-
స్మగ్లింగ్ వివాదంపై స్పందించిన 'జబర్దస్త్' హరి
'జబర్దస్త్' ప్రముఖ కమెడియన్.. ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు దొరికిపోయాడని తాజాగా న్యూస్ బయటకొచ్చింది. దీంతో అందరూ అవాక్కయ్యారు. ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తున్న ఓ హస్యనటుడు ఇలాంటి పనులు చేస్తున్నాడా అని మాట్లాడుకున్నారు. ఇంకొందరైతే తిట్టుకున్నారు. ఇప్పుడు వీటన్నంటికీ చెక్ పెట్టేందుకు డైరెక్ట్ గా సదరు కమెడియన్ స్పందించాడు. ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. (ఇదీ చదవండి: విశాల్పై కేసును కొట్టివేసిన కోర్టు) 'జబర్దస్త్'లో కమెడియన్ గా చేసిన హరిబాబు ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో కీలకపాత్రధారి. గత కొన్నేళ్ల నుంచి పరారీలో ఉన్న ఇతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాజాగా హరిబాబుపై మరో కేసు నమోదైంది. దీంతో మీడియాలో న్యూస్ వచ్చింది. అయితే ఇక్కడ చిన్న పొరపాటు జరగడంతో ఓ వ్యక్తికి బదులు మరోవ్యక్తి ఫొటోలతో వార్తలు రాసేశారు. ప్రస్తుతం ఇదే షోలో హరికృష్ణ అనే కమెడియన్ చేస్తున్నాడు. అతడి బదులు ఇతడి గురించి అందరూ రాశారు. దీంతో కమెడియన్ గంపా హరికృష్ణ ఇప్పుడు స్పందించాల్సి వచ్చింది. 'స్మగ్లింగ్ కేసులో ఉంది నేను కాదు. నాకు దీనితో ఎలాంటి సంబంధం లేదు. 2013లో షకలక శంకర్ టీమ్ లో హరిబాబు పనిచేశాడు. తర్వాత అతడు ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో దొరికిపోయాడు. అప్పటికే నేను ఫేమ్ లో ఉండటంతో గూగుల్ లో ఆ పేరు కొడితే నా ఫొటోలు వచ్చాయి. నా ఫొటో పెట్టి వార్తలు రాసేశారు. నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు' అని 'జబర్దస్త్' హరికృష్ణ అన్నాడు. ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ ఈ విషయాలన్నీ బయటపెట్టాడు. (ఇదీ చదవండి: టాంగో ఇక లేదు.. సాయి తేజ్ ఎమోషనల్ పోస్ట్) -
టీడీపీ స్పెషల్ ఫ్లైట్లో బీజేపీ ఎంపీ
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ-టీడీపీ రహస్య కాపురం గుట్టు రట్టైంది. పబ్లిగ్గా దుమ్మెత్తి పోసుకుంటూ.. ప్రైవేట్గా కొనసాగిస్తున్న ప్రేమాయాణాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా బయట పెట్టారు. ధర్మపోరాట దీక్ష కోసం ఢిల్లీకి టీడీపీ నేతలు ఎక్కిన ప్రత్యేక విమానంలో బీజేపీ ఎంపీ హరిబాబు ప్రత్యక్షమయ్యారు. ఈ ఫొటోలను విజయసాయిరెడ్డి షేర్ చేస్తూ బీజేపీ-టీడీపీ అక్రమ సంబంధానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆయన ట్విటర్ వేదికగా చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ తీరును ఎండగట్టారు. బాబు.. ప్రజలు గమనిస్తున్నారు ధర్మ పోరాట దీక్షల పేరుతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న చంద్రబాబు నాయుడిని ప్రజలు గమనిస్తున్నారని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. ధర్మపోరాట దీక్షలతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న చంద్రబాబు రూ. 200 కోట్ల ప్రజాధనాన్ని తిరిగి చెల్లించక తప్పదన్నారు. ఎవరి సొమ్మని పచ్చ కుల మీడియాకు వేల కోట్లు దోచి పెడుతున్నారని మండిపడ్డారు. సొంత పనులకు హెలికాప్టర్, విమాన ప్రయాణాలు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు కన్నం పెట్టడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని హెచ్చిరించారు. మరో ట్వీట్లో లోకేష్ బాబుకి ఇండిపెండెన్స్ డేకు రిపబ్లిక్ డేకు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి కట్టబెట్టినా చంద్రబాబుకూ చిట్టి నాయుడిపై ఏమాత్రం నమ్మకం లేదన్నారు. అందుకే తెలంగాణా ఎన్నికల్లో సరిహద్దు దాటకుండా గీత గీశాడని గుర్తు చేశారు. కానీ దోచుకోవడంలో మాత్రం లోకేష్ తండ్రి శిక్షణలో రాటు తేలాడని, ఇందులో A గ్రేడ్ ఇవ్వక తప్పదని అభిప్రాయపడ్డాడు. -
ఆంధ్రప్రదేశ్కు నిజమైన దోషులెవరో తేలిపోయింది
-
నిజమైన దోషులెవరో తేలిపోయింది
