breaking news
Sports
-
రోహిత్, కోహ్లి అభిమానులకు గుడ్ న్యూస్
దౌత్యపరమైన ఉద్రిక్తతల కారణంగా ఆగస్ట్లో జరగాల్సిన భారత్-బంగ్లాదేశ్ పరిమిత ఓవర్ల సిరీస్ ఏడాది పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో ఆగస్ట్లో టీమిండియా ఖాళీగా ఉండనుంది. ఈ ఖాళీని భర్తీ చేసేందుకు బీసీసీఐ శ్రీలంక క్రికెట్ బోర్డుతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఆగస్ట్లో భారత్, శ్రీలంక మధ్య పరిమిత ఓవర్ల సిరీస్లు (3 వన్డేలు, 3 టీ20లు) నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంది.ఇందుకు శ్రీలంక బోర్డు ఒకే చెబితే మరికొద్ది రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఆగస్ట్లో జరగాల్సిన లంక ప్రీమియర్ లీగ్ కూడా వాయిదా పడటంతో భారత్తో సిరీస్ ఆడేందుకు శ్రీలంక బోర్డుకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకపోవచ్చు. ఆగస్ట్ చివర్లో శ్రీలంక జింబాబ్వేలో పర్యటించాల్సి ఉంది. ఆలోపే భారత్తో సిరీస్ జరిగే ఆస్కారం ఉంది. భారత్ చివరిసారిగా 2023లో శ్రీలంకలో పర్యటించింది. ఈ ఏడాది లంకలో టీమిండియా పర్యటన షెడ్యూల్ కాలేదు. అయితే అనుకోకుండా ఈ ప్రతిపాదన వచ్చింది.ఆగస్ట్లో బరిలోకి దిగనున్న దిగ్గజాలు..?భారత్, శ్రీలంక మధ్య ఆగస్ట్లో పరిమిత ఓవర్ల సిరీస్ల ప్రస్తావనకు రావడంతో టీమిండియా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఫ్యాన్స్ పట్టరాని సంతోషంతో తేలిపోతున్నారు. శ్రీలంక పర్యటనలో భారత్ మూడు వన్డేలు ఆడే అవకాశం ఉంది. ఇప్పటికే టీ20, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, కోహ్లి ఈ వన్డే సిరీస్లో తప్పక ఆడతారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ సిరీస్ సాధాసాధ్యాలపై మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ సిరీస్లో రోహిత్, కోహ్లి పాల్గొనే దానిపై కూడా క్లారిటీ రానుంది.ఒకవేళ శ్రీలంకతో సిరీస్ సాధ్యపడకపోతే మాత్రం రోహిత్, కోహ్లి అభిమానులు వారి రాక కొరకు అక్టోబర్ వరకే వేచి చూడాల్సిందే. అక్టోబర్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ జరుగనుంది. ఆస్ట్రేలియాలో జరిగే ఈ సిరీస్లో భారత్ 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. ఈ సిరీస్లో రోహిత్, కోహ్లి తప్పక ఆడే అవకాశం ఉంది. రోహిత్, కోహ్లి చివరిగా ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో కలిసి ఆడారు. ఆ టోర్నీలో భారత్ విజేతగా నిలిచి 13 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించింది. ఆ టోర్నీ తర్వాతే రోహిత్, కోహ్లి రోజుల వ్యవధిలో టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. అంతకుముందు వీరిద్దరు ఒకేసారి (2024 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత) టీ20 ఫార్మాట్కు గుడ్బై చెప్పారు. -
ENG VS IND 3rd Test: చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో రిషబ్ పంత్
టీమిండియా డాషింగ్ బ్యాటర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. రేపటి నుంచి ఇంగ్లండ్తో ప్రారంభమయ్యే మూడో టెస్ట్లో మరో 5 సిక్సర్లు బాదితే టెస్ట్ల్లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా అవతరిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. వీరూ 103 టెస్ట్ల్లో 90 సిక్సర్లు బాదాడు. వీరూ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. హిట్మ్యాన్ 67 టెస్ట్ల్లో 88 సిక్సర్లు కొట్టాడు. పంత్ విషయానికొస్తే.. ఇతగాడు కేవలం 45 మ్యాచ్ల్లోనే 86 సిక్సర్లు బాది చరిత్ర సృష్టించేందుకు మరో 5 సిక్సర్ల దూరంలో ఉన్నాడు. పంత్ ప్రస్తుత ఫామ్ను బట్టి చూస్తే రేపటి నుంచి ప్రారంభమయ్యే టెస్ట్లో ఈ రికార్డు సాధించడం ఖాయంగా కనినిస్తుంది.ఓవరాల్గా చూస్తే టెస్ట్ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో పంత్ 12వ స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్తో మూడో టెస్ట్లో పంత్ 5 సిక్సర్లు కొడితే భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డుతో పాటు టెస్ట్ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఏడో స్థానానికి ఎగబాకుతాడు. టెస్ట్ల్లో అత్యధిక సిక్సర్ల రికార్డు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ పేరిట ఉంది. స్టోక్స్ 113 మ్యాచ్ల్లో 133 సిక్సర్లు బాదాడు. స్టోక్స్ తర్వాతి స్థానాల్లో బ్రెండన్ మెక్కల్లమ్ (107), గిల్క్రిస్ట్ (100), టిమ్ సౌథీ (98), గేల్ (98), కల్లిస్ (97), సెహ్వాగ్ (91), ఏంజెలో మాథ్యూస్ (90), రోహిత్ శర్మ (88), లారా (88) ఉన్నారు (టాప్-10లో).కొద్ది రోజుల కిందట మరో భారీ సిక్సర్ల రికార్డు బద్దలు కొద్ది రోజుల కిందట జరిగిన ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో పంత్ మరో భారీ సిక్సర్ల రికార్డు సాధించాడు. విదేశీ గడ్డపై టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్గా అవతరించాడు. ఈ క్రమంలో బెన్ స్టోక్స్ పేరిట ఉన్న ఆల్టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. పంత్ ఇంగ్లండ్లో (టెస్ట్ల్లో) 23 సిక్సర్లు బాదగా.. స్టోక్స్ సౌతాఫ్రికాలో 21 సిక్సర్లు కొట్టాడు. భీకర ఫామ్లో పంత్ఇంగ్లండ్తో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో పంత్ రెండు ఇన్నింగ్స్లో శతకాలతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్లో 178 బంతుల్లో 12 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్లో 140 బంతుల్లో 15 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 118 పరుగులు సాధించాడు.ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో పంత్ తొలి ఇన్నింగ్స్లో తక్కువ స్కోర్కే (25) ఔటైనా, రెండో ఇన్నింగ్స్లో తనదైన శైలిలో మెరుపు అర్ద సెంచరీ (65) చేశాడు. రేపటి నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభమయ్యే మూడో టెస్ట్లో భారీ అంచనాలు ఉన్నాయి. పంత్ మరోసారి చెలరేగాలని అంతా ఆశిస్తున్నారు. ఈ సిరీస్లో భారత్, ఇంగ్లండ్ తలో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. తొలి టెస్ట్లో ఇంగ్లండ్ గెలవగా.. రెండో టెస్ట్లో భారత్ భారీ విజయం సాధించింది. -
చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ కుమారుడు అఖిల్ 14 ఏళ్లకే..!
పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. చెస్ గ్రాండ్మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ కుమారుడు పద్నాలుగేళ్ల అఖిల్ ఆనంద్ ( Akhil Anand) గురించి తెలుసుకుంటే ఇది అక్షరాలా నిజం అనిపిస్తుంది. ఏడేళ్ల వయసులోనే 2018లో, తన తండ్రి ఆనంద్ 49వ పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు కార్డు తయారు చేసిన ఔరా అనిపించుకున్న అఖిల్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకోబోతున్నాడు. యువ కళాకారుడిగా తొలి సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్, మోర్ఫోజెనిసిస్తో అరంగేట్రం చేయబోతున్నాడు.సోలో ఎగ్జిబిషన్ మోర్ఫోజెనిసిస్ (గణితం, పురాణాలు , ప్రకృతిని పొరల దృశ్య కథనాలలో మిళితంచేసే ఆర్ట్) తో తన కళాత్మక అరంగేట్రం చేయబోతున్నాడు.ఆగస్టు 1న చెన్నైలోని కల్పడ్రుమాలో తన తొలి సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్ను నిర్వహిస్తున్నాడు భారతదేశపు గొప్ప జానపద, గిరిజన కళా సంప్రదాయాల రూపాయల్లో, ముఖ్యంగా మధుబని ,గోండ్ చెరియాల్ వార్లి , కాళిఘాట్ - అఖిల్ పవిత్ర జ్యామితి , ఫైబొనాక్సీ ఇలా అద్భుతమైన శైలులతో ఆర్ట్ స్టోరీ ఆధారిత కళాఖండాలను ప్రదర్శించబోతున్నాడు.దీనిపై అఖిల్ ఆనంద్ మాట్లాడుతూ తన రాబోయే ప్రదర్శన గురించి మాట్లాడుతూ, , "నేను ప్రపంచాన్ని ఎలా చూస్తానో వ్యక్తీకరించడానికి కళ సహాయపడుతుంది. నేను విభిన్న శైలులు మరియు ఆలోచనలతో పనిచేయడమంటే ఇష్టం. నేను సృష్టిస్తున్న వాటిని పంచుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది కళాభిమానులకు నచ్చుతుందని భావిస్తున్నాను’’ అన్నాడు.ఆగస్టు 1 నుంచి 7 వరకు ఈ ప్రదర్శన ఉండబోతోంది. తొమ్మిదేళ్ల వయస్సు నుండి కళాకారిణి డయానా సతీష్ వద్ద శిక్షణ పొందాడు అఖిల్. భారతదేశ వారసత్వ కళలను సంరక్షించడం, ప్రాచుర్యాన్నివ్వడం అతని కళాత్మక లక్ష్యం. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, డేవిడ్ అటెన్బరో, జేన్ గూడాల్ లాంటి ప్రముఖుల ప్రేరణతో విద్య- పర్యావరణ అవగాహన సాధనాలుగా తన కళను వినియోగించుకోవడం విశేషం. అంతేకాదు అఖిల్ ఆనంద్ అఖిలిజమ్స్ అనే సంస్థ ఫౌండర్ కూడా. భారతీయ కళను ధరించగలిగే , బహుమతిగా ఇచ్చే రూపాలుగా మార్చే వేదిక. బ్లాక్ ప్రింటింగ్లో నాడీ సంబంధిత సవాళ్లతో బాధపడుతున్న వ్యక్తులకు మద్దతు ఇచ్చే ఫౌండేషన్ హస్తతో కలిసి, అఖిల్ క్రాఫ్ట్, సంరక్షణ , వ్యాపారాన్ని వారధిగా చేసే బెస్పోక్ దుస్తులను డిజైన్ చేస్తాడు. అలాగే ప్రకృతిలో గణిత నమూనాలను అన్వేషించే పుస్తకం ది హార్ట్ ఆఫ్ మ్యాథ్ రచయిత కూడా. -
Viral Video: నిప్పులు చెరిగిన ఆసీస్ పేసర్.. దెబ్బకు రెండుగా చీలిన వికెట్
ఇంగ్లండ్లో జరుగుతున్న టీ20 బ్లాస్లో ఆస్ట్రేలియా యువ ఫాస్ట్ బౌలర్ రిలే మెరిడిత్ చెలరేగిపోయాడు. నిప్పులు చెరిగే బౌలింగ్తో ప్రత్యర్థి బ్యాటర్లను భయభ్రాంతులకు గురి చేశాడు. ఈ టోర్నీలో సోమర్సెట్కు ఆడుతున్న మెరిడిత్.. నిన్న (జులై 8) ఎసెక్స్తో జరిగిన మ్యాచ్లో అరివీర భయంకరంగా బౌలింగ్ చేశాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్ నాలుగో బంతికి ఎసెక్స్ ఓపెనర్ కైల్ పెప్పర్ను క్లీన్ బౌల్డ్ చేయగా.. వికెట్ మధ్యలో రెండు ముక్కలుగా చీలింది. ఇది చూసి మెడిరిత్ చాలా ఆనందపడ్డాడు. సహజంగానే ఏ ఫాస్ట్ బౌలర్కు అయినా ఇది గర్వంచదగ్గ సందర్భం. మెరిడిత్ కూడా దీన్ని ఎంజాయ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది.RILEY SNAPS THE STUMP DOWN THE MIDDLE 🤯Have you ever seen this before?!?#SOMvESS#WeAreSomerset pic.twitter.com/VQ244pq8RR— Somerset Cricket (@SomersetCCC) July 8, 2025కాగా, ఈ మ్యాచ్లో మెరిడిత్ జట్టు సోమర్సెట్ ఎసెక్స్పై 95 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సోమర్సెట్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. టామ్ కోహ్లెర్ కాడ్మోర్ సుడిగాలి ఇన్నింగ్స్తో (39 బంతుల్లో 90; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) బీభత్సం సృష్టించాడు. మిగతా ఆటగాళ్లు నామమాత్రపు ప్రదర్శన చేశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఎసెక్స్.. సోమర్సెట్ ఫాస్ట్ బౌలర్లు మ్యాట్ హెన్రీ (4-0-21-4), రిలీ మెరిడిత్ (2-0-22-2), క్రెయిగ్ ఓవర్టన్ (3.1-0-32-2) ధాటికి 14.1 ఓవర్లలో 130 పరుగులకే కుప్పకూలింది. ఎసెక్స్ ఇన్నింగ్స్లో నోవా థైన్ (38) టాప్ స్కోరర్గా నిలిచాడు. -
న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్
జులై 14 నుంచి జింబాబ్వేలో జరుగబోయే ముక్కోణపు టీ20 సిరీస్కు ముందు న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు విధ్వంసకర బ్యాటర్ ఫిన్ అలెన్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అలెన్ ప్రస్తుతం జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ సందర్భంగా శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్కు ఆడుతూ గాయపడ్డాడు (ఫుట్ ఇంజ్యూరి). అలెన్ గాయం తీవ్రతపై స్పష్టత లేదు. మరోసారి పరీక్షలు జరిపిన అనంతరం క్లారిటీ వస్తుందని వైద్యులు తెలిపారు. అలెన్కు ప్రత్యామ్నాయ ఆటగాడిగాని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఇంకా ప్రకటించలేదు. ముక్కోణపు టోర్నీలో జింబాబ్వే, న్యూజిలాండ్తో పాటు సౌతాఫ్రికా పాల్గొంటుంది.భీకర ఫామ్లో అలెన్ప్రస్తుతం జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్లో ఫిన్ అలెన్ భీకర ఫామ్లో ఉన్నాడు. ఈ లీగ్ తొలి మ్యాచ్లోనే అతను సుడిగాలి శతకం (51 బంతుల్లో 151) విరుచుకుపడ్డాడు. అనంతరం జరిగిన మ్యాచ్ల్లో మరో రెండు మెరుపు అర్ద సెంచరీలు చేశాడు. ఈ లీగ్లో అలెన్ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో సెంచరీ, 2 హాఫ్ సెంచరీల సాయంతో 333 పరుగులు చేశాడు. ఈ సీజన్లో అత్యధిక స్ట్రయిక్రేట్ (225) అలెన్దే.అలెన్ జట్టు శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ ఈ సీజన్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్కు చేరింది. రేపు (భారతకాలమానం ప్రకారం) జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో యూనికార్న్స్ ఎంఐ న్యూయార్క్తో అమీతుమీ తేల్చుకోనుంది.సౌతాఫ్రికా విషయానికొస్తే.. ముక్కోణపు టోర్నీలో న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్ను జులై 16న ఆడనుంది. ఆ మ్యాచ్లో కివీస్ సౌతాఫ్రికాతో తలపడనుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్లో అతిథ్య జింబాబ్వే, సౌతాఫ్రికా పోటీ పడతాయి. ఈ టోర్నీ ఫైనల్ జులై 26న జరుగనుంది. టోర్నీ మొత్తం హరారేలో జరుగనుంది. -
మ్యాక్స్వెల్ సేనకు కలిసొచ్చిన అదృష్టం.. నేరుగా ఫైనల్స్కు
మేజర్ లీగ్ క్రికెట్ 2025 ఎడిషన్లో భారతకాలమానం ప్రకారం ఇవాళ (జులై 9) జరగాల్సిన క్వాలిఫయర్ (వాషింగ్టన్ ఫ్రీడం వర్సెస్ టెక్సాస్ సూపర్ కింగ్స్) మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దైంది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన వాషింగ్టన్ జట్టు ఫైనల్స్కు చేరింది. ఫాఫ్ డుప్లెసిస్ నేతృత్వంలోని టీఎస్కే జులై 11న జరిగే ఛాలెంజర్ మ్యాచ్ ఆడనుంది. ఆ మ్యాచ్లో టీఎస్కే జులై 9న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ (శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ వర్సెస్ ఎంఐ న్యూయార్క్) విజేతతో తలపడనుంది. ఛాలెంజర్లో గెలిచిన జట్టు జులై 13న జరిగే ఫైనల్లో వాషింగ్టన్తో అమీతుమీ తేల్చుకుంటుంది.ఇవాళ జరగాల్సిన క్వాలిఫయర్ మ్యాచ్ ఎడతెరిపిలేని వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఇవాళ ఉదయం 5:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండింది. 8:15 గంటల వరకు వేచి చూసిన అంపైర్లు వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మ్యాక్స్వెల్ నేతృత్వంలోని వాషింగ్టన్ ఫ్రీడం మ్యాచ్ ఆడకుండానే అదృష్టం కలిసొచ్చి నేరుగా ఫైనల్కు చేరింది. ఈ సీజన్ పాయింట్ల పట్టికలో వాషింగ్టన్ టాప్ ప్లేస్లో ఉండగా.. టీఎస్కే రెండో స్థానంలో నిలిచింది. శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, ఎంఐ న్యూయార్క్ జట్లు మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.ఎలిమినేటర్ మ్యాచ్కు ఎలాంటి ముప్పు లేదుశాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, ఎంఐ న్యూయార్క్ మధ్య రేపు జరగాల్సిన ఎలిమినేటర్ మ్యాచ్కు ఎలాంటి ముప్పు లేదని తెలుస్తుంది. డల్లాస్లో రేపు వాతావరణం క్లియర్గా ఉండనుందని వాతావరణ శాఖ నివేదించింది. ఇవాల్టి క్వాలిఫయర్ మ్యాచ్ కూడా డల్లాస్లోనే ఉండింది. -
కుశాల్ మెండిస్ రికార్డు సెంచరీ.. శ్రీలంకదే వన్డే సిరీస్
పల్లెకెలె: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన శ్రీలంక జట్టు... బంగ్లాదేశ్పై వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మంగళవారం జరిగిన చివరి వన్డేలో శ్రీలంక 99 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా 2–1తో సిరీస్ చేజిక్కించుకుంది. అంతకుముందు రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను సైతం ఆతిథ్య లంక జట్టు 1–0తో గెలుచుకుంది.మూడో వన్డేలో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ (114 బంతుల్లో 124; 18 ఫోర్లు) సెంచరీతో కదంతొక్కగా... కెప్టెన్ అసలంక (68 బంతుల్లో 58; 9 ఫోర్లు) అర్ధశతకంతో రాణించాడు. ఓపెనర్ పాథుమ్ నిసాంక (35) ఫర్వాలేదనిపించాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కీన్ అహ్మద్, మెహదీ హసన్ మిరాజ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 39.4 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌటైంది. తౌహిద్ హృదయ్ (78 బంతుల్లో 51; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకంతో పోరాడగా... కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్ (28), పర్వేజ్ (28), జాకీర్ అలీ (27) మెరుగైన ఆరంభాలను వృథా చేసుకున్నారు. శ్రీలంక బౌలర్లలో అశిత ఫెర్నాండో, దుశ్మంత చమీరా చెరో 3 వికెట్లు పడగొట్టగా... దునిత్ వెల్లలాగె, వణిండు హసరంగా రెండేసి వికెట్లు తీశారు.ఈ సిరీస్లో మూడు మ్యాచ్ల్లోనూ మొదట బ్యాటింగ్ చేసిన జట్లే గెలుపొందాయి. కుశాల్ మెండిస్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’అవార్డులు దక్కాయి. మెండిస్ ఈ సిరీస్లో తొలి వన్డేలో 45, రెండో వన్డేలో 56, ఇప్పుడు మూడో వన్డేలో 124 పరుగులు చేశాడు. ఈ సెంచరీ కుసాల్కు అంతర్జాతీయ క్రికెట్లో 16వది. ఈ మ్యాచ్లో కుసాల్ మరో రికార్డు కూడా సాధించాడు. బంగ్లాదేశ్పై 2000 పరుగులు (అన్ని ఫార్మాట్లలో) పూర్తి చేసిన రెండో శ్రీలంకన్గా నిలిచాడు. గతంలో కుమార్ సంగక్కర (3090) ఒక్కడే ఈ ఘనత సాధించాడు. ఇరు జట్ల మధ్య గురువారం తొలి టి20 జరగనుంది. -
అత్యంత విలువైన జట్టుగా ఆర్సీబీ.. పడిపోయిన సీఎస్కే.. భారీగా పెరిగిన పంజాబ్ విలువ
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 17 సీజన్ల పాటు ఒక్కసారి టైటిల్ సాధించకపోయినా సరే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు అభిమానుల్లో మంచి క్రేజ్ కొనసాగింది. 2025 సీజన్లో తొలి సారి విజేతగా నిలవడంతో ఇప్పుడు వాణిజ్యపరంగా కూడా ఆ జట్టు విలువ అమాంతం పెరిగిపోయింది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ హూలీహాన్ లోకీ నివేదిక ప్రకారం ప్రస్తుతం ఆర్సీబీ టీమ్ విలువ అక్షరాలా 269 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2306 కోట్లు).ఈ జాబితాలో ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ను (సీఎస్కే) వెనక్కి నెట్టిన ఆర్సీబీ టాప్కు చేరింది. ఈ సీజన్లో చెత్త ప్రదర్శనతో చివరి స్థానంలో నిలిచిన సీఎస్కే 235 మిలియన్ డాలర్లు (రూ. 2014 కోట్లు) విలువతో మూడో స్థానానికి పడిపోయింది. ముంబై ఇండియన్స్ విలువను 242 మిలియన్ డాలర్లు (రూ. 2074 కోట్లు)గా బ్యాంక్ హూలీహాన్ లెక్కగట్టింది. ఇతర ఐపీఎల్ జట్లలో కోల్కతా నైట్రైడర్స్ (రూ. 1946 కోట్లు) , సన్రైజర్స్ హైదరాబాద్ (రూ. 1320 కోట్లు), పంజాబ్ కింగ్స్ (రూ. 1209 కోట్లు) విలువ కలిగి ఉన్నాయి. ఈ సీజన్లో అత్యధిక వృద్ధి సాధించిన జట్టు పంజాబ్ కింగ్స్. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో ఈ సీజన్ ఫైనల్కు చేరిన పంజాబ్ ఏకంగా 39.6 శాతం వృద్ధి సాధించింది. మరో వైపు ఐపీఎల్ విలువ కూడా 13.8 శాతం పెరిగి 3.9 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 33 వేల కోట్లు)కు చేరింది.అత్యంత విలువైన ఐపీఎల్ జట్లు1) RCB - 269 మిలియన్లు (సుమారు రూ. 2306 కోట్లు)2) MI - 242 మిలియన్లు (రూ. 2074 కోట్లు)3) CSK - 235 మిలియన్లు (రూ. 2014 కోట్లు)4) KKR - 227 మిలియన్లు (రూ. 1946 కోట్లు) 5) SRH - 154 మిలియన్లు (రూ. 1320 కోట్లు)6) DC - 152 మిలియన్లు (రూ. 1303 కోట్లు)7) RR - 146 మిలియన్లు (రూ. 1252 కోట్లు)8) GT - 142 మిలియన్లు (రూ. 1217 కోట్లు)9) PBKS - 141 మిలియన్లు (రూ. 1209 కోట్లు)10) LSG - 122 మిలియన్లు (రూ. 1046 కోట్లు) -
రైజింగ్ ‘గ్రాండ్’ స్టార్
టెన్నిస్ రాకెట్ చేతపట్టిన ప్రతి ప్లేయర్ గ్రాండ్స్లామ్ ఆడాలనే కలలు కంటాడు. అందులోనూ 148 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన వింబుల్డన్ కోర్టులో అడుగు పెట్టాలనిఅందరికీ ఉంటుంది. కానీ దాన్ని కొందరు మాత్రమే నిజం చేసుకుంటారు. నాలుగు గ్రాండ్స్లామ్ టోర్నీలలో వింబుల్డన్కు ఉన్న క్రేజే వేరు. నిగనిగలాడే పచ్చిక కోర్టులు... ఎంత గొప్ప ప్లేయర్లయినా తెలుపు రంగు దుస్తులతోనే ఆడాలన్న నిబంధన... దీనిని ప్రతి ఒక్కరూ పాటించడం... ఇదొక అనిర్వచనీయ అనుభూతి. లండన్లోని ఆల్ ఇంగ్లండ్ క్లబ్లో నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఈసారి మన హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ (Bollipalli Rithvik Choudary) బరిలోకి దిగాడు. తొలి అడ్డంకిని దాటి రెండో రౌండ్కు చేరిన రిత్విక్... భవిష్యత్తుపై భరోసా పెంచుతున్నాడు. ఇప్పటి వరకు ముగ్గురు భారతీయులు మాత్రమే వింబుల్డన్ డబుల్స్ విభాగంలో విజేతలుగా నిలవగా... ఎప్పటికైనా ఇక్కడ చాంపియన్గా నిలవడమే తన జీవిత లక్ష్యమని రిత్విక్అంటున్నాడు. – సాక్షి క్రీడావిభాగం అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సాధించాలని చిన్నప్పటి నుంచి కలలు కన్న బొల్లిపల్లి రిత్విక్చౌదరీ కెరీర్లో రెండు ఏటీపీ–250 టోర్నీ డబుల్స్ టైటిల్స్ గెలిచాడు. అధిక శాతం ఆటగాళ్లు కెరీర్ తొలినాళ్లలో సింగిల్స్పై దృష్టి పెట్టి... ఇక చాలు అనుకుంటున్న దశలో డబుల్స్కు మారడం పరిపాటి. అయితే రిత్విక్మాత్రం అందుకు భిన్నంగా కెరీర్ ఆరంభంలోనే తన లక్ష్యాలపై స్పష్టత ఏర్పరచుకున్నాడు. తన ఆటతీరుకు డబుల్స్ అనుకూలంగా ఉంటుందని భావించిన రిత్విక్సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడు. ఫలితంగా 24 ఏళ్ల వయసులోనే రెండు ఏటీపీ–250 టైటిల్స్ అతడి ఖాతాలో చేరాయి. ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్లో ప్రస్తుతం ప్రపంచ 79వ ర్యాంక్లో ఉన్న ఈ హైదరాబాదీ... ఈ ఏడాది వరుసగా మూడు గ్రాండ్స్లామ్ టోర్నమెంట్లలోనూ బరిలోకి దిగి నిలకడ కనబర్చాడు. ఆ్రస్టేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్లలో తొలి రౌండ్లోనే వెనుదిరిగిన రిత్విక్ వింబుల్డన్లో మాత్రం రెండో రౌండ్కు చేరుకున్నాడు. తొలిసారి వింబుల్డన్ బరిలోకి దిగడం చాలా ఆనందంగా ఉందన్న రిత్విక్... దీని వెనక తన తల్లిదండ్రులు ప్రతాప్, లక్ష్మీ త్యాగాలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నాడు. ప్రపంచంలో అత్యుత్తమ టోర్నమెంట్లో తల్లిదండ్రుల సమక్షంలో మ్యాచ్ నెగ్గడం మరిచిపోలేని అనుభూతి అని అన్నాడు. డ్యాన్సింగ్, డ్రాయింగ్ కాదని... క్రికెట్ను మతంలా భావించే మన దేశంలో... అందరిలాగే రిత్విక్కూడా పెద్దయ్యాక ప్రొఫెషనల్ క్రికెటర్గా మారాలనుకున్నాడు. ఏక కాలంలో అనేక అంశాలపై ఆసక్తి కనబరిచే పిల్లల్లాగే రిత్విక్పసితనంలో అన్నీ చేస్తూ హైపర్ యాక్టివ్గా ఉండేవాడు. డ్యాన్సింగ్, డ్రాయింగ్ ఇలా అన్నీట్లో ముందుండేవాడు. దీంతో అతడిని ఏదైనా ఆటలో శిక్షణ ఇప్పించాలని తల్లిదండ్రులు భావించారు. క్రికెట్ నేర్పించాలని అనుకున్నా... రిత్విక్వయసు మరీ చిన్నది కావడంతో బంతితో దెబ్బలు తగులుతాయేమోననే భయంతో తల్లిదండ్రులు అతడిని ఇంటికి సమీపంలోని టెన్నిస్ కోచింగ్ సెంటర్లో చేర్పించారు.సికింద్రాబాద్లోని రైల్వే రిక్రియేషన్ క్లబ్ మైదానం సమీపంలోని ‘ద స్కూల్ ఆఫ్ పవర్ టెన్నిస్’ సెంటర్లో కోచ్ సీవీ నాగరాజ్ వద్ద ఓనమాలు నేర్చుకున్న రిత్విక్అండర్–12, అండర్–16 స్థాయిలో జాతీయ నంబర్వన్గా నిలిచాడు. ఒలింపియన్, భారత డేవిస్కప్ జట్టు మాజీ సభ్యుడు, వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో ఆడిన విష్ణువర్ధన్, ఆసియా క్రీడల్లో, డేవిస్కప్లో, గ్రాండ్స్లామ్ టోర్నీల్లో ఆడిన సాకేత్ మైనేని కూడా ఒకప్పుడు ‘ద స్కూల్ ఆఫ్ పవర్ టెన్నిస్’ సెంటర్లోనే శిక్షణ తీసుకున్నారు. కోచ్ నాగరాజ్ వద్ద క్రమం తప్పకుండా తన ఆటకు మెరుగులు దిద్దుకున్న రిత్విక్ అంచలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నాడు. ప్రపంచంలో ఎన్ని టెన్నిస్ టోర్నీలు ఉన్నా వింబుల్డన్ మాత్రం ప్రత్యేకమని రిత్విక్తల్లి లక్ష్మి వెల్లడించారు. వింబుల్డన్ అధికారిక వెబ్సైట్ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో లక్ష్మి... రిత్విక్ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. స్టెఫీ గ్రాఫ్, పీట్ సంప్రాస్, లియాండర్ పేస్, మహేశ్ భూపతి, సానియా మీర్జా (Sania Mirza) వంటి దిగ్గజ ఆటగాళ్లు విజేతలుగా నిలిచిన చోట తమ కుమారుడు కూడా ఆడటం మాటల్లో వర్ణించలేని అనుభూతి అని ఆమె అన్నారు. ఆర్థిక ఇబ్బందులకు ఎదురొడ్డి... టెన్నిస్ బాగా ఖర్చుతో కూడుకున్న క్రీడ కావడంతో ఒక దశలో రిత్విక్ శిక్షణకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే తమ కుమారుడి కెరీర్కన్నా తమకు ఏదీ ఎక్కువ కాదనుకున్న ఆ తల్లిదండ్రులు... రిత్విక్ లక్ష్యం కోసం అన్నీ వదిలేసుకున్నారు. ఎదుగుతున్న క్రమంలో అతడి ఆటతీరు ఆ నమ్మకాన్నివ్వగా... ఒక్కసారి ప్రొఫెషనల్ కెరీర్ ప్రారంభించాక ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. ‘వింబుల్డన్ ఆడుతున్నానని తెలిసినప్పుడు నా కన్నా మా అమ్మానాన్నే ఎక్కువగా సంతోషించారు. చిన్నప్పటి నుంచి ఇక్కడ ఆడాలని ఎన్నో కలలు కన్నా. ఇప్పటికి అది సాధ్యపడింది. దీని వెనక మా కుటుంబం మొత్తం కృషి ఉంది. ఈ విజయం నా ఒక్కడిది కాదు ఇందులో మా అమ్మ, నాన్న, అమ్మమ్మ పాత్ర ఎంతో ఉంది’ అని తొలి రౌండ్ విజయానంతరం రిత్విక్అన్నాడు. కొలంబియాకు చెందిన నికోలస్ బరియెంటోస్తో కలిసి పురుషుల డబుల్స్ బరిలోకి దిగిన రిత్విక్... రెండో రౌండ్లో ఆరో సీడ్ జోడీ జో సాలిస్బరీ–నీల్ స్కప్స్కీ (బ్రిటన్) చేతిలో పోరాడి ఓడిపోయారు. రిత్విక్వింబుల్డన్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించడంతో... చిన్నప్పటి నుంచి కన్న కల నిజమైనట్లు అనిపించింది. ప్రపంచంలో ఎన్ని టోర్నమెంట్లు ఉన్నా... వింబుల్డన్ అంటే వింబుల్డనే. ఆటలో హుందాతనానికి ఇది గొప్ప నిదర్శనం. ప్రపంచంలోని అత్యుత్తమ టోర్నీలో రిత్విక్ ఆడతాడని కలలో కూడా ఊహించలేదు. అందుకే లండన్లో అడుగు పెట్టిన మూడు రోజుల తర్వాత కూడా నమ్మశక్యంగా అనిపించలేదు. సంప్రాస్, స్టెఫీ గ్రాఫ్ వంటి దిగ్గజాలు ఆడిన చోట రిత్విక్ బరిలోకి దిగడం నాకెంతో గర్వంగా ఉంది. – లక్ష్మి, రిత్విక్తల్లి రిత్విక్ప్రొఫైల్పుట్టిన తేదీ, స్థలం: 17–1–2001; హైదరాబాద్ ఎత్తు: 6 అడుగుల 2 అంగుళాలు బరువు: 85 కేజీలు ప్రొఫెషనల్గా మారిన ఏడాది: 2022 డబుల్స్లో కెరీర్ బెస్ట్ ర్యాంక్: 65 (మార్చి;2025లో) ఏటీపీ టూర్లో నెగ్గిన డబుల్స్ టైటిల్స్: 2 (అల్మాటీ ఓపెన్–250 టోర్నీ; చిలీ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీ) ఏటీపీ చాలెంజర్ టూర్ టైటిల్స్: 5 ఐటీఎఫ్ సర్క్యూట్లో నెగ్గిన టైటిల్స్: 6 -
ముగిస్తారా... ఆఖరిదాకా లాక్కొస్తారా?
మాంచెస్టర్: వరుస విజయాలతో జోరు మీదున్న భారత మహిళల జట్టుకు గత మ్యాచ్లో అనూహ్యంగా ఆతిథ్య ఇంగ్లండ్ బ్రేకులేసింది. దీంతో మూడో టి20 ఓటమితో ‘వాయిదా’ పడిన సిరీస్ విజయాన్ని మాంచెస్టర్లో రాబట్టాలని హర్మన్ప్రీత్ బృందం పట్టుదలతో ఉంది. మరోవైపు ‘హ్యాట్రిక్’ విజయాన్ని అడ్డుకున్న ఇంగ్లండ్ అదే ఊపుతో ఇప్పుడు సిరీస్ను సమం చేయాలనే లక్ష్యంతో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య బుధవారం జరిగే నాలుగో టి20 ఆసక్తికరంగా జరుగనుంది. బర్మింగ్హామ్ (12న ఐదో టి20) దాకా సాగదీయకుండా ఎలాగైనా ఇక్కడే సిరీస్ను చేజిక్కించుకోవాలని అమ్మాయిల జట్టు ఆశిస్తోంది. ఓపెనర్ స్మృతి మంధాన సూపర్ఫామ్, తెలుగమ్మాయి శ్రీచరణి స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ కంటే ఓ మెట్టుపైనే ఉన్న భారత్కు ఈ మ్యాచ్, సిరీస్ విజయం ఏమంత కష్టం కానేకాదు. హర్మన్ప్రీత్ రాణిస్తే... పొట్టి సిరీస్లో ఎవరైనా ప్రదర్శన పరంగా బాకీ పడ్డారంటే అది కెప్టెన్ హర్మన్ప్రీతే! తొలి మ్యాచ్కు గైర్హాజరైన సారథి తర్వాత మ్యాచ్లాడినా... ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. మూడో టి20లో హర్మన్ తన స్థాయికి తగ్గ ఆటతీరు కనబరిచి ఉంటే ఇదివరకే సిరీస్ దక్కేది. కేవలం 5 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గడ్డపై ‘హ్యట్రిక్’ విజయం దూరమవగా... సిరీస్ కోసం ఇంకా పోరాడాల్సి వస్తోంది. మిగతా వారిలో గత మ్యాచ్లో ఓపెనర్ ఫషాలీ వర్మ ఫామ్లోకి రావడం సానుకూలాంశం. ఓపెనర్లతో పాటు జెమీమా రోడ్రిగ్స్, హర్మన్లు కూడా రాణిస్తే... రిచా ఘోష్ తన హిట్టింగ్తో ఆదరగొట్టేందుకు అవకాశముంటుంది. ఈ సిరీస్లో శ్రీచరణి అత్యంత నిలకడగా స్పిన్నేస్తోంది. అరుంధతి రెడ్డి, దీప్తి శర్మలు కూడా ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నారు. ఎలా చూసినా కూడా భారత బౌలింగ్ దళం మెరుగ్గానే ఉంది. సమం కోసమే సమరం ఈ సిరీస్లోనే నిలకడలేమి ఆటతీరుతో అగచాట్లు పడుతున్న ఇంగ్లండ్ గత మ్యాచ్ గెలిచిందంటే ఓపెనర్లే కారణం. సోఫియా డంక్లీ, డానీ వ్యాట్లు తొలి రెండు మ్యాచ్ల్లోనూ చేతులెత్తేశారు. కానీ గెలిచి నిలవాల్సిన మ్యాచ్లో నిలబెట్టారు. మిగతా బ్యాటర్లను భారత బౌలర్లు తెలివిగానే బోల్తాకొట్టించారు. ఈ నేపథ్యంలో బ్యూమోంట్ సేన అందివచి్చన అవకాశాన్ని జారవిడువకుండా వరుసగా ఈ మ్యాచ్లోనూ పుంజుకొంటే సిరీస్ రేసులో పడొచ్చని భావిస్తోంది. పటిష్టమైన భారత బృందాన్ని ఎదుర్కోవాలంటే ఒకరిద్దరు రాణిస్తే సరిపోదని సమష్టి బాధ్యత తీసుకోవాలని అనుకుంటుంది. తుదిజట్లు (అంచనా) భారత్: హర్మన్ప్రీత్ (కెప్టెన్ ), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా, రిచా ఘోష్, అమన్జోత్, దీప్తిశర్మ, రాధా యాదవ్, అరుంధతీ, స్నేహ్ రాణా, శ్రీచరణి. ఇంగ్లండ్: టామీ బ్యూమోంట్ (కెప్టెన్ ), సోఫియా డంక్లీ, డానీ వ్యాట్, అలైస్ క్యాప్సీ, స్కాలిఫీల్డ్, అమీ జోన్స్, సోఫీ ఎకిల్స్టోన్, ఇసీ వాంగ్, చార్లీ డీన్, లారెన్ ఫిలెర్, లారెన్ బెల్. -
‘టాప్’ ర్యాంక్కు చేరువగా దీప్తి శర్మ
దుబాయ్: ఇంగ్లండ్తో జరుగుతున్న టి20 సిరీస్లో నిలకడగా రాణిస్తున్న భారత స్పిన్నర్ దీప్తి శర్మ... అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళల టి20 ర్యాంకింగ్స్లో అగ్ర స్థానానికి చేరువైంది. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో దీప్తి శర్మ ఒక స్థానం పురోగతి సాధించి రెండో ర్యాంక్కు చేరుకుంది. గత ఆరేళ్లగా టాప్–10లో కొనసాగుతున్న దీప్తి తన కెరీర్లో తొలిసారి టాప్ ర్యాంక్ అందుకునేందుకు దగ్గరగా వచ్చింది. ప్రస్తుతం దీప్తి ఖాతాలో 738 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. 746 పాయింట్లతో పాకిస్తాన్ బౌలర్ సాదియా ఇక్బాల్ నంబర్వన్ స్థానంలో ఉంది. ఇంగ్లండ్తో మరో రెండు టి20లు జరగాల్సి ఉన్న నేపథ్యంలో దీప్తి శర్మ విశేషంగా రాణిస్తే తదుపరి ర్యాంకింగ్స్లో టాప్ ర్యాంక్ను అందుకునే అవకాశముంది. ‘హండ్రెడ్’ టోర్నీకి దూరం వచ్చే నెలలో ఇంగ్లండ్లో జరిగే ‘హండ్రెడ్’ టోర్నీ నుంచి దీప్తి శర్మ వైదొలిగింది. వర్క్లోడ్ మేనేజ్మెంట్, టీమిండియా బిజీ షెడ్యూల్ కారణంగా ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. దీప్తి వైదొలిగిన నేపథ్యంలో ఈసారి ‘హండ్రెడ్’ టోర్నీలో భారత ప్రాతినిధ్యం ఉండటంలేదు. గత సీజన్ ఫైనల్లో దీప్తి శర్మ చివరి ఓవర్లో కొట్టిన సిక్స్తో లండన్ స్పిరిట్స్ జట్టు తొలిసారి ‘హండ్రెడ్’ ట్రోఫీని సొంతం చేసుకోవడం విశేషం. గత సీజన్లో లండన్ స్పిరిట్స్ జట్టు దీప్తి శర్మకు 36 వేల పౌండ్లు చెల్లించింది. -
సబలెంకా శ్రమించి...
లండన్: ఈ ఏడాది వరుసగా మూడో గ్రాండ్స్లామ్ టోర్నీలో ఫైనల్ చేరేందుకు బెలారస్ స్టార్ సబలెంకా మరో విజయం దూరంలో నిలిచింది. ఈ సంవత్సరం ఆ్రస్టేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీల్లో ఫైనల్కు చేరి రన్నరప్తో సరిపెట్టుకున్న సబలెంకా... అదే జోరును వింబుల్డన్ టోర్నీలోనూ కొనసాగించి ఈ టోర్నీలో మూడోసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సబలెంకా 4–6, 6–2, 6–4తో ప్రపంచ 104వ ర్యాంకర్ లౌరా సిగెముండ్ (జర్మనీ)పై కష్టపడి గెలిచింది. 2 గంటల 54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సబలెంకాకు 37 ఏళ్ల సిగెముండ్ నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. క్వార్టర్ ఫైనల్ చేరే క్రమంలో ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోని సబలెంకా ఈ మ్యాచ్లో తొలి సెట్ను చేజార్చుకుంది. అయితే రెండో సెట్లో తేరుకున్న సబలెంకా మూడుసార్లు ప్రత్యర్థి సర్వీస్ను బ్రేక్ చేసింది. సెట్ను 6–2తో దక్కించుకొని మ్యాచ్లో నిలిచింది. మూడో సెట్లో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. చివరకు పదో గేమ్లో సిగెముండ్ సర్వీస్ను బ్రేక్ చేసిన సబలెంకా విజయాన్ని ఖరారు చేసుకుంది.మ్యాచ్ మొత్తంలో రెండు ఏస్లు సంధించిన సబలెంకా నాలుగు డబుల్ ఫాల్ట్లు చేసింది. నెట్ వద్దకు 43 సార్లు దూసుకొచ్చి 25 సార్లు పాయింట్లు గెలిచింది. 29 విన్నర్స్ కొట్టిన ఈ బెలారస్ స్టార్ 36 అనవసర తప్పిదాలు చేసింది. తన సర్వీస్ను ఆరుసార్లు కోల్పోయి ప్రత్యర్థి సర్వీస్ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేసింది. 2021, 2023లలో వింబుల్డన్లో సెమీఫైనల్ చేరి ఓడిపోయిన సబలెంకా రేపు జరిగే సెమీఫైనల్లో అనిసిమోవాతో ఆడుతుంది. తొలిసారి సెమీస్లో అనిసిమోవా నాలుగోసారి వింబుల్డన్ టోర్నీలో ఆడుతున్న ప్రపంచ 12వ ర్యాంకర్ అనిసిమోవా (అమెరికా) తొలిసారి సెమీఫైనల్కు అర్హత సాధించింది. క్వార్టర్ ఫైనల్లో అనిసిమోవా 6–1, 7–6 (11/9)తో పావ్లీచెంకోవా (రష్యా)పై నెగ్గింది. 22వసారి గ్రాండ్స్లామ్ టోర్నీ ఆడిన అనిసిమోవా 2019లో ఫ్రెంచ్ ఓపెన్లో సెమీఫైనల్కు చేరుకుంది. అల్కరాజ్ అలవోకగా... పురుషుల సింగిల్స్లో డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్) వరుసగా మూడో ఏడాది సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. కామెరాన్ నోరి (బ్రిటన్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ 6–2, 6–3, 6–3తో గెలుపొందాడు. 99 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో అల్కరాజ్ 13 ఏస్లు సంధించి ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. సెమీఫైనల్లో అమెరికా ప్లేయర్, ప్రపంచ ఐదో ర్యాంకర్ టేలర్ ఫ్రిట్జ్తో అల్కరాజ్ తలపడతాడు. మరో క్వార్టర్ ఫైనల్లో ఫ్రిట్జ్ 6–3, 6–4, 1–6, 7–6 (7/4)తో ఖచనోవ్ (రష్యా)పై గెలిచి తన కెరీర్లో తొలిసారి వింబుల్డన్లో సెమీఫైనల్కు చేరాడు. గట్టెక్కిన సినెర్ సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ (ఇటలీ) కి అదృష్టం కలిసొచ్చింది. దిమిత్రోవ్ (బల్గేరియా) తో జరిగిన మ్యాచ్లో సినెర్ తొలి రెండు సెట్లను 3–6, 5–7తో కోల్పోయాడు. మూడో సెట్లో స్కోరు 2–2తో సమంగా ఉన్నపుడు దిమిత్రోవ్ గాయపడ్డాడు. దాంతో దిమిత్రోవ్ ఆటను కొనసాగించలేకపోవడంతో సినెర్ను విజేతగా ప్రకటించారు. గత ఐదు గ్రాండ్స్లామ్ టోర్నీలలో దిమిత్రోవ్ గాయాల కారణంగా వైదొలగడం గమనార్హం. -
బూమ్ బూమ్ బుమ్రా
లండన్: ఇంగ్లండ్తో మూడో టెస్టు కోసం భారత టాప్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సిద్ధమవుతున్నాడు. రేపటి నుంచి ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. పని భారం కారణంగా ఈ సిరీస్లో మూడు టెస్టులే ఆడాలని నిర్ణయించుకున్న బుమ్రా బర్మింగ్హామ్లో జరిగిన రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు తగినంత విరామం తర్వాత పూర్తి ఫిట్గా మ్యాచ్కు అతను సన్నద్ధమయ్యాడు. టెస్టుకు రెండు రోజుల ముందు మంగళవారం బుమ్రా సుదీర్ఘ సమయం పాటు నెట్స్లో శ్రమించాడు. విరామం లేకుండా అతను బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఆప్షనల్ ప్రాక్టీస్ రోజు కావడంతో ప్రధాన బ్యాటర్లు గిల్, రాహుల్, జైస్వాల్, పంత్తో పాటు సుందర్, సిరాజ్, ఆకాశ్దీప్ కూడా మంగళవారం సాధన చేయలేదు. దాంతో కరుణ్ నాయర్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, ధ్రువ్ జురేల్లకు బుమ్రా బౌలింగ్ చేశాడు. వీరందరినీ తన బౌలింగ్తో బుమ్రా ఇబ్బంది పెట్టాడు. ఎలాంటి అసౌకర్యం లేకుండా పూర్తి రనప్తో అతను బౌలింగ్ చేశాడు. నెట్స్కు వచ్చీ రాగానే బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ను అడిగి తనకు కొత్త బంతి మాత్రమే కావాలని ఎంచుకున్న బుమ్రా దాంతో ప్రాక్టీస్ కొనసాగించాడు. 2021లో లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో రివర్స్ స్వింగ్తో మూడు కీలక వికెట్లు పడగొట్టిన బుమ్రా భారత్ ఘన విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ సారి లార్డ్స్ పిచ్ పేస్ బౌలింగ్కు అనుకూలంగా ఉంటుందని వినిపిస్తున్న నేపథ్యంలో అతను ఎలా చెలరేగుతాడనేది ఆసక్తికరం -
పాకిస్తాన్ జట్టు ప్రకటన.. బాబర్ ఆజం, రిజ్వాన్లపై వేటు
బంగ్లాదేశ్తో జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్ క్రికెట్ మంగళవారం ప్రకటించింది. ఈ జట్టుకు సల్మాన్ అలీ అఘా నాయకత్వం వహించనున్నాడు. అయితే స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజం, షాహీన్ షా అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్లపై సెలక్టర్లు వేటు వేశారు.ఈ జట్టులో ఈ సీనియర్ త్రయానికి చోటు దక్కలేదు. పాక్ కొత్త వైట్బాల్ కోచ్ మైక్ హెస్సన్ సూచన మేరకు వీరిని సెలక్టర్లు పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఇకపై ఈ ముగ్గురు సీనియర్ ప్లేయర్లు టెస్టులు, వన్డేల్లో మాత్రమే భాగమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.ఇక ఈ సిరీస్కు ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్, స్పీడ్ స్టార్ హ్యారిస్ రవూఫ్ గాయం కారణంగా దూరమయ్యాడు. అయితే వెటరన్ ఆటగాడు మొహమ్మద్ నవాజ్ మాత్రం సెలక్టర్లు తిరిగి పిలుపునిచ్చారు. అదేవిధంగా యువ పేస్ సంచలనం సల్మాన్ మీర్జాకు సైతం ఈ జట్టులో చోటు దక్కింది. ఈ మూడు మ్యాచ్ల సిరీస్ జూలై 20 నుంచి 24 మధ్య జరగనుంది. మొత్తం మూడు మ్యాచ్లు కూడా ఢాకా వేదికగా జరగనున్నాయి.బంగ్లాతో టీ20 సిరీస్కు పాక్ జట్టుసల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, అహ్మద్ డానియాల్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ హారీస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, సాహిబ్జాదా సల్మాన్ , మొహమ్మద్ నవాజ్, సైమ్ అయూబ్, సల్మాన్ మీర్జా ,సుఫ్యాన్ మోకిమ్. -
స్టోక్స్ ఇదొక కఠిన పరీక్ష.. గిల్ మాత్రం అద్భుతం: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ను 336 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు చేసిన సంగతి తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అదరగొట్టిన భారత జట్టు.. ఎడ్జ్బాస్టన్ మైదానంలో తమ తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసింది.దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను 1-1తో గిల్ సేన సమం చేసింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆదేశ మాజీ క్రికెటర్ మైఖేల్ అథర్టన్ విమర్శల వర్షం కురిపించాడు. స్టోక్స్ పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్నాడని, కెప్టెన్గా తన మార్క్ చూపించలేకపోతున్నాడని అథర్టన్ మండిపడ్డాడు. కాగా తొలి టెస్టులో పర్వాలేదన్పించిన స్టోక్స్.. రెండో టెస్టులో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. అటు వ్యక్తిగత ప్రదర్శన పరంగా.. ఇటు కెప్టెన్సీలోనూ విఫలమయ్యాడు."ఈ సిరీస్కు బెన్ స్టోక్స్కు కఠిన పరీక్ష వంటింది. స్టోక్స్ గత కొంత కాలంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా అతడి బ్యాటింగ్ ఫామ్ జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రోజు రోజుకు అతడి బ్యాటింగ్ ఫామ్ దిగజారుతూ వస్తోంది.వన్డే, టీ20లకు దూరంగా ఉంటూ స్టోక్స్ కేవలం టెస్టుల్లో ఆడుతూ వన్-ఫార్మాట్ ప్లేయర్గా కొనసాగుతున్నాడు. అతడు జట్టును ఒక ప్రణాళికపరంగా ముందుకు నడిపించలేకపోతున్నాడు. అతడి పేలవ ఫామ్ కెప్టెన్సీపై ఇంపాక్ట్ చూపుతోంది. అంతేకాకుండా స్పిన్నర్లను ఆడటానికి ఇబ్బంది పడుతున్నాడు.కానీ ప్రత్యర్ధి కెప్టెన్ శుబ్మన్ గిల్ మాత్రం అద్బుతంగా రాణిస్తున్నాడు. తొలిసారి కెప్టెన్గా వ్యవహరిస్తునప్పటకి జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. లార్డ్స్లో జరగనున్న మూడో టెస్టులో కూడా భారత్ నుంచి ఇంగ్లండ్కు గట్టి సవాల్ ఎదురుకానుంది.ఈ మ్యాచ్లో స్టోక్స్ కెప్టెన్గా ఎలా రాణిస్తాడన్నది చాలా ముఖ్యంమని" ది టైమ్స్ కాలమ్లో అథర్టన్ పేర్కొన్నాడు. కాగా టెస్టుల్లో స్టోక్స్ సెంచరీ చేసి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఇక ఇంగ్లండ్-భారత్ మధ్య మూడో టెస్టు గురువారం నుంచి ప్రారంభం కానుంది.చదవండి: IND vs ENG: భారత్తో వన్డే సిరీస్.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన! కెప్టెన్ ఈజ్ బ్యాక్ -
భారత్తో వన్డే సిరీస్.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన
భారత మహిళలతో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. గజ్జ గాయం కారణంగా భారత్తో టీ20 సిరీస్ మధ్యలోనే వైదొలిగిన ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ స్కైవర్-బ్రంట్ తిరిగి వన్డే జట్టులోకి వచ్చింది.అదేవిధంగా సోఫీ ఎకిలిస్టోన్, బౌచర్ ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. గత నెలలో వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్కు ఎకిలిస్టోన్ దూరమైంది. మానసిక ఒత్తిడి కారణంగా కొన్నాళ్ల పాటు క్రికెట్ దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.కానీ ఈ ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుని తన నిర్ణయాన్ని సోఫీ మార్చుకుంది. ఈ క్రమంలోనే వన్డే జట్టులోకి ఆమె తిరిగొచ్చింది. ఈ సిరీస్ వన్డే వరల్డ్కప్-2025 సన్నాహాకాల్లో భాగంగా జరగనుంది. జూలై 16 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ రెండు జట్లు టీ20 సిరీస్లో తలపడతున్నాయి. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో 1-2 ఆధిక్యంలో భారత్ కొనసాగుతోంది.వన్డే సిరీస్ షెడ్యూల్:1వ వన్డే – జూలై 16, ది అగేస్ బౌల్, సౌతాంప్టన్2వ వన్డే – జూలై 19, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్, లండన్3వ వన్డే – జూలై 22, సీట్ యూనిక్ రివర్సైడ్, చెస్టర్-లె-స్ట్రీట్భారత్తో వన్డే సిరీస్కు ఇంగ్లండ్ జట్టునాట్ స్కైవర్-బ్రంట్(కెప్టెన్),ఎమ్ ఆర్లాట్, టామీ బ్యూమాంట్, లారెన్ బెల్, మైయా బౌచియర్, ఆలిస్ కాప్సే, కేట్ క్రాస్, ఆలిస్ డేవిడ్సన్-రిచర్డ్స్, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్, అమీ జోన్స్, ఎమ్మా లాంబ్, లిన్సే స్మిత్భారత మహిళల వన్డే జట్టుహర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యాస్తికా భాటియా, తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ, స్నేహ రాణా, శ్రీ చారణి, శుచి ఉపాధ్యాయ్, అరుంధతి రెడ్డి, కె. సత్ఘరేచదవండి: IND vs ENG 3rd Test: లార్డ్స్ టెస్టుకు గ్రీన్ పిచ్.. భారత జట్టులోకి యువ సంచలనం? -
జింబాబ్వేను చిత్తు చేసిన సౌతాఫ్రికా.. సిరీస్ క్లీన్ స్వీప్
బులవాయో వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్ 236 పరుగుల తేడాతో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. దీంతో రెండు టెస్టు సిరీస్ను 2-0 తేడాతో దక్షిణాఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. 456 రన్స్ లోటుతో ఫాలో ఆన్ ఆడిన ఆతిథ్య జింబాబ్వే.. తమ రెండో ఇన్నింగ్స్లో 220 పరుగులకు కుప్పకూలింది.సఫారీ బౌలర్లలో కార్బిన్ బాష్ 4 వికెట్లు పడగొట్టగా.. సేనురన్ ముత్తుసామి మూడు, కోడీ యూసఫ్ రెండు వికెట్లు సాధించారు. జింబాబ్వే బ్యాటర్లలో నిక్ వెల్చ్(55) టాప్ స్కోరర్గా నిలవగా.. క్రెయిగ్ ఎర్విన్(49), కైతానో(40) పర్వాలేదన్పించారు.ముల్డర్ ట్రిపుల్ సెంచరీ..అంతకుముందు సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్ను 626/5 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దక్షిణాఫ్రికా తత్కాలిక కెప్టెన్ వియాన్ ముల్డర్ అజేయ ట్రిపుల్ సెంచరీతో (334 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 367 పరుగులు)చెలరేగాడు.అతడితో పాటు డేవిడ్ బెడింగ్హమ్ (82), లుహాన్ డ్రి ప్రిటోరియస్ (78), డెవాల్డ్ బ్రెవిస్ (30), వెర్రిన్ (42) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో చివంగ, మటిగిము తలో 2 వికెట్లు తీయగా.. మసకద్జ ఓ వికెట్ సాధించాడు.అనంతరం జింబాబ్వే తమ తొలి ఇన్నింగ్స్లో 170 పరుగులకే ఆలౌటైంది. ప్రోటీస్ బౌలర్లలో సుబ్రేయన్ నాలుగు.. ముల్డర్, యూసఫ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఫలితంగా జింబాబ్వే ఫాలో ఆన్ ఆడింది. ఫాల్ ఆన్లో కూడా విఫలం కావడంతో ఆతిథ్య జట్టు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. కాగా ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ది సిరీస్ రెండు అవార్డులు కూడా ముల్డర్కే దక్కాయి.చదవండి: లారా ఒక్కడి మీదే గౌరవమా?.. అతడిది నిజంగా నిస్వార్థమేనా? -
సెంచరీతో చెలరేగిన కుశాల్ మెండిస్.. రెండో శ్రీలంక బ్యాటర్గా రికార్డు
శ్రీలంక వికెట్ కీపర్ బ్యాటర్ కుశాల్ మెండిస్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. పల్లెకలే వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మూడో వన్డేలో మెండిస్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో మెండిస్ 95 బంతుల్లో తన ఆరో వన్డే సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఈ వికెట్ కీపర్ బ్యా టర్ సహచర ఆటగాళ్లు పాథుమ్ నిస్సాంక, చరిత్ అసలంకతో కలిసి కీలక భాగస్వామ్యాలను నెలకొల్పాడు.ఓవరాల్గా 114 బంతులు ఎదుర్కొన్న మెండిస్.. 18 ఫోర్లతో 124 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డును మెండిస్ తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో బంగ్లాదేశ్పై 2 వేల పరుగుల మైలు రాయిని అందుకున్న రెండో శ్రీలంక క్రికెటర్గా మెండిస్ నిలిచాడు. కుశాల్ ఇప్పటివరకు బంగ్లాపై మూడు ఫార్మాట్లు కలిపి 2032 పరుగులు చేశాడు. ఈ జాబితాలో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార్ సంగక్కర(3090) అగ్రస్దానంలో ఉన్నాడు.బంగ్లాదేశ్పై అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన శ్రీలంక ఆటగాళ్లు వీరేకుమార్ సంగక్కర – 3090కుసాల్ మెండిస్ - 2032దిల్షాన్ - 1903మహేల జయవర్ధనే - 1723ఉపుల్ తరంగ – 1507బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే?ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 285 పరుగుల భారీ స్కోర్ చేసింది. శ్రీలంక బ్యాటర్లలో కుశాల్ మెండిస్తో పాటు నిస్సాంక(35), అసలంక(58) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో టాస్కిన్ ఆహ్మద్, మెహాదీ హసన్ మిరాజ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. షమీమ్, తన్వీర్, షకీబ్ చెరో వికెట్ సాధించారు.చదవండి: లారా ఒక్కడి మీదే గౌరవమా?.. అతడిది నిజంగా నిస్వార్థమేనా? -
లారా ఒక్కడి మీదే గౌరవమా?.. అతడిది నిజంగా నిస్వార్థమేనా?
‘‘ట్రిపుల్ సెంచరీ సంగతేమో గానీ డబుల్ సెంచరీ చేస్తానని కూడా కలలో అనుకోలేదు. లారా ఒక దిగ్గజం. 400 రికార్డుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ విషయంపై కోచ్తో చర్చించా. దిగ్గజాల పేరిటే అలాంటి రికార్డు ఉండటం సబబని భావించాం. ఆ ఘనత లారా పేరిట ఉండటమే సరైంది’’.. జింబాబ్వేపై త్రిశతకం బాదిన తర్వాత సౌతాఫ్రికా స్టార్ వియాన్ ముల్డర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. తనకు క్వాడ్రపుల్ సెంచరీ చేసే అవకాశం వచ్చినా.. లారా మీద గౌరవంతో మాత్రమే.. ఆ ఫీట్ జోలికి వెళ్లలేదని చెప్పాడతడు.ఈ నేపథ్యంలో వియాన్ ముల్డర్పై క్రికెట్ ప్రేమికులు ప్రశంసలు కురిపిస్తుండగా.. మరికొందరు మాత్రం అతడిని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. జింబాబ్వే లాంటి పసికూన మీద ట్రిపుల్ సెంచరీ బాదడం కాస్త సులువేనని.. అయినా.. 399 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తే దానిని త్యాగం అంటారు గానీ.. 367 వద్ద డిక్లేర్ చేయడం ఏమిటంటూ అతడి విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నారు. తొలిసారి సౌతాఫ్రికా కెప్టెన్గాఇంతకీ విషయం ఏమిటంటే.. వరల్డ్ టెస్టు చాంపియన్షిన్ నయా చాంపియన్ సౌతాఫ్రికా ప్రస్తుతం జింబాబ్వేలో పర్యటిస్తోంది. ఆతిథ్య జట్టుపై తొలి టెస్టులో గెలిచిన ప్రొటిస్ జట్టు.. రెండో మ్యాచ్లోనూ ఇదే ఫలితం పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. ఇక ఈ టెస్టులో ఆల్రౌండర్ వియాన్ ముల్డర్ తొలిసారి సౌతాఫ్రికా కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. బులవాయో వేదికగా టాస్ గెలిచిన జింబాబ్వే తొలుత బౌలింగ్ చేయగా.. సౌతాఫ్రికా ఐదు వికెట్ల నష్టానికి 626 పరుగులు చేసి తమ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.కాగా సోమవారం నాటి రెండో రోజు ఆటను వియాన్ ముల్డర్ ఓవర్నైట్ స్కోరు 264తో మొదలు పెట్టాడు... రెండో రోజు మరో 38 బంతులు ఆడే సరికి అతడి ‘ట్రిపుల్ సెంచరీ’ పూర్తయింది... మరో 5 బంతుల తర్వాత దక్షిణాఫ్రికా తరఫున టెస్టుల్లో టాప్ స్కోరర్ రికార్డు సొంతమైంది... ఆ తర్వాత మరిన్ని రికార్డుల వేట మొదలైంది... జోరు కొనసాగిస్తూ దిగ్గజాలను దాటుకుంటూ పోయాడు... సంగక్కర, వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, గూచ్, డాన్ బ్రాడ్మన్, మార్క్ టేలర్, హనీఫ్, జయసూర్య, గ్యారీ సోబర్స్... ఇలా అందరిని అధిగమించి టాప్–5లోకి వచ్చేశాడు. 367 పరుగులకు చేరాక లంచ్ విరామం వచ్చింది.మరో 34 పరుగులు చేస్తే చాలుఇక తదుపరి లక్ష్యం బ్రియాన్ లారా 400 పరుగుల ఘనత... మరో 34 పరుగులు చేస్తే చాలు టెస్టు చరిత్రలో అతను శిఖరాన నిలిచిపోతాడు. కానీ దక్షిణాఫ్రికా శిబిరం నుంచి అనూహ్య ప్రకటన వచ్చింది. ఈ టెస్టులో కెప్టెన్గా వ్యవహరిస్తున్న ముల్డర్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేస్తున్నట్లు తానే స్వయంగా ప్రకటించాడు. 367 పరుగులతో నాటౌట్గా తన ఇన్నింగ్స్ను ముగించాడు. లారాను దాటకపోయినా... తన అద్భుత బ్యాటింగ్తో అతను ఎన్నో రికార్డులను తిరగరాశాడు. ఈ క్రమంలోనే లారా రికార్డును టచ్ చేయకూడదనే ఉద్దేశంతోనే తాను 400కు దూరంగా ఉన్నట్లు తెలిపాడు.లారా ఒక్కడి మీదే గౌరవమా?.. అతడిది నిజంగా నిస్వార్థమేనా?ఈ నేపథ్యంలో.. ‘‘ప్రతి ఒక్కరు వియాన్ ముల్డర్లా నిస్వార్థంగా ఉంటే.. ఈ ప్రపంచం ఎంతో బాగుండేది’’ అని కొంత మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొందరు మాత్రం అతడు చేసిన పని తప్పు అని విమర్శిస్తున్నారు. ‘‘ఒకవేళ ముల్డర్ లారా పట్ల గౌరవం ప్రదర్శించాలని భావిస్తే.. 399 వరకు ఆడి అప్పుడు డిక్లేర్ చేయాల్సింది.లారాను గౌరవిస్తున్నాడు సరే.. మరి హెడెన్, జయవర్దనే, సోబర్స్ ఇలా అందరినీ గౌరవించాలి కదా! అయినా ఆటల్లో రికార్డులు ఉన్నవే బద్దలు కొట్టడానికి కదా! అసాఫా పావెల్ కోసం ఉసేన్ బోల్ట్ నెమ్మదిగా పరిగెత్తలేడు..ఏదేమైనా ఇక్కడ ప్రత్యర్థిని ఆడించి.. ఆలౌట్ చేసి గెలవాలంటే సౌతాఫ్రికాకు సమయం కావాలి. అందుకే ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు. కానీ ముల్డర్ తానేదో త్యాగం చేస్తున్నట్లు చెప్పడం సరికాదు’’ అని ట్రోల్ చేస్తున్నారు. -
Sourav Ganguly: ఈ రికార్డులను ఇంత వరకూ ఎవరూ టచ్ కూడా చేయలేదు!
భారత క్రికెట్కు దూకుడు పరిచయం చేసిన ధీరుడు అతడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో జట్టు బాధ్యతలను భుజాలపై వేసుకున్న వారియర్ అతడు. తన కెప్టెన్సీతో ఇంటా, బయట భారత జట్టును విజయపథంలో నడిపించిన నాయకుడు అతడు.యువరాజ్ సింగ్, హార్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్ వంటి స్టార్ క్రికెటర్లను పరిచయం చేసిన దాదా అతడు. అతడే టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly). అభిమానులు ముద్దుగా పిలుచుకునే బెంగాల్ టైగర్ పుట్టిన రోజు నేడు(జూలై 8). ఈ సందర్భంగా గంగూలీ పేరిట ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉన్న పది ఐకానిక్ రికార్డులపై ఓ లుక్కేద్దాం.ఒకే ఒక్కడు..అంతర్జాతీయ వన్డే మ్యాచ్లలో వరుసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు పొందిన ఏకైక క్రికెటర్ గంగూలీ. ఇప్పటికి అతడి రికార్డును ఎవరూ టచ్ చేయలేకపోతున్నారు. 1997లో పాకిస్తాన్తో వన్డే సిరీస్లో దాదా ఈ ఘనత సాధించాడు.ఏకైక లెఫ్ట్ హ్యాండర్గా..వన్డేల్లో భారత జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఎడమచేతి వాటం బ్యాటర్గా గంగూలీ కొనసాగుతున్నాడు. గంగూలీ తన కెరీర్లో 308 మ్యాచ్లు ఆడి 11221 పరుగులు చేశాడు. ఓవరాల్గా వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో భారత ఆటగాడిగా గంగూలీ ఉన్నాడు. అగ్రస్ధానంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(18426) ఉండగా.. రెండో స్దానంలో విరాట్ కోహ్లి(14181) కొనసాగుతున్నాడు.👉ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్లో సెంచరీ సాధించిన ఏకైక భారత ఆటగాడు కూడా గంగూలీనే కావడం గమనార్హం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2000 ఫైనల్లో న్యూజిలాండ్పై సౌరవ్ సెంచరీ(117) సెంచరీతో మెరిశాడు.👉ఐసీసీ వన్డే టోర్నీల నాకౌట్ మ్యాచ్ల్లో మూడు శతకాలు చేసిన ఆటగాళ్లలో గంగూలీ ఒకడు. ఆయనతోపాటు ఈ లిస్ట్ లో రికీ పాంటింగ్, సయద్ అన్వర్ లు ఉన్నారు. ఈ జాబితాలో భారత తరపున నుంచి గంగూలీ ఒక్కడే ఉన్నాడు.👉ఐసీసీ వన్డే ప్రపంచకప్లో భారత తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగా ఇప్పటికీ గంగూలీ కొనసాగుతున్నాడు. 1999 వరల్డ్ కప్లో శ్రీలంకపై గంగూలీ 183 పరుగులు పరుగులు చేశాడు.వరసుగా నాలుగు సార్లు1997 నుంచి 2000 వరకు వరుసగా నాలుగు క్యాలెండర్ ఈయర్స్లో 1000 కన్నా ఎక్కువ పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ గంగూలీ.1997లో – 1338 పరుగులు1998లో – 1328 పరుగులు1999లో – 1767 పరుగులు2000లో – 1579 పరుగులు👉వరల్డ్ క్రికెట్లో అంతర్జాతీయ వన్డేల్లో పదివేలకు పైగా పరుగులు, వంద వికెట్లు సాధించిన ఆరుగురిలో ఒకడిగా గంగూలీ ఉన్నారు. భారత్ నుంచి మాత్రం గంగూలీ ఒక్కడే ఈ ఫీట్ను అందుకున్నాడు.👉టెస్టు అరంగేట్రంలో ఫస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీ చేసి, సెకెండ్ ఇన్నింగ్స్లో గోల్డెన్ డక్ అయిన ఏకైక క్రికెటర్ కూడా దాదానే కావడం విశేషం.👉ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా గంగూలీ నిలిచాడు. గంగూలీ 1990లో ఈ ఫీట్ సాధించాడు.👉 భారత జట్టుకు తొలి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్నుని అందించిన కెప్టెన్ కూడా గంగూలీనే. 2000లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గంగూలీ సారథ్యంలోని టీమిండియా సొంతం చేసుకుంది. -
ఇంగ్లండ్ గడ్డ మీద ఇరగదీసిన వైభవ్ సూర్యవంశీ.. ఇక డబుల్ సెంచరీ బాకీ!
