breaking news
Sports
-
ఒమన్ పై పాకిస్తాన్ ఘన విజయం
ఆసియాకప్-2025లో దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో పాకిస్తాన్ ఒమన్ పై ఘన విజయం సాధించింది. 161 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఒమన్ 16.4 ఓవర్లలో 67 పరుగులకే తమ ఇన్నింగ్స్ ముగించింది.దీంతో పాకిస్తాన్ 93 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. ఒమన్ బ్యాటర్ల లో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్ సాధించగలిగారు. వారిలో మహమ్మద్ మిర్జా 27 పరుగులతో టాప్ స్కోరర్ కాగా , అమీర్ కలీం 13 పరుగులు , షకీల్ అహ్మద్ 10 పరుగులు చేశారు. పాకిస్తాన్ బౌలర్ల లో సయీమ్ అయూబ్ , సుఫియాన్ ముఖీమ్ , ఫహీమ్ అష్రఫ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా , మహ్మద్ నవాజ్, షాహీన్ షా ఆఫ్రిది, అబ్రార్ అహ్మద్ తలో వికెట్ సాధించారు.ఇక మొదట టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 160 పరుగులు మాత్రమే చేయగల్గింది. తొలి ఓవర్లోనే ఇన్ ఫామ్ బ్యాటర్ సైమ్ అయూబ్ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మహ్మద్ హరిస్(43 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 66).. సాహిబ్జాదా ఫర్హాన్(29 బంతుల్లో 29)తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. ఫర్హాన్ దాదాపు 10 ఓవర్ల పాటు క్రీజులో ఉన్నప్పటికి బ్యాట్ ఝూళిపించలేకపోయాడు. తన చెత్త బ్యాటింగ్తో జట్టుకు భారంగా మారాడు. అతడు ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన ఫఖార్ జమాన్(16 బంతుల్లో 23) తన మార్క్ చూపించలేకపోయాడు. కెప్టెన్ సల్మాన్ అలీ అఘా అయితే తొలి బంతికే గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. ఆఖరిలో మహ్మద్ నవాజ్(10 బంతుల్లో 19) కాస్త దూకుడుగా ఆడాడు. ఇక ఒమన్ బౌలర్లలో షా ఫైజల్, అమీర్ కలీం తలా మూడు వికెట్లు తీయగా.. నదీమ్ ఒక్క వికెట్ తీశాడు. -
పాకిస్తాన్కు చుక్కలు చూపించిన పసి కూన..
ఆసియాకప్-2025లో దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో పాకిస్తాన్ బ్యాటర్లకు ఒమన్ బౌలర్లు చుక్కలు చూపించారు. పాక్ బ్యాటర్లలో మహ్మద్ హరిస్ మినహా మిగితా బ్యాటర్లు ఎవరూ తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు.టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 160 పరుగులు మాత్రమే చేయగల్గింది. తొలి ఓవర్లోనే ఇన్ ఫామ్ బ్యాటర్ సైమ్ అయూబ్ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మహ్మద్ హరిస్(43 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 66).. సాహిబ్జాదా ఫర్హాన్(29 బంతుల్లో 29)తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. ఫర్హాన్ దాదాపు 10 ఓవర్ల పాటు క్రీజులో ఉన్నప్పటికి బ్యాట్ ఝూళిపించలేకపోయాడు. తన చెత్త బ్యాటింగ్తో జట్టుకు భారంగా మారాడు. అతడు ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన ఫఖార్ జమాన్(16 బంతుల్లో 23) తన మార్క్ చూపించలేకపోయాడు. కెప్టెన్ సల్మాన్ అలీ అఘా అయితే తొలి బంతికే గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. ఆఖరిలో మహ్మద్ నవాజ్(10 బంతుల్లో 19) కాస్త దూకుడుగా ఆడాడు. ఇక ఒమన్ బౌలర్లలో షా ఫైజల్, అమీర్ కలీం తలా మూడు వికెట్లు తీయగా.. నదీమ్ ఒక్క వికెట్ తీశాడు. -
చిన్ననాటి స్నేహితుడిని కలిసిన గిల్.. 14 ఏళ్ల తర్వాత! వీడియో
టీమిండియా స్టార్ ప్లేయర్, టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ తన చిన్ననాటి స్నేహితుడు సిమ్రన్జీత్ సింగ్ను 14 ఏళ్ల తర్వాత కలిశాడు. ఇందుకు ఆసియాకప్-2025 వేదికైంది. పంజాబ్కు చెందిన స్పిన్నర్ సిమ్రంజీత్ సింగ్ ప్రస్తుతం యూఏఈ తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు.ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం దుబాయ్ వేదికగా యూఏఈ, భారత్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో యూఏఈను తొమ్మిది వికెట్ల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్ ముగిశాక గిల్.. సిమ్రన్జీత్ వద్దకు వెళ్లి ఆలింగనం చేసుకుంటూ ఆప్యాయతగా మాట్లాడాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ మ్యాచ్లో గిల్ కేవలం 9 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్స్తో 20 పరుగులు చేశాడు. అతడితో పాటు అభిషేక్ శర్మ( 16 బంతుల్లో 30) మెరుపులు మెరిపించాడు. దీంతో 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం 4.3 ఓవర్లలో చేధించింది.నాకు గిల్ తెలుసు..కాగా భారత్తో మ్యాచ్కు ముందు పీటీఐతో మాట్లాడిన సిమ్రన్జీత్.. గిల్ తనకు చిన్ననాటి నుంచి తెలుసు అని చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు అతడికి తాను గుర్తున్నానో లేదో తెలియదని ఈ యూఏఈ స్పిన్నర్ పేర్కొన్నాడు. కానీ ఇప్పుడు గిల్ కలిసి మాట్లాడడంతో సిమ్రన్జీత్ ఆనందంలో మునిగి తేలిపోతున్నాడు. ఇక భారత్ తమ తదుపరి మ్యాచ్లో ఆదివారం దుబాయ్ వేదికగా పాకిస్తాన్తో తలపడనుంది.When Shubman Gill Meets his childhood friend after 14 years | Asia Cup | Asia Cup 2025 | Simranjeet Singh | UAE | India | Team India | Ind vs uae...#Cricket #teamindia #india #shubmangill #shubman #asiacup #asiacup2025 #indvsuae #simranjeetsingh #shubmangillchildhoodfriend pic.twitter.com/WFQwrzIrPf— Dinesh Bedi (@dineshbedi6) September 11, 2025 -
తోపు, తురుము అన్నారు.. కట్ చేస్తే? తొలి బంతికే ఔట్
ఆసియాకప్-2025కు ముందు పాకిస్తాన్ యువ ఓపెనర్ సైమ్ అయూబ్పై భారీ అంచనాలు ఉండేవి. ద్వైపాక్షిక సిరీస్లలో అద్బుతంగా రాణిస్తున్న అయూబ్.. ఈ ఖండాంతర టోర్నీలో కూడా దుమ్ములేపుతాడని అంతా భావించారు. కానీ ఈ యువ ఆటగాడు అందరి అంచనాలను తలకిందలు చేశాడు.ఈ మెగా ఈవెంట్లో భాగంగా దుబాయ్ వేదికగా ఒమన్తో జరుగుతున్న మ్యాచ్లో యూబ్ తీవ్ర నిరాశపరిచాడు. గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్లో అయూబ్ తన ఎదుర్కొన్న తొలి బంతికే వికెట్ల ముందు దొరికిపోయాడు. పాక్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసిన ఒమన్ పేసర్ షా ఫైజల్.. రెండో బంతిని మిడిల్ స్టంప్ దిశగా ఫుల్లర్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు.ఆ బంతిని అయూబ్ కాస్త బెండ్ అయ్యి లెగ్ సైడ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్కు మిస్స్ అయ్యి బ్యాక్ ప్యాడ్కు తాకింది. దీంతో బౌలర్తో పాటు ఫీల్డర్లు ఎల్బీకి అప్పీల్ చేయగా.. అంపైర్ వెంటనే ఔట్ అని వేలు పైకెత్తాడు. ఆ తర్వాత అయూబ్ రివ్యూ తీసుకున్నప్పటికి ఫలితం మాత్రం ఒమన్కు ఫేవర్గానే వచ్చింది. బంతి క్లియర్గా మిడిల్ స్టంప్కు తాకినట్లు తేలింది. దీంతో నిరాశతో అయూబ్ పెవిలియన్కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. తొలి బంతికే ఔటైన అయూబ్ నెటిజన్లు ట్రోలు చేస్తున్నారు. ఎందుకంటే పాక్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్.. జస్ప్రీత్ బుమ్రాను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆదివారం దుబాయ్ వేదికగా భారత్-పాక్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో బుమ్రా బౌలింగ్లో అయూబ్ ఆరు సిక్స్లు కొడతాడని అహ్మద్ బిల్డప్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు అయూబ్ పసికూన ఒమన్పై ఆడలేకపోయాడు.💥 Golden Duck! Saim Ayub trapped plumb LBW, Pakistan lose review early!#AsiaCup2025 #Pakistan #Oman #starzplay pic.twitter.com/cJ74GBVZ7q— Cricket on STARZPLAY (@starzplaymasala) September 12, 2025 -
పాక్తో మ్యాచ్.. టీమిండియా తుది జట్టు ఇదే! అతడికి నో ఛాన్స్?
ఆసియా కప్ 2025లో భాగంగా సెప్టెంబర్ 14న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్లు దుబాయ్ వేదికగా తలపడనున్నాయి. ఈ దాయాదుల పోరు కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ మెగా టోర్నీని ఇప్పటికే టీమిండియా అద్బుతమైన విజయంతో ప్రారంభించింది.బుధవారం దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో యూఏఈను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 4.3 ఓవర్లలోనే భారత్ ఊదిపడేసింది. ఇప్పుడు పాకిస్తాన్పై కూడా అదే జోరును కొనసాగించాలని మెన్ ఇన్ బ్లూ భావిస్తోంది. మరోవైపు పాక్ తమ తొలి మ్యాచ్లో శుక్రవారం దుబాయ్ వేదికగానే ఒమన్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో పసికూన ఒమన్ను పాక్ ఓడించడం దాదాపు ఖాయం అని చెప్పాలి. కానీ ఆదివారం మాత్రం పాక్కు భారత్ నుంచి కఠిన సవాల్ ఎదురుకానుంది. బ్యాటింగ్, బౌలింగ్లో దుమ్ములేపుతున్న సూర్య సేనను పాక్ ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి.నో ఛేంజ్..?కాగా పాక్తో మ్యాచ్కు భారత తుది జట్టులో ఎటువంటి మార్పులు చోటు చేసుకోపోవచ్చు. యూఈఏతో ఆడిన ప్లేయింగ్ ఎలెవన్తో టీమిండియా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. తుది జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్గా సంజూ శాంసన్ను కొనసాగించనున్నారు.యూఏఈతో మ్యాచ్లో సంజూకు బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు. ఈ కేరళ ఆటగాడు మిడిలార్డర్లో బ్యాటింగ్కు రానున్నాడు. ఈ మ్యాచ్లో కూడా భారత ముగ్గురు స్పిన్నర్లతో ఆడే అవకాశముంది. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఇద్దరూ స్పెషలిస్టు స్పిన్నర్లగా కొనసాగనున్నారు. దీంతో యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ మరోసారి బెంచ్కే పరిమితమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా ప్రధాన పేసర్గా ఉండనున్నాడు. అతడితో పాటు మీడియం పేస్ బౌలర్లు శివమ్ దూబే, హార్ధిక్ పాండ్యా బంతిని పంచుకోనున్నారు.భారత్ తుది జట్టు(పాకిస్తాన్)అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తిచదవండి: టీమిండియాలో నో ఛాన్స్.. ఆ కసి అక్కడ చూపించేశాడు! 12 ఫోర్లు, 2 సిక్స్లతో -
టీమిండియాలో నో ఛాన్స్.. ఆ కసి అక్కడ చూపించేశాడు! 12 ఫోర్లు, 2 సిక్స్లతో
దులీప్ ట్రోఫీ-2025లో సౌత్ జోన్తో జరుగుతున్న ఫైనల్లో సెంట్రల్ జోన్ పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 384 పరుగులు చేసింది. క్రీజులో యష్ రాథోడ్(137), శరన్ష్ జైన్ ఉన్నారు. వీరిద్దరూ ఐదో వికెట్కు 118 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు.సెంట్రల్ జోన్ వికెట్ల పడగొట్టడానికి సౌత్ జోన్ బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అంతకుముందు సెంట్రల్ జోన్ కెప్టెన్, ఆర్సీబీ సారథి రజత పాటిదార్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 50/0 ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను మొదలు పెట్టిన సెంట్రల్ జోన్ ఆరంభంలోనే అక్షయ్ వాడ్కర్ (52 బంతుల్లో 20, 3 ఫోర్లు) వికెట్ను కోల్పోయింది.ఆ తర్వాత సెంట్రల్ జోన్ శుబ్మ్ శర్మ(6), డానిశ్ మాలేవర్ (64 బంతుల్లో 53 బ్యాటింగ్; 5 ఫోర్లు) వికెట్లను రెండు ఓవర్ల వ్యవధిలోనే కోల్పోయింది. ఈ సమయంలో పాటిదార్ ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. వన్డే తరహాలో తన ఇన్నింగ్స్ను కొనసాగించిన పాటిదార్.. కేవలం 112 బంతుల్లోనే తన 15వ ఫస్ట్ క్లాస్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 115 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్లతో 101 పరుగులు చేశాడు. అంతేకాకుండా యష్ రాథోడ్తో కలిసి నాలుగో వికెట్కు 167 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని ఈ మధ్యప్రదేశ్ ఆటగాడు నెలకొల్పాడు. సౌత్ జోన్ బౌలర్లలో గుర్జప్నీత్ సింగ్ మూడు, నిదేశ్, కౌశిక్ తలా వికెట్ సాధించారు. సెంట్రల్ జోన్ ప్రస్తుతం 235 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.టీమిండియాలోకి రీ ఎంట్రీ?వెస్టిండీస్తో టెస్టు సిరీస్కు ముందు పాటిదార్ సూపర్ సెంచరీతో సెలక్టర్లకు సవాలు విసిరాడు. ఆస్ట్రేలియా-ఎతో సిరీస్కు ఎంపిక చేసిన భారత-ఎ జట్టులో పాటిదార్కు చోటు దక్కకపోవడం అందరిని ఆశ్చర్యపరిచాడు. గత కొంత కాలంగా దేశవాళీ క్రికెట్లో అద్బుతంగా రాణిస్తున్నప్పటికి పాటిదార్ను సెలక్టర్లు పరిగణలోకి తీసుకులోదు. దులీప్ ట్రోఫీలో కూడా పాటిదార్ దుమ్ములేపుతున్నాడు. ఒకవేళ దులీప్ ట్రోఫీలో ప్రదర్శనలను పరిగణలోకి తీసుకుంటే వెస్టిండీస్తో టెస్టు సిరీస్కు పాటిదార్ ఎంపికయ్యే అవకాశముంది. ఇప్పటికే టీమిండియా టెస్టుల్లో అరంగేట్రం చేసిన పాటిదార్ తన మార్క్ చూపించలేకపోయాడు. ప్రస్తుత పరిస్థితుల బట్టి అతడి రీ ఎంట్రీ కష్టమే అనే చెప్పాలి.చదవండి: రూట్ ఒక్క సెంచరీ చెయ్.. లేదంటే మా నాన్న అన్నంత పనిచేస్తాడు: హేడెన్ కుమార్తె -
పాకిస్తాన్ డేంజరస్ ప్లేయర్లు.. ఎప్పుడు ఎలా ఆడతారో తెలీదు!
భారత్-పాకిస్తాన్ జట్లు క్రికెట్ మైదానంలో మరోసారి యుద్దానికి సిద్దమయ్యాయి. ఆసియాకప్-2025లో భాగంగా ఆదివారం(సెప్టెంబర్ 14) దుబాయ్ వేదికగా దాయాదుల పోరు జరగనుంది. చివరగా ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో ముఖాముఖి తలపడిన భారత్-పాక్.. ఇప్పుడు మళ్లీ ఆరు నెలల తర్వాత అభిమానులను ఉరూత్రలూగించనున్నాయి.ఈ మెగా టోర్నీలో భారత్ ఇప్పటికే అద్బుతమైన విజయంతో శుభారంభం చేసింది. దుబాయ్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్లో యూఏఈను 9 వికెట్ల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. ఇప్పుడు అదే మైదానంలో పాక్ ఒమన్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. పసికూన ఒమన్ను చిత్తు చేసి టోర్నీలో శుభారంభం చేయాలని పాక్ కూడా యోచిస్తోంది. పాకిస్తాన్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉంది. ట్రైసిరీస్ విజయంతో ఈ టోర్నీలో అడుగుపెట్టింది. అయితే బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్లు లేకపోయినప్పటికి చాలా మంది యంగ్ టాలెంటడ్ ఆటగాళ్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో పాక్ బలాలు, బలహీనతలపై ఓ లుక్కేద్దాం.పాకిస్తాన్ జట్టు ఎప్పుడూ ఎలా ఆడుతుందో ఎవరూ చెప్పలేరు. తమదైన రోజున వరల్డ్ నెం1 జట్టును ఓడించగలిగే పాకిస్తాన్.. కొన్నిసార్లు జింబాబ్వే, అఫ్గాన్ వంటి పసికూన చేతిలో సైతం ఘోర పరాజయాల పాలై విమర్శకులకు దొరకిపోతుంటుంది. అయితే పాక్ జట్టు ప్రస్తుతం బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో పటిష్టం కన్పిస్తోంది. జమాన్తో జాగ్రత్త..ఫఖర్ జమాన్ గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి రావడం మెన్ ఇన్ గ్రీన్కు మరింత బలాన్ని చేకూరుస్తోంది. జమాన్కు భారత్పై మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2017ను పాక్ సొంత చేసుకోడంలో జమాన్ది కీలక పాత్ర. భారత్తో జరిగిన ఫైనల్లో అతడు అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. టీమిండియాపై టీ20ల్లో అతడు పెద్దగా రన్స్ సాధించికపోయినప్పటికి.. వన్డేల్లో మాత్రం కేవలం 6 మ్యాచ్లు ఆడి 234 పరుగులు చేశాడు. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ పాక్కు మరోసారి కీలకం కానున్నాడు.వారిద్దరూ చాలా డేంజరస్..అతడితో పాటు యువ ఆటగాళ్లు సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్ల నుంచి భారత బౌలర్లకు గట్టి పోటీ ఎదురు కానుంది. టీ20ల్లో పాక్ కొత్త ఓపెనింగ్ జోడీ అయినా ఫర్హాన్, సైమ్లు.. ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉన్నారు. వీరిద్దరూ యూఏఈ ట్రైసిరీస్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయనప్పటికి.. విధ్వంసకర బ్యాటింగ్ చేసే సత్తా వీరికి ఉంది. ఫర్హాన్కు టీ20ల్లో145కు పైగా స్ట్రైక్ రేట్ ఉంది. అయూబ్ అయితే తన అరంగేట్రం నుంచి బ్యాట్తో పాటు బంతితో కూడా రాణిస్తూ వస్తున్నాడు. ఇక మిడిలార్డర్లో కెప్టెన్ సల్మాన్ అఘా.. నిలకడకు పెట్టింది పేరు. అతడు పరిస్థితిని బట్టి తన బ్యాటింగ్ గేర్లను మారుస్తూ ఉంటాడు. అతడితో కొత్త ఆటగాడు హసన్ నవాజ్ సైతం మెరుపులు మెరిపించలడు. నవాజ్ న్యూజిలాండ్పై 44 బంతుల్లోనే సెంచరీ చేసి చరిత్రకెక్కాడు. హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా వంటి వెటరన్లు ఉన్నారు. అయితే వికెట్ కీపర్ మహ్మద్ హరిస్ ఫామ్లో లేకపోవడం పాక్ మెనెజ్మెంట్ను కాస్త కలవరపెడుతోంది.ఆ నలుగురు..ఇక ఆసియా ఉపఖండ పిచ్లలపై ప్రధాన ఆయుధం స్పిన్ బౌలింగ్. ఈ విభాగంలో పాక్ చాలా పటిష్టంగా ఉంది. ముఖ్యంగా మహ్మద్ నవాజ్, అబ్రార్ అహ్మద్ నుంచి భారత బ్యాటర్లకు సవాలు ఎదురు కానుంది. ఛాంపియన్స్ ట్రోఫీ-2005లో గిల్ను అబ్రార్ ఔట్ చేసిన విధానం ఇప్పటికి గుర్తుండే ఉంటుంది. ఈ లెగ్ స్పిన్నర్ అద్బుతమైన బంతితో గిల్ను బోల్తా కొట్టించాడు. వీరిద్దరితో పాటు ఖుష్దిల్ షా, సుఫియాన్ ముకీమ్ బంతిని గింగిరాలు తిరిగేలా చేయగలరు.పేస్ బ్యాటరీ పవర్ ఫుల్..ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ చాలా పవర్ ఫుల్గా ఉంది. షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, హసన్ అలీలు వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉన్నారు. వీరందరికి బంతిని స్వింగ్, రివర్స్ స్వింగ్ చేయడం వెన్నతో పెట్టిన విధ్య. ముఖ్యంగా దుబాయ్ పిచ్లపై ఆడిన అనుభవం మనకంటే వారికే ఎక్కువగా ఉంది.ఆ కండీషన్స్ ఉపయోగించుకుని ఈ పేస్ త్రయం చెలరేగితే భారత బ్యాటర్లకు కష్టాలు తప్పవు. అఫ్రిదికి భారత్పై మంచి రికార్డు ఉంది. అయితే ఎన్ని బలాలు ఉన్న పాక్కు బలహీనతలు కూడా ఉన్నాయి. బ్యాటింగ్లో స్ధిరత్వం లేకపోవడం పాక్ ప్రధాన బలహీనతగా ఉంది.టాప్ ఆర్డర్ మీద ఆధారపడటం ఎక్కువగా ఆధారపడుతూ వస్తుంది. అదేవిధంగా ఫీల్డింగ్లో కూడా పాక్ పేలవ ప్రదర్శన కనబరుస్తూ వస్తుంది. చాలా మ్యాచ్ల్లో కాచులు డ్రాప్, రన్ అవుట్స్ మిస్ చేయడం చేస్తూ భారీ మూల్యం చెల్లించుకుంటోంది. కాగా ఆసియాకప్లో పాక్పై టీమిండియానే ఇప్పటివరకు పూర్తి ఆధిపత్యం చెలాయించింది.ఆసియా కప్ 2025 కోసం పాకిస్థాన్ జట్టు:సల్మాన్ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం, సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహీన్ షా ఆఫ్రిది, సుఫియాన్ ముఖీమ్ -
రూట్ ఒక్క సెంచరీ చెయ్.. లేదంటే మా నాన్న అన్నంత పనిచేస్తాడు: హేడెన్ కుమార్తె
సంప్రదాయ క్రికెట్లో యాషెస్ సిరీస్కున్న ప్రత్యేకత, విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 141 సంవత్సరాల చరిత్ర గల ఈ సిరీస్లో మరోసారి ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమవుతున్నాయి. ఈ ఏడాది యాషెస్ సిరీస్ నవంబర్ నుంచి జనవరి 8, 2026 వరకు జరుగుతుంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్కు ఈసారి ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనుంది.ఈ సిరీస్ ఆరంభానికి ఇంకా రెండు నెలల పైగా సమయం ఉన్నప్పటికి మాజీ క్రికెటర్లు మాత్రం తమ సవాల్లతో మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడన్.. ఇంగ్లండ్ స్టార్ జో రూట్ను ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశాడు. "యాషెస్ సిరీస్లో జో రూట్ కనీసం ఒక సెంచరీ అయినా సాధించకపోతే మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో నగ్నంగా నడుస్తా" అని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ బోల్డ్ ఛాలెంజ్పై హేడెన్ కుమార్తె, క్రికెట్ ప్రెజెంటర్ గ్రేస్ హేడెన్ స్పందించింది. "ప్లీజ్ రూట్ ఒక్కసెంచరీ చేయండి.. లేదంటే మా నాన్న అన్నంత పని చేస్తాడు" అని కామెంట్స్లో గ్రేస్ రాసుకొచ్చింది.ఒక్క సెంచరీ కూడా..వరల్డ్ క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా కొనసాగుతున్న జో రూట్.. ఆశ్చర్యకరంగా ఇప్పటివరకు ఆస్ట్రేలియా గడ్డపై కనీసం ఒక్క సెంచరీ కూడా సాధించలేకపోయాడు. ఏ ఫార్మాట్లోనూ అతడు సెంచరీ మార్క్ను అందుకోలేకపోయాడు. ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు రూట్ 14 టెస్ట్ మ్యాచ్లు, 16 వన్డేలు, మూడు టీ20లు ఆడాడు.ఆసీస్లో మూడు ఫార్మాట్లలో కలిపి రూట్ 9 హాఫ్ సెంచరీలు చేశాడు. అతడి అత్యధిక స్కోర్ 91 నాటౌట్గా ఉంది. అయితే ఓవరాల్గా ఆసీస్పై రూట్కు మంచి రికార్డు ఉంది. రూట్ తన కరీర్లో కంగారులపై నాలుగు సెంచరీలు చేశాడు. అవన్నీ కూడా తన స్వదేశంలో వచ్చినవే కావడం గమానార్హం. -
విరాట్- అనుష్క.. మమ్మల్ని కూడా బయటకు పొమ్మన్నారు!
భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli)కి ఉన్న అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అద్భుతమైన ఆట తీరుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ రన్మెషీన్.. వర్ధమాన క్రికెటర్లకు ఆదర్శప్రాయం. ఎంతో మంది యువ ఆటగాళ్లకు అతడొక రోల్మోడల్.కోహ్లిని నేరుగా కలిసి బ్యాటింగ్ మెళకువలు నేర్చుకోవాలని తహతహలాడే వారెందరో!.. తాము కూడా ఆ కోవకే చెందుతామని చెబుతోంది భారత మహిళా జట్టు స్టార్ క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues). అయితే, తాను, స్మృతి మంధాన (Smriti Mandhana) చేసిన పని వల్ల విరాట్ కోహ్లి, అతడి భార్య అనుష్క శర్మ కాస్త అసౌకర్యానికి గురికావాల్సి వచ్చిందని తాజాగా వెల్లడించింది.ఒకే హోటల్లో బస.. అనుష్క కూడా అక్కడే‘‘అప్పుడు భారత పురుష, మహిళా క్రికెట్ జట్లు న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నాయి. ఇరుజట్లకు ఒకే హోటల్లో బస ఏర్పాటు చేశారు. అప్పుడు స్మృతి, నేను కలిసి విరాట్ను కలవాలి అనుకున్నాం.మీతో మాట్లాడాలనుకుంటున్నాము అనగానే.. ‘ఓహ్.. ప్లీజ్.. మేము ఇక్కడే కేఫ్లో ఉన్నాము వచ్చేయండి’ అని కోహ్లి చెప్పాడు. అప్పుడు అనుష్క శర్మ కూడా అక్కడే ఉంది.మొదటి అర్ధగంట సేపు క్రికెట్ గురించి మాట్లాడాము. ఈ క్రమంలో .. నేను, స్మృతి భారత మహిళా క్రికెట్లో కీలక ప్లేయర్లుగా ఉండిపోతామని కోహ్లి అన్నాడు. మేమిద్దరం గొప్ప పేరు తెచ్చుకుంటామని అన్నాడు.ఇక చాలు.. బయటకు వెళ్లండిఆ తర్వాత బ్యాటింగ్ గురించి మాకు కొన్ని టిప్స్ ఇచ్చాడు. మా మాటలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ తర్వాత వ్యక్తిగత జీవితాల గురించి కూడా మాట్లాడుకున్నాము. ఏదో.. పాత స్నేహితులు చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్నట్లుగా మా సంభాషణలు కొనసాగాయి.అప్పటికి నాలుగు గంటలు గడిచిపోయింది. అప్పుడు కేఫ్ నిర్వాహకులు వచ్చి.. ‘సమయం దాటిపోయింది.. ఇక వెళ్లండి’ అని చెప్పేంత వరకు అక్కడే కూర్చున్నాము. సుమారుగా రాత్రి 11.30 గంటల ప్రాంతంలో మేము అక్కడి నుంచి వెళ్లిపోయాము’’ అని జెమీమా రోడ్రిగ్స్ గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంది.లండన్లోనే నివాసంకాగా బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమించిన విరాట్ కోహ్లి.. 2017లో ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు కుమార్తె వామిక, కుమారుడు అకాయ్ సంతానం. లండన్లో అకాయ్కు జన్మనిచ్చిన తర్వాత అనుష్క కోహ్లితో కలిసి అక్కడే ఎక్కువగా ఉంటోంది. మ్యాచ్లు ఉన్నపుడు మాత్రమే కోహ్లి భారత్కు వస్తున్నాడు. ఇక పెళ్లికి ముందు నుంచే కోహ్లితో పాటు అనుష్క కూడా టీమిండియా వెళ్లే పర్యటనల్లో భాగమయ్యేదన్న విషయం తెలిసిందే.చదవండి: 21 సార్లు డకౌట్ అయినా సరే.. జట్టులోనే.. అతడికి గంభీర్ చెప్పిందిదే.. -
బుమ్రా బౌలింగ్లో మా వాడు 6 సిక్స్లు కొడతాడు: పాక్ ప్లేయర్
ఆసియాకప్-2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్కు సమయం అసన్నమవుతోంది. సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్ధులు అమీతుమీ తెల్చుకోనున్నారు. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. భారత్ ఇప్పటికే తమ తొలి మ్యాచ్లో యూఏఈను చిత్తు చేయగా.. పాక్ జట్టు వారి మొదటి మ్యాచ్లో శుక్రవారం ఒమన్తో తలపడనుంది.పాకిస్తాన్ కూడా వారి తొలి మ్యాచ్లో సునాయసంగా విజయం సాధించే అవకాశముంది. కానీ అసలు సిసలైన సవాల్ ఆదివారం ఎదురుకానుంది. ఆసియాకప్లో పాక్పై టీమిండియాకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. మరోసారి దాయాదిపై తమ జోరును కొనసాగించాలని సూర్యకుమార్ సేన ఉవ్విళ్లూరుతోంది.ప్రత్యర్ధి పాక్ సైతం ఎలాగైనా టీమిండియాను ఓడించాలని పట్టుదలతో ఉంది. ఈ బ్లాక్ బ్లాస్టర్ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ తన్వీర్ అహ్మద్ సంచలన కామెంట్స్ చేశాడు. టీమిండియా సూపర్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో పాక్ యవ ఓపెనర్ సైమ్ అయూబ్ వరుసగా ఆరు సిక్స్లు కొడతాడని తన్వీర్ బిల్డప్ ఇచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన్వీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. దీంతో భారత అభిమానులు తన్వీర్కు కౌంటరిస్తున్నారు. బుమ్రా బౌలింగ్లో అయూబ్ కనీసం ఫోర్ అయినా కొడతాడా? అని ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. కాగా ప్రపంచ క్రికెట్లో బుమ్రా నెంబర్ వన్ బౌలర్గా కొనసాగుతున్నాడు. స్మిత్, రూట్, స్టోక్స్ వంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్లు సైతం బుమ్రా బౌలింగ్ను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడ్డారు. అటువంటిది ఆరు బంతుల్లో ఆరు సిక్స్లు అంటే అది కలలో కూడా జరగదు. అయితే పాక్ జట్టులో అయూబ్ గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. 41 టీ20ల్లో 816 పరుగులు చేశాడు. ఆఫ్ బ్రేక్ బౌలింగ్ కూడా అయూబ్ చేయగలడు.చదవండి: మా జట్టుకు మాత్రం.. గిల్ ఇలా ఆడడు: గుజరాత్ టైటాన్స్ కోచ్ -
మా జట్టుకు మాత్రం.. గిల్ ఎప్పుడూ ఇలా ఆడడు: కోచ్
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నీతో అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేశాడు టీమిండియా స్టార్ శుబ్మన్ గిల్ (Shubman Gil). దాదాపు ఏడాది విరామం తర్వాత యూఏఈతో మ్యాచ్ సందర్భంగా బుధవారం రీఎంట్రీ ఇచ్చాడు. అభిషేక్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్ ఆరంభించిన గిల్ ధనాధన్ దంచికొట్టాడు.గిల్ ధనాధన్యూఏఈ విధించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గిల్ విశ్వరూపం ప్రదర్శించాడు. పసికూనపై ఆది నుంచే ఎదురుదాడి ఆరంభించాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతి (రెండో ఓవర్ మొదటి బంతి)నే ఫోర్గా మలిచిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. అదే ఓవర్లో ఓ సిక్సర్ కూడా బాదాడు.టీమిండియా ఘన విజయం ఇక ఈ మ్యాచ్లో మొత్తంగా తొమ్మిది బంతులు ఆడిన శుబ్మన్ గిల్.. రెండు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 20 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి స్ట్రైక్రేటు 222.22. ఇదిలా ఉంటే.. గిల్తో పాటు అభిషేక్ శర్మ (16 బంతుల్లో 30), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (2 బంతుల్లో 7 నాటౌట్) రాణించడంతో 4.3 ఓవర్లలోనే పని పూర్తి చేసింది టీమిండియా. యూఏఈని తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించి ఘన విజయం సాధించింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, ఐపీఎల్ ఫ్రాంఛైజీ బ్యాటింగ్ కోచ్ పార్థివ్ పటేల్.. తమ కెప్టెన్ శుబ్మన్ గిల్ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టైటాన్స్కు ఆడేటపుడు గిల్లో ఇలాంటి దూకుడు చూడలేదని అన్నాడు. ‘‘తొలి బంతి నుంచే గిల్ అటాకింగ్ మోడ్లోకి వెళ్లిపోయాడు.మా జట్టుకు మాత్రం.. గిల్ ఇలా ఆడడుఆ తర్వాత వెంటనే.. క్రీజు బయటకు వచ్చి మరీ ఫోర్ బాదాడు. అదే ఓవర్లో సిక్స్ కూడా కొట్టాడు. గుజరాత్ టైటాన్స్కు ఆడేటపుడు అతడిలో ఇలాంటి దూకుడు ఎప్పుడూ చూడలేదు. నిజానికి ఇక్కడ కుదురుకునేందుకు గిల్ కాస్త సమయం తీసుకుంటాడు.కానీ టీమిండియా తరఫున ఈ మ్యాచ్లో ఎనిమిది మంది బ్యాటర్లు ఉన్న కారణంగా ఆది నుంచే దూకుడు ప్రదర్శించాడు. అద్భుతంగా ఆడాడు కూడా!’’ అని పార్థివ్ పటేల్ గిల్ను ప్రశంసించాడు. టీ20 జట్టు వైస్ కెప్టెన్గాకాగా టైటాన్స్కు సారథ్యం వహించడంతో పాటు ఓపెనర్గానూ గిల్ సేవలు అందిస్తున్నాడు. ఇటీవలే ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా టీమిండియా టెస్టు కెప్టెన్గా గిల్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా బ్యాట్తో ఇరగదీసిన ఈ పంజాబీ బ్యాటర్.. కెప్టెన్గానూ 2-2తో సిరీస్ సమం చేయగలిగాడు.ఇక భవిష్యత్తులో టీమిండియా మూడు ఫార్మాట్లలో గిల్ను కెప్టెన్ను చేయాలనే ఉద్దేశంతో.. ఇటీవలే టీ20 జట్టు వైస్ కెప్టెన్గా బీసీసీఐ తిరిగి నియమించింది. ప్రస్తుతం టీమిండియాకు వన్డేల్లో రోహిత్ శర్మ, టీ20లలో సూర్యకుమార్ యాదవ్, టెస్టుల్లో శుబ్మన్ గిల్ కెప్టెన్లుగా పనిచేస్తున్నారు.చదవండి: 21 సార్లు డకౌట్ అయినా సరే.. జట్టులోనే.. అతడికి గంభీర్ చెప్పిందిదే.. -
చెమటలు గక్కిన హార్దిక్.. పడబోయిన రింకూ.. బీసీసీఐ వీడియో వైరల్
టీమిండియా ఆటగాళ్లు ‘బ్రాంకో టెస్టు’ (Bronco Test)లో భాగంగా చెమటలు గక్కారు. భారత జట్టు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ అడ్రియాన్ లీ రౌక్స్ (Adrian Le Roux) ఆధ్వర్యంలో కఠిన శ్రమకోరుస్తూ ప్రాక్టీస్ చేశారు. కాగా ఆటగాళ్ల ఫిట్నెస్ పరీక్ష కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవల బ్రాంకో టెస్టును ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే.1200 మీటర్ల పరుగుసాధారణంగా రగ్బీ ఆటగాళ్లు ఏరోబిక్, కార్టియోవాస్క్యులర్ కెపాసిటీని పెంచుకునేందుకు ఈ టెస్టును ఉపయోగిస్తున్నారు. ఇందులో 0 మీటర్ల నుంచి మొదలు పెట్టి 60 మీ... పరిగెత్తి.. ఆ తర్వాత 0- 40 మీ.. 0-20 మీ. పరుగు తీయాలి. మొత్తంగా 240 మీటర్లను ఓ సెట్లో పూర్తి చేయాలి. మొత్తంగా ఐదు సెట్లను అంటే.. 1200 మీటర్లను ఆరు నిమిషాల్లో పూర్తి చేయాలి.చెమటలు గక్కిన హార్దిక్.. పడబోయిన రింకూఇక ఆసియా కప్-2025లో భాగంగా సెప్టెంబరు 14నాటి పాకిస్తాన్తో మ్యాచ్కు టీమిండియా తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో మైదానంలోనే రౌక్స్.. ఆటగాళ్లకు బ్రాంకో టెస్టు నిర్వహించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ విడుదల చేసింది. హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా చెమటలు గక్కగా.. రింకూ కిందపడిపోబోయాడు. మిగతా ఆటగాళ్లు సైతం పరుగు పూర్తి చేసేందుకు తీవ్రంగా కష్టపడ్డారు.ప్రపంచంలోని ఏ మూలకు వెళ్లినాఈ విషయం గురించి రౌక్స్ మాట్లాడుతూ.. ‘‘ఈరోజు మేము బ్రాంకో టెస్టు రన్ చేశాము. ఇదేమీ కొత్త రకం పరీక్ష కాదు. వివిధ క్రీడల్లో ఇప్పటికే చాలా ఏళ్లుగా దీనిని వాడుతున్నారు.ఇదొక ఫీల్డ్ టెస్టు. ఎక్కడైనా దీనిని నిర్వహించవచ్చు. ప్రపంచంలోని ఏ మూలకు వెళ్లినా మేము దీనిని ఉపయోగించుకోవచ్చు. ట్రెయినింగ్ పరంగా.. ఆటగాళ్ల శారీరక దృఢత్వాన్ని పరీక్షించేందుకు .. ఇలా రెండు విధాలుగా ఇది ఉపయోగపడుతుంది.శారీరకంగా బలంగా ఉంటేనే..ఆటగాళ్ల ఏరోబిక్ ఫిట్నెస్ పెంచుకోవడానికి సహకరిస్తుంది. క్రికెట్ నైపుణ్యాలతో కూడిన ఆట. అయితే, ఆటగాళ్లు పూర్తి ఫిట్గా ఉన్నపుడే వారి కెరీర్సుదర్ఘీ కాలం కొనసాగుతుంది. శారీరకంగా బలంగా ఉన్నపుడే అన్ని రకాల సవాళ్లకు ఆటగాళ్లు సిద్ధం కాగలుగుతారు. మా ఆటగాళ్లు అద్బుతం. వారి హార్డ్వర్క్తో నన్నెంతగానో ఆకట్టుకుంటున్నారు.నేను గతంలో ఐపీఎల్ జట్లతో పనిచేశాను. ఎంతో మంది ఆటగాళ్లను చూశాను. ఇప్పుడిది నాకు కొత్త జట్టే. అయినా.. గతంలో ఇక్కడ పనిచేసిన అనుభవం నాకు ఉంది. ఇలాంటి పోరాట పటిమ ఉన్న జట్టుతో కలిసి ఉండటం గర్వంగా ఉంది’’ అని జట్టు పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.చదవండి: 21 సార్లు డకౌట్ అయినా సరే.. జట్టులోనే.. అతడికి గంభీర్ చెప్పిందిదే.. View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
ఇలాంటివి మనకు అవసరమా సూర్య?.. గట్టిగానే ఇచ్చిపడేశాడు!
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) వ్యవహార శైలిపై భారత మాజీ క్రికెటర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా.. సూర్య తీరు విమర్శలకు దారితీసే విధంగా ఉందన్నాడు. అయితే, మాజీ కెప్టెన్ అజింక్య రహానే మాత్రం సూర్య చేసింది సరైన పనేనంటూ మద్దతు పలికాడు.అసలేం జరిగిందంటే... ఆసియా కప్-2025 (Asia Cup) టీ20 టోర్నమెంట్లో భాగంగా టీమిండియా తమ తొలి మ్యాచ్లో యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో బుధవారం తలపడింది. దుబాయ్లో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.57 పరుగులకే ఆలౌట్ఈ క్రమంలో ఆకాశమే హద్దుగా చెలరేగిన భారత బౌలర్లు యూఏఈని 57 పరుగులకే ఆలౌట్ చేశారు. కుల్దీప్ యాదవ్ నాలుగు, శివం దూబే మూడు వికెట్లు కూల్చగా.. అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. యూఏఈ బ్యాటర్లలో ఓపెనర్ అలీషాన్ షరాఫూ (22) పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు.సూర్యకుమార్ యాదవ్ క్రీడాస్ఫూర్తిఇదిలా ఉంటే.. యూఏఈ పదో నంబర్ బ్యాటర్ జునైద్ సిద్దిఖీ విషయంలో సూర్యకుమార్ యాదవ్ క్రీడాస్ఫూర్తి కనబరిచాడు. యూఏఈ ఇన్నింగ్స్లో 13వ ఓవర్ను శివం దూబే వేశాడు. ఒకటో బంతికి ధ్రువ్ పరాశర్ (1)ను దూబే అవుట్ చేయగా జునైద్ క్రీజులోకి వచ్చాడు.ఈ క్రమంలో దూబే షార్ట్ డెలివరీ సంధించగా.. దానిని షాట్ ఆడబోయి జునైద్ విఫలమయ్యాడు. అయితే, దూబే బౌలింగ్ కోసం రన్ మొదలుపెట్టిన సమయంలో అతడి టవల్ జారి పడగా.. జునైద్ అటు వైపు చూసి సైగ చేశాడు. ఇంతలో బంతిని అందుకున్న భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ దానిని వికెట్లకు గిరాటేశాడు.అప్పీలును వెనక్కి తీసుకుని.. అప్పటికి జునైద్ క్రీజు బయట ఉండగా.. అంపైర్ అతడిని అవుట్గా ప్రకటించాడు. అయితే, కెప్టెన్ సూర్య మాత్రం తమ అప్పీలును వెనక్కి తీసుకుని.. జునైద్ను తిరిగి బ్యాటింగ్కు రావాల్సిందిగా ఆహ్వానించాడు. ఇలాంటివి అవసరమా సూర్య?ఈ విషయంపై స్పందించిన ఆకాశ్ చోప్రా.. ‘‘పాకిస్తాన్తో సెప్టెంబరు 14 నాటి మ్యాచ్లో మాత్రం ఇలా అస్సలు జరిగి ఉండేది కాదు. సల్మాన్ ఆఘా.. 14 ఓవర్లో బ్యాటింగ్ చేస్తున్నపుడు మ్యాచ్ రసవత్తరంగా ఉన్న వేళ.. సూర్య అస్సలు ఇలాంటి పని చేసి ఉండేవాడు కాదు. సంజూ అద్భుతంగా స్పందించి వికెట్లను గిరాటేశాడు. అతడు చేసింది సరైన పని.బ్యాటర్ క్రీజు బయట ఉన్నాడు కాబట్టి అది కచ్చితంగా అవుటే అని నా అభిప్రాయం. కానీ సూర్య ఇలా చేయడం వల్ల మున్ముందు పరిస్థితులు ఇబ్బందికరంగా మారతాయి. పాకిస్తాన్తో మ్యాచ్లో ఇలాంటివి జరిగితే అప్పుడు సూర్య అలా చేశాడు.. ఇలా చేశాడు అనే విమర్శలు వస్తాయి’’ అని పేర్కొన్నాడు.ఇచ్చిపడేసిన రహానేఅయితే, అజింక్య రహానే మాత్రం సూర్యను సమర్థించాడు. క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించినందుకు అతడిని ప్రశంసించాలని సూచించాడు. క్రికెట్లో ఇలాంటి ఘటనలు తరచూ జరగవని.. ఏదేమైనా టీమిండియా మంచి పనే చేసిందని కితాబులు ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. యూఏఈ విధించిన స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా 4.3 ఓవర్లలో ఛేదించి.. తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది.చదవండి: 21 సార్లు డకౌట్ అయినా సరే.. జట్టులోనే.. అతడికి గంభీర్ చెప్పిందిదే.. -
‘ఇలాంటి జట్లపై ఎవరైనా ఆడతారు.. అతడికి మున్ముందు కఠిన సవాలు’
ఆసియా కప్-2025 (Asia Cup) టీ20 టోర్నమెంట్లో తమ తొలి మ్యాచ్లో టీమిండియా ముగ్గురు స్పెషలిస్టు బౌలర్లతో బరిలోకి దిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో మ్యాచ్లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav), మిస్టరీ స్పిన్ బౌలర్ వరుణ్ చక్రవర్తి, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాలను ఆడించింది.ఇక యూఏఈతో మ్యాచ్లో కేవలం ఏడు పరుగులే ఇచ్చి కుల్దీప్ నాలుగు వికెట్లు కూల్చగా.. బుమ్రా, వరుణ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. అయితే ఆల్రౌండర్ల కోటాలో బరిలోకి దిగిన అక్షర్ పటేల్ ఒక వికెట్ తీయగా.. శివం దూబే (Shivam Dube) అద్భుత గణాంకాలు నమోదు చేశాడు. రెండు ఓవర్ల బౌలింగ్లో కేవలం నాలుగు పరుగులే ఇచ్చి ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు.ఇలాంటి జట్లపై ఎవరైనా ఆడతారుఈ నేపథ్యంలో శివం దూబే గురించి టీమిండియా మాజీ క్రికెటర్ సదగోపన్ రమేశ్ (Sadagopan Ramesh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీ20లలో హార్దిక్ పాండ్యా భారత మూడో సీమర్గా సేవలు అందించేవాడు. అయితే, ఇప్పుడు శివం దూబే మూడో సీమర్గా ఉన్నాడు.యూఏఈతో మ్యాచ్లో అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అయితే, అలాంటి జట్టులపై ఎవరైనా రాణించగలరు. మున్ముందు కాస్త పటిష్ట జట్లను ఎదుర్కొంటున్నపుడు అతడికి కఠిన సవాలు ఎదురవుతుంది.PC: BCCIనమ్మకం నిలబెట్టుకుంటేనే రింకూ సింగ్ను కాదని శివం దూబేను జట్టులోకి తీసుకోవడానికి కారణం.. అతడు మూడో సీమింగ్ ఆప్షన్గా అందుబాటులో ఉంటాడని మాత్రమే కదా!.. ఏదేమైనా శివం దూబేపై మేనేజ్మెంట్ నమ్మకం ఉంచుతున్న విషయం స్పష్టమవుతోంది. అతడు దానిని నిలబెట్టుకుంటేనే పరిస్థితులు మున్ముందు ఎలా ఉంటాయో తెలుస్తుంది’’ అని సదగోపన్ రమేశ్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు.తొలి మ్యాచ్లో ఘన విజయంకాగా యూఏఈ వేదికగా సెప్టెంబరు 9న ఆసియా కప్-2025 టోర్నీ ఆరంభమైంది. ఈ ఖండాంతర ఈవెంట్లో టీమిండియా.. పాకిస్తాన్, ఒమన్, యూఏఈతో కలిసి గ్రూప్-‘ఎ’లో ఉంది. ఈ క్రమంలో తమ తొలి మ్యాచ్లో యూఏఈతో ఆడిన టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచి .. శుభారంభం అందుకుంది.టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న భారత్ యూఏఈని 57 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత కేవలం 4.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. తదుపరి చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో సెప్టెంబరు 14న టీమిండియా తలపడనుంది.చదవండి: ఆకాశమే హద్దుగా చెలరేగిన అర్జున్ టెండుల్కర్.. సానియా చందోక్ రాకతో.. -
నువ్వు 21 సార్లు డకౌట్ అయినా సరే.. జట్టులో ఉంటావు: గంభీర్
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్ను టీమిండియా అద్భుత విజయంతో ఆరంభించింది. గ్రూప్-‘ఎ’లో భాగమైన యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో తమ తొలి మ్యాచ్ ఆడిన భారత్.. పసికూనను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో రాణించి మరోసారి సత్తా చాటింది.టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా.. యూఏఈ జట్టును 57 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత స్వల్ప లక్ష్య ఛేదనను.. కేవలం 4.3 ఓవర్లలోనే పూర్తి చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (16 బంతుల్లో 30), శుబ్మన్ గిల్ (9 బంతుల్లో 20 నాటౌట్), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (2 బంతుల్లో 7 నాటౌట్) వేగంగా ఆడటంతో ఈ రికార్డు విజయం సాధ్యమైంది.వికెట్ కీపర్గా సేవలుఇదిలా ఉంటే.. యూఏఈతో ఆడిన భారత తుదిజట్టులో సంజూ శాంసన్కు చోటు దక్కింది. అయితే, గిల్ (Shubman Gill) గైర్హాజరీలో అంతర్జాతీయ టీ20లలో ఓపెనర్గా వచ్చిన సంజూ.. ఇప్పుడు మిడిలార్డర్లో ఆడనున్నాడు. యూఏఈతో బుధవారం నాటి మ్యాచ్లో అతడు వికెట్ కీపర్గా సేవలు అందించగా.. బ్యాటింగ్ చేసే అవకాశం మాత్రం రాలేదు.ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ సంజూ పట్ల టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్కోచ్ గౌతం గంభీర్ల వైఖరిపై స్పందించాడు. ‘‘నిజంగా నాకైతే ఆశ్చర్యంగా అనిపించింది. అయితే, సంజూకు కెప్టెన్, కోచ్ ఇంతలా మద్దతునివ్వడం సంతోషంగా ఉంది.నువ్వు 21 సార్లు డకౌట్ అయినా సరేసంజూ పట్ల వారు వ్యవహరిస్తున్న తీరు అద్భుతం. మీడియా సమావేశంలో తాము సంజూ గురించి శ్రద్ధ తీసుకుంటున్నామని సూర్య చెప్పడం ఆనందదాయకం. ఇక సంజూకు బ్యాటింగ్ చేసే అవకాశం వస్తే అతడు మిడిలార్డర్లో వస్తాడు.పవర్ ప్లేలో త్వరగా వికెట్ కోల్పోతే సంజూ అప్పుడు బరిలోకి దిగుతాడు. అతడికి మంచి ప్రాధాన్యమే దక్కింది. ఏదేమైనా ఇది ప్రాజెక్ట్ సంజూ శాంసన్ అని చెప్పవచ్చు. నేను సంజూను ఇంటర్వ్యూ చేసినపుడు గంభీర్ తనతో ఏం చెప్పాడో సంజూ వివరించాడు.‘నువ్వు 21 సార్లు డకౌట్ అయినా సరే.. 22వ మ్యాచ్లో నీకు ఛాన్స్ ఉంటుంది’ అని గంభీర్ తనకు మద్దతుగా నిలిచాడని సంజూ చెప్పాడు. కోచ్, కెప్టెన్ ఓ ఆటగాడికి ఇలా అండగా నిలిస్తే అతడి ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది.నిజంగా అద్భుతంసంజూ నైపుణ్యాల పట్ల మేనేజ్మెంట్కు ఉన్న అవగాహన, నమ్మకం గురించి నాకు అప్పుడే అర్థమైంది. అతడి గురించి వారు ఆలోచించడం నిజంగా అద్భుతం’’ అని అశ్విన్.. సూర్య, గంభీర్లపై ప్రశంసలు కురిపించాడు. కాగా సంజూ శాంసన్ టీమిండియా తరఫున ఇప్పటి వరకు 43 టీ20 మ్యాచ్లు ఆడి 861 పరుగులు చేశాడు.ఇందులో మూడు శతకాలు ఉన్నాయి ఇక ఆసియా టీ20 కప్-2025 కంటే ముందు స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో మాత్రం సంజూ తేలిపోయాడు. ఐదు మ్యాచ్లలో నాలుగింటిలో కేవలం సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యాడు. అయితే, ఇటీవల జరిగిన కేరళ క్రికెట్ లీగ్లో భాగంగా సంజూ మళ్లీ ఫామ్లోకి వచ్చాడు. చదవండి: IND vs WI: వాషింగ్టన్ సుందర్ కీలక నిర్ణయం -
ఆకాశమే హద్దుగా చెలరేగిన అర్జున్ టెండుల్కర్.. సానియా రాకతో..!
భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) కుమారుడు అర్జున్ టెండుల్కర్ (Arjun Tendulkar) గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవలే అతడి వివాహ నిశ్చితార్థం జరిగింది. ముంబైలోని ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనుమరాలు సానియా చందోక్ (Saaniya Chandok)తో అర్జున్ ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు సమాచారం.తొలి బంతికే వికెట్అయితే, తాజాగా మరోసారి అర్జున్ టెండుల్కర్ పేరు వైరల్ అవుతోంది. అయితే, ఈసారి వ్యక్తిగత విషయాలతో కాకుండా.. ఆటతో ఈ ఆల్రౌండర్ వార్తల్లోకి వచ్చాడు. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) నిర్వహిస్తున్న డాక్టర్ కె. తిమ్మప్పయ్య మెమొరియల్ టోర్నమెంట్లో అర్జున్ టెండుల్కర్ తన దేశీ జట్టు గోవాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.ఈ రెడ్బాల్ ఇన్విటేషనల్ టోర్నీలో భాగంగా గోవా తొలుత మహారాష్ట్రను ఎదుర్కొంది. ఈ క్రమంలో టాస్ ఓడి బౌలింగ్కు దిగిన గోవాకు అర్జున్ అదిరిపోయే ఆరంభం అందించాడు. మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో తొలి బంతికే ఓపెనర్ అనిరుద్ సబాలేను అర్జున్ పెవిలియన్కు పంపాడు.ఆ తర్వాత కాసేపటికే మరో ఓపెనర్ మహేశ్ మాస్కే (1)ను కూడా అర్జున్ అవుట్ చేశాడు. ఇంతలో గోవాకు చెందిన మరో బౌలర్ లక్ష్మేశ్ పవానే యశ్ క్షీర్సాగర్ వికెట్ పడగొట్టగా..అర్జున్ మరోసారి స్ట్రైక్ అయ్యాడు. దిగ్విజయ్ పాటిల్ను డకౌట్గా వెనక్కి పంపాడు. మరోవైపు.. పవానే మహారాష్ట్ర కెప్టెన్ మందార్ భండారీని పెవిలియన్కు పంపగా.. మిజాన్ సయ్యద్ వికెట్ను మోహిత్ రేడ్కర్, షంసుజానా కాశీ వికెట్ను దర్శన్ మిశాల్ దక్కించుకున్నారు.మొత్తంగా ఐదు వికెట్లు కూల్చిన అర్జున్ఈ క్రమలో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన మహారాష్ట్ర కోలుకోలేకపోయింది. ఎనిమిదో వికెట్కు 39 పరుగులు జోడించిన మెహుల్ పటేల్ (54)ను అర్జున్ టెండుల్కర్ అవుట్ చేయగా.. అక్షయ్ వైకార్ను వికాస్ సింగ్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత నదీమ్ షేక్ వికెట్ను కూడా అర్జున్ తన ఖాతాలో వేసుకున్నాడు.మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో అర్జున్ 14-4-36-5 గణాంకాలు నమోదు చేశాడు. గోవా బౌలర్ల విజృంభణతో మహారాష్ట్ర 136 పరుగులకే కుప్పకూలగా.. గోవా తొలి ఇన్నింగ్స్లో 333 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. అభినవ్ తేజ్రాణా, కెప్టెన్ మిశాల్, రేడ్కార్ అర్ధ శతకాల కారణంగా గోవాకు ఈ స్కోరు సాధ్యమైంది.అర్జున్ లేడీ లక్ సానియా అంటూ..మరోవైపు బ్యాట్తోనూ రాణించిన పేస్ ఆల్రౌండర్ అర్జున్ టెండుల్కర్ 36 పరుగులతో అజేయంగా నిలవడం విశేషం. ఇదిలా ఉంటే.. సానియాతో ఎంగేజ్మెంట్ తర్వాత అర్జున్ ఇలా అద్భుత రీతిలో రాణించడంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘కాబోయే భార్య.. అర్జున్ లేడీ లక్’ అంటూ సానియాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అర్జున్ ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత క్రికెట్లో పునరాగమనం చేశాడు.చదవండి: జీవనాధారం కోసం ఉద్యోగానికి ‘జై’... క్రికెట్కూ ‘సై’Arjun Tendulkar Took Five Wicket in a Local Tournament after returning To The Cricket after 7 Month. pic.twitter.com/G7RWzxaGhI— яιşнí. (@BellaDon_3z) September 10, 2025 -
సారాంశ్కు ఐదు.. కార్తికేయకు నాలుగు.. చహర్ విఫలమైనా..
