breaking news
Sports
-
అరుంధతి రెడ్డికి ఘన స్వాగతం పలికిన తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ
ప్రపంచ మహిళా వరల్డ్ క్రికెట్ కప్ గెలుపులో తన వంతు కృషిచేసిన తెలంగాణ మహిళా క్రికెట్ క్రీడాకారిణి అరుంధతి రెడ్డికి నేడు శంషాబాద్ ఎయిర్పోర్టులో ఘన స్వాగతం లభించింది.తెలంగాణకు గర్వకారణంగా నిలిచిన అరుంధతి రెడ్డి ఇటీవల జరిగిన 2025 మహిళా వన్డే వరల్డ్ కప్లో భారత జట్టుకు విజయాన్ని అందించడంలో కృషి చేసింది. నవంబర్ 2న తొలిసారిగా ప్రపంచ కప్ను భారత మహిళల జట్టు గెలుచుకుంది. ఈ విజయానంతరం నేడు (నవంబర్ 6న) అరుంధతి హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా, కుటుంబ సభ్యులు, అభిమానులు, సన్నిహితులు పెద్ద ఎత్తున ఎయిర్పోర్టుకు వచ్చి ఆమెను అభినందించారు.ఇక తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండి డాక్టర్ సోనీ బాలాదేవి సైతం అరుంధతికి ఘన స్వాగతం పలికారు. -
టీమిండియాకు భారీ షాక్..
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ మళ్లీ గాయపడ్డాడు. బీసీసీఐ ఆఫ్ ఎక్స్లెన్స్ స్టేడియం వేదికగా రెండో అనాధికారిక టెస్టులో దక్షిణాఫ్రికా-ఎ, భారత్-ఎ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో ఇండియా-ఎ జట్టు సారథ్యం వహిస్తున్న పంత్ చేతి వేలికి గాయమైంది.రెండో రోజు ఆట ఆరంభంలో గ్రీన్ టాప్ పిచ్పై సఫారీ పేసర్లు నిప్పులు చెరిగారు. ఈ క్రమంలో భారత ఇన్నింగ్స్ 26 ఓవర్ వేసిన షెపో మోరెకి వేసిన ఓ రాకాసి బౌన్సర్ పంత్ చేతి వేలికి బలంగా తాకింది. దీంతో రిషబ్ నొప్పితో విల్లవిల్లాడు. వెంటనే ఫిజియో పరిగెత్తుకుంటూ వచ్చి చికిత్స అందించాడు. నొప్పిని భరిస్తూనే పంత్ తన బ్యాటింగ్ను కొనసాగించాడు. కానీ ఆ తర్వాత బంతికే పంత్ ఔటయ్యాడు. భారీ షాట్కు ప్రయత్నించి తన వికెట్ను కోల్పోయాడు. డ్రెస్సింగ్ రూమ్కు వెళ్తున్న క్రమంలో పంత్ కాస్త ఆసౌకర్యంగా కన్పించాడు. అయితే మూడో రోజు ఆటలో పంత్ ఫీల్డింగ్ వస్తాడో రాడో వేచి చూడాలి.కాగా దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు ఎంపిక చేసిన భారత జట్టులో పంత్ ఉన్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో గాయపడిన తర్వాత పంత్కు భారత్ తరపున ఇదే తొలిసారి. సఫారీలతో సిరీస్కు ముందు పంత్ గాయపడడం భారత జట్టు మెనెజ్మెంట్ను ఆందోళన కలిగిస్తోంది.చదవండి: జిడ్డు ఆటగాడి కోసం అతడిని బలి చేస్తావా? గంభీర్ ఇది నీకు న్యాయమేనా? -
వరల్డ్కప్ విన్నర్ దీప్తి శర్మకు భారీ షాక్..
యూపీ వారియర్జ్ (UP Warriorz) ఫ్రాంచైజీ సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళల ప్రీమియర్ లీగ్-2026 మెగా వేలానికి ముందు ఒక్క ప్లేయర్నే మాత్రమే రిటైన్ చేసుకుంది. అన్క్యాప్డ్ ఇండియన్ బ్యాటర్ శ్వేతా సెహ్రావత్ (Shweta Sehrawat)ను యూపీ అంటిపెట్టుకుంది.తమ జట్టు కెప్టెన్, భారత మహిళల జట్టు స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మను సైతం యూపీ వారియర్జ్ జట్టు నుంచి విడుదల చేసింది. నవంబర్ 27న ఢిల్లీ జరగనున్న వేలంలో దీప్తి పాల్గోనుంది. డబ్ల్యూపీఎల్ తొలి ఎడిషన్ నుంచి దీప్తీ శర్మ యూపీతో కొనసాగింది.ఈ వరల్డ్కప్ విన్నర్ను యూపీ ఫ్రాంచైజీ డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ వేలంలో రూ.2.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. మూడు సీజన్ల పాటు ఒకే జట్టు ప్రాతినిథ్యం వహించిన దీప్తీ.. ఇప్పుడు వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునుంది. అలిస్సా హీలీ, ఇంగ్లాండ్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ వంటి కీలక ఆటగాళ్లందరినీ యూపీ వారియర్జ్ రిలీజ్ చేసింది.యూపీ వారియర్జ్ వద్ద అత్యధికంగా రూ.14.5 కోట్లు పర్స్ బ్యాలెన్స్ ఉంది. అయితే యూపీ వద్ద నాలుగు 'రైట్ టు మ్యాచ్' (RTM) కార్డులు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించి దీప్తి శర్మను లేదా ఇతర స్టార్ ప్లేయర్లను తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.యూపీ వారియర్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్లుశ్వేతా సెహ్రావత్ (రూ. 50 లక్షలు)యూపీ వారియర్స్ రిలీజ్ చేసే ప్లేయర్లు వీరే..ఉమా ఛెత్రి ఆరుషి గోయెల్, పూనమ్ ఖెన్మార్, కిరణ్ నవగిరె, దినేశ్ వ్రింద, దీప్తి శర్మ, అంజలి శర్వాణి, క్రాంతి గౌడ్, రాజేశ్వరి గైక్వాడ్, గౌహర్ సుల్తానా, సైమా ఠాకూర్, చినెల్లి హెన్రి, జార్జియా వాల్, అలిసా హేలీ గ్రేస్ హ్యారిస్, అలనా కింగ్, చమరి ఆటపట్టు, తాహిలా మెగ్రాత్, సోఫీ ఎక్లిస్టోన్.చదవండి: వారిద్దరూ అద్భుతం.. గంభీర్, నేను ఒక్కటే: సూర్య కుమార్ -
జిడ్డు ఆటగాడి కోసం అతడిని బలి చేస్తావా? గంభీర్ ఇది నీకు న్యాయమేనా?
అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ తన మార్క్ను చూపించలేకపోతున్నాడు. దాదాపు ఏడాది పాటు భారత తరపున పొట్టి ఫార్మాట్కు దూరంగా ఉన్న గిల్.. ఈ ఏడాది ఆసియాకప్తో తిరిగి రీ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో అప్పటివరకు ఓపెనర్గా కొనసాగుతున్న సంజూ శాంసన్ను మిడిలార్డర్కు టీమ్మెనెజ్మెంట్ డిమోట్ చేసింది. అయితే తన టీ20 పునరాగమనంలో గిల్ మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించడం లేదు. ఆసియా కప్తో పాటు ఆస్ట్రేలియా టీ20 సిరీస్లోనూ విఫలమయ్యాడు. గురువారం క్వీన్స్లాండ్ వేదికగా ఆసీస్తో జరిగిన నాలుగో టీ20లో గిల్ 42 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచినప్పటికి.. అతడి జిడ్డు బ్యాటింగ్పై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ మ్యాచ్లో గిల్ 120 కంటే తక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. అతడు 39 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్తో 46 పరుగులు చేశాడు. తొలుత గిల్ పవర్ప్లేలో అభిషేక్ శర్మతో కలిసి కాస్త దూకుడా ఆడాడు. కానీ అభిషేక్ ఔటయ్యాక గిల్ బ్యాటింగ్ జోరు తగ్గింది. తను ఎదుర్కొన్న చివరి 21 బంతుల్లో కేవలం 20 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో గిల్ టీ20లకు సరిపోడని.. అతడికి బదులుగా జైశ్వాల్, సంజూ శాంసన్ ఎంతో బెటర్ అని నెటిజన్లు ఎక్స్లో పోస్ట్లు పెడుతున్నారు.గిల్ గణాంకాలు ఇవే..2023లో టీ20 అరంగేట్రం చేసిన శుభ్మన్ గిల్ ఇప్పటివరకు 32 ఇన్నింగ్స్లు ఆడి కేవలం 808 పరుగులు మాత్రమే చేశాడు. అతడి బ్యాటింగ్ సగటు 28.86 ఉండగా, స్ట్రయిక్రేట్ 139.32గా ఉంది. అతడి ఇన్నింగ్స్లలో ఒక సెంచరీతో పాటు మూడు హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. అయితే ఇదే ఫార్మాట్లో మరో ఓపెనర్ జైశ్వాల్ 22 ఇన్నింగ్స్లలో 36.15 యావరేజ్, 164.31 స్ట్రయిక్రేట్తో 723 పరుగులు చేశాడు. మరోవైపు సంజూ శాంసన్ సైతం ఓపెనర్గా వచ్చి అద్భుతాలు చేశాడు. ఓపెనర్గా కేవలం 13 ఇన్నింగ్స్లే ఆడినా సెంచరీలు మోత మ్రోగించాడు. 34.75 యావరేజ్, 182.89 స్ట్రయిక్రేట్తో 417 పరుగులు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ కూడా ఓపెనర్గా సత్తాచాటాడు. 9 మ్యాచ్లలో భారత్ ఓపెనర్గా బరిలోకి దిగిన గైక్వాడ్ ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలతో 365 పరుగులు చేశాడు. అందరికంటే రుతురాజ్( 60.83) సగటే ఎక్కువగా ఉంది. టీమిండియా మిగతా ఓపెనర్లతో గిల్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. ఒకవేళ ఇదే తీరును శుభ్మన్ కొనసాగిస్తే టీ20 జట్టు నుంచి పక్కన పెట్టే అవకాశముంది.చదవండి: -
WPL 2026: రిటైన్, రిలీజ్ చేసిన ఆటగాళ్ల పూర్తి జాబితా
మహిళల ప్రీమియర్ లీగ్ -2026 మెగా వేలానికి ముందు ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకునే, విడుదల చేసిన ప్లేయర్ల వివరాలు వెల్లడించాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ఐదుగురు క్రికెటర్లను రిటైన్ చేసుకోగా.. ముంబై ఇండియన్స్ కూడా ఐదుగురిని అట్టిపెట్టుకుంది. ఇందులో భారత్కు తొలి వన్డే వరల్డ్కప్ అందించిన కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) కూడా ఉంది.ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana)తో పాటు మరో ముగ్గురిని రిటైన్ చేసుకుంది. గుజరాత్ టైటాన్స్ ఇద్దరిని అట్టిపెట్టుకోగా.. యూపీ వారియర్స్ ఒక్కరిని మాత్రమే రిటైన్ చేసుకుని.. మిగతా అందరినీ విడుదల చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. కాగా భారత మహిళల జట్టు ఇటీవలే ఐసీసీ వన్డే వరల్డ్కప్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వేలంలోకి వస్తే హర్మన్, స్మృతి వంటి వారికి భారీ ధర దక్కుతుందనే అంచనాల నడుమ ఆయా జట్లు వీరిని రిటైన్ చేసుకోవడం గమనార్హం. కాగా నవంబరు 27న మెగా వేలం జరుగనుంది.రిటెన్షన్ లిస్టుఢిల్లీ క్యాపిటల్స్ షఫాలీ వర్మ (రూ. 2.20 కోట్లు)జెమీమా రోడ్రిగ్స్ (రూ. 2.20 కోట్లు)మరిజానే కాప్ (రూ. 2.20 కోట్లు)అనాబెల్ సదర్లాండ్ (రూ. 2.20 కోట్లు)నికీ ప్రసాద్ (రూ. 50 లక్షలు)ముంబై ఇండియన్స్నట్ సీవర్- బ్రంట్ (రూ. 3.50 కోట్లు)హర్మన్ప్రీత్ కౌర్ (రూ. 2.50 కోట్లు)హేలీ మాథ్యూస్ (రూ. 1.75 కోట్లు)అమన్జోత్ కౌర్ (రూ. 1 కోటి)గుణాలన్ కమిలిని (రూ. 50 లక్షలు)రాయల్ చాలెంజర్స్ బెంగళూరుస్మృతి మంధాన (రూ. 3.50 కోట్లు)రిచా ఘోష్ (రూ. 2.75 కోట్లు)ఎలిస్ పెర్రి (రూ. 2 కోట్లు)శ్రేయాంక పాటిల్ (రూ. 60 లక్షలు)గుజరాత్ జెయింట్స్ఆష్లే గార్డ్నర్ (రూ. 3.50 కోట్లు)బెత్ మూనీ (రూ. 2.50 కోట్లు)యూపీ వారియర్స్శ్వేతా సెహ్రావత్ (రూ. 50 లక్షలు)ఢిల్లీ క్యాపిటల్స్ వదిలేసిన ప్లేయర్లుతానియా భాటియా, నందిని కశ్యప్, స్నేహ దీప్తి, శిఖా పాండే, మిన్ను మణి, అరుంధతి రెడ్డి, టిటాస్ సాధు, శ్రీ చరణి, రాధా యాదవ్, మెగ్ లానింగ్, సారా బ్రైస్, అలిస్ క్యాప్సే, జెస్ జోనాసెన్.ముంబై ఇండియన్స్ వదిలేసిన ప్లేయర్లుయాస్తికా భాటియా, అమన్దీప్ కౌర్, క్లో ట్రయాన్, సజీవన్ సజన, సంస్కృతి గుప్తా, సైకా ఇషాక్, జింటిమణి కలిత, సత్యమూర్తి కీర్తన, అక్షితా మహేశ్వరి, పరుణికా సిసోడియా, పూజా వస్త్రాకర్, అమేలియా కెర్, నదీన్ డి క్లెర్క్, షబ్నిమ్ ఇస్మాయిల్.రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వదిలేసిన ప్లేయర్లుసబ్బినేని మేఘన, నుజాత్ పర్వీన్, కనికా అహుజా, రాఘవి బిస్త్, స్నేహ్ రానా, ఆశా శోభన, ఏక్తా బిష్త్, వీజే జోషిత, జాగ్రవి పవార్, ప్రేమ రావత్, రేణుకా సింగ్, డాని వ్యాట్-హాడ్జ్, చార్లీ డీన్, కిమ్ గార్త్, హీథర్ గ్రాహమ్ సోఫీ డివైన్, సోఫీ మొలినక్స్, జార్జియా వారేహమ్, కేట్ క్రాస్.గుజరాత్ జెయింట్స్ వదిలేసిన ప్లేయర్లుహర్లీన్ డియోల్, భారతీ ఫుల్మాలి, దయాళన్ హేమలత, సిమ్రాన్ షేక్, మన్నత్ కశ్యప్, సయాలీ సత్ఘరే, కశ్వీ గౌతమ్, తనూజా కన్వర్, మేఘనా సింగ్, ప్రకాశిక నాయక్, ప్రియా మిశ్రా, షబ్నమ్ షకిల్, ఫోబ్ లిచ్ఫీల్డ్, బెత్ మూనీ, లారా వోల్వర్ట్, డియోండ్రా డాటిన్, డేనియల్ గిబ్సన్.యూపీ వారియర్స్ఉమా ఛెత్రి ఆరుషి గోయెల్, పూనమ్ ఖెన్మార్, కిరణ్ నవగిరె, దినేశ్ వ్రింద, దీప్తి శర్మ, అంజలి శర్వాణి, క్రాంతి గౌడ్, రాజేశ్వరి గైక్వాడ్, గౌహర్ సుల్తానా, సైమా ఠాకూర్, చినెల్లి హెన్రి, జార్జియా వాల్, అలిసా హేలీ గ్రేస్ హ్యారిస్, అలనా కింగ్, చమరి ఆటపట్టు, తాహిలా మెగ్రాత్, సోఫీ ఎక్లిస్టోన్.చదవండి: క్రీజులోకి వెళ్లు.. నీ తల పగలకొడతా! -
వారిద్దరూ అద్భుతం.. గంభీర్, నేను ఒక్కటే: సూర్య కుమార్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసిది. గురువారం క్వీన్స్ల్యాండ్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో 48 పరుగుల తేడాతో ఆసీస్ను టీమిండియా చిత్తు చేసింది. దీంతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో 2-1 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన మెన్ ఇన్ బ్లూ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగుల స్కోరు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో ఆస్ట్రేలియాను 119 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ స్పందించాడు."సిరీస్లో ముందంజ వేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మా బ్యాటర్లకు క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నాను. ముఖ్యంగా అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. వారిద్దరూ మాకు పవర్ ప్లేలో మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ పిచ్పై 200 పైగా పరుగులు సాధించడం చాలా కష్టమని మా ఓపెనర్లు ముందే గ్రహించారు. అందుకే గిల్ ఆచితూచి ఆడాడు. బ్యాటింగ్లో దాదాపుగా ప్రతీ ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించారు. డగౌట్ నుంచి నుంచి కూడా మాకు ఎప్పటికప్పుడు సందేశాలు అందుతూ ఉన్నాయి. గౌతీ భాయ్(గంభీర్), నేను ఒకే అభిప్రాయంతో ఉన్నాము. మిడిల్ ఓవర్లలో శివమ్ దూబేను ఎటాక్లో తీసుకు రావాలని నిర్ణయించుకున్నాము. అందుకు తగ్గట్టే దూబే మాకు కీలక వికెట్లను అందించాడు. నిజంగా బౌలర్లు కూడా అద్భుతం చేశారు. మంచు ప్రభావం ఉన్నప్పటికి మా బౌలర్లు ఎక్కడ కూడా పట్టుకోల్పోలేదు. పిచ్ కండీషన్స్ తగ్గట్టు బౌలింగ్ చేశారు. మా జట్టులో నాలుగు ఓవర్లు కూడా బౌలింగ్ చేసే ఆల్రౌండర్లు ఉండడం గొప్ప విషయం. అయితే వారిని పరిస్థితుల బట్టి ఉపయోగిస్తాం. కొన్ని రోజులు వాషింగ్టన్ నాలుగు ఓవర్లు వేస్తే.. దూబే రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేస్తాడు. మరి కొన్ని మ్యాచ్లలో దూబే నాలుగు ఓవర్లు వేస్తే.. వాషింగ్టన్కు రెండు ఓవర్లే వస్తాయి. కానీ జట్టుకు ఏం అవసరమో అది అందించడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారని" పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో సూర్య పేర్కొన్నాడు.చదవండి: IND vs AUS: గంభీర్ పిచ్చి ప్రయోగం.. అట్టర్ ప్లాప్ -
IND vs SA: కేఎల్ రాహుల్, పంత్ ఫెయిల్.. శతక్కొట్టిన జురెల్
సౌతాఫ్రికా- ‘ఎ’తో అనధికారిక రెండో టెస్టులో భారత్ -‘ఎ’ (IND A vs SA- Day 1) మెరుగైన స్కోరు సాధించింది. పర్యాటక జట్టు బౌలర్లు ఆది నుంచే చెలరేగి.. టాపార్డర్ను కుదేలు చేయగా.. ఆరో నంబర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) శతక్కొట్టి జట్టును ఆదుకున్నాడు. కాగా బెంగళూరు వేదికగా భారత్- ‘ఎ’- సౌతాఫ్రికా- ‘ఎ’ జట్లు రెండు మ్యాచ్ల అనధికారిక టెస్టు సిరీస్లో తలపడుతున్న విషయం తెలిసిందే.టాస్ ఓడిన భారత్.. తొలుత బ్యాటింగ్ఇందులో భాగంగా తొలి టెస్టులో రిషభ్ పంత్ (Rishabh Pant) కెప్టెన్సీలోని భారత జట్టు ప్రొటిస్ జట్టును మూడు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గురువారం రెండో టెస్టు మొదలైంది. బెంగళూరులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా- ‘ఎ’ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్కు దిగింది.కేఎల్ రాహుల్, పంత్ ఫెయిల్ఇక ఈ మ్యాచ్తో జట్టులోకి వచ్చిన ఓపెనింగ్ బ్యాటర్లు కేఎల్ రాహుల్ (19), అభిమన్యు ఈశ్వరన్ (0) విఫలమయ్యారు. వన్డౌన్లో వచ్చిన సాయి సుదర్శన్ (17) నిరాశపరచగా.. దేవదత్ పడిక్కల్ (5) మరోసారి ఫెయిల్ అయ్యాడు.ఇలాంటి దశలో ఐదో నంబర్ ఆటగాడు, కెప్టెన్ రిషభ్ పంత్ జట్టును ఆదుకునే క్రమంలో వేగంగా ఆడాడు. మొత్తంగా 20 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 24 పరుగులు చేసిన పంత్.. షెపో మొరేకి బౌలింగ్లో ఎంజే అకెర్మన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.సౌతాఫ్రికా ఆనందం ఆవిరి చేసిన జురెల్దీంతో సౌతాఫ్రికా శిబిరం సంతోషంలో మునిగిపోయింది. హర్ష్ దూబే (14), ఆకాశ్ దీప్ (0)లను కూడా త్వరత్వరగా అవుట్ చేసింది. అయితే, వారి ప్రొటిస్ జట్టుకు ఆ ఆనందాన్ని ఎక్కువసేపు నిలవకుండా చేశాడు ధ్రువ్ జురెల్.సహచర ఆటగాళ్లు విఫలమైన చోట జురెల్ అద్భుత శతకంతో మెరిశాడు. మొత్తంగా 175 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 132 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖర్లో టెయిలెండర్లు కుల్దీప్ యాదవ్ (88 బంతుల్లో 20), మొహమ్మద్ సిరాజ్ (31 బంతుల్లో 15) వికెట్ పడకుండా జాగ్రత్తపడుతూ జురెల్కు సహకరించారు.భారత్ ఆలౌట్.. స్కోరెంతంటే?ఈ క్రమంలో 77.1 ఓవర్ వద్ద ప్రసిద్ కృష్ణ (0) పదో వికెట్గా వెనుదిరగడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసిపోయింది. తొలి రోజు పూర్తయ్యేసరికి77.1 ఓవర్లలో 255 పరుగులు చేసి భారత్ ఆలౌట్ అయింది. జురెల్ అద్భుత శతకం కారణంగా భారత జట్టుకు ఈ మేర మెరుగైన స్కోరు సాధ్యమైంది. ఇక సఫారీ జట్టు బౌలర్లలో టియాన్ వాన్ వారెన్ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. షెపో మొరేకి, ప్రెనేలన్ సుబ్రయాన్ చెరో రెండు, ఒకులే సిలీ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.భారత్- ‘ఎ’ వర్సెస్ సౌతాఫ్రికా -‘ఎ’ రెండో అనధికారిక టెస్టు తుదిజట్లుభారత్కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్ దేవ్దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రిషభ్ పంత్ (కెప్టెన్/వికెట్ కీపర్), హర్ష్ దూబే, ఆకాశ్ దీప్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.సౌతాఫ్రికాజోర్డాన్ హెర్మాన్, లిసెగో సెనొక్వనే తెంబా బవుమా, జుబేర్ హంజా, మార్వ్కెస్ అకెర్మన్ (కెప్టెన్), కొనొర్ ఎస్తర్హుజీన్ (వికెట్ కీపర్), టియాన్ వాన్ వారెన్, కైలీ సైమండ్స్, ప్రెనేలన్ సుబ్రయాన్, షెపో మొరేకి, ఒకులే సిలీ.చదవండి: క్రీజులోకి వెళ్లు.. నీ తల పగలకొడతా! -
విశ్వవిజేతలకు టాటా మోటార్స్ అదిరిపోయే గిఫ్ట్!
ఐసీసీ వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచిన ఇండియా ఉమెన్స్ టీమ్.. ప్రస్తుతం సంబరాల్లో మునిగిపోయింది. ఈ తరుణంలో టాటా మోటార్స్ వారికి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. జట్టులోని సభ్యులకు ఒక్కొక్కరికి.. ఒక్కో సియెర్రా కారును గిఫ్ట్గా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.టాటా మోటార్స్.. తన సియెర్రా కారును నవంబర్ 25న దేశీయ విఫణిలో లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ కారు టెస్టింగ్ సమయంలో చాలాసార్లు కనిపించింది. ఇది 5 డోర్స్ మోడల్. కాబట్టి కుటుంబ ప్రయాణాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కారు పనోరమిక్ సన్రూఫ్, కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్లైట్స్, సొగసైన డోర్ హ్యాండిల్స్ పొందుతుంది.టాటా సియెర్రా.. మూడు స్క్రీన్ లేఅవుట్తో కూడిన డ్యాష్బోర్డ్ పొందుతుంది. ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్, ఇన్ఫోటైన్మెంట్ కోసం సెంట్రల్ టచ్స్క్రీన్, ముందు ప్రయాణీకుడి కోసం అదనపు స్క్రీన్ వంటివి ఉన్నాయి. సరికొత్త స్టీరింగ్ వీల్ కూడా పొందుతుంది. ఈ కారు పసుపు, ఎరుపు రంగుల్లో అమ్మకానికి రానున్నట్లు సమాచారం. ఈ కారు ధరను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. కానీ దీని ప్రారంభ ధర రూ. 15 లక్షలు (ఎక్స్ షోరూమ్) ఉంటుందని అంచనా.ఇదీ చదవండి: హీరో ఎలక్ట్రిక్ కారు: నానో కంటే చిన్నగా!టాటా సియెర్రా యొక్క పవర్ట్రెయిన్ గురించి.. కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఇది పెట్రోల్ & డీజిల్ ఇంజిన్ ఎంపికలతో లభించనుంది. అయితే ప్రస్తుతం హారియర్ & సఫారీ మోడళ్లలోని 2.0-లీటర్ క్రియోటెక్ డీజిల్ ఇంజిన్, 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఎంపికలే.. సియెర్రాలో కూడా ఉంటాయని సమాచారం. ట్రాన్స్మిషన్ ఎంపికలలో మాన్యువల్ & ఆటోమేటిక్ ఉండనున్నాయి. -
నాలుగో టీ20లో భారత్ ఘన విజయం..
క్వీన్స్లాండ్ వేదికగా ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన నాలుగో టీ20లో 48 పరుగుల తేడాతో భారత్(India) ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో 2-1 ఆధిక్యంలో వెళ్లింది. భారత్ నిర్ధేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక కంగారులు చతకలపడ్డారు. లక్ష్య చేధనలో ఆసీస్ 18.2 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఓపెనర్లు మిచెల్ మార్ష్(30), మాథ్యూ షార్ట్(25) ఘనమైన ఆరంభాన్ని ఇచ్చినప్పటికి మిడిలార్డర్ విఫలం కావడంతో ఆస్ట్రేలియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అక్షర్ మ్యాజిక్..భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ బంతితో మ్యాజిక్ చేశాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లను పడగొట్టాడు. అక్షర్ దూకుడుగా ఆడుతున్న షార్ట్ను ఔట్ చేసి భారత్కు తొలి వికెట్ను అందించాడు. అతడితో పాటు శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ రెండు, వరుణ్ చక్రవర్తి, బుమ్రా అర్ష్దీప్ సింగ్ తలా వికెట్ సాధించారు.రాణించిన గిల్..అంతకుముందు బ్యాటింగ్ టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో శుభ్మన్ గిల్ 46 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. కానీ అతడు 120 కంటే తక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. ఇక గిల్తో పాటు అభిషేక్ శర్మ(28), అక్షర్ పటేల్(21) రాణించారు.ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా మూడేసి వికెట్లతో సత్తాచాటారు. ఇక ఇరు జట్ల మధ్య ఐదో టీ20 బ్రిస్బేన్ వేదికగా శనివారం జరగనుంది. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తే 3-1తో సిరీస్ సొంతం చేసుకుంటుంది. ఒకవేళ ఓడిపోతే 2-2 సిరీస్ సమంగా ముగుస్తుంది.చదవండి: IND vs AUS: గంభీర్ పిచ్చి ప్రయోగం.. అట్టర్ ప్లాప్Same matchup, same result! 😎Varun’s googly does the trick yet again as Maxwell’s off stump takes the hit! 🎯#AUSvIND 👉 4th T20I | LIVE NOW 👉 https://t.co/HUqC93tuuG pic.twitter.com/wrFxyTxV85— Star Sports (@StarSportsIndia) November 6, 2025 -
క్రీజులోకి వెళ్లు.. నీ తల పగలకొడతా!
‘‘ఆరోజు నాకింకా గుర్తుంది. సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar)కు అదే తొలి ఆస్ట్రేలియా పర్యటన. నేను శతకం పూర్తి చేసుకున్నా. సచిన్ బ్యాటింగ్కు వచ్చాడు. వచ్చీరాగానే ‘వా’ (స్టీవ్ వా, మార్క్ వా) సోదరులు అతడిని స్లెడ్జ్ చేయడం మొదలుపెట్టారు.నీ తల పగులగొడతా చూడుఅప్పుడు మైక్ విట్నీ ఫీల్డింగ్ కోసం 12th మ్యాన్గా వచ్చాడు. అప్పటికే నేను అలెన్ బోర్డర్తో పోటీ పడుతున్నా. ఇంతలో అతడు బంతి చేతులో పట్టుకుని నన్ను చూస్తూ.. ‘నువ్వైతే క్రీజులోకి వెళ్లు.. నీ తల పగులగొడతా చూడు’ అని నాతో అన్నాడు.నేను వెంటనే వెనక్కి తిరిగి.. పిచ్ మధ్య వరకు వెళ్లి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ అంతా వినిపించేలా గట్టిగా అరిచాను. ‘హే మైక్.. బంతిని విసరడం కాదు.. అద్భుతంగా బౌలింగ్ చేస్తేనే లెక్క. నువ్వెప్పటికీ ఆస్ట్రేలియా 12th మ్యాన్వి కాలేవు’ అని అరిచాను.నువ్వు నోరు మూసుకోఇంతలో సచిన్ నా దగ్గరికి వచ్చి.. తాను కూడా సెంచరీ చేసే ఆగమని చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరం కలిసి వాళ్లకు వాళ్ల మాటల్ని తిరిగి ఇచ్చేద్దాం అన్నాడు. కానీ నేను మాత్రం.. ‘నువ్వు నోరు మూసుకో.. ఇప్పటికే చాలా అయింది. నీ బ్యాట్తో నువ్వు మాట్లాడు (పరుగులు రాబట్టు).. వాళ్ల సంగతి నేను చూసుకుంటా’ అని చెప్పాను’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.దశాబ్దకాలానికి పైగా అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన రవిశాస్త్రి (Ravi Shastri).. ఆ తర్వాత హెడ్కోచ్గానూ సేవలు అందించాడు. ప్రస్తుతం కామెంటేటర్గా కొనసాగుతున్న రవిశాస్త్రి.. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్తో ముచ్చటిస్తూ.. 1992 నాటి ఆస్ట్రేలియా టూర్ జ్ఞాపకాలను ఇలా గుర్తు చేసుకున్నాడు.పరుగుల మీదే దృష్టి పెట్టు నాడు సిడ్నీలో జరిగిన మూడో టెస్టులో ఆసీస్ దిగ్గజం అలెన్ బోర్డర్ తమను స్లెడ్జ్ చేశాడని.. ఆ సమయంలో సచిన్కు కేవలం పరుగుల మీదే దృష్టి పెట్టాలని తాను సూచించినట్లు రవిశాస్త్రి తెలిపాడు. కాగా 1981- 1992 వరకు టీమిండియాకు ఆడిన రవిశాస్త్రి.. 80 టెస్టుల్లో 3830, 150 వన్డేల్లో 3108 పరుగులు సాధించాడు.ఇక అత్యధిక పరుగుల వీరుడిగా ప్రపంచ రికార్డు సాధించిన సచిన్ టెండుల్కర్.. 200 టెస్టుల్లో 15921, 463 వన్డేల్లో 18426, ఒక టీ20లో 10 పరుగులు చేశాడు. అతడి ఖాతాలో వంద సెంచరీలు ఉన్నాయి. తద్వారా ప్రపంచంలో ఏకైక శతక శతకాల ధీరుడిగా సచిన్ కొనసాగుతున్నాడు.చదవండి: హనుమాన్ టాటూ మీకెలా ఉపయోగపడింది?.. ప్రధాని మోదీ ప్రశ్నకు దీప్తి శర్మ జవాబు ఇదే -
మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్లకు ఈడీ షాక్
ఢిల్లీ: ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీమిండియా మాజీ క్రికెటర్లు సురేష్ రైనా,శిఖర్ ధావన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాకిచ్చింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో ఆస్తుల్ని జప్తు చేసింది. రూ.11.14 కోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. ఇటీవల ఈడీ విచారణకు రైనా,ధావన్ విచారణకు హాజరయ్యారు. ఈ వ్యవహారానికి సంబంధించి మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ను కూడా ఈడీ గతంలోనే విచారించిన విషయం తెలిసిందే. సురేష్ రైనా రూ.6.44 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, రూ.4.70 కోట్ల విలువైన శిఖర్ ధావన్కు చెందిన స్థిరాస్తుల్ని అటాచ్ చేసినట్లు తెలిపింది. ఈ ఆస్తులు 1xBet అనే విదేశీ బెట్టింగ్ ప్లాట్ఫామ్కు సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద జప్తు చేసినట్లు ఈడీ తెలిపింది.కేసు నేపథ్యం 1xBet అనే సంస్థ భారత్లో అక్రమంగా ఆన్లైన్ బెట్టింగ్ సేవలు అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంస్థకు సంబంధించిన సరొగేట్ యాప్స్ ద్వారా పలు ప్రముఖులు ప్రచారం చేసినట్లు ఈడీ గుర్తించింది. సురేష్ రైనా,శిఖర్ ధావన్,మ్యూజిక్ డైరెక్టర్ బాద్షా,యాక్టర్ కపిల్ శర్మ యూట్యూబర్ బీబీ కీ వైన్ (బువన్ బామ్)లను నిర్ధారించింది. వీరందంటూ బెట్టింగ్ యాప్స్ నిబంధనలకు విరుద్ధంగా ప్రమోట్ చేసినట్లు అభిపప్రాయం వ్యక్తి చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. టీఎక్స్ బెట్ వంటి బెట్టింగ్ యాప్స్ కారణంగా ప్రజలు మోసపోయే అవకాశం ఉంది. అందుకే ఈ ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. విచారణ కొనసాగుతోందని ఈడీ పేర్కొంది. -
సౌతాఫ్రికాతో మ్యాచ్.. ధ్రువ్ జురెల్ వీరోచిత సెంచరీ
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ రెడ్ బాల్ క్రికెట్లో తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ వేదికగా సౌతాఫ్రికా-ఎతో జరుగుతున్న రెండో అనాధికారిక టెస్టులో భారత్-ఎకు ప్రాతినిథ్యం వహిస్తున్న జురెల్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు.ఈ ఉత్తర్ప్రదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ 145 బంతుల్లో తన నాలుగవ ఫస్ట్ క్లాస్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 59 పరుగులకు 4 వికెట్లు కోల్పోయిన భారత్ను జురెల్ తన విరోచిత శతకంతో ఆదుకున్నాడు. తొలుత పంత్ కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించిన జురెల్.. ఆ తర్వాత లోయార్డర్ బ్యాటర్ కుల్దీప్యాదవ్తో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.ఇండియా-ఎ జట్టు 70 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. క్రీజులో జురెల్(102)తో పాటు మహ్మద్ సిరాజ్(11) ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఇప్పటివరకు వాన్ వుర్రెన్ మూడు వికెట్లు పడగొట్టగా.. సుబ్రాయెన్, మొరేకీ తలా రెండు వికెట్లు సాధించారు. పంత్ రీ ఎంట్రీ.. కాగా సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు ఎంపిక చేసిన భారత జట్టులో ధ్రువ్ జురెల్ ఉన్నాడు. అయితే రెగ్యూలర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తిరిగి రావడంతో జురెల్ బెంచ్కే పరిమితం కానున్నాడు. అయితే గత నెలలో వెస్టిండీస్తో జరిగిన టెస్టు సిరీస్లో జురెల్ సూపర్ సెంచరీతో అందరని ఆకట్టుకున్నాడు. ఇంతకుముందు కూడా తనకు వచ్చిన అవకాశాలను జురెల్ అందిపుచ్చుకున్నాడు. అతడు పంత్కు బ్యాకప్గా కొనసాగుతున్నాడు.చదవండి: IND vs AUS: గంభీర్ పిచ్చి ప్రయోగం.. అట్టర్ ప్లాప్ -
ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. రోవ్మన్ పావెల్ విధ్వంసం.. కానీ..
న్యూజిలాండ్- వెస్టిండీస్ మధ్య రెండో టీ20 ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ఆఖరి బంతి వరకు విజయం కోసం ఇరుజట్లు హోరాహోరీ తలపడ్డాయి. మరి గెలుపు ఎవరిని వరించిందంటే..?!ఐదు టీ20లు, మూడు వన్డేలు, మూడు టెస్టులు ఆడేందుకు విండీస్ జట్టు న్యూజిలాండ్లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ మొదలుకాగా.. ఆక్లాండ్లో బుధవారం ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్ వెస్టిండీస్ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది.ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గురువారం అదే వేదికపై రెండో టీ20 జరిగింది. ఆక్లాండ్లో టాస్ గెలిచిన విండీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వే (16), వన్డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్ర (11) మరోసారి విఫలం కాగా.. మరో ఓపెనర్ టిమ్ రాబిన్సన్ (25 బంతుల్లో 39) రాణించాడు.కేవలం 28 బంతుల్లోనేఇక నాలుగో నంబర్ బ్యాటర్ మార్క్ చాప్మన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 28 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఏడు సిక్సర్లు బాది ఏకంగా 78 పరుగులు సాధించాడు. చాప్మన్ విధ్వంసకర ఇన్నింగ్స్కు తోడు.. డారిల్ మిచెల్ (14 బంతుల్లో 28 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఆఖర్లో కెప్టెన్ మిచెల్ సాంట్నర్ 8 బంతుల్లో 18 పరుగులతో అజేయంగా నిలిచాడు.Starring Mark Chapman: A Bowler’s Nightmare 🎥#NZvWI pic.twitter.com/KXWomWevnN— FanCode (@FanCode) November 6, 2025ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్ రెండు వికెట్లు తీయగా.. మాథ్యూ ఫోర్డ్, జేసన్ హోల్డర్, రొమారియో షెఫర్డ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో వెస్టిండీస్కు ఆదిలోనే షాక్ తగిలింది.ఓపెనర్ బ్రాండన్ కింగ్ (0)ను జేకబ్ డఫీ డకౌట్ చేశాడు. అయితే, మరో ఓపెనర్ అలిక్ అథనాజ్ (25 బంతుల్లో 33), వన్డౌన్ బ్యాటర్, కెప్టెన్ షాయీ హోప్ (26 బంతుల్లో 24) ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. మిడిలార్డర్లో అకీమ్ ఆగస్టి (7), జేసన్ హోల్డర్ (16) నిరాశపరచగా.. ఏడో నంబర్ ఆటగాడు రోస్టన్ చేజ్ (6) కూడా విఫలమయ్యాడు.రోవ్మన్ పావెల్ అద్భుత ఇన్నింగ్స్ఈ క్రమంలో విజయంపై ఆశలు వదిలేసుకున్న వేళ.. విండీస్ పవర్ హిట్టర్ రోవ్మన్ పావెల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కివీస్ బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 16 బంతుల్లోనే ఒక ఫోర్, ఆరు సిక్సర్ల సాయంతో 45 పరుగులు సాధించి జట్టును విజయానికి చేరువ చేశాడు.అతడికి తోడుగా రొమారియో షెఫర్డ్ (16 బంతుల్లో 34), మాథ్యూ ఫోర్డ్ (13 బంతుల్లో 29) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఈ క్రమంలో కివీస్ విధించిన 208 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. ఆఖరి ఓవర్లో విండీస్ విజయ సమీకరణం ఆరు బంతుల్లో 16 పరుగులుగా మారింది.ఆఖరి ఓవర్లో కైలీ జెమీషన్ బంతితో రంగంలోకి దిగగా.. తొలి బంతికే ఫోర్డ్ ఫోర్ బాదాడు. ఆ తర్వాత పరుగులేమీ రాలేదు. మూడో బంతి నోబాల్ కాగా ఫోర్డ్ మరో ఫోర్తో చెలరేగాడు. ఆ తర్వాత బంతికి సింగిల్ తీశాడు. ఈ క్రమంలో పావెల్ నాలుగో బంతికి షాట్ ఆడేందుకు ప్రయత్నించి చాప్మన్కు క్యాచ్ ఇచ్చాడు.ఆఖరి బంతి వరకు ఉత్కంఠదీంతో విండీస్ కీలక వికెట్ కోల్పోగా.. అకీల్ హొసేన్ క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో ఐదో బంతికి అకీల్ సింగిల్ తీయగా.. ఆఖరి బంతికి విండీస్ విజయానికి ఐదు పరుగులు అవసరమయ్యాయి. అయితే, ఇక్కడే జెమీషన్ మాయ చేశాడు. అద్భుత బంతిని సంధించగా.. ఫోర్డ్ సింగిల్కే పరిమితమయ్యాడు. దీంతో మూడు పరుగుల స్వల్ప తేడాతో జయభేరి మోగించిన ఆతిథ్య కివీస్ సిరీస్ను 1-1తో సమం చేసింది. కివీస్ బౌలర్లలో ఇష్ సోధి, సాంట్నర్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. డఫీ, జెమీషన్ చెరో వికెట్ తీశారు. చాప్మన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరుజట్ల మధ్య ఆదివారం జరిగే మూడో టీ20కి సాక్స్టన్ ఓవల్ వేదిక.చదవండి: IND vs AUS: గంభీర్ పిచ్చి ప్రయోగం.. అట్టర్ ప్లాప్ -
గంభీర్ పిచ్చి ప్రయోగం.. అట్టర్ ప్లాప్
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir) మరో కొత్త ప్రయోగానికి తెరలేపాడు. క్వీన్స్ లాండ్ వేదికగా ఆసీస్తో జరుగుతున్న నాలుగో టీ20లో గంభీర్ ఎవరూ ఊహించని విధంగా ఆల్రౌండర్ శివమ్ దూబే (Shivam Dube)ను మూడో స్ధానంలో బ్యాటింగ్కు పంపాడు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ తొలి వికెట్కు 56 పరుగుల ఆరంభాన్ని అందించారు. దూకుడుగా ఆడుతున్న అభిషేక్(28) ఓ భారీ షాట్కు ప్రయత్నించి తన వికెట్ను కోల్పోయాడు. దీంతో ఫస్ట్ డౌన్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వస్తాడని అంతా భావించారు. కానీ శివమ్ దూబే బ్యాటింగ్కు వచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. రెగ్యూలర్గా మూడో స్దానంలో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్కు వస్తుంటాడు. మొన్న సంజూ.. ఇప్పుడు దూబేకానీ గంభీర్ మాత్రం మూడో స్ధానంలో వెర్వేరు ఆటగాళ్లను పంపి పిచ్చి ప్రయోగాలు చేస్తున్నాడు. మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ20లో సంజూ శాంసన్ను సూర్య స్ధానంలో బ్యాటింగ్కు పంపారు. కానీ శాంసన్ కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి అట్టర్ ప్లాప్ అయ్యాడు. ఆ తర్వాత సంజూ పూర్తిగా తుది జట్టులోనే కోల్పోయాడు. ఇప్పుడు దూబేను టాపర్డర్లో ప్రమోట్ చేశాడు. అస్సులు దూబేకు టాపర్డర్లో ఆడిన అనుభవం లేదు. అయినప్పటికి దూబేను ఎందుకు ముందు బ్యాటింగ్ పంపారో గంభీర్కే తెలియాలి. తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20లో దూబే ఏకంగా ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్ చేశాడు. మూడో టీ20లో అయితే దూబేకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇప్పుడు ఏకంగా తొలిసారి ఫస్ట్డౌన్లో బ్యాటింగ్ చేసే ఛాన్స్ దూబేకు లభించింది. కానీ గంభీర్ నమ్మకాన్ని దూబే నిలబెట్టుకోలేకపోయాడు. హెడ్కోచ్ చేసిన ప్రయోగం విఫలమైంది.18 బంతులు ఎదుర్కొన్న దూబే కేవలం 22 పరుగులు మాత్రమే చేసి నాథన్ ఎల్లీస్ బౌలింగ్లో బౌల్డయ్యాడు. దీంతో గంభీర్ను నెటిజన్లు ట్రోలు చేస్తున్నారు. నీవు మారవా? బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు అవసరమా? అంటూ పోస్ట్లు పెడుతున్నారు.ఇక ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్(46) టాప్ స్కోరర్గా నిలవగా..అభిషేక్ శర్మ(28), శివమ్ దూబే(22), సూర్యకుమార్(20), అక్షర్ పటేల్(21) రాణించారు. తిలక్ వర్మ(5), జితేష్ శర్మ(3) మాత్రం తీవ్ర నిరాశపరిచారు.చదవండి: ‘సాకులు చెబుతారు... కానీ ఏదో ఒకరోజు సెలక్ట్ చేయక తప్పదు’ -
Hanuman Tattoo: ప్రధాని మోదీ ప్రశ్నకు దీప్తి శర్మ జవాబు ఇదే
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పట్ల భారత స్టార్ క్రికెటర్, వన్డే వరల్డ్కప్ విజేత దీప్తి శర్మ (Deepti Sharma) అభిమానం చాటుకుంది. ఆయనను నేరుగా కలవాలని ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్నానని.. ఇప్పటికి తన కల నెరవేరిందని హర్షం వ్యక్తం చేసింది. కాగా ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025 (ICC Women's ODI World Cup)లో విజేతగా నిలిచిన భారత జట్టు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసింది.సరదాగా ముచ్చటించిన మోదీఈ సందర్భంగా.. విజయవంతమైన ఈ ప్రపంచకప్ ప్రయాణంలో ఎదురైన సవాళ్లను అధిగమించి తొలిసారి విశ్వవిజేతగా నిలిచిన హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలో జట్టును మోదీ అభినందించారు. ప్రధాని కేవలం ఓ ఫొటో, రెండు ముక్కల ప్రశంసకే పరిమితం కాకుండా ప్లేయర్లందరితో కలిసి కూర్చుని సరదాగా ముచ్చటించారు.ఈ క్రమంలో 2017లో ఫైనల్లో ఓడినపుడు ఉత్త చేతులతో మోదీని కలిసిన తాము ఇప్పుడు ప్రపంచకప్ ట్రోఫీతో కలవడం చాలా సంతోషాన్నిచ్చిందని కెప్టెన్ హర్మన్ప్రీత్ చెప్పుకొచ్చింది. మోదీ అప్పుడు చెప్పిన మాటలు ఈ సారి కప్ గెలిచేందుకు ఎంతగానో దోహదపడ్డాయని వైస్ కెప్టెన్ స్మృతి మంధాన చెప్పింది.ఇక ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచిన దీప్తి శర్మ మాట్లాడుతూ మరోసారి ప్రధానిని కలిసే అవకాశం కోసం ఎంతగానో ఎదురు చూశామని తాజా కప్తో కలుసుకోవడం మరింత తృప్తినిచ్చిందని పేర్కొంది. ఈ సందర్భంగా దీప్తి ఇన్స్ట్రాగామ్ బయోలో ఉన్న ‘జై శ్రీరామ్’, ఆమె భుజంపై ఉన్న హనుమాన్ టాటూ విశేషాలను మోదీ అడిగితెలుసుకున్నారు. తన మానసిక, శారీరక బలానికి హనుమాన్ టాటూ ఉత్ప్రేరకమని దీప్తి చెప్పింది.‘‘మిమ్మల్ని కలవాలని ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్నా. ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను. 2017లో మీరు మాతో ఓ మాట చెప్పారు. అవరోధాలను అధిగమించి సవాళ్లను సమర్థవంతంగా పూర్తి చేసినవాళ్లే అసలైన ఆటగాళ్లు అని మీరన్నారు.లార్డ్ హనుమాన్ టాటూ మీకెలా ఉపయోగపడుతుంది?కఠినంగా శ్రమిస్తే తప్పక ఫలితం వస్తుందని చెప్పారు. మీ మాటలు, సలహాలు మాలో స్పూర్తిని నింపాయి’’ అని దీప్తి శర్మ ప్రధాని మోదీతో పేర్కొంది. ఈ క్రమంలో ఆయన.. లార్డ్ హనుమాన్ టాటూ మీకెలా ఉపయోగపడుతుంది? అని దీప్తిని అడుగగా.. ‘‘నా కంటే నేను ఆయన (హనుమాన్)నే ఎక్కువగా నమ్ముతాను. నా ఆట మెరుగుపడటానికి ఆయన మీదున్న నా నమ్మకం, సానుకూల దృక్పథమే కారణం’’ అని దీప్తి శర్మ బదులిచ్చింది.కాగా వరల్డ్కప్-2025లో భాగంగా సౌతాఫ్రికాతో ఫైనల్లో దీప్తి శర్మ 58 పరుగులు చేయడంతో పాటు.. ఐదు వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచింది.‘ఫిట్ ఇండియా’ కార్యక్రమంలోఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో ఫైనల్లో అమన్జోత్ క్యాచ్, క్రాంతి గౌడ్ బౌలింగ్ ప్రదర్శనను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ‘ఫిట్ ఇండియా’ కార్యక్రమంలో విశ్వవిజేతలు భాగం కావాలని మోదీ క్రికెటర్లను ఉద్దేశించి అన్నారు. శారీరక ఫిట్నెస్ ఆవశ్యకతను తెలియజేసే కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. వీలైనపుడు విద్యార్థులను స్ఫూర్తిదాయక ప్రసంగాలతో ఉత్సాహపరచాలని మోదీ సూచించారు. చదవండి: ‘సాకులు చెబుతారు... కానీ ఏదో ఒకరోజు సెలక్ట్ చేయక తప్పదు’Player of the Tournament, Deepti Sharma, recalled that in 2017, Prime Minister @narendramodi had advised her to learn from failure and keep working hard. She shared that she had been eagerly looking forward to this meeting. Deepti also explained the significance of the ‘Hanuman’… pic.twitter.com/aUXki9yZz6— DD News (@DDNewslive) November 6, 2025 -
చాప్మన్ ఊచకోత.. న్యూజిలాండ్ భారీ స్కోర్
ఆక్లాండ్ వేదికగా వెస్టిండీస్తో ఇవాళ (నవంబర్ 6) జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ ఆటగాడు మార్క్ చాప్మన్ చెలరేగిపోయాడు. కేవలం 28 బంతుల్లోనే 6 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేశాడు. చాప్మన్ ధాటికి విండీస్ బౌలర్లు విలవిలలాపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ చేసింది.న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో చాప్మన్తో పాటు టిమ్ రాబిన్సన్ (39 బంతుల్లో 25; 5 ఫోర్లు, సిక్స్) రాణించాడు. ఆఖర్లో డారిల్ మిచెల్ (14 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్), మిచెల్ సాంట్నర్ (8 బంతుల్లో 18 నాటౌట్; 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. మిగతా ఆటగాళ్లలో డెవాన్ కాన్వే 16, రచిన్ రవీంద్ర 11, బ్రేస్వెల్ 5 పరుగులు చేశారు.విండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ 2, మాథ్యూ ఫోర్డ్, జేసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్ తలో వికెట్ తీశారు. జేడన్ సీల్స్ (4-0-61-0), అకీల్ హొసేన్కు (1-0-23-0) చాప్మన్ చుక్కలు చూపించాడు. ఫోర్డ్ (4-0-17-1), ఛేజ్ (4-0-33-2), హోల్డర్ (4-0-34-1) పొదుపుగా బౌలింగ్ చేశారు.కాగా, ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నిన్ననే జరిగిన తొలి మ్యాచ్లో వెస్టిండీస్ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ కెప్టెన్ పోరాటం వృధా అయ్యింది. 165 పరుగుల ఛేదనలో సాంట్నర్ చెలరేగి ఆడినా (28 బంతుల్లో 55 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) న్యూజిలాండ్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. అంతకుముందు విండీస్ ఇన్నింగ్స్లో షాయ్ హోప్ (53) అర్ద సెంచరీతో రాణించాడు.చదవండి: వేర్వేరు క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్లు వీరే..! -
వేర్వేరు క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్లు వీరే..!
ఏ క్రీడలో అయినా దేశానికి ప్రాతినిథ్యం వహించడం క్రీడాకారులందరి కల. ఇందు కోసం సర్వశక్తులు ఒడ్డి, ఎంతో శ్రమించి, చాలా త్యాగాలు, పోరాటాలు చేస్తారు. ఒక్క క్రీడలో దేశానికి ప్రాతినిథ్యం వహించాలంటేనే ఇన్ని కష్టాలు ఎదర్కోవాల్సి వస్తే.. కొందరు ఒకటికి మించిన క్రీడల్లో జాతీయ జట్లకు ప్రాతినిథ్యం వహించి శభాష్ అనిపించుకున్నారు. ఇలాంటి మల్టీ టాలెంటెడ్ క్రీడాకారులపై ఓ లుక్కేద్దాం.ఈ టాపిక్ డిస్కషన్కు రాగానే ముందుగా ఇద్దరు మహిళా క్రికెటర్లు గుర్తుకు వస్తారు. వారిలో మొదటి పేరు న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ సూజీ బేట్స్ కాగా.. రెండో పేరు ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ ఎల్లిస్ పెర్రీ. ఈ ఇద్దరు వారి దేశాల తరఫున క్రికెట్తో పాటు మరో క్రీడలో పాల్గొన్నారు.సూజీ బేట్స్సూజీ న్యూజిలాండ్ తరఫున క్రికెట్తో పాటు బాస్కెట్బాల్ ఆడింది. ప్రస్తుతం న్యూజిలాండ్ క్రికెట్ జట్టులో కీలక సభ్యురాలిగా కొనసాగుతున్న ఆమె.. 2008 Beijing Olympicsలో దేశానికి ప్రాతినిథ్యం వహించింది. బాస్కెట్బాల్లో ఆమె పలు అంతర్జాతీయ టోర్నీల్లోనూ పాల్గొంది. ప్రస్తుతం సూజీ బాస్కెట్బాల్ను వదిలి క్రికెట్పై దృష్టి సారించింది.ఎల్లిస్ పెర్రీ17 ఏళ్లకే ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన పెర్రీ.. క్రికెట్తో పాటు ఫుట్బాల్లోనూ దేశానికి ప్రాతినిథ్యం వహించింది. ఆమె 2011 FIFA Women’s World Cupలో ఆస్ట్రేలియా తరఫున బరిలోకి దిగింది. ICC & FIFA వరల్డ్ కప్లలో పాల్గొన్న ఏకైక ఆస్ట్రేలియన్ మహిళగా పెర్రీ చరిత్ర సృష్టించింది.పురుషుల క్రికెట్ విషయానికొస్తే.. ఇక్కడ కూడా చాలా మంది మల్టీ టాలెండెడ్ ఉన్నారు.యుజ్వేంద్ర చహల్ఐపీఎల్లో మెరిసి టీమిండియాకు ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కించుకున్న చహల్.. చెస్ క్రీడలోనూ భారత్కు ప్రాతినిథ్యం వహించాడు. World Chess Federationలో చహల్ పేరు నమోదై ఉంది. భారత్ తరఫున క్రికెట్ & చెస్ ఆడిన ఏకైక ఆటగాడు చహల్.ఏబీ డివిలియర్స్మిస్టర్ 360 డిగ్రీస్గా పేరుగాంచిన ఏబీ డివిలియర్స్ సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ కావడంతో పాటు ఆ దేశం తరఫున జూనియర్ లెవెల్లో టెన్నిస్ కూడా ఆడాడు. అలాగే స్విమ్మింగ్, రగ్బీ, గోల్ఫ్, బాడ్మింటన్, అథ్లెటిక్స్ వంటి అనేక క్రీడల్లోనూ ఏబీకి ప్రావీణ్యం ఉంది. మల్టీ టాలెంటెడ్ పదానికి ఏబీ నిజమైన అర్హుడని చాలామంది అంటుంటారు.జాంటీ రోడ్స్క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఫీల్డర్గా పేరొందిన జాంటీ రోడ్స్.. సౌతాఫ్రికా తరఫున క్రికెట్తో పాటు హాకీ ఆడే అవకాశం కూడా వచ్చింది. 1992, 1996 ఒలింపిక్స్ సౌతాఫ్రికా హాకీ జట్టుకు రోడ్స్ ఎంపికయ్యాడు. అయితే వేర్వేరు కారణాల వల్ల అతను హాకీలో దేశానికి ప్రాతినిథ్యం వహించలేకపోయాడు.ఆండ్రూ ఫ్లింటాఫ్ఈ ఆల్రౌండ్ దిగ్గజం ఇంగ్లండ్ తరఫున క్రికెట్ ఆడటంతో పాటు బాక్సింగ్ క్రీడలోనూ సత్తా చాటాడు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాక ఫ్లింటాఫ్ ప్రొఫెషనల్ బాక్సర్గా మారాడు. ఈ క్రీడలోనూ అతను అత్యున్నతాలను చూశాడు.ఇయాన్ బోథమ్క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్రౌండర్లలో ముఖ్యుడైన ఇయాన్ బోథమ్.. ఇంగ్లండ్ తరఫున క్రికెట్తో పాటు ఫుట్బాల్ కూడా ఆడాడు. క్రికెట్ ఆడే సమయంలోనే బోథమ్ పలు క్లబ్ లెవెల్ ఫుట్బాల్ పోటీల్లో పాల్గొన్నాడు.సర్ వివియన్ రిచర్డ్బ్యాటింగ్ దిగ్గజం సర్ వివియన్ రిచర్డ్ వెస్టిండీస్ తరఫున క్రికెట్ ఆడటంతో పాటు ఓ కరీబియన్ దీవి తరఫున ఫుట్బాల్ జట్టుకు కూడా ఎంపికయ్యాడు. క్రికెట్లో అత్యున్నత స్థానానికి చేరకముందే 1974 FIFA వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్లో Antigua & Barbuda దేశానికి ప్రాతినిథ్యం వహించాడు.చదవండి: ఆర్సీబీకి సంబంధించి మరో బిగ్ న్యూస్ -
IND vs AUS: ఆసీస్ను చిత్తు చేసిన భారత్
టీమిండియా- ఆస్ట్రేలియా క్వీన్స్లాండ్ వేదికగా నాలుగో టీ20లో తలపడ్డాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది.ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. 18.2 ఓవర్లలో కేవలం 119 పరుగులే చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా టీమిండియా 48 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది.వారెవ్వా వాషీ.. అదరగొట్టిన అక్షర్, శివంలక్ష్య ఛేదనలో ఆసీస్ ఓపెనర్లు మిచెల్ మార్ష్ (30), మాథ్యూ షార్ట్ (25) ఫర్వాలేదనిపించగా.. మిగిలిన వాళ్లంతా భారత బౌలర్ల ధాటికి తాళలేక చేతులెత్తేశారు. జోష్ ఇంగ్లిస్ (12), టిమ్ డేవిడ్ (14), జోష్ ఫిలిప్ (10), మార్కస్ స్టొయినిస్ (17) తీవ్రంగా నిరాశపరచగా.. గ్లెన్ మాక్స్వెల్ (2), బెన్ డ్వార్షుయిస్ (5), జేవియర్ బార్ట్లెట్ (0), నాథన్ ఎల్లిస్ (2 నాటౌట్), ఆడం జంపా (0) ఇలా వచ్చి అలా వెళ్లారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లతో చెలరేగగా.. అక్షర్ పటేట్, శివం దూబే చెరో రెండు వికెట్లు తీశారు. అర్ష్దీప్ సింగ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.ఆసీస్ ఆలౌట్18.2: వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో జంపా (0).. గిల్కు క్యాచ్ ఇవ్వడంతో ఆసీస్ పదో వికెట్ కోల్పోయింది. దీంతో భారత్ విజయం ఖరారైంది. తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా17.6: బుమ్రా బౌలింగ్లో బౌల్డ్ అయి తొమ్మిదో వికెట్గా వెనుదిరిగిన డ్వార్షుయిస్ (5). స్కోరు: 118-9(18). విజయానికి చేరువైన టీమిండియా.ఎనిమిదో వికెట్ డౌన్16.5: వాషీ బౌలింగ్లో బార్ట్లెట్ బౌల్డ్ (0). ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆసీస్. స్కోరు: 116-8(16.5). ఆసీస్ విజయానికి 19 బంతుల్లో 52 పరుగులు కావాల్సి ఉండగా.. టీమిండియాకు కేవలం రెండు వికెట్లు కావాలి.ఏడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా16.4: వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో స్టొయినిస్ (17) లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరిగాడు. దీంతో ఆసీస్ ఏడో వికెట్ కోల్పోయింది. ఆరో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా14.6: వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో మాక్స్వెల్ బౌల్డ్ (4 బంతుల్లో 2). దీంతో ఆసీస్ ఆరో వికెట్ కోల్పోయింది. డ్వార్షుయిస్ క్రీజులోకి రాగా.. స్టొయినిస్ 8 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 103-6 (15).ఐదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా13.1: ఫిలిప్ (10 బంతుల్లో 10) రూపంలో ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయింది. అర్ష్దీప్ బౌలింగ్లో అతడు వరుణ్ చక్రవర్తికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. స్కోరు: 98-5(13.1). స్టొయినిస్ ఐదు పరుగులతో ఉండగా.. మాక్స్వెల్ క్రీజులోకి వచ్చాడు.నాలుగో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా11.3: శివం దూబే బౌలింగ్లో సూర్యకుమార్కు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్గా వెనుదిరిగిన టిమ్ డేవిడ్ (9 బంతుల్లో 14). స్కోరు: 91-4(11.3). జోష్ ఫిలిప్ 8 పరుగులతో ఉండగా.. స్టొయినిస్క్రీజులోకి వచ్చాడు.మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా9.2: శివం దూబే బౌలింగ్లో మార్ష్ అర్ష్దీప్నకు క్యాచ్ ఇచ్చి మార్ష్ మూడో వికెట్గా వెనుదిరిగాడు. మార్ష్ 24 బంతుల్లో 30 పరుగులు చేశాడు. అతడి స్థానంలో జోష్ ఫిలిప్ క్రీజులోకి రాగా.. టిమ్ డేవిడ్ రెండు పరుగులతో ఉన్నాడు. స్కోరు: 70-3(9.2).రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా8.5: అక్షర్ పటేల్ బౌలింగ్లో రెండో వికెట్గా వెనుదిరిగిన ఇంగ్లిస్. 11 బంతులు ఎదుర్కొన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బౌల్డ్ అయ్యాడు. ఆసీస్ స్కోరు: 67-2(8.5). విజయానికి 67 బంతుల్లో 101 పరుగుల దూరంలో ఆసీస్ ఉండగా.. టీమిండియాకు ఎనిమిది వికెట్లు కావాలి. టిమ్ డేవిడ్ క్రీజులోకి రాగా.. మార్ష్ 30 పరుగులతో ఉన్నాడు.తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా4.5: అక్షర్ పటేల్ బౌలింగ్లో ఆసీస్ ఓపెనర్ మాథ్యూ షార్ట్ లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరిగాడు. అయితే, ఫీల్డ్ అంపైర్ దీనిని నాటౌట్గా ప్రకటించగా.. టీమిండియా రివ్యూకు వెళ్లి విజయవంతమైంది. దీంతో ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఇంగ్లిస్ క్రీజులోకి రాగా.. మార్ష్ 12 పరుగులతో ఉన్నాడు. ఆసీస్ స్కోరు: 39-1(5).రెండు ఓవర్లలో ఆసీస్ స్కోరు: 11-0షార్ట్ ఆరు, మార్ష్ ఐదు పరుగులతో ఉన్నారు.ఆసీస్ టార్గెట్ ఎంతంటే?క్వీన్స్ లాండ్ వేదికగా ఆసీస్తో జరుగుతున్న నాలుగో టీ20లో భారత బ్యాటర్లు రాణించారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఓ దశలో 200 పరుగుల మార్క్ను దాటేలా కన్పించిన మెన్ ఇన్ బ్లూ.. వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో ఓ మోస్తారు స్కోరుకే పరిమితమైంది.భారత ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్(46) టాప్ స్కోరర్గా నిలవగా..అభిషేక్ శర్మ(28), శివమ్ దూబే(22), సూర్యకుమార్(20), అక్షర్ పటేల్(21) రాణించారు. తిలక్ వర్మ(5), జితేష్ శర్మ(3) మాత్రం తీవ్ర నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో ఎల్లీస్, జంపా తలా మూడు వికెట్లు పడగొట్టగా.. బార్ట్లెట్, స్టోయినిష్ తలా రెండు వికెట్లు సాధించాడు.ఏడో వికెట్ డౌన్..152 పరుగుల వద్ద భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన వాషింగ్టన్ సెందర్.. ఎల్లీస్ బౌలింగ్లో ఔటయ్యాడు. 19 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. క్రీజులో అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్(8) ఉన్నారు.ఆరో వికెట్ కోల్పోయిన భారత్16.4: జితేశ్ శర్మను జంపా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ క్రమంలో జితేశ్ (4 బంతుల్లో 3) లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరగగా.. అక్షర్ పటేల్ క్రీజులోకి వచ్చాడు. వాషీ ఐదు పరుగులతో ఉన్నాడు. స్కోరు: 136-6(16.5). ఐదో వికెట్ డౌన్16.1: ఆడం జంపా బౌలింగ్లో జోష్ ఇంగ్లిస్కు క్యాచ్ ఇచ్చిన తిలక్ వర్మ (6 బంతుల్లో 5) ఐదో వికెట్గా వెనుదిరిగాడు. వాషింగ్టన్ సుందర్ క్రీజులోకి రావడంతోనే ఫోర్ బాదగా.. జితేశ్ 3 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 135-5(16.2) నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా15.1: బార్ట్లెట్ బౌలింగ్లో టిమ్ డేవిడ్కు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్గా వెనుదిరిగిన సూర్య (10 బంతుల్లో 20). స్కోరు: 125-4(15.1). జితేశ్ శర్మ క్రీజులోకి రాగా.. తిలక్ రెండు పరుగులతో ఉన్నాడు.మూడో వికెట్ కోల్పోయిన భారత్14.1: నాథన్ ఎల్లిస్ బౌలింగ్ గిల్(39 బంతుల్లో 46) బౌల్డ్. దీంతో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. స్కోరు: 121-3(14.1). తిలక్ వర్మ క్రీజులోకి రాగా.. సూర్య 7 బంతులు ఎదుర్కొని 18 పరుగులతో ఉన్నాడు.రెండో వికెట్ కోల్పోయిన భారత్11.3: నాథన్ ఎల్లిస్ బౌలింగ్లో రెండో వికెట్గా వెనుదిరిగిన శివం దూబే. 18 బంతులు ఎదుర్కొన దూబే ఓ ఫోర్, ఓ సిక్సర్ సాయంతో 22 పరుగులు చేసి ఎల్లిస్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 88-2(11.3). గిల్ 34 పరుగులతో ఉన్నాడు.పది ఓవర్ల ఆట ముగిసే సరికి భారత్ స్కోరు: 75-1.శివం దూబే 11, గిల్ 33 పరుగులతో ఆడుతున్నారు.భారత్ తొలి వికెట్ డౌన్..6.4: 56 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. ఆడమ్ జంపా బౌలింగ్లో డేవిడ్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి శివమ్ దూబే వచ్చాడు.దూకుడుగా ఆడుతున్న గిల్..4 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 31 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్(18), అభిషేక్ శర్మ(12) దూకుడుగా ఆడుతున్నారు.టీమిండియా- ఆస్ట్రేలియా క్వీన్స్లాండ్ వేదికగా నాలుగో టీ20లో తలపడుతున్నాయి. కరారా ఓవల్లో గురువారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన ఆసీస్... తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక నాలుగో టీ20లో ఆస్ట్రేలియా ఏకంగా నాలుగు మార్పులు చేసింది. ఆడం జంపా, గ్లెన్ మాక్స్వెల్, జోష్ ఫిలిప్, బెన్ డ్వార్షుయిస్లను తుదిజట్టుకు ఎంపిక చేసింది. ట్రావిస్ హెడ్, మిచెల్ ఓవెన్, సీన్ అబాట్, మాథ్యూ కుహ్నెమన్లను పక్కనపెట్టింది. మరోవైపు.. టీమిండియా మూడో టీ20లో ఆడిన జట్టునే కొనసాగించింది. దీంతో సంజూ శాంసన్కు మరోసారి మొండిచేయి తప్పలేదు.1-1తో సమంగాకాగా భారత్- ఆసీస్ మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా.. రెండో టీ20లో ఆస్ట్రేలియా గెలిచింది. ఈ క్రమంలో మూడో మ్యాచ్లో గెలవడం ద్వారా ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు సూర్యసేన సిరీస్ను 1-1తో సమం చేసింది. ఇక నాలుగో టీ20లో గెలిచి ఆధిక్యం సంపాదించాలని ఇరుజట్లు పట్టుదలగా ఉన్నాయి. తుదిజట్లుభారత్అభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), శివమ్ దూబే, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.ఆస్ట్రేలియామిచెల్ మార్ష్(కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, జోష్ ఫిలిప్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా. -
‘వాళ్లు ముందే డిసైడ్ అవుతారు.. తర్వాత సాకులు చెబుతారు’
సౌతాఫ్రికాతో టెస్టులకు జట్టును ప్రకటించిన నేపథ్యంలో టీమిండియా సెలక్టర్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ (Mohammed Shami)ని మరోసారి పక్కనపెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే ఈ బెంగాల్ బౌలర్కు మొండిచేయి చూపుతున్నారని అభిమానులు విమర్శిస్తున్నారు.కావాలనే షమీని పక్కనపెడుతున్నారుఈ నేపథ్యంలో షమీ చిన్ననాటి కోచ్ మొహమ్మద్ బద్రుద్దీన్ (Mohammed Badruddin) ఘాటుగా స్పందించాడు. కారణం లేకుండానే షమీని జట్టుకు దూరం చేస్తున్నారని మండిపడ్డాడు. ఈ మేరకు ఇండియా టుడేతో మాట్లాడుతూ... ‘‘ఇందులో దాచాల్సింది ఏమీ లేదు. వాళ్లు కావాలనే షమీని పక్కనపెడుతున్నారని స్పష్టంగా తెలుస్తోంది.ఇంతకంటే వాళ్లకు వేరే కారణం ఏమీ లేదు. అతడు ఫిట్గా లేడని అంటారా?... ఓ ఆటగాడు టెస్టు మ్యాచ్లు ఆడుతూ.. రెండు మ్యాచ్లలో కలిపి 15 వికెట్లు పడగొట్టినా అతడు ఫిట్గా లేడంటే మనం ఏం చేయగలం?వాళ్లు ముందే డిసైడ్ అవుతారుసెలక్టర్లు ఉద్దేశపూర్వకంగా ఇదంతా చేస్తున్నారు. తాము అలా చేయడం లేదంటే.. షమీని తప్పించడానికి గల కారణం ఏమిటో వాళ్లే స్వయంగా చెప్పాలి. సౌతాఫ్రికాతో సిరీస్కు షమీని ఎంపిక చేస్తారని భావించాను.స్వదేశంలో టెస్టుల్లో ఇద్దరు ఫాస్ట్బౌలర్లనే ఆడిస్తారు. కాబట్టి షమీకి ఈసారి అవకాశం ఇస్తారని అనుకున్నా. బుమ్రా వర్క్లోడ్ను తగ్గించే క్రమంలో షమీని పిలుస్తారని ఎదురుచూశా. అయినా.. ప్రదర్శన ఆధారంగా జట్టును ఎంపిక చేయాలనే ఉద్దేశం సెలక్టర్లకు లేదు.వాళ్లు ముందుగానే.. తమకు ఏ ఆటగాళ్లు కావాలో ఎంచుకుంటారు. ఆ తర్వాత తామేదో పారదర్శకంగా జట్టును ఎంపిక చేసినట్లు మాట్లాడతారు. టెస్టు జట్టు ఎంపికకు రంజీ ట్రోఫీ ప్రదర్శనల కంటే ప్రామాణికం ఏమి ఉంటుంది?టీ20 ప్రదర్శన ఆధారంగా టెస్టు జట్టును ఎంపిక చేస్తామనడం సరికాదు. రంజీల్లో బాగా ఆడుతున్న వారినే టెస్టుల్లోకి తీసుకోండి. ఏదేమైనా ఇక్కడ ముందుగానే తమకు ఇష్టమైన ఆటగాళ్లను ఎంచుకుంటారు.సాకులు చెబుతారుఅదే జాబితాకు కట్టుబడి ఉంటారు. ఆ తర్వాత.. ‘అతడు ఫిట్గా లేడు.. అతడికి మ్యాచ్ ప్రాక్టీస్ కావాలి’ అంటూ తప్పించిన ఆటగాళ్ల గురించి సాకులు చెబుతారు’’ అంటూ బద్రుద్దీన్ టీమిండియా సెలక్టర్లపై సంచలన ఆరోపణలు చేశాడు.ఏదో ఒకరోజు సెలక్ట్ చేయక తప్పదుఅదే విధంగా.. షమీది కష్టపడే తత్వమన్న బద్రుద్దీన్.. ఆట ద్వారానే అతడు అందరికీ సమాధానం చెబుతాడని పేర్కొన్నాడు. వంద శాతం ఫిట్గా ఉన్న షమీ.. త్వరలోనే టీమిండియాలోకి వస్తాడనే నమ్మకం తనకు ఉందని.. షమీతో తాను ఇదే మాట చెప్పానని తెలిపాడు. అద్భుతంగా ఆడే ఆటగాడిని సెలక్టర్లు ఏదో ఒకరోజు జట్టుకు ఎంపిక చేయక తప్పదని పేర్కొన్నాడు. వరల్డ్కప్, చాంపియన్స్ ట్రోఫీలో జట్టు కోసం శ్రమించిన ఆటగాడిని పక్కనపెట్టడం ఎంతమాత్రం సరికాదని బద్రుద్దీన్ పునరుద్ఘాటించాడు.చదవండి: అతడి కెరీర్ ముగించేశారు కదా!: అగార్కర్పై విమర్శల వర్షంసౌతాఫ్రికాతో టెస్టులకు టీమిండియా ప్రకటన -
గిల్.. ఎందుకిలా?
టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్ (shubman gill).. రెండు ఫార్మాట్లలోనూ అంచనాలకు మించి రాణిస్తున్నాడు. కానీ పొట్టి ఫార్మాట్ టి20లో స్థాయికి తగిన ఆటతీరు కనబరచడం లేదు. 26 ఏళ్ల వయసులో ఇండియన్ క్రికెట్ ఫేస్గా పేరుగాంచిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. పొట్టి ఫార్మాట్లోనూ పుంజుకోవాల్సి ఉంది. ప్రస్తుతం టీమిండియా జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా ఉన్నాడు. అతడి తర్వాత టి20 జట్టు పగ్గాలు కూడా గిల్కే దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీని కంటే అంతర్జాతీయ టి20ల్లో తన గణాంకాలను అతడు మెరుగుపరుచుకోవాల్సి ఉంది.శుబ్మన్ గిల్ ఎలాంటి బ్యాటరో క్రికెట్ అభిమానులకు తెలుసు. వన్డేలు, టెస్టుల్లో తానేంటో నిరూపించుకున్నాడు. సాంకేతికంగా అతడి బ్యాటింగ్ ఎటువంటి వంక పెట్టడానికి లేదు. క్లాసికల్ షాట్లు ఆడటంలోనూ దిట్ట. క్రీజులోకి వచ్చిన తర్వాత నెమ్మదిగా మొదలుపెట్టి తర్వాత జోరు పెంచడం అతడి స్టయిల్.భారీ ఇన్నింగ్స్ బాకీలాంగ్ ఫార్మాట్తో పోలిస్తే పొట్టి ఫార్మాట్లో బ్యాటింగ్ భిన్నంగా ఉంటుంది. పవర్ హిట్టింగ్ (Power hitting) చేసే వాళ్లే ఎక్కువగా మ్యాచ్ ఫలితాలను నిర్దేశిస్తూ ఉంటారు. గిల్ కూడా బంతులు ఎక్కువగా వృధా చేయకుండానే పరుగులు చేస్తుంటాడు. అయితే టి20ల్లో అతడి ప్రదర్శన స్థాయికి తగినట్టు లేకపోకడమే ప్రధాన సమస్య. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టి20 సిరీస్లోనూ గిల్ పెద్దగా రాణించలేదు. ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్ల్లో కేవలం 5, 15 పరుగులు మాత్రమే చేశాడు. చివరి రెండు మ్యాచ్ల్లోనా భారీ ఇన్నింగ్స్ ఆడతాడేమో చూడాలి.గట్టి పోటీ ఉన్నప్పటికీ..సూర్యకుమార్ తర్వాత కెప్టెన్ పదవి అప్పగించాలన్న ఉద్దేశంతోనూ టి20 వైస్ కెప్టెన్గా గిల్ను నియమించింది బీసీసీఐ. దీంతో ఏడాది విరామం తర్వాత టి20 జట్టులోకి వచ్చాడు. సంజూ శామ్సన్, యశస్వీ జైశాల్ (Yashasvi Jaiswal) నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ భవిష్యత్తు కెప్టెన్ అనే ఉద్దేశంతో గిల్పైపు జట్టు యాజమాన్యం మొగ్గు చూపింది. డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మతో పాటు ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లు పవర్ హిట్టింగ్తో దుంచుతున్నారు. దీంతో గిల్ కూడా రిథమ్ అందుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.ఐపీఎల్లో అదరహోధనాధన్ క్రికెట్ సిరీస్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో గిల్కు మంచి రికార్డ్ ఉంది. గత ఐదేళ్లలో ప్రతి సీజన్లోనూ 400 పరుగులు తగ్గకుండా స్కోరు చేస్తున్నాడు. ఇప్పటివరకు 118 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన గిల్.. 39.44 సగటుతో 3866 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తక్కువ మ్యాచ్లే ఆడినప్పటికీ ఇంటర్నేషనల్ టి20ల్లో అతడి బ్యాటింగ్ సగటు స్థాయికి తగ్గట్టు లేదనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పటివరకు 31 అంతర్జాతీయ టి20ల్లో 28.22 సగటుతో 762 పరుగులు మాత్రమే సాధించాడు. ఇందుల్లో సెంచరీ, 3 హాఫ్ సెంచరీలున్నాయి.సత్తా చాటాలిప్రస్తుతం అభిషేక్ శర్మతో కలిసి ఓపెనర్గా వస్తున్న గిల్.. మున్ముందు మ్యాచ్ల్లో అంచనాలకు తగినట్టుగా ఆడాల్సి ఉందని జట్టు మేనేజ్మెంట్ కోరుకుంటోంది. తక్కువ సమయంలోనే టెస్టులు, వన్డేల్లో తనదైన ముద్ర వేసిన ఈ యువ కెప్టెన్.. పొట్టి ఫార్మాట్లోనూ సత్తా చాటాలని టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. చదవండి: టీమిండియాకు ఎంపిక కావాలంటే ఇంకా ఏం చేయాలి? -
కష్టాల్లో టీమిండియా
దక్షిణాఫ్రికా-ఏతో ఇవాళ (నవంబర్ 6) మొదలైన రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్లో (India A vs South Africa A) భారత-ఏ జట్టు (India A) కష్టాల్లో పడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగి 59 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. రెండో ఓవర్లోనే అభిమన్యు ఈశ్వరన్ డకౌటయ్యాడు. ఆతర్వాత 19 పరుగులు చేసి కేఎల్ రాహుల్ కూడా ఔటయ్యాడు.17 పరుగులు చేసిన సాయి సుదర్శన్ జట్టు స్కోర్ 41 పరుగుల వద్ద ఉండగా మూడో వికెట్గా వెనుదిరిగాడు. ఆతర్వాత 5 పరుగులు చేసి దేవ్దత్ పడిక్కల్ కూడా పెవిలియన్కు చేరాడు. వాన్ వుర్రెన్ (2 వికెట్లు), సుబ్రాయెన్ (1), మొరేకీ (1) ధాటికి భారత టాపార్డర్ పేకమేడలా కూలింది.లంచ్ విరామం సమయానికి టీమిండియా స్కోర్ 85/4గా ఉంది. రిషబ్ పంత్ (23), ధృవ్ జురెల్ (19) క్రీజ్లో ఉన్నారు. వీరిద్దరు ఐదో వికెట్కు 26 పరుగులు జోడించి బ్యాటింగ్ను కొనసాగిస్తున్నారు.పంత్పై భారీ అంచనాలురెండు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్-ఏ తొలి మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో రిషబ్ పంత్ (90) ఛేదనలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత్ను గెలిపించాడు. ఇవాళ మొదలైన మ్యాచ్లో కూడా పంత్పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇంగ్లండ్లో గాయపడిన తర్వాత పంత్ ఆడుతున్న తొలి సిరీస్ ఇదే.బరిలో టీమిండియా స్టార్లుఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్కస్ ఆకెర్మన్ టాస్ గెలిచి టీమిండియాను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్లో చాలామంది టీమిండియా స్టార్లు బరిలోకి దిగుతున్నారు.కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్ ఓపెనింగ్కు దిగగా.. సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, దృవ్ జురెల్, రిషబ్ పంత్, హర్ష్ దూబే, ఆకాశ్దీప్, కల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ ఆతర్వాత స్థానాల్లో రానున్నారు. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ నేపథ్యంలో ఆ జట్టులో చోటు దక్కిన ఆటగాళ్లకు ప్రాక్టీస్ నిమిత్తం ఈ అవకాశం ఇచ్చారు. మరోవైపు దక్షిణాఫ్రికా-ఏ తరఫున ఆ జట్టు టెస్ట్ కెప్టెన్ టెంబా బవుమా సాధారణ ఆటగాడిగా బరిలోకి దిగాడు. సౌతాఫ్రికా టెస్ట్ జట్టులోకి ప్రెనేలన్ సుబ్రాయన్ కూడా ఈ మ్యాచ్ ఆడుతున్నాడు.ఇండియా A (ప్లేయింగ్ XI): KL రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రిషబ్ పంత్(w/c), హర్ష్ దూబే, ఆకాష్ దీప్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణదక్షిణాఫ్రికా A (ప్లేయింగ్ XI): జోర్డాన్ హెర్మాన్, లెసెగో సెనోక్వానే, టెంబా బావుమా, జుబేర్ హంజా, మార్క్వెస్ అకెర్మాన్ (సి), కానర్ ఎస్టర్హుయిజెన్ (w), టియాన్ వాన్ వురెన్, కైల్ సిమండ్స్, ప్రేనెలన్ సుబ్రాయెన్, షెపో మోరేకి, ఒకుహ్లే సెలె -
ఆర్సీబీకి సంబంధించి మరో బిగ్ న్యూస్
ఆర్సీబీ (RCB) ఫ్రాంచైజీకి సంబంధించి మరో బిగ్ న్యూస్ అందింది. తొలుత ఫ్రాంచైజీ అమ్మకానికి పెట్టిన వార్త రాగా.. తాజాగా మహిళల ఆర్సీబీ కొత్త హెడ్ కోచ్ను (Malolan Rangarajan) నియమించుకుందన్న వార్త వెలువడింది. ఈ విషయాన్ని ఆర్సీబీ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది. మలోలన్ రంగరాజన్ తమిళనాడుకు చెందిన మాజీ క్రికెటర్.🚨 OFFICIAL ANNOUNCEMENT Malolan Rangarajan, a key member of the RCB support staff for the last 6 years in various roles, has now been appointed as 𝗛𝗘𝗔𝗗 𝗖𝗢𝗔𝗖𝗛 for the upcoming WPL cycle. More details, and WPL retentions announcement soon… 🤩#PlayBold #ನಮ್ಮRCB pic.twitter.com/PLiDY9sxef— Royal Challengers Bengaluru (@RCBTweets) November 6, 2025రంగరాజన్ గతంలో ఆర్సీబీ పురుషులు, మహిళల జట్లకు స్కౌట్, ఫీల్డింగ్ కోచ్గా పని చేశారు. 2024 సీజన్లో ఆర్సీబీని ఛాంపియన్గా నిలిపిన ల్యూక్ విలియమ్స్ వేరే కోచింగ్ కమిట్మెంట్స్ కారణంగా ఆర్సీబీని వీడారు. వచ్చే సీజన్ నుంచి మలోలన్ ల్యూక్ విలియమ్స్ స్థానాన్ని భర్తీ చేస్తారు.మరోవైపు ఇంగ్లండ్ మాజీ పేసర్ అన్యా ష్రబ్సోల్ (Anya Shrubsole)ను ఆర్సీబీ తమ బౌలింగ్ కోచ్గా ఎంపిక చేసింది. అన్యా గతంలో ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధానతో కలిసి 'ది హండ్రెడ్'లో సదరన్ బ్రేవ్ తరఫున ఆడింది. ష్రబ్సోల్..గత సీజన్ వరకు బౌలింగ్ కోచ్గా పనిచేసిన సునేత్ర పరంజాపే స్థానంలో బాధ్యతలు చేపట్టనుంది.అమ్మకానికి ఆర్సీబీపురుషుల ఐపీఎల్లో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఆర్సీబీని అమ్మకానికి పెట్టినట్లు యాజమాన్యం (డియాజియో కంపెనీ) అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కు కూడా సమాచారం ఇచ్చినట్లు వెల్లడించింది. ఫ్రాంచైజీలో పెట్టుబడిదారుల కోసం అన్వేషిస్తున్నట్లు తెలిపింది. కొత్త యజమానులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సం ముగిసే నాటికి... అంటే వచ్చే మార్చి 31వ తేదీకల్లా విక్రయ ప్రక్రియ పూర్తిచేయనుంది.చదవండి: సీఎస్కే అభిమానులకు శుభవార్త -
సీఎస్కే అభిమానులకు శుభవార్త
2026 ఐపీఎల్ (IPL) సీజన్కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులకు ఎగిరే గంతేసే శుభవార్త అందింది. ఆ ఫ్రాంచైజీ లెజెండరీ ప్లేయర్ ఎంఎస్ ధోని (MS Dhoni) వచ్చే సీజన్ కూడా ఆడనున్నాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథ్ స్పష్టం చేశాడు. ధోనికి ఇప్పట్లో రిటైరయ్యే యోచన కూడా లేదని తెలిపాడు.కాగా, ధోని రిటైర్మెంట్పై ఊహాగానాలు ప్రతి సీజన్కు ముందు పరిపాటిగా మారాయి. అయితే ధోని మాత్రం ఏయేటికాయేడు వాటిని పటాపంచలు చేస్తూ బరిలోకి దిగుతున్నాడు. 2026 సీజన్కు ముందు కూడా ఇదే సీన్ కొనసాగింది. ధోని వచ్చే సీజన్లో బరిలోకి దిగడని ప్రచారం జరిగింది. తాజాగా కాశీ విశ్వనాథ్ వ్యాఖ్యలతో ధోని రిటైర్మెంట్పై ప్రచారానికి తెరపడింది.ధోని 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగి, ఇప్పటికీ ఐపీఎల్లో కొనసాగుతున్నాడు. ధోని ఇంకెంత కాలం ఐపీఎల్ ఆడతాడని క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఏయేటికాయేడు ఈ సీజనే ధోనికి లాస్ట్ అని అనుకున్నా, అతను మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ కెరీర్ను పొడిగిస్తున్నాడు.2026లోనూ ధోనిని మైదానంలో చూడబోతున్నామన్న వార్త అతని అభిమానులను పిచ్చెక్కిస్తుంది. సింహం మరోసారి బరిలోకి దిగబోతుందంటూ వారు సంబరాలు చేసుకుంటున్నారు.ఆల్టైమ్ గ్రేట్ఐపీఎల్ ప్రారంభం నుంచి (మధ్యలో రెండు సీజన్లు మినహా) సీఎస్కేతోనే ఉన్న ధోని.. ఆ ఫ్రాంచైజీకి ఐదు టైటిళ్లు (2010, 2011, 2018, 2021, 2023)అందించాడు. గత సీజన్లో మాత్రం సీఎస్కే ప్రదర్శన చాలా దారుణంగా ఉండింది. కెప్టెన్ రుతురాజ్ గాయపడటంతో ధోనినే కెప్టెన్సీ బాధ్యతలు మోశాడు. ఆ సీజన్లో సీఎస్కే 14 మ్యాచ్ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో తొలిసారి ఆఖరి స్థానంలో నిలిచింది.మోకాలి సమస్యరిటైర్మెంట్కు (అంతర్జాతీయ క్రికెట్కు) ముందు నుంచి ధోనిని గాయాల సమస్య వేధిస్తుంది. ముఖ్యంగా కెరీర్ మధ్య నుంచి ధోని మోకాలి సమస్యతో బాధ పడుతున్నాడు. 2023లో అతని ఎడమ మోకాలికి ప్రధాన శస్త్రచికిత్స జరిగింది. ఆతర్వాత అతను knee brace ధరించి, పెయిన్ కిల్లర్స్ వాడుతూ అన్ని బాధ్యతలను సమర్థంగా నిర్వహించాడు. 44 ఏళ్ల వయసులోనూ ధోని ఫిట్నెస్పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, ఆటపై తన ప్రేమను కొనసాగిస్తున్నాడు.చదవండి: సౌతాఫ్రికాతో రెండో టెస్ట్.. బ్యాటింగ్కు దిగిన టీమిండియా -
సౌతాఫ్రికాతో రెండో టెస్ట్.. బ్యాటింగ్కు దిగిన టీమిండియా
బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్-1లో ఇవాళ (నవంబర్ 6) భారత్-ఏ, దక్షిణాఫ్రికా-ఏ (India A vs South Africa A) జట్ల మధ్య రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్కస్ ఆకెర్మన్ టాస్ గెలిచి టీమిండియాను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్లో చాలామంది టీమిండియా స్టార్లు బరిలోకి దిగుతున్నారు.కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్ ఓపెనింగ్కు దిగగా.. సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, దృవ్ జురెల్, రిషబ్ పంత్, హర్ష్ దూబే, ఆకాశ్దీప్, కల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ ఆతర్వాత స్థానాల్లో రానున్నారు. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ నేపథ్యంలో ఆ జట్టులో చోటు దక్కిన ఆటగాళ్లకు ప్రాక్టీస్ నిమిత్తం ఈ అవకాశం ఇచ్చారు. మరోవైపు దక్షిణాఫ్రికా-ఏ తరఫున ఆ జట్టు టెస్ట్ కెప్టెన్ టెంబా బవుమా సాధారణ ఆటగాడిగా బరిలోకి దిగాడు. సౌతాఫ్రికా టెస్ట్ జట్టులోకి ప్రెనేలన్ సుబ్రాయన్ కూడా ఈ మ్యాచ్ ఆడుతున్నాడు.రెండు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్-ఏ తొలి మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో రిషబ్ పంత్ (90) ఛేదనలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత్ను గెలిపించాడు. ఇవాళ మొదలైన మ్యాచ్లో కూడా పంత్పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇంగ్లండ్లో గాయపడిన తర్వాత పంత్ ఆడుతున్న తొలి సిరీస్ ఇదే.ఆదిలోనే షాక్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ మొరేకీ బౌలింగ్లో డకౌటయ్యాడు. కేఎల్ రాహుల్కు జతగా సాయి సుదర్శన్ క్రీజ్లోకి వచ్చాడు.ఇండియా A (ప్లేయింగ్ XI): KL రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్, దృవ్ జురెల్, రిషబ్ పంత్(w/c), హర్ష్ దూబే, ఆకాష్ దీప్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణదక్షిణాఫ్రికా A (ప్లేయింగ్ XI): జోర్డాన్ హెర్మాన్, లెసెగో సెనోక్వానే, టెంబా బావుమా, జుబేర్ హంజా, మార్క్వెస్ అకెర్మాన్ (సి), కానర్ ఎస్టర్హుయిజెన్ (w), టియాన్ వాన్ వురెన్, కైల్ సిమండ్స్, ప్రేనెలన్ సుబ్రాయెన్, షెపో మోరేకి, ఒకుహ్లే సెలెచదవండి: చరిత్ర సృష్టించిన మిచెల్ సాంట్నర్ -
చరిత్ర సృష్టించిన మిచెల్ సాంట్నర్
వెస్టిండీస్తో నిన్న (నవంబర్ 5) జరిగిన టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (Mitchell Santner) చారిత్రక ఇన్నింగ్స్ ఆడాడు. 165 పరుగుల లక్ష్య ఛేదనలో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు దిగి.. వీరోచిత పోరాటాన్ని (28 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 55 పరుగులు) ప్రదర్శించాడు. సాంట్నర్ చెలరేగినా న్యూజిలాండ్ లక్ష్యానికి 8 పరుగుల దూరంలో నిలిచిపోయింది. తద్వారా స్వదేశంలో జరుగుతున్న ఐదు మ్యాచ్ల సిరీస్లో 0-1తో వెనుకపడిపోయింది.ఈ ఇన్నింగ్స్తో సాంట్నర్ పలు రికార్డులు నెలకొల్పాడు. ఐసీసీ ఫుల్ మెంబర్ టీమ్లలో ఎనిమిది అంతకంటే తక్కువ స్థానాల్లో బ్యాటింగ్కు దిగిన కెప్టెన్లలో హాఫ్ సెంచరీ చేసిన తొలి ప్లేయర్గా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ విభాగంలో అత్యధిక స్కోర్ సాంట్నర్ సహచరుడు టిమ్ సౌథీ (39), ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు (39) రషీద్ ఖాన్ పేరిట సంయుక్తంగా ఉండేది.ఈ మ్యాచ్లో 107/9 స్కోర్ వద్ద జేకబ్ డఫీతో (1 నాటౌట్) సాంట్నర్ పదో వికెట్కు అజేయమైన 50 పరుగులు జోడించాడు. తద్వారా ఐసీసీ ఫుల్ మెంబర్ టీమ్లలో పదో వికెట్కు అత్యధిక భాగస్వామ్యం జోడించిన రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు జోష్ లిటిల్-బ్యారీ మెక్కార్తీ (44*) పేరిట ఉండేది.కాగా, నిన్నటి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. షాయ్ హోప్ (53) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఛేదనలో తడబడిన న్యూజిలాండ్ను సాంట్నర్ (55 నాటౌట్) గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో జేడన్ సీల్స్, రోస్టన్ ఛేజ్ తలో 3 వికెట్లు తీసి కివీస్ను దెబ్బకొట్టారు. ఈ సిరీస్లోని రెండో టీ20 ఆక్లాండ్ వేదికగా నవంబర్ 6న జరుగనుంది. చదవండి: నరాలు తెగే ఉత్కంఠ: సాంట్నర్ విధ్వంసకర ఇన్నింగ్స్ వృథా -
టీమిండియాకు ఎంపిక కావాలంటే "ఇంకా ఏం చేయాలి"..?
త్వరలో సౌతాఫ్రికాతో జరుగోయే 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టును నిన్న (నవంబర్ 5) ప్రకటించారు. ఊహించిన విధంగానే అన్ని ఎంపికలు జరిగాయి. కొత్త వారెవ్వరికీ అవకాశాలు దక్కలేదు. ఇంగ్లండ్ సిరీస్ సందర్భంగా గాయపడిన పంత్ రీఎంట్రీ ఇచ్చాడు. అదే సిరీస్లో ఆకట్టుకున్న ఆకాశ్దీప్ పునరాగమనం చేశాడు. యువ ఆటగాళ్లు సాయి సుదర్శన్, దేవ్దత్ పడిక్కల్, ధృవ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి తమ స్థానాలు నిలబెట్టుకున్నారు.కెప్టెన్గా శుభ్మన్ గిల్.. సీనియర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ కొనసాగారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.అసలు టీమిండియాకు ఎంపిక కావాలంటే ఏం చేయాలి..?ఈ జట్టు ప్రకటన తర్వాత భారత క్రికెట్ అభిమానుల్లో ఓ విషయంలో గందరగోళం మొదలైంది. అసలు టీమిండియాకు ఎంపిక కావాలంటే ఏం చేయాలి.. దీనికి ప్రామాణికం ఏంటని చాలా మంది చర్చించుకుంటున్నారు.ఈ చర్చ ఉత్పన్నమవడానికి ఇటీవలికాలంలో భారత సెలెక్టర్లు అనుసరిస్తున్న విధానాలే కారణం. గతంలో భారత జట్టుకు ఎంపిక కావాలంటే దేశవాలీ క్రికెట్లో సత్తా చాటాల్సి ఉండేది. అక్కడ అత్యుత్తమంగా రాణిస్తేనే భారత సెలక్టర్ల నుంచి పిలుపు దక్కేది. అయితే ప్రస్తుతం సీన్ మారిపోయింది.పెద్ద తలకాయల అండదండలుంటే చాలా..?భారత క్రికెట్కు సంబంధించి పెద్ద తలకాయల అండదండలుంటే ఎలాగైనా జట్టులోకి వచ్చేయవచ్చు. ఇందుకు హర్షిత్ రాణా ఉదంతమే ప్రధాన ఉదాహరణ. హర్షిత్ ఏ అనుభవం లేకుండా, టీమిండియాలో ఓ పెద్ద తలకాయ మద్దతుతో దాదాపు ప్రతి జట్టులో ప్రత్యక్షమవుతుంటాడు. ఇతగాడికి ప్లేయింగ్ ఎలెవెన్లో కూడా అవకాశాలు సులువుగా వచ్చేస్తుంటాయి.ఇంత లాబీయింగ్ జరిగి తుది జట్టులోకి వచ్చాక ఏమైనా పొడిచేశాడా అంటే, అదీ లేదు. పైగా అతని ఎంపికను కొందరు సమర్దించుకోవడం హాస్యాస్పదం. ఓ పేరుమోసిన వ్యక్తయితే ఈ విషయంపై ప్రశ్నించిన వారిపై ఎదురుదాడికి దిగడం ఇంకా విడ్డూరం. అంతిమంగా హర్షిత్ విషయంలో వ్యతిరేకత తారాస్థాయికి చేరడంతో సెలెక్టర్లు కాస్త తగ్గారు. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్కు అతన్ని ఎంపిక చేయలేదు. అయితే సౌతాఫ్రికా-ఏతో వన్డే సిరీస్కు మరో అవకాశం ఇచ్చి ఈగోను సంతృప్తివరచుకున్నారు.అర్హులకు అన్యాయంహర్షిత్ లాంటి అనర్హులు జట్టులో రావడం వల్ల చాలామంది అర్హులకు అన్యాయం జరిగింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్లో ఇది మరోసారి నిరూపితమైంది. హర్షిత్కు అవకాశం ఇవ్వాల్సి రావడంతో మొదటి రెండు టీ20లకు ప్రపంచ నంబర్ వన్ బౌలర్ అర్షదీప్ సింగ్కు అవకాశం ఇవ్వలేదు. ఎట్టకేలకు మూడో టీ20లో హర్షిత్ను పక్కన పెట్టి అర్షదీప్కు అవకాశం ఇవ్వగా, అతడు చెలరేగిపోయాడు. 3 వికెట్లు తీసి టీమిండియాను గెలిపించాడు.హర్షిత్ విషయంలో అలా.. షమీ, కరుణ్ విషయంలో ఇలా..!వరుసగా విఫలమవుతున్న హర్షిత్ లాంటి ఆటగాళ్లకు పదేపదే అవకాశాలు ఇస్తున్న సెలెక్టర్లు.. దేశవాలీ క్రికెట్లో సత్తా చాటుతున్న మహ్మద్ షమీ, కరుణ్ నాయర్ లాంటి ఆటగాళ్లను మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో షమీ, కరుణ్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. అయినా వీరికి సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్కు అవకాశం దక్కలేదు. కనీసం సౌతాఫ్రికా-ఏతో సిరీస్కు కూడా సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు.హర్షిత్ లాంటి ఆటగాళ్ల విషయంలో పక్షపాతంగా వ్యవహరించే బీసీసీఐ పెద్దలు.. ఒకప్పుడు టీమిండియాలో ఓ వెలుగు వెలిగి, ప్రస్తుతం ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్న షమీ, కరుణ్ లాంటి వారిని మాత్రం విస్మరిస్తున్నారు. శుభపరిణామం కాదు..!భారత క్రికెట్కు ఇలాంటి అనుభవాలు ఏ మాత్రం మంచివి కావు. అర్హులకు అన్యాయాలు జరుగుతూ పోతుంటే, రానున్న తరాల్లో దేశానికి ప్రాతినిథ్యం వహించాలనే ఆశ చచ్చిపోతుంది. క్రికెట్కు ఇలాంటి అనుభవాలు ఎంత మాత్రం శుభపరిణామం కాదు. అనర్హమైన వ్యక్తుల కోసం దేశ ప్రయోజనాలు పణంగా పెట్టి, అర్హులను విస్మరించడం మంచి సాంప్రదాయం కాదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.దేశవాలీ క్రికెట్లో సత్తా చాటుతున్న మహ్మద్ షమీ, కరుణ్ నాయర్, పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్ లాంటి చాలామంది ఆటగాళ్ల అవేదన ఇది. చదవండి: పంత్, ఆకాశ్ పునరాగమనం -
మూడో రౌండ్లో అర్జున్, గుకేశ్
పనాజీ: ప్రపంచకప్ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్ మాస్టర్, భారత నంబర్ వన్ ఇరిగేశి అర్జున్... ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ మూడో రౌండ్లోకి ప్రవేశించారు. రెండో రౌండ్లో అర్జున్ 2–0తో పెట్రోవ్ మార్టిన్ (బల్గెరియా)పై... గుకేశ్ 1.5–0.5తో నోగేర్బెక్ కాజిబెక్ (కజకిస్తాన్)పై గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్లు పెంటేల హరికృష్ణ, కార్తీక్ వెంకటరామన్ కూడా మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. రెండో రౌండ్లో హరికృష్ణ 1.5–0.5తో నెస్తేరోవ్ (రష్యా)పై, కార్తీక్ వెంకటరామన్ 1.5–0.5తో అరవింద్ చిదంబరం (భారత్)పై విజయం సాధించారు. -
పంత్, ఆకాశ్ పునరాగమనం
న్యూఢిల్లీ: స్టార్ వికెట్ కీపర్–బ్యాటర్ రిషభ్ పంత్ మళ్లీ భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేశాడు. ఇంగ్లండ్ పర్యటనలో ఆకట్టుకున్న పేసర్ ఆకాశ్దీప్కూ సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. ఇంగ్లండ్లో నాలుగో టెస్టు సందర్భంగా పంత్ కాలికి గాయమైంది. దీంతో విండీస్తో సిరీస్కు సైతం దూరమయ్యాడు. ప్రస్తుతం భారత్ ‘ఎ’ జట్టు కెప్టెన్ పంత్ దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరిగిన మ్యాచ్లో రాణించాడు. అయితే వెటరన్ సీమర్ మహ్మద్ షమీని సెలక్టర్లు పట్టించుకోలేదు. టీమిండియా బెర్తుకోసం రంజీల్లో శ్రమిస్తున్న అతని పేరును సెలక్టర్లు పరిశీలించకపోవడం చూస్తుంటే ఇక 35 ఏళ్ల షమీ కెరీర్ ముగిసినట్లేననే ఊహాగానాలకు ఊపిరి పోసినట్లయ్యింది. సఫారీతో ఈ నెల 14 నుంచి కోల్కతాలో తొలిటెస్టు, 22 నుంచి గువాహటి రెండో టెస్టులో జరుగుతుంది. భారత టెస్టు జట్టు: గిల్ (కెప్టెన్), జైస్వాల్, రాహుల్, సాయి సుదర్శన్, పడిక్కల్, పంత్, జురేల్, జడేజా, సుందర్, బుమ్రా, అక్షర్, నితీశ్ రెడ్డి, సిరాజ్, కుల్దీప్, ఆకాశ్దీప్. -
పైచేయి కోసం...
గోల్డ్కోస్ట్: సిరీస్లో కీలకమైన పైచేయి కోసం భారత్, ఆ్రస్టేలియా జట్లు సమరానికి సై అంటున్నాయి. తొలి మ్యాచ్ వర్షంతో రద్దవడం... తదుపరి రెండు మ్యాచ్ల్లో చెరోటి గెలవడంతో ఇరు జట్లు ప్రస్తుతం 1–1తో సమవుజ్జీగా నిలిచాయి. ఈ నేపథ్యంలో గురువారం ఇక్కడ జరిగే నాలుగో టి20లో గెలిచిన జట్టు ఇక సిరీస్లో ఓడిపోదు. 2–1తో ఆధిక్యంలోకి వెళ్లిన జట్టు ఆఖరిపోరులో ఓడినా సిరీస్ సమమవుతుందే కానీ చేజారనే చేజారదు. దీంతో భారత్, ఆ్రస్టేలియా జట్లు ఇక్కడే గెలిసి సిరీస్ పట్టు పట్టాలనే లక్ష్యంతో ఉన్నాయి. ఇదే జరిగితే మాత్రం టి20లో మెరుపుల హోరు ఖాయం! ఎందుకంటే పిచ్ కూడా బ్యాటింగ్కు స్వర్గధామం. అంతర్జాతీయ మ్యాచ్లు అరకొరగా జరిగినా... బిగ్బాష్ లీగ్లలో భారీస్కోర్లకు లోటే లేదు. దీంతో బౌలర్లకే కఠిన సవాళ్లు ఎదురవక తప్పదు. గిల్ బాకీ పడ్డాడు ఓపెనర్ శుబ్మన్ గిల్ ఈ టి20 సిరీస్లోనే కాదు... అంతకుముందు జరిగిన వన్డే సిరీస్లోనూ పెద్దగా ప్రభావమే చూపలేదు. పరుగుల పరంగా రెండు సిరీస్లకు బాకీ పడ్డాడు. బహుశా బ్యాటింగ్కు అచ్చొచ్చే ఈ మ్యాచ్లో ఆ బాకీ ఏదో తీర్చుకుంటే భారత్కు శుభారంభం లభిస్తుంది. టి20 స్పెషలిస్టు ఓపెనర్, ధనాధన్ హిట్టర్ అభిషేక్ వర్మ పవర్ ప్లేలో కావల్సినదానికంటే పెద్ద సంఖ్యలోనే పరుగులు కూడబెడతాడు. కెపె్టన్ సూర్యకుమార్, తిలక్ వర్మలు సైతం భారీ షాట్లకు తెగబడితే, బౌలింగ్ ఆల్రౌండర్లు ఆక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లు అడపాదడపా దంచేస్తే మాత్రం 200 పైచిలుకు స్కోరు టీమిండియాకు ఏమంత కష్టమే కాదు. అప్పుడు బుమ్రా, అర్‡్షదీప్, వరుణ్, అక్షర్, సుందర్లతో కూడిన బౌలింగ్ దళం తమ పనిని చింత లేకుండా చక్కబెట్టే అవకాశం ఉంటుంది. కీలక ఆటగాళ్లు దూరం రెండో టి20తోనే హాజల్వుడ్, మూడో మ్యాచ్తో హెడ్, అబాట్లు జట్టు వీడారు. త్వరలోనే జరిగే ప్రతిష్టాత్మక యాషెస్ కోసం తుదిసన్నాహాల్లో ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడేందుకు కీలకమైన ఆటగాళ్లను విడుదల చేశారు. అయితే ఇది ఆసీస్ లాంటి అగ్రశ్రేణి జట్టుకు ప్రతికూలత కాదు... భారత్కు గొప్ప అనుకూలతగా భావించరాదు. ఎందుకంటే ఇది కంగారూ జట్టు. మేటి ఆటగాళ్లెంతో మంది ఉన్నారు. తొలి మూడు మ్యాచ్లు ఆడని విధ్వంసకర ఆల్రౌండర్ మ్యాక్స్వెల్ ఈ మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. స్టొయినిస్, టిమ్ డేవిడ్, ఇన్గ్లిస్లాంటి హిట్టర్లూ ఉన్నారు. కాబటి ఒకరిద్దరు లేనంత మాత్రం ఆసీస్ బలహీనమనుకుంటే తప్పులో కాలేసినట్లే కెప్టెన్ మిచెల్ మార్‡్ష, టిమ్ డేవిడ్, స్టొయినిస్లు ఈ సిరీస్లో చక్కని ఫామ్లో ఉన్నారు. అనుభవజు్ఞలైన పేస్ బలగం లేకపోవడం కాస్త ఇబ్బందికరమైనప్పటికీ బార్ట్లెట్, ఎలిస్లు ఆ బాధ్యతను సమర్థవంతగా నిర్వర్తించగలరు. ఈ నేపథ్యంలో సొంత ప్రేక్షకుల మద్దతుతో ఆతిథ్య జట్టు దంచేయడం ఖాయం! తద్వారా ఇరుజట్ల బ్యాటింగ్ మెరుపులతో స్కోరు హోరెత్తడం కూడా ఖాయమే!పిచ్–వాతావరణం ఈ కరార వేదిక బిగ్బాష్ లీగ్కు ఫేమస్. మెరుపుల టి20లో భారీస్కోర్లకు చిరునామా దీంతో బ్యాటర్లకు పండగే. ఇక అంతర్జాతీయ మ్యాచ్ల విషయానికొస్తే ఇక్కడ కేవలం రెండే మ్యాచ్లు జరిగాయి. వర్ష సూచన లేదు.తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్ ), అభిషేక్, శుబ్మన్, తిలక్వర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జితేశ్, శివమ్ దూబే, అర్‡్షదీప్, వరుణ్, బుమ్రా. ఆస్ట్రేలియా: మార్ష్(కెప్టెన్ ), షార్ట్, ఇన్గ్లిస్, టిమ్ డేవిడ్, మిచ్ ఒవెన్, స్టొయినిస్, మ్యాక్స్వెల్, బార్ట్లెట్, డ్వార్షుయిస్, ఎలిస్, కునెమన్. -
అమ్మకానికి ఆర్సీబీ... త్వరలోనే కొత్త యాజమాన్యం చేతుల్లోకి!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ సీజన్లో విజేతగా నిలిచింది. ఇన్నేళ్లలో ఈ జట్టులో కోహ్లి తప్ప అందరు మారారు. ఎంతో మంది కొత్త ఆటగాళ్లు వచ్చారు. ఇప్పుడేమో కొత్త యాజమాన్యం రాబోతోంది. ఎందుకంటే ఈ చాంపియన్ ఫ్రాంచైజీని తాజాగా అమ్మకానికి పెట్టారు. అన్నట్లు ఆర్సీబీ అంటే ఒక జట్టే కాదు... భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్వహిస్తున్న ఐపీఎల్, మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీల్లో ఆర్సీబీ జట్లు పోటీపడుతున్నాయి. గతేడాది మహిళల ఆర్సీబీ జట్టు కూడా డబ్ల్యూపీఎల్ విజేతగా నిలిచింది. కొన్ని రోజులుగా అమ్మకంపై ఊహగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయాన్ని ఫ్రాంచైజీ యాజమాన్యం డియాజియో కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు బాంబే స్టాక్ ఎక్సే్చంజ్కు సైతం సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. తమ ఫ్రాంచైజీలో పెట్టుబడిదారుల కోసం అన్వేషిస్తున్నట్లు చెప్పింది. కొత్త యజమానులను ఆహా్వనిస్తున్నట్లు తెలిపింది. ఈ ఆరి్థక సంవత్సం ముగిసే నాటికి... అంటే వచ్చే మార్చి 31 తేదీకల్లా విక్రయ ప్రక్రియ పూర్తిచేయనుంది. -
ఛ!.. నేను అలాంటి వాడిని కాదు: యువరాజ్ సింగ్
టీమిండియా దిగ్గజ ఆల్రౌండర్లలో యువరాజ్ సింగ్ (Yuvraj Singh) ఒకడు. భారత్ టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్కప్-2011 గెలవడంలో ఈ ఎడమచేతి వాటం ఆటగాడు కీలక పాత్ర పోషించాడు. క్యాన్సర్తో పోరాడి తిరిగి మైదానంలో అడుగుపెట్టి పరుగులు రాబట్టిన ఘనుడు.ఇక అన్ని ఫార్మాట్ల నుంచి చాలా ఏళ్ల క్రితమే వైదొలిగిన యువీ.. ఆ తర్వాత మెంటార్గా కొత్త అవతారం ఎత్తాడు. పంజాబీ స్టార్లు.. టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill), అభిషేక్ శర్మ (Abhishek Sharma)లకు చాన్నాళ్లుగా యువీ మార్గనిర్దేశకుడిగా ఉన్నాడు. ముఖ్యంగా అతడి గైడెన్స్లోనే అభిషేక్ టీ20 విధ్వంసకరవీరుడిగా రాటుదేలాడు.అస్సలు పోలికలు లేవుఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ తాజాగా PTIతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోచింగ్ విషయంలో తన తండ్రి యోగ్రాజ్ సింగ్తో తనకు అస్సలు పోలికలు లేవన్నాడు. మనకు నచ్చినది ఎదుటివాళ్లపై రుద్దడం కోచింగ్ కాదని.. ఆటగాళ్ల మైండ్సెట్ను బట్టి తీర్చిదిద్దడమే అసలైన కోచింగ్ అంటూ పరోక్షంగా తండ్రికి కౌంటర్ ఇచ్చాడు.యోగ్రాజ్ సింగ్ లాంటివాడిని కానే కాదుఈ మేరకు.. ‘‘నేను కచ్చితంగా యోగ్రాజ్ సింగ్ లాంటివాడిని కానే కాదు. వ్యక్తిగా, వ్యక్తిత్వం పరంగా ఆయనతో నాకు పోలిక లేదు. మేమిద్దరం భిన్న ధృవాలము. నా కోచింగ్ శైలి కూడా వేరుగా ఉంటుంది.ఒక ఆటగాడికి కోచ్గా ఉన్నపుడు.. అతడి స్థానంలో ఉండి ఆలోచించాలి. అతడికి ఆలోచనా విధానం, శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా వ్యవహరించాలి. వారి గురించి పూర్తిగా తెలుసుకుని మార్గనిర్దేశనం చేయాలి.అభిషేక్ శర్మకు చాలా ఏళ్లుగా మెంటార్గా ఉన్నాను. తద్వారా ఓ వ్యక్తికి ఎలా మార్గదర్శనం చేయాలో నేను పరిపూర్ణంగా నేర్చుకున్నా. ప్రతిభావంతులను ఎలా గుర్తించాలో తెలుసుకున్నా. కఠిన శ్రమకు ఓరుస్తూ.. ఒక్కో మెట్టు ఎక్కి మేము అనుకున్న ఫలితాలు రాబడుతున్నాం.అభిషేక్ శర్మ అదే చేస్తున్నాడుసహజమైన శైలిలో ఆడితేనే ఏ ఆటగాడైనా తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలడు. 2011 వరల్డ్కప్ విన్నింగ్ జట్టు కెప్టెన్ గ్యారీ కిర్స్టెన్ నాకు ఈ మాట చెప్పాడు. ఇదే నేను ఫాలో అయ్యాను. నా శిష్యులకు కూడా ఇదే చెబుతున్నా. కోచ్, కెప్టెన్ స్వేచ్ఛను ఇస్తే ఆటగాడు అద్భుతాలు చేయగలడు. ఇప్పుడు అభిషేక్ శర్మ అదే చేస్తున్నాడు’’ అని యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు.కాగా అభిషేక్ శర్మ ఐపీఎల్లో సత్తా చాటి టీమిండియాలో అడుగుపెట్టాడు. అనతికాలంలోనే ఐసీసీ నంబర్వన్ టీ20 బ్యాటర్గా ఎదిగాడు. ఇదిలా ఉంటే.. యువీని చిన్ననాటి నుంచే క్రికెటర్గా తీర్చిదిద్దే క్రమంలో యోగ్రాజ్ సింగ్ చాలా కఠినంగా వ్యవహరించాడు.ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు కూడా!.. ఒకానొక సందర్భంగా తన శిక్షణలో యువీ చచ్చిపోతాడంటూ అతడి తన తల్లి గొడవపెట్టినా పట్టించుకోలేదని తెలిపాడు. ఈ నేపథ్యంలో యువీ తన తండ్రి గురించి పైవిధంగా స్పందించడం గమనార్హం.చదవండి: BCCI: భారత జట్టు కెప్టెన్గా తిలక్ వర్మ.. రోహిత్- కోహ్లి లేరు -
వరల్డ్కప్ విజేతలకు ప్రధాని మోదీ ఆతిథ్యం
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత మహిళా క్రికెట్ జట్టుని అభినందించారు. తన నివాసంలో హర్మన్ సేనతో ప్రధాని సమావేశమై.. వరల్డ్కప్ విశేషాలను చర్చించారు. కాగా నలభై ఏడేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలుకుతూ భారత మహిళా జట్టు అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే.సొంతగడ్డపై ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 టైటిల్ను మన అమ్మాయిలు గెలుచుకున్నారు. నవీ ముంబై వేదికగా ఆదివారం నాటి ఫైనల్లో సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో చిత్తు చేసి విశ్వ విజేతగా అవతరించారు. ఈ క్రమంలో హర్మన్ సేనపై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ.. తన కార్యాలయంలో వారితో సమావేశం అవ్వాలని నిర్ణయించుకున్నారు.ఈ విషయాన్ని తెలుపుతూ ప్రధాని కార్యాలయం.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి ఆహ్వానం పంపింది. ఈ నేపథ్యంలో భారత మహిళా జట్టు బుధవారం ఢిల్లీలోని 7 లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసానికి చేరుకుంది. అనంతరం కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ వరల్డ్కప్ ట్రోఫీతో ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆ తర్వాత ప్రధాని మోదీ జగజ్జేతలతో సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా వన్డే వరల్డ్కప్ విజేతలు.. తమ సంతకాలతో కూడిన ‘నమో’ జెర్సీని ప్రధానికి కానుకగా ఇచ్చారు. ఈ క్రమంలో మహిళా క్రికెటర్లకు శుభాకాంక్షలు తెలిపిన మోదీ.. వరుసగా మూడు మ్యాచ్లు ఓడిన తర్వాత పుంజుకున్న తీరు అద్భుతమని కొనియాడారు.హ్యాట్రిక్ ఓటముల నేపథ్యంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చినా.. ఒత్తిడిని అధిగమించారంటూ భారత జట్టును ప్రధాని మోదీ ప్రశంసించారు. ‘ఫిట్ ఇండియా’ సందేశాన్ని దేశమంతా వ్యాప్తి చేయాలని.. ఈ సందర్భంగా మోదీ హర్మన్ సేనకు పిలుపునిచ్చారు.ఊబకాయం వల్ల వచ్చే సమస్యలు, ఫిట్గా ఉండటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రచారం చేయాలని.. పాఠశాలకు వెళ్లి మరీ పిల్లలకు ఇవన్నీ బోధించాలని మోదీ.. భారత జట్టుకు సూచించారు. ఇక ప్రధాని మోదీతో మాట్లాడుతున్న క్రమంలో కెప్టెన్ హర్మన్ప్రీత్.. 2017 ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమిని గుర్తు చేసుకోగా.. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన .. ఆ సమయంలో ప్రధాని మోదీ తమలో స్ఫూర్తి నింపారని తెలిపింది.చదవండి: BCCI: భారత జట్టు కెప్టెన్గా తిలక్ వర్మ.. రోహిత్- కోహ్లి లేరు -
అతడి కెరీర్ ముగించేశారు కదా!: అగార్కర్పై మండిపాటు
టీమిండియా తరఫున టెస్టుల్లో పునరాగమనం చేయాలని పట్టుదలగా ఉన్న వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీ (Mohammad Shami) ఆశలపై సెలక్టర్లు నీళ్లు పోశారు. దేశీ క్రికెట్లో సత్తా చాటుతున్నా అతడిపై శీతకన్నేశారు. సౌతాఫ్రికాతో టెస్టుల (IND vs SA Tests)కు ఎంపిక చేసిన జట్టులో షమీకి సెలక్టర్లు చోటివ్వలేదు.ఫలితంగా టీమిండియా యాజమాన్యంపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar), హెడ్కోచ్ గౌతం గంభీర్ కావాలనే షమీ కెరీర్ను ప్రశ్నార్థకం చేశారంటూ అతడి అభిమానులు మండిపడుతున్నారు. కాగా రెండేళ్ల క్రితం షమీ చివరగా టీమిండియా తరఫున టెస్టులు ఆడాడు.ఆ తర్వాత చీలమండ గాయంతో చాన్నాళ్లు జట్టుకు దూరమైన షమీ.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 వన్డే టోర్నీలో భారత్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అయినప్పటికీ.. ఇంగ్లండ్తో టెస్టులు, ఆస్ట్రేలియాతో వన్డేలకు ఈ రైటార్మ్ పేసర్ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు.అప్డేట్ లేదని.. ఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ అగార్కర్ మాట్లాడుతూ.. షమీ ఫిట్నెస్ గురించి తమకు అప్డేట్ లేదని.. అందుకే పక్కనపెట్టామని చెప్పాడు. అయితే, అగార్కర్ వ్యాఖ్యలకు షమీ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. రంజీలు ఆడేందుకు ఫిట్గా ఉన్న తాను.. వన్డేలు కూడా ఆడలేనా? అని ప్రశ్నించాడు.ఆటతోనే సమాధానంఈ క్రమంలో అగార్కర్ బదులిస్తూ.. షమీ ఫిట్గా లేనందు వల్లే తాము అతడిని ఇంగ్లండ్ పర్యటన, ఆసీస్ టూర్కు ఎంపిక చేయలేదని మరోసారి పునరుద్ఘాటించాడు. ఈ నేపథ్యంలో రంజీ సీజన్లో బెంగాల్ తరఫున చివరగా గుజరాత్తో మ్యాచ్ ఆడిన షమీ.. ఆటతోనే అగార్కర్కు సమాధానమిచ్చాడు.గుజరాత్తో మ్యాచ్లో మొత్తంగా ఎనిమిది వికెట్ల (3/44, 5/38)తో చెలరేగి.. సెలక్టర్లకు సవాల్ విసిరాడు. బెంగాల్ విజయంలో కీలక పాత్ర పోషించి సత్తా చాటాడు. ఈ క్రమంలో మీడియా షమీని పలకరించగా.. తాను ఇప్పుడు ఏం మాట్లాడినా.. అందుకు అపార్థాలు తీస్తారని పేర్కొన్నాడు.సీన్ రివర్స్ఈ నేపథ్యంలో టీమిండియా కొత్త సెలక్టర్ ఆర్పీ సింగ్ సూచన మేర, అతడి నుంచి అందిన హామీ మేరకే షమీ ఇలా మాట మార్చాడని నెటిజన్లు చర్చించుకున్నారు. అగార్కర్- షమీ మాటల యుద్ధానికి తెరపడినట్లేనని.. సౌతాఫ్రికాతో టెస్టులకు అతడిని ఎంపిక చేస్తారని అభిప్రాయపడ్డారు. కానీ సీన్ రివర్స్ అయింది.బెంగాల్ జట్టుకే ప్రాతినిథ్యం వహిస్తున్న మరో పేసర్ ఆకాశ్ దీప్ను ఎంపిక చేసిన సెలక్టర్లు.. షమీకి మాత్రం మరోసారి మొండిచేయి చూపారు. ఈ నేపథ్యంలో 35 ఏళ్ల షమీ టెస్టు రీఎంట్రీ కల ముగిసినట్లేనని.. ఇకపై షమీని టీమిండియా టెస్టు జెర్సీలో చూడలేమంటూ అభిమానులు ఉసూరుమంటున్నారు. మీకు ఎందుకింత పగ‘ఇగో’ కారణంగానే అతడి కెరీర్ను నాశనం చేస్తున్నారంటూ.. మీకు ఎందుకింత పగ? అంటూ అగార్కర్పై మండిపడుతున్నారు. కాగా సౌతాఫ్రికాతో స్వదేశంలో టీమిండియా రెండు టెస్టులు ఆడనుంది. ఇందుకోసం శుబ్మన్ గిల్ సారథ్యంలోని పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) బుధవారం ప్రకటించింది.చదవండి: IND vs SA Tests: సౌతాఫ్రికాతో టెస్టులకు టీమిండియా ప్రకటన -
భారత జట్టు కెప్టెన్గా తిలక్ వర్మ.. వైస్ కెప్టెన్గా అతడే
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ సందర్భంగా భారత బ్యాటింగ్ దిగ్గజాలు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లి (Virat Kohli) ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేశారు. కంగారూ జట్టుతో మూడు వన్డేల్లో రో‘హిట్’ కాగా.. కోహ్లి మాత్రం తొలి రెండు మ్యాచ్లలో డకౌట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు.ఆసీస్ టూర్కు ముందుఅయితే, మూడో వన్డేలో రోహిత్ శర్మ అద్భుత సెంచరీ (121)తో చెలరేగగా.. కోహ్లి భారీ అర్ధ శతకం (73)తో మెరిశాడు. ఇలా హిట్మ్యాన్ శతక్కొట్టడం.. కోహ్లి ఫామ్లోకి రావడంతో అభిమానులు ఖుషీ అయ్యారు. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్కప్-2027 నాటికి రో- కో జట్టులో ఉండాలంటే దేశీ క్రికెట్ కూడా ఆడాల్సి రావొచ్చని ఆసీస్ టూర్కు ముందు టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పేర్కొన్న విషయం తెలిసిందే.ఇక ఆస్ట్రేలియా పర్యటన తర్వాత టీమిండియా స్వదేశంలో సౌతాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఈ నేపథ్యంలో ప్రొటిస్ జట్టుతో వన్డే సిరీస్ సందర్భంగా రో- కో త్వరలోనే మరోసారి మైదానంలో అడుగుపెట్టనున్నారు.నవంబరు 13, 16 19 తేదీల్లోఇక అంతకంటే ముందు భారత్- ‘ఎ’- సౌతాఫ్రికా- ‘ఎ’ జట్లు అనధికారిక టెస్టు సిరీస్తో పాటు.. అనధికారిక వన్డే సిరీస్లోనూ పాల్గొననున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే తొలి అనధికారిక టెస్టు ముగియగా.. రిషభ్ పంత్ సారథ్యంలోని భారత జట్టు మ్యాచ్ గెలిచింది.ఈ క్రమంలోనే టెస్టుల తర్వాత నవంబరు 13, 16 19 తేదీల్లో భారత్- సౌతాఫ్రికా ‘ఎ’ జట్లు అనధికారిక వన్డే సిరీస్లో తలపడనున్నాయి. ఈ మూడూ డే- నైట్ మ్యాచ్లే. ఈ నేపథ్యంలో రోహిత్- కోహ్లి కూడా భారత్- ‘ఎ’ తరఫున బరిలోకి దిగుతారని వార్తలు వచ్చాయి. అయితే, ఈ సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తాజాగా జట్టును ప్రకటించింది.భారత జట్టు కెప్టెన్గా తిలక్ వర్మ.. రోహిత్- కోహ్లి లేరుఈ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్గా ఎంపిక కాగా... రోహిత్ శర్మ- విరాట్ కోహ్లిల పేర్లు లేవు. దీంతో రో-కో ఆటను మరోసారి చూడాలన్న అభిమానుల ఆశలకు గండిపడినట్లయింది. ఇదిలా ఉంటే.. వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయపడిన నేపథ్యంలో.. తిలక్ వర్మ ‘ఎ’ జట్టుకు సారథి కాగా.. రుతురాజ్ గైక్వాడ్ వైస్ కెప్టెన్గా రీఎంట్రీ ఇచ్చాడు.అదే విధంగా.. ఇషాన్ కిషన్కు ఈ జట్టులో చోటు దక్కింది. టీమిండియా స్టార్లు అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా కూడా ఇందులో భాగం కానున్నారు. కాగా టీమిండియా- సౌతాఫ్రికా మధ్య నవంబరు 14- డిసెంబరు 19 వరకు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుతో అనధికారిక వన్డేలకు భారత్- ‘ఎ’ జట్టు:తిలక్ వర్మ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆయుష్ బదోని, నిషాంత్ సింధు, విప్రజ్ నిగమ్, మానవ్ సుతార్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, ప్రభ్సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్).చదవండి: నరాలు తెగే ఉత్కంఠ: సాంట్నర్ విధ్వంసకర ఇన్నింగ్స్ వృథా -
సౌతాఫ్రికాతో టెస్టులకు టీమిండియా ప్రకటన.. షమీకి స్థానం ఉందా?
సౌతాఫ్రికాతో స్వదేశంలో టెస్టు సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తమ జట్టును ప్రకటించింది. శుబ్మన్ గిల్ (Shubman Gill) సారథ్యంలోని ఈ టీమ్కు పదిహేను మంది సభ్యులను సెలక్టర్లు ఎంపిక చేశారు.ఇక ఇంగ్లండ్ పర్యటనలో గాయపడిన వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant).. ప్రొటిస్ జట్టుతో సిరీస్ ద్వారా టీమిండియా తరఫున పునరాగమనం చేయనున్నాడు. ఇప్పటికే పంత్.. సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్లో భారత్- ‘ఎ’ (IND A vs SA) కెప్టెన్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.పడిక్కల్పై సెలక్టర్ల నమ్మకంబెంగళూరు వేదికగా జరిగిన తొలి అనధికారిక టెస్టులో పంత్ 90 పరుగులతో రాణించి.. భారత్ను గెలిపించాడు. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్లో భాగంగా ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ తమ స్థానాలు నిలబెట్టుకోగా.. సాయి సుదర్శన్తో పాటు దేవదత్ పడిక్కల్కు సెలక్టర్లు చోటు ఇచ్చారు.ఆస్ట్రేలియా పర్యటనతో పాటు.. ఇటీవల సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుతో తొలి టెస్టులో విఫలమైనా పడిక్కల్పై సెలక్టర్లు నమ్మకం ఉంచడం విశేషం. మరోవైపు.. పంత్ వికెట్ కీపర్గా రీఎంట్రీ ఇవ్వగా.. ధ్రువ్ జురెల్ స్పెషలిస్టు బ్యాటర్గా తుదిజట్టులో చోటు దక్కించుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది.షమీకి మరోసారి మొండిచేయిఇక స్పిన్నర్ల కోటాలో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్తో పాటు.. ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ స్థానం సంపాదించగా.. పేసర్ల కోటాలో జస్ప్రీత్ బుమ్రాతో పాటు మొహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని సెలక్టర్లు ఎంపిక చేశారు.ఈ క్రమంలో వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీకి మరోసారి మొండిచేయే ఎదురైంది. రంజీ ట్రోఫీ తాజా సీజన్లో ఇటీవల బెంగాల్ తరఫున షమీ సత్తా చాటినా సెలక్టర్లు అతడిని కనికరించలేదు. మరో బెంగాల్ పేసర్ ఆకాశ్కు చోటిచ్చి షమీని మాత్రం పక్కనపెట్టారు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సీజన్లో భాగంగా టీమిండియా.. సౌతాఫ్రికాతో సొంతగడ్డపై రెండు టెస్టులు ఆడనుంది. నవంబరు 14- నవంబరు 26 వరకు ఈ మ్యాచ్లు జరుగుతాయి. తొలి టెస్టుకు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక కాగా.. రెండో టెస్టుకు గువాహటిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇస్తుంది.సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్కు బీసీసీఐ ప్రకటించిన జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్/వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవ్దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్.చదవండి: భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా డీకే.. పన్నెండు జట్ల వివరాలు ఇవే -
నరాలు తెగే ఉత్కంఠ: సాంట్నర్ విధ్వంసకర ఇన్నింగ్స్ వృథా
న్యూజిలాండ్ పర్యటనను వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఘనంగా ఆరంభించింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన తొలి టీ20లో ఆతిథ్య కివీస్పై విండీస్ ఏడు పరుగుల స్వల్ప తేడాతో విజయం (West Indies Beat New Zealand) సాధించింది. తద్వారా ఐదు టీ20ల సిరీస్లో 1-0తో ముందంజ వేసింది.కాగా ఐదు టీ20 మ్యాచ్లు, మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడేందుకు వెస్టిండీస్.. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో బుధవారం ఆక్లాండ్లో ఇరుజట్ల మధ్య తొలి టీ20 జరిగింది. ఈడెన్ పార్క్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుని.. విండీస్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది.ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులుదీంతో బ్యాటింగ్కు దిగిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (3), అలిక్ అథనాజ్ (16) విఫలమైనా.. వన్డౌన్ బ్యాటర్ షాయీ హోప్ కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరిశాడు.మొత్తంగా 39 బంతులు ఎదుర్కొన్న హోప్ నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 53 పరుగులు సాధించాడు. మిగతా వారిలో రోస్టన్ చేజ్ (28), రోవ్మన్ పావెల్ (23 బంతుల్లో 33) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. కివీస్ బౌలర్లలో జేకబ్ డఫీ, జకారీ ఫౌల్క్స్ రెండేసి వికెట్లు తీయగా.. కైలీ జెమీషన్, జేమ్స్ నీషమ్ చెరో వికెట్ పడగొట్టారు.ఇక విండీస్ విధించిన 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ ఆది నుంచే తడబడింది. ఓపెనర్లు టిమ్ రాబిన్సన్ (27), డెవాన్ కాన్వే (13) ప్రభావం చూపలేకపోయారు. వన్డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్ర (21) నిరాశపరచగా.. మార్క్ చాప్మన్ (7), డారిల్ మిచెల్ (13), మైకేల్ బ్రాస్వెల్ (1), జేమ్స్ నీషమ్ (11) పూర్తిగా విఫలమయ్యారు.సాంట్నర్ విధ్వంసకర ఇన్నింగ్స్ వృథాఇలాంటి దశలో కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగుతూ గెలుపు ఆశలు చిగురించేలా చేశాడు. కేవలం 28 బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు, రెండు సిక్స్లు బాది.. 55 పరుగులు సాధించిన సాంట్నర్ ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అయితే, మిగిలిన వారి నుంచి సహకారం అందకపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయిన కివీస్.. 157 పరుగుల వద్దే నిలిచిపోయింది. ఫలితంగా విండీస్ చేతిలో ఏడు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. విండీస్ బౌలర్లలో జేడన్ సీల్స్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ రోస్టన్ ఛేజ్ చెరో మూడు వికెట్లు కూల్చారు. మిగిలిన వారిలో మాథ్యూ ఫోర్డ్, రొమారియో షెఫర్డ్, అకీల్ హొసేన్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఇరుజట్ల మధ్య గురువారం (నవంబరు 6) ఇదే వేదికపై రెండో టీ20 నిర్వహణకై ముహూర్తం ఖరారైంది.చదవండి: అందుకే అర్ష్దీప్ను తప్పించాం.. అతడికి అన్నీ తెలుసు: టీమిండియా కోచ్ -
అమ్మాయిల విజయాన్ని మాతో పోల్చకండి: టీమిండియా దిగ్గజం
విశ్వ విజేతగా అవతరించిన భారత మహిళా క్రికెట్ జట్టుపై ప్రశంసల వర్షం కొనసాగుతోంది. నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించి ట్రోఫీని ముద్దాడిన హర్మన్ సేన విజయాన్ని భారతావని ఉత్సవంగా జరుపుకొంది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్ (ICC Women's World Cup) టోర్నమెంట్లో.. 2005, 2017లో రన్నరప్తోనే సరిపెట్టుకున్న భారత్.. ఈసారి మాత్రం ఆఖరి గండాన్ని అధిగమించింది.గావస్కర్ వ్యాఖ్యలు వైరల్నవీ ముంబై వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో సౌతాఫ్రికా (Ind Beat SA)ను 52 పరుగుల తేడాతో ఓడించి.. జగజ్జేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో భారత మహిళా జట్టుపై ప్రశంసలు కురిపిస్తూనే.. టీమిండియా దిగ్గజం, 1983 వరల్డ్కప్ విజేత సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.తొలిసారి గ్రూప్ దశ దాటడమే కాకుండాస్పోర్ట్స్స్టార్కి రాసిన కాలమ్లో.. ‘‘కొంతమంది భారత పురుషుల క్రికెట్ జట్టు వన్డే వరల్డ్కప్- 1983 విజయాన్ని.. తాజాగా అమ్మాయిలు చాంపియన్గా నిలవడంతో పోలుస్తున్నారు. అయితే, 1983 ఎడిషన్ కంటే ముందు మెన్స్ టీమ్ ఒక్కసారి కూడా గ్రూప్ దశను దాటలేదు.నాకౌట్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మాకు అప్పుడు అస్సలు తెలియవు. అలాంటిది మేము తొలిసారి గ్రూప్ దశ దాటడమే కాకుండా విజేతలుగా నిలిచాము.అందుకే అమ్మాయిల విజయాన్ని మాతో పోల్చకండిఅయితే మన మహిళా జట్టు ఇప్పటికే రెండుసార్లు ఫైనల్ ఆడింది. తర్వాత ఇలా అద్భుతమైన విజయంతో విజేతగా నిలిచింది’’ అని గావస్కర్.. తమ విజయాన్ని అమ్మాయిలతో పోల్చవద్దని స్పష్టం చేశాడు.అదే విధంగా.. ‘‘83లో టీమిండియా సాధించిన విజయం భారత క్రికెట్ రూపురేఖలు మార్చింది. తల్లిదండ్రులు తమ పిల్లల్ని క్రికెట్ వైపు నడిపించేలా చేసింది. ఇక ఐపీఎల్ వచ్చిన తర్వాత భారత క్రికెట్ మరో స్థాయికి చేరుకుంది.ఇప్పుడు భారత జట్టులో కేవలం మెట్రో నగరాల నుంచి వచ్చినవారే కాకుండా.. దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు’’ అని గావస్కర్ రాసుకొచ్చాడు. కాగా నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా సౌతాఫ్రికాతో ఫైనల్లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది.సమిష్టి కృషితోఓపెనర్లు స్మృతి మంధాన (45), షఫాలి వర్మ (87) గట్టి పునాది వేయగా.. ఆల్రౌండర్ దీప్తి శర్మ (58), వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ (34) ఇన్నింగ్స్ నిర్మించారు. జెమీమా రోడ్రిగ్స్ (24), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (20) స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయారు. అయితే, మంధాన, షఫాలి దీప్తి, రిచా రాణించడంతో భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 298 పరుగులు స్కోరు చేసింది.అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికాకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. దీప్తి శర్మ ఐదు వికెట్లతో చెలరేగి ప్రొటిస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. షఫాలి వర్మ రెండు, నల్లపురెడ్డి శ్రీ చరణి ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. సఫారీ జట్టులో ఓపెనర్, కెప్టెన్ లారా వొల్వర్ట్ (101) శతకంతో పోరాడగా.. మిగతా వారి నుంచి ఆమెకు సహకారం అందలేదు.మరో ఓపెనర్ తజ్మిన్ బ్రిట్స్ (23), సూనే లూస్ (25) అనిరె డెర్క్సెన (35) ఓ మోస్తరుగా రాణించారు. అయితే, భారత బౌలర్ల విజృంభణ ముందు నిలవలేకపోయిన సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో కేవలం 246 పరుగులే చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా 52 పరుగుల తేడాతో గెలిచిన భారత్.. సరికొత్త చాంపియన్గా అవతరించింది.చదవండి: అందుకే అర్ష్దీప్ను తప్పించాం.. అతడికి అన్నీ తెలుసు: టీమిండియా కోచ్ -
భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా డీకే.. పూర్తి వివరాలు
హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్-2025 (Hong Kong Sixes) టోర్నమెంట్కు భారత్ తమ జట్టును ప్రకటించింది. హాంకాంగ్లో నవంబరు 6 నుంచి 9 వరకు మోంగ్ కాక్ వేదికగా జరిగే ఈ పొట్టి టోర్నీలో భారత్కు.. మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) సారథ్యం వహించనున్నాడు.డీకేతో పాటు రాబిన్ ఊతప్ప, స్టువర్ట్ బిన్నీ, అభిమన్యు మిథున్, భరత్ చిప్లి, షాబాజ్ నదీమ్లు హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్లో పాల్గొననున్నారు. అదే విధంగా.. దేశీ వెటరన్ క్రికెటర్ ప్రియాంక్ పాంచల్ (Priyank Panchal) కూడా ఈ టోర్నీలో భాగం కానున్నాడు.ఆరు ఓవర్ల పాటు ఆట కాగా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్ టోర్నీలో.. ఒక్కో టీమ్లో ఆరుగురు సభ్యులు (మాజీ క్రికెటర్లు) ఉంటారు. ఆరు ఓవర్ల పాటు ఆట సాగుతుంది. ఇక ఈ షార్టెస్ట్ క్రికెట్ ఈవెంట్లో 2005లో టైటిల్ గెలిచిన భారత్.. రెండుసార్లు రన్నరప్తో సరిపెట్టుకుంది.అయితే, గతేడాది రాబిన్ ఊతప్ప కెప్టెన్సీలో కనీసం ఫైనల్ కూడా చేరలేదు టీమిండియా. ఈ నేపథ్యంలో ఈసారి కొత్త సారథిగా డీకే రావడం విశేషం. కాగా తాజా ఎడిషన్లో పన్నెండు జట్లు పాల్గొంటున్నాయి.పన్నెండు జట్లు ఇవేభారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, నేపాల్, ఇంగ్లండ్, యూఏఈ, కువైట్, శ్రీలంక, బంగ్లాదేశ్, హాంకాంగ్ (చైనా) ఈసారి టోర్నీలో భాగం కానున్నాయి. పూల్- ‘ఎ’ నుంచి సౌతాఫ్రికా అఫ్గనిస్తాన్, నేపాల్.. పూల్- ‘బి’ నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ యూఏఈ.. పూల్- ‘సి’ నుంచి ఇండియా, పాకిస్తాన్, కువైట్... పూల్- ‘డి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, హాంకాంగ్ పోటీపడతాయి.హాంకాంగ్ సిక్సెస్-2025లో పాల్గొనే జట్ల వివరాలుభారత్దినేశ్ కార్తిక్ (కెప్టెన్), రాబిన్ ఊతప్ప, స్టువర్ట్ బిన్నీ, అభిమన్యు మిథున్, భరత్ చిప్లి, షాబాజ్ నదీమ్, ప్రియాంక్ పాంచల్.ఆస్ట్రేలియాఅలెక్స్ రాస్ (కెప్టెన్), బెన్ మెక్డెర్మాట్, జాక్ వుడ్, నిక్ హోబ్సన్, క్రిస్ గ్రీన్, విల్ బొసిస్టొ, ఆండ్యూ టై.ఇంగ్లండ్జో డెన్లీ (కెప్టెన్), జేమ్స్ కోల్స్, ఈథన్ బ్రూక్స్, టోబీ అల్బర్ట్, జార్జ్ హిల్ డాన్ మౌస్లే, టామ అస్పిన్వాల్.బంగ్లాదేశ్అక్బర్ అలీ (కెప్టెన్) అబు హైదర్ రోని, జిషాన్ ఆలం, మొహమ్మధ్ సైఫుద్దీన్, మొసాడెక్ హొసేన్, రకీబుల్ హసన్, టొఫేల్ అహ్మద్.యూఏఈకౌశిక్ హర్షిత్ (కెప్టెన్), ఖలీద్ షా, ముహమ్మద్ అర్ఫాన్, ముహమ్మద్ ఫారూక్, ముహమ్మద్ సాగిర్ ఖాన్, నిలాన్ష్ కేస్వాని, రెజిత్ కురుంగొడె, జాహిద్ అలీ.కువైట్యాసిన్ పటేల్ (కెప్టెన్), ఉస్మాన్ పటేల్, మీట్ భవ్సార్, బిలాల్ తాహిర్, రవిజ సాండరువాన్, అద్నాన్ ఇద్రీస్, మొహమద్ షఫీక్.నేపాల్శరద్ వేసావ్కర్ (కెప్టెన్), సందీప్ జోరా, లోకేశ్ బామ్, బాసిర్ అహ్మద్, ఆదిల్ ఆలం, రషీద్ ఖాన్, రూపేశ్ సింగ్.శ్రీలంకలాహిరు మధుషాంక (కెప్టెన్), ధనంజయ లక్షణ్, తనుక దబారే, నిమేశ్ విముక్తి, లాహిరు సమారకూన్, థారిందు రత్నాయక, సచిత జయతిలకె.సౌతాఫ్రికాజోర్డాన్ మోరిస్ (కెప్టెన్), అబ్దుల్లా బయోమి, ఈథన్ కన్నింగ్హామ్, బులెలొ దూబే, కషీఫ్ జోసెఫ్, బ్లేక్ సింప్సన్, జోరిచ్ వాన్ షాల్వేక్.హాంకాంగ్యాసిమ్ ముర్తజా (కెప్టెన్), బాబర్ హయత్, అన్షుమాన్ రథ్, ఐజాజ్ ఖాన్, నిజాకత్ ఖాన్, ఎహ్సాన్ ఖాన్, నస్రుల్లా రాణా.అఫ్గనిస్తాన్గుల్బదిన్ నైబ్ (కెప్టెన్), ఇక్రామ్ అలిఖిల్, కరీం జన్మత్, షరాఫుద్దీన్ ఆష్రఫ్, ఫర్మానుల్లా సఫీ, ఐజాజ్ అహ్మద్ అహ్మద్జాయ్, సెదీకుల్లా పచా.పాకిస్తాన్అబ్బాస్ ఆఫ్రిది (కెప్టెన్), అబ్దుల్ సమద్, ఖవాజా మొహమద్ నఫాయ్, మాజ్ సదాకత్, మొహమద్ షాజాద్, సాద్ మసూద్ షాహిద్ అజీజ్.చదవండి: యాషెస్ తొలి టెస్ట్కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన -
సతీమణి బర్త్ డే.. కేఎల్ రాహుల్ స్పెషల్ విషెస్!
