-
నిజంగానే మైదాపిండి మంచిదికాదా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..!
పరోటాలు దగ్గర నుంచి పిజ్జా, బర్గర్, కేక్స్, గులాబ్ జామున్, జిలేబీ వంటి పలు రకాల స్వీట్లను మైదాతోనే తయారు చేస్తారు. ఆఖరికి సాయంత్రం వేళ్ల టీ తాగుతూ తినే బిస్కెట్లు, సమోసాల్లో కూడా మైదా ఉంటుంది. రోగులకు ఇచ్చే బ్రెడ్లలో కూడా మైదా ఉంటుంది. అంటే మన నిత్య జీవితంలో ఏదో రకంగా తెలియకుండానే మైదాను తీసుకుంటున్నాం. అలాంటిది మరీ మైదా మంచిదికాదని చాలామంది చెబుతున్నారు. ఇది ఎంత వరకు నిజం? వైద్యులు ఏమంటున్నారు ? ఎవరెవరు తినకూడదు అంటే.. మైదాని ఎలా తయారు చేస్తారంటే.. బియ్యంలో మూడు దశలు ఉంటాయి. ఊక, బ్రాన్, బియ్యం. ఊకను తొలగించాక పైపొర (బ్రాన్)తో ఉండే బియ్యాన్ని బ్రౌన్ రైస్ అని పిలుస్తారు. ఈ పైపొరను కూడా తొలిగిస్తే పాలిష్డ్ రైస్ అని అంటారు. అలాగే గోదుమల విషయానికొస్తే పైపొట్టు (ఊక), పైపొర(బ్రాన్)తో కూడిన గోదుమ, పాలిష్డ్ గోదుమ అనే మూడు దశలు ఉంటాయి. ఊకను తొలగించి బ్రాన్తో కూడిన ధాన్యాన్ని గోదుమలుగా పిలుస్తారు. గోదుమ నుంచి బ్రాన్ను కూడా తీసేసి బాగా మెత్తగా పిండిలా చేస్తే దాన్నే మైదా అని అంటారు. విదేశాల్లో దీన్నే ఆల్ పర్పస్ ఫ్లోర్ అని పిలుస్తారనిని న్యూట్రీషియన్లు వివరించారు. గోధమ రవ్వకు, మైదాకు తేడా ఏంటంటే.. బ్రాన్ను తొలగించిన గోదుమ నుంచే రవ్వ తయారవుతుంది. కాకపోతే మైదాలా దీన్ని బాగా మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేస్తారు. కాబట్టి, ఈ రెండింటికీ పెద్ద తేడా లేదు. రెండూ పైపొర తీసేసిన గోదుమ నుంచే తయారవుతాయి. అందువల్ల మైదాను ఎక్కువగా తినడం కచ్చితంగా ఆరోగ్యానికి మంచిది కాదు. అలా అని చెప్పి మైదా విషయంలో అతిగా భయపడాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు. తెలుపు రంగుకి కారణం.. మైదాకు తెలుపు రంగు రావడం కోసం బ్లీచ్ను వాడతారు. బ్లీచ్ చుట్టూ చాలా వివాదాలు ఉన్నాయి. బ్లీచ్ అనేది ఆక్సీకరణ (ఆక్సిడేషన్) ప్రక్రియ. ఈ ప్రక్రియ గురించి మనం స్కూల్లోనే నేర్చుకున్నాం. ఈ ప్రక్రియ ద్వారా గోదుమల నుంచి బ్రౌన్ రంగును తొలగించవచ్చు. బ్లీచ్ ప్రక్రియలో బ్లీచింగ్ ఏజెంట్లుగా క్లోరిన్, బెంజాయిల్ పెరాక్సైడ్ వంటి రసాయనాలను వాడతారు. ఈ రసాయనాలను ఎంత మోతాదులో వాడాలనే అంశంపై కొన్ని పరిమితులు ఉన్నాయి. సరైన పరిమాణంలో ఈ రసాయనాలను వాడాలి. బ్లీచింగ్ ప్రక్రియ అంతా పూర్తిచేసుకొని వినియోగానికి అందుబాటులోకి వచ్చిన మైదాలో ఎలాంటి రసాయనాలు ఉండవని ఆహార నిపుణులు చెబుతున్నారు మైదా వల్ల షుగర్ వస్తుందా.. మైదాను బ్లీచింగ్ చేసినప్పుడు, అలోక్సాన్ అనే రసాయనం కలుస్తుంది. ఈ రసాయనం వల్ల డయాబెటిస్ వస్తుందని చెబుతారు. నిజానికి అలోక్సాన్ విషయానికొస్తే, మైదా బ్లీచింగ్ ప్రక్రియలో అదనంగా దీన్ని కలపరు. ఆక్సీకరణ ప్రక్రియలో భాగంగా బై ప్రోడక్ట్గా అలోక్సాన్ ఉత్పత్తి అవుతుంది. మైదాలో చాలా స్వల్ప పరిమాణంలో అలోక్సాన్ ఉంటుంది. పరిశోధనల్లో భాగంగా ఎలుకల్లో ఈ అలోక్సాన్ రసాయనాన్ని వాడి కృత్రిమంగా మధుమేహాన్ని ప్రేరేపిస్తారు. దీని కారణంగా మనకు కూడా షుగర్ వస్తుందేమో అని భయపడతారు. కానీ, అధ్యయనాల్లో వాడే అలోక్సాన్, మైదాలో ఉండే అలోక్సాన్ కంటే 25 వేల రెట్లు శక్తిమంతమైనదని గ్రహించాలి. అందువల్ల ఈ రెండింటిని పోల్చకూడదు. మైదాలో ఏముంటాయంటే.. ‘గోదుమ నుంచి తయారు చేసిన మైదాలో పిండిపదార్థం అధికంగా ఉంటుంది. ఉదాహరణకు, 100 గ్రాముల మైదాలో 351 కేలరీలు ఉంటాయి. 10.3 గ్రాముల ప్రొటీన్, 0.7 గ్రాముల కొవ్వు, 2.76 గ్రాముల ఫైబర్, 74.27 గ్రాముల స్టార్చ్ ఉంటుందని చెబుతున్నారు న్యూటిషియన్లు. (చదవండి: అరవింద్ కేజ్రీవాల్ మామిడి పండ్ల డైట్..షుగర్ పేషెంట్లకు మంచిదేనా..?) -
ఓమాడ్ డైట్ అంటే ఏంటీ? ఆరోగ్యానికి మంచిదేనా..?
ఇటీవల కాలంలో ఎన్నో డైట్లు చేసి ఉంటారు. మంచి ఫలితాలు పొందేందుకు అవన్నీ కాస్త టైం తీసుకుంటాయి. అయితే ఈ డైట్ మాత్రం సత్వర ఫలితాలు ఇవ్వడమే గాక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా బరువు తగ్గడమే గాక మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని అంటున్నారు. ఇంతకీ ఏంటీ ఓమాడ్ డైట్? చెయొచ్చా అంటే.. ఓమాడ్ అంటే.. 'వన్ మీల్ ఏ డే'ని ఓమాడ్ అంటారు. అంటే..ఒక్కపూట భోజనం చేసి మిగతా సమయం అంతా తినడానికి బ్రేక్ ఇవ్వడం అన్నమాట. దీని వల్ల ఈజీగా శరీరంలోని కేలరీలు బర్న్ అవుతాయంటున్నారు. చాలా గంటల సేపు తినడానికి విరామం ఇచ్చేస్తాం కాబట్టి శరీరంలోని కొవ్వులు కరుగుతాయని చెబుతున్నారు. ఇంతలా గ్యాప్ ఇవ్వడం వల్ల జీవక్రియ కూడా మెరుగుపడుతుందంటున్నారు. ఇక్కడ ఈ డైట్లో వ్యక్తి రోజువారీగా ఒక్కసాగే నిండుగా భోంచేస్తాడు. ఆ ఆహరం ఒకటి నుంచి రెండు గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత నుంచి దాదాపు 20 నుంచి 23 గంటలు విరామం ఇస్తారు. మొదట్లో మాత్రం వ్యక్తులకు కేవలం 16 గంటలే విరామం ఇవ్వగా రానురాను ఎక్కువ గంటలు పెంచడం జరుగుతుంది. దీన్ని అడపదడపా ఉపవాసం అనికూడా పిలుస్తారు. ఈ డైట్ ఆర్యో శ్రేయస్సును పెంచి ఎటువంటి అనారోగ్య సమస్యల బారినపడకుండా కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రయోజనాలు.. ఈ డైట్ వల్ల ఈజీగా బరువు తగ్గుతారు, పైగా ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుందని పరిశోధనలో తేలింది. జీవక్రియ మెరుగుపడుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది సెల్యూరలార్ ప్రక్రియలను సక్రియం చేస్తుంది. జీర్ణవ్యవస్థకు సుదీర్ఘ విరామం కారణంగా ప్రేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఉబ్బరం, అజీర్ణం, వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు ఎదురయ్యే సమస్యలు.. ఇక్కడే ఒకేసారి ఆహారం స్వీకరిస్తాం కాబట్టి..అన్ని క్యాలరీలు ఉండే ఆహారానని తీసుకోవాల్సి ఉంటుంది. పోషకాలతో కూడిన ఆహార తీసుకోవడం అత్యంత ముఖ్యం. ఎందుకంటే సుదీర్ఘ విరామాన్ని తట్టుకునేలా మంచి ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కొంతమంది దీనీని సరిగా తీసుకోలేకపోవచ్చు. లేదా ఒకేసారి ఇలా తీసుకోవడంలో సమస్యలు ఎదుర్కొనవచ్చు. వ్యక్తిగత ఆరోగ్య సమస్యలను కూడా పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి తగ్గట్టు జీవనశైలి ఉండాలి అప్పుడే ఈ డైట్ మంచి ఫలితాలనిస్తుంది. గమనిక: ఇది ఆరోగ్యంపై అవగాహన కోసమే ఇవ్వడం జరిగింది. అనుసరించే ముందు మీ వ్యక్తిగత నిపుణుడు లేదా వైద్యులను సలహాలు, సూచనలతో పాటించటం ఉత్తమం. (చదవండి: చెరుకురసం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా? కానీ వీళ్లు మాత్రం..) -
సుదీర్ఘమైన ఆరోగ్యకర జీవితానికి త్రీ సీక్రెట్స్ ఇవే!
చాలా మంది వృద్ధులు సుదీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించిన పలు ఘటనలను చూశాం. వాళ్లు అంతకాలం ఎలా జీవించారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించి మరీ అంతకాలం ఎలా జీవించారని కూడా అనుకుంటాం. అందకు రహస్యలివే అంటూ.. ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా ఓ వీడియోని షేర్ చేశారు. ఆయన ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గ్ ఉంటూ మంచి మంచి వీడియోలను నెటిజన్లతో పంచుకుంటుంటారు. అలానే ఈసారి ఆరోగ్యగానికి సంబంధించిన వీడియోని షేర్ చేశారు. ఆ వీడియోలో ఓ డాక్టర్ సుదీర్ఘమైన ఆరోగ్యకర జీవిత రహాస్యలను వెల్లడించారు. ఆ వీడియోలో డాక్టర్ నిషిత్ చోక్సీ అనే వ్యక్తి 90 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు గల రోగులతో సంభాషణ ద్వారా తాను తెలుసుకున్న విషయాలను గురించి చెప్పుకొచ్చారు. దాదాపు తన పేషంట్లలో చాలామంది సుదీర్ఘమైన ఆరోగ్యకర జీవితానికి సంతోషం, సంతృప్తి ప్రాముఖ్యతల గురించి నొక్కి చెప్పినట్లు తెలిపారు. వాళ్లందరూ చెప్పిన మరో కామన్ పాయింట్ వ్యాయామం అని అన్నారు. చక్కటి వ్యాయామం దీర్ఘాయువుని నిర్ణయిస్తుందని వారంతా చెప్పినట్లు తెలిపారు. తన పేషంట్లలో కొంతమంది వృద్ధులు కర్ర లేకుండా నడవగలరని, కొందరూ అసలు కళ్లద్దాలు ఉపయోగించకుండా పుస్తకాలు, పేపర్లు చదవగలరని చెప్పుకొచ్చారు. వారిలో చాలామంది తమ పనులను వారే స్వయంగా చేసుకుంటారు. అంతేగాదు చాలామంది మోతాదుకు మించి తిని ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటారని అన్నారు. ఓ వయసు వచ్చాక మితంగా తినాలని, అలాగే ఎక్కువ ఒత్తిడిగా ఉన్న సమయంలో మనం తీసుకునే ఆహారంలో తేడాలు ఉంటాయని కూడా చెప్పారన్నారు. "ఎందుకంటే.. ఒత్తిడిగా ఉంటే కొందరు తినరు, మరికొందరూ అతిగా తింటారు. ఇవి రెండూ కూడా ప్రమాదమే. పిడుగు వచ్చి మీద పడిపోయేంత సమస్య అయినా.. తాపీగా జరేది జరగక మానదు..నా చేతిలో ఏమిలేదు అనేది సత్యాన్ని గట్టిగా విశ్వసించాలి. అప్పుడూ ఎంతటి ఒత్తడి అయినా తట్టుకుంటారు, నిదానంగా తినేందుకు యత్నిస్తారు. అప్పుడు రక్తపోటు పెరగదు. కాబట్టి జీవితంలో సంతోషం, సంతృప్తికి ప్రాధాన్యత ఇస్తూ వీలైనంతలో వ్యాయామం చేయండి చాలు. ఈ మూడే సుదీర్ఘ కాలం ఆరోగ్యంగా జీవించడానికి కీలకమైనవని డాక్టర్ నిషిత్ అన్నారు. అందుకు సంబంధించిన వీడియోకి "సుదీర్ఘ జీవితానికి రహస్యాలు" అనే క్యాప్షన్ని జోడించి మరీ పోస్ట్ చేశారు హర్ష గోయెంకా. ఈ వీడియోని చూసిన నెటిజన్లు..ఆ వైద్యుడు చెప్పిన వాటితో ఏకీభవిస్తూ ఆరోగ్యమే అసలైన సంపద అంటూ పోస్టులు పెట్టారు. అలాగే మెదడు షార్ప్గా ఉండేలా పజిల్స్ లేదా కొత్త భాషను నేర్చుకునే ప్రయత్నాలు చేస్తుంటే కూడా ఆరోగ్యంగా ఉంటామని పోస్టుల్లో పేర్కొన్నారు. Simple secrets to long life… pic.twitter.com/nuVzuGGR2C — Harsh Goenka (@hvgoenka) March 27, 2024 (చదవండి: అందం కోసం పాము రక్తమా? ఎక్కడో తెలుసా!) -
వేగంగా బరువు తగ్గేందుకు సింపుల్ చిట్కాలివిగో!