బెంగళూరు: దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్ జట్టు తడబడింది. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ మైదానంలో గురువారం ప్రారంభమైన తుదిపోరులో సెంట్రల్జోన్ బౌలర్లు విజృంభించారు. ఫలితంగా మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 63 ఓవర్లలో 149 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్ రంజీ ప్లేయర్ తన్మయ్ అగర్వాల్ (76 బంతుల్లో 31; 3 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... సల్మాన్ నిజార్ (52 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్), అంకిత్ శర్మ (64 బంతుల్లో 20; 2 ఫోర్లు) క్రీజులో నిలదొక్కుకుంటున్న దశలో అవుటయ్యారు. వికెట్ నష్టపోకుండా 50 పరుగులుసెంట్రల్ జోన్ ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ జైన్ 24 ఓవర్లలో 49 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా... ఎడంచేతి వాటం స్పిన్నర్ కుమార్ కార్తికేయ సింగ్ 53 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన సెంట్రల్ జోన్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 19 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. ఈ సీజన్లో ఫుల్ ఫామ్లో ఉన్న దానిశ్ మాలేవర్ (64 బంతుల్లో 28 బ్యాటింగ్; 3 ఫోర్లు), అక్షయ్ వాడ్కర్ (52 బంతుల్లో 20 బ్యాటింగ్; 3 ఫోర్లు) ఆకట్టుకున్నారు. చేతిలో 10 వికెట్లు ఉన్న సెంట్రల్ జోన్... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు 99 పరుగులు వెనుకబడి ఉంది. స్పిన్కు విలవిల... టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన సౌత్ జోన్ జట్టుకు ఏదీ కలిసిరాలేదు. సెంట్రల్ జోన్ స్పిన్ను తట్టుకోలేక సౌత్జోన్ ప్లేయర్లు విలవిలలాడారు. హైదరాబాదీ తన్మయ్ అగర్వాల్ ఒక్కడే కాస్త పోరాడగా... మరో ఓపెనర్ మోహిత్ కాలే (50 బంతుల్లో 9), రవిచంద్రన్ స్మరణ్ (19 బంతుల్లో 1) క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించినా పరుగులు సాధించలేకపోయారు. ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్ (53 బంతుల్లో 15; 2 ఫోర్లు) గంటకు పైగా క్రీజులో ఉన్నా పరుగులు చేసేందుకు ఇబ్బందిపడ్డాడు. కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ (4) విఫలం కాగా... అండ్రె సిద్ధార్థ్ (12) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. సల్మాన్, అంకిత్ తలా కొన్ని పరుగులు చేయడంతో సౌత్ జోన్ జట్టు ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. దీపక్ చహర్ విఫలంసెంట్రల్ జోన్కు ప్రాతినిధ్యం వహిస్తున్న టీమిండియా బౌలర్ దీపక్ చహర్ ఆరు ఓవర్లకే పరిమితం కాగా... స్పిన్నర్లు చెలరేగిపోయారు. సారాంశ్ జైన్, కుమార్ కార్తికేయ కలిసి 45 ఓవర్లు వేసి 9 వికెట్లు పంచుకున్నారు. మిగిలిన ఒక్క వికెట్ రనౌట్ రూపంలో వచ్చింది. కార్తికేయ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో నిర్లక్ష్యంగా స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన మోహిత్ క్లీన్ బౌల్డ్ కాగా... ఇక అక్కడి నుంచి ప్రారంభమైన వికెట్ల పతనం ఏ దశలోనూ ఆగలేదు. లంచ్ సమయానికే సౌత్ జోన్ 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కూడా ఏమాత్రం ఆటతీరు మార్చుకోలేకపోయింది. దీనికి తోడు పరుగు తీసే క్రమంలో రికీ భుయ్తో సమన్వయలోపం కారణంగా తన్మయ్ అగర్వాల్ రనౌట్ కావడం జట్టును మరింత దెబ్బతీసింది. స్కోరు వివరాలు సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (రనౌట్) 31; మోహిత్ కాలే (బి) కార్తికేయ 9; స్మరణ్ (సి) సారాంశ్ జైన్ (బి) కార్తికేయ 1; రికీ భుయ్ (ఎల్బీ) (బి) సారాంశ్ జైన్15; అజహరుద్దీన్ (బి) కార్తీకేయ 4; సల్మాన్ నిజార్ (సి) పాటీదార్ (బి) సారాంశ్ జైన్ 24; సిద్ధార్థ్ (స్టంప్డ్) ఉపేంద్ర యాదవ్ (బి) సారాంశ్ 12; అంకిత్ శర్మ (ఎల్బీ) సారాంశ్ జైన్ 20; గురజపనీత్ సింగ్ (ఎల్బీ) కార్తికేయ 2; నిదీశ్ (సి అండ్ బి) సారాంశ్ జైన్ 12; వాసుకి కౌశిక్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 17; మొత్తం (63 ఓవర్లలో ఆలౌట్) 149. వికెట్ల పతనం: 1–27, 2–35, 3–47, 4–57, 5–65, 6–97, 7–116, 8–129, 9–142, 10–149. బౌలింగ్: దీపక్ చహర్ 6–1–11–0; ఆదిత్య ఠాకరే 4–2–7–0; కుల్దీప్ సేన్ 8–3–15–0; కుమార్ కార్తికేయ 21–1–53–4; సారాంశ్ జైన్ 24–2–49–5. సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్: దానిశ్ మాలేవర్ (బ్యాటింగ్) 28; అక్షయ్ వాడ్కర్ (బ్యాటింగ్) 20; ఎక్స్ట్రాలు 2; మొత్తం (19 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 50. బౌలింగ్: గుర్జపనీత్ సింగ్ 4–1–21–0; అంకిత్ శర్మ 8–1–22–0; నిధీశ్ 3–1–6–0; వాసుకి కౌశిక్ 4–3–1–0. -
భారత్ వర్సెస్ స్విట్జర్లాండ్
బీల్ (స్విట్జర్లాండ్): వచ్చే ఏడాది డేవిస్కప్ క్వాలిఫయర్స్లో చోటు కోసం భారత పురుషుల టెన్నిస్ జట్టు కీలకపోరుకు సిద్ధమైంది. శుక్రవారం నుంచి రెండు రోజులపాటు స్విట్జర్లాండ్ జట్టుతో వరల్డ్ గ్రూప్ తొలి రౌండ్లో భారత్ ఆడనుంది. ముఖాముఖి పోరులో భారత్ 2–1తో స్విట్జర్లాండ్పై ఆధిక్యంలో ఉంది. భారత్ తరఫున సింగిల్స్లో సుమిత్ నగాల్, దక్షిణేశ్వర్ సురేశ్, డబుల్స్లో హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ–శ్రీరామ్ బాలాజీ జోడీ బరిలోకి దిగనుంది. నేడు జరిగే రెండు సింగిల్స్ మ్యాచ్ల్లో జెరోమ్ కిమ్తో దక్షిణేశ్వర్ సురేశ్; మార్క్ ఆండ్రియా హుస్లెర్తో సుమిత్ నగాల్ తలపడతారు. శనివారం మూడు మ్యాచ్లు జరుగుతాయి. డబుల్స్ మ్యాచ్లో జాకబ్ పాల్–డొమినిక్ స్ట్రికర్ జంటతో రిత్విక్–శ్రీరామ్ బాలాజీ ద్వయం పోటీపడుతుంది. అనంతరం జెరోమ్ కిమ్తో నగాల్; హుస్లెర్తో సురేశ్ ఆడతారు. గురువారం ‘డ్రా’ కార్యక్రమం కంటే ముందు భారత టెన్నిస్ జట్టుకు స్విట్జర్లాండ్లోని భారత రాయబారి మృదుల్ కుమార్ సన్మానించారు. -
సూపర్ బైకర్
‘ఆడపిల్లలకు బైక్లు ఎందుకు!’ అని ఆ తండ్రి నిరాశపరిచి ఉంటే ఆ అమ్మాయి భవిష్యత్లో ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చేది కాదు. ‘బైక్ రేసింగ్ అంటే బాయ్స్కు మాత్రమే’ అనే అలిఖిత నిబంధనను జగతిశ్రీ కుమరేశన్ బ్రేక్ చేసింది. ప్రొఫెషనల్ మోటర్ సైకిల్ రేసర్గా దూసుకుపోతోంది. ట్రిపుల్ నేషనల్ చాంపియన్ జగత్శ్రీ కుమరేశన్ థాయ్లాండ్లో జరిగే ఎఫ్ఐఎం ఆసియా మహిళల కప్ ఆఫ్ సర్క్యూట్ రేసింగ్(ఏసీసీఆర్)లో మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోంది. కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళితే... చెన్నైకి చెందిన జగత్శ్రీ ఒకానొక రోజు బైక్ రేసింగ్ చూసి ఆహా అనుకుంది. ఆరోజు నుంచి బైక్ రేసింగ్పై పాషన్ మొదలైంది. తండ్రికి తన మనసులోని మాట చెబితే సరే అని ప్రోత్సహించాడు. అలా శిక్షణ మొదలైంది. పెద్ద పెద్ద బైక్లపై ప్రాక్టీస్ మొదలుపెట్టేది. 2021లో టీవీఎస్ రూకీస్ ఛాంపియన్షిప్ కోసం బాయ్స్తో పోటీ పడి సత్తా చాటింది. చదువు కారణంగా 2022లో పోటీలకు విరామం ఇచ్చింది. 2023లో ఎంఎంఎస్సీ ఎఫ్ఎంఎసీఐ ఇండియన్ నేషనల్ డ్రాగ్ రేసింగ్ చాంపియన్షిప్లో నేషనల్ టైటిల్ గెలుచుకుంది. మద్రాస్ క్రిస్టియన్ కళాశాల ఆర్కియాలజీ గ్రాడ్యుయేట్ అయిన జగత్శ్రీ ఎఫ్ఐఎం ఉమెన్స్ సర్క్యూట్ రేసింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్(వరల్డ్ డబ్ల్యూసీఆర్) తనదైన స్థానాన్ని నిలుపుకోవాలని పట్దుదలగా ప్రయత్నిస్తోంది. -
జీవనాధారం కోసం ఉద్యోగానికి ‘జై’... క్రికెట్కూ ‘సై’
సాక్షి క్రీడా విభాగం : మన దేశంలో క్రికెట్ ఓ మతమైంది. కోట్ల మంది జీవితాల్లో భాగమైంది. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లిల అంత స్థాయికి ఎదగలేకపోయినా సరే ఒక్కసారి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెంట్రల్ కాంట్రాక్టు దక్కితే చాలు... ‘గ్రేడ్’తో పని లేకుండా కోట్ల రూపాయల్లో వార్షిక పారితోషికం... పోటీలకు ఇంతని లక్షల్లో మ్యాచ్ ఫీజలు లభిస్తాయి. కాబట్టి ఆటగాడైతే చాలు... దేశవాళీ క్రికెట్తోనూ ఆటతోనే విలాసవంతంగా బ్రతికేస్తాడు. అంతెందుకు ఒక్క ఐపీఎల్ సీజన్లో జూనియర్ స్థాయి ఆటగాడైన సరే అదృష్టం తలుపుతట్టి వేలంలో ఆయా జట్లకు ఎంపికైనా చాలు మిగతా జీవితమంతా సుఖమయం అవుతుంది. అయితే ఇదంతా భారత్లోనే చెల్లుతుంది. కానీ ఇతర దేశాల్లోని క్రికెటర్లు మైదానంలో చెమటోడ్చాలి. ఆఫీస్లో ఉద్యోగం చేయాలి. చాలా దేశాల్లో ఇలానే... క్రికెట్ ఆడే ఎన్నో దేశాల్లో ఇలాగే ఉంటుంది. కేవలం బ్యాట్ పట్టి నెట్స్లో ప్రాక్టీస్ చేసి, మ్యాచ్లపుడు మైదానంలో దిగితే సరిపోదు. జీవనాధారం కోసం ఉద్యోగం లేదంటే వ్యాపారం ఏదో ఒకటి తప్పనిసరిగా చేయాల్సిందే! తాజా ఆసియా కప్ టి20 టోర్నీలో బరిలో ఉన్న ఒమన్ క్రికెటర్లు కూడా ఇదే చేస్తారు. రూపాయి మారకం విలువ పరంగా ఒమని రియాల్ (ఒమన్ కరెన్సీ) మనకంటే చాలా విలువైందే అయినా... క్రికెట్లో మాత్రం బలహీనమైంది. అక్కడి ప్రొఫెషనల్ క్రికెటర్లు సైతం తెల్లారితే లంచ్ బాక్స్లు కట్టుకొని ఆఫీస్కు వెళ్తారు. సాయంత్రమైతేనే ఆటకు సిద్ధమవుతారు. మ్యాచ్లు, పెద్ద పెద్ద సిరీస్లు ఉంటేనే పక్షం లేదంటే నెలకు మించి సెలవులు పెట్టి మెగా ఈవెంట్లు ఆడతారు. ఇది ముగియగానే ఒమన్ ఆటగాళ్లు మళ్లీ ఆఫీస్ వ్యవహారాలు చూసుకుంటారు. ఇవి ఎవరో ‘నెట్టింట’ పెట్టిన విషయాలో, ‘షార్ట్స్’, ‘రీల్స్’లో చెప్పిన కబుర్లో కాదు... స్వయంగా ఒమన్ కెప్టెన్ జతిందర్ సింగ్, ఆల్రౌండర్ సుఫియాన్ మెహమూద్ వెల్లడించిన వాస్తవాలు. ఉద్యోగానికే తొలి ప్రాధాన్యం క్రికెటే తమ కెరీర్ కానేకాదని జతిందర్ స్పష్టం చేశాడు. తమ తొలి ప్రాధాన్యం ఉద్యోగమేనన్నాడు. ఆటను మొదలు పెట్టిన తొలినాళ్లలో మా ప్రాధాన్యమంతా ఉద్యోగానికే ఉండేదని, క్రికెట్ ఆట తమకు రెండో ప్రాధాన్యమని ఒమన్ కెప్టెన్ చెప్పాడు. ‘నేనే కాదు చాలామంది ఇదే చేస్తారు. ఠంచనుగా ఉద్యోగం చేసేందుకు బయల్దేరతారు. క్రికెట్ను ఓ ప్రత్యామ్నాయంగానే చూస్తారు. అయితే ఇప్పుడు ఆసియా కప్ లాంటి పేరొందిన సిరీస్ ఆడటం ద్వారా క్రికెట్ కల పెద్దగా అనిపిస్తుంది. తొలిసారి ఈ టోర్నీ ఆడేందుకు ఆటగాళ్లంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు’ అని జతిందర్ అన్నాడు. కాంక్రిట్పై కష్టాలెన్నో... ఒమన్లో క్రికెట్కు ప్రత్యేకించి టర్ఫ్ గ్రౌండ్లు అంటూ లేని రోజుల్లో తాము సిమెంట్ వికెట్లపైనే ఆడాల్సి వచ్చిందని, 2008లో ఆస్ట్రోటర్ఫ్ వినియోగంలోకి వచ్చినా... మూడేళ్ల తర్వాతే 2011 నుంచి పూర్తిస్థాయి టర్ఫ్ గ్రౌండ్పై క్రమం తప్పకుండా ఆడుతున్నామని జతిందర్ ఒమన్ క్రికెట్ కష్టాలను చెప్పుకొచ్చాడు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ఫలితం (ప్రాభవం లేని క్రికెట్)లేని ఆట కోసం ఎందుకు కష్టపడాలని ఎన్నోసార్లు అనిపించినా... ఏదో క్రికెట్పై ఉన్న కాస్త మక్కువే ఇక్కడిదాకా తీసుకొచ్చిందని వివరించాడు. 36 ఏళ్ల జతిందర్ ఇప్పటి వరకు 36 వన్డేలాడి 1704 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలున్నాయి. అంతర్జాతీయ టి20ల్లో 115 స్ట్రయిక్రేట్తో 1120 పరుగులు సాధించాడు. మరోవైపు 34 ఏళ్ల ఆల్రౌండర్ సుఫియాన్ 8 వన్డేలాడి 107 పరుగులు చేయడంతో పాటు 24.50 సగటుతో 6 వికెట్లు కూడా తీశాడు. తనకు టీమిండియాలో గిల్, సూర్యకుమార్, అభిషేక్ శర్మ, అర్ష్ దీప్, తిలక్ వర్మ అంటే ఇష్టమని చెప్పాడు. క్రికెటెందుకు... చదువుకో ముందు! సుఫియాన్ ఒమన్ క్రికెట్ జట్టుకు ఎంపికవగానే అతని తల్లిదండ్రులు ససేమిరా అన్నారట! ఒమన్లో క్రికెట్కు భవిష్యత్తే లేదని, ఉన్నత చదువులు చదివి ఉన్నతోద్యోగంపైనే దృష్టి సారించాలని తన తల్లిదండ్రులు గట్టిగా చెప్పారని పేర్కొన్నాడు. ‘కానీ క్రికెట్ అంటే పిచ్చి. నాపై ఉన్న నమ్మకమే ఆటవైపు నడిపించింది. 2016 టి20 ప్రపంచకప్ అర్హత సాధించగానే మేం పడిన కష్టాలకు సాంత్వన చేకూరింది’ అని సుఫియాన్ తెలిపాడు. ఒమన్ క్రికెట్ నిలబడటానికి ఆ మెగా ఈవెంట్ ఎంతగానో దోహదం చేసిందన్నాడు. భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన అభిమాన క్రికెటర్ అని చెప్పుకొచ్చాడు. -
చైనా, ఉజ్బెక్ క్లబ్లతో ఈస్ట్ బెంగాల్ పోరు
న్యూఢిల్లీ: భారత ఫుట్బాల్ క్లబ్ ఈస్ట్ బెంగాల్ జట్టుకు ఏఎఫ్సీ మహిళల చాంపియన్షిప్ గ్రూప్ ‘బి’లో చోటు దక్కింది. కౌలాలంపూర్లో తీసిన ‘డ్రా’లో ఈస్ట్ బెంగాల్ మహిళల జట్టుకు ఒక రకంగా ఇది క్లిష్టమైన పోరే! ‘బి’ గ్రూపులో చైనా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్లకు చెందిన క్లబ్లతో ఈస్ట్ బెంగాల్ తలపడనుంది. ఈ సీజన్ భారత మహిళల లీగ్లో విజేతగా నిలువడం ద్వారా ఈస్ట్ బెంగాల్ ఎఫ్సీ ఏఎఫ్సీ మహిళల టోర్నీకి అర్హత సంపాదించింది.తెలంగాణకు చెందిన సౌమ్య గుగులోత్ ఈస్ట్ బెంగాల్కు టైటిల్ దక్కడంలో కీలకపాత్ర పోషించింది. వివిధ దేశాలకు చెందిన దేశవాళీ చాంపియన్లు ఈ టోర్నీలో పోటీ పడతాయి. మొత్తం 12 జట్లను మూడు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ‘బి’లో చైనాకు చెందిన వుహాన్ జియాంగ్దా, ఇరానీ చాంపియన్ బమ్ ఖటూన్, ఉజ్బెకిస్తాన్కు చెందిన పీఎఫ్సీ నసఫ్ మహిళల క్లబ్ జట్లు (డబ్ల్యూఎఫ్సీ) ఉన్నాయి. జియాంగ్లా ఐదుసార్లు చైనీస్ లీగ్లో విజేతగా నిలిచింది. బమ్ ఖటూన్ (ఇరాన్) అయితే ఏఎఫ్సీ టోర్నీకి అర్హత సాధించడం ఇది నాలుగోసారి. ఇక ఉజ్బెకిస్తాన్లో తిరుగులేని దేశవాళీ జట్టు పీఎఫ్సీ నసఫ్. ఈ జట్టు ఏకంగా 16 సార్లు అక్కడ విజేతగా నిలిచింది. ఇలాంటి ఘనాపాటిలతో భారత అమ్మాయిలు ఏ మేరకు తలపడతారో చూడాలి. నవంబర్లో జరిగే చాంపియన్స్ లీగ్ మ్యాచ్ల్లో ఈ మూడు జట్లతో ఈస్ట్ బెంగాల్ క్లబ్ తలపడుతుంది. ఒక్కో గ్రూప్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి.ఈ ఆరు జట్లతో పాటు మూడు గ్రూపుల్లో ఉన్న అత్యుత్తమ మూడో స్థానంలో ఉన్న మరో రెండు జట్లకు నాకౌట్ భాగ్యం దక్కుతుంది. వచ్చే ఏడాది మార్చిలో క్వార్టర్ ఫైనల్ పోటీలు, మే నెలలో సెమీస్ మ్యాచ్లు నిర్వహిస్తారు.ఈస్ట్ బెంగాల్ ఎఫ్సీ షెడ్యూల్ నవంబర్ 17: ఈస్ట్ బెంగాల్ X బమ్ ఖటూన్ ఎఫ్సీ (ఇరాన్ టీమ్) నవంబర్ 20: ఈస్ట్ బెంగాల్ X వుహాన్ జియాంగ్దా (చైనా టీమ్) నవంబర్ 23: ఈస్ట్ బెంగాల్ X పీఎఫ్సీ నసఫ్ (ఉజ్బెక్ టీమ్) -
భారత షూటర్లకు మళ్లీ నిరాశే
నింగ్బో (చైనా): భారత షూటర్ల నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు కూడా క్వాలిఫికేషన్ రౌండ్లలోనే గురి కుదరక పతకం బరికి దూరమవుతున్నారు. చైనాలో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్లో గురువారం జరిగిన పోటీల్లో ఆంధ్రప్రదేశ్ షూటర్ మద్దినేని ఉమా మహేశ్ సహా దివ్యాన్‡్ష, రాహీ సర్నోబత్లు క్వాలిఫయింగ్లోనే వెనుదిరిగారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ క్వాలిఫికేషన్లో దివ్యాన్‡్ష 630 స్కోరుతో 19వ స్థానంలో నిలిచాడు. ఉమామహేశ్ 627.7 పాయింట్లు స్కోరు చేసి 39 స్థానంలో, మరో భారత మరో షూటర్ నీరజ్ కుమార్ (626.1) 54వ స్థానంలో నిలిచారు. మహిళల ర్యాపిడ్ ఫైర్ క్వాలిఫికేషన్లో అభిజ్ఞ అశోక్ పాటిల్ 583 స్కోరుతో 11వ స్థానంలో నిలిచింది. టీఎస్ దివ్య (581), ఒలింపియన్, ఆసియా క్రీడల చాంపియన్ రాహీ సర్నోబత్ (581)లు వరుసగా 16, 17 స్థానాలు పొందారు. ఇప్పుడిక భారత్ ఆశలన్నీ మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్పైనే ఉన్నాయి. మెహులీ ఘోష్, తెలంగాణ అమ్మాయి సురభి రాపోలు, మానిని కౌశిక్లు బరిలో ఉన్నారు. -
మళ్లీ ఓడిన గుకేశ్
సమర్కండ్ (ఉజ్బెకిస్తాన్): గ్రాండ్ స్విస్ అంతర్జాతీయ చెస్ టోర్నీ ఓపెన్ విభాగంలో ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్కు వరుసగా మూడో పరాజయం ఎదురైంది. గురువారం జరిగిన ఏడో రౌండ్లో గుకేశ్ 52 ఎత్తుల్లో ఇదిజ్ గురెల్ (టర్కీ) చేతిలో ఓడిపోయాడు. ఐదో రౌండ్లో అభిమన్యు మిశ్రా (అమెరికా) చేతిలో, ఆరో రౌండ్లో నికోలస్ (గ్రీస్) చేతిలో ఓడిన గుకేశ్ ... ఏడో రౌండ్ తర్వాత మూడు పాయింట్లతో 84వ స్థానంలో ఉన్నాడు. మరోవైపు తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ తొలి పరాజయాన్ని చవిచూశాడు. మథియాస్ బ్లూబామ్ (జర్మనీ)తో జరిగిన గేమ్లో అర్జున్ 51 ఎత్తుల్లో ఓడిపోయాడు. ఓపెన్ విభాగంలో పోటీపడుతున్న భారత మహిళా గ్రాండ్మాస్టర్ దివ్య దేశ్ముఖ్ రెండో విజయం అందుకుంది. ఇవిచ్ వెల్మిర్ (సెర్బియా)తో జరిగిన గేమ్లో దివ్య 49 ఎత్తుల్లో గెలిచింది. -
పూజా రాణికి పతకం ఖాయం
లివర్పూల్: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్ మహిళల విభాగంలో భారత్కు మూడో పతకం ఖాయమైంది. ఇప్పటికే నుపుర్ షెరాన్ (ప్లస్ 80 కేజీలు), జైస్మీన్ లంబోరియా (57 కేజీలు) సెమీఫైనల్కు చేరి కనీసం కాంస్య పతకాలు ఖాయం చేసుకోగా... 80 కేజీల విభాగంలో పూజా రాణి కూడా సెమీస్లో అడుగు పెట్టింది. తొలి రౌండ్లో ‘బై’ దక్కించుకున్న 34 ఏళ్ల పూజ క్వార్టర్ ఫైనల్లో 3:2 తేడాతో ఎమిలియా కొటెరస్కా (పోలాండ్)పై విజయం సాధించింది. సెమీఫైనల్లో ఎమిలీ అస్క్విత్ (స్విట్జర్లాండ్)తో పూజ తలపడనుంది. పురుషుల 65 కేజీల విభాగంలో అభినాశ్ జమ్వాల్ 1:4తో ఒలింపిక్ కాంస్య పతక విజేత లాషా గురులి (జార్జియా) చేతిలో ఓడాడు. ఇక భారత్ నుంచి జాదూమణి సింగ్ (48 కేజీలు), మీనాక్షి (48 కేజీలు) మాత్రమే పోటీలో ఉన్నారు. తాష్కెంట్లో జరిగిన గత ప్రపంచ చాంపియన్షిప్లో భారత్ నుంచి దీపక్ భోరియా (51 కేజీలు), హుసాముద్దీన్ (57 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు) కాంస్యాలు సాధించారు. -
దబంగ్ ఢిల్లీ ‘పాంచ్ పటాకా’
విశాఖ స్పోర్ట్స్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో దబంగ్ ఢిల్లీ జోరు కొనసాగుతోంది. సీజన్ ఆరంభం నుంచి పరాజయం ఎరగకుండా దూసుకెళ్తున్న దబంగ్ ఢిల్లీ వరుసగా ఐదో మ్యాచ్లోనూ నెగ్గింది. గురువారం జరిగిన పోరులో దబంగ్ ఢిల్లీ 38–28 పాయింట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్ను చిత్తు చేసింది. దీంతో ఆడిన అన్నీ మ్యాచ్ల్లో నెగ్గిన ఢిల్లీ 10 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో కొనసాగుతోంది. కెప్టెన్ అశు మలిక్ 14 పాయింట్లతో ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అజింక్యా పవార్, ఫజల్ చెరో 5 పాయింట్లతో సారథికి అండగా నిలిచారు. రెయిడింగ్లో ఇరు జట్లు సమంగానే నిలిచినా... ట్యాక్లింగ్లో ఢిల్లీ 13 పాయింట్లు సొంతం చేసుకోగా... గుజరాత్ 5 పాయింట్లకే పరిమితమైంది. జెయింట్స్ తరఫున ప్రతీక్ 9 పాయింట్లతో పోరాడాడు. మరో మ్యాచ్లో యు ముంబా 40–39 పాయింట్ల తేడాతో పట్నా పైరెట్స్పై గెలిచింది. యు ముంబా తరఫున అమీర్ మొహమ్మద్ 12 పాయింట్లు, అనిల్ 9 పాయింట్లు సాధించారు. పట్నా తరఫున అయాన్ 21 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. గురువారంతో విశాఖపట్నం అంచె పోటీలు ముగియగా... నేటి నుంచి జైపూర్ వేదికగా టోర్నీ కొనసాగుతుంది. ఈ రోజు మ్యాచ్ల్లో జైపూర్ పింక్ పాంథర్స్తో బెంగళూరు బుల్స్... తమిళ్ తలైవాస్తో బెంగాల్ వారియర్స్ తలపడతాయి. -
ఆయుశ్ సంచలనం
హాంకాంగ్: భారత బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ ఆయుశ్ శెట్టి హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో సంచలనం సృష్టించాడు. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, 2023 ప్రపంచ చాంపియన్షిప్ రన్నరప్ కొడాయ్ నరోకా (జపాన్)ను బోల్తా కొట్టించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 31వ ర్యాంకర్ ఆయుశ్ 72 నిమిషాల్లో 21–19, 12–21, 21–14తో ఐదో సీడ్ నరోకాను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. భారత నంబర్వన్ లక్ష్య సేన్ కూడా క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. సహచరుడు హెచ్ఎస్ ప్రణయ్తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 15–21, 21–18, 21–10తో గెలుపొంది క్వార్టర్ ఫైనల్లో ఆయుశ్ శెట్టితో తలపడేందుకు సిద్ధమయ్యాడు. మరో మ్యాచ్లో కిరణ్ జార్జి (భారత్) 6–21, 12–21తో చౌ టియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 18–21, 21–15, 21–11తో పిరత్చాయ్ సుఖ్ఫున్–పకాపోన్ తీరత్సాకుల్ (థాయ్లాండ్) జంటపై గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రుతపర్ణ–శ్వేతాపర్ణ (భారత్) జోడీ 13–21, 7–21తో లి యి జింగ్–లువో జు మిన్ (చైనా) జంట చేతిలో ఓడిపోయింది. -
Asia Cup 2025: బంగ్లాదేశ్ శుభారంభం
అబుదాబి: ఆసియా కప్ టి20 టోర్నీని బంగ్లాదేశ్ సునాయాస విజయంతో మొదలుపెట్టింది. గ్రూప్ ‘బి’లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్లో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన బంగ్లా 7 వికెట్ల తేడాతో హాంకాంగ్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన హాంకాంగ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. అనంతరం బంగ్లాదేశ్ 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 144 పరుగులు సాధించి గెలిచింది. తమ తొలి పోరులో అఫ్గానిస్తాన్ చేతిలో ఓడిన హాంకాంగ్కు ఇది వరుసగా రెండో పరాజయం. ఓపెనర్ అన్షుమన్ రథ్ (4) తొందరగానే వెనుదిరిగినా... మరో ఓపెనర్ జీషాన్ అలీ (34 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి షాట్లతో హాంకాంగ్కు తగిన ఆరంభాన్ని అందించాడు. సీనియర్ బ్యాటర్ బాబర్ హయత్ (14) విఫలం కాగా, నిజాకత్ ఖాన్ (40 బంతుల్లో 42; 2 ఫోర్లు, 1 సిక్స్) పట్టుదలగా క్రీజ్లో నిలిచి పరుగులు సాధించాడు. ఈ క్రమంలో తాను ఆడిన 32వ బంతికి గానీ అతను తన తొలి బౌండరీ కొట్టలేకపోయాడు! చివర్లో కెప్టెన్ యాసిమ్ ముర్తజా (19 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడు హాంకాంగ్కు చెప్పుకోదగ్గ స్కోరును అందించింది. బంగ్లా బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేయడంలో సఫలమయ్యారు. ముఖ్యంగా 3–13 మధ్య ఆడిన 11 ఓవర్లలో ఒక్క ఓవర్లో మాత్రమే హాంకాంగ్ రెండంకెల స్కోరు చేయగలిగింది. అయితే ఆఖరి 6 ఓవర్లలో 54 పరుగులు రాబట్టడంతో హాంకాంగ్ గౌరవప్రదంగా ముగించగలిగింది. తన్జీమ్, తస్కీన్, రిషాద్ తలా 2 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో ఓపెనర్లు పర్వేజ్ (19), తన్జీద్ (14) ఎక్కువ సేపు నిలబడకపోయినా... కెపె్టన్ లిటన్ దాస్ (39 బంతుల్లో 59; 6 ఫోర్లు, 1 సిక్స్), తౌహీద్ (36 బంతుల్లో 35 నాటౌట్; 1 ఫోర్) భాగస్వామ్యంతో బంగ్లా సునాయాస విజయాన్ని అందుకుంది. వీరిద్దరు మూడో వికెట్కు 70 బంతుల్లో 95 పరుగులు జోడించారు. నేడు దుబాయ్లో జరిగే మ్యాచ్లో ఒమన్ జట్టుతో పాకిస్తాన్ ఆడుతుంది. -
రాణించిన హాంకాంగ్ బ్యాటర్లు.. బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే?
ఆసియాకప్-2025లో భాగంగా అబుదాబి వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో హాంకాంగ్ బ్యాటర్లు పర్వాలేదన్పించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన హాంకాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 143 పరుగులు సాధించింది. హాంకాంగ్ బ్యాటర్లలో నిజాకత్ ఖాన్(42) టాప్ స్కోరర్గా నిలవగా.. కెప్టెన్ యాసిమ్ ముర్తజా(28), జీషన్ అలీ(30) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హుస్సేన్, తంజిమ్ హసన్ సాకిబ్, టాస్కిన్ ఆహ్మద్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ముస్తఫిజుర్ రెహ్మన్ ఓ వికెట్ సాధించాడు. కాగా ఈ మ్యాచ్ హాంకాంగ్కు చాలా కీలకం. ఒకవేళ ఈ మ్యాచ్లో ఓడిపోతే హాంకాంగ్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. -
వాషింగ్టన్ సుందర్ కీలక నిర్ణయం.. మళ్లీ ఇంగ్లండ్కు
వెస్టిండీస్తో టెస్టు సిరీస్కు ముందు టీమిండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ తమిళనాడు స్టార్ క్రికెటర్ ఇంగ్లండ్ కౌంటీల్లో మరోసారి ఆడనున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ వన్లో హాంప్షైర్కు ప్రాతినిథ్యం వహించనున్నాడు.ఈ టోర్నీలో భాగంగా సోమర్సెట్, సర్రేతో జరిగే చివరి రెండు హాంప్షైర్ మ్యాచ్ల్లో సుందర్ భాగం కానున్నాడు. ఈ విషయాన్ని హాంప్షైర్ క్రికెట్ క్లబ్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. "భారత ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ మా చివరి రెండు మ్యాచ్ల్లో ఆడేందుకు మాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వెలకమ్ వాషీ" అంటూ హాంప్షైర్ ఓ పోస్ట్ చేసింది. సుందర్ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడడం ఇది రెండో సారి. ఇంతకుముందు లంకాషైర్ క్రికెట్ క్లబ్ తరపున సుందర్ ఆడాడు. ఈ రెండు కౌంటీ మ్యాచ్లు (15 సెప్టెంబర్ వర్సెస్ సొమర్సెట్, 24 సెప్టెంబర్ వర్సెస్ సర్రే) వెస్టిండీస్ సిరీస్కు ముందు సన్నాహకంగా ఉపయోగపడనుంది.వాస్తవానికి స్వదేశంలో ఆసీస్-ఎతో జరిగే అనాధికారిక టెస్టు సిరీస్లో భారత్-ఎ తరపున వాషీ ఆడుతాడని అంతా భావించారు. కానీ సెలక్టర్లు మాత్రం సుందర్కు ఛాన్స్ ఇవ్వలేదు. మానవ్ సుతార్, తనుష్ కోటియన్, హర్ష్ దుబే వంటి యువ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లకు అవకాశమిచ్చారు.కాగా ఇటీవల ముగిసిన ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ టూర్లో సుందర్ ఏడు వికెట్లు, 284 పరుగులతో సత్తాచాటాడు. అంతకుముందు న్యూజిలాండ్ సిరీస్లో కూడా మొత్తంగా 16 వికెట్లు సాధించాడు. ఇప్పుడు సుందర్ తిరిగి విండీస్తో సిరీస్లో ఆడనున్నాడు. భారత్-విండీస్ మధ్య రెండు మ్యాచ్ల సిరీస్ ఆక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానుంది. -
టీమిండియా కెప్టెన్గా కేఎల్ రాహుల్.. శ్రేయస్ రీ ఎంట్రీ?
ఆసియాకప్-2025 తర్వాత టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడనుంది. ఈ రెడ్ బాల్ క్రికెట్ సిరీస్ ఆక్టోబర్ 2 నుంచి 16 వరకు జరగనుంది. వెంటనే ఆక్టోబర్ 19 భారత్-ఇండియా వైట్ బాల్ సిరీస్ ప్రారంభం కానుంది. దీంతో రాబోయో రెండు నెలల పాటు భారత జట్టు వరుస సిరీస్లతో బీజీబీజీగా గడపనుంది.కెప్టెన్గా రాహుల్..?వెస్టిండీస్తో టెస్టు సిరీస్కు మరో పది రోజుల్లో ప్రకటించే అవకాశముంది. అయితే ఈ సిరీస్లోని తొలి టెస్టుకు టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ శుబ్మన్ గిల్కు దూరమయ్యే అవకాశముంది. గిల్ ప్రస్తుతం ఆసియా కప్ టోర్నీలో బిజీగా ఉన్నాడు. గ్రూపు-ఎలో ఉన్న భారత్ ఫైనల్కు చేరడం దాదాపు ఖాయమనే చెప్పుకోవాలి. ఈ ఖండాంతర టోర్నీ ఫైనల్ సెప్టెంబర్ 28న జరగనుంది. అక్కడికి మూడు రోజుల్లో అంటే అక్టోబర్ 2 నుంచి వెస్టిండీస్తో తొలి టెస్టు మొదలు కానుంది. దీంతో మొదటి టెస్టుకు సెలక్టర్లు గిల్కు విశ్రాంతి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇదే జరిగితే తొలి టెస్టులో భారత కెప్టెన్గా కేఎల్ రాహుల్ వ్యవహరించవచ్చు. రాహుల్ ఆసియాకప్ జట్టులో సభ్యునిగా లేని సంగతి తెలిసిందే.ఓపెనర్లగా రాహుల్, జైశ్వాల్..ఇక ఇంగ్లండ్ టూర్లో అద్బుతంగా రాణించిన యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనర్లగా కొనసాగనున్నారు. అదేవిధంగా అభిమన్యు ఈశ్వరన్ మరోసారి రిజర్వ్ ఓపెనర్గా ఉంటాడు. సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లగా ఎంపిక కానున్నారు. అయితే వీరిద్దరిలో ఒకరికే తుది జట్టులో చోటు దక్కే అవకాశముంది.పంత్కు గాయం, జగదీశన్కు చోటు..ఇక ఇంగ్లండ్ టూర్లో గాయపడ్డ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్.. విండీస్ సిరీస్కు దూరమయ్యే సూచనలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. అతడి స్ధానంలో ధ్రువ్ జురెల్ మరోసారి వికెట్ల వెనక బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. అయితే తమిళనాడుకు చెందిన నారయణ్ జగదీశన్ సెకెండ్ వికెట్ కీపర్గా ఉండనున్నాడు.అయ్యర్ ఎంట్రీ?ఇక మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తిరిగి భారత టెస్టు జట్టులోకి రానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ కారణంతోనే అతడిని ఆసీస్-ఎతో సిరీస్కు భారత-ఎ జట్టు కెప్టెన్గా అయ్యర్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. శ్రేయస్కు భారత టెస్టు జట్టులో చోటు దక్కితే మరోసారి సర్ఫరాజ్ ఖాన్పై వేటు పడే అవకాశముంది.ఇక ఆల్రౌండర్లగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్,నితీష్ కుమార్ రెడ్డి తమ స్దానాలను పదిలం చేసుకున్నారు. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చోటు దక్కించుకోనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ కొనసాగనున్నాడు. అయితే ఆసియాకప్లో కెప్టెన్ గిల్తో భాగమైన బుమ్రా, కుల్దీప్ యాదవ్లు తొలి టెస్టుకు అందుబాటులో ఉంటారో లేదో వేచి చూడాలి.వెస్టిండీస్తో టెస్టు సిరీస్కు భారత జట్టు (అంచనా)యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, ఎన్ జగదీశన్.చదవండి: #Babar Azam: 6 లగ్జరీ కార్లు.. పాక్ రిచెస్ట్ క్రికెటర్గా! బాబర్ ఆజం నెట్ వర్త్ ఎంతంటే? -
వన్డే ప్రపంచకప్కు న్యూజిలాండ్ జట్టు ప్రకటన..
మహిళల వన్డే ప్రపంచకప్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు బలమైన జట్టును ప్రకటించింది. వెటరన్ ఆల్రౌండర్ సోఫీ డివైన్ కివీస్ జట్టుకు సారథ్యం వహించనుండగా... నలుగురు కొత్త ప్లేయర్లకు వరల్డ్కప్ జట్టులో చోటు దక్కింది. ఈ నెల 30 నుంచి భారత్, శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో ప్రారంభం కానున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ కోసం న్యూజిలాండ్ బోర్డు 15 మందితో కూడిన జట్టును తాజాగా ప్రకటించింది.సుజీ బేట్స్, లీ తహుహు, సోఫీ డివైన్ ఐదోసారి ప్రపంచకప్ బరిలోకి దిగనుండగా... మ్యాడీ గ్రీన్, మెలియా కెర్కు ఇది మూడోది. 8 జట్లు పాల్గొంటున్న ఈ మెగా టోర్నీ కోసం ప్రకటించిన కివీస్ జట్టు అటు అనుభవజ్ఞులు, ఇటు యువ ప్లేయర్లతో సమతూకంగా ఉందని న్యూజిలాండ్ కోచ్ బెన్ సాయర్ అన్నాడు. వరల్డ్కప్లో భాగంగా వచ్చే నెల 1న డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియాతో న్యూజిలాండ్ తొలి మ్యాచ్ ఆడనుంది. న్యూజిలాండ్ జట్టు: సోఫీ డివైన్ (కెప్టెన్), సుజీ బేట్స్, ఈడెన్ కార్సన్, ఫ్లోరా డెవాన్షైర్, ఇజీ గేజ్, మ్యాడీ గ్రీన్, బ్రూకీ హాలిడే, బ్రీ ఇలింగ్, పాలీ ఇన్గ్లిస్, బెల్లా జేమ్స్, మెలీ కెర్, జెస్ కెర్, రోజ్మేరీ మైర్, జార్జియా ప్లిమర్, లీ తహుహు. -
బ్యాడ్మింటన్లో తెలంగాణ అమ్మాయికి రజతం
గ్వాటెమాల అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి రూహి రాజు సత్తా చాటింది. ఈ టోర్నీలో రన్నరప్గా నిలిచిన 22 ఏళ్ల రూహి రజత పతకాన్ని సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన ఫైనల్లో కొలంబియాకు చెందిన జూలియానా గిరాల్డో చేతిలో 10-21, 15-21 తేడాతో ఆమె ఓటమి చవిచూసింది.అన్సీడెడ్ ప్లేయర్గా ఈ ఈవెంట్లోకి అడుగుపెట్టిన రూహి రాజు.. క్వార్టర్ ఫైనల్లో గ్వాటెమాలకు చెందిన టాప్ సీడ్ నైక్ సోటోమేయర్ను 21-23, 21-19, 21-16 తేడాతో ఓడించింది. ఆతర్వాత హైదరాబాద్ అమ్మాయి సెమీఫైనల్లో పెరూ స్టార్ మియాహిరాపై 21-18, 21-17 తేడాతో విజయం సాధించింది.కానీ టోర్నీ అసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన రూహి రాజు.. ఆఖరి మొట్టుపై మాత్రం బోల్తా పడింది. రూహి రాజు గతంలో సుచిత్ర బ్యాడ్మింటన్ అకాడమీ ప్రధాన కోచ్, వ్యవస్థాపకుడు ప్రదీప్ రాజు వద్ద శిక్షణ తీసుకుంది. -
6 లగ్జరీ కార్లు.. పాక్ రిచెస్ట్ క్రికెటర్గా! బాబర్ ఆజం నెట్ వర్త్ ఎంతంటే?
బాబర్ ఆజం.. పాకిస్తాన్కే కాకుండా ప్రపంచంలోనే అత్యత్తుమ బ్యాటర్లలో ఒకడిగా పేరుగాంచాడు. అరంగేట్రం చేసిన కొన్నాళ్లకే మూడు ఫార్మాట్లలోనూ పాక్ క్రికెట్ ముఖ చిత్రంగా మారాడు. తన కెప్టెన్సీతో పాటు అద్బుత బ్యాటింగ్తో పాటు జట్టును విజయ పథంలో నడిపించిన ఘనత అతడిది. క్లాసిక్ కవర్ డ్రైవ్ షాట్లకు పెట్టింది పేరు. అతడి క్రీజులో ఉంటే ప్రత్యర్ధి బౌలర్లకు గుండెల్లో రైళ్లు పరిగేత్తేవి. అయితే ఇదంతా ఒకప్పుడు. గత కొన్నేళ్లగా అతడు బ్యాట్ ముగబోయింది. అంతర్జాతీయ క్రికెట్లో బాబర్ సెంచరీ చేసి రెండేళ్లపైనే అయిపోయింది.ఒకనొక దశలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లితో పోటిపోడిన బాబర్ ఆజం.. ఇప్పుడు ఏకంగా జట్టులోనే చోటు కోల్పోయాడు. ఆసియాకప్-2025కు ఎంపిక చేసిన పాక్ జట్టులో బాబర్కు చోటు దక్కలేదు. అతడి పేలవ ఫామ్ కారణంగా సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.అయితే బాబర్ను జట్టు నుంచి తప్పించినప్పటికి అతడి ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఇసుమంత కూడా తగ్గలేదు. ఆజం తిరిగి సౌతాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్లో ఆడే అవకాశముంది. ఇక ఇది ఇలా ఉండగా.. అభిమానులు బాబర్ ఆజం నెట్వర్త్ ఎంతో తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. బాబర్కు ఏడాదికి ఎంతో సంపాదిస్తున్నాడో ఓ లుక్కేద్దాం.బాబర్ ఆజం నెట్ వర్త్ ఎంతంటే?పాకిస్తాన్లో అత్యంత రిచెస్ట్ క్రికెటర్గా బాబర్ ఆజం కొనసాగుతున్నాడు. పలు రిపోర్ట్లు ప్రకారం.. 2024-25కు గానూ బాబర్ ఆజం నెట్ వర్త్ రూ. 41 కోట్లగా ఉన్నట్లు తెలుస్తోంది. బాబర్ మొన్నటివరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(PCB) ఏ గ్రేడ్ కాంట్రాక్ట్లో ఉన్నాడు. దీంతో అతడికి పీసీబీ నుంచి నెలకు పీకేఆర్ 4.5 మిలియన్లు(భారత కరెన్సీలో దాదాపు 13.95 లక్షలు) లభించేవి. అదేవిధంగా ఐసీసీ వాటా నుంచి పీకేర్ 2.07 మిలియన్లు బోనస్ రూపంలో బాబర్కు వచ్చేవి. అంటే మొత్తంగా ఏడాదికి జీతం రూపంలో ఆజంకు భారత కరెన్సీ ప్రకారం రూ.2 కోట్ల పైగా అందేది. అదే విధంగా అతడి మ్యాచ్ ఫీజుల విషయానికి వస్తే.. ప్రతీ టెస్టు మ్యాచ్కు రూ. సుమారు 4 లక్షలు, వన్డేకు రూ. 2 లక్షలు, టీ20 మ్యాచ్కు రూ.1.5 లక్షలు తీసుకుంటాడు.పీఎస్ఎల్ శాలరీ ఎంతంటే?పాకిస్తాన్ సూపర్ లీగ్లో పెషావర్ జల్మీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అతడు పెషావర్ నుంచి కాంట్రాక్ట్ రూపంలో ఏడాదికి రూ. 1.88 కోట్లు అందుకుంటాడు.ఒక్కో యాడ్కు రూ.50 లక్షలు?బాబర్ ప్రస్తుతం పలు ఇంటర్నేషనల్ బ్రాండ్స్కు అంబాసిడర్గా వ్యహహరిస్తున్నాడు. ఒక్కో యాడ్లో నటించినందుకు ఆజం రూ.50 లక్షలు అందుకున్నట్లు సమాచారం. పెప్సి, హెడ్ అండ్ షోల్డర్స్, హెబీఎల్ బ్యాండ్లను బాబర్ ప్రమోట్ చేస్తున్నాడు. ఆడి ఎ-5, బీఎమ్డబ్ల్యూ, ఆడి ఇ-ట్రోన్, బ్లాక్ హ్యుందాయ్ సొనాటా,లంబోర్గిని అవెంటడోర్, BJ40 ప్లస్ జీప్ వంటి ఖరీదైన కార్లు బాబర్ వద్ద ఉన్నాయి. అదే విధంగా బాబర్కు లాహోర్లో విలాసవంతమైన ఓ ఫామ్హౌస్ కూడా ఉంది. బాబర్కు డిమోషన్..అయితే ఇటీవల 2025-26 ఏడాదికి గానూ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించిన పీసీబీ.. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్లకు భారీ షాకిచ్చింది. ఈ స్టార్ క్రికెటర్లకు డిమోషన్ లభించింది. గత కొన్ని సంవత్సరాలుగా కేటగిరీ ఎలో ఉన్న బాబర్, రిజ్వాన్లు ఇప్పుడు కేటగిరీ బికి పడిపోయారు. దీంతో వీరికి నెలకు పీకేఆర్ 3 మిలియన్లు( భారత కరెన్సీ 9.28 లక్షలు) అందుకోనున్నారు. గతేడాదితో పోలిస్తే వారి జీతంలో దాదాపు నాలుగు లక్షలపైగా కోత పడింది.చదవండి: Asia Cup 2025: టీమిండియాతో మ్యాచ్.. పాకిస్తాన్కు భారీ షాక్!? -
బుమ్రా కంటే అతడు ఎంతో బెటర్.. ఎందుకు పక్కన పెట్టారు?
ఆసియాకప్-2025ను టీమిండియా విజయంతో ఆరంభించిన సంగతి తెలిసిందే. దుబాయ్ వేదికగా జరిగిన తమ తొలి మ్యాచ్లో యూఏఈను 9 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్లో భారత్ ప్లేయింగ్ ఎలెవన్ నుంచి అర్ష్దీప్ సింగ్ను తప్పించడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాశంగా మారింది. గత కొన్నళ్లగా టీ20ల్లో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్న ఆర్ష్దీప్కు యూఏఈపై ఆడే అవకాశం లభించలేదు. టీమ్ మెనెజ్మెంట్ తీసుకున్న ఈ నిర్ణయం అందరిని ఆశ్చర్యపరిచింది. తొలి మ్యాచ్లో భారత్ కేవలం ఒకే ప్రధాన పేసర్ బరిలోకి దిగింది. బుమ్రాతో పాటు మీడియం పేస్ బౌలర్లు హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే బంతిని పంచుకున్నారు. దూబే మూడు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా ఓ వికెట్ సాధించాడు. హార్దిక్ కేవలం ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు.అర్ష్దీప్ను బెంచ్కే పరిమితం చేయడంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ లైనప్ను చూస్తుంటే భారత్ ఇంకా ఛాంపియన్స్ ట్రోఫీ హ్యాంగోవర్ లో ఉన్నట్లు ఉందని చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్లను భారత్ దుబాయ్ వేదికగానే ఆడింది. ఫైనల్లో కివీస్ను చిత్తు చేసి టైటిల్ను మెన్ ఇన్ బ్లూ సొంతం చేసుకుంది.అర్ష్దీప్ సింగ్ అద్బుతమైన ఫాస్ట్ బౌలర్. అతడికి టీ20ల్లో 99 వికెట్లు ఉన్నాయి. ఈ ఫార్మాట్లో అతడు భారత్ తరపున లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు. టీ20 క్రికెట్లో జస్ప్రీత్ బుమ్రా కంటే అర్ష్దీప్ గణాంకాలు మెరుగ్గా ఉన్నాయి. ఈ ప్లేయింగ్ ఎలెవన్ను చూస్తుంటే భారత్ ఇంకా ఛాంపియన్స్ ట్రోఫీ హ్యాంగోవర్ నుంచి రానిట్లు అన్పిస్తోంది. మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది. ఆ సమయంలో వాతవారణం చాలా పొడిగా ఉంది. కాబట్టి అప్పుడు మీ వ్యహాలు పనిచేశాయి. కానీ ఇది సెప్టెంబర్. వాతారణ పరిస్థితులు మారాయి. అయినప్పటికి టీమ్ మెనెజ్మెంట్ అదే వ్యూహాంతో వెళ్లారు. ఫార్మాట్ మారిన భారత్ ప్లాన్ మారలేదు.వన్డే ఫార్మాట్కు టీ20కు చాలా తేడా ఉంది. రాబోయే మ్యాచ్లలో కూడా ఇదే ఎలెవన్తో ఆడనున్నారా? ఏదేమైనప్పటికి అత్యుత్తమ జట్టును ఎంపిక చేయండి" తన యూట్యూబ్ ఛానల్లో చోప్రా పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ నలుగురు స్పిన్నర్లతో ఆడింది. ఇప్పుడు ఫార్మాట్ మరినప్పటికి టీమిండియా అదే ప్రణాళికను అనుసరిస్తుందని చోప్రా విమర్శించాడు. కాగా ఈ మ్యాచ్లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. -
టీమిండియాతో మ్యాచ్.. పాకిస్తాన్కు భారీ షాక్!?
ఆసియాకప్-2025లో పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. శుక్రవారం (సెప్టెంబర్12) దుబాయ్ వేదికగా ఒమన్తో పాక్ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు పాక్ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఆ జట్టు కెప్టెన్ సల్మాన్ అలీ అఘాకు స్వల్ప గాయమైనట్లు వార్తలు వస్తున్నాయి.దీంతో బుధవారం (సెప్టెంబర్ 10) దుబాయ్లోని ఐసీసీ అకాడమీలో జరిగిన ప్రాక్టీస్ సెషన్కు అతడు దూరంగా ఉన్నట్లు పాక్ మీడియా వర్గాలు వెల్లడించాయి. జియో న్యూస్ రిపోర్ట్ ప్రకారం.. ప్రాక్టీస్ సెషన్లో సల్మాన్ ఆఘా నెక్ బ్యాండ్తో కన్పించినట్లు సమాచారం. జట్టుతో పాటు ఐసీసీ ఆకాడమీకి వెళ్లినప్పటికి అతడు ఎటువంటి ప్రాక్టీస్లోనూ పాల్గోలేదంట. ఈ క్రమంలో భారత్తో మ్యాచ్కు ముందు తమ కెప్టెన్ గాయం బారిన పడడంతో పాకిస్తాన్ శిబిరంలో ఆందోళన నెలకొంది. అయితే ముందుస్తు జాగ్రత్తలో భాగంగానే అతడి విశ్రాంతికి ఇచ్చినట్లు పాక్ క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అతడు ప్రస్తుతం మెడ నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.ఒకవేళ ఒమన్తో జరిగే తొలి మ్యాచ్కు అఘా దూరమైనా.. భారత్తో మ్యాచ్కు మాత్రం పూర్తి ఫిట్నెస్ సాధించే అవకాశముంది. అప్పటికి అతడి గాయం తీవ్రమై భారత్ మ్యాచ్కు దూరమైతే పాక్కు గట్టి ఎదురు దెబ్బే అని చెప్పుకోవాలి.కాగా పాకిస్తాన్ దాదాపు రెండు వారాల ముందే యూఏఈకు చేరుకుంది. ఆసియాకప్ టోర్నీ సన్నాహాకాల్లో భాగంగా అఫ్గానిస్తాన్-యూఏఈలతో ట్రైసిరీస్లో పాక్ తలపడింది. ఫైనల్లో అఫ్గాన్ను చిత్తు చేసి టైటిల్ను పాక్ సొంతం చేసుకుంది. అదే జోరును ఇప్పుడు ఆసియాకప్లోనూ కొనసాగించాలని మెన్ ఇన్ గ్రీన్ పట్టుదలతో ఉంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా భారత్-పాక్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.ఆసియాకప్కు పాక్ జట్టుసల్మాన్ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రాఫ్, ఫకర్ జమాన్, హారిస్ రవూఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారిస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వాసిమ్ జూనియర్, షహిబ్జాద ఫర్హాన్, సయామ్ ఆయుబ్, సల్మాన్ మిర్జా, షహీన్ షా అఫ్రిది, సుఫ్యాన్ మోకిమ్చదవండి: Asia Cup 2025: 'అతడొక సంచలనం.. అందుకే వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ అయ్యాడు' -
చేతులేత్తేసిన బ్యాటర్లు.. 149 పరుగులకే సౌత్ జోన్ ఆలౌట్
దులీప్ ట్రోఫీ-2025 సెమీఫైనల్లో దుమ్ములేపిన సౌత్ జోన్.. తుది పోరులో మాత్రం తడబడుతోంది. బెంగళూరు వేదికగా సెంట్రల్ జోన్తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో సౌత్ జోన్ బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. మొదటి ఇన్నింగ్స్లో సౌత్ జోన్ 63 ఓవర్లలో కేవలం 149 పరుగులకే కుప్పకూలింది. కుమార్ కార్తికేయ, శరన్ష్ జైన్ స్పిన్ వలలలో చిక్కుకుని సౌత్ జోన్ బ్యాటర్లు విలవిల్లాడారు. శరన్ష్ జైన్ ఫైవ్ వికెట్ హాల్తో మెరవగా.. శరన్ష్ జైన్ నాలుగు వికెట్లు సాధించాడు. సౌత్జోన్ ఇన్నింగ్స్లో తన్మయ్ అగర్వాల్(31) టాప్ స్కోరర్గా నిలవగా.. సల్మాన్ నిజార్(24), అంకిత్ శర్మ(20) రాణించారు. మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. సౌత్ జోన్ జట్టులో నారయణ్ జగదీశన్, దేవ్దత్ పడిక్కల్ లేని లోటు స్పష్టంగా కన్పిస్తోంది. వీరిద్దరు ఆస్ట్రేలియా- ‘ఎ’ జట్టుతో జరిగే అనధికారిక టెస్టు సిరీస్కు ఎంపిక కావడంతో దులీప్ ట్రోఫీ ఫైనల్లో భాగం కాలేదు. కాగా సెమీఫైనల్లో జగదీశన్ భారీ సెంచరీతో కదం తొక్కగా.. పడిక్కల్ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక బ్యాటింగ్లో విఫలమైన సౌత్ జోన్ కనీసం బౌలింగ్లో నైనా రాణిస్తుందో లేదో వేచి చూడాలి.చదవండి: Asia Cup 2025: 'అతడొక సంచలనం.. అందుకే వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ అయ్యాడు' -
టాప్-10లోకి అర్ష్దీప్ సింగ్.. ఆర్చర్ 16 స్ధానాలు జంప్
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టి20 బౌలింగ్ ర్యాంకింగ్స్లో భారత ప్లేయర్లు ముందడుగు వేశారు. స్పిన్నర్ రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్ ఒక్కో స్థానం మెరుగు పరుచుకున్నారు. ఈ జాబితాలో టీమిండియా నుంచి అత్యుత్తమంగా వరుణ్ చక్రవర్తి (706 పాయింట్లు) నాలుగో స్థానంలో ఉండగా... రవి బిష్ణోయ్ (674 పాయింట్లు) ఆరో ర్యాంక్లో, అర్ష్దీప్ సింగ్ సింగ్ (653 పాయింట్లు) పదో స్థానంలో ఉన్నారు. అక్షర్ పటేల్ (636 పాయింట్లు) సైతం ఒక స్థానం మెరుగు పరుచుకొని 13వ ర్యాంక్కు చేరుకున్నాడు. టి20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో అభిషేక్ శర్మ (829 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతుండగా... తిలక్ వర్మ (804 పాయింట్లు) రెండో ర్యాంక్లో ఉన్నాడు. టీమిండియా టి20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆరో స్థానంలో ఉండగా... ఆసియా కప్ టోర్నీకి ఎంపిక కాని ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఒక స్థానం కోల్పోయి 11వ ర్యాంక్లో నిలిచాడు. ఆల్రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా 252 పాయింట్లతో ‘టాప్’లో ఉన్నాడు. వన్డే ర్యాంకింగ్స్లో ఎలాటి మార్పులు చోటుచేసుకోలేదు. బ్యాటింగ్లో శుబ్మన్ గిల్ (784 పాయింట్లు), రోహిత్ శర్మ (756 పాయింట్లు) వరుసగా తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. విరాట్ కోహ్లి (736 పాయింట్లు) నాలుగో ర్యాంక్లో ఉన్నాడు. ఆర్చర్ అదుర్స్..కాగా వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ సత్తాచాటాడు. ఏకంగా 16 స్ధానాలు జంప్ చేసి టాప్-3 ర్యాంక్కు ఆర్చర్ చేరుకున్నాడు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో అద్బుతమైన ప్రదర్శన కనబరచడంతో ఆర్చర్ తన ర్యాంకింగ్స్లో గణనీయమైన పురోగతిని సాధించాడు. ఇదే సిరీస్లో దుమ్ములేపిన సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ 680 రేటింగ్ పాయింట్లతో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు.చదవండి: Asia Cup 2025: 'అతడొక సంచలనం.. అందుకే వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ అయ్యాడు' -
'అతడొక సంచలనం.. అందుకే వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ అయ్యాడు'
ఆసియాకప్-2025లో టీమిండియా శుభారంభం చేసింది. బుధవారం దుబాయ్ వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో భారత్ విజయాన్ని అందుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన యూఏఈ 57 పరుగులకే ఆలౌటైంది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా కేవలం 4.3 ఓవర్లలో వికెట్ కోల్పోయి చేధించింది.అభిషేక్ శర్మ(16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 30), శుభ్మన్ గిల్(9 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 20 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో 93 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని భారత్ అందుకుంది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. నాలుగు వికెట్లతో చెలరేగిన కుల్దీప్ యాదవ్, బ్యాటింగ్లో దుమ్ములేపిన అభిషేక్ శర్మపై సూర్య ప్రశంసల వర్షం కురిపించాడు."పిచ్ ఎలా స్పందిస్తుందో తెలుసుకోవాలనుకున్నాము. అందుకే టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నాము. రెండు ఇన్నింగ్స్లోనూ వికెట్ ఒకేలా ఉంది. ఈ మ్యాచ్లో మా బాయ్స్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. మేము ప్రతీ మ్యాచ్లోనూ మా బ్రాండ్ ఆఫ్ క్రికెట్ను కొనసాగించాలనకుంటున్నాము. ఈ మ్యాచ్లో మేము అన్ని విభాగాల్లోనూ మెరుగ్గా రాణించాము. మా జట్టులో చాలా మంది ఆటగాళ్లు ఇటీవల ఛాంపియన్ ట్రోఫీలో ఇక్కడ ఆడారు. పిచ్ బాగానే ఉంది. కానీ వికెట్ కాస్త నెమ్మదిగా ఉంది. స్పిన్నర్లకు అనుకూలంగా ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం దుబాయ్లో వాతవారణం చాలా వేడిగా ఉంది. నిజంగా కుల్దీప్ యాదవ్ ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. అతడికి దూబే, బుమ్రా, వరుణ్ నుంచి సపోర్ట్ లభించింది. ఇక అభిషేక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడొక అద్భుతం. జట్టు 200 పరుగులు చేధించినా, టార్గెట్ 50 అయినా అతడి ఆట తీరు ఒకే విధంగా ఉంటుంది. అందుకే అతడు ప్రస్తుతం ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్గా కొనసాగుతున్నాడు. పాకిస్తాన్తో మ్యాచ్ కోసం మా ఆటగాళ్లంతా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో పేర్కొన్నాడు. సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తెల్చుకోనుంది.చదవండి: Asia Cup 2025: చరిత్ర సృష్టించిన టీమిండియా.. తొలి జట్టుగా -
ఐసీసీ చారిత్రక నిర్ణయం
మహిళల క్రికెట్ అభివృద్ధి దిశగా ఐసీసీ మరో కీలక అడుగు వేసింది. 13వ మహిళల వన్డే వరల్డ్ కప్ (2025) కోసం 14 మంది మహిళా అంపైర్లు, నలుగురు మహిళా మ్యాచ్ రిఫరీలను ఎంపిక చేసింది. మహిళల వన్డే వరల్డ్ కప్ చరిత్రలో పూర్తిగా మహిళా అధికారులనే నియమించడం ఇదే మొదటిసారి.ఈ చారిత్రక నిర్ణయం తీసుకోవడంలో ఐసీసీ అధ్యక్షుడు, బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షా కీలకపాత్ర పోషించారు. ఇది మహిళల క్రికెట్ ప్రయాణంలో కీలక ఘట్టమని ఆయన అన్నారు.ఓవరాల్గా చూస్తే అందరూ మహిళా అధికారులే ఉన్న నాలుగో గ్లోబల్ టోర్నమెంట్ ఇది. 2022 కామన్వెల్త్ క్రీడలు, తాజాగా జరిగిన రెండు టీ20 వరల్డ్కప్ టోర్నీల్లో మ్యాచ్ అధికారులంతా మహిళలే.ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 కోసం ఎంపిక చేసిన మ్యాచ్ రిఫరీలు- ట్రూడీ ఆండర్సన్, - షాండ్రే ఫ్రిట్జ్ - జి.ఎస్. లక్ష్మి - మిచెల్ పెరెరాఅంపైర్లు- లారెన్ ఏజెన్బ్యాగ్ - కాండేస్ లా బోర్డే - కిమ్ కాటన్ - సారా డాంబనేవనా - షతిరా జకీర్ జెసీ - కెరిన్ క్లాస్టే - జనని ఎన్ - నిమాలి పెరెరా - క్లేర్ పోలోసాక్ - వృందా రాథీ - సూ రెడ్ఫెర్న్ - ఎలోయిస్ షెరిడన్ - గాయత్రి వేణుగోపాలన్ - జాక్వెలిన్ విలియమ్స్కాగా, మహిళల వన్డే ప్రపంచకప్ సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్లో ఆతిథ్య దేశాలే తలపడనున్నాయి. ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ ఆడబోయే మ్యాచ్లన్నీ శ్రీలంకలో జరుగుతాయి. -
భారత్-పాక్ మ్యాచ్ రద్దుకు సుప్రీం కోర్టులో పిల్.. న్యాయస్థానం స్పందన ఇదే..!
