-
ఉద్యోగుల ఫ్రెండ్లీ సీఎం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పుడూ స్నేహపూర్వకంగానే ఉంటారు. ప్రజలంటే ఎంత ప్రేమ చూపిస్తారో ఉద్యోగులతోనూ అంతే అభిమానంతో ఉంటారు. అందుకే సీఎం వైఎస్ జగన్ ఉద్యోగులకు మంచి మిత్రుడని, ఆయన ఐదేళ్ల పాలన ఉద్యోగుల పట్ల స్నేహపూర్వకంగా సాగిందని, పలువిధాలుగా మేలు కూడా చేకూర్చారని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. రెండేళ్లు కోవిడ్ కష్టాల్లోనూ ఉద్యోగులకు క్రమం తప్పకుండా జీతాలివ్వడం, గత చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఎగ్గొట్టిన రెండు డీఏలను కూడా వైఎస్ జగన్ సర్కారు చెల్లించడం ఇందుకు చిన్న ఉదాహరణలని చెబుతున్నారు. చంద్రబాబుది కపట ప్రేమబాబు ప్రతి ఎన్నికలకు ముందు ఉద్యోగులపై కపట ప్రేమ చూపిస్తారని, అధికారంలోకి వస్తే నరకం చూపిస్తారని, ఈసారీ ఇదే ఎత్తుగడ వేశారని రాష్ట్ర సచివాలయ ఉద్యోగవర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యోగులు వేళపాళా లేకుండా పనిచేయాల్సి వచ్చేదని, వారి పట్ల చంద్రబాబుకు, టీడీపీ నేతలకు కనీస గౌరవం కూడా ఉండేదికాదని, తరచూ బెదిరింపులు, ఛీత్కరింపులతో అవమానాలు ఎదురయ్యేవని వివరించారు. ఉమ్మడి ఏపీలో పెన్షనర్లకు డీఏనే రద్దు చేసిన చరిత్ర చంద్రబాబుదని, 2019 ఎన్నికలకు ముందు డీఏలు ఎగ్గొట్టారని తెలిపారు. గతంలో చిరుద్యోగులు జీతాలు పెంచాలని ఎన్నిమార్లు కోరినప్పటికీ నాలుగున్నరేళ్లు పట్టించుకోని చంద్రబాబు.. గత ఎన్నికలకు ఆరు నెలల ముందు ఎన్నికల స్టంట్లో భాగంగా జీతాలు పెంచుతున్నట్లు ఉత్తర్వులు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. ఇలా చంద్రబాబు పాలన అంటే ఉద్యోగులకు నరకమేనని చెబుతున్నారు.జగన్ పాలనలో ఏ సమస్యా లేదుగత ఐదేళ్లలో వైఎస్ జగన్ పాలనలో ఉద్యోగులకు అలాంటివి ఎప్పుడూ ఎదురు కాలేదని తెలిపారు. సీఎం సహా మంత్రులు, అధికారులు ఉద్యోగులను సమయం దాటి పనిచేయాలని ఎప్పుడూ కోరలేదు. పైగా, సీఎం జగన్ ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వేలాది యువతకు ఉద్యోగాలు రావడమే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగులపై పని ఒత్తిడి కూడా చాలా వరకు తగ్గిందని తెలిపారు. ఇప్పుడు ఉద్యోగులంతా చాలా ఉత్సాహంగా, ఆనందంగా పనిచేస్తున్నారని చెబుతున్నారు. వేతనాలు, పెన్షన్ల చెల్లింపులు కూడా ప్రతి నెలా 1 నుంచి 10వ తేదీలోగా చెల్లించారని ఉద్యోగ వర్గాలు తెలిపాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల డీఏలు, ఎర్న్డ్ లీవ్ల మంజూరులో కొంత జాప్యం అయింది తప్ప ఉద్యోగులకు, పెన్షర్లకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంటున్నాయి. సీఎం జగన్ ఎన్నికల మేనిఫేస్టోలో చెప్పిన మేరకు తొలి కేబినెట్ సమావేశంలోనే ఉద్యోగులు, పెన్షనర్లకు 27 శాతం మధ్యంతర భృతి మంజూరు చేసి, రూ.17,918 కోట్లు చెల్లించారని వివరిస్తున్నారు. 11వ వేతన సవరణ అమలు చేసి రూ.11,707 కోట్ల అదనపు వ్యయాన్ని ఈ ప్రభుత్వం భరించిందని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ఉద్యోగ సంఘాలు అడగకుండానే సీఎం జగన్ 12వ పీఆర్సీని ఏర్పాటు చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన మాట మేరకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా వారి వేతనాలను కూడా పెంచారు. మధ్య దళారీల నుంచి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించారు.ఉద్యోగుల మేలు కోసమే జీపీఎస్ చంద్రబాబు సీఎంగా ఉండగా సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ తేవాలన్న ఉద్యోగులు కోరగా, ఆయన ససేమిరా అన్నారు. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా జగన్ ఉద్యోగుల రిటైర్మెంట్ తరువాత చాలా తక్కువగా పెన్షన్ వస్తోందని గుర్తించి సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ తెస్తామని మాట ఇచ్చారు. అయితే కొన్ని రాష్ట్రాలు సీపీఎస్ రద్దు చేస్తామని ప్రకటించడమే కానీ, చేయలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఎస్ ఉద్యోగులకు మేలు చేయాలనే తపనతో జగన్ సర్కారు సుదీర్ఘ కసరత్తు చేసింది. రిటైర్డ్ ఉద్యోగుల జీవన ప్రమాణాలను కూడా నిలబెట్టేలా జీపీఎస్ను రూపొందించింది. బేసిక్ జీతంలో 50 శాతం అంటే రూ.1 లక్ష జీతం ఉంటే రూ. 50 వేలు రిటైర్ అయిన తర్వాత పెన్షన్గా వస్తుంది. 82 ఏళ్ల వయస్సులో కూడా అదే స్థాయిలో జీవన ప్రమాణాలు ఉండేలా ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని డీఆర్లు ఇచ్చేలా జీపీఎస్ రూపొందించారు. దీనిని ఉద్యోగ సంఘాలు స్వాగతించాయి. సీపీఎస్ కంటే జీపీఎస్ మేలన్నాయి. సీఎం జగన్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును కూడా 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పొడిగించారు. గత ప్రభుత్వాలు పట్టించుకోని ఆర్టీసీ కారుణ్య నియామకాలనూ సీఎం జగన్ చేపట్టారు. ఇచ్చిన మాట మేరకు ఆర్టీసీలోని 55 వేల మంది ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారు. 10 వేలకుపైగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు నిర్ణయం తీసుకున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ ఇస్తున్నారు. ఏపీ వైద్య విధాన పరిషత్లో ఉన్న 14,658 మందిని సొసైటీ నుంచి ప్రభుత్వంలోకి తీసుకొచ్చారు. ఇళ్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు సొంత జిల్లాల్లోనే ఇళ్ల స్థలాల ఖర్చులో 60 శాతం ప్రభుత్వం భరిస్తుందని తాజా మేనిఫేస్టోలో పేర్కొన్నారు.ఆర్థిక ప్రయోజనాలిలా..సీఎం జగన్ ఇచ్చిన మాట మేరకు ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చారు. వారి వేతనాల వ్యయం భారీగా పెరగడమే ఇందుకు నిదర్శనం. చంద్రబాబు హయాంలోకన్నా ఉద్యోగుల వేతనాల వ్యయం ఇప్పుడు రూ.11 వేల కోట్లకు పైగా పెరిగింది. పెన్షర్ల వ్యయం రూ.6 వేల కోట్లకు పెరిగింది.ప్రభుత్వ రంగాన్ని మూసివేయడంలో ఘనుడు చంద్రబాబుప్రభుత్వ రంగాన్ని మూసివేయడం, వీఆర్ఎస్ కూడా ఇవ్వకుండా గోల్డెన్ హ్యాండ్ షేక్ అంటూ ఉద్యోగులను ఇంటికి పంపేయడంలో చంద్రబాబుకు ఘనమైన చరిత్ర ఉంది. 2014–19 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు శాశ్వత ఉద్యోగుల నియామకాలను ఉద్దేశపూర్వకంగా తగ్గించేశారు. ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రైవేట్ పరం చేసే ఆలోచన చేశారు. బాబు ఐదేళ్ల పాలనలో కేవలం 34 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులనే నియమించారు. ఉమ్మడి రాష్ట్రంలో 1999 నుంచి 2004 మధ్య సీఎంగా ఉండగా ఆల్విన్, నిజాం షుగర్స్, రిపబ్లిక్ ఫోర్బ్స్, చిత్తూరు డెయిరీ, ప్రకాశం డెయిరీ వంటి 54 ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసి, అతి తక్కువ ధరకు తన వాళ్లకు కట్టబెట్టారు. ఉద్యోగులను నడిరోడ్డుపై వదిలేశారు. మనసులో మాట పుస్తకంలో చంద్రబాబు చెప్పిన విషయాలను ఉద్యోగులు ఇంకా మరిచిపోలేదు. రాష్ట్రంలో 2,70,700 ఉద్యోగాల్లో 40.62 శాతం అదనంగా ఉన్నాయని రాశారు. శాశ్వత ఉద్యోగాల కాలపరిమితిని సమీక్షించాలన్నారు. 1996 – 97లోనే సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో ఉపాధ్యాయుల్ని శాశ్వత ప్రాతిపదికన నియమించడం మానేహామంటూ తన ఘనకార్యాలను రాసుకున్నారు. కొత్త నియామకాలు చేపట్టకూడదని, కాంట్రాక్టు ప్రాతిపదికనే ఇవ్వాలని, సిబ్బందిని తగ్గించడానికి ఇది ఉత్తమ మార్గమని పేర్కొన్నారు. ఇంతేకాదు.. బాబు ఉద్యోగులను లంచగొండులుగా చిత్రీకరిస్తుంటారు. విద్యుత్ సంస్థ ఉద్యోగుల్లో 66 శాతం, పౌర సరఫరాల సంస్థలో 65 శాతం, రెవెన్యూలో 64 శాతం, పోలీసు శాఖలో 62 శాతం, స్థానిక సంస్థల్లో 52 శాతం అవినీతిపరులేనని తన పుస్తకంలో రాశారు. ఇప్పడు ఎన్నికల్లో లబ్ధికి, మరోసారి మోసం చేయడానికి ఉద్యోగులు, పెన్షర్ల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారు.చిరుద్యోగులకూ మేలు చేసిన సీఎం జగన్చిరుద్యోగులకూ సీఎం జగన్ మేలు చేస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ఇచ్చిన మాట మేరకు అధికారంలోకి రాగానే దాదాపు అన్ని రంగాల్లో చిరుద్యోగుల జీతాలు పెంచారు. దీంతో గత ప్రభుత్వ హయాంలో రూ.1,100 కోట్లు ఉండే వీరి జీతాల ఖర్చు ఇప్పుడు రూ.3,300 కోట్లకు పెరిగింది. చిరుద్యోగుల పట్ల సీఎం జగన్కు ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం. అంతే కాదు.. వారికి మరింత మేలు చేకూరుస్తూ మేనిఫెస్టో రూపొందించారు. నెలకు రూ.25 వేల వరకు జీతం పొందే ఆప్కాస్, అంగన్వాడీలు, ఆశావర్కర్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు విద్య, వైద్యానికి, ఇళ్లకు సంబంధించిన అన్ని నవరత్నాల పథకాలను వర్తింపజేస్తామని తాజా మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అంటే జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనతో పాటు వైద్య రంగంలో నవరత్నాల పథకాలు వారికి అందుతాయి. -