బరువు తగ్గడం అనుకున్నంత ఈజీ కాదు. దీనికి తగ్గ ఆహార నియమాలు, కమిట్మెంట్ చాలా అవసరం. ఎలా పడితే అలా డైటింగ్ చేయడం కాకుండా బాడీ తీరును అర్థం చేసుకుని, నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. బరువు తగ్గించే ప్రణాళికలకు సరైన ఆహార విధానం, జీవనశైలి పాటించడం ముఖ్యమని గుర్తుంచుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం, జాగ్రత్తగా తినడం అవసరం. అయితే ఈ లక్ష్యాన్ని స్థిరమైన, ఆరోగ్యకరమైన పద్ధతిలో చేరుకోవడం అత్యవసరం. మీబాడీ మాస్ ఇండెక్స్ ఎంత ఉన్నదీ లెక్కించుకొని, దానిని బట్ట ప్రణాళిక వేసుకోవాలి. నో జంక్ ఫుడ్, నో సుగర్ పోషకాహారం, సమతుల్య ఆహారం తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రాసెస్డ్ఫుడ్ సుగర్ పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. తక్కువ కేలరీలు ఎక్కువ శక్తినిచ్చే పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలను తీసుకోవాలి. తొందరగా బరువు తగ్గాలంటే కాఫీ, టీలు పూర్తిగా మానేయ్యాలి. దీని బదులు, గ్రీన్ టీ, హెర్బల్ టీ తీసుకోవాలి. రాత్రి 7 గంటల తరువాత భోజనం వద్దు రాత్రి 7 గంటలకే భోజనం చేయాలి. ఒక పూట భోజనంలోపూర్తిగా ఉడికించిన కూరగాయలు తీసుకుంటే ఇంకా మంచి ఫలితం . కంప్యూటర్, టీవీ ముందు కూర్చుని చిరు తిండ్లు (చిప్స్ కానీ, ఇంట్లో చేసుకున్నవైనా) మన తిండి మర ఆడుతూనే ఉంటుందనేది గుర్తు పెట్టుకోండి. వ్యాయామం బరువు ఎంత తొందరగా అంత వ్యవధిని వ్యాయామాన్ని పెంచాలి. యోగా, నడక, ఏరోబిక్, సైక్లింగ్ వంటివి ఎక్కువ కేలరీలు ఖర్చయ్యేలా చూసుకోవాలి. పుష్కలంగా నీరు తాగాలి బరువు తగ్గే ప్రక్రియలో నీరు చాలా కీలక పాత్ర. రోజంతా బాగా హైడ్రేటెడ్గా ఉండటంతోపాటు, పరగడుపున,రాత్రి నిద్రపోయేముందు నీరు తాగాలి. ఇది జీర్ణక్రియకు, చర్మానికి మంచిది. నిద్ర తప్పనిసరి మీరు తగినంత మంచి నిద్ర పోవాలి. నిద్ర లేకపోవడం హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. ప్రతి రాత్రి 7 నుండి 9 గంటల నిద్రను లక్ష్యంగా పెట్టుకోవాలి. Exercises with weights to lose weight fast: pic.twitter.com/Bm2RcZxUru — Health & Fitness (@FitnessF0rWomen) March 26, 2024 -
మనతో పాటు గోళ్ళు ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే..
మన జీవితంలో.. ఎన్నోవాటిపై మనం ముఖ్యతను చూపుతాం. మరెన్నో వాటిపై లీనమైపోతూ ఉంటాం. ఒక్కసారైనా ఆరోగ్యాన్ని పట్టించుకుంటామా..! మరెందుకు దీనిపై అశ్రద్ధ. అలాగే మన శరీరంలోని చేతిగోళ్ల గురించి మీరెప్పుడైనా ఆలోచించారా..? వాటి అందం, రంగు గురించి ఎప్పుడైనా చూడడంగానీ, గమనించడంగానీ చేశారా..! ఓసారి వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే మీకు ఈ నిజాలు తెలుస్తాయి. మరి వాటి గురించి తెలుసుకుందాం..! ఈ విధంగా.. గోళ్లు అందంగా ఉండాలంటే దేహం ఆరోగ్యంగా ఉండాలి. గోళ్లలో చీలికలు, పొడిబారిపోవడం కనిపిస్తే విటమిన్ లోపం ఉన్నట్లు అర్థం.. తెల్ల చుక్కలు కనిపిస్తే ఎప్పుడూ నెయిల్ పాలిష్ వేస్తుంటారని లేదా మీకు గోళ్లు కొరికే అలవాటుందని అర్థం చేసుకోవాలి. అడ్డంగా గీతలు, గాడి ఏర్పడినట్లు ఉంటే విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు, తీవ్రమైన జ్వరం బారిన పడినట్లు అర్థం. ఉబ్బెత్తుగా ఉండాల్సిన గోరు గుంట పడినట్లు పలుచగా మారితే అది ఐరన్లోపానికి గుర్తు. సమతుల ఆహారం తీసుకుంటూ, దేహం డీ హైడ్రేషన్కు గురి కాకుండా తగినంత నీటిని తీసుకుంటూ ఉండాలి. దాంతోపాటు కొన్ని చుక్కల ఆల్మండ్ ఆయిల్/ ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరినూనె వేసి వలయాకారంలో రుద్దుతూ ఉండాలి. అప్పుడు గోరు గులాబీరంగులో ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది. ఇవి చదవండి: కుండలినీ యోగాతో అల్జీమర్స్కు చెక్: తాజా పరిశోధన -
నటి మలైకా అరోరా ఇష్టపడే బ్రేక్ఫాస్ట్లు ఇవే..!
బాలీవుడ్ నటి మలైకా అరోరా ఐదు పదుల వయసు దాటినా యువ హిరోయిన్లకు దీటుగా అందంగా ఉంటుంది. ఇప్పటికి వయసు 20 అనేలా ఉంటుంది. ఎప్పటికప్పుడూ సరిక్తొత ఫ్యాషన్ డ్రెస్లతో తన స్టన్నింగ్ లుక్తో మిస్మరైజ్ చేస్తూనే ఉంటుంది. ఇంత వయసొచ్చిన ఎక్కడ వృధాప్య ఛాయలు కనపడను కూడా కనపడవు. ఈ ముద్దుగమ్మ ఇంతలా గ్లామర్ మెయింటైన్ చేసేందుకు ఎలాంటి తాను ఎలాంటి డైట్ ఫాలో అవుతుందో షేర్ చేసింది. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్లు ఇలాంటివి తీసుకుంటే ఆరోగ్యం తోపాటు అందం మీ సొంతం అని చెబతోంది. ఇంతకీ ఆమె ఇష్టంగా తీసుకునే బ్రేక్ఫాస్లు ఏంటంటే..అవకాడోతో చేసిన బ్రేక్ ఫాస్ట్లు తీసుకుంటుంది. ఆ అవకాడోతో నిమిషాల వ్యవధిలా ఎలా బ్రేక్ఫాస్ట్లు చేసుకోవచ్చో కూడా సవివరంగా తెలిపింది. అవేంటంటే.. క్లాసిక్ అవోకాడో టోస్ట్ : ఇది కేవల పది నిమిషాల్లో రెడీ అయిపోతుందట. కావల్సిందల్లా కేవలం అవకాడో, బ్రెడ్, ఆలివ్ ఆయిల్, మసాల ఉంటే చాలు. చక్కడగా బ్రేడ్ని వేయించి అవకాడో చిన్నచిన్న ముక్కలుగా కోసి పెట్టి దానిపై మసాల వేసి తింటే టేస్ట్ అదుర్స్ అని అంటోంది. చాలా ఈజీ రెసీపీ, త్వరితగతిన చేసుకోవచ్చు అని చెబుతోంది మలైకా అరోరా అవోకాడో ఫెటా చీజ్ టోస్ట్ దీనికి అవకాడో ముక్కలు, పుల్లని పిండి, ఫెటా చీజ్, వేయించిన గుడ్లు ఉంటే చాలు. కేఫ్ స్టైల్ అవకాడో టోస్ట్ సిద్దమయ్యిపోతుంది. అవోకాడో చియా టోస్ట్ అత్యంత పోషకమైన వంటకాల్లో ఇది ఒకటి. జస్ట్ పదినిమిషాల్లో చేసుకోవచ్చు. నిమిషాల్లో తయారయ్యే వంటకం. కేవలం అవకాడో చియా గింజలు ఉంటే చాలు. రెసిపీ రెడీ అయ్యిపోతుంది. తురిమిన గుడ్డు అవోకాడో టోస్ట్ ఇక్కడ అవకాడో తురుము, గుడ్లు తురుముతో చేసే రెసిపీ. ఇది మంచి రుచికరమైన బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. వీట్ ఆవకాడో టోస్ట్ గోధుమ పిండి, అవకాడోలతో చేసే వంటకం. అయితే ఇది చేయడానకి 20 నిమిషాల సమయం పడుతుంది. ఇది కూడా మంచి ఆరోగ్య కరమైన అల్పాహారం అని చెబుతోంది. మలైకా. అంతేగాదు మన రోజువారీ డైట్లో బలవర్ధకమైన ఆహారం ఉంటే ఆరోగ్యవంతంగా ఉండటమే గాక మంచి గ్లామర్ని కూడా పొందగలుగుతామని చెబుతోంది మలైకా అరోరా. (చదవండి: ఇంట్లోనే ఈజీగా నేచురల్ హెయిర్ డై చేసుకోండిలా..!) -
'ర్యాట్ బ్రేక్ ఫాస్ట్'! ఈ పద్ధతిలో తింటే.. ఈజీగా బరువు తగ్గొచ్చు!