ఆసియా కప్ 2025లో భాగంగా ఈ నెల 14న దుబాయ్లో జరుగబోయే భారత్-పాకిస్తాన్ మ్యాచ్పై సుప్రీం కోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (PIL) దాఖలైంది. ఈ మ్యాచ్ను రద్దు చేయాలని ఉర్వశి జైన్ నేతృత్వంలో నలుగురు న్యాయ విద్యార్థులు ఆర్టికల్ 32 ప్రకారం పిటిషన్ను దాఖలు చేశారు.పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం జాతీయ గౌరవానికి విరుద్ధమని వారు పిటిషన్లో పేర్కొన్నారు. మ్యాచ్ నిర్వహణ అమరవీరుల కుటుంబాలకు బాధ కలిగించే చర్యగా అభిప్రాయపడ్డారు.అయితే, ఈ పిటిషన్ను జస్టిస్ జె.కె.మహేశ్వరి, విజయ్ బిష్ణోయి నేతృత్వంలోని బెంచ్ విచారణకు తీసుకోలేదు. "ఇది కేవలం మ్యాచ్ మాత్రమే.. వదిలేయండి" అంటూ న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్పై రాజకీయ, సామాజిక భావోద్వేగాలు ఉన్నప్పటికీ, సుప్రీం కోర్టు ఈ విషయాన్ని క్రీడా పరంగా మాత్రమే పరిగణించింది. క్రికెట్ను జాతీయ ప్రయోజనాల కంటే పైగా చూడలేమన్న అభిప్రాయాలు ఉన్నా, ప్రస్తుత విధానాలు మరియు అంతర్జాతీయ ఒప్పందాలు కారణంగా మ్యాచ్ను కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బహుల దేశాలు పాల్గొనే టోర్నీల్లో పాక్తో మ్యాచ్ను రద్దు చేసుకుంటే, అది భారత ఆటగాళ్ల కెరీర్లపై ప్రభావం చూపే ప్రమాదముంది.బహుల దేశాలు పాల్గొనే టోర్నీల్లో టీమిండియా పాక్తో తలపడనున్నా, ద్వైపాక్షిక సిరీస్లు మాత్రం ఆడదు. ఈ విషయాన్ని బీసీసీఐ ఇదివరకే స్పష్టం చేసింది.ఇదిలా ఉంటే, ఆసియా కప్లో భారత్ ఘనంగా బోణీ కొట్టింది. నిన్న (సెప్టెంబర్ 10) యూఏఈతో జరిగిన మ్యాచ్ను టీమిండియా 27 బంతుల్లోనే ముగించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. కుల్దీప్ యాదవ్ (2.1-0-7-4), శివమ్ దూబే (2-0-4-3), వరుణ్ చక్రవర్తి (2-0-4-1), అక్షర్ పటేల్ (3-0-13-1), బుమ్రా (3-0-19-1) ధాటికి 13.1 ఓవర్లలో 57 పరుగులకే కుప్పకూలింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. అభిషేక్ శర్మ (16 బంతుల్లో 30; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), శుభ్మన్ గిల్ (9 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (2 బంతుల్లో 7 నాటౌట్; సిక్స్) చెలరేగడంతో 4.3 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
గెలుపు జోష్లో ఉన్న సౌతాఫ్రికాకు వరుస షాక్లు
ఇంగ్లండ్ పర్యటనలో వరుస విజయాలతో దూసుకుపోతున్న సౌతాఫ్రికాకు వరుస షాక్లు తగులుతున్నాయి. ఈ పర్యటనలో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న ఆ జట్టు.. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లోనూ ఘనంగా బోణీ కొట్టింది. నిన్న జరిగిన తొలి మ్యాచ్లో సౌతాఫ్రికా ఆతిథ్య ఇంగ్లండ్పై 14 పరుగుల తేడాతో (డక్వర్త్ లూయిస్ పద్దతి) గెలుపొంది, సిరీస్లో 1-0 ఆధిక్యంలో వెళ్లింది.ఈ మ్యాచ్కు ముందే సౌతాఫ్రికాకు రెండు భారీ షాక్లు తగిలాయి. స్టార్ పేసర్ లుంగి ఎంగిడి, స్టార్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ గాయాల బారిన పడ్డారు. వీరిలో ఎంగిడి ఇంగ్లండ్తో టీ20 సిరీస్ మొత్తానికి దూరంగా కాగా.. కేశవ్ మహారాజ్ ఇంగ్లండ్ టీ20 సిరీస్తో పాటు ఆతర్వాత పాకిస్తాన్తో జరిగే టెస్ట్ సిరీస్కు కూడా దూరం కావచ్చు. ఇంగ్లండ్ సిరీస్లో ఎంగిడికి ప్రత్యామ్నాయంగా నండ్రే బర్గర్ను ఎంపిక చేయగా.. మహారాజ్కు ప్రత్యామ్నాయాన్ని ఇంకా ప్రకటించలేదు. మహారాజ్ గాయంపై ఇంకా పూర్తి క్లారిటీ లేకపోవడంతో క్రికెట్ సౌతాఫ్రికా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మెడికల్ రిపోర్ట్లు వచ్చిన తర్వాత అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.మహారాజ్ ఇటీవలికాలంలో సౌతాఫ్రికా విజయాల్లో అత్యంత కీలకపాత్ర పోషిస్తున్నాడు. గత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్తో మొదలు.. తాజాగా ఇంగ్లండ్తో ముగిసిన వన్డే సిరీస్ వరకు అతని హవా కొనసాగింది. సౌతాఫ్రికా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో కొత్త డబ్ల్యూటీసీ సైకిల్ను ప్రారంభించే తరుణంలో (పాక్తో సిరీస్) మహారాజ్ గాయపడటం ఆ జట్టు విజయావకాశాలను తప్పక ప్రభావితం చేయవచ్చు. సౌతాఫ్రికా 2 టెస్ట్లు, 3 టీ20లు, 3 వన్డేల సిరీస్ల కోసం అక్టోబర్ 12 నుంచి పాకిస్తాన్లో పర్యటించనుంది. ఈ పర్యటనకు మహారాజ్ పూర్తిగా దూరమవుతాడా లేక టెస్ట్లకు మాత్రమే అందుబాటులో ఉండడా అన్న విషయంపై త్వరలోనే క్లారిటీ వస్తుంది.మహారాజ్ తాజాగా ఇంగ్లండ్తో ముగిసిన వన్డే సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచాడు. ఈ సిరీస్లో అతను 3 మ్యాచ్ల్లో 8 వికెట్లు తీశాడు. మహారాజ్ తొలి టీ20 ఆడకపోయినా సౌతాఫ్రికా ఆ మ్యాచ్లో గెలుపొందింది. -
భారత పర్యటనకు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్
సెప్టెంబర్ 16 నుంచి ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత్లో పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటనలో ఆసీస్ భారత-ఏ జట్టుతో రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్లు, మూడు అనధికారిక వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్లకు ముందు ఆసీస్-ఏ టీమ్కు భారీ షాక్ తగిలింది.ఆల్రౌండర్ ఆరోన్ హార్డీ భుజం గాయం కారణంగా తప్పుకున్నాడు. హార్డీ స్థానాన్ని విల్ సదర్లాండ్ భర్తీ చేయనున్నాడు. ఇదివరకే వన్డే జట్టులో సభ్యుడైన సదర్లాండ్ రెండో టెస్ట్ సమయానికి జట్టుతో కలుస్తాడు. వన్డేల్లో హార్డీకి ప్రత్యామ్నాయాన్ని ప్రకటించలేదు.హార్డీ ఇటీవల వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20, వన్డే సిరీస్ల్లో పాల్గొన్నాడు. అయితే, ఆ సిరీస్ల్లో పేలవ ప్రదర్శన కారణంగా త్వరలో జరుగనున్న న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక కాలేదు. హార్డీ తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు భారత్-ఏ సిరీస్తో అవకాశం కల్పించగా, గాయం బారిన పడ్డాడు. గాయం తీవ్రం కాకపోతే, వన్డే సిరీస్ ఆడవచ్చు.భారత్లో ఆస్ట్రేలియా ఏ జట్టు పర్యటన వివరాలు..సెప్టెంబర్ 16-23: తొలి టెస్ట్ (లక్నో)సెప్టెంబర్ 23-26: రెండో టెస్ట్ (లక్నో)సెప్టెంబర్ 30: తొలి వన్డే (కాన్పూర్)అక్టోబర్ 3: రెండో వన్డే (కాన్పూర్)అక్టోబర్ 5: మూడో వన్డే (కాన్పూర్)ఆస్ట్రేలియా-ఏ టెస్ట్ జట్టు..జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోల్లీ, జాక్ ఎడ్వర్డ్స్, కాంప్బెల్ కెల్లావే, సామ్ కాన్స్టాస్, నాథన్ మెక్స్వీనీ, టాడ్ మర్ఫీ, ఫెర్గస్ ఓ'నీల్, ఆలివర్ పీక్, జోష్ ఫిలిప్, కోరీ రోచిసియోలి, లియామ్ స్కాట్, విల్ సదర్లాండ్, హెన్రీ థోర్న్టన్వన్డే జట్టు..కూపర్ కొన్నోల్లీ, హ్యారీ డిక్సన్, జాక్ ఎడ్వర్డ్స్, సామ్ ఎలియట్, జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్, మెకెంజీ హార్వే, టాడ్ మర్ఫీ, తన్వీర్ సంఘ, లియామ్ స్కాట్, లాచీ షా, టామ్ స్ట్రాకర్, విల్ సదర్లాండ్, హెన్రీ థోర్న్టన్ఈ సిరీస్ల కోసం భారత-ఏ టెస్ట్ జట్టును కూడా ప్రకటించారు. ఈ జట్టుకు శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహిస్తాడు. అతనికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) అభిమన్యు ఈశ్వరన్ ఉంటాడు.శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్, అభిమన్యు ఈశ్వరన్ (వైస్ కెప్టెన్), ఎన్ జగదీశన్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, హర్ష్ దూబే, ఆయుష్ బడోని, నితీష్ కుమార్ రెడ్డి, తనుష్ కోటియన్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, ఖలీల్ అహ్మద్, మానవ్ సుతార్, యష్ ఠాకూర్ -
షాకింగ్ ఘటన.. క్రికెటర్లకు తుపాకీ బెదిరింపులు
తాజాగా జరిగిన ఓ ఘటన క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురి చేసింది. కరీబియన్ ప్రీమియర్ లీగ్లో (CPL) పాల్గొంటున్న ఇద్దరు స్టార్ ఆటగాళ్లు (సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియట్స్), ఓ సీపీఎల్ అధికారి తుపాకీ బెదిరింపులకు గురయ్యారు. ఈ ఘటన సెప్టెంబర్ 9వ తేదీ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగింది. పైన పేర్కొన్న వారు ఓ ప్రైవేట్ ఈవెంట్ నుండి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.పోలీసుల కథనం ప్రకారం.. ఆటగాళ్లను బెదిరించింది దొంగలై ఉండవవచ్చు. నగలు మరియు ఇతర విలువైన వస్తువుల కోసం ఇలా చేసి ఉంటారు. ఘటనా స్థలంలో ఓ తుపాకీ లభించింది. అది దొంగలదిగా భావిస్తున్నాం. ఈ ఘటనలో బాధితులు ఎవరూ గాయపడలేదు. విచారణ వేగవంతగా జరుగుతుంది.తాజా ఉదంతంతో సీపీఎల్ నిర్వహకులు అలర్ట్ అయ్యారు. ఆటగాళ్లు సహా సీపీఎల్లో భాగమైన వారందరికీ భద్రత పెంచారు. ఆటగాళ్ల సంక్షేమం తమకు చాలా ముఖ్యమని ప్రకటించారు. బాధితుల గోప్యతను గౌరవిస్తూ వారి పేర్లను వెల్లడించడం లేదని తెలిపారు.కాగా, తుపాకీ బెదింపుల ఘటన తర్వాత పేట్రియట్స్ ఇవాళ (సెప్టెంబర్ 11) జరుగబోయే మ్యాచ్కు ప్రిపేర్ అవుతుంది. ఆ జట్టు బార్బడోస్ రాయల్స్ను ఢీకొట్టనుంది. ఈ సీజన్లో పేట్రియాట్స్ ప్రదర్శన చాలా దారుణంగా ఉంది. ఆడిన 9 మ్యాచ్ల్లో కేవలం 3 విజయాలు మాత్రమే సాధించి, పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది.పేట్రియాట్స్ సెప్టెంబర్ 7న జరిగిన తమ చివరి మ్యాచ్లో గయానా అమెజాన్ వారియర్స్పై 5 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆ మ్యాచ్లో పాక్ ఆటగాడు రిజ్వాన్ (62 బంతుల్లో 85) ఒంటరిపోరాటం చేసి పేట్రియాట్స్ను గెలిపించాడు. రిజ్వాన్ ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన పాక్ జట్టుకు ఎంపిక కాలేదు. వన్డే జట్టు కెప్టెన్ అయినా పాక్ సెలెక్టర్లు ఫామ్ను సాకుగా చూపుతూ రిజ్వాన్ను పక్కన పెట్టారు. -
రోహిత్ శర్మకు సంబంధించి బిగ్ అప్డేట్
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మకు సంబంధించి ఓ బిగ్ అప్డేట్ వచ్చింది. అక్టోబర్లో ఆస్ట్రేలియాతో జరుగబోయే వన్డే సిరీస్లో హిట్మ్యాన్ పాల్గొనడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి రోహిత్ స్వయంగా క్లూ ఇచ్చాడు. ముంబై ఇండియన్స్ క్యాంప్లో ట్రైనింగ్ మొదలుపెట్టిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. View this post on Instagram A post shared by Rohit Sharma (@rohitsharma45)ఈ ఫోటోల్లో రోహిత్ ప్యాడింగ్ చేసుకుంటూ, స్ప్రింట్ చేస్తూ కనిపించాడు. రోహిత్ బరువు కూడా చాలా తగ్గినట్లు కనిపిస్తున్నాడు. పలు నివేదికల ప్రకారం హిట్మ్యాన్ ఇటీవలికాలంలో 8 కిలోల బరువు తగ్గినట్లు తెలుస్తుంది. తాజాగా బీసీసీఐ నిర్వహించిన యో-యో టెస్ట్లో అతను 19.4 స్కోర్ సాధించాడని సమాచారం. రోహిత్ ఫిట్నెస్పై ఈ స్థాయిలో దృష్టి పెట్టడం ఖచ్చితంగా ఆస్ట్రేలియా పర్యటన కోసమేనన్న సంకేతాన్నిస్తుంది.టీ20, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించి, వన్డేల్లో కొనసాగుతానని స్పష్టంగా ప్రకటించినా.. రోహిత్ వన్డే భవితవ్యం అంత క్లారిటీగా లేదు. కొందరు రోహిత్ 2027 వన్డే వరల్డ్కప్ వరకు ఆడతాడని అంటుంటే, ఆస్ట్రేలియా పర్యటనే లాస్ట్ అని కొందరు, ఆస్ట్రేలియా సిరీస్ కూడా ఆడడని ఇంకొందరు అంటున్నారు.ఈ ప్రచారాల నేపథ్యంలో రోహిత్ ఫిట్గా కనిపిస్తూ ప్రాక్టీస్ మొదలుపెట్టడం, వన్డేల్లో కొనసాగాలనుకున్న అతని సంకల్పాన్ని సూచిస్తుంది. రోహిత్ రాక కోసం అతని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. హిట్మ్యాన్ చివరిగా ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా జెర్సీలో కనిపించాడు.టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన అక్టోబర్ 19న మొదలవుతుంది. ఈ పర్యటనలో భారత్ 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. తొలుత వన్డేలు, ఆతర్వాత టీ20 సిరీస్ జరుగనున్నాయి. అక్టోబర్ 19 (పెర్త్), 23 (అడిలైడ్), 25 (సిడ్నీ) తేదీల్లో వన్డేలు.. 29 (కాన్బెర్రా), 31 (మెల్బోర్న్), నవంబర్ 2 (హోబర్ట్), 6 (గోల్డ్ కోస్ట్), 8 (బ్రిస్బేన్) తేదీల్లో టీ20లు జరుగనున్నాయి. -
Asia Cup 2025: రోహిత్ శర్మ సరసన అభిషేక్ శర్మ
టీమిండియా యువ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ యూఏఈతో నిన్న (సెప్టెంబర్ 10) జరిగిన ఆసియా కప్ 2025 మ్యాచ్లో చెలరేగిపోయాడు. 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 30 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో తొలి బంతి నుంచే ఊచకోత మొదలుపెట్టిన అభిషేక్.. యూఏఈ బౌలర్లపై తారాస్థాయిలో విరుచుకుపడ్డాడు. హైదర్ అలీ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికే సిక్సర్ బాదిన అభిషేక్ హిట్మ్యాన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ సరసన చేరాడు.ABHISHEK SHARMA - HIT THE FIRST BALL OF THE INNINGS FOR A SIX. 🤯 pic.twitter.com/4sWr6hOLl0— Johns. (@CricCrazyJohns) September 10, 2025రోహిత్ (2021లో ఇంగ్లండ్పై), జైస్వాల్ (2024లో జింబాబ్వేపై), సంజూ (2025లో ఇంగ్లండ్పై) కూడా గతంలో అభిషేక్ తరహాలనే ఇన్నింగ్స్ టీ20ల్లో తొలి బంతికే సిక్సర్ కొట్టారు.భారీ విజయంఅభిషేక్ విధ్వంసం ధాటికి యూఏఈ నిర్దేశించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం 4.3 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. బంతుల పరంగా టీ20ల్లో భారత్కు ఇదే భారీ విజయం. మరో 93 బంతులు మిగిలుండగానే టీమిండియా లక్ష్యాన్ని ఊదేసింది. 2021లో స్కాట్లాండ్పై 81 బంతులు మిగిలుండగానే గెలుపొందడం దీనికి ముందున్న రికార్డు.ఆసియా కప్ చరిత్రలోనూ బంతుల పరంగా ఇదే భారీ విజయం. గతంలో ఈ రికార్డు ఆఫ్ఘనిస్తాన్ పేరిట ఉండేది. 2022 ఎడిషన్లో ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంకపై 59 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.27 బంతుల్లోనే టార్గెట్ ఫినిష్ఈ మ్యాచ్లో టీమిండియా మరో ఘనత కూడా సాధించింది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా లక్ష్య ఛేదన చేసిన రెండో జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్లో భారత్ కేవలం 27 బంతుల్లోనే టార్గెట్ను ఊదేసింది. ఈ రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉంది. 2022 ప్రపంచకప్లో ఆ జట్టు ఒమన్పై కేవలం 19 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన యూఏఈ.. కుల్దీప్ యాదవ్ (2.1-0-7-4), శివమ్ దూబే (2-0-4-3), వరుణ్ చక్రవర్తి (2-0-4-1), అక్షర్ పటేల్ (3-0-13-1), బుమ్రా (3-0-19-1) ధాటికి 13.1 ఓవర్లలో 57 పరుగులకే కుప్పకూలింది. యూఏఈ ఇన్నింగ్స్లో ఓపెనర్లు అలీషాన్ షరాఫు (22), ముహమ్మద్ వసీం (19) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. అభిషేక్, శుభ్మన్ గిల్ (9 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (2 బంతుల్లో 7 నాటౌట్; సిక్స్) ధాటికి 4.3 ఓవర్లలో వికెట్ కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఈ టోర్నీలో భారత్ సెప్టెంబర్ 14న పాకిస్తాన్తో తలపడనుంది. -
ఇంగ్లండ్కు సౌతాఫ్రికా మరో షాక్
సౌతాఫ్రికా ఇంగ్లండ్కు మరో షాక్ ఇచ్చింది. ఇంగ్లండ్ను వారి దేశంలోనే వన్డే సిరీస్లో ఓడించిన (2-1తో) ఆ జట్టు.. తాజాగా టీ20 సిరీస్లోనూ ఆ దిశగా తొలి అడుగు వేసింది. నిన్న (సెప్టెంబర్ 10) జరిగిన తొలి మ్యాచ్లో అతిథ్య జట్టుపై సౌతాఫ్రికా డక్వర్త్ లూయిస్ పద్దతిలో 14 పరుగులు తేడాతో గెలుపొందింది. ఫలితంగా మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.వర్షం అంతరాయాల నడుమ సాగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 7.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. వర్షం కారణంగా ఆలస్యం కావడంతో ఈ మ్యాచ్ను తొలుత 9 ఓవర్ల మ్యాచ్గా నిర్ణయించారు. అయితే 7.5 ఓవర్ల తర్వాత వరుణుడు మరోసారి అడ్డుపడటంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ అక్కడే ముగించారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో మార్క్రమ్ (28), బ్రెవిస్ (23), డొనొవన్ ఫెర్రియెరా (25 నాటౌట్), స్టబ్స్ (13) ఉన్న పరిధిలో చెలరేగారు. ఇంగ్లండ్ బౌలర్లలో లూక్ వుడ్ 2, ఓవర్టన్, ఆదిల్ రషీద్, సామ్ కర్రన్ తలో వికెట్ తీశారు.వర్షం కారణంగా మరి కాస్త సమయం వృధా కావడంతో డక్వర్త్ లూయిస్ పద్దతిన ఇంగ్లండ్ టార్గెట్ను 5 ఓవర్లలో 69 పరుగులకే కుదించారు. అయితే ఈ లక్ష్యాన్ని అందుకోవడంలో ఇంగ్లండ్ విఫలమైంది. 5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 54 పరుగులు మాత్రమే చేయగలిగింది. సౌతాఫ్రికా బౌలర్లు వికెట్ల రూపంలోనే ఐదు బంతులు వేస్ట్ చేసి ఇంగ్లండ్ను దెబ్బకొట్టారు. జన్సెన్, కార్బిన్ బాష్ తలో 2, రబాడ ఓ వికెట్ తీశారు. ఛేదనలో తొలి బంతికే సాల్ట్ను రబాడ పెవిలియన్కు పంపాడు. ఆతర్వాత ఇంగ్లండ్ ఓవర్కు ఒకటి చొప్పున వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో బట్లర్ (25), సామ్ కర్రన్ (10 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఈ సిరీస్లో రెండో టీ20 మాంచెస్టర్ వేదికగా సెప్టెంబర్ 12న జరుగనుంది. -
సింధుకు షాక్
హాంకాంగ్: ఈ ఏడాది తొలి టైటిల్ కోసం భారత స్టార్ ప్లేయర్ పీవీ సింధు వేట ఇంకా కొనసాగనుంది. హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ –500 బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రపంచ 14వ ర్యాంకర్ సింధు తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. ప్రపంచ 27వ ర్యాంకర్, అన్సీడెడ్ లినె క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్)తో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21–15, 16–21, 19–21తో ఓటమి పాలైంది. గతంలో లినె క్రిస్టోఫర్సన్తో ఆడిన ఐదుసార్లూ విజయం సాధించిన సింధు ఆరోసారి మాత్రం ఓటమి తప్పలేదు. 58 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సింధు నిర్ణాయక మూడో గేమ్లో 16–13తో, 17–15తో ఆధిక్యంలోకి వెళ్లి విజయం దిశగా సాగింది. ఈ కీలక తరుణంలో సింధు అనవసర తప్పిదాలు చేయడం... 15–17తో వెనుకబడిన లినె వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి ఒక్కసారిగా 19–17తో ముందంజ వేసింది. ఆ తర్వాత సింధు ఒక పాయింట్ గెలిచినా... ఆ వెంటనే లినె రెండు పాయింట్లు నెగ్గి తన కెరీర్లో తొలిసారి భారత స్టార్పై విజయాన్ని ఖాయం చేసుకుంది. భారత్కే చెందిన అనుపమ, రక్షిత శ్రీ కూడా తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. అనుపమ 17– 21, 22–20, 14–21తో తొమ్మిదో ర్యాంకర్ టొమోకా మియకాజి (జపాన్) చేతిలో, రక్షిత శ్రీ 13–21, 7–21తో ప్రపంచ మాజీ చాంపియన్ రచనోక్ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయారు. లక్ష్య సేన్, ప్రణయ్ ముందంజ పురుషుల సింగిల్స్ విభాగంలో బరిలోకి దిగిన నలుగురు భారత క్రీడాకారులు లక్ష్య సేన్, ప్రణయ్, కిరణ్ జార్జి, ఆయుశ్ శెట్టి శుభారంభం చేశారు. తొలి రౌండ్ మ్యాచ్ల్లో లక్ష్య సేన్ 22–20, 16–21, 21–15తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ)పై, ప్రణయ్ 21–17, 21–14తో లు గ్వాంగ్ జు (చైనా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లో ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యారు. కిరణ్ జార్జి 21–16, 21–11తో జియా హెంగ్ జేసన్ (సింగపూర్)పై, ఆయుశ్ 15–21, 21–19, 21–13తో సు లి యాంగ్ (చైనీస్ తైపీ)లపై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో రుతపర్ణ–శ్వేతాపర్ణ (భారత్) ద్వయం 21–17, 21–9తో పాంగ్ వనెస్సా–వాంగ్ సమ్ (హాంకాంగ్) జంటను ఓడించింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో గద్దె రుత్విక శివాని–రోహన్ (భారత్) జోడీ 14–21, 17–21తో ప్రపంచ రెండో ర్యాంక్ జంట ఫెంగ్ యాన్ జె–హువాంగ్ డాంగ్ పింగ్ (చైనా) చేతిలో... తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) ద్వయం 16– 21, 11–21తో చెన్ చెంగ్ కువాన్–సు యిన్ హుయ్ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓడిపోయాయి. -
ఎవరిదో దులీప్ ట్రోఫీ?
బెంగళూరు: దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ ఫైనల్కు రంగం సిద్ధమైంది. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ గ్రౌండ్లో గురువారం ప్రారంభం కానున్న ఈ తుది పోరులో సెంట్రల్ జోన్తో సౌత్ జోన్ తలపడనుంది. ఓ వైపు టీమిండియా ఆసియాకప్ టి20 టోర్నమెంట్లో పాల్గొంటుండగా... మరోవైపు భారత ‘ఎ’ జట్టు ఆస్ట్రేలియా ‘ఎ’తో అనధికారిక టెస్టు సిరీస్కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కొత్త ఆటగాళ్లు తమ సత్తా చాటుకునేందుకు దులీప్ ట్రోఫీ చక్కటి వేదిక కానుంది. గతేడాది మాదిరిగా కాకుండా తిరిగి పాత పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో నార్త్ జోన్పై విజయంతో సౌత్ జోన్... వెస్ట్ జోన్ను ఓడించి సెంట్రల్ జోన్ ఫైనల్కు చేరాయి. సౌత్ జోన్ జట్టు చివరిసారిగా 2023లో దులీప్ ట్రోఫీ విజేతగా నిలవగా... 2014–15 సీజన్లో సెంట్రల్ జోన్ ట్రోఫీ చేజిక్కించుకుంది. అప్పుడు కూడా సౌత్జోన్పైనే నెగ్గిన సెంట్రల్ జోన్ అదే ఫలితం పునరావృతం చేయాలని యోచిస్తోంది. రజత్ పాటీదార్, దానిశ్ మాలేవర్, శుభమ్ శర్మ, యశ్ రాథోడ్, దీపక్ చాహర్, తన్మయ్ అగర్వాల్, తనయ్ త్యాగరాజన్, షేక్ రషీద్, రికీ భుయ్, మొహమ్మద్ అజహరుద్దీన్ వంటి వాళ్లు మెరుగైన ప్రద్శన చేసి సెలెక్టర్ల దృష్టిలో పడాలని భావిస్తున్నారు. మనవాళ్లు ఆకట్టుకునేనా... ముందస్తు షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ సౌత్ జోన్ జట్టుకు సారథ్యం వహించాల్సి ఉండగా... ఆసియా కప్లో ఆడుతున్న భారత జట్టుకు అతను ఎంపిక కావడంతో ఫైనల్కు దూరమయ్యాడు. దీంతో కేరళకు చెందిన మొహమ్మద్ అజహరుద్దీన్కు సారథ్య బాధ్యతలు దక్కాయి. ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ రికీ భుయ్ వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. దేవదత్ పడిక్కల్, జగదీశన్ కూడా అందుబాటులో లేకపోవడంతో... స్మరణ్, సిద్ధార్్థలకు జట్టులో చోటు దక్కింది. హైదరాబాద్ ఆటగాళ్లు తన్మయ్ అగర్వాల్, తనయ్ త్యాగరాజన్, ఆంధ్ర ప్లేయర్లు షేక్ రషీద్, రికీ భుయ్ సౌత్ జోన్ జట్టుకు కీలకం కానున్నారు. మోహిత్ కాలె, స్మరణ్, సల్మాన్ నిజార్తో సౌత్ జోన్ బ్యాటింగ్ బలంగానే ఉంది. ఇక అజహరుద్దీన్ సారథిగా, వికెట్కీపర్గా, బ్యాటర్గా కీలకం కానున్నాడు. గుర్జపనీత్ సింగ్, వాసుకి కౌశిక్, నిదీశ్, తనయ్ త్యాగరాజన్ బౌలింగ్ భారం మోయనున్నారు. పిచ్ అటు బౌలింగ్కు ఇటు బ్యాటింగ్కు సమానంగా అనుకూలించనుంది. ఆరంభంలో కాస్త జాగ్రత్త వహిస్తే భారీ స్కోర్లు చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు. మ్యాచ్ జరిగే ఐదు రోజుల్లోనూ వర్షం ముప్పు ఉంది. బ్యాటింగ్ బలంగా... సౌత్ జోన్తో పోల్చుకుంటే... సెంట్రల్ జోన్ బ్యాటింగ్ బలంగా ఉంది. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో సెంట్రల్ జోన్ ప్లేయర్లు ముందు వరుసలో ఉన్నారు. దానిశ్ మాలేవర్ 294 పరుగులతో అగ్రస్థానంలో ఉంటే... రజత్ పాటీదార్ 268, శుభమ్ శర్మ 252 పరుగులతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా పాటీదార్ 100కు పైగా స్ట్రయిక్ రేట్తో పరుగులు రాబట్టడం విశేషం. అతడు ఇదే జోరు తుదిపోరులోనూ కనబరిస్తే సౌత్ జోన్కు కష్టాలు తప్పకపోవచ్చు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో పాటీదార్ వరుస ఇన్నింగ్స్లలో 125, 66, 77 పరుగులు చేశాడు. ఐపీఎల్లో తొలిసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి టైటిల్ అందించిన పాటీదార్ సారథ్య అనుభవం కూడా సెంట్రల్ జోన్కు కలిసిరానుంది. ఖలీల్ అహ్మద్, మానవ్ సుతార్ వంటి వాళ్లు అందుబాటులో లేకపోయినా... సెంట్రల్ జోన్కు పెద్దగా ఇబ్బందులు లేవు. టీమిండియా ప్లేయర్ దీపక్ చాహర్తో పాటు వెస్ట్ జోన్తో సెమీఫైనల్లో 8 వికెట్లు పడగొట్టిన సారాంశ్ జైన్ బౌలింగ్లో కీలకం కానున్నారు. -
తెలుగు టైటాన్స్ ‘హ్యాట్రిక్’
విశాఖ స్పోర్ట్స్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) సీజన్–12లో తెలుగు టైటాన్స్ వరుసగా మూడో విజయంతో సత్తా చాటింది. హోం గ్రౌండ్లో ఐదు మ్యాచ్లు ఆడిన తెలుగు టైటాన్స్ తొలి రెండు మ్యాచ్లలో ఓడినా...ఇప్పుడు ‘హ్యాట్రిక్’ విజయంతో వైజాగ్ అంచెను ముగించింది. బుధవారం జరిగిన పోరులో టైటాన్స్ 45–37 స్కోరుతో యు ముంబాను చిత్తు చేసింది. టైటాన్స్ తరఫున భరత్ హుడా 13 పాయింట్లతో చెలరేగగా... చేతన్ సాహు 6, కెపె్టన్ విజయ్ మలిక్ 5 పాయింట్లతో అతనికి సహకరించారు. చివరి 10 నిమిషాల్లో కాస్త పోరాడిన ముంబా ప్రత్యర్థిని ‘ఆలౌట్’ చేయగలిగినా పాయింట్ల అంతరం మాత్రమే తగ్గించ గలిగింది. ముంబా ఆటగాళ్లలో సందీప్, ఆమిర్ మొహమ్మద్ చెరో 7 పాయింట్లు సాధించారు.మరో మ్యాచ్లో పుణేరీ పల్టన్ 43–32 తేడాతో యూపీ యోధాస్పై గెలిచిది. నేడు జరిగే మ్యాచ్లలో యు ముంబాతో పట్నా పైరేట్స్, దబంగ్ ఢిల్లీతో గుజరాత్ జెయింట్స్ తలపడతాయి. తొలి 28 మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చిన విశాఖపట్నంలో నేటితో పీకేఎల్ పోటీలు ముగియనున్నాయి. రేపటి నుంచి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ ఇండోర్ స్టేడియం వేదికగా టోర్నీ కొనసాగుతుంది. -
ధనాధన్... ఫటాఫట్
అంతర్జాతీయ టి20ల్లో భారత్కు, ఇతర జట్లకు మధ్య ఉన్న స్థాయీభేదం ఏమిటో మరోసారి కనిపించింది. వరల్డ్ చాంపియన్ టీమిండియా ముందు పసికూనలా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జట్టు పూర్తిగా తేలిపోయింది. ఫలితంగా ఆసియా కప్ టి20 టోర్నీలో భారత్ భారీ గెలుపుతో సత్తా చాటింది. భారత బౌలర్ల ధాటికి 79 బంతుల్లోనే యూఏఈ ఇన్నింగ్స్ ముగియగా, లక్ష్యాన్ని ఛేదించేందుకు మన జట్టుకు 27 బంతులే సరిపోయాయి. కుల్దీప్ యాదవ్, శివమ్ దూబే కలిసి 7 వికెట్లతో ప్రత్యర్థిని పడగొట్టగా... అభిషేక్ శర్మ జోరుతో లాంఛనం ముగిసింది. ఇక అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమరంలో ఆదివారం పాకిస్తాన్తో భారత్ ఆడుతుది. దుబాయ్: ఆసియా కప్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఘన విజయంతో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్లో భారత్ 9 వికెట్ల తేడాతో యూఏఈని చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన యూఏఈ 13.1 ఓవర్లలో 57 పరుగులకే కుప్పకూలింది. అలీషాన్ (17 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్), వసీమ్ (22 బంతుల్లో 19; 3 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. కుల్దీప్ యాదవ్ (4/7), శివమ్ దూబే (3/4) బౌలింగ్లో చెలరేగారు. అనంతరం భారత్ 4.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 60 పరుగులు చేసి గెలిచింది. ఇందులో 4 ఫోర్లు, 5 సిక్స్లతో మొత్తం 46 పరుగులు వచ్చాయి! అభిషేక్ శర్మ (16 బంతుల్లో 30; 2 ఫోర్లు, 3 సిక్స్లు) దూకుడుగా ఆడగా... శుబ్మన్ గిల్ (9 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (7 నాటౌట్) కలిసి మ్యాచ్ను ముగించారు. కుల్దీప్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం లభించింది. భారత్ తమ తదుపరి మ్యాచ్ను ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుతో ఆడుతుంది. అబుదాబి లో నేడు జరిగే గ్రూప్ ‘బి’ మ్యాచ్లో హాంకాంగ్తో బంగ్లాదేశ్ ఆడుతుంది. టపటపా... యూఏఈ ఇన్నింగ్స్ తొలి 21 బంతుల్లో 26 పరుగులు... ఇందులో 3 ఫోర్లు, ఒక సిక్స్తో అలీషాన్ ఒక్కడే 22 పరుగులు చేశాడు. ఆ తర్వాత బుమ్రా వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో కెప్టెన్ వసీమ్ మూడు ఫోర్లు బాది 12 పరుగులు రాబట్టాడు. ఈ రెండు సందర్భాలు మినహా యూఏఈ ప్రదర్శనలో చెప్పుకోవడానికేమీ లేదు. భారత బౌలర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంతో యూఏఈ బ్యాటర్లు పరుగులు చేయడంలో తీవ్ర తడబాటు కనిపించింది. సింగిల్ కూడా తీయడం కష్టంగా మారిపోవడంతో పాటు జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. 26/0 నుంచి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తర్వాతి 32 బంతుల్లో 24 పరుగులు మాత్రమే చేసిన టీమ్ సగం వికెట్లు కోల్పోవడంతో స్కోరు 50/5కి చేరింది. వీటిలో కుల్దీప్ ఒకే ఓవర్లో తీసిన మూడు వికెట్లు ఉన్నాయి. అనంతరం తర్వాతి 25 బంతుల్లో 7 పరుగులే చేసిన జట్టు మరో ఐదు వికెట్లు చేజార్చుకుంది. వీటిలో దూబే ఒకే ఓవర్లో తీసిన రెండు వికెట్లు ఉన్నాయి. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 2, బుమ్రా 4 ఫోర్లు ఇవ్వగా... మిగతా నలుగురు బౌలర్లు కలిపి 55 బంతుల్లో ఒక్క ఫోర్ ఇవ్వకుండా ఒక సిక్స్ మాత్రం (అక్షర్ బౌలింగ్లో) ఇచ్చారు! 2024 టి20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత తొలిసారి భారత్ తరఫున టి20 మ్యాచ్ బరిలోకి దిగిన బుమ్రా... ఆరేళ్ల తర్వాత మొదటిసారి పవర్ప్లేలో మూడు ఓవర్లు వేశాడు. స్కోరు వివరాలు యూఏఈ ఇన్నింగ్స్: అలీషాన్ (బి) బుమ్రా 22; వసీమ్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 19; జోహెబ్ (సి) కుల్దీప్ (బి) వరుణ్ 2; రాహుల్ చోప్రా (సి) గిల్ (బి) కుల్దీప్ 3; ఆసిఫ్ ఖాన్ (సి) సామ్సన్ (బి) దూబే 2; కౌశిక్ (బి) కుల్దీప్ 2; ధ్రువ్ (ఎల్బీ) (బి) దూబే 1; సిమ్రన్జిత్ (ఎల్బీ) (బి) అక్షర్ 1; హైదర్ అలీ (సి) సామ్సన్ (బి) కుల్దీప్ 1; జునైద్ (సి) సూర్యకుమార్ (బి) దూబే 0; రోహిద్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 2; మొత్తం (13.1 ఓవర్లలో ఆలౌట్) 57. వికెట్ల పతనం: 1–26, 2–29, 3–47, 4–48, 5–50, 6–51, 7–52, 8–54, 9–55, 10–57. బౌలింగ్: పాండ్యా 1–0–10–0, బుమ్రా 3–0– 19–1, అక్షర్ 3–0–13–1, వరుణ్ 2–0–4–1, కుల్దీప్ 2.1–0–7–4, దూబే 2–0–4–3. భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) హైదర్ (బి) జునైద్ 30; గిల్ (నాటౌట్) 20; సూర్య కుమార్ (నాటౌట్) 7; ఎక్స్ట్రాలు 3; మొత్తం (4.3 ఓవర్లలో వికెట్ నష్టానికి) 60. వికెట్ల పతనం: 1–48. బౌలింగ్: హైదర్ అలీ 1–0–10–0, రోహిద్ 1–0–15–0, ధ్రువ్ 1–0–13–0, జునైద్ 1–0–16–1, సిమ్రన్జిత్ 0.3–0–6–0. 27 ఛేదనలో బంతుల పరంగా భారత్కు ఇదే అతి వేగవంతమైన విజయం. గతంలో 39 బంతుల్లో స్కాట్లాండ్పై లక్ష్యాన్ని ఛేదించింది. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. తొలి జట్టుగా
ఆసియాకప్-2025ను టీమిండియా అద్బుతమైన విజయంతో ఆరంభించింది. ఈ టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన తమ తొలి మ్యాచ్లో యూఏఈను 9 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. యూఏఈ నిర్ధేశించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 4.3 ఓవర్లలోనే చేధించింది.భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ(16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 30), శుబ్మన్ గిల్(9 బంతుల్లో 20 నాటౌట్) దూకుడుగా ఆడి మ్యాచ్ను ఫినిష్ చేశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన యూఏఈ 13.1 ఓవర్లలో కేవలం 57 పరుగులకే కుప్పకూలింది.భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు, శివమ్ దూబే మూడు వికెట్లు పడగొట్టగారు. వీరితో పాటు బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా వికెట్ సాధించారు.ఇక ఈ మ్యాచ్లో కేవలం 4.3 ఓవర్లను టార్గెట్ను ఫినిష్ చేసిన భారత్ పలు అరుదైన రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది. చరిత్ర సృష్టించిన భారత్..ఆసియాకప్ టీ20 టోర్నీలో బంతులు పరంగా భారీ విజయం సాధించిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్లో 93 బంతులు మిగిలుండగానే భారత్ లక్ష్యాన్ని చేధించింది. ఇంతకుముందు ఈ రికార్డు అఫ్గానిస్తాన్ పేరిట ఉండేది.ఆసియాకప్-2022లో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో శ్రీలంకపై 59 బంతులు మిగిలూండగానే అఫ్గాన్ గెలుపొందింది. తాజా మ్యాచ్తో అఫ్గాన్ అల్టైమ్ రికార్డును భారత్ బ్రేక్ చేసింది. ఓవరాల్గా టీ20ల్లో టీమిండియాకు బంతులు పరంగా ఇదే భారీ విజయం కావడం గమనార్హం. అంతకుముందు టీ20 ప్రపంచకప్-2021లో స్కాట్లాండ్పై 81 బంతుల్లో మిగిలూండగా భారత్ విజయం సాధించింది. అదేవిధంగా అంతర్జాతీయ టీ20ల్లో అత్యంతవేగంగా రన్ ఛేజ్ చేసిన రెండో జట్టుగా భారత్ నిలిచింది. అగ్రస్దానంలో ఇంగ్లండ్ ఉంది. టీ20 ప్రపంచకప్-2024లో ఒమన్పై కేవలం 3.1 ఓవర్లలోనే ఇంగ్లండ్ లక్ష్యాన్ని చేధించింది. -
టీమిండియా సూపర్ విక్టరీ.. 27 బంతుల్లోనే టార్గెట్ ఫినిష్
ఆసియాకప్-2025లో భారత్ శుభారంభం చేసింది. ఈ టోర్నీలో భాగంగా బుధవారం దుబాయ్ వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ.. భారత బౌలర్ల ధాటికి 13.1 ఓవర్లలో కేవలం 57 పరుగులకే కుప్పకూలింది.టీమిండియా స్పిన్ ఉచ్చులో యూఏఈ బ్యాటర్లు చిక్కుకున్నారు. ఓపెనర్లు అలీషన్ షరాఫు(22), కెప్టెన్ వసీం మహ్మద్(19) ఆరంభంలో పర్వాలేదన్పించారు. షరాఫూను బుమ్రా ఔట్ చేశాక యూఏఈ వికెట్ల పతనం మొదలైంది. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 2.1 ఓవర్లలో కేవలం 7 పరుగులిచ్చి 4 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడితో పాటు ఆల్రౌండర్ శివమ్ దూబే మూడు, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, బుమ్రా తలా వికెట్ సాధించారు.అభిషేక్ ధానాధన్..అనంతరం 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 4.3 ఓవర్లలో ఊదిపడేసింది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ(16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 30) టాప్ స్కోరర్ కాగా.. శుబ్మన్ గిల్(20), సూర్యకకుమార్ యాదవ్(7) ఆజేయంగా నిలిచారు. యూఏఈ బౌలర్లలో సిద్దుఖీ ఒక్క వికెట్ సాధించాడు. ఇక భారత్ తమ తదుపరి మ్యాచ్లో సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్తో తలపడనుంది.చదవండి: Asia Cup 2025: జస్ప్రీత్ బుమ్రా సూపర్ యార్కర్.. దెబ్బకు బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో -
జస్ప్రీత్ బుమ్రా సూపర్ యార్కర్.. దెబ్బకు బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా మరోసారి తన మార్క్ చూపించాడు. ఆసియాకప్-2025లో భాగంగా యూఏఈతో జరుగుతున్న మ్యాచ్లో అద్బుతమైన యార్కర్తో మెరిశాడు. అతడి వేసిన బంతికి యూఏఈ బ్యాటర్ అలీషన్ షరాఫు వద్ద సమాధానమే లేకుండా పోయింది.యూఏఈ ఇన్నింగ్స్ 4వ ఓవర్ వేసిన బుమ్రా.. నాలుగో డెలివరీని అలీషన్కు సూపర్ యార్కర్గా సంధించాడు. అలీషన్ షరాఫు తన బ్యాట్ను కిందకు దించే లోపు బంతి ఆఫ్ స్టంప్ను గిరాటేసింది. దెబ్బకు యూఏఈ బ్యాటర్ బిత్తర పోయాడు. దీంతో అలీషన్(17 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్తో 22) ధానాదన్ ఇన్నింగ్స్కు తెరపడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.కాగా వర్క్లోడ్ మెనెజ్మెంట్లో భాగంగా ఇంగ్లండ్ పర్యటనలో మధ్యలోనే వచ్చేసిన బుమ్రాకు ఇదే తొలి మ్యాచ్. అయితే యూఏఈతో మ్యాచ్కు బుమ్రాకు విశ్రాంతి ఇస్తారని వార్తలు వచ్చాయి. కానీ టీమ్మెనెజ్మెంట్ బుమ్రాకు మొదటి మ్యాచ్లో ఆడించి యువ పేసర్ అర్ష్దీప్ను బెంచ్కే పరిమితం చేసింది. ఈ మ్యాచ్లో మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా.. 19 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన యూఏఈ 13.1 ఓవర్లలో కేవలం 57 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి పతనాన్ని శాసించాడు. అతడితో పాటు శివమ్ దూబే మూడు, అక్షర్ పటేల్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి తలా వికెట్ సాధించాడు. యూఏఈ బ్యాటర్లలో అలీషన్ షరాఫు(22) టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.Jasprit Bumrah and knocking stumps over — name a better combo 💥Watch #DPWORLDASIACUP2025 - LIVE on #SonyLIV & #SonySportsNetwork TV Channels 📺#AsiaCup #INDvUAE pic.twitter.com/q3wrec57d2— Sony LIV (@SonyLIV) September 10, 2025 -
టీమిండియా లీడింగ్ వికెట్ టేకర్.. కట్ చేస్తే! తుది జట్టులో నో ఛాన్స్
అర్ష్దీప్ సింగ్.. టీ20 క్రికెట్లో 100 వికెట్లు సాధించిన తొలి భారత బౌలర్గా చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో నిలిచాడు. ఆసియాకప్-2025లో బుధవారం దుబాయ్ వేదికగా భారత్-యూఏఈ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో అర్ష్దీప్ వంద వికెట్ల మైలు రాయిని అందుకుంటాడని అంతా భావించారు. కానీ భారత ప్లేయింగ్ ఎలెవన్లో అర్ష్దీప్కు చోటు దక్కకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. అతడి స్ధానంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు టీమ్ మెనెజ్మెంట్ అవకాశమిచ్చింది. తుది జట్టులో ప్రధాన పేసర్గా జస్ప్రీత్ బుమ్రా ఒక్కడికే చోటు దక్కింది. అతడితో పాటు మీడియం పేస్ బౌలర్ హార్దిక్ పాండ్యా బంతిని పంచుకోనున్నాడు. ఈ మ్యాచ్లో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలు స్పిన్నర్లగా ఉన్నారు. అయితే పిచ్ కండీషన్స్ దృష్ట్యా కెప్టెన్ సూర్య కుమార్ అండ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. వికెట్ మధ్యలో చిన్న చిన్న పగుళ్లు ఉండడంతో స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంది. అయితే అర్ష్దీప్ను పక్కన పెట్టడానికి గల కారణాన్ని అయితే కెప్టెన్ సూర్య వెల్లడించలేదు. కాగా అర్ష్దీప్ గత కొంతకాలంగా భారత టీ20 జట్టులో రెగ్యూలర్ సభ్యునిగా కొనసాగుతున్నాడు. కొత్త బంతితో పాటు డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసే సత్తా అతడికి ఉంది. అంతేకాకుండా టీమిండియా తరపున టీ20ల్లో లీడింగ్ వికెట్ టేకర్ కూడా అర్ష్దీప్(97)నే కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. -
శ్రేయస్ భయ్యా అలా చేయగానే సంబరం.. నేను మాత్రం..: హర్షిత్ రాణా
ఐపీఎల్లో ప్రతిభను నిరూపించుకుని ఇటీవల టీమిండియాలోకి దూసుకువచ్చిన ఆటగాళ్లలో హర్షిత్ రాణా (Harshit Rana) ఒకడు. గతేడాది శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) కెప్టెన్సీలోని కోల్కతా నైట్ రైడర్స్ టైటిల్ గెలవడంలో ఈ ఢిల్లీ ఎక్స్ప్రెస్ది కీలక పాత్ర. 13 మ్యాచ్లలో కలిపి ఈ పేస్బౌలర్ పందొమ్మిది వికెట్లు కూల్చాడు.గంభీర్ దృష్టిలో పడికేకేఆర్ తరఫున ప్రదర్శన ద్వారా అప్పటి మెంటార్ గౌతం గంభీర్ (Gautam Gambhir) దృష్టిలో పడిన హర్షిత్ రాణా.. గౌతీ టీమిండియా హెడ్కోచ్గా రావడంతో త్వరగానే జాతీయ జట్టులోకి వచ్చేశాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ రైటార్మ్ పేసర్ ఈ ఏడాది టీ20, వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు.ఒకే ఓవర్లో 26 పరుగులుఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు స్వదేశంలో టీమిండియా ఇంగ్లండ్తో ఆడిన సిరీస్ సందర్భంగా వన్డేలోకి వచ్చిన హర్షిత్కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది. అతడి బౌలింగ్లో ఇంగ్లిష్ జట్టు ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఒకే ఓవర్లో 26 పరుగులు పిండుకున్నాడు.అయితే, సాల్ట్ను శ్రేయస్ అయ్యర్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కలిసి సాల్ట్ (43)ను రనౌట్ చేయడంతో హర్షిత్కు కాస్త ఊరట దక్కింది. ఆ తర్వాత 23 ఏళ్ల ఈ బౌలర్.. మూడు వికెట్లతో సత్తా చాటాడు. పరుగులు కాస్త ఎక్కువగానే ఇచ్చుకున్నా.. బెన్ డకెట్ (32), హ్యారీ బ్రూక్ (0), లియామ్ లివింగ్స్టోన్ (5) వంటి ప్రమాదకర బ్యాటర్లును అవుట్ చేశాడు. తద్వారా టీమిండియా గెలుపులో తన వంతు పాత్ర పోషించాడు.శ్రేయస్ భయ్యా సాల్ట్ను రనౌట్ చేయగానేఇక హర్షిత్ రాణా ప్రస్తుతం ఆసియా కప్-2025 ఆడేందుకు టీమిండియాతో కలిసి యూఏఈలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో అతడు పంచుకున్న విషయాలు వైరల్ అవుతున్నాయి. వన్డే అరంగేట్రం గురించి గుర్తుచేసుకుంటూ.. ‘‘ఒక్క ఓవర్లోనే సాల్ట్ నా నుంచి 26 పరుగులు రాబట్టుకున్నాడు.అయితే, ఆ తర్వాత పరిస్థితి మారింది. తొలి మూడు ఓవర్లలో నేను 37 పరుగుల వరకే ఇచ్చాను. అయితే, శ్రేయస్ భయ్యా సాల్ట్ను అద్బుత రీతిలో రనౌట్ చేయగానే అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. నేనేమో సైలెంట్గా అక్కడ నిల్చున్నా.రోహిత్ భయ్యా వచ్చి.. ‘వేరే ఎండ్ నుంచి బౌల్ చెయ్’ అని చెప్పాడు. వెంటనే నా బౌలింగ్లో డకెట్ ఇచ్చిన క్యాచ్ను జైస్వాల్ పట్టాడు. తర్వాత హ్యారీ బ్రూక్ క్రీజులోకి వచ్చాడు. వచ్చీ రాగానే అతడిని పెవిలియన్కు పంపాలని అనుకున్నా.సర్ పే మారూఅందుకోసం తల మీదుగా బౌన్సర్ ఎందుకు సంధించకూడదు అని ఆలోచించా. వెంటనే.. ‘రోహిత్ భయ్యా.. సర్ పే మారూ (head-high bouncer) ’ అని అడిగాను. అందుకు భయ్యా సరేనంటూ అంగీకరించాడు. షార్ట్ పిచ్డ్ డెలివరీ సంధించగా,, బ్రూక్ దానిని షాట్ ఆడబోయి రాహుల్ భయ్యాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు’’ అని హర్షిత్ రాణా వన్డే అరంగేట్ర జ్ఞాపకాలు పంచుకున్నాడు.కాగా ఇంగ్లండ్తో సిరీస్ తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ హర్షిత్ ఆడే అవకాశం దక్కించుకున్నాడు. చాంపియన్గా నిలిచిన టీమిండియాలో తానూ ఒకడిగా ఉండి.. ట్రోఫీని ముద్దాడాడు. ఇక ఇప్పటి వరకు టీమిండియా తరఫున రెండు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడిన ఈ కుడిచేతి వాటం పేసర్.. ఆయా ఫార్మాట్లలో 4, 10, 3 వికెట్లు కూల్చాడు. చదవండి: ‘యువీ, సెహ్వాగ్ వంటి వారే లేరు.. బుమ్రాను తీర్చిదిద్దండి’ -
ఆసియాకప్లో భారత్ బోణీ.. యూఏఈ చిత్తు
Asia Cup 2025 Ind vs Uae live Updates and Highlights:భారత్ ఘన విజయం..ఆసియాకప్లో టీమిండియా బోణీ కొట్టింది. దుబాయ్ వేదికగా యూఏఈ జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 4.3 ఓవర్లలో చేధించింది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ(16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 30) టాప్ స్కోరర్ కాగా.. శుబ్మన్ గిల్(20), సూర్యకకుమార్ యాదవ్(7) ఆజేయంగా నిలిచారుయూఏఈ బౌలర్లలో సిద్దుఖీ ఒక్కడే వికెట్ సాధించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన యూఏఈ 13.1 ఓవర్లలో కేవలం 57 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు, శివమ్ దూబే మూడు వికెట్లు పడగొట్టగారు. వీరితో పాటు బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా వికెట్ సాధించారు.దూకుడుగా ఆడుతున్న గిల్,అభిషేక్58 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా దూకుడుగా ఆడుతోంది. రెండు ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. క్రీజులో శుబ్మన్ గిల్(13), అభిషేక్ శర్మ(11) ఉన్నారు.57 పరుగులకే యూఏఈ ఆలౌట్..దుబాయ్ వేదికగా యూఏఈతో జరుగుతున్న మ్యాచ్లో భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన యూఏఈ 13.1 ఓవర్లలో కేవలం 57 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి పతనాన్ని శాసించాడు.అతడితో పాటు శివమ్ దూబే మూడు, అక్షర్ పటేల్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి తలా వికెట్ సాధించాడు. యూఏఈ బ్యాటర్లలో అలీషన్ షరాఫు(22) టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.ఆలౌట్ దిశగా యూఏఈ..టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన యూఏఈ ఆలౌట్ దిశగా సాగుతోంది. 57 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఆతిథ్య యూఏఈ పీకల్లోతు కష్టాల్లో పడింది. కుల్దీప్ స్పిన్ మ్యాజిక్.. ఒకే ఓవర్లో 3 వికెట్లుకుల్దీప్ యాదవ్ స్పిన్ మయాజాలానికి యూఏఈ ఒకే ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయింది. 9వ ఓవర్లో తొలి బంతికి రాహుల్ చోప్రా ఔట్ కాగా.. నాలుగో బంతికి కెప్టెన్ మహ్మద్ వసీం(19),.. ఆఖరి బంతికి హర్షిత్ కౌశిక్(2) పెవిలియన్కు చేరారు. 9 ఓవర్లకు యూఏఈ స్కోర్: 50/57 ఓవర్లకు యూఏఈ స్కోర్: 45/27 ఓవర్లు ముగిసే సరికి యూఏఈ రెండు వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. క్రీజులో మహ్మద్ వసీం(18), రాహుల్ చోప్రా(2) ఉన్నారు.యూఏఈ రెండో వికెట్ డౌన్..29 పరుగుల వద్ద యూఏఈ రెండో వికెట్ కోల్పోయింది. రెండు పరుగులు చేసిన ముహమ్మద్ జోహైబ్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఔటయ్యాడు. యూఏఈ తొలి వికెట్ డౌన్..27 పరుగుల వద్ద యూఏఈ తొలి వికెట్ కోల్పోయింది. అలీషన్ షరాఫు(22)ను బుమ్రా అద్బుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. 4 ఓవర్లకు యూఏఈ స్కోర్: 27/0రెండు ఓవర్లకు యూఏఈ స్కోర్: 16/0రెండు ఓవర్లు ముగిసే సరికి యూఏఈ వికెట్ నష్టపోకుండా 16 పరుగులు చేసింది. క్రీజులో మహ్మద్ వసీం(1),అలీషన్ షరాఫు(14) ఉన్నారు.ఆసియాకప్-2025లో టీమిండియా తమ తొలి మ్యాచ్లో అబుదాబి వేదికగా యూఏఈతో తలపడతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పిచ్పై గ్రాస్ ఎక్కువగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత కెప్టెన్ సూర్యకుమార్ కుమార్ యాదవ్ వెల్లడించాడు. అదేవిధంగా ఈ మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ సెషన్స్లో తీవ్రంగా శ్రమించినట్లు సూర్య చెప్పుకొచ్చాడు. కాగా భారత ప్లేయింగ్ ఎలెవన్లో వికెట్ కీపర్ బ్యాటర్గా సంజూ శాంసన్కు చోటు దక్కింది. అయితే సంజూ మిడిలార్డర్ బ్యాటింగ్కు రానున్నాడు. ఓపెనర్లుగా శుబ్మన్ గిల్, అభిషేక్ శర్మ బరిలోకి దిగనున్నారు. అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా సైతం ఈ మ్యాచ్లో ఆడుతున్నాడు.తుది జట్లుభారత్అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తియునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ : ముహమ్మద్ వసీమ్(కెప్టెన్), అలీషాన్ షరాఫు, ముహమ్మద్ జోహైబ్, రాహుల్ చోప్రా(వికెట్ కీపర్), ఆసిఫ్ ఖాన్, హర్షిత్ కౌశిక్, హైదర్ అలీ, ధ్రువ్ పరాశర్, ముహమ్మద్ రోహిద్ ఖాన్, జునైద్ సిద్ధిక్, సిమ్రంజీత్ సింగ్ -
ODI World Cup 2025: శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మహిళల ప్రపంచ కప్ 2025 కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్గా సీనియర్ క్రికెటర్ చమరి అటపత్తు వ్యవహరించనుంది. అదేవిధంగా ఈ వరల్డ్కప్ జట్టులో హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హరి, ఉదేశిక ప్రబోధని వంటి అనుభవజ్ఞులైన ప్లేయర్లు ఉన్నారు. 27 ఏళ్ల హర్షిత గత కొన్నాళ్లగా శ్రీలంక జట్టులో కీలక సభ్యురాలిగా కొనసాగుతోంది. హర్షిత 41 వన్డేల్లో 1,075 పరుగులు చేసింది. గతేడాది జరిగిన ఆసియాకప్ ఫైనల్లో భారత్పై హర్షిత అద్బుతమైన సెంచరీతో చెలరేగింది. దీంతో 2024 ఆగస్టు నెలకు గాను సిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఆమె ఎంపికైంది. అదేవిధంగా యువ పేస్ సంచలనం దేవ్మి విహంగాకు ఈ జట్టులో చోటు దక్కింది. ఈ ఏడాది ఏప్రిల్లో శ్రీలంక ఆతిథ్యమిచ్చిన ముక్కోణపు వన్డే సిరీస్లో దేవ్మి విహంగా 11 వికెట్లతో సత్తాచాటింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది.తొలి మ్యాచ్లో గౌహతిలోని బర్సపారా స్టేడియం వేదికగా హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత్తో శ్రీలంక తలపడనుంది. ఈ టోర్నీ కోసం బీసీసీఐ ఇప్పటికే భారత జట్టును ప్రకటించింది.మహిళల వన్డే ప్రపంచకప్కు శ్రీలంక జట్టుచమరి అతపత్తు (కెప్టెన్), హాసిని పెరెరా, విష్మి గుణరత్నే, హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హరి, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని, ఇమేషా దులాని, దేవీ విహంగా, పియుమి వత్సల, ఇనోకా రణవీర, సుగండిక కుమారి, ఉద, సుగండిక కుమారి, ఉదేశిక ప్రబోదని, మల్కీ మదర, అచ్చిని కులసూర్యమహిళల వన్డే ప్రపంచకప్కు భారత జట్టు:హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతికా రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), క్రాంతి గౌడ్, అమన్జోత్ కౌర్, రాధా యాదవ్, శ్రీ చరణి, యస్తిక భాటియా (వికెట్ కీపర్), స్నేహ్ రాణా -
‘నా మీద పడి కరిచేసింది.. చచ్చిపోయేవాడిని బతికాను’
ఆసియాకప్-2025 కోసం టీమిండియా నయా ఫినిషర్ రింకూ సింగ్ సిద్దమయ్యాడు. అయితే ఈ స్ధాయికి చేరుకున్న రింకూ విజయం వెనక ఎన్నో కష్టాలు దాగి ఉన్నాయి. ఒక స్వీపర్గా, ఆటోడ్రైవర్గా, గ్యాస్ డెలివరీగా బాయ్గా పనిచేస్తూనే అంతర్జాతీయ క్రికెటర్గా ఎదిగాడు.అయితే రింకూ జీవితంలో ఇవే కాకుండా మరో విషాద సంఘటన కూడా దాగి ఉందంట. ఈ యూపీ క్రికెటర్ ఇటీవల రాజ్ షమ్మానీ యూట్యూబ్ పాడ్కాస్ట్లో పాల్గోన్నాడు. ఈ సందర్భంగా రింకూ సింగ్ చిన్నతనంలో జరిగిన ఓ ఊహించని సంఘటనను అభిమానులతో పంచుకున్నాడు. తన పదేళ్ల వయస్సులో కోతి కరవడంతో ప్రాణాపాయ స్థితికి వెళ్లానని రింకూ చెప్పుకొచ్చాడు."నా చిన్నతనంలో జరిగిన ఓ ఘటనను నేను ఎప్పటికి మర్చిపోలేను. అప్పటిలో మా ఇంట్లో వాష్ రూమ్స్ లేవు. కాబట్టి మేము ఆరు బయటకు వెళ్లేవాళ్లం. ఓ రోజు వర్షం పడుతుండడగా నేను మా అన్నయ్య, కొంత మంది స్నేహితులు కలిసి బయటకు వెళ్లాము.అయితే కోతి వస్తుంది దూరంగా ఉండండి అంటూ వెనక నుంచి మాకు అరుపులు వినిపించాయి. కానీ అంతలోనే ఆ కోతి వెనక నుంచి నాపై తీవ్రంగా దాడి చేసింది. దీంతో ఒక్కసారిగా కిందపడిపోయాను. అయినప్పటికి నన్ను అది వదలకుండా కరుస్తూనే ఉంది. నా చేతిలోని ముక్కను తన దంతాలతో లాగేసింది. నన్ను ఆ కోతి నుంచి కాపాడానికి అక్కడ పెద్దగా జనం లేరు.మా అన్నయ్య మాత్రం కోతిపై రాళ్లు విసిరి వెళ్లగొట్టే ప్రయత్నం చేశాడు. కానీ అది నన్ను వదలలేదు. అది నన్ను తీవ్రంగా గాయపరిచింది. ఏదో విధంగా అక్కడ నుంచి తప్పించుకుని పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాను. అప్పటికే నా చేతి నుంచి తీవ్రంగా రక్తస్రావం అవుతోంది. నా చేతిలోని ఎమకులు బయటకు కన్పించాయి. తరువాత మేము ఒక క్లినిక్కి వెళ్ళాము. అక్కడ డాక్టర్ డ్రెస్సింగ్ చేశారు. అయినప్పటికి చాలా రక్తం బయటకు వచ్చిస్తోంది. నేను బ్రతుకుతానో లేదో తెలియక నా కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తర్వాత మరో డాక్టర్ వచ్చి నాకు చికిత్స అందించారు. దీంతో నేను ప్రాణపాయం స్ధితి నుంచి తప్పించుకున్నాను.రెండు చేతులూ ఒకేలా ఉండవు..ఇటీవలే నేను డెక్సా టెస్టుకు హాజరయ్యాను. రెండు చేతుల మధ్య బరువు కిలో తేడాగా ఉన్నట్లు తేలింది. ఎందుకంటే ఆ కోతి నా చేతిలో ఒక కండను కొరికి బయటకు తీసేసేంది. అందుకే నేనే జిమ్ చేసే సమయంలో ఒక చేతితో ఎత్తగలిగినంత బరువును మరొక చేతితో ఎత్తలేను. రెండు చేతుల మధ్య చాలా తేడా ఉంది. ఆ కోతి ఎవరినీ వదిలిపెట్టలేదు. మా ఐదుగురు సోదరులలో అందరిని కరిచింది" అని రింకూ సింగ్ పేర్కొన్నాడు.చదవండి: ‘యువీ, సెహ్వాగ్ వంటి వారే లేరు.. బుమ్రాను తీర్చిదిద్దండి’ -
గిల్కు ప్రమోషన్.. సూర్యకు సెగ!
