breaking news
Sports
-
రేసు గుర్రానికి సెలవిచ్చిన అనుశ్
న్యూఢిల్లీ: భారత ఈక్వె్రస్టియన్ అనుశ్ అగర్వల్లా తన విజయాల కోసం సుదీర్ఘకాలంగా శ్రమించిన రేసు గుర్రానికి సెలవిచ్చాడు. సర్ కారామెల్లో అనే అశ్వంతో 25 ఏళ్ల అనుశ్ చెప్పుకోదగ్గ విజయాలు సాధించాడు. పారిస్ ఒలింపిక్స్లోనూ పోటీపడ్డాడు. ఆ విశ్వక్రీడల్లో డ్రెస్సెజ్ ఈవెంట్ను పూర్తి చేసిన తొలి భారతీయ రైడర్గా ఘనత వహించాడు. పతకం రౌండ్కు అర్హత సాధించలేకపోయినప్పటికీ గ్రూప్ ‘ఇ’లో డ్రెస్సెజ్ ఈవెంట్ పోటీలో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఇలా తన ఒలింపిక్ ముచ్చట కూడా తీర్చిన గుర్రం కారామెల్లోకు గురువారం వీడ్కోలు పలికాడు. ‘థ్యాంక్యూ కారామెల్లో... నీవు కేవలం గుర్రానివే కాదు. అంతకుమించి మంచి భాగస్వామివి. నాకెంతో ముఖ్యమైన స్నేహితుడవు కూడా! నీవు నా కలల్నే కాదు... జాతి కలల్ని సాకారం చేశావ్. నీవల్లే ఒలింపిక్స్కు వెళ్లగలిగాను. మరెంతో మంది ఈక్వె్రస్టియన్లకు ప్రేరణగా నిలిచావు. నిన్ను నేను ఎప్పటికే మర్చిపోను. ఇన్నేళ్లు నా కోసం చెమటోడ్చిన నీకు విశ్రాంతి కావాలనే ఈ నిర్ణయం తీసుకున్నాను. హ్యాపి రిటైర్మెంట్ కారామెల్లో’ అని భావోద్వేగంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. -
ఔట్ చేసిన ఆనందంలో ఓవరాక్షన్.. కట్ చేస్తే! భారీ షాకిచ్చిన ఐసీసీ
వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ జేడెన్ సీల్స్కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) భారీ షాకిచ్చింది. బార్బోడస్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో తన చర్యలకు గాను ఐసీసీ జరిమానా విధించింది. మొదటి రోజు ఆటలో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ను ఔట్ చేసిన ఆనందంలో సీల్స్ దురుస ప్రవర్తన కనబరిచాడు.తొలి ఇన్నింగ్స్లో వరుస క్రమంలో వికెట్లు కోల్పోయిన ఆసీస్ను ప్యాట్ కమ్మిన్స్ ఆదుకునే ప్రయత్నం చేశాడు. కమ్మిన్స్ 18 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్స్తో 28 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కమ్మిన్స్ను సీల్స్ అద్బుతమైన బంతితో బోల్తా కొట్టించాడు. దీంతో సీల్స్ సెలబ్రేషన్స్ శ్రుతిమించాయి.ఈ విండీస్ స్పీడ్ స్టార్ కమ్మిన్స్ వైపు వేలు చూపిస్తూ డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిపో అంటూ సీరియస్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఫీల్డ్ అంపైర్ల ఫిర్యాదు మేరకు సీల్స్పై ఐసీసీ మ్యాచ్ రిఫరీ చర్యలు దిగారు. ఆర్టికల్ 2.5 ను ఉల్లంఘించినందుకు అతడి మ్యాచ్ ఫీజులో 15 శాతం కోతతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ విధించారు. సీల్స్ సైతం తన తప్పిదాన్ని అంగీకరించాడు."నా బౌలింగ్లో కమ్మిన్స్ రెండు భారీ షాట్లు కొట్టినందుకు, అతనికి డ్రెస్సింగ్ రూమ్ ఎక్కడ ఉందో చూపించాను. అంతే తప్ప అందులో ఇంకేమి లేదు" అని సీల్స్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్లో జైడన్ సీల్స్ నిప్పులు చెరుగుతున్నాడు. ఇప్పటివరకు రెండు ఇన్నింగ్స్లలో కలిపి 6 వికెట్లు పడగొట్టాడు.రసవత్తరంగా బార్బోడస్ టెస్టుఇక బార్బోడస్ టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఇరు జట్లకు విజయవకాశాలు సమంగా ఉన్నాయి. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ సెకెండ్ ఇన్నింగ్స్లో 4 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది.క్రీజులో ట్రావిస్ హెడ్(13), వెబ్స్టెర్(19) ఉన్నారు. ఆస్ట్రేలియా ప్రస్తుతం 82 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 190 పరుగులకే కుప్పకూలింది.చదవండి: WI vs AUS: ఆసీస్కు చుక్కలు చూపిస్తున్న విండీస్.. ఓటమి తప్పదా? -
ఆసీస్కు చుక్కలు చూపిస్తున్న విండీస్.. ఓటమి తప్పదా?
బ్రిడ్జ్టౌన్ వేదికగా వెస్టిండీస్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. రెండో రోజులో ఆటలో కూడా బార్బడోస్ పిచ్పై బౌలర్లు పండగ చేసుకున్నారు. 57/4 ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ఆరంభించిన వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 190 పరుగులకే కుప్పకూలింది. దీంతో కేవలం 10 పరుగుల ఆధిక్యం మాత్రమే విండీస్కు లభించింది.విండీస్ బ్యా టర్లలో షై హోప్ (91 బంతుల్లో 48; 5 ఫోర్లు), కెప్టెన్ చేజ్ (108 బంతుల్లో 44; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. బ్రాత్వైట్ (4), క్యాంప్బెల్ (7), కార్టీ (20), వారికన్ (0), బ్రాండన్ కింగ్ (26) విఫలమయ్యారు. ఆఖర్లో అల్జారీ జోసెఫ్ (20 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) కీలక పరుగులు చేశాడు. . ఆ్రస్టేలియా బౌలర్లలో స్టార్క్ 3, హాజల్వుడ్, కమిన్స్, వెబ్స్టర్ తలా 2 వికెట్లు పడగొట్టారు.ఆసీస్ మళ్లీ అదే తీరు..తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్లో విఫలమైన కంగారులు.. రెండో ఇన్నింగ్స్లో సైతం అదే తీరును కనబరుస్తున్నారు. 10 పరుగుల వెనకంజతో సెకెండ్ ఇన్నింగ్స్ను ఆరంభించిన ఆసీస్ తడబడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది.క్రీజులో ట్రావిస్ హెడ్(13), వెబ్స్టెర్(19) ఉన్నారు. ఆస్ట్రేలియా ప్రస్తుతం 82 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. మూడో రోజు ఆటలో ఆసీస్కు తొలి సెషన్ చాలా కీలకం. ఈ సెషన్లో కమ్మిన్స్ సేన వికెట్లు కోల్పోతే స్వల్ప ఆధిక్యానికే పరిమితమవుతోంది.ఇక విండీస్ బౌలర్లలో ఇప్పటివరకు జైడన్ సీల్స్, జోషఫ్, అల్జారీ జోషఫ్, గ్రీవ్స్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 180 పరుగులకే ఆలౌటైంది. మొత్తంగా రెండో రోజు ఆటలో 10 వికెట్లు నేలకూలాయి.చదవండి: భారత్-ఇంగ్లండ్ వన్డే, టీ20 సిరీస్.. షెడ్యూల్, జట్లు తదితర వివరాలు ఇవే -
భారత్-ఇంగ్లండ్ వన్డే, టీ20 సిరీస్.. షెడ్యూల్, జట్లు తదితర వివరాలు ఇవే
భారత పురుషల క్రికెట్ జట్టుతో పాటు మహిళల జట్టు కూడా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఈ టూర్లో భాగంగా హర్మన్ ప్రీత్ కౌర్ బృందం ఇంగ్లండ్ మహిళల జట్టుతో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ వైట్బాల్ సిరీస్ల కోసం భారత మహిళల జట్టు తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకుంది.ప్రాక్టీస్ గేమ్స్లో ఓటమి పాలైనప్పటికి ప్రధాన మ్యాచ్లలో మాత్రం సత్తాచాటాలని ఉమెన్ ఇన్ బ్లూ భావిస్తోంది. జూన్ 28 నుంచి జూలై 22 వరకు హర్మాన్ సేన పర్యటించనుంది. ఈ క్రమంలో భారత్-ఇంగ్లండ్ వైట్బాల్ సిరీస్లకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుంది.టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే..తొలుత ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టీ20 జూన్ 28న నాటింగ్హామ్ వేదికగా జరగనుంది.👉తొలి టీ20- శనివారం, జూన్ 28- నాటింగ్హామ్- రాత్రి 7 గంటలకు ఆరంభం👉రెండో టీ20- మంగళవారం, జూలై 1- బ్రిస్టల్- రాత్రి 11 గంటలకు ఆరంభం👉మూడో టీ20- శుక్రవారం, జూలై 4-ది ఓవల్- రాత్రి 11:05 గంటలకు ఆరంభం👉నాలుగో టీ20- బుధవారం, జూలై 9- మాంచెస్టర్- రాత్రి 11 గంటలకు ఆరంభం👉ఐదో టీ20- శనివారం, జూలై 12- బర్మింగ్హామ్- రాత్రి 11:05 గంటలకు ఆరంభంవన్డే సిరీస్ షెడ్యూల్👉మొదటి వన్డే – బుధవారం, జూలై 16 – సౌతాంప్టన్ – సాయంత్రం 5:30 గంటలకు ఆరంభం👉రెండవ వన్డే – శనివారం, జూలై 19 – లార్డ్స్ – మధ్యాహ్నం 3:30 గంటలకు ఆరంభం👉మూడవ వన్డే – మంగళవారం, జూలై 22 – చెస్టర్-లె-స్ట్రీట్ – సాయంత్రం 5:30 గంటలకు ఆరంభంభారత మహిళల టీ20 జట్టుహర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలి వర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యాస్తికా భాటియా), హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, స్నేహ రాణా, శ్రీ చరణి, శుచి ఉపాధ్యాయ్, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సయాలీ సత్ఘరే.భారత మహిళల వన్డే జట్టుహర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ, స్నేహ రాణా, శ్రీ చరణి, శుచి ఉపాధ్యాయ్, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సయాలీ సత్ఘరేఇంగ్లండ్ టీ20 జట్టునాట్ స్కైవర్-బ్రంట్ (కెప్టెన్), ఎమ్ అర్లాట్, టామీ బ్యూమాంట్, లారెన్ బెల్, ఆలిస్ కాప్సే, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్, అమీ జోన్స్ (వికెట్ కీపర్), పైజ్ స్కోల్ఫీల్డ్, లిన్సే స్మిత్, డానీ వ్యాట్-హాడ్జ్, ఇస్సీ వాంగ్.👉ఇంగ్లండ్ ఇంకా తమ వన్డే జట్టును ప్రకటించలేదు.👉ఇక ఈ సిరీస్లకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాలను సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్తో పాటు ఫ్యాన్ కోడ్ యాప్లో వీక్షించవచ్చు. -
తరుణ్ శుభారంభం
అయోవా (అమెరికా): యూఎస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తెలంగాణ ప్లేయర్, ప్రపంచ 54వ ర్యాంకర్ తరుణ్ మన్నేపల్లి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... ప్రపంచ మాజీ నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్, ప్రపంచ 37వ ర్యాంకర్ ప్రియాన్షు రజావత్, ప్రపంచ 57వ ర్యాంకర్ శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్, ప్రపంచ 61వ ర్యాంకర్ రిత్విక్ సంజీవి సతీశ్ కుమార్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. తొలి రౌండ్లో తరుణ్ 19–21, 21–18, 21–18తో ప్రపంచ 53వ ర్యాంకర్ అర్నాడ్ మెర్క్లే (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. 70 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఈ పోరులో కీలకదశలో తరుణ్ పాయింట్లు గెలిచి విజయాన్ని అందుకున్నాడు. తొలి గేమ్ను కోల్పోయిన తరుణ్... రెండో గేమ్లో స్కోరు 18–18 వద్ద వరుసగా మూడు పాయింట్లు నెగ్గి గేమ్ను దక్కించుకొని మ్యాచ్లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్లో 14–16తో వెనుకబడిన దశలో తరుణ్ విజృంభించి వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 19–16తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత రెండు పాయింట్లు చేజార్చుకున్న తరుణ్ వెంటనే తేరుకొని మరో రెండు పాయింట్లు నెగ్గి గేమ్తోపాటు మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత్కే చెందిన ఆయుశ్ శెట్టితో తరుణ్ తలపడతాడు. ఈ సీజన్లో తరుణ్ ఏడు టోర్నీల్లో ఆడి రెండింటిలో క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. మరోవైపు ప్రపంచ 50వ ర్యాంకర్ శ్రీకాంత్ 19–21, 21–12, 14–21తో ప్రపంచ 77వ ర్యాంకర్ హ్యారీ హువాంగ్ (ఇంగ్లండ్) చేతిలో, ప్రియాన్షు 10–21, 21–12, 7–21తో 106వ ర్యాంకర్ టింగ్ యెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో, శంకర్ 13–21, 19–21తో లియావో జు ఫు (చైనీస్ తైపీ) చేతిలో, రిత్విక్ 18–21, 12–21తో ఎనోగట్ రాయ్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయారు. శ్రియాన్షికి నిరాశ మహిళల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ క్రీడాకారిణి శ్రియాన్షి వలిశెట్టి, తాన్యా హేమంత్ తొలి రౌండ్లోనే నిష్క్రమించగా... భారత్కే చెందిన అన్మోల్ ఖరబ్, ఆకర్షి కశ్యప్, తన్వీ శర్మ, ఐరా శర్మ తొలి రౌండ్లో విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. శ్రియాన్షి 16–21, 21–23తో ఏడో సీడ్ పొలీనా బురోవా (ఉక్రెయిన్) చేతిలో, తాన్యా 21–10, 22–24, 16–21తో అమేలీ షుల్జ్ (డెన్మార్క్) చేతిలో ఓటమి పాలయ్యారు. అన్మోల్ 16–21, 21–13, 21–19తో తెరెజా స్విబికోవా (చెక్ రిపబ్లిక్)పై, ఆకర్షి 21–19, 21–10తో లియాంగ్ టింగ్ యు (చైనీస్ తైపీ)పై, తన్వీ శర్మ 21–19, 21–9తో రెండో సీడ్ ఎన్గుయెన్ థుయ్ లిన్ (వియత్నాం)పై గెలిచారు. హుంగ్ యిటింగ్ (చైనీస్ తైపీ)తో జరిగిన మ్యాచ్లో ఐరా శర్మ తొలి గేమ్ను 12–21తో కోల్పోయి, రెండో గేమ్ను 21–16తో సొంతం చేసుకుంది. నిర్ణాయక మూడో గేమ్లో స్కోరు 6–6తో సమంగా ఉన్నపుడు హుంగ్ యిటింగ్ గాయం కారణంగా మాŠయ్చ్ నుంచి వైదొలిగింది. మిక్స్డ్ డబుల్స్లో టాప్ సీడ్ తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) ద్వయం 21–17, 16–21, 17–21తో లిన్ యు చియె–హుంగ్ యుఎన్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో ఓడిపోయింది. -
భారత్ ‘తీన్మార్’
కౌలాలంపూర్: తుది పోరులో అదరగొట్టిన భారత స్క్వాష్ క్రీడాకారులు ఆసియా డబుల్స్ స్క్వాష్ చాంపియన్షిప్లో క్లీన్స్వీప్ చేశారు. ఫైనల్ చేరిన మూడు విభాగాల్లోనూ విజేతగా నిలిచి మూడు స్వర్ణ పతకాలతో మెరిశారు. పురుషుల డబుల్స్లో అభయ్ సింగ్–వెలవన్ సెంథిల్ కుమార్ జోడీ... మహిళల డబుల్స్లో అనాహత్ సింగ్–జోష్నా చినప్ప ద్వయం... మిక్స్డ్ డబుల్స్ లో అభయ్ సింగ్–అనాహత్ సింగ్ జంట పసిడి పతకాలను సొంతం చేసుకున్నాయి. పురుషుల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ అభయ్–సెంథిల్ జోడీ 9–11, 11–5, 11–5తో నూర్ జమాన్–నాసిర్ ఇక్బాల్ (పాకిస్తాన్) జంటను ఓడించింది. మహిళల డబుల్స్ తుది పోరులో అనాహత్–జోష్నా ద్వయం 8–11, 11–9, 11–10తో ఐనా అమాని–జిన్ యింగ్ యీ (మలేసియా) జోడీపై విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్ టైటిల్ సమరంలో అభయ్–అనాహత్ జంట 11–9, 11–7తో రాచెల్ అర్నాల్డ్–అమీòÙన్రాజ్ చందరన్ (మలేసియా) ద్వయంపై గెలుపొందింది. -
నేటి నుంచి ‘పంచ్’ పండుగ
సాక్షి, హైదరాబాద్: టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహైన్, రెండుసార్లు ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్తో పాటు పలువురు అంతర్జాతీయ బాక్సర్లు మహిళల ఎలైట్ బాక్సింగ్ టోర్నమెంట్ బరిలో దిగనున్నారు. హైదరాబాద్లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం వేదికగా నేటి నుంచి ప్రారంభంకానున్న ఈ టోర్నీ జూలై 1న ముగియనుంది. 10 వెయిట్ కేటగిరీల్లో పోటీలు జరగనుండగా... 15 యూనిట్లకు చెందిన 100 మందికిపైగా బాక్సర్లు ఇందులో పాల్గొననున్నారు. తెలంగాణ బాక్సింగ్ సంఘం, భారత బాక్సింగ్ సమాఖ్య, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ సంయుక్తంగా ఈ టోర్నీని నిర్వహించనున్నాయి. ఆతిథ్య తెలంగాణతో పాటు రైల్వేస్, హరియాణా, ఆలిండియా పోలీస్, సర్వీసెస్, పంజాబ్, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్తాన్, మహారాష్ట్ర, తమిళనాడు, సిక్కీం, భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కంబైన్డ్ నేషనల్ ఎక్స్లెన్ సెంటర్ టీమ్, టాప్స్ కోర్, డెవలప్మెంట్ జట్లు బరిలోకి దిగుతాయి. ప్రపంచ చాంపియన్షిప్ కాంస్య పతక విజేత మనీషా, ఒలింపియన్ ప్రీతి, వరల్డ్ యూత్ చాంపియన్ అరుంధతి చౌధరీ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఒక్కో విభాగంలో స్వర్ణ, రజతాలు సాధించిన బాక్సర్లు... పాటియాలాలో జరిగే ఎలైట్ జాతీయ శిబిరానికి ఎంపిక కానున్నారు. ‘భారత మహిళల బాక్సింగ్లోని పోటీతత్వానికి ఈ టోర్నమెంట్ నిదర్శనం కానుంది. అనుభవజు్ఞలు, యువ బాక్సర్ల మిళితమైన ఈ టోర్నమెంట్ ద్వారా కొత్తగా బాక్సింగ్లో అడుగుపెట్టిన వాళ్లు అనుభవం గడిస్తారు. మెరుగైన ప్రదర్శన కనబర్చిన వాళ్లను జాతీయ శిబిరానికి ఎంపిక చేస్తాం. కొత్త ప్రతిభను వెలికి తీసేందుకు ఇది ఉపయోగపడనుంది. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఇది ఉపకరిస్తుంది’ అని భారత బాక్సింగ్ సమాఖ్య అధ్యక్షుడు అజయ్ సింగ్ పేర్కొన్నారు. ఒక్కో జట్టు నుంచి 10 మంది బాక్సర్లు బరిలోకి దిగనున్నారు. ప్రపంచ బాక్సింగ్ నిబంధనల ప్రకారం నిర్వహించనున్న ఈ టోర్నమెంట్ ఒక్క బౌట్లో మూడు రౌండ్లు ఉంటాయి. ఒక్కో రౌండ్ వ్యవధి 3 నిమిషాలు కాగా... రౌండ్ల మధ్యలో ఒక్కో నిమిషం విరామం ఉటుంది. -
భారీ బృందంతో బరిలోకి భారత్
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరిగే ప్రతిష్టాత్మక ఆసియా అండర్–19 జూనియర్ టీమ్, వ్యక్తిగత బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత్ భారీ బృందంతో బరిలోకి దిగనుంది. ఐదు విభాగాల్లో కలిపి భారత్ నుంచి మొత్తం 19 మంది క్రీడాకారులు ఈ టోర్నీ లో పోటీపడనున్నారు. ఇండోనేసియాలోని సోలో నగరంలో జూలై 18 నుంచి 27వ తేదీ వరకు ఈ టోర్నీని నిర్వహిస్తారు. భారత జట్టులో తెలంగాణ నుంచి నలుగురు... ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. తెలంగాణకు చెందిన ప్రణవ్ రామ్ నాగలింగం పురుషుల సింగిల్స్లో, తన్వీ రెడ్డి అంద్లూరి మహిళల సింగిల్స్లో ఆడతారు. తెలంగాణకే చెందిన వెన్నెల కలగోట్ల సింగిల్స్తోపాటు డబుల్స్లో, మిక్స్డ్ డబుల్స్లో మంచాల కీర్తి పోటీపడుతారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన అరిగెల భార్గవ్ రామ్, గొబ్బూరు విశ్వతేజ్ పురుషుల డబుల్స్లో... కోడె విష్ణు కేదార్ మిక్స్డ్ డబుల్స్లో బరిలోకి దిగుతారు. భారత జట్టు: అన్ష్ నేగి, లాల్థజువాలా, రౌనక్ చౌహాన్, ప్రణవ్ రామ్ నాగలింగం (పురుషుల సింగిల్స్). రుజులా రాము, తన్వీ శర్మ, తన్వీ రెడ్డి అంద్లూరి, వెన్నెల కలగోట్ల (మహిళల సింగిల్స్). అరిగెల భార్గవ్ రామ్, గొబ్బూరు విశ్వతేజ్, భవ్య ఛాబ్రా, పరమ్ (పురుషుల డబుల్స్). వెన్నెల, రేషిక, గాయత్రి, మాన్సా రావత్ (మహిళల డబుల్స్). కోడె విష్ణు కేదార్, మంచాల కీర్తి, లాల్రామ్సాంగా, తారిణి సూరి (మిక్స్డ్ డబుల్స్). -
టెస్టుల్లో 'స్టాప్ క్లాక్'
దుబాయ్: టెస్టు క్రికెట్లో జాప్యాన్ని తగ్గించి మరింత రసవత్తరంగా మార్చే దిశగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రయత్నాలు ప్రారంభించింది. సుదీర్ఘ ఫార్మాట్లో ‘స్లో ఓవర్రేట్’ను నియంత్రించేందుకు ఐసీసీ ‘స్టాప్ క్లాక్’ పద్ధతిని ప్రవేశ పెట్టింది. 2025–27 ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) సైకిల్లో ఈ కొత్త నిబంధనలు అమలవుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య ఒక టెస్టు మ్యాచ్ పూర్తికాగా... ప్రస్తుతం రెండో టెస్టు జరుగుతోంది. మరోవైపు ఆ్రస్టేలియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో సైతం ఈ కొత్త నిబంధనలు అమలవుతున్నాయి. దీంతో పాటు బ్యాటర్లు వికెట్ల మధ్య పరుగు తీసే సమయంలో ఉద్దేశపూర్వకంగా ‘షార్ట్ రన్’కు పాల్పడితే... స్ట్రయిక్లో ఎవరు ఉండాలనే నిర్ణయం ఫీల్డింగ్ జట్టు సారథి తీసుకునే అవకాశం కల్పించింది. ఆటను మరింత జనరంజకంగా మార్చే ప్రక్రియలో భాగంగా ఐసీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. » ‘స్లో ఓవర్రేట్’ను అరికట్టేందుకు బోర్డు నడుం బిగించింది. ఓవర్కు ఓవర్కు మధ్య వ్యవధిని 60 సెకన్లకు పరిమితం చేసింది. » టెస్టు మ్యాచ్లో ఒక ఓవర్ ముగిసిన అనంతరం మైదానంలోని ‘స్టాప్ క్లాక్’లో కౌంట్డౌన్ ప్రారంభమవుతుంది. 60 సెకన్లలో తదుపరి ఓవర్ తొలి బంతి పడాల్సి ఉంటుంది. » నిర్ణీత సమయంలో ఓవర్ ప్రారంభం కాకపోతే... అంపైర్లు హెచ్చరిస్తారు. » బౌలింగ్ చేస్తున్న జట్టు రెండు సార్లకు మించి అంప్లైర్ల హెచ్చరికలు పొందితే... బ్యాటింగ్ జట్టుకు అదనంగా 5 పరుగులు కేటాయిస్తారు. » ఒక ఇన్నింగ్స్లో 80 ఓవర్లు ముగిస్తే హెచ్చరికలను తిరిగి ఒకటి నుంచి లెక్కిస్తారు. » బంతి ఆకారం మారిందని అంపైర్లు గుర్తిస్తే ఏ సమయంలోనైనా బాల్ను మార్చవచ్చు. » ఫీల్డ్ అంపైర్ ‘అవుట్’ అని ఇచ్చిన నిర్ణయంపై రెండో సమీక్ష జరిగితే... ఆ నిర్ణయంలో స్పష్టత రాకుంటే దాన్ని అవుట్గానే పరిగణించనున్నారు. ఉదాహరణకు... ఒక బ్యాటర్ క్యాచ్ అవుటైన సందర్భంలో ఆన్ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయాన్ని బ్యాటర్ సవాలు చేసి బంతి ప్యాడ్లను తాకినట్లు రీప్లేల్లో చూపించి నాటౌట్గా నిర్ణయిస్తే... టీవీ అంపైర్ ఎల్బీని పరిశీలిస్తాడు. ఈ సందర్భంలో డిఫాల్ట్ నిర్ణయం ‘అవుట్’గానే ఉంటుంది. బాల్ ట్రాకింగ్ విధానంలో పరిశీలించిన అనంతరం ‘అంపైర్ కాల్’ చూపిస్తే బ్యాటర్ క్రీజు వదిలి వెళ్లాల్సి ఉంటుంది. » ఉద్దేశపూర్వకంగా షార్ట్ రన్కు పాల్పడితే... అదనపు ప్రయోజనం పొందాలనే లక్ష్యంతోనే ఇలా చేసినట్లు అంపైర్లు భావిస్తే... ఫీల్డింగ్ జట్టుకు 5 పరుగులు అదనంగా అందివ్వనున్నారు. దీంతో పాటు తదుపరి బంతికి ఎవరు స్ట్రయిక్ తీసుకోవాలనే అంశం కూడా నిర్ణయించే అధికారం ఫీల్డింగ్ జట్టు కెపె్టన్కు కల్పిస్తారు. -
మహిళల గేమ్ మారింది
బెంగళూరు: భారత మహిళల బ్యాడ్మింటన్కు సైనా నెహ్వాల్ జోష్ తెస్తే... పతకాలు, ఘన విజయాలతో ముఖచిత్రాన్నే మార్చిన స్టార్ షట్లర్ మాత్రం ముమ్మూటికి పీవీ సింధునే! ఒలింపిక్ పతకాలు, ప్రపంచ చాంపియన్షిప్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల పతకాలతో చైనాకు సవాల్గా నిలిచిన బ్యాడ్మింటన్ తార సింధు కొంతకాలంగా పతకాల వేటలో వెనుకబడింది. అయితే రేసులో వెనుకబడినా... తన సత్తాలో ఏ మార్పూ లేదని చెప్పింది. ఆధునిక మహిళల బ్యాడ్మింటన్ ఆటతీరు చెప్పుకోదగ్గ స్థాయిలో మారిందని వివరించింది. కోర్టులో ఎదురుపడే ప్రత్యర్థులే కాదు... సుదీర్ఘ ర్యాలీలు సైతం మహిళా షట్లర్ల సామర్థ్యానికి కఠిన పరీక్ష పెడుతున్నాయని చెప్పింది. ఇక్కడి స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రానికి వచ్చిన సింధు మీడియాతో ముచ్చటించిన కబుర్లు ఆమె మాటల్లోనే... ‘సింగిల్స్’ అప్పట్లా లేదు బ్యాడ్మింటన్లో ప్రత్యేకించి మహిళల సింగిల్స్ పూర్తిగా మారింది. మొదట్లో అటాకింగ్, వేగవంతమైన ర్యాలీలే కనిపించేవి. మ్యాచ్ను ముగించేవి. కానీ ఇప్పుడు సుదీర్ఘ ర్యాలీలు మరింత పోటీని తెచ్చాయి. దీని వల్ల మ్యాచ్లు పోటాపోటీగా చాలా సేపు సాగుతున్నాయి. ప్రతీ పాయింట్ను కాపాడుకునేందుకు రక్షణాత్మక ధోరణితో ఆడుతుండటంతోనే మ్యాచ్ల టైమింగ్ పెరుగుతోంది. మారిన పరిస్థితులకు తగ్గట్టే మన ఆటతీరు మార్చుకోవాల్సిందే. ఫిట్నెస్ కీలకం ఆటలో దూకుడు కనబర్చాలంటే... అభివృద్ధి చెందుతున్న టెంపోకు అనుగుణంగా మన ఆటతీరును మార్చాలంటే ఫిట్నెసే కీలకం. అందుకే నేను నా శారీరక సత్తాను మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టాను. అప్పుడే నేను సహనంతో కోర్టులో ఎంతసేపైనా ఆడగలుగుతాను. ఇప్పుడు ప్రత్యర్థిపై ఫోకస్ కంటే ఇలాంటి మార్పులపైనే మరింత దృష్టి సారించాల్సిన అవసరం వచ్చింది. కొత్త కోచ్ కూడా సుదీర్ఘ సమయం ఆడటంపైనే శిక్షణ ఇస్తున్నారు. ఎప్పుడూ ఒకేలా ఉండలేం ఎవరైనా సరే ఎప్పుడు కూడా ఒకేలా ఉండలేరు. ఆడలేరు. పదేళ్ల క్రితం ఆడిన ఆటే ఇప్పుడు ఆడాలంటే ఎలా? అప్పటి ఆట, శిక్షణ, పరిస్థితులు వేరు. ఇప్పుడు ఎదురవుతున్న సవాళ్లు వేరు. ఇవన్నీ అర్థం చేసుకొని ఆడగలగడమే ముఖ్యం. అయితే కెరీర్లో నా సాఫల్యాల పట్ల సంతృప్తిగానే ఉన్నాను. కామన్వెల్త్, ఆసియా, ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్షిప్ పతకాలన్నీ గెలిచాను. ఇప్పుడు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడితే చాలు. మళ్లీ పతకాల బాట పట్టొచ్చు. ఫలితాలు నిరాశ పరిచాయి కొన్నాళ్లుగా కోర్టులో ఫలితాలు, నా ఆటతీరు నిరాశపరిచిన మాట నిజమే. అయితే ఈ వైఫల్యాలను అధిగమించేందుకు ఇటీవల తీవ్రమైన కసరత్తులు చేశాను. ఐదారు టోర్నీల్లో తొలి రౌండ్లలోనే ఓడిపోయాను. ఇప్పుడలా ఉండదు. తప్పకుండా మెరుగైన ఆటతీరునే చూస్తారు. క్లిష్టమైన ప్రత్యర్థులు ఎదురైనపుడే మనం మరింత కష్టపడతాం. నేను కూడా అంతే సానుకూల దృక్పథంతో అడుగు ముందుకు వేయాలనుకుంటున్నాను. -
భారత్ ఆడే సిడ్నీ మ్యాచ్ టికెట్లు ‘సోల్డ్ అవుట్’
మెల్బోర్న్: టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో సంప్రదాయ టెస్టు ఫార్మాట్ ఆడుతోంది. ఇది ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ కావడంతో ఇంగ్లండ్ పర్యటన ముగిసేందుకే చాలా సమయం పడుతోంది. ఆగస్టు 4 వరకు అఖరి టెస్టు జరుగుతుంది. అనంతరం బంగ్లాదేశ్ పర్యటన ఉంది. ఆ తర్వాతే ఆ్రస్టేలియాలో భారత్ పర్యటిస్తుంది. అక్టోబర్–నవంబర్లలో జరిగే ఈ పరిమిత ఓవర్ల సిరీస్లకు ఇంకా నాలుగు నెలల సమయం ఉంది. అయినా సరే భారత్ క్రికెట్ క్రేజ్ను ఆస్ట్రేలియా కూడా సొమ్ము చేసుకుంది. మూడు వన్డేలు, ఐదు టి20ల కోసం క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) టికెట్ల విక్రయం చేపట్టగా ఏకంగా 90 వేల పైచిలుకు టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయినట్లు స్వయంగా సీఏ వర్గాలే వెల్లడించాయి. సిడ్నీలో జరిగే మూడో వన్డే, కాన్బెర్రాలో జరిగే తొలి టి20 టికెట్లయితే ఒక్కటి కూడా మిగలకుండా ‘సోల్డ్ అవుట్’ కావడం విశేషం. ‘భారత్, ఆసీస్ల మధ్య జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టికెట్లు హాట్కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ముఖ్యంగా ‘కంగారూ’ దేశంలో స్థిరపడిన భారత సంతతి ప్రేక్షకులు వేలంవెర్రిగా ఎగబడ్డారు’ అని సీఏ ఒక ప్రకటనలో తెలిపింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (మూడో వన్డే వేదిక), మనుక ఓవల్ (కాన్బెర్రా–తొలి టి20 వేదిక)లలో జరిగే మ్యాచ్ టికెట్లకు అనూహ్య డిమాండ్ నెలకొనడంతో నాలుగు నెలల ముందే టికెట్లన్నీ అయిపోయాయని సీఏ పేర్కొంది. భారత సంతతి అభిమానులు కొందరు వందలు, వేల సంఖ్యలో టికెట్లు కొనుగోలు చేసినట్లు తెలిసింది. -
చరిత్ర సృష్టించిన లిట్టన్ దాస్
బంగ్లాదేశ్ వికెట్కీపర్ లిట్టన్ దాస్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్ట్ల్లో ఆ దేశం తరఫున అత్యధిక మంది ఔట్ చేయడంలో భాగమైన వికెట్ కీపర్గా రికార్డు నెలకొల్పాడు. కొలొంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో దినేశ్ చండీమల్ క్యాచ్ పట్టడం ద్వారా లిట్టన్ దాస్ ఈ ఘనత సాధించాడు. లిట్టన్కు ముందు బంగ్లాదేశ్ తరఫున టెస్ట్ల్లో అత్యధిక డిస్మిసల్స్ రికార్డు ముష్ఫికర్ రహీం పేరిట ఉంది. ముష్ఫికర్ 99 ఇన్నింగ్స్ల్లో 113 డిస్మిసల్స్లో (98 క్యాచ్లు, 15 స్టంపౌట్లు) భాగంగా కాగా.. లిట్టన్ కేవలం 65 ఇన్నింగ్స్ల్లోనే (114) ముష్ఫికర్ రికార్డును బద్దలు కొట్టాడు. లిట్టన్ డిస్మిసల్స్లో 99 క్యాచ్లుండగా.. 15 స్టంపౌట్లు ఉన్నాయి.బంగ్లాదేశ్ తరఫున టెస్ట్ల్లో విజయవంతమైన టాప్-4 వికెట్ కీపర్లు..లిట్టన్ దాస్-114ముష్ఫికర్ రహీం-113ఖలీద్ మసూద్-87నురుల్ హసన్-34మ్యాచ్ విషయానికొస్తే.. కొలొంబో వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక పైచేయి సాధించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసి, 43 పరుగుల ఆధిక్యం సాధించింది. ఓపెనర్ పథుమ్ నిస్సంక (146) వరుసగా రెండో మ్యాచ్లో సెంచరీ చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా ఓవర్నైట్ బ్యాటర్ ప్రభాత్ జయసూర్య (5) క్రీజ్లో ఉన్నాడు.లంక ఇన్నింగ్స్లో దినేశ్ చండీమల్ (93) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. మరో ఓపెనర్ లహీరు ఉడారా 40 పరుగులతో రాణించాడు. తైజుల్ ఇస్లాం, నయీమ్ హసన్కు తలో వికెట్ దక్కింది.అంతకుముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 247 పరుగులకు ఆలౌటైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసిన బంగ్లాదేశ్ ఇవాళ (రెండో రోజు) మరో 27 పరుగులు జోడించి మిగతా 2 వికెట్లు కోల్పోయింది. బంగ్లా ఇన్నింగ్స్లో ఓపెనర్ షద్మాన్ ఇస్లాం (46) టాప్ స్కోరర్ కాగా.. మొమినుల్ హక్ (21), ముష్ఫికర్ రహీం (35), లిటన్ దాస్ (34), మెహిది హసన్ మిరాజ్ (31), నయీమ్ హసన్ (25), తైజుల్ ఇస్లాం (33) రెండంకెల స్కోర్లు చేశారు. అనాముల్ హక్ 0, కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో 8, ఎబాదత్ హొసేన్ 8 పరుగులకు ఔటయ్యారు.బంగ్లా ఇన్నింగ్స్ను అశిత ఫెర్నాండో (18-2-51-3), విశ్వ ఫెర్నాండో (19-4-45-2), సోనల్ దినుష (9.3-3-22-3), ధనంజయ డిసిల్వ (5-0-15-1), తిరండు రత్నాయకే (17-1-72-1) దెబ్బకొట్టారు. నిస్సంక వరుస సెంచరీలుశ్రీలంక బ్యాటింగ్ సంచలనం, ఆ జట్టు ఓపెనర్ పథుమ్ నిస్సంక వరుస సెంచరీలతో చెలరేగిపోతున్నాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో తొలి మ్యాచ్లో భారీ శతకంతో (187) విరుచుకుపడిన అతను.. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్లోనూ అద్భుత శతకంతో (146 నాటౌట్) మెరిశాడు.కాగా, రెండు టెస్ట్లు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ల కోసం బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా గాలే వేదికగా జరిగిన తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. ఆ మ్యాచ్లో ఇరు జట్లు ఆటగాళ్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇరు జట్ల తరఫున నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో రెండు ఇన్నింగ్స్ల్లో (148, 125 నాటౌట్) సెంచరీలు చేయగా.. ముష్ఫికర్ రహీం (163),పథుమ్ నిస్సంక (187) తమతమ తొలి ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేశారు. -
విధ్వంసం సృష్టించిన ఆర్సీబీ స్టార్
మేజర్ లీగ్ క్రికెట్లో ఆర్సీబీ స్టార్ ఆటగాడు, శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ ఆల్రౌండర్ రొమారియో షెపర్డ్ చెలరేగిపోయాడు. సియాటిల్ ఓర్కాస్తో ఇవాళ (భారతకాలమానం ప్రకారం) జరిగిన మ్యాచ్లో విధ్వంసం సృష్టించాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్కు దిగి 31 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 56 పరుగులు చేశాడు. అనంతరం బౌలింగ్లోనూ రెచ్చిపోయాడు. 3 ఓవర్లలో కేవల 16 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.షెపర్డ్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టడంతో శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ సియాటిల్ ఓర్కాస్పై 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించిన యూనికార్న్స్ ప్లే ఆఫ్స్కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. షెపర్డ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. The ball striking of Romario Shepherd. pic.twitter.com/MvXzg673pJ— Mufaddal Vohra (@mufaddal_vohra) June 26, 2025షెపర్డ్ తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్లో సీఎస్కేపై 14 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు. తాజాగా అదే తరహా ప్రదర్శన చేసి వార్తల్లో నిలిచాడు. ఈ ప్రదర్శన షెపర్డ్కు వచ్చే ఐపీఎల్ సీజన్ రిటెన్షన్కు ఉపయోగపడవచ్చు. షెపర్డ్ ప్రస్తుత ఎంఎల్సీ సీజన్లో ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపిస్తున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన యూనికార్న్స్.. షెపర్డ్ (56), మాథ్యూ షార్ట్ (52) మెరుపు అర్ద సెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్ (34) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా ఆటగాళ్లలో ఫిన్ అలెన్ (4), సంజయ్ కృష్ణమూర్తి (4), హసన్ ఖాన్ (1), జేవియర్ బార్ట్లెట్ (3), హ్యామిల్టన్ (6) నిరాశపరిచారు. ఓర్కాస్ బౌలర్లలో హర్మీత్ సింగ్, కొయెట్జీ తలో 3 వికెట్లు తీయగా.. ఒబెద్ మెక్కాయ్, గానన్ చెరో వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన ఓర్కాస్.. హరీస్ రౌఫ్ (4-0-32-4) నిప్పులు చెరగడంతో 18.2 ఓవర్లలో 144 పరుగులకే ఆలౌటైంది. రౌఫ్కు మాథ్యూ షార్ట్ (4-0-12-3), షెపర్డ్ (3-0-16-2), బార్ట్లెట్ (2.2-0-37-1) కూడా జత కలవడంతో ఓర్కాస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ఓర్కాస్ జట్టులో ఓపెనర్ షయాన్ జహంగీర్ (40), షిమ్రోన్ హెట్మైర్ (30), డేవిడ్ వార్నర్ మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కైల్ మేయర్స్ (0), హెన్రిచ్ క్లాసెన్ (7) వైఫల్యాల పరంపరను కొనసాగించారు. ఈ సీజన్లో ఓర్కాస్కు ఇది వరుసగా ఐదో ఓటమి. ఈ ఓటమితో ఓర్కాస్ ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా గల్లంతైనట్లే. -
ఇంగ్లండ్తో రెండో టెస్ట్.. టీమిండియాకు షాకింగ్ న్యూస్..!
ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్లో పర్యటిస్తున్న టీమిండియా జులై 2 నుంచి బర్మింగ్హమ్ వేదికగా రెండో టెస్ట్ ఆడుతుంది. ఈ మ్యాచ్కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలినట్లు తెలుస్తుంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్ నుంచి వైదొలిగాడని వార్తలు వినిపిస్తున్నాయి. వర్క్ లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా జట్టు యాజమాన్యమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.బుమ్రా తాజాగా ముగిసిన లీడ్స్ టెస్ట్లో 44 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఇది అతనిపై అదనపు భారం పడేలా చేసిందని మేనేజ్మెంట్ భావిస్తుంది. దీంతో అతనికి రెండో టెస్ట్లో విశ్రాంతినిచ్చి, తిరిగి మూడో టెస్ట్లో బరిలోకి దించే అవకాశం ఉంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందే బుమ్రా అన్ని మ్యాచ్లు ఆడడని బీసీసీఐ పరోక్షంగా చెప్పింది. వర్క్ లోడ్ కారణంగా స్టార్ పేసర్ కేవలం మూడు మ్యాచ్లే ఆడతాడని బోర్డులోని కీలక సభ్యులంతా చెప్పారు.తొలి టెస్ట్కు, రెండో టెస్ట్కు మధ్య 8 రోజుల గ్యాప్ ఉండటంతో బుమ్రా రెండో టెస్ట్లో ఆడతాడని అంతా అనుకున్నారు. ఒకవేళ విశ్రాంతినిచ్చినా, చివరి మూడు టెస్ట్ల్లో ఉంటుందని అంచనా వేశారు. అయితే తొలి టెస్ట్లో పడిన అదనపు భారం కారణంగా బుమ్రా విషయంలో ప్రణాళికలు మారాయని తెలుస్తుంది. బుమ్రా విషయంలో బీసీసీఐ ఎలాంటి సాహసాలు చేసేందుకు సిద్దంగా ఉండదు. జులై 10 నుంచి లార్డ్స్లో జరిగే మూడో టెస్ట్కు బుమ్రా సిద్దంగా ఉండే అవకాశం ఉంది. 16 రోజుల గ్యాప్లో బుమ్రా పూర్తి సన్నద్దత సాధించవచ్చు.రెండో టెస్ట్లో బుమ్రా ఆడకపోతే సిరాజ్ భారత పేస్ విభాగానికి నాయకత్వం వహిస్తాడు. ఇప్పటికే తొలి టెస్ట్ కోల్పోయి సిరీస్లో వెనుకపడిన టీమిండియాకు ఇది అంత శుభపరిణాయం కాదు. తొలి టెస్ట్లో బుమ్రా మినహా పేసర్లంతా తేలిపోయారు. తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసిన బుమ్రా కూడా రెండో ఇన్నింగ్స్లో ప్రభావం చూపించలేకపోయాడు. రెండో టెస్ట్లో బుమ్రా ఆడినా, ఆడకపోయిన భారత బౌలింగ్ విభాగంలో భారీ మార్పులకు ఆస్కారం ఉంది.ఒకవేళ బుమ్రా ఆడకపోతే ఆకాశ్దీప్, అర్షదీప్ సింగ్లలో ఎవరో ఒకరికి అవకాశం దక్కుతుంది. బుమ్రా ఆడకుండా, తొలి టెస్ట్లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ప్రసిద్ద్ కృష్ణపై కూడా వేటు పడితే ఆకాశ్దీప్, అర్షదీప్ సింగ్ ఇద్దరికీ తుది జట్టులో చోటు దక్కుతుంది. తొలి టెస్ట్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయిన శార్దూల్ ఠాకూర్పై కూడా వేటు పడే అవకాశం ఉంది. అతని స్థానంలో రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. బ్యాటింగ్ విభాగంలో భారత్ ఎలాంటి సాహసాలు చేయకపోవచ్చు.పూర్తి లైనప్ను యధాతథంగా కొనసాగించే అవకాశం ఉంది. తొలి టెస్ట్లో సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ విఫలమైన వారికి మరో ఛాన్స్ తప్పక ఉంటుంది. టీమిండియా విషయాన్ని పక్కన పెడితే ఇంగ్లండ్ రెండో టెస్ట్ కోసం జట్టును ప్రకటించింది. ప్రమాదకర పేసర్ జోఫ్రా ఆర్చర్ నాలుగేళ్ల తర్వాత టెస్ట్ ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. -
టీమిండియాతో రెండో టెస్ట్.. ప్రమాదకర బౌలర్ను జట్టులోకి తీసుకున్న ఇంగ్లండ్
జులై 2 నుంచి బర్మింగ్హమ్ వేదికగా టీమిండియాతో జరుగబోయే రెండో టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టును ఇవాళ (జూన్ 26) ప్రకటించారు. ఈ జట్టులో ప్రమాదకర ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ చోటు దక్కించుకున్నాడు. 30 ఏళ్ల ఆర్చర్ నాలుగేళ్ల తర్వాత ఇంగ్లండ్ టెస్ట్ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. Jofra Archer is back in Test cricket.#ENGvINDpic.twitter.com/vd4VVRQmM8— CricTracker (@Cricketracker) June 26, 2025ఆర్చర్ 2021 ఫిబ్రవరిలో చివరిసారి టెస్ట్ల్లో ఇంగ్లండ్కు ప్రాతినిథ్యం వహించాడు. ఆర్చర్ తన చివరి టెస్ట్ మ్యాచ్ను టీమిండియాతోనే ఆడాడు. ఆతర్వాత అతను వరుస గాయాల కారణంగా క్రికెట్కు దూరమయ్యాడు. ఆర్చర్ గతేడాది మేలో పరిమిత ఓవర్ల ఫార్మాట్లలోకి తిరిగి వచ్చాడు. తాజాగా అతను టెస్ట్ జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు. ఆర్చర్ ఇటీవల కౌంటీ ఛాంపియన్షిప్ చివరి రౌండ్ మ్యాచ్లో ససెక్స్కు ఆడుతూ డర్హమ్ను ఎదుర్కొన్నాడు. తాజాగా ప్రకటించిన ఇంగ్లండ్ జట్టులో ఆర్చర్ అదనంగా జోడించబడ్డాడు. తొలి టెస్ట్ కోసం ప్రకటించిన జట్టు యధాతథంగా కొనసాగింది. ఆర్చర్ తాజాగా ఆడిన కౌంటీ మ్యాచ్లో 18 ఓవర్లు బౌలింగ్ చేసి ఓ వికెట్ తీశాడు. బ్యాటింగ్లో 34 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 31 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్లో ఆర్చర్కు బ్యాటింగ్, బౌలింగ్ అవకాశం దక్కలేదు. రెండో టెస్ట్లో ఆర్చర్కు తుది జట్టులో కూడా చోటు దక్కే అవకాశం ఉంది. ఆర్చర్ చేరిక ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ విభాగానికి అదనపు బలం చేకూరుస్తుంది. ఇప్పటికే ఇంగ్లండ్ తొలి టెస్ట్లో గెలిచి భారత్పై ఆధిక్యంలో కొనసాగుతుంది. రెండో టెస్ట్లో ఆర్చర్ తుది జట్టులో చేరితే టీమిండియాకు కష్టాలు తప్పవు. ఆర్చర్ తుది జట్టులో చేరితే ఏ పేసర్పై వేటు వేస్తారో చూడాలి. తొలి టెస్ట్లో పేసర్లు బ్రైడన్ కార్స్ (4 వికెట్లు), జోష్ టంగ్ (7), స్టోక్స్ (5)అద్బుతంగా రాణించారు. వీరు ముగ్గురే 16 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్లో సీనియర్ పేసర్ క్రిస్ వోక్స్ నిరాశపరిచాడు. అతను రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. దీంతో రెండో టెస్ట్లో వోక్స్ను పక్కన పెట్టి ఆర్చర్కు అవకాశం ఇవ్వొచ్చు. ఆర్చర్ తాజాగా ముగిసిన ఐపీఎల్లో, అంతకుముందు జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పర్వాలేదనిపించాడు. ఈ అర్హతలతో అతను రెండో టెస్ట్ తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఆర్చర్ ఇంగ్లండ్ తరఫున 13 టెస్ట్ల్లో 3 ఐదు వికెట్ల ప్రదర్శనల సాయంతో 42 వికెట్లు తీశాడు. కాగా, టీమిండియా ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్లో భారత్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఆ మ్యాచ్లో భారత్ తరఫున ఐదు సెంచరీలు నమోదైన ఓటమి తప్పలేదు. తొలి ఇన్నింగ్స్లో 471, రెండో ఇన్నింగ్స్లో 364 పరుగులు చేసినా.. భారత బౌలర్లు 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయారు.ఛేదనలో బుమ్రా సహా భారత బౌలర్లంతా తేలిపోయారు. మ్యాచ్ మొత్తంలో భారత ఫీల్డర్లు ఏకంగా ఏడు క్యాచ్లు నేలపాలు చేసింది. జైస్వాల్ ఒక్కడే నాలుగు క్యాచ్లు జారవిడిచాడు. భారీ లక్ష్య ఛేదనలో బెన్ డకెట్ అద్భుతమైన సెంచరీ చేసి ఇంగ్లండ్ను గెలిపించాడు. రెండో టెస్టుకు ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, ఓల్లీ పోప్, జో రూట్, జామీ స్మిత్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్ -
టీమిండియా చెత్త రికార్డు.. జింబాబ్వే సరసన చోటు
ఇంగ్లండ్ చేతిలో తొలి టెస్ట్లో (హెడింగ్లే) ఓడిన టీమిండియా పలు చెత్త రికార్డులను మూటగట్టుకుంది. ఇందులో ప్రధానమైనవి రెండున్నాయి. మొదటిది.. ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు ఐదు సెంచరీలు చేసినా టీమిండియా ఓటమిపాలవ్వడం. రెండోది.. టీమిండియా హ్యాట్రిక్ పరాజయాలు (టెస్ట్ల్లో) సహా చివరి 9 మ్యాచ్ల్లో ఒకే ఒక మ్యాచ్ గెలవడం. టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియాకు ముందు జింబాబ్వే మాత్రమే ఈ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఐర్లాండ్ లాంటి చిన్న జట్లు కూడా వారాడిన చివరి 9 మ్యాచ్ల్లో కనీసం రెండైనా గెలిచాయి. సౌతాఫ్రికా అయితే టెంబా బవుమా సారథ్యంలో చివరి 9 మ్యాచ్ల్లో ఏకంగా ఎనిమిదింట గెలిచింది.మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. జింబాబ్వే చివరి 9 మ్యాచ్ల్లో ఒకటే గెలిచినా, రెండు మ్యాచ్లు డ్రా అయినా చేసుకుంది. ఆరింట మాత్రమే ఓడింది. టీమిండియా అయితే ఒకటి గెలిచి, మరో మ్యాచ్ మాత్రమే డ్రా చేసుకొని, ఏకంగా ఏడింట ఓటమిపాలైంది. ఈ లెక్కన భారత్ను జింబాబ్వే సరసన అనడానికి కూడా వీళ్లేదు.డ్రా అయినా చేసుకోవాల్సింది..!తాజాగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్ను భారత్ కనీసం డ్రా అయినా చేసుకొని ఉండాల్సింది. ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాల్సిన పరిస్థితి నుంచి ఓటమిని కొని తెచ్చుకుంది. ఆటగాళ్ల స్వయంకృతాపరాధాలే భారత్ ఓటమికి కారణం. బౌలర్ల వైఫల్యం, ఫీల్డర్లు క్యాచ్లు జారవిడచడం టీమిండియా కొంపముంచాయి.ఈ మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. తొలి ఇన్నింగ్స్లో 471, రెండో ఇన్నింగ్స్లో 364 పరుగులు చేసినా టీమిండియాకు పరాభవం తప్పలేదు. భారత బౌలర్లు 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయారు.ఛేదనలో బుమ్రా సహా భారత బౌలర్లంతా తేలిపోయారు. మ్యాచ్ మొత్తంలో భారత ఫీల్డర్లు ఏకంగా ఏడు క్యాచ్లు నేలపాలు చేసింది. జైస్వాల్ ఒక్కడే నాలుగు క్యాచ్లు జారవిడిచాడు. భారీ లక్ష్య ఛేదనలో బెన్ డకెట్ అద్భుతమైన సెంచరీ చేసి ఇంగ్లండ్ను గెలిపించాడు. రెండో టెస్ట్ జులై 2 నుంచి బర్మింగ్హమ్ వేదికగా జరుగనుంది.టీమిండియా చివరిగా ఆడిన 9 టెస్ట్ల వివరాలు..ఇంగ్లండ్తో- ఓటమి (టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ 2025)ఆస్ట్రేలియాతో-ఓటమి (బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25)ఆస్ట్రేలియాతో-ఓటమి (బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25)ఆస్ట్రేలియాతో-డ్రా (బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25)ఆస్ట్రేలియాతో-ఓటమి (బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25)ఆస్ట్రేలియాతో-విజయం (బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25)న్యూజిలాండ్తో-ఓటమి (స్వదేశంలో 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ 2024)న్యూజిలాండ్తో-ఓటమి (స్వదేశంలో 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ 2024)న్యూజిలాండ్తో-ఓటమి (స్వదేశంలో 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ 2024) -
వరుస సెంచరీలతో చెలరేగిపోతున్న శ్రీలంక బ్యాటింగ్ సంచలనం
శ్రీలంక బ్యాటింగ్ సంచలనం, ఆ జట్టు ఓపెనర్ పథుమ్ నిస్సంక వరుస సెంచరీలతో చెలరేగిపోతున్నాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో తొలి మ్యాచ్లో భారీ శతకంతో (187) విరుచుకుపడిన అతను.. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్లోనూ అద్భుత శతకంతో మెరిశాడు. కొలొంబో వేదికగా జరుగుతున్న మ్యాచ్లో నిస్సంక 167 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. ప్రస్తుతం అతను 102 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా దినేశ్ చండీమల్ (59) క్రీజ్లో ఉన్నాడు. రెండో రోజు మూడో సెషన్ సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 204 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్లో లహీరు ఉడారా 40 పరుగులు చేసి తైజుల్ ఇస్లాం బౌలింగ్లో ఔటయ్యాడు. అంతకుముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 247 పరుగులకు ఆలౌటైంది.తొలి రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసిన బంగ్లాదేశ్ ఇవాళ మరో 27 పరుగులు మాత్రమే జోడించి మిగతా 2 వికెట్లు కోల్పోయింది. బంగ్లా ఇన్నింగ్స్లో ఓపెనర్ షద్మాన్ ఇస్లాం (46) టాప్ స్కోరర్ కాగా.. మొమినుల్ హక్ (21), ముష్ఫికర్ రహీం (35), లిటన్ దాస్ (34), మెహిది హసన్ మిరాజ్ (31), నయీమ్ హసన్ (25), తైజుల్ ఇస్లాం (33) రెండంకెల స్కోర్లు చేశారు. అనాముల్ హక్ 0, కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో 8, ఎబాదత్ హొసేన్ 8 పరుగులకు ఔటయ్యారు.బంగ్లా ఇన్నింగ్స్ను అశిత ఫెర్నాండో (18-2-51-3), విశ్వ ఫెర్నాండో (19-4-45-2), సోనల్ దినుష (9.3-3-22-3), ధనంజయ డిసిల్వ (5-0-15-1), తిరండు రత్నాయకే (17-1-72-1) దెబ్బకొట్టారు.కాగా, రెండు టెస్ట్లు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ల కోసం బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా గాలే వేదికగా జరిగిన తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. ఆ మ్యాచ్లో ఇరు జట్లు ఆటగాళ్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇరు జట్ల తరఫున నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో రెండు ఇన్నింగ్స్ల్లో (148, 125 నాటౌట్) సెంచరీలు చేయగా.. ముష్ఫికర్ రహీం (163),పథుమ్ నిస్సంక (187) తమతమ తొలి ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేశారు. -
నేనే గనుక గంభీర్ అయితే.. అతడిని పక్కకు తీసుకువెళ్లి..: అశ్విన్
ఇంగ్లండ్తో రెండో టెస్టు (Ind vs Eng)కు ముందు భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ టీమిండియాకు కీలక సూచనలు చేశాడు. భారత బ్యాటర్లు వీలైనంత ఎక్కువ సేపు క్రీజులో ఉండాలన్న ఈ స్పిన్ దిగ్గజం.. పరుగులు సాధించడం కంటే కూడా ఈ విషయం మీదే ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించాడు. ఏదేమైనా.. ఐదో రోజు వరకు ఆటను పొడిగించాలని.. ప్రత్యర్థిని ఫీల్డింగ్లో అలసిపోయేలా చేయాలని పేర్కొన్నాడు.అతడిని తీసుకోండిఇక తుదిజట్టులో పెద్దగా మార్పులు అక్కర్లేదన్న అశ్.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav)ను ఆడిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ఓటమికి భయపడాల్సిన పనిలేదు. వెనువెంటనే జట్టులో మార్పులూ చేయకూడదు.రెండో టెస్టులో గెలిచి సిరీస్ సమం చేయగల సత్తా టీమిండియాకు ఉంది. అయితే, ఇంగ్లండ్ వ్యూహాలను మనం సరిగ్గా అర్థం చేసుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. లేదంటే సిరీస్ మన చేజారిపోవడానికి ఎక్కువ సమయం అక్కర్లేదు.ఒత్తిడి పెంచాలిఐదో రోజు వరకు కూడా బ్యాటింగ్ చేయాలి. లేదంటే కథ ముగిసిపోతుంది. ఐదో రోజు ఎంత పెద్ద టార్గెట్ అయినా తాము ఛేదిస్తామని ఇంగ్లండ్ బహిరంగంగానే చెప్పింది. ఈ విషయాన్ని మన బ్యాటింగ్ లైనప్ గుర్తు పెట్టుకోవాలి. ప్రత్యర్థికి తక్కువ సమయంలోనే.. ఎక్కువ లక్ష్యాన్ని ఛేదించేలా ఒత్తిడి పెంచాలి.కనీసం 400- 450 పరుగుల మేర లక్ష్యాన్ని నిర్దేశిస్తేనే ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఇంగ్లండ్లో టెస్టు మ్యాచ్ గెలవగలం. వికెట్ను బట్టి ఎప్పటికప్పుడు ఆటను మార్చుకుంటూ ఉండాలి’’ అశ్విన్ భారత జట్టుకు సూచించాడు.అద్భుతమైన ఆటగాడు అతడుఇక రిషభ్ పంత్ తొలి టెస్టులో రెండు శతకాలు బాదడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘విరాట్ కోహ్లితో పోల్చగల ఆటగాడు. ఒకవేళ నేనే గనుక హెడ్కోచ్ గౌతం గంభీర్ అయి ఉంటే.. అతడిని పక్కకు తీసుకువెళ్లి.. ‘నువ్వు అద్భుతంగా, అసాధారణ రీతిలో బ్యాటింగ్ చేశావు. ఈసారి సెంచరీని డబుల్ సెంచరీగా మార్చు.130 పరుగులు చేసినపుడు కూడా నువ్వొక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. మన లోయర్ ఆర్డర్ అంతగా బ్యాటింగ్ చేయలేదు కాబట్టి.. నువ్వు వీలైనంత ఎక్కువ సేపు క్రీజులో ఉండాలి’ అని చెప్పేవాడిని. వాహ్.. ఎంతటి అద్భుతమైన ఆటగాడు అతడు’’ అంటూ అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. అదే విధంగా.. శతకం బాదిన తర్వాత ఫ్లిప్ కొట్టి సెలబ్రేట్ చేసుకోవద్దని అశూ ఈ సందర్భంగా పంత్కు సూచించాడు. ఐపీఎల్ ఆడేటపుడు శరీరం ఎక్కువగా అలసిపోదని.. అప్పుడు జంప్ కొట్టినా పర్లేదన్న అశూ.. టెస్టు క్రికెట్ అందుకు భిన్నమని సున్నితంగా హెచ్చరించాడు. కాగా ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా లీడ్స్లో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇరుజట్ల మధ్య బర్మింగ్హామ్లో జూలై 2-6 రెండో టెస్టు జరుగుతుంది. చదవండి: రింకూ సింగ్కు ప్రభుత్వ ఉద్యోగం.. పోస్ట్ ఏమిటంటే?! -
నిప్పులు చెరిగిన విండీస్ పేసర్లు.. స్వల్ప స్కోర్కే కుప్పకూలిన ఆస్ట్రేలియా
3 టెస్ట్లు, 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు వెస్టిండీస్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా నిన్న (జూన్ 25) తొలి టెస్ట్ మొదలైంది. బార్బడోస్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో తొలి రోజు పేసర్ల హవా కొనసాగింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను విండీస్ పేసర్లు జేడన్ సీల్స్ (15.5-1-60-5), షమార్ జోసఫ్ (16-3-46-4) వణికించారు. ఈ ఇద్దరి ధాటికి ఆస్ట్రేలియా 180 పరుగులకే కుప్పకూలింది. గడిచిన 30 ఏళ్లలో వెస్టిండీస్పై తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాకు ఇదే అత్యల్ప స్కోర్. సీల్స్, షమార్తో పాటు జస్టిన్ గ్రీవ్స్ కూడా ఓ వికెట్ తీయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ పరిసమాప్తమైంది. ఆసీస్ ఇన్నింగ్స్లో ట్రవిస్ హెడ్ (59) టాప్ స్కోరర్గా నిలువగా.. ఉస్మాన్ ఖ్వాజా 47 పరుగులతో పర్వాలేదనిపించాడు. వీరిద్దరు కాక కెప్టెన్ కమిన్స్ (28), వెబ్స్టర్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. సామ్ కొన్స్టాస్ 3, కెమారూన్ గ్రీన్ 3, జోస్ ఇంగ్లిస్ 5, అలెక్స్ క్యారీ 8, మిచెల్ స్టార్క్ 0, హాజిల్వుడ్ 4 పరుగులకు ఔటయ్యారు. నాథన్ లియోన్ 9 పరుగులతో అజేయంగా నిలిచాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ కూడా ఆసీస్ తరహాలోనే త్వరితగతిన వికెట్లు కోల్పోయింది. ఆసీస్ పేసర్లు స్టార్క్ (7-1-35-2), హాజిల్వుడ్ (7-1-13-1), కమిన్స్ (6-2-8-1) ధాటికి తొలి రోజు ఆట ముగిసే సమయానికి 57 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు విండీస్ ఇంకా 123 పరుగులు వెనుకపడి ఉంది. విండీస్ ఇన్నింగ్స్లో క్రెయిగ్ బ్రాత్వైట్ 4, జాన్ క్యాంప్బెల్ 7, కీసీ కార్టీ 20, జోమెల్ వార్రికన్ 0 పరుగులకు ఔట్ కాగా.. బ్రాండన్ కింగ్ (23), రోస్టన్ ఛేజ్ (1) క్రీజ్లో ఉన్నారు. బ్రాత్వైట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగిన తర్వాత రోస్టన్ ఛేజ్ విండీస్ టెస్ట్ జట్టు సారధిగా బాధ్యతలు చేపట్టాడు. కెప్టెన్గా ఇదే అతనికి తొలి మ్యాచ్.దిగ్గజాలు సరసన సీల్స్ఈ మ్యాచ్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన విండీస్ రైట్ ఆర్మ్ సీమర్ జేడన్ సీల్స్ దిగ్గజాల సరసన చేరాడు. బార్బడోస్ మైదానంలో (కెన్నింగ్స్టన్ ఓవల్) ఆస్ట్రేలియాపై ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన నాలుగో విండీస్ బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. సీల్స్కు ముందు కోట్నీ వాల్ష్ (5-39), మాల్కమ్ మార్షల్ (5-42), డెనిస్ అట్కిన్సన్ (5-56) మాత్రమే బార్బడోస్లో ఆసీస్పై ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు. మైఖేల్ హోల్డింగ్ లాంటి దిగ్గజానికి కూడా ఈ ఘనత సాధ్యం కాలేదు. -
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సౌతాఫ్రికాకు కొత్త కెప్టెన్
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ సౌతాఫ్రికాకు కొత్త కెప్టెన్ వచ్చాడు. టీ20 ఫార్మాట్లో ఆ జట్టుకు రస్సీ వాన్ డెర్ డస్సెన్ సారధిగా నియమితుడయ్యాడు. జులైలో జింబాబ్వేలో జరుగనున్న పొట్టి ఫార్మాట్ సిరీస్ కోసం క్రికెట్ సౌతాఫ్రికా డస్సెన్ను కెప్టెన్గా ఎంపిక చేసింది. ఈ ట్రై సిరీస్లో జింబాబ్వే, సౌతాఫ్రికాతో పాటు న్యూజిలాండ్ పాల్గొననుంది. రెగ్యులర్ టీ20 కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ సహా సీనియర్లకు విశ్రాంతినివ్వడంతో డస్సెన్కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పారు. ఈ ట్రై సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో చాలా కొత్త ముఖాలు ఉన్నాయి.ఈ ఏడాది సౌతాఫ్రికా టీ20 లీగ్లో టాప్ స్కోరర్గా నిలిచిన విధ్వంసకర ఓపెనర్ లూహాన్ డ్రి ప్రిటోరియస్ తొలిసారి జాతీయ టీ20 జట్టు నుంచి పిలుపునందుకున్నాడు. ఇదివరకే వన్డే, టెస్ట్ల్లో అరంగేట్రం చేసిన కార్బిన్ బాష్ కూడా తొలిసారి టీ20 బెర్త్ దక్కించుకున్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్లో సత్తా చాటిన రూబిన్ హెర్మన్.. ఇదివరకే మిగతా రెండు ఫార్మాట్లలో జాతీయ జట్టుకు ఆడిన సెనురన్ ముత్తుస్వామి మిగతా అన్క్యాప్డ్ ప్లేయర్లుగా ఎంపికయ్యారు.గాయాల కారణంగా గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్న పేసర్లు నండ్రే బర్గర్, గెరాల్డ్ కొయెట్జీ ఈ ట్రై సిరీస్తో రీఎంట్రీ ఇవ్వనున్నారు. గత రెండేళ్లుగా జట్టుకు దూరంగా ఉన్న బ్యాటింగ్ సంచనలం డెవాల్డ్ బ్రెవిస్ కూడా ఈ సిరీస్ కోసం పిలుపునందుకున్నాడు. షుక్రీ కన్రాడ్ సౌతాఫ్రికా ఆల్ ఫార్మాట్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇదే అతనికి తొలి టీ20 అసైన్మెంట్. జింబాబ్వేలోని హరారే వేదికగా జరిగే ఈ ట్రై సిరీస్ జులై 14 నుంచి ప్రారంభమవుతుంది. జులై 26న జరిగే ఫైనల్తో ఈ టోర్నీ ముగుస్తుంది. కాగా, టెంబా బవుమా నేతృత్వంలోని సౌతాఫ్రికా ఇటీవలే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే. లార్డ్స్లో జరిగిన ఫైనల్లో ఈ జట్టు ఆస్ట్రేలియాను చిత్తు చేసి చాలాకాలం తర్వాత ఐసీసీ టోర్నీ గెలిచింది.జింబాబ్వేలో జరిగే ట్రై సిరీస్ కోసం సౌతాఫ్రికా జట్టు..రస్సీ వాన్ డెర్ డస్సెన్ (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, నండ్రే బర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, రీజా హెండ్రిక్స్, రూబిన్ హెర్మన్, జార్జ్ లిండే, క్వేనా మఫాకా, సెనురన్ ముత్తుస్వామి, లుంగి ఎంగిడి, న్కాబా పీటర్, లుహాన్-డ్రి ప్రిటోరియస్, ఆండైల్ సైమ్లేన్జింబాబ్వే ట్రై సిరీస్ షెడ్యూల్..జులై 14- జింబాబ్వే వర్సెస్ సౌతాఫ్రికాజులై 16- సౌతాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్జులై 18- జింబాబ్వే వర్సెస్ న్యూజిలాండ్జులై 20- జింబాబ్వే వర్సెస్ సౌతాఫ్రికాజులై 22- న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికాజులై 24- జింబాబ్వే వర్సెస్ న్యూజిలాండ్జులై 26- ఫైనల్అన్ని మ్యాచ్లు హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతాయి. భారతకాలమానం ప్రకారం మ్యాచ్లన్నీ సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమవుతాయి. -
ప్రపంచంలో అత్యంత ధనిక క్రికెట్ లీగ్లు ఇవే.. ఐపీఎల్ తర్వాత అదే!