డైట్ చేసి బరువు తగ్గాలి అంటే నోటిని చాలా కంట్రోల్ చేయాలి. నచ్చిన వాటిని తినకుండా చాలా కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో డైట్ చేద్దాం అనుకునేవాళ్లు మధ్యలోనే బాబోయ్! నావల్ల కాదంటూ వదిలేస్తారు. దీంతో బరువు తగ్గలేక, నోటిని కంట్రోల్ చేయలేక చాలా మంది నానాపాట్లు పడుతుంటారు. అలాంటి వారికి 'ర్యాట్ బ్రేక్ ఫాస్ట్'(ఎలుక అల్పహారం) చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏంటీ ఎలుక అల్పహారమా? అని సందేహించకండి. అది అన్నింటిని కాంబేనేటడ్గా తింటుంది. దానికి దొరికిన వాటిని కొంచెం కొంచెంగా తినేస్తుంది. అది ఇది అని ఉండదు అన్నింటిని కలగపులగంగా తినేస్తుంది. అలా ఎలుక చిరుతిండిని ఫాలో అయితే అన్నింటిని తిన్న ఫీలింగ్ ఉంటుంది. పైగా బరువు కూడా ఈజీగా తగ్గొచ్చు అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం ఈ బ్రేక్ఫాస్ట్ గురించి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదేంటో చూద్దామా! చాలామందికి చిరుతిండ్లు తినడం అలవాటు. అంతెందుకు భోజనం చేయగానే నోట్లో కాస్త స్వీటు లేదా పండో నోట్లో పడాల్సిందే. కొందరూ అదే పనిగా తింటూనే ఉంటారు. అలాంటి వారికి ఈ ఎలుక అల్పహార విధాన మంచిం ఎంపిక. దీని వల్ల ఎక్కువ తినరు. పైగా అన్నింటిని తిన్నా.. ఫీల్ వస్తుంది. ఏంటీ ర్యాక్ బ్రేక్ ఫాస్ట్ అంటే..వివిధ పదార్థాల కలయిక. అంటే.. కొన్ని రకాల చిరుతిండ్లను కాంబినేటడ్గా అల్పహారంలా తింటే ఎక్కువ తిన్న ఫీల్ వస్తుంది. ఇలా ఎలుకలు తినేటప్పుగూ గమినిస్తే తెలుస్తుంది. అది తనకు కావాల్సిన తిండిగింజలను అన్నింటిని తెచ్చుకుంటుంది. అన్నింటిని మిక్స్డ్గా తింటుంది. అలా మనం కూడా తీసుకుంటే ఆహారం వృధా అవ్వదూ పైగా అన్ని తినగలుగుతాం. దీన్ని బ్రిటీష్ సూపర్ మార్కెట్ దిగ్గజం వెయిట్రోస్ తన వార్షిక ఆహార పానీయాల నివేదికలో ఈ ట్రెండ్ను హైలైట్ చేసింది. ఇది అసాధారణమైన స్నాక్ కాంబినేషన్. ఆకలిని అణుచుకోలేక వెంట వెంటనే పెద్దగా భోజనాన్ని తినేయకుండా కాస్త కడుపుకి తగ్గించి తినే విధానమే ఇది. దీని వల్ల కలిగే ప్రయోజనాలు, సమస్యలు బేరీజు వేసుకుని సరైన విధంగా ఫాలో అవ్వాలి. అవేంటంటే.. కఠినమైన భోజనం నుంచి విముక్తి: ర్యాట్ బ్రేక్ ఫాస్ట్ పాటించడం వల్ల ఇలాగే తినాలనే మన సాధారణ భోజన షెడ్యూల్ని కాస్త మారుస్తుంది. ఆకలిని బట్టి తినే విధంగా, ప్రాధాన్యతల ఆధారంగా తినడానికి అనుమతిస్తుంది. బిజీ షెడ్యూల్లు ఉన్నవారికి ఇది ఆకర్షణీయంగా ఉంటుంది. తినాలనే క్యూరియాసిటీ : ట్రెండ్కు తగినట్టుగా భోజన వేళలను, అలవాట్లను మార్చుకుని చిన్న భోజనాలతో రోజును పూర్తి చేయడం దీని ప్రధాన ఉద్దేశ్యం. అయితే ర్యాట్ బ్రేక్ పాస్ట్ అలవాటు చేసుకుంటే మాత్రం చిన్న చిన్న అల్పాహారాలతోనే కడుపు నింపేసుకుంటాం. బెటర్గా తినడం: మిగిలిపోయిన పదార్థాలను తినడం, కనిపించిన ప్రతి వస్తువునూ కొనేయడం వంటి అలవాట్లను, ఆహార వ్యర్థాలను తినే అవాటును తగ్గిస్తుంది. ఆహారంపై కంట్రోల్: నియంత్రణ లేని అల్పాహారం అధిక క్యాలరీలను తీసుకోవడానికి దారితీస్తుంది. ఈ విధానం ఒకరకంగా పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను ఎంచుకుని తినేలా చేస్తుంది. తత్ఫలితంగా ఆహారంపై నియంత్రణ ఏర్పడుతుంది. పోషకాహార సమతుల్యత: స్నాక్స్పై మాత్రమే దృష్టి కేంద్రీకరించడం వల్ల సమతుల్య భోజనం నుంచి అవసరమైన పోషకాలను తీసుకోవడం కుదరకపోవచ్చు. అందువల్ల ఈ స్నాక్స్లో వివిధ రకాల విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్లు ఉండేలా చూసుకోవడం మంచిది మూడ్స్పై ప్రభావం: ఒకోసారి ఇలా అల్పాహారంలా తింటుంటే మన ఆకలిపై ఒత్తిడి లేదా విసుగుకు దారితీస్తుంది. దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ సరైన విధాంగా ఈ విధానాన్ని అమలు చేయాలి. అయితే ఈ ర్యాక్ బ్రేక్ ఫాస్ట్ అనేది అన్ని వేళలా సౌకర్యవంతమైన విధానం కాకపోవచ్చు గానీ కాస్త ఆహారంపై మనసు పెట్టి తినేలా మాత్రం చేస్తుంది. ఏ విధానమైనా పిచ్చిలా కాకుండా ఇష్టపూర్వకంగా పద్ధతిగా తీసుకుంటే సత్ఫలితాలను పొందగలుగుతాం. గమనిక: ఇది కేవలం అవగాహన కోసమే ఇచ్చాం. ఈ పద్ధతి ఫాలో అవ్వాలనుకుంటే మీ ఆరోగ్య స్థితిని అనుసరించి వ్యక్తిగత వైద్యుడిని సలహాల మేరకు అనుసరించడం మంచిది. (చదవండి: ఆ క్రీడాకారుడు ధరించిన 'షూ'లు వేలంలో రికార్డు స్థాయిలో రూ. 66 కోట్లు..) -
బ్లాక్ వర్సెస్ బ్రౌన్ రైస్: రెండింటిలో ఏదీ బెటర్ అంటే..?
మార్కెట్లో ఇప్పుడూ పోషక విలువలు కలిగిన రకరకాల రైస్లు వస్తున్నాయి. ఆఫ్ బాయిల్డ్ రైస్, బ్రౌన్ రైస్, దంపుడు బియ్యం, బ్లాక్ రైస్ వంటివి ఎన్నో వస్తున్నాయి. వాటిల్లో ఇటీవల ఎక్కువమంది బ్రౌన్ రౌస్, బ్లాక్ రైస్లు విరివిగా వినియోగిస్తున్నారు. రెండింటిలోనూ అధిక స్థాయిలో పోషకాలు ఉంటాయి. పైగా ఆరోగ్యానికి ఈ రెండు చాలా మంచివి కూడా. అయితే వీటిలో ఏదీ మనకు బెటర్ అనే విషయానికి వస్తే.. పోషకాల పరంగా.. బ్రౌన్ రైస్ తృణధాన్యంగా బాగా ప్రసిద్ధి చెందింది. దాని బయట ఉండే ఊక పొర థయోమిన్ వ్యాధి రాకుండా కాపాడుతుంది. దీనిలో ఫైబర్లు, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. బ్లాక్ రైస్ వద్దకు వచ్చేటప్పటికీ దీన్ని నిషిద్ధ బియ్యంగా పిలుస్తారు. దీనిలోని ఆంథోసైనిన్ కారణంగా డీప్ కలర్లో ఉంటుంది. ఇది శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తుంది. దీనిలో కూడా చెప్పుకోదగ్గ మొత్తంలో ఐరన్, జింక్లు ఉన్నాయి. అలాగే పోషక సాంద్రతను మెరుగుపరుస్తుంది. ఫైబర్ కంటెంట్.. రెండూ ఫైబర్కి మూల వనరులు. పోలిస్తే మాత్రం బ్లాక్రైస్లో మూడు గ్రాముల ఫైబర్ ఉంటే, బ్రౌన్ రైస్లో 4.5 గ్రాముల ఫైబర్తో ముందంజలో ఉంటుంది. ఈ లక్షణం కారణంగానే బ్రౌన్ రైస్ జీర్ణక్రియకు సహాయపడటమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ముఖ్యంగా బరువును అందుపులో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక బ్లాక్ రైస్లో ఫైబర తక్కవుగా ఉన్నప్పటికీ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది, స్థిరమైన శక్తిని విడుదల చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ పవర్ బ్రౌన్ రైస్లో ఉండే సెలీనియం, మాంగనీస్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు మొత్తం ఆరోగ్యానికే దోహదం చేయగా, నల్ల బియ్యం వర్ణద్రవ్యానికి కారణమైన ఆంథోసైనిన్లు ఆక్సీకరణ, ఒత్తిడి, మంట వంటి వాటి నుంచి గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. ఖనిజ కంటెంట్ బ్రౌన్ రైస్లో ఉండే మెగ్నీషియం, ఫాస్పర్స్లు ఎముకల ఆరోగ్యం కండరాల పనితీరు, శక్తిమంతమైన జీవక్రియకు ఉపయోగపడుతుంది. అలాగే దీనిలో యాంటీ ఆక్సిడెంట్ల రక్షణకు మూలమైన మాంగనీస్ కూడా తగు మోతాదులో ఉంటుంది. ఇక బ్లాక రైస్లో ఇనుము, జింక్ కంటెంట్లు రోగ నిరోధక పనితీరుని మెరుగుపర్చడమే గాక శరీరం మొత్తం సవ్యంగా ఆక్సిజన్ రవాణా అయ్యేలా చేస్తుంది. కార్డియోమోటబాలిక్ ఆరోగ్యం.. ఈ రెండూ కార్డియోమెటబాలిక్ శ్రేయస్సుకు దోహదం చేసేవే. బ్రౌన్రైస్లోని అధిక ఫైబర్ కొలస్ట్రాల్ నియంత్రించడంలో ఉపకరించగా, బ్లాక్రైస్లో ఉండే ఆంథోసైనిన్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చి హృదయ సంబంధ వ్యాధులను దరిచేరకుండా కాపాడుతుంది. నిజానికి ఈ రెండింటిలో ఏదీ బెస్ట్ అని నిర్ణయించడం కష్టం. రెండు మంచి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అయితే ఏది ఎంచుకోవాలన్నది మీ వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని అనుసరించి వైద్యుల సలహ మేరకు ఎంచుకుంటే మంచిది. ముఖ్యంగా ప్రోటీన్ యాంటీ ఆక్సిడెంట్లకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే బ్లాక్ రైస్ ఎంచుకోవడం మంచిది. అలా కాదు రుచితో కూడిన తేలికగా ఉండే ఆహారం కావాలనుకుంటే బ్రౌన్ రైస్ మేలు. (చదవండి: షుగర్ని ఎంతలా స్వాహ చేసేస్తున్నామో తెలుసా? ఎలాంటి చక్కెర్లు బెటర్?) -
షుగర్ని ఎంతలా స్వాహా చేసేస్తున్నామో తెలుసా?
