-
ఐపీఎల్ ఒలింపిక్స్తో సమానం.. చాలా సంతోషంగా ఉంది: లక్నో హెడ్ కోచ్
ఐపీఎల్పై ఆస్ట్రేలియా మాజీ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్ ఒలిపింక్స్తో సమానమని లాంగర్ అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2024 సీజన్కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ తమ ప్రధాన కోచ్గా నియమించుకుంది. ఆండీ ప్లవర్ స్ధానాన్ని లంగర్తో లక్నో ఫ్రాంచైజీ భర్తీ చేసింది. ఐపీఎల్లో హెడ్కోచ్ పదివి చేపట్టడం లంగర్కు ఇదే తొలిసారి కావడం గమనార్హం. లంగర్కు కోచ్గా అద్బుతమైన ట్రాక్ రికార్డు ఉంది. అతడి నేతృత్వంలోనే ఆసీస్ తొలి టీ20 వరల్డ్కప్(2021)ను సొంతం చేసుకుంది. అదే విధంగా బిగ్బాష్ లీగ్లో కూడా లంగర్ కోచ్గా విజయవంతమయ్యాడు. ఈనేపథ్యంలో లక్నో ఫ్రాంచైకి ఇచ్చిన ఇంటర్వ్యూలో లంగర్ మాట్లాడుతూ.. "రికీ పాటింగ్కు ఐపీఎల్ టోర్నీ అంటే చాలా ఇష్టం. అతడితో నేను ఎప్పుడు మాట్లాడిన ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్తో తన ప్రయాణం గురించే చెబుతూ ఉంటాడు. అదే విధంగా నా బెస్ట్ ఫ్రెండ్ టామ్ మూడీ సైతం ఐపీఎల్లో చాలా కాలంగా తన సేవలు అందిస్తున్నాడు. అతడు కూడా చాలా సార్లు ఈ టోర్నీ కోసం నాతో మాట్లాడాడు. ఐపీఎల్ అనేది ఒలింపిక్స్ క్రీడలు వంటిది. ఇది చాలా పెద్ద ఈవెంట్. ప్రతీ మ్యాచ్ ఒక అద్భుతం. ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్కు ఆదరణ ఉంది. మ్యాచ్ జరుగుతున్నప్పుడు స్టేడియాలు దద్దరిల్లిపోతాయి. ఇటువంటి లీగ్లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. చదవండి: PAK vs AUS: పాకిస్తాన్తో మూడో టెస్టు.. ఆసీస్ జట్టు ప్రకటన! వార్నర్కు ఆఖరి మ్యాచ్ -
ఆర్సీబీ హెడ్ కోచ్గా భారత మాజీ ఆటగాడు..
RCB appoint Sanjay Bangar as head coach: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హెడ్కోచ్గా భారత మాజీ ఆటగాడు సంజయ్ బంగర్ ఎంపికయ్యాడు. తదుపరి రెండు ఐపీఎల్ సీజన్లకు ప్రధాన కోచ్గా అతడిని ఆర్సీబీ నియమించింది. అయితే గత కొద్ది సీజన్ల నుంచి ఆ జట్టుకు బ్యాటింగ్ కోచ్గా బంగర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా ఐపీఎల్-2021 తొలి దశలో ఆర్సీబీకు ప్రధాన కోచ్గా ఉన్న సైమన్ కటిచ్.. సెకెండ్ ఫేజ్కు వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. అతడి స్ధానంలో మైక్ హెస్సన్ తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టాడు. ఇక మైక్ హెస్సన్ ఆజట్టు క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్గా కొనసాగనున్నాడు. అయితే ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో తదుపరి ఆర్సీబీ సారథి ఎవరన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. చదవండి: Virat Kohli: ఓటమితో ఆరంభించి.. 'ఓటమి'తో ముగించినా.. లవ్ యూ భాయ్! -
ఐపీఎల్ అసలు క్రికెట్టే కాదు.. ప్రముఖ వ్యాఖ్యాత సంచలన వ్యాఖ్యలు
ఆంటిగ్వా: పొట్టి ఫార్మాట్పై వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్, ప్రముఖ వ్యాఖ్యాత మైఖేల్ హోల్డింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 ఫార్మాట్ అసలు క్రికెట్టే కాదని, అందుకే ఆ ఫార్మట్లో జరిగే ఐపీఎల్ తదితర లీగ్ల్లో కామెంటరీ చెప్పడం లేదని పేర్కొన్నాడు. తాజాగా ఇండియన్ ఎక్స్ప్రెస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తాను క్రికెట్కు మాత్రమే కామెంటరీ చెబుతానని, తాను ఐపీఎల్ను క్రికెట్గా పరిగణించనని, అందుకే కామెంటరీ చెప్పడం లేదని వెల్లడించాడు. ఈ సందర్భంగా ప్రస్తుత విండీస్ క్రికెట్ దుస్థితిపై ఆయన స్పందించాడు. టీ20ల కారణంగా సుదీర్ఘ ఫార్మాట్లో తమ దేశం రాణించలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటీవలి కాలంలో తమ జట్టు పొట్టి ఫార్మాట్లో రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచినప్పటికీ.. ఆ గెలుపు అసలు గెలుపే కాదని, ఈ టోర్నీలు నెగ్గడం విండీస్ క్రికెట్కు పునరుజ్జీవం కాదని అభిప్రాయపడ్డాడు. విండీస్ క్రికెటర్లు దేశం కోసం టెస్ట్ క్రికెట్ ఆడడం మానేసి, డబ్బు కోసం ఐపీఎల్ లాంటి క్యాష్ రిచ్ లీగ్ల బాట పట్టారని ఆయన వాపోయాడు. విండీస్ లాంటి పేద దేశం భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులలా ఆటగాళ్లకు వేతనాలు చెల్లించలేవని, అందుకే తమ ఆటగాళ్లు ఆ దేశాల్లో జరిగే టీ20 క్రికెట్ ఆడేందుకు ఇష్టపడుతున్నారని పేర్కొన్నాడు. వేతన వివాదాలపై తమ దేశ క్రికెట్ బోర్డు, ఆటగాళ్ల మధ్య అనేక వివాదాలున్నాయని, ఇలాంటి పరిస్థితులుంటే ఆటగాళ్లు మాత్రం ఏం చేయగలరని వ్యాఖ్యానించాడు. క్రికెటర్లను నిందించడం తన ఉద్దేశం కాదని, డబ్బులు ఎర వేసి ఆటగాళ్లను లోబర్చుకుంటున్న నిర్వాహకులను మాత్రమే తాను విమర్శిస్తున్నాని పేర్కొన్నాడు. తమ దేశ స్టార్ క్రికెటర్లు టెస్ట్ క్రికెట్కు చాలా సేవలు చేయాల్సి ఉందని, కానీ వారికి అవేవీ పట్టడం లేదని గేల్, రసెల్, బ్రేవో, పొలార్డ్, సునీల్ నరైన్ లాంటి క్రికెటర్లనుద్దేశించి వ్యాఖ్యానించాడు. ఇటీవలి కాలంలో విండీస్ జట్టు టీ20 టోర్నమెంట్లను గెలుస్తుండవచ్చని, అయితే అది క్రికెట్టే కాదు.. అసలు గెలుపే కాదని తెలిపాడు. కాగా, మైఖేల్ హోల్డింగ్ ఇటీవలే జాత్యహంకార అంశంపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ తాను ఇంగ్లండ్లో పెరిగి ఉంటే.. అసలు బతికి ఉండేవాడినే కాదని, అదృష్టవశాత్తు తాను అక్కడ పెరగలేదని, లేదంటే యువకుడిగా ఉన్నప్పుడే చనిపోయేవాడినని అన్నాడు. 1979లో వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన 67 ఏళ్ల హోల్డింగ్ విండీస్ తరఫున 60 టెస్టులు, 102 వన్డేలు ఆడాడు. మొత్తంగా 391 వికెట్లు పడగొట్టాడు. చదవండి: కోహ్లీని తప్పిస్తే టీమిండియా ఐసీసీ టోఫ్రీ గెలుస్తుందా..? -
క్రికెట్ కుంభమేళా: నేటి నుంచి ఐపీఎల్–2021
ఐపీఎల్ ఆటకు వేళయింది. టైటిల్ వేటకు రంగం సిద్ధమైంది. ఈ రెండింటికి ముందే ‘పాజిటివ్’ల గోల మొదలైంది. డగౌట్లో మాస్క్లతో... మైదానంలో బ్యాట్, ప్యాడ్లతో మెరుపుల లీగ్ రెడీ రెడీ అంటోంది. ఓ విధంగా ఇది క్రికెట్ కుంభమేళానే! కానీ వైరస్ వల్ల ప్రత్యక్షంగా చూడలేకపోయినా... ప్రపంచవ్యాప్తంగా అభిమానులంతా టీవీలకే అతుక్కుపోయే క్రికెట్ మేళా ఇది! ఒకప్పుడు ఐపీఎల్ అంటే బౌండరీ మీటర్, పర్పుల్ క్యాప్, ఆరెంజ్ క్యాప్లే తారుమారయ్యేవి. కానీ ఇప్పుడు మహమ్మారి కేసులు, క్వారంటైన్, ఐసోలేషన్లు లీగ్లో భాగమయ్యాయి. ఆటగాళ్లు తేల్చుకుంటారు మైదానంలో! మనం మాత్రం చూసుకుందాం టీవీల్లో! ఎందుకంటే కరోనా వైరస్ కాచుకుంది. గతానికి భిన్నంగా మనదేశంలో జరిగే ఐపీఎల్ పోటీలను మన వెళ్లి చూడలేని పరిస్థితి. గతేడాది యూఏఈలో జరిగినా... అది పరాయిగడ్డ! కానీ మన నగరాల్లో మెరుపులు మెరిపిస్తున్నా... అవి మనకు బుల్లితెరల్లోనే కనిపిస్తాయి. ఈల గోల ఉండదు. ఆడే ఆటగాళ్లు, తీర్పులిచ్చే అంపైర్లు, ఖాళీగా కుర్చీలు కనిపిస్తాయి. అయితే ఆట బోసిపోదు. మెరుపుల పవర్ తగ్గదు. బౌలింగ్ పదును తగ్గదు. తొలి పంచ్ విసిరేందుకు డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ సై అంటోంది. శుభారంభం చేసేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సిద్ధమంటోంది. -
సన్రైజర్స్కు షాక్.. కీలక ఆటగాడికి గాయం..!
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్ ప్రారంభానికి ముందే సన్రైజర్స్ హైదరాబాద్కు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు కీలక బ్యాట్స్మన్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మోచేతి గాయంతో బాధపడుతూ, బంగ్లాదేశ్తో జరగనున్న వన్డే సిరీస్కు దూరం అయ్యాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ధృవీకరించడంతో సన్రైజర్స్ యాజమాన్యంలో గుబులు మొదలైంది. గడిచిన కొన్ని సీజన్లుగా సన్రైజర్స్ తరఫున కీలక ఆటగాడిగా రాణిస్తున్న విలియమ్సన్ గాయం కారణంగా దూరమైతే ఆ జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని యాజమాన్యం భావిస్తోంది. ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్, టీ20 ప్రపంచకప్ల నేపథ్యంలో కేన్ విలియమ్సన్ ఫిట్గా ఉండటం తమకెంతో ముఖ్యమని న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపాడు. కివీస్ హెడ్ కోచ్ ప్రకటన నేపథ్యంలో విలియమ్సన్ ఐపీఎల్ 2021 సీజన్ ఆడటంపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో సన్రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, కీలక ఆటగాడు బెయిర్ స్టోలపై అదనపు భారం పడనుంది.
Pagination
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కదన రంగంలోకి కమల దళపతులు
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
- బెదిరింపుల పర్వం!
- ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?
- సమస్య ఏదైనా.. సత్తిబాబు మీ వెంటున్నాడు..
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
- దుబాయ్లో అతి పెద్ద విమానాశ్రయం.. ప్రత్యేకతలు ఇవే..
- నా పేరు గణ.. నా అరాచకాలేంటో.. పదేళ్లలో చూసే ఉంటారు...
- ప్రియాంక విజయానికి ‘స్పెషల్ 24’!
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
Advertisement