ఐపీఎల్-2025లో అదరగొట్టిన యువ క్రికెటర్, రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. భారత అండర్-19 జట్టు తరఫునా అదరగొట్టాడు. క్యాష్ రిచ్ లీగ్లో తన అరంగేట్ర సీజన్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఈ పద్నాలుగేళ్ల కుర్రాడు.. ఇంగ్లండ్ గడ్డ మీదా వేగవంతమైన శతకంతో మెరిశాడు.తద్వారా యూత్ వన్డేల్లో అత్యంత పిన్న వయసులో, తక్కువ బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్న తొలి క్రికెటర్గా వైభవ్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లంగ్ పర్యటనలో అతడి ప్రదర్శన తీరుపై ప్రశంసలు కురిపిస్తున్న మాజీ క్రికెటర్లు.. ఇలాగే కొనసాగితే త్వరలోనే టీమిండియా తరఫున అరంగేట్రం చేయడం ఖాయమంటున్నారు.252కు పైగా స్ట్రైక్రేటుతోఐదు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు భారత యువ జట్టు ఇంగ్లండ్కు వెళ్లింది. ఇందులో భాగంగా తొలుత వన్డే సిరీస్ ఆరంభం కాగా.. హోవ్లో మొదటి మ్యాచ్ జరిగింది. ఇందులో వైభవ్ సూర్యవంశీ ధనాధన్ దంచికొట్టాడు. కేవలం 19 బంతుల్లోనే 3 ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 252కు పైగా స్ట్రైక్రేటుతో 48 పరుగులు సాధించాడు.ఈ మ్యాచ్లో భారత్ గెలవడంలో వైభవ్ది కీలక పాత్ర. ఇక రెండో యూత్ వన్డేలోనూ ఈ ఓపెనింగ్ బ్యాటర్ రాణించాడు. 34 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు బాది 45 పరుగులు రాబట్టాడు.సునామీ శతకంతో చెలరేగి..అయితే, మూడో వన్డేలో ధనాధన్ ఇన్నింగ్స్తో దంచికొట్టిన వైభవ్.. ఈసారి ఏకంగా 31 బంతుల్లోనే 86 పరుగులతో దుమ్ములేపాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఇన్నింగ్స్లో ఆరు ఫోర్లతో పాటు తొమ్మిది సిక్స్లు ఉండటం విశేషం.ఇవన్నీ ఒక ఎత్తయితే.. నాలుగో వన్డేలో మాత్రం వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ను ప్రశంసించేందుకు మాటలు చాలవు. మంచి బంతిని గౌరవిస్తూనే.. లూజ్ బాల్ పడ్డప్పుడల్లా బౌండరీలతో ఇరగదీశాడు ఈ చిచ్చరపిడుగు. 24 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న వైభవ్.. ఇందులో 46 పరుగులు కేవలం బౌండరీల ద్వారానే రాబట్టడం విశేషం.Highlights of Vaibhav Suryavanshi's superb 143 off 78 against England Under-19s 🙌(via @WorcsCCC) pic.twitter.com/alFqUTxNHL— ESPNcricinfo (@ESPNcricinfo) July 5, 2025 ఫాస్టెస్ట్ సెంచరీఆ తర్వాత కూడా ఇదే జోరును కొనసాగించిన వైభవ్.. కేవలం 52 బంతుల్లోనే శతక్కొట్టాడు. తద్వారా యూత్ వన్డేలో 14 ఏళ్ల 100 రోజుల వయసులోనే ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు వైభవ్. ఇక ఈ మ్యాచ్ వైభవ్ (143)తో పాటు మరో ఆటగాడు విహాన్ మల్హోత్రా (129) కూడా శతకం బాదడంతో భారత్.. ఇంగ్లండ్పై ఏకపక్ష విజయం సాధించి 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది.ఇక ఆఖరిదైన ఐదో యూత్ వన్డేలో మాత్రం వైభవ్ నామమాత్రంగానే ఆడాడు. 42 బంతులు ఎదుర్కొని కేవలం 33 పరుగులే చేశాడు. మిగతా వారిలో ఆర్ఎస్ అంబరీష్ అజేయ అర్ధ శతకం (66)తో రాణించాడు. ఈ క్రమంలో 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసిన భారత జట్టు.. ఈ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. భారత బౌలర్లు తేలిపోవడంతో 31.1 ఓవర్లలోనే ఇంగ్లండ్ పనిపూర్తి చేసి.. ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది.ఏదేమైనా ఈ పర్యటన ద్వారా వైభవ్ సూర్యవంశీ తన సత్తా ఏమిటో మరోసారి నిరూపించుకున్నాడు. విధ్వంసకర బ్యాటింగ్కు మారుపేరుగా మారి.. భారత్ సిరీస్ కైవసం చేసుకోవడంలో ప్రధాన భూమిక పోషించాడు. ఈ ఐదు వన్డేల సిరీస్లో వైభవ్ సూర్యవంశీ మొత్తంగా 355 పరుగులు సాధించగా... ఇందులో 29 సిక్సర్లు ఉండటం విశేషం.ఇక డబుల్ సెంచరీ బాకీ..ఇక తన ఫాస్టెస్ట్ సెంచరీ తర్వాత బీసీసీఐతో మాట్లాడుతూ వైభవ్ సూర్యవంశీ.. ‘‘ఈ రికార్డు గురించి నాకసలు తెలియదు. మా టీమ్ మేనేజర్ అంకిత్ సర్ దీని గురించి చెప్పారు. శుబ్మన్ గిల్ (డబుల్ సెంచరీ)ను చూసి నేను ఎంతో స్ఫూర్తి పొందాను.సెంచరీని డబుల్ సెంచరీగా మార్చిన తీరును గమనించాను. అప్పుడే నేను కూడా సుదీర్ఘ ఇన్నింగ్స్ ఎలా ఆడాలో అర్థం చేసుకున్నాను. అయితే, సెంచరీ తర్వాత నేను తప్పుడు షాట్ సెలక్షన్తో అవుటయ్యాను. లేదంటే గిల్ మాదిరే డబుల్ సెంచరీ ఇన్నింగ్స్ కోసం ప్రయత్నించేవాడిని.నేనేం చేసినా జట్టు ప్రయోజనాల కోసమే!..తదుపరి మ్యాచ్లో డబుల్ సెంచరీ సాధించేందుకు ప్రయత్నిస్తా’’ అని చెప్పుకొచ్చాడు. అయితే, 33 పరుగులకే అవుట్ కావడంతో వైభవ్ ఆశ నెరవేరలేదు. అయినప్పటికీ ఈ సిరీస్లో వైభవ్ కనబరిచిన ఆట తీరు అద్భుతమనే చెప్పవచ్చు. వన్డే ఫార్మాట్లో అతడు టీ20 మాదిరి విధ్వంసం సృష్టించడం విశేషం. ఇక తదుపరి ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో యూత్ టెస్టులలోనైనా వైభవ్ తన డబుల్ సెంచరీ కోరికను నెరవేర్చుకుంటాడేమో చూడాలి!చదవండి: MCC: ఆకాశ్ దీప్ డెలివరీ.. రూట్కు అన్యాయం?.. ఎంసీసీ స్పందన ఇదే -
లార్డ్స్ టెస్టుకు గ్రీన్ పిచ్.. భారత జట్టులోకి యువ సంచలనం?
ఎడ్జ్బాస్టన్ టెస్టులో గెలిచి ఇంగ్లండ్ కంచుకోటను బద్దలు కొట్టిన భారత జట్టు ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమవుతోంది. లార్డ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు జూలై 10 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో కూడా తమ జోరును కొనసాగించి ప్రత్యర్దిని మట్టికర్పించాలని టీమిండియా(Teamindia) ఉవ్విళ్లూరుతోంది. లార్డ్స్ టెస్టు కోసం గిల్ సేన మంగళవారం ప్రాక్టీస్ సెషన్లో పాల్గోంది.మెకల్లమ్ మాస్టర్ ప్లాన్..కాగా మూడో టెస్టు కోసం లార్డ్స్ పిచ్ను ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించే విధంగా క్యూరేటర్లు తాయారు చేశారు. ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్(Brendon McCullum) అభ్యర్ధన మేరకు క్యూరేటర్లు పేస్ బౌలింగ్కు సరిపోయే వికెట్ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.ఈ పిచ్ను మంగళవారం భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ పరిశీలించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను రెవ్స్పోర్ట్స్ వెబ్సైట్ ఎక్స్లో షేర్ చేసింది. పిచ్పై ఎక్కువగా గ్రాస్ను ఉంచినట్లు ఫోటోలో కన్పిస్తోంది. దీంతో ఈ పిచ్పై ఫాస్ట్ బౌలర్లు పండగ చేసుకోనున్నారు.సుందర్పై వేటు..?ఇక లార్డ్స్ వికెట్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించే అవకాశమున్నందన అదనపు పేసర్తో భారత్ బరిలోకి దిగే అవకాశముంది. స్పిన్ ఆలౌండర్ వాషింగ్టన్ సుందర్ను పక్కన పెట్టి పేస్ బౌలింగ్ సంచలనం అర్ష్దీప్ సింగ్కు భారత టెస్టు క్యాప్ను అందించే సూచనలు కన్పిస్తున్నాయి.రెండో టెస్టులో సుందర్ అద్బుతంగా రాణించినప్పటికి పిచ్ కండీషన్స్ కారణంగా వేటు పడకతప్పదని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా మూడో టెస్టుకు జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి రానున్నందన ఎడ్జ్బాస్టన్లో ఘోరంగా విఫలమైన ప్రసిద్ద్ కృష్ణపై వేటు పడడం ఖాయన్పిస్తోంది.చదవండి: అతడు కోహ్లి, టెండుల్కర్ స్థానాన్ని భర్తీ చేస్తున్నాడు: ఇంగ్లండ్ మాజీ బ్యాటర్First look of the Lord's pitch for the third Test between India and England. India head coach Gautam Gambhir and batting coach Sitanshu Kotak take a closer view. 📸 @CricSubhayan pic.twitter.com/YC8pSaxKDI— RevSportz Global (@RevSportzGlobal) July 8, 2025 -
శ్రీలంక జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్లు రీ ఎంట్రీ
బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు 17 మందితో సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ మంగళవారం ప్రకటించింది. ఈ జట్టుకు చరిత్ అసలంక(Charith Asalanka) సారథ్యం వహించనున్నాడు. కాగా గత కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న స్టార్ ఆల్రౌండర్లు దసున్ షనక(Dasun Shanaka), చమిక కరుణరత్నేలకు సెలక్టర్లు తిరిగి పిలుపునిచ్చారు.అదేవిధంగా యువ పేసర్ ఎషాన్ మలింగకు తొలిసారి లంక టీ20 జట్టులో చోటు దక్కింది. ఐపీఎల్, సౌతాఫ్రికా టీ20 వంటి ఫ్రాంచైజీ లీగ్స్లో మలింగ అద్బుతమైన ప్రదర్శనతో సెలక్టర్లను ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే అతడిని సెలక్టర్లు టీ20 జట్టులోకి తీసుకున్నారు.మలింగకు డెత్లో బౌలింగ్ చేసే సత్తా ఉంది. ఇక ఈ జట్టులో కెప్టెన్ అసలంకతో కుశాల్ మెండిస్, నిస్సాంక, కమిందు మెండిస్ వంటి స్టార్ బ్యాటర్లు ఉన్నారు. బౌలింగ్ విభాగంలో మతీషా పతిరాన, వానిండు హసరంగా, నువాన్ తుషారా వంటి కీలక ప్లేయర్లు ఉన్నారు.కాగా ఈ సిరీస్ టీ20 వరల్డ్కప్-2026 సన్నాహాల్లో భాగంగా జరగనుంది. ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ జూలై 10 నుంచి ప్రారంభం కానుంది. కాగా వచ్చే ఏడాది జరగనున్న పొట్టి ప్రపంచకప్నకు శ్రీలంక, భారత్లు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఇక ఇప్పటికే మూడు వన్డేల సిరీస్లో శ్రీలంక, బంగ్లా జట్లు చెరో విజయంతో సమంగా ఉన్నాయి. సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో వన్డే పల్లెకలే వేదికగా మంగళవారం జరుగుతోంది.బంగ్లాతో టీ20 సిరీస్కు శ్రీలంక జట్టుచరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, దినేష్ చండిమల్, కుసల్ పెరీరా, కమిందు మెండిస్, అవిష్క ఫెర్నాండో, దసున్ షనక, దునిత్ వెల్లలగే, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, జెఫ్రీ వందేర్సే, చమిక కరుణరత్నే, మతీషా పతిరనా, నువాన్ తుషార, బినుర ఫెర్నాండో, ఎషాన్ మలింగ.చదవండి: అతడు కోహ్లి, టెండుల్కర్ స్థానాన్ని భర్తీ చేస్తున్నాడు: ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ -
‘అతడు కోహ్లి, టెండుల్కర్ స్థానాన్ని భర్తీ చేస్తున్నాడు’
టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill)పై ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ మార్క్ బుచర్ ప్రశంసలు కురిపించాడు. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో చక్కగా రాణిస్తున్నాడని.. సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లిల స్థానాన్ని అతడు భర్తీ చేస్తున్నాడని కొనియాడాడు. తీవ్రమైన ఒత్తిడిలోనూ బ్యాటర్గా అదరగొడుతున్నాడని.. మంచినీళ్లప్రాయంలా పరుగుల వరద పారిస్తున్నాడని ప్రశంసించాడు.ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా గిల్ భారత టెస్టు జట్టు కెప్టెన్గా తన ప్రయాణం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్లో తొలుత టీమిండియాను ఓటమి పలకరించింది. లీడ్స్లో శుబ్మన్ గిల్ సహా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (రెండు సెంచరీలు) శతక్కొట్టినా.. బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యం వల్ల ఓటమిపాలైంది.అయితే, రెండో టెస్టులో మాత్రం ఆ తప్పిదాన్ని పునరావృతం చేయలేదు. మరోసారి బ్యాటర్గా దుమ్ములేపిన గిల్.. కెప్టెన్గానూ అదరగొట్టాడు. ఎడ్జ్బాస్టన్ వేదికగా తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ (269) కొట్టిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్లో భారీ శతకం (161)తో అలరించాడు.సారథిగానూ తనదైన వ్యూహాలతో ముందుకు సాగి జట్టుకు చారిత్రాత్మక విజయం అందించాడు. ఎడ్జ్బాస్టన్లో ఇంగ్లండ్ను ఏకంగా 336 పరుగులతో ఓడించిన భారత్.. ఈ వేదికపై తొలిసారి విజయభేరి మోగించింది. ప్రస్తుతానికి సిరీస్ను 1-1తో సమం చేసింది.ఈ నేపథ్యంలో శుబ్మన్ గిల్ను ఉద్దేశించి మార్క్ బుచర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘క్రీడా ప్రపంచంలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్గా ఉండటం కంటే ఒత్తిడితో కూడిన బాధ్యత మరొకటి ఉండదు. ప్రతీ అడుగును నిశితంగా పరిశీలిస్తూ విమర్శలు చేస్తూ ఉంటారు.బ్యాటింగ్ ఆర్డర్లో కోహ్లి, టెండుల్కర్ స్థానాన్ని గిల్ భర్తీ చేస్తున్నాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడిపై ప్రస్తుతం తీవ్రమైన ఒత్తిడి ఉంది. అయినా సరే.. మంచినీళ్లప్రాయంగా తన పని చేసుకుంటూ పోతున్నాడు. కొత్త బాధ్యతను ఎంతో చక్కగా, సౌకర్యవంతంగా నిర్వర్తిస్తున్నాడు’’ అని గిల్పై బుచర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇండియా టుడేతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు (జూలై 10-14)కు లార్డ్స్ వేదిక. -
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్లో పెను విషాదం
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్లో విషాదం నెలకొంది. ఆ దేశ అంతర్జాతీయ అంపైర్ బిస్మిల్లా జన్ షిన్వారీ 41 ఏళ్ల యుక్త వయసులోనే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రమైన అనారోగ్యం కారణంగా షిన్వారీ మరణించినట్లు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఇవాళ (జులై 8) ప్రకటించింది. ఏసీబీ షిన్వారీ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసింది. ఆఫ్ఘన్ క్రికెట్ గొప్ప సేవకుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేస్తూ.. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది.ACB's Condolence and Sympathy MessageACB’s leadership, staff, and entire AfghanAtalan family are deeply shocked and saddened by the demise of Bismillah Jan Shinwari (1984 - 2025), a respected member of Afghanistan’s elite umpiring panel.It is with deep sorrow that we share… pic.twitter.com/BiZrTOLe6m— Afghanistan Cricket Board (@ACBofficials) July 7, 20251984 మార్చిలో జన్మించిన షిన్వారీ 2017 డిసెంబర్లో అంతర్జాతీయ అంపైరింగ్ అరంగేట్రం చేశాడు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ లీగ్ 2 మ్యాచ్లో అతను చివరి సారి అంపైరింగ్ చేశాడు. షిన్వారీ తన కెరీర్లో 60 అంతర్జాతీయ మ్యాచ్లకు (34 వన్డేలు, 26 టీ20లు) అంపైర్గా వ్యవహరించాడు. షిన్వారీ తన అంపైరింగ్ జర్నీని ఐర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ వన్డే మ్యాచ్తో ప్రారంభించాడు.బాంబు పేలుళ్ల నుంచి బయటపడి..!షిన్వారీ 2020 అక్టోబర్లో నగర్హర్ ఫ్రావిన్స్లో జరిగిన బాంబు పేలుళ్లను బయటపడ్డాడు. ప్రాథమిక నివేదికల్లో షిన్వారీ మరియు అతని కుటుంబ సభ్యులు చాలా మంది మృతి చెందారని వార్తలు వచ్చాయి. అయితే అతనే స్వయంగా మీడియా ముందుకు వచ్చి చనిపోలేదని నిర్ధారించాడు. -
అమాసకు.. పున్నానికోసారి మాత్రమే!.. గంభీర్ రియాక్షన్ వైరల్
టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ Gautam Gambhir)కు చాలా కాలం తర్వాత గొప్ప ఊరట లభించింది. ఇంగ్లండ్ (IND vs ENG)తో రెండో టెస్టులో భారత్ చారిత్రాత్మక విజయం సాధించడంతో అతడిపై విమర్శలకు అడ్డుకట్ట పడింది. కాగా గౌతీ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిమిత ఓవర్ల సిరీస్లో టీమిండియా బాగానే రాణిస్తోంది.వరుస పరాజయాలుముఖ్యంగా ఇటీవల చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy) రూపంలో ఐసీసీ ట్రోఫీ గెలవడం గంభీర్ కోచింగ్ కెరీర్లో ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది. అయితే, టెస్టుల్లో మాత్రం గౌతీ వచ్చిన తర్వాత బంగ్లాదేశ్పై విజయం మినహా.. టీమిండియా వరుసగా దారుణ పరాజయాలు చవిచూసింది. స్వదేశంలో ఎన్నడూ లేని విధంగా న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్స్వీప్ అయింది. అనంతరం ఆస్ట్రేలియా పర్యటనలోనూ ఘోర పరాభవం చవిచూసింది.ఆసీస్ చేతిలో 3-1తో ఓడి దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కోల్పోయింది. ఈ క్రమంలో స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ఈ ట్రోఫీ మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించగా.. ఇంగ్లండ్తో సిరీస్కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ, దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా టెస్టులకు స్వస్తి పలికారు.ఈ నేపథ్యంలో యువ ఆటగాడు శుబ్మన్ గిల్ టెస్టు జట్టు పగ్గాలు చేపట్టగా.. ఇంగ్లండ్ పర్యటనలోనూ ఆరంభంలో చేదు అనుభవమే మిగిలింది. తొలి టెస్టులో టీమిండియా గెలవాల్సిన మ్యాచ్ను చేజార్చుకుంది. ఇక సంప్రదాయ ఫార్మాట్లో భారత్ ఇలా వరుసగా మ్యాచ్లు ఓడటంతో గంభీర్పై విమర్శల వర్షం కురిసింది. అతడిని కోచ్గా తొలగించాలనే డిమాండ్లు వచ్చాయి.తొలిసారి ఈ వేదికపై గెలిచిఇలాంటి తీవ్ర ఒత్తిడి నడుమ టీమిండియా తమకు అచ్చిరాని ఎడ్జ్బాస్టన్ వేదికపై ఇంగ్లండ్పై భారీ విజయం సాధించింది. ఆతిథ్య జట్టుకు ఊహించని రీతిలో షాకిచ్చి.. ఏకంగా 336 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా టెస్టుల్లో కెప్టెన్గా గిల్కు.. విదేశీ గడ్డపై కోచ్గా గంభీర్కు తొలి విజయమే మధురానుభూతిని మిగిల్చింది.ఈ క్రమంలో ఇంగ్లండ్పై జయభేరి మోగించిన తర్వాత గంభీర్ చిరునవ్వులు చిందించాడు. సాధారణంగా అతడు ఎప్పుడూ గంభీరంగానే ఉంటాడన్న విషయం తెలిసిందే. అయితే, ఈసారి మాత్రం ఇరుజట్ల ఆటగాళుల పరస్పరం కరచాలనం చేసుకుంటున్న సమయంలో గిల్ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న గౌతీ.. ఎంతో సంతోషంగా కనిపించాడు.అతడు తరచూగా నవ్వడు.. ఈసారి మాత్రంఇందుకు సంబంధించిన దృశ్యాలను కెమెరామెన్ ఒడిసిపట్టగా.. కామెంటేటర్ రవిశాస్త్రి గంభీర్ను ఉద్దేశించి తనదైన శైలిలో చణుకులు విసిరాడు. ‘‘అతడు తరచూగా నవ్వడు. అయితే, ఈసారి మాత్రం చిరునవ్వులు చిందించేందుకు పూర్తిగా అర్హుడు.ఒక ఓటమి తర్వాత జట్టు తిరిగి పుంజుకోవడం.. అది కూడా ఈ స్థాయిలో బౌన్స్ బ్యాక్ అవ్వడం.. సిరీస్ ఆశలను సజీవం చేసుకోవడం కంటే ఓ కోచ్కు గొప్ప సంతోషం మరేదీ ఉండదు’’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. అమాసకు.. పున్నానికోసారి మాత్రమే!ఇక రవిశాస్త్రి కామెంట్స్ వైరల్ కాగా.. ‘‘అమాసకు.. పున్నానికి (అమావాస్యకు.. పౌర్ణమికి) ఓసారి నవ్వే గంభీర్.. ఈసారి మనస్ఫూర్తిగా చిరునవ్వులు చిందిస్తుంటే సంతోషంగా ఉంది’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఇంగ్లండ్తో ఐదు టెస్టులు ఆడుతోంది. లీడ్స్ వేదికగా తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో గెలవగా.. బర్మింగ్హామ్లో గెలిచిన భారత్ సిరీస్ను 1-1తో సమం చేసింది. ఇరుజట్ల మధ్య జూలై 10-14 వరకు లండన్లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో మూడో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్మన్ గిల్🎙️ Ravi Shastri on-air: Don't see him smile too often but Gautam Gambhir deserves every bit of it. #ENGvsIND pic.twitter.com/avyTsSTv5t— KKR Vibe (@KnightsVibe) July 6, 2025 -
న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. తప్పుకొన్న కేన్ విలియమ్సన్
ఈ నెలాఖరులో జింబాబ్వేతో ప్రారంభం కాబోయే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం 15 మంది సభ్యుల న్యూజిలాండ్ జట్టును ఇవాళ (జులై 8) ప్రకటించారు. మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ లేకుండానే న్యూజిలాండ్ ఈ సిరీస్ ఆడనుంది. ఇతరత్రా ప్లేయింగ్ కమిట్మెంట్స్ కారణంగా కేన్ ఈ టూర్ నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నాడు. కేన్ ప్రస్తుతం విటాలిటీ బ్లాస్ట్ టీ20 టోర్నీలో మిడిల్సెక్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ టోర్నీ కోసమే కేన్ జింబాబ్వే సిరీస్ను వద్దనుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో కేన్ న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్ట్ను తిరస్కరించాడు. ప్రైవేట్ లీగ్లకు అందుబాటులో ఉండేందుకు కేన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.జింబాబ్వే సిరీస్ నుంచి మరో స్టార్ ఆటగాడు కూడా తప్పుకొన్నాడు. ఫ్రాంచైజీ కమిట్మెంట్స్ కారణంగా మైఖేల్ బ్రేస్వెల్ జింబాబ్వే సిరీస్కు అందుబాటులో ఉండనని ప్రకటించాడు. ఈ సిరీస్ సమయంలో బ్రేస్వెల్ హండ్రెడ్ లీగ్లో ఆడాల్సి ఉంది. స్టార్ పేసర్ కైల్ జేమీసన్ కూడా ఈ సిరీస్కు అందుబాటులో ఉండటం లేదు. అతని భార్య బిడ్డకు జన్మనివ్వాల్సి ఉన్నందున అతను ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఈ మార్పులు మినహా మిగతా జట్టు మొత్తం యధాతథంగా కొనసాగనుంది. కెప్టెన్గా టామ్ లాథమ్ కొనసాగనున్నాడు. లెఫ్ట్మార్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్, బ్యాటర్ హెన్రీ నికోల్స్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు. కొత్తగా యువ పేసర్ మ్యాట్ ఫిషర్ జట్టులోకి వచ్చాడు. ఫిషర్ దేశవాలీ క్రికెట్లో విశేషంగా రాణించి జాతీయ జట్టు నుంచి పిలుపందుకున్నాడు. ఫిషర్ 14 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 24.11 సగటున 51 వికెట్లు పడగొట్టాడు.రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం జులై 30 నుంచి న్యూజిలాండ్ జట్టు జింబాబ్వేలో పర్యటించనుంది. తొలి టెస్ట్ జులై 30న, రెండో టెస్ట్ ఆగస్ట్ 7న ప్రారంభమవుతాయి. రెండు మ్యాచ్లు బులవాయో వేదికగా జరుగుతాయి. -
MCC: ఆకాశ్ దీప్ డెలివరీ.. రూట్కు అన్యాయం?.. ఎంసీసీ స్పందన ఇదే
టీమిండియాతో రెండో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) అవుటైన తీరుపై మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ (MCC) స్పందించింది. ఇందులో ఎలాంటి వివాదానికి తావులేదని.. భారత పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep) సంధించిన డెలివరీ నిబంధనలకు లోబడే ఉందని స్పష్టం చేసింది. ఈ అంశంపై అనవసరపు రాద్దాంతాలు అక్కర్లేదని కొట్టిపారేసింది.తొలి గెలుపుటెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టులో ఆతిథ్య జట్టు గెలవగా.. రెండో టెస్టులో భారత్ జయభేరి మోగించింది. ఎడ్జ్బాస్టన్లో జరిగిన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ను ఏకంగా 336 పరుగుల తేడాతో చిత్తు చేసి.. ఈ వేదికపై తొలిసారి గెలుపు రుచిచూసింది.పది వికెట్లు తీసిన ఆకాశ్ఇక భారత్ విజయంలో కెప్టెన్ శుబ్మన్ గిల్ (269, 161)తో పాటు పేసర్ ఆకాశ్ దీప్ కీలక పాత్ర పోషించాడు. ఆఖరిదైన ఐదో రోజు ఏడు వికెట్లు కూల్చాల్చిన తరుణంలో ఆకాశమే హద్దుగా చెలరేగి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. మొత్తంగా ఈ మ్యాచ్లో పది వికెట్లు తీసి సత్తా చాటాడు.అయితే, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు కూల్చిన ఈ రైటార్మ్ పేసర్.. రెండో ఇన్నింగ్స్లో ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. బెన్ డకెట్ (25), ఓలీ పోప్ (24), జో రూట్ (6)లను బౌల్డ్ చేసిన ఆకాశ్ దీప్.. హ్యారీ బ్రూక్ (23)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.రూట్ బలయ్యాడా?అదే విధంగా జేమీ స్మిత్ (88), బ్రైడన్ కార్స్ (38) వికెట్లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, జో రూట్ అవుటైన తీరు పట్ల విమర్శలు వచ్చాయి. ఆకాశ్ దీప్ రూట్ను బౌల్డ్ చేసింది నిజమే అయినా.. అది నో బాల్ అని.. అతడి కాలు రిటర్న్ క్రీజును దాటిందని పలువురు విమర్శించారు. అంపైర్ తప్పిదం కారణంగా అనవసరంగా రూట్ బలయ్యాడంటూ కామెంట్లు చేశారు.𝐑𝐨𝐨𝐭 𝐟𝐚𝐥𝐥𝐬 𝐭𝐨 𝐃𝐞𝐞𝐩 🥶#AkashDeep uproots #JoeRoot with a searing in-swinger, his second wicket puts England firmly on the back foot 🤩#ENGvIND 👉 2nd TEST, Day 4 | LIVE NOW on JioHotstar ➡ https://t.co/2wT1UwEcdi pic.twitter.com/avu1sqRrcG— Star Sports (@StarSportsIndia) July 5, 2025ఎంసీసీ వివరణఅయితే, అంపైర్ మాత్రం తన నిర్ణయాన్ని అమలు చేసి రూట్ను అవుట్గా ప్రకటించాడు. ఈ విషయంపై ఎంసీసీ తాజాగా స్పందించింది. రూట్ విషయలో అంపైర్ది సరైన నిర్ణయమని సమర్థించింది. ‘‘గత వారం టీమిండియా- ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు నాలుగో రోజు ఆట సందర్భంగా ఆకాశ్ దీప్ జో రూట్ను అవుట్ చేసిన విధానంపై కొందరు సందేహాలు లేవనెత్తారు.అభిమానులతో పాటు కామెంటేటర్లు కూడా అది బ్యాక్ ఫుట్ నో బాల్ అని విశ్వసించారు. నిజానికి దీప్ అసాధారణ రీతిలో క్రీజుపై ల్యాండ్ అయ్యాడు. అతడి బ్యాక్ ఫుట్ రిటర్న్క్రీజు ఆవల నేలను తాకినట్లు కనిపించింది. అయినా సరే.. అంపైర్ దానిని నో బాల్గా ప్రకటించలేదని అన్నారు.అయితే, ఈ విషయంలో ఎంసీసీ స్పష్టతనివ్వాలని భావిస్తోంది. నిబంధనల ప్రకారం.. బౌలర్ బ్యాక్ ఫుట్ తొలుత ఎక్కడ ల్యాండ్ అయిందన్న విషయాన్నే ఎంసీసీ పరిగణనలోకి తీసుకుంటుంది. ఇక్కడ దీప్ పాదం వెనుక భాగం తొలుత నేలను తాకింది. అది రిటర్న్ క్రీజు లోపలే ఉంది.అయితే, అతడి పాదంలో కొంత భాగం రిటర్న్ క్రీజు అవతల నేలను తాకి ఉండవచ్చు. కానీ నిబంధన ప్రకారం.. అతడి పాదం తొలుత రిటర్న్ క్రీజులోపలే ల్యాండ్ అయింది. కాబట్టి ఇది చట్టబద్దమైన డెలివరీయే’’ అని ఎంసీసీ తన ప్రకటనలో పేర్కొంది. చదవండి: భారత్తో మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ రీఎంట్రీ -
కౌంటీల్లో అరంగేట్రం చేయనున్న మరో భారత క్రికెటర్
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లోకి మరో భారత ఆటగాడు అరంగేట్రం చేయనున్నాడు. తమిళనాడు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవిశ్రీనివాస్ సాయి కిషోర్ సర్రే కౌంటీ జట్టుతో రెండు మ్యాచ్ల స్వల్ప ఒప్పందం చేసుకున్నాడు. సాయి కిషోర్ ఈ నెల 22న యార్క్షైర్తో జరుగబోయే మ్యాచ్తో కౌంటీ అరంగేట్రం చేస్తాడు. ఆ మ్యాచ్లో సాయి తన మాజీ సీఎస్కే సహచరడు రుతురాజ్ గైక్వాడ్ను ఢీకొంటాడు. రుతురాజ్ కూడా ఇదే సీజన్తో యార్క్షైర్ తరఫున కౌంటీ అరంగేట్రం చేశాడు.28 ఏళ్ల సాయి సర్రే క్లబ్తో ఒప్పందం చేసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశాడు. ఘన చరిత్ర కలిగిన సర్రేకు ఆడటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపాడు. సాయి ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడతాడు. రంజీ ట్రోఫీలో తమిళనాడు కెప్టెన్గా వ్యవహరిస్తాడు. భారత్ తరఫున 3 టీ20లు ఆడిన సాయికి ఫస్ట్క్లాస్ క్రికెట్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ ఫార్మాట్లో అతను 23.5 సగటున 192 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో 2022 సీజన్ నుంచి గుజరాత్కు ఆడుతున్న సాయి.. ఈ లీగ్లో 25 మ్యాచ్లు ఆడి 20.3 సగటుతో 32 వికెట్లు తీశాడు.ఈ సీజన్లో ఆరో క్రికెటర్ప్రస్తుత కౌంటీ సీజన్లో ఆడేందుకు భారత ఆటగాళ్లు క్యూ కడుతున్నారు. ఈ సీజన్లో ఇప్పటికే ఐదుగురు భారత ఆటగాళ్లు వేర్వేరు క్లబ్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇషాన్ కిషన్ నాటింగ్హమ్షైర్, తిలక్ వర్మ హ్యాంప్షైర్, ఖలీల్ అహ్మద్ ఎసెక్స్, రుతురాజ్ గైక్వాడ్ యార్క్షైర్, యుజ్వేంద్ర చహల్ నార్తంప్టన్షైర్కు ఆడుతున్నారు.వీరిలో యువ బ్యాటర్లు తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ తమ అరంగేట్రం మ్యాచ్ల్లోనే ఇరగదీశారు. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో తిలక్ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ చేయగా.. ఇషాన్ రెండు మ్యాచ్ల్లో రెండు హాఫ్ సెంచరీలు చేశారు. -
భారత్తో మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ రీఎంట్రీ
జులై 10 నుంచి లార్డ్స్ వేదికగా టీమిండియాతో జరుగబోయే మూడో టెస్ట్ కోసం 16 మంది సభ్యుల ఇంగ్లండ్ జట్టును ప్రకటించారు. గాయం కారణంగా తొలి రెండు మ్యాచ్లకు దూరంగా ఉన్న స్టార్ పేసర్ గస్ అట్కిన్సన్ ఈ మ్యాచ్తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. మిగతా జట్టు యధాతథంగా కొనసాగింది. రెండో టెస్ట్కు ముందు మరో స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే తొలి మ్యాచ్లో గెలవడంతో ఇంగ్లండ్ అదే జట్టును రెండో టెస్ట్లోనూ కొనసాగించింది. దీంతో ఆర్చర్కు ఛాన్స్ దక్కలేదు. మూడో టెస్ట్ తుది జట్టులో ఆర్చర్ లేదా అట్కిన్సన్లలో ఎవరో ఒకరికి అవకాశం దక్కుతుంది. తొలి రెండు టెస్ట్ల్లో పెద్దగా ప్రభావం చూపని క్రిస్ వోక్స్ స్థానంలో ఆర్చర్ లేదా అట్కిన్సన్ను ఆడించవచ్చు. మిగతా జట్టు మొత్తం యధాతథంగా కొనసాగే అవకాశం ఉంది.భారత్తో మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టు..బెన్ స్టోక్స్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, ఓల్లీ పోప్, జో రూట్, జామీ స్మిత్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్కాగా, తాజాగా ఎడ్జ్బాస్టన్లో ముగిసిన రెండో టెస్ట్లో ఇంగ్లండ్ 336 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది. ఈ మ్యాచ్లో భారత్ అన్ని విభాగాల్లో సత్తా చాటి చారిత్రక విజయం సాధించింది. ఎడ్జ్బాస్టన్లో భారత్కు ఇదే తొలి విజయం (58 ఏళ్ల తర్వాత).608 పరుగల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 271 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆకాశ్దీప్ (21.2-2-99-6) నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లండ్ బ్యాటర్ల భరతం పట్టాడు. తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు పడగొట్టిన ఆకాశ్దీప్ మొత్తంగా 10 వికెట్ల ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో శుభ్మన్ గిల్ తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్లో సెంచరీ చేసి భారత గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. అంతకుముందు లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. నాలుగో టెస్ట్ జులై 23 నుంచి ఓల్డ్ ట్రాఫోర్డ్లో.. ఐదో టెస్ట్ జులై 31నుంచి ఓవల్లో ప్రారంభం కానుంది. -
జట్టులోనే ఉండడు.. ఖేల్ ఖతం అనుకున్నాం.. కానీ: భారత మాజీ బ్యాటర్
టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ఘనత మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) సొంతం. 2007లో తొలిసారి ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్తో పాటు వన్డే వరల్డ్కప్-2011 (ODI World Cup), ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2013లను ధోని సారథ్యంలో భారత్ గెలుచుకుంది. తద్వారా దేశానికి మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్గా ధోని ఇప్పటికీ కొనసాగుతున్నాడు.జట్టులోనే ఉండడు.. ఖేల్ ఖతం అనుకున్నాం.. అయితే, అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రంలోనే డకౌట్ అయిన ధోని.. జట్టులో కొనసాగడం కష్టమేనని అప్పటికి జట్టులో ఉన్న క్రికెటర్లు భావించారట. అతడి ఆట మూణ్ణాళ్ల ముచ్చటేనని.. సుదీర్ఘకాలం కెరీర్ కొనసాగించలేడని అనుకున్నారట. టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ (Mohammad Kaif) ఈ విషయాన్ని వెల్లడించాడు.కాగా ధోని సోమవారం (జూలై 7) 44వ వసంతంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ధోని గురించిన జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న కైఫ్.. అరంగేట్ర వన్డే సిరీస్లో తీవ్రంగా నిరాశపరిచిన ధోని.. 2005లో పాకిస్తాన్తో మ్యాచ్లో అదరగొట్టిన తీరు తమను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు.వన్డౌన్లో రావడమే సర్ప్రైజ్‘‘పాకిస్తాన్తో మ్యాచ్ అంటే ఒత్తిడి ఎంతగా ఉంటుందో తెలుసు కదా!.. నాటి ఆ మ్యాచ్లో ధోనిని టాపార్డర్కు ప్రమోట్ చేయాలని గంగూలీ భావించాడు. అతడు కొన్నైనా పరుగులు చేస్తాడని అనుకున్నాడు.కానీ అతడు 140 పరుగులు చేస్తాడని ఎవరు అనుకోగలరు. డ్రెసింగ్రూమ్లో ఈ విషయం గురించి ఒక్కరికీ తెలియదు. కనీసం ఎవరూ ఊహించను కూడా లేదు. అసలు అతడు వన్డౌన్ (మూడో స్థానం)లో బ్యాటింగ్కు వెళ్లడమే ఒక సర్ప్రైజ్.అలాంటిది అతడు పాయింట్, మిడాఫ్ మీదుగా అలా షాట్లు బాదుతుంటే అందరూ అలా చూస్తూ ఉండిపోయారు. అసలు ఇతడు ఇలాంటి సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడతాడని ఒక్కరమూ ఊహించలేదు. మా ఆలోచన ఎంత తప్పో తన ఆట ద్వారానే నిరూపించాడు.అందరి బౌలింగ్ను చితక్కొట్టాడుఇన్నింగ్స్ సాగుతున్న కొద్దీ అతడు షాట్లు బాదుతూనే ఉన్నాడు. పవర్ ప్లేలో మొదలుపెడితే.. స్పిన్నర్లు, ఫాస్ట్ బౌలర్లు అన్న తేడా లేకుండా అందరి బౌలింగ్ను చితక్కొట్టాడు. తనకు చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ అని అతడికి తెలుసు.ఒకవేళ మూడో స్థానంలో గనుక తను రాణించకపోతే.. భవిష్యత్తులో తనకు మళ్లీ అవకాశాలు రావని కూడా అతడికి తెలుసు. అందుకే అతడు ధైర్యంగా, దూకుడుగా ఆడి సత్తా చాటాడు’’ అని మహ్మద్ కైఫ్ జియోస్టార్ షోలో పేర్కొన్నాడు. కాగా 2005లో పాక్తో రెండో వన్డేలో ధోని 123 బంతుల్లో 15 ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 148 పరుగులు చేశాడు. అతడి ధనాధన్ ఇన్నింగ్స్ వల్ల టీమిండియా పాక్ను ఓడించింది. అయితే, స్వదేశంలో జరిగిన ఆ సిరీస్లో మాత్రం 4-2తో ఓటమిపాలైంది.దిగ్గజ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్కాగా 2004లో బంగ్లాదేశ్తో వన్డే సిరీస్ సందర్భంగా ధోని అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆ మరుసటి ఏడాది టెస్టుల్లోనూ అరంగేట్రం చేసిన ధోని.. 2006లో టీ20లలో ప్రవేశించాడు. జట్టులోకి వచ్చిన అనతికాలంలోనే నాయకుడిగా ఎదిగిన ధోని.. 2007లో జట్టును విశ్వవిజేతగా నిలిపాడు.భారత దిగ్గజ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్గా ఎదిగాడు ధోని. టీమిండియా తరఫున మొత్తంగా 350 వన్డేలు, 98 టీ20లు, 90 టెస్టులు ఆడిన తలా... ఆయా ఫార్మాట్లలో 10773, 1617, 4876 పరుగులు సాధించాడు. 2019లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ధోని ఐపీఎల్లో కొనసాగుతున్నాడు. క్యాష్ రిచ్ లీగ్లో కెప్టెన్గా.. చెన్నై సూపర్ కింగ్స్ను రికార్డు స్థాయిలో ఐదుసార్లు చాంపియన్గా నిలిపాడు తలా.చదవండి: ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్మన్ గిల్ -
ఆర్సీబీ స్టార్ క్రికెటర్పై మహిళ ఫిర్యాదు.. కేసు నమోదు
ఆర్సీబీ స్టార్ క్రికెటర్ యశ్ దయాల్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఉత్తర్ప్రదేశ్లోని ఘజియాబాద్కు చెందిన ఓ యువతి యశ్ దయాల్పై లైంగిక వేధింపులు సహా శారీరక హింస, మానసిక వేధింపులు మరియు తప్పుడు వాగ్దానాల వంటి ఆరోపణలు చేస్తూ సీఎం గ్రీవెన్స్ పోర్టల్లో ఫిర్యాదు చేసింది. Ghaziabad, UP: An FIR has been registered against cricketer Yash Dayal at PS Indirapuram, under BNS Section 69, on charges of sexual exploitation, physical violence, mental harassment and cheating by making false promises of marriage.— ANI (@ANI) July 7, 2025ఈ ఫిర్యాదు ఆధారంగా ఇందిరాపురం పోలిస్ స్టేషన్లో యశ్ దయాల్పై కేసు నమోదైంది. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 69 కింద యశ్పై కేసు కట్టారు. పెళ్లి, ఉద్యోగం వంటి తప్పుడు వాగ్దానాలతో మోసం చేసిన ఘటనల్లో ఈ సెక్షన్ వాడతారు. ఈ కేసులో నేరం రుతువైతే పదేళ్ల వరకు శిక్ష పడుతుంది.ఫిర్యాదు ప్రకారం.. ఘజియాబాద్కు చెందిన యువతి దయాల్తో తనకు ఐదేళ్ల సంబంధం ఉందని తెలిపింది. దయాల్ తనను అతని కుటుంబానికి పరిచయం చేశాడని, వారు తనను కోడలుగా స్వాగతించారని ఆమె పేర్కొంది. సదరు యువతి గత 5 సంవత్సరాలుగా దయాల్తో సంబంధంలో ఉన్నట్లు చెప్పుకొచ్చింది.దయాల్ మోసాన్ని గ్రహించి నిరసన తెలిపినప్పుడు శారీరక, మానసిక వేధింపులకు గురయ్యానని ఫిర్యాదు చేసింది. దయాల్తో సంబంధంలో ఉన్నప్పుడు ఆర్దికంగానూ నష్టపోయానని ఆరోపించింది. దయాల్కు తనతో పాటు మరో ముగ్గురు మహిళలలో కూడా సంబంధాలు ఉన్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నట్లు పేర్కొంది. దయాల్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కాగా, 27 ఏళ్ల యశ్ దయాల్ను ఆర్సీబీ గత ఐపీఎల్ సీజన్కు ముందు రూ. 5 కోట్లకు రీటైన్ చేసుకుంది. తాజాగా ముగిసిన సీజన్లో దయాల్ 15 మ్యాచ్ల్లో 13 వికెట్లు తీసి పర్వాలేదనిపించాడు. ఈ సీజన్లో దయాల్ మంచి ఎకానమీతో బౌలింగ్ చేసి ఆర్సీబీ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. దయాల్ 2023 సీజన్లో రింకూ సింగ్కు బౌలింగ్ చేస్తూ చివరి ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు ఇచ్చి తొలిసారి వార్తల్లో నిలిచాడు. దయాల్ విరాట్ కోహ్లి మద్దతుతో ఆర్సీబీలో కొనసాగుతున్నాడు. -
బాధపడకు తమ్ముడు!.. ఇంకో ఆర్నెళ్ల సమయం ఉంది.. అన్నీ తానై..
లక్నో: భారత పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep) విజయవంతమైన బౌలింగ్ ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేసిన అతని సోదరి అఖండ్ జ్యోతి సింగ్ భావోద్వేగానికి గురైంది. క్యాన్సర్తో పోరాడుతున్న జ్యోతికి.. ఎడ్జ్బాస్టన్లోని పది వికెట్ల ప్రదర్శన అంకితమిస్తున్నట్లు మ్యాచ్ ముగిసిన అనంతరం ఆకాశ్దీప్ వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో ఓ వార్తా చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించిన జ్యోతి తన సోదరుడికి తన ఆనారోగ్యంపై చింతించకుండా దేశం కోసం శ్రమించాలని చెప్పినట్లు వెల్లడించింది.మా నాన్న చనిపోయినపుడు..క్యాన్సర్ బారిన పడటంతో తన కుటుంబానికి దూరమైన ఆనందాన్ని ఆకాశ్దీప్ తన ఆటతీరు ద్వారా తిరిగి తీసుకొచ్చాడని ఆమె సంతోషం వ్యక్తం చేసింది. తమ కుటుంబాన్ని 2015 ఏడాది పెను విషాదంలో ముంచిందని... మళ్లీ ఇన్నాళ్లకు ఆనందం వెల్లివిరిసిందని జ్యోతి చెప్పింది. ‘మా నాన్న చనిపోయినపుడు ఆకాశ్ ఢిల్లీలో క్లబ్ క్రికెట్ ఆడుతున్నాడు. అయితే ఆశించిన ఎదుగుదల రాలేదు. దీంతో నేను గట్టిగా చెప్పాను. క్రికెట్ను సీరియస్గా తీసుకుంటేనే రాణిస్తావని చెప్పా. ఇక్కడ కుదరకపోతే మరో చోటయినా ప్రయత్నించాలని సూచించాను. దీంతో 2017లో కోల్కతాకు మారాక బెంగాల్ అండర్–23 జట్టు తరఫున నిలకడగా రాణించడం మొదలుపెట్టాడు. ఒకే ఏడాది తండ్రి, ఓ తమ్ముడు మరణించడంతో మా కుటుంబాన్ని ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. అయినా సరే దేనికి దిగులు చెందక ఆకాశ్ లక్ష్యాన్ని చేరుకునేందుకు మా వంతు ప్రయత్నం మేం చేశాం’ అని జ్యోతి వివరించింది.జబ్బు గురించి చెప్పాలనుకోలేదు ఈ మ్యాచ్ను మేమంతా చూశాం. వికెట్ తీసిన ప్రతీసారి గట్టిగా చప్పట్లతో సంబరం చేసుకున్నాం. దీంతో ఇరుగు పొరుగువారు వచ్చి ఏమైందని అడిగి వెళ్లిపోయారు. దేశానికి విజయాన్నిచ్చిన అతని ప్రదర్శన మాకైతే పండగను తెచ్చింది. ఇక మీడియాలో నా జబ్బు సంగతి చెప్పినట్లు మొదట తెలియదు.ఎందుకంటే నా క్యాన్సర్ గురించి బయటికి వెల్లడించేందుకు మా కుటుంబం సిద్ధంగా లేదు. బహుశా నాపై అప్యాయత కొద్దీ ఆ క్షణం భావోద్వేగానికి గురై అక్కకు అంకితం చేస్తున్నానని చెప్పి ఉండొచ్చు. నేనన్నా... కుటుంబమన్నా అతనికి వల్లమాలిన ప్రేమ. నాకిప్పుడు క్యాన్సర్ మూడో దశలో ఉంది. ఇంకో ఆర్నేళ్ల చికిత్స అవసరమని వైద్యులు చెప్పారు. ఆ తర్వాతే ఏమవుతుందో చూడాలి. ఐపీఎల్ సమయంలో హాస్పిటల్కు... ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్కు ప్రాతినిధ్యం వహించే ఆకాశ్ లీగ్ జరిగే సమయంలో పది వేదికలు మార్చి మార్చి ఆడే అంతటి బిజీ షెడ్యూల్లోనూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నన్ను పరామార్శించేందుకు మ్యాచ్ ముందో, తర్వాతో తప్పకుండా వచ్చేవాడు. ఎడ్జ్బాస్టన్ వేదికపై విజయం సాధించాక రెండుసార్లు వీడియో కాల్లో మాట్లాడుకున్నాం.అప్పుడు అతను.. నాతో .. ‘‘అక్క ఏమాత్రం బాధపడకు. దేశం మొత్తం మనవెంటే ఉందని చెప్పడంతో ఆ క్షణం నన్ను నేను నియంత్రించుకోలేక భావోద్వేగానికి గురై ఏడ్చేశాను. నిజం చెబుతున్నా... ఇలాంటి తమ్ముడు చాలా అరుదుగా ఉంటాడు. మాకెప్పుడు అండగా ఉంటాడు. మాకు చెప్పందే ఏదీ చేయడు. ప్రతి విషయాన్ని కుటుంబంతో పంచుకుంటాడు. ఆర్నెళ్ల వ్యవధిలోనే మా నాన్న, ఒక సోదరుడు మరణించడంతో కుటుంబభారాన్ని ఆకాశే అన్నీ తానై మోస్తున్నాడు.ఆకాశమంత ధైర్యం నేను క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నప్పుడు ఆకాశ్ మాటలే నా స్థయిర్యాన్ని పెంచేవి. నా ఆరోగ్యం గురించే ఆలోచించేవాడు. అప్పుడు నేను అతని దృష్టి ఆటపైనే కేంద్రీకరించేందుకు ధైర్యం చెప్పేదాన్ని. ‘నేనిప్పుడు బాగానే ఉన్నాను. నా కోసం బాధపడొద్దు. నాకు తోడుగా నా భర్త ఉన్నాడు. నీవేం విచారించకు’ అని చెబితే... వెంటనే కల్పించుకుని తానేం చేసినా, సాధించినా సోదరిల కోసం, కుటుంబం కోసమే అని బదులిచ్చాడు.మా తల్లిదండ్రులకు మేం ఆరుగురు సంతానం. ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలం. ఆకాశ్ అందరికంటే చిన్నవాడు. నేను తనకంటే పదేళ్లు పెద్ద. చిన్నప్పటి నుంచి కూడా మా ఇద్దరి మధ్య ఆప్యాయత ఎక్కువే. మ్యాచ్కు ముందు, తర్వాత నాకు వీడియో కాల్ చేసి మాట్లాడతాడు. నేను తీసిన ఈ వికెట్లు నీ కోసం, దేశం కోసం’ అని గర్వంగా చెబుతాడు.రాగానే దహీ వడ తినిపిస్తా ఇంగ్లండ్ నుంచి స్వదేశానికి రాగానే ఆకాశ్ దీప్కు ఇష్టమైన వంట చేసి పెడతా. తనకిష్టమైనవే కాదు... తను ఏం కావాలన్నా సరే వండిపెడతా. నేను చేసే దహీ వడ అంటే అతనికెంతో ఇష్టం. ఆకుకూరలతో చేసిన వంటకాలను ఇష్టంగా తింటాడు. మా ఇంటికి ఎప్పుడొచ్చినా అవే చేసిపెట్టాలంటాడు. చదవండి: ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్మన్ గిల్ -
వరుసగా మూడో మ్యాచ్లోనూ సెంచరీ చేసిన టీమిండియా యువ సంచలన
టీమిండియా యువ సంచనలం ముషీర్ ఖాన్ ఇంగ్లండ్ పర్యటనలో పట్టపగ్గాల్లేకుండా చెలరేగిపోతున్నాడు. వరుస సెంచరీలు, ఐదు వికెట్ల ప్రదర్శనలతో దుమ్మురేపుతున్నాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎమర్జింగ్ టీమ్ (MCA Colts) తరఫున ఇంగ్లండ్లో పర్యటిస్తున్న ముషీర్ ఆల్రౌండర్గా అదరగొడుతున్నాడు.ఈ పర్యటనలో Notts 2nd XIతో జరిగిన తొలి మ్యాచ్లో 127 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 123 పరుగులు చేసిన ముషీర్.. ఆ మ్యాచ్లో బౌలింగ్లోనూ ఇరగదీసి 6 వికెట్లు ప్రదర్శన నమోదు చేశాడు.అనంతరం జులై 3న ఛాలెంజర్స్తో (కంబైన్డ్ నేషనల్ కౌంటీస్) ప్రారంభమైన రెండో మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో సెంచరీ (127 బంతుల్లో 125; 11 ఫోర్లు, సిక్స్) చేసిన ముషీర్.. బౌలింగ్లోనూ చెలరేగి ఆ మ్యాచ్ మొత్తంలో పది వికెట్లు (తొలి ఇన్నింగ్స్లో 6, రెండో ఇన్నింగ్స్లో 4) తీశాడు.తాజాగా ముషీర్ లౌబరో UCCE జట్టుతో జరిగిన మ్యాచ్లో మరోసారి సెంచరీతో కదంతొక్కాడు. ఈ మ్యాచ్లో ముషీర్ 146 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 154 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. ముషీర్కు ఇంగ్లండ్ పర్యటనలో ఇది వరుసగా మూడో సెంచరీ.హ్యాట్రిక్ సెంచరీలు, అదిరిపోయే బౌలింగ్ ప్రదర్శనలతో ఇంగ్లండ్ పర్యటనలో దుమ్మురేపుతున్న ముషీర్పై ప్రశంసల వర్షం కురుస్తుంది. భారత క్రికెట్కు మరో భవిష్యత్ తార దొరికాడని టీమిండియా అభిమానులు సంబురపడిపోతున్నారు. 20 ఏళ్ల ముషీర్ గతేడాది సెప్టెంబర్లో కారు ప్రమాదానికి గురైన తర్వాత ఆడుతున్న తొలి రెడ్ బాల్ టోర్నీ ఇది.ఈ టోర్నీలో ముషీర్ ఆకాశమే హద్దుగా చెలరేగుతూ భారత సీనియర్ టీమ్ సెలెక్టర్లకు సవాలు విసురుతున్నాడు. ఇప్పటికే భారత జట్టులో చోటు కోసం తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. ముషీర్ అన్న సర్ఫరాజ్ ఖాన్ సూపర్ ఫామ్లో ఉన్నా టీమిండియా బెర్త్ దక్కడం లేదు. మరోవైపు కౌంటీల్లో సత్తా చాటుతూ ఇషాన్ కిషన్, తిలక్ వర్మ కూడా భారత టెస్ట్ జట్టు బెర్త్ వైపు చూస్తున్నారు. ఇంత పోటీలో ముషీర్ టీమిండియా వైపు ఎలా వస్తాడో చూడాలి. ఇక్కడ ముషీర్కు ఓ అడ్వాంటేజ్ ఉంది. ముషీర్ బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ ఇరగదీస్తున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ అయిన ముషీర్.. ఇంగ్లండ్ పర్యటనకు ముందు కూడా సత్తా చాటాడు.ముషీర్కు దేశవాలీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. 2022-23 రంజీ సీజన్లో ముంబై తరఫున అరంగేట్రం చేసిన ముషీర్.. ఆడిన 9 మ్యాచ్ల్లో 51.14 సగటున 3 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 716 పరుగులు చేశాడు. ఇందులో ఓ అజేయ డబుల్ సెంచరీ కూడా ఉంది.ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ముషీర్ బౌలర్గానూ రాణించాడు. 9 మ్యాచ్ల్లో 8 వికెట్లు తీశాడు. ముషీర్ 2024 అండర్-19 వరల్డ్కప్లో భారత జట్టు సభ్యుడిగా ఉన్నాడు. టీమిండియా రన్నరప్గా నిలిచిన ఈ టోర్నీలో ముషీర్ రెండు సెంచరీలు చేశాడు. 2024 రంజీ ఫైనల్లో సెంచరీ చేసిన ముషీర్.. ముంబై తరఫున రంజీ ఫైనల్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. -
వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికి బ్రేక్.. ఇంగ్లండ్ చేతిలో ఓడిన టీమిండియా
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ తొలిసారి శాంతించాడు. ఐదు వన్డేల సిరీస్లో తొలి నాలుగు మ్యాచ్ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన వైభవ్.. నిన్న (జులై 7) జరిగిన చివరి మ్యాచ్లో ఓ మోస్తరు ఇన్నింగ్స్తో (42 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో, 78.57 స్ట్రయిక్రేట్తో 33 పరుగులు) సరిపెట్టాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తక్కువ స్కోర్కే పరిమితమై.. ఆతర్వాత ఆ స్కోర్ను కాపాడుకోవడంలో విఫలమైంది. ఈ మ్యాచ్లో ఓడినా టీమిండియా 3-2 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. భారత్ 1,3,4 వన్డేలు గెలువగా.. ఇంగ్లండ్ 2, 5 వన్డేల్లో నెగ్గింది. భారత్ త్వరలో ఇంగ్లండ్తో రెండు మ్యాచ్ల యూత్ టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లో తొలి టెస్ట్ జులై 12 నుంచి 15 వరకు బెకెన్హమ్లో జరుగనుంది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన యంగ్ ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 210 పరుగులు మాత్రమే చేసింది. ఆర్ఎస్ అంబ్రిష్ (66) అజేయ అర్ద శతకంతో రాణించి టీమిండియాకు ఈ మాత్రం స్కోరైనా అందించాడు. జట్టులో నెక్స్ హైయ్యెస్ట్ స్కోర్ వైభవ్దే. రాహుల్ కుమార్ (21), హర్వంశ్ పంగాలియా (24), కనిశ్క్ చౌహాన్ (24), యుద్దజిత్ గుహా (10) రెండంకెల స్కోర్లు చేయగా.. ఆయుశ్ మాత్రే (1) వైఫల్యాల పరంపరను కొనసాగించాడు. మరో స్టార్ బ్యాటర్ విహాన్ మల్హోత్రా (1) కూడా ఈ మ్యాచ్లో విఫలమయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఫ్రెంచ్, ఆల్బర్ట్ చెరో 2 వికెట్లు తీయగా.. ఫిర్బాంక్, మోర్గాన్, గ్రీన్, ఎకాంశ్ సింగ్ తలో వికెట్ తీశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 31.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ విజయం సాధించింది. తొలుత బెన్ డాకిన్స్ (66), ఆతర్వాత బెన్ మేస్ (82 నాటౌట్), కెప్టెన్ థామస్ రూ (49 నాటౌట్) రాణించి ఇంగ్లండ్ను విజయతీరాలకు చేర్చారు. భారత బౌలర్లలో నమన్ పుష్పక్ 2, దిపేశ్ దేవేంద్రన్ ఓ వికెట్ తీశాడు.శాంతించిన వైభవ్ఈ సిరీస్లో వైభవ్ 100 లోపు స్ట్రయిక్రేట్తో బ్యాటింగ్ చేయడం ఇదే మొదటిసారి. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో వైభవ్ తొలి నాలుగు మ్యాచ్ల్లో 130కి పైగా స్ట్రయిక్రేట్తో పరుగులు చేశాడు.తొలి మ్యాచ్లో 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసిన వైభవ్.. రెండో వన్డేలో 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 45 పరుగులు.. మూడో వన్డేలో 31 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 86 పరుగులు.. నాలుగో వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగి 78 బంతుల్లో 13 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో ఏకంగా 143 పరుగులు చేశాడు. ఈ సిరీస్ వైభవ్ విధ్వంసం ధాటికి ఇంగ్లండ్ యువ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. వైభవ్ ప్రతి మ్యాచ్ల కనీసం రెండైనా సిక్సర్లు కొట్టాడు. ఐదో వన్డేలో నిదానంగా ఆడినా 3 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. -
అందుకే లారా క్వాడ్రపుల్ సెంచరీ (400) రికార్డును బద్దలు కొట్టలేదు: వియాన్ ముల్దర్
జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ వియాన్ ముల్దర్ అజేయ ట్రిపుల్ సెంచరీతో (367) చెలరేగాడు. ఈ ట్రిపుల్తో ముల్దర్ చాలా రికార్డులను బద్దలు కొట్టాడు.విదేశీ గడ్డపై అత్యధిక టెస్ట్ స్కోర్ చేసిన ఆటగాడిగా..సౌతాఫ్రికా తరఫున ఓ టెస్ట్ మ్యాచ్లో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా.. కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా.. టెస్ట్ల్లో సెకెండ్ ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ (297 బంతుల్లో) చేసిన ఆటగాడిగా..టెస్ట్ల్లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా.. టెస్ట్ల్లో సౌతాఫ్రికా తరఫున హాషిమ్ ఆమ్లా (311 నాటౌట్) ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు.ఈ రికార్డులన్నీ పక్కన పెడితే ముల్దర్ ఓ చారిత్రక రికార్డును బద్దలు కొట్టే సువర్ణావకాశాన్ని వదిలేసి వార్తల్లోకెక్కాడు. టెస్ట్ల్లో అత్యంత అరుదైన క్వాడ్రపుల్ సెంచరీ (400) చేసే అవకాశాన్ని ముల్దర్ చేజేతులారా జారవిడిచాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా మాత్రమే క్వాడ్రపుల్ సెంచరీ చేశాడు.మ్యాచ్ రెండో రోజు తొలి సెషన్లోనే ట్రిపుల్ సెంచరీ పూర్తి చేసిన ముల్దర్.. క్వాడ్రపుల్ సెంచరీకి 33 పరుగుల దూరంలో (367 నాటౌట్) ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి సంచలనం నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది.టెస్ట్ క్రికెట్లో ఎప్పుడో కాని ఇలాంటి అవకాశం రాదు. అలాంటిది ముల్దర్ ఈ అవకాశాన్ని వదిలేసి చారిత్రక తప్పిదం చేశాడు. ఈ ఇన్నింగ్స్లో ముల్దర్ ఉన్న ఫామ్ను బట్టి చూస్తే మరో 20 బంతుల్లో ఈజీగా క్వాడ్రపుల్ సెంచరీ పూర్తయ్యేది. అయితే అతను అనూహ్యంగా లంచ్ విరామం తర్వాత తిరిగి బరిలోకి దిగకుండా ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి సంచలన నిర్ణయం తీసకున్నాడు.తగినంత సమయం, అవకాశం ఉండి కూడా ముల్దర్ క్వాడ్రపుల్ సెంచరీని కాదనుకోవడాన్ని సగటు క్రికెట్ అభిమాని జీర్ణించుకోలేకపోతున్నాడు. అత్యంత అరుదుగా వచ్చే అవకాశాన్ని కాదనుకొని ముల్దర్ చాలా పెద్ద తప్పిదం చేశాడని వాపోతున్నారు. ప్రస్తుత జమానాలో ఇలాంటి అవకాశం బహుశా ఎవరికీ రాకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు.ఈ ఇన్నింగ్స్ అనంతరం వియాన్ క్వాడ్రపుల్ సెంచరీని కాదనుకోవడంపై స్పందించాడు. లారా ఓ దిగ్గజం. అలాంటి ఆటగాడి పేరు మీదనే క్వాడ్రపుల్ సెంచరీ రికార్డు ఉండాలి. ఆ రికార్డును నిలబెట్టుకోవడానికి అతను అర్హుడు. నాకు మళ్లీ క్వాడ్రపుల్ సెంచరీ చేసే అవకాశం వచ్చినా ఇలాగే చేస్తాను. ఈ విషయాన్ని షుక్రీ కాన్రడ్తో (దక్షిణాఫ్రికా హెడ్ కోచ్) చెప్పాను. అతను కూడా నా అభిప్రాయంతో ఏకీభవించాడు. లంచ్ విరామం తర్వాత ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడానికి మరో కారణం కూడా ఉంది. మ్యాచ్ గెలవడానికి సరిపడా స్కోర్ చేశామని భావించాను. ఈ రెండు కారణాల చేత ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసినట్లు చెప్పుకొచ్చాడు.MULDER TALKS ABOUT HIS DECLARATION:"Lara's Record is exactly where it Should be". pic.twitter.com/PWwKGlvoL6— Johns. (@CricCrazyJohns) July 7, 2025ముల్దర్ కామెంట్స్ విన్న తర్వాత యావత్ క్రికెట్ ప్రపంచం అతనికి సెల్యూట్ కొట్టింది. దిగ్గజాలను గౌరవించే సంస్కారవంతమైన క్రికెటర్ అంటూ జేజేలు పలికింది. లారా క్వాడ్రపుల్ రికార్డును త్యాగం చేసి చిరకాలం తన పేరును స్మరించుకునేలా చేశాడని కామెంట్లు చేస్తుంది. నిస్వార్థ నాయకుడు, గొప్ప ఆటగాడని కీర్తిస్తుంది. వ్యక్తిగత రికార్డులు కాకుండా జట్టు ప్రయోజనాలే ముఖ్యమనుకునే ఇలాంటి నాయకుడిని చూడలేమని జేజేలు పలుకుతుంది.వియాన్ లారా క్వాడ్రపుల్ సెంచరీ రికార్డు కాదనుకున్నా టెస్ట్ల్లో ఐదో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. టెస్ట్ల్లో అత్యధిక పరగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో లారా (400 నాటౌట్), మాథ్యూ హేడెన్ (380), బ్రియాన్ లారా (375), మహేళ జయవర్దనే (374) మాత్రమే ముల్దర్ కంటే ముందున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. ముల్దర్ అజేయ ట్రిపుల్ సెంచరీతో (334 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 367 పరుగులు) చెలరేగడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 626 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో టోని డి జోర్జి 10, సెనోక్వానే 3, డేవిడ్ బెడింగ్హమ్ 82, లుహాన్ డ్రి ప్రిటోరియస్ 78, డెవాల్డ్ బ్రెవిస్ 30, వెర్రిన్ 42 (నాటౌట్) పరుగులు చేశాడు. జింబాబ్వే బౌలర్లలో చివంగ, మటిగిము తలో 2 వికెట్లు తీయగా.. మసకద్జ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం సౌతాఫ్రికా బౌలర్లు కూడా రెచ్చిపోవడంతో జింబాబ్వే తొలి ఇన్నింగ్స్లో 170 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ఫాలో ఆన్ ఆడుతుంది. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్ను సుబ్రాయన్ (10-1-42-4), కోడి యూసఫ్ (7-1-20-2), కార్బిన్ బాష్ (7-1-27-1), ముత్తస్వామి (13-2-59-1) కుప్పకూల్చారు. అజేయ ట్రిపుల్తో రికార్డులను తిరగరాసిన ముల్దర్ బౌలింగ్లోనూ రాణించాడు. 6 ఓవర్లలో 20 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. జింబాబ్వే ఇన్నింగ్స్లో సీన్ విలియమ్స్ (83 నాటౌట్) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఫాలో ఆన్ ఆడుతూ జింబాబ్వే రెండో ఇన్నింగ్స్లోనూ తడబడింది. 31 పరుగుల వద్ద ఆ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి జింబాబ్వే స్కోర్ 51/1గా ఉంది. కైటానో (34), నిక్ వెల్చ్ (6) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో జింబాబ్వే ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించుకోవాలంటే మరో 405 పరుగులు చేయాలి. రెండు మ్యాచ్ల ఈ సిరీస్లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్లో విజయం సాధించింది. -
పట్టుదల...పోరాటం...అద్భుతం
జనవరి 2022... ఆతిథ్య దేశం హోదాలో భారత మహిళల ఫుట్బాల్ జట్టు ఆసియా కప్లో తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. అయితే ఒక్కసారిగా ప్రపంచాన్ని తలకిందులు చేసిన కోవిడ్ మహమ్మారి ప్రభావం ఈ జట్టుపై కూడా పడింది. చైనీస్ తైపీతో తొలి మ్యాచ్ సమయానికి కోవిడ్ కారణంగా మన జట్టుకు కనీసం 13 మంది ప్లేయర్లు కూడా అందుబాటులో లేకుండా పోయారు. దాంతో నిబంధనల ప్రకారం మొదటి మ్యాచ్ నుంచే కాకుండా మొత్తం టోర్నీ నుంచి టీమ్ తప్పుకోవాల్సి వచ్చింది. క్వాలిఫయింగ్ పోటీలు లేని సమయంలో 2003లో చివరిసారిగా ఆసియా కప్కు నేరుగా అర్హత సాధించిన మన జట్టు ఈసారి ఎంతో ఉత్సాహంతో, పట్టుదలతో సొంతగడ్డపై ఆసియా కప్కు సన్నద్ధమైంది. అయితే అనూహ్య పరిణామాలు ఎదురు కావడం మన మహిళలకు ఇది తీరని వేదన మిగిల్చింది. ఇప్పుడు మూడున్నరేళ్ల తర్వాత క్వాలిఫయింగ్ టోర్నీలో సత్తా చాటి మన మహిళలు దర్జాగా ఆసియా కప్కు అర్హత సాధించారు. అయితే గత టోర్నీ, ప్రస్తుత క్వాలిఫికేషన్కు మధ్య ఎంతో పోరాటం ఉంది. సవాళ్లు, ప్రతికూలతలు అధిగమించి అమ్మాయిలు సాధించిన ఈ గెలుపునకు ఎంతో ప్రత్యేకత ఉంది. సాక్షి క్రీడా విభాగం : ఆసియా కప్లో ఆడకుండానే బరి నుంచి తప్పుకోవడం మొదలు ఇప్పుడు అర్హత సాధించడం వరకు భారత మహిళల ఫుట్బాల్ జట్టుకు ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. సరైన దిశా నిర్దేశం లేకుండా, అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) తమ బాధ్యతను మరిచి పట్టించుకోకపోవడంతో అనాథలా కనిపించింది. అసలు జాతీయ జట్టు ఉందనే విషయాన్ని కూడా అంతా మర్చిపోయారు. ఒకటా, రెండా ఎన్నో పరిణామాలు మహిళల ఫుట్బాల్ పతనానికి దారి తీశాయి. అండర్–17 జట్టు కోచ్పై లైంగిక వేధింపుల ఆరోపణలు, ‘శాఫ్’ టోర్నీ సెమీస్లో నేపాల్ చేతిలో పరాజయం, అండర్–17 వరల్డ్ కప్లో ఆడిన మూడు మ్యాచ్లలో ఓడి నిష్క్రమణ, ఆసియా క్రీడల్లో చివరి స్థానం, ఒలింపిక్ క్వాలిఫయర్స్లో ఆఖరి స్థానం, పేరుకే ఇండియన్ ఉమెన్ లీగ్ ఉన్నా కనీస సౌకర్యాలు కల్పించలేని ఫెడరేషన్... ఇలా మహిళల జట్టుకు సమస్యలు నిర్విరామంగా సాగుతూనే వచ్చాయి. ఇలాంటి స్థితి నుంచి పైకి లేచి మన టీమ్ ఆసియా కప్కు అర్హత సాధించడం చిన్న విషయమేమీ కాదు. నాలుగు మ్యాచ్లలో నాలుగూ గెలవడం అసాధారణ ప్రదర్శనగా చెప్పవచ్చు. ముఖ్యంగా కొంత మంది ప్లేయర్లకు వ్యక్తిగతంగా కూడా ఇది ఎంతో ప్రత్యేక ఘనత. అందుకే థాయ్లాండ్తో మ్యాచ్ గెలవగానే వారంతా కన్నీళ్లపర్యంతమయ్యారు. వారి భావోద్వేగాలను నిలువరించడం ఎవరి వల్లా కాలేదు. వరుసగా కోచ్ల మార్పు... భారత మహిళల జట్టుకు ఎదురైన ఇటీవలి అనుభవాలు చూస్తే టీమ్ ఎలా నడుస్తోందో అర్థమవుతుంది. సంవత్సరాల తరపడి స్వయంగా ఫెడరేషన్ నిర్వహించే లీగ్లో కూడా ఆట జరుగుతుందా లేదా అనే సందేహాలు, జాతీయ శిబిరానికి వెళ్లినా తర్వాతి రోజు కోచ్ వస్తాడా లేదా అనుమానం, అసలు మహిళలుగా తమకు కనీస భద్రత కూడా ఉంటుందా లేదా అని పరిస్థితిని వారు దాటుకుంటూ వచ్చారు. ఏఐఎఫ్ఎఫ్ వరుసగా కోచ్లను మారుస్తూ పోయింది. డెనర్బై, సురేన్ ఛెత్రి, ఛోబా దేవి, సంతోష్ కశ్యప్, జోకిమ్ అలెగ్జాండర్సన్... ఇలా కోచ్లు రావడం, పోవడం జరిగిపోయాయి. చివరకు క్రిస్పిన్ ఛెత్రి చేతుల్లోకి కోచింగ్ బాధ్యతలు వచ్చాయి. అతనికి అసిస్టెంట్గా పీవీ ప్రియను తీసుకున్నారు. ఆసియా కప్ కోసం మన జట్టు థాయ్లాండ్లో అడుగు పెట్టినప్పుడు కూడా ఎలాంటి అంచనాలు లేవు. 2022లో కోవిడ్ కారణంగా టోర్నీకి దూరమైన జట్టులో ఉన్నవారిలో చాలామంది ఈ సారి కూడా టీమ్లో ఉన్నారు. నాటి గాయం వారి మనసుల్లో ఇంకా మిగిలే ఉంది.కోచ్పై లైంగిక వేధింపుల ఆరోపణ వివాదం వచ్చినప్పుడు అండర్–17 టీమ్లో భాగమైన హేమమ్ షిల్కీ దేవి, లిండా కోమ్, మార్టినా తోక్చోమ్ ఇప్పుడు సీనియర్ టీమ్లో ఉన్నారు. పురుషుల ఫుట్బాల్ జట్టు చిత్తుగా ఓడిన సందర్భాల్లోనూ వార్తల్లో ఉంటుండగా... మహిళల టీమ్ను అసలు ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇలాంటి స్థితిలో వారు తమ పోరాటాన్ని మొదలు పెట్టారు. పటిష్ట ప్రత్యర్థి ని పడగొట్టి... మంగోలియాపై 13–0తో, తిమోర్ లెస్టెపై 4–0తో, ఆపై ఇరాక్పై 5–0తో ఘన విజయం... అంచనాలకు భిన్నంగా చక్కటి ప్రదర్శనతో మన మహిళలు వరుసగా మూడు విజయాలు సాధించారు. అయితే సరే ఆసియా కప్ క్వాలిఫికేషన్పై ఇంకా సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే చివరి లీగ్లో ఆతిథ్య థాయ్లాండ్ ప్రత్యరి్థగా ఎదురైంది. ‘ఫిఫా’ ర్యాంకింగ్స్లో మనకంటే ఎంతో ముందుండటం మాత్రమే కాదు, ఈ టీమ్ గత రెండు ‘ఫిఫా’ వరల్డ్ కప్లు కూడా ఆడింది. పైగా పెద్ద సంఖ్యలో విదేశీ ఆటగాళ్లు ఉండటంతో పాటు ప్రముఖ జపాన్ కోచ్ ఫుటోషీ ఐకెడా కోచింగ్ ఇస్తున్నాడు. మనకంటే బలమైన థాయ్లాండ్ జట్టు ఆరంభంలోనే దూకుడుగా ఆడి గోల్పోస్ట్పై దాడులు చేస్తూ ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే భారత్ పదునైన డిఫెన్స్తో వాటిని నిలువరించగలిగింది. తాము ఇంత కాలంగా పడిన ఆవేదన, చేసిన పోరాటం వారిలో ఒక్కసారిగా స్ఫూర్తి నింపినట్లుంది. అంతే... ఆ తర్వాత జట్టులో ఒక్కసారిగా కొత్త ఉత్సాహం వచ్చింది. ప్రత్యర్థి ఎవరనేది పట్టించుకోకుండా చివరి వరకు పట్టు విడవకుండా చెలరేగిన జట్టు విజయాన్ని అందుకుంది.అన్ని రకాలుగా సన్నద్ధమై...మ్యాచ్ ముగిశాక సంగీత బస్ఫోర్ ఆనందానికి హద్దుల్లేవు. రెండు గోల్స్తో ఆమె ఈ చిరస్మరణీయ విజయంలో కీలకపాత్ర పోషించింది. కోవిడ్ కారణంగా 2022 ఆసియా కప్కు జట్టుకు దూరంగా కాగా, అంతకుముందే గాయంతో సంగీత టోర్నీ నుంచి తప్పుకుంది. 2019 నుంచి జట్టులో ప్రధాన సభ్యురాలిగా ఉన్న ఆమె ఆపై కోలుకోవడానికి ఏడాది పట్టింది. అదే సమయంలో ఆమె తండ్రిని కూడా కోల్పోయింది. సీనియర్ ప్లేయర్ అయిన తనకు భవిష్యత్తులో మళ్లీ ఎప్పుడు ఈ స్థాయిలో విజయానందం వరిస్తుందో అంటూ ఆమె ఆనందభాష్పాలు రాల్చింది. టోర్నీకి ముందు తమదైన రీతిలో ప్లేయర్లు సన్నద్ధమయ్యారు. మనీషా కళ్యాణ్, జ్యోతి చౌహాన్, తెలంగాణ ప్లేయర్ గుగులోత్ సౌమ్య యూరోపియన్ క్లబ్స్ ట్రయల్స్కు వెళ్లి కాంట్రాక్ట్లు పొంది తమ ఆటకు పదును పెట్టారు. మిగిలిన వారు ఐ–లీగ్లో బరిలోకి దిగి సాధ్యమైనంత ఎక్కువగా ప్రాక్టీస్పై దృష్టి పెట్టారు. ఈ విజయం కచ్చితంగా ఏఐఎఫ్ఎఫ్ది మాత్రం కాదు. తమ శక్తి, స్వేదం, కన్నీళ్లు ధారబోసిన 23 మంది మహిళా ఫుట్బాలర్లదే. వచ్చే ఏడాది ఆసియాకప్లో కూడా ఇదే రీతిలో సత్తా చాటితే వరల్డ్ కప్లో పాల్గొనే స్వప్నం కూడా సాకారమవుతుంది. -
రెండో రౌండ్లో వంతిక అగర్వాల్
బతూమి (జార్జియా): మహిళల ప్రపంచకప్ నాకౌట్ చెస్ టోర్నమెంట్లో భారత క్రీడాకారిణులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. వంతిక అగర్వాల్, పద్మిని రౌత్, పీవీ నందిత రెండో రౌండ్లోకి ప్రవేశించగా... కిరణ్ మనీషా మొహంతి తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. కె.ప్రియాంక భవిత్యం నేడు జరిగే టైబ్రేక్ గేమ్లలో తేలనుంది. తొలి రౌండ్లో వంతిక 1.5–0.5తో లాలా షొహోర్దోవా (తుర్క్మెనిస్తాన్)పై, పద్మిని 2–0తో జాంగ్ లాన్లిన్ (చైనా)పై, నందిత 2–0తో ఒరిట్జ్ అనాహి (ఈక్వెడార్)పై గెలుపొందారు. కిరణ్ మనీషా 0.5–1.5తో సాంగ్ యుజిన్ (చైనా) చేతిలో ఓడిపోయింది. తొలి రౌండ్లోని రెండు గేమ్లు ముగిశాక ప్రియాంక–గాల్ జొసోకా (హంగేరి) 1–1తో సమంగా నిలిచారు. షొహోర్దోవాతో ఆదివారం తొలి గేమ్ను ‘డ్రా’ చేసుకున్న వంతిక సోమవారం జరిగే రెండో గేమ్లో 29 ఎత్తుల్లో నెగ్గింది. జాంగ్ లాన్లిన్పై తొలి గేమ్లో గెలిచిన పద్మిని సోమవారం జరిగిన రెండో గేమ్లో 34 ఎత్తుల్లో... అనాహిపై తొలి గేమ్లో నెగ్గిన నందిత రెండో గేమ్లో 64 ఎత్తుల్లో విజయం అందుకున్నారు. సాంగ్ యుజిన్ చేతిలో తొలి గేమ్లో ఓడిపోయిన మనీషా రెండో గేమ్ను 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకొని ఇంటిదారి పట్టింది. -
ఐసీసీ సీఈఓగా సంజోగ్ గుప్తా
దుబాయ్: భారత మీడియా మొఘల్ సంజోగ్ గుప్తా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ (సీఈఓ)గా నియమితులయ్యారు. ఈ ఏడాది పాకిస్తాన్ ఆతిథ్యమిచ్చిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆ్రస్టేలియాకు చెందిన జెఫ్ అలర్డైస్ సీఈఓ పదవి నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి ఈ పదవి ఖాళీగానే ఉండటంతో సంజోగ్ గుప్తాతో భర్తీ చేశారు. జియోస్టార్ నెట్వర్క్కు సీఈఓగా వ్యవహరించిన సంజోగ్కు మీడియా రంగంలో విశేషానుభవం ఉంది. దీంతో పాటు భారత్కే చెందిన జై షా ఐసీసీ చైర్మన్గా ఉండటం కూడా అంతర్జాతీయ క్రికెట్ వ్యవహారాలు చక్కబెట్టే పదవిని చేపట్టేందుకు కలిసొచ్చింది. అంతమాత్రాన పూర్తిగా జై షా చలవే అనలేం. ఎందుకంటే ఏళ్ల తరబడి మీడియా రంగంలో ఆయన విశేష కృషి చేశారు. అందువల్లేనేమో 2500 పైచిలుకు దరఖాస్తు చేసుకుంటే సంజోగ్నే సీఈఓ పదవి వరించింది. ఐసీసీలోని శాశ్వత, అనుబంధ సభ్యులైన 25 దేశాల నుంచి వేల సంఖ్యలో ఈ పదవి కోసం పోటీపడ్డారు. అనుభవం, పనితీరు ఆధారంగా ఒక్కో దేశం నుంచి 12 మంది చొప్పున తుది జాబితాకు ఖరారు చేయగా ఇందులో సంజోగ్ గుప్తా అర్హుడని ఐసీసీ కమిటీ భావించింది. ఈ నామినేషన్ల కమిటీలో ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖాజా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చైర్మన్ రిచర్డ్ థాంప్సన్, లంక క్రికెట్ అధ్యక్షుడు షమ్మీ సిల్లా, భారత బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ సిఫార్సు మేరకే ఐసీసీ చైర్మన్ జై షా... సంజోగ్ను కొత్త సీఈఓగా నియమించారు. స్పోర్ట్స్ జర్నలిస్ట్గా వచ్చి... ఈ జనవరిలో పదవి నుంచి వైదొలిగిన అలర్డైస్ వారసుడిగా సంజోగ్ గుప్తా త్వరలోనే పదవీ బాధ్యతలు చేపడతారు. ఐసీసీ చైర్మన్ తర్వాత రెండో ప్రాధాన్య పదవి సీఈఓ. దీంతో ఈ రెండు కీలకమైన పదవుల్లో భారతీయులే కొలువుదీరడం విశేషం. జై షా భారత హోం మంత్రి అమిత్ షా తనయుడు. కానీ గుప్తా మాత్రం ఢిల్లీలోని ద ట్రైబ్యున్ పత్రికలో ఓ సాధారణ స్పోర్ట్స్ జర్నలిస్టుగా కెరీర్ను ప్రారంభించి మీడియా మొఘల్గా ఎదిగాడు. 2010లో స్టార్ ఇండియా (ప్రస్తుత జియో స్టార్)లో సహాయ ఉపాధ్యక్షుడిగా చేరిన సంజోగ్ తన నేర్పు, నైపుణ్యం, అంకితభావం, నిబద్ధతతో అంచెలంచెలుగా ఎదిగారు. కంటెంట్, ప్రొగ్రామింగ్, వ్యూహారచనతో ఓ చానెల్ నెట్వర్క్ను విస్తరించారు. మొదటి పదేళ్లు ఐపీఎల్ ‘సోనీ’ నెట్వర్క్లో ప్రసారమైంది. తర్వాత కోట్లు గుమ్మరించి ఐపీఎల్ సహా, ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్), ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ (ఐఎస్ఎల్) సహా ఎన్నో ప్రీమియర్ లీగ్ను, గ్రాండ్స్లామ్ టోర్నీల ప్రసార హక్కుల్ని స్టార్ హస్తగతమయ్యేలా చేశారు. రిలయన్స్కు చెందిన వయాకామ్ 18 నెట్వర్క్ డిస్నీ స్టార్ను సొంతం చేసుకోవడంతో రిలయన్స్ యాజమాన్యం గతేడాది సంజోగ్ గుప్తాను సీఈఓగా నియమించింది. ఇప్పుడైతే ఏకంగా ఐసీసీలో ఏడో సీఈఓగా అంతర్జాతీయ క్రికెట్ను వ్యవహారాలను చక్కబెట్టే పనిలో పడతారు.7 ఐసీసీ సీఈఓగా నియమితుడైన ఏడో వ్యక్తి సంజోగ్ గుప్తా. గతంలో డేవిడ్ రిచర్డ్స్ (1993–2001), మాల్కం స్పీడ్ (2001–2008), హరూన్ లోర్గాట్ (2008–2012), డేవిడ్ రిచర్డ్సన్ (2012–2019), మనూ సాహ్ని (2019–2021), జెఫ్ అలర్డైస్ (2021–2025) ఈ బాధ్యతలు నిర్వర్తించారు. -
జొకోవిచ్ 16వసారి...
లండన్: రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్స్లామ్ టైటిల్ వేటలో సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ మరో అడుగు ముందుకేశాడు. వింబుల్డన్ టోర్నీలో ఏడుసార్లు చాంపియన్ జొకోవిచ్ 16వసారి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ జొకోవిచ్ 1–6, 6–4, 6–4, 6–4తో 11వ సీడ్ అలెక్స్ డిమినార్ (ఆ్రస్టేలియా)పై నెగ్గాడు. 3 గంటల 19 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో జొకోవిచ్ తొలి సెట్లో కేవలం ఒక గేమ్ మాత్రమే గెలిచాడు. అయితే రెండో సెట్ నుంచి గాడిలో పడ్డ జొకోవిచ్ ప్రత్యరి్థకి ఆధిపత్యం చలాయించే అవకాశం ఇవ్వలేదు. మ్యాచ్ మొత్తంలో ఆరు ఏస్లు సంధించిన జొకోవిచ్ ఐదు డబుల్ ఫాల్ట్లు చేశాడు. నెట్ వద్దకు 52 సార్లు దూసుకొచ్చి 35 సార్లు పాయింట్లు నెగ్గిన జొకోవిచ్ 38 విన్నర్స్ కొట్టాడు. తన సర్వీస్ను ఆరుసార్లు కోల్పోయిన జొకోవిచ్ ప్రత్యర్థి సర్వీస్ను కూడా ఆరుసార్లు బ్రేక్ చేశాడు. ఓవరాల్గా వింబుల్డన్లో 101వ విజయం నమోదు చేసిన జొకోవిచ్ కెరీర్లో 63వసారి గ్రాండ్స్లామ్ టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించాడు. క్వార్టర్ ఫైనల్లో ఇటలీ ప్లేయర్ ఫ్లావియో కొబోలితో జొకోవిచ్ ఆడతాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్లో కొబోలి 6–4, 6–4, 6–7 (4/7), 7–6 (7/3)తో మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై... బెన్ షెల్టన్ (అమెరికా) 3–6, 6–1, 7–6 (7/1), 7–5తో సొనెగో (ఇటలీ)పై, డిఫెండింగ్ చాంపియన్ , రెండో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్) 6–7 (5/7), 6–3, 6–4, 6–4తో 14వ సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా)పై విజయం సాధించారు. -
శాంతించిన వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసం డోసు కాస్త తగ్గింది..!
ఇంగ్లండ్ పర్యటనలో భారత యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ తొలిసారి శాంతించాడు. ఇవాళ (జులై 7) జరుగుతున్న ఐదో యూత్ వన్డేలో 42 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో, 78.57 స్ట్రయిక్రేట్తో 33 పరుగులు చేశాడు. ఈ సిరీస్లో వైభవ్ ఇంత తక్కువ స్ట్రయిక్రేట్తో బ్యాటింగ్ చేయడం ఇదే మొదటిసారి. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో వైభవ్ తొలి నాలుగు మ్యాచ్ల్లో 130కి పైగా స్ట్రయిక్రేట్తో పరుగులు చేశాడు.తొలి మ్యాచ్లో 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసిన వైభవ్.. రెండో వన్డేలో 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 45 పరుగులు.. మూడో వన్డేలో 31 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 86 పరుగులు.. నాలుగో వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగి 78 బంతుల్లో 13 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో ఏకంగా 143 పరుగులు చేశాడు. ఈ సిరీస్ వైభవ్ విధ్వంసం ధాటికి ఇంగ్లండ్ యువ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. వైభవ్ ప్రతి మ్యాచ్ల కనీసం రెండైనా సిక్సర్లు కొట్టాడు.ఇంగ్లండ్ పర్యటనలో వైభవ్ తొలిసారి శాంతించడంతో భారత్ స్వల్ప స్కోర్కే పరిమితమైంది. ఇవాళ జరుగుతున్న ఐదో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన యంగ్ ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 210 పరుగులు మాత్రమే చేసింది. ఆర్ఎస్ అంబ్రిష్ (66) అజేయ అర్ద శతకంతో రాణించి టీమిండియాకు ఈ మాత్రం స్కోరైనా అందించాడు. జట్టులో నెక్స్ హైయ్యెస్ట్ స్కోర్ వైభవ్దే. మిగతా ఆటగాళ్లలో రాహుల్ కుమార్ (21), హర్వంశ్ పంగాలియా (24), కనిశ్క్ చౌహాన్ (24), యుద్దజిత్ గుహా (10) రెండంకెల స్కోర్లు చేయగా.. ఆయుశ్ మాత్రే (1) వైఫల్యాల పరంపరను కొనసాగించాడు. మరో స్టార్ బ్యాటర్ విహాన్ మల్హోత్రా (1) కూడా ఈ మ్యాచ్లో విఫలమయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఫ్రెంచ్, ఆల్బర్ట్ చెరో 2 వికెట్లు తీయగా.. ఫిర్బాంక్, మోర్గాన్, గ్రీన్, ఎకాంశ్ సింగ్ తలో వికెట్ తీశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ విజయం దిశగా అడుగులు వేస్తుంది. 21 ఓవర్ల తర్వాత ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. బెన్ డాకిన్స్ (66) అర్ద సెంచరీతో రాణించగా.. బెన్ మేస్ (45) ఇంగ్లండ్ను గెలుపు దిశగా తీసుకెళ్తున్నాడు. మేస్కు జతగా కెప్టెన్ రూ (2) క్రీజ్లో ఉన్నాడు.కాగా, ఈ సిరీస్ను భారత్ ఇదివరకే కైవసం చేసుకుంది. తొలి నాలుగు మ్యాచ్ల్లో భారత్ మూడింట విజయాలు సాధించింది. చివరిదైన ఈ మ్యాచ్లో ఓడినా టీమిండియాకు ఒరిగేదేమీ ఉండదు. ఈ సిరీస్లో ఇంగ్లండ్ రెండో వన్డేలో మాత్రమే నెగ్గింది. వన్డే సిరీస్ అనంతరం భారత్ ఇంగ్లండ్తో రెండు మ్యాచ్ల యూత్ టెస్ట్ సిరీస్ ఆడనుంది. తొలి టెస్ట్ జులై 12 నుంచి 15 వరకు బెకెన్హమ్లో జరుగనుంది. -
రసెల్, నరైన్ కొనసాగింపు.. కొత్తగా మరో ముగ్గురు విధ్వంసకర వీరులు
దుబాయ్లో జరిగే ఇంటర్నేషనల్ లీగ్ టీ20 నాలుగో సీజన్ డిసెంబర్ 4 నుంచి వచ్చే ఏడాది జనవరి 2 వరకు జరుగనుంది. ఈ సీజన్లో కోసం లీగ్లో పాల్గొనే ఆరు ఫ్రాంచైజీలు మొదటి దశ సెలెక్షన్ ప్రక్రియను పూర్తి చేశాయి. ఇవాళ (జులై 7) లీగ్ నిర్వహకులు జట్ల వివరాలను వెల్లడించారు. ప్రతి జట్టులో గరిష్ఠంగా 23 మంది ఆటగాళ్లకు అనుమతి ఉంటుంది. ఇందులో ఎనిమిది మందిని రీటైన్ కానీ డైరెక్ట్ సైనింగ్ కానీ చేసుకోవచ్చు. మిగతా బెర్త్లను తొలిసారి వేలం ద్వారా భర్తీ చేయనున్నారు.తొలి దశ ఎంపిక ప్రక్రియలో అన్ని ఫ్రాంచైజీలు విధ్వంసకర బ్యాటర్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చాయి. అబుదాబీ నైట్రైడర్స్ సునీల్ నరైన్, ఫిలిప్ సాల్ట్, ఆండ్రీ రసెల్, చరిత్ అసలంక, ఆలీషాన్ షరాఫును రిటైన్ చేసుకొని, కొత్తగా మరో ముగ్గురు విధ్వంసకర బ్యాటర్లను ఎంపిక చేసుకుంది. టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్లైన అలెక్స్ హేల్స్, లియామ్ లివింగ్స్టోన్, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్లను కొత్తగా అక్కున చేర్చుకుంది.మరో ఫ్రాంచైజీ డెజర్ట్ వైపర్స్ డాన్ లారెన్స్, డేవిడ్ పెయిన్, ఖుజైమా బిన్ తన్వీర్, లోకీ ఫెర్గూసన్, మ్యాక్స్ హోల్డన్, సామ్ కర్రన్, వనిందు హసరంగను రీటైన్ చేసుకొని, ఆండ్రియస్ గౌస్ను కొత్తగా సైన్ చేసుకుంది.దుబాయ్ క్యాపిటల్స్ విషయానికొస్తే.. దసున్ షనక, దుష్మంత చమీరా, గుల్బదిన్ నైబ్, రోవ్మన్ పోవెల్, షాయ్ హోప్ను రీటైన్ చేసుకొని, కొత్తగా లూక్ వుడ్, వకార్ సలాంఖీల్, ముహమ్మద్ జవాదుల్లాను సైన్ చేసుకుంది.గల్ఫ్ జెయింట్స్ ఆయాన్ అఫ్జల్ ఖాన్, బ్లెస్సింగ్ ముజరబానీ, గెర్హార్డ్ ఎరాస్మస్, జేమ్స్ విన్స్, మార్క్ అదైర్ను రీటైన్ చేసుకొని.. అజ్మతుల్లా ఒమర్జాయ్, మొయిన్ అలీ, రహ్మానుల్లా గుర్బాజ్ను సైన్ చేసుకుంది.ఎంఐ ఎమిరేట్స్ అల్లా ఘజన్ఫర్, ఫజల్హక్ ఫారూకీ, కుసాల్ పెరీరా, రొమారియో షెపర్డ్, టామ్ బాంటన్, ముహమ్మద్ వసీంను రీటైన్ చేసుకొని.. క్రిస్ వోక్స్, కమిందు మెండిస్ను సైన్ చేసుకుంది.షార్జా వారియర్జ్ జాన్సన్ ఛార్లెస్, కుసాల్ మెండిస్, టిమ్ సౌధి, టామ్ కొహ్లెర్ కాడ్మోర్ను రీటైన్ చేసుకొని.. మహీశ్ తీక్షణ, సికందర్ రజా, సౌరభ్ నేత్కావల్కర్, టిమ్ డేవిడ్ను సైన్ చేసుకుంది. -
అత్యధిక పారితోషికం అందుకునే వ్యాఖ్యాతలు వీరే.. గవాస్కర్కు అత్యధికంగా..!
ఐపీఎల్లో అత్యధిక పారితోషికం అందుకున్న వ్యాఖ్యాతల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మొట్టమొదటి స్థానంలో ఉన్నాడు. 2024 ఐపీఎల్ సీజన్ లెక్కల ప్రకారం.. గవాస్కర్ ఓ సీజన్లో ఇంగ్లీష్ కామెంట్రీ చేసినందుకు గానూ రూ. 4.5 కోట్లు తీసుకుంటాడు. అంటే ఓ మ్యాచ్కు అతని రెమ్యూనరేషన్ రూ. 6 నుంచి 10 లక్షల మధ్యలో ఉంటుంది. వ్యాఖ్యాతలు కామెంట్రీతో పాటు మ్యాచ్ ప్రిడిక్షన్స్, స్టోరీస్ కూడా చేయాల్సి ఉంటుంది. వీటన్నిటికీ కలిపి వారి పారితోషికం ఉంటుంది.గవాస్కర్తో సమానంగా ఐపీఎల్లో పారితోషికం అందుకునే వ్యాఖ్యాతలుగా మాథ్యూ హేడెన్, కెవిన్ పీటర్సన్, ఇయాన్ బిషప్ ఉన్నారు. వీరంతా ఇంగ్లీష్ కామెంట్రీకి తలో రూ. 4.17 కోట్లు అందుకుంటారు. వీరి తర్వాత ఇంగ్లీష్ కామెంట్రీకి హర్షా భోగ్లే రూ. 4.1 కోట్లు, రవిశాస్త్రి రూ. 4 కోట్లు అందుకుంటారు.హిందీ కామెంట్రీకి అత్యధిక పారితోషికం అందుకునే వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా. అతనికి సీజన్కు రూ. 2.92 కోట్లు లభిస్తుంది. ఆకాశ్ చోప్రా తర్వాత సంజయ్ మంజ్రేకర్ అత్యధికంగా రూ. 2.8 కోట్లు అందుకుంటాడు. ఆతర్వాత సురేశ్ రైనా రూ. 2.5 కోట్లు, హర్భజన్ సింగ్ రూ. 1.5 కోట్లు రెమ్యూనరేషన్గా తీసుకుంటారు.సీనియర్ వ్యాఖ్యాతల పారితోషికాలు ఇలా ఉంటే, జూనియర్లకు మ్యాచ్ల లెక్కన పేమెంట్ ఇస్తారు. ఇంగ్లీష్, హిందీతో పాటు అన్ని స్థానిక భాషల్లో వ్యాఖ్యానం చేసే వారికి ఒకే లెక్కన మ్యాచ్కు రూ. 35 వేలు ఇస్తారు. ఇటీవలికాలంలో క్రికెట్లో కామెంట్రీకి ప్రాధాన్యత చాలా పెరిగింది. వ్యాఖ్యాతలకు కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే, వారి క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్దం చేసుకోవచ్చు. ప్రస్తుతం భారతీయ వ్యాఖ్యాతలు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, హర్షా భోగ్లేకు ప్రపంచ వ్యాప్తంగా పిచ్చ క్రేజ్ ఉంది. ఔటైనప్పుడు కానీ సిక్సర్లు కొట్టినప్పుడు వీరి వ్యాఖ్యానం పతాక స్థాయిలో ఉంటుంది. -
విండీస్ ఆటగాడి ఉగ్రరూపం.. 52 బంతుల్లో సుడిగాలి శతకం
మేజర్ లీగ్ క్రికెట్లో వెస్టిండీస్ వికెట్కీపర్ బ్యాటర్, లాస్ ఏంజెలెస్ నైట్రైడర్స్ ఆటగాడు ఆండ్రీ ఫ్లెచర్ విశ్వరూపం ప్రదర్శించాడు. శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్తో ఇవాళ (జులై 7) జరిగిన మ్యాచ్లో కేవలం 52 బంతుల్లోనే సుడిగాలి శతకం బాదాడు. వర్షం కారణంగా 19 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్రైడర్స్.. ఆండ్రీ ఫ్లెచర్ (58 బంతుల్లో 118; 10 ఫోర్లు, 8 సిక్సర్లు) సునామీ శతకంతో చెలరేగడంతో 3 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. నైట్రైడర్స్ ఇన్నింగ్స్లో ఫ్లెచర్తో పాటు అలెక్స్ హేల్స్ (26 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు), షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (28 బంతుల్లో 29; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా విధ్వంసం సృష్టించారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన యూనికార్న్స్ 7 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినప్పటికీ ఆ తర్వాత పుంజుకొని అద్భుతమైన పోరాటపటిమ కనబర్చింది. సంజయ్ కృష్ణమూర్తి (40 బంతుల్లో 92; 7 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి నైట్రైడర్స్ గుండెల్లో రైళ్లు పరిగెట్టించాడు. అతనికి హస్సన్ ఖాన్ (17 బంతుల్లో 35)చ, హమ్మద్ ఆజమ్ (27 బంతుల్లో 27), జేవియర్ బార్ట్లెట్ (13 బంతుల్లో 27) కూడా తోడవ్వడంతో ఓ దశలో యూనికార్న్స్ సంచలన విజయం సాధించేలా కనిపించింది. అయితే చివర్లో హోల్డర్, డొమినిక్ డేక్స్, వాన్ స్కాల్విక్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో యూనికార్న్స్ లక్ష్యానికి 11 పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమిపాలైంది. హోల్డర్, డొమినిక్ డేక్స్, వాన్ స్కాల్విక్ చివరి 3 ఓవర్లు అద్భుతంగా వేసి కీలక వికెట్లు తీశారు. ఈ గెలుపు ఇదివరకే లీగ్ నుంచి నిష్క్రమించిన నైట్రైడర్స్కు కంటితుడుపుగా వచ్చింది. ఈ మ్యాచ్లో ఓటమితో యూనికార్న్స్ మూడో స్థానానికి పరిమితమై ఎంఐ న్యూయార్క్తో ఎలిమినేటర్ మ్యాచ్లో తలపడనుంది. ఓడినా ప్లే ఆఫ్స్కు చేరిన ఎంఐ న్యూయార్క్ఇవాళే జరిగిన మరో మ్యాచ్లో ఎంఐ న్యూయార్క్ వాషింగ్టన్ ఫ్రీడం చేతిలో ఓడినా సీయాటిల్ ఓర్కాస్తో పోటీ పడి (రన్రేట్ విషయంలో) నాలుగో ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకుంది. ఎంఐపై గెలుపుతో వాషింగ్టన్ ఫ్రీడం టాప్ ప్లేస్ను ఖరారు చేసుకోగా.. టెక్సాస్ సూపర్ కింగ్స్ రెండో స్థానంలో నిలిచింది. క్వాలిఫయర్-1లో వాషింగ్టన్, టెక్సాస్ జట్లు తలపడనున్నాయి.ఐదో శతకం.. ఈ సీజన్లో రెండోదిఈ మ్యాచ్లో ఫ్లెచర్ చేసిన సెంచరీ ఈ సీజన్లో అతనికి రెండవది. కొద్ది రోజుల కిందట ఇతను వాషింగ్టన్ ఫ్రీడంపై మెరుపు శతకం (104) బాదాడు. ఓవరాల్గా ఫ్లెచర్కు ఇది టీ20ల్లో ఐదవ సెంచరీ. ఈ సెంచరీతో ఫ్లెచర్ కొలిన్ మున్రో, గ్లెన్ ఫిలిప్స్, డేవిడ్ మలాన్ లాంటి విధ్వంసకర వీరుల సరసన చేశాడు. వీరంతా టీ20ల్లో తలో 5 సెంచరీలు చేసిన వారిలో ఉన్నారు. -
క్వాడ్రపుల్ సెంచరీ (400) చేసే సువర్ణావకాశాన్ని వదిలేసిన సౌతాఫ్రికా కెప్టెన్
సౌతాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ వియాన్ ముల్దర్ టెస్ట్ క్రికెట్లో అత్యంత అరుదైన క్వాడ్రపుల్ సెంచరీ (400) చేసే సువర్ణావకాశాన్ని జట్టు ప్రయోజనాల కోసం తృణప్రాయంగా వదిలేశాడు. జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్లో ముల్దర్ రెండో రోజు తొలి సెషన్లోనే ట్రిపుల్ సెంచరీ పూర్తి చేసి, క్వాడ్రపుల్ సెంచరీకి 33 పరుగుల దూరంలో (367 నాటౌట్) ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు. ముల్దర్ తీసుకున్న ఈ అత్యంత సాహసోపేత నిర్ణయానికి యావత్ క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యానికి గురైంది.టెస్ట్ క్రికెట్లో ఎప్పుడో కాని ఇలాంటి సువర్ణావకాశం రాదు. ముల్దర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అవకాశాన్ని చేజేతులారా జారవిడిచుకున్నాడు. ఈ మ్యాచ్లో ముల్దర్ ఉన్న ఫామ్ను బట్టి చూస్తే మరో 20 బంతుల్లో ఈజీగా క్వాడ్రపుల్ సెంచరీ పూర్తయ్యేది. అయితే అతను అనూహ్యంగా లంచ్ విరామం తర్వాత తిరిగి బరిలోకి దిగకుండా ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు. తగినంత సమయం, అవకాశం ఉండి కూడా ముల్దర్ క్వాడ్రపుల్ సెంచరీని కాదనుకోవడాన్ని సగటు క్రికెట్ అభిమాని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఈ జమానా టెస్ట్ క్రికెట్లో ఇలాంటి అవకాశం బహుశా ఎవరికీ రాకపోవచ్చని బాధపడుతున్నారు. ఆటలో వేగం పెరిగిపోవడంతో డబుల్ సెంచరీలు చేయడమే ఎక్కువని క్రికెటర్లు భావిస్తున్నారు.ఏది ఏమైనా ముల్దర్ చేసిన పనికి విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులచే కీర్తించబడుతున్నాడు. నిస్వార్థ నాయకుడని జేజేలందుకుంటున్నాడు. జట్టు ప్రయోజనాలే ముఖ్యమనుకునే ఇలాంటి నాయకుడిని చరిత్రలో చూడలేమని సోషల్మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఒకే ఒక్కరు క్వాడ్రపుల్ సెంచరీ చేశారు. 2004లో విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ఇంగ్లండ్పై ఈ ఘనత సాధించాడు. టెస్ట్ల్లో అత్యధిక పరగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో లారా (400 నాటౌట్), మాథ్యూ హేడెన్ (380), బ్రియాన్ లారా (375), మహేళ జయవర్దనే (374) మాత్రమే ముల్దర్ కంటే ముందున్నారు. క్వాడ్రపుల్ మిస్ చేసుకున్నప్పటికీ ముల్దర్ మరో ఘనత సాధించాడు. విదేశీ గడ్డపై అత్యధిక టెస్ట్ స్కోర్ చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అలాగే సౌతాఫ్రికా తరఫున ఓ టెస్ట్ మ్యాచ్లో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు గ్రేమ్ స్మిత్ పేరిట ఉండేది. స్మిత్ 2003లో ఓ టెస్ట్ మ్యాచ్లో 362 పరుగులు (277 & 85) చేశాడు.దీనితో పాటు ముల్దర్ మరిన్ని రికార్డులు కూడా సాధించాడు. కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా.. టెస్ట్ల్లో సెకెండ్ ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ (297 బంతుల్లో) చేసిన ఆటగాడిగా (టెస్ట్ల్లో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ (278 బంతుల్లో) పేరిట ఉంది).. టెస్ట్ల్లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా.. టెస్ట్ల్లో సౌతాఫ్రికా తరఫున హాషిమ్ ఆమ్లా (311 నాటౌట్) ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు.విదేశీ టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు..367* - వియాన్ ముల్డర్ (SA) vs ZIM, బులవాయో, 2025337 - హనీఫ్ మొహమ్మద్ (PAK) vs WI, బార్బడోస్, 1958336* - వాలీ హమ్మండ్ (ENG) vs NZ, ఆక్లాండ్, 1933334* - మార్క్ టేలర్ (AUS) vs PAK, పెషావర్, 1998334 - సర్ డాన్ బ్రాడ్మాన్ (AUS) vs ENG, హెడింగ్లీ, 1930మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో ముల్దర్ 334 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 367 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఓవర్నైట్ స్కోర్ 264 వద్ద రెండో రోజు బరిలోకి దిగిన ముల్దర్.. తొలి సెషన్లోనే ట్రిపుల్ సెంచరీ పూర్తి చేశాడు. ముల్దర్ వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ వేగంగా ట్రిపుల్ సెంచరీ పూర్తి చేశాడు.ముల్దర్ చెలరేగడంతో సౌతాఫ్రికా లంచ్ తర్వాత 626/5 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ముల్దర్తో పాటు వెర్రిన్ (42) క్రీజ్లో ఉన్నాడు. అంతకుముందు సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో టోని డి జోర్జి 10, సెనోక్వానే 3, డేవిడ్ బెడింగ్హమ్ 82, లుహాన్ డ్రి ప్రిటోరియస్ 78, డెవాల్డ్ బ్రెవిస్ 30 పరుగులు చేసి ఔటయ్యారు. జింబాబ్వే బౌలర్లలో చివంగ, మటిగిము తలో 2 వికెట్లు తీయగా.. మసకద్జ ఓ వికెట్ దక్కించుకున్నాడు. రెండు మ్యాచ్ల ఈ సిరీస్లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్లో విజయం సాధించింది. -
పృథ్వీ షా సంచలన నిర్ణయం
టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. క్రికెటర్గా తనకు గుర్తింపునిచ్చిన ముంబైతో బంధాన్ని తెంచుకున్నాడు. తదుపరి (2025-26) దేశవాలీ సీజన్ కోసం మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నాడు. షా ఇటీవలే NOC (No Objection Certificate) కోసం ముంబై క్రికెట్ అసోసియేషన్కు దరఖాస్తు చేసుకోగా, తాజాగా అది జారీ అయ్యింది. PRITHVI SHAW JOINS MAHARASHTRA...!!!!- Waiting for Ruturaj × Shaw opening. 💛 pic.twitter.com/UPT4qF9mYv— Johns. (@CricCrazyJohns) July 7, 2025షా క్రమశిక్షణారాహిత్యం కారణంగా గత సీజన్లో ముంబై రంజీ జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే డిసెంబర్ 14న జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ఫైనల్లో మాత్రం ఆడాడు. ఆ మ్యాచ్ షా రాణించనప్పటికీ ముంబై ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్లో మధ్యప్రదేశ్పై విజయం సాధించింది. ఇదే షాకు ముంబై తరఫున ఆఖరి మ్యాచ్.షా ముంబై క్రికెట్ అసోసియేషన్కు (MCA) రాసిన లేఖలో ఇలా పేర్కొన్నాడు. MCA క్రికెటర్గా తనకు జన్మనిచ్చిందని అన్నాడు. MCA తనకు ఇచ్చిన అవకాశాలకు కృతజ్ఞతలు తెలిపాడు. మహారాష్ట్రకు ఆడే ఆశాజనకమైన అవకాశాన్ని కాదనుకోలేకపోయానని తెలిపాడు. ఈ మార్పును (ముంబై నుంచి మహారాష్ట్రకు) తన క్రికెట్ ప్రయాణంలో ముందడుగుగా అభివర్ణించాడు. ఇది తన అభివృద్ధికి దోహదపడుతుందని నమ్ముతున్నానని అన్నాడు.25 ఏళ్ల పృథ్వీ షా కెరీర్ హీన దశలో ఉన్నప్పుడు ఈ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ముంబై తరఫున అవకాశాలు దాదాపుగా కనుమరుగు కావడంతో ఈ సాహసం చేశాడు. సహజంగా క్రికెటర్లకు ముంబై తరఫున ఆడుతుంటేనే జాతీయ జట్టులో అవకాశాలు వస్తుంటాయి. అలాంటిది షా ముంబైని వీడి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. 2018లో టీమిండియా తరఫున అరంగేట్రంలోనే సెంచరీ చేసి భవిష్యత్ తారగా కీర్తించబడిన షా.. వివాదాలు, ఫిట్నెస్, పేలవ ఫామ్ కారణంగా జాతీయ జట్టుకు దూరమయ్యాడు.ఇవే కారణాలుగా అతను దేశవాలీ జట్టులోనూ చోటు కోల్పోయాడు. షాను తాజాగా ముగిసిన ఐపీఎల్లోనూ ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. షా కెరీర్ ప్రస్తుతం అగమ్యగోచరంగా ఉంది. ఈ దశలో అతను ముంబైని వీడి మహారాష్ట్రకు ఆడటానికి ఒప్పందం చేసుకున్నాడు. షా తదుపరి దేశవాలీ సీజన్లో మరో టీమిండియా యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్తో కలిసి ఆడతాడు. రుతురాజ్ మహారాష్ట్రకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. అన్నీ కుదిరితే షా, రుతురాజ్ మహారాష్ట్ర తరఫున ఇన్నింగ్స్ను ప్రారంభిస్తారు. -
ఒకే రోజు రెండు వరల్డ్ రికార్డులు బద్దలు
యుజీన్ (అమెరికా): మిడిల్ డిస్టెన్స్ రన్నింగ్లో తమకు తిరుగులేదని కెన్యా మహిళా అథ్లెట్లు మరోసారి నిరూపించుకున్నారు. డైమండ్ లీగ్లో భాగంగా అమెరికాలోని యుజీన్లో జరిగిన ప్రిఫోంటెయిన్ క్లాసిక్ మీట్లో ఇద్దరు కెన్యా మహిళా అథెట్లు రెండు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టారు. మూడుసార్లు ఒలింపిక్ చాంపియన్ ఫెయిత్ కిపియేగాన్ 1500 మీటర్ల విభాగంలో... పారిస్ ఒలింపిక్స్లో రెండు స్వర్ణాలు గెలిచిన బిట్రెస్ చెబెట్ 5000 మీటర్లలో కొత్త ప్రపంచ రికార్డులు సృష్టించారు. 31 ఏళ్ల కిపియేగాన్ 1500 మీటర్ల దూరాన్ని 3 నిమిషాల 48.68 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచింది.ఈ క్రమంలో గత ఏడాది పారిస్ ఒలింపిక్స్లో 3 నిమిషాల 49.04 సెకన్లతో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును కిపియేగాన్ తిరగరాసింది. కిపియేగాన్ 2016 రియో, 2020 టోక్యో, 2024 పారిస్ ఒలింపిక్స్లో స్వర్ణ పతకాలు గెలిచి 1500 మీటర్ల విభాగంలో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మరోవైపు 5000 మీటర్ల దూరాన్ని 25 ఏళ్ల బిట్రెస్ చెబెట్ 13 నిమిషాల 58.06 సెకన్లలో ముగించి తన పేరిట కొత్త ప్రపంచ రికార్డును లిఖించుకుంది.5000 మీటర్ల దూరాన్ని 14 నిమిషాల్లోపు పూర్తి చేసిన తొలి మహిళా అథ్లెట్గా గుర్తింపు పొందిన చెబెట్... రెండేళ్ల క్రితం ప్రిఫోంటెయిన్ క్లాసిక్ మీట్లో 14 నిమిషాల 00.21 సెకన్లతో గుడాఫ్ సెగె (ఇథియోపియా) సృష్టించిన ప్రపంచ రికార్డును సవరించింది. గత ఏడాది పారిస్ ఒలింపిక్స్లో చెబెట్ 5000, 10,000 మీటర్ల విభాగాల్లో స్వర్ణ పతకాలు నెగ్గి విశ్వ క్రీడల్లో అరుదైన ‘డబుల్’ సాధించిన మూడో అథ్లెట్గా గుర్తింపు పొందింది. -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్.. కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే ట్రిపుల్ సెంచరీ
సౌతాఫ్రికా ఆల్రౌండర్ వియాన్ ముల్దర్ టెస్ట్ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే ట్రిపుల్ సెంచరీ చేశాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఎవరూ ఈ ఘనత సాధించలేదు. జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్లో ముల్దర్ ఈ ఫీట్ సాధించాడు. WIAAN MULDER BECOMES THE FIRST TEST CAPTAIN TO SCORE TRIPLE HUNDRED ON CAPTAINCY DEBUT...!!! 🦁 pic.twitter.com/SujzdKo0Ht— Johns. (@CricCrazyJohns) July 7, 2025ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 297 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ పూర్తి చేసిన ముల్దర్.. టెస్ట్ల్లో రెండో వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ రికార్డును కూడా నమోదు చేశాడు. ఈ రికార్డు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. సెహ్వాగ్ 2008లో సౌతాఫ్రికాపై 278 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ పూర్తి చేశాడు. టెస్ట్ల్లో టాప్-5 ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీల వివరాలు ఇలా ఉన్నాయి.వీరేంద్ర సెహ్వాగ్-278 బంతుల్లోవియాన్ ముల్దర్-297హ్యారీ బ్రూక్-310మాథ్యూ హేడెన్-262వీరేంద్ర సెహ్వాగ్-364ఈ ట్రిపుల్తో ముల్దర్ టెస్ట్ల్లో సౌతాఫ్రికా తరఫున టెస్ట్ల్లో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగానూ రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్లో ముల్దర్ 314 పరుగుల స్కోర్ వద్ద హాషిమ్ ఆమ్లా (311 నాటౌట్) పేరిట ఉండిన రికార్డును బద్దలు కొట్టాడు. అలాగే ఆమ్లా తర్వాత టెస్ట్ల్లో సౌతాఫ్రికా తరఫున ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగానూ రికార్డుల్లోకెక్కాడు.మ్యాచ్ విషయానికొస్తే.. ఓవర్నైట్ స్కోర్ 264 వద్ద రెండో రోజు బరిలోకి దిగిన ముల్దర్.. తొలి సెషన్లోనే ట్రిపుల్ సెంచరీ పూర్తి చేశాడు. ముల్దర్ వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ వేగంగా ట్రిపుల్ సెంచరీ సాధించాడు. కడపటి వార్తలు అందేసరికి ముల్దర్ 350 పరుగులు కూడా పూర్తి చేశాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం ఏడుగురు (ముల్దర్తో కలిసి) మాత్రమే ఈ ఘనత సాధించారు. 108 ఓవర్ల తర్వాత తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా స్కోర్ 593/5గా ఉంది. ముల్దర్ 350 (324 బంతుల్లో 48 ఫోర్లు, 3 సిక్సర్లు), వెర్రిన్ 26 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో టోని డి జోర్జి 10, సెనోక్వానే 3, డేవిడ్ బెడింగ్హమ్ 82, లుహాన్ డ్రి ప్రిటోరియస్ 78, డెవాల్డ్ బ్రెవిస్ 30 పరుగులు చేసి ఔటయ్యారు. రెండు మ్యాచ్ల ఈ సిరీస్లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్లో విజయం సాధించింది. తొలి టెస్ట్లోనూ సెంచరీ చేసిన ముల్దర్జింబాబ్వేతో జరుగుతున్న ఈ సిరీస్లో ముల్దర్ తొలి టెస్ట్లోనూ సెంచరీ చేశాడు. తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో 147 పరుగులు చేసిన ముల్దర్ బౌలర్గానూ రాణించాడు. తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీశాడు. ఈ సిరీస్ కోసం సౌతాఫ్రికా కెప్టెన్గా ఎంపికైన కేశవ్ మహారాజ్ గాయపడటంతో ముల్దర్కు అనూహ్యంగా కెప్టెన్సీ పగ్గాలు దక్కాయి. -
అందని ద్రాక్ష పుల్లన!... ఇంత ఏడుపు దేనికి?
ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes)పై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. ఓడిపోయిన తర్వాత ఇలాంటి కుంటిసాకులు చెప్పడం అస్సలు బాగాలేదంటూ ట్రోల్ చేస్తున్నారు. ‘‘అందని ద్రాక్ష పుల్లన’’ అనుకునే ‘నక్క’ మాదిరి వేషాలు వేయొద్దంటూ తమదైన శైలిలో చురకలు అంటిస్తున్నారు. రెండో టెస్టులో ఇంగ్లండ్పై భారత్ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.ఎడ్జ్బాస్టన్లో చరిత్ర తిరగరాస్తూ తొలిసారి ఆతిథ్య జట్టు (IND Beat ENG)పై విజయ ఢంకా మోగించింది. రెండు ఇన్నింగ్స్లో కలిపి వెయ్యికి పైగా పరుగులు సాధించి.. ఇంగ్లండ్ను ఏకంగా 336 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా తొలి టెస్టు ఓటమికి ప్రతీకారం తీర్చుకుని ఐదు మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేసింది.ఉపఖండ పిచ్ మాదిరే ఉందిఈ నేపథ్యంలో ఓటమి అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందిస్తూ.. ఎడ్జ్బాస్టన్ పిచ్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘నిజం చెప్పాలంటే.. ఈ వికెట్ ఉపఖండ పిచ్ మాదిరే ఉంది. ఆట సాగుతున్న కొద్దీ పరుగులు రాబట్టడం కష్టతరంగా మారింది.పర్యాటక జట్టుకు అలవాటైన పిచ్లా మారిపోయిందనిపించింది. భారత బౌలింగ్ దళం తమకు అనుకూలమైన మాదిరి పిచ్పై బాగా ఆడింది’’ అని స్టోక్స్ పేర్కొన్నాడు. కాగా ఉపఖండ పిచ్లు స్పిన్కు అనుకూలంగా ఉంటాయన్న విషయం తెలిసిందే.పేసర్లకు 18 వికెట్లుఅయితే, ఎడ్జ్బాస్టన్ పిచ్ పొడిగా ఉంటుంది కాబట్టి బంతి టర్న్ అవుతుందనుకున్నా.. ఈ మ్యాచ్లో భారత పేసర్లే 18 వికెట్లు పడగొట్టారు. స్పిన్ ఆల్రౌండర్లైన రవీంద్ర జడేజా, వాషింగ్టన్ తలా ఒక్క వికెట్ మాత్రమే తీశారు. దీనిని బట్టి టీమిండియా కొత్త బంతితో ఎంత అద్భుతంగా రాణించిందో అర్థమవుతోంది. అయినప్పటికీ స్టోక్స్ ఇలా పిచ్ను సాకుగా చూపి.. టీమిండియా గెలుపును తక్కువ చేసేలా మాట్లాడటం అభిమానులకు రుచించలేదు. దీంతో.. ‘‘ఇంత ఏడుపు దేనికి?.. హుందాగా ఓటమిని అంగీకరించవచ్చు కదా’’ అంటూ అతడిని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.వరల్డ్ క్లాస్ టీమ్ ఇక ఏదేమైనా భారత్ వరల్డ్ క్లాస్ టీమ్ అంటూ ప్రశంసించిన స్టోక్స్.. శుమ్మన్ గిల్ అసాధారణ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడని కొనియాడటం విశేషం. కాగా ఈ మ్యాచ్లో భారత జట్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ ద్విశతకం (269), శతకం (161) బాదగా... పేసర్ ఆకాశ్ దీప్ పది వికెట్లతో చెలరేగాడు. కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య జూలై 10- 14 మధ్య జరుగనున్న మూడో టెస్టుకు లండన్లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానం వేదిక.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ రెండో టెస్టు- సంక్షిప్త స్కోర్లు👉భారత్: 587 & 427/6 డిక్లేర్డ్👉ఇంగ్లండ్: 407 & 271👉ఫలితం: ఇంగ్లండ్పై 336 పరుగుల తేడాతో భారత్ జయభేరి.చదవండి: ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్మన్ గిల్ -
టీమిండియా గెలుపుపై సచిన్ అలా.. కోహ్లి ఇలా..
ఇంగ్లండ్ గడ్డ మీద టీమిండియా చారిత్రాత్మక టెస్టు విజయం నేపథ్యంలో భారత దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar), విరాట్ కోహ్లి (Virat Kohli) హర్షం వ్యక్తం చేశారు. యువ సారథి శుబ్మన్ గిల్ (Shubman Gill)తో పాటు జట్టును అభినందించారు. కాగా ప్రసిద్ధ ఎడ్జ్బాస్టన్ మైదానంలో టీమిండియా తొలిసారి గెలుపు జెండా ఎగురవేసిన విషయం తెలిసిందే. దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ, స్పిన్ లెజెండ్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టు రిటైర్మెంట్ తర్వాత.. తొలిసారిగా విదేశీ పర్యటనకు వెళ్లిన యువ జట్టు.. ఈ అద్భుతం చేసింది.కెప్టెన్గా తొలి టెస్టులో ఓటమిని చవిచూసినప్పటికీ రెండో టెస్టులో మాత్రం శుబ్మన్ గిల్.. గత తప్పిదాలను పునరావృతం కానీయలేదు. ఇటు బ్యాటర్గా.. అటు సారథిగా అదరగొట్టి భారత్కు చిరస్మరణీయ విజయం అందించాడు.ఆకాశ్పై ప్రశంసలుఈ నేపథ్యంలో టీమిండియాతో పాటు గిల్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ స్పందిస్తూ... ‘‘టీమిండియా అద్భుత టెస్టు విజయం సాధించినందుకు నీకు శుభాకాంక్షలు గిల్. రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్లో అదరగొట్టారు.టీమిండియా తన వ్యూహాలతో ఇంగ్లండ్ తమ ఆట తీరును మార్చుకునేలా చేసింది. ప్రత్యర్థిపై పైచేయి సాధించి గెలుపొందింది. ఈ మ్యాచ్లో టీమిండియా బౌలింగ్ అద్భుతం. ఇక ఆకాశ్ దీప్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది?!... జో రూట్కు అతడు వేసిన బంతిని ‘బాల్ ఆఫ్ ది సిరీస్’గా చెప్పుకోవచ్చు. అంతేకాదు.. జాంటీరోడ్స్ మాదిరి మహ్మద్ సిరాజ్ క్యాచ్ అందుకోవడాన్ని నేనైతే పూర్తిగా ఆస్వాదించాను’’ అని సచిన్ టెండుల్కర్ భారత ఆటగాళ్లను ప్రశంసించాడు.కోహ్లి పోస్ట్ వైరల్మరోవైపు.. విరాట్ కోహ్లి సైతం స్పందిస్తూ.. ‘‘ఎడ్జ్బాస్టన్లో టీమిండియాకు గొప్ప విజయం. ఏమాత్రం బెదురులేకుండా ఆడి.. ఇంగ్లండ్పై ఆద్యంతం పైచేయి సాధించారు. శుబ్మన్ గిల్ బ్యాట్తోనూ.. సారథిగా తన వ్యూహాలతోనూ గొప్పగా రాణించాడు.ప్రతి ఒక్కరు గెలుపులో తమ వంతు పాత్ర పోషించారు. ముఖ్యంగా ఇలాంటి పిచ్పై సిరాజ్, ఆకాశ్ బౌలింగ్ చేసిన తీరును కొనియాడాల్సిందే’’ అని ట్వీట్ చేశాడు. కాగా కోహ్లి పోస్టును ఇప్పటికే ఐదున్నర మిలియన్ల మందిక్షించారు. ఇక టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ ఆడేందుకు ఇంగ్లండ్కు వెళ్లిన టీమిండియా.. ఐదు టెస్టుల సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా లీడ్స్లో జరిగిన తొలి టెస్టులో గిల్ సేన ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో ఓవరాల్గా భారత్ ఐదు సెంచరీలు నమోదు చేసినా.. బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యం కారణంగా గెలవాల్సిన మ్యాచ్లో పరాజయం చవిచూసింది.గిల్ సెంచరీలు.. అదరగొట్టిన ఆకాశ్అయితే, ఎడ్జ్బాస్టన్లో బ్యాటర్లతో పాటు బౌలర్లూ అదరగొట్టారు. కెప్టెన్ గిల్ డబుల్ సెంచరీ (269), సెంచరీ (161) బాది ముందుండి నడిపించగా.. రెండో ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ (55), రిషభ్ పంత్ (65), రవీంద్ర జడేజా (69 నాటౌట్) అర్ధ శతకాలతో సత్తా చాటారు. దీంతో భారత్ ఇంగ్లండ్కు 608 పరుగుల లక్ష్యం విధించగా.. నాలుగో రోజు ఆటలో మూడు వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టుకు వరణుడు సాయం చేసేలా కనిపించాడు.ఆఖరిదైన ఐదో రోజు వర్షం అంతరాయం కలిగించగా.. మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగుస్తుందేమోనన్న భయాలు నెలకొన్నాయి. అయితే, వాన తెరిపినిచ్చిన తర్వాత పేసర్ ఆకాశ్ దీప్ ఆకాశమే హద్దుగా చెలరేగి వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు. మొత్తంగా ఆకాశ్ దీప్ ఈ మ్యాచ్లో పది వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ ఏడు వికెట్లతో అతడి తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. చదవండి: ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్మన్ గిల్While Siraj & Akash Deep tore through England, the umpire had other plans for DSP Siraj… and got the stare of the century. 😤🎥India made history — first Asian team to conquer Edgbaston! 🏰🇮🇳From serious records to serial reactions —Historic win. Hilarious moments. One… pic.twitter.com/jF3q64fpws— Star Sports (@StarSportsIndia) July 6, 2025 -
రెడ్డి భవానీకి వైఎస్ జగన్ శుభాకాంక్షలు
ఆసియా యూత్ అండ్ జూనియర్ ఛాంపియన్షిప్లో బంగారు పతకం సాధించిన రెడ్డి భవానీకి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.కాగా విజయనగరం జిల్లాకు చెందిన రెడ్డి భవానీ ఆసియా యూత్ & జూనియర్ ఛాంపియన్షిప్లో మహిళల 48 కిలోల వెయిట్లిఫ్టింగ్ విభాగంలో పోటీపడింది. మొత్తంగా 159 కిలోల బరువునెత్తి స్వర్ణం కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా రెడ్డి భవానీకి.. వైఎస్ జగన్ సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. Hearty congratulations to Reddy Bhavani from Vizianagaram district on her stunning Gold Medal win at the Asian Youth & Junior Championships! Here’s to many more milestones and memorable victories ahead. Keep shining, Bhavani! pic.twitter.com/nNwL5I0QoG— YS Jagan Mohan Reddy (@ysjagan) July 7, 2025 -
వెస్టిండీస్ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా.. సిరీస్ కైవసం
వెస్టిండీస్తో రెండో టెస్టులో ఆస్ట్రేలియా (WI vs AUS 2nd Test) ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టును 133 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా మరో టెస్టు మిగిలి ఉండగానే సిరీస్ను 2-0తో కంగారూ జట్టు కైవసం చేసుకుంది. కాగా మూడు టెస్టులు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడే నిమిత్తం ఆస్ట్రేలియా వెస్టిండీస్కు వెళ్లింది. రెండో టెస్టులోనూఈ క్రమంలో ఇరుజట్ల మధ్య తొలుత టెస్టు సిరీస్ ఆరంభం కాగా.. బార్బడోస్లో మొదటి టెస్టు జరిగింది. ఇందులో ఆరంభంలో అదరగొట్టిన విండీస్.. ఆ తర్వాత చెత్త ప్రదర్శనతో 159 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తాజాగా గ్రెనెడా వేదికగా రెండో టెస్టులోనూ వెస్టిండీస్కు భంగపాటే ఎదురైంది.సెయింట్ జార్జెస్ మైదానంలో మరోసారి బ్యాటర్ల వైఫల్యం కారణంగా విండీస్... ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడింది. మ్యాచ్ నాలుగో రోజు ఆదివారం నాటి ఆట సందర్భంగా.. ఆస్ట్రేలియా నిర్దేశించిన 277 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగింది వెస్టిండీస్.143 పరుగులకు ఆలౌటైఓపెనర్లు క్రెయిగ్ బ్రాత్వైట్ (7), జాన్ కాంప్బెల్ (0)తో పాటు వన్డౌన్ బ్యాటర్ కేసీ కార్టీ (10) కూడా పూర్తిగా విఫలమయ్యాడు. నాలుగో నంబర్ బ్యాటర్ బ్రాండన్ కింగ్ (14)తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ షాయీ హోప్ (17), జస్టిన్ గ్రీవ్స్ (2) చేతులెత్తేశారు.ఇక కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (34) విండీస్ రెండో ఇన్నింగ్స్లో టాప్ రన్ స్కోరర్గా నిలవగా.. టెయిలెండర్లు అల్జారీ జోసెఫ్ 13, షమార్ జోసెఫ్ 24, జేడన్ సీల్స్ 8 పరుగులు చేశారు. ఆండర్సన్ ఫిలిప్ 11 పరుగులతో అజేయంగా ఉన్నాడు. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్లో 34.3 ఓవర్లలో 143 పరుగులకు ఆలౌటైన విండీస్.. 133 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్ (Nathon Lyon) మూడేసి వికెట్లు పడగొట్టగా... జోష్ హాజిల్వుడ్ (Josh Hazlewood) రెండు, కెప్టెన్ ప్యాట్ కమిన్స్, బ్యూ వెబ్స్టర్ చెరో వికెట్ కూల్చారు. ఇక అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 221/7తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 71.3 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (71; 7 ఫోర్లు, 1 సిక్స్), కామెరాన్ గ్రీన్ (52; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. ఈ సిరీస్లో చివరిదైన మూడో టెస్టు ఈనెల 13 నుంచి కింగ్స్టన్లో జరుగుతుంది. వెస్టిండీస్ వర్సెస్ ఆస్ట్రేలియా రెండో టెస్టు👉వేదిక: సెయింట్ జార్జెస్, గ్రెనెడా👉టాస్: ఆస్ట్రేలియా- తొలుత బ్యాటింగ్👉ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 286👉విండీస్ తొలి ఇన్నింగ్స్: 253👉ఆసీస్ రెండో ఇన్నింగ్స్: 243👉విండీస్ రెండో ఇన్నింగ్స్: 143👉ఫలితం: 133 పరుగుల తేడాతో విండీస్పై ఆసీస్ గెలుపు.. సిరీస్ 2-0తో కైవసం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అలెక్స్ క్యారీ (63, 30 రన్స్).చదవండి: ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్మన్ గిల్ -
చరిత్ర సృష్టించిన ఆకాశ్ దీప్..
టీమిండియా స్టార్ ఆకాశ్ దీప్ (Akash Deep) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ గడ్డ మీద అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్గా నిలిచాడు. స్టోక్స్ బృందంతో రెండో టెస్టు సందర్భంగా ఆకాశ్ దీప్ ఈ ఘనత సాధించాడు.టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందకు భారత జట్టు ఇంగ్లండ్కు వెళ్లింది. ఇందులో భాగంగా తొలి టెస్టులో ఓడిన గిల్ సేన.. రెండో టెస్టులో మాత్రం చారిత్రాత్మక విజయం సాధించింది.336 పరుగుల తేడాతో గెలుపుబర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో ఆతిథ్య జట్టును ఏకంగా 336 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్.. ఈ వేదికపై తొలిసారి టెస్టు గెలుపును రుచిచూసింది. అంతేకాదు పరుగుల తేడా పరంగా విదేశీ గడ్డపై టీమిండియాకు ఇదే అతిపెద్ద విజయం కావడం మరో విశేషం.ఇక చిరస్మరణీయ గెలుపులో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill)తో పాటు.. పేసర్ ఆకాశ్ దీప్లది అత్యంత కీలక పాత్ర. గిల్ డబుల్ సెంచరీ (269), సెంచరీ (161)తో చెలరేగి.. భారత్ ఇంగ్లండ్ ముందు కొండంత లక్ష్యం (608) ఉంచడానికి దోహం చేశాడు.పది వికెట్లతో మెరిసిఅయితే, వర్షం అంతరాయం కలిగించిన నేపథ్యంలో ఇంగ్లండ్ డ్రా కోసం ప్రయత్నిస్తుందేమోనన్న సందేహాలు నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో ఆకాశ్ దీప్ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టి.. జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో మొత్తంగా 20 ఓవర్లలో 88 పరుగులు ఇచ్చిన ఆకాశ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.బెన్ డకెట్ (0), ఓలీ పోప్ (0)లను డకౌట్ చేయడంతో పాటు.. ప్రమాదకర బ్యాటర్ హ్యారీ బ్రూక్ (158)తో పాటు క్రిస్ వోక్స్ (5) వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక రెండో ఇన్నింగ్స్లోనూ బెన్ డకెట్ (25), ఓలీ పోప్ (24)ల పనిపట్టాడు ఆకాశ్. అంతేకాదు జో రూట్ (6), హ్యారీ బ్రూక్ (23), జేమీ స్మిత్ (88), బ్రైడన్ కార్స్ (38) వికెట్లను కూడా ఈ 28 ఏళ్ల రైటార్మ్ పేసర్ పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్లో మొత్తంగా 21.1 ఓవర్ల బౌలింగ్లో 99 పరుగులు ఇచ్చిన ఆకాశ్ దీప్ ఇలా ఏకంగా ఆరు వికెట్లు కూల్చాడు.ఓవరాల్గా రెండో టెస్టులో మొత్తంగా 187 పరుగులు ఇచ్చి.. పది వికెట్లు పడగొట్టిన ఆకాశ్ దీప్.. టీమిండియా తరఫున ఇంగ్లండ్ గడ్డ మీద అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్గా నిలిచాడు. అంతకు ముందు ఈ రికార్డు చేతన్ శర్మ పేరిట ఉండేది.ఇంగ్లండ్ గడ్డ మీద టెస్టుల్లో భారత్ తరఫున అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్లు వీరే🏏ఆకాశ్ దీప్- 2025లో బర్మింగ్హామ్ వేదికగా- 10/187 🏏చేతన్ శర్మ- 1986లో బర్మింగ్హామ్ వేదికగా- 10/188🏏జస్ప్రీత్ బుమ్రా- 2021లో ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా- 9/110 🏏జహీర్ ఖాన్- 2007లో ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా- 9/134.చదవండి: ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్మన్ గిల్#AkashDeep’s 6/99 was nothing short of sensational. A game-changing performance that turned the tide in India’s favour, securing a historic victory.#ENGvIND 👉 3rd TEST, THU, JULY 10, 2:30 PM onwards on JioHotsta pic.twitter.com/JfBGgKQF7T— Star Sports (@StarSportsIndia) July 6, 2025 -
అయ్యో.. ఇలా ఎందుకు చేశావు గిల్?.. చిక్కుల్లో కెప్టెన్?!
భారత టెస్టు క్రికెట్లో ఇంత వరకు ఏ కెప్టెన్కూ సాధ్యం కాని అరుదైన ఘనతను శుబ్మన్ గిల్ (Shubman Gill) సాధించాడు. ఇంగ్లండ్లోని ఎడ్జ్బాస్టన్ మైదానంలో తొలిసారి టీమిండియాకు టెస్టు విజయాన్ని అందించాడు. బ్యాటర్గానూ అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకుని.. సారథిగా రెండో ప్రయత్నంలోనే చిరస్మరణీయ గెలుపుతో సత్తా చాటాడు.చారిత్రాత్మక విజయంతోనే సమాధానంఈ నేపథ్యంలో 25 ఏళ్ల శుబ్మన్ గిల్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. కెప్టెన్గా ఇతడేంటి? అన్న వాళ్లకు చారిత్రాత్మక విజయంతోనే సమాధానమిచ్చాడంటూ మాజీ క్రికెటర్లు ఈ కుర్రాడిని కొనియాడుతున్నారు. అయితే, అంతా బాగానే ఉన్నా టీమిండియా రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయంలో గిల్ వ్యవహరించిన తీరు అతడిని చిక్కుల్లో పడేసేలా ఉంది.చిక్కుల్లో పడేలా గిల్ చర్య?టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా భారత్ ఇంగ్లండ్తో ఎడ్జ్బాస్టన్ వేదికగా రెండో టెస్టు ఆడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ద్విశతకం (269)తో చెలరేగిన గిల్.. రెండో ఇన్నింగ్స్ (161)లోనూ శతక్కొట్టాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో తాను అవుటైన కాసేపటికే గిల్ ఇన్నింగ్స్ డిక్లేర్ ప్రకటన చేశాడు.డ్రెసింగ్రూమ్ బయటకు వచ్చి అప్పటికి క్రీజులో ఉన్న రవీంద్ర జడేజా (69*), వాషింగ్టన్ సుందర్ (12*)లను వెనక్కి రావాల్సిందిగా గిల్ రెండు చేతులతో సైగ చేశాడు. అయితే, ఈ సందర్భంగా అతడు తన జెర్సీ తీసేసి.. బ్లాక్ వెస్ట్ (లో దుస్తులు)తో దర్శనమిచ్చాడు. అది నైక్ బ్రాండ్కు చెందినది.ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు గిల్ తీరును విమర్శిస్తూ అతడితో పాటు బీసీసీఐ కూడా చిక్కుల్లో పడే అవకాశం ఉందంటూ హెచ్చరిస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే..బీసీసీఐ అధికారిక కిట్ స్పాన్సర్ అడిడాస్ అన్న విషయం తెలిసిందే. ఇందుకు గానూ భారత పురుషుల జట్టు జెర్సీలు, కిట్లు రూపొందించేందుకు బీసీసీఐతో భారీ మొత్తానికి అడిడాస్ 2023లో ఐదేళ్లకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే, ఆ బ్రాండ్కు కాంపిటీటర్ అయిన మరో బ్రాండ్ వెస్ట్ ధరించి గిల్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం.. అది విశేషంగా వైరల్ కావడంతో చట్టపరంగా బోర్డుకు, అతడికి చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు నెటిజన్లు భావిస్తున్నారు. మరి కొందరేమో ఓ అడుగు ముందుకేసి.. ‘‘నువ్వు ఇప్పుడు కెప్టెన్వి. ఆచితూచి అడుగేయాలి. ఇలా చేయడం ఎంతమాత్రం సరికాదు’’ అంటూ గిల్పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్- ఇంగ్లండ్ మధ్య జూలై 10 -14 మధ్య లార్డ్స్లో మూడో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ రెండో టెస్టు సంక్షిప్త స్కోర్లు🏏టీమిండియా- 587 & 427/6 d🏏ఇంగ్లండ్- 407 & 271🏏ఫలితం- ఇంగ్లండ్ను 336 పరుగుల తేడాతో చిత్తు చేసిన టీమిండియా.. 🏏తొలి టెస్టులో ఓటమికి బదులు తీర్చుకుని.. సిరీస్ 1-1తో సిరీస్ సమం🏏ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్- శుబ్మన్ గిల్.చదవండి: ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్మన్ గిల్pic.twitter.com/SkeKPaxH5S— Shubman Gill (@ShubmanGill) July 6, 2025While Siraj & Akash Deep tore through England, the umpire had other plans for DSP Siraj… and got the stare of the century. 😤🎥India made history — first Asian team to conquer Edgbaston! 🏰🇮🇳From serious records to serial reactions —Historic win. Hilarious moments. One… pic.twitter.com/jF3q64fpws— Star Sports (@StarSportsIndia) July 6, 2025 -
నా స్వప్నం సాకారమైంది: నోరిస్కు నాలుగో టైటిల్
సిల్వర్స్టోన్: ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన బ్రిటిష్ గ్రాండ్ప్రి ఫార్ములావన్ రేసులో బ్రిటన్ డ్రైవర్ లాండో నోరిస్ టైటిల్ సాధించాడు. ఆదివారం జరిగిన ఈ రేసులో మెక్లారెన్ జట్టుకు చెందిన నోరిస్ నిరీ్ణత 52 ల్యాప్లను అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 37 నిమిషాల 15.735 సెకన్లలో ముగించి విజేతగా అవతరించాడు. సొంతగడ్డపై నోరిస్కిదే తొలి విజయం కాగా... ఈ సీజన్లో నాలుగోది.నా స్వప్నం సాకారమైంది‘సొంతనగరంలో టైటిల్ నెగ్గాలని కలలు కన్నాను. నా స్వప్నం సాకారమైంది. ఈ చిరస్మరణీయ విజయాన్ని నా మనుసులో ఎల్లవేళలా దాచుకుంటాను’ అని విజయానంతరం నోరిస్ వ్యాఖ్యానించాడు. మెక్లారెన్ జట్టుకే చెందిన ఆస్కార్ పియాస్ట్రి రెండో స్థానంలో నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ వెర్స్టాపెన్ (రెడ్బుల్) ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.టాప్ ర్యాంక్లో పియాస్ట్రివర్షం అంతరాయం కలిగించిన ఈ రేసులో ఏకంగా ఐదుగురు డ్రైవర్లు కిమీ ఆంటోనెలి (మెర్సిడెస్), ఐజాక్ హద్జార్ (రేసింగ్ బుల్స్), బొర్టోలెటో (స్టేక్ ఎఫ్1), లియామ్ లాసన్ (రేసింగ్ బుల్స్), కొలాపింటో (అల్పైన్ టీమ్) రేసును పూర్తి చేయలేకపోయారు. 24 రేసుల సీజన్లో ఇప్పటికి 12 రేసులు ముగిశాయి. పియాస్ట్రి 234 పాయింట్లతో టాప్ ర్యాంక్లో కొనసాగుతుండగా... 226 పాయింట్లతో నోరిస్ రెండో స్థానంలో, 165 పాయింట్లతో వెర్స్టాపెన్ మూడో స్థానంలో ఉన్నారు. సీజన్లోని తదుపరి రేసు బెల్జియం గ్రాండ్ప్రి ఈనెల 27న జరుగుతుంది.బ్రిటిష్ గ్రాండ్ప్రిలో బ్రిటన్ డ్రైవర్కే టైటిల్ లభించడం ఇది 12సారి కావడం విశేషం. గతంలో స్టిర్లింగ్ మోస్, పీటర్ కోలిన్స్, క్లార్క్, స్టీవార్ట్, హంట్, జాన్ వాట్సన్, మాన్సెల్, డామన్ హిల్, జానీ హెర్బర్ట్, డేవిడ్ కౌతార్డ్, హామిల్టన్ ఈ రేసులో గెలిచారు. -
ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన సౌతాఫ్రికా ‘కెప్టెన్’.. సరికొత్త చరిత్ర
జింబాబ్వేతో తొలి టెస్టులో శతక్కొట్టిన దక్షిణాఫ్రికా బ్యాటర్ వియాన్ ముల్డర్ (259 బంతుల్లో 264 బ్యాటింగ్; 34 ఫోర్లు, 3 సిక్స్లు).. రెండో టెస్టులోనూ ఇరగదీశాడు. జింబాబ్వే (ZIM vs SA 2nd Test)తో ఆదివారం మొదలైన రెండో టెస్టులో తొలిరోజే అజేయ డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. దీంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 88 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 465 పరుగుల భారీస్కోరు చేసింది.బౌలర్ల భరతం పట్టాడుఈ మ్యాచ్ సందర్భంగా సౌతాఫ్రికా జట్టుకు తొలిసారి సారథ్యం వహిస్తున్న ముల్డర్ (Wiaan Mulder) వన్డేను తలపించే ఆట ఆడేశాడు. ఎదుర్కొన్న బంతులకంటే బాదిన పరుగులే ఎక్కువున్నాయి. బౌండరీలైతే మంచినీళ్ల ప్రాయంగా దంచేశాడు. జట్టు స్కోరు 11 వద్ద టోని డి జార్జి (10), 24 పరుగులకే సెనొక్వనే (3) ఇలా ఓపెనర్లు నిష్క్రమించిన వేళ... వన్డౌన్లో బ్యాటింగ్కు దిగి జింబాబ్వే బౌలర్ల భరతం పట్టాడు.ఇక బెడింగ్హామ్ (82; 7 ఫోర్లు)తో మూడో వికెట్కు 184 పరుగులు జోడించిన ముల్డర్ రెండో సెషన్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మూడో సెషన్లో ప్రిటోరియస్ (78; 7 ఫోర్లు, 3 సిక్స్లు)తో కలిసి నాలుగో వికెట్కు 217 పరుగులు జోడించాడు. దీంతో అఖరి సెషన్లో అతని డబుల్ సెంచరీ, జట్టు 400 పరుగుల మార్క్ను వేగంగా అందుకుంది.తొలిరోజు ఆట ముగిసే సమయానికి ముల్డర్, బ్రెవిస్ (15 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. తనక చివంగకు 2 వికెట్లు దక్కగా, మతిగిము, మసకద్జా చెరో వికెట్ తీశారు. ఇదే వేదికపై జరిగిన తొలి టెస్టులో సఫారీ 328 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించింది. ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన ముల్దర్కెప్టెన్ హోదాలో ఆడిన తొలి టెస్టులో.. తొలి ఇన్నింగ్స్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (264 నాటౌట్) చేసిన ప్లేయర్గా వియాన్ ముల్డర్ చరిత్రకెక్కాడు. ఈ సందర్భంగా.. న్యూజిలాండ్ కెప్టెన్ గ్రాహమ్ డౌలింగ్ పేరిట ఉన్న ఆల్టైమ్ ప్రపంచ రికార్డును ఈ సందర్భంగా ముల్డర్ బద్దలు కొట్టాడు.టెస్టు కెప్టెన్గా తొలి ఇన్నింగ్స్లోనే అత్యధిక స్కోర్లు సాధించిన ఆటగాళ్లు వీరే🏏వియాన్ ముల్డర్ (సౌతాఫ్రికా)- 2025లో బులవాయో వేదికగా జింబాబ్వేపై 264 రన్స్ నాటౌట్🏏గ్రాహమ్ డౌలింగ్ (Graham Dowling- న్యూజిలాండ్)- 1968లో క్రైస్ట్చర్చ్ వేదికగా టీమిండియాపై 239 రన్స్🏏శివ్నరైన్ చందర్పాల్ (వెస్టిండీస్)- 2005లో జార్జ్టౌన్ వేదికగా సౌతాఫ్రికా మీద 203 రన్స్ నాటౌట్🏏క్లెమ్ హిల్ (ఆస్ట్రేలియా)- 1910లో సిడ్నీ వేదికగా సౌతాఫ్రికాపై 191 రన్స్🏏జో రూట్ (ఇంగ్లండ్)- 2017లో లార్డ్స్ వేదికగా సౌతాఫ్రికాపై 190 రన్స్🏏అలిస్టర్ కుక్ (ఇంగ్లండ్)- 2017లో చట్టోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్పై 173 రన్స్🏏విజయ్ హజారే (ఇండియా)- 1954లో ఢిల్లీ వేదికగా ఇంగ్లండ్పై 164 నాటౌట్🏏క్లైవ్ లాయిడ్ (వెస్టిండీస్)- 1974లో బెంగళూరు వేదికగా టీమిండియాపై 163 రన్స్.ముల్డర్.. మరిన్ని రికార్డులు👉అదే విధంగా... టెస్టు మ్యాచ్ తొలి రోజున అత్యధిక పరుగులు చేసిన దక్షిణాఫ్రికా బ్యాటర్గా ముల్డర్ రికార్డు నెలకొల్పాడు. హెర్షల్ గిబ్స్ (228; 2003లో పాకిస్తాన్పై కేప్టౌన్లో) పేరిట ఉన్న రికార్డును ముల్డర్ సవరించాడు.👉అంతేకాదు.. టెస్టు మ్యాచ్ తొలి రోజున అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్గా ముల్డర్ (264) ఘనత వహించాడు. ఈ జాబితాలో డాన్ బ్రాడ్మన్ (309; 1930లో లీడ్స్లో ఇంగ్లండ్పై), వీరేంద్ర సెహ్వాగ్ (284; 2009లో ముంబైలో శ్రీలంకపై), డాన్ బ్రాడ్మన్ (271; 1934లో లీడ్స్లో ఇంగ్లండ్పై) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. 👉ఇక టెస్టు మ్యాచ్ తొలి రోజున దక్షిణాఫ్రికా చేసిన అత్యధిక స్కోరు (465) ఇదే కావడం విశేషం. 2003లో పాకిస్తాన్తో కేప్టౌన్లో జరిగిన టెస్టులో తొలి రోజు దక్షిణాఫ్రికా 3 వికెట్లకు 445 పరుగులు చేసింది.క్లీన్ స్వీప్ లక్ష్యంగా..కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిన్ నయా చాంపియన్ సౌతాఫ్రికా.. రెండు టెస్టులు ఆడేందుకు జింబాబ్వేలో పర్యటిస్తోంది. బులవాయో వేదికగా జరుగుతున్న ఈ సిరీస్ తొలి మ్యాచ్లో పర్యాటక ప్రొటిస్ జట్టు.. జింబాబ్వేను 328 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఇక రెండో టెస్టులోనూ అదే ఫలితం పునరావృతం చేసి 2-0తో సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది. చదవండి: ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్మన్ గిల్ -
అక్కా.. ఇది నీ కోసమే.. బంతి అందుకున్న ప్రతిసారీ..: ఆకాశ్ దీప్ భావోద్వేగం
‘‘మా అక్కకు క్యాన్సర్. గత రెండు నెలలుగా ఆమె వ్యాధితో పోరాడుతోంది. ఇంత వరకు నేను ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. అయితే, ప్రస్తుతం మా అక్క పరిస్థితి బాగానే ఉంది. తను కోలుకుంటోంది.ఈ మ్యాచ్లో నా ఆటతీరుతో ఆమె ఎంతగానో సంతోషించి ఉంటుంది. మా అక్కకు నా ఈ మ్యాచ్ను అంకితమిస్తున్నా. ఆమె ముఖంపై చిరునవ్వు ఎప్పటికీ చెరగకూడదు. ఇది నీ కోసమే అక్కా.. బంతి అందుకున్న ప్రతిసారి నా మనసులో ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి.నీ రూపమే నా మదిలో మెదులుతుంది. నిన్ను సంతోషరచాలనే నా ప్రయత్నాలు. మేమంతా నీతోనే ఉన్నాం’’ అంటూ టీమిండియా స్టార్ ఆకాశ్ దీప్ (Akash Deep) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఎడ్జ్బాస్టన్ (Edgbaston)లో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఈ పేస్ బౌలర్.. తన ప్రదర్శనను క్యాన్సర్తో పోరాడుతున్న తన అక్కకు అంకితమిచ్చాడు.కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో లీడ్స్లో జరిగిన తొలి టెస్టులో గిల్ సేన.. ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.ఆది నుంచే ఆధిపత్యంఇలాంటి తరుణంలో ఎడ్జ్బాస్టన్ వేదికగా రెండో టెస్టు బరిలో దిగిన భారత్.. ఆది నుంచే ఆధిపత్యం కనబరిచింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగి డబుల్ సెంచరీ (269), సెంచరీ (161) బాది జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా ఇంగ్లండ్కు 608 పరుగుల మేర భారీ లక్ష్యం విధించగలిగింది.కీలక వికెట్లు కూల్చి.. విజయం అందించిఈ క్రమంలో శనివారం నాటి నాలుగో రోజు ఆట పూర్తవుతుందనగా బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్.. తొలిరోజే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే, ఐదో రోజు వర్షం వల్ల మ్యాచ్ ఆలస్యం కాగా.. ‘డ్రా’ భయం అభిమానులను వెంటాడింది. కానీ ఆకాశ్ దీప్ ఇంగ్లండ్కు ఆ అవకాశం ఇవ్వలేదు.అద్భుతమైన డెలివరీలతో ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ను కుదేలు చేశాడు. బెన్ డకెట్ (25), ఓలీ పోప్ (24), జో రూట్ (6), హ్యారీ బ్రూక్ (23), జేమీ స్మిత్ (88) రూపంలో ఏకంగా ఐదు కీలక వికెట్లు కూల్చిన ఆకాశ్.. బ్రైడన్ కార్స్ (38) వికెట్తో సిక్సర్ కొట్టాడు. తద్వారా ఎడ్జ్బాస్టన్లో భారత్ తొలిసారి టెస్టు మ్యాచ్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు.బుమ్రా లేడు కాబట్టే..నిజానికి రెండో టెస్టులో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వడంతో ఆకాశ్ దీప్నకు తుదిజట్టులో చోటు దక్కింది. ఇక అక్క క్యాన్సర్తో పోరాడుతున్న వేళ.. ఓవైపు తోబుట్టువు గురించి మనసులో ఆందోళనలు చెలరేగుతున్నా ఈ రైటార్మ్ పేసర్ తన ఏకాగ్రత చెదరనీయలేదు. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు.#AkashDeep’s 6/99 was nothing short of sensational. A game-changing performance that turned the tide in India’s favour, securing a historic victory.#ENGvIND 👉 3rd TEST, THU, JULY 10, 2:30 PM onwards on JioHotsta pic.twitter.com/JfBGgKQF7T— Star Sports (@StarSportsIndia) July 6, 2025 ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లోనూ ఆకాశ్ దీప్ నాలుగు వికెట్లతో మెరిశాడు. ఇలా రెండో టెస్టులో మొత్తంగా పది వికెట్లు తీసి టీమిండియా చిరస్మరణీయ విజయంలో కీలకంగా మారాడు. మిగతా వాళ్లలో సిరాజ్ మొత్తంగా ఏడు వికెట్లు కూల్చగా.. ప్రసిద్ కృష్ణ, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ రెండో టెస్టు (జూలై 2-6)వేదిక: ఎడ్జ్బాస్టన్, బర్మింగ్హామ్భారత్: 587 & 427/6 డిక్లేర్డ్ఇంగ్లండ్: 407 & 271ఫలితం: ఇంగ్లండ్పై 336 పరుగుల తేడాతో భారత్ భారీ విజయంప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శుబ్మన్ గిల్.చదవండి: ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్మన్ గిల్ -
జాక్పాట్!.. భారీ ధరకు అమ్ముడుపోయిన సెహ్వాగ్ కొడుకు
టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ జాక్పాట్ కొట్టేశాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2025 (DPL Auction) వేలంలో ఏకంగా రూ. 8 లక్షలు దక్కించుకున్నాడు. సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ ఈ మేర భారీ మొత్తం వెచ్చించి ఈ అన్క్యాప్డ్ ప్లేయర్ను సొంతం చేసుకుంది.డబుల్ సెంచరీ వీరుడుకాగా ఆర్యవీర్ సెహ్వాగ్ (Aryavir Sehwag) ఢిల్లీ తరఫున అండర్-19 క్రికెట్ ఆడుతున్నాడు. తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్న 17 ఏళ్ల ఈ కుర్రాడు ఇప్పటికే అద్భుత ప్రదర్శనలతో సత్తా చాటాడు. ముఖ్యంగా గతేడాది మేఘాలయ జట్టు మీద డబుల్ సెంచరీతో మెరిసిన ఆర్యవీర్.. తృటిలో తండ్రి రికార్డుకు దూరమయ్యాడు. 297 పరుగుల వద్ద అవుటైన అతడు ట్రిపుల్ సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచాడు.కాగా టెస్టుల్లో సెహ్వాగ్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 319 కాగా.. అతడి కుమారుడు ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఈ రికార్డును చేరుకోలేకపోయాడు. ఈ క్రమంలో ఫెరారీ కారు గెలుచుకునే అవకాశం చేజార్చుకున్నాడు. గతంలో సెహ్వాగ్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు.ఫెరారీ మిస్ అయ్యావు‘‘టెస్టు క్రికెట్లో నేను కొన్ని మైలురాళ్లు సాధించానని నా కుమారులకు తెలుసు. అందుకే.. కనీసం స్కూల్ క్రికెట్లోనైనా నా హయ్యస్ట్ స్కోరు 319 పరుగుల బెంచ్ మార్కును దాటితే వారికి ఫెరారీ కొనిస్తానని చెప్పాను’’ అని సెహ్వాగ్ గతంలో చెప్పాడు.ఇక తన కుమారుడు ఆర్యవీర్ 2024లో ఈ ఫీట్ను మిస్ కాగా.. ‘‘బాగా ఆడావు ఆర్యవీర్. కానీ కేవలం 23 పరుగుల తేడాతో ఫెరారీ మిస్ అయిపోయావు. నీలోని పరుగుల దాహాన్ని ఇలాగే ఉండనివ్వు. సెంచరీలు, డబుల్ సెంచరీలు, ట్రిపుల్ సెంచరీలు సాధించు. ఆడుతూనే ఉండు’’ అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.అమ్ముడుపోని వేదాంత్కాగా ఇలా తనదైన శైలిలో పరుగులు సాధిస్తున్న ఆర్యవీర్ను సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ తమ సొంతం చేసుకుంది. అయితే, సెహ్వాగ్ చిన్న కుమారుడు వేదాంత్ (Vedant Sehwag)కు మాత్రం వేలంలో నిరాశే మిగిలింది. నిజానికి ఆర్యవీర్ కంటే ముందే వేదాంత్ పేరు వేలంలోకి వచ్చింది.ఖరీదైన ఆటగాడిగా సన్రైజర్స్ప్లేయర్కానీ అతడిని కొనేందుకు ఒక్క ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపలేదు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2025 వేలంలో సిమర్జీత్ సింగ్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. ఢిల్లీ సెంట్రల్ కింగ్స్ అతడి కోసం ఏకంగా రూ. 39 లక్షలు వెచ్చించింది. ఈ రైటార్మ్ పేసర్ ఐపీఎల్-2025లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఉన్న విషయం తెలిసిందే. గతంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లలోనూ సిమర్జీత్ భాగమయ్యాడు.మరోవైపు.. రాజస్తాన్ రాయల్స్ స్టార్ నితీశ్ రాణాను వెస్ట్ ఢిల్లీ లయన్స్ కొనుగోలు చేసింది. రూ. 34 లక్షల ధరకు అతడు జట్టుతో చేరాడు. ఇక టీమిండియా మాజీ క్రికెటర్ ఇషాంత్ శర్మ కూడా ఇదే జట్టుకు ఆడనున్నాడు. అతడి కోసం ఫ్రాంఛైజీ రూ. 13 లక్షలు వెచ్చించింది.ఢిల్లీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్లో భాగమైన జట్లు ఇవేసౌత్ ఢిల్లీ సూపర్స్టార్స్, ఈస్ట్ ఢిల్లీ రైడర్స్, సెంట్రల్ ఢిల్లీ కింగ్స్, నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్, వెస్ట్ ఢిల్లీ లయన్స్, పురాణీ ఢిల్లీ గతేడాది ఆడగా.. ఈసారి అవుటర్ ఢిల్లీ, న్యూ ఢిల్లీ పేరిట రెండు కొత్త జట్లు వచ్చాయి. ఇక 2024లో మొదలైన డీపీఎల్లో ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ విజేతకాగా.. సౌత్ ఢిల్లీ సూపర్స్టార్స్ రన్నరప్గా నిలిచింది.చదవండి: IND vs ENG 2nd Test: బర్మింగ్హామ్లో జైహింద్ -
ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్మన్ గిల్
ఇంగ్లండ్ గడ్డ మీద టీమిండియా చరిత్రను తిరగరాసింది. ఎక్కడైతే వరుస పరాజయాలు చవిచూసిందో అక్కడే ఘన విజయం సాధించి సగర్వంగా తలెత్తుకుంది. తొమ్మిదో ప్రయత్నంలో ఎడ్జ్బాస్టన్ వేదికపై తొలిసారి టెస్టు మ్యాచ్లో జయభేరి మోగించింది. ఆతిథ్య ఇంగ్లండ్ జట్టును ఏకంగా 336 పరుగుల (India Beat England)తో చిత్తు చేసింది.ఇక భారత టెస్టు జట్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ (Shubman Gill)కు ఇదే తొలి విజయం. లీడ్స్లో స్టోక్స్ బృందం చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటూనే.. సరికొత్త చరిత్ర సృష్టించాడు గిల్. ఎడ్జ్బాస్టన్లో ఇటు బ్యాటర్గా.. అటు సారథిగా సత్తా చాటి విమర్శకులకు సమాధానం ఇచ్చాడు.ఇంగ్లండ్తో రెండో టెస్టులో గిల్ డబుల్ సెంచరీ (269), సెంచరీ (161)తో చెలరేగి.. ఆతిథ్య జట్టుకు 608 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ఆఖరి రోజు వర్షం అడ్డంకిగా మారినా.. పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep) తన అద్భుత బౌలింగ్తో ఇంగ్లండ్ను కట్టడి చేసి భారత్కు చిరస్మరణీయ విజయం అందించాడు. ఈ మ్యాచ్లో అతడు మొత్తంగా పది వికెట్లు కూల్చాడు.ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతేఈ నేపథ్యంలో విజయానంతరం కెప్టెన్ శుబ్మన్ గిల్ మాట్లాడుతూ.. ఆకాశ్ దీప్పై ప్రశంసలు కురిపించాడు. ‘‘అతడు తన ప్రాణం పెట్టి పూర్తి నిబద్ధతతో ఆడాడు. సరైన లైన్ అండ్ లెంగ్త్తో అద్భుతం చేశాడు. ఇలాంటి వికెట్ మీద ఇలా బౌలింగ్ చేయడం అందరికీ సాధ్యం కాదు. అతడొక అద్భుతం అంతే’’ అంటూ ఆకాశ్ను ఆకాశానికెత్తాడు.కెప్టెన్కు ఇంకేం ఇబ్బందిఅదే విధంగా మిగతా బౌలర్ల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘మా బౌలర్లు చక్కటి ప్రదర్శన కనబర్చారు. పేసర్లే 17 వికెట్లు తీసి ఇస్తే.. కెప్టెన్కు ఇంకేం ఇబ్బంది ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా 20 వికెట్లు తీయగల బౌలింగ్ దళం మాకు ఉంది. గతంలో ఎన్నోసార్లు సిరీస్ తొలి మ్యాచ్లో ఓడిన తర్వాత తిరిగి పుంజుకున్నాం. మా గెలుపునకు కారణం అదేగత మ్యాచ్ అనంతరం లోపాలపై దృష్టి పెట్టాం. ఈసారి బౌలింగ్, ఫీల్డింగ్లో మెరుగైన ప్రదర్శన వల్లే విజయం సాధ్యమైంది’’ అని తమ గెలుపునకు గల కారణాన్ని వెల్లడించాడు. ఇక తన వ్యక్తిగత ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నానన్న గిల్.. క్రీజులో ఉన్నప్పుడు బ్యాటర్గానే ఆలోచిస్తానని స్పష్టం చేశాడు.కాగా ఇంగ్లండ్తో రెండో టెస్టుకు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చినా.. మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ కలిసి అతడు లేని లోటును పూడ్చారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో సిరాజ్ ఆరు వికెట్లతో అదరగొట్టగా.. ఆకాశ్ దీప్ నాలుగు వికెట్లు కూల్చాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో ఆకాశ్ దీప్.. ఆరు వికెట్లు కూల్చి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. మిగతా వారిలో సిరాజ్, ప్రసిద్ కృష్ణ ఒక్కో వికెట్ తీయగా.. స్పిన్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.చదవండి: Akash Deep: ‘ఆకాశ’మంత ఆనందం... #AkashDeep’s 6/99 was nothing short of sensational. A game-changing performance that turned the tide in India’s favour, securing a historic victory.#ENGvIND 👉 3rd TEST, THU, JULY 10, 2:30 PM onwards on JioHotsta pic.twitter.com/JfBGgKQF7T— Star Sports (@StarSportsIndia) July 6, 2025 -
సబలెంకా జోరు
లండన్: టైటిల్ ఫేవరెట్స్లో ఒక్కొక్కరూ వెనుదిరుగుతుండగా... మరోవైపు అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ బెలారస్ స్టార్, ప్రపంచ నంబర్వన్ సబలెంకా ముందంజ వేసింది. ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో టాప్ సీడ్ సబలెంకా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సబలెంకా 6–4, 7–6 (7/4)తో ఎలీసా మెర్టెన్స్ (బెల్జియం)పై విజయం సాధించింది. 122 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సబలెంకాకు రెండు సెట్లలో గట్టిపోటీ ఎదురైంది. అయితే కీలకదశలో సబెలంకా పైచేయి సాధించి వరుస సెట్లలో విజయాన్ని ఖరారు చేసుకుంది. అర డజను ఏస్లు సంధించిన సబలెంకా ఒక్కడబుల్ ఫాల్ట్ మాత్రమే చేసింది. నెట్ వద్దకు 15 సార్లు దూసుకొచ్చి 10 సార్లు పాయింట్లు గెలిచింది. తన సరీ్వస్ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సరీ్వస్ను మూడుసార్లు బ్రేక్ చేసింది. 36 విన్నర్స్ కొట్టిన సబలెంకా 18 అనవసర తప్పిదాలు చేసింది. ఆరోసారి వింబుల్డన్ టోర్నీలో ఆడుతున్న సబలెంకా 2021లో, 2023లో సెమీఫైనల్లో ని్రష్కమించింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో అనస్తాసియా పావ్లీచెంకోవా (రష్యా) 7–6 (7/3), 6–4తో సోనె కర్తాల్ (బ్రిటన్)పై, లౌరా సిగెముండ్ (జర్మనీ) 6–3, 6–2తో సొలానా సియెరా (అర్జెంటీనా)పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ఫ్రిట్జ్ మూడోసారి... పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ ఐదో ర్యాంకర్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా), కామెరాన్ నోరి (బ్రిటన్), కరెన్ ఖచనోవ్ (రష్యా) క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. జోర్డాన్ థాంప్సన్ (ఆ్రస్టేలియా)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫ్రిట్జ్ తొలి సెట్ను 6–1తో నెగ్గి, రెండో సెట్లో 3–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ దశలో గాయం కారణంగా థాంప్సన్ వైదొలిగాడు. దాంతో ఈ టోర్నీలో ఫ్రిట్జ్ మూడోసారి క్వార్టర్ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకున్నాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్లో కామెరాన్ నోరి 4 గంటల 27 నిమిషాల్లో 6–3, 7–6 (7/4), 6–7 (7/9), 6–7 (5/7), 6–3తో నికోలస్ జారీ (చిలీ)పై, ఖచనోవ్ 6–4, 6–2, 6–3తో కామిల్ మజార్జక్ (పోలాండ్)పై గెలుపొందారు. -
Akash Deep: ‘ఆకాశ’మంత ఆనందం...
ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా తొలి టెస్టులోనూ టీమిండియా మెరుగైన ప్రదర్శనే చేసింది. 15 సెషన్ల పాటు సాగిన పోరులో... అధిక భాగం మనదే ఆధిపత్యం. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ శతకాలతో ప్రత్యర్థి ముందు 371 పరుగుల లక్ష్యం నిలిచింది. ఎలాంటి పిచ్పైనైనా నాలుగో ఇన్నింగ్స్లో ఈ స్కోరు ఛేదించడం కష్టతరమే! అందులోనూ ప్రపంచ అత్యుత్తమ పేసర్లలో ఒకడైన జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కొంటూ పరుగులు రాబట్టడం అంటే ఆషామాషీ కాదు! అయితే ఇక్కడే ఇంగ్లండ్ ప్లేయర్లు తమ గేమ్ ప్లాన్తో ఆకట్టుకున్నారు. ]బుమ్రాను గౌరవించిన ఆతిథ్య ఆటగాళ్లు ఇతర బౌలర్లపై విరుచుకుపడ్డారు. నిర్జీవ పిచ్పై ఇంగ్లండ్ బ్యాటర్లు పరుగుల పండగ చేసుకుంటుంటే... మనవాళ్లు చేష్టలుడిగి చూస్తుండటం తప్ప మరేం చేయలేకపోయారు. సిరాజ్ ప్రభావం చూపలేకపోగా... ప్రసిధ్ కృష్ణ టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఏ బౌలర్కు సాధ్యం కాని చెత్త గణాంకాలు ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్గా తొలి మ్యాచ్లో శుబ్మన్ గిల్ నిర్ణయాలు బెడిసికొట్టడంతో... ఇక సిరీస్లో టీమిండియా కోలుకోవడం కష్టమే అనే వార్తలు వినిపించాయి. దీనికి తోడు ఆరు నెలల ముందు నుంచే బుమ్రా ఇంగ్లండ్ పర్యటనలో మూడు టెస్టులే ఆడుతాడు అని మేనేజ్మెంట్ ఊదరగొడుతుండగా... రెండో మ్యాచ్కు అతడు అందుబాటులో లేకుండా పోయాడు. బరి్మంగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ మైదానంలో ఇప్పటి వరకు టెస్టు మ్యాచ్ గెలిచిన చరిత్రలేని భారత జట్టు... ప్రధాన పేసర్ బుమ్రా లేకుండానే బరిలోకి దిగింది. ఇంకేముంది మరో పరాజయానికి బాటలు పడ్డట్లే అనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇలాంటి స్థితిలోనే టీమిండియా అద్భుతం చేసింది. మహామహా ఆటగాళ్లకు సాధ్యం కాని ఘనతను ఖాతాలో వేసుకుంది. యువ సారథి శుబ్మన్ గిల్ తొలి ఇన్నింగ్స్లో భారీ డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్లో భారీ సెంచరీ చేయడం వల్లే టీమిండియా కొండంత స్కోరు చేసిన మాట వాస్తవమే అయినా... ఆత్మవిశ్వాసం లోపించిన బౌలింగ్ దళంలో జవసత్వాలు నింపిన ఘనత మాత్రం ఆకాశ్దీప్కే దక్కుతుంది. బుమ్రా స్థానాన్ని భర్తీ చేయాల్సిన తీవ్ర ఒత్తిడిలో... కొత్త బంతి అందుకున్న ఆకాశ్దీప్ తన రెండో ఓవర్లోనే ఇంగ్లండ్కు ‘డబుల్ స్ట్రోక్’ ఇచ్చాడు. ఓ చక్కటి బంతితో డకెట్ను బుట్టలో వేసుకున్న ఈ బీహార్ పేసర్... తదుపరి బంతికి ఓలీ పోప్ను పెవిలియన్ బాట పట్టించి భారత శిబిరంలో ఆనందం నింపాడు. ఈ రెండు వికెట్లలో క్యాచ్లు పట్టిన గిల్, రాహుల్కు కూడా సమాన పాత్ర ఉన్నా... జట్టులో ఒక్కసారిగా సానుకూల దృక్పథం తీసుకొచ్చింది మాత్రం ముమ్మాటికీ ఆకాశ్దీపే. మరో ఎండ్లో సిరాజ్ కూడా రాణించడంతో ఇంగ్లండ్ వెనకడుగు వేసినట్లే అనిపించినా... బ్రూక్, స్మిత్ ట్రిపుల్ సెంచరీ భాగస్వామ్యం తిరిగి ఆతిథ్య జట్టును పోటీలోకి తెచ్చింది. ఈ దశలో మరోసారి ఆకాశ్దీప్ డబుల్ ధమాకా మోగించాడు. బ్రూక్ను క్లీన్ బౌల్డ్ చేసిన ఆకాశ్దీప్... వోక్స్కు పెవిలియన్ బాట చూపెట్టాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో అతడి బౌలింగ్ మరింత పదునెక్కింది. నాలుగో రోజు రెండు వికెట్లు తీసిన ఆకాశ్... ఆఖరి రోజు తన బౌలింగ్తో ఇంగ్లండ్ను బెంబేలెత్తించాడు. వర్షం విరామం అనంతరం కాస్త సీమ్కు సహకరిస్తున్న పిచ్పై చక్కటి బంతులతో పోప్, బ్రూక్ను అవుట్ చేసి భారత విజయానికి బాటలు వేశాడు. ఈ క్రమంలో కెరీర్లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శనతో అదుర్స్ అనిపించుకున్నాడు. రెండో ఇన్నింగ్స్లో ఆకాశ్దీప్ తీసిన ఐదు వికెట్లు వరుసగా డకెట్, రూట్, పోప్, బ్రూక్, స్మిత్వి కావడం అతడి బౌలింగ్ నైపుణ్యాన్ని చాటుతోంది. బుమ్రాలాగా మెరుపు వేగం లేకున్నా... లైన్ అండ్ లెంగ్త్తో కూడిన క్రమశిక్షణ కట్టిపడేసింది. తొలి ఇన్నింగ్స్ ప్రదర్శన అనంతరం ‘తదుపరి మ్యాచ్లో అవకాశం దక్కుతుందో లేదో’ అని అనుమానం వ్యక్తం చేసిన ఆకాశ్... రెండో ఇన్నింగ్స్ ప్రదర్శనతో తనను జట్టు నుంచి తప్పించలేని పరిస్థితి కలి్పంచాడు. ఈ జోరు ఇలాగే సాగిస్తే సుదీర్ఘకాలం అతడు జట్టుకు ప్రాతినిధ్యం వహించడం ఖాయమే!1692: ఈ మ్యాచ్లో ఇరు జట్లు కలిపి చేసిన పరుగులు. భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్టు మ్యాచ్లో ఇవే అత్యధికం సాక్షి క్రీడా విభాగం -
బర్మింగ్హామ్లో జైహింద్
బుమ్రాకు విశ్రాంతినివ్వడం... కుల్దీప్ను విస్మరించడం... ప్రసి«ద్ను కొనసాగించడం... టాపార్డర్ను కూల్చిన అనంతరం ప్రత్యర్థిని కోలుకోనివ్వడం... సరైన సమయంలో ఇన్నింగ్స్ ‘డిక్లేర్’ చేయకపోవడం... ఇన్ని ప్రతికూలతలకు తోడు చివరి రోజు వర్షం సైతం ఆతిథ్య జట్టును ఆదుకునేలా కనిపించడంతో.. ఒకదశలో భారత విజయంపై నీలినీడలు కమ్ముకోగా... ఆకాశ్దీప్ సింగ్ వాటిని పటాపంచలు చేస్తూ విజృంభించాడు. యువసారథి శుబ్మన్ గిల్ బ్యాటింగ్ మెరుపులకు... ఆకాశ్ నిప్పులు చెరిగే బౌలింగ్ తోడవడంతో ఇంగ్లండ్తో రెండో టెస్టులో టీమిండియా విజయఢంకా మోగించింది. నాలుగేళ్ల క్రితం ‘గబ్బా స్టేడియం’లో ఆ్రస్టేలియాపై తొలి విజయంలో కీలకపాత్ర పోషించిన గిల్, పంత్, సిరాజ్... ఇక్కడ కూడా సత్తా చాటడంతో బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ మైదానంలో టీమిండియా తొలిసారి టెస్టుల్లో గెలిచింది. గతంలో ఎడ్జ్బాస్టన్ గ్రౌండ్లో ఇంగ్లండ్తో భారత్ 8 టెస్టులు ఆడగా ... ఏడింటిలో ఓడి... ఒకసారి ‘డ్రా’ చేసుకుంది. తొమ్మిదో ప్రయత్నంలో గెలుపు రుచి చూసింది. బర్మింగ్హామ్: ఇంగ్లండ్ పర్యటనలో భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఎడ్జ్బాస్టన్ మైదానంలో తొలిసారి టెస్టు ఫార్మాట్లో విజయం నమోదు చేసుకుంది. బ్యాటర్ల బీభత్సానికి బౌలర్ల సహకారం తోడవడంతో రెండో టెస్టులో టీమిండియా 336 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసింది. విదేశాల్లో పరుగుల తేడా పరంగా భారత జట్టుకు ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. 608 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్నైట్ స్కోరు 72/3తో ఆదివారం చివరిరోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు చివరకు 68.1 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌటైంది. జేమీ స్మిత్ (99 బంతుల్లో 88; 9 ఫోర్లు, 4 సిక్స్లు) ఒంటరి పోరాటం చేశాడు. భారీ వర్షం కురవడంతో ... చివరిరోజు ఆట ఆలస్యంగా ప్రారంభం కాగా... ఒకదశలో వరుణుడి సాయంతో ఇంగ్లండ్ గట్టెక్కేలా కనిపించినా... వాన తెరిపినిచి్చన అనంతరం భారత బౌలర్లు విజృంభించి ఇంగ్లండ్ ఆశలపై నీళ్లు చల్లారు. ఆకాశ్దీప్ 6 వికెట్లతో అదరగొట్టగా... సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, జడేజా, సుందర్ తలా ఒక వికెట్ పడగొట్టారు. బర్మింగ్హామ్లో భారత్కు ఇదే మొదటి గెలుపు కాగా... ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను టీమిండియా 1–1తో సమం చేసింది. భారత కెప్టెన్ గిల్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. లార్డ్స్లో గురువారం నుంచి మూడో టెస్టు జరుగుతుంది. మళ్లీ అతడే... వర్షంతో దాదాపు రెండు గంటలు ఆలస్యంగా ఆట ప్రారంభం కావడంతో ఓవర్లను కుదించారు. దీంతో ఏ మూలో భారత విజయంపై అనుమానాలు రేకెత్తగా... వాటిని ఆకాశ్దీప్ పటాపంచలు చేశాడు. రెండో ఓవర్ తొలి బంతికే పోప్ (24)ను క్లీన్ బౌల్డ్ చేసిన ఆకాశ్... తదుపరి ఓవర్లో బ్రూక్ (23)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ ఆత్మరక్షణలో పడగా... లంచ్ విరామానికి ముందు కెప్టెన్ బెన్ స్టోక్స్ (73 బంతుల్లో 33; 6 ఫోర్లు)ను అవుట్ చేయడం ద్వారా సుందర్ జట్టును విజయానికి మరింత చేరువ చేశాడు. ఇక గెలుపు లాంఛనం మాత్రమే మిగలగా... తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో జేమీ స్మిత్ ఎదురుదాడికి దిగాడు. ధాటిగా ఆడుతూ ఓటమి అంతరాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు. ఆకాశ్దీప్ బౌలింగ్లో రెండు భారీ సిక్స్లు కొట్టిన స్మిత్ మరో షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ అవుట్ కావడంతో ఇంగ్లండ్ ఓటమి ఖరారైంది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 587; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 407; భారత్ రెండో ఇన్నింగ్స్: 427/6 డిక్లేర్డ్; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: డకెట్ (బి) ఆకాశ్దీప్ 25; క్రాలీ (సి) (సబ్) సుదర్శన్ (బి) సిరాజ్ 0; పోప్ (బి) ఆకాశ్దీప్ 24; రూట్ (బి) ఆకాశ్దీప్ 6; బ్రూక్ (ఎల్బీ) ఆకాశ్దీప్ 23; స్టోక్స్ (ఎల్బీ) (బి) సుందర్ 33; స్మిత్ (సి) సుందర్ (బి) ఆకాశ్దీప్ 88; వోక్స్ (సి) సిరాజ్ (బి) ప్రసిధ్ కృష్ణ 7; కార్స్ (సి) గిల్ (బి) ఆకాశ్దీప్ 38; టంగ్ (సి) సిరాజ్ (బి) జడేజా 2; బషీర్ (నాటౌట్) 12; ఎక్స్ట్రాలు 13; మొత్తం (68.1 ఓవర్లలో ఆలౌట్) 271. వికెట్ల పతనం: 1–11, 2–30, 3–50, 4–80, 5–83, 6–153, 7–199, 8–226, 9–246, 10–271. బౌలింగ్: ఆకాశ్దీప్ 21.1–2–99–6; సిరాజ్ 12–3–57–1; ప్రసిధ్ కృష్ణ 14–2–39–1; జడేజా 15–4–40–1; సుందర్ 6–2–28–1. -
పదేసిన ఆకాశ్దీప్.. ఇంగ్లండ్పై టీమిండియా చారిత్రక విజయం
ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో టీమిండియా చారిత్రక విజయం సాధించింది. చివరి రోజు వరకు సాగిన ఈ మ్యాచ్లో భారత్ 336 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసింది. విదేశాల్లో భారత్కు ఇదే భారీ విజయం. ఎడ్జ్బాస్టన్లో భారత్కు ఇదే తొలి విజయం (58 ఏళ్ల తర్వాత). ఈ వేదికపై భారత్ ఈ మ్యాచ్కు ముందు వరకు ఒక్క విజయం కూడా సాధించలేదు. 8 మ్యాచ్ల్లో ఏడింట ఓడి, ఓ మ్యాచ్ డ్రా చేసుకుంది. ఈ గెలుపుతో గిల్ ఎడ్జ్బాస్టన్లో విజయం సాధించిన తొలి ఆసియా కెప్టెన్గా కూడా రికార్డు నెలకొల్పాడు. 608 పరుగల భారీ లక్ష్య ఛేదనలో 72/3 స్కోర్ వద్ద చివరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ 271 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆకాశ్దీప్ (21.2-2-99-6) నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లండ్ బ్యాటర్ల భరతం పట్టాడు. ఆకాశ్దీప్కు కెరీర్లో ఇదే తొలి ఐదు వికెట్ల ఘనత. తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు పడగొట్టిన ఆకాశ్దీప్ మొత్తంగా 10 వికెట్ల ఘనత కూడా సాధించాడు.ఈ మ్యాచ్లో బుమ్రా స్థానంలో బరిలోకి దిగిన ఆకాశ్దీప్ అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియా చారిత్రక విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. మిగతా భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు. సెకెండ్ ఇన్నింగ్స్లోనూ టాప్ స్కోరర్గా నిలిచిన జేమీ స్మిత్ (88) డ్రా కోసం విఫలయత్నం చేశాడు.అంతకుముందు టీమిండియా 427/6 వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. శుభ్మన్ గిల్ (162 బాల్స్లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 161) సెంచరీతో చెలరేగగా.. రవీంద్ర జడేజా (69 నాటౌట్), రిషబ్ పంత్ (65), కేఎల్ రాహుల్ (55) హాఫ్ సెంచరీలతో రాణించారు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 407 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (158), జేమీ స్మిత్ (184 నాటౌట్) భారీ శతకాలతో చెలరేగారు. భారత బౌలర్లలో సిరాజ్ 6, ఆకాశ్దీప్ 4 వికెట్లు తీశారు.ఈ మ్యాచ్లో భారత్ తొలి ఇన్నింగ్స్లో 587 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ (269) భారీ డబుల్ సెంచరీతో రికార్డులు తిరగరాశాడు. యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89) సెంచరీలకు చేరువలో ఔటయ్యారు.ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది. తొలి టెస్ట్లో ఇంగ్లండ్ భారత్పై విజయం సాధించింది. ఈ సిరీస్లో మూడో టెస్ట్ జులై 10 నుంచి ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరుగనుంది. గిల్ కెప్టెన్సీలో భారత్కు ఇదే తొలి గెలుపు. -
నిస్వార్థ ఆటగాడు.. 90ల్లో సెంచరీని త్యాగం చేసి చరిత్ర సృష్టించిన డుప్లెసిస్
క్రికెట్లో జట్టు ప్రయోజనాల కోసం వ్యక్తిగత మైలురాళ్లను స్వచ్ఛందంగా త్యాగం చేసిన ఆటగాళ్లు చాలా అరుదుగా కనిపిస్తారు. సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఈ కోవలో ముందు వరుసలో ఉంటాడు. డుప్లెసిస్ తాజాగా జరిగిన ఓ మ్యాచ్లో సెంచరీ చేసే అవకాశం ఉన్నా జట్టు ప్రయోజనాల కోసం స్వచ్ఛందంగా తప్పుకొని నిస్వార్థ ఆటగాడనిపించుకున్నాడు.వివరాల్లోకి వెళితే.. మేజర్ లీగ్ క్రికెట్లో డుప్లెసిస్ టెక్సస్ సూపర్ కింగ్స్ను నాయకత్వం వహిస్తాడు. ఈ సీజన్లో అతను 9 మ్యాచ్ల్లో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 409 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. భారతకాలమానం ప్రకారం ఇవాళ (జులై 6) జరిగిన మ్యాచ్లో డుప్లెసిస్ జట్టు సూపర్ కింగ్స్ సియాటిల్ ఓర్కాస్తో తలపడింది. ఈ మ్యాచ్లో డుప్లెసిస్ 91 పరుగుల వద్ద రిటైర్డ్ ఔట్గా స్వచ్ఛందంగా తప్పుకున్నాడు. సెంచరీ చేసే అవకాశం (ఇంకో ఓవర్ మిగిలి ఉంది) ఉన్నా జట్టు ప్రయోజనాల కోసం అతనీ నిర్ణయం తీసుకున్నాడు. తాను తప్పుకుంటే ఆతర్వాత వచ్చే డొనొవన్ ఫెరియెరా ధాటిగా బ్యాటింగ్ చేసి జట్టు స్కోర్ను మరింత పెంచుతాడని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు డుప్లెసిస్ మ్యాచ్ అనంతరం తెలిపాడు. వాస్తవానికి డుప్లెసిస్ ఈ త్యాగం చేయాల్సిన అవసరం లేదు. అతడు కూడా భారీ హిట్టరే. అందులోనూ ఈ మ్యాచ్ అతని జట్టుకు పెద్దగా ఉపయోగపడేది కాదు. సూపర్ కింగ్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్కు చేరింది. అయితే ఈ గెలుపుతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరింది. అది వేరే విషయం. డుప్లెసిస్ నిస్వార్థంగా సెంచరీని త్యాగం చేయడంతో అతనిపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఈ ఉదంతంతో క్రికెట్ అభిమానులకు అతనిపై గౌరవం మరింత పెరిగింది. పొట్టి క్రికెట్ చరిత్రలో ఓ ఆటగాడు అవకాశం ఉండి కూడా స్వచ్ఛందంగా సెంచరీ చేసి అవకాశాన్ని వదులుకోవడం బహుశా ఇదే మొదటిసారి.ఈ సీజన్లో (MLC) అరివీర భయంకరమైన ఫామ్లో ఉన్న డుప్లెసిస్ మరో సెంచరీ (మూడోది) చేసి చరిత్రపుటల్లో చిరస్థాయిగా తన పేరును లిఖించుకునే అవకాశాన్ని స్వచ్ఛందంగా వద్దనుకున్నాడు. ఫెరియెరా బ్యాటింగ్కు వస్తే తన జట్టు 200 పరుగుల మార్కును దాటుతుందని భావించి రిటైర్డ్ ఔట్గా క్రీజ్ను వదిలాడు. తీరా చూస్తే ఆ ఫెరియెరా 3 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. ఈ మ్యాచ్ సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేస్తూ.. డుప్లెసిస్ (52 బంతుల్లో 91; 6 ఫోర్లు, 4 ఫోర్లు), శుభమ్ రంజనే (41 బంతుల్లో 65 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఓర్కాస్.. ఆడమ్ మిల్నే (3.4-1-23-5) ఐదేయడంతో 18.4 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. ఈ ఓటమితో ఓర్కాస్ ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపుగా గల్లంతు చేసుకుంది.ఇప్పటికే సూపర్ కింగ్స్, శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్, వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్లు ఆఫ్స్ బెర్తలను ఖారారు చేసుకోగా.. నాలుగో స్ధానం కోసం ఎంఐ న్యూయర్క్, ఓర్కాస్ మధ్య పోటీ జరుగుతుంది. ఈ రెండు జట్లకు తలో 6 పాయింట్లు ఉన్నాయి. ఓర్కాస్ తమ మొత్తం మ్యాచ్లను పూర్తి చేసుకోగా.. న్యూయార్క్కు మరో అవకాశం ఉంది. న్యూయార్క్ తమ చివరి లీగ్ మ్యాచ్లో (వాషింగ్టన్ ఫ్రీడమ్తో పోరు) ఘోర ఓటమిపాలైతేనే ఓర్కాస్కు నాలుగో ప్లే ఆఫ్స్ బెర్తు దక్కే అవకాశం ఉంది. ఇది జరగడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. -
చెలరేగిన ఆకాశ్దీప్.. చారిత్రక గెలుపునకు 2 వికెట్ల దూరంలో టీమిండియా
Update: లంచ్ తర్వాత మరో 2 వికెట్లు తీసిన టీమిండియా. క్రిస్ వోక్స్ను (7) ప్రసిద్ద్ కృష్ణ.. జేమీ స్మిత్ను ఆకాశ్దీప్ (88) ఔట్ చేశారు. 56 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 226/8గా ఉంది. భారత్ గెలుపుకు కేవలం 2 వికెట్లు మాత్రమే కావాలి. ఆకాశ్దీప్ ఈ ఇన్నింగ్స్లో 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసి 10 వికెట్ల ప్రదర్శనపై కన్నేశాడు. ఆకాశ్దీప్ తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీశాడు. ఎడ్జ్బాస్టన్లో చరిత్ర సృష్టించేందుకు టీమిండియా సిద్దమవుతోంది. ఈ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో చారిత్రక గెలుపుకు 4 వికెట్ల దూరంలో ఉంది. ఎడ్జ్బాస్టన్లో భారత్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఇక్కడ ఆడిన 8 మ్యాచ్ల్లో ఏడింట ఓడి, ఓ మ్యాచ్ డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్లో గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా ఆటగాళ్లు ఆరాటపడుతున్నారు. వారి ఆరాటం మరికొద్ది గంటల్లో తీరే అవకాశం ఉంది.608 పరుగల భారీ లక్ష్య ఛేదనలో 72/3 వద్ద చివరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. లంచ్ విరామం సమయానికి 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ గెలవాలంటే మరో 455 పరుగులు కావాలి. అది అసాధ్యం. భారత్ గెలలాంటే మాత్రం కేవలం 4 వికెట్లు తీస్తే చాలు.వర్షం కారణంగా ఇవాల్టి ఆట గంట 40 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. వర్షం కారణంగా 10 ఓవర్లు కోతకు గురైంది. ఈ రోజు కేవలం 80 ఓవర్ల ఆట మాత్రమే జరుగుతుంది. ఆట ప్రారంభం కాగానే టీమిండియా పేసర్ ఆకాశ్దీప్ ఇంగ్లండ్ను భారీ దెబ్బేశాడు. అతని బౌలింగ్లో ఓలీ పోప్ (24) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆతర్వాత కొద్ది సేపటికే ఆకాశ్దీప్ మరోసారి రెచ్చిపోయాడు. ఈ సారి ఇన్ ఫామ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (23) ఎల్బీడబ్ల్యూ చేసి ఇంగ్లండ్ డ్రా ఆశలపై నీళ్లు చల్లాడు. అనంతరం స్టోక్స్, జేమీ స్మిత్ ఆరో వికెట్కు 70 పరుగులు జోడించి టీమిండియా బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ఈసారి వాషింగ్టన్ సుందర్ అద్బుతమైన బంతితో బెన్ స్టోక్స్ను (33) పెవిలియన్కు సాగనంపాడు. స్టోక్స్ వికెట్ పడగానే అంపైర్లు లంచ్ విరామాన్ని ప్రకటించారు. 32 పరుగులతో జేమీ స్మిత్ క్రీజ్లో ఉన్నాడు. నాలుగో రోజు ఆటలో బెన్ డకెట్ (25), రూట్ను (60) ఔట్ చేసిన ఆకాశ్దీప్ ఈ ఇన్నింగ్స్లో మొత్తం 4 వికెట్లు తీయగా.. సిరాజ్, సుందర్ తలో వికెట్ దక్కించుకున్నారు. నాలుగో రోజు ఆటలో టీమిండియా 427/6 వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. శుభ్మన్ గిల్ (162 బాల్స్లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 161) సెంచరీతో చెలరేగగా.. రవీంద్ర జడేజా (69 నాటౌట్), రిషబ్ పంత్ (65), కేఎల్ రాహుల్ (55) హాఫ్ సెంచరీలతో రాణించారు.దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 407 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (158), జేమీ స్మిత్ (184 నాటౌట్) భారీ శతకాలతో చెలరేగారు. భారత బౌలర్లలో సిరాజ్ 6, ఆకాశ్దీప్ 4 వికెట్లు తీశారు.ఈ మ్యాచ్లో భారత్ తొలి ఇన్నింగ్స్లో 587 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ (269) భారీ డబుల్ సెంచరీతో రికార్డులు తిరగరాశాడు. యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89) సెంచరీలకు చేరువలో ఔటయ్యారు.స్కోర్ వివరాలు..భారత్ 587 & 427/6 డిక్లేర్ఇంగ్లండ్ 407 & 153/6 (40.3) -
కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే ఇరగదీసిన మరో ప్లేయర్.. వరుస ఇన్నింగ్స్ల్లో సెంచరీలు
టీమిండియా కెప్టెన్గా శుభ్మన్ గిల్ తన తొలి టెస్ట్ మ్యాచ్లోనే సెంచరీతో ఇరగదీసిన విషయం తెలిసిందే. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో గిల్ తొలి ఇన్నింగ్స్లో 147 పరుగులు చేశాడు. తాజాగా మరో ఆటగాడు కెప్టెన్గా తన తొలి టెస్ట్ ఇన్నింగ్స్లోనే సెంచరీతో చెలరేగాడు. వియాన్ ముల్దర్ సౌతాఫ్రికా కెప్టెన్గా తన తొలి ఇన్నింగ్స్లో మూడంకెల స్కోర్తో సత్తా చాటాడు. జింబాబ్వేతో ఇవాళ (జులై 6) ప్రారంభమైన రెండో టెస్ట్లో ముల్దర్ టీ విరామం సమయానికి 133 పరుగులతో అజేయంగా నిలిచాడు. అంతకుముందు టెస్ట్లో ముల్దర్ కేశవ్ మహారాజ్ సారథ్యంలో ఆటగాడిగా సెంచరీ చేశాడు. తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో 147 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ మ్యాచ్లో ముల్దర్ బౌలర్గానూ రాణించాడు. తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీశాడు. తొలి టెస్ట్ సందర్భంగా కేశవ్ మహారాజ్ గాయపడటంతో ముల్దర్కు అనూహ్యంగా కెప్టెన్సీ అవకాశం దక్కింది. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా ఇదివరకే తనను తాను నిరూపించుకున్న ముల్దర్కు కెప్టెన్గా తనదైన ముద్ర వేసే అవకాశం కూడా దక్కింది. 27 ఏళ్ల ముల్దర్ 21 మ్యాచ్ల టెస్ట్ కెరీర్లో 3 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 31 సగటున 930 పరుగులు చేశాడు. అలాగే బౌలింగ్లో 35 వికెట్లు పడగొట్టాడు. ముల్దర్ దక్షిణాఫ్రికా జట్టులో ఆల్ ఫార్మాట్ ఆటగాడిగా స్థిరపడ్డాడు. 25 వన్డేల్లో 2 హాఫ్ సెంచరీల సాయంతో 276 పరుగులు, 22 వికెట్లు.. 11 టీ20ల్లో 105 పరుగులు, 8 వికెట్లు తీశాడు. ముల్దర్ ఇటీవలే ఐపీఎల్ అరంగేట్రం కూడా చేశాడు. 2025 సీజన్లో అతను సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఓ మ్యాచ్ ఆడాడు. ఇందులో 9 పరుగులు చేసి, వికెట్లేమీ తీయలేదు. ముల్దర్ ఇటీవల డబ్ల్యూటీసీ గెలిచిన సౌతాఫ్రికా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆ మ్యాచ్లో అతను 33 పరుగులు చేసి ఓ వికెట్ తీశాడు. ప్రస్తుతం రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం సౌతాఫ్రికా జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ సిరీస్ కోసం సౌతాఫ్రికా మేనేజ్మెంట్ యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది. డబ్ల్యూటీసీ గెలిచిన జట్టులోని సీనియర్లకు విశ్రాంతినిచ్చి కేశవ్ మహారాజ్ను సారధిగా నియమించింది. ఈ సిరీస్లో సీనియర్లు లేకున్నా సౌతాఫ్రికా తొలి టెస్ట్లో అదిరిపోయే విజయం సాధించింది. తొలి మ్యాచ్లో యువ ఆటగాళ్లు చెలరేగడంతో సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్లో సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేస్తూ 59 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. వియాన్ ముల్దర్ 154, తొలి టెస్ట్ సెంచరీ హీరో లుహాన్ డ్రి ప్రిటోరియస్ 16 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో మరో ఆటగాడు డేవిడ్ బెడింగ్హమ్ (82) సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. టోని డి జోర్జి 10, అరంగేట్రం ఓపెనర్ లెసెగొ సెనోక్వానే 3 పరుగులకు ఔటయ్యారు. జింబాబ్వే బౌలర్లలో చివంగ 2, మసకద్జ ఓ వికెట్ పడగొట్టారు. -
తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ను గెలిపించిన పోలార్డ్
మేజర్ లీగ్ క్రికెట్ 2025 ఎడిషన్లో భాగంగా ఇవాళ (జులై 6) జరిగిన తొలి మ్యాచ్లో లాస్ ఏంజెలెస్ నైట్రైడర్స్పై ముంబై ఇండియన్స్ న్యూయార్క్ 6 పరుగుల తేడాతో గెలుపొందింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్లో కీరన్ పోలార్డ్ ఆల్రౌండ్ షోతో ముంబై ఇండియన్స్ను గెలిపించాడు. తొలుత బ్యాటింగ్లో అదరగొట్టిన పోలీ.. 36 బంతుల్లో బౌండరీ, 4 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేసి ఎంఐకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఆతర్వాత బౌలింగ్లో ఓ మ్యాచ్ విన్నింగ్ ఓవర్ (చివరి 2 ఓవర్లలో 21 పరుగులు కావాల్సి తరుణంలో 19వ ఓవర్లో వికెట్ తీసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు) వేసి ఎంఐ గెలుపుకు ప్రధాన కారకుడయ్యాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఈ గెలుపుతో ఎంఐ ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. ఈ సీజన్లో ఆ జట్టు 9 మ్యాచ్ల్లో మూడో విజయం సాధించి, సియాటిల్ ఓర్కాస్తో ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం పోటీపడుతుంది. ఓర్కాస్ ఇవాళే తమ చివరి మ్యాచ్లో ఓడి తమ విజయాల సంఖ్యను మూడు వద్దే ముగించింది. ప్రస్తుతం ఓర్కాస్, ఎంఐ తలో 6 పాయింట్లతో ఉన్నప్పటికీ ఎంఐకు ఇంకో మ్యాచ్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఎంఐ ఆ మ్యాచ్లో ఓడినా, భారీ తేడాతో ఓడకపోతే ఓర్కాస్ కంటే మెరుగైన రన్రేట్ ఉన్న కారణంగా ప్లే ఆఫ్స్కు చేరుతుంది. ఎంఐ రేపు జరుగబోయే మ్యాచ్లో వాషింగ్టన్ ఫ్రీడంతో తలపడనుంది. కాగా, ఈ సీజన్లో టెక్సస్ సూపర్ కింగ్స్, శాన్ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ ఫ్రీడం ఇదివరకే ప్లే ఆఫ్స్కు చేరుకున్నాయి.మ్యాచ్ వివరాల్లోకి వెళితే..తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ.. పోలార్డ్ రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. పూరన్ 30, మొనాంక్ పటేల్ 13, డికాక్ 0, తజిందర్ డిల్లాన్ 2, బ్రేస్వెల్ 18, జార్జ్ లిండే 13, బౌల్ట్ 7, కెంజిగే 1 పరుగు చేశారు. నైట్రైడర్స్ బౌలర్లలో వాన్ స్కాల్విక్ 3, హోల్డర్, కోర్నే డ్రై తలో 2, సునీల్ నరైన్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన నైట్రైడర్స్.. ఎంఐ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎంఐ బౌలర్లలో బౌల్ట్, లిండే, ఉగార్కర్ వికెట్లు తీయనప్పటికీ పొదుపుగా తమ కోటా ఓవర్లు పూర్తి చేశారు. కెంజిగే, పోలార్డ్ తలో వికెట్ తీశారు. నైట్రైడర్స్ ఇన్నింగ్స్లో ఉన్ముక్త్ చంద్ (59 రిటైర్ట్ ఔట్) హాఫ్ సెంచరీతో రాణించినప్పటికీ చాలా నిదానంగా ఆడాడు. ఇదే నైట్రైడర్స్ కొంపముంచింది. ఉన్ముక్త్ 48 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 59 పరుగులు చేశాడు. మిగతా వారిలో ఆండ్రీ ఫ్లెచర్ 9, అలెక్స్ హేల్స్ 21, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ 29, రసెల్ 9 (నాటౌట్), హోల్డర్ 2 (నాటౌట్) పరుగులు చేశారు. -
ENG Vs IND 2nd Test Day 5: గుడ్ న్యూస్.. ఆట మొదలైంది.. అయితే..!
ఎడ్జ్బాస్టన్ నుంచి టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్ తెలుస్తుంది. చివరి రోజు ఆట ప్రారంభానికి ముందు ఆటంకం కలిగించిన వరుణుడు ప్రస్తుతం శాంతించాడు. వర్షం పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో మైదానంలో కప్పి ఉంచిన కవర్లను తొలగించారు. ఔట్ ఫీల్డ్ను వేగంగా డ్రై చేశారు. సూర్యుడు మేఘాలను ముసుగు నుంచి బయటికి వచ్చాడు.అయితే ఓవర్ల కోత మాత్రం తప్పలేదు. ఇవాల్టి ఆటలో 90 కాకుండా 80 ఓవర్లకు మాత్రమే అవకాశం ఉంటుంది. వర్షం కారణంగా 10 ఓవర్ల కోత పడింది. భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్.. దాదాపు 2 గంటలు ఆలస్యంగా భారతకాలమానం ప్రకారం సాయంత్రం 5:10 గంటలకు ప్రారంభమయ్యింది.సవరించిన సెషన్ టైమింగ్స్ను కూడా అంపైర్లు ప్రకటించారు. తొలి సెషన్ 5:10 నుంచి 7 గంటల వరకు.. రెండో సెషన్ 7:40 నుంచి 9:40 వరకు.. మూడో సెషన్ రాత్రి 10 గంటల నుంచి 11:30 గంటల వరకు జరుగనుంది.కాగా, ఈ మ్యాచ్లో భారత్ చారిత్రక గెలుపుకు 7 వికెట్ల దూరంలో ఉంది. ఇంగ్లండ్.. భారత్ నిర్దేశించిన 608 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది.నాలుగో రోజు ఆటలో టీమిండియా 427/6 వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. శుభ్మన్ గిల్ (162 బాల్స్లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 161) సెంచరీతో చెలరేగగా.. రవీంద్ర జడేజా (69 నాటౌట్), రిషబ్ పంత్ (65), కేఎల్ రాహుల్ (55) హాఫ్ సెంచరీలతో రాణించారు.మరోవైపు టీమిండియా ఎడ్జ్బాస్టన్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఈ మ్యాచ్లో గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా ఆటగాళ్లు ఆరాటపడుతున్నారు.స్కోర్ వివరాలు..భారత్ 587 & 427/6 డిక్లేర్ఇంగ్లండ్ 407 & 72/3 (16) ప్రస్తుత రన్రేట్: 4.5 -
అరివీర భయంకరమైన ఫామ్లో శుభ్మన్ గిల్.. ప్రమాదంలో ఆల్టైమ్ రికార్డు
ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ అరివీర భయంకరమైన ఫామ్లో ఉన్నాడు. ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల్లోనే ఏకంగా 585 పరుగులు సాధించాడు. ఈ పర్యటనలో భారత్ ఇంకా మూడు టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. గిల్ ఇదే ఫామ్ను తదుపరి మ్యాచ్ల్లో కూడా కొనసాగిస్తే ఓ ఆల్టైమ్ రికార్డు బద్దలయ్యే ప్రమాదం ఉంది.అదేంటంటే.. ఐదు అంతకంటే తక్కువ మ్యాచ్ల ఓ సిరీస్లో (విదేశాల్లో) అత్యధిక పరుగుల రికార్డు. ప్రస్తుతం ఈ రికార్డు క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్మన్ (ఆస్ట్రేలియా) పేరిట ఉంది. బ్రాడ్మన్ 1930 ఇంగ్లండ్ పర్యటనలో 974 పరుగులు చేశాడు. 95 ఏళ్లుగా టెస్ట్ క్రికెట్లో ఇదే రికార్డుగా కొనసాగుతోంది.ఈ విభాగంలో రెండో స్థానంలో వాలీ హేమండ్ (ఇంగ్లండ్) ఉన్నాడు. హేమండ్ 1928/29 ఆసీస్ పర్యటనలో 905 పరుగులు చేశాడు. మూడో స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన నీల్ హార్వే ఉన్నాడు. హార్వే 1952/53 పర్యటనలో 834 పరుగులు చేశాడు. నాలుగో స్థానంలో విండీస్ బ్యాటింగ్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ ఉన్నాడు. రిచర్డ్స్ 1976 ఇంగ్లండ్ పర్యటనలో 829 పరుగులు చేశాడు. ఐదో స్థానంలో వెస్టిండీస్కు చెందిన క్లైడ్ వాల్కాట్ ఉన్నాడు. వాల్కాట్ 1955 ఆస్ట్రేలియా పర్యటనలో 827 పరుగులు చేశాడు.భారత్ తరఫున ఈ రికార్డు సునీల్ గవాస్కర్ పేరిట ఉంది. గవాస్కర్ 1970/71 వెస్టిండీస్ పర్యటనలో 4 మ్యాచ్ల్లో 774 పరుగులు చేశాడు. గవాస్కర్ తర్వాత ఈ రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉంది. విరాట్ 2014/15 ఆస్ట్రేలియా పర్యటనలో 692 పరుగులు చేశాడు. భారత్ తరఫున విదేశీ టెస్ట్ సిరీస్ల్లో (ఐదు అంతకంటే తక్కువ మ్యాచ్లు) అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో గవాస్కర్, విరాట్ తర్వాతి స్థానాల్లో దిలీప్ సర్దేశాయ్ (1970/71 విండీస్ పర్యటనలో 642 పరుగులు), రాహుల్ ద్రవిడ్ (2003/04 ఆస్ట్రేలియా పర్యటనలో 619 పరుగులు), రాహుల్ ద్రవిడ్ (2002/03 ఇంగ్లండ్ పర్యటనలో 602 పరుగులు), మొహిందర్ అమర్నాథ్ (1982/83 విండీస్ పర్యటనలో 598 పరుగులు), విరాట్ కోహ్లి (2018 ఇంగ్లండ్ పర్యటనలో 593 పరుగులు)య ఉన్నారు. ప్రస్తుతం గిల్ (2025 ఇంగ్లండ్ పర్యటనలో 585 పరుగులు) వీరి తర్వాతి స్థానాల్లో ఉన్నాడు.గిల్ ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో 147 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 8.. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో 269, రెండో ఇన్నింగ్స్లో 161 పరుగులు చేశాడు.ఇదిలా ఉంటే, ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో భారత్ చారిత్రక గెలుపుకు 7 వికెట్ల దూరంలో ఉంది. అయితే చివరి రోజు ఆట ప్రారంభానికి ముందు ఎడ్జ్బాస్టన్లో భారీ వర్షం కురుస్తుండటంతో మ్యాచ్ ఆలస్యమైంది. ఈ మ్యాచ్లో భారత్ విజయానికి ఇంకా 7 వికెట్లు అవసరం కాగా.. ఇంగ్లండ్ గెలుపునకు 536 పరుగులు కావాలి.ఇంగ్లండ్ భారత్ నిర్దేశించిన 608 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది.నాలుగో రోజు ఆటలో టీమిండియా 427/6 వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. శుభ్మన్ గిల్ (162 బాల్స్లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 161) సెంచరీతో చెలరేగగా.. రవీంద్ర జడేజా (69 నాటౌట్), రిషబ్ పంత్ (65), కేఎల్ రాహుల్ (55) హాఫ్ సెంచరీలతో రాణించారు.మరోవైపు టీమిండియా ఎడ్జ్బాస్టన్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఈ మ్యాచ్లో గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా ఆటగాళ్లు ఆరాటపడుతున్నారు.స్కోర్ వివరాలు..భారత్ 587 & 427/6 డిక్లేర్ఇంగ్లండ్ 407 & 72/3 (16) ప్రస్తుత రన్రేట్: 4.5 -
హోరాహోరీగా సాగుతున్న ఆస్ట్రేలియా, వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్
వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య గ్రెనెడా వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ హెరాహోరీగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి పర్యాటక ఆసీస్ 254 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అలెక్స్ క్యారీ (26), పాట్ కమిన్స్ (4) క్రీజ్లో ఉన్నారు. మూడో రోజు ఆటలో ఆసీస్ బ్యాటర్లు స్టీవ్ స్మిత్ (71), కెమరూన్ గ్రీన్ (52) అర్ద సెంచరీలతో రాణించారు. ట్రవిస్ హెడ్ 39 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. ఆసీస్ ఇన్నింగ్స్లో సామ్ కొన్స్టాస్ 0, ఉస్మాన్ ఖ్వాజా 2, నాథన్ లియోన్ 8, బ్యూ వెబ్స్టర్ 2 పరుగులకు ఔటయ్యారు. విండీస్ బౌలర్లలో జస్టిన్ గ్రీవ్స్, షమార్ జోసఫ్, జేడన్ సీల్స్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. అల్జరీ జోసఫ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అంతకుముందు విండీస్ తొలి ఇన్నింగ్స్లో 253 పరుగులకు ఆలౌటైంది. బ్రాండన్ కింగ్ (75) అర్ద సెంచరీతో రాణించడంతో విండీస్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. విండీస్ బ్యాటర్లలో జాన్ క్యాంప్బెల్ (40), అల్జరీ జోసఫ్ (27), షమార్ జోసఫ్ (29), షాయ్ హెప్ (21) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. కెరీర్లో 100వ టెస్ట్ ఆడుతున్న క్రెయిగ్ బ్రాత్వైట్ 0, కీసీ కార్టీ 6, కెప్టెన్ రోస్టన్ ఛేజ్ 16, జస్టిన్ గ్రీవ్స్ 1, ఆండర్సన్ ఫిలిప్ 10 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో లియోన్ 3, హాజిల్వుడ్, కమిన్స్ చెరో 2, స్టార్క్, వెబ్స్టర్, హెడ్ ఒక్కో వికెట్ తీశారు.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 286 పరుగులకు ఆలౌటైంది. వెబ్స్టర్ (60), క్యారీ (63) అర్ద సెంచరీలతో రాణించారు. కొన్స్టాస్ 25, ఖ్వాజా 16, గ్రీన్ 26, స్టీవ్ స్మిత్ 3, హెడ్ 29, కమిన్స్ 17, స్టార్క్ 6, లియోన్ 11, హాజిల్వుడ్ 10 (నాటౌట్) పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 4, సీల్స్ 2, షమార్ జోసఫ్, ఫిలిప్, గ్రీవ్స్ తలో వికెట్ తీశారు.కాగా, ఆస్ట్రేలియా జట్టు 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్, 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం వెస్టిండీస్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరుగుతున్న రెండో టెస్ట్ ఇది. తొలి టెస్ట్లో ఆసీస్ 159 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. -
ఆర్జే మహ్వశ్తో డేటింగ్.. చాహల్ బయటికి చెప్పేశాడుగా!
టీమిండియా ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ తర్వాత ప్రముఖ ఆర్జే మహ్వశ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే ఆ మ్యాచ్లో క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్తో కలిసి స్టేడియంలో కనిపించింది. ఆ తర్వాత వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ ఓ రేంజ్లో వైరలయ్యాయి. అంతేకాకుండా ఆర్జే మహ్వశ్ ఐపీఎల్లోనూ పంజాబ్ కింగ్స్ మద్దతుగా నిలిచింది. పంజాబ్ ఆడిన అన్ని మ్యాచ్లకు హాజరై సందడి చేసింది. దీంతో చాహల్తో డేటింగ్లో ఉన్నది నిజమేనంటూ పలు కథనాలొచ్చాయి. అయితే తనపై వస్తున్న రూమర్స్పై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు ముద్దుగుమ్మ.అయితే తాజాగా చాహల్ ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోకు హాజరయ్యారు. ఈ ఎపిసోడ్లో అతని ప్రేమ, డేటింగ్ గురించి ప్రస్తావన వచ్చింది. తన రిలేషన్ షిప్ గురించి "కౌన్ హై వో లడ్కీ? అంటూ చాహల్ను ప్రశ్నించారు. దీనికి చాహల్ స్పందిస్తూ 'నాలుగు నెలల కిందటే.. ఇండియా మొత్తం తెలుసు' అంటూ మాట్లాడారు. ఇది చూసిన నెటిజన్స్ పరోక్షంగా ఆర్జే మహ్వశ్ అని క్లారిటీ ఇచ్చాడని కామెంట్స్ చేస్తున్నారు. ఆమె పేరు ప్రస్తావించకపోయినా నెట్టింట మాత్రం తెగ వైరల్గా మారింది. మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ సైతం చాహల్ను ఆట పట్టించారు.కాగా.. టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన మొదటి భార్య ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకున్నారు. ఈ సంవత్సరం మార్చిలో విడాకులు తీసుకున్నారు. అంతకుముందే ఆర్జే మహ్వశ్తో కలిసి చాహల్ మొదటిసారి ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్ల కనిపించారు. అప్పటి నుంచే ఈ జంటపై డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. తాజాగా కపిల్ షోలో చాహల్ కామెంట్స్ చూస్తుంటే మహ్వస్తో డేటింగ్ కన్ఫామ్ చేసినట్లేనని నెటిజన్స్ భావిస్తున్నారు. -
ENG VS IND 2n Test Day 5: టీమిండియాకు చేదు వార్త
ఇంగ్లండ్పై చారిత్రక గెలుపు సాధించేందుకు 7 వికెట్ల దూరంలో టీమిండియాకు చేదు వార్త. రెండో టెస్ట్ చివరి రోజు ఆట ప్రారంభానికి ముందు ఎడ్జ్బాస్టన్లో భారీ వర్షం కురుస్తుంది. స్టేడియం మొత్తాన్ని కవర్లతో కప్పేశారు. అక్కడ వాతావరణం రాత్రిని తలపిస్తుంది. ఫ్లడ్ లైట్లు ఆన్ చేశారు. భారతకాలమానం ప్రకారం మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితిలో ఇది సాధ్యపడేలా లేదు. మరో గంట పాటు వర్షం ఇలాగే కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ నివేదించింది. అయితే మధ్యాహ్నం సమయంలో వర్షం ఉండకపోవచ్చని తెలుస్తుంది. వర్షం కారణంగా తొలి సెషన్ రద్దైతే టీమిండియాకు భారీ నష్టం సంభవిస్తుంది. మిగతా రెండు సెషన్లలో భారత బౌలర్లు ఏడు వికెట్లు తీయాల్సి ఉంటుంది. ఇది అంత ఈజీ కాదు. ఏం జరుగుతుందో వేచి చూడాలి.HEAVY RAIN AT EDGBASTON...!!!! [Amit Shah from RevSportz] pic.twitter.com/zdrYfwj3ri— Johns. (@CricCrazyJohns) July 6, 2025కాగా, ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ భారత్ నిర్దేశించిన 608 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. భారత్ విజయానికి ఇంకా 7 వికెట్లు అవసరం కాగా.. ఇంగ్లండ్ గెలుపునకు 536 పరుగులు కావాలి.నాలుగో రోజు ఆటలో టీమిండియా 427/6 వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. శుభ్మన్ గిల్ (162 బాల్స్లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 161) సెంచరీతో చెలరేగగా.. రవీంద్ర జడేజా (69 నాటౌట్), రిషబ్ పంత్ (65), కేఎల్ రాహుల్ (55) హాఫ్ సెంచరీలతో రాణించారు.గిల్పై విమర్శలుటీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ సెకెండ్ ఇన్నింగ్స్ను లేట్గా డిక్లేర్ చేయడాన్ని చాలా మంది క్రికెట్ నిపుణులు తప్పుబడుతున్నారు. కాస్త ముందుగానే ఇంగ్లండ్కు బ్యాటింగ్ చేసే అవకాశాన్ని ఇచ్చి ఉంటే మరిన్ని వికెట్లు పడివుండేవని అభిప్రాయపడుతున్నారు.మరోవైపు టీమిండియా ఎడ్జ్బాస్టన్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఈ మ్యాచ్లో గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా ఆటగాళ్లు ఆరాటపడుతున్నారు.స్కోర్ వివరాలు..భారత్ 587 & 427/6 డిక్లేర్ఇంగ్లండ్ 407 & 72/3 (16) ప్రస్తుత రన్రేట్: 4.5 -
డుప్లెసిస్ విధ్వంసం.. టాప్లోకి సూపర్ కింగ్స్
మేజర్ లీగ్ క్రికెట్-2025 లీగ్ స్టేజీని టెక్సాస్ సూపర్ కింగ్స్ అద్బుతమైన విజయంతో ముగించింది. ఆదివారం ఫ్లోరిడా వేదికగా సియాటెల్ ఓర్కాస్ వేదికగా జరిగిన మ్యాచ్లో 51 పరుగుల తేడాతో సూపర్ కింగ్స్ జయభేరి మ్రోగించింది.ఈ విజయంతో టెక్సాస్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్దానానికి చేరుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టెక్సాస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(52 బంతుల్లో 6 ఫోర్లు,4 సిక్స్లతో 91), శుభమ్ రంజనె (41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 65 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు.అనంతరం లక్ష్య ఛేదనలో సియాటెల్ 18.4 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. కేల్ మయేర్స్ (35), షిమ్రోన్ హెట్మయెర్ (26), సికందర్ రజా (23) రాణించినా.. మిగితా ప్లేయర్లు విఫలం కావడంతో ఓర్కాస్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. టెక్సాస్ బౌలర్లలో ఆడమ్ మిల్నే 5 వికెట్లు పడగొట్టి సియాటెల్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు నూర్ అహ్మద్ 2, అకీల్ హోసేన్ 2, మార్కస్ స్టాయినిస్ ఒక వికెట్ తీశారు. ఇక ఈ ఓటమితో సియాటెల్((6 పాయింట్లు) ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి. ఇప్పటికే టెక్సాస్, శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్, వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్లు తమ ప్లే ఆఫ్ బెర్త్ను ఖారారు చేసుకున్నాయి. మిగిలిన నాలుగో స్ధానం కోసం ఎంఐ న్యూయర్క్, సియాటెల్ పోటీలో ఉన్నాయి. న్యూయార్క్ తన చివరి లీగ్ మ్యాచ్లో (వాషింగ్టన్ ఫ్రీడమ్తో పోరు) ఘోర ఓటమిపాలైతేనే సియాటెల్కు నాలుగో బెర్తు దక్కే అవకాశం ఉంది. ఇది జరగడం దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి. -
వనిందు హసరంగా ప్రపంచ రికార్డు.. వన్డేల్లో తొలి ప్లేయర్గా
కొలంబో వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన రెండో వన్డేలో శ్రీలంక ఓటమి పాలైనప్పటికి.. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ వనిందు హసరంగా మరోసారి తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మూడు వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ను 248 పరుగులకు ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.బ్యాటింగ్లో మాత్రం వనిందు తన మార్క్ను చూపించలేకపోయాడు. కీలక సమయంలో బ్యాటింగ్కు వచ్చిన హసరంగా కేవలం 13 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో హసరంగా వన్డేల్లో తన 1000 పరుగుల మైలు రాయిని అందుకున్నాడు. వ్యక్తిగత స్కోర్ ఒక్క పరుగు వద్ద ఈ ఫీట్ను అందుకున్నాడు.తద్వారా వన్డేల్లో అత్యంతవేగంగా 1000 పరుగులతో పాటు 100 వికెట్లు తీసిన ఆటగాడిగా హసరంగా వరల్డ్ రికార్డు సృష్టించాడు. హసరంగా ఈ అరుదైన రికార్డును కేవలం 65 వన్డేల్లోనే అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా లెజెండరీ ఆల్రౌండర్ షాన్ పొలాక్ పేరిట ఉండేది. పొలాక్ ఈ ఫీట్ను 68 వన్డేల్లో అందుకున్నాడు. తాజా మ్యాచ్తో పొలాక్ ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.ఇక ఈ మ్యాచ్లో శ్రీలంక ఓటమిపాలవ్వడంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది. రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 45.5 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. పర్వేజ్ హుసేన్ (69 బంతుల్లో 67; 6 ఫోర్లు, 3 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. లంక బౌలర్లలో అసిత ఫెర్నాండో 4, వనిందు హసరంగ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య చేధనలో శ్రీలంక 48.5 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా స్పిన్నర్ తన్వీర్ ఇస్లాం (5/39) ఐదు వికెట్లు పడగొట్టి లంకను దెబ్బతీశాడు. జనిత్ లియనాగే (85 బంతుల్లో 78; 7 ఫోర్లు, 2 సిక్స్లు) శ్రీలంక ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి వన్డే మంగళవారం పల్లెకెలెలో జరుగుతుంది.చదవండి: IND vs ENG: పంత్పై శుబ్మన్ గిల్ సీరియస్.. ఎందుకంటే? -
పంత్పై శుబ్మన్ గిల్ సీరియస్.. ఎందుకంటే?
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తుది అంకానికి చేరుకుంది. ఈ మ్యాచ్లో పర్యాటక టీమిండియా విజయానికి 7 వికెట్ల దూరంలో నిలవగా.. ఆతిథ్య ఇంగ్లండ్ తమ గెలుపునకు 536 పరుగుల దూరంలో ఉంది. 608 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన స్టోక్స్ సేన నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది.క్రీజులో ఓలీ పోప్(24), హ్యారీ బ్రూక్(15) ఉన్నారు. ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ను ఆలౌట్ చేసి ఎడ్జ్బాస్టన్లో తొలి టెస్టు విజయాన్ని అందుకోవాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది. ఇక ఇది ఇలా ఉండగా.. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ పంత్పై కెప్టెన్ శుబ్మన్ గిల్ సీరియస్ అయ్యాడు. డీఆర్ఎస్ విషయంలో కెప్టెన్-వైస్ కెప్టెన్ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది.అసలేమి జరిగిందంటే?సెకెండ్ ఇన్నింగ్స్లో భారత పేసర్లు ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్ తమ అద్బుత బౌలింగ్తో ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్డకెట్ను ఆరంభంలోనే పెవిలియన్కు పంపారు. ఈ క్రమంలో గిల్ మూడో పేసర్ ప్రసిద్ద్ కృష్ణను ఎటాక్లో తీసుకొచ్చాడు.పదో ఓవర్ వేసిన ప్రసిద్ద్ కృష్ణ.. మూడో బంతిని జో రూట్కు ఫుల్లర్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని డిఫెన్స్ ఆడేందుకు రూట్ ప్రయత్నించాడు. కానీ బంతి మిస్ అయ్యి అతడి ప్యాడ్కు తాకింది. దీంతో ఎల్బీకి అప్పీల్ చేయగా.. అంపైర్ నాటౌట్ అంటూ తల ఊపాడు.అయితే బంతి లెగ్ సైడ్కు వెళ్తున్నట్లగా అన్పించడంతో గిల్ రివ్యూ తీసుకోవడానికి ఆసక్తి చూపలేదు. కానీ రిషబ్ పంత్ మాత్రం పట్టుపట్టి మరి రివ్యూకి వెళ్లమని బలవంతం చేశాడు. దీంతో గిల్ ఆఖరి సెకెన్లలో రివ్యూ తీసుకునేందుకు సిగ్నల్ చేశాడు.రిప్లేలో బంతి స్టంప్స్ మిస్స్ అయ్యి డౌన్ది లెగ్ వెళ్తున్నట్లు తేలింది. దీంతో శుబ్మన్ కోపంతో పంత్ వద్దకు వెళ్లాడు. పంత్ వెంటనే తను అనుకున్నది కెప్టెన్కు వివరించాడు. కానీ గిల్ మాత్రం కోపంగానే పంత్ వైపు చూస్తూ తన ఫీల్డింగ్ స్ధానానికి చేరుకున్నాడు. అయితే ఆ తర్వాతే ఓవర్లోనే రూట్ను ఆకాష్దీప్ క్లీన్ బౌల్డ్ చేశాడు.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన టీమిండియా.. టెస్టు క్రికెట్ హిస్టరీలోనే -
గెలుపు ముంగిట టీమిండియా.. కానీ ఓ బ్యాడ్ న్యూస్! అదే జరిగితే?
ఎడ్జ్బాస్టన్లో చరిత్ర సృష్టించేందుకు టీమిండియా(Teamindia) 7 వికెట్ల దూరంలో నిలిచింది. ఈ మైదానంలో ఇప్పటివరకు కనీసం ఒక్క టెస్టులో కూడా గెలవని భారత జట్టు.. తమ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించేందుకు సిద్దమైంది.బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ మైదానం వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ గెలుపు ముంగిట నిలిచింది. భారత్ నిర్దేశించిన 608 పరుగుల ఛేదనలో బ్యాటింగ్కు వచ్చిన ఇంగ్లండ్.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది.భారత్ విజయానికి ఇంకా 7 వికెట్లు అవసరం కాగా.. ఇంగ్లండ్ గెలుపునకు 536 పరుగులు కావాలి. అయితే గెలుపు ముంగిట భారత జట్టును వరుణుడు భయపెడుతున్నాడు. ఆఖరి రోజుకు వర్షం అంతరాయం కలిగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఎడ్జ్బాస్టన్లో ఆదివారం ఉదయం మ్యాచ్ ప్రారంభ సమయంలో 60 శాతం వర్షం కురిసేందుకు ఆస్కారం ఉన్నట్లు ఆక్యూ వెదర్ తమ రిపోర్టులో పేర్కొంది. అయితే మధ్యాహ్నం సమయంలో వర్షం ఉండకపోవచ్చని ఆక్యూ వెదర్ తెలిపింది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైతే ఇంగ్లండ్ కచ్చితంగా డ్రా కోసం ఆడుతోంది.అయితే మరోవైపు కెప్టెన్ శుబ్మన్ గిల్(Shubman Gill) ఇన్నింగ్స్ను లేట్గా డిక్లేర్ చేయడాన్ని చాలా మంది క్రికెట్ నిపుణులు తప్పుబడుతున్నారు. కాస్త ముందుగానే ఇంగ్లండ్కు బ్యాటింగ్ చేసే అవకాశాన్ని ఇచ్చి ఉంటే మరిన్ని వికెట్లు పడివుండేవని అభిప్రాయపడుతున్నారు.కాగా ఓవర్నైట్ స్కోరు 64/1తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన ఇండియా 427/6 వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. శుభ్మన్ గిల్ (162 బాల్స్లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 161) సెంచరీతో చెలరేగగా.. రవీంద్ర జడేజా (69 నాటౌట్), రిషబ్ పంత్ (65), కేఎల్ రాహుల్ (55) హాఫ్ సెంచరీలతో రాణించారు.చదవండి: IND vs ENG: శుబ్మన్ గిల్ వరల్డ్ రికార్డు.. 148 ఏళ్లలో ఇదే తొలిసారి -
శుబ్మన్ గిల్ వరల్డ్ రికార్డు.. 148 ఏళ్లలో ఇదే తొలిసారి
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ సారథి శుబ్మన్ గిల్(Shubman Gill) ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్లో గిల్ పరుగుల వరద పారించాడు. తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ(269)తో చెలరేగిన గిల్.. రెండో ఇన్నింగ్స్లో శతకం (162 బంతుల్లో 161; 13 ఫోర్లు, 8 సిక్స్లు) తో కదం తొక్కాడు. ఓవరాల్గా రెండు ఇన్నింగ్స్లు కలిపి 430 పరుగులు చేశాడు. ఈ క్రమంలో గిల్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.గవాస్కర్ రికార్డు బద్దలు..👉ఒకే టెస్టులో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా గిల్ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ పేరిట ఉండేది. 1971లో వెస్టిండీస్తో జరిగిన టెస్టులో సన్నీ రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 344 పరుగులు చేశాడు. ఇప్పుడు తాజా ప్రదర్శనతో గిల్ 54 ఏళ్ల కిందట గవాస్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఓవరాల్గా వరల్డ్ టెస్టు క్రికెట్లో ఈ రికార్డు ఇంగ్లండ్ లెజెండ్ గ్రాహం గూచ్ పేరిట ఉంది. 1990లో లార్డ్స్లో భారత్పై అతడు రెండు ఇన్నింగ్స్లు కలిపి 456 పరుగులు చేశాడు. గిల్ మరో 26 పరుగులు చేసి ఉంటే గూచ్ ఆల్టైమ్ రికార్డు కూడా బ్రేక్ అయిఉండేది. అయితే ఈ జాబితాలో గూచ్ తర్వాత స్ధానంలో గిల్నే ఉన్నాడు.👉అదేవిధంగా 148 ఏళ్ల టెస్టు క్రికెట్ హిస్టరీలో ఒకే టెస్టుల 250 ప్లస్, 150కు పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాటర్గా వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు ఏ బ్యాటర్కు ఈ ఘనత సాధ్యం కాలేదు.గెలుపు వాకిట్లో భారత్..ఈ మ్యాచ్లో భారత్ విజయం ముంగిట నిలిచింది. 608 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ టాపార్డర్ తడబడింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్లో మూడు వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. భారత్ విజయానికి ఇంకా 7 వికెట్లు అవసరం కాగా.. ఇంగ్లండ్ గెలుపునకు 536 పరుగులు కావాలి. -
శ్రీలంకకు షాకిచ్చిన బంగ్లాదేశ్.. రెండో వన్డేలో ఘన విజయం
కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో 16 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 1-1తో బంగ్లాదేశ్ సమం చేసింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 45.5 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది.పర్వేజ్ హుసేన్ (69 బంతుల్లో 67; 6 ఫోర్లు, 3 సిక్స్లు), తౌహీద్ హృదయ్ (69 బంతుల్లో 51; 2 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయగా...తన్జీమ్ హసన్ (21 బంతుల్లో 33 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. లంక బౌలర్లలో అసిత ఫెర్నాండో 4, వనిందు హసరంగ 3 వికెట్లు పడగొట్టారు.తిప్పేసిన తన్వీర్..అనంతరం లక్ష్య చేధనలో శ్రీలంక 48.5 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా స్పిన్నర్ తన్వీర్ ఇస్లాం (5/39) ఐదు వికెట్లు పడగొట్టి లంకేయుల పతనాన్ని శాసించాడు. అతడితో పాటు తన్జీమ్ హసన్ రెండు.. షమీమ్, మెహది హసన్, ముస్తఫిజుర్ రెహ్మన్ తలా వికెట్ సాధించారు.జనిత్ లియనాగే (85 బంతుల్లో 78; 7 ఫోర్లు, 2 సిక్స్లు), కుశాల్ మెండిస్ (31 బంతుల్లో 56; 9 ఫోర్లు, 1 సిక్స్), కమిందు మెండిస్ (51 బంతుల్లో 33; 2 ఫోర్లు) రాణించినా...జట్టును గెలిపించడంలో విఫలమయ్యారు. సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి వన్డే మంగళవారం పల్లెకెలెలో జరుగుతుంది.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన టీమిండియా.. టెస్టు క్రికెట్ హిస్టరీలోనే -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. టెస్టు క్రికెట్ హిస్టరీలోనే
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా విజయం దిశగా పయనిస్తోంది. 608 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ టాపార్డర్ తడబడింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్లో మూడు వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. భారత్ విజయానికి ఇంకా 7 వికెట్లు అవసరం కాగా.. ఇంగ్లండ్ గెలుపునకు 536 పరుగులు కావాలి.ఇక ఈ ఎడ్జ్బాస్టన్ టెస్టులో గిల్ సారథ్యంలోని భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. భారత తమ టెస్టు క్రికెట్ హిస్టరీలో ఓ మ్యాచ్లో 1000కు పైగా పరుగులు చేయడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 587 పరుగులు చేసిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్లో 427 పరుగులు చేసింది.మొత్తం రెండు ఇన్నింగ్స్లు కలిపి 1014 పరుగులు నమోదు చేసింది. ఇప్పటివరకు 2004లో సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియాపై చేసిన 916 పరుగులకే భారత్కు అత్యధికం. తాజా మ్యాచ్తో చరిత్రను యంగ్ టీమిండియా తిరగ రాసింది.అదరగొట్టిన గిల్..ఇక ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్లోనూ భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ అదరగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్లో ద్విశతకంతో చెలరేగిన శుబ్మన్.. రెండో ఇన్నింగ్స్లో (162 బంతుల్లో 161; 13 ఫోర్లు, 8 సిక్స్లు) శతకంతో కదం తొక్కాడు. దీంతో భారత్ తమ సెకెండ్ ఇన్నింగ్స్ 83 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 427 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.భారత బ్యాటర్లలో గిల్తో పాటు రవీంద్ర జడేజా (118 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), రిషభ్ పంత్ (58 బంతుల్లో 65; 8 ఫోర్లు, 3 సిక్స్లు), కేఎల్ రాహుల్ (84 బంతుల్లో 55; 10 ఫోర్లు) అర్ధ శతకాలతో రాణించారు. తొలి ఇన్నింగ్స్లో లభించిన ఆధిక్యాన్ని జోడించి ఇంగ్లండ్ ముందు 608 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఉంచింది.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన టీమిండియా.. టెస్టు క్రికెట్ హిస్టరీలోనే -
కోహ్లి, రోహిత్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్..
అంతా ఊహించిందే జరిగింది. బంగ్లాదేశ్లో భారత జట్టు పర్యటన వాయిదా పడింది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం ధ్రువీకరించింది. ఇరు బోర్డుల అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. అంతర్జాతీయ క్రికెట్ కమిట్మెంట్స్, రెండు జట్ల షెడ్యూల్ను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నాము.ఈ సిరీస్ను వచ్చే ఏడాది సెప్టెంబర్లో నిర్వహించేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆతృతగా ఎదురుచూస్తోంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని భారత క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది.వాయిదా ఎందుకంటే?కాగా ఈ ఏడాది ఆరంభం నుంచే బంగ్లా-భారత్ వైట్బాల్ సిరీస్లపై నీలినీడలు కమ్ముకున్నాయి. బంగ్లా పర్యటనకు భారత జట్టును పంపేందుకు బీసీసీఐ ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూసింది. కానీ భద్రతా కారణాల దృష్ట్యా ఈ పర్యటనను వాయిదా వేసుకోమని భారత ప్రభుత్వం బీసీసీఐని సూచించినట్లు తెలుస్తోంది.మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం కూలాక అక్కడ చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలతో బంగ్లాదేశ్ అట్టుడికింది. ప్రస్తుతం తాత్కాళిక ప్రభుత్వ ఏర్పాటుతో పరిస్థితులు అదుపులో ఉన్నట్లు కనబడుతున్నప్పటికీ, నివురుగప్పిన నిప్పులా మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తితే ఛాన్స్ ఉంది. అంతకుతోడు బంగ్లాదేశ్ మాజీ మంత్రులు, రాజకీయ నేతలపై అక్కడ తరచూ మూకదాడులు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.వచ్చే ఏడాదికల్లా ఎన్నికలు పూర్తయితే పరిస్థితిలో మార్పుంటుందని బోర్డు భావిస్తోంది. వీటిన్నంటిని పరిగణలోకి తీసుకునే ఈ పర్యటను బీసీసీఐ వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం.. భారత జట్టు ఆతిథ్య బంగ్లాతో వచ్చేనెల 17 నుంచి 31 వరకు చిట్టగాంగ్, ఢాకా వేదికలపై మూడేసి చొప్పున వన్డేలు, టి20లు ఆడాల్సి ఉంది. రోహిత్-కోహ్లి ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్..మరోవైపు తమ ఆరాధ్య క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను మైదానంలో చూడాలన్న ఆశపడ్డ అభిమానులు మరి కొన్న నెలలు వేచి చూడాల్సిందే. టెస్టు, టీ20లకు ప్రకటించిన రోహిత్, కోహ్లి కేవలం వన్డేల్లో మాత్రమే ఆడనున్నారు. ఈ క్రమంలో బంగ్లాతో జరిగే వన్డే సిరీస్లో వీరిద్దరని చూడవచ్చని అంతా భావించారు. కానీ ఇప్పుడు టూర్ వాయిదా పడడంతో ఫ్యాన్స్కు నిరాశే ఎదురైంది. ఈ ఏడాది ఆక్టోబర్లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్లో రో-కో ద్వయం ఆడనున్నారు.చదవండి: సునామీ శతకంతో విరుచుకుపడ్డ వైభవ్ సూర్యవంశీ.. ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్ -
డిఫెండింగ్ చాంప్ క్రెజికొవా అవుట్
లండన్: ఈ వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో సీడెడ్ స్టార్ల పరాజయాల పరంపర కొనసాగుతోంది. మహిళల సింగిల్స్లో డిఫెండింగ్ చాంపియన్, 17వ సీడ్ బార్బర క్రెజికొవా (చెక్ రిపబ్లిక్)కు మూడో రౌండ్లోనే చుక్కెదురైంది. ఆమెతో పాటు 11వ సీడ్ రిబాకినా (కజకిస్తాన్), 16వ సీడ్ కసట్కినా (ఆ్రస్టేలియా), లోకల్ స్టార్ ఎమ్మా రాడుకాను (బ్రిటన్)ల ఆట కూడా ముగిసింది. టాప్సీడ్ సబలెంక, ఎనిమిదో సీడ్ స్వియాటెక్, ఏడో సీడ్ అండ్రీవా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్లో ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ సునాయాస విజయంతో ప్రిక్వార్టర్స్ చేరాడు. 11వ సీడ్ డిమినార్, 19వ సీడ్ దిమిత్రోవ్లు కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మూడు గ్రాండ్స్లామ్ టైటిళ్ల చాంపియన్, టాప్ సీడ్ సినెర్ (ఇటలీ) 6–1, 6–3, 6–1తో స్పెయిన్కు చెందిన మార్టినెజ్పై వరుస సెట్లలో గెలుపొందాడు. డిమినార్ (ఆ్రస్టేలియా) 6–4, 7–6 (7/5), 6–3తో హొల్మ్గ్రెన్ (డెన్మార్క్)పై, దిమిత్రోవ్ (బల్గేరియా) 6–3, 6–4, 7–6 (7/0)తో సెబాస్టియన్ అఫ్నెర్ (ఆ్రస్టియా)పై, మారిన్ సిలిచ్ (క్రొయేషియా) 6–3, 3–6, 6–2, 6–4 జేమే మునర్ (స్పెయిన్)పై విజయం సాధించారు. 25వ గ్రాండ్స్లామ్ టైటిల్ లక్ష్యంతో బరిలోకి దిగిన సెర్బియన్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ సునాయాస విజయంతో ప్రిక్వార్టర్స్ చేరాడు. ఆరో సీడ్ జొకో 6–3, 6–0, 6–4తో కెక్మనోవిచ్ (సెర్బియా)పై విజయం సాధించాడు. క్రెజికొవా మూడో రౌండ్లోనే... చెక్ రిపబ్లిక్ స్టార్, 17వ సీడ్ క్రెజికొవా టైటిల్ నిలబెట్టుకునే పోరాటానికి పదో సీడ్ ఎమ్మా నవారో (అమెరికా) చెక్పెట్టింది. మూడో రౌండ్లో నవారో 2–6, 6–3, 6–4తో క్రెజికొవాను ఓడించింది. 2021 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ క్రెజికొవాకు ఈ ఏడాది కలిసిరావడం లేదు. ఈ సీజన్ ఆరంభ గ్రాండ్స్లామ్ ఆ్రస్టేలియా ఓపెన్కు గైర్హాజరైన ఆమె ఫ్రెంచ్ ఓపెన్లో రెండో రౌండ్లోనే వెనుదిరిగింది. ఇప్పుడు ఇక్కడా పేలవ ప్రదర్శనతోనే టోర్నీ నుంచి ని్రష్కమించింది. ఏనాడు వింబుల్డన్లో తొలిరౌండ్ అడ్డంకిని దాటలేకపోయిన క్లారా టౌసన్ (డెన్మార్క్) ఈ సారి ప్రిక్వార్టర్స్ చేరింది. ఆమె 7–6 (8/6), 6–3తో వింబుల్డన్ (2022) మాజీ చాంపియన్, ఆ్రస్టేలియా ఓపెన్ (2023) మాజీ రన్నరప్ ఎలీనా రిబాకినా (కజకిస్తాన్)ను కంగుతినిపించింది. దీంతో గతేడాది సెమీఫైనలిస్ట్ అయిన రిబాకినా ఆట ఈ సీజన్లో మూడో రౌండ్తోనే ముగిసింది. ఈ ఏడాది ఆ్రస్టేలియా, ఫ్రెంచ్ ఓపెన్లలో ప్రిక్వార్టర్స్ చేరిన రిబాకినా... ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్లో నిరాశపరిచింది. ఓవరాల్గా వింబుల్డన్లోనే ఆమెకిది పేలవ ప్రదర్శన. ఇక్కడ 2021 నుంచి ఆడుతున్న ఆమె ఆ ఏడాది ప్రిక్వార్టర్స్ చేరింది. మరుసటి ఏడాది విజేతగా నిలిచింది. 2023, 2024లలో క్వార్టర్స్, సెమీస్ వరకు పోరాడింది. స్వియాటెక్, అండ్రీవా అలవోకగా... మహిళల సింగిల్స్లో ఎనిమిదో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలండ్), అండ్రీవా (రష్యా) సునాయాస విజయాలతో ప్రిక్వార్టర్స్ చేరారు. ఐదు గ్రాండ్స్లామ్ టైటిళ్ల చాంపియన్ స్వియాటెక్ 6–2, 6–3తో కొలిన్స్ (అమెరికా)పై విజయం సాధించగా, ఏడో సీడ్ మిర్ర అండ్రీవా (రష్యా) కూడా 6–1, 6–3తో హెయిలీ బాప్టిస్ట్ (అమెరికా)పై వరుస సెట్లలో నెగ్గింది. ఈ సీజన్ ఆ్రస్టేలియా, ఫ్రెంచ్ ఓపెన్ల రన్నరప్ ప్రపంచ నంబర్వన్ సబలెంక (బెలారస్) 7–6 (8/6), 6–4తో రాడుకానుపై గెలుపొందింది. భారత జోడీలకు నిరాశపురుషుల డబుల్స్లో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. యూకీ బాంబ్రీ తన అమెరికా భాగస్వామితో కలిసి మూడో రౌండ్లోకి దూసుకెళ్లగా, రిత్విక్ బొల్లిపల్లి, శ్రీరామ్ బాలాజీ జోడీలకు రెండోరౌండ్లో చుక్కెదురైంది. యూకీ బాంబ్రీ–రాబర్ట్ గాలొవే (అమెరికా) ద్వయం 6–3, 7–6 (8/6)తో నునొ బోర్జెస్ (పోర్చుగల్)–మార్కస్ గిరోన్ (అమెరికా) జంటపై గెలిచింది. రిత్విక్–నికోలస్ బారియెంటోస్ (కొలంబియా) జోడీ 4–6, 6–7 (7/9)తో ఆరో సీడ్ జో సలిస్బురి–నియోల్ స్కప్స్కీ (బ్రిటన్) జంట చేతిలో ఓటమి పాలైంది. శ్రీరామ్ బాలాజీ–మిగెల్ రెయిస్ (మెక్సికో) ద్వయం 4–6, 4–6తో నాలుగో సీడ్ మార్సెల్ గ్రెనొల్లర్స్ (స్పెయిన్)–హొరాసియో జె»ొల్లస్ (అర్జెంటీనా) జోడీ చేతిలో పరాజయం చవిచూసింది. -
సత్తా చాటిన భారత అమ్మాయిలు
చియాంగ్ మై (థాయిలాండ్): భారత మహిళల ఫుట్బాల్ జట్టు అసలు సమయంలో చెలరేగింది. క్వాలిఫయింగ్ టోర్నీలో సత్తా చాటి ఆసియా కప్కు అర్హత సాధించింది. 2003 తర్వాత మన మహిళలు ఆసియా కప్ నేరుగా అర్హత సాధించడం ఇదే తొలిసారి. శనివారం జరిగిన మ్యాచ్లో భారత్ 2–1 గోల్స్ తేడాతో ఆతిథ్య జట్టు థాయిలాండ్ను ఓడించింది. భారత్ తరఫున సంగీత బస్ఫోర్ రెండు గోల్స్ (28వ నిమిషం, 78వ నిమిషం) సాధించడం విశేషం. థాయిలాండ్ తరఫున చట్చవాన్ రాడ్థాంగ్ ఏకైక గోల్ (47వ నిమిషం) నమోదు చేసింది.ఈ మ్యాచ్కు ముందు ఇరు జట్ల మధ్య గోల్ వ్యత్యాసం కూడా (+22) కూడా సమానంగా ఉండటంతో ఇరు జట్లూ తప్పనిసరిగా గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగాయి. ‘ఫిఫా’ ర్యాంకింగ్స్లో భారత్కంటే 24 స్థానాలు ముందున్న థాయిలాండ్ ఫేవరెట్గా బరిలోకి దిగింది. అయితే మన అమ్మాయిల పట్టుదలకు విజయం వరించింది. గతంలో భారత్ ఎప్పుడూ థాయిలాండ్ను ఓడించలేదు. క్వాలిఫయింగ్ టోర్నీలో గ్రూప్ ‘బి’ నుంచి ఆడిన నాలుగు మ్యాచ్లలోనూ భారత మహిళలు విజయం సాధించి అగ్రస్థానంతో ముందంజ వేయడం విశేషం. టోర్నీలో గత మూడు మ్యాచ్లలో ఇరాక్, మంగోలియా, తిమోర్ లెస్ట్లను భారత్ ఓడించింది. ఆసియా కప్ టోర్నీ 2026లో ఆస్ట్రేలియాలో జరుగుతుంది. -
ఎదురులేని నీరజ్
బెంగళూరు: భారత్లో నిర్వహించిన తొలి అంతర్జాతీయ జావెలిన్ త్రో ఈవెంట్... ‘నీరజ్ చోప్రా క్లాసిక్’లో భారత స్టార్ నీరజ్ చోప్రా విజేతగా నిలిచాడు. ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య ‘ఎ’కేటగిరీ గుర్తింపునిచ్చిన ఈ టోర్నీలో శనివారం నీరజ్ జావెలిన్ను 86.18 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానం దక్కించుకున్నాడు. ఇటీవల పారిస్ డైమండ్ లీగ్, ఓస్ట్రావా గోల్డెన్ స్పైక్ టోర్నీల్లో టైటిల్స్ నెగ్గిన 27 ఏళ్ల నీరజ్ చోప్రాకు ఇది ‘హ్యాట్రిక్’టైటిల్ కావడం విశేషం. 2020 టోక్యో ఒలింపిక్స్లో పసిడి, 2024 పారిస్ ఒలింపిక్స్లో రజతం నెగ్గిన నీరజ్... సొంతగడ్డపై అంచనాలను అందుకుంటూ అదరగొట్టాడు. ప్రపంచ మాజీ చాంపియన్ జూలియన్ యెగో (84.51 మీటర్లు; కెన్యా), రమేశ్ పతిరగే (84.34 మీటర్లు; శ్రీలంక) వరుసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచారు. భారత అథ్లెటిక్స్ సమాఖ్య, ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య, జేఎస్డబ్ల్యూ స్పోర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో నీరజ్ చోప్రా పర్యవేక్షణలో జరిగిన ఈ ఈవెంట్ విజయవంతం కాగా... విజేతలకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య బహుమతులు అందజేశారు. తొలి ప్రయత్నంలో ఫౌల్ చేసిన నీరజ్... రెండో త్రోలో జావెలిన్ను 82.99 మీటర్ల దూరం విసిరాడు. ఇక మూడో ప్రయత్నంలో ఈటెను 86.18 మీటర్ల దూరం విసిరి అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసిన నీరజ్ విజయనాదం చేశాడు. ఆ తర్వాత నాలుగో ప్రయత్నంలో మరోసారి ఫౌల్ చేసిన నీరజ్.. ఐదో ప్రయత్నంలో 84.07 మీటర్లు, ఆరో త్రోలో 82.22 మీటర్ల దూరం నమోదు చేసుకున్నాడు. మిగిలిన అథ్లెట్లెవరూ నీరజ్ దరిదాపుల్లోకి చేరుకోలేకపోవ డంతో భారత స్టార్ విజేతగా నిలిచాడు. -
విజయం వాకిట్లో...
ఇంగ్లండ్తో రెండో టెస్టులో టీమిండియా విజయం వాకిట్లో నిలిచింది. బ్యాటర్ల అసమాన ప్రదర్శనకు బౌలర్ల సహకారం తోడవడంతో భారీ విజయంపై కన్నేసింది. గిల్ రికార్డు శతకానికి పంత్, జడేజా, రాహుల్ హాఫ్ సెంచరీలు జతవడంతో ఆతిథ్య జట్టు ముందు కొండంత లక్ష్యం నిలవగా... 608 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్ టాపార్డర్ తడబడింది. 72 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. విజయానికి ఇంకా 536 పరుగులు చేయాల్సి ఉండగా... ఇక్కడి నుంచి ఆ జట్టు గెలవాలంటే మహాద్భుతం జరగాల్సిందే! భారత బౌలర్ల జోరు చూస్తుంటే ఆదివారం వేగంగా ఏడు వికెట్లు తీయడం ఖాయంగా అనిపిస్తుండగా... రోజంతా వర్షం కురవాలని ప్రార్థించడం తప్ప ఇంగ్లండ్ ముందు మరో అవకాశం కనిపించడం లేదు!బర్మింగ్హామ్: ఇంగ్లండ్తో రెండో టెస్టులో భారత క్రికెట్ జట్టు సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ విజయానికి చేరువైంది. రెండో ఇన్నింగ్స్లో దంచి కొట్టిన టీమిండియా... ప్రత్యర్థి ముందు ఏకంగా 608 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కొండంత స్కోరును చేరుకునే క్రమంలో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 16 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. క్రాలీ (0), డకెట్ (15 బంతుల్లో 25; 5 ఫోర్లు), రూట్ (6) పెవిలియన్ చేరగా... పోప్ (24 బ్యాటింగ్; 3 ఫోర్లు), బ్రూక్ (15 బ్యాటింగ్; 2 ఫోర్లు) పోరాడుతున్నారు. భారత బౌలర్లలో ఆకాశ్దీప్ 2, సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు. ఆదివారం ఆటకు చివరి రోజు కాగా... చేతిలో 7 వికెట్లు ఉన్న ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు... విజయానికి ఇంకా 536 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 64/1తో శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా 83 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 427 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ డబుల్ సెంచరీ హీరో, యువ సారథి శుబ్మన్ గిల్ (162 బంతుల్లో 161; 13 ఫోర్లు, 8 సిక్స్లు) మరో శతకంతో కదం తొక్కాడు. రవీంద్ర జడేజా (118 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), రిషభ్ పంత్ (58 బంతుల్లో 65; 8 ఫోర్లు, 3 సిక్స్లు), కేఎల్ రాహుల్ (84 బంతుల్లో 55; 10 ఫోర్లు) అర్ధ శతకాలు సాధించారు. ఈ క్రమంలో టీమిండియా రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి తమ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక (1014) స్కోరు నమోదు చేసుకోగా... గిల్ రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 430 పరుగులతో విజృంభించాడు. పంత్ ఫటాఫట్... గత మ్యాచ్లో ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా... పరాజయం పాలైన టీమిండియా ఈ సారి ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో కనిపించింది. నాలుగో రోజు తొలి సెషన్ ఆరంభంలో కొన్ని ఉత్కంఠ క్షణాలు ఎదురైనా... వాటిని అధిగమించి భారీ స్కోరు చేసింది. ఇంగ్లండ్ పేసర్లు కట్టుదిట్టంగా బంతులేస్తుండటంతో పరుగుల రాక కష్టం కాగా... కరుణ్ నాయర్ (26; 5 ఫోర్లు) మరోసారి మంచి ఆరంభాన్ని వృథా చేసుకున్నాడు. కాసేపటికి అర్ధశతకం అనంతరం రాహుల్ కూడా వెనుదిరగగా... పంత్ వచ్చిరావడంతో విరుచుకుపడ్డాడు.ఎదుర్కొన్న మూడో నాలుగు బంతులకు వరుసగా 4, 6 కొట్టి తన ఉద్దేశం చాటాడు. అతడి దూకుడుకు ఇంగ్లండ్ పేలవ ఫీల్డింగ్ కూడా తోడ్పడింది. 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పంత్ ఇచ్చిన క్యాచ్ను క్రాలీ అందుకోలేకపోయాడు. దీన్ని సద్వినియోగం చేసుకున్న అతడు... తదుపరి ఓవర్లో మరో 4, 6 బాదాడు. బషీర్కు రెండు ఫోర్లతో స్వాగతం పలికిన పంత్... చిత్రవిచిత్రమైన షాట్లతో చెలరేగిపోయాడు. దీంతో తొలి సెషన్లో భారత్ 25 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. గిల్ నిలకడ... రెండో సెషన్లో పంత్తో పాటు గిల్ కూడా దంచి కొట్టడంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. టంగ్ బౌలింగ్లో 6, 4, 4 కొట్టిన గిల్.. అతడి తదుపరి ఓవర్లో మరో 6, 4తో 57 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మరోవైపు పంత్ 48 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. స్కోరు పెంచే క్రమంలో పంత్ ఔట్ కాగా... జడేజా రాకతో పరుగుల వేగం మందగించింది. ఈ మధ్యలో కొన్ని చక్కటి షాట్లతో అలరించిన గిల్ 129 బంతుల్లో మ్యాచ్లో రెండో సెంచరీ తన పేరిట లిఖించుకున్నాడు. రెండో సెషన్లో టీమిండియా 30 ఓవర్లు ఆడి ఒక వికెట్ నష్టానికి 127 పరుగులు చేసింది. ఇక మూడో సెషన్లో గిల్, జడేజా దుమ్మురేపారు. బంతి తమ పరిధిలో ఉంటే చాలు దానిపై విరుచుకుపడిన ఈ జంట స్కోరు బోర్డుకు రాకెట్ వేగాన్నిచ్చింది. వోక్స్ ఓవర్లో గిల్ 6, 4, 4తో చెలరేగాడు. మరోవైపు జడేజా కూడా మ్యాచ్లో రెండో అర్ధశతకం తన పేరిట లిఖించుకున్నాడు. రూట్ బౌలింగ్ 6, 4తో గిల్ 150 పరుగుల మార్క్ అందుకున్నాడు. పంత్తో నాలుగో వికెట్కు 110 పరుగులు జోడించిన గిల్... జడేజాతో ఐదో వికెట్కు 175 పరుగులు జతచేశాడు. ఎట్టకేలకు బషీర్ బౌలింగ్లో గిల్ ఔట్ కాగా... ఆంధ్రప్రదేశ్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (1) ఇలా వచ్చి అలా వెళ్లాడు. వాషింగ్టన్ సుందర్ (12 నాటౌట్) అండతో జడేజా జట్టు ఆధిక్యాన్ని 607కు చేర్చాడు. స్కోరు వివరాలుభారత్ తొలి ఇన్నింగ్స్: 587; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 407; భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (ఎల్బీ) (బి) టంగ్ 28; రాహుల్ (బి) టంగ్ 55; నాయర్ (సి) స్మిత్ (బి) కార్స్ 26; గిల్ (సి అండ్ బి) బషీర్ 161; పంత్ (సి) డకెట్ (బి) బషీర్ 65; జడేజా (నాటౌట్) 69; నితీశ్ రెడ్డి (సి) క్రాలీ (బి) రూట్ 1; సుందర్ (నాటౌట్) 12; ఎక్స్ట్రాలు 10; మొత్తం (83 ఓవర్లలో 6 వికెట్లకు డిక్లేర్డ్) 427. వికెట్ల పతనం: 1–51, 2–96, 3–126, 4–236, 5–411, 6–412. బౌలింగ్: వోక్స్ 14–3–61–0; కార్స్ 12–2–56–1; టంగ్ 15–2–93–2; స్టోక్స్ 7–1–26–0; బషీర్ 26–1–119–2; రూట్ 9–1–65–1. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: డకెట్ (బి) ఆకాశ్దీప్ 25; క్రాలీ (సి) (సబ్) సుదర్శన్ (బి) సిరాజ్ 0; పోప్ (బ్యాటింగ్) 24; రూట్ (బి) ఆకాశ్దీప్ 6; బ్రూక్ (బ్యాటింగ్) 15; ఎక్స్ట్రాలు 2; మొత్తం (16 ఓవర్లలో 3 వికెట్లకు) 72. వికెట్ల పతనం: 1–11, 2–30, 3–50, బౌలింగ్: ఆకాశ్దీప్ 8–1–36–2; సిరాజ్ 5–1–29–1; ప్రసిధ్ కృష్ణ 3–0–6–0.430 ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి గిల్ చేసిన పరుగులు. భారత్ తరఫున ఇదే అత్యధికం. సునీల్ గావస్కర్ (344; 1971లో వెస్టిండీస్పై)ను అతను అధిగమించాడు. ఓవరాల్గా గూచ్ (456; 1990లో భారత్పై) అగ్ర స్థానంలో ఉండగా... గిల్ రెండో స్థానంలో నిలిచాడు.1014 ఈ మ్యాచ్లో భారత్ చేసిన పరుగులు. మన టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధికం. 2004లో ఆస్ట్రేలియాపై చేసిన 916 పరుగుల స్కోరును టీమ్ దాటింది.2 ఒక టెస్టు రెండు ఇన్నింగ్స్ల్లో డబుల్ సెంచరీ, సెంచరీ చేసిన రెండో భారత ప్లేయర్గా గిల్ నిలిచాడు. గతంలో సునీల్ గావస్కర్ ఒక్కడే ఈ ఘనత సాధించాడు. రెండు ఇన్నింగ్స్ల్లో 150+స్కోర్లు చేసిన రెండో బ్యాటర్గాను గిల్ నిలిచాడు. గతంలో అలెన్ బోర్డర్ ఈ ఫీట్ నమోదు చేశాడు. -
సునామీ శతకంతో విరుచుకుపడ్డ వైభవ్.. ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్
భారత యువ క్రికెట్ జట్టు అద్భుత విజయం సాధించింది. నాలుగో యూత్ వన్డేలో ఇంగ్లండ్ అండర్-19 జట్టును చిత్తు చేసింది. ఏకంగా 55 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 3-1తో కైవసం చేసుకుంది.వోర్సెస్టర్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్లో టాస్ ఓడిన భారత్ అండర్-19 జట్టు.. తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ ఆయుశ్ మాత్రే విఫలం కాగా.. మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi), వన్డౌన్ బ్యాటర్ విహాన్ మల్హోత్రా (Vihaan Malhotra) దుమ్ములేపారు. వైభవ్ సునామీ శతక ఇన్నింగ్స్వైభవ్ కేవలం 52 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. మొత్తంగా 78 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 143 పరుగులు సాధించాడు. అయితే, బెన్ మేయ్స్ బౌలింగ్లో జోసెఫ్ మూర్స్కు క్యాచ్ ఇవ్వడంతో వైభవ్ సునామీ శతక ఇన్నింగ్స్కు తెరపడింది.ఇక విహాన్ 121 బంతుల్లో 15 ఫోర్లు, మూడు సిక్స్ల సాయంతో 129 పరుగులు సాధించాడు. మిగతా వారిలో కెప్టెన్ అభిజ్ఞాన్ ముకుంద్.. 23 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. రాహుల్ కుమార్, హర్వన్ష్ పంగాలియా డకౌట్ అయ్యారు. కనిష్క్ చౌహాన్ (2), ఆర్ఎస్ అంబరీష్ (9), దీపేశ్ దేవేంద్రన్ (3) విఫలం కాగా.. యుధాజిత్ గుహ 15, నమన్ పుష్పక్ 2 పరుగులతో అజేయంగా నిలిచారు.ఫలితంగా భారత్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసింది.రాకీ ఫ్లింటాఫ్ అద్భుత సెంచరీ వృథాఇంగ్లండ్ బౌలర్లలో జాక్ హోమ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. సెబాస్టియన్ మోర్గాన్ మూడు వికెట్లు తీశాడు. బెన్ మేయ్స్, జేమ్స్ మింటో చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.ఇక భారత్ విధించిన 364 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ 308 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్లు బెన్ డాకిన్స్ (67), జోసెఫ్ మూర్స్ (52) అర్ధ శతకాలు బాదగా.. రాకీ ఫ్లింటాఫ్ అద్భుత సెంచరీ (91 బంతుల్లో 107) వృథాగా పోయింది. భారత బౌలర్లలో నమన్ పుష్పక్ మూడు వికెట్లు, ఆర్ అంబరీష్ రెండు వికెట్లు కూల్చి ప్రత్యర్థిని దెబ్బకొట్టగా.. దీపేశ్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇరుజట్ల మధ్య నామమాత్రపు ఐదో యూత్ వన్డే సోమవారం వోర్సెస్టర్లోనే జరుగనుంది.ఇక ఐదు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్ వెళ్లింది భారత జట్టు. మొదటి, మూడు, నాలుగో యూత్ వన్డేల్లో గెలిచిన 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది. చదవండి: వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు.. -
Ind vs Eng: పట్టుబిగించిన భారత్.. భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ తడబాటు!
ఇంగ్లండ్తో రెండో టెస్టులో భారత్ సంపూర్ణ ఆధిపత్యం సాధించింది. ఆది నుంచి పట్టుబిగించిన గిల్ సేన.. ఆతిథ్య జట్టుకు కొండంత లక్ష్యాన్ని విధించింది. బ్యాటింగ్లో దుమ్ములేపిన టీమిండియా.. శనివారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా 427/6 పరుగుల వద్ద తమ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.తద్వారా ఇంగ్లండ్ ముందు ఏకంగా 608 పరుగుల టార్గెట్ ఉంచింది. 64/1 ఓవర్ నైట్ స్కోరుతో టీమిండియా శనివారం తమ ఆట మొదలుపెట్టింది. తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ (269)తో చెలరేగిన భారత కెప్టెన్ శుబ్మన్ గిల్.. రెండో ఇన్నింగ్స్లోనూ ధనాధన్ దంచికొట్టాడు. 162 బంతుల్లో 161 పరుగులతో భారీ శతకం సాధించాడు.మిగతా వారిలో ఓపెనింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (55), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (65) అర్ధ శతకాలతో రాణించగా.. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (69 నాటౌట్) కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. ఫలితంగా ఆరు వికెట్ల నష్టానికి 427 పరుగుల వద్ద టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, షోయబ్ బషీర్ రెండేసి వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్, జో రూట్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్కు మహ్మద్ సిరాజ్ ఆదిలోనే షాకిచ్చాడు. ఓపెనర్ జాక్ క్రాలే (0)ను డకౌట్గా వెనక్కి పంపాడు.ఇక మరో భారత పేసర్ ఆకాశ్ దీప్ మరో ఓపెనర్ బెన్ డకెట్ (25), జో రూట్ (6) వికెట్లు కూల్చి సత్తా చాటాడు. ఈ క్రమంలో నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ 16 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ 15, ఓలీ పోప్ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆఖరిదైన ఐదో రోజు భారత్ మిగిలిన ఏడు వికెట్లు కూల్చి గెలుపొందాలని పట్టుదలగా ఉండగా.. విజయానికి 536 పరుగుల దూరంలో ఉన్న ఇంగ్లండ్ కనీసం డ్రా కోసం ప్రయత్నించే అవకాశం ఉంది.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ రెండో టెస్టు-2025 (బుధవారం (జూలై 2)- ఆదివారం (జూలై 6))👉వేదిక: ఎడ్జ్బాస్టన్ స్టేడియం, బర్మింగ్హామ్👉టాస్: ఇంగ్లండ్- మొదట బౌలింగ్👉భారత్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు- 587 ఆలౌట్👉ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు- 407 ఆలౌట్ 👉భారత్కు తొలి ఇన్నింగ్స్లో 180 పరుగుల ఆధిక్యం👉భారత్ రెండో ఇన్నింగ్స్- 427/6 డిక్లేర్డ్- తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకొని మొత్తం 607👉ఇంగ్లండ్ లక్ష్యం- 608👉శనివారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు: 72/3 (16). -
అదరగొట్టిన టీమిండియా.. ఇంగ్లండ్కు కొండంత లక్ష్యం
రెండో టెస్టులో టీమిండియా ఇంగ్లండ్కు భారీ లక్ష్యం విధించింది. ఆతిథ్య జట్టుపై ఆద్యంతం పైచేయి సాధించిన భారత్.. ఏకంగా 608 పరుగుల టార్గెట్ ఇచ్చింది. టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Torphy)లో భాగంగా బర్మింగ్హామ్ వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు బుధవారం మొదలైంది.587 పరుగులుఈ క్రమంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 587 పరుగులు స్కోరు చేసింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) భారీ ద్విశతకం (269) బాదగా.. రవీంద్ర జడేజా (89), యశస్వి జైస్వాల్ (87) అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నారు. వీరితో పాటు వాషింగ్టన్ సుందర్ (42) కూడా రాణించాడు.ఇక ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ అత్యధికంగా మూడు వికెట్లు తీయగా.. క్రిస్ వోక్స్, జోష్ టంగ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. మిగిలిన వారిలో కెప్టెన్ బెన్ స్టోక్స్, బ్రైడన్ కార్స్ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్.. మూడో రోజు ఆటలో భాగంగా 407 పరుగులకు ఆలౌట్ అయింది.హ్యారీ బ్రూక్ (158), జేమీ స్మిత్ (184 నాటౌట్) అద్భుత శతకాలతో 303 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో.. ఇంగ్లండ్ మేర స్కోరు చేయగలిగింది. భారత బౌలర్లలో పేసర్లు మహ్మద్ సిరాజ్ ఆరు వికెట్లతో చెలరేగగా.. ఆకాశ్ దీప్ నాలుగు వికెట్లు దక్కించుకున్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్తో కలుపుకొని 180 పరుగుల ఆధిక్యం సంపాదించిన భారత్.. ఓవర్ నైట్ స్కోరు 64/1 (13)తో శనివారం నాటి నాలుగో రోజు ఆట మొదలుపెట్టింది.మరోసారి గిల్ దంచేశాడుఆట మొదలైన కాసేపటికే కరుణ్ నాయర్ (26) పెవిలియన్ చేరగా.. ఓపెనర్ కేఎల్ రాహుల్ (55) అర్ధ శతకంతో రాణించాడు. ఇక గిల్ మరోసారి భారీ శతకం (161)తో దుమ్ములేపగా.. వికెట కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (65), ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (69 నాటౌట్) అర్ధ శతకాలతో అదరగొట్టారు. నితీశ్ రెడ్డి (1) మరోసారి నిరాశపరచగా.. వాషింగ్టన్ సుందర్ జడేజాతో కలిసి 12 పరుగులతో అజేయంగా నిలిచాడు.గిల్ భారీ శతకం పూర్తైన కాసేపటికి భారత్ తమ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 83 ఓవర్ల ఆటలో ఆరు వికెట్ల నష్టానికి 427 పరుగుల వద్ద డిక్లేర్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్లో దక్కిన 180 పరుగులకు ఈ మేర (427) స్కోరు జతచేసి... ప్రత్యర్థికి భారీ లక్ష్యం విధించింది. ఈ క్రమంలో శనివారం మూడో సెషన్ ఆఖర్లో లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్.. 108 ఓవర్లలో పనిపూర్తి చేయాలి. ఈ నేపథ్యంలో ఆదివారం నాటి ఆఖరి రోజు ఆట ఆసక్తికరంగా మారింది. ఇంగ్లండ్ను టీమిండియా ఆలౌట్ చేస్తుందా? లేదంటే.. డ్రా చేసుకునేందుకు స్టోక్స్ బృందం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా? అన్న విషయం తేలుతుంది.చదవండి: వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు.. మరో ఆటగాడి శతకం.. భారత్ భారీ స్కోరు -
స్వర్ణం గెలిచిన నీరజ్ చోప్రా.. సరికొత్త చరిత్ర
భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా మరోసారి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. భారత్లో తొలిసారి జరుగుతున్న అంతర్జాతీయ జావెలిన్ ఈవెంట్లో స్వర్ణ పతకంతో మెరిశాడు. బెంగళూరు వేదికగా తన పేరిట జరుగుతున్న ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ టైటిల్ను ఈ గోల్డెన్ బాయ్ సొంతం చేసుకున్నాడు.ఈ క్రమంలో తన పేరిట జరుగుతున్న అంతర్జాతీయ పోటీలో తానే పసిడి పతకం గెలిచిన తొలి అథ్లెట్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. అత్యుత్తమంగా ఈటెను 86.18 మీటర్ల దూరం విసిరి నీరజ్ గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. బెంగళూరులోని శనివారం నాటి ఈవెంట్కు శ్రీ కంఠీవరవ స్టేడియం వేదికైంది.ఇక కెన్యాకు చెందిన జూలియస్ యెగో 84.51 దూరం బల్లాన్ని విసిరి నీరజ్ తర్వాతి స్థానంలో నిలిచి రజత పతకం అందుకున్నాడు. శ్రీలంకకు చెందిన అండర్-16 మాజీ ఫాస్ట్ బౌలర్ రమేశ్ పతిరగె 84.34 మీటర్ల దూరం ఈటెను విసిరి కాంస్య పతకం గెలుచుకోగా.. భారత్కే చెందిన సచిన్ యాదవ్ తృటిలో కాంస్యాన్ని కోల్పోయాడు. అతడు అత్యుత్తమంగా బల్లాన్ని 82.33 మీటర్ల దూరం విసిరాడు.హ్యాట్రిక్ కొట్టిన నీరజ్ చోప్రాకాగా టోక్యో ఒలింపిక్స్-2020లో పసిడి పతకం గెలిచిన నీరజ్ చోప్రా.. 2024 పారిస్ ఒలింపిక్స్లో రజతం సొంతం చేసుకున్నాడు. అంతేకాదు..27 ఏళ్ల ఈ హర్యానా అథ్లెట్ ఖాతాలో ప్రపంచ చాంపియన్షిప్ స్వర్ణాలు, డైమండ్ లీగ్ టైటిల్స్.. అదే విధంగా ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో గెలిచిన పతకాలు ఉన్నాయి. ఇక ఇటీవల పారిస్ డైమండ్ లీగ్, ఓస్ట్రావా గోల్డెన్ స్పైక్ టోర్నీల్లో టైటిల్స్ కైవసం చేసుకున్న నీరజ్ చోప్రా.. తాజాగా నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్ గెలిచి హ్యాట్రిక్ కొట్టాడు. ఈ ఈవెంట్లో నీరజ్ చోప్రా (భారత్)తో పాటు.. సిప్రియన్ మిర్జిగ్లాడ్ (పోలాండ్), లూయిజ్ మౌరిసియో డా సిల్వా (బ్రెజిల్), థామస్ రోలెర్ (జర్మనీ), కర్టిన్స్ థామ్సన్ (అమెరికా), మార్టిన్న్ కొనెస్నీ (చెక్ రిపబ్లిక్), జూలియస్ యెగో (కెన్యా), రమేశ్ పతిరగే (శ్రీలంక), సచిన్ యాదవ్ (భారత్), రోహిత్ యాదవ్ (భారత్), సాహిల్ సిల్వాల్ (భారత్), యశ్ వీర్ సింగ్ (భారత్) బరిలో దిగారు.NEERAJ CHOPRA WINS NC CLASSIC 2025! 🏆- The Winning Throw of 86.18m for G.O.A.T 🐐pic.twitter.com/nPaJhHuJmk— The Khel India (@TheKhelIndia) July 5, 2025 -
శెభాష్!.. మరోసారి శతక్కొట్టిన గిల్.. అరుదైన రికార్డు
టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) తన కెరీర్లోనే అద్భుత ఫామ్లో ఉన్నాడు. ఇంగ్లండ్ గడ్డ మీద వరుస శతకాలతో దుమ్ములేపుతున్నాడు. ఆతిథ్య జట్టుతో లీడ్స్ వేదికగా తొలి టెస్టులో గిల్ భారీ శతకం (147) బాదిన విషయం తెలిసిందే.అనంతరం బర్మింగ్హామ్లో బుధవారం మొదలైన రెండో టెస్టులోనూ శతక్కొట్టిన శుబ్మన్ గిల్.. దానిని డబుల్ సెంచరీగా మార్చాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 387 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 30 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 269 పరుగులు సాధించాడు. అయితే, కెరీర్లో సాధించిన తొలి ద్విశతకాన్ని ట్రిపుల్ సెంచరీగా మార్చడంలో గిల్ విఫలమయ్యాడు.జోష్ టంగ్ బౌలింగ్లో ఓలీ పోప్నకు క్యాచ్ ఇచ్చి గిల్ పెవిలియన్ చేరడంతో.. అతడి భారీ డబుల్ సెంచరీ ఇన్నింగ్స్కు తెరపడింది. ఇక శనివారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా గిల్ మరోసారి బ్యాట్ ఝులిపించాడు. యాభై ఏడు బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న కెప్టెన్ సాబ్.. 129 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో వంద పరుగుల మార్కు అందుకున్నాడు.భారీ ఆధిక్యంలో భారత్ఇదిలా ఉంటే.. 64/1 ఓవర్నైట్ స్కోరుతో శనివారం నాటి నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన భారత్.. కాసేపటికే వన్డౌన్ బ్యాటర్ కరుణ్ నాయర్ (26) వికెట్ కోల్పోయింది. అయితే, ఓపెనింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అర్ధ శతకం(55)తో రాణించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మెరుపు హాఫ్ సెంచరీ (58 బంతుల్లో 65) సాధించాడు. ఇక గిల్ మరోసారి శతక్కొట్టగా.. 68 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. గిల్ సెంచరీ పూర్తి చేసుకునేసరికి, టీ బ్రేక్ సమయానికి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం (180)తో కలుపుకొని భారత్.. 484 పరుగుల భారీ లీడ్ సాధించింది.భారత రెండో బ్యాటర్గా..కాగా టెస్టు మ్యాచ్లో ఓ ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ.. మరో ఇన్నింగ్స్లో సెంచరీ బాదిన భారత రెండో బ్యాటర్గా గిల్ చరిత్రకెక్కాడు. అతడి కంటే ముందు భారత మాజీ కెప్టెన్ సునిల్ గావస్కర్ 1971లొ పోర్ట్ ఆఫ్ స్పెయిన్వేదికగా వెస్టిండీస్పై ఈ ఘనత సాధించాడు. ఇక ఓవరాల్గా ఈ జాబితాలో గిల్ తొమ్మిదో ఆటగాడు.టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ రెండో టెస్టుషెడ్యూల్: బుధవారం (జూలై 2)- ఆదివారం (జూలై 6)వేదిక: ఎడ్జ్బాస్టన్, బర్మింగ్హామ్టాస్: ఇంగ్లండ్- తొలుత బౌలింగ్టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 587 ఆలౌట్ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 407 ఆలౌట్ టీమిండియాకు తొలి ఇన్నింగ్స్లో 180 పరుగుల ఆధిక్యం.చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకం.. మరోసారి సునామీ ఇన్నింగ్స్ -
వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు.. విహాన్ శతకం.. భారత్ భారీ స్కోరు
ఇంగ్లండ్ గడ్డ మీద భారత యువ జట్టు అదరగొడుతోంది. ఆతిథ్య అండర్-19 జట్టుతో ఐదు యూత్ వన్డేల సిరీస్లో ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత్.. నాలుగో మ్యాచ్లో భారీ స్కోరు సాధించింది.వోర్సెస్టర్ వేదికగా శనివారం యూత్ వన్డేలో టాస్ ఓడిన భారత అండర్-19 జట్టు తొలుత బ్యాటింగ్కు దిగింది. అయితే, ఆదిలోనే భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఆయుశ్ మాత్రే 14 బంతులు ఎదుర్కొన్ని కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు.దీంతో ఆదిలోనే వికెట్ తీసినందుకు ఇంగ్లండ్ సంబరాలు చేసుకోగా.. ఆ ఆనందాన్ని భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కాసేపట్లోనే ఆవిరి చేశాడు. మరోసారి బ్యాట్తో వీర విహారం చేసిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.ఆ తర్వాత కూడా ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ పద్నాలుగేళ్ల కుర్రాడు.. 52 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా యూత్ వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీని తన పేరిట నమోదు చేసుకున్నాడు. మొత్తంగా ఈ మ్యాచ్లో 78 బంతులు ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ ఇంగ్లండ్ బౌలింగ్ను చితక్కొడుతూ 143 పరుగులు సాధించాడు. ఈ లెఫ్టాండర్ బౌలింగ్లో పదమూడు ఫోర్లతో పాటు ఏకంగా పది సిక్సర్లు ఉండటం విశేషం.ఇక వైభవ్ వరుసగా ఇలా నాలుగో మ్యాచ్లో సునామీ ఇన్నింగ్స్తో విరుచుకుపడితే.. వన్డౌన్ బ్యాటర్ విహాన్ మల్హోత్రా కూడా శతకంతో చెలరేగాడు. 121 బంతుల్లో 15 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 129 పరుగులు సాధించాడు. అయితే, వీరిద్దరు అవుటైన తర్వాత భారత ఇన్నింగ్స్ నెమ్మదించింది.మిగతా వారిలో కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ అభిజ్ఞాన్ కుందు 23 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. రాహుల్ కుమార్ (0), హర్వన్ష్ పంగాలియా (0), కనిష్క్ చౌహాన్ (2) పూర్తిగా విఫలమయ్యారు. ఇక ఆర్ఎస్ అంబరీష్ (9), దీపేశ్ దేవేంద్రన్ (3) కూడా చేతులెత్తేయగా.. యుధాజిత్ గుహ 15, నమన్ పుష్పక్ రెండు పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచారు.ఫలితంగా భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 363 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఇంగ్లండ్ అండర్-19 బౌలర్లలో జాక్ హోమ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. సెబాస్టియన్ మోర్గాన్ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇతరులలో బెన్ మేయ్స్, జేమ్స్ మింటో ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఇదిలా ఉంటే.. తొలి యూత్ వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలవగా.. రెండో మ్యాచ్లో ఇంగ్లండ్ ఒక వికెట్ తేడాతో గట్టెక్కింది. ఈ క్రమంలో మూడో వన్డేలో భారత్ నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించి సిరీస్లో 2-1తో ముందంజలో ఉంది. కీలకమైన నాలుగో మ్యాచ్లో గెలిచి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. కాగా భారత్ విజయాల్లో వైభవ్ సూర్యవంశీ ( 48 (19) - 45 (34)- 86 (31))దే కీలక పాత్ర.వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు..యూత్ వన్డే చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. 14 ఏళ్ల 100 రోజుల వయసులోనే ఈ ఘనత సాధించాడు. ప్రపంచంలో ఈ ఫీట్ అందుకున్న తొలి ఆటగాడు వైభవ్. అంతేకాదు.. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ నజ్ముల్ షాంటో (2009లో 14 ఏళ్ల 241 రోజుల వయసులో శతకం) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును కూడా ఈ సందర్భంగా బద్దలు కొట్టాడు. -
వాటే ఫామ్!.. ధనాధన్ దంచికొట్టి.. గిల్, పంత్ హాఫ్ సెంచరీలు
టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇంగ్లండ్ (Ind vs Eng)తో తొలి టెస్టులో శతకం (147) బాదిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగాడు. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో విరాట్ కోహ్లి (Virat Kohli) లేని లోటు పూడుస్తూ.. ఇంగ్లండ్ గడ్డ మీద అతడి రికార్డునే బద్దలు కొట్టాడు.భారీ ద్విశతకం (269)తో ఆకట్టుకుని.. ఎడ్జ్బాస్టన్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన టీమిండియా క్రికెటర్, కెప్టెన్గా నిలిచాడు. ఇక రెండో ఇన్నింగ్స్లోనూ శుబ్మన్ గిల్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. యాభై ఏడు బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. జోష్ టంగ్ బౌలింగ్లో ఫోర్ బాది 51 పరుగులు సాధించాడు.𝐅𝐥𝐮𝐞𝐧𝐭. 𝐅𝐞𝐚𝐫𝐥𝐞𝐬𝐬. 𝐅𝐨𝐜𝐮𝐬𝐞𝐝. 🔥Leading with intent, #ShubmanGill crafts a classy fifty, setting the stage for a commanding team effort 🫡#ENGvIND 👉 2nd TEST, Day 4 | LIVE NOW on JioHotstar ➡ https://t.co/2wT1UwEcdi pic.twitter.com/ftaIUA9YIy— Star Sports (@StarSportsIndia) July 5, 2025మరోవైపు.. గిల్కు తోడుగా వైస్ కెప్టెన్ బ్యాటర్ రిషభ్ పంత్ కూడా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 51 బంతుల్లోనే 50 పరుగుల మార్కు అందుకున్నాడు. ఈ క్రమంలో 44 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి మూడు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసిన టీమిండియా ఆధిక్యం.. 400కు చేరింది.పంత్ అవుటైన తర్వాత స్కోరు ఇలాకాగా ఎడ్జ్బాస్టన్ టెస్టులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 587 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ డబుల్ సెంచరీ (269)తో అదరగొట్టగా.. రవీంద్ర జడేజా (89), యశస్వి జైస్వాల్ (87) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ మూడు వికెట్లు తీయగా.. క్రిస్వోక్స్, జోష్ టంగ్ రెండేసి వికెట్లు కూల్చారు. బ్రైడన్ కార్స్, కెప్టెన్ బెన్స్టోక్స్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 407 పరుగులకు ఆలౌట్ అయింది. హ్యారీ బ్రూక్ (158), జేమీ స్మిత్ (184 నాటౌట్) శతకాలతో చెలరేగారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ ఆరు, ఆకాశ్ దీప్ నాలుగు వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్తో కలుపుకొని భారత్కు 180 పరుగుల ఆధిక్యం లభించింది.ఈ క్రమంలో 64/1 ఓవర్నైట్ స్కోరుతో శనివారం నాటి నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన భారత్.. కేఎల్ రాహుల్ (55), రిషభ్ పంత్ (65) అర్ధ శతకాలు.. గిల్ అజేయ హాఫ్ సెంచరీ (ప్రస్తుతానికి 58) కారణంగా 46.2 ఓవర్ల ఆట ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసి.. 416 పరుగుల ఆధిక్యంలో ఉంది. పంత్ 65 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షోయబ్ బషీర్ బౌలింగ్లో డకెట్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకం.. మరోసారి సునామీ ఇన్నింగ్స్ -
చరిత్ర సృష్టించిన పంత్.. ఆల్టైమ్ వరల్డ్ రికార్డు బద్దలు
భారత స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ గడ్డపై ధనాధన్ ఆటతో అలరిస్తున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. రెండో టెస్టు సందర్భంగా ఓ అరుదైన రికార్డు సాధించాడు. విదేశీ గడ్డపై టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్గా అవతరించాడు.ఈ క్రమంలో బెన్ స్టోక్స్ (Ben Stokes) పేరిట ఉన్న ఆల్టైమ్ వరల్డ్ రికార్డు (World Record)ను పంత్ బద్దలు కొట్టాడు. కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లీడ్స్ వేదికగా తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్లోనూ రిషభ్ పంత్ శతకాలతో చెలరేగాడు.వరుసగా రెండు శతకాలుతొలి ఇన్నింగ్స్లో 178 బంతుల్లో 12 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్లో 140 బంతుల్లో 15 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 118 పరుగులు సాధించాడు. అయితే, ఎడ్జ్బాస్టన్ వేదికగా బుధవారం మొదలైన రెండో టెస్టులో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఆరంభంలో విఫలమయ్యాడు.దూకుడుగా ఆడుతూరెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 42 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ బాది 25 పరుగులు చేసిన పంత్.. షోయబ్ బషీర్ బౌలింగ్లో జాక్ క్రాలేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే, రెండో ఇన్నింగ్స్లో మాత్రం తనలోని దూకుడైన ఆటను మరోసారి వెలికితీశాడు. శనివారం నాటి నాలుగో రోజు ఆట భోజన విరామ సమయానికి పంత్ 35 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 41 పరుగులతో అజేయంగా ఉన్నాడు.ఈ క్రమంలోనే పంత్ స్టోక్స్ ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. ఇంగ్లండ్లో టెస్టు ఫార్మాట్లో మొత్తంగా 23 సిక్సర్లు పూర్తి చేసుకున్న పంత్.. విదేశీ గడ్డ(ఒకే దేశం)పై అత్యధిక సిక్స్లు నమోదు చేసిన క్రికెటర్గా నిలిచాడు. అంతకుముందు బెన్ స్టోక్స్ సౌతాఫ్రికాలో 21 సిక్సర్లు బాదాడు. ఇక ఇంగ్లండ్పై పంత్ తర్వాత అత్యధిక సిక్స్లు కొట్టిన రెండో పర్యాటక బ్యాటర్గా.. వెస్టిండీస్ దిగ్గజం సర్ వివియన్ రిచర్డ్స్ (16 సిక్సర్లు) నిలిచాడు.విదేశీ గడ్డపై టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్లు🏏రిషభ్ పంత్ (ఇండియా)- ఇంగ్లండ్పై 23 సిక్సర్లు🏏బెన్ స్టోక్స్ (ఇండియా)- సౌతాఫ్రికాపై 21 సిక్సర్లు🏏మాథ్యూ హెడెన్ (ఆస్ట్రేలియా)- టీమిండియాపై 19 సిక్సర్లు🏏వివియన్ రిచర్డ్స్ (వెస్టిండీస్)- ఇంగ్లండ్పై 16 సిక్సర్లు🏏హ్యారీ బ్రూక్ (ఇంగ్లండ్)- న్యూజిలాండ్పై 16 సిక్సర్లు.భారత్ 177/3 @ లంచ్ బ్రేక్ఇక ఓవర్నైట్ స్కోరు 64/1తో శనివారం నాటి ఆట మొదలుపెట్టిన టీమిండియా.. భోజన విరామ సమయానికి 38 ఓవర్ల ఆటలో మూడు వికెట్ల నష్టానికి 177 పరుగులు సాధించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ అర్ధ శతకం (55) చేయగా.. వన్డౌన్ బ్యాటర్ కరుణ్ నాయర్ (26) మరోసారి స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. కెప్టెన్ శుబ్మన్ గిల్ 24, పంత్ 41 పరుగులతో క్రీజులో ఉన్నారు. నాలుగో రోజు లంచ్ బ్రేక్ సమయానికి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం (180) కలుపుకొని భారత జట్టుకు ఇంగ్లండ్పై 357 పరుగుల ఆధిక్యం లభించింది. కాగా తొలి టెస్టులో ఐదు వికెట్ల తేడాతో ఓడిన గిల్ సేన.. ఎడ్జ్బాస్టన్ టెస్టులో గెలిచి సిరీస్ 1-1తో సమం చేయాలని పట్టుదలగా ఉంది.పంత్ 65 పరుగులు చేసి...కాగా 51 బంతుల్లోనే 50 పరుగులు చేసిన పంత్.. 65 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు. షోయబ్ బషీర్ బౌలింగ్లో బెన్ డకెట్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు.చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకం.. ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడిన చిచ్చరపిడుగుIt’s Rishabh’s world and we’re just living in it! 😌#SonySportsNetwork #GroundTumharaJeetHamari #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/d1V9UBz17b— Sony Sports Network (@SonySportsNetwk) July 5, 2025 -
వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకం.. మరోసారి సునామీ ఇన్నింగ్స్
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) అద్భుత ఫామ్ కొనసాగుతోంది. ఇంగ్లండ్తో యూత్ వన్డేల్లో పద్నాలుగేళ్ల ఈ చిచ్చరపిడుగు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. హోవ్ వేదికగా ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో తొలి వన్డేలో ఈ ఓపెనింగ్ బ్యాటర్ దుమ్ములేపిన విషయం తెలిసిందే. కేవలం 19 బంతుల్లోనే మూడు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో.. 252కు పైగా స్ట్రైక్రేటుతో 48 పరుగులు సాధించాడు.వరుసగా నాలుగో మ్యాచ్లో..ఇక రెండో యూత్ వన్డేలో 34 బంతుల్లో 45 పరుగులతో ఫర్వాలేదనిపించిన వైభవ్.. మూడో మ్యాచ్లో మరోసారి తన విశ్వరూపం ప్రదర్శించాడు. నార్తాంప్టన్ వేదికగా ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ 31 బంతుల్లో ఆరు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు బాది 86 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.వైభవ్ వీరబాదుడుతాజాగా వోర్సెస్టర్ వేదికగా నాలుగో యూత్ వన్డేలో వైభవ్ సూర్యవంశీ మరోసారి బ్యాట్ ఝులిపించాడు. ఇంగ్లండ్ బౌలింగ్ను చితక్కొడుతూ కేవలం 24 బంతుల్లోనే అర్ధ శతకం బాదాడు. ఇందులో 46 పరుగులు బౌండరీల ద్వారానే రావడం విశేషం. దీనిని బట్టి వైభవ్ వీరబాదుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.ఫాస్టెస్ట్ సెంచరీఅంతటితో వైభవ్ పరుగుల దాహం తీరలేదు. అర్ధ శతకాన్ని సెంచరీగా మార్చేశాడు యువ సంచలనం. కేవలం 52 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుని.. తన వీరవిహారాన్ని కొనసాగిస్తున్నాడు. కాగా యూత్ వన్డేలలో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ అని తెలుస్తోంది.కాగా ఐదు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు భారత అండర్-19 క్రికెట్ జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా తొలి మూడు యూత్ వన్డేల్లో రెండు గెలిచిన ఆయుశ్ మాత్రే సేన.. శనివారం నాలుగో మ్యాచ్లోనూ దుమ్ములేపుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్.. సగం ఆట అంటే 25 ఓవర్లు పూర్తయ్యే సరికి వికెట్ నష్టానికి 216 పరుగులు సాధించింది. ఓపెనర్ ఆయుశ్ మాత్రే (5) మరోసారి నిరాశపరచగా.. వైభవ్ 74 బంతుల్లో 140, విహాన్ మల్హోత్రా 62 బంతుల్లో 47 పరుగులతో ఆడుతున్నారు.143 పరుగులు చేసి అవుట్..ఇక ఈ మ్యాచ్లో మొత్తంగా 78 బంతులు ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ.. 143 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో 13 ఫోర్లతో పాటు 10 సిక్సర్లు ఉన్నాయి. అయితే, బెన్ మాయెస్ బౌలింగ్లో జోసెఫ్ మూరేస్కు క్యాచ్ ఇవ్వడంతో వైభవ్ విధ్వంసకర శతక ఇన్నింగ్స్కు తెరపడింది. చదవండి: కోహ్లి, రోహిత్ కాదు!.. వైభవ్ సూర్యవంశీ రోల్మోడల్ ఆ సూపర్స్టారే! -
కేఎల్ రాహుల్ అర్ధ శతకం.. పంత్ ధనాధన్
ఇంగ్లండ్తో రెండో టెస్టులో టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) అర్ధ శతకంతో మెరిశాడు. సంప్రదాయ ఫార్మాట్లో తన 18వ ఫిఫ్టీ నమోదు చేశాడు. కాగా భారత్- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య ఎడ్జ్బాస్టన్ వేదికగా బుధవారం రెండో టెస్టు మొదలైన విషయం తెలిసిందే.ఈ క్రమంలో తొలి రెండు రోజుల్లో టీమిండియా ఏకఛత్రాధిపత్యం కొనసాగింది. తమ మొదటి ఇన్నింగ్స్లో 587 పరుగులకు ఆలౌట్ అయిన టీమిండియా.. రెండో రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ 77 పరుగుల వద్ద ఉండగా మూడు వికెట్లు కూల్చి సత్తా చాటింది.ఇంగ్లండ్ 407 పరుగులకు ఆలౌట్అయితే, శుక్రవారం నాటి మూడో రోజు ఆటలో మాత్రం ఇంగ్లండ్ కుదురుకుంది. హ్యారీ బ్రూక్ (158), జేమీ స్మిత్ (184 నాటౌట్) అద్భుత శతకాలతో రాణించి 303 పరుగుల భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. అయితే, ఆ తర్వాత మరోసారి భారత బౌలర్లు చెలరేగడంతో ఇంగ్లండ్ 407 పరుగులకు ఆలౌట్ అయింది.ఈ క్రమంలో 180 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా శుక్రవారం ఆట పూర్తయ్యేసరికి వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 28 పరుగుల వద్ద నిష్క్రమించగా.. కేఎల్ రాహుల్ 28, కరుణ్ నాయర్ 7 పరుగులతో క్రీజులో నిలిచారు.కేఎల్ రాహుల్ అర్ధ శతకంఈ నేపథ్యంలో 64/1 ఓవర్నైట్ స్కోరుతో శనివారం నాటి నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన భారత్.. కరుణ్ నాయర్ (26) రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. బైడన్ కార్స్ బౌలింగ్లో 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతడు వికెట్ కీపర్ జేమీ స్మిత్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.ఈ క్రమంలో కెప్టెన్ శుబ్మన్ గిల్తో కలిసి నిలకడగా ఆడిన కేఎల్ రాహుల్ 78 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే, కాసేపటికే జోష్ టంగ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. టంగ్ అద్భుత డెలివరీతో మిడిల్ స్టంప్ ఎగరగొట్టగా.. ఆశ్చర్యపోవడం రాహుల్ వంతైంది. కాగా మొత్తంగా 84 బంతులట్లో 55 పరుగులు చేసి రాహుల్ నిష్క్రమించగా.. రిషభ్ పంత్ గిల్కు జతయ్యాడు. ముప్పై ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. తద్వారా తొలి ఇన్నింగ్స్తో కలిపి 315కు పైగా ఆధిక్యంలో కొనసాగుతోంది.UPDATE: ఇక భోజన విరామ సమయానికి టీమిండియా 38 ఓవర్ల ఆటలో మూడు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. రిషభ్ పంత్ 35 బంతులలో 41, శుబ్మన్ గిల్ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా ప్రస్తుతం 357 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.చదవండి: IND vs ENG 2nd Test: నన్ను మూడో టెస్టులో ఆడిస్తారో?.. లేదో తెలియదు: టీమిండియా స్టార్ Must have taken an absolute peach to get KL out 😳Josh Tongue, you beauty 👌 #SonySportsNetwork #GroundTumharaJeetHamari #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/gE7laUME3c— Sony Sports Network (@SonySportsNetwk) July 5, 2025 -
టెస్టుల్లో ఆడతా.. నా రోల్ మోడల్ అతడే: వైభవ్ సూర్యవంశీ
భారత క్రికెట్ వర్గాల్లో ఇద్దరు ఆటగాళ్లు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నారు. ఒకరు టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) అయితే.. మరొకరు భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi). వీరిద్దరూ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నారు.గిల్ శతకాల మోతఇంగ్లండ్తో టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tenudulkar- Anderson Trophy)లో భాగంగా గిల్ కెప్టెన్గా తన తొలి టెస్టులోనే శతకం (147) బాదడంతో పాటు.. రెండో టెస్టులో భారీ డబుల్ సెంచరీ (269)తో చెలరేగాడు. తద్వారా ఎడ్జ్బాస్టన్ మైదానంలో ఇప్పటి వరకు ఏ భారత క్రికెటర్కూ సాధ్యం కాని ఘనత సాధించాడు.వైభవ్ తుఫాన్ ఇన్నింగ్స్ఈ వేదికపై అత్యధిక వ్యక్తిగత స్కోరు (269) సాధించిన భారత తొలి క్రికెటర్, కెప్టెన్గా గిల్ చరిత్ర సృష్టించాడు. మరోవైపు.. వైభవ్ సూర్యవంశీ అండర్-19 భారత జట్టు తరఫున అదరగొడుతున్నాడు. ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరుగుతున్న యూత్ వన్డే సిరీస్లో ఈ బిహారీ చిచ్చరపిడుగు దుమ్ములేపుతున్నాడు.ఆయుశ్ మాత్రే సారథ్యంలోని జట్టులో భాగమైన పద్నాలుగేళ్ల వైభవ్.. తొలి మూడు వన్డేల్లో వరుసగా 19 బంతుల్లో 48, 34 బంతుల్లో 45, 31 బంతుల్లోనే 81 పరుగులతో అదరగొట్టాడు. చివరగా మూడో యూత్ వన్డేలో సంచలన ఇన్నింగ్స్తో మెరిసిన వైభవ్.. ఆ తర్వాత వెంటనే తమ జట్టుతో కలిసి ఎడ్జ్బాస్టన్కు వెళ్లాడు.ఇంగ్లండ్తో తలపడుతున్న సీనియర్ జట్టు ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు యువ జట్టును బీసీసీఐ అక్కడకు పిలిపించింది. ఈ నేపథ్యంలో గిల్ అద్భుత, చిరస్మరణీయ ఇన్నింగ్స్ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం వైభవ్తో పాటు యువ ఆటగాళ్లందరికీ కలిగింది.టెస్టుల్లో ఆడతా.. నా రోల్ మోడల్ అతడేఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ ముగిసిన అనంతరం వైభవ్ సూర్యవంశీ మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లండ్లో నాకిదే తొలి టెస్టు. ఇక్కడ టెస్టు మ్యాచ్ చూడటం ఇదే తొలిసారి. మ్యాచ్ ఎలా సాగుతుందో ప్రత్యక్షంగా వీక్షించాను. నాకెంతో సంతోషంగా ఉంది. మ్యాచ్ చూసేందుకే మమ్మల్ని ప్రత్యేకంగా ఇక్కడకు తీసుకువచ్చారు.టీమిండియా ఆట చూసి మేమెంతగానో స్ఫూర్తి పొందాము. శుబ్మన్ గిల్ మా అందరికీ రోల్ మోడల్. దేశం తరఫున రెడ్ బాల్ క్రికెట్ ఆడాలని ప్రతి ఒక్క క్రికెటర్ కోరుకుంటాడు’’ అని పేర్కొన్నాడు. టెస్టుల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించడమే తన చిరకాల కోరిక అని చెప్పుకొచ్చాడు. కాగా అనేక మంది క్రికెటర్ల మాదిరి.. భారత దిగ్గజాలైన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల పేర్లు కాకుండా టీమిండియా యువ సారథి గిల్ను వైభవ్ తన రోల్మోడల్గా చెప్పడం విశేషం.యువ భారత్దే పైచేయికాగా ఇంగ్లండ్ యువ జట్టుతో ఐదు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు భారత అండర్-19 జట్టు అక్కడికి వెళ్లింది. ఇప్పటికి మూడు యూత్ వన్డేలు పూర్తి కాగా భారత్ రెండింట గెలిచి 2-1తో ఆధిక్యంలో ఉంది. వోర్సెస్టర్ వేదికగా శనివారం నాటి నాలుగో యూత్ వన్డేలో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు.. ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్లో తలపడుతున్న టీమిండియా తొలి టెస్టులో ఓడింది. ఎడ్జ్బాస్టన్ టెస్టులో గెలిచి సిరీస్ సమం చేయాలని పట్టుదలగా ఉంది.చదవండి: WCL: భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా యువరాజ్ సింగ్ -
నన్ను మూడో టెస్టులో ఆడిస్తారో?.. లేదో తెలియదు: టీమిండియా స్టార్
టీమిండియా- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య రెండో టెస్టు రసవత్తరంగా మారింది. మొదటి రెండు రోజులు భారత్ ఏకపక్షంగా పైచేయి సాధించగా.. మూడో రోజు మాత్రం ఇంగ్లండ్ అదరగొట్టింది. భారత బౌలర్ల ధాటికి ఒక దశలో 84 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన స్టోక్స్ బృందాన్ని జేమీ స్మిత్ (184 నాటౌట్), హ్యారీ బ్రూక్(158) అద్భుత ఇన్నింగ్స్తో ఆదుకున్నారు.ఇద్దరూ సెంచరీలతో చెలరేగి ఏకంగా 303 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. దీంతో టీమిండియా పట్టుతప్పినట్లే అనిపించింది. అయితే, పేసర్లు మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ (Akash Deep) తమ అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్ను దెబ్బకొట్టారు. సిరాజ్ ఏకంగా ఆరు వికెట్లతో మెరవగా.. ఆకాశ్ దీప్ నాలుగు వికెట్లు దక్కించుకున్నాడు.180 పరుగుల మేర ఆధిక్యంభారత పేసర్ల దెబ్బకు ఇంగ్లండ్ బజ్బాల్ ఇన్నింగ్స్ 407 పరుగుల వద్ద ముగిసిపోయింది. 89.3 ఓవర్లలో ఈ మేర స్కోరు చేసి ఇంగ్లండ్ ఆలౌట్ కాగా.. భారత్కు తొలి ఇన్నింగ్స్లో 180 పరుగుల మేర ఆధిక్యం లభించింది. ఇక మ్యాచ్లో బెన్ డకెట్ (0), ఓలీ పోప్ (0), హ్యారీ బ్రూక్ (158) రూపంలో మూడు కీలక వికెట్లు కూల్చిన ఆకాశ్ దీప్.. క్రిస్ వోక్స్(5) వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ నేపథ్యంలో శుక్రవారం నాటి మూడో రోజు ఆట ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆకాశ్ దీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తదుపరి మ్యాచ్లో ఆడతానో లేదో తెలియదని.. రెండో టెస్టులో మిగిలిన రెండు రోజుల్లో తానేంటో మరోసారి నిరూపించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపాడు.మూడో టెస్టులో ఆడిస్తారో?.. లేదో తెలియదు‘‘ఈ టెస్టు మ్యాచ్లో మాకు ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రతి మ్యాచ్లోనూ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతాం. మూడో టెస్టు గురించి నేను ఇప్పుడే ఆలోచించడం లేదు. ఈ రెండు రోజుల్లో నా శాయశక్తులా జట్టు విజయం కోసం పనిచేయడమే ముఖ్యం.ఆ తర్వాతే మరో మ్యాచ్లో ఆడిస్తారా? లేదా? అన్న విషయం గురించి ఆలోచిస్తాను. ఈ విషయంలో మేనేజ్మెంట్దే తుది నిర్ణయం. లార్డ్స్ టెస్టు ఆడతారా? అంటే నాకైతే కచ్చితంగా తెలియదు. నేను ఆడొచ్చు.. ఆడకపోవచ్చు. మ్యాచ్కు ఒకరోజు ముందే మాకు ఆ విషయం తెలుస్తుంది’’ అని ఆకాశ్ దీప్ మీడియా ప్రశ్నలకు బదులిచ్చాడు.బుమ్రా స్థానంలోకాగా ఐదు టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్ వెళ్లిన టీమిండియా తొలి మ్యాచ్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. లీడ్స్లో జరిగిన ఈ మ్యాచ్లో గిల్ సేన ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలు కాగా.. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో బుధవారం రెండో టెస్టు మొదలైంది.ఇక లీడ్స్లో తొలి టెస్టు ఆడిన భారత ప్రధాన జస్ప్రీత్ బుమ్రాకు.. రెండో టెస్టు నుంచి విశ్రాంతినిచ్చారు. ఈ క్రమంలో అతడి స్థానంలో ఆకాశ్ దీప్ జట్టులోకి వచ్చాడు. అయితే, బుమ్రాను తదుపరి లార్డ్స్ టెస్టులో ఆడించేందుకే ఇప్పుడు రెస్ట్ ఇచ్చామని కెప్టెన్ గిల్ చెప్పాడు. దీనిని బట్టి ఆకాశ్ దీప్నకు మూడో టెస్టులో చోటు దక్కదా? అన్న ప్రశ్నకు ఈ పేసర్ ఇలా బదులిచ్చాడు.ఇదిలా ఉంటే.. శుక్రవారం నాటి మూడో రోజు పూర్తయ్యేసరికి టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (28) పెవిలియన్ చేరగా.. కేఎల్ రాహుల 28, కరుణ్ నాయర్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్పై భారత్ మూడో రోజు ఆట ముగిసే సరికి 244 పరుగుల ఆధిక్యంలో ఉంది.చదవండి: 'అతడిని ఆడించకపోవడం తెలివితక్కువ నిర్ణయం'.. గంభీర్పై ఇంజనీర్ ఫైర్ -
సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్న సురేశ్ రైనా.. ప్రకటన విడుదల
టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా (Suresh Raina) కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్నాడు. సినిమా నటుడిగా అవతారం ఎత్తేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని రైనా స్వయంగా వెల్లడించాడు. తాను కోలీవుడ్లో నటించనున్నట్లు తెలిపాడు.ఇందుకు సంబంధించి తమిళ సినిమా నిర్మాణ సంస్థ నుంచి శనివారం అధికారిక ప్రకటన వెలువడింది. డ్రీమ్ నైట్ స్టోరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీలో రైనాకు స్వాగతం పలుకుతున్న వీడియోను క్రికెటర్ శివం దూబే చేతుల మీదుగా విడుదల చేశారు.క్రికెట్ మైదానం నుంచి.. కోలీవుడ్ ఫ్రేమ్స్ దాకా..ఈ నేపథ్యంలో సురేశ్ రైనా స్పందిస్తూ.. ‘‘క్రికెట్ మైదానం నుంచి.. కోలీవుడ్ ఫ్రేమ్స్ దాకా.. చెన్నై నాలో నిండి నన్ను ముందుకు నడిపిస్తోంది. నా ఈ కొత్త ప్రయాణంలో డీకేఎస్ సంస్థతో జట్టుకట్టడం ఎంతో గర్వంగా ఉంది’’ అని ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు. కాగా ఉత్తరప్రదేశ్కు చెందిన సురేశ్ రైనా.. 2005 నుంచి 2018 వరకు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.అంతర్జాతీయ స్థాయిలో 226 వన్డేలు, 78 టీ20లు, 18 టెస్టులు ఆడిన రైనా.. ఆయా ఫార్మాట్లలో 5615, 1604, 768 పరుగులు సాధించాడు. ఇక ఈ లెఫ్టాండర్ బ్యాటర్కు ఐపీఎల్లో ఘనమైన రికార్డు ఉంది. క్యాష్ రిచ్ లీగ్లో మొత్తంగా 205 మ్యాచ్లు ఆడిన రైనా.. 5528 పరుగులు సాధించి మిస్టర్ ఐపీఎల్గా గుర్తింపు పొందాడు.చిన్న తలాగా అభిమానుల హృదయాల్లో చోటుఇక ఐపీఎల్ కెరీర్లో చాలా ఏళ్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించిన సురేశ్ రైనా.. చిన్న తలాగా గుర్తింపు పొందాడు. మహేంద్ర సింగ్ ధోని తర్వాత అంతటి స్థాయిలో చెన్నై అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పుడు అక్కడి నుంచే తన సినీ ప్రయాణం కూడా మొదలుపెట్టనున్నాడు.సంతోషంగా ఉందితాను తమిళ సినిమా ద్వారా అరంగేట్రం చేయడం గురించి సురేశ్ రైనా మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు నా దగ్గరకు వచ్చి కథ చెప్పినపుడు అది నా మనసుకు ఎంతో దగ్గరగా అనిపించింది. క్రికెట్కు సంబంధించిన ఈ సినిమాలో నటించడం గర్వకారణం.అది కూడా ఎన్నో ఏళ్లుగా సీఎస్కేకు ఆడి.. తమిళనాడు నుంచి నా సినిమా ప్రయాణం మొదలుపెట్టడం మరింత సంతోషంగా ఉంది. ఇక్కడి ప్రజలు మాపై ఎంతో ప్రేమను కురిపించారు’’ అని పేర్కొన్నాడు. కాగా సురేశ్ రైనా నటిస్తున్న తమిళ చిత్రానికి లోగాన్ దర్శకుడు కాగా.. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా మరో మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా కోలీవుడ్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అదే విధంగా.. కేరళకు చెందిన మాజీ పేసర్ శ్రీశాంత్ కూడా తమిళ సినీ రంగంలో నటుడిగా అడుగుపెట్టాడు. నయనతార, సమంతలతో కలిసి విజయ్ సేతుపతి నటించిన కాతువాకుల రెండు కాదల్ సినిమాలో శ్రీశాంత్ మోబీ అనే పాత్రలో నటించాడు.చదవండి: వేలంలో రికార్డులు బద్దలు.. అత్యంత ఖరీదైన ఆటగాడిగా సంజూ శాంసన్ -
సూపర్ కింగ్స్కు హార్ట్ బ్రేకింగ్.. ఒక్క పరుగు తేడాతో ఓటమి
మేజర్ లీగ్ క్రికెట్-2025లో శనివారం శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, టెక్సాస్ సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఆఖరి వరకు ఉత్కంఠిభరితంగా సాగిన ఈ పోరులో సూపర్ కింగ్స్పై ఒక్క పరుగు తేడాతో శాన్ ఫ్రాన్సిస్కో విజయం సాధించింది.తొలుత బ్యాటింగ్ చేసిన శాన్ ఫ్రాన్సిస్కో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. యూనికార్న్స్ బ్యాటర్లలో కెప్టెన్ మాథ్యూ షార్ట్ (80: 63 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లు) అద్బుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు. అతడితో పాటు హసన్ ఖాన్ (40: 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 69 పరుగులు జోడించారు. మిగితా బ్యాటర్లు ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. టెక్సాస్ బౌలర్లలో స్టోయినిష్ మూడు, మోసిన్, అకీల్, బర్గర్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీశారు.ఫెర్రీరా పోరాటం వృథా..అనంతరం లక్ష్య ఛేదనలో టెక్సాస్ సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 147 పరుగులకే పరిమితమైంది. ఆఖరి ఓవర్లో సూపర్ కింగ్స్ విజయానికి 13 పరుగులు అవసరమయ్యాయి. ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను ఆసీస్ స్పీడ్ స్టార్ బార్ట్లెట్కు షార్ట్ అప్పగించాడు. బార్ట్లెట్ ఆ ఓవర్లో 11 పరుగులే ఇచ్చి తన జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించాడు.చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన క్రమంలో కాల్విన్ (2) రనౌట్ కావడంతో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. సూపర్ కింగ్స్ బ్యాటర్లలో డొనొవన్ ఫెర్రీరా( 39: 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు.అతడితో పాటు , సాయితేజ ముక్కామల (34), శుభమ్ రంజనె (28) తమవంతు ప్రయత్నం చేశారు. . శాన్ ఫ్రాన్సిస్కో బౌలర్లలో బ్రాడీ కౌచ్ , రొమారియో షెఫర్డ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా..హసన్ ఖాన్, కరీమా గోరె చెరో వికెట్ తీశారు. ఇప్పటికే ఇరు జట్లు తమ ప్లే ఆఫ్ బెర్త్లను ఖారారు చేసుకున్నాయి.చదవండి: వేలంలో రికార్డులు బద్దలు.. అత్యంత ఖరీదైన ఆటగాడిగా సంజూ శాంసన్ -
'అతడిని ఆడించకపోవడం తెలివితక్కువ నిర్ణయం'.. గంభీర్పై ఇంజనీర్ ఫైర్
ఎడ్జ్బాస్టన్లో ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలి ఇన్నింగ్స్లో 587 పరుగుల భారీ స్కోర్ చేసిన భారత్.. బౌలింగ్లో కూడా పర్వాలేదన్పించింది. ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్లో 407 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్కు 180 పరుగుల ఆధిక్యం లభించింది.ఓవరాల్గా గిల్ సేన ప్రస్తుతం 244 పరుగుల లీడ్లో కొనసాగుతోంది. అయితే ఎడ్జ్బాస్టన్లో భారత్ పట్టుబిగించినప్పటికి, ఈ మ్యాచ్లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఆడించకపోవడం తీవ్రవిమర్శలకు దారితీసింది. చాలా మంది మాజీలు ఇండియన్ టీమ్ మెనెజ్మెంట్ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు గుప్పించారు. తాజాగా ఈ జాబితాలో భారత మాజీ వికెట్ కీపర్ ఫరూఖ్ ఇంజనీర్ చేరాడు. కుల్దీప్ను ఆడించకపోవడం తెలివతక్కువ నిర్ణయమని అతడు మండిపడ్డాడు.గత మూడేళ్ల నుంచి భారత జట్టులో అత్యంతవిజయవంతమైన స్పిన్నర్గా కుల్దీప్ కొనసాగుతున్నాడు. అయితే ఎడ్జ్బాస్టన్ టెస్టులో కుల్దీప్కు చోటు దక్కుతుందని అంతా భావించారు. కానీ ఆఖరి నిమిషంలో గంభీర్ అండ్ కో కుల్దీప్కు బదులుగా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ను జట్టులోకి తీసుకున్నారు. సుందర్ బ్యాటింగ్ పరంగా పర్వాలేదన్పించినా బౌలింగ్లో మాత్రం విఫలమయ్యాడు.ఈ క్రమంలో ఫరూఖ్ ఇంజనీర్ మాట్లాడుతూ.. "కుల్దీప్ యాదవ్ మొదటి టెస్టు నుంచి ఆడాల్సింది. అతడొక మ్యాచ్ విన్నర్. ఫ్లాట్ వికెట్పై కూడా బంతిని తిప్పే సత్తా అతడికి ఉంది. కానీ అతడి పట్ల భారత జట్టు మెనెజ్మెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అతన్ని ఆడించకపోవడం తెలివితక్కువ నిర్ణయం. కనీసం రెండు టెస్టులోనైనా అతడి ఆడి ఉంటే కచ్చితంగా ప్రభావం చూపేవాడు. మూడో టెస్టుకైనా అతడిని ఎంపిక చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఆటగాళ్ల ఎంపిక పట్ల భారత్ అనుసరిస్తున్న విధానం సరైనది కాదు. అంతేకాకుండా బుమ్రా ఐదు మ్యాచ్ల సిరీస్లో మూడు టెస్టులు మాత్రమే ఆడాలని ముందే నిర్ణయించుకోవడం సరైనది కాదు. ఎందుకంటే ప్రతీ మ్యాచ్కు ముందు దాదాపు వారం రోజుల పాటు విశ్రాంతి లభిస్తోంది. ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లకపోతే టెస్టు సిరీస్ను మీరు గెలవలేరు" అని పేర్కొన్నారు. -
భారత బౌలర్ అత్యంత చెత్త రికార్డు.. 148 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలోనే?
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ద్ కృష్ణ దారుణ ప్రదర్శన కనబరిచాడు. తొలి టెస్టు కాస్త పర్వాలేదన్పించిన ఈ కర్ణాటక పేసర్.. రెండో టెస్టులో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ప్లాట్ పిచ్పై ఎలా బౌలింగ్ చేయాలో తెలియక భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. పదే పదే షార్ట్ బంతుల్ని సంధించి భారీ మూల్యం చెల్లించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో 13 ఓవర్లు వేసిన ప్రసిద్ద్.. 5.50 ఏకానమితో 72 పరుగులు సమర్పించుకున్నాడు. ముఖ్యంగా ప్రసిద్ద్ను ఇంగ్లండ్ యువ ఆటగాడు జేమీ స్మిత్ ఉతికారేశాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 32వ ఓవర్ వేసిన ప్రసిద్ద్ బౌలింగ్లో స్మిత్ ఏకంగా 23 పరుగులు రాబట్టాడు. స్మిత్ వరుసగా 4, 6, 4, 4, 4 బాదగా.. వైడ్ రూపంలో మరో పరుగు వచ్చింది. ఈ క్రమంలో ప్రసిద్ద్ అత్యంత చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో 500 లేదా అంతకంటే ఎక్కువ బంతులు వేసిన బౌలర్లలో అత్యధిక ఎకానమీ రేట్ నమోదు చేసిన బౌలర్గా ప్రసిద్ద్ నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్(4.77) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో ఆరోన్ రికార్డును కృష్ణ బ్రేక్ చేశాడు.అదేవిధంగా 2000 సంవత్సరం తర్వాత టెస్టు క్రికెట్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన నాలుగో భారత బౌలర్గా ఈ కర్ణాటక పేసర్ నిలిచాడు. ఈ మ్యాచ్లో ప్రసిద్ద్ ఒకే ఓవర్లో 23 రన్స్ ఇచ్చాడు. ఈ జాబితాలో ప్రసిద్ద్ కంటే ముందు హర్భజన్ సింగ్(27), మునాఫ్ పటేల్(25), కర్ణ్ శర్మ (24) ఉన్నారు.ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 407 పరుగులకు ఆలౌటైంది. జెమీ స్మిత్(207 బంతుల్లో 21 ఫోర్లు, 4 సిక్స్లతో 184 నాటౌట్), హ్యారీ బ్రూక్(234 బంతుల్లో 17 ఫోర్లు, సిక్స్తో 158) భారీ సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరూ 6వ వికెట్కు 303 పరుగులు జోడించారు.భారత బౌలర్లలో సిరాజ్తో పాటు ఆకాష్ దీప్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో భారత్కు 180 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 13 ఓవర్లలో వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది.చదవండి: వేలంలో రికార్డులు బద్దలు.. అత్యంత ఖరీదైన ఆటగాడిగా సంజూ శాంసన్ -
వేలంలో రికార్డులు బద్దలు.. అత్యంత ఖరీదైన ఆటగాడిగా సంజూ శాంసన్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్(Sanju Samson) తొలిసారి కేరళ క్రికెట్ లీగ్ (KCL)లో ఆడనున్నాడు. శనివారం తిరువనంతపురంలో జరిగిన కేసీఎల్ సీజన్-2 ఆటగాళ్ల వేలంలో శాంసన్ను కొచ్చి బ్లూ టైగర్స్ రూ. 26.80 లక్షల భారీ ధరకు కొనుగోలు చేసింది.తద్వారా కేరళ క్రికెట్ లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా సంజూ నిలిచాడు. అతడి కోసం కొచ్చి ఫ్రాంచైజీ తమ పర్స్లో ఉన్న సగానికిపైగా మొత్తాన్ని వెచ్చింది. తొలుత శాంసన్ బిడ్డింగ్ పోరు రూ.5 లక్షలతో ప్రారంభమైంది. త్రిస్సూర్ టైటాన్స్ ఒక్కసారిగా రూ.20 లక్షలకు బిడ్ను పెంచింది.అయితే ఆఖరికి కొచ్చి 26.80 లక్షలు వెచ్చించి అతడిని కైవసం చేసుకుంది. వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలకు కేసీఎల్ మెనెజ్మెంట్ రూ. 50 లక్షలు కేటాయించింది. ఇప్పుడు సంజూ శాంసన్పైనే 26.80 లక్షలు వెచ్చించడంతో కొచ్చి వద్ద రూ. 23.2 లక్షలే మిగిలియాయి. దీంతో వేలంలో మిగితా స్టార్ ప్లేయర్లను సొంతం చేసుకోవడం కొచ్చి కష్టం కావచ్చు.ఈ వేలం ముందువరకు కెసీఎల్లో అత్యధిక ధర కలిగిన రికార్డు ఎం. సజీవన్ పేరిట ఉండేది. తొలి ఎడిషన్లో సజీవన్ను త్రివేండ్రం రాయల్స్ రూ.7.4 లక్షలకు సొంతం చేసుకుంది. ఇప్పుడు సంజూ ఆ రికార్డును బద్దలు కొట్టాడు.ఈ ఏడాది వేలంలో సంజూ కంటే ముందు బాసిల్ తంపిని రూ.8.4 లక్షలకు తివేండ్రం రాయల్స్ సొంతం చేసుకుంది. సంజూ ప్రస్తుతం భారత టీ20 జట్టులో రెగ్యూలర్ సభ్యునిగా కొనసాగుతున్నాడు. అయితే ఈ మధ్యలో టీ20 సిరీస్లు లేకపోవడంతో కెసీఎల్ టోర్నీ మొత్తానికి అందుబాటులో ఉండనున్నాడు. కెసీఎల్ సీజన్-2 ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 6 వరకు జరగనుంది.చదవండి: IND vs ENG: రివ్యూ తీసుకున్న జైశ్వాల్.. అంపైర్పై కోపంతో ఊగిపోయిన స్టోక్స్! వీడియో -
వారెవ్వా కమ్మిన్స్.. క్రికెట్ చరిత్రలోనే అద్బుతమైన క్యాచ్! వీడియో
గ్రెనడా వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ సంచలన క్యాచ్తో మెరిశాడు. విండీస్ ఆటగాడు కీస్ కార్టీని సింగిల్ హ్యాండ్ క్యాచ్తో కమ్మిన్స్ పెవిలియన్కు పంపాడు. విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్ 9 వ ఓవర్ వేసిన కమ్మిన్స్.. రెండో బంతిని కార్టీగా గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు.ఆ బంతిని కార్టీ ఆఫ్సైడ్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్తీసుకుని లెగ్సైడ్ షార్ట్ స్క్వేర్ మిడ్ వికెట్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో ఫాలో త్రూలో కమ్మిన్స్ తన కుడివైపనకు పరిగెత్తుకుంటూ వెళ్లి సింగిల్ హ్యాండ్ క్యాచ్ను అందుకున్నాడు.ఇది చూసిన విండీస్ బ్యాటర్ బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ క్యాచ్లలో ఒకటిగా నిలిచిపోతుందని కొనియాడుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ సెకెండ్ ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 12 పరుగులు చేసింది.కంగారులు ప్రస్తుతం 45 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అంతకుముందు విండీస్ తమ మొదటి ఇన్నింగ్స్లో 253 పరుగులకు ఆలౌటైంది. వెస్టిండీస్ బ్యాటర్లలో కింగ్(75), జాన్ క్యాంప్బెల్(40) పరుగులతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో లియోన్ మూడు, హాజిల్వుడ్, కమ్మిన్స్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్లో 286 పరుగులు చేసింది.CUMMINS, YOU BEAUTY 🤯 Pat Cummins pulls off a diving, one-handed caught & bowled screamer to dismiss Keacy Carty 🔥#AUSvWI pic.twitter.com/0JxwJaz16t— FanCode (@FanCode) July 4, 2025 -
రివ్యూ తీసుకున్న జైశ్వాల్.. అంపైర్పై కోపంతో ఊగిపోయిన స్టోక్స్!
ఎడ్జ్బాస్టన్ వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తన సహనాన్ని కోల్పోయాడు. ఫీల్డ్ అంపైర్తో స్టోక్స్ తీవ్ర వాగ్వాదానికి దిగాడు. అసలేమి ఏమి జరిగిందంటే.. టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో పేసర్ జోష్ టంగ్ వేసిన బంతి జైస్వాల్ ప్యాడ్ను తాకింది.దీంతో ఇంగ్లండ్ ఆటగాళ్లతో పాటు బౌలర్ కూడా ఎల్బీ కోసం అప్పీల్ చేశాడు. వెంటనే అంపైర్ షర్ఫుద్దౌలా ఔట్ అంటూ వేలు పైకెత్తాడు. ఈ క్రమంలో జైశ్వాల్ డీఆర్ఎస్ తీసుకోవాలా? వద్దా అని? నాన్స్ట్రైకర్లో ఎండ్లో ఉన్న కేఎల్ రాహుల్తో చర్చించాడు. కొద్దిసేపు మాట్లాడకున్నాక జైశ్వాల్ చివరకు రివ్యూ కోసం వెళ్లాడు.అయితే జైస్వాల్ రివ్యూ అడగడానికి ముందే 15 సెకన్ల టైమర్ ముగిసినట్లు బిగ్ స్క్రీన్పై కన్పించింది. అయినప్పటికి అంపైర్ మాత్రం రివ్యూకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. దీంతో స్టోక్స్ అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగాడు.మైదానంలో ఉన్న ఇంగ్లండ్ అభిమానులు సైతం అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఆ సమయంలో స్టాండ్స్ నుంచి బిగ్గరగా అరుపులు వినిపించాయి. అయితే రిప్లేలో మాత్రం బంతి స్టంప్స్ను హిట్చేస్తున్నట్లు తేలడంతో జైశ్వాల్(28) మైదానాన్ని వీడక తప్పలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.చదవండి: IND vs ENG: ఉత్కంఠ పోరు.. ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమిpic.twitter.com/fJTJeyRZ4n— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) July 4, 2025Josh Tongue gets Jaiswal trapped in front! ☝️🇮🇳 5️⃣1️⃣-1️⃣ pic.twitter.com/raWBqQXjv4— England Cricket (@englandcricket) July 4, 2025 -
ఉత్కంఠ పోరు.. ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి
లండన్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేలో 5 పరుగుల తేడాతో భారత మహిళల జట్టు ఓటమిపాలైంది. ఆఖరివరకు నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో భారత్పై ఇంగ్లండ్ పై చేయి సాధించింది. చివరి ఓవర్లో టీమిండియా విజయానికి 12 పరుగులు అవసరమయ్యాయి.క్రీజులో హర్మన్ ప్రీత్ కౌర్ ఉండడంతో మన అమ్మాయిలు విజయం సాధిస్తారని అంతా భావించారు. కానీ ఆ ఓవర్ వేసిన ఇంగ్లండ్ పేసర్ లారెన్ బెల్ అద్బుతంగా బౌలింగ్ చేసి తొలి ఐదు బంతుల్లో 6 పరుగులే మాత్రమే ఇచ్చింది. చివరి బంతికి ఆరు పరుగులు అవసరం కాగా.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ క్యాచ్ ఔటైంది. దీంతో 172 పరుగుల లక్ష్య చేధనలో భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 166 పరుగులే చేయగల్గింది. భారత బ్యాటర్లలో ఓపెనర్లు స్మృతి మంధాన (56: 49 బంతుల్లో 10 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేయగా, షఫాలీ వర్మ (47: 25 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లు) చెలరేగింది. అయితే మంధాన ఎక్కువ బంతులు ఆడేయడంతో మిడిలార్డర్పై ఒత్తిడిపెరిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ ఫైలర్ రెండు, ఎకిలిస్టోన్, వాంగ్ తలా వికెట్ సాధించారు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఓపెనర్లు సోఫియా డంక్లీ (75: 53 బంతుల్లో 7 ఫోర్లు ఒక సిక్స్), వ్యాట్ హాడ్జ్ (66: 42 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లు) చెలరేగారు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.భారత బౌలర్లలో అరుంధతీ రెడ్డి 3, దీప్తి శర్మ 3, శ్రీ చరణి 2, రాధా యాదవ్ ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో ఇంగ్లండ్ సిరీస్ ఆశలను సజీవగా ఉంచుకుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-2తో భారత్ ఆధిక్యంలో కొనసాగుతోంది. మిగిలిన రెండు మ్యాచ్లో ఒక్కదాంట్లో గెలిస్తే చాలు సిరీస్ భారత్ సొంతమవుతోంది. ఇక ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 మాంచెస్టర్ వేదికగా జరగనుంది.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన యశస్వి జైశ్వాల్.. తొలి భారత ప్లేయర్గా -
ఈ రోజు కోసమే ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నా: మహ్మద్ సిరాజ్
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగాడు. తన సంచలన బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా లేని లోటును సిరాజ్ తీర్చాడు. తొలి ఇన్నింగ్స్లో సిరాజ్ మియా ఆరు వికెట్లతో సత్తాచాటాడు.రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీని ఔట్ చేసిన సిరాజ్.. ఆ తర్వాత మూడో రోజు బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్ వంటి కీలక వికెట్లను పడగొట్టాడు. ఇంగ్లీష్ జట్టు టెయిలాండర్లను ఈ హైదారబాదీ వరుస క్రమంలో పెవిలియన్కు పంపాడు.ఒక ఇన్నింగ్స్లో సిరాజ్ ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం ఇది నాలుగో సారి కావడం గమనార్హం. తన ప్రదర్శనపై మూడో రోజు ఆట అనంతరం సిరాజ్ స్పందించాడు. ఇది తనకు ఎంతో ప్రత్యేకమని అతడు చెప్పుకొచ్చాడు."ఇంగ్లండ్ గడ్డపై ఐదు వికెట్ల ప్రదర్శన కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నా. అందుకే నమ్మశక్యంగా అనిపించడం లేదు. నిజానికి నేను చాలా బాగా బౌలింగ్ చేస్తున్నా వికెట్లు మాత్రం రావడం లేదు. ఇప్పటి వరకు నాలుగు వికెట్లకు మించి తీయలేదు.ఇప్పుడు ఆరు వికెట్లు సాధించడం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది. పిచ్ నెమ్మదిగా ఉన్నా క్రమశిక్షణతో సరైన చోట బంతులు వేస్తే ఫలితం రాబట్టవచ్చని నమ్మాను. కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ పరుగులు నిరోధించే ప్రయత్నం చేశాను. మిగతా ఇద్దరితో పోలిస్తే నాకే అనుభవం ఎక్కువ కాబట్టి ఆ సవాల్ను స్వీకరించి బాధ్యతగా బౌలింగ్ చేశాను. బుమ్రా లేకపోవడంతో పేస్ బౌలింగ్ ఎటాక్ను లీడ్ చేశాను" అని విలేకరుల సమావేశంలో సిరాజ్ పేర్కొన్నాడు.ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 407 పరుగులకు ఆలౌటైంది. జెమీ స్మిత్(207 బంతుల్లో 21 ఫోర్లు, 4 సిక్స్లతో 184 నాటౌట్), హ్యారీ బ్రూక్(234 బంతుల్లో 17 ఫోర్లు, సిక్స్తో 158) భారీ సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరూ 6వ వికెట్కు 303 పరుగులు జోడించారు.భారత బౌలర్లలో సిరాజ్తో పాటు ఆకాష్ దీప్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో భారత్కు 180 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 13 ఓవర్లలో వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన యశస్వి జైశ్వాల్.. తొలి భారత ప్లేయర్గా -
చరిత్ర సృష్టించిన యశస్వి జైశ్వాల్.. తొలి భారత ప్లేయర్గా
బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైశ్వాల్(Yashasvi Jaiswal) అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్లో 87 పరుగులు చేసిన జైశ్వాల్.. రెండో ఇన్నింగ్స్లో కేవలం 22 బంతుల్లో 28 పరుగులు సాధించాడు.కేఎల్ రాహుల్తో కలిసి 50 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని ఈ ముంబైకర్ నెలకొల్పాడు. ఈ క్రమంలో జైశ్వాల్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్లో 2000 పరుగులు మైలు రాయిని అత్యంతవేగంగా అందుకున్న భారత ప్లేయర్గా జైశ్వాల్ నిలిచాడు. సెకెండ్ ఇన్నింగ్స్లో 10 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఫీట్ సాధించాడు. భారత ఓపెనర్ కేవలం 21 మ్యాచ్ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు.గవాస్కర్ రికార్డు బద్దలు..ఇంతకముందు ఈ రికార్డు టీమిండియా లెజెండ్ సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) పేరిట ఉండేది. గవాస్కర్ 23 మ్యాచ్లలో ఈ మైల్స్టోన్ను సాధించాడు. గవాస్కర్ ఈ రికార్డును 1976లో సాధించాడు. తాజా మ్యాచ్తో 49 ఏళ్ల గవాస్కర్ ఆల్టైమ్ రికార్డును జైశూ బ్రేక్ చేశాడు. అయితే ఇన్నింగ్స్ల పరంగా మాత్రం ఈ ఫీట్ సాధించిన జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ సరసన జైశ్వాల్ నిలిచాడు. సెహ్వాగ్, ద్రవిడ్ ఈ ఘనతను 40 ఇన్నింగ్స్లలో సాధించగా.. జైస్వాల్ వారిని సమం చేశాడు. అయితే వారిద్దరికి ఈ ఫీట్ను అందుకోవడానికి 25 మ్యాచ్లు అవసరమయ్యాయి. ఓవరాల్గా ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో ఆసీస్ దిగ్గజం డాన్ బ్రాడ్మాన్(15 మ్యాచ్లు) అగ్రస్ధానంలో ఉండగా.. జార్జ్ హెడ్లీ (17), హెర్బర్ట్ సట్క్లిఫ్ (22),మైఖేల్ హస్సీ (20), మార్నస్ లబుషేన్(20) ఉన్నారు.ఆరేసిన సిరాజ్..ఇక ఈ ఎడ్జ్బాస్టన్ టెస్టులో భారత్ పట్టు బిగించింది. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 407 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమిండియాకు 180 పరుగుల ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 6 వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు ఆకాష్ దీప్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.ఇంగ్లండ్ బ్యాటర్లలో జేమీ స్మిత్ (184 నాటౌట్; 207 బంతుల్లో 21×4, 4×6), హ్యారీ బ్రూక్ (158; 234 బంతుల్లో 17×4, 1×6) అద్బుతమైన సెంచరీలతో మెరిశారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 64/1తో నిలిచింది. రాహుల్ (28), కరుణ్ నాయర్ (7) క్రీజులో ఉన్నారు.చదవండి: బ్రాత్వైట్ వరల్డ్ రికార్డు.. ఇక ముందు కూడా ఎవరికీ సాధ్యం కాదు! -
నవ శకానికి నాంది
బెంగళూరు: భారత్లో తొలిసారి జరుగుతున్న అంతర్జాతీయ జావెలిన్ ఈవెంట్కు రంగం సిద్ధమైంది. శనివారం బెంగళూరు వేదికగా ప్రతిష్ఠాత్మక ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ ఈవెంట్ జరగనుంది. భారత స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన నీరజ్ చోప్రా పేరిట నిర్వహిస్తున్న ఈ టోర్నీలో 12 మంది జావెలిన్ త్రోయర్లు పాల్గొంటున్నారు. తన పేరిట జరుగుతున్న ఈ టోర్నీలో నీరజ్ ఫేవరెట్గా బరిలోకి దిగుతున్నాడు. ఇటీవల పారిస్ డైమండ్ లీగ్, ఓస్ట్రావా గోల్డెన్ స్పైక్ టోర్నీల్లో టైటిల్స్ నెగ్గిన 27 ఏళ్ల నీరజ్ చోప్రా... హ్యాట్రిక్ టైటిల్పై గురిపెట్టాడు. 2020 టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం, 2024 పారిస్ ఒలింపిక్స్లో రజతంతో పాటు... ప్రపంచ చాంపియన్షిప్ స్వర్ణాలు, డైమండ్ లీగ్ టైటిల్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు ఇలా అంతర్జాతీయ స్థాయిలో దాదాపు అన్నీ టోర్నీల్లో నీరజ్ సత్తా చాటాడు. ఇప్పుడు స్వదేశంలో నిర్వహిస్తున్న ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ ఈవెంట్లో కూడా అదే పరంపర కొనసాగించాలని భావిస్తున్నాడు. దేశంలో అథ్లెటిక్స్కు మరింత ఊతం ఇచ్చేందుకు ఈ టోర్నీ దోహదపడుతుందన్న నీరజ్... యువ అథ్లెట్లు దీని నుంచి స్ఫూర్తి పొందితే సంతోíÙస్తానని వెల్లడించాడు. ఈ ఏడాది తొలిసారి 90 మీటర్ల మార్క్ అందుకున్న నీరజ్... అదే ప్రదర్శన పునరావృతం చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. మే నెలలో దోహా వేదికగా జరిగిన పోటీల్లో నీరజ్ తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసుకొని ఫుల్ జోష్లో ఉన్నాడు. భారత్లో నీరజ్ ఓ టోర్నీలో పాల్గొననుండటం ఏడాది విరామం తర్వాత ఇదే మొదటి సారి. భారత్లో ఇదే తొలిసారి.. భారత అథ్లెటిక్స్ సమాఖ్య, ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య, జేఎస్డబ్ల్యూ స్పోర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో నీరజ్ చోప్రా పర్యవేక్షణలో ఈ ఈవెంట్ జరుగుతోంది. ప్రస్తుతానికి ఈ ఈవెంట్లో జావెలిన్ త్రో పోటీలు మాత్రమే జరుగుతుండగా... భవిష్యత్తులో దీన్ని మరింత విస్తృతం చేయాలని నీరజ్ భావిస్తున్నాడు. ప్రతి ఏటా దీన్ని నిర్వహించడంతో పాటు మరిన్ని క్రీడాంశాలను జతచేసే ఆలోచన ఉన్నట్లు వెల్లడించాడు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం మే 24న హర్యానాలోని పంచకులలో ఈ ఈవెంట్ నిర్వహించాలని నిర్ణయించగా... అంతర్జాతీయ ప్రసారదారుల విజ్ఞప్తి మేరకు దీన్ని బెంగళూరుకు మార్చారు. అనంతరం సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఈవెంట్ తేదీ సైతం మారింది. ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య దీనికి ‘ఎ’ కేటగిరీ గుర్తింపునివ్వగా... భారత్లో జరుగుతున్న తొలి అంతర్జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీ ఇదే కావడం విశేషం. అయితే ఈవెంట్ ప్రారంభానికి ముందే పలువురు స్టార్ అథ్లెట్లు వేర్వేరు కారణాల వల్ల టోర్నీ నుంచి వైదొలిగారు. గ్రెనడాకు చెందిన రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అండర్సన్ పీటర్స్ గాయం కారణంగా పోటీలకు దూరం కాగా... భారత్కు చెందిన కిషోర్ జెనా సైతం గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. వరల్డ్ అథ్లెటిక్స్కు సన్నాహకంగా ఈ ఏడాది సెప్టెంబర్లో టోక్యో వేదికగా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్íÙప్ జరగనుండగా... దానికి ఇది సన్నాహకంగా ఉపయోగపడనుంది. మొత్తం 12 మంది అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొంటుండగా... అందులో ఐదుగురు త్రోయర్లు ఇప్పటికే వరల్డ్ అథ్లెటిక్స్ అర్హత మార్క్ (85.50 మీటర్లు) అందుకున్నారు. పాకిస్తాన్కు చెందిన ఒలింపిక్ చాంపియన్ అర్షద్ నదీమ్ను కూడా ఈ ఈవెంట్కు ఆహ్వానించగా... అతడు వ్యక్తిగత శిక్షణకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో పాల్గొనబోవడం లేదని ప్రకటించాడు. ఆ తర్వాత ఇరు దేశల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఆ ఊసే లేకుండా పోయింది. 2016 రియో ఒలింపిక్స్ చాంపియన్ థామస్ రోలెర్ (జర్మనీ), ప్రపంచ మాజీ చాంపియన్ జూలియస్ యెగో (కెన్యా), కర్టిస్ థామ్సన్ (అమెరికా) నుంచి నీరజ్కు ప్రధాన పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే యెగో, రోలెర్ ప్రస్తుతం ఫామ్లో లేరు. మార్టిన్ కొనెస్నీ (చెక్ రిపబ్లిక్), లూయిజ్ మౌరిసియో డా సిల్వా (బ్రెజిల్), రమేశ్ పతిరగే (శ్రీలంక), సిప్రియన్ మిర్జిగ్లాడ్ (పోలాండ్) సంచలనం నమోదు చేయాలని చూస్తున్నారు. భారత్ నుంచి నీరజ్ చోప్రాతో పాటు సచిన్ యాదవ్, యశ్వీర్ సింగ్, రోహిత్ యాదవ్, సాహిల్ సిల్వాల్ బరిలో దిగనున్నారు. ప్రస్తుతం దిగ్గజ కోచ్ జాన్ జెలెన్జీ వద్ద నీరజ్ శిక్షణ తీసుకుంటున్నాడు. ఇలాంటి టోర్నమెంట్ మనదేశంలో జరగాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నా. ఇప్పుడు దానికి సమయం ఆసన్నమైంది. కల నెరవేరినట్లు అనిపిస్తోంది. చాలా ఉత్సాహంగా ఉన్నా. ఒలింపిక్స్లో దేశం కోసం పతకాలు సాధించా. ఇప్పుడు దేశానికి తిరిగి ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నా. ఇది భారత యువ అథ్లెట్లకు, అభిమానులకు ఆనందం పంచుతుందనుకుంటున్నా. భారత అథ్లెటిక్స్లో నూతన అధ్యాయానికి ఇది నాంది. ఈ ఈవెంట్ ఇంత భారీ స్థాయిలో నిర్వహించేందుకు తోడ్పడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మనదేశంలో అంతర్జాతీయ పోటీలకు ఇది శుభారంభం. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో టోర్నీలు జరగాలి. జర్మనీలో వారానికి ఒకటి చొప్పున కేటగిరి ‘ఎ’, ‘బి’, ‘సి’పోటీలు జరుగుతుంటాయి. మనం కూడా ఆ స్థాయికి చేరాలి. అప్పుడు దేశంలో క్రీడా సంస్కృతి పెరుగుతుంది. మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తా. అందుకోసం కఠోర సాధన చేస్తున్నా. ఈ పోటీల తర్వాత ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ కోసం ప్రాక్టీస్ ప్రారంభిస్తా. జావెలిన్ను విసిరే సమయంలో మరింత నియంత్రణ అవసరం. ప్రస్తుతం దానిపై దృష్టి పెట్టా. –నీరజ్ చోప్రాబరిలో ఉన్నది వీరే నీరజ్ చోప్రా (భారత్) సిప్రియన్ మిర్జిగ్లాడ్ (పోలాండ్) లూయిజ్ మౌరిసియో డా సిల్వా (బ్రెజిల్) థామస్ రోలెర్ (జర్మనీ) కర్టిన్స్ థామ్సన్ (అమెరికా) మార్టిన్న్ కొనెస్నీ (చెక్ రిపబ్లిక్) జూలియస్ యెగో (కెన్యా) రమేశ్ పతిరగే (శ్రీలంక) సచిన్ యాదవ్ (భారత్) రోహిత్ యాదవ్ (భారత్) సాహిల్ సిల్వాల్ (భారత్) యశ్ వీర్ సింగ్ (భారత్) -
ముందుకెవరు? ఇంటికెవరు?
చియాంగ్ మయ్ (థాయ్లాండ్): ఆసియా ఫుట్బాల్ సమాఖ్య (ఏఎఫ్సీ) మహిళల ఆసియా కప్ క్వాలిఫయర్స్లో భారత అమ్మాయిలకు అసలైన సవాల్ ఎదురవుతోంది. ర్యాంకింగ్లోనూ, పోటీలోనూ పటిష్టమైన థాయ్లాండ్తో ‘ఢీ’ కొట్టేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నేడు గ్రూప్ దశలోని ఆఖరి క్వాలిఫయింగ్ పోరు రసవత్తరంగా జరుగనుంది. ఈ క్వాలిఫయింగ్ టోర్నీలో పాయింట్ల పరంగా, గోల్స్ పరంగా సమఉజ్జీలుగా ఉన్న ఇరు జట్లలో గెలిచిన జట్టే ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నీకి అర్హత సాధిస్తుంది. ఏఎఫ్సీ ఆసియా కప్ టోర్నీ వచ్చే ఏడాది ఆ్రస్టేలియాలో జరుగుతుంది. ప్రస్తుత క్వాలిఫయర్స్లో సత్తా చాటుకున్నప్పటికీ థాయ్లాండ్పై ఏనాడూ గెలవని భారత్ ఈ చెత్త రికార్డును చెరిపేయాలన్నా... ఏఎఫ్సీ ఆసియా కప్కు అర్హత సాధించాలన్నా సర్వశక్తులు ఒడ్డాల్సిందే! గ్రూప్ ‘బి’లో భారత్, థాయ్లాండ్ జట్లు ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలిచాయి. ఇరాక్, తిమోర్–లెస్టే, మంగోలియాలపై గెలుపొందిన రెండు జట్లు ఇప్పుడు ఆఖరి లీగ్లో ఎదురుపడుతున్నాయి. ఆఖరి మెట్టులో గట్టెక్కితే మాత్రం ఆసియా కప్ ఆడే అవకాశం లభిస్తుంది. ఇదే జరిగితే ‘ఫిఫా’ మహిళల ప్రపంచకప్ (2027) క్వాలిఫికేషన్ టోర్నీ ఆడే జట్టుగా చరిత్రలో నిలుస్తుంది. అందుకేనేమో కోచ్ క్రిస్పిన్ ఛెత్రి థాయ్లాండ్తో మ్యాచ్పై గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ విజయంతో వచ్చే ఆసియా కప్ బెర్త్తో భారత ఫుట్బాల్ ముఖచిత్రమే మారుతుందని అన్నారు. దేశ ఫుట్బాల్ క్రీడకే కొత్త ఊపిరినిస్తుందని చెప్పారు. గతంలో 2003లో అమ్మాయిల జట్టు ఆసియా కప్ ఆడింది. కానీ అప్పుడు ఏఎఫ్సీ క్వాలిఫయర్స్ లేవు. ఎట్టకేలకు మళ్లీ మూడేళ్ల క్రితం 2022లో ఆతిథ్య జట్టుగా ఆడే భాగ్యం భారత్కు లభిస్తే ‘కరోనా’ మహమ్మారి గద్దలా తన్నుకుపోయినట్లు టోర్నీనే తుడిచి పెట్టేసింది. కోవిడ్ వల్ల భారత్ ఆ ఏడాది టోర్నీని నిర్వహించలేక పోయింది. ఇప్పుడు మాత్రం క్వాలిఫయింగ్ టోర్నీలో చేసిన పోరాటంతో దర్జాగా అర్హత సాధించాలనుకుంటున్న భారత్కు శనివారం విషమ పరీక్ష ఎదురవుతోంది. 13–0తో మంగోలియాపై, 4–0తో తిమోర్ లెస్టేపై, 5–0తో ఇరాక్పై గెలిచిన భారత్ ప్రత్యర్థులకు ఒక్క గోల్ ఇవ్వకుండా ఘనవిజయాలు సాధించింది. మరోవైపు థాయ్లాండ్ కూడా ఒక్క గోల్ ఇవ్వకుండానే జైత్రయాత్ర సాగించింది. ఈ ఆఖరి మజిలీనే ఇరు జట్లను ఒంటికాలుపై నిలబడేలా చేస్తుంది. సాధారణంగా గ్రూప్ దశలో షూటౌట్ నిర్వహించరు. అయితే ఇరు జట్లు సమఉజ్జీగా ఉండటంతో ఫలితం కోసం ఈ మ్యాచ్లో ‘షూటౌట్’ నిర్వహించడం ఖాయమైంది. -
కీస్ కథ ముగిసె...
లండన్: వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో స్టార్ ప్లేయర్ల నిష్క్రమణ పర్వం కొనసాగుతోంది. తాజాగా మహిళల సింగిల్స్ విభాగంలో ఆరో సీడ్, ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ మాడిసన్ కీస్ (అమెరికా)... ప్రపంచ మాజీ నంబర్వన్, నాలుగు గ్రాండ్స్లామ్ టోర్నీల విజేత నయోమి ఒసాకా (జపాన్) మూడో రౌండ్లో ఇంటిముఖం పట్టగా... పురుషుల సింగిల్స్ విభాగంలో నాలుగో సీడ్ జాక్ డ్రేపర్ (బ్రిటన్) రెండో రౌండ్లోనే వెనుదిరిగాడు.శుక్రవారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్లో ప్రపంచ 104వ ర్యాంకర్, 37 ఏళ్ల లౌరా సిగెముండ్ (జర్మనీ) 6–3, 6–3తో మాడిసన్ కీస్పై సంచలన విజయం సాధించి తన కెరీర్లో తొలిసారి వింబుల్డన్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంది. 93 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో లౌరా తన సర్వీస్ను రెండుసార్లు కోల్పోయి ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. కీస్ నాలుగు డబుల్ ఫాల్ట్లతోపాటు 31 అనవసర తప్పిదాలు చేసింది. మరో మ్యాచ్లో పావ్లీచెంకోవా (రష్యా) 3–6, 6–4, 6–4 తో ఒసాకాను ఓడించి 2016 తర్వాత మరోసారి వింబుల్డన్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంది. డ్రేపర్ అవుట్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో 2017 రన్నరప్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) 2 గంటల 39 నిమిషాల్లో 6–4, 6–3, 1–6, 6–4తో డ్రేపర్ను ఓడించాడు. మరో రెండో రౌండ్ మ్యాచ్లో వరల్డ్ నంబర్వన్ యానిక్ సినెర్ (ఇటలీ) 6–1, 6–1, 6–3తో వుకిచ్ (ఆ్రస్టేలియా)పై గెలిచాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్ల్లో ఐదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 6–4, 6–3, 6–7 (5/7), 6–1తో ఫొకీనా (స్పెయిన్)పై, 14వ సీడ్ రుబ్లెవ్ (రష్యా) 7–5, 6–2, 6–3తో మనారినో (ఫ్రాన్స్)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. యూకీ జోడీ బోణీ మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో యూకీ బాంబ్రీ (భారత్)–జిన్యు జియాంగ్ (చైనా) జోడీ 6–3, 1–6, 7–6 (10/6)తో హారిసన్–నికోల్ మెలిచార్ (అమెరికా) ద్వయంపై గెలిచి రెండో రౌండ్కు చేరుకుంది. -
చెస్ను ఆస్వాదించలేకపోతున్నా
జాగ్రెబ్: ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ మునుపటిలా తాను చెస్ ఆడటాన్ని ఆస్వాదించలేకపోతున్నానని చెప్పాడు. ఓ దశాబ్దంపాటు ప్రపంచ చెస్ చాంపియన్షిప్ టైటిల్ను నిలబెట్టుకున్న కార్ల్సన్ ఇటీవల భారత టీనేజ్ సంచలనం, ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ చేతిలో ఓడిపోతున్నాడు. ఇక్కడ జరుగుతున్న సూపర్ యునైటెడ్ ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీలో గురువారం రెండోసారి గుకేశ్ చేతిలో కంగుతిన్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆటపై ఆసక్తి తగ్గి బలహీన ప్లేయర్గా మారుతున్నానని వ్యాఖ్యానించాడు. అయితే ప్రపంచ చాంపియన్ గుకేశ్ అద్భుతంగా ఆడుతున్నాడని కితాబిచ్చాడు. అవకాశాల్ని ఒడిసిపట్టుకోవడం, సందర్భోచిత ఎత్తులు వేయడంలో అతని ఆటతీరు గొప్పగా ఉందన్నాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే... ఇప్పుడు నేను చెస్ ఆడటాన్ని ఏమాత్రం ఆస్వాదించలేకపోతున్నాను. ఎత్తులు, పైఎత్తులపై ఆసక్తి సన్నగిల్లుతోంది. చెస్ బోర్డు ముందు కూర్చొని ఆడేటపుడు నాలో ఎలాంటి అనుభూతి కలగడం లేదు. అందుకే ఆటలో పేలవంగా ఆడుతున్నాను’ అని నార్వే సూపర్ స్టార్ అన్నాడు. 2013 నుంచి 2023 వరకు ప్రపంచ చెస్ను శాసించిన ఈ సూపర్ గ్రాండ్మాస్టర్ బరిలో ఉన్న పదేళ్లు టైటిల్ను నిలబెట్టుకోవడం విశేషం. రెండేళ్ల క్రితం కార్ల్సన్ స్వయంగా వైదొలగడంతోనే డింగ్ లిరెన్ (చైనా) చాంపియన్ అయ్యాడు. ఇతన్ని గతేడాది ఓడించిన గుకేశ్ సరికొత్త చాంపియన్గా అవతరించాడు. -
సిరాజ్ ‘సిక్సర్’
భారత బౌలింగ్ ధాటికి ఒకదశలో ఇంగ్లండ్ స్కోరు 84/5... ఇక మూడో రోజే మ్యాచ్ మన చేతికి చిక్కినట్లే అనిపించింది. అయితే జేమీ స్మిత్, హ్యారీ బ్రూక్ అసాధారణ బ్యాటింగ్తో ఎదురుదాడి చేసి ‘ట్రిపుల్ సెంచరీ’ భాగస్వామ్యం నెలకొల్పడంతో ఇంగ్లండ్ తేరుకోగలిగింది. హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఆరు వికెట్ల ప్రదర్శన శుక్రవారం ఆటలో హైలైట్గా నిలవగా, ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఆరుగురు ‘డకౌట్’ కావడం విశేషం. అయినా సరే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 180 పరుగులతో కలిపి ఇప్పటికే 244 పరుగులు ముందంజలో ఉన్న టీమిండియా మ్యాచ్ను శాసించే స్థితికి చేరింది. నేడు మన బ్యాటర్లు చెలరేగి ప్రత్యర్థి ముందు ఎంత లక్ష్యం ఉంచుతారనేది ఆసక్తికరం.బర్మింగ్హామ్: ఇంగ్లండ్తో రెండో టెస్టుపై భారత్ పట్టు బిగించింది. మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. ప్రస్తుతం జట్టు ఓవరాల్గా 244 పరుగుల ఆధిక్యంలో ఉంది. జైస్వాల్ (22 బంతుల్లో 28; 6 ఫోర్లు) అవుట్ కాగా... కేఎల్ రాహుల్ (38 బంతుల్లో 28 బ్యాటింగ్; 6 ఫోర్లు), కరుణ్ నాయర్ (7 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 77/3తో శుక్ర వారం ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 89.3 ఓవర్లలో 407 పరుగులకు ఆలౌటైంది. జేమీ స్మిత్ (207 బంతుల్లో 184 నాటౌట్; 21 ఫోర్లు, 4 సిక్స్లు), హ్యారీ బ్రూక్ (234 బంతుల్లో 158; 17 ఫోర్లు, 1 సిక్స్) భారీ సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరు ఆరో వికెట్కు 303 పరుగులు జోడించారు. భారత పేసర్లు మొహమ్మద్ సిరాజ్ (6/70), ఆకాశ్దీప్ (4/88) కలిసి ప్రత్యరి్థని పడగొట్టారు. మెరుపు భాగస్వామ్యం... మూడో రోజు ఆటలో తొలి 10 బంతులు ముగిసేసరికి మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చేసినట్లు అనిపించింది! ‘హైదరాబాద్ పేసర్’ సిరాజ్ వరుసగా రెండు చక్కటి బంతులతో రూట్ (22), స్టోక్స్ (0)లను పెవిలియన్ పంపించాడు. ఈ ఇన్నింగ్స్లో రెండోసారి ఇంగ్లండ్ వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. అయితే ఈ వికెట్ల తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. బ్రూక్, స్మిత్ కలిసి బౌండరీలతో చెలరేగిపోయారు. వీరిద్దరిని నిలువరించేందుకు తీవ్రంగా ప్రయత్నించిన భారత బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడిన స్మిత్ 80 బంతుల్లోనే సెంచరీ (14 ఫోర్లు, 3 సిక్స్లు) సాధించడం విశేషం. తొలి సెషన్లో ఇంగ్లండ్ 27 ఓవర్లలో ఏకంగా 172 పరుగులు రాబట్టడం విశేషం. తప్పిన ఫాలోఆన్... లంచ్ తర్వాత కూడా బ్రూక్, స్మిత్ అంతే పట్టుదలతో బ్యాటింగ్ను కొనసాగించారు. ఈ క్రమంలో బ్రూక్ కూడా 137 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోగా, భాగస్వామ్యం 200 పరుగులు దాటింది. రెండో సెషన్లో ఒక్క వికెట్ కూడా కోల్పోని ఇంగ్లండ్ 28 ఓవర్లలో 106 పరుగులు జోడించింది. విరామానంతరం సిరాజ్ ఓవర్లో స్మిత్ స్వే్కర్ లెగ్ దిశగా ఆడి రెండు పరుగులు తీయడంతో పార్ట్నర్íÙప్ 300 పరుగులకు చేరింది. అయితే ఎట్టకేలకు ఈ జోడీని ఆకాశ్దీప్ విడదీశాడు. కొత్త బంతితో వేసిన మూడో ఓవర్లోనే బ్రూక్ను ఆకాశ్దీప్ బౌల్డ్ చేయగా... తర్వాతి ఓవర్లోనే ఇంగ్లండ్కు ఫాలో ఆన్ ప్రమాదం తప్పింది. అయితే ఆ తర్వాత 12 పరుగుల వ్యవధిలో చివరి 4 వికెట్లు కోల్పోవడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 587; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) నాయర్ (బి) సిరాజ్ 19; డకెట్ (సి) గిల్ (బి) ఆకాశ్దీప్ 0; పోప్ (సి) రాహుల్ (బి) ఆకాశ్దీప్ 0; రూట్ (సి) పంత్ (బి) సిరాజ్ 22; బ్రూక్ (బి) ఆకాశ్దీప్ 158; స్టోక్స్ (సి) పంత్ (బి) సిరాజ్ 0; స్మిత్ (నాటౌట్) 184; వోక్స్ (సి) నాయర్ (బి) ఆకాశ్దీప్ 5; కార్స్ (ఎల్బీ) (బి) సిరాజ్ 0; టంగ్ (ఎల్బీ) (బి) సిరాజ్ 0; బషీర్ (బి) సిరాజ్ 0; ఎక్స్ట్రాలు 19; మొత్తం (89.3 ఓవర్లలో ఆలౌట్) 407.వికెట్ల పతనం: 1–13, 2–13, 3–25, 4–84, 5–84, 6–387, 7–395, 8–396, 9–407, 10–407. బౌలింగ్: ఆకాశ్దీప్ 20–2–88–4, సిరాజ్ 19.3–3–70–6, ప్రసిధ్ 13–1–72–0, నితీశ్ రెడ్డి 6–0–29–0, జడేజా 17–2–70–0, సుందర్ 14–0–73–0. భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (ఎల్బీ) (బి) టంగ్ 28; రాహుల్ (బ్యాటింగ్) 28; నాయర్ (బ్యాటింగ్) 7; ఎక్స్ట్రాలు 1; మొత్తం (13 ఓవర్లలో వికెట్ నష్టానికి) 64. వికెట్ల పతనం: 1–51. బౌలింగ్: వోక్స్ 5–0–28–0, కార్స్ 5–1–23–0, టంగ్ 3–1–12–1. ఒకే ఓవర్లో 23 పరుగులు... ప్రసిధ్ కృష్ణ ఓవర్లో స్మిత్ చెలరేగిన తీరు ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో హైలైట్గా నిలిచింది. ఈ ఓవర్లో తొలి బంతికి పరుగు తీయని స్మిత్ ఆ తర్వాత వరుసగా 4, 6, 4, 4, (వైడ్), 4 బాదడంతో మొత్తం 23 పరుగులు వచ్చాయి. తొలి టెస్టులోనే ఆరుకు పైగా ఎకానమీతో చెత్త బౌలింగ్ ప్రదర్శన చేసిన ప్రసిధ్ ఈ టెస్టులోనూ ఘోరంగా విఫలమయ్యాడు.క్యాచ్లు చేజారె... మూడో రోజు ఆటలో బ్రూక్, స్మిత్ జోరును నిలువరించేందుకు కొన్ని అవకాశాలు వచి్చనా అవి వృథా అయ్యాయి. మరీ సులువైనవి కాకపోయినా... మూడు క్యాచ్లు వదిలేయడం ఇంగ్లండ్కు మేలు చేసింది. జడేజా బౌలింగ్లో బ్రూక్ (వ్యక్తిగత స్కోరు 63) ఇచ్చిన క్యాచ్ను గిల్ అందుకోలేకపోయాడు. వేగంగా వచి్చన బంతి అతని తలకు కూడా తగిలింది. తన బౌలింగ్లోనే స్మిత్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్ (స్కోరు 90)ను సుందర్ చేజార్చాడు. ఆ తర్వాత నితీశ్ బౌలింగ్లో స్మిత్ (స్కోరు 121) ఇచి్చన క్యాచ్ను పంత్ నేలపాలు చేశాడు.⇒ 4 సిరాజ్ కెరీర్లో నాలుగో సారి ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఈ నాలుగూ వేర్వేరు దేశాల్లో (ఆస్ట్రేలియా, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్) రావడం విశేషం. -
ENG VS IND 2nd Test: ఆరేసిన సిరాజ్.. 407 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
ఎడ్జ్బాస్టన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్ట్లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 407 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (158), జేమీ స్మిత్ (184 నాటౌట్) భారీ సెంచరీలు చేసి ఇంగ్లండ్ను గట్టెక్కించారు. 84 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఇంగ్లండ్ను బ్రూక్, స్మిత్ అద్భుతమైన ఇన్నింగ్స్లతో ఆదుకున్నారు. వీరిద్దరు ఆరో వికెట్కు 303 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి ఇంగ్లండ్ను తిరిగి ఆటలోకి తెచ్చారు. బ్రూక్, స్మిత్ ద్వయం సగం వికెట్లు కోల్పోయినా డిఫెన్స్లో పడకుండా భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలో స్మిత్ 80, బ్రూక్ 137 బంతుల్లో సెంచరీలు పూర్తి చేశారు.387 పరుగుల వద్ద బ్రూక్ ఔటయ్యాక ఇంగ్లండ్ మరో 20 పరుగుల వ్యవధిలో చివరి 5 వికెట్లు కోల్పోయింది. జేమీ స్మిత్ అర్హమైన డబుల్ సెంచరీని మిస్ అయ్యాడు. అతనికి మరికొద్ది బంతులు అవకాశం దొరికినా డబుల్ పూర్తి చేసేవాడు. బ్రూక్ను ఆకాశ్దీప్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ పతనం మొదలైంది. ఆతర్వాత కొద్ది సేపటికే ఆకాశ్దీప్ క్రిస్ వోక్స్ను కూడా పెవిలియన్కు పంపాడు. చివరి 3 వికెట్లను సిరాజ్ పడగొట్టాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఆరుగురు (డకెట్, పోప్, స్టోక్స్, కార్స్, టంగ్, బసీర్) డకౌట్ అయ్యారు. క్రాలే 19, రూట్ 22, వోక్స్ 5 పరుగులు చేశారు. ఇంగ్లండ్ స్కోర్లో 80 శాతం పరుగులు బ్రూక్, స్మిత్లే చేశారు. భారత బౌలర్లలో సిరాజ్ (6/70), ఆకాశ్దీప్ (4/88) అద్భుతంగా బౌలింగ్ చేసి మొత్తం వికెట్లు తీశారు. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. మొత్తంగా భారత్కు 180 పరుగుల కీలకమైన ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భారత్.. శుక్రవారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 28 పరుగుల చేసి ఔట్ కాగా.. కే ఎల్ రాహూల్ 28 , కరుణ్ నాయర్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 244 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 587 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ శుభ్మన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీతో (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి భారత్కు భారీ స్కోర్ అందించాడు. భారత ఇన్నింగ్స్లో గిల్తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు.మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1, ఆకాశ్దీప్ 6, సిరాజ్ 8, ప్రసిద్ద్ కృష్ణ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ తలో 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు. -
వరుస సెంచరీలు.. జట్టులో స్థానం గల్లంతు
బంగ్లాదేశ్ టెస్ట్ జట్టు కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటోపై వేటు పడింది. త్వరలో శ్రీలంకతో జరుగబోయే టీ20 సిరీస్ కోసం అతన్ని ఎంపిక చేయలేదు. ఇటవలి కాలంలో షాంటో పొట్టి ఫార్మాట్లో పేలవ ఫామ్లో ఉన్నాడు. ఈ కారణంగానే అతన్ని టీ20 జట్టు నుంచి తప్పించినట్లు సెలెక్టర్లు తెలిపారు. బ్యాటింగ్పై దృష్టి సారించేందుకు షాంటో ఇటీవలే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఈ లోపే అతన్ని జట్టు నుంచే తప్పించారు. షాంటో ప్రస్తుత శ్రీలంక పర్యటనలో జరిగిన తొలి టెస్ట్లో రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేశాడు. అయినా అతన్ని టీ20 జట్టు నుంచి తొలగించారు. షాంటో గత కొద్ది రోజులుగా తరుచూ వార్తల్లో నిలుస్తున్నాడు. బోర్డుతో విబేధాల కారణంగా అతను టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడని వార్తలు వస్తున్నాయి. షాంటో గతేడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ ఆల్ ఫార్మాట్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. అనంతర పరిణామాల్లో అతను పరిమిత ఓవర్ల కెప్టెన్సీని వదిలి పెట్టాడు. జులై 10 నుంచి శ్రీలంకతో జరుగబోయే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టును ఇవాళ (జులై 4) ప్రకటించారు. ఈ జట్టులో షాంటోతో పాటు మరో ఐదుగులు స్థానాలు కోల్పోయారు. పాకిస్తాన్తో చివరిగా ఆడిన జట్టులో సభ్యులైన సౌమ్య సర్కార్, హసన్ మహమూద్, తన్వీర్ ఇస్లాం, నహీద్ రాణా, ఖలీద్ అహ్మద్ లంకతో సిరీస్కు ఎంపిక కాలేదు. ఆల్రౌండర్ మొహమ్మద్ సైఫుద్దీన్ ఏడాది తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు. తస్కిన్ అహ్మద్, షొరీఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రెహ్మాన్, నసుమ్ అహ్మద్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు. జులై 10, 13, 16 తేదీల్లో పల్లెకెలె, డంబుల్లా, కొలొంబో వేదికలుగా శ్రీలంకతో మూడు టీ20లు జరుగనున్నాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ శ్రీలంకతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ శ్రీలంక 77 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను శ్రీలంక 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో తొలి టెస్ట్ డ్రా కాగా.. రెండో టెస్ట్లో శ్రీలంక ఇన్నింగ్స్ 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రేపు కొలొంబో వేదికగా ఇరు జట్ల మధ్య రెండో వన్డే జరుగుతుంది.శ్రీలంకతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు.. లిట్టన్ కుమార్ దాస్ (కెప్టెన్), తంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, మహ్మద్ నయీమ్ షేక్, తౌహిద్ హృదయ్, జాకెర్ అలీ అనిక్, షమీమ్ హుస్సేన్ పట్వారీ, మెహిదీ హసన్ మిరాజ్, రిషద్ హుస్సేన్, షాక్ మహిదీ హసన్, నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షొరీఫుల్ ఇస్లాం, తంజిమ్ హసన్ సాకిబ్, మహ్మద్ సైఫుద్దీన్. -
ఇంగ్లండ్లో కొనసాగుతున్న టీమిండియా యువ సంచలనం హవా.. మరో సెంచరీ, 6 వికెట్లు
ఇంగ్లండ్ పర్యటనలో భారత యువ సంచలనం ముషీర్ ఖాన్ హవా కొనసాగుతోంది. ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎమర్జింగ్ టీమ్ (MCA Colts) తరఫున ఇంగ్లండ్లో పర్యటిస్తున్న ముషీర్.. వరుసగా రెండు మ్యాచ్ల్లో అదిరిపోయే ఆల్రౌండ్ ప్రదర్శనలతో అదరగొట్టాడు.Notts 2nd XIతో జరిగిన తొలి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్లో 123 పరుగులు (127 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో) చేసిన ముషీర్.. ఆతర్వాత బౌలింగ్లో 6 వికెట్ల ప్రదర్శన (8.2 ఓవర్లలో 6/31) నమోదు చేశాడు.తాజాగా రెండో మ్యాచ్లోనూ ముషీర్ తొలి మ్యాచ్ తరహా ప్రదర్శనలు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఈ మ్యాచ్లో కూడా ముషీర్ సెంచరీ, 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలిసి భారత క్రికెట్ అభిమానులు ముషీర్ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.భారత క్రికెట్కు మరో భవిష్యత్తు తార దొరికాడని ఆకాశానికెత్తుతున్నారు. ముషీర్కు సంబంధించిన తాజా వార్త ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతుంది.కారు ప్రమాదం నుంచి బయటపడి..!20 ఏళ్ల ముషీర్ గతేడాది సెప్టెంబర్లో కారు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో ముషీర్ మెడకు బలమైన గాయమైంది. ఆ ప్రమాదం తర్వాత ముషీర్ ఆడుతున్న తొలి రెడ్ బాల్ టోర్నీ ఇదే. ముషీర్ తన చివరి రెడ్ బాల్ మ్యాచ్ను దులీప్ ట్రోఫీలో ఇండియా-బి తరఫున ఆడాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత ముషీర్ ఐపీఎల్ 2025లో ఆడాడు (పంజాబ్ కింగ్స్ తరఫున ఓ మ్యాచ్). ఆర్సీబీతో జరిగిన ఆ మ్యాచ్లో ముషీర్ డకౌటై నిరాశపరిచాడు. ఆ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన ముషీర్ 3 బంతులు ఎదుర్కొని సుయాశ్ శర్మ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. అయితే ఇదే మ్యాచ్లో ముషీర్ బంతితో పర్వాలేదనిపించాడు. 2 ఓవర్లలో 27 పరుగులిచ్చి మయాంక్ అగర్వాల్ వికెట పడగొట్టాడు.ముషీర్ ఖాన్ మరో టీమిండియా అప్ కమింగ్ మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు. ముషీర్కు దేశవాలీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. 2022-23 రంజీ సీజన్లో ముంబై తరఫున అరంగేట్రం చేసిన ముషీర్.. ఆడిన 9 మ్యాచ్ల్లో 51.14 సగటున 3 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 716 పరుగులు చేశాడు. ఇందులో ఓ అజేయ డబుల్ సెంచరీ కూడా ఉంది.ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ముషీర్ బౌలర్గానూ రాణించాడు. 9 మ్యాచ్ల్లో 8 వికెట్లు తీశాడు. ముషీర్ 2024 అండర్-19 వరల్డ్కప్లో భారత జట్టు సభ్యుడిగా ఉన్నాడు. టీమిండియా రన్నరప్గా నిలిచిన ఈ టోర్నీలో ముషీర్ రెండు సెంచరీలు చేశాడు. 2024 రంజీ ఫైనల్లో సెంచరీ చేసిన ముషీర్.. ముంబై తరఫున రంజీ ఫైనల్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. -
బ్రాత్వైట్ వరల్డ్ రికార్డు.. ఇక ముందు కూడా ఎవరికీ సాధ్యం కాదు!
వెస్టిండీస్ క్రికెటర్ క్రెయిగ్ బ్రాత్వైట్ (Kraigg Brathwaite) అరుదై ఘనత సాధించాడు. విండీస్ తరఫున వంద టెస్టులు పూర్తి చేసుకున్న ఈ మాజీ కెప్టెన్.. ఇంత వరకు ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ క్రమంలో టీ20 క్రికెట్ ప్రవేశపెట్టిన తర్వాత.. పొట్టి ఫార్మాట్లో అరంగేట్రం చేయకుండా వంద టెస్టుల క్లబ్లో చేరిన తొలి ఆటగాడిగా నిలిచాడు.ఏకైక క్రికెటర్గాకాగా బ్రాత్వైట్ విండీస్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లోనూ.. అదే విధంగా లీగ్ క్రికెట్లోనూ ఒక్క పొట్టి మ్యాచ్ కూడా ఆడకపోవడం విశేషం. ప్రపంచంలో ఇలా టీ20 మ్యాచ్ ఆడకుండానే.. టెస్టుల్లో వంద మ్యాచ్ల మైలురాయిని అందుకున్న ఏకైక క్రికెటర్గా బ్రాత్వైట్ గుర్తింపు పొందాడు. ఆస్ట్రేలియా (WI vs AUS)తో తాజా సిరీస్ రెండో టెస్టు సందర్బంగా ఈ ఘనత సాధించాడు. ఈ టీ20 లీగ్ల జమానాలో బ్రాత్వైట్ మాదిరి ఇలాంటి రికార్డు ఇక ముందు కూడా ఎవరికీ సాధ్యం కాదని చెప్పవచ్చు. కాగా మూడు టెస్టులు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడేందుకు ఆస్ట్రేలియా వెస్టిండీస్లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా బార్బడోస్లో జరిగిన తొలి టెస్టులో ఆసీస్ 159 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. ఈ క్రమంలో గురువారం ఇరుజట్ల మధ్య గ్రెనెడా వేదికగా రెండో టెస్టు మొదలైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. తొలిరోజు ఆటలో భాగంగా తొలి ఇన్నింగ్స్లో 286 పరుగులకు ఆలౌట్ అయింది. బ్యూ వెబ్స్టర్ (60), వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ (63) అర్ధ శతకాలతో రాణించారు.వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ నాలుగు వికెట్లు కూల్చగా.. జేడన్ సీల్స్ రెండు, షమార్ జోసెఫ్, ఆండర్సన్ ఫిలిప్, జస్టిన్ గ్రీవ్స్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. విండీస్ టెస్టు స్పెషలిస్టు అయిన బ్రాత్వైట్కు సంప్రదాయ ఫార్మాట్లో ఇది వందో మ్యాచ్.ఇక 2011లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన 32 ఏళ్ల బ్రాత్వైట్.. 39 టెస్టుల్లో విండీస్కు సారథ్యం వహించాడు. విండీస్ తరఫున ప్రస్తుతం ఆటగాడిగా కొనసాగుతున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 100 టెస్టులు పూర్తి చేసుకున్న పదో వెస్టిండీస్ ప్లేయర్. ఓవరాల్గా 82వ ఆటగాడు.బ్రాత్వైట్ చెత్త రికార్డువంద టెస్టులు ఆడిన టాప్-6 స్పెషలిస్టు బ్యాటర్లలో లోయస్ట్ యావరేజ్ బ్రాత్వైట్దే. అతడి బ్యాటింగ్ సగటు 32.83 కాగా.. తర్వాతి స్థానంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (36.11) ఉన్నాడు. ఇదిలా ఉంటే.. బ్రాత్వైట్ ఖాతాలో మొత్తం పన్నెండు శతకాలు ఉన్నాయి. కాగా 100 టెస్టు క్లబ్లో అతి తక్కువ శతకాలు బాదిన ఆటగాడిగా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ (7 శతకాలు) ఉండగా.. అతడి తర్వాతి స్థానం బ్రాత్వైట్దే. చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ!.. చరిత్ర సృష్టించిన జేమీ స్మిత్.. ఇంగ్లండ్ తొలి ప్లేయర్గా.. -
నా హృదయం ముక్కలైంది.. కుల్దీప్ యాదవ్ భావోద్వేగం
పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ డియాగో జోటాకు టీమిండియా క్రికెటర్ కుల్దీప్ యాదవ్ నివాళి అర్పించాడు. జోటా మరణంతో ఫుట్బాల్ ప్రపంచం మొత్తం మూగబోయిందని.. అతడు లేని లోటు ఎవరూ పూడ్చలేరంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. నా హృదయం ముక్కలైందిఈ మేరకు.. ‘‘2020 (లివర్పూల్)లో ఒప్పందం.. 20వ నంబర్ను సాధించావు.. అదే నీ శాశ్వత గుర్తింపుగా మార్చుకున్నావు. ఈరోజు ఫుట్బాల్ ఒక్కటే నిన్ను కోల్పోలేదు.ప్రపంచం మొత్తం చీకటిగా మారింది. పిచ్పై అడుగుపెట్టేటపుడు నీ చిరునవ్వే ఉజ్వలమైన కాంతిలా అనిపించేది. పోర్టో లేదంటే వోల్వ్స్.. లేదంటే లివర్పూల్.. ఎక్కడ ఉన్నా నువ్వు అందరి హృదయాలను గెలుచుకున్నావు.నీ కుటుంబానికి ఆ దేవుడు ధైర్యం అందించాలి. నీ ఆత్మకు శాంతి చేకూరాలి డియాగో’’ అంటూ ఇన్స్టా స్టోరీలో కుల్దీప్ యాదవ్ భావోద్వేగపూరిత నోట్ రాశాడు. హార్ట్బ్రేక్ ఎమోజీతో తన అభిమాన ఆటగాడికి నివాళి అర్పించాడు.కారు ప్రమాదంలో..కాగా పోర్చుగల్ ఫుట్బాల్ జట్టు ఫార్వర్డ్ ప్లేయర్ డియాగో జోటా రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన విషయం విదితమే. స్పెయిన్లో జరిగిన కారు ప్రమాదంలో 28 ఏళ్ల డియాగో జోటాతో పాటు అతడి సోదరుడు ఆండ్రె సిల్వా (25) దుర్మరణం పాలయ్యాడు. జమోరా నగరంలో బుధవారం అర్ధరాత్రి దాటాక ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనలో ఇతర వాహనాల ప్రమేయం లేదని... అతి వేగంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమిక అంచనాకు వచ్చారు.ఈ బంధం శాశ్వతంఅయితే ఘటన జరిగిన సమయంలో కారు ఎవరు నడుపుతున్నారనే అంశంపై స్పష్టత రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. జోటా ఇటీవలే తన ప్రియురాలు రూట్ కార్డోసోను వివాహమాడాడు. ‘ఈ బంధం శాశ్వతం’ అని సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించిన వారాల్లోనే అనుకోని ప్రమాదంలో జొటా కన్నుమూశాడు. వీరికి ముగ్గురు సంతానం.గత నెలలో పోర్చుగల్ జాతీయ జట్టు నేషన్స్ లీగ్ టైటిల్ సాధించడంలో జోటా కీలక పాత్ర పోషించాడు. మరోవైపు ఆండ్రె సిల్వా పోర్చుగల్ క్లబ్ పినాఫైల్ తరఫున పలు డివిజన్ లీగ్లలో పాల్గొన్నాడు. ‘ఈ విషాదం తీవ్రంగా బాధిస్తోంది’ అని లివర్పూల్ ఫుట్బాల్ క్లబ్ ప్రకటించింది. ఇలాంటి క్లిష్ట సమయంలో జోటా, ఆండ్రె కుటుంబానికి అండగా ఉంటామని వెల్లడించింది.లివర్పూల్ ప్రధాన ఆయుధం ప్రముఖ ఫుట్బాల్ క్లబ్ లివర్పూల్ తరఫున 123 మ్యాచ్లాడిన జోటా 47 గోల్స్ సాధించాడు. లెఫ్ట్ వింగ్లో ఫార్వర్డ్గా ఆడే డియాగో జోటా... అద్వితీయమైన ఫినిషింగ్, ప్రత్యర్థికి అంతుచిక్కని డ్రిబ్లింగ్లో సిద్ధహస్తుడు. చిన్నప్పటి నుంచి ఆటను ప్రేమించిన జోటా... జూనియర్ స్థాయిలో సంచలనాలతో వెలుగులోకి వచ్చాడు.లా లీగాలో అట్లెటికో మాడ్రిడ్ తరఫున 2016 నుంచి రెండు సీజన్లు ఆడిన జోటా... ఆ తర్వాత వివిధ క్లబ్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2020 నుంచి లివర్పూల్ తరఫున కొనసాగుతున్న జొటా... మూడు మేజర్ ట్రోఫీలు గెలుచుకున్నాడు. గత సీజన్లో ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలిచిన జట్టులో డియాగో ప్రధాన సభ్యుడు. ఇక 2019లో పోర్చుగల్ జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేసిన జోటా... కెరీర్లో 49 మ్యాచ్లాడి 14 గోల్స్ చేశాడు. ఇది తీరని లోటు... పోర్చుగల్ సాకర్ సమాఖ్య కూడా జోటా మృతికి సంతాపం తెలిపింది. ‘ఇది పూడ్చలేని లోటు. జాతీయ జట్టు తరఫున 50కి పైగా మ్యాచ్లు ఆడిన అద్భుత ఆటగాడు ఇలా అర్ధాంతరంగా మృతిచెందడం కలచివేస్తోంది. సహచరులు, ప్రత్యర్థులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ గౌరవించే అత్యుత్తమ ఆటగాడు అప్పుడే లోకం వీడి వెల్లడం బాధగా ఉంది’ అని ఒక ప్రకటనలో తెలిపింది.జోటా మృతికి సంతాపంగా... గురువారం పోర్చుగల్, స్పెయిన్ మహిళల జట్ల మధ్య యూరోపియన్ చాంపియన్షిప్ మ్యాచ్కు ముందు ఇరు జట్ల ఆటగాళ్లు ఒక నిమిషం పాటు మౌనం వహించారు. పోర్చుగల్ ప్రధానమంత్రి లూయిస్ మోంటెనెగ్రో కూడా డియాగో జోటా మృతికి సంతాపం ప్రకటించారు.‘మేము ఇద్దరు చాంపియన్లను కోల్పోయాము. వారి లోటు పోర్చుగల్ సాకర్కు తీరని లోటు. వారి వారసత్వాన్ని గౌరవించేందుకు మా వంతు కృషి చేస్తాం. దేశ ఖ్యాతిని పెంచిన ఆటగాళ్లో జోటా ఒకడు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. ఇది సాకర్కు విషాదకరమైన రోజు’ అని పేర్కొన్నారు.ఇక సహచర ఆటగాడు పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో... ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ‘ఇప్పటి వరకు జాతీయ జట్టులో డియాగోతో కలిసి ఆడాను. ఇంతలో ఇలా ఎలా జరిగిందో. ఇటీవలే జోటా వివాహం జరిగింది. కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతాడు అనుకుంటే ఊహించని ఘటన అతడిని దూరం చేసింది. ఈ క్లిష్ట సమయంలో అతడి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. మేమందరం మిమ్మల్ని మిస్ అవుతాము’ అని రొనాల్డో అన్నాడు.మరోవైపు.. బాస్కెట్బాల్ దిగ్గజం లెబ్రాన్ జేమ్స్తో పాటు టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ వంటి పలు ప్లేయర్లతో పాటు... ఇతర క్లబ్లు, పలువురు ప్రముఖులు కూడా సంతాపం ప్రకటించారు. టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా జోటా మృతికి సంతాపం తెలిపాడు. కాగా కుల్దీప్ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నాడు. అయితే, తొలి రెండు టెస్టుల్లోనూ అతడికి తుదిజట్టులో ఆడే అవకాశం లభించలేదు. చదవండి: వింబుల్డన్లో సంచలనాల మోత.. టాప్ సీడ్లకు ఊహించని షాకులు -
ENG VS IND 2nd Test: శతక్కొట్టిన బ్రూక్.. కేవలం 44 ఇన్నింగ్స్ల్లోనే..!
ఎడ్జ్బాస్టన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు హ్యారీ బ్రూక్ సెంచరీతో మెరిశాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యతను భుజాన వేసుకున్న బ్రూక్ తన శైలికి విరుద్దంగా ఎంతో సంయమనంతో ఆడి 137 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్ సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బ్రూక్కు ఇది టెస్ట్ల్లో తొమ్మిదో సెంచరీ. బ్రూక్ ఈ తొమ్మిది సెంచరీలను కేవలం 44 ఇన్నింగ్స్ల్లో చేశాడు. తద్వారా ఇంగ్లండ్ క్రికెట్లో అత్యంత వేగంగా తొమ్మిది సెంచరీలు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.ఇంగ్లండ్ తరఫున అతి తక్కువ ఇన్నింగ్స్ల్లో తొమ్మిది టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాళ్లు37 - డెనిస్ కాంప్టన్43 - హెర్బర్ట్ సట్క్లిఫ్44 - హ్యారీ బ్రూక్50 - వాలీ హామండ్52 - మైఖేల్ వాన్26 ఏళ్ల బ్రూక్ 44 టెస్ట్ ఇన్నింగ్స్ల్లో ఓ డబుల్ సెంచరీ, 9 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీల సాయంతో 60.48 సగటున 2540 పరుగులు చేశాడు. బ్రూక్ స్ట్రయిక్రేట్ 87కి పైగా ఉండటం విశేషం.మ్యాచ్ విషయానికొస్తే.. మూడో రోజు లంచ్ విరామం తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 284/5గా ఉంది. బ్రూక్ (102), జేమీ స్మిత్ (126) క్రీజ్లో ఉన్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంగ్లండ్ ఇంకా 303 పరుగులు వెనుకపడి ఉంది. బ్రూక్, స్మిత్ ఆరో వికెట్కు అజేయమైన 200 పరుగులు జోడించారు.లంచ్కు ముందు జేమీ స్మిత్ సెంచరీ పూర్తి చేశాడు. స్మిత్ కేవలం 80 బంతుల్లోనే శతక్కొట్టి టెస్ట్ల్లో ఇంగ్లండ్ తరఫున నాలుగో వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో క్రాలే (19), బెన్ డకెట్ (0), ఓలీ పోప్ (0) నిన్న ఔట్ కాగా.. రూట్ (22), స్టోక్స్ (0) ఇవాళ ఆట ప్రారంభం కాగానే పెవిలియన్కు చేరారు. భారత బౌలర్లలో సిరాజ్ 3, ఆకాశ్దీప్ 2 వికెట్లు పడగొట్టారు.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 587 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ శుభ్మన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీతో (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి భారత్కు భారీ స్కోర్ అందించాడు. భారత ఇన్నింగ్స్లో గిల్తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1, ఆకాశ్దీప్ 6, సిరాజ్ 8, ప్రసిద్ద్ కృష్ణ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ తలో 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు. -
అయ్యో జడేజా.. టైం అయిపోయిందంటూ..!
ప్రస్తుత టీమిండియా టెస్ట్ టీమ్లో అందరికంటే సీనియర్ ఆటగాడు రవీంద్ర జడేజా. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్ కావడంతో జట్టులో సీనియర్గా కొనసాగుతున్నాడు జడ్డూ. ఇంగ్లండ్తో జరుగుతున్న తాజా టెస్ట్ సిరీస్లో శుబ్మన్ గిల్ నాయకత్వంలోని జట్టులో అతడు సభ్యుడిగా ఉన్నాడు. రెండో టెస్టులో కీలకమైన ఇన్నింగ్స్ ఆడి.. జట్టు భారీ స్కోరు చేయడంలో తనవంతు పాత్ర పోషించాడు. ఆట రెండో రోజు 89 పరుగులు చేసి జట్టుకు తన విలువను మరోసారి గుర్తు చేశాడీ సీనియర్ ఆల్రౌండర్. కెప్టెన్ గిల్తో కలిసి కీలకమైన 203 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆరో వికెట్ అంతకంటే దిగువ స్థానాల్లో 200 పరుగులు భాగస్వామ్యాల్లో పాలుపంచుకోవడం జడేజాకు ఇది మూడోసారి.కాగా, ఇంగ్లండ్తో సెకండ్ టెస్ట్ మ్యాచ్లో రెండో రోజు ఆట ముగిసిన తర్వాత జడేజాకు మీడియా నుంచి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. కెప్టెన్సీపై ఇంకా ఆశలు ఉన్నాయా అని మీడియా ప్రతినిధి అడగ్గా.. చిరునవ్వుతో లేదన్నట్టుగా సమాధానం ఇచ్చాడు. 'వో టైమ్ గయా' (ఆ సమయం దాటిపోయింది) అని వ్యాఖ్యానించాడు.చాన్స్ లేదా?నిజంగానే అతడికి సమయం మించిపోయిందని క్రీడావ్యాఖ్యతలు అభిప్రాయపడుతున్నారు. జడేజా వయసు ఇప్పుడు 35 ఏళ్లు. ఇంకో రెండుమూడేళ్లు క్రికెట్ ఆడినా కూడా అతడికి కెప్టెన్ చాన్స్ రాదు. ఎందుకంటే జట్టు ప్రయోజనాలను గమనంలోకి తీసుకుని గిల్కు టెస్ట్ టీమ్ సారథ్య బాధ్యతలు కట్టబెట్టింది బీసీసీఐ. నాయకత్వ బాధ్యతను భుజానికెత్తుకోవడానికి బుమ్రా నిరాకరించడంతో గిల్కు చాన్స్ దక్కింది. బహుశా రోహిత్ శర్మ తప్పుకున్న తర్వాత వన్డే జట్టు పగ్గాలు కూడా శుబ్మన్కే దక్కుతాయి. ఈ నేపథ్యంలోనే తనకు ఇక చాన్స్ లేదని జడేజా వ్యాఖ్యానించి ఉంటాడని క్రీడావ్యాఖ్యతలు పేర్కొంటున్నారు.కలిసిరాని కెప్టెన్సీఅయితే దేశం తరపున జాతీయ జట్టుకు నాయకత్వం వహించే చాన్స్ రాకపోయినా.. మరోవిధంగా అతడికి కెప్టెన్సీ దక్కింది. సారథిగా తనకు వచ్చిన అవకాశాన్ని జడేజా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు 2022లో కెప్టెన్గా చాన్స్ దక్కించకున్నాడు. వరుస పరాజయాలతోనే మధ్యలోనే నాయకత్వం నుంచి వైదొలగడంతో మళ్లీ ధోనికే పగ్గాలు అప్పగించాల్సి వచ్చింది. ఆ రకంగా చూస్తే కెప్టెన్సీ జడ్డూకు కలిసిరాలేదనే చెప్పాలి.నంబర్ 1 ఆల్రౌండర్ఆల్రౌండర్గా జడేజా ఆటకు పేరు పెట్టలేం. బ్యాట్తోనే కాకుండా బంతితో కూడా తానేంటో నిరూపించుకున్నాడు. మెరుపు ఫీల్డింగ్తో జట్టు విజయాల్లో ఎన్నోసార్లు కీలకపాత్ర పోషించాడు. ఇప్పటికీ యంగ్ ప్లేయర్స్తో పోటీ పడుతూ మైదానంలో విన్యాసాలు చేస్తుంటాడు. చాలా సందర్భాల్లో జట్టును కష్టాల నుంచి గట్టెక్కించిన ఘనత అతడికి ఉంది. అందుకే ఐసీసీ టెస్ట్ ఆల్రౌండర్ల ర్యాంకుల్లో టాప్లో కొనసాగుతున్నాడు.చదవండి: చరిత్ర సృష్టించిన జడేజా.. డబ్ల్యూటీసీలో తొలి ప్లేయర్ గిల్ గురించి జడేజా.. ఆటగాడి నుంచి టెస్ట్ కెప్టెన్ వరకు గిల్ ఎదుగుదల గురించి మీడియా ప్రతినిధులు జడేజాను అడగ్గా.. శుబ్మన్ గిల్ (shubhman gills) ఎంత ఎదిగాడో మీరు చూడలేదా? అంటూ ఎదురు ప్రశ్నించాడు. డబుల్ సెంచరీ చేసిన గిల్ను ప్రశంసించాడు. సుదీర్ఘ భాగస్వామ్యం నెలకొల్పాలని తామిద్దం మాట్లాడుకున్నామని వెల్లడించాడు. -
ENG VS IND 2nd Test: చరిత్ర సృష్టించిన బ్రూక్.. కొనసాగుతున్న పరుగుల ప్రవాహం
ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు హ్యారీ బ్రూక్ ఖాతాలో మరో భారీ రికార్డు చేరింది. బంతుల పరంగా (2832) టెస్ట్ల్లో అత్యంత వేగంగా 2500 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ పేరిట ఉండేది. బాబర్ 62 ఇన్నింగ్స్ల్లో 3806 బంతులు ఎదుర్కొని ఈ మైలురాయిని తాకాడు.అయితే బ్రూక్ బాబర్ కంటే చాలా తక్కువ బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు. ఇన్నింగ్స్ పరంగా కూడా బాబర్కు బ్రూక్కు భారీ తేడాతో ఉంది. ఈ మైలురాయిని చేరుకునేందుకు బాబర్కు 62 ఇన్నింగ్స్లు అవసరమైతే.. బ్రూక్ కేవలం 44 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనత సాధించాడు.బ్రూక్ టెస్ట్ కెరీర్ ప్రారంభం నుంచి ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. 26 ఏళ్ల బ్రూక్ కేవలం 44 టెస్ట్ ఇన్నింగ్స్ల్లోనే ఓ డబుల్ సెంచరీ, 8 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీల సాయంతో 60.21 సగటున 2529 పరుగులు చేశాడు. బ్రూక్ స్ట్రయిక్రేట్ 88కి పైగా ఉండటం విశేషం. ఎడ్జ్బాస్టన్ వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్లో బ్రూక్ ఈ ఘనత సాధించాడు.మెరుపు శతకంఈ మ్యాచ్లో బ్రూక్ 127 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్ సాయంతో 91 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. మరో ఎండ్లో జేమీ స్మిత్ మెరుపు సెంచరీ సాధించాడు. స్మిత్ కేవలం 80 బంతుల్లోనే శతక్కొట్టి టెస్ట్ల్లో ఇంగ్లండ్ తరఫున నాలుగో వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. స్మిత్ 82 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 102 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. మూడో రోజు లంచ్ విరామం సమయానికి ఇంగ్లండ్ 5 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంగ్లండ్ ఇంకా 338 పరుగులు వెనుకపడి ఉంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో క్రాలే (19), బెన్ డకెట్ (0), ఓలీ పోప్ (0) నిన్ననే ఔటయ్యారు. బుమ్రా స్థానంలో ఈ మ్యాచ్ ఆడుతున్న ఆకాశ్దీప్ వరుస బంతుల్లో తొలి టెస్ట్ సెంచరీ హీరోలు బెన్ డకెట్, ఓలీ పోప్లను డకౌట్ చేశాడు. అప్పటికి ఇంగ్లండ్ స్కోర్ 13 పరుగులు మాత్రమే. 25 పరుగుల వద్ద ఇంగ్లండ్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సిరాజ్ బౌలింగ్లో కరుణ్ నాయర్ క్యాచ్ పట్టడంతో జాక్ క్రాలే (19) ఔటయ్యాడు. నిప్పులు చెరిగిన సిరాజ్.. ఆదుకున్న బ్రూక్, స్మిత్ఇవాళ ఆట ప్రారంభం కాగానే సిరాజ్ బౌలింగ్లో వరుస బంతుల్లో రూట్ (22), స్టోక్స్ (0) వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను బ్రూక్, స్మిత్ జోడీ ఆదుకుంది. వీరిద్దరు ఆరో వికెట్కు అజేయమైన 165 పరుగులు జోడించారు. ఓవర్నైట్ స్కోర్ 77/3 వద్ద ఇంగ్లండ్ ఇవాల్టి ఆటను ప్రారంభించింది.ముందు రోజు (రెండో రోజు) టీ విరామం తర్వాత భారత తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కెప్టెన్ శుభ్మన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీతో (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో 587 పరుగులకు ఆలౌటైంది.భారత ఇన్నింగ్స్లో గిల్తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. గిల్.. జడేజాతో ఆరో వికెట్కు 203 పరుగులు , వాషింగ్టన్ సుందర్తో (42) ఏడో వికెట్కు 144 పరుగులు జోడించాడు.మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1, ఆకాశ్దీప్ 6, సిరాజ్ 8, ప్రసిద్ద్ కృష్ణ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ తలో 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు. -
ఫాస్టెస్ట్ సెంచరీ!.. చరిత్ర సృష్టించిన జేమీ స్మిత్.. ఇంగ్లండ్ తొలి ప్లేయర్గా..
టీమిండియాతో రెండో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ జేమీ స్మిత్ సంచలన ఇన్నింగ్స్తో మెరిశాడు. కేవలం 80 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. తద్వారా ఇంగ్లండ్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు.ఇంగ్లండ్ తొలి ప్లేయర్గా..అంతేకాదు.. టెస్టు మ్యాచ్లో భాగంగా ఓ రోజు ఆటలో భోజన విరామానికి ముందు సెషన్లోనే వందకు పైగా పరుగులు స్కోరు చేసిన ఇంగ్లండ్ తొలి బ్యాటర్గానూ చరిత్రకెక్కాడు జేమీ స్మిత్. అతడి శతక ఇన్నింగ్స్లో పద్నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ఇక భారత యువ పేసర్ ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో ఒకే ఓవర్లో జేమీ స్మిత్ ఏకంగా 23 పరుగులు పిండుకోవడం విశేషం.టెస్టుల్లో ఇంగ్లండ్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాళ్లు🏏గిల్బర్ట్ జెసప్- 1902లో ది ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాపై 76 బంతుల్లో శతకం🏏జానీ బెయిర్ స్టో- 2022లో ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా న్యూజిలాండ్పై 77 బంతుల్లో శతకం🏏హ్యారీ బ్రూక్- 2022లో రావల్పిండి వేదికగా పాకిస్తాన్పై 80 బంతుల్లో శతకం🏏జేమీ స్మిత్- 2025లో ఎడ్జ్బాస్టన్ వేదికగా టీమిండియాపై 80 బంతుల్లో శతకం🏏బెన్ స్టోక్స్- 2015లో లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్పై 85 బంతుల్లో శతకం.The THIRD-FASTEST England Test century 🤯Counter-attacking in the extreme from Jamie Smith ☄️ pic.twitter.com/8Yz3Ccc0WL— England Cricket (@englandcricket) July 4, 2025 లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ స్కోరు: 249/5 (47)ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా భారత్- ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టులో ఆతిథ్య జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా రెండో టెస్టు మొదలైంది.ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రెండో రోజు ఆటలో భాగంగా 587 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ డబుల్ సెంచరీ (269)తో అదరగొట్టగా.. రవీంద్ర జడేజా (89), యశస్వి జైస్వాల్ (87) కూడా అద్భుత అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ మూడు వికెట్లు తీయగా.. క్రిస్ వోక్స్, జోష్ టంగ్ రెండేసి వికెట్లు కూల్చారు. అదే విధంగా... కెప్టెన్ స్టోక్స్, బ్రైడన్ కార్స్, జో రూట్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్.. గురువారం నాటి రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి మూడు వికెట్లు నష్టపోయి 77 పరుగులు చేసింది. ఇక శుక్రవారం నాటి ఆటలో ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్.. హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ బజ్బాల్ ఇన్నింగ్స్ కారణంగా భోజన విరామ సమయానికి 249 పరుగులు స్కోరు చేసింది. లంచ్ బ్రేక్ సమయానికి స్మిత్ 102, బ్రూక్ 91 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు కూల్చగా.. ఆకాశ్ దీప్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ టీమిండియా కంటే ఇంకా 338 పరుగులు వెనుకబడి ఉంది.చదవండి: IND vs ENG 2nd Test: వైభవ్ సూర్యవంశీని పిలిపించిన బీసీసీఐ! -
కాస్తైనా కనికరం లేదా?!.. ఇంత చెత్త బౌలింగ్ ఏంటి బ్రో!
టీమిండియా యువ పేసర్ ప్రసిద్ కృష్ణ (Prasidh Krishna)పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరీ ఇంత చెత్తగా బౌలింగ్ చేస్తావా? అంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. అదే సమయంలో.. ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ (Jamie Smith)పై క్రికెట్ ప్రేమికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే..ఆదిలోనే షాకులుభారత్-ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య బుధవారం మొదలైన రెండో టెస్టులో గిల్ సేన తొలి ఇన్నింగ్స్లో 587 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో రెండో రోజు భారత ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత.. బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్కు ఆదిలోనే షాకులు తగిలాయి. భారత బౌలర్ల దెబ్బకు... ఇంగ్లిష్ జట్టు ఓపెనర్లు జాక్ క్రాలే (19), బెన్ డకెట్ (0) సహా వన్డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ (0)లు పెవిలియన్కు క్యూ కట్టారు. ‘బజ్బాల్’ దూకుడుఈ క్రమంలో గురువారం నాటి ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ మూడు వికెట్లన నష్టానికి 77 పరుగులు చేసింది. ఓవర్ నైట్ స్కోరు 77/3తో శుక్రవారం ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్.. వెనువెంటనే జో రూట్ (22), బెన్ స్టోక్స్ (0) వికెట్లు కోల్పోయింది. ఇలా జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన వేళ హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ తమదైన శైలి ‘బజ్బాల్’ ఆటకు తెరలేపారు.43 బంతుల్లోనేఈ క్రమంలో కేవలం 43 బంతుల్లోనే జేమీ స్మిత్ అర్ధ శతకం పూర్తి చేసుకోవడం విశేషం. ప్రస్తుతం భారత్- ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న సిరీస్లో ఇదే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కావడం గమనార్హం. కాగా ఆదిలో కాస్త నెమ్మదిగానే ఆడిన జేమీ స్మిత్ వేగంగా యాభై పరుగుల మార్కు చేరుకోవడానికి.. భారత పేసర్ ప్రసిద్ కృష్ణ చెత్త బౌలింగే కారణం.ఒకే ఓవర్లో 23 పరుగులుఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 32వ ఓవర్లో బంతితో బరిలోకి దిగిన ప్రసిద్ కృష్ణ... ఏకంగా 23 పరుగులు సమర్పించుకున్నాడు. తొలి బంతిని కట్టుదిట్టంగా వేసిన అతడు.. ఆ తర్వాత పదే పదే షార్ట్ బంతుల్ని సంధించి మూల్యం చెల్లించాడు. ప్రసిద్ బౌలింగ్లో జేమీ స్మిత్ వరుసగా 4, 6, 4, 4, 4 బాదగా.. వైడ్ రూపంలో మరో పరుగు వచ్చింది.Jamie Smith with back-to-back boundaries to start the 38th over 🔥He's absolutely flying here 😍 pic.twitter.com/rLEry94aGo— England Cricket (@englandcricket) July 4, 2025కాస్తైనా కనికరం లేదా?!.. ఇంత చెత్త బౌలింగ్ ఏంటి బ్రోఇక జేమీ స్మిత్కు బజ్బాల్ అటాకింగ్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ప్రసిద్ కృష్ణపై విమర్శల వర్షం కురుస్తోంది. ‘‘ఇంత చెత్త బౌలింగ్ ఏంటి బ్రో.. ఏదేమైనా జేమీ స్మిత్ సూపర్’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు.. కామెంటేటర్ రవిశాస్త్రి.. ‘‘కాస్తైనా కనికరం లేదా?!.. ఇంత నిర్దయగా బాదేస్తావా?!’’అంటూ జేమీ స్మిత్ సూపర్ బ్యాటింగ్ను కొనియాడాడు.కాగా 47 ఓవర్ల ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ ఐదు వికెట్ల నష్టానికి 249 పరుగులు సాధించింది. హ్యారీ బ్రూక్ 91 పరుగులతో ఉండగా.. జేమీ స్మిత్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. లీడ్స్ వేదికగా తొలి టెస్టు జరుగగా.. స్టోక్స్ బృందం చేతిలో గిల్ సేన ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇరుజట్ల మధ్య బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో బుధవారం రెండో టెస్టు మొదలైంది.చదవండి: కోహ్లి, అజారుద్దీన్ కాదు!.. భారత అత్యుత్తమ స్లిప్ ఫీల్డర్ ఎవరో తెలుసా? -
గిల్ భారీ డబుల్ సెంచరీ.. టెస్ట్ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు ఇవే..!
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ డబుల్ సెంచరీతో కదంతొక్కాడు. గిల్కు టెస్ట్ల్లో ఇదే తొలి డబుల్ సెంచరీ. ఈ డబుల్ సెంచరీతో గిల్ చాలా రికార్డులను తిరగరాశాడు.టెస్ట్ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన భారత కెప్టెన్గా.. ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారత కెప్టెన్గా.. సేనా దేశాల్లో (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆసియా కెప్టెన్గా.. ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక స్కోర్ చేసిన భారత ఆటగాడిగా.. సేనా దేశాల్లో 250 పరుగుల మార్కు తాకిన తొలి భారత ఆటగాడిగా పలు రికార్డులు నెలకొల్పాడు.గిల్ భారీ డబుల్ సెంచరీ అనంతరం క్రికెట్ అభిమానులు ఓ విషయంపై ఆరా తీయడం మొదలు పెట్టారు. సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఎవరిదని వెతకడం ప్రారంభించారు. అలాగే భారత్ తరఫున టెస్ట్ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఎవరిదని.. ఇందులో గిల్ స్థానం ఏంటని గూగుల్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో టెస్ట్ల్లో టాప్ 10 అత్యధిక వ్యక్తిగత స్కోర్లపై ఓ లుక్కేద్దాం. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా పేరిట ఉంది. లారా 2004లో ఆంటిగ్వాలో ఇంగ్లండ్పై 400 పరుగలు చేశాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో క్వాడ్రపుల్ సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా లారా కొనసాగుతున్నాడు.ఈ జాబితాలో లారా తర్వాతి స్థానంలో ఆసీస్ మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ఉన్నాడు. హేడెన్ 2003లో పెర్త్ మైదానంలో జింబాబ్వేపై 380 పరుగులు చేశాడు. దీనికి ముందు అత్యధిక స్కోర్ రికార్డు లారా పేరిటే ఉండింది. లారా 1994లో ఆంటిగ్వాలో ఇంగ్లండ్పై 375 పరుగులు చేశాడు. దాదాపు 9 ఏళ్లు లారా పేరిటే టెస్ట్ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు నమోదై ఉండింది.అయితే హేడెన్ 2003లో ఈ రికార్డును బద్దలు కొట్టాడు. హేడెన్ తన రికార్డును బద్దలు కొట్టిన ఏడాదిలోపే లారా క్వాడ్రాపుల్ సెంచరీ చేసి తిరిగి ఆ రికార్డును తన పేరిటే లిఖించుకున్నాడు.2006లో లారా రికార్డును శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్దనే బద్దలు కొడతాడని అంతా అనుకున్నారు. కొలొంబోలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో జయవర్దనే 374 పరుగులకు ఔటై లారా ఆల్టైమ్ రికార్డుకు 26 పరుగుల దూరంలో నిలిచిపోయాడు.లారా, హేడెన్, జయవర్దనేకు ముందు ఈ రికార్డు విండీస్ ఐకాన్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ పేరిట ఉండేది. 1958లో సోబర్స్ పాకిస్తాన్పై 365 పరుగులు చేశాడు. ఈ రికార్డు 36 ఏళ్ల పాటు సోబర్స్ ఖాతాలోనే ఉండింది. 1994లో తన దేశానికి చెందిన లారా ఈ రికార్డును బద్దలు కొట్టాడు.సోబర్స్కు ముందు ఈ రికార్డు ఇంగ్లండ్ దిగ్గజం లెన్ హటన్ ఖాతాలో ఉండింది. 1938లో అతను ఆస్ట్రేలియాపై 364 పరుగులు సాధించాడు. అప్పటివరకు ఈ రికార్డు మరో ఇంగ్లండ్ ఆటగాడు వాలీ హేమండ్ పేరిట ఉండింది. హేమండ్ 1933లో న్యూజిలాండ్పై 336 పరుగులు చేశాడు.టెస్ట్ల్లో ఏడో అత్యధిక వ్యక్తిగత స్కోర్ శ్రీలంక డాషింగ్ బ్యాటర్ సనత్ జయసూర్య పేరిట ఉంది. జయసూర్య 1997లో భారత్పై 340 పరుగులు చేశాడు. జయసూర్య తర్వాత ఈ రికార్డు పాకిస్తాన్ స్టయిలిష్ బ్యాటర్ యూనిస్ ఖాన్ పేరిట ఉంది. 2009లో యూనిస్ శ్రీలంకపై 313 పరుగులు చేశాడు. తొమ్మిదో స్థానంలో ఇంగ్లండ్ ఆటగాడు వాలీ హేమండ్ (336) ఉన్నాడు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక స్కోర్ చేసిన పదవ ఆటగాడిగా డేవిడ్ వార్నర్ ఉన్నాడు. వార్నర్ 2019లో పాకిస్తాన్పై 335 పరుగులు చేశాడు.ఓవరాల్గా టెస్ట్ క్రికెట్లో ఇప్పటివరకు 31 మంది ఆటగాళ్లు ట్రిపుల్ సెంచరీలు చేశారు. భారత్ తరఫున ఈ ఘనతను వీరేంద్ర సెహ్వాగ్ రెండు సార్లు.. ప్రస్తుతం ఇంగ్లండ్లో పర్యటిస్తున్న భారత జట్టు సభ్యుడు కరుణ్ నాయర్ ఓ సారి సాధించారు. భారత్ తరఫున టెస్ట్ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. సెహ్వాగ్ 2008లో సౌతాఫ్రికాపై 319 పరుగులు చేశాడు. భారత్ తరఫున రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్ కూడా సెహ్వాగ్ పేరిటే ఉంది. 2004లో సెహ్వాగ్ ముల్తాన్లో పాకిస్తాన్పై 309 పరుగులు చేశాడు. కరుణ్ విషయానికొస్తే.. ఇతను 2016లో ఇంగ్లండ్పై అజేయమైన 303 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో 269 పరుగులు చేసిన గిల్ టెస్ట్ల్లో భారత్ తరఫున ఏడో అత్యధిక వ్యక్తిగత స్కోర్ను నమోదు చేశాడు. ఓవరాల్గా టెస్ట్ క్రికెట్లో 61వ అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. -
జైసూ నేర్చుకోవాలి!.. భారత అత్యుత్తమ స్లిప్ ఫీల్డర్ ఎవరో తెలుసా?
క్రికెట్ ప్రపంచంలోని అత్యుత్తమ టెస్టు జట్లలో టీమిండియా ఒకటి. భారత జట్టు ఫీల్డింగ్ కూడా అదే స్థాయిలో గుర్తింపు పొందింది. ముఖ్యంగా స్లిప్స్, గల్లీ పాయింట్లో టీమిండియా ఫీల్డింగ్కు తిరుగులేదు. 2023 నుంచి ఇప్పటి వరకు భారత జట్టు ఈ పాయింట్లలో క్యాచ్లు పట్టడంలో 80.6 శాతం మేర విజయవంతమైంది.ఈ గణాంకాల జాబితాలో టీమిండియా తర్వాత న్యూజిలాండ్ 78.5 శాతం, శ్రీలంక 78.3 శాతంతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అయితే, ఇటీవల ఇంగ్లండ్తో తొలి టెస్టులో టీమిండియా ఏకంగా ఎనిమిది క్యాచ్లు నేలపాలు చేసిన విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టు చేతిలో గిల్ సేన ఓటమికి ఇదే ప్రధాన కారణమైంది.ఫీల్డింగ్ వైఫల్యంపై విమర్శలుఈ నేపథ్యంలో భారత జట్టు ఫీల్డింగ్ వైఫల్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా సీనియర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja)తో పాటు.. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)పై మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిలో జైసూ ఏకంగా నాలుగు క్యాచ్లు మిస్ చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. క్రిక్విజ్ కథనం ప్రకారం.. 2006 నుంచి ఉన్న డేటాను గమనిస్తే.. భారత్ ఇలా ఓ టెస్టు మ్యాచ్లో ఏకంగా ఎనిమిది క్యాచ్లు మిస్ చేయడం ఇది మూడోసారి. ఓవరాల్గా ఈ మ్యాచ్లో క్యాచ్లు పట్టడంలో 52.9 శాతం మాత్రమే విజయవంతమైంది.నిజానికి.. రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండుల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ ఆడుతున్న సమయంలో స్లిప్స్లో క్యాచ్లు అందుకోవడంలో భారత్ విజయశాతం అధికంగా ఉండేది. ముఖ్యంగా వీరిలో స్లిప్ ఫీల్డర్గా సక్సెస్ రేటు ఎక్కువగా ఉన్నది రాహుల్ ద్రవిడ్కే!..భారత అత్యుత్తమ స్లిప్ ఫీల్డర్ ఎవరో తెలుసా?స్లిప్లో ఫీల్డింగ్ చేయడం, క్యాచ్లు అందుకోవడం ఓ కళ. ఇందులో నంబర్ వన్ భారత ప్లేయర్గా ద్రవిడ్ పేరు చెప్పవచ్చని మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే చెప్పడం ఇందుకు నిదర్శనం. టెస్టు క్రికెట్లో ద్రవిడ్ స్లిప్స్ ఫీల్డర్గా ఏకంగా 210 క్యాచ్లు అందుకున్నాడు. ముఖ్యంగా స్పిన్నర్లు అటాకింగ్లో ఉన్నపుడు అతడు మరింత గొప్పగా రాణించేవాడు. ఓవరాల్గా టెస్టుల్లో ఇది రెండో అత్యుత్తమ ప్రదర్శన కాగా.. భారత క్రికెట్లో ద్రవిడ్దే అగ్రస్థానం.టీమిండియా మాజీ కోచ్ జాన్ రైట్ కూడా ద్రవిడ్ ఫీల్డింగ్ నైపుణ్యాల నుంచి గతంలో కొనియాడాడు. ‘‘2000 సంవత్సరంలో నేను టీమిండియా కోచ్గా బాధ్యతలు చేపట్టినప్పుడు తొలి టెస్టులోనే స్లిప్స్లో మూడు- నాలుగు క్యాచ్లు డ్రాప్ చేశాం.అయితే, ద్రవిడ్ ఫస్ట్ స్లిప్లోకి వచ్చిన తర్వాతే మా క్యాచింగ్ ప్రదర్శన మెరుగుపడింది. ముఖ్యంగా విదేశీ గడ్డపై అతడి వల్లే ఎక్కువ సక్సెస్ రేటు సాధించగలిగాం’’ అని జాన్ రైట్ ద్రవిడ్ను ప్రశంసించాడు.వీరు కూడా..ఇక ద్రవిడ్తో పాటు మాజీ కెప్టెన్లు మహ్మద్ అజారుద్దీన్, సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లి, అజింక్య రహానేలతో పాటు.. వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఈ ఫీల్డింగ్ పొజిషన్లో మెరుగ్గా రాణించాడు. ప్రస్తుతం అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ద్రవిడ్, అజారుద్దీన్ వంటి దిగ్గజాల ఫీల్డింగ్ వీడియోలు చూస్తే.. స్లిప్ ఫీల్డింగ్ ఎలా చేయాలో.. వారి వారసత్వాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో యువ ఆటగాళ్లకు అవగాహన వస్తుంది. తద్వారా ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకోవచ్చు. లేదంటే.. లీడ్స్ టెస్టు మాదిరి గెలవాల్సిన మ్యాచ్లో.. ఓటమి రూపంలో భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఇంగ్లండ్తో ఐదు టెస్టుల్లో భాగంగా తొలి మ్యాచ్లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.చదవండి: IND vs ENG 2nd Test: వైభవ్ సూర్యవంశీని పిలిపించిన బీసీసీఐ! -
ENG VS IND 2nd Test Day 3: ఇంగ్లండ్కు వరుస షాక్లు
ఎడ్జ్బాస్టన్ టెస్ట్ మూడో రోజు ఆట ప్రారంభం కాగానే టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ఇంగ్లండ్ను భారీ దెబ్బేశాడు. రెండో ఓవర్లోనే వరుస బంతుల్లో స్టార్ బ్యాటర్లు జో రూట్ (22), బెన్ స్టోక్స్లను (0) ఔట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 88 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. DSP SIRAJ HAS TAKEN CHARGE AT EDGBASTON 🥶 pic.twitter.com/ycxlvrtuMC— Johns. (@CricCrazyJohns) July 4, 2025ప్రస్తుతం హ్యారీ బ్రూక్ (31), జేమీ స్మిత్ (4) క్రీజ్లో ఉన్నారు. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంగ్లండ్ ఇంకా 499 పరుగులు వెనుకపడి ఉంది. భారత బౌలర్లలో సిరాజ్ 3, ఆకాశ్దీప్ 2 వికెట్లు తీశారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ గట్టెక్కలేదు.ముందు రోజు (రెండో రోజు) టీ విరామం తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. ఇంగ్లండ్కు ఇన్నింగ్స్ ప్రారంభించగానే వరుస షాక్లు తగిలాయి. బుమ్రా స్థానంలో ఈ మ్యాచ్ ఆడుతున్న ఆకాశ్దీప్ వరుస బంతుల్లో తొలి టెస్ట్ సెంచరీ హీరోలు బెన్ డకెట్, ఓలీ పోప్లను డకౌట్ చేశాడు. అప్పటికి ఇంగ్లండ్ స్కోర్ 13 పరుగులు మాత్రమే. 25 పరుగుల వద్ద ఇంగ్లండ్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సిరాజ్ బౌలింగ్లో కరుణ్ నాయర్ క్యాచ్ పట్టడంతో జాక్ క్రాలే (19) ఔటయ్యాడు.ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కెప్టెన్ శుభ్మన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీతో (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో 587 పరుగులకు ఆలౌటైంది.భారత ఇన్నింగ్స్లో గిల్తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. గిల్.. జడేజాతో ఆరో వికెట్కు 203 పరుగులు , వాషింగ్టన్ సుందర్తో (42) ఏడో వికెట్కు 144 పరుగులు జోడించాడు.మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1, ఆకాశ్దీప్ 6, సిరాజ్ 8, ప్రసిద్ద్ కృష్ణ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ తలో 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు. -
ENG VS IND 2nd Test: చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీతో (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో 587 పరుగులకు ఆలౌటైంది (తొలి ఇన్నింగ్స్లో).భారత ఇన్నింగ్స్లో గిల్తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. గిల్.. జడేజాతో ఆరో వికెట్కు 203 పరుగులు , వాషింగ్టన్ సుందర్తో (42) ఏడో వికెట్కు 144 పరుగులు జోడించాడు.మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1, ఆకాశ్దీప్ 6, సిరాజ్ 8, ప్రసిద్ద్ కృష్ణ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ తలో 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్కు ఆదిలోనే వరుస షాక్లు తగిలాయి. బుమ్రా స్థానంలో ఈ మ్యాచ్ ఆడుతున్న ఆకాశ్దీప్ వరుస బంతుల్లో తొలి టెస్ట్ సెంచరీ హీరోలు బెన్ డకెట్, ఓలీ పోప్లను డకౌట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 13 పరుగలకే 2 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 25 పరుగుల వద్ద ఇంగ్లండ్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సిరాజ్ బౌలింగ్లో కరుణ్ నాయర్ క్యాచ్ పట్టడంతో జాక్ క్రాలే (19) ఔటయ్యాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 3 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. రూట్ (18), బ్రూక్ (30) క్రీజ్లో ఉన్నారు.చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజాఈ మ్యాచ్లో గిల్తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాకు జీవం పోసిన జడేజా ఓ భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. 79 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అప్పటికే బౌలర్గా 132 వికెట్లు తీసిన జడ్డూ.. డబ్ల్యూటీసీలో 2000 పరుగులు, 100 వికెట్లు సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. డబ్ల్యూటీసీలో మొత్తం 41 మ్యాచ్లు ఆడిన జడేజా తాజా ఇన్నింగ్స్తో కలుపుకొని 39 సగటుతో 2010 పరుగులు చేశాడు.బౌలింగ్లో 25.92 సగటున 132 వికెట్లు తీశాడు.ఎడ్జ్బాస్టన్ అంటే చాలు పూనకాలు వస్తాయి..!రవీంద్ర జడేజాకు ఇంగ్లండ్లోని ఎడ్జ్బాస్టన్ మైదానం అంటే చాలు పూనకాలు వస్తాయి. జడ్డూ ఇక్కడ ఆడిన రెండు మ్యాచ్ల్లో మరపురాని ఇన్నింగ్స్లు ఆడాడు. 2022 పర్యటనలో సెంచరీ (194 బంతుల్లో 104; 13 ఫోర్లు) చేసిన జడ్డూ.. ఈసారి కూడా సెంచరీ చేసినంత పని చేశాడు. నాడు రిషబ్ పంత్తో కలిసి 222 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జడేజా.. తాజాగా గిల్తో కలిసి 203 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. -
కావాలనే ఖరాబ్ చేస్తున్నాడు!.. స్టోక్స్కు ఇచ్చిపడేసిన జడ్డూ
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) తనపై చేసిన ఆరోపణలపై టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) స్పందించాడు. తాను ఉద్దేశపూర్వకంగా పిచ్ మధ్యలోకి వెళ్లలేదని.. ఇంగ్లండ్ బౌలింగ్ విధానమే తనను అందుకు పురిగొల్పిందని పేర్కొన్నాడు. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా ఇంగ్లండ్ ఆటగాళ్లు పదే పదే అంపైర్ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశారని.. కానీ తాము మాత్రం ఇలాంటి తప్పులు చేయమని తెలిపాడు.కాగా ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య ఎడ్జ్బాస్టన్ వేదికగా బుధవారం రెండో టెస్టు మొదలైంది. ఇందులో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ భారీ డబుల్ సెంచరీ (269)తో పాటు రవీంద్ర జడేజా (89), యశస్వి జైస్వాల్ (87 అద్భుతంగా రాణించగా.. తొలి ఇన్నింగ్స్లో 587 పరుగులు చేసింది.అంపైర్కు ఫిర్యాదుఇక గురువారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా జడ్డూపై ఇంగ్లండ్ పేసర్ క్రిస్వోక్స్, కెప్టెన్ స్టోక్స్ పిచ్ను పాడుచేస్తున్నాడంటూ అంపైర్కు ఫిర్యాదు చేశారు. కావాలనే పదే పదే పిచ్ మధ్యలోకి పరిగెత్తుకు వచ్చి డ్యామేజ్ చేస్తున్నాడంటూ ఆరోపించారు.స్టోక్స్కు ఇచ్చిపడేసిన జడ్డూఇదే విషయంపై స్టోక్స్ జడ్డూతో.. ‘‘చూడు మేట్.. నువ్వేం చేస్తున్నావో కనబడుతోందా?’’ అంటూ మైదానంలోనే వాగ్వాదానికి దిగాడు కూడా!.. ఇందుకు జడ్డూ గట్టిగానే బదులిచ్చాడు. ‘‘నేను ఎక్కడి నుంచి వస్తున్నానో చూస్తూనే ఉన్నావు కదా!..నేనైతే ఇలాంటి ఏరియాల్లో బౌలింగ్ చేయను. అయినా నా దృష్టి మొత్తం ఇప్పుడు బ్యాటింగ్ మీదే ఉంది’’ అని కౌంటర్ ఇచ్చాడు. ఇక ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం జడేజా స్పందించాడు.మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘నేనేదో కావాలనే పిచ్ను తొక్కుతున్నట్లు వారు భావించారు. నిజానికి ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్ను ఎలా ఎదుర్కోవాలో నేను అదే పని చేశాను. కానీ వాళ్లు ప్రతిసారి అంపైర్ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశారు.నాకైతే పిచ్ మధ్యలోకి వెళ్లాలన్న ఉద్దేశం ఎంతమాత్రమూ లేదు. పరుగులు తీసే క్రమంలో నేను ముందుకు సాగిపోతూ ఉన్నానంతే!.. ఏదేమైనా నాకు అవకాశం వస్తే గనుక... నేను వాళ్లలా బౌల్ చేయను. సరైన లైన్ అండ్ లెంగ్త్తో.. సరైన చోటే బంతిని వేస్తాను’’ అని జడ్డూ చెప్పుకొచ్చాడు. కాగా గురువారం నాటి ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. చదవండి: IND vs ENG 2nd Test: వైభవ్ సూర్యవంశీని పిలిపించిన బీసీసీఐ! Sir Jadeja classic on the Stumps Mic. 😂 pic.twitter.com/SqhuVJqq4f— Mufaddal Vohra (@mufaddal_vohra) July 4, 2025 -
నైట్రైడర్స్ను చిత్తు చేసిన ఎంఐ న్యూయార్క్.. ప్లే ఆశలు సజీవం
మేజర్ లీగ్ క్రికెట్-2025 టోర్నీలో ఎంఐ న్యూయర్క్(MI New York) తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. శుక్రవారం ఫ్లోరిడా వేదికగా లాసెంజెల్స్ నైట్రైడర్స్తో జరిగిన డూఆర్డై మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో న్యూయర్క్ టీమ్ ఘన విజయం సాధించింది.ఈమ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన నైట్రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. నైట్రైడర్స్ బ్యాటర్లలో షెర్ఫెన్ రూథర్ఫర్డ్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ కరేబియన్ ఆటగాడు 44 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్లతో 86 పరుగులు చేశాడు.ఓవైపు వికెట్లు పడుతున్నా రూథర్ఫోర్డ్ మాత్రం తన దూకుడును కొనసాగించాడు. మిగితా నైట్రైడర్స్ బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. న్యూయర్క్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ నాలుగు వికెట్లు పడగొట్టి నైట్రైడర్స్ను దెబ్బతీశాడు. అతడితో పాటు పొలార్డ్ రెండు, ఇషాన్ అదిల్, కెంజిగె చెరో వికెట్ తీశారు. అనంతరం 155 పరుగుల లక్ష్యాన్ని న్యూయర్క్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో చేధించింది.ఓపెనర్ మోనాంక్ పటేల్ (56), కెప్టెన్ నికోలస్ పూరన్ (62 నాటాట్) హాఫ్ సెంచరీలతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. నైట్రైడర్స్ బౌలర్లు సునీల్ నరైన్, ఆండ్రూ రస్సెల్ చెరో వికెట్ తీశారు. ఎంఐ న్యూయర్క్ ప్లే ఆఫ్స్కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్లో గెలిచి రన్రేట్ను మెరుగుపరుచుకోవాలి. అంతేకాకుండా సీటెల్ ఓర్కాస్ టీమ్ మిగిలిన రెండు మ్యాచ్లలో ఓడిపోవాలి. అప్పుడే పూరన్ సేన నాలుగో జట్టుగా ప్లే ఆఫ్స్కు ఆర్హత సాధిస్తోంది. -
ఏం చూస్తున్నావు?.. వేగంగా పరిగెత్తలేవా?: ఆకాశ్ దీప్పై గిల్ ఫైర్!
ఇంగ్లండ్తో రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) అద్భుత ఇన్నింగ్స్తో దుమ్ములేపాడు. ఎడ్జ్బాస్టన్లో తొలి రోజు బాదిన శతకాన్ని ప్రిన్స్.. రెండో రోజు ఆట సందర్భంగా దానిని డబుల్ సెంచరీ (Double Century)గా మలిచాడు. మొత్తంగా 387 బంతులు ఎదుర్కొన్న గిల్.. 30 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 269 పరుగులు సాధించాడు. తద్వారా రికార్డుల మోత మోగించాడు.ఎడ్జ్బాస్టన్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత కెప్టెన్, ఆటగాడిగా గిల్ చరిత్రకెక్కాడు. ఈ నేపథ్యంలో గిల్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత టెస్టు క్రికెట్లో ప్రిన్స్ శకం మొదలైందంటూ అభిమానులు, మాజీ క్రికెటర్లు అతడిని ఆకాశానికెత్తుతున్నారు. మరోవైపు.. గిల్ తన ద్విశతకాన్ని ట్రిపుల్ సెంచరీగా మలిస్తే ఇంకా బాగుండేదంటూ కాస్త నిరాశకు లోనవుతున్నారు..@ShubmanGill rewrites the record books in England! 👑📚✅ First Asian captain to score a double century in SENA✅ First visiting captain to score 200 in England since 2003✅ Only the third Indian to score a double century in England!#ENGvIND 👉 2nd TEST, Day 2 | LIVE NOW… pic.twitter.com/VoVrRQT8VT— Star Sports (@StarSportsIndia) July 3, 2025 ఇదిలా ఉంటే.. డబుల్ సెంచరీ వీరుడు గిల్ రెండో రోజు బ్యాటింగ్ చేస్తున్న సందర్భంగా సహనం కోల్పోయాడు. తొలి రోజు నుంచి.. రెండో రోజు వరకు దాదాపు ఐదు సెషన్లలోనూ ఓపికగా ఉన్న గిల్కు కోపం రావడానికి కారణం భారత పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep).రనౌట్ రూపంలో బలయ్యేవారే!గురువారం నాటి రెండో రోజు ఆట టీ సమయానికి ముందు.. గిల్ చరిత్రాత్మక ట్రిపుల్ సెంచరీ దిశగా పయనిస్తున్న వేళ.. షోయబ్ బషీర్ బౌలింగ్ (139.5)లో మిడ్ వికెట్ మీదుగా గిల్ షాట్ బాదాడు. ఈ క్రమంలోనే అవతలి ఎండ్లో ఉన్న ఆకాశ్ దీప్ను పరుగుకు ఆహ్వానించాడు. కానీ అప్పుడు పరధ్యానంగా ఉన్న ఆకాశ్.. వెంటనే తేరుకుని డైవ్ కొట్టి ఎలాగోలా క్రీజులోకి చేరుకున్నాడు. లేదంటే ఎవరో ఒకరు రనౌట్ రూపంలో బలయ్యేవారే!pic.twitter.com/cXM1utO4a8— Nihari Korma (@NihariVsKorma) July 3, 2025ఏం చూస్తున్నావు?.. తొందరగా పరిగెత్తలేవా?దీంతో కోపోద్రిక్తుడైన గిల్.. ‘‘ఏం చూస్తున్నావు?.. తొందరగా పరిగెత్తలేవా?’’ అంటూ ఆకాశ్ దీప్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. ఇక అప్పటికి 260 పరుగుల వద్ద ఉన్న గిల్.. మరో తొమ్మిది రన్స్ తన స్కోరుకు జతచేసి జోష్ టంగ్ బౌలింగ్లో పోప్నకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరోవైపు.. ఆకాశ్ దీప్ ఆరు పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.ఇదిలా ఉంటే.. ఎడ్జ్బాస్టన్ వేదికగా రెండో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 587 పరుగుల మేర భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ భారీ ద్విశతకం (269) బాదగా.. యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89) కూడా అద్భుత ఇన్నింగ్స్ ఆడారు.చదవండి: IND vs ENG 2nd Test: వైభవ్ సూర్యవంశీని పిలిపించిన బీసీసీఐ! -
12 ఏళ్ల కిందట స్పాట్ ఫిక్సింగ్.. కట్ చేస్తే! ఇప్పుడు ఆ జట్టు హెడ్ కోచ్గా
ముంబై క్రికెట్ ఆసోయేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో నిషేదం ఎదుర్కొన్న మాజీ క్రికెటర్ అంకిత్ చవాన్(Ankeet Chavan)ను తమ అండర్-14 జట్టు ప్రధాన కోచ్గా ఎంసీఎ నియమించింది. ఐపీఎల్-2013 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తరపున ఆడినప్పుడు అజిత్ చండిలా, ఎస్ శ్రీశాంత్తో పాటు చవాన్ స్పాట్ ఫిక్సింగ్ పాల్పడ్డాడు.దీంతో అతడిపై బీసీసీఐ(BCCI) జీవితకాల నిషేదం విధించింది. కానీ 2021లో చవాన్ పై విధించిన నిషేధాన్ని బీసీసీఐ ఏడు సంవత్సరాలకు తగ్గించింది. దీంతో అతడు తిరిగి క్రికెట్లో వచ్చేందుకు అవకాశం లభించింది. అంకిత్ ప్రస్తుతం ముంబైలో కర్ణాటక స్పోర్ట్స్ క్లబ్ తరపున క్లబ్ క్రికెట్ ఆడుతున్నాడు.ఈ క్రమంలో లెవల్-1 కోచింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో.. ఇప్పుడు ముంబై అండర్-14 హెడ్కోచ్గా ఎంపికయ్యాడు. చవాన్ తన కెరీర్లో 18 ఫస్ట్-క్లాస్ మ్యాచ్లు, 20 లిస్ట్-ఎ మ్యాచ్లు, 13 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. హెడ్కోచ్గా ఎంపికైన అనంతరం చవాన్ స్పందించాడు."నాకు ఇది రెండో ఇన్నింగ్స్. నా సరికొత్త ప్రయాణాన్ని ఆరంభించేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాను. జీవితంలో తిరిగి కమ్బ్యాక్ ఇచ్చేంందుకు ఎల్లప్పుడూ అవకాశం ఉంటుంది. నాపై నమ్మకం ఉంచినందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.కోచింగ్ అంటే నాకు ఎంతో ఇష్టం. అండర్-14 స్థాయిలో, ఆటగాళ్ల ఆటను మెరుగుపరచడంలో నావంతు కృషి చేస్తాను" అని ఇండియన్ ఎక్స్ప్రెస్తో చవాన్ పేర్కొన్నాడు. మరోవైపు ముంబై సీనియర్ జట్టు హెడ్కోచ్గా ఓంకార్ సాల్వి కొనసాగనున్నాడు.చదవండి: IND vs ENG: ఇలాంటి తప్పెలా చేశావు గిల్?.. యువీ తండ్రి అసంతృప్తి! -
సంచలనాల మోత.. టాప్ సీడ్లకు ఊహించని షాకులు
టెన్నిస్ సీజన్ మూడో గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ వింబుల్డన్లో ఈ ఏడాది సంచలనాల మోత కొనసాగుతోంది. ముఖ్యంగా మహిళల సింగిల్స్ విభాగంలో టైటిల్ ఫేవరెట్స్ అనూహ్య పరాజయాలతో ఇంటిదారి పడుతున్నారు. ఇప్పటికే రెండో సీడ్ కోకో గాఫ్, మూడో సీడ్ జెస్సికా పెగూలా, ఐదో సీడ్ కిన్వెన్ జెంగ్, తొమ్మిదో సీడ్ పౌలా బదోసా తొలి రౌండ్లోనే నిష్క్రమించగా... తాజాగా వీరి సరసన గత ఏడాది రన్నరప్, నాలుగో సీడ్ జాస్మిన్ పావోలిని చేరింది. రష్యాకు చెందిన ప్రపంచ 80వ ర్యాంకర్, అన్సీడెడ్ కామిలా రఖిమోవా అద్భుత ఆటతో పావోలిని ఆట కట్టించి మూడో రౌండ్లోకి దూసుకెళ్లింది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ క్రెజికోవా (చెక్ రిపబ్లిక్), మాజీ నంబర్వన్ నయోమి ఒసాకా (జపాన్) మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. లండన్: గత ఏడాది రెండు గ్రాండ్స్లామ్ టైటిల్స్కు గెలుపు దూరంలో ఉండిపోయిన ఇటలీ టెన్నిస్ స్టార్ జాస్మిన్ పావోలినికి ఈ సీజన్ కలిసి రావడం లేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్లో మూడో రౌండ్లో వెనుదిరిగిన పావోలిని... ఫ్రెంచ్ ఓపెన్లో నాలుగో రౌండ్లో ఓడిపోగా... తాజాగా వింబుల్డన్ టోర్నీలో రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. రష్యాకు చెందిన అన్సీడెడ్ క్రీడాకారిణి, ప్రపంచ 80వ ర్యాంకర్ కామిలా రఖిమోవా 4–6, 6–4, 6–4తో ప్రపంచ ఐదో ర్యాంకర్, నాలుగో సీడ్ పావోలినిపై సంచలన విజయం సాధించింది.తద్వారా తన కెరీర్లో మూడోసారి ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో మూడో రౌండ్కు చేరుకుంది. గత ఏడాది ఫ్రెంచ్ఓపెన్ ఫైనల్లో స్వియాటెక్ చేతిలో... వింబుల్డన్ టోర్నీ ఫైనల్లో క్రెజికోవా చేతిలో ఓడిపోయి రన్నరప్గా నిలిచిన పావోలిని ఈ ఏడాది మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. రఖిమోవాతోజరిగిన పోరులో తొలి సెట్ను నెగ్గిన పావోలిని ఆ తర్వాత తడబడింది. 2 గంటల 19 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో పావోలిని 40 అనవసర తప్పిదాలు చేసి, 23 విన్నర్స్ కొట్టింది. తన సరీ్వస్ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేసింది. రఖిమోవా 26 విన్నర్స్ కొట్టింది. నెట్ వద్దకు 12 సార్లు దూసుకొచ్చి ఎనిమిదిసార్లు పాయింట్లు గెలిచింది. స్వియాటెక్ ముందంజ... మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ క్రెజికోవా (చెక్ రిపబ్లిక్), మాజీ నంబర్వన్ నయోమి ఒసాకా (జపాన్), ఏడో సీడ్ మిరా ఆంద్రీవా (రష్యా), ఎనిమిదో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్), మాజీ చాంపియన్ రిబాకినా (కజకిస్తాన్), పదో సీడ్ ఎమ్మా నవారో (అమెరికా) మూడో రౌండ్లోకి ప్రవేశించారు. రెండో రౌండ్ మ్యాచ్ల్లో క్రెజికోవా 6–4, 3–6, 6–2తో డొలెహిడి (అమెరికా)పై, ఒసాకా 6–3, 6–2తో సినియకోవా (చెక్ రిపబ్లిక్)పై, ఆంద్రీవా 6–1, 7–6 (7/4)తో బ్రాన్జెట్టి (ఇటలీ)పై, రిబాకినా 6–3, 6–1తో సాకరి (గ్రీస్)పై, నవారో 6–1, 6–2తో కుదెర్మెటోవా (రష్యా)పై, స్వియాటెక్ 5–7, 6–2, 6–1తో కేటీ మెక్నాలీ (అమెరికా)పై గెలిచారు. బాలాజీ జోడీ బోణీ పురుషుల డబుల్స్ విభాగంలో శ్రీరామ్ బాలాజీ (భారత్)–వరేలా (మెక్సికో) జోడీ శుభారంభం చేసింది. తొలి రౌండ్లో బాలాజీ–వరేలా ద్వయం 6–4, 6–4 తో లెర్నర్ టియెన్–కొవాసెవిక్ (అమెరికా) జంటను ఓడించింది. జొకోవిచ్... వరుసగా 16వసారి పురుషుల సింగిల్స్ విభాగంలో ఏడుసార్లు చాంపియన్, సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ వరుసగా 16వ సారి వింబుల్డన్ టోర్నీలో మూడో రౌండ్కు చేరుకున్నాడు. గత ఆరు పర్యాయాల్లో ఫైనల్ చేరిన జొకోవిచ్... గురువారం జరిగిన రెండో రౌండ్లో అలవోకగా గెలిచాడు. 1 గంటా 47 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో జొకోవిచ్ 6–3, 6–2, 6–0తో డేనియల్ ఇవాన్స్ (బ్రిటన్)పై గెలుపొందాడు. 11 ఏస్లు కొట్టిన జొకోవిచ్ రెండు డబుల్ ఫాల్ట్లు చేశాడు. 26 సార్లు నెట్ వద్దకు దూసుకొచ్చి 23 సార్లు పాయింట్లు గెలిచాడు. తన సర్వీస్ను ఒక్కసారి కూడా చేజార్చుకోని జొకోవిచ్ ప్రత్యర్థి సర్వీస్స్ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. -
ఇలాంటి తప్పెలా చేశావు గిల్?.. యువీ తండ్రి అసంతృప్తి!
టీమిండియా కెప్టెన్, డబుల్ సెంచూరియాన్ శుబ్మన్ గిల్( Shubman Gill)పై మాజీ క్రికెటర్ యువరాజ్ తండ్రి యోగరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో గిల్ ట్రిపుల్ సెంచరీ చేసే అవకాశం కోల్పోవడం పట్ల యోగరాజ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.ఈ మ్యాచ్లో గిల్ ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. 387 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్స్లతో 269 పరుగులు చేశాడు. తన మొదటి ట్రిపుల్ సెంచరీకి 31 పరుగుల దూరంలో శుబ్మన్ నిలిచిపోయాడు. ఇంగ్లండ్ పేసర్ జోష్ టాంగ్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి తన వికెట్ను కోల్పోయాడు."యువరాజ్ సింగ్(Yuvraj Singh) తన కెరీర్లో ఏమి సాధించాడో, దానిని ఆటగాళ్లకు శిక్షణ రూపంలో అందించడం చాలా సంతోషంగా ఉంది. శుబ్మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్షదీప్ సింగ్ వంటి యువ ఆటగాళ్లను యువరాజ్ తన శిక్షణతో రాటుదేల్చాడు. ఈ మ్యాచ్లో శుబ్మన్ 200 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, అతను 250 పరుగులు చేసి నాటౌట్గా ఉండాలని నేను కోరుకున్నాను.250 పరుగుల మార్క్ చేరుకున్నాక ట్రిపుల్ సెంచరీ చేసి ఆజేయంగా ఉండాలని ఆశించాను. కానీ గిల్ అంతలోనే గిల్ ఔట్ కావడంతో నేను బాధపడ్డాను. యువరాజ్ కూడా నిరాశచెందాడు. అంత భారీ స్కోర్ సాధించాక అలా ఔట్ కావడం పెద్దం నేరం. రెండు వందులు అవ్వొచ్చు, మూడు వందలు అవ్చొచ్చు ఏదైనా కానీ నాటౌట్గా ఉంటే మన తప్పిదాలను సరిదిద్దుకోవచ్చు.ఇక శుబ్మన్ గిల్ కోసం చాలా మంది చాలా విషయాలు మాట్లాడారు. వారందరికి ఒక్క విషయం చెప్పాలనకుంటున్నాను. దయచేసి మీరు క్రికెటర్ కాకపోతే, ఆ విషయం గురించి మాట్లాడకండి. గిల్ ఒక టాప్ క్లాస్ ప్లేయర్. గిల్కు 400 పరుగులు చేసే సత్తా కూడా ఉంది" అని ఎన్ఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగరాజ్ పేర్కొన్నాడు.చదవండి: 'ఇదంతా అతడి వల్లే'.. గిల్ డబుల్ సెంచరీ వెనక మాస్టర్ మైండ్ -
IND vs ENG 2nd Test: వైభవ్ సూర్యవంశీని పిలిపించిన బీసీసీఐ!
ఇంగ్లండ్తో రెండో టెస్టులో టీమిండియా అదరగొడుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గిల్ సేన.. మొదటి ఇన్నింగ్స్లో 587 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఎడ్జ్బాస్టన్ వేదికగా కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) భారీ ద్విశతకం (269)తో చెలరేగగా.. రవీంద్ర జడేజా (Ravindra Jadeja- 89), యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal- 87) అర్ధ శతకాలతో రాణించారు. 510 పరుగుల ఆధిక్యంవీరికి తోడుగా వాషింగ్టన్ సుందర్ (42) మెరుగ్గా ఆడగా కరుణ్ నాయర్ (31) కూడా ఈసారి కాస్త ఫర్వాలేదనిపించాడు. ఇక బ్యాటింగ్లో అదరగొట్టిన భారత్.. బౌలింగ్లోనూ రాణిస్తోంది. గురువారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి మూడు వికెట్లు తీసిన టీమిండియా.. ఇంగ్లండ్ను 77 పరుగులకు పరిమితం చేసింది. తద్వారా ప్రస్తుతం 510 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.అరుదైన రికార్డులుఇక రెండో రోజు ఆటలో హైలైట్ గిల్ డబుల్ సెంచరీ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎడ్జ్బాస్టన్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన భారత బ్యాటర్గా నిలవడంతో పాటు.. ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్గానూ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి పేరిట ఉన్న ఆల్టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు.అంతేకాదు.. SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో టెస్టుల్లో అత్యధిక స్కోరు సాధించిన ఆసియా తొలి కెప్టెన్గానూ గిల్ చరిత్రకెక్కాడు. వీటితో పాటు మరెన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు.ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో వైభవ్ ప్రత్యక్షంఇక గిల్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ను భారత క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా ప్రత్యక్షంగా వీక్షించాడు. ఓవైపు గిల్కు సంబంధించిన మరుపురాని మధుర క్షణాలను ఒడిసిపడుతూనే.. స్టాండ్స్లో వైభవ్పై కూడా కెమెరామెన్ ఫోకస్ చేశాడు. ఈ నేపథ్యంలో ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో వైభవ్ సూర్యవంశీ మ్యాచ్ను వీక్షిస్తున్న ఫొటోలు వైరల్గా మారాయి.కాగా ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్ తరఫున సంచలన శతకం సాధించిన వైభవ్ సూర్యవంశీ.. ప్రస్తుతం ఇంగ్లండ్లో భారత అండర్-19 జట్టు తరఫునా మెరుపులు మెరిపిస్తున్నాడు. ఇంగ్లండ్తో యూత్ వన్డేల్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.తొలి యూత్ వన్డేలో 19 బంతుల్లోనే 48 పరుగులతో రాణించిన వైభవ్.. రెండో వన్డేలో 34 బంతుల్లో 45 రన్స్ చేశాడు. తాజాగా మూడో వన్డేలో 31 బంతుల్లోనే 81 పరుగులతో దుమ్ములేపాడు. ఇక నాలుగో యూత్ వన్డే జూలై 5న జరుగనుండగా.. ఆఖరిదైన ఐదో మ్యాచ్ జూలై 7న జరుగనుంది.యువ జట్టును పిలిపించిన బీసీసీఐఇక నార్తాంప్టన్లో మూడో యూత్వన్డే ముగిసిన తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI).. ఆయుశ్ మాత్రే సారథ్యంలోని యువ జట్టును ఎడ్జ్బాస్టన్కు పిలిపించింది. సీనియర్ల ఆటను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పించింది. ఈ క్రమంలో గిల్ ఐకానిక్ ఇన్నింగ్స్ను వీక్షించిన వైభవ్ సూర్యవంశీ.. ‘‘మనదే ఆధిపత్యం’’ అంటూ గిల్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇక వైభవ్ను ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో చూసిన అభిమానులు త్వరలోనే అతడు టీమిండియాలో అరంగేట్రం చేయాలంటూ ఆకాంక్షిస్తున్నారు.చదవండి: WCL: భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా యువరాజ్ సింగ్Vaibhav Suryavanshi in the stands at the Edgbaston. pic.twitter.com/p7xMZoZdQf— Mufaddal Vohra (@mufaddal_vohra) July 3, 2025 -
'ఇదంతా అతడి వల్లే'.. గిల్ డబుల్ సెంచరీ వెనక మాస్టర్ మైండ్
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టు భారత కెప్టెన్ శుబ్మన్ గిల్కు తన కెరీర్లో చిర్మసరణీయంగా మిగిలిపోనుంది. ఈ మ్యాచ్లో గిల్ అద్బుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు. గిల్కు టెస్టుల్లో ఇదే తొలి డబుల్ సెంచరీ కావడం విశేషం.అంతేకాకుండా టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత కెప్టెన్గా విరాట్ కోహ్లి రికార్డును గిల్ బద్దలు కొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో 387 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్స్లతో 269 పరుగులు చేశాడు. అయితే హెడ్కోచ్ గౌతం గంభీర్ సలహాతోనే ఈ మారథాన్ ఇన్నింగ్స్ ఆడినట్లు గిల్ వెల్లడించాడు."తొలి రోజు ఆటలో లంచ్ బ్రేక్కు వెళ్లేముందు నేను క్రీజులోకి వచ్చాను. ఆ తర్వాత టీ సమయానికి నేను 100 బంతులు ఆడి 35 పరుగులు మాత్రమే చేశాను. ఆ సమయంలో డ్రెస్సింగ్ రూమ్కి వెళ్లి గౌతమ్ గంభీర్ భాయ్తో మాట్లాడాను. నేను బౌండరీలు కొట్టలేకపోతున్నాని, ఫీల్డర్ల గ్యాప్ చూసుకుని ఆడుతున్నానని అతడితో చెప్పాను. అందుకు బదులుగా గౌతీ భాయ్ నన్ను క్రీజులో నిలదొక్కకోమని చెప్పాడు. వీలైనంత ఎక్కువ సేపు క్రీజులో ఉంటే పరుగులు వాటింతట అవే వస్తాయి అని అతడు అన్నాడు. ఇక ఐపీఎల్ ఆఖరిలో నా బ్యాటింగ్ టెక్నిక్పై తీవ్రంగా శ్రమించాను. నా ఫుట్ మూమెంట్, ఏ బంతులను ఆడాలో ఎంచుకోవడంపై ఎక్కువగా దృష్టిసారించాను.ప్రతీ మ్యాచ్లోనూ నేను బాగానే బ్యాటింగ్ చేస్తున్నాను. కానీ 30-40 పరుగుల మధ్య ఔటయ్యేవాడిని. అందుకే ఈ సారి నా బ్యాటింగ్ను ఆస్వాదించాలనుకున్నాను. అందుకు తగ్గట్టు నెట్స్లో కూడా ప్రాక్టీస్ చేశాను. టీ20 ఫార్మాట్లో ఆడి ఒక్కసారిగా టెస్టుల్లోకి తిరిగి రావడం కష్టం.మన మైండ్సెట్ను మార్చుకోని ఆడాలి. వైట్బాల్ క్రికెట్ పూర్తి భిన్నం. అందుకే ఐపీఎల్-2025 నుంచే రెడ్బాల్ క్రికెట్తో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాను" అని రెండో రోజు ఆట అనంతరం విలేకరుల సమావేశంలో గిల్ పేర్కొన్నాడు.ఇక భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 587 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత ఇన్నింగ్స్లో గిల్తో పాటు యశస్వి జైశ్వాల్( 87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది.చదవండి: ENG vs IND: ట్రిపుల్ సెంచరీ మిస్.. ఇంగ్లండ్ ఆటగాడి ట్రాప్లో పడ్డ గిల్! వీడియో -
ట్రిపుల్ సెంచరీ మిస్.. ఇంగ్లండ్ ఆటగాడి ట్రాప్లో పడ్డ గిల్! వీడియో
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 387 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్స్లతో 269 పరుగులు చేశాడు. ఈ మారథాన్ ఇన్నింగ్స్తో టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత కెప్టెన్గా విరాట్ కోహ్లి(254) రికార్డును గిల్ బ్రేక్ చేశాడు.ఓ దశలో గిల్ ట్రిపుల్ సెంచరీ మార్క్ను కూడా అందుకునేలా కన్పించాడు. అయితే సమయంలో ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మైండ్ గేమ్స్ మొదలు పెట్టాడు. టీ విరామం తర్వాత 265 పరుగుల మార్కును దాటి బ్యాటింగ్ చేస్తున్న శుబ్మన్ గిల్ ఏకగ్రాతను దెబ్బతీసేందుకు బ్రూక్ ప్రయత్నించాడు.స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న హ్యారీ బ్రూక్.. గిల్తో తన ట్రిపుల్ సెంచరీ కోసం చర్చించాడు. 143 ఓవర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. గిల్-బ్రూక్ మధ్య జరిగిన సంభాషణ స్టంప్ మైక్లో రికార్డు అయింది. అయితే ఇద్దరి మాటలు అంత క్లారిటీగా బయటకు వినిపించడం లేదు.ఈ క్రమంలో కామెంటరీ బాక్స్ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ అథర్టన్.. ఆ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను వివరించాడు. "290 పరుగుల వద్ద ఆడటం చాలా కష్టం" అని బ్రూక్ అనగా, "నీ కెరీర్లో ఎన్ని ట్రిపుల్ సెంచరీలు చేశావ్? అని గిల్ బదులు ఇచ్చినట్లు అథర్టన్ తెలిపారు.ఇది జరిగిన తర్వాత ఓవరే గిల్ తన వికెట్ను కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలవుతోంది. కాగా హ్యారీ బ్రూక్ పేరిట ఓ టెస్టు ట్రిపుల్ సెంచరీ ఉంది. గతేడాది పాకిస్తాన్తో జరిగిన టెస్టులో బ్రూక్ 317 పరుగులు చేశాడు.ఇక భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 587 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత ఇన్నింగ్స్లో గిల్తో పాటు యశస్వి జైశ్వాల్( 87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది.pic.twitter.com/PKokKBCd4R— The Game Changer (@TheGame_26) July 3, 2025 -
భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా యువరాజ్ సింగ్
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) సీజన్ 2 కోసం ఇండియా ఛాంపియన్స్ మెనెజ్మెంట్ తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్గా లెజెండరీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ మరోసారి ఎంపికయ్యాడు. 2024లో అరంగేట్ర ఎడిషన్లో యువీ సారథ్యంలోనే భారత జట్టు విజేతగా నిలిచింది.ఇక ఈ 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో శిఖర్ ధావన్, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, యూసుఫ్ పఠాన్ వంటి దిగ్గజాలు ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో ఇండియా జట్టు సమతుల్యంగా కన్పిస్తోంది.పేస్ బౌలింగ్ విభాగంలో వరుణ్ ఆరోన్, సిద్ధార్థ్ కౌల్, వినయ్ కుమార్ చోటు దక్కించుకోగా.. స్పిన్ బాధ్యతలు హర్భజన్, పియూష్ చావ్లా, పవన్ నేగి నిర్వహించనున్నారు. ఇక బ్యాటింగ్ లైనప్లో యువీ, ధావన్, సురేష్ రైనా వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు.తొలి పోరు పాక్తోనే..ఇక డబ్ల్యూసీఎల్ సెకెండ్ సీజన్ జూలై 18 నుండి ఆగస్టు 2 వరకు ఇంగ్లండ్లోని నాలుగు వేదికలలో జరగనుంది. ఎడ్జ్బాస్టన్ (బర్మింగ్హామ్), కౌంటీ గ్రౌండ్ (నార్తాంప్టన్), గ్రేస్ రోడ్ (లీసెస్టర్), హెడింగ్లీ (లీడ్స్) మైదానాలు ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమివ్వనున్నాయి.ఈ టోర్నీలో భారత్, ఇంగ్లండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మొత్తం ఆరు జట్లు పాల్గోనున్నాయి. ఈ మెగా ఈవెంట్ రౌండ్-రాబిన్ లీగ్ ఫార్మాట్లో జరగనుంది. పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్దానాల్లో నిలిచే జట్లు సెమీ-ఫైనల్స్కు చేరుకుంటాయి. ఇక ఇండియా ఛాంపియన్స్ తమ తొలి మ్యాచ్లో జూలై 20న పాకిస్తాన్తో తలపడనుంది.ఇండియా ఛాంపియన్స్ జట్టుయువరాజ్ సింగ్ (కెప్టెన్), శిఖర్ ధావన్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, హర్భజన్ సింగ్, పీయూష్ చావ్లా, స్టువర్ట్ బిన్నీ, గురుకీరత్ మాన్, వినయ్ కుమార్, సిద్దార్థ్ కౌల్, వరుణ్ ఆరోన్, అభిమన్యు మిథున్, పవన్ నేగి మిథున్ -
వెస్టిండీస్తో రెండో టెస్టు.. 286 పరుగులకు ఆసీస్ ఆలౌట్
సెయింట్ జార్జెస్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా టాపార్డర్ విఫలమైంది. . ఓపెనర్లు సామ్ కొన్స్టాస్ (37 బంతుల్లో 25; 4 ఫోర్లు), ఉస్మాన్ ఖ్వాజా (29 బంతుల్లో 16; 2 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోగా... స్టీవ్ స్మిత్ (3), కామెరూన్ గ్రీన్ (37 బంతుల్లో 26; 4 ఫోర్లు), ట్రావిస్ హెడ్ (43 బంతుల్లో 29; 3 ఫోర్లు) పెవిలియన్కు వరుస కట్టారు. అయితే బ్యూ వెబ్స్టెర్(60), అలెక్స్ కారీ(63) మరోసారి హాఫ్ సెంచరీలతో ఆసీస్ను ఆదుకున్నారు. దీంతో ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్లో 286 పరుగులు చేయగల్గింది. వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ 4 వికెట్లు పడగొట్టగా... సీల్స్ రెండు, షామార్ జోసెఫ్, ఫిలిప్ తలా ఒక వికెట్ తీశారు. అయితే వెలుతురు లేమి కారణంగా తొలి రోజు కేవలం 66.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. రెండో రోజు ఆటలో విండీస్ తమ తొలి ఇన్నింగ్స్ను ఆరంభించనుంది.బ్రాత్వైట్ 100వ టెస్టు వెస్టిండీస్ మాజీ కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్వైట్ ఈ మ్యాచ్ ద్వారా వంద టెస్టులు ఆడిన పదో కరీబియన్ ప్లేయర్గా రికార్డుల్లోకెక్కాడు. ఫ్రాంచైజీ క్రికెట్ ప్రభావంతో జాతీయ జట్టు కన్నా లీగ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న విండీస్ ప్లేయర్ల మధ్య బ్రాత్వైట్ ఈ ఘనత అందుకోవడం విశేషం.జాతీయ జట్టు తరఫున ఒక్క మ్యాచ్ ఆడినా చాలు అనే లక్ష్యంతో క్రికెట్ను కెరీర్గా ఎంచుకున్న బ్రాత్వైట్... సుదీర్ఘ ఫార్మాట్పై మక్కువతో టి20ల జోలికి వెళ్లకుండా ఈ స్థాయికి చేరుకున్నాడు.చదవండి: #Shubman Gill: టెస్టు క్రికెట్కు సరికొత్త రారాజు.. ఇంక అంతా 'శుభ్' మయం -
ఇంగ్లండ్తో మూడో టీ20.. తొలిసిరీస్ విజయంపై భారత్ కన్ను
ఇంగ్లండ్ పర్యటనకు వచ్చిన భారత మహిళల జట్టు మొదట సన్నాహకంగా ఈసీబీ డెవలప్మెంట్ టీమ్తో రెండు మ్యాచ్లాడింది. ఈ రెండు మ్యాచ్ల్లోనూ హర్మన్ప్రీత్ బృందం ఓడింది. అయితే అసలైన సిరీస్ మొదలుకాగానే అమ్మాయిల జట్టు అద్భుతంగా రాణిస్తోంది. వరుసగా ఓడిన జట్టే... ఇప్పుడు వరుసగా రెండు మ్యాచ్ల్ని గెలిచింది. ఇక ‘హ్యాట్రిక్’తో ఇంకో రెండు మ్యాచ్లుండగానే సిరీస్ను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో భారత మహిళల జట్టు బరిలోకి దిగుతోంది. ఇదే జరిగితే ఇంగ్లండ్ గడ్డపై అమ్మాయిలు సాధించే తొలి టి20 సిరీస్ కానుంది. మరోవైపు సొంతగడ్డపై వరుస పరాభవాల భారం ఒత్తిడి పెంచగా... తాజాగా అనుభవజ్ఞురాలైన కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ గాయంతో కీలకమైన మూడో మ్యాచ్కు దూరమైంది. ఇది ఆతిథ్య జట్టుకు మరింత ప్రతికూలమవగా... సిరీస్ను గెలిచేందుకు భారత్కు అనుకూలతనీయనుంది. రెగ్యులర్ కెపె్టన్ గైర్హాజరీతో టామీ బ్యూమౌంట్ జట్టును నడిపించనుంది. బ్రంట్ స్థానంలో మైయా బౌచియెర్ను ఎంపిక చేశారు. జోరుమీదున్న భారత్ విజయాలిచ్చి ఉత్సాహం, బ్యాటర్ల ఫామ్తో భారత అమ్మాయిల జట్టు జోరుమీదుంది. తొలి మ్యాచ్లో స్మృతి మంధాన చెలరేగితే... గత మ్యాచ్లో జెమీమా రోడ్రిగ్స్, అమన్జోత్ కౌర్ బ్యాటింగ్ బాధ్యతను పంచుకున్నారు. రిచా ఘోష్ కూడా మెరుపులు మెరిపించింది. వీరితో పాటు షఫాలీ వర్మ, దీప్తి శర్మలు కూడా ఫామ్లో ఉండటం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. బౌలింగ్లో తెలుగమ్మాయి శ్రీచరణి నిలకడగా ప్రత్యర్థి బ్యాటర్లను తిప్పేస్తోంది.తొలి మ్యాచ్లో 4 వికెట్లు తీసిన ఆంధ్ర స్పిన్నర్, రెండో మ్యాచ్లో రెండు కీలక వికెట్లతో ఇంగ్లండ్ వెన్నువిరిచింది. దీప్తి శర్మ, అమన్జోత్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి కూడా బౌలింగ్లో ఆకట్టుకుంటున్నారు. ఇన్ని సానుకూలాంశాల మధ్య మూడో విజయం సాధించడం హర్మన్ప్రీత్ బృందానికి ఏమంత కష్టం కానేకాదు. అన్నింటికి మించి ఆల్రౌండ్ సత్తాతో ఆతిథ్య జట్టును చిత్తు చేస్తున్న తీరు వచ్చే ఏడాది ఇక్కడ జరిగే టి20 ప్రపంచకప్కు ఎంతగానో దోహదం చేసే అవకాశాలున్నాయి. గెలిస్తేనే నిలిచేది! వరుస వైఫల్యాలకు తోడు రెగ్యులర్ కెపె్టన్ బ్రంట్ గాయంతో ఈ మ్యాచ్కు దూరమవడం ఇంగ్లండ్ను తీవ్రమైన ఒత్తిడిలోకి నెడుతోంది. పర్యాటక బ్యాటర్లేమో చెలరేగుతుంటే... సొంతగడ్డపై ఇంగ్లండ్ బ్యాటర్లు పరుగులు సాధించేందుకు ఆపసోపాలు పడుతున్నారు. గెలిస్తేనే సిరీస్లో నిలిచే దశలో ఒత్తిడిని తట్టుకొని ఏ మేరకు నెట్టుకురాగలరన్నది ప్రశ్నార్థకంగా మారింది. తొలి టి20లో ఆడిన బ్రంట్ అందుబాటులో లేదు. రెండు మ్యాచ్లో బ్యూమౌంట్ రాణించింది. వీరిద్దరు మినహా ఇంకెవరూ భారత బౌలర్లను ఎదుర్కోలేకపోతున్నారు. మూడో మ్యాచ్లోనూ ప్రత్యర్థి బౌలర్లదే పైచేయి అయితే మాత్రం మాంచెస్టర్ (నాలుగో మ్యాచ్ వేదిక) వెళ్లకముందే ఇక్కడే సిరీస్ను కోల్పోవడం ఖాయం. తుది జట్లు (అంచనా) భారత్: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ, జెమీమా, అమన్జోత్, రిచా ఘోష్, దీప్తిశర్మ, రాధా యాదవ్, అరుంధతి, స్నేహ్ రాణా, శ్రీచరణి.ఇంగ్లండ్: టామీ బ్యూమౌంట్ (కెప్టెన్), సోఫియా, డానీ వ్యాట్, మైయా బౌచియెర్, అమీ జోన్స్, అలైస్ క్యాప్సీ, అర్లాట్, సోఫీ ఎకిల్స్టోన్, లారెన్ ఫిలెర్, లారెన్ బెల్, లిన్సే స్మిత్. -
టెస్టు క్రికెట్కు సరికొత్త రారాజు.. ఇంక అంతా 'శుభ్' మయం
"ఈ సిరీస్లో నేను బెస్ట్ బ్యాటర్గా నిలుస్తా.. కెప్టెన్గా ఎటువంటి ఒత్తిడి తీసుకోను".. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు భారత యువ సారథి శుబ్మన్ గిల్ చెప్పిన మాటలివి. ఇప్పుడు అందుకు తగ్గట్టే దూసుకుపోతున్నాడు ఈ యువ రాజు.ఎవరైతే అతడిని కెప్టెన్గా ఎంపికచేయడాన్ని వ్యతిరేకించారో.. ఇప్పుడు వారితోనే శెభాష్ అనిపించుకుంటున్నాడు. కెప్టెన్గా తొలి టెస్టులోనే సెంచరీతో మెరిసిన గిల్.. ప్రస్తుతం ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఏకంగా ద్విశతకంతో మెరిశాడు.తన అసాధారణ ప్రదర్శనతో టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత కెప్టెన్గా చరిత్రను తిరగ రాశాడు. ఈ సిరీస్ ముందు వరకు ఇంగ్లండ్ గడ్డపై ఒక్క సెంచరీ కూడా చేయని శుబ్మన్.. ఇప్పుడు శతకాల మోత మ్రోగిస్తున్నాడు. ఇంతకుముందు ఒక్క లెక్క.. కెప్టెన్ అయ్యాక ఒక లెక్క అన్నట్లు గిల్ ప్రయాణం సాగుతోంది.జయహో నాయక..ఒక జట్టు నాయకుడికి ఉండవలసిన అన్ని లక్షణాలు గిల్కు ఉన్నాయి. జట్టు గెలిస్తే క్రెడిట్ తీసుకున్న వాడు నిజమైన కెప్టెన్ కాడు.. అదే జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ముందుకొచ్చి ఆదుకున్న వాడే నిజమైన లీడర్. ఇది గిల్కు సరిగ్గా సరిపోతుంది.తొలి టెస్టులో ఓటమికి నైతిక బాధ్యత వహించిన గిల్.. ఇప్పుడు ఎడ్జ్బాస్టన్లో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్ ఆరంభంలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును.. తన బాధ్యయుత ఆటతీరుతో ఆదుకున్నాడు.ఆచితూచి ఆడి భారత ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. తొలుత 100 బంతుల్లో కేవలం 25 పరుగులు మాత్రమే చేసిన ఈ పంజాబీ ఆటగాడు.. క్రీజులో నిలదొక్కొన్నాక ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. గిల్ తొలి టెస్టు డబుల్ సెంచరీ వెనక ఎంతో శ్రమ దాగి ఉంది. దాదాపు రెండు రోజుల పాటు ఎంతో ఓర్పు, నిబద్దతతో బ్యాటింగ్ చేసి జట్టును పటిష్ట స్ధితిలో నిలిపాడు. అతడి ఆటతీరుకు ప్రత్యర్ధి ఆటగాళ్లు సైతం ఫిదా అయిపోయారు. అప్పటిలో సచిన్, కోహ్లి.. భారత టెస్టు జట్టులో నాలుగో నంబర్కు ప్రత్యేక స్ధానం ఉంది. ఒక దశాబ్ధం క్రితం జోహన్నెస్బర్గ్లో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వదిలిపెట్టి వెళ్లిన నాలుగో నంబర్ స్ధానాన్ని లెజెండరీ విరాట్ కోహ్లి భర్తీ చేశాడు. ఆ స్ధానంలో దాదాపు పుష్కరకాలం పాటు విరాట్ కోహ్లి విజయవంతంగా కొనసాగాడు. విరాట్ తన అద్బుత ప్రదర్శనలతో మాస్టర్బ్లాస్టర్ను మరిపించాడు. ఇప్పుడు కింగ్ కోహ్లి వారసుడిగా అదే ఎంఆర్ఎఫ్( MRF) బ్యాట్తో 25 ఏళ్ల గిల్ బాధ్యతలు చేపట్టాడు. ఈ సిరీస్ ఆరంభానికి ముందు వరకు ఈ కీలకమైన స్దానంలో ఎవరి బ్యాటింగ్ వస్తారన్న చర్చ తీవ్ర స్ధాయిలో జరిగింది.కొంతమంది మాజీలు కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్ను నాలుగో స్ధానంలో బ్యాటింగ్ పంపాలని సూచించారు. కానీ కెప్టెన్ గిల్ మాత్రం విరాట్ కోహ్లి స్దానానికి తానే సరైనోడనని ముందుకు వచ్చాడు. అందుకు తగ్గట్టే ఆ స్ధానంలో ఆడిన తొలి ఇన్నింగ్స్లో శతక్కొట్టాడు. ఇప్పుడు రెండో టెస్టులో 269 పరుగులు చేసి సత్తాచాటాడు. ఓవరాల్గా గిల్ ఇప్పటివరకు 34 టెస్టులు ఆడి 40.65 సగటుతో 2317 పరుగులు చేశాడు.పట్టు బిగిస్తున్న భారత్..ఇక ఎడ్జ్బాస్టన్ టెస్టులో భారత్ పట్టు బిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. క్రీజులో హ్యారీ బ్రూక్(30), జో రూట్(18) ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాష్ దీప్ రెండు, సిరాజ్ ఒక్క వికెట్ సాధించారు. అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 587 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా ఇన్నింగ్స్లో గిల్తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. -
గిల్ రికార్డుల హోరు ఇంగ్లండ్ బేజారు
‘హెడింగ్లీలో నేను 147 పరుగులకే అవుటయ్యా... మరింత సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాల్సింది. తప్పుడు షాట్తో వెనుదిరిగా’... రెండో టెస్టుకు ముందు భారత జట్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ చెప్పిన మాట ఇది. తాను నిజంగా నిలబడి పట్టుదలగా ఆడితే ఎలా ఉంటుందో ఇప్పుడు అతను ఎడ్జ్బాస్టన్లో చూపించాడు. 8 గంటల 29 నిమిషాల అసాధారణ బ్యాటింగ్, ఎక్కడా చిన్న తప్పుకు కూడా అవకాశం ఇవ్వకుండా... 94 శాతం నియంత్రణతో కూడిన చక్కటి షాట్లతో గిల్ అదరగొట్టాడు... ఏకంగా 269 పరుగులు చేసి పలు రికార్డులను అలవోకగా అధిగమిస్తూ పోయాడు. గిల్కు జడేజా, వాషింగ్టన్ సుందర్ అండగా నిలవడంతో టీమిండియా భారీ స్కోరుతో ప్రత్యర్థికి సవాల్ విసిరింది. ఒక దశలో 211/5తో కష్టాల్లో నిలిచిన జట్టు చివరి 5 వికెట్లకు ఏకంగా 376 పరుగులు జోడించింది. ఆపై బుమ్రా లేని లోటును తీర్చేలా ఆకాశ్దీప్, సిరాజ్ చెలరేగిపోయి ఇంగ్లండ్ టాప్–3ని కుప్పకూల్చారు. మూడో రోజూ మన బౌలర్ల జోరు సాగితే టీమిండియాకు మ్యాచ్పై పట్టు చిక్కడం ఖాయం. బరి్మంగ్హామ్: ఇంగ్లండ్తో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులు చేసి కూడా ఓడిన భారత్ ఈసారి అంతకంటే మరింత భారీ స్కోరును నమోదు చేసింది. ఓవర్నైట్ స్కోరు 310/5తో ఆట కొనసాగించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 151 ఓవర్లలో 587 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ క్రికెట్లో స్టోక్స్–మెకల్లమ్ (బజ్బాల్) శకం మొదలైన తర్వాత ఆ జట్టుపై ప్రత్యర్థి సాధించిన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్స్లు) అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చగా, రవీంద్ర జడేజా (137 బంతుల్లో 89; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేజార్చుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ (103 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆరో వికెట్కు జడేజాతో 203 పరుగులు జోడించిన గిల్... ఏడో వికెట్కు సుందర్తో 144 పరుగులు జత చేశాడు. అనంతరం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 20 ఓవర్లలో 3 వికెట్లకు 77 పరుగులు చేసింది. ఫాలోఆన్ తప్పించుకునేందుకు కూడా ఆ జట్టు మరో 311 పరుగులు చేయాల్సి ఉంది. జడేజా చేజారిన సెంచరీ మ్యాచ్ రెండో రోజు తొలి బంతికి సింగిల్తో గిల్, జడేజా భాగస్వామ్యం 100 పరుగులకు చేరింది. అనంతరం 80 బంతుల్లో జడేజా అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా... ధాటిని పెంచిన గిల్ టెస్టుల్లో తన అత్యధిక స్కోరును అందుకోవడంతో పాటు కెరీర్లో తొలిసారి 150 పరుగులు (263 బంతుల్లో) దాటాడు. ఆ తర్వాత మరింత జోరు ప్రదర్శించిన వీరిద్దరు బషీర్ ఓవర్లో చెరో సిక్స్ బాదారు. ఇదే ఊపులో శతకం దిశగా దూసుకుపోయిన జడేజా దురదృష్టవశాత్తూ ఆ అవకాశం కోల్పోయాడు. టంగ్ వేసిన షార్ట్ బంతి నుంచి అతను తప్పించుకునే ప్రయత్నం చేయగా... గ్లవ్కు తగిలిన బంతి గాల్లోకి లేచి కీపర్ చేతుల్లో పడింది. దాంతో ద్విశతక భాగస్వామ్యానికి తెర పడింది. అనంతరం సుందర్ కూడా చక్కటి షాట్లతో గిల్కు తగిన సహకారం అందించాడు. తొలి సెషన్లో భారత్ 25 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోయి 109 రన్స్ చేసింది. కొనసాగిన జోరురెండో సెషన్లో గిల్ మరింత చెలరేగిపోయాడు. బషీర్ ఓవర్లో సిక్స్ కొట్టిన అతను టంగ్ ఓవర్లో రెండు ఫోర్లతో 195కు చేరుకున్నాడు. ఆ తర్వాత టంగ్ బౌలింగ్లోనే ఫైన్ లెగ్ దిశగా సింగిల్ తీయడంతో 311 బంతుల్లో గిల్ డబుల్ సెంచరీ పూర్తయింది. ఆపై 200 నుంచి 250 వరకు చేరేందుకు గిల్కు కేవలం 37 బంతులు (8 ఫోర్లు, 1 సిక్స్) సరిపోయాయి. ఈ క్రమంలో బ్రూక్ ఓవర్లో అతను వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. ఎట్టకేలకు సుందర్ను రూట్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్కు కాస్త ఊరట లభించింది. రెండో సెషన్లో భారత్ 31 ఓవర్లలో ఓవర్కు 4.6 రన్రేట్తో ఏకంగా 145 పరుగులు సాధించడం విశేషం. టీ విరామానంతరం ‘ట్రిపుల్’పై కన్నేసిన గిల్ను నిలువరించడంలో ఇంగ్లండ్ సఫలమైంది. టంగ్ వేసిన షార్ట్ పిచ్ బంతిని ఆడబోయి స్క్వేర్లెగ్లో సునాయాస క్యాచ్ ఇవ్వడంతో గిల్ అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది. మరో 13 పరుగుల తర్వాత భారత్ తమ చివరి 2 వికెట్లు కోల్పోయింది. టపటపా ప్రత్యర్థి చేసిన కొండంత స్కోరు కనిపిస్తుండగా ఒత్తిడిలో బరిలోకి దిగిన ఇంగ్లండ్ బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు. ఆకాశ్దీప్ చెలరేగిపోతూ వరుస బంతుల్లో డకెట్ (0), పోప్ (0)లను అవుట్ చేయడంతో ఇంగ్లండ్ ఒక్కసారిగా షాక్కు గురైంది. ఆ తర్వాత క్రాలీ (19)ని సిరాజ్ పెవిలియన్ పంపడంతో పరిస్థితి మరింత దిగజారింది. అయితే రూట్, బ్రూక్ పట్టుదలగా నిలబడి ఇంగ్లండ్ను ఆదు కున్నారు. ఆరంభంలో కొంత తడబడినా చివరకు 12.5 ఓవర్లు నిలిచి రోజును ముగించారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) స్మిత్ (బి) స్టోక్స్ 87; రాహుల్ (బి) వోక్స్ 2; కరుణ్ నాయర్ (సి) బ్రూక్ (బి) కార్స్ 31; గిల్ (సి) పోప్ (బి) టంగ్ 269; పంత్ (సి) క్రాలీ (బి) బషీర్ 25; నితీశ్ రెడ్డి (బి) వోక్స్ 1; జడేజా (సి) స్మిత్ (బి) టంగ్ 89; సుందర్ (బి) రూట్ 42; ఆకాశ్దీప్ (సి) డకెట్ (బి) బషీర్ 6; సిరాజ్ (స్టంప్డ్) స్మిత్ (బి) బషీర్ 8; ప్రసిధ్ (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 22; మొత్తం (151 ఓవర్లలో ఆలౌట్) 587. వికెట్ల పతనం: 1–15, 2–95, 3–161, 4–208, 5–211, 6–414, 7–558, 8–574, 9–574, 10–587. బౌలింగ్: వోక్స్ 25–6–81–2, కార్స్ 24–3–83–1, టంగ్ 28–2–119–2, స్టోక్స్ 19–0–74–1, బషీర్ 45–2–167–3, రూట్ 5–0–20–1, బ్రూక్ 5–0–31–0. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) నాయర్ (బి) సిరాజ్ 19; డకెట్ (సి) గిల్ (బి) ఆకాశ్దీప్ 0; పోప్ (సి) రాహుల్ (బి) ఆకాశ్దీప్ 0; రూట్ (బ్యాటింగ్) 18; బ్రూక్ (బ్యాటింగ్) 30; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 77. వికెట్ల పతనం: 1–13, 2–13, 3–25. బౌలింగ్: ఆకాశ్దీప్ 7–1–36–2, సిరాజ్ 7–2–21–1, ప్రసిధ్ కృష్ణ 3–0–11–0, నితీశ్ రెడ్డి 1–0–1–0, జడేజా 2–1–4–0. -
ENG VS IND 2nd Test Day 2: పట్టుబిగిస్తున్న భారత్
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో భారత్ తొలి ఇన్నింగ్స్లో 587 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ శుభ్మన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీ (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి భారత్కు భారీ స్కోర్ అందించాడు. భారత ఇన్నింగ్స్లో గిల్తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. గిల్.. జడేజాతో ఆరో వికెట్కు 203 పరుగులు , వాషింగ్టన్ సుందర్తో (42) ఏడో వికెట్కు 144 పరుగులు జోడించాడు.మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1, ఆకాశ్దీప్ 6, సిరాజ్ 8, ప్రసిద్ద్ కృష్ణ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ తలో 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు.వరుస షాక్లుఅనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. బుమ్రా స్థానంలో ఈ మ్యాచ్ ఆడుతున్న ఆకాశ్దీప్ నిప్పులు చెరిగాడు. వరుస బంతుల్లో తొలి టెస్ట్లో సెంచరీలు చేసిన బెన్ డకెట్, ఓలీ పోప్లను డకౌట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 13 పరుగలకే 2 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.మరో ఎదురుదెబ్బ13 పరుగుల వద్ద వరుస బంతుల్లో ఇన్ ఫామ్ బ్యాటర్లు డకెట్, పోప్ వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. 25 పరుగుల వద్ద జాక్ క్రాలే (19) ఔటయ్యాడు. సిరాజ్ బౌలింగ్లో కరుణ్ నాయర్ క్యాచ్ పట్టడంతో క్రాలే పెవిలియన్కు చేరాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. 20 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 77/3గా ఉంది. రూట్ (18), బ్రూక్ (30) క్రీజ్లో ఉన్నారు. -
ENG VS IND 2nd Test: నిప్పులు చెరిగిన ఆకాశ్దీప్, సిరాజ్.. పీకల్లోతు కష్టాల్లో ఇంగ్లండ్
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో భారత్ తొలి ఇన్నింగ్స్లో 587 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ శుభ్మన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీ (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి భారత్కు భారీ స్కోర్ అందించాడు. భారత ఇన్నింగ్స్లో గిల్తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. గిల్.. జడేజాతో ఆరో వికెట్కు 203 పరుగులు , వాషింగ్టన్ సుందర్తో (42) ఏడో వికెట్కు 144 పరుగులు జోడించాడు.మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1, ఆకాశ్దీప్ 6, సిరాజ్ 8, ప్రసిద్ద్ కృష్ణ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ తలో 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు.వరుస షాక్లుఅనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. బుమ్రా స్థానంలో ఈ మ్యాచ్ ఆడుతున్న ఆకాశ్దీప్ నిప్పులు చెరిగాడు. వరుస బంతుల్లో తొలి టెస్ట్లో సెంచరీలు చేసిన బెన్ డకెట్, ఓలీ పోప్లను డకౌట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 13 పరుగలకే 2 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.మరో ఎదురుదెబ్బ13 పరుగుల వద్ద వరుస బంతుల్లో ఇన్ ఫామ్ బ్యాటర్లు డకెట్, పోప్ వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. 25 పరుగుల వద్ద జాక్ క్రాలే (19) ఔటయ్యాడు. సిరాజ్ బౌలింగ్లో కరుణ్ నాయర్ క్యాచ్ పట్టడంతో క్రాలే పెవిలియన్కు చేరాడు. 10 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 33/3గా ఉంది. రూట్ (5), బ్రూక్ (5) క్రీజ్లో ఉన్నారు. -
ENG VS IND 2nd Test: గిల్ రికార్డు డబుల్ సెంచరీ.. టీమిండియా భారీ స్కోర్
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. రెండో రోజు టీ విరామం తర్వాత భారత తొలి ఇన్నింగ్స్ 587 పరుగుల వద్ద ముగిసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీ (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి భారత్కు ఈ స్థాయి స్కోర్ అందించాడు. ఈ మ్యాచ్లో భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి రోజు 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసిన భారత్.. ఇవాళ (రెండో రోజు) మరో 264 పరుగులు జోడించి మిగతా 5 వికెట్లు కోల్పోయింది. తొలి రోజే సెంచరీ పూర్తి చేసిన గిల్.. ఇవాళ డబుల్ సెంచరీ సాధించాడు.భారత ఇన్నింగ్స్లో గిల్తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. గిల్.. జడేజాతో ఆరో వికెట్కు 203 పరుగులు , వాషింగ్టన్ సుందర్తో (42) ఏడో వికెట్కు 144 పరుగులు జోడించాడు.మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1, ఆకాశ్దీప్ 6, సిరాజ్ 8, ప్రసిద్ద్ కృష్ణ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ తలో 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు.కాగా, ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత్ ఇంగ్లండ్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. లీడ్స్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. చివరి రోజు వరకు ఉత్కంఠగా సాగిన ఆ మ్యాచ్లో భారత్ 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయింది. ఆ మ్యాచ్లో భారత తరఫున ఐదు శతకాలు నమోదైనా ప్రయోజనం లేకుండా పోయింది. తొలి ఇన్నింగ్స్లో జైస్వాల్ (101), గిల్ (147), పంత్ (134).. రెండో ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ (137), పంత్ (118) శతకాలు చేశారు. -
భారీ డబుల్ సెంచరీ.. కోహ్లి ఆల్ టైమ్ రికార్డు బద్దలు కొట్టిన గిల్
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ భారీ డబుల్ సెంచరీ (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించి రికార్డులు తిరగరాశాడు. రెండో రోజు గిల్ టీ విరామం తర్వాత కాసేపటికే ఔటయ్యాడు. టంగ్ బౌలింగ్లో ఓలీ పోప్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ డబుల్ సెంచరీతో గిల్ చాలా రికార్డులు సాధించాడు.కోహ్లి ఆల్ టైమ్ రికార్డు బద్దలుఈ మ్యాచ్లో 269 పరుగులు చేసి ఔటైన గిల్.. టెస్ట్ల్లో అత్యధిక స్కోర్ చేసిన భారత కెప్టెన్గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉండేది. విరాట్ 2019లో సౌతాఫ్రికాపై 254 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్లో గిల్ కోహ్లి ఆల్టైమ్ రికార్డును బద్దలు కొట్టి టెస్ట్ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్గా అవతరించాడు. గిల్ కెప్టెన్గా తన మూడో ఇన్నింగ్స్లోనే ఈ ఘనత సాధించడం విశేషం.టెస్ట్ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 భారత కెప్టెన్లు..గిల్-269కోహ్లి-254 నాటౌట్ (2019)కోహ్లి-243 (2017)కోహ్లి-235 (2016)ధోని-224 (2013)టెస్ట్ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత ఆటగాళ్లు..వీరేందర్ సెహ్వాగ్ - 319వీరేందర్ సెహ్వాగ్ - 309కరుణ్ నాయర్ - 303*వీరేందర్ సెహ్వాగ్ - 293వీవీఎస్ లక్ష్మణ్ - 281రాహుల్ ద్రవిడ్ - 270శుభ్మన్ గిల్ - 269ఇంగ్లండ్లో 250+ స్కోర్లు సాధించిన పర్యాటక టెస్ట్ కెప్టెన్లు..311 - బాబ్ సింప్సన్ (AUS), ఓల్డ్ ట్రాఫోర్డ్, 1964277 - గ్రేమ్ స్మిత్ (SA), ఎడ్జ్బాస్టన్, 2003269 - శుభ్మన్ గిల్ (IND), ఎడ్జ్బాస్టన్, 2025259 - గ్రేమ్ స్మిత్ (SA), లార్డ్స్, 2003విదేశీ టెస్టుల్లో టీమిండియా తరపున 250+ స్కోర్లు చేసిన ఆటగాళ్లు..309 - వీరేంద్ర సెహ్వాగ్ vs PAK, ముల్తాన్, 2004270 - రాహుల్ ద్రవిడ్ vs PAK, రావల్పిండి, 2004269 - శుభ్మన్ గిల్ vs ENG, ఎడ్జ్బాస్టన్, 2025254 - వీరేంద్ర సెహ్వాగ్ vs PAK, లాహోర్, 2006గిల్ సాధించిన మరిన్ని రికార్డులు..ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారత కెప్టెన్.. సేనా దేశాల్లో (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆసియా కెప్టెన్..ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక స్కోర్ చేసిన భారత ఆటగాడు.. సేనా దేశాల్లో 250 పరుగుల మార్కు తాకిన తొలి భారత ఆటగాడు.. విదేశాల్లో డబుల్ సెంచరీ సాధించిన రెండో భారత కెప్టెన్.. ఇంగ్లండ్లో డబుల్ సెంచరీ సాధించిన మూడో భారత ఆటగాడు.. టెస్ట్ల్లో డబుల్ సెంచరీ సాధించిన ఆరో భారత కెప్టెన్మ్యాచ్ విషయానికొస్తే.. గిల్ రికార్డు డబుల్ సెంచరీతో చెలరేగడంతో భారత్ భారీ స్కోర్ చేసింది. గిల్ ఔటయ్యాక భారత్ అదే స్కోర్ వద్ద ఆకాశ్దీప్ (6) వికెట్ కూడా కోల్పోయింది. 149 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 583/9గా ఉంది. సిరాజ్ (7), ప్రసిద్ద్ కృష్ణ (2) క్రీజ్లో ఉన్నారు.యశస్వి జైస్వాల్ (87), కేఎల్ రాహుల్ (2), కరుణ్ నాయర్ (31), రిషబ్ పంత్ (25), నితీశ్ కుమార్ రెడ్డి (1), రవీంద్ర జడేజా (89), సుందర్ (42), గిల్ (269), ఆకాశ్దీప్ (6) ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, టంగ్, బషీర్ తలో 2 వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, రూట్ చెరో వికెట్ పడగొట్టారు. -
ENG VS IND 2nd Test: భారీ డబుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన శుభ్మన్ గిల్
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ భారీ డబుల్ సెంచరీతో (266) చెలరేగి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. రెండో రోజు లంచ్ తర్వాత గిల్ ఈ అరుదైన ఘనత సాధించాడు. గిల్కు టెస్ట్ల్లో ఇది తొలి డబుల్ సెంచరీ. ఈ మైలురాయిని గిల్ 311 బంతుల్లో చేరుకున్నాడు. ఈ డబుల్తో గిల్ పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు.ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారత కెప్టెన్గా.. సేనా దేశాల్లో (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆసియా కెప్టెన్గా..ఇంగ్లండ్లో డబుల్ సెంచరీ సాధించిన మూడో భారత ఆటగాడిగా.. ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక స్కోర్ చేసిన భారత ఆటగాడిగా.. టెస్ట్ల్లో డబుల్ సెంచరీ సాధించిన ఆరో భారత కెప్టెన్గా.. విదేశాల్లో డబుల్ సెంచరీ సాధించిన రెండో భారత కెప్టెన్గా.. సేనా దేశాల్లో 250 పరుగుల మార్కు తాకిన తొలి భారత ఆటగాడిగా.. టెస్ట్ల్లో అత్యధిక స్కోర్ చేసిన భారత కెప్టెన్గా పలు రికార్డులు సాధించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. గిల్ రికార్డు డబుల్ సెంచరీతో చెలరేగడంతో భారత్ ఇప్పటికే భారీ స్కోర్ చేసేసింది. డబుల్ సెంచరీ తర్వాత కూడా గిల్ జోరు కొనసాగుతుంది. 266 పరుగుల వద్ద గిల్ బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా ఆకాశ్దీప్ (0) క్రీజ్లో ఉన్నాడు. టీ విరామం సమయానికి భారత్ స్కోర్ 565/7గా ఉంది.310/5 స్కోర్ వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్.. లంచ్ విరామానికి ముందు రవీంద్ర జడేజా (137 బంతుల్లో 89; 10 ఫోర్లు, సిక్సర్) వికెట్ కోల్పోయింది. 41 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన జడేజా గిల్తో అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చాడు. గిల్-జడేజా ఆరో వికెట్కు 203 పరుగులు జోడించారు. అనంతరం గిల్, వాషింగ్టన్ సుందర్తో (42) కలిసి ఏడో వికెట్కు 144 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ తొలి రోజు ఆటలో యశస్వి జైస్వాల్ (87), కేఎల్ రాహుల్ (2), కరుణ్ నాయర్ (31), రిషబ్ పంత్ (25), నితీశ్ కుమార్ రెడ్డి (1) వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 2 వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, షోయబ్ బషీర్, జోష్ టంగ్ తలో వికెట్ పడగొట్టారు. -
IND vs ENG: గంభీర్ ఏం చేస్తున్నాడు?.. కుమార్ సంగక్కర ఫైర్
ఇంగ్లండ్తో రెండో టెస్టు నేపథ్యంలో టీమిండియా తీసుకున్న నిర్ణయాన్ని శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగర్కర విమర్శించాడు. సిరీస్ గెలవడం కంటే కూడా.. లార్డ్స్ టెస్టే ముఖ్యమా అంటూ భారత జట్టు నాయకత్వ తీరును ప్రశ్నించాడు. కాగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్కు వెళ్లిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య లీడ్స్ (Leeds Test)లోని హెడింగ్లీ మైదానంలో తొలి టెస్టు జరిగింది. ఇందులో గిల్ సేన.. స్టోక్స్ బృందం చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా సిరీస్లో 0-1తో వెనుకబడింది. ఇక టెస్టు జట్టు కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే శతక్కొట్టిన శుబ్మన్ గిల్కూ పరాజయం రూపంలో చేదు అనుభవమే మిగిలింది.విశ్రాంతి పేరిటకాగా భారత్ -ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా బుధవారం (జూలై 2) రెండో టెస్టు మొదలైంది. ఈ మ్యాచ్కు.. విశ్రాంతి పేరిట భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. పనిభారాన్ని తగ్గించే నిమిత్తం అతడిని ఇంగ్లండ్లో కేవలం మూడు టెస్టులే ఆడిస్తామన్న మేనేజ్మెంట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.ఇక టాస్ సందర్భంగా ఇదే విషయాన్ని మరోసారి పునరుద్ఘాటించిన కెప్టెన్ శుబ్మన్ గిల్.. లార్డ్స్లో జరిగే మూడో టెస్టులో బుమ్రాను ఆడిస్తామని చెప్పాడు. అక్కడి పిచ్ అనుకూలంగా ఉంటుంది కాబట్టి బుమ్రా తప్పక ఆడతాడని చెప్పాడు.విమర్శల వర్షంనిజానికి.. తొలి టెస్టుకు.. రెండో టెస్టుకు మధ్య వారం రోజుల విరామ సమయం దొరికింది. అయినప్పటికీ కీలక మ్యాచ్లో బుమ్రాకు విశ్రాంతినివ్వడాన్ని భారత మాజీ క్రికెటర్లు రవిశాస్త్రి, సునిల్ గావస్కర్ తదితరులు తప్పుబట్టారు. ఇక సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ అయితే.. టీమిండియా మేనేజ్మెంట్ తీరును తనదైన శైలిలో విమర్శించాడు.రొనాల్డో లేని పోర్చుగల్ మాదిరి‘‘ప్రపంచంలోని అత్యుత్తమ స్ట్రైకర్ అయిన రొనాల్డో లేకుండా పోర్చుగల్ బరిలోకి దిగితే ఎలా ఉంటుందో.. బుమ్రా లేని టీమిండియాకు కూడా అదే పరిస్థితి. నాకైతే ఏమీ అర్థం కావడం లేదు’’ అంటూ స్టెయిన్ చురకలు అంటించాడు. ఇక ఈ జాబితాలో తాజాగా.. శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార్ సంగక్కర కూడా చేరిపోయాడు.ఈ నిర్ణయం ఎవరిది?.. కోచ్ ఏం చేస్తున్నాడు?‘‘అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఎవరు తీసుకున్నారు? ఆటగాళ్లను, ఫిజియోలను సంప్రదించిన తర్వాతే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా? సిరీస్ గెలవడం కంటే లార్డ్స్ టెస్టే ముఖ్యమని మీరు భావిస్తున్నారా?బుమ్రాను మూడు టెస్టులే ఆడించాలని భావిస్తే.. 1-3-5 మాత్రమే ఎందుకు కావాలి? కావాల్సినంత విరామం దొరికింది.. విజయం కోసం జట్టు పరితపిస్తోంది. మరి అలాంటపుడు కోచ్ బుమ్రా దగ్గరకు వెళ్లి ఇదే విషయాన్ని అర్థమయ్యేట్లు చెప్పవచ్చు కదా!’’ అని కుమార్ సంగక్కర స్కై స్పోర్ట్స్తో వ్యాఖ్యానించాడు.కాగా ఇంగ్లండ్తో రెండో టెస్టులో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. బుమ్రాకు రెస్ట్ ఇవ్వడంతో పాటు.. సాయి సుదర్శన్, శార్దూల్ ఠాకూర్లపై వేటు వేసింది. ఈ ముగ్గురి స్థానాలను ఆకాశ్ దీప్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్లతో భర్తీ చేసింది.చదవండి: Ind vs Eng: ఇదేం తీరు?.. గిల్పై మండిపడ్డ గావస్కర్!.. గంగూలీ విమర్శలు -
భారత్కు రానున్న పాకిస్తాన్ జట్టు..!
ఇటీవల జరిగిన తీవ్ర పరిణామాల (పహల్గాం ఉగ్రదాడి, బదులుగా భారత్ ఆపరేషన్ సిందూర్) తర్వాత భారత్, పాక్ల మధ్య అన్ని విషయాల్లో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. క్రీడలకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి. పాక్తో ఏ క్రీడలో అయినా తలపడేందుకు భారత్ నిరాసక్తత వ్యక్తం చేస్తుంది.అయితే తాజాగా జరుగుతున్న ఓ ప్రచారం భారత క్రీడాభిమానులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆసియా కప్, జూనియర్ వరల్డ్కప్ టోర్నీల్లో పాల్గొనేందుకు పాకిస్తాన్ హాకీ జట్లు భారత్కు రానున్నాయట. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పాక్ హాకీ జట్లకు అనుమతి కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది.వచ్చే నెల (అగస్ట్) 27 నుంచి సెప్టెంబర్ 7 వరకు బీహార్లోని రాజ్గిర్లో ఆసియా కప్ జరుగనుంది. ఈ టోర్నీ కోసం 31 మంది సభ్యుల పాకిస్తాన్ జట్టుకు భారత్కు రానున్నట్లు సమాచారం. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఓ కీలక అధికారి ప్రముఖ క్రీడా వెబ్సైట్ స్పోర్ట్స్స్టార్కు చెప్పాడు. జూనియర్ హాకీ వరల్డ్కప్ నవంబర్ 28 నుంచి డిసెంబర్ 10 వరకు చెన్నై, మధురై నగరాల్లో జరుగనుంది. ఈ టోర్నీలో పాల్గొనేందుకు కూడా పాకిస్తాన్కు అనుమతి లభించినట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే, భారత్, పాకిస్తాన్ త్వరలో క్రికెట్ ఆసియా కప్లో కూడా తలపడాల్సి ఉంది. అయితే, ఈ విషయంపై బీసీసీఐ ఇప్పటివరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖను సంప్రదించలేదు. ఈ టోర్నీపై ఎలాంటి అధికారిక సమాచారమూ లేదు. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది క్రికెట్ ఆసియా కప్ సెప్టెంబర్ 5 నుంచి 21వ తేదీ వరకు యూఏఈలో జరగాల్సి ఉంది. ఈ టోర్నీ టీ20 ఫార్మాట్లో జరుగనుంది. భారత్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో టోర్నీ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. -
డబుల్ సెంచరీతో చెలరేగిన శుబ్మన్ గిల్
ఇంగ్లండ్తో రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఎడ్జ్బాస్టన్ వేదికగా అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకుంటున్న ఈ నాలుగో నంబర్ బ్యాటర్.. 311 బంతుల్లో 200 పరుగుల మార్కును అందుకున్నాడు. తద్వారా తన టెస్టు కెరీర్లో తొలి ద్విశతకం (Maiden Test Double Century)నమోదు చేయడంతో పాటు.. జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. కాగా గిల్ ఇన్నింగ్స్లో ప్రస్తుతానికి 21 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. అంతేకాదు.. ఎన్నో అరుదైన రికార్డులను కూడా గిల్ సొంతం చేసుకున్నాడు. టీమిండియా కెప్టెన్ హోదాలో టెస్టుల్లో ద్విశతకం బాదిన దిగ్గజాల సరసన గిల్ చేరాడు. గిల్ కంటే ముందు.. విరాట్ కోహ్లి ఏడుసార్లు ఈ ఫీట్ నమోదు చేయగా.. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్, మహేంద్ర సింగ్ ధోని ఒక్కో డబుల్ సెంచరీ బాదారు.విదేశీ గడ్డ మీద కోహ్లి తర్వాత..అదే విధంగా.. విదేశీ గడ్డ మీద విరాట్ కోహ్లి (Virat Kohli) తర్వాత టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన రెండో కెప్టెన్గానూ గిల్ చరిత్రకెక్కాడు. కోహ్లి 2016లో నార్త్ సౌండ్లో 200 పరుగులు సాధించాడు.👉అత్యంత పిన్న వయసులో టెస్టు డబుల్ సెంచరీ చేసిన భారత రెండో కెప్టెన్గానూ ఘనత.. ఈ జాబితాలో గిల్ కంటే ముందు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ ఉన్నాడు.🏏మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ- 1964లో ఢిల్లీ వేదికగా 23 ఏళ్ల 39 రోజుల వయసులో..🏏శుబ్మన్ గిల్- 2025లో ఎడ్జ్బాస్టన్ వేదికగా 25 ఏళ్ల 298 రోజుల వయసులో..🏏సచిన్ టెండుల్కర్- 1999లో అహ్మదాబాద్ వేదికగా 26 ఏళ్ల 189 రోజుల వయసులో..🏏విరాట్ కోహ్లి- 2016లో నార్త్ సౌండ్ వేదికగా 27 ఏళ్ల 260 రోజుల వయసులో...500 పరుగుల మార్కు దాటిన టీమిండియాఎడ్జ్బాస్టన్ వేదికగా ఓవైపు శుబ్మన్ గిల్ డబుల్ సెంచరీతో అదరగొట్టగా.. మరో ఎండ్ నుంచి వాషింగ్టన్ సుందర్ అతడికి సహకారం అందిస్తున్నాడు. 129 ఓవర్ల ఆట ముగిసేసరికి సుందర్ 24, గిల్ 231 పరుగులతో ఉండగా.. టీమిండియా స్కోరు: 510/6. అంతకు ముందు రవీంద్ర జడేజా అర్ధ శతకం (89) బాది అవుట్ కాగా.. తొలిరోజు ఓపెనర్ యశస్వి జైస్వాల్ (87) కూడా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.చదవండి: Ind vs Eng: ఇదేం తీరు?.. గిల్పై మండిపడ్డ గావస్కర్!.. గంగూలీ విమర్శలు -
భావోద్వేగంతో వీడ్కోలు పలికిన రొనాల్డో.. పోస్ట్ వైరల్
లివర్పూల్ ఫుట్బాల్ స్టార్ డియోగో జోటా (Diogo Jota) జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. 28 ఏళ్లకే ఈ పోర్చుగల్ ఫుట్బాలర్కు నూరేళ్లూ నిండాయి. స్పెయిన్లో జరిగిన ఘోర ర కారు ప్రమాదం అతడిని బలిగొంది. ఈ దుర్ఘటనలో జోటాతో పాటు అతడి తమ్ముడు ఆండ్రీ సిల్వా (25) కూడా మృత్యువాత పడ్డాడు.కాగా ఆండ్రీ కూడా అన్న మాదిరే ప్రొఫెషనల్ ఫుట్బాల్ ప్లేయర్. వీరిద్దరి దుర్మరణంతో ఫుట్బాల్ ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. ముఖ్యంగా పెళ్లైన పదిరోజులకే జోటా ఈ లోకాన్ని విడిచి శాశ్వతంగా వెళ్లిపోవడం.. అతడి భార్య రూటే కార్డొసోకు తీరని శోకాన్ని మిగిల్చింది. మర్చిపోలేని రోజుఇక చనిపోవడానికి కొన్ని గంటల ముందే జోటా.. తమ పెళ్లి వీడియోను షేర్ చేశాడు. ‘ఇది జీవితంలో మర్చిపోలేని రోజు’ అంటూ తన లవ్ లైఫ్లోని మధుర క్షణాలను అభిమానులతో పంచుకున్నాడు. వధూవరులుగా మారిన చిరకాల స్నేహితులు అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో ఉంగరాలు మార్చుకుని వివాహ బంధంతో ఒక్కటైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఈ వీడియోను చూసిన జోటా అభిమానులు తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు. ‘‘మీ ప్రేమను చూసి చూసి విధికి కన్నుకుట్టింది. వి మిస్ యూ’’ అంటూ జోటాకు సంతాపం తెలుపుతున్నారు. కాగా పది రోజుల క్రితమే.. తన చిన్ననాటి స్నేహితురాలు రూటేను జోటా పెళ్లి చేసుకున్నాడు. జోటాకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు సంతానం. View this post on Instagram A post shared by Diogo Jota (@diogoj_18) రొనాల్డో భావోద్వేగంపోర్చుగల్ దిగ్గజ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) సహచర ఆటగాడు జోటా దుర్మరణం పట్ల తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశాడు. ‘‘అసలు ఇది నిజమేనా?!.. ఇలాంటిది ఒకటి జరిగిందా?.. మనం ఇప్పుడే కదా జాతీయ జట్టులో కలిసి ఆడటం మొదలుపెట్టాము.మొన్ననే కదా నువ్వు పెళ్లి చేసుకున్నావు. నీ భార్య, పిల్లలు, కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. నువ్వు ఎల్లప్పుడూ వాళ్లతోనే ఉంటావని నాకు తెలుసు. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. డియోగో, ఆండ్రీ.. మీ ఇద్దరిని మేము చాలా మిస్సవుతాము’’ అంటూ రొనాల్డో భావోద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు. డియోగో జోటా ఫొటో షేర్ చేస్తూ రొనాల్డో పెట్టిన ఈ పోస్టు కూడా పదికి పైగా మిలియన్ల వ్యూస్తో వైరల్గా మారింది.లివర్పూల్ తరఫున ఐదు టైటిళ్లులివర్పూల్ ఫుట్బాల్ క్లబ్ తరఫున డియోగో జోటా ప్రీమియర్ లీగ్తో పాటు రెండు నేషన్స్ లీగ్ టైటిళ్లు.. అదే విధంగా.. రెండు ఈఎఫ్ఎల్ టైటిళ్లూ గెలిచాడు. కాగా తమ స్టార్ ప్లేయర్ మృతి పట్ల లివర్పూల్ ఎఫ్సీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. డియోగో, ఆండ్రీ మరణం తమను తీవ్రంగా కలచివేసిందని.. ఇలాంటి క్లిష్ట సమయంలో వారి కుటుంబం ధైర్యంగా ఉండాలంటూ సంతాపం ప్రకటించింది. వారికి తాము ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపింది. View this post on Instagram A post shared by Cristiano Ronaldo (@cristiano) -
ENG VS IND 2nd Test: పాపం జడేజా.. తృటిలో సెంచరీ మిస్..!
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 310/5 స్కోర్ వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ లంచ్ విరామం సమయానికి 6 వికెట్ల నష్టానికి 419 పరుగులు చేసింది. 114 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు బరిలోకి దిగిన శుభ్మన్ గిల్ 150 పరుగులు పూర్తి చేసుకొని ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. 41 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన రవీంద్ర జడేజా 89 పరుగుల స్కోర్ (137 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్ సాయంతో) వద్ద ఔటయ్యాడు.జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన జడేజా గిల్తో అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చాడు. గిల్-జడేజా ఆరో వికెట్కు 203 పరుగులు జోడించారు. గిల్తో పాటు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన జడేజా సెంచరీ మిస్ చేసుకోవడంతో టీమిండియా అభిమానులు పాపం అంటున్నారు. తొలి టెస్ట్లో సామర్థ్యం మేరకు రాణించలేక (11, 25 నాటౌట్) విమర్శలు ఎదుర్కొన్న జడేజా ఈ మ్యాచ్లో తానేంటో నిరూపించుకున్నాడు. జోష్ టంగ్ బౌలింగ్లో వికెట్కీపర్ జేమీ స్మిత్కు క్యాచ్ ఇచ్చి జడేజా ఔటయ్యాడు. లంచ్ విరామం సమయానికి గిల్ 168, వాషింగ్టన్ సుందర్ (1) క్రీజ్లో ఉన్నారు. ఈ ఇన్నింగ్స్తో గిల్ విరాట్ కోహ్లి రికార్డును బద్దలు కొట్టాడు. ఎడ్జ్బాస్టన్ మైదానంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు (168) సాధించిన భారత క్రికెటర్గా అవతరించాడు. గతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లి (149) పేరిట ఉండేది. టెస్టుల్లో గిల్ 150 పరుగుల మార్కుకు చేరుకోవడం కూడా ఇదే తొలిసారి. ఇంగ్లండ్ గడ్డ మీద ఓ టెస్టు మ్యాచ్ ఇన్నింగ్స్లో నూట యాభైకి పైగా వ్యక్తిగత స్కోరు సాధించిన టీమిండియా రెండో కెప్టెన్గానూ గిల్ నిలిచాడు. 1990లో ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో మహ్మద్ అజారుద్దీన్ కెప్టెన్ హోదాలో 179 పరుగులు సాధించాడు. -
చరిత్ర తిరగరాసిన శుబ్మన్ గిల్.. అత్యధిక స్కోరుతో..
ఇంగ్లండ్తో రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) అద్భుత ప్రదర్శనతో దుమ్ములేపుతున్నాడు. తొలిరోజే శతకం పూర్తి చేసుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. గురువారం నాటి రెండో రోజు ఆటలో 150 పరుగుల మార్కు అందుకున్నాడు. 263 బంతుల్లో 17 ఫోర్ల సాయంతో గిల్ ఈ మేర స్కోరు చేశాడు.తద్వారా టీమిండియా దిగ్గజ బ్యాటర్, కెప్టెన్ విరాట్ కోహ్లి (Virat Kohli) పేరిట ఉన్న రికార్డును గిల్ బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్లోని ఎడ్జ్బాస్టన్ మైదానంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత క్రికెటర్గా అవతరించాడు. ఇంతకు ముందు 2018 నాటి టెస్టు మ్యాచ్లో కోహ్లి ఇదే వేదికపై 149 పరుగులు స్కోరు చేశాడు. తాజాగా గిల్ కోహ్లిని అధిగమించి ఎడ్జ్బాస్టన్లో చరిత్ర తిరగరాశాడు. ఇక టెస్టుల్లో గిల్ 150 పరుగుల మార్కుకు చేరుకోవడం ఇదే తొలిసారి.భారత రెండో కెప్టెన్గా..ఇంగ్లండ్ గడ్డ మీద ఓ టెస్టు మ్యాచ్ ఇన్నింగ్స్లో నూట యాభైకి పైగా వ్యక్తిగత స్కోరు సాధించిన టీమిండియా రెండో కెప్టెన్గానూ గిల్ నిలిచాడు. 1990లో ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో మహ్మద్ అజారుద్దీన్ కెప్టెన్ హోదాలో 179 పరుగులు సాధించాడు.మూడో సారథిగా..అదే విధంగా.. 26వ పడిలో అడుగుపెట్టక ముందే టెస్టు ఇన్నింగ్స్లో 150 పరుగుల మార్కు దాటిన భారత మూడో కెప్టెన్గానూ గిల్ చరిత్రకెక్కాడు. అతడి కంటే ముందు మన్సూర్ అలీఖాన్ పటౌడీ రెండుసార్లు ఈ ఘనత సాధించగా.. సచిన్ టెండుల్కర్ కూడా ఈ ఫీట్ నమోదు చేశాడు.కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడే నిమిత్తం భారత జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తోంది. ఈ సిరీస్తో గిల్ భారత టెస్టు జట్టు కెప్టెన్గా తన ప్రయాణం మొదలుపెట్టాడు. ఇక లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఐదు వికెట్లు తేడాతో ఓటమిపాలైంది.జడేజాతో కలిసి 200 పరుగుల భాగస్వామ్యంఈ క్రమంలో బుధవారం (జూలై 2) నుంచి ఎడ్జ్బాస్టన్ వేదికగా రెండో టెస్టు మొదలు కాగా.. టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్కు దిగింది. తొలి రోజు ఆట ముగిసే సరికి ఐదు వికెట్లు నష్టపోయి 310 పరుగులు చేసిన భారత్.. గురువారం నాటి రెండో రోజు 400 పరుగుల మార్కు దాటింది. 107 ఓవర్లుముగిసే సరికి గిల్ 164, జడేజా 88 పరుగులతో ఉన్నారు. ఇద్దరూ కలిసి 200 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి జట్టును ఆదుకున్నారు. అయితే, తన స్కోరుకు మరో పరుగు జతచేసిన తర్వాత జడ్డూ జోష్ టంగ్ బౌలింగ్లో వికెట్ కీపర్ జేమీ స్మిత్కు క్యాచ్ ఇచ్చి 89 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు.లంచ్ బ్రేక్ సమయానికి స్కోరు ఎంతంటే?గురువారం భోజన విరామ సమయానికి టీమిండియా స్కోరు: 419/6 (110). గిల్ 168, వాషింగ్టన్ సుందర్ ఒక పరుగుతో ఉన్నారు.చదవండి: ఇదేం సెలక్షన్?.. ఇచ్చిపడేసిన యశస్వి జైస్వాల్