షుగర్ లెస్గా తినడం దాదాసే అసాధ్యం. మధుమేహ వ్యాధిగ్రస్తులైన ఒక్కోసారి నోరు కట్టడి చేయడం కష్టంగా ఉంటుంది. స్వీట్ తినలేకపోతున్నామనే బాధను భర్తీ చేసేలా వాటి స్థానంలో ప్రాసెప్ చేసినవి కూడా వచ్చాయి. నిపుణులు అభిప్రాయం ప్రకారం వీటిలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండి, విటమిన్లు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే ఈ రెండింటిలో ఏదీ బెటర్? పూర్తిగా షుగర్ వాడకాన్ని నియంత్రించొచచ్చా? ప్రపంచవ్యాప్తంగా గణాంకాల ప్రకారం దేశంలో దాదాపు 176 మిలియన్ మెట్రిక్ టన్నుల చక్కెర వినియోగం అవుతుంది. ఈ ఏడాది కల్లా అది కాస్త ఏకంగా 180 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకుంటుందనేది అంచనా. ప్రతీ వ్యక్తి రోజుకి 17 టీస్పూన్ల కంటే ఎక్కువ చక్కెర తీసుకుంటారని నిపుణులు చెబుతున్నారు. నిజానికి పురుషులు తొమ్మిది టీస్పూన్లు, స్త్రీలు ఆరు టీస్పూన్ల చక్కెర వాడాలని సిపార్సు చేయగా, ప్రజలు మాత్రం దాన్ని మించే వినియోగిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అలాంటి వారికి ప్రాసెస్ చేసిన షుగర్ వాడోచ్చా అంటే?. నిపుణులు దానికంటే సహజ చక్కెర్లు ఉన్న పండ్లు పాలు తీసుకోవడమే ఉత్తమం అని చెబుతున్నారు. తేనె వంటి కొన్ని రకాల సిరప్లు మంచివే గానీ వాటిలో అదనపు చక్కెర్లు ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వైద్యులు మాత్రం ఫ్రక్టోజ్, తేనె, బెల్లం వంటి వాటిల్లో తక్కువ గ్లైసెమిక్ ఉండి, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు. అయినప్పటికీ వీటిని కూడా అతిగా తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగడమే గాక రక్తపోటు వంటి వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. అలాగే తేనెలో యాంటీమైక్రోబయల్ వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నప్పటికీ ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. వీటన్నింటికంటే ఉత్తమమైన స్వీటెనర్ కేవలం సహజసిద్ధమైన పండ్లేనని, అవి తీసుకోవడమే మేలని చెబుతున్నారు. చక్కెరను పూర్తిగా తొలగించాలనుకోవడం కంటే ఇలా సహజసిద్ధమైన పండ్ల రూపంలో తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. ముఖ్యంగా నారింజ, ఆపిల్, పైనాపిల్, కివి వంటి పండ్లు మంచివని చెబుతున్నారు. అలాగే వీటి తోపాటు తృణధాన్యాలు కూడా ఆరోగ్యానికి మంచివి. ఇవి శరీరానికి కావాల్సిన మంచి చక్కెర్లను అందిస్తాయి. ఎలాంటి చక్కెర్లకు దూరంగా ఉండాలి సోడాలు, కూల్ డ్రింక్స్ వంటి జోలికి పోవకపోవడమే ఉత్తమం అని చెబుతున్నారు. ఎందుకంటే వాటిలో అధికంగా షుగర్ కంటెంట్ ఉంటుంది. ఇది కాలేయం ప్రభావం చూపించి ఇన్సులిన్ని ప్రభావితం చేస్తుంది. తగినంతగా నిద్రపోకపోతే ఆకలి అనే హార్మోన్పై ఎలాంటి ప్రభావం ఏర్పడదు లేదంటే తెలియకుండానే ఎక్కువ తినాలనే కోరిక కలుగుతుంది. దీంతో చక్కెర కలిగిన ఆ హరం తీసుకుంటారని చెబుతున్నారు నిపుణులు. నిద్రలేమి లెప్టిన్ స్థాయిలను తగ్గిస్తుంది. దీంతో తినే సంతృప్తికి సంబంధించిన హార్మోన్, ఆకలితో సంబంధం ఉన్న గ్రెలిన్, అడిపోనెక్టిన్ల సాంద్రతను పెంచేస్తుంది. తత్ఫలితంగా స్వీట్ కంటెంట్కి సంబంధించినవి తినాలనిపిస్తుంది. నూనెలో డీప్ ఫ్రై చేసిన వాటికంటే కొద్ది ఆలివ్ నూనెతో ఓవెన్లో వేయించినవి తీసుకుంటే మేలని చెబుతన్నారు. ఇలా తీసుకుంటే సహజ చక్కెరలతో కూడిన పోషకాహారం శరీరానికి అందడమే గాక తినేందుకు కూడా రుచికరంగానూ ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: బాదం పప్పులు మంచివని తినేస్తున్నారా? అధికంగా తీసుకుంటే డేంజరే!) -
అమ్మాయి ఆరోగ్యానికి ఏడు పరీక్షలు
ఆడపిల్లలు ఆరోగ్యంగా పెరగాలి. అన్ని రంగాల్లో ప్రతిభ చూపాలి.వారికి వద్దు ఆటంకాలు. వారిపై వద్దు చిన్నచూపు.ఇదే ‘నేషనల్ గర్ల్ చైల్డ్ డే’ సందేశం.అయితే యుక్త వయసుకు వచ్చిన బాలికలకు చాలామంది తల్లిదండ్రులు ఆరోగ్య పరీక్షలు చేయించరు.వైద్యనిపుణులు మాత్రం ఎదిగే వయసులోని ఆడపిల్లలకు తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించాలంటున్నారు.‘జాతీయ బాలికా దినోత్సవం’ సందర్భంగా తల్లిదండ్రులు ఆడపిల్లలకు ఇవ్వాల్సిన కానుక ఈ ఆరోగ్య పరీక్షలే. ఆడుతూ పాడుతూ ఉన్నంత మాత్రాన మన ఇంటి ఆడపిల్లలకు శారీరకంగా ఏవో కొన్ని పోషక విలువల లోటుపాట్లు ఉండకపోవు. అయితే చాలామంది తల్లిదండ్రులు వాటిని నిర్థారణ చేసుకోరు. నిజానికి బాలికలు అనేక శారీరక సవాళ్లను ఎదుర్కొంటారు. యుక్తవయస్సు వచ్చిన తర్వాత శారీరక మార్పులకు లోనవుతారు. పోషకాహార లోపంతో బాధపడే బాలికల్లో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. అందుకే వారి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసేందుకు, లోపాలను సరి చేసుకునేందుకు కొన్ని పరీక్షలు తరచూ చేయించాలంటున్నారు వైద్య నిపుణులు. బాలికల సమగ్ర వికాసాన్ని సందేశంగా ఇచ్చే ‘నేషనల్ గర్ల్ చైల్డ్ డే’ సందర్భంగా తప్పక ఈ పరీక్షలను చేయించడమే ఆడపిల్లలకు ఇచ్చే అసలైన కానుక అవుతుంది. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (సీబీపీ): బాలికల్లో రక్తహీనత సర్వసాధారణం. పూర్తి రక్త గణన (íసీబీపీ) పరీక్ష చేయించడం వల్ల రక్తహీనత ఉందో లేదో తెలుస్తుంది. సీబీసీ పరీక్ష ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ కౌంట్ గురించి చెబుతుంది. ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉన్నా సీబీపీ పరీక్ష తెలియచేస్తుంది. బాలికల్లో అలసట, బరువు తగ్గడం, జ్వరం, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటే అసలు కారణం తెలియడానికి సీబీపీ చేయించడం మంచిది. ఐరన్ప్రొఫైల్: ఐరన్ లోపం వల్ల రక్తహీనత వంటి వ్యాధులు వస్తాయి. శరీరం తగినన్ని ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయనప్పుడు సాధారణంగా రక్తహీనత వస్తుంది. సరైన ఆహారం, ఐరన్ సప్లిమెంట్లు, ఐరన్ స్థాయులను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం ద్వారా ఈ పరిస్థితిని (ఐరన్ లోపాన్ని) సమర్థంగా అధిగమించవచ్చు. విటమిన్ప్రొఫైల్ టెస్ట్స్: ఉత్సాహకరమైన శారీరక ఆరోగ్యానికి విటమిన్లు చాలా అవసరం. విటమిన్ప్రొఫైల్ టెస్ట్స్ వల్ల విటమిన్ల లోపం ఏదైనా ఉంటే తెలుస్తుంది. విటమిన్ బి12 జీవ క్రియలకు అత్యంత ముఖ్యమైనది. ఆ విటమిన్ లోపం ఉంటే వైద్యుని సలహాతో దానిని పూరించే సప్లిమెంట్స్ ఇప్పించాలి. విటమిన్ డి లోపంతో ఎముకలపై ప్రభావం పడుతుంది. శరీరంలో డి విటమిన్ తగ్గకుండా ఉదయపు ఎండ తగిలేలా చూడటం, వైద్యుల సూచనతో సప్లిమెంట్స్ తీసుకోవడం చేయాలి. ఆడపిల్లలు కండరాల బలహీనత, అలసట, ఎముకల్లో నొప్పిని ఎదుర్కొంటుంటే విటమిన్ల టెస్ట్ తప్పక చేయించాలి. మూత్ర పరీక్ష: మైక్రోస్కోప్ ద్వారా చేసే మూత్రపరీక్ష ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే తెలియచేస్తుంది. బాలికల్లో పొత్తి కడుపు నొప్పి, మూత్రవిసర్జనలో ఇబ్బందులు, మూత్రంలో రక్తం, మంట వంటి లక్షణాలు కనిపిస్తే మూత్ర పరీక్ష చేయించాలి. ఒక్కోసారి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నా సింప్టమ్స్ కనిపించకపోవచ్చు. అందువల్ల ఒకసారి ఈ పరీక్ష చేయించడం మంచిది. మల పరీక్ష: ఎదిగే వయసు పిల్లలు మల విసర్జన రోజువారీ చేయకపోయినా, మల విసర్జనలో ఇబ్బంది పడుతున్నా, తరచూ విరేచనాలవుతున్నా లేదా కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్నా అదేం పెద్ద విషయం కాదన్నట్టు నిర్లక్ష్యం చేయకూడదు. మల పరీక్ష చేయించాలి. దానివల్ల జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉంటే తెలుస్తుంది. కంటి పరీక్ష: టీనేజ్ పిల్లలకు తప్పనిసరిగా చేయించాల్సిన పరీక్ష ఇది. ఈ వయసులో హ్రస్వదృష్టి వచ్చినా, దీర్ఘదృష్టి వచ్చినా పిల్లలు దానిని గుర్తించకనే కంటికి శ్రమ ఇచ్చి రోజువారి పనులను, చదువును కొనసాగిస్తారు. కాని కంటి పరీక్ష వల్లే దృష్టిలోపం తెలుస్తుంది. ఈ వయసులో గుర్తించకుండా దృష్టిలోపం కొనసాగితే తర్వాత కాలంలో కంటి నరాలకు సంబంధించిన సమస్యలు వస్తాయి. అందుకని కంటి పరీక్ష తప్పదు.హార్మోనల్ వర్కప్ టెస్ట్: ఆడపిల్లల్లో ఈడేరడం ఆలస్యం అవుతుంటే ఈ టెస్ట్ చేయించడం తప్పనిసరి. దీనివల్ల పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, థైరాయిడ్ పని తీరు, అడ్రినల్ గ్రంథి పనితీరు తదితరాలు తెలుస్తాయి. దీనివల్ల యుక్తవయసుకు జాప్యం ఎందుకో తెలుస్తుంది. సరి చేయ వీలవుతుంది. -
చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా కనిపించాలంటే..!
కొందరి చర్మం చూడగానే ఆరోగ్యవంతంగా కనిపించదు. చూడటానికి కూడా బాగుండదు. మరికొందరికి చర్మం పెళుసుగా ముడతలు పడినట్లు ఉంటుంది. దీంతో చాలా ఇబ్బందిగా ఫీలవుతారు. ఎన్నో రకాల క్రీంలు ఉపయోగించినా ఫలితం అంతగా ఉండదు. అలాంటప్పుడూ ఇలా చేయండి. చర్మం ఆరోగ్యంగా కనిపించాలంటే... చర్మం ఆరోగ్యంగా నిగనిగలాడుతూ ఉండాలంటే కొబ్బరిపాలు మేలైన ఎంపిక. కొబ్బరి పాలను రాత్రిపూట పడుకునేముందు తలకు పట్టించి, షవర్ క్యాప్ వేసుకోవాలి. మరుసటి రోజు ఉదయం షాంపూతో తలస్నానం చేయాలి. కొబ్బరి పాలు వెంట్రుకల కుదుళ్లకు చేరి, శిరోజాల మృదుత్వం దెబ్బతినదు. పచ్చి కొబ్బరిని తురిమి, మిక్సీలో గ్రైండ్ చేసి, పాలు తీయాలి. ఈ పాలను చర్మానికంతటా పట్టించి, అరగంట ఆగి, చల్లని నీటితో స్నానం చేయాలి. చర్మానికి మంచి మాయిశ్చరైజర్లా పని చేసి, ముడతలు తగ్గి, మృదువుగా మారిపోతుంది. ఎండలో నుంచి ఇంటికి వెళ్లినప్పుడు ఫ్రిజ్లో ఉంచిన కొబ్బరి పాలను, దూదితో ఒళ్లంతా రాసుకొని, పది నిమిషాలు సేదదీరాలి. తర్వాత స్నానం చేస్తే ఎండవల్ల కమిలిన చర్మానికి ఉపశమనం లభిస్తుంది. మృదువుగా, కాంతిమంతంగా తయారవుతుంది. (చదవండి: క్లెన్సింగ్ నుంచి ఫేషియల్ వరకు.. ఇదొక్క బ్యూటీ ప్రొడక్ట్ ఉంటే చాలు) -
కూరగాయలే ఎక్కువగా తినాలి
రామచంద్రాపురం (పటాన్చెరు): ‘ఒక మనిషి నిత్యం 240 గ్రాముల కూరగాయలను ఆహారంగా తీసుకోవాలి..కానీ కేవలం 145 గ్రాములే తీసుకుంటున్నారని’అంతర్జాతీయ కూరగాయల పరిశోధన కేంద్రం డైరెక్టర్ జనరల్ డాక్టర్ మార్కో వోపేరీస్ అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం ఇక్రిశాట్లోని వరల్డ్ వెజిటబుల్ సెంటర్ 50వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మార్కో వోపేరీస్ విలేకరులతో మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాల్లోనూ జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారని, నిత్యం కూరగాయలను ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటామని చెప్పారు. ఆదాయం తక్కువగా ఉన్న ప్రజలు సైతం ఎక్కువ మాంసాహారం తీసుకుంటున్నారని, అభివృద్ధి చెందిన ఫ్రాన్స్లాంటి దేశాల్లో సైతం కూరగాయలు ఎక్కువగా తినడం లేదన్నారు. తైవాన్, జపాన్, వియత్నాం, కొరియాలాంటి దేశాల్లో కూరగాయలను ఆహారంగా తీసుకునేవారి ఎక్కువ అని, భారత్లో అయితే 145 గ్రాముల కూరగాయలను మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నారని తెలిపారు.కూరగాయల సాగులో రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడటం వల్ల అవి తిన్నవారికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పారు. కూరగాయలు, పండ్లపై మరింత పరిశోధన జరగాలన్నారు. అవసరమైతే కూరగాయల నుంచి తీసిన జ్యూస్ భద్రపరచుకొని దానిని తీసుకోవచ్చన్నారు. అనంతరం వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులకు కూరగాయలు పండించే విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసీఏఆర్ డైరెక్టర్ డాక్టర్ టీకే బెహెరా, ప్రపంచ విత్తనపరిశోధన సంస్థ రీజినల్ డాక్టర్ రామ్నాయర్ తదితరులు పాల్గొన్నారు. -
పెదవులు ఆరోగ్యంగా అందంగా కనిపించాలంటే ఇలా చేయండి!
