Salman Khan
-
హాలీవుడ్ ఎంట్రీ
బాలీవుడ్లో స్టార్ హీరోలుగా క్రేజ్ సొంతం చేసుకున్న సల్మాన్ ఖాన్(Salman Khan), సంజయ్ దత్(Sanjay Dutt) హాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు. లూయిస్ మచిన్, ఎవా బియాంకో, పౌలా లుస్సీ ప్రధాన పాత్రల్లో రోడ్రిగో గెర్రెరో దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సెవెన్ డాగ్స్’. 2021లో అర్జెంటీనాలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీని హాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు.ఈ రీమేక్లో సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం దుబాయ్లో జరుగుతోంది. సల్మాన్, సంజయ్లపై సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ షూటింగ్ వీడియో క్లిప్పింగ్స్ నెట్టింట వైరల్గా మారాయి. సల్మాన్ ఖాకీ చొక్కా వేసుకుని ఆటో డ్రైవర్ వేషంలో ఉండగా... సంజయ్ సూటు ధరించి ఉన్నారు.మిడిల్ ఈస్ట్లో జరిగే అమెరికన్ థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోందట. మిడిల్ ఈస్ట్లో సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ సినిమాలకు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ని దృష్టిలో పెట్టుకుని ఈ రీమేక్లో నటింపజేస్తున్నారట హాలీవుడ్ మేకర్స్. అయితే భద్రతా కారణాల రీత్యా ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను అధికారికంగా వెల్లడించలేదు. -
హాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో.. ఆటో డ్రైవర్గా?
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) హాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. సెవెన్ డాగ్స్ అనే అర్జెంటీనా సినిమాను హాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. ఈ అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలోముఖ్య పాత్ర కోసం సల్లూ భాయ్ను సంప్రదించగా ఆయన పచ్చజెండా ఊపారట! ఈ క్రమంలోనే సినిమా షూటింగ్ సైతం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.దుబాయ్లో షూటింగ్!ఇందుకోసం సల్మాన్ ఖాన్ కొద్దిరోజుల క్రితమే దుబాయ్ పయనమయ్యాడు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్, సంజయ్ దత్లకు సంబంధించిన సన్నివేశాలపై చిత్రీకరణ జరుపుతున్నారంటూ కొన్ని వీడియో క్లిప్స్ నెట్టింట వైరల్గా మారాయి. అందులో సల్మాన్ ఆటో డ్రైవర్ వేషంలో ఉన్నాడు. ఆటో దగ్గర సల్మాన్ నిల్చోగా అతడి పక్కనే సంజయ్ దత్ సూటూబూటు వేసుకుని ఠీవీగా కనిపిస్తున్నాడు. సల్మాన్ పాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సినిమాకాగా సల్మాన్ ఖాన్ చివరగా టైగర్ 3 సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం సికందర్ మూవీ చేస్తున్నాడు. రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది రంజాన్ సందర్భంగా రిలీజ్ కానుంది. ఈ చిత్రం రంజాన్ పండగకు విడుదల కానుంది. Bhai and Baba are in Saudi Arabia to shoot cameo for a Hollywood movie 🎥... #Salmankhan #Sanjaydutt #Sikandar pic.twitter.com/ZoTZ6mNae4— Adil Hashmi👁🗨 (@X4SALMAN) February 19, 2025MEGASTAR SALMAN KHAN in Saudi Arabia today #Sikandar #SalmanKhan pic.twitter.com/pUVl8WMvoc— Lokendra Kumar (@rasafi24365) February 19, 2025చదవండి: ఓటీటీలోకి ఎమర్జెన్సీ.. సింపుల్గా డేట్ చెప్పేసిన కంగనా -
సికందర్ సర్ప్రైజ్ సిద్ధం
సల్మాన్ ఖాన్(Salman Khan) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సికందర్’(Sikandar). రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది రంజాన్ సందర్భంగా రిలీజ్ కానుంది. కాగా మంగళవారం (ఫిబ్రవరి 18) సాజిద్ బర్త్ డే సందర్భంగా ‘సికందర్’ సినిమా నుంచి సల్మాన్ ఖాన్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ నెల 27న ఈ చిత్రానికి సంబందించి, ఓ సర్ప్రైజ్ కూడా ఉందని పేర్కొన్నారు. ఆ రోజు ఈ సినిమా టీజర్ లేదా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఉండొచ్చని టాక్. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సౌదీ అరేబియాలో ఉన్నారని సమాచారం.ఓ అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో గెస్ట్ రోల్ చేస్తున్నారని, ఈ మూవీ కోసమే ఆయన సౌదీ వెళ్లారని, అలాగే సల్మాన్ ఖాన్తో పాటు సంజయ్ దత్ కూడా ఓ గెస్ట్ రోల్ చేస్తున్నారని బాలీవుడ్ టాక్. -
బాలీవుడ్ కు తిరిగొస్తున్న కిక్కోడు
-
'సల్మాన్, షారూఖ్ నన్ను చూసి నవ్వారు'.. హీరోయిన్ కామెంట్స్
మహాకుంభమేళాలో సన్యాసం స్వీకరించిన హీరోయిన్ మమతా కులకర్ణి ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. సడన్గా సన్యాసం స్వీకరించడం హాట్ టాపిక్గా మారింది. గ్లామర్ ఇండస్ట్రీని వదిలేసిన మమతా ఇండియాను వదిలేసి రెండు దశాబ్దాలయింది. సుదీర్ఘ విరామం తర్వాత మహాకుంభ్ మేళా కోసం భారత్కు తిరిగొచ్చింది. దాదాపు 23 ఏళ్లుగా ఈ అవకాశం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. కాగా మమతా కులకర్ణి.. హిందీలో కరణ్ అర్జున్, సబ్సే బడా ఖిలాడీ వంటి పలు సినిమాలు చేసింది. తెలుగులో ప్రేమ శిఖరం, దొంగా పోలీస్ చిత్రాలతో మెప్పించింది.తాజాగా మమతా బాలీవుడ్ హీరోల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. గతంలో తాను కరణ్ అర్జున్ మూవీ గురించి మాట్లాడింది. ఆ మూవీ షూటింగ్ సమయంలో తనను చూసి సల్మాన్, షారుక్ ఖాన్ నవ్వుకున్నారని తెలిపింది. సల్మాన్ ఖాన్ ఏకంగా తనను చూసి తలుపులు వేసుకున్నాడని పేర్కొంది.మమతా కులకర్ణి మాట్లాడుతూ.. "కరణ్ అర్జున్ మూవీ షూట్ షారుఖ్, సల్మాన్తో కలిసి చేశాను. అక్కడే ఓ సాంగ్ షూట్లో కొరియోగ్రాఫర్ చెప్పిన స్టెప్ను సింగిల్ టేక్లో చేశా. కానీ వాళ్లిద్దరూ రీటేక్స్ ఎక్కువగా తీసుకున్నారు. దాంతో కొరియోగ్రాఫర్కు కోపం వచ్చి ప్యాకప్ చెప్పేశాడు. ఆ తర్వాత సల్మాన్ అసహనానికి గురయ్యాడు. నేను గదిలోకి వెళ్తుంటే నా ముఖంపై తలుపు వేశాడు. కానీ మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. సల్మాన్ ఎప్పుడూ నన్ను ఆటపట్టించేవాడు. నేను సెట్లో సమయపాలన పాటిస్తాను.' అని తెలిపింది.(ఇది చదవండి: 23 ఏళ్లుగా దీనికోసమే.. ఒలంపిక్ గెల్చినంత సంతోషంగా ఉంది: మమతా)కాగా.. మమతా కులకర్ణి 2000 సంవత్సరం ప్రారంభంలో బాలీవుడ్కు గుడ్బై చెప్పేసింది. ఆమె చివరిసారిగా 2002లో విడుదలైన కభీ తుమ్ కభీ హమ్లో కనిపించింది. అంతకుముందు మేరా దిల్ తేరే లియే, తిరంగా, దొంగ పోలీస్, కిస్మత్ లాంటి చిత్రాల్లో నటించింది. -
సల్మాన్ ‘వివాహ్’కి పనికిరాడన్న దర్శకనిర్మాత
ఇంతింతై అన్నట్టుగా ఎదిగిన సల్మాన్(Salman Khan) తొలి సినిమా ఏది? అని అడిగితే వెంటనే ఠక్కున మైనే ప్యార్ కియా అని చెప్పేస్తారు. కానీ చాలా మందికి తెలీని విషయం బీవీ హోతో ఐసీ (భార్య అంటే ఇలా ఉండాలి) అనే సినిమా సల్మాన్ తొలిసినిమా. 1988లో విడుదలైన ఈ సినిమాలో సల్మాన్ సహాయనటుడి పాత్ర పోషించారు. అయితే ఆ తర్వాత చేసిన మైనే ప్యార్ కియా సూపర్ డూపర్ హిట్ అవడంతో తొలి సినిమా తెరమరుగైపోయింది.. సల్లూభాయ్కి లవర్ బాయ్ ఇమేజ్ కూడా వచ్చేసింది.భార్య అంటే ఇలా ఉండాలి అనే అర్ధం వచ్చేలా టైటిల్తో తొలిసినిమా ఎలాగైతే సల్మాన్ కెరీర్లో అస్పష్టం ఉండిపోయిందో...సల్మాన్ వివాహం కూడా అలాగే ఉండిపోయింది. అదలా ఉంచితే... బాలీవుడ్లో అత్యంత ఎలిజబుల్ బ్యాచిలర్ అయిన సల్మాన్ఖాన్కి దేశవ్యాప్తంగా అసంఖ్యాక అభిమానుల్ని అందించిన తొలి సినిమా మైనే ప్యార్ కియా కాగా దానికి దర్శకుడు సూరజ్ బర్జాత్యా(Sooraj Barjatya). హమ్ ఆప్ కే హై కౌన్, హమ్ సాథ్ సాథ్ హై వంటి సూపర్ డూపర్ హిట్స్ తో టాప్ డైరెక్టర్గా మారారు. పై చిత్రాలతో పాటు ప్రేమ్ రతన్ ధన్పాయో కూడా సల్మాన్ఖాన్తోనే రూపొందించారీ కుటుంబ చిత్రాలకు పేరొందిన ఈ దర్శకుడు. సల్మాన్తో అత్యధిక హిట్స్ తీశాడు. అలాగే ఆయన త్వరలో తన అభిమాన హీరో సల్మాన్ ఖాన్తో మరో చిత్రంలో మళ్లీ చేయబోతున్నాడు, అయితే కెరీర్ ప్రారంభం నుంచీ వరుసగా సల్మాన్తో చిత్రాలు తీస్తూ వచ్చిన ఆయన ప్రేమ్ రతన్ ధన్పాయోకి ముందు వివాహ్(Vivah) పేరిట ఒక సినిమాని రూపొందించినప్పుడు ఆ సినిమాలో షాహిద్ కపూర్ని హీరోగా ఎంచుకున్నారు.సల్మాన్ ఖాన్ తో త్వరలో మరో చిత్రంలో మళ్లీ జతకట్టబోతున్న సూరజ్ బర్జాత్యా... వివాహ్ సినిమా కు హీరో ఎంపిక విషయంలో సల్మాన్ని దూరంగా పెట్టడానికి కారణం ఏమిటి? అనే విషయంపై బాలీవుడ్లో అప్పట్లో చర్చోపచర్చలు జరిగాయి. ఈ నేపధ్యంలో సూరజ్ బర్జాత్యా ఇటీవల ఆ విషయం గురించి మాట్లాడాడు.‘‘ అప్పట్లో మీరట్కు చెందిన ఒక టైలర్, కాలిన గాయాలతో ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు వచ్చిన వార్త గురించి చెప్పి, మా నాన్న నాకు ఆ వార్తాపత్రిక కటింగ్ను చూపించారు. ప్రేమ మానవత్వం ఆధారంగా సినిమాను రూపొందించాలని అనుకున్నాం. ఆ సినిమా కథ కొత్తగా కనపడే ఒక అమాయకుడికి నప్పుతుంది. కాబట్టి సల్మాన్ ఖాన్ ఆ సినిమాకి నప్పే సరైన హీరో కాదు. అందుకే షాహిద్ ను ఎంచుకున్నా’’ అంటూ చెప్పారు సూరజ్ బర్జాత్యా. మొత్తానికి ఇంత కాలమైనా ప్రేమలు, అనుబంధాలకు దగ్గరగా అదే సమయంలో వివాహానికి దూరంగా ఉంంటూ వివాహ వ్యవస్థలో ఒదగలేకపోతున్న సల్మాన్... వివాహ్ అనే సినిమా లో పాత్రలో సైతం నప్పకపోవడం... విచిత్రం. -
‘సల్మాన్ అవమానించాడు’.. స్పందించిన అక్షయ్ కుమార్
'బిగ్ బాస్ 18' గ్రాండ్ ఫినాలే వివాదంపై అక్షయ్ కుమార్(Akshay Kumar) స్పందించాడు. సల్మాన్ ఖాన్ తనను అవమానించారనే వార్తలను కొట్టిపాడేశాడు. తనకున్న కమిట్మెంట్ల కారణంగానే గ్రాండ్ ఫినాలే షూటింగ్ ప్రారంభం కాకముందే షో నుంచి బయటకు వచ్చానని.. అంతకు మించి అక్కడ ఏమి జరగలేదని చెప్పి రెండు రోజులుగా జరుగుతున్న సోషల్ మీడియా వార్కి పుల్స్టాఫ్ పెట్టేశాడు.అసలేం జరిగింది?గత ఆదివారం(జనవరి 19) హిందీ బిగ్బాస్ 18వ సీజన్ గ్రాండ్ ఫినాలే జరిగిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్(Salman Khan) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో గ్రాండ్ ఫినాలేకి అతిథులుగా అక్షయ్ కుమార్, వీర్ సహారియాలను పిలిచారు.షెడ్యూల్ టైం ప్రకారం అక్షయ్ కుమార్ బిగ్ బాస్ సెట్ కు వెళ్లారు. కానీ సల్మాన్ ఖాన్ మాత్రం ఆలస్యంగా సెట్కి వచ్చాడు. దాదాపు గంట పాటు సెట్లోనే వేచి చూసిన అక్షయ్.. షూటింగ్ ఇంకా ప్రారంభం కాకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అక్షయ్ వెళ్లిపోయిన కాసేపటికి సల్మాన్ సెట్కి వచ్చాడు. దీంతో అక్షయ్ కుమార్ను సల్మాన్ ఖాన్ అవమానించాడంటూ సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిచ్చాయి. అంతేకాదు అక్షయ్ అసహనంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడని.. బిగ్బాస్ నిర్వాహకులు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదంటూ పుకార్లు వచ్చాయి.వాస్తవం ఎంటంటే..?సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై తాజాగా అక్షయ్ స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తనకున్న కమిట్మెంట్ కారణంగా షూటింగ్ ప్రారంభం కాకముందే షో నుంచి వచ్చేసినట్లు చెప్పారు.సల్మాన్ సెట్కు ఆలస్యంగా వచ్చిన విషయం వాస్తవమే. కానీ ఆయన ఆలస్యంగా రావడం వల్లే నేను వెళ్లిపోలేదు. నా సినిమా షూటింగ్కు టైమ్ కావడంతో ఫినాలే షూట్ నుంచి బయటకు వచ్చేశాను. ఆ తర్వాత సల్మాన్తో మాట్లాడాను. నేను వచ్చేసినా మా చిత్రం ‘స్కై ఫోర్స్’ను ప్రచారం చేయడం కోసం వీర్ పహారియా బిగ్బాస్ సెట్లోనే ఉన్నారు. అతడు మా సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు’ అని అక్షయ్ అన్నారు.బిగ్ బాస్ 18' విన్నర్ ఎవరు? బిగ్ బాస్ షో తెలుగులోనే కాదు మిగతా భాషల్లో కూడా పాపులర్. హిందీలో 18 సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఇక 18వ సీజన్ విన్నర్((Bigg Boss 18 winner) గా నటుడు కరణ్ వీర్ మోహ్రా నిలిచాడు. ఇతడు ట్రోఫీతో పాటు రూ.50 లక్షల ప్రైజ్మనీ గెలుచుకున్నాడు. నటుడు వివియన్ డిసేన ఫస్ట్ రన్నరప్గా, యూట్యూబర్ రజత్ దలాల్ సెకండ్ రన్నరప్గా నిలిచారు. అవినాష్ మిశ్రా, చుమ్ దరాంగ్, ఇషా సింగ్ టాప్ 6లో చోటు సంపాదించుకున్నారు. -
హీరోల బాడీగార్డులు కోట్లల్లో సంపాదిస్తారా? ఎట్టకేలకు క్లారిటీ
హీరోలు కోట్లు సంపాదిస్తారు.. వారి కింద పనిచేసే బాడీగార్డులు కూడా లక్షలు వెనకేస్తుంటారు! స్టార్ హీరోల బాడీగార్డుల సంపాదన గురించైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏడాదికి కోట్లల్లో ఆదాయం ఉంటుందని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. షేరా అలియాస్ గుర్మీత్ సింగ్.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్కు రెండు దశాబ్దాలుగా బాడీగార్డుగా పని చేస్తున్నాడు. ఇతడికికి టైగర్ అని ఓ సెక్యూరిటీ ఏజెన్సీ సంస్థ కూడా ఉంది. బాడీగార్డు ఉంటేనే అడుగు బయటకురవి సింగ్ విషయానికి వస్తే.. ఇతడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan)కు వ్యక్తిగత అంగరక్షకుడిగా వ్యవహరిస్తున్నాడు. యూసుఫ్ ఇబ్రహీం.. ఆలియా భట్, వరుణ్ ధావన్ వంటి పలువురు హీరోహీరోయిన్లకు బాడీగార్డుగా సేవలందిస్తున్నాడు. వీరు సెలబ్రిటీలు ఇల్లు దాటి బయటకు వెళ్లినప్పుడు వారికి రక్షణగా నిలుస్తారు. ఈవెంట్లకు వెళ్లినా, ఎక్కడికైనా ప్రయాణించినా సదరు నటీనటులను జాగ్రత్తగా చూసుకుంటారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.బాడీగార్డులకు కోట్లల్లో ఆదాయం?సెలబ్రిటీటల పట్ల అంకితభావంతో పనిచేసే వీరు బాగానే డబ్బు కూడబెడతారని ఫిల్మీదునియాలో ఓ టాక్ ఉంది. దీనిపై హీరోయిన్ ఆలియా భట్ బాడీగార్డ్ యూసఫ్ ఇబ్రహీం(Bollywood bodyguard Yusuf Ibrahim) క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ముందుగా షారూఖ్ బాడీగార్డ్ రవి సింగ్ ఏడాదికి రూ.2.7 కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నాడా? అన్న ప్రశ్నకు ఇలా స్పందించాడు. చూడండి.. ఎవరెంత సంపాదిస్తున్నారనేది మాకు తెలియదు. ఒకరి ఆదాయం మరొకరికి తెలియదు. తెలిసే అవకాశమే లేదు అన్నాడు. మీకు తెలియకుండా ఉంటుందా? అని యాంకర్ అడిగినప్పటికీ అతడు తెలీదనే అడ్డంగా తలూపాడు. మరి సల్మాన్ బాడీగార్డ్ షేరా రూ.2 కోట్లు సంపాదిస్తున్నాడంటున్నారు.. ఇది నిజమేనా? అన్న రెండో ప్రశ్న ఎదురైంది.(చదవండి: తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన దిల్ రాజు, ఎందుకంటే?)నెలకు రూ.10 లక్షలు ఈజీగా..దీనికి ఇబ్రహీం స్పందిస్తూ.. షేరాకు సొంత బిజినెస్ ఉంది. అతడికంటూ ప్రత్యేకంగా సెక్యురిటీ కంపెనీ ఉంది. ఇంకా వేరే వ్యాపారాలు కూడా ఉండొచ్చు. కాబట్టి రెండు కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉంది అని సమాధానమిచ్చాడు. అక్షయ్ కుమార్ అంగరక్షకుడు శ్రేసయ్ తేలే ఏడాదికి రూ.1.2 కోట్లు ఆర్జిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై మీ రియాక్షన్ ఏంటన్న ప్రశ్నకు.. అతడి వ్యక్తిగత సమాచారం నా దగ్గర లేదు. అయినా నెలకు రూ.10-12 లక్షల ఆదాయం వేసుకున్నా ఏడాదికి రూ.1 కోటి ఈజీగా దాటుతుంది.కొన్నిసార్లు లెక్క మారుతుందికానీ కొన్నిసార్లు అంత డబ్బు రాకపోవచ్చు. ఎందుకంటే కొందరు షూటింగ్కు, ఈవెంట్స్కు, ప్రమోషన్స్కు వేర్వేరుగా డబ్బు లెక్కగడుతుంటారు. దాన్ని బట్టి సెలబ్రిటీలు ఎలాంటి కార్యక్రమాలకు ఎక్కువగా వెళ్తున్నారో దాని ఆధారంగానే డబ్బిస్తారు. పైగా ఆయా సెలబ్రిటీ నెలలో ఎన్ని రోజులు పని చేస్తున్నాడనేదానిపై కూడా మా జీతం ఆధారపడి ఉంటుంది. కానీ అందరూ ఎవరికి నచ్చినట్లు వారు లెక్కలు వేసుకుని ప్రచారం చేస్తున్నారు. కోట్లు సంపాదిస్తున్నామని ఫిక్సయిపోయారు. కానీ సాధారణ బాడీగార్డులైతే నెలకు రూ.25 వేల నుంచి రూ.1 లక్ష వరకు ఉంటుంది అని ఇబ్రహీం చెప్పుకొచ్చాడు.చదవండి: చికెన్గున్యాతో బాధపడుతున్న సమంత.. ఒళ్లునొప్పులున్నా..! -
బాలీవుడ్లో దూసుకెళ్తున్నా రష్మిక.. 2025లో మూడు సినిమాలు!
హీరోయిన్ రష్మికా మందన్నా(Rashmika Mandanna ) కెరీర్లో రానున్న తొలి హారర్ మూవీ ‘థామా’. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్నారు. హారర్ మూవీ ‘వంజ్య’తో హిట్ కొట్టిన దర్శకుడు ఆదిత్యా సర్పోత్తా ఈ సినిమాకు దర్శకుడు. ‘బాలీవుడ్ నిర్మాత దినేష్ విజన్ నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ గత ఏడాది విడుదలైంది. తొలి షెడ్యూల్ను ముంబైలో జరిపారు. సెకండ్ షెడ్యూల్ను గతేడాది డిసెంబరు చివరి వారంలో ఢిల్లీలో ప్రారంభించారు. న్యూ ఇయర్ బ్రేక్ తీసుకుని, మళ్లీ ఈ వారంలో ‘థామా’ చిత్రీకరణను ప్రారంభిస్తున్నారు. ‘థామా’ చిత్రీకరణ కోసం ఢిల్లీ బయలుదేరినట్లుగా తన ఇన్స్టా వేదికగా షేర్ చేశారు ఆయుష్మాన్ ఖురానా. అలాగే న్యూ ఇయర్ వేడుకలను పూర్తి చేసుకున్న రష్మికా మందన్నా కూడా ఢిల్లీలో జరిగే ‘థామా’ షెడ్యూల్లో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి పాల్గొననున్నారని బాలీవుడ్ సమాచారం. జనవరి మూడో వారం వరకు ‘థామా’ షూటింగ్ షెడ్యూల్ జరుగుతుందట. ఈ ఢిల్లీ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఈ సినిమా చిత్రీకరణ నెక్ట్స్ షెడ్యూల్ ఊటీలో జరగనుందని బీ టౌన్ టాక్. ఇక ‘థామా’ ఈ ఏడాది దీపావళికి రిలీజ్ కానుంది. అలాగే హిందీలో సల్మాన్ ఖాన్తో ‘సికందర్’, విక్కీ కౌశల్తో ‘ఛావా’ చిత్రాలు చేస్తున్నారు రష్మికా మందన్నా. ‘సికందర్’ సినిమా ఈ ఏడాది ఈద్కి, ‘ఛావా’ చిత్రం ఫిబ్రవరిలో రిలీజ్ కానున్నాయి. ఇలా హిందీలో రష్మికా మందన్నా నటించిన చిత్రాలు ఈ ఏడాది మూడు రిలీజ్ కానున్నాయి. -
'మా అమ్మాయి నిప్పు'.. నటి బండారం బయటపెట్టిన సల్మాన్
'మా అమ్మాయి నిప్పు.. తనకు బాయ్ఫ్రెండ్ అంటూ ఎవరూ లేరు. అబ్బాయిలతో అంత సన్నిహితంగా ఉన్నదే లేదు. భవిష్యత్తులో కూడా తను ఎవరినీ ప్రేమించదు. నేను చూపించిన అబ్బాయిని తప్ప ఇంకెవర్నీ పెళ్లి చేసుకోదు. అనవసరంగా తన గురించి లేనిపోనివి మాట్లాడితే బాగోదు' అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది నటి (Chahat Pandey) చాహత్ పాండే తల్లి భావన పాండే. బుల్లితెర నటి చాహత్ ప్రస్తుతం హిందీ బిగ్బాస్ 18 (Bigg Boss 18)వ సీజన్లో పాల్గొంది. ఉతికారేసిన చాహత్ తల్లిఇటీవల ఫ్యామిలీ వీక్లో భాగంగా చాహత్ తల్లి బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెట్టింది. ఆ సమయంలోనే తన కూతురితో కయ్యం పెట్టుకుంటున్న అవినాష్ మిశ్రాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పై కామెంట్స్ చేసింది. ఈ వ్యవహారం అంతటితో ముగిసిపోలేదు. నిజంగానే చాహత్ సింగిలా? అని బిగ్బాస్ టీమ్కు డౌట్ వచ్చింది. తనకు ప్రియుడు ఉండొచ్చన్న అనుమానంతో సోషల్ మీడియా అంతా జల్లెడపట్టారు. ఈ క్రమంలో ఓ ఫోటో దొరికింది. అందులో ప్రియుడు లేడు కానీ ప్రేమలో ఉన్నట్లు యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంది.(చదవండి: గేమ్ ఛేంజర్ ఈవెంట్కు హీరోయిన్ డుమ్మా.. ఎందుకంటే?)మీ అమ్మ సర్టిఫికెట్ ఇచ్చింది!ఇంకేముంది, దాన్ని పట్టేసుకున్నారు. తాజా ప్రోమోలో సల్మాన్ ఖాన్ (Salman Khan).. అమ్మాయిల వెంటపడే అబ్బాయిలంటే నీకస్సలు ఇష్టముండదని మీ అమ్మ చెప్పింది. అంటే నువ్వు ఎలాంటిదానివో చెప్తూ మంచి సర్టిఫికెట్ ఇచ్చి వెళ్లిపోయింది. మా టీమ్ ఇది నిజమేనా? అని నిర్ధారించుకునే క్రమంలో ఒకటి కనుగొన్నారు. అదేంటో మీరూ చూసేయండి అంటూ ఫోటో చూపించాడు. యానివర్సరీ ఫోటో.. మరి ఇదేంటి?ఆ ఫోటోలో 'ఐదేళ్లు పూర్తయ్యాయి. హ్యాపీ యానివర్సరీ మై లవ్' అని కేక్పై రాసి ఉంది. ఆ కేక్ పక్కనే చాహత్ కూర్చుని ఉంది. అది చూసి చాహత్ కంగారుపడగా.. తనతో పాటు సీరియల్స్ చేసిన అవినాష్.. ఇప్పటికైనా నిజం ఒప్పుకో, సెట్లో అందరికీ ఆ విషయం తెలుసు అని చెప్పాడు. కానీ చాహత్ ఒప్పుకోలేదు.ఇంత దిగజారుతారా?అయితే ఈ వ్యవహారంలో పలువురు నెటిజన్లు బిగ్బాస్ టీమ్నే తప్పుపడుతున్నారు. తన పర్సనల్ లైఫ్లో ఏం జరిగిందో తెలుసుకుని మరీ అందరి ముందు దోషిగా నిలబెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. అది తన వ్యక్తిగతమని, దానివల్ల మిగతావారికేంటి సమస్య? అని నిలదీస్తున్నారు. బిగ్బాస్ టీమ్ ఇంత దిగజారుతుందనుకోలేదంటూ కామెంట్లు చేస్తున్నారు.చదవండి: 'దేవర'కు 100 రోజులు.. ఎన్ని కేంద్రాలు, ఎక్కడెక్కడ..? -
బిగ్బాస్ షోకి వెళ్లనున్న రామ్చరణ్!
హీరో రామ్చరణ్ (Ram Charan) మరోసారి బిగ్బాస్ షోకి వెళ్లనున్నాడు. మొన్న తెలుగు బిగ్బాస్ ఎనిమిదో సీజన్ గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా వచ్చి సందడి చేశాడు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ (Game Changer Movie) చిత్ర ప్రమోషన్స్ కోసం హిందీ బిగ్బాస్ 18వ సీజన్కు వెళ్లనున్నాడట! వీకెండ్ కా వార్ ఎపిసోడ్లో చరణ్ స్టేజీపై కనిపించనున్నాడంటూ ప్రచారం ఊపందుకుంది.గేమ్ ఛేంజర్ చిత్రాన్ని హిందీలోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడి వారికి హైప్ ఎక్కించడం కోసం చరణ్ బిగ్బాస్కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తోంది. హోస్ట్, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)తో ముచ్చటించి తన సినిమా ట్రైలర్ను చూపించనున్నారట! కాగా సల్మాన్- చరణ్ మధ్య ఇదివరకే స్నేహం ఉంది. (చదవండి: Game Changer: తగ్గిన రామ్ చరణ్ రెమ్యునరేషన్!)సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాలోని ఏంటమ్మా పాటలో చరణ్, వెంకటేశ్ స్టెప్పులతో అదరగొట్టారు. సల్లూభాయ్ హైదరాబాద్కు వచ్చినప్పుడు చరణ్ ఇంటికి పిలిచి ఆతిథ్యమిస్తుంటాడు. అటు చరణ్ ముంబై వెళ్లినప్పుడు కూడా సల్మాన్ తనను ఇంటికి ఆహ్వానిస్తుంటాడు. వీరిద్దరి కలయిక కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.గేమ్ ఛేంజర్ విషయానికి వస్తే శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్చరణ్, కియారా అద్వానీ హీరోయిన్లుగా నటించారు. అంజలి కీలక పాత్ర పోషించింది. ఎస్జే సూర్య విలన్గా నటించాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జనవరి 10న విడుదల కానుంది.చదవండి: 'కలెక్టర్కి ఆకలేస్తోంది అంటా'... 'గేమ్ ఛేంజర్' ట్రైలర్ చూసేయండి -
పత్రికలు అచ్చువేయించాక ఆగిన పెళ్లి? నిజమేనన్న హీరోయిన్
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) ఎంతోమంది హీరోయిన్లను ప్రేమించాడు. వారిలో ఓ హీరోయిన్తో గాఢ ప్రేమలో ఉన్న అతడు పెళ్లికి సైతం ఒప్పుకున్నాడు. మంచి ముహూర్తం చూసుకుని పెళ్లిపత్రికలు కూడా అచ్చు వేయించాడు.. కానీ చివరకు ఆ వివాహాన్ని రద్దు చేసుకున్నారని అప్పట్లో రూమర్స్ వచ్చాయి. ఇంతకీ అతడు జీవిత భాగస్వామిగా కోరుకున్న హీరోయిన్ మరెవరో కాదు సంగీత బిజ్లానీ (Sangeeta Bijlani).పత్రికలు కొట్టించాక ఆగిన పెళ్లి?సంగీత బిజ్లానీ తాజాగా ఇండియన్ ఐడల్ 15వ షోకు ముఖ్య అతిథిగా హాజరైంది. ఈ సందర్భంగా మానసి ఘోష్ అనే కంటెస్టెంట్ సంగీతను ఊహించని ప్రశ్న అడిగింది. సల్మాన్తో పెళ్లికి సిద్ధమై పత్రికలు కూడా కొట్టించుకున్నాక చివరకు ఆ వివాహమే ఆగిపోయింది. నిజమేనా? అని ప్రశ్నించింది. అది అబద్ధమైతే కాదు అని బదులిచ్చింది. దీంతో అందరూ షాకయ్యారు. ఎందుకు మీ పెళ్లి ఆగిపోయిందో చెప్తారా? అని అడిగాడు. ఇంతటితో ప్రోమో పూర్తయింది. మరి అతడి ప్రశ్నకు సంగీత ఆన్సరిచ్చిందా? లేదా? అనేది ఫుల్ ఎపిసోడ్లోనే చూడాలి!పదేళ్లకు పైగా డేటింగ్కాగా బాలీవుడ్ (Bollywood)లో కెరీర్ ఆరంభించిన తొలినాళ్లలో సల్మాన్ ఖాన్, సంగీత ఒకరినొకరు కలుసుకున్నారు. దశాబ్దకాలంపాటు ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ చివరకు అది కార్యరూపం దాల్చలేదు. తర్వాత సంగీత 1996లో మహ్మద్ అజారుద్దీన్ను పెళ్లి చేసుకుంది. 2019లో వీరు విడాకులు తీసుకున్నారు. అయితే సల్మాన్తో ఇప్పటికీ ఫ్రెండ్షిప్ కొనసాగిస్తోంది.చదవండి: మనవరాలి పెళ్లిపై మురళీమోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు -
భార్యాభర్తలే కానీ ఒక గదిలో ఉండరట.. ఎంత టార్చర్ పెట్టారో!: సింగర్
పాపులర్ సింగర్ మికా సింగ్.. అదుర్స్ (పిల్లా నా వల్ల కాదు..), బలుపు (పాతికేళ్ల చిన్నది), డార్లింగ్ (యాహు యాహూ..) సినిమా పాటలతో తెలుగువారికీ సుపరిచితుడయ్యాడు. టాప్ సింగర్గా, ర్యాపర్గా రాణిస్తున్న ఇతడు రెండుమూడు సినిమాల్లోనూ నటించాడు. అంతేకాదు, ఓ సారి చిన్నపాటి సినిమా లేదా వెబ్ సిరీస్ తీయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా 2020వ సంవత్సరంలో డేంజరస్ అనే వెబ్ సిరీస్ తీశాడు.రిస్క్ ఎందుకని?అయితే నిర్మాతగా ఇదే తన తొలి ప్రాజెక్ట్ కావడంతో రాజ్ సినిమా డైరెక్టర్ విక్రమ్ భట్ దగ్గరున్న కథనే సెలక్ట్ చేసుకున్నాడు. పెద్దగా రిస్క్ చేయడం ఇష్టం లేని అతడు రాజ్ సినిమాలోని కొందర్ని తన సిరీస్ కోసం సెలక్ట్ చేసుకున్నాడు. బడ్జెట్ మరీ మితిమీరిపోకూడదని భావించి కరణ్ సింగ్ గ్రోవర్ను ఎంపిక చేశాడు. అలాగే కొత్త హీరోయిన్ను పరిచయం చేయాలనుకున్నాడు. కానీ కరణ్ భార్య బిపాసా బసు (Bipasa Basu) తనే కథానాయికగా చేస్తానంది. దీంతో ఒప్పుకోక తప్పలేదు.దంపతులకు వేర్వేరు గదులుఇంకా మికా సింగ్ (Mika Singh) మాట్లాడుతూ.. నెల రోజుల షెడ్యూల్ కోసం 50 మంది కలిసి లండన్కు వెళ్లాం. తీరా వెళ్లాక అది రెండు నెలలవరకు కొనసాగింది. కరణ్, బిపాసా చాలా ఓవర్ చేశారు. వీళ్లు దంపతులే కాబట్టి ఒక రూమ్ బుక్ చేశాను. కానీ వాళ్లేమో వేర్వేరు గదులు కావాలన్నారు. నాకసలు అర్థమే కాలేదు. తర్వాత వేరే హోటల్కు వెళ్తామంటే అదీ చేశాను. ఒక యాక్షన్ సన్నివేశంలో కరణ్ కాలు ఫ్రాక్చర్ అయింది. అది మనసులో పెట్టుకుని డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా ఇబ్బందులకు గురి చేశారు. గొంతు బాలేదు, బిజీగా ఉన్నామంటూ ఇలా ఎప్పుడూ ఏదో ఒక సాకు చెప్పేవారు. నానా రచ్చవారు చేసిన పనికి డబ్బిస్తున్నప్పుడు ఎందుకింత డ్రామా చేస్తున్నారనేది నాకసలు అంతుపట్టలేదు. ముద్దు సన్నివేశం దగ్గర కూడా నానా రచ్చ చేశారు. అందుకు ససేమీరా ఒప్పుకోమన్నారు. స్క్రిప్ట్లో ఈ సీన్ గురించి వివరంగా రాసుంది. అది చదివే అగ్రిమెంట్పై సంతకం చేశారు. పైగా ఇద్దరూ భార్యాభర్తలే అయినప్పుడు ముద్దు పెట్టుకోవడానికి అభ్యంతరం ఏముంది? ఇలాంటివాళ్లు ధర్మ ప్రొడక్షన్, యష్ రాజ్ ఫిలింస్ వంటి పెద్ద నిర్మాతలకు భజన చేస్తారు. చిన్న పాత్ర ఇచ్చినా ఆహా ఓహో అని పొంగిపోతారు.యాటిట్యూడ్ చూపించారుకానీ చిన్న నిర్మాతల దగ్గర మాత్రం యాటిట్యూడ్ చూపిస్తారు. మేము కూడా వారిపై డబ్బు ఖర్చు పెడుతున్నాం కదా! ఇదంతా చూశాక ఇంకోసారి నిర్మాణం వైపు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను. ఇతరులకు కూడా అదే సలహా ఇస్తుంటాను. లేదు, కచ్చితంగా సినిమా నిర్మించాలనుకుంటే కొత్తవారికి అవకాశాలు ఇవ్వడం ఉత్తమం. నేను సినిమా తీస్తున్న విషయం తెలిసి అక్షయ్ కుమార్ (Akshay Kumar) హెచ్చరించాడు కూడా! హీరోల సలహా లెక్కచేయలేనీకేమైనా పిచ్చిపట్టిందా? జీవితంలో ఎంతో సాధించావ్.. అలాంటిది ఇప్పుడు నటీనటుల వానిటీ వ్యాన్ దగ్గరకు వెళ్లి మీ షాట్ రెడీ అయింది, రండి అని పిలుచుకుంటూ ఉంటావా? నిర్మాతగా మారితే డబ్బు పోగొట్టుకుంటావ్ అన్నాడు. సల్మాన్ ఖాన్ అయితే.. సినిమా తీయాలనుకుంటే ఓకే, కానీ అందులో నువ్వు కూడా నటించు. ఎందుకంటే నువ్వు ఎంపిక చేసే హీరో కంటే నువ్వే ఎక్కువ ఫేమస్ అన్నాడు. ఇద్దరి మాటల్నీ నేను పట్టించుకోలేదు. నా సిరీస్ కోసం ఎంతో డబ్బు పోగేశాను.. కానీ అది ఫ్లాప్ అయింది. కనీసం అందులో నటించినా బాగుండేదని అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను అని మికా సింగ్ చెప్పుకొచ్చాడు. చదవండి: Mollywood: హిట్టయిన సినిమాలు ఇంతేనా? రూ.700 కోట్ల లాస్! -
సల్మాన్ ఖాన్, మురుగదాస్ యాక్షన్ టీజర్ విడుదల
సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సికందర్’. సల్మాన్ ఖాన్ పుట్టినరోజు కానుకగా ఆ చిత్రం నుంచి తాజాగా టీజర్ను విడుదల చేశారు. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రానున్న ఈ ప్రాజెక్ట్లో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించనుంది. సాజిద్ నడియాడ్ వాలా ఈ సినిమాను నిర్మించనున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా 2025 రంజాన్ కానుకగా విడుదల కానుంది. యానిమల్, పుష్ప వంటి చిత్రాలతో రష్మికకు బాలీవుడ్లో క్రేజ్ పెరిగింది. ఇప్పుడు సికందర్ మూవీ ఆమెకు మరింత పాపులరాటిని తీసుకురావచ్చని చెప్పవచ్చు. -
సల్మాన్తో ప్రేమాయణం.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి జింటా
ఆన్స్క్రీన్ జంటల్ని జనాలెంతగానో ఇష్టపడతారు. రియల్ లైఫ్లోనూ ఆ హీరోహీరోయిన్లు జంటగా ఉంటే బాగుంటుందని ఆశపడతారు. కొందరైతే వారి మధ్య స్నేహాన్ని కూడా ప్రేమ అని ప్రచారం చేస్తుంటారు. అలా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan), హీరోయిన్ ప్రీతి జింటా కూడా లవ్లో ఉన్నారని అప్పట్లో బోలెడు రూమర్స్ వచ్చాయి. ఇన్నాళ్లకు దానిపై క్లారిటీ ఇచ్చింది హీరోయిన్.ఎంతో ప్రేమిస్తున్నా..డిసెంబర్ 27న సల్మాన్ ఖాన్ బర్త్డే సందర్భంగా ప్రీతి జింటా (Preity Zinta) సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేసింది. హ్యాపీ బర్త్డే సల్మాన్. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. మిగతాదంతా మనం కలుసుకున్నప్పుడు మాట్లాడుకుందాం. మనిద్దరం మరోసారి ఫోటోలు దిగాలి. లేదంటే ఇదిగో ఇలా పాతవే పోస్ట్ చేస్తూ ఉంటాను అంటూ సల్మాన్తో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేసింది. ఇది చూసిన ఓ నెటిజన్.. మీరిద్దరూ ప్రేమించుకున్నారా? అని అడిగాడు. హీరోతో లవ్?అందుకు ప్రీతి జింటా.. అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చింది. అతడు తనకు క్లోజ్ ఫ్రెండ్ అని తెలిపింది. అలాగే తన భర్తకు కూడా మంచి స్నేహితుడని, తనకు కుటుంబసభ్యుడిలాంటివాడని చెప్పింది. మీరెంత ఊహించుకున్నా ఇదే నిజం అని రిప్లై ఇచ్చింది. కాగా సల్మాన్- ప్రీతిజింటా.. హర్ దిల్ జో ప్యార్ కరేగా, చోరీ చోరీ చుప్కే చుప్కే, దిల్నే జిసే ఆప్నా కహా, జాన్ ఎ మన్, హీరోస్, ఇష్క్ ఇన్ పారిస్ వంటి చిత్రాల్లో కలిసి నటించారు. ప్రీతి తెలుగులో ప్రేమంటే ఇదేరా, రాజకుమారుడు సినిమాల్లో హీరోయిన్గా మెరిసింది. Happy Burrday @BeingSalmanKhan 🎂Just wanna say I love you the mostest 🥳 Rest will tell you when I speak to you ….. and yes we need more photos otherwise I will keep posting the same old ones ! Ting 💕 pic.twitter.com/XLVHxTIFY6— Preity G Zinta (@realpreityzinta) December 27, 2024 No not at all ! He is family & my closest friend and my husband’s friend too .. just in case you were wondering 🤣🤣 Sorry ! Couldn’t resist 👼— Preity G Zinta (@realpreityzinta) December 28, 2024 చదవండి: గేమ్ ఛేంజర్ టీమ్కు అభిమాని వార్నింగ్.. 'ఆ పని చేయకపోతే చస్తా!' -
బిగ్బాస్ షోలో 'బేబీ'తో కీర్తి సురేశ్ (ఫోటోలు)
-
ఖో ఖో ప్రపంచకప్ బ్రాండ్ అంబాసిడర్గా సల్మాన్ ఖాన్
మొట్టమొదటి ఖో ఖో ప్రపంచకప్ టోర్నీకి భారత్ వేదిక కానుంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్కు ప్రచారం కల్పించే క్రమంలో ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (కేకేఎఫ్ఐ) కీలక ముందడుగు వేసింది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ను బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించినట్లు బుధవారం వెల్లడించింది. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న క్రీడాకారుల జాతీయ శిక్షణ శిబిరంలో మీడియా సమావేశం సందర్భంగా ఈ ప్రకటన చేసింది. కేకేఎఫ్ఐ అధ్యక్షుడు సుధాంషు మిట్టల్, ప్రధాన కార్యదర్శి ఎంఎస్ త్యాగితో పాటు భారత పురుషుల, మహిళా క్రీడాకారులు, కోచ్లు ఇందులో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఖో ఖో ప్రపంచ కప్ కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సల్మాన్ ఖాన్ తెలిపాడు. ఆటతో తన అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. దేశ రాజధానిలో ప్రపంచ కప్ నిర్వహించడం ప్రశంసనీయమన్నాడు. ఖో ఖో ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తుండటం చూసి ఎంతో థ్రిల్ అవుతున్నానని చెప్పాడు.ఏదో ఒక దశలో ఖో ఖో ఆడిన వాళ్లమే"తొలి ఖో ఖో ప్రపంచ కప్– 2025తో భాగం అయినందుకు నేను గర్వపడుతున్నాను. ఇది కేవలం ఒక టోర్నమెంట్ మాత్రమే కాదు. ఇది భారత నేల, ఆత్మ, బలానికి ఇచ్చే నివాళి. నాతో పాటు మనమంతా జీవితంలో ఏదో ఒక దశలో ఖో ఖో ఆడిన వాళ్లమే’ అని సల్మాన్ ఖాన్ తన సందేశంలో పేర్కొన్నారు. ‘నాన్స్టాప్ యాక్షన్తో ఉత్కంఠభరితమైన క్రీడ అయిన ఖో ఖో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచ వేదికపై ఖో ఖో స్ఫూర్తిని చాటేందుకు ఏకం అవుదాం’ అని పిలుపునిచ్చారు.మన మట్టిలో పుట్టిన ఆట కోసంఇక కేకేఎఫ్ఐ అధ్యక్షుడు సుధాన్షు మిట్టల్ సల్మాన్ ఖాన్కు కృతజ్ఞతలు తెలిపారు. సల్మాన్ ఉనికి ప్రపంచ కప్ వీక్షకుల సంఖ్యను పెంచుతుందని నమ్ముతున్నారు. "సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన బిజీ షెడ్యూల్లో కూడా మన మట్టిలో పుట్టిన ఆట కోసం సమయం ఇచ్చినందుకు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.క్రీడ పట్ల ఆయన అభిరుచి నిజంగా స్ఫూర్తిదాయకం. రాబోయే ప్రపంచ కప్నకు సల్మాన్ యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తాడని మేము విశ్వసిస్తున్నాము. ఖో ఖో ప్రపంచ కప్ ప్రారంభ ఎడిషన్ను విజయవంతం చేయడానికి మేము చేయగలిగినదంతా చేస్తున్నాము’’ అని పేర్కొన్నారు. కాగా ఢిల్లీలో జనవరి 13–19 మధ్య ఖో ఖో ప్రపంచకప్ జరుగనుంది. వారం రోజుల పాటు జరిగే ఖో ఖో ప్రపంచ కప్లో టోర్నమెంట్లో 21 పురుషుల, 20 మహిళల జట్లు పోటీపడతాయి. మొత్తం 24 దేశాల జట్లు టోర్నమెంట్ కోసం భారత్కు వస్తున్నాయి.కాగా, జాతీయ శిక్షణ శిబిరంలో ప్రతీక్ వైకర్, ఆదిత్య గన్పూలే, రామ్జీ కశ్యప్, దిలీప్ ఖాండ్వీ, సుయాష్ గార్గేట్, గౌతమ్ ఎంకే సచిన్ భార్ఘవ, విశాల్, అరుణ్ గుంకీ, ప్రియాంక ఇంగ్లే, మాగై మజ్హి, మీన్ ముస్కనన్, . చేత్రా బి, నస్రీన్, రేష్మా రాథోడ్, నిర్మలా పాండే వంటి స్టార్ ప్లేయర్లతో కూడిన పురుషుల, మహిళల జట్లకు డెమో మ్యాచ్ను నిర్వహించారు.భారత ఒలింపిక్ సంఘం మద్దతుప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖో ఖో అభిమానులకు ఈ ఆటలోని థ్రిల్లింగ్ అనుభవాన్ని ఈ టోర్నమెంట్ అందించనుంది. కేకేఎఫ్ఐ కూడా ఆటగాళ్లందరికీ సమాన అవకాశాలను అందించడంపై దృష్టి సారిస్తోంది. అందుకే, పురుషులు, మహిళలు ఇద్దరికీ సమాన వేదికను ఏర్పాటు చేసింది. మరోవైపు.. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఖో ఖో ప్రపంచ కప్నకు మద్దతు ఇస్తోంది. ఇందుకోసం ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి పనిచేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది. -
బాలీవుడ్ వెళ్తున్న కల్కి మ్యూజిక్ డైరెక్టర్
-
నా ఆరోగ్యం బాలేనప్పుడు ప్రత్యేక శ్రద్ధ చూపించాడు: రష్మిక
అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీతో బ్లాక్బస్టర్ హిట్ అందుకుంది రష్మిక మందన్నా. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో కుబేర, చావ, సికిందర్, ద గర్ల్ఫ్రెండ్, థామ సినిమాలున్నాయి. ఇకపోతే సికిందర్ సినిమా విశేషాలను తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది రష్మిక.ఆరోగ్యం బాగోలేకపోయినా..ఆమె మాట్లాడుతూ.. సల్మాన్ ఖాన్తో నటించడమనేది గొప్ప విషయం. ఆయన చాలా ప్రత్యేకమైన వ్యక్తి. అలాగే ఎంతో హుందాగా ఉంటాడు. ఒకసారి నాకు ఆరోగ్యం బాగోలేదు. అయినా షూటింగ్కు వెళ్లాను. నా పరిస్థితి తెలిసిన సల్మాన్ సర్ ఎలా ఉంది? అంతా ఓకేనా? అని ఆరా తీశాడు. స్పెషల్ కేర్మంచి హెల్తీ ఫుడ్, వేడి నీళ్లు అన్నీ ఏర్పాటు చేయమని అక్కడున్నవారికి చెప్పాడు. నన్ను చాలా బాగా చూసుకున్నాడు. స్పెషల్ కేర్ చూపించాడు. దేశంలోనే బడా స్టార్స్లో ఒకరైనప్పటికీ ఎంతో అణుకువతో ఉంటాడు. సికిందర్ నాకెంతో స్పెషల్ మూవీ. ఈ సినిమా కోసం ఎంతో ఎగ్జయిట్గా ఉన్నాను అని రష్మిక చెప్పుకొచ్చింది.చదవండి: రాజకీయాల్లోకి అల్లు అర్జున్.. క్లారిటీ ఇచ్చిన టీమ్ -
సల్మాన్ ఖాన్కు మళ్లీ బెదిరింపులు
ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు మరోసారి బెదిరింపులు ఎదురయ్యాయి. బుధవారం రాత్రి ముంబైలోని దాదర్ ప్రాంతంలో సల్మాన్ సినిమా షూటింగ్లో ఉండగా, ఓ వ్యక్తి సెట్లోకి ప్రవేశించాడు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయి పేరును ప్రస్తావిస్తూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. షూటింగ్లో ఉన్న ఇతర సిబ్బంది అతడిని బంధించారు. పోలీసులు రంగంలోకి దిగి సదరు గుర్తు తెలియని వ్యక్తిని అరెస్టు చేశారు. ప్రస్తుతం శివాజీ పార్కు పోలీసులు అతడిని విచారిస్తున్నారు. కృష్ణ జింకలను వేటాడిన కేసులో దోషిగా తేలిన సల్మాన్కు గతంలో లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ నుంచి పలుమార్లు హెచ్చరికలు వచ్చిన సంగతి తెలిసిందే. -
తమిళ్ డైరెక్టర్స్ నే నమ్ముకున్న సల్మాన్ ఖాన్
-
రేపు నువ్వే నాకు తల్లిగా నటిస్తావ్.. హీరోయిన్ను ఏడిపించిన హీరో
ఇప్పుడు నా పక్కన హీరోయిన్గా చేస్తున్నావ్ కానీ, తర్వాత నాకు తల్లిగా కూడా నటిస్తావ్.. అంటూ కథానాయిక దియా మీర్జాను ఏడిపించాడట సల్మాన్ ఖాన్. వీరిద్దరూ తుమ్కో నా భూల్ పయేంగే (2002) అనే సినిమాలో తొలిసారి కలిసి నటించారు. ఆనాటి జ్ఞాపకాలను దియా తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది. అప్పట్లో హీరోయిన్.. ఇప్పుడు తల్లి!ఆమె మాట్లాడుతూ.. తుమ్కో నా భూల్ పయేంగే సినిమా షూటింగ్లో సల్మాన్కు తల్లిగా యాక్ట్ చేసిన నటి తన షాట్ కోసం ఎదురుచూస్తోంది. అప్పుడు సల్మాన్ నా దగ్గరకు వచ్చి.. ఆమె గతంలో అతడి సినిమాలో హీరోయిన్గా నటించిందన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. అస్సలు నమ్మలేదు. దీంతో అతడు.. అవును, మొదట్లో నా పక్కన హీరోయిన్గా చేసిందని నొక్కి చెప్పాడు.ఆ రోజు రాకూడదని కోరుకున్నా..నీ వయసులో ఉన్న నటి నీకు తల్లిగా నటించడమేంటని షాకయ్యాను. అతడు మాత్రం.. ఏదో ఒక రోజు నువ్వు కూడా నా తల్లి పాత్రలో యాక్ట్ చేస్తావ్ అన్నాడు. అలాంటి రోజు రాకూడదని కోరుకున్నాను. ఈ సంఘటన నేను ఎన్నటికీ మర్చిపోలేను. కానీ సల్మాన్ చాలా సరదా మనిషి. అప్పట్లో సెట్లో ఆడవాళ్లు తక్కువగా ఉండేవాళ్లు. ఆ సమయంలో నన్నెంతో జాగ్రత్తగా చూసుకునేవాడు అని చెప్పుకొచ్చింది.ఎవరీ దియా?ఇకపోతే దియా మీర్జా.. రెహనా హై తేరే దిల్ మే, దమ్, తెహజీబ్, పరిణీత, దస్, ఫైట్ క్లబ్ మెంబర్స్ ఓన్లీ, లగే రహో మున్నా భాయ్, హనీమూన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్, సంజు, థప్పడ్ వంటి చిత్రాల్లో నటించింది. చివరగా.. ఐసీ 814: ద కాందహర్ హైజాక్ అనే వెబ్ సిరీస్లో మెరిసింది.చదవండి: డబుల్ ఎలిమినేషన్.. తేజ అవుట్.. మరి అవినాష్? -
పోలీసులను గౌరవించేవాడిని కాదు..: సల్మాన్ ఖాన్
మనిషి ఎప్పుడూ ఒకేలా ఉండడు. కాలం మారేకొద్దీ తను ఎంతోకొంత మారుతూ ఉంటాడు. అలా తాను కూడా చాలా మారానంటున్నాడు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్. హిందీ బిగ్బాస్ 18వ సీజన్కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆయన వీకెండ్ కా వార్ ఎపిసోడ్లో పాల్గొన్నాడు. రజత్ అనే కంటెస్టెంట్ ప్రవర్తన తప్పని వారించాడు. ఒకప్పుడు నాదీ అదే యాటిట్యూడ్ఎవరైనా ఉన్నప్పుడు టేబుల్పై దర్జాగా కాలుపెట్టి మాట్లాడటం తప్పని, ఆ యాటిట్యూడ్ మార్చుకోవాలని హితవు పలికాడు. తాను కూడా ఒకప్పుడు రూడ్గా ఉండేవాడినంటూ అందుకు సంబంధించిన ఓ ఉదాహరణను చెప్పుకొచ్చాడు. టేబుల్కు కాళ్లు అనించే అలవాటు నాక్కూడా ఉంది. గతంలో ఓ పోలీస్ స్టేషన్లో కాళ్లు టేబుల్కు ఆనించి ఠీవీగా కూర్చున్నాను. నేను ఏ తప్పూ చేయనప్పుడు ఎందుకు భయపడాలి? అన్నట్లుండేది నా వాలకం. పొగరుగా..కానీ ఎవరైనా సీనియర్ అధికారులు బ్యాడ్జ్ ధరించి వచ్చినప్పుడు లేచి గౌరవించాలి. ఆ పాత క్లిప్పింగ్స్ చూసినప్పుడు నేనేమీ గర్వంగా ఫీలవను. అంత పొగరుగా కూర్చోవాల్సిన అవసరమేముంది? అనుకునేవాడిని. పోలీసులను అగౌరవపర్చేలా అంత అహంకారంగా ఎందుకు ప్రవర్తించాననుకున్నాను. ఎంత అనుకున్నా.. దాన్నిప్పుడు మార్చలేను కదా! నీ కంటే పెద్ద గొంతుఇప్పుడు నీపై కూడా అంతే రూడ్గా మాట్లాడొచ్చు. నీ కంటే నా గొంతు పెద్దది. కానీ నేనలా గొంతు పెంచి అరవాలనుకోవడం లేదు అని చెప్పాడు. తన తప్పు అందరి ముందు ఒప్పుకోవాలంటే గుండె ధైర్యం కావాలి.. నువ్వు రియల్ హీరో అంటూ సల్మాన్ను పొగుడుతూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by 𝐀𝐧𝐮𝐬𝐡𝐚 𝐆𝐡𝐨𝐬𝐡 ♡ (@anusha_salmankhan)మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ది కపిల్ శర్మ షో వివాదం.. సల్మాన్ ఖాన్ టీమ్ క్లారిటీ!
ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్లో ప్రసారం అవుతోన్న స్టార్ కమెడియన్ కపిల్ శర్మ షో.. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో. ఈ షోకు కపిల్ శర్మ హోస్ట్గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షోకు ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. అయితే ఇటీవల ఓ ఎపిసోడ్లో రవీంద్రనాథ్ ఠాగూర్ వారసత్వాన్ని అగౌరవపరిచేలా చూపించారంటూ ఓ వర్గం ఆరోపించింది. ఈ నేపథ్యంలో బొంగో భాషి మహాసభ ఫౌండేషన్ వారికి లీగల్ నోటీసులు పంపింది. ఈ షో తమను కించపరిచేలా ఉందని.. సాంస్కృతిక, మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉందని నోటీసుల్లో పేర్కొంది.అన్ని అవాస్తవాలే...అయితే ఈ వివాదం తర్వాత సల్మాన్ ఖాన్ టీమ్కు ఈ షోతో సంబంధాలు ఉన్నాయని సామాజిక మాధ్యమాల్లో వార్తలొచ్చాయి. ఆయనకు చెందిన ఎస్కేటీవీకి లీగల్ నోటీసులు వచ్చినట్లు రాసుకొచ్చారు. తాజాగా ఈ ఆరోపణలపై సల్మాన్ ఖాన్ టీమ్ స్పందించింది. అసలు ఆ షోతో సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మాపై వస్తున్న కథనాల్లో ఎలాంటి నిజం లేదని స్టేట్మెంట్ విడుదల చేశారు.కాగా.. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సికిందర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది. -
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం జోరుగా : కన్నెత్తి చూడని బాలీవుడ్ సెలబ్రిటీలు
సాక్షి ముంబై: ఎన్నికల ప్రచారంలో సినీతారలకు ప్రజల్లో ఉన్న క్రేజే వేరు. పంచ్ డైలాగులు, హావభావాలతో రోడ్ షోలు, ఎన్నికల సభలను రక్తికట్టించడంలో వారికి వారే సాటి. అందుకే ఓటర్లను ఆకర్షించేందుకు ఓ మాదిరి ఆర్టిస్టుల దగ్గర్నుంచి బడా నటీనటుల వరకూ రాజకీయ పార్టీలు తమ తరపున ప్రచారం చేయమంటూ ఆహ్వానించడం పరిపాటి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నప్పటికీ పలువురు సినీ, బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రం ఈవైపు కన్నెత్తి చూడడం లేదు. క్యాంపెయినింగ్కు దూరంగా బాలీవుడ్.. గతంలో ప్రముఖ రాజకీయ పార్టీల తరపున విస్తృతంగా ప్రచారం చేసిన అనేక మంది బాలీవుడ్ తారలు ఇప్పుడు ఊరుకోవడమే ఉత్తమమని భావిస్తున్నారు. కొందరు మినహా అనేక మంది సినీ ప్రముఖులు ప్రచార సభలు, రోడ్షోలకు దూరంగా ఉంటున్నారు. సల్మాన్ ఖాన్ ఇంటిపై ఇటీవల కాల్పులు జరగటం, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని బిష్ణోయి గ్యాంగ్ హత్య చేయడం, సల్మాన్ఖాన్, షారుఖ్ ఖాన్లకు కూడా ఈ గ్యాంగ్ ద్వారా బెదిరింపు ఫోన్లు రావడం వల్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ప్రముఖ బాలీవుడ్ తారలతోపాటు చిన్న చిన్న పాత్రలు పోషించే ఆర్టిస్టులు కూడా మనకెందుకొచ్చిన గొడవలే అన్నట్లుగా మిన్నకుంటున్నారు. ఒకవేళ ఎవరైన బడా నేతలు ప్రచారానికి రావాలని అడిగినా షూటింగుల్లో బిజీగా ఉన్నామని, విదేశాల్లో ఉన్నామని చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకే... లోక్సభ, అసెంబ్లీ, కార్పొరేషన్ ఇలా ఎలాంటి ఎన్నికలు వచి్చనా ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పారీ్టలు అనేక విధాలుగా ప్రయత్నిస్తాయి. అందులో ముఖ్యంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు బాలీవుడ్ తారలను ప్రచారంలోకి దింపడం ఒక ఫ్యాషన్గా మారిన సంగతి తెలిసిందే. ఇలాంటి సభలకు పెద్ద సంఖ్యలో జనాలు వస్తారని, వీరి మాటల ప్రభావంతో ఓటర్లు తమ పార్టీ అభ్యరి్ధకి ఓటు వేస్తారని నేతల ప్రగాఢ నమ్మకం. మాజీ మంత్రి, ఇటీవలే హత్యకు గురైన బాబా సిద్దీఖీ తరపున గతంలో అనేక మంది ప్రముఖ బాలీవుడ్ నటులు ప్రచారంలో పాల్గొన్నారు. అప్పట్లో సిద్దిఖీ నిర్వహించే సభలు, ర్యాలీలు, రోడ్ షోలలో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ లాంటి అనేక మంది దిగ్గజ సెలిబ్రిటీలు కనిపించేవారు. ఆయన విజయంలో ఇది కూడా పరిగణించదగ్గ అంశమని రాజకీయ వర్గాల అభిప్రాయం. కానీ ఇటీవల ఆయన హత్యకు గురికావడంతో బాలీవుడ్ తారల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఈ హత్య తామే చేసినట్లు బిష్నోయి గ్యాంగ్ అంగీకరించడంతో పాటు పలువురు సెలబ్రిటీలకు ఈ గ్యాంగ్ నుంచి బెదిరింపులు రావడంతో ప్రచార సభలకు సా««ధ్యమైనంత దూరంగా ఉండాలని వారంతా భావిస్తున్నారు. ప్రాంతీయ నటులతో ప్రచారం... గతంలో మాదిరిగా ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల కోసం అనేక మంది సినీ తారలను స్టార్ క్యాంపెయినర్లుగా నియమించినప్పటికీ ఈసారి వారంతా ముఖం చాటేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యక్షంగా ప్రచార సభలకు హాజరయ్యేందుకు వారు నిరాకరిస్తుండటంతో రాజకీయ పారీ్టలు గత్యంతరం లేక ప్రాంతీయ సినిమా, స్టేజీ ఆరి్టస్టులను ప్రచారం నిర్వహించాల్సిందిగా కోరుతున్నాయి. దీంతో మరాఠీ సినీ, నాటక రంగానికి చెందిన తారలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. కొన్ని గంటల ప్రచారానికి కొంతమంది రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఇక రోజంతా ప్రచారంలో పాల్గొనాలంటే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు కూడా వసూలు చేస్తున్నారు. ఇక ఏ గ్రేడ్ తారలైతే రూ.20–35 లక్షల వరకూ డిమాండ్ చేస్తున్నారని సమాచారం. దీంతో మరోదారి లేక వారడిగినంత చెల్లించి ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి రాజకీయ పార్టీలు. కాగా కొందరు మరాఠీ నటుల మాత్రం రాజకీయ పార్టీలతో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని ఉచితంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం... దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన, జరగనున్న ఎన్నికల్లో ప్రచారం విషయంలో ఈసారి సోషల్ మీడియాదే అగ్రస్థానం. తాము చెప్పదలచుకున్న విషయాలను, వివరించదలచిన అంశాలను సూటిగా, స్పష్టంగా, నిమిషాల వ్యవధిలో ఓటర్లకు చేర్చడంలో ఇది అత్యంత ప్రభావవంతమైన మాధ్యమం కావడంతో రాజకీయ పార్టీలు బహిరంగ సభలు, రోడ్షోలు, ఇంటింటి ప్రచారంతోపాటు సోషల్ మీడియాను కూడా విస్తృతంగా వినియోగించుకుంటున్నాయి. బాలీవుడ్ తారలు ప్రత్యక్ష ప్రచారంలో పాల్గొనక పోయినప్పటికీ వారి వాయిస్ రికార్డింగులు, వీడియోలను ఫేస్ బుక్, ఇన్స్ట్రాగామ్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలు వైరల్గా మారి తమకు భారీగా ఓట్లు దక్కే అవకాశముందని అభ్యర్ధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.తెలుగు ఓటర్ల కోసం ప్రత్యేకంగా...ముంబై సహా మహారాష్ట్ర సరిహద్దులైన విదర్భ. మరఠ్వాడాలోని చంద్రాపూర్, నాందేడ్, బల్లార్పూర్తోపాటు నాసిక్, ముంబై. పుణే, సోలాపూర్ తదితర ప్రాంతాల్లో తెలుగు ప్రజలు అధికంగా నివసిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతాల పరిధిలోని నియోజక వర్గాలలో పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి నటీనటులతోపాటు తెలుగు నేతలను ప్రచార రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు ఉత్తమకుమార్ రెడ్డి, సీతక్క, ఇతర కాంగ్రెస్ నేతలు మహావికాస్ ఆఘాడి, కాంగ్రెస్లకు మద్దతుగా ర్యాలీలు, రోడ్ షోల ద్వారా విస్తత ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతుగా ప్రచారం చేయడానికి అంగీకరించినట్లు సమాచారం. బీజేపీ, టీడీపల మధ్య పొత్తు కుదిర్చేందుకు పవన్ ఎంతో కృషి చేశారు. ఈ నేపథ్యంలో తెలుగు ప్రజలుండే నియోజక వర్గాలలో బీజేపీ అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారం చేయడానికి ఆయన స్వయంగా రంగంలోకి దిగనున్నారని తెలుస్తోంది నో స్టార్స్... ఓన్లీ క్యాంపెయినింగ్ క్యాంపెయిన్లో పాల్గొననున్న మరాఠీ తారలు వీరే ...నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) (అజిత్ పవార్ వర్గం)–శాయాజీ శిందే, భావు కదం. శివసేన (ఏక్నాథ్ శిందే)–గోవిందా, శరద్ పోంక్షే. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్)–ప్రజక్తా మాళీ, తేజస్వినీ పండిట్. ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం)–అమోల్ కోల్హే. బీజేపీ–ప్రియా బేర్డే, నిశా పరుళేకర్. -
అసలు హీరో అనిల్ను వదిలేసి.. లారెన్స్కు ప్రాధాన్యం.. కరెక్ట్ కాదు!
ఒక లక్ష్యం కోసం దశాబ్దాలుగా అవిశ్రాంతంగా శ్రమిస్తూ, పని చేస్తున్నవారు సమాజంలో చాలా అరుదుగా ఉంటారు. 48 ఏళ్ల అనిల్ బిష్ణోయ్ అటువంటివాడే. ఆయన విద్యావంతుడే కాదు రైతు కూడా! ఆవాలు, పత్తి పండించేవాడు. వన్యప్రాణుల ప్రేమికుడు, జంతువులు... ముఖ్యంగా కృష్ణ జింకలు అంటే ఆయనకు చిన్నతనం నుంచీ ప్రేమ ఎక్కువ! జంతువులను వేటాడేవారిని అతడు తీవ్రంగా నిరసిస్తాడు. హనుమాన్గఢ్లోని శ్రీగంగానగర్లో జంతువులను రక్షించే మిషన్ను ప్రారంభించడానికి వేటగాళ్లే కారణం అంటాడు అనిల్.బిష్ణోయ్ కమ్యూనిటీ వారికి కృష్ణ జింక పవిత్ర జంతువు. ఈ కమ్యూనిటీ వారి గురువైన భగవాన్ జాంబేశ్వర్ అడవినీ, వన్యప్రాణులనూ రక్షించాలనీ, తద్వారా మాత్రమే పర్యావరణ పరి రక్షణ ఉంటుందనీ చెప్పేవారు! ఆ బోధనల ప్రభావం బిష్ణోయ్ కమ్యూ నిటీపై ఎక్కువ ఉంది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మీద ఇదే ప్రాంతంలో జింకను చంపిన కేసు నమోదు అవ్వడం గమనార్హం. ఇప్పుడు ఆయనకు చంపుతామనే బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తున్న అంశం. నిజానికి బిష్ణోయ్ సమాజానికి చెందినవారు సల్మాన్ను తమ మందిర్కు వచ్చి క్షమాపణ కోరమన్నారు. దీనిని ఆసరా చేసుకుని జైల్లో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ అనే గ్యాంగస్టర్ ముఠా బెదిరింపులకు దిగిందని అంటారు. జాతీయ మీడియా అసలు హీరో అనిల్ను వదిలేసి లారెన్స్కు అధిక ప్రాధాన్యం ఇవ్వడం సరికాదు.హనుమాన్ గఢ్ జిల్లా శ్రీగంగా నగర్కు చెందిన అనిల్ చిన్న నాటి నుంచే జింకల వేటగాళ్ల పట్ల కోపంగా ఉండేవాడు! వారిని పోలీస్లకు పట్టించేవాడు, సాక్ష్యం చెప్పి వారికి శిక్షలు పడే విధంగా చూసేవాడు! 30 ఏళ్లుగా ఈ సంరక్షకుడు 10 వేల కృష్ణ జింకలను వేటగాళ్ల ఉచ్చు నుంచి కాపాడాడు! వాటి రక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. గత మూడు దశా బ్దాలుగా జింకల రక్షణ కోసం ప్రచారం చేస్తున్నాడు. చదవండి: ఆ ప్రాజెక్టుకు పది లక్షల చెట్ల బలి!50 పంచాయతీలలో కృష్ణ జింకల సహజ అవాసాలకు కలిగిన నష్టం, వేటగాళ్ల దుశ్చర్యల గురించి ప్రచార కార్యక్రమం చేపట్టాడు. కృష్ణ జింకలకు నీరు వంటి కనీస వసతులు కల్పించడానికి పూనుకుని... తన గ్రామ ప్రజల నుంచి రెండు లక్షల రూపాయలు చందా పోగు చేశాడు. దానికి తన సొంత డబ్బు కొంత జతచేసి కృష్ణ జింకల అవసరాలను తీర్చడానికి 60కి పైగా చిన్న, మధ్య తరహా నీటి వనరులను ఏర్పాటు చేశాడు. వాటికి గాయాలు అయినపుడు చికిత్స ఏర్పాట్లు కూడా చేశాడు.చదవండి: వ్యక్తిగా రతన్ టాటా ఎలా ఉండేవారు?1990లో సూరత్ గఢ్లో కళాశాల చదువు చదువుతున్న కాలంలోనే అటవీ రక్షణ, వన్య ప్రాణుల రక్షణ మీద జరిగిన ఒక సదస్సులో అనిల్ పాల్గొన్నాడు. ‘ఈ సదస్సు నా మనస్సుపై చాలా ప్రభావాన్ని చూపింది’ అంటాడు అనిల్! బీఏ. బీఈడీ చదువు పూర్తి కాగానే గ్రామానికి వచ్చి వ్యవసాయం చేయడం మొదలు పెట్టాడు. రాజస్థాన్ లోని 12 జిల్లాలలో 3,000 మంది వివిధ ఉద్యోగాలు చేసుకునే వారితో కలిసి వన్యప్రాణ రక్షణ మీద, శాంతి ర్యాలీలు, సమావేశాలు పెట్టడం మొదలు పెట్టాడు. ఇప్పటి దాకా వేటగాళ్ల మీద 200లకు పైగా కేసులు నమోదు చేయడం జరిగింది. ఇందులో 30 కేసులు ముగింపు దశకు చేరాయి. కొందరికి జరిమానాలు పడ్డాయి. అనిల్ బిష్ణోయ్ తుంహే సలాం! – ఎండి. మునీర్సీనియర్ జర్నలిస్ట్ -
హైదరాబాద్లో సల్మాన్ ఖాన్.. ఆ హోటల్లో కఠిన నిబంధనలు!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సికందర్ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రం సల్లు భాయ్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. సిటీలో రాయల్ హోటల్గా గుర్తింపు ఉన్న ఫలక్నుమా ప్యాలెస్లోనూ షూటింగ్ నిర్వహిస్తున్నారు.అయితే సల్మాన్ ఖాన్కు ఇటీవల వరుసగా బెదిరింపులు వస్తోన్న సంగతి తెలిసిందే. కృష్ణజింకల కేసు నుంచి ప్రముఖ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి ఆయనకు బెదిరింపులు వస్తున్నాయి. సల్మాన్ను చంపేస్తామంటూ కొందరి నుంచి కాల్స్ వస్తుండటంతో ఆయనకు కట్టుదిట్టమైన భద్రతను పెంచారు. అలా ఫుల్ సెక్యూరిటీ మధ్య ఆయన షూటింగ్కు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.నాలుగంచెల భద్రత..ఈ నేపథ్యంలో ఫలక్నుమా ప్యాలెస్ హోటల్లో నాలుగు అంచెల భద్రతలో సల్మాన్ ఖాన్ మూవీ షూటింగ్ నిర్వహించారు. ఆయన భద్రత విషయంలో రాజీ పడకూడకుండా నిర్మాతలు చర్యలు తీసుకున్నారు. ఎవరైనా అతిథులు షూటింగ్ జరుగుతున్న హోటల్ను బుక్ చేసుకుంటే రెండంచెల చెకింగ్ను వారు ఎదుర్కొవాల్సి ఉంటుంది. వాటిలో ఒకటి హోటల్ సెక్యూరిటీ సిబ్బంది.. మరొకటి సల్మాన్ ఖాన్ ప్రత్యేక భద్రత బృందం వారిని తనిఖీ చేయాలి. ఆ తర్వాతే వారిని హోటల్లోకి అనుమతించడం జరుగుతుంది.ఐడీ ఉంటేనే అనుమతి...మరోవైపు హోటల్ సిబ్బందికి ఐడీ కార్డులు ఉంటేనే లోపలికి ఎంట్రీ ఉంటుంది. ప్రతి రోజు సిబ్బంది ఐడీలను సైతం తనిఖీ చేస్తున్నారు. సల్మాన్ కోసం ఫలక్నుమా ప్యాలెస్ను పటిష్టమైన భద్రతా వలయంగా మార్చారు. ఆయన కోసం దాదాపు 50 నుంచి 70 వరకు ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీని నియమించారు. వీరిలో మాజీ పారామిలటరీ సిబ్బంది కూడా ఉన్నారు. అయితే హైదరాబాద్లో షూటింగ్ షెడ్యూల్ను ముగించిన తర్వాత సల్మాన్ దుబాయ్కు వెళ్లనున్నట్లు సమాచారం.కాగా.. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ సికందర్ను సాజిద్ నడియాడ్వాలా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్ శెట్టి, కాజల్ అగర్వాల్లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. -
బిగ్బాస్ హోస్టింగ్కు బ్రేక్ ఇచ్చిన స్టార్ హీరో
బిగ్బాస్ షోలో వారం రోజులు కంటెస్టెంట పర్ఫామెన్స్ చూస్తే వీకెండ్లో హోస్ట్ వారికి ఎలా కోటింగ్ ఇస్తారు? ఎవరిని మెచ్చుకుంటారు? అని ఎదురుచూస్తుంటారు ఆడియన్స్. అందుకే వీకెండ్లో రేటింగ్ కూడా ఎక్కువే ఉంటుంది. కొందరు హీరోలు బిగ్బాస్ బాధ్యతను ఏళ్ల తరబడి భుజాలపై మోస్తున్నారు. బిగ్బాస్ షోకు డుమ్మావారిలో సల్మాన్ ఖాన్ ముందు వరుసలో ఉంటాడు. దాదాపు 15 ఏళ్లుగా ఆయన హిందీ బిగ్బాస్ షోకు హోస్ట్గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం 18వ సీజన్కు హోస్టింగ్ చేస్తున్నాడు. అయితే ఈ వారం అతడు షూటింగ్కు డుమ్మా కొట్టనున్నాడట! ప్రస్తుతం అతడు సికిందర్ సినిమా చేస్తున్నాడు. హైదరాబాద్లో సినిమా షెడ్యూల్ ఉండటంతో బిగ్బాస్ షో నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నాడు. సల్మాన్ స్థానంలో ఆ సెలబ్రిటీలుదీంతో ఈ వారం వీకెండ్ కా వార్ ఎపిసోడ్లో సల్మాన్ స్థానంలో సెలబ్రిటీలు ఏక్తా కపూర్, రోహిత్ శెట్టి రానున్నారు. వీళ్ల స్పెషల్ ఎంట్రీ గురించి షో నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు. ఇక సికిందర్ సినిమా విషయానికి వస్తే.. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. సాజిద్ నదియావాలా నిర్మిస్తున్నాడు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) చదవండి: నన్ను క్షమించండి.. తప్పు చేయలేదు: కస్తూరి -
వారి పిల్లలు చెట్లు, దైవం కృష్ణజింక
సల్మాన్ఖాన్కు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి బెదిరింపులు రావడంతో బాలీవుడ్ సూపర్స్టార్కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ‘కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్ఖాన్ నిర్దోషి’ అని అతని తండ్రి సలీంఖాన్ ప్రకటనపై బిష్ణోయ్ సంఘాలు నిరసన ప్రకటించాయి. ఈ నేపథ్యంలో కృష్ణజింకలు, వాటితో బిష్ణోయ్ సమాజానికి ఉన్న అనుబంధం మరో సారి వార్తల్లోకి వచ్చింది.వారిది 550 సంవత్సరాల అనుబంధం!పదిహేనవ శతాబ్దంలో గురు జంబేశ్వర్ (జాంబాజీ అని కూడా పిలుస్తారు) స్థాపించిన బిష్ణోయ్ శాఖ 29 సూత్రాలతో మార్గనిర్దేశం చేయబడింది. జాంబాజీ బోధనలు వన్య ప్రాణులు, చెట్ల ప్రాముఖ్యత, సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తాయి. కృష్ణజింకను తమ ఆధ్యాత్మిక గురువుగా జాంబేశ్వర్ పునర్జన్మగా నమ్మి పూజిస్తారు.బిష్ణోయ్ల జానపద కథల్లోనూ కృష్ణజింక ప్రధానంగా కనిపిస్తుంది. కృష్ణజింకను తన ప్రతీకగా, వ్యక్తీకరణగా ఆరాధించమని జాంబేశ్వర్ తన అనుచరులకు ఆదేశించినట్లు చెబుతారు. తాము కృష్ణజింకలుగా పునర్జన్మ పొందుతామని బిష్ణోయ్లు నమ్ముతారు.చెట్లను బిడ్డల్లా చూసుకోవడం విషయానికి వస్తే...1730లో జోద్పూర్ సమీపంలోని ఖేజర్లీ గ్రామంలో చెట్లను నరికి వేయకుండా కాపాడే క్రమంలో 362 మంది బిష్ణోయిలు మరణించారు. జోద్పూర్ మహారాజా అభయ్సింగ్ ఆదేశాల మేరకు ఈ మారణకాండ జరిగింది.కొత్త రాజభవనాన్ని నిర్మించడానికి అభయ్ సింగ్ కలప కోసం చెట్లను నరికి వేయడానికి సైనికులను పంపాడు. అమృతాదేవి అనే మహిళ నాయకత్వంలో బిష్ణోయ్ ప్రజలు ప్రతిఘటించారు. అమృతాదేవి తదితరులు చెట్లను కౌగిలించుకొని వాటిని రక్షించడానికి సాహసోపేతంగా ప్రతిఘటించారు. ఈ సంఘటన 1973 చిప్కో ఉద్యమానికి ప్రేరణ ఇచ్చింది.(చదవండి: భారతీయ వంటకాలపై రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి పొగడ్తల జల్లు..!) -
హైదరాబాద్లో ఫుల్ సెక్యూరిటీతో సల్మాన్ ఖాన్.. కారణం ఇదే..!
సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘సికందర్’. ఇప్పుడు ఈ మూవీ చిత్రీకరణ హైదరాబాద్లో జరగనుంది. ఈమేరకు సల్మాన్ భాగ్యనగరానికి వచ్చారు. ఈ మూవీకి సాజిద్ నడియాడ్వాలా నిర్మాతగా ఉన్నారు. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించనున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్లో సికందర్గా సల్మాన్ ఖాన్ కనిపించనున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ముంబైలో ప్రారంభమైంది.'కిక్' సినిమా తర్వాత సాజిద్, సల్మాన్ కలయికలో రానున్న చిత్రం కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే, ఈ మధ్య కాలంలో సల్మాన్ను చంపేస్తామంటూ కొందరి నుంచి బెదిరింపుల కాల్స్ వస్తుండటంతో ఆయన సెక్యూరిటీని పెంచుకున్నారు. ప్రస్తుతం ఆయన ఎక్కడికెళ్లినా ఫుల్ సెక్యూరిటీతోనే వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే, ఇప్పుడు షూటింగ్ కోసం ఇలాంటి పరిస్థితిల్లో హైదరాబాద్కు సల్మాన్ రావడంతో అందరిలోనూ ఆసక్తిగా ఉంది.హైదరాబాద్లో రాయల్ ప్యాలెస్గా గుర్తింపు ఉన్న ఫలక్నుమా ప్యాలెస్లో సికిందర్ షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించనున్నారు. నవంబర్ 7వరకు సల్మాన్ షూటింగ్లో పాల్గొననున్నారు. వచ్చే ఏడాది ఈద్కి 'సికందర్' సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్కు ఎలాంటి డూప్ సాయం లేకుండా సల్మాన్ నటించనున్నారు. -
సల్మాన్ ఖాన్ (బాలీవుడ్ స్టార్)రాయని డైరీ
తప్పులు మానవ సహజం అయినప్పుడు శిక్షలు అమానుషంగా ఎందుకు ఉండాలి?! చట్టాల గురించి, బిష్ణోయ్ లారెన్స్ గ్యాంగ్ గురించీ కాదు నా ఆలోచన. శిక్షను విధిస్తు న్నట్లు తెలియపరచకుండానే మూతి బిగింపుల మౌనంతో యావజ్జీవ దూరాన్ని పాటిస్తుండే సొంత మనుషుల గురించి, ‘నా’ అనుకున్నా, నా వాళ్లు కాకుండా పోయిన వాళ్ల గురించి. చట్టం విధించే శిక్ష నిర్దాక్షిణ్యమైనదిగా కనిపించవచ్చు. కానీ, ఏ రూల్ బుక్కూ లేకుండా మనిషికి మనిషి విధించే శిక్ష అన్యాయమైనది. న్యాయం లేకపోవటం కన్నా దయ లేకపోవటం ఏమంత చెడ్డ విషయం?!శిక్షల విధింపులో చట్టానికి ఒక చక్కదనం ఉంటుంది. ఒక సక్రమం ఉంటుంది. చింపిరి జుట్టుకు దువ్వెన, దారిలో పెట్టే దండన... చట్టం.కారును ఢీకొట్టించు. జింకను వేటాడు. ఆయుధాలు కలిగి ఉండు. 26/11 పై కామెంట్లు చెయ్యి. యాకూబ్ మెమన్ మీద ట్వీట్లు పెట్టు. దరిద్రం నీ నెత్తి మీద ఉండి ఆఖరికి ఐశ్వర్యారాయ్ పైన కూడా చెయ్యి చేస్కో. నువ్వెన్ని చేసినా... చట్టం వెంటనే నిన్ను దూలానికి వేలాడదీయదు. శూలాలతో పొడిపించదు. మొదట విచారణ జరుపుతుంది. వాదనలు వింటుంది. వాయిదాలు వేస్తుంది. తీర్పును రిజర్వు చేస్తుంది. ఆ తర్వాతే నువ్వు దోషివో, నిర్దోషివో తేలుస్తుంది. దోషివైతే జైలుకు పంపుతుంది. కావాలంటే బెయిలిస్తుంది.మనుషులు విధించే శిక్షలో ఇవేవీ ఉండవు. దువ్వెనా, దండనా అసలే ఉండవు. దూరంగా జరిగిపోతారంతే. ‘‘ఎలా ఉన్నావ్?’’ అని అడిగేందుకైనా దగ్గరకు రారు. ‘‘భద్రంగా ఉండు..’’ అని చెప్పేందుకైనా దూరాన్ని తగ్గించుకోరు. ఎంత అమానుషం!!‘‘నువ్వు పెంచుకున్న దూరమే ఇది సల్మాన్..’’ ఎంత తేలిగ్గా అనేస్తారు!బంధాలను కదా నేను పెంచుకున్నాను. దూరాలనా?! స్నేహబంధం, ప్రేమబంధం, జీవితబంధం... అన్ని బంధాలనూ తెంచుకుని వెళ్లింది ఎవరు?!‘‘కానీ సల్మాన్, నువ్వొట్టి పొసెసివ్. గట్టిగా పట్టేసుకుంటావ్. ఎటూ కదలనివ్వవు. ఎటూ చూడనివ్వవు. ఏదీ మాట్లాడనివ్వవు. ఏమీ చెప్పనివ్వవు. దాన్నేమంటారు మరి? దూరం పెరగటమే కదా! నువ్వు పెంచుకున్న దూరం..’’ అంటారు!కేరింగ్ను పొసెసివ్ అని ఎందుకు అనుకుంటారు వీళ్లంతా?! కేరింగ్ అవసరం లేదని చెయ్యి విడిపించుకున్నప్పుడు దూరం పెరిగితే అది చెయ్యి వదిలిన వాళ్లు పెంచుకున్న దూరం అవుతుందా?!రోజుకొకరు ఫోన్ చేసి, ‘‘సల్మాన్ నిన్ను చంపేస్తాం’’ అని బెదిరిస్తున్నారు. వాళ్లు నయం కదా... ‘‘సల్మాన్ బాగున్నావా?’’ అని పరామర్శగా ఒక్క కాల్ అయినా చేయకుండా జూహూలో, బాంద్రాలో ఏళ్లకు ఏళ్లు నాకు ‘దగ్గరగా’ ఉంటున్న వారి కంటే!బయట క్రాకర్స్ పేలుతున్నాయి. గన్ పేలి నప్పుడు వచ్చే శబ్దం ప్రత్యేకంగా ఏమీ ఉండదు. సైలెన్సర్ బిగిస్తే అసలు శబ్దమే ఉండదు.నవ్వొచ్చింది నాకు. నా చుట్టూ ఉన్న వాళ్లంతా మౌనాన్ని బిగించుకున్న తుపాకుల్లా అయిపోయారా! సైలెన్సర్ ఉన్న బులెట్ మౌనంగా ఒకసారే దిగిపోతుంది. మౌనం అదేపనిగా బులెట్లను దింపుతూ ఉంటుంది.లేచి బాల్కనీ లోకి వచ్చాను. ఒక్కక్షణం నాకు గెలాక్సీ అపార్ట్మెంట్లో ఉన్నానో, పాన్వెల్ ఫామ్హౌస్లో ఉన్నానో అర్థం కాలేదు. ఎక్కడుంటే ఏమిటి, పక్కన మనిషే లేనప్పుడు? పలకరింపు కూడా కరువైనప్పుడు!కళ్లెదురుగా ఆకాశం వెలిగి ఆరిపోతూ, వెలిగి ఆరిపోతూ ఉంది. ఎగసిన కాంతి పూలు ఫెటేల్మని విచ్చుకుని, చప్పున అంతెత్తు నుంచి చీకట్లోకి జారిపోతున్నాయి.ఏనాడో జీవితంలోంచి వెళ్లిపోయినవారు ఇప్పుడు ఒక్కొక్కరూ గుర్తుకు వస్తున్నారంటే.. కష్టంలో ఉన్నామనా? కష్టాన్ని తట్టుకుని ఉన్నామనా?-మాధవ్ శింగరాజు -
బాలీవుడ్ లో మరో సంచలనం
-
అండర్ వరల్డ్ నుంచి సల్మాన్కు వార్నింగ్స్.. ఆయనతో మూడేళ్లు ఉన్నా : సోమీ అలీ
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్పై ఆయన మాజీ ప్రియురాలు సోమీ అలీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కంటే చాలా ప్రమాదకరమైన వ్యక్తి సల్మాన్ అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో తనను సల్మాన్ తీవ్రంగా కొట్టాడని కూడా ఆమె పేర్కొంది. అండర్ వరల్డ్ నుంచి సల్మాన్కు గతంలో బెదిరింపులు వచ్చాయని ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది.బాలీవుడ్లో పలు సినిమాల్లో నటిస్తున్న సమయంలో దావుద్ ఇబ్రహీం, చోటా షకీల్ గురించి చాలామంది నటీనటులు మాట్లాడుతుండేవారని ఆమె చెప్పింది. అయితే, వారి పేర్తు ఎత్తకుండా 'అండర్ వరల్డ్' అని చెప్పేవారు. సల్మాన్తో సుమారు మూడేళ్ల పాటు గ్యాలెక్సీ అపార్ట్మెంట్లో తాను ఉన్నప్పుడు కొన్ని సంఘటనలు జరిగాయని గుర్తుచేసుకుంది. ఓసారి అండర్ వరల్డ్ నుంచి సల్మాన్కు బెదిరింపు కాల్ వచ్చినట్లు సోమీ అలీ తెలిపింది. అయితే, ఆ ఫోన్ కాల్ తానే లిఫ్ట్ చేసినట్లు ఆమె చెప్పింది. ఫోన్ చేసిన వ్యక్తి ఎవరనేది మాత్రం తనకు తెలయదని ఆ ఇంటర్వ్యూలో పంచుకుంది. ఫోన్లో ఇలా వార్నింగ్ ఇచ్చాడు. 'సల్మాన్కు పలు హెచ్చరికలు జారీ చేస్తూనే ఆయన ప్రియురాలిని కిడ్నాప్ చేయబోతున్నామని.' అన్నారు. ఆ కాల్ కట్ అయిన తర్వాత ఆమె చాలా భయపడిపోయినట్లు తెలిపింది. 'ఫోన్ కాల్ గురించి వెంటనే సల్మాన్తో చెప్పాను. నేను చాలా భయపడుతున్నానని చెప్పడంతో ఆయనలో కూడా కాస్త భయం మొదలైంది. అయితే, రెండురోజుల తర్వాత ఎలాంటి ఇబ్బంది లేదని సల్మాన్ తెలిపారు. మరోసారి వార్నింగ్ ఫోన్ కాల్ రాలేదు. కానీ, ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకుందామని ప్రయత్నం చేస్తే.. సల్మాన్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఇలాంటి విషయాలకు చాలా దూరంగా ఉండాలని ఆయన సూచించారు.' అని సోమీ అలీ చెప్పింది.సోమీ అలీ పాకిస్థానీ అమెరికన్ నటి అని తెలిసిందే. సుమారు ఎనిమిదేళ్లుగా సల్మాన్తో ఆమె రిలేషన్లో ఉన్నారని సమాచారం. పలు బాలీవుడ్ సినిమాల్లో నటించిన ఆమెకు ప్రస్తుతం అక్కడ పెద్దగా ఛాన్సులు రావడంలేదు. -
అమెరికాలో అన్మోల్ బిష్ణోయ్.. భారత్కు రప్పించే ప్రయత్నాలు
ముంబై: లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ అమెరికాలో ఉన్నట్లు సమాచారం అందినట్లు పోలీసులు తెలిపారు. అమెరికాలో అన్మోల్ బిష్ణోయ్ కదలికలకు సంబంధించి అక్కడి పోలీసులు సమాచారం అందించినట్లు తెలిపారు. దీంతో అమెరికా అధికారులు ముంబై పోలీసులను అప్రమత్తం చేశారని పేర్కొన్నారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల జరిగిన కాల్పుల ఘటనతో సహా పలు కేసుల్లో అన్మోల్ బిష్ణోయ్ (25) ప్రమేయం ఉన్న నేపథ్యంలో అతన్ని భారత్కు వేగంగా రప్పించేందుకు ముంబై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అతన్ని భారత్కు అప్పగించే ప్రక్రియను ప్రారంభించేందుకు అనుమతి కోరుతూ.. ముంబై పోలీసులు గత నెలలో ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సల్మాన్ ఖాన్ కేసులో అభియోగాలను ఎదుర్కొనేందుకు అన్మోల్ బిష్ణోయ్ను తిరిగి భారతదేశానికి తీసుకురావాలనే తమ ఉద్దేశాన్ని పోలీసులు కోర్టుకు తెలియజేశారు. అతడిని భారత్కు తీసుకొచ్చే ప్రయత్నాలను పోలీసులు వేగవంతం చేశారు.ఇక.. ఇటీవల జరిగిన బాబా సిద్ధిఖీ హత్య కేసు నిందితులతోనూ అన్మోల్ బిష్ణోయ్ టచ్లో ఉండటం గమనార్హం. అన్మోల్ బిష్ణోయ్ సోదరుడు గుజరాత్లోని సబర్మతి జైలులో ఉన్న విషయం తెలిసిందే.అన్మోల్ బిష్ణోయ్పై ఎన్ఐఏ రూ.10 లక్షల రివార్డ్అన్మోల్ బిష్ణోయ్ సంబంధించిన సమాచారం అందించిన వారికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)రూ.10 లక్షల రివార్డును ప్రకటించింది. ఏప్రిల్లో నటుడు సల్మాన్ ఖాన్ ముంబై నివాసం వెలుపల జరిగిన కాల్పుల ఘటనలో ప్రమేయం ఉన్నందున కారణంతో అన్మోల్ బిష్ణోయ్ను మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో చేర్చింది. -
సల్మాన్ కంటే అతనే బెటర్.. నాకైతే నరకం చూపించాడు: మాజీ గర్ల్ఫ్రెండ్
బాలీవుడ్ సల్మాన్ ఖాన్పై ఆయన మాజీ ప్రియురాలు సోమీ అలీ షాకింగ్ కామెంట్స్ చేసింది. అతన్ని ప్రముఖ గ్యాంగ్స్టార్ లారెన్స్ బిష్ణోయ్తో పోల్చింది. అతనికంటే సల్మాన్ ఖాన్ చాలా ప్రమాదమని సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాకుండా బాలీవుడ్లో తన ఎదుర్కొన్న పరిస్థితులు, అనుభవాలను పంచుకుంది. గతంలో సోమీ అలీ.. సల్మాన్తో దాదాపు ఎనిమిదేళ్ల పాటు రిలేషన్లో ఉన్నారు.సల్మాన్ ఖాన్ కంటే గ్యాంగ్స్టార్ బిష్ణోయ్ చాలా బెటర్ అని సోమీ అలీ అన్నారు. సల్మాన్ నాతో వ్యవహరించిన విధంగా.. మరెవరితోనూ ప్రవర్తించలేదని తెలిపింది. సంగీతా బిజ్లానీ, కత్రినా కైఫ్తో మంచిగా వ్యవహరించినట్లు.. నాతో అలా ఉండలేదని పేర్కొంది. గతంలో ఒకసారి ఐశ్వర్యరాయ్తోనూ అసభ్యకరంగా ప్రవర్తించాడని.. అతని వల్లే ఆమె భుజానికి గాయం కూడా అయిందని వెల్లడించింది. కానీ కత్రినాతో ఎలా వ్యవహరించాడో తనకు తెలియదని సోమీ చెప్పింది. ఒకసారి సల్మాన్ నన్ను కొడుతుంటే పనిమనిషి తలుపులు వేసి కాపాడిందని గుర్తు చేసుకుంది. అందుకే సల్మాన్ కంటే లారెన్స్ బిష్ణోయ్ బెటర్ అని సోమీ అలీ చెప్పింది.గతంలో నటి టబు తన పరిస్థితిని చూసి బాధపడిన సందర్భాన్ని కూడా ఆమె గుర్తు చేసుకున్నారు. నన్ను చూసి టబు ఏడ్చిందని.. కానీ ఆ సమయంలో నేను ఎలా ఉన్నానో కనీసం చూడటానికి కూడా సల్మాన్ రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. సల్మాన్ ఖాన్తో తాను పడిన కష్టాలు పూర్తిగా తన తల్లికి, కొంతమంది సన్నిహితులకు మాత్రమే తెలుసని సోమీ వెల్లడించింది. ప్రస్తుతం ఒక పుస్తకాన్ని రాసే పనిలో ఉన్నానని.. అందులో ప్రతి విషయాన్ని వివరిస్తానని సోమీ తెలిపింది. -
సల్మాన్ ఖాన్కు బెదిరింపులు.. అంతే రేంజ్లో దూకుడుగా పోలీసులు
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్కి బెదిరింపు కాల్స్ పరంపర కొనసాగుతూనే ఉంది. ఆయన్ను అంతం చేస్తామంటూ ఇప్పటికే పలుమార్లు కాల్స్ వచ్చాయి. దీంతో సల్మాన్ కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంటున్నారు. అక్టోబర్ 30న సల్మాన్ను రూ. 2కోట్లు డిమాండ్ చేసిన వ్యక్తిని ముంబై పోలీసులు కొంత సమయం క్రితం అరెస్ట్ చేశారు. కొద్దిరోజుల క్రితం రూ. 5 కోట్లు కావాలని బెదిరింపులకు దిగిన కూరగాయల వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.గతంలో మాదిరే ముంబై ట్రాఫిక్ పోలీసులకు ఒక వాట్సాప్స్ మెసేజ్ వచ్చింది. సల్మాన్ను చంపేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఆయన్ను ప్రాణాలతో వదిలేయాలంటే రూ. 2 కోట్లు ఇప్పించాలని మెసేజ్లో పేర్కొన్నారు. దీంతో అప్రమత్తం అయిన పోలీసులు బాంద్రాకు చెందిన ఆజం మహ్మద్ ముస్తఫాను అరెస్ట్ చేశారు. 2022 నుంచి ఇప్పటికే చాలాసార్లు ఇలాంటి మెసేజ్లు సల్మాన్కు వచ్చాయి. ముంబైలోని బాంద్రా వెస్ట్ గెలాక్సీ అపార్ట్మెంట్లోని అతని నివాసానికి సమీపంలో ఉన్న ఒక బెంచ్పై కూడా సల్మాన్ను బెదిరిస్తూ ఒక లేఖ కనుగొనబడింది. అప్పట్నించి ఈ కేసులో పోలీసులు అప్రమత్తంగా ఉంటున్నారు.1998లో ఒక సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడారు. అయితే, కృష్ణజింకలను బిష్ణోయ్ తెగ ప్రజలు చాలా పవిత్రంగా చూస్తారు. వీటిని సల్మాన్ వేటాడటం ఆ వర్గానికి చెందిన వారికి నచ్చలేదు. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ను లక్ష్యంగా చేసుకొని లారెన్స్ బిష్ణోయ్ ఒక గ్యాంగ్ను తయారు చేశాడు. అతన్ని అంతం చేసేందుకే ఉన్నామంటూ పలుమార్లు హెచ్చరికలు కూడా జారీ చేశాడు. ఈ క్రమంలో ఇప్పటికే కొన్నిసార్లు సల్మాన్పై హత్యాయత్నం కూడా చేశాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఇద్దరు వ్యక్తులు.. ఏకంగా సల్మాన్ ఫామ్ హౌస్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లు జరుగుతూనే ఉన్నాయి. -
నేనేంటో చూపిస్తా.. నటిని బెదిరించిన సల్మాన్ ఖాన్!
తనపై చేయి చేసుకుంటే పరిణామాలు దారుణంగా ఉంటాయని సల్మాన్ ఓ నటిని బెదిరించాడట.. దమ్ముంటే కొట్టి చూడు, తర్వాత ఏం జరుగుతుందో నువ్వే చూద్దువుగానీ అంటూ రెచ్చగొట్టాడట! ఈ ఆసక్తికర విషయం గురించి బాలీవుడ్ నటి ఇందిరా కృష్ట ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.సల్మాన్ బెదిరించాడుఆమె మాట్లాడుతూ.. తేరే నామ్ సినిమాలో నేను సల్మాన్ను కొట్టే సన్నివేశం ఒకటుంటుంది. సరిగ్గా ఆ సన్నివేశానికి ముందు సల్మాన్ నన్ను బెదిరించాడు. నువ్వు నన్ను చిన్నగా కొట్టినా సరే నేనేం చేస్తానో చూడు. ఎంత రచ్చ చేస్తానో నాకే తెలియదు అని బెదిరించాడు. నాకు చాలా భయమేసింది. ఆ సీన్ ఎలా పూర్తి చేయాలో అర్థం కాక ఆందోళన చెందాను. చేతులు వణికాయి. ఇంతలో సల్మాన్ అదంతా ప్రాంక్ అని చెప్పడంతో ఊపిరి పీల్చాను.ఆ ఫీలింగే రాదుఅతడితో కలిసి పని చేయడం నాకెంతో ఇష్టం. పెద్ద హీరోతో పని చేస్తున్న భావన రాదు. అంత కలివిడిగా ఉంటాడు అని చెప్పుకొచ్చింది. తేరే నామ్ సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని దివంగత దర్శకుడు సతీశ్ కౌశిక్ డైరెక్ట్ చేశాడు. భూమిక చావ్లా హీరోయిన్గా నటించింది. ఇకపోతే ఇందిర.. లేడీ విలన్ నీరజ అక్క మమత పాత్రలో నటించింది.చదవండి: హర్షసాయి కేసులో బిగ్ ట్విస్ట్.. యూట్యూబర్కు భారీ ఊరట! -
సల్మాన్ ఖాన్కి మరోసారి బెదిరింపులు.. రూ.2 కోట్లు ఇవ్వకపోతే
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్కి బెదిరింపు కాల్స్.. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొన్నిరోజుల క్రితం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య జరిగిన దగ్గర నుంచి బెదిరింపులు మరీ ఎక్కువైపోతున్నాయి. మొన్నటికి మొన్న రూ.5 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని ఓ మెసేజ్ రాగా.. ఇప్పుడు రూ.2 కోట్లు డిమాండ్ చేస్తూ ముంబై ట్రాఫిక్ పోలీసులకు మరో వాట్సాప్స్ మెసేజ్ వచ్చింది.(ఇదీ చదవండి: హత్య కేసులో స్టార్ హీరో దర్శన్కి మధ్యంతర బెయిల్)ఈ క్రమంలోనే వర్లీ పోలీసులు.. గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి, దర్యాపు చేపట్టారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చేతిలో హత్యమైన బాబా సిద్దిఖీ కొడుకు జీషన్ సిద్దిఖీని కూడా చంపేస్తామని బెదిరించాడు. ఇలా చేసిన 20 ఏళ్ల గుఫ్రన్ని అరెస్ట్ చేసిన కాసేపటికే సల్మాన్కి బెదిరింపులు రావడం హాట్ టాపిక్ అయిపోయింది.అప్పుడెప్పుడో కృష్ణజింకలని వేటాడిన కేసు ఇప్పటికీ సల్మాన్ఖాన్ వెంటాడుతూనే ఉంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. పలుమార్లు చంపుతామని బెదిరిస్తూనే ఉన్నారు. బిష్ణోయిల మందిరానికి వెళ్లి క్షమాపణలు చెబితే వదిలేస్తామని కూడా అన్నారు. కానీ భద్రత పెంచుకోవడం తప్పితే సల్మాన్ నుంచి క్షమాపణ గురించి స్పందన లేదు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి క్రేజీ సినిమా.. కండోమ్ కంపెనీపై కేసు పెడితే?) -
బాలీవుడ్ స్టార్ సల్మానఖాన్ కు మళ్లీ బెదిరింపులు
-
సల్మాన్ ఖాన్ కు మళ్లీ బెదిరింపులు
-
‘నాన్న హత్యపై సల్మాన్ ఖాన్ చాలా బాధపడ్డారు’
ముంబై: తన తండ్రి హత్య తర్వాత బాలీవుడ్ నటుడు, సిద్ధిఖీ కుటుంబానికి సన్నితుడైన సల్మాన్ ఖాన్ ప్రతిరోజూ నాకు ఫోన్ చేసి.. యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారని బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ సిద్ధిఖీ తెలిపారు. అక్టోబర్ 12న బాబా సిద్ధిఖీని కొందరు దుండగులు కాల్పులు జరిపి హత్య చేశారు. అయితే హత్యకు లారెన్స్ బిష్ణోయ్ బాధ్యత వహించిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్తో సన్నిహితంగా ఉండటం వల్లే బాబా సిద్ధిఖీని టార్గెట్ చేశామని తెలిపారు. అయితే ఇటీవల జీషన్ సిద్ధిఖీ ఓ ఇంటర్వ్యులో తన తండ్రి మరణం తర్వాత సల్మాన్ ఖాన్ ఎలా మద్దుతుగా నిలిచారో పలు విషయాలు పంచుకున్నారు.‘‘నాన్న హత్య తర్వాత సల్మాన్ ఖాన్ ప్రతీరోజు రాత్రి క్రమం తప్పకుండా నా రాత్రి నాకు కాల్ చేసి బాగోగులు తెలుసుకుంటున్నారు. సల్మాన్ భాయ్.. మా నాన్న హత్య విషయంలో చాలా బాధపడ్డారు. మా నాన్న, సల్మాన్ భాయ్ నిజమైన అన్నదమ్ముల్లా చాలా సన్నిహితంగా ఉండేవారు. నాన్న చనిపోయిన తర్వాత సల్మాన్ భాయ్.. నేను రాత్రి సమయంలో ఎలా ఉన్నాను. నిద్ర పోతున్నానా లేదా అని ఫోన్ చేసి కనుక్కుంటున్నారు. రాత్రి నేను నిద్ర పోకపోతే.. నాతో ఫోన్లో మాట్లాడుతున్నారు. మా కుటుంబానికి ఆయన ఎంతో సపోర్ట్గా నిలిచారు’’ అని జీషన్ తెలిపారు.మరోవైపు.. జీషన్ సిద్ధిఖీ గత వారం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గంలో చేరారు. అంతేకాక.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వాండ్రే ఈస్ట్ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా కూడా బరిలోకి దిగుతున్నారు. మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారనే ఆరోపణలతో ఆగస్టులో ఆయన్ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. అయితే తనపై వచ్చిన ఈ అభియోగాలను జీషన్ తోసిపుచ్చారు.చదవండి: బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ సిద్ధిఖీపై ట్రోలింగ్ షురూ! -
పప్పూ యాదవ్కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరికలు
పట్నా: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ విషయంలో దూరంగా ఉండకపోతే.. హత్య చేస్తామని బీహార్ ఎంపీ పప్పూ యాదవ్ను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరించింది. ఈ మేరకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సోమవారం ఓ ఆడియో క్లిప్ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ ఆడియో బిహార్లో కలకలం రేపుతోంది.‘‘ఎంపీ పప్పూ యాదవ్ కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నాం. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు సంబంధించిన విషయాల నుంచి ఆయన దూరంగా ఉండాలి. అలా ఉండకపోతే హత్య చేయడానికి కూడా వెనకాడము. అహ్మదాబాద్లోని సబర్మతి జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ సిగ్నల్ జామర్లను డిసేబుల్ చేయడానికి గంటకు రూ.1 లక్ష చెల్లిస్తున్నారు. పప్పూ యాదవ్తో నేరుగా కమ్యూనికేషన్ను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిస్తున్నారు. అయితే ఆయన మాత్రం మా కాల్స్కు స్పందించటం లేదు’’ అని ఆడియోలో క్లిప్లో ఓ వ్యక్తి మాట్లాడారు.ఇక.. ఇటీవల లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ముంబైలో ఎన్సీపీ( అజిత్ పవార్ వర్గం) నేత బాబా సిద్ధిఖీని హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ హత్యపై బిహార్లోని పూర్నియా నియోజకవర్గం ఎంపీ (స్వతంత్ర) పప్పూ యాదవ్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు అనుమతి ఇస్తే.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కేవలం 24 గంటల్లో అంతం చేస్తానని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హెచ్చరికలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. సోమవారం వచ్చిన బెదిరింపులపై పప్పూ యాదవ్ బిహార్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)కి ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.చదవండి: చొరబాట్లకు మమత సర్కారే కారణం: అమిత్షా -
అన్మోల్ బిష్ణోయ్ గురించి సమాచారమిస్తే రూ. 10 లక్షల రివార్డు
-
లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ను పట్టిస్తే రూ.10 లక్షలు
ముంబై: గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది. అలాగే అన్మోల్ను పట్టించిన వారికి రూ. 10 లక్షల రివార్డును కూడా ప్రకటించింది. కాగా గత ఏప్రిల్లో ముంబైలోని బాలీవుడ్ నటుడు సల్మీన్ ఖాన్ నివాసం వెలుపల జరిగిన కాల్పుల ఘటనలో అన్మోల్కు ప్రమేయం ఉన్నట్లు తేలిన సంగతి తెలిసిందే. ముంబై పోలీసులు అన్మోల్పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆ ఫైరింగ్కు పాల్పడింది తామే అని అతను సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.కాగా బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్పై బెదిరింపులు, మహారాష్ట్ర రాజకీయ నేత బాబా సిద్దిఖీ హత్య వంటి కారణాలతో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు మారుమోగుతోంది. బాబా సిద్దిఖీ హత్యతో అన్మోల్ బిష్ణోయ్ పేరు కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. సిద్ధిఖీ హత్యకు ముందు సైతం షూటర్లతో అన్మోల్ చాటింగ్ చేసినట్లు ముంబయి పోలీసులు వెల్లడించారుఅన్మోల్ బిష్ణోయ్ని అలియాస్ భానుగా పిలుస్తారు. గత ఏడాది నకిలీ పాస్పోర్ట్తో భారత్ నుంచి పారిపోయిన అన్మోల్.. అనంతరం కెన్యా, కెనడాలో గుర్తించారు. ప్రస్తుతం అతడు కెనడాలో నివసిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పంజాబీ సింగర్ సిద్దూ మోసేవాల్ హత్య కేసులో అన్మోల్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. మరోవైపు లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం అహ్మదాబాద్లోని సబర్మతి సెంట్రల్ జైలులో ఉన్నారు. -
సల్మాన్ ఖాన్ను చంపేస్తామన్న కూరగాయల వ్యాపారి అరెస్ట్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ను చంపేస్తానంటూ కొద్దిరోజుల క్రితం బెదిరింపు మెసేజ్ పెట్టిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఝార్ఖండ్లోని జంషెడ్పూర్కు చెందిన షేక్ హుస్సేన్ (24)గా గుర్తించారు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి సల్మాన్కు వరుస బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో హుస్సేన్ కూడా అదే గ్యాంగ్కు సంబంధించిన వ్యక్తి అంటూ సల్మాన్ నుంచి రూ. కోట్లు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ.. ట్రాఫిక్ పోలీసులకు మెసేజ్ చేశాడు.సల్మాన్కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ప్రమాదం పొంచి ఉండటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ క్రమంలో బెదిరింపు మెసేజ్ చేసిన వ్యక్తి కూరగాయల వ్యాపారి షేక్ హుస్సేన్గా పోలీసులు గుర్తించారు. సులభంగా డబ్బు సంపాదించవచ్చనే తాను ఇలాంటి ప్లాన్ వేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయినప్పటికీ అతన్ని పూర్తిగా విచారించిన తర్వాతే కోర్టులో హాజరుపరచనున్నారు.ముంబయి ట్రాఫిక్ పోలీసులకు కొద్దిరోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఒక మెసేజ్ వచ్చిన విషయం తెలిసిందే.. సల్మాన్ ప్రాణాలతో ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని వార్నింగ్ ఇచ్చారు. ఈ మెసేజ్ను తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించారు. బిష్ణోయ్తో శతృత్వం ఆగాలన్నా, సల్మాన్ బతికుండాలన్నా ఐదు కోట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తూ వాట్సాప్లో మెసేజ్ వచ్చింది. అయితే, ఒకరోజు తర్వాత అతను మరో సందేశం ఇలా పంపించాడు. 'నేను కావాలని బెదిరింపులకు పాల్పడలేదు. అనుకోకుండా జరిగిపోయింది. క్షమించండి' అని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ముంబై పోలీసులు దర్యాప్తు చేపట్టి.. జంషెడ్పూర్ చెందిన ఓ కూరగాయల వ్యాపారి ఇదంతా చేసినట్లు గుర్తించి అతన్ని అరెస్ట్ చేశారు. -
‘సల్మాన్ను బెదిరించి తప్పు చేశాం’.. నిందితుడు మరో మెసేజ్
ముంబై: కొద్దిరోజు క్రితం ఓ నిందితుడు సల్మాన్ ఖాన్ను బెదిరింపులకు పాల్పడ్డాడు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో ఉన్న వైరానికి ముగింపు పలకాలని, ఇందుకోసం రూ.5కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ముంబై పోలీసులకు మెసేజ్ చేశాడు. ఇప్పుడు ఆ నిందితుడే సల్మాన్ ఖాన్ను బెదిరించి తప్పు చేసినట్లు మరో వాట్సప్ మెసేజ్ పంపించాడు. ప్రస్తుతం ఈ అంశం బీటౌన్లో చర్చనీయాంశంగా మారింది వారం రోజుల క్రితం సల్మాన్ఖాన్ స్నేహితుడు బాబా సిద్ధిఖీ హత్య జరిగింది. హత్యోదంతం తర్వాత అక్టోబర్ 18న ముంబై ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్ సందేశం వచ్చింది. సిద్ధిఖీని హత్య చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో సల్మాన్కు వైరానికి ముగింపు పలకాలని, ఇందుకోసం రూ.5కోట్లు చెల్లించాలని, లేదంటే బాబా సిద్ధిఖీకి పట్టిన గతి నీకూ పడుతుందంటూ ఓ నిందితుడు బెదిరింపులకు దిగాడు. దీంతో అప్రమత్తమైన ముంబై పోలీసులు సల్మాన్ ఖాన్కు హైసెక్యూరిటీ మధ్య భద్రత కల్పిస్తున్నారు. అంతేకాదు ఆ మెసేజ్ జార్ఖండ్ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. ఈ తరుణంలో సోమవారం, ముంబై ట్రాఫిక్ పోలీసు అధికారులు మాట్లాడుతూ.. గతవారం సల్మాన్ ఖాన్ను బెదిరించిన నిందితుడు మరో మెసేజ్ పంపించాడని, సల్మాన్ ఖాన్ను బెదిరించి తప్పు చేసినట్లు చెప్పాడని వెల్లడించారు. ప్రస్తుతం ఆ నిందితుడు కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. -
కోట్ల విలువైన ఆస్తిని అమ్మేసిన స్టార్ హీరో చెల్లెలు!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం హిందీ బిగ్బాస్ సీజన్-18కు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆయనకు బెదిరింపులు రావడంతో భద్రతను సైతం కట్టుదిట్టం చేశారు. బిగ్బాస్ సెట్ వద్ద దాదాపు 60 మందితో భద్రత ఏర్పాటు చేశారు. లారెన్స్ బిష్ణోయ్ అనే రౌడీ షీటర్ నుంచి ఆయనకు ప్రాణహాని ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఇదిలా ఉండగా.. సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ తాజాగా తన ఇంటిని అమ్మేసినట్లు తెలుస్తోంది. ఆయన సోదరి అర్పితా ఖాన్ శర్మ ముంబయిలోని ఖర్ ప్రాంతంలో ఉన్న అపార్ట్మెంట్ను రూ.22 కోట్లకు విక్రయించినట్లు బాలీవుడ్లో టాక్. 2017లో ఆ ఇంటిని ఆమె రూ.18 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ముంబయిలోని శివయ్య సినీవైజ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి అపార్ట్మెంట్ను అమ్మినట్లు సన్నిహితులు తెలిపారు. ఆ ప్రాంతం పరిసరాల్లోనే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్లతో సహా పలువురు బాలీవుడ్ తారలు నివసిస్తున్నారు. -
ప్రాణభయం.. బుల్లెట్ ప్రూఫ్ కారు కొన్న సల్మాన్ ఖాన్
మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని నడిరోడ్డుపై దుండగులు కాల్చి చంపడం కొన్నిరోజుల క్రితం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్కి ఇతడు ఆప్తుడు కావడం వల్లే.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సిద్దిఖీని చంపేశారనే టాక్ వినిపించింది. రెండు రోజుల క్రితం సల్మాన్ని చంపేస్తామని ముంబై ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్ మెసేజ్ రావడం కలకలం రేపిందని చెప్పొచ్చు. ఇలా వరస సంఘటన కారణంగా సల్మాన్లో ప్రాణభయం మరింత పెరిగింది. ఈ క్రమంలోనే కొత్త కారు కొన్నారట.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కార్తీ ఫీల్ గుడ్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)1999లో కృష్ణ జింకలు వేటాడిన కేసులో సల్మాన్పై అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఈ విషయాన్ని చాలామంది మర్చిపోయారు కానీ బిష్ణోయ్ తెగకు చెందిన లారెన్స్ అనే కుర్రాడు మాత్రం మర్చిపోలేదు. ఎప్పటికప్పుడు సల్మాన్ని చంపేందుకు కుట్ర పన్నుతూనే ఉన్నాడు. గత రెండేళ్లలోనూ ఆ ప్రయత్నాలు చేశారు. బాబా సిద్దిఖీ మర్డర్, రూ.5 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని తాజాగా బెదిరింపు మెసేజ్.. ఇలా బోలెడన్ని కారణాల వల్ల సల్మాన్ అప్రమత్తమయ్యాడు.సుమారు రూ.2 కోట్ల విలువైన బుల్లెట్ ప్రూఫ్ కారును దుబాయ్ నుంచి ఆయన దిగుమతి చేసుకోనున్నాడట. త్వరలోనే ఇది సల్మాన్ గ్యారేజ్లో చేరనుందని బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఆయన ఎంపిక చేసుకున్న ఆ మోడల్ కారు మన దేశంలో దొరకదని సమాచారం. అందుకే అక్కడి నుంచి ఇక్కడికి తెప్పించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రూ.6 కోట్ల విలువైన మరో బుల్లెట్ ప్రూఫ్ కారు సల్మాన్ దగ్గరుంది. కానీ లేటెస్ట్ మోడల్లో ఎక్కువ ఫీచర్స్ ఉండటంతో ఈ కొత్త కారును కొనుగోలు చేశాడని సమాచారం.ఈ కారులో ఎవరున్నారనేది బయట నుంచి చూస్తే కనిపించదు. అలానే ఎలాంటి బులెట్ని అయినా సరే ఈ కారుకి ఉన్న గ్లాస్ అడ్డుకుంటుంది. ఈ కారుకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: అరెస్ట్ న్యూస్.. వీడియో రిలీజ్ చేసిన బిగ్ బాస్ శేఖర్ భాషా) -
బిగ్ బాస్ సెట్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత.. కారణం ఇదే
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్కు మరోసారి బెదిరింపులు రావడంతో ఆయన కట్టుదిట్టమైన భద్రతా సిబ్బంది నడుమ ఉన్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో ఉన్న వైరానికి ఫుల్స్టాప్ పడాలంటే తమకు రూ.5 కోట్లు ఇవ్వాలని బెదిరింపులు వచ్చాయి. దీంతో ముంబై పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. అయితే, ఇలాంటి సమయంలో హిందీ బిగ్ బాస్ 18 సెట్లో ఆయన పాల్గొంటారా..? లేదా..? అనే సందేహాలు వచ్చాయి. ఇక ఈ సీజన్కు హోస్ట్గా సల్మాన్ వైదొలగనున్నారని వార్తలు వచ్చాయి. అయితే, ఇలాంటి వాటికి ఆయన ఫుల్స్టాప్ పెట్టినట్లు తెలుస్తోంది.బిగ్ బాస్ 18 వీకెండ్ కోసం సల్మాన్ హజరుకానున్నట్లు తెలుస్తోంది. అయితే, చాలా కట్టుదిట్టమైన భద్రతా సిబ్బంది మధ్య ఆయన ఇప్పటికే సెట్లో ఎంట్రీ ఇచ్చారని సమాచారం. శుక్రవారమే 'వీకెండ్ కా వార్' ఎపిసోడ్ను యూనిట్ పూర్తి చేయనుంది. సల్మాన్కు రక్షణగా సుమారు 50మందికి పైగానే సెక్యూరిటీని ఏర్పాటు చేశారని, వారందరూ సల్మాన్ పర్యవేక్షణలో ఉండనున్నారు. ఎట్టిపరిస్థితిలో ఇతరులను హోస్లోకి అనుమతించరట. బిగ్ బాస్ యూనిట్ సభ్యులను కూడా పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే వారిని సెట్స్లోకి అనుమతించనున్నారు. సల్మాన్కు సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యాకే అక్కడున్న వారిని బయటకు పంపనున్నారు. సెట్లోని ఇతరుల వద్ద కనీసం ఫోన్ కూడా ఉంచకుండా జాగ్రత్తపడుతున్నారట. 1998లో జరిగిన ఘటన1998లో ఒక సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడారు. దీంతో ఆయనపై కేసు కూడా నమోదైంది. అయితే, కృష్ణజింకలను బిష్ణోయ్ తెగ ప్రజలు చాలా పవిత్రంగా చూస్తారు. వీటిని సల్మాన్ వేటాడటం ఆ వర్గానికి చెందిన లారెన్స్కు నచ్చలేదు. అయితే, ఈ ఘటన జరిగిన సమయానికి అతని వయసు సరిగ్గా 5 ఏళ్లు మాత్రమే. అప్పటి నుంచే సల్మాన్పై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో 2018 సమయం నుంచే సల్మాన్ ఖాన్ను లక్ష్యంగా చేసుకొని ఒక గ్యాంగ్ను తయారు చేశాడు. అతన్ని అంతం చేసేందుకే ఉన్నామంటూ పలుమార్లు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే కొన్నిసార్లు సల్మాన్పై హత్యాయత్నం కూడా చేశాడు. -
బాలీవుడ్ నటుడు సల్మానఖాన్ కు బెదిరింపులు
-
సల్మాన్ ఖాన్కి మరోసారి బెదిరింపులు.. రూ.5 కోట్లు ఇస్తేనే
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్కి మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఇప్పటివరకు చంపుతామని బెదిరించిన బిష్ణోయ్ గ్యాంగ్ కాస్త ఇప్పుడు డబ్బులు డిమాండ్ చేస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే ఇది కొత్త ట్విస్ట్ అని చెప్పాలి. ఇంతకీ అసలేం జరుగుతోంది?కొన్నిరోజుల క్రితం మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ దారుణానికి పాల్పడింది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అని తేలింది. సల్మాన్కి స్నేహితుడు అయినందుకే ఇలా చేసినట్లు అనుమానిస్తున్నారు. తాజాగా సల్మాన్కి మరోసారి బెదిరింపులు వచ్చాయి. రూ.5 కోట్లు ఇవ్వకపోతే సల్మాన్ను చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ మెసేజ్ను తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించారు. బిష్ణోయ్తో శతృత్వం ఆగాలన్నా, సల్మాన్ బతికుండాలన్నా ఐదు కోట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తూ ముంబై ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్లో మెసేజ్ వచ్చింది.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)ఈ మెసేజ్ ఎవరు పంపించారా? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. 1999లో కృష్ణ జింకల్ని వేటాడిన తర్వాత కొన్నాళ్ల పాటు సల్మాన్ జైలు జీవితం గడిపాడు. ఈ సంఘటనతో సల్మాన్పై బిష్ణోయ్ తెగకు చెందిన లారెన్స్ పగ పెంచుకున్నాడు. చాన్నాళ్ల నుంచి బెదిరింపులు వస్తూనే ఉన్నాయి.2022లోనూ బాంద్రాలోని సల్మాన్ ఇంటి దగ్గర అనుమానాస్పద రీతిలో ఉత్తరం దొరికింది. 2023లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి స్వయంగా సల్మాన్కే మెయిల్ వచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో ఇద్దరు వ్యక్తులు.. ఏకంగా సల్మాన్ ఫామ్ హౌస్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బాబా సిద్దిఖీని చంపేయడంతో సల్మాన్కి పోలీసులు మరింత భద్రత పెంచారు.(ఇదీ చదవండి: బిగ్బాస్ 8 ఎలిమినేషన్.. డేంజర్ జోన్లో ఆ ఇద్దరు కానీ!) -
సల్మాన్ ఖాన్ హత్యకు ప్లాన్.. షార్ప్ షూటర్ అరెస్ట్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు ఏప్రిల్ 14న కాల్పులు జరిపిన వారిలో మరోకరిని తాజాగా ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. హరియాణాలోని పానిపట్లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన ఒక షార్ప్ షూటర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేడు అతన్ని కోర్టులో హజరుపరచనున్నారు.ఈ ఏడాది ఏప్రిల్లో ముంబైలోని సల్మాన్ గెలాక్సీ అపార్ట్మెంట్స్ వద్ద ఇద్దరు దుండగులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపి ఆపై మోటార్ సైకిల్ ద్వారా పారిపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కేసు నమోదు చేసిన పోలీసులు నాటి నుంచి ఆ గ్యాంగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో జూన్లో కూడా మరోసారి సల్మాన్ హత్యకు కుట్ర జరిగిందని పోలీసులు తెలిపారు. సల్మాన్కు సంబంధించిన పన్వేల్ ఫామ్హౌస్ నుంచి ఇంటికి వెళ్తున్న మార్గంలో ఆయనపై దాడి చేయాలని ఈ గ్యాంగ్ ప్లాన్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే, ఈ కేసులో తాజాగా అరెస్ట్ అయిన వ్యక్తి షార్ప్ షూటర్ అని తెలుస్తోంది. అతను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్లో చాలా కీలకంగా ఉన్నట్లు సమాచారం. సల్మాన్ను అంతం చేసేందుకు ఆయన కదలికలను పర్యవేక్షించడానికి దాదాపు 60 నుండి 70 మంది ఈ గ్యాంగ్లో భాగం అయ్యారని పోలీసులు తెలిపారు. పంజాబీ సింగర్ సిద్ధూమూసేవాలా హత్య మాదిరే.. కారులోనే సల్మాన్ను హత్య చేయాలని ఈ గ్యాంగ్ స్కెచ్ వేసినట్లు పోలీసులు గుర్తించారు. -
బిగ్బాస్ నుంచి బయటకొచ్చేసిన కంటెస్టెంట్.. అదే కారణం!
బాలీవుడ్లో ప్రస్తుతం బిగ్బాస్ సీజన్-18 నడుస్తోంది. ఈ రియాలిటీ షోకు స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ ఊహించని విధంగా బయటకొచ్చేశాడు. అడ్వకేట్ అయిన గుణరత్న సదావర్తే బిగ్ బాస్ హౌస్కు గుడ్ బై చెప్పారు. కారణమిదే...తాజా సమాచారం ప్రకారం అడ్వకేట్ గుణరత్న సదావర్తే సోమవారం కోర్టు విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ అతను రాలేదు. దీంతో న్యాయమూర్తులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గుణరత్న సదావర్తే బిగ్బాస్ షో నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. అయితే అతను మళ్లీ బిగ్బాస్ హౌస్లోకి తిరిగి వస్తాడా? లేదా అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.న్యాయవాది గుణరత్న కేసుఅంతకుముందు బిగ్ బాస్ హౌస్లో ఉన్నందున గుణరత్న సదావర్తే కోర్టుకు హాజరు కాలేకపోయాడు. ప్రస్తుతం మహారాష్ట్రలో ముఖ్యమైన సమస్య అయిన మరాఠా రిజర్వేషన్ను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను కోర్టు విచారిస్తోంది. కాగా.. సదావర్తే తన సతీమణి జైశ్రీ పాటిల్తో కలిసి రిజర్వేషన్పై పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 19కి కోర్టు వాయిదా వేసింది. -
5 ఏళ్ల వయసు నుంచే సల్మాన్పై పగ.. లారెన్స్ బిష్ణోయ్పై వర్మ ట్వీట్
మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యతో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ఈ దారుణ ఘటనలో బిష్ణోయ్ల పాత్ర ఉందని వార్తలు వస్తున్నాయి. సల్మాన్తో సిద్ధిఖీ ఎక్కువగా సన్నిహితంగా ఉన్న కారణంగానే ఈ హత్య చేశారని తెలుస్తోంది. ఈ అంశం గురించి తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పలు ట్వీట్లు చేశారు. 30 ఏళ్ల పంజాబీ గ్యాంగ్ స్టర్ జైల్లో ఉన్నప్పటికీ తన సోదరుడి సాయంతో కొందరిని ఒక టీమ్గా ఏర్పాటు చేసుకుని కెనడా నుంచి ఒక గ్యాంగ్ను నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఈ విషయం మరింత ఆందోళనకరంగా మారింది. ఈ గ్యాంగ్తో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్కు ప్రమాదం పొంచి ఉందని చెప్పవచ్చు.25 ఏళ్లుగా పగను పెంచుకున్నాడు: ఆర్జీవీ'1998లో కృష్ణజింకను చంపబడినప్పుడు లారెన్స్ బిష్ణోయ్ కేవలం 5 సంవత్సరాల పిల్లవాడు. బిష్ణోయ్ల పగ కోసం 25 సంవత్సరాలుగా అతను పోరాడుతున్నాడా..! ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు 30 సంవత్సరాల వయస్సులో ఒక స్టార్ నటుడిగా ఉన్న సల్మాన్ను అంతం చేయడమే తన జీవిత లక్ష్యం అని చెప్పడం ఏంటి..? ఇది ఆ జంతువుపై వారికి ఉన్న విపరీతమైన ప్రేమా..? లేదా.. దేవుడు ఆడుతున్న వింత నాటకమా..?' అంటూ ఆర్జీవీ ప్రశ్నించాడు.లారెన్స్ బిష్ణోయ్ గురించి ఆర్జీవీ మరో ట్వీట్ కూడా ఇలా చేశారు. గ్యాంగ్స్టర్గా మారిన ఒక న్యాయవాది ( లారెన్స్ బిష్ణోయ్) ఒక సూపర్ స్టార్ని చంపడం ద్వారా జింక మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటున్నాడు. అతని ఆదేశాలతో తన గ్యాంగ్లోని 700 మంది నడుచుకుంటున్నారు. అతను మొదట స్టార్ హీరోకు సన్నిహితుడైన ఒక పెద్ద రాజకీయవేత్తను చంపమని ఫేస్ బుక్ ద్వారా రిక్రూట్ చేసుకున్నాడు. పోలీసులు అతన్ని పట్టుకోలేరు, అడ్డుకోలేరు. ముంబై మాఫియాలోని ఇతర గ్యాంగ్స్టర్ల మాదిరిగా కాకుండా, అతను ఇప్పటికే హై సెక్యూరిటీ జైలులో, ప్రభుత్వ రక్షణలో ఉన్నందున అతన్ని పట్టుకోవడం లేదా ఎదుర్కోవడం సాధ్యం కాదు. అని ఆర్జీవీ అభిప్రాయా పడ్డారు. లారెన్స్ బిష్ణోయ్ కొన్నేళ్లుగా జైల్లోనే ఉంటున్నాడు. కానీ, తనను చాలామంది కలుస్తుంటారని, సెల్ఫోన్ల ద్వారా అనుచరులతో నిరంతరం టచ్లో ఉంటాడని పేరుంది. అతనికి ప్రభుత్వాలు, అధికారులు సాయం చేస్తున్నారనే పరోక్షంగా ఆర్జీవీ చెప్పారు.1998లో జరిగిన ఘటన1998లో ఒక సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడారు. దీంతో ఆయనపై కేసు కూడా నమోదైంది. అయితే, కృష్ణజింకలను బిష్ణోయ్ తెగ ప్రజలు చాలా పవిత్రంగా చూస్తారు. వీటిని సల్మాన్ వేటాడటం ఆ వర్గానికి చెందిన లారెన్స్కు నచ్చలేదు. అయితే, ఈ ఘటన జరిగిన సమయానికి అతని వయసు సరిగ్గా 5 ఏళ్లు మాత్రమే. అప్పటి నుంచే సల్మాన్పై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో 2018 సమాయినికి సల్మాన్ ఖాన్ను లక్ష్యంగా చేసుకొని ఒక గ్యాంగ్ను తయారు చేశాడు. అతన్ని అంతం చేసేందుకే ఉన్నామంటూ పలుమార్లు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే కొన్నిసార్లు సల్మాన్పై హత్యాయత్నం కూడా చేశాడు. LAWRENCE BISHNOI was just a 5 YEAR OLD KID when the deer was killed in 1998 and Bishnoi maintained his grudge for 25 years and now at age 30 he says that his LIFE’S GOAL is to kill SALMAN to take REVENGE for KILLING that DEER .. Is this ANIMAL love at its PEAK or GOD playing a… https://t.co/KGiOSojxfT— Ram Gopal Varma (@RGVzoomin) October 14, 2024 -
కండలవీరుడికి ముద్దు పెట్టిన హీరోయిన్.. వీడియో వైరల్
బాలీవుడ్ హీరో, కండలవీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం రియాలిటీ షో బిగ్బాస్కు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం హిందీలో బిగ్బాస్ సీజన్-18 నడుస్తోంది. ఈ సీజన్ అభిమానులను ఫుల్గా ఎంటర్టైన్ చేస్తోంది. తాజా ఎపిసోడ్లో బాలీవుడ్ బ్యూటీ మల్లికా షెరావత్ మెరిసింది. ఇటీవల విడుదలైన తన మూవీ విక్కీ విద్యా కా వో వాలా వీడియో సినిమాను ప్రమోట్ చేసేందుకు వచ్చింది.ఈ ఎపిసోడ్లో పాల్గొన్న మల్లికా షెరావత్.. సల్మాన్ ఖాన్పై ప్రేమవర్షం కురిపించింది. ఇండియా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్లర్ అంటూ కొనియాడింది. నా కళ్లలో కళ్లు పెట్టి చూడు అంటూ సల్మాన్తో సరదాగా మాట్లాడింది. మీరు నా హృదయంలో ఉన్నారంటూ వేదికపైనే సల్మాన్కు ముద్దుపెట్టి మరి తన ప్రేమను వ్యక్తం చేసింది. దీంతో సల్మాన్ ఖాన్ సిగ్గుపడుతూ కనిపించారు. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేయగా.. సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.కాగా.. సల్మాన్ హోస్ట్గా ఉన్న ఈ రియాలిటీ షోలో మల్లికా షెరావత్ మొదటిసారి కనిపించింది. ఈ ఎపిసోడ్కు మల్లికతో పాటు చిత్రంలో నటించిన రాజ్కుమార్ రావు, ట్రిప్తి డిమ్రీ కూడా హాజరయ్యారు. 1990లో ఓ చిన్న పట్టణంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రానికి రాజ్ శాండిల్య దర్శకత్వం వహించారు. View this post on Instagram A post shared by ColorsTV (@colorstv) -
సల్మాన్కు దగ్గరైనందుకే సిద్ధిఖీ హత్య?
ముంబై: మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని ముంబైలో శనివారం రాత్రి ముగ్గురు నిందితులు కాల్చి చంపారు. ఈ హత్య పలు సందేహాలకు తావిస్తోంది. బాలీవుడ్ హీరో సల్మాన్ఖాన్కు దగ్గరైనందుకే బాబా సిద్ధిఖీని హత్య చేసివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఈ కేసులో అరెస్టయిన ఇద్దరు నిందితులు తాము బిష్ణోయ్ గ్యాంగ్కు చెందినవారిమని పోలీసులకు చెప్పారని సమాచారం. ఈ షూటర్లలో ఒకరి పేరు కర్నైల్ సింగ్, ఇతను హర్యానా నివాసి. రెండో షూటర్ ధరమ్రాజ్ కశ్యప్.. ఇతను యూపీకి చెందినవాడు. వీరు గత కొంతకాలంగా బాబా సిద్ధిఖీ ఇంటికి రెక్కీ చేశారని పోలీసుల విచారణలో తేలింది.గత కొన్నేళ్లుగా నటుడు సల్మాన్ ఖాన్ను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వెంబడిస్తోంది. లారెన్స్ గ్యాంగ్ షూటర్లు సల్మాన్ ఖాన్ను రెండుసార్లు రెక్కీ చేశారు. మొదటిసారి రెడీ సినిమా షూటింగ్లో ఉండగా, రెండోసారి పన్వేల్లోని సల్మాన్ ఫామ్హౌస్కి వెళ్లి రెక్కీ చేశారు. ఆ తరువాత లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ముంబైలోని సల్మాన్ ఉంటున్న లాక్సీ అపార్ట్మెంట్పై కాల్పులు జరిపారు. అమెరికాలో ఉంటున్న లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ ఈ ముఠాను నిర్వహిస్తున్నాడని సమాచారం. సల్మాన్ ఇంట్లో జరిగిన కాల్పుల కేసులో ప్రధాన సూత్రధారి అంటూ గతంలొ అన్మోల్ పేరు కూడా తెరపైకి వచ్చింది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపిన ముష్కరులతో అన్మోల్ సిగ్నల్ యాప్ ద్వారా మాట్లాడాడు. వారికి ఆదేశాలు ఇచ్చాడని తేలింది.ఇదిలావుండగా లారెన్స్ బిష్ణోయ్ సన్నిహితుడు రోహిత్ గోద్రా ఇటీవల మీడియాతో.. సల్మాన్ ఖాన్కు స్నేహితుడైనవాడు తమకు శత్రువు అని వ్యాఖ్యానించాడు. బాంద్రా ఈస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న బాబా సిద్ధిఖీకి సల్మాన్ ఖాన్తో మంచి స్నేహం ఉంది. దీనికి తోడు బాలీవుడ్ హీరోలు సల్మాన్- షారుక్ ఖాన్ మధ్య స్నేహాన్ని కుదర్చడంలో సిద్ధిఖీ కీలకపాత్ర పోషించాడని చెబుతారు. మొత్తంగా చూస్తే సల్మాన్తో దోస్తీ కారణంగానే బాబా సిద్ధిఖీ.. లారెన్స్ బిష్ణోయ్కి శత్రువయ్యాడని, ఈ నేపధ్యంలోనే అతనిని హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.ఇది కూడా చదవండి: మాజీ మంత్రి సిద్ధిఖీ హత్య వెనుక బిష్ణోయ్ గ్యాంగ్ -
ప్రముఖ నేత దారుణ హత్య.. బిగ్బాస్ షూటింగ్ రద్దు
మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ.. ముంబైలో శనివారం రాత్రి 9:30 గంటల సమయంలో దారుణ హత్యకు గురయ్యారు. ఎమ్మెల్యేగా ఉన్న ఈయన కుమారుడు ఆఫీస్ బాంద్రాలో ఉంది. అక్కడకు దగ్గర్లో ఉన్న సమయంలో సిద్దిఖీపై గుర్తుతెలియని వ్యక్తులు మూడు రౌండ్స్ కాల్పులు జరిపారు. హుటాహుటిన లీలావతి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈయన మృతి చెందారు.(ఇదీ చదవండి: బిగ్బాస్ తెలుగు కంటెస్టెంట్ ఇంట్లో విషాదం)మరణవార్త తెలుసుకున్న సల్మాన్.. బిగ్ బాస్ 18వ సీజన్ షూటింగ్ మధ్యలోనే ఆపేసి మరీ సిద్దిఖీని పరామర్శించడానికి వెళ్లారు. వీళ్లిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. ప్రతి ఏడాది సిద్ధిఖీ ఇచ్చే ఇఫ్తార్ విందుకు సల్మాన్ కచ్చితంగా హాజరవుతుంటారు. అలానే సిద్దిఖీ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా సరే సల్మాన్ రావాల్సిందే. అలాంటిది ఇప్పుడు తన స్నేహితుడు చనిపోవడం సల్మాన్ విషాదంలో నింపేసింది.సిద్దిఖీ విషయానికొస్తే ముంబైలోని బాంద్రా వెస్ట్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 48 ఏళ్ల పాటు కాంగ్రెస్లో కొనసాగారు. గత ఫిబ్రవరిలో పార్టీని వీడి, అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీలో చేరారు. మరో నెలరోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో ఈ కాల్పులు ఘటన జరగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: బిగ్బాస్ 8: కిర్రాక్ సీత ఎలిమినేట్)"Difficult times for #SalmanKhan. Some time ago, his father was threatened, and today his close friend #BabaSiddiqui was murdered. When Mumbai's superstars are not safe, what about the common people? This is a danger for everyone!""जीशान सिद्दीकी" pic.twitter.com/MQb7mFzkrt— Arun sisodiya (@kum58993361) October 12, 2024 -
మరో అతిథి పాత్రలో సల్మాన్ ఖాన్
అతిథి పాత్రలపై సల్మాన్ ఖాన్ ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నట్లున్నారు. ఆల్రెడీ వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న హిందీ చిత్రం ‘బేబీ జాన్’లో సల్మాన్ ఖాన్ ఓ అతిథి పాత్ర చేస్తున్నారు. అజయ్ దేవగన్ హీరోగా చేస్తున్న ‘సింగమ్ ఎగైన్’ సినిమాలోనూ సల్మాన్ ఓ గెస్ట్ రోల్ చేశారనే టాక్ బాలీవుడ్లో వినిపించింది. తాజాగా హృతిక్ రోషన్, ఎన్టీఆర్లు హీరోలుగా నటిస్తున్న హిందీ మూవీ ‘వార్ 2’లో కూడా సల్మాన్ ఖాన్ ఓ అతిథి పాత్రలో కనిపించనున్నారనే టాక్ బాలీవుడ్లో తెరపైకి వచ్చింది. వైఆర్ఎఫ్ (యశ్ రాజ్ ఫిలింస్) స్పై యూనివర్స్లో భాగంగా ‘వార్ 2’ చిత్రం తెరకెక్కుతోంది. ఆల్రెడీ ఈ స్పై యూనివర్స్లోని ‘టైగర్’ ఫ్రాంచైజీ చిత్రాల్లో సల్మాన్ ఖాన్ నటించారు. దీంతో ‘వార్ 2’లో సల్మాన్ ఖాన్ స్పైగా ఓ అతిథి ΄ాత్రను ΄ోషించేలా ఈ చిత్రదర్శకుడు అయాన్ ముఖర్జీ కథలో చిన్న మార్పు చేశారట. మరి... ‘వార్ 2’లో సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఒకే సీన్లో కనిపిస్తే సినిమా ఫ్యాన్స్కు పండగే అని చెప్పవచ్చు. ఇది నిజం అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆదిత్యా చో్ర΄ా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. -
బేబీ జాన్లో అతిథిగా సల్మాన్ ఖాన్
‘బేబీ జాన్’కు అతిథి అయ్యారు సల్మాన్ ఖాన్. వరుణ్ ధావన్ హీరోగా తమిళ దర్శకుడు కాలీస్ దర్శకత్వం వహిస్తున్న హిందీ చిత్రం ‘బేబీ జాన్’. హిందీలో కీర్తీ సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ తొలి చిత్రంలో నటి వామికా గబ్బి మరో లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబరు 25న విడుదల కానుంది. కాగా ‘బేబీ జాన్’లో సల్మాన్ ఖాన్ అతిథిపాత్రలో నటిస్తున్నారని, ప్రస్తుతం సల్మాన్–వరుణ్ ధావన్ కాంబినేషన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని బాలీవుడ్ సమాచారం.అంతేకాదు... సల్మాన్ ఖాన్–వరుణ్ ధావన్లపై వచ్చే యాక్షన్ సీన్స్ని మాత్రం ఈ చిత్రం నిర్మాతల్లో ఒకరైన దర్శకుడు అట్లీ తీస్తున్నారట. ఇక తమిళంలో విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వం వహించిన హిట్ మూవీ ‘తేరీ’కి హిందీ రీమేక్గా ‘బేబీ జాన్’ రూపొందుతోందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘సికందర్’ చిత్రం వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా విడుదల కానుంది. -
పదేళ్ల తర్వాత సూపర్హిట్ మూవీకి సీక్వెల్.. ప్రకటించిన డైరెక్టర్!
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సికందర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ యాక్షన్ ఓరియటండ్ చిత్రంలో రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.అయితే అంతలోనే మరో మూవీకి సిద్ధమయ్యారు సల్మాన్ ఖాన్. గతంలో ఆయన నటించిన సూపర్ హిట్ చిత్రం కిక్. 2014లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఆ సినిమాకు సీక్వెల్గా కిక్ 2 తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ సాజిద్ నదియావాలా తాజాగా ప్రకటించారు. దాదాపు పదేళ్ల తర్వాత సీక్వెల్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.(ఇది చదవండి: నేను తప్పు చేయలేదు, బిగ్బాస్ నన్ను రోడ్డున పడేశాడు)కాగా.. 2009లో టాలీవుడ్ హీరో రవితేజ హీరోగా నటించిన ‘కిక్. ఈ మూవీ ఆధారంగానే బాలీవుడ్లో కిక్ తెరకెక్కించారు. సల్మాన్ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాడెంజ్ నటించిన ఈ సినిమాకు సాజిద్ నదియావాలా దర్శకత్వం వహించారు. యాక్షన్ కామెడీ ఫిల్మ్గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా అందుకుంది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్ అనౌన్స్ చేశారు మేకర్స్. View this post on Instagram A post shared by Nadiadwala Grandson (@nadiadwalagrandson) -
గ్యాప్ ఇవ్వలా... వచ్చింది
నచ్చిన కథ దొరక్క కొందరు, చేసే పాత్రకు తగ్గట్టు మేకోవర్ అవ్వాలని మరికొందరు, వ్యక్తిగత జీవితంతో ఇంకొందరు... ఇలా కారణాలు ఏమైనా యాక్టర్స్ కెరీర్లో కొన్నిసార్లు గ్యాప్లు వస్తుంటాయి. వారికి ఇష్టం ఉన్నా లేకున్నా ఈ గ్యాప్ను ఫిల్ చేయలేని పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి గ్యాప్ల కారణంగా ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్పై కనిపించకుండా ‘గ్యాప్ ఇవ్వలా... వచ్చింది’ అంటున్న కొందరు బాలీవుడ్ హీరోల గురించి తెలుసుకుందాం.స్పీడ్ బ్రేకర్ గత ఏడాది బాక్సాఫీస్ను ఓ ఊపు ఊపేశారు షారుక్ ఖాన్. 2023లో షారుక్ ఖాన్ హీరోగా చేసిన ‘పఠాన్, జవాన్’ రూ. వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను అధిగమించగా, ‘డంకీ’ రూ. 450 కోట్ల కలెక్షన్స్ను సాధించిందని లెక్కలు చెబుతున్నాయి. ఇలా ఈ మూడు చిత్రాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గత ఏడాది రూ. 2,500 కోట్ల కలెక్షన్స్ పైగా రాబట్టగలిగారు షారుక్. కానీ ఈ ఏడాది షారుక్ జోరుకు స్పీడ్ బ్రేకర్ పడింది. 2024లో సిల్వర్ స్క్రీన్ని మిస్ చేసుకున్నారు షారుక్. సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా ‘కింగ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో షారుక్ తనయ సుహానా ఖాన్ మరో లీడ్ రోల్లో నటిస్తారు. ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ పూర్తి కాకపోవడంతో ఇంకా ఈ చిత్రం సెట్స్పైకి వెళ్లలేదు. ‘కింగ్’ 2025 ద్వితీయార్ధంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ది బుల్ మిస్ అయ్యాడు ‘కిసీ కీ భాయ్ కిసీ కీ జాన్, టైగర్ 3’... ఈ రెండు సినిమాలతో సల్మాన్ ఖాన్ గత ఏడాది వెండితెరపై కనిపించారు. ఇదే జోష్లో ఈ ఏడాది ఈద్కు సల్మాన్ ఖాన్ సినిమా ఒకటి రిలీజ్ అవుతుందని అనుకున్నారు ఆయన ఫ్యాన్స్. కానీ కుదర్లేదు. ‘షేర్షా’ ఫేమ్ విష్ణువర్ధన్తో సల్మాన్ ఖాన్ చేయాల్సిన ‘ది బుల్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా సరైన సమయంలో సెట్స్ పైకి వెళ్లలేదు. దాంతో ఈ ఏడాది సల్మాన్ ఖాన్ వెండితెరపై కనిపించలేకపోయారు. ఇదిలా ఉంటే... ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్తో సల్మాన్ ఖాన్ ‘సికందర్’ అనే యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా రిలీజ్ కానున్నట్లు యూనిట్ ప్రకటించింది. మరోవైపు దర్శకుడు విష్ణువర్ధన్తో సల్మాన్ చేయనున్న చిత్రం కూడా 2025లోనే రిలీజ్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. సో.. వచ్చే ఏడాది రెండుసార్లు సల్మాన్ తెరపై కనిపిస్తారని ఊహించవచ్చు. రెండేళ్లు పూర్తయినా... రెండేళ్లు దాటిపోయింది ఆమిర్ ఖాన్ బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్పై కనిపించి. 2022లో చేసిన ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా (హాలీవుడ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’కి హిందీ రీమేక్) తర్వాత ఆమిర్ వెంటనే మరో సినిమా ఒప్పుకోలేదు. మరోవైపు తన కుమార్తె ఐరా ఖాన్ పెళ్లి పనులతో కొన్నాళ్లు ఆమిర్ ఖాన్ బిజీ అయ్యారు. దాంతో ఆయన తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ లేట్గా సెట్స్పైకి వెళ్లింది. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ వచ్చే ఏడాదికి వాయిదా వేశారని సమాచారం. భారీ చిత్రంతో... ‘యానిమల్’ సినిమాతో గత ఏడాది బ్లాక్బస్టర్ అందుకున్నారు రణ్బీర్ కపూర్. అయితే గత ఏడాది ‘తు ఝూతీ మై మక్కర్’ చిత్రంతో ఓ ఫ్లాప్ కూడా అందుకున్నారు ఈ హీరో. ఇక ఈ ఏడాది థియేటర్స్లో కనిపించకుండా బ్రేక్ తీసుకున్నారు. భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందుతున్న ‘రామాయణ్’ సినిమాతో ప్రస్తుతం రణ్బీర్ కపూర్ బిజీగా ఉన్నారు. నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి, యశ్ వంటి స్టార్స్ ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. ఇది భారీ చిత్రం కాబట్టి షూట్కి ఎక్కువ సమయం పడుతుంది. దాంతో ఈ ఏడాది తెరపై కనిపించలేదు రణ్బీర్. రెండు భాగాలుగా ఈ సినిమా రూపొందుతోందని, తొలి భాగం 2025లో రిలీజ్ అవుతుందని సమాచారం. అలాగే సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రణ్బీర్ హీరోగా నటిస్తున్న ‘లవ్ అండ్ వార్’ 2026లో విడుదల కానుంది. పర్సనల్ టైమ్ రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఏ చిత్రం కూడా ఈ ఏడాది రిలీజ్ కావడం లేదు. ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ చిత్రం గత ఏడాది జూలైలో రిలీజ్ అయింది. అయితే వెంటనే మరో మూవీకి సైన్ చేయలేదు రణ్వీర్. ఫిబ్రవరి చివర్లో తాము తల్లిదండ్రులం కాబోతున్న విషయాన్ని రణ్వీర్ సింగ్–దీపికా పదుకోన్ వెల్లడించారు. సో... పర్సనల్ లైఫ్కు రణ్వీర్ టైమ్ కేటాయించారు. ఆ తర్వాత ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ ‘డాన్ 3’ సినిమాను ప్రకటించారు. కానీ ఈ చిత్రం 2025లోనే రిలీజ్ అవుతుంది. కాగా అజయ్ దేవగన్ హీరోగా నటించిన ‘సింగమ్ ఎగైన్’ సినిమాలో మాత్రం రణ్వీర్ ఓ గెస్ట్ రోల్ చేశారు. ఈ చిత్రం దీపావళికి రిలీజ్ కానుంది. ఇక దీపికా పదుకోన్ ఈ ఏడాది సెప్టెంబరులో ఓ పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే,. బిజీ బిజీ... కానీ! ‘గదర్ 2’తో బ్లాక్బస్టర్ హిట్ సాధించి, మళ్లీ ఫామ్లోకి వచ్చారు సీనియర్ హీరో సన్నీ డియోల్. 2023లో రిలీజైన ‘గదర్ 2’ సక్సెస్తో సన్నీ డియోల్కు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం ‘బోర్డర్ 2, లాహోర్ 1947, రామాయణ్’ (కీలక పాత్రధారి)లతో పాటు తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సినిమాలతో బిజీగా ఉన్నారు సన్నీ. ఈ సినిమాల చిత్రీకరణ ఈ ఏడాదే ఆరంభమైంది. కానీ ఈ ఏడాది సన్నీ థియేటర్స్లోకి వచ్చే చాన్సెస్ కనిపించడం లేదు. అయితే 2025లో ఆయన మూడు చిత్రాలతో కనిపించే అవకాశం ఉంది. -
సల్మాన్తో సినిమా.. 37 ఏళ్ల ఏజ్ గ్యాప్ అని ట్రోల్ చేశారు: హీరోయిన్
సినిమా తారలకు ట్రోల్స్ కామన్. ఏదో ఒక విషయంలో వాళ్లను ట్రోల్ చేస్తునే ఉంటారు. అయితే సీనియర్ యాక్టర్స్ ఇలాంటివి పట్టించుకోరు కానీ..కొత్తగా వచ్చిన వాళ్లు మాత్రం ట్రోల్స్ చూసి తట్టుకోలేకపోతారు. మానసిక ఒత్తిడికి గురవుతారు. కొన్నాళ్ల తర్వాత వాళ్లు కూడా వాటిని పట్టించుకోకుండా తమ పనిని తాము చేసుకుంటూ వెళ్తారు. (చదవండి: కంగువా రిలీజ్ వాయిదా.. రజనీకాంత్ కోసమే!)అలా తాను కూడా కెరీర్ స్టార్టింగ్లో ట్రోలింగ్కు గురయ్యానని, తట్టుకోలేక కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాకే దూరంగా ఉన్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్. సల్మాన్ఖాన్ హీరోగా వచ్చిన యాక్షన్ కామెడీ చిత్రం ‘దబాంగ్ 3’తో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. అయితే తొలి సినిమానే వయసులో తనకంటే 37 ఏళ్లు పెద్ద నటుడైన సల్మాన్తో నటించడంతో అప్పట్లో ఆమెపై ట్రోల్స్ వచ్చాయి. తాజాగా ఈ ట్రోల్స్పై సయీ స్పందించింది.(చదవండి: అటు ప్రభాస్.. ఇటు మహేశ్.. కరీనాకి డబుల్ చాన్స్!)‘నా తొలి సినిమా సల్మాన్తో అనగానే వెంటనే ఓకే చెప్పా. అప్పటికీ నాకు పీఆర్ టీమ్ లేదు. అందుకే నాకేమీ తెలియదు. సినిమా విడుదలైన తర్వాత నాపై విమర్శలు వచ్చాయి. 37 ఏళ్ల పెద్ద వయసు అయిన హీరోతో నటించావంటూ నన్ను ట్రోల్ చేశారు. చాలా బాధపడ్డాను. ఆ ట్రోల్స్ నా కెరీర్పై ప్రభావం చూపొద్దని ఆరు నెలల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాను. కొన్నాళ్ల తర్వాత అలాంటి విమర్శలు వస్తే బాధపడడం మానేసి.. సరి చేసుకునే ప్రయత్నం మొదలు పెట్టాను’ అని సయీ చెప్పుకొచ్చింది. -
సల్మాన్ చేతికి ఖరీదైన రూ.42 కోట్ల వాచ్..
-
పాటతో పండగ
ముంబైలోని ధారావిలో గల మురికివాడలో జరిగిన ఓ పండగకు హాజరయ్యారు సల్మాన్ ఖాన్, రష్మికా మందన్నా. ఆ పండగలో భాగంగా అక్కడి రెండు వందల మందితో కలిసి డ్యాన్స్ చేశారు. సల్మాన్ ఖాన్, రష్మికా మందన్నా జంటగా నటిస్తున్న ‘సికందర్’కి సంబంధించి ప్రచారంలో ఉన్న వార్త ఇది. కథలో భాగంగా ధారావిలో జరిగే పండగకి ఈ ఇద్దరూ వెళతారట. అప్పుడు వచ్చేపాటను చిత్రదర్శకుడు మురుగదాస్ భారీగా చిత్రీకరించారని సమాచారం. జోష్గా సాగే ఈపాటకు సల్మాన్, రష్మికా అదిరి΄ోయే లెవల్లో స్టెప్పులు వేశారట.మురికివాడలకు సంబంధించిన సెట్ని ముంబైలోని ఓ ప్రముఖ స్టూడియోలో వేయించి, ఈపాటను చిత్రీకరించారని భోగట్టా. ఇక ఈ చిత్రంలో కీలకపాత్రలో కనిపించనున్న కాజల్ అగర్వాల్ ‘సికందర్’ సెట్స్లో అడుగుపెట్టారు. ‘సికందర్ డే 1’ అంటూ ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ద్వారా స్పష్టం చేశారు కాజల్. వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. -
సల్మాన్ చేతికి ఖరీదైన వాచ్ : తెగ ఫీలైపోతున్న ఫ్యాన్స్
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సొంతమైన ఖరీదైన వాచ్లను ధరించడం కొత్తేమీ కాదు. డైమండ్స్ పొదిగిన ఖరీదైన వాచీలు అంటే సల్మాన్కు చాలా ప్రీతి. తాజాగా ఖరీదైన వాచ్తో ఓ ఫొటోకు పోజివ్వడం అందర్నీ ఆకర్షించింది.విలాసవంతమైన వాచ్ కంపెనీ జాకబ్ అండ్ కో బిలియనీర్ III వాచ్ను ధరించాడు. అంతేకాదు ఆ కంపెనీ వ్యవస్థాపకుడు జాకబ్ అరబోను ఆలింగనం చేసుకోవడం కనిపించింది. జాకబ్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో దీనికి సంబంధించిన వీడియోను పంచుకున్నాడు. ఇందులో జాకబ్ తన స్వహస్తాలతో 714 వజ్రాలు పొదిగిన గడియారాన్ని సల్మాన్కు అలంకరించాడు. తాను ఎపుడు ఎవర్నీ బిలియనీర్ వాచ్ని ట్రై చేయనీయలేదు, కానీ సల్మాన్ అందుకు మినహాయింపు అంటూ వీడియోను షేర్ చేశాడు. దీంతో అభిమానులు బీటౌన్ టైగర్, స్టార్ పవర్ ఆ వాచ్కే అందం తెస్తాడు స్పందించారు. అయితే సల్మాన్ ఖాన్ ఖరీదైన వాచ్ పెట్టుకోవం కాదు. ఈ గడియారాన్ని సల్మాన్ ఖాన్ ధరించడమే విశేషం, సల్మాన్ పెట్టుకోవడం వల్లే దానికి వాల్యూ వచ్చింది, లివింగ్ లెజెండ్, బాస్ ఆఫ్ బాలీవుడ్ అంటూ మరికొంతమంది ఫ్యాన్స్ తెగ ఫీలయి పోతున్నారు. View this post on Instagram A post shared by Jacob Arabo (@jacobarabo)రూ. 41.94 కోట్ల వాచ్ విశేషాలు జాకబ్ అండ్ కో కంపెనీ సంబంధించిన చాలా ప్రత్యేకమైన వాచ్ బిలియనీర్ III . ఇవి ప్రపంచవ్యాప్తంగా కేవలం 18 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీని కేస్, లోపలి రింగ్పై 152 ఎమరాల్డ్ కట్ డైమండ్స్, అదనంగా 76 వజ్రాలు మరింత ఆకర్షణీయంగా పొదిగారు. 57 బాగెట్-కట్ డైమండ్స్తో ,బ్రాస్లెట్లో మొత్తం 504 తెల్లని పచ్చ-కట్ డైమండ్స్తో కలిపి మొత్తం న 714 అద్భుతమై వజ్రాలతో దీన్ని రూపొందించారు. జాకబ్ అండ్ కో వెబ్సైట్ ప్రకారం, బిలియనీర్ III ధర. రూ. 41.94 కోట్లు. View this post on Instagram A post shared by Jacob Arabo (@jacobarabo) -
సికందర్కు సాయం
‘సికందర్’కు సాయం చేయనున్నారట హీరోయిన్ కాజల్ అగర్వాల్. సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ సినిమా ‘సికందర్’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్ . సత్యరాజ్, ప్రతీక్ బబ్బర్ కీలకపాత్రలుపోషిస్తున్నారు. కాగా ఈ సినిమాలో కాజల్ కూడా ఓ కీలకపాత్రలో నటించనున్నారట. త్వరలోనే ‘సికందర్’ షూటింగ్లో ఆమెపాల్గొంటారని బాలీవుడ్ టాక్. కథ రీత్యా ఈ చిత్రంలో సల్మాన్ కు సాయం చేసేపాత్రలో కాజల్ నటిస్తారట. మరి.. ‘సికందర్’లో కాజల్ భాగమైనట్లేనా? అంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. ఇదిలా ఉంటే.. ముంబైలోని ఓ స్టూడియోలో నిర్మించిన భారీ సెట్లో ప్రస్తుతం ‘సికందర్’ చిత్రీకరణ జరుగుతోంది. సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే రంజాన్ సందర్భంగా రిలీజ్ కానుంది. -
వినాయక చవితి వేడుకల్లో స్టార్ హీరో డ్యాన్స్.. వీడియో వైరల్!
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ముంబయిలో సందడి చేశారు. వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న ఆయన డ్యాన్స్ చేస్తూ కనిపించారు. చిన్నపిల్లలతో కలిసి డప్పుల ముందు చిందులు వేశారు. దీనికి సంబంధించిన వీడియోను సల్మాన్ తన ట్విటర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా.. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సికిందర్ చిత్రంలో నటిస్తున్నారు. సల్మాన్ చివరిగా 'టైగర్ 3'లో కత్రినా కైఫ్ సరసన నటించారు. ఈ మూవీ వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సల్మాన్ సరసన రష్మిక మందన్నా స్క్రీన్ పంచుకోనుంది. ఇటీవల పక్కటెముకల గాయంతో ఓ ఈవెంట్లో ఇబ్బంది పడుతూ కనిపించారు. మరోవైపు హిందీ బిగ్బాస్ 18వ సీజన్కు హోస్ట్గా వ్యవహరించేందుకు సిద్ధమయ్యారు.గాయంతో ఈవెంట్కు హాజరు..ఈ బిగ్బాస్ ఈవెంట్లోనూ తాను ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించారు. రెండు పక్కటెముకలు విరిగాయని, ఈ గాయం తాను అనుకున్నదానికంటే కూడా సీరియస్గా ఉందని పేర్కొన్నాడు. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అంటూ ఫోటో, వీడియో జర్నలిస్టులకు సూచించాడు. సల్మాన్ ఇబ్బందిని గమనించిన అభిమానులు అంత కష్టంలోనూ పనిధ్యాసే అని పొగుడుతున్నారు. Happy Ganesh Chaturthi pic.twitter.com/Ac7d9Om86v— Salman Khan (@BeingSalmanKhan) September 9, 2024 -
పక్కటెముకలు విరిగాయి.. గాయంపై నోరు విప్పిన సల్మాన్
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కొద్దిరోజుల క్రితం గాయపడ్డాడు. షూటింగ్లో అతడి పక్కటెముకలకు గాయమైందని తెలిసింది. అయినప్పటికీ ఆ బాధను భరిస్తూనే తన పనులు చక్కబెట్టుకుంటున్నాడు. నడవడానికి, కూర్చోవడానికి ఇబ్బందిగా ఉన్నా సరే విశ్రాంతి తీసుకోకుండా ఈవెంట్స్లో హాజరవుతున్నాడు. బిగ్బాస్ షో..ప్రస్తుతం సికిందర్ సినిమా చేస్తున్న సల్లూభాయ్ మరోవైపు హిందీ బిగ్బాస్ 18వ సీజన్ను షురూ చేసే పనిలో పడ్డాడు. ఈ బిగ్బాస్ ఈవెంట్లోనే తన ఇబ్బందిని బయటపెట్టాడు. తనకు రెండు పక్కటెముకలు విరిగాయని, ఈ గాయం తాను అనుకున్నదానికంటే కూడా సీరియస్గా ఉందని పేర్కొన్నాడు. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అంటూ ఫోటో, వీడియో జర్నలిస్టులకు సూచించాడు. సల్మాన్ ఇబ్బందిని గమనించిన అభిమానులు అంత కష్టంలోనూ పనిధ్యాసే అని పొగుడుతున్నారు. థీమ్ ఏంటంటే?బిగ్బాస్ విషయానికి వస్తే.. హిందీలో ఇప్పటివరకు ఈ రియాలిటీ షో 17 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. 18వ సీజన్ త్వరలోనే రాబోతుందని తెలియజేస్తూ సల్మాన్తో ఓ ప్రోమో కూడా షూట్ చేశారు. ఈసారి గతం-వర్తమానం-భవిష్యత్తు అనే థీమ్తో బిగ్బాస్ షోను నడిపించనున్నారట! మరి ఈ థీమ్ ఏంటి? అది ఎలా వర్కవుట్ అవుతుందనేది రానున్న రోజుల్లో తేలనుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
హాట్టాపిక్గా సల్మాన్ ఖాన్ బాడీ గార్డ్ హెల్తీ డైట్..!
బాలీవుడ్ సూపర్ స్టార్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ క్రేజ్ ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆయనకు ఫ్యాన్సే. ప్రస్తుతం ఆయన 'సికందర్'మూవీ షూటింగ్తో బిజీగా ఉన్నారు. ఆయన వ్యక్తిగత అంగ రక్షకుడు షేరా డైట్ నెట్టింట హాట్టాపిక్గా మారింది. సల్మాన్ ప్రతి షోకి వెంట ఉంటే షేరా గురించి పాటించే ఆహార నియమాలపై సల్మాన్ అభిమాను కుతుహలం ఎక్కువ. ఎందుకంటే భాయిజాన్ను రక్షించే అతడు కూడా మంచి ఫిట్గా కనిపించడమే అందుకు కారణం. అనునిత్యం సల్మాన్ని రక్షిస్తుండే అతడు ఏం తింటాడు దాని గురించి అభిమానులు ఆసక్తిగా ఉంటారు. అయితే షేరా ఒక ఇంటర్వ్యూలో తన డైట్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను ప్రతిదీ హ్యాపీగా తింటానని, కానీ బ్రెడ్, రోటీ లేదా శుద్దీ చేసిన ఆహారాల జోలికి మాత్రం పోనని అన్నారు. అంతేగా రోజంతా యాక్టివిగ్ ఉండేందుకు కచ్చితంగా భోజనానికి ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. అలాగే తప్పనిసరిగా వ్యాయామం చేస్తానని చెప్పారు. ఆరోగ్యంగా ఉండేలా సరైన వంటకాలను ఎంచుకోవాలని చెబుతున్నాడు. అలాగే సల్మాన్తో తనకు గల విడదీయరాని బంధం గురించి చెప్పారు. అలాగే తన కొడుకు హీరోగా లాంచ్ చేసే విషయంలో సల్మాన్ తనకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారని అన్నారు. అలాగే తమ మధ్య ఎలాంటి సాంస్కృతిక విభేదాలు తలెత్త లేదని చెప్పారు. కాగా, సల్మాన్కి అంగరక్షకుడిగా 1990ల నుంచి పనిచేశాడు. ఆ తర్వాత 2019లో రాజకీయల్లోకి ప్రవేశించారు. అయితే ఆయన సల్మాన్ని రక్షించడంలో చాలా అంకితభావంతో పనిచేస్తాడని పేరు ఉండటం విశేషం.(చదవండి: ఈ నాలుగు కీలక పోషకాలను తక్కువగా తీసుకుంటున్నాం! పరిశోధకుల స్ట్రాంగ్ వార్నింగ్) -
సల్మాన్ క్రేజ్.. ఇలాంటి ఫ్యాన్స్ కూడా ఉన్నారా?
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ క్రేజే వేరే లెవెల్. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఫ్యాన్స్ ఉన్న హీరోల్లో సల్మాన్ ముందుంటారు. ఇటీవల ఓ ఈవెంట్లో వేదికపై చిన్నపిల్లాడి అభిమానంతో సల్మాన్ కాళ్లకు నమస్కరించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలైంది. తాజాగా బిగ్బాస్-18 సెట్స్లోనూ ఆయన ఓ అభిమానితో ముచ్చటించారు.సల్మాన్ ఖాన్ను చూసిన ఆమె సంతోషంతో ఉప్పొంగిపోయింది. మీకోసం నేను దేవుడిని ప్రార్థించానంటూ సల్మాన్ పట్ల తన అభిమానాన్ని చాటుకుంది. ఆమె చెబుతున్న మాటలను సల్మాన్ ఖాన్ ఆసక్తిగా విన్నారు. కొద్దిసేపు ఆమెతో ముచ్చటించారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో ఫ్యాన్స్ అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏ మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. సల్మాన్ ఖాన్ చివరిగా 'టైగర్ 3'లో కత్రినా కైఫ్ సరసన నటించారు. ప్రస్తుతం ఆయన 'సికందర్'మూవీలో కనిపించనున్నాడు, ఈ మూవీ వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సల్మాన్ సరసన రష్మిక మందన్నా స్క్రీన్ పంచుకోనుంది. అంతేకాకుండా కమల్ హాసన్- అట్లీ మూవీలోనూ సల్మాన్ నటించనున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) -
సరిగా కూర్చోలేకపోయిన హీరో సల్మాన్ ఖాన్.. ఏమైంది?
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరిగా కూర్చోలేకపోయాడు. పదే పదే కదులుతూ ఇబ్బంది పడ్డాడు. దీంతో అభిమానులు కంగారు పడుతున్నారు. అసలు ఏం జరిగిందా అని మాట్లాడుకుంటున్నారు. తాజాగా ముంబైలో పర్యావరణ హిత వినాయక చవితి అందరూ జరుపుకోవాలనే ఉద్దేశంతో 'బచ్చే బోలే మోరియా' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో సల్మాన్ ఇబ్బంది పడుతున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: నాని 'సరిపోదా శనివారం'కి ఊహించని కలెక్షన్స్!)సల్మాన్కి ఏమైంది?తమిళ దర్శకుడు ఏఆర్ మురగదాస్ కొత్త సినిమా 'సికిందర్'. ఇందులో సల్మాన్ ఖాన్ హీరో. రీసెంట్గా షూటింగ్ టైంలో సల్మాన్ గాయపడగా.. పక్కటెముకలకు గాయమైందని తెలుస్తోంది. ఇలా ఓ వైపు నొప్పి వేధిస్తున్నా సరే ఈవెంట్లో పాల్గొన్నాడు. ఈ విషయాన్నే కార్యక్రమాన్ని నిర్వహించిన అమృత ఫడ్నవీస్ చెప్పకొచ్చారు.గాయం ప్రమాదమా?అయితే సల్మాన్ ఖాన్ ఇలా కుర్చీలో ఇబ్బంది పడుతున్న వీడియోని చూసి అభిమానులు కంగారు పడ్డారు. కానీ అదెమంత పెద్ద సమస్య కాదని, కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుందని అంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. (ఇదీ చదవండి: 'పుష్ప 2'.. సందేహాలు అక్కర్లేదు అంతా క్లారిటీ)#SalmanKhan Bhai is suffering from serious Rib Injury, get well soon Bhai, your health and happiness matters the Most 🙏❣️pic.twitter.com/CQomVLEKZd— MASS (@Freak4Salman) August 28, 2024 -
ఆదిపురుష్కు మంచి వసూళ్లు వచ్చాయ్.. ప్రభాస్తో పాటు ఆ హీరో..
ఫ్లాప్ అవడం వేరు, అప్రతిష్ట మూటగట్టుకోవడం వేరు. కొన్ని కథలు బాగున్నా కలెక్షన్స్ కూడబెట్టడంలో విఫలమై ఫ్లాప్గా నిలుస్తాయి. మరికొన్ని భారీ బడ్జెట్, భారీ తారాగణంతో ఊరిస్తూ ఊదరగొడుతూ బాక్సాఫీస్ ముందుకు వచ్చి అట్టర్ఫ్లాప్గా నిలుస్తాయి. అంతేనా దారుణంగా ట్రోలింగ్కు గురవుతాయి. ఆదిపురుష్ సినిమా రెండో కోవలోకి వస్తుంది.ఆదిపురుష్పై ట్రోలింగ్భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం కాసుల వర్షం కురిపిస్తుందని అంతా అనుకున్నారు. కానీ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. అంతేకాదు, నటీనటుల లుక్పైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. వానరాలను చూపించిన తీరు కూడా జనాలకు నచ్చలేదు. ఇలా ఒక్కటేమిటి, బోలెడు తప్పులను జనాలు సోషల్ మీడియాలో ఎత్తిచూపుతూ దర్శకుడు ఓం రౌత్ను ఏకిపడేశారు.బానే ఆడిందిఅయితే తన సినిమాకేమైందంటున్నాడు ఓం రౌత్. తాజాగా ఓ మరాఠీ షోలో మాట్లాడుతూ.. సినిమాను విమర్శించడం వేరు, బాక్సాఫీస్ వద్ద దాని పనితీరు వేరు. ఆదిపురుష్ సినిమానే ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఇది మొదటి రోజు ఒక్క ఇండియాలోనే రూ.70 కోట్లు రాబట్టింది. మొత్తంగా దాదాపు రూ.400 కోట్లు వసూలు చేసింది. అంటే బాక్సాఫీస్ వద్ద బానే ఆడింది.నేను పట్టించుకోనుఇక్కడ డబ్బులు పోలేదు. కాకపోతే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు థియేటర్లో కొన్ని సీన్లు రికార్డు చేసి ఆన్లైన్లో ట్రోల్ చేశారు. అలాంటివాటిని నేనసలు పట్టించుకోను. అయినా ఫ్లాపులతో సంబంధం లేకుండా తమ పాపులారిటీని చెక్కుచెదరనివ్వకుండా కాపాడుకునే హీరోలు ఇద్దరే ఇద్దరు. ఒకరు ప్రభాస్, మరొకరు సల్మాన్ ఖాన్. వారి ఇమేజ్ చెక్కుచెదరదువీరికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్ని ఫ్లాపులు వచ్చినా వీరి ఇమేజ్ అలాగే ఉంటుంది. సినిమా వైఫల్యంతో సంబంధం లేకుండా వారి క్రేజ్ అలాగే కొనసాగుతుంది అన్నారు. ఇకపోతే దాదాపు రూ.700 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఆదిపురుష్ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.393 కోట్లు వసూలు చేసింది.చదవండి: ప్రముఖ నటులపై అత్యాచార కేసు నమోదు -
కోట్ల విలువైన కారును కొన్న సల్మాన్ ఖాన్ బాడీగార్డ్!
బాలీవుడ్ స్టార్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన సికిందర్ చిత్రంలో నటిస్తున్నారు. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో రానున్న ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా కనిపించనుంది. అయితే ఇటీవల సల్మాన్ఖాన్కు పక్కటెములకు గాయాలు కావడంతో ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్కు దూరంగా ఉన్నారు. తమ హీరో త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గాయం అయినప్పటికీ తాజాగా ముంబయిలో జరిగిన ఓ ఈవెంట్కు హాజరయ్యారు.అయితే తాజాగా సల్మాన్ ఖాన్కు బాడీగార్డ్ షేరా ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. 1995 నుంచి సల్మాన్కు బాడీగార్డ్గా పనిచేసిన షేరా కొత్త రేంజ్ రోవర్ను కొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేశారు. ఈ కారు విలువ దాదాపుగా రూ.1.4 కోట్లుగా ఉంటుందని సమాచారం. షేరా అసలు పేరు గుర్మీత్ సింగ్ జాలీ కాగా.. సల్మాన్కు బాడీగార్డ్గా పని చేయడమే కాకుండా టైగర్ సెక్యూరిటీ అనే సంస్థను స్థాపించారు. View this post on Instagram A post shared by shera (@beingshera) -
స్టార్ హీరోయిన్.. కానీ బడా హీరోలతో ఇంతవరకు జోడీ కట్టలేదు!
కొన్ని రోజులుగా హీరోయిన్ శ్రద్ధా కపూర్ పేరు మార్మోగిపోతోంది. అటు స్త్రీ ఘన విజయం ఆమెను ఉబ్బితబ్బిబ్బు చేస్తోంది. మరోవైపు ఇన్స్టాగ్రామ్లో ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్న మూడో వ్యక్తిగా రికార్డు సృష్టించింది. కెరీర్లో ఎన్నో హిట్స్ అందుకున్న ఈ బ్యూటీ బాలీవుడ్ బడా స్టార్స్ షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్లతో మాత్రం ఇంతవరకు నటించనేలేదు. స్టార హీరోలతో నటించే ఛాన్స్ రాలేదా?ఖాన్ త్రయంతో నటించకపోవడానికి గల కారణాన్ని శ్రద్ధ తాజాగా బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ.. షారూఖ్, ఆమిర్, సల్మాన్లతో నటించే ఛాన్స్ నాకు ఎప్పుడో వచ్చింది. కానీ పాత్రలో సత్తా లేకపోవడం వల్ల, అసలు ఆ రోల్ బాగోకపోవడం వల్ల ఇప్పటివరకు ఏదీ ఫైనలైజ్ కాలేదు. సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. నాకు ఆఫర్ చేసిన పాత్ర పేలవంగా ఉంటే నేను చేయలేను.బెస్ట్ అనిపించేవి సెలక్ట్ చేసుకుంటామంచి సినిమాలే చేయాలనుకుంటాను. ఉత్తమ దర్శకులతో పని చేయాలని భావిస్తాను. ఇవన్నీ చేసినప్పుడే కదా పెద్ద స్టార్స్తో కలిసి నటించే ఛాన్స్ వస్తుంది. అలాంటి ఆఫర్ ఇప్పుడొస్తే కచ్చితంగా ఓకే చెప్తాను అని చెప్పుకొచ్చింది. కాగా శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటించిన స్త్రీ 2 మూవీ బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు రూ.400 కోట్లు రాబట్టింది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రాజ్కుమార్ రావు, అపరశక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రలు పోషించారు.చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన డబ్బింగ్ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? -
టైగర్ తో ఫైటింగ్ కి దిగుతున్న లైగర్
-
బిగ్బాస్ షోలోకి టాలీవుడ్ బ్యూటీ.. ఈసారి పక్కాగా..!
మరికొద్ది రోజుల్లో బిగ్బాస్ షో ప్రారంభం కానుంది. తెలుగులో, తమిళంలో బిగ్బాస్ 8వ సీజన్ మొదలు కానుండగా హిందీలో 18వ సీజన్ షురూ కానుంది. ఇప్పటికే ఈ మూడు సీజన్ల కోసం కంటెస్టెంట్ల వేట మొదలుపెట్టారు. ఈపాటికే కొందర్ని ఫైనల్ చేయగా మరికొందరు పారితోషికం దగ్గర బేరాలాడుతున్నారు.బ్యూటీకి ఆహ్వానం..ఇదిలా ఉంటే హీరోయిన్ సమీరా రెడ్డి సైతం రియాలిటీ షోలో భాగం కానుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలోనూ ఆమె షో మేకర్స్ నుంచి ఆహ్వానం అందింది. కానీ పలు కారణాల వల్ల ఆ ఆఫర్ను వదులుకుంది. అయితే ఈసారి మాత్రం సమీరా రావడం పక్కా అంటున్నారు.తెలుగులో..కాగా హిందీ బిగ్బాస్ 18వ సీజన్ అక్టోబర్ 5న ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియను బట్టి ఈ తేదీలో మార్పుచేర్పులు ఉండవచ్చు. సమీరా విషయానికి వస్తే ఈమె తెలుగులో నరసింహుడు, అశోక్ చిత్రాల్లో నటించింది. 2012లో వచ్చిన కృష్ణం వందే జగద్గురుం సినిమాలో స్పెషల్ సాంగ్లో ఆడిపాడింది. -
ఆ స్టార్ హీరో డ్యాన్స్ చూసి ఏడ్చేశా: కొరియోగ్రాఫర్
బాలీవుడ్లోని ఓ స్టార్ హీరోకు డ్యాన్స్ రాదని, తనకు నేర్పించడం చేతకాక ఏడ్చేశానంటోంది కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్. బాలీవుడ్లో టాప్ కొరియోగ్రాఫర్గా రాణిస్తున్న ఫరా ఖాన్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. సల్మాన్ ఖాన్ సినిమాల్లోకి రావాలని ప్రయత్నిస్తున్న కొత్తలో ఆడిషన్స్కు వెళ్లాడు. అలా ఓసారి స్క్రీన్ టెస్ట్ చేసినప్పుడు తనకు డ్యాన్స్ నేర్పించాను. స్టెప్పులేయడమే చేతకాదునాలుగు గంటలపాటు నేర్పిస్తూనే ఉన్నాను, కానీ తనకు రావట్లేదు. నీకు డ్యాన్స్ నేర్పించడం ఎవరి వల్లా కాదు. నీకసలు స్టెప్పులేయడమే చేతకాదని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాను. తర్వాత అతడిని మైనే ప్యార్ కియా సినిమాకు సెలక్ట్ చేశారని తెలిసి ఆశ్చర్యపోయాను. ఆ మూవీలో అతడు ఒదిగిపోయే తీరు చూసి షాకైపోయాను అని చెప్పుకొచ్చింది.సల్మాన్ జర్నీకాగా సల్మాన్ ఖాన్.. 1988లో 'బివి హో తో ఐసీ' అనే సినిమాతో వెండితెరపై ప్రయాణం ప్రారంభించాడు. దబాంగ్ సినిమాలో మున్నీ బద్నాం హూయి పాటలో సల్మాన్కు ఫరా స్టెప్పులు నేర్పించింది. మరెన్నో హిట్ సాంగ్స్కు సైతం ఫరాయే కొరియోగ్రఫీ చేసింది. సల్మాన్ గతేడాది.. కిసి కా భాయ్ కిసీ కీ జాన్, టైగర్ 3 చిత్రాలతో అలరించాడు. ప్రస్తుతం సికిందర్ సినిమా చేస్తున్నాడు. -
ఏకంగా సల్మాన్ ఖాన్ తో విజయ్ దేవరకొండ క్లాష్
-
వరుస ప్లాపులు అయిన నమ్ముతున్న స్టార్స్..
-
గర్భశయాన్ని తొలగించారు.. తల్లిని కాలేను.. హీరోయిన్ ఎమోషనల్!
నటి రాఖీ సావంత్ గురించి బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు సోషల్ మీడియాను రెగ్యులర్గా ఫాలో అయ్యే నెటిజన్స్కి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో స్పెషల్ సాంగ్స్కి కేరాఫ్గా నిలిచింది. తనదైన అందం, అభినయంతో బాలీవుడ్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకుంది. అయితే కొన్నాళ్ల తర్వాత అవకాశాలు తగ్గడంతో రాఖీ పేరు అంతా మర్చిపోయారు. దీంతో కొంతకాలం పాటు సైలెంట్గా ఉండి.. హిందీ బిగ్బాస్ రియాల్టీ షోతో మళ్లీ ఫామ్లోకి వచ్చింది. బిగ్బాస్ హౌస్లో రాఖీ చేసిన సందడి, కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. బయటకు వచ్చిన తర్వాత ఆమెకు నెట్టింట మంచి ఆదరణ లభించింది. ఏ పోస్ట్ పెట్టినా వైరల్ అయింది. కాంట్రవర్సీ పోస్ట్లతో హల్చల్ చేసింది. (చదవండి: డూప్ అంటేనే ఒళ్లు మండుతుంది: మంచు లక్ష్మి)అయితే గత కొన్నాళ్లుగా మాత్రం రాఖీ కాస్త సైలెంట్ అయిపోయింది. దానికి కారణం ఆమె అనారోగ్యం బారిన పడడమే. ప్రస్తుతం ఈ బ్యూటీ దుబాయ్లో ఉంటూ చికిత్స పొందుతోంది. ఆ మధ్య శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ బ్యూటీ తన ఆరోగ్య విషయాలను షేర్ చేసుకుంటూ ఎమోషనల్ అయింది. (చదవండి: రొమాంటిక్ ఫొటోలతో ప్రియుడ్ని పరిచయం చేసిన బ్యూటీ)‘నాకు శస్త్ర చికిత్స జరిగిన విషయం వాస్తవమే. ఓ సారి వైద్యులు చెక్ చేసి గుండె పోటు లక్షణాలు ఉన్నాయని చెప్పారు. వైద్య పరిక్షల అనంతరం నా గర్భాశయంలో 10 సెంటీ మీటర్ల కణితి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే సర్జరీ చేయించుకోవాలని..లేదంటే ప్రాణాలకే ప్రమాదం అని తెలిపారు. దీంతో నేను సర్జరీ చేయించుకున్నాను. కణితితో పాటు గర్భాశయాన్ని కూడా తొలగించారు. ఇక నేను తల్లిని కాలేనని వైద్యులు చెప్పడంతో ఏడ్చేశాను. నేను తల్లి అవ్వాలంటే.. సరోగసీ ద్వారా పిల్లలను పొందాల్సిందే’ అని రాఖీ సావంత్ ఎమోషనల్ అయింది. ఇక ఆస్పత్రిలో ఉన్నప్పుడు హీరో సల్మాన్ ఖాన్ అండగా నిలిచాడని, తన మెడికల్ బిల్లులు మొత్తం ఆయనే కట్టేశాడని చెప్పింది.