ఆసియాకప్ 2025 టోర్నిలో టీమిండియా ఈరోజు తన తొలి మ్యాచ్ ఆడనుంది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టు టైటిల్ ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది. యంగ్ ప్లేయర్స్తో టీమిండియా మంచి ఊపుమీద ఉంది. భారత క్రికెట్ కొత్త పోస్టర్ బాయ్ శుబ్మన్ గిల్ను టి20 టీమ్కు వైస్ కెప్టెన్గా నియమించడంతో పాజిటివ్ బజ్ క్రియేటయింది. ఇదే సమయంలో కెప్టెన్ సూర్యకు పరోక్షంగా హెచ్చరిక జారీ చేసినట్టయింది. 'నీ పోస్టుకు ఎసరు తప్పద'ని సందేశం ఇచ్చినట్టుగా కనబడుతోంది. గిల్కు ప్రమోషన్తో సూర్యకు సెగ తాకిందా అనే చర్చ మొదలైంది.టీమిండియా పొట్టి ఫార్మాట్ కెప్టెన్గా సూర్య విజయవంతం అయ్యాడు. టి20 టీమ్ నాయకుడిగా అతడి విజయాల శాతం 80 వరకు ఉంది. కానీ ఆటగాడిగా విఫలమవుతున్నాడు. స్కై భారీ ఇన్నింగ్స్ ఆడి చాలా కాలమైంది. కెప్టెన్గా జట్టును విజయవంతంగా నడిపించడంతోనే సరిపెట్టుకోకుండా, వ్యక్తిగతంగానూ పరుగులు చేయాలని బీసీసీఐ (BCCI) పెద్దలు కోరుకుంటున్నారు. గత నెల టీమ్ ప్రకటన సందర్భంగా సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 'సిరీస్లు గెలవడం ఒక్కటే కెప్టెన్ పనికాదు. అతడి బ్యాట్ నుంచి ధారాళంగా పరుగులు కూడా రావాలి' అంటూ అగార్కర్ కమెంట్ చేశారు.కెప్టెన్ అయ్యాక రన్స్ డౌన్ సూర్యకుమార్ యాదవ్ 22 మ్యాచ్ల్లో జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి 26.57 సగటుతో 558 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. జట్టు పగ్గాలు చేపట్టిన తర్వాత అతడి బ్యాట్ నుంచి పరుగులు రావడం తగ్గిపోయాయి. కెప్టెన్ కాకముందు 66 మ్యాచ్ల్లో 43.40 సగటుతో 2040 పరుగులు సాధించాడు. ఇందులో మూడు శతకాలు, 17 ఫిఫ్టీలు ఉన్నాయి. నాయకత్వ బాధ్యతలు తలకెత్తుకున్న తర్వాత స్కై బ్యాట్ నుంచి పరుగులు రావడం క్రమంగా తగ్గింది. గత ఏడాది అక్టోబర్లో బంగ్లాదేశ్పై అతడు చేసిన హాఫ్ సెంచరీ(75) తర్వాత మళ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడలేదు. స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన 5 మ్యాచ్ల సిరీస్లోనూ దారుణంగా విఫలమయ్యాడు. ఈ సిరీస్లో అతడు చేసిన అత్యధిక స్కోరు 28.షార్ట్ సెలక్షన్ బాలేదుఆసియాకప్లో సూర్య ఎలా ఆడతాడనే దానిపై అతడి భవితవ్యం ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నాయి. అయితే సూర్య పుంజుకుంటాడని, ఐపీఎల్ ఫామ్ను కొనసాగిస్తాడని టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ (Wasim Jaffer) అభిప్రాయపడ్డాడు. 'పరుగులు సాధించలేకపోవడమే అతడి సమస్య. ఇంతకుముందు ఆడిన ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో అతడి షార్ట్ సెలక్షన్ స్థాయికి తగినట్టు లేదు. కానీ ఐపీఎల్లో మాత్రం బాగా ఆడాడు. పొట్టి ఫార్మాట్లో అతడు ప్రమాదకర ఆటగాడు. తనదైన రోజున బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. ఆసియాకప్ భిన్నంగా ఉంటుంది. జట్టు కూర్పు, బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉండాలో చూసుకోవడంతోనే సరిపోదు. ఏ స్థానంలో బ్యాటింగ్కు వచ్చినా ఎక్కువ పరుగులు చేసి స్కై తన స్థానాన్ని పదిలపరుచుకోవాల'ని జాఫర్ అన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్లో 16 మ్యాచ్ల్లో 717 పరుగులు చేసిన సూర్య.. సాయి సుదర్శన్ తర్వాత రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.చదవండి: యువరాజ్ సింగ్కు అప్గ్రేడ్ వర్షన్ అతడు బ్యాట్తోనే జవాబిస్తాడుశుబ్మన్ గిల్ను వైస్ కెప్టెన్ నియమించడం వల్ల సూర్యపై ఒత్తిడి పెరగబోదని జాఫర్ అభిప్రాయపడ్డాడు. ప్రతి టోర్నమెంట్కు వైస్ కెప్టెన్ ఉంటాడని, అలాగే ప్రతి టోర్నీ కూడా సవాల్తో కూడుకున్నదని చెప్పాడు. భారీ స్కోరుతో గతవైభవాన్ని అందుకోవడమే సూర్య తక్షణ కర్తవ్యమని, అంచనాలకు తగినట్టుగా రాణించాలని అన్నాడు. తనపైన ముసురుకున్న నీలి మేఘాలను పటాపంచలు చేయాలని ప్రపంచం ఎదురు చూస్తోందన్నాడు. సూర్యపై తనకు నమ్మకం ఉందని, ఆటతోనే సమాధానం చెబుతాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా, ఆరంభ రోజుల్లో జాఫర్ కెప్టెన్సీలో ముంబై తరపున సూర్య ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన సంగతి క్రికెట్ లవర్స్కు గుర్తుండే ఉంటుంది. -
పాకిస్తాన్కు ఆహ్వానం పంపిన హాకీ ఇండియా
చెన్నై: పురుషుల జూనియర్ హాకీ ప్రపంచకప్లో యువ భారత జట్టు తొలి మ్యాచ్లో చిలీ జట్టుతో తలపడనుంది. చెన్నై, మదురై వేదికగా మొత్తం 24 దేశాల మధ్య ఈ ఏడాది నవంబర్ 28 నుంచి డిసెంబర్ 10 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ను మంగళవారం విడుదల చేశారు. పాకిస్తాన్, చిలీ, స్విట్జర్లాండ్తో కలిసి భారత జట్టు పూల్ ‘బి’ నుంచి పోటీపడుతుంది.ఇక టోర్నీ ఆరంభ రోజే చిలీతో భారత్ మ్యాచ్ జరగనుంది. మరుసటి రోజు పాకిస్తాన్తో... డిసెంబర్ 2న స్విట్జర్లాండ్ భారత్ మ్యాచ్లు ఆడనుంది. షెడ్యూల్ విడుదల కార్యక్రమంలో అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడు తయ్యబ్ ఇక్రామ్, హాకీ ఇండియా (హెచ్ఐ) కార్యదర్శి భోళానాథ్ సింగ్, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. పాకిస్తాన్ జట్టుకు ఆహ్వానం పంపాంఅయితే ఈ టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్తాన్ హాకీ జట్టు... భారత్కు వస్తుందా లేదా అనే అంశంపై మాత్రం స్పష్టత లోపించింది. ఆతిథ్య హోదాలో హాకీ ఇండియా అన్నీ ఏర్పాట్లు చేస్తోంది.‘పాకిస్తాన్ జట్టుకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆసియా కప్ సమయంలో కూడా పాకిస్తాన్ జట్టుకు ఆహ్వానం పంపాం. కానీ భద్రతా కారణాల దృష్ట్యా వారు రాలేదు. జూనియర్ ప్రపంచకప్నకు సైతం మా నుంచి అధికారిక ఆహ్వానం పంపించాం’ అని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలిప్ టిర్కీ అన్నారు. చదవండి: Asia Cup 2025: భారత్-పాక్ మ్యాచ్ టికెట్లు ఇంకా అమ్ముడుపోలేదు.. ఆసక్తి తగ్గిందా..? ఆగ్రహమా..? -
‘యువీ, సెహ్వాగ్ వంటి వారే లేరు.. బుమ్రాను తీర్చిదిద్దండి’
టీమిండియా లోయర్ ఆర్డర్ గురించి భారత మాజీ క్రికెటర్, యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ (Yograj Singh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బౌలర్లందరినీ ఆల్రౌండర్లుగా తీర్చిదిద్దాలని.. వారిని టెయిలెండర్లు అని పిలవద్దని మేనేజ్మెంట్కు సూచించాడు. కాగా భారత జట్టు చివరగా ఇంగ్లండ్లో పర్యటించిన విషయం తెలిసిందే.శుబ్మన్ గిల్ (Shubman Gill) టెస్టు జట్టు నయా సారథిగా పగ్గాలు చేపట్టగా.. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్తో ఐదు టెస్టులు ఆడింది. ఆఖరి టెస్టు ఆఖరి రోజు వరకు పోరాడి సిరీస్ను 2-2తో సమం చేసుకుని గట్టెక్కింది. ఇక ఇంగ్లండ్లో భారత లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడింది.యువీ, సెహ్వాగ్ వంటి వారే లేరుఓవైపు ఇంగ్లండ్ బౌలర్లు సైతం హాఫ్ సెంచరీలతో అలరిస్తే మనవాళ్లలో ఒకరిద్దరు మినహా మిగతా అంతా ఇలా వెళ్లి అలా వచ్చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో యోగ్రాజ్ సింగ్ మాట్లాడుతూ.. భారత జట్టుకు ప్రస్తుతం తన కుమారుడు యువరాజ్ సింగ్, వీరేందర్ సెహ్వాగ్ వంటి పూర్తిస్థాయి ఆల్రౌండర్ల అవసరం ఉందన్నాడు.‘‘భారత జట్టులో ప్రస్తుతం ఉన్న సమస్య లోయర్ ఆర్డర్. బౌలర్లను ఆల్రౌండర్లుగా తీర్చిదిద్దడానికి మనవాళ్లు ఆసక్తి చూపడం లేదు. కపిల్ దేవ్ నెట్స్లో ఎప్పుడూ బ్యాటింగ్ చేయలేదు. అప్పుడు నేను.. ‘కపిల్తో బ్యాటింగ్ చేయించండి’ అంటూ గొంతు చించుకునేవాడిని.బుమ్రాను తీర్చిదిద్దండిఆ రోజుల్లో కపిల్ పదకొండో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి 70- 80 పరుగులు స్కోరు చేసేవాడు. ఈరోజుల్లోనూ బుమ్రా వంటి బౌలర్లను టెయిలెండర్లు అని పిలవవద్దు. వారిని మెరుగైన ఆల్రౌండర్లుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది.ప్రాక్టీస్ సెషన్లో కనీసం ఒకటి నుంచి రెండు గంటల పాటు వారితో బ్యాటింగ్ చేయించాలి. గతం తాలుకు చేదు అనుభవాల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే అత్యుత్తమ మార్గం.టెయిలెండర్ల తప్పేం లేదుఒకవేళ మన లోయర్ ఆర్డర్ బ్యాటర్లు బాగా ఆడి ఉంటే లార్డ్స్ టెస్టులో ఇరవై రెండు పరుగుల తేడాతో ఓడిపోయేవాళ్లమే కాదు. అయినా ఇందులో టెయిలెండర్ల తప్పేం లేదు. ఎందుకంటే వారికి బ్యాట్తో ప్రాక్టీస్ చేసేందుకు తగినంత సమయం ఇవ్వలేదు’’ అని యోగ్రాజ్ సింగ్ ఇన్సైగ్స్పోర్ట్తో చెప్పుకొచ్చాడు.యువీ ఇలా.. వీరూ అలా..ఇదిలా ఉంటే.. యువరాజ్ సింగ్ 2000- 2017 వరకు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. ఈ ఎడమ చేతి వాటం బ్యాటర్.. 40 టెస్టుల్లో 1900, 304 వన్డేల్లో 9924, 58 అంతర్జాతీయ టీ20లలో 1177 పరుగులు సాధించాడు.అదే విధంగా.. లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన యువీ ఖాతాలో టెస్టుల్లో తొమ్మిది, వన్డేల్లో 111, టీ20లలో 28 వికెట్లు ఉన్నాయి. ఇక అంతర్జాతీయ స్థాయిలో వీరేందర్ సెహ్వాగ్ 1999 నుంచి 2013 వరకు టీమిండియాకు ఆడాడు.మొత్తంగా 104 టెస్టుల్లో 8586, 251 వన్డేల్లో 8273, 19 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లలో 394 పరుగులు సాధించాడు ఈ కుడిచేతి వాటం బ్యాటర్. అంతేకాదు.. కుడిచేతి వాటం స్పిన్నర్ అయిన వీరూ.. టెస్టుల్లో 40, వన్డేల్లో 96 వికెట్లు తీశాడు.చదవండి: పక్షవాతం.. నొప్పి భరించలేకపోయా: టీమిండియా స్టార్ క్రికెటర్ -
అరటిపండ్లకు రూ.35 లక్షలు ఖర్చు? బీసీసీఐకి హైకోర్టు నోటీసులు
ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ (CAU)లో రూ.12 కోట్ల స్కామ్ జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఏయూ భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడిందని.. టోర్నమెంట్స్ కోసం కేటాయించిన ఫండ్స్ను దారిమళ్లించారని, వాటిపై విచారించాలని కోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి.దీంతో ఆరోపణలపై విచారణ జరిపించాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI)కి ఉత్తరాఖండ్ హైకోర్టు బుధవారం నోటీసు జారీ చేసింది. ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ ఆడిట్ నివేదిక ఆధారంగా ఆటగాళ్లకు అరటిపండ్ల కోసం రూ.35 లక్షలకు ఖర్చు చేశారని పిటిషనర్ ఆరోపించారు.2024-25 ఏడాదికి గానూ సీఏయూ ఆడిట్ నివేదికపై దర్యాప్తును కోరుతూ సంజయ్ రావత్ అనే వ్యక్తి వాజ్యం దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ మనోజ్ కుమార్ తివారీ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ మంగళవారం విచారణ జరిపింది. ఈ ఫిటిషన్పై తదుపరి విచారణను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.ఆడిట్ రిపోర్ట్ ప్రకారం.. రాష్ట్ర క్రికెట్ బోర్డు నిర్వహించే అన్ని టోర్నమెంట్లకు సీఎయూ భారీగా ఖర్చు చేసినట్లు సమాచారం. ఈవెంట్ మెనెజ్మెంట్ ఫీజుల కోసం రూ.6.4 కోట్లు, టోర్నమెంట్ల నిర్వహణ, ట్రయల్స్ కోసం రూ.26.3 కోట్లు చేసినట్లు సంజయ్ రావత్ తన ఫిటిషన్లో పేర్కొన్నారు. కాగా ఈ ఖర్చు గత ఆర్ధిక సంవత్సరంలో రూ. 22.30 కోట్లే ఉంది. ముఖ్యంగా ఆహార ఖర్చుల పేరుతో అసోసియేషన్ కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేసిందన్నది ప్రధాన ఆరోపణగా ఉంది. దీనిపై బీసీసీఐ విచారణ జరిపి కోర్టుకు నివేదిక సమర్పించనుంది.చదవండి: ఆ జట్టు ఓటమి ఖాయమే!.. టీమిండియా నుంచి ఎవరిని తప్పిస్తారు?: అక్తర్ -
అభిషేక్, బుమ్రా, సంజూ.. వావ్.. ఎవరిని తప్పిస్తారు?: అక్తర్
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా మంగళవారం మొదలైంది. గ్రూప్-‘బి’ మ్యాచ్లో భాగంగా హాంకాంగ్పై అఫ్గనిస్తాన్ 94 పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా టాపర్గా నిలిచి.. రన్రేటు పరంగా (+4.700)నూ పటిష్ట స్థితిలోకి వెళ్లింది.ఈ క్రమంలో గ్రూప్-‘ఎ’ తొలి మ్యాచ్లో భాగంగా టీమిండియా- యూఏఈ (IND vs UAE)తో తలపడనుంది. దుబాయ్లో బుధవారం నాటి ఈ మ్యాచ్కు భారత తుదిజట్టు ఎంపిక ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్బౌలర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.అభిషేక్, బుమ్రా, సంజూ.. వావ్.. ఎవరిని తప్పిస్తారు?భారత్ పటిష్ట జట్టుగా పేర్కొన్న అక్తర్.. ఉన్న పదిహేను మంది సూపర్ అని.. వారిలో ఎవరిని పక్కనపెడతారో అర్థం కావడం లేదని పేర్కొన్నాడు. ఓ యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ.. ‘‘అచ్చా.. అభిషేక్ వచ్చేశాడు. బుమ్రా (Jasprit Bumrah) ఉన్నాడు. అంతేకాదు సంజూ కూడా ఉన్నాడు. తిలక్ ఉన్నాడు.హార్దిక్ పాండ్యా, అర్ష్దీప్ సింగ్, రింకూ సింగ్ కూడా ఉండనే ఉన్నారు. శుబ్మన్ ఉన్నాడు. సూర్య ఉన్నాడు. శివం దూబేతో పాటు మన అక్షర్ పటేల్ కూడా!.. ఇందులో ఎవరిని తప్పించగలరు మిత్రమా!’’ అంటూ షోయబ్ అక్తర్ తనదైన శైలిలో కామెంట్లు చేశాడు.కత్తిమీద సాములాప్రస్తుత పరిస్థితుల్లో భారత తుదిజట్టు కూర్పు మేనేజ్మెంట్కు కత్తిమీద సాములా మారిందంటూ టీమిండియా అత్యంత పటిష్టంగా ఉందని అక్తర్ చెప్పకనే చెప్పాడు. ఇక తొలి మ్యాచ్లో సూర్యకుమార్ సేన విజయం నల్లేరు మీద నడకేనన్న అక్తర్.. యూఏఈ కూడా మంచి జట్టేనని కితాబులు ఇచ్చాడు.ఓటమి ఖాయమే.. కానీ కనీసం‘‘టీమిండియా చేతిలో యూఏఈ ఓడిపోతుందని తెలుసు. అయితే, తక్కువ తేడాతో ఓడిపోవాలని ఆకాంక్షిస్తున్నా. తొలి మ్యాచ్లో అఫ్గనిస్తాన్ చేతిలో హాంకాంగ్ చిత్తుగా ఓడింది. కనీసం మీరైనా అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. కాస్తైనా పోరాట పటిమ కనబరచండి. విజయానికి దగ్గరగా వచ్చి ఓడిపోయినా పర్లేదు. అది కూడా గొప్ప అచీవ్మెంట్ లాంటిదే’’ అని అక్తర్ యూఏఈ జట్టుకు సూచించాడు.దాయాదితో ఆరోజే పోరుఇదిలా ఉంటే.. రెండో మ్యాచ్లో టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఢీకొడుతుంది. సెప్టెంబరు 14న ఈ హై వోల్టేజీ మ్యాచ్కు షెడ్యూల్ ఖరారైంది. ఇక లీగ్ దశలో ఆఖరిగా భారత జట్టు.. సెప్టెంబరు 19న ఒమన్తో తలపడుతుంది. కాగా ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఆసియా కప్ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి.గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్... గ్రూప్-‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ రేసులో నిలిచాయి. ఇక ఈ ఖండాంతర టోర్నీలో టీమిండియా అత్యధికంగా ఎనిమిదిసార్లు గెలవగా.. శ్రీలంక ఆరు, పాకిస్తాన్ రెండుసార్లు గెలిచాయి. మిగతా జట్లలో బంగ్లాదేశ్ రెండుసార్లు ఫైనల్ చేరి రన్నరప్తో సరిపెట్టుకుంది. ఆసియా కప్-2025కి టీమిండియాసూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.చదవండి: పక్షవాతం.. నొప్పి భరించలేకపోయా: టీమిండియా స్టార్ క్రికెటర్ఆసియా కప్-2025: పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు -
SA20 Auction: టాప్-5 ఖరీదైన ప్లేయర్లు.. ఖరారైన ఆరు జట్ల పూర్తి వివరాలు
సౌతాఫ్రికా టీ20 లీగ్ వేలం-2026 (SA20 Auction) ముగిసింది. వచ్చే ఏడాది జరిగే ఈ పొట్టి ఫార్మాట్ టోర్నీ కోసం ఆరు జట్లు తమ ఆటగాళ్లను ఖరారు చేసుకున్నాయి. జొహన్నస్బర్గ్ వేదికగా మంగళవారం జరిగిన ఈ వేలంపాటలో ప్రొటిస్ యువ తరంగం డెవాల్డ్ బ్రెవిస్ అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.ప్రిటోరియా క్యాపిటల్స్ బ్రెవిస్ (Dewald Brevis)ను రూ. 8.31 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, అంతకంటే ముందు డర్బన్ సూపర్ జెయింట్స్.. సౌతాఫ్రికా టీ20 జట్టు కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ను రూ. 7 కోట్లకు దక్కించుకుంది.టాప్-5 ఖరీదైన ప్లేయర్లు వీరేఈ నేపథ్యంలో ఎస్ఏటీ20 చరిత్రలో ఖరీదైన ఆటగాళ్లుగా బ్రెవిస్, మార్క్రమ్ తొలి రెండు స్థానాలు దక్కించుకున్నారు. ఆ తర్వాతి ప్లేస్లో వియాన్ ముల్దర్ (రూ. 4.50 కోట్లు- జోబర్గ్ సూపర్ కింగ్స్), గెరాల్డ్ కోయెట్జి (రూ. 3.73 కోట్లు- డర్బన్ సూపర్ జెయింట్స్), నండ్రీ బర్గర్ (రూ. 3.20 కోట్లు- జొబర్గ్ సూపర్ కింగ్స్) నిలిచారు.మరి.. ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు, వేలంలో అమ్ముడుపోయిన ప్లేయర్లు.. వెరసి వచ్చే ఏడాది ఆరు ఫ్రాంఛైజీలకు సంబంధించి ఖరారైన జట్ల వివరాలు తెలుసుకుందామా?!సన్రైజర్స్ ఈస్టర్న్కేప్👉ముందస్తు ఒప్పందం: జానీ బెయిర్స్టో, ఏఎమ్ ఘజన్ఫర్, ఆడం మిల్నే.👉రిటైన్డ్ ప్లేయర్లు: ట్రిస్టన్ స్టబ్స్👉వైల్డ్కార్డు: మార్కో యాన్సెన్ఎంఐ కేప్టౌన్👉రిటైన్డ్ ప్లేయర్లు: ట్రెంట్ బౌల్ట్, రషీద్ ఖాన్, రియాన్ రికెల్టన్, కగిసో రబడ, జార్జ్ లిండే, కార్బిన్ బాష్.👉ముందస్తు ఒప్పందం: నికోలస్ పూరన్.జొహన్నస్బర్గ్ సూపర్ కింగ్స్👉రిటైన్డ్ ప్లేయర్లు: ఫాఫ్ డుప్లెసిస్, డొనొవాన్ ఫెరీరా👉ముందస్తు ఒప్పందం: జేమ్స్ విన్స్, అకీల్ హొసేన్ప్రిటోరియా క్యాపిటల్స్👉ముందస్తు ఒప్పందం: ఆండ్రీ రసెల్, విల్ జాక్స్, షెర్ఫానే రూథర్ఫర్డ్పర్ల్ రాయల్స్👉రిటైన్డ్ ప్లేయర్లు: లువామన్-డి- ప్రిటోరియస్, డేవిడ్ మిల్లర్, జార్జ్ ఫార్చూన్👉ముందస్తు ఒప్పందం: సికందర్ రజా, ముజీబ్-ఉర్- రహమాన్.డర్బన్ సూపర్ జెయింట్స్👉ముందస్తు ఒప్పందం: సునిల్ నరైన్👉రిటైన్డ్ ప్లేయర్లు: నూర్ అహ్మద్👉వైల్డ్ కార్డ్: హెన్రిచ్ క్లాసెన్వేలం ముగిసిన తర్వాత పూర్తి జట్లుసన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టుట్రిస్టన్ స్టబ్స్, మార్కో యాన్సెన్, జానీ బెయిర్స్టో, AM ఘజన్ఫర్, ఆడమ్ మిల్నే, క్వింటన్ డి కాక్, మాథ్యూ బ్రీట్జ్కే, అన్రిచ్ నోర్ట్జే, సెనురాన్ ముత్తుసామి, పాట్రిక్ క్రూగర్, లూథో సిపమ్లా, మిచెల్ వాన్ బ్యూరెన్, జోర్డాన్ హర్మన్, బేయర్స్ స్వనేపోల్, జేమ్స్ కోల్స్, క్రిస్ వుడ్, లూయిస్ గ్రెగరీ, సీజే కింగ్, జేపీ కింగ్.ఎంఐ కేప్టౌన్ జట్టుట్రెంట్ బౌల్ట్, రషీద్ ఖాన్, ర్యాన్ రికెల్టన్, జార్జ్ లిండే, కార్బిన్ బాష్, కగిసో రబడా, నికోలస్ పూరన్, రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్, రీజా హెండ్రిక్స్, డ్వైన్ ప్రిటోరియస్, ట్రిస్టన్ లూస్, జాసన్ స్మిత్, టామ్ మూర్స్, డేన్ పీడ్ట్, టియాన్ వాన్ వారెన్, డాన్ లటేగన్, తబ్రేజ్ షంసీ, కరీం జనత్, జాకెవ్స్ స్నీమాన్.జోబర్గ్ సూపర్ కింగ్స్ జట్టుఫాఫ్ డు ప్లెసిస్, డోనోవన్ ఫెరీరా, జేమ్స్ విన్స్, అకేల్ హోసేన్, రిచర్డ్ గ్లీసన్, వియాన్ ముల్దర్, నండ్రీ బర్గర్, ప్రేనాలెన్ సుబ్రేయన్, డయాన్ ఫారెస్టర్, స్టీవ్ స్టోక్, జాంకో స్మిత్, నీల్ టిమ్మర్స్, శుభమ్ రంజానే, బ్రాండన్ కింగ్, రీలీ రొసోవ్, రివాల్డో మూన్సామీ, ఇమ్రాన్ తాహిర్, రీస్ టోప్లీ.ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టుఆండ్రీ రస్సెల్, విల్ జాక్స్, షెర్ఫానే రూథర్ఫోర్డ్, కేశవ్ మహరాజ్, లుంగీ ఎన్గిడి, డెవాల్డ్ బ్రెవిస్, లిజాద్ విలియమ్స్, క్రెయిగ్ ఓవర్టన్, సాకిబ్ మహమూద్, కోడీ యూసుఫ్, కానర్ ఈస్టర్హుజెన్, బ్రైస్ పార్సన్స్, గిడియాన్ పీటర్స్, జునైద్ దావూద్, విల్ స్మీడ్, మీకా- ఈల్ ప్రిన్స్, బయాండా మజోలా, విహాన్ ల్యూబ్, సిబోనెలో మఖాన్య.పర్ల్ రాయల్స్ జట్టులువాన్-డ్రే ప్రిటోరియస్, డేవిడ్ మిల్లర్, జోర్న్ ఫార్చూయిన్, రూబిన్ హెర్మాన్, సికందర్ రజా, ముజీబ్-ఉర్-రహమాన్, ఒట్నీల్ బార్ట్మాన్, గుడకేష్ మోటీ, డెలానో పోట్గీటర్, కైల్ వెర్రెయిన్, కీగన్ లయన్-కాచెట్, అసా ట్రూడ్, హార్డస్ విల్జోన్, జాకన్ జొహన్స్ బేసర్, డాన్ లారెన్స్, ఇషాన్ మలింగ, ఎన్కొబానీ మొకొయెనా, విశేన్ హలాంబగే, ఎన్కబా పీటర్.డర్బన్ సూపర్ జెయింట్స్నూర్ అహ్మద్, హెన్రిచ్ క్లాసెన్, సునీల్ నరైన్, జోస్ బట్లర్, క్వేనా మఫాకా, ఐడెన్ మార్క్రమ్, డెవాన్ కాన్వే, గెరాల్డ్ కోయెట్జీ, డేవిడ్ బెడింగ్హామ్, మార్క్వెస్ అకెర్మాన్, ఈథన్ బాష్, ఆండిలే సిమెలానే, టోనీ డీ జోర్జి, డయాన్ గలీమ్, తైజుల్ ఇస్లాం, ఎవాన్ జోన్స్, గిస్బెర్ట్ వేజ్, డేవిడ్ వీస్, డారిన్ డుపావిలోన్.చదవండి: ‘యువీకి అప్గ్రేడ్ వర్షన్ అతడు.. గిల్కు కూడా మంచి ఛాన్స్’ -
పక్షవాతం.. నొప్పి భరించలేకపోయా: టీమిండియా స్టార్ క్రికెటర్
గత కొన్నాళ్లుగా భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైన పేరు శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer). పరిమిత ఓవర్ల ఫార్మాట్లో మంచి ఫామ్లో ఉన్నా ఆసియా కప్-2025 ఆడే టీమిండియాలో అతడికి చోటు దక్కకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఇదిలా ఉంటే.. 2022-23 మధ్య కాలంలో శ్రేయస్ ఇంతకంటే గడ్డు పరిస్థితులే ఎదుర్కొన్నాడు.క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డాడన్న కారణంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శ్రేయస్ సెంట్రల్ కాంట్రాక్టును రద్దు చేసింది. అదే సమయంలో ఫిట్నెస్ సమస్యలు కూడా అతడిని వెంటాడాయి. నాటి పరిస్థితి గురించి శ్రేయస్ అయ్యర్ తాజాగా మాట్లాడుతూ విస్మయకర విషయాలు వెల్లడించాడు.పక్షవాతం వచ్చింది‘‘ఆ సమయంలో నేను నొప్పితో ఎంతగా విలవిల్లాడానో ఎవరికీ తెలియదు. నా కాలుకు పక్షవాతం వచ్చింది. వెన్నెముకకు సర్జరీ జరిగిన తర్వాత.. నడుములో రాడ్డుతో ఎలా మేనేజ్ చేసుకున్నానో నాకే తెలియదు. ఆ ప్లేస్లో ఉన్న నరం కూడా దెబ్బతిన్నది.అదెంతో ప్రమాదకరమని వైద్యులు చెప్పారు. ఆ సమయంలో భరించలేని నొప్పి. నా కాలి చిటికిన వేలు వరకు నొప్పి పాకింది. నిజంగా అదొక భయంకర అనుభవం’’ అని జీక్యూ ఇండియాకు శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.కాగా గాయం నుంచి కోలుకున్న తర్వాత శ్రేయస్ అయ్యర్ ముంబై తరఫున దేశవాళీ క్రికెట్లో తనను తాను నిరూపించుకున్నాడు. అదే విధంగా ఐపీఎల్-2024లో కోల్కతా నైట్ రైడర్స్కు కెప్టెన్గా టైటిల్ అందించాడు. ఈ క్రమంలోనే టీమిండియాలో పునరాగమనం చేయగా.. బీసీసీఐ అతడి సెంట్రల్ కాంట్రాక్టును పునరుద్ధరించింది. వన్డే వరల్డ్కప్-2023లో ఆడిన శ్రేయస్ అయ్యర్ భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.వాటిని మాత్రమే నియంత్రించగలనుఅదే విధంగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియాను విజేతగా నిలపడంలో ముఖ్య భూమిక అతడిదే. ఇక ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా, బ్యాటర్గా శ్రేయస్ అయ్యర్ గొప్పగా రాణించాడు. జట్టును ఫైనల్కు చేర్చాడు. అయినప్పటికీ ఆసియా టీ20 కప్ ఆడే భారత జట్టులో మాత్రం అతడికి చోటు దక్కకపోవడం గమనార్హం.ఈ విషయంపై స్పందిస్తూ.. ‘‘నా ఆధీనంలో ఉన్న వాటిని మాత్రమే నేను నియంత్రించగలను. నా నైపుణ్యాలు, బలాలను మరింత మెరుగుపరచుకోవడం మాత్రమే నాకు తెలిసిన పని. అవకాశం వచ్చినప్పుడు రెండు చేతులతో దానిని అందిపుచ్చుకునేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను’’ అని శ్రేయస్ అయ్యర్ స్పష్టం చేశాడు.చదవండి: ‘యువీకి అప్గ్రేడ్ వర్షన్ అతడు.. గిల్కు కూడా మంచి ఛాన్స్’ -
భారత్-పాక్ మ్యాచ్ టికెట్లు ఇంకా అమ్ముడుపోలేదు.. ఆసక్తి తగ్గిందా..? ఆగ్రహమా..?
క్రీడ ఏదైనా భారత్, పాకిస్తాన్ సమరమంటే నెలల ముందుగానే టికెట్లు అమ్ముడుపోతుంటాయి. రేట్ ఎంతైనా కొనేందుకు అభిమానులు వెనుకాడరు. కొన్ని సందర్భాల్లో టికెట్ల ధరలు లక్షల్లో ఉన్నా జనాలు తగ్గలేదు.అయితే తాజా పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. క్రికెట్ ఆసియా కప్లో భాగంగా ఈ నెల 14న దుబాయ్లో దాయాదుల పోరు జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్కు సంబంధించి ఇప్పటివరకు టికెట్లు అమ్ముడుపోలేదు.ఇందుకు విపరీతంగా పెరిగిన రేట్లు ఓ కారణమని తెలుస్తుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రెండు ప్రీమియం సీట్ల ధర రూ. 2.5 లక్షలుగా (VIP Suites East) ఉంది. - Royal Box: ₹2.30 లక్షలు- Sky Box East: ₹1.67 లక్షలు- Platinum, Lounge, Pavilion: ₹28,000-₹75,000- సాధారణ టికెట్ ధర ₹10,000గా ఉన్నాయి.ఇవి సాధారణంగా ఉండే రేట్ల కంటే చాలా ఎక్కువ. ఆర్దిక స్థితి బాగా ఉన్న అభిమానులు కూడా ఇంత రేట్లు పెట్టి టికెట్లు కొనడానికి వెనకడుగు వేస్తారు.టికెట్లు అమ్ముడుపోకపోవడానికి ఇదో కారణమైతే, భారత్-పాక్ల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు మరో కారణంగా తెలుస్తుంది. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి దాడి తర్వాత భారతీయులు ఏ విషయంలోనూ పాక్తో సంబంధాలు పెట్టుకోవాలని అనుకోవడం లేదు. ఇరు దేశాలు క్రికెట్ మ్యాచ్ల్లో తలపడటం కూడా చాలా మందికి ఇష్టం లేదు. ఈ కారణంగానే భారత్-పాక్ ఆసియా కప్ సమరంపై ఆసక్తి తగ్గి ఉంటుంది. పైగా ఆసియా కప్లో భారత్ తలపడబోయే పాక్ జట్టు గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా బలహీనంగా ఉంది. భారత అభిమానులు ఆసక్తి చూపకపోవడానికి ఇదీ ఓ కారణం కావచ్చు. ద్వితియ శ్రేణి జట్లపై గెలిచినా మజా ఉండదన్నది చాలా మంది భావన. -
ఆసియా కప్-2025: ‘యువీకి అప్గ్రేడ్ వర్షన్ అతడు’
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్లో టీమిండియా టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా భారత్ ఆతిథ్యం ఇస్తున్న ఈ టీ20 టోర్నీ మంగళవారం మొదలైంది. అఫ్గనిస్తాన్- హాంకాంగ్ మ్యాచ్తో ఈ మెగా ఈవెంట్కు తెరలేవగా.. బుధవారం టీమిండియా తమ తొలి మ్యాచ్లో యూఏఈతో తలపడనుంది.అనంతరం సెప్టెంబరు 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్, సెప్టెంబరు 19న ఒమన్తో మ్యాచ్తో సూర్యకుమార్ సేన తమ లీగ్ దశను పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. టీమిండియా యువ స్టార్లు శుబ్మన్ గిల్, అభిషేక్ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.అరంగేట్రంలోనే డకౌట్.. ఆ తర్వాతకాగా పంజాబ్కు చెందిన అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఐపీఎల్లో సత్తా చాటి.. గతేడాది జూలైలో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. జింబాబ్వేతో జరిగిన టీ20 మ్యాచ్లో అరంగేట్రంలోనే డకౌట్ అయిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. మరుసటి మ్యాచ్లో 47 బంతుల్లోనే సెంచరీ చేసి సత్తా చాటాడు.ఈ క్రమంలో టీమిండియా టీ20 జట్టులో ఓపెనర్గా పాతుకుపోయిన అభిషేక్.. ఇప్పటి వరకు 17 మ్యాచ్లలో కలిపి 33కు పైగా సగటుతో 193కు పైగా స్ట్రైక్రేటుతో 535 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.వైస్ కెప్టెన్గా రీఎంట్రీఇక మరోవైపు.. దాదాపు ఏడాది కాలం తర్వాత వైస్ కెప్టెన్గా టీమిండియా టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు శుబ్మన్ గిల్. టెస్టుల్లో ఇప్పటికే సారథిగా పగ్గాలు చేపట్టిన ఈ పంజాబీ బ్యాటర్.. భవిష్యత్తులో మూడు ఫార్మాట్లలోనూ టీమిండియా కెప్టెన్గా ఎంపికయ్యే అవకాశం ఉంది.యువీకి అప్గ్రేడ్ వర్షన్ అతడుఇక ఆసియా కప్-2025లో తొలి మ్యాచ్కు అభిషేక్, గిల్ సిద్ధమవుతున్న వేళ రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘యూఏఈ పిచ్లపై కూడా అభిషేక్ శర్మ దూకుడైన ఆట కొనసాగుతుందో లేదో చూడాలి. ఏదేమైనా అతడో సూపర్ ప్లేయర్. యువరాజ్ సింగ్ అప్గ్రేడ్ వర్షన్ లాంటోడు.గిల్కు మంచి అవకాశంఇక ఈ టోర్నీలో పరుగులు చేయాలనే ఒత్తిడి శుబ్మన్ గిల్పై తప్పక ఉంటుంది. 140- 150కి పైగా స్ట్రైక్రేటుతో అతడు పరుగులు రాబట్టాల్సి ఉంటుంది. ఈసారి ఈ టోర్నమెంట్లో అత్యధిక పరుగుల వీరుడు అయ్యేందుకు గిల్కు మంచి అవకాశం ఉంది’’ అని పేర్కొన్నాడు.కాగా ఐపీఎల్-2025లో అభిషేక్ శర్మ సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఓపెనర్గా.. 14 మ్యాచ్లలో కలిపి 439 పరుగులు సాధించాడు. మరోవైపు.. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్.. 15 మ్యాచ్లు ఆడి 650 పరుగులతో టాప్-4లో నిలిచాడు.చదవండి: టెంబా బవుమాకు ఘోర అవమానం.. వరుసగా రెండోసారి..! -
చరిత్ర సృష్టించిన అఫ్గన్ ప్లేయర్.. ఆల్టైమ్ రికార్డు!
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్ను అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు ఘన విజయంతో ఆరంభించింది. హాంకాంగ్ను 94 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఈ టోర్నీలో తొలి గెలుపు నమోదు చేసింది. అబుదాబి వేదికగా మంగళవారం మొదలైన ఈ టీ20 ఈవెంట్ తొలి మ్యాచ్లో గ్రూప్- ‘బి’లో భాగమైన అఫ్గనిస్తాన్- హాంకాంగ్ (AFG vs HK) తలపడ్డాయి.టాస్ గెలిచిన అఫ్గన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 188 పరుగులు సాధించింది. ఓపెనర్ సెదీఖుల్లా అజేయ అర్ధ శతకం (52 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు)తో అద్భుత ప్రదర్శన కనబరచగా.. నాలుగో స్థానంలో వచ్చిన మహ్మద్ నబీ (26 బంతుల్లో 33) ఫర్వాలేదనిపించాడు.ఆకాశమే హద్దుగా.. ఇరవై బంతుల్లోనే ఇక లోయర్ ఆర్డర్లో అఫ్గన్ ఆల్రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ (Azmatullah Omarzai) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం ఇరవై బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 21 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 53 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లో రెండు ఫోర్లతో పాటు ఏకంగా ఐదు సిక్సర్లు ఉన్నాయి.సూర్య రికార్డు బద్దలు.. సరికొత్త చరిత్రఈ క్రమంలోనే ఒమర్జాయ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆసియా కప్ టీ20 టోర్నీలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించాడు. కాగా ఆసియా కప్-2022 సందర్భంగా సూర్య హాంకాంగ్పై 22 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఒమర్జాయ్ తాజాగా ఈ రికార్డును బద్దలు కొట్టాడు. అంతేకాదు అఫ్గన్ తరఫున ఫాస్టెస్ట్ టీ20 ఫిఫ్టీ సాధించిన ఆటగాడిగానూ నిలిచాడు.కేవలం 94 పరుగులే చేసి.. ఇదిలా ఉంటే.. అఫ్గన్ విధించిన 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో పసికూన హాంకాంగ్ విఫలమైంది. ఓపెనర్లు జీషన్ అలీ (5), అన్షుమన్ రథ్ (0) నిరాశపరచగా.. నిజఖత్ ఖాన్ (0), కించిత్ షా (6), ఐజాజ్ ఖాన్ (6), ఎషాన్ ఖాన్ (6) పూర్తిగా తేలిపోయారు. ఆఖర్లో ఆయుశ్ శుక్లా 1, అతీక్ ఇక్బాల్ ఒక పరుగుతో అజేయంగా నిలిచారు.ఇక వన్డౌన్లో వచ్చిన బాబర్ హయత్ 39 పరుగులతో హాంకాంగ్ టాప్ రన్ స్కోరర్గా నిలవగా.. కెప్టెన్ యాసిమ్ ముర్తాజా 16 పరుగులు చేయగలిగాడు. అఫ్గన్ బౌలర్ల ధాటికి తాళలేక హాంకాంగ్ బ్యాటర్లు ఇలా పెవిలియన్కు వరుస కట్టడంతో.. నిర్ణీత 20 ఓవర్లలో జట్టు తొమ్మిది వికెట్లు నష్టపోయి కేవలం 94 పరుగులు మాత్రమే చేయగలిగింది.అఫ్గన్ బౌలర్లలో ఫజల్హక్ ఫారూఖీ, గుల్బదిన్ నైబ్ రెండేసి వికెట్లు కూల్చగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్, కెప్టెన్ రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. బ్యాట్తో, బాల్తో రాణించి అజ్మతుల్లా ఒమర్జాయ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.ఆసియా టీ20 టోర్నీలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు నమోదు చేసింది వీరే..🏏అజ్మతుల్లా ఒమర్జాయ్ (అఫ్గనిస్తాన్)- హాంకాంగ్ మీద-20 బంతుల్లో🏏సూర్యకుమార్ యాదవ్ (ఇండియా)- హాంకాంగ్ మీద- 22 బంతుల్లో🏏రహ్మనుల్లా గుర్బాజ్ (అఫ్గనిస్తాన్)- శ్రీలంక మీద- 22 బంతుల్లో.చదవండి: ఆసియా కప్-2025: పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు -
గిల్ కేసులో పృథ్వీ షాకు 100 రూపాయల జరిమానా
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సప్నా గిల్ దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసులో టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షాకు ముంబైలోని ఓ సెషన్స్ కోర్టు 100 రూపాయల జరిమానా విధించింది. ఈ కేసులో షా తన సమాధానాన్ని కోర్టులో దాఖలు చేయకపోవడంతో న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. నామమాత్రపు జరిమానాతో చివరి అవకాశం ఇస్తూ.. తదుపరి విచారణను డిసెంబర్ 16కి వాయిదా వేశారు.కేసు నేపథ్యం (సప్నా ఫిర్యాదు ప్రకారం)..2023 ఫిబ్రవరి 15న, అంధేరీలోని (ముంబై) ఓ పబ్ వద్ద పృథ్వీ షా, సప్నా గిల్ మధ్య ఘర్షణ జరిగింది. సప్నా స్నేహితుడు షాను సెల్ఫీలు కోరగా మొదట అంగీకరించాడు. ఆతర్వాత సదరు వ్యక్తి కాస్త అతిగా ప్రవర్తించడంతో షా సెల్పీ ఇచ్చేందుకు నిరాకరించాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.పక్కనే ఉన్న సప్నా జోక్యం చేసుకుని సర్ది చెప్పబోగా, షా ఆమె స్నేహితుడి ఫోన్ను లాక్కొని విసిరికొట్టాడు. అంతటితో ఆగకుండా సప్నాను లైంగికంగా వేధించాడు. ఈ విషయాన్ని సప్నా దగ్గర్లోని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా వారు పట్టించుకోలేదు. దీంతో ఆమె అంధేరి మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించింది. 2024 ఏప్రిల్లో మేజిస్ట్రేట్ కోర్టు ప్రాథమిక విచారణకు ఆదేశిస్తూ, సాంతాక్రూజ్ పోలీస్ స్టేషన్కు కేసు అప్పగించింది.సప్నా లాయర్ ఏమంటున్నాడంటే..షా ఇప్పటివరకు కోర్టు సమన్లను నిర్లక్ష్యం చేస్తూ విచారణను ఆలస్యం చేస్తున్నాడని సప్నా గిల్ తరఫు న్యాయవాది అలీ కాశిఫ్ ఖాన్ ఆరోపించారు. ఇది అతని స్థిరమైన ప్రవర్తన అని, కోర్టు ప్రక్రియను ఎప్పటికప్పుడు తప్పించుకుంటున్నాడని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు.షా దేశవాలీ కెరీర్ విషయానికొస్తే.. ఇటీవలే ముంబై నుంచి మహారాష్ట్రకు మారిన షా.. ఆ జట్టు తరఫున తొలి మ్యాచ్లోనే సెంచరీతో (బుచ్చిబాబు టోర్నీ) మెరిశాడు. ప్రస్తుతం అతను టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. -
ఆసియా కప్ జట్టును మరింత బలోపేతం చేసుకున్న శ్రీలంక
శ్రీలంక క్రికెట్ బోర్డు ఆసియా కప్ ఆడబోతున్న తమ జట్టును మరింత బలోపేతం చేసుకుంది. ఇదివరకే 17 మంది సభ్యుల జట్టును ప్రకటించిన ఆ బోర్డు.. తాజాగా మరో ఆటగాడిని యాడ్ చేసి బృంద సంఖ్యను 18కి పెంచుకుంది. కొత్తగా మిడిలార్డర్ బ్యాటర్, పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ జనిత్ లియనాగేను జట్టులో చేర్చుకుంది. లియనాగే మూడేళ్ల తర్వాత టీ20 జట్టులోకి వచ్చాడు. తాజాగా జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్లో రాణించినందుకు (70, 19) లియనాగేకు లేటుగా ఆసియా కప్ బెర్త్ దక్కింది. లియనాగే చివరిగా 2022 ఫిబ్రవరిలో భారత్తో తన చివరి అంతర్జాతీయ టీ20 ఆడాడు. కెరీర్లో 29 వన్డేలు, 3 టీ20లు ఆడిన లియనాగే సెంచరీ, 6 అర్ద సెంచరీల సాయంతో 852 పరుగులు చేశాడు. అలాగే 3 వికెట్లు తీశాడు. ఆసియా కప్లో లియనాగే.. దసున్ షనక, చమిక కరుణరత్నేతో కలిసి లంక బ్యాటింగ్ లోతును పెంచనున్నాడు.జట్టులో చేరిన హసరంగగాయంతో బాధపడుతున్నా, ఆసియా కప్ బెర్త్ దక్కించుకున్న స్టార్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వనిందు హసరంగ.. గాయం నుంచి పూర్తిగా కోలుకుని లేటుగా జట్టులో చేరాడు. హసరంగ, లియనాగే దుబాయ్లో ఉన్న జట్టుతో కలిశారు.ఆసియా కప్లో శ్రీలంక సెప్టెంబర్ 13న తొలి పోటీ (బంగ్లాదేశ్తో) ఎదుర్కొంటుంది. ఈ టోర్నీలో గ్రూప్-బిలో ఉన్న ఆ జట్టు.. సెప్టెంబర్ 15న హాంకాంగ్తో, సెప్టెంబర్ 18న ఆఫ్ఘానిస్తాన్తో పోటీపడుతుంది.శ్రీలంక ఆసియా కప్ 2025 జట్టు: చరిత్ అసలంక (కెప్టెన్), పాతుం నిస్సాంక, కుసల్ మెండిస్, కుసల్ పెరెరా, నువానిడూ ఫెర్నాండో, కమిందు మెండిస్, కమిల్ మిశారా, దసున్ శానకా, జనిత్ లియనాగే, చామికా కరుణరత్నే, దునిత్ వెలలాగే, వనిందు హసరంగ, మహీష్ తీక్షణ, దుష్మంత చమీరా, బినురా ఫెర్నాండో, నువాన్ తుషార, మతీషా పథిరానా -
సౌతాఫ్రికాకు భారీ షాక్
ఇంగ్లండ్తో ఇవాల్టి నుంచి (సెప్టెంబర్ 10) ప్రారంభం కాబోయే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు ముందు సౌతాఫ్రికా జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ గాయం కారణంగా ఈ సిరీస్ మొత్తానికే దూరమయ్యాడు. మిల్లర్ ఇటీవల హండ్రెడ్ లీగ్లో Northern Superchargers తరఫున ఆడుతున్న సమయంలో హ్యామ్స్ట్రింగ్ గాయానికి గురయ్యాడు. ఆ గాయం నుంచి అతను ఇంకా కోలుకోలేదు. దీంతో ఇంగ్లండ్తో టీ20 సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని Cricket South Africa (CSA) అధికారికంగా ప్రకటించింది. అయితే మిల్లర్కు ప్రత్యామ్నాయ ఆటగాడిని మాత్రం ప్రకటించలేదు. ఇంగ్లండ్ సిరీస్లో ఆ జట్టు 14 మంది సభ్యులతోనే కొనసాగనుంది.మిల్లర్ తాజాగా ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లోనూ ఆడలేదు. గత కొంతకాలంగా అతను టీ20లకు మాత్రమే పరిమితమవుతున్నాడు. మిల్లర్ వన్డేలపై ఆసక్తి చూపనప్పటికీ.. 2027 వరల్డ్ కప్ ప్లాన్స్లో ఉంటాడని సౌతాఫ్రికా వన్డే కెప్టెన్ బవుమా తెలిపాడు. మిల్లర్ ఇంగ్లండ్ టీ20 సిరీస్కు దూరమైన ప్రకటన చేసిన సమయంలోనే క్రికెట్ సౌతాఫ్రికా మరో ప్రకటన కూడా చేసింది.100కి పైగా అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన అనుభవమున్న అల్బీ మోర్కెల్ ఈ సిరీస్కు బౌలింగ్ కన్సల్టెంట్గా నియమించినట్లు తెలిపింది. అల్బీ సోదరుడు మోర్నీ మోర్కెల్ టీమిండియా బౌలింగ్ కోచ్గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.కాగా, మూడు వన్డేలు, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సౌతాఫ్రికా జట్టు ఇదివరకే ముగిసిన వన్డే సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య ఇవాల్టి నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. కార్డిఫ్ వేదికగా జరుగబోయే తొలి మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతుంది. రెండు (మాంచెస్టర్), మూడు (నాటింగ్హమ్) టీ20లు 12, 14 తేదీల్లో జరుగనున్నాయి. తొలి టీ20 కోసం ఇంగ్లండ్ తుది జట్టును ఇప్పటికే ప్రకటించింది.ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు సౌతాఫ్రికా జట్టు: ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, డొనోవన్ ఫెరియెరా, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, క్వెనా మాఫాకా, సెనురన్ ముతుసామి, లుంగి ఎంగిడి, లుహాన్-డ్రే ప్రిటోరియస్, కగిసో రబాడా, రయాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్బ్స్, లిజాడ్ విలియమ్స్, కార్బిన్ బోష్దక్షిణాఫ్రికాతో తొలి టీ20కి ఇంగ్లండ్ XI: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), జేకబ్ బేతెల్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), సామ్ కర్రన్, టామ్ బాంటన్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ -
SA20 లీగ్ వేలంలో సంచలనం.. సెకెన్ల వ్యవధిలో 1050 శాతం పెరిగిన ఆటగాడి జీతం
నిన్న జరిగిన సౌతాఫ్రికా టీ20 లీగ్ వేలంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఓ ఆటగాడి జీతం సెకెన్ల వ్యవధిలో 1050 శాతం పెరిగింది. ఈ హఠాత్ పరాణామం చూసి నిర్వహకులు సహా వేలంలో పాల్గొన్న వారంతా నివ్వెరపోయారు.పూర్తి వివరాల్లో వెళితే.. WTC 2023-25 టైటిల్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు సభ్యుడు కైల్ వెర్రిన్ నిన్న జరిగిన వేలంలో R200K (₹10.06 లక్షలు) బేస్ ధరతో పాల్గొన్నాడు. వెర్రిన్ను పార్ల్ రాయల్స్ ఇదే ధరకు దక్కించుకుని సంతృప్తి చెందింది. అయితే ఈలోపే వెర్రిన్ను దక్కించుకునేందుకు ప్రిటోరియా క్యాపిటల్స్ RTM (Right to Match) కార్డ్తో ముందుకొచ్చింది.దీంతో అలర్ట్ అయిన రాయల్స్ వెర్రిన్ ధరకు ఒక్కసారిగా 1050 శాతం పెంచి R2.3 మిలియన్లకు (₹1.15 కోట్లు) తీసుకెళ్లింది. ఇది చూసి క్యాపిటల్స్ సహా వేలం నిర్వహకులంతా నివ్వెరపోయారు. రాయల్స్ ఒక్కసారిగా వెర్రిన్ ధరను ఎందుకంత పెంచిందో ఎవ్వరికీ అర్దం కాలేదు. వికెట్కీపర్ బ్యాటర్ అయిన వెర్రిన్కు రాయల్స్ అంత ప్రాధాన్యత ఇవ్వడం చూసి జనాలు అవాక్కయ్యారు.వాస్తవానికి వెర్రిన్ను పొట్టి ఫార్మాట్లో చెప్పుకోదగ్గ ట్రాక్ రికార్డేమీ లేదు. అతనో సాధారణ వికెట్కీపర్ బ్యాటర్ మాత్రమే. అడపాదడపా మెరుపులు మెరిపించగలడు. మిడిలార్డర్లో బ్యాటింగ్కు వస్తాడు. రాయల్స్ ఈ స్థాయి భారీ మొత్తం వెచ్చించాలనుకుంటే ఇంతకంటే మెరుగైన ప్రొఫైల్ ఉన్న ఆటగాడి కోసం పోటీపడి ఉండవచ్చు. కానీ వెర్రిన్కు ఇంత భారీ బిడ్ ఎందుకు వేసిందో మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉండిపోయింది. ఫైనల్గా రాయల్స్ వెర్రిన్ను దక్కించుకోగలిగింది కానీ, అనవసర ఖర్చును మీదేసుకుంది. ఒకవేళ క్యాపిటల్స్ కానీ మరే ఇతర ఫ్రాంచైజీ కానీ వెర్రిన్ కోసం పోటీపడినా అతని ధర భారత కరెన్సీలో ₹30 లక్షలు మించేది కాదు. అలాంటిది రాయల్స్ ఏకంగా ₹1.15 కోట్లు పెట్టి చేతులు కాల్చుకుంది. ఏది ఏమైనా వెర్రిన్ మాత్రం జాక్పాట్ కొట్టాడు. ₹10 లక్షలే ఎక్కువనుకుంటే.. సెకెన్ల వ్యవధిలో కోటీశ్వరుడయ్యాడు. అతని కెరీర్లో ఇదే భారీ వేలం మొత్తం. వెర్రిన్ గత రెండు సీజన్లలో క్యాపిటల్స్కు ఆడాడు. ఇందుకే ఆ ఫ్రాంచైజీ వెర్రిన్ కోసం RTM వాడింది.Paarl Royals Squad 2025–26: డేవిడ్ మిల్లర్ (కెప్టెన్), కైల్ వెర్రిన్, సికందర్ రజా, ముజీబ్ ఉర్ రెహ్మాన్, గుడకేష్ మోటీ, బ్జోర్న్ ఫోర్టుయిన్, డాన్ లారెన్స్, హార్డస్ విల్జోయెన్, డెలానో పోట్గిటర్, రూబిన్ హెర్మన్, లుహాన్-డ్రే ప్రిటోరియస్, కీగన్ లయన్-కాషెట్, ఎషాన్ మాలింగ, ఆసా ట్రైబ్, విశెన్ హలంబేజ్, జాకబ్ బాస్సన్, ఎన్కోబాని మొకోయెనా, ఎన్కాబయోమ్జీ పీటర్ -
ఇంగ్లండ్ తుది జట్టులో నాలుగు మార్పులు.. స్టార్ ఆల్రౌండర్ రీఎంట్రీ
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా సౌతాఫ్రికాతో ఇవాళ (సెప్టెంబర్ 10) జరుగబోయే తొలి టీ20 కోసం ఇంగ్లండ్ తుది జట్టును ప్రకటించారు. దాదాపుగా ఏడాది తర్వాత పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ సామ్ కర్రన్ ప్లేయింగ్ ఎవెవెన్లోకి వచ్చాడు. తాజాగా ముగిసిన హండ్రెడ్ లీగ్లో బంతితో (12 వికెట్లు), బ్యాట్తో (238 పరుగులు) అద్బుత ప్రదర్శనలు చేయడంతో సామ్కు జాతీయ జట్టు నుంచి పిలుపందింది.అతను చివరిగా 2024 నవంబర్లో (వెస్టిండీస్ టూర్) ఇంగ్లండ్ తరఫున టీ20 ఆడాడు. బ్రెండన్ మెక్కల్లమ్ ఇంగ్లండ్ టీ20 జట్టు కోచ్ అయ్యాక సామ్ ఆడనున్న తొలి టీ20 ఇదే. సామ్తో పాటు ఫిల్ సాల్ట్, జోఫ్రా ఆర్చర్, జేమీ ఓవర్టన్ కూడా ఇంగ్లండ్ టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు. సాల్ట్ పితృత్వ సెలవు కారణంగా ఇంగ్లండ్ ఆడిన గత టీ20 సిరీస్ (విండీస్) ఆడలేదు. ఆర్చర్, ఓవర్టన్ ఇంగ్లండ్ చివరిగా ఆడిన టీ20లో లేరు. మొత్తంగా ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ నాలుగు మార్పులతో బరిలోకి దిగనుంది. కాగా, సౌతాఫ్రికాతో తొలి టీ20 కార్డిఫ్ వేదికగా భారతకాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో సాల్ట్తో పాటు జోస్ బట్లర్ ఇంగ్లండ్ ఇన్నింగ్స్ను ప్రారంభిస్తారు. బేతెల్, బ్రూక్, సామ్ కర్రన్, టామ్ బాంటన్, విల్ జాక్స్ ఆతర్వాతి స్థానాల్లో బ్యాటింగ్కు వస్తారు. బౌలర్లుగా ఓవర్టన్, డాసన్, ఆర్చర్, ఆదిల్ రషీద్ ఉంటారు.దక్షిణాఫ్రికాతో తొలి టీ20కి ఇంగ్లండ్ XI: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), జేకబ్ బేతెల్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), సామ్ కర్రన్, టామ్ బాంటన్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ -
బవుమాకు ఘోర అవమానం.. వరుసగా రెండోసారి..!
జోహన్నెస్బర్గ్ వేదికగా నిన్న (సెప్టెంబర్ 9) జరిగిన SA20 లీగ్ 2025-26 వేలంలో సౌతాఫ్రికా వన్డే, టెస్ట్ జట్టు కెప్టెన్ టెంబా బవుమాకు ఘోర అవమానం జరిగింది. జాతీయ జట్టుకు రెండు ఫార్మాట్లలో కెప్టెన్ అయినా బవుమాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. వరుసగా రెండో సీజన్లో ఫ్రాంచైజీలు బవుమాను చిన్నచూపు చూశాయి. ఈసారి వేలంలో బవుమా 2 లక్షల ర్యాండ్ల బేస్ ప్రైజ్ విభాగంలో తన పేరు నమోదు చేసుకున్నాడు. అతనిపై ఒక్క ఫ్రాంచైజీ కూడా ఆసక్తి కనబర్చలేదు.ఫ్రాంచైజీలు చిన్నచూపు చూడటానికి బవుమా టీ20 రికార్డు మరీ అంత తీసికట్టుగా ఏమీ లేదు. ఈ ఫార్మాట్లో అతను 123.99 స్ట్రయిక్రేట్తో 27.07 సగటున 2653 పరుగులు చేశాడు. అంతర్జాతీయంగానూ బవుమా టీ20 రికార్డు బాగానే ఉంది. సౌతాఫ్రికా తరఫున అతను 36 టీ20ల్లో 118.17 స్ట్రయిక్రేట్తో 670 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్ద సెంచరీ ఉంది.2021-2022 మధ్యలో బవుమా సౌతాఫ్రికా టీ20 కెప్టెన్గానూ వ్యవహరించాడు. అతని సారథ్యంలో సౌతాఫ్రికా రెండు టీ20 వరల్డ్కప్లు (2021,2022) ఆడింది. అయినా బవుమాను సొంత దేశంలో జరిగే టోర్నీలోనే ఫ్రాంచైజీలు పట్టించుకోకపోవడం నిజంగా బాధాకరం. బవుమా ఆటగాడిగా, కెప్టెన్గా తన జట్టుకు వంద శాతం ఇచ్చేందుకు ప్రయత్నిస్తాడు. కొన్ని సార్లు సఫలం కాకపోవచు. ఇది ఆటలో సర్వసాధాణం.బవుమాకు పొట్టి క్రికెట్ ఆడే టాలెంట్ లేక విస్మరణకు గురైతే పెద్దగా పట్టింపు లేదు. అతనిలో పొట్టి క్రికెట్కు కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నా ఎవరు పట్టించుకోకపోవడమే బాధాకరం. అత్యుత్తమ కెప్టెన్ఎవరు ఔనన్నా కాదన్నా సౌతాఫ్రికా క్రికెట్ చరిత్రలో బవుమా అత్యుత్తమ కెప్టెన్. ఈ ఏడాది అతను సౌతాఫ్రికాను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్గా నిలబెట్డాడు. తాజాగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ను వారి దేశాల్లోనే వన్డే సిరీస్ల్లో మట్టికరిపించాడు. ఆటగాడిగా, కెప్టెన్గా ఘనమైన ట్రాక్ రికార్డు ఉన్న బవుమాకు సొంత దేశంలో జరిగే టోర్నీలోనే ఆదరణ లభించకపోవడం విచారకరం. ఇదిలా ఉంటే, నిన్న జరిగిన వేలంలో బవుమాతో పాటు జేమ్స్ ఆండర్సన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, కుసాల్ పెరీరా, మొయిన్ అలీ లాంటి స్టార్ ఆటగాళ్లకు కూడా చుక్కెదురైంది. వీరిని కూడా ఏ ఫ్రాంచైజీ పట్టించుకోలేదు. డెవాల్డ్ బ్రెవిస్, ఎయిడెన్ మార్క్రమ్, మాథ్యూ బ్రీట్జ్కీ లాంటి ఆటగాళ్లు మాత్రం జాక్పాట్ కొట్టారు. బ్రెవిస్ను ప్రిటోరియా క్యాపిటల్స్ రూ. 8.31 కోట్లకు.. మార్క్రమ్ను డర్బన్ సూపర్ జెయింట్స్ రూ. 7.05 కోట్లకు.. బ్రీట్ట్కేను సన్రైజర్స్ ఈస్ట్రన్కేప్ రూ. 3.05 కోట్లకు కొనుగోలు చేశాయి. -
రాజస్థాన్ రాయల్స్కు మరో బిగ్ షాక్
తదుపరి ఐపీఎల్ సీజన్ (2026) ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉన్నా, రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి నుంచే మార్పులు చేర్పుల ప్రక్రియ మొదలుపెట్టింది. తొలుత కెప్టెన్ సంజూ శాంసన్ ఫ్రాంచైజీ వీడతాడని అనుకున్నా.. అతని కంటే ముందే హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వైదొలిగాడు. తాజాగా రాయల్స్కు మరో కీలక వ్యక్తి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తుంది.ఆ ఫ్రాంచైజీ CEO జేక్ లష్ మెక్క్రమ్ తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. వచ్చే నెలలో అతను అధికారికంగా వైదొలగనున్నట్లు తెలుస్తుంది. జోహన్నెస్బర్గ్లో నిన్న (సెప్టెంబర్ 9) జరిగిన SA20 వేలంలో రాజస్థాన్ రాయల్స్ సిస్టర్ ఫ్రాంచైజీ అయిన Paarl Royals టేబుల్ వద్ద జేక్ కనిపించలేదు. జేక్ 2021లో కేవలం 28 ఏళ్ల వయసులో రాయల్స్ CEOగా బాధ్యతలు చేపట్టి వార్తల్లో నిలిచాడు. కాగా, రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం గత సీజన్ పేలవ ప్రదర్శన అనంతరం ఫ్రాంచైజీలో సమూల ప్రక్షాళన చేపట్టాలని భావిస్తుంది. ఇందులో భాగంగానే కీలక పదవుల్లో వారికి పొమ్మనలేక పొగ పెట్టింది. ఈ క్రమంలో తొలుత ఫ్రాంచైజీ మార్కెటింగ్ హెడ్, ఆతర్వాత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, తాజాగా సీఈఓ నిష్క్రమణ జరిగాయి.త్వరలో కెప్టెన్ సంజూ శాంసన్ కూడా రాయల్స్కు గుడ్ బై చెప్పడం దాదాపుగా ఖరారైంది. రాయల్స్ యాజమాన్యం ఇంత మంది తప్పిస్తున్నా, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా ఉన్న కుమార సంగక్కరను మాత్రం కొనసాగించనున్నట్లు తెలుస్తుంది. రాయల్స్ 2025 సీజన్లో 14 మ్యాచ్ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది.గత సీజన్లో ఆ జట్టు తరఫున అద్బుతమైన ప్రదర్శనలు నమోదైనా ఎందుకో విజయాలు సాధించలేకపోయింది. చాలావరకు గెలవాల్సిన మ్యాచ్ల్లో ఆ జట్టు ఒత్తిడిలోనై పరాజయాలపాలైంది. గత సీజన్లో రాయల్స్కు వైభవ్ సూర్యవంశీ రూపంలో ఆణిముత్యం దొరికాడు. వైభవ్ గత సీజన్లో ఎలా పేట్రేగిపోయాడో అందరం చూశాం. -
దబంగ్ ఢిల్లీ దూకుడు
విశాఖ స్పోర్ట్స్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో దబంగ్ ఢిల్లీ జోరు కొనసాగుతోంది. తిరుగులేని ప్రదర్శనతో దూసుకెళ్తున్న దబంగ్ ఢిల్లీ లీగ్లో వరుసగా నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. మంగళవారం జరిగిన తొలి పోరులో దబంగ్ ఢిల్లీ 45–34 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్పై సునాయాస విజయం సాధించింది. కెపె్టన్ అశు మలిక్ 16 పాయింట్లతో విజృంభించగా... అజింక్య పవార్ (8 పాయింట్లు), నీరజ్ నర్వాల్ (6 పాయింట్లు) సారథికి సహకరించారు.బెంగాల్ వారియర్స్ కెపె్టన్ దేవాంక్ 12 పాయింట్లు సాధించగా... విశ్వాస్ 9 పాయింట్లతో పోరాడాడు. అయితే మ్యాచ్ ఆరంభంలోనే దబంగ్ ఢిల్లీ ఆధిక్యం సాధించింది. నీరజ్, అజింక్య సూపర్ రెయిడ్లతో ఢిల్లీ జట్టు వరుస పాయింట్లు సాధించగా... ఆ తర్వాత అశు చెలరేగిపోయాడు. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచిన దబంగ్ ఢిల్లీ 8 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో కొనసాగుతోంది. బెంగాల్ వారియర్స్ 4 మ్యాచ్లాడి ఒక విజయం, 3 పరాజయాలతో 2 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక అట్టడుగున ఉంది. మరో మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు ‘గోల్డెన్ రైడ్’లో గుజరాత్ జెయింట్స్పై విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య జరిగిన పోరు నిర్ణీత సమయంలో 30–30 పాయింట్లతో సమం కాగా... విజేతను నిర్ణయించేందుకు ‘గోల్డెన్ రైడ్’ నిర్వహించాల్సి వచ్చింది. మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ తరఫున నితిన్ కుమార్ 15 పాయింట్లతో సత్తా చాటగా... గుజరాత్ జెయింట్స్ తరఫున రాకేశ్ 11 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే మ్యాచ్ల్లో యు ముంబాతో తెలుగు టైటాన్స్... యూపీ యోధాస్తో పుణేరి పల్టన్ తలపడనున్నాయి. -
అహ్మదాబాద్లో 2026 టి20 ప్రపంచకప్ ఫైనల్!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2026 టి20 ప్రపంచకప్ ఫైనల్ అహ్మదాబాద్లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నీకి సంబంధించిన మ్యాచ్లు భారత్లోని 5 మైదానాలతో పాటు శ్రీలంకలోని రెండు గ్రౌండ్లలో జరగనున్నాయి. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత జట్టు పాకిస్తాన్లో.... పాకిస్తాన్ జట్టు భారత్లో మ్యాచ్లు ఆడని నేపథ్యంలో... ఇరు జట్ల మధ్య మ్యాచ్లను ఐసీసీ తటస్థ వేదికపై నిర్వహిస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టు టి20 వరల్డ్కప్ ఫైనల్కు అర్హత సాధిస్తే... మెగా టోర్నీ తుది సమరం కొలంబోలో జరుగుతుంది. ఐసీసీ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ ఆడాల్సిన అన్నీ మ్యాచ్లను శ్రీలంకలోనే నిర్వహించనున్నారు. ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ను ఐసీసీ అధికారికంగా విడుదల చేయకపోయినప్పటికీ... వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 మధ్య మ్యాచ్లు జరిగే అవకాశాలున్నాయి. 2024 టి20 వరల్డ్కప్ మాదిరిగానే మొత్తం 20 జట్లను నాలుగు గ్రూప్లుగా విభజించనున్నారు. అందులో మెరుగైన ప్రదర్శన చేసిన జట్లు ‘సూపర్–8’ దశకు... అందులో మెరుగ్గా ఆడిన జట్లు సెమీఫైనల్కు చేరునున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ భారత్తో పాటు శ్రీలంక, అఫ్గానిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, అమెరికా, వెస్టిండీస్, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్, కెనడా, నెదర్లాండ్స్, ఇటలీ జట్లు ఇప్పటికే వరల్డ్కప్నకు అర్హత సాధించాయి. ఇందులో ఇటలీ జట్టు ప్రపంచకప్నకు అర్హత సాధించడం ఇదే తొలిసారి. ఇక మిగిలిన ఐదు స్థానాల కోసం క్వాలిఫయింగ్ టోర్నీలు జరగనున్నాయి. ఆఫ్రికా క్వాలిఫయర్స్ నుంచి 2 జట్లు, తూర్పు ఆసియా పసిఫిక్ క్వాలిఫయర్స్ నుంచి మరో మూడు జట్లు ఈ టోర్నమెంట్కు అర్హత సాధించనున్నాయి. 2024లో అమెరికా, వెస్టిండీస్ సంయుక్త ఆతిథ్యంలో జరిగిన టి20 ప్రపంచకప్ను రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు గెలుచుకున్న విషయం తెలిసిందే. -
చాంపియన్ హైదరాబాద్
చెన్నై: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన హైదరాబాద్ జట్టు... వరుసగా రెండో ఏడాది ఆలిండియా బుచ్చిబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్లో విజేతగా నిలిచింది. తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్సీఏ) ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుతో జరిగిన ఫైనల్ ‘డ్రా’గా ముగియగా... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్కు టైటిల్ ఖాయమైంది. హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్లో 376 పరుగులు చేయగా... టీఎన్సీఏ జట్టు 353 పరుగులకు పరిమితమైంది. దీంతో హైదరాబాద్ జట్టుకు 23 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఓవర్నైట్ స్కోరు 14/1తో మంగళవారం అఖరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ జట్టు... చివరకు 70 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వరుణ్ గౌడ్ (122 బంతుల్లో 56 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా... రాహుల్ రాధేశ్ (133 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు), రవితేజ (87 బంతుల్లో 30; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. వరుణ్ గౌడ్, రాహుల్ రాధేశ్ అబేధ్యమైన ఆరో వికెట్కు 85 పరుగులు జోడించారు. ప్రత్యర్థి బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ జంట అలవోకగా పరుగులు రాబట్టింది. భారీ షాట్లకు పోకుండా సింగిల్స్, డబుల్స్తో స్ట్రయిక్ రొటేట్ చేసింది. అమన్ రావు (19), హిమతేజ (11), కెపె్టన్ రాహుల్ సింగ్ (2) ఎక్కువసేపు నిలవలేకపోయారు. టీఎన్సీఏ బౌలర్లలో విద్యుత్, హేమచుడేశన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని హైదరాబాద్ జట్టు ఓవరాల్గా 178 పరుగుల ముందంజలో నిలిచింది. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెపె్టన్లు నిర్ణీత సమయం కంటే ముందే ‘డ్రా’కు అంగీకరించారు. ఆట చివరి రోజు హైదరాబాద్ ప్లేయర్లు సాధికారికంగా ఆడారు. ఎలాంటి సంచలనాలకు తావివ్వకుండా... వరుసగా రెండో ఏడాది ట్రోఫీ చేజిక్కించుకున్నారు. తొలి ఇన్నింగ్స్లో భారీ హాఫ్సెంచరీ బాదిన హైదరాబాద్ ప్లేయర్ హిమతేజకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, టోర్నీ ఆసాంతం రాణించిన ఆల్రౌండర్ వరుణ్ గౌడ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డులు దక్కాయి. విజేత హైదరాబాద్ జట్టుకు ట్రోఫీతో పాటు రూ. 3 లక్షల నగదు బహుమతి దక్కింది. విజేతలకు భారత మాజీ ఆటగాడు రాబిన్ సింగ్, తమిళనాడు క్రికెట్ సంఘం ప్రతినిధులు బహుమతులు ప్రదానం చేశారు. -
శుభారంభంపై గురి
దుబాయ్: ఆసియా కప్ టోర్నీలో తమ ఆధిపత్యాన్ని మరోసారి ప్రదర్శించేందుకు భారత జట్టు సిద్ధమైంది. టోర్నీలో భాగంగా గ్రూప్ ‘ఎ’లో నేడు జరిగే తమ తొలి మ్యాచ్లో టీమిండియా... ఆతిథ్య జట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో తలపడనుంది. డిఫెండింగ్ వరల్డ్కప్ చాంపియన్ కావడంతో పాటు అపార ఐపీఎల్ అనుభవంతో నిండిన సూర్యకుమార్ బృందానికి ఈ పోరులో విజయం లాంఛనమే. అయితే మన తుది జట్టు కూర్పు ఎలా ఉంటుందనేదే ఇప్పుడు ప్రధాన చర్చ కానుంది. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్లో ఇంకా ఎదిగే దశలోనే ఉన్న యూఏఈ బలమైన ప్రత్యర్థికి ఏమాత్రం పోటీనిస్తుందనేది చూడాలి. 2024లో విజేతగా నిలిచిన టి20 వరల్డ్ కప్ ఆరంభం నుంచి చూస్తే భారత్ 24 మ్యాచ్లు గెలిచి, 3 మాత్రమే ఓడింది. సామ్సన్ అవుట్! టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ పునరాగమనంతో టి20 టీమ్లో భారత్ తప్పనిసరి మార్పులు చేసుకోవాల్సి వస్తోంది. ఈ ఫార్మాట్లో అసాధారణ ఫామ్లో ఉన్న అభిషేక్ శర్మతో కలిసి అతను ఓపెనింగ్ చేస్తాడు. మూడో స్థానంలో ఇప్పటికే తనను తాను నిరూపించుకున్న తిలక్ వర్మకు అదే స్థానంలో అవకాశం ఖాయం కాగా నాలుగో స్థానంలో కెపె్టన్ సూర్యకుమార్ ఉన్నాడు. దాంతో వికెట్ కీపర్గా సంజు సామ్సన్కు చాన్స్ దొరికే అవకాశం కనిపించడం లేదు.సామ్సన్ సాధారణంగా టాపార్డర్ బ్యాటర్. టాప్–3లో ఆడకపోతే అతనికి చోటు అనవసరమని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. మంగళవారం జట్టు ప్రాక్టీస్ సెషన్ను బట్టి చూసినా అదే కనిపించింది. సామ్సన్కంటే ఫినిషర్గా జితేశ్ శర్మ మెరుగైన ఆటగాడు కాబట్టి కీపర్గా అతను బరిలోకి దిగవచ్చు. పేస్ బౌలింగ్, విధ్వంసక బ్యాటింగ్ కలగలిపిన ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలతో జట్టు దుర్బేధ్యంగా ఉంది. ప్రధాన పేసర్లు బుమ్రా, అర్ష్ దీప్ల స్థానాలకు ఢోకా లేదు. మరో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కూడా ఆడటంపై ఎలాంటి సందేహం లేదు. మిగిలిన ఏకైక స్థానం కోసం కుల్దీప్, వరుణ్ చక్రవర్తి మధ్య పోటీ ఉంది. అయితే టీమిండియాకు సంబంధించి తుది జట్టులో ఎవరు ఉన్నా అంతా విడివిడిగా మ్యాచ్ విన్నర్లు కాబట్టి సమస్య లేదు. అనుభవలేమితో సమస్య... సొంత మైదానంలో బరిలోకి దిగుతుండటం, ఇటీవలే ముక్కోణపు టోర్నీలో కూడా ఆడిన అనుభవం యూఏఈ జట్టుకు మానసికంగా కాస్త ఆత్మవిశ్వాసం పెంచే విషయం. అయితే భారత్లాంటి అత్యంత బలమైన జట్టును ఈ టీమ్ నిలువరించడం చాలా కష్టమైన విషయం. బుమ్రాలాంటి స్టార్ను ఎదుర్కొని పరుగులు సాధించడం వారి శక్తికి మించిన పని కావచ్చు. ఓపెనర్, కెప్టెన్ మొహమ్మద్ వసీమ్తో పాటు మరో ఓపెనర్ అలీషాన్పై జట్టు బ్యాటింగ్ ప్రధానంగా ఆధారపడి ఉంది. ఆసిఫ్ ఖాన్, రాహుల్ చోప్రా కూడా కొన్ని కీలక పరుగులు సాధించగల సమర్థులు. జునైద్ సిద్దిఖ్, రోహిద్, హైదర్ అలీ ప్రధాన బౌలర్లు కాగా...లెఫ్టార్మ్ స్పిన్నర్ సిమ్రన్జీత్ సింగ్ మరో కీలక బౌలర్. భారత మాజీ ఆటగాడు, 2007లో టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు కోచ్గా వ్యవహరించిన లాల్చంద్ రాజ్పుత్ ఇప్పుడు యూఏఈ టీమ్కు హెడ్ కోచ్గా ఉన్నాడు. ఆయన మార్గదర్శకత్వంలోనే టీమ్ ఇటీవల కాస్త మెరుగైంది.1 భారత్, యూఏఈ మధ్య ఇప్పటి వరకు ఒకే ఒక టి20 మ్యాచ్ జరిగింది. 2016 ఆసియా కప్లో భాగంగా జరిగిన ఈ పోరులో భారత్ 9 వికెట్ల తేడాతో గెలిచింది. పిచ్, వాతావరణంచాంపియన్స్ ట్రోఫీ సమయంలో పిచ్ల పూర్తిగా పొడిబారి స్పిన్కు బాగా అనుకూలించాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఈ సీజన్లో కొత్తగా, జీవం ఉన్న పిచ్లు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి అటు బ్యాటింగ్తో పాటు పేసర్లకు కూడా మంచి అవకాశం ఉంది. తీవ్రమైన ఎండల మధ్య ఆటగాళ్లు శ్రమించాల్సి ఉంటుంది. -
పతకానికి విజయం దూరంలో నిఖత్ జరీన్
లివర్పూల్: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత స్టార్, రెండుసార్లు విశ్వవిజేత నిఖత్ జరీన్ మూడో పతకానికి విజయం దూరంలో నిలిచింది. ఇంగ్లండ్లో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ 51 కేజీల విభాగంలో క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో నిఖత్ 5:0తో జపాన్కు చెందిన యునా నిషినాకాపై విజయం సాధించింది. 29 ఏళ్ల నిఖత్ 2022, 2023 ప్రపంచ చాంపియన్షిప్లలో స్వర్ణ పతకాలు గెలిచింది. మరోవైపు 48 కేజీల విభాగంలో మీనాక్షి హుడా కూడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించి పతకానికి గెలుపు దూరంలో నిలిచింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో మీనాక్షి 5:0తో వాంగ్ కియుపింగ్ (చైనా)పై గెలుపొందింది. పురుషుల విభాగంలో భారత బాక్సర్లు సుమిత్ కుందు (75 కేజీలు), సచిన్ సివాచ్ (60 కేజీలు), నరేందర్ (ప్లస్ 90 కేజీలు), లక్ష్య చహర్ (80 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగారు. సుమిత్ 0:5తో రామి కివాన్ (బల్గేరియా) చేతిలో, సచిన్ 1:4తో బిబార్స్ జెక్సన్ (కజకిస్తాన్) చేతిలో, నరేందర్ 1:4తో డీగో లెంజీ (ఇటలీ) చేతిలో, లక్ష్య చహర్ 0:3తో సీజర్ యోజెర్లిన్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయారు. పురుషుల విభాగంలో భారత్ నుంచి ప్రస్తుతం ఇద్దరు బాక్సర్లు మాత్రమే బరిలో మిగిలారు -
ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ
హాంకాంగ్: భారత డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–13, 18–21, 21–10తో చియు సియాంగ్ చియె–వాంగ్ చి లిన్ (చైనీస్ తైపీ) జంటపై విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో కిరణ్ జార్జి (భారత్) మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. క్వాలిఫయింగ్ మ్యాచ్ల్లో కిరణ్ జార్జి 21–14, 21–13తో చియెమ్ జూన్ వె (మలేసియా)పై, 21–18, 21–14తో శంకర్ ముత్తుస్వామి (భారత్)లపై గెలుపొందాడు. మరోవైపు హైదరాబాద్ ప్లేయర్ తరుణ్ మన్నేపల్లి మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయాడు. క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో తరుణ్ 28–26, 21–13తో ప్రపంచ మాజీ నంబర్వన్, భారత్కే చెందిన కిడాంబి శ్రీకాంత్ను ఓడించి... రెండో రౌండ్లో 23–21, 13–21, 18–21తో జస్టిన్ హో (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. -
అఫ్గానిస్తాన్ అలవోకగా...
అబుదాబి: అఫ్గానిస్తాన్ జట్టు అంచనాలకు తగిన ప్రదర్శనతో ఆసియా కప్లో శుభారంభం చేసింది. మంగళవారం మొదలైన ఈ టి20 టోర్నీ గ్రూప్ ‘బి’ తొలి మ్యాచ్లో అఫ్గానిస్తాన్ 94 పరుగుల తేడాతో హాంకాంగ్ను చిత్తు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన అఫ్గాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేయగా... ఆ తర్వాత హాంకాంగ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 94 పరుగులే చేయగలిగింది. అఫ్గాన్ భారీ స్కోరులో ఓపెనర్ సాదిఖుల్లా అటల్ (52 బంతుల్లో 73 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్లు), అజ్మతుల్లా ఒమర్జాయ్ (21 బంతుల్లో 53; 2 ఫోర్లు, 5 సిక్స్లు) అర్ధ సెంచరీలతో ప్రధాన పాత్ర పోషించారు. ముఖ్యంగా అజ్మతుల్లా 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకొని అఫ్గాన్ తరఫున ‘ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ’ని నమోదు చేశాడు. వీరిద్దరు ఐదో వికెట్కు 35 బంతుల్లోనే 82 పరుగులు జోడించడం విశేషం. సీనియర్ ఆటగాడు మొహమ్మద్ నబీ (26 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా కీలక పరుగులతో రాణించగా... రహ్మనుల్లా గుర్బాజ్ (8), ఇబ్రహీం జద్రాన్ (1), గుల్బదిన్ నైబ్ (5) విఫలమయ్యారు. హాంకాంగ్ బౌలర్లలో కించిత్ షా, ఆయుశ్ శుక్లా చెరో 2 వికెట్లు పడగొట్టాడు. హాంకాంగ్ ఫీల్డింగ్ వైఫల్యం కూడా అఫ్గాన్ టీమ్కు కలిసొచ్చింది. ఆ జట్టు ఆటగాళ్లు ఏకంగా నాలుగు సునాయాస క్యాచ్లు వదిలేశారు. సాదిఖుల్లాకు 4, 45, 51 పరుగుల వద్ద లైఫ్ లభించగా...అజ్మతుల్లా 22 పరుగుల వద్ద బతికిపోయి ఆ తర్వాత మెరుపు బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చాడు. కఠినమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హాంకాంగ్ పూర్తిగా తడబడింది. మొత్తం జట్టులో బాబర్ హయత్ (43 బంతుల్లో 39; 3 సిక్స్లు), ముర్తజా (16) మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. 9.5 ఓవర్ల వద్దే 43/5 వద్ద నిలిచిన జట్టు ఆ తర్వాత కోలుకోలేకపోయింది. హాంకాంగ్ తమ తర్వాతి మ్యాచ్లో 11న బంగ్లాదేశ్తో... అఫ్గానిస్తాన్ తమ తర్వాతి మ్యాచ్లో 16న బంగ్లాదేశ్తో తలపడతాయి. -
దుమ్ములేపిన ఒమర్జాయ్, అటల్.. హాంకాంగ్ టార్గెట్ ఎంతంటే?
ఆసియాకప్-2025లో అబుదాబి వేదికగా హాంకాంగ్తో జరుగుతున్న తొలి మ్యాచ్లో అఫ్గానిస్తాన్ బ్యాటర్లు దుమ్ములేపారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అఫ్గాన్ ఆరంభంలోనే రెహ్మతుల్లా గుర్బాజ్(8), ఇబ్రహీం జాద్రాన్(1) వికెట్లు కోల్పోయినప్పటికి.. ఓపెనర్ సెదికుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్ దుమ్ములేపారు. వీరిద్దరూ హాంకాంగ్ బౌలర్లను వీరిద్దరూ ఉతికారేశారు. అటల్ 49 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 73 పరుగులు చేసి ఆజేయంగా నిలవగా.. ఒమర్జాయ్ కేవలం 21 బంతుల్లోనే 2 ఫోర్లు, 5 సిక్స్లతో 53 పరుగులు చేసి ఔటయ్యాడు. వీరిద్దరితో పాటు మహ్మద్ నబీ(33) రాణించాడు.హాంకాంగ్ బౌలర్లలో కించిత్ షా, అయూష్ శోక్లా తలా రెండు వికెట్లు పడగొట్టగా..ఇషాన్, అతీక్ చెరో వికెట్ పడగొట్టారు. అయితే హాంకాంగ్ ఫీల్డర్లు మూడు సునాయస క్యాచ్లను జారవిడిచారు. ఫలితంగా అఫ్గాన్ ఈ భారీ స్కోర్ సాధించగల్గింది. -
సౌతాఫ్రికా టీ20 లీగ్ వేలంలో గంగూలీ మార్క్..
టీమిండియా దిగ్గజం సౌరవ్ గంగూలీ.. ప్రిటోరియా క్యాపిటల్స్ హెడ్ కోచ్గా తన పనని మొదలు పెట్టాడు. జోహన్నెస్బర్గ్ వేదికగా జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 లీగ్-2026 వేలంలో గంగూలీ తన మార్క్ను చూపించాడు. అత్యధిక పర్స్ వాల్యూతో వేలంలోకి వచ్చిన ప్రిటోరియా క్యాపిటల్స్.. తొలి ఆటగాడిగా సౌతాఫ్రికా స్టార్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ను సొంతం చేసుకుంది.సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ యజమాని కావ్య మారన్తో పోటీపడి మరి 1.7 మిలియన్ ర్యాండ్లు(సుమారు రూ. 85 లక్షలు)కు మహారాజ్ను ప్రిటోరియా దక్కించుకుంది. అతడిని సొంతం చేసుకోవడంలో గంగూలీది కీలక పాత్ర. ఆ తర్వాత సౌతాఫ్రికా టీ20 వేలంలో పది మిలియన్ ర్యాండ్లు దాటిన మొదటి ఆటగాడిగా నిలిచిన ఐడెన్ మార్క్రమ్ కోసం కూడా ప్రిటోరియా తీవ్రంగా ప్రయత్నించింది. కానీ డర్బన్ సూపర్ జెయింట్స్ గట్టీ పోటీ ఇవ్వడంతో క్యాపిటల్స్ వెనక్కి తగ్గింది. మార్క్రమ్ను డర్బన్ సూపర్ జెయింట్స్ రికార్డు స్థాయిలో రూ. 7 కోట్లకు కొనుగోలు చేసింది.క్యాపిటల్స్లోకి బ్రెవిస్..ఇక మార్క్రమ్ను దక్కించుకోవడంలో విఫలమైన సౌరవ్ గంగూలీ.. సౌతాఫ్రికా సూపర్ స్టార్ డెవాల్డ్ బ్రెవిస్ను మాత్రం ఆఖరివరకు పోటీపడి మరి తమ జట్టులోకి తీసుకొచ్చాడు. ప్రిటోరియా క్యాపిటల్స్ అతడి కోసం ఏకంగా రూ. 8.3 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. దీంతో ఎస్ఎ టీ20 లీగ్ హిస్టరీలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్గా 22 ఏళ్ల బ్రెవిస్ నిలిచాడు. బ్రెవిస్ కోసం జోబర్గ్ సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లేమింగ్ కూడా ఆఖరి వరకు ప్రయత్నించాడు. కానీ ప్రిటోరియా క్యాపిటల్స్ మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గలేదు. అదేవిధంగా గంగూలీ అండ్ కో ప్రోటీస్ స్టార్ ఫాస్ట్ బౌలర్ లుంగి ఎంగిడీని సైతం సొంతం చేసుకున్నారు. కాగా ప్రిటోరియా క్యాపిటల్స్ ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ సిస్టర్ ఫ్రాంచైజీ కావడం విశేషం. ఈ ఏడాది ఆగస్టులో ప్రిటోరియా క్యాపిటల్స్ హెడ్ కోచ్గా గంగూలీ ఎంపికయ్యాడు. గత కొన్ని ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్గా గంగూలీ వ్యహరించిన సంగతి తెలిసిందే. -
యూఈఏతో మ్యాచ్.. భారత తుది జట్టు ఇదే! శాంసన్కు నో ఛాన్స్
ఆసియాకప్-2025లో తమ తొలి మ్యాచ్కు టీమిండియా సిద్దమైంది. సెప్టెంబర్ 10న అబుదాబి వేదికగా యూఈఏతో తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలని భారత జట్టు భావిస్తోంది. ఈ క్రమంలో యూఏఈతో మ్యాచ్కు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ను భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అంచనా వేశాడు. తన ఎంచుకున్న తుది జట్టులో ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్కు ఛాన్స్ ఇచ్చాడు. ఈ జట్టులో సంజూ శాంసన్కు మాత్రం చోటు దక్కలేదు. అతడి స్ధానంలో వికెట్ కీపర్ బ్యాటర్గా జితేష్ శర్మను శ్రీకాంత్ ఎంపిక చేశాడు. మిడిలార్డర్లో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబేలతో అతడు వెళ్లాడు. తిలక్ వర్మ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్తో పాటు ఐపీఎల్-2025లో దుమ్ములేపాడు. దీంతో అతడికి భారత తుది జట్టులో చోటు ఖాయం. ఇక ఆల్రౌండర్లగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్కు ఈ తమిళనాడు క్రికెటర్ అవకాశమిచ్చాడు. అదేవిధంగా ఫాస్ట్ బౌలర్ల కోటాలో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్లకు చోటు దక్కింది. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తికి ఛాన్స్ లభించింది. అయితే గిల్ తిరిగి రావడంతో తుది జట్టులో సంజూ శాంసన్ స్దానంపై సందిగ్ధం కొనసాగుతోంది.కానీ మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం శాంసన్కు తుది జట్టులో చోటు దక్కుతుందన్న సంకేతాలు ఇచ్చాడు. సంజూ ప్రస్తుతం టీ20 క్రికెట్లో దుమ్ములేపుతున్నాడు.ఐపీఎల్-2025తో పాటు కేరళ క్రికెట్ లీగ్ టోర్నీలోనూ మెరుగైన ప్రదర్శన చేశాడు. మరోవైపు జితేష్ కూడా ఐపీఎల్లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేశాడు. టీమ్ మెనెజ్మెంట్కు ఇదొక కఠిన సవాల్ అనే చెప్పుకోవాలి. మరి సూర్య అండ్ గంభీర్ ఎవరివైపు మొగ్గు చూపుతారో బుధవారం వరకు వేచి చూడాల్సిందే.యూఏఈతో మ్యాచ్కు శ్రీకాంత్ అంచనా వేసిన భారత తుది జట్టు: అభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్చదవండి: IND vs AUS: ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. ఆ సిరీస్కు కోహ్లి-రోహిత్ దూరం!? -
Asia Cup 2025: శివం దూబే మాకు కీలకం: భారత బౌలింగ్ కోచ్
టీమిండియా స్టార్ శివం దూబే (Shivam Dube)ను ఉద్దేశించి బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ (Morney Morkel) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్లో అతడి సేవలను పూర్తిగా వినియోగించుకుంటామని తెలిపాడు. ఈ టీ20 టోర్నీలో శివంను పూర్తిస్థాయి ఆల్రౌండర్గా ఉపయోగించుకుంటామని పేర్కొన్నాడు.ఎనిమిది జట్ల మధ్య పోటీ కాగా యూఏఈ వేదికగా భారత్ ఆసియా కప్ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈసారి పొట్టి ఫార్మాట్లో నిర్వహించే ఈ ఈవెంట్లో గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ పాల్గొంటుండగా.. గ్రూప్-‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ తలపడుతున్నాయి.రెండు నైపుణ్యాలపై దృష్టి ఉండాలిఇక అఫ్గనిస్తాన్- హాంకాంగ్ మ్యాచ్తో మంగళవారం (సెప్టెంబరు 9) ఈ టోర్నీ మొదలుకానుండగా.. బుధవారం టీమిండియా తమ తొలి మ్యాచ్ను యూఏఈతో ఆడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మీడియా సమావేశంలో మాట్లాడాడు.ఈ సందర్భంగా.. ‘‘నాలుగు ఓవర్లు బౌల్ చేసే ఆటగాడిగా శివంను మేము ఉపయోగించుకుంటాము. నా దృష్టిలో ఇది అత్యంత ముఖ్యమైన విషయం. ఆల్రౌండర్లు బ్యాటర్, బౌలర్గా తమకున్న రెండు నైపుణ్యాలపై దృష్టి సారించాలని నేను ఎల్లప్పుడూ చెబుతూ ఉంటా.ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలికొంతమంది ప్రాక్టీస్ సమయంలో ఏదో ఒక దానిపై మాత్రమే ఫోకస్ చేస్తారు. కానీ మేము మాత్రం వారు రెండు విధాలుగా రాణించాలని కోరుకుంటాము. ఇక.. మ్యాచ్ రోజున అందరి కంటే అతడికే పరిస్థితులు ఎక్కువగా అనుకూలించవచ్చు. కాబట్టి అందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలని చెప్తాము’’ అని మోర్నీ మోర్కెల్ పేర్కొన్నాడు.ఆల్రౌండర్లు మెరుగ్గా రాణిస్తే కెప్టెన్కు పని సులువు అవుతుందన్న మోర్నీ.. ఫ్రంట్లైన్ బౌలర్లతో పాటు ఆల్రౌండర్ల సేవలు కూడా బౌలింగ్ విభాగంలో ఉపయోగించుకుంటామని మరోసారి స్పష్టం చేశాడు. కాగా ఆసియా కప్ టోర్నీలో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ రూపంలో ముగ్గురు కీలక ఆల్రౌండర్లు అందుబాటులో ఉన్నారు. ఆసియా కప్ టీ20-2025 టోర్నీకి టీమిండియాసూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.చదవండి: ముందుగానే స్టేజీ దిగిపోయిన పాక్ కెప్టెన్.. సూర్య, రషీద్ ఖాన్ ఏం చేశారంటే? -
టీ20 వరల్డ్కప్-2026 టోర్నీకి డేట్స్ ఫిక్స్..! వివరాలు ఇవే
భారత్, శ్రీలంక వేదికలగా జరగనున్న టీ20 వరల్డ్కప్-2026కు తేదీలను ఐసీసీ ఖరారు చేసినట్లు తెలుస్తోంది ఈఎస్పీఎన్ రిపోర్ట్ ప్రకారం.. ఈ మెగా టోర్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8వరకు జరగనున్నట్లు సమాచారం. ఐపీఎల్-2026కు ముందే ఈ పొట్టి ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగా ఈవెంట్లో మొత్తం 20 జట్లు పాల్గోనున్నాయి. ఈ మార్య్కూ ఈవెంట్కు శ్రీలంక, భారత్లోని మొత్తం ఐదు స్టేడియాలు ఆతిథ్యమివ్వనున్నాయి. అయితే సదరు రిపోర్ట్ ప్రకారం.. ఈ టోర్నీకి సంబంధించి షెడ్యూల్ను మాత్రం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఇంకా ఫైన్లైజ్ చేయలేదంట.కానీ ఫైనల్ మ్యాచ్కు వేదికలగా ఆహ్మదాబాద్, కొలంబోలను పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ పాక్ ఫైనల్కు చేరుకుంటే కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో తుది పోరు జరిగే అవకాశముంది.ఫార్మాట్ ఇదే..ఇక టీ20 వరల్డ్కప్-2026 ఫార్మాట్ విషయానికి వస్తే.. గత ఎడిషన్ మాదిరిగానే నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో పాల్గోనే మొత్తం జట్లను నాలుగు గ్రూపులగా విభజిస్తారు. ప్రతీ గ్రూపులో ఐదు జట్లు ఉంటాయి. లీగ్ స్టేజిలో ప్రతీ జట్టు నాలుగు మ్యాచ్లు ఆడుతోంది.లీగ్ దశ ముగిసే సమయానికి ప్రతీ గ్రూపులో టాప్-2లో నిలిచే జట్లు సూపర్-8కు ఆర్హత సాధిస్తాయి. సూపర్-8 రౌండ్లో టాప్ 4 జట్లు సెమీఫైనల్లో అడుగుపెడతాయి. ఆ తర్వాత సెమీస్లో గెలిచిన రెండు జట్లు ఫైనల్లో తలపడతాయి.ఈ ప్రపంచకప్లో ఓవరాల్గా 55 మ్యాచ్లు జరగనున్నాయి. ప్రస్తుతం ఈ మెగా టోర్నీ కోసం 15 జట్లు తమ బెర్త్లను ఖరారు చేసుకున్నాయి. మిగిలిన ఐదు జట్లు ఆఫ్రికన్, ఆసియా, తూర్పు ఆసియా పసిఫిక్ క్వాలిఫయర్స్ నుంచి ఆర్హత సాధించనున్నాయి.చదవండి: వేలంలో రికార్డులు బద్దలు కొట్టిన డెవాల్డ్ బ్రెవిస్.. కాస్ట్లీ ప్లేయర్గా చరిత్ర -
వేలంలో రికార్డులు బద్దలు కొట్టిన డెవాల్డ్ బ్రెవిస్.. కాస్ట్లీ ప్లేయర్గా చరిత్ర
సౌతాఫ్రికా యువ క్రికెటర్ డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis) సరికొత్త చరిత్ర సృష్టించాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్ వేలం (SAT20 Auction)లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. కాగా 2023లో ఎస్టీ20 లీగ్ మొదలు కాగా.. వరుసగా రెండు సీజన్లలో సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ టైటిల్ సాధించింది.అత్యధిక ధర పలికిన ఆటగాడిగా మార్క్రమ్ఈ ఏడాది కూడా సన్రైజర్స్ ఫైనల్ చేరగా.. ఎంఐ కేప్టౌన్ తొలిసారి టైటిల్ సొంతం చేసుకుంది. ఇక వచ్చే ఏడాదికి ఇప్పటికే ఈ లీగ్లోని ఆరు జట్లు రిటెన్షన్ జాబితా విడుదల చేయగా.. మంగళవారం వేలానికి షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో ఎస్ఏటీ20 -2026 వేలంలో తొలుత ఐడెన్ మార్క్రమ్ (Aiden Markram) అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు.కాగా సన్రైజర్స్ ఈస్టర్న్కేప్ కెప్టెన్గా రెండుసార్లు టైటిల్ అందించిన ఘనత మార్క్రమ్కు ఉంది. అయితే, కారణమేమిటో తెలియదు గానీ.. వేలానికి ముందే సన్రైజర్స్తో అతడు బంధం తెంచుకున్నాడు. ఈ క్రమంలో వేలంలోకి రాగా.. డర్బన్ సూపర్ జెయింట్స్ రికార్డు స్థాయిలో రూ. 7 కోట్లకు అతడిని కొనుగోలు చేసింది.కాసేపటికే రికార్డు బద్దలుతద్వారా ఎస్ఏఈ టీ20 లీగ్ చరిత్రలో ఖరీదైన ప్లేయర్గా మార్క్రమ్ రికార్డు సాధించాడు. అయితే, కాసేపటికే అతడి రికార్డును యువ తార డెవాల్డ్ బ్రెవిస్ బద్దలు కొట్టేశాడు. ప్రిటోరియా క్యాపిటల్స్ అతడి కోసం ఏకంగా రూ. 8.3 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. దీంతో లీగ్ హిస్టరీలోనే కాస్ట్లీ ప్లేయర్గా 22 ఏళ్ల బ్రెవిస్ చరిత్ర లిఖించాడు.అంతర్జాతీయ క్రికెట్లోనూకాగా ఐపీఎల్లో 2022లో అరంగేట్రం చేసిన డెవాల్డ్ బ్రెవిస్.. ఇప్పటి వరకు 16 మ్యాచ్లు ఆడి.. 455 పరుగులు సాధించాడు. చివరగా అంటే 2025 సీజన్లో అతడు చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించాడు. హిట్టర్గా పేరొందిన బ్రెవిస్ 2023లోనే అంతర్జాతీయ క్రికెట్లోనూ అడుగుపెట్టాడు.అయితే, సౌతాఫ్రికా తరపున టీ20లకే పరిమితమైన బ్రెవిస్.. ఈ ఏడాది టెస్టు, వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో 10 టీ20 మ్యాచ్లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 318 పరుగులు చేశాడు. ఇక ఆరు వన్డేల్లో 110, రెండు టెస్టుల్లో కలిపి 84 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా టీ20 కెప్టెన్గా ఉన్న ఐడెన్ మార్క్రమ్ ఈసారి డర్బన్ సూపర్ జెయింట్స్ సారథిగా పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది.సౌతాఫ్రికా టీ20 లీగ్-2025 రిటెన్షన్స్ జాబితాసన్రైజర్స్ ఈస్టర్న్కేప్🏏ముందస్తు ఒప్పందం: జానీ బెయిర్స్టో, ఏఎమ్ ఘజన్ఫర్, ఆడం మిల్నే.🏏రిటైన్డ్ ప్లేయర్లు: ట్రిస్టన్ స్టబ్స్🏏వైల్డ్కార్డు: మార్కో యాన్సెన్ఎంఐ కేప్టౌన్🏏రిటైన్డ్ ప్లేయర్లు: ట్రెంట్ బౌల్ట్, రషీద్ ఖాన్, రియాన్ రికెల్టన్, కగిసో రబడ, జార్జ్ లిండే, కార్బిన్ బాష్.🏏ముందస్తు ఒప్పందం: నికోలస్ పూరన్.జొహన్నస్బర్గ్ సూపర్ కింగ్స్🏏రిటైన్డ్ ప్లేయర్లు: ఫాఫ్ డుప్లెసిస్, డొనొవాన్ ఫెరీరా🏏ముందస్తు ఒప్పందం: జేమ్స్ విన్స్, అకీల్ హొసేన్ప్రిటోరియా క్యాపిటల్స్🏏ముందస్తు ఒప్పందం: ఆండ్రీ రసెల్, విల్ జాక్స్, షెర్ఫానే రూథర్ఫర్డ్డర్బన్ సూపర్ జెయింట్స్🏏ముందస్తు ఒప్పందం: సునిల్ నరైన్🏏రిటైన్డ్ ప్లేయర్లు: నూర్ అహ్మద్🏏వైల్డ్ కార్డ్: హెన్రిచ్ క్లాసెన్పర్ల్ రాయల్స్🏏రిటైన్డ్ ప్లేయర్లు: లువామన్-డి- ప్రిటోరియస్, డేవిడ్ మిల్లర్, జార్జ్ ఫార్చూన్🏏ముందస్తు ఒప్పందం: సికందర్ రజా, ముజీబ్-ఉర్- రహమాన్.చదవండి: ఆల్టైమ్ ఆసియా టీ20 జట్టు: భారత్ నుంచి ఐదుగురు.. యువీకి నో ఛాన్స్ -
మైదానంలో వాళ్లను ఆపను.. ఈసారి ఫేవరెట్ జట్టు ఏదీ లేదు: పాక్ కెప్టెన్
పొట్టి క్రికెట్ ప్రేమికులకు వినోదం పంచేందుకు ఆసియా కప్-2025 (Asia Cup 2025) టోర్నమెంట్ సిద్ధంగా ఉంది. అఫ్గనిస్తాన్- హాంకాంగ్ (AFG vs HK) మ్యాచ్తో మంగళవారం (సెప్టెంబరు 9) ఈ మెగా ఈవెంట్కు తెరలేస్తుంది. ఈ నేపథ్యంలో టోర్నీలో పాల్గొనే ఎనిమిది జట్ల కెప్టెన్లు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)తో పాటు.. రషీద్ ఖాన్ (అఫ్గనిస్తాన్), చరిత్ అసలంక (శ్రీలంక), లిటన్ దాస్ (బంగ్లాదేశ్), సల్మాన్ ఆఘా (పాకిస్తాన్), జతీందర్ సింగ్ (ఒమన్), ముహమ్మద్ వసీం (యూఏఈ), యాసిమ్ ముర్తాజా (హాంకాంగ్) విలేకరులతో ముచ్చటించారు.హుందాగా బదులిచ్చిన సూర్యఈ క్రమంలో ఆసియా కప్ తాజా ఎడిషన్ టోర్నీ విజేతగా టీమిండియా ఫేవరెట్ కదా అన్న ప్రశ్న వచ్చింది. ఇందుకు సూర్య తనదైన శైలిలో హుందాగా సమాధానమిచ్చాడు. ‘‘మీకెవరు ఈ విషయం చెప్పారు?.. నేనైతే ఎప్పుడూ వినలేదు.అయితే, సుదీర్ఘకాలంగా మేము టీ20 క్రికెట్లో ఉత్తమంగా రాణిస్తున్నాం. ఇప్పుడు కూడా టోర్నీకి పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాము’’ అని సూర్య తెలిపాడు. ఇక ఇదే ప్రశ్నకు పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా ఇచ్చిన సమాధానం వైరల్గా మారింది.షాకింగ్గా సల్మాన్ సమాధానంటీమిండియాను ఫేవరెట్గా భావిస్తున్నారా అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘టీ20 క్రికెట్లో గంట.. రెండు గంటల సమయంలోనే అంతా తలకిందులైపోతాయి. మ్యాచ్ రోజు ఎవరైతే గొప్పగా ఆడతారో వారిదే విజయం. అందుకే ఈ ఫార్మాట్ టోర్నీలో ఓ జట్టు ఫేవరెట్గా ఉంటుందని నేను అనుకోను’’ అని సల్మాన్ ఆఘా పేర్కొన్నాడు.మైదానంలో వాళ్లను ఆపనుఇక మైదానంలో ఫాస్ట్బౌలర్లను కట్టడి చేస్తారా అని విలేకరులు అడుగగా.. ‘‘ఫాస్ట్ బౌలర్లు అంటేనే దూకుడుగా ఉంటారు. వారిని దాని నుంచి మనం వేరుచేయలేము. ఎవరైతే మైదానంలో అగ్రెసివ్ ఉండాలనుకుంటారో వారికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.క్రీడా స్ఫూర్తికి భంగం కలగనంత వరకు స్వేచ్ఛ కొనసాగుతుంది. నా వైపు నుంచైతే ఫాస్ట్బౌలర్లపై ఎలాంటి ఆంక్షలూ ఉండవు’’ అని సల్మాన్ ఆఘా స్పష్టం చేశాడు.కాగా ఆసియా కప్-2025 టోర్నీకి ముందు పాకిస్తాన్.. యూఏఈ- అఫ్గనిస్తాన్లతో ముక్కోణపు టీ20 సిరీస్ ఆడింది. ఇందులో యూఏఈ, అఫ్గన్లపై వరుస విజయాలతో ఫైనల్ చేరింది. టైటిల్ పోరులో రషీద్ ఖాన్ బృందాన్ని ఓడించి సిరీస్ను కైవసం చేసుకుంది. తద్వారా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో పాక్ బరిలోకి దిగుతోంది.టీమిండియాదే హవాఇదిలా ఉంటే.. ఆసియా కప్ టోర్నీలో ఆది నుంచీ టీమిండియాదే హవా. ఇప్పటికి ఎనిమిది సార్లు భారత్ టైటిల్ గెలవగా.. శ్రీలంక ఆరుసార్లు చాంపియన్గా నిలిచింది. పాకిస్తాన్ రెండుసార్లు మాత్రమే ట్రోఫీని సొంతం చేసుకోగలిగింది. ఇక ఈసారి దాయాదులు భారత్- పాక్ సెప్టెంబరు 14న ముఖాముఖి తలపడనున్నాయి.చదవండి: ముందుగానే స్టేజీ దిగిపోయిన పాక్ కెప్టెన్.. సూర్య, రషీద్ ఖాన్ ఏం చేశారంటే? -
గ్రేటెస్ట్ ప్లేయర్లు వారే.. రోహిత్కు స్థానం లేదు: టీమిండియా మాజీ క్రికెటర్
రోహిత్ శర్మ.. భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. హిట్మ్యాన్ గత 18 ఏళ్ల నుంచి ఆటగాడిగా, కెప్టెన్గా తన సేవలను భారత జట్టుకు అందిస్తున్నాడు. భారత్కు రెండు ఐసీసీ టైటిల్స్ను అందించిన ఘనత అతడిది.రోహిత్ సారథ్యంలోనే టీమిండియా టీ20 వరల్డ్కప్-2024, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025ని సొంతం చేసుకుంది. అదేవిధంగా వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ప్లేయర్గా, సింగిల్ వరల్డ్కప్ ఎడిషన్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా రోహిత్ కొనసాగుతున్నాడు. అయితే ఇన్ని ఘనతలు సాధించిన రోహిత్.. ఇండియన్ ఆల్ టైమ్ గ్రెటెస్ట్ క్రికెటర్లలో ఒకడు కాదంట. సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లిల కంటే రోహిత్ వెనకబడి ఉన్నాడని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. అయితే వైట్బాల్ క్రికెట్లో మాత్రం రోహిత్ గొప్ప ప్లేయర్ అని అతడు కొనియాడాడు. టెస్టుల్లో రోహిత్కు మంచి ట్రాక్ రికార్డు లేకపోవడంతో ఆల్టైమ్ గ్రేట్ బ్యాటర్ల సరసన చోటు ఇవ్వడం లేదని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ టెస్టుల్లో కేవలం 12 సెంచరీలు మాత్రమే సాధించాడు. అందులో రెండు సెంచరీలు విదేశీ గడ్డపై వచ్చినవి. అదే టెండూల్కర్ సేనా దేశాలలో (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) 17 సెంచరీలు నమోదు చేయగా.. కోహ్లి, ద్రవిడ్ వరుసగా 12, 10 సెంచరీలు సాధించారు."ఆల్-టైమ్ ఇండియన్ బ్యాటింగ్ దిగ్గజాల జాబితాలోకి రోహిత్ సరిపోడు. ఎందుకంటే సచిన్, గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, విరాట్ వంటి దిగ్గజాలతో పోలిస్తే రోహిత్ వెనకబడి ఉన్నాడు. రోహిత్ వారి స్ధాయికి చేరుకోలేకపోయాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్ అద్భుతమైన ప్లేయర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అతడు ప్రతీ జట్టుపై అధిపత్యం చెలాయించాడు. ఒక వన్డే ఇన్నింగ్స్లో దాదాపు మూడు వందల పరుగుల(264) వరకు సాధించాడు. కానీ ఆల్ టైమ్ గ్రేట్ జాబితా గురించి మాట్లేడప్పుడు టెస్ట్ క్రికెట్కు ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. రెడ్ బాల్ ఫార్మాట్లో రోహిత్ తన మార్క్ చూపించలేకపోయాడు.వైట్ బాల్ క్రికెట్ గ్రేట్..అయితే భారత క్రికెట్లో స్వార్ధం లేని ఆటగాళ్ల లిస్ట్లో రోహిత్ ముందుంజలో ఉంటాడు. అంతే కాకుండా అతడి కెప్టెన్సీ కూడా గురుంచి కూడా మాట్లాడుకోవాలి. నిజంగా అతడొక అద్బుతమైన నాయకుడు. 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత అతడిపై గౌరవం, ప్రేమ మరింత పెరిగిపోయింది. జట్టు కోసం ఎన్నో త్యాగాలు చేశాడు. సెల్ప్లెస్ క్రికెటర్. వన్డే క్రికెట్లో అతడొక లెజెండ్ అని దూరదర్శన్ ది గ్రేట్ ఇండియన్ క్రికెట్ షోలో పేర్కొన్నాడు.చదవండి: మైదానంలో వాళ్లను ఆపను.. ఈసారి ఫేవరెట్ జట్టు ఏదీ లేదు: పాక్ కెప్టెన్ -
ముందుగానే స్టేజీ దిగిపోయిన పాక్ కెప్టెన్.. సూర్య, రషీద్ ఖాన్ ఏం చేశారంటే?
క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్ గురించే చర్చ. ఈ ఖండాంతర టోర్నీలో టీమిండియా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో (2023 వన్డే ఫార్మాట్ విజేత ) టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగుతుండగా.. టీ20 ఫార్మాట్లో గత చాంపియన్గా శ్రీలంక పోటీలో ఉంది.ఈసారి పొట్టి ఫార్మాట్లో నిర్వహించే ఈ టోర్నీకి భారత్.. యూఏఈ వేదికగా ఆతిథ్యం ఇస్తోంది. ఇందులో గ్రూప్-‘ఎ’ నుంచి టీమిండియాతో పాటు పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ పోటీలో ఉన్నాయి. ఇక గ్రూప్- ‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ పోటీపడుతున్నాయి.కెప్టెన్ల మీడియా సమావేశంఇక సెప్టెంబరు 9- 28 వరకు ఆసియా కప్ టోర్నీ జరుగనుండగా.. మంగళవారం ఎనిమిది జట్ల కెప్టెన్లు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అందరి దృష్టి టీమిండియా- పాకిస్తాన్ కెప్టెన్లపైనే కేంద్రీకృతమైంది.సూర్య - సల్మాన్ మధ్యలో రషీద్భారత టీ20 జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్ ప్రెస్మీట్లో అఫ్గన్ కెప్టెన్ రషీద్ ఖాన్ పక్కన కూర్చున్నాడు. ఇక పాక్ జట్టు నాయకుడు సల్మాన్ ఆఘా రషీద్కు మరోవైపు కూర్చున్నాడు. విలేకరులతో మాట్లాడిన అనంతరం సల్మాన్ ఆఘా.. హాంకాంగ్, ఒమన్ కెప్టెన్లతో కలిసి ముందుగానే వేదిక దిగిపోయాడు.సారథుల ఆలింగనం.. పాక్ కెప్టెన్ మిస్ఇంతలో రషీద్- సూర్యతో మాట్లాడుతూ నవ్వులు చిందించగా.. యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం వచ్చి ఒక్కొక్కరిగా వేదికపై ఉన్న జట్ల సారథులను ఆలింగనం చేసుకుని కరచాలనం చేశాడు. ఈ క్రమంలో సూర్య, రషీద్ శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక, బంగ్లా సారథి లిటన్ దాస్లకు షేక్హ్యాండ్ ఇచ్చి హగ్ చేసుకున్నారు.ఆ తర్వాత..ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోకి రాగా.. టీమిండియా- పాకిస్తాన్ కెప్టెన్లు దూరం దూరంగానే ఉన్న వార్త ప్రచారం అయింది. అయితే, ఇంకో వీడియోలో మిగతా కెప్టెన్లతో పాటు సల్మాన్కు కూడా సూర్య షేక్హ్యాండ్ ఇచ్చినట్లు కనిపించింది.కేంద్రం అనుమతితోనే..కాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దాయాది దేశాలు భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో క్రీడల్లోనూ అన్ని స్థాయిల్లోనూ పాకిస్తాన్తో బంధం తెంచుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. అయితే, ఆసియా కప్ మల్టీలేటరల్ టోర్నీ కావున చిరకాల ప్రత్యర్థితో టీమిండియా మ్యాచ్ ఆడేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినివ్వడం గమనార్హం.ఇక ప్రెస్మీట్లో అంటీముట్టనట్టుగానే ఉన్న భారత్- పాక్ జట్ల సారథులు ఆఖర్లో కర్టసీగా కరచాలనం చేసుకోవడం నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 10న తమ తొలి మ్యాచ్లో యూఏఈతో తలపడనున్న సూర్యకుమార్ సేన.. 14న దాయాది పాక్తో తలపడుతుంది. లీగ్ దశలో ఆఖరిగా సెప్టెంబరు 19న ఒమన్తో మ్యాచ్ ఆడుతుంది.చదవండి: ఆసియా కప్-2025: పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలుIndian Captain Suryakumar Yadav and Pakistan Captain Salman Agha..(This video is for those saying that the Pakistan captain wasn't sitting next to the Indian players and they didn’t even shake hands)pic.twitter.com/76CSDcJIQW— Sporttify (@sporttify) September 9, 2025 -
ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. ఆ సిరీస్కు కోహ్లి-రోహిత్ దూరం!?
అంతా ఊహించిందే జరిగింది. టీమిండియా దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు ఆస్ట్రేలియా-ఎ సిరీస్లో భాగం కావడం లేదు. ఇప్పటికే టెస్టులకు, టీ20లకు వీడ్కోలు పలికిన రోకో ద్వయం ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నారు.చివరగా ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జెర్సీలో కన్పించిన వీరిద్దరూ తిరిగి వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్లో ఆడనున్నారు. ఈ క్రమంలో వీరిద్దరిని స్వదేశంలో ఆస్ట్రేలియా-ఎతో జరగనున్న అనాధికారిక వన్డే సిరీస్లో భారత్-ఎ జట్టు తరపున ఆడించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇది వారికి ప్రాక్టీస్ ఉపయోగపడుతుందని, అందుకు రో-కో కూడా అంగీకరించారని పలు రిపోర్ట్లు పేర్కొన్నాయి. తాజాగా ఇదే విషయంపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు స్పందించారు. ఇవన్నీ వట్టి రూమర్సే అని ఆయన కొట్టిపారేశారు."ఆస్ట్రేలియా-తో జరిగే సిరీస్లో రోహిత్, కోహ్లి ఇద్దరూ ఆడడం ఆసాధ్యమనే చెప్పాలి. ఇప్పటివరకు మేము ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అంతేకాకుండా జానియర్లతో కలిసి ఆడమని వారిని మేము బలవంతం కూడా చేయము. వారింత వారు ప్రాక్టీస్ కావాలని భావిస్తే, ఆస్ట్రేలియా వన్డేలకు ముందు ఒకటి రెండు అనాధికారిక మ్యాచ్లు ఆడే అవకాశముంది. కానీ ఇది జరగకపోవచ్చు. ఎందుకంటే వారు ప్రస్తుతం చాలా ఫిట్గా ఉన్నారు. ఆస్ట్రేలియాతో వన్డేలకు రోహిత్, కోహ్లి కూడా సిద్దంగా ఉన్నారని" సదరు అధికారి టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నారు. కాగా రోహిత్ గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా ఫిట్గా కన్పిస్తున్నాడు. దాదాపు ఎనిమిది కేజీలు తగ్గినట్లు తెలుస్తోంది. ఇటీవలే హిట్మ్యాన్ తన ఫిట్నెస్ టెస్టును క్లియర్ చేశాడు. కోహ్లి ఇంకా తన ఫిట్నెస్ టెస్టుకు హాజరు కావాల్సి ఉంది. కాగా ఈ ఏడాది ఆక్టోబర్లో ఆసీస్ పర్యటనకు భారత జట్టు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, ఐదు టీ20 సిరీస్లో మెన్ ఇన్ బ్లూ తలపడనుంది.చదవండి: ఆల్టైమ్ ఆసియా టీ20 జట్టు: భారత్ నుంచి ఐదుగురు.. యువీకి నో ఛాన్స్ -
ఆల్టైమ్ ఆసియా టీ20 జట్టు: భారత్ నుంచి ఐదుగురు.. యువీకి నో ఛాన్స్
ఆసియా కప్- 2025 (Asia Cup) టోర్నీకి రంగం సిద్ధమైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా సెప్టెంబరు 9- 28 వరకు టీ20 ఫార్మాట్లో ఈసారి ఈ ఈవెంట్ను నిర్వహించనున్నారు. భారత్ ఆతిథ్య దేశంగా వ్యవహరించనుండగా.. టీమిండియాతో పాటు శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఒమన్, యూఏఈ, హాంకాంగ్ ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి.భారత్ నుంచి ఐదుగురుఇందుకోసం ఇప్పటికే ఎనిమిది జట్లు యూఏఈకి చేరుకుని.. అన్ని విధాలా సన్నద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ బ్రెట్ లీ.. ఆసియా ఉత్తమ టీ20 జట్టును ఎంచుకున్నాడు. ఇందులో ఐదుగురు టీమిండియా స్టార్లకు చోటిచ్చిన ఈ ఆసీస్ దిగ్గజం.. బంగ్లాదేశ్ నుంచి ఒక్కరిని కూడా ఎంపిక చేయలేదు.యూఏఈ నుంచి ఇద్దరుఅయితే, అనూహ్యంగా యూఏఈ నుంచి ఇద్దరు.. హాంకాంగ్ నుంచి ఒక ఆటగాడికి బ్రెట్ లీ తన జట్టులో చోటివ్వడం విశేషం. ఇక పాకిస్తాన్ నుంచి ఇద్దరిని ఎంచుకున్న బ్రెట్ లీ... స్పిన్ విభాగంలో శ్రీలంక, అఫ్గనిస్తాన్ ప్లేయర్లకు అవకాశం ఇచ్చాడు. అయితే, బ్రెట్ లీ ఎంచుకున్న జట్టులో టీమిండియా టీ20 ప్రపంచకప్ విజేతలు యువరాజ్ సింగ్ (2007), సూర్యకుమార్ యాదవ్ (2024)లకు మాత్రం చోటు ఇవ్వకపోవడం గమనార్హం. ధోని, రో- కో తమకు తామే సాటిఐసీసీ తొలిసారి ప్రవేశపెట్టిన పొట్టి క్రికెట్ ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్గా ధోని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. 2007లో భారత్ వరల్డ్కప్ గెలవడంలో యువీది కూడా కీలక పాత్ర.ఇక అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక రన్స్కోరర్ రోహిత్ శర్మ (4231 పరుగులు). ఇక మూడో స్థానంలో విరాట్ కోహ్లి (4188) ఉన్నాడు. 2024లో కెప్టెన్గా రోహిత్ పొట్టి ప్రపంచకప్ గెలవగా.. కోహ్లి ఖాతాలో మరో టైటిల్ చేరింది. వీరితో పాటు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా కూడా టీమిండియాను చాంపియన్గా నిలపడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఈ టోర్నీ తర్వాత రోహిత్- కోహ్లి.. ఇద్దరూ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారుబ్రెట్ లీ ఎంచుకున్న ఆసియా ఆల్టైమ్ టీ20 ప్లేయింగ్ ఎలెవన్విరాట్ కోహ్లి (ఇండియా), రోహిత్ శర్మ (ఇండియా), మొహమ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్), బాబర్ హయత్ (హాంకాంగ్), మహేంద్ర సింగ్ ధోని (ఇండియా), హార్దిక్ పాండ్యా (ఇండియా), వనిందు హసరంగ (శ్రీలంక), రషీద్ ఖాన్ (అఫ్గనిస్తాన్), అమ్జద్ జావేద్ (యూఏఈ), మొహమ్మద్ నవీద్ (యూఏఈ), హ్యారిస్ రవూఫ్ (పాకిస్తాన్), జస్ప్రీత్ బుమ్రా (ఇండియా).చదవండి: ఆసియా కప్-2025: పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు -
వారిద్దరిని మిస్ అవ్వడం లేదు..అన్నింటికీ మేము రెడీ: పాక్ కెప్టెన్
ఆసియాకప్-2025కు రంగం సిద్దమైంది. అబుదాబి వేదికగా మరి కొన్ని గంటల్లో అఫ్గానిస్తాన్-యూఏఈ మ్యాచ్తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. అయితే ఈ ఖండాంతర టోర్నమెంట్ ఆరంభానికి ముందు మొత్తం 8 జట్ల కెప్టెన్లు విలేకరుల సమావేశంలో పాల్గోన్నారు.ఈ సందర్భంగా పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ జట్టులో లేకపోవడం తమకు ఎటువంటి నష్టం కలిగించదు సల్మాన్ చెప్పుకొచ్చాడు. కాగా గత కొంత కాలంగా బాబర్, రిజ్వాన్ పేలవ ప్రదర్శన కనబరుస్తుండడంతో ఆసియాకప్కు సెలక్టర్లు చేయలేదు. సెలక్టర్ల నిర్ణయాన్ని చాలా మంది తప్పు బట్టారు. కాగా ఇటీవల కాలంలో పాక్ ఈ ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు లేకుండా ఓ మల్టీనేషనల్ టోర్నమెంట్లో పాల్గొంటుండడం ఇదే తొలిసారి"ప్రస్తుతం మా జట్టు చాలా బాగుంది. గత నాలుగు సిరీస్లలో మేము మూడింట మేము విజయం సాధించాము. అన్ని విభాగాల్లోనూ మేము మెరుగ్గా రాణిస్తున్నాము. ఏదేమైనప్పటికి ఆసియాకప్ మాకు ఒక కఠిన సవాల్ వంటిది. ఎందుకంటే మా జట్టులో చాలా మంది ఆటగాళ్లు తొలిసారి ఒక ప్రధాన టోర్నమెంట్లో ఆడనున్నారు.ఈ సవాల్ను ఎదుర్కొనేందుకు మేము సిద్దంగా ఉన్నాము. టీ20 క్రికెట్లో ఏ జట్టు ఫేవరేట్ కాదు. తమదైన రోజున ప్రతీ జట్టు అద్బుతాలు చేస్తోంది. ఒకట్రెండు ఓవర్లలో మ్యాచ్ స్వరూపమే మారిపోతుంది. ఈ టోర్నీకి ముందు ముక్కోణపు సిరీస్ను మేము సన్నాహకంగా ఉపయోగించుకున్నాము.సిరీస్ను గెలిచినందుకు సంతోషంగా ఉన్నాము" అని సల్మాన్ పేర్కొన్నాడు. కాగా ఈ మల్టీనేషన్ టోర్నమెంట్కు ముందు పాక్ జట్టు యూఏఈ, అఫ్గానిస్తాన్లతో ట్రైసిరీస్లో తలపడింది. ఫైనల్లో అఫ్గానిస్తాన్ను చిత్తు చేసి పాక్ టైటిల్ను సొంతం చేసుకుంది.ఇప్పుడు అదే జోరును ఆసియాకప్లోనూ కనబరిచాలని మెన్ ఈన్ గ్రీన్ భావిస్తుంది. ఈ ఖండాంత టోర్నీలో పాక్ జట్టు తమ తొలి మ్యాచ్లో సెప్టెంబర్ 12న ఒమన్తో తలపడనుంది. అనంతరం సెప్టెంబర్ 14న టీమిండియాతో అమీతుమీ తెల్చుకోనుంది.పాకిస్తాన్ జట్టుసల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్ (వికెట్-కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్ జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహిన్ అఫ్రిది, సూఫియాన్ మొకిమ్ -
టీమిండియా ఫేవరెటా?.. అతడి గురించి బెంగ వద్దు: సూర్యకుమార్
ఆసియా కప్-2025 (Asia Cup 2025) టోర్నమెంట్ నేపథ్యంలో ఎనిమిది జట్ల కెప్టెన్లు మీడియాతో మంగళవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘గత వారమే మేము యూఏఈకి చేరుకున్నాము. ఇక్కడ గట్టిగానే ప్రాక్టీస్ చేశాము.వాళ్లు మరింత గొప్పగా రాణించాలిఆసియాలోని అత్యుత్తమ జట్లతో పోటీ పడనుండటం సంతోషంగా ఉంది. యూఏఈతోనే తొలి మ్యాచ్ ఆడబోతున్నాం. ఆ జట్టు బ్రాండ్ క్రికెట్ ఆడుతోంది. ఇటీవలే ఓ టోర్నీలోనూ పాల్గొన్నారు. తాము ఉత్తమంగా రాణించి గెలుపు అంచుల వరకు వెళ్లామని యూఏఈ కెప్టెన్ చెప్పాడు.ఆసియా కప్లో కూడా వాళ్లు మరింత గొప్పగా రాణించి.. ఈసారి అనుకున్న ఫలితాన్ని రాబట్టడంలో సఫలం కావాలి. ఆ జట్టుతో ఆడేందుకు మేము ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నాం’’ అని సూర్యకుమార్ యాదవ్ ప్రత్యర్థి జట్టుకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పాడు.టీమిండియా ఫేవరెటా?.. నేనైతే వినలేదుఇక ఆసియా కప్ టోర్నీలో టీమిండియా ఫేవరెట్ కదా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఈ విషయం మీకెవరు చెప్పారు. నేనైతే ఎక్కడా వినలేదు. మేము సుదీర్ఘకాలంగా టీ20లలో అత్యుత్తమంగా రాణిస్తున్నాం. ఏదేమైనా పూర్తి స్థాయిలో టోర్నీకి సిద్ధంగా ఉన్నామని మాత్రం చెప్పగలను.మైదానంలో దూకుడుగా ఉండటం అన్నికంటే ముఖ్యం. అసలు అగ్రెషన్ లేకుండా గ్రౌండ్కు ఎలా వెళ్లగలం?.. మేము ఈసారి కూడా అలాగే చేస్తాం’’ అని సూర్య పేర్కొన్నాడు. ఇక టీమిండియా ఓపెనర్గా శుబ్మన్ గిల్- సంజూ శాంసన్లలో ఎవరు వస్తారన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. అతడి గురించి బెంగ వద్దు‘‘తుదిజట్టు ప్రకటన సమయంలో నేనే చెప్తాను. అతడి గురించి బెంగ వద్దు. మేము అతడి గురించి ఆలోచిస్తున్నాం. బుధవారం నాటి మ్యాచ్లో మేము సరైన నిర్ణయమే తీసుకుంటామని హామీ ఇస్తున్నా’’ అని సూర్య తెలిపాడు.ఇక తాము జనవరి- ఫిబ్రవరి తర్వాత కలిసి టీ20లు ఆడలేదన్న సూర్యకుమార్ యాదవ్.. ఐపీఎల్ ద్వారా టీమిండియా ఆటగాళ్లకు కావాల్సినంత ప్రాక్టీస్ లభించిందని తెలిపాడు. జూన్ నుంచి తాము టీ20లు ఆడలేదని.. టోర్నీలో మున్ముందు ఏం జరుగుతుందో చూద్దామని పేర్కొన్నాడు.కాగా భారత్.. యూఏఈ వేదికగా ఆసియా కప్-2025 టోర్నీకి ఆతిథ్యమిస్తోంది. సెప్టెంబరు 9- 28 వరకు పొట్టి ఫార్మాట్లో ఈ టోర్నీ జరుగనుంది. గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ పోటీపడుతుండగా.. గ్రూప్-‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ రేసులో ఉన్నాయి. చదవండి: ఆసియా కప్-2025: పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు -
ఆసియా కప్కు ముందు పాక్ క్రికెటర్ రిటైర్మెంట్
ఆసియా కప్ 2025 ప్రారంభానికి ముందు ఓ పాకిస్తానీ క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. పాక్ తరఫున ఓ టెస్ట్, 17 వన్డేలు, 16 టీ20లు ఆడిన 31 ఏళ్ల ఉస్మాన్ షిన్వారీ అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అయిన షిన్వారీ టెస్ట్ల్లో ఒకటి, వన్డేల్లో 34, టీ20ల్లో 13 వికెట్లు తీశాడు.2013లో టీ20 ఫార్మాట్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన షిన్వారీ, 2019లో శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్ తర్వాత పాక్ జట్టులోకి తిరిగి రాలేకపోయాడు. ఈ మధ్యలో ఆరేళ్లు జాతీయ జట్టుకు దూరంగా ఉన్న అతను, తాజాగా రిటైర్మెంట్ ప్రకటించాడు. షిన్వారీకి స్వల్ప కెరీర్లోనే ఓ ప్రత్యేకత ఉంది. అతనాడిన 17 వన్డేల్లోనే రెండు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. ఇంత స్వల్ప కెరీర్లో ఇలా చాలా అరుదుగా జరుగుతుంది. షిన్వారీ 2018 ఆసియా కప్ ఆడిన పాకిస్తాన్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అయితే ఆ ఎడిషన్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్ల్లో అతను ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. హాంగ్కాంగ్పై మాత్రం మూడు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఈ ఏడాది మధ్య వరకు దేశవాలీ క్రికెట్లో కొనసాగిన షిన్వారీ.. పాకిస్తాన్ సూపర్ లీగ్, లంక ప్రీమియర్ లీగ్ల్లో పాల్గొన్నాడు. -
‘ధోని రాకతో తీవ్రమైన ఒత్తిడి.. నేనో ఊసరవెళ్లిలా మారిపోయా’
టీమిండియాలోకి వచ్చిన మూడేళ్ల కాలంలోనే కెప్టెన్గా ఎదిగాడు మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni). 2004లో బంగ్లాదేశ్తో వన్డే సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ జార్ఖండ్ డైనమైట్.. 2007లో సారథిగా పగ్గాలు చేపట్టాడు. ఆ తర్వాత అతడు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.దశాబ్దకాలం భారత జట్టు కెప్టెన్గా కొనసాగిన ధోని.. ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడిగా, మేటి ఫినిషర్గా గుర్తింపు పొందాడు. అంతేకాదు భారత్కు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ఏకైక సారథి కూడా అతడే!ఓ కొత్త ‘వేషం’.. ఊసరవెళ్లిలా మారిపోయాఅయితే, జాతీయ జట్టులోకి ధోని రాకతో టీమిండియాలో వికెట్ కీపర్గా చోటు కోల్పోయిన ఆటగాళ్లలో దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) ఒకడు. అప్పట్లో తనపై ఒత్తిడి తీవ్రంగా ఉండేదని.. ఎప్పటికప్పుడు తాను ఓ కొత్త ‘వేషం’తో.. ఊసరవెళ్లిలా మారిపోయానని డీకే తాజాగా గుర్తుచేసుకున్నాడు.‘‘అలాంటి వ్యక్తి ఓ జట్టులోకి వచ్చినపుడు మన మీద మనకే సందేహాలు వస్తాయి. నాలోని అత్యుత్తమ ఆటను వెలికితీయాలనే కసి పెరుగుతుంది. అప్పుడే నేను ఓ ఊసరవెళ్లిలా మారిపోయాను.తీవ్రమైన ఒత్తిడిఒకవేళ ఓపెనింగ్ స్థానం ఖాళీగా ఉందంటే.. తమిళనాడు జట్టులో ఓపెనర్గా అవకాశం ఇస్తారా సర్ అని మా వాళ్లను అడిగేవాడిని. ఓపెనర్గా వచ్చి పరుగులు సాధించేందుకు కృషి చేసేవాడిని. అదే విధంగా.. టీమిండియాలో మిడిలార్డర్లో స్థానం ఖాళీగా ఉందంటే.. అక్కడ బ్యాటింగ్ చేసేందుకు ప్రయత్నించేవాడిని. అసలు నాకపుడు ఏం కావాలో నాకే అర్థమయ్యేది కాదు. తీవ్రమైన ఒత్తిడి.ధోని జట్టులోకి రాకముందు అతడి ఆట తీరు గురించి నాకు తెలియదు. అయితే, కెన్యాతో ‘ఎ’ సిరీస్లో ఓ ఆటగాడు అదరగొట్టారని అంతా అతడి గురించే మాట్లాడుకుంటున్నారు. బంతిని బలంగా బాదడంలో అతడు దిట్ట అని చెప్పారు.గ్యారీ సోబర్స్తో పోలికకొంతమంది ఏకంగా భారీ సిక్సర్లు బాదే గ్యారీ సోబర్స్తో పోల్చారు. ఎంఎస్ ధోని బ్యాటింగ్ టెక్నిక్ విభిన్నంగా ఉంటుంది. అలాంటి ఫినిషర్ మరొకరు లేరంటూ అప్పట్లోనే చర్చ నడిచేది’’ అని 40 ఏళ్ల దినేశ్ కార్తిక్ ఇండియా టుడే ఎన్క్లేవ్ సౌత్-2025లో గత జ్ఞాపకాలు నెమరువేసుకున్నాడు.కోచ్గా మారిన డీకేకాగా 2004 నుంచి 2022 వరకు దినేశ్ కార్తిక్ టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. తన కెరీర్ మొత్తంగా ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 94 వన్డేలు, 60 అంతర్జాతీయ టీ20లు, 26 టెస్టు మ్యాచ్లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 1752, 686, 1025 పరుగులు సాధించాడు.ఇక ఐపీఎల్లో 257 మ్యాచ్లు ఆడిన డీకే 4842 పరుగులు చేశాడు. గతేడాది క్యాష్రిచ్ లీగ్కు కూడా గుడ్బై చెప్పిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ కోచ్గా ఉన్నాడు. ఈ ఏడాది ఆర్సీబీ తమ మొదటి ఐపీఎల్ ట్రోఫీని గెలిచిన విషయం తెలిసిందే. మరోవైపు.. డీకే విదేశీ లీగ్ క్రికెట్లో ఆడుతుండటం విశేషం.చదవండి: Ro- Ko: ‘ఎవరూ తోపులు కారు.. నేనే దేవుడిని అనుకుంటే ఇలాగే ఉంటుంది’ -
కేకేఆర్పై శ్రేయస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు
ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కకపోవడం, ఆతర్వాత అర్హుడైన అభిమన్యు ఈశ్వరన్ ఉన్నా ఆస్ట్రేలియా-ఏతో సిరీస్కు ఇండియా-ఏ కెప్టెన్గా ఎంపిక కావడం వంటి అంశాల ద్వారా టీమిండియా మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ఇటీవల వార్తల్లో నిలిచాడు.అయ్యర్ను ఆసియా కప్కు ఎంపిక చేయకపోవడంపై సోషల్మీడియాలో పెద్ద రచ్చే జరిగింది. తాజా ఐపీఎల్ సీజన్లో అద్భుతమైన ఫామ్లో ఉన్నా అయ్యర్ను ఎందుకు ఎంపిక చేయలేదని చాలామంది సెలెక్టర్లను నిలదీశారు. ఈ రచ్చ కొనసాగుతుండగానే శ్రేయస్ను ఆస్ట్రేలియా-ఏ సిరీస్కు భారత-ఏ కెప్టెన్గా నియమించడం, ఆతర్వాత అతను దులీప్ ట్రోఫీ మ్యాచ్లో విఫలం (2 ఇన్నింగ్స్ల్లో 37 పరుగులు) కావడం జరిగిపోయాయి.తాజాగా అయ్యర్ మరో అంశానికి సంబంధించి వార్తల్లోకెక్కాడు. తన మాజీ ఐపీఎల్ జట్టు కేకేఆర్పై సంచలన వ్యాఖ్యలు చేసి ఐపీఎల్ అభిమానులకు కావాల్సిన మసాలా అందించాడు. 2024 సీజన్లో కేకేఆర్ను ఛాంపియన్గా నిలబెట్టిన అయ్యర్.. 2025 సీజన్కు ముందు పంజాబ్ కింగ్స్కు మారాడు. వేలంలో పంజాబ్ అయ్యర్కు రికార్దు ధర ( ₹26.75 కోట్లు) చెల్లించి సొంతం చేసుకుంది.తాజా సీజన్లో కెప్టెన్గా, ఆటగాడిగా అద్బుతంగా రాణించి పంజాబ్ కింగ్స్ను కూడా ఫైనల్కు చేర్చిన అయ్యర్.. ఐపీఎల్లో విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా కీర్తించబడుతున్నాడు. ఇంత వరకు అంతా బాగానే ఉంది. అయ్యర్ పెద్ద కారణాలేమీ లేకుండానే కేకేఆర్ను వీడాడని అంతా అనుకున్నారు.అయితే అయ్యర్ కేకేఆర్ను వీడటం వెనుక పెద్ద మతలబే ఉందని అతని తాజా వ్యాఖ్యల ద్వారా బయటపడింది. ఓ ఇంటర్వ్యూలో అయ్యర్ కేకేఆర్పై చాన్నాళ్లుగా మనసులో పెట్టుకున్న అసంతృప్తిని వెల్లగక్కాడు.GQ ఇంటర్వ్యూలో అయ్యర్ మాట్లాడుతూ.. నేను ఒక ఆటగాడిగా, నాయకుడిగా చాలా ఇవ్వగలను. కానీ గౌరవం లభిస్తేనే అది సాధ్యమవుతుంది. పంజాబ్ జట్టులో నాకు పూర్తి మద్దతు, నిర్ణయాల్లో భాగస్వామ్యం లభించింది. కోచ్లు, మేనేజ్మెంట్, ఆటగాళ్లు నా మాట వినేందుకు సిద్ధంగా ఉంటారు అంటూ కేకేఆర్లో తనకు గౌరవం లభించలేదన్న విషయాన్ని తేటతెల్లం చేశాడు.పంజాబ్లో నేను ప్రతి మీటింగ్లో, నిర్ణయాల్లో, స్ట్రాటజీలో భాగమయ్యాను. ఇది నాకు చాలా ఇష్టం. కేకేఆర్లో నేను చర్చల్లో ఉన్నా, పూర్తిగా మిక్స్లో లేను. నేను ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాను అంటూ కేకేఆర్లో తనకు పూర్తి స్వేచ్ఛ లేకుండిదన్న విషయాన్ని బయటపెట్టాడు.అయ్యర్ మాటల్ని బట్టి చూస్తే.. కేకేఆర్లో నాయకత్వ హక్కులపై పరిమితి, నిర్ణయాల్లో భాగస్వామ్యం లేకుండిదన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. అయ్యర్ మాటల్లో గంభీర్ కారణంగా తనకు స్వేచ్చ లేకుండా పోయిందన్న విషయం కూడా తెలుస్తుంది. శ్రేయస్ కేకేఆర్ను ఛాంపియన్గా నిలిపిన సీజన్లో గంభీర్ ఆ ఫ్రాంచైజీ మెంటార్గా ఉన్నాడు. కేకేఆర్లో గంభీర్ మాటకు తిరుగుండేది కాదు. గంభీర్ అతి జోక్యం వల్ల అయ్యర్ తప్పక ఇబ్బంది పడి ఉంటాడన్నది చాలామంది భావన. మొత్తంగా అయ్యర్ కేకేఆర్ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ఐపీఎల్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. -
గిల్ చిన్నప్పటి నుంచే తెలుసు.. గుర్తుపడతాడో లేదో!: యూఏఈ క్రికెటర్
టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill)ను ఉద్దేశించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) స్పిన్నర్ సిమ్రన్జీత్ సింగ్ (Simranjeet Singh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చిన్ననాడు గిల్కు నెట్స్లో బౌలింగ్ చేశానని.. అయితే, ఇప్పుడు అతడికి తాను గుర్తున్నానో లేదో తెలియదని అన్నాడు. కాగా పంజాబ్లోని లుథియానాకు చెందిన సిమ్రన్జీత్ సింగ్ ఊహించని పరిస్థితుల్లో యూఏఈకి చేరుకున్నాడు.ఆ తర్వాత వరుస అవకాశాలు రావడంతో అక్కడే ఉండిపోయాడు. జూనియర్లకు కోచ్గా వ్యవహరిస్తూనే.. యూఏఈ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో పన్నెండు టీ20 మ్యాచ్లు ఆడిన సిమ్రన్జీత్ సింగ్ పదిహేను వికెట్లు పడగొట్టాడు. ఇక ఇప్పుడు ఆసియా కప్-2025 రూపంలో మేజర్ టోర్నీ ఆడేందుకు అతడు సిద్ధమయ్యాడు.తొలి మ్యాచ్లోనే టీమిండియాతో ఢీకాగా సొంతగడ్డపై జరుగనున్న ఈ ఖండాంతర టోర్నీలో యూఏఈ.. టీమిండియాతో కలిసి గ్రూప్-‘ఎ’లో ఉంది. ఇరుజట్లు సెప్టెంబరు 10న తమ తొలి మ్యాచ్లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన సిమ్రన్జీత్ సింగ్ గిల్తో తనకున్న జ్ఞాపకాలు, తన క్రికెట్ ప్రయాణం గురించి తెలిపాడు.గిల్ చిన్నప్పటి నుంచే తెలుసు‘‘శుబ్మన్ చిన్నపిల్లాడిగా ఉన్నప్పటి నుంచే నాకు తెలుసు. అయితే, ప్రస్తుతం తనకు నేను గుర్తున్నానో లేదో తెలియదు. 2011-12లో మొహాలీలో ఉన్న పంజాబ్ క్రికెట్ అకాడమీలో ఉదయం ఆరు నుంచి పదకొండు వరకు మేము ప్రాక్టీస్ చేసేవాళ్లం.శుబ్మన్ వాళ్ల నాన్నతో కలిసి పదకొండు గంటలకు అక్కడికి వచ్చేవాడు. నేను కాసేపు ఎక్కువ సమయం అక్కడే ఉండేవాడిని గనుక గిల్కు బౌలింగ్ చేసేవాడిని. అయితే, ఇప్పుడు తను నన్ను గుర్తుపట్టగలడో లేదో తెలియదు’’ అని 35 ఏళ్ల లెఫ్టార్మ్ స్పిన్నర్ సిమ్రన్జీత్ సింగ్ గుర్తు చేసుకున్నాడు.అనూహ్య పరిస్థితుల్లోఅదే విధంగా.. ‘‘పంజాబ్ జట్టుకు జిల్లా స్థాయిలో చాలా మ్యాచ్లే ఆడాను. 2017 రంజీ ప్రాబబుల్స్లోనూ నాకు చోటు దక్కింది. అంతేకాదు ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ మొహాలీలో మ్యాచ్ ఆడినప్పుడల్లా నెట్స్లో బౌలింగ్ చేసేవాడిని.అయితే, 2021 ఏప్రిల్లో దుబాయ్లో ఇరవై రోజుల పాటు ప్రాక్టీస్ చేసేందుకు నాకు ఆఫర్ వచ్చింది. అప్పుడే కోవిడ్ రెండో దశ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇండియాలో మరోసారి లాక్డౌన్ విధించారు. దీంతో నేను దుబాయ్లోనే మరి కొన్నినెలల పాటు ఉండిపోవాల్సి వచ్చింది.సెంట్రల్ కాంట్రాక్టు కూడాఅప్పటి నుంచి దుబాయ్లోనే సెటిల్ అయ్యాను. జూనియర్ ఆటగాళ్లకు కోచింగ్ ఇవ్వడం ద్వారా మంచిగానే సంపాదించాను. క్లబ్ క్రికెట్ ఆడేవాడిని కూడా!.. అలా కుటుంబాన్ని పోషించుకునేవాడిని.ఈ క్రమంలోనే యూఏఈ జట్టులోకి వచ్చాను. యూఏఈ బోర్డు నాకు సెంట్రల్ కాంట్రాక్టు కూడా ఇచ్చింది. అప్పటి నుంచి నా ఆర్థిక పరిస్థితి మరింత మెరుగైంది’’ అని సిమ్రన్జీత్ సింగ్ చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం టెస్టుల్లో టీమిండియా కెప్టెన్గా ఉన్న గిల్.. టీ20 జట్టు వైస్ కెప్టెన్గా ఇటీవలే తిరిగి నియమితుడయ్యాడు. ఇక సెప్టెంబరు 9- 28 వరకు టీ20 ఫార్మాట్లో ఆసియా కప్ టోర్నీ జరుగనుంది.చదవండి: ఆసియా కప్-2025: పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు -
ఆసుపత్రిలో రోహిత్ శర్మ.. ఆందోళనలో అభిమానులు
భారత వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ నిన్న (సెప్టెంబర్ 8) రాత్రి ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రికి వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది. రోహిత్ ఆసుపత్రికి ఎందుకు వెళ్లాడోనని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ROHIT SHARMA AT THE KOKILABEN HOSPITAL IN MUMBAI. (Pallav Paliwal).pic.twitter.com/sT42YFD5Ak— Tanuj (@ImTanujSingh) September 8, 2025కొందరేమో రోహిత్కు బాగలేదని అంటుంటే, మరికొందరేమో ఆసుపత్రిలో ఉన్న సన్నిహితులను పరామర్శించేందుకు వెళ్లాడని అంటున్నారు. మొత్తంగా ఈ అంశంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. సోషల్మీడియాలో నిరాధార ప్రచారం జరుగుతుంది.అయితే రోహిత్ ఆసుపత్రిలోకి ప్రవేశించే సమయంలో వ్యవహరించిన తీరు మాత్రం కాస్త ఆందోళనకరంగా ఉంది. ఎప్పుడూ సరదాగా కనిపించే హిట్మ్యాన్ ఎందుకో కాస్త భిన్నంగా కనిపించాడు. మీడియా ప్రశ్నలకు స్పందించకుండా హడావుడిగా ఆసుపత్రి లోపలికి వెళ్లిపోయాడు. రోహిత్వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన కొందరు జర్నలిస్ట్లకు ఆసుపత్రి సిబ్బంది అడ్డుకున్నారు.రోహిత్ అసౌకర్యంగా (శారీకంగా) కనిపించకపోయినా రాత్రి వేళ అసుపత్రికి వెళ్లడం ఊహాగానాలకు తావిస్తుంది. రోహిత్ ఇటీవలే బీసీసీఐ ఆథ్వర్యంలో నిర్వహించిన Yo-Yo టెస్ట్ను విజయవంతంగా పూర్తి చేశాడు. రోహిత్ ఆసుపత్రి సందర్శన గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి.38 ఏళ్ల రోహిత్ ఇటీవలే టెస్టులు, గతేడాది టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి, వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అతను 2027 వన్డే వరల్డ్ కప్ లక్ష్యంగా ఫిట్నెస్ను మెరుగుపరచేందుకు ప్రయత్నిస్తున్నాడు. రోహిత్ త్వరలో ఆస్ట్రేలియాతో జరుగబోయే వన్డే సిరీస్లో ఆడే అవకాశం ఉంది. రోహిత్ లాగే టెస్ట్లకు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లి కూడా ఆస్ట్రేలియా సిరీస్లో బరిలోకి దిగే అవకాశం ఉంది. వీరిద్దరి రాక కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
హార్దిక్ వాచ్ ధర ఆసియా కప్ ప్రైజ్మనీ కంటే 8 రెట్లు ఎక్కువ..!
కొద్ది రోజుల కిందట ఆసియా కప్ 2025 ట్రైనింగ్ సెషన్లో భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ధరించిన "Richard Mille RM 27-04 Tourbillon" చేతి గడియారం (వాచ్) క్రికెట్ అభిమానులనే కాక యావత్ ప్రపంచాన్ని ఆకర్షించింది. ఈ వాచ్ విలువ రూ.20 కోట్లకు పైబడి ఉంటుంది. ఇది ఆసియా కప్ ప్రైజ్ మనీతో (రూ.2.6 కోట్లు) ఎనిమిది రెట్లు ఎక్కువ.ఈ లిమిటెడ్ ఎడిషన్ టైమ్పీస్లు ప్రపంచవ్యాప్తంగా కేవలం 50 మాత్రమే తయారు చేయబడ్డాయి. ఈ లగ్జరీ చేతి గడియారం టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నదాల్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది.ఈ టైమ్పీస్ ప్రత్యేకతలు ఏమిటంటే..- 30 గ్రాముల బరువు మాత్రమే, స్ట్రాప్తో సహా- 12,000 g’s వరకు షాక్ రెసిస్టెన్స్ ఉంటుంది, ఇది రికార్డు స్థాయి- టెన్నిస్ రాకెట్ స్ట్రింగ్ల ప్రిన్సిపుల్ ఆధారంగా రూపొందించిన స్టీల్ మెష్- TitaCarb® అనే అత్యాధునిక పాలిమర్తో తయారైన కేస్ - 38.5% కార్బన్ ఫైబర్ కలిగి ఉండి, అత్యధిక బలాన్ని కలిగిస్తుందికాగా, వాచ్ల పిచ్చి ఉన్న హార్దిక్ పాండ్యా గతంలో Richard Mille RM 27-04 Tourbillon కంటే చాలా రెట్లు ఖరీదైన Patek Philippe Nautilus Travel Time Blue Diamond వాచ్ను ధరించాడు. దీని విలువ రూ. 43.83 కోట్లు ఉంటుందని అంచనా. హార్దిక్ వద్ద రూ.7 కోట్ల విలువైన RM 27-02 వాచ్ కూడా ఉంది.హార్దిక్ తర్వాత భారత క్రికెటర్లలో అత్యంత ఖరీదైన వాచ్ను విరాట్ కోహ్లి ధరించాడు. కోహ్లి ఓ సందర్భంలో రూ. 4.36 కోట్ల విలువైన Rolex Daytona Rainbow Everose Gold మోడల్ను ధరించాడు. క్రీడా ప్రపంచం మొత్తంలో అత్యంత ఖరీదైన వాచ్ను ధరించిన ఘనత బాక్సింగ్ దిగ్గజం ఫ్లాయిడ్ మెవెదర్ను దక్కుతుంది. మెవెదర్ ఓ సందర్భంలో Jacob & Co. Billionaire వాచ్ ధరించాడు. దీని విలువ రూ. 150 కోట్లు. దీన్ని 260 కారెట్ల డైమండ్లతో ప్రత్యేకంగా తయారు చేశారు.కాగా, ఆసియా కప్లో భారత్ తమ తొలి మ్యాచ్ను సెప్టెంబర్ 10న UAEతో ఆడుతుంది. సెప్టెంబర్ 14న పాకిస్తాన్తో హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. -
ఆసియా కప్లో సెహ్వాగ్
ఆసియా కప్ 2025 కోసం టోర్నీ బ్రాడ్కాస్టర్ సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ బహుభాషా కామెంటరీ ప్యానెల్ను ప్రకటించింది. ఈ ప్యానెల్లో వరల్డ్ ఫీడ్ (ఇంగ్లీష్) అందించడానికి సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, సంజయ్ మంజ్రేకర్, రాబిన్ ఉతప్ప, వకార్ యూనిస్, వసీం అక్రమ్, బాజిద్ ఖాన్, రస్సెల్ ఆర్నాల్డ్, సైమన్ డౌల్ ఎంపిక చేయబడ్డారు.హిందీ ప్యానెల్లో వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, అజయ్ జడేజా, అభిషేక్ నాయర్, సబా కరీమ్ సభ్యులుగా ఉన్నారు. తమిళ ప్యానెల్లో భరత్ అరుణ్, WV రామన్.. తెలుగు వ్యాఖ్యాతలుగా వెంకటపతి రాజు, వేణుగోపాల్ రావు తదితరులు వ్యవహరిస్తారు.ప్రత్యేక ఆకర్షణగా వీరూకామెంటరీ ప్యానెల్ మొత్తంలో భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాడు. సెహ్వాగ్ తన స్పష్టమైన అభిప్రాయాలు, హాస్యంతో కూడిన వ్యాఖ్యానంతో అభిమానులను మంత్రముగ్దుల్ని చేస్తాడు. ఆటగాడిగా ఏరకంగా మెరుపులు మెరిపించాడో, వ్యాఖ్యానంతోనూ అలాగే కట్టిపడేస్తాడు.కాగా, ఇవాల్టి నుంచే (సెప్టెంబర్ 9)ప్రారంభం కాబోయే ఆసియా కప్లో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ, ఆఫ్ఘానిస్తాన్, యూఏఈ, ఒమన్, హాంకాంగ్ జట్లు పోటీపడనున్నాయి. భారత్, పాకిస్తాన్, ఒమన్, యూఏఈ గ్రూప్-బిలో ఉండగా.. మిగతా జట్లు గ్రూప్-ఏలో ఉన్నాయి. ఇవాళ జరుగబోయే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్, హాంగ్కాంగ్ తలపడనున్నాయి. భారత్ తమ తొలి మ్యాచ్ను సెప్టెంబర్ 10న UAEతో ఆడనుంది. ఈ టోర్నీ మొత్తంలో ప్రత్యేక మ్యాచైన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ సెప్టెంబర్ 14న జరుగనుంది.ఈ టోర్నీలో భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తున్నాడు. జట్టులో శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా, సంజు శాంసన్, జస్ప్రీత్ బుమ్రా లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. -
పంత్కు సంబంధించి బిగ్ అప్డేట్
టీమిండియా వికెట్కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్కు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. ఇటీవల (జులై 23న) ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా గాయపడిన పంత్.. నెలకు పైగా ఇంగ్లండ్లోనే ట్రీట్మెంట్ తీసుకుని కొద్ది రోజుల కిందటే భారత్కు తిరిగి వచ్చాడు. ముంబైలో వైద్య నిపుణులను సంప్రదించిన అనంతరం, వారి సలహా మేరకు త్వరలోనే నేషనల్ క్రికెట్ అకాడమీ (CoE) పునరావాస శిబిరంలో చేరనున్నాడు.అక్టోబర్లో వెస్టిండీస్తో జరిగే సిరీస్ సమయానికి తిరిగి జట్టులోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్న పంత్.. ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం పంత్కు గాయం పూర్తిగా తగ్గలేదని తెలుస్తుంది. వైద్యులు అతనికి తిరిగి ఫిట్నెస్ సాధించేందుకు టైమ్లైన్ ఇచ్చినట్లు సమాచారం.టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ 2025లో భాగంగా మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్లో పంత్ తొలి రోజు ఆటలో క్రిస్ వోక్స్ బౌలింగ్లో గాయపడ్డాడు. వోక్స్ సంబంధించిన బంతి పంత్ పాదానికి తీవ్ర గాయం చేసింది. నొప్పితో విలవిలలాడిన పంత్ అప్పుడు మైదానాన్ని వీడి, జట్టు అవసరాల దృష్ట్యా కుంటుతూనే రెండో రోజు బ్యాటింగ్కు దిగాడు.తొలి రోజు గాయపడిన సమయానికి 37 పరుగుల వద్ద ఉండిన పంత్.. రెండో రోజు తిరిగి బరిలోకి దిగి జట్టుకు చాలా ముఖ్యమైన 17 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ గాయం కారణంగా పంత్ ఓవల్లో జరిగిన ఐదో టెస్ట్ దూరమయ్యాడు. ఆ మ్యాచ్లో భారత్ విజయం సాధించి సిరీస్ను సమం చేసింది.పంత్ పాదం గాయం నుంచి పూర్తిగా కోలుకుని అక్టోబర్లో వెస్టిండీస్తో జరిగే హోమ్ టెస్ట్ సిరీస్ సమయానికంతా రెడీగా ఉండాలని అనుకుంటున్నాడు. ఇందులో భాగంగానే CoEలోని రీహ్యాబ్లో చేరనున్నాడు. ఒకవేళ విండీస్తో సిరీస్ సమయానికి పూర్తిగా కోలుకోకపోతే, తదుపరి ఆస్ట్రేలియాతో జరిగే వైట్-బాల్ సిరీస్ సమయానికైనా పునారగమనం చేయడం లక్ష్యంగా పెట్టుకుంటాడు.పంత్ భావోద్వేగ పోస్ట్తాజాగా పంత్ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ పోస్ట్ చేశాడు. ఎంత బాధను గతంలో అనుభవించినా, మళ్లీ గాయపడితే అదే స్థాయిలో బాధ కలుగుతుంది. అయితే రెండో సారి మన సహనశక్తి పెరుగుతుంది. ఇదే మనల్ని బలంగా మారుస్తుందని తన ఇన్స్టా ఖాతాలో రాసుకొచ్చాడు. కాగా, 2022లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పంత్ తీవ్రగాయాలపాలై, అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఆ స్థాయి గాయాలు కాకపోయినా పంత్ మరోసారి గాయపడ్డాడు. ఫలితంగా మరోమారు జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం భారత టీ20 జట్టు ఆసియా కప్ కోసం యూఏఈలో పర్యటిస్తుంది. ఈ జట్టులో వికెట్కీపర్లుగా సంజూ శాంసన్, జితేశ్ శర్మ ఎంపికయ్యారు. -
ఆసియా కప్కు మందు సంజూ శాంసన్ ఆసక్తికర నిర్ణయం
ఆసియా కప్ 2025 ప్రారంభానికి ముందు టీమిండియా వికెట్కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఆసక్తికర నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల తన సొంత రాష్ట్రం కేరళలో జరిగిన టీ20 టోర్నీ (KCL 2025) ద్వారా అర్జించిన జీతాన్ని సహచరులు, సహాయక బృందానికి విరాళంగా ఇచ్చాడు. ఈ టోర్నీ ద్వారా సంజూ రూ. 26.8 లక్షల జీతాన్ని పొందాడు. ఈ మొత్తాన్ని కొచ్చి బ్లూ టైగర్స్ బృందానికి ఇచ్చేసి ఉదారతను చాటుకున్నాడు. వాస్తవానికి ఈ టోర్నీ వేలంలో సంజూ రూ. 50 లక్షలకు (ఈ సీజన్ వేలంలో ఇదే అత్యధికం) అమ్ముడుపోయాడు. అయితే అతనికి కొచ్చితో ఉన్న ప్రత్యేక అనుబంధం కారణంగా తన వేతనంలో సగం డబ్బుకే ఆడేందుకు ఒప్పుకున్నాడు.Sanju Samson's brother "Saly Samson" led Kochi Blue Tigers won the KCL 2025. 🏅- Sanju Samson played an important role in the Group Stage with 368 runs from 5 Innings. pic.twitter.com/w7ZFClxpGz— Johns. (@CricCrazyJohns) September 8, 2025KCL 2025లో సంజూ ప్రాతినిథ్యం వహించిన కొచ్చి బ్లూ టైగర్స్ ఛాంపియన్గా అవతరించింది. ఫైనల్లో ఏరిస్ కొల్లమ్ టైగర్స్ 75 పరుగుల భారీ తేడాతో గెలుపొంది టైటిల్ కైవసం చేసుకుంది. సంజూ ఫైనల్, సెమీఫైనల్లో ఆడకపోయినా, కొచ్చి టైటిల్ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు.లీగ్ దశలో ఆడిన 5 ఇన్నింగ్స్ల్లో 186.80 స్ట్రయిక్రేట్తో 73.60 సగటున 368 పరుగులు చేశాడు. ఇందులో ఓ విధ్వంసకర సెంచరీతో కలిపి నాలుగు 50 ప్లస్ స్కోర్లు ఉన్నాయి. ఈ టోర్నీలో కొచ్చిని ఛాంపియన్గా నిలిపింది (కెప్టెన్) సంజూ సోదరుడు శాలీ శాంసన్ కావడం మరో విశేషం. శాలీ కూడా ఈ టోర్నీలో బ్యాటర్గా, కెప్టెన్గా అద్భుతంగా రాణించాడు.సంజూకు కేరళ క్రికెట్పై అమితాసక్తి ఉంది. తన సొంత రాష్ట్రం నుంచి చాలా మంది టీమిండియాకు ఆడాలన్నది అతని కల. అతనికి తన KCL టీమ్ కొచ్చి బ్లూ టైగర్స్ అంటే కూడా చాలా ఇష్టం. ఈ ఇష్టంలో భాగంగానే అతను తన జీతం మొత్తాన్ని సహచరులకు విరాళంగా ఇచ్చాడు. సంజూకు ఇలాంటి దానాలు కొత్తేమీ కాదు. తన పేరిట ఓ ట్రస్ట్ను నడిపిస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాడు. ఇందుకుగానూ కేరళ ప్రభుత్వం నుంచి కూడా అభినందనలు పొందాడు. గత దశాబ్దకాలంలో కేరళ నుంచి టీమిండియాకు ఆడిన క్రికెటర్ సంజూ ఒక్కడే.ఇదిలా ఉంటే, సంజూ KCLలో అద్భుతంగా రాణించినప్పటికీ భారత తుది జట్టులో (ఆసియా కప్లో) స్థానం ప్రశ్నార్థకంగా ఉంది. సంజూ ఆడాల్సిన ఓపెనింగ్ స్థానం కోసం జట్టు వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ పోటీపడుతున్నాడు. గిల్ను ఆల్ ఫార్మాట్ ప్లేయర్గా ప్రమోట్ చేయడంలో భాగంగా సంజూపై వేటు పడుతుందని టాక్ నడుస్తుంది. ఈ విషయంపై స్పష్టత రావాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. -
ఇంగ్లండ్తో ఐర్లాండ్ చారిత్రక సిరీస్.. ప్రత్యేక ఆకర్షణగా కెనడా కుర్రాడు
త్వరలో స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగబోయే చారిత్రక టీ20 సిరీస్కు ముందు ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. ఈ సిరీస్ కోసం ప్రకటించిన 14 మంది సభ్యుల జట్టులో కెనడా కుర్రాడికి చోటు కల్పించింది. 23 ఏళ్ల బెన్ కాలిట్జ్ అండర్-19 స్థాయి వరకు కెనడాకు ప్రాతినిథ్యం వహించాడు. ఇటీవలే ఐర్లాండ్కు వలస వచ్చాడు. ఐర్లాండ్ పౌరసత్వం పొందడం ద్వారా కాలిట్జ్ జాతీయ జట్టు ఎంపికకు అర్హత సాధించాడు.ఎడమ చేతి వాటం బ్యాటర్, రైట్ ఆర్మ్ స్లో బౌలర్ అయిన కాలిట్జ్కు ఇదే తొలి అంతర్జాతీయ అవకాశం. కాలిట్జ్కు 17 టీ20లు, 11 లిస్ట్-A మ్యాచ్లు, ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడిన అనుభవం ఉంది. గతంలో ఐర్లాండ్ తరఫున చాలామంది విదేశీ ఆటగాళ్లు ఆడినప్పటికీ.. ఇంగ్లండ్తో హోం టీ20 సిరీస్లో కాలిట్జ్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాడు.ఈ సిరీస్కు పాల్ స్టిర్లింగ్ కెప్టెన్గా వ్యవహరించనుండగా.. హ్యారీ టెక్టర్, కర్టిస్ క్యాంఫర్, జార్డన్ నీల్, లార్కన్ టక్కర్ వంటి కీలక ఆటగాళ్లు జట్టులో చోటు దక్కించుకున్నారు. అయితే గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిధ్యం వహించిన ఫాస్ట్ బౌలర్ జోష్ లిటిల్ మాత్రం ఈ సిరీస్కు ఎంపిక కాలేదు. ఈ సిరీస్ ఐర్లాండ్కు ఇంగ్లండ్తో తొలి హోమ్ టీ20 సిరీస్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లోని మ్యాచ్లన్నీ డబ్లిన్లోని ది విలేజ్ వేదికగా జరుగనున్నాయి.షెడ్యూల్:తొలి టీ20: సెప్టెంబర్ 17 రెండో టీ20: సెప్టెంబర్ 19 మూడో టీ20: సెప్టెంబర్ 21 ఐర్లాండ్ జట్టు: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), రాస్ అడైర్, బెన్ కాలిట్జ్, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, గ్రాహం హ్యూమ్, మాథ్యూ హంఫ్రీస్, బ్యారీ మెక్కార్తీ, జోర్డాన్ నీల్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్. -
బెంగళూరు బుల్స్కు రెండో విజయం
విశాఖ స్పోర్ట్స్: ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్లో మాజీ చాంపియన్ బెంగళూరు బుల్స్ ఖాతాలో రెండో విజయం చేరింది. హరియాణా స్టీలర్స్తో సోమవారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 40–33 పాయింట్ల తేడాతో గెలుపొందింది. బెంగళూరు తరఫున అలీ రెజా 12 పాయింట్లు సాధించగా, యోగేశ్ 6 పాయింట్లు సాధించాడు. హరియాణా ఆటగాళ్లలో శివమ్ పటారే 7, మయాంక్ సైనీ 6 పాయింట్లతో రాణించారు. మరోవైపు మూడుసార్లు చాంపియన్ పట్నా పైరేట్స్ ఎట్టకేలకు గెలుపు బోణీ చేసింది. మూడు పరాజయాల తర్వాత ఆ జట్టు తొలి విజయాన్ని అందుకుంది. పుణేరి పల్టన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో పట్నా పైరేట్స్ 48–37 పాయింట్ల తేడాతో నెగ్గింది. పైరేట్స్ రెయిడర్ అయాన్ లోచబ్ ఒంటి చేత్తో జట్టును గెలిపించాడు. అయాన్ ఒక్కడే 21 పాయింట్లు సాధించడం విశేషం. తొలి అర్ధ భాగంలోనే అయాన్ ‘సూపర్ 10’ సహా ప్రత్యర్థిని రెండు సార్లు ఆలౌట్ చేసిన పట్నా 27–10 తేడాతో ముందంజలో నిలిచింది. రెండో అర్ధభాగంలో సమష్టితత్వంతో కోలుకున్న పుణేరి పదునైన ఆటతో చెలరేగినా భారీ వ్యత్యాసాన్ని తగ్గించలేకపోయింది. పైరేట్స్ను రెండుసార్లు ఆలౌట్ చేసి రెండో అర్ధభాగంలో 27–21తో పైచేయి సాధించినా తుది ఫలితంలో మాత్రం 11 పాయింట్ల తేడాతో నిరాశ తప్పలేదు. పుణేరి తరఫున సచిన్ 6, అభిషేక్ గున్గే 5 పాయింట్లు నమోదు చేశారు. నేడు జరిగే మ్యాచ్లలో దబంగ్ ఢిల్లీతో బెంగాల్ వారియర్స్...గుజరాత్ జెయింట్స్తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడతాయి. -
జోరు కొనసాగించాలని...
హాంకాంగ్: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో తాజా కాంస్య పతకంతో జోరు మీదున్న భారత అగ్రశ్రేణి డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి హంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. పురుషుల డబుల్స్లో ప్రపంచ మూడో ర్యాంకు ద్వయం ఇటీవల పారిస్లో జరిగిన ఈవెంట్లో సత్తా చాటుకుంది. భారత బ్యాడ్మింటన్లోనే అత్యంత నిలకడైన షట్లర్లుగా ఖ్యాతి గాంచిన వీరిద్దరు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) టూర్ ఈవెంట్లలో సెమీఫైనల్, ఫైనల్స్ చేరారు. ఇండియా ఓపెన్ సహా మలేసియా, చైనా, సింగపూర్ టోర్నీల్లో రాణించిన సాత్విక్–చిరాగ్ జంటకు హాంకాంగ్ టోర్నీలో ఎనిమిదో సీడ్ కేటాయించారు. పురుషుల డబుల్స్ తొలి మ్యాచ్లో ఎనిమిదో సీడ్ భారత జోడీ తొలి రౌండ్లో చైనీస్ తైపీకి చెందిన చియు హియాంగ్–వాంగ్ చి లిన్ జంటతో తలపడనుంది. సింధు సత్తా చాటేనా! రెండు వరుస ఒలింపిక్ పతకాల విజేత, భారత స్టార్ పీవీ సింధు ఇటీవల జరిగిన ప్రపంచ చాంపియన్íÙప్లో క్వార్టర్ ఫైనల్ చేరింది. ఈ పయనంలో ఆమె తనకన్నా ర్యాంకింగ్లో మెరుగైనా చైనా సూపర్స్టార్ వాంగ్ జి యిని కంగుతినిపించి తన పూర్వ వైభవాన్ని చాటుకుంది. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో హాంకాంగ్ టోర్నీపై కన్నేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఈ ఆంధ్రప్రదేశ్ షట్లర్ డెన్మార్క్ ప్లేయర్ లినె క్రిస్టోఫెర్సన్తో తలపడుతుంది. ఆమెతో పాటు మహిళల సింగిల్స్లో అనుపమ, రక్షిత శ్రీలు బరిలో ఉన్నారు. పురుషుల సింగిల్స్లో భారత మేటి ఆటగాడు లక్ష్యసేన్ తన ఫామ్ను అందిపుచ్చుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ టోర్నీని సానుకూలంగా మలచుకోవాలని ఆశిస్తున్నాడు. తొలి రౌండ్లో అతను వాంగ్ జు వీ (చైనీస్ తైపీ)ను ఎదుర్కోనున్నాడు. యూఎస్ ఓపెన్ చాంపియన్ ఆయుశ్ షెట్టి... లూ గ్వాంగ్ జు (చైనా)తో, ప్రణయ్... ఐదో సీడ్ కొడాయ్ నరొకా (జపాన్)తో పోటీపడనున్నారు. ప్రపంచ మాజీ నంబర్వన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్, తరుణ్ మన్నేపల్లి క్వాలిఫయర్స్లో తలపడనున్నారు. పురుషుల డబుల్స్లో హరిహరన్–రూబన్ కుమార్, మహిళల డబుల్స్లో రుతపర్ణ–శ్వేతపర్ణ జోడీలు బరిలోకి దిగుతున్నాయి. మిక్స్డ్ డబుల్స్లో హైదరాబాద్కు చెందిన గద్దె రుతి్వక శివాని... రోహన్ కపూర్తో జోడీ కట్టింది. -
భారత్కు మూడో స్థానం
హిసోర్ (తజికిస్తాన్): సెంట్రల్ ఏషియన్ ఫుట్బాల్ అసోసియేషన్స్ (సీఏఎఫ్ఏ) నేషన్స్ కప్ టోర్నీలో భారత జట్టుకు మూడో స్థానం లభించింది. ఒమన్ జట్టుతో సోమవారం జరిగిన వర్గీకరణ మ్యాచ్లో భారత్ ‘షూటౌట్’లో 3–2తో విజయం సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో ఒమన్ జట్టుపై భారత్కిదే తొలి గెలుపు కావడం విశేషం. నిరీ్ణత సమయం ముగిసేసరికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. ఒమన్ తరఫున జమీల్ (55వ నిమిషంలో) గోల్ చేయగా... 80వ నిమిషంలో ఉదాంత సింగ్ గోల్తో భారత్ స్కోరును సమం చేసింది. ‘షూటౌట్’లో ఒమన్ ఆటగాళ్లు తొలి రెండు షాట్లను వృథా చేయగా... చివరిదైన ఐదో షాట్ను భారత గోల్కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధూ నిలువరించి జట్టును గెలిపించాడు. భారత్ తరఫున లాలియన్జువాలా, రాహుల్ భెకె, జితిన్ గోల్స్ చేయగా... అన్వర్ అలీ, ఉదాంత సింగ్ గురి తప్పారు. -
గుకేశ్కు అభిమన్యు షాక్
సమర్కండ్ (ఉజ్బెకిస్తాన్): అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) గ్రాండ్ స్విస్ టోర్నీలో సోమవారం సంచలనం చోటు చేసుకుంది. ఐదో రౌండ్లో భారత గ్రాండ్మాస్టర్, ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్కు అనూహ్య పరాజయం ఎదురైంది. భారత సంతతికి చెందిన అమెరికా గ్రాండ్మాస్టర్, 16 ఏళ్ల అభిమన్యు మిశ్రా 61 ఎత్తుల్లో గుకేశ్ను ఓడించాడు. మరో గేమ్లో టాప్ సీడ్, భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద 55 ఎత్తుల్లో మథియాస్ బ్లూబామ్ (జర్మనీ) చేతిలో ఓటమి పాలయ్యాడు. తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ 37 ఎత్తుల్లో నికిత వితియుగోవ్ (ఇంగ్లండ్)పై గెలుపొందాడు. ఈ టోర్నీలో మూడు గేముల్లో నెగ్గి, రెండు గేమ్లను ‘డ్రా’ చేసుకున్న అర్జున్ మరో ముగ్గురితో కలిసి ఉమ్మడిగా రెండో స్థానంలో ఉన్నాడు. -
భారత్ను ఆపతరమా!