బాలీవుడ్ బ్యూటీ అతియా శెట్టికి ఆమె భర్త, టీమిండియా క్రికెటర్ ప్రత్యేక విషెస్ తెలిపారు. ఇవాళ అతియా శెట్టి పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆమెతో ఉన్న ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేశారు. కాగా.. ఇవాళ అతియా తన 33వ పుట్టినరోజు జరుపుకుంటోంది.కేఎల్ రాహుల్ తన పోస్ట్లో రాస్తూ.. "నా ప్రాణ స్నేహితురాలు, సతీమణి, ప్రేమికురాలు, స్ట్రెస్ బాల్, గూఫ్బాల్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. గడిచిన ప్రతి సంవత్సరం నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నా' అంటూ సతీమణిపై ప్రేమ కురిపించారు. దీనికి లవ్ యూ అంటూ అతియా శెట్టి రిప్లై కూడా ఇచ్చింది. కూతురు బర్త్ డే సందర్భంగా సునీల్ శెట్టి బర్త్ డే విషెస్ చెబుతూ నెట్టింట పోస్ట్ చేశారు. అతియాతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. అతియా బ్రదర్ అహన్ శెట్టి కూడా సిస్టర్కు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నా ప్రాణ స్నేహితుడిగా ఉన్న వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశాడు.కాగా.. అతియా శెట్టి కొంతకాలంగా సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటోంది. 2023 జనవరి 23న క్రికెటర్ కేఎల్ రాహుల్ను పెళ్లాడింది. ముంబయి సమీపంలోని ఖండాలా ఉన్న సునీల్ శెట్టి ఫామ్హౌస్లో వీరిద్దరి వివాహం జరిగింది. ఆ తర్వాత ఈ జంటకు ఈ ఏడాది మార్చిలో తమ మొదటి బిడ్డకు ఎవారా అనే కుమార్తెకు స్వాగతం పలికారు. మరోవైపు అతియా 2015లో హీరోయిన్గా ఇండస్ట్రీలో రంగ ప్రవేశం చేసింది. ఆ తరువాత ముబారకన్, మోతీచూర్ చక్నాచూర్ వంటి చిత్రాలలో నటించింది. View this post on Instagram A post shared by KL Rahul👑 (@klrahul) -
అందుకే అర్ష్దీప్ను తప్పించాం: టీమిండియా కోచ్
ఆస్ట్రేలియాతో తొలి రెండు టీ20 మ్యాచ్లలో టీమిండియా యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ (Arshdeep Singh)కు మొండిచేయే ఎదురైంది. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో వందకు పైగా వికెట్లు తీసి.. భారత్ తరఫున అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్న అర్ష్కు.. యాజమాన్యం తుదిజట్టులో చోటు ఇవ్వలేదు.అర్ష్దీప్ను కాదని.. హర్షిత్ రాణా (Harshit Rana)కు ప్రాధాన్యం ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) హర్షిత్ కోసం అర్ష్ను బలిచేస్తున్నాడనే ఆరోపణలు వచ్చాయి. సత్తా చాటిన అర్ష్ఈ నేపథ్యంలో ఆసీస్ (IND vs AUS)తో జరిగిన మూడో టీ20లో ఎట్టకేలకు అర్ష్ను యాజమాన్యం ఆడించింది. వరుసగా రెండు మ్యాచ్లలోనూ బెంచ్కే పరిమితమైన ఈ లెఫ్టార్మ్ పేసర్ తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు.నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి.. 35 పరుగులు ఇచ్చిన అర్ష్దీప్.. ట్రావిస్ హెడ్ (6), జోష్ ఇంగ్లిస్ (11), మార్కస్ స్టొయినిస్ (64) రూపంలో మూడు కీలక వికెట్లు తీసి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.ఇక భారత్- ఆసీస్ మధ్య గురువారం నాలుగో టీ20 జరుగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తొలి మ్యాచ్లలో అర్ష్దీప్ను బెంచ్కే పరిమితం చేయడంపై ప్రశ్న ఎదురైంది.అతడు వరల్డ్క్లాస్ బౌలర్.. అర్థం చేసుకున్నాడుఇందుకు బదులిస్తూ.. ‘‘అర్ష్దీప్ అనుభవజ్ఞుడైన బౌలర్. మేము వైవిధ్యమైన కాంబినేషన్లు ప్రయత్నిస్తున్నామని అతడు అర్థం చేసుకున్నాడు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలుసుకున్నాడు.అతడు వరల్డ్క్లాస్ బౌలర్. పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీయగల నైపుణ్యం గల ఆటగాడు. అతడి విలువ మాకు తెలుసు. అయితే, ఈ పర్యటనలో మాకు వివిధ కాంబినేషన్లు అవసరం. దీని వల్ల కొంత మంది ఆటగాళ్లకు నిరాశ తప్పకపోవచ్చు.అయితే, సెలక్షన్ విషయం ఆటగాళ్ల చేతుల్లో ఉండదు. ఇందుకు గల కారణాలు మాత్రం వారు అర్థం చేసుకోగలరు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీని దృష్టిలో పెట్టుకుని మేము ఆటగాళ్లను మరింత శ్రమించేలా చేస్తున్నాం. ఎప్పుడు జట్టులోకి వచ్చినా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేలా సంసిద్ధం చేస్తున్నాం.కొన్నిసార్లు కొందరికి నిరాశ తప్పదుఒత్తిడిలోనూ రాణించేలా తీర్చిదిద్దుతున్నాం. మా ఆటగాళ్ల నైపుణ్యాలపై మాకు ఎటువంటి సందేహాలు లేవు. అయితే, కాంబినేషన్ల కోసం ప్రయత్నిస్తున్నపుడు కొన్నిసార్లు కొందరికి నిరాశ తప్పదు’’ అని 41 ఏళ్ల మోర్నీ మోర్కెల్ చెప్పుకొచ్చాడు.చదవండి: ప్రపంచ క్రికెట్ను శాసించేందుకు మరో వసంతంలోకి అడుగుపెట్టిన కోహ్లి -
రాణించిన హోప్.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..?
ఐదు టీ20లు, మూడు టెస్ట్ మ్యాచ్లు, మూడు వన్డేల సిరీస్ల కోసం వెస్టిండీస్ జట్టు న్యూజిలాండ్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ (నవంబర్ 5) తొలి టీ20 జరుగుతుంది. అక్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. విండీస్ బ్యాటింగ్కు దిగింది.రాణించిన హోప్విండీస్కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. తొలి ఓవర్లో బ్రాండన్ కింగ్ (3), ఐదో ఓవర్లో అలిక్ అథనాజ్ (16), ఎనిమిదో ఓవర్లో అకీమ్ అగస్టీ (2) ఔటయ్యారు. ఈ దశలో కెప్టెన్ షాయ్ హోప్ (39 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రోస్టన్ ఛేజ్ (28), రోవ్మన్ పావెల్ (33) సాయంతో ఇన్నింగ్స్ను నిర్మించాడు. ఫలితంగా విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేయగలిగింది. ఇన్నింగ్స్ చివరి రెండు బంతులకు రొమారియో షెపర్డ్ బౌండరీలు బాదాడు.సత్తా చాటిన బౌలర్లుఈ మ్యాచ్లో న్యూజిలాండ్ బౌలర్లు సత్తా చాటారు. సాంట్నర్ మినహా అందరూ పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా వికెట్లు తీశారు. జేకబ్ డఫీ, జకరీ ఫౌల్క్స్ తలో 2 వికెట్లు తీయగా.. జేమీసన్, నీషమ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.తుది జట్లు..వెస్టిండీస్: షాయ్ హోప్ (కెప్టెన్), అలిక్ అథనాజ్, బ్రాండన్ కింగ్, రోస్టన్ ఛేజ్, రొమారియో షెపర్డ్, అకీమ్ అగస్టీ, రోవ్మన్ పావెల్, జేసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డ్, అకీల్ హొసేన్, జేడన్ సీల్స్న్యూజిలాండ్: టిమ్ రాబిన్సన్, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మైఖేల్ బ్రేస్వెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, జకరీ ఫౌల్క్స్, కైల్ జేమీసన్, జేకబ్ డఫీచదవండి: బంగ్లాదేశ్ కెప్టెన్గా దేశవాలీ స్టార్ -
బంగ్లాదేశ్ కెప్టెన్గా దేశవాలీ స్టార్
నవంబర్ 14 నుంచి 23 మధ్యలో ఖతార్ వేదికగా జరిగే రైజింగ్ స్టార్స్ ఆసియా కప్-2025 (ACC Cup Rising Stars 2025) కోసం 15 మంది సభ్యుల బంగ్లాదేశ్-ఏ జట్టును (Bangladesh-A) ఇవాళ (నవంబర్ 5) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా దేశవాలీ స్టార్, వికెట్కీపర్, బ్యాటర్ అయిన అక్బర్ అలీ (Akbar Ali) ఎంపికయ్యాడు.అక్బర్ అలీకి దేశవాలీ క్రికెట్లో మంచి రికార్డు ఉంది. 92 మ్యాచ్ల్లో 27.65 సగటున 1853 పరగులు చేశాడు. అతని తాజాగా ప్రదర్శనలు (40, 44, 28) కూడా పర్వాలేదనేలా ఉన్నాయి. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీలైన రాజ్షాహీ, ఖుల్నా టైగర్స్ తరఫున కూడా అక్బర్ అలీ సత్తా చాటాడు.ఈ జట్టు అక్బర్తో పాటు అనుభవజ్ఞులు, యువశక్తి కలయికగా ఉంది. అబూ హీదర్ రోని, రిపోన్ మొండల్ బంగ్లాదేశ్ సీనియర్ జట్టు తరఫున సత్తా చాటారు. రోని 2016, మొండల్ 2023లో సీనియర్ టీమ్లోకి అరంగేట్రం చేశారు. యార్కర్ స్పెషలిస్ట్ అయిన రోని 13 టీ20ల్లో 6 వికెట్లు తీయగా.. మొండల్ 23 టీ20ల్లో 31 వికెట్లు తీశాడు. ఈ జట్టులో దేశవాలీ స్టార్లు,యువ ఆటగాళ్లు జిషన్ అలం, మహిదుల్ ఇస్లాం, అరిఫుల్ ఇస్లాం వంటి వారికి చోటు దక్కింది.ఈ టోర్నీలో బంగ్లాదేశ్తో పాటు భారత్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఒమన్, యూఏఈ, హాంగ్కాంగ్ జట్లు పాల్గొంటున్నాయి. బంగ్లాదేశ్.. ఆఫ్ఘనిస్తాన్-ఏ, శ్రీలంక-ఏ, హాంగ్కాంగ్లతో కలిసి గ్రూప్-బిలో పోటీపడుతుండగా.. భారత్-ఏ, పాకిస్తాన్-ఏ, ఒమన్, యూఏఈ గ్రూప్-ఏ తలపడనున్నాయి.టోర్నీ తొలి మ్యాచ్లో పాకిస్తాన్, ఒమన్ తలపడనుండగా.. రెండో మ్యాచ్లో భారత్, యూఏఈ ఢీకొంటాయి. నవంబర్ 15న జరిగే మ్యాచ్లో బంగ్లాదేశ్ హాంగ్కాంగ్ను ఎదుర్కొంటుంది. ఈ టోర్నీలో ప్రతి జట్టు తమ గ్రూప్లోకి మిగతా జట్లతో తలో మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్కు (A1 vs B2, B1 vs A2) చేరతాయి. ఈ మ్యాచ్లు నవంబర్ 21న జరుగుతాయి. సెమీస్ విజేతలు నవంబర్ 23న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.బంగ్లాదేశ్ ఏ జట్టు..అక్బర్ అలీ (కెప్టెన్), జిషాన్ అలం, హబీబుర్ రెహమాన్, జవాద్ అబ్రార్, అరిఫుల్ ఇస్లాం, యాసిర్ అలీ చౌదరి, మహిదుల్ ఇస్లాం భుయాన్, రకీబుల్ హసన్, ఎస్ఎం మెహెరోబ్ హుస్సేన్, అబూ హిడర్ రోనీ, తుఫాయెల్ అహ్మద్, షాధిన్ ఇస్లాం, రిపోన్ మొండోల్, అబ్దుల్ గఫార్ సక్లైన్, మృత్తుంజయ్ చౌదరిచదవండి: ప్రపంచ క్రికెట్ను శాశించేందుకు మరో వసంతంలోకి అడుగుపెట్టిన కోహ్లి -
త్వరలో మరో క్రికెట్ లీగ్
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో 60 వేదికల్లో 600 జట్లతో తెలుగు ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) క్రికెట్ టోర్నీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ లీగ్కు సంబంధించిన పోస్టర్ను తెలంగాణ క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి ఆవిష్కరించారు. టీపీఎల్ నిర్వాహకులైన జూపర్ ఎల్ఈడీ సంస్థ ప్రతినిధులు మంగళవారం మంత్రిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి లీగ్ విశేషాలను వివరించారు. యువతను మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా క్రమశిక్షణ గల క్రీడాకారులుగా, బాధ్యయుత పౌరుడిగా తయారు చేసే శక్తి క్రీడలకు ఉందని శ్రీహరి అన్నారు. క్రికెట్తో పాటు ఏదో ఒక క్రీడలో యువత రాణించాలని, తద్వారా ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ కూడా అలవడుతుందని చెప్పారు. ‘సే నో టూ’ డ్రగ్స్ ప్రచారాన్ని యువతలోకి తీసుకెళ్లేందుకు నిర్వహిస్తున్న ఈ టీపీఎల్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అనంతరం లీగ్ నిర్వాహక సంస్థ జూపర్ ఎల్ఈడీ డైరెక్టర్ ఒ.రమేశ్ మాట్లాడుతూ తమ సీఎస్ఆర్ నిధులతో ఈ పోటీలను నిర్వహిస్తోందని తెలిపారు. ఈ లీగ్ను కేవలం వినోదం కోసం నిర్వహించకుండా సమాజంలో ఆరోగ్య భద్రత, ఫిట్నెస్, క్రీడలపై అవగాహన పెంచేందుకు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ టోర్నీ మొత్తం ప్రైజ్మనీ రూ. 80 లక్షలు అని ఆయన చెప్పారు. చదవండి: ప్రపంచ క్రికెట్ను శాశించేందుకు మరో వసంతంలోకి అడుగుపెట్టిన కోహ్లి -
హైదరాబాద్, ఆంధ్ర బోణీ విజయాలు
నాదౌన్: రంజీ ట్రోఫీ తాజా సీజన్లో హైదరాబాద్ జట్టు తొలి విజయాన్ని అందుకుంది. హిమాచల్ ప్రదేశ్ జట్టుతో మంగళవారం ముగిసిన గ్రూప్ ‘డి’ మూడో లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. 344 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు ఓవర్నైట్ స్కోరు 8/0తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ జట్టు... 75.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 347 పరుగులు సాధించింది. ఓపెనర్ అభిరథ్ రెడ్డి (200 బంతుల్లో 175 నాటౌట్; 19 ఫోర్లు, 3 సిక్స్లు) వీరోచిత సెంచరీ సాధించి హైదరాబాద్ను విజయతీరాలకు చేర్చాడు. వన్డౌన్ బ్యాటర్ రాహుల్ రాధేశ్ (127 బంతుల్లో 66; 8 ఫోర్లు)తో కలిసి అభిరథ్ రెడ్డి రెండో వికెట్కు 145 పరుగులు జోడించాడు. రాధేశ్ అవుటయ్యాక కెప్టెన్ రాహుల్ సింగ్ (24; 2 ఫోర్లు), హిమతేజ (25 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్), తనయ్ త్యాగరాజన్ (25 బంతుల్లో 29; 2 ఫోర్లు) సహకారంతో అభిరథ్ హైదరాబాద్ను లక్ష్యం దిశగా నడిపించాడు. మూడో వికెట్కు రాహుల్ సింగ్తో 74 పరుగులు జోడించిన అభిరథ్æ.... నాలుగో వికెట్కు హిమతేజతో 53 పరుగులు... ఐదో వికెట్కు తనయ్తో 47 పరుగులు జత చేశాడు. హిమాచల్ జట్టు బౌలర్లలో ఆర్యమాన్ సింగ్ మూడు వికెట్లు తీశాడు. తొలి రెండు మ్యాచ్లను ‘డ్రా’ చేసుకున్న హైదరాబాద్జట్టు ఈ గెలుపుతో తమ ఖాతాలో ఆరు పాయింట్లు వేసుకుంది. హిమాచల్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 318 పరుగులు చేయగా... హైదరాబాద్ జట్టు 278 పరుగులకు ఆలౌటైంది. 40 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందిన హిమాచల్ 303 పరుగులు చేసి హైదరాబాద్కు 344 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. గ్రూప్ ‘డి’లో మూడు మ్యాచ్లు పూర్తి చేసుకున్న హైదరా బాద్ జట్టు పది పాయింట్లతో ముంబై జట్టుతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉంది. ఆంధ్ర బోణీకటక్: తొలి రెండు లీగ్ మ్యాచ్లను ‘డ్రా’తో సరిపెట్టుకున్న ఆంధ్ర క్రికెట్ జట్టు రంజీ ట్రోఫీలో తొలి విజయం నమోదు చేసింది. ఒడిశా జట్టుతో మంగళవారం ముగిసిన గ్రూప్ ‘ఎ’ మూడో లీగ్ మ్యాచ్లో ఆంధ్ర ఇన్నింగ్స్ 50 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఫాలోఆన్ ఆడుతూ ఓవర్నైట్ స్కోరు 190/2తో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఒడిశా జట్టు 104.2 ఓవర్లలో 274 పరుగులకు ఆలౌటైంది. రెండు వికెట్లకు 198 పరుగులతో పటిష్టంగా కనిపించిన ఒడిశా జట్టు చివరి ఎనిమిది వికెట్లను 80 పరుగుల తేడాలో కోల్పోయింది. ఓపెనర్ గౌరవ్ చౌధురీ (80; 10 ఫోర్లు), వన్డౌన్ బ్యాటర్ సందీప్ పటా్నయక్ (63; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీలు చేశారు. మూడో వికెట్గా గౌరవ్ అవుటయ్యాక ఒడిశా ఇన్నింగ్స్ తడబడింది. ఈసారి ఆంధ్ర జట్టుకు ఆడుతున్న ఉత్తరప్రదేశ్కు చెందిన ఎడంచేతి వాటం స్పిన్నర్ సౌరభ్ కుమార్ 47 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... ఆఫ్ స్పిన్నర్ త్రిపురణ విజయ్ 89 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. కావూరి సాయితేజ, శశికాంత్, పృథ్వీరాజ్లకు ఒక్కో వికెట్ దక్కింది. ఆంధ్ర తొలి ఇన్నింగ్స్లో 475 పరుగులు చేయగా... ఒడిశా తొలి ఇన్నింగ్స్లో 151 పరుగులకు ఆలౌటైంది. ఇన్నింగ్స్ తేడాతో గెలిచినందుకు ఆంధ్ర జట్టుకు ఏడు పాయింట్లు లభించాయి. ఈ మ్యాచ్లో 69 పరుగులు చేయడంతోపాటు ఆరు వికెట్లు పడగొట్టిన సౌరభ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. చదవండి: భారీ విజయంతో కర్ణాటక బోణీ -
ప్రపంచ క్రికెట్ను శాసించేందుకు మరో వసంతంలోకి..
క్రికెట్ దిగ్గజం, రికార్డుల రారాజు, ఛేజింగ్ మాస్టర్, ఫిట్నెస్ ఫ్రీక్ అయిన విరాట్ కోహ్లి (Virat Kohli) ప్రపంచ క్రికెట్ను శాసించేందుకు మరో వసంతంలోకి అడుగుపెట్టాడు. ఇవాళ (నవంబర్ 5, 2025) కింగ్ కోహ్లి 37వ జన్మదినం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని యావత్ క్రీడా సమాజం అతడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుంది.ఇటీవలే టీ20, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. 2027 ప్రపంచకప్ ఆడాలన్నది అతడి కొరిక. అంతవరకు విరాట్ మునుపటి మెరుపులు మెరిస్తూ, మరెన్నో రికార్డులను బద్దలు కొడుతూ అప్రతిహతంగా కెరీర్ను కొనసాగించాలని ఆశిద్దాం.కోహ్లి ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో ఆడాడు. ఇందులో తొలి రెండు మ్యాచ్ల్లో డకౌటైనా, మూడో మ్యాచ్లో తిరిగి పుంజుకున్నాడు. రోహిత్ శర్మతో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియాను విజయాన్నందించాడు. సిడ్నీ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో రోహిత్ సెంచరీ (121 నాటౌట్) చేయగా.. కోహ్లి (74 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించాడు.విరాట్ త్వరలో మరోసారి దర్శనమివ్వబోతున్నాడు. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగే సిరీస్లో కోహ్లి ఆడే అవకాశం ఉంది. 2027 ప్రపంచకప్ వరకు కోహ్లి ఫిట్నెస్ను, ఫామ్ను కాపాడుకుంటూ టీమిండియాను గెలిపిస్తూ ఉండాలని భారత క్రికెట్ అభిమానులంతా కోరుకుంటున్నారు. అతడి జన్మదినం సందర్భంగా ప్రతి భారత క్రికెట్ అభిమాని అకాంక్ష ఇదే.ఢిల్లీ వీధుల్లో క్రికెట్ ఆడటం మొదలుపెట్టి, క్రీడలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన కోహ్లి.. ఫామ్ను కాపాడుకోగలిగితే సునాయాసంగా మరో రెండు, మూడేళ్లు దేశానికి సేవలందించగలడు. ఫిట్నెస్ విషయంలో అతడికి ఎలాంటి సమస్యలు లేవు. ఉండవు. సాధారణంగా 35 ఏళ్ల వయసొచ్చే సరికే క్రికెటర్లు ఫిట్నెస్ను కోల్పోయి సమస్యలు ఎదుర్కొంటుంటారు.అయితే కోహ్లి మాత్రం అలా కాదు. 25 ఏళ్ల కుర్రాళ్లు కూడా పోటీ పడలేని విధంగా ఫిట్నెస్ను మెయిన్టెయిన్ చేస్తున్నాడు. తాజాగా ఆసీస్తో జరిగిన సిరీస్లో కోహ్లిని చూస్తే ఇది స్పష్టంగా తెలుస్తుంది.కెరీర్ను నిదానంగా ప్రారంభించిన కోహ్లి.. అందరిలాగే మధ్యలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. ఓ దశలో ఫామ్ కోల్పోయి చాలా ఇబ్బంది పడ్డాడు. అప్పటివరకు పొగిడిన నోళ్లే అతన్ని దూషించాయి. బ్యాడ్ టైమ్ను అధిగమించిన కోహ్లి తిరిగి నిలబడ్డాడు. దూషించిన నోళ్లకు బ్యాట్తో సమాధానం చెప్పాడు.ఆటగాడిగానే కాకుండా కెప్టెన్గానూ కోహ్లి కెరీర్ విజయవంతంగా సాగింది. టెస్ట్ల్లో భారత అత్యుత్తమ కెప్టెన్ కోహ్లినే అని చెప్పవచ్చు. అతడి హయాంలో భారత్ అత్యున్నత శిఖరాలు అధిరోహించింది. కోహ్లి జట్టు ఆటతీరునే మార్చేశాడు. ఆటగాళ్లకు దూకుడు నేర్పాడు. ఫిట్నెస్ మెరుగుపర్చుకునే విషయంలో అందరికీ దిక్సూచిగా నిలిచాడు. కోహ్లి జమానాలో భారత్ చిరస్మరణీయ విజయాలు సాధించింది. చాలాకాలం పాటు ప్రపంచ నంబర్ వన్ జట్టుగా కొనసాగింది.కోహ్లి ఆటగాడిగా, కెప్టెన్గా ఎన్నో మైలురాళ్లను అధిగమించాడు. ఇప్పటికే భారత క్రికెట్కు చేయాల్సిన దానికంటే ఎక్కువే చేశాడు. అయినా కోహ్లిలో కసి తీరడం లేదు. భారత జట్టుకు ఇంకా ఏదో చేయాలనే తపన ఉంది. 2027 వన్డే ప్రపంచకప్ గెలిచి కెరీర్కు ముగింపు పలకాలన్నది కోహ్లి కోరిక. ఈ కోరిక నెరవేరాలని, కోహ్లి ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశిద్దాం. కోహ్లి సాధించిన ఘనతలు..అండర్-19 వరల్డ్కప్ (2008)వన్డే వరల్డ్కప్ (2011)టీ20 వరల్డ్కప్ (2024)ఛాంపియన్స్ ట్రోఫీ (2013, 2025)ఐపీఎల్ (2025)ఆసియా కప్-3టెస్ట్ మేస్-5ఐసీసీ అవార్డ్స్-10చదవండి: డ్రగ్స్కు బానిస.. స్టార్ క్రికెటర్పై శాశ్వత నిషేధం -
స్టార్ క్రికెటర్పై శాశ్వత నిషేధం
జింబాబ్వే క్రికెట్కు 20 ఏళ్ల పాటు సేవలందించిన మాజీ కెప్టెన్ సీన్ విలియమ్స్ (Sean Williams) ఇకపై జాతీయ జట్టుకు ఎంపిక కాడు. డ్రగ్స్ అలవాటు కారణంగా జింబాబ్వే క్రికెట్ బోర్డు అతనిపై శాశ్వత నిషేధం విధించింది. ఇకపై అతని సెంట్రల్ క్రాంటాక్ట్ పొడిగించేది లేదని స్పష్టం చేసింది.సీన్ ఈ ఏడాది సెప్టెంబర్లో స్వదేశంలో జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 క్వాలిఫయింగ్ టోర్నీ నుంచి ఆకస్మికంగా తప్పుకున్నాడు. కారణం ఏంటని బోర్డు ఆరా తీయగా షాకింగ్ విషయం వెలుగు చూసింది. అప్పటికే హెవీగా డ్రగ్స్కు అలవాటు పడిన సీన్.. డోపింగ్ టెస్ట్లో పట్టుబడతాడన్న భయంతో టోర్నీ నుంచి వైదొలిగాడు. సీన్ తాను డ్రగ్స్ అలవాటు పడిన విషయాన్ని బోర్డు పెద్దల వద్ద అంగీకరించినట్లు తెలుస్తుంది. అలవాటు నుంచి బయటపడేందుకు డీఎడిక్షన్ సెంటర్లో కూడా జాయిన్ అయ్యాడని సమాచారం. బోర్డుతో సీన్ కాంట్రాక్ట్ ఈ ఏడాది చివర్లో ముగుస్తుంది. 39 ఏళ్ల సీన్ జింబాబ్వేకు ఎన్నో అపురూప విజయాలు అందించాడు. కెరీర్లో 18 టెస్ట్లు, 162 వన్డేలు, 8 టీ20లు ఆడి 13 సెంచరీలు, 50 సెంచరీల సాయంతో 8000 పైచిలుకు పరుగులు చేశాడు. లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ కూడా అయిన సీన్.. మూడు ఫార్మాట్లలో 156 వికెట్లు తీశాడు.కాగా, సీన్ డుమ్మా కొట్టిన టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నీ జింబాబ్వేకు అత్యంత కీలకంగా ఉండింది. ఆ టోర్నీలో జింబాబ్వే సికందర్ రజా పుణ్యమా అని నెగ్గి ప్రపంచకప్కు అర్హత సాధించింది. సీన్ లాంటి సీనియర్ ఆటగాడు ఆ టోర్నీకి అందుబాటులో లేకపోవడం జింబాబ్వే విజయావకాశాలను ప్రభావితం చేసేదే. ఒకవేళ ఆ టోర్నీలో జింబాబ్వే ఓటమిపాలై, ప్రపంచకప్కు అర్హత సాధించలేకపోయుంటే జింబాబ్వే అభిమానులు సైతం సీన్ను క్షమించేవారు కాదు.జింబాబ్వే క్రికెట్కు మాదకద్రవ్యాల ముప్పు జింబాబ్వే క్రికెట్లో మాదకద్రవ్యాల కలకలం ఇది మొదటిసారి కాదు. 2022లో మరో మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్ కోకైన్ వాడకం వల్ల మ్యాచ్ ఫిక్సర్ల చేతిలో బ్లాక్మెయిల్కు గురయ్యాడు. ఆ ఉదంతంలో ఫిక్సర్ల నుంచి డబ్బు తీసుకున్న టేలర్పై 3.5 ఏళ్ల నిషేధం విధించబడింది. టేలర్ ఇటీవల శిక్షను పూర్తి చేసుకొని రీఎంట్రీ ఇచ్చాడు. టేలర్ విషయంలో కాస్త ఉదాసీనంగా వ్యవహరించిన జింబాబ్వే క్రికెట్ బోర్డు సీన్ విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించింది. చదవండి: యాషెస్ తొలి టెస్ట్కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన -
యాషెస్ తొలి టెస్ట్కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన
నవంబర్ 21 నుంచి పెర్త్ వేదికగా ఇంగ్లండ్తో జరిగే తొలి యాషెస్ (Ashes Series 2025-26) టెస్ట్ కోసం 15 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును (Australia) ఇవాళ (నవంబర్ 5) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్గా స్టీవ్ స్మిత్ వ్యవహరించనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ముందుగానే ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో స్మిత్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పారు.ఈ జట్టులో ఎవరూ ఊహించని ఓ ఆటగాడికి (జేక్ వెదరాల్డ్, Jake Weatherald) చోటు దక్కింది. ఇటీవల దేశవాలీ క్రికెట్లో సెంచరీల మోత మోగించిన మార్నస్ లబూషేన్ (Marnus Labuschagne) తిరిగి జట్టులోకి వచ్చాడు. వెదరాల్డ్, లబూషేన్లలో ఎవరో ఒకరు ఉస్మాన్ ఖ్వాజాతో కలిసి ఓపెనింగ్ చేస్తారు.పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లుగా కెమెరాన్ గ్రీన్, బ్యూ వెబ్స్టర్ చోటు దక్కించుకున్నారు. కమిన్స్ గైర్హాజరీలో సీన్ అబాట్, బ్రెండన్ డాగెట్ బ్యాకప్ బౌలర్లుగా జట్టులోకి వచ్చారు. అలెక్స్ క్యారీ రెగ్యులర్ వికెట్కీపర్గా, జోస్ ఇంగ్లిస్ రిజర్వ్ వికెట్కీపర్గా ఎంపికయ్యారు. పేలవ ఫామ్ కారణంగా యువ ఓపెనర్ సామ్ కొన్స్టాస్ జట్టులో స్థానంలో కోల్పోయాడు. మ్యాట్ రెన్షా పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ అతనికి నిరాశే మిగిలింది.పేసర్లుగా జోష్ హాజిల్వుడ్, మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్.. స్పెషలిస్ట్ స్పిన్నర్గా నాథన్ లియాన్ కొనసాగుతున్నారు.యాషెస్ సిరీస్ తొలి టెస్ట్కు ఆస్ట్రేలియా జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, బ్రెండన్ డాగెట్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్ లాబూషేన్, నాథన్ లియాన్, మిచెల్ స్టార్క్, జేక్ వెదరాల్డ్, బ్యూ వెబ్స్టర్మరోవైపు యాషెస్ సిరీస్ మొత్తానికి బెన్ స్టోక్స్ నేతృత్వంలోని 16 మంది సభ్యుల ఇంగ్లండ్ జట్టును ఇదివరకే ప్రకటించారు. యాషెస్ సిరీస్ 2025-26కి ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేకబ్ బేతెల్, బెన్ డకెట్, జాక్ క్రాలే, జో రూట్, హ్యారీ బ్రూక్, విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, జేమీ స్మిత్, ఓలీ పోప్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్, మాథ్యూ పాట్స్చదవండి: పాకిస్తాన్, సౌతాఫ్రికా తొలి వన్డేలో హైడ్రామా -
పాకిస్తాన్, సౌతాఫ్రికా తొలి వన్డేలో హైడ్రామా
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా పాకిస్తాన్, సౌతాఫ్రికా (Pakistan vs South Africa) జట్ల మధ్య నిన్న (నవంబర్ 4) జరిగిన తొలి వన్డేలో హైడ్రామా చోటు చేసుకుంది. పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ (Abrar Ahmed) హ్యాట్రిక్ సాధించినట్టే సాధించి మిస్ అయ్యాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 44వ ఓవర్ తొలి రెండు బంతులకు అబ్రార్.. బ్రీట్జ్కే, ఫోర్టుయిన్ను ఔట్ చేశాడు. మూడో బంతికి లుంగి ఎంగిడి ఎల్బీడబ్ల్యూ అయినట్లు తొలుత ఫీల్డ్ అంపైర్ ప్రకటించాడు.దీంతో అబ్రార్, అతని సహచరులు సహా మైదానంలో ఉన్న పాక్ అభిమానులంతా తెగ సంబరపడిపోయారు. అయితే ఎంగిడి అంపైర్ నిర్ణయంపై రివ్యూకి వెళ్లడంతో కథ తారుమారైంది. రివ్యూలో స్పష్టంగా ఇన్సైడ్ ఎడ్జ్ ఉన్నట్లు తేలింది. దీంతో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది. చేతిలోకి వచ్చిన హ్యాట్రిక్ మిస్ కావడంతో అబ్రార్ తీవ్ర నిరాశకు గురయ్యాడు.ఈ మ్యాచ్లో పాక్ సౌతాఫ్రికాను ఓడించి సిరీస్లో బోణీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 49.1 ఓవర్లలో 263 పరుగులకు ఆలౌట్ కాగా.. పాక్ 8 వికెట్లు కోల్పోయి, మరో 2 బంతులు మిగిలుండగా అతి కష్టం మీద లక్ష్యాన్ని చేరుకుంది. పాక్ గెలుపులో సల్మాన్ అఘా (62), మొహమ్మద్ రిజ్వాన్ (55), ఫకర్ జమాన్ (45), సైమ్ అయూబ్ (39, 2 వికెట్లు) కీలక పాత్రలు పోషించారు. సౌతాఫ్రికా బౌలర్లు పాక్ను భయపెట్టారు. ఎంగిడి, ఫెరియెరా, కార్బిన్ బాష్ తలో 2, లిండే, ఫోర్టుయిన్ చెరో వికెట్ పడగొట్టారు.అంతకుముందు నసీం షా (9.1-1-40-3), అబ్రార్ అహ్మద్ (9-1-53-3), సైమ్ అయూబ్ (8-0-39-2), షాహీన్ అఫ్రిది (10-0-55-1), మొహమ్మద్ నవాజ్ (10-0-45-1) ధాటికి సౌతాఫ్రికా ఓ మోస్తరు స్కోర్కే పరిమితమైంది. ఓపెనర్లు ప్రిటోరియస్ (57), డికాక్ (63) అర్ద సెంచరీలతో రాణించారు. కెప్టెన్ బ్రీట్జ్కే (42), కార్బిన్ బాష్ (41) పర్వాలేదనిపించారు. ఈ సిరీస్లోని రెండో వన్డే కూడా ఫైసలాబాద్ వేదికగానే నవంబర్ 6న జరుగుతుంది. చదవండి: ఆసియాకప్లో ఓవరాక్షన్.. పాక్ ఆటగాడిపై 2 మ్యాచ్ల బ్యాన్! సూర్యకు కూడా -
అమ్మాయిల బ్రాండ్ వాల్యూ.. అమాంతం పెరిగింది!
సాక్షి, స్పెషల్ డెస్క్ : మహిళా క్రికెట్లో ప్రపంచ విజేతగా నిలిచిన భారత మహిళల జట్టుకు దేశవ్యాప్తంగా అభిమా నులు పెరిగారు. సోషల్ మీడియా ఫాలోవర్లు రెండు మూడు రెట్లు పెరిగారు. దీంతో, ఈ విజేతలను ప్రచారకర్తలుగా నియమించుకోవడానికి కంపెనీలు క్యూ కడుతున్నాయి. కొత్తవే కాదు.. పాత అగ్రిమెంట్లను కొనసాగించేందుకూ చర్చలు మొదలయ్యా యి. ఇప్పటికే పలు కంపెనీల బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న క్రికెటర్ల ఎండార్స్మెంట్ ఫీజులు 100% వరకు పెరిగాయి. మైదానంలోనే కాదు తమ వ్యాపార విజయంలోనూ ఈ క్రికెటర్లు బెస్ట్ స్కోర్కు దోహదం చేస్తారని కంపెనీలు విశ్వసిస్తున్నాయి. మహిళల క్రికెట్ ప్రపంచకప్ సెమీ–ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించడంలో కీలక పాత్ర పోషించిన జెమీమా రోడ్రిగ్స్ బ్రాండ్ విలువ 100% పెరిగిందని సమాచారం. ఆస్ట్రేలియాతో మ్యాచ్ పూర్తయిన వెంటనే ఆమెతో ఒప్పందం చేసుకోవడానికి బ్రాండ్స్ సిద్ధమయ్యా యి. ఆమె ప్రస్తుతం రెడ్ బుల్, బోట్, నైకీ, ఎస్జీ, సర్ఫ్ ఎక్సెల్ బ్రాండ్స్కు ప్రచారకర్తగా ఉంది. కంపెనీ, ఒప్పంద కాలాన్ని బట్టి ఆమె ఫీజు రూ.75 లక్షల నుండి రూ.1.5 కోట్ల వరకు ఉంది.కొత్త ఒప్పందాల కోసం..అత్యధిక పారితోషికం పొందుతున్న మహిళా క్రికెటర్ స్మృతి మంధాన.. రెక్సోనా డియోడరెంట్, నైకీ, హ్యుండై, హెర్బాలైఫ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), గల్ఫ్ ఆయిల్, పీఎన్ బీ మెట్లైఫ్ ఇన్సూరెన్స్ వంటి 16 బ్రాండ్స్కు ప్రచారకర్తగా ఉంది. ఒక్కో బ్రాండ్ నుంచి ఆమె సుమారు 2 కోట్లు అందుకుంటోంది. హర్మన్ ప్రీత్ కౌర్ ఒక యాడ్కు రూ.1.2 కోట్లు, షెఫాలీ వర్మ రూ.25–50 లక్షలు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు మహిళా క్రికెటర్లను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకున్న గూగుల్ జెమినై, రెక్సోనా, నైక్, ఎస్బీఐ, రెడ్ బుల్, ప్యూమా వంటి బ్రాండ్స్.. ఒప్పందాలను కొనసాగించాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇది అబ్బాయిల సత్తావిరాట్ కోహ్లీ ఒక్కో బ్రాండ్ నుంచి రూ.4.5–10 కోట్లుఇతర పురుష క్రికెటర్లు సగటున రూ.1.5–5 కోట్లుఇది అమ్మాయిల పవర్ప్రచారకర్తగా ఒక్కో బ్రాండ్ నుంచి మహిళా క్రికెటర్లు అందుకునే ఫీజు..ప్రపంచ కప్నకు ముందు: రూ.30 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకువరల్డ్ కప్ తర్వాత: రూ.60 లక్షల నుంచి రూ.3 కోట్ల వరకుకోకాకోలాకు చెందిన థమ్స్ అప్ ఎక్స్ఫోర్స్, బాడీ ఆర్మర్; ప్యూమా, ఏషియన్ పెయింట్స్, అడీడాస్, స్విగ్గీ ఇన్ స్టామార్ట్ బ్రాండ్స్ ఇప్పటికే ఉన్న ఒప్పందాలను కొనసాగించే ఆలోచనలో ఉన్నాయని సమాచారం కాంట్రాక్ట్ ఫీజు పెరుగుతుందా?మ్యాచ్ ఫీజులను పురుష క్రికెటర్లకు సమానంగా 2022 నుంచి మహిళా క్రికెటర్లకూ బీసీసీఐ చెల్లిస్తోంది. అయితే వార్షిక కాంట్రాక్ట్ విషయంలో మాత్రం ఇరువురి మధ్య తీవ్ర అంతరం ఉంది. పురుష క్రికెటర్లు రూ.కోట్లలో అందుకుంటుంటే అమ్మాయిలు రూ.లక్షల్లో పొందుతున్నారు. ‘ఎ ప్లస్’ విభాగంలో బీసీసీఐ ఒక్కో (పురుష) క్రికెటర్కు వార్షిక కాంట్రాక్ట్ ఫీజు కింద రూ.7 కోట్లు చెల్లిస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఈ కేటగిరీలో ఉన్నారు. మహిళా క్రికెటర్లు ఒక్కరు కూడా ఈ జాబితాలో లేరు. ‘ఎ’ విభాగంలో మహిళా క్రికెటర్లలో ప్రస్తుతానికి హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మకు చోటు దక్కింది. -
పాకిస్తాన్దే తొలి వన్డే
ఫైసలాబాద్: కొత్త వన్డే కెప్టెన్ షాహిన్ అఫ్రిది నేతృత్వంలో పాకిస్తాన్ శుభారంభం చేసింది. మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో పాక్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 49.1 ఓవర్లలో 263 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు క్వింటన్ డి కాక్ (71 బంతుల్లో 63; 6 ఫోర్లు, 2 సిక్స్లు), డ్రి ప్రిటోరియస్ (60 బంతుల్లో 57; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు చేయగా, కార్బిన్ బాష్ (41) రాణించాడు. పాక్ బౌలర్లలో నసీమ్ షా, అబ్రార్ అహ్మద్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 8 వికెట్లకు 264 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సల్మాన్ ఆగా (71 బంతుల్లో 62; 5 ఫోర్లు, 1 సిక్స్), మొహమ్మద్ రిజ్వాన్ (74 బంతుల్లో 55; 6 ఫోర్లు) హాఫ్ సెంచరీలు నమోదు చేయగా...ఫఖర్ జమాన్ (45), సయీమ్ అయూబ్ (39) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. మూడు మ్యాచ్ల సిరీస్లో పాక్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లగా...రెండో వన్డే రేపు ఇదే మైదానంలో జరుగుతుంది. -
భారీ విజయంతో కర్ణాటక బోణీ
తిరువనంతపురం: స్పిన్నర్ మోసిన్ ఖాన్ (6/29) తిప్పేయడంతో రంజీ ట్రోఫీలో కర్ణాటక భారీ విజయం సాధించింది. కేరళ సొంతగడ్డపై జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్లో కర్నాటక ఇన్నింగ్స్ 164 పరుగుల తేడాతో కేరళపై ఘనవిజయం సాధించింది. ఈ సీజన్లో కర్ణాటక జట్టుకిది తొలి గెలుపు. సౌరాష్ట్ర, గోవాలతో జరిగిన గత రెండు మ్యాచ్లు కూడా ‘డ్రా’గానే ముగిశాయి. డబుల్ సెంచరీతో భారీస్కోరుకు బాట వేసిన కర్ణాటక బ్యాటర్ కరుణ్ నాయర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మంగళవారం 10/0 ఓవర్ నైట్ స్కోరుతో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన కేరళ... సొంతగడ్డపై కనీసం 200 పరుగులైనా చేయలేకపోయింది. ఫాలోఆన్ ఆడిన కేరళ 79.3 ఓవర్లలో 184 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ కృష్ణప్రసాద్ (33; 5 ఫోర్లు) కాస్త మెరుగ్గా ఆడాడు. మిగతా టాపార్డర్ బ్యాటర్లు ని«దీశ్ (9), అక్షయ్ చంద్రన్ (0)లను పేసర్ విద్వత్ కావేరప్ప వరుస బంతుల్లో అవుట్ చేయడంతోనే కేరళ పతనం మొదలైంది. కెప్టెన్ అజహరుద్దీన్ (15)ను శిఖర్ పెవిలియన్ చేర్చగా మిగతా బ్యాటర్లకు మోసిన్ స్పిన్ ఉచ్చు బిగించడంతో కేరళ క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయింది. నిజానికి 140 పరుగులకే 9 వికెట్లను కోల్పోయిన కేరళ 150 పరుగుల్లోపే ఆలౌట్ ఖాయమనిపించింది. అయితే ఆఖరి వరుస బ్యాటర్ ఇడెన్ ఆపిల్ టామ్ (68 బంతుల్లో 39 నాటౌట్; 7 ఫోర్లు) చేసిన పోరాటంతో కర్ణాటక విజయం కాస్త ఆలస్యమైంది.మిగతా మ్యాచ్ల్లో గ్రూప్ ‘ఎ’లో జార్ఖండ్ ఇన్నింగ్స్ 196 పరుగుల తేడాతో నాగాలాండ్పై జయభేరి మోగించింది. వడోదరలో వర్షం వల్ల బరోడా, ఉత్తర ప్రదేశ్ మ్యాచ్లో అసలు టాస్ కూడా పడలేదు. మ్యాచ్ పూర్తిగా వర్షార్పణమైంది. ‘బి’లో సౌరాష్ట్ర–మహారాష్ట్ర, పంజాబ్–గోవా, మధ్యప్రదేశ్–చండీగఢ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. విహారి, మురాసింగ్ల పోరాటంతో... అగర్తలా: హనుమ విహారి (253 బంతుల్లో 141; 19 ఫోర్లు, 1 సిక్స్), కెపె్టన్ మణిశంకర్ మురాసింగ్ (130 బంతుల్లో 102 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్స్లు)ల పోరాటంతో త్రిపుర డ్రాతో గట్టెక్కడమే కాదు... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కూడా సంపాదించింది. దీంతో గ్రూప్ ‘సి’లో బెంగాల్తో జరిగిన మ్యాచ్లో త్రిపుర కీలకమైన 3 పాయింట్లను ఖాతాలో వేసుకుంది. ఓవర్నైట్ స్కోరు 273/7తో తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన త్రిపుర 103.2 ఓవర్లలో 385 పరుగుల వద్ద ఆలౌటైంది. తద్వారా బెంగాల్ (336)పై తొలి ఇన్నింగ్స్లో 49 పరుగులు ఆధిక్యం లభించింది. మూడో రోజే విహారి శతక్కొట్టగా, ఆఖరి రోజు మురాసింగ్ వన్డేను తలపించే విధంగా ధాటిగా ఆడి సెంచరీ సాధించాడు. ఇద్దరు ఎనిమిదో వికెట్కు 116 పరుగులు జోడించారు. విహారి అవుటయ్యాక టెయిలెండర్ రాణా దత్త (27; 4 ఫోర్లు) కూడా మురాసింగ్కు అండగా నిలిచాడు. బెంగాల్ బౌలర్లలో భారత వెటరన్ సీమర్ షమీకి ఒక్క వికెట్ కూడా దక్కలేదు. కైఫ్ 4, ఇషాన్ పొరెల్ 3 వికెట్లు తీశారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆడిన బెంగాల్ 25 ఓవర్లలో 3 వికెట్లకు 90 పరుగులు చేసింది. షహబాజ్ అహ్మద్ (51 నాటౌట్) అర్ధసెంచరీ సాధించాడు. శ్రమించి గెలిచిన హరియాణా అహ్మదాబాద్: గ్రూప్ ‘సి’లో గుజరాత్తో జరిగిన మ్యాచ్లో సులువైన 62 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు కూడా హరియాణా తెగ కష్టపడింది. చివరకు 6 వికెట్లు కోల్పోయి ఈ ఆరు పదుల లక్ష్యాన్ని ఛేదించి గెలిచింది. మొత్తానికి గ్రూప్ ‘సి’లోనే కాదు... ఈ సీజన్లోనే అన్ని గ్రూపుల్లో ఆడిన మూడు మ్యాచ్లు గెలిచిన ఏకైక జట్టుగా హరియాణా ‘హ్యాట్రిక్’ విజయాలు సాధించింది. మంగళవారం 113/8 ఓవర్నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన గుజరాత్ 60.4 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది.ఇంకో 24 పరుగులు చేసి మిగిలిన 2 వికెట్లు కోల్పోయింది. రవి బిష్ణోయ్ (2)ని పార్థ్వత్స (2/38), క్షితిజ్ పటేల్ (37; 2 ఫోర్లు)ను నిఖిల్ కశ్యప్ (4/59) అవుట్ చేయడంతో ఇన్నింగ్స్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్లో 76 పరుగుల ఆధిక్యం పొందిన హరియాణా ముందు కేవలం 62 పరుగుల లక్ష్యమే ఉంది. అయితే రెండో ఇన్నింగ్స్లో హరియాణా టాప్–6 బ్యాటర్లు లక్ష్యయ్ (1), అంకిత్ (1), శాండిల్యా (3), నిశాంత్ (13), అమన్ (3), ధీరు సింగ్ (13)లను గుజరాత్ బౌలింగ్ త్రయం విశాల్ (3/23), సిద్ధార్థ్ దేశాయ్ (2/25), బిష్ణోయ్ (1/13) మూకుమ్మడిగా అవుట్ చేయడంతో 43 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. పార్థ్ వత్స (14 నాటౌట్), యశ్వర్ధన్ (13 నాటౌట్) అజేయంగా నిలువడంతో హరియాణా 4 వికెట్ల తేడాతో గెలిచి నిట్టూర్చింది. ఇదే గ్రూప్ ‘సి’లో జరిగిన మ్యాచ్లో బౌలర్ల అద్భుత ప్రతిభతో ఉత్తరాఖండ్ 17 పరుగుల తేడాతో సర్వీసెస్పై గెలుపొందింది. 123 పరుగుల స్వల్పలక్ష్యాన్ని ఛేదించేందుకు ఆఖరి రోజు 71/5 ఓవర్నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సర్వీసెస్ 48.4 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలింది. 34 పరుగులు మాత్రమే చేసి మిగతా సగం (5) వికెట్లను కోల్పోయింది. మయాంక్ మిశ్రా (5/45), సుచిత్ (2/12), అవనీశ్ (2/27) సర్వీసెస్ బ్యాటర్లను క్రీజులో నిలువనీయలేదు. -
అర్జున్ శుభారంభం
పనాజీ: టైటిల్ ఫేవరెట్స్లో ఒకరైన భారత నంబర్వన్, ప్రపంచ ఆరో ర్యాంకర్ ఇరిగేశి అర్జున్ ప్రపంచకప్ చెస్ టోర్నీలో శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్ ఆడుతున్న తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ తొలి గేమ్లో గెలుపొందాడు. బల్గేరియా గ్రాండ్మాస్టర్ పెట్రోవ్ మారి్టన్తో మంగళవారం జరిగిన తొలి గేమ్లో నల్లపావులతో ఆడుతూ అర్జున్ 37 ఎత్తుల్లో విజయం సాధించాడు. పెట్రోవ్తో నేడు జరిగే రెండో గేమ్ను అర్జున్ ‘డ్రా’ చేసుకుంటే మూడో రౌండ్కు అర్హత సాధిస్తాడు. భారత ఇతర గ్రాండ్మాస్టర్లు దొమ్మరాజు గుకేశ్, ప్రజ్ఞానంద, పెంటేల హరికృష్ణ, దీప్తాయన్ ఘోష్, విదిత్ సంతోష్ గుజరాతి, కార్తీక్ వెంకటరామన్, అరవింద్ చిదంబరం, నిహాల్ సరీన్, ఇనియన్, కార్తికేయన్ మురళీ, ఎస్ఎల్ నారాయణన్, ప్రాణేశ్, రౌనక్ సాధ్వాని తమ ప్రత్యర్థులతో జరిగిన రెండో రౌండ్లోని తొలి గేమ్ను ‘డ్రా’ చేసుకున్నారు. భారత్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్ ప్రణవ్ తన ప్రత్యర్థి టారీ ఆర్యన్ (నార్వే)పై 41 ఎత్తుల్లో గెలుపొందగా... సూర్యశేఖర గంగూలీ (భారత్) 37 ఎత్తుల్లో మాక్సిమి లాగ్రెవ్ (ఫ్రాన్స్) చేతిలో, అరోణ్యక్ ఘోష్ (భారత్) 30 ఎత్తుల్లో లెవోన్ అరోనియన్ (అమెరికా) చేతిలో ఓడిపోయారు. గుకేశ్–నొగెర్బెక్ కాజీబెక్ (కజకిస్తాన్) గేమ్ 84 ఎత్తుల్లో... ప్రజ్ఞానంద–తెముర్ కుయ్బోకరోవ్ (ఆస్ట్రేలియా) గేమ్ 60 ఎత్తుల్లో... దీప్తాయన్ ఘోష్–నెపోమ్నిషి (రష్యా) గేమ్ 30 ఎత్తుల్లో... విదిత్–ఓరో ఫౌస్టినో (అర్జెంటీనా) గేమ్ 28 ఎత్తుల్లో... కార్తీక్ వెంకటరామన్–అరవింద్ గేమ్ 55 ఎత్తుల్లో... నిహాల్ సరీన్–స్టామాటిస్ (గ్రీస్) గేమ్ 90 ఎత్తుల్లో... పెంటేల హరికృష్ణ–అర్సెని నెస్తోరోవ్ (రష్యా) గేమ్ 30 ఎత్తుల్లో... ఇనియన్–నుగుయెన్ థాయ్ డాయ్ వాన్ (చెక్ రిపబ్లిక్) గేమ్ 45 ఎత్తుల్లో... కార్తికేయన్ మురళీ–ఇదానీ (ఇరాన్) గేమ్ 76 ఎత్తుల్లో... నారాయణన్–విటియుగోవ్ (ఇంగ్లండ్) గేమ్ 57 ఎత్తుల్లో... ప్రాణేశ్–దిమిత్రిజ్ కొలార్స్ (జర్మనీ) గేమ్ 34 ఎత్తుల్లో... రౌనక్–రాబర్ట్ హోవ్నాసియన్ (అర్మేనియా) గేమ్ 67 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. -
అమోల్ శిక్షణ అమూల్యం
సాక్షి క్రీడా విభాగం : అమోల్ మజుందార్కు క్రికెట్ మైదానంలో ఆటగాడిగా ఘనమైన రికార్డులు ఉన్నాయి... దేశవాళీ క్రికెట్లో ముంబై, అస్సాం, ఆంధ్ర జట్లకు ఆడి టన్నుల కొద్దీ పరుగులు సాధించాడు... కానీ అందరూ కలలుగనే అంతర్జాతీయ క్రికెటర్ స్థాయి మాత్రం అతనికి దక్కలేదు. వేర్వేరు కారణాలతో ఒక్కసారి కూడా భారత జట్టు తరఫున ఆడే అవకాశం రాలేదు. కెరీర్లో చెలరేగుతున్న అతని అత్యుత్తమ దశలో భారత జట్టు దిగ్గజాలతో నిండిపోవడంతో పాటు కాసింత కలిసి రావాల్సిన చోట అదృష్టం మొహం చాటేసింది. అయితే ఆటగాడిగా ప్రస్థానాన్ని ముగించి తన అనుభవాన్ని మరో రూపంలో ప్రదర్శించుకునేందుకు అతను సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో కోచ్గా మారిన మజుందార్ దశాబ్ద కాలం తర్వాత తన కెరీర్లో అత్యుత్తమ క్షణాలను అనుభవిస్తున్నాడు. భారత మహిళల క్రికెట్ జట్టును తొలిసారి విశ్వవిజేతగా నిలిపిన శిక్షకుడిగా అతను తన పేరును లిఖించుకున్నాడు. గత రెండేళ్ల ఈ ప్రయాణంలో అతను ఎన్నో ప్రతికూలతలను దాటి టీమ్ను శిఖరానికి చేర్చాడు. వచ్చే మంగళవారం తన 51వ పుట్టిన రోజును జరుపుకోనున్న అమోల్ ఇప్పుడు మహిళల క్రికెట్ జట్టు కొత్త ప్రస్థానానికి దిక్సూచిలా నిలిచాడు. మారిన ఆటశైలి... ‘మా లక్ష్యాలు ఏమిటో స్పష్టంగా నిర్దేశించుకున్నాం. మన ప్లేయర్లు ఆటలో దూకుడు పెంచాల్సి ఉంది. నిర్భీతిగా ఆడే ఆటను నేను ఎప్పుడైనా ప్రోత్సహిస్తాను. అదే మన శైలి కావాలి. ఫీల్డింగ్, ఫిట్నెస్కు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఈ విషయంలో ఎలాంటి సడలింపులు ఉండవు. నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) ప్రమాణాలను పాటిస్తూ ఏడాదిలో మూడుసార్లు ఫిట్నెస్ పరీక్షలు జరుగుతాయి. మ్యాచ్లు లేని సమయంలో నిరంతరాయంగా ప్రత్యేక క్యాంప్లతో సాధన కొనసాగుతుంది. కొత్తగా జట్టులోకి వచ్చేవారందరికీ మంచి అవకాశాలు కల్పిస్తాం’... భారత మహిళల జట్టు కోచ్గా ఎంపికైన తర్వాత అమోల్ మజుందార్ తన మొదటి మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలివి. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క అంటూ పాత గణాంకాలను తాను పట్టించుకోనని, కొత్తగా మళ్లీ మొదలు పెడుతున్నట్లుగా భావిస్తానని కూడా మజుందార్ చెప్పాడు. వరల్డ్ కప్లో భారత ప్లేయర్ల ప్రదర్శనను చూస్తే తాను చెప్పిన ప్రతీ అంశంపై అతను పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాడని అర్థమవుతుంది. మన ప్లేయర్ల ఫిట్నెస్ గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా ఉందనేది చూడగానే అర్థమవుతోంది. అన్నింటికి మించి బ్యాటింగ్లో దూకుడు పెరిగింది. భారీ స్కోర్లు నమోదు చేయడమే కాదు, ఛేదనలో కూడా మన టీమ్ ఎంత బాగా ఆడగలదో పలుమార్లు రుజువైంది. తమ శ్రమ వెనక కోచ్ ఉన్నాడని ప్లేయర్లు పదే పదే చెప్పడం విశేషం. ఓటమి తర్వాత ప్రణాళికలతో... అయితే కోచ్గా మజుందార్ బాధ్యతలు స్వీకరించగానే ఒక్కసారిగా ఫలితాలు రాలేదు. మజుందార్ కోచ్గా వచ్చి న తర్వాత మొదటి సవాల్ టి20 వరల్డ్ కప్ రూపంలో వచ్చి ంది. ఇందులో మన జట్టు కనీసం సెమీఫైనల్కు కూడా అర్హత సాధించలేదు. జట్టులో దూకుడు రాకపోగా కీలక క్షణాల్లో పాత తడబాటు పోలేదని కోచ్కు అర్థమైంది. అయితే అతను ఒక్కసారిగా టీమ్లో భారీ మార్పులు కోరుకొని గందరగోళంగా మార్చలేదు. ముందుగా 25 మందితో తన కోర్ టీమ్ను ఎంచుకున్నాడు. వన్డే వరల్డ్ కప్కు ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో పక్కాగా ప్రణాళికలు రూపొందించాడు. నాటి టీమ్ లో ఉన్నవారిలో 9 మంది ఇప్పుడు వరల్డ్ కప్ గెలిచిన టీమ్లో కూడా ఉన్నారు. గాయాలతో మిగతా ఆటగాళ్లు దూరమయ్యారు తప్ప.. లేదంటే అమోల్ ప్రణాళికల్లో అందరికీ వరల్డ్ కప్ బాధ్యతలు ప్రత్యేకంగా ఉన్నాయి. సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడేలా బోర్డును ఒప్పించడంతో పాటు మిగతా సమయమంతా ప్లేయర్లు జాతీయ క్రికెట్ అకాడమీలోనే రాటుదేలారు. దాని ఫలితం ఇప్పుడు కనిపించింది. జాగ్రత్తగా నడిపిస్తూనే... ‘జెమీమాను తుది జట్టు నుంచి తప్పించడం మేం తీసుకున్న కఠిన నిర్ణయం. జట్టు సమతూకం కోసం అలా చేయక తప్పలేదు’... ప్రపంచ కప్లో ఇంగ్లండ్ తో మ్యాచ్కు జెమీమాను దూరం పెట్టిన తర్వాత జట్టు కోచ్ మజుందార్ ఇచ్చి న వివరణ ఇది. ఆ సమయంలో అతను చాలా ఇబ్బంది పడినట్లు, అబద్ధం చెబుతున్నట్లు అతని మాటల్లోనే కనిపించింది. నిజానికి జెమీమా తొలి 4 మ్యాచ్లలో 2 డకౌట్లు సహా 65 పరుగులే చేసింది. దీన్ని బట్టి చూస్తే ఆమెకు ఒక హెచ్చరికలా ఇది సహేతుక నిర్ణయమే. కానీ దానికీ అతను జాగ్రత్తగా వివరణ ఇవ్వాల్సి వచ్చి ంది. ఒక మహిళల టీమ్ను పురుష కోచ్ నడిపించడంలో ఉండే ప్రతికూలతల్లో ఇది కూడా ఒకటని విశ్లేషకుల అభిప్రాయం. వారినుంచి అత్యుత్తమ ఆటతీరును రాబట్టడంతో పాటు ప్రోత్సహిస్తూ, ఎక్కడా మానసికంగా కుంగిపోకుండా జట్టును నడిపించడం కూడా కోచ్ బాధ్యతే అవుతుంది. ఈ విషయం మజుందార్కు బాగా తెలుసు. తుది జట్టులో స్థానం విషయంలో తనకంటే ముందు భారత మహిళల జట్టుకు కోచ్గా ఉన్న తన మాజీ సహచరుడు, మరో ముంబైకర్ రమేశ్ పొవార్, సీనియర్ మిథాలీ రాజ్ మధ్య ఎంత పెద్ద వివాదం రేగిందో ప్రపంచం చూసింది. ఇలాంటి అంశాలను జాగ్రత్తగా చూసుకుంటూనే మజుందార్ తన బాధ్యతను నెరవేర్చాడు. సాధారణంగా ఆటగాడిగా సాధించని ఘనతలు కోచ్గా అందుకోవాలని చాలా మంది కోరుకుంటారు. తమ పట్టుదలతో వాటిని నిజం చేసుకొనే కొద్ది మంది జాబితాలో ఇప్పుడు అమోల్ చేరాడు. -
అమ్మానాన్నలూ గెలిచారు
పిల్లల ప్రతిభను ప్రపంచం కంటే ముందు తల్లిదండ్రులే గుర్తించాలి. గోరుముద్దల్లో ఉత్సాహం.. వేలు పట్టి నడిపే నడకలో ప్రోత్సాహం అందించినప్పుడే పిల్లలు పులుల్లా మారతారు... చిరుతల్లా కదలాడతారు. తల్లిదండ్రులు అమ్మాయిలను చదివించి... ఉద్యోగాలు చేయించడం వరకు ఆలోచిస్తారు. కానీ, క్రీడల్లో కొనసాగమని చెప్పడం తక్కువ. మన మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ విజయం సాధించడం చూసి ఇకపై పెద్ద మార్పు రావచ్చు. ఈ జట్టులోని అమ్మాయిలను తల్లిదండ్రులు ప్రోత్సహించిన తీరు చూస్తే ‘క్రీడాకారిణి కావాలని ఉంది’ అని ఏ అమ్మాయి కోరినా తల్లిదండ్రులు తప్పక ‘మేమున్నాం’ అనే రోజులు వచ్చేశాయి.ఇంట్లో నాతోనే క్రికెట్ ఆడేది!చిన్నప్పటినుంచి అథ్లెటిక్స్ అంటే శ్రీచరణికిప్రాణం. జాతీయ స్థాయిలో ఖోఖో అడింది. కానీ, క్రికెట్ అంటేనే చాలా ఇష్టం. ఇంట్లో క్రికెట్ ఆడతానని అలిగేది. తన తండ్రి కూడా అథ్లెటిక్స్ ఆడమని చెప్పారు. కానీ, నేను మాత్రం శ్రీచరణీకి తోడుగా నిలిచి క్రికెట్ను ప్రోత్సహించాను. నాతోనే ఇంట్లో క్రికెట్ ఆడేది. ఇప్పుడు ఏకంగా వరల్డ్ కప్ గెలుపులో కీలకంగా నిలవడం మాకెంతో గర్వకారణం. ఇక మా సంతోషానికి హద్దులు లేవు. – నల్లపురెడ్డి రేణుక (శ్రీచరణి తల్లి)తండ్రిగా చెప్పుకోవడానికిగర్వంగా ఉంది..ఉమెన్స్ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్ క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీచరణి తండ్రిగా చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. నా కూతురు వరల్డ్ కప్లో క్రికెట్ ఆడుతుంటే చాలా సంతోషంగా ఉంది. – నల్లపురెడ్డి చంద్రశేఖర్రెడ్డి, శ్రీచరణి తండ్రిమహిళల ప్రపంచ కప్ పోటీల్లో సాటిలేని ప్రతిభ కనబర్చి వైఎస్సార్ కడప జిల్లా పేరును ప్రపంచ పటంలో నిలిపిన శ్రీచరణి వైఎస్సార్ జిల్లా వీరపునాయునిపల్లె మండలం యర్రంపల్లె గ్రామానికి చెందిన నల్లపురెడ్డి చంద్రశేఖరరెడ్డి, రేణుక దంపతుల కుమార్తె. తండ్రి ఆర్టీపీపీలో ఎలక్ట్రికల్ ఫోర్మన్ . ఒకటి నుంచి 10వ తరగతి వరకూ ఆర్టీపీపీలోని డీఏవీ స్కూల్లో చదివింది. హైదరాబాద్ లేపాక్షి జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ పూర్తిచేసింది. ప్రస్తుతం వీఎన్ పల్లె వీఆర్ఎస్ డిగ్రీ కళాశాలలో బీఎస్పీ కంప్యూటర్స్ చదువుతూ క్రికెట్లో విశేష ప్రతిభ కనబరుస్తోంది.ఇదీ చదవండి: స్టార్ క్రికెటర్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ లగ్జరీ వాచ్ : ధర ఎంతో తెలుసా?అండర్–19 నుంచి భారత జట్టు స్థాయికి..తొలుత శ్రీచరణి 2017–18లో జిల్లా అండర్–19 జట్టుకు ఎంపికైంది. అప్పటినుంచి ఇంక వెనక్కి తిరిగి చూడలేదు. అదే ఏడాది రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం లభించింది. జిల్లాకు చెందిన క్రికెట్ శిక్షకులు ఖాజా మొయినుద్దీన్, మధుసూదన్ రెడ్డి మార్గదర్శకత్వంలో ఎన్నో మెళకువలు నేర్చుకుంది. ఆ తర్వాత..⇒ 2021లో అండర్–19 చాలెంజర్స్ ట్రోఫీలో ఇండియా–సి జట్టుకుప్రాతినిధ్యం వహించి నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. ⇒ శ్రీచరణి ఆట నైపుణ్యం గుర్తించిన డబ్ల్యూపీఎల్ ప్రతినిధులు ఢిల్లీ క్యాపిటల్స్కు రూ.55 లక్షలతో ఎంపిక చేసుకున్నారు. ⇒ ఏప్రిల్ 27 నుంచి మే 11 వరకు జరిగిన శ్రీలంక ముక్కోణపు వన్డే సీరీస్ క్రికెట్ టోర్నీకి నల్లపురెడ్డి శ్రీచరణి తొలిసారి భారత జట్టుకుప్రాతినిధ్యం వహించింది. ⇒లండన్ లో జరిగిన టీ–20 టూర్కు భారత జట్టు తరఫున ఎంపికైంది. ⇒ ప్రస్తుతం ఐసీసీ మహిళ విభాగంలో భారత జట్టు తరఫున ప్రపంచకప్లో నిలకడగా రాణించింది. ఈ టోర్నీలో 14 వికెట్లు తీసి అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన రెండో బౌలర్గా ఘనత సాధించింది.కుటుంబ సభ్యుల ప్రోత్సాహం..చిన్నప్పటి నుంచి ఆటలపై మక్కువ చూపే శ్రీచరణి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. మొదట్లో అథ్లెటిక్స్లో రాణిస్తున్న శ్రీచరణి ఆ తర్వాత క్రికెట్పై ఆసక్తి చూపుతుండడంపై అమ్మానాన్నలు సందేహించారు. కానీ, క్రికెట్పై ఉన్న ఆసక్తిని గమనించిన మామ కిశోర్కుమార్రెడ్డి శ్రీచరణిని ప్రోత్సహించారు. సరదాగా మొదలుపెట్టిన క్రికెట్ ఇప్పుడు శ్రీచరణికి సర్వస్వం అయింది. ప్రోత్సాహం ఉంటే అమ్మాయిలు ఎందులోనైనా రాణించగలరని శ్రీచరణి రుజువు చేసింది. – మోపూరు బాలకృష్ణారెడ్డి. సాక్షి ప్రతినిధి, కడపదిసీజ్ ఫర్ యూ..!‘పిల్లల ఇష్టాలు కనిపెట్టి, వారు ఎంచుకున్న మార్గంలో వెళ్లేలా ప్రోత్సహించడం, తగిన స్వేచ్ఛను ఇస్తూ, సపోర్ట్గా ఉండటం పేరెంట్స్ నిర్వర్తించాల్సిన పనులు’ అంటారు ఇండియన్ విమెన్ క్రికెటర్ అరుంధతీరెడ్డి తల్లి భాగ్యరెడ్డి. మహిళా క్రికెట్లో వరల్డ్ కప్ కైవసం చేసుకున్న మన భారత జట్టులో భాగమైన ఫాస్ట్ బౌలర్ అరుంధతి రెడ్డి హైదరాబాద్ వాసి. ఈ విజయోత్సవ ఆనందంలో కూతురి కల గురించి అమ్మగా భాగ్య రెడ్డి పంచుకున్న విషయాలు..‘‘ఫైనల్స్ చూడటానికి ముంబయ్ వెళ్లి, ఈ రోజే వచ్చాను. మ్యాచ్ గెలవగానే ‘అమ్మా.. దిస్ ఈజ్ ఫర్ యు’ అని చెప్పింది నా బిడ్డ. ఆ క్షణంలో పొందిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఈ గెలుపును ఇప్పుడు మా కుటుంబం అంతా ఎంజాయ్ చేస్తున్నాం. చిన్నప్పుడు తన అన్న రోహిత్, ఇతర కజిన్స్తో కలిసి గల్లీలో క్రికెట్ ఆడేది. టీవీలో క్రికెట్ చూసేది. సోర్ట్స్లో చాలా చురుకుగా ఉండేది. నేను వాలీబాల్ స్టేట్ ప్లేయర్ని. స్పోర్ట్స్ అంటే ఇష్టం ఉన్నా కుటుంబ పరిస్థితుల కారణంగా నా కలలను నెరవేర్చుకోలేకపోయాను. నా కూతురుకి ఉన్న ఇష్టాన్ని కాదనకూడదు అనుకున్నాను. క్రికెట్ ఫస్ట్..మేముండేది సైనిక్పురిలో. ప్రైవేట్ స్కూల్ టీచర్ని. మధ్యతరగతి కుటుంబం. సోర్ట్స్లో అరుంధతికి ఉన్న ఇష్టాన్ని చూసి, పన్నెండేళ్ల వయసులో స్పోర్ట్స్ సెంటర్లో చేర్పించాను. ఉదయం నాలుగు గంటలకే స్పోర్ట్స్ సెంటర్కి వెళ్లిపోయేవాళ్లం. అక్కణ్ణుంచి స్కూల్. మళ్లీ సాయంత్రం ఇద్దరం గ్రౌండ్కి వెళ్లిపోయేవాళ్లం. క్రికెట్ప్రాక్టీస్ చేస్తూనే ఓపెన్ లో టెన్త్ ఎగ్జామ్స్ రాసింది. 15 ఏళ్లకే అండర్ –19 హైదరాబాద్ జట్టుకు ఎంపికయ్యింది. ఫాస్ట్ బౌలర్ గా పేరు తెచ్చుకుంది. పెద్ద కల ఉంటే త్యాగాలు ఎన్నో...2017లో రైల్వేలో చేరింది. అక్కడ ఉంటూనే చాలా విషయాల పట్ల అవగాహన ఏర్పరుచుకుంది. అండర్ 23 జోనల్ టోర్నమెంట్ లో రాణించింది. మళ్లీ ఒక దశలో క్రికెట్– జాబ్ .. దేనిని ఎంచుకోవాలనే నిర్ణయం వచ్చింది. ఓ రోజు తన నిర్ణయం క్రికెట్ మాత్రమే అని చెప్పింది. నేనూ ‘సరే’ అన్నాను. రెండేళ్ల కిందట జాబ్ మానేసి పూర్తి సమయాన్నిప్రాక్టీస్కే కేటాయించింది.ప్రాక్టీస్లో భాగంగా కుటుంబంలో ఎన్నో సంతోష సమయాలలో తను దూరంగా ఉండాల్సి వచ్చేది. ఈ రోజు దేశాన్ని గెలిపించిన జట్టులో నా బిడ్డ ఉందంటే... చాలా ఆనందంగా ఉంది. ధైర్యమే పెద్ద సపోర్ట్అరుంధతికి క్రికెట్తో పాటు పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. సమయం దొరికితే మెలోడీస్ ను చాలా ఇష్టంగా పాడుతుంది. అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా వారి జీవితాన్ని వారు ఎంచుకునే స్వేచ్ఛ వారికే ఇవ్వాలి. పెద్దలుగా మనం కనిపెడుతూ ఉండాలి. పిల్లల ఆసక్తితో ఎంచుకున్న మార్గంవైపు మనకు తెలిస్తే ఏవైనా సూచనలు ఇవ్వాలి. లేదంటే, ధైర్యంగా వెళ్లు అని చెప్పాలి. ఈ ఏడాది పిల్లలను సోర్ట్స్ అకాడమీలో చేర్చాం. వచ్చే ఏడాదికి పెద్ద ప్లేయర్ అయిపోవాలని వారిపై ఒత్తిడి తీసుకురావద్దు. అది సాధ్యం కాదు కూడా.ఎంచుకున్న దానిపైన అంకితభావం, క్రమశిక్షణ, సాధన ఉండాలి. మా అమ్మాయి ఆలోచన ఎప్పుడూ క్రికెట్ వైపు ఉండేది. మా కుటుంబం అంతా ఆమె వైపు ఉన్నాం. నా కలలను పిల్లల ద్వారా తీర్చుకోవాలి అనుకోలేదు. నా జీవితంలో ఎదురైన స్ట్రగుల్స్ని ఎప్పుడూ పిల్లల ముందు చెప్పలేదు. నా జర్నీలో మా అమ్మ నాకు పెద్ద మోరల్ సపోర్ట్. నా కూతురు ఎదుగుదలలో నేను కూడా అంతే. ఎంచుకున్న మార్గం వైపు ధైర్యంగా వెళ్లమనే చెబుతుంటాను. ఈ రోజు ఆ సక్సెస్ను చూస్తున్నాం’’ అంటూ ఆనందంగా వివరించారు. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఆసియాకప్లో ఓవరాక్షన్.. పాక్ ఆటగాడిపై 2 మ్యాచ్ల బ్యాన్
ఆసియాకప్-2025లో భారత్తో జరిగిన మ్యాచ్లలో ఓవరాక్షన్ చేసిన పాకిస్తాన్ స్పీడ్ స్టార్ హారిస్ రవూఫ్కు ఐసీసీ భారీ షాకిచ్చింది. రవూఫ్పై రెండు మ్యాచ్ల నిషేధాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ విధించింది. ఈ మెగా టోర్నీలో రవూఫ్ రెండు సార్లు తమ ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది.అసలేమి జరిగింగదంటే?ఆసియాకప్లో భాగంగా లీగ్ స్టేజిలో సెప్టెంబర్ 14న భారత్-పాక్ జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్లో భారత ఓపెనర్లు శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మలను రవూఫ్ దుర్భాషలాడాడు. అంతేకాకుండా వారితో పాక్ పేసర్ వాగ్వాదానికి దిగాడు. దీంతో అతడి మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా ఐసీసీ విధించింది.అదేవిధంగా రెండు డిమెరిట్ పాయింట్లు కూడా అతడి ఖాతాలో చేరాయి. అయినా కూడా రవూఫ్ ప్రవర్తన ఏ మాత్రం మారలేదు. సూపర్-4 మ్యాచ్లో రవూఫ్ తన వక్రబుద్దిని చాటుకున్నాడు. ఫీల్డింగ్ చేస్తుండగా భారత అభిమానులు కోహ్లి కోహ్లి అని అరవగా.. అందుకు బదులుగా రవూఫ్ భారత్కు చెందిన 6 రఫెల్ జెట్ ఫ్లైట్స్ను కూల్చామని, యుద్దంలో తమదే విజయమని పేర్కొంటూ 6-0 సంజ్ఞలు చేశాడు.#Indian are crying because #HarisRauf trolled 1000s of them alone . pic.twitter.com/hx8qACIBm2— Zeitung (@Himat75) September 22, 2025దీంతో మళ్లీ అతడి మ్యాచ్ ఫీజులో 30 శాతం కోతను ఐసీసీ విధించింది. మళ్లీ రెండు డిమెరిట్ పాయింట్లు ఇవ్వబడ్డాయి. మొత్తంగా అతడి ఖాతాలో నాలుగు డిమెరిట్ పాయింట్లు వచ్చి చేరాయి. అయితే 24 నెలల వ్యవధిలో 4 లేదా అంతకంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్లు పొందితే.. ఐసీసీ సదరు ఆటగాడిపై ఒక టెస్ట్ మ్యాచ్ లేదా రెండు వన్డేలు లేదా రెండు టీ20ల నిషేధం విధిస్తుంది. ఈ కారణాంగానే ఫైసలాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేకు రవూఫ్ దూరమయ్యాడు.సూర్యకు షాక్..అదేవిధంగా లీగ్ స్టేజిలో పాకిస్తాన్పై సాధించిన విజయాన్ని ఫహల్గాం ఉగ్రదాడి బాధితులు, సైనికులకు అంకితమిస్తున్నట్లు ప్రకటించిన భారత కెప్టెన్ సూర్యకుమార్పై కూడా ఐసీసీ చర్యలు తీసుకుంది. సూర్యకుమార్ యాదవ్కు మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానాతో పాటు రెండు డీమెరిట్ పాయింట్లు కూడా విధించబడ్డాయి. సూర్య ఖాతాలో మరో రెండు డీమెరిట్ పాయింట్లు చేరితే 2 మ్యాచ్ల నిషేదం ఎదుర్కొక తప్పదు. అదేవిధంగా హ్యారిస్ రవూఫ్కు జెట్ విమానం కూలినట్లగా సైగ చేసిన జస్ప్రీత్ బుమ్రాను కూడా ఐసీసీ మందలించింది. -
ప్లీజ్ డివిలియర్స్.. నాకు సాయం చేయండి: సూర్య కుమార్
సూర్యకుమార్ యాదవ్.. 30 ఏళ్ల వయస్సులో భారత క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం భారత టీ20 జట్టు సారథిగా కొనసాగుతున్న సూర్య.. వన్డేల్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోయాడు. 2021లో భారత తరపున వన్డేల్లో అరంగేట్రం చేసిన సూర్యకు సెలక్టర్లు చాలా అవకాశాలు ఇచ్చారు.కానీ తనకు లభించిన అవకాశాలను మిస్టర్ 360 అందిపుచ్చుకోలేకపోయాడు. ఇప్పటివరకు 37 వన్డేలు ఆడిన సూర్య 25.77 సగటుతో కేవలం 773 పరుగులు మాత్రమే చేశాడు. భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్కప్-2023లోనూ ఈ ముంబై ఆటగాడికి ఛాన్స్ లభించింది. కానీ అక్కడ కూడా అతడు ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో అతడిని సెలక్టర్లు జట్టు నుంచి తప్పించారు. సూర్యను ప్రస్తుతం కేవలం టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్గానే పరిగణిస్తారు. అయితే తనకు మాత్రం వన్డేల్లో రీఎంట్రీ ఇవ్వాలని ఉందని తాజా ఇంటర్వ్యూలో సూర్య వెల్లడించాడు. వన్డే, టీ20 ఫార్మాట్లలో ఎలా మెనెజ్ చేయాలో సౌతాఫ్రికా క్రికెట్ లెజెండ్ ఏబీ డివిలియర్స్ నుంచి నేర్చుకుంటానని సూర్య తెలిపాడు. కాగా సూర్య టెస్టుల్లో కూడా భారత తరపున డెబ్యూ చేశాడు."ఒకవేళ ఏబీ డివిలియర్స్ను నేను కలిస్తే టీ20లు, వన్డేల్లో తన ఆటను ఎలా బ్యాలెన్స్ చేశాడో తెలుసుకోవాలనకుంటున్నాను. నేను మాత్రం రెండింటిని మెనెజ్ చేయలేకపోయాను. వన్డేలు కూడా టీ20ల మాదిరిగా ఆడాలని నేను అనుకున్నాను. కానీ నేను అనుకున్నది జరగలేదు.ఏబీ ఈ ఇంటర్వ్యూ మీరు చూసినట్లయితే దయచేసి త్వరగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే నాకు మూడు-నాలుగేళ్ల కెరీర్ ఇంకా ఉంది. వన్డేల్లో నేను రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాను. దయచేసి నాకు సాయం చేయండి. నేను టీ20లు, వన్డేలు రెండింటిని బ్యాలెన్స్ చేయలేకపోయాను" అని విమల్ కుమార్ పాడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్య పేర్కొన్నాడు. అయితే సూర్య ప్రస్తుతం అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాడు. ఈ ఏడాది టీ20ల్లో సూర్య ఇప్పటివరకు ఒక్కసారి హాఫ్ సెంచరీ మార్క్ దాటలేకపోయాడు. కెప్టెన్గా జట్టును విజయ పథంలో నడిపిస్తున్నప్పటికి వ్యక్తిగత ప్రదర్శన పరంగా మాత్రం సూర్య నిరాశపరుస్తున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్లో సూర్య బీజీబీజీగా ఉన్నాడు.చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. వణికి పోయిన బౌలర్లు -
ఆస్ట్రేలియా కెప్టెన్గా ఎవరూ ఊహించని ప్లేయర్..
హాంగ్కాంగ్ క్రికెట్ సిక్సెస్-2025 టోర్నమెంట్ నవంబర్ 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్ కోసం ఏడుగురు సభ్యులతో కూడిన ఆస్ట్రేలియా జట్టును సెలక్టర్లు ప్రకటించారు. ఈ జట్టు కెప్టెన్గా బిగ్ బాష్ లెజెండ్ అలెక్స్ రాస్ ఎంపికయ్యాడు. ఈ జట్టులో బెన్ మెక్డెర్మాట్, ఆండ్రూ టై, క్రిస్ గ్రీన్ వంటి అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లు సైతం ఉన్నారు.క్రిస్ గ్రీన్కు కెప్టెన్గా అపారమైన అనుభవం ఉనప్పటికి రాస్కే జట్టు పగ్గాలను సెలక్టర్లు కట్టబెట్టారు. గతేడాది ఆస్ట్రేలియా సెమీఫైనల్లో పాక్ చేతిలో ఓటమి పాలైంది. దీంతో ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలని కంగారులు పట్టుదలతో ఉన్నారు. కాగా ఈవెంట్లో మొత్తం 12 జట్లు పాల్గొననున్నాయి. ఆస్ట్రేలియా, భారత్, పాకిస్తాన్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, హాంకాంగ్, నేపాల్, ఒమన్, యూఏఈ జట్లు భాగం కానున్నాయి. నవంబర్ 7 నుంచి 9 వరకు టిన్ క్వాంగ్ రోడ్ రిక్రియేషన్ గ్రౌండ్లో జరగనుంది. ఈ సిక్సెస్ టోర్నీ కోసం భారత జట్టును ఇప్పటికే ప్రకటించారు. టీమిండియా కెప్టెన్ దినేష్ కార్తీక్ వ్యవహరించనున్నాడు.హాంకాంగ్ క్రికెట్ సిక్సర్స్ కోసం ఆస్ట్రేలియా జట్టు:అలెక్స్ రాస్ (కెప్టెన్), బెన్ మెక్డెర్మాట్, జాక్ వుడ్, నిక్ హాబ్సన్, క్రిస్ గ్రీన్, విలియం బోసిస్టో , ఆండ్రూ టై.అసలేంటి హాంకాంగ్ సిక్సెస్?1992లో హాంకాంగ్ క్రికెట్ ఆధ్వర్యంలో మొదలైన హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ.. చివరగా 2017 వరకు జరిగింది. ఆ తర్వాత కొన్ని కారణాలతో ఈ టోర్నీని నిర్వహించలేదు. అయితే ఈ ఈవెంట్కు మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు హాంకాంగ్ క్రికెట్ ముందుకు వచ్చింది. ఈ క్రమంలో ఏడేళ్ల తర్వాత ఈ టోర్నీని మళ్లీ నిర్వహించారు. గత సీజన్ విజేతగా శ్రీలంక నిలిచింది.దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు అత్యధికంగా 5 సార్లు ఈ టోర్నమెంట్ విజేతలగా నిలవగా.. పాకిస్తాన్ 4 సార్లు, శ్రీలంక రెండు సార్లు ఈ హాంకాంగ్ సిక్సెస్ ట్రోఫీని ముద్దాడింది. భారత్, ఆస్ట్రేలియా, విండీస్ జట్లు చెరో ఒక్కసారి ఛాంపియన్స్గా నిలిచాయి. గతంలో ఈ టోర్నీలో సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, అనిల్ కుంబ్లే వంటి దిగ్గజ క్రికెటర్లు సైతం ఆడారు.రూల్స్ ఇవే..ఒక మ్యాచ్లో ప్రతీ జట్టు 5 ఓవర్లు మాత్రమే ఆడుతోంది. మ్యాచ్ ఆడే రెండు జట్లలో ఆరుగురు ఆటగాళ్లు ఉండాలి. గ్రూప్ దశలో ఒక్కో ఓవర్కు ఆరు బంతులు ఉంటాయి. అదే ఫైనల్లో ఒక్కో ఓవర్లో ఎనిమిది బంతులు ఉంటాయి. . వికెట్ కీపర్ మినహా జట్టులోని ప్రతి ఒక్కరు ఒక్కో ఓవర్ వేయాల్సి ఉంటుంది. చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. వణికి పోయిన బౌలర్లు -
దక్షిణాఫ్రికాకు భారీ షాక్..
పాకిస్తాన్ పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ భుజం కండరాల నొప్పి కారణంగా పాక్తో మూడు వన్డేల సిరీస్కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది. బ్రెవిస్ ప్రస్తుతం తమ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నట్లు సౌతాఫ్రికా క్రికెట్ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే బ్రెవిస్కు ప్రత్నమ్నాయంగా మరోక ఆటగాడిని జట్టులోకి సెలక్టర్లు తీసుకోలేదు. అతడి స్దానాన్ని మరొకరితో సెలక్టర్లు భర్తీ చేయలేదు. జూనియర్ ఏబీడీ తన స్వదేశానికి వెళ్లకుండా ప్రస్తుతం జట్టుతో పాటు పాక్లో ఉన్నాడు.భారత పర్యటనకు ముందు బ్రెవిస్ తిరిగి పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని ఆశిస్తుంది. సౌతాఫ్రికా క్రికెట్ జట్టు మరో వారం రోజుల్లో భారత్ టూర్కు రానుంది. ఈ పర్యటనలో భాగంగా ప్రోటీస్ ఆతిథ్య జట్టుతో రెండు టెస్టు, మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్లో తలపడనుంది.ఈ మూడు ఫార్మాట్ల సిరీస్కు ఎంపిక చేసిన సౌతాఫ్రికా జట్టులో బ్రెవిస్ భాగంగా ఉన్నాడు. నవంబర్ 14 నుంచి ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ సమయానికి బ్రెవిస్ కోలుకోపోతే అది సఫారీలకు గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పుకోవాలి. బ్రెవిస్ విధ్వంసకర బ్యాటింగ్కు పెట్టింది పేరు. ఫార్మాట్ ఏదైనా తన ఆట తీరు ఏ మాత్రం మారదు. అయితే పాక్ పర్యటనలో మాత్రం బ్రెవిస్ విఫలమయ్యాడు. తొలుత టెస్టు సిరీస్లో రెండు మ్యాచ్లు ఆడి కేవలం 54 పరుగులు మాత్రమే చేసిన బ్రెవిస్.. ఆ తర్వాత టీ20 సిరీస్లో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అయితే బ్రెవిస్ లాంటి ఆటగాడు తనదైన రోజున ఒంటి చేత్తో మ్యాచ్ను గెలిపించగలడు.చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. వణికి పోయిన బౌలర్లు -
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం..
రంజీ ట్రోఫీ 2025-26లో టీమిండియా అండర్-19 స్టార్ వైభవ్ సూర్యవంశీ సంచలన ప్రదర్శన కనబరిచాడు. ఈ దేశవాళీ టోర్నీలో బిహార్కు ప్రాతినిథ్యం వహిస్తున్న సూర్యవంశీ.. పాట్నా వేదికగా మేఘాలయతో జరిగిన మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్లో 166 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడినప్పటికి, వైభవ్ మాత్రం తన విధ్వంసకర బ్యాటింగ్తో అందరిని అలరించాడు.14 ఏళ్ల వైభవ్ ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 67 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్స్లతో 93 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని స్ట్రైక్ రేట్ 138.81గా ఉంది. కేవలం 7 పరుగుల దూరంలో తన తొలి ఫస్ట్-క్లాస్ సెంచరీని వైభవ్ కోల్పోయాడు. బిజోన్ డే బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. కాగా ఈ టోర్నీలో బిహార్ వైస్ కెప్టెన్ సూర్యవంశీ వ్యవహరిస్తున్నాడు. ఇక తాజాగా రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ కోసం ప్రకటించిన భారత్-ఎ జట్టులో సూర్యవంశీకి చోటు దక్కింది. వైభవ్ గత కొంత కాలంగా ఫార్మాట్తో సంబంధం లేకుండా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన మేఘాలయ తమ తొలి ఇన్నింగ్స్లో 408 పరుగుల భారీ స్కోర్ సాధించింది. మెఘాలయ ఇన్నింగ్స్లో అజయ్ దుహాన్(129) శతక్కొట్టగా.. ఛెత్రి(94) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అయితే వర్షం కారణంగా తొలి రెండు రోజుల పాటు ఆట పూర్తిగా రద్దు అయింది. కేవలం ఆఖరి రెండు రోజుల ఆట మాత్రమే జరిగింది. దీంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. బిహార్ తమ తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీ కోసం భారత్ ఏ జట్టు : ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, నేహాల్ వధేర, నమన్ ధిర్ (వైస్ కెప్టెన్), సూర్యాంశ్ షెడ్జే, జితేశ్ శర్మ (కెప్టెన్, వికెట్ కీపర్), రమణ్దీప్ సింగ్, హర్ష్ దూబె, అశుతోశ్ శర్మ, యశ్ ఠాకూర్, గుర్జప్రీత్ సింగ్, విజయ్ కుమార్ వైశాఖ్, యుధ్వీర్ సింగ్ చరక్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సుయాంశ్ శర్మస్టాండ్ బై: గుర్నూర్ సింగ్ బ్రార్, కుమార్ కుశాగ్ర, తనుష్ కోటిన్, సమీర్ రిజ్వీ, షేక్ రషీద్చదవండి: IPL 2026: ఎస్ఆర్హెచ్ షాకింగ్ నిర్ణయం.. విధ్వంసకర వీరుడికి గుడ్ బై!? -
ఛాంపియన్ టీమ్ కెప్టెన్కు మొండిచెయ్యి..!
మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 టీమ్ ఆఫ్ ద టోర్నీని (Women's Cricket World Cup Team of the Tournament) ఐసీసీ ఇవాళ (నవంబర్ 4) ప్రకటించింది. ఈ జట్టులో ఛాంపియన్ జట్టు భారత్ నుంచి ముగ్గురు, రన్నరప్ జట్టు సౌతాఫ్రికా నుంచి ముగ్గురికి అవకాశం దక్కింది. అలాగే ఏడు సార్లు ఛాంపియన్, ఈ ఎడిషన్ సెమీఫైనలిస్ట్ అయిన ఆస్ట్రేలియా నుంచి కూడా ముగ్గురికి చోటు లభించింది. ఈ ఎడిషన్ మరో సెమీ ఫైనలిస్ట్ అయిన ఇంగ్లండ్ నుంచి ఒకరు, లీగ్ దశలో నిష్క్రమించిన పాకిస్తాన్ నుంచి ఒకరికి అవకాశం దక్కింది. ఇంగ్లండ్కు చెందిన మరో ప్లేయర్కు 12వ సభ్యురాలిగా అవకాశం లభించింది. ఆశ్చర్యకరంగా ఈ జట్టులో ఛాంపియన్ టీమ్ కెప్టెన్కు (Harmanpreet Kaur) చోటు దక్కలేదు.బెర్త్లు పరిమితిగా ఉండటంతో ఛాంపియన్ టీమ్ కెప్టెన్కు చోటు కల్పించలేకపోయామని ఐసీసీ వివరణ ఇచ్చింది. ఈ జట్టుకు కెప్టెన్గా రన్నరప్ టీమ్ కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ ఎంపిక కాగా.. అదే జట్టు నుంచి పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ మారిజాన్ కాప్, ఆల్రౌండర్ నదినే డి క్లెర్క్ చోటు దక్కించుకున్నారు.లారా సెమీస్, ఫైనల్స్లో సెంచరీలు సహా టోర్నీ లీడింగ్ రన్ స్కోరర్గా నిలువగా.. కాప్ 2 అర్ద సెంచరీలు సహా 208 పరుగులు చేసి 12 వికెట్లు తీసింది. డి క్లెర్క్ 52 సగటున, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 208 పరుగులు చేసి, 26.11 సగటున 9 వికెట్లు తీసింది.భారత్ నుంచి టోర్నీ సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్ స్మృతి మంధన, సెమీస్లో ఆస్ట్రేలియాపై వీరోచిత శతకం బాదిన జెమీమా రోడ్రిగ్స్, ఫైనల్లో హాఫ్ సెంచరీ సహా 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన దీప్తి శర్మకు చోటు దక్కింది.మంధన సెంచరీ, 2 హాఫ్ సెంచరీల సాయంతో 434 పరుగులు చేయగా.. జెమీ సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 292 పరుగులు చేసింది. దీప్తి సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు సహా 22 వికెట్లు తీసి, టోర్నీ లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచింది. ఈ ప్రదర్శనలకు గానూ దీప్తి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగానూ నిలిచింది.ఆస్ట్రేలియా నుంచి ఆష్లే గార్డ్నర్, అన్నాబెల్ సదర్ల్యాండ్, అలానా కింగ్ ఐసీసీ టీమ్ ఆఫ్ ద టోర్నీలో చోటు దక్కించుకున్నారు. గార్డ్నర్ రెండు సెంచరీలు, హాఫ్ సెంచరీతో పాటు 7 వికెట్లు తీయగా.. సదర్ల్యాండ్ ఓ హాఫ్ సెంచరీ చేసి, 17 వికెట్లు తీసింది. లెగ్ స్పిన్నర్ అలానా కింగ్ 17.38 సగటున 13 వికెట్లు తీసింది.పాకిస్తాన్ నుంచి వికెట్కీపర్ సిద్రా నవాజ్, ఇంగ్లండ్ నుంచి సోఫీ ఎక్లెస్టోన్ ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. సిద్రా ఈ ప్రపంచకప్లో 8 డిస్మిసల్స్లో భాగంగా కావడంతో పాటు 62 పరుగులు చేయగా.. ఎక్లెస్టోన్ 14.25 సగటున 16 వికెట్లు తీసింది. 12వ ప్లేయర్గా ఇంగ్లండ్ ఆల్రౌండర్ నాట్ సీవర్ బ్రంట్ ఎంపికైంది. బ్రంట్ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 262 పరుగులు చేసి, 9 వికెట్లు తీసింది.చదవండి: స్మృతి మంధనకు భారీ షాక్ -
పాపం సంజూ శాంసన్..
క్వీన్స్ లాండ్ వేదికగా గురువారం (నవంబర్ 6) ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగో టీ20లో తలపడేందుకు భారత జట్టు సిద్దమవుతోంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్లో 2-1 ఆధిక్యం సాధించాలని టీమిండియా పట్టుదలతో ఉంది. కాన్బెర్రాలో తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘోర ఓటమి చవిచూసింది. కానీ హోబర్ట్లో జరిగిన మూడో టీ20లో మాత్రం ఆసీస్ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసిన భారత్.. ఐదు టీ20ల సిరీస్ను 1-1తో సమం చేసింది. దీంతో ఇప్పుడు అందరి కళ్లు నాలుగో టీ20 పైనే పడ్డాయి. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ కీలక పోరులో టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.దూబేపై వేటు.. రాణాకు చోటుహోబర్ట్ టీ20లో బెంచ్కే పరిమితమైన హర్షిత్ రాణా.. నాలుగవ టీ20కి తిరిగి తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. గత మ్యాచ్లో బౌలింగ్లో విఫలమైన ఆల్రౌండర్ శివమ్ దూబేను పక్కన పెట్టనున్నట్లు తెలుస్తోంది. దూబే స్దానంలోనే రాణా ప్లేయింగ్ ఎలెవన్లోకి రానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. మెల్బోర్న్ టీ20లో మిడిలార్డర్లో బ్యాటింగ్ వచ్చి కీలక నాక్ ఆడిన రాణాకు హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ మరో అవకాశమివ్వనున్నట్లు సమాచారం.సంజూకు నో ఛాన్స్..ఇక వికెట్ కీపర్-బ్యాటర్ సంజు శాంసన్ మళ్లీ బెంచ్కే పరిమితమయ్యే అవకాశం ఉంది. హోబర్ట్లో ఆడిన జితేశ్ శర్మను తుది జట్టులో కొనసాగించాలని భారత జట్టు మెనెజ్మెంట్ భావిస్తుందంట. గత మ్యాచ్లో జితేశ్ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. కేవలం 3 బంతుల్లో 22 పరుగులు చేసి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.ఈ సిరీస్లో సంజూ తొలి రెండు మ్యాచ్లో ఆడినప్పటికి ఒక్క మ్యాచ్లోనే బ్యాటింగ్ చేసే ఛాన్స్ వచ్చింది. మెల్బోర్న్ టీ20లో టాపార్డర్లో బ్యాటింగ్కు వచ్చిన శాంసన్ తీవ్ర నిరాశపరిచాడు. దీంతో అతడిని మూడో టీ20కు పక్కన పెట్టారు.మరోవైపు అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్లో కూడిన స్పిన్ త్రయాన్ని భారత్ కొనసాగించనుంది. గత మ్యాచ్లో ఒక్క ఓవర్ కూడా వేయని సుందర్కు నాలుగో టీ20లోనైనా బౌలింగ్ చేసే అవకాశం దక్కుతుందో లేదో వేచి చూడాలి. కానీ హెబర్ట్లో సుందర్ బ్యాట్తో మాత్రం అద్భుతం చేశాడు. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాతో పాటు హర్షిత్ రాణా బంతిని పంచుకోనున్నాడు.భారత తుది జట్టు(అంచనా)శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాచదవండి: కావ్య మారన్ సంచలన నిర్ణయం.. జట్టు పేరు మార్పు -
ఎస్ఆర్హెచ్ షాకింగ్ నిర్ణయం.. విధ్వంసకర వీరుడికి గుడ్ బై!?
ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందు సన్రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.స్టార్ బ్యాటర్, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హెన్రిచ్ క్లాసెన్ను వేలంలోకి విడిచి పెట్టేందుకు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం సిద్దమైనట్లు తెలుస్తోంది.. అతడిని వేలంలోకి విడిచిపెట్టి తమ పర్స్ బలాన్ని పెంచుకోవాలని సన్రైజర్స్ యోచిస్తుందంట. ఐపీఎల్-2025 వేలానికి ముందు క్లాసెన్ను ఏకంగా రూ.23 కోట్లకు ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకుంది. గత సీజన్లో క్లాసెన్దే అత్యంత ఖరీదైన రిటెన్షన్. క్లాసెన్ ఎస్ఆర్హెచ్ తరఫున గత కొన్ని సీజన్లగా అద్భుతంగా రాణిస్తున్నప్పటికి.. వేలంలోకి విడిచి పెట్టి తక్కువ మొత్తానికి తిరిగి సొంతం చేసుకునేందుకు కావ్య మారన్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.హెన్రిస్ క్లాసెన్ విడిచిపెట్టేందుకు సన్రైజర్స్ సిద్దమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఎస్ఆర్హెచ్ది తెలివైన నిర్ణయంగా చెప్పుకోవచ్చు. రూ.23 (క్లాసెన్ ప్రస్తుత ధర) కోట్లతో బౌలింగ్ బలాన్ని, మిడిల్ ఆర్డర్ లోటును ఎస్ఆర్హెచ్ భర్తీ చేయవచ్చు . అయితే మినీ వేలంలో రూ. 15 కోట్లకు తిరిగి దక్కించుకోవడానికి ప్రయత్నించవచ్చు. మిగిలిన మొత్తంతో యువ ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశముందని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.కావ్య ఆ తప్పు చేస్తుందా?అయితే క్లాసెన్ వేలంలోకి విడిచిపెట్టి తిరిగి జట్టులోకి తీసుకోపోతే సన్రైజర్స్ నిర్ణయాన్ని తప్పుబట్టాల్సిందే. ఎందుకంటే గత మూడు సీజన్లగా ఎస్ఆర్హెచ్ జట్టులో క్లాసెన్ కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. క్లాసెన్ ఐపీఎల్- 2023 నుండి ఎస్ఆర్హెచ్ జట్టులో ఉన్నాడు. అతను ఫ్రాంచైజీ తరఫున ఆడిన ప్రతి సీజన్లో 400 పరుగుల మార్కును అధిగమించాడు. ఐపీఎల్ అతనికి అత్యుత్తమ సీజన్. అందులో అతను ఒక సెంచరీ, ఒక అర్ధసెంచరీతో సహా 487 పరుగులు చేశాడు.చదవండి: కావ్య మారన్ సంచలన నిర్ణయం.. జట్టు పేరు మార్పు -
కావ్య మారన్ సంచలన నిర్ణయం..
ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం సన్ గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. ది హండ్రెడ్ లీగ్ ఫ్రాంచైజీ నార్తర్న్ సూపర్చార్జర్స్ పేరును సన్రైజర్స్ లీడ్స్గా (Sunrisers Leeds) గా మార్చాలని సన్ గ్రూప్ నిర్ణయించింది. ఐపీఎల్, సౌతాఫ్రికా టీ20 లీగ్లలో ఫ్రాంచైజీలు కలిగి ఉన్న సన్గ్రూప్.. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్కు చెందిన ది హండ్రెడ్ లీగ్లో కూడా అడుగుపెట్టింది. నార్తర్న్ సూపర్చార్జర్స్ ఫ్రాంచైజీని కావ్యా మారన్ కొనుగోలు చేసింది. అయితే తొలుత ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) కేవలం 49% వాటాను మాత్రమే సన్ గ్రూపుకు విక్రయించింది. మిగితా 51 శాతం వాటా యార్క్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ కలిగి ఉండేది. కానీ ఆ తర్వాత కావ్య మారన్ యార్క్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ తో చర్చలు జరిపి మిగిలిన వాటాను కూడా కొనుగోలు చేసింది. దీంతో నార్తర్న్ సూపర్చార్జర్స్ పూర్తి వాట సన్ గ్రూప్కు లభించింది. ఈ క్రమంలోనే 2026 సీజన్కు ముందు ఫ్రాంచైజీ పేరును నార్తర్న్ సూపర్చార్జర్స్ నుండి సన్రైజర్స్ లీడ్స్ (Sunrisers Leeds) గా సన్ గ్రూపు మార్చింది.కాగా ది హాండ్రడ్ లీగ్లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ (LSG) యాజమాన్యాలు కూడా ఫ్రాంచైజీలను కలిగి ఉన్నారు. ముంబై ఇండియన్స్ ఓవల్ ఇన్విన్సిబుల్స్లో 49% వాటాను కొనుగోలు చేయగా.. లక్నో మాంచెస్టర్ ఒరిజినల్స్లో 70% వాటాను కలిగి ఉంది.చదవండి: ఆర్సీబీకి కొత్త హెడ్ కోచ్.. -
స్మృతి మంధనకు భారీ షాక్
విశ్వవిజేత భారత మహిళల క్రికెట్ జట్టులో కీలక సభ్యురాలైన స్మృతి మంధనకు (Smriti Mandhana) భారీ షాక్ తగిలింది. తాజాగా ముగిసిన వన్డే ప్రపంచకప్-2025లో విశేషంగా రాణించినా, ఐసీసీ ర్యాంకింగ్స్లో (ICC ODI Rankings) నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ఓ స్థానం కోల్పోయి రెండో స్థానానికి పడిపోయింది.ఇదే ప్రపంచకప్లో మంధన కంటే మెరుగ్గా రాణించిన దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (Laura Wolvaardt) రెండు స్థానాలు ఎగబాకి అగ్రస్థానాన్ని చేజిక్కించుకుంది. ప్రపంచకప్ సెమీఫైనల్, ఫైనల్స్లో సెంచరీలతో లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచిన లారా కెరీర్ అత్యుత్తమ రేటింగ్ పాయింట్లు (814) సాధించి, అగ్రపీఠాన్ని అధిరోహించింది.గత వారం రెండో స్థానంలో ఉండిన ఆసీస్ స్టార్ బ్యాటర్ ఆష్లే గార్డ్నర్ ఓ స్థానం కోల్పోయి మూడో స్థానానికి పడిపోయింది. ప్రపంచకప్లో టాప్-3 రన్ స్కోరర్లుగా నిలిచిన లారా, మంధన, గార్డ్నర్ ఐసీసీ తాజా వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లోనూ అదే స్థానాల్లో నిలవడం గమనార్హం. ప్రపంచకప్లో లారా 9 మ్యాచ్ల్లో 571 పరుగులతో టాప్ స్కోరర్గా నిలువగా.. మంధన 9 మ్యాచ్ల్లో 434 పరుగులు, గార్డ్నర్ 7 మ్యాచ్ల్లో 328 పరుగులతో రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.ప్రపంచకప్లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో వీరోచిత శతకం సాధించిన టీమిండియా నంబర్-3 బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ తాజా ఐసీసీ ర్యాంకింగ్స్లో భారీగా లబ్ది పొందింది. జెమీమా ఏకంగా 9 స్థానాలు ఎగబాకి 10వ స్థానానికి చేరుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఎల్లిస్ పెర్రీ 3 స్థానాలు మెరుగుపర్చుకొని సోఫీ డివైన్తో కలిసి సంయుక్తంగా ఏడో స్థానాన్ని షేర్ చేసుకుంది.మిగతా భారత ప్లేయర్లలో హర్మన్ప్రీత్ 4, దీప్తి శర్మ 3, రిచా ఘోష్ 4 స్థానాలు మెరుగుపర్చుకొని 14, 21, 30 స్థానాలకు ఎగబాకారు. భారత్తో జరిగిన సెమీఫైనల్లో సెంచరీ చేసిన ఆసీస్ ప్లేయర్ ఫోబ్ లిచ్ఫీల్డ్ 13 స్థానాలు మెరుగుపర్చుకొని 13వ స్థానానికి చేరింది.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఇంగ్లండ్కు చెందిన సోఫీ ఎక్లెస్టోన్ టాప్ ర్యాంక్ను నిలబెట్టుకోగా.. సౌతాఫ్రికా పేసర్ మారిజాన్ కాప్ 2 స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకుంది. ఆసీస్ బౌలర్లు అలానా కింగ్, ఆష్లే గార్డ్నర్ తలో స్థానం కోల్పోయి 3, స్థానాలకు పడిపోయారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ ఆష్లే గార్డ్నర్తో పాటు నాలుగో స్థానాన్ని పంచుకుంది. రేణుకా సింగ్ 19వ స్థానంలో కొనసాగుతుండగా.. శ్రీ చరణి 7 స్థానాలు మెరుగుపర్చుకొని 23వ స్థానానికి చేరింది.చదవండి: బిగ్బాష్ లీగ్ నుంచి అశ్విన్ ఔట్ -
ఆర్సీబీకి కొత్త హెడ్ కోచ్..
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) తమ కోచింగ్ స్టాప్లో కీలక మార్పులు చేసింది. తమ జట్టు కొత్త హెడ్ కోచ్గా తమిళనాడు మాజీ క్రికెటర్ మలోలన్ రంగరాజన్ను ఆర్సీబీ యాజమాన్యం నియమించింది.రెగ్యూలర్ హెడ్ కోచ్ ల్యూక్ విలియమ్స్ బిగ్ బాష్ లీగ్ (BBL)లో అడిలైడ్ స్ట్రైకర్స్తో ఒప్పందం కుదర్చుకోవడంతో రాబోయే డబ్ల్యూపీఎల్ ఎడిషన్కు దూరంగా ఉండనున్నాడు. ఈ క్రమంలోనే విలియమ్స్ స్ధానాన్ని రంగరాజన్తో ఆర్సీబీ భర్తీ చేసింది. రంగరాజన్ గతంలో ఆర్సీబీ పురుషుల, మహిళల జట్లకు స్కౌట్, ఫీల్డింగ్ కోచ్గా పనిచేశారు. మరోవైపు ఇంగ్లండ్ మాజీ నేసర్ అన్యా ష్రబ్సోల్ (Anya Shrubsole)ను తమ బౌలింగ్ కోచ్గా ఆర్సీబీ ఎంపిక చేసింది. అన్యా గతంలో ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధానతో కలిసి 'ది హండ్రెడ్'లో సదరన్ బ్రేవ్ తరఫున ఆడింది. ష్రబ్సోల్..గత సీజన్ వరకు బౌలింగ్ కోచ్గా పనిచేసిన సునేత్ర పరంజాపే స్థానంలో బాధ్యతలు చేపట్టనుంది. ష్రబ్సోల్ ఇంగ్లండ్ తరఫున 86 వన్డేలు, 79 టీ20లు, 8 టెస్ట్లు ఆడింది. ఇక బ్యాటింగ్ కోచ్గా ఆర్ మురళీధర్, హెడ్ ఫిజియోగా నవనీత గౌతమ్ తమ పదవుల్లో కొనసాగనున్నారు. కాగా ఈ నెలాఖరులో డబ్ల్యూపీల్ మినీ వేలం జరగనుంది. నవంబర్ 5లోపు ఆయా ఫ్రాంచైజీలు ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాను సమర్పించాలి.చదవండి: బిగ్బాష్ లీగ్ నుంచి అశ్విన్ ఔట్ -
బిగ్బాష్ లీగ్ నుంచి అశ్విన్ ఔట్
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఆస్ట్రేలియాలో జరిగే బిగ్బాష్ లీగ్ (Big Bash League) నుంచి వైదొలిగాడు. మోకాలి గాయం కారణంగా 15వ ఎడిషన్కు దూరమయ్యాడు. అశ్విన్ ఇటీవలే బీబీఎల్లోని సిడ్నీ థండర్ (Sydney Thunder) ఫ్రాంచైజీతో ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఒప్పందం చారిత్రాత్మకమైంది. బీబీఎల్లో ఇప్పటివరకు ఏ భారత క్రికెటర్ ఆడలేదు. అశ్విన్ బీబీఎల్ అరంగేట్రం చేసుంటే చరిత్ర సృష్టించేవాడు. గాయం కారణంగా అశ్విన్ బీబీఎల్ ఎంట్రీ వాయిదా పడింది. ఈ సీజన్ మొత్తానికి అశ్విన్ దూరమైనట్లు సిడ్నీ థండర్ యాజమాన్యం ప్రకటించింది. అశ్విన్ సేవలు కోల్పోవడం దురదృష్టకరమని థండర్ ఫ్రాంచైజీ జనరల్ మేనేజర్ అన్నారు. యాష్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. యాష్పై ఈ సీజన్లో తామెన్నో ఆశలు పెట్టుకున్నామని తెలిపాడు. అతడి అరంగేట్రాన్ని గ్రాండ్గా ప్లాన్ చేశామని, దురదృష్టవశాత్తు అది వాయిదా పడిందని చెప్పుకొచ్చాడు. మరోవైపు అశ్విన్ కూడా బిగ్బాష్ లీగ్ను మిస్ అయినందుకు బాధ పడ్డాడు. ఫ్యాన్స్ను నిరాశపరిచినందుకు క్షమాపణలు చెప్పాడు. యాష్ ఇటీవల చెన్నైలో జరిగిన ఓ షూటింగ్లో గాయపడ్డాడని తెలుస్తుంది.కాగా, 2025-26 బిగ్బాష్ లీగ్ సీజన్ డిసెంబర్ 14 నుంచి ప్రారంభమవుతుంది. అశ్విన్ ప్రాతినిథ్యం వహించాల్సిన సిడ్నీ థండర్ తమ తొలి మ్యాచ్ను డిసెంబర్ 16న హోబర్ట్ హరికేన్స్తో ఆడాల్సి ఉంది.బీబీఎల్ 2025-26లో సిడ్నీ థండర్ జట్టు.. వెస్ అగర్, టామ్ ఆండ్రూస్, కామెరాన్ బాన్క్రాఫ్ట్, సామ్ బిల్లింగ్స్, ఓలీ డేవిస్, లోకీ ఫెర్గూసన్, మాథ్యూ గిల్క్స్, క్రిస్ గ్రీన్, ర్యాన్ హాడ్లీ, షాదాబ్ ఖాన్, సామ్ కొన్స్టాస్, నాథన్ మెక్ఆండ్రూ, బ్లేక్ నికితారాస్, డేవిడ్, అడియన్ ఓకానర్, డేనియల్ సామ్స్, తన్వీర్ సంఘా, డేవిడ్ వార్నర్చదవండి: IPL 2026: ఆసీస్ దిగ్గజానికి కీలక పదవి -
ఆసీస్ దిగ్గజానికి కీలక పదవి
ఐపీఎల్ 2026కి ముందు ఆస్ట్రేలియా దిగ్గజం టామ్ మూడీకి (Tom Moody) కీలక పదవి దక్కింది. లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) ఫ్రాంచైజీ మూడీని గ్లోబల్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా నియమించింది. ఈ పదవి చేపట్టాక మూడీ ఎల్ఎస్జీతో పాటు సౌతాఫ్రికా టీ20 లీగ్లో డర్బన్ సూపర్ జెయింట్స్, హండ్రెడ్ లీగ్లో మాంచెస్టర్ ఆధారిత ఫ్రాంచైజీ కార్యకలాపాలు పర్యవేక్షిస్తాడు.గతంలో ఈ పదవిలో టీమిండియా దిగ్గజ పేసర్ జహీర్ ఖాన్ ఉండేవాడు. జహీర్ తప్పుకున్న తర్వాత మూడీని ఈ పదవి వరించింది. మూడో రానున్న ఐపీఎల్ సీజన్లో రిషబ్ పంత్ (కెప్టెన్), జస్టిన్ లాంగర్ (హెడ్ కోచ్), కేన్ విలియమ్సన్ (స్ట్రాటజిక్ అడ్వైజర్), భరత్ అరుణ్ (బౌలింగ్ కోచ్), లాన్స్ క్లూసెనర్తో (అసిస్టెంట్ కోచ్) కలిసి పని చేస్తాడు. మూడీకి కోచింగ్తో పాటు ఫ్రాంచైజీ మేనేజ్మెంట్లో అపార అనుభవం ఉంది. ఈ అనుభవాన్ని క్యాష్ చేసుకునేందుకే ఎల్ఎస్జీ మూడీని తమ ఫ్రాంచైజీల గ్లోబల్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా నియమించింది. మూడీ పర్యవేక్షణలో (కోచ్గా) సన్రైజర్స్ హైదరాబాద్ తమ తొలి, ఏకైక టైటిల్ (2016) సాధించింది.మూడీ ప్రొఫైల్..2000 సంవత్సరం ప్రారంభంలో ఆటకు వీడ్కోలు పలికిన మూడీ.. 2005-07 మధ్యలో శ్రీలంక జాతీయ జట్టుకు కోచ్గా పని చేశాడు. అతని జమానాలో శ్రీలంక 2007 వరల్డ్ కప్ ఫైనల్కు చేరింది.అదే ఏడాది మూడీ వెస్ట్రన్ ఆస్ట్రేలియా జట్టుకు హెడ్ కోచ్గా బాధ్యతలు నిర్వహించాడు.అంతర్జాతీయ స్థాయిలో కోచ్గా రాణించిన మూడీ.. 2008-10 మధ్యలో ఐపీఎల్లో Kings XI Punjab (ఇప్పుడు Punjab Kings) జట్టుకు కోచ్గా సేవలందించాడు.2013లో Sunrisers Hyderabad ఫ్రాంచైజీలో హెడ్ కోచ్గా చేరి, 2016లో ఆ జట్టుకు తొలి ఐపీఎల్ టైటిల్ అందించాడు. 2019 వరకు అదే బాధ్యతలు నిర్వహించిన మూడీ.. 2020 డిసెంబర్లో అదే ఫ్రాంచైజీకి Director of Cricketగా తిరిగి వచ్చాడు.చదవండి: జైస్వాల్ సూపర్ సెంచరీ -
జైస్వాల్ సూపర్ సెంచరీ
రాజస్థాన్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్లో (Ranji Trophy 2025-26) ముంబై ఆటగాడు, టీమిండియా ప్లేయర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. తొలి ఇన్నింగ్స్లో సైతం అర్ద సెంచరీతో (67) రాణించిన ఈ ముంబైకర్.. రెండో ఇన్నింగ్స్లో మూడంకెల మార్కును తాకాడు. 120 బంతుల్లో 11 బౌండరీల సాయంతో ఈ మార్కును చేరుకున్నాడు.జైస్వాల్కు రంజీ ట్రోఫీలో ముంబై తరఫున ఇది ఐదో సెంచరీ (21 ఇన్నింగ్స్ల్లో). ఓవరాల్గా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 17వది (టెస్ట్ల్లో 7 సెంచరీలు, భారత్-ఏ తరఫున 1, ముంబై తరఫున రంజీల్లో 5, రెస్ట్ ఆఫ్ ఇండియా తరఫున 2, వెస్ట్ జోన్ తరఫున 2).2019లో రంజీ అరంగేట్రం చేసిన జైస్వాల్ ఈ సెంచరీతో 1000 పరుగుల మార్కును కూడా తాకాడు. 10 మ్యాచ్ల్లో 57కు పైగా సగటుతో ఈ పరుగులు చేశాడు. తాజా సెంచరీని జైస్వాల్ తన ఐపీఎల్ హోం గ్రౌండ్ అయిన సువాయ్ మాన్ సింగ్ స్టేడియంలో (జైపూర్) చేయడం విశేషం.చెలరేగిన రాజస్థాన్ బౌలర్లుతొలుత బ్యాటింగ్ చేసిన ముంబై తొలి ఇన్నింగ్స్లో 254 పరుగులకే ఆలౌటైంది. ముంబై ఇన్నింగ్స్ మొత్తంలో యశస్వి జైస్వాల్ (67) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ముషీర్ ఖాన్ 49, షమ్స్ ములానీ 32, హిమాన్షు సింగ్ 25, తుషార్ దేశ్పాండే 25 (నాటౌట్) పరుగులతో పర్వాలేదనిపించారు. రాజస్థాన్ బౌలర్లలో కుక్నా అజయ్ సింగ్ 4, అశోక్ శర్మ 3, అంకిత్ చౌదరి, ఆకాశ్ మహారాజ్ సింగ్, రాహుల్ చాహర్ తలో వికెట్ తీశారు.దీపక్ హుడా ద్విశతకంఅనంతరం బరిలోకి దిగిన రాజస్థాన్ రెండో ఇన్నింగ్స్లో దీపక్ హూడా ద్విశతకంతో (248), కార్తిక్ శర్మ (139) శతకంతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ (617/6) చేసింది. సచిన్ యాదవ్ (92) తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. ముంబై బౌలర్లలో తుషార్ దేశ్పాండే, షమ్స్ ములానీ తలో 2 వికెట్లు తీశారు. యశస్వి జైస్వాల్ బంతితోనూ రాణించి డబుల్ సెంచరీ వీరుడు దీపక్ హుడాను ఔట్ చేశాడు.363 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై నాలుగో రోజు తొలి సెషన్ సమయానికి (52 ఓవర్లలో) 2 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ముషీర్ ఖాన్ (63), అజింక్య రహానే (18) ఔట్ కాగా.. జైస్వాల్ 105, సిద్దేశ్ లాడ్ 0 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతానికి ముంబై రాజస్థాన్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే ఇంకా 170 పరుగులు వెనుకపడి ఉంది.చదవండి: భారత జట్టులో వైభవ్ సూర్యవంశీ, ప్రియాంశ్ ఆర్య -
రాహుల్ ద్రవిడ్ కుమారుడికి బంపరాఫర్
నవంబర్ 5 నుంచి 11 వరకు హైదరాబాద్ వేదికగా జరుగబోయే మెన్స్ అండర్-19 IDFC ఫస్ట్ బ్యాంక్ వన్డే ఛాలెంజర్ ట్రోఫీ 2025 కోసం నాలుగు వేర్వేరు జట్లను బీసీసీఐ జూనియర్ సెలెక్షన్ కమిటీ ఇవాళ (నవంబర్ 4) ప్రకటించింది.టీమ్-ఏకు కెప్టెన్గా విహాన్ మల్హోత్రా, టీమ్-బికి కెప్టెన్గా వేదాంత్ త్రివేది, టీమ్-సికి కెప్టెన్గా ఆరోన్ జార్జ్, టీమ్-డికి కెప్టెన్గా చంద్రహాస్ దాస్ ఎంపికయ్యారు. ద్రవిడ్ కుమారుడికి బంపరాఫర్టీమిండియా దిగ్గజ బ్యాటర్ రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ ద్రవిడ్కు (Anvay Dravid) బంపరాఫర్ వచ్చింది. ఈ టోర్నీ కోసం ఎంపిక చేసిన టీమ్-సిలో అతనికి చోటు దక్కింది. అన్వయ్ గత నెలలో కర్ణాటక అండర్-19 జట్టును వినూ మన్కడ్ ట్రోఫీ గెలిపించాడు. ఫైనల్లో కెప్టెన్ నాక్ (82 నాటౌట్) తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.జట్ల వివరాలు..టీమ్ A: విహాన్ మల్హోత్రా (C) (PCA), అభిజ్ఞాన్ కుందు (VC & WK) (MCA), వంశ్ ఆచార్య (SCA), బాలాజీ రావు (WK) (CSCS), లక్ష్య రాయ్చందాని (CAU), వినీత్ V.K (TNCA), మార్కండే పంచాల్ (UTCA), సాత్విక్ దేస్వాల్ (CAP), వీ యశ్వీర్ (HYCA), హేమ్చూడేశన్ (TNCA), R.S. అంబరీష్ (TNCA), హనీ ప్రతాప్ సింగ్ (RCA), వాసు దేవాని (GCA), యుధాజిత్ గుహా (CAB), ఇషాన్ సూద్ (PCA)టీమ్ B: వేదాంత్ త్రివేది (C) (GCA), హర్వన్ష్ సింగ్ (VC & WK) (SCA), వాఫీ కచ్చి (HYCA), సాగర్ విర్క్ (PCA), సయన్ పాల్ (CAB), వేదాంత్ సింగ్ చౌహాన్ (PCA), ప్రణవ్ పంత్ (DDCA), ఎహిత్ సలారియా (WK) (UTCA), B.K. కిషోర్ (TNCA), అన్మోల్జీత్ సింగ్ (PCA), నమన్ పుష్పక్ (MCA), D దీపేష్ (TNCA), మహమ్మద్ మాలిక్ (HYCA), మహమ్మద్ యాసీన్ సౌదాగర్ (MCA), వైభవ్ శర్మ (KSCA)టీమ్ సి: ఆరోన్ జార్జ్ (C) (HYCA), ఆర్యన్ యాదవ్ (VC) (PCA), అంకిత్ ఛటర్జీ (CAB), మణికాంత్ శివానంద్ (KSCA), రాహుల్ కుమార్ (PCA), యష్ కస్వాంకర్ (GOA CA), అన్వయ్ ద్రవిడ్ (WK) (KSCA), యువరాజ్ గోహిల్ (WK) (SCA), ఖిలన్ పటేల్ (GCA), కనిష్క్ చౌహాన్ (HCA), ఆయుష్ శుక్లా (MPCA), హెనిల్ పటేల్ (GCA), లక్ష్మణ్ పృథి (DDCA), రోహిత్ కుమార్ దాస్ (CAB), మోహిత్ ఉల్వా (SCA)టీమ్ డి: చంద్రహాస్ డాష్ (C) (CAB), మౌల్యరాజ్సింగ్ చావ్డా (VC) (GCA), శంతను సింగ్ (UPCA), అర్నవ్ బుగ్గ (DDCA), అభినవ్ కన్నన్ (TNCA), కుషాగ్రా ఓజా (RCA), ఆర్యన్ సక్పాల్ (WK) (MCA), ఎ. రాపోల్ (WK) (HYCA), వికల్ప్ తివారి (CSCS), మొహమ్మద్ ఎనాన్ (KCA), అయాన్ అక్రమ్ (UPCA), ఉదవ్ మోహన్ (DDCA), అశుతోష్ మహిదా (BCA), M తోషిత్ యాదవ్ (ACA), సోలిబ్ తారిక్ (JKCA)చదవండి: భారత జట్టులో వైభవ్ సూర్యవంశీ, ప్రియాంశ్ ఆర్య -
భారత జట్టులో వైభవ్ సూర్యవంశీ
నవంబర్ 14 నుంచి 23 మధ్యలో ఖతార్ వేదికగా జరుగబోయే రైజింగ్ స్టార్స్ ఆసియా కప్-2025 (ACC Cup Rising Stars 2025) కోసం 15 మంది సభ్యుల ఇండియా-ఏ (India-A) జట్టును బీసీసీఐ ఇవాళ (నవంబర్ 4) ప్రకటించింది. ఈ జట్టుకు సారధిగా వికెట్కీపర్, బ్యాటర్ జితేశ్ శర్మ (Jitesh Sharma) ఎంపిక కాగా.. నమన్ ధిర్ (Naman Dhir) అతనికి డిప్యూటీగా నియమితుడయ్యాడు.ఈ జట్టులో చిచ్చరపిడుగులు, ఐపీఎల్ సంచలనాలు ప్రియాంశ్ ఆర్య (Priyansh Ayra), వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) చోటు దక్కించుకున్నారు. ఈ ఇద్దరు జట్టు ఓపెనర్లుగా వ్యవహరిస్తారు. మిడిలార్డర్ బ్యాటర్లుగా నేహల్ వధేరా, నమన్ ధిర్, సూర్యాంశ్ షేడ్గే, రమన్దీప్ సింగ్, అశుతోష్ శర్మ ఎంపికయ్యారు. అభిషేక్ పోరెల్ సెకెండ్ ఛాయిస్ వికెట్కీపర్, బ్యాటర్గా చోటు దక్కించుకున్నాడు. పేసర్లుగా గుర్జప్నీత్ సింగ్, యశ్ ఠాకూర్, విజయ్ కుమార్ వైశాక్, యుద్ద్వీర్ సింగ్ చరక్ ఎంపిక కాగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా సుయాశ్ శర్మ, హర్ష్ దూబే చోటు దక్కించుకున్నారు. స్టాండ్ బై ప్లేయర్లుగా గుర్నూర్ బ్రార్, కుమార్ కుషాగ్రా, తనుశ్ కోటియన్, సమీర్ రిజ్వి, షేక్ రషీద్ను ఎంపిక చేశారు. ఈ టోర్నీలో భారత-ఏ జట్టు.. ఒమన్, యూఏఈ, పాకిస్తాన్ ఏ జట్లతో పాటు గ్రూప్-బిలో ఉంది.రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ కోసం భారత A జట్టు: ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, నేహల్ వధేరా, నమన్ ధిర్ (VC), సూర్యాంశ్ షెడ్గే, జితేష్ శర్మ (C) (WK), రమణదీప్ సింగ్, హర్ష్ దూబే, అశుతోష్ శర్మ, యశ్ ఠాకూర్, గుర్జప్నీత్ సింగ్, విజయ్కుమార్ వైశాక్, యుద్ద్వీర్ సింగ్ చరక్, అభిషేక్ పోరెల్ (WK), సుయాష్ శర్మ -
8 ఇన్నింగ్స్ల్లో 5 సెంచరీలు.. ఆసీస్ బ్యాటర్ సూపర్ ఫామ్
టెస్ట్, వన్డే జట్ల నుంచి ఉద్వాసనకు గురైన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లబూషేన్ (Marnus Labuschagne).. స్వదేశవాలీ సీజన్లో చెలరేగిపోతున్నాడు. 8 ఇన్నింగ్స్ల్లో 5 సెంచరీలు సహా 679 పరుగులు చేసి సూపర్ ఫామ్ను చాటుకున్నాడు.యాషెస్ జట్టులో స్థానమే లక్ష్యంగా జైత్రయాత్రను కొనసాగిస్తున్న లబూషేన్.. తాజాగా న్యూ సౌత్ వేల్స్తో జరిగిన మ్యాచ్లో (వన్డే కప్-2025) 111 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్ సాయంతో 101 పరుగులు చేశాడు.ఈ మ్యాచ్లో లబూషేన్ బంతితోనూ సత్తా చాటాడు. జాతీయ జట్టు సహచరుడు క్రిస్ గ్రీన్ సహా 2 వికెట్లు తీశాడు. ఈ టోర్నీలో లబూషేన్ క్వీన్స్లాండ్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. మొత్తంగా లబూషేన్కు లిస్ట్-ఏ క్రికెట్లో ఇది ఆరో శతకం. ప్రస్తుత వన్డే కప్లో నాలుగు ఇన్నింగ్స్ల్లో ఇది మూడవది.ప్రస్తుత స్వదేశవాలీ సీజన్లో లబూషేన్ లిస్ట్-ఏ ఫార్మాట్తో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనూ చెలరేగిపోతున్నాడు. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో టస్మానియా, సౌత్ ఆస్ట్రేలియాపై శతకాలు నమోదు చేశాడు.ఆగస్ట్లో సౌతాఫ్రికాతో జరిగిన స్వదేశీ వన్డే సిరీస్కు ముందు లబూషేన్పై వేటు పడింది. అప్పటి నుంచి వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో జట్టులో చోటు కోల్పోయాడు. 31 లబూషేన్ ప్రస్తుత అరివీర భయంకరమైన ఫామ్కు ముందు గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాడు. చాలాకాలం పాటు ఫామ్ కోల్పోయి తంటాలు పడ్డాడు.ప్రస్తుతం లబూషేన్ ఉన్న ఫామ్ను బట్టి చూస్తే యాషెస్ సిరీస్తో రీఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. యాషెస్ సిరీస్ 2025-26 నవంబర్ 21 నుంచి మొదలవుతుంది. తొలి టెస్ట్ పెర్త్ వేదికగా జరుగనుంది. ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టును ఇదివరకే ప్రకటించగా.. ఆసీస్ జట్టును ప్రకటించాల్సి ఉంది. రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో తొలి టెస్ట్కు స్టీవ్ స్మిత్ను తాత్కాలిక కెప్టెన్గా ఎంపిక చేశారు. -
పోరాడి ఓడిన రాజా ర్వితిక్ , లలిత్ బాబు
పనాజీ: ప్రపంచకప్ పురుషుల చెస్ టోర్నమెంట్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ గ్రాండ్మాస్టర్ రాజా ర్వితిక్... ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ఎంఆర్ లలిత్ బాబులకు నిరాశ ఎదురైంది. ఈ ఇద్దరు గ్రాండ్మాస్టర్లు తీవ్రంగా పోరాడినా... తొలి రౌండ్ అడ్డంకిని దాటలేకపోయారు. నొగెర్బెక్ కాజీబెక్ (కజకిస్తాన్)తో జరిగిన తొలి రౌండ్లో రాజా ర్వితిక్ ‘టైబ్రేక్’లో 2–4తో... మాక్స్ వార్మెర్డామ్ (నెదర్లాండ్స్)తో జరిగిన తొలి రౌండ్లో లలిత్ బాబు ‘టైబ్రేక్’లో 2–4తో ఓడిపోయారు. ఆదివారం నిరీ్ణత రెండు క్లాసికల్ గేమ్ల తర్వాత 1–1తో సమంగా ఉండటంతో... విజేతను నిర్ణయించేందుకు సోమవారం ‘టైబ్రేక్’ గేమ్లు ఆడించారు. నిబంధనల ప్రకారం ముందుగా 15 నిమిషాల నిడివిగల రెండు ర్యాపిడ్ గేమ్లు నిర్వహించారు. నొగెర్బెక్తో జరిగిన తొలి గేమ్లో రాజా ర్వితిక్ 42 ఎత్తుల్లో ఓడిపోయాడు. అయితే రెండో గేమ్లో ర్వితిక్ 52 ఎత్తుల్లో గెలిచాడు. దాంతో టైబ్రేక్లో స్కోరు 1–1తో సమమైంది. దాంతో ఫలితం తేలేందుకు ఈసారి 10 నిమిషాల నిడివిగల మరో రెండు గేమ్లు ఆడించారు. తొలి గేమ్లో నొగెర్బెక్ 43 ఎత్తుల్లో గెలిచి 2–1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. కానీ రెండో గేమ్లో ర్వితిక్ 42 ఎత్తుల్లో గెలవడంతో స్కోరు 2–2తో సమమైంది. దాంతో ఈసారి 5 నిమిషాల నిడివిగల రెండు గేమ్లు ఆడించారు. తొలి గేమ్లో ర్వితిక్ 71 ఎత్తుల్లో ఓడిపోయాడు. బరిలో నిలవాలంటే రెండో గేమ్లో ర్వితిక్ తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే రెండో గేమ్లో ర్వితిక్ 65 ఎత్తుల్లో ఓటమి పాలయ్యాడు. దాంతో నొగెర్బెక్ టైబ్రేక్లో 4–2తో విజయాన్ని అందుకొని రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. మరోవైపు వార్మెర్డామ్తో జరిగిన 15 నిమిషాల నిడివిగల టైబ్రేక్ తొలి గేమ్లో లలిత్బాబు 30 ఎత్తుల్లో నెగ్గాడు. రెండో గేమ్ను ‘డ్రా’ చేసుకున్నా లలిత్ బాబు ముందంజ వేసేవాడు. కానీ రెండో గేమ్లో వార్మెర్డామ్ 40 ఎత్తుల్లో గెలిచి స్కోరును 1–1తో సమం చేశాడు. ఇక 10 నిమిషాల నిడివిగల తొలి గేమ్లో వార్మెర్డామ్ 46 ఎత్తుల్లో నెగ్గి 2–1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే రెండో గేమ్లో లలిత్ బాబు 50 ఎత్తుల్లో గెలిచి స్కోరును 2–2తో సమం చేశాడు. ఇక 5 నిమిషాల నిడివిగల తొలి గేమ్లో వార్మెర్డామ్ 47 ఎత్తుల్లో విజయం సాధించి 3–2తో ఆధిక్యాన్ని సంపాదించాడు. బరిలో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన రెండో గేమ్లో లలిత్ బాబు 61 ఎత్తుల్లో ఓడిపోయాడు. దాంతో వార్మెర్డామ్ 4–2తో గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. భారత్కే చెందిన గ్రాండ్మాస్టర్లు ఎస్ఎల్ నారాయణన్, దీప్తాయాన్ ఘోష్ టైబ్రేక్ ర్యాపిడ్ గేముల్లో తమ ప్రత్యర్థులను ఓడించి రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. -
ప్రతీకకు పతకం లేదు!
భారత జట్టు ఓపెనర్ ప్రతీక రావల్ లీగ్ దశలో 7 మ్యాచ్లూ ఆడి 51.33 సగటుతో 308 పరుగులు చేసి జట్టు విజయాల్లో తానూ కీలకపాత్ర పోషించింది. ఇందులో 1 సెంచరీ, 1 అర్ధ సెంచరీ ఉన్నాయి. అయితే గాయంతో తప్పుకున్న ఆమె సెమీస్, ఫైనల్ ఆడలేకపోయింది. ప్రతీక స్థానంలో షఫాలీ వర్మకు చోటు లభించింది. కప్ గెలిచిన అనంతరం జట్టు సభ్యులంతా వీల్చైర్లో ఉన్న ప్రతీకను వేదిక మీదకు తీసుకొచ్చి జట్టు సంబరాల్లో భాగం చేశారు. అయితే దురదృష్టవశాత్తూ ఆమెకు ఈ టోర్నీని చిరస్మరణీయంగా మార్చే ‘విన్నర్ మెడల్’ లభించలేదు. ఐసీసీ నిబంధనల ప్రకారం 15 మందికే ఈ పతకాన్ని ఇస్తారు. ప్రతీకను పూర్తిగా జట్టు నుంచి తప్పించిన తర్వాతే అధికారికంగా షఫాలీని టీమ్లో చేర్చారు కాబట్టి ప్రతీకను పరిగణనలోకి తీసుకోలేదు. -
జట్టు సభ్యులలో స్ఫూర్తి నింపేందుకు ప్రయత్నించాను: హెడ్ కోచ్ అమోల్ మజుందార్
భారత మహిళల జట్టు వన్డే వరల్డ్ కప్ గెలువడంలో తెర వెనక కీలకపాత్ర పోషించిన హెడ్ కోచ్ అమోల్ మజుందార్ తమ ప్లేయర్ల ప్రదర్శన పట్ల గర్వం వ్యక్తం చేశాడు. ప్రతికూల పరిస్థితుల్లోనూ వారిని ప్రోత్సహించి బాగా ఆడేలా చేయడంలో తన అనుభవం ఉపయోగపడిందని అతను వ్యాఖ్యానించాడు. ‘గత రెండేళ్లు ఈ జట్టుతో అద్భుతంగా సాగాయి. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్లాం. ఇలాంటి ప్లేయర్లతో పని చేయడం గర్వంగా అనిపించింది. నాకున్న అనుభవంతో టీమ్ను తీర్చి దిద్దేందుకు ప్రయత్నించాను. వారిలో స్ఫూర్తి నింపేందుకు నా అనుభవాన్ని వాడుకున్నా. వరుసగా మూడు మ్యాచ్లు ఓడినప్పుడు ఇది చాలా ఉపయోగపడింది. ఒక మ్యాచ్లో జెమీమాను తప్పించడం జట్టు ప్రయోజనాల కోసమే తీసుకున్న నిర్ణయం. ఈ గెలుపు క్రికెట్ నేర్చుకోవాలనుకునే అమ్మాయిలందరికీ స్ఫూర్తినివ్వడం ఖాయం. చివరి వికెట్ పడిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు నాకు ఏమీ కనిపించలేదు. ఏం జరిగిందో అర్థం చేసుకొని విజయాన్ని ఆస్వాదించేందుకు సమయం పట్టింది’ అని మజుందార్ అన్నాడు. -
‘మా విజయం రాత మారుస్తుంది’
ముంబై: భారత మహిళల క్రికెట్ జట్టు వన్డేలు, టి20 ఫార్మాట్లు కలిపి మూడుసార్లు వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లలో ఓటమి పాలైంది. సెమీఫైనల్ దశలో కూడా ఎదురైన పరాజయాలు ఉన్నాయి. చెప్పుకోదగ్గ ఆటతీరు కనబర్చినా అసలు విజయం మాత్రం దక్కలేదు. అయితే ఇప్పుడు దక్కిన ప్రపంచ కప్తో భవిష్యత్తులో చెప్పుకోదగ్గ మార్పు కనిపిస్తుందని కెపె్టన్ హర్మన్ప్రీత్ కౌర్ వ్యాఖ్యానించింది. ‘మేం మంచి క్రికెట్ ఆడుతున్నామని ఎన్నో ఏళ్లుగా చాలాసార్లు ప్రశంసలు వచ్చాయి. అయితే ఒక పెద్ద విజయం లేకుండా ఇలాంటి మాటలన్నీ వృథా అని మాకు బాగా తెలుసు. అలాంటి గెలుపు వస్తేనే మార్పు గురించి మాట్లాడాలి. దీని కోసం ఎంతగానో ఎదురు చూశాం. ప్రతీ టోర్నీ ముగియగానే నేను, స్మృతి బాధతో ఇంటికి వెళ్లిపోవడం, నిశ్శబ్దంగా కొద్ది రోజులు గడపడం, ఆపై తిరిగొచ్చి మళ్లీ కొత్తగా మొదలుపెట్టడం జరిగేది. దీనికి ముగింపు ఎప్పుడు అని మేం మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా వాడుకున్నాం. నా ఆనందాన్ని చెప్పడానికి మాటలు రావడం లేదు. నా జట్టును చూస్తే గర్వంగా ఉంది. ఈ విజయంతో ఇకపై మరిన్ని విజయాలకు ప్రేరణ అందడంతో పాటు మహిళల క్రికెట్ స్థాయి మరింత పెరగడం ఖాయం’ అని హర్మన్ చెప్పింది. లీగ్ దశలో ఇంగ్లండ్ చేతిలో చిత్తయిన తర్వాత తమలో మరింత కసి పెరిగిందని, అదే తర్వాతి మ్యాచ్లలో కనిపించిందని హర్మన్ పేర్కొంది. ‘ఇంగ్లండ్ మ్యాచ్ తర్వాత మా ఆలోచనా ధోరణి మారింది. వ్యూహాలు కూడా మార్చాలని, కొత్తగా మొదలు పెట్టాలని అర్థమైంది. ఆ ఓటమి ప్రభావం అందరిపై పడింది. ఇన్నేళ్లుగా సిద్ధమై ఇలా ఎలా ఓడామని అంతర్మథనం జరిగింది. ఫలితంగా పట్టుదల పెరిగి మా అత్యుత్తమ ఆటను ప్రదర్శించాం’ అని కెపె్టన్ వెల్లడించింది. తమపై తమకు ఉన్న నమ్మకం, ఆత్మవిశ్వాసం కారణంగానే ఫైనల్లో విజయం దక్కిందని హర్మన్ అభిప్రాయపడింది. -
సంబరాలు... నజరానాలు...
ముంబై: ‘న లేగా కోయీ పంగా, కర్దేంగే హమ్ దంగా... రహేగా సబ్ సే ఊపర్, హమారా తిరంగా’... విశ్వ విజేతగా నిలిచిన తర్వాత భారత మహిళల క్రికెట్ జట్టు సభ్యుల సంబరాలు అంబరాన్నంటాయి. స్టేడియం నుంచి మొదలు పెట్టి హోటల్ గదిలో ట్రోఫీని గుండెలకు హత్తుకొని పడుకునే వరకు ప్రతీ క్షణాన్ని వారు ఆస్వాదించారు. దక్షిణాఫ్రికా ప్లేయర్ డిక్లెర్క్ క్యాచ్ను అందుకోవడంతో మన శిబిరంలో షురూ అయిన వేడుకలు ఆ తర్వాత సుదీర్ఘ సమయం పాటు కొనసాగాయి. క్యాచ్ పట్టిన బంతిని అపురూపంగా దాచుకున్న కెపె్టన్ హర్మన్ప్రీత్ కౌర్ సహచరులందరితో కలిసి ఆనందం పంచుకుంది. అక్కడే ఉన్న తన తల్లిదండ్రులను కలిసిన హర్మన్ సంతోషం రెట్టింపైంది. ఎంత ఎదిగినా నాకు పసిదానివే అన్నట్లుగా... 36 ఏళ్ల హర్మన్ను ఎత్తుకొని మరీ తండ్రి చూపించిన ప్రేమ హైలైట్గా నిలిచింది. తన బాయ్ఫ్రెండ్, గాయకుడు పలాష్ ముచ్చల్తో స్మృతి విజయానందాన్ని ప్రదర్శించింది. భావోద్వేగానికి లోనైన జట్టు సభ్యులు పరస్పర అభినందనల తర్వాత కోలుకొని సాధారణ స్థితికి వచ్చేందుకు కొంత సమయం పట్టింది. ట్రోఫీ, పతకాల ప్రదానం వంటి లాంఛనాలు ముగిసిన తర్వాత మళ్లీ ప్లేయర్లంతా తమ ‘టీమ్ సాంగ్’తో ఒక్క చోటికి చేరారు. పిచ్పై ట్రోఫీని ఉంచి ‘టీమిండియా, టీమిండియా... హియర్ టు ఫైట్, కోయీ న లేతా హమ్కో లైట్’... అంటూ సాగిన ఈ పాటను అందరూ కలిసి పాడారు. దీనికి సంబంధించి ఆసక్తికర నేపథ్యాన్ని జెమీమా వెల్లడించింది. నాలుగేళ్ల క్రితమే తమ జట్టుకు థీమ్ సాంగ్ కావాలని భావించామని... అయితే ప్రపంచకప్ గెలిచిన తర్వాత దీని గురించి చెప్పాలనే అంతా నిర్ణయించుకున్నామని ఆమె పేర్కొంది. ఇప్పుడు దానికి సరైన సమయం వచి్చందంటూ జెమీమా పాటను మొదలుపెట్టింది. జట్టు సభ్యులు స్టేడియం నుంచి హోటల్కు చేరుకున్న సమయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఢోల్ బాజాలతో వారికి స్వాగతం లభించింది. హర్మన్ స్వయంగా పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్ చేతిలో పట్టుకొని పంజాబీ పాటలకు డ్యాన్స్ చేస్తూ ముందుకు సాగడం విశేషం. జెమీమా, స్మృతి ట్రోఫీతో కలిసి పడుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేశాయి. బోర్డు కానుకతో పాటు... తొలిసారి వరల్డ్కప్ను సొంతం చేసుకున్న భారత బృందానికి బీసీసీఐ సముచిత రీతిలో బహుమతిని ప్రకటించింది. టీమిండియా జట్టు సభ్యులు, సహాయక సిబ్బంది, సెలక్షన్ కమిటీకి కలిపి మొత్తం రూ.51 కోట్లు నజరానాగా ఇస్తున్నట్లు బోర్డు వెల్లడించింది. విడివిడిగా ఎంత మొత్తం అనే విషయంలో స్పష్టత లేకపోయినా... ప్లేయర్లకు ఒక్కొక్కరికి కనీసం రూ. 2 కోట్ల 50 లక్షలు దక్కే అవకాశం ఉంది. జట్టులో ప్రధాన పేసర్లయిన రేణుకా సింగ్, క్రాంతి గౌడ్లకు వారి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రోత్సాహకాన్ని ప్రకటించాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం క్రాంతి గౌడ్కు, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రేణుకకు రూ. 1 కోటి చొప్పున ఇవ్వనున్నాయి. మరోవైపు సూరత్కు చెందిన వ్యాపారవేత్త, రాజ్యసభ సభ్యుడు గోవింద్ ఢోలకియా కూడా తన తరఫు నుంచి భారత జట్టు సభ్యులకు వజ్రాల ఆభరణాలను బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. సీనియర్లకు గౌరవంతో...భారత జట్టు తొలిసారి ప్రపంచకప్ విజేతగా నిలిచింది. కానీ ప్రస్తుత టీమ్ ఈ స్థాయికి చేరడంలో తమ వంతు పాత్ర పోషించిన సీనియర్లు, గతంలో తమ సహచరులను ఆటగాళ్లు మర్చిపోలేదు. 2005, 2017 రన్నరప్గా నిలిచిన జట్లకు కెప్టెన్గా ఉండటంతో పాటు మొత్తం ఆరు వరల్డ్ కప్లు ఆడినా ట్రోఫీని ముద్దాడలేకపోయిన మిథాలీ రాజ్తో పాటు మరో దిగ్గజం జులన్ గోస్వామిలను భారత జట్టు సభ్యులు తమ వేడుకల్లో భాగం చేశారు. మరో మాజీ ప్లేయర్, టీవీ వ్యాఖ్యాత అంజుమ్ చోప్రా కూడా వీరితో జత కలిసింది. మిథాలీ చేతికి ట్రోఫీని అందించగా, దానిని అందుకొని ఆమె కొద్ది సేపు భావోద్వేగానికి గురైంది. ఈ టీమ్లో చాలా మంది మిథాలీ నాయకత్వంలో ఆడినవారే ఉన్నారు. -
ఆట.. అంతకుమించి...
వ్యూహం.. బలం ఈ రెంటికి జెండర్ లేదని క్రీడలు నిరూపిస్తాయి! అందులో క్రికెట్ ఒకటి.. వ్యూహం.. బలం.. టీమ్ స్పిరిట్ ప్రతిఫలించే ఆట! మహిళా క్రికెట్లో వరల్డ్ కప్ కైవసం చేసుకుని ఈ మూడింటిలోనూ భేష్ అని నిరూపించుకుంది మన జాతీయ మహిళా జట్టు! ఈ టీమ్లో ప్రతి ఒక్కరిదీ ఒక్కో ప్రత్యేకత.రాహుల్ ద్రవిడ్ బ్యాట్తో...స్మృతి మంధాన అంటే తెలియనిదెవరికి? క్రికెట్తోనే కాకుండా తన ΄్యాషన్ అయిన మొబైల్ గేమింగ్ (బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా బీజీఎమ్ఐ)తోనూ ప్రసిద్ధి. కుకింగ్ అండ్ ట్రావెలింగ్ హాబీస్తో ఫేమస్. క్రికెట్ మ్యాచ్లు లేకపోతే మొబైల్ గేమింగ్.. కుకింగ్.. ట్రావెల్తో సేదతీరుతుందీ ఏ23 అంబాసిడర్. పంజాబీ వంటకాల్లో చేయితిరిగిన నైపుణ్యం ఆమెది. స్పైసీ పనీర్ టిక్కా మసాలా ఆమె సిగ్నేచర్ డిష్. దాన్ని ఆమె థెరపీ ఇన్ ఎ బౌల్గా అభివర్ణిస్తుంది. ఇష్టమైన ట్రావెల్ డెస్టినేషన్ స్విట్జర్లాండ్. క్రికెట్ విషయానికి వస్తే.. స్మృతి మంధానది సహజంగా కుడిచేతి వాటమే. కానీ వాళ్ల నాన్నకున్న లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ అబ్సెషన్ వల్ల ఆయన బలవంతంగా కూతురిని క్రికెట్లో ఎడమచేతి వాటం ప్లేయర్గా మార్చాడు. డొమెస్టిక్ క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి మహిళా క్రికెటర్గా ఘనత వహించిన విషయం తెలిసిందే కదా! కానీ ఆ డబుల్ సెంచరీ చేసిన బ్యాట్ ఎవరిదో తెలుసా.. మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ది. అయితే ఆ బ్యాట్ను స్మృతి సోదరుడు శ్రవణ్కు (జూనియర్ క్రికెటర్గా ఉన్న రోజుల్లో) ద్రవిడ్ గిఫ్ట్గా ఇచ్చాడట. ముచ్చటపడి ఆ బ్యాట్తో తాను ఆడటం మొదలుపెట్టి అలా రికార్డ్ క్రియేట్ చేసింది స్మృతి మంధాన.వంటాగింటా జాన్తా నై ..క్రికెట్టే జీవితంహర్మన్ ప్రీత్ కౌర్.. మన మహిళా క్రికెట్ జట్టు సారథి. కూలెస్ట్ పర్సన్. ధైర్యసాహసాలు అని పర్ప్లెక్సిటీని అడిగితే ఆమెనే చూపిస్తుంది. పంజాబ్కు చెందిన 36 ఏళ్ల ఈ ప్లేయర్ క్రికెట్లో తన ఇమేజ్ను క్రియేట్ చేసుకోవడానికి సంప్రదాయ మూసధోరణులతో ఒక యుద్ధమే చేసింది. ఆటల్లో హర్మన్ప్రీత్కి స్ఫూర్తి ఆమె తండ్రి హర్మందర్ సింగ్ భుల్లర్. ఆయన బాస్కెట్బాల్, వాలీబాల్ ప్లేయర్. తనూ తండ్రిలాగే దేశం తరపున ఆడాలని చిన్నప్పుడే నిశ్చయించుకుంది. క్రికెట్లో మహిళల జట్టు లేకపోతే మగవాళ్ల జట్టులో అయినా సరే ఆడి తన సత్తా చాటాలనుకుంది. స్థానిక మేల్ టీమ్తోనే ప్రాక్టీస్ మొదలుపెట్టింది కూడా. అలా కూతురు ప్యాంట్, షర్ట్ వేసుకుని.. అస్తమానం మగపిల్లలతోనే ఆడుతుండటం చూసిన హర్మన్ప్రీత్ తల్లి కంగారు పడింది. పిల్ల భవిష్యత్ ఏం గానూ అని కలవరం చెందింది. ‘నువ్విలా ప్యాంట్, షర్ట్లు వేసుకుని మగపిల్లలతో ఆటలాడ్డం ఏమీ బాగోలేదు. అందరు ఆడపిల్లల్లా చక్కగా సల్వార్ కమీజ్ వేసుకుని ఇంటిపట్టునే ఉండు. రోజూ వంటింట్లో నాకు చేదోడు వాదోడుగా ఉంటూ వంట నేర్చుకో’ అని అల్టిమేటం కూడా జారీ చేసింది. కానీ మన ప్లేయర్ ‘వంటాగింటా జాన్తా నై.. క్రికెటే నా జీవితం.. నేను ఇలాగే ఉంటాను’ అని తేల్చేసింది. ‘నా ఆ జవాబుతో అమ్మ మళ్లీ మాట్లాడలేదు’ అంటుంది హర్మన్ప్రీత్ కౌర్.ఆటకే కాదు పాటలకూ అంతే ఫాలోయింగ్.. మన మహిళా క్రికెట్ జట్టుకు జెమీమా రోడ్రిగ్స్ ఒక మెరుపు. తండ్రి గైడెన్స్తో ఏడేళ్ల వయసులోనే క్రికెట్ గ్రౌండ్లో అడుగుపెట్టింది. అయితే ఆమెకు స్ఫూర్తి మాత్రం సోదరులు ఎలి, ఎనోచ్లే! క్రికెట్లో ఆమె సూపర్స్టార్ అవుతుందని ప్రపంచానికి జోస్యం చెప్పింది ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్. అన్నట్టుగానే ఆమె సూపర్స్టార్ అయింది. క్రికెట్తోపాటు ఆమెకు పాటలు పాడటం.. రీల్స్ చేయడం ప్రాణం. ఆటలో ఆమె పట్ల ఎంత క్రేజ్ ఉందో.. ఆమె రీల్స్కి సోషల్ మీడియాలో అంతే ఫాలోయింగ్ ఉంది.అమ్మ ఆనంద తాండవంమన టీమ్ ఘన విజయం తరవాత పేసర్ రేణుక సింగ్ తల్లి సునీత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో స్థానికులతో కలిసి పాట పాడుతూ, డ్యాన్స్ చేస్తున్న దృశ్యం నెటిజనులను ఆకట్టుకుంటోంది. హిమాచల్ ప్రదేశ్లోని పర్సా అనే మారుమూల గ్రామానికి చెందిన రేణుక చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయింది. అప్పటి నుంచి తల్లే తండ్రిగా మారింది.రేణుక తండ్రికి క్రికెట్ అంటే మహా ఇష్టం. తన కూతురిని క్రికెటర్గా చూడాలనుకునేవాడు. తండ్రి కల నెరవేర్చడానికి రేణుక ఎంతో కష్టపడింది. ఆమె ప్రయాణంలో ప్రతి అడుగులో తల్లి అండగా నిలిచింది.ఈ అమ్మాయి పేరు... ముంబై కీ డొనాల్డ్ ట్రంప్ప్రపంచ కప్ ఘన విజయ సంబరాలు అం» రాన్ని అంటుతున్న నేపథ్యంలో ఒక అమ్మాయి సోషల్ మీడియాలో ఎట్రాక్షన్గా మారింది. ప్రపంచ కప్ విజయం గురించి ఈ అమ్మాయి అద్భుతమైన ఇంగ్లీష్లో మాట్లాడిన తీరు, హావభావాలకు నెటిజనులు ఫిదా అయ్యారు. అంతేకాదు, ఈ అమ్మాయికి ‘ముంబై కీ డొనాల్డ్ ట్రంప్’ అని పేరు పెట్టారు. డొనాల్డ్ ట్రంప్ లెవెల్లో ఇంగ్లీష్ మాట్లాడుతుందని ఆ పేరు పెట్టారు! ‘ఈ విజయం గురించి మాట్లాడడానికి నాకు మాటలు రావడం లేదు. ప్రతి ప్లేయర్ అద్భుతంగా ఆడారు. ఎంతో నిరీక్షణ తరువాత వరల్డ్ కప్ గెలుచుకున్నాం. సహనానికీ , అంకితభావానికి అద్దం పట్టే విజయం ఇది’ అని చెప్పింది ముంబై కి డోనాల్డ్ ట్రంప్.విల్పవర్తో వీల్చైర్లో...గాయం కారణంగా ఐకానిక్ మహిళల ప్రపంచ కప్ టోర్నమెంట్ నుంచి తప్పుకున్న ప్రతీక రావల్ నవీముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో వీల్చైర్లో విజయోత్సవంలో పాల్గొంది. టీమ్ సభ్యులు ఆమెను వీల్చైర్పై వేదికపైకి తీసుకువస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది.‘నేను మైదానంలో పోరాడలేకపోయాను. కానీ నా మనసు ఎప్పుడూ ఆటతోనే ఉంది. ప్రతి ఉత్సాహం నాదే, కన్నీటి బొట్టు కూడా నాదే’ అని ‘ఎక్స్’లో ఫోటో షేర్ చేసింది, కామెంట్ రాసింది రావల్. ‘సీరియస్లీ స్వీట్ మూమెంట్’ అని ఒక నెటిజనుడు ఈ ఫొటో గురించి కామెంట్ రాశాడు.→ ఐర్లండ్తో జరిగిన మ్యాచ్లో 320 పరుగులు సాధించి.. ఇంటర్నేషనల్ వన్ డే మ్యాచ్లలో 300 పరుగుల భాగస్వామ్యం సాధించిన తొలి మహిళా జోడీగా దీప్తి శర్మ, పూనమ్ రౌత్లు రికార్డ్ నెలకొల్పారు.→ మన దేశంలో తొలి మహిళా క్రికెట్ క్లబ్ పేరు ‘ది అల్బీస్’. దీన్ని ముంబైలో.. 1969లో అలూ బామ్జీ ఏర్పాటు చేశారు. ఇండియన్ క్రికెట్ క్లబ్ సభ్యురాలైన ఆమె.. క్రికెట్లో మహిళలూ ప్రొఫెషనల్గా ఆడాలని .. వాళ్లకూ అందులో కీలక స్థానం కల్పించాలని సాఫ్ట్బాల్ ప్లేయర్స్ను పరిచయం చేశారు. -
టీమిండియా నుంచి తీసేశారు.. కట్ చేస్తే! అక్కడ డబుల్ సెంచరీతో
టీమిండియా బ్యాటర్, రాజస్తాన్ స్టార్ ప్లేయర్ దీపక్ హుడా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అదరగొడుతున్నాడు. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో భాగంగా జైపూర్ వేదికగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో హుడా అద్బుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు. 121 పరుగుల ఓవర్ నైట్స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన హుడా.. వన్డే తరహాలో తన బ్యాటింగ్ను కొనసాగించాడు.ఆచితూచి ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించాడు. ఈ క్రమంలోనే తన రెండో ఫస్ట్ క్లాస్ డబుల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. మొత్తంగా 335 బంతులు ఎదుర్కొన్న హుడా.. 22 ఫోర్లు, 2 సిక్స్లతో 248 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ 293గా ఉంది. ఇక మ్యాచ్లో హుడా ద్విశతకం ఫలితంగా రాజస్తాన్ తొలి ఇన్నింగ్స్ను 617/6 వద్ద డిక్లేర్ చేసింది. రాజస్తాన్ ఇన్నింగ్స్లో హుడాతో కార్తీక్ శర్మ(139), సచిన్ యాదవ్(92) రాణించారు. దీంతో రాజస్తాన్కు మొదటి ఇన్నింగ్స్లో 363 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ముంబై బౌలర్లలో తుషార్ దేశ్పాండే, ములానీ తలా రెండు వికెట్లు సాధించారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై వికెట్ నష్టపోకుండా 89 పరుగులు చేసింది.క్రీజులో జైశ్వాల్(56), ముషీర్ ఖాన్(32) ఉన్నారు. ఇక దీపక్ హుడా విషయానికి వస్తే.. భారత తరపున చివరగా 2023లో న్యూజిలాండ్పై ఆడాడు. అయితే ఐర్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో సెంచరీతో మెరిసిన హుడా, ఆ తర్వాత వరుస మ్యాచ్ల విఫలమయ్యాడు. దీంతో అతడిని నుంచి జట్టు నుంచి తప్పించారు. గత రెండు ఐపీఎల్ సీజన్లలోనూ అతడు విఫలమయ్యాడు.చదవండి: Womens World Cup: విశ్వ విజేతలకు డైమండ్ నెక్లెస్లు.. -
అన్నకు తగ్గ తమ్ముడు..
రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న మహ్మద్ షమీ సోదరుడు, బెంగాల్ పేసర్ మహ్మద్ కైఫ్.. తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. అగర్తల వేదికగా త్రిపురతో జరుగుతున్న మ్యాచ్లో 28 ఏళ్ల కైఫ్ సత్తాచాటాడు. తన అన్న షమీ కంటే అద్బుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు.మహ్మద్ కైఫ్ తన పేస్ బౌలింగ్తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. తొలి ఇన్నింగ్స్లో ఇప్పటివరకు 19 ఓవర్లు బౌలింగ్ చేసిన కైఫ్.. 53 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. టాపార్డర్ బ్యాటర్లు బిక్రం కుమార్ దాస్, శ్రీదాం పాల్లను క్లీన్ బౌల్డ్ చేసిన కైఫ్.. బిక్రంజిత్ దేబ్నాథ్ను ఎల్బీగా పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత సీనియర్ బ్యాటర్ విజయ్ శంకర్ను అద్బుతమైన బంతితో బోల్తా కొట్టించాడు.కైఫ్పై నమ్మకంతో బెంగాల్ కెప్టెన్ అభిషేక్ పోరెల్ మూడో రోజు ఆటలో ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేశాడు. అతడు అన్న షమీ అయితే 19 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక్క వికెట్ సాధించకుండా 70 పరుగులు సమర్పించుకున్నాడు. 78 ఓవర్లు ముగిసేసరికి త్రిపుర తమ తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. క్రీజులో హనుమా విహారి(121), మణిశంకర్ మురాసింగ్(42) ఉన్నారు. బెంగాల్ బౌలర్లలో కైఫ్తో పాటు, ఇషాన్ పోరెల్, షాబాజ్ అహ్మద్, రాహుల్ ప్రసాద్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.కాగా కైఫ్ బెంగాల్ జట్టులో రెగ్యూలర్ సభ్యుడు కాదు. 28 ఏళ్ల కైఫ్ కేవలం 12 ఫస్ట్-క్లాస్ మ్యాచ్లే ఆడాడు. 18 ఇన్నింగ్స్లలో అతడు 34 వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ షమీ అయితే 20 ఏళ్లకే ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసి.. నాలుగేళ్లు తిరిగక ముందే భారత్ తరపున టెస్టు అరంగేట్రం చేశాడు.చదవండి: Womens World Cup: విశ్వ విజేతలకు డైమండ్ నెక్లెస్లు.. -
విశ్వ విజేతలకు డైమండ్ నెక్లెస్లు..
తొలి వన్డే వరల్డ్కప్ను గెలిచి భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన ఫైనల్లో 52 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించిన భారత జట్టు.. తమ చిరకాల స్వప్నాన్ని నేరవేర్చుకుంది. అంజుమ్ చోప్రా, జులాన్ గో స్వామి, మిథాలీ రాజ్ వంటి దిగ్గజ కెప్టెన్లకు సాధ్యం కాని వరల్డ్కప్ను హర్మన్ ప్రీత్ కౌర్ భారత్కు అందించింది. దీంతో ఉమెన్ ఇన్ బ్లూపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యులు గోవింద్ ధోలాకియా ప్రత్యేక బహుమతిని ప్రకటించారు. సూరత్కు చెందిన గోవింద్ ధోలాకియా.. హర్మన్ సేనకు వజ్రాభరణాలు(డైమండ్ నెక్లస్), సోలార్ ప్యానెళ్లను గిప్ట్గా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఆదివారం ఫైనల్ మ్యాచ్కు ముందు ఢోలాకియా బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాకు లేఖ రాశారు."వన్డే వరల్డ్ప్లో మన భారత మహిళల జట్టు అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఫైనల్లో కూడా విజయం సాధించి మన అమ్మాయిలు ఛాంపియన్గా నిలుస్తారని ఆశిస్తున్నాను. ఒకవేళ భారత్ కప్ను గెలుచుకుంటే జట్టులో సభ్యులందరికీ వజ్రాల ఆభరణాలను కానుకగా ఇవ్వాలనుకుంటున్నాను. దీంతో పాటు వారందరి ఇళ్లపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నాను" అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు భారత జట్టు విశ్వ విజేతగా నిలవడంతో ధోలాకియా తన మాటను నిలబెట్టుకోనున్నారు. త్వరలోనే జట్టులోని ప్రతీ ఒక్కరికి తన ప్రకటించిన గిఫ్ట్లను ఇవ్వనున్నట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కాగా వరల్డ్ ఛాంపియన్స్కు బీసీసీఐ కూడా భారీ నజరానా ప్రకటించింది. భారత జట్టుతో పాటు సహాయక సిబ్బందికి కలిపి రూ. 51 కోట్ల భారీ నగదు బహుమతిని భారత క్రికెట్ బోర్డు ఇవ్వనుంది.చదవండి: Womens World cup: చెల్లి కోసం అన్న త్యాగం.. ఇప్పుడు ఏకంగా వరల్డ్కప్నే -
భారత మహిళా క్రికెట్కు ఊపిరి పోసిన ఆస్ట్రేలియన్
ఇది 112 సంవత్సరాలుగా మన దేశం కంటున్న కల. 1913లో, ఆస్ట్రేలియాలో జన్మించిన పాఠశాల ఉపాధ్యాయురాలు అన్నే కెల్లెవ్ కేరళలోని కొట్టాయంలో ఉన్న బేకర్ మెమోరియల్ స్కూల్లో బాలికలకు క్రికెట్ను తప్పనిసరి చేశారు. ఒక శతాబ్దం తర్వాత, భారత మహిళా క్రికెట్ జట్టు తన జన్మస్థలం నుంచి వచ్చిన జట్టును ఓడించి కలల ఫైనల్కు చేరుకుంటుందని బహుశా ఆమె అప్పుడే ఊహించారేమో.. తెలీదు. కానీ అదే జరిగింది.భారత్ ఇంతకు ముందు మహిళల క్రికెట్ ప్రపంచ కప్లో ఫైనల్లోకి ప్రవేశించలేదని కాదు, కానీ 2025 ఎడిషన్ చరిత్రలో అద్భుతాలను చవిచూసిన టోర్నమెంట్గా నిలిచిపోతుంది, కలలు పండిస్తూ మన మహిళలు విజేతలుగా మారారు. గత దశాబ్దంలో కాలానుగుణంగా పెరుగుతున్న మహిళల క్రికెట్పై మన దేశపు ఆసక్తిని మేల్కొల్పడానికి వారు అందించిన స్ఫూర్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే భారతదేశంలో మహిళలు ఈ క్రీడను ఆడటం అంటే ఒక పోరాటం, దీనిని అధిగమిస్తూ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కొత్త స్టార్ల ఆవిర్భావాన్ని చూసింది.ఆదివారానికి ముందు, భారతదేశం రెండు ఫైనల్స్ ఆడింది ఒకటి 2005లో మరొకటి 2017లో... పోరాడి ఓడింది. దక్షిణాఫ్రికాతో జరిగిన 2025 టైటిల్ పోటీ జట్టుకు ప్రత్యేకంగా చేసింది ఏమిటంటే, వారు కిక్కిరిసిన స్టేడియం మధ్య స్వదేశంలో పోరాడారు, అక్కడ ‘ఇండియా! ఇండియా!‘ అనే నినాదం దేశం అంతటా ప్రతిధ్వనించింది. "ఏఆర్ రెహమాన్ జై హో, బాలీవుడ్ సహకారం కొత్త తరపు క్రీడా గీతం, చక్ దే ఇండియా ప్రజలను చైతన్యపరచింది. ఆ కాలంలో ’పంచుకోవడం అంటే శ్రద్ధ’ అనేది నిజంగా ఉండేది. ఎందుకంటే కొన్నిసార్లు వివాహ మండపాల్లో బస చేసేవాళ్లం ఎక్కువగా పాఠశాలల్లో ఖాళీ తరగతి గదుల్లో ఉండేవాళ్ళం. మాకు తోడుగా బొద్దింకలు ఎలుకలు ఉండేవి. చాలా మందికి కేవలం ఒక జత తెల్లటి బ్యాట్లు పరిమితమైన బ్యాట్లు మాత్రమే ఉండేవి. అయినప్పటికీ, ఎవరూ ఫిర్యాదు చేయలేదు, ఎందుకంటే క్రికెట్ పట్ల ఉన్న ప్రేమతో ఆడాము,‘ అని భారత మాజీ కెప్టెన్ నిర్వాహకురాలు శాంత గుర్తుచేసుకున్నారు. శాంత, డయానా ఎడుల్జీ, శుభంగి కులకర్ణి సుధా షాలతో కలిసి ఆటలో కొనసాగారు. ఇలాంటి అలుపెరుగని పోరాటాలు కష్టాల కథలతో మహిళల క్రికెట్ ప్రయాణం దేశవ్యాప్తంగా సాగింది. ఒక, వ్యవస్థీకృత మహిళా క్రికెట్గా రూపుదిద్దుకుంది. ఈ నేపధ్యంలోమహిళా క్రికెట్ ప్రయాణంలో కొన్ని కీలక ఘట్టాలు...👉క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా సభ్యురాలు ఆలూ బామ్జీ, ఆమె పేరు ను మేళవిస్తూ ఆల్బీస్ అనే మొదటి మహిళా క్రికెట్ జట్టును ఏర్పాటు చేశారు.👉నాలుగు సంవత్సరాల తరువాత, మహేంద్ర కుమార్ శర్మ వ్యవస్థాపక కార్యదర్శిగా భారత మహిళా క్రికెట్ సంఘం లక్నోలో స్థాపించబడింది. 👉1993లో మొదటి జాతీయ ఛాంపియన్ షిప్ను లక్నోలో నిర్వహించారు, ఇందులో బొంబాయి, మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ నుంచి మూడు జట్లు ఉన్నాయి. రెండు విజిటింగ్ జట్ల నుంచి అదనపు ఆటగాళ్లను ఆతిథ్య జట్టులో చేర్చారు, ఒక కళాశాల మైదానంలో ఆడిన ఈ మ్యాచ్లో మహిళలు క్రికెట్ ఎలా ఆడతారు అనేదానికన్నా లేదా వారు ఏమి ధరిస్తారు అనే దానిపై ఆసక్తి కారణంగా ఇది గణనీయమైన ప్రేక్షకులను ఆకర్షించింది.👉1978లో, భారతదేశం ప్రపంచ కప్లో జట్టుగా ఆతిథ్య జట్టుగా అరంగేట్రం చేసింది. ఆతిథ్య జట్టుతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ అనే నాలుగు జట్లతో ఈ ఈవెంట్ను నిర్వహించగలగడానికి కేవలం ధైర్యం కంటే ఎక్కువ అవసరం.👉 2006లో బిసిసిఐతో విలీనం అనేక విధాలుగా ఒక మలుపు తిరిగింది, మొదటిసారిగా, మహిళల వన్ డే మ్యాచ్ల కోసం రూ. 2,500 మ్యాచ్ ఫీజును కేటాయించారు. మెరుగైన మైదానాలు,, వసతి గృహాలు హోటల్ గదులు వచ్చాయి.,రిజర్వ్ చేయని రైలు ప్రయాణాల స్థానంలో రిజర్వ్డ్ ఎసి రైళ్లు, విమానాలు వచ్చాయి. రెండు సంవత్సరాల తరువాత, మహిళా క్రికెటర్లు జాతీయ క్రికెట్ అకాడమీలో ప్రవేశం పొందారు. -
కడప నుంచి వరల్డ్ కప్ దాకా.. శెభాష్ శ్రీచరణి
ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025 ఛాంపియన్గా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించినన భారత జట్టు.. తమ 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. అయితే ఈ చారిత్రత్మక విజయంలో ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాకు చెందిన యువ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీ చరణిది కీలక పాత్ర. టోర్నీ అసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచి భారత్కు తొలి వన్డే వరల్డ్కప్ను అందించింది. ఈ 50 ఓవర్ల ప్రపంచకప్లో 9 మ్యాచ్లు ఆడిన శ్రీ చరణి 78 ఓవర్లు వేసి 14 వికెట్లు తీసింది. దీప్తీ శర్మ తర్వాత భారత్ తరపున అత్యధిక వికెట్ల తీసిన జాబితాలో చరణి నిలిచింది. దీంతో ఈ కడప అమ్మాయిపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది.పల్లెటూర్ నుంచి వరల్డ్ ఛాంపియన్గా..ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా క్రీడా రంగంలో పెద్దగా పేరున్న ప్రాంతం కాదు. కానీ ఈ జిల్లాలోని వీరపునాయిని మండలం ఎర్రమల్లె గ్రామం నుంచి వచ్చిన నల్లపురెడ్డి శ్రీ చరణి.. భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి పురుషుల లేదా మహిళల క్రికెట్లో ప్రపంచ కప్లో ఆడిన మొట్టమొదటి క్రీడాకారిణిగా నిలిచింది. కానీ, ఆమె ప్రయాణం అనేక కష్ట నష్టాల మధ్య సాగింది.21 ఏళ్ల ఈ యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ చిన్నతనంలో ఆమె బ్యాడ్మింటన్, కబడ్డీ, అథ్లెటిక్స్లో ప్రతిభ చూపింది. అయితే 16 ఏళ్ల వయస్సులో మాత్రమే ఆమె క్రికెట్ను సీరియస్గా తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయానికి ఆమె మావయ్య కిషోర్ కుమార్ రెడ్డి ప్రధాన కారణం.ఆమె క్రికెట్ను ఎంచుకోకపోవడానికి ప్రధాన అడ్డంకులు ఆర్థిక సమస్యలు, కుటుంబం నుంచి మొదట్లో వచ్చిన వ్యతిరేకత. ఆమె తండ్రి చంద్రశేఖర్ రెడ్డి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్లో చిన్న ఉద్యోగిగా పనిచేసేవారు. క్రికెట్ జట్టు ఎక్కువగా పురుషుల క్రీడ కావడంతో ఆమె తండ్రి మొదట్లో చరణి నిర్ణయానికి మద్దతు ఇవ్వలేదు.తండ్రిని ఒప్పించడానికి ఆమెకు ఏడాది కాలం పట్టింది. చరణి చెప్పిన ప్రకారం.. ఆమె క్రీడా జీవితాన్ని ప్రారంభించే సమయంలో తన కుటుంబం అప్పులతో బాధపడేది. అయినప్పటికీ ఆ కష్టాలు తన ఆటపై ప్రభావం చూపకుండా ఆమె తల్లిదండ్రులు సహకరించారు.క్రీడా జీవితం ప్రారంభంలో శ్రీ చరణి మొదట ఫాస్ట్ బౌలర్గా శిక్షణ పొందింది. ఫాస్ట్ బౌలింగ్లో వికెట్లు లభించకపోవడంతో స్పిన్ బౌలింగ్ను ప్రయత్నించగా బాగా కలిసి వచ్చింది. ఆ తర్వాత ఆమె నెమ్మదిగా లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్గా మారింది. కడప లాంటి మారుమూల ప్రాంతం నుంచి వచ్చి కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ద్వారా సెలెక్టర్ల దృష్టిలో పడింది. అంతర్జాతీయ క్రికెట్కు ఎంపిక కావడం ఆమె అచంచలమైన పట్టుదలకు, కష్టపడే తత్వానికి నిదర్శనం. ఆర్థిక కష్టాలు ఆమె ఆశయాన్ని ఆపలేకపోయాయి. -
చెల్లి కోసం అన్న త్యాగం.. ఇప్పుడు ఏకంగా వరల్డ్కప్నే
భారత మహిళల జట్టు ప్రపంచాన్ని జయించింది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 విజేతగా టీమిండియా నిలిచింది. ఆదివారం ముంబై వేదికగా జరిగిన తుది పోరులో 52 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసిన హర్మన్ సేన.. సరికొత్త వరల్డ్ ఛాంపియన్గా అవతరించింది. మన అమ్మాయిలు తమ అద్బుత పోరాటంతో విశ్వవేదికపై భారత జెండాను రెపరెపాలడించారు. ఒకే ఒక్క విజయంతో 140 కోట్ల మంది భారతీయులను తలెత్తుకునేలా చేశారు. కాగా ఈ చారిత్రత్మక విజయంలో స్టార్ పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ది కీలక పాత్ర. ఫైనల్ మ్యాచ్లో రేణుకా వికెట్లు పడగొట్టనప్పటికి.. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. పవర్ ప్లేలో బంతిని స్వింగ్ చేస్తూ ప్రోటీస్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టిన రేణుకా.. డెత్ ఓవర్లలోనూ తన పేస్ బౌలింగ్తో సత్తాచాటింది.మొత్తంగా టోర్నీలో రేణుకా మూడు వికెట్లు పడగొట్టింది. అయితే రేణుకా సక్సెస్ వెనక ఆమె తల్లి సునీత కష్టం దాగి ఉంది. రేణుకా చిన్నతనంలోనే తన తండ్రి మరణించినప్పటికి.. తల్లి సునీత అన్ని తానే అయ్యి బిడ్డలను ఈ స్ధాయికి చేర్చింది.తండ్రి కలను నేరవేర్చిన రేణుకా.."మా ఆయనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. పిల్లల్లో ఎవరో ఒకరిని కబడ్డీ ప్లేయర్గా లేదా క్రికెటర్గా చూడాలని కలలు కన్నారు. కేహర్ సింగ్ ఇప్పుడు మాతో లేనప్పటికీ, మా అమ్మాయి తన కలను నెరవేర్చింది. చాలా సంతోషంగా ఉంది. నాకు మాటలు రావడం లేదు. రేణుకకు చిన్న తనం నుంచే క్రికెట్పై మక్కువ ఎక్కువ.తన స్కూల్డేస్లో అబ్బాయిలతో కలిసి క్రికెట్ ఆడేది. చెక్క బ్యాట్, వస్త్రాలతో చేసిన బాల్తో రోడ్డుపక్కన ఆడుతుండేది. ఫైనల్ మ్యాచ్కు ముందు ఆమెతో నేను మాట్లాడాను. ఈ రోజు(ఫైనల్లో) నీ కోసం కాదు.. దేశం కోసం ఆడు. ప్రపంచ కప్ గెలుచుకురా అని చెప్పాను. మా అమ్మాయి ఈ రోజు ఈ స్థాయికి చేరినందుకు చాలా ఆనందంగా ఉంది. అమ్మాయిలందరూ ఈ విధంగానే ముందుకు సాగాలి. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని.. నేను ఆ దేవుణ్ని ప్రార్ధిస్తున్నానని రేణుకా తల్లి సునీత" ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది.చెల్లి కోసం అన్న త్యాగం..కాగా రేణుక తండ్రి కెహర్ సింగ్ ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అండ్ ప్రజా ఆరోగ్య శాఖలో పనిచేసేవారు. అయితే రేణుకకు మూడేళ్ల వయసు ఉన్నప్పుడే కెహర్ సింగ్ ఠాకూర్ మరణించారు. అయితే కెహర్కు కూడా క్రికెట్ అంటే పిచ్చి. అందుకే భారత స్టార్ క్రికెటర్ వినోద్ కాంబ్లీ పేరు వచ్చేలా తన కుమారుడికి వినోద్ ఠాకూర్ అని పేరు కెహర్ పెట్టాడు.అయితే వినోద్ ఠాకూర్ కూడా క్రికెటర్ కావాలని కలలు కానేవాడంట. కానీ తన చెల్లి కోసం వినోద్ తన కలను వదులుకున్నాడు. ఆర్ధిక కష్టాలు ఉండడంతో తనకు బదులుగా రేణుకాను క్రికెట్ ఆకాడమీలో జాయిన్ చేయాలని తల్లిని వినోద్ ఠాకూర్ సూచించాడు. అయితే రేణుకాలో టాలెంట్ను గుర్తించింది మాత్రం ఆమె మామయ్య భూపిందర్ ఠాకూర్.ఆయన రేణుకాకు అన్ని విధాలగా మద్దతుగా నిలిచాడని ఆమె తల్లి సునీత స్పష్టం చేసింది. ధర్మశాల క్రికెట్ అకాడమీలో రేణుకాను భూపిందర్ చేర్చాడు. అక్కడ నుంచే ఆమె క్రికెట్ కెరీర్ ప్రారంభమైంది.చదవండి: Amanjot Kaur: మ్యాచ్ను మలుపు తిప్పిన క్యాచ్..! అమన్ వెనుక కన్నీటి గాథ -
సచిన్, లక్ష్మణ్, రోహిత్ వచ్చారు.. మీరెక్కడా సార్?
భారత మహిళల క్రికెట్ చిరకాల స్వప్నం నెరవేరింది. మూడోసారి ఫైనల్ చేరిన మన వనితలు కప్ను ఒడిసి పట్టుకున్నారు. కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తూ ఎట్టకేలకు విశ్వ విజేతగా నిలిచారు. భారత మహిళల క్రికెట్ టీమ్ వరల్డ్ కప్ సాధించడంతో దేశవ్యాప్తంగా ప్రజలు సంబురాలు చేసుకున్నారు. విశ్వవ్యాప్తంగా ఉన్న భారతీయులు మన మహిళలను ప్రశంసలతో ముంచెత్తారు. అదే సమయంలో రన్నరప్గా నిలిచిన దక్షిణాఫ్రికా మహిళల టీమ్ను సైతం కొనియాడారు.అయితే తమ టీమ్ రన్నరప్గా నిలవడంతో ప్రముఖ దక్షిణాఫ్రికా నటి స్పందించింది. సౌత్ఆఫ్రికాకు చెందిన ప్రముఖ నటి, రచయిత్రి తంజా వుర్ విన్నర్గా నిలిచిన భారత మహిళల టీమ్పై ప్రశంసలు కురిపించింది. అదే సమయంలో సొంత దేశంలోని పురుష క్రికెటర్లతో పాటు ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. భారతీయులు చూపించిన ప్రేమ, మద్దతు.. మన మహిళా క్రికెట్ జట్టుకు సౌతాఫ్రికన్స్ సపోర్ట్ ఇవ్వకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్లో వీడియో షేర్ చేస్తూ తన ఆవేదన వ్యక్తం చేసింది. భారతీయులు క్రీడల పట్ల చూపిస్తున్న ప్రేమ, మద్దతు మనవాళ్లకు ఎందుకు రాదని ప్రశ్నించింది.వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో మాజీ క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, వీవీఎస్ లక్ష్మణ్ మహిళా క్రికెటర్లను ఉత్సాహపరిచేందుకు స్టేడియానికి వచ్చారని కొనియాడింది. మరి దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్స్ ఎక్కడ? అని నిలదీసింది. ఎందుకంటే మీకు ఈ మ్యాచ్ అంత ముఖ్యం కాకపోవచ్చంటూ సౌతాఫ్రికా పురుష క్రికెటర్లను ఉద్దేశించి ఘాటుగా విమర్శించింది. సౌతాఫ్రికా క్రీడా మంత్రి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం.. మహిళల క్రీడల పట్ల తన దేశ వైఖరిని సోషల్ మీడియా వేదికగా ఎండగట్టింది.స్మృతి మంధానతో పాటు భారత మహిళ క్రికెటర్స్ చాలా బాగా ఆడారని తంజా వుర్ ప్రశంసలు కురిపించింది. భారతీయ అభిమానుల నమ్మకాన్ని ఆమె కొనియాడింది. ఇలాంటి మద్దతు టీమ్ ఇండియాకు బాాగా కలిసొచ్చిందని తంజా వుర్ తెలిపింది. ఏది ఏమైనా ఈ రోజు మీరు ఈ ప్రపంచ కప్ విజేతలు.. మీరు దానికి అర్హులు అంటూ టీమిండియాను ప్రశంసంచింది. కాగా.. ఈ ప్రతిష్టాత్మ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కు దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజ క్రికెటర్స్ జాక్వస్ కల్లిస్, ఏబీ డివిలియర్స్, గ్రేమ్ స్మిత్ లాంటి వాళ్లెవరూ కూడా స్టేడియంలో కనిపించలేదు. దీంతో నటికి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వీడియోను రిలీజ్ చేసింది. View this post on Instagram A post shared by Thanja Vuur 🔥 (@cape_town_cricket_queen) -
Women's World Cup: అమన్ కన్నీటి గాథ
భారత మహిళల క్రికెట్లో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఊరిస్తున్న వరల్డ్ కప్ టైటిల్ ఎట్టకేలకు మన అమ్మాయిల సొంతమైంది. ఆదివారం నవీ ముంబై వేదికగా జరిగిన ఫైనల్లో 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత జట్టు.. తొలిసారి వరల్డ్కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది.2005, 2017లో ఫైనల్స్లో ఓటమిని చవిచూసిన టీమిండియా.. మూడో ప్రయత్నంతో విశ్వవిజేతగా నిలిచింది. కాగా హర్మన్ సారథ్యంలోని భారత జట్టు తొలి వరల్డ్కప్ ట్రోఫీని సొంతం చేసుకోవడంలో ఆల్రౌండర్ అమన్జోత్ కౌర్ది కీలక పాత్ర. ఫైనల్లో అమన్జోత్ అద్బుతమైన క్యాచ్తో మ్యాచ్ను మలుపు తిప్పింది. సెంచరీతో కదం తొక్కి భారత బౌలర్లకు కొరకరాని కోయ్యిగా మారిన సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ను సంచలన క్యాచ్తో ఆమె పెవిలియన్కు పంపింది. ఈ ఒక్క క్యాచ్తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అయితే తన క్యాచ్తో భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించిన అమన్జోత్ కౌర్ వెనక ఆమె కుటుంబం చేసిన త్యాగం కూడా ఉంది. ప్రపంచకప్ వంటి వేదికలో తన బిడ్డ సత్తాచాటాలని ఆమె కుటుంబం ఎంతో బాధను దిగమింగారు.ఏమి జరిగిందంటే?ప్రపంచకప్ ప్రారంభమైన తర్వాత అమన్జోత్ కౌర్ వాళ్ల నానమ్మ భగవంతి(75) గుండెపోటుకు గురయ్యారు. అయితే అమన్జోత్ తన ఆటపై ఏకాగ్రత కోల్పోకూడదని ఆమె తండ్రి భూపిందర్ సింగ్తో సహా కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ఆమెకు చెప్పకుండా దాచారు. ఈ విషయాన్ని తాజాగా భూపిందర్ సింగ్ వెల్లడించారు. భారత్ విజయం సాధించిన వెంటనే అమన్జోత్ తండ్రి భావోద్వేగానికి లోనయ్యాడు. తన కుటుంబంతో కలిసి కన్నీళ్లు పెట్టుకున్నాడు.అమన్జోత్ ఈ స్దాయికి చేరుకుకోవడంలో మా అమ్మ భగవంతిది కీలక పాత్ర. అమన్ క్రికెట్ ఆడటం ప్రారంభించిన రోజు నుంచి మా అమ్మ ఆమెకు ఎంతో సపోర్ట్గా ఉండేది. అమన్ చిన్నతనంలో క్రికెట్ ఆడటానికి ఎక్కడికి వెళ్లినా మా అమ్మ తన వెనుక వెళ్లేది. అయితే గత నెలలో ఆమెకు గుండెపోటు వచ్చింది. ఈ విషయాన్ని మేము అమన్జోత్కు తెలియజేయలేదు. గత కొన్ని రోజులుగా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. ఇటువంటి కఠిన సమయంలో ప్రపంచ కప్ విజయం మాకు కాస్త ఉపశమనం కలిగించింది. ఈ విజయం గురుంచి మా అమ్మకు తెలియజేశాము. ఆమె వెంటనే కళ్లు తెరిచి చూసింది అని అని భూపిందర్ ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.ప్రస్తుతం అమన్ వాళ్ల నానమ్మ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. కాగా ఈ టోర్నమెంట్లో 7 మ్యాచ్లు ఆడిన అమన్జోత్.. 146 పరుగులు చేసి, 6 వికెట్లు పడగొట్టింది. ఫైనల్లో లారా వోల్వార్ట్ క్యాచ్తో అద్బుతమైన రనౌట్తో కూడా అమన్ మెరిసింది.చదవండి: ఆస్ట్రేలియా సెలెక్టర్ల కీలక నిర్ణయంAfter India’s World Cup triumph, cricketer Amanjot Kaur’s father grew emotional, expressing immense pride and joy over his daughter’s remarkable achievement.#WomensWorldCup2025 #WomenInBlue pic.twitter.com/Q1azAudoIj— Karan Verma (@Mekaranverma) November 2, 2025 -
ఊడ్చేసిన ఆఫ్ఘనిస్తాన్
ఆఫ్ఘనిస్తాన్ జట్టు జింబాబ్వేను (Afghanistan vs Zimbabwe) వారి సొంత గడ్డపై ఊడ్చేసింది. 3 మ్యాచ్ల సిరీస్ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది. నిన్న (నవంబర్ 2) జరిగిన నామమాత్రపు మూడో మ్యాచ్లో 9 పరుగుల తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (92), ఇబ్రహీం జద్రాన్ (60) చెలరేగారు. ఆఖర్లో సెదిఖుల్లా అటల్ (35 నాటౌట్) సైతం మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. జింబాబ్వే బౌలర్లలో ఈవాన్స్ 2, నగరవ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో జింబాబ్వే సైతం అద్భుతంగా పోరాడింది. నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసి 201 పరుగులకు ఆలౌటైంది. సికందర్ రజా (51), బ్రియాన్ బెన్నెట్ (47), ర్యాన్ బర్ల్ (37), ముసేకివా (28) పోరాడారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో అహ్మద్జాయ్ 3, ఫజల్ హక్ ఫారూకీ, ఫరీద్ అహ్మద్ మాలిక్ తలో 2, ముజీబ్, నబీ చెరో వికెట్ తీశారు.ఈ సిరీస్కు ముందు ఇరు జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో జింబాబ్వే ఇన్నింగ్స్ 73 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చదవండి: ఆస్ట్రేలియా సెలెక్టర్ల కీలక నిర్ణయం -
ఆస్ట్రేలియా సెలెక్టర్ల కీలక నిర్ణయం
నవంబర్ 6న గోల్డ్కోస్ట్ వేదికగా భారత్తో జరుగబోయే నాలుగో టీ20కి ముందు ఆస్ట్రేలియా సెలెక్టర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. విధ్వంసకర ఓపెనింగ్ బ్యాటర్ ట్రవిస్ హెడ్ను (Travis Head) జట్టు నుంచి విడుదల చేశారు. షెఫీల్డ్ షీల్డ్లో సౌత్ ఆస్ట్రేలియా తరఫున ఆడాలని ఆదేశించారు. ఆసీస్ సెలెక్టర్ల ఈ నిర్ణయం యాషెస్ సిరీస్ వ్యూహాల్లో భాగంగా తీసుకోబడింది. పని భారం తగ్గించే క్రమంలో హెడ్కు చివరి రెండు టీ20లకు విశ్రాంతి కల్పించారు. హెడ్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేస్తారో సెలెక్టర్లు చెప్పలేదు.అంతకుముందు మరికొందరు సీనియర్లను కూడా భారత్ను ఎదుర్కొనే టీ20 జట్టు నుంచి రిలీజ్ చేశారు. స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్వుడ్ షెఫీల్డ్ షీల్డ్లో న్యూసౌత్ వేల్స్ తరఫున ఆడతారు. కెమరూన్ గ్రీన్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించనున్నాడు.హెడ్ భారత్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో తొలి మూడు మ్యాచ్లు ఆడాడు. ఇందులో హెడ్ చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ చేయలేదు. రెండో టీ20లో 28, మూడో మ్యాచ్లో 6 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచిన హెడ్.. అంతకుముందు మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లోనూ దారుణంగా విఫలమయ్యాడు. వరుసగా 8, 28, 29 స్కోర్లు చేశాడు.కాగా, ప్రస్తుతం భారత్తో జరుగుతున్న సిరీస్లో ఆస్ట్రేలియా 1-1 సమంగా ఉంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20లో ఆస్ట్రేలియా, మూడో మ్యాచ్లో భారత్ గెలుపొందాయి.భారత్తో నాలుగు, ఐదు టీ20లకు ఆస్ట్రేలియా జట్టు..మిచెల్ మార్ష్, టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, మహ్లి బియర్డ్మన్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఇల్లిస్, జోష్ ఇంగ్లిస్, జోష్ ఫిలిప్, జేవియర్ బార్ట్లెట్, బెన్ డ్వార్షుయిస్, మాథ్యూ కుహ్నేమన్, ఆడమ్ జంపాచదవండి: విశ్వ విజేతల వెనుక త్యాగాల గాథ -
‘అడ్డంకులు తొలిగాయి.. లెజెండ్స్ పుట్టారు’
ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో లక్షలాది మంది అభిమానుల సమక్షంలో హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమ్ ఇండియా క్రికెట్ జట్టు, దక్షిణాఫ్రికా జట్టుపై 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంతో భారత్ మొదటిసారి ఐసీసీ మహిళల ప్రపంచ కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో టెక్ పరిశ్రమ దిగ్గజాలు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సోషల్ మీడియా వేదికగా ఇండియా జట్టును అభినందించారు.భారతదేశం ప్రతిష్టాత్మక క్రికెట్ విజయాలను గుర్తుచేస్తూ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ ఫైనల్ను ఉత్కంఠభరితమైన మ్యాచ్గా అభివర్ణించారు. ‘భారత క్రికెట్ మహిళల జట్టుకు అభినందనలు. ఈ విజయంతో 1983, 2011నాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ఈ విజయం మొత్తం తరానికి స్ఫూర్తినిస్తుందని అనుకుంటున్నాను. దక్షిణాఫ్రికా టీమ్కు కూడా ఇదో గొప్ప టోర్నమెంట్’ అని తన ఎక్స్ ఖాతాలో టీమ్ ఇండియాను అభినందించారు.మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఈ విజయంపై స్పందిస్తూ..‘ఉమెన్ ఇన్ బ్లూ = ప్రపంచ ఛాంపియన్లు! మహిళల క్రికెట్కు నిజంగా చారిత్రక రోజు. కొత్త అధ్యాయాలు లిఖించారు. అడ్డంకులు తొలిగాయి. లెజెండ్స్ పుట్టుకొచ్చారు. ఈ ఫార్మాట్లో తొలిసారి ఫైనల్కు చేరిన దక్షిణాఫ్రికాకు ప్రశంసలు’ అని రాసుకొచ్చారు.ఇదీ చదవండి: అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్పై ఈడీ చర్య -
విశ్వ విజేతల వెనుక త్యాగాల గాథ
2025, నవంబర్ 2. భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించిన రోజు. ఈ రోజు భారత్ తొలిసారి జగజ్జేతగా అవతరించింది. 2025 ఎడిషన్ వన్డే ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి ఛాంపియన్గా నిలిచింది. ఈ గెలుపుతో యావత్ భారతావణి ఉప్పొంగి పోయింది. భారత ఆటగాళ్ల ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి. తొలిసారి ప్రపంచకప్ గెలిచిన భారత క్రికెటర్లు కోట్లాది హృదయాలను గెలుచుకున్నారు. భారతీయుల ప్రపంచకప్ కలను సాకారం చేసిన టీమిండియా ప్లేయర్ల వెనుక ఎన్నో త్యాగాలు, పోరాటాలు, కన్నీరు, కలలు దాగి ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.హర్మన్ప్రీత్ కౌర్.. దూషించిన నోళ్లతోనే జేజేలు కొట్టించుకుందిపంజాబ్లోని మోగాలో జన్మించిన హర్మన్ప్రీత్, తండ్రి ప్రోత్సాహంతో క్రికెట్లోకి అడుగుపెట్టింది. 1983లో కపిల్ దేవ్ భారత జట్టుకు తొలి ప్రపంచకప్ అందించి, పురుషుల క్రికెట్లో కొత్త శకానికి నాంది పలికితే.. హర్మన్ 2025 ప్రపంచకప్ విక్టరీతో మహిళల క్రికెట్లో కొత్త శకాన్ని ప్రారంభించింది.హర్మన్ క్రీడల్లో అడుపెట్టాలనుకున్న అందరు అమ్మాయిల్లాగే చిన్నతనంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆమె భారత జట్టు కెప్టెన్గా ఎదిగి భారతీయుల ప్రపంచకప్ కలను సాకారం చేసింది. చిన్నతనంలో హర్మన్ అబ్బాయిలతో క్రికెట్ ఆడుతూ మెళకువల నేర్చుకుంది. గ్రామీణ నేపథ్యం నుంచి రావడంతో అబ్బాయిలతో క్రికెట్ ఏంటని బంధులందరూ ఆమెను దూషించారు. అయినా పట్టువదలని హర్మన్ అనుకున్నది సాధించి దూషించిన నోళ్లతోనే శభాష్ అనిపించుకుంది.Worked as a carpenter. Got taunted by many when young daughter started playing cricket with boys in the neighborhood. But he stood by her. Made her first bat with his own hands. Got her enrolled in an academy. Travelled far everyday to take her to training and decided to pick and https://t.co/fgmIiEAFtl— TheRandomCricketPhotosGuy (@RandomCricketP1) November 2, 2025అమన్జోత్ కౌర్.. కార్పెంటర్ తండ్రి కలను నెరవేర్చిన కూతురుక్రికెటర్గా అమన్జోత్ ప్రయాణం తండ్రి చెక్కిన బ్యాట్తో మొదలైంది. ఆమె తండ్రి ఓ కార్పెంటర్. బాల్యంలో అమన్జోత్ బాలురతో క్రికెట్ ఆడటాన్ని చూసి ఊరంతా విమర్శించేవారు. అయినా తండ్రి ఆమెను వెనకేసుకొచ్చేవాడు. రోజూ 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అమన్జోత్ను అకాడమీకి తీసుకెళ్లెవాడు. భారత జట్టు ప్రపంచకప్ గెలిచిన తర్వాత అమన్జోత్ తండ్రి ఆనంధానికి అవథుల్లేవు. “నా కూతురు గెలిచింది” అంటూ విజయ గర్వంతో ఊగిపోయాడు.Renuka's father passed away before she turned 3. He was such a cricket tragic that he named his son Vinod after Kambli. Renuka's mother encouraged her to take up the game despite being from a village in HP. Renuka showed her CWG Bronze to all the girls in her village. She will https://t.co/TBUEnQssJb— TheRandomCricketPhotosGuy (@RandomCricketP1) November 2, 2025రేణుకా సింగ్.. తల్లి త్యాగాన్ని, అన్న నమ్మకాన్ని నిలబెట్టిందిహిమాచల్ ప్రదేశ్లోని షిమ్లా జిల్లాలో జన్మించిన రేణుకా సింగ్కు మూడేళ్ల వయసుండగానే తండ్రి చనిపోయాడు. తల్లి సునీతా సింగే రేణుకా బాగోగులు చూసింది. రేణుకను క్రికెట్ అకాడమీకి పంపేందుకు సునీత ఎన్నో కష్టాలు పడింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం కావడంతో రేణుక కోసం తల్లి సునీత ఎన్నో త్యాగాలు చేసింది. రేణుక కోసం ఆమె అన్న వినోద్ కూడా క్రికెట్ను వదిలేశాడు. ఆర్దిక కష్టాలు ఉండటంతో ఇంట్లో ఒక్కరికే ఆకాడమీలో చేరే అవకాశం ఉండేది. రేణుక క్రికెట్లో రాణిస్తుండటంతో వినోద్ తన కలను చంపుకున్నాడు. చివరికి రేణుక ప్రపంచకప్ గెలిచిన జట్టులో కీలక సభ్యురాలిగా నిలిచి తల్లి, అన్నల త్యాగాలకు న్యాయం చేసింది.Comes from Bundelkhand, backwaters of Indian cricket. Played tennis ball cricket with boys in the neighborhood. Toiled hard in domestic cricket for years. Became a net bowler in 2024 for MI before UP Warriorz picked her in the auctions. Soon made her India debut, took a 6 wicket https://t.co/NO7T8nd9L1— TheRandomCricketPhotosGuy (@RandomCricketP1) November 2, 2025క్రాంతి గౌడ్.. పోలీస్ కానిస్టేబుల్ కూతురుమధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలోని ఘువారా అనే చిన్న పట్టణంలో జన్మించిన క్రాంతి గౌడ్ ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో కీలక సభ్యురాలిగా నిలిచింది. క్రాంతి తండ్రి ఓ రిటైర్డ్ పోలీస్ కానిస్టేబుల్. కుటుంబం ఆర్థికంగా వెనుకబడినప్పటికీ, క్రాంతికి క్రికెట్పై ఉన్న ఆసక్తిని చూసి తల్లిదండ్రులు ఆమెను ప్రోత్సహించారు. తండ్రి తన పెన్షన్తో ఆమెకు క్రికెట్ కిట్ కొనిపెట్టాడు. తల్లి రోజూ ప్రాక్టీస్కు తీసుకెళ్లేది.క్రాంతి చిన్నతనంలో అబ్బాయిలతో గల్లీ క్రికెట్ ఆడుతూ పెరిగింది. క్రాంతి క్రికెటర్ అవుతానంటే ఊరిలోని వారంతా నవ్వేవారు. ఇవాళ ఆమె ప్రపంచకప్లో భారత పేస్ బౌలింగ్ సెస్సేషన్గా నిలిచింది. టీమిండియా వరల్డ్కప్ గెలిచాక క్రాంతి సొంత ఊరిలో సంబరాలు అంబరాన్ని అంటాయి. #WATCH | Rohtak, Haryana | Cricketer Shafali Sharma's father says, "... It is all by the grace of god. We are thankful to the almighty... The whole nation was praying for our victory... By the grace of god, she has become the player of the match... The whole team worked hard to… https://t.co/uV2mBjIT6V pic.twitter.com/65nBhFfITq— ANI (@ANI) November 2, 2025షఫాలీ వర్మ.. బాలుడి వేషధారణలో..!షఫాలీ వర్మ హర్యానా రాష్ట్రంలోని రూథక్లో జన్మించింది. చిన్నతనం నుంచే ఆమెకు క్రికెట్పై ఆసక్తి పెరిగింది. కానీ స్థానిక అకాడమీలో అమ్మాయిలకు ప్రవేశం లేదు. దీంతో ఆమె బాలుడి వేషధారణలో, అన్న కోసం తయారు చేసిన జెర్సీ వేసుకుని ప్రాక్టీస్కి వెళ్లేది. షఫాలీ ఆర్థికంగా వెనుకపడిన కుటుంబం నుంచి వచ్చింది. తండ్రి సంజయ్ వర్మ ఎంతో కష్టపడి ఆమెను అకాడమీలో చేర్పించాడు. ఓ సమయంలో అతని దగ్గర షఫాలీకి కిట్ కొనిచ్చే స్తోమత కూడా లేకుండింది. ఇన్ని కష్టాలు ఎదుర్కొన్న షఫాలీ ఫైనల్లో 87 పరుగులు చేయడంతో పాటు 2 వికెట్లు తీసి, భారత్ను విశ్వ విజేతగా నిలపడంలో ప్రధానపాత్ర పోషించింది.#WATCH | Agra, UP | Celebrations erupt at cricketer Dipti Sharma's residence as India win the ICC Women's World Cup by defeating South Africa by 52 runs. pic.twitter.com/zTbGBH82gK— ANI (@ANI) November 2, 2025దీప్తి శర్మ.. రైల్వే ఉద్యోగి తండ్రి కలను నిజం చేసిన బౌలింగ్ సంచలనంఉత్తరప్రదేశ్లోని సాగర్జీ నగర్కు చెందిన దీప్తి, తన అన్నతో కలిసి క్రికెట్ ఆడుతూ పెరిగింది. తండ్రి రైల్వే ఉద్యోగి. అందరిలాగే అబ్బాయిలతో క్రికెట్ ఆడుతుండటంతో దీప్తి కూడా విమర్శలు ఎదుర్కొంది. అయినా తండ్రి ప్రోత్సాహంతో ముందడుగు వేసి, టీమిండియా ప్రపంచకప్ కలను సాకారం చేసింది. ఫైనల్లో దీప్తి అర్ద సెంచరీ సహా 5 వికెట్ల ప్రదర్శనను నమోదు చేసింది.జెమిమా రోడ్రిగ్స్.. మల్టీ టాలెంటెడ్ స్టార్సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై వీరోచిత శతకం బాది భారత్ను ఫైనల్కు చేర్చిన జెమిమా రోడ్రిగ్స్.. ముంబైలోని ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది. జెమిమా తండ్రి స్వయంగా కోచ్గా మారి ఆమెను ప్రాక్టీస్కు తీసుకెళ్లెవాడు. జెమిమాకు క్రికెట్తో పాటు సంగీతంలోనూ ప్రావీణ్యం ఉంది. ఆమె గిటార్ అద్భుతంగా వాయిస్తుంది. చదవండి: CWC25 Team India Prize Money: జగజ్జేత టీమిండియాకు భారీ నజరానా -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా కెప్టెన్.. వరల్డ్ రికార్డు బద్దలు
సౌతాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (Laura Wolvaardt) చరిత్ర సృష్టించింది. ఓ సింగిల్ వన్డే వరల్డ్కప్ (women's CWC) ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 2025 ఎడిషన్లో అరివీర భయంకరమైన ఫామ్లో ఉండిన లారా.. 9 మ్యాచ్ల్లో 2 సెంచరీలు, 3 అర్ద సెంచరీల సాయంతో 571 పరుగులు చేసింది. తద్వారా ఈ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలవడంతో పాటు ఓ సింగిల్ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గానూ ప్రపంచ రికార్డు సాధించింది. ఈ క్రమంలో లారా ఆస్ట్రేలియా కెప్టెన్ అలైస్సా హీలీ (Alyssa Healy) పేరిట ఉండిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. హీలీ 2022 ఎడిషన్లో 509 పరుగులు చేసింది.ఓ సింగిల్ వన్డే వరల్డ్కప్ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 ప్లేయర్లు..లారా వోల్వార్డ్ట్- 570 (2025)అలైస్సా హీలీ- 509 (2022)రేచల్ హేన్స్- 497 (2022)డెబ్బీ హాక్లీ- 456 (1997)లిండ్సే రీలర్- 448 (1989)సెమీస్, ఫైనల్స్లో సెంచరీలుతాజాగా ముగిసిన వన్డే ప్రపంచకప్ ఎడిషన్లో లారా అరివీర భయంకరమైన ఫామ్లో ఉండింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్, భారత్తో జరిగిన ఫైనల్స్లో అద్భుతమైన సెంచరీలు చేసింది. అలాగే భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్తో జరిగిన లీగ్ మ్యాచ్ల్లో అర్ద సెంచరీలు చేసింది. నిన్న జరిగిన ఫైనల్లో ఓ పక్క సహచరులంతా విఫలమైనా లారా ఒంటరిపోరాటం చేసి తన జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేసింది. ఈ ఇన్నింగ్స్తో ఆమె అందరి మన్ననలు అందుకుంది.మూడో ప్రయత్నంలోనూ..గడిచిన రెండేళ్లలో మూడు సార్లు (2023, 2024 టీ20 ప్రపంచకప్, 2025 వన్డే ప్రపంచకప్) వరల్డ్కప్ ఫైనల్స్కు చేరిన సౌతాఫ్రికా మహిళల జట్టు ఒక్కసారి కూడా ఛాంపియన్గా అవతరించలేకపోయింది. తాజాగా భారత్తో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఈ జట్టు 52 పరుగుల తేడాతో పరాజయంపాలై, రన్నరప్తో సరిపెట్టుకుంది. ఫైనల్లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన భారత్ తొలిసారి జగజ్జేతగా అవతరించింది.చెలరేగిన షఫాలీ, దీప్తి.. లారా ఒంటరి పోరాటం వృధాఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. షఫాలీ వర్మ (87), దీప్తి శర్మ (58), స్మృతి మంధన (45) సత్తా చాటి భారీ స్కోర్ (298/7) చేసింది. టార్గెట్ను కాపాడుకునే క్రమంలో దీప్తి శర్మ (9.3-0-39-5) చెలరేగడంతో సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (101) ఒంటరి పోరాటం చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. చదవండి: ఓటమి బాధ కలిగిస్తున్నా, గర్వంగా ఉంది: సౌతాఫ్రికా కెప్టెన్ లారా -
ఓటమి బాధ కలిగిస్తున్నా, గర్వంగా ఉంది: సౌతాఫ్రికా కెప్టెన్ లారా
నిన్న (నవంబర్ 2) జరిగిన వన్డే వరల్డ్కప్ 2025 (Women's CWC 2025) ఫైనల్లో సౌతాఫ్రికా భారత్ చేతిలో పరాజయంపాలై, రన్నరప్తో సరిపెట్టుకుంది. గత రెండేళ్లలో ఈ జట్టుకు ఇది వరుసగా మూడో ఫైనల్స్ పరాభవం. దీనికి ముందు 2023 (ఆస్ట్రేలియా చేతిలో), 2024 (న్యూజిలాండ్ చేతిలో) టీ20 ప్రపంచకప్ ఫైనల్స్లో ఓడింది.తాజా ఫైనల్స్ (India vs South Africa) పరాభవం తర్వాత సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (Laura Wolvaardt) తీవ్రమైన భావోద్వేగానికి లోనైంది. ఆమె మాటల్లో..“మా జట్టు పట్ల ఎంత గర్వంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. టోర్నీ ఆధ్యాంతం అద్భుతంగా ఆడాం. ఫైనల్లో భారత్ మా కంటే మెరుగ్గా ఆడింది. ఓటమి బాధ కలిగించినా, ఈ ప్రయాణం మాకు ఎంతో నేర్పింది. మరింత బలంగా తిరిగి వస్తాం.ఇంగ్లండ్, ఆస్ట్రేలియా చేతిలో ఓటములపై స్పందిస్తూ.. "ఓపెనింగ్ మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో, ఆతర్వాత ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాభవాలను సమర్దవంతంగా అధిగమించాం. కొన్ని మ్యాచ్లు అద్భుతంగా, కొన్ని బాగా కష్టంగా సాగుతాయి. ఈ టోర్నీలో చాలా మంది ఆటగాళ్లు మెరిశారు. ఫైనల్ వరకూ వచ్చామంటే, మా బలాన్ని చూపించాం”అంత ఈజీ కాదు..“కెప్టెన్సీ, బ్యాటింగ్ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం అంత సులభం కాదు. టోర్నమెంట్ ప్రారంభంలో నేను బాగా ఆడలేదు. కానీ చివర్లో ‘ఇది కూడా ఓ క్రికెట్ మ్యాచ్’ అని భావించి నా సహజ ఆటతీరును ప్రదర్శించగలిగాను”సరైన నిర్ణయమే..“టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయమే. 300 పరుగుల లక్ష్యం సాధ్యమే అనిపించింది. కానీ వికెట్లు ఎక్కువగా కోల్పోయాం”అద్భుతంగా పుంజుకున్నాం..“టీమిండియా 350 పరుగుల దిశగా వెళ్తోంది అనిపించింది. కానీ చివర్లో మా బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. టోర్నమెంట్ మొత్తం మా డెత్ ఓవర్ల బౌలింగ్ బలంగా ఉంది”షఫాలీ, కాప్ గురించి..“షఫాలీ బౌలింగ్లోనూ, బ్యాటింగ్లోనూ అద్భుతంగా రాణించింది. ఆమె ఆట చాలా అగ్రెసివ్గా ఉంటుంది. ఇవాళ అది బాగా వర్కౌట్ అయ్యింది. ఆమె ప్రత్యర్థిని గాయపరచగలదు”“మారిజాన్ కాప్ గురించి చెప్పాలంటే.. ఆమె ఇద్దరు ఆటగాళ్లతో సమానం. గతంలో చాలా వరల్డ్ కప్లలో అద్భుతంగా ఆడింది. ఇది ఆమె చివరి టోర్నీ కావడం బాధ కలిగిస్తుంది. ఆమె కోసమైనా ఈసారి ప్రపంచకప్ గెలవాలన్న తపన అందరిలోని ఉండింది”కాగా, నిన్న జరిగిన ఫైనల్లో భారత్ సౌతాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించి, తొలిసారి జగజ్జేతగా అవతరించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. షఫాలీ వర్మ (87), దీప్తి శర్మ (58), స్మృతి మంధన (45) సత్తా చాటి భారీ స్కోర్ (298/7) చేసింది. టార్గెట్ను కాపాడుకునే క్రమంలో దీప్తి శర్మ (9.3-0-39-5) చెలరేగడంతో సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (101) ఒంటరి పోరాటం చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. వోల్వార్డ్ట్ ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లోనూ సూపర్ సెంచరీతో (169) చెలరేగింది.చదవండి: హ్యాట్సాఫ్ మజుందార్ -
పాపం సౌతాఫ్రికా.. ఓడినా మనసులు గెలుచుకుంది..!
క్రికెట్ చరిత్రలో అత్యంత దురదృష్టవంతమైన జట్టు ఏదైనా ఉందా అంటే అది సౌతాఫ్రికానే (South Africa) అని చెప్పాలి. ఈ జట్టు పురుషుల, మహిళల విభాగాంలో సమానంగా దురదృష్టాన్ని షేర్ చేసుకుంటుంది. ఇటీవలికాలంలో ఏకంగా నాలుగు ప్రపంచకప్ ఫైనల్స్లో ఓడింది.తొలుత మహిళల జట్టు 2023 టీ20 వరల్డ్కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ఆ మరుసటి ఏడాదే (2024) మహిళల జట్టు మరోసారి టీ20 వరల్డ్కప్ ఫైనల్లో (న్యూజిలాండ్) చిత్తైంది. అదే ఏడాది (2024) పురుషుల జట్టుకు కూడా ఫైనల్లో (భారత్ చేతిలో) చుక్కెదురైంది. తాజాగా మహిళల జట్టు మరోసారి ఫైనల్లో ఓటమిపాలై, దురదృష్ట పరంపరను కొనసాగించింది.2025 వన్డే ప్రపంచకప్లో (Women's Cricket World Cup) భాగంగా నిన్న (నవంబర్ 2) జరిగిన ఫైనల్లో సౌతాఫ్రికా భారత్ చేతిలో 52 పరుగుల తేడాతో ఓడి, రన్నరప్తో సరిపెట్టుకుంది. ప్రపంచకప్ ప్రయాణంలో సౌతాఫ్రికా జట్టు రెండేళ్ల వ్యవధిలో నాలుగు సార్లు ఫైనల్కు చేరినప్పటికీ.. ఒక్కసారి కూడా ఛాంపియన్గా నిలవలేకపోయింది.ప్రపంచ కప్ టోర్నీల్లో సౌతాఫ్రికా జర్నీ క్రికెట్ అభిమానులను ఒకింత బాధకు గురి చేస్తుంది. పాపం సౌతాఫ్రికా.. అంటూ నెటిజన్లు సానుభూతి వ్యక్తపరుస్తున్నారు. తాజా ప్రయత్నంలో సౌతాఫ్రికా వీరోచితంగా పోరాడినప్పటికీ అంతిమ సమరంలో అద్భుతమైన క్రికెట్ ఆడిన భారత్ చేతిలో ఓడింది.ఈ ఎడిషన్లో సౌతాఫ్రికా సైతం అది నుంచి అద్భుతంగా ఆడింది. లీగ్ దశలో భారత్ సహా న్యూజిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ జట్లను ఓడించిన ఈ జట్టు (ఇంగ్లండ్, ఆస్ట్రేలియా చేతుల్లో మాత్రమే ఓడింది).. సెమీస్లో ఇంగ్లండ్పై అద్భుత విజయం సాధించి ఫైనల్కు చేరింది. ఫైనల్లోనూ సౌతాఫ్రికా అంత ఈజీగా ఓటమిని ఒప్పుకోలేదు. తొలుత బౌలింగ్ చేసి భారీ స్కోర్ (298) ఇచ్చినప్పటికీ.. దాన్ని ఛేదించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. అరివీర భయంకరమైన ఫామ్లో ఉన్న వారి కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (101) మరోసారి శతకంతో విజృంభించింది. అయితే ఆమెకు మరో ఎండ్ నుంచి సరైన సహకారం లభించలేదు. దీంతో ఓటమి తప్పలేదు.భారత బౌలర్లు, ముఖ్యంగా స్పిన్నర్లు దీప్తి శర్మ (9.3-0-39-5), షఫాలీ వర్మ (7-0-36-2), శ్రీచరణి (9-0-48-1) మ్యాజిక్ చేసి భారత్కు చరిత్రాత్మక విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా ఓడినా హుందాగా ప్రవర్తించి అందరి మన్ననలు అందుకుంది. అత్యుత్తమ క్రికెట్ ఆడిన జట్టు చేతిలో ఓడామని సర్ది చెప్పుకుంది. చదవండి: జగజ్జేత టీమిండియాకు భారీ నజరానా -
విశ్వవిజేతగా నిలిచేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి: టీమిండియా కెప్టెన్
విశ్వవిజేతగా (Women's CWC 2025) నిలిచేందుకు భారత మహిళా క్రికెట్ జట్టుకు (Team India) అన్ని అర్హతలు ఉన్నాయని కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) అభిప్రాయపడింది. 2025 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో సౌతాఫ్రికాపై విజయం అనంతరం హర్మన్ మాట్లాడుతూ ఇలా అంది."వరుసగా మూడు ఓటముల తర్వాత కూడా ఏదైనా అద్భుతం చేయగలమని మేం నమ్మాం. పగలు, రాత్రి శ్రమించిన ఈ జట్టుకు విశ్వ విజేతగా నిలిచేందుకు అన్ని అర్హతలూ ఉన్నాయి.బ్యాటింగ్లో షఫాలీ చూపించిన ఆత్మవిశ్వాసాన్ని బట్టి ఆమెకు బౌలింగ్లో కూడా రాణిస్తుందని భావించా. అదే మలుపుగా మారింది. ఈ రోజు పిచ్ సెమీస్కంటే భిన్నమైంది.ఫైనల్లో ఉండే ఒత్తిడి వల్ల మేం చేసిన స్కోరు సరిపోతుందని తెలుసు. దక్షిణాఫ్రికా బాగానే ఆడినా చివర్లో ఒత్తిడి పెంచుకుంది. దానిని మేం సరైన విధంగా వాడుకున్నాం.ప్రతీ ప్రపంచ కప్ ముగిసిన తర్వాత మేం వచ్చే సారైనా ఎలా గెలవాలి అనే విషయం చర్చించుకునేవాళ్లం. గత రెండేళ్లలో కోచ్ అమోల్ మజుందార్ నేతృత్వంలో మా సన్నాహకాలు చాలా బాగా సాగాయి. తుది జట్టులో మేం పెద్దగా మార్పులు చేయకుండా ప్రతీ మ్యాచ్లో వారిపై నమ్మకం ఉంచాం.ఇది ఆరంభం మాత్రమే. మున్ముందు ఇలాంటి విజయాలను అలవాటుగా మార్చుకోవాలనుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని పెద్ద టోర్నీలు ఉన్నాయి. అక్కడా ఇదే జోరు కొనసాగాలి.మ్యాచ్ ఆసాంతం మైదానంలో అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు"కాగా, నిన్న జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్లో భారత్ సౌతాఫ్రికాపై 52 పరుగుల తేడాతో గెలుపొంది, తొలిసారి ప్రపంచ ఛాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టి సౌతాఫ్రికాను చిత్తు చేసింది.తొలుత బ్యాటింగ్లో షఫాలీ వర్మ (87), దీప్తి శర్మ (58), స్మృతి మంధన (45) సత్తా చాటి భారత్కు భారీ స్కోర్ (298/7) అందించగా.. టార్గెట్ను కాపాడుకునే క్రమంలో దీప్తి శర్మ (9.3-0-39-5) చెలరేగిపోయింది. ఫలితంగా సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ లారా వోల్వర్డ్ట్ (101) ఒంటరి పోరాటం చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. చదవండి: జగజ్జేత టీమిండియాకు భారీ నజరానా -
జగజ్జేత టీమిండియాకు భారీ నజరానా
తొలిసారి వన్డే ప్రపంచకప్ (Women's Cricket World Cup 2025 Winner Prize Money) గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టుకు (Team India) భారీ నజరానా (Prize Money) లభించింది. జగజ్జేత భారత్కు రికార్డు స్థాయిలో 44 లక్షల 80 వేల డాలర్లు (రూ. 39 కోట్ల 80 లక్షలు) ప్రైజ్మనీ అందింది. రన్నరప్గా నిలిచిన దక్షిణాఫ్రికా జట్టుకు 22 లక్షల 40 వేల డాలర్లు (రూ. 19 కోట్ల 90 లక్షలు) లభించాయి.సెమీఫైనల్లో ఓడిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల ఖాతాలో 11 లక్షల 20 వేల డాలర్ల (రూ. 9 కోట్ల 94 లక్షలు) చొప్పున చేరాయి. ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన శ్రీలంక, న్యూజిలాండ్ జట్లకు 7 లక్షల డాలర్ల (రూ. 6 కోట్ల 21 లక్షలు) చొప్పున... ఏడు, ఎనిమిదో స్థానాల్లో నిలిచిన బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లకు 2 లక్షల 80 వేల డాలర్ల (రూ. 2 కోట్ల 48 లక్షలు) చొప్పున లభించాయి.అంతేకాకుండా ఈ మెగా ఈవెంట్లో ఆడిన ఎనిమిది జట్లకు గ్యారంటీ మనీ కింద 2 లక్షల 50 వేల డాలర్ల (రూ. 2 కోట్ల 22 లక్షలు) చొప్పున దక్కాయి. లీగ్ దశలో సాధించిన ఒక్కో విజయానికి ఆయా జట్లకు 34 వేల 314 డాలర్ల (రూ. 30 లక్షల 47 వేలు) చొప్పున లభించాయి. 300 శాతం పెరిగిన ప్రైజ్మనీవన్డే ప్రపంచకప్ విజేతకు లభించే ప్రైజ్మనీ ఈసారి 300 శాతం పెరిగింది. ఐసీసీ అధ్యక్షుడు జై షా ఈ పెంపును అమల్లోకి తెచ్చారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.బీసీసీఐ భారీ నజరానావరల్డ్కప్ విజేత భారత్కు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. జగజ్జేత టీమిండియాకు రూ. 51 కోట్లు బహుమతిగా ఇవ్వనున్నట్లు సైకియా తెలిపారు. ఈ బహుమతిని జట్టులోని ఆటగాళ్లు, కోచ్లు, సపోర్ట్ స్టాఫ్ పంచుకుంటారని అన్నారు.కాగా, నిన్న జరిగిన ఫైనల్లో భారత్ సౌతాఫ్రికాపై 52 పరుగుల తేడాతో గెలుపొంది, వన్డే ప్రపంచ ఛాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టి సౌతాఫ్రికాను చిత్తు చేసింది.తొలుత బ్యాటింగ్లో షఫాలీ వర్మ (87), దీప్తి శర్మ (58), స్మృతి మంధన (45) సత్తా చాటి భారత్కు భారీ స్కోర్ (298/7) అందించగా.. టార్గెట్ను కాపాడుకునే క్రమంలో దీప్తి శర్మ (9.3-0-39-5) చెలరేగిపోయింది. ఫలితంగా సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ లారా వోల్వర్డ్ట్ (101) ఒంటరి పోరాటం చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. చదవండి: హ్యాట్సాఫ్ మజుందార్ -
హ్యాట్సాఫ్ మజుందార్
దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ఆటలో రికార్డు స్థాయిలో పరుగులు సాధించిన తర్వాత కూడా దేశానికి ప్రాతినిధ్యం వహించని దురదృష్టవంతుల్లో అమోల్ మజుందార్ పేరు ఉంటుంది. ముంబైకి చెందిన 51 ఏళ్ల మజుందార్ 171 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో 30 సెంచరీలు సహా 11,167 పరుగులు సాధించాడు. అయితే ఏనాడూ భారత్కు ఆడే అవకాశం రాలేదు. ఈ దేశవాళీ దిగ్గజం కోచ్గా తన రెండో ఇన్నింగ్స్లో మర్చిపోలేని ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.రెండేళ్ల క్రితం మహిళల టీమ్కు కోచ్గా వచ్చిన తర్వాత ఆయన నేతృత్వంలో జట్టు ఎంతో రాటుదేలింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ బలంగా నిలబడిన మజుందార్ జట్టుకు మద్దతుగా నిలుస్తూ తన ప్లేయర్లపై నమ్మకం ఉంచాడు. ఆయన నమ్మిన ప్లేయర్లు ఇప్పుడు దానిని నిలబెట్టారు. చాంపియన్గా నిలిచి కోచ్కు కానుక అందించారు. ఫైనల్కు ముందు వేడుకలతో వేదికొక్కటే మెరిసింది. స్టేడియం వెలుగుజిలుగుల సవ్వడి చేసింది. పోరు మొదలయ్యాక భారత మహిళల హోరు కొనసాగింది. మ్యాచ్ గెలిచాక... ప్రపంచకప్ చేతికందాక... యావత్ భారతావని పండగ చేసుకుంది. నడిరాతిరంతా సంతోషాల జాతర చేసుకుంది. తెల్లవారేదాకా ఊరు వాడ తేడానే లేకుండా గల్లీ నుంచి ఢిల్లీ దాకా గెలుపు మురిపెంగా... మూడు రంగుల పతాకాలు, జయజయధ్వానాలే వినిపించాయి. కనిపించాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా అతిరథమహారథులంతా మహిళల విజయాన్ని వేనోళ్ల ప్రశంసలతో ముంచెత్తారు. హర్మన్ సేన పోరాటాన్ని ఆకాశానికెత్తారు. -
తొలి రౌండ్లోనే దివ్య నిష్క్రమణ
పనాజీ: ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగిన భారత గ్రాండ్మాస్టర్, మహిళల ప్రపంచకప్ విజేత దివ్య దేశ్ముఖ్... స్వదేశంలో జరుగుతున్న పురుషుల ప్రపంచకప్ టోర్నీలో తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. ఈ టోర్నీలో పోటీపడుతున్న 206 మంది క్రీడాకారుల్లో ఏకైక మహిళా క్రీడాకారిణి అయిన దివ్య ఆడిన రెండు గేముల్లోనూ ఓడిపోయింది. గ్రీస్ గ్రాండ్మాస్టర్ అర్డిటిస్ స్టామటిస్ 2–0తో దివ్య దేశ్ముఖ్ను ఓడించి రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. శనివారం జరిగిన తొలి రౌండ్ తొలి గేమ్లో 41 ఎత్తుల్లో ఓడిపోయిన దివ్య... టోర్నీలో నిలవాలంటే ఆదివారం జరిగిన రెండో గేమ్లో కచ్చితంగా గెలవాల్సింది. అయితే రెండో గేమ్లో దివ్య 71 ఎత్తుల్లో పరాజయం పాలైంది. మరోవైపు భారత పురుష గ్రాండ్మాస్టర్లు కార్తీక్ వెంకటరామన్ (ఆంధ్రప్రదేశ్), ప్రణవ్ (తమిళనాడు), రౌనక్ సాధ్వాని (మహారాష్ట్ర), ప్రాణేశ్ (తమిళనాడు), ఇనియన్ (తమిళనాడు), సూర్యశేఖర గంగూలీ (బెంగాల్) తొలి రౌండ్లో విజయం సాధించి రెండో రౌండ్లోకి దూసుకెళ్లారు. ప్రణవ్ 2–0తో బుల్రెన్స్ (అల్జీరియా)పై, రౌనక్ 1.5–0.5తో డానియల్ బారిష్ (దక్షిణాఫ్రికా)పై, ప్రాణేశ్ 2–0తో సత్బేక్ (కజకిస్తాన్)పై, ఇనియన్ 1.5–0.5తో బెర్దాయెస్ (క్యూబా)పై, కార్తీక్ వెంకటరామన్ 1.5–0.5తో రొబెర్టో గార్సియా (కొలంబియా)పై, సూర్యశేఖర గంగూలీ 2–0తో అహ్మదాజాదా అహ్మద్ (అజర్బైజాన్)పై గెలుపొందారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ఎంఆర్ లలిత్బాబు, తెలంగాణ గ్రాండ్మాస్టర్ రాజా రిత్విక్, ఎస్ఎల్ నారాయణన్, దీప్తాయన్ ఘోష్ భవితవ్యం నేడు తేలనుంది. ఈ నలుగురు ఈరోజు జరిగే టైబ్రేక్ గేముల్లో తలపడతారు. మాక్స్ వెర్మెర్డామ్ (నెదర్లాండ్స్)–లలిత్ బాబు; నొగెర్బెక్ కాజీబెక్ (కజకిస్తాన్)–రాజా రిత్విక్ మధ్య జరిగిన నిర్ణీత రెండు గేమ్లు ‘డ్రా’గా ముగియడంతో 1–1తో సమంగా ఉన్నారు. భారత్కే చెందిన గ్రాండ్మాస్టర్లు లియోన్ మెండోంకా, నీలేశ్ సాహా తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. లియోన్ 0.5–1.5తో వాంగ్ షిజు (చైనా) చేతిలో, నీలేశ్ 0.5–1.5తో మియెర్ జార్జి (ఉక్రెయిన్) చేతిలో ఓడిపోయారు. -
23 ఏళ్ల తర్వాత...
చెన్నై: అంచనాలకు మించి రాణించిన ఇండోనేసియా క్రీడాకారిణి జనిస్ జెన్ తన కెరీర్లో తొలి మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ)–250 టూర్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఎంజెలిక్ విద్జాజా (2002లో పట్టాయా ఓపెన్) తర్వాత డబ్ల్యూటీఏ సింగిల్స్ టైటిల్ నెగ్గిన ఇండోనేసియా క్రీడాకారిణిగా జనిస్ గుర్తింపు పొందింది. ఆదివారం ముగిసిన చెన్నై ఓపెన్ డబ్ల్యూటీఏ–250 టోర్నీలో ప్రపంచ 82వ ర్యాంకర్ జనిస్ జెన్ విజేతగా అవతరించింది. రెండు గంటలపాటు జరిగిన ఫైనల్లో నాలుగో సీడ్ జనిస్ జెన్ 6–3, 6–4తో ఏడో సీడ్ కింబర్లీ బిరెల్ (ఆ్రస్టేలియా)పై నెగ్గింది. విజేతగా నిలిచిన జనిస్ జెన్కు 36,300 డాలర్ల (రూ. 32 లక్షల 26 వేలు) ప్రైజ్మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ముఖ్యఅతిథిగా విచ్చేసి విన్నర్, రన్నరప్లకు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్, భారత టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ఓటముల నుంచి ఉవ్వెత్తున ఎగసి...
ఎనిమిదేళ్ల క్రితం... వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లండ్పై 229 పరుగుల లక్ష్య ఛేదనలో చివర్లో తడబడిన భారత మహిళలు 9 పరుగుల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఆఖరి 3 ఓవర్లలో 3 వికెట్లతో 14 పరుగుల చేయాల్సిన స్థితిలో అంత చేరువగా వచ్చి ఓడటం అందరినీ వేదనకు గురి చేసింది. అయితే 2017 వరల్డ్ కప్ ప్రదర్శన గతంతో పోలిస్తే మహిళల జట్టుకు ఎంతో మేలు చేసింది. అన్ని వైపుల ఆసక్తి కనిపించడంతో పాటు టీమ్ స్థాయి కూడా పెరిగింది. ప్రతీ దశలో బీసీసీఐ అన్ని రకాలుగా ప్రోత్సాహం ఇస్తూ టీమ్కు తగిన అవకాశాలు కల్పించింది. అయినా సరే, 2021 వరల్డ్ కప్ మరోసారి నిరాశను మిగిల్చింది. ఈ టోర్నీలో భారత్ సెమీస్కు కూడా చేరలేకపోయింది. దీని తర్వాత మళ్లీ కొత్తగా మొదలు పెట్టాల్సి వచ్చింది. సీనియర్ ప్లేయర్ మిథాలీ రాజ్ రిటైర్మెంట్ తర్వాత హర్మన్ప్రీత్ చేతుల్లోకి వన్డే టీమ్ సారథ్య బాధ్యతలు వచ్చాయి. సరిగ్గా రెండేళ్ల క్రితం అమోల్ మజుందార్ను హెడ్ కోచ్గా ఎంపిక చేసిన తర్వాత టీమ్లో అసలైన మార్పు మొదలైంది. ఆ సమయంలో వేరే ఆలోచన లేకుండా 2025 వరల్డ్ కప్ కోసమే పక్కా ప్రణాళికతో జట్టు సన్నద్ధమైంది. టోర్నీ వేదిక భారత్ కావడంతో దానికి అనుగుణంగా జట్టును తీర్చిదిద్దేందుకు టీమ్ మేనేజ్మెంట్ ప్రయత్నించింది. 2023లో పూర్తి స్థాయిలో వచ్చిన ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్రభావం కూడా టీమ్పై కనిపించింది. ఈ లీగ్ మన ప్లేయర్లకు కూడా పరిమిత ఓవర్ల క్రికెట్లో దూకుడు నేర్పించింది. అప్పుడప్పుడు కొన్ని ఓటములు వచ్చినా ప్రత్యర్థులు తేలిగ్గా తీసుకునే పరిస్థితిలో మార్పు కూడా కనిపించింది. ప్రత్యేక శిబిరాలు, ఎక్కువ విరామం లేకుండా వరుసగా వేర్వేరు జట్లతో సిరీస్లు భారత్ ఆటను మరింత పదునుగా మార్చాయి. గత రెండేళ్లలో ఇది క్రమ పద్ధతిలో సాగింది. బలమైన ప్రత్యర్థులైన ఆ్రస్టేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలపై జట్టు చెప్పుకోదగ్గ విజయాలు సాధించింది. ఇటీవలే ఇంగ్లండ్ను వారి సొంతగడ్డపైనే ఓడించి సిరీస్ గెలవడం టీమ్లో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. సరిగ్గా టోర్నీకి ముందు స్వదేశంలోనే జరిగిన సిరీస్లో ఆ్రస్టేలియాతో ఓడినా... మన జట్టు కూడా బలమైన ప్రదర్శనే ఇచ్చింది. ముఖ్యంగా మూడో వన్డేలో 412 పరుగుల లక్ష్య ఛేదనలో ఏకంగా 369 పరుగులు చేయగలిగింది. ఇదే మ్యాచ్ సెమీస్లో ఆసీస్పై విజయానికి స్ఫూర్తినిచ్చిందనడంలో సందేహం లేదు. జట్టులోని ప్రతీ ఒక్కరు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. 434 పరుగులతో ఎప్పటిలాగే స్మృతి జట్టు నంబర్వన్ బ్యాటర్గా తన స్థాయిని ప్రదర్శించగా, గాయంతో 7 మ్యాచ్లకే పరిమితమైన ప్రతీక 308 పరుగులు సాధించింది. విజయం సాధించిన తర్వాత వీల్చైర్లో కూర్చొని ఆమె సంబరాల్లో పాల్గొనడం సగటు అభిమానులందరికీ సంతృప్తినిచ్చింది. జెమీమా 292 పరుగులే చేసినా, ఆసీస్పై సెమీఫైనల్లో ఆడిన ఇన్నింగ్స్ను ఆమెను చిరస్థాయిగా నిలబెట్టింది. రిచా ఘోష్ ఏకంగా 133.52 స్ట్రయిక్రేట్తో చేసిన 235 పరుగులు జట్టుకు ప్రతీసారి కావాల్సిన జోరును అందించాయి. 260 పరుగులు చేసిన హర్మన్ నాయకురాలిగా జట్టును సమర్థంగా నడిపించింది. సెమీస్ ఆడిన ఇన్నింగ్స్ కూడా ఆమె స్థాయిని చూపించింది. కెప్టెన్గా సాధించిన ఈ గెలుపుతో భారత క్రికెట్లో ఆమె దిగ్గజాల సరసన నిలిచింది. బౌలింగ్లో దీప్తి శర్మ 22 వికెట్లతో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా విజయంలో ప్రధాన భూమిక పోషించింది. ముఖ్యంగా ఫైనల్లో తీసిన ఐదు వికెట్లు ఎప్పటికీ మర్చిపోలేనివి. బ్యాటింగ్లో కూడా ఆమె 3 అర్ధసెంచరీలు సాధించింది. రేణుక, క్రాంతి, అమన్జోత్, రాధ అంకెలపరంగా పెద్ద గణాంకాలు నమోదు చేయకపోయినా... జట్టుకు అవసరమైన ప్రతీసారి కీలక సమయంలో తామున్నామంటూ ముందుకు వచ్చారు. ఇదే జట్టును నడిపించింది. లీగ్ దశలో వరుసగా దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా, ఇంగ్లండ్లాంటి చేతుల్లో ఓడి ఒక్కసారిగా జట్టు నిరాశలో కూరుకుపోయింది. అన్నివైపుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఎన్ని సౌకర్యాలు కల్పించినా ఆట మాత్రం మారడం లేదని సూటిపోటు మాటలు వినిపించాయి. కానీ అక్కడినుంచి టీమ్ ఉవ్వెత్తున ఎగసింది. సెమీస్ స్థానం ఖాయం చేసుకోవడంతో పాటు సెమీస్, ఫైనల్ మ్యాచ్లలో అద్భుత విజయాలతో చాంపియన్గా నిలిచింది. ఈ అసాధారణ, అద్భుత ప్రదర్శనకు దేశం మొత్తం సలామ్ చేస్తోంది. -
IND W Vs SA W: మన అమ్మాయిల మహాద్భుతం
మన అతివల ఆట అంబరాన్ని తాకింది... ఆకాశమంత అంచనాలతో బరిలోకి దిగిన భారత బృందం వాటిని అందుకొని అందనంత ఎత్తులో నిలిచింది... గతంలో రెండుసార్లు అందినట్లుగా అంది చేజారిన వన్డే వరల్డ్ కప్ను ఎట్టకేలకు మూడో ప్రయత్నంలో ముద్దాడింది... ఆఖరి సమరంలో అద్భుత ప్రదర్శనను కనబర్చిన మన అమ్మాయిలు విశ్వ విజేతలుగా శిఖరానికి చేరారు... ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు... సమష్టిగా చెలరేగిన టీమిండియా ప్రపంచ కప్ను సగర్వంగా ఎత్తుకుంది. ఈ ప్రపంచకప్ గెలుపు సాధారణమైంది కాదు. మన మహిళల క్రికెట్ను మరింత పెద్ద స్ధాయికి చేర్చే పునాదిరాయి. పురుషుల క్రికెట్లో 1983 వరల్డ్ కప్ గెలుపునకు సమానంగా మన అమ్మాయిల జట్టు రాత మార్చే అరుదైన ఘట్టం. దాదాపు 40 వేల మంది ప్రేక్షకులతో మైదానం నీలి సముద్రంగా మారిపోగా... ఆసక్తిగా సాగిన ఫైనల్లో బ్యాటింగ్లో షఫాలీ వర్మ, దీప్తి శర్మ, స్మృతి మంధాన భారీ స్కోరుకు బాటలు వేసి ప్రత్యర్థికి సవాల్ విసరగా... బౌలింగ్లోనూ దీప్తి, షఫాలీ సత్తా చాటి విజయానికి బాటలు పరిచారు. అభిమానులు అండగా నిలుస్తూ మైదానాన్ని హోరెత్తిస్తుండగా... 46వ ఓవర్ మూడో బంతికి డిక్లెర్క్ షాట్ కొట్టగా, కవర్స్లో కెప్టెన్హర్మన్ప్రీత్ క్యాచ్ అందుకొని విజయధ్వానం చేయడం టోర్నీకి లభించిన సరైన ముగింపు. ముంబై: భారత మహిళల జట్టు వన్డే వరల్డ్ కప్ను గెలుచుకొని విశ్వ విజేతగా నిలిచింది. టీమిండియా ఈ టైటిల్ సాధించడం ఇదే మొదటిసారి. ఆదివారం డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత్ 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. షఫాలీ వర్మ (78 బంతుల్లో 87; 7 ఫోర్లు, 2 సిక్స్లు), దీప్తి శర్మ (58 బంతుల్లో 58; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించగా...స్మృతి మంధాన (58 బంతుల్లో 45; 8 ఫోర్లు) రాణించింది. షఫాలీ, స్మృతి తొలి వికెట్కు 106 బంతుల్లో 104 పరుగులు జోడించారు. అనంతరం దక్షిణాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్లారా వోల్వార్ట్ (98 బంతుల్లో 101; 11 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే సెంచరీతో ఒంటరి పోరాటం చేసింది. దీప్తి శర్మ (5/39) ఐదు వికెట్లతో ప్రత్యర్థిని కుప్పకూల్చగా, షఫాలీ 2 వికెట్లతో కీలక పాత్ర పోషించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్ మ్యాచ్’ పురస్కారం షఫాలీ వర్మకు... ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు దీప్తి శర్మకు లభించాయి. భారీ ఓపెనింగ్ భాగస్వామ్యం... టోర్నీలో గత మ్యాచ్లతో పోలిస్తే ఈసారి భారత్కు మరింత మెరుగైన ఆరంభం లభించింది. సెమీస్లో విఫలమైన షఫాలీ ధాటిగా మొదలు పెట్టగా, స్మృతి కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడింది. కాప్ వేసిన మొదటి ఓవర్ మెయిడిన్గా ముగిసినా... తర్వాత భారత బ్యాటర్లిద్దరూ జోరు ప్రదర్శించారు. 10 ఓవర్లు ముగిసేసరికి ఇద్దరూ చెరో 5 ఫోర్లు బాదగా, స్కోరు 64 పరుగులకు చేరింది. ఈ ప్రపంచకప్లో భారత్కు ఇదే అత్యుత్తమ పవర్ప్లే స్కోరు. 17.2 ఓవర్లలో స్కోరు 100కు చేరగా, ఆ తర్వాత ట్రయాన్ తొలి ఓవర్లోనే స్మృతిని అవుట్ చేయడంతో ఈ భాగస్వామ్యానికి తెర పడింది. 49 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం షఫాలీ మరింత వేగంగా ఆడే ప్రయత్నం చేసింది. అయితే సెంచరీకి చేరువవుతున్న దశలో అలసటతో ఇబ్బంది పడిన ఆమె వికెట్ సమర్పించుకుంది. జెమీమా రోడ్రిగ్స్ (37 బంతుల్లో 24; 1 ఫోర్), హర్మన్ప్రీత్ కౌర్ (29 బంతుల్లో 20; 2 ఫోర్లు) విఫలమయ్యారు. ముఖ్యంగా ఎంలాబా చక్కటి బంతితో హర్మన్ను బౌల్డ్ చేయడంతో సఫారీలకు పైచేయి సాధించే అవకాశం దక్కింది. దీప్తి భారీ షాట్లకంటే సింగిల్స్పైనే ఎక్కువ దృష్టి పెట్టగా, అమన్జోత్ (14 బంతుల్లో 12; 1 ఫోర్) విఫలమైంది. అయితే రిచా ఘోష్ (24 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్స్లు) క్రీజ్లో ఉన్నంత సేపు తనదైన శైలిలో దూకుడుగా ఆడటంతో జట్టు చెప్పుకోదగ్గ స్కోరు సాధించగలిగింది. కెప్టెన్ మినహా.. ఛేదనను వోల్వార్ట్, బ్రిట్స్ (35 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) ఎలాంటి సాహసాలకు పోకుండా జాగ్రత్తగా ప్రారంభించారు. పవర్ప్లే ముగిసేసరికి జట్టు 52 పరుగులు చేసింది. అయితే 10వ ఓవర్లో అనవసరపు సింగిల్కు ప్రయత్నించిన బ్రిట్స్ను అమన్జోత్ డైరెక్ట్ త్రోతో రనౌట్ చేయడంతో జట్టు వికెట్ల పతనం మొదలైంది. అనెక్ బాష్ను (0) తన తొలి ఓవర్లోనే అవుట్ చేసి శ్రీచరణి మళ్లీ దెబ్బ తీసింది. 21వ ఓవర్లో పార్ట్టైమర్ షఫాలీని బౌలింగ్కు దించడం భారత్కు కలిసొచ్చింది. 9 పరుగుల వ్యవధిలో లూస్ (31 బంతుల్లో 25; 4 ఫోర్లు), కాప్ (4)లను షఫాలీ అవుట్ చేసింది. ఒకవైపు వోల్వార్ట్ పోరాడుతున్నా...మరో ఎండ్లో వరుసగా వికెట్లు పడ్డాయి. డెర్క్సెన్ (37 బంతుల్లో 35; 1 ఫోర్, 2 సిక్స్లు) కొద్ది సేపు సహకరించినా లాభం లేకపోయింది. 96 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం వోల్వార్ట్ వెనుదిరగడంతో సఫారీ ఓటమి లాంఛనమే అయింది. మన చరణి బంగారం... ప్రపంచకప్కు ముందు 9 వన్డేలు ఆడి ఆకట్టుకున్న ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి ప్రపంచకప్లో చోటు దక్కించుకోగలిగింది. ప్రపంచకప్లో ప్రతీ మ్యాచ్లో సత్తా చాటింది. కడప జిల్లాకు చెందిన 21 ఏళ్ల చరణి తన లెఫ్టార్మ్ స్పిన్నర్తో ప్రత్యర్థులందరినీ కట్టి పడేసింది. తొలి సారి ఆడిన ప్రపంచ కప్లో విజేతగా నిలిచిన జట్టులో సభ్యురాలిగా ఘనతను సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో 9 మ్యాచ్లలో 27.64 సగటుతో ఆమె 14 వికెట్లు పడగొట్టి భారత్ తరఫున రెండో అత్యుత్తమ బౌలర్గా నిలిచింది. ఐదుకంటే తక్కువ ఎకానమీ (4.96)తో ఆమె పరుగులు ఇచ్చింది. హైదరాబాద్కే చెందిన అరుంధతి రెడ్డి కూడా భారత విశ్వవిజేత జట్టులో సభ్యురాలిగా ఉంది. షఫాలీ సూపర్.... ‘నన్ను దేవుడు ఒక ప్రత్యేక పని కోసమే ఇక్కడికి పంపించినట్లున్నాడు’... ఫైనల్ తర్వాత షఫాలీ వర్మ వ్యాఖ్య ఇది. నిజంగానే అనుకోకుండా కలిసి వచ్చిన అదృష్టంతో జట్టులోకి వచ్చిన ఆమె తాను అరుదైన ఘనతను నమోదు చేసి చూపించింది. ప్రతీక రావల్తో హడావిడిగా షఫాలీని సెమీస్కు ముందు టీమ్లోకి చేర్చారు. సెమీస్లో విఫలమైనా... ఫైనల్లో చెలరేగి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచి షఫాలీ తానేమిటో ప్రపంచానికి చూపించింది. బ్యాటింగ్తో మాత్రమే కాకుండా బౌలింగ్లో కూడా 2 కీలక వికెట్లు ఆమె ఫైనల్ ఫలితాన్ని శాసించింది. గతంలో అండర్–19 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యురాలైన షఫాలీ ఇప్పుడు సీనియర్ ప్రపంచకప్లోనూ భాగమైంది. వికెట్ కీపర్ రిచా ఘోష్కు కూడా అండర్–19 తర్వాత ఇది రెండో ప్రపంచ కప్ విజయం కావడం విశేషం. ఆ ముగ్గురు... 2017లో ఇంగ్లండ్ చేతిలో ఫైనల్లో అనూహ్య ఓటమి భారత ఆటగాళ్లకు వేదనను మిగిల్చింది. నాటి జట్టులో సభ్యులైన హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ ఇప్పుడు ఎట్టకేలకు విశ్వవిజేతలుగా నిలిచారు. ఈ ముగ్గురూ తమదైన ప్రత్యేకతలతో ఈ విజయాన్ని చిరస్మరణీయం చేసుకున్నారు. హర్మన్ కెపె్టన్గా చరిత్రను సృష్టించగా...స్మృతి టాప్ స్కోరర్గా, దీప్తి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలవడం వారి ఆటకు ఘనమైన గుర్తింపు అనడంలో సందేహం లేదు. 4 మహిళల వన్డే వరల్డ్కప్ టైటిల్ నెగ్గిన నాలుగో జట్టుగా భారత్ నిలిచింది. ఆస్ట్రేలియా ఏడుసార్లు (1978, 1982, 1988, 1997, 2005, 2013, 2022), ఇంగ్లండ్ నాలుగుసార్లు (1973, 1993, 2009, 2017), న్యూజిలాండ్ (2000), భారత్ (2025) ఒక్కోసారి విజేతగా నిలిచాయి.4 ఆతిథ్య దేశం హోదాలో వన్డే వరల్డ్కప్ టైటిల్ గెలిచిన నాలుగో జట్టు భారత్. గతంలో ఇంగ్లండ్ (1973, 1993, 2017), ఆ్రస్టేలియా (1988), న్యూజిలాండ్ (2000) ఈ ఘనత సాధించాయి.571 ఒకే ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా దక్షిణాఫ్రికా కెపె్టన్ వోల్వార్ట్ నిలిచింది. ఆ్రస్టేలియా కెపె్టన్ అలీసా హీలీ (2022లో 509 పరుగులు) పేరిట ఉన్న రికార్డును వోల్వార్ట్ బద్దలు కొట్టింది.22 ఒకే ప్రపంచకప్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా దీప్తి శర్మ (9 మ్యాచ్ల్లో 22 వికెట్లు) గుర్తింపు పొందింది. నీతూ డేవిడ్ (2005లో 20 వికెట్లు), శుభాంగి కులకర్ణి (1982లో 20 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును దీప్తి శర్మ సవరించింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: స్మృతి (సి) జాఫ్తా (బి) ట్రయాన్ 45; షఫాలీ (సి) లూస్ (బి) ఖాకా 87; జెమీమా (సి) వోల్వార్ట్ (బి) ఖాకా 24; హర్మన్ప్రీత్ (బి) ఎంలాబా 20; దీప్తి శర్మ (రనౌట్) 58; అమన్జోత్ (సి అండ్ బి) డిక్లెర్క్ 12; రిచా (సి) డెర్క్సెన్ (బి) ఖాకా 34; రాధ (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 15; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 298. వికెట్ల పతనం: 1–104, 2–166, 3–171, 4–223, 5–245, 6–292, 7–298. బౌలింగ్: కాప్ 10–1–59–0, ఖాకా 9–0–58–3, ఎంలాబా 10–0–47–1, డిక్లెర్క్ 9–0–52–1, లూస్ 5–0–34–0, ట్రయాన్ 7–0–46–1. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: వోల్వార్ట్ (సి) అమన్జోత్ (బి) దీప్తి 101; బ్రిట్స్ (రనౌట్) 23; బాష్ (ఎల్బీ) (బి) శ్రీచరణి 0; లూస్ (సి అండ్ బి) షఫాలీ 25; కాప్ (సి) రిచా (బి) 4; జాఫ్తా (సి) రాధ (బి) దీప్తి 16; డెర్క్సెన్ (బి) దీప్తి 35; ట్రయాన్ (ఎల్బీ) (బి) దీప్తి 9; డిక్లెర్క్ (సి) హర్మన్ (బి) దీప్తి 18; ఖాకా (రనౌట్) 1; ఎంలాబా (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 14; మొత్తం (45.3 ఓవర్లలో ఆలౌట్) 246. వికెట్ల పతనం: 1–51, 2–62, 3–114, 4–123, 5–148, 6–209, 7–220, 8–221, 9–246, 10–246. బౌలింగ్: రేణుక 8–0–28–0, క్రాంతి 3–0–16–0, అమన్జోత్ 4–0–34–0, దీప్తి 9.3–0–39–5, శ్రీచరణి 9–0–48–1, రాధ 5–0–45–0, షఫాలీ 7–0–36–2. -
భారత మహిళల జట్టుకు ప్రధాని మోదీ అభినందనలు
భారత మహిళల క్రికెట్ జట్టు 2025 ICC Women’s World Cup విజేతగా నిలవడంతో ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ విజయాన్ని ఆయన "చారిత్రాత్మక ఘట్టం"గా అభివర్ణించారు, ఇది భవిష్యత్ క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. A spectacular win by the Indian team in the ICC Women’s Cricket World Cup 2025 Finals. Their performance in the final was marked by great skill and confidence. The team showed exceptional teamwork and tenacity throughout the tournament. Congratulations to our players. This…— Narendra Modi (@narendramodi) November 2, 2025 భారత మహిళల జట్టు విజయంపై పలువురు ప్రముఖులు తమ 'ఎక్స్' ఖాతా వేధికగా స్పందించారుMy heartiest congratulations to each and every member of the Indian women cricket team on winning the ICC Women’s Cricket World Cup 2025! They have created history by winning it for the first time. They have been playing well and today they got the result befitting their talent…— President of India (@rashtrapatibhvn) November 2, 2025Inspiration for generations to come, you’ve made every Indian proud with your fearless cricket and belief throughout. You guys deserve all the accolades and enjoy the moment to the fullest. Well done Harman and the team. Jai Hind 🇮🇳🇮🇳 pic.twitter.com/f9J34QIMuP— Virat Kohli (@imVkohli) November 2, 2025భారత మహిళల జట్టు 47 ఏళ్ల తమ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025 విజేతగా భారత్ నిలిచింది. ఆదివారం నవీ ముంబై వేదికగా జరిగిన ఫైనల్లో సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. తొలిసారి వరల్డ్కప్ టైటిల్ను సొంతం చేసుకుంది. 299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 45.3 ఓవర్లో 246 పరుగులకు ఆలౌటైంది. ऐतिहासिक विजय...विश्व विजेता भारतीय महिला क्रिकेट टीम का हार्दिक अभिनंदन! देश वासियों को हृदयतल से बधाई!आप सभी देश का गौरव हैं।भारत माता की जय 🇮🇳— Yogi Adityanath (@myogiadityanath) November 2, 20251983 inspired an entire generation to dream big and chase those dreams. 🏏 Today, our Women’s Cricket Team has done something truly special. They have inspired countless young girls across the country to pick up a bat and ball, take the field and believe that they too can lift… pic.twitter.com/YiFeqpRipc— Sachin Tendulkar (@sachin_rt) November 2, 2025My heartiest congratulations to each and every member of the Indian women cricket team on winning the ICC Women’s Cricket World Cup 2025! They have created history by winning it for the first time. They have been playing well and today they got the result befitting their talent… -
మహిళల వరల్డ్కప్-2025 విజేతగా భారత్
భారత మహిళల జట్టు 47 ఏళ్ల తమ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025 విజేతగా భారత్ నిలిచింది. ఆదివారం నవీ ముంబై వేదికగా జరిగిన ఫైనల్లో సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో చిత్తు చేసిన టీమిండియా.. తొలి వరల్డ్కప్ టైటిల్ను ముద్దాడింది. 299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 45.3 ఓవర్లో 246 పరుగులకు ఆలౌటైంది.సౌతాఫ్రికా కెప్టెన్ ఒంటరి పోరాటం..సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ ఒంటరి పోరాటం చేసింది. 98 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 101 పరుగులు చేసింది. లారా క్రీజులో ఉన్నంతసేపు భారత డగౌట్తో పాటు అభిమానులలో టెన్షన్ నెలకొంది. దీప్తీ శర్మ బౌలింగ్లో వోల్వార్డ్ట్ ఔట్ కావడంతో భారత విజయం ఖాయమైంది. అమన్ జ్యోత్ కౌర్ అద్బుత క్యాచ్తో వోల్వార్డ్ట్ పెవిలియన్కు పంపించింది.శెభాష్ షఫాలీ..ఈ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ షఫాలీ వర్మతో బ్యాట్తో బంతితో మ్యాజిక్ చేసింది. భారీ లక్ష్య చేధనలో 51 పరుగుల వద్ద సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. బ్రిట్స్ రనౌట్ రూపంలో వెనుదిరిగింది. అనంతరం క్రీజులోకి వచ్చిన బోష్ కూడా ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరింది. ఈ సమయంలో సౌతాఫ్రికా కెప్టెన్ లారా.. వన్ డౌన్ బ్యాటర్ లూస్తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పింది. భారత కెప్టెన్ హర్మన్ ఎంత మంది బౌలర్లను మార్చిన ఫలితం లేకపోయింది. దీంతో పార్ట్ టైమ్ బౌలర్ షఫాలీకి హర్మన్ బంతిని అందించింది. కెప్టెన్ నమ్మకాన్ని షఫాలీ వమ్ము చేయలేదు. అద్బుతమైన సన్నీ లూస్ను షఫాలీ బోల్తా కొట్టించింది. ఆ తర్వాత డేంజరస్ బ్యాటర్ కాప్ను కూడా వర్మ పెవిలియన్కు పంపింది. రెండు కీలక వికెట్లు పడగొట్టి భారత్ను వరల్డ్ ఛాంపియన్గా షఫాలీ నిలిపింది.WE ARE THE CHAMPIONS! Every ounce of effort, every clutch moment, every tear, all of it has paid off. 💙#CWC25 #INDvSA pic.twitter.com/hhxwlStp9t— Star Sports (@StarSportsIndia) November 2, 2025ఐదేసిన దీప్తి..ఇక భారత్ తొలిసారి వరల్డ్కప్ను సొంతం చేసుకోవడంలో స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మది కీలక పాత్ర. తొలుత బ్యాటింగ్లో హాఫ్ సెంచరీతో మెరిసిన దీప్తి.. బౌలింగ్లో బంతితో అద్బుతం చేసింది. ఈ యూపీ క్రికెటర్ ఐదు వికెట్లతో ప్రోటీస్ పతనాన్ని శాసించింది. 9.3 ఓవర్లు బౌలింగ్ చేసిన శర్మ..39 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. మొత్తంగా 17 వికెట్లతో దీప్తి ప్లేయర్ ఆఫ్ది టోర్నమెంట్గా నిలిచింది.బ్యాటింగ్లో అదుర్స్..అంతకుముందు బ్యాటింగ్ చేసిన మన అమ్మాయిల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత ఇన్నింగ్స్లో షెఫాలీ వర్మ(78 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 87) టాప్ స్కోరర్గా నిలవగా.. దీప్తి శర్మ(58 బంతుల్లో 58), రిచా ఘోష్(24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 34), మంధాన(45) రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో అయబొంగా ఖాకా మూడు వికెట్లు పడగొట్టగా.. మలాబా, క్లార్క్, ట్రయాన్ తలా వికెట్ సాధించారు.చదవండి: IND vs AUS T20 Series: ఉన్నపళంగా స్వదేశానికి టీమిండియా స్టార్ క్రికెటర్ -
ఫైనల్లో హైయెస్ట్ రన్ ఛేజ్ ఎంతో తెలుసా?
ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025లో భాగంగా ముంబై వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో భారత బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఓపెనర్ షెఫాలీ వర్మ(78 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 87), దీప్తి శర్మ(58 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 58 ) రాణించగా.. స్మృతి మంధాన(58 బంతుల్లో 45), రిచా ఘోష్(24 బంతుల్లో 34) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఖాకా మూడు వికెట్లు పడగొట్టగా.. ట్రయాన్, డిక్లార్క్, మబ్లా తలా వికెట్ సాధించారు. కాగా భారత్ మహిళల ప్రపంచకప్ ఫైనల్లో అత్యధిక స్కోర్ చేసిన రెండో జట్టుగా భారత్ నిలిచింది. ఇంతకుముందు వరల్డ్కప్-2022 ఫైనల్లో ఇంగ్లండ్పై ఆసీస్ 356 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్లో ఆసీస్ 71 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ కప్ ఫైనల్లో ఛేదించిన అత్యధిక లక్ష్యాలపై ఓ లుక్కేద్దాం. మహిళల వన్డే వరల్డకప్ ఫైనల్లో ఛేజ్ చేసిన హైయెస్ట్ టోటల్ 167గా ఉంది. 2009 వరల్డ్కప్లో నార్త్ సిడ్నీ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ ఈ లక్ష్యాన్ని చేధించింది. మహిళల ప్రపంచ కప్ ఫైనల్స్లో కేవలం నాలుగు మాత్రమే విజయవంతమైన రన్-ఛేజింగ్లు జరిగాయి. ఇప్పటివరకు జరిగిన పది ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. మరి ఇప్పుడు భారత్ అదే ఫలితాన్ని పునరావృతం చేస్తుందో లేదా సౌతాఫ్రికా చరిత్రను తిరగరాస్తుందో వేచి చూడాలి.మహిళల ప్రపంచ కప్ ఫైనల్స్లో అత్యధిక లక్ష్య చేధనలు ఇవే..సంఖ్యపరుగుల ఛేదనజట్టుప్రత్యర్థిఫైనల్ సంవత్సరం1167ఇంగ్లండ్ న్యూజిలాండ్20092165ఆస్ట్రేలియాన్యూజిలాండ్19973152ఆస్ట్రేలియా ఇంగ్లండ్ 19824128ఆస్ట్రేలియా ఇంగ్లండ్1988 -
ఆసీస్తో టీ20 సిరీస్.. భారత జట్టులో కీలక మార్పు
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత టీ20 జట్టులో ఓ కీలక మార్పు చోటు చేసుకుంది. ఆసీస్ మిగిలిన రెండు టీ20కు ముందు జట్టు నుంచి స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను బీసీసీఐ రిలీజ్ చేసింది. 30 ఏళ్ల కుల్దీప్ స్వదేశానికి వచ్చి దక్షిణాఫ్రికా-తో జరగనున్న రెండో అనాధికరిక టెస్టులో ఇండియా-ఎ జట్టు తరపున ఆడనున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ముందు ఈ మ్యాచ్ కుల్దీప్కు ప్రాక్టీస్ ఉపయోగపడుతుందని బోర్డు భావించింది. ఈ క్రమంలోనే జట్టు నుంచి యాదవ్ను బీసీసీఐ విడుదల చేసింది. "బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో దక్షిణాఫ్రికా-ఎతో జరగనున్న రెండో టెస్టులో కుల్దీప్ పాల్గోనున్నాడు. భారత జట్టు మెనెజ్మెంట్ అభ్యర్ధన మెరకు ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ నుంచి కుల్దీప్ను రిలీజ్ చేశాము" అని భారత క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ఆసీస్తో తొలి రెండు మ్యాచ్లలో ప్లేయింగ్ ఎలెవన్లో భాగమైన కుల్దీప్.. మూడో టీ20కి మాత్రం బెంచ్కే పరిమితమయ్యాడు. ఇప్పుడు ఏకంగా జట్టు నుంచి బయటకు వచ్చేశాడు. ఇక ఆదివారం హోబర్ట్ వేదికగా జరిగిన మూడో టీ20లో 5 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 1-1తో సమం చేసింది.ఆసీస్తో సిరీస్ కోసం అప్డేటడ్ భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, సంజూకు రష్దీప్ సింగ్, సంజూకు వాషింగ్టన్ సుందర్.దక్షిణాఫ్రికా -ఎతో జరిగే టెస్టుకు భారత-ఎ జట్టురిషబ్ పంత్ (కెప్టెన్) , కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, హర్ష్ దూబే, తనుష్ కోటియన్, మానవ్ సుతార్, ఇ, ఖులీల్, అబ్ర్మేద్యు, ఖులీల్, ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, కుల్దీప్ యాదవ్ -
టీమిండియా కెప్టెన్ వరల్డ్ రికార్డు..
మహిళల ప్రపంచకప్-2025లో భాగంగా ముంబై వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ఫైనల్లో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తీవ్ర నిరాశపరిచింది. కీలక సమయంలో బ్యాటింగ్కు వచ్చిన హర్మన్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది.దీప్తి శర్మతో కలిసి కాసేపు క్రీజులో నిలబడినప్పటికి తన మార్క్ చూపించడంలో మాత్రం విఫలమైంది. 29 బంతుల్లో 20 పరుగులు చేసిన హర్మన్.. సఫారీ స్పిన్నర్ మలాబా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యింది. అయితే ఈ మ్యాచ్లో హర్మన్ విఫలమైనప్పటికి ఓ వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకుంది. చరిత్ర సృష్టించిన హర్మన్..మహిళల ప్రపంచ కప్ నాకౌట్లలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా హర్మన్ చరిత్ర సృష్టించింది. వరల్డ్కప్లో నాలుగు నాకౌట్ మ్యాచ్లు ఆడిన హర్మన్.. 331 పరుగులు చేసింది.ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ బెలిండా క్లార్క్ పేరిట ఉండేది. బెలిండా తన కెరీర్లో వరల్డ్కప్ నాకౌట్ మ్యాచ్లలో 330 పరుగులు చేసింది. తాజా మ్యాచ్తో బెలిండా ఆల్టైమ్ రికార్డును హర్మన్ బ్రేక్ చేసింది.చదవండి: World cup 2025: మొన్నటివరకు జట్టులో నో ఛాన్స్! ఇప్పుడు ఫైనల్లో మెరుపు ఇన్నింగ్స్ -
మొన్నటివరకు జట్టులో నో ఛాన్స్! ఇప్పుడు ఫైనల్లో మెరుపు ఇన్నింగ్స్
నవీ ముంబై వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐసీసీ మహిళల ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా ఓపెనర్ షఫాలీ వర్మ అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. సెమీస్లో విఫలమైన షఫాలీ.. తుది పోరులో మాత్రం తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది.ఇన్నింగ్స్ ఆరంభం నుంచే తనదైన షాట్లతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడింది. స్మృతి మంధానతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. మంధానతో కలిసి తొలి వికెట్కు 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన షఫాలీ వర్మ.. ఆ తర్వాత రోడ్రిగ్స్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించింది.ఓ దశలో సునాయసంగా సెంచరీ చేసేలా కన్పించిన ఈ విధ్వంసకర ఓపెనర్, భారీ షాట్కు ప్రయత్నించి తన వికెట్ను కోల్పోయింది. మొత్తంగా 78 బంతులు ఎదుర్కొన్న వర్మ.. 7 ఫోర్లు, 2 సిక్స్లతో 87 పరుగులు చేసింది. కాగా వాస్తవానికి వరల్డ్ కప్ జట్టులో షఫాలీ వర్మకు చోటు లేదు.స్టార్ ఓపెనర్ ప్రతీక రావల్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలగడంతో.. షఫాలీకి సెలక్టర్లు తిరిగి పిలుపునిచ్చారు. తనకు లభించిన అవకాశాన్ని ఈ హర్యానా క్రికెటర్ అందిపుచ్చుకుంది. ఈ మెరుపు ఇన్నింగ్స్తో షఫాలీ వర్మ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. ప్రపంచ కప్ ఫైనల్లో భారత మహిళల జట్టు తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ప్లేయర్గా షఫాలీ నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ ప్లేయర్ పూనమ్ రౌత్ పేరిట ఉండేది. 2017 ప్రపంచకప్ ఫైనల్లో పూనమ్ 86 పరుగులు చేసింది. తాజా మ్యాచ్తో పూనమ్ ఆల్టైమ్ రికార్డును వర్మ బ్రేక్చేసింది.చదవండి: IND vs AUS: అతడెందుకు దండగ అన్నారు.. కట్ చేస్తే! ఒంటి చేత్తో గెలిపించాడుA shot that leaves you going 😯😳🤯We’re witnessing vintage #ShafaliVerma, delivering on the grandest stage, just when it matters the most! 👏🏻👍🏻#CWC25 Final 👉 #INDvSA, LIVE NOW 👉 https://t.co/gGh9yFhTix pic.twitter.com/1mwc8WsLH9— Star Sports (@StarSportsIndia) November 2, 2025 -
రాణించిన జైస్వాల్.. దీపక్ హుడా అజేయ శతకం
రంజీ ట్రోఫీ 2025-26లో (Ranji Trophy) భాగంగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ ఆటగాడు దీపక్ హుడా (Deepak Hooda) సెంచరీతో కదంతొక్కాడు. 159 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 121 పరగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. హుడా సెంచరీ సాయంతో రాజస్థాన్ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ దిశగా సాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు స్కోర్ 4 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. దీపక్ హుడాకు జతగా కార్తిక్ శర్మ (26) క్రీజ్లో ఉంది. రాజస్థాన్ ఇన్నింగ్స్లో సచిన్ యాదవ్ (92) తృటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. కెప్టెన్ మహిపాల్ లోమ్రార్ (41) ఓ మోస్తరు స్కోర్తో పర్వాలేదనిపించాడు. అభిజీత్ తోమర్ 14, కునాల్ సింగ్ 31 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో తుషార్ దేశ్పాండే 2, షమ్స్ ములానీ ఓ వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం రాజస్థాన్ 85 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోందిరాణించిన జైస్వాల్అంతకుముందు ముంబై తొలి ఇన్నింగ్స్లో 254 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) (67), ముషీర్ ఖాన్ (49) రాణించగా.. మిడిలార్డర్ విఫలమైంది. రహానే 3, సిద్దేశ్ లాడ్ 8, సర్ఫరాజ్ ఖాన్ 15, ఆకాశ్ ఆనంద్ 5 పరుగులకు ఔటయ్యారు. లోయర్డార్ ఆటగాళ్లలో షమ్స్ ములానీ (32), కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ (18), హిమాన్షు సింగ్ (25), తుషార్ దేశ్పాండే (25 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో కుక్నా సింగ్ 4 వికెట్లు పడగొట్టగా.. ఆశోక్ శర్మ 3, అనికేత్ చౌదరీ, ఆకాశ్ సింగ్, రాహుల్ చాహర్ తలో వికెట్ తీశారు. చదవండి: శివాలెత్తిన గుర్బాజ్.. ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్ -
శివాలెత్తిన గుర్బాజ్.. ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్
జింబాబ్వేతో మూడు మ్యాచ్ల సిరీస్లో (Zimbabwe vs Afghanistan) భాగంగా ఇవాళ (నవంబర్ 2) జరుగుతున్న నామమాత్రపు మూడో మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (92), ఇబ్రహీం జద్రాన్ (60) ఆఫ్ఘన్ ఇన్నింగ్స్కు మెరుపు ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా గుర్భాజ్ (Rahmanullah Gurbaz) శివాలెత్తిపోయారు. 48 బంతుల్లో 8 ఫోర్లు, 5 భారీ సిక్సర్ల సాయంతో 92 పరుగులు చేశాడు. ఆఖర్లో సెదిఖుల్లా అటల్ (15 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగిపోయాడు. వేగంగా పరుగులు చేసే క్రమంలో షాహిదుల్లా కమల్ (10) ఔటయ్యాడు. నబీ ఒక్క పరుగు చేసి అజేయంగా నిలిచాడు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఈవాన్స్ 2 వికెట్లు తీయగా.. రిచర్డ్ నగరవ ఓ వికెట్ దక్కించుకున్నాడు.కాగా, ఈ సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల్లో గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ ఇదివరకే సిరీస్ను కైవసం చేసుకుంది. టీ20 సిరీస్కు ముందు ఇరు జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్ట్లో జింబాబ్వే ఇన్నింగ్స్ 73 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సిరీస్ల కోసం ఆఫ్ఘనిస్తాన్ జింబాబ్వేలో పర్యటిస్తుంది. చదవండి: చరిత్ర సృష్టించిన స్మృతి మంధన -
చరిత్ర సృష్టించిన స్మృతి మంధన
టీమిండియా స్టార్ మహిళా బ్యాటర్ స్మృతి మంధన (Smriti Mandhana) సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఓ సింగిల్ వరల్డ్ కప్ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా చరిత్ర సృష్టించింది. 2025 వన్డే వరల్డ్కప్ ఎడిషన్లో (Women's CWC 2025) భాగంగా సౌతాఫ్రికాతో ఇవాళ (నవంబర్ 2) జరుగుతున్న ఫైనల్లో (India vs South Africa) మంధన ఈ ఘనత సాధించింది. గతంలో ఈ రికార్డు మిథాలీ రాజ్ పేరిట ఉండేది. మిథాలీ 2017 ఎడిషన్లో 409 పరుగులు చేయగా.. తాజా ఎడిషన్లో మంధన 412 పరుగులతో ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది.మ్యాచ్ విషయానికొస్తే.. సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకోగా, భారత్కు శుభారంభం లభించింది. ఓపెనర్లు స్మృతి మంధన (39), షఫాలీ వర్మ (48) వేగంగా పరుగులు సాధిస్తున్నారు. 17 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 97/0గా ఉంది.తుది జట్లు..భారత్: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్దక్షిణాఫ్రికా: లారా వోల్వార్డ్ట్(కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్, అన్నేకే బాష్, సునే లూస్, మారిజానే కాప్, సినాలో జాఫ్తా(వికెట్ కీపర్), అన్నరీ డెర్క్సెన్, క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, అయాబొంగా ఖాకా, మ్లాబాచదవండి: IND Vs AUS: సుందర్ విధ్వంసం.. ఆసీస్పై టీమిండియా గెలుపు -
అతడెందుకు దండగ అన్నారు.. కట్ చేస్తే! ఒంటి చేత్తో గెలిపించాడు
హోబర్ట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో 5 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను 1-1తో భారత్ సమం చేసింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్(38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్లతో 74), మార్కస్ స్టోయినిష్(39 బంతుల్లో 8 ఫోర్లు,2 సిక్స్లతో 64) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి రెండు, శివమ్ దూబే ఒక్క వికెట్ సాధించారు.వాషింగ్టన్ విశ్వరూపం..అనంతరం 187 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఈ విజయంలో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ది కీలక పాత్ర. లక్ష్య చేధనలో భారత జట్టు 111 పరుగులకు నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో బ్యాటింగ్కు వచ్చిన సుందర్.. ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.అయితే జితేష్ శర్మ, శివమ్ దూబే వంటి పవర్ హిట్టర్ల కంటే ముందు సుందర్ను బ్యాటింగ్కు పంపడంపై విమర్శలు వచ్చాయి. కానీ విమర్శకులకు తన బ్యాటింగ్తోనే సుందర్ సమాధానమిచ్చాడు. తాను ఎదుర్కొన్న రెండో బంతినే సిక్సర్గా మలిచాడు. ఆ తర్వాత 14 ఓవర్ వేసిన సీన్ అబాట్ బౌలింగ్లో సుందర్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఆ ఓవర్లో సుందర్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్తో మొత్తంగా 19 పరుగులు పిండుకున్నాడు. మూడు పరుగులు సింగిల్స్ రూపంలో వచ్చాయి. అబాట్ ఓవర్తో గేమ్ భారత్ వైపు మలుపు తిరిగింది.ఆ తర్వాత కూడా సుందర్ తన జోరును కొనసాగించాడు. ఆఖరి వరకు క్రీజులో నిలబడిన సుందర్.. జితేష్ శర్మతో కలిసి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. ఓవరాల్గా 23 బంతులు ఎదుర్కొన్న సుందర్.. 3 ఫోర్లు, 4 సిక్స్లతో 49 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కాగా కుల్దీప్ యాదవ్ను పక్కన పెట్టి సుందర్ను తుది జట్టులోకి తీసుకోవడాన్ని చాలా మంది తప్పుబట్టారు. అంతేకాకుండా ఈ మ్యాచ్లో సుందర్తో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయించలేదు. మెనెజ్మెంట్ అతడిని స్పెషలిస్ట్ బ్యాటర్గా జట్టుగా తీసుకుంది. సుందర్ స్పెషలిస్ట్ బ్యాటర్ ఎలా అవుతాడంటూ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ను ట్రోలు చేశారు. కానీ సుందర్ మాత్రం తన అద్భుత బ్యాటింగ్తో గంభీర్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. -
IND Vs AUS: సుందర్ విధ్వంసం.. ఆసీస్పై టీమిండియా గెలుపు
ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ (Team India) బోణీ కొట్టింది. హోబర్ట్ వేదికగా జరిగిన మూడో మ్యాచ్లో (India vs Australia) 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. సిరీస్లో తొలి మ్యాచ్ ఆడిన సుందర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఒంటిచేత్తో టీమిండియాను గెలిపించాడు. ఈ గెలుపుతో భారత్ సిరీస్లో సమంగా (1-1) నిలిచింది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్లో ఆసీస్ విజయం సాధించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ (74), స్టోయినిస్ (64) విధ్వంసకర ఇన్నింగ్స్లతో చెలరేగారు. ఆఖర్లో మాథ్యూ షార్ట్ (26 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ (Arshdeep Singh) 3 వికెట్లు తీయగా.. వరున్ చక్రవర్తి 2, శివమ్ దూబే ఓ వికెట్ పడగొట్టాడు.అనంతరం 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) 23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 49 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సుందర్కు జితేశ్ శర్మ (13 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు) సహకరించాడు. భారత ఇన్నింగ్స్లో అభిషేక్ శర్మ 25, శుభ్మన్ గిల్ 15, సూర్యకుమార్ యాదవ్ 24, తిలక్ వర్మ 29, అక్షర్ పటేల్ 17 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఇల్లిస్ 3 వికెట్లు పడగొట్టగా.. బార్ట్లెట్, స్టోయినిస్ తలో వికెట్ తీశారు. నాలుగో టీ20 గోల్డ్ కోస్ట్ వేదికగా నవంబర్ 6న జరుగుతుంది.చదవండి: రంజీ క్రికెటర్ దుర్మరణం -
రంజీ క్రికెటర్ దుర్మరణం
త్రిపుర రంజీ జట్టు మాజీ కెప్టెన్ రాజేష్ బానిక్ (Rajesh Banik) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. పశ్చిమ త్రిపుర ప్రాంతంలోని ఆనంద్ నగర్లో ఈ ప్రమాదం జరిగింది. 40 ఏళ్ల బానిక్ తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి జీవనం సాగించే వాడు. నిత్యం కళ్లెదుటే ఉండే బానిక్ ఇక లేడని తెలిసి తల్లిదండ్రులు, సోదరుడు కన్నీరుమున్నీరవుతున్నారు. బానిక్ మరణవార్త భారత క్రికెట్ అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. త్రిపుర క్రికెట్ అసోసియేషన్ బానిక్కు నివాళులర్పించింది.కుడి చేతి వాటం బ్యాటర్, అకేషనల్ లెగ్ స్పిన్నర్ అయిన బానిక్ 2001-02 సీజన్లో త్రిపుర తరఫున రంజీ అరంగేట్రం చేశాడు. అనతికాలంలోనే నమ్మదగ్గ క్రికెటర్గా పేరు తెచ్చుకున్నాడు. బానిక్ 42 మ్యాచ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో 1469 పరుగులు చేశాడు. అలాగే 24 లిస్ట్-ఏ మ్యాచ్ల్లో 378 పరుగులు, 18 టీ20ల్లో 203 పరుగులు చేశాడు. క్రికెటర్గా బానిక్ కెరీర్ 17 ఏళ్ల పాటు సాగింది.అనంతరం అతడు త్రిపుర అండర్-16 జట్టుకు స్టేట్ సెలెక్టర్గా సేవలందించాడు. అండర్-15 రోజుల్లో బానిక్ టీమిండియా మాజీ ఆటగాళ్లు ఇర్ఫాన్ పఠాన్, అంబటి రాయుడుతో డ్రస్సింగ్ రూమ్ను షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం అగర్తలలో జరుగుతున్న రంజీ మ్యాచ్లో త్రిపుర జట్టు ఆటగాళ్లు బ్లాక్ ఆర్మ్బ్యాండ్స్ ధరించి బానిక్ను నివాళులర్పించారు. చదవండి: IND vs AUS: టీ20 క్రికెట్లో అతి భారీ సిక్సర్.. వరల్డ్ రికార్డు బ్రేక్ -
టీ20 క్రికెట్లో అతి భారీ సిక్సర్.. వరల్డ్ రికార్డు బ్రేక్
హోబర్ట్ వేదికగా భారత్తో జరుగుతున్న మూడో టీ20లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు ఆసీస్కు అర్ష్దీప్ సింగ్ ఆరంభంలోనే బిగ్ షాకిచ్చాడు. అతడి బౌలింగ్ ధాటికి హెడ్, ఇంగ్లిష్ వికెట్లను ఆతిథ్య జట్టు కోల్పోయింది.ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన డేవిడ్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. హోబర్ట్లోని బెల్లెరివ్ ఓవల్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో డేవిడ్ కేవలం 23 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. మొత్తంగా 38 బంతులు మాత్రమే ఎదుర్కొన్న డేవిడ్.. 8 ఫోర్లు, 5 సిక్స్లతో 74 పరుగులు చేశాడు.డేవిడ్ భారీ సిక్సర్..కాగా ఈ మ్యాచ్లో డేవిడ్ భారీ సిక్సర్తో మెరిశాడు. అక్షర్ పటేల్ బౌలింగ్లో ఈ ఆసీస్ డెంజరస్ బ్యాటర్ 129 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. ఆసీస్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన అక్షర్ ఐదో బంతిని.. టాసడ్ ఆఫ్ డెలివరీగా సంధించాడు. ఆ డెలివరీని డేవిడ్ ముందుకు వచ్చి స్ట్రైట్ డ్రైవ్ షాట్ ఆడాడు. అతడి పవర్ ధాటికి బంతి నింజా స్టేడియం బయటకు వెళ్లింది. అతడి షాట్ చూసి మైదానంలో అందరూ షాక్ అయిపోయారు. ఈ క్రమంలో డేవిడ్ అంతర్జాతీయ టీ20ల్లో భారీ సిక్సర్ బాదిన తొలి బ్యాటర్గా నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ మార్టిన్ గప్టిల్ పేరిట ఉండేది. 2012లో గప్టిల్ సౌతాఫ్రికాపై 127 మీటర్ల సిక్స్ బాదాడు. తాజా మ్యాచ్తో గప్టిల్ ఆల్టైమ్ రికార్డును డేవిడ్ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో డేవిడ్, మార్టిన్ గప్టిల్ తర్వాత యువరాజ్ సింగ్(119 మీటర్లు), క్రిస్ గేల్(116 మీటర్లు) ఉన్నారు.చదవండి: కరుణ్ నాయర్ డబుల్ సెంచరీWhat a hand power man 130M six by Tim David 🥵🥵 pic.twitter.com/0N9PRABZqv— Raf! (@MBVKtweets) November 2, 2025 -
ఫైనల్లో సౌతాఫ్రికా చిత్తు.. వరల్డ్ ఛాంపియన్స్గా భారత్
India vs South Africa Womens WC 2025 Final Live Updates: వరల్డ్కప్ విజేతగా భారత్ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025 విజేతగా భారత్ నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించిన భారత్.. తొలి వరల్డ్కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. 299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 45.3 ఓవర్లో 246 పరుగులకు ఆలౌటైంది.సౌతాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్ లారా వోల్వార్డ్(101) అద్బుతమైన సెంచరీతో పోరాడనప్పటికి తన జట్టును గెలిపించలేకపోయింది. భారత బౌలర్లలో దీప్తీ శర్మ ఐదు వికెట్లతో చెలరేగగా.. షఫాలీ వర్మ రెండు, చరణి ఒక్క వికెట్ సాధించింది.👉సౌతాఫ్రికా తొమ్మిదో వికెట్ కోల్పోయింది.44 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్: 232/844 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా 8 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. ప్రోటీస్ విజయానికి 33 బంతుల్లో 67 పరుగులు కావాలి. సౌతాఫ్రికా ఎనిమిదో వికెట్ డౌన్..221 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. దీప్తీ శర్మ బౌలింగ్లో ట్రయాన్ వికెట్ల ముందు దొరికిపోయింది.సౌతాఫ్రికా కెప్టెన్ ఔట్.. విజయం దిశగా భారత్తొలి ప్రపంచకప్ విజయం దిశగా భారత్ పయనిస్తోంది. 220 పరుగుల వద్ద సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్(101) వికెట్ కోల్పోయింది. క్రీజులోకి డిక్లార్క్ వచ్చింది. ప్రోటీస్ విజయానికి 78 బంతుల్లో51 పరుగులు కావాలి. సౌతాఫ్రికా కెప్టెన్ సెంచరీ..సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ 96 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేసుకుంది. 41 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. క్రీజులో లారా వోల్వడర్ట్(101), ట్రయాన్(9) ఉన్నారు. ప్రోటీస్ విజయానికి 54 బంతుల్లో 79 పరుగులు కావాలి.సౌతాఫ్రికా ఆరో వికెట్ డౌన్..209 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన డికర్సన్ దీప్తీ శర్మ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయింది.38 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్38 ఓవర్ల అనంతరం సౌతాఫ్రికా స్కోరు 207గా ఉంది. ఇంకా దక్షిణాఫ్రికా మహిళల జట్టు 66 బంతుల్లో 92 పరుగులు చేయాలి.36 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్36 ఓవర్ల అనంతరం సౌతాఫ్రికా స్కోరు 186గా ఉంది. దక్షిణాఫ్రికా మహిళల జట్టు 84 బంతుల్లో 113 పరుగులు చేయాలి32 ఓవర్ల అనంతరం సౌతాఫ్రికా స్కోరు 175, దక్షిణాఫ్రికా మహిళల జట్టుకు ఇంకా 124 పరుగులు అవసరం31 ఓవర్ల అనంతరం సౌతాఫ్రికా స్కోరు 167 పరుగులు చేసింది.ఐదో వికెట్ డౌన్148 పరుగుల వద్ద సౌతాఫ్రికా జట్లు ఐదో వికెట్ కోల్పోయింది. దీప్తిశర్మ బౌలింగ్లో రాధా యాదవ్కు క్యాచ్ ఇచ్చి సినాలో జాఫ్తా ఔట్ అయింది. 27 ఓవర్ల అనంతరం సౌతాఫ్రికా స్కోరు141-4 గా ఉంది. దక్షిణాఫ్రికా మహిళల జట్టుకు ఇంకా 158 పరుగులు అవసరంమరో వికెట్ తీసిన షఫాలీ వర్మ.. సౌతాఫ్రికా నాలుగో వికెట్ డౌన్షఫాలీ వర్మ తన రెండో ఓవర్లో మొదటి బంతికి మరో వికెట్ తీసింది. దాంతో 123 పరుగుల వద్ద సౌతాఫ్రికా తన నాలుగో వికెట్ కోల్పోయింది.సౌతాఫ్రికా మూడో వికెట్ డౌన్..సన్నీ లూస్ రూపంలో సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. పార్ట్టైమ్ బౌలర్ షఫాలీ వర్మ బౌలింగ్లో 25 పరుగులు చేసిన లూస్ ఔటైంది. 21 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్: 113-3 సౌతాఫ్రికా కెప్టెన్ ఫిప్టీ..సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ 46 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుంది. 19 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా 2 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. క్రీజులో లారా వోల్వడర్ట్(60), లూస్(21) ఉన్నారు. సౌతాఫ్రికా రెండో వికెట్ డౌన్..బోష్ రూపంలో సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. స్పిన్నర్ శ్రీచరణి బౌలింగ్లో బోష్(0) వికెట్ల ముందు దొరికిపోయింది. 13 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్: 69/2. క్రీజులో కెప్టెన్ లారా వోల్డోర్ట్(42), లూస్(1) ఉన్నారు.సౌతాఫ్రికా తొలి వికెట్ డౌన్..51 పరుగుల వద్ద సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన టాజ్మిన్ బ్రిట్స్.. రనౌట్ రూపంలో పెవిలియన్కు చేరింది. క్రీజులోకి అన్నేకే బోష్ వచ్చింది.స్పీడ్ పెంచిన సౌతాఫ్రికా..8 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. క్రీజులో సౌతాఫ్రికా ఓపెనర్లు టాంజిమన్ బ్రిట్స్(17), లారా వోల్డర్ట్(23) ఉన్నారు.కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్న భారత్299 పరుగుల లక్ష్య చేధనలో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 4 ఓవర్లు ముగిసే సరికి 12 పరుగులు చేసింది. క్రీజులో లారా వోల్వడర్ట్(3), బ్రిట్స్(6) ఉన్నారు. భారత పేసర్లు రేణుకా సింగ్, క్రాంతి గౌడ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు.సౌతాఫ్రికా ముందు భారీ టార్గెట్..నవీ ముంబై వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ఫైనల్లో భారత బ్యాటర్లు చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత ఇన్నింగ్స్లో షెఫాలీ వర్మ(78 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 87) టాప్ స్కోరర్గా నిలవగా.. దీప్తి శర్మ(58 బంతుల్లో 58), రిచా ఘోష్(24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 34), మంధాన(45) రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో అయబొంగా ఖాకా మూడు వికెట్లు పడగొట్టగా.. మలాబా, క్లార్క్, ట్రయాన్ తలా వికెట్ సాధించారు.దీప్తి శర్మ హాఫ్ సెంచరీ..దీప్తి శర్మ 53 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుంది. 48 ఓవర్లు ముగిసే సరికి భారత్ 5 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. క్రీజులో రిచా(33), దీప్తి(50) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న రిచా..క్రీజులోకి వచ్చిన రిచా ఘోష్(25) దూకుడుగా ఆడుతోంది. 47 ఓవర్లు ముగిసే సరికి భారత్ 5 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. క్రీజులో రిచాతో పాటు దీప్తి(49) ఉన్నారు.టీమిండియా ఐదో వికెట్ డౌన్అమన్జ్యోత్ కౌర్ రూపంలో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన అమన్జ్యోత్.. డిక్లార్క్ బౌలింగ్లో ఔటైంది. క్రీజులోకి రిచాఘోష్ వచ్చింది. రిచా వచ్చిన వెంటనే సిక్సర్తో తన ఇన్నింగ్స్ను ఆరంభించింది. 44 ఓవర్లకు భారత్ స్కోర్: 253/5టీమిండియా నాలుగో వికెట్ డౌన్..హర్మన్ప్రీత్ కౌర్ రూపంలో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన హర్మన్.. మలాబా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 39 ఓవర్లు ముగిసే సరికి భారత్ 4 వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది. క్రీజులోకి అమన్జ్యోత్ కౌర్ వచ్చింది.నిలకడగా ఆడుతున్న హర్మన్, దీప్తి37 ఓవర్లు ముగిసే సరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ హర్మన్ ప్రీత్(17), దీప్తి శర్మ(25) ఉన్నారు.భారత్కు భారీ షాక్.. రోడ్రిగ్స్ ఔట్టీమిండియాకు భారీ షాక్ తగిలింది. సెమీస్లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన రోడ్రిగ్స్.. ఫైనల్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోయింది. 24 పరుగులు చేసిన రోడ్రిగ్స్, ఖాఖా బౌలింగ్లో పెవిలియన్కు చేరింది.షెఫాలీ వర్మ ఔట్..షెఫాలీ వర్మ రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 78 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్ల సాయంతో 87 పరుగులు చేసిన.. ఖాఖా బౌలింగ్లో ఔటైంది. 29 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 167/2గా ఉంది. సెంచరీ దిశగా సాగుతున్న షఫాలీషఫాలీ వర్మ సెంచరీ దిశగా సాగుతుంది. 74 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. షఫాలీకి జతగా జెమీమా (21) క్రీజ్లో ఉంది. 27 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 162/1గా ఉంది. షెఫాలీ వర్మ ఫిప్టీ..ఫైనల్ మ్యాచ్లో షెఫాలీ వర్మ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడుతోంది. షెఫాలీ 49 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుంది. 20 ఓవర్లకు భారత్ స్కోర్: 114/1తొలి వికెట్ కోల్పోయిన భారత్..భారత మహిళల జట్టు తొలి వికెట్ కోల్పోయింది. 45 పరుగులు చేసిన మంధాన.. ట్రయాన్ బౌలింగ్లో వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి ఔటైంది. క్రీజులోకి జెమీమా రోడ్రిగ్స్ వచ్చింది.17 ఓవర్లకు భారత్ స్కోర్: 97/017 ఓవర్లు ముగిసే సరికి భారత మహిళల జట్టు వికెట్ నష్టపోకుండా 97 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ(45 బంతుల్లో 48), మంధాన(51 బంతుల్లో 39) ఉన్నారు.నిలకడగా ఆడుతున్న ఓపెనర్లు..10 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 64 పరుగులు చేసింది. క్రీజులో షెఫాలీ వర్మ(29), మంధాన(27) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న షెఫాలీ..5 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 31 పరుగులు చేసింది. క్రీజులో షెఫాలీ వర్మ(21), మంధాన(7) ఉన్నారు.2 ఓవర్లు భారత్ స్కోర్: 7/02 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు స్మృతి మంధాన(1), షెఫాలీ వర్మ(5) ఉన్నారు.బ్యాటింగ్ భారత్దే..డివై పాటిల్ స్టేడియం వేదికగా భారత్తో జరుగుతున్న వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ లారా లారా వోల్వార్డ్ట్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు కూడా తమ ప్లేయింగ్ ఎలెవన్లో ఎటువంటి మార్పులు చేయలేదు. సెమీస్లో ఆడిన జట్టునే కొనసాగించాయి.తుది జట్లుభారత్ : షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్దక్షిణాఫ్రికా : లారా వోల్వార్డ్ట్(కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్, అన్నేకే బాష్, సునే లూస్, మారిజానే కాప్, సినాలో జాఫ్తా(వికెట్ కీపర్), అన్నరీ డెర్క్సెన్, క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, అయాబొంగా ఖాకా, మ్లాబాతగ్గిన వర్షం..నవీ ముంబైలో వర్షం తగ్గుముఖం పట్టింది. దీంతో మైదానాన్ని సిద్దం చేసే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. 4:30 గంటలకు టాస్ పడనుంది. సాయంత్రం ఐదు గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025 ఫైనల్కు రంగం సిద్దమైంది. నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా భారత్-సౌతాఫ్రికా జట్లు తలపడతున్నాయి. అయితే ఈ తుది పోరుకు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో షెడ్యూల్ ప్రకారం టాస్ 2.30 గంటలకు పడాల్సిన టాస్ ఆలస్యం కానుంది.కాగా సౌతాఫ్రికాకు ఇది తొలి వరల్డ్కప్ ఫైనల్ కాగా.. హర్మన్ సేన ఫైనల్ అర్హత సాధించడం ఇది మూడోసారి. అయితే ఈసారి మహిళల క్రికెట్లో సరికొత్త చాంపియన్ను చూడబోతున్నాము. ఎందుకంటే భారత్ కానీ, సౌతాఫ్రికా కానీ ఒక్కసారి కూడా వరల్డ్కప్ ట్రోఫీని గెలుచుకోలేదు. -
కరుణ్ నాయర్ డబుల్ సెంచరీ
రంజీ ట్రోఫీ 2025-26 ఎడిషన్లో కర్ణాటక ఆటగాడు కరుణ్ నాయర్ సూపర్ ఫామ్ను కొనసాగించాడు. తొలి మ్యాచ్లో సౌరాష్ట్రపై హాఫ్ సెంచరీ (73), రెండో మ్యాచ్లో గోవాపై భారీ సెంచరీ (174 నాటౌట్) చేసిన అతడు.. తాజాగా కేరళతో జరుగుతున్న మ్యాచ్లో ఏకంగా డబుల్ సెంచరీతో (233) చెలరేగాడు. ఇదే ఇన్నింగ్స్లో మరో కర్ణాటక ఆటగాడు స్మరణ్ రవిచంద్రన్ (171 నాటౌట్) కూడా డబుల్ సెంచరీ దిశగా సాగుతున్నాడు.కరుణ్, స్మరణ్ చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేస్తున్న కర్ణాటక భారీ స్కోర్ (514/4) చేసింది. స్మరణ్తో పాటు అభినవ్ మనోహర్ (15) క్రీజ్లో ఉన్నాడు. కృష్ణణ్ శ్రీజిత్ (65) అర్ద సెంచరీతో రాణించాడు. బాసిల్ 2, నిధీష్, బాబా అపరాజిత్ తలో వికెట్ తీశారు. ప్రస్తుతం మ్యాచ్ రెండో రోజు రెండో సెషన్ ఆట కొనసాగుతుంది.చదవండి: PAK Vs SA: రాణించిన బాబర్, అఫ్రిది.. పాకిస్తాన్దే టీ20 సిరీస్ -
PAK Vs SA: రాణించిన బాబర్, అఫ్రిది.. పాకిస్తాన్దే టీ20 సిరీస్
స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను పాకిస్తాన్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. లాహోర్ వేదికగా నిన్న (నవంబర్ 1) జరిగిన నిర్ణయాత్మక మూడో మ్యాచ్లో పాక్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేయగా.. పాక్ మరో ఓవర్ మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.చెలరేగిన షాహీన్రీజా హెండ్రిక్స్ (34), కార్బిన్ బాష్ (30 నాటౌట్), డొనొవన్ ఫెరియెరా (29), డెవాల్డ్ బ్రెవిస్ (21) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో సౌతాఫ్రికా ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. డికాక్, ప్రిటోరియస్. జార్జ్ లిండే డకౌట్లయ్యారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది (4-0-26-3), ఫహీమ్ అష్రాఫ్ (4-0-28-2), సల్మాన్ మీర్జా (4-0-16-1), ఉస్మాన్ తారిఖ్ (4-0-26-2), మొహమ్మద్ నవాజ్ (3-0-38-1) చెలరేగిపోయారు.రాణించిన బాబర్చాలాకాలం తర్వాత బాబర్ ఆజమ్ ఫామ్లోకి వచ్చాడు. ఈ మ్యాచ్లో 47 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 68 పరుగులు చేశాడు. సల్మాన్ అఘా (33) ఓ మోస్తరుతో పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లలో సాహిబ్జాదా ఫర్హాన్ 19, సైమ్ అయూబ్ డకౌట్, ఉస్మాన్ ఖాన్ 6 (నాటౌట్), హసన్ నవాజ్ 5, మొహమ్మద్ నవాజ్ డకౌట్, ఫహీమ్ అష్రాఫ్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో కార్బిన్ బాష్, లిజాడ్ విలియమ్స్ తలో 2, డొనొవన్ ఫెరియెరా, సైమ్లేన్ చెరో వికెట్ తీశారు. చదవండి: బాబర్ ఆజం ప్రపంచ రికార్డు.. మొన్న రోహిత్.. ఇప్పుడు కోహ్లి రికార్డు బద్దలు -
ఆసీస్పై టీమిండియా గెలుపు
హోబర్ట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. సిరీస్లో తొలి మ్యాచ్ ఆడిన వాషింగ్టన్ సుందర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఒంటిచేత్తో టీమిండియాను గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేయగా.. భారత్ 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ ఇన్నింగ్స్లో టిమ్ డేవిడ్ (74), స్టోయినిస్ (64) అర్ద సెంచరీలతో సత్తా చాటగా.. భారత్ తరఫున వాషింగ్టన్ సుందర్ చెలరేగాడు. సుందర్ 23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 49 పరుగులు చేసి అజేయంగా నిలువగా.. జితేశ్ శర్మ (13 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు) సుందర్కు సహకరించాడు. భారత ఇన్నింగ్స్లో అభిషేక్ శర్మ 25, శుభ్మన్ గిల్ 15, సూర్యకుమార్ యాదవ్ 24, తిలక్ వర్మ 29, అక్షర్ పటేల్ 17 పరుగులు చేశారు.భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3, వరున్ చక్రవర్తి 2, శివమ్ దూబే ఓ వికెట్ పడగొట్టగా... ఆసీస్ బౌలర్లలో నాథన్ ఇల్లిస్ 3, బార్ట్లెట్, స్టోయినిస్ తలో వికెట్ తీశారు. నాలుగో టీ20 గోల్డ్ కోస్ట్ వేదికగా నవంబర్ 6న జరుగుతుంది.ఐదో వికెట్ కోల్పోయిన భారత్14.2వ ఓవర్- 145 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. బార్ట్లెట్ బౌలింగ్లో తిలక్ వర్మ (29) ఔటయ్యాడు.15 ఓవర్ద తర్వాత భారత్ స్కోర్ 152/5గా ఉంది. సుందర్ (30), జితేశ్ శర్మ (5) క్రీజ్లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్11.1 ఓవర్- 111 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఇల్లిస్ బౌలింగ్లో అక్షర్ పటేల్ (17) ఔటయ్యాడు. 11.4 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 117/4గా ఉంది. వాషింగ్టన్ సుందర్ (6), తిలక్ వర్మ (24) క్రీజ్లో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన భారత్7.3వ ఓవర్- 76 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. స్టోయినిస్ బౌలింగ్లో ఇల్లిస్కు క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ యాదవ్ (24) ఔటయ్యాడు. 8 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 82/3గా ఉంది. అక్షర్ పటేల్ (3), తిలక్ వర్మ (12) క్రీజ్లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన భారత్5.3వ ఓవర్- 61 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. నాథన్ ఇల్లిస్ బౌలింగ్లో శుభ్మన్ గిల్ (15) ఔటయ్యాడు.6 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 64/2గా ఉంది. తిలక్ వర్మ (2), సూర్యకుమార్ యాదవ్ (19) క్రీజ్లో ఉన్నారు. టీమిండియా రెండో వికెట్ డౌన్..శుభ్మన్ గిల్ రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 15 పరుగులు మాత్రమే చేసిన శుభ్మన్ గిల్.. నాథన్ ఎల్లీస్ బౌలింగ్లో వికెట్లు ముందు దొరికిపోయాడు. 6 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 63/2గా ఉంది. తిలక్ వర్మ (2), సూర్యకుమార్ యాదవ్ (19) క్రీజ్లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన భారత్3.3 ఓవర్- 187 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ధాటిగా ఆడుతున్న అభిషేక్ శర్మ 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 25 పరుగులు చేసి నాథన్ ఇల్లిస్ బౌలింగ్లో ఔటయ్యాడు. 4 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 41/1గా ఉంది. శుభ్మన్ గిల్ (7), సూర్యకుమార్ యాదవ్ (7) క్రీజ్లో ఉన్నారు. దూకుడుగా ఆడుతున్న అభిషేక్187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ దూకుడుగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(24), శుభ్మన్ గిల్(5) ఉన్నారు.భారత్ ముందు భారీ టార్గెట్హోబర్ట్ వేదికగా భారత్తో జరుగుతున్న మూడో టీ20లో ఆస్ట్రేలియా బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్(38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్లతో 74), మార్కస్ స్టోయినిష్(39 బంతుల్లో 8 ఫోర్లు,2 సిక్స్లతో 64) విధ్వసంకర హాఫ్ సెంచరీలతో మెరిశారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి రెండు, శివమ్ దూబే ఒక్క వికెట్ సాధించారు.ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్12.6వ ఓవర్- 118 పరుగుల వద్ద ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న టిమ్ డేవిడ్ (74) శివమ్ దూబే బౌలింగ్లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 16 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 143/5గా ఉంది.వరుణ్ మ్యాజిక్.. వరుస బంతుల్లో వికెట్లువరుణ్ చక్రవర్తి తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో వరుస బంతుల్లో మిచెల్ మార్ష్ (11), మిచెల్ ఓవెన్ను (0) ఔట్ చేశాడు. 9 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 75/4గా ఉంది. స్టోయినిస్ (1), టిమ్ డేవిడ్ (55) క్రీజ్లో ఉన్నారు. ఓ పక్క వికెట్లు పడుతున్నా డేవిడ్ మెరుపు హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. డేవిడ్ 23 బంతుల్లోనే ఈ మార్కును తాకాడు. రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్.. 5 ఓవర్ల తర్వాత స్కోర్ ఎంతంటే..?టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆసీస్కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. అర్షదీప్ సింగ్ తొలి ఓవర్లో, మూడో ఓవర్లో వికెట్లు తీశాడు. తొలుత ట్రవిస్ హెడ్ (6), ఆతర్వాత జోస్ ఇంగ్లిస్ను (1) పెవిలియన్కు పంపాడు. 5 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 35/2గా ఉంది. టిమ్ డేవిడ్ (20), మిచ్ మార్ష్ (7) క్రీజ్లో ఉన్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్హోబర్ట్ వేదికగా ఇవాళ (నవంబర్ 2) భారత్, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేసింది. జితేశ్ శర్మ, అర్షదీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి వచ్చారు. ఆస్ట్రేలియా ఈ మ్యాచ్లో ఓ మార్పుతో బరిలోకి దిగింది. హాజిల్వుడ్ స్థానంలో సీన్ అబాట్ తుది జట్టులోకి వచ్చాడు.ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్కీపర్), టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ షార్ట్, సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్భారత్: శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్కీపర్), శివం దుబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రాచదవండి: IND vs SA: వారెవ్వా అన్షుల్!.. ఉత్కంఠ పోరులో సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్ -
IND vs SA: సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్
సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుతో ఉత్కంఠ పోరులో భారత్- ‘ఎ’ జట్టు విజయం సాధించింది. టెయిలెండర్లు అన్షుల్ కాంబోజ్ (37 నాటౌట్), మానవ్ సుతార్ (Manav Suthar- 20 నాటౌట్) యాభైకి పరుగుల భాగస్వామ్యంతో రాణించి జట్టును గట్టెక్కించారు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా.. అనధికారిక తొలి టెస్టులో భారత్.. సౌతాఫ్రికాను మూడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది.ఇంగ్లండ్ పర్యటనలో గాయపడ్డ టీమిండియా స్టార్ రిషభ్ పంత్.. సౌతాఫ్రికాతో స్వదేశంలో టెస్టు సిరీస్కు ముందు భారత్-‘ఎ’ జట్టు కెప్టెన్గా తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. పంత్ సారథ్యంలో భారత్- సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుతో రెండు అనధికారిక టెస్టు సిరీస్లు ఆడుతోంది. ఇందులో భాగంగా బెంగళూరు వేదికగా గురువారం తొలి అనధికారిక టెస్టు మొదలైంది.తనుశ్ కొటియాన్కు నాలుగు వికెట్లుటాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 309 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ జొర్డాన్ హెర్మాన్ (71), జుబేర్ హంజా (66), రుబిన్ హెర్మాన్ (66), టియాన్ వాన్ వారెన్ (46) రాణించారు.234 పరుగులకే ఆలౌట్భారత బౌలర్లలో తనుశ్ కొటియాన్ నాలుగు వికెట్లు దక్కించుకోగా.. గుర్నూర్ బ్రార్, మానవ్ సుతార్ రెండేసి వికెట్లు కూల్చారు. ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన భారత్.. 234 పరుగులకే ఆలౌట్ అయింది.ఓపెనర్లు ఆయుశ్ మాత్రే (65), సాయి సుదర్శన్ (32)లతో పాటు ఆయుశ్ బదోని (38) రాణించగా.. కెప్టెన్ పంత్ (17) సహా దేవదత్ పడిక్కల్ (6), రజత్ పాటిదార్ (19) విఫలమయ్యారు. తనుశ్ కొటియాన్ 13 పరుగులు చేయగా.. టెయిలెండర్లు అన్షుల్ 5, మావన్ 4, ఖలీల్ 4 పరుగులే చేశారు.ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా భారత బౌలర్ల ధాటికి 199 పరుగులకే కుప్పకూలింది. తనుశ్ మరోసారి నాలుగు వికెట్లతో చెలరేగగా.. అన్షుల్ 3, బ్రార్ రెండు, మానవ్ ఒక వికెట్ దక్కించుకున్నారు.ఈ నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 75 పరుగులు కలుపుకొని సౌతాఫ్రికా.. భారత్కు 275 పరుగుల లక్ష్యాన్ని విధించింది. అయితే, ఓపెనర్లు సాయి సుదర్శన్ (12), ఆయుశ్ మాత్రే (6), వన్డౌన్ బ్యాటర్ పడిక్కల్ (5) త్వరగా అవుట్ కావడంతో భారత్ చిక్కుల్లో పడింది.పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్ఈ దశలో రజత్ పాటిదార్ (28) సహకారం అందించగా.. పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరిశాడు. ఐదో స్థానంలో వచ్చి 113 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 90 పరుగులు సాధించాడు. అయితే, పంత్ అవుటైన తర్వాత.. ఆ వెంటనే ఆయుశ్ బదోని (34) కూడా అవుట్ కావడంతో భారత్ కష్టాల్లో కూరుకుపోయింది.గెలిపించిన అన్షుల్, మానవ్ఇలాంటి తరుణంలో తనుశ్ కొటియాన్ 23 పరుగులు చేయగా.. ఆశలు వదిలేసుకున్న సమయంలో మానవ్ 20, అన్షుల్ 37 (4 ఫోర్లు, 2 సిక్స్లు) పరుగులతో అజేయంగా నిలిచి భారత్కు విజయం అందించారు. ఆల్రౌండ్ ప్రతిభతో రాణించిన తనుశ్ కొటియాన్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.భారత్- ‘ఎ’ వర్సెస్ సౌతాఫ్రికా- ‘ఎ’తొలి అనధికారిక టెస్టు సంక్షిప్త స్కోర్లు👉వేదిక: బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ 1, బెంగళూరు👉టాస్: భారత్.. తొలుత బౌలింగ్👉సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 309👉భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 234👉సౌతాఫ్రికాకు 75 పరుగుల ఆధిక్యం👉సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ స్కోరు: 199👉భారత్ లక్ష్యం: 275 పరుగులు👉భారత్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 277/7👉ఫలితం: మూడు వికెట్ల తేడాతో సౌతాఫ్రికాపై భారత్ విజయం.చదవండి: ICC: గెలిచిన జట్టుకు కళ్లు చెదిరే ప్రైజ్మనీ!.. బీసీసీఐ బంపరాఫర్ -
బాబర్ ఆజం ప్రపంచ రికార్డు
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజం (Babar Azam) ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చాడు. సౌతాఫ్రికాతో మూడో టీ20 (PAK vs SA 3rd T20I)లో ఈ వన్డౌన్ బ్యాటర్ అదరగొట్టాడు. ధనాధన్ దంచికొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.మెరుపు హాఫ్ సెంచరీఈ క్రమంలోనే బాబర్ ఆజం అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో మరో ప్రపంచ రికార్డు సాధించాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024లో వైఫల్యం తర్వాత కెప్టెన్సీ కోల్పోయిన బాబర్కు.. ఆ తర్వాత జట్టులోనూ స్థానం కరువైంది. అయితే, ఇటీవల సొంతగడ్డపై సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ సందర్భంగా అతడు పునరాగమనం చేశాడు.కానీ రీఎంట్రీలో.. అంటే ప్రొటిస్తో తొలి మ్యాచ్లో బాబర్ ఆజం పూర్తిగా విఫలమయ్యాడు. రెండు బంతులు ఎదుర్కొని డకౌట్ అయ్యాడు. అయితే, రెండో టీ20లో 11 పరుగులతో అజేయంగా నిలిచి ఫర్వాలేదనిపించిన అతడు.. మూడో టీ20లో మాత్రం మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు.139 పరుగులకు కట్టడిలాహోర్ వేదికగా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పాక్.. సౌతాఫ్రికాను 139 పరుగులకు కట్టడి చేసింది. షాహిన్ ఆఫ్రిది మూడు వికెట్లు తీయగా.. ఫాహిమ్ ఆష్రఫ్ , ఉస్మాన్ తారిక్ రెండేసి వికెట్లు, సల్మాన్ మీర్జా, మొహమ్మద్ నవాజ్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ప్రొటిస్ బ్యాటర్లలో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ 34 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలవగా.. కార్బిన్ బాష్ 30 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్.. 19 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (19), సయీమ్ ఆయుబ్ (0) దారుణంగా విఫలం కాగా.. వన్డౌన్లో వచ్చిన బాబర్ బాధ్యత తీసుకున్నాడు.బాబర్కు తోడుగా కెప్టెన్ సల్మాన్ ఆఘా (26 బంతుల్లో 33) రాణించగా.. హసన్ నవాజ్ (5), నవాజ్ (0) ఇలా వచ్చి అలా వెళ్లారు. ఇక బాబర్ మొత్తంగా 47 బంతుల్లో తొమ్మిది ఫోర్ల సాయంతో 68 పరుగులు సాధించాడు. ఆఖర్లో ఉస్మాన్ ఖాన్ 6, ఫాహిమ్ ఆష్రఫ్ 4 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయాన్ని ఖరారు చేశారు. కోహ్లి ప్రపంచ రికార్డు బద్దలుఇక మూడో టీ20లో విజయంతో పాకిస్తాన్ సౌతాఫ్రికాను 2-1తో ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది. కాగా ఈ మ్యాచ్ సందర్భంగా బాబర్ ఆజం అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో తన ఫిఫ్లీ ప్లస్ స్కోర్ల సంఖ్యను నలభైకి పెంచుకున్నాడు.తద్వారా ఇప్పటిదాకా అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్ల వీరుడిగా ఉన్న టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి ప్రపంచ రికార్డును బాబర్ బద్దలు కొట్టాడు. కాగా సౌతాఫ్రికాతో రెండో టీ20 సందర్భంగా 11 పరుగులు చేసిన బాబర్.. అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్న భారత దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మను అధిగమించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన క్రికెటర్లు🏏బాబర్ ఆజం (పాకిస్తాన్)- 40 (3 శతకాలు, 37 ఫిఫ్టీలు)🏏విరాట్ కోహ్లి (ఇండియా)- 39 (ఒక శతకం, 39 ఫిఫ్టీలు)🏏రోహిత్ శర్మ (ఇండియా)- 37 (5 శతకాలు, 32 ఫిఫ్టీలు)🏏మొహమ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్)- 31 (ఒక శతకం, 30 ఫిఫ్టీలు)🏏డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)- 29 (ఒక శతకం, 28 ఫిఫ్టీలు).చదవండి: IND vs SA: వన్డే తరహా బ్యాటింగ్!.. పాపం పంత్.. భారత్కు షాక్ -
కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం
న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం కేన్ విలియమ్సన్ (Kane Williamson) అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్-2026 (T20 WC 2026) టోర్నమెంట్ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు.ఇదే సరైన సమయం‘‘నాకు.. జట్టుకు ఈ నిర్ణయం ఎంతో ముఖ్యమైనది. రిటైర్మెంట్ ప్రకటనకు ఇదే సరైన సమయం. వచ్చే టీ20 వరల్డ్కప్ టోర్నీకి జట్టును సంసిద్ధం చేసే విషయంలో వారికి ఇప్పుడు ఒక స్పష్టత వస్తుంది.జట్టులో టీ20 ప్రతిభకు కొదవలేదు. ప్రపంచకప్ టోర్నీకి వారిని ఇప్పటి నుంచి సిద్ధం చేయాల్సి ఉంది. మిచ్ (మిచెల్ సాంట్నర్) అద్భుతమైన సారథి. జట్టుకు నా వంత సహకారం ఉంటుంది. సుదీర్ఘ కెరీర్లో నాకెన్నో అనుభవాలు, జ్ఞాపకాలు ఉన్నాయి’’ అంటూ కేన్ విలియమ్సన్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. టెస్టులకు మాత్రం కొనసాగుతాకాగా వెస్టిండీస్తో స్వదేశంలో జరుగబోయే టీ20 సిరీస్కు ముందు విలియమ్సన్ ఈ విషయం వెల్లడించాడు. అదే విధంగా.. విండీస్తో వన్డే సిరీస్కు కూడా దూరం కానున్నట్లు తెలిపాడు.అయితే, వెస్టిండీస్తో డిసెంబరులో జరుగబోయే మూడు టెస్టులకు మాత్రం తాను అందుబాటులో ఉంటానని విలియమ్సన్ స్పష్టం చేశాడు. కాగా విలియమ్సన్ టీ20 రిటైర్మెంట్పై న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్కాట్ వీనింక్ స్పందించాడు.కేన్ కెరీర్ అద్భుతంగా సాగిందని.. తను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందుకు తమ మద్దతు ఉంటుందని స్కాట్ తెలిపాడు. ఏదేమైనా కేన్ చాన్నాళ్లపాటు క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నామని.. అయితే, ఆటకు వీడ్కోలు పలికే విషయంలో అతడికి పూర్తి స్వేచ్ఛ ఉందని పేర్కొన్నాడు. కేన్ న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజంగా చరిత్రలో గుర్తుండిపోతాడని ప్రశంసించాడు.సెంట్రల్ కాంట్రాక్డు నుంచి వైదొలిగి..కాగా మొట్టమొదటి వరల్డ్ టెస్టు చాంపియన్షిప్లో కెప్టెన్ హోదాలో న్యూజిలాండ్ను విజేతగా నిలిపాడు కేన్ విలియమ్సన్. ఆ తర్వాత టెస్టు, వన్డే, టీ20 జట్ల కెప్టెన్సీ వదులుకున్న కేన్ మామ.. న్యూజిలాండ్ క్రికెట్ సెంట్రల్ కాంట్రాక్డు నుంచి వైదొలిగాడు.కుటుంబానికి సమయం కేటాయించడం, ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడే క్రమంలో ఈ మేరకు స్వేచ్ఛను కోరుకున్న 35 ఏళ్ల కేన్.. క్యాజువల్ కాంట్రాక్టు కుదుర్చుకోవడం ద్వారా తనకు వీలైనపుడు దేశం తరఫున ఆడుతున్నాడు.సెకండ్ హయ్యస్ట్ రన్ స్కోరర్గాఇక కివీస్ జట్టు తరఫున ఎన్నో రికార్డులు సాధించిన కేన్ మామ.. అంతర్జాతీయ టీ20లలో 93 మ్యాచ్లు ఆడి.. 2575 పరుగులు సాధించాడు. ఇందులో 18 అర్ధ శతకాలు ఉన్నాయి. 2021 టీ20 ప్రపంచకప్ టోర్నీలో కివీస్ కెప్టెన్గా వ్యవహరించిన కేన్.. ఆస్ట్రేలియాతో ఫైనల్లో 85 పరుగులు చేశాడు. కానీ జట్టును గెలిపించలేకపోయాడు.ఇక 2016, 2022 టీ20 ప్రపంచకప్ టోర్నీల్లోనూ కేన్ కివీస్ జట్టుకు సారథ్యం వహించాడు. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కేన్ రెండో స్థానంలో నిలిచాడు. కాగా 2011లో కివీస్ తరఫున టీ20లలో అరంగేట్రం చేసిన కేన్.. గతేడాది జూన్లో తన చివరి మ్యాచ్ ఆడాడు.చదవండి: ICC: గెలిచిన జట్టుకు కళ్లు చెదిరే ప్రైజ్మనీ!.. బీసీసీఐ బంపరాఫర్ -
IND vs SA: వన్డే తరహా బ్యాటింగ్!.. పాపం పంత్
సౌతాఫ్రికా- ‘ఎ’తో మ్యాచ్ భారత్- ‘ఎ’ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) తృటిలో శతకం చేజార్చుకున్నాడు. వంద పరుగుల మార్కుకు పది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. పంత్ ఐదో వికెట్గా వెనుదిరడంతో భారత జట్టు మరోసారి కష్టాల్లో పడింది. కాగా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ వేదికగా భారత్- సౌతాఫ్రికా ‘ఎ’ జట్ల గురువారం తొలి అనధికారిక టెస్టు ఆరంభమైంది.ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్లో 309 పరుగులకు ఆలౌట్ అయిన సౌతాఫ్రికా.. రెండో ఇన్నింగ్స్లో 199 పరుగులకే చాప చుట్టేసింది. అయితే, తొలి ఇన్నింగ్స్లో భారత్ 234 పరుగులకే ఆలౌట్ కావడం సౌతాఫ్రికాకు కలిసి వచ్చింది.భారత్కు 275 పరుగుల లక్ష్యంమొదటి ఇన్నింగ్స్ కలుపుకొని భారత్కు 275 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ఈ క్రమంలో శనివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా లక్ష్య ఛేదనకు దిగిన భారత్ ఆరంభంలోనే వరుస వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ఆయుశ్ మాత్రే (6), వన్డౌన్ బ్యాటర్ దేవ్దత్ పడిక్కల్ (5) పూర్తిగా విఫలం కాగా.. మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (12) కూడా నిరాశపరిచాడు.ఈ క్రమంలో... గాయం నుంచి కోలుకొని తిరిగి మైదానంలో అడుగు పెట్టిన భారత స్టార్ రిషబ్ పంత్ (81 బంతుల్లో 64 బ్యాటింగ్; 8 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా గాయపడిన పంత్ దాదాపు మూడు నెలల తర్వాత పోటీ క్రికెట్లో అడుగుపెట్టగా... తొలి ఇన్నింగ్స్లో 17 పరుగులే చేశాడు. అయితే, రెండో ఇన్నింగ్స్లో మాత్రం అదరగొట్టాడు.వన్డే తరహా ఆటతీరుతోకీలక దశలో క్రీజులోకి వచ్చిన పంత్... తనదైన శైలిలో రెచ్చిపోయాడు. వన్డే తరహా ఆటతీరుతో సఫారీ బౌలర్లను ఎదుర్కొన్నాడు. ఒక ఎండ్లో పాటీదార్ క్రీజులో పాతుకుపోయి వికెట్ల పతనాన్ని అడ్డుకుంటే... మరో ఎండ్లో పంత్ ఫటాఫట్ ఆటతీరుతో పరుగులు రాబట్టాడు. నాలుగో వికెట్కు 87 పరుగులు జోడించిన అనంతరం రజత్ అవుటయ్యాడు. పంత్తో పాటు ఆయుశ్ బదోనీ (0 బ్యాటింగ్) క్రీజులో నిలిచాడు.ఫలితంగా 275 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన భారత ‘ఎ’ జట్టు మూడో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 39 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఆఖరిదైన ఆదివారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా తన ఓవర్నైట్ స్కోరుకు మరో 26 పరుగులు జత చేసిన పంత్ సెంచరీ దిశగా పయనించాడు. సెంచరీ మిస్అయితే, 90 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ప్రొటిస్ బౌలర్ టియాన్ వాన్ వారెన్ అద్భుత బంతితో పంత్ను బోల్తా కొట్టించాడు. వారెన్ వేసిన బంతిని షాట్ ఆడే క్రమంలో లీసెగో సెనొక్వనేకు క్యాచ్ ఇచ్చి పంత్.. ఐదో వికెట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత ఆయుశ్ బదోని 34 పరుగుల వద్ద వారెన్కు తన వికెట్ సమర్పించుకున్నాడు.ఫలితంగా 53 ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసిన భారత్.. విజయానికి ఇంకా 80 పరుగుల దూరంలో నిలిచింది. తనుశ్ కొటియాన్ (9), మానవ్ సుతార్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా రెండో ఇన్నింగ్స్లో పంత్.. 113 బంతులుఎదుర్కొని పదకొండు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 90 పరుగులు సాధించాడు. Update: లంచ్ బ్రేక్ సమయానికి భారత్ స్కోరు: 216-7 (61)తనుశ్ కొటియాన్ 23 పరుగులు చేసి ఏడో వికెట్గా వెనుదిరగగా.. మానవ్ సుతార్ 1, అన్షుల్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 59 పరుగుల దూరంలో ఉండగా.. చేతిలో కేవలం కేవలం మూడు వికెట్లు (టెయిలెండర్లు) మాత్రమే ఉన్నాయి.Match Result: IND vs SA: వారెవ్వా అన్షుల్!.. ఉత్కంఠ పోరులో సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్చదవండి: ICC: గెలిచిన జట్టుకు కళ్లు చెదిరే ప్రైజ్మనీ!.. బీసీసీఐ బంపరాఫర్! -
‘వరల్డ్ నంబర్ వన్ కావాలని కోరుకోలేదు’
టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)పై భారత మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ (Mohammad Kaif) ప్రశంసలు కురిపించాడు. ప్రపంచ నంబర్ వన్ కావాలనే ఆశ హిట్మ్యాన్కు లేదని.. ఎల్లప్పుడూ జట్టు కోసమే తాపత్రయపడేవాడని తెలిపాడు. రోహిత్ అద్భుత కెప్టెన్సీ కారణంగానే భారత జట్టు వన్డే, టీ20లలో అగ్రస్థానానికి చేరుకుందని కొనియాడాడు.కాగా ఆస్ట్రేలియా పర్యటనకు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. యువ ఆటగాడు శుబ్మన్ గిల్ (Shubman Gill)కు సారథ్య బాధ్యతలు అప్పగించగా.. హిట్మ్యాన్ కేవలం బ్యాటర్గా జట్టులో కొనసాగుతున్నాడు. తొలిసారి అగ్రస్థానంఇక ఆసీస్ టూర్లో మూడు వన్డేల సిరీస్లో 38 ఏళ్ల రోహిత్ 202 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో తొలిసారి అగ్రస్థానం దక్కించుకున్నాడు. రెండు స్థానాలు మెరుగుపరచుకుని.. 781 పాయింట్లతో నంబర్ వన్ వన్డే బ్యాటర్గగా నిలిచాడు. అతిపెద్ద వయస్కుడిగాతద్వారా సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి, శుబ్మన్ గిల్ తర్వాత ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టాప్ ర్యాంక్లో నిలిచిన ఐదో భారతీయ క్రికెటర్గా హిట్మ్యాన్ గుర్తింపు దక్కించుకున్నాడు. అంతేకాదు.. ఐసీసీ నంబర్వన్ ర్యాంక్ దక్కించుకున్న అతిపెద్ద వయస్కుడిగానూ రోహిత్ చరిత్ర సృష్టించాడు.వరల్డ్ నంబర్ వన్ కావాలని కోరుకోలేదుఈ నేపథ్యంలో మొహమ్మద్ కైఫ్ రోహిత్ శర్మ జట్టుకు నిస్వార్థ సేవ చేశాడంటూ అతడి అంకితభావాన్ని ప్రశంసించాడు. ‘‘ఐసీసీ వన్డే నంబర్ వన్ ర్యాంకు నడుచుకుంటూ రోహిత్ దగ్గరకు వచ్చింది. తాను ప్రపంచంలోనే నంబర్ వన్ బ్యాటర్ కావాలని రోహిత్ ఎప్పుడూ అనుకోలేదు.అలాంటి కోరిక ఒకటి మనసులో ఉందని ఎన్నడూ చెప్పనూ లేదు. తన ధ్యాస ఎల్లప్పుడూ జట్టు గురించే. టీమిండియా గెలవాలి.. టాప్లో ఉండాలి.. ఇదే తన ఆశయం. అతడు గొప్ప కెప్టెన్.టీమిండియాను నంబర్ వన్గా నిలిపాడుకీలక సమయాల్లో బ్యాట్తో రాణించడం తనకు అలవాటు. ఇక జట్టు విజయానికి కారణం ఎవరైనా వారిని తప్పక ప్రశంసిస్తాడు రోహిత్. టీమిండియా వన్డే ర్యాంకింగ్స్లో నాలుగో స్థానంలో ఉన్నపుడు రోహిత్ కెప్టెన్సీ చేపట్టాడు.జట్టును నంబర్ వన్గా నిలిపిన తర్వాత అతడు తప్పుకోవాల్సి వచ్చింది. ఇక టీ20లలో రెండో ర్యాంకులో ఉన్నపుడు పగ్గాలు చేపట్టిన రోహిత్.. ఈ ఫార్మాట్లోనూ టీమిండియాను అగ్రస్థానంలో నిలిపి.. వరల్డ్కప్ (2024) అందించి కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు’’ అని కైఫ్ ప్రశంసల వర్షం కురిపించాడు.అజేయ సెంచరీతో చెలరేగిన రోహిత్ ఇక ఇప్పటికే టీ20, టెస్టు ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ... చాంపియన్స్ ట్రోఫీ తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం ఆసీస్తో వన్డే సిరీస్ ఆడిన విషయం తెలిసిందే. కంగారూలతో చివరి మ్యాచ్లో అజేయ సెంచరీతో చెలరేగిన రోహిత్ భారత్ తరఫున అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు చేసిన ఓపెనర్గానూ రికార్డుల్లోకెక్కాడు.కాగా 2019 వన్డే ప్రపంచకప్లో రికార్డు స్థాయిలో 5 శతకాలతో చెలరేగిన రోహిత్ శర్మ కెరీర్ అత్యుత్తమంగా 882 రేటింగ్ పాయింట్లు సాధించినా... రెండో ర్యాంక్లోనే నిలిచాడు. తాజాగా ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా అతడికి తొలిసారి ‘టాప్’ ప్లేస్ దక్కింది.చదవండి: ఓడిపోతే.. ఎలా ఉంటుందో తెలుసు.. గెలిచినా.. ఓడినా ఏడ్చేస్తా: భారత కెప్టెన్ -
WC 2025: కళ్లు చెదిరే ప్రైజ్మనీ!.. బీసీసీఐ బంపరాఫర్
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025 టోర్నమెంట్ తుది అంకానికి చేరుకుంది. నవీ ముంబై వేదికగా భారత్- సౌతాఫ్రికా (IND W vs SA W) మధ్య ఆదివారం నాటి ఫైనల్తో ఈ టోర్నీలో కొత్త చాంపియన్ అవతరించనుంది.ఈ ఈవెంట్లో ఇప్పటికే రెండుసార్లు రన్నరప్గా నిలిచిన టీమిండియా.. తొలిసారి ఫైనలిస్టు అయిన సౌతాఫ్రికా... ప్రస్తుత బలాబలాల దృష్ట్యా టైటిల్ పోరు రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. కొత్త చాంపియన్ రాకతో పాటు.. ఈసారి వన్డే వరల్డ్కప్ టోర్నీకి మరో ప్రత్యేకత కూడా ఉంది.కళ్లు చెదిరే ప్రైజ్మనీవిజేతగా నిలిచిన జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కళ్లు చెదిరే ప్రైజ్మనీ ప్రకటించింది. పురుషుల, మహిళల క్రికెట్లో రికార్డు స్థాయిలో చాంపియన్కు ఏకంగా 4.48 మిలియన్ యూఎస్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 39.78 కోట్లు) ఇవ్వనుంది.123 కోట్ల రూపాయలుఅదే విధంగా.. రన్నరప్ జట్టుకు.. విజేతకు అందించిన నగదులో సగం అంటే 2.24 మిలియన్ యూఎస్ డాలర్లు (దాదాపు రూ. 19 కోట్లకు పైగా) ప్రైజ్మనీగా ప్రకటించింది. భారత్- శ్రీలంక సంయుక్త ఆతిథ్య దేశాలుగా ఉన్న ఈ టోర్నీ ప్రైజ్మనీల మొత్తానికి ఐసీసీ ఏకంగా 13.88 మిలియన్ యూఎస్ డాలర్లు అంటే... దాదాపు 123 కోట్ల రూపాయలు కేటాయించింది.239 శాతం పెంచారువరల్డ్కప్ టోర్నీ చరిత్రలోనే ఇది అత్యధికం. వన్డే వరల్డ్కప్-2022 ఎడిషన్తో పోలిస్తే ఇది ఏకంగా 297 శాతం ఎక్కువ కావడం విశేషం. అంతేకాదు.. నాటి విజేత ఆస్ట్రేలియాకు ఇచ్చిన ప్రైజ్మనీ కంటే తాజా సీజన్ విన్నర్కు ఇచ్చే ప్రైజ్మనీని ఏకంగా 239 శాతం పెంచడం గమనార్హం.రూ. 42 కోట్లకుఇక ఈ టోర్నీలో భారత్ ఇప్పటికే దాదాపు 3,50,000 యూఎస్ డాలర్ల ప్రైజ్మనీ (సుమారుగా 3.1 కోట్ల రూపాయలు) సొంతం చేసుకుంది. టోర్నీలో పాల్గొన్నందుకు, గ్రూప్ దశలో మూడు విజయాలకు గానూ ఈ మొత్తం టీమిండియాకు లభించింది. అన్నీ సజావుగా సాగి భారత్ చాంపియన్గా అవతరిస్తే మొత్తం ప్రైజ్మనీ రూ. 42 కోట్లకు చేరుకుంటుంది.మరోవైపు.. సౌతాఫ్రికా ఇప్పటికే నాలుగు లక్షల యూఎస్ డాలర్లకుపైగా గెలుచుకుంది. గ్రూప్ దశలో ఐదు విజయాలు సాధించి ఈ మొత్తం సొంతం చేసుకుంది. ఏదేమైనా క్రికెట్ ప్రపంచంలో పురుష జట్ల ఆధిపత్యం కొనసాగుతున్న వేళ.. మహిళా టోర్నీలో రికార్డు స్థాయి ప్రైజ్మనీ అందించడం హర్షించదగ్గ పరిణామం. మహిళా క్రికెట్కు ఆదరణ పెంచడంతో పాటు.. యువ ఆటగాళ్లను ఆకర్షించడానికి ఇలాంటి చర్యలు తోడ్పడతాయి.బీసీసీఐ బంపరాఫర్!ఇదిలా ఉంటే.. ఒకవేళ హర్మన్ సేన గనుక వన్డే వరల్డ్కప్ గెలిస్తే.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మహిళా క్రికెటర్లుకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోందని సమాచారం. పురుష క్రికెటర్లతో పాటు మహిళా ప్లేయర్లకు కూడా సమవేతనం చెల్లించాలనే యోచనలో ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు పీటీఐతో పేర్కొన్నాయి. మరోవైపు.. హర్మన్సేన ట్రోఫీ గెలిస్తే బీసీసీఐ రూ. 125 కోట్ల నజరానా ఇవ్వనుందనే ప్రచారం జరుగుతోంది. కాగా నవీ ముంబై వేదికగా ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు భారత్- సౌతాఫ్రికా మధ్య ఫైనల్కు తెరలేస్తుంది.చదవండి: IND vs AUS 3rd T20: సమం చేసేందుకు సమరం -
ఫైనల్లో ఓడిపోతే.. ఎలా ఉంటుందో తెలుసు: భారత కెప్టెన్
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్ టోర్నమెంట్లో ఇప్పటికే రెండుసార్లు ఫైనల్ చేరింది భారత్. 2005, 2017 ఎడిషన్లలో టైటిల్ పోరుకు అర్హత సాధించినా రన్నరప్తోనే సరిపెట్టుకుంది. ఈసారి సొంతగడ్డపై ఈ మెగా ఈవెంట్లో ముచ్చటగా మూడోసారి ఫైనల్కు చేరుకున్న భారత జట్టు.. కలల ‘కప్పు’ను ముద్దాడాలని పట్టుదలగా ఉంది.నవీ ముంబై వేదికగా ఆదివారం సౌతాఫ్రికా (ICC World Cup 2025 Ind W vs SA W)ను చిత్తు చేసి విశ్వవిజేతగా అవతరించాలని హర్మన్ సేన కంకణం కట్టుకుంది. భారత్కు ఇప్పటికే రెండుసార్లు ఫైనల్ ఆడిన అనుభవం ఉండగా.. సౌతాఫ్రికా టైటిల్ పోరుకు అర్హత సాధించడం ఇదే తొలిసారి. అయితే, ప్రొటిస్ జట్టులో మరిజానే కాప్, కెప్టెన్ లారా వొల్వర్ట్లను నిలువరించగలిగితే భారత్కు తిరుగు ఉండదు.ఫైనల్లో ఓడిపోతే.. ఎలా ఉంటుందో తెలుసుఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్కు ముందు భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘వరల్డ్కప్ ఫైనల్లో ఓడిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మాకు బాగా తెలుసు. ఈసారి ఆ భావనను సంతోషకరంగా మార్చుకోవాలని పట్టుదలగా ఉన్నాము.అన్నింటికంటే అదే ముఖ్యంటైటిల్ గెలిచి సత్తా చాటాలని భావిస్తున్నాం. ఇది మాకెంతో ప్రత్యేకమైన రోజు. కష్టపడి, కఠిన సవాళ్లు అధిగమించి ఇక్కడిదాకా చేరుకున్నాం. ఒత్తిడిని దరిచేరనీయకుండా ఆడటం అన్నింటికంటే ముఖ్యం’’ అని హర్మన్ప్రీత్ కౌర్ పేర్కొంది.ఇక పటిష్ట ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్ గెలిచిన నేపథ్యంలో టీమిండియాతో పాటు దేశమంతా సంబరాలు అంబరాన్నంటిన విషయం తెలిసిందే. ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ విషయంపై హర్మన్ప్రీత్ స్పందిస్తూ..గెలిచినా.. ఓడినా ఏడ్చేస్తా‘‘నేను భావోద్వేగాలను నియంత్రించుకోలేను. చాలా ఎమోషనల్గా ఉంటా. మ్యాచ్ గెలవగానే ఏడ్చేశా. ఎంతసేపు ఏడ్చానో గుర్తులేదు. ఓడిన తర్వాత కాదు.. గెలిచిన తర్వాత కూడా ఏడుపు వస్తుంది.టీవీల్లో మీరంతా చూసే ఉంటారు. అయితే, మా వాళ్లకు ఇది అలవాటే. డ్రెసింగ్రూమ్లో నేను ఏడ్వటం వాళ్లు చాలాసార్లు చూశారు. చిన్న చిన్న విషయాలకు కూడా నేను ఉద్వేగానికి లోనవుతా. ముఖ్యంగా జట్టు అనుకున్న ఫలితాన్ని రాబట్టినపుడు అందరికంటే ముందే నా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి’’ అని హర్మన్ప్రీత్ చెప్పుకొచ్చింది. కాగా ఆదివారం నాటి పోరులో భారత్- సౌతాఫ్రికాల జట్లలో గెలుపు ఎవరిదైనా.. ఈసారి కొత్త చాంపియన్ అవతరిస్తుంది.చదవండి: WC 2025 Final IND vs SA: ఇరుజట్ల బలాలు ఇవే -
న్యూజిలాండ్ ‘క్లీన్ స్వీప్’
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ పర్యటనలో పేలవ ఆటతీరు కొనసాగించిన ఇంగ్లండ్... మూడో వన్డేలోనూ పరాజయం పాలైంది. ఇటీవలి కాలంలో వన్డే ఫార్మాట్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవుతున్న ఇంగ్లండ్... శనివారం కివీస్తో జరిగిన ఆఖరి పోరులో 2 వికెట్ల తేడాతో ఓడింది. ఫలితంగా సొంతగడ్డపై టి20 సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్... వన్డే సిరీస్ను 3–0తో ‘క్లీన్ స్వీప్’ చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్... 40.2 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌటైంది. ఈ సిరీస్లో మూడు మ్యాచ్ల్లోనూ ఇంగ్లండ్ పూర్తి ఓవర్లు ఆడకుండానే ఆలౌటైంది. జేమీ ఓవర్టన్ (62 బంతుల్లో 68; 10 ఫోర్లు, 2 సిక్స్లు) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా... జోస్ బట్లర్ (56 బంతుల్లో 38; 7 ఫోర్లు), బ్రైడన్ కార్స్ (30 బంతుల్లో 36; 1 ఫోర్, 4 సిక్స్లు) ఫర్వాలేదనిపించారు. బౌలర్లలో బ్లెయిర్ టిక్నెర్ 4 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో న్యూజిలాండ్ 44.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర (46; 7 ఫోర్లు), డారిల్ మిచెల్ (44; 4 ఫోర్లు, 1 సిక్స్), డెవాన్ కాన్వే (34; 2 ఫోర్లు, 2 సిక్స్లు) తలా కొన్ని పరుగులు చేశారు. టిక్నెర్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, డారిల్ మిచెల్కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి. -
శ్రీకర్ 93; ఆంధ్ర 222/3
కటక్: ఆంధ్ర ఓపెనర్ శ్రీకర్ భరత్ (129 బంతుల్లో 93; 10 ఫోర్లు, 3 సిక్స్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా ఒడిశాతో జరుగుతున్న మ్యాచ్లో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్లో మంచి స్కోరు దిశగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆంధ్ర శనివారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 68 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. భరత్తో పాటు అభిషేక్ రెడ్డి (195 బంతుల్లో 76; 9 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు. వీరిద్దరూ తొలి వికెట్కు 161 పరుగులు జోడించడంతో ఆంధ్ర జట్టుకు శుభారంభం దక్కింది. సెంచరీకి సమీపించిన తర్వాత భరత్ అవుట్ కాగా... కెప్టెన్ రికీ భుయ్ (0) విఫలమయ్యాడు. షేక్ రషీద్ (25 బ్యాటింగ్; 2 ఫోర్లు), కరణ్ షిండే (16 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ఒడిశా బౌలర్లలో సంబిత్ బరల్ 2 వికెట్లు పడగొట్టాడు. సత్తాచాటిన రోహిత్ రాయుడు గత రెండు మ్యాచ్లను ‘డ్రా’తో సరిపెట్టుకున్న హైదరాబాద్ జట్టు... మూడో మ్యాచ్లో ఫర్వాలేదనిపించింది. ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హిమాచల్ ప్రదేశ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 90 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది. ఆకాశ్ వశిష్ఠ (156 బంతుల్లో 114 బ్యాటింగ్; 14 ఫోర్లు, 1 సిక్స్) అజేయ శతకంతో కదంతొక్కగా... సిద్ధార్థ్ పురోహిత్ (37), అంకుశ్ (30), పుఖ్రాజ్ మాన్ (30), మయాంక్ డాగర్ (36) తలాకొన్ని పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో రోహిత్ రాయుడు 3 వికెట్లు పడగొట్టగా... తనయ్ త్యాగరాజన్ 2 వికెట్లు తీశాడు. చామా మిలింద్, నిశాంత్ చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. -
రోహన్ బోపన్న గుడ్బై
డబుల్స్ మిస్సైల్స్ లియాండర్ పేస్, మహేశ్ భూపతిల తర్వాత భారత టెన్నిస్లో ఎవరనే ఎదురుచూపులకు రోహన్ బోపన్న తన ఆటతీరుతో తెరదించాడు. ఆ డబుల్స్ దిగ్గజ ద్వయం గెలిచినన్ని గ్రాండ్స్లామ్ టైటిల్స్ గెలవకపోయినా... వాళ్లిద్దరిలా సుదీర్ఘ అంతర్జాతీయ టెన్నిస్లో భారత జెండాను రెపరెపలాడించిన ఘనత మాత్రం బోపన్నకు దక్కుతుంది. రెండు దశాబ్దాలకుపైబడిన కెరీర్లో రాకెట్తో ప్రత్యర్థి జోడీలను రఫ్పాడించిన రోహన్ తాజాగా టెన్నిస్కు బైబై చెప్పాడు. న్యూఢిల్లీ: భారత వెటరన్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న తన సుదీర్ఘ కెరీర్కు గుడ్బై చెప్పాడు. గ్రాండ్స్లామ్ డబుల్స్ సాధించిన నలుగురు భారత దిగ్గజాల్లో (పేస్, భూపతి, సానియా మీర్జా) ఒకడిగా ఎదిగిన ఈ ఆరడుగుల రాకెట్... ప్రొఫెషనల్ టెన్నిస్కు శనివారం రిటైర్మెంట్ ప్రకటించాడు. 45 ఏళ్ల ఈ సీనియర్ ఆటగాడు చివరి సారిగా అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) టూర్లో పారిస్ మాస్టర్స్ టోర్నీలో పాల్గొన్నాడు. ఈ వారమే జరిగిన టోర్నీలో కజకిస్తాన్ భాగస్వామి అలెగ్జాండర్ బబ్లిక్తో కలిసి పోటీపడ్డాడు. కానీ తొలి రౌండ్లోనే ఈ జోడీ ఓడిపోయింది. ఇప్పుడు అదే రౌండ్ తన కెరీర్కు ఆఖరి రౌండ్ అయ్యింది. ‘ఎ గుడ్బై... బట్ నాట్ ద ఎండ్’ (ఇక సెలవ్... కానీ ముగింపు మాత్రం కాదు సుమా) అనే టైటిల్తో భావోద్వేగ సందేశాన్ని బోపన్న విడుదల చేశాడు. ‘మీ జీవితానికి సరిపడా సాఫల్యమిచ్చిన దానికి మీరెలా వీడ్కోలు పలుకుతారు చెప్పండి? కానీ ఇరవై వసంతాల మరుపురాని ఈ పయనానికి బైబై చెప్పే సమయం ఆసన్నమైంది. అందుకే ఈ రిటైర్మెంట్. భారత్లోని కూర్గ్లాంటి ఓ చిన్న పట్టణంలో మొదలైన నా ప్రయాణం... కూర్గ్ కాఫీ తోటల్లో పడిన నా అడుగులు అంతర్జాతీయ టెన్నిస్ సర్క్యూట్లో నా కలల్ని సాకారం చేసే దాకా తీసుకొస్తాయని నేనెప్పుడూ అనుకోలేదు. ప్రపంచంలోని పెద్ద పెద్ద టెన్నిస్ ఎరెనా వెలుగుజిలుగుల్లో నా ఏస్లు పడుతుంటే నా జీవితానికి ఇంతకు మించిన సాఫల్యమేముంటుంది’ అని బోపన్న తన రిటైర్మెంట్ సందేశంలో పేర్కొన్నాడు. తన విజయవంతమైన కెరీర్కు అన్ని రకాలుగా సహకరించిన కుటుంబానికి, ఇన్నేళ్ల పాటు తనతో జోడీకట్టిన భాగస్వాములకు, కోచింగ్ బృందానికి, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. ‘ముఖ్యంగా తల్లిదండ్రుల తోడ్పాటు మరువలేనిది. సోదరి రష్మీ భుజం తట్టి ప్రోత్సహించింది. నా భార్య సుప్రియా వెన్నంటే నిలిచింది. కోర్టుల్లో విజయాలకు నాతో జతకట్టిన ప్లేయర్లు కారణమైతే, కోర్టు వెలుపల ఉన్న గ్రేటెస్ట్ భాగస్వామి ఎవరైన ఉంటే అది సుప్రియానే. నా కుమార్తె త్రిద నా ఆనందాన్ని రెట్టింపు చేసే ఆయుధం’ అని కుటుంబసభ్యులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపాడు. 2023లోనే అతను డేవిస్ కప్ నుంచి తప్పుకున్నాడు. చివరగా లక్నోలో మొరాకోతో జరిగిన డేవిస్ కప్ టైలో భారత జట్టు తరఫున బరిలోకి దిగాడు. 2000లో ప్రొఫెషనల్ ఆటగాడిగా మారిన బోపన్న 2003 నుంచి 2025 వరకు 22 ఏళ్లపాటు టెన్నిస్ కోర్టుల్లో టైటిల్స్ కోసం అలుపెరగని పోరాటం చేశాడు. డేవిస్ కప్ ఆసియా ఓసియానియా మ్యాచ్లు, చెప్పలేనన్ని గ్రాండ్స్లామ్ టోర్నీలు, పలు ఒలింపిక్స్లో ఫలితాలతో సంబంధం లేకుండా చెమట చిందించాడు. ఎట్టకేలకు 2017లో ‘ఫ్రెంచ్ ఓపెన్’ మిక్స్డ్ డబుల్స్తో తన గ్రాండ్స్లామ్ కలను నెరవేర్చుకున్నాడు. కెనడాకు చెందిన గాబ్రియెలా దబ్రొస్కీతో విజేతగా నిలిచాడు. ఇక ఏకైక పురుషుల డబుల్స్ గ్రాండ్స్లామ్ టైటిల్ను మాత్రం కెరీర్ చరమాంకంలో గతేడాదే అందుకున్నాడు. మాథ్యూ ఎబ్డెన్ (ఆసీస్)తో కలిసి ఆ్రస్టేలియన్ ఓపెన్–2024లో బోపన్న తన కెరీర్కు లోటుగా ఉన్న పురుషుల డబుల్స్ను సాకారం చేసుకున్నాడు. ఈ టైటిల్తోనే బోపన్న లేటు వయసులో (43) ప్రపంచ నంబర్వన్గా నిలిచిన ఆటగాడిగా ఘనతకెక్కాడు. -
వినూ మన్కడ్ చాంప్ హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అండర్–19 బాలుర జట్టు చరిత్ర సృష్టించింది. దేశవాళీ అండర్–19 క్రికెట్ టోర్నమెంట్ వినూ మన్కడ్ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు తొలిసారి విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో పంజాబ్పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 28.2 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఆర్యాన్ యాదవ్ (29), విహాన్ (28) కాస్త పోరాడారు. హైదరాబాద్ బౌలర్లలో యశ్వీర్ 3 వికెట్లు పడగొట్టగా... మలిక్, నిపుణ్ రెడ్డి, ఉజైర్ అహ్మద్ తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం హైదరాబాద్ 29.3 ఓవర్లలో 5 వికెట్లకు 112 పరుగులు చేసి గెలిచింది. అలంకృత్ రాపోల్ (70 బంతుల్లో 58 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్లు) హాఫ్ సెంచరీతో రాణించగా... అవేజ్ అహ్మద్ (85 బంతుల్లో 35 నాటౌట్; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. వినూ మన్కడ్ ట్రోఫీ గెలిచిన జట్టు సభ్యులకు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) రూ. 2 లక్షల చొప్పున నజరానా ప్రకటించింది. సహాయక సిబ్బందికి రూ. 1.50 లక్షలు అందించనుంది. -
WC 2025: తొలిసారి ప్రపంచాన్ని గెలిచేందుకు...
ప్రపంచ కప్లో రెండు సార్లు ఫైనల్కు అర్హత సాధించినా నిరాశతో వెనుదిరిగిన జట్టు ఒక వైపు... సమష్టితత్వంలో మొదటి సారి తుది పోరుకు చేరిన టీమ్ ఒక వైపు... సొంతగడ్డపై పెద్ద ఎత్తున అభిమానుల ఆకాంక్షలు, మైదానంలో అండతో ఒక జట్టు కప్పై ఆశలు పెట్టుకోగా, తమ బలాన్నే నమ్ముకొని ప్రత్యర్థికి సవాల్ విసురుతున్న టీమ్ మరో వైపు... 12వ మహిళల వన్డే వరల్డ్ కప్ ఆఖరి సమరానికి రంగం సిద్ధమైంది. అన్ని అడ్డంకులను దాటి అగ్రగామిగా నిలిచిన రెండు టీమ్లు భారత్, దక్షిణాఫ్రికా పైనల్లో తలపడనున్నాయి. ఇప్పటికే టోర్నీని సాధించిన మూడు జట్లు ముందే నిష్క్రమించడంతో వరల్డ్ కప్లో కొత్త విజేత రావడం ఖాయమైంది. 2017 టోర్నీ ఫైనల్లో ఓడిన జట్టులో సభ్యులైన హర్మన్, స్మృతి, దీప్తి మాత్రమే ఈ సారి వరల్డ్ కప్ బరిలో నిలిచారు. ముంబై: మహిళల వన్డే వరల్డ్ కప్ పలు ఆసక్తికర సమరాల తర్వాత తుది ఘట్టానికి చేరింది. నేడు డీవై పాటిల్ స్టేడియంలో జరిగే ఫైనల్లో ఆతిథ్య భారత జట్టు దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. ఇరు జట్ల లీగ్ దశలో జరిగిన మ్యాచ్లో సఫారీ టీమ్ గెలుపొందగా దానికి సరైన ప్రతీకారం తీర్చేందుకు హర్మన్ బృందం సిద్ధమైంది. సెమీస్లో రెండు జట్లూ అద్భుత విజయాలతో తుది పోరుకు అర్హత సాధించాయి. ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవని భారత్ అతి చేరువగా వచ్చిన ఈ అవకాశాన్ని వృథా చేసుకోరాదని పట్టుదలగా ఉండగా, బలబలాల పరంగా దక్షిణాఫ్రికా కూడా ఏమాత్రం తక్కువగా లేదు. ఈ మైదానంలో మన జట్టుకు బాగా అనుకూలమైంది కాగా...దక్షిణాఫ్రికా ఈ టోర్నీలో తొలిసారి ఇక్కడ మ్యాచ్ ఆడుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం క్రికెట్ అభిమానులకు అసలైన వినోదం ఖాయం. మార్పుల్లేకుండా... సెమీఫైనల్లో ఆ్రస్టేలియాపై సంచలన విజయం సాధించిన జట్టునే సహజంగా భారత్ కొనసాగించే అవకాశం ఉంది. గత మ్యాచ్లో విఫలమైన షఫాలీ దూకుడుగా ఆడి మెరుపు ఆరంభం ఇవ్వడంలో సమర్థురాలు. సెమీస్లో అనూహ్య రీతిలో వెనుదిరిగిన స్మృతి తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే మన జట్టు ఓపెనింగ్తో మంచి పునాది ఖాయం. జెమీమా, హర్మన్ బ్యాటింగ్ సామర్థ్యం ఏమిటో సెమీస్లో కనిపించింది. వీరిద్దరు దానిని కొనసాగిస్తే తిరుగుండదు. భారీ షాట్లకు పెట్టింది పేరైన రిచా ఘోష్తో పాటు మిడిల్ ఓవర్లలో సమర్థంగా ఆడే దీప్తి కూడా రాణిస్తే మన బ్యాటింగ్కు తిరుగుండదు. అదనపు బ్యాటింగ్ కోసం ఆఫ్ స్పిన్నర్ స్నేహ్ రాణాను తీసుకోవాలని భావిస్తున్నా... దక్షిణాఫ్రికా టీమ్లో అంతా కుడి చేతివాటం బ్యాటర్లే కావడంతో లెఫ్టార్మ్ స్పిన్నర్ రాధనే కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. రేణుక, క్రాంతి తమ పేస్తో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టగలరు. అదనపు బ్యాటర్తో... కెప్టెన్ లారా వోల్వార్ట్ అసాధారణ బ్యాటింగ్తో దూసుకుపోతుండటం దక్షిణాఫ్రికా ప్రధాన బలం. గత మ్యాచ్లో ఆమె మెరుపు సెంచరీతో చెలరేగింది. టోర్నీలో పెద్దగా ప్రభావం చూపకపోయినా మరో సీనియర్ ఓపెనర్ బ్రిట్స్ అసలు పోరులో సత్తా చాటాలని మేనేజ్మెంట్ కోరుకుంటోంది. లూస్, మరిజాన్ కాప్లతో మిడిలార్డర్ పటిష్టంగా ఉంది. వైజాగ్ మ్యాచ్లో భారత్పై చెలరేగి ఒక్కసారి స్టార్గా మారిన డిక్లెర్క్ లాంటి బ్యాటర్ 9వ స్థానంలో ఆడే అవకాశం ఉండటం సఫారీ టీమ్కు మరో సానుకూలాంశం. ఆల్రౌండర్ క్లో ట్రయాన్ కూడా మ్యాచ్ ఫలితాన్ని శాసించగలదు. సెమీస్లో దక్షిణాఫ్రికా ఒక బ్యాటర్ను తప్పించి బౌలర్ క్లాస్ను ఆడించింది. అయితే పిచ్ను దృష్టిలో ఉంచుకొని చూస్తే క్లాస్ స్థానంలో అనరీ డెర్క్సన్ రావచ్చు. 20 భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఇప్పటి వరకు 34 వన్డేలు జరగ్గా... భారత్ 20 గెలిచి 13 ఓడింది. మరో మ్యాచ్లో ఫలితం తేలలేదు. వరల్డ్ కప్ మ్యాచ్లలో గత మూడు సార్లూ దక్షిణాఫ్రికానే నెగ్గింది.పిచ్, వాతావరణం బ్యాటింగ్కు బాగా అనుకూలం. సెమీస్లాగే భారీ స్కోరుకు అవకాశం ఉంది. మంచు ప్రభావం ఉండటంతో పాటు రాత్రి వేళ ఛేదన సులభం కాబట్టి టాస్ గెలిచిన జట్టు మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. మ్యాచ్ రోజున వర్ష సూచన ఉంది. అయితే సోమవారం రిజర్వ్ డే ఉంది. ఆట ఎక్కడ ఆగిపోతే అక్కడినుంచి మళ్లీ కొనసాగిస్తారు. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: హర్మన్ప్రీత్ (కెప్టెన్), స్మృతి, షఫాలీ, జెమీమా, దీప్తి, రిచా, అమన్జోత్, రాధ, క్రాంతి, శ్రీచరణి, రేణుక. దక్షిణాఫ్రికా: వోల్వార్ట్ (కెప్టెన్), బ్రిట్స్, అనెక్ బాష్, లూస్, కాప్, జాఫ్తా, డెర్క్సన్, ట్రయాన్, డిక్లెర్క్, ఖాకా, ఎంలాబా -
IND vs AUS: సమం చేసేందుకు సమరం
హోబర్ట్: ఆతిథ్య ఆ్రస్టేలియా ఆధిక్యానికి ఆదిలోనే గండికొట్టాలని, ఈ మ్యాచ్తోనే సిరీస్ను సమం చేయాలనే పట్టుదలతో భారత జట్టు బరిలోకి దిగుతోంది. మరోవైపు వన్డే సిరీస్లాగే పొట్టి ఫార్మాట్లోనూ వరుస మ్యాచ్లు గెలవాలనే లక్ష్యంతో కంగారూ సేన ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఆదివారం జరిగే మూడో టి20 మ్యాచ్ హోరాహోరీగా జరగడం ఖాయం. ప్రధానంగా భారత టీమ్ మేనేజ్మెంట్ బ్యాటింగ్ లోపాలపైనే దృష్టిపెట్టింది. ఈ పర్యటన ఆరంభం నుంచే టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్ తన లయను ఇప్పటికీ అందుకోలేకపోతున్నాడు. రద్దయిన తొలి టి20లో 30 పైచిలుకు పరుగులైతే చేశాడు కానీ... ఫలితం తేలిన నాలుగు మ్యాచ్ల్లో (మూడు వన్డేలు, రెండో టి20 కలిపి) గిల్ ఆట తీవ్రంగా నిరాశపరిచింది. గత పోరుతో పరుగుల జోరును అందుకున్న అభిషేక్తో పాటు గిల్, సంజూ సామ్సన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తెలుగుతేజం ఠాకూర్ తిలక్వర్మ మూకుమ్మడిగా మెరుపులు మెరిపిస్తే ఆసీస్ను 20 ఓవర్ల మ్యాచ్లో ఓడించడం ఏమంత కష్టమేకాదు. వన్డే సిరీస్ను కోల్పోయిన టీమిండియా ఈ సిరీస్లో నిలవాలంటే ఈ మ్యాచ్ తప్పకుండా గెలవాల్సిందే. లేదంటే సూర్య సేన ఒత్తిడిలోకి కూరుకుపోతుంది. మరోవైపు ఆతిథ్య జట్టు వరుసగా ఈ మ్యాచ్ గెలవడం ద్వారా ఇక సిరీస్ను కోల్పోలేని పటిష్టస్థితిలో నిలవాలని చూస్తోంది. బ్యాటింగ్లో కెప్టెన్ మార్ష్, ట్రవిస్ హెడ్, ఇన్గ్లిస్ ఫామ్లో ఉన్నారు. బౌన్సీ పిచ్లపై నిప్పులు చెరిగే బార్ట్లెట్, ఎలిస్, స్టొయినిస్లు టీమిండియా ప్రధాన బ్యాటర్లను ఆదిలోనే పడేయాలని ఆశిస్తున్నారు. -
షాహీన్ అఫ్రిది వరల్డ్ రికార్డు..
పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది (Shaheen Afridi) ఓ వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో మొదటి ఓవర్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా షాహీన్ చరిత్ర సృష్టించాడు. ఈ స్పీడ్ స్టార్ ఇప్పటివరకు టీ20ల్లో తొలి ఓవర్లో మొత్తంగా 24 వికెట్లు పడగొట్టాడు.లహోర్ వేదికగా సౌతాఫ్రికాతో మూడో టీ20లో మొదటి ఓవర్లో డికాక్, ప్రిటోరియస్ను ఔట్ చేసిన అఫ్రిది.. ఈ అరుదైన ఫీట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఒమన్ పేసర్ బిలాల్ ఖాన్ పేరిట ఉండేది. బిలాల్ మొదటి ఓవర్లో బంతితో రంగంలోకి దిగి ఓవరాల్గా 22 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్తో బిలాల్ను అఫ్రిది అధిగమించాడు.కాగా ఈ సిరీస్ డిసైడర్ అయిన మూడో టీ20లో టాస్ గెలిచి పాక్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అఫ్రిది మొదటి ఓవర్లలోనే రెండు వికెట్లు పడగొట్టి పాక్కు శుభారంభం అందించాడు. అతడితో పాటు స్పిన్నర్లు ఉస్మాన్ తరీఖ్, నవాజ్ తలా వికెట్ సాధించారు. దీంతో ప్రోటీస్ 9 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి కేవలం 45 పరుగులు మాత్రమే చేసింది.తుది జట్లుపాకిస్థాన్ (ప్లేయింగ్ XI): సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్(వికెట్ కీపర్), బాబర్ ఆజం, సల్మాన్ అఘా(కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, సల్మాన్ మీర్జా, ఉస్మాన్ తారిఖ్దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): రీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), లువాన్-డ్రే ప్రిటోరియస్, డెవాల్డ్ బ్రెవిస్, మాథ్యూ బ్రీట్జ్కే, డోనోవన్ ఫెరీరా(కెప్టెన్), జార్జ్ లిండే, కార్బిన్ బాష్, ఆండిల్ సిమెలన్, లిజాడ్ విలియమ్స్, ఒట్నీల్ బార్ట్మన్ -
ఢిల్లీ క్యాపిటల్స్కు సంజూ శాంసన్..!
ఐపీఎల్ 2026 వేలానికి ముందు సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్ (RR) ఫ్రాంచైజీని వీడనున్నాడా? అంటే అవునానే సమాధానం ఎక్కువగా వినిపిస్తోంది. రాజస్తాన్ నుంచి శాంసన్ను ట్రేడ్ చేసుకోవడానికి ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత సీజన్ నుంచి రాయల్స్, సంజు శాంసన్ మధ్య విభేదాలు తలెత్తాయి.దీంతో సంజూను రాజస్తాన్ మెనెజ్మెంట్ విడిచిపెట్టేందుకు ఆసక్తిగా ఉందంట. ప్రస్తుతం కెప్టెన్గా ఉన్న శాంసన్ సైతం రాజస్తాన్ నుంచి బయటకు వచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. వచ్చే సీజన్లో శాంసన్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడనున్నట్లు సమాచారం.రాజస్తాన్లోకి స్టబ్స్..రాజస్తాన్ ఫ్రాంచైజీ శాంసన్కు బదులుగా మరో వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ను ఇవ్వాలని ఢిల్లీని డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అందుకు ఢిల్లీ యాజమాన్యం ఒప్పుకోలేదని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. కానీ రాహుల్కు బదులుగా దక్షిణాఫ్రికా బ్యాటర్ అయిన ట్రిస్టన్ స్టబ్స్ను ఇచ్చేందుకు తాము సిద్దమని ఢిల్లీ తెలిపినట్లు తెలుస్తోంది. అందుకు రాజస్తాన్ అంగీకరించినట్లు వినికిడి. స్టబ్స్తో పాటు ఓ అన్క్యాప్డ్ భారత ఆటగాడిని పంపమని ఆర్ఆర్ కోరిందంట.ఎందుంకంటే సంజు శాంసన్ ధర రూ.18 కోట్లు కాగా, స్టబ్స్ విలువ రూ.10 కోట్లు. ఎనిమిది కోట్లు వ్యత్యాసం రావడంతో ఓ అన్క్యాప్డ్ ఆటగాడిని తీసుకోవాలని రాజస్తాన్ భావిస్తోంది. ఆర్ఆర్కు మంచి ఫినిషర్ లేని లోటును స్టబ్స్ తీర్చగలడు. ఒకవేళ అన్క్యాప్డ్ ఆటగాడిని ఢిల్లీ ట్రేడ్ చేయకపోతే, మిగిలిన మొత్తాన్ని (సుమారు రూ.8 కోట్లు) రాజస్తాన్కు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఐపీఎల్-2026 వేలంలో రాజస్తాన్ పర్స్ విలువ పెరుగుతుంది. కాగా సంజూ శాంసన్ తన ఐపీఎల్ అరంగేట్రం ఢిల్లీ క్యాపిటల్స్(అప్పటిలో ఢిల్లీ డేర్డేవిల్స్) తరపునే చేశాడు. -
నైట్రైడర్స్ టీమ్కు కొత్త కెప్టెన్.. ఎవరంటే?
ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ILT20) 2025-26 సీజన్కు ముందు అబుదాబి నైట్ రైడర్స్ (ABKR) కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు కెప్టెన్గా వెస్టిండీస్ ఆల్రౌండర్ జాసన్ హోల్డర్ను నైట్ రైడర్స్ యాజమాన్యం నియమించింది. గత సీజన్ వరకు కెప్టెన్గా కొనసాగిన సునీల్ నరైన్ స్ధానాన్ని హోల్డర్ భర్తీ చేయనున్నాడు. ఈ విషయాన్ని అబుదాబి ఫ్రాంచైజీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. హోల్డర్ గతేడాది సీజన్లోనే నైట్ రైడర్స్ జట్టులో చేరాడు. ఇప్పుడు ఏకంగా కెప్టెన్గా జాక్ పాట్ కొట్టేశాడు. గత సీజన్లో నైట్రైడర్స్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్దానంలో నిలిచినప్పటికి.. హెల్డర్ మాత్రం తన ఆల్రౌండ్ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు.అందుకే నరైన్పై వేటు..కాగా సునీల్ నరైన్ కెప్టెన్సీలో అంచనాలకు తగ్గట్టుగా జట్టు రాణించికపోవడం వల్లే నైట్రైడర్స్ ఫ్రాంఛైజీ ఈ కీలక మార్పు చేసినట్లు తెలుస్తోంది. మూడు సీజన్ల పాటు అబుదాబి నైట్ రైడర్స్ కెప్టెన్గా నరైన్ వ్యవహరించాడు. ఈ మూడు సీజన్లలోనూ ఎబీకేర్ లీగ్ స్టేజికే పరిమితమైంది.దీంతో హోల్డర్కు విండీస్ కెప్టెన్గా పనిచేసిన అనుభవం ఉండడంతో తమ జట్టు పగ్గాలను ఎబీకేర్ అప్పగించింది. హోల్డర్ సారథ్యంలోనైనా ఆ జట్టు తలరాత మారుతుందో లేదో చూడాలి. నైట్రైడర్స్ జట్టులో ఆండ్రీ రస్సెల్, లియామ్ లివింగ్స్టోన్, ఫిల్ సాల్ట్, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. కాగా అబుదాబి నైట్ రైడర్స్.. ఐపీఎల్ జట్టు కోల్కతా నైట్రైడర్స్ సిస్టర్ ఫ్రాంచైజీ కావడం గమనార్హం. ఈ టోర్నమెంట్ డిసెంబర్ 2 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: టీమిండియా నుంచి తీసేశారు.. కట్ చేస్తే! ఆ కోపం అక్కడ చూపించేస్తున్నాడు -
భారత్ ఆశలన్నీ రిషబ్ పంత్ పైనే..
బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ గ్రౌండ్ వేదికగా సౌతాఫ్రికా-ఎ, భారత్-ఎ మధ్య జరుగుతున్న తొలి అనాధికారిక టెస్టు రసవత్తరంగా మారింది. 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు పోరాడుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా-ఎ టీమ్ 4 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. చివరి రోజు ఆటలో భారత్ విజయానికి ఇంకా 156 పరుగులు కావాలి. క్రీజులో కెప్టెన్ రిషబ్ పంత్(64), ఆయూష్ బదోని(0) ఉన్నారు. మొదటి ఇన్నింగ్స్లో పంత్ నిరాశపరిచినప్పటికీ (17 పరుగులు).. రెండో ఇన్నింగ్స్లో మాత్రం అద్భుతమైన నాక్ ఆడుతున్నాడు. భారత్ ఆశలన్నీ పంత్ పైనే ఉన్నాయి. పంత్తో పాటు బదోని కూడా రాణించాల్సిన అవసరముంది. వీరిద్దరూ ఔటైతే తర్వాత చెప్పుకోదగ్గ బ్యాటర్లు ఎవరూ లేరు.30/0 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికా-ఎ టీమ్.. అదనంగా 169 పరుగులు చేసి ఆలౌటైంది. ఆఫ్ స్పిన్నర్ తనుశ్ కొటియాన్ (Tanush Kotian) మరోసారి నాలుగు వికెట్లతో సఫారీల పతనాన్ని శాసించగా.. అన్షుల్ కాంబోజ్ మూడు, గుర్నూర్ బ్రార్ రెండు వికెట్లు సాధించారు. సౌతాఫ్రికా బ్యాటర్లలో లెసెగో సెనోక్వానే (37), జుబేర్ హంజా (37) రాణించారు.సత్తాచాటిన తనుశ్ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తమ మొదటి ఇన్నింగ్స్లో 309 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ జోర్డాన్ హెర్మాన్ (71), వన్డౌన్ బ్యాటర్ జుబేర్ హంజా (66), రుబిన్ హెర్మాన్ (54) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. భారత బౌలర్లలో తనుశ్ కొటియాన్ నాలుగు వికెట్లు తీయగా.. గుర్నూర్ బ్రార్, మానవ్ సుతార్ చెరో రెండు, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. భారత-ఎ జట్టు మాత్రం తమ తొలి ఇన్నింగ్స్లో తీవ్ర నిరాశపరిచింది. భారత ‘ఎ’జట్టు తొలి ఇన్నింగ్స్లో 58 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటైంది. ఆయుశ్ మాత్రే (76 బంతుల్లో 65; 10 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలవగా... ఆయుశ్ బదోనీ (47 బంతుల్లో 38; 5 ఫోర్లు), సాయి సుదర్శన్ (94 బంతుల్లో 32; 3 ఫోర్లు) ఫర్వాలేదన్పించారు.చదవండి: టీమిండియా నుంచి తీసేశారు.. కట్ చేస్తే! ఆ కోపం అక్కడ చూపించేస్తున్నాడు -
సెమీస్లో గెలిస్తే సంబరమే..! కానీ ఫైనల్లో ఆ తప్పులు చేశారంటే?
భారత మహిళల జట్టు.. తమ 47 ఏళ్ల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025 ఫైనల్లో ఆదివారం సౌతాఫ్రికాతో తలపడేందుకు భారత్ సిద్దమైంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి తొలి ప్రపంచకప్ టైటిల్ను ముద్దాడాలని హర్మన్ సేన ఉవ్విళ్లూరుతోంది.అయితే ఈసారి మనం మహిళల క్రికెట్లో సరికొత్త వరల్డ్ ఛాంపియన్ చూడబోతున్నాము. ఎందుకంటే, భారత్ కానీ, దక్షిణాఫ్రికా కానీ ఇప్పటివరకు మహిళల వన్డే ప్రపంచకప్ ట్రోఫీని ఒక్కసారి కూడా గెలవలేదు. తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్ను ఓడించి సౌతాఫ్రికా ఫైనల్కు చేరగా.. రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి టీమిండియా ముచ్చటగా మూడోసారి తుది పోరుకు అర్హత సాధించింది. అయితే సెమీస్లో భారత అమ్మాయిల జట్టు రికార్డు విజయం సాధించినప్పటికి.. ఫైనల్కు ముందు సరిదిద్దుకోవాల్సిన తప్పులు కొన్ని ఉన్నాయి.ఫీల్డింగ్ మారుతుందా?ఈ మెగా టోర్నీలో టీమిండియా బ్యాటింగ్ పరంగా మెరుగైన ప్రదర్శన చేస్తున్నప్పటికి.. ఫీల్డింగ్, బౌలింగ్లో మాత్రం తీవ్ర నిరాశపరుస్తోంది. భారత జట్టు ఫీల్డింగ్ మ్యాచ్కు మ్యాచ్కు దిగజారుతోంది. ఈ టోర్నమెంట్లో భారత్ ఇప్పటివరకు 18 క్యాచ్లు జారవిడిచింది. అత్యధిక క్యాచ్లు విడిచిపెట్టిన జాబితాలో హర్మన్ సేన అగ్రస్దానంలో నిలిచింది.ఆసీస్తో సెమీస్లో హర్మన్ ప్రీత్ కౌర్ సైతం సునాయస క్యాచ్ను జారవిడించింది. మిస్ఫీల్డ్స్, ఓవర్ త్రోల రూపంలో మన అమ్మాయిల జట్టు భారీగా పరుగులు సమర్పించుకుంటుంది. ఈ ఈవెంట్లో ఇప్పుటివరకు భారత్ మొత్తం 74 మిస్ఫీల్డ్స్ (అన్ని జట్లలో అత్యధికం) చేశారు. 6 ఓవర్త్రోలు కూడా ఉన్నాయి. సెమీస్లో మిస్ఫీల్డ్స్, ఓవర్ త్రోల ద్వారానే భారత్ 22 అదనపు పరుగులు ఇచ్చింది. కనీసం ఫైనల్ మ్యాచ్లో భారత్ మెరుగైన ఫీల్డింగ్ ప్రదర్శన చేయాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.డెత్ బౌలింగ్ కష్టాలు..బౌలింగ్ విభాగంలో కూడా భారత్ చాలా బలహీనంగా కన్పిస్తోంది. ఆసీస్తో జరిగిన సెమీఫైనల్లో ఒక్క శ్రీ చరణి మినహా మిగితా బౌలర్లంతా తేలిపోయారు. ఆఖరికి దీప్తి శర్మ వంటి స్టార్ స్పిన్నర్ సైతం భారీగా పరుగులు సమర్పించుకుంది.రేణుకా సింగ్ వంటి స్టార్ పేసర్ జట్టులో ఉన్నప్పటికి ఆరంభంలో పిచ్ స్వింగ్కు అనుకూలించకపోతే ఆమె ఒక సాధారణ బౌలర్గా మారిపోతుంది. అంతేకాకుండా సెమీఫైనల్లో హర్లీన్ డియోల్ వంటి స్టార్ బ్యాటర్ను పక్కన పెట్టిమరి రాధా యాదవ్ను తీసుకొచ్చారు. కానీ ఆమె కూడా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. క్రాంతి గౌడ్ యువ ఫాస్ట్ బౌలర్ ఆడపదడప ప్రదర్శనలు చేస్తున్నప్పటికి.. ఫైనల్ వంటి హైవోల్టేజ్ మ్యాచ్లో ఎలా రాణిస్తుందో వేచి చూడాలి. ఇక భారత జట్టులో డెత్ బౌలింగ్ లేమి స్పష్టంగా కన్పిస్తోంది.భారత జట్టులో డెత్ ఓవర్లలో కట్టడి చేయగలిగే బౌలర్లే లేరు. రేణుకా గానీ, గౌడ్ గానీ డెత్ బౌలర్లు కాదు. దీప్తి శర్మపైనే అతిగా ఆధారపడటం ఒక పెద్ద సమస్యగా మారింది. లీగ్ దశలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఈ విషయం తేటతెల్లమైంది. 251 పరుగుల లక్ష్య చేధనలో సఫారీలు 81/5 తో కష్టాల్లో ఉన్నప్పటికీ.. భారత్ బౌలర్లు మాత్రం వారిని ఆలౌట్ చేయడంలో విఫలమయ్యారు. దీంతో ఆ మ్యాచ్లో భారత్ అనుహ్య ఓటమి చవిచూడాల్సి వచ్చింది. మరి ఇప్పుడు ఫైనల్లో అదే సౌతాఫ్రికాపై మన బౌలర్లు ఎలా రాణిస్తారో చూడాలి. బౌలింగ్, ఫీల్డింగ్లో భారత్ మెరుగ్గా రాణిస్తే తొలి వరల్డ్కప్ టైటిల్ను సొంతం చేసుకోవడం ఖాయమనే చెప్పాలి. ఇక బ్యాటింగ్లో యువ ఓపెనర్ షెఫాలీ వర్మ బ్యాట్ ఝూళిపించాల్సి ఉంది. రెగ్యూలర్ ఓపెనర్ ప్రతీక రావల్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలగడంతో షెఫాలీకి అవకాశం లభించింది. కానీ ఆసీస్తో జరిగిన సెమీఫైనల్లో ఆమె కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఔటైంది.అదేవిధంగా లీగ్ దశలో దుమ్ములేపిన స్మృతి మంధాన కీలకమైన ఫైనల్లో తన బ్యాట్కు పనిచెప్పాలి. ఆమె కూడా సెమీస్లో విఫలమైంది. మిడిలార్డర్లో రోడ్రిగ్స్, హర్మన్ వంటి ప్లేయర్లు మరోసారి చెలరేగాల్సిన అవసరముంది.చదవండి: టీమిండియా నుంచి తీసేశారు.. కట్ చేస్తే! ఆ కోపం అక్కడ చూపించేస్తున్నాడు -
సెలక్టర్లకు వార్నింగ్.. మళ్లీ శతక్కొట్టిన టీమిండియా స్టార్
రంజీ ట్రోఫీ-2025 సీజన్లో టీమిండియా వెటరన్, కర్ణాటక స్టార్ బ్యాటర్ కరుణ్ నాయర్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. భారత టెస్ట్ జట్టులోకి తిరిగి రావాలనే లక్ష్యంతో ఉన్న నాయర్.. మరో అద్బుతమైన ఫస్ట్ క్లాస్ సెంచరీతో చెలరేగాడు.రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూపులో భాగంగా తిరువనంతపురం వేదికగా కేరళతో జరుగుతున్న మ్యాచ్లో కరుణ్ నాయర్ శతక్కొట్టాడు. కేవలం 163 బంతుల్లోనే తన 26వఫస్ట్ క్లాస్ సెంచరీ మార్క్ను అతడు అందుకున్నాడు. నాయర్ ప్రస్తుతం 116 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. గత కొంతకాలంగా విదర్భ తరఫున ఆడిన కరుణ్ నాయర్.. ప్రస్తుత రంజీ సీజన్లో తన సొంత జట్టు కర్ణాటకకు తిరిగి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సౌరాష్ట్రతో జరిగిన తొలి మ్యాచ్లో హాఫ్ సెంచరీతో మెరిసిన నాయర్(73).. ఆ తర్వాత గోవాతో జరిగిన మ్యాచ్లో భారీ శతకం(174)తో కదం తొక్కాడు. ఇప్పుడు కేరళపై కూడా మూడంకెల స్కోరును అందుకున్నారు.కరుణ్ మళ్లీ ఎంట్రీ ఇస్తాడా?కాగా దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన నాయర్.. ఇంగ్లండ్ పర్యటనలో దారుణ ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లండ్ సిరీస్లో నాలుగు టెస్టులు ఆడి కేవలం 25.63 సగటుతో 205 పరుగులు మాత్రమే చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో కేవలం ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది.దీంతో స్వదేశంలో వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ సిరీస్కు కరుణ్ నాయర్ను జట్టు నుంచి సెలక్టర్లు తొలగించారు. అతడి స్థానంలో యువ ఆటగాడు దేవదత్ పడిక్కల్కు అవకాశం కల్పించారు. అయితే జట్టు నుంచి తొలగించడంపై కరుణ్ నాయర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాను ఒక సిరీస్ కంటే ఎక్కువ అవకాశాలకు అర్హుడిని అని చెప్పుకొచ్చాడు. మళ్లీ టీమిండియాలోకి వస్తానిని ఈ కర్ణాటక బ్యాటర్ థీమా వ్యక్తం చేశాడు.చదవండి: ENG vs NZ: ఇంగ్లండ్కు ఘోర పరాభవం.. 42 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి -
రిటైర్మెంట్ ప్రకటించిన రోహన్ బోపన్న
భారత టెన్నిస్ దిగ్గజం, రెండుసార్లు గ్రాండ్స్లామ్ విజేత రోహన్ బోపన్న ప్రొఫెషనల్ టెన్నిస్కు వీడ్కోలు పలికాడు. 45 ఏళ్ల బోపన్న సోషల్ మీడియా మీడియా వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. "ఇది కేవలం వీడ్కోలు మాత్రమే.. ముగింపు కాదు. నా జీవితానికి అర్థాన్ని ఇచ్చిన ఈ ఆటను నేను ఎలా వదులుకోగలను? నా 20 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన జ్ణాపకాలు ఉన్నాయి. అయితే నా రాకెట్ను పక్కటన పెట్టాల్సిన సమయం అసన్నమైంది. ప్రొఫెషనల్ టెన్నిస్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. బరువెక్కిన హృదయంతో ఈ నోట్ రాశాను. కర్ణాటకలోని కూర్గ్ అనే చిన్న పట్టణం నుంచి నా జర్నీని ప్రారంభించి.. ప్రపంచంలోని అతిపెద్ద వేదికలపై ఆడటం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన తల్లిదండ్రులకు, కోచ్లకు, అభిమానులు ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ను ధన్యవాదాలు" అని తన రిటైర్మెంట్ నోట్లో పేర్కొన్నాడు. బోపన్న చివరిసారిగా పారిస్ మాస్టర్స్ 1000 టోర్నమెంట్లో కజకిస్తాన్కు చెందిన అలెగ్జాండర్ బుబ్లిక్తో కలిసి ఆడారు. అయితే ఈ జోడీ రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో జాన్ పీర్స్- జేమ్స్ ట్రేసీ చేతిలో 5-7, 6-2, 10-8 తేడాతో ఓడిపోయింది.రోహన్ తన కెరీర్లో ఎన్నో ఘనతలు అందుకున్నాడు. 43 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 (Australian Open 2024) డబుల్స్లో విజేతగా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు. రోహన్కు ఇదే తొలి గ్రాండ్స్లామ్ టైటిల్. తద్వారా తిపెద్ద వయసులో గ్రాండ్స్లామ్ టైటిల్ గెలుచుకున్న టెన్నిస్ ప్లేయర్గా బోపన్న రికార్డులకెక్కాడు.2017 ఫ్రెంచ్ ఓపెన్లో గాబ్రియల్ డబ్రోస్కీ (కెనడా)తో కలిసి మిక్స్డ్ డబుల్స్ టైటిల్ దక్కించుకున్నాడు. టూర్ స్థాయి డబుల్స్ టైటిళ్లు 26 నెగ్గాడు. ఏటీపీ మాస్టర్స్ 1000 టైటిళ్లు ఆరు గెలిచాడు.చదవండి: PKL 12: విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే?.. అవార్డుల జాబితా ఇదే -
ఇంగ్లండ్కు ఘోర పరాభవం
వెల్లింగ్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేలో 2 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను కివీస్ క్లీన్ స్వీప్ (3-0) చేసింది. ఆఖరి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 40.2 ఓవర్లలో కేవలం 222 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లీష్ జట్టు టాపర్డర్ విఫలమైనప్పటికి.. ఆల్రౌండర్ జేమీ ఓవర్టన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.ఓవర్టన్ 62 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లతో 68 పరుగులు సాధించారు. అతడితో పాటు జోస్ బట్లర్(38), బ్రైడన్ కార్స్(36) పర్వాలేదన్పించారు. న్యూజిలాండ్ బౌలర్లలో బ్లెయిర్ టిక్నర్ 4 వికెట్లతో సత్తాచాటగా.. జాకబ్ డఫీ మూడు, జకారీ ఫౌల్క్స్ రెండు వికెట్లు పడగొట్టాడు.తడబడి నిలబడి..అనంతరం స్వల్ప లక్ష్య చేధనలో న్యూజిలాండ్ కూడా కాస్త తడబడింది. ఓపెనర్లు రచిన్ రవీంద్ర (46), డెవాన్ కాన్వే (34) తొలి వికెట్కు 78 పరుగులు జోడించారు. దీంతో బ్లాక్ క్యాప్స్ ఈజీగా గెలుస్తుందని అంతా భావించారు. కానీ న్యూజిలాండ్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.కివీస్ 118 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు కోల్పోయింది. అయితే టెయిలెండర్లు జాకరీ ఫోల్క్స్ (14 నాటౌట్), బ్లెయిర్ టిక్నర్ (18 నాటౌట్) ఆచితూచి ఆడుతూ జట్టును విజయతీరాలకు చేర్చారు. ఫలితంగా ఈ లక్ష్యాన్ని న్యూజిలాండ్ 44.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కుర్రాన్, ఓవర్టన్ తలా రెండు వికెట్లు సాధించారు.కాగా వన్డే సిరీస్లో ఇంగ్లండ్ను న్యూజిలాండ్ జట్టు వైట్ వాష్ చేయడం 42 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. అంతకుముందు మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఇంగ్లండ్ 1-0 తేడాతో సొంతం చేసుకుంది. అయితే ఈ సిరీస్లోని రెండు మ్యాచ్లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి.చదవండి: IND vs SA: రసవత్తరంగా మ్యాచ్.. లక్ష్య ఛేదనలో భారత్కు భారీ షాక్ -
IND vs SA: రసవత్తర పోరు.. భారత్కు భారీ షాక్
భారత్- ‘ఎ’- సౌతాఫ్రికా- ‘ఎ’ జట్ల మధ్య అనధికారిక తొలి టెస్టు రసవత్తరంగా మారింది. తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు చేసిన సౌతాఫ్రికాను.. రెండో ఇన్నింగ్స్లో తక్కువ స్కోరుకే భారత్ పరిమితం చేసింది. ఆఫ్ స్పిన్నర్ తనుశ్ కొటియాన్ (Tanush Kotian) మరోసారి నాలుగు వికెట్లతో చెలరేగి సఫారీ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు.నాలుగు వికెట్లు తీసిన తనుశ్రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బెంగళూరు వేదికగా భారత్- ‘ఎ’- సౌతాఫ్రికా- ‘ఎ’ (IND A vs SA A) జట్ల మధ్య గురువారం తొలి అనధికారిక టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 309 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ జోర్డాన్ హెర్మాన్ (71), వన్డౌన్ బ్యాటర్ జుబేర్ హంజా (66), రుబిన్ హెర్మాన్ (54) అర్ధ శతకాలతో రాణించారు. టియాన్ వాన్ వారెన్ 46 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.234 పరుగులకే ఆలౌట్భారత బౌలర్లలో తనుశ్ కొటియాన్ నాలుగు వికెట్లు తీయగా.. గుర్నూర్ బ్రార్, మానవ్ సుతార్ చెరో రెండు, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా బ్యాటింగ్ మొదలుపెట్టిన భారత్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. టీమిండియా ఆటగాళ్లతో నిండిన భారత ‘ఎ’జట్టు తొలి ఇన్నింగ్స్లో 58 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటైంది.ఆయుశ్ మాత్రే (76 బంతుల్లో 65; 10 ఫోర్లు) అర్ధ శతకంతో టాప్ స్కోరర్గా నిలవగా... ఆయుశ్ బదోనీ (47 బంతుల్లో 38; 5 ఫోర్లు), సాయి సుదర్శన్ (94 బంతుల్లో 32; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. రిషబ్ పంత్ విఫలంఇంగ్లండ్ పర్యటన సందర్భంగా నాలుగో టెస్టులో గాయపడి ఆటకు దూరమైన వికెట్ కీపర్ రిషబ్ పంత్ చాన్నాళ్ల తర్వాత మైదానంలో అడుగు పెట్టగా... 17 పరుగులు మాత్రమే చేయగలిగాడు. రజత్ పాటీదార్ (19), దేవదత్ పడిక్కల్ (6), తనుశ్ కొటియాన్ (13), మానవ్ సుతార్ (4) విఫలమయ్యారు.దక్షిణాఫ్రికా ‘ఎ’బౌలర్లలో ప్రేనెలన్ సుబ్రాయన్ 61 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. సిపామ్లా రెండు వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి 12 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. ఇక శనివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా మరో 169 పరుగులు జతచేసి ఆలౌట్ అయింది.భారత్కు 275 పరుగుల లక్ష్యంఈసారి ఓపెనర్లలో జోర్డాన్ (12) విఫలం కాగా.. లెసెగో సెనోక్వానే (37).. వన్డౌన్ బ్యాటర్ జుబేర్ హంజా (37) రాణించారు. లోయర్ ఆర్డర్లో మొరేకి 25 పరుగులు చేశాడు. మిగతా వారంతా విఫలం కావడంతో 48.1 ఓవర్లలో 199 పరుగులకు సౌతాఫ్రికా ఆలౌట్ అయింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని (75+199) భారత్కు 275 పరుగుల లక్ష్యం విధించింది.భారత బౌలర్లలో తనుశ్ కొటియాన్ నాలుగు వికెట్లతో మెరవగా.. అన్షుల్ కాంబోజ్ మూడు, గుర్నూర్ బ్రార్ రెండు, మానవ్ సుతార్ ఒక వికెట్ తీశారు. లక్ష్య ఛేదనలో భారత్కు భారీ షాక్ఇక లక్ష్య ఛేదనకు దిగిన భారత్కు ఆదిలోనే షాక్ తగిలింది. గత ఇన్నింగ్స్లో అర్ధ శతకం బాదిన ఓపెనర్ ఆయుశ్ మాత్రే 6 పరుగులకే అవుటయ్యాడు. మొరేకి బౌలింగ్లో బౌల్డ్ అయి తొలి వికెట్గా వెనుదిరిగాడు.ఇక వన్డౌన్లో వచ్చిన దేవ్దత్ పడిక్కల్ (5) మరోసారి విఫలం అయ్యాడు. సిలీ బౌలింగ్లో అతడు బౌల్డ్ అయ్యాడు. కాగా టీ విరామ సమయానికి ఓపెనర్ సాయి సుదర్శన్ 8, నాలుగో నంబర్ బ్యాటర్ రజత్ పాటిదార్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీ బ్రేక్ సమయానికి భారత్ స్కోరు: 25-2 (9). చదవండి: శివం దూబేను కాదని.. హర్షిత్ను ప్రమోట్ చేయడానికి కారణం అదే: అభిషేక్ శర్మ -
IND vs SA: ఫైనల్ మ్యాచ్ అంపైర్లు వీరే
మహిళల వన్డే వరల్డ్కప్-2025 ఫైనల్ సందర్భంగా కొత్త చాంపియన్ అవతరించనుంది. నవీ ముంబై వేదికగా జరిగే టైటిల్ పోరులో గెలవాలని భారత్ పట్టుదలగా ఉండగా.. తమకు వచ్చిన సువర్ణావకాశాన్ని చేజారనీయొద్దని సౌతాఫ్రికా భావిస్తోంది.కాగా సెప్టెంబరు 30న మొదలైన మహిళల వన్డే వరల్డ్కప్ టోర్నీ తుది అంకానికి చేరుకుంది. తొలి సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ను ఓడించి సౌతాఫ్రికా.. రెండో సెమీస్ మ్యాచ్లో ఆస్ట్రేలియాను మట్టికరిపించి ఆతిథ్య భారత్ ఫైనల్కు చేరాయి.ఎవరు గెలిచినా చరిత్రేనవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా ఆదివారం (నవంబరు 2) నాటి టైటిల్ పోరులో భారత్- సౌతాఫ్రికా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో టైటిల్ సమరంలో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించే అధికారుల పేర్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఖరారు చేసింది.ఫైనల్ మ్యాచ్ అంపైర్లు వీరేఈ మెగా ఈవెంట్ ఫైనల్ మ్యాచ్కు ఎలోసీ షేరిడాన్, జాక్వెలిన్ విలియమ్స్ ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరిస్తారని ఐసీసీ తెలిపింది. అదే విధంగా.. సూ రెడ్ఫెర్న్ థర్డ్ అంపైర్గా.. నిమాలి పెరీరా ఫోర్త్ అంపైర్గా పనిచేయనుండగా.. మిచెల్లి పెరీరా మ్యాచ్ రిఫరీగా ఉంటారని ఐసీసీ తెలిపింది.వర్షం పడే అవకాశంకాగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు భారత్- సౌతాఫ్రికా మధ్య ఫైనల్కు తెరలేస్తుంది. అయితే, ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం కురిసేందుకు 30- 60 శాతం అవకాశం ఉన్నట్లు ఆక్యూవెదర్ రిపోర్టు తెలిపింది.ఒకవేళ వర్షం కారణంగా ఆదివారం కనీసం 20 ఓవర్ల ఆట సాగకపోతే.. రిజర్వ్ డేన మ్యాచ్ కొనసాగిస్తారు. అంటే.. ఆదివారం ఎక్కడైతే మ్యాచ్ ఆగిపోయిందో అక్కడి నుంచి ఆటను కొనసాగిస్తారు. ఇక రిజర్వ్ డే కూడా వర్షం వల్ల ఆట సాగకపోతే ఇరుజట్లను ఉమ్మడి విజేతగా ప్రకటిస్తారు.వన్డే వరల్డ్కప్-2025 ఫైనల్: భారత్- సౌతాఫ్రికా జట్లుభారత్హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, రేణుకా సింగ్ ఠాకూర్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రాధా యాదవ్, అమన్జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, ఉమా ఛెత్రి, షఫాలీ వర్మ.సౌతాఫ్రికాలారా వొల్వర్ట్ (కెప్టెన్), అయబొంగా ఖాకా, క్లోయీ ట్రైయాన్, నదినె డి క్లెర్క్, మరిజానే కాప్, తజ్మిన్ బ్రిట్స్, సినాలో జఫ్టా, నొన్కులులెకో మలాబా, అనెరి డెర్క్సెన్, అనెకె బాష్, మసబట క్లాస్, సునే లూస్, కరాబో మెసో, టుమి సెఖుహునే, నొండమిసో షాంగేస్. చదవండి: PKL 12: విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే?.. అవార్డుల జాబితా ఇదే -
అందుకే హర్షిత్ రాణాను ప్రమోట్ చేశారు: అభిషేక్ శర్మ
ఆస్ట్రేలియాతో రెండో టీ20 మ్యాచ్లో భారత పేసర్ హర్షిత్ రాణా (Harshit Rana)ను బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోట్ చేయడంపై విమర్శల వర్షం కురుస్తోంది. పవర్ హిట్టింగ్ ఆల్రౌండర్ శివం దూబే (Shivam Dube)ను కాదని.. ఈ బౌలర్ను ఏడో స్థానంలో ఎందుకు పంపారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఈ విషయంపై టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) స్పందించాడు. ఆసీస్ చేతిలో ఓటమి తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. హర్షిత్ రాణాను ముందుగా బ్యాటింగ్కు పంపడానికి గల కారణాన్ని వెల్లడించాడు.ఇక్కడ షాట్లు బాదడం అంత తేలికేమీ కాదు‘‘మా జట్టులో చాలా మందికి ఆస్ట్రేలియాలో ఇదే తొలి పర్యటన. ఇక్కడి పిచ్లపై అదనపు బౌన్స్, పేస్ గురించి మాకు తెలుసు. అయినా.. సరే ఈ మ్యాచ్లో ఆసీస్ బౌలర్లు బౌల్ చేసిన తీరు మమ్మల్ని ఆశ్చర్యపరిచింది.క్రమశిక్షణగా సరైన లైన్ అండ్ లెంగ్త్తో వాళ్లు బౌలింగ్ చేశారు. ఆరంభం నుంచే బౌలర్లపై ఎదురుదాడికి దిగాలని మేము ప్రణాళికలు రచించుకున్నాం. అయితే, ఊహించని రీతిలో వారు చెలరేగారు.వరుసగా వికెట్లు పడుతుంటే అక్కడ బ్యాటర్గా ఎవరున్నారన్న విషయంతో బౌలర్లకు పనిలేదు. ఇక క్రీజులో ఎవరు ఉన్నా జట్టు ప్రయోజనాలకు అనుగుణంగానే ఆడతారు. మెల్బోర్న్ వికెట్ కఠినంగా ఉంది. ఇక్కడ షాట్లు బాదడం అంత తేలికేమీ కాదు.అందుకే శివంను కాదని హర్షిత్ను.. హర్షిత్ బ్యాట్తోనూ రాణించగలడని నాకు తెలుసు. నెట్స్లో అతడు చాలాసార్లు సిక్స్లు బాదాడు. ‘నీ సాధారణ ఆట తీరుతోనే ముందుకు సాగు’ అని నాకు చెప్పాడు. మా లెఫ్ట్- రైట్ కాంబినేషన్ ఈ మ్యాచ్లో బాగా వర్కౌట్ అయింది.ఈ కాంబినేషన్ కోసమే.. శివం దూబే కంటే.. హర్షిత్ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా పంపించారు’’ అని అభిషేక్ శర్మ తెలిపాడు. కాగా 24 ఏళ్ల ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఆసీస్తో రెండో మ్యాచ్లో విశ్వరూపం ప్రదర్శించాడు..@IamAbhiSharma4 leads from the front with a blazing half-century, taking the Aussies head-on in true Skyball fashion! 💥Fearless intent, clean hitting, and total command at the crease! 🚀#AUSvIND 👉 2nd T20I | LIVE NOW 👉 https://t.co/mq9j8bivd0 pic.twitter.com/bcAUdN2kyw— Star Sports (@StarSportsIndia) October 31, 2025 మొత్తంగా 37 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ శర్మ ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 68 పరుగులు సాధించాడు. అయితే, నాథన్ ఎల్లిస్ బౌలింగ్లో లెగ్ బిఫోర్గా వెనుదిరగడంతో అతడి ధనాధన్ ఇన్నింగ్స్కు తెరపడింది. ఇక ఈ మ్యాచ్లో అభిషేక్తో పాటు హర్షిత్ రాణా (33 బంతుల్లో 35) ఒక్కడే మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు.Short ball? No problem! #HarshitRana clears it for a six! 🚀Brings up a solid fifty stand fearless, fiery, and full Skyball mode on! 🔥#AUSvIND 👉 2nd T20I | LIVE NOW 👉 https://t.co/mq9j8bivd0 pic.twitter.com/sOGZ6m3u5y— Star Sports (@StarSportsIndia) October 31, 2025మూకుమ్మడిగా విఫలంఓపెనర్ శుబ్మన్ గిల్ 5, మూడో స్థానంలో వచ్చిన సంజూ శాంసన్ 2, నాలుగో స్థానంలో వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 1 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచారు. ఐదో స్థానానికి డిమోట్ అయిన తిలక్ వర్మ డకౌట్ కాగా.. కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కూడా పరుగుల ఖాతా తెరవలేదు. శివం దూబే 4 పరుగులకే వెనుదిరిగాడు.ఫలితంగా 18.4 ఓవర్లలో కేవలం 125 పరుగులు చేసి టీమిండియా ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్వుడ్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్ చెరో రెండు వికెట్లు, మార్కస్ స్టొయినిస్ ఒక వికెట్ దక్కించుకున్నారు.స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 13.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి పని పూర్తి చేసింది. రెండో టీ20లో భారత్పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచి.. ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ముందంజ వేసింది. కాగా కాన్బెర్రాలో జరగాల్సిన తొలి టీ20 వర్షం వల్ల రద్దైన విషయం తెలిసిందే.చదవండి: అతడే మా ఓటమిని శాసించాడు.. అభిషేక్ మాత్రం అద్భుతం: భారత కెప్టెన్ -
BCCI: శ్రేయస్ అయ్యర్ డిశ్చార్జ్.. కానీ..
టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శనివారం ఈ విషయాన్ని వెల్లడించింది. శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితి కుదుటపడిందని.. అతడు వేగంగా కోలుకుంటున్నట్లు తెలిపింది. బీసీసీఐ వైద్య బృందం, సిడ్నీలోని స్పెషలిస్టులు అతడి రికవరీ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని.. శనివారం అతడిని డిశ్చార్జ్ చేయనున్నట్లు బోర్డు వెల్లడించింది. కాగా భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సిడ్నీలో ఆస్ట్రేలియాతో మూడో వన్డే సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే. పక్కటెముకల్లో అంతర్గత రక్తస్రావంహర్షిత్ రాణా బౌలింగ్లో ఆసీస్ ఆటగాడు అలెక్స్ క్యారీ ఇచ్చిన రన్నింగ్ క్యాచ్ పట్టే ప్రయత్నంలో శ్రేయస్ పక్కటెముకలకు బలమైన గాయమైంది. దీంతో వైద్య సిబ్బంది సహాయంతో అతడు మైదానాన్ని వీడగా... ఆ తర్వాత పరిస్థితి తీవ్రతను గుర్తించి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయు)కు తరలించారు.స్పందించిన శ్రేయస్పక్కటెముకల్లో అంతర్గత రక్తస్రావాన్ని గుర్తించి వైద్యం అందించగా... శ్రేయస్ త్వరితగతిన కోలుకుంటున్నాడు. ఈ విషయంపై గతంలోనే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటన విడుదల చేసింది. అయితే రెండోసారి వైద్య పరీక్షల అనంతరం శ్రేయస్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ‘ప్రస్తుతం కోలుకునే ప్రక్రియలో ఉన్నాను. రోజు రోజుకు మరింత మెరుగ్గా అనిపిస్తుంది. క్లిష్ట సమయంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అని శ్రేయస్ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించాడు. గాయం కారణంగా మైదానాన్ని వీడినప్పటి నుంచి అయ్యర్... బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలోనే ఉండగా.. తాజాగా అతడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు బోర్డు తెలిపింది.వారికి బీసీసీఐ థాంక్స్ఈ సందర్భంగా.. సిడ్నీ డాక్టర్ కొరొష్ హగిగి, అతడి వైద్య బృందానికి.. అదే విధంగా.. భారత్కు చెందిన డాక్టర్ దిన్షా పార్దీవాలాకు బీసీసీఐ ధన్యవాదాలు చెప్పింది. శ్రేయస్ అయ్యర్ త్వరగా కోలుకునేలా మెరుగైన చికిత్స అందించినందుకు కృతజ్ఞతలు తెలిపింది.డిశ్చార్జ్ అయినాకాగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినా శ్రేయస్ అయ్యర్ మరికొన్నాళ్లు పాటు సిడ్నీలోనే ఉండనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. చికిత్స అనంతర పరీక్షల కోసం అతడు సిడ్నీలోనే ఉంటాడని.. విమాన ప్రయాణం చేయొచ్చని వైద్యులు చెప్పిన తర్వాతే భారత్కు తిరిగి వస్తాడని తెలిపింది.చదవండి: రోహిత్ శర్మ ఆల్టైమ్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన బాబర్ -
PKL 12: విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే?.. అవార్డుల జాబితా ఇదే
ప్రొ కబడ్డీ లీగ్ (PKL)-12వ సీజన్లో దబాంగ్ ఢిల్లీ కేసీ విజేతగా అవతరించింది. ఢిల్లీలోని త్యాగరాజ్ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్లో 31-28 తేడాతో టేబుల్ టాపర్ పుణెరి పల్టన్ (Dabang Delhi Beat Puneri Paltan)ను ఓడించింది. ఫలితంగా ఆషు మాలిక్ కెప్టెన్సీలోని ఢిల్లీ రెండోసారి పీకేఎల్ టైటిల్ అందుకుంది.అరుదైన ఘనతగతంలో ఎనిమిదో సీజన్లో ఢిల్లీ ట్రోఫీ నెగ్గిన విషయం తెలిసిందే. ప్రస్తుత హెడ్ కోచ్ జోగిందర్ నర్వాల్ (Joginder Narwal) అప్పుడు ఆ జట్టుకు కెప్టెన్గా ఉండటం విశేషం. తద్వారా పీకేఎల్లో కెప్టెన్గా, హెడ్కోచ్గా టైటిల్ గెలిచిన రెండో వ్యక్తిగా జోగిందర్ నిలిచాడు.ఇక పుణెరి పల్టన్తో ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్లో ఢిల్లీ రైడర్ నీరజ్ నర్వాల్ ఎనిమిది పాయింట్లతో సత్తా చాటగా.. అజింక్య పవార్ ఆరు పాయింట్లతో రాణించాడు. మరోవైపు, పుణెరి పల్టన్ తరఫున ఆదిత్య షిండే సూపర్ టెన్ సాధించినా.. అభినేష్ నాడరాజన్ నాలుగు ట్యాకిల్ పాయింట్లతో మెప్పించినా ఫలితం లేకుండా పోయింది.CLINICAL. CONSISTENT. CHAMPIONS. 🏆What an incredible season for #DabangDelhiKC! 👏👏👏 pic.twitter.com/C3fc1SwU48— Star Sports (@StarSportsIndia) October 31, 2025 మరి ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్ విజేత, రన్నరప్నకు దక్కే ప్రైజ్మనీ, ఈ సీజన్లో వివిధ విభాగాల్లో అవార్డులు గెలుచుకున్న ప్లేయర్లు ఎవరో తెలుసుకుందామా?ప్రైజ్మనీ ఎంతంటే?🏆విజేత దబాంగ్ ఢిల్లీ కేసీకి దక్కే ప్రైజ్మనీ- రూ. 3 కోట్లు👏రన్నరప్ పుణెరి పల్టన్కు దక్కే ప్రైజ్మనీ- రూ. 1.8 కోట్లువివిధ అవార్డులు గెలిచిన ఆటగాళ్లు🌟మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్- ఫజల్ అట్రాచలీ (దబాంగ్ ఢిల్లీ)🌟బెస్ట్ రైడర్ : అయాన్ లోహచబ్ (పట్నా పైరేట్స్)- 316 రైడింగ్ పాయింట్లు🌟బెస్ట్ డిఫెండర్ : నవదీప్ (పట్నా పైరేట్స్)- 73 టాకిల్ పాయింట్లు🌟మషాల్ స్పోర్ట్స్ న్యూ యంగ్ ప్లేయర్: దీపక్ శంకర్ (బెంగళూరు బుల్స్)PKL పన్నెండు సీజన్ల విజేతల జాబితా🏆సీజన్ 1: జైపూర్ పింక్ పాంథర్స్🏆సీజన్ 2: యు ముంబా🏆సీజన్ 3: పట్నా పైరేట్స్🏆సీజన్ 4: పట్నా పైరేట్స్🏆సీజన్ 5: పట్నా పైరేట్స్🏆సీజన్ 6: బెంగళూరు బుల్స్🏆సీజన్ 7: బెంగాల్ వారియర్స్🏆సీజన్ 8: దబాంగ్ ఢిల్లీ కేసీ🏆సీజన్ 9: జైపూర్ పింక్ పాంథర్స్🏆సీజన్ 10: పుణెరి పల్టన్🏆సీజన్ 11: హర్యానా స్టీలర్స్🏆సీజన్ 12: దబాంగ్ ఢిల్లీ కేసీపీకేఎల్-12 ఫైనల్ సాగిందిలా..ఈ సీజన్లో గత మ్యాచ్లలో రాణించినట్లుగానే తుదిపోరులోనూ అస్లాం ఇనాందార్, ఆషు మాలిక్ తమ జట్లకు తొలి పాయింట్లు అందించారు. ఆ తర్వాత నీరజ్ నర్వాల్ బాధ్యత తీసుకుని.. ఒక డబుల్-పాయింట్ రైడ్.. ఒక ట్యాకిల్తో ఢిల్లీకి ఆరంభంలోనే నాలుగు పాయింట్ల ఆధిక్యాన్ని సంపాదించిపెట్టాడు. అయితే, పుణెరి పల్టన్ ఆ ఒత్తిడికి లొంగలేదు. గౌరవ్ ఖత్రీ రెండు సూపర్ టాకిల్స్ సాధించి.. స్కోర్ల మధ్య తేడాను ఒక పాయింట్కు తగ్గించాడు. ఇరు జట్లు డూ -ఆర్ -డై వ్యూహాన్ని అనుసరించడంతో ఆట కాస్త నెమ్మదించింది. ఈ దశలో అజింక్య పవార్, తొలి పది నిమిషాలు ముగిసే సమయానికి దబాంగ్ ఢిల్లీకి రెండు పాయింట్ల ఆధిక్యాన్ని నిలబెట్టాడు. ఆపై, అనేష్ పల్టన్కు మూడో సూపర్ టాకిల్ నమోదు చేయడంతో, ఆట మళ్లీ ఒక పాయింట్ తేడాకు వచ్చింది. కానీ, 15వ నిమిషంలో అజింక్ పవార్ అద్భుత ఆటతో ప్రత్యర్థిని ఆలౌట్ చేసిన ఢిల్లీ ఆరు పాయింట్ల ఆధిక్యంతో మళ్లీ ముందంజ వేసింది. సొంత గడ్డపై ఆడుతున్న ఢిల్లీ నీరజ్ నర్వాల్ సూపర్ రైడ్తో తమ ఆధిపత్యాన్ని మరింత పెంచుకుని, ఆధిక్యాన్ని ఎనిమిది పాయింట్లకు పెంచుకుంది. పుణెరి కూడా పంకజ్ మోహితే ట్యాకిల్, ఆదిత్య షిండే డబుల్ -పాయింట్ రైడ్తో దీటుగా స్పందించి అంతరాన్ని కాస్త తగ్గించింది. అయితే, అజింక్య పవార్ వెంటనే మరో మల్టీ -పాయింట్ రైడ్తో జోరు చూపడంతో దబాంగ్ ఢిల్లీ 20-14 స్కోరుతో తొలి అర్ధభాగాన్ని ముగించింది. రెండో అర్ధభాగంలో ఇరు జట్లూ నెమ్మదిగా ఆడాయి. దబాంగ్ ఢిల్లీ తమ ఆధిక్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించింది. పుణెరి పల్టన్ కూడా దూకుడు ప్రదర్శించకుండా, తమ డిఫెన్స్, డూ -ఆర్ -డై వ్యూహంపై ఆధారపడి తిరిగి ఆటలోకి రావడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో గుర్దీప్ రెండు ట్యాకిల్స్ సాధించి లోటును నాలుగు పాయింట్లకు తగ్గించాడు. కానీ, దబాంగ్ ఢిల్లీ ఓ సూపర్ టాకిల్తో తన ఆధిక్యాన్ని 24-18కి పెంచుకుంది. స్టార్ రైడర్ ఆషు మాలిక్ ఓ పాయింట్ రాబట్టగా..అనురాగ్ చేసిన సూపర్ ట్యాకిల్తో దబాంగ్ ఢిల్లీ భారీ విజయం దిశగా దూసుకెళ్లింది.అయితే, చివరి నిమిషాల్లో పుణెరి పల్టన్ అంత తేలిగ్గా తలొగ్గలేదు. అమాన్ చేసిన ట్యాకిల్, ఆదిత్య షిండే వరుస రైడ్ పాయింట్లతో కీలక దశలో ఢిల్లీని ఆలౌట్ చేసింది. దీంతో మరో మూడు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా 25–28తో నిలిచి మ్యాచ్లో మరింతను పెంచింది. ఆపై ఆదిత్య షిండే అంతరాన్ని ఒక్క పాయింట్కు తగ్గించాడు, కానీ, ఢిల్లీ ఆటగాడు నీరజ్ నర్వాల్ మెరుపు రైడ్తో తమ ఆధిక్యాన్ని మూడు పాయింట్లకు పెంచాడు.ఆదిత్య షిండే మరో రెండు -పాయింట్ల రైడ్తో తన సూపర్ టెన్ పూర్తి చేసుకున్నాడు. చివరి నిమిషంలోకి అడుగుపెట్టేసరికి ఇరు జట్ల మధ్య కేవలం ఒక పాయింట్ మాత్రమే తేడా ఉంది. ఈ కీలక సమయంలో, ఫజెల్ అత్రాచలి తన అనుభవాన్ని ఉపయోగించి ఆదిత్య షిండేను ట్యాకిల్ చేసి, ఈ మ్యాచ్లో తన తొలి పాయింట్ను సాధించాడు. ఈ ట్యాకిల్తోనే దబాంగ్ ఢిల్లీ సొంత మైదానంలో రెండోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది.చదవండి: రోహిత్ శర్మ ఆల్టైమ్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన బాబర్Dabang Delhi K.C. are the crowned champions of PKL 12! 🏆⭐👏🏻[Pro Kabaddi League, PKL 12, Dabang Delhi K.C., Agent Ashu] pic.twitter.com/ICIUPuuMMP— Star Sports (@StarSportsIndia) October 31, 2025 -
పిచ్చి ప్రయోగాలు ఆపండి: సూర్య, గంభీర్పై మాజీ క్రికెటర్ ఫైర్
ఆస్ట్రేలియాతో రెండో టీ20లో టీమిండియా (IND vs AUS 2nd T20) యాజమాన్యం అనుసరించిన వ్యూహాలపై విమర్శలు వస్తున్నాయి. బ్యాటింగ్ ఆర్డర్లో ఇష్టారీతిన మార్పులు చేయడం వల్లే భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఆసీస్తో టీ20 సిరీస్ను కూడా టీమిండియా ఓటమితో మొదలు పెట్టింది. కాన్బెర్రాలో జరగాల్సిన తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా.. శుక్రవారం నాటి రెండో టీ20లో నెగ్గిన ఆసీస్ సిరీస్లో 1–0తో ముందంజ వేసింది. 125 పరుగులకే ఆలౌట్మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో ఆసీస్ 4 వికెట్లతో టీమిండియాపై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 18.4 ఓవర్లలో 125 పరుగులకే కుప్పకూలింది. అభిషేక్ శర్మ (Abhishek Sharma- 37 బంతుల్లో 68; 8 ఫోర్లు, 2 సిక్స్లు) తనదైన శైలిలో దూకుడుగా ఆడి అర్ధ సెంచరీ సాధించగా, హర్షిత్ రాణా (33 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. వీరిద్దరు ఆరో వికెట్కు 47 బంతుల్లో 56 పరుగులు జోడించారు.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జోష్ హాజిల్వుడ్ (3/13) మూడు కీలక వికెట్లు తీసి భారత్ను దెబ్బ తీశాడు. అనంతరం ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో 6 వికెట్లకు 126 పరుగులు చేసి విజయాన్నందుకుంది.GOOD GRIEF JOSH INGLIS 🤩 #AUSvIND | #PlayoftheDay | @BKTtires pic.twitter.com/g2Qb2CW7Pj— cricket.com.au (@cricketcomau) October 31, 2025 ఆసీస్ అలవోకగాఓపెనర్లు మిచెల్ మార్ష్ (26 బంతుల్లో 46; 2 ఫోర్లు, 4 సిక్స్లు), ట్రవిస్ హెడ్ (15 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్కు 28 బంతుల్లోనే 51 పరుగులు జోడించి ఆసీస్ గెలుపునకు పునాది వేశారు. జోష్ ఇంగ్లిస్ (20), మిచెల్ ఓవెన్ (14) ఓ మోస్తరుగా రాణించగా.. మార్స్ స్టొయినిస్ (6 నాటౌట్) పని పూర్తి చేశాడు.పిచ్చి ప్రయోగాలు ఆపండిఈ నేపథ్యంలో టీమిండియా ఓటమిపై భారత మాజీ క్రికెటర్ సదగోపన్ రమేశ్ స్పందించాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ఇష్టం వచ్చినట్లుగా మార్పులు చేయడాన్ని తప్పుబట్టాడు. ‘‘ఇప్పటికైనా బ్యాటింగ్ ఆర్డర్లో పిచ్చి ప్రయోగాలకు టీమిండియా స్వస్తి పలకాలి.ఈ మ్యాచ్లో 160- 170 పరుగులు స్కోరు చేసి గెలవగల సత్తా టీమిండియాకు ఉంది. గత మ్యాచ్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో వచ్చి అదరగొట్టాడు. నాటౌట్గా నిలిచాడు.కానీ ఈ మ్యాచ్లో వన్డౌన్లో సంజూను ఎందుకు తీసుకువచ్చారు?.. సంజూను ఓపెనింగ్ స్థానం నుంచి మిడిలార్డర్కు పంపారు. మళ్లీ ఇప్పుడు ఐదు నుంచి మూడో స్థానానికి మార్చారు. ఇలాంటి పనుల వల్ల ఎవరు ఎప్పుడు బ్యాటింగ్కు రావాలో తెలియని గందరగోళం నెలకొంటుంది.తిలక వర్మ ఆసియా కప్ ఫైనల్లో నాలుగో స్థానంలో వచ్చి గెలిపించాడు. కానీ ఇప్పుడు అతడిని ఐదో స్థానానికి మార్చారు’’ అని కెప్టెన్ సూర్య, హెడ్కోచ్ గౌతం గంభీర్ తీరును సదగోపన్ రమేశ్ విమర్శించాడు.ఎవరి పని వాళ్లే చేస్తే బాగుంటుందిఅదే విధంగా.. శివం దూబేను కాదని హర్షిత్ రాణాను ఏడో స్థానంలో ఆడించడాన్ని కూడా సదగోపన్ రమేశ్ తీవ్ర స్థాయిలో తప్పుబట్టాడు. ‘‘ఎవరి పని వాళ్లే చేస్తే బాగుంటుంది. గొప్ప వంటకాడు గొప్ప డ్రైవర్ కాలేడు. అదే విధంగా మంచి డ్రైవర్ గొప్పగా వంట చేయలేడు.ఆటగాళ్ల బలాలపై దృష్టి పెట్టి మేనేజ్మెంట్ వారికి తగిన పాత్ర ఇవ్వాలి. వారిలోని అత్యుత్తమ ప్రతిభ బయటకు వచ్చేలా ప్రోత్సహించాలి. అంతేగానీ బౌలర్ను బ్యాటర్గా మారుస్తాం.. బ్యాటర్తో బౌలింగ్ చేయిస్తాం అంటే ప్రతికూల ఫలితాలు రావచ్చు. ఈ విషయంలో యాజమాన్యం ఇప్పటికైనా పొరపాట్లు సరిచేసుకుంటే బాగుంటుంది’’ అంటూ సదగోపన్ రమేశ్.. టీమిండియా నాయకత్వ బృందానికి సూచించాడు.మార్పులు ఇవేకాగా మెల్బోర్న్లో ఆసీస్తో రెండో టీ20లో సంజూ శాంసన్ (2) మూడో స్థానంలో రాగా.. సూర్య (1) నాలుగో నంబర్ బ్యాటర్గా వచ్చి విఫలమయ్యాడు. ఇక తిలక్ వర్మ ఐదో స్థానంలో బ్యాటింగ్కు దిగి డకౌట్ అయ్యాడు. మరోవైపు.. బ్యాటింగ్ ఆల్రౌండర్ శివం దూబే (4)ను ఎనిమిదో స్థానానికి డిమోట్ చేసి.. పేసర్ హర్షిత్ రాణా (35)ను ఏడో స్థానంలో ఆడించారు.చదవండి: అతడే మా ఓటమిని శాసించాడు.. అభిషేక్ మాత్రం అద్భుతం: భారత కెప్టెన్ -
రోహిత్ శర్మ ఆల్టైమ్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన బాబర్
సౌతాఫ్రికాతో రెండో టీ20లో పాకిస్తాన్ (PAK vs SA 2nd T20) ఘన విజయం సాధించింది. లాహోర్ వేదికగా సఫారీ జట్టును ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో మట్టికరిపించింది. తద్వారా తొలి టీ20లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుని సిరీస్ను 1-1తో సమం చేసింది.ప్రపంచ రికార్డు బద్దలుఈ మ్యాచ్ సందర్భంగా పాక్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం (Babar Azam) సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్న టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. టీ20 క్రికెట్లో హయ్యస్ట్ రన్ స్కోరర్గా బాబర్ నిలిచాడు.బాబర్ డకౌట్వరుస వైఫల్యాల నేపథ్యంలో పాక్ కెప్టెన్సీ కోల్పోయిన బాబర్ ఆజం.. చాన్నాళ్ల పాటు టీ20 జట్టులోనూ స్థానం దక్కించుకోలేకపోయాడు. ఎట్టకేలకు స్వదేశంలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ సందర్భంగా సెలక్టర్లు అతడిని కరుణించారు. అయితే, రావల్పిండి వేదికగా సఫారీలతో తొలి టీ20లో బాబర్ డకౌట్ అయి పూర్తిగా నిరాశపరిచాడు.ఇందుకు తోడు ఈ మ్యాచ్లో పాక్ 55 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ నేపథ్యంలో బాబర్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అతడిని జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్లు పెరిగాయి. అయితే, తాజాగా శుక్రవారం నాటి మ్యాచ్లో పాక్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది.110 పరుగులకు ఆలౌట్లాహోర్ వేదికగా టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికాను 19.2 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌట్ చేసింది. ప్రధాన ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగిన ప్రొటిస్ జట్టు టాపార్డర్ పాక్ బౌలర్ల ధాటికి కుదేలైంది.రీజా హెండ్రిక్స్ డకౌట్ కాగా.. క్వింటన్ డికాక్ (7), టోనీ డి జోర్జి (7) పూర్తిగా విఫలమయ్యారు. యువ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ 25 పరుగులతో ప్రొటిస్ ఇన్నింగ్స్లో టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. మిగిలిన వారిలో కెప్టెన్ డొనోవాన్ ఫెరీరా (15), కార్బిన్ బాష్ (11), ఒట్నీల్ బార్ట్మన్ (12) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు.పాక్ బౌలర్లలో ఫాహీమ్ ఆష్రఫ్ నాలుగు వికెట్లు తీయగా.. సల్మాన్ మీర్జా మూడు, నసీం షా రెండు, అబ్రార్ అహ్మద్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్.. 13.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 112 పరుగులు చేసి.. తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది.సయీమ్ ఆయుబ్ విధ్వంసకర అర్ధ శతకంఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (28) ఓ మోస్తరుగా రాణించగా.. సయీమ్ ఆయుబ్ విధ్వంసకర అర్ధ శతకం (38 బంతుల్లో 71) సాధించాడు. అతడికి తోడుగా బాబర్ ఆజం 18 బంతుల్లో ఒక ఫోర్ సాయంతో 11 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలోనే బాబర్ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగుల వీరుడిగా రోహిత్ శర్మను అధిగమించాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024లో భారత్ను చాంపియన్గా నిలిపిన తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగుల వీరులు (టాప్-5)🏏బాబర్ ఆజం (పాకిస్తాన్)- 130* మ్యాచ్లలో 4234 పరుగులు🏏రోహిత్ శర్మ (ఇండియా)- 159 మ్యాచ్లలో 4231 పరుగులు🏏విరాట్ కోహ్లి (ఇండియా)- 125 మ్యాచ్లలో 4188 పరుగులు🏏జోస్ బట్లర్ (ఇంగ్లండ్)- 144 మ్యాచ్లలో 3869 పరుగులు🏏పాల్ స్టిర్లింగ్ (ఐర్లాండ్)- 153 మ్యాచ్లలో 3710 పరుగులు.చదవండి: అతడే మా ఓటమిని శాసించాడు.. అభిషేక్ మాత్రం అద్భుతం: భారత కెప్టెన్ -
IND vs PAK T20: భారత్- పాకిస్తాన్ మ్యాచ్ ఆరోజే
దుబాయ్: ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) రైజింగ్ స్టార్స్ టీ20 టోర్నమెంట్ ఈ నెల 14 నుంచి ప్రారంభం కానుంది. దోహా, ఖతర్ వేదికగా జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు రెండు గ్రూప్లుగా పాల్గొననున్నాయి. ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్’ పేరుతోఒమన్, పాకిస్తాన్, యూఏఈతో కలిసి భారత్ గ్రూప్ ‘బి’లో పోటీ పడుతుండగా... అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్, శ్రీలంక గ్రూప్ ‘ఎ’ నుంచి బరిలోకి దిగనున్నాయి. గతంలో ఏసీసీ ‘ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్’ పేరుతో నిర్వహించిన ఈ టోర్నీని ఈ సారి ‘రైజింగ్ స్టార్స్ టి20 టోర్నమెంట్’ పేరుతో నిర్వహించనున్నారు. ఇందులో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాలకు చెందిన ‘ఎ’ జట్లు పాల్గొననుండగా... మిగిలిన మూడు అసోసియేట్ దేశాలైన హాంకాంగ్, ఒమాన్, యూఏఈ ప్రధాన జట్లు బరిలోకి దిగనున్నాయి. ఈ నెల 14 నుంచి 19 వరకు రోజుకు రెండు మ్యాచ్ల చొప్పున నిర్వహించనున్నారు. నవంబర్ 16నఇందులో భాగంగా నవంబర్ 16న దాయాది పాకిస్తాన్తో భారత్ మ్యాచ్ ఆడనుంది. నవంబర్ 21న సెమీఫైనల్స్ నిర్వహించనుండగా... నవంబర్ 23న ఫైనల్ జరగనుంది. 2013 నుంచి ఎమర్జింగ్ టీమ్స్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీ ఆరంభంలో అండర్–23 జట్లు పోటీపడగా... ఆ తర్వాత ‘ఎ’ జట్లకు మార్చారు. చివరిసారిగా 2024లోఇప్పటి వరకు పాకిస్తాన్, శ్రీలంక జట్లు రెండేసి సార్లు విజేతగా నిలవగా... భారత్, అఫ్గానిస్తాన్ ఒక్కోసారి ట్రోఫీ చేజిక్కించుకున్నాయి. చివరిసారిగా 2024లో జరిగిన ఈ టోర్నమెంట్లో అఫ్గానిస్తాన్ విజేతగా నిలిచింది. ఒమన్లో జరిగిన టోర్నీ ఫైనల్లో శ్రీలంకపై అఫ్గాన్ విజయం సాధించింది. చదవండి: పీఎకేల్-2025 విజేతగా దబంగ్ ఢిల్లీ -
నేటి నుంచి చెస్ ప్రపంచకప్
పన్జిమ్ (గోవా): సొంతగడ్డపై జరిగే చెస్ ప్రపంచకప్లో హేమాహేమీలతో పావులు కదిపేందుకు భారత గ్రాండ్మాస్టర్లు సిద్ధమయ్యారు. తెలంగాణ స్టార్ అర్జున్ ఇరిగేశి, తమిళనాడు మేటి ఆటగాడు ఆర్.ప్రజ్ఞానంద సహా పలువురు ఆతిథ్య ఆటగాళ్లు ప్రపంచ దిగ్గజాలను ఢీకొట్టేందుకు సై అంటున్నారు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ కూడా ఈ మెగా టోర్నీ బరిలోకి దిగాడు. అయితే దశాబ్దంపైగా ప్రపంచ చెస్ను ఏలిన చదరంగ రారాజు మాగ్నస్ కార్ల్సన్ (నార్వే), అమెరికన్ స్టార్లు హికరు నకముర, ఫాబియానో కరువానా ఈ టోర్నీకి గైర్హాజరు అవుతున్నారు. ఇక టోర్నీ విషయానికొస్తే ఇది ఆషామాషీ ప్రపంచకప్ కాదు. తదుపరి ప్రపంచ చాంపియన్కు క్వాలిఫయింగ్ టోర్నీగా పేర్కొనవచ్చు. వచ్చే ఏడాది జరగబోయే ఫిడే క్యాండిడేట్స్ టోర్నమెంట్కు ఈ టోర్నీ ద్వారా ముగ్గురు అర్హత సాధిస్తారు. ఈ ముగ్గురిలో ఒకరు ప్రస్తుత చాంపియన్ గుకేశ్తో టైటిల్ కోసం ఢీ కొంటాడు. సుమారు 80 దేశాలకు చెందిన 206 మంది టాప్ చెస్ ప్లేయర్లు పోటీపడేందుకు గోవా చేరుకున్నారు. నాలుగు వారాల పాటు జరిగే ఈ టోర్నీలో భారత ఆటగాళ్లంతా ప్రపంచ చాంపియన్లు గుకేశ్ (పురుషులు), దివ్య దేశ్ముఖ్ (మహిళలు)లే స్ఫూర్తిగా బరిలోకి దిగుతున్నారు. వెటరన్ స్టార్ పెంటేల హరికృష్ణ, అనుభవజు్ఞడైన విదిత్ గుజరాతీలతో పాటు యువ సంచలనాలు నిహాల్ సరీన్, అరవింద్ చిదంబరంలు సైతం ప్రపంచ దిగ్గజాలకు సవాళ్లు విసరనున్నారు. సొంతగడ్డపై జరుగుతున్న ఈ టోర్నీలో కొత్తగా 24 మంది భారత ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు, సంచలన ఫలితాలు సాధించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. గుకేశ్ ప్రపంచ చాంపియన్ కావడంతో గెలిచినా పెద్దగా ఒరిగేదేమీ లేదు. అతను ఎలో రేటింగ్ను మెరుగు పర్చుకునేందుకే బరిలోకి దిగుతున్నాడు. అర్జున్, ప్రజ్ఞానందలు మాత్రం క్యాండిడేట్స్ టోర్నీపై గంపెడాశలతో ఉన్నారు. ఇంకా ఈ టోర్నీలో డచ్ సూపర్స్టార్ అనిశ్ గిరి, జర్మనీ టాప్ ప్లేయర్ విన్సెంట్ కీమర్, ఉజ్బెకిస్తాన్ గ్రాండ్మాస్టర్ నొదిర్బెక్ అబ్దుసతొరొవ్లు సైతం క్యాండిడేట్స్ టోర్నీ లక్ష్యంగా పైఎత్తులు వేసేందుకు సిద్ధమయ్యారు. టోర్నీ కథా కమామీషు... టోర్నీ మొత్తం ప్రైజ్మనీ రూ. 17.75 కోట్లు (2 మిలియన్ డాలర్లు). ఇందులో విజేతగా నిలిచిన చాంపియన్కు భారత దిగ్గజం, ప్రపంచ మాజీ చాంపియన్ ఆనంద్ పేరిట ‘విశ్వనాథన్ ఆనంద్ కప్’ అందజేస్తారు. ఎనిమిది రౌండ్ల పాటు మ్యాచ్లు జరుగుతాయి. ఒక్కో మ్యాచ్లో రెండు క్లాసికల్ గేమ్లు నిర్వహిస్తారు. ఇందులో స్కోరు సమమైతే మూడో రోజు ర్యాపిడ్, బ్లిట్జ్లలో జరిగే టైబ్రేకర్లతో విజేతను ఖరారు చేస్తారు. మొత్తం 206 మంది ప్లేయర్లలో ప్రపంచ ర్యాంకింగ్స్ ఆధారంగా టాప్–50లో ఉన్న గ్రాండ్మాస్టర్లంతా నేరుగా రెండో రౌండ్లోకి ప్రవేశిస్తారు. మిగిలిన 156 మంది తొలిరౌండ్ నుంచి ఆడాల్సివుంటుంది. వీరి నుంచి 78 మంది రెండో రౌండ్కు అర్హత సాధించడం ద్వారా మొత్తం 128 మంది ఆటగాళ్లతో రెండో రౌండ్ నుంచి రసవత్తర సమరం జరుగుతుంది.