ఏ సమస్యనైనా దాచడం సాధ్యమేమోగానీ... పెదవులకు వచ్చే సమస్యలు ఇట్టే బయటకు కనిపిస్తాయి. దాంతో అనారోగ్యం బయటపడటంతో పాటు అందం కూడా తగ్గుతుంది. ఫలితంగా సెల్ఫ్ ఎస్టీమ్ కూడా తగ్గుతుంది. అందుకే పెదవుల ఆరోగ్యం కాపాడుకోవాలంటే తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలివి... పెదవుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే... అన్ని పోషకాలు ఉండే సమతుల ఆహారం తీసుకోవాలి. సిగరెట్లు తాగేవారిలో పెదవులు నల్లగా, బండగా మారవచ్చు. అందుకే స్మోకింగ్ అలవాటును వెంటనే మానేయాలి మహిళల్లో లిప్స్టిక్ వాడేవారు వాటి కొనుగోలు సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అందులో ప్రొపైల్ గ్యాలేట్ అనే రసాయన పదార్థం ఉంటుంది. దాని వల్లనే ప్రధానంగా అలర్జీలు వస్తుంటాయి. లిప్స్టిక్ వాడే వారు అది తమకు సరిపడుతుందా లేదా అన్న విషయాన్ని తొలుత పరిశీలించుకుని, తమకు సరిపడుతుందని తేలిన తర్వాతే వాడటం మంచిది నిద్రకు ఉపక్రమించే ముందు లిప్స్టిస్ శుభ్రంగా కడుక్కోవాలి. ఆ టైమ్లో పెదవులపై పలుచగా నెయ్యి లేదా బాదం నూనె రాసుకోవచ్చు కొన్ని టూత్పేస్ట్ల వల్ల కూడా మనకు పెదవులపై దురద రావచ్చు. అలాంటప్పుడు వాటిని ఉపయోగించడం ఆపేయాలి నీరు ఎక్కువగా తాగుతుండాలి. పెదవులు తడి ఆరిపోకుండా చూసుకోవాలి. అయితే నాలుకతో తడపకూడదు. (చదవండి: మచ్చలు లేని ముఖ సౌందర్యం కోసం..బీట్రూట్తో ఇలా ట్రై చేయండి!) -
కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ నగరం అడుగులు.. భారీ ప్రాజెక్టులతో కళకళ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అభివృద్ధిలో దూసుకెళుతున్న విశాఖ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగస్టు 1వతేదీన శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు నిర్వహించనున్నారు. నగర అభివృద్ధితో పాటు ప్రజలకు ఆరోగ్యకరమైన, గౌరవ ప్రదమైన జీవన ప్రమాణాల్ని అందించే లక్ష్యంతో ఇవి రూపుదిద్దుకున్నాయి. రూ.600 కోట్లతో రహేజా గ్రూప్ నిర్మిస్తున్న ఇనార్బిట్ మాల్కు మంగళవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్ అదేరోజు జీవీఎంసీ పరిధిలో మరో 50 పనులకు భూమి పూజ చేయనున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉపాధి, నైపుణ్య అవకాశాల్ని కల్పించే నాలుగు ప్రాజెక్టులను కూడా ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. ఐటీ టవర్స్పై సానుకూలం.. ఆర్థిక రాజధానిగా విరాజిల్లుతున్న విశాఖ నగరం కార్యనిర్వాహక రాజధానిగా అడుగులు వేస్తోంది. సిటీ ఆఫ్ డెస్టినీగా పిలిచే విశాఖను విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రణాళికలు, ప్రాజెక్టులను అమలు చేస్తోంది. ఐటీ హబ్గా మార్చేందుకు బీచ్ ఐటీ కాన్సెప్ట్తో దిగ్గజ సంస్థలను ఆహ్వనించిన ప్రభుత్వం పర్యాటక రంగంలోనూ అదే ఒరవడిని అనుసరిస్తోంది. ఇప్పటికే అన్నవరం సమీపంలో రూ.350 కోట్లతో ఒబెరాయ్ లగ్జరీ రిసార్టుల ప్రాజెక్టుకు భూమి పూజ జరిగింది. తాజాగా దిగ్గజ సంస్థ రహేజా గ్రూప్ భారీ మాల్ని నిర్వించనుంది. మాల్ శంకుస్థాపనకు ఆహ్వనించేందుకు రహేజా గ్రూప్స్ ప్రెసిడెంట్ నీల్ రహేజా ఇటీవలే ముఖ్యమంత్రి జగన్తో సమావేశమయ్యారు. 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న మాల్ని మూడేళ్లలోగా పూర్తి చేయాలని రహేజా లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీనిద్వారా 5 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఇనార్బిట్ మాల్ నిర్మాణంలో భాగంగా ఐటీ టవర్స్ను కూడా ఏర్పాటు చేయాలని సీఎం జగన్ రహేజా గ్రూప్ ప్రతినిధులకు సూచించారు. దీనిపై కంపెనీ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. రూ.135.88 కోట్లతో జీవీఎంసీ ప్రాజెక్టులు ఇనార్బిట్ మాల్కు శంకుస్థాపన అనంతరం అదే ప్రాంగణంలో విశాఖ ప్రజలకు మౌలిక సదుపాయాలు, నగర సుందరీకరణ, వివిధ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు సీఎం జగన్ భూమి పూజ చేయనున్నారు. అమృత్ 2.0, స్మార్ట్ సిటీ, 15వ ఆరి్థక సంఘం నిధులు రూ.135.88 కోట్లతో చేపట్టనున్న 50 పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. శివారు, జీవీఎంసీ విలీన ప్రాంతాలైన మధురవాడ, లంకెలపాలెం, గాజువాక, అనకాపల్లి తాగునీటి కష్టాలను తీర్చేలా పైప్లైన్ ప్రాజెక్టులు, మురికివాడల్లో అభివృద్ధి పనులు, రూ.30 కోట్లతో జీవీఎంసీ పరిధిలోని 10 చెరువుల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. రూ.6.4 కోట్ల స్మార్ట్సిటీ నిధులతో యూరోపియన్ స్టైల్లో సాగర్నగర్, డిఫెన్స్ కాలనీ వద్ద నిర్వించనున్న ఈట్ స్ట్రీట్స్తో పాటు రూ.6 కోట్లతో స్మార్ట్ స్ట్రీట్, రూ.12 కోట్లతో విశాఖ నగరంలోని పలు ప్రధాన రహదారులు, జంక్షన్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించిన జీవీఎంసీ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఉపాధి, నైపుణ్యాలను పెంచేలా.. ఉత్తరాంధ్ర విద్యార్థులకు ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా సీఎం జగన్ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రూ.129 కోట్లతో చేపట్టిన కీలక ప్రాజెక్టులను సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం ఏయూ విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొంటారు. ఏయూలో రూ.21 కోట్లతో 30,000 చ.అడుగుల విస్తీర్ణంలో నిర్వించిన ఏయూ స్టార్టప్ అండ్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ హబ్(అ–హబ్)ని సీఎం ప్రారంభించనున్నారు. ఇందులో ప్రస్తుతం 121 స్టార్టప్ కంపెనీలకు చోటు కల్పించారు. రూ.44 కోట్లతో 55 వేల చ.అడుగుల విస్తీర్ణంలో బయోటెక్, ఫార్మా, జెనోమిక్స్ ఇంక్యుబేషన్, టెస్టింగ్ ల్యాబ్ కోసం నిర్మించిన ఎలిమెంట్ (ఏయూ ఫార్మా ఇంక్యుబేషన్ అండ్ బయోలాజికల్ మానిటరింగ్ హబ్)ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. రూ.35 కోట్లతో 60 వేల చ.అడుగుల విస్తీర్ణంలో నిర్వించిన అల్గారిథమ్ (ఏయూ డిజిటల్ జోన్ అండ్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ కాంప్లెక్స్)ని సీఎం జగన్ విద్యార్థులకు అందుబాటులోకి తేనున్నారు. ఐఐఎంతో ఒప్పందంలో భాగంగా రూ.18 కోట్లతో 25 వేల చ.అడుగుల విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ అనలిటిక్స్లో ప్రత్యేక కోర్సులందించేందుకు నిర్వించిన ఏయూ–సిబ్(ఏయూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్)ని సీఎం ప్రారంభించనున్నారు. రూ.11 కోట్లతో అవంతి సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా రూ.11 కోట్లతో మెరైన్ అగ్రికల్చర్, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్లో యువతకు నైపుణ్యం అందించేందుకు నిర్వించిన ఏయూ అవంతి ఆక్వాకల్చర్ ఇన్నోవేషన్ అండ్ స్కిల్ హబ్ని ముఖ్యమంత్రి జగన్ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇనార్బిట్ మాల్ ప్రత్యేకతలివీ.. నిర్మిస్తున్న సంస్థ : రహేజా గ్రూప్ విస్తీర్ణం : 17 ఎకరాలు (6 లక్షల చ.అడుగులు) ఎక్కడ : విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని సాలిగ్రామపురంలో ఎవరి స్థలం : విశాఖపట్నం పోర్టు అథారిటీ లీజు వ్యయం: 30 ఏళ్లకు రూ.125 కోట్లు శంకుస్థాపన : ఆగస్ట్ 1వ తేదీన పూర్తి : మూడేళ్ల వ్యవధిలో నిర్మాణం ఇలా: రెండు బేస్మెంట్ ప్లస్ 3 స్టిల్ట్ ఫ్లోర్స్, 5 ఫ్లోర్లు రీటైల్ కోసం, 6వ ఫ్లోర్ మల్టీలెవల్ కార్ పార్కింగ్ కోసం, 7, 8వ ఫ్లోర్లు ఆఫీస్ స్పేస్ కోసం, 9వ ఫ్లోర్లో హోటల్ నిర్మాణం చేపట్టేలా ప్రణాళికలు సరికొత్త విశాఖ ఆవిష్కృతం విశాఖ అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన చర్యలతో సరికొత్త నగరం ఆవిష్కృతమవుతోంది. ఇప్పటికే భారీ ప్రాజెక్టులకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు కూడా మొదలయ్యాయి. పర్యాటక ప్రాజెక్టులతో పాటు ఐటీ సంస్థల రాకతో నగరం కళకళలాడుతోంది. ఆగస్ట్ 1 న దాదాపు రూ.865 కోట్ల విలువైన కీలక ప్రాజెక్టులకు సీఎం జగన్ శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. – డా.మల్లికార్జున, జిల్లా కలెక్టర్ -
వేసవి నేపథ్యంలో నెహ్రు జూపార్కులో ప్రత్యేక ఏర్పాట్లు
-
బ్రిటన్ హిందువుల ఆరోగ్యం భేష్ !
లండన్: ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలు అంటారు. దానికి తగ్గట్టుగానే ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో హిందువులకి మించిన వారు లేరని బ్రిటన్లోని ఒక సర్వేలో తేలింది. బ్రిటన్లో నివసించే హిందువులు అత్యంత ఆరోగ్యవంతులు , విద్యాధికులని తేలితే, సిక్కులందరికీ దాదాపుగా సొంతిల్లు ఉందని వెల్లడైంది. ఇంగ్లండ్, వేల్స్లోని జనగణన సందర్భంగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. యూకేలో ఆఫీస్ ఫర్ నేషనల్ స్టేటస్టిక్స్ (ఒఎన్ఎస్) ఈ జనగణన వివరాలను విడుదల చేసింది. ‘‘2021లో మార్చిలో జరిపిన ఈ సర్వేలో హిందువుల్లో ఆరోగ్యంగా ఉన్నవారు 87.8% ఉంటే, మొత్తంగా జనాభాలో 82%మంది ఆరోగ్యంతో ఉన్నారు. ఇక ఉన్నత విద్యనభ్యసించిన హిందువులు 54.8% ఉంటే, మొత్తం బ్రిటన్ జనాభాలో 33.8% ఉన్నారు. ఇక సిక్కుల్లో 77.7% మంది సొంతిళ్లలో నివసిస్తున్నారు.ఉద్యోగాల్లేక అవస్తలు పడుతున్న వారిలో ముస్లింలు ఎక్కువ మంది ఉన్నారు. బ్రిటన్లో నివసిస్తున్న 16–64 ఏళ్ల మధ్య వయసున్న ముస్లింలలో 51% మందే ఉద్యోగాలు చేస్తున్నారు’’ అని సర్వే నివేదిక వివరించింది. -
ఆరోగ్య పంజాబ్ సృష్టికి తీవ్ర కృషి: సీఎం మాన్
అమృత్సర్: పంజాబ్ను ఆరోగ్యకరంగా, శక్తివంతంగా మార్చేందుకు తమ ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తోందని ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ చెప్పారు. ప్రతి రంగంలోనూ రాష్ట్రం సమగ్ర అభివృద్ధి సాధించడమే తమ లక్ష్యమన్నారు. శుక్రవారం అమృత్సర్లో ఆయన ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో కలిసి 400 ఆమ్ ఆద్మీ క్లినిక్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఎన్నికల సమయంలో తమ పార్టీ ఇచ్చిన హామీలన్నిటినీ మాన్ సర్కార్ నెరవేరుస్తుందని కేజ్రీవాల్ చెప్పారు. ఆప్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న పంజాబ్ ప్రజలు ఆకాంక్షలు నెరవేరేందుకు కొద్దిగా ఓపిక పట్టాలన్నారు. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 500 ఆమ్ ఆద్మీ క్లినిక్కులను ఏర్పాటు చేయనుండటం సంతోషకరమని చెప్పారు. -
మొక్కజొన్న కండె హెల్దీ టైమ్పాస్
గుడ్ ఫుడ్ సరదాగా బయటకు వెళ్లినప్పుడో లేదా ఎక్కడైనా టైమ్పాస్ కోసం ఏదైనా నమలాలనుకున్నప్పుడు మొక్కజొన్న కండెలు తినడం చాలామంది చేసే పనే. అయితే దాన్ని ఏదో టైంపాస్ కోసం అన్నట్లుగా తేలిగ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మొక్కజొన్న కండెలతోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అందుకే అలా అలా సరదాగా సమయం గడపుతూ, టైంపాస్ చేస్తున్న సమయంలోనే ఆరోగ్యాన్ని అవెలా సమకూరుస్తుంటాయో తెలుసుకుందాం. ∙ మొక్కజొన్నలో డయటరీ ఫైబర్ (పీచు పదార్థాలు) చాలా ఎక్కువ. వాటిలోని సాల్యుబుల్ ఫైబర్ మలం మృదువుగా వచ్చేలా చేస్తుంది. అందుకే అవి జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు మలబద్దకాన్ని నివారిస్తాయి. ∙ ఒక కప్పు మొక్కజొన్న గింజల్లో 18.4 శాతం డయటరీ ఫైబర్ ఉండటం వల్ల మొలలు (పైల్స్) సమస్యను నివారిస్తాయి. పెద్ద పేగు క్యాన్సర్కూ నివారణగా పనిచేస్తాయి. అంతేకాదు నీళ్ల విరేచనాలు, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి. ∙ ఐరన్ లోపాలను అధిగమించేలా చేసి రక్తహీనతను తగ్గిస్తాయి. కొత్త రక్తకణాలు పుట్టేందుకు మొక్కజొన్న బాగా దోహదపడుతుంది. ∙ మొక్కజొన్నలో ఖనిజలవణాలైన ఫాస్ఫరస్, మెగ్నీషయమ్, మ్యాంగనీస్, ఐరన్, కాపర్ పాళ్లు చాలా ఎక్కువ. అంతేకాదు... అరుదైన సెలీనియమ్ పాళ్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఫాస్ఫరస్ ఎదుగుదలకూ, ఎముకల ఆరోగ్యానికి బాగా దోహదపడుతుంది. మెగ్నీషియమ్ మంచి గుండె ఆరోగ్యంతో, ఎముకలకు బలాన్నిస్తుంది. . దీని పసుపుపచ్చ రంగు కెరటనాయిడ్స్ పుష్కలంగా ఉండటానికి సూచన. ఇందులో విటమిన్–ఏ ను సమకూర్చేందుకు అవసరమైన బీటా–కెరటిన్ ఉంటుంది. అందుకే మొక్కజొన్న చూపును మెరుగుపరచడంతో పాటు వయసు పెరిగే కొద్దీ వచ్చే మాక్యులార్ డీజనరేషన్ వంటి కంటిజబ్బులను నివారిస్తుంది. ∙మొక్కజొన్నలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ–ర్యాడికల్స్ను నిర్వీర్యం చేసే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నందున అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. -
ఆరోగ్య ప్రదాయని యోగా
సిరిసిల్ల టౌన్ : యోగాభ్యాసం సంపూర్ణ ఆరోగ్య ప్రదాయని అని మైసూరుకు చెందిన అవధూత దత్తపీఠం ప్రతినిధి లీలావతి అనానరు. డివిజన్ స్థాయి ప్రైవేటు, ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆదివారం చివరిరోజు యోగా సాధనపై మెలకువలు నేర్పించారు. ఉపాధ్యాయులు యోగా నేర్చుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చన్నారు. కార్యక్రమంలో ఎంఈవో రాంచందర్రావు, యోగా శిక్షకులు వెనిగల్ల గోపాలకృష్ణ, బాలయ్య, కిరణ్, లీలావతి, దత్తపీఠం సిరిసిల్ల శాఖ ప్రతినిధులు గుండ్లపల్లి సుదర్శన్, మోర దామోదర్, కొక్కుల రాజేశం, వరదవెల్లి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
సిక్స్ ప్యాక్.. ఫిట్నెస్కు చిహ్నం కాదు!
కండలు పెంచినంత మాత్రాన ఆరోగ్యంగా ఉన్నట్లు కాదంటున్నారు వైద్య నిపుణులు. సిక్స్ ప్యాక్ బాడీ... చూసేందుకు ఫిట్ గా కనిపించినా... శరీర దారుఢ్యంతోపాటు, ఆరోగ్యంకూడ అవసరమని చెప్తున్నారు. ఫిట్నెస్ కోసం తరచుగా జిమ్ లకు వెళ్ళేవారు ట్రెండ్ ను ఫాలో అయ్యేందుకు బాడీ పెంచినా, తగిన ఆహార పద్ధతులను కూడ పాటించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో.. పోషక విలువలున్న ఆహారం కూడ అంతే అవసరమని చెప్తున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ తారలను, ప్రముఖ బాడీ బిల్డర్లను చూసి.. నేటి యువత సిక్స్ ప్యాక్ ట్రెండ్.. ఫాలో అయిపోతున్నారు. బానపొట్ట, వదులు శరీరం తగ్గించుకొని బాడీ ఫిట్నెస్ కోసం అత్యాధునిక జిమ్ లను ఆశ్రయిస్తున్నారు. కానీ చాలాశాతం వ్యాయామశాలల్లో శిక్షణ ఇచ్చేవారు తమ కస్టమర్లను డబ్బుకోసం తప్పుదారి పట్టిస్తుంటారు. తమ ఆదాయ వనరులను పెంచుకునేందుకు శరీరంలో కొవ్వును తగ్గించేందుకు ఆరోగ్యకరమైన ఆహారానికి బదులుగా మందులను సూచిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇటీవల సిక్స్ ప్యాక్ కోసం ప్రయత్నించిన ఇద్దరు యువకులు కార్డియాక్ సమస్యతో ఏకంగా ప్రాణాలను సైతం పోగొట్టుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. అందుకే ఫిట్నెస్ ప్రియులు కొవ్వును తగ్గించుకునేందుకు ప్రొటీన్ షేక్స్, స్టెరాయిడ్స్ వంటి వాటి జోలికి వెళ్ళవద్దని, ఆరోగ్యకరమైన ఆహారం, రోజువారీ వ్యాయామం ఫిట్నెస్ పెంచుకునేందుకు మూలాలని నిపుణులు సూచిస్తున్నారు. సిక్స్ ప్యాక్ ఆరోగ్యానికి చిహ్నం కాదని, ప్రకృతికి విరుద్ధంగా ప్రయత్నాలు చేయడం ఎంత మాత్రం సరికాదని ఫిట్నెస్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వారికిచ్చిన నిర్ణీత సమయంలో ప్రాజెక్టు పూర్తి చేయడాని సిక్స్ ప్యాక్ కోసం ప్రయత్నించే సినిమా యాక్టర్లను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఫాలో కావొద్దని హెచ్చరిస్తున్నారు. ఫిట్నెస్ ప్రియులు ముఖ్యంగా వారికి సిక్స్ ప్యాక్ అవసరం ఎంతవరకు ఉందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సిక్స్ ప్యాక్ కోసం ప్రయత్నించి, రెండుసార్లు ప్లేట్ లెట్ కౌంట్ తగ్గడంతో ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితికి చేరుకున్నామని, సిక్స్ ప్యాక్ బాడీ కోసం 48 గంటలపాటు నీటికి, ఉప్పుకు దూరంగా ఉండటమేకాక, అదే సమయంలో వర్కవుట్ కూడ చేయాల్సి వస్తుందని అనుభవజ్ఞులు చెప్తున్నారు. అయితే ఇది భవిష్యత్తులో జీర్ణక్రియపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని.. అందుకే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతోపాటు, వ్యాయామం చేయాలని సిక్స్ ప్యాక్ అభిమానులకు సలహా ఇస్తున్నారు. ఒకవేళ తప్పనిసరిగా సిక్స్ ప్యాక్ చేయాలనుకుంటే ప్రకృతి సిద్ధమైన ఆహారమే తీసుకోవాలని, ఫలితానికి కొంత సమయం పట్టినా... ఆరోగ్యానికి నష్టం చేకూరదని చెప్తున్నారు. ఫిట్ గా కనిపించాలనుకుంటారే తప్ప... ఫిట్ గా ఉండాలనుకోరని మిస్టర్ ఇండియా రన్నర్ అప్ రాహుల్ రాజశేఖరన్ అంటున్నారు. రెండిటి మధ్య వ్యత్యాసాన్ని గమనించడం ఎంతో అవసరమని చెప్తున్నారు. శరీరంలోని అవయవాలు ఆరోగ్యంగా పనిచేసేందుకు స్త్రీ పురుషులిద్దరికీ కనీసం 15 నుంచి 20 శాతం కొవ్వు అవసరమౌతుందని, అయితే తమకు వృత్తి పరంగా అది సాధ్యం కాకపోవడంతో 5శాతం మాత్రమే కొవ్వు శరీరంలో ఉంటుందని, ఈ పరిస్థితి భవిష్యత్తులోతమకు తీవ్ర నష్టాన్ని కలుగజేయడంతోపాటు సమాజానికి తప్పుడు సందేశాన్ని అందించడం బాధగా అనిపిస్తుందని చెప్తున్నారు. -
గుడ్డుతిన్నా గుండె పదిలమే!
లండన్: కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న గుడ్డును తరచుగా తింటే గుండెజబ్బులు వస్తాయని భయపడుతున్నారా? అలాంటి భయాలేవీ అక్కరలేదంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ ఈస్టర్న్ ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు. రోజుకో గుడ్డు తిన్నా గుండె పదిలంగానే ఉంటుందని చెబుతున్నారు. సాధారణంగా రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్తం సరఫరాకు ఇబ్బంది కలుగుతుంది. ఫలితంగా హృదయ సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. అయితే గుడ్డులో ఉండే కొవ్వు పదార్థాల కారణంగానే రక్తనాళాల మందం పెరిగినట్లు ఎటువంటి ఆధారాలు లేవని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. పైగా రక్తంలో కొవ్వుశాతం పెరగడానికి కూడా గుడ్డు ఏమాత్రం కారణం కాదని రుజువైంది. ఎటువంటి గుండె జబ్బులు లేని 1,032 మందిపై దాదాపు 21 ఏళ్లపాటు అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు. ఈ వివరాలు అమెరికన్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. -
మెదడు బాగా పనిచేయాలంటే..
న్యూ ఢిల్లీ: మెదడు క్రియాశీలకంగా పనిచేయాలంటే ఒకటి కంటే ఎక్కువ భాషల్లో ప్రావీణ్యం సంపాదించాలని చెబుతున్నారు పరిశోధకులు. ఇలా ఎక్కువ భాషలను నేర్చుకోవడం, ఉపయోగించడం వలన వృత్తి పరంగానే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతోందని జర్నల్ ఆఫ్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్.. భారతీయులపై జరిపిన పరిశోధనలో నిర్థారించింది. ఎక్కువ భాషల్లో ప్రావీణ్యం ఉన్నవారు ఒక భాష నుండి ఇంకో భాషలోకి తమ మెదళ్లను సందర్భానుసారం ట్యూన్ చేసుకొని ఉపయోగించడం మూలంగా మెదడు నిర్మాణాత్మకంగా బాగా అభివృద్ధి చెందుతోందని పరిశోధకులు పేర్కొన్నారు. ఒకే భాషలో ప్రావీణ్యం ఉన్నవారితో పోల్చితే.. ఒకటి కంటే ఎక్కువ భాషలు ఉపయోగించేవారు మానసిక సంబంధమైన వ్యాధులకు గురయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నయని పరిశీలనలో తేలింది. దేశంలో మెదడు సంబంధిత రుగ్మతలతో బాధ పడేవారి సంఖ్య 40 లక్షలకు పైగా ఉందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఈ సంఖ్య 2030 నాటికి రెట్టింపయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. -
డయాబెటిస్ హెచ్చరించే స్నేహితుడు
డయాబెటిస్ ఉందని కుంగిపోకండి. డయాబెటిస్ని కిందపడేసి తొక్కాలంటే మెట్లెక్కండి. లిఫ్టులు ఎక్కడం మానండి. నిజానికి డయాబెటిస్ వల్ల చాలామంది వాళ్ల జీవితాన్ని సంతోషకరంగా మలుచుకున్నారు. తప్పదు కాబట్టి బరువు తగ్గారు. తప్పించుకోలేరు కాబట్టి యాక్టివ్గా ఉంటున్నారు. అవసరం కాబట్టి మితంగా తింటున్నారు. వెరసి... హెల్దీగా, చలాకీగా ఉంటున్నారు. దృష్టికోణం మారితే లైఫ్ అందంగా ఉంటుంది. షుగర్ని శాపం అనుకునే బదులు... హెచ్చరించే ఒక స్నేహితుడు అనుకోండి. జీవితాన్ని మన అదుపులోకి తెచ్చే సన్నిహితుడు అనుకోండి. ఒంటికి ఏమాత్రం అలసట ఇవ్వని అధునాతన సౌకర్యాల్లో లిఫ్ట్ కూడా ఒకటి. ఒక్కోసారి ఇదే మనకూ మన ఆరోగ్యానికీ మధ్య రిఫ్ట్ సృష్టిస్తుంది. మెట్లు చేసే మేలును మరచిపోయేలా చేస్తుంది. అవును. మెట్లను నమ్ముకుంటే మన ఫేసూ, ఫేటూ బ్రైటవుతాయి. హెల్త్, వెల్త్ బెటరవుతాయి. నానా సమస్యలకు దారితీసే డయాబెటిస్ వంటి జబ్బులూ అదుపులో ఉంటాయి.మీరు ఈ కథనాన్ని నింపాదిగా కూర్చొని చదువుతున్నారా? కాస్త అటూ ఇటూ నడుస్తూ చదవండి. పక్కనే ఉన్న మార్కెట్కు బైక్ వేసుకొని బయల్దేరుతున్నారా? కాస్త నాలుగడుగులు వేసి నడక సాగించండి. ఒంటికి పనిచెప్పండి. చక్కెరవ్యాధి పనిపట్టండి. ముందుగానే గుర్తించిన భారతీయులు.. డయాబెటిస్ మనిషితో పాటే ఉంది. ప్రాచీన ఈజిప్షియన్లు, భారతీయ ఆయుర్వేద వైద్యులు క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల నాడే ఈ జబ్బును గుర్తించారు. ప్రాచీన భారతీయులు దీనికి ‘మధుమేహం’ అని నామకరణం చేశారు. ఆస్కార్ మిన్కోవ్స్కీ, జోసెఫ్ వాన్ మెరింగ్ అనే పాశ్చాత్య వైద్యనిపుణులు తమ పరిశోధనల్లో పాంక్రియాస్ పనితీరులో లోపమే డయాబెటిస్కు కారణంగా గుర్తించారు. తమ ప్రయోగంలో ఒక కుక్కకు పాంక్రియాస్ తొలగించి దాని మూత్రాన్ని పరీక్షిస్తే అందులో చక్కెర ఎక్కువగా ఉన్నట్లు తేలడంతో ఈ నిర్థారణకు వచ్చారు. జీవితంలో ఒత్తిడి వల్ల కూడా... వంశపారంపర్య కారణాల వల్ల, ఆధునిక జీవితంలోని ఒతిళ్ల వల్ల, వ్యాయామం లేకపోవడం వల్ల, మితిమీరి తినడం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రసగుల్లా, గులాబ్జామ్ వంటి స్వీట్లలో పంచదార పాకం అదనపు రుచిని కలిగిస్తుంది. చక్కెర ఉన్న నీరు చిక్కబడితే అది పాకం అవుతుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారిలో కూడా రక్తం చిక్కబడి ప్రసరణ నెమ్మదిస్తుంది. అది పక్షవాతం, గుండెజబ్బుల వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతుంది. ఇంతకీ ఈ చక్కెర వ్యాధి ఎలా వస్తుంది? జీవక్రియల్లో మార్పుల వల్ల వస్తుంది. శరీరంలోని క్లోమగ్రంథి (పాంక్రియాస్) తగినంత ఇన్సులిన్ను ఉత్పత్తి చేయకపోయినా, పాంక్రియాస్ పనితీరు మందగించి, అది ఉత్పత్తి చేసే ఇన్సులిన్కు శరీరంలోని జీవకణాలు తగిన రీతిలో స్పందించకపోయినా డయాబెటిస్ వస్తుంది. ఎన్నో రకాలు... డయాబెటిస్లో చాలా రకాలు ఉన్నాయి. అయితే, ఎక్కువ మంది బాధపడేది మాత్రం ముఖ్యంగా మూడు రకాల డయాబెటిస్తోనే. ఇవి: టైప్-1, టైప్-2, జెస్టేషనల్ డయాబెటిస్. అయితే, జీవనశైలి లోపాల వల్ల ఎక్కువ మంది బాధపడే టైప్-2 డయాబెటిస్ గురించి ఈ కథనంలో చర్చిస్తున్నాం. టైప్-2 డయాబెటిస్ దీర్ఘకాలం కొనసాగడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి దానంతట అదే నిలిచిపోయే పరిస్థితి తలెత్తుతుంది. అందుకే దీనిని నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మెలిటస్ లేదా అడల్డ్ ఆన్సెట్ డయాబెటిస్ అంటారు. డయాబెటిస్ రోగుల్లో దాదాపు 90 శాతం మంది ఈ రకానికే చెందుతారు. చక్కెరవ్యాధి లక్షణాలు... సమస్యలు తలనొప్పి, కళ్లు మసకబారడం, కళ్లు తిరగడం, మెదడుకు తగినంత చక్కెర అందకపోవడంతో త్వరగా అలసిపోవడం, తరచు ఆకలి వేయడం, దాహంగా అనిపించడం, స్వల్ప వ్యవధిలోనే బరువు పెరగడం లేదా తగ్గడం, తరచు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం వంటి లక్షణాలు చాలామందిలో కనిపిస్తాయి. డయాబెటిస్కు గురైనా, కొందరిలో వ్యాధి లక్షణాలేవీ కనిపించవు. క్రమం తప్పకుండా ప్రతి ఆరు నెలలకు ఒకసారైనా రక్తపరీక్షలు చేయించుకుంటే తప్ప ఇలాంటి పరిస్థితిని ప్రారంభంలోనే గుర్తించడం సాధ్యం కాదు.ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా తగిన పరీక్షలు చేయించుకోకుండా చికిత్స పొందకుండా వదిలేస్తే చక్కెరవ్యాధి వల్ల గుండెజబ్బులు, పక్షవాతం, అంధత్వం వంటి ప్రమాదకర పరిస్థితులతో పాటు మూత్ర వ్యవస్థలో ఇన్ఫెక్షన్లు, ఎరక్టైల్ డిస్ఫంక్షన్ వంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. చక్కెర వ్యాధితో బాధపడేవారికి పొరపాటున గాయాలైతే త్వరగా మానవు. ఇలాంటి సందర్భాల్లో నిర్లక్ష్యం చేస్తే, గాయమైన అవయవాన్ని పూర్తిగా తొలగించాల్సిన (యాంప్యుటేషన్) పరిస్థితి తలెత్తవచ్చు. చక్కెరవ్యాధిని పరీక్షల ద్వారా తెలుసుకోవడం ఎలా? చక్కెర వ్యాధిని గుర్తించడానికి ముఖ్యంగా మూడు రకాల రక్తపరీక్షలు చేస్తారు. ఆ పరీక్షలు, వాటి వివరాలు... ఫాస్టింగ్ సుగర్ టెస్ట్: కనీసం ఎనిమిది గంటలు ఏమీ తినకుండా ఈ పరీక్ష జరిపించుకోవాలి. ఈ పరీక్షలో రక్తంలో చక్కెర 70-100 స్థాయిలో ఉంటే సాధారణ పరిస్థితిలో ఉన్నట్లు లెక్క. ఫాస్టింగ్లో రక్తంలో చక్కెర 100-126 లోపు, పోస్ట్ లంచ్ 140-180 లోపు ఉంటే అది డయాబెటిస్ వచ్చేందుకు ముందు దశ (ప్రీ డయాబెటిక్ స్టేజ్) గా పేర్కొంటారు. పోస్ట్ ఫుడ్ సుగర్ టెస్ట్: ఆహారం తీసుకున్న గంటన్నర తర్వాత పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో రక్తంలో చక్కెర 140 కంటే మించకూడదు. ర్యాండమ్ సుగర్ టెస్ట్: తిన్నా, తినకున్నా ఏదో ఒకవేళ ఈ పరీక్ష చేస్తారు. ఇవి కాకుండా బ్లడ్ సుగర్ పరిస్థితి తీవ్రంగా ఉన్న వారికి గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (జీటీటీ) కూడా చేస్తారు. హెచ్బీఏ1సీ అనే పరీక్ష ద్వారా రక్తంలోని చక్కెర స్థాయిని మరింత కచ్చితంగా తెలుసుకోవచ్చు. ఈ పరీక్షలో కొలత 6 లోపు ఉండాలి.ఇప్పుడు ఇంట్లోనే రక్తపరీక్షలు జరుపుకొనేందుకు చేతిలో ఇమిడిపోయే కిట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఖర్చు తక్కువే: కేవలం లక్షణాల ఆధారంగానే చక్కెర వ్యాధిని గుర్తించలేము. అందువల్ల దగ్గర్లోని ల్యాబ్లలో గానీ, ప్రభుత్వాసుపత్రుల్లో గానీ కనీసం ఆరు నెలలకు ఒకసారైనా రక్తపరీక్ష జరిపించుకోవడం మంచిది. ఇప్పుడు ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ వంటి చక్కెరకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు డయాగ్నస్టిక్ ల్యాబ్స్లో రూ. 200 లోపే లభ్యమవుతున్నాయి. ఇక ఆర్నెల్లకు ఒకసారి చేయించాల్సిన అన్ని రకాల పెద్ద పరీక్షలనూ కలుపుకొని కొన్ని పెద్ద పెద్ద సంస్థలు రూ. 1500 నుంచి రూ. 2000 లకు ప్రత్యేక ఆఫర్లలో చేస్తుంటారు. జీవనశైలిని ఆరోగ్యకరంగా మార్చుకోవాలి డయాబెటిస్ ఉన్నట్లుగా వైద్య పరీక్షల్లో తేలితే వెంటనే జీవనశైలిని ఆరోగ్యకరంగా మార్చుకోవడం ద్వారా పరిస్థితిని అదుపులో ఉంచుకోవచ్చు. ఒత్తిడిని అధిగమించేందుకు యోగా, ధ్యానం వంటివి కూడా చక్కెర జబ్బును నియంత్రణలో ఉంచుతాయి.రక్తంలో చక్కెరస్థాయి సాధారణ స్థితిలో ఉంచుకునేందుకు వైద్యుల సలహాపై క్రమం తప్పకుండా తగిన మందులు వాడుతూ ఉండాలి. అదనపు బరువు ఉంటే అదుపులోకి తెచ్చుకోవాలి. ప్రశాంతంగా కంటినిండా నిద్రపోవాలి. అరుదైన పరిస్థితుల్లో తప్ప సాధారణంగా వచ్చే డయాబెటిస్ను పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు. డయాబెటిస్ వచ్చాక ఆరోగ్యకరమైన అలవాట్లతో దీనిని నియంత్రించుకోవడం తప్ప మార్గం లేదు. - ఇన్పుట్స్: డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి కన్సల్టెంట్ - ఇంటర్నల్ మెడిసిన్ అండ్ డయాబెటిస్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్ టైప్-1 డయాబెటిస్ ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో కనిపిస్తుంది. జన్యులోపం వల్ల వస్తుంది. పిల్లల్లోని రోగనిరోధక వ్యవస్థ పాంక్రియాస్లోని బీటా సెల్స్ను పరాయి కణాలుగా ఎంచి నాశనం చేయడంతో ఇన్సులిన్ ఉత్పత్తి నిలిచిపోతుంది. దీనినే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మెలిటస్ అని అంటారు. దీనిని జువెనైల్ డయాబెటిస్ అని కూడా అంటారు. అయితే, కొందరికి ఎదిగిన తర్వాత కూడా టైప్-1 డయాబెటిస్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. దీనికి వైద్యుల పర్యవేక్షణలో నిత్యం ఇన్సులిన్ తీసుకోవడమే ఏకైక మార్గం. ఇక జెస్టేషనల్ డయాబెటిస్ ఉన్న తల్లులకు పుట్టిన పిల్లలకు భవిష్యత్తులో డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కొన్ని అరుదైన రకాలు... డయాబెటిస్లో ‘మోడీ’(కైఈ్గ)... మెచ్యూరిటీ ఆన్సెట్ ఆఫ్ ద డయాబెటిస్ ఇన్ ద యంగ్, ‘లాడా’ (ఔఅఈఅ)... లేటెంట్ ఆటోఇమ్యూన్ డయాబెటిస్ ఇన్ అడల్ట్స్ వంటి కొన్ని అరుదైన రకాలూ ఉన్నాయి. ఇందులో మొదటిది 30 ఏళ్లలోపు వాళ్లలో ఎక్కువ. ఎలా నియంత్రించవచ్చు..? ఎక్కువ మందిలో కనిపించే టైప్-2 డయాబెటిస్ను కొద్దిపాటి జాగ్రత్తలతో నియంత్రించుకోవచ్చు.ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, తగినంత వ్యాయామం చేయడం, శరీరం బరువు సాధారణ స్థాయికి మించి పెరగకుండా చూసుకోవడం వంటి తేలికపాటి జాగ్రత్తలతో దీని బారిన పడకుండా చూసుకోవచ్చు.ఒకేసారి ఎక్కువ మోతాదులో తినే బదులు, కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తినాలి. ఇలా తినే ఆహారంలో తప్పనిసరిగా పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.కొవ్వుల్లో చేటు చేసే కొవ్వులుంటాయి. వాటిని లో డెన్సిటీ లైపోప్రోటీన్స్ (ఎల్డీఎల్) అంటారు. వేటమాంసం (రెడ్ మీట్), వెన్న, నెయ్యి వంటి జంతు సంబంధిత కొవ్వులను చెడు కొవ్వుపదార్థాలుగా పరిగణిస్తారు. డయాబెటిస్ బారిన పడినవారు వీటికి దూరంగా ఉండటం మంచిది. మంచి కొవ్వులను హై డెన్సిటీ లైపో ప్రోటీన్స్ (హెచ్డీఎల్) అంటారు.గుడ్లలో ఉండే తెలుపుసొన, చేపలు, అవిసెగింజలు, వాల్నట్స్, శాకాహార నూనెల్లో మంచి కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. చక్కెరలు మోతాదుకు మించి ఉండే కూల్డ్రింక్స్, స్వీట్స్, చాక్లెట్లు, పొటాటో చిప్స్ వంటి వాటికి దూరంగా ఉండటం ద్వారా రక్తంలో చక్కెరల స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు.చక్కెర, ఉప్పు, మైదాలకు దూరంగా ఉండటం ద్వారా కూడా చక్కెరజబ్బును అదుపు చేయవచ్చు. నికోటిన్ - డయాబెటిస్ పొగతాగేవారిలో నికోటిన్తో పాటు కాడ్మియం వంటి భారలోహాలు రక్తనాళల్లోకి చేరతాయి. అవి రక్తనాళాలల్లోని లోపలి పొరను నష్టపరిచి జీవక్రియల తీరును (మెటబాలిజమ్ను) దెబ్బతీసి, డయాబెటిస్కు దారితీయవచ్చు. పొగతాగేవారిలో రక్తనాళాలు కుంచించుకుపోవడం, రక్తంలో అడ్డంకులు ఏర్పడటం వంటి సమస్యల వల్ల గుండెజబ్బులు తద్వారా అవి డయాబెటిస్కు దారితీయవచ్చు. లేదా డయాబెటిస్ ఉన్నప్పుడు గుండెజబ్బులు రావచ్చు. కాబట్టి డయాబెటిస్ వచ్చినవారిలో గుండెజబ్బు లేకపోయినా... అది ఉన్నట్లుగా పరిగణించి డాక్టర్లు అవసరమైన జీవనశైలి మార్పులు సూచిస్తారు. డయాబెటిక్ సెలిబ్రిటీలు డయాబెటిస్ అంటే యాక్టివ్ లైఫ్కు ఫుల్స్టాప్ కాదు. డయాబెటిస్ ఉన్నా చాలామంది సెలిబ్రిటీలు తమ తమ రంగాల్లో రాణిస్తున్నారు. భారతీయ నటీనటులు కమల్ హాసన్, సుధాచంద్రన్, సోనమ్ కపూర్, సమంతా, ‘ఆస్కార్’నటి హాలీ బెరీ, హాలీవుడ్ నటి సల్మా హయక్, పాకిస్తానీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ వంటి వాళ్లు డయాబెటిస్ బాధితులే. జీవనశైలిని మరింత చురుకుగా మార్చుకోవడం ద్వారా వీరంతా ఈ సమస్యను విజయవంతంగా నియంత్రణలో ఉంచుకోగలుగుతున్నారు. -
ప్రాణాలు తీస్తున్న రక్తహీనత
మహిళలకు మాతృత్వం దేవుడిచ్చిన గొప్ప వరం. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన వారు మాతృత్వం కోసం పరి తపిస్తుంటారు. అమ్మతనంలోని మాధుర్యాన్ని అనుభవించాలని ఆరాటపడుతారు. అలాంటి మాతృత్వం జిల్లా ఏజెన్సీలోని మహిళలకు శాపంగా మారుతోంది. గిరి సీమలో సరైన పోషకాహారం లభించక రక్తహీనతతో గర్భిణులు, బాలింతలు మృత్యు ఒడికి చేరుతున్నారు. కొంతకాలంగా ఏజెన్సీలో ఎక్కడో ఓ చోట గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం లోపించి రక్తహీనతతో చనిపోతూనే ఉన్నారు. గత నెలలో సమస్యాత్మక మండలాల్లో ముగ్గురు బాలింతలు రక్తహీనతతో మృతిచెందడం ఆందోళన కలిగిస్తోంది. ఉట్నూర్ : సాధారణంగా మనిషి శరీరంలో 14 గ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి. 12 నుంచి 16 గ్రాముల వరకు ఉంటే ఆరోగ్యవంతులుగా భావిస్తారు. ఏజెన్సీలోని గర్భిణి, బాలింతల్లో 15 నుంచి 18 గ్రాముల వరకు, చిన్నారుల్లో 9 నుంచి 12 గ్రాముల వరకు ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు. దీనికితోడు ఏజెన్సీలోని బాలింతలు, గర్భిణుల్లో ఏడు గ్రాముల కంటే తక్కువగా హిమోగ్లోబిన్ ఉంటోంది. ఏజెన్సీలోని పీహెచ్సీల పరిధిలో ఆగస్టు నెల వరకు 4,999 మంది గిరిజన గర్భిణులు ఉన్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. వీరిలో 75 శాతం గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్న వారే కావడం గమనార్హం. వీరికి సరైన పోషకాహారం దొరక్క పరిస్థితి ఇలా ఉంది. వీరిలో చాలామంది నెలనెలా వైద్య పరీక్షలు చేయించుకోకుండా దూరంగా ఉంటున్నారు. దీంతో చాలామందిలో రక్తహీనత సమస్య రావడంతో ప్రసవ సమయంలో రక్తస్రావం అధికమై చనిపోతున్నారు. శాపంగా పోషకాహారం లోపం.. ఏజెన్సీలో పోషకాహార లేమి గిరిజనుల పాలిట శాపంగా మారుతోంది. సరిపడా ఆహారం దొరక్క.. దొరికిన దాంట్లో పోషక విలువలు కొరవడడంతో శ రీరంలో హిమోగ్లోబిన్ శాతం వేగంగా తగ్గుతోంది. ఎర్ర రక్తకణాల సంఖ్య పడి పోతూ రక్తహీనతకు గురవుతున్నారు. రక్తహీనతను నివారించడానికి గర్భిణి, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు ఉట్నూర్లో 2008లో ఏర్పాటుచేసిన పోషక ఆహార పునరావాస కేంద్రం మూతపడింది. సమస్యాత్మక మండలాలైన నార్నూర్, జైనూర్, ఇంద్రవెల్లి, ఉట్నూర్, సిర్పూర్(యు)లోని గ్రామాల్లో ఏర్పాటు చేసిన 170 సంపూర్ణ గ్రామ ఆరోగ్య కేంద్రాల్లో సగానికి పైగా మూతపడ్డాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆశయం నీరుగారుతోంది. ఏజెన్సీలోని మహిళల మరణాలను నిరోధించేందుకు ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా ఆహార భద్రత కార్యక్రమం చేపట్టినా.. ఐటీడీఏ మధ్యలోనే చేతులెత్తేసింది. ఏజెన్సీలో 2007లో 35,402 గిరిజన కుటుంబాలు, 2008లో 28,217 కుటుంబాలు, 2009లో 11,667 కుటుంబాలు, 2011లో 13,269 కుటుంబాలకు ఈ పథకం ద్వారా పోషకాహారం అందించారు. తదుపరి నాలుగేళ్లుగా ఆ ఊసే లేదు. అవగాహన కరువు.. ఏజెన్సీలో మహిళలు గర్భం దాల్చిన నాటి నుంచి తీసుకోవాల్సిన పౌష్టికాహారం, జాగ్రత్తలపై అవగాహన కల్పించాల్సిన వైద్య సిబ్బంది ఆ దిశగా చర్యలు చేపట్ట డం లేదు. ఫలితంగా క్రమం తప్పకుండా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలకు వారు దూరంగా ఉంటున్నారు. ప్రసూతి సమయంలో ఆస్పత్రికి వెళ్లకుండా ఇంట్లోనే సాధారణ ప్రసూతి చేసుకోవాలని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గర్భిణులుగా ఉన్న సమయంలో పేర్లు నమోదు చేసుకునే సిబ్బంది.. తర్వాత వారిని విస్మరిస్తున్నారు. ఏజెన్సీ వాసులు వైద్యం కోసం డివిజన్ కేం ద్రంలోని ఉట్నూర్లో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రానికి వస్తుంటారు. ప్రసూతి సమయంలో గర్భిణులను ఈ కేంద్రానికి తీసుకువద్దామంటే సీహెచ్సీలో రెండు గైనకాలజిస్టు పోస్టులు, అనస్థీషియా, ప్రిడియాస్ట్రీషన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతంలో ఐటీడీఏ ద్వారా నెలసరి వేతనం రూ.లక్షన్నర ఇస్తామని ప్రకటనలు ఇచ్చినా.. ఇక్కడ విధులు నిర్వర్తించేందుకు ఎవ రూ రా లేదు. దీంతో సీహెచ్సీలో గైనకాలజిస్టులు లేక ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. కొందరు అక్కడికి వెళ్లలేక.. ఆర్థిక స్థోమతకు నోచుకోక ప్రాణాలు కోల్పోతున్నారు. చర్యలు తీసుకుంటున్నాం.. రక్తహీనతతో గర్భిణులు, బాలింతలు మృతిచెందకుండా చర్యలు తీసుకుంటుంన్నాం. వీరిపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందిని ఆదేశించాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవం అయ్యేలా అవగాహన కల్పిస్తూ ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను వివరిస్తున్నాం. - ప్రభాకర్ రెడ్డి, ఏజెన్సీ అదనపు వైద్యాధికారి గత నెలలో మృత్యువాత పడిన బాలింతలు.. - జైనూర్ మండలం పుల్లారాకు చెందిన ఆత్రం లలిత(48). నెలలు నిండడంతో నెల రోజుల ముందుగానే ప్రసవం కోసం తల్లిగారిళ్లు గూడమామడకు వచ్చింది. ఆగస్టు 17న పురిటి నొప్పులు రావడంతో ప్రసవం కోసం ఉట్నూర్ సీహెచ్సీకి ఆటోలో తరలిస్తుండగా రక్తహీనతకు తోడు తీవ్ర రక్తస్రావమైంది. దీంతో తల్లి, పుట్టిన బిడ్డ మృతిచెందారు. - నార్నూర్ మండలం శివనారాకు చెందిన సిడాం రాంబాయి(22) గత నెల 25న రక్తహీనతతో మృతిచెందింది. 20 రోజుల క్రితం మగశిశువుకు జన్మనిచ్చిన రాంబాయి రక్తహీనతతో బాధపడుతోంది. దీనికి తోడు జ్వరం రావడంతో గాదిగూడ పీహెచ్సీకి వైద్యం కోసం తీసుకెళ్లారు. వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో గ్రామంలోని ఆర్ఎంపీకి చూపించారు. పరిస్థితి విషమించిందని.. రిమ్స్కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో రిమ్స్కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. - కెరమెరి మండలం కోలాంగూడ(డి)కు చెందిన ఆత్రం మారుబాయి(25) గత నెల 21న ఆడ శిశువుకు జన్మనిచ్చింది. మరుసటి రోజు వైద్యం కోసం ఆమెను ఉట్నూర్ సీహెచ్సీకి, అక్కడి నుంచి రిమ్స్కు తరలించారు. మూడు రోజులు చికిత్స పొంది మృతిచెందింది. రక్తహీనతతో బాధపడుతూ మృతి చెందిందని కుటుంబీకులు పెర్కొన్నారు. - వాంకిడి మండలం ఖిర్ది గ్రామానికి చెందిన ఈశ్వరిబాయి గత నెల 25న ఇంట్లో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత తీవ్ర రక్తస్రావం జరగడంతో కొద్ది గంటల్లోనే మృత్యువాత పడింది. -
ఆస్పత్రుల చరిత్ర చెప్పే ‘హెల్దీ’ యాప్
పంజగుట్ట: హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్న ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, క్లినిక్లు, బ్లడ్ బ్యాంక్ల సమాచారం తెలుసుకునేందుకు విధూ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ‘హెల్దీ’ (Healtheey) పేరుతో కొత్త మొబైల్ యాప్ తయారు చేశారు. శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో యాప్ రూపకర్తలు గణేష్, సంపత్, సుదర్శన్ దీన్ని ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. బయటి నుంచి నగరానికి వచ్చి ఆస్పత్రుల వివరాలు తెలియక సతమతమయ్యే వారికి ఈ యాప్ ఉపయోగ పడుతుందన్నారు. నగరంలో ఎక్కడి నుండైనా ఆస్పత్రుల సమాచారం కోసం ఈ యాప్ను ఉపయోగించుకుంటే.. సదరు వ్యక్తి నిలబడిన చోటు నుంచి 5 కిలోమీటర్ల లోపు ఉన్న ఆస్పత్రుల వివరాలు, సదరు ఆస్పత్రి ఏ వ్యాధికి విజయవంతంగా చికిత్స అందిస్తుంది.. అక్కడి వైద్య పరికరాలు, వైద్యుల వివరాలు, సౌక ర్యాలు, ఆస్పత్రి చరిత్ర వస్తాయని తెలిపారు. ఇప్పటివరకూ యాప్లో నగరంలోని 50 ఆస్పత్రుల వివరాలు పొందుపరిచామని, త్వరలో మరికొన్ని ఆస్పత్రుల వివరాలు ఉంచనున్నట్లు తెలిపారు.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మూకుమ్మడిగా సెలవు పెట్టిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఉద్యోగులు
Yashika Aannand: అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న యాషిక ఆనంద్ (ఫొటోలు)
Paris Olympics 2024: భారత రెజ్లర్లకు ఆఖరి అవకాశం
65 ఏళ్లలో 7.8 శాతం తగ్గిన హిందూ జనాభా
కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రచారం
Mayawati: మేనత్త నిర్ణయంపై పెదవి విప్పిన ఆకాష్ ఆనంద్
ఎన్నికల ప్రచారంలో మంత్రి రోజాకు అపూర్వ స్వాగతం
జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
పచ్చ మద్యం స్వాధీనం..
SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- SRH: వాళ్లిద్దరు పిచ్ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్కుమార్
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- మా పిల్లల చదువులపై కుట్రలొద్దు బాబూ
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement