-
20 రూపాయిల కోసం దారుణం..
న్యూఢిల్లీ: రానురాను మనుషుల్లో మానవత్వం మచ్చుకైనా లేకుండా పోతుంది. చిన్న చిన్న విషయాలు కూడా తీవ్ర పరిణామాలకు దారి తీస్తున్నాయి. ఇలాంటి దారుణం ఒకటి దేశ రాజధానిలో చోటు చేసుకుంది. కేవలం 20 రూపాయలు ఇవ్వనందుకు ఓ వ్యక్తిని అతడి కుమారుడి కళ్ల ముందే దారుణంగా కొట్టి చంపేశారు కర్కోటకులు. వివరాలు.. రూపేష్(38) అనే వ్యక్తి ఉత్తర ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో తన భార్య, కుమారుడితో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈ ప్రాంతం ఘోరమైన నేరాలకు ప్రసిద్ధి చెందింది. ఈ క్రమంలో రూపేష్ కటింగ్ చేయించుకోవడం కోసం తన ఇంటి పక్కనే ఉన్న బార్బర్ షాప్కి వెళ్లాడు. యాభై రూపాయల బిల్లు అయ్యింది. రూపేష్ రూ.30 చెల్లించి మిగతా ఇరవై రూపాయలు తర్వాత ఇస్తా అన్నాడు. దాంతో ఆగ్రహించిన షాపు ఓనర్ తన సోదరుడితో కలిసి అతడిపై దాడి చేశాడు. (చదవండి: పోలీసు ఉన్నతాధికారి దారుణం : వైరల్ వీడియో) ఈ దారుణం జరిగినప్పుడు రూపేష్ కుమారుడు అక్కడే ఉన్నాడు. దాడిని ఆపేందుకు ప్రయత్నించాడు. కానీ వారు ఆగలేదు. జనాలు చూస్తూ ఉన్నారు కానీ ఆపే ప్రయత్నం చేయలేదు. చివరకు అతడు మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితులు సంతోష్, సరోజ్లను అరెస్ట్ చేశారు. -
బురారీ ఉదంతం: ఒంటరిని.. పోరాడలేను
న్యూఢిల్లీ : గత ఏడాది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బురారీ ఆత్మహత్యల ఉందతాన్ని అంత సులభంగా మర్చిపోలేం. ముఢవిశ్వాసంతో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది సభ్యులు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కుటుంబానికి సంబంధించి ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో ఉన్నాడు. మరణించిన నారాయణ దేవి పెద్ద కుమారుడు దినేష్ చుందావత్ మాత్రమే ప్రస్తుతం బతికి ఉన్నాడు. జరిగిన దారుణాన్ని నేటికి కూడా అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. ఈ విషయం గురించి దినేష్ మాట్లాడుతూ.. ‘వ్యాపార నిమిత్తం నేను మా స్వస్థలం రాజస్తాన్ చిత్తోర్గఢ్లో ఉంటున్నాను. జరిగిన దారుణం గురించి తెలిసి షాక్కు గురయ్యాను. మా కుటుంబ సభ్యులు అందరు చాలా మంచివారు. బయటి వ్యక్తులను ఎప్పుడు కనీసం ‘థూ’ అని కూడా ఎరగరు. పైగా మాది విద్యావంతుల కుటుంబం. అలాంటిది కేవలం మూఢనమ్మకంతోనే ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే నమ్మశక్యంగా లేదు. పోలీసుల విచరణ పట్ల నేను సంతృప్తిగా లేను. కానీ ప్రస్తుతం నేను ఒంటరిగా మిగిలాను.. పోరాడే ఓపిక లేదు’ అన్నాడు. (చదవండి : 11 మంది మరణం: అతడే సూత్రధారి) అంతేకాక ‘మా కుటంబంలో జరిగిన విషయంలో మీడియా అత్యుత్సాహం ప్రదర్శించింది. తాంత్రిక శక్తులంటూ ఏవేవో పుకార్లు వ్యాపించాయి. ప్రస్తుతం మా ఇంటికి సంబంధించి కూడా ఇలాంటి వార్తలే ప్రచారం చేస్తున్నారు. మా ఇంటిని తక్కువ రేటుకు కొట్టేయాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నార’ని దినేష్ ఆరోపించాడు. ఇంతమంది మృతికి నారాయణ దేవి(77) చిన్న కుమారుడు లలిత్ భాటియా(45)నే కారణం. అతడు మరణించిన తండ్రి తనకు కనిపిస్తున్నాడని, తనతో మాట్లాడుతున్నాడని.. తనకు సందేశాలు ఇస్తున్నాడని కుటుంబ సభ్యులకు చెప్పేవాడు. ఈ క్రమంలోనే తండ్రి సందేశాలను రిజిస్టర్లో రాసి మిగతా కుటుంబ సభ్యులకు తెలిపేవాడు. అందులో భాగంగానే రిజిస్టర్లో ఒక చోట ‘త్వరలోనే మీ ఆఖరి కోరికలు నెరవేరతాయి. అప్పుడు ఆకాశం తెరుచుకుంటుంది. భూమి కంపిస్తుంది. కానీ ఎవరూ భయపడకండి. గట్టిగా మంత్రాన్ని జపించండి నేను మిమ్మల్ని కాపాడతాను’ అని తండ్రి తనతో చెప్పినట్లు కాగితంలో రాసి కుటుంబ సభ్యులకు తెలిపాడు. లలిత్ భాటియా చెప్పిన విషయాలను మిగతా కుటుంబ సభ్యులు కూడా నమ్మి అతడు చెప్పినట్లే ఆత్మహత్య చేసుకున్నారని నిర్ధారించారు పోలీసులు. -
బురారీ ఉదంతం : ఆత్మలు తిరుగుతున్నాయి
న్యూఢిల్లీ : అహ్మద్ అలీ, అస్ఫర్ అలీల వృత్తి కార్పెంటర్ పని.. ప్రవృత్తి హాంటెడ్ హౌస్(దెయ్యాలు తిరుగుతున్నాయనే ప్రచారం జరిగే ఇళ్లు)ల్లో నివసించడం. సాధరణంగా ఇలాంటి వారి గురించి ఎక్కువగా సినిమాల్లోనే చూస్తూంటాం. దెయ్యాలు తిరుగుతున్నాయనే ప్రచారంతో విలువైన ఇంటిని ఎవరూ కొనడానికి ముందుకు రాకపోవడం.. ఈ క్రమంలో హీరో అక్కడ కొన్ని రోజుల పాటు గడిపి.. అవన్ని ఒట్టి పుకార్లే అని నిరూపిస్తుంటారు. సరిగా అలీ బ్రదర్స్ పని కూడా ఇదే అన్నమాట. ప్రస్తుతం వీరు ఇద్దరు బురారీ కుంటుంబ సభ్యుల ఇంట్లో ఉంటున్నారు. గత ఏడాది దేశ రాజధానిలో సంచలనం సృష్టించిన బురారీ కుటుంబ సభ్యుల ఆత్మహత్య ఉదంతాన్ని అంత తొందరగా మర్చిపోలేం. (చదవండి : తండ్రి కాపాడుతాడని...) అతీత శక్తుల భ్రమలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి మరణాంతరం గత ఏడాది అక్టోబర్లో దినేష్ చుంద్వాత్ అనే వ్యక్తి ఈ ఇంటిని కోటిన్నర రూపాయలకు కొనుగోలు చేశాడు. ప్రస్తుతం డబ్బు అవసరం ఉండటంతో.. ఇంటిని అమ్మేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పటికే ఈ ఇంటిలో ఆత్మలు తిరుగుతున్నాయనే పుకార్లు వ్యాపించాయి. దాంతో కోటిన్నర పెట్టి కొన్న ఇంటిని కొనడానకి ఎవరూ ముందుకు రావడం లేదు. ఒక వేళ వచ్చినా.. చాలా తక్కువ ధరకు అడుగుతున్నారు. ఈ క్రమంలో ఇంటి మీద వచ్చిన పుకార్లు నిజం కాదని నిరూపించి.. మంచి రేటుకు ఇంటిని అమ్మాలని భావించిన దినేష్, అలీ సోదరులకు కబురుపెట్టాడు. కొన్ని రోజులు పాటు తన ఇంట్లో ఉండాల్సిందిగా దినేష్ వారిని కోరాడు. రెంట్ ఇవ్వాల్సిన పని లేదని చెప్పాడు. దినేష్ కోరిక మేరకు అలీ సోదరులు ప్రస్తుతం ఈ ఇంట్లో నివాసం ఉంటున్నారు. మూడంతస్థుల భవనంలో కింది ఫ్లోర్ను తమ కార్పెంటర్ విధుల కోసం వాడుకుంటుండగా.. మిగతా రెండంతస్థుల్లో వారు నివాసం ఉంటున్నారు. ఈ విషయం గురించి అలీ సోదరులు మాట్లాడుతూ.. ‘తొలి రోజు మేం నారాయణి దేవి రూంలో ఆమె మంచం మీద పడుకున్నాం. మాకేం తేడగా అన్పించలేదు. తరువాత మేం ఇంట్లో ఉన్న వేర్వేరు బెడ్రూంల్లో ఒంటరిగా పడుకుంటున్నాం’ అన్నారు. అయితే తాము బురారీ కుటుంబ సభ్యుల ఇంట్లో ఉండటం తమ ఇంట్లోవారికి కూడా ఇష్టం లేదని తెలిపారు. మమ్మల్ని ఇక్కడకు రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నించారు. కానీ తాము అందుకు ఒప్పుకోలేదన్నారు. గ్రామాల్లో ఇలాంటి మూఢనమ్మకాలు అధికంగా ఉంటాయని.. కానీ తాము వాటిని నమ్మమని తెలిపారు అలీ సోదరులు. అయితే అర్థరాత్రి సమయంలో ఆత్మలు తిరుగుతుంటాయని తాము బలంగా విశ్వసిస్తామన్నారు. ఈ విషయం గురించి ఓ ప్రాపర్టీ డీలర్ మాట్లాడుతూ.. ‘ఇలాంటి దారుణాలు జరిగిన ఇళ్లను కొనడానికి జనాలు ఆసక్తి చూపరు. ఒక వేళ ఎవరైనా కొందామని భావించిన చాలా తక్కువ రేటుకు కొందామనే భావిస్తారు. బురారీ ఇళ్లు రోడ్డుకు దగ్గర్లో ఉంది. పెయింట్ వేసి.. చిన్న చిన్న మార్పులు చేస్తే.. మంచి ధర పలుకుతుంది. కానీ ముందు ఆ ఇంటి గురించి ప్రచారం అవుతోన్న పుకార్లు అవాస్తవమని తెలాలి’ అన్నారు. -
బురారీ కేసు.. ప్రమాదం మాత్రమే : ఫోరెన్సిక్ రిపోర్టు
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బురారీ సామూహిక మరణాల మిస్టరీ వీడింది. భాటియా కుటుంబ సభ్యులవి ఆత్మహత్యలు కావని.. పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా జరిగిన ప్రమాదం మాత్రమేనని సీబీఐ- సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక ఇచ్చింది. గత జూన్లో ఢిల్లీలోని బురారి ప్రాంతంలో నివాసం ఉంటున్న ఒకే కుటుంబంలోని 11 మంది అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. వారిలో 10 మంది ఇంట్లోని సీలింగ్కు ఉన్న ఇనుప కమ్మీలకు వేలాడుతుండగా, ఇంటి యజమాని నారాయణ దేవి (75) గొంతు కోయడం వల్ల చనిపోయింది. కాగా తాంత్రిక పూజల ప్రభావానికి లోనుకావడం వల్లే వీరంతా ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు భావించారు. భాటియా కుటుంబ సభ్యుల్లో ఒకడైన లలిత్ భాటియా మూఢనమ్మకాల కారణంగానే ఈ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని విచారణలో వెల్లడైంది. అయితే భాటియా కుటుంబంలోని ఇతర వ్యక్తులు ఈ విషయాన్ని వ్యతిరేకించారు. కానీ పోస్టుమార్టం రిపోర్టులో ఉరివేసుకోవడం వల్లే మరణించారని నివేదిక రావడంతో ఢిల్లీ పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకున్నారు. వీరి మరణాలకు గల స్పష్టమైన కారణాలు తెలుసుకునేందుకు.. మృతుల సైకలాజికల్ అటాప్సీ నివేదిక ఇవ్వాల్సిందిగా సీబీఐ ఫోరెన్సిక్ ల్యాబ్కు లేఖ రాశారు. వీరికి ఆత్మహత్య చేసుకోవాలనే భావన ఏమాత్రం లేదని.. ఇదొక ప్రమాదమని ఫోరెన్సిక్ ల్యాబ్ బుధవారం సాయంత్రం నివేదిక ఇచ్చింది. సైకలాజికల్ అటాప్సీ అంటే... మెడికల్ రిపోర్టుల ఆధారంగా ఒక వ్యక్తి మానసిక స్థితిని అధ్యయనం చేసే ప్రక్రియనే సైకలాజికల్ అటాప్సీ అంటారు. సైకలాజికల్ అటాప్సీలో వ్యక్తి స్నేహితులు, వ్యక్తిగత డైరీలు, కుటుంబ సభ్యులు చెప్పిన విషయాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. బురారీ కేసులో కూడా ఈ ప్రక్రియనే అనుసరించామని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. సైకలాజికల్ అటాప్సీలో భాగంగా భాటియా కుటుంబ యజమాని నారాయణ దేవి పెద్ద కుమారుడు దినేశ్ సింగ్ చందావత్, అతడి సోదరి సుజాతా నాగ్పాల్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు, లలిత్ భాటియా డైరీలు, రిజిస్టర్లు, ఇరుగుపొరుగు వారు చెప్పిన విషయాల ఆధారంగా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. -
మరో బురారీ : బిహార్ నుంచి వలస వచ్చి...
రాంచీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీలోని బురారీ సామూహిక ఆత్మహత్యల మిస్టరీ వీడకముందే జార్ఖండ్లో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రాంచీలోని కంకే ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు సోమవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వ్యక్తులను దీపక్, అతడి భార్య, తల్లిదండ్రులు, ఐదేళ్ల కూతురు, ఏడాదిన్నర కొడుకుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. వీరిలో ఇద్దరు వ్యక్తులు ఉరివేసుకోగా, మిగతావారి శవాలు ఓ గదిలో నేలపై పడి ఉన్నట్లు వెల్లడించారు. వివరాలు... బిహార్లోని భగల్పూర్కు చెందిన దీపక్ ఝా అనే వ్యక్తి కుటుంబంతో సహా వచ్చి రాంచీలో స్థిరపడ్డాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఇంటి అద్దె కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే మానసికంగా కుంగిపోయిన దీపక్ కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించకపోవడంతో అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఎస్పీ అనీష్ గుప్తా తెలిపారు. కాగా కొన్ని రోజుల క్రితం జార్ఖండ్లోని హజారీ బాగ్లో కూడా ఇదే తరహాలో మహవీర్ మహేశ్వరీ అనే వ్యక్తి వ్యాపారంలో నష్టం రావడంతో కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.
Pagination
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
Advertisement