వన్డే, టి20 ఫార్మాట్లు కలిపి ఇప్పటి వరకు ఆసియా కప్ 16 సార్లు జరిగింది. వీటిలో 8 సార్లు విజేతగా నిలిచిన భారత్ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఫార్మాట్ ఏదైనా ఇప్పుడు టీమిండియా ఫామ్ చూస్తే ఎదురులేని జట్టుగా కనిపిస్తోంది. విధ్వంసకర బ్యాటర్లు, పదునైన బౌలర్లతో నిండిన సూర్యకుమార్ బృందం టైటిల్ గెలవకపోతేనే ఆశ్చర్యపోవచ్చు! ఎనిమిది దేశాల ఈ టోర్నీలో భారత్కు మిగతా జట్లు ఎంత వరకు పోటీనిస్తాయనేది సందేహమే. ఈ నేపథ్యంలో కొంత విరామం తర్వాత క్రికెట్ అభిమానులకు కొత్త సీజన్లో మళ్లీ పూర్తి వినోదానికి ఆసియా కప్తో తెర లేస్తోంది. దుబాయ్: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన సరిగ్గా ఆరు నెలల తర్వాత ఎడారి దేశంలో మరో పెద్ద టోర్నీకి రంగం సిద్ధమైంది. ఎనిమిది టీమ్లు పాల్గొంటున్న ఆసియా కప్ టి20 టోర్నీ నేడు మొదలవుతోంది. తొలి మ్యాచ్లో అఫ్గానిస్తాన్తో హాంకాంగ్ ‘ఢీ’కొంటుండగా... భారత్ తమ తొలి మ్యాచ్లో బుధవారం ఆతిథ్య యూఏఈతో తలపడుతుంది. నిజానికి ఈ టోర్నీ భారత్లోనే జరగాల్సింది. అయితే పాకిస్తాన్ మన దేశంలో ఆడే అవకాశం లేదని తేలడంతో తటస్థ వేదికకు మార్చారు.దుబాయ్, అబుదాబిలలో మ్యాచ్లు నిర్వహిస్తుండగా... ఆతిథ్య హక్కులు మాత్రం బీసీసీఐ చేతుల్లోనే ఉన్నాయి. 2023లో వన్డే ఫార్మాట్లో జరిగిన ఆసియా కప్లో భారత్ విజేతగా నిలిచింది. సిరాజ్ (6/51) ధాటికి శ్రీలంక 50 పరుగులకే కుప్పకూలగా, భారత్ 6.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. వచ్చే ఏడాది ఆరంభంలో టి20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఈసారి ఫార్మాట్ను టి20కి మార్చారు. సెప్టెంబర్ 28న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. రెండు గ్రూపులుగా... ఆసియా కప్లో ఎనిమిది జట్లు ఆడటం ఇదే మొదటిసారి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నేరుగా అర్హత సాధించగా... ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రీమియర్ కప్ పేరుతో నిర్వహించిన టోర్నీలో టాప్–3లో నిలిచిన యూఏఈ, ఒమన్, హాంకాంగ్ టోర్నీకి అర్హత పొందాయి. గ్రూప్ ‘ఎ’లో భారత్తో పాటు పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ ఉండగా... గ్రూప్ ‘బి’లో అఫ్గానిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, హాంకాంగ్ తలపడుతున్నాయి. ప్రతీ జట్టు తమ గ్రూప్లోని మిగతా మూడు జట్లతో తలపడుతుంది. ప్రతీ గ్రూప్లోని టాప్–2 టీమ్లు సూపర్–4కు అర్హత సాధిస్తాయి. ఇక్కడా మిగతా మూడు జట్లతో ఆడిన తర్వాత టాప్–2 ఫైనల్ చేరతాయి. అంతా ఆ మ్యాచ్ కోసమే... పహల్గాం ఉగ్రదాడి తర్వాతి పరిణామాలను బట్టి చూస్తే భారత్, పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్లు జరగడం అసాధ్యంగా అనిపించింది. అయితే చివరకు భారత ప్రభుత్వం పాక్తో మ్యాచ్లు ఆడేందుకు టీమిండియాకు అనుమతి ఇచ్చింది. బలాబలాలపరంగా ఇరు జట్ల మధ్య ఆకాశమంత వ్యత్యాసం ఉన్నా...ఇటీవలి ఉద్రిక్తతల నేపథ్యంలో ఒక్కసారిగా ఈ పోరుపై ఆసక్తి పెరిగింది.భారత్, పాక్ గ్రూప్ దశలో ఈ నెల 14న (ఆదివారం) తలపడతాయి. సంచలన ఫలితాలు లేకపోతే ఇరు జట్ల మధ్య టోర్నీలో మరో రెండు మ్యాచ్లు (ఫైనల్ సహా) జరిగే అవకాశం కూడా ఉంది. దాయాది దేశాల మధ్య గతంలో ఎప్పుడూ ఆసియా కప్ ఫైనల్ జరగలేదు! కొత్త కుర్రాళ్లతో... భారత్తో పోలిస్తే బలహీనంగా ఉన్నా... ఇతర టీమ్లు కొన్ని అనూహ్య ఫలితాలను ఆశిస్తున్నాయి. పైగా కొందరు ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన కూడా టోర్నీలో కీలకం కానుంది. బాబర్, రిజ్వాన్లను తప్పించిన పాకిస్తాన్ జట్టు సల్మాన్ ఆఘా సారథ్యంలో కొత్తగా కనిపిస్తోంది. ముక్కోణపు టోర్నీని గెలవడం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. బంగ్లా ఇటీవలే లంకపై సిరీస్ విజయం సాధించింది. ఒమన్కు ముంబై మాజీ క్రికెటర్ సులక్షణ్ కులకర్ణి కోచ్గా వ్యవహరిస్తుండగా, హాంకాంగ్, యూఏఈ జట్లు తమ కెపె్టన్లు ముర్తజా, వసీమ్లపై ఆధారపడుతున్నాయి. పాక్ లెఫ్టార్మ్ పేసర్ సల్మాన్ మీర్జా, అఫ్గానిస్తాన్ స్పిన్నర్ ఘజన్ఫర్ కొత్తగా చూడదగ్గ ఆటగాళ్లు. -
అల్కరాజ్ ‘సిక్సర్’
న్యూయార్క్: మూడు నెలల వ్యవధిలో మూడోసారి చిరకాల ప్రత్యర్థులు కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్), యానిక్ సినెర్ (ఇటలీ) మధ్య ‘గ్రాండ్స్లామ్ ఫైనల్’ సమరం... ప్రతి పాయింట్కూ హోరాహోరీ తప్పదని... ఐదు సెట్ల పోరు ఖాయమని అభిమానులు భావించారు. కానీ అల్కరాజ్ అలాంటి అవకాశం ఇవ్వలేదు. 2 గంటల 42 నిమిషాల్లో డిఫెండింగ్ చాంపియన్ సినెర్ను 6–2, 3–6, 6–1, 6–4తో ఓడించి రెండోసారి యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను దక్కించుకున్నాడు. విజేత అల్కరాజ్కు 50 లక్షల డాలర్లు (రూ. 44 కోట్ల 11 లక్షలు), రన్నరప్ సినెర్కు 25 లక్షల డాలర్లు (రూ. 22 కోట్ల 5 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. తాజా విజయంతో అల్కరాజ్ రెండేళ్ల తర్వాత మళ్లీ ప్రపంచ నంబర్వన్ ర్యాంక్నూ అందుకున్నాడు. ఇప్పటికే అల్కరాజ్ రెండుసార్లు చొప్పున ఫ్రెంచ్ ఓపెన్ (2024, 2025), వింబుల్డన్ (2023, 2024), యూఎస్ ఓపెన్ (2022, 2025) టైటిల్స్ నెగ్గాడు. రెండు బ్రేక్ పాయింట్లతో... ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ఐదు సెట్లలో సినెర్ను ఓడించిన అల్కరాజ్... వింబుల్డన్ టోర్నీ ఫైనల్లో నాలుగు సెట్లలో సినెర్ చేతిలో ఓడిపోయాడు. ఈ నేపథ్యంలో యూఎస్ ఓపెన్ తుదిపోరుపై అందరికీ ఆసక్తి ఏర్పడింది. అయితే ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ఫైనల్ చేరిన అల్కరాజ్ తొలి గేమ్ నుంచే తన జోరు కనబరిచాడు. రెండో గేమ్లో, ఏడో గేమ్లో సినెర్ సర్వీస్ను బ్రేక్ చేసిన అల్కరాజ్ తొలి సెట్ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్లో సినెర్ పుంజుకున్నాడు. నాలుగో గేమ్లో అల్కరాజ్ సర్వీస్ను బ్రేక్ చేసి తన సర్వీస్లను నిలబెట్టుకొని సెట్ను గెల్చుకున్నాడు. ఇక మూడో సెట్లో అల్కరాజ్ అసాధారణ ప్రదర్శన ముందు సినెర్ తేలిపోయాడు. 5–0తో ఆధిక్యంలోకి వెళ్లిన అల్కరాజ్ ఆ తర్వాత ఒక గేమ్ కోల్పోయి సెట్ను దక్కించుకున్నాడు. నాలుగో సెట్ పోటాపోటీగా సాగినా ఐదో గేమ్లో సినెర్ సర్వీస్ను బ్రేక్ చేసిన అల్కరాజ్ ఆ తర్వాత తన సర్వీస్లను కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకున్నాడు.2 అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ర్యాంకింగ్స్ మొదలయ్యాక (1973లో) ఒకే సీజన్లో రెండు గ్రాండ్స్లామ్ టోర్నీ ఫైనల్స్లో వరల్డ్ నంబర్వన్ను ఓడించిన రెండో ప్లేయర్గా అల్కరాజ్ గుర్తింపు పొందాడు. ఇంతకుముందు రాఫెల్ నాదల్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. 2008లో నాదల్ ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోర్నీ ఫైనల్స్లో నాటి నంబర్వన్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)పై గెలిచి విజేతగా నిలిచాడు.2 జాన్ బోర్గ్ (స్వీడన్ –7 టైటిల్స్) తర్వాత 23 ఏళ్ల లోపే ఆరు గ్రాండ్స్లామ్ టైటిల్స్ నెగ్గిన రెండో ప్లేయర్గా అల్కరాజ్ (22 ఏళ్ల 111 రోజులు) నిలిచాడు.1 మూడు వేర్వేరు కోర్టులపై (హార్డ్, క్లే, గ్రాస్) రెండుసార్లు చొప్పున గ్రాండ్స్లామ్ టైటిల్స్ నెగ్గిన అతిపిన్న వయస్కుడిగా అల్కరాజ్ గుర్తింపు పొందాడు.6 అల్కరాజ్ కెరీర్లో నెగ్గిన గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్స్. ఓపెన్ శకంలో (1968 నుంచి) కనీసం ఆరు గ్రాండ్స్లామ్ టైటిల్స్ నెగ్గిన క్రీడా కారుల జాబితాలో స్టీఫెన్ ఎడ్బర్గ్ (స్వీడన్), బోరిస్ బెకర్ (జర్మనీ) సరసన అల్కరాజ్ చేరాడు. ఈ జాబితాలో జొకోవిచ్ (24), నాదల్ (22), ఫెడరర్ (20), సంప్రాస్ (14), జాన్ బోర్గ్ (11), జిమ్మీ కానర్స్, ఇవాన్ లెండిల్, అగస్సీ (8 చొప్పున), విలాండర్, జాన్ మెకన్రో (7 చొప్పున) ముందున్నారు. -
సింగపూర్పై 12–0తో గెలిచి ‘సూపర్–4’ దశకు భారత్
హాంగ్జౌ (చైనా): ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్ లీగ్ దశను భారత జట్టు అజేయంగా ముగించింది. సింగపూర్ జట్టుతో సోమవారం జరిగిన పూల్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 12–0 గోల్స్తో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నవ్నీత్ కౌర్ (14వ, 20వ, 28వ నిమిషాల్లో), ముంతాజ్ ఖాన్ (2వ, 32వ, 39వ నిమిషాల్లో) మూడు గోల్స్ చొప్పున చేశారు. నేహా (11వ, 38వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించింది. లాల్రెమ్సియామి (13వ నిమిషంలో), ఉదిత (29వ నిమిషంలో), షరి్మలా (45వ నిమిషంలో), రుతుజా (53వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. థాయ్లాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో 11–0తో నెగ్గిన భారత్... జపాన్తో రెండో మ్యాచ్ను 2–2తో ‘డ్రా’ చేసుకుంది. పూల్ ‘బి’లో భారత్, జపాన్ జట్లు ఏడు పాయింట్లతో సమంగా నిలిచినా... ఎక్కువ గోల్స్ చేసిన భారత్కు అగ్రస్థానం ఖాయమైంది. జపాన్కు రెండో స్థానం దక్కింది. పూల్ ‘బి’ నుంచి భారత్, జపాన్... పూల్ ‘ఎ’ నుంచి చైనా, దక్షిణ కొరియా జట్లు ‘సూపర్–4’ దశకు అర్హత సాధించాయి. బుధవారం జరిగే ‘సూపర్–4’ మ్యాచ్ల్లో కొరియాతో భారత్; జపాన్తో చైనా తలపడతాయి. ‘సూపర్–4’ మ్యాచ్లు ముగిశాక తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్కు అర్హత పొందుతాయి. విజేత జట్టు వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్ టోరీ్నకి అర్హత సాధిస్తుంది. -
‘ఎవరూ తోపులు కారు.. నేనే దేవుడిని అనుకుంటే ఇలాగే ఉంటుంది’
టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) అంతర్జాతీయ కెరీర్లో చివరి దశకు చేరుకుంటున్నారు. ఇప్పటికే ఇంటర్నేషనల్ టీ20 ఫార్మాట్, టెస్టులకు ఈ లెజెండరీ బ్యాటర్లు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టీమిండియా తరఫున వన్డేల్లో కొనసాగుతున్న రో-కో ద్వయం వన్డే ప్రపంచకప్-2027 వరకు ఆడతారా? లేదా? అన్నది కూడా ప్రశ్నార్థకంగానే మారింది.ఆట కంటే ఎవరూ తోపులు కారుఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ తండ్రి, భారత మాజీ క్రికెటర్ యోగ్రాజ్ సింగ్ (Yograj Singh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చంద్రకాంత్ పండిట్ వంటి కోచ్ దగ్గరికి వెళ్తే కోహ్లి, రోహిత్ మరికొన్నేళ్ల పాటు ఆటలో కొనసాగవచ్చని పేర్కొన్నాడు. ‘‘రోహిత్, విరాట్ అత్యంత ప్రతిభావంతులైన ఆటగాళ్లు అని ఒప్పుకొంటాను.అయితే, వారికి గనుక నేనే కోచ్ని అయి ఉంటే.. ‘ఉదయం ఐదు గంటలు అయింది. లేవండి.. శిక్షణ మొదలుపెడదాం పదండి’ అనే చెప్తా. ఎందుకంటే ఆట కంటే ఎవరూ గొప్పోళ్లు, తోపులు కారు. ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లి ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతిని ఆడేందుకు ప్రయత్నించి పదే పదే అవుటయ్యాడు.పది కిలోమీటర్లు పరిగెత్తాలి బాబూ!అయినా సరే.. విరాట్ దగ్గరికి వెళ్లి.. ‘నువ్వు తప్పుగా ఆడుతున్నావు. బ్యాటింగ్పై దృష్టి పెట్టు’ అని ఎవరూ ఎందుకు చెప్పరు? రోహిత్ దగ్గరికి వెళ్లి ఐదు గంటలకే లేచి పది కిలోమీటర్లు పరిగెత్తాలి అని ఎందుకు అతడిని తొందరపెట్టరు?డాన్ బ్రాడ్మాన్ సగటు 99.9గా ఉంటే.. మన సగటు 54-55 మధ్య మాత్రమే ఎందుకు ఉందని రో-కో తమను తాము ఎందుకు ప్రశ్నించుకోరు?.. ‘నేనే దేవుణ్ణి.. అందరికంటే గొప్పోడిని’ అనుకుంటే కుదరదు. సచిన్ 43 ఏళ్ల వయసు వరకు ఎలా ఆడగలిగాడు? ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమే మంచిది.ముంబై తరపున రంజీల్లో ఆఖరి వరకు సచిన్ ఆడిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి’’ అని యోగ్రాజ్ సింగ్ విరాట్- రోహిత్ల తీరును విమర్శించాడు. ఇన్సైడ్ స్పోర్ట్తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా కోల్కతా నైట్ రైడర్స్కు గతేడాది ఐపీఎల్ టైటిల్ అందించిన దేశీ కోచ్ చంద్రకాంత్ పండిట్ వంటి వారి వద్దకు రో-కో వెళ్లి.. తమ తప్పులు సరిచేసుకోవాలని యోగ్రాజ్ ఈ సందర్భంగా సూచించాడు.ఆసీస్తో వన్డేలతో రీఎంట్రీ కాగా టీమిండియా సెప్టెంబరు 9- 28 వరకు ఆసియా కప్-2025 టోర్నమెంట్తో బిజీ కానుంది. ఈసారి టీ20 ఫార్మాట్లో టోర్నీ జరుగుతున్నందున విరాట్- రోహిత్కు మరికొంత కాలం విశ్రాంతి లభించనుంది. ఈ మెగా ఈవెంట్ తర్వాత స్వదేశంలో వెస్టిండీస్తో టెస్టులు ఆడిన తర్వాత.. పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడేందుకు టీమిండియా.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఇక ఆసీస్తో వన్డే సిరీస్తో వీరిద్దరు రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఇందుకోసం ఇ ప్పటికే ఇద్దరూ ఫిట్నెస్ పరీక్ష పాసయ్యారు. కాగా రోహిత్- కోహ్లి చివరగా ఆస్ట్రేలియా టూర్లో టెస్టు సిరీస్ సందర్భంగా టీమిండియాకు ఆడారు.చదవండి: ఆసియా కప్-2025: పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు -
'అందుకే చాహల్ను అగౌరవపరచలేదు'.. మాజీ భార్య ధనశ్రీ వర్మ
కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ గురించి పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే క్రికెటర్ చాహల్ పెళ్లాడిన ఆమె.. కొన్నేళ్లకే వివాహ బంధానికి ఎండ్ కార్డ్ పడేసింది. 2020లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట.. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత చాహల్, ఆర్జే మహ్వశ్తో డేటింగ్లో ఉన్నట్లు కథనాలొచ్చాయి. వీరిద్దరు తమ వస్తున్న రూమర్స్పై ఇప్పటి వరకు స్పందించలేదు.అయితే చాహల్తో విడాకుల తర్వాత మాజీ భార్య ధనశ్రీ వర్మ ఈ విషయంపై మాట్లాడింది. రియాలిటీ షో రైజ్ అండ్ ఫాల్లో పాల్గొన్న ధనశ్రీ వర్మ విడాకుల తర్వాత తనను చాలా అగౌవరంగా మాట్లాడారని గుర్తు చేసుకుంది. అయితే తాను తిరిగి చాహల్ పట్ల అగౌరవపరిచేలా వ్యవహరించకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఎందుకంటే ఒకప్పుడు అతను నా భర్త కావడం వల్లే తనకు గౌరవం ఉందని పేర్కొంది.మీరు బాధ్యతాయుతంగా ఉన్నప్పుడు.. ఇతరులను గౌరవించడం కూడా మీ చేతుల్లో ఉంటుందని ధనశ్రీ వర్మ అన్నారు. ఒక మహిళగా నాకు ఈ విషయాలు చెప్పే హక్కు లేదా? అని ప్రశ్నించారు. అతను నా భర్త.. నేను వివాహం చేసుకున్నప్పుడు కూడా చాహల్ను గౌరవించానని తెలిపింది. మన ఇమేజ్ కోసం ఇతరులను తక్కువ చేయాల్సిన అవసరం లేదన్నారు. నాపై ఎంత నెగెటివ్ ప్రచారం చేసినా.. ఎంత బ్యాడ్గా చెప్పినా.. మీ టైమ్ వేస్ట్ తప్ప ఎలాంటి ఫలితం ఉండదని ధనశ్రీ వర్మ పేర్కొన్నారు. -
సౌతాఫ్రికాకు భారీ షాకిచ్చిన ఐసీసీ.. పాపం పుండు మీద కారంలా!
మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లు సౌతాఫ్రికాకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రొటిస్ జట్టుకు భారీ జరిమానా విధించింది. మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు ఆడేందుకు సౌతాఫ్రికా జట్టు ఇంగ్లండ్తో పర్యటిస్తోంది.ఇందులో భాగంగా తొలుత వన్డే సిరీస్ జరుగగా.. తొలి రెండు మ్యాచ్లో బవుమా బృందం అద్భుత విజయాలు సాధించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది. అయితే, ఆఖరిదైన నామమాత్రపు మూడో వన్డేలో మాత్రం సఫారీలకు ఘోర పరాభవం ఎదురైంది.రూట్, బెతెల్ శతకాలుఇంగ్లండ్ చేతిలో ఏకంగా 342 పరుగుల తేడాతో బవుమా బృందం చిత్తుచిత్తుగా ఓడిపోయింది. సౌతాంప్టన్ వేదికగా టాస్ గెలిచిన సౌతాఫ్రికా ఇంగ్లండ్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఓపెనర్ జేమీ స్మిత్ (62) శుభారంభం అందించగా వన్డౌన్ బ్యాటర్ జో రూట్ (Joe Root- 100), జేకబ్ బెతెల్ (110) దానిని కొనసాగించారు.బట్లర్ మెరుపు హాఫ్ సెంచరీరూట్, బెతెల్ శతకాలతో చెలరేగగా.. ఆఖర్లో జోస్ బట్లర్ (Jos Buttler) అజేయ మెరుపు అర్ధ శతకం (32 బంతుల్లో 62) సాధించాడు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఇంగ్లండ్ కేవలం ఐదు వికెట్లు మాత్రమే నష్టపోయి ఏకంగా 414 పరుగులు సాధించింది. ప్రొటిస్ బౌలర్లలో కార్బిన్ బాష్, కేశవ్ మహరాజ్ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు.పేకమేడలా కుప్పకూలిందిఇక లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి ఐడెన్ మార్క్రమ్ (0), రియాన్ రికెల్టన్ (1), వియాన్ ముల్దర్ (0), మాథ్యూ బ్రీట్జ్కే (4), ట్రిస్టన్ స్టబ్స్ (10), డెవాల్డ్ బ్రెవిస్ (6) పెవిలియన్కు వరుస కట్టారు.డౌన్ ఆర్డర్లో కార్బిన్ బాష్ 20 పరుగులతో సౌతాఫ్రికా టాప్ స్కోరర్గా నిలవగా.. కేశవ్ మహరాజ్ 17 పరుగులు చేయగలిగాడు. నండ్రీ బర్గర్ 2 పరుగులతో అజేయంగా నిలవడగా.. కెప్టెన్ తెంబా బవుమా ఆబ్సంట్ హర్ట్గా ఉన్నాడు. దీంతో 20.5 ఓవర్లలో కేవలం 72 పరుగులు చేసి సౌతాఫ్రికా 72 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్ చేతిలో 342 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. వన్డేల్లో ఏ జట్టుకైనా పరుగుల తేడా పరంగా ఇదే అతి భారీ ఓటమి. అలా సఫారీలు ఈ చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ నాలుగు వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్ మూడు, బ్రేడన్ కార్స్ రెండు వికెట్లు దక్కించుకున్నారు.భారీ జరిమానా.. కారణం ఇదేఇదిలా ఉంటే.. నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందున సౌతాఫ్రికా కెప్టెన్ బవుమాతో పాటు జట్టుకు జరిమానా విధిస్తున్నట్లు ఐసీసీ తాజాగా ప్రకటించింది. మ్యాచ్ ఫీజులో ఐదు శాతం కోత విధిస్తున్నట్లు వెల్లడించింది. ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ మ్యాచ్ రిఫరీలలో ఒకరైన టీమిండియా మాజీ పేసర్ శ్రీనాథ్ జవగళ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇక సారథి బవుమా తమ తప్పిదాన్ని అంగీకరించడంతో తదుపరి విచారణ లేకుండానే ఐదు శాతం జరిమానా ఖరారైంది.చదవండి: ఆసియా కప్-2025: పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు -
ఒకే ఒక్క మ్యాచ్.. ప్రతిష్టాత్మక అవార్డు రేసులో సిరాజ్
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) ప్రతిష్టాత్మక అవార్డు రేసులో నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఇచ్చే ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ పురస్కారానికి అతడు నామినేట్ అయ్యాడు. కాగా ఐసీసీ ఓటింగ్ అకాడమీతో పాటు.. ఆన్లైన్లో అభిమానులు వేసిన ఓట్ల ఆధారంగా ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు విజేతను నిర్ణయిస్తారు.ఇక ఆగష్టు 2025 నెలకు గానూ నామినేట్ అయిన పురుష క్రికెటర్ల పేర్లను ఐసీసీ సోమవారం వెల్లడించింది. ఇందులో ఈసారి ముగ్గురూ బౌలర్లే ఉండటం విశేషం. టీమిండియా నుంచి సిరాజ్, న్యూజిలాండ్ జట్టుకు చెందిన మ్యాట్ హెన్రీ (Matt Henry), వెస్టిండీస్ పేసర్ జేడన్ సీల్స్ (Jayden Seals) ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు.ఆగష్టు నెలలో ఒకే ఒక్క మ్యాచ్కాగా ఈ ఏడాది ఆగష్టు నెలలో సిరాజ్ ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా.. ఇంగ్లండ్తో జూలై 31- ఆగష్టు 4 వరకు ఓవల్ మైదానంలో జరిగిన ఐదో టెస్టులో... ఈ హైదరాబాదీ పేసర్ చివరగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. ఐదు టెస్టుల సిరీస్ను సమం చేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత్ను విజయతీరాలకు చేర్చాడు.ఆఖరి రోజు.. చివరి సెషన్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో సిరాజ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లండ్ చేతిలో ఆరు వికెట్లు ఉండి విజయానికి కేవలం 73 పరుగుల దూరంలో ఉన్న వేళ ఈ రైటార్మ్ పేసర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో జాక్ క్రాలీ (14), ఓలీ పోప్ (27), జేమీ స్మిత్ (2), జేమీ ఓవర్టన్ (9) రూపంలో కీలక వికెట్లు కూల్చి సిరాజ్ మియా.. ఆఖరి వికెట్గా గస్ అట్కిన్సన్ (17)ను వెనక్కి పంపాడు.సిరీస్ను 2-2తో సమం చేయడంలో కీలక పాత్రఇలా వికెట్లతో చెలరేగి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించి.. విజయానికి కేవలం ఆరు పరుగుల దూరంలో నిలిచేలా చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్లో తొమ్మిది వికెట్లు కూల్చి.. టీమిండియా సిరీస్ను 2-2తో సమం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే ఆగష్టు నెలకుగానూ ఈ అవార్డుకు నామినేట్ అయ్యాడు.అదరగొట్టిన హెన్రీ, జేడన్ సీల్స్మరోవైపు.. జింబాబ్వేతో టెస్టు సిరీస్లో కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీ గొప్పగా రాణించాడు. రెండు మ్యాచ్లలో కలిపి 16 వికెట్లు కూల్చి.. న్యూజిలాండ్ సిరీస్ను 2-0తో వైట్వాష్ చేయడంలో ముఖ్య భూమిక పోషించాడు.ఇక పాకిస్తాన్పై 34 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వెస్టిండీస్ వన్డే సిరీస్ గెలవడంలో జేడన్ సీల్స్ పాత్ర కీలకం. ఆఖరి వన్డేలో ఏకంగా ఆరు వికెట్లు కూల్చి.. పాక్పై విండీస్ 202 పరుగుల భారీ తేడాతో గెలవడంలో కీలకంగా వ్యవహరించాడు. మొత్తంగా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో కేవలం 4.10 ఎకానమీ రేటుతో సీల్స్ పది వికెట్లు కూల్చడం గమనార్హం.చదవండి: ఆసియా కప్-2025: పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు -
గిల్ వద్దు!.. టీమిండియా ఓపెనర్గా అతడే సరైనోడు: రవిశాస్త్రి
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్లో భారత ఓపెనింగ్ జోడీ గురించి టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి (Ravi Shastri) కీలక వ్యాఖ్యలు చేశాడు. టాపార్డర్లో విశ్వరూపం ప్రదర్శించే సంజూ శాంసన్ (Sanju Samson)ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెనర్గా తప్పించవద్దని జట్టు యాజమాన్యానికి సూచించాడు.వైస్ కెప్టెన్ అయినప్పటికీ శుబ్మన్ గిల్ (Shubman Gill) కూడా సంజూను రీప్లేస్ చేయలేడని.. అతడు వేరొక స్థానంలో బ్యాటింగ్కు రావాలని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. యూఏఈ వేదికగా సెప్టెంబరు 9- 28 వరకు టీ20 ఫార్మాట్లో ఆసియా కప్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. వైస్ కెప్టెన్గా..ఈ మెగా ఈవెంట్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. దాదాపు ఏడాది తర్వాత అంతర్జాతీయ టీ20లలోకి గిల్కు పిలుపునిచ్చిన మేనేజ్మెంట్.. అతడిని వైస్ కెప్టెన్గా నియమించింది. ఈ నేపథ్యంలో గిల్ గైర్హాజరీలో ఓపెనర్గా వచ్చిన సంజూ శాంసన్పై వేటు పడే అవకాశాలు ఉన్నాయి.గిల్ లేనందు వల్లే సంజూ ఓపెనింగ్ చేశాడని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వ్యాఖ్యానించడం ఇందుకు నిదర్శనం. అంతేకాదు ఓపెనర్గా అభిషేక్ శర్మ పాతుకుపోయాడంటూ కితాబులు ఇవ్వడం ద్వారా.. అభి- గిల్ భారత ఇన్నింగ్స్ ఆరంభిస్తారనే సంకేతాలు ఇచ్చాడు.ప్రమాదకర బ్యాటర్ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి మాత్రం సంజూ శాంసన్కే తన మద్దతు అంటూ కుండబద్దలు కొట్టేశాడు. ‘‘టాపార్డర్లో అత్యంత ప్రమాదకర బ్యాటర్ సంజూ శాంసన్. అక్కడ ఆడిస్తేనే మనకోసం మ్యాచ్లు గెలవగలడు. కాబట్టి తన బ్యాటింగ్ ఆర్డర్ను మార్చకూడదు.సంజూ శాంసన్ స్థానాన్ని భర్తీ చేయడం ఎవరికీ అంత సులువేం కాదు. టాప్ ఆర్డర్లో టీమిండియా తరఫున టీ20లలో సంజూకు మంచి రికార్డు ఉంది. గిల్ కూడా అతడిని డిస్ప్లేస్ చేయలేడు. కాబట్టి గిల్ వేరొకరి స్థానంలో బ్యాటింగ్ చేస్తే మంచిది.సంజూనే సరైనోడుసంజూ శాంసనే ఓపెనర్గా ఉండాలి. టీ20 ఫార్మాట్లో తనకు ఉన్న రికార్డును బట్టి సంజూనే సరైనోడు. టాప్లో రాణిస్తూ పరుగులు రాబట్టడంతో పాటు సెంచరీలు కూడా చేసిన ఘనత అతడిది’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.కాగా రవిశాస్త్రి హెడ్కోచ్గా ఉన్న సమయంలోనే సంజూ టీమిండియాలో పునరాగమనం చేశాడు. అయితే, అతడికి వరుస అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో టీ20 ప్రపంచకప్-2021 జట్టులోనూ చోటు దక్కలేదు. ఇక టీ20 ప్రపంచకప్-2024 ఆడిన భారత జట్టులో స్థానం దక్కినప్పటికీ.. ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు.జితేశ్ శర్మతో పోటీఇక గిల్ రాకతో ఆసియా కప్ టోర్నీలో కేవలం వికెట్ కీపర్ కోటాలొ సంజూ తుదిజట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, అక్కడ కూడా జితేశ్ శర్మతో అతడికి పోటీ తప్పదు. జితేశ్ స్పెషలైజ్డ్ ఫినిషర్గా పేరు తెచ్చుకున్నాడు కాబట్టి మేనేజ్మెంట్ అతడి వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. కాగా అంతర్జాతీయ స్థాయిలో 42 టీ20 మ్యాచ్లు ఆడిన సంజూ.. మూడు శతకాల సాయంతో 861 పరుగులు చేశాడు.చదవండి: అతడే నా ఫేవరెట్ క్రికెటర్.. టీమిండియాకు ఎందుకు సెలక్ట్ చేయరు? -
ఆసియా కప్-2025: పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
ఖండాంతర క్రికెట్ టోర్నమెంట్ ఆసియా కప్ (Asia Cup). ఈసారి పొట్టి ఫార్మాట్లో జరిగే ఈ ఈవెంట్లో ఎనిమిది జట్లు భాగంగా ఉన్నాయి. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో టీమిండియా (2023 వన్డే ఫార్మాట్ విజేత) బరిలోకి దిగుతుండగా.. శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఒమన్, యూఏఈ, హాంకాంగ్ కూడా పాల్గొంటున్నాయి.ఈ టోర్నీ ఆతిథ్య హక్కులు భారత్వే అయినా.. పాక్ కూడా ఈ ఈవెంట్లో భాగమైనందున తటస్థ వేదికైన యూఏఈలో మ్యాచ్లు నిర్వహిస్తారు. మరి.. ఆసియా కప్-2025 టోర్నీ పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, మ్యాచ్ ఆరంభ సమయం, ప్రత్యక్ష ప్రసారం తదితర వివరాలు తెలుసుకుందామా!!గ్రూపులు- రెండుగ్రూప్-‘ఎ’- భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్గ్రూప్-‘బి’- శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్పూర్తి షెడ్యూల్, మ్యాచ్ ఆరంభ సమయం👉సెప్టెంబరు 9: అఫ్గనిస్తాన్ వర్సెస్ హాంగ్కాంగ్- అబుదాబి- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 10: ఇండియా వర్సెస్ యూఏఈ- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు 👉సెప్టెంబరు 11: బంగ్లాదేశ్ వర్సెస్ హాంగ్కాంగ్- అబుదాబి- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 12: పాకిస్తాన్ వర్సెస్ ఒమన్- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 13: బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక- అబుదాబి- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 14: ఇండియా వర్సెస్ పాకిస్తాన్- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 15: యూఏఈ వర్సెస్ ఒమన్- అబుదాబి- సాయంత్రం 5.30 నిమిషాలకు👉సెప్టెంబరు 15:శ్రీలంక వర్సెస్ హాంగ్కాంగ్- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 17: పాకిస్తాన్ వర్సెస్ యూఏఈ- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 18: శ్రీలంక వర్సెస్ అఫ్గనిస్తాన్- అబుదాబి- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 19: ఇండియా వర్సెస్ ఒమన్- అబుదాబి- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 20: గ్రూప్- బి టాపర్ వర్సెస్ రెండో స్థానంలో ఉన్న జట్టు (B1 Vs B2)- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 21: గ్రూప్-ఎ టాపర్ వర్సెస్ రెండో స్థానంలో ఉన్న జట్టు (A1 vs A2)- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 23: A2 vs B1- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 24: A1 vs B2- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 25: A2 vs B2- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 26: A1 vs B1- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు👉సెప్టెంబరు 28: ఫైనల్- దుబాయ్- రాత్రి ఎనిమిది గంటలకు.జట్లు ఇవేటీమిండియాసూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.పాకిస్తాన్సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్ (వికెట్-కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్ జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహిన్ అఫ్రిది, సూఫియాన్ మొకిమ్యూఏఈముహమ్మద్ వసీం (కెప్టెన్), అలిశాన్ షరాఫూ, ఆర్యాంశ్ శర్మ (వికెట్ కీపర్), ఆసిఫ్ ఖాన్, ధ్రువ్ పరాశర్, ఈథన్ డిసౌజా, హైదర్ అలీ, హర్షిత్ కౌశిక్, జునైద్ సిద్దిఖీ, మతీఉల్లా ఖాన్, ముహమ్మద్ ఫారూక్, ముహమ్మద్ జవాదుల్లా, ముహమ్మద్ జోహైబ్, రాహుల్ చోప్రా (వికెట్ కీపర్), రోహిద్ ఖాన్, సిమ్రన్జీత్ సింగ్, సాఘిర్ ఖాన్.ఒమన్జతీందర్ సింగ్ (కెప్టెన్), హమ్మద్ మీర్జా, వినాయక్ శుక్లా, సూఫియాన్ యూసుఫ్, ఆశిష్ ఒడెదెరా, అమీర్ కలీమ్, మహ్మద్ నదీమ్, సూఫియాన్ మెహమూద్, ఆర్యన్ బిష్త్, కరణ్ సోనావాలే, జిక్రియా ఇస్లాం, హస్నైన్ అలీ షా, ఫైసల్ షా, మహమ్మద్ ఇమ్రాన్, షకీల్ అహ్మద్, సమయ్ శ్రీవాస్తవ.శ్రీలంకచరిత్ అసలంక (కెప్టెన్), కుశాల్ మెండిస్ (వికెట్కీపర్), పాతుమ్ నిస్సాంక, కుశాల్ పెరీరా, కమిల్ మిషార, దసున్ షనక, కమిందు మెండిస్, వనిందు హసరంగ, నువానీదు ఫెర్నాండో, దునిత్ వెల్లాలగే, చమిక కరుణరత్నే, మహీశ్ తీక్షణ, మతీశ పతిరణ, నువాన్ తుషార, దుష్మంత చమీరా, బినుర ఫెర్నాండో.బంగ్లాదేశ్లిట్టన్ కుమార్ దాస్ (కెప్టెన్), తాంజిద్ హసన్, పర్వేజ్ హొస్సేన్ ఇమాన్, సైఫ్ హసన్, తౌహిద్ హ్రిదోయ్, జాకర్ అలీ అనిక్, షమీమ్ హొస్సేన్, క్వాజీ నూరుల్ హసన్ సోహన్, షాక్ మహేదీ హసన్, రిషద్ హుస్సేన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తాంజిమ్ హసన్ సకీబ్, టస్కిన్ అహ్మద్, షరీఫుల్ ఇస్లాం, షైఫ్ ఉద్దీన్స్టాండ్బై ప్లేయర్లు: సౌమ్య సర్కార్, మెహిదీ హసన్ మిరాజ్, తన్వీర్ ఇస్లాం, హసన్ మహమూద్.అఫ్గనిస్తాన్రషీద్ ఖాన్ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, దర్విష్ రసూలీ, సెదిఖుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కరీం జనత్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, షరాఫుద్దీన్ అష్రఫ్, మహ్మద్ ఇషాక్, ముజీబ్ ఉర్ రహమాన్, అల్లాహ్ గజన్ఫార్. నూర్ అహ్మద్, ఫారిక్ అహ్మద్ మాలిక్, నవీన్-ఉల్-హక్, ఫజల్హాక్ ఫరూకీరిజర్వ్ ఆటగాళ్లు: వఫివుల్లా తారఖాల్, నంగ్యాల్ ఖరోటే, అబ్దుల్లా అహ్మద్జాయ్హాంకాంగ్యాసిమ్ ముర్తాజా (కెప్టెన్), బాబర్ హయత్, ఆదిల్ మెహమూద్, జీషన్ అలీ (వికెట్ కీపర్), ఎహ్సాన్ ఖాన్, అనాస్ ఖాన్, షాహిద్ వాసిఫ్ (వికెట్ కీపర్), కల్హన్ చల్లు, హరూన్ అర్షద్, నిజకత్ ఖాన్, ఆయుశ్ శుక్లా, అలీ హసన్, నస్రుల్లా రానా, ఐజాజ్ ఖాన్, ఎండీ ఘజన్ఫర్, మార్టిన్ కోయెట్జి, అతీక్ ఇక్బాల్, మహ్మద్ వాహిద్, అన్షుమన్ రథ్, కించిత్ షా.ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే..ఆసియా కప్-2025 టీ20 మ్యాచ్లను సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ (టీవీ)లో వీక్షించవచ్చు. డిజిటల్ యూజర్ల కోసం సోనీలివ్ వెబ్సైట్, మొబైల్ అప్లికేషన్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.ప్రైజ్ మనీ ఎంతంతంటే?ఆసియాకప్-2022(టీ20 ఫార్మాట్) ఛాంపియన్స్గా నిలిచిన శ్రీలంకకు దాదాపు 200,000 డాలర్ల( సుమారు రూ. 1.6 కోట్లు) ప్రైజ్మనీ లభించింది. ఈ ఏడాది ఆసియా విజేతగా నిలిచే జట్టుకు 300,000 డాలర్లు (దాదాపు రూ. 2.6 కోట్లు) నగదు బహుమతి ఏసీసీ అందజేయనున్నట్లు సమాచారం. గత ఎడిషన్తో పోలిస్తే ఇది 50 శాతం అధికం. రన్నరప్గా నిలిచే జట్టు 150,000 డాలర్లు (సుమారు రూ. 1.3 కోట్లు) ప్రైజ్మనీ సొంతం చేసుకోనుంది. మూడు, నాలుగు స్ధానాల్లో నిలిచే జట్లు వరుసగా రూ. 80, 60 లక్షలు దక్కించుకోనున్నాయి.చదవండి: కుంబ్లేకి చెప్పి ఏడ్చాను.. అయినా పట్టించుకోలేదు.. కేఎల్ రాహుల్ కాల్ చేసి: క్రిస్ గేల్ -
అతడే నా ఫేవరెట్ క్రికెటర్.. టీమిండియాకు ఎందుకు సెలక్ట్ చేయరు?
వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం క్రిస్ గేల్ (Chris Gayle) టీమిండియా సెలక్టర్ల తీరును విమర్శించాడు. టెస్టు జట్టులో ఉండేందుకు సర్ఫరాజ్ ఖాన్ (Sarfraz Khan) అర్హుడని.. అతడికి వరుస అవకాశాలు ఇవ్వాలని పేర్కొన్నాడు. బరువు అనేది పెద్ద సమస్య కాదని.. ఆటగాడు ఫిట్గా ఉంటే చాలంటూ సర్ఫరాజ్కు మద్దతుగా నిలిచాడు.న్యూజిలాండ్తో చివరగా..కాగా 2024లో ఇంగ్లండ్తో స్వదేశంలో టెస్టు సిరీస్ సందర్భంగా సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున ఆరు టెస్టులు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఓ శతకం, మూడు అర్ధ శతకాల సాయంతో 371 పరుగులు చేశాడు. చివరగా న్యూజిలాండ్తో గతేడాది నవంబరులో జరిగిన మ్యాచ్లో సర్ఫరాజ్ ఖాన్ ఆడాడు.ఆ తర్వాత ఇంగ్లండ్-‘ఎ’తో అనధికారిక టెస్టు సిరీస్ ఆడిన భారత్-‘ఎ’ జట్టుకు ఎంపికైన సర్ఫరాజ్.. ప్రధాన జట్టు (టీమిండియా)లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. తదుపరి ఆస్ట్రేలియా- ‘ఎ’తో మ్యాచ్కు కూడా ఈ ముంబైకర్ దూరమయ్యాడు. గాయం వల్ల అతడు సెలక్షన్కు అందుబాటులో లేకుండా పోయినట్లు సమాచారం.అతడు బాగా బరువు తగ్గాడుఈ నేపథ్యంలో క్రిస్ గేల్ సర్ఫరాజ్ ఖాన్కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలంటూ టీమిండియా సెలక్టర్లకు విజ్ఞప్తి చేశాడు. ‘‘అతడు భారత టెస్టు తుదిజట్టులో ఉండాలి. లేదంటే కనీసం జట్టులోనైనా అతడికి చోటివ్వాలి. సొంతగడ్డపై ఇంగ్లండ్ మీద సెంచరీ చేసిన ఆటగాడిని పక్కనపెట్టారు.కొన్నాళ్ల క్రితం సోషల్ మీడియాలో ఓ పోస్టు చూశాను. అతడు బాగా బరువు తగ్గాడు. అసలు బరువు అనేది సమస్యే కాదు. అతడు ఫిట్గా ఉన్నాడు. పరుగులు చేస్తున్నాడు. అదే కదా అన్నింటికంటే ముఖ్యమైనది.టెస్టు జట్టులో ఉండాల్సిందేఫస్ట్క్లాస్ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీలు బాదిన ఆటగాడు. కానీ బరువును సాకుగా చూపి అతడిని జట్టు నుంచి తప్పించినట్లయితే అది నిజంగా విచారించదగ్గ విషయం. వందకు వంద శాతం అతడు టెస్టు జట్టులో ఉండాల్సిందే.ఇండియాలో ప్రతిభకు కొదువలేదు. అయితే, ఇలాంటి ప్రత్యేకమైన ఆటగాడు మాత్రం అవకాశాలకు అర్హుడు’’ అంటూ గేల్ టీమిండియా సెలక్టర్ల తీరును విమర్శించాడు. శుభంకర్ మిశ్రా పాడ్కాస్ట్లో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.అతడే నా అభిమాన క్రికెటర్ఇక భారత క్రికెటర్లలో సర్ఫరాజ్ ఖాన్ తన అభిమాన క్రికెటర్ అని గేల్ ఈ సందర్భంగా తెలిపాడు. విరాట్ కోహ్లి వంటి దిగ్గజ క్రికెటర్ను కాదని.. గేల్ సర్ఫరాజ్ పేరు చెప్పడం విశేషం. కాగా ఐపీఎల్లో గేల్- సర్ఫరాజ్ ఖాన్ ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. టీమిండియా చివరగా ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ ఆడింది. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీని 2-2తో సమం చేసింది. తదుపరి టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా కప్-2025 ఆడిన అనంతరం.. స్వదేశంలో వెస్టిండీస్తో టెస్టులు ఆడనుంది.చదవండి: కుంబ్లేకి చెప్పి ఏడ్చాను.. అయినా పట్టించుకోలేదు.. కేఎల్ రాహుల్ కాల్ చేసి: క్రిస్ గేల్ -
IND vs UAE: భయమేమీ లేదు.. బాగా ఆడిన జట్టుదే గెలుపు: యూఏఈ కోచ్
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్ నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కోచ్, భారత మాజీ క్రికెటర్ లాల్చంద్ రాజ్పుత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరని.. మ్యాచ్ రోజున బాగా ఆడిన వాళ్లనే విజయం వరిస్తుందని పేర్కొన్నాడు. కాగా పొట్టి క్రికెట్ ప్రేమికులను అలరించేందుకు ఆసియా కప్ టోర్నీ సిద్ధమైపోయింది.టీమిండియా వర్సెస్ యూఏఈఈసారి టీ20 ఫార్మాట్లో యూఏఈలో జరిగే ఈ ఖండాంతర టోర్నీలో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్- ‘ఎ’ నుంచి భారత్ , పాకిస్తాన్లతో పాటు పసికూనలు యూఏఈ, ఒమన్.. గ్రూప్- ‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ పోటీ పడతాయి. సెప్టెంబరు 9న అఫ్గనిస్తాన్- హాంకాంగ్ మ్యాచ్తో టోర్నీకి తెరలేవనుండగా.. సెప్టెంబరు 10న యూఏఈ టీమిండియాను ఢీకొట్టనుంది.మేము ఫియర్లెస్ క్రికెట్ ఆడతాముఈ నేపథ్యంలో యూఏఈ కోచ్ లాల్చంద్ రాజ్పుత్ మీడియాతో మాట్లాడాడు.. ‘‘టీమిండియా పటిష్ట జట్టు. గత టీ20 ప్రపంచకప్లో చాంపియన్. అలాంటి జట్టుతో ఆడే అవకాశం రావడం గొప్ప విషయం.అయితే, టీ20 ఫార్మాట్లో మ్యాచ్ రోజున ఏ జట్టైతే బాగా ఆడుతుందో అదే గెలుస్తుంది. ఒక్క బ్యాటర్ లేదంటే బౌలర్ మ్యాచ్ను మలుపు తిప్పగలరు. మేము ఫియర్లెస్ క్రికెట్ ఆడతాము.అన్నింటికీ సిద్ధంగా ఉన్నారుమా జట్టు బ్యాటింగ్ విభాగం బలంగా ఉంది. బౌలింగ్ యూనిట్లో మంచి స్పిన్నర్లు ఉన్నారు. యూఏఈలో మ్యాచ్లు ఆడిన అనుభవం వారికి ఉంది. అయితే, పటిష్ట జట్టు అయిన టీమిండియాతో ఎలా ఆడతారో చూద్దాం.ప్రతి ఒక్క జట్టుకు టీమిండియాతో ఆడాలని ఉంటుంది. మేము కూడా అంతే. అయితే, కాస్త ఆందోళనగానే ఉంది. ఏదేమైనా మా ఆటగాళ్లు అన్నింటికీ సిద్ధంగా ఉన్నారు’’ అని లాల్చంద్ రాజ్పుత్ పేర్కొన్నాడు. కాగా యూఏఈ జట్టు ఇటీవల పాకిస్తాన్- అఫ్గనిస్తాన్లతో కలిసి ముక్కోణపు టీ20 సిరీస్ ఆడింది. అయితే, ఒక్క మ్యాచ్లో కూడా గెలవలేదు.ఆసియా కప్-2025 టోర్నీకి యూఏఈ జట్టు:ముహమ్మద్ వసీం (కెప్టెన్), అలిశాన్ షరాఫూ, ఆర్యాంశ్ శర్మ (వికెట్ కీపర్), ఆసిఫ్ ఖాన్, ధ్రువ్ పరాశర్, ఈథన్ డిసౌజా, హైదర్ అలీ, హర్షిత్ కౌశిక్, జునైద్ సిద్దిఖీ, మతీఉల్లా ఖాన్, ముహమ్మద్ ఫారూక్, ముహమ్మద్ జవాదుల్లా, ముహమ్మద్ జోహైబ్, రాహుల్ చోప్రా (వికెట్ కీపర్), రోహిద్ ఖాన్, సిమ్రన్జీత్ సింగ్, సాఘిర్ ఖాన్.చదవండి: కుంబ్లేకి చెప్పి ఏడ్చాను.. అయినా పట్టించుకోలేదు.. కేఎల్ రాహుల్ కాల్ చేసి: క్రిస్ గేల్ -
సెంచరీ వీరుడు అవుట్.. ఫైనల్లో కష్టమే!
దులిప్ ట్రోఫీ-2025 (Duleep Trophy) ఫైనల్కు చేరిన సౌత్ జోన్కు ఎదురుదెబ్బ తగిలింది. టైటిల్ పోరుకు అర్హత సాధించడంలో కీలకంగా వ్యవహరించిన సెంచరీ వీరుడు నారాయణ్ జగదీశన్ (N Jagadeesan) జట్టుకు దూరమయ్యాడు.అదే విధంగా.. దేవ్దత్ పడిక్కల్ కూడా అందుబాటులో ఉండటం లేదు. వీరిద్దరు ఆస్ట్రేలియా- ‘ఎ’ జట్టుతో జరిగే అనధికారిక టెస్టు సిరీస్కు ఎంపికయ్యారు. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత్- ‘ఎ’ తరఫున ఆడబోతున్నారు. ఈ సిరీస్ సెప్టెంబరు 16 నుంచి ప్రారంభం కానుంది.సౌత్ జోన్ వర్సెస్ సెంట్రల్ జోన్మరోవైపు.. దులిప్ ట్రోఫీ-2025 ఫైనల్కు సెప్టెంబరు 11- 15 వరకు షెడ్యూల్ ఖరారైంది. సౌత్ జోన్- సెంట్రల్ జోన్ టైటిల్ కోసం తలపడనున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో నారాయణ్ జగదీశన్, దేవ్దత్ పడిక్కల్ స్థానాల్లో ఆండ్రీ సిద్దార్థ్ (తమిళనాడు), స్మరణ్ రవిచంద్రన్ (కర్ణాటక) సౌత్ జోన్ జట్టుకు ఎంపికయ్యారు. అజయ్ రోహెరా, అనికేత్ రెడ్డి స్టాండ్ బై ప్లేయర్లుగా చోటు దక్కించుకున్నారు.ఫైనల్కు సౌత్ జోన్ జట్టు (అప్డేటెడ్)అజారుద్దీన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), రికీ భుయ్ (వైస్-కెప్టెన్), స్మరణ్ రవిచంద్రన్, కాలే ఎమ్, షేక్ రషీద్, తన్మయ్ అగర్వాల్, సల్మాన్ నిజార్, ఆండ్రీ సిద్దార్థ్, తనయ్ త్యాగరాజన్, గుర్జాబ్నీత్ సింగ్, నిధీష్, కౌశిక్ వి, అనికేత్, టి. విజయ్, బాసిల్ ఎన్పీ.స్టాండ్ బై ప్లేయర్లు: మోహిత్ రెడ్కర్ (గోవా), స్నేహల్ కౌతంకర్ (గోవా), ఈడెన్ యాపిల్ టామ్ (కేరళ), అజయ్ రోహెరా (పాండిచ్చేరి), జి. అనికేత్ రెడ్డి (హైదరాబాద్).వెస్ట్జోన్కు నిరాశేఇదిలా ఉంటే.. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, శార్దుల్ ఠాకూర్లాంటి భారత ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించిన వెస్ట్జోన్ దులీప్ ట్రోఫీలో సెమీఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. సెంట్రల్ జోన్తో మ్యాచ్ ‘డ్రా’ కాగా... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో దేశవాళీ ఆటగాళ్లతో కూడిన సెంట్రల్ జోన్ ముందంజ వేసింది. మరో సెమీఫైనల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన తన్మయ్ అగర్వాల్, తనయ్ త్యాగరాజన్, రికీ భుయ్లు బాధ్యతగా ఆడటంతో సౌత్జోన్ కూడా దులీప్ ట్రోఫీ ఫైనల్లోకి దూసుకెళ్లింది.నార్త్జోన్తో సౌత్ సెమీస్ పోరు కూడా ‘డ్రా’గానే ముగిసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో అంతిమ పోరుకు అర్హత సంపాదించిన సౌత్జోన్... ఈ నెల 11 నుంచి ఇదే వేదికపై జరిగే టైటిల్ పోరులో సెంట్రల్ జోన్తో తలపడుతుంది. విజేతను తేల్చనున్న ఫైనల్ మ్యాచ్ సంప్రదాయ టెస్టులాగా ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు. సెంట్రల్ 600 ఆలౌట్ వెస్ట్జోన్తో జరిగిన ఈ సెమీఫైనల్ మ్యాచ్లో సెంట్రల్ జోన్ బ్యాటర్లు సమష్టిగా రాణించారు. ఆఖరి రోజు సారాంశ్ జైన్ (108 బంతుల్లో 63 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధసెంచరీ కొట్టాడు. దీంతో క్రీజులోకి దిగిన 11 మందిలో ఏకంగా ఆరుగురు బ్యాటర్లు అర్ధశతకం పైచిలుకు పరుగులు చేయడం విశేషం. దీంతో నాలుగో రోజు 556/8 ఆదివారం తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన సెంట్రల్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 164.3 ఓవర్లలో 600 పరుగుల వద్ద ఆలౌటైంది.టెయిలెండర్లు సారాంశ్, యశ్ ఠాకూర్లపై కూడా వెస్ట్ బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. దీంతో వీరిద్దరు అవలీలగా పరుగులు సాధించారు. ఈ క్రమంలో సారాంశ్ జైన్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొమ్మిదో వికెట్కు 42 పరుగులు జతయ్యాక యశ్ ఠాకూర్ (21; 5 ఫోర్లు)ను అర్జన్ అవుట్ చేయగా, కాసేపటికే ఖలీల్ అహ్మద్ (0) కూడా అతనికే వికెట్ అప్పగించడంతో సెంట్రల్ ఇన్నింగ్స్ సరిగ్గా 600 వద్ద ముగిసింది. అర్జన్ నాగ్వస్వాలాకు 3 వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్లో సెంట్రల్కు 162 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ ఆధిక్యమే జట్టును ఫైనల్కు తీసుకెళ్లింది.రాణించిన జైస్వాల్.. శ్రేయస్ ఫెయిల్అప్పటికే ఫలితం ఖాయమైన మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్ ఆడిన వెస్ట్జోన్ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసే సమయానికి 53.3 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో నిరాశపరిచిన భారత డాషింగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (70 బంతుల్లో 64; 3 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధసెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్లో భారీ శతకం సాధించిన రుతురాజ్ గైక్వాడ్ (16) ఈసారి విఫలమవగా, శ్రేయస్ అయ్యర్ (12) రెండు ఇన్నింగ్స్ల్లోనూ మెప్పించలేకపోయాడు. మిగతా వారిలో తనుశ్ కొటియాన్ (72 బంతుల్లో 40 నాటౌట్; 7 ఫోర్లు), ఆర్య దేశాయ్ (35; 5 ఫోర్లు) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లే చేయలేదు. బ్యాటింగ్లో రాణించిన సెంట్రల్ బౌలర్ సారాంశ్ జైన్ 5, హర్ష్ దూబే 3 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్లో సారాంశ్కు 8 వికెట్లు దక్కాయి. అజేయ అర్ధసెంచరీ కూడా సాధించడంతో అతనికే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.నార్త్జోన్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో సౌత్జోన్కు తొలి ఇన్నింగ్స్లో 175 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఆఖరి రోజు ఓవర్నైట్ స్కోరు 278/5తో తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన నార్త్జోన్ 100.1 ఓవర్లలో 361 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆదివారం ఆటలో 83 పరుగులు జోడించి మిగతా సగం వికెట్లను కోల్పోయింది. ఓవర్నైట్ బ్యాటర్ శుభమ్ ఖజురియా (252 బంతుల్లో 128; 20 ఫోర్లు, 1 సిక్స్) తన క్రితం రోజు స్కోరు వద్దే అవుటయ్యాడు. లోయర్ ఆర్డర్లో మయాంక్ డాగర్ (40 బంతుల్లో 31; 5 ఫోర్లు), సాహిల్ లోత్రా (19; 2 ఫోర్లు) కాసేపు సౌత్జోన్ బౌలర్లను ఎదుర్కోవడంతో జట్టు 300 పైచిలుకు స్కోరు దాటింది. అయితే 2 పరుగుల వ్యవధిలో ని«దీశ్ వీరిద్ధరిని క్లీన్»ౌల్ట్ చేయడంతో ఆలౌటయ్యేందుకు ఎంతో సమయం పట్టలేదు. గుర్జప్నీత్ 4 వికెట్లు తీయగా, నిదీశ్కు 3 వికెట్లు దక్కాయి. జగదీశన్ అజేయ అర్ధశతకం అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌత్జోన్ మ్యాచ్ ముగిసే సమయానికి 24.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. ఓపెనర్ నారాయణ్ జగదీశన్ నార్త్ బౌలర్లపై మళ్లీ ఆడుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో 3 పరుగుల స్వల్ప తేడాతో డబుల్ సెంచరీని కోల్పోయిన జగదీశన్ (69 బంతుల్లో 52 నాటౌట్; 6 ఫోర్లు) అజేయ అర్ధశతకంతో రాణించాడు. మొదట హైదరాబాదీ బ్యాటర్ తన్మయ్ అగర్వాల్ (13)తో కలిసి ఓపెనింగ్ వికెట్కు 34 పరుగులు జతచేశాడు.తన్మయ్ని అకీబ్ నబీ బౌల్డ్ చేయడంతో జగదీశన్కు వన్డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (54 బంతుల్లో 16 నాటౌట్; 1 ఫోర్) జతయ్యాడు. వీరిద్దరు మరో వికెట్ పడకుండా సౌత్ రెండో ఇన్నింగ్స్ను నడిపించారు. ‘డ్రా’ ఫలితం ఖాయమవడంతో జగదీశన్ అర్ధసెంచరీ పూర్తవగానే ఇరుజట్ల కెప్టెన్ను మ్యాచ్ను ముందుగానే ముగించేందుకు చేతులు కలిపారు. రెండు ఇన్నింగ్స్ల్లోనూ అదరగొట్టిన నారాయణ్ జగదీశన్ (తొలి ఇన్నింగ్స్లో 197)కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.చదవండి: భారత జట్టు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్.. బీసీసీఐ ప్రకటన -
కుంబ్లేకి చెప్పి ఏడ్చాను.. అయినా పట్టించుకోలేదు.. అతడేమో...: గేల్
వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ (Chris Gayle) ఐపీఎల్ ఫ్రాంఛైజీ పంజాబ్ కింగ్స్ (Punjab Kings) గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనను అగౌరవపరిచారని.. యాజమాన్యం వ్యవహారశైలి కారణంగా తాను డిప్రెషన్లో కూరుకుపోయే పరిస్థితి తలెత్తిందని తెలిపాడు. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 2008లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు.2021లో ఐపీఎల్కు వీడ్కోలు..క్యాష్ రిచ్ లీగ్లో మొత్తంగా 142 మ్యాచ్లు ఆడిన క్రిస్ గేల్.. ఆరు శతకాల సాయంతో 4965 పరుగులు సాధించాడు. పంజాబ్ కింగ్స్ తరఫున తన చివరి మ్యాచ్ ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 2021లో ఐపీఎల్కు వీడ్కోలు పలికాడు. పంజాబ్ ఫ్రాంఛైజీ (అప్పడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్)కి 2018- 2021 వరకు ప్రాతినిథ్యం వహించిన గేల్.. మొత్తంగా ఆ జట్టు తరఫున 41 మ్యాచ్లు ఆడి 1304 పరుగులు చేశాడు.ఇందులో ఓ సెంచరీ, పదకొండు అర్ధ శతకాలు కూడా ఉండటం విశేషం. ఇక పంజాబ్ తరఫున గేల్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 104. అయితే, జట్టు కోసం ఇంతచేసినా.. ఫ్రాంఛైజీ మాత్రం తనకు కనీస మర్యాద ఇవ్వలేదని గేల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.గౌరవం, మర్యాద ఇవ్వలేదు‘‘పంజాబ్ ఫ్రాంఛైజీ కారణంగా నా ఐపీఎల్ కెరీర్ ముందుగానే ముగిసిపోయింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో నన్ను అగౌరవపరిచారు. ఓ సీనియర్ ఆటగాడిగా నాకు ఇవ్వాల్సిన గౌరవం, మర్యాద ఇవ్వలేదు.జట్టుతో పాటు లీగ్కు కూడా విలువ తెచ్చిన నాలాంటి ఆటగాడి పట్ల అలా ఎవరూ వ్యవహరించరు. నన్నో చిన్నపిల్లాడిలా చూశారు. వారి వైఖరి వల్ల.. జీవితంలో తొలిసారి నేను డిప్రెషన్లోకి వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది.కుంబ్లేకి చెప్పి ఏడ్చాను.. అయినా పట్టించుకోలేదునా మనసు బాగా గాయపడింది. ఇదే విషయాన్ని అనిల్ కుంబ్లేకు చెప్పాను. అతడితో మాట్లాడుతూ గట్టిగా ఏడ్చేశాను. కానీ అతడు కూడా నన్ను పూర్తిగా నిరాశపరిచాడు. ఫ్రాంఛైజీని యాజమాన్యం నడిపిస్తున్న తీరు నన్ను నిరాశకు గురిచేసింది.కేఎల్ రాహుల్ ఫోన్ చేసి..అప్పటి కెప్టెన్ కేఎల్ రాహుల్ నాకు ఫోన్ చేసి.. ‘క్రిస్.. నువ్వు తదుపరి మ్యాచ్ ఆడబోతున్నావు’ అని చెప్పాడు. నేను మాత్రం.. ‘మీకు ఆల్ ది బెస్ట్’ అని చెప్పేసి బ్యాగ్ సర్దేసుకున్నాను. ఫ్రాంఛైజీ నుంచి బయటకు వచ్చేశాను’’ అని శుభంకర్ మిశ్రా పాడ్కాస్ట్లో గేల్ తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి వెల్లడించాడు.కాగా కేకేఆర్, పంజాబ్ జట్లతో పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కూడా గేల్ ప్రాతినిథ్యం వహించాడు. ఇటీవల ఫైనల్లో పంజాబ్ కింగ్స్ను ఓడించి ఆర్సీబీ ట్రోఫీ గెలిచినప్పుడు విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్తో కలిసి మైదానమంతా కలియదిరుగుతూ సందడి చేశాడు. ఇదిలా ఉంటే.. పంజాబ్పైన గేల్ 16 ఇన్నింగ్స్ ఆడి 797 పరుగులు చేయడం గమనార్హం.చదవండి: సెలెక్టర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పాకిస్తాన్ కెప్టెన్ -
Asia Cup 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ న్యాయనిర్ణేతలు వీరే..!
ఆసియా కప్-2025లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య ఈనెల 14న జరుగనున్న గ్రూప్ స్టేజీ మ్యాచ్ కోసం న్యాయనిర్ణేతల (Match Officials) జాబితాను ఐసీసీ ఇవాళ (సెప్టెంబర్ 8) ప్రకటించింది. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ హై వోల్టేజీ మ్యాచ్కు ఫీల్డ్ అంపైర్లుగా రుచిర పల్లియగురుగె (శ్రీలంక), మసుదుర్ రెహ్మాన్ (బంగ్లాదేశ్) ఎంపిక చేయబడ్డారు. వీరిద్దరికి అంతర్జాతీయ అంపైర్లుగా అపార అనుభవం ఉంది.రుచిరాకు 160కి పైగా అంతర్జాతీయ మ్యాచ్ల్లో న్యాయనిర్ణేతగా పని చేసిన అనుభవం ఉండగా.. మసుదూర్ 70కి పైగా మ్యాచ్ల్లో అంపైర్గా వ్యవహరించాడు. రుచిరా 2019 వన్డే వరల్డ్కప్, 2022 మహిళల వరల్డ్కప్ లాంటి మెగా టోర్నీల్లో పని చేయగా.. మసుదూర్ 2022 ఆసియా కప్ ఫైనల్లో అంపైర్గా వ్యవహరించాడు.భారత్, పాక్ మధ్య తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో, ఆసియా కప్ మ్యాచ్లో ఫీల్డ్ అంపైర్ల పాత్రపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే, మైదానంలో వారు తీసుకునే నిర్ణయాలు ఇరు దేశాల అభిమానుల భావోద్వేగాలతో ముడిపడి ఉంటాయి. ఇరు జట్లకు సంబంధించి ఏ ఒక్క తప్పు నిర్ణయం తీసుకున్నా, దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.ఈ మ్యాచ్కు సంబంధించి ఐసీసీ టీవీ అంపైర్, ఫోర్త్ అంపైర్, మ్యాచ్ రిఫరీ పేర్లను కూడా ప్రకటించింది. టీవీ అంపైర్గా అహ్మద్ పక్తీన్ (ఆఫ్ఘానిస్తాన్), ఫోర్త్ అంపైర్గా ఇజతుల్లా సఫీ (ఆఫ్ఘానిస్తాన్) వ్యవహరించనున్నారు. మ్యాచ్ రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్ (జింబాబ్వే) ఉంటారు. -
మానవ శక్తికి కొత్త నిర్వచనం.. 510 కిలోల బరువును సునాయాసంగా ఎత్తేశాడు..!
ఐస్లాండ్కు చెందిన ప్రఖ్యాత స్ట్రాంగ్మాన్ హాఫ్థోర్ బ్జోర్న్సన్ (Hafthor Bjornsson) మానవ శక్తికి కొత్త నిర్వచనం చెప్పాడు. బర్మింగ్హమ్లో జరిగిన 2025 వరల్డ్ డెడ్లిఫ్ట్ ఛాంపియన్షిప్లో ఊహకందని విధంగా 510 కిలో బరువు (1,124.4 పౌండ్లు) ఎత్తాడు. ఈ క్రమంలో తన పేరిటే ఉండిన ప్రపంచ రికార్డును (505 కిలోలు) తిరగరాశాడు. బ్జోర్న్సన్ 500 కిలోలకు పైగా డెడ్లిఫ్ట్ చేయడం ఇది మూడోసారి. 2020లో 501 కిలోలు, 2025 జులై 505 కిలోల బరువులు ఎత్తాడు. తాజా ఉదంతంతో బ్జోర్న్సన్ మానవ శక్తి సామర్థ్యానికి కొత్త ప్రమాణాన్ని స్థాపించాడు. అతని శ్రమ, పట్టుదల, శరీర సామర్థ్యం ప్రపంచానికి ప్రేరణగా నిలుస్తున్నాయి.510kg / 1124lbs DEADLIFT WORLD RECORD pic.twitter.com/WMKUqQvvzr— Hafþór J Björnsson (@ThorBjornsson_) September 6, 20252018లో వరల్డ్ స్ట్రాంగ్మాన్గా అవతరించిన బ్జోర్న్సన్.. ఆతర్వాత Arnold Strongman Classic, Europe’s Strongest Man పోటీలు గెలిచి, ఒకే సంవత్సరంలో ఈ ఘనతలు సాధించిన ఏకైక వ్యక్తిగా చరిత్రకెక్కాడు. 36 ఏళ్ల బ్జోర్న్సన్ తన కెరీర్లో 129కి పైగా ప్రపంచ రికార్డులు, 32 అంతర్జాతీయ టైటిళ్లు సాధించాడు. బ్జోర్న్సన్ Game of Thrones సినిమాలో “The Mountain” పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. -
సెలెక్టర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పాకిస్తాన్ కెప్టెన్
ఆసియా కప్ జట్టుకు తనను ఎంపిక చేయలేదన్న కసితో రగిలిపోతున్న పాకిస్తాన్ వన్డే కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్, తాజాగా ఆ దేశ సెలెక్టర్లకు బ్యాట్తో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఫార్మాట్ ఏదైనా తాను విలువైన ఆటగాడిగేనని బ్యాట్తో సందేశం పంపాడు. ప్రస్తుతం కరీబియన్ ప్రీమియర్ లీగ్లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్కు ఆడుతున్న రిజ్వాన్.. ఇవాళ (సెప్టెంబర్ 8) గయానా అమెజాన్ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ చేసినంత పని చేసి (62 బంతుల్లో 85; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆసియా కప్కు తనను ఎంపిక చేయని వారు పశ్చాత్తాపపడేలా చేశాడు.ఈ మ్యాచ్లో రిజ్వాన్ ఇన్నింగ్స్ కారణంగానే పేట్రియాట్స్ మ్యాచ్ గెలిచింది. రిజ్వాన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా లభించింది. ఈ మ్యాచ్ మొత్తంలో రిజ్వాన్ మినహా ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. కష్టమైన పిచ్పై రిజ్వాన్ అద్భుతంగా ఆడి ప్రశంసలందుకున్నాడు.రిజ్వాన్ వన్డే జట్టు కెప్టెన్ అయినా ఫామ్ లేని కారణంగా పాక్ సెలెక్టర్లు అతన్ని ఆసియా కప్కు ఎంపిక చేయలేదు. టీ20 ఫార్మాట్కు రిజ్వాన్ సరిపొడపడన్నది వారి వాదన. ఆసియా కప్కు పాక్ సెలెక్టర్లు రిజ్వాన్తో పాటు మరో స్టార్ బ్యాటర్ అయిన బాబర్ ఆజమ్ను కూడా ఎంపిక చేయలేదు.బాబర్ను అయితే పాక్ సెలెక్టర్లు చాలాకాలం నుంచే పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు దూరం పెట్టారు. అన్ని ఫార్మాట్లలో అతని దారుణమైన ఫామే ఇందుకు కారణం. అంతర్జాతీయ క్రికెట్లో అతను సెంచరీ చేసి రెండేళ్లు పూర్తైంది. సీనియర్లైన రిజ్వాన్, బాబర్పై వేటు వేసిన పాక్ సెలెక్టర్లు.. సల్మాన్ అఘా నేతృత్వంలోని యువ జట్టును ఆసియా కప్కు ఎంపిక చేశారు.కరీబియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ విషయానికొస్తే.. రిజ్వాన్ (85) చెలరేగినా, తొలుత బ్యాటింగ్ చేసిన పేట్రియాట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో వారియర్స్ కూడా తడబడి లక్ష్యానికి 6 పరుగుల దూరంలో నిలిచిపోయింది. వారియర్స్ ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. 31 పరుగులు చేసిన షాయ్ హోప్ టాప్ స్కోరర్గా నిలిచాడు. -
ఈ ఏడాది మూడో శతకం.. వన్డేల్లోనూ కొనసాగుతున్న రూట్ జోరు
గత ఐదారేళ్లుగా టెస్ట్ క్రికెట్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న జో రూట్.. ప్రస్తుతం వన్డేల్లోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. కొంతకాలం క్రితం వరకు రూట్కు కేవలం టెస్ట్ బ్యాటర్గా మాత్రమే ముద్ర ఉండేది. ఈ ముద్రను రూట్ ఇటీవలికాలంలో చెరిపేశాడు. వన్డేల్లోనూ వరుస పెట్టి సెంచరీలు చేస్తూ, పరుగుల వరద పారిస్తూ సత్తా చాటుతున్నాడు.ఈ ఏడాది రూట్ ఇప్పటికే 3 వన్డే శతకాలు చేశాడు. తాజాగా సౌతాఫ్రికాపై చేసిన సెంచరీ అతని వన్డే కెరీర్లో 19వది. మొత్తం కెరీర్లో 58వది. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న క్రికెటర్లలో కోహ్లి (82) తర్వాత అత్యధిక సెంచరీలు రూట్ పేరిటే ఉన్నాయి. సెంచరీల విషయంలో రూట్ తన సమకాలిక దిగ్గజాలైన రోహిత్ శర్మ (49), కేన్ విలియమ్సన్ (48), స్టీవ్ స్మిత్ను (48) దాటేసి మరింత దూరం వెళ్లిపోతున్నాడు.తాజాగా సౌతాఫ్రికాపై చేసిన సెంచరీతో బాబర్ ఆజమ్, బ్రియాన్ లారా, మహేల జయవర్ధనే సరసన చేరాడు. వీరంతా వన్డేల్లో తలో 19 సెంచరీలు చేశారు. తాజా చేసిన సెంచరీ రూట్ ఇంగ్లండ్ గడ్డపై 10వది. ఈ సెంచరీతో అతను స్వదేశంలో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాడిగా ట్రెస్కోథిక్ రికార్డును బద్దలు కొట్టాడు.వన్డేల్లో ఇప్పటికే ఇంగ్లండ్ తరఫున అత్యధిక సెంచరీలు (19), పరుగులు (7301) చేసిన ఆటగాడిగా కొనసాగుతున్న రూట్.. ఈ ఏడాది ఈ ఫార్మాట్లోనూ కెరీర్ అత్యుత్తమ ఫామ్లో ఉన్నాడు. ఈ ఏడాది రూట్ 70కి పైగా సగటుతో పరుగులు చేశాడు. ఫ్యాబ్ ఫోర్లో రూట్.. కోహ్లి, విలియమ్సన్, స్టీవ్ స్మిత్లకు సవాల్ విసురుతూ దూసుకుపోతున్నాడు.సౌతాఫ్రికాతో మ్యాచ్ విషయానికొస్తే.. రూట్తో పాటు యువ ఆటగాడు జేకబ్ బేతెల్ కూడా సెంచరీతో చెలరేగడం, ఆతర్వాత బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్ నిప్పులు చెరగడంతో ఇంగ్లండ్ సౌతాఫ్రికాపై 342 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వన్డే క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇదే అతి భారీ విజయం. ఈ మ్యాచ్లో గెలిచినా ఇంగ్లండ్ 3 మ్యాచ్ల సిరీస్ను 1-2 తేడాతో కోల్పోయింది. -
యూఎస్ ఓపెన్ విజేత అల్కరాజ్.. అరుదైన ఘనత
స్పానిష్ యువ సంచలనం కార్లోస్ ఆల్కరాజ్ 2025 యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను సాధించాడు. ఫైనల్లో ఇటలీకి చెందిన జానిక్ సినర్ను 6–2, 3–6, 6–1, 6–4 తేడాతో ఓడించి, రెండో యూఎస్ ఓపెన్ను (2022, 2025), ఓవరాల్గా ఆరో గ్రాండ్స్లామ్ను (2022 యూఎస్ ఓపెన్, 2023 వింబుల్డన్, 2024 ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, 2025 ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్) సొంతం చేసుకున్నాడు.ఈ గెలుపుతో అల్కరాజ్ నంబర్ వన్ స్థానాన్ని కూడా తిరిగి దక్కించకున్నాడు. అల్కరాజ్ 23 ఏళ్ల వయసులోనే మూడు వేర్వేరు సర్ఫేస్లపై (క్లే, గ్రాస్, హార్డ్కోర్ట్) బహుళ గ్రాండ్స్లామ్ టైటిళ్లు గెలిచిన అరుదైన ఆటగాడిగా నిలిచాడు. అల్కరాజ్, సినర్ ఈ ఏడాది వరుసగా మూడో గ్రాండ్స్లామ్ ఫైనల్స్లో తలపడ్డాడు. ఇందులో సినర్ వింబుల్డన్ విజేతగా నిలువగా.. అల్కరాజ్ మిగతా రెండు (ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్) గెలిచాడు.మ్యాచ్ విషయానికొస్తే.. ఆర్థర్ ఆష్ స్టేడియంలో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్లో అల్కరాజ్ తన అద్భుతమైన ఫుట్వర్క్, శక్తివంతమైన ఫోర్హ్యాండ్స్తో సినర్ను కట్టడి చేశాడు. ఆట ప్రారంభం నుంచే దూకుడు ప్రదర్శించిన అల్కరాజ్ తొలి సెట్ గెలిచి, రెండో సెట్ కోల్పోయినప్పటికీ.. తిరిగి పుంజుకున్నాడు. ఈ మ్యాచ్లో అల్కరాజ్ ఫస్ట్-సర్వ్ అద్భుతంగా ఉండింది. ఇందులో అతను 83 శాతం విజయవంతమయ్యాడు. ఇదే అతని ఆటకు స్థిరతనిచ్చింది. మ్యాచ్ ఆధ్యాంతం అల్కరాజ్ ఫోర్హ్యాండ్ వేగం 100mph పైబడి ఉండింది. ఈ శక్తివంతమైన షాట్లే సినర్ను వెనక్కి నెట్టాయి. ఈ మ్యాచ్లో అల్కరాజ్ అసమాన మానసిక స్థైర్యాన్ని ప్రదర్శించాడు. కీలక పాయింట్లలో ఒత్తిడిని ఎదుర్కొని, క్లచ్ షాట్లతో మ్యాచ్ను తనవైపు తిప్పుకున్నాడు.సినర్ విషయానికొస్తే.. తొలి సెట్ కోల్పోయినప్పటికీ, రెండో సెట్లో అద్భుతంగా పుంజుకున్నాడు. ఈ మ్యాచ్లో సినర్ బేస్లైన్ కంట్రోల్ బాగా ఉండింది. ర్యాలీల్లో స్థిరత్వాన్ని ప్రదర్శించాడు. అన్ ఫోర్స్డ్ ఎర్రర్లు తక్కువగా ఉన్నాయి. ఫుట్వర్క్, బ్యాక్ హ్యాండ్ ఎగ్జిక్యూషన్ బాగానే ఉన్నాయి.అయితే సర్వీస్లో లోపాలు అతని కొంపముంచాయి. సినర్ ఫస్ట్-సర్వ్ విజయశాతం కేవలం 48 శాతంగా ఉంది. అలాగే సినర్ అల్కరాజ్కు బ్రేక్ అవకాశాలు చాలా ఇచ్చాడు. అతని ఆటకు తగిన విధంగా స్పందించలేకపోయాడు. మూడో సెట్ కోల్పోవడం సినర్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ఓవరాల్గా చూస్తే ఈ మ్యాచ్లో సినర్ అల్కరాజ్తో పోటీలో వెనుకపడ్డాడు. -
హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన పాక్ బౌలర్
పాకిస్తాన్ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ మొహమ్మద్ నవాజ్ చరిత్ర సృష్టించాడు. అతని దేశం తరఫున టీ20ల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి స్పిన్ బౌలర్గా రికార్డు నెలకొల్పాడు. యూఏఈ ట్రై సిరీస్ ఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్పై ఈ ఘనత సాధించాడు. హ్యాట్రిక్ సహా ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసి పాక్కు టైటిల్ను అందించాడు.అంతర్జాతీయ టీ20ల్లో నవాజ్కి ముందు 73 మంది హ్యాట్రిక్లు నమోదు చేశారు. పాక్ తరఫున నవాజ్ది మూడో హ్యాట్రిక్. నవాజ్కు ముందు పాక్ తరఫున హ్యాట్రిక్లు సాధించిన వారిద్దరు (ఫహీమ్ అష్రాఫ్, మొహమ్మద్ హస్నైన్) పేస్ బౌలర్లే.మ్యాచ్ విషయానికొస్తే.. నవాజ్ హ్యాట్రిక్ సహా ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగడంతో పాక్ ఆఫ్ఘనిస్తాన్పై 75 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫకర్ జమాన్ (27), మొహమ్మద్ నవాజ్ (25), కెప్టెన్ సల్మాన్ అఘా (24) మాత్రమే 20కి పైగా స్కోర్లు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి పాక్ను కట్టడి చేశారు. రషీద్ ఖాన్ 3, నూర్ అహ్మద్, ఫజల్ హక్ ఫారూకీ తలో 2, ఘజన్ఫర్ ఓ వికెట్ తీసి పాక్ను కట్టడి చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ ఆదిలోనే ఓటమి ఖాయం చేసుకుంది. పాక్ స్పిన్నర్ మొహమ్మద్ నవాజ్ (4-1-19-5) ధాటికి 15.5 ఓవర్లలో 66 పరుగులకే కుప్పకూలింది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. రషీద్ ఖాన్ (17), సెదిఖుల్లా అటల్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. నవాజ్ 6వ ఓవర్ చివరి రెండు బంతులకు, 8వ ఓవర్ తొలి బంతికి వికెట్లు తీసి హ్యాట్రిక్ సాధించాడు. 8వ ఓవర్లో నవాజ్ మరో వికెట్ కూడా తీశాడు. పాక్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్, సుఫియాన్ ముఖీమ్ కూడా తలో 2 వికెట్లు తీసి ఆఫ్ఘనిస్తాన్ను దెబ్బ కొట్టారు. షాహీన్ అఫ్రిది ఓ వికెట్ దక్కించుకున్నాడు.ఈ టోర్నీలో పాల్గొన్న మరో జట్టు యూఏఈ. ఈ జట్టు లీగ్ దశలో ఆడిన 4 మ్యాచ్ల్లో ఓడి అప్పుడే నిష్క్రమించింది. -
ఎట్టకేలకు ఒకటి.. ట్రై సిరీస్ గెలిచిన పాక్.. ఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్పై విజయం
ద్వైపాక్షిక సిరీస్లు కాకుండా పాక్ ఇటీవలికాలంలో ఆడిన ఏ ప్రధాన టోర్నీ గెలవలేదు. చివరిగా 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఆ జట్టు.. ఎట్టకేలకు 8 ఏళ్ల తర్వాత రెండుకు పైగా జట్లు పాల్గొన్న ఓ టోర్నీలో విజయం సాధించింది. యూఏఈ వేదికగా జరిగిన ముక్కోణపు టోర్నీలో విజేతగా నిలిచింది. నిన్న (సెప్టెంబర్ 7) జరిగిన ఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ను ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది.షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ చెప్పుకోదగ్గ స్కోరేమీ చేయలేదు. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫకర్ జమాన్ (27), మొహమ్మద్ నవాజ్ (25), కెప్టెన్ సల్మాన్ అఘా (24) మాత్రమే 20కి పైగా స్కోర్లు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి పాక్ను కట్టడి చేశారు. రషీద్ ఖాన్ 3, నూర్ అహ్మద్, ఫజల్ హక్ ఫారూకీ తలో 2, ఘజన్ఫర్ ఓ వికెట్ తీసి పాక్ను కట్టడి చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో పాక్ విజయవంతమైంది. ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ తడబడింది. మొహమ్మద్ నవాజ్ (4-1-19-5) ధాటికి 15.5 ఓవర్లలో 66 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా లో స్కోరింగ్ మ్యాచ్లో 75 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. పాక్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్, సుఫియాన్ ముఖీమ్ కూడా తలో 2 వికెట్లు తీసి ఆఫ్ఘనిస్తాన్ను దెబ్బ కొట్టారు. షాహీన్ అఫ్రిది ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో రషీద్ ఖాన్ (17), సెదిఖుల్లా అటల్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఈ టోర్నీలో పాల్గొన్న మరో జట్టు యూఏఈ. ఈ జట్టు లీగ్ దశలో ఆడిన 4 మ్యాచ్ల్లో ఓడి అప్పుడే నిష్క్రమించింది. -
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్.. వన్డే క్రికెట్లో అతి భారీ విజయం
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. వన్డే క్రికెట్లో పరుగుల పరంగా అతి భారీ విజయం నమోదు చేసింది. సౌతాఫ్రికాతో నిన్న (సెప్టెంబర్ 7) జరిగిన మ్యాచ్లో 342 పరుగుల భారీ తేడాతో గెలుపొందడంతో ఈ ఘనత సాధించింది. 54 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇంతటి భారీ విజయాన్ని ఏ జట్టు సాధించలేదు.ఇంగ్లండ్కు ముందు ఈ రికార్డు భారత్ పేరిట ఉంది. టీమిండియా 2023 జనవరిలో శ్రీలంకపై 317 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విభాగంలో ఆస్ట్రేలియా, జింబాబ్వే.. ఇంగ్లండ్, భారత్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2023 అక్టోబర్లో ఆస్ట్రేలియా నెదర్లాండ్స్పై 309 పరుగుల తేడాతో.. 2023 జూన్లో జింబాబ్వే యూఎస్ఏపై 304 పరుగుల తేడాతో గెలుపొందాయి.కాగా, స్వదేశంలో సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నిన్న జరిగిన (సౌతాంప్టన్) మూడో వన్డేలో ఇంగ్లండ్ఈ చారిత్రక విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్కు ఒరిగేదేమీ లేనప్పటికీ చరిత్ర సృష్టించగలిగింది. ఎందుకుంటే, ఈ సిరీస్లో తొలి రెండు మ్యాచ్లను గెలిచిన సౌతాఫ్రికా అప్పటికే సిరీస్ను కైవసం చేసుకుంది.రూట్, బేతెల్ శతకాలుటాస్ ఓడి సౌతాఫ్రికా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రూట్ (100), జేకబ్ బేతెల్ (110) శతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 414 పరుగులు చేసింది. జేమీ స్మిత్ (62), జోస్ బట్లర్ (62 నాటౌట్) కూడా మెరుపు అర్ద సెంచరీలతో రాణించారు. బెన్ డకెట్ 31, కెప్టెన్ బ్రూక్ 3 పరుగులకు ఔట్ కాగా.. విల్ జాక్స్ 19 పరుగులతో అజేయంగా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్లందరూ ధారాళంగా పరుగులు సమర్పించున్నారు. కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్ తలో 2 వికెట్లు తీశారు.నిప్పులు చెరిగిన ఆర్చర్.. బెంబేలెత్తిపోయిన సౌతాఫ్రికా బ్యాటర్లుఅనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా.. జోఫ్రా ఆర్చర్ (9-3-18-4), బ్రైడన్ కార్స్ (6-1-33-2), ఆదిల్ రషీద్ (3.5-0-13-3) ధాటికి కనీసం సగం ఓవర్లు కూడా ఆడలేక 20.5 ఓవర్లలో 72 పరుగులకే కుప్పకూలింది. సౌతాఫ్రికాకు వన్డే క్రికెట్లో ఇది అతి భారీ పరాజయం. ఆ జట్టుకు వన్డేల్లో ఇది రెండో అత్యల్స స్కోర్ (72) కూడా. ఈ మ్యాచ్లో ఆర్చర్ దెబ్బకు సౌతాఫ్రికా బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో కార్బిన్ బాష్ చేసిన 20 పరుగులే అత్యధికం. అరంగేట్రం నుంచి వరుసగా 5 మ్యాచ్ల్లో 50 ప్లస్ స్కోర్లు చేసి చరిత్ర సృష్టించిన మాథ్యూ బ్రీట్జ్కీ (4) ఈ మ్యాచ్లో నిరాశపరిచాడు. మంచి ఫామ్లో ఉండిన మార్క్రమ్, ముల్దర్ డకౌట్లయ్యారు. రికెల్టన్ 1 పరుగుకే వెనుదిరిగాడు. విధ్వంసకర ఆటగాళ్లు స్టబ్స్ (10), బ్రెవిస్ (6) చేతులెత్తేశారు. -
తెలుగు టైటాన్స్కు రెండో విజయం
విశాఖ స్పోర్ట్స్: ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్ లో తెలుగు టైటాన్స్ రెండో విజయాన్ని సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో టైటాన్స్ 44–34 తో బెంగాల్ వారియర్స్పై నెగ్గింది. టైటాన్స్ జట్టులో భరత్ 12, విజయ్ 11 పాయింట్లు సాధించారు. రెయిడర్ చేతన్ సాహు, డిఫెండర్ అంకిత్ చెరో 5 పాయింట్లు చేశారు. బెంగాల్ తరఫున కెప్టెన్ దేవాంక్ ఒంటరి పోరాటం చేసి 13 పాయింట్లు సాధించాడు. డిఫెండర్లలో నితీశ్ (6), ఆశిష్ (5) మెరుగ్గా ఆడారు. అనంతరం పోటాపోటీగా జరిగిన రెండో మ్యాచ్లో రెండుసార్లు విజేతగా నిలిచిన జైపూర్ పింక్ పాంథర్స్ 35–36తో దబంగ్ ఢిల్లీ చేతిలో ఓడిపోయింది. దబంగ్ కెప్టెన్ అశు మలిక్ 21 పాయింట్లు సాధించాడు. జైపూర్ తరఫున రెయిడర్లు నితిన్ (14), సాహిత్ (10) రాణించారు. నేడు జరిగే మ్యాచ్ల్లో హరియాణాతో బెంగళూరు బుల్స్, పుణేరి పల్టన్తో పట్నా పైరేట్స్ తలపడతాయి. -
మనదే ఆసియా కప్
రాజ్గిర్ (బిహార్): మ్యాచ్ మ్యాచ్కూ రాటుదేలిన భారత పురుషుల హాకీ జట్టు అసలు సిసలు సమరంలోనూ తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. సొంతగడ్డపై జరిగిన ఆసియా కప్ టోర్నీలో హర్మన్ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు చాంపియన్గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత జట్టు 4–1 గోల్స్ తేడాతో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియా జట్టును ఓడించింది. ఈ విజయంతో ఆసియా కప్ విజేత హోదాలో... భారత జట్టు వచ్చే ఏడాది ఆగస్టులో బెల్జియం–నెదర్లాండ్స్లో జరిగే ప్రపంచ కప్ టోర్నీకి నేరుగా అర్హత సాధించింది. కొరియాతో జరిగిన ఫైనల్లో భారత్ తరఫున దిల్ప్రీత్ సింగ్ (28వ, 45వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... సుఖ్జీత్ సింగ్ (1వ నిమిషంలో), అమిత్ రోహిదాస్ (50వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. కొరియా జట్టుకు డెయిన్ సన్ (51వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. విజేతగా నిలిచిన భారత జట్టుకు హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. జట్టులోని ప్రతి సభ్యుడికి రూ. 3 లక్షల చొప్పున... సహాయక సిబ్బందికి రూ. 1 లక్ష 50 వేల చొప్పున నగదు పురస్కారం అందజేయనుంది. ఆసియా కప్ను అత్యధికంగా ఐదుసార్లు నెగ్గిన కొరియా జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా ఫైనల్లో భారత్ పక్కా వ్యూహంతో ఆడింది. తొలి నిమిషం నుంచే సమన్వయంతో కదులుతూ దాడులు చేసింది. ఫలితంగా తొలి నిమిషంలోనే భారత్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత భారత్ జోరు కొనసాగించగా... ఆతిథ్య జట్టు దాడులను అడ్డుకోవడంలోనే కొరియాకు సమయం సరిపోయింది. మ్యాచ్ మొత్తం భారత్ ఒకేతీరుగా ఆడటంతో కొరియాకు తేరుకునే అవకాశం లేకుండా పోయింది. నాలుగు గోల్స్ సమర్పించుకున్నాక కొరియా ఖాతా తెరిచినా అప్పటికే ఆలస్యమైపోయింది. మ్యాచ్ మొత్తంలో భారత్కు రెండు పెనాల్టీ కార్నర్లు రాగా ఒక దానిని సద్వినియోగం చేసుకుంది. ఒక పెనాల్టీ స్ట్రోక్ను వృథా చేసింది. కొరియా జట్టుకు లభించిన మూడు పెనాల్టీ కార్నర్లలో ఒక దానిని గోల్గా మలిచింది. అంతకుముందు మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్లో మలేసియా 4–1తో చైనాపై గెలిచింది.4: ఆసియా కప్ టైటిల్ సాధించడం భారత్కిది నాలుగోసారి. గతంలో భారత్ 2003, 2007, 2017లలో విజేతగా నిలిచింది. కొరియా అత్యధికంగా ఐదుసార్లు ఆసియా కప్ విజేతగా నిలిచింది.164: తాజా ఆసియా కప్లో నమోదైన మొత్తం గోల్స్. ఇందులో 97 ఫీల్డ్ గోల్స్ కాగా... 59 పెనాల్టీ కార్నర్ల ద్వారా, 8 పెనాల్టీ స్ట్రోక్ల ద్వారా వచ్చాయి. మలేసియా ప్లేయర్ అఖీముల్లా 12 గోల్స్తో టోర్నీ టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత్ తరఫున అభిõÙక్, హర్మన్ప్రీత్, సుఖ్జీత్ 6 గోల్స్ చొప్పున చేశారు.39: తాజా ఆసియా కప్లో అత్యధిక గోల్స్ చేసిన జట్టుగా భారత్ (39) నిలిచింది. ఈ టోర్నీలో భారత్ ఆరు మ్యాచ్ల్లో గెలిచి, ఒక మ్యాచ్ను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచింది. -
342 పరుగుల తేడాతో...
సౌతాంప్టన్: వన్డే క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ జట్టు అరుదైన రికార్డు తమ పేరిట లిఖించకుంది. దక్షిణాఫ్రికాతో తొలి రెండు వన్డేల్లో ఓడి ఇప్పటికే సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్ జట్టు ఆఖరి వన్డేలో విశ్వరూపం కనబర్చింది. బ్యాటర్ల జోరుకు బౌలర్ల విజృంభణ తోడవడంతో ఆదివారం జరిగిన మూడో మ్యాచ్లో ఇంగ్లండ్ 342 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది. అంతర్జాతీయ వన్డేల్లో పరుగుల పరంగా ఇదే అతిపెద్ద విజయం కాగా... రెండేళ్ల క్రితం శ్రీలంకపై భారత్ నమోదు చేసుకున్న 317 పరుగుల గెలుపు రెండో స్థానానికి చేరింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 414 పరుగులు చేసింది. 21 ఏళ్ల జాకబ్ బెథెల్ (82 బంతుల్లో 110; 13 ఫోర్లు, 3 సిక్స్లు), సీనియర్ ప్లేయర్ జో రూట్ (96 బంతుల్లో 100; 6 ఫోర్లు) సెంచరీలతో కదంతొక్కగా... జేమీ స్మిత్ (48 బంతుల్లో 62; 9 ఫోర్లు, 1 సిక్స్), జోస్ బట్లర్ (32 బంతుల్లో 62 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఆరంభం నుంచే ఇంగ్లండ్ బ్యాటర్లు ధాటిగా ఆడగా... ఆఖర్లో బట్లర్ మెరుపు ఇన్నింగ్స్తో జట్టుకు భారీ స్కోరు అందించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్, కార్బిన్ బాష్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 20.5 ఓవర్లలో 72 పరుగులకే ఆలౌటైంది. గత రెండు మ్యాచ్ల్లో చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్న సఫారీలు... భారీ లక్ష్యఛేదనలో పోరాడకుండానే చేతులెత్తేశారు. కార్బిన్ బాష్ (20), కేశవ్ మహరాజ్ (17), ట్రిస్టన్ స్టబ్స్ (10) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మార్క్రమ్ (0), రికెల్టన్ (1), ముల్డర్ (0), బ్రిట్జ్కీ (4), బ్రేవిస్ (6) విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ (4/18), ఆదిల్ రషీద్ (3/13) విజృంభించారు. ఆర్చర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... రూట్, కేశవ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. ఇరు జట్ల మధ్య బుధవారం నుంచి టి20 సిరీస్ ప్రారంభం కానుంది. -
ఆసియకప్ విజేతగా టీమిండియా..
హాకీ ఆసియా కప్- 2025 విజేతగా భారత్ నిలిచింది. ఆదివారం రాజ్గిర్ వేదికగా జరిగిన ఫైనల్ పోరులో సౌత్ కొరియాను 4-1 తేడాతో టీమిండియా చిత్తు చేసింది. దీంతో ఎనిమిదేళ్ల తర్వాత భారత హాకీ జట్టు ఆసియాకప్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో వచ్చే ఏడాది జరగనున్న హాకీ వరల్డ్కప్కు భారత్ నేరుగా ఆర్హత సాధించింది.ఓవరాల్గా భారత్కు ఇది నాల్గో ఆసియాకప్ టైటిల్. చివరగా 2017 బంగ్లాదేశ్లో జరిగిన హాకీ ఆసియాకప్ను ఇండియా గెలుచుకుంది. ఈ తుది పోరులో భారత్ తరపున దిల్ప్రీత్ సింగ్ రెండు గోల్స్ సాధించగా.. సుఖ్జీత్, అమిత్ రోహిదాస్ చెరో గోల్ సాధించింది. నిర్ణీత సమయంలో భారత్ నాలుగు గోల్స్ సాధించగా.. కొరియా కేవలం ఒక్క గోల్కే పరిమితమైంది. రెండు గోల్స్తో మెరిసిన దిల్ప్రీత్కు ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు లభించింది. భారత హాకీ జట్టుకు వైఎస్ జగన్ అభినందనలుఆసియాకప్లో అద్భుత విజయం సాధించిన భారత హాకీ జట్టుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలియజేశారు. ‘టీమిండియాకు హృదయపూర్వక అభినందనలు. భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలి’ అని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు ‘ ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు జగన్.Heartiest congratulations to Team India on a magnificent victory at the Asia Cup 2025 in Rajgir, Bihar! Wishing the entire team continued success, good health, and glory in the years ahead.#HockeyIndia pic.twitter.com/80jd1hj5s3— YS Jagan Mohan Reddy (@ysjagan) September 7, 2025 -
మూడో టీ20లో జింబాబ్వే చిత్తు.. సిరీస్ శ్రీలంక సొంతం
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన సిరీస్ డిసైడర్ మూడో టీ20లో శ్రీలంక సత్తాచాటింది. ఈ మ్యాచ్లో ఆతిథ్య జింబాబ్వేను 8 వికెట్ల తేడాతో లంక చిత్తు చేసింది. దీంతో మూడు టీ20ల సిరీస్ను 2-1తో సొంతం చేసుకుంది. ఈ మూడో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్ సాధించింది. టి మారుమణి(51) టాప్ స్కోరర్గా నిలవగా.. రజా(28), బర్ల్(18), సీన్ విలియమ్స్(23), ముసెకివా(18) రాణించారు. శ్రీలంక బౌలర్లలో దుషాన్ హేమంత మూడు వికెట్లు పడగొట్టగా.. చమీరా రెండు, పతిరాన, ఫెర్నాండో తలా వికెట్ సాధించారు.కమిల్ మిశ్రా విధ్వంసం..అనంతరం 192 పరుగుల భారీ లక్ష్యాన్ని శ్రీలంక కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 17.4 ఓవర్లలో చేధించింది. తొలి వికెట్కు ఓపెనర్లు కుశాల్ మెండిస్(33), ఫాథుమ్ నిస్సాంక(30) 57 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.ఆ తర్వాత యువ ఆటగాడు కమిల్ మిశ్రా(43 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 73 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతడితో పాటు కుశాల్ పెరీరా(26 బంతుల్లో 46) బ్యాట్ ఝూలిపించాడు. జింబాబ్వే బౌలర్లలో రజా, ముజర్బానీ తలా వికెట్ సాధించారు. కాగా రెండో టీ20లో శ్రీలంక అనూహ్య ఓటమి పాలైన సంగతి తెలిసిందే.చదవండి: SA vs ENG: ఇంగ్లండ్ బ్యాటర్ల విధ్వంసం.. వన్డేల్లో భారీ స్కోర్! భారత్ రికార్డు సమం -
ఇంగ్లండ్ బ్యాటర్ల విధ్వంసం.. వన్డేల్లో భారీ స్కోర్! భారత్ రికార్డు సమం
సౌతాంప్టన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో ఇంగ్లండ్ బ్యాటర్లు జూలు విధిల్చారు. సిరీస్ కోల్పోయిన కసిని ఆఖరి మ్యాచ్లో చూపించేశారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 414 పరుగుల భారీ స్కోర్ సాధించింది.తొలుత ఇంగ్లండ్కు ఓపెనర్లు బెన్ డకెట్(31), జేమీ స్మిత్(48 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్తో 62) తొలి వికెట్కు 58 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత సీనియర్ బ్యాటర్ జో రూట్(96 బంతుల్లో 6 ఫోర్లతో 100), యువ ఆటగాడు జాకబ్ బెతల్( 82 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్లతో 110) సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరూ మూడో వికెట్కు 181 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రూట్ ఆచితూచి ఆడితే.. స్మిత్ మాత్రం టీ20 తరహాలో తన ఇన్నింగ్స్ను కొనసాగించాడు. బెతల్కు ఇదే తొలి వన్డే సెంచరీ కావడం విశేషం. వీరిద్దరూ ఔటయ్యాక జోజ్ బట్లర్(62 నాటౌట్), విల్ జాక్స్ మెరుపులు మెరిపించారు. సౌతాఫ్రికా బౌలర్లలో కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్ తలా రెండు వికెట్లు సాధించారు. సౌతాఫ్రికా అరంగేట్ర పేసర్ యూసఫ్ వికెట్ ఏమీ తీయకుండా 80 పరుగులు సమర్పించుకున్నాడు.ఇక ఈ మ్యాచ్లో భారీ స్కోర్ సాధించిన ఇంగ్లండ్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక సార్లు 400కు పైగా స్కోర్లు సాధించిన రెండో జట్టుగా టీమిండియా సరసన ఇంగ్లండ్ నిలిచింది. ఇంగ్లండ్ 7 సార్లు 400 ప్లస్ స్కోర్లు చేయగా.. భారత్ కూడా సరిగ్గా ఏడు సార్లు 400కు పైగా స్కోర్లు నమోదు చేసింది. ఈ జాబితాలో సౌతాఫ్రికా (8 సార్లు) అగ్రస్ధానంలో ఉంది.చదవండి: ఖాళీ కడుపుతోనే పాక్పై సెంచరీ చేశా: వీరేంద్ర సెహ్వాగ్ -
ఖాళీ కడుపుతోనే పాక్పై సెంచరీ చేశా: వీరేంద్ర సెహ్వాగ్
ఆసియాకప్-2025కు మరో రెండు రోజుల్లో తెరలేవనుంది. సెప్టెంబర్ 9న అబుదాబి వేదికగా అఫ్గానిస్తాన్-హాంకాంగ్ మ్యాచ్తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. అయితే ఈ మల్టీ నేషనల్ టోర్నమెంట్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. దాదాపు ఆరు నెలల తర్వాత క్రికెట్ మైదానంలో చిరకాల ప్రత్యర్ధులు అమీతుమీ తెల్చుకోనున్నారు.సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా దాయాదుల పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అధికారిక బ్రాడ్ కాస్టర్ సోన్ స్పోర్ట్స్ నెట్వర్క్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. పాకిస్తాన్తో తన ఆడిన రోజులను సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు. పాక్పై ఓడిపోయినా ప్రతీసారి తన అసహనానికి లోనయ్యేవాడని అని అతడు తెలిపాడు. "పాకిస్తాన్పై ఓడిపోయిన ప్రతీసారి నేను కుంగిపోయేవాడిని. ఫలితంగా నా ఏకాగ్రతను కోల్పోయేవాడని. ఆ సమయంలో ప్రతిదీ కోల్పోయినట్లు అన్పించేది" అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.కాగా ఈ నజాఫ్గఢ్ నవాబుకు ప్రత్యర్ధి పాకిస్తాన్ అయితే చాలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయేవాడు. ముఖ్యంగా టెస్టుల్లో అయితే పాక్కు చుక్కలు చూపించేవాడు. సెహ్వాగ్ తన తొలి ట్రిపుల్ సెంచరీని పాక్ పైనే నమోదు చేశాడు.2008లో పాకిస్తాన్ టూర్లో కరాచీ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్లో సెహ్వాగ్ ఆడిన ఇన్నింగ్స్ ఎప్పటికి అభిమానులకు గుర్తుండిపోతుంది. 300 పరుగుల టార్గెట్ను చేధించే క్రమంలో వీరు సూపర్ సెంచరీతో చెలరేగాడు. 95 బంతుల్లోనే 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 119 పరుగులు సాధించాడు. ఈ సెంచరీ కోసం కూడా తాజా ఇంటర్వ్యూలో వీరేంద్రుడు మాట్లాడాడు."కరాచీ వన్డే రోజున నేను ఊపవాసంతో ఉన్నాను. ఖాలీ కడుపుతో బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. కానీ ఆ మ్యాచ్లో పరుగులు సాధించి నా ఆకలిని తీర్చుకున్నాను" అని సెహ్వాగ్ పేర్కొన్నాడు. -
కపిల్ దేవ్పై 'మ్యాచ్ ఫిక్సింగ్' ఆరోపణలు.. యువీ తండ్రి సంచలన కామెంట్స్
టీమిండియా మాజీ క్రికెటర్, గ్రేట్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ మరోసారి తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. తాజాగా ఇన్సైడ్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 1997 మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం గురుంచి యోగరాజ్ మాట్లాడాడు.భారత దిగ్గజ ఆటగాళ్లు కపిల్ దేవ్, మహ్మద్ అజారుద్దీన్లు మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయని, ఉద్దేశ్వపూర్వకంగానే కేసును నీరు గార్చారని ఆయన అన్నాడు. కాగా 1997లో కలిప్ దేవ్పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. అయితే అందుకు ఎటువంటి ఆధారాలు లేవని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది."సుప్రీం కోర్టులో కొట్టివేయబడిన మ్యాచ్-ఫిక్సింగ్ కేసు ఫైల్ ఎక్కడ ఉందో జర్నలిస్టులందరినీ అడగండి. ఆ కేసులో మొదటి పేరు కపిల్ దేవ్ది ఉంటుంది. ఆ తర్వాత అజారుద్దీన్లతో పాటు చాలా మంది ఆటగాళ్ల పేర్లు ఉంటాయి. ఆ కేసును ఎందుకు కొట్టేశారు? తర్వాత ఎందుకు రీ ఓపెన్ చేయలేదు? ఎందుకు రీ ఓపెన్ చేయలేదో నాకు తెలుసు. ఎందుకంటే ఇందులో చాలా మంది దిగ్గజ క్రికెటర్ల ప్రమేయం ఉందని యోగరాజ్ పేర్కొన్నారు.అసలేంటి మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం?1997లో టీమిండియా మాజీ ఆటగాడు మనోజ్ ప్రభాకర్ ఓ మ్యాగ్జైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సహచర ఆటగాళ్లపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేశాడు. శ్రీలంక వేదికగా జరిగిన సింగర్ కప్-1994లో పాకిస్తాన్తో మ్యాచ్లో మ్యాచ్ ఫిక్స్ చేసేందుకు సహచర భారత ఆటగాడు తనకు రూ. 25 లక్షలు ఆఫర్ చేశాడని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో బీసీసీఐ భారత విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి వైవీ చంద్రచూడ్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అజహర్తో పాటు సచిన్, కపిల్దేవ్, సునీల్ గావస్కర్, నయన్ మోంగియా , అజిత్ వాడేకర్ తదితరులు జస్టిస్ చంద్రచూడ్ కమిటీ ముందు విచారణకు హాజరయ్యారు. అయితే ప్రభాకర్ తన ఆరోపణలకు సరైన ఆధారాలు ఇవ్వలేదని కమిటీ తేల్చింది. అందువల్ల అన్ని ఆరోపణలను కొట్టివేసింది. ఈ కమిటీ నివేదిక తర్వాత కూడా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కొనసాగాయి. 2000లో మళ్లీ మనోజ్ ప్రభాకర్ మీడియాకు ముందుకు వచ్చాడు. తనను మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు అప్పటి కెప్టెన్ కపిల్ దేవ్ ఆఫర్ చేశాడని మరో బాంబు పేల్చాడు. దీంతో సీబీఐ రంగంలో దిగింది. సీబీఐ విచారణలో కూడా కపిల్ దేవ్ నిర్ధేషిగానే తేలింది. కానీ మహ్మద్ అజహరుద్దీన్ను మాత్రం సీబీఐ దోషిగా తేల్చింది. మహ్మద్ అజహరుద్దీన్ అప్పటి దక్షిణాఫ్రికా కెప్టెన్ హాన్సీ క్రోనేతో కలిసి మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డాడని సీబీఐ తన నివేదికలో పేర్కొంది. సీబీఐ రిపోర్ట్ ఆధారంగా అజహరుద్దీన్పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. అయితే 2012లో కోర్టు ఆ నిషేధాన్ని రద్దు చేసింది.చదవండి: పాక్లో మ్యాచ్ జరుగుతుండగా ఉగ్రదాడి.. సౌతాఫ్రికా పర్యటనపై నీలినీడలు? -
World Archery Championships: భారత్కు గోల్డ్ మెడల్.. జ్యోతి జోడీకి రజతం
ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్షిప్-2025లో భారత ఆర్చర్లు సత్తాచాటారు. ఈ మెగా ఈవెంట్లో భారత్కు రెండు పతకాలు లభించాయి. రిషబ్ యాదవ్, అమన్ సైని, ప్రథమేష్ ఫుగేలతో కూడిన భారత పురుషల జట్టు స్వర్ణ పతకం కైవసం చేసుకోగా.. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రిషబ్- వెన్నం జ్యోతిసురేఖ జోడికి రజత పతకం దక్కింది.ఆదివారం జరిగిన ఫైనల్లో తొలుత భారత మెన్స్ టీమ్ ఫ్రాన్స్తో తలపడింది. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో కేవలం రెండు పాయింట్ల తేడాతో ఇండియా విజయం సాధించింది. రిషబ్ అండ్ కో 235 పాయింట్లు సాధించగా ఫ్రాన్స్ 233 పాయింట్లు సాధించింది. భారత పురుషుల జట్టు ఈ మెగా ఈవెంట్లో స్వర్ణం సాధించడం ఇదే తొలిసారి. మరోవైపు కాంపౌండ్ మిక్సిడ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో సురేఖ, రిషబ్ యాదవ్లతో కూడిన భారత జట్టు తృటిలో స్వర్ణాన్ని చేజార్చుకుంది. ఫైనల్ లో నెదర్లాండ్స్ జోడి చేతిలో 157-155 తేడాతో ఓటమి పాలయ్యారు. కేవలం రెండు పాయింట్ల తేడాతో పసడి పతకాన్ని భారత్ కోల్పోయింది. ప్రపంచ ఛాంపియన్షిప్లో అత్యధిక పతకాలు గెలిచిన భారత ఆర్చర్గా ఇప్పటికే రికార్డు సాధించిన జ్యోతి సురేఖకు ఇది తొమ్మిదో పతకం కావడం విశేషం.చదవండి: పాక్లో మ్యాచ్ జరుగుతుండగా ఉగ్రదాడి.. సౌతాఫ్రికా పర్యటనపై నీలినీడలు? -
మ్యాచ్ జరుగుతుండగా ఉగ్రదాడి.. సౌతాఫ్రికా పర్యటనపై నీలినీడలు?
పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో ఉగ్రదాడి తీవ్ర కలకలం రేపింది. ఉగ్రవాదులు బజౌర్ జిల్లా ఖార్ తహసీల్లోని కౌసర్ క్రికెట్ గ్రౌండ్ను ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. శనివారం కౌసర్ క్రికెట్ మైదానంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో భారీ పేలుడు సంభవించింది.ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారని స్థానిక పోలీసులు వెల్లడించారు. ఐఈడీని ఉపయోగించి పేలుడు జరిపారని బజౌర్ జిల్లా పోలీసు అధికారి వక్వాస్ రఫీక్వ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గాయపడిన వారిని జిల్లా ప్రధాన అస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సదరు అధికారి తెలిపారు. ఇప్పటివరకు ఏ ఉగ్రవాది సంస్థ కూడా బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటన చేయలేదు. అయితే ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా భద్రతా దళాలు ప్రారంభించిన 'ఆపరేషన్ సర్బకాఫ్'కు ప్రతిస్పందనగా ఈ దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.స్వల్ప తొక్కిసలాట..ఈ పేలుడు తర్వాత క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లు, మైదానంలో ఉన్న వీక్షకులు భయంతో పరుగులు తీశారు. ఈ సందర్భంగా స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పేలుడు ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఇటీవల కాలంలో ఈ తరహా సంఘటన జరగడం ఇది రెండో సారి. కొన్ని వారాల కిందట పోలీస్ స్టేషన్పై క్వాడ్కాప్టర్ ద్వారా దాడి జరిగింది. ఈ దాడిలో ఒక పోలీసు కానిస్టేబుల్ , పౌరుడు గాయపడ్డారు.సౌతాఫ్రికా పర్యటనపై నీలినీడలు?కాగా వచ్చే నెలలో సౌతాఫ్రికా క్రికెట్ జట్టు మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం పాకిస్తాన్లో పర్యటించనుంది. ప్రోటీస్ టూర్కు ముందు తమ దేశంలో ఇటువంటి ఉగ్రదాడులు జరుగుతుండడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆందోళన చెందతుంది. అయితే ఇప్పటికే సౌతాఫ్రికాకు చెందిన భద్రతా అధికారులు కొంత మంది పాక్లో పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం అయితే సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశముంది. ఇటీవల కాలంలో పాక్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025తో పాటు పలు ద్వైపాక్షిక సిరీస్లు కూడా జరిగాయి. -
జగదీశన్ భారీ శతకం..దులీప్ ట్రోఫీ ఫైనల్కు సౌత్ జోన్
దులీప్ ట్రోఫీ-2025లో భాగంగా బెంగళూరు వేదికగా నార్త్ జోన్, సౌత్ జోన్ మధ్య జరిగిన తొలి సెమీఫైనల్ డ్రా ముగిసింది. అయితే తొలి ఇన్నింగ్స్లో లీడ్ ఆధారంగా సౌత్ జోన్ జట్టు ఫైనల్కు ఆర్హత సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన నార్త్ జోన్ కెప్టెన్ అంకిత్ కుమార్ తొలుత సౌత్ జోన్ను బ్యాటింగ్కు ఆహ్హనించాడు. ఈ క్రమంలో మొహమ్మద్ అజారుద్దీన్ సారథ్యంలోని సౌత్ జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 536 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సౌజ్ జోన్ బ్యాటర్లలో నారయణ్ జగదీశన్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన జగదీశన్ తృటిలో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. మొత్తంగా 352 బంతులు ఎదుర్కొన్న జగదీశన్.. 16 ఫోర్లు, 2 సిక్స్లతో 197 పరుగులు చేశాడు.అతడితో పాటు జగదీశన్తో పాటు దేవదత్ పడిక్కల్ (71 బంతుల్లో 57; 7 ఫోర్లు), రికీ భుయ్(54) తన్మయ్ అగర్వాల్ (99 బంతుల్లో 43; 5 ఫోర్లు) రాణించారు. నార్త్జోన్ బౌలర్లలో నిశాంత్ సింధు 5, అన్షుశ్ కంబోజ్ రెండు వికెట్లు వికెట్ తీశారు. అనంతరం నార్త్జోన్ తమ తొలి ఇన్నింగ్స్లో 361 పరుగులకు ఆలౌటైంది. 258/5 ఓవర్నైట్ స్కోర్తో ఆఖరి రోజు ఆటను ఆరంభించిన నార్త్జోన్.. అదనంగా 103 పరుగులు చేసి ఇన్నింగ్స్ను ముగించింది.నార్త్జోన్ బ్యాటర్లలో శుభమ్ కజురియా(28) సెంచరీతో కదం తొక్కాడు. అతడితో నిశాంత్ సింధు 82 పరుగులతో రాణించాడు. సౌత్జోన్ పేసర్ గుర్జప్నీత్ సింగ్ (4/96) టాపార్డర్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. అతడితో పాటు నిదేశ్ మూడు, టి త్యాగరాజన్, కౌశిక్ తలా వికెట్ సాధించారు.దీంతో తొలి ఇన్నింగ్స్లో సౌత్ జోన్కు 175 పరుగుల ఆధిక్యం లభించింది. ఆతర్వాత సెకెండ్ ఇన్నింగ్స్ను మొదలు పెట్టిన సౌత్ జోన్ వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. ఈ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు డ్రా అంగీకరించడంతో ఆట నిర్ణీత సమయం కంటే ముందే ముగిసిపోయింది. జగదీశన్కు ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు దక్కింది.చదవండి: Duleep Trophy 2025: ఆసియా కప్ జట్టులో నో ప్లేస్.. సత్తా చాటిన యశస్వి జైస్వాల్ -
ఆసియా కప్ జట్టులో నో ప్లేస్.. సత్తా చాటిన యశస్వి జైస్వాల్
ఆసియా కప్ 2025 ప్రధాన జట్టులో (స్టాండ్బైగా ఎంపిక) చోటు దక్కించుకోలేకపోయిన టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ దులీప్ ట్రోఫీలో సత్తా చాటాడు. ఈ టోర్నీలో వెస్ట్ జోన్కు ఆడుతున్న జైస్వాల్.. సెంట్రల్ జోన్తో జరుగుతున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్లో రాణించాడు. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో విఫలమైనా (4).. సెకెండ్ ఇన్నింగ్స్లో మెరుపు అర్ద సెంచరీతో (70 బంతుల్లో 64; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరిశాడు.రెండో ఇన్నింగ్స్లో జైస్వాల్ రాణించినా అతని జట్టు చేతుల్లో నుంచి మ్యాచ్ జారిపోయేలా కనిపిస్తుంది. సెంట్రల్ జోన్ బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్ లీడ్ సాధించారు. ఒక వేళ మ్యాచ్ డ్రా అయిన పక్షంలో తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగానే విజేతను నిర్ణయిస్తారు. అదే జరిగితే సెంట్రల్ జోన్ ఫైనల్స్కు చేరుతుంది. తొలి ఇన్నింగ్స్లో 600 పరుగులు చేసిన సెంట్రల్ జోన్ 162 పరుగుల కీలక ఆధిక్యాన్ని సాధించింది.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్ట్ జోన్.. రుతురాజ్ గైక్వాడ్ (184) భారీ సెంచరీతో కదంతొక్కడంతో 438 పరుగులు చేసింది. తనుశ్ కోటియన్ (76), కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ (64) అర్ద సెంచరీలతో రాణించారు.అనంతరం బ్యాటింగ్కు దిగిన సెంట్రల్ జోన్.. ఒక్క ఆటగాడు కూడా సెంచరీ చేయకపోయినా 600 పరుగుల భారీ స్కోర్ చేసింది. దనిశ్ మాలేవార్ (76), షుభమ్ శర్మ (96), కెప్టెన్ రజత్ పాటిదార్ (77), ఉపేంద్ర యాదవ్ (87), హర్ష్ దూబే (75), సరాన్ష్ జైన్ (63 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు.162 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్ట్ జోన్ నాలుగో రోజు రెండో సెషన్ సమయానికి 4 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో రుతురాజ్ (16) విఫలం కాగా.. తనుశ్ కోటియన్ (1), షమ్స్ ములానీ (1) క్రీజ్లో ఉన్నారు. సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు వెస్ట్ జోన్ ఇంకా 30 పరుగులు వెనుకపడి ఉంది. -
యూఎస్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న సబలెంకా
బెలారస్ క్రీడాకారిణి, ప్రపంచ నంబర్ వన్ అరినా సబలెంకా వరుసగా రెండో ఏడాది యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ను ఎగరేసుకుపోయింది. ఫైనల్లో ఆమె అమెరికాకు చెందిన అమండ అనిసిమోవాను వరుస సెట్లలో (6–3, 7–6(3)) ఓడించింది. 94 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో సబలెంక 13 విన్నర్లు కొట్టి, 15 అన్ఫోర్స్డ్ ఎర్రర్లు మాత్రమే చేసింది. అనిసిమోవా 29 అన్ఫోర్స్డ్ ఎర్రర్లు, 7 డబుల్ ఫాల్ట్స్ చేసి తడబడింది.ఈ మ్యాచ్లో సబలెంక తన శక్తివంతమైన సర్వ్లు, ఖచ్చితమైన గ్రౌండ్స్ట్రోక్లతో అనిసిమోవాను కట్టడి చేసింది. రెండో సెట్ టైబ్రేక్కి వెళ్లినా, ఆమె మానసిక స్థైర్యాన్ని చూపించి విజయం సాధించింది.సబలెంకకు ఇది నాలుగో గ్రాండ్స్లామ్ టైటిల్. అన్ని టైటిళ్లను ఆమె హార్డ్కోర్ట్లపైనే సాధించింది. దీంతో ఆమెకు హార్డ్కోర్డ్ల రాణిగా గుర్తింపు వచ్చింది. సబలెంక 2023, 2024లో వరుసగా ఆస్ట్రేలియా ఓపెన్ టైటిళ్లు సాధించి.. 2024, 2025లో వరుసగా యూఎస్ ఓపెన్ను గెలిచింది. వరుసగా రెండు యూఎస్ ఓపెన్ టైటిళ్లు సాధించడంతో సబలెంక సెరీనా విలియమ్స్ సరసన చేరింది. సెరీనా కూడా గతంలో వరుసగా రెండు ఎడిషన్లలో యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచింది.టైటిల్ గెలిచిన అనంతరం సబలెంక మాట్లాడుతూ.. ఇది నా జీవితంలో మరచిపోలేని క్షణం. నా దేశానికి, అభిమానులకు ఈ విజయం అంకితమని తెలిపింది. తాజా విజయంతో సబలెంక 100 గ్రాండ్ స్లామ్ మ్యాచ్లు గెలిచిన రెండో మహిళగానూ గుర్తింపు పొందింది. సబలెంక ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్లోనూ ఫైనల్కు చేరి కోకో గాఫ్ చేతిలో పరాజయంపాలై రన్నరప్తో సరిపెట్టుకుంది. -
బంతితో చెలరేగిన లబూషేన్.. హ్యాట్రిక్ నమోదు
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లబూషేన్ దేశవాలీ టీ20 టోర్నీలో చెలరేగిపోయాడు. అతను చెలరేగింది బ్యాట్తోకాదు. నాణ్యమైన లెగ్ స్పిన్నర్ కూడా అయిన అతను..బ్రిస్బేన్లో జరిగిన కేఎఫ్సీ మ్యాక్స్ టీ20 టోర్నీలో బంతితో రఫ్ఫాడించాడు. ఫైనల్లో హ్యాట్రిక్ వికెట్లు తీసి తన జట్టు టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.Marnus Labuschagne took a a hattrick in the KFC T20 Max Final. 🤯pic.twitter.com/8ye7U7udVu— Mufaddal Vohra (@mufaddal_vohra) September 7, 2025ఈ టోర్నీలో రెడ్ల్యాండ్స్ టైగర్స్కు ప్రాతినిథ్యం వహించిన లబూషేన్.. వ్యాలీ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో లబూషేన్ బౌలర్గా మాత్రమే కాకుండా ఫీల్డర్గానూ సత్తా చాటాడు. 3 క్యాచ్లు పట్టుకుని రెడ్ల్యాండ్స్ గెలుపుకు మరో రకంగానూ దోహదపడ్డాడు. ఈ మ్యాచ్లో లబూషేన్ బ్యాటర్గా నిరాశపరిచాడు. 10 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రెడ్ల్యాండ్స్.. జిమ్మీ పీర్సన్ (50 బంతుల్లో 102 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సులు) శతక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో వ్యాలీ జట్టు 150 పరుగులకే ఆలౌటై 41 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. లబుషేన్ చివర్లో వరుసగా మూడు వికెట్లు తీసి రెడ్ల్యాండ్స్ విజయం ఖాయం చేశాడు. వ్యాలీ తరఫున మాక్స్ బ్రయంట్ 76 (38 బంతులు) పరుగులతో పోరాడినా, తన జట్టును గెలిపించలేకపోయాడు. ఈ టోర్నీ మహిళల విభాగంలో విన్నమ్-మాన్లీ జట్టు టైటిల్ గెలిచింది.కాగా, పేలవ ఫామ్ కారణంగా లబూషేన్ కొద్ది రోజుల కిందట ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు నుంచి తప్పించబడ్డాడు. ప్రస్తుతం అతను యాషెస్ సిరీస్ కోసం జట్టులోకి తిరిగి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. -
చరిత్ర సృష్టించిన జింబాబ్వే ప్లేయర్.. కోహ్లి, స్కైను అధిగమించి ప్రపంచ రికార్డు
అంతర్జాతీయ టీ20ల్లో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా చరిత్ర సృష్టించాడు. ఐసీసీ ఫుల్ మెంబర్స్ దేశాల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి, భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను వెనక్కు నెట్టాడు.నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకోవడంతో ఈ ఘనత సాధించాడు. ఈ అవార్డుతో అంతర్జాతీయ టీ20ల్లో రజా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల సంఖ్య 17కు చేరగా.. కోహ్లి, స్కై 16 వద్ద ఉన్నారు. ఓవరాల్గా (ఐసీసీ సభ్య దేశాలన్నీ) అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల రికార్డు మలేసియా ఆటగాడు విరన్దీప్ సింగ్ (22) పేరిట ఉంది.కొనసాగుతున్న రజా హవాఅంతర్జాతీయ టీ20ల్లో సికందర్ రజా హవా గత కొంతకాలంగా కొనసాగుతుంది. ఈ ఫార్మాట్లో అతను 39 ఏళ్ల లేటు వయసులోనూ ఇరగదీస్తున్నాడు. బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ సత్తా చాటుతూ, తన దేశం కాని దేశానికి వన్నె తెస్తున్నాడు. రజా పాకిస్తాన్లో పుట్టి, జింబాబ్వే తరఫున అంతర్జాతీయ కెరీర్ను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.2013లో అంతర్జాతీయ టీ20 కెరీర్ మొదలుపెట్టిన రజా.. 12 ఏళ్ల కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించి, టాప్ ఆల్రౌండర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. వ్యక్తిగతంగా సత్తా చాటుతూనే, కెప్టెన్గా జింబాబ్వేకు చిరస్మరణీయ విజయాలు అందిస్తున్నాడు. తాజాగా అలాంటి ప్రదర్శనే మరోసారి చేసి, తమ కంటే చాలా రెట్లు పటిష్టమైన శ్రీలంకను చిత్తు చేయడంలో ముఖ్యపాత్ర పోషించాడు.స్వదేశంలో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా శ్రీలంకతో నిన్న (సెప్టెంబర్ 6) జరిగిన మ్యాచ్లో బౌలింగ్లో సత్తా చాటి తన జట్టుకు అదిరిపోయే విజయాన్నందించాడు. ఈ మ్యాచ్లో 4 ఓవర్లలో కేవలం 11 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన రజా.. శ్రీలంకను 80 పరుగులకే కుప్పకూల్చడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో జింబాబ్వే శ్రీలంకను 5 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. -
వీరంగం సృష్టించిన లివింగ్స్టోన్
టీ20 బ్లాస్ట్ 2025లో భాగంగా కెంట్తో నిన్న (సెప్టెంబర్ 6) జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో లాంకాషైర్ ఆటగాడు లియామ్ లివింగ్స్టోన్ వీరంగం సృష్టించాడు. తొలుత బౌలింగ్లో రాణించి (4-0-21-2), ఆతర్వాత బ్యాటింగ్లో (45 బంతుల్లో 85 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగిపోయాడు. లివింగ్స్టోన్ విధ్వంసం ధాటికి కెంట్ నిర్దేశించిన 154 పరుగుల సాధారణ లక్ష్యాన్ని లాంకాషైర్ మరో 9 బంతులు మిగిలుండగానే ఛేదించింది.- T20 Blast.- Quarter Final.- 85*(45) with bat.- 2/21 with ball.- Player of the match.ITS LIAM LIVINGSTONE SHOW, THE BIG MATCH PLAYER. 💪🔥 pic.twitter.com/R0ag5hQgQe— Johns. (@CricCrazyJohns) September 6, 2025ఇటీవలికాలంలో లివింగ్స్టోన్ పెద్ద మ్యాచ్లనగానే చెలరేగిపోతున్నాడు. ఇంగ్లండ్ మెగా టీ20 టోర్నీ అయిన టీ20 బ్లాస్ట్లోనూ ఇదే జరిగింది. క్వార్టర్ ఫైనల్లో బంతితో, బ్యాట్తో సత్తా చాటిన లివింగ్స్టోన్ తన జట్టును ఒంటిచేత్తో సెమీఫైనల్కు చేర్చాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన కెంట్ 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 153 పరుగులకు ఆలౌటైంది. లాంకాషైర్ బౌలర్లు కలిసికట్టుగా రాణించి కెంట్ను తక్కువ స్కోర్కే పరిమితం చేశారు. లూక్ వుడ్ 3, లివింగ్స్టోన్, థామస్ అస్పిన్వాల్ చెరో 2, జేమ్స్ ఆండర్సన్, బ్లాథర్విక్, టామ్ హార్ట్లీ తలో వికెట్ తీసి కెంట్ ఇన్నింగ్స్ను కుప్పకూల్చారు. కెంట్ తరఫున 28 పరుగులు చేసిన జో డెన్లీ టాప్ స్కోరర్గా నిలువగా.. జాక్ క్రాలే (27), జోయ్ ఎవిసన్ (27), స్టీవర్ట్ (25) 20కి పైగా పరుగులు చేశారు. ఇటీవలే హండ్రెడ్ లీగ్లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ను ఛాంపియన్గా నిలిపిన సామ్ బిల్లింగ్స్ (కెంట్ కెప్టెన్) 2 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో లాంకాషైర్ ఆదిలో తడబడినప్పటికీ (31 పరుగులకే 3 వికెట్లు).. లివింగ్స్టోన్ ఇన్నింగ్స్ కారణంగా ఆతర్వాత గెలుపు తీరాలు దాటింది. లివింగ్స్టోన్ సింగిల్ హ్యాండ్తో ఆ జట్టును గెలిపించాడు. అతనికి ఆస్టన్ టర్నర్ (22), మైఖేల్ జోన్స్ (28) సహకరించారు. ఓ పక్క వికెట్లు పడుతున్నా లివింగ్స్టోన్ తన బ్యాట్కు పని పెట్టి, టెయిలెండర్ల సాయంతో లాంకాషైర్ను విజయతీరాలు దాటించాడు. కెంట్ బౌలర్లలో ఫ్రెడ్ క్లాసెన్ (4-0-14-3), జోయ్ ఎవిసన్ (4-0-21-1) అద్బుతంగా బౌలింగ్ చేశారు. వీరిద్దరు ఓ దశలో లాంకాషైర్ చేతుల్లో నుంచి మ్యాచ్ను లాగేసుకునేలా కనిపించారు. అయితే లివింగ్స్టోన్ తన జోరును ఏమాత్రం తగ్గించకుండా బ్యాటింగ్ చేసి లాంకాషైర్ను గెలిపించాడు. -
పోలార్డ్ ఊచకోత
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2025లో ట్రిన్బాగో నైట్రైడర్స్ ఆటగాడు కీరన్ పోలార్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటికే రెండు విధ్వంసకర హాఫ్ సెంచరీలు సహా పలు మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన అతను.. తాజాగా మరోసారి రెచ్చిపోయాడు. గయానా అమెజాన్ వారియర్స్తో ఇవాళ (సెప్టెంబర్ 7) జరిగిన మ్యాచ్లో 17 బంతుల్లోనే అర్ద శతకం బాదాడు. మొత్తంగా 18 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 54 పరుగులు చేశాడు. పోలార్డ్ బ్యాట్తో బీభత్సం సృష్టించినప్పటికీ ఈ మ్యాచ్లో అతని జట్టు ఓడిపోయింది.🚨 KIERON POLLARD SMASHED 54* FROM JUST 18 BALLS IN CPL 🚨- 50 runs came through Boundaries. 🤯🔥 pic.twitter.com/hpY3SoQ2Zt— Johns. (@CricCrazyJohns) September 7, 2025ఈ సీజన్లో ఇదివరకే ప్లే ఆఫ్స్కు చేరిన నైట్రైడర్స్ గయానా అమెజాన్ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. పోలార్డ్ విధ్వంసకర ఇన్నింగ్స్తో చెలరేగడంతో నైట్రైడర్స్ ఈమాత్రం స్కోరైనా చేయగలిగింది. కీసీ కార్టీ (34 బంతుల్లో 29 రిటైర్డ్ ఔట్), డారెన్ బ్రావో (35 బంతుల్లో 33) టెస్ట్ మ్యాచ్ను తలపించేలా బ్యాటింగ్ చేసి నైట్రైడర్స్ ఇన్నింగ్స్కు డ్యామేజ్ చేశారు. విధ్వంసకర ఆటగాళ్లు కొలిన్ మున్రో (17), అలెక్స్ హేల్స్ (7), పూరన్ (13) తక్కువ స్కోర్లకే ఔటై నిరాశపరిచారు. వారియర్స్ బౌలర్లలో మొయిన్ అలీ (4-0-11-1), ఇమ్రాన్ తాహిర్ (4-0-38-1) అద్బుతంగా బౌలింగ్ చేశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన వారియర్స్ గెలుపు కోసం శ్రమించింది. అకీల్ హొసేన్ (4-0-35-2), సునీల్ నరైన్ (4-0-12-2), నాథన్ ఎడ్వర్డ్స్ (4-0-30-1) ఉస్మాన్ తారిక్ (4-0-36-1) రాణించడంతో మరో బంతి మాత్రమే మిగిలుండగా 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓ పక్క వికెట్లు పడుతున్నా, డ్వేన్ ప్రిటోరియస్ (26 నాటౌట్) చివరి దాకా క్రీజ్లో నిలబడి వారియర్స్ను గెలిపించాడు. అంతకుముందు షాయ్ హోప్ (53), షిమ్రోన్ హెట్మైర్ (49) వారియర్స్ గెలుపుకు పునాది వేశారు.