క్రికెట్లో ప్రస్తుతం టీ20 ఫార్మాట్ హవా నడుస్తోంది. పొట్టి క్రికెట్ను చూసేందుకు నవతరం యువత ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో టీ20 లీగ్లు పుట్టుకొచ్చాయి. వీటి ద్వారా ఆటగాళ్లు రెండు చేతులా సంపాదించుకుండగా.. ఆయా బోర్డులపై కూడా కనక వర్షం కురుస్తోంది.స్పాన్సర్షిప్లు. టీవీ ప్రసార హక్కులు, టికెట్ల విక్రయం తదితర మార్గాల ద్వారా బోర్డులు ఆదాయం సమకూర్చుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ లీగ్లే ప్రపంచ క్రికెట్ మార్కెట్ను ఏలుతున్నాయి. మరి 2025 నాటికి పేరెన్నికగన్న ధనిక పొట్టి లీగ్లలో టాప్-10లో ఉన్న లీగ్లు ఏవో తెలుసా?!ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)సందేహమే అక్కర్లేదు.. అవును.. ప్రపంచ టీ20 మార్కెట్లో ఐపీఎల్దే అగ్రస్థానం. 2008లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) దీనిని మొదలుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా మేటి జట్ల ఆటగాళ్లంతా ఈ లీగ్లో భాగమవుతూ.. కోట్లాది రూపాయాలు ఆర్జిస్తున్నారు.ఎంతో మంది యువ క్రికెటర్లు కూడా వెలుగులోకి వచ్చి జాతీయ జట్లకు ప్రాతినిథ్యం వహించే అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇక అత్యంత ఆదరణ పొందిన లీగ్గా పేరున్న ఐపీఎల్ కేవలం బ్రాడ్కాస్ట్ డీల్స్ ద్వారానే 6.2 బిలియన్ డాలర్లు సంపాదించినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. ప్రస్తుతం ఐపీఎల్ విలువ- 11 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపుగా 94, 220.5 కోట్ల రూపాయలు) వరకు ఉంటుందని అంచనా.రెండో స్థానంలో ఐఎల్టీ20 (ILt20)నెట్వర్త్పరంగా ఐపీఎల్ తర్వాతి స్థానం యూఏఈ వేదికగా సాగే ఇంటర్నేషనల్ లీగ్టీ20ది. మధ్య ప్రాచ్చ దేశాల పెట్టుబడి, ఐపీఎల్ ఫ్రాంఛైజీల ఆధ్వర్యంలో నడుస్తున్న ఐఎల్టీ20 విలువ 15 మిలియన్ డాలర్లు (సుమారుగా రూ. 128.64 కోట్లు) అని తెలుస్తోంది. పన్ను లేని కాంట్రాక్టులు మేటి క్రికెటర్లను కూడా ఐఎల్టీ20 వైపు ఆకర్షిస్తున్నాయి.సౌతాఫ్రికా టీ20 లీగ్ (SAT20)2023లో మొదలైన సౌతాఫ్రికా టీ20 లీగ్లో జట్లన్నీ ఐపీఎల్ ఫ్రాంఛైజీలవే. హైదరాబాద్ (సన్రైజర్స్ ఈస్టర్న్కేప్), లక్నో (డర్బన్ సూపర్ జెయింట్స్), రాజస్తాన్ (పర్ల్ రాయల్స్), ఢిల్లీ (ప్రిటోరియా క్యాపిటల్స్), చెన్నై (జొబర్గ్ సూపర్ కింగ్స్), ముంబై (ఎంఐ కేప్టౌన్)ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ఇందులో పెట్టుబడులు పెట్టాయి. ఈ లీగ్ విలువ 12 మిలియన్ డాలర్లు (దాదాపుగా రూ. 102.79 కోట్లు) అని అంచనా.బిగ్బాష్ లీగ్ (BBL)ఆస్ట్రేలియాకు చెందిన ఈ టీ20 లీగ్ నికర విలువ పది మిలియన్ల డాలర్ల (దాదాపు రూ. 85. 65 కోట్లు)వరకు ఉంటుందని తెలుస్తోంది.ది హండ్రెడ్ఇంగ్లండ్ వేదికగా సాగే 100 బాల్ టోర్నీ ‘ది హండ్రెడ్ లీగ్’ వాల్యూ తొమ్మిది మిలియన్ డాలర్లు (సుమారు రూ. 77.08 కోట్లు) అని అంచనా.మేజర్ లీగ్ క్రికెట్ (MLC)అమెరికాకు చెందిన ఈ పొట్టి లీగ్ విలువ 6.9 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 59.09 కోట్లు) అని సమాచారం.పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)పాకిస్తాన్ సూపర్ లీగ్ నెట్వర్త్ 5.7 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు 48.82 కోట్లు) అని అంచనా.బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL)బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ వాల్యూ 4.8 మిలియన్ డాలర్లు (సుమారు 41.11 కోట్ల రూపాయలు) అని తెలుస్తోంది.కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL)ఈ వెస్టిండీస్ టీ20 లీగ్లోనూ ఐపీఎల్ ఫ్రాంఛైజీల పెట్టుబడులు ఉన్నాయి. దీని నెట్వర్త్ 4.6 మిలియన్ డాలర్లు (సుమారు 39.40 కోట్లు) అని అంచనా.లంక ప్రీమియర్ లీగ్ (LPL)శ్రీలంకకు చెందిన ఈ పొటి ఫార్మాట్ లీగ్ వాల్యూ 3.98 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 34.09 కోట్లు) అని తెలుస్తోంది.చదవండి: రింకూ సింగ్కు ప్రభుత్వ ఉద్యోగం.. పోస్ట్ ఏమిటంటే?! -
టీమిండియాకు శుభవార్త.. అతడు వచ్చేస్తున్నాడు!
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)కు సర్జరీ విజయవంతంగా పూర్తైంది. చాన్నాళ్లుగా ‘స్పోర్ట్స్ హెర్నియా’ (sports hernia)తో బాధ పడుతున్న ఈ పవర్ హిట్టర్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఈ విషయాన్ని సూర్యకుమార్ యాదవ్ స్వయంగా వెల్లడించాడు.కోలుకుంటున్నా‘‘స్పోర్ట్స్హెర్నియాకు సంబంధించి కుడివైపున పొట్ట దిగువ భాగంలో చేసిన సర్జరీ పూర్తైంది. శస్త్ర చికిత్స ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగిపోయినందుకు సంతోషంగా ఉంది. కోలుకునే దశలో ఉన్నాను.బ్యాట్ పట్టి మళ్లీ మైదానంలో దిగేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా’’ అని సూర్యకుమార్ యాదవ్ తన ఆరోగ్యం, పునరాగమనానికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా అప్డేట్ అందించాడు. ఆస్పత్రి బెడ్పై పడుకుని.. థంబ్స్ అప్ సింబల్ చూపిస్తున్న ఫొటో ఇందుకు జతచేశాడు.సరికొత్త రికార్డుకాగా ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ తరఫున సూర్యకుమార్ అదరగొట్టాడు. ఈ సీజన్లో మొత్తంగా 717 పరుగులతో దుమ్ములేపాడు. తద్వారా ఒక ఎడిషన్లో అత్యధిక పరుగులు రాబట్టిన ముంబై ఇండియన్స్ నాన్- ఓపెనర్గా ఈ మిడిలార్డర్ బ్యాటర్ నిలిచాడు.అంతేకాదు.. ఆడిన పదహారు మ్యాచ్లలో వరుసగా 25 కంటే ఎక్కువ స్కోరు చేసి సూర్య సరికొత్త రికార్డు సాధించాడు. ఐపీఎల్ ముగిసిన తర్వాత ముంబై టీ20 లీగ్లో సైతం పాల్గొన్నాడు. అయితే ముంబై లీగ్లో మ్యాచ్లు ఆడుతున్న సమయంలో నొప్పి ఎక్కువవడంతో... ‘స్పోర్ట్స్ హెర్నియా’కు చికిత్స తీసుకోవాలని 33 ఏళ్ల సూర్య భావించాడు.‘సూర్య చాన్నాళ్లుగా నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. దీనికి సంబంధించిన వైద్యులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఒకవేళ అవసరమైతే శస్త్రచికిత్స చేయించుకుంటాడు’ అని బీసీసీఐ వర్గాలు గతంలో వెల్లడించాయి. ఇక ఈ ఏడాది ఆగస్టు వరకు భారత జట్టుకు అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు లేవు.బంగ్లాదేశ్ పర్యటనఈ నేపథ్యంలో చికిత్సకు ఇదే సరైన సమయమని భావించిన సూర్య కోలుకునేందుకు తగినంత సమయం ఉండటంతో వైద్యులను సంప్రదించాడు. జర్మనీలోని మ్యూనిచ్లో సర్జరీ చేయించుకున్నాడు. కాగా ప్రస్తుతం ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ ఆడుతున్న టీమిండియా.. ఈ ఏడాది ఆగష్టులో టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది.ఇందులో భాగంగా ఆతిథ్య జటుట్తో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు ఆడనుంది. అయితే, స్పోర్ట్స్ హెర్నియా కారణంగా సూర్య జట్టుకు దూరమవుతాడని.. అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్ టీ20 కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తిస్తాడనే వార్తలు వచ్చాయి.సూర్య వచ్చేస్తాడు!అయితే, తాను కోలుకుంటున్నానని.. త్వరలోనే మైదానంలో అడుగుపెడతానంటూ సూర్య తాజాగా చెప్పడంతో టీమిండియా అభిమానులు ఖుషీ అవుతున్నారు. కాగా టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్గా నిలిచిన తర్వాత.. రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్గా సూర్య బాధ్యతలు చేపట్టాడు. సూర్య సారథ్యంలో టీమిండియా టీ20 క్రికెట్ అద్భుత విజయాలు సాధించింది. శ్రీలంకలో 3-0తో క్లీన్స్వీప్ చేయడంతో పాటు బంగ్లాదేశ్, సౌతాఫ్రికా తదితర జట్లపై గెలిచింది.చదవండి: Rohit Sharma On T20 WC: భయంతో వణికిపోయా.. అతడే గేమ్ ఛేంజర్ View this post on Instagram A post shared by Surya Kumar Yadav (SKY) (@surya_14kumar) -
డేవిడ్ వార్నర్ వరల్డ్ రికార్డు!.. కానీ అతడి జట్టుకు ఓటమి తప్పలేదు!
అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికినా ఫ్రాంఛైజీ క్రికెట్తో అలరిస్తున్నాడు ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్ (David Warner). ప్రస్తుతం మేజర్ లీగ్ క్రికెట్ (MLC) టోర్నమెంట్తో బిజీగా ఉన్న వార్నర్ భాయ్.. తాజాగా సరికొత్త చరిత్ర సృష్టించాడు.అటు అంతర్జాతీయ క్రికెట్లో.. ఇటు పొట్టి ఫార్మాట్ లీగ్లలో 200 క్యాచ్లు అందుకున్న తొలి క్రికెటర్గా ప్రపంచ రికార్డు సాధించాడు. ఎంఎల్సీలో వార్నర్ సీటెల్ ఒర్కాస్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక గురువారం నాటి మ్యాచ్లో సీటెల్.. డల్లాస్ వేదికగా శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్తో తలపడింది.శాన్ ఫ్రాన్సిస్కో మెరుగైన స్కోరుఇందులో టాస్ గెలిచిన సీటెల్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుని శాన్ ఫ్రాన్సిస్కో టీమ్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనర్, కెప్టెన్ మాథ్యూ షార్ట్ (29 బంతుల్లో 52)తో పాటు.. జేక్ ఫ్రేజర్ మెగర్క్ (21 బంతుల్లో 34), రొమారియో షెఫర్డ్ (31 బంతుల్లో 56) రాణించగా.. శాన్ ఫ్రాన్సిస్కో మెరుగైన స్కోరు సాధించింది.నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సీటెల్ బౌలర్లలో గెరాల్డ్ కోయెట్జి, హర్మీత్ సింగ్ చెరో మూడు వికెట్లు తీయగా.. గెనాన్, ఒబెడ్ మెకాయ్ తలా ఓ వికెట్ దక్కించుకున్నాడు. టీ20లలో 200 క్యాచ్లుఇక వార్నర్ కోయెట్జి బౌలింగ్లో ఫిన్ అలెన్ (4) ఇచ్చిన క్యాచ్తో పాటు.. హర్మీత్ బౌలింగ్లో మెగర్క్ ఇచ్చిన క్యాచ్ను అందుకున్నాడు. తద్వారా టీ20లలో 200 క్యాచ్లు పూర్తి చేసుకున్నాడు.కాగా అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక క్యాచ్లు అందుకున్న క్రికెటర్గా శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్ధనే కొనసాగుతున్నాడు. 652 మ్యాచ్లలో కలిపి అతడు 449 క్యాచ్లు అందుకున్నాడు. మరోవైపు.. టీ20 ఫార్మాట్లో అత్యధిక క్యాచ్ల వీరుడిగా వెస్టిండీస్ స్టార్ కీరన్ పొలార్డ్ ఉన్నాడు. అతడు 386 క్యాచ్లు అందుకున్నాడు.అయితే, వార్నర్ అంతర్జాతీయ క్రికెట్లో 383 మ్యాచ్లలో 223 క్యాచ్లు అందుకోవడంతో పాటు.. టీ2- ఫార్మాట్లో 200 క్యాచ్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్లో.. అదే విధంగా పొట్టి ఫార్మాట్లో 200 క్యాచ్లు పూర్తి చేసుకున్న ఆటగాడిగా చరిత్రకెక్కాడు.సీటెల్కు తప్పని ఓటమిఇక మ్యాచ్ విషయానికొస్తే.. శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ విధించిన 177 పరుగుల లక్ష్యాన్ని సీటెల్ ఒర్కాస్ ఛేదించలేకపోయింది. 18.2 ఓవర్లలో కేవలం 144 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. సీటెల్ బ్యాటర్లలో ఓపెనర్లు షయాన్ జహంగీర్ (40), డేవిడ్ వార్నర్ (23).. నాలుగో నంబర్ బ్యాటర్ షిమ్రన్ హెట్మెయిర్ (30) మాత్రమే రాణించారు. శాన్ ఫ్రాన్సిస్కో బౌలర్లలో హ్యారిస్ రవూఫ్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. మాథ్యూ షార్ట్ మూడు, షెఫర్డ్ రెండు, జేవియర్ బ్రాట్లెట్ ఒక వికెట్ దక్కించుకున్నారు. చదవండి: తప్పుడు వ్యక్తులతో స్నేహం.. అప్పుడు అతడు తప్ప ఎవరూ మాట్లాడలేదు: పృథ్వీ షా -
రింకూ సింగ్కు ప్రభుత్వ ఉద్యోగం.. పోస్ట్ ఏమిటంటే?!
టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్ (Rinku Singh) కొత్త ప్రయాణం ఆరంభించబోతున్నాడు. ఉత్తరప్రదేశ్ విద్యా శాఖ విభాగంలో అతడు ఉద్యోగం చేరనున్నాడు. అలీగఢ్కు చెందిన రింకూ సింగ్ పేద కుటుంబంలో జన్మించాడు.పేద కుటుంబంతన తండ్రి ఇంటింటికి గ్యాస్ సిలిండర్లు వేస్తూ కుటుంబాన్ని పోషించగా.. ఆయన బాధ్యతల్లో భాగం పంచుకునేందుకు రింకూ చిరు ఉద్యోగాలు చేశాడు. ఒకానొక సమయంలో స్వీపర్గానూ పనిచేసేందుకు వెనకాడలేదని వార్తలు వచ్చాయి. అయితే, కష్టాల సుడిగుండంలో చిక్కుకుపోయినా.. క్రికెటర్గా ఎదగాలన్న రింకూ తన కలను సాకారం చేసుకునేందుకు అహర్నిషలు శ్రమించాడు.పట్టుదలతో టీమిండియా స్టార్గాదేశవాళీ క్రికెట్లో యూపీ తరఫున సత్తా చాటిన రింకూ సింగ్ దశ.. ఐపీఎల్తో మారిపోయింది. కోల్కతా నైట్ రైడర్స్ అతడిని కొనుగోలు చేసి.. ఆరంభంలో పక్కకుపెట్టినా.. ఆ తర్వాత వరుస అవకాశాలు ఇచ్చింది. ఈ క్రమంలో 2018లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. అద్భుత ఆట తీరుతో అలరించాడు.ఈ నేపథ్యంలో టీమిండియా సెలక్టర్లు రింకూపై నమ్మకం ఉంచి 2023లో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టులో చోటిచ్చారు. అలా రింకూ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అదే ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. రింకూ ఇప్పటికి భారత్ తరఫున 33 టీ20 మ్యాచ్లు ఆడి 546 పరుగులు, రెండు వన్డేల్లో కలిపి 55 పరుగులు సాధించాడు.రూ. 13 కోట్లకు రిటైన్ఇక ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు కోల్కతా ఫ్రాంఛైజీ రింకూను తమ మొదటి ప్రాధాన్య ఆటగాడిగా.. ఏకంగా రూ. 13 కోట్లకు రిటైన్ చేసుకుంది. క్యాష్ రిచ్ లీగ్లో ఇప్పటికి 58 మ్యాచ్లు పూర్తి చేసుకున్న రింకూ 1099 పరుగులు చేశాడు.స్కూల్డ్రాపౌట్? ఇలా క్రికెట్ రంగంలో సేవలు అందిస్తూ.. రాష్ట్రానికి పేరు తీసుకువస్తున్న రింకూను ఉద్యోగంతో సత్కరించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ మెడల్ విన్నర్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్-2022 పథకం ప్రకారం అతడిని జిల్లా ప్రాథమిక విద్యా అధికారి (BSA) నియమించేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. స్థానిక మీడియా ఇందుకు సంబంధించిన కథనాలు ఇచ్చింది. కాగా ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. రింకూ తొమ్మిదో తరగతిలో చేరకముందే డ్రాపౌట్ అయినట్లు తెలుస్తోంది.ఎంపీతో నిశ్చితార్థంఇక వ్యక్తిగత జీవితంలోనూ రింకూ సింగ్ కొత్త ప్రయాణానికి సిద్ధమయ్యాడు. లోక్సభ ఎంపీ ప్రియా సరోజ్తో మూడేళ్ల ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకువచ్చాడు. ఈ ఏడాది జూన్ 8న ప్రియసఖి వేలికి ఉంగరం తొడిగి నిశ్చితార్థం చేసుకున్న రింకూ.. ఈ ఏడాది నవంబరులో లేదంటే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు.చదవండి: తప్పుడు వ్యక్తులతో స్నేహం.. అప్పుడు అతడు తప్పు ఎవరూ మాట్లాడలేదు: పృథ్వీ షా -
T20 WC: భయంతో వణికిపోయా.. అతడే గేమ్ ఛేంజర్: రోహిత్ శర్మ
టీమిండియాకు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma). అతడి సారథ్యంలో 2024లో టీ20 ప్రపంచకప్ (T20 World Cup) గెలిచిన భారత్.. యాభై ఓవర్ల ఫార్మాట్లో ఈ ఏడాది చాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy)ని కూడా కైవసం చేసుకుంది. ఇక పొట్టి వరల్డ్కప్ గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్.. ఇటీవలే టెస్టులకు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు.ప్రస్తుతం భారత వన్డే జట్టు కెప్టెన్గా కొనసాగుతున్న రోహిత్ శర్మ.. టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్ నాటి జ్ఞాపకాలను తాజాగా గుర్తు చేసుకున్నాడు. ఒక దశలో తాను భయంతో వణికిపోయానని.. అయితే, తమ జట్టు మీద తనకున్న నమ్మకం వమ్ముకాలేదని పేర్కొన్నాడు. అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ మ్యాచ్ను తిరిగి తమ ఆధీనంలోకి తీసుకువచ్చిందని తెలిపాడు.ఆదుకున్న కోహ్లి, అక్షర్, దూబేకాగా బార్బడోస్ వేదికగా గతేడాది జూన్లో జరిగిన వరల్డ్కప్ ఫైనల్లో టీమిండియా సౌతాఫ్రికాతో తలపడింది. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా... ఓపెనర్ రోహిత్ శర్మ 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. వన్డౌన్లో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ డకౌట్ కాగా.. పవర్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ 3 పరుగులకే అవుటయ్యాడు.ఈ క్రమంలో దూకుడుగా మొదలుపెట్టి 1.3 ఓవర్లలోనే 23 పరుగులు సాధించిన టీమిండియా.. ఐదో ఓవర్ పూర్తయ్యేసరికి 34 పరుగులు మాత్రమే చేసి మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఇలాంటి దశలో మరో ఓపెనర్ విరాట్ కోహ్లి (76), ఐదు, ఆరు స్థానాల్లో వచ్చిన అక్షర్ పటేల్ (47), శివం దూబే (27) జట్టును ఆదుకున్నారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి టీమిండియా 176 పరుగులు చేయగలిగింది. ఇక లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ఎనిమిది వికెట్ల నష్టానికి 169 పరుగులే చేయగలిగింది. దీంతో ఏడు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి టీమిండియా పదమూడేళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది.భయంతో వణికిపోయాను.. ఏమీ తోచలేదుఈ విషయాలను గుర్తు చేసుకున్న రోహిత్ శర్మ.. ‘‘నిజం చెప్పాలంటే నేను వణికిపోయాను. నాకసలు ఏమీ తోచలేదు. ఫలితం విషయంలో ప్రత్యర్థికి అవకాశం ఇచ్చామా అనిపించింది.అయితే, నా మనసులో మాత్రం మా లోయర్ ఆర్డర్ మీద పూర్తి నమ్మకం ఉంది. ఆ టోర్నీ మొత్తంలో వారికి ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రానప్పటికీ.. ఈసారి కచ్చితంగా ప్రభావం చూపుతారని నమ్మాను.అతడే గేమ్ ఛేంజర్నిజానికి చాలా మందికి అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ గురించి గుర్తుండకపోవచ్చు. అయితే, అతడే గేమ్ ఛేంజర్. క్లిష్ట పరిస్థితుల్లో 31 బంతుల్లో 47 పరుగులు చేయడం గొప్ప విషయం. ఇక విరాట్ గురించి చెప్పేదేముంది. తను అద్భుత బ్యాటింగ్తో మరోసారి ఆకట్టుకున్నాడు’’ అని పేర్కొన్నాడు. జియోహాట్స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా ఫైనల్లో విరాట్ కోహ్లి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవగా... భారత ప్రధాన పేసర్ ‘జస్ప్రీత్ బుమ్రా’ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు.చదవండి: విధ్వంసకర శతకం, మూడు ఫిఫ్టీలు.. ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్ -
తప్పుడు వ్యక్తులతో స్నేహం.. అప్పుడు అతడు తప్ప ఎవరూ మాట్లాడలేదు: పృథ్వీ షా
భారత క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) గత రెండేళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. ఒకప్పుడు.. ఆటలో సచిన్ టెండుల్కర్ వారసుడిగా పేరొందిన ఈ ముంబైకర్ ఇప్పుడు అవకాశాల కోసం పాకులాడాల్సిన పరిస్థితి. క్రమశిక్షణా రాహిత్యం, ఫిట్నెస్ లేమి కారణంగా కెరీర్ పరంగా ఎంతో వెనుకబడిపోయాడు పృథ్వీ.గిల్ ఏకంగా టీమిండియా సారథి అయితే..అండర్-19 జట్టు కెప్టెన్గా భారత్కు ప్రపంచకప్ అందించిన పృథ్వీ షా సారథ్యంలో ఆడిన శుబ్మన్ గిల్ (Shubman Gill) ఏకంగా టీమిండియా కెప్టెన్ అయితే.. ఇతడు మాత్రం దేశవాళీ జట్టులోనూ చోటు దక్కించుకోలేకపోతున్నాడు. ఇక ఐపీఎల్-2025 మెగా వేలంలో ఒక్క ఫ్రాంఛైజీ కూడా కనీస ధర రూ. 75 లక్షల ధరకు పృథ్వీని కొనుగోలు చేయకపోవడం అతడి పరిస్థితికి అద్దం పడుతోంది.ఈ నేపథ్యంలో పృథ్వీ షా ఇటీవలే ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశీ క్రికెట్లో ముంబై జట్టును వీడాలని నిర్ణయించుకోగా.. ముంబై క్రికెట్ అసోసియేషన్ ఇందుకు అంగీకరించింది. ఇక వచ్చే సీజన్లో కొత్త ప్రయాణం మొదలుపెట్టనున్న పృథ్వీ షా తాజాగా న్యూస్24కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని భావాలు పంచుకున్నాడు.పంత్ తప్ప ఎవరూ మాట్లాడలేదు.. సచిన్ సర్కు తెలుసుతాను కెరీర్ పరంగా ఇబ్బందుల్లో ఉన్నపుడు ఒక్క ‘బిగ్ క్రికెటర్’ కూడా తనకు అండగా నిలవలేదని పృథ్వీ చెప్పాడు. టీమిండియా స్టార్ రిషభ్ పంత్ (Rishabh Pant) తప్ప ఎవరూ తనతో కనీసం మాట్లాడలేదని తెలిపాడు. ‘‘సచిన్ టెండుల్కర్కు నాకు సమస్యలు తెలుసు.అర్జున్ టెండుల్కర్తో పాటు నేను క్రికెటర్గా ఎదగడం ఆయన చూశారు. ఓసారి వారి ఇంటికి కూడా వెళ్లాను. అయితే, నేను కెరీర్ పరంగా చిక్కుల్లో ఉన్నపుడు రిషభ్ పంత్ తప్ప ఒక్కరూ పలకరించలేదు’’ అని పృథ్వీ షా వెల్లడించాడు.అదే విధంగా ఆటపై దృష్టి పెట్టలేకపోవడానికి గల కారణాల్ని వివరిస్తూ.. ‘‘నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు మాత్రమే తెలుసు. బయటి నుంచి చూసే వాళ్లకు ఇది అర్థం కాకపోవచ్చు. జీవితంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా.తప్పుడు వ్యక్తులతో స్నేహంఅందుకే ఆటకు ఎక్కువ సమయం కేటాయించలేకపోయా. నిజానికి నేను గంటల కొద్దీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసేవాడిని. కనీసం మూడు నాలుగు గంటలు నెట్స్లో గడిపేవాడిని. రోజులో సగం సమయం అక్కడే గడిపేవాడిని. కానీ ఆ తర్వాత ఆట నుంచి నా దృష్టి మరలింది.తర్వాత నాలో పశ్చాత్తాపం మొదలైంది. దేనికి ఎంత సమయం కేటాయించాలో ఓ అవగాహన వచ్చింది. తప్పుడు వ్యక్తులతో స్నేహం చేశాను. క్రికెటర్గా నేను ఉన్నత స్థితిలో ఉన్నపుడు వాళ్లు నా చెంత చేరారు. నన్ను చాలా చోట్లకు తిప్పారు.అప్పుడే నేను దారి తప్పాను. ఒకప్పుడు నెట్స్లో 8 గంటలకు పైగా ప్రాక్టీస్ చేసేవాడిని. ఇప్పుడు ఆ సమయం నాలుగు గంటలకు తగ్గింది’’ అని పృథ్వీ షా తన తప్పులను అంగీకరించాడు. ఇకపై ఆటపైనే దృష్టి కేంద్రీకరిస్తానని వెల్లడించాడు. కాగా వచ్చే డొమెస్టిక్ సీజన్లో పృథ్వీ మహారాష్ట్ర జట్టుకు ఆడే అవకాశం ఉంది.చదవండి: క్రికెట్ టీమ్ను కొనుగోలు చేసిన సల్మాన్ ఖాన్ -
అఖిల భారత చెస్ సమాఖ్య కొత్త పథకం
న్యూఢిల్లీ: యువ క్రీడాకారులకు ఆర్థికపరంగా అండగా నిలిచేందుకు అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) కొత్త పథకంతో ముందుకు వచ్చింది. ఇకపై జాతీయ స్థాయి క్రీడాకారులకు శిక్షణ తదితర అవసరాల కోసం ఉపకార వేతనం అందిస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి ఏప్రిల్–జూన్ మధ్య కాలానికి ఇప్పటికే రూ. 42.30 లక్షలను నేరుగా ఆటగాళ్ల అకౌంట్లకు బదిలీ చేసింది.ఈ పథకం ద్వారా ప్రయోజనం అందుకునే వారిలో అండర్–7 నుంచి అండర్–19 వయో విభాగాల క్రీడాకారులు ఉన్నారు. రూ. 60 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు ఒక్కో ఆటగాడికి లభించాయి. ‘భారత చెస్లో తొలిసారి బాలుర విభాగంలో 39 మంది, బాలికల విభాగంలో 39 మంది ఆటగాళ్లను గుర్తించి భవిష్యత్తు కోసం వారిని తీర్చిదిద్దుతున్నాం. దీని ద్వారా వారికి కీలక దశలో ఆర్థికపరంగా వెసులుబాటు లభిస్తుంది.ఇతరత్రా కూడా అన్ని రకాలుగా మేం మద్దతు అందిస్తాం. మరోవైపు జాతీయ స్థాయి టోర్నీల సంఖ్యను పెంచి పోటీల్లో పాల్గొనే అవకాశాలు కూడా పెంచుతాం. దాని వల్ల మంచి ప్రతిభ వెలుగులోకి వస్తుంది’ అని ఏఐసీఎఫ్ అధ్యక్షుడు నితిన్ నారంగ్ తెలిపారు. ఈ జాబితాలో తెలంగాణ నుంచి దివిత్ రెడ్డి , నిధీశ్ శ్యామల్ (అండర్–9), శ్రీరామ్ ఆదర్శ్ ఉప్పల, బి.కీర్తిక (అండర్–17), శరణ్య దేవి నరహరి (అండర్–13), ఆదిరెడ్డి అర్జున్, వేల్పుల సరయు (అండర్–19) ఉన్నారు. -
బంగ్లాదేశ్ 220/8
కొలంబో: శ్రీలంక పర్యటనలో భాగంగా తొలి టెస్టులో భారీ స్కోర్లు చేసిన బంగ్లాదేశ్... రెండో మ్యాచ్లో అదే జోరు కనబర్చలేకపోయింది. బుధవారం కొలంబో వేదికగా ప్రారంభమైన రెండో టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్... తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 71 ఓవర్లలో 8 వికెట్లకు 220 పరుగులు చేసింది. ఓపెనర్ షాద్మన్ ఇస్లామ్ (93 బంతుల్లో 46; 7 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... ముషి్ఫకర్ రహీమ్ (75 బంతుల్లో 35; 5 ఫోర్లు), లిటన్ దాస్ (56 బంతుల్లో 34; 3 ఫోర్లు), మెహదీ హసన్ మిరాజ్ (42 బంతుల్లో 31; 3 ఫోర్లు) తలా కొన్ని పరుగులు చేశారు. వీరంతా మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. క్లిష్టతరమైన పిచ్పై పరుగులు రాబట్టేందుకు తడబడుతూ లంక బౌలర్లకు వికెట్లు అప్పగించుకున్నారు. గత మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ల్లోనూ సెంచరీలతో ఆకట్టుకున్న బంగ్లా కెపె్టన్ నజు్మల్ హసన్ షంటో (8) విఫలం కాగా... మరో ఓపెనర్ అనాముల్ హక్ (0) డకౌటయ్యాడు. తైజుల్ ఇస్లామ్ (9 బ్యాటింగ్), ఇబాదత్ హుసేన్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. శ్రీలంక బౌలర్లలో అరంగేట్ర స్పిన్నర్ సోనాల్ దినుశా, అషిత ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో రెండేసి వికెట్లు పడగొట్టారు. గత మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఏంజెలో మాథ్యూస్ స్థానంలో సోనాల్ దినుశా జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇరు జట్ల మధ్య గాలె వేదికగా జరిగిన తొలి టెస్టు ‘డ్రా’గా ముగిసిన విషయం తెలిసిందే. -
ప్రాక్టీస్లో ఫ్లాప్...
బాకెన్హామ్: భారత పురుషుల క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పరాజయం పాలవగా... మరోవైపు మహిళల జట్టు ప్రధాన సిరీస్ల ప్రారంభానికి ముందు జరిగిన రెండు ప్రాక్టీస్ మ్యాచ్ల్లోనూ ఓడింది. 5 టి20లు, 3 వన్డేల సిరీస్లు ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తోంది. శనివారం భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టి20 జరగనుంది. దీనికి ముందు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) డెవలప్మెంట్ ఎలెవన్తో జరిగిన వన్డే, టి20 టూర్ మ్యాచ్ల్లో భారత్ పరాజయం పాలైంది. మంగళవారం జరిగిన ప్రాక్టీస్ వన్డే పోరులో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్ 18 పరుగుల తేడాతో ఓడింది. మొదట బ్యాటింగ్ చేసిన ఈసీబీ ఎలెవన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 353 పరుగులు చేసింది. మైయా బౌచర్ (84 బంతుల్లో 104; 16 ఫోర్లు) సెంచరీతో కదంతొక్కగా... ఎమ్మా లాంబ్ (92 బంతుల్లో 94; 15 ఫోర్లు) దంచికొట్టింది. వీరిద్దరూ తొలి వికెట్కు 196 పరుగులు జోడించడంతో ఈసీబీ జట్టు భారీ స్కోరు చేయగలిగింది. భారత బౌలర్లలో తెలుగమ్మాయి శ్రీచరణి 3 వికెట్లు పడగొట్టగా... స్నేహ్ రాణా, రాధా యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత మహిళల జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 335 పరుగులకు పరిమితమైంది. హర్లీన్ డియోల్ (91 బంతుల్లో 100; 14 ఫోర్లు, 1 సిక్స్) ‘శత’క్కొట్టగా... కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (47 బంతుల్లో 54; 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్సెంచరీ సాధించింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (1), జెమీమా రోడ్రిగ్స్ (5), రిచా ఘోష్ (5), షఫాలీ వర్మ (16) విఫలమయ్యారు. అమన్జ్యోత్ కౌర్ (32 బంతుల్లో 43; 6 ఫోర్లు), యస్తిక భాటియా (45 బంతుల్లో 32; 3 ఫోర్లు), హైదరాబాద్ ప్లేయర్ అరుంధతి రెడ్డి (21 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) పోరాడారు. ఈసీబీ బౌలర్లలో ర్యానా మెక్డొనాల్డ్, మహికా గౌర్, సారా గ్లెన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అందరికీ ప్రాక్టీస్ దక్కాలనే ఉద్దేశంతో హర్లీన్ డియోల్ శతకం అనంతరం రిటైర్డ్ నాటౌట్గా పెవిలియన్ చేరింది. టి20లోనూ తప్పని ఓటమి...ప్రాక్టీస్ వన్డేలో పరాజయం పాలైన టీమిండియాకు... టి20లోనూ ఓటమే ఎదురైంది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో హర్మన్ బృందం 6 పరుగుల తేడాతో ఈసీబీ ఎలెవన్ చేతిలో ఓడింది. మొదట బ్యాటింగ్ చేసిన ఈసీబీ ఎలెవన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. బ్రియోనీ స్మిత్ (33 బంతుల్లో 62; 8 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుపు అర్ధశతకం బాదగా... కెప్టెన్ హోలీ ఆర్మిటేజ్ (32 బంతుల్లో 48; 7 ఫోర్లు), మైయా బౌచర్ (25 బంతుల్లో 35; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. భారత బౌలర్లలో అమన్జ్యోత్ కౌర్, స్నేహ్ రాణా చెరో 2 వికెట్లు పడగొట్టగా... దీప్తి శర్మ, రాధ యాదవ్ చెరో వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులకు పరిమితమైంది. స్మృతి మంధాన (28 బంతుల్లో 47; 10 ఫోర్లు) ధాటిగా ఆడగా... మిగిలినవాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. షఫాలీ వర్మ (13), అమన్జ్యోత్ కౌర్ (15), హర్మన్ప్రీత్ కౌర్ (28), జెమీమా రోడ్రిగ్స్ (11), రాధా యాదవ్ (17) ఎక్కువసేపు నిలవలేకపోయారు. రిచా ఘోష్ (23 బంతుల్లో 37; 4 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడింది. ఈసీబీ బౌలర్లలో సారా గ్లెన్ 3 వికెట్లు పడగొట్టింది. -
భారత షూటింగ్ లీగ్కు అనూహ్య స్పందన
న్యూఢిల్లీ: భారత షూటింగ్ లీగ్ (ఎస్ఎల్ఐ)లో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా షూటర్లు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న ఈ లీగ్ కోసం ఇప్పటి వరకు దేశవిదేశాలకు చెందిన 400 మందికి పైగా షూటర్లు పేర్లు నమోదు చేసుకున్నట్లు జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ) బుధవారం వెల్లడించింది. ఇందులో కజకిస్తాన్, రష్యా, ఇరాన్, హంగేరి, క్రొయేషియా, అజర్బైజాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, గ్రెనెడా, ఇటలీ, ఆ్రస్టేలియా, ఆ్రస్టియా, సెర్బియా, అమెరికా, స్పెయిన్, థాయ్లాండ్, జర్మనీ, చెక్ రిపబ్లిక్, నార్వే, సాన్ మారినో, రొమానియా దేశాలకు చెందిన షూటర్లు ఉన్నారు. తొలిసారి నిర్వహిస్తున్న ఈ లీగ్కు అనూహ్య స్పందన రావడం ఆనందంగా ఉందని ఎన్ఆర్ఏఐ అధ్యక్షుడు కాళికేశ్ నారాయణ్ సింగ్ పేర్కొన్నారు. ‘ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న భారత షూటింగ్ లీగ్ పై స్పష్టమైన అవగాహనతో ఉన్నాం. ప్రపంచ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నాం. భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలిచేవిధంగా సహృద్భావ వాతావరణంలో పోటీలు నిర్వహిస్తాం’ అని అన్నారు. జూలై వరకు పేర్లు నమోదు చేసుకునే ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 2 వరకు ఎస్ఎల్ఐ తొలి సీజన్ జరిగే అవకాశం ఉంది. లీగ్లో పిస్టల్ విభాగంలో 10 మీటర్లు, 25 మీటర్లు... రైఫిల్ విభాగంలో 10 మీటర్లు, 50 మీటర్లు, ‘త్రీ’ పొజిషన్... షాట్గన్ విభాగంలో ట్రాప్, స్కీట్లో పోటీలు నిర్వహించనున్నారు. లీగ్లో కనీసం ఆరు జట్లు పాల్గొననుండగా... రెండు గ్రూప్లుగా విభజించి పోటీలు చేపట్టనున్నారు. ఆటగాళ్లను ఎలైట్ చాంపియన్స్, వరల్డ్ ఎలైట్, నేషనల్ చాంపియన్స్, యూత్ చాంపియన్స్ అనే నాలుగు కేటగిరీల్లో విభజించనున్నారు -
జర్మనీ ఫుట్బాల్ సమాఖ్యకు జరిమానా
బెర్లిన్: జర్మనీ ఆతిథ్యమిచ్చిన 2006 ప్రపంచకప్ పన్ను ఎగవేత కేసులో జర్మనీ ఫుట్బాల్ సమాఖ్యకు జరిమానా పడింది. ఈ కేసులో సుదీర్ఘ వాదనల అనంతరం ఫ్రాంక్ఫర్ట్ స్థానిక కోర్టు బుధవారం తీర్పు వెల్లడించింది. పన్ను ఎగవేతకు పాల్పడిన జర్మనీకి 1,28,000 డాలర్లు (రూ. 1 కోటీ 10 లక్షలు) జరిమానా విధించింది. ప్రపంచకప్ ప్రారంభానికి ఒక ఏడాది ముందు అంటే 2005లో ‘ఫిఫా’ నిర్దేశించిన పన్నులు చెల్లించడంలో జర్మనీ విఫలమైంది.దీంతో జరిమానా భారీ మొత్తంలో ఉండాలని ‘ఫిఫా’ తరఫున న్యాయవాదులు పట్టుబట్టారు. ప్రపంచకప్ ప్రారంబోత్సవం కోసం తీసుకున్న రుణాన్ని దాచిపెట్టిన జర్మనీ ఫుట్బాల్ సమాఖ్య.. ఓ ఏడాది తర్వాత దాన్ని వ్యాపార ఖర్చుగా తప్పుగా వెల్లడించింది. ఆ తర్వాత దాన్ని రద్దు చేసింది. ఈ మొత్తం వ్యవహారంతో సంబంధం ఉన్న జర్మనీ ఫుట్బాల్ సమాఖ్య ప్రతినిధులు జ్వాన్జిగర్, వోల్ఫ్గ్యాంగ్, నీర్స్బాచ్, హోర్ట్స్ స్మిత్లపై తొలుత విచారణ సమయంలో అభియోగాలు మోపారు. వాటిని ఖండించిన ఈ ముగ్గురూ జరిమానాలు చెల్లించిన తర్వాత వారిపై వేసిన విచారణలను రద్దు చేశారు. -
‘పేస్ బౌలర్లను నిందించవద్దు’
లీడ్స్: ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు పరాజయానికి పేలవమైన పేస్ బౌలింగ్ కూడా ఒక కారణం. తొలి ఇన్నింగ్స్లో బుమ్రా మినహా మిగితా వారంతా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, శార్దుల్ ఠాకూర్ సమష్టిగా విఫలమయ్యారు. ప్రసిధ్ అయితే ఏకంగా ఓవర్కు ఆరుకు పైగా పరుగులు ఇచ్చాడు. అయితే భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తమ పేసర్లకు అండగా నిలిచాడు. ఒక్క ఓటమికే వారిని నిందించడం భావ్యం కాదని అతను పేర్కొన్నాడు. ‘గతంలో భారత జట్టులో నలుగురు పేసర్లు ఉంటే వారంతా ఒక్కొక్కరు కనీసం 40 టెస్టుల అనుభవంతో ఉండేవారు. వన్డేలు, టి20ల్లో సమస్య లేకపోవచ్చు కానీ ఆ్రస్టేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలాంటి చోట టెస్టులు ఆడేటప్పుడు అనుభవం ఎంతో కీలకం. బుమ్రా, సిరాజ్లకు కొంత అనుభవం ఉన్నా ప్రసిధ్ నాలుగు టెస్టులే ఆడాడు. తుది జట్టులో లేనివారిని చూసినా నితీశ్ రెడ్డికి ఐదు, హర్షిత్కు రెండు టెస్టుల అనుభవం మాత్రమే ఉండగా అర్‡్షదీప్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇది ఆరంభం మాత్రమే. వారు తమ ఆటను మెరుగు పర్చుకునేందుకు తగినంత సమయం ఇవ్వాలి. ప్రతీ టెస్టు తర్వాత లోపాలను వెతికితే బలమైన బౌలింగ్ బృందాన్ని ఎలా తయారు చేయగలం. వారిలో తగినంత ప్రతిభ ఉంది కాబట్టే జట్టులోకి ఎంపికై ఇక్కడ ఉన్నారు’ అని గంభీర్ సమర్థించాడు. తొలి నాలుగు రోజుల పాటు బౌలర్లు కూడా రాణించడం వల్లే భారత జట్టు ఆధిక్యం ప్రదర్శించగలిగిందని, వారిపై తనకు నమ్మకం ఉందని అతను అన్నాడు. ప్రసిధ్ కూడా బాగానే బౌలింగ్ చేశాడని... అతనితో పాటు శార్దుల్ కూడా కీలకదశలో రెండేసి వికెట్లు తీశారని గంభీర్ గుర్తు చేశాడు. ఫలానా ఆటగాళ్ల వల్లే తాము ఓడిపోయామంటూ ఎవరినీ బాధ్యులను చేయనన్న కోచ్... తాము గెలిచినా ఓడినా అందులో అందరి పాత్ర ఉంటుందని వెల్లడించాడు. కెప్టెన్గా తొలి టెస్టులో ఒత్తిడి సహజమన్న గంభీర్... మున్ముందు గిల్ చాలా నేర్చుకొని మంచి ఫలితాలు రాబడతాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఈ పర్యటనలో తాము ముందుగా అనుకున్నట్లుగా బుమ్రా మూడు టెస్టులు మాత్రమే ఆడతాడని, మిగిలిన నాలుగు మ్యాచ్లలో ఏ రెండు ఆడించాలనే విషయంపై టీమ్ మేనేజ్మెంట్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోచ్ వెల్లడించాడు. తొలి టెస్టులో పంత్ రెండు సెంచరీలు సాధించిన విషయంపై మాట్లాడుతూ... ‘పంత్ మాత్రమే కాదు. మరో ముగ్గురు కూడా సెంచరీలు సాధించారనే విషయం మరచిపోవద్దు. అయినా జట్టు గెలవనప్పుడు వ్యక్తిగత ప్రదర్శనలకు విలువ లేదు’ అని గంభీర్ కాస్త ఘాటుగా జవాబిచ్చాడు. -
‘అదే కీలక మలుపు’
లీడ్స్: తొలి టెస్టులో భారత జట్టు లోయర్ ఆర్డర్ను కట్టడి చేయడం కూడా తమ విజయానికి ప్రధాన కారణమని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న పిచ్పై కూడా తమ బౌలర్లు ప్రత్యర్థి చివరి వరుస బ్యాటర్లను తొందరగా అవుట్ చేయడంలో సఫలమయ్యారని అతను ప్రశంసించాడు. తొలి ఇన్నింగ్స్లో 41 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లు కోల్పోయిన భారత్... రెండో ఇన్నింగ్స్లో 31 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లు చేజార్చుకుంది. ‘ఇరు జట్లు నమోదు చేసిన స్కోర్లు చూస్తే మంచి బ్యాటింగ్ పిచ్ అని అర్థమవుతోంది. అయితే ఈ మ్యాచ్లో పలు మలుపులున్నా అన్నింటికంటే ప్రధానమైన కారణం రెండుసార్లూ భారత్ లోయర్ ఆర్డర్ను మేం కట్టడి చేయడమే అని నేను భావిస్తున్నా. రెండో ఇన్నింగ్స్లో అయితే భారత్ స్కోరు కనీసం 500 వరకు చేరే అవకాశం కనిపించింది. అలా జరిగితే మాకు ఛేదన కష్టమయ్యేది. కానీ మా బౌలర్లు వారికి ఆ అవకాశం ఇవ్వలేదు. చక్కటి ఆటతో పాటు ప్రతీ సెషన్లో మా ఆటగాళ్లు చూపిన పట్టుదల కూడా ప్రశంసనీయార్హం’ అని స్టోక్స్ అన్నాడు. 371 పరుగుల ఛేదనలో శుభారంభం అందించిన ఓపెనర్లు డకెట్, క్రాలీలను కెపె్టన్ ప్రత్యేకంగా అభినందించాడు. ముఖ్యంగా జడేజా బౌలింగ్లో డకెట్ రివర్స్ స్వీప్లతో భారీగా పరుగులు రాబట్టడం అద్భుతమని... అతని సలహాతోనే తాను కూడా స్పిన్ను ఎదుర్కొనేందుకు రివర్స్ స్వీప్ వైపే మొగ్గు చూపానని ఇంగ్లండ్ కెపె్టన్ చెప్పాడు. హెడింగ్లీ మైదానంలో సాధారణంగా అవుట్ఫీల్డ్ చాలా వేగంగా ఉంటుందని, అందుబాటులో ఉన్న ఓవర్లన్నీ ఆడగలిగితే తాము విజయం సాధిస్తామనే గట్టి నమ్మకంతో ఉన్నామన్న స్టోక్స్... టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న నిర్ణయం చివరకు తప్పు కాకపోవడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. -
గౌతమ్ గంభీర్పై విమర్శల వర్షం
టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ గతేడాది టీ20 వరల్డ్కప్ తర్వాత (2024, జూన్) బాధ్యతలు చేపట్టాడు. రాహుల్ ద్రవిడ్ నుంచి గంభీర్ బాధ్యతలు స్వీకరించాడు. ద్రవిడ్ ఆథ్వర్యంలో భారత్ టీ20 వరల్డ్ ఛాంపియన్గా అవతరించింది. ద్రవిడ్ వారసుడిగా అప్పటికే కేకేఆర్కు ఐపీఎల్ టైటిల్ (మెంటార్) అందించిన గంభీర్ రావడంతో టీమిండియాపై అంచనాలు భారీగా పెరిగాయి. మూడు ఫార్మాట్లలో భారత్కు తిరుగుండదని అందరూ భావించారు.అయితే అంచనాలు తారుమారయ్యాయి. గంభీర్ ఆథ్వర్యంలో టీమిండియా టెస్ట్ల్లో దారుణంగా విఫలమవుతూ వస్తుంది. టీమిండియా హెడ్ కోచ్గా గంభీర్ రెండు వరుస విజయాలతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. తొలి రెండు విజయాలు బంగ్లాదేశ్పై సాధించినవి కావడంతో వాటికి అంత ప్రాముఖ్యత దక్కలేదు.అయితే గంభీర్కు అసలు పరీక్ష మూడో టెస్ట్ నుంచి మొదలైంది. భారత్ స్వదేశంలో ఇంగ్లండ్ చేతిలో వరుసగా మూడు టెస్ట్ల్లో ఓడింది. ఇక్కడి నుంచే గంభీర్పై విమర్శలు ప్రారంభమయ్యాయి. అయితే ఆ తర్వాతి మ్యాచ్లో భారత్ ఆస్ట్రేలియాను ఓడించడంతో గంభీర్ విజయ ప్రస్తానం మొదలైందని అంతా అనుకున్నారు. అయితే గంభీర్ విజయ పరంపర కేవలం ఆ ఒక్క మ్యాచ్కే పరిమితమైంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన రెండో టెస్ట్లో భారత్ ఆస్ట్రేలియా చేతిలో పరాజయంపాలైంది. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో మూడో టెస్ట్ డ్రా కాగా.. నాలుగు, ఐదు మ్యాచ్ల్లో టీమిండియా వరుసగా పరాజయాలు చవిచూసింది.తాజాగా ఇంగ్లండ్ చేతిలో ఓటమితో భారత్ గంభీర్ ఆథ్వర్యంలో హ్యాట్రిక్ పరాజయాలను మూటగట్టుకుంది. గంభీర్ టీమిండియా హెడ్ కోచ్గా ఉండగా.. భారత్ 11 టెస్ట్ మ్యాచ్ల్లో కేవలం మూడే విజయాలు సాధించింది. ఒకటి డ్రా చేసుకొని, ఏకంగా ఏడింట పరాజయాలు ఎదుర్కొంది. వరుస వైఫల్యాల నేపథ్యంలో గంభీర్పై విమర్శలు ధాటి బాగా పెరిగింది. ద్రవిడ్ హయాంలో వరుస విజయాలతో దూసుకుపోయిన టీమిండియా.. గంభీర్ వచ్చాక అదఃపాతాళానికి పడిపోయిందని భారత క్రికెట్ అభిమానులే అంటున్నారు. గంభీర్ వచ్చాక టీమిండియాలో రాజకీయాలు ఎక్కువయ్యాయని, అందుకే ఈ పరాజయాలు పరంపర అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.గంభీర్ తన తీరును మార్చుకోకపోతే టీమిండియా ఇంగ్లండ్లో వైట్వాష్ తప్పదని జోస్యం చెబుతున్నారు. గంభీర్ రాజకీయాలు మాని జట్టును గెలుపు బాట పట్టించడంపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. గంభీర్ ఇదే ధోరణిని కొనసాగిస్తే.. భారత్కు టెస్ట్ క్రికెట్ చరిత్రలో అతి పెద్ద పరాజయాలు పరంపర తప్పదని హెచ్చరిస్తున్నారు. 1967-68లో భారత్ వరుసగా ఏడు మ్యాచ్ల్లో పరాజయాలు ఎదుర్కొంది. ఇప్పటికే హ్యాట్రిక్ పరాజయాలు ఎదుర్కొన్న భారత్.. ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయితే ఆ రికార్డును సమం చేస్తుంది. ప్రస్తుతం టీమిండియా గంభీర్ ఆథ్వర్యంలో గత 9 మ్యాచ్ల్లో ఒకే విజయం సాధించి, మరో అపవాదును మూటగట్టుకుంది. -
England Tour: యువ ఆటగాడిని వెనక్కి పిలిచిన బీసీసీఐ
ఇంగ్లండ్ పర్యటన కోసం టీమిండియా బ్యాకప్ పేసర్గా ఎంపికైన హర్షిత్ రాణాను బీసీసీఐ వెనక్కు పిలిచినట్లు తెలుస్తుంది. హర్షిత్ను వెంటనే స్వదేశానికి తిరిగి రావాలని బీసీసీఐ ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు భారత మేనేజ్మెంట్ రెండో టెస్ట్ మ్యాచ్కు ముందు హర్షిత్ను రిలీజ్ చేసినట్లు తెలుస్తుంది. రెండో టెస్ట్ కోసం బర్మింగ్హమ్కు పయనమైన భారత జట్టుతో పాటు హర్షిత్ లేడని టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. వాస్తవానికి హర్షిత్ ఇంగ్లండ్ పర్యటన కోసం తొలుత ప్రకటించిన భారత జట్టులో లేడు. సుదీర్ఘంగా సాగే పర్యటన కావడంతో పేస్ బౌలర్లు గాయపడే అవకాశం ఉందని హెడ్ కోచ్ గంభీర్ ముందు జాగ్రత్త చర్యగా హర్షిత్ పేరును సిఫార్సు చేశాడు. దీంతో తొలి టెస్ట్ ప్రారంభానికి ముందు హర్షిత్ హుటాహుటిన ఇంగ్లండ్కు పయనమయ్యాడు. అయితే తాజా పరిస్థితుల ప్రకారం బ్యాకప్ పేసర్ అవసరం లేదని భారత మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. జట్టులోని పేసర్లంతా ఫిట్గా ఉన్నారని సమాచారం. అందుకే మేనేజ్మెంట్ హర్షిత్ను బీసీసీఐకి సరెండర్ చేసినట్లు తెలుస్తుంది.గంభీర్పై విమర్శలుఇంగ్లండ్ పర్యటన కోసం హర్షిత్ను టీమిండియా బ్యాకప్ పేసర్ ఎంపిక చేసిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై విమర్శలు వచ్చాయి. హర్షిత్ విషయంలో గంభీర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడని విశ్లేషకులు బహిరంగ కామెంట్లు చేశారు. గంభీర్ కేకేఆర్ కోచ్గా ఉన్నప్పుడు హర్షిత్ను దగ్గరగా చూశాడు. అదే పరిచయంతో గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ అయ్యాక హర్షిత్ పేరును సెలెక్టర్లకు కూడా సిఫార్సు చేసినట్లు టాక్ వినిపించింది. గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ అయ్యాకే హర్షిత్ మూడు ఫార్మాట్లలో భారత్ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. హర్షిత్లో గుర్తించదగ్గ ప్రత్యేకతలేమీ లేనప్పటికీ.. టీమిండియా తరఫున సులువుగా అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. తాజాగా ఇంగ్లండ్ పర్యటనకు హర్షిత్ను బ్యాకప్ పేసర్గా ఎంపిక చేయడంతో విమర్శల శృతి మించిందని గంభీరే స్వయంగా హర్షిత్ను బీసీసీఐ సరెండర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.కాగా, బ్యాకప్ పేసర్తో పాటు పేస్ బౌలింగ్ బలం సంపూర్ణంగా ఉన్నా భారత్ తొలి టెస్ట్లో ఇంగ్లండ్ చేతిలో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్లో భారత ఓటమికి బౌలింగ్ విభాగం కూడా ఒకానొక కారణం. తొలి ఇన్నింగ్స్లో బుమ్రా పుణ్యమా అని (5 వికెట్ల ప్రదర్శన) ఇంగ్లండ్ను ఆలౌట్ చేసిన భారత్.. రెండో ఇన్నింగ్స్లో దారుణంగా విఫలమైంది. బుమ్రా సహా బౌలింగ్ విభాగమంతా తేలిపోయింది. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్కు పగ్గాలేయడం ఎవరి వల్ల కాలేదు. బుమ్రా సైతం చేతులెత్తేశాడు. ఫలితంగా భారత్ 371 పరుగుల లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేక పరాజయంపాలైంది. -
జియోస్టార్ రిపోర్ట్: అహో ఐపీఎల్.. అన్నీ ‘ఫస్ట్’లే..
టాటా ఐపీఎల్ 2025 లీగ్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన సీజన్లలో ఒకటిగా నిలిచింది, అనేక రికార్డులు, పరిశ్రమ ఫస్ట్లతో కొత్త బెంచ్మార్క్లను నెలకొల్పింది. మీడియా పార్ట్నర్స్ ఆసియా (ఎంపీఏ) భాగస్వామ్యంతో ఇండోనేషియాలోని బాలిలో నిర్వహించిన ఏపీఓఎస్ సదస్సులో జియోస్టార్ ‘టాటా ఐపీఎల్ 2025: ఎ ఇయర్ ఆఫ్ ఫస్ట్స్’ రిపోర్ట్ను విడుదల చేసింది.'ఐపీఎల్ 2025 సీజన్ క్రీడలు, కథనాలు, అనుభవాలు పంచుకోవడం మధ్య గీతలను చెరిపివేసింది. ఇది కేవలం మ్యాచ్లను ప్రసారం చేయడం మాత్రమే కాదు - సృజనాత్మకత, సంస్కృతి, వాణిజ్యం, అభిమానుల కనెక్షన్లతో కలిసిపోయింది" అని జియోస్టార్ స్పోర్ట్స్ అండ్ లైవ్ ఎక్స్పీరియన్స్ సీఈఓ సంజోగ్ గుప్తా అన్నారు.నివేదిక ముఖ్యాంశాలుజియోస్టార్ నెట్వర్క్లో టాటా ఐపీఎల్ 2025 మొత్తం 1.19 బిలియన్ల మొత్తం రీచ్ను నమోదు చేసింది. ఇందులో టీవీలో 537 మిలియన్లు. డిజిటల్లో 652 మిలియన్లు.స్టార్ స్పోర్ట్స్లో ఐపీఎల్ వీక్షకుల్లో 47 శాతం మంది మహిళలే ఉన్నారు.ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ను 426 మిలియన్ల మంది వీక్షించారు. (టీవీలో 189 మిలియన్లు, డిజిటల్ లో 237 మిలియన్లు)జియో హాట్స్టార్ 300 మిలియన్ల సబ్స్క్రైబర్లకు చేరుకుంది. ఆండ్రాయిడ్ లో 1.04 బిలియన్ యాప్ డౌన్ లోడ్ లుకనెక్టెడ్ టీవీలో 235 మిలియన్ల రీచ్. మొబైల్ ఫోన్ల ద్వారా 41.7 కోట్ల మంది రీచ్ అయ్యారు.టోర్నమెంట్ వీక్షణ సమయం 514 బిలియన్ నిమిషాలు; స్టార్ స్పోర్ట్స్ హెచ్డీలో 129 మిలియన్ల మంది వీక్షించారు. 840 బిలియన్ నిమిషాల వాచ్ టైమ్.వీక్షకుల్లో 30 శాతం మంది మాక్స్ వ్యూ 3.0ను ఉపయోగించగా, ప్రాంతీయ భాషా ఫీడ్ వార్షిక వృద్ధిని చూసింది: హిందీ: 31 శాతం; తెలుగు: 87 శాతం; తమిళం: 52 శాతం.మొబైల్లో 44 శాతం మంది ఐపీఎల్ వీక్షకులు 'జీతో ధన్ ధనా ధన్' గేమ్ థ్రిల్ను అనుభవించారు.జియోస్టార్లో 425 కుపైగా ప్రకటనకర్తలు వచ్చారు. 40 ప్రత్యేక కేటగిరీల్లో 270+ నూతన ప్రకటనకర్తలే. మార్కెట్ లీడర్ల నుండి ఛాలెంజర్స్ వరకు 9 కేటగిరీలలో 32 బ్రాండ్లు నీల్సన్ థర్డ్ పార్టీ మెజర్మెంట్ను ఉపయోగించాయి.16:9లో మల్టీ క్యామ్, 360°/ వీఆర్ స్ట్రీమింగ్, మ్యాక్స్ వ్యూ 3.0, కనెక్టెడ్ టీవీలో వాయిస్-అసిస్టెడ్ సెర్చ్, ప్రకటనల రహిత ఫాస్ట్ చానెల్స్, ఏఐ ఆధారిత మ్యాచ్ హైలైట్స్ వంటి సరికొత్త టెక్నాలజీలను ఈ సీజన్లో వినియోగించారు. -
అన్ లక్కీ పంత్.. ప్రతిసారి ఇంతే..!
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ క్రికెట్ చరిత్రలో మోస్ట్ అన్ లక్కీ బ్యాటర్గా మారిపోతున్నాడు. ఫార్మాట్ ఏదైనా ఇతగాడు సెంచరీ చేశాడంటే అతని జట్టు గెలవడం లేదు. తాజాగా భారత్, ఇంగ్లండ్ మధ్య లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ ఇందుకు ఉదాహరణ. ఈ మ్యాచ్లో పంత్ రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేసినా ఇండియా గెలవలేదు. దీనికి ముందు ఐపీఎల్-2025లోనూ ఇలాగే జరిగింది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో పంత్ అద్బుత సెంచరీ చేసినా, ఆ మ్యాచ్లోనూ అతని జట్టు (లక్నో) గెలవలేదు.టెస్ట్ క్రికెట్లో, ప్రత్యేకించి విదేశాల్లో పంత్ సెంచరీల బ్యాడ్ లక్ ఇప్పుడు మొదలైంది కాదు. 2018 నుంచి పంత్ విదేశాల్లో 6 టెస్ట్ సెంచరీలు చేయగా.. ఇందులో టీమిండియా ఒక్క మ్యాచ్లో కూడా గెలవలేదు. 2018లో పంత్ తన తొలి విదేశీ టెస్ట్ సెంచరీని (114) కెన్నింగ్స్టన్ ఓవల్ మైదానంలో ఇంగ్లండ్పై చేశాడు. ఆ మ్యాచ్లో టీమిండియా దారుణంగా ఓడింది. విదేశాల్లో పంత్ రెండో టెస్ట్ సెంచరీని (159 నాటౌట్) 2019లో సిడ్నీ గ్రౌండ్లో ఆస్ట్రేలియాపై చేశాడు. ఆ మ్యాచ్లో టీమిండియా అదృష్టవశాత్తు డ్రాతో గట్టెక్కింది.విదేశాల్లో పంత్ మూడో టెస్ట్ సెంచరీని (100 నాటౌట్) 2022లో న్యూలాండ్స్లో సౌతాఫ్రికాపై చేశాడు. ఆ మ్యాచ్లో కూడా టీమిండియాకు పరాజయమే ఎదురైంది. విదేశాల్లో పంత్ నాలుగో టెస్ట్ సెంచరీ (146) అదే ఏడాది ఇంగ్లండ్పై (ఎడ్జ్బాస్టన్) చేశాడు. ఆ మ్యాచ్లోనూ టీమిండియాకు పరాభవం తప్పలేదు. తాజాగా హెడింగ్లే టెస్ట్లో పంత్ ఇంగ్లండ్పై రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు (134 & 118) చేసినా టీమిండియా గెలవలేకపోయింది. ఈ మ్యాచ్లో భారత్ తరఫున ఐదు సెంచరీలు (పంత్-2, జైస్వాల్, గిల్, రాహుల్) నమోదైనా గెలుపు దక్కకపోవడం శోచనీయం.ఇదిలా ఉంటే, హెడింగ్లేలో నిన్న ముగిసిన తొలి టెస్ట్లో భారత్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 471, రెండో ఇన్నింగ్స్లో 364 పరుగులు చేసినా టీమిండియాకు పరాభవం తప్పలేదు. భారత బౌలర్లు 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయారు. ఛేదనలో బుమ్రా సహా భారత బౌలర్లంతా తేలిపోయారు. ఈ మ్యాచ్లో క్యాచ్లు కూడా టీమిండియా కొంపముంచాయి. భారత జట్టు మ్యాచ్ మొత్తంలో ఏడు క్యాచ్లు నేలపాలు చేసింది. ఒక్క జైస్వాల్ ఒక్కడే నాలుగు క్యాచ్లు జారవిడిచాడు. భారీ లక్ష్య ఛేదనలో బెన్ డకెట్ అద్భుతమైన సెంచరీ చేసి ఇంగ్లండ్ను గెలిపించాడు. రెండో టెస్ట్ జులై 2 నుంచి బర్మింగ్హమ్ వేదికగా జరుగనుంది. -
తొలి టెస్ట్లో హిట్.. రెండో టెస్ట్లో ఫట్
కొలొంబో వేదికగా శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య ఇవాళ (జూన్ 25) రెండో టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. బంగ్లా ఇన్నింగ్స్లో ఓపెనర్ షద్మాన్ ఇస్లాం (46), మొమినుల్ హక్ (21), ముష్ఫికర్ రహీం (35), లిటన్ దాస్ (34), మెహిది హసన్ మిరాజ్ (31), నయీమ్ హసన్ (25) రెండంకెల స్కోర్లు చేయగా.. అనాముల్ హక్ 0, కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో 8 పరుగులకు ఔటయ్యారు. ఆట ముగిసే సమయానికి తైజుల్ ఇస్లాం (9), ఎబాదత్ హోసేన్ (5) క్రీజ్లో ఉన్నారు. బంగ్లా ఇన్నింగ్స్ను అశిత ఫెర్నాండో (14-2-43-2), విశ్వ ఫెర్నాండో (16-3-35-2), సోనల్ దినుష (9-3-22-2), ధనంజయ డిసిల్వ (5-0-15-1), తిరండు రత్నాయకే (16-1-63-1) దెబ్బకొట్టారు.కాగా, రెండు టెస్ట్లు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ల కోసం బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా గాలే వేదికగా జరిగిన తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. ఆ మ్యాచ్లో ఇరు జట్లు ఆటగాళ్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇరు జట్ల తరఫున నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో రెండు ఇన్నింగ్స్ల్లో (148, 125 నాటౌట్) సెంచరీలు చేశాడు. తొలి ఇన్నింగ్స్ల్లో బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్ రహీం (163), శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సంక (187) సెంచరీలు చేశారు.తొలి టెస్ట్లో హిట్.. రెండో టెస్ట్లో ఫట్తొలి టెస్ట్లో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేసి అదరగొట్టాడు. అయితే ఇవాళ ప్రారంభమైన రెండో టెస్ట్లో మాత్రం 8 పరుగులకే ఔటయ్యాడు. తొలి టెస్ట్లో తొలి ఇన్నింగ్స్లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్లో 49 పరుగులు చేసిన ముష్ఫికర్.. రెండో టెస్ట్లో ఓ మోస్తరు స్కోర్ (35) చేసి ఔటయ్యాడు. తొలి టెస్ట్లో ట్విన్ సెంచరీలు చేసి హిట్ అయిన నజ్ముల్ హసన్.. రెండో టెస్ట్లో సింగిల్ డిజిట్ స్కోర్కే ఔటై ఫట్ అనిపించాడు. -
క్రికెట్ టీమ్ను కొనుగోలు చేసిన సల్మాన్ ఖాన్
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) ఓ క్రికెట్ టీమ్కు ఓనరయ్యాడు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL)ఎడిషన్తో అరంగేట్రం చేయనున్న న్యూఢిల్లీ ఫ్రాంచైజీని కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని ISPL కమీషనర్ సూరజ్ సమత్ ధృవీకరించాడు. ISPLలో సల్మాన్ ఫ్రాంచైజీని కొనుగోలు చేయడంపై హర్షం వ్యక్తం చేశాడు. ISPLలో సల్మాన్ భాగస్వామ్యం లీగ్ యొక్క కొత్త అధ్యాయాన్ని సూచిస్తుందని అన్నాడు.ISPLలో ఇదివరకే పలువురు సినీ ప్రముఖులు ఫ్రాంచైజీలు కొనుగోలు చేశారు. అమితాబ్ బచ్చన్ (మాఝీ ముంబై), సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ (టైగర్స్ ఆఫ్ కోల్కతా), అక్షయ్ కుమార్ (శ్రీనగర్ కే వీర్), తమిళ నటుడు సూర్య (చెన్నై సింగమ్స్), హృతిక్ రోషన్ (బెంగళూరు స్ట్రైకర్స్), మెగా పవర్స్టార్ రామ్ చరణ్ (ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్) సంబంధిత ఫ్రాంచైజీలకు ఓనర్లుగా ఉన్నారు.ISPLకు శక్తివంతమైన కోర్ కమిటీ ఉంది. ఇందులో భారతరత్న సచిన్ టెండూల్కర్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ సభ్యుడు మరియు క్యాబినెట్ మంత్రి ఆశిష్ షెలార్, మినల్ అమోల్ కాలే, సూరజ్ సమత్ సభ్యులుగా ఉన్నారు.ISPL అనేది టెన్నిస్ బాల్తో జరిగే టీ10 టోర్నమెంట్. ఈ టోర్నీని 2024లో ప్రారంభించారు. దేశం నలుమూలల్లో ఉండే క్రికెటర్లలో ప్రతిభను గుర్తించి, ప్రొఫెషనల్ క్రికెట్ ఆడే అవకాశం కల్పించాలన్న ఆలోచనతో ఈ లీగ్ పుట్టింది. ఈ లీగ్ కోసం ఆటగాళ్లను ఐపీఎల్ వేలం తరహాలో ఎంపిక చేసుకుంటారు.రెండు సీజన్లలోనే ఈ టోర్నీ విశేషమైన ప్రజాధరణ పొందింది. రానున్న సీజన్ కోసం ఇప్పటికే 42 లక్షల రిజిస్ట్రేషన్లు దాఖలయ్యాయి. ఢిల్లీ ఫ్రాంచైజీ ఓనర్గా సల్మాన్ చేరిక రిజిస్ట్రేషన్ల సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉంది. త్వరలోనే అహ్మదాబాద్కు సంబంధించిన ఫ్రాంచైజీపై కూడా ప్రకటన రావచ్చని తెలుస్తుంది.ISPL మొదటి సీజన్లో టైగర్స్ ఆఫ్ కోల్కతా ఛాంపియన్గా అవతరించింది. గత సీజన్లో అమితాబ్ బచ్చన్ ఫ్రాంచైజీ మాఝీ ముంబై విజేతగా నిలిచింది. గత సీజన్ రికార్డు స్థాయిలో 28 మిలియన్లకు పైబడిన టీవీ వ్యూయర్షిప్ను పొందింది. అరంగేట్రం ఎడిషన్తో పోలిస్తే ఇది 47 శాతం అధికం.ఢిల్లీ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన అనంతరం సల్మాన్ ఖాన్ ఇలా స్పందించాడు. ISPL ప్రతిభావంతులైన ఆటగాళ్లకు సాధికారత కల్పిస్తుంది. భారత దేశంలోని ప్రతి వీధిలో ప్రతిధ్వనించే హృదయ స్పందన క్రికెట్. ఆ శక్తి స్టేడియంకు చేరుకున్నప్పుడు ISPL వంటి లీగ్లు పుడతాయి. క్రికెట్ పట్ల నేను ఎప్పుడూ మక్కువ కలిగి ఉంటాను. ఈ ప్రత్యేకమైన లీగ్ భారతదేశంలో అట్టడుగు స్థాయి క్రికెట్ను ప్రోత్సహించడమే కాకుండా ప్రతిభావంతులైన ఆటగాళ్లకు విలువైన వేదికను అందించడం ద్వారా వారికి సాధికారత కల్పిస్తుంది. కాబట్టి ISPLలో చేరడం నాకు చాలా సంతోషంగా ఉందంటూ ఓ ప్రకటనలో తెలిపారు.కాగా, ISPLలో విజేతకు రూ. కోటి, రన్నరప్కు రూ. 50 లక్షలు బహుమతిగా ఇస్తారు. -
ఆ రెండే కాదు.. మరో మూడు ఉన్నాయి.. గంభీర్పై పంత్ ఫ్యాన్స్ ఫైర్
టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ తీరు (Gautam Gambhir)పై స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఇంగ్లండ్తో తొలి టెస్టులో అద్భుత శతకాలు బాదిన ఆటగాడిని తక్కువ చేసినట్లు మాట్లాడటం సరికాదని హితవు పలుకుతున్నారు. వేరే వాళ్లను ప్రశంసించడంలో తప్పులేదని.. కానీ అందుకోసం పంత్ గురించి అడిగిన ప్రశ్నకు ఇంతలా అసహనం వ్యక్తం చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.విషయం ఏమిటంటే.. టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar-Anderson Trophy)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. ఈ టూర్తో భారత టెస్టు జట్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ తన ప్రయాణం ఆరంభించాడు. ఇక ఈ సిరీస్లో భాగంగా ఇరుజట్ల మధ్య లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో తొలి టెస్టు జరిగింది.ఐదు శతకాలుఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా మూడు సెంచరీలు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101)తో పాటు కెప్టెన్ గిల్ (147), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (134) కూడా శతకాలతో అలరించారు.ఇక రెండో ఇన్నింగ్స్లో జైస్వాల్ (4), గిల్ (8) విఫలం కాగా.. మరో ఓపెనింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (137), పంత్ (118) సెంచరీలు బాది.. జట్టును ఆదుకున్నారు. వీరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా ఇంగ్లండ్కు 371 పరుగుల లక్ష్యం విధించగలిగింది.అయితే, ఆఖరి రోజు వరకు ఉత్కంఠ సాగిన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు శతకాలు బాదినా టీమిండియాకు పరాభవమే మిగిలింది. ఫీల్డింగ్, బౌలర్ల వైఫల్యం కారణంగా ఓటమిని చవిచూసింది.ఆ రెండే కాదు.. మరో మూడు ఉన్నాయిఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం భారత జట్టు హెడ్కోచ్ గౌతం గంభీర్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా.. పంత్ ప్రదర్శన గురించి చెప్పాల్సిందిగా ఓ విలేకరి ప్రశ్నించారు. దీంతో అసహనానికి గురైన గౌతీ.. ‘‘ఈ మ్యాచ్లో మనకు మరో మూడో సెంచరీలు కూడా ఉన్నాయి.అవి కూడా అతిపెద్ద సానుకూల అంశాలే. మీరు ఈ ప్రశ్న అడిగినందుకు ధన్యవాదాలు. అయితే, యశస్వి బాదిన 100, కెప్టెన్గా అరంగేట్రంలోనే గిల్ చేసిన శతకం.. కేఎల్ రాహుల్ 100 గురించి కూడా మీరు ప్రస్తావించి ఉంటే ఇంకా సంతోషించేవాడిని.వీరు ఒక్కో సెంచరీ చేస్తే రిషభ్ పంత్ రెండు శతకాలు బాదాడు. ఒక్క టెస్టు మ్యాచ్లో ఐదు సెంచరీలు. నిజం చెప్పాలంటే.. ఇదొక గొప్ప ప్రదర్శన. ఏదేమైనా మీ ప్రశ్న ఇంకాస్త బెటర్గా ఉండాల్సింది’’ అని కౌంటర్ ఇచ్చాడు.అంత అసహనం ఎందుకు?ఈ మేరకు గంభీర్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కాగా... పంత్ ఫ్యాన్స్ అతడిపై ఫైర్ అవుతున్నారు. ఈ మ్యాచ్ సందర్భంగా పంత్ సాధించిన రికార్డులను ప్రస్తావిస్తూ గౌతీని విమర్శిస్తున్నారు. కాగా ఒకే టెస్టు మ్యాచ్లో రెండు శతకాలు బాదిన రెండో వికెట్ కీపర్ బ్యాటర్గా పంత్ చరిత్రకెక్కాడు. అతడి కంటే ముందు ఆండీ ఫ్లవర్ ఈ ఘనత సాధించాడు.మరోవైపు.. ఇంగ్లండ్లో రెండు ఇన్నింగ్స్లోనూ శతక్కొట్టిన ఏడో భారత బ్యాటర్గా పంత్ నిలిచాడు. అయితే, టీమిండియా ఇంగ్లండ్ చేతిలో ఓడటంతో అతడి వీరోచిత ప్రదర్శన వృథాగా పోయింది. ఇరుజట్ల మధ్య జూలై 2- 6 వరకు బర్మింగ్హామ్ వేదికగా రెండో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: ఏ ఒక్కరినో తప్పుబట్టను.. కెప్టెన్ నిర్ణయం ప్రకారమే అలా చేశాం: గంభీర్𝘈 𝘚𝘰𝘯𝘨 𝘰𝘧 𝘐𝘤𝘦 & 𝘍𝘪𝘳𝘦 𝘢𝘵 𝘏𝘦𝘢𝘥𝘪𝘯𝘨𝘭𝘦𝘺.🔥❄️@klrahul set the foundation with a composed and elegant century while @RishabhPant17’s quickfire hundred electrified the crowd with an explosive display of fearless strokeplay! 🤩WATCH FULL HIGHLIGHTS OF DAY 4… pic.twitter.com/MQ13EvHIae— Star Sports (@StarSportsIndia) June 23, 2025 -
Ind vs Eng 2nd Test: వాళ్లిద్దరిపై వేటు.. తుదిజట్టులో మార్పులు ఇవే!
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2025-27 సైకిల్ను టీమిండియా ఓటమితో ఆరంభించింది. టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar - Andersomn Trophy)లో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. లీడ్స్లోని హెడింగ్లీ మైదానం వేదికగా గిల్ సేన ఐదు సెంచరీలు బాదినా ఫలితం లేకుండా పోయింది.ఇద్దరూ విఫలమేఫీల్డింగ్, బౌలర్ల వైఫల్యం కారణంగా 371 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేక ఆతిథ్య జట్టు చేతిలో ఓడింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో స్టోక్స్ బృందం 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక తొలి టెస్టులో విఫలమైన ఆటగాళ్లలో ప్రధానంగా ఇద్దరు బ్యాటర్ల పేర్లు చెప్పవచ్చు.లీడ్స్ మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన చెన్నై యువ ఆటగాడు సాయి సుదర్శన్.. తొలి ఇన్నింగ్స్లో నాలుగు బంతులు ఎదుర్కొని డకౌట్(0)గా వెనుదిరిగాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 48 బంతుల్లో 30 పరుగులు చేయగలిగాడు. ఈ రెండు సందర్భాల్లోనూ అతడు ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్కే వికెట్ సమర్పించుకున్నాడు.మరోవైపు.. ఎనిమిదేళ్ల తర్వాత పునరాగమనం చేసిన కరుణ్ నాయర్ (Karun Nair) కూడా పూర్తిగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో సాయి మాదిరే డకౌట్ అయిన కరుణ్.. రెండో ఇన్నింగ్స్లో 20 పరుగులు చేయగలిగాడు. ఈ నేపథ్యంలో వీరు తదుపరి టెస్టు ఆడే అవకాశాలు సన్నగిల్లవచ్చని టీమిండియా దిగ్గజం, కామెంటేటర్ సునిల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు.అతడిని తీసుకోండిఅదే విధంగా.. బౌలింగ్ విభాగంలో చేయాల్సిన మార్పుల గురించి కూడా ప్రస్తావిస్తూ.. ‘‘జస్ప్రీత్ బుమ్రా ఫిట్గా ఉన్నాడో లేదో తెలియదు. ఇక తదుపరి మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ను తీసుకువస్తే మంచిది. శార్దూల్ ఠాకూర్ స్థానంలో అతడిని తీసుకుంటే బెటర్. బర్మింగ్హామ్లో పిచ్ మణికట్టు స్పిన్నర్లకు కాస్త సహకరిస్తుంది.వారిపై వేటు పడవచ్చుఅందుకే కుల్దీప్ వస్తే బాగుంటుంది అంటున్నాను. ఒకవేళ కాలం కలిసి రాకపోతే సాయి సుదర్శన్, కరుణ్ నాయర్లపై వేటు పడే అవకాశం ఉంది. నేనైతే ప్రస్తుతానికి వారిని జట్టు నుంచి తప్పించాలని అనుకోవడం లేదు.ఏదేమైనా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను జట్టులోకి తీసుకుంటే.. బ్యాటింగ్ లైనప్ బలపడుతుంది. బౌలింగ్ పరంగానూ కాస్త వైవిధ్యం చేకూరుతుంది’’ అని సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ షోలో గావస్కర్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఇంగ్లండ్- భారత్ మధ్య జూలై 2- 6 మధ్య రెండో టెస్టు జరుగనుంది. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ ఇందుకు వేదిక. కాగా ఈ సిరీస్లో టీమిండియా ఆతిథ్య జట్టుతో ఐదు టెస్టులు ఆడనుంది.ఇంగ్లండ్తో టెస్టులకు భారత జట్టు:యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, అభిమన్యు ఈశ్వరన్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, ధ్రువ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా. చదవండి: విధ్వంసకర శతకం, మూడు ఫిఫ్టీలు.. ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్ -
ఢిల్లీకి మారనున్న నితీశ్ రాణా
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహించే నితీశ్ రాణా.. రానున్న దేశవాలీ సీజన్ (2025-26) కోసం జట్టు మారనున్నాడు. రెండేళ్ల క్రితమే ఢిల్లీ నుంచి ఉత్తర్ప్రదేశ్కు మకాం మార్చిన నితీశ్ తిరిగి సొంతగూటికి చేరేందుకు సిద్దమయ్యాడు. ఈ మేరకు దేశీయ క్రికెట్ వర్గాల్లో బలమైన ప్రచారం జరుగుతుంది. నితీశ్కు అత్యంత సన్నితంగా వ్యవహరించే ఓ వ్యక్తి (చిన్ననాటి కోచ్ సంజయ్ భరద్వాజ్) ఈ విషయాన్ని ధృవీకరించాడు. తదుపరి సీజన్లో నితీశ్ ఢిల్లీ తరఫున ఆడతాడని అతను చెప్పాడు.31 ఏళ్ల నితీశ్ 2023-24 సీజన్కు ముందు ఢిల్లీని వీడి ఉత్తర్ప్రదేశ్కు వలస వెళ్లాడు. గతంలో నితీశ్ ఢిల్లీకి కెప్టెన్గా కూడా వ్యవహరించాడు. యూపీ తరఫున నితీశ్ పెద్దగా రాణించలేకపోయాడు. గత సీజన్లో అతను అన్ని ఫార్మాట్లలో దారుణంగా విఫలమయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో 9 మ్యాచ్ల్లో 111 పరుగులు.. విజయ్ హజారే ట్రోఫీలో 2 మ్యాచ్ల్లో 17 పరుగులు.. రంజీ ట్రోఫీలో 4 మ్యాచ్ల్లో 150 పరుగులు మాత్రమే చేశాడు. పేలవ ప్రదర్శనల కారణంగా నితీశ్ యూపీ జట్టులో స్థానం కోసం పాకులాడాల్సి వచ్చేది. ఎవరైనా మిడిలార్డర్ బ్యాటర్ గాయపడితేనే నితీశ్కు అవకాశాలు వచ్చేవి. దీంతో ఉపయోగం లేదని అనుకున్న నితీశ్ సొంతగూటికి తిరిగి రావడానికి సిద్దమయ్యాడు.అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో నితీశ్కు ఢిల్లీ జట్టులో గతంలోలా తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. పేలవ ఫామ్, జట్టును అకారణంగా వీడాడన్న కారణాల చేత ఢిల్లీ యాజమాన్యం నితీశ్ను గతంలో ఇచ్చిన ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్కు చెందిన ఓ వ్యక్తి నితీశ్ను ఉద్దేశిస్తూ.. ఇదేమీ డంప్ యార్డ్ కాదని సంచలన కామెంట్లు చేశాడు. దీన్ని బట్టి చూస్తే నితీశ్ ఢిల్లీ జట్టులో చేరినా అతని కెరీర్ నల్లేరుపై నడకలా ఉండకపోవచ్చు. నితీశ్ త్వరలో జరుగున్న ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో తన పేరును నమోదు చేసుకున్నాడు. ఈ దేశీయ లీగ్లో అతను సత్తా చాటగలిగితే ఢిల్లీ దేశవాలీ జట్టులో పూర్వవైభవం సాధించవచ్చు.నితీశ్ వర్సెస్ ఢిల్లీ కెప్టెన్ఒకవేళ నితీశ్ ఢిల్లీ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చినా అతని పరిస్థితి అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే నితీశ్ ఢిల్లీ సారధి ఆయుశ్ బదోనితో గొడవపడ్డాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ సందర్భంగా నితీశ్, బదోని బాహాబాహీకి దిగినంత పని చేశారు. ఆ సమయంలో అంపైర్లు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.ఐపీఎల్లోనూ అదే ప్రదర్శననితీశ్ తాజాగా ముగిసిన ఐపీఎల్లోనూ పేలవ ప్రదర్శనను కొనసాగించాడు. ఈ సీజన్కు ముందు రాజస్థాన్ రాయల్స్ అతన్ని రూ.4.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే అతను సామర్థ్యం మేరకు రాణించలేకపోయాడు. 11 ఇన్నింగ్స్ల్లో కేవలం 217 పరుగులు మాత్రమే చేశాడు. -
28 బంతుల్లో సెంచరీ.. మళ్లీ బ్యాట్ పట్టనున్న ఏబీ డివిలియర్స్
సౌతాఫ్రికా బ్యాటింగ్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ (AB DE Villiers) మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 (World Championship Of Legends) లీగ్ కోసం సౌతాఫ్రికా ఛాంపియన్స్ (South Africa Champions) జట్టులో జాయిన్ కానున్నాడు. ఈ లీగ్లో ఏబీడీ సౌతాఫ్రికా కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. సౌతాఫ్రికా జట్టులో ఏబీడీతో పాటు హషీమ్ ఆమ్లా, క్రిస్ మోరిస్, అల్బీ మోర్కెల్, వేన్ పార్నెల్, హార్డస్ విల్యోన్, ఆరోన్ ఫాంగిసో తదితర దిగ్గజాలు ఉన్నారు.2021 నవంబర్లో క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఏబీడీ.. ఇటీవలే ఓ సారి బ్యాట్ పట్టాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడి తన సహజ శైలిలో రెచ్చిపోయాడు. ఆ మ్యాచ్లో టైటాన్స్ లెజెండ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఏబీడీ.. బుల్స్ లెజెండ్స్తో జరిగిన మ్యాచ్లో 28 బంతుల్లో సెంచరీ చేశాడు. ఇందులో 15 సిక్సర్లు ఉన్నాయి.ఆ మ్యాచ్ తర్వాత ఏబీడీ తిరిగి జులైలో బ్యాట్ పట్టనున్నాడు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్ కోసం సౌతాఫ్రికా ఛాంపియన్స్ జట్టు ఏబీడీని సంప్రదించగా.. అతను ఒప్పుకున్నాడు. 41 ఏళ్ల ఏబీడీ తన అభిమానుల కోసమే ఈ లీగ్లో ఆడటానికి ఒప్పుకున్నానని చెప్పాడు.కాగా, వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్ 2025 ఇంగ్లండ్ వేదికగా జులైలో జరుగనుంది. ఇంగ్లండ్లోని బర్మింగ్హమ్, నార్తంప్టన్, లీడ్స్, లీసెస్టర్ నగరాల్లో మ్యాచ్లు జరుగనున్నాయి. ఈ లీగ్లో మొత్తం 6 జట్లు (ఇండియా ఛాంపియన్స్, దక్షిణాఫ్రికా ఛాంపియన్స్, ఆస్ట్రేలియా ఛాంపియన్స్, ఇంగ్లాండ్ ఛాంపియన్స్, వెస్టిండీస్ ఛాంపియన్స్ మరియు పాకిస్తాన్ ఛాంపియన్స్) పాల్గొంటాయి. ఈ లీగ్లో ఇది రెండో ఎడిషన్. గతేడాది ఈ లీగ్ పురుడు పోసుకుంది. గతేడాది కూడా జులైలో జరిగిన ఈ టోర్నీలో ఇండియా ఛాంపియన్స్ విజేతగా నిలిచింది. ఫైనల్లో యువరాజ్ సింగ్ నేతృత్వంలోని ఇండియా పాకిస్తాన్పై విజయం సాధించింది. ఆ మ్యాచ్లో భారత్ పాక్ నిర్దేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో ఛేదించింది. అంబటి రాయుడు 50, యూసఫ్ పఠాన్ 30 పరుగులు చేసి భారత్ విజయంలో ప్రధాన పాత్రలు పోషించారు.ఏబీడీ కెరీర్ విషయానికొస్తే.. ఈ ప్రొటీస్ విధ్వంసకర బ్యాటర్ దక్షిణాఫ్రికా తరఫున 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడి 20,014 పరుగులు చేశాడు. ఏబీడీ తన అంతర్జాతీయ కెరీర్లో 47 సెంచరీలు, 99 అర్ద సెంచరీలు సాధించాడు. ఏబీడీ 2018లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా వన్డేల్లో ఇప్పటికి అతని పేరిటే ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఉంది. 2015లో జోహనెస్బర్గ్లో అతను వెస్టిండీస్పై 31 బంతుల్లో సెంచరీ చేశాడు. ఏబీడీకి ఐపీఎల్లోనూ ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. లీగ్ ప్రారంభం నుంచి క్యాష్ రిచ్ లీగ్ ఆడిన ఏబీడీ 2021లో రిటైరయ్యాడు. ఈ లీగ్లో ఢిల్లీ డేర్డెవిల్స్ (ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్) మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున ఆడిన ఇతను.. 184 మ్యాచ్ల్లో 151.68 స్ట్రైక్-రేట్తో 5162 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. -
విధ్వంసకర శతకం, మూడు ఫిఫ్టీలు.. ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్
ఇంగ్లండ్లో టీమిండియా ఓటమి చవిచూసిన వేళ.. అండర్-19 క్రికెట్ జట్టు మాత్రం అదరగొట్టింది. ఇంగ్లండ్ యంగ్ లయన్స్తో మంగళవారం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో దుమ్ములేపింది. ధనాధన్ బ్యాటింగ్తో దంచికొట్టిన ఆయుశ్ మాత్రే సేన.. నిర్ణీత యాభై ఓవర్లలో ఏకంగా 444 పరుగులు సాధించింది.భారత జట్టు ఇన్నింగ్స్లో ఏకంగా 26 సిక్సర్లు నమోదు కావడం విశేషం. భారత లోయర్ మిడిల్ ఆర్డర్ ఈ మేరకు చెలరేగడం విశేషం. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేసిన 18 ఏళ్ల హర్వన్ష్ పంగాలియా (Harvansh Pangalia) సెంచరీతో కదం తొక్కాడు.52 బంతుల్లోనే 103 పరుగులుకేవలం 52 బంతుల్లోనే 103 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో ఎనిమిది ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు ఉన్నాయి. మిగిలిన వాళ్లలో రాహుల్ కుమార్, కనిష్క్ చౌహాన్ ఆర్ఎస్ అంబరిష్ అర్ధ శతకాలతో మెరిశారు. రాహుల్ 60 బంతుల్లో 73, కనిషష్క్ 67 బంతుల్లో 79 పరుగులు చేయగా.. అంబరిష్ 47 బంతుల్లో 72 రన్స్తో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.తేలిపోయిన ఆయుశ్, వైభవ్లాబొరో వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఐపీఎల్ యువ సంచలనాలు కెప్టెన్ ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) మాత్రం ఈ మ్యాచ్లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఆయుశ్ ఒక్క పరుగే చేయగా.. కేవలం 17 పరుగులు చేసి వైభవ్ పెవిలియన్ చేరాడు. కాగా ఇంగ్లండ్ బౌలర్లలో మ్యానీ లమ్స్డన్ నాలుగు వికెట్లు తీయగా.. మాథ్యూ ఫిబ్రాంక్ మూడు వికెట్లు పడగొట్టాడు.ఈ క్రమంలో భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ యంగ్ లయన్స్ను భారత బౌలర్లు 211 పరుగులకే కట్టడి చేశారు. దీపేశ్ దేవేంద్రన్ మూడు వికెట్లతో మెరవగా.. నమన్ పుష్పక్, విహాన్ మల్హోత్రా రెండేసి వికెట్లు తీశారు. ఇక ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ విల్ బెన్నిసన్ సెంచరీతో అలరించాడు.231 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చిత్తుఅయితే, అతడికి మిగిలిన ఆటగాళ్ల నుంచి సహకారం లేకపోవడంతో భారత్ చేతిలో ఇంగ్లండ్ 231 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. కాగా జూన్ 27 నుంచి జూలై 23 వరకు భారత అండర్-19 జట్టుకు ఇంగ్లండ్ లయన్స్ మధ్య ఐదు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది.ఇక భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన హర్వన్ష్ గంధిగామ్కు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్. గుజరాత్లోని రాణా ఆఫ్ కచ్కు చెందిన చిన్న పట్టణం నుంచి వచ్చాడు. అతడి కుటుంబం ప్రస్తుతం కెనడాలో సెటిలైంది. హర్వన్ష్ తండ్రి బ్రాంప్టన్లో ట్రక్కు డ్రైవర్గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టీమిండియా తొలి టెస్టులో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్ల సిరీస్లో లీడ్స్ వేదికగా ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయిన గిల్ సేన.. 0-1తో వెనుబడి ఉంది.ఇంగ్లండ్ పర్యటనకు భారత అండర్-19 జట్టు ఇదేఆయుష్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్సింగ్ చావ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), హర్వన్ష్ సింగ్ (వికెట్ కీపర్), ఆర్.ఎస్. అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, యుధాజిత్ గుహ, ప్రణవ్ రాఘవేంద్ర, మొహ్మద్ ఇనాన్, ఆదిత్య రానా, అన్మోల్జీత్ సింగ్.స్టాండ్ బై ప్లేయర్లు: నమన్ పుష్కక్, డి. దీపేశ్, వేదాంత్ త్రివేది, వికల్ప్ తివారి, అలంకృత్ రాపోలే (వికెట్ కీపర్).చదవండి: ఏ ఒక్కరినో తప్పుబట్టను.. కెప్టెన్ నిర్ణయం ప్రకారమే అలా చేశాం: గంభీర్ -
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. 'ఆ ఘనత' సాధించిన తొలి మొనగాడు
టీమిండియా వికెట్కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో 800 రేటింగ్ పాయింట్లు సాధించిన తొలి భారత వికెట్కీపర్ బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ వికెట్కీపర్ బ్యాటర్ 800 రేటింగ్ పాయింట్లు సాధించలేదు. టీమిండియా దిగ్గజ వికెట్కీపర్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోనికి కూడా ఇది సాధ్యపడలేదు.ఐసీసీ తాజాగా (జూన్ 25) విడుదల చేసిన ర్యాంకింగ్స్లో పంత్ 800 రేటింగ్ పాయింట్ల మార్కును (801) తాకాడు. అలాగే ర్యాంకింగ్స్లో ఓ స్థానం మెరుగపర్చుకొని ఏడో స్థానానికి ఎగబాకాడు. ప్రస్తుతమున్న వికెట్కీపర్లలో పంత్దే అత్యుత్తమ ర్యాంకింగ్. ఇంగ్లండ్తో నిన్న (జూన్ 24) ముగిసిన తొలి టెస్ట్లో రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేయడంతో పంత్ ఈ ఘనతలను సాధించాడు.తాజా ర్యాంకింగ్స్లో టాప్-10లో పంత్తో పాటు మరో భారత బ్యాటర్ కూడా ఉన్నాడు. ఇంగ్లండ్తో తొలి టెస్ట్లో (తొలి ఇన్నింగ్స్లో) సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. మరో తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో, టీమిండియా నయా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఐదు స్థానాలు మెరుగుపర్చుకొని 20వ స్థానానికి చేరాడు. సెకెండ్ ఇన్నింగ్స్లో అద్బుతమైన సెంచరీ చేసిన కేఎల్ రాహుల్ ఏకంగా 10 స్థానాలు మెరుగుపర్చుకొని 38వ స్థానానికి ఎగబాకాడు.ఈ వారం ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ గణనీయంగా లబ్ది పొందాడు. భారత్పై అద్భుతమైన సెంచరీ (149) చేసినందుకు గానూ ఐదు స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లలో జో రూట్, హ్యారీ బ్రూక్ మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా.. ఓలీ పోప్ 3 స్థానాలు మెరుగుపర్చుకొని 19వ స్థానానికి ఎగబాకాడు. కేన్ విలియమ్సన్ 3, స్టీవ్ స్మిత్ 5, టెంబా బవుమా 6, కమిందు మెండిస్ 9, సౌద్ షకీల్ 10 స్థానాల్లో ఉన్నారు.మిగతా బ్యాటర్ల విషయానికొస్తే.. ఇటీవల శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్లో రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేసిన బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ షాంటో ఏకంగా 21 స్థానాలు మెరుగుపర్చుకొని 29వ స్థానానికి చేరగా.. అదే మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన మరో బంగ్లాదేశీ ముష్ఫికర్ రహీం 11 స్థానాలు మెరుగుపర్చుకొని 28వ స్థానానికి ఎగబాకాడు. అదే మ్యాచ్లో భారీ సెంచరీ చేసిన శ్రీలంక ఆటగాడు పథుమ్ నిస్సంక కూడా 21 స్థానాలు మెరుగుపర్చుకొని 31వ స్థానానికి ఎగబాకాడు. ఈ వారం బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ఇవే చెప్పుకోదగ్గ మార్పులు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టాప్-10 పెద్దగా మార్పులేమీ లేవు. బుమ్రా, రబాడ, కమిన్స్, నౌమన్ అలీ, హాజిల్వుడ్, నాథన్ లియోన్, జన్సెన్, మ్యాట్ హెన్రీ టాప్-8లో కొనసాగుతున్నారు. మిచెల్ స్టార్క్ ఓ స్థానం ఎగబాకి తొమ్మిదో స్థానానికి చేరాడు. భారత్తో తాజాగా జరిగిన టెస్ట్లో రాణించిన బ్రైడన్ కార్స్ 8 స్థానాలు, జోష్ టంగ్ 16 స్థానాలు మెరుగుపర్చుకొని 32, 64 స్థానాలకు ఎగబాకారు. ఇంగ్లండ్తో తొలి టెస్ట్లో పర్వాలేదనిపించిన భారత పేసర్ ప్రసిద్ద్ కృష్ణ 21 స్థానాలు మెరుగుపర్చుకొని 72వ ప్లేస్కు చేరాడు. ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో రవీంద్ర జడేజా, మెహిది హసన్ మిరాజ్, జన్సెన్ టాప్-3లో కొనసాగుతున్నారు. -
Jaiswal: నీకసలు బుద్ధుందా? రోహిత్ ఉంటే ఒక్కటి ఇచ్చేవాడు..
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashavi Jaiswal)పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెత్త ఫీల్డింగ్తో జట్టు ఓటమికి కారణమైందే గాకుండా.. డాన్సులు వేస్తావా? అంటూ మండిపడుతున్నారు. కాగా ఐదు టెస్టు మ్యాచ్లు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్ (India vs England)లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది. ఫీల్డింగ్, బౌలర్ల వైఫల్యం కారణంగా ఐదు వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు మరీ చెత్తగా ఫీల్డింగ్ చేశారు.నాలుగు క్యాచ్లను జారవిడిచిన జైసూమొత్తంగా ఐదు రోజుల ఆటలో దాదాపు ఎనిమిది క్యాచ్లు డ్రాప్ చేసి.. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లకు లైఫ్ ఇచ్చి మూల్యం చెల్లించారు. ఇందులో నాలుగు క్యాచ్లను యశస్వి జైస్వాల్ జారవిడిచాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ కీలక సమయాల్లో బ్యాటర్లు ఇచ్చిన క్యాచ్లను నేలపాలు చేసిన జైసూ.. ఆఖరి రోజు ఆటలోనూ బెన్ డకెట్ (149) క్యాచ్ విడిచిపెట్టేశాడు.మహ్మద్ సిరాజ్ బౌలింగ్లో డకెట్.. 97 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నపుడు క్యాచ్ ఇవ్వగా.. జైసూ దానిని జారవిడిచాడు. ఆ ర్వాత డకెట్ భారీ సెంచరీ చేసి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఇప్పటికే జైస్వాల్పై అభిమానులు, భారత మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.డాన్స్ చేసిన జైసూ.. అభిమానులు ఫైర్ఇంగ్లండ్ విజయానికి చేరువవుతున్న వేళ.. యశస్వి జైస్వాల్ బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో చిన్నగా స్టెప్పులేస్తూ కనిపించాడు. ఇంగ్లండ్ అభిమానుల ప్రేక్షకులు చిరునవ్వులు చిందిస్తుండగా.. వారి ముందు జైసూ నవ్వుతూ కాలుకదిపాడు. ఇది చూసిన నెటిజన్లు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.‘‘నీకసలు బుద్ధి ఉందా?.. ఏకంగా నాలుగు క్యాచ్లు మిస్ చేశావు. ప్రత్యర్థి జట్టు గెలుపునకు పరోక్షంగా కారణమయ్యావు. అయినా.. ఏమాత్రం బాధ లేకుండా డాన్స్ చేస్తున్నావా?.. ఇప్పుడు గనుక కెప్టెన్గా రోహిత్ శర్మ మైదానంలో ఉంటే.. చెంప మీద ఒక్కటి ఇచ్చేవాడు’’ అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.మరికొందరేమో.. ‘‘విరాట్ కోహ్లిని కాపీ కొట్టాలని చూస్తున్నావేమో.. నువ్వెప్పటికీ కింగ్వి కాలేవు’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే, జైసూ అభిమానులు మాత్రం అతడికి అండగా నిలుస్తున్నారు. బ్యాటర్గా తన వంతు పూర్తి చేసిన ఈ యువ ఆటగాడి పట్ల అంత ద్వేషం పనికిరాదని.. ఇంగ్లండ్ గడ్డ మీద తన తొలి మ్యాచ్ను అతడు ఆస్వాదించడంలో తప్పేంటని ప్రశ్నిస్తున్నారు.గిల్కు చేదు అనుభవంకాగా ఇంగ్లండ్తో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో జైస్వాల్ శతక్కొట్టాడు. మొత్తంగా 159 బంతులు ఎదుర్కొని 16 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 101 పరుగులు సాధించాడు. అయితే, రెండో ఇన్నింగ్స్లో మాత్రం ఈ లెఫ్టాండర్ బ్యాటర్ విఫలమయ్యాడు. పదకొండు బంతులు ఎదుర్కొని కేవలం నాలుగు పరుగులే చేశాడు. ఇక ఈ మ్యాచ్తో భారత టెస్టు జట్టు సారథిగా ప్రస్థానం ఆరంభించిన శుబ్మన్ గిల్కు.. ఓటమి రూపంలో తొలి ప్రయత్నంలోనే భంగపాటు ఎదురైంది.చదవండి: ఏ ఒక్కరినో తప్పుబట్టను.. కెప్టెన్ నిర్ణయం ప్రకారమే అలా చేశాం: గంభీర్Bro Jaiswal dancing happily after dropping 7 catches in a single match.Helped England to win single-handedly.Goal achieved.#INDvsENG pic.twitter.com/EqjsxuJ5vO— Villager Anuj Tomar (@Da___Engineer) June 24, 2025 -
మాగ్నస్ కార్ల్సెన్కు చెమటలు పట్టించిన 9 ఏళ్ల ఢిల్లీ బాలుడు
ప్రపంచ చెస్ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్సెన్కు ఢిల్లీకి చెందిన తొమ్మిదేళ్ల ఆరిత్ కపిల్ చెమటలు పట్టించాడు. మంగళవారం అర్ధరాత్రి ప్రముఖ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో జరిగిన 'ఎర్లీ టైటిల్డ్ ట్యూస్డే' చెస్ టోర్నమెంట్లో కార్ల్సెన్ను ఆరిత్ ఓడించినంత పనిచేశాడు.తొమ్మిదేళ్ల అరిత్ ఎత్తుల ముందు ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన కార్ల్సెన్ తడబడ్డాడు. అయితే ఆఖరి రౌండ్లో సమయం దగ్గరపడుతుండంతో కపిల్ తనకు లభించిన అవకాశాన్ని ఉపయెగించుకోలేకపోయాడు. దీంతో గేమ్ డ్రాగా ముగిసింది.ఆరిత్ ఈ ఈవెంట్లో జార్జియా నుంచి పాల్గోన్నాడు. అతడు ప్రస్తుతం జార్జియా వేదికగా జరుగుతున్న అండర్-10 ప్రపంచ ఛాంపియన్షిప్లో పోటీపడుతున్నాడు. ఇప్పటికే రెండు రౌండ్లలో విజయం సాధించిన అరిత్..బుధవారం తన మూడవ గేమ్ ఆడనున్నాడు. అంతకుముందు అండర్-9 ప్రపంచ ఛాంపియన్షిప్ రన్నరప్గా ఆరిత్ నిలిచాడు.మరోవైపు భారత్కు చెందిన వి. ప్రణవ్ 10 పాయింట్లతో ఈ 'ఎర్లీ టైటిల్డ్ ట్యూస్డే' టైటిల్ను సొంతం చేసుకున్నాడు. అమెరికన్ గ్రాండ్మాస్టర్ హాన్స్ మోక్ నీమాన్ , కార్ల్సెన్ ఇద్దరూ 9.5 పాయింట్లతో ముగించారు. కానీ టైబ్రేక్లో నీమాన్ రెండవ స్థానాన్ని దక్కించుకున్నాడు.చదవండి: అనుభవం ఉండి ఏం లాభం?.. మరీ ఇలా ఆడతావా?: డీకే ఫైర్ -
గావస్కర్, రవిశాస్త్రి కాదు!.. ఇతడికే కామెంటేటర్గా ఎక్కువ జీతం!
క్రికెట్ మైదానంలో ఆటగాళ్లు తమ ప్రదర్శనతో ప్రేక్షకులను ఎంతగా అలరిస్తారో.. తమ వ్యాఖ్యానంతో టీవీల ముందు కూర్చునే అభిమానులను అంతే అలరిస్తారు కామెంటేటర్లు. ఆటగాడిపై ప్రశంసల కురిపించాలన్నా.. బాగా ఆడకపోతే విమర్శలు చేయాలన్న.. కొట్టిన షాట్లను, గత రికార్డులను విశ్లేషించాలన్న మాటలతో మ్యాజిక్ చేసే వ్యాఖ్యతలు కావాల్సిందే.రేడియోలో క్రికెట్ కామెంటరీ వినే రోజుల నుంచి ఇప్పటివరకు ఎంతో మంది కామెంటేటర్లు తమ మాటల చాతుర్యంతో ఫ్యాన్స్ను అలరిస్తూనే ఉన్నారు. ఈ కోవకు చెందిన వారే భారత దిగ్గజ కామెంటేటర్లు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, హర్షా భోగ్లే, నవ్జ్యోత్ సింగ్ సిద్దు. వీరంతా ఐసీసీ టోర్నీలు, ద్వైపాక్షిక సిరీస్లు, ఐపీఎల్ వంటి ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్లో తమ మైక్ పట్టి సందడి చేస్తారు. మరి ఈ లెజెండరీ కామెంటేర్ల ఆదాయం ఎంతో తెలుసా? ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నారో మీకు తెలుసా?క్రిక్బ్లోగర్ రిపోర్ట్స్ ప్రకారం.. మాజీ క్రికెటర్ నవ్జ్యోత్ సింగ్ సిద్దు అత్యధిక పారితోషికం పొందుతున్న భారతీయ వ్యాఖ్యతగా నిలిచాడు. అతడు ఒక రోజుకు కామెంటేటర్గా 15 లక్షలు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లీష్ కంటే హిందీ కామెంటరీ అందించడంలో సిద్దుని మించిన వారు లేరు.తన మాటలతో అభిమానులను మంత్రముగ్ధులను చేస్తాడు. ఐపీఎల్ సమయంలో సిద్దుని కామెంటేటర్గా ఎక్కువగా మనం చూస్తాము. అయితే ఐసీసీ టోర్నీలు, ద్వైపాక్షిక సిరీస్లలో ఇంగ్లీష్ వ్యాఖ్యనం అందించే భారత క్రికెట్ దిగ్గజం రవి శాస్త్రి.. రోజుకు రూ. 12 లక్షలు సంపాదిస్తున్నట్లు సమాచారం. రవిశాస్త్రితో పాటు భారత మాజీ ఓపెనర్ సునీల్ గవాస్కర్ కామెంటేటర్గా రోజుకు రూ. 7లక్షలు అర్జిస్తున్నరంట.క్రిక్బ్లోగర్ రిపోర్ట్స్ ప్రకారం కామెంటేటర్ల సంపాదన ఇదే..👉నవజ్యోత్ సింగ్ సిద్ధూ - రూ.15 లక్షలు👉రవిశాస్త్రి - రూ.12 లక్షలు👉వీరేంద్ర సెహ్వాగ్ - రూ.10 లక్షలు👉ఆశిష్ నెహ్రా - రూ.9 లక్షలు👉ఇర్ఫాన్ పఠాన్ - రూ.7 లక్షలు👉సునీల్ గవాస్కర్ - రూ.6 లక్షలు👉దినేష్ కార్తీక్ - రూ. 6 లక్షలు👉సంజయ్ మంజ్రేకర్ - రూ.6 లక్షలు👉అనిల్ కుంబ్లే - రూ.5–6 లక్షలు👉పార్థివ్ పటేల్ - రూ.4–5 లక్షలు👉అజయ్ జడేజా - రూ. 4 లక్షలు👉ఛెతేశ్వర్ పుజారా - రూ. 4 లక్షలు👉దీప్ దాస్గుప్తా - రూ.3–4 లక్షలు👉హర్ష భోగ్లే - రూ. 3 లక్షలుచదవండి: ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.. లేదంటే గెలవడం కష్టమే: రవిశాస్త్రి -
అనుభవం ఉండి ఏం లాభం?.. మరీ ఇలా ఆడతావా?: డీకే ఫైర్
ఇంగ్లండ్తో తొలి టెస్టులో టీమిండియా స్టార్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఆట తీరును భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) విమర్శించాడు. జడ్డూ బౌలింగ్ చేసిన విధానం తనను ఆశ్చర్యానికి లోనుచేసిందన్నాడు. అనుభవజ్ఞుడైన అతడు విఫలం కావడం వల్ల జట్టు భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar-Anderson Trophy)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్తో పర్యటిస్తోంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం- మంగళవారం తొలి టెస్టు జరిగింది. లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్తో భారత టెస్టు జట్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ తన ప్రయాణం మొదలుపెట్టాడు.అందరికంటే సీనియర్ఇక ఇంగ్లండ్కు వెళ్లిన జట్టులో రవీంద్ర జడేజానే అందరికంటే సీనియర్. అయితే, తొలి టెస్టులో ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ నిరాశపరిచాడు. రెండు ఇన్నింగ్స్లో కలిపి 36 (11, 25 నాటౌట్) పరుగులు చేసిన జడ్డూ.. బౌలింగ్లో పూర్తిగా తేలిపోయాడు.ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 23 ఓవర్లు బౌలింగ్ వేసిన జడ్డూ.. 68 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక రెండో ఇన్నింగ్స్లోనూ అతడు విఫలం చెందాడు. ముఖ్యంగా ఫలితాన్ని తేల్చే మంగళవారం నాటి ఐదో రోజు ఆటలో భాగంగా జడ్డూ స్థాయికి తగ్గట్లు బౌలింగ్ చేయలేకపోయాడు.ముఖ్యంగా ఎడమచేతి వాటం బ్యాటర్ల పని పట్టడంలో ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ విఫలమయ్యాడు. అతడి బౌలింగ్లో ఇంగ్లండ్ బ్యాటర్లు తొలి రెండు సెషన్లలో రివర్స్ స్వీప్ షాట్లతో తేలికగా పరుగులు పిండుకున్నారు. బెన్ డకెట్ శతకం (149)తో చెలరేగగా.. టీ బ్రేక్ తర్వాత పాత బడిన పిచ్పై జడ్డూ మ్యాజిక్ చేయగలిగాడు. బెన్ స్టోక్స్ (33)ను ఎట్టకేలకు పెవిలియన్కు పంపాడు.అనుభవం ఉండి ఏం లాభం?ఈ విషయంపై భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ స్పందిస్తూ.. ‘‘జడేజా రఫ్సైడ్ వేయకుండా స్ట్రెయిట్గా బౌల్ చేశాడు. అది నన్ను ఆశ్చర్యపరిచింది. అన్ఈవెన్ పిచ్పై తన పాత్ర పోషించడంలో విఫలమయ్యాడు.అనుభవం ఉన్న ఆటగాడు అతడు. అయినా.. ఇలా ఎందుకు ఎలా చేశాడో తెలియదు. వైడ్ ఆఫ్ ది వికెట్ వేయాల్సింది. సరైన చోట బంతులు వేయడంలో జడ్డూ విఫలమయ్యాడు’’ అని విమర్శించాడు.కాగా తొలి టెస్టులో ఓటమితో గిల్ సేన ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 0-1తో వెనుకబడింది. ఇక ఇంగ్లండ్- భారత్ మధ్య జూలై 2- జూలై 6 వరకు బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ మైదానంలో రెండో టెస్టు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తొలి టెస్టు స్కోర్లుభారత్ స్కోర్లు: 471 & 364ఇంగ్లండ్ స్కోర్లు: 465 & 373/5ఫలితం: ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చేతిలో భారత జట్టు ఓటమి.చదవండి: ఏ ఒక్కరినో తప్పుబట్టను.. కెప్టెన్ నిర్ణయం ప్రకారమే అలా చేశాం: గంభీర్#BenDuckett’s brilliant 149 set the tone for England’s highest successful chase at Leeds and their second-highest in Test history.👉 Relive the innings that turned the tide in the 1st Test : https://t.co/MhwlN52U7s#ENGvIND 👉🏻 2nd TEST | WED, 2nd JULY, 2.30 PM on JioHotstar pic.twitter.com/1uRcpT5vRE— Star Sports (@StarSportsIndia) June 24, 2025 -
ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.. లేదంటే గెలవడం కష్టమే: రవిశాస్త్రి
ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను భారత జట్టు ఓటమితో ఆరంభించింది. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో 5 వికెట్ల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ తొలి నాలుగు రోజులు ఆతిథ్య జట్టుపై అధిపత్యం చెలాయించిన టీమిండియా.. కీలకమైన ఆఖరి రోజు మాత్రం తేలిపోయింది.371 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత బౌలర్లు డిఫెండ్ చేసుకుపోలేకపోయారు. శార్ధూల్ ఠాకూర్, ప్రసిద్ద్ కృష్ణ తలా రెండు వికెట్లు సాధించగా.. రవీంద్ర జడేజా ఒక్క వికెట్ సాధించాడు. మిగితా బౌలర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు.అయితే సెకెండ్ ఇన్నింగ్స్లో బుమ్రా ఒక్క వికెట్ తీయకపోయినప్పటికి.. తొలి ఇన్నింగ్స్లో మాత్రం బుమ్రా ఒంటరి పోరాటం చేశాడు. ఐదు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ను ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.బుమ్రాకు విశ్రాంతి..!కాగా బుమ్రా వర్క్ లోడ్ను దృష్టిలో పెట్టుకుని రెండో టెస్టుకు అతడికి విశ్రాంతి ఇవ్వాలని టీమ్ మెనెజ్మెంట్ భావిస్తోంది. ఈ సిరీస్లో బుమ్రా కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడుతాడని టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గంభీర్ అండ్ కోకు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri) కీలక సూచనలు చేశాడు. "సెకెండ్ టెస్టుకు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలనుకుంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి.ఎందుకంటే బుమ్రా లేకపోతే ఆ మ్యాచ్లో భారత్ ఓడిపోయే అవకాశం ఉంది. అప్పుడు 2-0 తేడాతో వెనకబడితే సిరీస్ విజయం సాధించడం కష్టతరమవుతుంది.లీడ్స్ టెస్టులో ఓటమిని భారత జట్టు జీర్ణించుకోలేదు. గెలిచేందుకు అవకాశమున్న మ్యాచ్లో వారు ఓడిపోయారు. ఫీల్డింగ్లో చేసిన తప్పిదాలతో ఇంగ్లండ్కు గెలిచే అవకాశం కల్పించారు. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి.అదేవిధంగా టెయిలాండర్ల నుంచి భారత్కు బ్యాటింగ్ సపోర్ట్ కావాలి" అని స్కై స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శాస్త్రి పేర్కొన్నాడు. ఇక ఇంగ్లండ్- భారత్ మధ్య రెండో టెస్టు వచ్చే బుధవారం నుంచి ఎడ్జ్బాస్టన్ వేదికగా జరగనుంది.చదవండి: ఏ ఒక్కరినో తప్పుబట్టను.. కెప్టెన్ నిర్ణయం ప్రకారమే అలా చేశాం: గంభీర్ -
మా అన్నను ఆడించేందుకు.. నాపై వేటు వేశారు: భారత మాజీ క్రికెటర్
సీకే నాయుడు- సీఎస్ నాయుడు, క్రిపాల్ సింగ్- ఏజీ మిల్కా సింగ్, సుభాష్- బాలూ గుప్తే, అమర్ సింగ్- లధా రామ్జీ, మాధవ్- అరవింద్ ఆప్టే, మోహిందర్- సురీందర్ అమర్నాథ్, వజీర్ అలీ- నజీర్ అలీ, టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన అన్నదమ్ముల జోడీలు ఇవి.ప్రస్తుతం ఆక్టివ్గా ఉన్న హార్దిక్ పాండ్యా- కృనాల్ పాండ్యా (Hardik Pandya- Krunal Pandya)లతో పాటు మాజీ ఆటగాళ్లు పఠాన్ బ్రదర్స్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. అన్న యూసఫ్ పఠాన్ (Yousuf Pathan) బ్యాటింగ్ ఆల్రౌండర్ అయితే.. తమ్ముడు ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) బౌలింగ్ ఆల్రౌండర్. అన్న కంటే ముందు తమ్ముడే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అయితే, ఎవరికి వారు తమదైన శైలిలో దూసుకుపోయి గుర్తింపు సాధించారు.ఇక వీరిద్దరు మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన, 2011 వన్డే వరల్డ్కప్ గెలిచిన భారత జట్టులో సభ్యులు కావడం మరో విశేషం. ఇదిలా ఉంటే.. ఒకానొక సందర్భంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో అన్న యూసఫ్ సేవలు వినియోగించుకునే క్రమంలో టీమిండియా యాజమాన్యం తమ్ముడు ఇర్ఫాన్ను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టిందట.కోచ్ నాతో ఇదే అన్నాడుఈ విషయాన్ని ఇర్ఫాన్ పఠాన్ తాజాగా వెల్లడించాడు. శ్రీలంక పర్యటనలో భాగంగా తాను అద్భుత ప్రదర్శన కనబరిచినా.. తదుపరి న్యూజిలాండ్ టూర్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశాన్ని మేనేజ్మెంట్ ఇవ్వలేదని తెలిపాడు. యూసఫ్ కోసం తనను తప్పించామని నాటి కోచ్ గ్యారీ కిర్స్టన్ స్వయంగా తనతో అన్నట్లు తెలిపాడు.మా అన్నను ఆడించేందుకు.. నాపై వేటు వేశారుఈ మేరకు సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ షోలో మాట్లాడుతూ.. ‘‘టీమిండియాలో నా స్థానాన్ని నా సోదరుడు తీసుకున్నాడు. 2009లో శ్రీలంకతో మ్యాచ్లో మేమిద్దరం కలిసి ఆడి.. గెలిచాం. రెండు మ్యాచ్లలో కలిపి నేను నాలుగు వికెట్లు తీశాను.జట్టులో నా చోటు పదిలమైందని అనుకున్నాను. కానీ న్యూజిలాండ్తో నాకు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత జట్టు నుంచి తప్పించారు.అప్పుడు గ్యారీ కిర్స్టన్.. ‘సారీ.. నీకు జట్టులో చోటు లేదు.. ఎందుకంటే.. ఏడో స్థానంలో ఆడేందుకు మేము మీ సోదరుడి పేరును పరగణనలోకి తీసుకున్నాం’ అని చెప్పాడు’’’ అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు. జట్టు కూర్పు కోసం ఎవరిపై ఎప్పుడు ఎందుకు వేటు వేస్తారో తెలియని పరిస్థితి ఉంటుందని పేర్కొన్నాడు. ఇంగ్లండ్- టీమిండియా మధ్య టెస్టు సిరీస్ నేపథ్యంలో చర్చ సందర్భంగా ఇర్ఫాన్ ఈ విషయాన్ని వెల్లండించాడు.బ్రదర్స్ అదుర్స్కాగా గుజరాత్కు చెందిన 40 ఏళ్ల ఇర్ఫాన్ పఠాన్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్. 2003- 2012 వరకు టీమిండియాకు ఆడిన ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్.. 29 టెస్టుల్లో 100, 120 వన్డేల్లో 173, 24 టీ20 మ్యాచ్లలో 28 వికెట్లు కూల్చాడు.అదే విధంగా.. ఎడమచేతి వాటం గల ఇర్ఫాన్ పఠాన్ టెస్టుల్లో 1105, వన్డేల్లో 1544, టీ20లలో 127 పరుగులు సాధించాడు. మరోవైపు.. 42 ఏళ్ల యూసఫ్ పఠాన్ 2007- 2012 మధ్య కాలంలో 57 వన్డేల్లో 810, 22 టీ20లలో 236 పరుగులు చేశాడు. ఈ రైటార్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్ ఖాతాలో 33 వన్డే వికెట్లు, 13 టీ20 వికెట్లు ఉన్నాయి.చదవండి: ఏ ఒక్కరినో తప్పుబట్టను.. కెప్టెన్ నిర్ణయం ప్రకారమే అలా చేశాం: గంభీర్𝘒𝘢𝘩𝘢𝘯𝘪 𝘣𝘩𝘢𝘪𝘺𝘰 𝘬𝘪...𝘗𝘢𝘵𝘩𝘢𝘯 𝘬𝘪 𝘻𝘶𝘣𝘢𝘯𝘪! 😊#SonySportsNetwork #GroundTumharaJeetHamari #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings | @IrfanPathan @rpsingh @Vimalwa pic.twitter.com/AkdeeMzz67— Sony Sports Network (@SonySportsNetwk) June 24, 2025 -
ఏ ఒక్కరినో తప్పుబట్టను.. కెప్టెన్ నిర్ణయం ప్రకారమే అలా చేశాం: గంభీర్
ఇంగ్లండ్తో టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీని టీమిండియా పరాజయంతో ప్రారంభించింది. లీడ్స్లో జరిగిన తొలి టెస్టు (Ind vs Eng 1st Test)లో ఐదు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు ఐదు సెంచరీలు సాధించినప్పటికీ భారత్కు చేదు అనుభవమే మిగిలింది.బ్యాటింగ్లో లోయర్ ఆర్డర్ పూర్తిగా విఫలం కావడం.. ఫీల్డర్ల బౌలర్ల వైఫల్యం తీవ్ర ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో గిల్ సేన ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)మాత్రం జట్టుకు అండగా నిలిచాడు. ఏ ఒక్కరిని నిందించేందుకు తాను సిద్ధంగా లేనని.. గెలిచినా, ఓడినా ఆటగాళ్లంతా ఒక్కటిగా ఉంటారని పేర్కొన్నాడు.అంతా కలిసి కేవలం తొమ్మిది పరుగులేకాగా ఇంగ్లండ్తో తొలి టెస్టులో భారత లోయర్ ఆర్డర్ (8-11 స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చినవాళ్లు) అంతా కలిసి కేవలం తొమ్మిది పరుగులే చేసింది. ఈ విషయం గురించి ప్రస్తావన రాగా.. ‘‘కొన్నిసార్లు కొందరు విఫలమవుతారు. నిరాశ కలిగించే విషయమే అయినా మరేం పర్లేదు.అయితే, అందరి కంటే ఎక్కువ సదరు ఆటగాళ్లే ఎక్కువ నిరాశకు లోనవుతారు. ఎందుకంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయామని వారికి తెలుసు. ఒకవేళ మొదటి ఇన్నింగ్స్లో మేము 570- 580 పరుగులు చేసినట్లయితే మా ఆధిపత్యమే కొనసాగేది.ప్రతి ఒక్కరు నెట్స్లో తీవ్రంగా శ్రమించారు. అయితే, అన్నిసార్లూ అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోవచ్చు. స్పెషలిస్టు బ్యాటర్లు కూడా విఫలమయ్యారు. అంతమాత్రాన ఏ ఒక్కరినో వేరు చేసి నిందించాల్సిన పనిలేదు.ఈ మ్యాచ్లో మేము గెలిచే సందర్భాలు కూడా ఎన్నో వచ్చాయి. కానీ దురదృష్టవశాత్తూ పని పూర్తి చేయలేకపోయాం. ఏదేమైనా గెలిచినా, ఓడినా ఒక్కటే. కలిస్తే గెలుస్తాం.. కలిసే ఓడిపోతాం’’ అని గంభీర్ మీడియా సమావేశంలో పేర్కొన్నాడు.కెప్టెన్ నిర్ణయం ప్రకారమే అలా చేశాంఇక శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) గురించి ప్రశ్నించగా.. ‘‘అతడిని మేము స్పెషలిస్టు బౌలర్గా జట్టులోకి తీసుకోలేదు. బౌలింగ్ ఆల్రౌండర్గానే తీసుకున్నాం. కొన్నిసార్లు కెప్టెన్ నిర్ణయంతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్లో శార్దూల్ రెండు వికెట్లు మాత్రమే తీశాడు. అదే విధంగా.. 1, 4 పరుగులు స్కోర్ చేశాడు.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సైకిల్ను టీమిండియా ఇంగ్లండ్తో సిరీస్తో మొదలుపెట్టింది. ఐదు టెస్టులు ఆడేందుకు అక్కడికి వెళ్లిన భారత జట్టు.. హెడింగ్లీ మైదానంలో జరిగిన తొలి మ్యాచ్లోనే ఓడిపోయింది. టీమిండియా టెస్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ ఈ సిరీస్తో తన ప్రయాణం మొదలుపెట్టగా.. ఓటమి కారణంగా నిరాశే ఎదురైంది.ఇక ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101), కెప్టెన్ శుబ్మన్ గిల్ (147), వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (134) సెంచరీలు బాదారు. ఇక రెండో ఇన్నింగ్స్లో ఓపెనర్ కేఎల్ రాహుల్ (137)తో పాటు రిషభ్ పంత్ (118) శతక్కొట్టాడు.టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ తొలి టెస్టు స్కోర్లుటీమిండియా: 471 & 364ఇంగ్లండ్: 465 & 373/5.చదవండి: వారి వల్లే ఓడిపోయాము.. అందుకు ఇంకా సమయం ఉంది: గిల్ -
శుభమ్ సూపర్ ఇన్నింగ్స్.. నైట్రైడర్స్పై సూపర్కింగ్స్ విజయం
మేజర్ లీగ్ క్రికెట్-2025 టోర్నీలో టెక్సాస్ సూపర్ కింగ్స్ తిరిగి గెలుపు బాట పట్టింది. బుధవారం డల్లాస్ వేదికగా లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 52 పరుగుల తేడాతో సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన టీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ సాధిచింది.టీఎస్కే బ్యాటర్లలో శుభమ్ రంజనే(75 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 70) టాప్ స్కోరర్గా నిలవగా.. డోనోవన్ ఫెర్రీరా(43), సమిత్ పటేల్(38) కీలక ఇన్నింగ్స్లు ఆడాడరు. కెప్టెన్ డుప్లెసిస్(12), స్టార్ ఆల్రౌండర్(0) విఫలమయ్యారు.నైట్రైడర్స్ బౌలర్లలో వాన్ షాల్క్వైక్, రస్సెల్ తలా మూడు వికెట్లు సాధించారు. అనంతరం భారీ లక్ష్య చేధనలో నైట్రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 144 పరుగులకే పరిమితమైంది. లాస్ ఏంజిల్స్ బ్యాటర్లలో ఉన్ముక్త్ చంద్(30) టాప్ స్కోరర్గా నిలిచాడు.టీఎస్కే బౌలర్లలో అకిల్ హూస్సేన్, నూర్ ఆహ్మద్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. జియా ఉల్ హక్, స్టోయినిష్, ఫెర్రీరా తలా వికెట్ సాధించారు. టీఎస్కే ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు ఆడి నాలుగింట గెలుపొంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో డుప్లెసిస్ టీమ్ రెండో స్ధానంలో కొనసాగుతోంది.చదవండి: వారి వల్లే ఓడిపోయాము.. అందుకు ఇంకా సమయం ఉంది: గిల్ -
ఆండీ ముర్రే అరుదైన ఘనత
లండన్: వింబుల్డన్ గ్రాండ్స్లామ్ ఈవెంట్ మరో రెండేళ్లలో150వ వార్షికోత్సవం జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో బ్రిటన్ మేటి టెన్నిస్ ఆటగాడు ఆండీ ముర్రే విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఆల్ ఇంగ్లండ్ క్లబ్ భావించింది. దీని కోసం ముర్రే సంబంధిత కళాకారులతో కలిసి పనిచేయనున్నట్లు తెలిసింది. ముర్రే చుట్టుకొలతలు, ఒద్దిక, పొడవుల్ని వారితో పంచుకోనున్నాడు. నిజానికి ‘బిగ్–త్రీ’ ఫెడరర్–నాదల్–జొకోవిచ్లతో ముర్రే సమకాలికుడైనప్పటికీ ఆ ముగ్గురితో పోల్చదగిన దిగ్గజమైతే కాదు. అయితే ముర్రే 2013లో వింబుల్డన్ టైటిల్తో 77 ఏళ్ల బ్రిటన్ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించడం ద్వారా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 1936లో ఫ్రెడ్ పెర్రీ గెలిచిన తర్వాత మరే బ్రిటన్ ప్లేయర్ వింబుల్డన్లో గెలుపొందలేకపోయాడు.ఏడున్నర దశాబ్దాల తర్వాత ఎట్టకేలకు ముర్రే వింబుల్డన్ టైటిల్తో బ్రిటన్ ముచ్చట తీర్చాడు. 2027లో జరిగే 150 ఏళ్ల వింబుల్డన్ పండగలో ముర్రేతో పాటు పెర్రీ విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తారు. ముర్రే తన కెరీర్లో మూడు గ్రాండ్స్లామ్ టైటిళ్లను గెలిచాడు. 2012లో యూఎస్ ఓపెన్ గెలిచిన అతను 2013, 2016లలో వింబుల్డన్ విజేతగా నిలిచాడు. ఇక ఈ సీజన్ వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీ ఈ నెల 30 నుంచి జరుగుతుంది. ఇదీ చదవండి: క్వార్టర్స్లో యూకీ జోడీ మలోర్కా (స్పెయిన్): వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీకి సన్నాహాల్లో భాగంగా మలోర్కా ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో బరిలోకి దిగిన భారత స్టార్ యూకీ బాంబ్రీ శుభారంభం చేశాడు. రాబర్ట్ గాలోవే (అమెరికా)తో జత కలిసి ఈ టోర్నీలో పోటీపడుతున్న యూకీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో యూకీ–గాలోవే ద్వయం 6–3, 6–3తో గ్రెగోరి జాక్–అలెగ్జాండర్ ముల్లర్ (ఫ్రాన్స్) జోడీపై విజయం సాధించింది. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో యూకీ–గాలోవే ఆరు ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేశారు. తమ సర్వీస్ను ఒక్కసారి కూడా చేజార్చుకోని యూకీ–గాలోవే ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేశారు. -
ఆస్ట్రేలియా తుది జట్టు ప్రకటన.. యువ సంచలనం రీఎంట్రీ
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్-2025లో ఓటమి తర్వాత ఆస్ట్రేలియా తొలి సవాల్ను ఎదుర్కొనేందుకు సిద్దమైంది. డబ్ల్యూటీసీ సైకిల్ 2025-27లో భాగంగా నేటి నుంచి వెస్టిండీస్-ఆసీస్ మధ్య మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టెస్టు బార్బోడోస్ వేదికగా జరగనుంది.ఈ క్రమంలో మొదటి టెస్టు కోసం ఆసీస్, విండీస్ తమ ప్లేయింగ్ ఎలెవన్ను ప్రకటించాయి. ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు కంగారులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టీవ్ స్మిత్ చేతి వేలి గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమయ్యాడు.అతడి స్దానంలో తుది జట్టులోకి వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిష్ వచ్చాడు. అదేవిధంగా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్ ఇన్నింగ్స్ను ఆరంభించిన మార్నస్ లబుషేన్ను సెలక్టర్లు పక్కన పెట్టారు. లబుషేన్ స్దానంలో సామ్ కాన్స్టాస్ ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కించుకున్నాడు. గతేడాది ఆఖరిలో భారత్పై టెస్టు అరంగేట్రం చేసిన కాన్స్టాస్ తన ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. దీంతో అతడికి మళ్లీ టీమ్ మెన్జ్మెంట్ మరో అవకాశం కల్పించింది.ఇక ఈ రెండు మార్పులు మినహా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడినే జట్టును ఆసీస్ కొనసాగించింది. మరోవైపు ఈ సిరీస్ నుంచే స్టార్ ఆల్రౌండర్ రోస్టన్ చేజ్ వెస్టిండీస్ టెస్టు కెప్టెన్గా తన ప్రస్ధానాన్ని ప్రారంభించనున్నాడు. గత నెలలో క్రెయిగ్ బ్రాత్వైట్ విండీస్ టెస్టు కెప్టెన్సీకి రాజీనామా చేయడంతో చేజ్ ఎంపిక అనివార్యమైంది. ఈ మ్యాచ్లో విండీస్ నలుగురు పేసర్లు, ఒక స్పెషలిస్టు స్పిన్నర్తో బరిలోకి దిగనుంది.తుది జట్లువెస్టిండీస్ ప్లేయింగ్ ఎలెవన్: 1. క్రెయిగ్ బ్రాత్వైట్, 2. జాన్ కాంప్బెల్, 3. కీసీ కార్టీ, 4. బ్రాండన్ కింగ్, 5. రోస్టన్ చేజ్ (సి), 6. షాయ్ హోప్ (వికెట్ కీపర్), 7. జస్టిన్ గ్రీవ్స్, 8. జోమెల్ వారికన్, 9. అల్జారి జోసెఫ్, 10. షమర్ జోసెఫ్, 11. జేడెన్ సీల్స్ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్: 1. ఉస్మాన్ ఖవాజా, 2. సామ్ కాన్స్టాస్, 3. కామెరాన్ గ్రీన్, 4. జోష్ ఇంగ్లిస్, 5. ట్రావిస్ హెడ్, 6. బ్యూ వెబ్స్టర్, 7. అలెక్స్ కారీ (వికెట్ కీపర్), 8. పాట్ కమ్మిన్స్ (సి), 9. మిచెల్ స్టార్క్, 10. నాథన్ లియాన్, 11. జోష్ హాజిల్వుడ్ -
'భారత జట్టుకు ఫీల్డింగ్ కోచ్ను నేనే'.. టీమిండియాపై మైఖేల్ వాన్ సెటైర్లు
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో 5 వికెట్ల తేడాతో టీమిండియా(Teamindia) ఓటమి పాలైంది. 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. ఆఖరి రోజు ఆటలో బౌలర్లు తేలిపోయారు. దీంతో ఈ భారీ టార్గెట్ను ఇంగ్లండ్ కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్(149) భారీ సెంచరీతో చెలరేగాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఇంగ్లీష్ జట్టు దూసుకెళ్లింది. కాగా భారత్ ఓటమికి ప్రధానం కారణం ఫీల్డింగ్ వైఫల్యమే. మొత్తంగా ఈ మ్యాచ్లో 6 క్యాచ్లను భారత ఫీల్డర్లు జారవిడిచారు.ఆఖరి రోజు ఆటలో సైతం టీమిండియా ఫీల్డింగ్ ఏ మాత్రం మెరుగుపడలేదు. ఆఖరి రోజు ఆటలో మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ బెన్ డకెట్ క్యాచ్ను 97 పరుగుల వద్ద జైశ్వాల్ విడిచిపెట్టాడు. దీంతో అతడు ఏకంగా 149 పరుగులు చేసి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.ఈ క్రమంలో పేలవ ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచిన టీమిండియాను ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్(Michael Vaughan) ట్రోలు చేశాడు. "ఈ భారత జట్టుకు ఫీల్డింగ్ కోచ్ను నేనే అని ప్రకటిస్తున్నాను. నా ఫీల్డింగ్ ఆకాడమీ ప్రస్తుతం బాగా రాణిస్తోంది" అని అని సెటైరికల్ ట్వీట్ చేశాడు. అతడికి భారత అభిమానులు గట్టిగా కౌంటిరిస్తున్నారు. గతంలో వాన్ క్యాచ్లు విడిచిపెట్టిన వీడియోలను ఎక్స్లో షేర్ చేస్తున్నారు. గతంలో వాన్ తన సొంత జట్టును కూడా విధంగానే ట్రోలు చేశాడు. ఇక ఇంగ్లండ్-భారత్ మధ్య రెండో టెస్టు వచ్చే బుధవారం నుంచి ప్రారంభం కానుంది.చదవండి: వారి వల్లే ఓడిపోయాము.. అందుకు ఇంకా సమయం ఉంది: గిల్The CV of the fielding coach: pic.twitter.com/1xkurSt9Qr— 𝐉𝐨𝐟𝐫𝐚 𝐒𝐭𝐨𝐜𝐤 𝐇𝐮𝐧𝐭𝐞𝐫 (@Niteish_14) June 24, 2025 -
వారి వల్లే ఓడిపోయాము.. అందుకు ఇంకా సమయం ఉంది: గిల్
టీమిండియా టెస్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ తన ప్రయాణాన్ని ఓటమితో ఆరంభించాడు. టెండూల్కర్- అండర్సన్ ట్రోఫీ 2025లో భాగంగా లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో 5 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. బ్యాటింగ్లో భారత జట్టు అద్భుతంగా రాణించినప్పటికి బౌలింగ్, ఫీల్డింగ్లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచింది. మొదటి నాలుగు రోజుల ఆటలో ఇంగ్లండ్పై ఆధిపత్యం చెలాయించిన టీమిండియా.. ఆఖరి రోజు ఆటలో మాత్రం తేలిపోయింది. 371 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయి ఊదిపడేసింది. ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్(149) భారీ సెంచరీతో కదం తొక్కగా.. జాక్ క్రాలీ(65), జో రూట్(53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, శార్ధూల్ ఠాకూర్ తలా రెండు వికెట్లు సాధించగా.. రవీంద్ర జడేజా ఓ వికెట్ పడగొట్టాడు.ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ గిల్ స్పందించాడు. చెత్త ఫీల్డింగ్ కారణంగానే తాము ఓడిపోయామని గిల్ చెప్పుకొచ్చాడు."టెస్టు మ్యాచ్ అద్భుతంగా సాగింది. మాకూ మంచి అవకాశాలు వచ్చాయి. అయితే క్యాచ్లు వదిలేయడం, లోయర్ ఆర్డర్లో ఎక్కువ పరుగులు చేయలేకపోవడం ఓటమికి కారణాలు. నాలుగో రోజు కూడా కనీసం 430 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించాలని అనుకున్నాం.అయితే 25 పరుగులకే చివర్లో వరుసగా వికెట్లు పడటంతో అది సాధ్యం కాలేదు. ఈ రోజు కూడా తొలి వికెట్ తీసిన తర్వాత మాకు మంచి అవకాశం ఉందనిపించింది. కానీ అది జరగలేదు. తొలి సెషన్లో మేం బాగానే బౌలింగ్ చేసి వారిని నియంత్రించగలిగినా ఒక్కసారి బంతి పాతబడిన తర్వాత ఏమీ చేయలేకపోయాం. అలాంటి స్థితిలోనూ వికెట్లు తీయడం అవసరం.జడేజా చాలా బాగా బౌలింగ్ చేసి మంచి అవకాశాలు సృష్టించాడు. మొదటి ఇన్నింగ్స్లో అనూహ్యంగా కుప్పకూలడంపై ఇప్పటికే చర్చించాం. ఈ తప్పును మేం మున్ముందు సరిదిద్దుకోవాలి. ఇలాంటి పిచ్పై అవకాశాలు అంత సులువుగా రావు.వాటిని వృథా చేసుకోవద్దు. అయితే మాది యువ జట్టు. నేర్చుకునే దశలో ఉంది. మరింత మెరుగువుతాం. బుమ్రా మిగిలిన టెస్టుల్లో ఏవి ఆడతాడో ఇప్పుడే చెప్పలేం. దానికి తగినంత సమయం ఉంది" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో గిల్ పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: టీమిండియా అత్యంత చెత్త రికార్డు.. 148 ఏళ్ల టెస్టు క్రికెట్ హిస్టరీలోనే -
IND Vs ENG: టీమిండియా అత్యంత చెత్త రికార్డు.. 148 ఏళ్ల టెస్టు క్రికెట్ హిస్టరీలోనే
ఇంగ్లండ్ పర్యటనను టీమిండియాతో ఓటమితో ఆరంభించింది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ చేతిలో 5 వికెట్ల తేడాతో భారత జట్టు ఓటమి పాలైంది. 371 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయి చేధించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ డకెట్(149) భారీ శతకంతో చెలరేగగా.. జాక్ క్రాలీ(65), జో రూట్(53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.రెండో ఇన్నింగ్స్లోనూ భారత బౌలర్లు తేలిపోయారు. ప్రసిద్ద్ కృష్ణ, శార్ధూల్ ఠాకూర్ తలా రెండు వికెట్లు పడగొట్టగా, జడేజా ఓ వికెట్ సాధించాడు. అయితే తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లతో సత్తాచాటిన జస్ప్రీత్ బుమ్రా.. రెండో ఇన్నింగ్స్లో ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు.అంతకుతోడు చెత్త ఫీల్డింగ్ కూడా టీమిండియా కొంపముంచింది. రెండో ఇన్నింగ్స్లు కలపి ఏడు క్యాచ్లను భారత ఫీల్డర్లు విడిచిపెట్టారు. అందులో నాలుగు క్యాచ్లు జైశ్వాల్ జారవిడిచినవే కావడం గమనార్హం. ఈ విజయంతో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.టెస్టు క్రికెట్ హిస్టరీలోనే..ఇక ఈ ఓటమితో భారత్ అత్యంత చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఒక టెస్టులో ఐదు సెంచరీలు నమోదు చేసిన తర్వాత కూడా ఓటమి పాలైన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది. 141 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు కూడా ఈ చెత్త ఫీట్ను నమోదు చేయలేదు.తాజా ఓటమితో టీమిండియా ఈ ఘోర ఆప్రతిష్టతను మూట కట్టుకుంది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జూలై 2 నుంచి ఎడ్జ్ బాస్టన్ వేదికగా ప్రారంభం కానుంది.టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్- తొలి టెస్టు సంక్షిప్త సమాచారం🏏షెడ్యూల్: జూన్ 20- 24🏏వేదిక: హెడింగ్లీ, లీడ్స్🏏టీమిండియా తొలి ఇన్నింగ్స్: 471 ఆలౌట్🏏ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 465 ఆలౌట్🏏తొలి ఇన్నింగ్స్లో టీమిండియాకు ఆరు పరుగుల ఆధిక్యం🏏టీమిండియా రెండో ఇన్నింగ్స్: 364 ఆలౌట్🏏ఇంగ్లండ్ లక్ష్యం: 371🏏ఆఖరిదైన ఐదో రోజు ఆటలో భాగంగా 373 పరుగులు సాధించి లక్ష్యాన్ని ఛేదించిన స్టోక్స్ బృందం🏏ఫలితం: ఐదు వికెట్ల తేడాతో టీమిండియాపై ఇంగ్లండ్ విజయం -
అన్నీ ఆయనే చూసుకున్నాడు
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ చరిత్రలో తొలి పతకాన్ని గెలిచిన భారత మహిళా రెజ్లర్గా ఘనత వహించిన సాక్షి మలిక్ తన అంతరంగాన్ని ఆవిష్కరించింది. ఓ అథ్లెట్గా ఎదిగిన వైనం, తల్లిగా... భార్యగా... మారిన విధానంతో ‘గేమ్ ఆన్’ తొలి ఎపిసోడ్ రూపుదిద్దుకుంది. ప్రీతి దహియా హోస్ట్గా వ్యవహరించిన ఈ పాడ్కాస్ట్లో సాక్షి తనను తాను పరిచయం చేసుకుంది. తన రెజ్లింగ్ పయనం... గృహిణిగా బాధ్యతలు ఇలా పదిలమైన జ్ఞాపకాలు, మధురమైన క్షణాలు అన్ని పంచుకుంది. క్రికెట్ మతమైన దేశంలో మిగతా ఆటల్లోని ఆణిముత్యాల్ని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో సాక్షి సంగతులన్నీ ఇలా చెప్పుకొచ్చింది. ‘ప్రేమ, పెళ్లికి ముందే సత్యవర్త్ కడియాన్ ఓ రెజ్లర్గానే తెలుసు. 2011లో ఇ చ్చిన పుస్తకం, నేను రాసుకున్న ఊసులు, పోడియంపై ఊహించుకున్న బాసలు, రాత్రిళ్లు త్రివర్ణ పతకంతో పాటే నిదరోవడం అన్ని ఓ మెరుపు కలలు కానే కావు. నిజ జీవితంలో నిజమైన అనుభూతులు’ అని ముచ్చటగా చెప్పింది. రెజ్లింగ్లో నా అడుగులు ‘మా కుటుంబంలో రెజ్లర్లు ఎవరూ లేరు. అలాంటి నాకు రెజ్లింగ్పై ఆసక్తి కలగడానికి జపాన్ దిగ్గజ రెజ్లర్ సావోరి యోషిదానే కారణం. ఓసారి విమానంలో విదేశీయానం చేసిన నాకు మూడుసార్లు ఒలింపిక్ చాంపియన్ అయిన ఆమె గురించి తెలిసింది. అప్పుడే నా కెరీరే రెజ్లింగ్ అయ్యింది. రెజ్లింగే తదనంతరం జీవితమైంది. కెనడాలో జరిగిన ప్రపంచ చాంపియన్షిప్లో నా అభిమాన రెజ్లర్ యోషిదాను కలుసుకోవడంతో ఆనందం రెట్టింపైంది. అప్పుడే అనుకున్న నాకు ఆడబిడ్డ పుడితే యోషిదా పేరే పెట్టాలని! చివరకు అనుకున్నట్లే భగవంతుడు కుమార్తెనే ఇచ్చాడు. నేను గట్టిగా అనుకున్న పేరే పెట్టుకున్నాను’ ఫేస్బుక్ రిక్వెస్ట్తో... ‘నేను... నా భర్త సత్యవర్త్ బాల్యం గడిపింది, చదివింది ఒకే చోటే అయినా కూడా ఒకరికొకరం తెలియదు. ఓ ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్తో మొదట టెక్ట్స్ (అక్షరాలు) కలిసింది. ఆ తర్వాతే మాట, బాట అన్ని కలిశాయి. రెజ్లింగ్ కెరీర్ కూడా ఇద్దరివి సమాంతరంగానే సాగాయి. మా క్రీడా ప్రయాణం, ప్రేమాయనం, 2014 కామన్వెల్త్ క్రీడల్లో పతకాల విజయం అన్ని కలిసే పయనించాయి. గ్లాస్గోలో రజతాలు గెలిచినపుడే సత్యవర్త్ ప్రేమ ప్రస్తావన తెచ్చాడు. కానీ నేనైతే ఒలింపిక్ పతకం వచ్చేదాకా ప్రేమపంజరంలో ఇరుక్కోనని చెప్పా. అప్పుడు నా జీవితమంతా రెజ్లింగే. నేను ఆశించినట్లే తను నా ప్రేమకై నిరీక్షించాడు. నా లక్ష్యం (రియో ఒలింపిక్ పతకం) సాకారమవగానే మా ప్రేమ తీరం కూడా చేరుకున్నాం’.ప్రసవానికి ముందు రోజు కూడా... ‘నేను నా కుమార్తెను ప్రసవించడానికి ముందు రోజు కూడా బాగా సిద్దమయ్యాను. ఎందుకంటే నేనొక అథ్లెట్ను. ప్రసవానంతర ఒత్తిడి నన్ను దరిచేరదని భావించా. కానీ చిత్రంగా నేను ఇంటికెళ్లగానే పది–పదిహేను రోజుల పాటు ఏడుపును ఆపుకోలేకపోయాను. నా దగ్గరే బిడ్డ వుండటం కూడా కష్టంగా ఉండేది. అసలేమి జరుగుతుందో అర్థమయ్యేది కాదు అప్పుడు. నెలలు గడిచేకొద్దీ పరిస్థితిలో మార్పొచ్చింది. ఇప్పుడు పాపకు ఏడు నెలలు నిండాయి. మా అందరిలో ఆమెనే బలవంతురాలని అనిపిస్తుంది. చాలా ముద్దొస్తుంది. ఎంతటి క్రీడాకారులైనా కూడా మాతృత్వపు భావోద్వేగాలకు అతీతులు కాలేరనే విషయం అప్పుడే నాకు అర్థమైంది. ఇందులో ముఖ్యంగా నా భర్త అండదండల గురించి చెప్పుకోవాలి. ఎంతో ఓపిగ్గా, మురిపెంగా పాపని నన్ను చూసుకున్నారు’.జపనీస్ దిగ్గజం పేరది ‘మా ముద్దుల పాప పేరు యోషిదా. బహుశా మేమిద్దరం రెజ్లర్లు కావడంతో పాటు నాకెంతగానో స్ఫూర్తినిచి్చన జపాన్ రెజ్లింగ్ దిగ్గజం సావోరి యోషిదా పేరే పెట్టుకున్నాం. మా బిడ్డకు అమ్మలాలన తక్కువైనా తండ్రి ప్రేమ మాత్రం అపారం. నేను ఆరోగ్యంగా ఉండేందుకు, తగినంత విశ్రాంతి తీసుకునేందుకు సత్యవర్త్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు. రోజూ రాత్రి 11 నుంచి తెల్లవారు జాము 3 గంటల వరకు నా భర్తే తల్లి పాత్ర పోషిస్తాడు. ఆ తర్వాత 3 నుంచి ఉదయం 8 గంటల వరకు నేను పాప సంగతి చూసుకుంటాను. ఈ సమయంలోనే సత్యవర్త్ విశ్రాంతి తీసుకుంటాడు’. -
విజేత లలిత్
ముంబై: ఆరియన్ప్రొ ముంబై ఓపెన్ అంతర్జాతీయ గ్రాండ్మాస్టర్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ముసునూరి రోహిత్ (ఎంఆర్) లలిత్ బాబు చాంపియన్గా అవతరించాడు. మంగళవారం ముగిసిన ఈ టోర్నీలో విజయవాడకు చెందిన 32 ఏళ్ల లలిత్ బాబు ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. లలిత్తోపాటు అర్మేనియాకు చెందిన మామికోన్ ఘరిబియాన్ కూడా 8 పాయింట్లు సంపాదించాడు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా విజేతను నిర్ణయించగా... లలిత్ బాబుకు టైటిల్ ఖరారైంది. 150 మంది ప్లేయర్ల మధ్య స్విస్ ఫార్మాట్లో తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో లలిత్ బాబు ఏడు గేముల్లో గెలిచి, మరో రెండు గేమ్లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. చివరిదైన తొమ్మిదో రౌండ్లో నల్ల పావులతో ఆడిన లలిత్ 72 ఎత్తుల్లో జార్జియా గ్రాండ్మాస్టర్ లెవాన్ పాంట్సులయపై గెలుపొందాడు. 2012లో భారత 26వ గ్రాండ్మాస్టర్ (జీఎం)గా అవతరించిన లలిత్ బాబు 2014 చెస్ ఒలింపియాడ్లో కాంస్య పతకం గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. కామన్వెల్త్ చాంపియన్గా నిలిచిన లలిత్ ఆసియా చాంపియన్షిప్లో రజతం కూడా సాధించాడు. ఓవరాల్గా లలిత్ తన కెరీర్లో ఇప్పటి వరకు 20 స్వర్ణాలు, 15 రజతాలు, 14 కాంస్య పతకాలు సాధించాడు. -
‘పట్టుదలతో కట్టిపడేశాడు’
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రస్తుత అధ్యక్షుడు, గతంలో బీసీసీఐ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన జై షాపై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించాడు. 2019 నుంచి 2022 వరకు గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా వ్యవహరించిన సమయంలో జై షా బోర్డు కార్యదర్శిగా పనిచేశాడు. వీరిద్దరి మధ్య చక్కటి అనుబంధం ఉంది. రాజకీయ నేపథ్యం ఉన్న జై షా నిజాయితీ, పట్టుదల తనను ఎంతో ఆకట్టుకున్నాయని గంగూలీ పేర్కొన్నాడు. ‘అప్పగించిన పనులు పూర్తి చేయడంలో జై షా చాలా ప్రత్యేకం. అతడు భారత క్రికెట్ అభివృద్ధికి సహకరించాడు. రాజకీయ నేపథ్యం నుంచి రావడంతో అతడి నిర్ణయాల్లో మొండితనం, ఓరకమైన దృఢత్వం ఉంటుందని ఆశించా. కానీ అందుకు భిన్నమైన తీరుతో నిజాయితీ, పట్టుదలతో ఆకట్టుకున్నాడు. ఎప్పుడూ ఆట గురించే ఆలోచిస్తాడు. దీన్ని మరింత మెరుగు పరిచేందుకు ఎలాంటి చర్యలు చేపట్టొచ్చా అని మార్గాలు వెతుకుతుంటాడు’ అని గంగూలీ అన్నాడు. కోవిడ్–19 వంటి క్లిష్ట సమయంలో బోర్డు అధ్యక్ష, కార్యదర్శులుగా పనిచేసిన గంగూలీ, జై షా ఆటగాళ్ల సంరక్షణ కోసం ఎన్నోచర్యలు చేపట్టారు. కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా క్రీడా కార్యకలాపాలు ఆగిపోయిన దశలోనూ ‘బయోబబుల్’ వంటి ప్రత్యేక ఏర్పాట్లతో ద్వైపాక్షిక సిరీస్లు, ఐపీఎల్ వంటి టోర్నీలను నిర్వహించారు. 2022లో పదవీకాలం ముగియడంతో గంగూలీ స్థానంలో రోజర్ బిన్నీ బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగా... గతేడాది వరకు కార్యదర్శిగా కొనసాగిన 36 ఏళ్ల జై షా... 2024 నవంబర్లో ఐసీసీ చైర్మన్గా నియమితుడయ్యాడు. తద్వారా పిన్న వయసులో ఈ బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా నిలిచాడు. ‘2019లో తొలిసారి అతడిని కలిశాను. గుజరాత్ క్రికెట్ సంఘంలో పనిచేసి వచ్చాడు. చిన్నపిల్లవాడిలా కనిపించాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా అండగా నిలిచేవాడు. ఏ సమయంలో అయినా సంప్రదించగానే స్పందించేవాడు. అతడికి ఆటపై స్పష్టమైన అభిప్రాయాలు, అవగాహన ఉంది. ఆటగాళ్లకు ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటాడు. క్రికెట్ను మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఉన్నత లక్ష్యం అతని ఎదుగుదలకు సహకరించింది. అనుభవంతో మరింత రాటుదేలాడు. ఇప్పుడు క్రికెట్లో అత్యున్నత పదవైన ఐసీసీ చైర్మన్ బాధ్యతలు చేపడుతున్నాడు. నిజాయితీగా పనులు పూర్తి చేస్తాడు. ఇప్పటికీ అతడితో మంచి అనుబంధం కొనసాగుతోంది’ అని గంగూలీ వివరించాడు. -
నీరజ్ చోప్రాకు స్వర్ణ పతకం
ఒ్రస్టావా (చెక్ రిపబ్లిక్): భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా... ఒ్రస్టావా గోల్డెన్ స్పైక్ అథ్లెటిక్స్ మీట్లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. గతవారం పారిస్ డైమండ్ లీగ్ మీట్లో ‘టాప్’లో నిలిచిన నీరజ్... మంగళవారం జరిగిన పోటీల్లో జావెలిన్ను 85.29 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానం దక్కించుకున్నాడు. నాలుగు రోజుల వ్యవధిలో నీరజ్కు ఇది రెండో టైటిల్ కావడం విశేషం. ఈ మీట్లో తొలిసారి బరిలోకి దిగిన నీరజ్ అందరికంటే మెరుగైన ప్రదర్శనతో విజేతగా నిలిచాడు. డౌ స్మిత్ (84.12 మీటర్లు; దక్షిణాఫ్రికా), అండర్సన్ పీటర్స్ (83.63 మీటర్లు; గ్రెనెడా) వరుసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచారు. తొలి ప్రయత్నంలో ఫౌల్ చేసిన నీరజ్... రెండో ప్రయత్నంలో ఈటెను 83.45 మీటర్ల దూరం విసిరాడు.మూడో ప్రయత్నంలో అత్యుత్తమంగా 85.29 మీటర్ల దూరాన్ని నమోదు చేసుకున్న భారత అథ్లెట్.. తర్వాతి ప్రయత్నాల్లో ఆకట్టుకోలేకపోయాడు. నీరజ్ కోచ్, చెక్ రిపబ్లిక్ గ్రేట్ అథ్లెట్ జాన్ జెలెజ్నీ గతంలో ఈ మీట్లో తొమ్మిదిసార్లు విజేతగా నిలిచాడు. -
'లీడ్స్' వదిలేశారు.. ఇంగ్లండ్ చేతిలో గిల్ సేన ఓటమి
తొలి రోజు నుంచే అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన... రెండు ఇన్నింగ్స్లలో కలిపి 835 పరుగులు... గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఐదు సెంచరీలు... బుమ్రా అద్భుత బౌలింగ్ ప్రదర్శన... అన్నీ సానుకూలతలే కనిపించినా... చివరకు ఓటమి మాత్రం తప్పలేదు. తొలి టెస్టుల్లో పలు సందర్భాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ తుది దశకు వచ్చేసరికి చేతులెత్తేసింది. గెలుపు కోసం చివరి రోజు 350 పరుగుల భారీ స్కోరు చేయాల్సిన ఇంగ్లండ్ మొదటి ఓవర్ నుంచే పరుగుల వేటలో పడింది. వ్యూహాత్మకంగా బుమ్రా బౌలింగ్లో సాహసం చేయని బ్యాటర్లు ఇతర బౌలర్లపై చెలరేగి జోరుగా సాగిపోయారు. తాము ఆశించిన రీతిలో ‘బజ్బాల్’ శైలిలో ఎక్కడా తగ్గకుండా 4.54 రన్రేట్తో దూసుకుపోయిన ఇంగ్లండ్ ఘన విజయాన్ని అందుకుంది. డకెట్ మెరుపు సెంచరీకి క్రాలీ అండగా నిలవగా... చివర్లో రూట్ కీలక అర్ధ సెంచరీతో జట్టును నడిపించాడు. తొలి టెస్టులో ఓటమి పక్షాన నిలిచిన కొత్త కెపె్టన్ శుబ్మన్ గిల్ సిరీస్లో మున్ముందు ఎలాంటి ఫలితాలు రాబడతాడనేది చూడాలి. లీడ్స్: ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ను భారత్ పరాజయంతో మొదలు పెట్టింది. హెడింగ్లీ మైదానంలో మంగళవారం ముగిసిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి రోజు 21/0తో ఆటను మొదలు పెట్టిన ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్లో 82 ఓవర్లలో 5 వికెట్లకు 373 పరుగులు చేసింది. బెన్ డకెట్ (170 బంతుల్లో 149; 21 ఫోర్లు, 1 సిక్స్), జాక్ క్రాలీ (126 బంతుల్లో 65; 7 ఫోర్లు) తొలి వికెట్కు 188 పరుగులు జోడించి బలమైన పునాది వేయగా... ఆఖర్లో జో రూట్ (84 బంతుల్లో 53 నాటౌట్; 6 ఫోర్లు), జేమీ స్మిత్ (55 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. రూట్, స్మిత్ ఆరో వికెట్కు అభేద్యంగా 71 పరుగులు జత చేశారు. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ పని పట్టిన స్టార్ పేసర్ బుమ్రా రెండో ఇన్నింగ్స్లో పరుగులు ఇవ్వకుండా కట్టడి చేయగలిగినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇతర బౌలర్ల పేలవ ప్రదర్శన ఇంగ్లండ్కు గెలుపు అవకాశాలు సృష్టించింది. ఈ విజయంతో సిరీస్లో ఇంగ్లండ్ 1–0తో ముందంజ వేసింది. సిరీస్లో రెండో టెస్టు జూలై 2 నుంచి బర్మింగ్హామ్లో జరుగుతుంది. భారీ భాగస్వామ్యం... ఇంగ్లండ్ ఓపెనర్లు క్రాలీ, డకెట్ చివరి రోజు ఆటను జాగ్రత్తగా మొదలు పెట్టారు. అయితే నిలదొక్కుకున్న తర్వాత వీరిద్దరు చక్కటి షాట్లతో ధాటిని పెంచారు. ఈ క్రమంలో ముందుగా 66 బంతుల్లో డకెట్ హాఫ్ సెంచరీ పూర్తయింది. 42 పరుగుల వద్ద క్రాలీ ఇచ్చిన కఠినమైన రిటర్న్ క్యాచ్ను అందుకోవడంలో బుమ్రా విఫలమయ్యాడు. లంచ్ వరకు కూడా ఇంగ్లండ్ ఓపెనింగ్ జోడీని విడదీయడంలో భారత్ విఫలమైంది. తొలి సెషన్లో ఇంగ్లండ్ 24 ఓవర్లలో 96 పరుగులు సాధించింది. విరామం తర్వాత 111 బంతుల్లో క్రాలీ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాత వీరిద్దరు మరింత జోరుగా ఆడారు. 97 పరుగుల వద్ద డకెట్ ఇచి్చన క్యాచ్ జైస్వాల్ వదిలేయడం కూడా జట్టుకు కలిసొచ్చింది. తర్వాతి ఓవర్లోనే డకెట్ 121 బంతుల్లో కెరీర్లో ఆరో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత స్వల్ప వర్షం కారణంగా దాదాపు ఇరవై నిమిషాల పాటు ఆటకు అంతరాయం కలిగింది. గెలిపించిన రూట్, స్మిత్... వాన ఆగిన తర్వాత భారత్కు సానుకూల ఫలితం వచ్చింది. ఎట్టకేలకు క్రాలీని అవుట్ చేసి భారత్కు తొలి వికెట్ అందించిన ప్రసిద్... తన తర్వాతి ఓవర్లోనే ఒలీ పోప్ (8)ను కూడా పెవిలియన్ పంపించాడు. ఈ దశలో డకెట్, రూట్ మళ్లీ ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తూ మూడో వికెట్కు 47 పరుగులు జోడించారు. ఇంగ్లండ్ వేగంగా దూసుకుపోతున్న తరుణంలో శార్దుల్కు బంతి అప్పగించడం భారత్కు మేలు చేసింది.దూకుడుగా ఆడుతున్న డకెట్తో పాటు హ్యారీ బ్రూక్ (0)ను వరుస బంతుల్లో అవుట్ చేసి శార్దుల్ ఒక్కసారిగాటీమిండియా శిబిరంలో ఉత్సాహం నింపాడు. అయితే రూట్, బెన్ స్టోక్స్ (51 బంతుల్లో 33; 4 ఫోర్లు) కలిసి జట్టును విజయం దిశగా నడిపించారు. వీరిద్దరు 77 బంతుల్లో 49 పరుగులు జత చేశారు. అయితే జడేజా బౌలింగ్ పదే పదే రివర్స్ స్వీప్కు ప్రయత్నించిన స్టోక్స్ అదే షాట్ ఆడి నిష్క్రమించాడు. ఈ దశలో ఇంగ్లండ్ మరో 69 పరుగులు చేయాల్సి ఉండటంతో భారత బృందంలో కాస్త ఆశలు రేగాయి. అయితే అనుభవజు్ఞడైన రూట్ అండగా యువ కీపర్ స్మిత్ ఒత్తిడిని అధిగమించి చక్కటి షాట్లు ఆడటంతో ఇంగ్లండ్ గెలుపునకు చేరువైంది. భారత్ కొత్త బంతిని తీసుకున్నా అప్పటికే ఆలస్యమైపోయింది. జడేజా ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన స్మిత్...అదే ఓవర్ చివరి బంతికి మరో సిక్స్ బాది మ్యాచ్ను ముగించాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 471; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 465; భారత్ రెండో ఇన్నింగ్స్: 364; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (సి) రాహుల్ (బి) ప్రసిధ్ 65; డకెట్ (సి) (సబ్) నితీశ్ రెడ్డి (బి) శార్దుల్ 149; పోప్ (బి) ప్రసిధ్ 8; రూట్ (నాటౌట్) 53; బ్రూక్ (సి) పంత్ (బి) శార్దుల్ 0; స్టోక్స్ (సి) గిల్ (బి) జడేజా 33; స్మిత్ (నాటౌట్) 44; ఎక్స్ట్రాలు 21; మొత్తం (82 ఓవర్లలో 5 వికెట్లకు) 373. వికెట్ల పతనం: 1–188, 2–206, 3–253, 4–253, 5–302. బౌలింగ్: బుమ్రా 19–3–57–0, సిరాజ్ 14–1–51–0, జడేజా 24–1–104–1, ప్రసిధ్ 15–0–92–2, శార్దుల్ 10–0–51–2. 5 ఒక టెస్టులో ఐదు సెంచరీలు నమోదు చేసిన తర్వాత కూడా ఓటమి పాలైన తొలి జట్టుగా భారత్ నిలిచింది.2 టెస్టుల్లో ఇంగ్లండ్కు ఇది రెండో అతి పెద్ద ఛేదన. 2022లో భారత్పైనే బర్మింగ్హామ్లో 378 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది.6 హెడింగ్లీ మైదానంలో ఇంగ్లండ్ వరుసగా ఆరో టెస్టు గెలిచింది. ఈ ఆరు సార్లు జట్టు లక్ష్యాలను ఛేదించడం విశేషం.3 టెస్టు మ్యాచ్ నాలుగు ఇన్నింగ్స్లలోనూ 350కు పైగా స్కోర్లు నమోదు కావడం ఇది మూడోసారి మాత్రమే.1673 భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఒకే టెస్టులో నమోదైన మొత్తం పరుగులు. ఈ రెండు జట్ల మధ్య ఇదే అత్యధికం. -
Ind vs Eng: ఇంగ్లండ్తో తొలి టెస్టులో టీమిండియాకు తప్పని ఓటమి
Ind vs Eng 1st Test: ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. లీడ్స్ వేదికగా తొలి టెస్టులో ఆతిథ్య జట్టు చేతిలో గిల్ సేన ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్కు వెళ్లింది. ఈ క్రమంలో హెడింగ్లీ మైదానంలో శుక్రవారం తొలి టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.తొలి ఇన్నింగ్స్లో మూడు శతకాలుబ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు కేఎల్ రాహుల్ (42), యశస్వి జైస్వాల్ (101) శుభారంభం అందించారు. జైసూతో పాటు కెప్టెన్ శుబ్మన్ గిల్ (147), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (134) సెంచరీతో చెలరేగారు. ఫలితంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులకు ఆలౌట్ అయింది.ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ చెరో నాలుగు వికెట్లు తీయగా.. షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్ తలా ఓ వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆతిథ్య జట్టు.. 465 పరుగులు చేసింది.ఆరు పరుగుల ఆధిక్యంఓపెనర్ బెన్ డకెట్ (62) హాఫ్ సెంచరీతో మెరవగా.. వన్డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ సెంచరీ (106)తో ఆకట్టుకున్నాడు. ఇక మరో కీలక బ్యాటర్ హ్యారీ బ్రూక్ 99 పరుగులతో అదరగొట్టగా... మిగతా వాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ 40, టెయిలెండర్ క్రిస్ వోక్స్ 38 పరుగులతో రాణించారు.భారత బౌలర్లలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు కూల్చగా.. మిగిలిన పేసర్లలో ప్రసిద్ కృష్ణ మూడు, సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో465 పరుగులకే ఆలౌట్ కావడంతో టీమిండియాకు ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.ఆదుకున్న రాహుల్, పంత్.. కానీఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన గిల్ సేన శుభారంభం అందుకోలేకపోయింది. ఈసారి ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) పూర్తిగా విఫలమయ్యాడు. నాలుగో నంబర్ బ్యాటర్, కెప్టెన్ గిల్ (8) కూడా నిరాశపరిచాడు. ఇక వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ 30 పరుగులు చేశాడు.ఈ దశలో మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (137), రిషభ్ పంత్ (118) శతకాలు సాధించి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. అయితే, ఆ తర్వాత వచ్చిన కరుణ్ నాయర్ (20) ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. శార్దూల్ ఠాకూర్ (4), సిరాజ్ (0), బుమ్రా (0), ప్రసిద్ కృష్ణ (0) చేతులెత్తేశారు. రవీంద్ర జడేజా (25 నాటౌట్) కాసేపు ఒంటరి పోరాటం చేశాడు. ఈ క్రమంలో 96 ఓవర్లలో 364 పరుగులకు టీమిండియా ఆలౌట్ అయింది.శతక్కొట్టిన డకెట్ఈ స్కోరుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆరు పరుగులు కలుపుకొని.. ఇంగ్లండ్ లక్ష్యాన్ని 371 పరుగులుగా నిర్దేశించింది గిల్ సేన. సోమవారం నాటి నాలుగో రోజు ఆట పూర్తయ్యేసరికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఈ క్రమంలో మంగళవారం ఓవర్ నైట్ స్కోరు 21/0తో ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్ ఆది నుంచే ఆధిపత్యం కనబరిచింది. తొలి సెషన్లో వికెట్ నష్టపోకుండా ఆడిన స్టోక్స్ బృందం.. ఆ తర్వాత వికెట్లు కోల్పోయినా టార్గెట్ను పూర్తి చేసింది.ఓపెనర్లలో జాక్ క్రాలే అర్ద శతకం (65) చేయగా.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ బెన్ డకెట్ అద్భుత శతకం (149)తో మెరిశాడు. ఓలీ పోప్ (8), హ్యారీ బ్రూక్ (0) విఫలమైనా.. జో రూట్ (53 నాటౌట్), జేమీ స్మిత్ (44 నాటౌట్) పని పూర్తి చేశారు. ఇక కెప్టెన్ స్టోక్స్ 33 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో జడేజా ఒక వికెట్ తీయగా.. ప్రసిద్, శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు తీశారు. కాగా, ఈ ఓటమితో కెప్టెన్గా గిల్కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది.టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్- తొలి టెస్టు🏏షెడ్యూల్: జూన్ 20- 24🏏వేదిక: హెడింగ్లీ, లీడ్స్🏏టీమిండియా తొలి ఇన్నింగ్స్: 471 ఆలౌట్🏏ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 465 ఆలౌట్🏏తొలి ఇన్నింగ్స్లో టీమిండియాకు ఆరు పరుగుల ఆధిక్యం🏏టీమిండియా రెండో ఇన్నింగ్స్: 364 ఆలౌట్🏏ఇంగ్లండ్ లక్ష్యం: 371🏏ఆఖరిదైన ఐదో రోజు ఆటలో భాగంగా 373 పరుగులు సాధించి లక్ష్యాన్ని ఛేదించిన స్టోక్స్ బృందం🏏ఫలితం: ఐదు వికెట్ల తేడాతో టీమిండియాపై ఇంగ్లండ్ విజయం -
IND VS ENG 1st Test Day 5: రసవత్తరంగా సాగుతున్న మ్యాచ్
లీడ్స్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. చివరి రోజు ఆటలో (371 పరుగుల లక్ష్య ఛేదనలో) తొలి రెండు సెషన్లలో (253/2) ఆధిపత్యం చలాయించిన ఇంగ్లండ్.. రెండో సెషన్ చివరి దశలో అనూహ్యంగా రెండు వికెట్లు కోల్పోయి డిఫెన్స్లో పడింది. లక్ష్యానికి 118 పరుగుల దూరంలో ఉన్న సమయంలో శార్దూల్ వరుస బంతుల్లో సెట్ బ్యాటర్ బెన్ డకెట్ (149), ఇన్ ఫామ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ను (0) ఔట్ చేసి ఇంగ్లండ్ను దెబ్బ కొట్టాడు.భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటల 52 నిమిషాల సమయంలో వర్షం మరోసారి మొదలుకావడంతో టీ బ్రేక్ను ముందుగానే ప్రకటించారు. టీ విరామం సమయానికి ఇంగ్లండ్ లక్ష్యానికి 102 పరుగుల దూరంలో ఉంది. రెండో ఇన్నింగ్స్లో ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. క్రీజ్లో జో రూట్ (14), బెన్ స్టోక్స్ (13) ఉన్నారు. ఒకవేళ టీ విరామం తర్వాత వర్షం తగ్గి మ్యాచ్ యధావిధిగా సాగితే ఇరు జట్లకు సమానమైన విజయావకాశాలు ఉన్నాయి. భారత్ గెలవాలంటే మరో 6 వికెట్లు తీయాలి.ఓవర్నైట్ స్కోర్ 21/0 వద్ద చివరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. డకెట్, జాక్ క్రాలే (65) మొండి పట్టుదలతో ఆడటంతో సునాయాసంగా విజయం సాధించేలా కనిపించింది. డకెట్, క్రాలే తొలి వికెట్కు 188 పరుగులు రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి ఇంగ్లండ్ గెలుపుకు బలమైన పునాది వేశారు. ఈ దశలో ప్రసిద్ద్ కృష్ణ క్రాలే, పోప్ను (8) స్వల్ప వ్యవధిలో ఔట్ చేసి భారత్ను తిరిగి మ్యాచ్లోకి తెచ్చాడు. అయితే సెంచరీ పూర్తి చేసిన తర్వాత మరింత రెచ్చిపోయిన డకెట్ వేగంగా పరుగులు సాధిస్తూ లక్ష్యాన్ని చిన్నదిగా చేశాడు. ఈ దశలో శార్దూల్ వరుస బంతుల్లో డకెట్, బ్రూక్ను ఔట్ చేసి భారత శిబిరంలో ఆశలు రేకెత్తించాడు.ఇవాల్టి ఆటలో తొలి సెషన్ వరకు ఎలాంటి ఆటంకం కలిగించని వర్షం.. రెండో సెషన్లో ఓ సారి, టీకి ముందు మరోసారి పలకరించింది.స్కోర్ వివరాలు.. భారత్: 471 (జైస్వాల్ 101, గిల్ 147, పంత్ 134) & 364 (రాహుల్ 137, పంత్ 118)ఇంగ్లండ్: 465 (పోప్ 106, బ్రూక్ 99) & 269/4 (డకెట్ 149, క్రాలే 65) -
రూ. 27 కోట్ల విలువ చేసే లగ్జరీ అపార్ట్మెంట్లను కొనుగోలు చేసిన శివమ్ దూబే
టీమిండియా విధ్వంసకర ఆటగాడు శివమ్ దూబే ముంబైలోని అంధేరి వెస్ట్ ప్రాంతంలోని ఓషివరాలో రెండు లగ్జరీ అపార్ట్మెంట్లను కొనుగోలు చేశాడు. స్క్వేర్యార్డ్స్ సమీక్షించిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం.. ఈ అపార్ట్మెంట్ల ధర రూ. 27.50 కోట్లని తెలుస్తుంది. ఈ రెండు అపార్ట్మెంట్లు DLH ఎన్క్లేవ్ అనే నివాస ప్రాజెక్ట్లోని 17 మరియు 18వ అంతస్తులలో ఉన్నాయి. వీటి మొత్తం వైశాల్యం 9,603 చదరపు అడుగులు (నివాస ప్రాంతం 4,200, బాల్కనీ 3,800 చదరపు అడుగులు).అపార్ట్మెంట్లతో పాటు మూడు పార్కింగ్ స్థలాలను దూబే దేవ్ ల్యాండ్ అండ్ హౌసింగ్ లిమిటెడ్ నుండి కొనుగోలు చేశాడు. ఈ లావాదేవీ జూన్ 20, 2025న నమోదు చేయబడింది. దీనికి మొత్తం రూ. 1.65 కోట్ల స్టాంప్ డ్యూటీ మరియు రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించబడ్డాయి. DLH ఎన్క్లేవ్లో ఇదివరకే పలువురు సెలబ్రిటీలు ఉన్నారు. బాలీవుడ్ హాస్యనటుడు కపిల్ శర్మ, గాయకుడు మికా సింగ్, దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ కుటుంబం ఇక్కడే నివాసముంటుంది.31 ఏళ్ల శివం దూబే (లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలర్) భారత టీ20 జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా ఉండటంతో పాటు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహిస్తాడు. దేశీయ క్రికెట్లో అతను ముంబైకి ఆడతాడు. 2019 నవంబర్లో టీమిండియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన దూబే.. 2024 టీ20 ప్రపంచ కప్ గెలుచుకున్న భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. దూబే ఇప్పటివరకు టీమిండియా తరఫున 4 వన్డేలు, 35 టీ20లు ఆడి 574 పరుగులు చేశాడు. అలాగే 14 వికెట్లు పడగొట్టాడు. దూబే ఐపీఎల్లో 79 మ్యాచ్లు ఆడి 10 హాఫ్ సెంచరీల సాయంతో 1859 పరుగులు చేయడంతో పాటు 5 వికెట్లు తీశాడు. -
కొంప ముంచిన జైస్వాల్.. కట్టలు తెంచుకున్న సిరాజ్ ఆగ్రహం!
టీమిండియాతో తొలి టెస్టులో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ (Ben Duckett) శతక్కొట్టాడు. ఆఖరిదైన ఐదో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్లో.. 122 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. తద్వారా 2010 తర్వాత ఓ టెస్టు మ్యాచ్లో ఇంగ్లండ్ తరఫున నాలుగో ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన తొలి ఓపెనింగ్ బ్యాటర్గా నిలిచాడు.చివరగా 2010లో బంగ్లాదేశ్తో మీర్పూర్ టెస్టులో అలిస్టర్ కుక్ ఈ ఘనత సాధించాడు. ఇదిలా ఉంటే.. బెన్ డకెట్కు టెస్టుల్లో ఇది ఆరో శతకం. నిజానికి.. టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) ఫీల్డింగ్ వైఫల్యం కారణంగానే డకెట్ సెంచరీ మార్కు అందుకున్నాడని చెప్పవచ్చు.జైసూ తప్పిదం..ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 39వ ఓవర్లో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) బంతితో రంగంలోకి దిగాడు. ఈ క్రమంలో ఐదో ప్రయత్నంలో షార్ట్ బంతిని సంధించంగా.. దానిని ఆడే క్రమంలో నియంత్రణ కోల్పోయిన డకెట్.. బంతిని గాల్లోకి లేపాడు. టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లో ఉన్న వేళ డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ నుంచి పరిగెత్తుకు వచ్చిన జైస్వాల్ క్యాచ్ అందుకోవడంలో విఫలమయ్యాడు.సిరాజ్ ఆగ్రహంఅప్పటికి డకెట్ 97 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నాడు. కొరకరాని కొయ్యగా మారిన అతడిని అవుట్ చేసే అవకాశాన్ని జైసూ జారవిడవడంతో సిరాజ్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు. గాల్లోకి పంచ్లు విసురుతూ ఆగ్రహం వెళ్లగక్కాడు. మరోవైపు.. భారత జట్టు హెడ్కోచ్ గౌతం గంభీర్ కూడా అసహనానికి లోనయ్యాడు.కాగా ఇంగ్లండ్తో తొలి టెస్టులో జైస్వాల్ క్యాచ్లు డ్రాప్ చేయడం ఇది నాలుగోసారి. తొలి ఇన్నింగ్స్లో మూడుసార్లు ఇదే తరహాలో జైసూ కారణంగా ప్రత్యర్థి బ్యాటర్లు అవుటయ్యే ప్రమాదం తప్పించుకున్నారు. క్యాచ్ విన్ మ్యాచెస్ అంటారు కదా! కానీ జైసూ ఇలా కీలక సమయాల్లో పదే పదే క్యాచ్లు మిస్ చేయడం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి! ఒకవేళ వీటి కారణంగా మ్యాచ్ ఫలితం గనుక తారుమారైతే జైస్వాల్పై విమర్శల జడి కురవడం ఖాయం.వర్షం వల్ల ఆగిన మ్యాచ్ఇక బ్యాటర్గా మాత్రం ఈ యువ ఓపెనర్ లీడ్స్ టెస్టులో సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్లో శతకం (101) బాదిన జైసూ.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం నాలుగు పరుగులకే పెవిలియన్ చేరాడు. కాగా భారత్ విధించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ నిలకడైన ఆటతో ముందుకు సాగుతోంది. మంగళవారం నాటి ఆఖరి రోజు ఆటలో 40.5 ఓవర్ల వద్ద వర్షం కారణంగా ఇంగ్లండ్ బ్యాటింగ్ నిలిచిపోయింది. అప్పటికి ఓపెనర్లు డకెట్ 105, జాక్ క్రాలే 59 పరుగులతో ఉండగా.. ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 181 పరుగులు చేసింది. విజయానికి భారత్ ఇంకా పది వికెట్ల దూరంలో ఉండగా.. ఇంగ్లండ్ గెలుపునకు 190 పరుగులు అవసరం.UPDATE: Ind vs Eng 1st Test: ఇంగ్లండ్తో తొలి టెస్టులో టీమిండియాకు తప్పని ఓటమిచదవండి: గిల్ అసంతృప్తి.. జడ్డూ చర్య వైరల్!.. ఆఖరికి మేమే గెలిచాం! -
IND VS ENG 1st Test Day 5: వరుణుడి ఆటంకం తర్వాత తిరిగి మొదలైన మ్యాచ్
వరుణుడి ఆటంకం తర్వాత తిరిగి మొదలైన మ్యాచ్వర్షం పాక్షిక అంతరాయం కలిగించిన తర్వాత మ్యాచ్ మళ్లీ మొదలైంది. రెండో ఓవర్లోనే ప్రసిద్ద్ కృష్ణ జాక్ క్రాలేను (65) ఔట్ చేశాడు. ఇంగ్లండ్ గెలుపుకు ఇంకా 183 పరుగులు చేయాలి. భారత్ గెలవాలంటే మరో 9 వికెట్లు తీయాలి. లీడ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. చివరి రోజు ఇంగ్లండ్ 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తుండగా.. రెండో సెషన్లో వర్షం మొదలైంది. వర్షం మొదలయ్యే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో వికెట్ కోల్పోకుండా 181 పరుగులు చేసింది. బెన్ డకెట్ (105) సెంచరీ పూర్తి చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా మరో ఓపెనర్ జాక్ క్రాలే (59) బాధ్యతాయుతంగా ఆడుతూ క్రీజ్లో ఉన్నాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ విజయం దిశగా సాగుతున్న వేల వరుణుడు అడ్డుపడ్డాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ గెలవాలంటే మరో 190 పరుగులు చేయాల్సి ఉంది. భారత్ గెలవాలంటే 10 వికెట్లు తీయాలి.స్కోర్ వివరాలు.. భారత్: 471 (జైస్వాల్ 101, గిల్ 147, పంత్ 134) & 364 (రాహుల్ 137, పంత్ 118)ఇంగ్లండ్: 465 (పోప్ 106, బ్రూక్ 99) & 117/0 (డకెట్ 105 నాటౌట్, క్రాలే 59 నాటౌట్) -
ఆసియా కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. ? వైరలవుతున్న సోనీ స్పోర్ట్స్ పోస్టర్
ఈ ఏడాది చివర్లో భారత్లో జరగాల్సిన ఆసియా కప్-2025 కోసం టోర్నీ అధికారిక ప్రసారదారు సోనీ స్పోర్ట్స్ ఓ ప్రత్యేక పోస్టర్ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక టీ20 జట్లకు చెందిన కెప్టెన్లు సూర్యకుమార్ యాదవ్, నజ్ముల్ శాంటో, చరిత్ అసలంక మాత్రమే ఉన్నారు. ఈ పోస్టర్లో పాకిస్తాన్కు ప్రాతినిథ్యం లేకపోవడం సోషల్మీడియాలో చర్చలకు తావిచ్చింది. ఆసియా కప్ నుంచి పాక్ వైదొలిగిందని ప్రచారం మొదలైంది.పహల్గాం ఉదంతం, తదనంతర పరిణామాల్లో (ఆపరేషన్ సిందూర్) భారత్, పాక్ మధ్య అప్పటివరకు ఉన్న తేలికపాటి సంబంధాలు కూడా తెగిపోయిన విషయం తెలిసిందే. క్రీడలు సహా అన్ని అంశాల్లో భారత్ పాక్తో సంబంధాలు తెంచుకుంది. క్రికెట్కు సంబంధించి ఆసియా కప్, ఐసీసీ టోర్నీల్లో, అదీ తటస్థ వేదికల్లో మాత్రమే భారత్ పాక్తో మ్యాచ్లు ఆడే విషయం పరిశీలనలో ఉంది. వాస్తవానికి క్రికెట్లో కూడా భారత్ పాక్తో పూర్తి స్థాయి సంబంధాలు తెంచుకోవాలని భారతీయుల నుంచి ఒత్తిడి ఉంది.ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా పాకిస్తాన్కు చెందిన మంత్రి, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహిసిన్ నఖ్వీ ఉండటంతో భారత్ ఆసియా కప్ నుంచి కూడా వైదొలుగుతుందని పలు నివేదికలు తెలిపాయి.మరికొన్ని నివేదికలేమో భారత్ తమ దేశ క్రికెట్ బోర్డు (బీసీసీఐ) పరపతిని ఉపయోగించి పాకిస్తాన్నే ఆసియా కప్ నుంచి వైదొలిగేలా చేస్తుందని చెప్పాయి. తాజాగా సోనీ స్పోర్ట్స్ పాక్ ప్రాతినిథ్యం లేని పోస్టర్ను విడుదల చేయడంతో ఇదే నిజమైదేంమోనని అనిపిస్తుంది. మొత్తానికి సోనీ స్పోర్ట్స్ విడుదల చేసిన ఆసియా కప్ పోస్టర్ భారత్, పాక్ల మధ్య మరోసారి అగ్గి రాజేసేలా ఉంది.కాగా, ఆసియా కప్ 2025పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఈ టోర్నీ యొక్క ఖచ్చితమైన వివరాలు, వేదికలు, షెడ్యూల్ గురించి ఏసీసీ ఎలాంటి సమాచారం ఇవ్వ లేదు. ఏసీసీ అధ్యక్షుడిగా పాక్కు చెందిన వ్యక్తి ఉన్నా, తమ దేశ భాగస్వామ్యంపై ఇప్పటివరకు స్పందించలేదు. కొద్ది రోజుల కిందట టోర్నీని భారత్లో కాకుండా యూఏఈలో నిర్వహిస్తారని కూడా ప్రచారం జరిగింది.2031 వరకు ఏసీసీ ఈవెంట్స్ హక్కులను దక్కించుకున్న సోనీ స్పోర్ట్స్సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా (SPNI) 2024 నుండి 2031 వరకు అన్ని ఏసీసీ టోర్నమెంట్ల మీడియా హక్కులను $170 మిలియన్ల బేస్ ధరకు దక్కించుకుంది. ఇది మునుపటి సైకిల్ కంటే 70% ఎక్కువ. ఆశ్చర్యకరంగా మీడియా హక్కుల కోసం పోటీ బిడ్డింగ్ జరగలేదు. జియోస్టార్ మధ్యలో వైదొలిగింది. -
గిల్ అసంతృప్తి.. జడ్డూ చర్య వైరల్!.. ఆఖరికి మేమే గెలిచాం!
ఇంగ్లండ్తో తొలి టెస్టు (Ind vs Eng 1st Test)లో ఐదో రోజు తొలి సెషన్లో టీమిండియాకు కలిసిరాలేదు. లీడ్స్ (Leeds)లో భారత్ విధించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆతిథ్య జట్టు నిలకడగా ముందుకు సాగుతోంది. ఓపెనర్లు జాక్ క్రాలే, బెన్ డకెట్ క్రీజులో పాతుకుపోగా.. ఈ జోడీని విడదీసేందుకు భారత బౌలర్లు ఎంతగా ప్రయత్నించినా అనుకున్న ఫలితం రాబట్టలేకపోయారు.లంచ్ బ్రేక్కు వెళ్లేసరికి ఇలా..దీంతో.. ఓవర్ నైట్ స్కోరు 21/0తో మంగళవారం నాటి ఐదో రోజు ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్.. భోజన విరామ సమయానికి ముప్పై ఓవర్ల ఆట పూర్తి చేసుకుని వికెట్ నష్టపోకుండా 117 పరుగులు సాధించింది. లంచ్ బ్రేక్కు వెళ్లేసరికి జాక్ క్రాలే 42, బెన్ డకెట్ 64 పరుగులతో క్రీజులో ఉన్నారు.శుబ్మన్ గిల్ అసంతృప్తిఇక ఎంతగా ప్రయత్నించినప్పటికీ క్రాలే, డకెట్ను అవుట్ చేయడం సాధ్యం కాకపోవడంతో భారత శిబిరంలో అసంతృప్తి నెలకొంది. బౌలర్లతో పాటు కెప్టెన్ శుబ్మన్ గిల్ కూడా అసంతృప్తికి లోనయ్యాడు. బంతి ఆకారం మారిందని, దానిని మార్చి కొత్త బంతి ఇవ్వాలని ఫీల్డ్ అంపైర్లు క్రిస్ గఫానీ, పాల్ రీఫిల్లకు భారత ఆటగాళ్లు కేఎల్ రాహుల్, సిరాజ్ తదితరులు విజ్ఞప్తి చేశారు.కెప్టెన్ గిల్ కూడా వారి వద్దకు వెళ్లి మర్యాదపూర్వకంగా, నవ్వులు చిందిస్తూ బంతిని మార్చమని అడిగాడు. కానీ అంపైర్లు మాత్రం ఇందుకు అంగీకరించలేదు. అయితే, టీమిండియా పట్టుబట్టడంతో గేజ్ టెస్టులో బంతి ఆకారం మారినట్లు తేలింది. దీంతో అంపైర్లు కొత్త బంతి ఇవ్వక తప్పని పరిస్థితి.జడ్డూ చర్య వైరల్ఈ నేపథ్యంలో భారత స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అంపైర్ వద్దకు వెళ్లి.. ‘‘చూశారా.. మేము చెప్పింది నిజం.. ఆఖరికి మాదే విజయం’’ అన్నట్లుగా పిడికిలి మడిచి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు బదులుగా అంపైర్ కూడా నవ్వులు చిందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఏదేమైనా ఎట్టకేలకు కొత్త బంతిని తెచ్చుకోవడంలో టీమిండియా సఫలమైంది. ఇక భారమంతా బౌలర్లదే. ఇంగ్లండ్ను కట్టడి చేసి జట్టుకు విజయం అందించాల్సిన బాధ్యత వారిదే.ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ సైతం బంతిని మార్చమని అంపైర్లను కోరగా.. నిరాశే ఎదురైంది. దీంతో అతడు తన చేతిలో ఉన్న బంతిని నేలకేసి కొట్టగా.. అంతర్జాతీయ క్రికెట్ మండలి మందలించింది. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతడి ఖాతాలో ఓ డిమెరిట్ పాయింట్ జతచేసింది.ఇంగ్లండ్ వర్సెస్ భారత్ తొలి టెస్టు🏏షెడ్యూల్: జూన్ 20- 24🏏వేదిక: హెడింగ్లీ, లీడ్స్🏏టాస్: ఇంగ్లండ్.. తొలుత బౌలింగ్🏏భారత్ తొలి ఇన్నింగ్స్: 471 ఆలౌట్🏏ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 465 ఆలౌట్🏏భారత్కు ఆరు పరుగుల ఆధిక్యం🏏భారత్ రెండో ఇన్నింగ్స్: 364 ఆలౌట్🏏ఇంగ్లండ్ లక్ష్యం: 371🏏నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు: 21/0 (6) 🏏ఐదో రోజు భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ స్కోరు: 117/0.చదవండి: వసీం అక్రం, షేన్ వార్న్ కాదు!.. నన్ను భయపెట్టింది ఆ బౌలరే: గంగూలీ.@imjadeja is all fired up as the umpire allows #TeamIndia a ball change! 🔄💥Is a breakthrough around the corner? Will the next two sessions bring the wickets India needs? 👀#ENGvIND 1st Test Day 5 LIVE NOW Streaming on JioHotstar 👉 https://t.co/0K41uhrKJ5 pic.twitter.com/qKMYKc6gDl— Star Sports (@StarSportsIndia) June 24, 2025 -
IND VS ENG 1st Test, Day 5: తొలి సెషన్ వారిదే.. లక్ష్యం దిశగా సాగుతున్న ఇంగ్లండ్
లీడ్స్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ రసపట్టులో సాగుతోంది. 350 పరుగుల లక్ష్య ఛేదనలో చేతిలో 10 వికెట్లు పెట్టుకొని చివరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ తొలి సెషన్లో అద్భుతంగా ఆడింది. ఓపెనర్లు బెన్ డకెట్ (64 నాటౌట్), జాక్ క్రాలే (42 నాటౌట్) అద్బుతమైన పోరాటపటిమ కనబరుస్తూ తొలి సెషన్లో భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ఈ ఇద్దరు తొలి సెషన్లో అజేయమైన 96 పరుగులు జోడించారు. తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ చేసిన డకెట్ ఈ ఇన్నింగ్స్లోనూ హాఫ్ సెంచరీ చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. క్రాలేతో పోలిస్తే డకెట్ ధాటిగా ఆడుతూ ఇంగ్లండ్ గెలుపుపై ఆశలు రేకెత్తిస్తున్నాడు. క్రాలే బాధ్యతాయుతంగా ఆడుతూ ఇన్నింగ్స్ను నిర్మిస్తున్నాడు. చివరి రోజు లంచ్ విరామం సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 117 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ గెలవాలంటే మరో రెండు సెషన్లలో 254 పరుగులు చేయాల్సి ఉంది. అదే భారత్ గెలవాలంటే 10 వికెట్లు తీయాల్సి ఉంటుంది. మొత్తానికి భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఓపెనర్లు తొలి సెషన్లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.వాతావరణ ముందస్తు హెచ్చరికలో ఇవాళ వర్షం పడే అవకాశముందని తెలిపింది. అయితే వరుణుడు తొలి సెషన్లో ఎలాంటి బ్రేకులు వేయలేదు. మ్యాచ్ సజావుగా సాగుతుంది. ఇంగ్లండ్ ఓపెనర్లు ఒక్కో పరుగును పేరుస్తూ.. తమ జట్టును లక్ష్యం దిశగా తీసుకెళ్తున్నారు. తొలి సెషన్లో భారత బౌలర్లు గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు. ప్రసిద్ద్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. సెషన్ ముగియడానికి ముందు బంతి మార్పిడి జరిగింది. కొత్త బంతితో కూడా భారత బౌలర్లకు ఎలాంటి ఫలితం రాలేదు. వరుణుడి నుంచి ఎలాంటి ఆటంకం ఉండకపోతే తదుపరి రెండు సెషన్లలో భారత బౌలర్లు 66 ఓవర్లు బౌల్ చేయాల్సి ఉంటుంది.స్కోర్ వివరాలు..భారత్: 471 (జైస్వాల్ 101, గిల్ 147, పంత్ 134) & 364 (రాహుల్ 137, పంత్ 118)ఇంగ్లండ్: 465 (పోప్ 106, బ్రూక్ 99) & 117/0 (డకెట్ 64 నాటౌట్, క్రాలే 42 నాటౌట్) -
అక్రం, వార్న్ కాదు!.. నేను ఎదుర్కొన్న డేంజరస్ బౌలర్ అతడే: గంగూలీ
భారత క్రికెట్లో తమకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న ఆటగాళ్లలో సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) ఒకడు. కెప్టెన్గా భారత జట్టు దశ దిశను మార్చిన ఘనత అతడి సొంతం. అంతేకాదు.. సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్లతో కూడిన తన సమకాలీన అత్యుత్తమ బ్యాటర్ల జాబితాలో స్థానం సంపాదించాడు దాదా.విదేశీ గడ్డపై తాను ఎదుర్కొన్న ప్రతీ బౌలర్పై గంగూలీ ఒకానొక సందర్భంలో పూర్తి ఆధిపత్యం కనబరిచాడు. 1992లో వెస్టిండీస్తో వన్డే మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన దాదా.. 1996లో టెస్టుల్లోనూ అరంగేట్రం చేశాడు.పదహారేళ్ల తన సుదీర్ఘ కెరీర్లో టీమిండియా తరఫున 113 టెస్టులు ఆడిన గంగూలీ.. పదహారు శతకాల సాయంతో 7212 పరుగులు సాధించాడు. అదే విధంగా.. 311 వన్డేల్లో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ 11363 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు, 72 అర్ధ శతకాలు ఉన్నాయి.గంగూలీని భయపెట్టిన బౌలర్ ఎవరో తెలుసా?ఇంతటి అనుభవం, అసాధారణ నైపుణ్యాలు ఉన్న గంగూలీని భయపెట్టిన బౌలర్ ఎవరో తెలుసా?.. దాదానే స్వయంగా ఈ విషయం గురించి మాట్లాడాడు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ఎదుర్కొన్న బౌలర్లలో తనను ఎక్కువగా భయపెట్టిందిఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ గ్లెన్ మెగ్రాత్ అని గంగూలీ తెలిపాడు. తన కెరీర్లో ఎదుర్కొన్న అత్యుత్తమ బౌలర్ల జాబితాలో భాగమైన పాక్ పేస్ లెజెండ్ వసీం అక్రం, ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ల పేర్లు కాకుండా దాదా మెగ్రాత్ పేరు చెప్పడం విశేషం. కాగా 1999-2011 మధ్య ఆస్ట్రేలియా అత్యంత పటిష్టమైన జట్టుగా కొనసాగింది.మూడుసార్లు వరుసగా కంగారూ జట్టు వన్డే వరల్డ్కప్ అందుకుంది. ఇక ఆసీస్ ప్రధాన బౌలర్లలో ఒకడైన మెగ్రాత్ది ఇందులో కీలక పాత్ర. ఈ రైటార్మ్ పేసర్ 1993- 2007 మధ్య ఆస్ట్రేలియా తరఫున 124 టెస్టుల్లో 563 వికెట్లు పడగొట్టాడు.అదే విధంగా.. 250 వన్డేల్లో మెగ్రాత్ 381 వికెట్లు కూల్చాడు. రెండు టీ20 మ్యాచ్లలో కలిపి ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఐపీఎల్లో ఒకప్పటి ఢిల్లీ డేర్డెవిల్స్ ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మెగ్రాత్ ఆడాడు. క్యాష్ రిచ్ లీగ్లో మొత్తంగా 14 మ్యాచ్లు ఆడి 12 వికెట్లు తీశాడు.చదవండి: IND vs ENG: రిషబ్ పంత్కు భారీ షాకిచ్చిన ఐసీసీ.. -
లండన్లో క్రికెటర్ మరణం.. నివాళులు అర్పించిన భారత్- ఇంగ్లండ్ ఆటగాళ్లు
టీమిండియా- ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు (Indv s Eng 1st Test) ఐదో రోజు ఆట సందర్భంగా ఇరుజట్ల ఆటగాళ్లు బ్లాక్ ఆర్మ్ బ్యాండ్స్తో బరిలోకి దిగారు. భారత మాజీ క్రికెటర్ దిలీప్ దోషి (Dilip Doshi) మరణానికి సంతాపం వ్యక్తం చేస్తూ మౌనం పాటించారు. కాగా భారత్కు చెందిన లెఫ్టార్మ్ స్పిన్నర్ దిలీప్ దోషి 77 ఏళ్ల వయసులో లండన్ (London)లో కన్నుమూశారు.చారిత్రాత్మక విజయంలో కీలక పాత్రగుండెపోటు కారణంగా ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. కాగా 1979- 1983 మధ్య కాలంలో దిలీప్ దోషి భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడారు. మెల్బోర్న్లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో ఐదు వికెట్లు తీసి.. జట్టు చారిత్రాత్మక విజయానికి దోహదం చేశారు.ఇక తన కెరీర్లో మొత్తంగా 33 టెస్టు మ్యాచ్లు ఆడిన దిలీప్ దోషి 114 వికెట్లతో సత్తా చాటారు. అదే విధంగా.. పదిహేను వన్డేలు ఆడి 22 వికెట్లు పడగొట్టారు. దేశవాళీ క్రికెట్లో సౌరాష్ట్ర, బెంగాల్ క్రికెట్ జట్లకు ఆడిన ఆయన.. ఇంగ్లండ్ కౌంటీల్లోనూ భాగమయ్యారు. వార్విక్షైర్, నాటింగ్హామ్షైర్ జట్లకు ప్రాతినిథ్యం వహించారు.అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత లండన్లోనే శాశ్వత నివాసం ఏర్పరచుకున్న దిలీప్ దోషి.. సోమవారం మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన మృతికి సంతాపంగా భారత్- ఇంగ్లండ్ ఆటగాళ్లు మౌనం పాటించడంతో పాటు.. బ్లాక్ ఆర్మ్ బ్యాండ్స్ ధరించారు.తొలి రోజు.. మూడో రోజు ఆలాకాగా.. టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్తో భారత జట్టు ఐదు టెస్టులు ఆడనుంది. ఇందులో భాగంగా లీడ్స్ వేదికగా శుక్రవారం తొలి టెస్టు మొదలుకాగా.. అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతులకు సంతాప సూచకంగా తొలి రోజు ఇరుజట్ల ఆటగాళ్లు నల్లటి బ్యాండ్స్ భుజానికి కట్టుకుని బరిలోకి దిగారు.అదే విధంగా.. మూడో రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ డేవిడ్ వాలంటైన్ లారెన్స్ (61) మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. మౌనం పాటించడంతో పాటు నల్ల బ్యాండ్లు ధరించారు. తాజాగా మంగళవారం నాటి ఆఖరిదైన ఐదో రోజు ఆటలోనూ ఇదే తరహాలో నివాళి అర్పించారు.భారత్కు 10 వికెట్లు.. ఇంగ్లండ్కు 350 రన్స్మ్యాచ్ విషయానికొస్తే.. హెడింగ్లీ మైదానంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులు చేసింది. ఇందుకు దీటుగా బదులిచ్చిన ఇంగ్లండ్ 465 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా 364 పరుగులు చేయగా.. తొలి ఇన్నింగ్స్లో ఆరు పరుగుల ఆధిక్యం కలుపుకొని ఇంగ్లండ్కు 371 పరుగుల లక్ష్యాన్ని విధించింది.ఈ క్రమంలో ఆఖరిదైన ఐదో రోజు ఆటలో ఫలితం తేలనుంది. టీమిండియా పది వికెట్లు తీస్తే విజేతగా నిలుస్తుంది. అదే ఇంగ్లండ్ తమ ఓవర్ నైట్ స్కోరు (21/0)తో ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్ విజయానికి 350 పరుగుల దూరంలో ఉంది.చదవండి: IND vs ENG: రిషబ్ పంత్కు భారీ షాకిచ్చిన ఐసీసీ.. -
ఇంగ్లండ్ గడ్డపై అరంగేట్రంలోనే శతక్కొట్టిన తిలక్ వర్మ
తెలుగు తేజం, హైదరాబాదీ ఆటగాడు, టీమిండియా టీ20 స్పెషలిస్ట్ తిలక్ వర్మ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో అరంగేట్రం మ్యాచ్లోనే ఇరగదీశాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ వన్-2025లో ఆడేందుకు ఇటీవలే హ్యాంప్షైర్తో ఒప్పందం చేసుకున్న తిలక్.. ఇంగ్లండ్ గడ్డపై తన తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లోనే సెంచరీ చేసి శభాష్ అనిపించుకున్నాడు. ఎసెక్స్తో రెండు రోజుల క్రితం ప్రారంభమైన మ్యాచ్లో తన జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (34/2) బరిలోకి దిగిన తిలక్.. ఎంతో సంయమనంతో బ్యాటింగ్ చేసి 239 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. అయితే దురదృష్టవశాత్తు సెంచరీ పూర్తి కాగానే హార్మర్ బౌలింగ్లో డీన్ ఎల్గర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎసెక్స్ తొలి ఇన్నింగ్స్లో 296 పరుగులకు ఆలౌట్ కాగా.. హ్యాంప్షైర్ 5 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది (మూడో రోజు తొలి సెషన్). తిలక్ ఔట్ కాగానే మరో హ్యాంప్షైర్ ఆటగాడు లియామ్ డాసన్ కూడా సెంచరీ పూర్తి చేశాడు. అంతకుముందు ఎసెక్స్ ఇన్నింగ్స్లో చార్లీ అల్లీసన్ (101) సెంచరీతో కదంతొక్కాడు.కాగా, తిలక్ ఇటీవలే హ్యాంప్షైర్తో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. జూన్ 18 నుండి ఆగస్టు 2 వరకు ఈ జట్టుకు అందుబాటులో ఉండనున్నట్లు ప్రకటించాడు. ఈ ఒప్పందంలో తిలక్ నాలుగు రోజుల మ్యాచ్లు ఆడనున్నాడు. వైట్బాల్ గేమ్స్ ఆడతాడో లేదో క్లారిటీ లేదు. ప్రస్తుతం ఇంగ్లండ్లో టీ20 బ్లాస్ట్ టోర్నీ జరుగుతోంది.22 ఏళ్ల తిలక్ ఈ మ్యాచ్కు ముందు వరకు 18 ఫస్ట్ క్లాస్లు మ్యాచ్లు ఆడి 50కి పైగా సగటుతో 1204 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, నాలుగు ఆర్ధ శతకాలు ఉన్నాయి. టీమిండియా తరఫున 4 వన్డేలు, 25 టీ20లు ఆడిన తిలక్.. టీ20ల్లో స్పెషలిస్ట్గా పేరు తెచ్చుకున్నాడు. పొట్టి ఫార్మాట్లో అతను 24 ఇన్నింగ్స్లలో 49.93 సగటుతో 749 పరుగులు చేశాడు.తిలక్కు ముందు మరో ఇద్దరు టీమిండియా యువ ఆటగాళ్లు, టీ20 స్పెషలిస్ట్లు ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ నాటింగ్హమ్షైర్తో.. రుతురాజ్ గైక్వాడ్ యార్క్షైర్తో జతకట్టారు. ఇషాన్ కూడా తిలక్ తరహాలోనే తన కౌంటీ అరంగేట్రంలో ఇరగదీశాడు. యార్క్షైర్తో జరిగిన మ్యాచ్లో 98 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్ సాయంతో 87 పరుగులు చేసి ఔటయ్యాడు. -
IND VS ENG 1st Test Day 5: టీమిండియాను కలవరపెడుతున్న చెడు శకునాలు..!
భారత్-ఇంగ్లండ్ మధ్య లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ఈ మ్యాచ్లో ఇరు జట్లకు సమానమైన విజయావకాశాలు ఉన్నాయి. ఇంగ్లండ్ గెలవాలంటే చివరి రోజు 350 పరుగులు (90 ఓవర్లలో) సాధించాలి. అదే భారత్ గెలవాలంటే 10 వికెట్లు తీయాలి. ఆధునిక టెస్ట్ క్రికెట్లో రెండూ అసాధ్యం కాదు. ఫలితం ఏ జట్టుకైనా అనుకూలంగా రావచ్చు.అయితే, గత రికార్డులను పరిశీలిస్తే మాత్రం ఎడ్జ్ ఇంగ్లండ్కే సూచిస్తున్నాయి. 2019లో ఇదే మైదానంలో ఆసీస్తో జరిగిన మ్యాచ్లో స్టోక్స్ నమ్మశక్యంకాని శతకాన్ని (135 నాటౌట్) బాది ఇంగ్లండ్కు చారిత్రక విజయాన్ని అందించాడు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 67 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్లో రికార్డు స్థాయిలో 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది. లీడ్స్ మైదానానికి 350 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన ఘన చరిత్ర ఉండటం ఐదో రోజు ఆటకు ముందు భారత ఆటగాళ్లను డిఫెన్స్లో పడేస్తుంది. అప్పట్లో ఆ లక్ష్యాన్ని ఛేదించింది ఇంగ్లండే కావడం టీమిండియాను మరింత బయపెడుతుంది. ఇంగ్లండ్ ఆటగాళ్లు సైతం చివరి రోజు 350 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో తగ్గేదేలేదంటున్నారు.చివరి రోజు ఆట ప్రారంభానికి ముందు టీమిండియాను మరో చెడు సూచకం కూడా బయపెడుతుంది. భారత్ తమ యావత్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో 350 ప్లస్ లక్ష్యాన్ని కాపాడుకోలేక ఒకే ఒకసారి చతికిలపడింది. టీమిండియా 59 మ్యాచ్ల్లో 350 ప్లస్ లక్ష్యాలను కాపాడుకునేందుకు బరిలోకి దిగగా.. 42 సార్లు సఫలమైంది. ఒకే ఒక సందర్భంలో బోల్తా పడింది. ఆ ఒక్క ఓటమి ఇంగ్లండ్ చేతిలోనే కావడం టీమిండియాను కలవరపెడుతుంది. 2022లో బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో జరిగిన మ్యాచ్లో భారత్ 378 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేక ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది. ఆ మ్యాచ్లో రూట్, బెయిర్స్టో అద్భుత శతకాలు సాధించి ఇంగ్లండ్ను గెలిపించారు.మరోవైపు చివరి రోజు ఆటకు ముందు వాతావరణం కూడా భారత్ విజయానికి అడ్డుకట్ట వేసేలా కనిపిస్తుంది. మ్యాచ్ మధ్య మధ్యలో వరుణుడు పలకరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇన్ని ప్రతికూలతల నడుమ భారత బౌలర్లు చివరి రోజు ఏం చేస్తారోనని టీమిండియా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.స్కోర్ వివరాలు..భారత్: 471 & 364ఇంగ్లండ్: 465 & 21/0చివరి రోజు భారత్ గెలుపుకు 10 వికెట్లు కావాలి. అదే ఇంగ్లండ్ గెలవాలంటే 90 ఓవర్లలో 350 పరుగులు చేయాలి. ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలే, బెన్ డకెట్ క్రీజ్లో ఉన్నారు. -
పృథ్వీ షా ఆడబోయేది ఈ జట్టుకే!.. సీఎస్కే స్టార్ సారథ్యంలో..
భారత క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) తన సొంత జట్టు మంబైని వీడాడు. దేశవాళీ క్రికెట్లో జట్టు మారాలని నిర్ణయించుకోగా.. ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) అందుకు అంగీకరించింది. అతడు కోరినట్లుగానే నిరభ్యంతర పత్రం (NOC) జారీ చేసింది.పరస్పరం హుందా ప్రకటనలు‘‘ముంబై క్రికెట్ అసోసియేషన్ నాకు విలువైన అవకాశాలెన్నో ఇచ్చింది. ఎల్లవేళలా నాకు మద్దతుగా నిలిచింది. అందుకు అసోసియేషన్కు ధన్యవాదాలు. ఎంసీఏకు చెందిన జట్టులో భాగం కావడం నాకు దక్కిన గొప్ప గౌరవం.ఇక్కడ నేను ఎంతో నేర్చుకున్నాను. అయితే, జట్టు మారాలని నిర్ణయించుకున్నాను’’ అని పృథ్వీ షా ఎంసీఏకు రాసిన లేఖలో పేర్కొన్నాడు. ఈ విషయంపై స్పందించిన ఎంసీఏ.. ‘‘క్రికెటర్ పృథ్వీ షా.. ముంబైకి చెందిన ఈ ప్రొఫెషనల్ ఆటగాడు వచ్చే దేశవాళీ సీజన్లో ఇతర జట్టుకు ఆడేందుకు అనుమతించాలని నిరభ్యంతర పత్రం కోరాడు.అతడి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని ఎంసీఏ ఎన్ఓసీ జారీ చేసింది’’ అని తమ ప్రకటనలో పేర్కొంది. ఈ నేపథ్యంలో పృథ్వీ జట్టు ఆడబోయే కొత్త జట్టు ఇదేనంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనం ప్రచురించింది. ఇందులో భాగంగా పృథ్వీ ఇకపై మహారాష్ట్ర జట్టుకు ఆడబోతున్నట్లు తెలిపింది.మహారాష్ట్రకు ఆడేందుకే నిర్ణయం!కాగా 25 ఏళ్ల పృథ్వీ షాకు రెండు- మూడు అసోసియేషన్ల నుంచి పిలుపు వచ్చినప్పటికీ.. మహారాష్ట్రకు ఆడేందుకే అతడు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే.. టీమిండియా ఓపెనర్లలో ఒకడైన రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో పృథ్వీ షా ఆడతాడు. కాగా మహారాష్ట్ర దేశీ జట్టును ముందుండి నడిపిస్తున్న రుతు.. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ఉన్న విషయం తెలిసిందే.కాగా దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి.. భారత్కు అండర్-19 వరల్డ్కప్ అందించిన పృథ్వీ షా 2018లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. 2020లో వన్డే, 2021లో టీ20లలోనూ అరంగేట్రం చేశాడు.ఓపెనర్గా ఆరంభంలో ఆకట్టుకున్నప్పటికీ.. ఆ తర్వాత పృథ్వీ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. క్రమశిక్షణా రాహిత్యం, ఫిట్నెస్ లేమి కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇవే కారణాలతో ఎంసీఏ కూడా అతడిని కొన్నాళ్లు పక్కనపెట్టింది.ఇక టీమిండియా తరఫున ఇప్పటి వరకు మొత్తంగా ఐదు టెస్టులు, ఆరు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడిన పృథ్వీ షా.. ఆయా ఫార్మాట్లలో 339, 189, ఒక పరుగు చేశాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 79 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి 1892 పరుగులు సాధించాడు. అయితే, ఐపీఎల్-2025 మెగా వేలంలో అతడిని ఏ జట్టూ కొనుగోలు చేయలేదు.చదవండి: IND vs ENG: రిషబ్ పంత్కు భారీ షాకిచ్చిన ఐసీసీ.. -
అలా చేయగలవా?.. అప్పుడు నన్ను బ్రూక్ అంటారు! పాపం వెంటనే..
టీమిండియా- ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు (Ind vs Eng 1st Test) నాలుగో రోజు ఆట సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (Harry Brook).. భారత పేస్ బౌలర్ ప్రసిద్ కృష్ణ (Prasidh Krishna)ను టీజ్ చేశాడు. సిక్సర్లు బాదగలవా అంటూ రెచ్చగొట్టాడు.ఇందుకు ప్రసిద్ ఏమాత్రం ఆవేశానికి లోనుకాకుండా కూల్గా సమాధానమిచ్చాడు. అయితే, ఆ మరుసటి బంతికే ప్రసిద్ అవుట్ కావడంతో భారత ఇన్నింగ్స్కు తెరపడింది.విషయం ఏమిటంటే.. టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో లీడ్స్ వేదికగా శుక్రవారం (జూన్ 20) తొలి మ్యాచ్ ఆరంభం కాగా.. టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట బౌలింగ్ చేసింది.ఆది నుంచి గిల్ సేనదే పైచేయిఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులకు ఆలౌట్ అయింది. యశస్వి జైస్వాల్ (101), కెప్టెన్ శుబ్మన్ గిల్ (147), రిషభ్ పంత్ (134) శతకాల కారణంగా ఈ మేర స్కోరు సాధ్యమైంది.ఇక ఇందుకు బదులిచ్చే క్రమంలో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు 465 పరుగులకు తమ తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఫలితంగా ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది టీమిండియా.ఈ క్రమంలో సోమవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా.. 96వ ఓవర్ వద్ద 364 పరుగులకు భారత్ ఆలౌట్ అయింది. కేఎల్ రాహుల్ (137), రిషభ్ పంత్ (118) శతకాలతో రాణించారు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్లో ఆరు పరుగుల ఆధిక్యంతో కలిపి.. ఇంగ్లండ్కు టీమిండియా 371 పరుగుల లక్ష్యం విధించింది.అయితే, నాలుగో రోజు ఆటలో భారత ఇన్నింగ్స్లో 96వ ఓవర్ను ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ వేశాడు. అప్పటికి రవీంద్ర జడేజా, ప్రసిద్ కృష్ణ క్రీజులో ఉన్నారు. ఐతే ఐదో బంతిని ఎదుర్కొన్న ప్రసిద్.. ఆరో బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధంకాగా.. ఫస్ట్స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న హ్యారీ బ్రూక్ అతడిని టీజ్ చేశాడు.నువ్వు భారీ సిక్సర్లు బాదగలవా?‘‘నువ్వు భారీ సిక్సర్లు బాదగలవా?’’ అంటూ ప్రసిద్ను రెచ్చగొట్టాడు. ఇందుకు.. ‘‘ఒకవేళ నేను అలా చేశానంటే.. అప్పుడు నన్ను బ్రూక్ అంటారు’’ అని ప్రసిద్ సమాధానమిచ్చాడు. అయితే, ఆరో బంతిని బషీర్ ఫుల్ అవుట్సైడ్ ఆఫ్ దిశగా సంధించగా.. దానిని ఆడేందుకు ముందుకు వచ్చిన ప్రసిద్ బంతిని గాల్లోకి లేపగా.. డీప్ మిడ్ వికెట్ వద్ద జోష్ టంగ్ క్యాచ్ పట్టాడు. దీంతో ప్రసిద్ ఇన్నింగ్స్తో పాటు టీమిండియా ఇన్నింగ్స్ కూడా ముగిసింది.విజేత ఎవరో?కాగా బ్రూక్- ప్రసిద్ కృష్ణ మాటలు స్టంప్ మైకులో రికార్డు కాగా.. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో చక్కర్లు కొడుతోంది. కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టులో ఆఖరిదైన మంగళవారం నాటి ఐదో రోజు ఆటలో భాగంగా విజేత ఎవరో తేలుతుంది. భారత్ విజయానికి పది వికెట్లు అవసరం కాగా.. ఇంగ్లండ్ గెలుపునకు 350 పరుగుల దూరంలో ఉంది.చదవండి: పంత్ సెంచరీలపై అలా.. కేఎల్ రాహుల్ శతకంపై ఇలా! గోయెంకా పోస్ట్ వైరల్ "Can you hit big sixes?" — Harry Brook on the stump mic... and Prasidh goes for it on the very next ball and gets out.Classic Test cricket theatre — brought to you by the mic (and a bit of mischief). 🎭#ENGvIND | 1st Test, Day 5 | TUE, 24th JUNE, 2:30 PM on JioHotstar! pic.twitter.com/Bgwq5D3PiB— Star Sports (@StarSportsIndia) June 24, 2025 -
రిషబ్ పంత్కు భారీ షాకిచ్చిన ఐసీసీ..
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఊహించని షాకిచ్చింది. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో అంపైర్తో వాగ్వదం దిగినందుకు గానూ పంత్కు ఓ డిమెరిట్ పాయింట్ ఐసీసీ విధించింది.ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8ని ఉల్లంఘించినందుకు ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. గత 24 నెలలలో ఇదే తొలి తప్పిదం అయినందున కేవలం ఒక డీమెరిట్ పాయింట్తో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సరిపెట్టింది.అసలేమి జరిగిందంటే?ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 61 ఓవర్లో బంతిని మార్చమని ఫీల్డ్ అంపైర్ పాల్ రీఫెల్పై పంత్ ఒత్తిడి తీసుకొచ్చాడు. బంతి కండీషన్ బాగోలేదని కొత్త బంతిని తీసుకురావాలని పంత్ సూచించాడు. కానీ ఫీల్డ్ అంపైర్లు బంతిని పరిశీలించి, మార్చాల్సిన అవసరంలేదంటూ అదే బాల్ను తిరిగి పంత్కు ఇచ్చాడు.ఈ క్రమంలో సహనం కోల్పోయిన పంత్.. బంతిని నేలకేసి బలంగా కొట్టాడు. దీంతో అంపైర్లు మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్కు ఫిర్యాదు చేశారు. పంత్ కూడా తన తప్పును అంగీకరించాడు. ఈ నేపథ్యంలోనే పంత్పై ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఈ చర్యలు తీసుకున్నారు.శతక్కొట్టిన పంత్..కాగా ఈ మ్యాచ్లో పంత్ సెంచరీలు మోత మోగించాడు. రెండో ఇన్నింగ్స్లలోనూ శతకాలు బాది సంచలనం సృష్టించాడు. ఓ టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో సెంచరీలు చేసిన తొలి భారత వికెట్ కీపర్గా రికార్డులకెక్కాడు. తొలి ఇన్నింగ్స్లో 134 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్లో 118 పరుగులు చేశాడు. కాగా తొలి టెస్టులో విజయంపై భారత్ కన్నేసింది.ఇంగ్లండ్ ముందు 371 పరుగుల భారీ లక్ష్యాన్ని గిల్ సేన ఉంచింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఆఖరి రోజు ఆటలో ఎవరు మెరుగ్గా రాణిస్తే వారిదే విజయం.చదవండి: రింకూ సింగ్- ఎంపీ ప్రియా సరోజ్ పెళ్లి వాయిదా!.. కారణం ఇదే! -
రింకూ సింగ్- ఎంపీ ప్రియా సరోజ్ పెళ్లి వాయిదా!.. కారణం?
భారత స్టార్ క్రికెటర్ రింకూ సింగ్ (Rinku Singh)- లోక్సభ ఎంపీ ప్రియా సరోజ్ (Priya Saroj)ల పెళ్లి వాయిదా పడినట్లు సమాచారం. ఈ ఏడాది జరగాల్సిన వీరి వివాహం (Wedding Postoponed) వచ్చే సంవత్సరంలో జరుగనున్నట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ (KKR)కు ప్రాతినిథ్యం వహిస్తూ వెలుగులోకి వచ్చాడు ఉత్తరప్రదేశ్కు చెందిన రింకూ సింగ్.గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదిన అతడు.. టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో 2023లో ఐర్లాండ్తో టీ20 సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. నయా ఫినిషర్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. అదే ఏడాది వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు.ఇప్పటి వరకు భారత్ తరఫున 33 టీ20లు, 2 వన్డే మ్యాచ్లు ఆడిన రింకూ సింగ్.. ఆయా ఫార్మాట్లలో 339, 41 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్ ఇప్పటికి 58 మ్యాచ్లు పూర్తి చేసుకున్న ఈ కేకేఆర్ స్టార్.. 1099 రన్స్ చేశాడు. ఇందులో నాలుగు అర్ధ శతకాలు ఉన్నాయి.ఎంపీతో ప్రేమలో రింకూనిరుపేద కుటుంబం నుంచి వచ్చి స్టార్ క్రికెటర్గా ఎదిగిన రింకూ.. కెరీర్ పరంగా నిలదొక్కుకున్నాడు. ఇటీవలే వివాహ బంధంలో అడుగుపెట్టేందుకు కూడా సిద్ధపడ్డాడు. సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారగా.. ఇరు కుటుంబాల అంగీకారంతో ఈ ఏడాది జూన్ 8న వీరి నిశ్చితార్థం జరిగింది. మూడేళ్లుగా ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నామంటూ రింకూ- ప్రియా తమ ఎంగేజ్మెంట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.జూన్ 8న నిశ్చితార్థంఇక లక్నోలోని ఓ హోటల్లో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో రింకూ- ప్రియా ఉంగరాలు మార్చుకున్నారు. సమాజ్వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్తో పాటు జయా బచ్చన్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తదితరులు వీరి ఎంగేజ్మెంట్కు హాజరయ్యారు.ఈ క్రమంలో నవంబరు 18న తాజ్ హోటల్లో పెళ్లి వేడుకను జరిపేందుకు పెద్దలు ముహూర్తం ఖరారు చేశారు. అయితే, అమర్ ఉజాలా న్యూస్పేపర్ కథనం ప్రకారం.. రింకూ- ప్రియాల వివాహం వాయిదా పడినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి పెళ్లి జరుగనుందని సమాచారం. కారణం ఇదే?టీమిండియా క్రికెటర్గా రింకూ బిజీ షెడ్యూల్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ ఏడాది నవంబరులో టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. నవంబరు 14- డిసెంబరు 19 వరకు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.చదవండి: పంత్ సెంచరీలపై అలా.. కేఎల్ రాహుల్ శతకంపై ఇలా! గోయెంకా పోస్ట్ వైరల్ -
రిషబ్ పంత్ సరికొత్త చరిత్ర.. 148 ఏళ్ల టెస్టు క్రికెట్ హిస్టరీలోనే
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్లలోనూ పంత్ సెంచరీలతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్లో 134 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్లో 118 పరుగులు చేశాడు.తన అద్బుత సెంచరీలతో ఇంగ్లండ్కు 371 పరుగుల లక్ష్యాన్ని ఉంచడంలో పంత్ కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో పంత్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.పంత్ సాధించిన రికార్డులు ఇవే..ఒక టెస్టు మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్గా పంత్ చరిత్ర సృష్టించాడు. లీడ్స్ టెస్టులో పంత్ 252 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఈ రికార్డు భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ బుద్ధి కుందరన్ పేరిట ఉండేది. కుందరన్ 1964లో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో రెండు సెంచరీలు సాధించాడు. తాజా మ్యాచ్తో 61 ఏళ్ల కుందరన్ ఆల్టైమ్ రికార్డును పంత్ బ్రేక్ చేశాడు.ఒకే టెస్టు మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్ కీపర్లు వీరే..👉రిషబ్ పంత్ 252👉బుద్ధి కుందరన్ 230👉ఎంఎస్ ధోని 224👉రిషబ్ పంత్ 203👉ఫరోఖ్ ఇంజనీర్ 187👉అదేవిధంగా 148 టెస్టు క్రికెట్ హిస్టరీలోనే ఒకే మ్యాచ్లో 2 సెంచరీలు బాదిన రెండో వికెట్ కీపర్గా రిషబ్ పంత్ నిలిచాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో జింబాబ్వే దిగ్గజం ఆండీ ఫ్లవర్ అగ్రస్ధానంలో ఉన్నారు. సౌతాఫ్రికాతో 2001లో జరిగిన టెస్ట్లో తొలి ఇన్నింగ్స్లో 142 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 199 పరుగులతో ఫ్లవర్ ఆజేయంగా నిలిచాడు.👉ఒక టెస్టు మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లలోనూ సెంచరీలు చేసిన ఏకైక ఆసియాన్ వికెట్ కీపర్ కూడా పంత్ కావడం విశేషం.👉ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో భారత ఆటగాడిగా క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్,దిలీప్ వెంగ్సర్కార్ రికార్డును రిషబ్ సమం చేశాడు. వారిద్దరూ ఇంగ్లండ్లో నాలుగు టెస్టు సెంచరీలు సాధించారు. పంత్కు కూడా ఇంగ్లండ్ గడ్డపై నాలుగో టెస్టు సెంచరీ. ఈ రేర్ ఫీట్సాధించిన జాబితాలో రాహుల్ ద్రవిడ్ 6 సెంచరీలతో రాహుల్ ద్రవిడ్ అగ్రస్ధానంలో ఉన్నాడు.Cartwheeling into the record books literally! 🌀Rishabh Pant brings his love for gymnastics into every 100 celebration, and it’s just as fearless as his batting.Who needs quiet fist pumps when you can flip your way to history?#ENGvIND 1st Test Day 4 LIVE NOW Streaming on… pic.twitter.com/iOQ8fVgHJT— Star Sports (@StarSportsIndia) June 23, 2025 -
పంత్ సెంచరీలపై అలా.. కేఎల్ రాహుల్ శతకంపై ఇలా! గోయెంకా పోస్ట్ వైరల్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant)పై ప్రముఖ వ్యాపారవేత్త, లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా (Sanjiv Goenka) ప్రశంసలు కురిపించారు. దూకుడైన ఆటకు మారుపేరంటూ పంత్ బ్యాటింగ్ తీరును కొనియాడారు. అదే సమయంలో.. భారత ఓపెనింగ్ బ్యాటర్, లక్నో మాజీ ఆటగాడు కేఎల్ రాహుల్ను కూడా సంజీవ్ గోయెంకా ప్రశంసించడం విశేషం.రెండు ఇన్నింగ్స్లోనూ శతకాలుకాగా భారత్- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య తొలి టెస్టులో రిషభ్ పంత్ శతకాలతో అదరగొట్టిన విషయం తెలిసిందే. లీడ్స్ వేదికగా తొలి ఇన్నింగ్స్లో 178 బంతులు ఎదుర్కొన్న ఈ ఐదో నంబర్ బ్యాటర్.. 12 ఫోర్లు, ఆరు సిక్సర్ సాయంతో.. 75కు పైగా స్ట్రైక్రేటుతో 134 పరుగులు సాధించాడు.ఇక రెండో ఇన్నింగ్స్లోనూ పంత్ దంచికొట్టాడు. 140 బంతుల్లోనే 118 పరుగులు రాబట్టాడు. అతడి ఇన్నింగ్స్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లు ఉండటం విశేషం. స్ట్రైక్రేటు 84.29. తన అద్భుత శతక ఇన్నింగ్స్ల ద్వారా టీమిండియా పటిష్ట స్థితిలో నిలవడంలో పంత్ కీలక పాత్ర పోషించాడు.అమోఘం.. రాహుల్కు కంగ్రాట్స్ ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ యజమాని తమ కెప్టెన్ రిషభ్ పంత్ను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘అమోఘం! రెండు వరుస సెంచరీలు.. దూకుడుకు మారుపేరుగా, బెదురులేని.. అద్భుత ఇన్నింగ్స్.టెస్టు మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన రెండో వికెట్ కీపర్గా చరిత్ర.. సూపర్’’ అంటూ క్లాప్ ఎమోజీలు జత చేశారు. అదే సమయంలో మరో శతక వీరుడు కేఎల్ రాహుల్ పేరును కూడా గోయెంకా ప్రస్తావించడం వైరల్గా మారింది. ‘‘సెంచరీ చేసిన కేఎల్ రాహుల్కు కూడా శుభాకాంక్షలు’’ అని గోయెంకా ట్వీట్ చేశారు.కాగా 2022లో ఐపీఎల్లో అడుగుపెట్టిన లక్నో జట్టుకు మూడేళ్ల పాటు కేఎల్ రాహుల్ కెప్టెన్గా వ్యవహరించాడు. 2022, 2023లో వరుసగా రెండుసార్లు జట్టును ప్లే ఆఫ్స్నకు చేర్చాడు. కానీ 2024లో మాత్రం రాహుల్ ఇదే ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయాడు.రాహుల్పై ఫైర్.. ఫ్రాంఛైజీని వీడిన స్టార్ఈ నేపథ్యంలో సంజీవ్ గోయెంకా మైదానంలో బహిరంగంగా రాహుల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఇక ఈ పరిణామం తర్వాత అంటే.. 2025 మెగా వేలానికి ముందు రాహుల్ లక్నో ఫ్రాంఛైజీని వీడాడు.అనంతరం ఆక్షన్లో భాగంగా లక్నో రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లకు రిషభ్ పంత్ను కొనుగోలు చేసి కెప్టెన్గా నియమించింది. అయితే, బ్యాటర్, కెప్టెన్గా ఈ సీజన్లో పంత్ పూర్తిగా విఫలమయ్యాడు. పద్నాలుగు మ్యాచ్లలో కలిపి పంత్ కేవలం 269 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ ఉండటం చెప్పుకోదగ్గ అంశం.గెలుపునకు పది వికెట్ల దూరంలోఇక పంత్ సేన తాజా ఎడిషన్లో పద్నాలుగింట ఆరు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికే పరిమితమైంది. మరోవైపు.. 2025లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిథ్యం వహించిన కేఎల్ రాహుల్ పదమూడు మ్యాచ్లు ఆడి.. ఓ శతకం సాయంతో 539 పరుగులు సాధించడం విశేషం.ఇక టీమిండియా- ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు రసవత్తరంగా మారింది. ఆఖరిదైన ఐదో రోజు ఆటలో విజేత ఎవరన్నది తేలనుంది. భారత బౌలర్లు రాణించి పది వికెట్లు కూలిస్తే.. గిల్ సేనకు శుభారంభం లభిస్తుంది. మరోవైపు.. భారత్ విధించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలంటే ఇంగ్లండ్ మంగళవారం 350 పరుగులు చేయాలి. చదవండి: ‘లక్ష్మణ్ను కాదని అతడిని తీసుకున్నాం.. నాతో మూడు నెలలు మాట్లాడలేదు’𝘈 𝘚𝘰𝘯𝘨 𝘰𝘧 𝘐𝘤𝘦 & 𝘍𝘪𝘳𝘦 𝘢𝘵 𝘏𝘦𝘢𝘥𝘪𝘯𝘨𝘭𝘦𝘺.🔥❄️@klrahul set the foundation with a composed and elegant century while @RishabhPant17’s quickfire hundred electrified the crowd with an explosive display of fearless strokeplay! 🤩WATCH FULL HIGHLIGHTS OF DAY 4… pic.twitter.com/MQ13EvHIae— Star Sports (@StarSportsIndia) June 23, 2025 -
టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. ఒకవేళ అదే జరిగితే?
లీడ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలిటెస్టు తుది అంకానికి చేరుకుంది. గత నాలుగు రోజుల నుంచి హోరా హోరీగా సాగుతున్న ఈ మ్యాచ్ ఫలితం మంగళవారం తేలిపోనుంది. తొలి ఇన్నింగ్స్లో అదరగొట్టిన భారత బ్యాటర్లు.. రెండో ఇన్నింగ్స్లో కూడా సత్తాచాటారు.దీంతో ఇంగ్లండ్ ముందు 371 పరుగుల భారీ లక్ష్యాన్ని గిల్ సేన ఉంచింది. లక్ష్య చేధనలో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లీష్ జట్టు వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. దూకుడుగా ఆడి లక్ష్యాన్ని పూర్తి చేయాలని స్టోక్స్ సేన భావిస్తుంటే.. భారత జట్టు మాత్రం ప్రత్యర్ధిని ఆలౌట్ చేయాలని పట్టుదలతో ఉంది.వర్షం ముప్పు..అయితే భారత్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లే అవకాశముంది. ఐదో రోజు ఆటకు వర్షం ముప్పు పొంచి ఉంది. ఆక్యూవెధర్, బీబీసీ వెదర్ రిపోర్ట్ ప్రకారం.. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయంలో లీడ్స్లో వర్షం పడటానికి 40 శాతం ఆస్కారం ఉంది. స్ధానిక కాలమానం ప్రకారం ఉదయం 11:00 గంటలకు ఆఖరి రోజు ఆట ఆరంభం కానుంది. ఒకవేళ రిపోర్ట్స్ ప్రకారం.. మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగిస్తే తొలి టెస్టు డ్రాగా ముగిసే ఛాన్స్ ఉంది.ఆక్యూ వెదర్ రిపోర్ట్..మధ్యాహ్నం 2:30 (స్దానిక కాలమానం ఉదయం 10 గంటలకు 55% వర్షం పడే అవకాశం)మధ్యాహ్నం 3:30 (స్దానిక కాలమానం ఉదయం 11 గంటలకు 40% వర్షం పడే అవకాశం)మధ్యాహ్నం 4:30 (స్దానిక కాలమానం ఉదయం 12 గంటలకు 43% వర్షం పడే అవకాశం)సాయంత్రం 6:30 (స్ధానిక కాలమనం మధ్యాహ్యం 2 గంటలకు 47 % వర్షం పడే అవకాశం)సాయంత్రం 7:30 (స్ధానిక కాలమనం మధ్యాహ్యం 3 గంటలకు 52 % వర్షం పడే అవకాశంరాత్రి 8:30-10:30( స్ధానిక కాలమనం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు 50 % వర్షం పడే అవకాశం)చదవండి: చరిత్ర సృష్టించిన కిరాన్ పొలార్డ్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా -
చరిత్ర సృష్టించిన కిరాన్ పొలార్డ్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో 700 మ్యాచ్లు ఆడిన ఏకైక ప్లేయర్గా వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. పొలార్డ్ ప్రస్తుతం అమెరికా మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2025లో ఎంఐ న్యూయర్క్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.మంగళవారం డల్లాస్ వేదికగా శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్, ఎంఐ న్యూయర్క్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ ఆడేందుకు మైదానంలోకి అడుగుపెట్టిన పొలార్డ్.. ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 38 ఏళ్ల పొలార్డ్ 2006లో ట్రినిడాడ్ & టొబాగో తరపున టీ20 క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత వెస్టిండీస్తో పాటు ఐపీఎల్, సీపీఎల్, బీబీఎల్, బీపీఎల్, అబుదాబి టీ20, టీ10 వంటి ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్లో భాగమయ్యాడు. ఐపీఎల్లో 2010 నుంచి 2022కు ముంబై ఇండియన్స్కు ఈ కరేబియన్ దిగ్గజం ప్రాతనిథ్యం వహించాడు.2023 సీజన్కు ముందు రిటైర్మెంట్ ప్రకటించిన పొలార్డ్.. ముంబై ఇండియన్స్ కోచింగ్ స్టాప్లో చేరాడు. ఇప్పటివరకు 700 టీ20లు ఆడిన పొలార్డ్.. 13,634 పరుగులతో పాటు 326 వికెట్లు పడగొట్టాడు. కాగా అత్యధిక టీ20లు ఆడిన జాబితాలో పొలార్డ్ తర్వాత స్ధానంలో డ్వైన్ బ్రావో(582), షోయబ్ మాలిక్(557) ఉన్నారు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఎంఐ న్యూయర్క్పై 47 పరుగుల తేడాతో శాన్ ఫ్రాన్సిస్కో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శాన్ ఫ్రాన్సిస్కో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 246 పరుగుల భారీ స్కోర్ చేసింది.శాన్ ఫ్రాన్సికో కెప్టెన్ మాథ్యూ షార్ట్ (43 బంతుల్లో 91 పరుగులు), జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్ (26 బంతుల్లో 64 పరుగులు) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. అనంతరం భారీ లక్ష్య చేధనలో న్యూయర్క్ 199 పరుగులకే పరిమితమైంది.చదవండి: IND vs ENG: 'అతడిని ఎందుకు తీసుకున్నారు.. నితీశ్ రెడ్డి వంద రెట్లు బెటర్' -
'అతడిని ఎందుకు తీసుకున్నారు.. నితీశ్ రెడ్డి వంద రెట్లు బెటర్'
ఠాకూర్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. బ్యాటింగ్ ఆల్రౌండర్ నితీశ్కుమార్ రెడ్డి స్ధానంలో తుది జట్టులోకి వచ్చిన శార్ధూల్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్లో కేవలం ఒకే ఒక్క పరుగు చేసిన ఠాకూర్.. రెండో ఇన్నింగ్స్లోనూ అదే తీరును కనబరిచాడు. జోష్ టంగ్ బౌలింగ్లో చెత్త షాట్ ఆడి తన వికెట్ను సమర్పించుకున్నాడు. ఈ ముంబై క్రికెటర్ 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. బౌలింగ్లోనూ విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో 6 ఓవర్లు వేసి 38 పరుగులు సమర్పించుకున్నాడు.దీంతో భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ మరో స్పెల్ బౌలింగ్ చేసే అవకాశమివ్వలేదు. అయితే ఈ మ్యాచ్లో శార్థూల్ ఠాకూర్పై టీమిండియా మెనెజ్మెంట్ భారీ అంచనాలు పెట్టుకుంది. లోయార్డర్లో శార్ధూల్ తన అనుభవంతో పరుగులు సాధిస్తాడని భావించింది. అందుకే ఆసీస్ గడ్డపై దుమ్ములేపిన తెలుగు తేజం తీష్ కుమార్ రెడ్డిని పక్కనపెట్టి మరీ శార్దూల్ను ఆడించారు.కానీ హెడ్ కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ గిల్ నమ్మకాన్ని శార్ధూల్ వమ్ము చేశాడు. ఈ క్రమంలో టీమ్మెనెజ్మెంట్పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నాడు. శార్థూల్ను ఎందుకు అవకాశమిచ్చారు.. అతడి కంటే నితీశ్ రెడ్డి వంద రెట్లు బెటర్ అని పోస్ట్లు పెడుతున్నారు. మరోవైపు శార్దూల్కు తొలి ఇన్నింగ్స్లో కేవలం 6 ఓవర్ల మాత్రమే బౌలింగ్ ఇవ్వడాన్ని పలువురు మాజీలు తప్పబడుతున్నారు. అతడిపై మీకు నమ్మకం లేనప్పుడు జట్టులోకి ఎందుకు తీసుకున్నారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇక లీడ్స్ టెస్టు ముగింపునకు చేరుకుంది. ఇంగ్లండ్ ముందు టీమిండియా 371 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. తమ రెండో ఇన్నింగ్స్ను మొదలు పెట్టిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఇంగ్లీష్ జట్టు విజయానికి ఇంకా 350 పరుగులు కావాలి. చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 70 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి -
వారెవ్వా రూట్.. ద్రవిడ్ వరల్డ్ రికార్డు సమం
ఇంగ్లండ్ స్టార్ బ్యా టర్ జో రూట్ మరో అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక క్యాచ్లు అందుకున్న ఫీల్డర్గా భారత మాజీ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ రికార్డును రూట్ సమం చేశాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో రూట్ ఈ ఫీట్ సాధించాడు.నాలుగో రోజు ఆటలో శార్థూల్ ఠాకూర్ క్యాచ్ను అందుకున్న జో.. ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రూట్, ద్రవిడ్ ఇద్దరూ సమానంగా చెరో 210 అవుట్ఫీల్డ్ క్యాచ్లను అందుకున్నారు. ద్రవిడ్ ఈ వరల్డ్ రికార్డును 164 టెస్టుల్లో సాధించగా.. రూట్ 154 మ్యాచ్లలోనే ఈ రేర్ఫీట్ను సమం చేశాడు.ఈ సిరీస్లో రూట్ మరో క్యాచ్ను అందుకుంటే ద్రవిడ్ను అధిగమిస్తాడు. ఈ రికార్డు సాధించిన జాబితాలో ద్రవిడ్, రూట్ తర్వాత స్ధానంలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్దనే(205 అవుట్ఫీల్డ్ క్యాచ్లు) ఉన్నారు. అయితే టెస్టుల్లో అత్యధిక క్యాచ్లు అందుకున్న వికెట్ కీపర్గా దక్షిణాఫ్రికా లెజెండ్ మార్క్ బౌచర్(532) అగ్రస్దానంలో ఉన్నాడు.గెలుపువరిదో?ఇక ఇంగ్లండ్-భారత్ మధ్య తొలి టెస్టు ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఇంగ్లండ్ ముందు టీమిండియా 371 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. తమ రెండో ఇన్నింగ్స్ను మొదలు పెట్టిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఇంగ్లీష్ జట్టు విజయానికి ఇంకా 350 పరుగులు కావాలి. భారత్ తమ విజయానికి పది వికెట్ల దూరంలో నిలిచింది. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 90/2 తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. 96 ఓవర్లలో 364 పరుగులకు ఆలౌటైంది.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 70 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి -
బ్యాటింగ్కు అంత ఈజీగా లేదు.. విజయం మాదే: కేఎల్ రాహుల్
హెడింగ్లీ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా మారింది. 90/2తో నాలుగో రోజును ఆటను ప్రారంభించిన టీమిండియా.. అదనంగా 274 పరుగులు జోడించి తమ రెండో ఇన్నింగ్స్ను ముగించింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (137), రిషబ్ పంత్ (118) సెంచరీలతో చెలరేగారు.పంత్, రాహుల్ ఇద్దరూ నాలుగో వికెట్కు 195 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే వీరిద్దరూ ఔటయ్యాక టీమిండియా బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. 31 పరుగుల వ్యవధిలోనే భారత్ చివరి 6 వికెట్లు కోల్పోయింది.దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం జోడించి ఇంగ్లండ్ ముందు 371 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ను మొదలు పెట్టిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 21/0 స్కోరుతో నిలిచింది. ఇక ఈ మ్యాచ్ విజయంపై సెంచూరియాన్ కేఎల్ రాహుల్ థీమా వ్యక్తం చేశాడు.ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ను ఆలౌట్ చేసేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తామని రాహుల్ తెలిపాడు. మరోవైపు ఇంగ్లండ్ సైతం డ్రా కోసం కాకుండా గెలుపు కోసం ప్రయత్నిస్తోంది. ఈ విషయాన్ని ఇంగ్లండ్ యువ సంచలనం జోష్ టంగ్ స్పష్టం చేశాడు."బ్లాక్బస్టర్ ముగింపు కోసం ఎదురు చూస్తున్నాము. ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఫలితం తేలుతుంది. ఇంగ్లండ్ జట్టు కూడా డ్రా కోసం కాకుండా విజయం కోసం ప్రయత్నిస్తోంది. ఈ విషయాన్ని వారు బహిరంగంగానే వెల్లడించారు. కాబట్టి వారు దూకుడుగా ఆడితే మాకు 10 వికెట్లు తీసేందుకు అవకాశం లభిస్తోంది. నాలుగో రోజు ఆటలో పిచ్ బ్యాటింగ్కు అంత అనుకూలంగా లేదు. బంతి కాస్త ఆగి వచ్చింది. రేపు(మంగళవారం) పిచ్ మరింత ట్రిక్కీగా మారవచ్చు. దీంతో ఇంగ్లండ్ను ఆలౌట్ చేసేందుకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి" అని నాలుగో రోజు ఆట అనంతరం విలేకరుల సమావేశంలో రాహుల్ పేర్కొన్నాడు.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 70 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి -
ఆటకు హాకీ స్టార్ లలిత్ బైబై
న్యూఢిల్లీ: భారత వెటరన్ హాకీ ఆటగాడు లలిత్ ఉపాధ్యాయ్ అంతర్జాతీయ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టోక్యో ఒలింపిక్స్, పారిస్ ఒలింపిక్స్లలో కాంస్య పతకం గెలుపొందిన భారత జట్టులో ఫార్వర్డ్ ప్లేయర్గా కీలకపాత్ర పోషించాడు. పదేళ్ల సుదీర్ఘ కెరీర్కు వీడ్కోలు పలికేందుకు ఇదే సరైన సమయమని ఉత్తరప్రదేశ్కు చెందిన 31 ఏళ్ల లలిత్ భావించాడు. 2014 ప్రపంచకప్ ద్వారా అంతర్జాతీయ కెరీర్లో అడుగుపెట్టిన ఈ స్టార్ ఫార్వర్డ్ ఆటగాడు జట్టు విజయాల్లో తన వంతు పాత్రను నిలకడగా పోషించేవాడు. ఆటలో దూకుడు కనబరిచే అతను తన ప్రవర్తనతో జెంటిల్మన్ ప్లేయర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజా సీజన్ ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్లో ఆదివారం బెల్జియంతో మ్యాచ్ అనంతరం లలిత్ ఉపాధ్యాయ్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ‘కేవలం అరకొర వసతులుండే ఓ మారుమూల పల్లెతో మొదలైన నా పయనం సుదీర్ఘకాలం కొనసాగడమే కాదు... నా కలల్ని సాకారం చేసింది. అన్నింటికి మించి దేశం తరఫున ఆడటం గొప్ప గౌరవాన్నిచ్చింది. రెండుసార్లు పోడియంపై నిల్చోని ఒలింపిక్ పతకాలు అందుకోవడం అంతులేని ఆనందాన్నిచ్చింది’ అని తన రిటైర్మెంట్ సందేశంలో పేర్కొన్నాడు. అలనాటి హాకీలో ఘనమైన కీర్తిని గడించిన భారత జట్టు... ఆధునిక హాకీలో మాత్రం వెనుకబడింది. ఇలా ఎన్నో ఏళ్ల తర్వాత భారత హాకీ జట్టు ఎట్టకేలకు 2021 టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకంతో పోడియంలో మువ్వన్నెల జెండాను సగర్వంగా ఎగిరేలా చేసింది. తదుపరి పారిస్ విశ్వక్రీడల్లోనూ ఈ పతకాన్ని నిలబెట్టుకుంది. ఈ రెండు సందర్భాల్లోనూ లలిత్ ఉపాధ్యాయ్ కేవలం జట్టు సభ్యుడి పాత్రకే పరిమితం కాకుండా... ఫార్వర్డ్లో నిలకడను ప్రదర్శించి జట్టు విజయానికి దోహదం చేసిన వారిలో ఒకడిగా నిలిచాడు. పదేళ్ల సుదీర్ఘ కెరీర్లో 183 అంతర్జాతీయ మ్యాచ్లాడిన లలిత్ 67 గోల్స్ సాధించాడు. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ (2016, 2018), ఆసియా కప్ (2017) విజయాలతో పాటు, హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ (2017)లో కాంస్యం, 2018 చాంపియన్స్ ట్రోఫీ (2018)లో రజతం, ఆసియా క్రీడలు (2018)లో కాంస్యం, 2022లో స్వర్ణం గెలిచిన జట్టులో ఫార్వర్డ్ ప్లేయర్గా పలు గోల్స్ సాధించాడు. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ హాకీ (2021–22)లో మూడో స్థానంలో నిలిచిన టీమిండియా ప్లేయర్గాను ఉన్నాడు. హాకీ మైదానంలో అతని ప్రదర్శన భారత్కు గోల్స్, పతకాలు తెచి్చపెడితే... అతని కృషికి భారత ప్రభుత్వం 2021లో అర్జున అవార్డుతో సత్కరించింది. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. 70 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రసవత్తర ముగింపునకు చేరుకుంది. ఇంగ్లండ్ తమ విజయానికి 350 పరుగులు దూరంలో ఉండగా.. టీమిండియా 10 వికెట్ల దూరంలో నిలిచింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది.క్రీజులో జాక్ క్రాలీ (12 బ్యాటింగ్), బెన్ డకెట్ (9 బ్యాటింగ్) ఉన్నారు. అంతకముందు భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో 364 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (247 బంతుల్లో 137; 18 ఫోర్లు), రిషభ్ పంత్ (140 బంతుల్లో 118; 15 ఫోర్లు, 3 సిక్స్లు) శతక్కొట్టారు.ఈ టెస్టులో పంత్కు ఇది రెండో సెంచరీ. ఇక తొలి ఇన్నింగ్స్లో లభించిన 6 పరుగుల ఆధిక్యాన్ని జోడించి ఇంగ్లండ్ ముందు 371 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఉంచింది. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండడంతో మరోసారి బౌలర్లకు మరోసారి కఠిన సవాలు తప్పదు. బుమ్రాకు తోడుగా సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ రాణించాల్సిన అవసరముంది.93 ఏళ్ల చరిత్రలోనే..ఇక ఈ లీడ్స్ టెస్టులో భారత జట్టు చారిత్రాత్మక రికార్డు సృష్టించింది. ఒక టెస్టు మ్యాచ్లో టీమిండియా తరపున ఐదు సెంచరీలు నమోదు కావడం ఇదే తొలిసారి. 1932 నుంచి టెస్టు క్రికెట్ ఆడుతున్న భారత జట్టు.. 93 ఏళ్ల తర్వాత ఈ అరుదైన ఫీట్ను అందుకుంది.గతంలో భారత్ తరపున ఒక టెస్టు మ్యాచ్లో నాలుగు సెంచరీలు నమోదైన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఐదు సెంచరీలు రావడం మొదటి సారి. తొలి ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్, రిషభ్ పంత్ సెంచరీలు చేయగా...రెండో ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్, పంత్ శతకాలు బాదారు.అదేవిధంగా 1955 తర్వాత విదేశీ గడ్డపై ఒకే టెస్టు మ్యాచ్లో ఐదు సెంచరీలు చేసిన పర్యాటక జట్టుగా భారత్ నిలిచింది. 70 ఏళ్ల కిందట వెస్టిండీస్ టూర్లో ఒకే టెస్టులో ఐదుగురు ఆస్ట్రేలియన్ ఆటగాళ్ళు మూడు అంకెల స్కోర్ను అందుకున్నారు.చదవండి: గుండెపోటుతో భారత మాజీ క్రికెటర్ కన్నుమూత -
గుండెపోటుతో భారత మాజీ క్రికెటర్ కన్నుమూత
భారత క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మాజీ లెఫ్టార్మ్ స్పిన్నర్ దిలీప్ దోషి (77) సోమవారం లండన్లో గుండెపోటుతో కన్నుమూశారు. 32 ఏళ్ల వయసులో ఆయనకు తొలిసారి భారత్ జట్టు తరఫున ఆడే అవకాశం దక్కింది. 1979–1983 మధ్య కాలంలో 33 టెస్టులు ఆడి 114 వికెట్లు పడగొట్టిన దిలీప్ దోషి...15 వన్డేల్లో 22 వికెట్లు తీశారు.1981లో మెల్బోర్న్లో జరిగిన టెస్టులో ఆ్రస్టేలియాపై భారత జట్టు చారిత్రాత్మక విజయంలో దిలీప్ 5 వికెట్లతో కీలక పాత్ర పోషించారు. దేశవాళీ క్రికెట్లో సౌరాష్ట్ర, బెంగాల్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఆయన సుదీర్ఘ కాలం ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో వార్విక్షైర్, నాటింగ్హామ్షైర్ జట్ల తరఫున ఆడారు. అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన తర్వాత లండన్లోనే శాశ్వత నివాసం ఏర్పరచుకున్నారు. కెరీర్ అత్యుత్తమ దశలో ఉన్నప్పుడు కూడా భారత్ జట్టులో బిషన్సింగ్ బేడి హవా నడుస్తుండటంతో దిలీప్కు ఎక్కువగా టెస్టులు ఆడే అవకాశం రాలేదు. ‘స్పిన్ పంచ్’ పేరుతో ఆయన ఆటోబయోగ్రఫీ వచ్చింది. దిలీప్ మృతి పట్ల బీసీసీఐ సంతాపం వ్యక్తం చేసింది.కాగా ఆయన కుమారుడు నయన్ జోషీ సైతం సర్రే, సౌరాష్ట్ర తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. దోషీ మృతికి సంతాపంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు ఐదు రోజు ఆటలో భారత్-ఇంగ్లండ్ ఆటగాళ్లు బ్లాక్ బ్యాండ్స్ భుజానికి కట్టుకుని బరిలోకి దిగనున్నారు. -
ముంబైని వీడిన పృథ్వీ షా
ముంబై: భారత క్రికెట్లో మెరుపులా వచ్చివెళ్లిన యువ బ్యాటర్ పృథ్వీ షా తాజాగా ముంబై జట్టును వీడాడు. ఈ మేరకు మరో జట్టుతో ఆడేందుకు వీలుగా తనకు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఇవ్వాల్సిందిగా ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ)ను అభ్యర్థించాడు. అతని క్రికెట్ భవిష్యత్తు కోసం పృథ్వీ షా అభ్యర్థనను మన్నించిన ముంబై సంఘం ఎన్ఓసీ జారీ చేసింది. ఇదివరకే మహారాష్ట్ర సంఘంతో సంప్రదింపులు జరిపిన అతను ఈ సీజన్లో మహారాష్ట్ర క్రికెట్ జట్టు తరఫున దేశవాళీ క్రికెట్ బరిలోకి దిగనున్నాడు. అంతర్జాతీయ కెరీర్లో టీమిండియా తరఫున ఐదు టెస్టులు, ఆరు వన్డేలు ఆడాడు. చివరిసారిగా ముంబై తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీ మాత్రమే ఆడాడు. అందులోనూ పెద్దగా మెరుపుల్లేకపోవడంతో ఎంసీఏ అతన్ని పూర్తిగా పక్కనబెట్టేసింది. అలా ఓ సీజన్ అంతా తుడిచిపెట్టుకుపోయిన తర్వాత కళ్లు తెరిచిన పృథ్వీ షా ఈ సీజన్లో ముంబై తరఫున అవకాశం రాదని గుర్తించాడు. దీంతో మరో జట్టును సంప్రదించిన మీదట ఎన్ఓసీ కోసం ముంబై సంఘాన్ని కోరాడు. ఈ సందర్భంగా ఎంసీఏ కూడా హుందాగా వ్యవహరించి అతను తమ దేశవాళీ జట్టుకు అందించిన సేవల్ని కొనియాడింది. ఎంసీఏ కార్యదర్శి అభయ్ హదప్ యువ క్రికెటర్ భవిష్యత్తులో రాణించాలని అభిలషించారు. దీనికి ప్రతిగా పృథ్వీ కూడా కృతజ్ఞత చాటుకున్నాడు. తనకెన్నో అవకాశాలచ్చిన ముంబై ద్వారానే నేను క్రికెట్కు పరిచయమయ్యానని చెప్పుకొచ్చాడు. ఏడాదిగా... ఖాళీగా... క్రికెట్లోకి వచ్చీరాగానే యువ కెరటంగా మారిన పృథ్వీ షా దిగ్గజాలు సునీల్ గావస్కర్, సచిన్ సహా పలువురి మన్ననలు పొందాడు. ఎంత వేగంగా వెలిగాడో... కానీ ఆటపై కొరవడిన ఆసక్తి, ఫామ్పై అలసత్వం, క్రమశిక్షణ రాహిత్యం, ఫిట్నెస్ సమస్యలతో అంతే వేగంగా కుంగాడు. మొదట టీమిండియాకు ఎప్పుడో దూరమయ్యాడు. తర్వాత ఐపీఎల్కు భారమయ్యాడు. తాజాగా సొంత జట్టు ముంబైకి అవసరం లేకుండా పోయాడు. క్రమంగా ఏ జట్టు అక్కున చేర్చుకోలేకపోవడంతో పూర్తిగా ఏడాదికిపైగానే ఖాళీగా ఉంటున్నాడు. మితీమీరిన శరీర బరువుతో సతమతమవుతున్న పృథ్వీ షా ముంబై జట్టులో స్థానం కోల్పోయాక... ఇప్పుడు మహారాష్ట్ర పంచన చేరేందుకు సిద్ధమయ్యాడు. -
నా లక్ష్యం... ‘టోక్యో స్వర్ణం’
ఒ్రస్టావా (చెక్ రిపబ్లిక్): భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈ సీజన్లో తన ప్రధాన లక్ష్యం ప్రపంచ చాంపియన్షిప్ టైటిలే అని స్పష్టం చేశాడు. చోప్రా తను ఆశించిన 90 మీటర్ల మార్క్తో కాకపోయినా... పారిస్ డైమండ్ లీగ్లో 88.16 మీటర్ల దూరంలో ఈటెను విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. తాజాగా ఇక్కడ జరిగే ‘గోల్డెన్ స్పైక్ అథ్లెటిక్స్ మీట్’లో పాల్గొనేందుకు వచ్చిన భారత స్టార్ మరో విజయంపై కన్నేశాడు. రెండు ఒలింపిక్ పతకాల విజేత అయిన నీరజ్ తన ప్రదర్శనకు చెక్ రిపబ్లిక్ గ్రేట్ జాన్ జెలెజ్నీ కోచింగ్ ఎంతో దోహదం చేసిందని అన్నాడు. అతని శిక్షణలోనే రాటుదేలిన 27 ఏళ్ల భారత స్టార్ ఈ సీజన్లో జరిగిన ప్రారంభ దోహా డైమండ్ లీగ్లో తొలిసారిగా 90 మీటర్ల మార్క్ను అందుకున్నాడు. ఈ నేపథ్యంలో చోప్రా మాట్లాడుతూ ‘మేటి అథ్లెట్, కోచ్ అయిన జెలెజీ్నతో కలిసి పనిచేయడం చాలా సంతోషానిస్తోంది. ఆయన ఇచ్చిన సూచనలు, కిటుకులతోనే ఈ ఏడాది 90 మీటర్ల మార్క్ను దాటేశాను. దీన్ని పునరావృతం చేయడంపై దృష్టిసారించాను. ఇక్కడి నైంబర్క్లో అహ్లాదకర వాతావరణంలో ట్రెయినింగ్ సెషన్ పూర్తిచేశాను. తప్పకుండా ఒ్రస్టావాలో నా శక్తి మేర రాణిస్తాను. అయితే నా ప్రధాన లక్ష్యం మాత్రం టోక్యోలో జరిగే ప్రపంచ చాంపియన్షిప్లో నెగ్గడమే. ఇందుకోసమే క్రమం తప్పకుండా చెమటోడ్చుతున్నాను. తీరిక లేకుండా ఇటు ట్రెయినింగ్ సెషన్స్, అటు డైమండ్ లీగ్లలో పోటీపడుతున్నా’ అని అన్నాడు. ఈ సెప్టెంబర్ 13 నుంచి 21 వరకు టోక్యోలో ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్షిప్ పోటీలు జరుగనున్నాయి. టోక్యో ఒలింపిక్స్లోనే స్వర్ణం గెలుపొందిన తొలి భారతీయ అథ్లెట్ అక్కడ మరో పతకాన్ని ఆశిస్తున్నాడు. ప్రస్తుతం ఒ్రస్టావా మీట్కు రావడం చాలా ఆనందంగా ఉందని చోప్రా అన్నాడు. ఒకప్పుడు ఇక్కడ జరిగే పోటీల్లో గ్రేటెస్ట్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ పోటీని టీవీల్లో చూసి మురిసేవాడినని ఇప్పుడు అదే వేదికపై తాను పోటీ పడుతున్నానని చెప్పుకొచ్చాడు. మంగళవారం ఒస్ట్రావా గోల్డెన్ స్పైక్ మీట్ జరుగుతుంది. -
భారత్ 13 మంగోలియా 0
చియాంగ్ మాయ్ (థాయ్లాండ్): ఆసియా కప్–2026 మహిళల ఫుట్బాల్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత జట్టు శుభారంభం చేసింది. గ్రూప్ ‘బి’లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్లో భారత్ 13–0 గోల్స్ తేడాతో మంగోలియా జట్టును చిత్తు చేసింది. భారత్ తరఫున ప్యారీ జక్సా ఐదు గోల్స్ (29వ, 45వ, 46వ, 52వ, 55వ నిమిషాల్లో)తో అదరగొట్టగా... తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్ (20వ, 59వ నిమిషాల్లో), ప్రియదర్శిని సెల్లాదురై (73వ, 86వ నిమిషాల్లో) రెండు గోల్స్ చొప్పున చేశారు. సంగీత (8వ నిమిషంలో), రింపా హల్దర్ (67వ నిమిషంలో), మాళవిక (71వ నిమిషంలో), గ్రేస్ డాంగ్మె (75వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. గోల్స్ పరంగా ఆసియా కప్ చరిత్రలోనే భారత జట్టుకిది అతిపెద్ద విజయం కావడం విశేషం. 1997లో, 2005లో గ్వామ్ జట్టుపై భారత్ 10–0 గోల్స్ తేడాతో గెలిచింది. తాజా ఫలితంతో భారత జట్టు తమ రికార్డును మెరుగుపర్చుకుంది. గత సీజన్లో ‘భారత ఉత్తమ ఫుట్బాల్ క్రీడాకారిణి’ అవార్డు గెల్చుకున్న సౌమ్య అందించిన పాస్ను లక్ష్యానికి చేర్చి సంగీత భారత్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత రింపా క్రాస్ పాస్ను హెడర్ షాట్తో సౌమ్య గోల్గా మలిచింది. విరామ సమయానికి ముందు ప్యారీ జక్సా రెండు గోల్స్ చేయడంతో భారత్ తొలి అర్ధభాగం ముగిసేసరికి 4–0 తో ముందంజ వేసింది. రెండో అర్ధభాగంలో భారత్ మరింత దూకుడును పెంచింది. భారత్ తమ తదుపరి మ్యాచ్ను ఈనెల 29న తిమోర్ లెస్టె జట్టుతో ఆడుతుంది. చివరిసారి భారత జట్టు 2003లో ఆసియా కప్ ప్రధాన టోర్నీలో ఆడింది. -
‘పదేళ్లుగా అదే మాట వింటున్నా’
లీడ్స్: భారత స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్లో దాదాపు పదేళ్లుగా ఉన్నాడు. ఐపీఎల్లో పుష్కర కాలం పూర్తి చేసుకున్నాడు. అయితే కెరీర్ ఆరంభం నుంచి అతని భిన్నమైన బౌలింగ్ శైలిపై ఎన్నో చర్చలు సాగాయి. ఈ తరహా యాక్షన్తో ఎక్కువ కాలం కొనసాగలేడని, సుదీర్ఘ కెరీర్ సాగడం కష్టమని చాలా మంది అభిప్రాయపడ్డారు. పైగా గాయాలతో ఆటకు దూరం కాగానే ఇంతటితో కెరీర్ ముగిసినట్లే అనే విమర్శలు వినిపించాయి. కానీ బుమ్రా వాటన్నింటినీ పట్టించుకోలేదు. అద్భుత ప్రదర్శనలతో భారత్కు చిరస్మరణీయ విజయాలు అందించి ప్రపంచ అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా ఎదిగాడు. బరిలోకి దిగిన ప్రతీసారి కొత్త రికార్డులు తన ఖాతాలో వేసుకుంటున్నాడు. తాజాగా ఇంగ్లండ్పై తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల ప్రదర్శన తర్వాత అతను ఈ విషయాలపై స్పందించాడు. ‘నేను ఎప్పుడైనా భారత్కు ఆడాలని బలంగా కోరుకున్నా. నాపై నాకున్న నమ్మకం వల్లే అన్ని ఫార్మాట్లలో ఆడగలిగా. కానే వేరేవాళ్లు ఎవరూ దానిని నమ్మలేదు. నువ్వు అసలు ఎప్పుడూ ఆడలేవు అని మొదట్లో అనేవారు. ఆ తర్వాత ఆరు నెలలు, ఆపై ఎనిమిది నెలలు ఆడితే గొప్ప అనేవారు. కానీ ఇప్పుడు భారత్ తరఫున దాదాపు పదేళ్లు ఆడితే ఐపీఎల్లో మరో మూడేళ్లు అదనంగా ఆడాను. ఇప్పుడు కూడా ఒక గాయం కాగానే నా పనైపోయిందని వెంటనే అనేస్తారు. ప్రతీ మూడు–నాలుగు నెలలకు ఇవే మాటలు వస్తాయి. నేను ఇవేమీ పట్టించుకోను. నా పని నేను చేస్తూ పోతా. భారత జట్టును గెలిపించేందుకు ప్రయత్నిస్తా. ఆపై దేవుడు నాకు ఏది రాసిపెట్టి ఉంటే అది జరుగుతుంది’ అని బుమ్రా వ్యాఖ్యానించాడు. బుమ్రా ఫిట్నెస్, పనిభారాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంగ్లండ్తో సిరీస్లో అతను మూడు టెస్టులే ఆడతాడని కోచ్ గంభీర్ ప్రకటించాడు. అయితే ఇదే విషయంపై బుమ్రా కాస్త భిన్నంగా స్పందించాడు. తాను మూడు టెస్టులే ఆడతానా లేదా అనేదానిపై అతను స్పష్టతనివ్వలేదు. ‘మున్ముందు ఏం జరగవచ్చనే విషయంపై ఆలోచించడం అనవసరం. ప్రస్తుతం మైదానంలో ఏం జరుగుతోంది అనే దానిపైనే నా దృష్టి ఉంది. నేను పూర్తి చేయాల్సి పని ఉంది. పిచ్ ఎలా స్పందిస్తోంది, వికెట్ ఎలా తీయాలి, ఏ బ్యాటర్కు ఎలా బౌలింగ్ చేయాలి అనే అంశాలపైనే నేను ఆలోచిస్తున్నాను. అంతే తప్ప ఎన్ని టెస్టులు ఆడతానని కాదు. ఒక్కసారి మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ లెక్కలన్నీ చూసుకోవచ్చు. రాత్రయ్యాక ఈ రోజు నేను నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చానని భావిస్తే ప్రశాంతంగా పడుకుంటా’ అని బుమ్రా వివరించాడు. -
విజయంపై గురి
భారత బ్యాటింగ్ దళం అంచనాలకు అనుగుణంగా తమ బాధ్యత ముగించింది. చివర్లో కొంత తడబాటు కనిపించినా...రాహుల్, పంత్ సెంచరీలతో చెలరేగి భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో ప్రత్యరి్థకి కష్టసాధ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇప్పుడు ఇక బౌలర్ల వంతు...బుమ్రా ఒక్కడే ఇంగ్లండ్ ఆట కట్టిస్తాడా...ఈసారి మేం కూడా అంటూ ఇతర బౌలర్లూ సహకరిస్తారా అనేది చూడాలి.చివరి రోజు 90 ఓవర్లలో 350 పరుగులు చేయాల్సిన ఇంగ్లండ్ దూకుడుగా ఆడి ఛేదనకు మొగ్గు చూపుతుందా...లేక పరిస్థితి మారిపోతే కాస్త తగ్గి ‘డ్రా’కు ప్రయతి్నస్తుందా చూడాలి. మరోవైపు హెడింగ్లీ మైదానంలో ఆఖరి రోజు ఆటకు వాన ముప్పు కూడా ఉంది! లీడ్స్: భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రసవత్తర స్థితికి చేరింది. 371 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. జాక్ క్రాలీ (12 బ్యాటింగ్), బెన్ డకెట్ (9 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో 96 ఓవర్లలో 364 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (247 బంతుల్లో 137; 18 ఫోర్లు) శతకం పూర్తి చేసుకోగా... రిషభ్ పంత్ (140 బంతుల్లో 118; 15 ఫోర్లు, 3 సిక్స్లు) ఈ టెస్టులో రెండో సెంచరీ సాధించాడు. వీరిద్దరు నాలుగో వికెట్కు 195 పరుగులు జోడించారు. ఒకదశలో 333/4తో ఉన్న భారత్ 31 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లు కోల్పోయింది. తొలి సెషన్ నెమ్మదిగా... ఓవర్నైట్ స్కోరు 90/2తో నాలుగో రోజు ఆట కొనసాగించిన భారత్ అదే స్కోరు వద్ద కెపె్టన్ శుబ్మన్ గిల్ (8) వికెట్ కోల్పోయింది. దాంతో రాహుల్, పంత్ తొలి సెషన్లో చాలా జాగ్రత్తగా ఆడారు. 87 బంతుల్లో రాహుల్ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఇంగ్లండ్ కూడా చక్కటి నియంత్రణతో బౌలింగ్ చేయడంతో పరుగులు అంత సులువుగా రాలేదు. 58 పరుగుల వద్ద రాహుల్ ఇచి్చన క్యాచ్ను బ్రూక్ వదిలేయడం జట్టుకు కలిసొచ్చింది. తొలి సెషన్లో భారత్ 24.1 ఓవర్లలో 63 పరుగులే చేయగలిగింది. పంత్, రాహుల్ జోరు... లంచ్ తర్వాత ఒక్కసారిగా భారత్ ఆట మారింది. బ్యాట్ ఝళిపించిన పంత్ దూకుడు పెంచి పరుగులు రాబట్టగా... రాహుల్ తనదైన శైలిలో చూడచక్కటి షాట్లతో అలరించారు. 83 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న పంత్ ఆ తర్వాత మరింత ధాటిగా ఆడుతూ తర్వాతి 25 బంతుల్లోనే 44 పరుగులు రాబట్టాడు. మరోవైపు 202 బంతుల్లో రాహుల్ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత కొద్ది సేపటికే పంత్ కూడా ఈ టెస్టులో రెండో సెంచరీని (130 బంతుల్లో) తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ జోడీని విడదీసేందుకు తీవ్రంగా శ్రమించిన ఇంగ్లండ్ ఎట్టకేలకు 46.4 ఓవర్ల తర్వాత సఫలమైంది. శతకం పూర్తయిన తర్వాత రూట్ ఓవర్లో వరుసగా 4, 6, 4 బాదిన పంత్... బషీర్ వేసిన తర్వాతి ఓవర్లో మరో భారీ షాట్కు ప్రయత్నించి వెనుదిరిగాడు. రెండో సెషన్లో భారత్ 27 ఓవర్లలోనే ఏకంగా 5.37 రన్రేట్తో 145 పరుగులు సాధించడం విశేషం. విరామానంతరం ఆట మళ్లీ మలుపు తిరిగింది. కార్స్ బౌలింగ్లో రాహుల్ బౌల్డ్ కాగా...కరుణ్ నాయర్ (20) మరో అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. ఆ తర్వాత టంగ్ నాలుగు బంతుల్లో శార్దుల్ (4), సిరాజ్ (0), బుమ్రా (0)లను అవుట్ చేయగా... ప్రసిధ్ కృష్ణ (0) చివరి వికెట్గా వెనుదిరిగాడు. మరో ఎండ్లో రవీంద్ర జడేజా (40 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని పరుగులు జోడించగలిగాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 471; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 465; భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) స్మిత్ (బి) కార్స్ 4; రాహుల్ (బి) కార్స్ 137; సాయి సుదర్శన్ (సి) క్రాలీ (బి) స్టోక్స్ 30; గిల్ (బి) కార్స్ 8; పంత్ (సి) క్రాలీ (బి) బషీర్ 118; నాయర్ (సి అండ్ బి) వోక్స్ 20; జడేజా (నాటౌట్) 25; శార్దుల్ (సి) రూట్ (బి) టంగ్ 4; సిరాజ్ (సి) స్మిత్ (బి) టంగ్ 0; బుమ్రా (బి) టంగ్ 0; ప్రసిధ్ (సి) టంగ్ (బి) బషీర్ 0; ఎక్స్ట్రాలు 18; మొత్తం (96 ఓవర్లలో ఆలౌట్) 364. వికెట్ల పతనం: 1–16, 2–82, 3–92, 4–287, 5–333, 6–335, 7–349, 8–349; 9–349; 10–364. బౌలింగ్: వోక్స్ 19–4–45–1, కార్స్ 19–2–80–3, టంగ్ 18–2–72–3, బషీర్ 22–1–90–2, స్టోక్స్ 15–2–47–1, రూట్ 3–0–21–0. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (బ్యాటింగ్) 12; డకెట్ (బ్యాటింగ్) 9; ఎక్స్ట్రాలు 0; మొత్తం (6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 21. బౌలింగ్: బుమ్రా 3–0–9–0, సిరాజ్ 2–1–9–0, జడేజా 1–0–3–0. -
IND VS ENG 1st Test: శతక్కొట్టిన రాహుల్, పంత్.. ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం
తొలి టెస్ట్ లో టీమిండియా విధించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఇంగ్లండ్ బరిలోకి దిగింది. సోమవారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించాలంటే ఆఖరిదైన ఐదవ రోజు బౌలింగ్ లో సత్తా చాటి 10 వికెట్లు తీయాల్సి ఉంది. మరోవైపు విజయానికి ఇంగ్లండ్ కు 350 పరుగులు అవసరం.ఇంగ్లండ్ లక్ష్యం 371లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియా పట్టు బిగించింది. నాలుగో రోజు భారత్ సెకెండ్ ఇన్నింగ్స్లో భారీ స్కోర్ (364) చేసి ఆలౌటైంది. ఫలితంగా ఇంగ్లండ్ ముందు 371 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. కేఎల్ రాహుల్ (137), రిషబ్ పంత్ (118) సెంచరీలతో కదంతొక్కారు. మిగతా భారత ఆటగాళ్లలో సాయి సుదర్శన్ 30, రవీంద్ర జడేజా 25 (నాటౌట్), యశస్వి జైస్వాల్ 4, శుభ్మన్ గిల్ 8, కరుణ్ నాయర్ 20, శార్దూల్ ఠాకూర్ 4, సిరాజ్ 0, బుమ్రా 0, ప్రసిద్ద్ కృష్ణ 0 పరుగులకు ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, జోష్ టంగ్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. బషీర్ 2, వోక్స్, స్టోక్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి జైస్వాల్ (101), శుభ్మన్ గిల్ (147), రిషబ్ పంత్ (134) సెంచరీలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ తలో నాలుగు వికెట్లు తీయగా.. షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ టీమిండియాకు ధీటుగా బదులిచ్చింది. ఓలీ పోప్ (106) సెంచరీతో కదంతొక్కగా.. హ్యారీ బ్రూక్ (99) పరుగు తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. మిగతా బ్యాటర్లలో బెన్ డకెట్ 62, జేమీ స్మిత్ 40, క్రిస్ వోక్స్ 38 రాణించడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 465 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ కృష్ణ మూడు, సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. -
IND VS ENG 1st Test: ఇంగ్లండ్ గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్
టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఇంగ్లండ్ గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లీష్ నేలపై అత్యధిక సెంచరీలు సాధించిన భారత ఓపెనర్గా రికార్డు నెలకొల్పాడు. లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో సెంచరీ సాధించడంతో రాహుల్ ఈ ఘనత సాధించాడు. ఈ ఇన్నింగ్స్లో రాహుల్ ఎంతో బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేస్తూ ఈ రికార్డుతో పాటు మరిన్ని మైలురాళ్లను చేరుకున్నాడు.47 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన రాహుల్.. 202 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ విరామం అనంతరం రాహుల్ 137 పరుగులతో ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా కరుణ్ నాయర్ (20) క్రీజ్లో ఉన్నాడు. కడపటి వార్తలు అందేసరికి భారత్ స్కోర్ 332/4గా ఉంది. భారత్ 338 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.ఇదే ఇన్నింగ్స్లో మరో భారత ఆటగాడు రిషబ్ పంత్ (118) కూడా శతకొట్టాడు. పంత్ తొలి ఇన్నింగ్స్లో కూడా సెంచరీతో (134) మెరిశాడు. ఈ మ్యాచ్పై భారత్ పట్టు బిగించింది.తాజా సెంచరీతో రాహుల్ సాధించిన రికార్డులు..ఆసియా ఖండం బయట అత్యధిక సెంచరీలు సాధించిన ఓపెనర్ల జాబితాలో రాహుల్ రెండో స్థానంలో ఉన్నాడు. రాహుల్ తన కెరీర్లో 9 టెస్ట్ సెంచరీలు చేయగా.. అందులో ఆరు ఆసియా బయటే చేయడం విశేషం. భారత ఓపెనర్లలో సునీల్ గవాస్కర్ అత్యధికంగా ఆసియా బయట 15 సెంచరీలు చేశాడు. గవాస్కర్ తర్వాత రాహుల్ అత్యధికంగా 6, వీరేంద్ర సెహ్వాగ్ 4 సెంచరీలు చేశారు.ఇంగ్లండ్పై అత్యధిక సెంచరీలు చేసిన భారత్ ఓపెనర్లు..కేఎల్ రాహుల్-3విజయ్ మర్చంట్-2సునీల్ గవాస్కర్-2రవిశాస్త్రి-2రాహుల్ ద్రవిడ్-2లీడ్స్లో మూడో ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన రెండో పర్యాటక ఓపెనర్గా రికార్డు. రాహుల్కు ముందు (1955) సౌతాఫ్రికాకు చెందిన జాకీ మెక్గ్లూ లీడ్స్లో మూడో ఇన్నింగ్స్లో సెంచరీ చేశాడు.ఇంగ్లండ్ గడ్డపై ఆరో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాడు. ఈ సెంచరీతో రాహుల్ ఇంగ్లండ్పై మూడు సెంచరీలు చేసినట్లైంది. భారత ఆటగాళ్లలో రాహుల్ ద్రవిడ్ (6), సచిన్ టెండూల్కర్ (4), దిలీప్ వెంగసర్కార్ (4), రిషబ్ పంత్ (4) మాత్రమే ఇంగ్లండ్ గడ్డపై రాహుల్ కంటే ఎక్కువ సెంచరీలు చేశారు. సౌరభ్ గంగూలీ రాహుల్తో సమానంగా 3 సెంచరీలు చేశాడు.SENA దేశాల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రాహుల్ ఐదో స్థానంలో ఉన్నాడు. రాహుల్ సేనా దేశాల్లో 6 సెంచరీలు చేశాడు. ఈ విభాగంలో సచిన్ టెండూల్కర్ (17), విరాట్ కోహ్లి (12), రాహుల్ ద్రవిడ్ (10), సునీల్ గవాస్కర్ (8) రాహుల్ కంటే ముందున్నారు. రాహుల్తో సమానంగా మహ్మద్ అజారుద్దీన్ సేనా దేశాల్లో 6 సెంచరీలు చేశాడు.కాగా, ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో భారత్ 471, ఇంగ్లండ్ 465 పరుగులు చేసిన విషయం తెలిసిందే. భారత తొలి ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ (101), శుభ్మన్ గిల్ (147), రిషబ్ పంత్ (134) సెంచరీలు చేయగా.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఓలీ పోప్ (106) సెంచరీతో కదంతొక్కాడు. హ్యారీ బ్రూక్ (99) పరుగు తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. భారత్కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ కృష్ణ మూడు, సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. -
IND VS ENG 1st TEST: చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్
టీమిండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ టెస్ట్ల్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఓ టెస్ట్ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేసిన తొలి ఆసియా వికెట్కీపర్ బ్యాటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఆసియా వికెట్కీపర్ బ్యాటర్ ఈ ఘనత సాధించలేదు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో పంత్ ఈ ఘనత సాధించాడు.ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 178 బంతుల్లో డజను ఫోర్లు, అర డజను సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్లో 140 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 118 పరుగులు చేసి ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్లో పంత్కు ముందు కేఎల్ రాహుల్ కూడా సెంచరీతో కదంతొక్కడంతో భారత్ పటిష్ట స్థితికి చేరింది.నాలుగో రోజు టీ విరామం సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసి 304 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. కేఎల్ రాహుల్ 120, కరుణ్ నాయర్ 4 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. రెండో ఇన్నింగ్స్లో భారత ఆటగాళ్లు యశస్వి జైస్వాల్ 4, సాయి సుదర్శన్ 30, శుభ్మన్ గిల్ 8 పరుగులు చేసి ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 2 వికెట్లు పడగొట్టగా.. షోయబ్ బషీర్, బెన్ స్టోక్స్ తలో వికెట్ తీశారు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి జైస్వాల్ (101), శుభ్మన్ గిల్ (147), రిషబ్ పంత్ (134) సెంచరీలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ తలో నాలుగు వికెట్లు తీయగా.. షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ టీమిండియాకు ధీటుగా బదులిచ్చింది. ఓలీ పోప్ (106) సెంచరీతో కదంతొక్కగా.. హ్యారీ బ్రూక్ (99) పరుగు తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. మిగతా బ్యాటర్లలో బెన్ డకెట్ 62, జేమీ స్మిత్ 40, క్రిస్ వోక్స్ 38 రాణించడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 465 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ కృష్ణ మూడు, సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. -
IND VS ENG 1st Test: రెండో ఇన్నింగ్స్లోనూ శతక్కొట్టిన పంత్.. అయితే ఈసారి..!
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేశాడు. తొలి ఇన్నింగ్స్లో 178 బంతుల్లో డజను ఫోర్లు, అర డజను సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్లో 130 బంతుల్లో 13 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ సారి పంత్ సెంచరీ చేసిన తర్వాత పల్టీ సెలబ్రేషన్స్ చేసుకోలేదు. స్టాండ్స్ నుంచి గవాస్కర్ పల్టీ కొట్టాలని అడిగినా పంత్ పెద్దగా పట్టించుకోలేదు. డబుల్ సెంచరీ తర్వాత అన్నట్లు సైగలు చేశాడు. తాజా సెంచరీతో టెస్ట్ల్లో పంత్ సెంచరీల సంఖ్య 8కి చేరింది. మరో ఎండ్లో కేఎల్ రాహుల్ కూడా సెంచరీ పూర్తి చేశాడు. తొలి ఇన్నింగ్స్లో 42 పరుగులకు ఔటైన రాహుల్.. ఈసారి మరింత బాధ్యతాయుతంగా ఆడి కెరీర్లో తొమ్మిదో సెంచరీ పూర్తి చేశాడు. రాహుల్ 202 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో సెంచరీ మార్కును అందుకున్నాడు.నాలుగో రోజు ఆట ప్రారంభం కాగానే శుభ్మన్ గిల్ (8) వికెట్ కోల్పోయిన భారత్ను రాహుల్-పంత్ జోడీ ఆదుకుంది. ఈ ఇద్దరు ఎంతో సంయమనంతో బ్యాటింగ్ చేస్తూ.. భారత్ పైచేయి సాధించే దిశగా తీసుకెళ్తున్నారు. ఈ జోడీ ఇప్పటికే నాలుగో వికెట్కు 172 పరుగులు జోడించింది. పంత్ సెంచరీ పూర్తయ్యే సమయానికి రెండో ఇన్నింగ్స్లో భారత్ స్కోర్ 264/3గా ఉంది. రాహుల్ 112, పంత్ 100 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతానికి భారత్ ఆధిక్యం 270 పరుగులుగా ఉంది. భారత రెండో ఇన్నింగ్స్లో జైస్వాల్ 4, సాయి సుదర్శన్ 30, గిల్ 8 పరుగులు చేసి ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 2, స్టోక్స్ ఓ వికెట్ దక్కించుకున్నారు.అంతకుముందు భారత్, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ల్లో నువ్వా నేనా అన్నట్లు బ్యాటింగ్ చేశాయి. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101), కెప్టెన్ శుబ్మన్ గిల్ (147), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (134) సెంచరీలతో చెలరేగడంతో 471 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ తలో నాలుగు వికెట్లు తీయగా.. షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ టీమిండియాకు ధీటుగా బదులిచ్చింది. ఓపెనర్ బెన్ డకెట్ (62) అర్ధ శతకంతో రాణించగా.. ఓలీ పోప్ (106) శతక్కొట్టాడు. హ్యారీ బ్రూక్ 99 పరుగులతో తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. మిగతా ఆటగాళ్లలో జేమీ స్మిత్ 40, క్రిస్ వోక్స్ 38 పరుగులతో పర్వాలేదనిపించారు. ఫలితంగా ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్లో 465 పరుగులు చేసింది. దీంతో భారత్కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ కృష్ణ మూడు, సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. -
Ind vs Eng 1st Test: శతక్కొట్టిన కేఎల్ రాహుల్
ఇంగ్లండ్తో మొదటి టెస్టులో కేఎల్ రాహుల్ (KL Rahul) అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో 42 పరుగుల వద్ద అవుటైన ఈ స్టార్ ఓపెనర్.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం శతకంతో మెరిశాడు. జట్టు కష్టాల్లో ఉన్న వేళ పెద్దన్నలా ఆదుకుని బాధ్యతాయుత ఇన్నింగ్స్తో ఆకట్టుకుంటున్నాడు. 202 బంతుల్లో వంద పరుగుల మార్కును అందుకున్నాడు.రాహుల్ శతక ఇన్నింగ్స్లో 13 ఫోర్లు ఉన్నాయి. మరోవైపు.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కూడా అదరగొడుతున్నాడు. సోమవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా పంత్ కూడా సెంచరీ బాదాడు.కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో శుక్రవారం తొలి టెస్టు ఆరంభమైంది.టాస్ గెలిచిన ఆతిథ్య ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101), కెప్టెన్ శుబ్మన్ గిల్ (147), వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (134) శతకాలతో చెలరేగడంతో.. తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులు చేసింది.ఇందుకు బదులుగా స్టోక్స్ బృందం తమ మొదటి ఇన్నింగ్స్లో 465 పరుగులు చేయగా.. భారత్కు ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టగా.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.ఓపెనర్ యశస్వి జైస్వాల్ నాలుగు పరుగులు మాత్రమే చేసి.. బ్రైడన్ కార్స్ బౌలింగ్లో జేమీ స్మిత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ పట్టుదలగా నిలబడగా.. వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ 30 పరుగులు చేశాడు.ఇక నాలుగో రోజు ఆట ఆరంభమైన కాసేపటికే కెప్టెన్ శుబ్మన్ గిల్ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో రాహుల్- పంత్ నిలకడగా ఆడుతూ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 69.4 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి పంత్ 100, రాహుల్ 112 పరుగులతో ఉన్నారు. టీమిండియా 270 పరుగుల ఆధిక్యంలో ఉంది.𝗖 𝗛 𝗔 𝗠 𝗣 𝗜 𝗢 𝗡 𝗦 𝗧 𝗨 𝗙 𝗙 🫡🙌🏻After missing out in the first innings, @klrahul makes it count in the second! A priceless century that puts #TeamIndia in a commanding position in the 1st Test! 🇮🇳#ENGvIND 1st Test Day 4 LIVE NOW Streaming on JioHotstar 👉… pic.twitter.com/FVrutSIABd— Star Sports (@StarSportsIndia) June 23, 2025 -
కేఎల్ రాహుల్ మాస్టర్ మైండ్.. జట్టు పీక్కున్న పాకిస్తాన్ సంతతి బౌలర్
లీడ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్ల్లో ఇరు జట్లు నువ్వా-నేనా అన్నట్లు పోటీపడగా (భారత్ 471, ఇంగ్లండ్ 465).. భారత్కే స్వల్ప ఆధిక్యం లభించింది. 6 పరుగుల లీడ్తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. నాలుగో రోజు లంచ్ విరామం తర్వాత 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. రాహుల్ 98, పంత్ 77 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతానికి భారత్ ఆధిక్యం 232 పరుగులుగా ఉంది.ఇదిలా ఉంటే, మూడో రోజు ఆటలో చోటు చేసుకున్న ఓ ఆసక్తికర పరిణామం సోషల్మీడియాలో వైరలవుతుంది. భారత స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ ఎంత క్లాసీ ఆటగాడో అంతే తెలివిపరుడని మరోసారి రుజువు చేసుకున్నాడు. ఓ సందర్భంలో రాహుల్ తన మాస్టర్ మైండ్ను ఉపయోగించిన తీరును భారత క్రికెట్ అభిమానులు తెగ ప్రశంశిస్తున్నారు.ఇంతకీ ఏం జరిగిందంటే.. మూడో రోజు ఆటలో తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి బ్రైడన్ కార్స్ బౌలింగ్లో వికెట్కీపర్ జేమీ స్మిత్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.అనంతరం రాహుల్కు తొలి ఇన్నింగ్స్లో డకౌటైన సాయి సుదర్శన్ జత కలిశాడు. సాయి సుదర్శన్ వచ్చీ రాగానే ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తన ఎత్తుగడలను మొదలుపెట్టాడు. తొలి ఇన్నింగ్స్లో డకౌటై అప్పటికే ఒత్తిడిలో ఉన్న సాయి సుదర్శన్పై బెన్ తన స్పిన్ అస్త్రం, పాకిస్తానీ సంతతి ఆటగాడు షోయబ్ బషీర్ను ప్రయోగించాడు.ఈ సమయంలో రాహుల్ తన మాస్టర్ బుర్రను (సాయి సుదర్శన్ను అలర్ట్ చేసే క్రమంలో) ఉపయోగించాడు. సాయి సుదర్శన్తో హిందీ, ఇంగ్లీష్లో కాకుండా తమిళంలో సంభాషించాడు. పాకిస్తానీ సంతతి వాడైన షోయబ్ బషీర్కు హిందీ, ఇంగ్లీష్లో మాట్లాడితే అర్దమవుతుందనే ఉద్దేశంతో రాహుల్ సాయితో తమిళంలో మాట్లాడాడు. రాహుల్ తనకు అర్దం కాని భాషలో మాట్లాడటం చూసి బషీర్ జట్టు పీక్కున్నాడు. కర్ణాటకు చెందిన రాహుల్కు కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషలే కాకుండా తమిళం కూడా తెలుసని చాలామందికి తెలీదు. వాస్తవానికి ఈ ట్రిక్కు భారత దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ వాడేవారు. పాకిస్తాన్తో మ్యాచ్లు ఆడే సమయంలో వారికి ఇంగ్లీష్, హిందీ అర్దమవుతాయని ఆ ఇద్దరు దిగ్గజాలు మరాఠీలో మాట్లాడేవారు. తమ వ్యూహాలు ప్రత్యర్ధికి అర్దం కాకుండా భారత దిగ్గజాలు ఈ ఎత్తుగడను ఉపయోగించేవారు. తాజాగా రాహుల్ సచిన్, ద్రవిడ్ మాస్టర్ మైండ్స్ను ఫాలో అయ్యి క్రికెట్ అభిమానులచే శభాష్ అనిపించుకున్నాడు. -
KL Rahul: చూసి ఆడు పంత్.. నేనేమీ నిర్లక్ష్యపు షాట్లు ఆడటం లేదు!.. నువ్వే..
ఇంగ్లండ్ (Ind vs Eng)తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత్ ఆచితూచి ఆడుతోంది. ఇప్పటికే ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4), వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (30), కెప్టెన్ శుబ్మన్ గిల్ (8)ల వికెట్లను టీమిండియా కోల్పోయింది. ఇలాంటి క్లిష్ట దశలో ఓపెనర్ కేఎల్ రాహుల్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్లపై భారం పడింది.నాలుగో రోజు ఆటలో భాగంగా ఆదిలోనే గిల్ అవుట్ కావడంతో.. పంత్ రాహుల్ (KL Rahul)కు జతయ్యాడు. ఇద్దరూ కలిసి భోజన విరామ సమయానికి 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఫలితంగా లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.ఓవైపు కేఎల్ రాహుల్ కూల్గా తన పని తాను చేసుకుపోతుంటే.. రిషభ్ పంత్ (Rishabh Pant) మాత్రం తగ్గేదేలే అంటూ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఈ క్రమంలో ముప్పై మూడవ ఓవర్లో మూడో బంతికి బ్రైడన్ కార్స్ బౌలింగ్లో ఫోర్ బాదిన పంత్.. అదృష్టవశాత్తూ క్యాచ్ అవుట్ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బ్యాట్ ఎడ్జ్ను తాకిని బంతి ఫైన్-లెగ్ రీజన్లో గాల్లోకి లేవగా.. వికెట్ కీపర్, ఫస్ట్ స్లిప్ క్యాచ్ పట్టేందుకు ప్రయత్నం చేసి విఫలమయ్యారు. దీంతో పంత్ బతికిపోయాడు.చూసి ఆడు.. నేనేమీ నిర్లక్ష్యఫు షాట్లు ఆడటం లేదుఈ నేపథ్యంలో రాహుల్ పంత్కు సలహా ఇచ్చాడు. ‘కాస్త చూసి ఆడు.. జాగ్రత్త’ అని హెచ్చరించాడు. అయితే, పంత్ ఇందుకు కాస్త దురుసుగానే సమాధానం ఇచ్చినట్లు అనిపించింది. ‘‘నేనేమీ నిర్లక్ష్యఫు షాట్లు ఆడటం లేదు. జాగ్రత్తగానే హిట్టింగ్ చేస్తున్నా’’ అని పంత్ పేర్కొన్నాడు. స్టంప్ మైకులో ఈ మాటలు రికార్డయ్యాయి.స్కోర్ చేయలేకపోతున్నాంఆ తర్వాత మరోసారి.. ‘‘బంతి పాతబడిపోయింది. మరీ ఆచితూచి ఆడటం వల్ల స్కోర్ చేసే అవకాశాన్ని మిస్ అయిపోతున్నాం’’ అని పంత్ పేర్కొనడం గమనార్హం. వీరికి సంభాషణను హైలైట్ చేస్తూ కామెంటేటర్లు హర్షా భోగ్లే, ఛతేశ్వర్ పుజారా నవ్వుకున్నారు. మరోవైపు.. టీమిండియా అభిమానులు రాహుల్ కూల్గానే పని పూర్తి చేస్తాడని ప్రశంసిస్తూనే.. పంత్ కాన్ఫిడెన్స్ వేరే లెవల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.కాగా సోమవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా 54 ఓవర్ల ఆట పూర్తయ్యే సరికి టీమిండియా మూడు వికెట్ల నష్టాననికి 175 పరుగుల వద్ద నిలిచింది. రాహుల్ 83, పంత్ 41 రన్స్తో ఆడుతున్నారు. ఇక 57వ ఓవర్ ముగిసే సరికి భారత్ 57 ఓవర్లలో 192 పరుగులు చేసింది. పంత్ అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. రాహుల్ సెంచరీకి 15 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇద్దరూ కలిసి ఇప్పటికే 100 పరుగుల భాగస్వామ్యం పూర్తి చేసుకున్నారు. ఇక ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా టీమిండియా ఇంగ్లండ్తో లీడ్స్ వేదికగా శుక్రవారం తొలి టెస్టు ఆరంభించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గిల్ సేన.. మొదటి ఇన్నింగ్స్లో 471 పరుగులు చేసింది. ఇందుకు దీటుగా బదులిచ్చిన ఇంగ్లండ్ 465 పరుగులు సాధించింది. ఈ క్రమంలో ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా మెరుగ్గా ఆడి.. మంచి స్కోరు నమోదు చేస్తేనే ఆతిథ్య జట్టుకు సవాల్ విసరగలదు.UPDATE: Ind vs Eng 1st Test: శతక్కొట్టిన కేఎల్ రాహుల్చదవండి: ‘లక్ష్మణ్ను కాదని అతడిని తీసుకున్నాం.. నాతో మూడు నెలలు మాట్లాడలేదు’Give us a day full of stump mic Pant, we won't complain! 🎙️ 🤭 #SonySportsNetwork #GroundTumharaJeetHamari #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia | @RishabhPant17 pic.twitter.com/51XLsNwqu9— Sony Sports Network (@SonySportsNetwk) June 23, 2025 -
IND VS ENG 1st Test: సెహ్వాగ్ సరసన రాహుల్.. గవాస్కర్ ఒక్కడే మిగిలాడు..!
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు. 47 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన రాహుల్.. 87 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. రాహుల్కు కెరీర్లో ఇది 18వ హాఫ్ సెంచరీ. SENA దేశాల్లో (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) ఓపెనర్గా అతనికిది తొమ్మిదో హాఫ్ సెంచరీ. ఈ హాఫ్ సెంచరీతో రాహుల్ భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, మరో మాజీ ఓపెనర్ మురళీ విజయ్ రికార్డును సమం చేశాడు. భారత ఓపెనర్లుగా సెహ్వాగ్, మురళీ కూడా సేనా దేశాల్లో తలో 9 హాఫ్ సెంచరీలు చేశారు. ఈ విభాగంలో సునీల్ గవాస్కర్ ఒక్కడే ప్రస్తుతం రాహుల్ కంటే ముందున్నాడు. భారత ఓపెనర్గా గవాస్కర్ సేనా దేశాల్లో 19 హాఫ్ సెంచరీలు చేశాడు.సేనా దేశాల్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన భారత ఓపెనర్లు:19 - సునీల్ గవాస్కర్ 57 ఇన్నింగ్స్లలో9* - కేఎల్ రాహుల్ 42 ఇన్నింగ్స్లలో9 - మురళీ విజయ్ 42 ఇన్నింగ్స్లలో9 - వీరేంద్ర సెహ్వాగ్ 49 ఇన్నింగ్స్లలోమ్యాచ్ విషయానికొస్తే.. ఓవర్నైట్ స్కోర్ 90/2 వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్కు ఆదిలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్ చివరి బంతికే (24.6వ ఓవర్) బ్రైడన్ కార్స్ బౌలింగ్లో శుభ్మన్ గిల్ (8) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఓవర్నైట్ స్కోర్కు మరో రెండు పరుగులు మాత్రమే జోడించి భారత్ మూడో వికెట్ కోల్పోయింది.ఈ దశలో రిషబ్ పంత్ రాహుల్కు జత కలిశాడు. వీరిద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్లు కొనసాగిస్తున్నారు. లంచ్ విరామం సమయానికి భారత్ స్కోర్ 153/3గా ఉంది. రాహుల్ 72, పంత్ 31 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతానికి భారత్ ఆధిక్యం 159 పరుగులుగా ఉంది. భారత రెండో ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ (4) విఫలం కాగా.. వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (30) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 2, స్టోక్స్ ఓ వికెట్ పడగొట్టారు.అంతకుముందు భారత్, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ల్లో నువ్వా నేనా అన్నట్లు బ్యాటింగ్ చేశాయి. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101), కెప్టెన్ శుబ్మన్ గిల్ (147), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (134) సెంచరీలతో చెలరేగడంతో 471 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ తలో నాలుగు వికెట్లు తీయగా.. షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ టీమిండియాకు ధీటుగా బదులిచ్చింది. ఓపెనర్ బెన్ డకెట్ (62) అర్ధ శతకంతో రాణించగా.. ఓలీ పోప్ (106) శతక్కొట్టాడు. హ్యారీ బ్రూక్ 99 పరుగులతో తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. మిగతా ఆటగాళ్లలో జేమీ స్మిత్ 40, క్రిస్ వోక్స్ 38 పరుగులతో పర్వాలేదనిపించారు. ఫలితంగా ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్లో 465 పరుగులు చేసింది. దీంతో భారత్కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ కృష్ణ మూడు, సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. -
‘లక్ష్మణ్ను కాదని అతడిని తీసుకున్నాం.. నాతో మూడు నెలలు మాట్లాడలేదు’
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) 2003 వన్డే ప్రపంచకప్ నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. జట్టు ఎంపిక సమయంలో ఆచితూచి వ్యవహరించామని.. కూర్పు దృష్ట్యా నాడు ఓ దిగ్గజ బ్యాటర్కు మొండిచేయి చూపామని పేర్కొన్నాడు. ఈ కారణంగా అతడు తనతో మూడు నెలల పాటు ఒక్క మాట కూడా మాట్లాడలేదని తాజాగా వెల్లడించాడు.కాగా 2003లో సౌతాఫ్రికాలో జరిగిన వన్డే వరల్డ్కప్ (ODI World Cup 2003) జట్టులో యాజమాన్యం వీవీఎస్ లక్ష్మణ్కు చోటు ఇవ్వలేదు. అతడిని కాదని దినేశ్ మోంగియా (Dinesh Mongia)ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇక నాటి ఈ ఐసీసీ టోర్నీలో టీమిండియా రన్నరప్తో సరిపెట్టుకుంది.నాతో మూడు నెలలు మాట్లాడలేదుతాజాగా నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న వరల్డ్కప్ జట్టు కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. లక్ష్మణ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడం సహజమే. అలా చాలా మందిని చాలా సార్లు పక్కనపెట్టాల్సి వచ్చేది.అందుకు వారు అసంతృప్తికి లోనవడం కూడా మామూలే. వరల్డ్కప్ జట్టులో స్థానం దక్కనందుకు లక్ష్మణ్ నాతో మూడు నెలల పాటు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను చొరవ తీసుకుని అతడిని కదిలించాను.ఏ ఆటగాడి కెరీర్లోనైనా ఇలాంటి ఆటుపోట్లు తప్పవు. ముఖ్యంగా సమర్థవంతుడైన తనకు చోటు దక్కనందుకు లక్ష్మణ్ అసంతృప్తికి లోనుకావడం, బాధపడటం సహజమే.పాక్లో అదరగొట్టాడుఅయితే, ప్రపంచకప్ టోర్నీలో మా ప్రదర్శన పట్ల అతడు సంతోషం వ్యక్తం చేశాడు. ఈ ఈవెంట్ తర్వాత అతడు వన్డే జట్టులోకి తిరిగి వచ్చాడు. పాకిస్తాన్, ఆస్ట్రేలియా పర్యటనల్లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఏ ఆటగాడైనా జట్టులో చోటు దక్కనపుడు బాధపడినా... దానిని మరీ వ్యక్తిగతంగా తీసుకోరు. జట్టు ప్రయోజనాల కోసం తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు’’ అని గంగూలీ పేర్కొన్నాడు.కాగా టీమిండియా తరఫున గంగూలీ 1992 నుంచి 2008 వరకు 113 టెస్టులు, 311 వన్డే మ్యాచ్లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 7212, 11363 పరుగులు సాధించాడు. భారత క్రికెట్ జట్టు దశ దిశ మార్చిన కెప్టెన్గా పేరొందిన దాదా ఖాతాలో.. 16 టెస్టు, 22 వన్డే శతకాలు ఉన్నాయి.మరోవైపు.. హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ 1996- 2012 మధ్య భారత్కు ప్రాతినిథ్యం వహించాడు. తన కెరీర్లో 134 టెస్టుల్లో 8781 పరుగులు,86 వన్డేల్లో 2338 పరుగులు సాధించాడు. ఇక గతంలో గంగూలీ భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడిగా పనిచేయగా.. లక్ష్మణ్ జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్గా ఉన్నాడు. ప్రధాన కోచ్ల గైర్హాజరీలో టీమిండియా హెడ్కోచ్గా వ్యవహరిస్తున్నాడు.చదవండి: దంచికొట్టిన ఉన్ముక్త్ చాంద్.. క్లాసెన్ బృందానికి తప్పని ఓటమి -
నమ్మశక్యంకాని రీతిలో మ్యాచ్ను గెలిపించిన వరుణ్ చక్రవర్తి.. భావోద్వేగానికి లోనైన అశ్విన్
తమిళనాడు ప్రీమియర్ లీగ్లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బ్యాటర్గా చెలరేగిపోయాడు. లక్ష్య ఛేదనలో చివరి 2 బంతుల్లో 7 పరుగులు అవసరమైనప్పుడు.. వరుసగా సిక్సర్, బౌండరీ కొట్టి తన జట్టును గెలిపించాడు. వరుణ్ మ్యాచ్ను గెలిపించాక, అతని జట్టు కెప్టెన్, టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు. కాసేపు తల వంచుకొని అలాగే ఉండిపోయాడు. అనంతరం వరుణ్ను అభినందించేందుకు గ్రౌండ్లోకి వచ్చాడు. ఈ మొత్తం తంతుకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది.VARUN CHAKARAVARTHY, THE FINISHER IN TNPL...!!!- Dindigul needed 7 from 2 balls then Varun smashed 6 & 4 🤯pic.twitter.com/HOMpyK8U2W— Johns. (@CricCrazyJohns) June 23, 2025పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా దిండిగుల్ డ్రాగన్స్, సేలమ్ స్పార్టన్స్ జట్లు నిన్న (జూన్ 22) తలపడ్డాయి. ఈ లీగ్లో రవిచంద్రన్ అశ్విన్ దిండిగుల్ డ్రాగన్స్కు సారథ్యం వహిస్తుండగా.. వరుణ్ చక్రవర్తి ఆ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన స్పార్టన్స్.. నిధీశ్ రాజగోపాల్ (47 బంతుల్లో 74) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. స్పార్టన్స్ ఇన్నింగ్స్లో రాజేంద్రన్ (35), సన్నీ సంధు (25) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. స్పార్టన్స్ను అశ్విన్ అద్బుతమైన బౌలింగ్తో దెబ్బకొట్టాడు. అశ్విన్ తన కోటా 4 ఓవర్లలో 3 వికెట్లు తీసి కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు. సందీప్ వారియర్, కార్తీక్ శరణ్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు.అనంతరం లక్ష్య ఛేదనలో డ్రాగన్స్ను అశ్విన్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. ఈ లీగ్లో ఆది నుంచి ఓపెనర్గా బరిలోకి దిగుతున్న అశ్విన్ నిన్నటి మ్యాచ్లో 14 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 36 పరుగులు చేశాడు. అశ్విన్ ఔటయ్యాక కాస్త తడబడిన డ్రాగన్స్ను శివమ్ సింగ్ (34), జయంత్ (25), హన్నీ సైనీ (35), విమల్ కుమార్ (24) ఓ మోస్తరు ఇన్నింగ్స్లతో ఆదుకున్నారు. వికెట్లు పడుతున్నా వీరు డ్రాగన్స్ను గెలుపు ట్రాక్లోనే ఉంచారు. తొమ్మిదో స్థానంలో వరుణ్ చక్రవర్తి బ్యాటింగ్కు దిగే సమయానికి డ్రాగన్స గెలుపుకు 11 బంతుల్లో 20 పరుగులు అవసరంగా ఉన్నాయి. ఈ దశలో బ్యాట్కు పని చెప్పిన వరుణ్, నమ్మశ్యంకాని రీతిలో 5 బంతుల్లో 13 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు. చివరి 2 బంతుల్లో 7 పరుగులు అవసరమైన తరుణంలో వరుణ్ వరుసగా సిక్సర్, బౌండరీ కొట్టి గెలిపించిన వైనం మ్యాచ్ మొత్తానికే హైలైట్గా నిలిచింది. తొలుత బంతితో, ఆ తర్వాత బ్యాట్తో ఇరగదీసిన అశ్విన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
అరంగేట్రంలోనే అదరగొట్టిన ఇషాన్ కిషన్
టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ కౌంటీ క్రికెట్లోకి గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చాడు. అరంగేట్రం ఇన్నింగ్స్లోనే మెరుపు హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ ఇన్నింగ్స్లో ఇషాన్ కేవలం 57 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా 94 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్ సాయంతో 83 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. కౌంటీల్లో ఇషాన్కు ఇదే తొలి అసైన్మెంట్. ఇటీవలే అతను నాటింగ్హమ్షైర్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ జట్టుతో ఇషాన్ ఒప్పందం కేవలం రెండు మ్యాచ్లకు మాత్రమే వర్తిస్తుంది. సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ కైల్ వెర్రెయిన్ జాతీయ విధులు హాజరయ్యేందుకు జింబాబ్వేకు వెళ్లడంతో (రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం) నాటింగ్హమ్షైర్ ఇషాన్తో స్వల్ప కాలిక ఒప్పందం చేసుకుంది. డివిజన్–1 కౌంటీ చాంపియన్షిప్లో భాగంగా నాటింగ్హమ్షైర్ యార్క్షైర్తో తలపడుతుంది. రెండో రోజు తొలి సెషన్లో నాటింగ్హమ్షైర్ 348/6గా ఉంది. ఇషాన్, లియామ్ పాటర్సన్ (22) క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు నాటింగ్హమ్ ఇన్నింగ్స్లో హసబ్ హమీద్ 52, బెన్ స్లేటర్ 96, ఫ్రెడ్డీ 23, జో క్లార్క్ 31, జాక్ హేన్స్ 18, లిండన్ జేమ్స్ 12 పరుగులు చేసి ఔటయ్యారు. యార్క్షైర్ బౌలర్లలో జార్జ్ హిల్, డేనియల్ మోరియార్టీ తలో 2 వికెట్లు పడగొట్టగా.. జాక్ వైట్, విలయమ్ ఓరూర్కీ చెరో వికెట్ దక్కించుకున్నారు.10 రోజుల్లో మూడో ఆటగాడు..10 రోజుల వ్యవధిలో కౌంటీ ఛాంపియన్షిప్లో ఆడేందుకు ఒప్పందం కుదర్చుకున్న మూడో భారత ఆటగాడిగా ఇషాన్ కిషన్ నిలిచాడు. కిషన్ కంటే ముందు రుతురాజ్ గైక్వాడ్ ,తిలక్ వర్మ యార్క్షైర్, హాంప్షైర్లతో జతకట్టారు.ఇషాన్ కిషన్ గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. గతేడాది బీసీసీఐ నిబంధనలు ఉల్లఘించి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ను కోల్పోయిన ఇషాన్.. తిరిగి ఈ ఏడాది తన కాంట్రాక్ట్ను దక్కించుకున్నాడు.టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. దాదాపు రెండు నెలల పాటు భారత జట్టు ఇంగ్లండ్లోనే ఉండనుంది. ఒకవేళ ఏ ఆటగాడు అయినా గాయపడితే ప్రత్యామ్నాయంగా ఇషాన్కు పిలుపు వచ్చే అవకాశముంది. -
బుమ్రాను అందుకు నువ్వే ఒప్పించాలమ్మా!.. పుజారా రిక్వెస్ట్
ఇంగ్లండ్ పర్యటనను టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఘనంగా ఆరంభించాడు. ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు కూల్చి.. భారత్కు స్వల్ప ఆధిక్యం అందించాడు. బౌలింగ్ దళ భారాన్ని మొత్తం తానే మోస్తూ.. మరోసారి తన విలువను చాటుకున్నాడు.ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో ఓపెనర్లు జాక్ క్రాలే (4), బెన్ డకెట్ (4).. అదే విధంగా మరో ప్రధాన బ్యాటర్ జో రూట్ (28) రూపంలో మూడు కీలక వికెట్లు కూల్చిన బుమ్రా.. క్రిస్ వోక్స్ (38), బ్రైడన్ కార్స్ (22) వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.ఇదిలా ఉంటే.. టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా భారత్ ఇంగ్లండ్తో ఐదు టెస్టులు ఆడనుంది. అయితే, పనిభారాన్ని తగ్గించుకునే క్రమంలో బుమ్రా అన్ని మ్యాచ్లు ఆడకపోవచ్చు. జట్టు ప్రకటన సందర్భంగా టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు.అందుకే కెప్టెన్సీకి కూడా దూరం అంతేకాదు.. తాను కూడా అన్ని టెస్టులు ఆడలేను కాబట్టే కెప్టెన్సీ వద్దని చెప్పానని బుమ్రా కూడా ఇటీవల పేర్కొన్నాడు. ఇక ఇంగ్లండ్తో ఆదివారం నాటి మూడో రోజు ఆట ముగిసిన తర్వాత కూడా భవిష్యత్ దృష్ట్యా తాను పనిభారాన్ని మేనేజ్ చేసుకునే విషయంలో ‘స్మార్ట్’గా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్, వెటరన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఇంగ్లండ్తో ఐదు టెస్టుల్లోనూ బుమ్రా ఆడాలని కోరుకున్న ఈ ఇద్దరు క్రికెటర్లు.. ఇందుకు అతడిని ఒప్పించాలంటూ స్పోర్ట్స్ ప్రజెంటర్ను కోరారు. ఆమె మరెవరో కాదు బుమ్రా సతీమణి సంజనా గణేషన్.సంజనా.. నాదో రిక్వెస్ట్..భారత్- ఇంగ్లండ్ టెస్టుల బ్రాడ్కాస్టర్ సోనీ నెట్వర్క్ షోలో భాగంగా.. ‘‘సంజనా.. నాదో రిక్వెస్ట్.. అన్ని మ్యాచ్లు ఆడేలా జస్ప్రీత్ను నువ్వు మాత్రమే ఒప్పించగలవు. ఒక్కసారి ప్రయత్నించి చూడు. నీకు మాత్రమే అది సాధ్యం’’ అని పుజారా సంజనాతో అన్నాడు.ఇంతలో గావస్కర్ కలుగజేసుకుంటూ.. ‘‘మ్యాచ్కి మ్యాచ్కి మధ్య కావాల్సినంత విరామం దొరుకుతుంది. దాదాపు ఎనిమిది రోజులు విశ్రాంతి లభిస్తుంది. తదుపరి మ్యాచ్కు వారానికి పైగా సమయం ఉంది. ఆ తర్వాత లార్డ్స్ టెస్టుకు.. ఆపై మాంచెస్టర్ టెస్టుకు కూడా ఇదే తరహాలో విరామం లభిస్తుంది.జట్టుకు బుమ్రా అవసరం ఉందిమాంచెస్టర్లో ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగష్టు, సెప్టెంబరు, అక్టోబర్ లేదంటే నవంబరు.. ఎప్పుడైనా బంతి బాగా స్వింగ్ అవుతుంది. ది ఓవల్లో ఐదు రోజులు మ్యాచ్ జరిగే అవకాశం ఉంటుంది.జట్టుకు జస్ప్రీత్ అవసరం ఎంతగానో ఉంది. అతడు ఐదు టెస్టులు ఆడాలని మేము కోరుకుంటున్నాము. దయచేసి నువ్వు అన్ని మ్యాచ్లు ఆడు బుమ్రా’’ అని సంజనా సమక్షంలో విజ్ఞప్తి చేశాడు. కాగా లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 465 పరుగులకు ఆలౌట్ అయింది.ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్.. నాలుగో రోజు ఆటలో భాగంగా 34 ఓవర్ల ఆట ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో శతకాలు బాదిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4), కెప్టెన్ శుబ్మన్ గిల్ (8) ఈసారి విఫలమయ్యారు. వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ 30 పరుగులు చేయగా.. ఓపెనర్ కేఎల్ రాహుల్ 52, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ షెడ్యూల్తొలి టెస్టు: జూన్ 20-24, లీడ్స్రెండో టెస్టు: జూలై 2-6, బర్మింగ్హామ్మూడో టెస్టు: జూలై 10- 14, లార్డ్స్, లండన్నాలుగో టెస్టు: జూలై 23-27, మాంచెస్టర్ఐదో టెస్టు: జూలై 31- ఆగష్టు 4, కెన్నింగ్టన్ ఓవల్, లండన్.చదవండి: పృథ్వీ షా సంచలన నిర్ణయం.. ఇక గుడ్ బై? The People vs. Bumrah's workload management 👨⚖️This bench rules: Bumrah MUST play all 5 Tests ✅ 😅#SonySportsNetwork #GroundTumharaJeetHamari #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia | @cheteshwar1 @SanjanaGanesan @Jaspritbumrah93 pic.twitter.com/22f2LichMZ— Sony Sports Network (@SonySportsNetwk) June 23, 2025 -
IND VS ENG 1st Test Day 4: టీమిండియాకు షాక్
భారత్-ఇంగ్లండ్ మధ్య లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుంది. తొలి ఇన్నింగ్స్ల్లో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు బ్యాటింగ్ చేశాయి. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101), కెప్టెన్ శుబ్మన్ గిల్ (147), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (134) సెంచరీలతో చెలరేగడంతో 471 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ తలో నాలుగు వికెట్లు తీయగా.. షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ టీమిండియాకు ధీటుగా బదులిచ్చింది. ఓపెనర్ బెన్ డకెట్ (62) అర్ధ శతకంతో రాణించగా.. ఓలీ పోప్ (106) శతక్కొట్టాడు. హ్యారీ బ్రూక్ 99 పరుగులతో తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. మిగతా ఆటగాళ్లలో జేమీ స్మిత్ 40, క్రిస్ వోక్స్ 38 పరుగులతో పర్వాలేదనిపించారు. ఫలితంగా ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్లో 465 పరుగులు చేసింది. దీంతో భారత్కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ కృష్ణ మూడు, సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు.ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4), వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (30) ఔట్ కాగా.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (47), కెప్టెన్ శుభ్మన్ గిల్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. 6 పరుగుల ఆధిక్యం కలుపుకొని భారత్ 96 పరుగుల ఆధిక్యంలో ఉంది.నాలుగో రోజు ఆట ప్రారంభం కాగానే టీమిండియాకు షాక్ఓవర్నైట్ స్కోర్ 90/2 వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. తొలి ఓవర్ చివరి బంతికే (24.6వ ఓవర్) బ్రైడన్ కార్స్ బౌలింగ్లో తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో శుభ్మన్ గిల్ (8) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఓవర్నైట్ స్కోర్కు మరో రెండు పరుగులు మాత్రమే జోడించి భారత్ మూడో వికెట్ కోల్పోయింది. కేఎల్ రాహుల్కు జతగా రిషబ్ పంత్ క్రీజ్లోకి వచ్చాడు. గిల్ వికెట్ కోల్పోవడంతో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్పై ఒత్తిడి పడే అవకాశం ఉంది. ఇంగ్లండ్ ముందు టీమిండియా గౌరవప్రదమైన టార్గెట్ ఉంచాలంటే రాహుల్, పంత్ చాలా కీలకం కానున్నారు. వీరిద్దరు ఈ రోజంతా క్రీజ్లో ఉంటేనే భారత్ ఓ మోస్తరు స్కోర్ చేయగలుగుతుంది. -
పంజాబ్ కింగ్స్ బ్యాటర్ విధ్వంసం.. చరిత్ర సృష్టించిన మ్యాక్స్వెల్ సేన
మేజర్ లీగ్ క్రికెట్ 2025 ఎడిషన్లో భాగంగా టెక్సాస్ కింగ్స్తో ఇవాళ (జూన్ 23) జరిగిన మ్యాచ్లో వాషింగ్టన్ ఫ్రీడం ఆటగాడు, పంజాబ్ కింగ్స్ ఆల్రౌండర్ మిచెల్ ఓవెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలుత బౌలింగ్లో (3-0-33-3) రెచ్చిపోయిన ఓవెన్.. ఆతర్వాత బ్యాటింగ్లో విధ్వంసం సృష్టించాడు (52 బంతుల్లో 89; 8 ఫోర్లు, 5 సిక్సర్లు). ఫలితంగా ఓవెన్ ప్రాతినిథ్యం వహించిన వాషింగ్టన్ ఫ్రీడం మేజర్ లీగ్ క్రికెట్ చరిత్రలోనే అతి భారీ లక్ష్య ఛేదనను (223/3) నమోదు చేసింది. ఈ మ్యాచ్లో ఓవెన్ ఆండ్రియస్ గౌస్తో (45 బంతుల్లో 80 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) కలిసి రెండో వికెట్కు 121 పరుగుల మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఓవెన్, గౌస్ కలిసి వాషింగ్టన్ ఫ్రీడంకు చారిత్రక విజయాన్ని అందించారు.పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టెక్సాస్ సూపర్ కింగ్స్.. ఫాఫ్ డుప్లెసిస్ (31 బంతుల్లో 69; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ద సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్లో స్టోయినిస్ (32), మిలింద్ కుమార్ (31), షుభమ్ రంజనే (26 నాటౌట్), స్మిత్ పటేల్ (24) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సాయితేజ ముక్కామల (6), డొనోవన్ ఫెరియెరా (9) విఫలమయ్యారు. వాషింగ్టన్ బౌలర్లలో మిచెల్ ఓవెన్ 3, మ్యాక్స్వెల్ 2, రచిన్ రవీంద్ర ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన వాషింగ్టన్.. ఓవెన్, గౌస్ చెలరేగిపోవడంతో 19.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. వాషింగ్టన్ ఇన్నింగ్స్లో రచిన్ రవీంద్ర 11, మ్యాక్స్వెల్ 20 పరుగులు చేసి ఔట్ కాగా.. గౌస్తో కలిసి గ్లెన్ ఫిలిప్స్ (4 బంతుల్లో 12 నాటౌట్) వాషింగ్టన్ను విజయతీరాలకు చేర్చాడు. వాషింగ్టన్ కోల్పోయిన మూడు వికెట్లు ఆడమ్ మిల్నే ఖాతాలో పడ్డాయి. ఈ మ్యాచ్కు ముందు ఎంఎల్సీలో అత్యధిక లక్ష్య ఛేదన రికార్డు నికోలస్ పూరన్ నేతృత్వంలోని ఎంఐ న్యూయార్క్ పేరిట ఉండింది. ఇదే సీజన్లో ఆ జట్టు సియాటిల్ ఓర్కాస్పై 201 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది (7 వికెట్లు కోల్పోయి). ఈ మ్యాచ్కు ముందు వరకు ఎంఎల్సీలో ఇదే భారీ లక్ష్య ఛేదనగా ఉండింది. -
దంచికొట్టిన ఉన్ముక్త్ చాంద్.. క్లాసెన్ బృందానికి తప్పని ఓటమి
మేజర్ లీగ్ క్రికెట్-2025 మ్యాచ్లో ఉన్ముక్త్ చాంద్ దంచికొట్టాడు. లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ తరఫున బరిలోకి దిగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ధనాధన్ ఇన్నింగ్స్తో జట్టును గెలిపించాడు. అమెరికా టీ20 లీగ్ మేజర్ లీగ్ క్రికెట్లో భాగంగా డల్లాస్ వేదికగా సీటెల్ ఒర్కాస్- లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ మధ్య సోమవారం తెల్లవారుజామున మ్యాచ్ జరిగింది.టాస్ గెలిచిన సీటెల్ జట్టు కెప్టెన్ హెన్రిచ్ క్లాసెన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు షయాన్ జహంగీర్ (15 బంతుల్లో 26), డేవిడ్ వార్నర్ (28 బంతుల్లో 38).. వన్డౌన్ బ్యాటర్ ఆరోన్ జోన్స్ (36 బంతుల్లో 44) రాణించారు. కెప్టెన్ క్లాసెన్ మాత్రం 4 పరుగులకే పరిమితం కాగా.. ఆఖర్లో షిమ్రన్ హెట్మెయిర్ 19 పరుగులు చేయగా.. సికందర్ రజా 16 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో సీటెల్ ఒర్కాస్ ఆరు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. నైట్ రైడర్స్ బౌలర్లలో ఆండ్రీ రసెల్ మూడు వికెట్లు కూల్చగా.. కార్నీ డ్రై, వాన్ షాల్విక్, కెప్టెన్ జేసన్ హోల్డర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఇక లక్ష్య ఛేదనకు దిగిన నైట్ రైడర్స్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అలెక్స్ హేల్స్ (1) ఎదుర్కొన్న నాలుగో బంతికే వెనుదిరిగాడు. వన్డౌన్ బ్యాటర్ నితీశ్ కుమార్ (1) కూడా నిరాశపరిచాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ ఉన్ముక్త్ చాంద్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.మొత్తంగా 58 బంతులు ఎదుర్కొని పది ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 86 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా నాలుగో నంబర్ బ్యాటర్ సైఫ్ బాదర్ (32 బంతుల్లో 54) అర్ధ శతకంతో రాణించాడు. చివర్లో షెర్ఫానే రూథర్ఫర్డ్ 9 బంతుల్లో 20 రన్స్తో మెరుపులు మెరిపించాడు. ఉన్ముక్త్తో కలిసి అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 18.2 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే నష్టపోయి లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ సీటెల్ ఒర్కాస్పై జయభేరి మోగించింది.కాగా ఈ సీజన్లో ఉన్ముక్త్ చాంద్ ఇప్పటికి నాలుగు మ్యాచ్లలో కలిపి 161 పరుగులతో దుమ్ములేపాడు. ఇక 2012లో ఉన్ముక్త్ చాంద్ భారత్కు అండర్-19 ప్రపంచకప్ అందించిన విషయం తెలిసిందే. భారత్కు వరల్డ్కప్ అందించిన ఘనుడుఅయితే, ఆ తర్వాత అతడికి అవకాశాలు రాలేదు. టీమిండియాలో చోటు కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన ఉన్ముక్త్ చాంద్ తన కల నెరవేరకపోవడంతో అమెరికాకు వలస వెళ్లిపోయాడు. అక్కడే క్రికెటర్గా కొనసాగుతున్నాడు.ఇదిలా ఉంటే.. జూన్ 12న మొదలైన మేజర్ లీగ్ క్రికెట్-2025 లీగ్లో శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, వాషింగ్టన్ ఫ్రీడమ్, టెక్సాస్ సూపర్ కింగ్స్, ఎంఐ న్యూయార్క్, లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్, సీటెల్ ఒర్కాస్ టైటిల్ కోసం తలపడుతున్నాయి. నాలుగింట నాలుగు విజయాలతో శాన్ ఫ్రాన్సిస్కో జట్టు ప్రస్తుతం టాప్లో కొనసాగుతోంది. మరోవైపు.. లాస్ ఏంజెల్స్కు ఇదే తొలి విజయం కాగా.. సీటెల్ జట్టు ఇంకా ఖాతా తెరవనేలేదు.చదవండి: పృథ్వీ షా సంచలన నిర్ణయం.. ఇక గుడ్ బై? -
దివిత్ రెడ్డికి కాంస్య పతకం
హైదరాబాద్: జాతీయ అండర్–9 చెస్ చాంపియన్షిప్ ఓపెన్ విభాగంలో తెలంగాణకు చెందిన అదుళ్ల దివిత్ రెడ్డి కాంస్య పతకం సాధించాడు. హరియాణాలో జరిగిన ఈ టోర్నీలో నిర్ణీత 11 రౌండ్ల తర్వాత దివిత్తోపాటు మరో ఐదుగురు 8.5 పాయింట్లతో ఉమ్మడిగా మూడో స్థానంలో నిలిచారు.మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్ను వర్గీకరించగా... దివిత్కు కాంస్య పతకం ఖరారైంది. 10 పాయింట్లతో సాతి్వక్ స్వయిన్ (ఒడిశా) విజేతగా అవతరించగా... 9.5 పాయింట్లతో ఆది్వక్ అభినవ్ కృష్ణ (కర్ణాటక) రన్నరప్గా నిలిచాడు. 150 మంది ప్లేయర్ల మధ్య స్విస్ ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీలో దివిత్ ఏడు గేముల్లో గెలిచి, మూడు గేమ్లను ‘డ్రా’ చేసుకొని, ఒక గేమ్లో మాత్రమే ఓడిపోయాడు.గత ఏడాది నవంబర్లో ఇటలీలో జరిగిన ప్రపంచ క్యాడెట్ చెస్ చాంపియన్ షిప్లో దివిత్ రెడ్డి అండర్–8 ఓపెన్ విభాగంలో... ఏప్రిల్లో అల్బేనియాలో జరిగిన ప్రపంచ క్యాడెట్ ర్యాపిడ్ చాంపియన్షిప్ అండర్–8 ఓపెన్ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించడం విశేషం. మరోవైపు బాలికల విభాగంలో తెలంగాణకు చెందిన సాయి అన్షిత 8.5 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్యం చేజార్చుకుంది.వ్రిత్తి అగర్వాల్కు కాంస్య పతకంభువనేశ్వర్: జాతీయ సీనియర్ అక్వాటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ పతకాల బోణీ చేసింది. తెలంగాణకు చెందిన వ్రిత్తి అగర్వాల్ మహిళల 400 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది. ఆదివారం జరిగిన 400 మీటర్ల ఫైనల్ను వ్రిత్తి 4 నిమిషాల 30.05 సెకన్లలో ముగించి మూడో స్థానాన్ని దక్కించుకుంది. భవ్య సచ్దేవ (ఢిల్లీ; 4ని:26.66 సెకన్లు) స్వర్ణ పతకం... అదితి సతీశ్ హెగ్డే (మహారాష్ట్ర; 4ని:29.48 సెకన్లు) రజత పతకం గెల్చుకున్నారు. -
పృథ్వీ షా సంచలన నిర్ణయం.. ఇక గుడ్ బై?
టీమిండియా ఓపెనర్, ముంబై స్టార్ ప్లేయర్ పృథ్వీ షా కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ క్రికెట్లో ఇకపై ముంబైకి ఆడకూడదని పృథ్వీ షా నిశ్చయించుకున్నాడు. వేరే జట్టుకు మారేందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) కోసం ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA)ను అతడు అభ్యర్ధించాడు.ఈ విషయాన్నిఎంసీఎ సీనియర్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. "పృథ్వీ షా.. ఎంసీఎ నుంచి నుంచి ఎన్వోసీ కోరాడు. మేము త్వరలో దానిపై నిర్ణయం తీసుకుంటాము" అని సదరు అధికారి ఇండియన్ ఎక్స్ప్రెస్తో పేర్కొన్నారు. కాగా కెరీర్ ఆరంభంలో జూనియర్ సచిన్ టెండూల్కర్ పేరొందిన పృథ్వీ షా.. ఆ తర్వాత పేలవ ఫామ్, ఫిట్నెస్ సమస్యలతో భారత జట్టులో చోటు కోల్పోయాడు. భారత జట్టుకు దూరంగా ఉన్నప్పటికి దేశవాళీ క్రికెట్, ఐపీఎల్లో భాగమయ్యేవాడు. ఈ సారి ఐపీఎల్లో ఆడే అవకాశం కూడా అతడికి రాలేదు. ఎంసీఎతో విభేదాలు..కాగా గత కొంత కాలం నుంచి ముంబై క్రికెట్ అసోసియేషన్తో అతడికి విబేధాలు తలెత్తాయి. అందుకు ప్రధాన కారణం అతడిని జట్టు నుంచి తప్పించడమే. ఫిట్నెస్ సరిగా లేకపోవడంతో గతేడాది రంజీ ట్రోఫీ జట్టు నుంచి అతడిని ముంబై సెలక్టర్లు పక్కన పెట్టారు. షా శరీరంలో అధికంగా ఫ్యాట్ ఉందని, బరువు ఎక్కువగా ఉన్నాడని ముంబై టీమ్ మెనెజ్మెంట్ సెలక్టర్లకు ఫిర్యాదు చేసింది.టీమ్ మెనెజ్మెంట్ ఫిర్యాదు మెరకు అతడికి రెండు వారాల ప్రత్యేక ఫిట్నెస్ ప్రోగ్రామ్ను ఎంసీఎ సిఫార్సు చేసింది. కానీ సెలక్టర్లు ఆశించినంత ఫిట్నెస్ను షా సాధించలేకపోయాడు. దీంతో గతేడాది డిసెంబర్లో జరిగిన విజయ్ హాజారే ట్రోఫీలో కూడా షా భాగం కాలేదు.ఈ క్రమంలోనే ఎంసీఎతో పృథ్వీషా తెగదింపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. పృథ్వీ షా ఇప్పటివరకు ముంబై జట్టు తరపున 58 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 4556 పరుగులు చేశాడు. అదేవిధంగా 65 లిస్ట్-ఎ, 117 టీ20ల్లో ముంబైకి ప్రాతినిథ్యం వహించాడు.చదవండి: IND vs ENG: రెచ్చగొట్టిన మహ్మద్ సిరాజ్.. ఇచ్చిపడేసిన ఇంగ్లండ్ బ్యాటర్! వీడియో -
అడ్డుగోడలా..: జైస్వాల్, జడ్డూలపై సచిన్ ఫైర్!.. పోస్ట్ వైరల్
ఇంగ్లండ్తో తొలి టెస్టులో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అదరగొడుతున్నాడు. లీడ్స్ వేదికగా ఆతిథ్య జట్టు మొదటి ఇన్నింగ్స్లో ఈ పేస్ గుర్రం ఐదు వికెట్లతో చెలరేగాడు. తద్వారా స్టోక్స్ బృందాన్ని 465 పరుగులకు కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మరోసారి బౌలింగ్ విభాగం భారమంతా తన భుజాలపైనే వేసుకుని ముందుకు నడిపించాడు.అయితే, మిగతా బౌలర్ల నుంచి బుమ్రాకు అంతగా సహకారం లభించలేదు. మరోవైపు.. ఫీల్డర్ల తప్పిదాల కారణంగా బుమ్రా బౌలింగ్లో ఇంగ్లండ్ బ్యాటర్లు ఇచ్చిన దాదాపు ఐదు క్యాచ్లు నేలపాలయ్యాయి. శనివారం నాటి రెండో రోజు ఆటలో మూడు.. ఆదివారం నాటి మూడో రోజు ఆటలో రెండు క్యాచ్లను భారత ఫీల్డర్లు జారవిడిచారు.క్యాచ్లు నేలపాలు చేసిన జైసూ, జడ్డూముఖ్యంగా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) బుమ్రా బౌలింగ్లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ (62), వన్డౌన్ బ్యాటర్, శతక వీరుడు ఓలీ పోప్ (106), మరో కీలక బ్యాటర్ హ్యారీ బ్రూక్ (99) ఇచ్చిన క్యాచ్లను నేలపాలు చేశాడు. మరోవైపు.. రవీంద్ర జడేజా (Ravindra Jadeja) కూడా బుమ్రా బౌలింగ్లో డకెట్ క్యాచ్ను జారవిడిచాడు. ఇదిలా ఉంటే.. బ్రూక్ను బుమ్రా డకౌట్ చేశాడని భావించగా.. అది నో బాల్గా తేలడం.. ఆ తర్వాత బ్రూక్ శతకానికి సమీపించడం జరిగాయి. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ జస్ప్రీత్ బుమ్రాను ప్రశంసిస్తూనే.. భారత ఫీల్డర్ల వైఫల్యాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేశాడు. జైస్వాల్, జడ్డూలపై సచిన్ ఫైర్!‘‘బుమ్రాకు శుభాకాంక్షలు!.. ఒక నో బాల్.. మూడు జారవిడిచిన క్యాచ్లు నీకూ.. తొమ్మిది వికెట్లకు మధ్య అడ్డుగోడలా నిలిచాయి’’ అని పేర్కొన్నాడు.జైసూ, జడ్డూ ఫీల్డింగ్ తప్పిదాలతో, బ్రుక్కు వేసిన బంతి నో బాల్గా తేలనట్లయితే బుమ్రా ఖాతాలో మరో నాలుగు వికెట్లు చేరేవని.. తద్వారా అతడు తొమ్మిది వికెట్లు తీసేవాడని సచిన్ టెండుల్కర్ పరోక్షంగా వ్యాఖ్యానించాడు. ఎవరి వికెట్లు తీశాడంటే?కాగా ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో బుమ్రా 24.4 ఓవర్ల బౌలింగ్లో 83 పరుగులు (3.40 ఎకానమీ) ఇచ్చి ఐదు వికెట్లు కూల్చాడు. ఇందులో నాలుగు నో బాల్స్ ఉన్నాయి. ఇక ఇంగ్లండ్ బ్యాటర్లలో బుమ్రా.. జాక్ క్రాలే (4), బెన్ డకెట్ (62), జో రూట్ (28), క్రిస్ వోక్స్(38), జోష్ టంగ్ (11) వికెట్లు పడగొట్టాడు. ఇందులో డకెట్తో పాటు.. వోక్స్, టంగ్లను బుమ్రా బౌల్డ్ చేశాడు.ఇక భారత్- ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ను గతంలో పటౌడీ ట్రోఫీ అని పిలిచేవారన్న విషయం తెలిసిందే. అయితే, తాజా సిరీస్ నుంచి దీనికి టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీగా నామకరణం చేసింది ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య ఐదు టెస్టులు జరుగనున్నాయి. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సైకిల్లో టీమిండియా- ఇంగ్లండ్కు ఇదే తొలి సిరీస్ కావడం గమనార్హం. ఇక ఈ సిరీస్తోనే భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్గా శుబ్మన్ గిల్ తన ప్రయాణం ఆరంభించాడు.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తొలి టెస్టు (జూన్ 20-24)🏏వేదిక: హెడింగ్లీ, లీడ్స్🏏టాస్: ఇంగ్లండ్.. తొలుత బౌలింగ్🏏టీమిండియా తొలి ఇన్నింగ్స్: 471 ఆలౌట్ (జైస్వాల్ (101), గిల్ (147), రిషభ్ పంత్ (134) శతకాలు)🏏ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 465 ఆలౌట్ (ఓలీ పోప్ (106) శతకం)🏏ఆదివారం నాటి మూడో రోజు ఆట ముగిసేసరికి: టీమిండియా స్కోరు: 90/2 (23.5).. 96 పరుగుల ఆధిక్యం.చదవండి: అతడిపై నమ్మకం లేనపుడు.. ఎందుకు ఎంపిక చేశారు?: భారత మాజీ క్రికెటర్ Congratulations Bumrah!A no-ball and 3 missed chances stood between you and 𝙣𝙖𝙪 wickets. 🤪 pic.twitter.com/09rJNI9KP0— Sachin Tendulkar (@sachin_rt) June 22, 2025 -
అతడొక సూపర్ మ్యాన్.. 700 పరుగులు చేస్తాడు: సునీల్ గవాస్కర్
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. బ్యాటింగ్ పరంగా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాయి. మొదటి ఇన్నింగ్స్లో భారత్ 471 పరుగులు చేస్తే.. ఇంగ్లండ్ అందుకు సమాధానంగా 465 పరుగులు చేసింది. భారత్కు కేవలం 6 పరుగులు మాత్రమే ఆధిక్యం లభించింది.మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(47), శుబ్మన్ గిల్ ఉన్నారు. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్నందున ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించక తప్పదు. అది జరగాలంటే భారత్ నాలుగో రోజు మొత్తం బ్యాటింగ్ చేయాలి.క్రీజులో పాతుకుపోయిన కేఎల్ రాహుల్ నుంచి భారీ ఇన్నింగ్స్ను భారత అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్పై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. రాహుల్లో అద్బుతమైన టాలెంట్ ఉందని అతడు కొనియాడాడు."కేఎల్ రాహుల్ టోటల్ టీమ్ మ్యాన్. జట్టుకు ఏ అవసరమున్న తను ముందుకు వస్తాడు. ఏ స్ధానంలోనైనా బ్యాటింగ్ చేయగలడు. ఓపెనర్గా, మిడిలార్డర్లో ఎక్కడైనా బ్యాటింగ్ చేసే సత్తా అతడికి ఉంది. అంతేకాకుండా వికెట్ కీపర్గా కూడా రాణించలగడు. పరిస్థితులకు తగ్గట్టు ఆడే టాలెంట్ అతడి వద్ద ఉంది.ఎటువంటి పరిస్థితులలోనైనా రాహుల్ చాలా ప్రశాంతంగా కన్పిస్తాడు. ప్రస్తుత తరంలో ఇటువంటి క్రికెటర్లు చాలా అరుదుగా ఉంటారు. అతడు ఏదైనా సాధించినప్పుడు సెలబ్రేషన్స్ కూడా పెద్దగా చేసుకోడు. నిజంగా అతడు చాలా గ్రేట్. రాహుల్లో అద్బుతమైన టాలెంట్ ఉంది.ఈ మ్యాచ్లో ఆఫ్సైడ్, లెగ్-సైడ్, ఫ్లిక్ వంటి మాస్టర్ క్లాస్ షాట్లు ఆడాడు. అతడి ఆట చూడటానికి చాలా అందంగా అనిపించింది. ఈ సిరీస్లో రాహుల్ బాగా రాణిస్తున్నాడన్న నమ్మకం నాకుంది. 5 టెస్టుల్లో కనీసం 700 పరుగులైనా చేస్తాడని" గవాస్కర్ జోస్యం చెప్పాడు.చదవండి: అతడిపై నమ్మకం లేనపుడు.. ఎందుకు ఎంపిక చేశారు?: భారత మాజీ క్రికెటర్ -
అథ్లెట్ల కోసం మెటా ఏఐ గ్లాసెస్
అథ్లెట్లు, క్రీడా ఔత్సాహికులను లక్ష్యంగా చేసుకుని మెటా కొత్త తరం ఏఐ గ్లాసెస్ను పరిచయం చేయడానికి ఓక్లేతో జతకట్టింది. ఓక్లే మెటా హెచ్ఎస్టీఎన్ అని పిలువబడే ఈ గ్లాసెస్తో మెటా అధునాతన సాంకేతికతను వాడినట్లు తెలిపింది. ఈ గ్లాసెస్లోని ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి. 3కే అల్ట్రా హెచ్డీ కెమెరా.. 12 మెగాపిక్సెల్ కెమెరాతో హై రిజల్యూషన్, పాయింట్ ఆఫ్ వ్యూ వీడియోలు, ఫొటోలను క్యాప్చర్ చేస్తుంది.మెటా ఏఐ ఇంటిగ్రేషన్.. రియల్ టైమ్ సమాచారాన్ని పొందడానికి, మ్యూజిక్ను నియంత్రించడానికి, వెదర్ను తనిఖీ చేయడానికి లేదా ల్యాంగ్వేజ్లను ట్రాన్స్లేట్ చేయడానికి ‘హే మెటా’ అనే వాయిస్ కమాండ్ ఉపయోగించవచ్చు.ఓపెన్-ఇయర్ ఆడియో.. ఈ గ్లాసెస్లో బిల్ట్ ఇన్ స్పీకర్లు ఉండడంతో ఎలాంటి ఇయర్ ఫోన్లు లేకుండానే మ్యూజిక్ వినవచ్చు.నీరు, ధూళి నిరోధకత కోసం ఐపీఎక్స్ 4-రేటింగ్తో అవుట్ డోర్ క్రీడలకు ఎంతో అనువైందని కంపెనీ తెలిపింది.బ్యాటరీ లైఫ్.. 8 గంటల వరకు యాక్టివ్ యూజ్, 19 గంటల స్టాండ్ బై ఉంటుంది. 20 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. చార్జింగ్ కేస్ ద్వారా మరో 48 గంటలు అదనంగా ఛార్జింగ్ ఉంటుంది.ఈ లిమిటెడ్ ఎడిషన్ ఓక్లే మెటా హెచ్ఎస్టీఎన్ ధర 499 డాలర్లు (సుమారు రూ.43,200)గా నిర్ణయించారు. ప్రీ-ఆర్డర్లు జులై 11 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది.ఇదీ చదవండి: పుత్తడి ప్రియులకు స్వల్ప ఊరటప్రాథమికంగా యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ గ్లాసెస్ అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది. ఇండియా, మెక్సికో, యూఏఈతో ఈ సంవత్సరం చివరలో అందుబాటులోకి తేనున్నట్లు చెప్పింది. -
అతడిపై నమ్మకం లేనపుడు.. తుదిజట్టులో ఎందుకు?: భారత మాజీ క్రికెటర్
టీమిండియా నాయకత్వ బృందం తీరుపై భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra)విమర్శలు గుప్పించాడు. ఇంగ్లండ్తో తొలి టెస్టులో శార్దూల్ ఠాకూర్ (Sahrdul Thakur) పట్ల యాజమాన్యం వ్యవహరించిన తీరు సరికాదన్నాడు. అతడి సేవలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోనపుడు తుది జట్టులోకి ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించాడు.మొదటి ఇన్నింగ్స్లో 471 పరుగులుకాగా టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీ (Tedulkar-Anderson Trophy)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య లీడ్స్ వేదికగా శుక్రవారం తొలి టెస్టు మొదలైంది. హెడింగ్లీ మైదానంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. మొదటి ఇన్నింగ్స్లో 471 పరుగులు చేసి ఆలౌట్ అయింది.భారత బ్యాటర్లలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101), కెప్టెన్ శుబ్మన్ గిల్ (147), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (134) శతకాలతో రాణించారు. ఈ క్రమంలో ఆతిథ్య ఇంగ్లండ్ సైతం భారత్కు దీటుగా బదులిచ్చింది. తొలి ఇన్నింగ్స్లో 465 పరుగులు సాధించింది.బుమ్రాకు ఐదు వికెట్లుఓపెనర్ బెన్ డకెట్ హాఫ్ సెంచరీ(62) చేయగా.. వన్డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ (106) శతక్కొట్టాడు. మిగతా వాళ్లలో హ్యారీ బ్రూక్ (99) రాణించాడు. ఇక ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్లో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా 24.4 ఓవర్లు బౌల్ చేసి ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ కృష్ణ 20 ఓవర్లు వేసి మూడు, మహ్మద్ సిరాజ్ 27 ఓవర్లు బౌల్ చేసి రెండు వికెట్లు దక్కించుకున్నారు.ఇక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 23 ఓవర్లు బౌలింగ్ చేసినా వికెట్ తీయలేకపోయాడు. అయితే, ఈ ఇన్నింగ్స్లో సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్కు మాత్రం కేవలం ఆరు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసే అవకాశం లభించింది. కేవలం ఆరు ఓవర్లలోనే అతడు 38 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత కెప్టెన్ శుబ్మన్ గిల్ మళీ శార్దూల్ చేతికి బంతిని ఇవ్వలేదు.నమ్మకం లేనపుడు జట్టులో ఎందుకు?ఈ విషయం గురించి మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. గిల్ తీరును ప్రశ్నించాడు. ‘‘శార్దూల్ ఠాకూర్ సేవలను పూర్తి స్థాయిలో ఎందుకు వినియోగించుకోలేదు. అతడిని తుదిజట్టుకు ఎంపిక చేశారు. కొన్ని ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం ఇచ్చారు.అయితే, అతడు ధారాళంగానే పరుగులు సమర్పించుకున్నాడు. అయినప్పటికీ అతడికి లాంగ్ స్పెల్స్ వేసే అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది. జట్టులోని ప్రతి బౌలర్ దాదాపు 20 ఓవర్లకు పైగానే బౌల్ చేశారు. కానీ శార్దూల్ మాత్రం సింగిల్ డిజిట్ వద్దే ఆగిపోయాడు.మొదటిసారి, రెండోసారి కొత్త బంతి పాతబడిన తర్వాత కూడా అతడికి ఛాన్స్ రాలేదు. నాయకత్వ బృందం అతడిపై నమ్మకం ఉంచలేదు. మరి అలాంటపుడు అతడిని ఎందుకు ఎంపిక చేసినట్లు?’’ అని ఆకాశ్ చోప్రా టీమిండియా యాజమాన్యం తీరును విమర్శించాడు.కాగా ఓవరల్గా 100.4 ఓవర్లు బౌలింగ్ చేసి.. మూడోరోజు ఆటలో భాగంగా 465 పరుగులకు ఇంగ్లండ్ను ఆలౌట్ చేసింది. అనంతరం.. ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన గిల్ సేన.. ఆదివారం నాటి ఆట పూర్తయ్యేసరికి 23.5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది.ఇంగ్లండ్తో తొలి టెస్టుకు భారత తుదిజట్టుయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.చదవండి: IND vs ENG: దిగ్గజ క్రికెటర్ కన్నుమూత.. నివాళులర్పించిన ఇంగ్లండ్-భారత్ ఆటగాళ్లు -
బోర్డుతో విభేదాలు.. ఆ జట్టు కెప్టెన్ సంచలన నిర్ణయం?
బంగ్లాదేశ్ క్రికెట్కు గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశముంది. శ్రీలంకతో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత బంగ్లాదేశ్ టెస్టు కెప్టెన్సీ నుంచి నజ్ముల్ హొస్సేన్ షాంటో తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన నిర్ణయాన్ని బంగ్లా క్రికెట్ బోర్డుకు షాంటో తెలియజేసినట్లు సమాచారం బంగ్లాదేశ్ ఆల్ఫార్మాట్ కెప్టెన్గా గతేడాది ఆరంభంలో షాంటో బాధ్యతలు చేపట్టాడు.కానీ ఏడాది కాలంలోనే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న షాంటో.. వన్డే, టెస్టుల్లో సారథిగా కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. కానీ బీసీబీ మాత్రం అతడికి ఊహించని షాకిచ్చింది. ఈ నెల 12న అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన బంగ్లా క్రికెట్ బోర్డు.. అనూహ్యంగా వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి షాంటోని తప్పించింది.అతడి స్ధానంలో స్టార్ ఆల్రౌండర్ మెహది హసన్ మిరాజ్కు ఆ బాధ్యతలు అప్పగించింది. దీంతో బీసీబీ నిర్ణయం పట్ల షాంటో ఆసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రెడ్బాల్ కెప్టెన్సీ నుంచి కూడా వైదొలగాలని షాంటో యోచిస్తున్నట్లు క్రిక్బజ్ తమ రిపోర్ట్లో పేర్కొంది.కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగే రెండో టెస్టు అనంతరం దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. అయితే ఈ వార్తలపై బీసీబీ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు.గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్లలోనూ షాంటో సెంచరీతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్లో 148 పరుగులు చేసిన షాంటో.. రెండో ఇన్నింగ్స్లో 125 రన్స్ చేశాడు. అయితే ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండో టెస్టు జూన్ 25 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: ఎప్పుడో నా కెరీర్ ముగిసిందన్నారు.. కానీ పదేళ్లు పూర్తి చేసుకున్నాను: బుమ్రా -
‘క్వీన్స్ క్లబ్’ కింగ్ అల్కరాజ్.. ప్రైజ్ మనీ ఎంతంటే?
లండన్: ఈ ఏడాది తన అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తూ స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ ఐదో సింగిల్స్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం ముగిసిన క్వీన్స్ క్లబ్ ఏటీపీ–500 టోర్నీలో ప్రపంచ రెండో ర్యాంకర్ అల్కరాజ్ చాంపియన్గా నిలిచాడు. 2 గంటల 8 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ అల్కరాజ్ 7–5, 6–7 (5/7), 6–2తో జిరీ లెహెస్కా (చెక్ రిపబ్లిక్)పై గెలుపొందాడు.ప్రైజ్మనీ ఎంతంటే? విజేత అల్కరాజ్కు 4,71,755 యూరోల (రూ. 4 కోట్ల 70 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ లెహెస్కాకు 2,53,790 యూరోల (రూ. 2 కోట్ల 53 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 330 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఫైనల్లో అల్కరాజ్ 18 ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేశాడు. ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేసిన అల్కరాజ్ తన సర్వీస్ను ఒక్కసారి కూడా కోల్పోలేదు. ఓవరాల్గా అల్కరాజ్ కెరీర్లో ఇది 21వ సింగిల్స్ టైటిల్. ఈ ఏడాది అల్కరాజ్ రొటర్డామ్ ఓపెన్, మోంటెకార్లో మాస్టర్స్, రోమ్ మాస్టర్స్, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీల్లో విజేతగా నిలిచాడు.ఇదీ చదవండి: రెండేళ్ల తర్వాత... మరో సింగిల్స్ టైటిల్బెర్లిన్: హోరాహోరీ పోరులో పైచేయి సాధించిన చెక్ రిపబ్లిక్ టెన్నిస్ స్టార్ మర్కెటా వొండ్రుసోవా... రెండేళ్ల తర్వాత తన కెరీర్లో మరో సింగిల్స్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన బెర్లిన్ ఓపెన్ డబ్ల్యూటీఏ–500 టోర్నీలో 25 ఏళ్ల వొండ్రుసోవా విజేతగా అవతరించింది. 2 గంటల 16 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో ప్రపంచ 164వ ర్యాంకర్ వొండ్రుసోవా 7–6 (12/10), 4–6, 6–2తో ప్రపంచ 49వ ర్యాంకర్ జిన్యు వాంగ్ (చైనా)పై విజయం సాధించింది.2023లో వింబుల్డన్ గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గి సంచలనం సృష్టించిన వొండ్రుసోవా ఆ తర్వాత మరో టైటిల్ను అందుకోలేకపోయింది. జిన్యు వాంగ్తో జరిగిన ఫైనల్లో వొండ్రుసోవా ఆరు ఏస్లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్లు చేసింది. తన సర్వీస్ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. టైటిల్ గెలిచే క్రమంలో వొండ్రుసోవా సెమీఫైనల్లో ప్రపంచ నంబర్వన్ సబెలెంకా (బెలారస్)పై, తొలి రౌండ్లో ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ మాడిసన్ కీస్ (అమెరికా)పై, క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మాజీ రెండో ర్యాంకర్ ఆన్స్ జబర్ (ట్యూనిషియా)పై నెగ్గడం విశేషం. విజేతగా నిలిచిన వొండ్రుసోవాకు 1,42,610 యూరోల (రూ. 1 కోటీ 42 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ఎప్పుడో నా కెరీర్ ముగిసిందన్నారు.. కానీ పదేళ్లు పూర్తి చేసుకున్నాను: బుమ్రా
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. మొదటి ఇన్నింగ్స్లో ఫైవ్ వికెట్ల హాల్తో మెరిశాడు. రెండో రోజు ఆటలో మూడు వికెట్లు పడగొట్టిన బుమ్రా.. రెండో రోజు ఆటలో మరో రెండు వికెట్లను సాధించాడు.దీంతో విదేశీగడ్డపై టెస్టుల్లో అత్యధిక సార్లు ఫైవ్ వికెట్ హాల్ సాధించిన భారత బౌలర్గా కపిల్దేవ్ సరసన బుమ్రా(12) నిలిచాడు. అయితే మూడో రోజు ఆట అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన బుమ్రా.. తన ఫిట్నెస్పై విమర్శలు చేసే వారికి గట్టి కౌంటరిచ్చాడు. తన శరీరం సహకరించేంతవరకు భారత్ తరపున క్రికెట్ ఆడాలని అనుకుంటున్నానని అతడు తెలిపాడు.కాగా గత క్యాలెండర్ ఈయర్లో భారత్ తరపున అత్యధిక మ్యాచ్లు ఆడిన బౌలర్గా నిలిచిన బుమ్రా.. ఆస్ట్రేలియాతో జరిగిన 5వ టెస్ట్ సందర్భంగా వెన్ను గాయం బారిన పడ్డాడు. ఈ గాయం కారణంగా బుమ్రా దాదాపు నాలుగు నెలలు ఆటకు దూరమయ్యాడు. ఈ క్రమంలో కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ జస్ప్రీత్ భాగం కాలేదు. ఐపీఎల్-2025తో తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ టూర్కు వచ్చినప్పటికి వర్క్లోడ్, ఫిట్నెస్ కారణంగా మొత్తం అన్ని మ్యాచ్లు ఆడుతాడన్న గ్యారెంటీ లేదు.రిపోర్టర్: గాయం బారిన ప్రతీసారీ మీపై వచ్చే విమర్శలకు బాధపడతారా?బమ్రా: "నా ఫిట్నెస్పై వచ్చే నెగిటివ్ కామెంట్లను పట్టించుకోను. అరంగేట్రం నుంచి నా ఫిట్నెస్పై ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. మొదటిలో కొంతమంది నేను ఎనిమిదినెలలు మాత్రమే ఆడగలనని అన్నారు. మరికొంతమంది 10 నెలల మాత్రమే అన్నారు. కానీ ఇప్పుడు నేను అంతర్జాతీయ క్రికెట్లో పదేళ్ల కెరీర్ను పూర్తి చేసుకున్నాను. 12-13 సంవత్సరాలపాటు ఐపీఎల్ ఆడాను.ప్రతీ గాయం తర్వాత నా కెరీర్ ముగిసిపోయిందని, అతడు మరి తిరిగి రాడని కామెంట్స్ చేస్తుంటారు. వారి అలానే అనుకోనివ్వండి. నా పని నేను చేసుకుపోతాను. ప్రతి నాలుగు నెలలకు ఇలాంటి మాటలు వింటూనే ఉంటాము. నేను దాని గురించి ఎక్కువగా ఆలోచించను.దేవుడు రాసిపెట్టినంత కాలం భారత తరపున క్రికెట్ ఆడుతాను. అందుకు తగ్గట్టు నా శరీరాన్ని కూడా సిద్దం చేసుకుంటాను. నేను అలిసి పోయాను అనుకున్నప్పుడు క్రికెట్ను వదిలేస్తాను. భారత క్రికెట్ జట్టును మరింత ముందుకు తీసుకువెళ్లడమే నా లక్ష్యమంటూ" సమాధనమిచ్చాడు -
రెచ్చగొట్టిన మహ్మద్ సిరాజ్.. ఇచ్చిపడేసిన ఇంగ్లండ్ బ్యాటర్! వీడియో
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బౌలింగ్ చేసేటప్పుడు తన మాటలతో, చేష్టలతో ప్రత్యర్ధి బ్యాటర్లను రెచ్చగొడుతూ ఉంటాడు. తాజాగా సిరాజ్ మియా మరోసారి తన చర్యలతో వార్తల్లో నిలిచాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో సిరాజ్ తన సహనాన్ని కోల్పోయాడు. మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్తో ఈ హైదరాబాదీ వాగ్వాదానికి దిగాడు. ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్ 84వ ఓవర్ వేసిన సిరాజ్ బౌలింగ్లో బ్రూక్ వరుసగా రెండు బౌండరీలు బాదాడు. ఆ తర్వాతి బంతిని సిరాజ్ షర్ప్ ఇన్స్వింగర్గా సంధించాడు. ఆ బంతిని ఆడడానికి హ్యారీ ఇబ్బందిపడ్డాడు. ఈ క్రమంలో బ్రూక్ వైపు సిరాజ్ సీరియస్ లూక్ ఇచ్చాడు. అంతేకాకుండా అతడిని ఏదో మాట అన్నాడు.అందుకు బదులుగా బ్రూక్.. బౌలింగ్ వేసేందుకు రన్ ఆప్ మార్క్ చేసుకో అంటూ సమాధనమిచ్చాడు. బ్రూక్ను రెచ్చగొట్టి ఔట్ చేయాలన్న సిరాజ్ వ్యూహాం ఫలించలేదు. 86వ ఓవర్ వేసిన సిరాజ్ బౌలింగ్ను బ్రూక్ ఓ ఆట ఆడేసికున్నాడు. ఆ ఓవర్లో సిరాజ్ ఏకంగా 18 పరుగులు సమర్పించుకున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా తొలి ఇన్నింగ్స్లో హ్యారీ బ్రూక్ దురదృష్టవశాత్తూ 99 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. ఇక మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. టీమిండియా ప్రస్తుతం 96 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.👀😯🗣️ Tensions rising in the middle!#MohammedSiraj and #HarryBrook in a fiery exchange as the heat is on at Headingley! 🔥#ENGvIND 1st Test Day 3 LIVE NOW Streaming on JioHotstar 👉 https://t.co/SIJ5ri9fiC pic.twitter.com/nKZTSeFZt1— Star Sports (@StarSportsIndia) June 22, 2025 -
స్టోక్స్ స్ధానంలో భారత సంతతి ఆటగాడు.. ఎవరీ యష్ వగాడియా?
లీడ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ సైతం తొలి ఇన్నింగ్స్లో 465 పరుగులు చేసి టీమిండియాకు ధీటైన సమాధానం ఇచ్చింది.మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. గిల్ సేన ప్రస్తుతం 96 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్ ఉంచాలంటే నాలుగో రోజు మొత్తం భారత్ బ్యాటింగ్ చేయాల్సిందే. క్రీజులో కేఎల్ రాహుల్(47), శుబ్మన్ గిల్(6) ఉన్నారు.స్టోక్స్ స్ధానంలో భారత సంతతి ఆటగాడు..ఇక నాలుగో రోజు ఆటలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. భారత రెండో ఇన్నింగ్స్ సందర్బంగా ఇంగ్లండ్ స్క్వాడ్లో లేని ఓ ఆటగాడు ఫీల్డింగ్కు వచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సబ్స్ట్యూట్గా యార్క్షైర్ క్లబ్ ఆటగాడు యష్ వగాడియా మైదానంలో అడుగుపెట్టాడు.భారత సంతతికి చెందిన 21 ఏళ్ల వగాడియా రెండు ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేశాడు. అయితే జట్టులో లేని ఆటగాడు ఫీల్డింగ్కు రావడమేంటని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కాగా లీడ్స్ టెస్టు కోసం వగాడియాతో పాటు జవాద్ అక్తర్, నోహ్ కెల్లీను 12వ ఆటగాడిగా ఎంపికయ్యాడు. ఈ క్రమంలోనే అంపైర్ అనుమతి తీసుకుని వగాడియా సబ్స్ట్యూట్గా బరిలోకి దిగాడు.ఎవరీ వగాడియా?21 ఏళ్ల యష్ వగాడియా.. దేశవాళీ క్రికెట్లో యార్క్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. యష్కు బ్యాటింగ్తో పాటు ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేసే సత్తా కూడా ఉంది. ఈ టాప్ ఆర్డర్ బ్యాటర్ డర్హామ్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు. వగాడియా పదకొండేళ్ల వయసులోనే యార్క్షైర్ క్రికెట్ ఆకాడమీలో చేరాడు.అకాడమీ, అండర్-18 జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. దీంతో తొలిసారి 2023 సంవత్సరంలో యార్క్షైర్ క్రికెట్ క్లబ్ ప్రొఫెషనల్ కాంట్రాక్టును పొందాడు. వగాడియా 2024లో వార్విక్షైర్పై తన లిస్ట్-ఎ అరంగేట్రం చేశాడు. తన కెరీర్లో ఇప్పటివరకు రెండు లిస్ట్-ఎ మ్యాచ్లు ఆడిన వగాడియా.. 22 పరుగులు చేశాడు.ఇంకా ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేయనప్పటికీ, అతను యార్క్షైర్ సెకండ్ ఎలెవన్ మ్యాచ్లలో క్రమం తప్పకుండా ఆడుతాడు. కాగా వగాడియాకు గుజరాతీ మూలాలు ఉన్నాయి. వగాడియా మాత్రం ఇంగ్లండ్లోని న్యూకాజిల్లో జన్మించాడు.చదవండి: IND vs ENG: జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర.. కపిల్ దేవ్ రికార్డు బ్రేక్ -
జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర.. కపిల్ దేవ్ రికార్డు బ్రేక్
టెస్టు క్రికెట్లో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా తన హవాను కొనసాగిస్తున్నాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగాడు. రెండో రోజు ఆటలో మూడు వికెట్లు పడగొట్టిన జస్ప్రీత్.. మూడో రోజు ఆటలో మరో రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. బుమ్రాకు ఇది 14వ ఫైవ్ వికెట్ హాల్ వికెట్ కావడం గమనార్హం. ఈ క్రమంలో బుమ్ బుమ్రా పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.కపిల్ దేవ్ రికార్డు బ్రేక్..👉టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక సార్లు అత్యధిక సార్లు ఫైవ్ వికెట్ హాల్ సాధించిన భారత బౌలర్గా బుమ్రా రికార్డులకెక్కాడు. ఇంగ్లండ్లో టెస్టు మ్యాచ్ ఆడుతున్నప్పుడు బుమ్రా ఐదు వికెట్ల ఘనత సాధించడం ఇది మూడోసారి.2018లో ఇంగ్లండ్ పర్యటనలో తొలిసారి ఐదు వికెట్ల హాల్ సాధించిన బుమ్రా.. 2021లో మళ్లీ ఇంగ్లండ్ గడ్డపై రెండో సారి ఐదు వికెట్ల హాల్ను నమోదు చేశాడు. ఇప్పుడు తాజా పర్యటనలో ముచ్చటగా మూడో సారి ఈ ఫీట్ సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత దిగ్గజ క్రికెటర్లు లాలా అమర్ నాథ్, కపిల్ దేవ్, బి చంద్రశేఖర్, భువనేశ్వర్ కుమార్, వినూ మన్కడ్, చేతన్ శర్మ, ఇషాంత్ శర్మ, మహ్మద్ నిస్సార్ మరియు సురేంద్రనాథ్ల పేరిట ఉండేది.ఈ లెజెండరీ క్రికెటర్లు తమ కెరీర్లో రెండు సార్లు ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో ఫైవ్ వికెట్ హాల్ సాధించారు.లీడ్స్ టెస్ట్ కు ముందు బుమ్రా కూడా రెండు ఫైవ్ వికెట్ల హాల్తో ఈ జాబితాలో ఉండేవాడు. కానీ తాజా మ్యాచ్తో వీరిందని బుమ్రా అధిగమించాడు.👉అదేవిధంగా విదేశీ గడ్డపై అత్యధిక ఐదు వికెట్ల హాల్స్ సాధించిన భారత బౌలర్గా కపిల్ దేవ్ రికార్డును బుమ్రా సమం చేశాడు. ఈ ఇద్దరూ విదేశాల్లో చెరో 12 సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నారు.👉సెనా(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో 150 వికెట్లు తీసిన తొలి ఆసియా బౌలర్గా నిలిచాడు. విదేశాల్లో అత్యధిక ఫైవ్ వికెట్స్ హాల్ సాధించిన ప్లేయర్లు.. 👉జస్ప్రీత్ బుమ్రా - 12👉కపిల్ దేవ్ - 12👉అనిల్ కుంబ్లే - 10👉ఇషాంత్ శర్మ - 9👉ఆర్ అశ్విన్ - 8సేనా దేశాల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆసియా బౌలర్లు👉జస్ప్రీత్ బుమ్రా - 31 మ్యాచ్ల్లో 150 👉వసీం అక్రమ్ - 32 మ్యాచ్ల్లో 146👉అనిల్ కుంబ్లే - 35 మ్యాచ్ల్లో 141👉ఇషాంత్ శర్మ - 40 మ్యాచ్ల్లో 127👉జహీర్ ఖాన్ - 30 మ్యాచ్ల్లో 119నువ్వా నేనా..భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(47), శుబ్మన్ గిల్(6) ఉన్నారు.అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 465 పరుగులకు ఆలౌటైంది.చదవండి: రోహిత్... ‘ప్రేమ కథా చిత్రం’𝘼 𝙢𝙖𝙨𝙩𝙚𝙧 𝙖𝙩 𝙬𝙤𝙧𝙠 🙌@Jaspritbumrah93 crafts magic with the ball once again, taking a stunning 5/83,his 14th Test 5-fer.WATCH HIS BRILLIANT PERFORMANCE 👉🏻 https://t.co/kg96V4NpFH#ENGvIND | 1st Test, Day 4 | MON, 23rd JUNE, 2:30 PM on JioHotstar pic.twitter.com/y1QUUMAVuC— Star Sports (@StarSportsIndia) June 22, 2025 -
భారత్ ‘పసిడి’ పట్టు
వుంగ్ తౌ (వియత్నాం): తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత పురుషుల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ జట్టు... ఆసియా అండర్–23 చాంపియన్íÙప్లో టీమ్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో భారత రెజ్లర్లు ఆరు స్వర్ణ పతకాలు, ఒక రజత పతకంతో కలిపి మొత్తం ఏడు పతకాలతో టాప్ ర్యాంక్లో నిలిచింది. భారత్ తరఫున నిఖిల్ (61 కేజీలు), సుజీత్ కల్కాల్ (65 కేజీలు), జైదీప్ (74 కేజీలు), చందర్ మోహన్ (79 కేజీలు), సచిన్ (92 కేజీలు), విక్కీ (97 కేజీలు) పసిడి పతకాలను గెల్చుకున్నారు. జస్పూరణ్ సింగ్ (125 కేజీలు) రజత పతకాన్ని సాధించాడు. ఫైనల్స్లో నిఖిల్ 7–2తో మెరీ బజర్బయేవ్ (కజకిస్తాన్)పై, సుజీత్ 10–0తో ఉమిద్జాన్ జలోలోవ్ (ఉజ్బెకిస్తాన్)పై, జైదీప్ 7–0తో జఫర్బెక్ (ఉజ్బెకిస్తాన్)పై, చందర్ మోహన్ 5–2తో బెజెన్జోవ్ (తుర్క్మెనిస్తాన్)పై, సచిన్ 5–2తో తుముర్బాటర్ (మంగోలియా)పై, విక్కీ 9–6తో నూర్దౌలత్ బెకెనోవ్ (కజకిస్తాన్)పై నెగ్గారు. జస్పూరణ్ 3–4తో బత్బాయెర్ (మంగోలియా) చేతిలో ఓడిపోయాడు. ఇదే టోరీ్నలో భారత మహిళల ఫ్రీస్టయిల్ జట్టు కూడా పోటీపడ్డ 10 వెయిట్ కేటగిరీల్లో పతకాలు గెలిచి టీమ్ టైటిల్ను సాధించింది. -
రోహిత్... ‘ప్రేమ కథా చిత్రం’
ముంబై: మైదానంలో సహచరులతో సరదాగా ఉంటూ... ప్రత్యర్థి బౌలర్ల భరతం పట్టే భారత వన్డే కెపె్టన్ రోహిత్ శర్మ... తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి అభిమానులకు తెలియని విషయాలు తాజాగా పంచుకున్నాడు. భార్య రితికా సజ్దేకు తొలిసారి తన ప్రేమను వ్యక్త పరిచిన విధానాన్ని వెల్లడించాడు. మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, గీతా బస్రా దంపతుల యూట్యూబ్ చానల్లో నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో రోహిత్ తన ప్రేమకథను వివరించాడు. తాను చిన్నప్పుడు క్రికెట్ ఓనమాలు నేర్చుకున్న మైదానంలోని పిచ్పై మోకాళ్ల మీద కూర్చొని రితికాకు లవ్ ప్రపోజ్ చేసినట్లు తెలిపాడు. ‘నా ప్రేవ వ్యక్తీకరణ రొమాంటిక్గా జరిగింది. నా కెరీర్ ప్రారంభమైన చోటే లవ్ ప్రపోజ్ చేయాలని నిర్ణయించుకున్నా. అందుకోసం ముందే అంతా సిద్ధం చేసుకున్నా. ఓ సాయంత్రం రితికా నా కోసం ఇంటి నుంచి భోజనం తీసుకొచ్చింది. ఇద్దరం కలిసి మెరీన్ డ్రైవ్లో కబుర్లు చెప్పుకుంటూ అది లాగించాం. ఆ తర్వాత ఐస్క్రీమ్ తిందామని చెప్పి తనను కారు ఎక్కించుకున్నా. మరీన్ డ్రైవ్, హాజీ అలీ, వర్లీ ఇలా ముందుకు వెళ్తుంటే... ఐస్క్రీమ్ షాప్ ఇంకెక్కడుంది అని రితికా ఎదురు ప్రశి్నంచింది. బాంద్రా తప్పించి తనకు ముంబై సిటీ ఎక్కువ తెలియదు. దీంతో బోరీవాలిలో మంచి ఐస్క్రీమ్ దొరుకుతుందని అబద్ధం చెప్పి తీసుకెళ్లా. కారు ఒక చోట పార్క్ చేసి ఆమెను మైదానంలోకి తీసుకెళ్లా. అప్పటికే నా స్నేహితులతో చెప్పి కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేయించా. ఆ క్షణాలను ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్లాన్ చేశా. పిచ్ మధ్యకు వెళ్లిన తర్వాత మోకాళ్లపై కూర్చొని తనకు నా ప్రేమను వ్యక్త పరిచా’ అని రోహిత్ తన ప్రేమ కథను వివరించాడు. గతేడాది టి20 ప్రపంచకప్ గెలిచిన అనంతరం ఆ ఫార్మాట్కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ... ఇటీవల టెస్టు క్రికెట్ నుంచి సైతం తప్పుకున్నాడు. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న హిట్మ్యాన్... ఐపీఎల్ అనంతరం కుటుంబంతో కలిసి గడుపుతున్నాడు. -
రాజకీయాలకు నో... కోచింగ్కు సై!
కోల్కతా: రాజకీయ రంగంలో అడుగుపెట్టే ఆసక్తి లేదని భారత మాజీ కెశ్చిన్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన అనంతరం వివిధ రూపాల్లో ఆటతో మమేకమై ఉన్న ‘దాదా’... భవిష్యత్తులో టీమిండియాకు కోచ్గా కనిపించే అవకాశాలు లేకపోలేదన్నాడు. వచ్చేనెలతో 53వ పడిలోకి అడుగు పెట్టనున్న గంగూలీ... తాజాగా ఓ పాడ్కాస్ట్లో వివిధ అంశాలపై వివరంగా మాట్లాడాడు. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ... ఏదైనా రాజకీయ పార్టీలో చేరాలని అనుకుంటున్నారా అనే ప్రశ్నకు ఈ ‘బెంగాల్ టైగర్’ చిరునవ్వుతో ‘ఆసక్తి లేదని’ బదులిచ్చాడు. ముఖ్యమంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినా తాను రాజకీయాల్లోకి అడుగు పెట్టబోనని గంగూలీ వెల్లడించాడు. 2018–19, 2022–24 మధ్య ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్కు టీమ్ డైరెక్టర్గా పనిచేసిన గంగూలీ... భారత హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టడంపై సుముఖత వ్యక్తం చేశాడు. ‘2013లో పోటీ క్రికెట్ నుంచి తప్పుకున్నా. ఆ తర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టా. ఆ తర్వాత కూడా వేర్వేరు పాత్రల్లో పనిచేస్తున్నందు వల్ల టీమిండియా కోచింగ్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. నా వయసు ఎక్కువేం కాదు. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి. నేను దానికి సిద్ధంగానే ఉన్నాను. బోర్డు అధ్యక్షుడిగా మహిళా క్రికెట్కు వెన్నుదన్నుగా నిలవడం సంతృప్తిగా ఉంది. ప్రస్తుతం గంభీర్ తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు. ఆ్రస్టేలియా, న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లు ఓడినా... అతడి కోచింగ్లో టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ అందుకుంది. ఇప్పుడు ఇంగ్లండ్ పర్యటనలోనూ టీమిండియా మంచి ప్రదర్శన చేస్తోంది. ఆట పట్ల అతడి నిబద్ధత చాలా గొప్పది. కోచ్గా అతడి వ్యవహార శైలిపై అవగాహన లేకపోయినా... ఆటగాడిగా అతడితో కలిసి ఆడాను. ముక్కుసూటి వ్యక్తి. ఆటగాళ్ల నుంచి తాను ఏం కోరుకుంటున్నాడో దాన్ని స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పగలడు. చాలా పారదర్శకంగా వ్యవహరిస్తాడు. ఆటగాడిగా ఉన్న సమయంలో నాతో పాటు ఇతర సీనియర్ ఆటగాళ్ల పట్ల గంభీర్ చాలా గౌరవంగా ఉండేవాడు. కోచ్గా బాధ్యతలు చేపట్టి దాదపు ఏడాదే అవుతోంది. నేర్చుకోవడానికి కొంత సమయం ఇవ్వాల్సిన అవసరముంది’ అని గంగూలీ వివరించాడు. రోహిత్, కోహ్లి... 2027 వన్డే వరల్డ్కప్ ఆడటం కష్టమే గతేడాది టి20 ప్రపంచకప్ గెలిచిన అనంతరం టి20 ఫార్మాట్కు వీడ్కోలు పలికిన సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి... తాజాగా టెస్టు ఫార్మాట్ నుంచి కూడా తప్పుకున్నారు. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న ఈ ఇద్దరూ 2027 జరిగే 50 ఓవర్ల ప్రపంచకప్లో పాల్గొనడంపై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నీ సమయానికి రోహిత్ 40 ఏళ్లు, కోహ్లి 38 ఏళ్లలో ఉండనున్నారు. ఆలోపు భారత జట్టు 9 ద్వైపాక్షిక సిరీస్ల్లో కలుపుకొని మొత్తం 27 వన్డే మ్యాచ్లు ఆడనుంది. అంటే రోహిత్, కోహ్లి ఏడాదికి అటు ఇటుగా 15 మ్యాచ్ల చొప్పున ఆడనున్నారు. ఈ నేపథ్యంలో గంగూలీ మాట్లాడుతూ... ‘మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఏడాదికి 15 మ్యాచ్లు ఆడటం అంత సులువు కాదు. అంతర్జాతీయ క్రికెట్లో అపార అనుభవం ఉన్న వాళ్లిద్దరికి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. వారే నిర్ణయం తీసుకుంటారు. కోహ్లి వంటి కళాత్మక ఆటగాడి స్థానాన్ని భర్తీ చేయడం అంత సులువు కాదు. కాస్త సమయం పడుతుంది’ అని అన్నాడు. ఇక భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్పై ‘దాదా’ ప్రశంసలు కురిపించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో యువీ అత్యంత ప్రతిభావంతుడని కొనియాడాడు. ‘దేశానికి రెండు ప్రపంచకప్లు అందించడంలో యువరాజ్ కీలక పాత్ర పోషించాడు. 2007 టి20 వరల్డ్కప్, 2011 వన్డే ప్రపంచకప్లో అతడు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ఎందులో చూసుకున్నా అతడు అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. అయితే టెస్టు క్రికెట్లో అతడికి తగినన్ని అవకాశాలు రాలేదు. ద్రవిడ్, సచిన్, గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ల మధ్య నలిగిపోయాడు’ అని చమత్కరించాడు.వచ్చే ఏడాది చివర్లో ‘దాదా’ బయోపిక్ ఇక తన బయోపిక్ వచ్చే ఏడాది చివరి వరకు విడుదలయ్యే అవకాశాలున్నాయని గంగూలీ వెల్లడించాడు. ‘స్క్రిప్ట్ వర్క్, ప్రి ప్రొడక్షన్కు ఎక్కువ సమయం పడుతుంది. వచ్చ ఏడాది జనవరిలో సెట్స్ మీదకు వెళ్లొచ్చు. అంతా సిద్ధమైతే షూటింగ్కు ఎక్కువ సమయం పట్టదు’ అని సౌరవ్ వెల్లడించాడు. భారత క్రికెట్ గతిని మార్చిన ‘దాదా’ బయోపిక్లో బాలీవుడ్ నటుడు రాజ్కుమార్ రావు నటిస్తున్నాడు. -
విజయంతో ముగించిన భారత్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య 2024–2025 ప్రొ లీగ్ను భారత పురుషుల జట్టు విజయంతో ముగించింది. యూరోపియన్ చివరి అంచె లీగ్లో భాగంగా ఆదివారం ఆంట్వర్ప్లో ఆతిథ్య బెల్జియం జట్టుతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 4–3 గోల్స్ తేడాతో గెలుపొందింది. యూరోపియన్ అంచెలో భారత్కు దక్కిన ఏకైక విజయం ఇదే కావడం గమనార్హం. యూరోపియన్ అంచెలో భారత్ వరుసగా ఏడు మ్యాచ్ల్లో ఓడిపోయి, చివరి మ్యాచ్లో నెగ్గి ఊపిరి పీల్చుకుంది.ఈ మ్యాచ్లో భారత్ తరఫున సుఖ్జీత్ సింగ్ (21వ, 35వ నిమిషంలో) రెండు గోల్స్ చేయగా... అమిత్ రోహిదాస్ (36వ నిమిషంలో), కెప్టేన్ హర్మన్ప్రీత్ సింగ్ (59వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. బెల్జియం జట్టు తరఫున స్లూవర్ (8వ నిమిషంలో), స్టాక్బ్రోయెక్స్ (34వ నిమిషంలో), హుగో (41వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు.మొత్తం తొమ్మిది జట్ల మధ్య జరుగుతున్న ప్రొ లీగ్లో భారత జట్టు తమ 16 మ్యాచ్లను పూర్తి చేసుకుంది. 6 మ్యాచ్ల్లో గెలిచి, 10 మ్యాచ్ల్లో ఓడిపోయిన భారత్ 18 పాయింట్లతో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. మరోవైపు భారత మహిళల జట్టు వరుసగా ఆరో పరాజయాన్ని చవిచూసింది. బెల్జియంతో ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత్ 0–2తో ఓడిపోయింది. -
అటా...ఇటా!
ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లతో అదరగొట్టినా... మిగిలిన వాళ్లు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో... ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు భారీ స్కోరుకు అతి చేరువగా వచ్చింది. బ్రూక్ బాదుడుకు లోయర్ ఆర్డర్ సహకారం తోడవడంతో కేవలం 6 పరుగుల వెనుకబడిన ఇంగ్లండ్ పోటీలోకి రాగా... రెండో ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ రాణించడంతో టీమిండియా మెరుగైన స్థితిలో నిలిచింది. ప్రస్తుతానికి ఇరు జట్లు సమంగానే ఉన్నా... నాలుగో రోజు భారత బ్యాటర్లు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారన్నది కీలకంగా మారింది. సొంతగడ్డపై దంచికొట్టే అలవాటు ఉన్న ఇంగ్లండ్ ముందు ఎంత లక్ష్యం నిర్దేశించినా సురక్షితం కాదనే విశ్లేషణల మధ్య... టీమిండియా సోమవారం పూర్తిగా బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది! లీడ్స్: భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఆధిక్యం చేతులు మారుతూ సాగుతున్న పోరులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 23.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ (4) త్వరగానే అవుటైనా... కేఎల్ రాహుల్ (75 బంతుల్లో 47 బ్యాటింగ్; 7 ఫోర్లు), సాయి సుదర్శన్ (48 బంతుల్లో 30; 4 ఫోర్లు) ఆకట్టుకున్నారు. చేతిలో 8 వికెట్లు ఉన్న టీమిండియా... ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 6 పరుగులు కలుపుకొని ఓవరాల్గా 96 పరుగుల ముందంజలో ఉంది.రాహుల్తో పాటు కెపె్టన్ శుబ్మన్ గిల్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 209/3తో ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్... చివరకు 100.4 ఓవర్లలో 465 పరుగులకు ఆలౌటైంది. ఒలీ పోప్ (137 బంతుల్లో 106; 14 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోగా... హ్యారీ బ్రూక్ (112 బంతుల్లో 99; 11 ఫోర్లు, 2 సిక్స్లు) ఒక్క పరుగు తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. మిగతా బ్యాటర్లు తలా కొన్ని పరుగులు చేయడంతో ఇంగ్లండ్ జట్టు... టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు 6 పరుగుల దూరంలో నిలిచింది. భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లతో అదరగొట్టగా... ప్రసిధ్ కృష్ణ 3, మొహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీశారు. జైస్వాల్ 4 పరుగులకే... తొలి ఇన్నింగ్స్లో చక్కటి సెంచరీ చేసిన జైస్వాల్... రెండో ఇన్నింగ్స్లో ఆకట్టుకోలేకపోయాడు. ఫీల్డింగ్లో మూడు క్యాచ్లు వదిలేయడంతో నెలకొన్న ఒత్తిడి అతడి ఆటతీరులో కనిపించింది. కార్స్ వేసిన నాలుగో ఓవర్లో కీపర్కు క్యాచ్ ఇచ్చి భారంగా పెవిలియన్కు వెనుదిరిగాడు. ఈ దశలో అరంగేట్ర ఆటగాడు సాయి సుదర్శన్తో కలిసి రాహుల్ క్లాస్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్లు భారీ షాట్లతో రెచ్చిపోయిన పిచ్పై రాహుల్ సంయమనం పాటించాడు. రాహుల్తో కలిసి రెండో వికెట్కు 66 పరుగులు జోడించిన అనంతరం సుదర్శన్ వెనుదిరగగా... కెపె్టన్ గిల్తో కలిసి రాహుల్ మరో వికెట్ పడకుండా రోజును ముగించాడు. వర్షం కారణంగా ఆట నిర్ణిత సమయం కంటే ముందే ముగిసింది. ఇంగ్లండ్ బౌలర్లలో కార్స్, స్టోక్స్ చెరో వికెట్ పడగొట్టారు. బ్రూక్... పరుగు తేడాతో బ్యాటింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై మూడో రోజు ఇంగ్లండ్ సమష్టి ప్రదర్శనతో సత్తా చాటింది. ‘సెంచరీ హీరో’ ఓలీ పోప్ క్రితం రోజు స్కోరుకు మరో 6 పరుగులు మాత్రమే జత చేసి వెనుదిరగగా... కెపె్టన్ బెన్ స్టోక్స్ (52 బంతుల్లో 20; 3 ఫోర్లు)ను సిరాజ్ అవుట్ చేశాడు. ఇక ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎక్కువ సమయం పట్టుదు అనుకుంటే... లోయర్ ఆర్డర్తో కలిసి హ్యారీ బ్రూక్ చెలరేగిపోయాడు. ధనాధన్ షాట్లతో చకచకా పరుగులు రాబట్టాడు. వికెట్ కీపర్ జేమీ స్మిత్ (52 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్), క్రిస్ వోక్స్ (55 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడారు.తొలి సెషన్లో 28 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్ 2 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేయగా... రెండో సెషన్లో 23.4 ఓవర్లలోనే 138 పరుగులు చేసి మిగిలిన ఐదు వికెట్లు కోల్పోయింది. రెండో రోజు ఆటలో బుమ్రా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయినా... ఆ బంతి నోబాల్ కావడంతో బతికిపోయిన బ్రూక్కు... మూడో రోజు మరో రెండు అవకాశాలు లభించాయి. వాటిని వినియోగించుకున్న అతడు భారత్ ఆధిక్యాన్ని తగ్గించగలిగాడు. శతకానికి ఒక పరుగు దూరంలో ప్రసిధ్ కృష్ణ వేసిన షార్ట్ పిచ్ బంతికి బ్రూక్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కార్స్ (23 బంతుల్లో 22; 4 ఫోర్లు), వోక్స్, టంగ్ (18 బంతుల్లో 11; 2 ఫోర్లు) విలువైన పరుగులు చేసి టీమిండియా ఆధిక్యాన్ని 6 పరుగులకు పరిమితం చేశారు.అదే తంతు..ఈ మ్యాచ్లో భారత ఫీల్డింగ్ మరీ పేలవంగా సాగింది. రెండో రోజు బుమ్రా బౌలింగ్లోనే మన ఫీల్డర్లు మూడు క్యాచ్లు జారవిడవగా... మూడో రోజు మరో రెండు క్యాచ్లు నేల పాలయ్యాయి. 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా బౌలింగ్లో బ్రూక్ ఇచ్చిన క్యాచ్ను పంత్ అందుకోలేకపోగా... 82 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్లో బ్రూక్ ఇచ్చిన సులువైన క్యాచ్ను జైస్వాల్ జారవిడిచాడు. ఒక ఎండ్లో బుమ్రా ఒత్తిడి పెంచుతున్నా... మరో ఎండ్ నుంచి అతడికి సరైన సహకారం దక్కలేదు.దీనిపై మాజీ ఆటగాళ్లు కూడా మండిపడగా... షార్ట్ బాల్స్తో వికెట్లు తీసిన ప్రసిధ్ కృష్ణ పరుగుల నియంత్రణలో పూర్తిగా విఫలమయ్యాడు. 20 ఓవర్లు వేసిన అతడు 128 పరుగులు సమరి్పంచుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ బ్యాటర్ల మీద ఒత్తిడి కొనసాగలేకపోయింది. దీనికి తోడు తొలి టెస్టులో కెపె్టన్సీ చేస్తున్న గిల్ కూడా కొన్ని తప్పుడు నిర్ణయాలతో ఇంగ్లండ్కు సాయపడ్డాడు.టెయిలెండర్లు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బుమ్రాను రంగంలోకి దింపి ఆధిక్యం పెంచుకోవాల్సింది పోయి... జడేజాకు బంతి అప్పగించి ఇంగ్లండ్ మరికొన్ని పరుగులు చేసే అవకాశం ఇచ్చాడు. ఎట్టకేలకు రెండో సెషన్ చివర్లో బంతి అందుకున్న బుమ్రా వరుస ఓవర్లలో వోక్స్, టంగ్ను క్లీన్ బౌల్డ్ చేసి ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్కు తెరదింపాడు. ఈ క్రమంలో అతడు టెస్టుల్లో 14వసారి 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసుకున్నాడు.స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 471; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) నాయర్ (బి) బుమ్రా 4; డకెట్ (బి) బుమ్రా 62; పోప్ (సి) పంత్ (బి) ప్రసిధ్ 106; రూట్ (సి) నాయర్ (బి) బుమ్రా 28; బ్రూక్ (సి) శార్దుల్ (బి) ప్రసిధ్ 99; స్టోక్స్ (సి) పంత్ (బి) సిరాజ్ 20; జేమీ స్మిత్ (సి) సుదర్శన్ (బి) ప్రసిధ్ 40; వోక్స్ (బి) బుమ్రా 38; కార్స్ (బి) సిరాజ్ 22; టంగ్ (బి) బుమ్రా 11; బషీర్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 34; మొత్తం (100.4 ఓవర్లలో ఆలౌట్) 465.వికెట్ల పతనం: 1–4, 2–126, 3–206, 4–225, 5–276, 6–349, 7–398, 8–453, 9–460, 10–465.బౌలింగ్: బుమ్రా 24.4–5–83–5; సిరాజ్ 27–0 –122–2; ప్రసిధ్ 20–0–128–3; జడేజా 23–4–68–0; శార్దుల్ 6–0–38–0. భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) స్మిత్ (బి) కార్స్ 4; రాహుల్ (బ్యాటింగ్) 47; సుదర్శన్ (సి) క్రాలీ (బి) స్టోక్స్ 30; గిల్ (బ్యాటింగ్) 6; ఎక్స్ట్రాలు 3; మొత్తం (23.5 ఓవర్లలో 2 వికెట్లకు) 90.వికెట్ల పతనం: 1–16, 2–82.బౌలింగ్: వోక్స్ 6–2– 18–0; కార్స్ 5–0–27–1; టంగ్ 5–0–15–0; బషీర్ 2.5–1– 11–0; స్టోక్స్ 5–1–18–1. -
Ind vs Eng: వర్షం వల్ల ముందే ముగిసిన ఆట.. పూర్తి వివరాలు
India vs England 1st Test Day 3 Report: టీమిండియా- ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు మూడో రోజు ఆటకు వర్షం ఆటంకం కలిగించింది. దీంతో నిర్ణీత సమయం కంటే కాస్త ముందుగానే అంపైర్లు ఆటను నిలిపివేశారు. ఆదివారం నాటి మూడో రోజు ఆట పూర్తయ్యేసరికి భారత్ 23.5 ఓవర్లు ఆడి రెండు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. అంతకు ముందు ఇంగ్లండ్ 465 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్ కంటే 96 పరుగుల ఆధిక్యంలో ఉంది.కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా శుక్రవారం మొదటి టెస్టు ఆరంభమైన విషయం తెలిసిందే. లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆతిథ్య ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. గిల్ సేన తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులకు ఆలౌట్ అయింది.భారత తొలి ఇన్నింగ్స్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101), కెప్టెన్ శుబ్మన్ గిల్ (147)లతో పాటు.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (134) సెంచరీతో చెలరేగాడు. మిగతా వారిలో ఓపెనర్ కేఎల్ రాహుల్ (42) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ నాలుగేసి వికెట్లు కూల్చగా.. షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్ ఒక్కో వికెట్ తీశారు.ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ టీమిండియాకు దీటుగా బదులిచ్చింది. ఓపెనర్ బెన్ డకెట్ (62) అర్ధ శతకంతో రాణించగా.. ఓలీ పోప్ (106) శతక్కొట్టాడు. మరోవైపు.. హ్యారీ బ్రూక్ 99 పరుగులతో రాణించాడు. మిగతా వాళ్లలో జేమీ స్మిత్ 40, క్రిస్ వోక్స్ 38 పరుగులతో ఆకట్టుకున్నారు. ఫలితంగా ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్లో 465 పరుగులు చేసింది.భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ కృష్ణ మూడు, సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఈ క్రమంలో ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సరికి మొత్తంగా 96 పరుగుల లీడ్లో ఉంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) ఈసారి నిరాశపరచగా.. వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ 30 పరుగులు చేశాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ 47, కెప్టెన్ గిల్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. -
భారత్తో టెస్టు: ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ఇలా.. !
లీడ్స్: భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ తన మొదటి ఇన్నింగ్స్లో 465 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆదివారం మూడో రోజు ఆటలో 100.4 ఓవర్లో ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో ఓలీ పోప్(106)సెంచరీతో మెరవగా, హారీ బ్రూక్(99) పరుగు దూరంలో సెంచరీ కోల్పోయాడు. ప్రసిద్ధ్ కిష్ణ వేసిన ఓవర్లో శార్దూల్ ఠాకూర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు బ్రూక్. పరుగు దూరంలో శతకం కోల్పోవడంతో నిరాశగా పెవిలియన్ చేరాడు బ్రూక్.అయితే అంతకుముందు ఓపెనర్ బెన్ డకెట్(62) హాఫ్ సెంచరీతో ఇంగ్లండ్కు మంచి ఆరంభాన్ని అందించాడు. పోప్తో కలిసి 122 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యాన్ని అందించాడు. ఆపై జోరూట్(28)తో కలిసి పోప్ మరో 80 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఇంగ్లండ్ పుంజుకుంది. అదే ఊపును కొనసాగించిన పోప్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది పోప్కు టెస్టుల్లో 9వ సెంచరీగా నిలిచింది.ఇదిలా ఉంచితే, జెమీ స్మిత్(40), క్రిస్ వోక్స్(38), బ్రైడన్ కార్స్(22)లు ఫర్వాలేదనిపించడంతో ఇంగ్లండ్ 450 పరుగుల మార్కును దాటింది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ ఆరు పరుగుల వెనుకబడి ఉంది. బుమ్రాకు ఐదు వికెట్లుఈ మ్యాచ్లో భారత స్టార్ బౌలర్ బుమ్రా ఐదు వికెట్లు సాధించాడు. ఇంగ్లండ్ఓపెనర్లు క్రావ్లె, డకెట్,జో రూట్, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ వికెట్లను బుమ్రా తీశాడు. టెస్టుల్లో బుమ్రా ఐదు వికెట్ల మార్కును చేరడం ఇది 14వ సారి. ఇక బుమ్రాకు తోడుగా ప్రసిద్ధ్ మూడు వికెట్లు సాధించగా, మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లతో రాణించాడు. -
అంపైర్తో వాగ్వాదం.. సహనం కోల్పోయిన పంత్
లీడ్స్: భారత్ -ఇంగ్లండ్ల మధ్య లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో రిషభ్ పంత్ సహనం కోల్పోయాడు. ఆదివారం మూడో రోజు ఆటలో భాగంగా తొలి సెషన్లో భారత వైస్ కెప్టెన్ పంత్ కాస్త దూకుడుగా వ్యవహరించాడు. అంపైర్ పాల్ రఫెల్ వద్దకు వెళ్లి బాల్ను మార్చాలంటూ విజ్ఞప్తి చేశాడు. ఈ క్రమంలో బాల్ను పట్టుకుని చూసిన అంపైర్ రఫెల్.. అవసరం లేదు అంటూ అదే బాల్ను తిరిగి పంత్కు చేతికిచ్చాడు. దాంతో అసంతృప్తి చెందిన పంత్.. అదే బాల్తో నేలకేసి కొట్టాడు. ఇది 63 ఓవర్లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ క్రీజ్లో ఉన్న సమయంలో జరిగింది. పంత్ ఇలా ప్రవర్తించడం ఐసీసీ క్రమశిక్షణా చర్యలు ఉల్లంఘన చర్యలు కిందకు రావడంతో భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. ఇది ఐసీసీ నియమావళికి విరుద్ధం కావడంతో పంత్పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. Rishabh Pant asked the umpire to change the ball, got denied and then threw it in frustration 😭😭😭 pic.twitter.com/F1A78XGwWV— Sandy (@flamboypant) June 22, 2025 కాగా, ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 471 పరుగులకు ఆలౌట్ కాగా, ఇంగ్లండ్ కూడా అంతే ధీటుగా బదులిస్తోంది. ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్ లో భాగంగా ఓలీ పోప్)106) సెంచరీ చేయగా, హారీ బ్రూక్ 99 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. -
దిగ్గజ క్రికెటర్ కన్నుమూత.. నివాళులర్పించిన ఇంగ్లండ్-భారత్ ఆటగాళ్లు
ఇంగ్లండ్ క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్, గ్లౌసెస్టర్షైర్ దిగ్గజం డేవిడ్ వాలెంటైన్ లారెన్స్(61) కన్నుమూశారు. గత కొంత కాలంగా మోటార్ న్యూరోన్ వ్యాధితో బాధపడుతున్న లారెన్స్.. ఆదివారం తుది శ్వాస విడిచారు.1988లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన లారెన్స్.. ఇంగ్లండ్ తరపున ఐదు టెస్టులు ఆడి 18 వికెట్లు సాధించారు. 1991లో ది ఓవల్లో వెస్టిండీస్పై అద్బుతమైన ఫైవ్ వికెట్ల హాల్ సాధించారు. ఆ సమయంలో విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ను అవుట్ చేశారు.అయితే అద్బుతమైన టాలెంట్ ఉన్నప్పటికి మెకాలి గాయం కారణంగా 1992లో ఆయన్ కెరీర్కు ఎండ్ కార్డ్ పడింది. పస్ట్ క్లాస్ క్రికెట్లో మాత్రం ఆయన ఎన్నో ఘనతలను అందుకున్నారు. 185 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన లారెన్స్..515 వికెట్లు పడగొట్టారు. లిస్ట్-ఎ క్రికెట్లో కూడా ఆయన పేరిట 155 వికెట్లు ఉన్నాయి.నివాళులర్పించిన ఇంగ్లండ్-భారత్ ఆటగాళ్లు..లారెన్స్ మృతి పట్ల భారత్-ఇంగ్లండ్ ఆటగాళ్లు సంతాపం వ్యక్తం చేశారు. లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆట ఆరంభానికి ముందు ఇరు జట్ల ఆటగాళ్లు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడుతూ ఆటగాళ్లు చప్పట్లు కొట్టారు. అదేవిధంగా ఇంగ్లండ్-భారత్ ప్లేయర్లు భుజానికి నల్ల బ్యాండ్లు కట్టుకుని బరిలోకి దిగారు. ఈ విషయాన్ని బీసీసీఐ ఎక్స్ వేదికగా వెల్లడించింది.ఇంగ్లండ్ ఐదో వికెట్ డౌన్..మూడో రోజు ఆటలో భారత బౌలర్లు రాణిస్తున్నారు. 67 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ 5 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. నాలుగో వికెట్గా సెంచూరియన్ ఓలీ పోప్(106) ఔట్ కాగా.. ఐదో వికెట్గా కెప్టెన్ బెన్ స్టోక్స్(20) పెవిలియన్కు చేరాడు.భారత బౌలర్లలో ఇప్పటివరకు బుమ్రా మూడు వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ద్ కృష్ణ తలా వికెట్ సాధించారు. ఇంగ్లండ్ ఇంకా టీమిండియా స్కోర్కు 189 పరుగులు వెనకంజలో ఉంది. క్రీజులో ఇంగ్లండ్ బ్యాటర్లు హ్యారీ బ్రూక్(42), జేమీ స్మిత్(5) ఉన్నారు. -
టీ20 ప్రపంచ కప్ 2026కు ఆర్హత సాధించిన కెనడా..
టీ20 ప్రపంచ కప్ 2026కు కెనడా జట్టు ఆర్హత సాధించింది. శనివారం కింగ్ సిటీ వేదికగా జరిగిన అమెరికాస్ క్వాలిఫైయర్లో బహామాస్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన కెనడా.. వరల్డ్కప్ బెర్త్ను ఖారారు చేసుకుంది. పొట్టి ప్రపంపకప్నకు కెనడా క్వాలిఫై కావడం ఇదే రెండో సారి.అమెరికాస్ క్వాలిఫైయర్లో భాగంగా ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్లోనూ విజయం సాధించిన కెనడా.. పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో నిలిచింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన బహామాస్ కేవలం 57 పరుగులకే ఆలౌటైంది.కెనడా బౌలర్లలో కలీం సానా, శివమ్ శర్మ తలా మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి పతనాన్ని శాసించగా.. అన్షూ పటేల్ రెండు వికెట్లు సాధించారు. అనంతరం 58 పరుగుల లక్ష్యాన్ని కెనడా కేవలం 5.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. కెనడా బ్యాటర్లలో దిల్ప్రీత్ బజ్వా(36) ఆజేయంగా నిలిచి మ్యాచ్ను ముగించాడు.13వ జట్టుగా..2026 టీ 20 వరల్డ్ కప్లో 20 జట్లు బరిలోకి దిగనున్నాయి. ఈ మెగా టోర్నీ కోసం ఐసీసీ ఇప్పటికే 12 జట్లకు నేరుగా అర్హత కల్పించింది. ఆతిధ్య దేశ హోదాలో భారత్, శ్రీలంక క్వాలిఫై కాగా.. టీ20 వరల్డ్కప్-2024 టాప్-8లో నిలిచిన జట్లు ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, అఫ్గానిస్తాన్, దక్షిణాఫ్రికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వెస్టిండీస్ నేరుగా ఆర్హత సాధించాయి.గత టీ20 ప్రపంచకప్లో భారత జట్టు అగ్రస్ధానంలో నిలిచినప్పటికి ఆతిథ్య హోదాలో బరిలోకి దిగనుంది. అదే విధంగా టీ20 ర్యాంకింగ్స్ ప్రకారం న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్ కూడా క్వాలిఫై అయ్యాయి. . మిగిలిన 8 బెర్తులు వివిధ రీజియన్ల క్వాలిఫయింగ్ పోటీల ద్వారా భర్తీ చేయబడతాయి.అందులో ఇప్పుడు అమెరికాస్ క్వాలిఫైయర్స్ నుంచి 13వ జట్టుగా కెనడా ఆర్హత సాధించింది. యూరప్ క్వాలిఫైయర్స్, ఆఫ్రికా క్వాలిఫైయర్స్ నుంచి రెండేసి జట్లు చొప్పున క్వాలిఫై కానున్నాయి. ఈస్ట్ ఆసియా ఫసిఫిక్ క్వాలిఫయర్స్ నుంచి మరో మూడు జట్లు ఈ మెగా టోర్నీలో అడుగుపెట్టనున్నాయి.చదవండి: IND Vs ENG: చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. వసీం అక్రమ్ రికార్డు బద్దలు -
IND Vs ENG: చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. వసీం అక్రమ్ రికార్డు బద్దలు
ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతం తనను మించిన బౌలర్ లేడని టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా మరోసారి నిరూపించుకున్నాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మొదటి టెస్టు రెండో రోజు ఆటలో బుమ్రా నిప్పలు చెరిగాడు. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ వంటి సహచర పేసర్లు తేలిపోయిన చోట.. బుమ్రా తన బౌలింగ్ స్కిల్తో ఆకట్టుకున్నాడు.పిచ్, పరిస్థితులతో సంబంధం లేకుండా అతడు ప్రతి బంతికి వికెట్ తీసేలా అత్యంత ప్రమాదకారిగా కనిపించాడు. భారత్ పడడొట్టిన మూడు వికెట్లు కూడా బుమ్రా తీసినవే కావడం గమనార్హం. జాక్ క్రాలీ, బెన్ డకెట్, జో రూట్ వంటి కీలక వికెట్లు పడగొట్టి భారత్ను గేమ్లో ఉంచాడు. ఈ క్రమంలో బుమ్రా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.వసీం అక్రమ్ రికార్డు బ్రేక్..సేనా(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆసియా బౌలర్గా బుమ్రా చరిత్ర సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్లో బెన్ డకెట్ను ఔట్ చేసిన అనంతరం ఈ రికార్డును బుమ్రా తన ఖాతాలో వేసుకున్నాడు. బుమ్రా ఇప్పటివరకు సేనా దేశాల్లో 148 వికెట్లు పడగొట్టాడు. ఈ రికార్డు గతంలో వసీం అక్రమ్(146) పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్తో అక్రమ్ ఆల్టైమ్ రికార్డును బుమ్రా బ్రేక్ చేశాడు.సెనా దేశాల్లో బుమ్రా రికార్డుఆస్ట్రేలియా- 12 మ్యాచ్లు- 64 వికెట్లుఇంగ్లాండ్ 10 మ్యాచ్లు- 39 వికెట్లున్యూజిలాండ్- 2 మ్యాచ్లు- 6 వికెట్లుదక్షిణాఫ్రికా- 8 మ్యాచ్లు- 38 వికెట్లుసెనా దేశాల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లుజస్ప్రీత్ బుమ్రా 147వసీం అక్రమ్ 146అనిల్ కుంబ్లే 141ఇషాంత్ శర్మ 130 -
అభిషేక్ విధ్వంసం.. 33 బంతుల్లోనే సెంచరీ! 15 సిక్స్లతో
మధ్యప్రదేశ్ లీగ్ (MPL) 2025లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వీరాభిమాని అభిషేక్ పాఠక్ విధ్వంసం సృష్టించాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా శనివారం మాధవరావు సింధియా క్రికెట్ స్టేడియం వేదికగా జబల్పూర్ రాయల్ లయన్స్, బుందేల్ఖండ్ బుల్స్ జట్లు తలపడ్డాయి.ఈ మ్యాచ్లో బుందేల్ఖండ్ బుల్స్కు ప్రాతినిథ్యం వహించిన అభిషేక్ పాఠక్.. కేవలం 33 బంతుల్లో సెంచరీ చేసి అందరని ఆశ్చర్యపరిచాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన అభిషేక్.. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. తన విధ్వంసకర బ్యాటింగ్తో మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు.అతడిని ఆపడం ఎవరిని తరం కాలేదు. అభిషేక్ ఓవరాల్గా 48 బంతుల్లో15 సిక్సర్లు, 7 ఫోర్ల సాయంతో 133 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ కరణ్ తహిలియానితో కలిసి మొదటి వికెట్కు 178 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన బుందేల్ఖండ్ బుల్స్ 246 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో జబల్పూర్ జట్టు 227 పరుగులకే పరిమితమైంది. దీంతో 19 పరుగుల తేడాతో బుందేల్ఖండ్ విజయం సాధించింది."నేను 13 ఏళ్ల వయస్సు నుంచి క్రికెట్ ఆడటం మొదలుపెట్టాను. ఇప్పటివరకు అండర్-16, అండర్-19, అండర్-23 స్దాయిలో మధ్యప్రదేశ్కు ప్రాతినిధ్యం వహించాను. అంతేకాకుండా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా ఆడాను నా ఈ ప్రయాణంలో ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొన్నాను.నేను ఈ స్దాయికి చేరుకోవడానికి మద్దతుగా నిలిచిన నా తల్లిదండ్రులకు, నా శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. సూర్యకుమార్ యాదవ్ అంటే నాకు ఎంతో ఇష్టం. సూర్యకుమార్ యాదవ్ లాగా స్థిరత్వం నేర్చుకోవాలనుకుంటున్నాను. ఆ దిశగా నేను నిరంతరం కృషి చేస్తున్నాను" అని మ్యాచ్ అనంతరం అభిషేక్ పాఠక్ పేర్కొన్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడిన అభిషేక్.. 229 పరుగులు చేశాడు.వైభవ్ సూర్యవంశీ రికార్డు బ్రేక్..ఇక ఈ మ్యాచ్లో సెంచరీతో మెరిసిన అభిషేక్ పాఠక్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్లో అత్యంతవేగవంతమైన సెంచరీ చేసిన మూడో ఇండియన్ క్రికెటర్గా అభిషేక్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరిట ఉండేది. ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్పై సూర్యవంశీ 35 బంతుల్లో సెంచరీ చేశాడు. తాజా ఇన్నింగ్స్తో సూర్యవంశీ రికార్డును పాఠక్ బ్రేక్ చేశాడు.టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత ప్లేయర్లు వీరేఉర్విల్ పటేల్- 28 బంతులుఅభిషేక్ శర్మ- 28 బంతులురిషబ్ పంత్- 32 బంతులుఅభిషేక్ పాఠక్-33 బంతులువైభవ్ సూర్యవంశీ- 35 బంతులు View this post on Instagram A post shared by SportsTiger (@sportstiger_official) -
బెంగళూరు తొక్కిసలాట ఎఫెక్ట్.. విజయోత్సవాలకు బీసీసీఐ సరికొత్త నిబంధనలు
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన ఆర్సీబీ విజయోత్సవ సంబరాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఆర్సీబీ విన్నింగ్ సెలబ్రేషన్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 50 మందికి పైగా గాయపడ్డారు.ఈ క్రమంలో భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండడానికి భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) కఠిన నియమాలను తీసుకురానుంది. ఇకపై విన్నింగ్ సెలబ్రేషన్స్, సత్కార కార్యక్రమాలు సురక్షితంగా జరిగేలా భద్రతా నియమాలను రూపొందించడానికి బీసీసీఐ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ధ్రువీకరించారు.బీసీసీఐ ప్రతిపాదించిన గైడ్లైన్స్ ఇవే..👉కూలింగ్-ఆఫ్ పీరియడ్: ఏ జట్టు అయినా టైటిల్ గెలిచిన తర్వాత మూడు, నాలుగు రోజుల్లోపు వేడుకలు నిర్వహించడానికి అనుమతి నిరాకరణ.👉బీసీసీఐ క్లియరెన్స్ తప్పని సరి: జట్లు ఏదైనా వేడుకను నిర్వహించే ముందు బీసీసీఐ నుంచి కచ్చితంగా అనుమతి తీసుకోవాలి.👉బోర్డు నుండి లిఖిత పూర్వకంగా అనుమతి లేకుండా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదు.👉భద్రతా బ్లూప్రింట్ను ముందే సమర్పించాలి. ఫైవ్ టైర్ సెక్యూరిటీ కచ్చితంగా ఉండాలి.👉విమానాశ్రయం నుండి కార్యక్రం జరిగే వేదిక వరకు జట్టు వెళ్లే మార్గమంతా భద్రతా ఏర్పాట్లను పరిశీలించాలి.👉ఈవెంట్ షెడ్యూల్ అంతటా ఆటగాళ్లు, సిబ్బందికి పూర్తి రక్షణ కల్పించడం.👉జిల్లా పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక అధికారుల నుండి అనుమతి పొందాలి. -
మెడల్స్ ఏమీ లేవు.. ఇంత చెత్త ఫీల్డింగ్ చేస్తారా! గవాస్కర్ ఫైర్
లీడ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. మొదటి ఇన్నింగ్స్లో టీమిండియాకు ఇంగ్లీష్ జట్టు ధీటైన జవాబు ఇస్తుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. క్రీజులో ఓలీ పోప్(100), హ్యారీ బ్రూక్(0) ఉన్నారు. స్టోక్స్ సేన టీమిండియా స్కోరుకు ఇంకా 262 పరుగులు వెనుకబడి ఉంది.బుమ్రా ఒక్కడే భారత బౌలర్లలో బుమ్రా ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టి ఒంటరి పోరాటం చేశాడు. సిరాజ్, జడేజా, ప్రసిద్ద్ కృష్ణ, శార్ధూల్ రెండో రోజు ఆటలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. తొలి ఓవర్లో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీని ఔట్ చేసిన బుమ్రా.. ఆ తర్వాత కూడా తన పేస్ బౌలింగ్తో నిప్పులు చెరిగాడు. అతడిని ఎదుర్కొవడానికి ఇంగ్లండ్ బ్యాటర్లు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్నారు. కానీ మిగితా ముగ్గురు పేసర్లు వన్డేను తలపిస్తూ పరుగులు సమర్పించుకున్నారు.ఆ మూడు క్యాచ్లు పట్టుంటే..అయితే ఈమ్యాచ్లో బుమ్రాకు ఫీల్డర్ల నుంచి మద్దతు లభించి ఉంటే టీమిండియా కచ్చితంగా పైచేయి సాధించి ఉండేది. అతడి బౌలింగ్లో భారత ఫీల్డర్లు మొత్తం మూడు క్యాచ్లను జారవిడిచారు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ ఐదో బంతికి డకెట్ ఇచ్చిన క్యాచ్ను గల్లీలో యశస్వి జారవిడవగా... భారత అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడైన జడేజా కూడా డకెట్ క్యాచ్ నేలపాలు చేశాడు.డకెట్ బ్యాక్వర్డ్ పాయింట్లో ఇచ్చిన క్యాచ్ను అందుకోవడంలో జడ్డూ విఫలమయ్యాడు. బుమ్రా వేసిన 31వ ఓవర్లో పోప్ ఇచ్చిన క్యాచ్ను సైతం జైస్వాల్ నేలపాలు చేశాడు. దీంతో అతడు ఏకంగా సెంచరీ బాదేశాడు. ఈ క్రమంలో గిల్ సేన చెత్త ఫీల్డింగ్పై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు."గత కొంత కాలంగా అత్యుత్తమ ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచిన ఆటగాడికి డ్రెస్సింగ్ రూమ్లో అవార్డు ఇవ్వడం అనవాయితీగా వస్తోంది. కానీ ఈ రోజు మాత్రం ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ ఎవరికి ఎటువంటి అవార్డు ఇవ్వడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే భారత ఫీల్డర్లు దారుణమైన ప్రదర్శన కనబరిచారు.యశస్వి జైస్వాల్ చాలా మంచి ఫీల్డర్, కానీ ఈ మ్యాచ్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోయాడు. రెండు క్యాచ్లను జారవిడిచాడు. నిజంగా ఇది నన్ను తీవ్ర నిరాశపరిచిందని" కామెంటరీ బాక్స్లో ఉన్న గవాస్కర్ పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన జో రూట్.. సచిన్ రికార్డు బ్రేక్ -
చరిత్ర సృష్టించిన జో రూట్.. సచిన్ రికార్డు బ్రేక్
ఇంగ్లండ్ సూపర్ స్టార్ జో రూట్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్ గడ్డపై భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా రూట్ నిలిచాడు. లీడ్స్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో రూట్ ఈ ఫీట్ సాధించాడు. రూట్ ఇప్పటివరకు ఇంగ్లండ్లో భారత్తో జరిగిన టెస్టుల్లో 1589 పరుగులు చేశాడు.ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. ఇంగ్లండ్ గడ్డపై సచిన్ 1575 పరుగులు చేశాడు. తాజా ఇన్నింగ్స్తో సచిన్ ఆల్టైమ్ రికార్డును జో బ్రేక్ చేశాడు. అయితే ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో రూట్ తన మార్క్ చూపించలేకపోయాడు. కేవలం 28 పరుగులు మాత్రమే చేసి జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో ఔటయ్యాడు.ఇంగ్లండ్లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు..👉జో రూట్ (ఇంగ్లాండ్) – 1579*👉సచిన్ టెండూల్కర్ (భారత్) – 1575👉రాహుల్ ద్రవిడ్ (భారత్) – 1376👉అలిస్టర్ కుక్ (ఇంగ్లాండ్) – 1196👉సునీల్ గవాస్కర్ (భారత్) – 1152👉గ్రహం గూచ్ (ఇంగ్లాండ్) – 1134ధీటుగా బదులిస్తున్న ఇంగ్లండ్..తొలి ఇన్నింగ్స్లో భారత్కు ఇంగ్లండ్ జట్టు ధీటుగా బదులిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఒలీ పోప్ (131 బంతుల్లో 100 బ్యాటింగ్; 13 ఫోర్లు) సెంచరీతో చెలరేగగా... బెన్ డకెట్ (94 బంతుల్లో 62; 9 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే మూడు వికెట్లు సాధించాడు. మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 359/3తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 113 ఓవర్లలో 471 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్,శుబ్మన్ గిల్, యశస్వి జైశ్వాల్ సెంచరీలతో మెరిశారు.చదవండి: IND vs ENG: జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత.. ఫస్ట్ ఓవర్ కింగ్గా -
డోపింగ్... ప్రమాద ఘంటికలు!
న్యూఢిల్లీ: క్రీడల నుంచి డోపింగ్ను రూపుమాపాలని ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా... సత్ఫలితాలు మాత్రం రావడం లేదు. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) పరీక్షల ఫలితాల్లో భారత్ ప్రమాదకర స్థాయిలో నిలుస్తోంది. 2023 సంవత్సరానికి గానూ ‘వాడా’ నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో భారత్ 3.8 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. 5,606 నమూనాలు సేకరించగా... అందులో 3.8 శాతం అంటే 214 మంది అథ్లెట్లు నిషేధిత ఉ్రత్పేరకాలు తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. అంతకముందు సంవత్సరంలో 3,865 నమూనాల్లో భారత డోపింగ్ రేటు 3.2గా ఉంది. 5,606 నమూనాల్లో 2,748 నమూనాలు పోటీలు జరుగుతున్న సమయంలో తీసుకున్నవి కావడం గమనార్హం. నిషేధిత ఉ్రత్పేరకాలు వాడిన జాబితాలో చైనా (28,197 నమూనాల్లో 0.2శాతం), అమెరికా (6798 నమూనాల్లో 1.0 శాతం), ఫ్రాన్స్ (11,368 నమూనాల్లో 0.9 శాతం), జర్మనీ (15,153 నమూనాల్లో 0.4 శాతం), రష్యా (10,395 నమూనాల్లో 1.0 శాతం) మెరుగ్గా ఉండగా... భారత్ ప్రమాదకర స్థాయిలో ఉంది. సేకరించిన నమూనాల్లో భారత్ నుంచి 214 మంది పాజిటివ్గా తేలగా... ఫ్రాన్స్ నుంచి 105 మంది, రష్యా నుంచి 99 మంది, అమెరికా నుంచి 66 మంది, చైనా నుంచి 60 మంది, జర్మనీ నుంచి 57 మంది అథ్లెట్లు డోపింగ్లో దొరికారు. -
BAN Vs SL: బంగ్లా-శ్రీలంక తొలి టెస్టు డ్రా.. మాథ్యూస్కు ఘన వీడ్కోలు
గాలె: బ్యాటర్లు పరుగుల పండగ చేసుకున్న బంగ్లాదేశ్, శ్రీలంక తొలి టెస్టు చివరకు ‘డ్రా’గా ముగిసింది. శనివారం వర్షం కారణంగా మ్యాచ్కు అంతరాయం వాటిల్లడంతో... రసవత్తర ఫలితానికి అవకాశం లేకుండా పోయింది. ఓవర్నైట్ స్కోరు 177/3తో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్... 87 ఓవర్లలో 285/6 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. కెప్టెన్ నజ్ముల్ హసన్ షంటో (199 బంతుల్లో 125 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్లు) ఈ మ్యాచ్లో రెండో సెంచరీని తన పేరిట రాసుకున్నాడు. ముష్ఫికర్ రహీమ్ (102 బంతుల్లో 49; 4 ఫోర్లు) రాణించాడు.అయితే బంగ్లా కెప్టెన్ సెంచరీ పూర్తి చేసుకునే క్రమంలో... నిధానంగా ఆడటంతో మ్యాచ్ ఆసక్తికర మలుపు వైపు మొగ్గు చూపలేదు. శ్రీలంక బౌలర్లలో తిరిందు రత్ననాయకే 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 296 పరుగుల లక్ష్యఛేదన కోసం బరిలోకి దిగిన శ్రీలంక ఆట నిలిచిపోయే సమయానికి 32 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. తైజుల్ ఇస్లామ్ 3 వికెట్లు తీసి భయపెట్టినా... తగినంత సమయం లేకపోవడంతో శ్రీలంక ‘డ్రా’తో గట్టెక్కింది. అంతకుముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 495 పరుగులు చేయగా... శ్రీలంక 485 పరుగులు చేసింది. రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేసిన బంగ్లాదేశ్ సారథి నజ్ముల్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య బుధవారం నుంచి కొలంబో వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది.మాథ్యూస్కు వీడ్కోలు..ఈ మ్యాచ్తో శ్రీలంక ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. జాతీయ జట్టు తరఫున 119 టెస్టులు ఆడిన మాథ్యూస్ 44.40 సగటుతో 8214 పరుగులు చేశాడు. బంతితోనూ ఫర్వాలేదనిపించిన అతడు 33 వికెట్లు సైతం పడగొట్టాడు. 2014లో ఇంగ్లండ్ గడ్డపై ఏకైక టెస్టు సిరీస్ గెలిచిన శ్రీలంక జట్టుకు మాథ్యూస్ కెప్టెన్గానూ వ్యవహరించాడు.చదవండి: IND vs ENG 1st Test: అప్పుడు స్టుపిడ్.. స్టుపిడ్! ఇప్పుడు సూపర్బ్.. సూపర్బ్ -
నీరజ్ ‘టాప్’ త్రో
నా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా. జావెలిన్ విసరడానికి ముందు నా రనప్ వేగంగా ఉంది. దాన్ని అదుపు చేయలేకపోయా. అయినా ఫలితం ఆనందాన్నిచి్చంది. మరో నాలుగు రోజుల్లో జరగనున్న ఓ్రస్టావా గోల్డెన్ స్పైక్ అథ్లెటిక్ మీట్లో పాల్గొననున్నా. అందుకే కాస్త విశ్రాంతి అవసరం. 90 మీటర్ల మార్క్ దాటిన తర్వాత సగం ఒత్తిడి దూరమైనట్లు అనిపించింది. ఇక నిలకడగా అదే దూరాన్ని కొనసాగించడంపై దృష్టి పెడతా. అయితే పోటీ జరిగే రోజు పరిస్థితులు, వాతావరణం, శరీర తీరును బట్టి ప్రదర్శనలో మార్పులు రావడం సహజం. అంతర్జాతీయ పోటీల్లో నిలకడగా 90 మీటర్ల దూరాన్ని కొనసాగించాలంటే మరింత దృఢంగా ఉండాలి. దాని కోసం సాధన కొనసాగిస్తా. జావెలిన్ విసిరే సమయంలో నియంత్రణ ముఖ్యం. శిక్షణ సమయంలో దానిపై దృష్టి సారిస్తా. ప్రదర్శనలో చిన్న చిన్న లోపాలు జరుగుతూ ఉంటాయి. వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరముంది. ఈ సీజన్లో మరిన్ని పోటీల్లో పాల్గొననున్నా. అందుకే నిలకడగా మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటున్నా. టోక్యో ఒలింపిక్స్లో పసిడి పతకం సాధించినప్పటి నుంచి దేశంలో జావెలిన్ త్రోకు ఆదరణ మరింత పెరిగింది. ఇప్పుడు నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్ నిర్వహిస్తుండటం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో ఇది మరింత పెద్ద స్థాయికి చేరడం ఖాయం. -నీరజ్ చోప్రా పారిస్: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పారిస్ డైమండ్ లీగ్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ మీట్లో నీరజ్ జావెలిన్ను 88.16 మీటర్ల దూరం అగ్ర స్థానంలో నిలిచాడు. రెండేళ్లలో నీరజ్కు ఇదే తొలి డైమండ్ లీగ్ టైటిల్ కాగా... 90 మీటర్ల మార్క్ దాటకుండానే భారత స్టార్ నంబర్వన్గా నిలవడం విశేషం. జర్మనీకి చెందిన జులియన్ వెబర్ 87.88 మీటర్ల దూరంతో రెండో స్థానంలో నిలిచాడు. బ్రెజిల్కు చెందిన లూయిజ్ మారిసియో డా సిల్వా 86.62 మీటర్ల దూరంతో మూడో స్థానం దక్కించుకున్నాడు. తొలి ప్రయత్నంలోనే అత్యుత్తమ ప్రదర్శన చేసిన నీరజ్... ఆ తర్వాత రెండో ప్రయత్నంలో జావెలిన్ను 85.10 మీటర్లు విసిరాడు... ఆ తర్వాత మూడు సార్లు ఫౌల్ చేసిన భారత అథ్లెట్... ఆఖరి ప్రయత్నంలో 82.89 మీటర్ల దూరం నమోదు చేసుకున్నాడు. కేషార్న్ వాల్కాట్ (81.66 మీటర్లు; ట్రినిడాడ్, టొబాగో) నాలుగో స్థానం దక్కించుకోగా... రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (80.29 మీటర్లు; గ్రెనడా), జూలియన్ యోగో (80.26 మీటర్లు; కెన్యా) వరుసగా ఐదో, ఆరో స్థానాల్లో నిలిచారు.సీజన్లో తొలి టైటిల్...భారత అథ్లెటిక్స్ గతిని మార్చిన నీరజ్ ఈ సీజన్లో తొలి టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు. చివరిసారిగా 2023లో లుసానే డైమండ్ లీగ్లో విజేతగా నిలిచిన నీరజ్... ఆ తర్వాత ఈ రెండేళ్లలో బరిలోకి దిగిన ఆరు డైమండ్ లీగ్ల్లో రెండో స్థానానికే పరిమితమయ్యాడు. పారిస్ డైమిండ్ లీగ్లో చివరిసారిగా 2017లో పోటీపడిన నీరజ్... జూనియర్ ప్రపంచ చాంపియన్గా బరిలోకి దిగి ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం నెగ్గిన భారత జావెలిన్ త్రోయర్... 2024 పారిస్ ఒలింపిక్స్లో రజత పతకం గెలుచుకున్నాడు. గత నెలలో జరిగిన దోహా డైమండ్ లీగ్లో 90 మీటర్ల మార్క్ దాటిన ఈ హర్యానా త్రోయర్... దూరంతో పాటు ఫిట్నెస్పై కూడా దృష్టి పెట్టాడు. ఈ నెల 24 నుంచి జరగనున్న గోల్డెన్ స్పైక్ అథ్లెటిక్ మీట్లో పాల్గొననున్న 27 ఏళ్ల నీరజ్... ఆ తర్వాత భారత్లో తొలిసారి నిర్వహిస్తున్న అంతర్జాతీయ జావెలిన్ త్రో ఈవెంట్ ‘నీరజ్ చోప్రా క్లాసిక్‘లో పాల్గొననున్నాడు. బెంగళూరు వేదికగా వచ్చే నెల 5న ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్కు ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య ‘ఎ’ కేటగిరీ గుర్తింపునిచ్చింది. -
ఇంగ్లండ్ దీటైన జవాబు.. తొలి ఇన్నింగ్స్లో 209/3
జైస్వాల్, గిల్ వేసిన బాటలో... పంత్ చెలరేగిపోయి సెంచరీ బాదడంతో ఇంగ్లండ్తో తొలి టెస్టులో టీమిండియా భారీ స్కోరు చేయగా... అదే స్థాయిలో రెచ్చిపోయిన ఇంగ్లండ్ దీటుగా బదులిస్తోంది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో విజృంభించినా...అతడికి మరో ఎండ్ నుంచి సరైన సహకారం లేకపోవడంతో ఆతిథ్య ఇంగ్లండ్ బ్యాటర్లు స్వేచ్ఛగా పరుగులు రాబట్టారు. ప్రస్తుతానికి ఇరు జట్లు సమాన స్థితిలోనే ఉన్నా... మూడో రోజు తొలి సెషన్లో బుమ్రాను ఇంగ్లండ్ ఆటగాళ్లు ఎలా ఎదుర్కొంటారనే దానిపైనే ఈ మ్యాచ్ గమనం ఆధారపడి ఉంది!లీడ్స్: బ్యాటింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై ఇరు జట్ల ఆటగాళ్లు భారీ స్కోర్లతో రెచి్చపోవడంతో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. బుమ్రా మినహా భారత బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో... శనివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఒలీ పోప్ (131 బంతుల్లో 100 బ్యాటింగ్; 13 ఫోర్లు) ‘శత’క్కొట్టగా... బెన్ డకెట్ (94 బంతుల్లో 62; 9 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. ప్రస్తుతం చేతిలో 7 వికెట్లు ఉన్న ఇంగ్లండ్... టీమిండియా స్కోరుకు ఇంకా 262 పరుగులు వెనుకబడి ఉంది. పోప్తో పాటు బ్రూక్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 359/3తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 113 ఓవర్లలో 471 పరుగులు చేసి ఆలౌటైంది. కెపె్టన్ శుబ్మన్ గిల్ (227 బంతుల్లో 147; 19 ఫోర్లు, 1 సిక్స్) టెస్టు కెరీర్లో అత్యధిక స్కోరు నమోదు చేసుకోగా... రిషభ్ పంత్ (178 బంతుల్లో 134; 12 ఫోర్లు, 6 సిక్స్లు) ధనాధన్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్, టంగ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. బుమ్రా ఒంటరి పోరాటం... సిరీస్ ఆరంభానికి ముందు అంతా ఊహించినట్లు... ఇరు జట్ల మధ్య ప్రధాన తేడా బుమ్రానే అని నిరూపించుకున్నాడు. పిచ్, పరిస్థితులతో సంబంధం లేకుండా అతడు ప్రతి బంతికి వికెట్ తీసేలా అత్యంత ప్రమాదకారిగా కనిపించాడు. వర్షం కారణంగా ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఆలస్యంగా ప్రారంభం కాగా... తొలి ఓవర్లోనే ఓపెనర్ జాక్ క్రాలీ (4)ని పంత్ వెనక్కి పంపాడు. అదే తీవ్రత కొనసాగిస్తూ బుమ్రా రెచ్చిపోతుంటే... ఇంగ్లండ్ బ్యాటర్లు ప్రతీ బంతికీ బతుకు జీవుడా అంటూ కాలం వెల్లదీశారు. ఈ క్రమంలో ఎడ్జ్ల ద్వారా కాస్త పరుగులు రాగా... మనవాళ్ల పేలవ ఫీల్డింగ్ ప్రత్యర్థికి కలిసొచ్చింది. ఇంగ్లండ్ వంటి పేస్ పిచ్లపై స్లిప్స్లో దూసుకొచ్చే బంతులను అందుకోవడంలో యువ ఆటగాళ్ల అనుభవ రాహిత్యం కొట్టిచి్చనట్లు కనిపించింది. బుమ్రా బౌలింగ్లోకు ఫీల్డర్ల మద్దతు లభించి ఉంటే ఈ పాటికి మ్యాచ్ మన చేతుల్లోకి వచ్చి ఉండేదే! కొన్ని ఉత్కంఠ క్షణాలను ఎదుర్కొన్న బెన్ డకెట్, పోప్ కుదురుకున్నాక చక్కటి షాట్లతో పరుగులు రాబట్టారు. బుమ్రా బౌలింగ్ను కాచుకున్న ఈ జంట... సిరాజ్, ప్రసిధ్ కృష్ణ బౌలింగ్లో స్వేచ్ఛగా ఆడింది. దీంతో ఏ దశలోనూ పరుగుల వేగం తగ్గలేదు. టీ విరామం అనంతరం మరోసారి బంతినందుకున్న బుమ్రా... డకెట్ను క్లీన్ బౌల్డ్ చేయగా... చివరి సెషన్లో పోప్ చెలరేగిపోయాడు. ఎడాపెడా షాట్లు ఆడుతూ... 125 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ మరుసటి బంతికే రూట్ (28)ను బుమ్రా బుట్టలో వేసుకోగా... ఇంగ్లండ్ మరో వికెట్ కోల్పోకుండా రోజును ముగించింది. అదరగొట్టిన పంత్.. తొలి రోజు ఇంగ్లండ్ బౌలర్లను ఓ ఆటాడుకున్న భారత బ్యాటర్లు... రెండో రోజు తొలి సెషన్ ఆరంభంలోని దాన్ని కొనసాగించారు. ఓవర్నైట్ బ్యాటర్లు గిల్, పంత్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. గిల్ కాస్త సంయమనం పాటించగా... పంత్ మాత్రం భారీ షాట్లతో రెచి్చపోయాడు. ఈ క్రమంలో పంత్ 146 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 99 పరుగుల వద్ద బషీర్ బౌలింగ్లో భారీ సిక్సర్తో మూడంకెల స్కోరు అందుకున్నాడు. అనంతరం తనదైన శైలిలో పల్టీలు కొడుతూ సంబరాలు జరుపుకున్నాడు. గతేడాది బంగ్లాదేశ్పై సెంచరీ అనంతరం పంత్కు ఇదే తొలి మూడంకెల స్కోరు. వన్డే తరహాలో ఆడిన ఈ జోడీ చకచకా పరుగులు రాబట్టింది. నాలుగో వికెట్కు 301 బంతుల్లో 209 పరుగులు జోడించిన అనంతరం గిల్ అవుటయ్యాడు. షోయబ్ బషీర్ బంతికి క్రీజు వదిల బయటకు వచ్చి భారీ షాట్కు యతి్నంచిన గిల్... బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్లో టంగ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 430 పరుగుల వద్ద భారత జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. అదే సమయంలో వాతావరణంలో స్వల్ప మార్పులతో మేఘావృతం కాగా... ఇంగ్లండ్ పేసర్లు రెచి్చపోయారు. ఎనిమిదేళ్ల తర్వాత టెస్టు ఆడే అవకాశం దక్కించుకున్న కరుణ్ నాయర్ (0) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఎక్స్ట్రా కవర్స్లో పోప్ పట్టిన మెరుపు క్యాచ్కు వెనుదిరిగాడు. ఆ తర్వాత టంగ్ బౌలింగ్లో పంత్ వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోగా... పేస్ ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ (1) అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు. 454/7తో లంచ్కు వెళ్లిన భారత జట్టు ఆ తర్వాత మరో 17 పరుగులు జోడించి మిగిలిన మూడు వికెట్లు కోల్పోయింది. జడేజా (11) ధాటిగా ఆడే ప్రయత్నంలో అవుట్ కావడం దెబ్బకొట్టింది. ఓవరాల్గా టీమిండియా 41 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లు కోల్పోయింది.స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) స్టోక్స్ 101; రాహుల్ (సి) రూట్ (బి) కార్స్ 42; సాయి సుదర్శన్ (సి) స్మిత్ (బి) స్టోక్స్ 0; గిల్ (సి) టంగ్ (బి) బషీర్ 147; పంత్ (ఎల్బీ) (బి) టంగ్ 134; కరుణ్ నాయర్ (సి) పోప్ (బి) స్టోక్స్ 0; జడేజా (బి) టంగ్ 11; శార్దుల్ (సి) జేమీ స్మిత్ (బి) స్టోక్స్ 1; బుమ్రా (సి) బ్రూక్ (బి) టంగ్ 0; సిరాజ్ (నాటౌట్) 3; ప్రసిధ్ కృష్ణ (బి) టంగ్ 1; ఎక్స్ట్రాలు 31; మొత్తం (113 ఓవర్లలో ఆలౌట్) 471. వికెట్ల పతనం: 1–91, 2–92, 3–221, 4–430, 5–447, 6–453, 7–454, 8–458, 9–469, 10–471. బౌలింగ్: వోక్స్ 24–4–103–0; కార్స్ 22–5–96–1; టంగ్ 20–0–86–4; స్టోక్స్ 20–2–66–4; బషీర్ 27–6–100–1. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: జాక్ క్రాలీ (సి) కరుణ్ నాయర్ (బి) బుమ్రా 4; డకెట్ (బి) బుమ్రా 62; పోప్ (బ్యాటింగ్) 100; రూట్ (సి) కరుణ్ నాయర్ (బి) బుమ్రా 28; బ్రూక్ (బ్యాటింగ్) 0; ఎక్స్ట్రాలు 15; మొత్తం (49 ఓవర్లలో 3 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–4, 2–126, 3–206. బౌలింగ్: బుమ్రా 13–2–48–3; సిరాజ్ 14–0–50–0; ప్రసిధ్ కృష్ణ 10–0–56–0; జడేజా 9–2–25–0; శార్దుల్ 3–0–23–0.ఆ మూడు క్యాచ్లు పట్టుంటే... బుమ్రా బౌలింగ్లో డకెట్ రెండు సార్లు బతికిపోయాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ ఐదో బంతికి డకెట్ ఇచి్చన క్యాచ్ను గల్లీలో యశస్వి జారవిడవగా... భారత అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడైన జడేజా కూడా డకెట్ క్యాచ్ నేలపాలు చేశాడు. డకెట్ బ్యాక్వర్డ్ పాయింట్లో ఇచి్చన క్యాచ్ను అందుకోవడంలో జడ్డూ విఫలమయ్యాడు. బుమ్రా వేసిన 31వ ఓవర్లో పోప్ ఇచి్చన క్యాచ్ను సైతం జైస్వాల్ నేలపాలు చేశాడు. -
టీమిండియాతో తొలి టెస్టు.. రెండో రోజు ఇంగ్లండ్దే
లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో టీమిండియాపై ఇంగ్లండ్ పై చేయి సాధించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లీష్ జట్టు 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. క్రీజులో వైస్ కెప్టెన్ ఓలీ పోప్(100), హ్యారీ బ్రూక్ (0) ఉన్నారు. టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులకు ఆలౌటైంది. 359/3 ఓవర్ నైట్స్కోర్తో రెండో రోజు ఆటను ఆరంభించిన టీమిండియా అదనంగా 112 పరుగులు జోడించి తమ ఇన్నింగ్స్ను ముగించింది. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్తో పాటు కెప్టెన్ శుబ్మన్ గిల్ (147, 227 బంతుల్లో 19 ఫోర్లు, 1 సిక్స్), యశస్వి జైస్వాల్ (101, 159 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో చెలరేగారు. -
జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత.. ఫస్ట్ ఓవర్ కింగ్గా
టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్లో 2021 నుంచి తొలి ఓవర్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా బుమ్రా నిలిచాడు. లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఓవర్లో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీని ఔట్ చేసిన బుమ్రా.. ఈ రేర్ ఫీట్ను తన ఖాతాలో వేసుకున్నాడు.2021 నుంచి బుమ్రా ఇప్పటివరకు తొలి ఓవర్లో 8 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు సౌతాఫ్రికా స్పీడ్ స్టార్, ఆసీస్ ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ పేరిట సంయుక్తంగా ఉండేది. వీరిద్దరూ తొలి ఓవర్లో 7 వికెట్లు పడగొట్టారు. తాజా మ్యాచ్తో ఈ ఇద్దరి పేసర్లను బుమ్రా అధిగమించాడు.ఇంగ్లండ్ ఓపెనర్ మైండ్ బ్లాంక్..కాగా బుమ్రా తొలి ఓవర్లోనే క్రాలీని బోల్తా కొట్టించాడు. మొదటి ఓవర్లో ఐదో బంతిని బుమ్రా.. క్రాలీకి మిడిల్ స్టంప్పై అవుట్-స్వింగర్ వేశాడు. క్రాలీ ఆ బంతిని లెగ్సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి అవుట్సైడ్ ఎడ్జ్ తీసుకుని ఫస్ట్ స్లిప్లో కరుణ్ నాయర్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో 4 పరుగులు చేసిన ఇంగ్లండ్ ఓపెనర్ నిరాశతో పెవిలియన్కు చేరాడు.ధీటుగా బదులిస్తున్న ఇంగ్లండ్..ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో భారత్ 471 పరుగులకు ఆలౌటైంది. 359/3 ఓవర్ నైట్స్కోర్తో రెండో రోజు ఆటను ఆరంభించిన టీమిండియా అదనంగా 112 పరుగులు జోడించి తమ ఇన్నింగ్స్ను ముగించింది. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్తో పాటు కెప్టెన్ శుబ్మన్ గిల్ (147, 227 బంతుల్లో 19 ఫోర్లు, 1 సిక్స్), యశస్వి జైస్వాల్ (101, 159 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో చెలరేగారు.ఇంగ్లండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్స్టోక్స్, జోష్ టంగ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. బ్రైడాన్ కార్స్, షోయక్ బషీర్ చెరో వికెట్ సాధించారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో29 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ నష్టానికి 126 పరుగులు చేసింది. రెండు వికెట్లు కూడా బుమ్రానే పడగొట్టాడు. -
అప్పుడు స్టుపిడ్.. స్టుపిడ్! ఇప్పుడు సూపర్బ్.. సూపర్బ్
స్టుపిడ్..స్టుపిడ్.. స్టుపిడ్.. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ నిర్లక్ష్యపు షాట్ ఆడి వికెట్ కోల్పోవడంతో కామెంటేటర్ సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇప్పుడు అదే గవాస్కర్ రిషబ్ పంత్ను ప్రశంసలతో ముంచెత్తాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో పంత్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.రెండో రోజు ఆటలో తన ఏడో టెస్టు సెంచరీ మార్క్ను రిషబ్ అందుకున్నాడు. ఈ ఢిల్లీ వికెట్ కీపర్ బ్యాటర్ 99 పరుగుల వద్ద సిక్సర్ బాది మరి తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో కామెంటరీ బాక్స్లో ఉన్న గవాస్కర్ సూపర్బ్.. సూపర్బ్.. సూపర్బ్ అంటూ కొనియాడాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. విమర్శించిన నోళ్లతోనే పొగిడించుకోవడం చాలా గ్రేట్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఓవరాల్గా 178 బంతులు ఎదుర్కొన్న పంత్.. 12 ఫోర్లు, 6 భారీ సిక్సర్లతో 134 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ సెంచరీతో టెస్టు క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత వికెట్ కీపర్గా ధోని రికార్డును పంత్ బ్రేక్ చేశాడు. పంత్కు ఇది ఏడో టెస్టు సెంచరీ.తొలి ఇన్నింగ్స్లో భారత స్కోరంతంటే?ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో భారత్ 471 పరుగులకు ఆలౌటైంది. 359/3 ఓవర్ నైట్స్కోర్తో రెండో రోజు ఆటను ఆరంభించిన టీమిండియా అదనంగా 112 పరుగులు జోడించి తమ ఇన్నింగ్స్ను ముగించింది. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్తో పాటు కెప్టెన్ శుబ్మన్ గిల్ (147, 227 బంతుల్లో 19 ఫోర్లు, 1 సిక్స్), యశస్వి జైస్వాల్ (101, 159 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో చెలరేగారు.ఇంగ్లండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్స్టోక్స్, జోష్ టంగ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. బ్రైడాన్ కార్స్, షోయక్ బషీర్ చెరో వికెట్ సాధించారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 15 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 72 పరుగులు చేసింది.చదవండి: IND vs ENG: రిషబ్ పంత్ వరల్డ్ రికార్డు.. -
ఓర్నీ.. క్రికెట్ గ్రౌండ్లో నీకేమి పని? ఫోటో వైరల్
గాలే వేదికగా శ్రీలంక-బంగ్లాదేశ్ మధ్య జరిగిన తొలి టెస్టు సందర్భంగా ఓ విచిత్రకర సంఘటన చోటు చేసుకుంది. ఐదో రోజు ఆటలో పాములు పట్టే వ్యక్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. స్నేక్ క్యాచర్ రెండు పాములను తీసుకొచ్చి ప్రశాంతంగా నేలపై కూర్చుని మ్యాచ్ను వీక్షించాడు. అతడి వద్ద పాములతో పాటు ఓ కోతి కూడా ఉంది. ఇది చూసిన మిగితా ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది.తొలి టెస్టు డ్రా.. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లా, శ్రీలంక మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. మొదటి ఇన్నింగ్స్లో పర్యాటక బంగ్లాదేశ్ జట్టు 495 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో(148), ముష్ఫికర్ రహీం(163) అద్బుతమైన సెంచరీలతో చెలరేగగా.. లిట్టన్ దాస్ 90 పరుగులతో రాణించాడు.అనంతరం శ్రీలంక కూడా బంగ్లాకు ధీటుగా బదులిచ్చింది. శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్లో 485 పరుగుల భారీ చేసింది. లంక బ్యాటర్లలో ఓపెనర్ పాథుమ్ నిస్సాంక(187) భారీ శతకం సాధించగా.. చండీమల్(54), కుమిందు మెండిస్(87) రాణించారు. అనంతరం బంగ్లా జట్టు తమ రెండో ఇన్నింగ్స్ను 285-6 వద్ద డిక్లేర్ చేసింది.దీంతో తొలి ఇన్నింగ్స్లో లభించిన ఆధిక్యాన్ని జోడించి ప్రత్యర్ధి ముందు 296 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా జట్టు ఉంచింది. ఆఖరి రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 4 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. దాంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. View this post on Instagram A post shared by Mufaddal Vohra (@mufastweet) -
గిల్, జైశ్వాల్, పంత్ సెంచరీలు.. తొలి ఇన్నింగ్స్లో భారత్ భారీ స్కోర్
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటర్లు జూలు విదిల్చారు. మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా 471 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 359/3 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన గిల్ సేన. అదనంగా 112 పరుగులు జోడించి తమ ఇన్నింగ్స్ను ముగించింది.రెండో రోజు ఆటలో టీమిండియా బ్యాటర్లు మెరుగ్గా రాణించలేకపోయారు. భారత బ్యాటర్లలో కెప్టెన్ శుబ్మన్ గిల్ (147, 227 బంతుల్లో 19 ఫోర్లు, 1 సిక్స్), రిషబ్ పంత్ (134, 178 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లు), యశస్వి జైస్వాల్ (101 159 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో చెలరేగారు.సుదర్శన్, కరుణ్ నాయర్ అట్టర్ ప్లాప్.. ఇక ఈ మ్యాచ్లో భారత తరపున అరంగేట్రం చేసిన సాయిసుదర్శన్ తీవ్ర నిరాశపరిచాడు. మొదటి ఇన్నింగ్స్లో డకౌట్గా వెనుదిరిగాడు. అతడితో పాటు తొమ్మిదేళ్ల తర్వాత భారత టెస్టు జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్ సైతం ఖాతా తెరవకుండా పెవిలియన్కు చేరాడు. ఇంగ్లండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్స్టోక్స్, జోష్ టంగ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. బ్రైడాన్ కార్స్, షోయక్ బషీర్ చెరో వికెట్ సాధించారు.చదవండి: నాకు అది అలవాటు..! నువ్వే గుర్తు చేస్తూ ఉండాలి!.. నో చెప్పడం వల్లే ఇలా.. -
ఎనిమిదేళ్ల తర్వాత ఛాన్స్.. కట్ చేస్తే! రీఎంట్రీ మ్యాచ్లో డకౌట్
టీమిండియా వెటరన్ ఆటగాడు కరుణ్ నాయర్ తన రీ ఎంట్రీలో తీవ్రనిరాశపరిచాడు. ఎనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత భారత జట్టులోకి తిరిగొచ్చిన.. కరుణ్ నాయర్కు తన లభించిన అవకాశాన్నిసద్వినియోగం చేసుకోలేకపోయాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో కరుణ్ డకౌటయ్యాడు.మొదటి ఇన్నింగ్స్లో ఆరో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన నాయర్ నాలుగు బంతులు ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్లో ఓలీ పోప్ సంచలన క్యాచ్ అందుకోవడంతో నాయర్ డకౌట్ అవ్వాల్సి వచ్చింది. అంతకుముందు అరంగేట్ర ఆటగాడు సాయిసుదర్శన్ కూడా తన ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు.టీమిండియా@471ఇక మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా 471 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 359/3 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన గిల్ సేన. అదనంగా 112 పరుగులు జోడించి తమ ఇన్నింగ్స్ను ముగించింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ శుబ్మన్ గిల్ (147, 227 బంతుల్లో 19 ఫోర్లు, 1 సిక్స్), రిషబ్ పంత్ (134, 178 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లు), యశస్వి జైస్వాల్ (101 159 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో చెలరేగారు.ఇంగ్లండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్స్టోక్స్, జోష్ టంగ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. బ్రైడాన్ కార్స్, షోయక్ బషీర్ చెరో వికెట్ సాధించారు.చదవండి: IND vs ENG: రిషబ్ పంత్ వరల్డ్ రికార్డు.. -
రిషబ్ పంత్ వరల్డ్ రికార్డు..
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ అద్బుతమైన సెంచరీ సాధించాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన పంత్.. వన్డే తరహాలో తన ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు.ఈ క్రమంలో పంత్ 146 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్ల సాయంతో తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. పంత్కు ఇది ఏడో టెస్టు సెంచరీ కావడం విశేషం. రిషబ్ సెంచరీ సాధించగానే సంతోషంతో మరోసారి ఫ్లిప్ జంప్ చేశాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది.106 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 451 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్(113)తో పాటు కెప్టెన్ రవీంద్ర జడేజా(1) ఉన్నాడు. కాగా ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన రిషబ్ పంత్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్..👉టెస్టు క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన భారత వికెట్ కీపర్ బ్యాటర్గా పంత్ చరిత్ర సృష్టించాడు. పంత్ ఇప్పటివరకు టెస్టుల్లో 7 సెంచరీలు సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా లెజెండ్ ఎంఎస్ధోని పేరిట ఉండేది. ధోని తన కెరీర్లో 6 టెస్టు సెంచరీలు సాధించాడు. తాజా శతకంతో ధోనిని పంత్ అధిగమించాడు.👉సేనా (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అత్యధిక టెస్టు రన్స్ చేసిన పర్యాటక జట్టు వికెట్ కీపర్గా పంత్ నిలిచాడు. పంత్ ఇప్పటివరకు సేనా దేశాల్లో 49 ఇన్నింగ్స్లలో 1746 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ వరల్డ్ రికార్డు కూడా ఎంఎస్ ధోని పేరిటే ఉండేది. ధోని తన కెరీర్లో సేనా దేశాల్లో 60 ఇన్నింగ్స్లు ఆడి 1731 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్తో ధోని వరల్డ్ రికార్డును పంత్ బ్రేక్ చేశాడు.👉విదేశీ గడ్డపై అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన మూడో వికెట్ కీపర్గా ఇంగ్లండ్కు చెందిన లెస్ అమెస్ రికార్డును పంత్ సమం చేశాడు. అమీస్ విదేశాల్లో ఐదు టెస్టు సెంచరీలు చేయగా.. పంత్ కూడా సరిగ్గా ఐదు సెంచరీలు చేశాడు. ఈ పర్యటనలో మరో సెంచరీ చేస్తే అమీస్ను అధిగమిస్తున్నాడు. ఈ జాబితాలో ఆసీస్ లెజెండరీ వికెట్ కీపర్ బ్యాటర్ ఆడమ్ గిల్క్రిస్ట్(10) అగ్రస్ధానంలో ఉన్నాడు. -
'శుబ్మన్ గిల్ ఒక అద్బుతం'.. యూటర్న్ తీసుకున్న భారత మాజీ క్రికెటర్
టీమిండియా టెస్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ తన తొలి మ్యాచ్లోనే సత్తాచాటాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మొదటి టెస్టులో గిల్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. తొలి రోజు ఆటముగిసే సమయానికి 127 పరుగులతో గిల్ అజేయంగా నిలిచాడు.ఇంగ్లండ్ గడ్డపై గిల్కు ఇదే మొదటి టెస్టు సెంచరీ కావడం గమనార్హం. ఈ క్రమంలో కెప్టెన్గా అతడిని ఎంపిక చేయడాన్ని విమర్శించిన నోళ్లే ఇప్పుడు శెభాష్ అంటున్నాయి. తొలుత కెప్టెన్గా గిల్ను వ్యతిరేకించిన భారత క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఇప్పుడు ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్లో గిల్ అద్బుతమైన టెక్నిక్తో బ్యాటింగ్ చేశాడని మంజ్రేకర్ కొనియాడాడు."కొన్ని రోజుల కిందట భారత టెస్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ను ఎంపికచేయడాన్ని నేను వ్యతిరేకించాను. గిల్ కంటే జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్గా బెటర్ అని అభిప్రాయపడ్డాను. ఆ సమయంలో సెలక్టర్లు సరైన నిర్ణయం తీసుకోలేదని నేను చెప్పుకొచ్చాను. కానీ నేను ఎక్కడా కూడా గిల్ కెప్టెన్గా విఫలమవుతాడని మాత్రం చెప్పలేదు.కెప్టెన్సీ భారం తన బ్యాటింగ్కు పడకుండా గిల్ చూసుకుంటాడని నేను ముందే ఊహించాను. కానీ విదేశాల్లో మాత్రం అతడి ప్రదర్శన ఇంకా మెరుగు పడాల్సి ఉంది. ఈ మ్యాచ్లో మాత్రం గిల్ అసాధరణ ప్రదర్శన కనబరిచాడు.శుబ్మన్ తన బ్యాటింగ్లో టెక్నికల్ లోపాలను సరిదిద్దుకున్నాడు. అందుకే విదేశీ గడ్డపై భారీ సెంచరీసాధించగలిగాడని" జియో హాట్స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజ్రేకర్ పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ -
అదృష్టమంటే ఇదే!.. దారుణంగా ఢీకొట్టుకున్నారు.. కానీ..
మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ (MPL) మ్యాచ్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రెండో పరుగు కోసం వికెట్ల మధ్య పరిగెత్తిన బ్యాటర్లు దారుణంగా ఢీకొట్టుకున్నారు. ఇద్దరూ కిందపడిపోయారు. అయితే, అనూహ్య రీతిలో ఇద్దరూ రనౌట్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. విషయం ఏమిటంటే..ఎంపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్లో రాయగడ్ రాయల్స్ (Raigad Royals)- కొల్హాపూర్ టస్కర్స్ తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన.. రాహుల్ త్రిపా (Rahul Tripathi)ఠి కెప్టెన్సీలోని కొల్హాపూర్ 165 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన క్రమంలో రాయల్స్ ఓపెనర్ విక్కీ ఓస్త్వాల్ (Vicky Ostwal) పరుగుకు యత్నించాడు.దారుణంగా ఢీకొట్టుకున్నారునాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న మరో ఓపెనర్ సిద్దేశ్ వీర్తో కలిసి సింగిల్ పూర్తి చేశాడు. అయితే, రెండో పరుగు కోసం వెళ్లే క్రమంలో ఇద్దరూ బంతిని చూస్తూ పరిగెత్తగా దారుణంగా ఢీకొట్టుకున్నారు. తలలు గుద్దుకుని కిందపడిపోయారు. దెబ్బకు ఇద్దరు చేతుల్లోని బ్యాట్లు కూడా నేలమీద పడిపోయాయి.ఇంతలో నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపున ఎన్న ఫీల్డర్ చేతికి బంతి చిక్కగా బ్యాటర్ పరుగున వచ్చి క్రీజును చేరుకున్నాడు. ఈ క్రమంలో బంతిని స్ట్రైకర్ ఎండ్ వైపు విసరగా దానిని అందుకున్న కెప్టెన్ త్రిపాఠి డైరెక్ట్ త్రో చేయగా.. ఈసారీ విక్కీ కూడా లేచి పరుగున వెళ్లి క్రీజును దాటాడు. అంతేకాదు బంతి బౌండరీ వైపు దూసుకువెళ్లింది.దీంతో రెండుసార్లు రనౌట్ చేయాలని ప్రయత్నించి విఫలం కావడంతో పాటు అదనంగా పరుగులు సమర్పించుకోవడం కొల్హాపూర్ వంతైంది. మరోవైపు.. దారుణంగా ఢీకొట్టుకున్నా రాయల్స్ ఓపెనర్లు.. కిందపడినా అదృష్టవశాత్తూ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో పాటు పరుగులు రాబట్టడం విశేషం.గెలిచి.. క్వాలిఫయర్-2లో అడుగుపెట్టిఇక ఈ మ్యాచ్లో విక్కీ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. 54 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 74 పరుగులు సాధించాడు. మిగతా వాళ్లలో సిద్దేశ్ వీర్ 39, నీరజ్ జోషి(37 నాటౌట్) రాణించారు. ఈ క్రమంలో రాయల్స్ కొల్హాపూర్ జట్టుపై ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. ఈ క్రమంలో పుణేరి బప్పాతో రాయల్స్ తదుపరి తలపడనుంది. ఈ మ్యాచ్లో విజేతగా నిలిచిన జట్టు ఫైనల్లో ఈగల్ నాసిక్ను ఢీకొట్టనుంది.చదవండి: బుర్ర వాడేవాళ్లు ఇలాంటి పనిచేయరు: స్టోక్స్పై మాజీ కెప్టెన్ ఫైర్Collided, but never gave up — still made the crease! ✅Vicky Ostwal. TAKE A BOW 👏#AdaniMPL2025 #RRvsPBGKT #ThisIsMahaCricket pic.twitter.com/LXsssa740e— MPLT20Tournament (@mpltournament) June 20, 2025 -
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
టెస్టు క్రికెట్లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ మరోసారి తన సత్తా చాటాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో పంత్ ఫియర్లెస్ ఇన్నింగ్స్ ఆడాడు. యశస్వి జైశ్వాల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన రిషబ్.. తనదైన స్టైల్లో బ్యాటింగ్ చేశాడు.మొదటి రోజు ఆటముగిసే సమయానికి పంత్ 65 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో ఇప్పటివరకు 6 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో పంత్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.హిట్మ్యాన్ రికార్డు బ్రేక్..వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ హిస్టరీలోనే అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా పంత్ రికార్డులెక్కాడు. పంత్ ఇప్పటివరకు డబ్ల్యూటీసీలో 35 మ్యాచ్లు ఆడి 58 సిక్సర్లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ(56) పేరిట ఉండేది.తాజా మ్యాచ్తో రోహిత్ను రిషబ్ అధిగమించాడు. ఇక ఓవరాల్గా ఈ ఫీట్ సాధించిన జాబితాలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(83) అగ్రస్ధానంలో ఉండగా.. పంత్ రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్లో మూడు వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో కెప్టెన్ శుబ్మన్ గిల్(127 నాటౌట్), యశస్వి జైశ్వాల్(101) సెంచరీలతో మెరిశారు.చదవండి: అలా అయితే అవుట్ అయిపోతావు! గిల్కు పంత్ వార్నింగ్.. వైరల్