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్కు నిజమైన దోషులెవరో తేలిపోయిందని కేంద్ర మాజీమంత్రి, బీజేపీ నేత పురందేశ్వరి అన్నారు. అవిశ్వాస చర్చ సందర్భంగా పార్లమెంట్లో జరిగిన పరిణామాలపై శనివారం ఆమె స్పందించారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా దివంగత నేత ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే.. ఆ కాంగ్రెస్ మద్దతుతోనే అవిశ్వాసం పెట్టి పార్లమెంట్లో తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్నిటీడీపీ నాయకులు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. పార్లమెంట్లో రాహుల్ ఏపీ ప్రస్తావనే తీసుకురాలేదన్నారు. ఏపీకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం కాంగ్రెస్సేనన్నారు. అశాస్త్రీయంగా జరిగిన విభజనలో సీఎం చంద్రబాబుకు భాగం ఉందని ఆరోపించారు. ఏపీకి ఏమడిగినా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్లు ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా చెప్పారని గుర్తు చేశారు. నిన్న పార్లమెంట్లో బీజేపీపై టీడీపీ అబద్ధాలు చెప్పిందన్నారు. దుగరాజుపట్నం ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని, కడప స్టీల్ ప్లాంట్ జాప్యం చంద్రబాబు వల్ల కాదా అని ఆమె ప్రశ్నించారు. విశాఖ రైల్వే జోన్ కచ్చితంగా ఇస్తామని, అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయడలేందని, రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. చంద్రబాబు అబద్ధాలను ఏపీ ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని పేర్కొన్నారు. రాజ్నాథ్ వ్యాఖ్యలు వ్యక్తిగతం: హరిబాబు పార్లమెంట్లో చంద్రబాబుపై రాజ్నాథ్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని విశాఖ పట్నం ఎంపీ హరిబాబు అన్నారు. ఏపీకి కేంద్రం ఏం చేయలేదనేది ప్రచారమేనని, తప్పకుండా రైల్వే జోన్ వస్తుందన్నారు. దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు స్థలం చూపించమని ప్రభుత్వాన్ని కోరామన్నారు. స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుకు అధికారికంగా లేఖలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దొంగల పార్టీ... టీడీపీ దొంగల దౌర్జన్య కారుల పార్టీగా మారిందని బీజేపీ అధికార ప్రతినిథి సుదీశ్ రాంబోట్ల మండిపడ్డారు. గతంలో ప్యాకేజీ ఒప్పుకున్న చంద్రబాబు ఎన్నికల కోసం యూటర్న్ తీసుకున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిందని, మళ్లీ గెలిచే పరిస్థితి లేకపోవడంతో ఆయన తప్పులు తమ మీద నెట్టి కాంగ్రెస్తో కలిసి గెలుస్తామనే భ్రమలో ఉన్నారని తెలిపారు. -
కమెడియన్ హరిబాబు అరెస్టు
సాక్షి, తిరుపతి : బుల్లితెర కమెడియన్, ఎర్రచందనం స్మగ్లర్ హరిబాబును తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. గత ఆరు సంవత్సరాలుగా ఎర్రచందనం అక్రమంగా అక్రమంగా తరలిస్తూ కోట్ల రూపాయలు సంపాదించాడు. గత కొద్ది రోజులుగా అతని కోసం టాస్క్ పోర్స్ పోలీసులు గాలిస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు బతుకు దెరువు కోసం టీవీ సీరియల్స్లో చిన్న చిన్న పాత్రలు వేసే క్యారెక్టర్ ఆర్టిస్. తిరుపతిలో ఓ సాధారణ ఉద్యోగిగా ఉండిన హరిబాబు ఎర్రచందన స్మగ్లింగ్తో కోట్లకు పడగలెత్తాడు. అతను అక్రమంగా సంపాదించిన సొమ్ముతో సినిమాలకు ఫైనాన్స్ చేస్తున్నాడని సమాచారం. ఇటీవలే ఓ కమెడియన్ సినిమాకు సైతం హరిబాబే పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. తిరుపతిలో టాస్క్ఫోర్స్ సీఐ మధుబాబు నేతృత్వంలో మంగళవారం హరిబాబును అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. సంవత్సరాలుగా తప్పించుకు తిరుగుతున్న స్మగ్లర్ హరిబాబుపై 10 పోలీస్ స్టేషన్లలో 13 కేసులకు పైగా నమోదయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- తాతా.. నీకు టాటా..
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement