పంజాబ్, చెన్నైలకు ఇప్పటికే అర్హత
రాజస్థాన్, కోల్కతాలకు మెరుగైన అవకాశాలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ కీలక దశకు చేరుకుంది. లీగ్లో 56 మ్యాచ్లకు గాను 48 మ్యాచ్లు ముగిశాయి. ఇంకా ఎనిమిది మ్యాచ్లు జరగాల్సి ఉంది. అయితే ఏడో సీజన్లో ఎవరూ ఊహించని విధంగా సంచలన విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇంతకుముందే ప్లే ఆఫ్ దశకు చేరుకుంది. మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కూడా ప్లే ఆఫ్ బెర్తును ఖరారు చేసుకుంది. ఢిల్లీకి ఎలాంటి అవకాశాలు లేవు. ఇక మిగిలిన రెండు బెర్తుల కోసం ఐదు జట్లు పోటీపడుతున్నాయి. దీంతో ప్లే ఆఫ్ రేసు ఆసక్తికరంగా మారింది. ఆయా జట్ల ప్రస్తుత స్థితి...
- సాక్షి క్రీడావిభాగం
రాజస్థాన్ రాయల్స్
ప్రస్తుతం: 12 మ్యాచ్ల్లో 14 పాయింట్లు
ఆడాల్సినవి: 23న పంజాబ్ (మొహాలీలో)తో, 25న ముంబై (వాంఖడేలో)తో
ప్లే ఆఫ్ అవకాశాలు: రెండు మ్యాచ్ల్లో కనీసం ఒకటి నెగ్గినా రాజస్థాన్ రాయల్స్ తదుపరి దశకు సమీకరణాలతో సంబంధం లేకుండానే అర్హత సాధిస్తుంది. ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ రెండు మ్యాచ్ల్లో ఓడితే అప్పుడు నెట్ రన్రేట్ కీలకమవుతుంది. రెండు మ్యాచ్ల్లో ఓడటం ద్వారా రాజస్థాన్ రన్రేట్ మరింతగా పడిపోతుంది. లేదంటే బెంగళూరు, హైదరాబాద్, ముంబై జట్లు ఒక్కో మ్యాచ్లో ఓడిపోవాలి.
కోల్కతా నైట్ రైడర్స్
ప్రస్తుతం: 12 మ్యాచ్ల్లో 14 పాయింట్లు
మిగిలిన మ్యాచ్లు: 22న బెంగళూరు (ఈడెన్లో)తో,
24న హైదరాబాద్ (ఈడెన్లో)తో
ప్లే ఆఫ్ అవకాశాలు: కనీసం ఒక్క మ్యాచ్ గెలిచినా ప్లే ఆఫ్ చేరుతుంది. ఒకవేళ రెండూ ఓడితే బెంగళూరు, హైదరాబాద్, ముంబై జట్లు ఒక్కో మ్యాచ్లో ఓడాలి.
ముంబై ఇండియన్స్
ప్రస్తుతం: 12 మ్యాచ్ల్లో 10 పాయింట్లు
మిగిలిన మ్యాచ్లు: 23న ఢిల్లీతో, 25న రాజస్థాన్తో (రెండు వాంఖడేలోనే)
ప్లే ఆఫ్ అవకాశాలు: చివరి రెండు మ్యాచ్ల్లో తప్పనిసరిగా గెలవాలి. రన్రేట్ కూడా మెరుగుపడాలి. అలాగే హైదరాబాద్, బెంగళూరు జట్లు తప్పనిసరిగా ఒక్కో మ్యాచ్లో ఓడాలి. రాజస్థాన్, కోల్కతాలలో ఒక జట్టు రెండు మ్యాచ్లు ఓడాలి.
బెంగళూరు రాయల్ చాలెంజర్స్
ప్రస్తుతం: 12 మ్యాచ్ల్లో 10 పాయింట్లు
మిగిలిన మ్యాచ్లు: 22న కోల్కతా (ఈడెన్లో)తో,
24న చెన్నై (బెంగళూరులో)తో
ప్లే ఆఫ్ అవకాశాలు: చివరి రెండు మ్యాచ్ల్లో తప్పనిసరిగా గెలవాలి. అదే సమయంలో తనకన్నా మెరుగైన స్థానంలో ఉన్న రాజస్థాన్, కోల్కతా జట్లలో ఏదైనా ఒక జట్టు తాను ఆడే రెండు మ్యాచ్ల్లోనూ ఓడిపోవాలి. అదే సమయంలో హైదరాబాద్, ముంబై జట్లు ఒక్కో మ్యాచ్లో అయినా ఓడిపోవాలి. బెంగళూరు రన్రేట్ కూడా మెరుగుపడాలి.
హైదరాబాద్ సన్రైజర్స్
ప్రస్తుతం: 12 మ్యాచ్ల్లో 10 పాయింట్లు
మిగిలిన మ్యాచ్లు: 22న చెన్నై (రాంచీలో)తో,
24న కోల్కతా (ఈడెన్లో)తో
ప్లే ఆఫ్ అవకాశాలు: తదుపరి దశకు చేరాలంటే మిగిలిన రెండు లీగ్ మ్యాచ్ల్లో గెలుపుతో పాటు రేసులో ఉన్న మిగిలిన జట్ల ఫలితాలపై సన్రైజర్స్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. 14 పాయింట్లు సాధించిన రాజస్థాన్, కోల్కతా జట్లలో ఏదైనా ఒక జట్టు తాను ఆడే రెండు మ్యాచ్ల్లోనూ ఓడిపోవాలి. అదే సమయంలో బెంగళూరు, ముంబై జట్లు కచ్చితంగా ఒక్కో మ్యాచ్లో ఓడాలి. హైదరాబాద్ రన్రేట్ కూడా మెరుగుపడాలి.
రంజుగా ప్లే ఆఫ్ రేసు
Published Thu, May 22 2014 12:52 AM
Advertisement
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
ఆసియాలోనే అతిపెద్ద సూపర్ స్టార్ గా రజనీ..ఆ విషయంలో అందరికంటే టాప్..
కౌంటింగ్ ప్రక్రియకుపరిశీలకుల నియామకం
ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు
16కు తగ్గదు.. 30కి పెరగదు.. ఏసీతో ఎందుకలా?
అసలు విషయం చెప్పేసిన రష్మిక..గాల్లో తేలుతున్న రౌడీ బాయ్స్..
విద్యుదీకరణ త్వరగా పూర్తి చేయండి
వన్యప్రాణులపై తూటా..!
బెస్ట్ వేల్యూ యూనివర్సిటీ ర్యాంకింగ్లో ఏయూకు స్థానం
మరో ముగ్గురు అటవీఅధికారులపై వేటు
కేజీహెచ్కు కారు వితరణ
తప్పక చదవండి
- ఎలాన్ మస్క్కు నాగ్ అశ్విన్ రిక్వెస్ట్.. ఇండియాకు రావాలంటూ ట్వీట్
- India vs China: టగ్ ఆఫ్ వార్లో భారత బలగాల గెలుపు
- నన్ను వాళ్లు మోసం చేశారు: నటుడు జగపతిబాబు
- రేవ్ పార్టీ కేసులో నటి హేమకు మరోసారి నోటీసు
- JC Diwakar Reddy: వేధించి, ఆపై సంతకాన్ని ఫోర్జరీ చేసి..
- ఈ ఏడాది.. వికసించిన 'మే పుష్పం' ఇదే!
- స్కానింగ్ సెంటర్ వికృత చేష్టలపై కలెక్టర్ సీరియస్.. నలుగురి కమిటీ
- ప్రమాదమా.. గాయాలేవీ? ఖమ్మం కేసులో ట్విస్ట్
- ముస్లిం ఓటు బ్యాంకు ప్రభావమెంత? ఏ పార్టీకి ప్రయోజనం?
- 'గోరుముద్ద'కు తాజ్ రుచులు
Advertisement