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
ఏపీలో ప్రైవేటీకరణ అభిమాని చంద్రబాబు జాతీయ ప్రైవేటీకరణ అభిమాని బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. అన్ని ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటు ఏకస్వామ్య కంపెనీలకు అప్పజెప్పాలన్నది వారి ఆలోచన. ఇక్కడ రిజర్వేషన్లు అమలు కావు. ప్రభుత్వ ఉద్యోగులు ఈ కూటమికి ఓటు వేయడమంటే, ప్రైవేటీకరణకు ఓటు వేయడమే. కానీ నిరుపేదలకు ప్రభుత్వ విద్య, ప్రభుత్వ ఉద్యోగ అవకాశం మొదటి తరంలో చాలా ముఖ్యం. మన దేశ భవిష్య త్తుకు పునాది స్కూలు విద్యను పూర్తిగా ప్రభుత్వ రంగంలోకి తెచ్చి, ప్రైవేట్ స్కూలు విద్యను రద్దు చెయ్యడంలో ఉంది. ఉద్యోగస్థులు మొత్తం సమాజ భవిష్యత్ గురించి ఆలోచించకుండా ప్రైవేటీకరణకు, మత తత్వానికి ఓటు వేస్తే ప్రజాస్వామ్యం కాదుకదా, మానవీయ విలువలు కూడా బతకవు.ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటీకరణ అభిమాని చంద్రబాబు నాయుడు జాతీయ ప్రైవేటీకరణ అభిమాని బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. దేశంలోని మొత్తం కేంద్ర ప్రభుత్వ కంపెనీలను, అతి పెద్దదైన రైల్వేతో సహా ప్రైవేట్ ‘మోనోపలి’ (ఏకస్వామ్య) కంపెనీలకు అప్పజెప్పి ప్రభుత్వం కేవలం సూపర్వైజ్ చెయ్యాలనేది ఆరెస్సెస్/బీజేపీ సిద్ధాంతం. దేశంలో రిజర్వేషన్ వ్యవస్థను కూడా క్రమంగా రద్దు చెయ్యాలన్నది వారి సిద్ధాంతం. నరేంద్ర మోదీ ఓబీసీ పేరుతో ప్రధానమంత్రి అయ్యారు కనుక గత పదేండ్ల పాలనలో వాళ్ళు రిజర్వేషన్ పట్ల కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ రిజర్వేషన్ వ్యతిరేక విధానం రిజర్వేషన్ ద్వారా కాక జనరల్ కోటాలో ఉద్యోగాలు తెచ్చుకున్న వారికి నచ్చ వచ్చు కూడా. కానీ విద్యా అసమాన వ్యవస్థ ఉండగా రిజర్వేషన్లు ఎత్తేస్తే దేశంలో అంతర్యుద్ధం జరుగుతుందని చాలామందికి అర్థం కాని విషయం. దేశంలోని ఉత్పత్తి కులాలు రిజర్వేషన్లు రద్దు చెయ్య డాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాయి.బీజేపీతో పొత్తుతో చంద్రబాబు అధికారంలోకి వస్తే మొట్ట మొదట ప్రైవేట్ స్టీల్ కంపెనీకి అప్పజెప్పే అతిపెద్ద స్టీల్ కంపెనీ ‘విశాఖ ఉక్కు’. ఆ తరువాత బీజేపీ తెలంగాణలోని బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్ వంటి అతిపెద్ద కంపెనీలను ప్రైవేట్ గుజరాతీ, ముంబై కంపెనీలకు అమ్మకానికి పెడుతుంది. బీజేపీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ చేతుల్లోని సంస్థల్లో దొడ్డిదారిన ఏ సెలక్షన్ కమిటీని ఫేస్ చెయ్యకుండా అధికారులను, యూనివర్సిటీ ప్రొఫెసర్లను సైతం నియమిస్తోంది.ఈ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు బీజేపీకి ఓటు వేయడమంటే ప్రైవేటీకరణకు అనుకూలంగా ఓటు వేయడమే. చంద్ర బాబు 2014 నుండి 2019 వరకు చూపిన స్వతంత్రతను కూడా చూపలేడు. ఆయన పూర్తిగా బీజేపీ ఏమి చెబితే అది చెయ్యాల్సిందే. ఈ స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఈ కూటమికి ఓటేస్తే ముందు ప్రైవేటీకరణ సమస్యను కొని తెచ్చుకుంటారు.బీజేపీ ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టారు ఎంప్లాయిమెంట్ను అమెరికా మోడల్లోకి మార్చాలనే ఆలోచనతో ఉన్నట్లు వాళ్ళ ఆర్థికవేత్తల రచనలు చదివితే స్పష్టంగా అర్థమౌతుంది. ఆంధ్రప్రదేష్ సుదీర్ఘ తీర ప్రాంతం గల రాష్ట్రం. విశాఖ పోర్టు మాత్రమే కాక క్రమంగా ఇతర సీ–పోర్టులను అక్కడ అభివృద్ధి చేసుకోవచ్చు. ఇప్పటికే కొన్ని కొత్త పోర్టుల నిర్మాణం జరుగుతోంది. అయితే బీజేపీ ప్రభుత్వం వాటి నిర్మాణం మాత్రమే కాక వాటి మేనేజ్మెంట్ మొత్తాన్ని ప్రైవేట్ సెక్టా రుకు అప్పజెప్పే ఆలోచనలో ఉన్నది. ఈ పని ఇప్పటికే ఎయిర్పోర్టుల విషయంలో చేశారు. దేశంలోని పెద్ద, పెద్ద ఎయిర్పోర్టులన్నిటినీ ప్రైవేటు మేనేజ్మెంట్కు – అదీ పెద్ద పెద్ద మోనోపలి కంపెనీలకు అప్పజెప్పారు. ఇక్కడి ఉద్యోగాలన్నీ ప్రైవేట్ కంపెనీల చేతిలోనే ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగాలన్ని కాంట్రాక్ట్ ఉద్యోగాలే. అక్కడ పెద్ద ఉద్యోగాలన్నీ పెద్ద కంపెనీల బంధువులకు మాత్రమే వస్తాయి. యూపీఎస్సీ పరీక్షల్లో పోటీపడి ఎవరైనా ఉద్యోగం తెచ్చుకునేది అక్కడ ఉండదు. కమ్మ, రెడ్డి కులాలకు కూడా పెద్ద ఉద్యోగాలు రావు.ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నాన్ని రాజధానిగా చేసుకొని తీరాన్నంతా అభివృద్ధి చేసుకుంటే అది ముంబైకి మించిన నగరమయ్యే అవకాశ ముంది. కోల్కతా కూలిపోతున్న నగరం. ఇటు చెన్నై దేశపు చివరి మూలన ఉంది. దానికి ఇంకా అభివృద్ధి అవకాశం తక్కువ. ఇంగ్లిష్ విద్యలో ఆదివాసులు, దళితులు, బీసీలు, ఇతర బీద పిల్లలు చదువు కుంటే వైజాగ్ నగరాన్ని అత్యాధునిక నగరంగా మార్చే అవకాశం వారికొస్తుంది. ప్రభుత్వ రంగంలో ఇంగ్లిష్ విద్య నాణ్యంగా కొన సాగితే అడవుల్లోని ఆదివాసులు పక్షులుగా ఎదిగి విమానాలుగా మారుతారు. వారికి ఎంత పోడు భూమి ఇచ్చినా, ఎంత పంట సహాయం చేసినా ఒక్క తరంలో అడవి నుండి విశాఖ నగరంలోకి, అక్కడి నుండి అమెరికాకో, ఆస్ట్రేలియాకో పోలేరు. అయితే ఈ ఆదివాసులకు ప్రభుత్వ విద్య, ప్రభుత్వ ఉద్యోగ అవకాశం మొదటి తరంలో చాలా ముఖ్యం. ప్రైవేట్ సెక్టారు వీరికి అవకాశాలివ్వదు. వారిని ఉన్నత ఉద్యోగాల్లోకి రానివ్వదు. ఆంధ్రలో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాణ్యమైన ఇంగ్లిష్ విద్య ఈ ఆదివాసుల్లో కొనసాగితే, 20–30 సంవత్సరాల్లో అమెరికాలో నల్లజాతీయులను మించిన మేధా వులు ఆదివాసుల నుండి వచ్చి విశాఖ పట్టణాన్ని ప్రపంచ నగరంగా మారుస్తారు. ఈ ఆదివాసుల నుండి ఎంతోమంది ఎలాన్ మస్క్లు వచ్చే అవకాశముంది. ఇటువంటి మార్పు భారతదేశపు గుజరాతీ క్యాపిటలిస్టులకు, నరేంద్ర మోదీ ప్రభుత్వానికి, ఆరెస్సెస్కు ఏ మాత్రం ఇష్టం లేదు. వీరికి ప్రభుత్వ ఉద్యోగులు ఓటువేసి గెలిపించే ప్రయత్నం చేస్తే వ్యవస్థనంతా గుజరాత్–ముంబై క్యాపిటలిస్టులకు అప్పజెప్పడమే.భారతదేశం అమెరికా కాదు, యూరప్ కాదు, ఆస్ట్రేలియా కాదు, కెనడా కాదు. ఇది 140 కోట్ల జనాభా కలిగిన చిన్న దేశం. దీన్ని చిన్న దేశం అని ఎందుకు అంటున్నానంటే భూపరిమాణంలో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, చైనాతో పోలిస్తే ఇది చాలా చిన్న భూమి కలిగిన దేశం. ఈ దేశ జనాభా ఇంకా ముందు, ముందు పెరుగుతుంది. ఆధునిక సైన్స్ను ఇంగ్లిష్ భాషతో ముడేసి గొప్ప, గొప్ప శాస్త్ర పరిశోధనల ద్వారానే మనం ఇంతమందికి తిండి, బట్ట, ఇల్లు ప్రపంచంలో తలెత్తుకుని బతికే ఆత్మ గౌరవాన్ని ఇవ్వగలం. అందుకు భావితరాలు – ముఖ్యంగా ఆదివాసులు, దళితులు, ఓబీసీలు – ఇంగ్లిష్లో చదువుకొని ప్రపంచ జ్ఞానాన్ని సాధించకుండా ఈ దేశానికి మనుగడ ఉండదు. మన దేశ భవిష్యత్తుకు పునాది స్కూలు విద్యను పూర్తిగా ప్రభుత్వ రంగంలోకి తెచ్చి, ప్రైవేట్ స్కూలు విద్యను రద్దు చెయ్యడంలో ఉంది; అన్ని రకాల ఎంట్రన్స్లను, కోచింగ్లను రద్దు చేసి నేరుగా 12వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా, విద్యార్థి శ్రమ గౌరవ పనుల్లో పాల్గొన్న సర్టిఫికెట్ల ఆధారంగా ఉన్నత చదువులకు పోవడంలో ఉంది. అమెరికా, యూరప్ ఇదే చేస్తాయి. బీజేపీ, చంద్రబాబు ఇటువంటి విద్యకు పూర్తిగా వ్యతిరేకం. కనుక ఇప్పుడు ఉద్యోగాలు ఏ కులస్థులైనా మొత్తం సమాజ భవిష్యత్ గురించి ఆలో చించకుండా ప్రైవేటీకరణకు, కుల తత్వానికి, మత తత్వానికి, వర్గ తత్వానికి ఓటు వేసుకుంటే సమాజంలో తిరుగుబాటు మొదలైతే దేశం కుప్పకూలుతుంది.భారతదేశపు ప్రైవేట్ రంగం అమెరికాలో, యూరప్లో ఉన్నట్టు మానవతా విలువలతో ఏర్పడినది కాదు. గ్రామాల్లో రైతులను, కూలీలను దోచుకొని వారితో బడిలో, గుడిలో ప్రేమతో పెరిగిన మనుషులుగా కాక మేం కులానికి ఎక్కువ, మేం కంచం–మంచం పొత్తును అంగీకరించం అనే వారి చేతిలో పెరిగింది. ఈ దేశంలో అతిపెద్ద పెట్టుబడిదారులు కుష్ఠు రోగులకు, కుంటి వారికి, గుడ్డి వారికి ఒక ఆశ్రమం కట్టించి ఆదుకున్నట్టు చూశామా! అమెరికా తెల్లజాతి ధనవంతులు, నల్లజాతి స్త్రీలను తమ ఇంట్లో వంట మనిషిగా పెట్టుకొని వారి పిల్లలను చదివించి మేధావులను చేసిన ఘటనలు చాలా ఉన్నాయి. నల్లవారికి ప్రత్యేక స్కూళ్ళు, కాలేజీలు పెట్టి ముందు చదివించింది తెల్లజాతి పెట్టుబడిదారులు. ఈ దేశంలో అతిపెద్ద పెట్టుబడిదారులు దళితుల కోసం, ఆదివాసుల కోసం ఒక్క స్కూలు కట్టి చదివించారా!అందుకే దిక్కులేని రోడ్డుమీద బతికే పిల్లల్ని దగ్గరకు తీసి ‘నిన్ను ఇంగ్లిష్ మీడియం బడిలో చదివిస్తాన’ని హామీ ఇచ్చిన వ్యక్తిని దింపేసి నారాయణ స్కూలును వెనుక ఉండి నడిపించే వ్యక్తికి ఓటు వేస్తే, ప్రజాస్వామ్యం కాదు గదా మానవ విలువలే బతకవు. అందరికంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు నేను చెప్పే ఈ మాట గురించి ఆలోచించండి.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
ఏపీ ఉద్యోగులతో ఒక మాట!
దేశంలోనే అన్ని రంగాల్ని మొట్టమొదటగా ప్రైవేటీకరించడం మొదలుపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. అన్నిటికంటే ప్రమాదకరమైంది – స్కూళ్ళు, జూనియర్ కాలేజీల విద్యా ప్రైవేటీకరణ. దీంతో పేదలకు చదువు దూరమైంది. ఆంగ్లం అందకుండా పోయింది. దీనికి విరుగుడుగా జగన్ నేతృత్వంలో విద్యా, వైద్య రంగాల్లో ప్రైవేటీకరణ వ్యతిరేక మోడల్ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైంది. దేశంలోని మొత్తం స్కూలు విద్యను ఎల్కేజీ నుండి 12వ తరగతి వరకు ప్రైవేట్ రంగం నుండి ప్రభుత్వ రంగంలోకి మార్చకుండా విద్యా సమానత్వాన్ని తేవడం సాధ్యమా? అందుకే గ్రామాలలో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు అట్టడుగు గ్రామీణ శ్రమజీవుల జీవితాలను మార్చడానికి ప్రభుత్వం ఏమి చేస్తున్నదో అర్థం చేసుకోవడం ముఖ్యం.రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులు ఎక్కువ ఎటు ఓటు వేశారనేది ముందుగానే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించినప్పుడు తెలుస్తుంది. ముఖ్యంగా అత్యధిక సంఖ్యలో ఉన్న టీచర్లు – స్కూలు, కాలేజీ, యూనివర్సిటీలలో పనిచేసేవారు ఎటువైపు ఉన్నారు? ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లు, నర్సులు, సహాయక సిబ్బంది ఎటు ఓటు వేస్తారనేది కూడా ముఖ్యం. వీరితోపాటు గణనీయ సంఖ్యలో ప్రభుత్వ పోలీసు రంగం ఉద్యోగులు కూడా ఎటు ఓటు వేస్తారనేది చాలా ముఖ్యం. ఇక రెవెన్యూ, మున్సిపాలిటీ, సఫాయి శాఖతో పాటు ప్రభుత్వ రంగంలో ఉన్న పర్మనెంటు ఉద్యోగులు ఎటు ఓటు వేస్తారు, ఎవరు గెలవాలనుకుంటారు అనేది చాలా ముఖ్యమైంది. ఇంతకీ ఈ ఉద్యోగుల ఓటు గురించి ఎన్నడూలేని విధంగా ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్లోనే ఎందుకు చర్చించాలి? దానికొక ముఖ్య కారణమున్నది.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబులాగే ఒక రీజినల్ పార్టీ నడిపే ప్రభుత్వం. దేశంలోనే అన్ని రంగాల్ని మొట్టమొదటగా ప్రైవేటీ కరించడం మొదలుపెట్టిన ముఖ్యమంత్రి, చంద్రబాబునాయుడు. అన్నిటికంటే ప్రమాదకరమైంది–స్కూళ్ళు, జూనియర్ కాలేజీల విద్యా ప్రైవేటీకరణ. దాన్ని ఆయన విపరీతంగా ప్రైవేటీకరించి అక్కడినుండి పార్టీ ఫండ్ను జమ చేశాడు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున అన్ని రంగాల్లో ఎంట్రెన్సులు, కోచింగ్ సెంటర్లు ప్రారంభమయ్యాయి. ఈ దశలోనే పుట్టగొడుగుల్లా స్కూళ్ళు, జూనియర్ కాలేజీలు, గైడ్ రైటింగ్ కంపెనీలు, అడ్వరై్టజ్ ర్యాంకులు మొదలయ్యాయి.వైద్య రంగంలో కూడా ప్రభుత్వ రంగాన్ని మండలాల వరకు అభివృద్ధి చెయ్యకుండా ప్రైవేట్ హాస్పిటల్స్, ఒక్కొక్క డాక్టరు తన సొంత హాస్పిటల్ కట్టి నడపడం మొదలయ్యాయి. గత ఐదేళ్ళ జగన్ పాలనలో ప్రభుత్వ విద్యా రంగంలో ఇంగ్లిష్ మీడియం పెట్టి, స్కూళ్ళ అభివృద్ధి ప్రారంభించాక స్కూలు విద్యలో ప్రైవేట్ రంగం విద్య బాగా పడిపోయింది.స్కూలు టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్రైవేట్ విద్యా వ్యవస్థ వ్యతిరేక అభివృద్ధిని ఎలా చూడాలి? రాష్ట్రంలో మండలం, గ్రామ స్థాయిలో చిన్న, చిన్న ప్రభుత్వ హాస్పిటల్స్ పెరిగి, వాటిని టెలీ మెడిసిన్తో ముడేసిన వైద్యం... వైద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకమైందా, కాదా? గ్రామ సెక్రటేరియట్ల నిర్మాణం, చిన్న జీతాలతోనైనా 2,50,000 మంది వలంటీర్లను ప్రభుత్వ రంగంలో నియమిస్తే ప్రభుత్వ రంగం విస్తరించినట్టా, ప్రైవేట్ రంగం విస్తరించినట్టా?నిజంగానే బడ్జెట్ డబ్బులో ఎక్కువ భాగం గ్రామీణ ప్రాంత బీద, దిగువ మధ్యతరగతి రైతాంగానికి, కూలీలకు బదిలీ చేయబడ్డది కనుక ఉద్యోగుల జీతభత్యాల పెరుగుదల ఆగిందనుకుందాం. అయినా ప్రభుత్వ రంగ ఎదుగుదల, ప్రైవేట్ రంగ ఎదుగుదల కోణం నుండి చూసినప్పుడు ప్రభుత్వం 30 వేల ఎకరాల్లో అమరావతి కట్టడం కోసం కాంట్రాక్టర్లకు ఆ డబ్బు ఇస్తే ఏ రంగం పెరిగేది? అందుకు బదులు గ్రామీణ అభివృద్ధి ముఖ్యంగా విద్యా, వైద్య రంగాల అభివృద్ధి జాతీయ వాదంలో కీలకమైంది.ఈ స్థితిలో ప్రభుత్వ రంగ ఉద్యో గులు, ముఖ్యంగా టీచర్లు ఏ ముఖ్యమంత్రిని కోరుకోవాలి? ప్రభుత్వ రంగాన్ని గణనీయంగా పెంచిన జగన్నా, ప్రైవేట్ రంగ అనుకూల బాబునా? మరీ ముఖ్యంగా మోదీల కూటమినా? పవన్ కల్యాణ్కి సినిమా రంగం తప్ప ఏ రంగం గురించి తెలియదు. ఆయన మోదీ, బాబు ఏది చెబితే అది చేస్తాడు.ఉద్యోగస్తులు నిరంతరం ప్రజా జీవన విధానం, వారి ఆర్థిక స్థితి గతులతో సంబంధం లేకుండా తమ జీతాల పెంపు, అనుకూల ట్రాన్స్ ఫర్, రిటైర్మెంట్ ఏజ్ పెంపు గురించి ఆలోచిస్తే క్రమంగా ప్రభుత్వ రంగాన్ని మూసేసి ప్రైవేట్ రంగ ఎదుగుదలకు ఓటెయ్యడమే. భవిష్యత్ తరాల బతుకుదెరువు గురించి, రాష్ట్ర, దేశ భవిష్యత్ గురించి మాకెందుకు అనుకుంటే ప్రైవేటీకరణను ప్రభుత్వ రంగ ఉద్యోగులే కోరుకోవడం కాదా? ఉద్యోగుల్లో, ముఖ్యంగా టీచర్లు కమ్యూనిస్టు పార్టీలతో ఉండి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తుంటారు.అదే టీచర్లు ఇప్పుడు ఏపీలో ప్రైవేట్ విద్యారంగాన్ని ప్రభుత్వ రంగంలోకి మారిస్తే, ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడితే, నాడు–నేడు పథకం ద్వారా స్కూళ్ల రూపురేఖలను మారిస్తే ఈ ప్రక్రియకు మద్దతు ఇవ్వాలి కదా! కమ్యూ నిస్టు పార్టీలు ఈ నూతన ప్రభుత్వ రంగ అభివృద్ధిని వ్యతిరేకిస్తూ జగన్ను ఓడించాలని చూస్తున్నాయి. ఇది విద్యా, వైద్య రంగంలో పెరుగుతున్న ప్రభుత్వ ఆస్తులను వ్యతిరేకించడం కాదా?కమ్యూనిస్టులు ఏపీలో ఒకవేళ అధికారంలోకి వస్తే ప్రభుత్వ రంగంలో ఇంగ్లిష్ మీడియంను తీసేసి, ఆ బడులను మూసేసి, విద్యా దోపిడీదారులకు అప్పజెబుతారా? భారతదేశంలో అతి పెద్ద ప్రైవేట్ సెక్టార్, విద్యా రంగం. ప్రైవేట్ రంగంలో ఇంగ్లిష్ విద్య పేరుతో చంద్రబాబు మిత్రబృందం వేల కోట్లు దోచుకుంటుంటే జగన్ ప్రభుత్వం ఆ దోపిడీకి అడ్డుకట్ట వేసే విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది.కమ్యూనిస్టులు సైతం ప్రభుత్వ రంగ అభివృద్ధిని వ్యతిరేకిస్తూ, మాతృభాష ప్రాంతీయ వాదానికి తలొగ్గి మళ్ళీ ప్రైవేట్ విద్యా వైద్యానికి ఊడిగం చేస్తే ప్రజలు వీరినెలా నమ్ముతారు? విద్యా, వైద్య రంగాల్లో ప్రైవేటీకరణ వ్యతిరేక మోడల్ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైంది. దాన్ని చంపెయ్యడానికి కమ్యూనిస్టులు నడుం కడితే ప్రజలు ఏమైపోవాలి?ఆరెస్సెస్/బీజేపీ నేతృత్వంలో నడిచే కేంద్ర ప్రభుత్వం కేంద్ర స్థాయి పరీక్షలు, సెంట్రల్ యూనివర్సిటీల ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లను హిందీ, ఇంగ్లిష్ భాషల్లో మాత్రమే రాయనిస్తున్నది. అంటే క్రమంగా హిందీని దేశపు ఉత్పత్తి కులాల పిల్లల మీద రుద్ది, ధనవంతులకు మాత్రమే ప్రైవేట్ ఇంగ్లిష్ అంతర్జాతీయ జ్ఞాన సంపదను అందు బాటులో ఉంచ చూస్తున్నది.ఈ విద్యా విధానాన్ని ఎలా ఎదు ర్కోవాలి? దేశంలోని మొత్తం స్కూలు విద్యను ఎల్కేజీ నుండి 12వ తరగతి వరకు ప్రైవేట్ రంగం నుండి ప్రభుత్వ రంగంలోకి మార్చ కుండా విద్యా సమానత్వాన్ని సాధించగలమా? దేశంలో విద్యా వ్యవస్థని, కనీసం స్కూలు విద్యా వ్యవస్థనైనా ప్రభుత్వ రంగంలోకి మార్చడానికి ప్రభుత్వ టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, మానవ సమానత్వం కోసం పనిచేసేవాళ్ళు సపోర్టు చెయ్యకపోతే ఎలా?అంతేకాక ప్రభుత్వ ఉద్యోగులు బీద ప్రజల సంక్షేమం కోసం బడ్జెట్ డబ్బును ఖర్చు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ తమ కుటుంబాల గురించే ఆలోచిస్తే ప్రభుత్వ రంగం కూలిపోక ఏమౌతుంది? ఈ సమస్య చాలా కీలకంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల ముందు ఉన్నది. దేశంలోనే అన్ని రంగాల్ని పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలోకి నెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా టీచర్లు ప్రభుత్వ రంగ వ్యతిరేకికే ఓటు వేస్తే జరిగేదేంటి?గ్రామాలలో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా టీచర్లు అట్టడుగు గ్రామీణ శ్రమ జీవుల జీవితాలను మార్చడానికి ప్రభుత్వం ఏమి చేస్తుందో చూసి ఆ ప్రభుత్వాన్ని కొనసాగించాలా వద్దా అని నిర్ణ యించుకోవాలి. ఉత్పత్తి రంగంలో పనిచేసే ప్రజల జీవితాలను మెరుగుపర్చే ప్రభుత్వం ఉన్నప్పుడు తమ జీతభత్యాల పెంపుదలతో కొంత రాజీపడాల్సి వస్తే కూడా పడాలి. అది ఒక ఉద్యోగి రాష్ట్రానికి, దేశానికి చేసే మేలు. రాజకీయ నాయకులు దోచుకుంటున్నప్పుడు వారిపై పోరాటం తప్పు కాదు.ఉద్యోగులు హక్కులను, ఆత్మగౌర వాన్ని ఎప్పుడు కూడా తాకట్టు పెట్టకూడదు. అయితే, తమ హక్కుల పోరాటం, ఉత్పత్తి రంగంలో పనిచేసే మానవాళిని ఆకలితో మాడ్చ టానికో, బీద పిల్లలు ధనవంతుల పిల్లలతో పోటీపడి ఎదిగే జీవితాన్ని అడ్డుకోవడానికో చెయ్యడం మహానేరం. ఈ మాట 38 సంవత్సరాలు ప్రభుత్వ రంగంలో పనిచేసిన వ్యక్తిగా చెబుతున్నాను. ప్రతి ఉద్యోగి, ఓటరు, పౌరుడు దిక్కు లేని వారికి దిక్కుగా నిలబడాలి. అందుకే 2024 ఎన్నికల్లో వాళ్ళ ఓటు వాళ్ళ జీవిత లక్ష్యాన్ని సూచిస్తుంది.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
ఉద్యోగులపై ఈసీ నిఘా
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వ ఉద్యోగులపై నిఘా పెట్టింది. దీనికోసం ప్రత్యేక యంత్రాంగాన్ని రంగంలోకి దించింది. ఏ పార్టీకైనా కొమ్ముగాస్తున్నట్టు ఏ విధంగా తేలినా షోకాజ్ నోటీసులు, ఆ తర్వాత కఠిన చర్యలు తీసుకునేందుకు సమాయత్తమవుతోంది. వ్యక్తిగత కదలికలే కాకుండా, వారి సామాజిక మాధ్యమ ఖాతాలపై కూడా కన్నేసి ఉంచింది. అన్ని సాంకేతిక వనరులను వినియోగించుకుంటూ గతంలో ఈ తరహా ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు, రాజకీయ పార్టీలతో అంటకాగుతున్న నేతలను కనిపెట్టాలని నిర్ణయించింది. దీంతో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు అప్రమత్తమయ్యాయి. జాగ్రత్తగా ఉండాలని తమ ఉద్యోగులకు సూచిస్తున్నాయి. ఎన్నికల కోడ్ ముగిసే వరకూ ఏ పార్టీ నేతలను కలవద్దని స్పష్టం చేశాయి. రాజకీయ పార్టీలు, నేతలు నిర్వహించే విందులు, వినోద కార్యక్రమాలకు వెళ్ళొద్దని హెచ్చరించాయి. సోషల్ మీడియా ఖాతాలపై నిఘా ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు, ఉపాధ్యాయుల వ్యక్తిగత సామాజిక మాధ్యమ ఖాతాలపై ఎన్నికల కమిషన్ నిఘా పెట్టింది. వారు ఉండే వాట్సాప్ గ్రూపులు, వారి ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రాం ఖాతాలను ప్రత్యేక బృందాలు పరిశీలిస్తున్నాయి. గతంలో ఆరోపణలున్న వారిపై మరింత నిఘా పెట్టినట్టు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఓ నేతకు అనుకూలంగా సామాజిక మాధ్యమంలో పోస్టు చేసినా, లేదా ఎవరైనా పోస్టు చేసినదాన్ని ఫార్వర్డ్ చేసినా ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినట్టుగానే పరిగణిస్తారు. ఆరోపణలు వచ్చిన ఉద్యోగి ఫోన్ కాల్ డేటాను కూడా పరిశీలించే అవకాశం ఉందని సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. టీచర్లు, ఉద్యోగులే కీలకం పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉద్యోగులదే కీలక పాత్ర. రాష్ట్రవ్యాప్తంగా 1.25 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులున్నారు. 1.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. వీళ్లల్లో దాదాపు 90 శాతం ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. ఉద్యోగుల్లో క్లాస్–4 తప్ప, అందరికీ ఎన్నికల విధులు తప్పనిసరి. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో వీళ్ళు పని చేస్తుంటారు. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో వీరికి ప్రత్యేక నిబంధనావళిని ఎన్నికల కమిషన్ జారీ చేసింది. రాజకీయ నేతలతో ఎలాంటి సంబంధాలు నెరపడానికి వీల్లేదని, ఏ సభలు సమావేశాల్లో పాల్గొనవద్దని, విందులు, వినోదాలకు వెళ్ళొద్దని, అధికారిక, అనధికారిక కార్యక్రమాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ భాగస్వామ్యం కావద్దని, ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వొద్దని పేర్కొంది. ప్రతి నేత సమావేశం, ప్రచారం వీడియో చిత్రీకరణ ఉంటుందని, ఇందులో ఉద్యోగి ఉన్నట్టు తేలితే, నేతలతో సంబంధాలున్నట్టు ఆధారాలతో ఫిర్యాదులొచ్చిన తక్షణమే సస్పెన్షన్ తప్పదని కూడా స్పష్టం చేసింది. అయినా సరే..! ఎన్నికల కోడ్లో ఉద్యోగులకు ప్రత్యేక నిబంధనలు ఉన్నప్పటికీ కొందరు వాటిని బేఖాతరు చేస్తున్నారు. సిద్దిపేటలో ఇటీవల 110 మంది డీఆర్డీఏ ప్రాజెక్టు మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లు ఓ రాజకీయ పార్టీ ఎంపీ అభ్యర్థి నిర్వహించిన బహిరంగ సమావేశానికి హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియోతో ప్రత్యర్థి పార్టీ నేతలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. దీంతో వారిని కమిషన్ సస్పెండ్ చేసింది. వీడియోను మార్ఫింగ్ చేశారని ఆ ఉద్యోగులు వాదిస్తున్నారు. సదాశివ పేటలో ఓ జూనియర్ లెక్చరర్ ఓ జాతీయ పార్టీ అభ్యర్థికి మద్దతుగా జరిగిన మీటింగ్లో పాల్గొనడం ప్రత్యర్థులు పసిగట్టారు. ఈ వీడియోను ఈసీకి అందజేయడంతో ఆయన్ను సస్పెండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో ఓ ప్రధానోపాధ్యాయుడు ఓ పార్టీ మీటింగ్లో పాల్గొన్న వీడియో బయటకు రావడంతో ఈసీ షోకాజ్ నోటీసు ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓ ప్రధాన ఉపాధ్యాయ సంఘం నేతలు ఓ పార్టీ నేత ఇచ్చిన విందులో పాల్గొన్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆయా సంఘాల నేతలు సూచిస్తున్నారు. -
సిద్ధిపేట: 106 మంది ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్
సాక్షి, సిద్ధిపేట: జిల్లాలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన 106 మంది ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్కు గురయ్యారు. రెండురోజుల క్రితం మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి సమావేశంలో పాల్గొన్న 106 మంది ప్రభుత్వ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ సభలో పాల్గొనడంపై ఎన్నికల కమిషన్, సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారికి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. -
సర్కారుపై ‘విరమణ’ భారం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడేళ్ల తర్వాత మొదలైన ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్లతో ఆర్థిక శాఖలో ఆందోళన మొదలైంది. పదవీ విరమణ చేసే ఉద్యోగులకు ఇవ్వాల్సిన తక్షణ బెనిఫిట్లను చెల్లించేందుకు ఏటా రూ.3,500 వేలకోట్ల భారం పడనుంది ఈ మేరకు నిధులను ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపై ఆర్థిక శాఖ మల్లగుల్లాలు పడుతోంది. 2021లో అప్పటి బీఆర్ఎస్ సర్కారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచింది. దీంతో గత మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల (క్లాస్–4 ఉద్యోగులు మినహా) రిటైర్మెంట్లు జరగలేదు. తిరిగి ఈ ఏడాది మార్చి 31వ తేదీ నుంచి ఉద్యోగుల పదవీ విరమణలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 7,995 మంది ఉద్యోగులు రిటైర్ కానున్నట్టు సమాచారం. వీరికి ప్రభుత్వం చెల్లించాల్సిన తక్షణ బెనిఫిట్ల కింద రూ.3,200 కోట్ల వరకు అవసరమని ఆర్థిక శాఖ అంచనా. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగుల మెడికల్ బిల్లుల చెల్లింపు కూడా కష్టమవుతుండటం, ఇక నుంచి ఏటా రిటైర్మెంట్ల భారం మరింత పెరగనుండటం ఆర్థిక శాఖను కలవరపెడుతోంది. సరాసరి రూ.40 వేల మూల వేతనం ఈ ఏడాది రిటైర్మెంట్లను పరిశీలిస్తే 1,419 మంది గెజిటెడ్ స్థాయి, 5,360 మంది నాన్ గెజిటెడ్ స్థాయి, 1,216 మంది క్లాస్–4 ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు. నాన్ గెజిటెడ్ వారు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. రిటైరయ్యే వారి సగటు మూల వేతనం రూ.40వేల వరకు ఉంటుందని అంచనా. దీనికి హెచ్ఆర్ఏ, సీసీఏ, డీఏలు కలిపితే ఈ మొత్తం రూ.60 వేల వరకు ఉంటుంది. రిటైరయ్యే ప్రతి ఉద్యోగికి లీవ్ శాలరీల కింద 10 నెలల వేతనాన్ని.. అంటే రూ.6 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. దీనికితోడు గ్రాట్యుటీ కింద రూ.12 లక్షలు, కమిటేషన్ కింద రూ.20 లక్షలు ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించాలి. అంటే సగటున ప్రతి రిటైర్డ్ ఉద్యోగికి రూ.38లక్షల నుంచి రూ.40 లక్షల వరకు తక్షణ బెనిఫిట్లను వారి హక్కుగా ఇవ్వాలి. ఈ ఏడాది రిటైరయ్యే 7,995 మందికి ఈ బెనిఫిట్లను చెల్లించాలంటే రూ.3 వేల కోట్లకుపైగా అవసరం. ఇక 2025లో 9,630 మంది, 2026లో 9,719 మంది, 2027లో 9,443 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేస్తారని లెక్కలు చెప్తున్నాయి. అంటే వారికి తక్షణ బెనిఫిట్ల కింద సగటున ఏటా రూ.3,500 కోట్ల వరకు చెల్లించాలి. దీనితో ఖజానాపై భారం పడుతుందని ఆర్థిక శాఖ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుత పరిస్థితేమిటి? ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన మెడికల్ బిల్లులు, సరెండర్ లీవ్స్లకు కూడా చెల్లించే పరిస్థితి లేదని ఆర్థిక శాఖ వర్గాలు చెప్తున్నాయి. వీటికితోడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2022 జూలై, 2023 జనవరి, జూలై, 2024 జనవరిలో చెల్లించాల్సిన నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయి. లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఐదో డీఏ (జూలై, 2024) కూడా ముందుకు వస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో.. ఈ నాలుగు డీఏల చెల్లింపును సర్కారు వాయిదా వేస్తూ వస్తోంది. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ జీవిత బీమా (జీఎల్ఐ) కింద జమ చేసుకున్న నిధులను కూడా వాడుకోవాల్సి వచ్చిందని ఆర్థికశాఖ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడు రిటైరైన ఉద్యోగులకు వారి జీఎల్ఐతోపాటు జీపీఎఫ్పై వడ్డీ చెల్లించాలని.. ఇవన్నీ కలిపితే చాలా భారం పడుతుందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. గత ప్రభుత్వం పదవీ విరమణ వయసు పెంచి అప్పటికి ఈ భారం నుంచి గట్టెక్కిందని.. ఇప్పుడు చెల్లించక తప్పదని తెలిపారు. ఈ చెల్లింపుల కోసం నెలకు రూ.250 కోట్లదాకా అవసరమన్నారు. ఎప్పటికప్పుడే బెనిఫిట్లు చెల్లించాలి: ఉద్యోగ సంఘాలు రిటైర్మెంట్లతో సర్కారుపై భారమన్న ప్రచారంపై ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి ఉద్యోగి రిటైరవడానికి మూడు నెలల ముందే బెనిఫిట్ల కోసం దరఖాస్తు చేసుకుంటారని, ఉద్యోగుల హక్కు కింద ప్రభుత్వం వాటిని ఎప్పటికప్పుడే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. పదవీ విరమణ వయసును మరోసారి పెంచడం వంటి ఆలోచనలు చేయవద్దని కోరుతున్నాయి. -
వైఎస్ జగన్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో మేలు
పి.గన్నవరం: సీఎం వైఎస్ జగన్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో మేలు జరిగిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి అన్నారు. ఆయన అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి 1.36 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారని కొనియాడారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏపీజీఈఎఫ్) వైస్ చైర్మన్ విప్పర్తి నిఖిల్ కృష్ణ ఆధ్వర్యాన ఆదివారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో మూడు రోడ్ల సెంటర్ నుంచి దుర్గమ్మ గుడి వరకూ వివిధ శాఖల ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగులకు అండగా నిలిచి, గ్రామ స్వరాజ్యానికి బాటలు వేసినందుకు ‘థాంక్యూ సీఎం సార్’ అంటూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. కరోనా వంటి కష్టకాలంలో ఆర్థిక శాఖ అధికారులు వద్దన్నా కొత్త పీఆర్సీ ప్రకారం పే స్కేల్ అమలు చేశారన్నారు. అధికారంలోకి వచి్చన మూడు నెలల్లోనే 50 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను సీఎం జగన్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంతోపాటు రాష్ట్రాభివృద్ధికి పాటు పడుతున్న ప్రభుత్వంపై ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోందని వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి ‘మన ప్రభుత్వం – మన ప్రగతి’ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. -
ప్రభుత్వ పథకాలను సక్సెస్ చేసింది ఉద్యోగులే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను సక్సెస్ చేసింది ప్రభుత్వ ఉద్యోగులేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవ హారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఉద్యోగులూ ప్రభుత్వంలో భాగమేనని, ప్రభుత్వం ఏర్పాటు లో, పరిపాలనలో వారి పాత్ర వెలకట్టలేనిదని తెలిపారు. ఈ ఐదేళ్ల ప్రభుత్వ ప్రస్థానం ఉద్యోగుల సహకారంతో సాఫీగానే సాగిందన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బుధవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల సాధక బాధకాలు మొత్తం ప్రభుత్వానికి తెలుసునని చెప్పా రు. వారి ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు పొందుతున్న ఫలాలు అందరికీ అందేలా ప్రభుత్వమే ఒక పాలసీని రూపొందిస్తుందని చెప్పారు. ఉద్యోగుల జీతాల మొత్తం భారీగా పెరిగినప్పటికీ, వేతనాలు పెంచామని, కొత్త ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. కోవిడ్ సమయంలో రాష్ట్రానికి ఆదాయం రాలేదని, అదనంగా డబ్బు ఖర్చయిందని తెలిపారు. చంద్రబాబు దిగిపోతూ ప్రభుత్వంపై రూ.2.90 లక్షల కోట్లఅప్పులు పడేశారన్నారు. ప్రభుత్వానికి అప్పు పుట్టకుండా, ఆదాయం రాకుండా చంద్రబాబు రోజూ అవాంతరాలు కల్పిస్తున్నారని చెప్పారు. రాష్ట్రం మరో శ్రీలంక అవుతుంది అన్న పెద్ద మనిషి.. ఈరోజు 18 ఏళ్లు దాటిన అ మ్మాయిల దగ్గర నుంచి పథకాలు ప్రకటించారని, 50 ఏళ్లు దాటగానే బీసీలకు పెన్షన్ ఇస్తానంటున్నారని అన్నారు. అర్హత ఉన్న వారిని తీసేసీ పథకాలు ఇవ్వడం చంద్రబాబు దగ్గర ఉన్న ట్రిక్కని చెప్పారు. కానీ సీఎం జగన్ మాత్రం జల్లెడపట్టి అర్హత ఉన్న వారిని గుర్తించి మరీ పథకాలు అందజేస్తున్నారని తెలిపారు. నాడు–నేడు కింద పాఠశాలలను అభివృద్ధి చేయకుండా అమ్మ ఒడి ఇచ్చి వదిలేసి ఉంటే నిధులు మిగిలేవన్నారు. కానీ సీఎం జగన్ ఎంత కష్టమైనా స్కూళ్లను అభివృద్ధి చేయాల్సిందేనని గట్టి పట్టుదలతో పాఠశాలలను అధునాతనంగా తీర్చిదిద్దారని చెప్పారు. ఆస్పత్రులకు కోటాను కోట్లు ఖర్చు చేశారని, ఫ్యామిలీ డాక్టర్ సిస్టమ్ తెచ్చారని తెలిపారు. రూ.16 వేల కోట్లతో నాలుగు పోర్టులు వస్తున్నాయని, అభివృద్ధి అంటే ఇది అని వివరించారు. కోవిడ్ రెండేళ్లు తీసేస్తే మిగిలిన తక్కువ కాలంలోనే దేశంలోనే ఆదర్శవంతంగా వ్యవస్థలో మార్పులు తెచ్చారన్నారు. బ్రాహ్మణుల అభివృద్ధికి వైఎస్సార్సీపీ కట్టుబడి ఉంది బ్రాహ్మణుల అభివృద్ధికి వైఎస్సార్సీపీ కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. బ్రాహ్మణులలో పేదలు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. సీఎం జగన్ బ్రాహ్మణులకు రాజకీయంగా, ఇతరత్రా సముచిత గౌరవం, ప్రాధాన్యత కల్పిస్తున్నారని చెప్పారు. 2014 –19 మధ్య రాష్ట్రంలో అరాచకం నడిచిందని, తిరిగి ఆ పాలన వస్తే ప్రజలు కష్టాల పాలవుతారని అన్నారు. అన్ని వర్గాలకు అర్ధమయ్యేలా చెప్పగలిగినది బ్రాహ్మణ సామాజిక వర్గమే కనుక సీఎం జగన్ ప్రకటించినట్లు 175 అసెంబ్లీ స్థానాల్లో గెలిచే దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పి.కామేశ్వరరావు (పీకేరావు), ప్రభుత్వ సలహాదారులు నేమాని భాస్కర్, జ్వాలాపురం శ్రీ కాంత్, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి సుందర రామశర్మ, బ్రాహ్మణ సంఘం నాయకులు అమ్మ ప్రసాద్, ద్రోణంరాజు రవికుమార్, పి. పురుషోత్తమ శర్మ, జ్వాలా నరసింహారావు పాల్గొన్నారు. -
ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ చర్చల్లో పురోగతి
-
AP: ఉద్యోగ సంఘాల నేతలతో ముగిసిన చర్చలు
సాక్షి, విజయవాడ: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు ముగిశాయి. ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై మంత్రుల బృందం భేటీ అయ్యింది. ఐఆర్, పెండింగ్ డీఏ, సరెండర్ లీవ్లు, పదవీ విమరణ బకాయిలపై చర్చించింది. చర్చలు అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, రూ.5,600 కోట్ల బకాయిల విడుదలపై చర్చించామని తెలిపారు. త్వరగా ఉద్యోగుల పెండింగ్ అంశాలను పరిష్కరించాలని సీఎస్, ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించామన్నారు. విశాఖ ఎమ్మార్వో కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇప్పటికే ప్రకటించామని మంత్రి బొత్స పేర్కొన్నారు. -
అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట.. కేంద్రం కీలక ప్రకటన
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 22న హాఫ్ హాలీడే ప్రకటిస్తున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే కార్యాలయాలన్నింటికి ఈ హాఫ్ హాలీడే వర్తించనున్నట్లు తెలిపారు. అయోధ్యలోని రామాలయంలో జరిగే రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. విగ్రహ ప్రాణ ప్రతిష్ట పూర్తయ్యేంత వరకు ఒకపూట సెలవు వర్దిస్తుందని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ కూడా విడుదల చేసినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా 22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అయోధ్య నగరమంతా రామమయంగా మారిపోయింది. ప్రతిచోటా ‘జై శ్రీరామ్’ నినాదాలు వినిపిస్తున్నాయి. శ్రీరామ్లల్లాకు జరిగే పట్టాభిషేకం కోసం అయోధ్యవాసులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చదవండి: అయోధ్య వాతావరణం.. ప్రత్యేక వెబ్పేజీ ప్రారంభించిన ఐఎండీ -
ప్రభుత్వోద్యోగులకు కలిసొచ్చిన వచ్చే ఏడాది సెలవులు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే ఏడాది (2024) పండుగలు, పర్వదినాల సెలవులు కలిసొచ్చాయి. 2024కు రాష్ట్ర ప్రభుత్వం 20 సాధారణ సెలవులను ప్రకటించగా అందులో 11 సెలవులు వారాంతం లేదా వారం ప్రారంభంలోనే వచ్చాయి. 2024కు సంబంధించి ప్రభుత్వ సాధారణ సెలవులు, ఐచ్చిక సెలవులను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 2024 సంవత్సరానికి 20 సాధారణ సెలవులతో పాటు 17 ఐచ్చిక సెలవులను ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఏడాదిలో గరిష్టంగా అయిదు ఐచ్చిక సెలవులను వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. చంద్ర దర్శనం బట్టి మారే రంజాన్, బక్రీద్, మొహర్రం,, మిలాద్ ఉల్ నబీ వంటి పర్వదినాలతో పాటు తిధుల ప్రకారం మారే హిందూ పండుగల వివరాలను తరువాత ఆయా పరిస్థితులకు అనుగుణంగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. అటువంటి సందర్భాల్లో సాధారణ ఉత్తర్వులు వచ్చే వరకు ఆగకుండా ఆయా శాఖాధిపతులు తగు నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేశారు. -
AP: దసరా కానుక.. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదల
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం దసరా కానుక అందించింది. డీఏ విడుదల చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల సమావేశంలో సీఎం జగన్ ప్రకటన మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. డీఏ 3.64 శాతం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ డీఏను 2022 జూలై ఒకటో తేదీ నుంచి ఇస్తారు. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. చదవండి: AP: 31న కేబినెట్ భేటీ -
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం దసరా కానుక ప్రకటించింది. ఉద్యోగులకు డీఏ మంజూరు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. రేపు(శనివారం) డీఏ విడుదల ఉత్తర్వులు వెలువడనున్నాయి. 3.64 శాతం డీఏ విడుదల చేయనున్నారు. జీపీఎస్ అమలు బిల్లుకి గవర్నర్ ఆమోదం ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు బిల్లుకి గవర్నర్ ఆమోదం తెలిపారు. గవర్నర్ ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన భద్రత కల్పిస్తూ సీఎం జగన్ ప్రభుత్వం చట్టం చేసింది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో జీపీఎస్ చట్టానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సీపీఎస్ ఉద్యోగులకు పెన్షన్ భద్రత కల్పించేలా జీపీఎస్ అమలు చేయనున్నారు. పదవి విరమణ సమయంలో మూల వేతనం లో 50 శాతం పెన్షన్ భద్రత కల్పిస్తూ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త కాగా, కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు గెజిట్ను గవర్నర్ జారీ చేశారు. చదవండి: నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్ -
AP: ప్రభుత్వ ‘కారుణ్యం’
సాక్షి, అమరావతి: కోవిడ్–19తో మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కారుణ్యం చూపుతోంది. కోవిడ్తో 2,917 మంది ప్రభుత్వ ఉద్యోగులు మృతి చెందగా.. వారి కుటుంబాల్లో ఒకరికి చొప్పున కారుణ్య నియామకాలను చేపట్టిన విషయం తెలిసిందే. గతంలోనే కారుణ్య నియామకాల కోసం 2,744 మంది దరఖాస్తు చేసుకోగా 1,488 మందికి ఉద్యోగాలను కల్పించింది. పెండింగ్లో ఉన్న దరఖాస్తుదారులకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మృతి చెందిన ఉద్యోగికి మైనర్ పిల్లలు ఉంటే వయసు, విద్యార్హతల ఆధారంగా జీవిత భాగస్వామికి ఉద్యోగం ఇవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఆయా పోస్టుల విద్యార్హతలు, సాంకేతిక అర్హతలు ఆధారంగా కారుణ్య నియామకాలను భర్తీ చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాల నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో కారుణ్య నియామకాల కింద ఉద్యోగాల కోసం 330 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 241 దరఖాస్తులు అర్హమైనవిగా గుర్తించారు. వీటిలో ఇప్పటి వరకు జిల్లాల వారీగా 164 మందికి ఉద్యోగ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. మిగతా 77 మంది అర్హత గల కుటుంబాల్లోని వారికి వెంటనే ఉద్యోగ నియామక ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లను ఆదేశించారు. ఉద్యోగ నియామక ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు అందరూ ఉద్యోగాల్లో చేరిన నివేదికను ప్రభుత్వానికి సమరి్పంచాల్సిందిగా సీఎస్ సూచించారు. -
Telangana: కొత్త పీఆర్సీ
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తీపి కబురు అందించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్.శివశంకర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర రెండో వేతన సవరణ సంఘం (పీఆర్సీ)ను ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బి.రామయ్య కమిటీ సభ్యుడిగా వ్యవహరించనున్నారు. వేతన సవరణ సంఘం నివేదిక సమర్పించే వరకు ఉద్యోగులు, పెన్షనర్ల మూలవేతనం/మూల పెన్షన్పై 5 శాతం మధ్యంతర భృతి (ఐఆర్)ని చెల్లించాలని కూడా సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రస్తుత అక్టోబర్ నెల నుంచే ఐఆర్ను వర్తింపజేయనున్నారు. ఈ మేరకు కొత్త పీఆర్సీ ఏర్పాటు, మధ్యంతర భృతి చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. ఆరు నెలల్లోగా నివేదికను సమర్పించాలని కమిటీని ఆదేశించారు. వేతన సవరణ సిఫారసుల కోసం దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలపై మార్గదర్శకాలు జారీ చేశారు. ‘రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రస్తుత వేతనాలను పరిగణనలోకి తీసుకుని ఉద్యోగుల వేతన సవరణపై సిఫారసులు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వృద్ధి, రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత, భవిష్యత్తు మూలధన పెట్టుబడి అవసరాలు/ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి..’ అని సూచించారు. 5% ఐఆర్తో రూ.2 వేల కోట్లకు పైగా భారం! ప్రస్తుతం అమల్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర తొలి వేతన సవరణ గడువు గత జూన్ 30తో ముగిసింది. జూలై 1 నుంచి ఉద్యోగులకు కొత్త వేతన సవరణ వర్తింపజేయాల్సి ఉంది. తాజాగా ఏర్పాటైన రాష్ట్ర రెండో పీఆర్సీ.. వేతన సవరణ ఫిట్మెంట్ శాతాన్ని సిఫారసు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. ఆ తర్వాత ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరిపి కొత్త పీఆర్సీ అమలుపై నిర్ణయం తీసుకుంటుంది. అప్పటివరకు 5 శాతం మధ్యంతర భృతిని ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లించనుంది. వేతన సవరణ అమల్లోకి వచ్చిన తర్వాత అప్పటివరకు చెల్లించిన ఐఆర్ను సర్దుబాటు చేసి ఉద్యోగులకు రావాల్సిన మిగిలిన వేతన సవరణ బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తుంది. కాగా 5 శాతం ఐఆర్ అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2 వేల కోట్లకు పైగా భారం పడనుందని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. దీనికి ముందు 2018 జూలై 1 నుంచి కొత్త పీఆర్సీని వర్తింప చేయాల్సి ఉండగా.. కోవిడ్ కారణంగా ప్రభుత్వం వాయిదా వేసింది. 2020 ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులు, పెన్షనర్లకు 30 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రయోజనాలను అమలు చేసింది. ఐఆర్ వీరికి వర్తిస్తుంది.. ► రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, స్థానిక సంస్థల ఉద్యోగులు, వర్క్ చార్జ్డ్ ఉద్యోగులు, ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ అందుకుంటున్న సంస్థల ఉద్యోగులకు మాత్రమే ఐఆర్ను వర్తింపజేయనున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు వర్తించదు.. ► తెలంగాణ ఉన్నత న్యాయ సేవలు, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవలు, అఖిల భారత సర్వీసు అధికారులు, యూజీసీ/ఏఐసీటీఈ/ఐసీఏఆర్/ కేంద్ర ప్రభుత్వ వేతనాలు/పెన్షన్లు అందుకుంటున్న ఉద్యోగులు/పెన్షనర్లతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులు, సొసైటీల ఉద్యోగులు, స్వయం ప్రతిపత్తి గల సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఐఆర్ వర్తించదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. -
పాత పింఛన్ పథకాన్ని పునరుద్ధరించాలి
న్యూఢిల్లీ: పాత పింఛన్ పథకాన్ని(ఓపీఎస్) పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వ, ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో ఆదివారం ‘పెన్షన్ శంఖనాథ్ మహార్యాలీ’ పేరిట భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 20కిపైగా రాష్ట్రాల నుంచి వేలాది మంది ఉద్యోగులు తరలివచ్చారు. ప్రభుత్వం తీసుకొచి్చన కొత్త పింఛన్ పథకాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రిటైర్మెంట్ తర్వాత తమ జీవితానికి భరోసానిచ్చే పాత పింఛన్ పథకాన్ని పునరుద్ధరించాలని తేల్చిచెప్పారు. జాయింట్ ఫోరం ఫర్ రిస్టోరేషన్ ఆఫ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్, నేషనల్ జాయింట్ కౌన్సిల్ ఆఫ్ యాక్షన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టినట్లు నిరసనకారులు వెల్లడించారు. 2004 జనవరి 1 తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరినవారు కొత్త పింఛన్ పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు అలిండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ జాతీయ కనీ్వనర్ శివగోపాల్ మిశ్రా చెప్పారు. -
అంగన్వాడీల సమ్మె యథాతథం
సాక్షి, హైదరాబాద్, ముషీరాబాద్: అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె య«థాతథంగా కొనసాగుతుందని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రానందువల్లే సమ్మెను కొనసాగిస్తున్నామని, సామాజిక మాధ్యమాల్లో సమ్మె విరమించినట్లు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని పేర్కొంది. ఈ మేరకు జేఏసీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను మంత్రి హరీశ్రావు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆయన వేతనాలను ఏమేరకు పెంచుతామనే అంశాన్ని స్పష్టం చేయలేదని పేర్కొంది. వేతనాల అంశాన్ని సీఎం కేసీఆర్తో మాట్లాడి ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించినప్పుడు అంగన్వాడీలకు కూడా పెంచుతామని హామీ ఇచ్చారని వివరించింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్కు సంబంధించి టీచర్కు రూ.2 లక్షలు, హెల్పర్కు రూ.లక్ష ఇస్తామన్న మంత్రి సత్యవతి రాథోడ్ ప్రతిపాదనలు అమలు చేయాలని కోరితే మంత్రి హరీశ్రావు పరిశీలిస్తామని చెప్పారని, స్పష్టతనివ్వలేదని జేఏసీ నేతలు తెలిపారు. గ్రాట్యుటీ అంశాన్ని సాధ్యం కాదని మంత్రి తేల్చి చెప్పారని పేర్కొన్నారు. సమ్మె విరమించాలని మంత్రి హరీశ్రావు కోరారని, కానీ జేఏసీ మంత్రికి నిర్ణయాన్ని వెల్లడించలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో సమ్మె విరమిస్తున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. ఈ నెల 4న ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంత్రి హరీశ్తో భేటీ అయిన వారిలో సీఐటీయూ నేతలు పి.జయలక్ష్మి, సునీత, ఏఐటీయూసీ నేతలు ఎన్.కరుణకుమారి, ఎం.సాయిశ్వరి, కె.చందన, జేఏసీ నేతలు భూపాల్, ఓ.ఈశ్వరరావు, ఏఐటీయూసీ కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య ఉన్నారు. మరింత పట్టుదలతో సమ్మె: ఏఐటీయూసీ నేత విజయలక్ష్మి అంగన్వాడీలు మరింత పట్టుదలతో సమ్మె కొనసాగించాలని ఏఐటీయూసీ జాతీయ నాయకురాలు బి.వి.విజయలక్ష్మి, ఏఐటీయూసీ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఎం.డీ.యూసఫ్, ఎస్.బాలరాజులు పిలుపునిచ్చారు. వేతనాల పెంపుపై ప్రభుత్వం నుంచి సరిగ్గా హామీ రాకపోవడం, మిగిలిన డిమాండ్లపైనా స్పష్టత లేకపోవడంచో సమ్మె కొనసాగించాలని నిర్ణయించామని చెప్పారు. సోషల్ మీడియాలో సమ్మె విరమిస్తున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని పిలుపునిచ్చారు. -
అంగన్వాడీలకూ పీఆర్సీ ఫలాలు
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల వేతనాన్ని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా స్థిరీకరిస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు స్పష్టం చేశారు. త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటిస్తామని, ఇందులో భాగంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వేతనాలు పెరుగుతాయన్నారు. ఆదివారం అంగన్వాడీ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు, సీఐటీయూ, ఏఐటీయూసీ ప్రతినిధులు మంత్రి హరీశ్రావును ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల డిమాండ్లు, ఇతర సమస్యలను మంత్రి ముందు ఉంచారు. దీనిపై హరీశ్ సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు త్వరలో ప్రభుత్వం ఇవ్వనున్న పీఆర్సీలో అంగన్వాడీలను చేర్చుతామని,ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జీతాలను కూడా పెంచుతామని భరోసానిచ్చారు. ఇతర డిమాండ్లపై సానుకూలంగా స్పందించి వాటిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని, ఈ డిమాండ్లపై నివేదికను సమర్పించాల్సిందిగా మహిళా శిశు సంక్షేమ కార్యదర్శి భారతి హోలికేరినీ ఆయన ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పెండింగ్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకం బిల్లులను కూడా ప్రభుత్వం విడుదల చేసిందని, రెండు రోజుల్లో ఆయా ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి హరీశ్ వెల్లడించారు. -
ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులే
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. గత నెల ఆరో తేదీన ఈమేరకు ప్రవేశపెట్టిన బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపగా, అందులో కొన్ని సందేహాలను నివృత్తి చేసుకుని గత గురువారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దానిపై సంతకం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ బిల్లును చట్టరూపంగా ఇప్పుడు అమలులోకి తెస్తూ, సెప్టెంబరు 15వ తేదీతో మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ను న్యాయ శాఖ కార్యదర్శి జారీ చేశారు. దీంతో 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులు ఇక ప్రభుత్వ ఉద్యోగులుగా మారినట్టయింది. ఇక విలీన విధివిధానాలను ఖరారు చేసేందుకు కమిటీని నియమిస్తూ ప్రభుత్వం త్వరలో ఉత్తర్వు జారీ చేయనుంది. ఆ కమిటీ కూలంకుషంగా పరిశీలించి, ఆర్టీసీ ఉద్యోగులు– ప్రభుత్వంలో ఏయే కేడర్లతో సమంగా ఉండాలి, వారి పే స్కేల్ ఎలా ఉండాలి, రిటైర్మెంట్ వయసు, పింఛన్ విధానం, ప్రస్తుతం ఆర్టీసీలో కొనసాగుతున్న ప్రత్యేక ఆర్థిక బెనిఫిట్స్ ఉండాలా వద్దా.. వంటి చాలా అంశాలపై స్పష్టతనిస్తూ ప్రభుత్వానికి సిఫారసులు అందించనుంది. వాటిని ఏ రోజు నుంచి అమలులోకి తేవాలో ఓ అపాయింటెడ్ డేæను కూడా ఖరారు చేయాల్సి ఉంది. ఈ నెల జీతాలు ఆర్టీసీ నుంచేనా? గెజిట్ నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో.. వచ్చే నెల జీతాలను ప్రభుత్వం చెల్లిస్తుందని ఉద్యోగులు భావిస్తున్నారు. కానీ, ట్రెజరీ వేతనాలు ఎప్పటి నుంచి చెల్లించాలో స్పష్టం చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వు జారీ చేయాల్సి ఉన్నందున, అప్పటి వరకు ఆర్టీసీ నుంచే యథావిధిగా జీతాలు చెల్లించాల్సి ఉంటుందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. వీలైనంత తొందరలో ఉత్తర్వు జారీ అయితే ఆ సందిగ్ధం వీడుతుందంటున్నారు. కాగా ప్రస్తుతం ఆర్టీసీ ఎంత చెల్లిస్తుందో, ప్రభుత్వం కూడా అంతే చెల్లిస్తుందని, విధివిధానాలు ఖరారయ్యాక అసలు జీతాలపై స్పష్టత వస్తుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. -
ఆర్టీసీ ఉద్యోగులు.. ఇక ప్రభుత్వ ఉద్యోగులే
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోద ముద్ర వేశారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లుకు గవర్నర్ గురువారం ఓకే చెప్పడంతో చట్ట బద్ధత లభించింది. దీంతో 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. టీఎస్ ఆర్టీసీ (ఉద్యో గులను ప్రభుత్వంలో విలీనం) బిల్లు–2023ను శాసనసభ గతనెలలో ఆమోదించగా, రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ బిల్లుపై సంతకం చేసినట్టు రాజ్భవ న్ తాజాగా ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన ఆర్టీసీ కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే.. జూలై 31న సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే అంశానికి సంబంధించి ఆమోద ముద్ర వేయడం, ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని నిర్ణ యించిన విషయం విదితమే. అయితే ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టడానికి ముందు గవర్నర్ అనుమతి తప్పనిసరి కావడంతో, గవర్నర్ బిల్లు ను పరిశీలించి పలు అనుమానాలు వ్యక్తం చేయడం, మొద ట సంస్థ ఆస్తులు, కేంద్ర గ్రాంట్లు, వాటా, విభజన చట్టంలో 9వ షె డ్యూల్, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూస్తారా.? వారి సీనియారిటీ, పారిశ్రామిక వి వాదాల చట్టం వర్తిస్తుందా..? ప్రభుత్వ ఉద్యోగులతో సమా నంగా పెన్షన్ వర్తిస్తుందా..?అన్ని ప్రయోజనాలు కల్పి స్తారా..? ప్రభుత్వ ఉద్యోగాల్లో కండక్టర్, కంట్రోలర్ వంటి పోస్టులు లేవు మరి వారిని ఏ విధంగా సర్దుబాటు చేస్తారు.? కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నారా.? డిపోల్లో కేటగిరి వారీగా ఉన్న ఉద్యోగుల సంఖ్య ఎంత.. కాంట్రాక్టు, క్యాజువ ల్ కార్మికుల పరిస్థితి ఏమిటీ..? ఆర్టీసీ ప్రస్తుత స్వరూపంతోనే పనిచేస్తుందా..? ఆస్తులను ప్రభుత్వం విలీనం చేసు కుంటుందా.? బస్సుల నిర్వహణ, ఆజమాయిషీ ఎవరిది లాంటి అనేక ప్రశ్నలు గవర్నర్ లేవనెత్తడం.. వాటిన్నింటికి ప్రభుత్వం సమాధానం ఇవ్వడంతోపాటు, బిల్లులో పొందుపరిచి అసెంబ్లీలో పాస్ చేసిన సంగతి విదితమే. బిల్లు వచ్చిన తర్వాత మళ్లీ న్యాయశాఖ పరిశీలనకు పంపించిన గవర్నర్.. ఈనెల 3వ తేదీన న్యాయశాఖ నుంచి బిల్లు తిరిగి వచ్చిన తర్వాత దాదాపు పదిరోజుల పరిశీలన అనంతరం బిల్లుకు ఆమోదం తెలిపారు. సీఎంకు ధన్యవాదాలు : బాజిరెడ్డి గోవర్ధన్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగులంతా రుణపడి ఉంటారని పేర్కొన్నారు. తాను సంస్థ చైర్మన్గా ఉన్న సమయంలో వారంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారడం ఆనందంగా ఉందన్నారు. -
ఉద్యోగుల ఆకాంక్ష తీరేలా!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా పండుగ కానుకగా 2022 జూలై ఒకటికి సంబంధించిన డీఏ ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. బకాయి ఉన్న రెండు డీఏల్లో ఒకటి పండుగ రోజు ఇస్తామని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలో మహిళా ఉద్యోగులకు ఇతర శాఖల ఉద్యోగుల మాదిరిగానే 5 రోజులు అడిషనల్ లీవులు ఇస్తామని చెప్పారు. సోమవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ ఎన్జీవోల సంఘం 21వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలకు సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యోగుల ప్రయోజనాలు, వారికి మంచి చేసే విషయంలో గతంలోని అన్ని ప్రభుత్వాల కంటే ఎంతో ముందున్నామని తెలిపారు. ఉద్యోగులకు మంచి చేసే విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గే పరిస్థితే లేదని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం ఉద్యోగులదని, వారికి తోడుగా ఉంటున్న ప్రభుత్వమని చెప్పారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. మీ భుజ స్కందాలపైనుంచే... సంక్షేమాన్ని అందించడం, అభివృద్ధిని పంచిపెట్టడం, సేవా ఫలాలను ప్రజల దాకా తీసుకెళ్లడంలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులు ఉద్యోగులే. విధాన నిర్ణయాలు తీసుకునేది రాజకీయ వ్యవస్థ, ముఖ్యమంత్రి అయితే వాటిని అమలు చేసేది మీరే. పౌర సేవలు ప్రజల వద్దకు డెలివరీ అయ్యేది మీ భుజ స్కందాలపైనుంచే. మీ సంతోషం, మీ భవిష్యత్ మన ప్రభుత్వ ప్రాధాన్యతలేనని మీ అందరికీ మరోసారి భరోసా ఇస్తున్నా. అది నా బాధ్యత. ప్రభుత్వం అనే కుటుంబంలో కీలక సభ్యులైన మీ అందరి పట్ల అభిమానాన్ని, గౌరవాన్ని, ప్రేమను, మరీ ముఖ్యంగా నిజాయితీని చాటే విషయంలో మన ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వంతో పోల్చినా మిన్నగా, సానుకూలంగా ఉందని సవినయంగా తెలియజేస్తున్నా. ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించాం 2019లో అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించేందుకు ఆర్నెళ్లలోనే గ్రామ స్థాయిలో సేవలను అందుబాటులోకి తెచ్చాం. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ఎంత కమిట్మెంట్ చూపించామంటే ఏకంగా 1.35 లక్షల శాశ్వత ఉద్యోగాలను ప్రతి గ్రామం, మున్సిపాలిటీ వ్యవస్థలో సచివాలయ వ్యవస్థ ద్వారా రిక్రూట్ చేశాం. చాలామంది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అసాధ్యమన్నారు. వారి బాధలకు వాళ్లను వదిలేయాలని ఎంతో మంది సలహా ఇచ్చారు. విలీనంతో ఎన్నో సమస్యలు వస్తాయన్నారు. అయినాసరే ఆర్టీసీ ఉద్యోగులపై మమకారంతో కమిట్మెంట్లో ఎక్కడా లోపం చేయలేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం మీరందరూ చూశారు. నిజాయితీగా, కమిట్మెంట్తో అడుగులు వేశాం. పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచిన ప్రభుత్వం మనందరిది. గత ప్రభుత్వ హయాంలో అతి తక్కువ జీతాలకు పని చేస్తూ ఎన్నికలకు 6 నెలలు ముందు వరకు రూపాయి కూడా జీతం పెరగక దయనీయ పరిస్థితిలో ఉన్న ఉద్యోగుల జీతాలను మనం వచ్చాక పెంచాం. గత పాలకులు ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు వారికి జీతాలు పెంచాలనే ఆలోచనే చేయలేదు. ఓట్లు వేయించుకోవాలన్న దుర్బుద్ధితో ఎన్నికలకు ముందు పెంచారు. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ జీతాలను మరింత పెంచి మొట్ట మొదటి రోజు నుంచి పెంచిన జీతాలు ఇస్తున్నాం. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, వీఈవోలు, మెప్మా రీసోర్స్ పర్సన్లు, శానిటేషన్ వర్కర్లు, గిరిజన కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు, హోంగార్డులు, మధ్యాహ్న భోజనం వండే ఆయాలు.. వీరందరి జీతాలను మనమే మనసు పెట్టి పెంచి ఇస్తున్నాం. జీతాల బడ్జెట్ మూడు రెట్లు పెంపు.. గత ప్రభుత్వ హయాంలో కేవలం రూ.1,100 కోట్లు మాత్రమే ఉండే జీతాల బడ్జెట్ ఇప్పుడు రూ.3,300 కోట్లకు ఎగబాకినా చిరునవ్వుతో అందరికీ మంచి చేస్తున్నాం. కోవిడ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఎస్వోఆర్ (స్టేట్ ఓన్ రెవెన్యూ) తగ్గినా డీబీటీ ద్వారా పారదర్శకంగా సంక్షేమ ఫలాలను అందించాం. ఇవన్నీ జరగబట్టే ఈరోజు ప్రజలు సంతోషంగా ఉన్నారు.ప్రతి పేదవాడి మొహంలో చిరునవ్వు ఉంది అంటే దానికి కారణం మీరు (ఉద్యోగులు) మీరు డెలివరీ చేసిన విధానం అని చెప్పడానికి గర్వపడుతున్నా. ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ప్రజలను కష్టాలకు వదిలేయలేదు. ఉద్యోగుల పట్లా మానవత్వంతో వ్యవహరించాం. గత ప్రభుత్వాలు పట్టించుకోకుండా వదిలేసిన ఆర్టీసీ కారుణ్య నియామకాల విషయంలోగానీ 10 వేలకుపైగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో గానీ ఏపీ వైద్య విధాన పరిషత్లోని 14,658 మందిని ప్రభుత్వంలోకి తీసుకొనే విషయంలోగానీ జిల్లా కేంద్రాలన్నింటిలోనూ 16 శాతం హెచ్ఆర్ఏ ఇచ్చే విషయంలోగానీ ఆర్టీసీ నష్టాల్లో ఉన్నా 55 వేల మంది సిబ్బందిని క్రమబద్ధీకరించడంలోగానీ 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలోగానీ భాషా పండితులను స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోట్చేసే విషయంలోగానీ ఎంఈవోల నియామకాలు, ఎంపీడీవోలకు ప్రమోషన్లు ఇవ్వడం.. ఇలా అనేక అంశాల్లో గత ప్రభుత్వం మాదిరిగా మన ప్రభుత్వం ఎవరికీ అన్యాయం చేయలేదు. ప్రతి సమస్యనూ పరిష్కరించాలి, ఉద్యోగుల ముఖంలో చిరునవ్వు చూడాలనే తపన, తాపత్రయంతో సమస్యలను పరిష్కరిస్తూ ఉద్యోగులకు తోడుగా నిలిచాం. కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ ఇవ్వడం మొదలు పెట్టింది మనందరి ప్రభుత్వమే. ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఆప్కాస్ కిందకు తెచ్చి కమిషన్లు లేకుండా నెలలో మొదటి వారంలోనే జీతాలు ఇచ్చేలా అండగా నిలబడగలిగాం. ప్రతి గ్రామంలో నాడు – నేడు ఉద్యోగులు ఎంతమంది? మీరే చూడండి.. గతంలో ప్రతి గ్రామంలో ఎంత మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండే వారు? ఎన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉండేవి? ఈరోజు ఎంత మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు? ఎన్ని కార్యాలయాలు గ్రామంలో ఉన్నాయో ఆలోచన చేయండి. సచివాలయాలు మొదలు రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ స్కూళ్లు.. కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థలే. వీటన్నింటినీ గత నాలుగేళ్లలోనే విస్తరించాం. ఇవన్నీ బాగుంటేనే ప్రజలు బాగుంటారు. ఉగ్యోగులు కూడా బాగుంటారు. చంద్రబాబు లాంటి పాలకుడు ఉంటే.. చంద్రబాబు లాంటి పాలకుడు ఉంటే ఇవన్నీ తీసేస్తారు. గవర్నమెంట్ ఆస్పత్రులు నిర్వీర్యమవుతాయి. పేషెంట్లు రావడం మానేస్తారు. పేషెంట్లు రావడం లేదని ఆస్పత్రులను తొలగిస్తారు. ఆర్టీసీని బాగా నడపలేకపోతే ప్రజలు రావట్లేదు కదా.. ఇక ఆర్టీసీ బస్సులు ఎందుకు? ఆర్టీసీ కార్మికులు ఎందుకని వాటిని మూసివేసే కార్యక్రమం చేస్తారు. ఇవాళ 26 జిల్లాలతో ప్రభుత్వ వ్యవస్థ విస్తరించింది. ఈరోజు 7 నియోజకవర్గాలకు ఓ కలెక్టర్, ఎస్పీ, సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు, గ్రామస్థాయిలో సచివాలయాలు, సిబ్బంది, అడుగడుగునా 50 ఇళ్లకు వలంటీర్ వ్యవస్థ ఉన్నాయి. ఈ స్థాయిలో ప్రభుత్వం, ఉద్యోగులంతా సేవలందించేందుకు ఉత్సాహంగా అడుగులు వేస్తున్న పరిస్థితి. సీపీఎస్ సమస్యపై నిజాయితీగా మనసు పెట్టా అనేక ఏళ్లుగా పరిష్కారం చూపకుండా గత ప్రభుత్వాలు గాలికి వదిలేసిన సీపీఎస్ సమస్యను పరిష్కరించేందుకు నిజాయితీగా, మనసు పెట్టి అడుగులు వేశాం. అనేక సమావేశాలు, ఆలోచనలు, ఒకటిన్నర సంవత్సరం.. ఈ స్థాయిలో అధ్యయనం చేసిన పరిస్థితులు గతంలో ఎప్పుడూ లేవు. విదేశాల్లో అమలవుతున్న రకరకాల పెన్షన్ స్కీములను కూడా అధ్యయనం చేశాం. రిటైర్ అయిన తర్వాత కూడా ఉద్యోగులు చిరునవ్వుతో జీవించేలా, న్యాయం జరిగేలా ఆర్డినెన్స్కు పంపించాం. జీపీఎస్.. గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ను తెచ్చాం. మాట తప్పే ఉద్దేశమే ఉంటే ఇది అమలు చేయలేమని చెప్పి ఊరుకునేవాళ్లం. కానీ మంచి చేయాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తపన, తాపత్రయంతో పని చేశాం. ఈ విషయంలో నేను గడిపినంత సమయం.. బహుశా చాలా తక్కువ విషయాల్లో నేను ఇంత టైమ్ ఇచ్చి ఉంటా. ఒక మంచి సొల్యూషన్ ఇవ్వగలిగాం. రాబోయే రోజుల్లో దేశమంతా ఈ పెన్షన్ స్కీమ్ను కాపీ కొట్టి అనుసరించే పరిస్థితి వస్తుంది. నాడు 3.97 లక్షలు.. నేడు అదనంగా 2.06 లక్షల ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్మెంట్లో కొత్త రికార్డులు నెలకొల్పిన ప్రభుత్వం మనది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2019 వరకు 3.97 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే మనం అధికారంలోకి వచ్చాక 2,06,388 మందిని కొత్తగా నియామకాల ద్వారా శాశ్వత ఉద్యోగులుగా నియమించాం. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో 1.35 లక్షల మంది, హెల్త్ సెక్టార్లో 53,126 మంది ఉద్యోగులు మన కళ్లెదుటే కనిపిస్తారు. నష్టాల ఊబి నుంచి ఆర్టీసీని, ఉద్యోగులను కాపాడేందుకు 53 వేల మందిని రెగ్యులరైజ్ చేశాం. మెరుగైన ప్రభుత్వ వ్యవస్థ కోసం ఇవన్నీ చేశాం. గత ప్రభుత్వ డ్రామాలతో విసిగిపోయిన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడంపై క్యాబినెట్లో చర్చించాం. తొలుత 2014 జూన్కు ముందు 5 సంవత్సరాలు ఇస్తే సరిపోతుందనుకున్నాం. కానీ నేను జిల్లాలకు తిరగడం మొదలు పెట్టాక.. మాకు ఇబ్బందులున్నాయి, వాళ్లకు అవుతున్నాయి, మాకు రెగ్యులరైజ్ కావడం లేదని చెప్పారు. దీనిపై ఆలోచన చేశా. వారి ముఖంలో కూడా చిరునవ్వు చూడాలని మళ్లీ క్యాబినెట్లో పెట్టి వీరందరికీ ఇచ్చాం. మనసు పెట్టి మిగతావారికి కూడా మంచి జరగాలి, వారి ముఖంలో చిరునవ్వులు చూడాలనే తపన, తాపత్రయంతో అడుగులు వేశాం. దళారీ వ్యవస్థను తొలగించి ఆప్కాస్ ద్వారా ఒకటో తారీఖునే జీతాలు వచ్చేలా, లంచాలు, కటింగ్లు లేకుండా ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ తెచ్చి చిరు ఉద్యోగులకు మంచి జరిగేలా అడుగులు వేశాం. ఉద్యోగులు నిశ్చింతగా తమ ఉద్యోగాలు చేసుకునేలా తగిన వాతావరణం కల్పిస్తూ అడుగులు ముందుకు వేశాం. ప్రభుత్వ రంగాల మూసివేతలో రికార్డు బాబుదే ప్రభుత్వ రంగాలను మూసివేయడం, వీఆర్ కూడా ఇవ్వకుండా గోల్డెన్ హ్యాండ్ షేక్ అంటూ ఉద్యోగులను ఇంటికి పంపడంలో గత ప్రభుత్వానిది ఓ అడ్డగోలు రికార్డు. కొన్నేళ్ల క్రితం చంద్రబాబు నాయుడు రాసిన మనసులో మాట పుస్తకాన్ని ప్రతి ఉద్యోగీ చదవాలని విజ్ఞప్తి చేస్తున్నా. (మనసులో మాట పుస్తకంలో కొన్ని అంశాలను సీఎం జగన్ చదివి వినిపించారు). 2,70,700 ఉద్యోగాలను సమీక్షించి 40.62 శాతం అదనంగా ఉన్నాయని ఆ పుస్తకంలో ఆయన రాసుకున్నారు. శాశ్వత ఉద్యోగాల కాలపరిమితిని పరిశీలించాలని, 1996–97లోనే సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో ఉపాధ్యాయుల్ని శాశ్వత ప్రాతిపదికన నియమించటాన్ని ప్రభుత్వం మానేసిందని చంద్రబాబు తన పుస్తకంలో ప్రస్తావించారు. ఓ విద్యా సంవత్సరానికి కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగుల ఎంపిక ప్రారంభించామని, ప్రభుత్వ ఉద్యోగాలను కాంట్రాక్టు ప్రాతిపదికన ఇవ్వాలని, సిబ్బంది సంఖ్యను తగ్గించడానికి అది ఉత్తమ మార్గమని చంద్రబాబు తన మనసులో మాట చెప్పారు. కొత్త నియామకాలు చేపట్టకూడదు. ఇవీ చంద్రబాబు మనసులో ప్రభుత్వ ఉద్యోగుల పట్ల అభిప్రాయం. విద్యుత్ సంస్థ ఉద్యోగుల్లో 66 శాతం, పౌర సరఫరాల సంస్థలో 65 శాతం, రెవెన్యూలో 64 శాతం, పోలీసు శాఖలో 62 శాతం, స్థానిక సంస్థల్లో 52 శాతం మంది అవినీతిపరులేనని తేలినట్లు చంద్రబాబు స్వయంగా ఆ పుస్తకంలో రాసుకున్నారు. అదే ప్రజాభిప్రాయమంటూ తనకు నచ్చిన పర్సెంటేజీని జోడించి పుస్తకాన్ని ముద్రించారు. కనీసం ఈ నంబర్లు రాసే ముందు ఎవరిని అడిగారు? ప్రతి ఆఫీసుకూ వెళ్లి.. వీళ్లు మాత్రమే మంచోళ్లు, మిగతావాళ్లంతా లంచగొండులనే అధికారం ఎవరిచ్చారని చంద్రబాబును ప్రశ్నిస్తున్నా. ఒకటి రెండు కేసులో ఆఫీసర్లు లంచాలు తీసుకుంటే ఏసీబీ వాళ్లు రెయిడ్ చేస్తే కలెక్టర్ యాక్షన్ తీసుకుంటారు. తనంతట తానే లెక్కలు గట్టి అంతా లంచగొండులేనని, వాటిని మూసేయాలి, ప్రైవేట్ పరం చేయాలంటూ ఆ పెద్దమనిషి పుస్తకంలో రాశాడు. మరి ఇలాంటి మనిషి రేపొద్దున మీకు మంచి చేయగలడా? అని ఆలోచన చేయాలి. శాశ్వత ఉద్యోగాలకు కోత.. వ్యవస్థలు నిర్వీర్యం ఇలాంటి వ్యక్తి కాబట్టే 2014–19 మధ్య శాశ్వత ఉద్యోగుల నియామకాన్ని చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా తగ్గించారు. ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఆయన హయాంలో ఆర్టీసీ పరిస్థితి ఏమిటి? గవర్నమెంట్ ఆస్పత్రులు, గవర్నమెంట్ స్కూళ్ల పరిస్థితి ఏమిటి? ఇక గ్రామ స్థాయిలో పరిపాలన దేవుడెరుగు! అధికారులు, పారదర్శకతతో పని లేదు. జన్మభూమి కమిటీలు చాలు.. లంచాలు తీసుకుని ఎవరికి సిఫారసు చేస్తే అదే పరిపాలన. ఐదేళ్లలో కేవలం 34 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే నియమించారు. 1999 నుంచి 2004 మధ్య ఏకంగా 54 ప్రభుత్వ రంగ సంస్థలను చంద్రబాబు మూసివేశారు. ఇందుకోసం ఇంప్లిమెంటేషన్ సెక్రటేరియట్ అని ఓ విభాగాన్నే సెక్రటేరియట్లో ఏర్పాటు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను పప్పు బెల్లాలకు తన వాళ్లకు అమ్మేసుకున్నారు. ఉద్యోగులను నడిరోడ్డుపై వదిలేశాడు. ఆల్విన్, నిజాం షుగర్స్, రిపబ్లిక్ ఫోర్చ్, చిత్తూరు డెయిరీ, ప్రకాశం డెయిరీ.. ఇలాంటివి ఏకంగా 54 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసిన చరిత్ర ఈ పెద్దమనిషిది. ఆయన ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల గురించి మొసలి కన్నీరు కారుస్తుంటే ఇంతకంటే ఘోరం ఏముంటుంది? మనది ఉద్యోగుల అనుకూల ప్రభుత్వం. మీరు ఎవరి ప్రలోభాలకూ గురి కావద్దు. చంద్రబాబు, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, దత్తపుత్రుడు.. వీరందరికీ ఉన్నదంతా ఒక్కటే.. కేవలం నా మీద కడుపుమంట. రాష్ట్ర ప్రజల మీద, ఉద్యోగుల మీద మీదా వీరికి ఏమాత్రం ప్రేమ లేదు. వీరు చేసే రాజకీయ విమర్శలు, రెచ్చగొట్టే మాటలు, కట్టు కథలను నమ్మవద్దని సవినయంగా కోరుతున్నా. పోలీసులు, ఉద్యోగులపై భౌతిక దాడులా? పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులపై టీడీపీ నేతలు పగబట్టి భౌతిక దాడులు జరుపుతున్నారు. 47 మంది పోలీసులపై పుంగనూరులో దాడి చేశారు. ఒకరి కన్ను కూడా పోయింది. పోలీసులు ఏం పాపం చేశారని దాడులు చేశారు? కన్ను పోగొట్టడానికి మీరు ఎవరు? ‘‘మీకు పర్మిషన్ ఉన్న రూట్లో వెళ్లండి.. వేరే రూట్లో పోవద్దండి.. వేరే పార్టీ వాళ్లు ధర్నా చేసుకుంటున్నారు. గొడవలు జరుగుతాయి.. ’’ అని పోలీసులు చెబితే శాంతి భద్రతల సమస్య సృష్టించి శవ రాజకీయాలకు కూడా వెనుకాడని వారిని గమనించమని కోరుతున్నా. ఉద్యోగులకు మేలుపై వెనక్కి తగ్గం ఉద్యోగుల ప్రయోజనాలు, వారికి మంచి చేసే విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గే పరిస్థితి లేదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. రెండు డీఏలు పెండింగ్లో ఉన్నాయని శీనన్న (ఎన్జీవోల సంఘం ఛైర్మన్) అన్నారు. 2022 జూలై 1కి సంబంధించిన డీఏని దసరా పండుగనాడు మీ అందరికీ ఇచ్చే కార్యక్రమం చేస్తా. మెడికల్, హెల్త్ డిపార్ట్మెంట్లో మహిళా ఉద్యోగులకు మిగతా వారి మాదిరిగా 5 రోజుల అడిషనల్ హాలిడే కావాలన్నారు. దాన్ని కూడా మంజూరు చేస్తున్నాం. ఈ ప్రభుత్వం మీది. మీకు తోడుగా ఉంటున్న ప్రభుత్వం. ఆర్థిక ఇబ్బందులతో కొద్దో గొప్పో మీరు అనుకున్న స్థాయిలో నేను చేయలేకపోయి ఉండవచ్చు. కానీ మనసు నిండా ప్రేమ మాత్రం ఎక్కువగానే ఉంది. ఈ ప్రభుత్వం మీది. మీకు మంచి చేసే విషయంలో నాలుగు అడుగులు వేయడానికి ఎప్పుడూ ముందుంటా. -
జగన్ చేసిన మంచి పని కేసీఆర్ చేస్తడు.. అన్ని చెప్తరు ఆ ఒక్కటి తప్ప!
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిత్యం వార్తలు, కథనాలు వండి వార్చే ఒక మీడియా, తెలంగాణలో ఒక ఆసక్తికరమైన కథనాన్ని ఇచ్చింది. తెలంగాణలో కూడా ఆర్టిసి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ వార్త ఇచ్చారు. అందులో ఎపి ప్రభుత్వానికి, ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కితాబు ఇవ్వడానికి కాకుండా అక్కడి ముఖ్యమంత్రిని ఎద్దేవ చేయడానికి ఆ కథనాన్ని ఇచ్చారని అర్ధం అవుతోంది. ఎపిలో ఆర్టిసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అది సాధ్యం కాని పని అని వ్యాఖ్యానించిన విషయాన్ని ఈ పత్రిక గుర్తు చేసింది. వైరల్గా సీఎం కేసీఆర్ వీడియో అంతేకాక ఆయన ఇలా అన్నారట. 'ఆర్టిసిని గవర్నరమెంట్ లో కలపడమనే ఒక అసంబద్దమైన, అర్థరహితమైన నినాదాన్ని పట్టుకుంటారా? అదో నినాదమా.. నాకర్దం కాదు. ఒక పనికిమాలిన, పిచ్చి రాజకీయ పార్టీలు తలకకాయమాసినోడు, నెత్తిన మాసినోడు, గీళ్లా.. నాకర్దం కాదు. అర్ధం ఉండాలి. భూ గోళం ఉన్నంతవరకు అది జరగదు. ఎపి ప్రభుత్వం ఏమి చేస్తుందో చూద్దాం. అది ఒక ప్రయోగం. అక్కడ ఏ మన్ను జరగలేదు. అది అయ్యే పని కాదు.. అని కెసిఆర్ అప్పట్లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని పేర్కొన్నారు. తెలంగాణలో ఆర్టిసి ఉద్యోగులు సమ్మె చేసిన నేపధ్యంలో ఆయన అప్పట్లో అలా అభిప్రాయ పడ్డారు. కాని జగన్ ప్రభుత్వం ఆర్టిసిని విలీనం చేయడమే కాకుండా, విజయవంతంగా గత కొద్ది సంవత్సరాలుగా అమలు చేస్తోంది. దీంతో ఆర్టిసి పై జీతాలు, తదితర వ్యయ భారం తగ్గింది. ఆర్టిసి లాభాలు ఆర్జించడానికి ఆస్కారం ఏర్పడింది. ఈ విషయాన్ని తెలంగాణలోని ఆర్టిసి ఉద్యోగులు గమనిస్తున్నారు. కేసీఆర్ వైఖరిలో మార్పునకు కారణమిదే.. ఎపిలో విలీనం జరిగినప్పుడు తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదని వారు ప్రశ్నించుకుంటున్నారు. తెలంగాణలో ఎన్నికలు జరగనున్న తరుణంలో కెసిఆర్ వైఖరి మారిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆర్టిసి ఉద్యోగ కుటుంబాలలో సుమారు రెండున్నర లక్షల ఓట్లు ఉంటాయని అంచనా. వారిలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, దానిని పోగొట్టడానికి కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్లేషిస్తున్నారు. ఇది చివరివరకు జరుగుతుందా? లేదా? అన్న సంశయాన్ని కార్మికులు వ్యక్తం చేస్తున్నారట. అయితే మంత్రి కెటిఆర్ ఇప్పటికే ఆర్టిసి డిపోల వద్ద సంబరాలు జరపాలని పిలుపు ఇచ్చారు. (చదవండి: హైదరాబాద్లో పార్కింగ్ పరేషాన్! కేటీఆర్కు ట్వీట్.. ఇలా చేస్తే బెటర్!) దాచేస్తే దాగుతుందా? సహజంగానే ఈ వార్తకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఎపి ప్రభుత్వంపై ఈ మధ్య కొన్నిసార్లు కెసిఆర్ ఒకింత వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం, వాటిని తెలుగుదేశం మీడియా ఎపిలో కూడా పనికట్టుకుని ప్రచురించి జగన్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని యత్నించడం తెలిసిన సంగతే. ఇదే సమయంలో ఎపి ప్రభుత్వం చేసే మంచి పనులను మాత్రం ఎక్కడ కనిపించకూడా చూడాలన్నది ఈ మీడియా యత్నం. దాచేస్తే దాగదు నిజం అని నానుడి. అలాగే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎపిలో చేసిన కొన్ని కార్యక్రమాలను అమలు చేయడానికి ముందుకు వస్తోంది. అది తప్పేమి కాదు. దేశంలో ఏ రాష్ట్రంలో ఏ మంచి జరిగినా దానిని ఎవరైనా ఆచరించవచ్చు. ఎపిలో స్కూళ్లను బాగు చేసిన తీరును గమనించిన కెసిఆర్ ప్రభుత్వం కూడా అదే తరహాలో స్కీమును ప్రకటించి నిధులు కేటాయించింది. ఎపిలో గ్రామ సచివాలయ వ్యవస్థను పరిశీలించిన తమిళనాడు ప్రభుత్వం అక్కడ కూడా ఆ వ్యవస్థను చేపడుతోంది. ముందుగా 600 చోట్ల ఆ గ్రామ సచివాలయాల ఏర్పాటుకు పూనుకుంది. ఎపిలో ఉన్న వలంటీర్ల వ్యవస్థ దేశ వ్యాప్తంగా ప్రశంసలు పొందుతోంది. రైతు భరోసా కేంద్రాలను పరిశీలించిన పలువురు కేంద్ర మంత్రులు, కేంద్ర అధికార బృందాలు వాటి పనితీరును ప్రశంసిస్తున్నారు. కేరళ ప్రభుత్వ అధికారులు వచ్చి పరిశీలించి వెళ్లారు. ఆరోగ్య వసతులలో దేశంలోనే ఎపి ముందంజలో ఉందని ఆరోగ్య యాజమాన్య సమాచార వ్యవస్థ ప్రకటించింది. జనాభా ప్రాతిపదిక చూసుకుంటే ఈ స్థానం వచ్చింది. అంకెల వారీగా చూస్తే దక్షిణాదిలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఎపిలో 13,432 ప్రభుత్వ ఆరోగ్య వసతులు ఉన్నాయని ఆ సంస్థ తెలిపింది. అభివృద్ది రేటులో అగ్రభాగాన ఉన్న రాష్ట్రాలలో ఎపి కూడా ఉంది. (చదవండి: TSRTC: నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ప్రభుత్వంలో విలీనంతో ఊపిరి ) నెగిటివ్ భావాలే వెళ్లాలని ఉబలాటం అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఎపిలోని జగన్ ప్రభుత్వం వరసగా మూడో సంవత్సరం కూడా మొదటి ర్యాంకు సాధించింది. అయినా తెలుగుదేశం మీడియా ప్రభుత్వంపై విషపూరిత ప్రచారం చేస్తూ ప్రజలలోకి నెగిటివ్ భావాలే వెళ్లాలని విశ్వయత్నం చేస్తోంది. ఎపిలో పలు కొత్త వ్యవస్థలు, సరికొత్త నిర్ణయాలతో జగన్ ప్రభుత్వం ముందుకు వెళుతుంటే, కొంతమంది వాటిని జనం మర్చిపోయేలా చేయాలని కృషి చేస్తున్నారు. కొసమెరుపు ఏమిటంటే తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఎద్దేవ చేయడానికి ఎపిలో జరిగిన ఆర్టిసి విలీనం విషయాన్ని ఈ మీడియా వాడుకుందే తప్ప, ఎపిలో జరిగింది మంచి పని అని, ఆ క్రెడిట్ ముఖ్యమంత్రి జగన్ కు దక్కుతుందని కాని ఒక్క ముక్క రాయలేదు. కనీసం జగన్ పేరు ను కూడా ప్రస్తావించకుండా జాగ్రత్తపడ్డారు. దానికి కారణం ఆ మీడియా ఎపిలో జగన్ కు వ్యతిరేకంగా పనిచేస్తోంది. తెలుగుదేశం కు బాకా ఊదుతోంది. తెలంగాణలో కెసిఆర్ కు వ్యతిరేకం అయినా, కాకపోయినా, రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్న కాంగ్రెస్ పార్టీకి బాసటగా నిలబడాలన్న తపనతో ఉందని చెబుతారు. దానికి రీజన్ ఎవరికివారే ఊహించుకోవచ్చు. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
Telangana: వీఆర్ఏ వ్యవస్థ రద్దు
మానవీయ కోణంలో నిర్ణయం కాలానుగుణంగా కనుమరుగవుతున్న వృత్తుల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే.. ఈ క్రమంలోనే వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేస్తున్నాం.వీఆర్ఏలను రెవెన్యూ శాఖలోనే క్రమబద్ధీకరించి.. తర్వాత వివిధ శాఖల్లో సర్దుబాటు చేస్తాం. అట్టడుగు స్థాయి నుంచి త్యాగాలు, శ్రమతో సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తున్న వారిపట్ల మా ప్రభుత్వం మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకుంటుంది. – సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: నీరటి, మస్కూరు, లష్కర్ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలవబడుతూ భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలుగా పనిచేస్తున్న సిబ్బందిని రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరిస్తామన్నారు. తర్వాత మంత్రివర్గ ఉప సంఘం సిఫార్సుల మేరకు వీఆర్ఏలను అర్హతల ఆధారంగా పురపాలక, మిషన్ భగీరథ, నీటిపారుదల తదితర శాఖల్లో సర్దుబాటు చేస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారమే జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. వీఆర్ఏల క్రమబద్ధీకరణ అంశంపై ఆదివారం సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సీఎం కార్యాలయం ప్రకటించింది. వీఆర్ఏ వృత్తికి ప్రాధాన్యత తగ్గింది సమీక్ష సందర్భంగా.. సామాజిక పరిణామ క్రమంలో మార్పులకు అనుగుణంగా, ప్రజల అవసరాలను అనుసరించి పాలకులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కాలానుగుణంగా కనుమరుగవుతున్న వృత్తుల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని.. ఈ క్రమంలోనే వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేస్తున్నామని స్పష్టం చేశారు. ‘‘వ్యవసాయం అభివృద్ధి చెంది సాగునీటి విధానం అమల్లోకి వచ్చినకాలంలో గ్రామాల్లో నీటి వ్యవస్థను సక్రమంగా నిర్వహించడం, గ్రామ రెవెన్యూ, ఇతర విభాగాల అవసరాల కోసం ఏర్పాటైన గ్రామ సహాయకుల వ్యవస్థ తర్వాత వీఆర్ఏలుగా రూపాంతరం చెందింది. తరతరాలుగా సామాజిక సేవ చేస్తున్న వీఆర్ఏల త్యాగపూరిత సేవ గొప్పది. నేటి మారిన పరిస్థితుల్లో వీఆర్ఏ వృత్తికి ప్రాధాన్యత తగ్గింది. ఈ నేపథ్యంలో వారిని రెవెన్యూ శాఖలో క్రమబద్ధీకరించి ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకుంటున్నాం..’’ అని సీఎం కేసీఆర్ తెలిపారు. అట్టడుగు స్థాయి నుంచి త్యాగాలు, శ్రమతో సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తున్న వారిపట్ల తమ ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి, నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొన్నారు. పలుమార్లు ఎవరూ అడగకుండానే ఉద్యోగ వర్గాలకు జీతాలు పెంచి వారి సంక్షేమానికి పాటుపడ్డామని వివరించారు. విద్యార్హతల ఆధారంగా పోస్టులు రాష్ట్రంలో 20,555 మంది వీఆర్ఏలు పనిచేస్తున్నారని.. వారిలో నిరక్షరాస్యులతోపాటు ఏడో తరగతి, పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఆపై ఉన్నత చదువులు చదివినవారూ ఉన్నారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఈ క్రమంలో వారి విద్యార్హతను బట్టి ప్రభుత్వం ఉద్యోగ కేటగిరీలను నిర్ధారిస్తుందని.. నిబంధనలకు అనుగుణంగా ఆయా శాఖల్లో భర్తీ చేస్తామని తెలిపారు. ఉన్నత చదువులు చదివి ప్రమోషన్లకు అర్హులైన వారిని అందుకు అనుగుణమైన పోస్టుల్లో నియమిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను వెంటనే ఖరారు చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ను ఆదేశించారు. కారుణ్య నియామకాలు కూడా.. 61 ఏళ్ల వయసుపైబడిన వీఆర్ఏల వారసులకు కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీనితోపాటు 61 ఏళ్లలోపు వయసు ఉండి 2014 జూన్ 2న తర్వాత ఏదైనా కారణంతో మరణించిన వీఆర్ఏల వారసులకు కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. చనిపోయిన వీఆర్ఏల వారసులు, వారి విద్యార్హతల వివరాలను త్వరగా సేకరించాలని అధికారులకు, వీఆర్ఏల జేఏసీ నేతలకు సూచించారు. వారిని అర్హతలు, ప్రభుత్వ నిబంధనల మేరకు వివిధ శాఖల్లో సర్దుబాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సామాజిక వివక్ష నుంచి విముక్తినిచ్చారు: వీఆర్ఏ జేఏసీ మస్కూరు వంటి పేర్లతో తరతరాలుగా ఎదుర్కొన్న సామాజిక వివక్ష నుంచి విముక్తి కల్పించి ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించడం ద్వారా సీఎం కేసీఆర్ వీఆర్ఏల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని వీఆర్ఏ జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. తమకు పేస్కేల్ వర్తింపజేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. -
ఆ జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులకు 16 శాతం హెచ్ఆర్ఏ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన జిల్లాల కేంద్రాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి అద్దె భత్యాన్ని (హెచ్ఆర్ఏ) 16 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనాభా నిబంధనల మేరకు కొన్ని జిల్లా కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులకు 12 శాతమే ఇంటి అద్దె భత్యం వస్తోంది. అయితే ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు జనాభా నిబంధనలను ప్రభుత్వం సడలించింది. 12 శాతం ఇంటి అద్దె భత్యాన్ని 16 శాతానికి పెంచింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పెంపుదల వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం జనాభా నిబంధనల మేరకు కొత్త జిల్లాల కేంద్రాలైన పార్వతీపురం, పాడేరు, అమలాపురం, భీమవరం, బాపట్ల, నరసరావుపేట, పుట్టపర్తి, రాయచోటిల్లో పనిచేసే ఉద్యోగులకు 12 శాతం ఇంటి అద్దె భత్యాన్ని మంజూరు చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని 16 శాతానికి పెంచారు. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులకు ఒకేలా 16 శాతం ఇంటి అద్దె భత్యం అందుతుంది. పీఎస్టీయూ హర్షం రాష్ట్రంలో కొత్త జిల్లాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు 12 శాతం నుంచి 16 శాతానికి ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) పెంచడంపై ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (పీఎస్టీయూ) హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు పీఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు లెక్కల జమాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏసీవీ గురువారెడ్డి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం ఒక్కొక్కటిగా తమ డిమాండ్లను పరిష్కరిస్తుండడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. డీఏ బకాయిలు, ఆర్జిత సెలవులకు నగదు చెల్లింపు డిమాండ్లను కూడా వీలైనంత త్వరగా పరిష్కరించాలని వారు కోరారు. సీఎం జగన్కు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ కృతజ్ఞతలు తమ సంఘం అభ్యర్థన మేరకు రాష్ట్ర ప్రభుత్వం 16 శాతం హెచ్ఆర్ఏను పెంచడంపై ఏపీ ఎన్జీవో అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. హెచ్ఆర్ఏను పెంచిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కేవీ శివారెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అలాగే తమకు ఇచ్చిన హామీ ప్రకారం అందరి ఉద్యోగులతోపాటు పోలీసు సిబ్బందికి కూడా సరెండర్ లీవులను మే నెలాఖరున వారి ఖాతాల్లో జమ చేయాలని కోరారు. పీఆర్సీ, డీఏ ఎరియర్స్ను సెప్టెంబర్లోగా ఇవ్వాలని విన్నవించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని, సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
ఇండియా కూటమితో విభేదాలు.. వెనక్కి తగ్గిన దీదీ
నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తప్పక చదవండి
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement