breaking news
Sports
-
నితీష్ రాణాపై ప్రతీకారం తీర్చుకున్న దిగ్వేష్ రాఠీ
పురానీ ఢిల్లీ 6 స్పిన్నర్ దిగ్వేష్ సింగ్ రాఠీ, వెస్ట్ ఢిల్లీ లయన్స్ బ్యాటర్ నితీష్ రాణా మధ్య గత సీజన్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో జరిగిన వివాదానికి ఆసక్తికరమైన ముగింపు లభించింది.గత సీజన్ ఎలిమినేటర్లో రాఠీ, రాణా ఒకరినొకరు కవ్వించుకోగా.. రాణా బ్యాట్తో పైచేయి సాధించాడు. ప్రస్తుత సీజన్లో భాగంగా ఇవాళ జరిగిన మ్యాచ్లో ఈ ఇద్దరు మరోసారి ఎదురెదురుపడగా.. రాణాను ఔట్ చేసి రాఠీ రివెంజ్ తీర్చుకున్నాడు. ఈ ప్రతీకార పర్వం క్రికెట్ అభిమానులను అమితంగా ఆకర్షించింది.వివరాల్లోకి వెళితే.. గత సీజన్ ఎలిమినేటర్లో రాణా-రాఠీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రాఠీ బంతి వేయడానికి వచ్చి చివరి క్షణంలో ఆగడంతో రాణా కూడా అదే తరహాలో స్పందించాడు. ఆ తర్వాత రాఠీ బౌలింగ్లో రాణా భారీ సిక్సర్ కొట్టి, అతడి నోట్బుక్ సెలబ్రేషన్ను అతడికే అప్పజెప్పాడు.ఆ మ్యాచ్లో రాణా 55 బంతుల్లో అజేయమైన 134 పరుగులు చేసి వెస్ట్ ఢిల్లీకి విజయాన్ని అందించాడు. ఆ వివాదానికి సంబంధించి అప్పుడు రాఠీ మ్యాచ్ ఫీజులో 80 శాతం, రాణా 50 శాతం జరిమానా విధించారు.తాజాగా జరిగిన మ్యాచ్లో రాఠీ రాణాను ఔట్ చేసి, గత సీజన్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. 11వ ఓవర్ చివరి బంతికి రాఠీ వేసిన బంతిని రాణా రివర్స్ స్వీప్ చేసేందుకు ప్రయత్నించాడు. బంతి బ్యాట్కు తగలకుండా ముందు ప్యాడ్కు తగలడంతో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. రాణా కేవలం 3 పరుగులకే వెనుదిరిగాడు.గత సీజన్ చెడు అనుభవం దృష్ట్యా రాఠీ సాధారణంగానే సంబరాలు చేసుకున్నాడు. తన స్టయిల్లో నోట్బుక్ సెలబ్రేషన్ చేసుకోలేదు. అతడు కామ్గానే ఉన్నా, పరోక్షంగా రాణాపై ప్రతీకారం తీర్చుకున్నట్లైంది. ఈ ఉదంతం సోషల్మీడియాలో వైరలవుతోంది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్ట్ ఢిల్లీ లయన్స్ 180 పరుగులు చేయగా.. పురానీ ఢిల్లీ 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. పురానీ ఢిల్లీ విజయంలో దేవ్ లక్రా (64), అనూజ్ రావత్ (49 నాటౌట్), లలిత్ యాదవ్ (30 నాటౌట్) కీలకపాత్ర పోషించారు. రాఠీకి కేవలం రాణా వికెట్ మాత్రమే లభించింది. -
కోహ్లీ-గంభీర్ గొడవపై మాజీ అంపైర్ సంచలన వ్యాఖ్యలు
విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య 2013 ఐపీఎల్లో జరిగిన వివాదం మరోసారి చర్చకు వచ్చింది. ఈ ఘటనపై మాజీ అంతర్జాతీయ అంపైర్ అనిల్ చౌదరి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు.2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న కోహ్లీ ఔటైన తర్వాత, అప్పటి కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గంభీర్ తన సహచరులతో కలిసి సంబరాలు చేసుకున్నాడు. ఆ సమయంలో కోహ్లీ-గంభీర్ మధ్య మాటల యుద్ధం మొదలై, చివరకు తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. రజత్ భాటియా ఇద్దరినీ విడదీశాడు.‘ఏదో జరుగుతుందని తెలుసు’జియోస్టార్ ‘చీకీ సింగిల్స్’ కార్యక్రమంలో అనిల్ చౌదరి ఆ ఘటనను గుర్తు చేసుకున్నాడు. ఉత్తర భారత క్రికెటర్లలో సహజంగానే దూకుడు ఎక్కువగా ఉంటుందని, అలాంటి దూకుడు ఆటలో అవసరమేనని చౌదరి చెప్పాడు. అయితే ఆ దూకుడు హద్దు దాటకూడదని స్పష్టం చేశాడు.‘కోహ్లీకి ఎలాంటి దురుద్దేశం ఉండదు’కోహ్లీని చిన్నప్పటి నుంచే తాను చూస్తున్నానని చౌదరి తెలిపాడు. కోహ్లీకి ఎలాంటి దురుద్దేశం ఉండదని, అయితే కొన్నిసార్లు అతని స్పందన చాలా దూకుడుగా ఉంటుందని అన్నాడు.అంపైర్ నిర్ణయం సరైనదని అనిపిస్తే కోహ్లీ అభినందిస్తాడని, ఓవర్ల మధ్యలో వచ్చి సరదాగా మాట్లాడే స్వభావం కూడా అతనికి ఉందని చౌదరి పేర్కొన్నాడు. ఇలాంటి ఉత్సాహభరితమైన ఆటగాళ్లు ఉండటం వల్లే క్రికెట్కు ప్రత్యేకమైన ఉత్సాహం వస్తుందని చెప్పాడు.పదేళ్ల తర్వాత మళ్లీ వివాదం2013 ఘటన తర్వాత 2023 ఐపీఎల్లో కోహ్లీ, గంభీర్ మరోసారి తీవ్ర వాగ్వాదానికి దిగారు. లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్ అనంతరం కోహ్లీ, నవీన్ ఉల్ హక్ మధ్య వివాదం మొదలై, అనంతరం గంభీర్తోనూ మాటల యుద్ధానికి దారితీసింది.ప్రస్తుతం గంభీర్ భారత జట్టు హెడ్ కోచ్గా, కోహ్లీ వన్డే జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న నేపథ్యంలో, 2013 నాటి ఘటనపై అంపైర్ చేసిన వ్యాఖ్యలు మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. -
ఆసీస్, ఇంగ్లండ్ వల్ల కాలేదు.. చరిత్ర సృష్టించిన బీసీసీఐ!
భారత ఆటగాడు అజింక్య రహానే ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రిటైర్మెంట్ పొందిన ఆటగాళ్లకు బీసీసీఐ పెన్షన్ అందిస్తుంది. రహానే సీనియర్ టెస్టు క్రికెటర్ కావడంతో, అతడు నెలకు పెన్షన్ కింద రూ. 70వేలు అందుకోనున్నాడు. ఈ సంగతి పక్కనబెడితే క్రికెట్ చరిత్రలో బీసీసీఐ (భారత్), ఈసీబీ (ఇంగ్లండ్), క్రికెట్ ఆస్ట్రేలియా క్రికెట్ సంపన్న బోర్డులుగా గుర్తింపు పొందాయి. కానీ ఈ మూడు బోర్డుల్లో బీసీసీఐ మాత్రమే రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లకు గౌరవ వేతనం కింద పెన్షన్ అందిస్తుండడం విశేషం.అటు ఆస్ట్రేలియా కానీ.. ఇటు ఇంగ్లండ్ కానీ తమ మాజీ ఆటగాళ్లకు ఎలాంటి పెన్షన్ సౌకర్యం కల్పించడం లేదు. దీంతో క్రికెట్ చరిత్రలోనే మాజీ ఆటగాళ్లకు పెన్షన్ కల్పిస్తున్న ఏకైక బోర్డుగా బీసీసీఐ చరిత్ర సృష్టించింది. బీసీసీఐ అందిస్తున్న పెన్షన్ విధానాన్ని ఒకసారి పరిశీలించి చూద్దాం.బీసీసీఐ కల్పిస్తున్న పెన్షన్ వివరాలు👉మాజీ క్రికెటర్లు: నెలకు రూ. 58,750👉టెస్టు క్రికెటర్లు: నెలకు రూ. 60 వేలు👉సీనియర్ టెస్టు క్రికెటర్లు: నెలకు రూ. 70 వేలు👉ఫస్ట్ క్లాస్ క్రికెటర్లు: నెలకు రూ. 30 వేల నుంచి 45వేలు👉అంతర్జాతీయ మహిళా క్రికెటర్లు: నెలకు రూ. 52,500👉దేశవాళీ మహిళా క్రికెటర్లు: నెలకు రూ. 45వేలుఇక దేశవాళీ క్రికెట్లో రాష్ట్రాల వారీగా చూసుకుంటే గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ తమ రాష్ట్రం తరఫున రంజీ ట్రోఫీ ఆడిన 150 మంది మాజీ క్రికెటర్లకు పెన్షన్తో పాటు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ ఆదర్శంగా నిలిచింది. మిగతా రాష్ట్రాల బోర్డులు కూడా తమ మాజీ క్రికెటర్లకు తమకు తోచినంత పెన్షన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. 🔴 NO AUSTRALIA, NO ENGLAND- ONLY BCCI PAYS CRICKETERS AFTER RETIREMENT 🤯- Cricket Australia: No pension system- England Cricket: No pension systemBCCI: Pays an avg pension of ₹58,750/month to former cricketers.Current BCCI pension structure:- Test cricketers:… pic.twitter.com/HM0Y3aBMqr— Sam (@cricsam02) August 3, 2026Read: ప్రేమకు ఎండ్కార్డ్.. గర్ల్ఫ్రెండ్తో రొనాల్డో పెళ్లి ఎప్పుడంటే? -
మరోసారి వార్తల్లోకెక్కిన అర్షదీప్ సింగ్
టీమిండియా యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ క్రికెటేతర విషయానికి సంబంధించి మరోసారి వార్తల్లో నిలిచాడు. అతడు పంజాబీ నటి, మోడల్ సమ్రీన్ కౌర్తో రిలేషన్లో ఉన్నాడని ఇటీవల సోషల్మీడియా కోడై కూసింది. ఆ ప్రచారం నిజమేనని తాజాగా జరిగిన ఓ ఉదంతంతో స్పష్టమైంది.సమ్రీన్ ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో పోస్ట్ చేయగా అర్షదీప్ స్పందించాడు. ఎలుగుబంటి, రెడ్ హార్ట్ ఎమోజీలతో కామెంట్ చేశాడు. దీనికి సమ్రీన్ కూడా రెడ్ హార్ట్, లాక్ ఎమోజీలతో రిప్లై ఇచ్చింది. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం బహిర్గతమైంది.అర్ష్దీప్ కొద్ది రోజుల కిందట సమ్రీన్తో కలిసి ఉన్న రెండు ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి 'My Person' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్ట్ తర్వాతే అర్షదీప్-సమ్రీన్ రిలేషన్లో ఉన్నారని ప్రచారం మొదలైంది.ఈ ఏడాది ఐపీఎల్ సందర్భంగానూ వీరిద్దరు కలిసి తిరిగినప్పటికీ.. అప్పట్లో ఇంత ప్రచారం జరగలేదు. అర్షదీప్-సమ్రీన్ రిలేషన్కు నెటిజన్లు ఫిక్స్ అయిపోయినప్పటికీ.. వారి నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అర్షదీప్ క్రికెట్తో, సమ్రీన్ సోషల్మీడియాలో బిజీగా ఉన్నారు.అర్షదీప్ ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. అయితే వన్డేల్లో మాత్రం అతని ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ఒకే ఒక వన్డే ఆడి 0/72 గణాంకాలు నమోదు చేశాడు.ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీ 2026 కోసం అర్ష్దీప్ సింగ్ నార్త్ జోన్ జట్టుకు ఎంపికయ్యాడు. జమ్మూ కశ్మీర్కు చెందిన కన్హయ్య వాధ్వాన్ ఈ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఢిల్లీ ఆటగాడు ఆయుష్ బదోనీ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. -
ప్రేమకు ఎండ్కార్డ్.. గర్ల్ఫ్రెండ్తో రొనాల్డో పెళ్లి ఎప్పుడంటే?
పోర్చుగల్ స్టార్ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో తన లాంగ్టైమ్ గర్ల్ఫ్రెండ్ జార్జినా రోడ్రిగ్వేజ్ను వివాహమాడనున్నాడు. ఆగస్టు 8న వీరి వివాహం రొనాల్డో జన్మించిన పోర్చుగీస్ ద్వీపం మదీరాలో జరగనున్నట్లు సమాచారం. ఫంచల్ కేథడ్రల్లో మత పెద్దల సమక్షంలో బైబిల్పై ప్రమాణాలు చేసిన అనంతరం రింగులు మార్చుకొని వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. అనంతరం ఫైవ్స్టార్ హోటల్ అయిన సావోయ్ ప్యాలెస్లో కుటుంబసభ్యులు, స్నేహితులకు ఘనంగా విందు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా రొనాల్డో, రోడ్రిగ్వేజ్ రిసెప్షన్ పార్టీకి భారీ ఎత్తున సెలబ్రెటీలు రానున్నట్లు బ్రిటన్ మీడియా ఒక నివేదికలో తెలిపింది. అయితే వివాహ ప్రకటనను రొనాల్డో జంట అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే మొదట సింట్రాలోని క్వింటా డా రెగరలేరా ఎస్టేట్లో వీరి వివాహం జరగనున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, తాజాగా రొనాల్డో పుట్టిన ప్రదేశమైన మదీరాలోనే అంరరంగ వైభవంగా పెళ్లి వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరి వివాహం కోసం ఆగస్టు 8న ఫంచల్ కేథడ్రల్ను రిజర్వ్ చేశారని, తమ పెళ్లికి వచ్చే అతిథుల కోసం కేథడ్రల్ పక్కనే ఉన్న పెద్ద హోటల్లో రెండు ఫ్లోర్లలో ఉన్న రూంలను కూడా బుక్ చేసినట్లు సమాచారం.2016లో చిగురించిన ప్రేమక్రిస్టియానో రొనాల్డో, జార్జినాల మధ్య 2016లో ప్రేమ చిగురించింది. మాడ్రిడ్లోని ఒక గూచీ స్టోర్లో జార్జినా సేల్స్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సమయంలో రొనాల్డో ఆమెను మొదటిసారి కలిశాడు. ఆ తర్వాత ఒక ఫ్యాషన్ ఈవెంట్లో మళ్లీ కలుసుకున్నఈ జంట డేటింగ్ మొదలుపెట్టింది. ఆ తర్వాత క్రమంగా తమ మధ్య ఉన్న బంధాన్ని బయటపెట్టారు. 2017 జనవరిలో జ్యూరిచ్లో జరిగిన 'ది బెస్ట్ ఫీఫా ఫుట్బాల్ అవార్డ్స్'లో వారు మొదటిసారి అధికారికంగా కలిసి కనిపించారు. ఆ తర్వాత అదే సంవత్సరం ఇన్స్టాగ్రామ్లో తమ మొదటి జంట ఫోటోను పంచుకున్నారు.2017 నవంబర్లో ఈ ప్రేమికులకు కుమార్తె అలనా మార్టినా పుట్టింది. అలనాను పెంచడంతో పాటు, క్రిస్టియానో జూనియర్, ఇవా, మాటియోల పెంపకంలో రోడ్రిగ్జ్ బిజీగా మారిపోయింది. 2022 ఏప్రిల్లో, ఈ దంపతులు కవల కుమార్తెలకు స్వాగతం పలికారు. ఇక 2025 ఆగస్టులో జార్జినా రోడ్రిగ్జ్ రొనాల్డో తొడిగిన ఉంగరాన్ని ఇన్స్టాగ్రామ్లో పంచుకుంటూ ‘నీ ప్రొపోజల్కు అంగీకరిస్తున్నా’ అని క్యాప్షన్ జత చేసి నిశ్చితార్థం జరిగినట్లు ధృవీకరించింది. అప్పటి నుంచి వీరి వివాహంపై ఊహాగానాలు వస్తున్న వేళ ఆగస్టు 8న వీరి వివాహం జరగనున్నట్లు వార్తలు రావడం అభిమానులను ఆనందంలో ముంచెత్తింది.ఇక రొనాల్డో ఇటీవలే ఫిఫా ప్రపంచకప్లో పోర్చుగల్ తరఫున ఆడాడు. అయితే జట్టును ఫైనల్ చేర్చడంలో విఫలమయ్యాడు. ఈసారి ప్రిక్వార్టర్స్లోనే పోర్చుగల్ వెనుదిరిగింది. రికార్డు స్థాయిలో ఆరో ఫిఫా ప్రపంచకప్ ఆడిన రొనాల్డో వయసు 41 ఏళ్లు. కాబట్టి రొనాల్డో తన కెరీర్లో చివరి ఫిఫా ప్రపంచకప్ ఆడేసినట్లే. After So Many Years, They Finally Said “I Do.” 💍❤️After a long journey together, raising kids, and living through life’s biggest highs and lows, Cristiano Ronaldo and Georgina Rodríguez have officially tied the knot 👰🤵✨ pic.twitter.com/WzrIBpTgWO— Molly (@Molly_AFC) August 2, 2026 -
అభిషేక్ శర్మకు నో ప్లేస్.. ఊహించని ఆటగాడికి కెప్టెన్సీ
దులీప్ ట్రోఫీ 2026 కోసం 15 మంది సభ్యుల నార్త్ జోన్ జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టులో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మకు చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ జట్టుకు కెప్టెన్గా ఎవరూ ఊహించిన ఆటగాడికి అవకాశం లభించింది. జమ్మూ కశ్మీర్కు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ కన్హయ్య వాధ్వాన్కు సెలెక్టర్లు కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పారు. అతడికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) ఢిల్లీకి చెందిన ఆయుష్ బదోనీని ఎంపిక చేశారు.ఈ జట్టులో అత్యధికంగా (6) రంజీ ఛాంపియన్ జమ్మూ కశ్మీర్ ఆటగాళ్లకు చోటు లభించింది. టీమిండియా ఆటగాళ్లు అర్ష్దీప్ సింగ్, అన్షుల్ కాంబోజ్ కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉన్నందున శుభ్మన్ గిల్, ఆకిబ్ నబీని ఎంపిక చేయలేదు. దులీప్ ట్రోఫీ ఆగస్టు 23న ప్రారంభం కానుండగా.. అదే రోజు నార్త్ జోన్-వెస్ట్ జోన్ మ్యాచ్ ప్రారంభం కానుంది.నార్త్ జోన్ జట్టు:సనత్ సంగ్వాన్, క్వామ్రాన్ ఇక్బాల్, యశ్ ధుల్, ఆయుష్ దోసేజా, అబ్దుల్ సమద్, ఆయుష్ బదోనీ (వైస్ కెప్టెన్), కన్హయ్య వాధ్వాన్ (కెప్టెన్), నిశాంత్ సింధు, అర్జున్ శర్మ, అబిద్ ముస్తాక్, అర్ష్దీప్ సింగ్, సునీల్ కుమార్, అన్షుల్ కాంబోజ్, యుధ్వీర్ సింగ్, నిఖిల్ కశ్యప్.ఎవరీ కన్హయ్య వాధ్వాన్..?జమ్మూ కశ్మీర్ రంజీ ట్రోఫీ 2025-26 టైటిల్ సాధించడంలో వాధ్వాన్ కీలక పాత్ర పోషించాడు. 13 ఇన్నింగ్స్ల్లో 474 పరుగులు, 36.56 సగటుతో రాణించాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. రంజీ ట్రోఫీ ఫైనల్లోనూ హాఫ్ సెంచరీ సాధించాడు.24 ఏళ్ల వాధ్వాన్ గతేడాది దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్ తరఫున ఆడాడు. మూడు ఇన్నింగ్స్ల్లో 99 పరుగులు చేశాడు. గత ఎడిషన్లో శుభ్మన్ గిల్ నాయకత్వంలో ఆడిన అతను, ఇప్పుడు తొలిసారి నార్త్ జోన్కు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. -
39 పతకాలకే పరిమితం.. 24 ఏళ్లలో అత్యల్పం.. అయినా..!
గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ 39 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇందులో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలు ఉన్నాయి. సంఖ్యాపరంగా చూస్తే 1998 తర్వాత కామన్వెల్త్ గేమ్స్లో భారత్ సాధించిన అత్యల్ప పతకాల సంఖ్య ఇదే. అయితే గ్లాస్గో గేమ్స్లో భారత్ ఎదుర్కొన్న పరిస్థితులను పరిశీలిస్తే ఈ ప్రదర్శనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.పరిమితుల కారణంగా ఈసారి కామన్వెల్త్ గేమ్స్లో కేవలం 10 క్రీడలనే నిర్వహించారు. భారత్కు సంప్రదాయంగా భారీగా పతకాలు అందించే షూటింగ్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, హాకీ వంటి క్రీడలు ఈసారి పోటీల్లో లేకపోవడం భారత పతకాల అవకాశాలను గణనీయంగా దెబ్బతీసింది.2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లో ఈ ఐదు క్రీడల నుంచే భారత్ 30 పతకాలు (13 స్వర్ణాలు) సాధించింది. అంటే గతసారి భారత్ సాధించిన మొత్తం పతకాలలో దాదాపు సగం ఈ క్రీడల నుంచే వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లోనూ భారత్ గ్లాస్గోలో 39 పతకాలు సాధించడం గమనార్హం.బాక్సింగ్లో చారిత్రాత్మక ప్రదర్శనభారత బాక్సర్లు ఈసారి అద్భుతంగా రాణించారు. మొత్తం 10 పతకాలు సాధించగా, అందులో ఏకంగా 7 స్వర్ణాలు, 3 రజతాలు ఉన్నాయి. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో ఒకే దేశానికి చెందిన బాక్సింగ్ బృందం సాధించిన అత్యుత్తమ ప్రదర్శనల్లో ఇది ఒకటిగా నిలిచింది.జూడోలో కొత్త చరిత్రజూడోలోనూ భారత్ సత్తా చాటింది. హర్ష్ సింగ్, అస్మితా డే తమ విభాగాల్లో స్వర్ణాలు సాధించి, కామన్వెల్త్ గేమ్స్ జూడోలో భారత్కు తొలి స్వర్ణ పతకాలను అందించారు. యామిని మౌర్య రజతం, ఉన్నతి శర్మ కాంస్యం సాధించారు.అథ్లెటిక్స్లోనూ మెరుపులుఅథ్లెటిక్స్లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో రజత పతకం సాధించాడు. గుల్వీర్ సింగ్ 10,000 మీటర్లలో రజతం, 5,000 మీటర్లలో కాంస్యం సాధించి ఒకే కామన్వెల్త్ గేమ్స్లో రెండు పతకాలు సాధించిన తొలి భారత ట్రాక్ అథ్లెట్గా చరిత్ర సృష్టించాడు.తేజస్విన్ శంకర్ డెకాథ్లాన్లో కాంస్యం సాధించి ఈ ఈవెంట్లో భారత్కు తొలి కామన్వెల్త్ పతకాన్ని అందించాడు.వెయిట్లిఫ్టింగ్, పారా-స్పోర్ట్స్లోనూ సత్తావెయిట్లిఫ్టింగ్లో మీరాబాయి చాను వరుసగా మూడో కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించి అరుదైన ఘనత అందుకుంది. భారత వెయిట్లిఫ్టింగ్ బృందం మొత్తంగా 8 పతకాలు సాధించింది.పారా-అథ్లెటిక్స్లోనూ భారత్ అద్భుతంగా రాణించింది. ఈ విభాగంలో 7 పతకాలు వచ్చాయి. శర్మిలా ధంకర్, దిలీప్ మహదు గవిత్, సోమన్ రాణా స్వర్ణాలు సాధించారు.నాలుగో స్థానంలో భారత్మొత్తంగా ఈసారి కామన్వెల్త్ క్రీడల్లో భారత్ 39 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. టాప్-3లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా ఉన్నాయి. భారత్, ఆతిథ్య స్కాట్లాండ్ చెరో 39 పతకాలు సాధించినప్పటికీ, భారత్ ఎక్కువ రజతాలు సాధించడంతో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది.సంఖ్యాపరంగా 39 పతకాలు భారత్కు 1998 తర్వాత అత్యల్పమే అయినప్పటికీ, సంప్రదాయ పతకాల వనరులైన ఐదు క్రీడలు లేకుండానే ఈ స్థాయిలో ప్రదర్శన ఇవ్వడం గ్లాస్గో గేమ్స్లో భారత బృందం సాధించిన కీలక విజయంగా చెప్పొచ్చు. ముఖ్యంగా బాక్సింగ్, జూడో, అథ్లెటిక్స్, పారా-స్పోర్ట్స్లో వచ్చిన పురోగతి భారత బహుళ క్రీడా సామర్థ్యానికి కొత్త ఆశలు కలిగిస్తోంది. -
భారత సంతతి క్రికెటర్పై ఐసీసీ 8 ఏళ్ల నిషేధం!
భారత సంతతికి చెందిన అమెరికా క్రికెటర్ బొదుగుమ్ అఖిలేశ్ రెడ్డిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 8 ఏళ్లు నిషేధం విధించింది. అబుదాబి టీ20 లీగ్లో అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించినట్లు గతేడాది నవంబర్లో అతడిపై అభియోగాలు వచ్చాయి. ఆరోపణలు నిజమని తేలడంతో అప్పట్లో ఐసీసీ అఖిలేష్పై తాత్కాలిక నిషేధం విధించింది. తాజాగా ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆర్టికల్ 2.1.1, ఆర్టికల్ 2.1.4, ఆర్టికల్ 2.4.7కు చెందిన మూడు నిబంధనలను అఖిలేష్ ఉల్లంఘించినట్లు తేలడంతో ఐసీసీ అతడిని దోషిగా నిర్ధారించింది. అతడిపై విధించిన 8 ఏళ్ల నిషేధం నవంబర్ 21, 2025 నుంచే అమల్లోకి వచ్చిందని ఐసీసీ తెలిపింది. 8 ఏళ్ల తర్వాత అంటే 2033లో అఖిలేష్ మళ్లీ క్రికెట్ ఆడేందుకు అనుమతి ఉంటుంది. అప్పటికీ అతడి వయసు 33 ఏళ్లు నిండుతాయి కాబట్టి అతడి కెరీర్కు ఎండ్కార్డ్ పడినట్లే. యూఎస్ఏ తరఫున క్రికెట్ ఆడిన అఖిలేష్ రెడ్డి 2000లో అమెరికాలోనే జన్మించాడు. అమెరికాలో జన్మించినప్పటికీ క్రికెట్లో పేరు వచ్చింది మాత్రం హైదరాబాద్కు ఆడడం ద్వారానే. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) తరఫున దేశవాళీ డొమొస్టిక్ టోర్నీల్లో ఆడిన అఖిలేష్ అబుదాబి టీ10 లీగ్లో యూపీ నవాబ్స్ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించాడు. ఆ ఫ్రాంచైజీకి ఆడుతున్న సమయంలో అతడిపై అవినీతి నిరోధక నియమాల ఉల్లంఘనకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.అఖిలేష్ ఉల్లంఘించిన నిబంధనలివే..👉ఆర్టికల్ 2.1.1-అబుదాబి టీ10 లీగ్ 2025లో మ్యాచ్ల ఫలితం, పురోగతి, నిర్వహణ లేదా ఇతర అంశాన్ని నిర్ధారించడానికి, కుట్ర పన్నడానికి లేదా ఇతరత్రా అనుచితంగా ప్రభావితం చేయడానికి ప్రయత్నించడం, లేదా ఏ విధంగానైనా నిర్ధారించడానికి లేదా కుట్ర పన్నడానికి లేదా ఇతరత్రా అనుచితంగా ప్రభావితం చేయడానికి చేసే ఒప్పందంలో కుట్రదారుడిగా తేలడం.👉ఆర్టికల్ 2.1.4- అబుదాబి టీ10 లీగ్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్లలో ఆర్టికల్ 2.1.1ను ఉల్లంఘించాలని వేరే వాళ్లను ఉద్దేశపూర్వకంగా ప్రేరేపించడం, ప్రలోభాలకు గురి చేయడం, ప్రోత్సహించడం లేదా ఉద్దేశపూర్వకంగా సులభతరం చేయడానికి ప్రయత్నించడం.👉ఆర్టికల్ 2.4.7-విచారణలో భాగంగా దర్యాప్తుకు ఆటంకం కలిగించేలా తన వద్ద ఉన్న డేటా, సమాచారాన్ని దొరక్కుండా చేయడం లేదా తొలగించడం.👉ఇక బొదుగుమ్ అఖిలేష్ రెడ్డి అమెరికా తరఫున నాలుగు టీ20 మ్యాచ్లు ఆడాడు. నాలుగు ఇన్నింగ్స్లు కలిపి అఖిలేష్ ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు. ఇక మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో తొలి రెండు ఎడిషన్లలో వాషింగ్టన్ ఫ్రీడమ్కు ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఒక్కసారి కూడా జట్టులో ఆడే అవకాశం లభించలేదు.Read: సొంత జట్టుతో గొడవ.. పంజాబ్ ఆల్రౌండర్ కీలక నిర్ణయం! -
ఇక ఈ అధ్యాయం ముగిసిపోయింది
టీమిండియాతో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ భావోద్వేగానికి లోనయ్యాడు. భారత జట్టు సాధించిన తిరుగులేని విజయాల్లో తానూ భాగమైనందుకు సంతోషంగా ఉందన్నాడు. అయితే, ఈ అధ్యాయం ముగిసిపోయిందని.. ఏదేమైనా గత ఐదేళ్లు తన జీవితంలో మధుర జ్ఞాపకంగా మిగిలిపోతాయని పేర్కొన్నాడు.కాగా 2021, నవంబరులో టీమిండియా ఫీల్డింగ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన టి.దిలీప్ (T. Dilip).. తన హయాంలో మంచి మార్పులు తీసుకువచ్చాడు. మైదానంలో అత్యుత్తమంగా రాణించిన ఫీల్డర్లకు గుర్తింపుగా డ్రెసింగ్రూమ్లో ఫీల్డింగ్ మెడల్ ప్రదానం చేయడం మొదలుపెట్టాడు ఈ హైదరాబాదీ.అయితే, బీసీసీఐ మాత్రం అతడి కాంట్రాక్టును పొడిగించేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ నేపథ్యంలో దిలీప్ స్థానంలో కొత్త ఫీల్డింగ్ కోచ్గా శుభదీప్ ఘోష్ను నియమించింది. ఈ నేపథ్యంలో దిలీప్ తాజాగా టీమిండియాతో తన అనుబంధం గురించి గుర్తుచేసుకుంటూ ఇన్స్టాలో పోస్టు పెట్టాడు.అదే లక్ష్యంతో పనిచేశాను‘‘ఈ ఐదేళ్ల ప్రయాణం గురించి వర్ణించడానికి మాటలు సరిపోవు. సహాయక సిబ్బందిలో చేరే ముందే.. జట్టు కోసం నా సర్వస్వం ఇవ్వాలని భావించాను. మొదటి రోజు నుంచి అదే లక్ష్యంతో పనిచేశాను.ఫీల్డింగ్ కోచ్గా జట్టుతో ప్రయాణం చేయడం పట్ల నేను కృతజ్ఞుడినై ఉంటాను. ఫీల్డింగ్ మెడల్ అనేది మా మనసులో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ మెడల్ ప్రదానం ద్వారా డ్రెసింగ్రూమ్లో ఒక ఆహ్లాదకర వాతావరణం సృష్టించాము.చిరస్మరణీయ విజయాలుఈ జ్ఞాపకాలు నా మదిలో నిలిచిపోతాయి. రెండు టీ20 ప్రపంచకప్ (2024,2026), ఒక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (2025), రెండు ఆసియా కప్ (2023, 2025) ట్రోఫీలు గెలిచిన జట్టులో నేనూ భాగమే.ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్, వన్డే వరల్డ్కప్ (2023) ఫైనల్ చేరిన జట్టులోనూ నేను ఉన్నాను. ఈ ప్రయాణంలో నాకెన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన బీసీసీఐకి సదా కృతజ్ఞుడినై ఉంటాను.మీరు కెప్టెన్లుగా ఉన్న సమయంలోనాపై నమ్మకం ఉంచినందుకు రాహుల్ ద్రవిడ్, గౌతం గంభీర్కు నా ధన్యవాదాలు. మీ ఇద్దరితో కలిసి పని చేయడం గొప్ప అనుభవం. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, శుబ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్.. మీరు కెప్టెన్లుగా ఉన్న సమయంలో భారత క్రికెట్కు నా వంతు సేవ చేయడాన్ని గొప్పగా భావిస్తున్నాను.ఈ ప్రయాణంలో నాతో ఉన్న ప్రతీ ఆటగాడు, కోచ్, సహాయక సిబ్బందిలోని ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ఇప్పుడిక ఈ అధ్యాయం ముగిసిపోయింది. ఈ ఐదేళ్లు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని మధుర జ్ఞాపకాలు. అయితే, నా ప్రయాణం మాత్రం కొనసాగుతుంది’’ అని టి. దిలీప్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు.చదవండి: బుమ్రా అవుట్.. రీప్లేస్మెంట్ ప్రకటించిన బీసీసీఐ -
సొంత జట్టుతో గొడవ.. పంజాబ్ ఆల్రౌండర్ కీలక నిర్ణయం!
పంజాబ్ కింగ్స్ ఆల్రౌండర్ శశాంక్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 2026-27 దేశవాళీ సీజన్ ప్రారంభానికి ముందు శశాంక్ సింగ్ ఛత్తీస్గడ్ నుంచి పాండిచ్చేరికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. గాయాలతో ఇబ్బంది పడుతున్న తనకు కష్టకాలంలో మద్దతుగా నిలవాల్సిన ఛత్తీస్గఢ్ స్టేట్ క్రికెట్ సంఘ్ (సీఎస్సీఎస్) తనను పక్కనబెట్టిందని, కనీసం వివరణ ఇచ్చుకునే సమయం కూడా తనకు ఇవ్వలేదని శశాంక్ సింగ్ వాపోయాడు. ఇప్పటికే పాండిచ్చేరికి ఆడేందుకు తాను ఛత్తీస్గఢ్ క్రికెట్ బోర్డు నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) కూడా తీసుకున్నట్లు 34 ఏళ్ల శశాంక్ పేర్కొన్నాడు. ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శశాంక్ సింగ్ మాట్లాడుతూ.. 'అవును నేను ఛత్తీస్గఢ్ను వీడుతున్నా. ఇప్పటికే సీఎస్సీఎస్ నుంచి ఎన్వోసీ కూడా తీసుకున్నా. ఈ సీజన్ నుంచి పాండిచ్చేరికి ఆడబోతున్నా. గత సీజన్లో భుజం, చేతి వేలి గాయాలతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నా. కానీ ఛత్తీస్గఢ్ స్టేట్ క్రికెట్ సంఘ్ మాత్రం నాకు ఏ దశలోనూ మద్దతుగా నిలబడలేదు. గాయాల నుంచి కోలుకున్నప్పటికీ, ఛత్తీస్గఢ్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ ఆటగాళ్ల జాబితా నుంచి నన్ను అకారణంగా తప్పించారు. అలాగే ప్రీ-సీజన్ శిక్షణా శిబిరం కోసం బెంగళూరు వెళ్లిన జట్టు నుంచి కూడా నన్ను తొలగించారు. ఎందుకు నా పేరు తొలగించారని అడిగితే బోర్డు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అయితే నేను కేవలం ఐపీఎల్ ఫ్రాంచైజీ క్రికెట్ మాత్రమే ఆడేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వచ్చిన వార్తలు కూడా అవాస్తవం. అలా అనుకుంటే ఇప్పటిదాకా ఛత్తీస్గఢ్కు ఎందుకు ఆడుతాను? 2023-24 సీజన్లో బెస్ట్ ఆల్రౌండర్ అవార్డు (లాలా అమర్నాథ్ అవార్డు) లభించినప్పడు, బీసీసీఐ నన్ను ఉత్తమ వైట్బాల్ ఆల్రౌండర్గా ప్రకటించినప్పుడు ఛత్తీస్గఢ్ ఈ క్రెడిట్ను తమ ఖాతాలోకి చేర్చుకున్న విషయం మరిచిపోయిందా?’ అని శశాంక్ ప్రశ్నించాడు.ఇక దేశవాళీలో ముఖ్యంగా వైట్బాల్ క్రికెట్లో శశాంక్ సింగ్కు మంచి రికార్డు ఉంది. 2024-25 విజయ్ హజారే ట్రోఫీలో 450 పరుగులు చేయడంతో పాటు 11 వికెట్లు తీశాడు. ఆ సీజన్లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ ఏడు మ్యాచ్ల్లో 188 రన్స్ సాధించాడు. అదే ఫామ్ను ఐపీఎల్ 2025 సీజన్లోనూ కంటిన్యూ చేశాడు. ఆ సీజన్లో పంజాబ్ కింగ్స్ ఫైనల్ చేరడంలో శశాంక్ సింగ్ కీలకపాత్ర పోషించాడు. 350 పరుగులు చేసిన శశాంక్ సింగ్ ఆర్సీబీతో జరిగిన ఫైనల్లో 30 బంతుల్లోనే 61 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే దేశవాళీ క్రికెట్లో మెరుగైన అవకాశాల కోసం 2018లో ముంబై నుంచి తన సొంత రాష్ట్రం ఛత్తీస్గఢ్కు మారాడు. తాజాగా వివాదాస్పద రీతిలో ఛత్తీస్గఢ్ను వీడిన శశాంక్ సింగ్ పాండిచ్చేరి జట్టులో చేరడం ద్వారా కెరీర్లో కొత్త ప్రారంభాన్ని ఆశిస్తున్నట్లు శశాంక్ సింగ్ తెలిపాడు.Read: 16 ఏళ్లకే ప్రపంచ రికార్డు.. ఎవరీ నీల్ పటేల్? -
47 ఏళ్ల రికార్డును సమం చేసిన పాక్ బౌలర్
వెస్టిండీస్తో రెండో టెస్టుకు ముందు పాకిస్తాన్ జట్టులో ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తొలి టెస్ట్లో 8 వికెట్లతో (రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్ల ప్రదర్శన) సత్తా చాటినప్పటికీ, రైట్ ఆర్మ్ మీడియం పేసర్ మహ్మద్ అబ్బాస్ను ప్లేయింగ్ ఎలెవెన్ నుంచి తప్పించారు. ఈ ఆశ్చర్యకర పరిణామం ద్వారా అబ్బాస్ ఓ పాకిస్తాన్ రికార్డును సమం చేశాడు.ముందు మ్యాచ్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసినా, ఆ తర్వాతి మ్యాచ్లో జట్టులో చోటు దక్కని రెండో పాకిస్తానీ బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు.47 ఏళ్ల ముందు (1979-80) భారత పర్యటనలో ఎహ్తెషాముద్దీన్ నాలుగో టెస్టులో ఐదు వికెట్ల ప్రదర్శనతో (5/47) సత్తా చాటాడు. కానీ ఆ తర్వాతి టెస్టులో అప్పటి కెప్టెన్ అసిఫ్ ఇక్బాల్ అతడిని తప్పించి ఇమ్రాన్ ఖాన్ను జట్టులోకి తీసుకున్నాడు. తాజాగా అబ్బాస్ కూడా ముందు టెస్టులో 5 వికెట్లు తీసినప్పటికీ, తదుపరి టెస్టులో ప్లేయింగ్ XIకి దూరమయ్యాడు.అబ్బాస్ స్థానంలో నసీమ్ షా తమ్ముడు ఉబైద్ షా జట్టులోకి వచ్చాడు. అతడికి ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ (రెండో టెస్ట్కు వేదిక) పరిస్థితులకు సరిపోడనే కారణంతో అబ్బాస్ను బెంచ్కు పరిమితం చేసినట్లు పాక్ కెప్టెన్ బాబర్ ఆజం తెలిపాడు.అయితే అబ్బాస్ను తప్పించడం సరైన నిర్ణయం కాదని మ్యాచ్ తొలి రోజే తేలిపోయింది. అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన ఉబైద్ 9 ఓవర్లలో 56 పరుగులిచ్చి కేవలం ఒక వికెట్ మాత్రమే తీశాడు. దీంతో వెస్టిండీస్ 239/5తో తొలి రోజు ఆట ముగించింది.తొలి టెస్ట్లో బంతితో సత్తా చాటిన జస్టిన్ గ్రీవ్స్ ఈ మ్యాచ్లో బ్యాట్తో రాణించి (64 నాటౌట్) విండీస్ జట్టును ఆదుకున్నాడు. అతడికి జతగా కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (36 నాటౌట్) క్రీజ్లో ఉన్నాడు. కాగా, రెండు మ్యాచ్ల ఈ సిరీస్లో వెస్టిండీస్ 1-0 ఆధిక్యంలో ఉంది. -
వినేశ్ ఫొగాట్ సంచలన ఆరోపణలు
భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసులో అతడికి క్లీన్చిట్ ఇస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసులో బ్రిజ్భూషణ్తో పాటు సహ నిందితుడిగా ఉన్న రెజ్లింగ్ సమాఖ్య మాజీ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్ను కూడా నిర్దోషిగా తేల్చింది.ఈ నేపథ్యంలో భారత స్టార్ రెజ్లర్, ఒలింపియన్ వినేశ్ ఫొగాట్ ఘాటుగా స్పందించింది. మొదటి నుంచీ వ్యవస్థ బ్రిజ్భూషణ్ సింగ్ను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోందని సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు.. ‘‘బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయించేందుకు మేము ఢిల్లీ వీధుల్లో పోరాడాల్సి వచ్చింది.అతడు తన అధికారం, పలుకుబడిని ఉపయోగించి కొంత మంది అమ్మాయిలను ఈ కేసు నుంచి ఉపసంహరించుకునేలా బలవంతం చేశాడు. అయితే, మరికొందరు మాత్రం తమకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా బ్రిజ్భూషణ్పై న్యాయస్థానంలో పోరాడేందుకు సిద్ధమయ్యారు.కానీ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన కేసులో కోర్టు బ్రిజ్భూషణ్ను నిర్దోషిగా ప్రకటించడం అత్యంత విచారకరం. మొదటి నుంచి అతడిని కాపాడేందుకు వ్యవస్థ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయంలో హైకోర్టుకు అప్పీలు చేసేలా ఇప్పటికే చాలా మంది మహిళా రెజ్లర్లు తమ న్యాయవాదులకు సందేశం ఇచ్చారు.ఇప్పటికీ మేము ఆశను కోల్పోలేదు. బ్రిజ్భూషణ్ అఘాయిత్యాలకు వ్యతిరేకంగా రెజ్లర్ల పోరాటం కొనసాగుతుంది’’ అని వినేశ్ ఫొగాట్ ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకుంది. కాగా బ్రిజ్భూషణ్ తమను లైంగికంగా వేధించాడంటూ ఆరుగురు మహిళా రెజ్లర్లు ఆరోపించారు.అయితే, ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయడం లేదని రాజధానిలో రెజ్లర్లు నిరసనకు దిగారు. సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ వారికి మద్దతుగా జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు.ఆరోపణలు చేసిన ఆరుమంది రెజ్లర్లలో ఓ మైనర్ కూడా ఉండటంతో.. పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. అయితే, ఆ తర్వాత ఆమె కేసును ఉపసంహరించుకోవడంతో బ్రిజ్భూషణ్కు భారీ ఊరట దక్కింది. తాజాగా.. మిగిలిన కేసుల్లోనూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించడం గమనార్హం. అయితే, రెజ్లర్లు హైకోర్టులో అప్పీలు చేసేందుకు సిద్ధమైనట్లు వినేశ్ ఫొగాట్ వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. -
16 ఏళ్లకే ప్రపంచ రికార్డు.. ఎవరీ నీల్ పటేల్?
ఆస్ట్రేలియా అండర్-19 జట్టు భారత్లో వచ్చే నెలలో మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడనున్న నేపథ్యంలో సోమవారం క్రికెట్ ఆస్ట్రేలియా జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. 16 మందితో కూడిన జట్టులో భారత సంతతి టీనేజర్ అయిన నీల్ పటేల్ కూడా చోటు దక్కించుకోవడం విశేషం. అతడి తల్లిదండ్రుల స్వస్థలం గుజరాత్ కావడంతో నీల్ పటేల్ వచ్చే నెలలో పేరేంట్స్ పుట్టిన గడ్డపై మ్యాచ్లు ఆడేందుకు వస్తుండడంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో నీల్ పటేల్ ఎవరు? ఆస్ట్రేలియా తరఫున అతడు క్రికెటర్గా ఎలా ఎదిగాడన్నది ఆసక్తిగా మారింది.సిడ్నీకి చెందిన నీల్ పటేల్ న్యూసౌత్ వేల్స్ తరఫున అండర్-19 క్రికెట్ ఆడుతున్నాడు. న్యూసౌత్ వేల్స్ తరఫున ఓపెనర్ బ్యాటర్గా జూనియర్ లెవెల్ కెరీర్ను ప్రారంభించాడు. సిడ్నీ ప్రీమియర్ క్రికెట్ ఫస్ట్ గ్రేడ్లో ఒక క్యాలెండర్ ఇయర్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న పిన్న వయస్కుడిగా (16 ఏళ్లు) నీల్ పటేల్ ప్రపంచ రికార్డు అందుకున్నాడు. బ్యాట్తోనే గాక తన ఆఫ్ స్పిన్తోనూ ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టడంలో నీల్ పటేల్ సమర్థుడు. నీల్ పటేల్ అండర్-19 జట్టుకు ఎంపిక కావడం వెనుక అతడి కఠోర శ్రమ దాగుంది. అడిలైడ్ వేదికగా మార్చి 29 నుంచి ఏప్రిల్ 2 వరకు సాగిన అండర్-19 టాలెంట్ క్యాంప్కు ఎంపికైన నీల్ పటేల్ తన ఆటను మరింత మెరుగుపరుచుకున్నాడు. ఈ క్రమంలోనే క్రికెట్ ఆస్ట్రేలియా బృందం కళ్లలో పడిన నీల్ పటేల్ ఇవాళ మల్టీ ఫార్మాట్ సిరీస్కు ఎంపికయ్యాడు. అంతేకాదు బాక్ ఫుట్ ప్లే షాట్స్ను కచ్చితంగా ఆడే నైపుణ్యం సాధించాడు.ఇక నీల్ పటేల్ కంటే ముందు జాసన్ సంఘా భారత్లో మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడిన తొలి భారత సంతతి క్రికెటర్గా ఉన్నాడు. ఇక ప్రస్తుతం అండర్-19 చాంపియన్షిప్ ట్యాగ్ భారత్ వద్దే ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్ను 100 పరుగులతో ఓడించిన భారత అండర్-19 జట్టు టైటిల్ను ఎగరేసుకుపోయింది.సెప్టెంబర్, అక్టోబర్ మధ్యలో జరగనున్న ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్లో ఆస్ట్రేలియా అండర్-19 జట్టు మూడు యూత్ వన్డేలతో పాటు రెండు యూత్ టెస్టులు (నాలుగు రోజులు) ఆడనుంది. మ్యాచ్లన్నీ రాజ్కోట్, అహ్మదాబాద్ వేదికగా జరగనున్నాయి. Read: భారత్లో మల్టీ ఫార్మాట్ సిరీస్.. ఆసీస్ జట్టు ప్రకటన -
టాప్-5 బెస్ట్ బౌలర్లు వీరే.. సారీ భాయ్ నువ్వే లాస్ట్!
టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్కు తాను వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతానని పేర్కొన్నాడు. అసలు విషయం ఏమిటంటే...టాప్-5 బెస్ట్ బౌలర్లు వీరేఇంగ్లండ్ పర్యటన తర్వాత భారత్కు తిరిగి వచ్చిన అర్ష్దీప్ సింగ్ ప్రస్తుతం ఆటకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో క్రిషాంక్ ఆత్రేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఈ లెఫ్టార్మ్ పేసర్ తన టాప్-5 టీమిండియా బౌలర్ల పేర్లను వెల్లడించాడు. ఈ జాబితాలో వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్కు అర్ష్ అగ్రస్థానమిచ్చాడు.భువీనే ఎందుకంటే..ఇందుకు గల కారణాన్ని వెల్లడిస్తూ.. ‘‘భువీ భాయ్ అంటే వ్యక్తిగతంగా నాకెంతో ఇష్టం. కాబట్టి నేను ఆయనకే ఓటు వేశాను. భువీ భాయ్ ఎప్పుడూ టాప్లోనే ఉంటాడు. ఇక రెండో స్థానంలో షమీ భాయ్కు నేను చోటిస్తాను.ఎలాంటి వికెట్ మీదనైనా సీమ్ రాబట్టగల సత్తా అతడి సొంతం. షమీ భాయ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. మూడో స్థానానికి కుల్దీప్ యాదవ్ను ఎంచుకుంటాను. అతడికి అరుదైన బౌలింగ్ నైపుణ్యాలు ఉన్నాయి. అతడు లెఫ్టార్మ్ చైనామన్ బౌలర్.ఇక నాలుగో స్థానంలో యుజీ భాయ్ ఉంటాడు. పంజాబ్ జట్టులో నాకు అతడు సహచరుడు. ఐపీఎల్లో అతడి రికార్డు అమోఘం. అత్యధిక వికెట్లు కూల్చిన ఘనత యుజీ భాయ్కు ఉంది’’ అని అర్ష్దీప్ సింగ్ పేర్కొన్నాడు.సారీ భాయ్.. నువ్వే లాస్ట్!అదే విధంగా.. ‘‘నిజానికి అశూ భాయ్ (అశ్విన్)ను నేను ఈ జాబితాలో చివరి స్థానంలో పెట్టాలనుకోలేదు. కానీ టాప్-5లో ఇంకా చోటు లేదు కాబట్టి తప్పడం లేదు. ఆయన ఒక దిగ్గజం. ఐపీఎల్లో నాకు అశూ భాయ్నే మొదటి కెప్టెన్. సారీ భాయ్. నీకు నేను వ్యక్తిగతంగా మెసేజ్ చేస్తాను’’ అని అర్ష్దీప్ సింగ్ సరదాగా వ్యాఖ్యానించాడు.చదవండి: బుమ్రా అవుట్.. రీప్లేస్మెంట్ ప్రకటించిన బీసీసీఐ -
భారత్లో మల్టీ ఫార్మాట్ సిరీస్.. ఆసీస్ జట్టు ప్రకటన
ఆస్ట్రేలియా సీనియర్ జట్టు ప్రస్తుతం పాకిస్తాన్ టూర్ వెళ్లేందుకు సిద్ధమవుతుంటే, తాజాగా వచ్చే నెలలో భారత్లో జరగనున్న అండర్-19 మల్టీ ఫార్మాట్ సిరీస్కు క్రికెట్ ఆస్ట్రేలియా 16 మందితో కూడిన అండర్-19 జట్టును ప్రకటించింది. సెప్టెంబర్, అక్టోబర్ మధ్యలో జరగనున్న ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్లో ఆస్ట్రేలియా అండర్-19 జట్టు మూడు యూత్ వన్డేలతో పాటు రెండు యూత్ టెస్టులు (నాలుగు రోజులు) ఆడనుంది. ఈ నేపథ్యంలోనే క్రికెట్ ఆస్ట్రేలియా సోమవారం 16 మందితో జట్టును ప్రకటించింది. కేసీ బార్టన్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, విల్ బైరోమ్ అతడికి డిప్యుటీగా ఉండనున్నాడు. 16 మందిలో కేసీ బార్టన్, విల్ బైరోమ్ మాత్రమే జింబాబ్వే వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచకప్లో ఆడారు. ఇక ఇదే జట్టులో భారత సంతతి కుర్రాడు, గుజరాత్కు చెందిన నీల్ పటేల్ చోటు దక్కించుకున్నాడు.ఇక జట్టులో క్వీన్స్లాండ్ నుంచి ఐదుగురు ఆటగాళ్లు ఉండగా, విక్టోరియా, న్యూ సౌత్వేల్స్ నుంచి ముగ్గురేసి, తస్మానియా, సౌత్ ఆస్ట్రేలియా, వెస్ట్రన్ ఆస్ట్రేలియా నుంచి మిగిలిన ఆటగాళ్లు ఉన్నారు. ఇక మ్యాచ్లన్నీ రాజ్కోట్, అహ్మదాబాద్ వేదికగా జరగనున్నాయి.భారత్లో ఆసీస్ సిరీస్ షెడ్యూల్👉తొలి యూత్ వన్డే – శుక్రవారం, సెప్టెంబర్ 18👉రెండో యూత్ వన్డే – సోమవారం, సెప్టెంబర్ 21👉మూడో యూత్ వన్డే – బుధవారం, సెప్టెంబర్ 23👉మొదటి యూత్ టెస్ట్ – ఆదివారం, సెప్టెంబర్ 27-30 వరకు👉రెండో యూత్ టెస్ట్ – సోమవారం, అక్టోబర్ 5-8 వరకుభారత్లో సిరీస్ నిర్వహణ ఎందుకంటే?ఇండియా అండర్-19 జట్టుతో మల్టీ ఫార్మాట్లో సిరీస్ నిర్వహణ ఎందుకు అనే దానిపై క్రికెట్ ఆస్ట్రేలియా హెడ్ ఆఫ్ నేషనల్ డెవలప్మెంట్ అధికారిణి సొన్యా థాంప్సన్ వివరణ ఇచ్చారు. "మా పాత్వేస్ ప్రోగ్రామ్లో భాగంగా ఆస్ట్రేలియాలోని కొంతమంది అత్యుత్తమ యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలను కల్పించి వారిని ప్రోత్సహించడం మాకు చాలా సంతోషంగా ఉంది. కఠిన పరిస్థితుల్లో భారత్ను ఎదుర్కోవడం ఆటగాళ్లకు సాంకేతికంగా, మానసికంగా ఎదగడానికి సహాయపడుతుంది. భారత్లో పర్యటించడం, సవాలుతో కూడిన పరిస్థితుల్లో అత్యున్నత స్థాయి ప్రత్యర్థులతో తలపడడం ద్వారా అనుభవంతో కూడిన పాఠాలు నేర్చుకుంటారు. ఇది అన్ని ఫార్మాట్లలో ఆటగాళ్లను సాంకేతికంగా, మానసికంగా పరీక్షిస్తుంది," అని థాంప్సన్ తెలిపారు. మరోవైపు ఆసీస్తో మల్టీ ఫార్మాట్ సిరీస్కు భారత అండర్-19 జట్టును బీసీసీఐ త్వరలోనే ప్రకటించనుంది.ఆస్ట్రేలియా అండర్-19 జట్టు:కేసీ బార్టన్ (కెప్టెన్), హేడెన్ బార్బులోవిక్, ఎలీ బ్రెయిన్, విల్ బైరోమ్ (వైస్ కెప్టెన్), బ్లేక్ క్యాటిల్, జాక్ జోస్నెక్, స్పెన్సర్ గ్రీన్, కానర్ గ్రెగొరీ, చార్లీ హెండర్సన్, జెడ్ హోలిక్, మాథ్యూ లాఫ్, నీల్ పటేల్, జాకబ్ పీట్జ్, పాట్రిక్ సుల్లివన్, థియో సింగోస్, థామస్ వాసియో.Introducing our Australian Men's Under 19 squad to tour India next month 👋 pic.twitter.com/1z8Vf6erj7— Cricket Australia (@CricketAus) August 2, 2026చదవండి: విండీస్కు ఆపద్బాంధవుడిలా.. మొన్న బంతితో, ఇవాళ బ్యాట్తో! -
విండీస్కు ఆపద్బాంధవుడిలా.. మొన్న బంతితో, ఇవాళ బ్యాట్తో!
ట్రినిడాడ్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ బ్యాటర్ జస్టిన్ గ్రీవ్స్ మరోసారి ఆపద్బాంధవుడి పాత్రను పోషించాడు. అయితే ఈసారి బౌలర్గా కాకుండా బ్యాటర్గా తన విలువను ప్రదర్శించాడు. పాక్తో జరిగిన తొలి టెస్టులో వరుస ఐదు ఓవర్లలో ఐదు మెయిడెన్ వికెట్లు తీసి చరిత్ర సృష్టించిన జస్టిన్ గ్రీవ్స్ ఈసారి బ్యాట్తో (125 బంతుల్లో 64 నాటౌట్) రాణించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ 5 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. గ్రీవ్స్తో పాటు కెప్టెన్ రోస్టన్ చేజ్ (36 బ్యాటింగ్) క్రీజులో కొనసాగుతున్నాడు. అంతకముందు ఓపెనర్ బ్రాండన్ కింగ్ (46) అర్ధశతకం మిస్ చేసుకోగా, అమిర్ జాంగో (26), షెయ్ హోప్ (29) పర్వాలేదనిపించారు. పాకిస్తాన్ బౌలర్లలో మొహమ్మద్ అలీ 2 వికెట్లు తీయగా, ఉబైద్ షా, అలీ ఉస్మాన్, సాజిద్ ఖాన్లు తలా ఒక వికెట్ తీశారు. ఇదే స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో వెస్టిండీస్ 90 పరుగుల తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఇక తొలి వికెట్కు బ్రాండన్ కింగ్, టగ్ నరైన్ చంద్రపాల్ (15) 49 పరుగులు జోడించిన తర్వాత విండీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో పెద్దగా ఎవరు ఆకట్టుకోలేదు. 120 పరుగుల వద్ద వెస్టిండీస్ నాలుగో వికెట్ కోల్పోవడంతో జస్టిన్ గ్రీవ్స్ క్రీజులోకి వచ్చాడు. క్రీజులోకి వచ్చిందే మొదలు తనలోని క్లాస్ బ్యాటర్ను బయటికి తీసిన గ్రీవ్స్ నింపాదిగా ఆడాడు. వీలైనప్పుడల్లా బంతులను బౌండరీలను తరలించాడు. షెయ్ హోప్ ఔటైన తర్వాత మరింత బాధ్యతగా ఆడిన గ్రీవ్స్ టెస్టుల్లో మూడో అర్థసెంచరీని సాధించాడు. చేజ్తో కలిసి ఆరో వికెట్కు గ్రీవ్స్ అజేయంగా 66 పరుగులు జోడించడంతో విండీస్ మళ్లీ ట్రాక్లో పడింది. రెండో రోజు ఆటలో ఈ ఇద్దరు ఎంతసేపు బ్యాటింగ్ చేస్తారనే దానిపై విండీస్ స్కోరు ఆధారపడి ఉంది. Justin Greaves Is A Classy Batter. Very Fluent Batter. His Drives Are Awesome pic.twitter.com/QfKDf5rWT0— Aryan Goel 2.0 (@AryanGoelNew) August 2, 2026Read: తీవ్ర అసంతృప్తిలో గిల్, గంభీర్.. వాళ్లపై బీసీసీఐ వేటు! -
తీవ్ర అసంతృప్తిలో గిల్, గంభీర్.. వాళ్లపై బీసీసీఐ వేటు!
ఇటీవలి కాలంలో టీమిండియాకు గాయాల బెడద ఎక్కువైంది. కీలక ఆటగాళ్లంతా జట్టుకు అవసరమైన సమయంలో అందుబాటులో లేకుండా పోతున్నారు. జట్టు విజయావకాశాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది.పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్-2026 తర్వాత ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికయ్యాడు, అయితే, గాయం వల్ల టూర్ మొత్తానికి అతడు దూరమయ్యాడు. పాండ్యా మాదిరే అరుదైన నైపుణ్యాలున్న నితీశ్ కుమార్ రెడ్డి కూడా గాయపడ్డాడు.యువ పేసర్ హర్షిత్ రాణాతో పాటు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, యువ పేస్ బౌలర్ ప్రిన్స్ యాదవ్ ఇటీవలే ఈ గాయాల జాబితాలో చేరారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.ఫిజియోథెరపీ టీమ్లో సమూలంగా మార్పులు చేపట్టేందుకు బోర్డు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇంజూరీ మేనేజ్మెంట్, ఫిట్నెస్ క్లియరెన్స్ల విషయంలో స్పష్టత లేదని.. ఇందుకు హెడ్ ఫిజియోథెరపిస్ట్ నిర్లక్ష్యమే కారణమని యాజమాన్యం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, నితీశ్ కుమార్ రెడ్డి వంటి ఆటగాళ్లు క్లియరెన్స్ సర్టిఫికెట్తో తిరిగి వచ్చిన తర్వాత.. ఆ వెంటనే మళ్లీ గాయాల బారిన పడటాన్ని ఇందుకు నిదర్శనంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హెడ్ ఫిజియోథెరపిస్ట్ కమలేశ్ జైన్, టీమ్ డాక్టర్ రిజ్వాన్ ఖాన్లపై వేటు వేసేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు సమాచారం.ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘కమలేశ్ జైన్ విషయంలో మేనేజ్మెంట్ అసంతృప్తితో ఉంది. ఆటగాళ్లు తరచూ గాయాలబారిన పడటం వల్ల కెప్టెన్ శుబ్మన్ గిల్, హెడ్కోచ్ గౌతం గంభీర్ తమ తుదిజట్టు కూర్పులో ఇబ్బంది పడుతున్నారు.పదిహేను మంది సభ్యులు ఉన్నప్పటికీ సరైన కాంబినేషన్ని సెట్ చేయలేక తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గాయాల విషయంలో సిబ్బంది పూర్తి అవగాహన, స్పష్టతతో ఉండాలి. ఆటగాళ్లను తిరిగి మైదానంలోకి పంపేందుకు తొందరపడకూడదు.వారు పూర్తి ఫిట్నెస్ సాధించిన తర్వాతే సర్టిఫికెట్ జారీచేయాలి. హడావుడిగా రంగంలోకి దించడం వల్ల పరిస్థితి మళ్లీ మొదటికే వస్తుంది. నితీశ్ రెడ్డి, హర్షిత్ రాణా విషయంలో ఇదే జరిగింది. ఇలాంటి తొందరపాటు చర్యలు కీలక సమయంలో జట్టు విజయావకాశాలను దెబ్బతీస్తాయి. అందుకు సదరు బృందం కచ్చితంగా జవాబుదారీగా ఉండాల్సిందే. వారి నుంచి సరైన వివరణ లభించకపోతే వేటు తప్పకపోవచ్చు’’ అని పేర్కొన్నాయి.కాగా ఆటగాళ్లు తరచూ గాయపడటం పట్ల టెస్టు, వన్డే జట్ల కెప్టెన్ శుబ్మన్ గిల్ బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. ఒకటి, రెండు మ్యాచ్ల తర్వాత ఆటగాళ్లు గాయపడితే.. వన్డే వరల్డ్కప్-2027 వంటి మేజర్ టోర్నీలో తమకు ఇబ్బందులు తప్పవన్నాడు. ఫిట్నెస్ సమస్యలు మెరుగుపరచుకుంటేనే అనుకున్న ఫలితాలు రాబట్టగలమని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే అతడు బీసీసీఐ వైద్య బృందాన్ని కాదని.. చికిత్స కోసం బయటి డాక్టర్లను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. కాగా గిల్ తరచూ మెడనొప్పి, కండరాల నొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.చదవండి: బుమ్రా అవుట్.. రీప్లేస్మెంట్ ప్రకటించిన బీసీసీఐ -
ఐదు వికెట్లతో చెలరేగిన రషీద్ ఖాన్
‘ది హండ్రెడ్ మెన్స్ కాంపిటిషన్’- 2026లో అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఎంఐ లండన్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. మాంచెస్టర్ సూపర్ జెయింట్స్తో ఆదివారం నాటి మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగి.. తన జట్టును గెలిపించాడు.విల్ జాక్స్, పూరన్ మెరుపులులండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో టాస్ గెలిచిన మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఎంఐ లండన్ వంద బంతుల్లో ఆరు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్లలో విల్ జాక్స్ మెరుపు అర్ధ శతకం (31 బంతుల్లో 62) సాధించగా.. వన్డౌన్ వచ్చిన నికోలస్ పూరన్ కూడా హాఫ్సెంచరీ (28 బంతుల్లో 54)తో మెరిశాడు.చెలరేగిన రషీద్ ఖాన్మిగిలిన వారిలో కెప్టెన్ సామ్ కర్రన్ ధనాధన్ (11 బంతుల్లో 23) దంచికొట్టగా.. ఆఖర్లో రషీద్ ఖాన్ నాలుగు బంతుల్లో ఏడు పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన మాంచెస్టర్ సూపర్ జెయింట్స్.. లండన్ బౌలర్ల ధాటికి తాళలేక 95 బంతుల్లో 138 పరుగులే చేసి ఆలౌట్ అయింది.టాపార్డర్లో కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (26 బంతుల్లో 50) అర్ధ శతకం చేయగా.. మిగిలిన వారిలో లూయిస్ డూ ప్లోయీ (22) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. లండన్ బౌలర్లు నిప్పులు చెరగడంతో మాంచెస్టర్ లోయర్ ఆర్డర్ కుప్పకూలింది. ఆరో నంబర్ బ్యాటర్ నుంచి అందరూ సింగిల్ డిజిట్కే వెనుదిరిగారు.20 బంతుల్లో కేవలం 17 పరుగులేలండన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 20 బంతుల్లో కేవలం 17 పరుగులే ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు కూల్చి.. మాంచెస్టర్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. మిగితా వారిలో టామ్ కర్రాన్ రెండు, ట్రెంట్ బౌల్ట్, రిచర్ట్ గ్లీసన్, నాథన్ సోటర్ తలా ఒక వికెట్ పడగొట్టారు.5 WICKETS FOR RASHID KHAN 😍Rashid Khan collects his first five wicket haul in #TheHundred 🔥 pic.twitter.com/EDTyAkx42I— The Hundred (@thehundred) August 2, 2026ఇక మాంచెస్టర్ 138 పరుగులకే కుప్పకూలగా లండన్ 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. రషీద్ ఖాన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కాగా 2024 తర్వాత ది హండ్రెడ్ కాంపిటిషన్లో ఒకే మ్యాచ్లో ఐదు వికెట్లు తీసిన ఏకైక బౌలర్గా రషీద్ ఖాన్ నిలిచాడు. ఇక ఈ సీజన్లో లండన్కు ఐదింట ఇది మూడో విజయం కాగా.. మాంచెస్టర్కు ఐదింట మూడో ఓటమి.చదవండి: బుమ్రా అవుట్.. రీప్లేస్మెంట్ ప్రకటించిన బీసీసీఐ -
బుమ్రా అవుట్.. రీప్లేస్మెంట్ ప్రకటించిన బీసీసీఐ
టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా శ్రీలంకతో టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో యాజమాన్యం అతడికి విశ్రాంతిని పొడగించింది. ఈ నేపథ్యంలో టీమిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ బుమ్రా స్థానంలో ఆకిబ్ నబీని శ్రీలంక పర్యటనకు ఎంపిక చేసింది. ఇందుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది.అప్పుడు విమర్శలుజమ్మూ కశ్మీర్ ఎక్స్ప్రెస్గా పేరొందిన ఆకిబ్ నబీ.. గత రెండు రంజీ సీజన్లలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. గత రెండు ఎడిషన్లలో కలిపి మొత్తంగా 104 వికెట్లు కూల్చాడు. అంతేకాదు జమ్మూ కశ్మీర్ తొలిసారి రంజీ ట్రోఫీని ముద్దాడటంలో కీలక పాత్ర పోషించాడు.దీంతో త్వరలోనే ఆకిబ్ నబీ టీమిండియాకు ఎంపికవుతాడని విశ్లేషకులు భావించారు. అయితే, స్వదేశంలో అఫ్గానిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టుకు సెలక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు. ఒకేసీజన్లో (2025-26) 60కి పైగా వికెట్లు తీసినప్పటికీ అతడిని పక్కనపెట్టడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.PC: BCCI Xబుమ్రా గాయం.. నబీకి అదృష్టంఇదిలా ఉంటే.. ఇటీవల శ్రీలంక-ఎ జట్టుతో జరిగిన అనధికారిక టెస్టు సిరీస్లో భారత్-ఎ తరఫునా ఆకిబ్ నబీ సత్తా చాటాడు. మొత్తంగా ఆరు వికెట్లు కూల్చాడు. కాగా ఇంగ్లండ్తో రెండో వన్డే సందర్భంగా బుమ్రా ఎడమ మోకాలికి గాయమైన సంగతి తెలిసిందే. అయితే, లంకతో టెస్టు సిరీస్ నాటికి అతడు కోలుకుంటాడని సెలక్టర్లు భావించారు.కానీ బుమ్రా ఇంకా పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధించలేదు. దీంతో సెలక్టర్లు ఆకిబ్ నబీకి మార్గం సుగమం చేశారు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సీజన్లో భారత్ ఫైనల్ రేసులో ఉండాలంటే శ్రీలంకను 2-0తో వైట్వాష్ చేయక తప్పని పరిస్థితి. ఇలాంటి కీలక సిరీస్కు అనుభవజ్ఞుడైన బుమ్రా దూరం కాగా.. ఆకిబ్ నబీకి తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కింది. అయితే, తుదిజట్టులో అతడిని ఆడిస్తారో లేదో చూడాలి! కాగా ఆగష్టు 15- 28 మధ్య శ్రీలంక- టీమిండియా మధ్య రెండు టెస్టు మ్యాచ్లు జరుగుతాయి. ఇందుకు గాలె, కొలంబో వేదికలు.శ్రీలంకతో టెస్టు సిరీస్కు భారత జట్టు (అప్డేటెడ్)శుబ్మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (ఫిట్నెస్ ఆధారంగా), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ్ జైన్, ఆకిబ్ నబీ.చదవండి: గిల్, అభిషేక్ శర్మ కీలక నిర్ణయం! -
నాడు సన్మానాలు, సత్కారాలు.. తర్వాత తొక్కిపడేశారు!
ఒలింపిక్స్లో పాకిస్తాన్కు మొట్టమొదటి వ్యక్తిగత స్వర్ణ పతకం అందించిన అథ్లెట్ అర్షద్ నదీమ్. పారిస్ ఒలింపిక్స్-2024లో అనూహ్య రీతిలో ఈ జావెలిన్ త్రోయర్ ఈటెను 92.97 మీటర్ల దూరం విసిరి పసిడి పతకం కైవసం చేసుకున్నాడు. తద్వారా విశ్వక్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన జావెలిన్ త్రోయర్గా ప్రపంచ రికార్డు సాధించాడు.ఈ క్రమంలో పాకిస్తాన్లో అర్షద్ నదీమ్పై ప్రశంసల వర్షం కురిసింది. అత్యంత సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అతడు సన్మానాలు, సత్కారాలతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. కానీ ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. అతడి ప్రదర్శన రోజురోజుకీ దిగజారిపోయింది.చేదు అనుభవంతాజాగా కామన్వెల్త్ గేమ్స్-2026లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన అర్షద్ నదీమ్.. కనీసం కాంస్యం కూడా గెలవలేకపోయాడు. తొలి ప్రయత్నంలోనే ఫౌల్ కావడంతో అతడికి ఫైనల్ రౌండ్లో చేదు అనుభవం ఎదురైంది. టాప్-8కు చేరలేక అతడు ఎలిమినేట్ అయ్యాడు. గత ఎడిషన్లో పసిడితో మెరిసిన అతడు ఈసారి కనీసం కాంస్యం కూడా లేకుండానే వెనుదిరిగాడు.చెప్పినట్లు వినలేదని...అయితే, ఇందుకు పాకిస్తాన్ అమెచూర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ (PAAF)తో అతడికి ఉన్న విభేదాలే కారణం అని తెలుస్తోంది. PAAF అభీష్టానికి వ్యతిరేకంగా అర్షద్.. సల్మాన్ బట్ను తన కోచ్గా ఎంచుకున్నట్లు సమాచారం. నిజానికి సల్మాన్పై PAAF 2025 అక్టోబరులో జీవితకాల నిషేధం విధించింది. ఆ తర్వాత నెల రోజుల వ్యవధిలోనే నిషేధం ఎత్తివేసింది.దీంతో అర్షద్ సల్మాన్ మార్గదర్శనంలో ప్రాక్టీస్ చేశాడు. అయితే, ఇందుకు PAAF ఏమాత్రం సహకరించలేదని సమాచారం. పాకిస్తాన్ క్రీడా బోర్డు సైతం అర్షద్ నదీమ్ సన్నాహకాలకు కావాల్సిన నిధులు విడుదల చేయలేదని అతడి సన్నిహిత వర్గాలు గతంలో స్థానిక మీడియాకు తెలిపాయి.ఈ నేపథ్యంలో విదేశాల్లో ప్రాక్టీస్ చేయడం వీలుకాక.. లాహోర్లో ఎర్రటి ఎండల్లో అర్షద్ ప్రాక్టీస్ చేసినట్లు సమాచారం. కామన్వెల్త్ క్రీడల వేదికైన గ్లాస్గో (స్కాట్లాండ్)లో ఇందుకు పూర్తి వ్యతిరేకమైన వాతావరణం ఉండటం అతడి ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.అతడికి ఎంతటి దుస్థితిఈ పరిణామాల నేపథ్యంలో అర్షద్ నదీమ్ ఈసారిక పతకం లేకుండానే వెనుదిరిగినట్లు అతడి సన్నిహితవర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, పాక్ మాజీ బాక్సర్ హుసేన్ షా ఈ విషయం గురించి మాట్లాడుతూ..‘‘సరైన ఆదాయం లేని.. నిరుపేద కుటుంబం, చిన్న గ్రామం నుంచి వచ్చి దేశాన్ని తలెత్తుకునేలా చేసిన అథ్లెట్ అతడు. ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్లో దేశానికి పసిడి పతకాలు అందించాడు. కానీ ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్ కోసం సన్నద్ధమయ్యే వాతావరణం కూడా మా క్రీడా సంస్థ కల్పించలేకపోయింది.పాక్ క్రీడా వ్యవస్థలోని లోపానికి ఇది నిలువెత్తు నిదర్శనం’’ అని హుసేన్ షా మండిపడ్డాడు. కాగా అంతకుముందు సల్మాన్తో పాటు సౌతాఫ్రికా కోచ్ టెర్సస్ లీబెన్బెర్గ్తో అర్షద్ ప్రాక్టీస్ చేసి అత్యుత్తమ ఫలితాలు అందుకున్నాడు.సరైన సదుపాయాలు ఉంటే స్వర్ణం గెలిచేదాన్నిమరోవైపు.. పాకిస్తాన్కు ఈసారి కామన్వెల్త్ గేమ్స్లో ఏకైక పతకం అందించిన బాక్సర్ ఫాతిమా జెహ్రా సైతం పాక్ క్రీడా బోర్డు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తనకు సరైన సదుపాయాలు కల్పించి ఉంటే కచ్చితంగా మెరుగైన పతకం అందించేదానినని పేర్కొంది. కాగా ఫాతిమా కాంస్య పతకం గెలిచింది. ఇక పాకిస్తాన్ నుంచి ఈసారి మొత్తంగా 36 మంది సభ్యుల బృందం గ్లాస్గోకు వెళ్లగా.. కేవలం ఒకే ఒక్క పతకం దక్కింది.చదవండి: గిల్, అభిషేక్ శర్మ కీలక నిర్ణయం -
శుబ్మన్ గిల్, అభిషేక్ శర్మ కీలక నిర్ణయం!
టీమిండియా టెస్టు, వన్డే జట్ల కెప్టెన్ శుబ్మన్ గిల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ స్థానిక టీ20 లీగ్లో ఆడేందుకు అతడు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. గిల్తో పాటు టీమిండియా స్టార్లు అభిషేక్ శర్మ, అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ప్రభ్సిమ్రన్ సింగ్.. అదే విధంగా రమణ్దీప్ సింగ్ ఈ లీగ్లో భాగం కానున్నట్లు తెలుస్తోంది.పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (PCA) ... షేర్-ఈ-పంజాబ్ పేరిట తమ సొంత టీ20 లీగ్ను నిర్వహించనున్నట్లు ఆదివారం ప్రకటించింది. స్థానిక ఆటగాళ్లను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. చండీగఢ్లో జరిగిన ఈ కార్యక్రమంలో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ పాల్గొన్నాడు.ఇదొక చక్కటి ప్లాట్ఫామ్ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘యువ ఆటగాళ్లను తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఇదొక చక్కటి ప్లాట్ఫామ్. క్రమంగా పంజాబ్ జట్టు, టీమిండియా స్థాయికి ఎదిగేందుకు షేర్-ఈ-పంజాబ్ దోహదం చేస్తుంది. పంజాబ్ ఎల్లప్పుడూ టీమిండియాకు అత్యుత్తమ క్రికెటర్లను అందించింది.ఈ లీగ్ ద్వారా కూడా మరెంతో మంది వెలుగులోకి వస్తారని నమ్ముతున్నాను. మా గ్రామంలో నాన్న క్రికెట్ అకాడమీ నిర్వహించేవారు. అక్కడ ఉచితంగానే కోచింగ్ ఇచ్చేవాళ్లము. ఇప్పటికీ మా నాన్నకి కాస్త సమయం దొరికితే అక్కడికి వెళ్లి పిల్లల ఆటను గమనిస్తారు. క్రికెట్ పట్ల ఆయనకు ఉన్న అంకితభావం అలాంటిది’’ అని శుబ్మన్ గిల్ పేర్కొన్నాడు.గిల్, బ్రార్ ఆలస్యంగానైనా..కాగా ఆగష్టు 30 నుంచి సెప్టెంబరు 13 మధ్య షేర్-ఈ-పంజాబ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మ, అర్ష్దీప్ సింగ్ తదితరులు ఈ లీగ్కు అందుబాటులో ఉన్నప్పటికీ.. శుబ్మన్ గిల్, గుర్నూర్ బ్రార్ మాత్రం కాస్త ఆలస్యంగా తమ జట్లతో చేరే అవకాశం ఉంది. వీరిద్దరు ఆగష్టు 15- 28 వరకు శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్తో బిజీగా ఉండనున్నారు. ఇదిలా ఉంటే.. షేర్-ఈ-పంజాబ్ లీగ్ ఆరంభ ఎడిషన్లో ఆరుజట్లు పాల్గొననున్నాయి. అమృత్సర్, ఫజిల్క, జలంధర్, లుథియానా, మొహాలీ, భటిండా టైటిల్ కోసం పోటీపడనున్నాయి.చదవండి: అభిషేక్ శర్మ విధ్వంసం... 91 బంతుల్లో 233 పరుగులు -
పీవీ సింధు నుదుటిపై గాడ్జెట్...ఆసక్తికర చర్చ
విశాఖ : ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం జరిగిన అవయవదానం అవగాహన సదస్సుకు హాజరైన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు నుదుటిపై ఉన్న పింపుల్.. అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె నుదుటిపై పెద్ద పులిపిరి కాయ వచ్చిందని కొందరు.. కాదు కాదు.. అది పింపుల్ అని మరికొందరు.. ఇలా చర్చించుకున్నారు. కానీ.. అసలు విషయం ఏంటంటే.. ఆమె ధరించింది.. ఒక గాడ్జెట్. దానిపేరే టెంపుల్.ఇటీవల డెన్మార్క్ వేదికగా జరిగిన ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ మ్యాచ్ల్లో సింధు తొలిసారి.. నుదిటి కణతపై ఈ వెండిరంగు పరికరాన్ని ధరించి.. క్రీడాభిమానుల్ని ఆశ్చర్యంలో పడేసింది. టెంపుల్ అని పిలిచే ఈ అధునాతన వేరబుల్ గాడ్జెట్ను జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ రూపొందించారు. క్రీడాకారుల మెదడుకు వెళ్లే రక్త ప్రసరణని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం దీని ప్రధాన ఉద్దేశం.ఆట సమయంలో వారి మానసిక ఒత్తిడి హెచ్చుతగ్గులు, నిద్ర సరిపోయిందా లేదా.? రికవరీ స్థాయిలు, మెటబాలిక్ రేటుని కచ్చితంగా అంచనా వేసేందుకు ఇది సహాయ పడుతుంది. తీవ్రమైన ఒత్తిడి జయించి.. బ్యాడ్మింటన్ కోర్టులో మరింత ఏకాగ్రతతో మెరుగైన ప్రదర్శన కనబరిచేందుకు ఈ టెంపుల్... నా బెస్ట్ ఫ్రెండ్గా మారిందని సింధు ‘సాక్షి’తో చెప్పారు.ఫొటో : సాక్షిఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
శ్రీలంకతో టెస్టు సిరీస్కు బుమ్రా దూరం
న్యూఢిల్లీ: భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా శ్రీలంకతో టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. మోకాలి గాయం నుంచి బుమ్రా పూర్తి స్థాయిలో కోలుకోకపోవడంతో... పనిభారం, భవిష్యత్తులో కీలక సిరీస్లను దృష్టిలో పెట్టుకొని అతడికి ఇంకొన్నాళ్లు విశ్రాంతి అవసరమని బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (సీఓఈ) వైద్యబృందం భావిస్తోంది. బుమ్రా స్థానంలో సెలక్టర్లు దేశవాళీల్లో రాణిస్తున్న జమ్మూకశ్మీర్ పేసర్ అఖీబ్ నబీని ఎంపిక చేయనున్నారు. -
అహ్మదాబాద్లో కలుద్దాం!
క్రీడాంశాలు తగ్గిపోయినా... పతకాల వేటలో మాత్రం భారత క్రీడాకారులు జోరు కొనసాగించారు. 2022 బర్మింగ్హామ్ గేమ్స్లో సాధించిన ఓవరాల్ నాలుగో స్థానాన్ని 2026 గ్లాస్గో గేమ్స్లోనూ నిలబెట్టుకున్నారు. స్కాట్లాండ్లో 11 రోజులపాటు జరిగిన కామన్వెల్త్ గేమ్స్కు ఆదివారం తెరపడింది. 74 దేశాల నుంచి 2,729 మంది క్రీడాకారులు 10 క్రీడాంశాల్లో పోటీపడ్డారు. ఆ్రస్టేలియా మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకొని 171 పతకాలతో అగ్రస్థానాన్ని అలంకరించింది. 110 పతకాలతో ఇంగ్లండ్ రెండో స్థానం దక్కించుకోగా... 62 పతకాలతో కెనడా మూడో స్థానాన్ని సంపాదించింది. 39 పతకాలతో భారత్, స్కాట్లాండ్ సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాయి. రెండు దేశాలు 13 చొప్పున స్వర్ణాలు గెలుపొందగా... స్కాట్లాండ్కంటే ఎక్కువ రజతాలు నెగ్గిన భారత్కు నాలుగో స్థానం ఖరారైంది. 2022 బర్మింగ్హామ్ గేమ్స్లో భారత్ 61 పతకాలతో నాలుగో స్థానంలోనే నిలిచింది. బర్మింగ్హామ్ గేమ్స్లో భారత్ పతకాలు నెగ్గిన క్రీడాంశాలు బ్యాడ్మింటన్, హాకీ, టేబుల్ టెన్నిస్, రెజ్లింగ్, స్క్వాష్, టి20 క్రికెట్ ఈసారి లేకపోవడంతో ఈసారి మనం గెలిచిన పతకాల సంఖ్య తగ్గింది. తదుపరి 2030 కామన్వెల్త్ గేమ్స్కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. గుజరాత్లోని అహ్మదాబాద్ నగరం ఈ మెగా ఈవెంట్కు వేదిక కానుంది. గ్లాస్గో: ఆఖరి రోజును పతకంతో ముగించాలని ఆశించిన భారత బృందానికి నిరాశ ఎదురైంది. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో చివరిరోజు భారత్ పతకం గెలవకుండానే ముగించింది. జూడోలో మహిళల 78 కేజీల విభాగంలో భారత క్రీడాకారిణి ఇష్రూప్ నారంగ్ కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది. అయితే కాంస్య పతక బౌట్లో ఇష్రూప్ కెనడా ప్లేయర్ కొరాలీ గాడ్బౌట్ చేతిలో ఓడిపోయింది. ఇక ఆఖరి ఈవెంట్ సైక్లింగ్ 40 కిలోమీటర్ల పాయింట్స్ రేస్లో భారత ప్లేయర్లు హర్ష్ వీర్, దినేశ్ క్వాలిఫయింగ్ రౌండ్లోనే వెనుదిరిగారు. వెరసి గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ చివరిరోజు భారత్ ఖాతాలో ఒక్క పతకం కూడా చేరలేదు. ఓవరాల్గా భారత్ 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి 39 పతకాలతో నాలుగో స్థానాన్ని సొంతం చేసుకుంది. తద్వారా 2002 మాంచెస్టర్ కామన్వెల్త్ గేమ్స్ నుంచి వరుసగా ఏడో గేమ్స్లోనూ భారత్ టాప్–5లో నిలిచింది. మరోవైపు ఆ్రస్టేలియా 70 స్వర్ణాలు, 45 రజతాలు, 56 కాంస్యాలతో కలిపి 171 పతకాలతో నంబర్వన్ ర్యాంక్ను కైవసం చేసుకుంది. ఇంగ్లండ్ 29 స్వర్ణాలు, 45 రజతాలు, 36 కాంస్యాలతో కలిపి 110 పతకాలతో రెండో స్థానం దక్కించుకుంది. కెనడా 19 స్వర్ణాలు, 20 రజతాలు, 23 కాంస్యాలతో కలిపి 62 పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. గ్లాస్గో గేమ్స్లో చివరి స్వర్ణం ‘ఐల్ ఆఫ్ మ్యాన్’ దేశం ఖాతాలోకి వెళ్లింది. పురుషుల సైక్లింగ్ 40 కిలోమీటర్ల పాయింట్స్ రేస్ ఫైనల్లో ‘ఐల్ ఆఫ్ మ్యాన్’ సైక్లిస్ట్ మాథ్యూ బోస్టాక్ పసిడి పతకం గెలిచాడు. అర్ధరాత్రి గం. 1:30 నుంచి జరిగిన ముగింపు వేడుకల్లో భారత బృందానికి స్వర్ణ పతకం గెలిచిన మహిళా బాక్సర్ జైస్మిన్ లంబోరియా ఫ్లాగ్ బేరర్గా వ్యవహరించింది. తదుపరి 2030 కామన్వెల్త్ గేమ్స్కు భారత్లోని అహ్మదాబాద్ నగరం ఆతిథ్యమివ్వనుంది.45 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో కనీసం ఒక్క పతకమైనా సాధించిన దేశాలు. ఇందులో 25 దేశాలు కనీసం ఒక్క స్వర్ణ పతకమైనా గెలిచాయి.5 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రీడాకారులు ఒక్క పతకం నెగ్గని క్రీడాంశాలు జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్, సైక్లింగ్, బాస్కెట్బాల్, లాన్ బౌల్స్21 ఈసారి భారత్ గెలిచిన 39 పతకాల్లో 21 పతకాలు తొలిసారి ఈ క్రీడల్లో పాల్గొన్నవారు గెలిచారు. -
విజేత తన్వీ శర్మ
తైపీ సిటీ: భారత యువ షట్లర్ తన్వీ శర్మ తన కెరీర్లో తొలి సూపర్–300 టోర్నీ టైటిల్ను గెలిచింది. ఆదివారం ముగిసిన తైపీ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ లో పంజాబ్కు చెందిన 17 ఏళ్ల తన్వీ శర్మ మహిళల సింగిల్స్ చాంపియన్గా అవతరించింది. ప్రపంచ 21వ ర్యాంకర్ థుయ్ లిన్ నుగుయెన్ (వియత్నాం)తో జరిగిన ఫైనల్లో తన్వీ 21–16, 21–16తో విజయం సాధించింది. తనీ్వకి 18,750 డాలర్ల (రూ. 17 లక్షల 88 వేలు) ప్రైజ్మనీతోపాటు 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
శ్రీజకు డబుల్స్ టైటిల్
న్యూఢిల్లీ: కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్ భారత్కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ మహిళల సింగిల్స్లో రన్నరప్గా నిలిచింది. మహిళల డబుల్స్లో భారత్కే చెందిన సిండ్రెల్లా దాస్తో కలిసి టైటిల్ సాధించింది. సింగిల్స్ ఫైనల్లో శ్రీజ 6–11, 1–11, 11–8, 7–11, 11–13తో భారత్కే చెందిన యశస్విని చేతిలో ఓడింది. డబుల్స్ ఫైనల్లో శ్రీజ–సిండ్రెల్లా 11–8, 11–13, 11–8, 11–6తో యశస్విని–దివ్యాంశిలపై గెలిచారు. -
గాయత్రి–ట్రెసా జోడీకి డబుల్స్ టైటిల్
మనీలా: ఫిలిప్పీన్ ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ విజేతగా నిలిచింది. ఫైనల్లో గాయత్రి–ట్రెసా ద్వయం 16–21, 21–4, 21–17తో మికి కనెహిరో–యునా కాటో (జపాన్) జంటపై నెగ్గింది. గాయత్రి–ట్రెసా జోడీకి 1600 డాలర్ల (రూ. 1 లక్ష 52 వేలు) ప్రైజ్మనీతోపాటు 4000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
హండ్రెడ్ టోర్నీలో స్మృతి మంధాన విధ్వంసం!
హండ్రెడ్ వుమెన్స్ కాంపిటీషన్లో భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన తన ప్రదర్శనతో అదరగొట్టింది. హండ్రెడ్ టోర్నీలో మంధాన మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ వుమెన్ టీంకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆదివారం లండన్ వేదికగా ఎంఐ లండన్ వుమెన్స్తో జరిగిన మ్యాచ్లో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఓపెనర్ స్మృతి మంధాన (27 బంతుల్లో 34 ; 4 ఫోర్లు, ఒక సిక్సర్) దనాధన్ ఇన్నింగ్స్తో అలరించింది. మరో ఓపెనర్ అయిన కెప్టెన్ మెగ్ లానింగ్ (31 బంతుల్లో 43) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. దీంతో ఎంఐ లండన్ విధించిన 93 పరుగుల టార్గెట్ను మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ లండన్ వుమెన్స్ జట్టు 99 బంతుల్లో 92 పరుగులకు ఆలౌటైంది. కిరా ఛత్లీ (18), నికోలా కేరీ (17), చిన్నెల్లె హెన్రీ (16) పర్వాలేదనిపించారు. మాంచెస్టర్ బౌలర్లలో రియానా మెక్డొనాల్డ్ మూడు వికెట్లు తీయగా, మైట్లన్ బ్రౌన్, సోఫి ఎసెల్స్టోన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. మాంచెస్టర్ సూపర్జెయింట్స్కు ఇది మూడో విజయం కాగా.. ఎంఐ లండన్ వుమెన్స్ మరో ఓటమిని మూటగట్టుకుంది. దీంతో సీజన్లో ఇప్పటివరకు ఖాతా తెరవని జట్టుగా ఎంఐ లండన్ వుమెన్స్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. Smriti Mandhana continuing her form and playing some spectacular shots pic.twitter.com/x19qUEPpXq— Nalin Kumar Awasthi (@cricnalin) August 2, 2026Read: యువరాజ్ సింగ్ విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు! -
యువరాజ్ సింగ్ విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు!
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ వ్యక్తిగత గోప్యత, హక్కులకు సంబంధించి దాఖలు చేసిన పిటిషన్ విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. యువరాజ్ సింగ్ వ్యక్తిగత హక్కులకు, గోప్యతకు భంగం కలిగించవద్దని స్పష్టంచేసింది. యువరాజ్ అనుమతి లేకుండా అతడి పేరు, ఫొటోలు, గొంతును వాణిజ్య లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని థర్డ్ పార్టీలను నియంత్రిస్తూ జస్టిస్ జ్యోతి సింగ్ తీర్పునిచ్చారు.తన వ్యక్తిత్వానికి భంగం కలిగించేలా అనుమతి లేకుండా తన పేరును ఉపయోగించి వస్తువులను అనధికారికంగా విక్రయించడమే కాకుండా, పలు సోషల్ మీడియా ఖాతాలు తనను కల్పిత, అవాస్తవ దృశ్యాలలో చూపిస్తున్నట్లుగా ఏఐ రూపొందించిన చిత్రాలు, వీడియోలను ప్రచురిస్తున్నారని, ఇవి తన ప్రతిష్టకు, సద్భావనకు నష్టం కలిగిస్తున్నాయని యువరాజ్ సింగ్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో ఇతర క్రీడాకారులపై దాడి చేస్తున్నట్లు, మతపరమైన భావాలను దెబ్బతీసేలా, అసభ్యకరమైన భాషతో కూడిన డీప్ఫేక్ కంటెంట్ను సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారని యువరాజ్ సింగ్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై జస్టిస్ జ్యోతిసింగ్ స్పందిస్తూ.. ‘17 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో దేశానికి యువరాజ్ ప్రాతినిధ్యం వహించాడు. దేశం తరఫున ఆడుతూ ఎన్నో ఘనతలు సొంతం చేసుకొని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన క్రికెటర్లలో యువరాజ్ ఒకడు. అతడి వ్యక్తిత్వ, గోప్యతా హక్కులకు భంగం కలిగిస్తున్నవారి పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముంది. యువరాజ్ ఆమోదం లేకుండా రూపొందించిన అభ్యంతరకర పోస్టులు, వీడియోలు తక్షణమే తొలగించాలి’ అని తెలిపాడు.చదవండి: 'పతకాలు చూసి మురిసిపోవద్దు.. ముందుంది ముసళ్ల పండగ!’ -
'పతకాలు చూసి మురిసిపోవద్దు.. ముందుంది ముసళ్ల పండగ!’
గ్లాస్కో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత్ పతకాల పంట పండిస్తున్న వేళ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పీటీ ఉష ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కామన్వెల్త్ గేమ్స్లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కనబరిచారని ఆమె కొనియాడారు. బాక్సింగ్లో ఏడు స్వర్ణాలు రావడం నిజంగా గొప్ప విషయమన్నారు.అయితే కామన్వెల్త్లో సాధించిన పతకాలను చూసి మురిసిపోవద్దని, ఆసియా గేమ్స్ రూపంలో మన ముంగిట అసలైన సవాల్ ఉందని పేర్కొన్నారు. కామన్వెల్త్ ముగిసిన కొద్ద రోజులకే ఆసియా గేమ్స్ జరగనున్న నేపథ్యంలో అథ్లెట్లంతా ఆ క్రీడలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొనని చైనా, జపాన్లు ఇక్కడ పోటీలో ఉంటాయని, కాబట్టి భారత్ పతకాల కోసం గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని సున్నితంగా హెచ్చరించారు. మన అథ్లెట్లంతా కామన్వెల్త్లో చూపిన ప్రదర్శనను ఆసియా గేమ్స్లోనూ కంటిన్యూ చేసి దేశానికి వీలైనన్ని ఎక్కువ పతకాలు తీసుకురావాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు పీటీ ఉష వెల్లడించారు. అయితే పీటీ ఉష వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడిచింది. ఒలింపిక్స్లో లేదా కామన్వెల్త్ గేమ్స్లో దేశానికి ఒక్క పతకం కూడా తీసుకురాని వ్యక్తి ఇలా మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందని కొంతమంది కామెంట్లు చేయడం కనిపించింది. ఈసారి కామన్వెల్త్ గేమ్స్లో భారత్ 39 పతకాలు కొల్లగొట్టింది. మనకు అచ్చొచ్చిన రెజ్లింగ్, షూటింగ్ సహా చాలా క్రీడలను ఈసారి కామన్వెల్త్ గేమ్స్ నుంచి తొలగించడం భారత్పై గట్టి ప్రభావం చూపింది. అయినప్పటికీ మన అథ్లెట్లు మంచి ప్రదర్శనే కనబరిచారు. ముఖ్యంగా బాక్సింగ్లో ఎవర్గ్రీన్ ప్రదర్శనతో అదరగొట్టారు. ఏడు స్వర్ణాలు, మూడు రజతాలతో మన బాక్సర్ల తమ పంచ్ పవర్ చూపించారు. మొత్తంగా భారత్ సాధించిన 39 పతకాల్లో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలున్నాయి. ఇక పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఆదివారం చివరి రోజు కావడం, భారత అథ్లెట్లకు మెడల్ ఈవెంట్స్ ఉండడంతో, 40 పతకాల మార్క్ను అందుకుంటుందా అన్నది చూడాలి. “They should not just celebrate their victory. They have a very big competition ahead of them, the Asian Games. They should now focus on their events and bring a lot of medals for our country."- Indian Olympic Association President P. T. Usha pic.twitter.com/wBJ8O8wrQ5— The Khel India (@TheKhelIndia) August 1, 2026Read: ‘అతడిని ఎంపిక చేయబోం.. రిటైరవ్వడమే మంచిది’ -
పాక్ వివాదాస్పద బౌలర్కు ఐపీఎల్ స్టార్ మద్దతు
పాకిస్తాన్ వివాదాస్పద స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్కు ఐపీఎల్ స్టార్, విండీస్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ అండగా నిలిచాడు. ఇటీవల తారిఖ్ బౌలింగ్ యాక్షన్ మరోసారి వివాదాస్పదమైన నేపథ్యంలో నరైన్ అతడికి ఫోన్ చేసి మద్దతు పలికాడు. విమర్శలపై స్పందించకుండా, బౌలింగ్పై దృష్టి పెట్టాలని.. అంపైర్లు అనుమతిస్తున్నంత వరకు యాక్షన్ చట్టబద్ధమేనని నరైన్ భరోసా ఇచ్చినట్లు తారిఖ్ వెల్లడించాడు.అసలేం జరిగిందంటే..?ద హండ్రెడ్ లీగ్ 2026లో తారిఖ్ టిమ్ డేవిడ్ను ఔట్ చేశాడు. అనంతరం తారిఖ్ బౌలింగ్ యాక్షన్పై డేవిడ్ అంపైర్కు ఫిర్యాదు చేశాడు. తారిఖ్ యాక్షన్ చట్టబద్ధమేనా అని ప్రశ్నించాడు. డేవిడ్ అప్పీల్ను పెద్దగా పట్టించుకోని అంపైర్ ఆ బంతిని నో-బాల్గా ప్రకటించలేదు. దీంతో చేసేదేమీ లేక డేవిడ్ పెవిలియన్ బాట పట్టాడు.ఈ ఉదంతం తర్వాత తారిఖ్ బౌలిగ్ యాక్షన్పై చర్చ మరోసారి మొదలైంది. తారిఖ్ బౌలింగ్ యాక్షన్ వైవిధ్యంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అతడు బంతిని డెలివర్ చేసే సమయంలో ఆగుతాడు. అలాగే చేతిని మిగతా బౌలర్లలా కాకుండా ఫ్లాట్గా ఉంచుతాడు.ఐసీసీ నిబంధనల ప్రకారం, బౌలర్ బంతిని సంధించే సమయంలో మోచేయి 15 డిగ్రీలకు మించి వంగకూడదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం తారిఖ్ యాక్షన్ ఈ పరిమితిలోనే ఉంది. అతని బౌలింగ్ శైలి చూడటానికి అసాధారణంగా కనిపించడం వల్లే అనుమానాలు వస్తున్నాయి. తారిఖ్పై ఇలాంటి విమర్శలు రావడం ఇదే మొదటిసారి కాదు. -
‘అతడిని ఎంపిక చేయబోం.. రిటైరవ్వడమే మంచిది’
భారత జట్టు సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ టీమిండియాలో తిరిగి చోటు దక్కించుకోవడం కష్టమే అనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే అలాంటి సంకేతాలే కనిపిస్తున్నాయి. తాజాగా భువనేశ్వర్ కుమార్తో పాటు మహమ్మద్ షమీ భవిష్యత్తుపై అజిత్ అగార్కర్ కీలక ప్రకటన చేయడం ఈ వార్తలకు బలం చేకూరుస్తుంది. 2027 వన్డే ప్రపంచకప్ కోసం 15 మంది ఫాస్ట్ బౌలర్లను సిద్ధం చేస్తున్నట్లు బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు. అయితే ఇందులో అందరూ యంగ్ బౌలర్లే ఉంటారని అగార్కర్ పేర్కొన్నాడు. 30 సంవత్సరాలు దాటిన బౌలర్లను తాము పరిగణలోకి తీసుకోవడం లేదని బాంబు పేల్చాడు.'షమీ టీమిండియా అత్యుత్తమ మ్యాచ్ విన్నర్లలో ఒకడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఐసీసీ ఈవెంట్లలో షమీ ఛాంపియన్. కానీ భవిష్యత్తు కోసం మేము యువ పేస్ బౌలింగ్ దళానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. భారత క్రికెట్కు అతని సేవలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయి. మేము అతడిని గౌరవిస్తున్నాము.’ అని చెప్పుకొచ్చాడు. అగార్కర్ వ్యాఖ్యల ను బట్టి చూస్తే మాత్రం షమీ రిటైర్మెంట్కు సమయం ఆసన్నమైందంటూ పరోక్షంగా హింట్ ఇచ్చినట్లు అనిపిస్తోంది.ఒకప్పుడు భారత బౌలింగ్ దళానికి ప్రధాన బలంగా నిలిచిన షమీ.. ఇప్పుడు సెలెక్టర్ల దీర్ఘకాలిక ప్రణాళికల్లో చోటు దక్కించు కోలేకపోతున్నట్లు తెలుస్తోంది. 2023 వన్డే ప్రపంచకప్లో భారత జట్టు ఫైనల్ చేరడంలో షమీ కీలక పాత్ర పోషించాడు. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకరిగా నిలిచి తన ప్రతిభను చాటుకున్నాడు. అనంతరం 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో చివరిసారిగా భారత జట్టు తరఫున వన్డే ఆడగా, అదే ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో చివరిసారి కనిపించాడు. షమీతో పాటు భువనేశ్వర్ కుమార్ కూడా 2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలని ఎదురుచూస్తున్నారు. దీనికి తగినట్లుగానే గత రెండేళ్లుగా వీళ్లిద్దరి గణాంకాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. దేశవాళీ, రంజీలు అదే సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్స్లో అద్భుతంగా రాణిస్తున్నారు. అయినప్పటికీ బీసీసీఐ మాత్రం ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లను పట్టించుకోవడం లేదు. అవకాశాలు ఇవ్వడం లేదు. ముఖ్యంగా హెడ్కోచ్గా గంభీర్, సెలెక్టర్గా అజిత్ అగార్కర్ వచ్చిన తర్వాత వీళ్ల అడ్రస్ గల్లంతయ్యింది.🚨 Ajit Agarkar breaks silence on Mohammed Shami .🚨🔹We've picked our group of 15 fast bowlers for the future and want to give young players more opportunities ahead of the World Test Championship and the 2027 ODI World Cup.Shami has been one of India's finest match-winners… pic.twitter.com/p0mEPybruS— Indian cricket (@Cricketpaglu45) August 1, 2026చదవండి: హార్దిక్ మాజీ భార్యపై తీవ్ర విమర్శలు! -
బుమ్రా స్థానంలో సంచలన ఫాస్ట్ బౌలర్..?
ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో ప్రారంభం కానున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ క్రమంలో 29 ఏళ్ల సంచలన ఫాస్ట్ బౌలర్, జమ్మూ అండ్ కశ్మీర్ ఎక్స్ప్రెస్గా పేరున్న ఆకిబ్ నబీ దార్ పేరు తెరపైకి వచ్చింది.బుమ్రాకు ప్రత్యామ్నాయంగా నబీ పేరు దాదాపుగా ఖరారైనట్లు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. నబీకి దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. 2025-26 రంజీ ట్రోఫీలో అతడు 10 మ్యాచ్ల్లో 60 వికెట్లు తీసుకుని టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా నిలిచాడు. జమ్మూ కశ్మీర్ తొలి రంజీ ట్రోఫీ టైటిల్ సాధించడంలోనూ నబీ కీలక పాత్ర పోషించాడు.ఓవరాల్గా అతడి ఫస్ట్క్లాస్ రికార్డు కూడా ఆకట్టుకునేలా ఉంది.* మ్యాచ్లు: 43* వికెట్లు: 162* బౌలింగ్ సగటు: 18.63* 5 వికెట్ల ప్రదర్శనలు: 16* 10 వికెట్ల ప్రదర్శనలు: 4* అత్యుత్తమ బౌలింగ్: 7/24శ్రీలంకలోనూ సత్తా నబీఇటీవల భారత్-A జట్టుతో కలిసి శ్రీలంక పర్యటనకు వెళ్లిన నబీ, శ్రీలంక-Aతో జరిగిన రెండు ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో నాలుగు ఇన్నింగ్స్లలో 6 వికెట్లు పడగొట్టాడు. తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 4/58తో ఆకట్టుకున్నాడు.ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న నబీకి ఇప్పటివరకు భారత సీనియర్ జట్టులో ఆడిన అనుభవం లేదు. అయినప్పటికీ దేశవాళీ క్రికెట్లో అతడి నిలకడైన ప్రదర్శన, శ్రీలంక పరిస్థితులపై ఇటీవల వచ్చిన అనుభవం అతడికి కలిసొచ్చే అవకాశముంది.ఇదిలా ఉంటే, ఎడమ మోకాలి అసౌకర్యం నుంచి బుమ్రా పూర్తిగా కోలుకోకపోవడంతో అతడిని తొందరపెట్టకూడదని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. బుమ్రా ప్రత్యామ్నాయాన్ని సెలెక్టర్లు అతి త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. -
ఆసియా కప్ 2026కు భారత జట్టు ప్రకటన
మహిళల ఆసియా కప్ 2026 కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. కెప్టెన్సీపై ఇటీవల చర్చ జరిగినప్పటికీ హర్మన్ప్రీత్ కౌర్నే కెప్టెన్గా కొనసాగించింది. స్మృతి మంధానను వైస్ కెప్టెన్గా ఎంపిక చేసింది. జట్టులో స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ వంటి కీలక ప్లేయర్లకు చోటు దక్కింది.శ్రేయాంక పాటిల్కు చోటు లేదుటీ20 ప్రపంచకప్ జట్టులో ఉన్న శ్రేయాంక పాటిల్కు ఆసియా కప్ జట్టులో చోటు దక్కలేదు. నెదర్లాండ్స్తో మ్యాచ్లో ఆమె కుడి చీలమండకు గాయమయ్యింది. శ్రేయాంక స్థానంలో టీ20 ప్రపంచకప్ జట్టులోకి వచ్చిన ప్రేమా రావత్ ఆసియా కప్ జట్టులోనూ కొనసాగింది. ఇదే జట్టులో జరిగిన ప్రధాన మార్పు.భారత మహిళల ఆసియా కప్ 2026 జట్టుహర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, భారతి ఫుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జి. కమిలిని, అరుంధతి రెడ్డి, ప్రేమా రావత్, రాధా యాదవ్, శ్రీ చరణి, రేణుకా ఠాకూర్, నందిని శర్మ, క్రాంతి గౌడ్.కాగా, ఆసియా కప్ 2026 సెప్టెంబర్ 17న మొదలై 22వ తేదీ వరకు జరుగనుంది. ఈ టోర్నీ ఫిక్చర్స్ ఇంకా ఖరారు కాలేదు. -
హార్దిక్ మాజీ భార్యపై తీవ్ర విమర్శలు!
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్ ప్రవర్తన పట్ల సోషల్ మీడియాలో అభిమానులు విమర్శల వర్షం కురిపించారు. బిచ్చగాళ్లతో నటాషా ప్రవర్తించిన తీరుపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయంలోకి వెళితే.. నటాషా స్టాంకోవిచ్ తన బాయ్ఫ్రెండ్ అలెగ్జాండర్ అలెక్స్తో కలిసి ఒక హోటల్కు వెళ్లింది. లంచ్ అనంతరం బయటికి వస్తున్న నటాషాతో కొంతమంది ఫొటోలు దిగారు. ఇదే సమయంలో అక్కడికి పిల్లలతో కలిసి బిక్షాటన చేస్తున్న మహిళల వచ్చారు. తమకు సాయం చేయమని నటాషాను అడిగినప్పటికీ, వారిని పట్టించుకోకుండా తన కారు ఎక్కి అక్కడినుంచి వెళ్లిపోవడం కెమెరాలకు చిక్కింది. ఇంకేముంది, అసలే తమ అభిమాన క్రికెటర్ను మోసం చేసి తెగదెంపులు చేసుకున్న నటాషా ఎక్కడ దొరుకుతుందా అని కాచుకు కూర్చుకున్న కొంతమంది విమర్శల వర్షం కురిపించారు. 'ఇదేం పద్దతి.. ఫొటోలకు ఫోజివ్వడం తెలుసు కాని ఒక రూపాయి ధర్మం చేయాలన్న కనీస జ్ఞానం లేదా' అని కామెంట్ల రూపంలో నటాషాను దెప్పిపొడిచారు. అయితే గతంలో పాండ్యాతో కలిసి ఉన్నప్పుడు ఇదే నటాషా పేద వాళ్లకు సాయం చేయడంలో ముందు వరుసలో ఉండడం గమనార్హం.సెర్బియాకు చెందిన నటాషా స్టాంకోవిచ్ 2013లో భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో పరిచయం ఏర్పడింది. అనతి కాలంలో ఆ పరిచయం ప్రేమగా మారింది. హార్దిక్, నటాషా ప్రేమలో ఉన్నారనే వార్తలు ప్రచారంలో ఉండగానే ఆమె గర్భం దాల్చింది. తండ్రి కాబోతున్నట్లు హార్దిక్ పాండ్యా అధికారికంగా ప్రకటించి, అభిమానులతో తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఆ తర్వాత 2020లో హార్దిక్ పాండ్యా, నటాషా వివాహం జరిగింది. పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పేసిన నటాషా కుమారుడి పెంపకంపైనే దృష్టి సారించింది.వివాహం తర్వాత కొంత కాలం వీరి జీవితం ఆనందంగా సాగింది. ట్రిప్పులు, అగస్త్యతో ఆటలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. వివాహం అయిన నాలుగేళ్ల తర్వాత (2024)లో పాండ్యా, నటాషా మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో హార్దిక్ పాండ్యా ‘విడాకుల’పై అధికారిక ప్రకటన చేశాడు. భార్య నటాషా స్టాంకోవిచ్తో విడిపోతున్నట్లు ప్రకటించాడు. 4 ఏళ్ల దాంపత్య జీవితం అనంతరం నటాషా, తాను విడిపోవడానికే నిర్ణయం తీసుకున్నామని వెల్లడించాడు.విడిపోయినప్పటికీ తమ కుమారుడు అతస్త్యకు కో-పేరెంట్స్గా ఉంటామని స్పష్టత ఇచ్చాడు. हार्दिक पांड्या की पूर्व पत्नी नताशा अब पहले जैसी नहीं रहीं। Natasa अपने बॉयफ्रेंड "Aleksandar Alex Ilic' के साथ एक होटल से बाहर निकली।तभी वहां मौजूद कुछ भिखारियों ने उनसे मदद के लिए पैसे मांगे।लेकिन नताशा बिना रुके सीधे अपनी गाड़ी में बैठकर वहां से निकल गईं।भिखारी बस… pic.twitter.com/RfBOplXnxV— ʀᴜᴅʜʀᴀ ʏᴀᴅᴀᴠ🇮🇳 (@Rudhrayadav001) August 1, 2026Read: 'అసంపూర్ణంగా భారతదేశ చిత్రపఠం.. ఎందుకీ వివక్ష?' -
'అసంపూర్ణంగా భారతదేశ చిత్రపఠం.. ఎందుకీ వివక్ష?'
భారత మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ తన చర్యతో వార్తల్లో నిలిచింది. గ్లాస్కోలోని ఒక రెస్టారెంట్లో తమకు ఇచ్చిన నాప్కిన్లో భారతదేశ చిత్రపఠం అసంపూర్తిగా ఉండడంపై లవ్లీనా అసంతృప్తి వ్యక్తం చేసింది. విషయంలోకి వెళితే.. గ్లాస్కో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత బాక్సర్లు పతకాలు సాధించిన సంతోషంలో ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు గ్లాస్కోలోని ఒక రెస్టారెంట్కు వెళ్లారు. అక్కడి రెస్టారెంట్ మేనేజ్మెంట్ తమ హోటల్కు వచ్చిన సందర్భంగా ఆటగాళ్లకు భారత చిత్రపఠంతో తయారు చేసిన ప్రత్యేక నాప్కిన్లను అందించారు. అయితే నాప్కిన్ను సుశితంగా పరిశీలించిన బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ నాప్కిన్పై భారత చిత్రపఠం అసంపూర్ణంగా ఉండడాన్ని గమనించింది. నాప్కిన్పై ముద్రించిన చిత్రపఠంలో ఈశాన్య రాష్ట్రాలను చేర్చకపోవడంపై లవ్లీనా అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే ఇక్కడా ఎలాంటి గొడవ చేయకుండా లవ్లీనా వ్యవహరించిన తీరు రెస్టారెంట్ మేనేజ్మెంట్కు బాగా నచ్చింది. నాప్కిన్పై ముద్రించిన భారత చిత్రపఠంలో ఈశాన్య ప్రాంతాలను విస్మరించడం తనకు బాధ కలిగించిందని, తమపై ఎందుకీ వివక్ష అని నవ్వుతూనే పేర్కొంది. వెంటనే దానిని సవరించాలని రెస్టారెంట్ యజమానులను లవ్లీనా అభ్యర్థిస్తూ కోరింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇక కామన్వెల్త్ గేమ్స్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత బాక్సర్లు స్వర్ణ వర్షం కురిపించారు. శనివారం మధ్యాహ్నం ప్రీతి పవార్ ఆరంభించిన గోల్డెన్ పంచ్.. రాత్రి అంకుశ్ పంఘల్ తెచ్చిన ఆఖరి బంగారు పతకం వరకూ కొనసాగింది. జాస్మిన్ లంబోరియా, సాక్షి చౌదరి, ప్రియ ఘంగాస్ , అరుంధతి చౌదరి, సచిన్ సివాచ్ కూడా పసిడి పతకాలకు గురిపెట్టగా.. ఒలింపిక్ మెడలిస్ట్ లవ్లీనా బొర్గోహైన్, జాదుమణి సింగ్, నరేందర్ బెర్వాల్ రజతాలు తీసుకొచ్చారు. కామన్వెల్త్ చరిత్రలో భారత బాక్సర్లకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. 2010, 2018, 2022 ఎడిషన్లలో మూడేసి స్వర్ణాలే ఇప్పటిదాకా రికార్డు కాగా.. గ్లాస్గోలో బాక్సర్లు ఆల్టైమ్ రికార్డు సృష్టించారు. పారా అథ్లెట్ సోమన్ రాణా కూడా పసిడి పతకం అందుకోవడంతో మెగా గేమ్స్లో ఒకే రోజు 8 పసిడి పతకాలతో పండగ చేసుకున్న భారత్ పట్టికలో టాప్-5లోకి దూసుకొచ్చింది. ప్రస్తుతం భారత్ 39 పతకాలు (13 స్వర్ణం, 17 రజతం, 9 కాంస్యం) సాధించి పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. All Indian players went to a restaurant in Glasgow to celebrate victory in commonwealth games when they noticed incomplete map of India..Boxer Lovlina Borgohain who recently won silver medal in commonwealth games objected to a map of India printed on the restaurant's napkins as… pic.twitter.com/gfSGXmx00B— Trupti Garg (@garg_trupti) August 2, 2026Read: గుండుతో దర్శనం.. హార్దిక్ పాండ్యా కొత్త లుక్ వైరల్ -
పాక్ను మరోసారి చిత్తు చేసిన శ్రీలంక.. మరో సిరీస్ కైవసం
శ్రీలంక పర్యటనలో పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టుకు వరుస పరాభవాలు ఎదురవుతున్నాయి. తొలుత మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను కోల్పోయిన (1-2తో) ఈ జట్టు.. తాజాగా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 0-2 తేడాతో కోల్పోయింది.డంబుల్లా వేదికగా ఇవాళ జరిగిన రెండో టీ20లో ఆతిథ్య జట్టు పాక్పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. శ్రీలంక మరో 14 బంతులు (17.4 ఓవర్లు) మిగిలుండగానే కేవలం 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ చమారీ ఆటపట్టు (40), సంజనా కవిండి (46) మెరుపు ఇన్నింగ్స్ ఆడి లంక విజయంలో కీలకపాత్ర పోషించారు. విష్మి గుణరత్నే (31), హర్షిత సమరవిక్రమ (37 నాటౌట్) కూడా ఉపయోగకరమైన ఇన్నింగ్స్లు ఆడారు. ఆఖర్లో కవిష దిల్హరి (14 నాటౌట్) కూడా బ్యాట్ ఝులిపించింది. పాక్ బౌలర్లలో హనీ 2, వహీదా, అయేషా జాఫర్ తలో వికెట్ తీశారు.అంతకుముందు పాక్ తరఫున ఓపెనర్లు మునీబా అలీ (45), షావాల్ జుల్ఫికర్ (48) రాణించారు. ఆఖర్లో ఫాతిమా (30 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. మిగతా ప్లేయర్లలో ఎమాన్ నసీర్ 21, అయేషా జాఫర్ 8, సైరా జబీన్ 16, హనీ 2 (నాటౌట్) పరుగులు చేశారు. లంక బౌలర్లలో ప్రబోధ 2, సుగంధక కుమారి, చమారీ ఆటపట్టు, కవిష దిల్హరి తలో వికెట్ తీశారు. ఈ సిరీస్లో నామమాత్రపు మూడో టీ20 ఆగస్ట్ 4న జరుగనుంది. -
గుండుతో దర్శనం.. హార్దిక్ పాండ్యా కొత్త లుక్ వైరల్
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కొత్త లుక్తో దర్శనమిచ్చాడు. తన గర్ల్ఫ్రెండ్ మహికా శర్మతో కలిసి తిరుమల స్వామి వారిని దర్శించుకున్న పాండ్యా క్లీన్ హెడ్షేవ్ (గుండు)తో కనిపించాడు. దీంతో పాండ్యా కొత్త లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. తిరుమల పర్యటనలో హార్దిక్ పాండ్యా శ్రీవారికి తలనీలాలు సమర్పించాడు. ఆ తర్వాత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన మొక్కుబడి తీర్చుకునే భాగంగానే తలనీలాలు సమర్పించారా.? లేక మరేదైనా వ్యక్తిగత కారణం ఉందా? అనేది తెలియాలి. ఇక ఐపీఎల్ 2026 సీజన్ చివర్లో గాయానికి గురైన పాండ్యా స్వదేశంలో అప్గానిస్తాన్తో సిరీస్తో పాటు ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్లకు కూడా దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (సీవోఈ)లో పాండ్యా రీహాబిలిటేషన్లో గడుపుతున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ కోసం పాండ్యాను జాగ్రత్తగా కాపాడుకోవడంపై బీసీసీఐ ప్రత్యేక ప్రణాళిక రచించింది. ఇందులో భాగంగానే పరిమితంగానే పాండ్యా సేవలు ఉపయోగించుకోవాలని చూస్తోంది. మరోవైపు పాండ్యా కూడా 2027 వన్డే ప్రపంచకప్ వరకు పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించే పనిలో పడ్డాడు.ఇక ఐపీఎల్ 2026 సీజన్లోనూ ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కనబరిచింది. పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ 14 మ్యాచ్ల్లో కేవలం నాలుగు విజయాలు మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. 2024 సీజన్కు ముందు రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా నియమించినప్పటికీ.. అతని నాయకత్వంలో ముంబై ఇండియన్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. పాండ్యా కెప్టెన్గా వచ్చిన తర్వాత కూడా ముంబై గత మూడు సీజన్లలో నిరాశాజనక ఫలితాలే అందుకుంది. దీంతో పాండ్యాను ముంబై ఇండియన్స్ వదులుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్కు పాండ్యా వేరే జట్టులో దర్శనమిచ్చే అవకాశముంది. ఇప్పటికే హార్దిక్ పాండ్యాను తమ జట్టులోకి తీసుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తి చూపుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ కూడా ఈ స్టార్ ఆల్రౌండర్ను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ట్రేడ్ లేదా ఒప్పందం ఖరారు కాలేదు. మొత్తంగా 2027 సీజన్లో హార్దిక్ ఏ జట్టు జెర్సీలో కనిపిస్తారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.Indian cricketer Hardik Pandya visited the Sri Venkateswara Swamy Temple in Tirumala today with Mahika Sharma.Hardik offered his hair as part of a religious vow and was seen in a new bald look. The two also took part in the early morning Suprabhatha Seva. 🙏 pic.twitter.com/mdkQlecKLv— Amit Kumar Sindhi (@AMIT_GUJJU) August 2, 2026 Hardik Pandya with Mahieka at the Tirumala Temple. pic.twitter.com/3FjJ33ltw8— Mufaddal Vohra (@mufaddal_vohra) August 2, 2026Read: అభిషేక్ శర్మ ఊచకోత.. 91 బంతుల్లో 233 పరుగులు -
అభిషేక్ శర్మ ఊచకోత.. 91 బంతుల్లో 233 పరుగులు
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ స్థానికంగా జరిగిన ఓ వన్డే మ్యాచ్లో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. అమృత్సర్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ తరన్ తారన్ మెన్స్ సీనియర్ జట్టుపై 91 బంతుల్లో 233 పరుగులతో చెలరేగాడు. ఈ ఇన్నింగ్స్లో 15 ఫోర్లు, 25 సిక్సర్లు ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.ఇదిలా ఉంటే, అభిషేక్ ఇటీవలికాలంలో టీమిండియా తరఫున వరుసగా విఫలమయ్యాడు. గత ఏడు టీ20 మ్యాచ్ల్లో అతడు ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. చివరిగా ఇంగ్లండ్ పర్యటనలో తొలి మ్యాచ్లో అర్ద సెంచరీ చేశాడు. దానికి ముందు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ చేయలేదు. అతడు చివరి సారిగా మూడంకెల స్కోర్ చేసింది ఐపీఎల్ 2026లో. డీసీతో జరిగిన మ్యాచ్లో అతడు 68 బంతుల్లో అజేయమైన 135 పరుగులు చేశాడు.తాజాగా జింబాబ్వేతో ముగిసిన 3 మ్యాచ్ల సిరీస్లో అభిషేక్ ఫామ్ ఘోరంగా పడిపోయింది. ఆ మూడు మ్యాచ్ల్లో అతడు వరుసగా 1, 8, 2 స్కోర్లు చేశాడు. ఈ సిరీస్లో అభిషేక్ కనీసం రెండంకెల స్కోర్ను కూడా చేయలేకపోయాడు. ప్రస్తుతం భారత జట్టు ఖాళీగా ఉండటంతో స్థానిక వన్డే మ్యాచ్ ఆడిన అభిషేక్ ఎట్టకేలకు ఫామ్ దొరకబుచ్చుకున్నాడు.త్వరలో టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుండగా, ఆ పర్యటన నిమిత్తం ఎంపిక చేసిన టెస్ట్ జట్టులో అభిషేక్కు చోటు దక్కలేదు. అభిషేక్కు గతకొంతకాలంగా టీ20ల్లో మాత్రమే అవకాశం వస్తుంది. తాజా ప్రదర్శనతో అతడు వన్డే జట్టులో స్థానంపై కూడా కన్నేయవచ్చు. టీమిండియా రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ నిమిత్తం ఆగస్ట్ 4న శ్రీలంక పర్యటనకు బయల్దేరనుంది. ఈ సిరీస్లోని తొలి టెస్ట్ మ్యాచ్ గాలే వేదికగా ఆగస్ట్ 15న ప్రారంభం కానుంది. దీనికి ముందు భారత జట్టు ఓ వార్మప్ మ్యాచ్ ఆడనుంది. -
టీమిండియా రీఎంట్రీపై భువనేశ్వర్ కీలక వ్యాఖ్యలు
టీమిండియా వెటరన్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ను తిరిగి జాతీయ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు ఎక్కవుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం వన్డే ప్రపంచకప్-2027 దృష్ట్యా భువనేశ్వర్ను తిరిగి పిలుపునివ్వాలని సెలక్టర్లను సూచించాడు.ఈ నేపథ్యంలో తన రీఎంట్రీపై భువీ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టులోకి తిరిగి రావడమే లక్ష్యంగా తాను ఆడట్లేదని, ఆటపై ఇష్టంతోనే క్రికెట్ను కొనసాగిస్తున్నాని అతడు తెలిపాడు. భువనేశ్వర్ గత నాలుగేళ్లగా భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. అయితే ఐపీఎల్, యూపీ టీ20 లీగ్స్లో మాత్రం క్రమం తప్పకుండా అతడు ఆడుతున్నాడు. ఆర్సీబీ వరుసగా రెండు టైటిల్స్ గెలవడంలో భువీది కీలక పాత్ర. అతడిలో ఏ మాత్రం జోరు తగ్గలేదు. అదే పేస్, స్వింగ్తో బౌలింగ్ చేస్తున్నాడు. అందుకే అతడు రీఎంట్రీ ఇవ్వాలని మాజీలతో పాటు అభిమానులు కోరుకుంటన్నారు."నేను ఐపీఎల్, డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్నానంటే దానికి కారణం ఆటపై ఉన్న ఇష్టమే. దేశం తరపున ఆడాలనే నా కలను ఇప్పటికే నెరవేర్చుకున్నాను. మళ్లీ తిరిగి భారత జట్టుకు ఆడేందుకు కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మళ్లీ భారత జట్టుకు ఆడే అవకాశం వస్తే అది చాలా సంతోషం. కానీ నేను ఎప్పుడూ ప్రస్తుతం గురించే ఆలోచిస్తాను. నా చేతుల్లో లేని విషయం గురుంచి ఆలోచించను. ఆటపై ఇష్టమున్నంతవరకు కొనసాగుతాను. దేశవాళీ క్రికెట్తో పాటు ఐపీఎల్, యూపీ క్రికెట్ లీగ్స్లో వీలైనంతవరకు పూర్తి స్ధాయిలో అందుబాటులో ఉండేందుకు ఇష్టపడతాను. మిగిలిన సమయాన్ని నా కుటంబానికి కేటాయిస్తాను" అని ఆర్సీబీ పాడ్కాస్ట్లో భువీ పేర్కొన్నాడు. 36 ఏళ్ల భువనేశ్వర్ చివరిసారిగా 2022లో భారత్ తరపున ఆడాడు. ఇప్పటివరకు అతడు 21 టెస్టులు, 121 వన్డేలు, 87 టీ20ల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. -
టీమిండియాకు భారీ షాక్
శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఎడమ మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్కు దూరమైనట్లు తెలుస్తోంది. తొలుత బుమ్రా పూర్తి ఫిట్నెస్ సాధించాడని ప్రచారం జరిగినప్పటికీ.. అది నిజం కాదని సమాచారం.బుమ్రా ఇటీవల బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)కు చేరుకున్నాడు. అక్కడ నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో మోకాలిలో మరోసారి అసౌకర్యం ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం.గాయం పూర్తిగా తగ్గకముందే బుమ్రాను బరిలోకి దింపితే సమస్య మళ్లీ తిరగబడే ప్రమాదం ఉందని బీసీసీఐ భావిస్తోంది. అందుకే అతడిని తొందరపెట్టకుండా విశ్రాంతి, పునరావాసానికి మరింత సమయం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.ప్రత్యామ్నాయంపై ఇంకా స్పష్టత లేదుబుమ్రా స్థానంలో ఎవరిని జట్టులోకి తీసుకుంటారనే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. బీసీసీఐ కూడా ఇప్పటివరకు బుమ్రా గైర్హాజరీపై అధికారికంగా స్పందించలేదు.శ్రీలంకతో తొలి టెస్టు ఆగస్టు 15న ప్రారంభం కానుండటంతో, బుమ్రా లేకపోవడం భారత పేస్ బౌలింగ్ విభాగానికి పెద్ద ఎదురుదెబ్బగా మారే అవకాశం ఉంది. -
47 వయస్సులో సంచలనం.. కెప్టెన్గా కప్ కొట్టాడు
గ్లోబల్ సూపర్ లీగ్ (GSL)-2026 సీజన్ విజేతగా గయానా అమేజాన్ వారియర్స్ నిలిచింది. శనివారం ప్రొవిడెన్స్ స్టేడియం వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ పోరులో శాన్ ఫ్రాన్సిస్కోను 6 పరుగుల తేడాతో ఓడించిన గయానా.. వరుసగా రెండో సారి జీఎస్ఎల్ టైటిల్ను ముద్దాడింది.85 పరుగులే చేసినాఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గయానా అమేజాన్ వారియర్స్ కేవలం 85 పరుగులకే ఆలౌటైంది. టాప్-8 బ్యాటర్లలో ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. ఒకానొక దశలో 29 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కనీసం 40 పరుగులైనా చేస్తుందో లేదో అనిపించింది.అయితే చివర్లో మాథ్యూ ఫోర్డ్ (23 బంతుల్లో 28 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడడంతో గయానా ఆ మాత్రం స్కోర్ అయినా సాధించగల్గింది. అనంతరం బౌలింగ్లో మాత్రం ఇమ్రాన్ తహీర్ సారథ్యంలో గయానా వారియర్స్ అద్భుతం చేసింది. యూనికార్న్స్ బ్యాటర్లలో ఆస్ట్రేలియా యంగ్ ప్లేయర్ ఆలివర్ పీక్ (28 బంతుల్లో 31 పరుగులు) మినహా మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.యూనికార్న్స్ విజయానికి చివరి ఓవర్లో 7 పరుగులు అవసరమయ్యాయి. ఈ సమయంలో కల్లమ్ స్టో అనూహ్యంగా రనౌట్ కావడంతో యూనికార్న్స్ 79 పరుగులకే ఆలౌటైంది. గయానా బౌలర్లలో డ్వేన్ ప్రిటోరియస్ మూడు, మహ్మద్ నబీ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. కెప్టెన్ తహీర్ రెండు వికెట్లు సాధించాడు.చరిత్ర సృష్టించిన తహీర్ఈ విజయంతో అమేజాన్ వారియర్స్ కెప్టెన్, సౌతాఫ్రికా మాజీ స్పిన్నర్ ఇమ్రాన్ తహీర్ ఓ అరుదైన ఘనత సాధించాడు. టీ20 టోర్నీ గెలిచిన అతి పెద్ద వయస్కుడిగా(47) తహీర్ నిలిచాడు.చదవండి: రిటైర్మెంట్ తర్వాత రహానేకి బీసీసీఐ పెన్షన్.. నెలకి ఎంతంటే? -
కాషాయ రంగులోకి టీమిండియా జెర్సీ.. దిగ్గజ గోల్కీపర్ కీలక వ్యాఖ్యలు
భారత హాకీ జట్టు సంప్రదాయ నీలం రంగు స్థానంలో కాషాయ రంగు జెర్సీ ధరించడంపై కొనసాగుతున్న వివాదానికి దిగ్గజ గోల్కీపర్ పీఆర్ శ్రీజేష్ తెరదించే ప్రయత్నం చేశారు. జెర్సీ రంగు మార్చడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే నీలం జెర్సీ వల్ల నీలం టర్ఫ్పై ఆటగాళ్లకు కనిపించడం కష్టమవుతుందనే కారణం మాత్రం తనకు అర్థం కావడం లేదని అన్నారు.ఆగస్టు 15 నుంచి నెదర్లాండ్స్, బెల్జియంలో జరగనున్న హాకీ ప్రపంచకప్లో భారత పురుషుల, మహిళల జట్లు తమ ప్రధాన కిట్గా కాషాయ జెర్సీని ధరించనున్నాయి. దీనిపై మాజీ కెప్టెన్లు వీరెన్ రస్కిన్హా, ధన్రాజ్ పిళ్లే, అజిత్ పాల్ సింగ్, వాసుదేవన్ భాస్కరన్, పర్గత్ సింగ్ తదితరులు అభ్యంతరం వ్యక్తం చేశారు.“జెర్సీ రంగు మార్చడమే వివాదమైతే 2014, 2018 ప్రపంచకప్ల సమయంలోనూ ఇది జరగాలి. అప్పుడు మేం పసుపు, లైట్ బ్లూ రంగు జెర్సీలు ధరించాం. రంగు మార్చడంపై నాకు సమస్య లేదు. కానీ అందుకు చెబుతున్న కారణమే విచిత్రంగా ఉంది” అని శ్రీజేష్ పేర్కొన్నారు.నీలం టర్ఫ్ కారణంగా నీలం జెర్సీ కనిపించడం కొంత కష్టంగా ఉండొచ్చని అంగీకరించినప్పటికీ, 2012 లండన్ ఒలింపిక్స్ నుంచి నీలం టర్ఫ్పై భారత్ ఎన్నో టోర్నీల్లో నీలం జెర్సీతోనే ఆడిందని గుర్తుచేశారు.రాజకీయాలకు దూరంగా ఉండాలిజెర్సీ మార్పుకు ఆటగాళ్లు అంగీకరించి ఉంటే ఇక ఈ అంశంపై చర్చ అవసరం లేదని శ్రీజేష్ స్పష్టం చేశారు.“క్రీడలను రాజకీయాలకు దూరంగా ఉంచాలి. ఆటగాళ్లే అత్యంత ముఖ్యమైన వారు. వారికి ఎలాంటి సమస్య లేకపోతే బయటివారు కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు” అని అన్నారు.అయితే కొత్త జెర్సీని ప్రపంచకప్కు ముందే కొన్ని మ్యాచ్ల్లో ఉపయోగించి ఉంటే ఆటగాళ్లు దానికి అలవాటు పడేవారని అభిప్రాయపడ్డారు.50 ఏళ్ల నిరీక్షణకు తెరదించే అవకాశంప్రపంచకప్లో భారత్ 50 ఏళ్లుగా టైటిల్ కోసం ఎదురుచూస్తోందని, ఈసారి సెమీఫైనల్ చేరే అవకాశం బలంగా ఉందని శ్రీజేష్ అభిప్రాయపడ్డారు.ఇంగ్లండ్ మాత్రమే తమ గ్రూప్లో ప్రధాన సవాల్ అని, గ్రూప్లో అగ్రస్థానంలో నిలిస్తే తర్వాతి దశలో మార్గం కొంత సులభంగా ఉండొచ్చని చెప్పారు.“బయటి చర్చలను పక్కన పెట్టి అత్యుత్తమ హాకీ ఆడండి. 50 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికి పతకం సాధించండి” అని శ్రీజేష్ భారత జట్టుకు సూచించారు. -
రిటైర్మెంట్ తర్వాత రహానేకి బీసీసీఐ పెన్షన్.. నెలకి ఎంతంటే?
టీమిండియా సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే ఇటీవల తన 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. 34 ఏళ్ల రహానే ప్లేయర్గా, కెప్టెన్గా భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ కొన్ని ప్రత్యేక పేజీలను లిఖించుకున్నాడు.అతడి సారథ్యంలోనే భారత్ 2021లో ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. అయితే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన రహానేకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నుంచి ఎంత పెన్షన్ వస్తుందో తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపుతున్నారు.రహానే పెన్షన్ ఎంతంటే?బీసీసీఐ మాజీ క్రికెటర్లను వారి అనుభవం, ఆడిన టెస్ట్ మ్యాచ్ల ఆధారంగా మూడు విభాగాలగా విభజించింది. అత్యధికంగా 25 కంటే ఎక్కువ టెస్ట్ మ్యాచ్లు ఆడిన మాజీ అంతర్జాతీయ ఆటగాళ్లు టాప్ కేటగిరీకి వస్తారు. వారికి ప్రస్తుతం నెలకు రూ.70,000 చొప్పున పెన్షన్ లభిస్తుంది. గతంలో ఈ జాబితాలో ఉన్న ఆటగాళ్లకు నెలకు రూ. 50,000 దక్కేది. కానీ 2022లో సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈ మొత్తాన్ని రూ.70,000కు పెంచాడు. ఇప్పుడు భారత్ తరఫున 85 టెస్టు మ్యాచ్లు ఆడిన రహానే, అత్యున్నత పెన్షన్ స్లాట్లో ఉన్నాడు. అతడికి ప్రతీ నెల రూ.70,000 పెన్షన్ లభించనుంది. ఇక దిగువ శ్రేణిలోని వారికి రూ. 60 వేలు, ఫస్ట్క్లాస్ మాజీ ఆటగాళ్లకు రూ. 30 వేలు పెన్షన్ అందిస్తోంది. పెన్షన్ పథకం ప్రస్తుతం దాదాపు 900 మందికి పైగా రిటైర్డ్ క్రికెటర్లు, అంపైర్లకు ప్రయోజనం చేకూరుస్తోంది. -
చరిత్ర సృష్టించిన భారత బ్యాడ్మింటన్ యువ సంచలనం
భారత యువ బ్యాడ్మింటన్ సంచలనం తన్వీ శర్మ చరిత్ర సృష్టించింది. తైపీ ఓపెన్ సూపర్ 300 టోర్నీలో మహిళల సింగిల్స్ టైటిల్ను గెలుచుకుని తన కెరీర్లో తొలి BWF వరల్డ్ టూర్ టైటిల్ను సొంతం చేసుకుంది.ఆదివారం జరిగిన ఫైనల్లో 17 ఏళ్ల తన్వీ.. వియత్నాంకు చెందిన ఆరో సీడ్ తుయ్ లిన్ న్గుయెన్ను వరుస గేముల్లో ఓడించింది. కేవలం 36 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో 21-16, 21-16తో విజయం సాధించి టైటిల్ను ఎగరేసుకుపోయింది.పంజాబ్కు చెందిన తన్వీ గతేడాది US ఓపెన్ సూపర్ 300లో రన్నరప్గా నిలిచింది. ఈసారి తైపీ ఓపెన్లో మాత్రం ఫైనల్ను విజయంగా మలిచి తన తొలి సూపర్ 300 టైటిల్ను అందుకుంది.జూనియర్ స్థాయిలోనూ ఘనతలుతన్వీ గతంలో ప్రపంచ జూనియర్ నంబర్-1గా నిలిచింది. వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్స్లో ఒకే ఎడిషన్లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయురాలిగా కూడా రికార్డు సృష్టించింది. బాలికల సింగిల్స్లో రజతం, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్యం సాధించింది.అంతేకాకుండా, భారత జట్టు తొలిసారి ఆసియా టీమ్ ఛాంపియన్షిప్ స్వర్ణం గెలిచిన జట్టులో కూడా సభ్యురాలిగా ఉంది.17 ఏళ్ల వయసులో మరో రికార్డు16 ఏళ్ల వయసులోనే తన తొలి సూపర్ 300 ఫైనల్కు(2025 US ఓపెన్) చేరుకున్న తన్వీ.. ఆ తర్వాత ఒడిశా మాస్టర్స్, గువాహటి మాస్టర్స్లోనూ రన్నరప్గా నిలిచింది.తైపీ ఓపెన్ ఫైనల్కు చేరుకునే సమయానికి ఆమె ప్రపంచ ర్యాంకింగ్స్లో టాప్-35లోకి దూసుకొచ్చింది.17 ఏళ్ల 222 రోజుల వయసులో తైపీ ఓపెన్ నెగ్గిన తన్వీ, ఈ టోర్నీ చరిత్రలో అత్యంత పిన్న వయస్కురాలైన టైటిల్ విన్నర్గా నిలిచింది.తన్వీకి పీవీ సింధు మాజీ కోచ్ పార్క్ టే-సాంగ్ మార్గదర్శకత్వం అందిస్తున్నాడు. దూకుడైన ఆటతీరు, నిలకడతో ఆకట్టుకుంటున్న తన్వీ.. ఈ టైటిల్తో భారత బ్యాడ్మింటన్లో భవిష్యత్ స్టార్గా తన స్థానాన్ని మరింత బలపరుచుకుంది. -
టోర్నీ మధ్యలోనే అలిగి వెళ్లిపోయిన షాహీన్ షా అఫ్రిది!?
పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది కీలక నిర్ణయం తీసుకున్నాడు. లంక ప్రీమియర్ లీగ్ (LPL) 2026లో క్యాండీ రాయల్స్ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అఫ్రిది.. సీజన్ మధ్యలోనే వైదొలిగాడు. వ్యక్తిగత కారణాల వల్ల అతడు తన స్వదేశానికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.ఈ పొట్టి క్రికెట్ టోర్నమెంట్లో షాహీన్ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. అఫ్రిది 6 ఇన్నింగ్స్లలో కేవలం 7 వికెట్లు మాత్రమే తీశాడు. 10.18 ఎకానమీ రేటుతో పరుగులు సమర్పించుకున్నాడు. వైదొలగడానికి వ్యక్తిగత కారణాలు చెప్పినప్పటికీ, దీని వెనుక వేరే కథ ఉన్నట్లు సమాచారం. క్యాండీ రాయల్స్కు మేనెజ్మెంట్కు అఫ్రిది మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది.అసలేమి జరిగిందంటే?ఈ లీగ్లో భాగంగా కొలంబో క్యాప్స్తో జరిగిన మ్యాచ్లో అఫ్రిదిని 'ఇంపాక్ట్ ప్లేయర్'గా బరిలోకి దించుతామని క్యాండీ జట్టు మేనెజ్మెంట్ చెప్పింది. కానీ మ్యాచ్ షీట్ తయారీలో అనలిస్ట్ల పొరపాటు వల్ల అతడి ఇంపాక్ట్ ప్లేయర్ల లిస్ట్లో కనిపించలేదు. దీంతో అతడిని ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగేందుకు అంపైర్లు అనుమతించలేదు.దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన షాహీన్.. వెంటనే యాంటీ కరప్షన్ యూనిట్ (ACU) ను ఆశ్రయించాడు. ఈ వివాదం నేపథ్యంలో టోర్నీని వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఫ్రాంచైజీ జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెప్పడంతో కొద్దిరోజులు జట్టుతో పాటు ఉన్నాడు. కానీ ఇప్పుడు అతడు తిరిగి స్వదేశానికి వెళ్లిపోయాడు. కాగా షాహీన్ అఫ్రిది పాకిస్తాన్ టెస్ట్ జట్టులో కూడా చోటు కోల్పోయాడు. వెస్టిండీస్, ఇంగ్లండ్ పర్యటనలకు ఎంపిక కాకపోవడంతో అతడి రెడ్బాల్ క్రికెట్ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది.చదవండి: WTC ఫైనల్ రేసు: గంభీర్కు మరో అగ్నిపరీక్ష! -
లార్డ్స్లో ఆర్చర్ అదుర్స్.. 9 పరుగులు, 4 వికెట్లు
ది హండ్రెడ్ లీగ్ 2026లో సదరన్ బ్రేవ్స్ జట్టు తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. శనివారం లార్డ్స్ వేదికగా లండన్ స్పిరిట్తో జరిగిన కీలక మ్యాచ్లో సదరన్ బ్రేవ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లండన్ స్పిరిట్ జట్టుకు పిచ్ నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. బౌలర్లకు అనుకూలంగా ఉన్న వికెట్పై సదరన్ బ్రేవ్ పేసర్లు పండగ చేసుకున్నారు. ముఖ్యంగా స్టార్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ నిప్పులు చెరిగాడు. ఈ ఇంగ్లండ్ స్పీడ్ స్టార్ నాలుగు వికెట్లు పడగొట్టి లండన్ జట్టును దెబ్బ తీశాడు. ఆర్చర్ తన బౌలింగ్లో కోటాలో కేవలం 9 పరుగులు మాత్రమే ఇవ్వడం గమనార్హం. అయితే ఒకానొక దశలో 103/5తో ఉన్న లండన్ స్పిరిట్.. కేవలం 2 పరుగుల వ్యవధిలోనే మిగతా 5 వికెట్లను కోల్పోయి 105 పరుగులకే ఆలౌట్ అయింది. సదరన్ బ్రేవ్ బౌలర్లలో ఆర్చర్తో పాటు స్టోయినిష్ మూడు వికెట్లు పడగొట్టాడు. లండన్ బ్యాటర్లలో ఓపెనర్ జానీ బెయిర్స్టో (56 పరుగులు) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు.అనంతరం 106 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు సదరన్ బ్రేవ్స్ కూడా తీవ్రంగా శ్రమించింది. లక్ష్య చేధనలో బ్రేవ్స్ 60 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. ఈ సమయంలో డేవిడ్ మిల్లర్(28 బంతుల్లో 39 నాటౌట్) నిలకడగా ఆడి జట్టును గెలిపించాడు. మిల్లర్తో పాటు ఓపెనర్ జేమీ స్మిత్ 36 పరుగులతో రాణించాడు. ఫలితంగా సదరన్ బ్రేవ్ లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి 97 బంతుల్లో చేధించింది. లండన్ బౌలర్లలో డేవిడ్ విల్లీ రెండు, జంపా, కోల్స్ తలా వికెట్ సాధించారు.చదవండి: WTC ఫైనల్ రేసు: గంభీర్కు మరో అగ్నిపరీక్ష! -
జో రూట్ క్లాసీ ఇన్నింగ్స్
ది హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్-2026లో వెల్ష్ ఫైర్ తిరిగి గెలుపు బాట పట్టింది. శనివారం ఎడ్జ్బాస్టన్ వేదికగా బర్మింగ్హామ్ ఫోనిక్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో వెల్ష్ ఫైర్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బర్మింగ్హామ్ ఫోనిక్స్ నిర్ణీత 100 బంతుల్లో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే సాధించగల్గింది. ఓపెనర్లు మిచెల్ ఓవెన్ (18), జో క్లార్క్ (35) మంచి ఆరంభాన్ని ఇచ్చినప్పటికి బర్మింగ్హామ్ మిడిలార్డర్ మాత్రం దారుణంగా విఫలమైంది. ఆఖరిలో కెప్టెన్ డోనోవన్ ఫెరీరా (23), స్కాట్ కర్రీ (17) దూకుడుగా ఆడడంతో బర్మింగ్హామ్ ఆ మాత్రం స్కోరైనా సాధించగల్గింది. వెల్ష్ ఫైర్ బౌలర్లలో మార్కో జాన్సన్, లాకీ ఫెర్గ్యూసన్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. రచిన్ రవీంద్ర, క్రిస్ వోక్స్, సామ్ కుక్ తలొక వికెట్ తీశారు.రూట్ హాఫ్ సెంచరీఅనంతరం 138 పరుగుల లక్ష్యాన్ని వెల్ష్ ఫైర్ 3 వికెట్లు కోల్పోయి 96 బంతుల్లో చేధించింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (36 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్లతో 46), జోరూట్(40 బంతుల్లో 7 ఫోర్లతో 58 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్లు ఆడారు. బర్మింగ్హామ్ బౌలర్లలో సాకిబ్ మహ్మద్, క్రిస్ వుడ్, మిచెల్ ఓవెన్ తలా వికెట్ సాధించారు.చదవండి: WTC ఫైనల్ రేసు: గంభీర్కు మరో అగ్నిపరీక్ష! -
WTC ఫైనల్ రేసు: గంభీర్కు మరో అగ్నిపరీక్ష!
వరుస వైట్ బాల్ సిరీస్ల అనంతరం టీమిండియా మళ్లీ సుదీర్ఘ ఫార్మాట్ (టెస్ట్ క్రికెట్)లో తలపడేందుకు సిద్ధమైంది. శబ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం ఒకట్రెండు రోజుల్లో శ్రీలంకకు పయనం కానుంది. ఆగస్టు 15 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే 'వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్' ఫైనల్ చేరే అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని భారత జట్టుకు ఈసిరీస్ చాలా కీలకం. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం టీమిండియా ఐదవ స్థానంలో ఉంది. ఈ సైకిల్లో ఇంకా భారత్ ఇంకా తొమ్మిది టెస్టులు ఆడాల్సి ఉంది. ఇందులో కనీసం 7 నుంచి 8 మ్యాచ్ల్లో విజయం సాధిస్తేనే టీమిండియా ఫైనల్కు అర్హత సాధిస్తోంది. దీంతో శ్రీలంకతో జరగనున్న సిరీస్లో గిల్ సేన ఎలా రాణిస్తుందో అని అందరూ అతృతగా ఎదురు చూస్తున్నారు.గంభీర్కు మరో అగ్ని పరీక్షహెడ్కోచ్గా గౌతమ్ గంభీర్ భారత్కు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 ప్రపంచకప్-2026 వంటి ఐసీసీ ట్రోఫీలు అందించినప్పటికి.. టెస్టు క్రికెట్లో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. అతడి హయంలోనే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వంటి జట్ల చేతిలో వరుస సిరీస్లను టీమిండియా కోల్పోయింది. దీంతో అతడిని కోచ్గా తప్పించాలని చాలా మంది డిమాండ్ చేశారు. కానీ భారత క్రికెట్ బోర్డు మాత్రం అతడిపై నమ్మకం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో బోర్డు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని గంభీర్ నిరూపించుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ దీప్ దాస్గుప్తా కీలక వ్యాఖ్యలు చేశాడు."జట్టు సరిగ్గా రాణించనప్పుడు మేనెజ్మెంట్(కోచ్లు), కెప్టెన్పై ప్రశ్నలు రావడం సహజం. ముఖ్యంగా సొంతగడ్డపై, విదేశీ పర్యటనల్లో సిరీస్లు కోల్పోవడం వల్ల ఒత్తిడి విపరీతంగా పెరిగింది. 2011-12 తర్వాత తొలిసారి న్యూజిలాండ్తో సిరీస్ ఓడిపోయాం. అప్పటి నుంచి ఓటముల పరంపర కొనసాగుతూనే ఉంది. వైట్బాల్ క్రికెట్తో పోలిస్తే టెస్టుల్లో మన జట్టు తడబడుతోంది. అయితే ఈ ఒత్తిడి నుంచి ఎలా కోలుకోవాలో గంభీర్ నేతృత్వంలోని టీమిండియాకు తెలుసు. ఏదేమైనప్పటికి శ్రీలంక టూర్లో భారత్కు కఠిన సవాల్ ఎదురయ్యే అవకాశముందని" దాస్గుప్తా పేర్కొన్నాడు. కాగా శ్రీలంకతో టెస్ట్ల తర్వాత భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. కివీస్ గడ్డపై రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తలపడనుంది. ఈ రెండు సిరీస్లో భారత జట్టుకు కచ్చితంగా ప్రత్యర్ధి నుంచి గట్టి పోటీ ఎదురు కానుంది. -
చరిత్ర సృష్టించిన గుల్వీర్ సింగ్.. తొలి భారత అథ్లెట్గా
గ్లాస్కో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ గుల్వీర్ సింగ్ అదరగొట్టాడు. తొలుత జూలై 28న జరిగిన 10,000 మీటర్ల విభాగంలో రజతం (సిల్వర్) గెలుచుకున్న గుల్వీర్.. తాజాగా శనివారం 5000 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు.రేసును గుల్వీర్ 13 నిమిషాల 24.95 సెకన్లలో ముగించి ఈ బ్రాంజ్ మెడల్ను ఒడిసి పట్టాడు. తద్వారా ఉత్తరప్రదేశ్కు చెందిన గుల్వీర్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలోనే 5000 మీటర్ల పరుగు పందెంలో పతకం సాధించిన తొలి భారత అథ్లెట్గా గుల్వీర్ రికార్డులకెక్కాడు. అంతేకాకుండా కామన్వెల్త్ గేమ్స్ ఒకే ఎడిషన్లో భారత్ తరపున రెండు పతకాలు సాధించిన మొదటి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్గా కూడా అతడు చరిత్ర సృష్టించాడు.గుల్వీర్ సింగ్ ట్రాక్ రికార్డ్28 ఏళ్ల గుల్వీర్ సింగ్ అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. 5000 మీటర్లు (12:59.77), 10,000 మీటర్లు రెండింటిలోనూ జాతీయ రికార్డులు కలిగి ఉన్నాడు. అంతకుముందు చైనా వేదికగా జరిగిన ఆసియాక్రీడలు-2023లోనూ అతడు 10,000 మీటర్ల విభాగంలో కాంస్య పతకం సాధించాడు. గుల్వీర్ సింగ్ ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలోని గ్రెనేడియర్స్ రెజిమెంట్లో నాయిబ్ సుబేదార్గా పనిచేస్తున్నాడు. -
'పంచ్'లతో పసిడి పంట
భారత బాక్సింగ్ బృందం కామన్వెల్త్ గేమ్స్లో పదునైన పంచ్లతో విరుచుకుపడింది...అటు పురుషులు, ఇటు మహిళల విభాగాల్లో పసిడి వేటలో ఒకరితో మరొకరు పోటీ పడినట్లుగా మన బాక్సర్లు చెలరేగిపోయారు... ఫలితంగా ఒకే రోజు మన ఖాతాలో 7 స్వర్ణాలు చేరాయి. ఫైనల్లో ఓటమితో మరో 3 రజతాలు కూడా దక్కడంతో మొత్తంగా 10 పతకాలకు బాక్సింగ్ మనకు అందించింది. జైస్మీన్, సాక్షి, ప్రీతి, ప్రియ, అరుంధతి, అంకుశ్, సచిన్ స్వర్ణ పతకాలు గెలుచుకోగా...జాదూమణి సింగ్, లవ్లీనా బొర్గొహైన్, నరేందర్ రజతాలు సాధించారు. 2022 కామన్వెల్త్ క్రీడల్లో 3 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యంతో 7 పతకాలు గెలుచుకున్న భారత్...ఇప్పుడు దానిని అధిగమించింది. మొత్తంగా శుక్ర, శనివారాలు కలిపి వేర్వేరు ఈవెంట్లలో పెద్ద సంఖ్యలో పతకాలు గెలిచిన భారత్ కామన్వెల్త్ క్రీడల్లో తమ స్థాయిని ప్రదర్శించింది. నేడు పోటీలకు చివరి రోజు. జైస్మీన్ లంబోరియా (57 కేజీలు): ప్రస్తుత ప్రపంచ చాంపియన్ జైస్మీన్ కామన్వెల్త్ క్రీడల్లో తొలి స్వర్ణాన్ని అందుకుంది. ఫైనల్లో జైస్మీన్ 5–0తో మికెలా వాల్ష్ (నార్తర్న్ ఐలాండ్)పై ఘన విజయం సాధించింది. 2022 క్రీడల్లో ఆమె కాంస్యం సాధించింది. సాక్షి చౌదరి (51 కేజీలు): ఫైనల్లో సాక్షి 5–0తో రూబీ వైట్ (ఇంగ్లండ్)ను ఓడించింది. గత కొంత కాలంగా పలు మార్లు కెరీర్లో గాయాలతో ఇబ్బంది పడి కోలుకున్న సాక్షి కెరీర్లో ఇది కీలక విజయం. ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్న సమయంలో విరాట్ కోహ్లి ఫౌండేషన్ మూడేళ్ల పాటు సాక్షికి అండగా నిలవడంతో ఆమె పట్టుదలగా పోటీలో నిలవగలిగింది. అరుంధతి చౌదరి (70 కేజీలు): ఫైనల్లో అరుంధతి 5–0తో షాంటెల్ రీడ్ (ఇంగ్లండ్)ను ఓడించి పసిడి గెలుచుకుంది. రాజస్తాన్కు చెందిన అరుంధతి గత ఏడాది వరల్డ్ బాక్సింగ్ కప్లో స్వర్ణం సాధించింది. ప్రియా ఘంఘాస్ (60 కేజీలు): ఫైనల్లో ప్రియ 4–1 తేడాతో మేరీ అల్ అహ్మదీ (కెనడా)పై గెలుపొందింది. సచిన్ సివాచ్ (60 కేజీ): హోరాహోరీగా సాగిన ఫైనల్లో సచిన్ 3–2తో ట్రైగెన్ మార్నింగ్ (నమీబియా)ను ఓడించి స్వర్ణం గెలిచాడు. అతనికి కామన్వెల్త్ పోటీల్లో ఇదే తొలి పతకం కావడం విశేషం. అంకుశ్ పంఘాల్ (80 కేజీలు): ఫైనల్లో అంకుశ్ 4–1 స్కోరుతో దిమెజె షిటు (ఇంగ్లండ్)ను ఓడించి పసిడి గెలిచాడు.గుల్వీర్కు కాంస్యంభారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో ‘డబుల్’ సాధించాడు. ఈ పోటీల్లో ఇప్పటికే 10,000 మీటర్ల పరుగులో రజతం నెగ్గిన అతను శనివారం 5,000 మీటర్ల పరుగులతో కాంస్యం సొంతం చేసుకున్నాడు. ఈ పరుగును గుల్వీర్ 13 నిమిషాల 24.95 సెకన్లలో పూర్తి చేశాడు.లవ్లీనాకు నిరాశ...ఒలింపిక్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గొహైన్కు కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం లభించలేదు. మహిళల 75 కేజీల విభాగంలో ఆమె ఫైనల్లో 1–4తో ఎమా స్యూ గ్రీన్ట్రీ (ఆ్రస్టేలియా) చేతిలో ఓడి రజతంతో సంతృప్తి చెందింది. పురుషుల 55 కేజీల కేటగిరీ ఫైనల్లో జాదూమణి సింగ్ 0–5తో జై డిక్సన్ (ఆ్రస్టేలియా) చేతిలో ఓడి రజతాన్ని సొంతం చేసుకున్నాడు. పురుషుల 90+ కేటగిరీలో నరేందర్ బెర్వాల్ 0–5తో డామర్ థామస్ (ఇంగ్లండ్) చేతిలో పరాజయంపాలు కావడం రజతం మాత్రమే దక్కింది.పవర్ ఫుల్ ప్రీతిశనివారం బాక్సింగ్లో ప్రీతి పవార్ భారత్కు తొలి స్వర్ణాన్ని అందించింది. 54 కేజీల ఫైనల్లో ఆమె 5–0 స్కోరుతో స్కార్లెట్ డెల్గాడో (కెనడా)ను చిత్తు చేసింది. తొలి రౌండ్నుంచి ప్రత్యర్థిపై ప్రీతి చెలరేగింది. ఐదుగురూ జడ్జీలు ఆమెకు అనుకూలంగా 10–9 పాయింట్లు ఇచ్చారు. తర్వాతి రెండు రౌండ్లలో కూడా ఇదే సరళి కొనసాగి 10–9, 10–9తో ప్రీతి సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. చివరకు 30–27 పాయింట్లతో ఆమె ఏకపక్ష విజయాన్ని అందుకుంది. హరియాణాలోని భివానికి చెందిన 22 ఏళ్ల ప్రీతికి కామన్వెల్త్ క్రీడల్లో ఇదే తొలి పతకం. 2022 ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించిన ఆమె గత ఏడాది వరల్డ్ బాక్సింగ్ కప్లో స్వర్ణం గెలుచుకుంది. బాంటమ్ వెయిట్ విభాగంలో ప్రపంచ ర్యాంకింగ్స్లో మూడో స్థానంలో ఉన్న ప్రీతి ప్రస్తుతం భారత ఆర్మీలో నాయబ్ సుబేదార్ హోదాలో పని చేస్తోంది. -
2030లో అహ్మదాబాద్లో కామన్వెల్త్ గేమ్స్... నేడు భారత్ చేతికి క్రీడల పతాకం
గాందీనగర్: పది రోజులుగా క్రీడాభిమానులను అలరిస్తున్న గ్లాస్గో కామన్వెల్త్ క్రీడలు నేటితో ముగియనున్నాయి. నాలుగేళ్ల తర్వాత జరగనున్న ఈ క్రీడలకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. అహ్మదాబాద్ వేదికగా 2030 కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి. దీంతో ప్రస్తుత క్రీడల ముగింపు కార్యక్రమంలో కామన్వెల్త్ క్రీడల పతాకాన్ని భారత్కు అప్పగించనున్నారు. ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గ్లాస్గోలో నేడు ప్రత్యేక ప్రదర్శన జరగనుంది.భారత సంస్కృతిని ప్రతిబింభించేలా ప్రత్యేక సంగీత కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. 1930లో కెనడాలోని హామిల్టన్లో తొలి కామన్వెల్త్ క్రీడలు జరగగా... సరిగ్గా వందేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 2030లో అహ్మదాబాద్లో జరిగే క్రీడలు శతాబ్ది ఉత్సవాలుగా నిలవనున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం గ్లాస్గో ముగింపు వేడుకలకు గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్‡్ష సంఘ్వీ హాజరై క్రీడల పతాకాన్ని స్వీకరించనున్నారు. -
ఉన్నతికి కాంస్యం
జూడోలో భారత ప్లేయర్ ఉన్నతి శర్మ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. మహిళల 63 కేజీల విభాగంలో మూడో స్థానం కోసం జరిగిన పోరులో ఉన్నతి ఇపాన్ స్కోరు (100–0)తో స్కై క్నోస్టర్ (దక్షిణాఫ్రికా)ను చిత్తు చేసింది. చురుగ్గా ప్రత్యర్థిని పడగొట్టి అత్యధిక పాయింట్లు సాధించిన ఉన్నతి కేవలం 1 నిమిషం 7 సెకన్లలోనే పోరును ముగించింది. అంతకు ముందు జరిగిన సెమీఫైనల్లో ఉన్నతి 1–100 స్కోరుతో సాయా మిడిల్టన్ (ఆ్రస్టేలియా) చేతిలో పరాజయంపాలైంది. పురుషుల 81 కేజీల కేటగిరీలో హర్ష్ టోకాస్ కాంస్యం కోల్పోయాడు.మూడో స్థానం కోసం జరిగిన పోరులో హర్ష్ ఇపాన్ (0–100)తో కీషిన్ ఓచీ (ఆ్రస్టేలియా) చేతిలో ఓడిపోయాడు. బరిలో నిలిచిన ఇతర భారత జూడోకాలు ఇనున్గన్బి టాకెలంబమ్, కరణ్జిత్ సింగ్ మాన్ పతకాలు గెలుచుకోవడంలో విఫలమయ్యారు. మరో వైపు పురుషుల లాన్ బౌల్స్లో ఇంగ్లండ్ ద్వయం నిక్ బ్రెట్–జేమీ వాకర్ చేతిలో పరాజయంపాలైన భారత జోడి నవనీత్ సింగ్–దినేశ్ కుమార్ పతకావకాశాలు కోల్పోయింది.సైక్లింగ్ స్ప్రింట్ ఈవెంట్ పురుషుల విభాగంలో భారత సైక్లిస్ట్లు క్వాలిఫై కావడంలో విఫలమయ్యారు. రోజిత్ సింగ్ 22వ స్థానంలో, రొనాల్డో సింగ్ 24వ స్థానంలో, డేవిడ్ బెక్హామ్ 25వ స్థానంలో నిలిచి ని్రష్కమించారు. మహిళల 10,000 మీటర్ల రేస్వాక్లో భారత అథ్లెట్లు ప్రియాంక (45 నిమిషాల 53.93 సె.) నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకాన్ని చేజార్చుకోగా, రవీనా డిస్క్వాలిఫై అయింది. -
‘డెకా’లో తేజస్విన్ కేక
కామన్వెల్త్ క్రీడల చరిత్రలో డెకాథ్లాన్ పోటీల్లో పతకం గెలుచుకున్న తొలి భారత అథ్లెట్గా తేజస్విన్ శంకర్ గుర్తింపు పొందాడు. శుక్రవారం జరిగిన ఈ పోటీల్లో అతను కాంస్య పతకంతో సత్తా చాటాడు. పది వేర్వేరు ఈవెంట్ల సమాహారమైన డెకాథ్లాన్లో తేజస్విన్ ఓవరాల్గా 7976 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. లిండన్ విక్టర్ (గ్రెనడా – 8096) స్వర్ణం గెలుచుకోగా, డామియాన్ వార్నర్ (కెనడా – 8036)కు కాంస్యం లభించింది. 2022 కామన్వెల్త్ క్రీడల హైజంప్లో కాంస్యం సాధించిన తేజస్విన్...ఈ పోటీల రెండు వేర్వేరు క్రీడాంశాల్లో పతకం నెగ్గిన తొలి భారతీయుడిగా కూడా ఘనత సాధించాడు. తాజా పోటీల హైజంప్ ఈవెంట్లో తొలి ప్రయత్నంలో విఫలమైన తర్వాత తేజస్విన్ బరినుంచి తప్పుకున్నాడు. సుదీర్ఘకాలంగా తనను ఇబ్బంది పెడుతున్న మోకాలి గాయం తిరగబెట్టడమే అందుకు కారణం.కన్నీళ్లతో ఫీల్డ్ను వీడిన తేజస్విన్ ఇప్పుడు డెకాథ్లాన్లో విజయం అనంతరం తన భావోద్వేగాన్ని ప్రదర్శించాడు. డెకాథ్లాన్లో తేజస్విన్ వరుసగా 100 మీ. (870 పాయింట్లు), లాంగ్ జంప్ (1015), షాట్పుట్ (673), హైజంప్ (944), 400 మీ. (837), 110 మీ. హర్డిల్స్ (922), డిస్కస్ త్రో (674), పోల్వాల్ట్ (702), జావెలిన్ (635), 1500 మీ.(704) చొప్పున పాయింట్లు నమోదు చేశాడు. -
రజతంతో నీరజ్ ‘సమ్’తృప్తి!
గ్లాస్గో: భారత స్టార్ అథ్లెట్, జావెలియన్ నీరజ్ చోప్రా కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకంతో మెరిశాడు. రెండు ఒలింపిక్ పతకాల విజేత అయిన నీరజ్ స్థాయి, అంచనాలతో పోలిస్తే రెండో స్థానం నిరాశ కలిగించేదే అయినా...సుదీర్ఘ కాలం గాయంతో బాధపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తీరును చూస్తే రజతం సంతృప్తికర ఫలితంగానే చెప్పవచ్చు. క్వాలిఫయింగ్లో జావెలిన్ ఆశించిన విధంగా విసరలేకపోయిన నీరజ్ అసలు పోరులో సత్తా చాటాడు. తన రెండో ప్రయత్నంలో బల్లెంను 85.83 మీటర్లు విసిరిన నీరజ్ ఖాతాలో సిల్వర్ మెడల్ చేరింది. తన మొదటి ప్రయత్నంలో 80.97 మీటర్ల దూరం జావెలిన్ను విసిరిన నీరజ్... రెండో ప్రయత్నంలో విసిరిన దూరం పతకాన్ని అందించింది మూడు, నాలుగు ప్రయత్నాల్లో అంతకంటే మెరుగైన ప్రదర్శన ఇవ్వలేకపోయిన నీరజ్...తర్వాతి రెండు ప్రయత్నాలనూ ఫౌల్గా ముగించాడు. ఈ ఈవెంట్లో కాంస్యం కూడా భారత ఆటగాడే గెలుచుకోవడం విశేషం. యశ్వీర్ సింగ్ (85.41 మీ.) తన కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం అందుకున్నాడు. గత ఏడాది కాలంగా నిలకడగా రాణిస్తున్న శ్రీలంక జావెలిన్ త్రోయర్ రుమేశ్ తరంగ పతిరగేకు స్వర్ణ పతకం లభించింది. పతిరగే విసిరిన జావెలియన్ 89.75 మీటర్లు దూసుకుపోయింది. ఈ సీజన్లో తాను పాల్గొన్న ఎనిమిది ఈవెంట్లలో పతిరగే ఏడు సార్లు మొదటి స్థానంలో నిలవడం విశేషం. యశ్వీర్ తొలి ఐదు ప్రయత్నాల్లో రెండు ఫౌల్స్ సహా తడబాటుకు గురైనా...చివరి ప్రయత్నంలో నమోదు చేసిన దూరం అతనికి కాంస్యాన్ని అందించింది. 12 మంది పాల్గొన్న ఫైనల్లో మరో భారత ఆటగాడు రోహిత్ (81.56 మీ.) ఏడో స్థానంతో ముగించగా... పారిస్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అర్షద్ నదీమ్ (పాకిస్తాన్) 9వ స్థానానికే పరిమితమయ్యాడు.‘ఫిట్నెస్పరంగా నేను ఇంకా కోలుకునే దశలోనే ఉన్నాను. ఈ సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినందుకు సంతృప్తిగా ఉన్నా. ఇక్కడి వాతావరణ పరిస్థితుల్లో నేను అనుకున్నట్లుగా జావెలిన్ విసరలేకపోయా. కానీ ఇలాంటి చోటా పతకం గెలవడం ఆనందాన్నిచ్చింది. ఆసియా క్రీడలకు ముందు నా ప్రదర్శనను మరింత మెరుగుపర్చుకునేందుకు అవకాశం ఉంది’ అని నీరజ్ స్పందించాడు.తండ్రి శిక్షణలో...భారత జావెలిన్లో నీరజ్ చోప్రా శకం మొదలైన తర్వాత అతని నీడలో మరో ఆటగాడి ప్రదర్శనకు సహజంగానే గుర్తింపు లభించడం లేదు. ఇలాంటి స్థితిలో యశ్వీర్ గెలిచిన కాంస్యం విలువ ఎంతో అమూల్యం. నిజానికి 2021లో నీరజ్ ఒలింపిక్ చాంపియన్గా నిలవడానికి కొన్నాళ్ల క్రితం నెలకొల్పిన జూనియర్ ఫెడరేషన్ మీట్ రికార్డును బద్దలు కొట్టడంతోనే యశ్వీర్ మొదటిసారి వెలుగులోకి వచ్చాడు. అయితే ఇంత కాలానికి అతని కష్టానికి ఫలితం లభించింది. రాజస్తాన్కు చెందిన యశ్వీర్కు అతని తండ్రి, మాజీ జావెలిన్ త్రోయర్ అయిన రాయ్ సింగ్ కోచ్గా మారి మార్గనిర్దేశనం చేశాడు.జాతీయ స్థాయిలో, రైల్వే చాంపియన్షిప్లలో పలు పతకాలు గెలుచుకొని స్పోర్ట్ కోటాలోనే ఉద్యోగం అందుకున్న రాయ్ సింగ్ కోచింగ్లో కూడా ఎన్ఐఎస్ డిప్లొమా హోల్డర్. ఈ అనుభవాన్నంతా అతను తన కొడుకును తీర్చిదిద్దేందుకు ఉపయోగించాడు. తాను పెద్ద స్థాయిలో విజయాలు సాధించలేదని, యశ్వీర్ కామన్వెల్త్, ఆసియా క్రీడలవంటి ప్రతిష్టాత్మక ఈవెంట్లలో పతకాలు సాధించాలని కలగన్న రాయ్ సింగ్ అన్ని రకాలుగా శ్రమించి శిక్షణ అందించాడు.ఈవెంట్కు ముందు కొడుకును ప్రోత్సహిస్తూ ‘జీవితంలో ఇదే అతి పెద్ద ప్రశ్నగా భావించి సరైన రీతిలో సమాధానం ఇవ్వు. ఇక్కడ పూర్తి సామర్థ్యంతో సత్తా చాటు. ఇక్కడ గెలిస్తే నీ జీవితం మారిపోతుంది. ఎంత బాగా ఆడగలవో ఆడు’ అంటూ ఈవెంట్కు ముందు స్ఫూర్తి నింపిన తండ్రికి యశ్వీర్ పతకాన్ని కానుకగా ఇచ్చాడు. -
ఫైనల్లో తన్వీ శర్మ
తైపీ: భారత బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ తన్వీ శర్మ తైపీ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో 17 ఏళ్ల తన్వీ 21–17, 21–11తో ప్రపంచ 24వ ర్యాంకర్ హువాంగ్ యు సున్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించింది. 33 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో తన్వీ వరుస గేమ్ల్లో విజృంభించింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస పాయింట్లతో విజయం సాధించింది. గతేడాది యూఎస్ ఓపెన్ సూపర్–300 టోర్నీలో రన్నరప్గా నిలిచిన తన్వీ నేడు జరిగే ఫైనల్లో ఆరో సీడ్ థుయ్ లిన్ నుగుయెన్ (వియత్నాం)తో తలపడనుంది. మరో సెమీఫైనల్లో ఉన్నతి హుడా 15–21, 18–21తో ప్రపంచ 21వ ర్యాంకర్ థుయ్ లిన్ నుగుయెన్ చేతిలో పోరాడి ఓడింది. -
సెమీస్లో శ్రీజ
న్యూఢిల్లీ: కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్లో భారత ప్యాడ్లర్లు సత్తాచాటుతున్నారు. మహిళ ల, పురుషుల విభాగాల్లో మొత్తం ఎనిమిది మంది భార త ప్లేయర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ప్లేయర్, రెండో సీడ్ ఆకుల శ్రీజ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శనివారం 13–11, 11–4, 11–9, 12–10తో టిన్ టిన్ హో (ఇంగ్లండ్)పై ఏకపక్ష విజయం నమోదు చేసుకుంది. మరో క్వార్టర్ ఫైనల్లో సిండ్రెలా దాస్ 10–12, 11–9, 12–10, 11–8, 7–11, 11–8తో టాప్ సీడ్ యాంగ్జీ లూ (ఆస్ట్రేలియా)పై సంచలన విజయం సాధించింది. ఇతర మ్యాచ్ల్లో యశస్విని 4–0తో కాన్స్టాంటినా (ఆస్ట్రేలియా)పై... సుతీర్థ ముఖర్జీ 4–1తో మిన్ హ్యూంగ్ జీ (ఆస్ట్రేలి యా)పై గెలిచి సెమీస్లో అడుగుపెట్టారు. ఇక పురుషుల విభాగంలో టాప్ సీడ్ మనుశ్ షా 11–6, 11–8, 2–11, 13–15, 11–8, 11–5తో ఆదిత్య సరీన్ (ఆస్ట్రేలియా)పై... పాయస్ జైన్ 8–11, 12–10, 12–14, 12–10, 11–6, 11–9తో భారత్కే చెందిన హర్మీత్ దేశాయ్పై గెలుపొందారు. అంకుర్ భట్టాచార్య 7–11, 15–13, 10–12, 11–5, 11–9, 11–9తో నికోలస్ వెన్ జెంగ్ లుమ్ (ఆస్ట్రేలి యా)పై... మానవ్ ఠక్కర్ 5–11, 11–8, 13–11, 11–8, 11–6తో అలెగ్జాండర్ గ్రీన్ (ఇంగ్లండ్)పై విజయాలతో ముందంజ వేశారు. -
సౌత్ జోన్ సారథిగా తిలక్ వర్మ
బెంగళూరు: దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ దులీప్ ట్రోఫీలో పాల్గొనే సౌత్ జోన్ జట్టుకు తిలక్వర్మ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (సీఓఈ)లో జరగనున్న ఈ టోర్నమెంట్ కోసం సౌత్ జోన్ సెలక్టర్లు శనివారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించారు. భారత టి20 జట్టుకు వైస్కెప్టెన్గా వ్యవహరిస్తున్న తిలక్ వర్మ ఈ జట్టుకు సారథిగా ఎంపిక కాగా... ఆంధ్రప్రదేశ్ సీనియర్ ప్లేయర్ రికూ భుయ్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. భారత సీనియర్ ఆటగాడు కరుణ్ నాయర్తో పాటు హైదరాబాద్కు చెందిన హిమతేజ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ యువ ఆటగాడు షేక్ రషీద్కు కూడా చోటు దక్కింది. సౌత్ జోన్ జట్టు: తిలక్ వర్మ (కెప్టెన్), రికీ భుయ్, అభినవ్, షేక్ రషీద్, హిమతేజ, స్మరణ్, జగదీషన్, కరుణ్ నాయర్, త్యాగరాజన్, శ్రేయస్ గోపాల్, సాయితేజ, విజయ్, కవెరప్ప, అమన్ ఖాన్. -
కామన్వెల్త్లో బంగారు పంట.. ఒక్కరోజే ఆరు స్వర్ణాలు కైవసం
కామన్ వెల్త్ గేమ్స్లో భారత్ దూసుకెళ్తోంది. ఇవాళ ఒక్కరోజే ఏకంగా ఆరు స్వర్ణ పతకాలు సాధించింది. ఈ ఆరు బంగారు పతకాలు బాక్సింగ్లోనే రావడం మరో విశేషం. ఈ మెడల్స్తో పతకాల పట్టికలో భారత్ ఏకంగా నాలుగో స్థానానికి ఎగబాకింది. ఇప్పటికే ప్రీతి పవార్, జాస్మిన్ లంబోరియా, సాక్షి చౌదరి, ప్రియా గంగాస్, అరుంధతి చౌదరి పసిడి పతకాలు నెగ్గారు.తాజాగా ఈ లిస్ట్లో సచిన్ సివాచ్ కూడా చేరారు. పురుషుల 60 కేజీల విభాగంలో పోటీపడిన సచిన్ సివాచ్ గోల్డ్ మెడల్ సాధించాడు. ఫైనల్ బౌట్లో ఆస్ట్రేలియా బాక్సర్ను చిత్తు చేశాడు. ఈ పతకంతో ఇండియా మెడల్స్ సంఖ్య ఓవరాల్గా 36కు చేరుకుంది. దీంతో ప్రస్తుతం పతకాల పట్టికలో ఇండియా నాలుగో స్థానంలో కొనసాగుతోంది. -
బాక్సింగ్లో మరో స్వర్ణం.. అరుంధతికి గోల్డ్
కామన్వెల్త్ గేమ్స్లో భారత మహిళా బాక్సర్లు స్వర్ణాల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ప్రీతి పవార్, జాస్మిన్ లంబోరియా, సాక్షి చౌదరి, ప్రియా గంగాస్ పసిడి పతకాలు నెగ్గగా.. తాజాగా ఈ లిస్ట్లో అరుంధతి చౌదరీ కూడా చేరింది. మహిళల 70 కేజీల విభాగంలో గోల్డ్ కైవసం చేసుకుంది. దీంతో భారతదేశ బాక్సింగ్లో భారత స్వర్ణాల సంఖ్య ఐదుకు చేరింది.తాజాగా మహిళల 70 కేజీల విభాగంలో అరుంధతి చౌదరీ కూడా స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. కామన్వెల్త్లో భారత్కు ఇది 11వ స్వర్ణం కాగా.. మొత్తం పతకాల సంఖ్య 34కి పెరిగింది. ఈ పతకాలతో ఇండియా నాలుగో స్థానంలో నిలిచింది. -
అసలెప్పుడు విడిపోయారు.. కలిసిపోవడానికి?
హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా.. టీమిండియా క్రికెటర్లయిన పాండ్యా బ్రదర్స్కు సెపరేట్ ఫ్యాన్బేస్ ఉంది. ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ అన్నదమ్ముల్లో తమ్ముడైన హార్దిక్ టీమిండియాలో ఒక వెలుగు వెలుగుతున్నాడు. తమ్ముడంత కాకపోయినా కృనాల్ కూడా ఐపీఎల్ ద్వారా బాగానే గుర్తింపు పొందాడు. ముఖ్యంగా కృనాల్ పాండ్యా ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన జట్లలో సభ్యుడిగా ఉన్నాడు. అటు పాండ్యా కూడా ఈ రికార్డులో ముందువరుసలో ఉన్నాడు. మరి ఇప్పుడు వీరిద్దరి ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే.. తాజాగా హార్దిక్, కృనాల్లు కలిసిపోయారన్న వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ముంబై ఎయిర్పోర్టు నుంచి బయటకు వస్తూ ఈ ఇద్దరు అన్నదమ్ములు నవ్వుకుంటూ, మాట్లాడుకుంటూ బయటకి వస్తున్న ఫొటోలో సోషల్ మీడియాలో ప్రత్యక్ష్యమయ్యాయి. అయితే రియాల్టీలో ఇది పాత వీడియో అని, ఇప్పుడు కూడా హర్దిక్, కృనాల్ పాండ్యాలు మాట్లాడుకోవడం లేదని కొంతమంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ వీడియోపై కొంతమంది ఫ్యాన్స్ మాత్రం 'అసలెప్పుడు విడిపోయారు.. ఇప్పుడు కలవడానికి’ అని కామెంట్ పెట్టారు.ఐపీఎల్ 2026 సీజన్ సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో హార్దిక్ ఔటైనప్పుడు కృనాల్ ఉత్సాహంగా సంబరాలు చేసుకున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనికి తోడు, ఆర్సీబీ టైటిల్ గెలిచిన తర్వాత హార్దిక్ తన సోదరుడిని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయకపోవడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయనే ప్రచారం మొదలైంది.ఈ ఊహాగానాలపై కృనాల్ స్పందిస్తూ, "మేమిద్దరం కలిసే క్రికెట్ ఆడాం. ఆటలోని వ్యూహాలు, టెక్నిక్ గురించి ఎప్పుడూ చర్చించుకుంటాం. మా మధ్య ఆరోగ్యకరమైన చర్చే ఉంటుంది. ఒకే క్రీడలో ఇద్దరు సోదరులు ఉన్నప్పుడు ఒకరికొకరు అండగా నిలుస్తారు. దేవుడి దయవల్ల పాండ్య కుటుంబంలో 10 ఐపీఎల్ ట్రోఫీలు ఉండటం చిన్న విషయం కాదు" అని వివరించాడు. హార్దిక్ 5, తాను 5 ఐపీఎల్ టైటిళ్లు గెలిచామని తెలిపాడు.ఇక టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం తొడ కండరాల గాయం నుంచి కోలుకునే పనిలో ఉన్నాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెక్స్ (సీవోఈ)లో రీహాబిలిటేషన్లో ఉన్న పాండ్యా పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించే పనిలో ఉన్నాడు. 2027 వన్డే వరల్డ్కప్ దృష్టిలో పెట్టుకొని పాండ్యాను జాగ్రత్తగా కాపాడుకోవాలని బీసీసీఐ భావిస్తోంది.It's hard to understand what changed between Hardik Pandya and Krunal Pandya. There was a time when the Pandya brothers were always seen together. But for the last two years, they haven't been seen together, and they don't talk to each other anymore. pic.twitter.com/Q71CCwo6HU— Sonu (@Cricket_live247) August 1, 2026Read: రేపే భారత్, పాక్ మ్యాచ్.. ఫెవరెట్గా గబ్బర్ సేన! -
రేపే భారత్, పాక్ మ్యాచ్.. ఫెవరెట్గా గబ్బర్ సేన!
మ్యాచ్ ఏదైనా భారత్, పాకిస్తాన్ మధ్య పోరు అంటే ఆ మజానే వేరుగా ఉంటుంది. ఇప్పుడంటే ఎక్కువగా వన్సైడ్ ఫలితాలు వస్తున్నాయి కానీ దశాబ్దం కిందట టీమిండియా, పాకిస్తాన్లు తలపడుతున్నాయంటే ఎంతో థ్రిల్లింగ్ ఉండేది. ఆఖరి దాకా నువ్వా నేనా అన్నట్లుగా మ్యాచ్లు సాగేవి. తాజాగా భారత్, పాకిస్తాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. అదేంటి.. ఇప్పుడు ఎలాంటి ఐసీసీ మేజర్ టోర్నీలు జరగడం లేదు కదా? చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ అంటారేంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం.ఏషియన్ లెజెండ్స్ లీగ్ 2026 టోర్నీలో భాగంగా ఆదివారం (ఆగస్టు 2) భారత్, పాకిస్తాన్ తలపడుతున్నాయి. ఇండియన్ రాయల్స్, పాకిస్థాన్ పాంథర్స్ జట్ల మధ్య జరిగే ఈ ఆరో మ్యాచ్ జాంబియాలోని లుసాకా నగరంలో ఉన్న లోటస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్లో జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఈ హై-వోల్టేజ్ పోరు సాయంత్రం 4:00 గంటలకు ప్రారంభమవుతుంది. ఇండియన్ రాయల్స్ జట్టును మాజీ ఆటగాడు శిఖర్ ధావన్ నడిపించనుండగా.. దినేష్ కార్తీక్, సురేష్ రైనా, హర్భజన్ సింగ్, యూసుఫ్ పఠాన్, అంబటి రాయుడు, రిషి ధావన్, స్టువర్ట్ బిన్ని వంటి స్టార్ ఆటగాళ్లతో బలంగా కనిపిస్తోంది. ఇక తమ తొలి మ్యాచ్లో గబ్బర్ సేన బంగ్లాదేశ్ టైగర్స్ జట్టును 19 పరుగుల తేడాతో ఓడించి మంచి ఫామ్లో ఉంది. మరోవైపు.. మహమ్మద్ హఫీజ్ సారథ్యంలో ఉమర్ అక్మల్, షోయబ్ మాలిక్, వహాబ్ రియాజ్, సోహైల్ తన్వీర్, సయీద్ అజ్మల్ వంటి వెటరన్ ఆటగాళ్లతో కూడిన పాకిస్థాన్ పాంథర్స్ జట్టు తమ మొదటి మ్యాచ్లో ఏషియన్ స్టార్స్ చేతిలో 85 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. దీంతో మ్యాచ్లో భారత జట్టు ఫెవరెట్గా కనిపిస్తోంది. ఆసియా ఖండానికి చెందిన రిటైర్డ్ దిగ్గజ క్రికెటర్లు పాల్గొంటున్న ఎషియన్ లెజెండ్స్ లీగ్ సీజన్-2 జూలై 30న ప్రారంభమై ఆగస్టు 10న ముగియనుంది. ఈ టోర్నమెంట్లో మొత్తం 19 టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. గతేడాది జరిగిన తొలి సీజన్లో భారత్ ఫైనల్ చేరుకుని రన్నరప్ నిలిచింది. మొత్తంగా మ్యాచ్లు లేక జుట్టు పీక్కుంటున్న క్రికెట్ అభిమానులకు భారత్, పాక్ పోరు ఫుల్ మీల్స్ అందించనుంది.Read: మేరీ కోమ్ స్ఫూర్తి.. కామన్వెల్త్లో పాకిస్తాన్కు తొలి పతకం -
మేరీ కోమ్ స్ఫూర్తి.. కామన్వెల్త్లో పాకిస్తాన్కు తొలి పతకం
భారత దిగ్గజ మహిళా బాక్సర్ మేరీ కోమ్ ఘనత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మేరీ కోమ్ ఇచ్చిన స్ఫూర్తి భారత్లో ఎంతోమంది మహిళా బాక్సర్లను పుట్టేలా చేసింది. అయితే తాజాగా ఆమె ఇచ్చిన స్ఫూర్తి దేశ సరిహద్దులను కూడా దాటి పాకిస్తాన్ను కూడా తాకింది. విషయంలోకి వెళితే పాకిస్తాన్ బాక్సర్ అయిన 22 ఏళ్ల ఫాతిమా జహ్రా కామన్వెల్త్ గేమ్స్లో మహిళల 60 కేజీల విభాగంలో కాంస్య పతకం గెలుచుకుంది.తద్వారా కామన్వెల్త్ గేమ్స్లో పతకం సాధించిన తొలి పాకిస్తాన్ బాక్సర్గా ఫాతిమా నిలిచింది. అంతేకాదు ఈ కామన్వెల్త్ గేమ్స్లో ఫాతిమా సాధించిన పతకమే వారికి మొదటిది కావడం గమనార్హం. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న సర్ఘోడాలో పెరిగిన ఫాతిమా భారత దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ను ఆదర్శంగా తీసుకుంది. మేరీ కోమ్ జీవితం ఆధారంగా 2014లో బాలీవుడ్లో తెరకెక్కిన బయోపిక్ అప్పటికి 10 ఏళ్ల వయసు ఉన్న ఫాతిమాపై చెరగని ముద్ర వేసింది. ఆ సినిమాలో మేరీ కోమ్ జీవితంలో ఎన్నో కష్టాలను దాటుకొని దిగ్గజ బాక్సర్గా పేరు పొందడం ఫాతిమాను బాగా ఆకట్టుకుంది. ఆ క్షణంలోనే తాను కూడా బాక్సర్ కావాలని కలలు కన్నది. అయితే ఫాతిమా బాక్సర్ అయ్యే క్రమంలో సొంత దేశంలో ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొంది. ఫాతిమా కుటుంబం బాక్సింగ్కు వ్యతిరేకంగా ఉండేది. ఆమెను శిక్షణకు వెళ్లనిచ్చేవారు కాదు. కానీ సంవత్సరాల తరబడి ఫాతిమా చేసిన పోరాటం ఆమెపై వ్యతిరేకతను పోగొట్టి మద్దతు పెరిగింది. అంచెలంచెలుగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇవాళ వాళ్ల దేశానికి కామన్వెల్త్ గేమ్స్లో పతకం తీసుకొచ్చి అందరి చేత శెభాష్ అనిపించుకుంది. కాగా పతకం సాధించిన అనంతరం ఫాతిమా మాట్లాడుతూ.. భారతదేశానికి చెందిన మేరీ కోమ్ నాకు స్ఫూర్తి. ఆమె జీవితంపై తీసిన సినిమాను నేను అప్పట్లో ప్రతీరోజు చూసేదాన్ని. నేను బాక్సింగ్ మొదలుపెట్టినప్పుడు ఆ సినిమా చూస్తూ శిక్షణ తీసుకునేదాన్ని. ఆమె అంటే నాకు చాలా గౌరవం. దేవుడి దయవల్ల ఇవాళ ఆమె లాగే మా దేశానికి ఒక పతకం తీసుకొచ్చాను. ఏదో ఒకరోజు ఆమెలానే మా దేశానికి నేను కూడా పేరు ప్రఖ్యతలు తీసుకొస్తానని ఆశిస్తున్నా* అని తెలిపింది.ఇక మేరీకోమ్ ఘనతల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అమెచ్యూర్ బాక్సింగ్లో ఆరుసార్లు చాంపియన్గా నిలిచిన మేరీ కోమ్ దేశ ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాప్తి చేసింది. మేరీకోమ్ తన కెరీర్లో ఆరు ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిళ్లు, ఒలింపిక్స్లో కాంస్య పతకం, ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకాలు, ఐదు ఆసియా ఛాంపియన్షిప్లను గెలిచి అత్యున్నత శిఖరాన్ని అందుకుంది. More history has been made at the 2026 Commonwealth Games as Fatima Zahra becomes the first women from Pakistan to medal in boxing. 🇵🇰Zahra lost in the semi finals against Marie-Bathoul Al-Ahmadieh, who will go on to face Priya Priya of India in the final. #TimeForWorldBoxing pic.twitter.com/SpSuDpBhVB— World Boxing (@RealWorldBoxing) July 31, 2026చదవండి: సెంట్రల్ జోన్ కెప్టెన్గా పటీదార్.. అందరి కళ్లు అతడిపైనే! -
సెంట్రల్ జోన్ కెప్టెన్గా పటీదార్.. అందరి కళ్లు అతడిపైనే!
దులీప్ ట్రోఫీ 2026కు సంబంధించి సెంట్రల్ జోన్ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు రజత్ పటీదార్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, ఫినిషర్ రింకూ సింగ్ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు మోయనున్నాడు. 15 మందితో పాటు అమన్దీప్ ఖరె, మయాంక్ మిశ్రా, సౌరబ్ రావత్, భార్గవ్ మెరాయ్, కునాల్ యాదవ్, కుమార్ కార్తికేయలు రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపికయ్యారు. ఆగస్టు 23న ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీలో ఐదు టెస్టులు జరగనున్నాయి. సెంట్రల్ జోన్తో పాటు నార్త్ ఈస్ట్ జోన్, నార్త్ జోన్, వెస్ట్ జోన్తో పాటు సౌత్జోన్ ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 6న జరగనుంది. అయితే ఇటీవలే శ్రీలంకతో టెస్టు సిరీస్కు ప్రకటించిన భారత జట్టులో చోటు దక్కించుకున్న ఆల్రౌండర్ సారాంశ్ జైన్ కూడా సెంట్రల్ జోన్లో చోటు లభించింది. సారాంశ్తో పాటు ఎస్ఆర్హెచ్ బౌలర్లు జీషన్ అన్సారి, హర్ష్ దూబేలకు కూడా జట్టులో చోటు లభించింది.గతేడాది జరిగిన దులీప్ ట్రోఫీ విజేతగా సెంట్రల్ జోన్ నిలిచిన సంగతి తెలిసిందే. ఆయేడు ఫైనల్లో సౌత్జోన్ను మట్టికరిపించిన సెంట్రల్ జోన్ను పటీదార్ దశాబ్ద కాలంలో తొలిసారి చాంపియన్గా నిలిపాడు. అంతేకాదు ఆ సీజన్లో 382 పరుగులు చేసిన పటీదార్ ఖాతాలో ఒక సెంచరీ ఉంది. ఈసారి చాంపియన్ హోదాలో సెంట్రల్ జోన్ నేరుగా సెమీఫైనల్ ఆడనుంది. ఆగస్టు 23 నుంచి 26 మధ్య జరగనున్న క్వార్టర్ ఫైనల్స్లో ఈస్ట్ జోన్తో నార్త్ఈస్ట్ జోన్, నార్త్ జోన్తో వెస్ట్జోన్ తలపడనున్నాయి. ఈ రెండింటిలో గెలిచిన జట్లు సెమీస్లో చాంపియన్ సెంట్రల్ జోన్తో పాటు రన్నరప్ సౌత్జోన్తో ఆడనున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 6న జరగనుంది.సెంట్రల్ జోన్ జట్టు: రజత్ పాటిదార్ (కెప్టెన్), రింకు సింగ్ (వైస్ కెప్టెన్), ఆర్యన్ జుయల్ (వికెట్ కీపర్), సారాంశ్ జైన్, అమన్ మొఖాడే, కునాల్ చండేలా, జీషన్ అన్సారీ, ఆర్యన్ పాండే, అర్షద్ ఖాన్, ఆయుష్ పాండే, యశ్ రాథోడ్, హర్ష్ దూబే, కునాల్ సింగ్ రాథోడ్ (వికెట్ కీపర్), యాష్ ఠాకూర్, నాచికేత్ భూటెస్టాండ్ బై ప్లేయర్స్: అమన్దీప్ ఖరే, మయాంక్ మిశ్రా, సౌరభ్ రావత్, భార్గవ్ మెరాయ్, కునాల్ యాదవ్, కుమార్ కార్తికేయ.సపోర్ట్ స్టాఫ్: నిఖిల్ డోరు - హెడ్ కోచ్, దేశ్రాజ్ చౌహాన్ - ఫిజియో, చంద్రశేఖర్ రావు - వీడియో అసిస్టెంట్, మోహిత్ కుమార్ - మసీర్, మనీష్ ఝా - అసిస్ట్ కోచ్, మయాంక్ అగర్వాల్ - ట్రైనర్, జుఫ్రీ జకేరియా - మేనేజర్.చదవండి: నీరజ్కు చెక్.. ఫాస్ట్ బౌలర్ నుంచి జావెలిన్ చాంపియన్ దాకా -
చెత్త ఏరుకునే కుటుంబం నుంచి.. భారత క్రికెటర్గా
అతడిది నిరుపేద కుటుంబం. కుటుంబ పోషణ కోసం అతడి తల్లిదండ్రులు చెత్త ఏరుకుంటారు. పదమూడు మంది సంతానంలో అతడు ఒకడు. కడుపేద కుటుంబంలో దివ్యాంగుడిగా జన్మించిన అతడి కల మాత్రం పెద్దది.క్రికెటర్గా రాణించాలనే ఆశయంతో ఎన్నో సవాళ్లకు ఎదురునిలిచాడు. తన సంకల్ప బలంతో ఆటంకాలు అధిగమించి భారత దివ్యాంగ క్రికెట్ జట్టు ఓపెనర్ స్థాయికి ఎదిగాడు. ఇంగ్లండ్ గడ్డ మీద ఆగష్టు 5- 19 వరకు జరిగే టీ20 టోర్నమెంట్లో అతడు పాల్గొనబోతున్నాడు.ఇంతకీ అతడు ఎవరంటారా?.. రాజేశ్ కన్నూర్. కర్ణాటకకు చెందిన ఈ 27 ఏళ్ల క్రికెటర్.. మల్టీనేషనల్ టోర్నమెంట్లో భారత్ తరఫున తొలి సెంచరీ బాదిన దివ్యాంగ ఆటగాడిగా చరిత్రకెక్కాడు. విజయాపురలోని మురికివాడలో జన్మించాడు రాజేశ్. అతడి కుటుంబం గుడిసెలో నివాసం ఉంటుంది. వారి గుడిసెకు విద్యుత్ సౌకర్యం కూడా లేదు.అయినప్పటికీ మొక్కవోని ధైర్యం, ఆత్మవిశ్వాసంతో క్రికెటర్గా ఎదిగాడు రాజేశ్ కన్నూర్. అయితే, ఆటగాడిగా గుర్తింపు వచ్చినప్పటికీ అతడి ఆర్థిక కష్టాలు మాత్రం తీరలేదు. దివ్యాంగ భారత క్రికెట్ మండలి (DCCI) ఇప్పటికీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)లో భాగం కాకపోవడమే ఇందుకు కారణం. డీసీసీఐని బీసీసీఐ ఇంతవరకు అనుబంధ సంస్థగా గుర్తించలేదని సమాచారం.కాబట్టి రాజేశ్ కన్నూర్ మ్యాచ్ల కోసం తన సొంతంగా డబ్బులు ఖర్చు చేసి ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. స్నేహితులు, ఇతర దాతల సాయంతో అతడు కెరీర్ను నెట్టుకొస్తున్నాడు. ఈ విషయం గురించి టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ..పదమూడు మంది సంతానంలో‘‘మా అమ్మానాన్న కాశీబాయి, చిన్నప్ప. విజయపురలో వాళ్లు చెత్తు ఏరుకుంటారు. మేము పదమూడు మందిమి సంతానం. ఏడుగురు అబ్బాయిలు, ఆరుగురు అమ్మాయిలు. పేదరికం కారణంగా నా చదువు పదో తరగతిలోనే ఆగిపోయింది.అయితే, చిన్ననాటి నుంచే క్రికెటర్ కావాలన్న కోరిక నా మనసులో బలంగా నాటుకుపోయింది. కానీ దివ్యాంగుడినైందున నాతో ఎవరూ ఆడేవారు కాదు. గల్లీ క్రికెట్ ఆడుతున్న సమయంలో కొంతమంది స్నేహితులు దివ్యాంగులకు క్రికెట్ కోచింగ్ ఇచ్చే సెంటర్ గురించి చెప్పారు.అదే నా కెరీర్లో టర్నింగ్ పాయింట్అది హుబ్బలిలో ఉంది. 2018లో నేను అక్కడ చేరాను. 2-3 ఏళ్ల పాటు అక్కడే ఆడాను. అయితే, కర్ణాటక దివ్యాంగ జట్టులో చేరిన తర్వాత నా కెరీర్ మలుపు తిరిగింది. కానీ ఆర్థిక కష్టాలు మాత్రం తీరలేదు. అంతర్జాతీయ మ్యాచ్ల కోసం ప్రయాణం చేసే సమయంలో నిధులు నేనే సమీకరించుకోవాల్సి వచ్చేది. నేను ఎప్పుడూ రైలులోనే ప్రయాణం చేసేవాడిని.అయితే, అత్యవసర పరిస్థితుల్లో మాత్రం విమానంలో ప్రయాణిస్తా. ఇందుకు నా స్నేహితుడు విశ్వనాథ్ రాథోడ్ సాయం చేశాడు. అంతర్జాతీయ మ్యాచ్లు ఆడతాను కాబట్టి నాకు ఆదాయం వస్తుందని అంతా అనుకుంటారు. కానీ నేను ఇప్పటికీ సరైన క్రికెట్ కిట్ కొనుక్కోలేకపోయాను.సాధారణ క్రికెట్ మాదిరే ప్రజలు దివ్యాంగ క్రికెట్ను ఆదరించాలి. ప్రభుత్వం కూడా మాకు నిధులు కేటాయిస్తే బాగుంటుంది. కాగా రాజేశ్ కన్నూర్ అఫ్గనిస్తాన్, పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లపై హాఫ్ సెంచరీలు చేశాడు. చదవండి: మంచి సెలక్షన్.. వాషీ కంటే అతడే బెటర్ -
CWG 2026: షాట్పుట్ భారత్కు డబుల్ ధమాకా.. స్వర్ణం, రజతం సొంతం
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత పారా అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల షాట్పుట్ F57 ఫైనల్లో సోమన్ రాణా స్వర్ణ పతకం సాధించగా, శుభమ్ జుయాల్ రజత పతకం దక్కించుకున్నాడు. సోమన్ రాణా 13.40 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలువగా.. శుభమ్ జుయాల్ 13.28 మీటర్ల త్రోతో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ పతకాలతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 30కి (8 గోల్డ్, 15 సిల్వర్, 7 బ్రాంజ్) చేరింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ ఆరో స్థానంలో కొనసాగుతోంది.కాగా, ఇవాళ ఒక్క రోజే భారత్ ఖాతాలో 3 స్వర్ణాలు (మహిళల బాక్సింగ్ 54 కేజీల విభాగంలో ప్రీతి పవార్, మహిళల బాక్సింగ్ 57 కేజీల విభాగంలో జాస్మిన్ లంబోరియా, పారా పురుషుల షాట్పుట్ F57 విభాగంలో సోమన్ రాణా) చేరాయి.ట్రిపుల్ జంప్లోనూ రెండు పతకాలుఇవాళే జరిగిన పురుషుల ట్రిపుల్ జంప్ విభాగంలోనూ భారత అథ్లెట్లు మెరిశారు. ప్రవీణ్ చిత్రవేల్ (16.58 మీటర్ల ఎత్తు) ఎగిరి రజతం ఒడిసిపట్టగా, భారత్కే చెందిన మరో అథ్లెట్ సెల్వ ప్రభు (16.52 మీటర్ల ఎత్తు) ఎగిరి కాంస్య పతకం సాధించాడు.రజతంతో సరిపెట్టుకున్న జడుమణిపురుషుల 55 కేజీల విభాగంలో భారత బాక్సర్ జడుమణి సింగ్ రజతంతో సరిపెట్టుకున్నాడు. ఫైనల్లో జడుమణి ఆస్ట్రేలియాకు చెందిన జై డిక్సన్ చేతిలో ఓటమి పాలయ్యాడు. -
ఇక్కడ ధోని లేడు: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ వార్నింగ్
ఇంగ్లండ్ టెస్టు జట్టు హెడ్కోచ్గా స్టీఫెన్ ఫ్లెమింగ్ నియామకంపై మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ స్పందించాడు. ఫ్లెమింగ్ మంచి వ్యూహకర్త అని ప్రశంసించిన వాన్.. అయితే, మహేంద్ర సింగ్ ధోని మాదిరి అతడికి ఇంగ్లండ్ జట్టులో ఎవరూ దొరకరని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా ‘బజ్బాల్’తో టెస్టుల్లో దూకుడు ప్రదర్శించిన బ్రెండన్ మెకల్లమ్కు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. కెప్టెన్ బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ తర్వాత హెడ్కోచ్ మెకల్లమ్ను కూడా టెస్టు కోచ్ బాధ్యతల నుంచి తప్పించింది.నాలుగేళ్ల కాలానికిమెకల్లమ్ స్థానంలో మరో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ను హెడ్కోచ్గా ఎంపిక చేసింది. ఈ ఏడాది నుంచి 2030, సెప్టెంబర్వరకు నాలుగేళ్ల కాలానికి అతడిని కోచ్గా నియమిస్తున్నట్లు ఈసీబీ ప్రకటించింది. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 18 సీజన్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్కు కోచ్గా వ్యవహరించిన ఫ్లెమింగ్ ఇటీవలే తప్పుకున్నాడు. ఇప్పుడు తొలిసారిగా అంతర్జాతీయ జట్టుకు కోచ్గా కొత్త పాత్రలోకి అడుగు పెడుతున్నాడు.ఇక్కడ ధోని లేడుఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ది టెలిగ్రాఫ్నకు రాసిన కాలమ్లో ఫ్లెమింగ్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఫ్లెమింగ్కు మంచి మేనేజర్, వ్యూహకర్తగా పేరుంది. అందుకు అతడు అర్హుడు కూడా! ఐపీఎల్లో అతడి రికార్డు గొప్పగా ఉంది.అయితే, ఐపీఎల్లో మాదిరి ఇంగ్లండ్ క్రికెట్లో ఎంఎస్ ధోని వంటి కెప్టెన్ ఫ్లెమింగ్కు దొరకడు. చెన్నై సూపర్ కింగ్స్ అనే పడవను ధోని నడిపాడు. కోచ్గా ఫ్లెమింగ్ కూడా తన వంతు పాత్ర పోషించాడు. అక్కడ అతడికి బౌలింగ్ కోచ్గా ఎరిక్ సైమన్స్ ఉన్నాడు.వైట్బాల్ క్రికెట్లో స్వింగ్ రాబట్టడంలో అతడు మాస్టర్. అందుకే చెన్నై జట్టు బౌలింగ్ విభాగం అంతలా రాటుదేలింది. ఒకవేళ ఇంగ్లండ్ జట్టు కూడా అలా మారితే మంచిదే. ఏదేమైనా ఇక్కడ మాత్రం ఫ్లెమింగ్కు ధోని వంటి కెప్టెన్ మాత్రం లేడు’’ అని మైకేల్ వాన్ ఫ్లెమింగ్కు హెచ్చరికలు జారీ చేశాడు. చెన్నై విజయాల్లో ఫ్లెమింగ్ కంటే కూడా ధోని పాత్రే ఎక్కువని పరోక్షంగా సెటైర్లు వేశాడు.అనుభవం ఉందికాగా కౌంటీ క్రికెట్లో ఆటగాడిగా మిడిలెసెక్స్, యార్క్షైర్, నాటింగ్హామ్ జట్ల తరఫున ఆడిన అనుభవం ఉన్న ఫ్లెమింగ్కు ఇంగ్లండ్ క్రికెట్పై మంచి అవగాహన ఉంది. ప్రస్తుతం ‘హండ్రెడ్’ లీగ్లో అతడు సదరన్ బ్రేవ్కు కూడా కోచ్గా పని చేస్తున్నాడు. ఈ ఏడాది దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ నుంచి ఫ్లెమింగ్ బాధ్యతలు చేపడతాడు. మరోవైపు... ఫ్లెమింగ్ ఆత్మీయ స్నేహితుడు, వ్యాపార భాగస్వామి బ్రెండన్ మెకల్లమ్ ఇంగ్లండ్ వన్డే, టీ20 టీమ్లకు కోచ్గా కొనసాగుతున్నాడు.చదవండి: మంచి సెలక్షన్.. సుందర్ కంటే అతడు బెటర్ -
ఆసీస్తో తొలి టెస్ట్.. బంగ్లాదేశ్ జట్టుకు శుభవార్త
ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు ముందు బంగ్లాదేశ్ జట్టుకు భారీ ఊరట లభించింది. గాయం కారణంగా తొలుత జట్టులో చోటు దక్కని స్టార్ బ్యాటర్ లిట్టన్ దాస్, కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చాడు.జూలై 26న ప్రకటించిన బంగ్లాదేశ్ తొలి 15 మంది సభ్యుల జట్టులో లిట్టన్ దాస్కు చోటు దక్కలేదు. ఎడమ కాలి కాఫ్ మసిల్కు గ్రేడ్-1 గాయం కావడంతో అతడి ఫిట్నెస్పై అనుమానాలు నెలకొన్నాయి.అయితే పునరావాస ప్రక్రియలో లిట్టన్ వేగంగా కోలుకున్నాడు. అవసరమైన ఫిట్నెస్ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత సాధించడంతో తొలి టెస్టుకు అతడిని జట్టులోకి చేర్చినట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ ఆగస్టు 13న డార్విన్లో ప్రారంభం కానుంది. రెండో టెస్ట్ మెక్కే వేదికగా ఆగస్ట్ 22 నుంచి మొదలవుతోంది. టెస్ట్ మ్యాచ్లకు ముందు ఆగస్ట్ 6-8 వరకు బంగ్లాదేశ్-క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవెన్ మధ్య మూడు రోజుల వార్మప్ మ్యాచ్ జరుగనుంది.2003 తర్వాత బంగ్లాదేశ్ తొలిసారి ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ ఆడబోతుండటంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.తొలి టెస్టుకు బంగ్లాదేశ్ జట్టునజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), సౌమ్య సర్కార్, షాద్మాన్ ఇస్లాం, తంజిద్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, అమిత్ హసన్, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్ (వైస్ కెప్టెన్), తైజుల్ ఇస్లాం, టాస్కిన్ అహ్మద్, హసన్ మహ్ముద్, సయ్యద్ ఖాలెద్ అహ్మద్, ఎబాడత్ హొస్సేన్ చౌదరి, ముష్ఫిక్ హసన్, లిట్టన్ దాస్. -
నీరజ్కు చెక్.. ఫాస్ట్ బౌలర్ నుంచి జావెలిన్ చాంపియన్ దాకా
కామన్వెల్త్ గేమ్స్ 2026లో జావెలిన్ త్రోలో శ్రీలంక స్టార్ రుమేశ్ తరంగ పతిరగె స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో రుమేశ్ తరంగా పతిరగె 89.75 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని సాధించగా, నీరజ్ చోప్రా ఈ సీజన్లో తన అత్యుత్తమ ప్రదర్శన (85.83 మీటర్లు) చేసినప్పటికీ రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. భారత్కే చెందిన మరో జావెలిన్ త్రోయర్ యశ్వీర్ సింగ్ తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో 85.41 మీటర్లు విసిరి కాంస్య పతకాన్ని ఒడిసిపట్టాడు. కామన్వెల్త్లో రుమేశ్ స్వర్ణం సాధించడం వెనుక పెద్దగా ఆశ్చర్యమేమి లేదు. ఎందుకంటే ఈ ఏడాది రోమ్ డైమండ్ లీగ్లో 90 మీటర్ల మార్కును దాటిన తొలి అథ్లెట్గా నిలిచిన పతిరగే, 92.62 మీటర్లతో ప్రపంచంలోనే అత్యుత్తమ త్రో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.క్రికెటర్ నుంచి జావెలిన్ ఛాంపియన్గా..రుమేశ్ పతిరగే ప్రస్థానం ఎంతో ఆసక్తికరమైనది. జావెలిన్ క్రీడలోకి రాకముందు అతను ఒక క్రికెటర్. అండర్-18 కేటగిరీలో శ్రీలంక పేసర్ ఇషాన్ మలింగ తర్వాత గంటకు 134 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసిన రెండో ఫాస్టెస్ట్ బౌలర్గా అతనికి పేరుంది. అయితే, కోచ్ టోనీ ప్రసన్న ప్రోత్సాహంతో జావెలిన్ వైపు మళ్లినట్లు పతిరగే 'ది ఇండియన్ ఎక్స్ప్రెస్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. "నాకు జావెలిన్ను పరిచయం చేసింది కోచ్ టోనీనే. ఆయన నాకు క్రీడ గురించే కాదు, జీవితం గురించి కూడా నేర్పించారు" అని పేర్కొన్నాడు.చదవండి: బాక్సింగ్లో డబుల్ స్వర్ణాలు.. ట్రిపుల్ జంప్లో రెండు పతకాలు -
గేల్ను అధిగమించిన బట్లర్
ఇంగ్లండ్ స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ జోస్ బట్లర్ టీ20 క్రికెట్లో మరో అరుదైన ఘనత సాధించాడు. ది హండ్రెడ్ 2026లో భాగంగా మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న బట్లర్.. ఆల్టైమ్ టీ20 పరుగుల జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ను అధిగమించి రెండో స్థానానికి చేరుకున్నాడు.ట్రెంట్ రాకెట్స్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో బట్లర్ 37 బంతుల్లో 55 పరుగులు చేశాడు. దీంతో అతడి టీ20 కెరీర్ పరుగుల సంఖ్య 14,780కి చేరింది. గేల్ 14,562 పరుగులతో మూడో స్థానానికి పడిపోయాడు.టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వెస్టిండీస్ మాజీ ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్ కొనసాగుతున్నాడు. అతడి ఖాతాలో 746 మ్యాచ్ల్లో 14,803 పరుగులు ఉన్నాయి. బట్లర్ మరో 24 పరుగులు చేస్తే టీ20 క్రికెట్లో అత్యధిక పరుగుల వీరుడిగా అవతరించి, పోలార్డ్ పేరిట ఉన్న రికార్డును తిరగరాస్తాడు.టీ20ల్లో అత్యధిక పరుగులు1. కీరన్ పొలార్డ్ – 14,8032. జోస్ బట్లర్ – 14,7803. క్రిస్ గేల్ – 14,5624. అలెక్స్ హేల్స్ – 14,4495. డేవిడ్ వార్నర్ – 14,2846. విరాట్ కోహ్లీ – 14,2187. జేమ్స్ విన్స్ – 13,7488. షోయబ్ మాలిక్ – 13,5719. క్వింటన్ డి కాక్ – 12,65410. రోహిత్ శర్మ – 12,531బాబర్ ఆజమ్ రికార్డును సమం చేసిన బట్లర్బట్లర్కు ఇదే మ్యాచ్లో మరో అరుదైన రికార్డు కూడా దక్కింది. టీ20ల్లో అతడి 50+ స్కోర్ల సంఖ్య 114కి చేరింది. దీంతో అతడు పాకిస్తాన్ స్టార్ బాబర్ ఆజమ్ రికార్డును సమం చేశాడు.ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ 128 హాఫ్ సెంచరీ+ స్కోర్లతో అగ్రస్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ 120తో రెండో స్థానంలో ఉన్నాడు. బట్లర్, బాబర్ ఆజమ్ 114 స్కోర్లతో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు.ఇదిలా ఉంటే, ట్రెంట్ రాకెట్స్తో మ్యాచ్లో బట్లర్ 55 పరుగులు చేసినప్పటికీ మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ 137/3కే పరిమితమైంది. అనంతరం ఫిన్ అలెన్ 35 బంతుల్లోనే 72 పరుగులు చేయడంతో ట్రెంట్ రాకెట్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. -
బాక్సింగ్లో డబుల్ స్వర్ణాలు.. ట్రిపుల్ జంప్లో రెండు పతకాలు
కామన్వెల్త్ గేమ్స్లో భారత మహిళా బాక్సర్ ప్రీతి పవార్ స్వర్ణం గెలిచింది. మహిళల 54 కేజీల విభాగంలో ప్రీతి పవార్ కెనడాకు చెందిన బాక్సర్ స్కార్లెట్ సవన్నాహ్పై సునాయాసంగా గెలుపొందింది. తొలి బౌట్ నుంచి ప్రీతి పవార్ ప్రత్యర్థిపై పంచ్లతో విరుచుకుపడింది. ఇక రెండో బౌట్లోనూ ప్రీతి తన ప్రత్యర్థి ముఖంపై పంచుల వర్షం కురిపించి ఆధిక్యంలో నిలిచింది. ఇక మూడో బౌట్లోనూ తనదైన శైలిలో విరుచుకుపడ్డ ప్రీతి పవార్ను న్యాయ నిర్ణేతలు యునానిమస్ విజయం సాధించినట్లు ప్రకటించారు. కాగా ఈసారి కామన్వెల్త్ గేమ్స్లో బాక్సింగ్ విభాగంలో భారత్కు ఇదే తొలి స్వర్ణ పతకం. ఇప్పటికే బాక్సింగ్ విభాగం నుంచి కనీసం 10 పతకాలు ఖాయమైన సంగతి తెలిసిందే. ప్రీతి సాధించిన స్వర్ణం భారత్కు 6వ స్వర్ణం కాగా, ఓవరాల్గా 24వ పతకం.👉ఇక మహిళల 57 కేజీల విభాగంలో జాస్మిన్ లంబోరియా కూడా స్వర్ణం కైవసం చేసుకుంది. ఫైనల్లో జాస్మిన్ ఐర్లాండ్కు చెందిన మికెలియాను చిత్తు చేసి పసిడి పతకం సాధించింది. కామన్వెల్త్లో భారత్కు ఇది ఏడో స్వర్ణం కాగా, ఓవరాల్గా 25వ పతకం. JAISMINE LAMBORIA IS BOXING 57KG COMMONWEALTH GAMES CHAMPION 🇮🇳🥇- She defeated Northern Ireland’s boxer via unanimous decision 5:0 in the FinalsTOTAL DOMINATING WIN! 🔥🔥🔥 pic.twitter.com/fgu6Nt0jCG— The Khel India (@TheKhelIndia) August 1, 2026 👉ఇక పురుషుల ట్రిపుల్ జంప్ విభాగంలో భారత అథ్లెట్లు మెరిశారు. ప్రవీణ్ చిత్రవేల్ (16.58 మీటర్ల ఎత్తు) ఎగిరి రజతం ఒడిసిపట్టగా, భారత్కే చెందిన మరో అథ్లెట్ సెల్వ ప్రభు (16.52 మీటర్ల ఎత్తు) ఎగిరి కాంస్య పతకం సాధించాడు. దీంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 27కు చేరుకుంది. ఇందులో 7 స్వర్ణాలు, 13 రజతాలు, 7 కాంస్యాలు ఉన్నాయి.SELVA PRABHU WINS THE BRONZE MEDAL FOR INDIA IN TRIPLE JUMP! 🥉- 27th Medal for India at CWG 2026 pic.twitter.com/2Y2AjToipA— The Khel India (@TheKhelIndia) August 1, 2026PRAVEEN CHITRAVEL WINS THE SILVER FOR INDIA IN TRIPLE JUMP! 🥈- 26th Medal for India at CWG 2026 pic.twitter.com/wbnXWA02DB— The Khel India (@TheKhelIndia) August 1, 2026 -
మంచి సెలక్షన్.. సుందర్ కంటే అతడు బెటర్
శ్రీలంకతో టీమిండియా టెస్టు సిరీస్ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. లంక పర్యటనలో భారత్కు కచ్చితంగా ఆఫ్ స్పిన్నర్ అవసరం ఉంటుందని.. ఈ విషయంలో సెలక్టర్లు మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించాడు.కాగా ఆగష్టు 15 నుంచి భారత్- శ్రీలంక మధ్య రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ మొదలుకానుంది. ఇందుకు గాలె, కొలంబో వేదికలు. ప్రపంచటెస్టు చాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగమైన ఈ సిరీస్లో విజయం భారత్కు అతిముఖ్యమైనది. లంకను వైట్వాష్ చేస్తేనే టీమిండియా ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి.నిఖార్సైన ఆఫ్ స్పిన్నర్ అవసరం ఈ నేపథ్యంలో ఇప్పటికే శుబ్మన్ గిల్ సారథ్యంలో టెస్టు జట్టును ఎంపిక చేసిన సెలక్టర్లు.. తొలిసారిగా 33 ఏళ్ల సారాంశ్ జైన్కు జాతీయ జట్టులో చోటిచ్చారు. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడగా.. అతడి స్థానంలో సారాంశ్ను ఎంపిక చేశారు.ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ సారాంశ్ ఎంపిక ఉత్తమమైన నిర్ణయం అని పేర్కొన్నాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘శ్రీలంక జట్టులో ప్రస్తుతం ఎడమచేతి వాటం బ్యాటర్లు ఎక్కువగానే ఉన్నారు. కాబట్టి నిఖార్సైన ఆఫ్ స్పిన్నర్ అవసరం టీమిండియాకు ఉంది.మంచి సెలక్షన్వాషింగ్టన్ సుందర్ ఫిట్గా లేడు కాబట్టి సారాంశ్ జైన్కు అవకాశం వచ్చింది. నిజానికి సుందర్ కంటే సారాంశ్ బెటర్ బౌలర్. వాషీ మెరుగ్గా బ్యాటింగ్ చేయగలడేమోగానీ.. సారాంశ్ మాత్రం అతడి కంటే బౌలింగ్లో మెరుగ్గా రాణించగలడు.సారాంశ్లో ఆ ప్రతిభ ఉంది. ఇప్పటికైనా అతడిని సెలక్టర్లు గుర్తించినందుకు సంతోషంగా ఉంది. దేశవాళీ క్రికెట్లో గత కొన్నేళ్లుగా అతడు నిలకడగా రాణిస్తున్నాడు. ముఖ్యంగా రెడ్బాల్ క్రికెట్లో అదరగొడుతున్నాడు. అతడు ఓల్డ్ స్కూల్ స్పిన్నర్.అతడి బౌలింగ్లో పెద్దగా వైవిధ్యం ఉండదు. అయితే, నిలకడగా బౌలింగ్ చేస్తూ ఒకే చోట బంతులు విసురుతూ బ్యాటర్లను తికమకపెట్టగలడు. రవిచంద్రన్ అశ్విన్, హర్భజన్ సింగ్ మాదిరి నైపుణ్యాలు అతడిలో ఉన్నాయి. కాబట్టి ఇదొక మంచి సెలక్షన్’’ అని వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు.చదవండి: గోల్డ్ మెడల్ నుంచి.. ఒక్కసారిగా ‘పాతాళానికి’! -
భారత్-శ్రీలంక సిరీస్కు సంబంధించి కీలక అప్డేట్స్
టీమిండియా శ్రీలంక పర్యటనకు సంబంధించి ఓ అప్డేట్ అందుతోంది. ఈ పర్యటనలో భారత్ ముందుగా ఓ నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్, ఆతర్వాత రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉండగా.. వార్మప్ మ్యాచ్ వ్యవధిని నాలుగు నుంచి మూడు రోజులకు తగ్గించారు. అప్డేట్ తర్వాత వార్మప్ మ్యాచ్ ఆగస్టు 7న ప్రారంభమై, ఆగస్టు 9న ముగియనుంది. ఈ మ్యాచ్ కొలంబోలోని NCC గ్రౌండ్లో జరుగనుంది. వార్మప్ మ్యాచ్ను ఒక రోజుకు కుదించడానికి గల ఖచ్చితమైన కారణం తెలియరాలేదు. ఈ మ్యాచ్కు సంబంధించి మరో కీలక విషయం ఏంటంటే, ఈ మ్యాచ్ను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది.కాగా, శుభ్మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు ఆగస్టు 4న కొలంబోకు బయలుదేరనుంది. మూడు రోజుల వార్మప్ మ్యాచ్ అనంతరం గాలేకు వెళ్లనుంది.తొలి టెస్టు ఆగస్టు 15న గాలేలో ప్రారంభం కానుంది. రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి కొలంబోలోని SSC మైదానంలో జరగనుంది. ఈ సిరీస్ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) సైకిల్లో భాగంగా జరుగనుంది.గుడ్ న్యూస్లంక సిరీస్కు ఫిట్నెస్ ఆధారంగా జట్టులోకి ఎంపికైన సాయి సుదర్శన్ కోలుకునే దిశగా ముందుకు సాగుతున్నట్లు సమాచారం. బొటనవేలికి స్వల్ప గాయం కారణంగా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పునరావాసం పొందుతున్న అతను ఇప్పటికే బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించినట్లు తెలుస్తోంది.అదేవిధంగా మోకాలి సమస్య కారణంగా షరతులతో ఎంపికైన జస్ప్రీత్ బుమ్రా కూడా పూర్తి ఫిట్నెస్ సాధించే దిశగా ఉన్నట్లు సమాచారం. సిరీస్ ప్రారంభానికి ముందే ఇద్దరూ అందుబాటులోకి వస్తారని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. -
‘మీ శకం ముగిసిందా?’.. నీరజ్ చోప్రా అదిరిపోయే రిప్లై!
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా గ్లాస్కో కామన్వెల్త్ గేమ్స్ 2026లో రజతం సాధించిన సంగతి తెలిసిందే. ప్రతికూల వాతావరణంలోనూ సీజన్ బెస్ట్ నమోదు చేసిన నీరజ్ ఈటెను 85.83 మీటర్ల దూరం విసిరి వెండి పతకాన్ని ఒడిసిపట్టాడు. ముందే ఊహించినట్లుగా ఈసారి నీరజ్కు పోటీ పాకిస్తాన్ ప్లేయర్ అర్షద్ నదీమ్ నుంచి కాకుండా శ్రీలంక అథ్లెట్ రుమేశ్ పతిరగె నుంచే ఎదురయ్యింది. ఈ పోటీలో రుమేశ్ తరంగా పతిరగె 89.75 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని సాధించగా, భారత్కు చెందిన మరో జావెలిన్ త్రోయర్ యశ్వీర్ సింగ్ తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో 85.41 మీటర్లు విసిరి కాంస్య పతకాన్ని ఒడిసిపట్టాడు. రజతం సాధించిన అనంతరం తన ప్రదర్శనపై నీరజ్ చోప్రా స్పందించాడు. గాయం పూర్తిగా నయం కాకపోవడం వల్ల మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురయ్యానని నీరజ్ తెలిపాడు. ఇదే సమయంలో ‘నీరజ్ మీలో మునుపటి జోష్ కనిపించడం లేదు.. మీ శకం ముగిసినట్లేనా?’ అనే ప్రశ్న ఎదురైంది. దీనికి నీరజ్ స్పందిస్తూ.. ‘‘మనం 100 శాతం ఫిట్గా ఉన్నప్పుడు ఎంతటి కఠినమైన సవాలునైనా ఎంతో ధైర్యంతో ఎదుర్కొంటాం. కానీ శరీరంలో గాయం ఉన్నప్పుడు ఎక్కడ అది తిరగబెడుతుందోననే భయం ప్రతి త్రోకు ముందు వెంటాడుతుంది. ఈరోజు కూడా అదే జరిగింది. అందుకే చాలా వేగంగా పరిగెత్తకుండా నా శరీరాన్ని నియంత్రణలో ఉంచుకోవడానికి ప్రయత్నించాను. పోటీ జరిగిన ప్రాంతంలో వాతావరణం చాలా చల్లగా ఉంది.Photo Credit: SAI Twitterసాధారణంగా ఇలాంటి వాతావరణంలో తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం కొంచెం కష్టమే. ఈ ఫైనల్ పోటీలో నాకు ఒక్క మంచి త్రో మాత్రమే వచ్చిందని, మిగిలిన ప్రయత్నాల్లో ఆశించిన స్థాయిలో జావెలిన్ వెళ్లలేదు. విజేతగా నిలిచిన రుమేశ్ తరంగా కూడా ఒక్క అద్భుతమైన త్రోతోనే స్వర్ణాన్ని సాధించాడన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ పునరాగమనం నాకు మంచి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. రాబోయే పోటీల్లో ఈ లోపాలను సరిదిద్దుకుని మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వడమే నా ప్రధాన లక్ష్యం’’ అని స్పష్టం చేశాడు.పదును తగ్గిందా?ఇక నీరజ్ చోప్రా ప్రదర్శనలో పదును తగ్గుతుందా అంటే సమాధానం చెప్పలేని స్థితి. ఎందుకంటే వయసు మీద పడుతుండడంతో నీరజ్లో మునుపటి జోష్ కనిపించడం లేదు. 2018 కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం గెలిచిన నీరజ్ చోప్రా 2020 టోక్యో ఒలింపిక్స్లో 87.58 మీటర్లు విసిరి స్వర్ణం సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత నీరజ్ 90 మీటర్ల మార్క్ను దాటేందుకు విఫలయత్నం చేశాడు. Photo Credit: SAI Twitterకానీ ఈ ఐదేళ్లలో నీరజ్ అంతర్జాతీయ ఈవెంట్లలో ఒక్కసారి కూడా 90 మీటర్ల మార్క్ అందుకోలేదు. చివరగా 2024 పారిస్ ఒలింపిక్స్లో ఫైనల్ ఈవెంట్లో ఈటెను 89.45 మీటర్ల దూరం విసిరి రజతం ఒడిసిపట్టాడు. అప్పుడు కూడా తృటిలో 90 మీటర్ల మార్క్ను చేజార్చుకున్నాడు. ఆ తర్వాత వెన్ను నొప్పి బారిన పడిన నీరజ్ కోలుకోలేకోపోయాడు. రీఎంట్రీ తర్వాత నీరజ్లో మునుపటి పదును తగ్గిందనే చెప్పొచ్చు.2025 వరల్డ్ చాంపియన్షిప్లో ఈటెను 84.03 మీటర్ల దూరం విసిరిన నీరజ్ 8వ స్థానంలో నిలిచి నిరాశపరిచాడు. తాజాగా గ్లాస్కో కామన్వెల్త్ గేమ్స్లో రజతం గెలిచినప్పటికీ ఈటెను వేసిన దూరం లెక్కిస్తే ఇది నీరజ్ స్థాయికి సరిపోని ప్రదర్శనగా పరిగణించవచ్చు. ప్రస్తుతం నీరజ్ 28 ఏళ్ల వయసు ఉండడం, ఒలింపిక్స్కు మరో రెండేళ్ల సమయం ఉండడంతో తన ప్రదర్శనను మెరుగుపరుచుకోవాలని ఆశిద్దాం. What a soaring throw by Neeraj Chopra!Heartiest congratulations on winning the Silver medal in the Men's Javelin Throw event at the Commonwealth Games 2026. His relentless pursuit of excellence, competitive spirit and ability to deliver on the biggest stages continue to inspire… pic.twitter.com/FzJRAJbAt0— Anurag Thakur (@ianuragthakur) August 1, 2026 Glasgow, Scotland: On winning the silver medal in the men's javelin throw at the Commonwealth Games 2026, Neeraj Chopra says, "I am very happy. Even when I am dealing with injuries, it feels good to see other Indian javelin throwers performing well. Yash Vir has crossed the… pic.twitter.com/SP5CNfoeax— IANS (@ians_india) July 31, 2026Read: మెడ విరిగినా వెనక్కి తగ్గలేదు.. ఒలింపిక్ గోల్డ్ను ముద్దాడాడు! -
గోల్డ్ మెడల్స్ నుంచి.. ఒక్కసారిగా ‘పాతాళానికి’!
పాకిస్తాన్ స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్స్ పసిడి పతక విజేత అర్షద్ నదీమ్కు కామన్వెల్త్ క్రీడలు-2026 చేదు అనుభవాన్ని మిగిల్చాయి. గత ఎడిషన్లో స్వర్ణ పతకం గెలిచిన అతడు.. ఈసారి ఫైనల్ ఈవెంట్లో కనీసం చివరి మూడు అవకాశాలు ఉపయోగించుకోలేని దుస్థితిలో నిలిచాడు.ఫైనల్కు చేరినా....కాగా కామన్వెల్త్ క్రీడల తాజా ఎడిషన్లో గురువారం జావెలిన్ త్రో క్వాలిఫయింగ్ రౌండ్ నిర్వహించారు. ఇందులో పద్దెనిమిది మంది పాల్గొనగా అత్యుత్తమంగా ఈటెను ఎక్కువ దూరం విసిరిన టాప్-12 మంది ఫైనల్కు అర్హత సాధించారు. శ్రీలంకకు చెందిన రుమేశ్ తరంగ పతిరగే అగ్రస్థానం సంపాదించగా.. భారత అథ్లెట్లు నీరజ్ చోప్రా, రోహిత్ యాదవ్, యశ్వీర్ సింగ్ వరుసగా ఐదు, తొమ్మిది, పదో స్థానాల్లో నిలిచారు.ఫౌల్తో మొదలు.. ఇక అర్షద్ నదీమ్ టాప్-7లో చోటు సంపాదించి ఫైనల్లో అడుగుపెట్టాడు. ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన ఫైనల్ ఈవెంట్లో అర్షద్కు చేదు అనుభవం ఎదురైంది. తొలి మూడు త్రోలలో భాగంగా అతడు ఫౌల్తో ఈవెంట్ మొదలుపెట్టాడు.ఇక రెండో ప్రయత్నంలో 77.41 మీటర్ల దూరం ఈటెను విసిరిన అర్షద్.. మూడో ప్రయత్నంలో 75.39 మీటర్లు మాత్రమే విసిరాడు. దీంతో టేబుల్లో అతడు తొమ్మిదో స్థానానికి పరిమితమయ్యాడు. నిబంధనల ప్రకారం.. ఫైనల్కు వచ్చిన టాప్-12లోని అథ్లెట్ల తొలి మూడు త్రోల ఆధారంగా.. చివరి నాలుగు స్థానాల్లో నిలిచిన జావెలిన్ త్రోయర్లు ఎలిమినేట్ అవుతారు.ఎలిమినేట్...దీంతో తొమ్మిదో స్థానంలో నిలిచిన అర్షద్ నదీమ్ ఎలిమినేట్ అయిపోయాడు. దీంతో పతక వేటలో భాగంగా చివరి మూడు ప్రయత్నాలు చేయకుండానే అతడు వెనుదిరగాల్సి వచ్చింది. కాగా 2022 కామన్వెల్త్ గేమ్స్లో అర్షద్ నదీమ్ స్వర్ణం గెలిచాడు. నాడు అతడు ఈటెను 85.28 మీటర్ల దూరం విసిరాడు.ఇక పారిస్ ఒలింపిక్స్లో అత్యుత్తమంగా రికార్డు స్థాయిలో 92.97 మీటర్ల దూరం ఈటెను విసిరి పసిడి పతకం గెలుచుకున్నాడు అర్షద్ నదీమ్. దీంతో అతడి పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది. అయితే, ఆ తర్వాత అర్షద్ స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిలపడ్డాడు. టోక్యోలో వరల్డ్కప్ చాంపియన్షిప్స్ మెడల్ ఈవెంట్లో అత్యుత్తమంగా 82.75 మీటర్లు ఈటెను విసిరిన అర్షద్ నదీమ్.. ఆ తర్వాత కనీసం 80 మీటర్ల మార్కు దాటలేకపోయాడు.Champions know. 💫 The javelin was still in the air. The message was already clear. 🔥Neeraj Chopra's second throw travelled 85.83m, his season's best. 🤩Watch the Commonwealth Games Glasgow 2026 LIVE & EXCLUSIVE on Sony Sports Network TV channels & Sony LIV.… pic.twitter.com/OZpCUfPVFA— Sony Sports Network (@SonySportsNetwk) July 31, 2026భారత్కు రెండు పతకాలుకామన్వెల్త్ క్రీడలు-2026 జావెలిన్ త్రో విభాగంలో శ్రీలంక స్టార్ రుమేశ్ పతిరగే 89.75 మీటర్ల దూరం ఈటెను విసిరి స్వర్ణం గెలిచాడు. ఇక టోక్యో ఒలింపిక్స్ పసిడి పతక విజేత, భారత స్టార్ జావెలిన్త్రోయర్ నీరజ్ చోప్రా 85.3 మీటర్ల దూరం విసిరి రజతంతో సరిపెట్టుకున్నాడు. భారత్కే చెందిన యశ్వీర్ 85.41 మీటర్ల దూరం ఈటెను విసిరి కాంస్యం దక్కించుకున్నాడు. మొత్తానికి ఈ విభాగంలో మూడు పతకాలు సౌత్ ఆసియా ప్లేయర్లకే దక్కడం విశేషం. Bronze unlocked! 🔥𝐏𝐨𝐝𝐢𝐮𝐦 𝐰𝐨𝐫𝐭𝐡𝐲 𝐭𝐡𝐫𝐨𝐰! 🚀Despite the challenging conditions, Yash Vir Singh unleashed a personal best of 85.41m to win bronze! 🥉Watch the Commonwealth Games Glasgow 2026 LIVE & EXCLUSIVE on Sony Sports Network TV channels & Sony LIV.… pic.twitter.com/Y1zmDC50iV— Sony Sports Network (@SonySportsNetwk) July 31, 2026 -
రాజా రిత్విక్కు కాంస్యం
ప్రపంచ స్క్వాష్ జూనియర్ చాంపియన్షిప్లో భారత పురుషుల జట్టుకు కాంస్య పతకం లభించింది. అమెరికా జట్టుతో జరిగిన సెమీఫైనల్లో భారత్ 0–2తో ఓడిపోయింది. తొలి మ్యాచ్లో గుర్వీర్ సింగ్ 7–11, 12–10, 9–11, 7–11తో బ్రెండన్ టాగ్లియారిని చేతిలో.... రెండో మ్యాచ్లో ఆర్యవీర్ దివాన్ 5–11, 7–11, 5–11తో యాసీన్ షలాబీ చేతిలో ఓటమి పాలయ్యారు. గత ప్రపంచ చాంపియన్షిప్లోనూ భారత పురుషుల జట్టు సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాన్ని సాధించింది. రిత్విక్ కాంస్యం సాక్షి, హైదరాబాద్: పొంటెవెడ్రా అంతర్జాతీయ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్మాస్టర్ రాజా రిత్విక్ కాంస్య పతకం సాధించాడు. స్పెయిన్లో జరిగిన ఈ టోర్నీలో రాజా రిత్విక్ నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత ఏడు పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. 92 మంది ప్లేయర్లు పోటీపడ్డ ఈ టోర్నీలో రిత్విక్ ఐదు గేముల్లో గెలిచి, నాలుగు గేమ్లను ‘డ్రా’ చేసుకున్నాడు.రిత్విక్తోపాటు రోడ్రిగెజ్ హెర్నాండెజ్ డేనియల్ (క్యూబా), ముత్తయ్య (భారత్) ఏడు పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ముత్తయ్యకు టైటిల్ లభించగా... డేనియల్కు రెండో స్థానం, రిత్విక్కు మూడో స్థానం ఖరారయ్యాయి. -
వన్డే ప్రపంచకప్ టోర్నీకి భారత జట్టు ఇదే..? భువనేశ్వర్కు ఛాన్స్?
టీమిండియాలోకి వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తిరిగి తీసుకోవాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ఈ జాబితాలో భారత మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ చేరాడు. వన్డే ప్రపంచకప్-2027 టోర్నీకి తను ఎంపిక చేసిన భారత జట్టులో భవీకి కార్తీక్కు చోటిచ్చాడు.అంతకుముందు రవిచంద్రన్ అశ్విన్ కూడా తన వరల్డ్కప్ జట్టులో భువనేశ్వర్కు అవకాశమిచ్చాడు. కాగా భువనేశ్వర్ గత నాలుగేళ్లగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ రైట్ ఆర్మ్ పేసర్ ప్రస్తుతం ఐపీఎల్తో పాటు దేశవాళీ టీ20 క్రికెట్ లీగ్స్లో మాత్రమే ఆడుతున్నాడు.అయితే భువీలో ఏ మాత్రం జోరు తగ్గలేదు. ఈ క్రమంలోనే అతడిని జట్టులోకి తీసుకోవాలని సెలక్టర్లను సూచిస్తున్నారు. కాగా దినేష్ కార్తీక్ తను ఎంపిక జట్టులో భువీతో పాటు మరో సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి ఛాన్స్ ఇచ్చాడు. షమీ కూడా ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తర్వాత జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు.ఇక డికే జట్టులో ఓపెనర్లగా శుబ్మన్ గిల్, రోహిత్ శర్మలు ఉన్నారు. బ్యాకప్ ఓపెనర్గా యశస్వి జైశ్వాల్కు చోటు కల్పించాడు. విరాట్ కోహ్లి, కుల్దీప్ యాదవ్, బుమ్రా వంటి సీనియర్ ప్లేయర్లు ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి వంటి యువ ఆటగాళ్లను కార్తీక్ ఎంపిక చేశాడు. అయితే తను సెలక్ట్ చేసిన జట్టులో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్కు చోటు దక్కకపోవడం గమనార్హం.కార్తీక్ డ్రీమ్ టీమిండియా ఇదేశుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ -
CWG 2026: ఇవాళ భారత్కు పతకాల పంట
గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో శనివారం (ఆగస్ట్ 1) భారత్కు అత్యంత కీలకమైన రోజు కానుంది. ఈ ఎడిషన్లో ఇప్పటికే 23 పతకాలు (5 స్వర్ణాలు, 12 రజతాలు, 6 కాంస్యాలు) సొంతం చేసుకున్న భారత్.. ఇవాళ మరిన్ని అద్భుత ప్రదర్శనలు చేస్తే మరో 25 పతకాలు ఖాతాలో చేరే అవకాశం ఉంది.బాక్సింగ్లో 10 పతకాలు ఖాయంభారత్కు అత్యధిక పతక అవకాశాలు బాక్సింగ్లో ఉన్నాయి. ఇప్పటికే 10 మంది భారత బాక్సర్లు సెమీఫైనల్స్ దాటి ఫైనల్కు చేరుకోవడంతో 10 పతకాలు ఖాయమయ్యాయి. వీరిలో ప్రీతి, జాస్మిన్, జడుమణి సింగ్, సాక్షి, ప్రియా, అరుంధతి చౌదరి, లవ్లీనా బోర్గోహైన్, సచిన్, అంకుష్ పాంగల్, నరేందర్ ఉన్నారు.వీరంతా ఫైనల్స్లో విజయం సాధిస్తే భారత్కు బాక్సింగ్లోనే 10 స్వర్ణ పతకాలు వచ్చే అవకాశం ఉంది.అథ్లెటిక్స్లో 8 పతకాలపై కన్నుఅథ్లెటిక్స్లోనూ భారత్కు భారీ అవకాశాలున్నాయి. పురుషుల ట్రిపుల్ జంప్ ఫైనల్లో ప్రవీణ్ చిత్రవేల్, సెల్వ ప్రభు తిరుమారన్, మహిళల 10,000 మీటర్ల రేస్ వాక్లో ప్రియాంక గోస్వామి, రవీనా గాయక్వాడ్, పురుషుల పోల్ వాల్ట్లో దేవ్ కుమార్ మీనా, కుల్దీప్ కుమార్ బరిలోకి దిగనున్నారు.అలాగే పురుషుల 5000 మీటర్ల ఫైనల్లో గుల్వీర్ సింగ్, మిక్స్డ్ 4x400 మీటర్ల రిలేలో భారత జట్టు పతకం కోసం పోటీ పడనుంది.పారా అథ్లెటిక్స్లో 3 అవకాశాలుపురుషుల షాట్పుట్ F57 ఫైనల్లో సోమన్ రాణా, శుభమ్ జుయాల్, పురుషుల 1500 మీటర్ల T54 ఫైనల్లో రమేశ్ షణ్ముగం పతకాల కోసం పోటీ పడనున్నారు.జూడోలో మరో 4 అవకాశాలుజూడోలో ఉన్నతి శర్మ, కరణ్జిత్ సింగ్ మాన్, హర్ష్ తోకస్, ఇనుంగన్బి తఖెల్లంబమ్ తమ తమ విభాగాల్లో ముందడుగు వేస్తే భారత్ పతకాల సంఖ్య మరింత పెరగనుంది.ఇవాళ భారత్ పతకాల అంచనా* బాక్సింగ్: 10* అథ్లెటిక్స్: 8* పారా అథ్లెటిక్స్: 3* జూడో: 4కాగా, ప్రస్తుతం పతకాల పట్టికలో 10వ స్థానంలో ఉన్న భారత్.. ఇవాల్టి ప్రదర్శనల తర్వాత ఒక్కసారి భారీ జంప్ కొట్టే అవకాశం ఉంది. ఒకవేళ స్వర్ణాలు ఎక్కువ సాధిస్తే.. ఆస్ట్రేలియా (128), ఇంగ్లండ్ (80), కెనడా (53) తర్వాత నాలుగో స్థానానికి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. -
సీనియర్లు ఉండగా ఇదేం పద్ధతి?: భారత మాజీ క్రికెటర్ ఫైర్
ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్గా వైభవ్ సూర్యవంశీని నియమించడంపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే ఈ విషయంలో సెలక్టర్ల నిర్ణయాన్ని తప్పుబట్టగా.. తాజాగా భారత మాజీ క్రికెటర్ దీప్ దాస్ గుప్తా సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. రెడ్బాల్ క్రికెట్లో అనుభవం లేని ఆటగాడిని ఏకంగా వైస్ కెప్టెన్ను చేయడం ఏమిటని ప్రశ్నించాడు.అనుభవం తక్కువకాగా దేశవాళీ ప్రతిష్టాత్మక దులిప్ ట్రోఫీ తాజా ఎడిషన్లో ఈస్ట్ జోన్ జట్టుకు కెప్టెన్గా టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ ఎంపిక కాగా.. అతడి డిప్యూటీగా పదిహేనేళ్ల వైభవ్కు అవకాశం దక్కింది. ఇక ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టినప్పటికీ ఈ బిహారీ పిల్లాడు రెడ్బాల్ క్రికెట్లో మాత్రం ఇప్పటికి కేవలం 8 మ్యాచ్లు ఆడి 207 పరుగులు చేశాడు.ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీకి ఏకంగా వైస్ కెప్టెన్గా ప్రమోషన్ ఇవ్వడంపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ విషయం గురించి భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దీప్ దాస్ గుప్తా సైతం సెలక్టర్ల నిర్ణయంపై పెదవి విరిచాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ..సీనియర్లు ఉండగా ఇదేం పద్ధతి?‘‘వైభవ్ను వైస్ కెప్టెన్గా నియమించడాన్ని నేను అస్సలు సమర్థించను. అనుకూల్ రాయ్ వంటి సీనియర్ ప్లేయర్లు ఎంతో మంది జట్టులో ఉన్నారు. చాలా ఏళ్లుగా వాళ్లంతా రెడ్బాల్ క్రికెట్లో సేవలు అందిస్తున్నారు. అలాంటి వాళ్లకి నాయకత్వ బృందంలో చోటివ్వాలి.15, 16 ఏళ్ల వయసుకే వైభవ్ సూర్యవంశీ క్రికెటర్గా పరిణతి సాధించాడని నేను ఒప్పుకొంటాను. అతడి ప్రతిభ విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. అయితే, రెడ్బాల్ క్రికెట్లో పూర్తిగా ఆడకముందే అతడికి వైస్ కెప్టెన్గా బాధ్యత ఇవ్వడం సరికాదు.అతడు ఇప్పుడిప్పుడే ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. వైస్ కెప్టెన్ స్థాయికి తగ్గ గణాంకాలు కూడా ప్రస్తుతం అతడి ఖాతాలో లేవు. ముందు అతడిని ఆడనివ్వండి. తనను తాను నిరూపించుకోనివ్వండి’’ అని దీప్ దాస్ గుప్తా సెలక్టర్లకు హితవు పలికాడు.మా నిర్ణయం సరైందేఇదిలా ఉంటే.. ఈస్ట్ జోన్ సెలక్టర్ ప్రవంజన్ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్న సంగతి తెలిసిందే. వైభవ్ సూర్యవంశీ ఏదో ఒకరోజు టీమిండియా కెప్టెన్ స్థాయికి ఎదుగుతాడని.. అన్నీ తెలిసే తాము అతడిని ఇప్పుడు వైస్ కెప్టెన్ని చేశామని పేర్కొన్నాడు. దులిప్ ట్రోఫీలో ప్రదర్శన ఆధారంగా వైభవ్ భారత టెస్టు జట్టుకు ఎంపికయ్యే అవకాశం ఉందన్నాడు.చదవండి: ఇంగ్లండ్ గడ్డ మీద ఇరగదీస్తున్న కుల్దీప్ యాదవ్ -
కబడ్డీ ప్లేయర్ భార్య అనుమానాస్పద మృతి
హర్యానాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కబడ్డీ ఆటగాడు షీలూ బల్హారా భార్య, 23 ఏళ్ల ముస్కాన్ శుక్రవారం మధ్యాహ్నం రోహ్తక్ జిల్లాలోని వారి నివాసంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.రోహ్తక్లోని మెహమ్ ప్రాంతానికి చెందిన ముస్కాన్ 2023 డిసెంబర్లో షీలూను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు గతేడాది నవంబర్లో హార్దిక్ అనే కుమారుడు జన్మించాడు.ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ బృందాన్ని కూడా రంగంలోకి దించి ఆధారాలను సేకరించారు. ముస్కాన్ ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.పోలీసుల విచారణలో భాగంగా ముస్కాన్ సోషల్ మీడియా కార్యకలాపాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఘటనకు ఒక్కరోజు ముందు ఆమె పంజాబీ పాటకు సంబంధించిన రీల్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి.ముస్కాన్ మృతికి సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కారణం నిర్ధారించేందుకు కుటుంబ సభ్యుల వాంగ్మూలాలతో పాటు ఇతర ఆధారాలను కూడా పరిశీలిస్తున్నారు.షీలూ బల్హారా కెరీర్ విషయానికొస్తే.. షీలూకు హర్యానాలో స్టార్ కబడ్డీ ప్లేయర్గా పేరుంది. డిఫెన్స్లో ‘క్యాచర్’గా అతడు మంచి గుర్తింపు కలిగి ఉన్నాడు. ఈ ఏడాది అతడిని ఓ స్థానిక టోర్నీలో “India’s leading catchers”లో ఒకరిగా ప్రముఖులు పేర్కొన్నారు. -
ఇంగ్లండ్ గడ్డపై చెలరేగిపోతున్న ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్
ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్రౌండర్ ఆశుతోష్ శర్మ ఇంగ్లండ్ గడ్డపై అదరగొడుతున్నాడు. అక్కడి వన్డే కప్లో హ్యాంప్షైర్కు ప్రాతినిథ్యం వహిస్తూ, 4 మ్యాచ్ల్లో 13 వికెట్లు పడగొట్టాడు. భారత్లో భారీ హిట్టర్గా పేరున్న అశుతోష్, ఇంగ్లండ్లోని వైవిధ్యభరితమైన పిచ్లపై తన మీడియం పేస్ బౌలింగ్లో చెలరేగడం గమనార్హం.తాజాగా అతడు ఎసెక్స్తో జరిగిన మ్యాచ్లో ఏకంగా 5 వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటి తన జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. దీనికి ముందు మ్యాచ్లో ఓ వికెట్ తీసిన అశుతోష్ అంతకుముందు మ్యాచ్లో 4 వికెట్లు, దానికి ముందు మ్యాచ్లో 3 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనలతో అశుతోష్ ఈ సీజన్లో హ్యాంప్షైర్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.అయితే ఈ టోర్నీలో అశుతోష్ బ్యాటింగ్లో మాత్రం తేలిపోతున్నాడు. 4 మ్యాచ్ల్లో కేవలం 37 పరుగులే చేశాడు. భారీ హిట్టింగ్ చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ, ఒకటి రెండు మెరుపులతో సరిపెట్టాడు. ఈ టోర్నీలో అశుతోష్ స్కోర్లు వరుసగా 10, 0, 11, 16 పరుగులుగా ఉన్నాయి.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. అశుతోష్ బౌలింగ్లో ఇరగదీయడంతో ఎసెక్స్పై హ్యాంప్షైర్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎసెక్స్ 50 ఓవర్లలో 317 పరుగులు చేసింది. నోవా థైన్ శతకం (109)తో మెరిశాడు.318 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హాంప్షైర్ 47.4 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నిక్ గుబిన్స్ (53), టామ్ ప్రెస్ట్ (51), జేమ్స్ ఫుల్లర్ (నాటౌట్ 58) అర్ధశతకాలతో జట్టుకు విజయాన్ని అందించారు. కాగా, ఇంగ్లండ్ వన్డే కప్లో అశుతోష్తో పాటు మరో భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ కూడా సత్తా చాటుతున్నాడు. కుల్దీప్ సైతం ఆడిన ప్రతి మ్యాచ్లో కనీసం 2 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేసి, తన జట్టు (యార్క్షైర్) విజయాల్లో ప్రధానపాత్ర పోషిస్తున్నాడు. -
ఫిన్ అలెన్ విధ్వంసం.. కేవలం 35 బంతుల్లోనే
ది హండ్రెడ్ మెన్స్ కాంపిటేషన్-2026లో ట్రెంట్ రాకెట్స్ హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. శుక్రవారం ఓల్డ్ట్రాఫర్డ్ వేదికగా మాంచెస్టర్ సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ట్రెంట్ రాకెట్స్ 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ జెయిట్స్ నిర్ధేశిత 100 బంతుల్లో 3 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేయగలిగింది. మాంచెస్టర్ బ్యాటర్లలో జోస్ బట్లర్(55), లీస్ డుప్లే(40) రాణించారు. రాకెట్స్ బౌలర్లలో క్రెయిగ్ ఓవర్టన్ ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టాడు.అలెన్ విధ్వంసంఅనంతరం 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాకెట్స్కు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ బెన్ డకెట్, ఫస్ట్ డౌన్ బ్యాటర్ టామ్ బాంటన్ వికెట్లను వరుస ఓవర్లలో ట్రెంట్ రాకెట్స్ కోల్పోయింది. ఈ సమయంలో మరో ఓపెనర్, న్యూజిలాండ్ పవర్ హిట్టర్ ఫిల్ అలెన్ విధ్వంసం సృష్టించాడు. అలెన్ కేవలం 35 బంతుల్లోనే 11 ఫోర్లు, 2 సిక్స్లతో 72 పరుగులు చేశాడు. ఫలితంగా ఈ లక్ష్యాన్ని ట్రెంట్ రాకెట్స్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 87 బంతుల్లోనే చేధించింది. మాంచెస్టర్ బౌలర్లలో గాస్ అట్కిన్సన్, సోనీ బాకర్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో రాకెట్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి చేరుకుంది. -
ఆ ఫీలింగ్ 5 నిమిషాలే.. ఆ తర్వాత: హార్దిక్ పాండ్యా
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ఆటకు దూరంగా ఉన్నాడు. గాయం నుంచి కోలుకుంటున్న అతడు ప్రస్తుతం జాతీయ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు. ఫిట్నెస్ సాధించే క్రమంలో ఈ ముంబైకర్ మకాంను పూర్తిగా బెంగళూరుకు మార్చేశాడు.హోదా, పేరు కోసం ఆడనుఈ నేపథ్యంలో తాజాగా ఎస్జీటీవీతో మాట్లాడిన హార్దిక్ పాండ్యా టీమిండియా కెప్టెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘జట్టుకు నాయకుడిగా ఉండాలని చెప్పినపుడు నేను ఏమాత్రం సంకోచించలేదు. నాపై నాకు పూర్తి నమ్మకం ఉంది. సారథిగా హోదా, పేరు కోసం నేను ఆడను.జట్టు కోసం మాత్రమే ఆడతాను. ఒక నాయకుడిగా నేనెంత శక్తిమంతుడనో నాకు తెలుసు. కాబట్టి కెప్టెన్సీ అనేది పెద్ద విషయం కాదు. నాయకుడిని కాకపోయినా జట్టులోని మిగిలిన సభ్యులు నా మాట వినేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారు.కాబట్టి ప్రతీసారి మనకి కెప్టెన్ హోదా అనేది అవసరం లేదు. ఏదేమైనా జాతీయ జట్టుకు సారథ్యం వహించడం అదృష్టం. గొప్ప గౌరవం. ప్రతీ ఆటగాడు టీమిండియాకు ఆడటం మొదలుపెట్టిన నాటి నుంచే ఏదో ఒకరోజు కెప్టెన్ కావాలనే కల కంటాడు.ఆ అనుభూతి ఐదు నిమిషాలు మాత్రమేనిజంగానే టీమిండియా సారథిగా వ్యవహరించడం గొప్ప విషయం. అయితే, ఆ అనుభూతి ఐదు నిమిషాలు మాత్రమే. ఆతర్వాత జట్టు కోసం ఆటగాడిగానూ మనం చేయగలమన్న విషయంపైనే మనసు కేంద్రీకృతమై ఉంటుంది.అయితే, ఆ ఐదు నిమిషాల ఫీలింగ్ను వర్ణించడానికి మాటలు సరిపోవు. కానీ ఎప్పుడు పదవి మన చేజారిపోతుందో తెలియదు. కాబట్టి దానిపై పెద్దగా ఆశలు పెట్టుకోకూడదు’’ అని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు.కాగా 2022లో హార్దిక్ పాండ్యా ఐర్లాండ్లో తొలిసారి టీమిండియా కెప్టెన్గా వ్యవహరించాడు. మొత్తంగా 19 మ్యాచ్లలకు అతడు సారథ్యం వహించాడు. హార్దిక్ కెప్టెన్సీలో 16 టీ20 మ్యాచ్లలో పది గెలిచిన భారత్.. ఐదింట ఓడిపోయింది. ఒక మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసిపోయింది.హార్దిక్కు బదులు సూర్యకు..తద్వారా హార్దిక్ టీ20లలో 62 శాతం విజయాలు సాధించిన టీమిండియా సారథిగా నిలిచాడు. ఇక హార్దిక్ పాండ్యా నేతృత్వంలో మూడు వన్డేలు ఆడిన టీమిండియా రెండు గెలిచింది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియాను చాంపియన్గా నిలిపిన తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు గుడ్బై చెప్పాడు.ఈ క్రమంలో హార్దిక్కే పగ్గాలు అప్పగిస్తారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా రోహిత్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ను టీ20 కెప్టెన్గా నియమించింది యాజమాన్యం. అరుదైన పేస్ బౌలింగ్ నైపుణ్యాలున్న హార్దిక్ పాండ్యాపై అదనంగా కెప్టెన్సీ భారం పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ అప్పట్లో తెలిపాడు.జట్టులో స్థానమే లేదుఇక 2026లో భారత్ను టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిపాడు సూర్యకుమార్ యాదవ్. అయితే, ఆ వెంటనే అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించడంతో పాటు.. జట్టులోనే చోటు లేకుండా చేశారు సెలక్టర్లు. ఈ పరిణామాల నేపథ్యంలో హార్దిక్ పాండ్యా తాజా వ్యాఖ్యలు వైరల్గా మారాయి.చదవండి: ఇంగ్లండ్ గడ్డ మీద ఇరగదీస్తున్న కుల్దీప్ యాదవ్ -
పాక్ కెప్టెన్ను హత్తుకున్న టీమిండియా స్టార్! వీడియో వైరల్
హండ్రెడ్ వుమెన్స్ కాంపిటీషన్ 2026లో సదరన్ బ్రేవ్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్లలోనూ విజయం సాధించిన సదరన్ బ్రేవ్.. టేబుల్ టాపర్గా కొనసాగుతోంది.అయితే సదరన్ బ్రేవ్ వరుస విజయాల్లో భారత స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ది కీలక పాత్ర. గురువారం బర్మింగ్హమ్ ఫోనిక్స్తో జరిగిన మ్యాచ్లోనూ రోడ్రిగ్స్ సత్తాచాటింది.వివాదంలో రోడ్రిగ్స్అయితే అద్భుతమైన ప్రదర్శనలతో దూసుకుపోతున్న రోడ్రిగ్స్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది. ఇదే టోర్నీలో పాకిస్తాన్ మహిళల జట్టు కెప్టెన్ ఫాతిమా సన కూడా ఆడుతోంది. ఆమె బర్మింగ్హమ్ ఫోనిక్స్ ప్రాతినిథ్యం వహిస్తోంది. ఈ క్రమంలో సదరన్ బ్రేవ్, బర్మింగ్హమ్ ఫోనిక్స్ మ్యాచ్ ముగిసిన అనంతరం జెమీమా, ఫాతిమా సన ఒకరినొకరు అలింగనం చేసుకుని ముచ్చటించుకున్నారు. కాగా 2025 పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్లతో భారత క్రికెటర్లు షేక్ హ్యాండ్స్ ఇవ్వడం మానేశారు. ఆసియాకప్తో పాటు మెన్స్, ఉమెన్స్ వరల్డ్కప్లలోనూ అదే ఫాలో అయ్యారు. కానీ ఇప్పుడు ఫాతిమా సనాను జెమీమా హత్తు కోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో ఎక్స్ వేదికగా జెమీమాపై భారత అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అందరూ షేక్ హ్యాండ్ ఇస్తుంటే సనాను అలింగనం చేసుకోవాల్సిన అవసరం ఏముందని పోస్ట్లు పెడుతున్నారు. మరికొంత మంది ఆమె అక్కడ భారత్ తరపున ఆడడం లేదని, అందుకే అలా చేసిందని సపోర్ట్గా నిలుస్తున్నారు.చదవండి: ఇంగ్లండ్ గడ్డపై ఇరగదీస్తున్న కుల్దీప్ యాదవ్Everyone debating if Fatima Sana and jemimah Rodrigues would shake hands and they straight up HUGGED?!😭😭🙏 Keep politics out of sports FOREVER. pic.twitter.com/XCE2lswGlg— A. (@anhnjo) July 30, 2026 -
కెప్టెన్సీకి గుడ్బై.. ఇక ఆటగాడిగానే కొనసాగుతా!
నెదర్లాండ్స్ పురుషుల క్రికెట్ జట్టు కెప్టెన్ పదవి నుంచి స్కాట్ ఎడ్వర్డ్స్ తప్పుకొన్నాడు. ఆటగాడిగా జట్టుకు విశేష సేవలు అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఇందుకు సంబంధించి నెదర్లాండ్స్ క్రికెట్ శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.విజయవంతమైన సారథికాగా 2018లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన స్కాట్ ఎడ్వర్డ్స్.. 2022 జూన్లో కెప్టెన్గా నియమితుడయ్యాడు. ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా డచ్ జట్టు సారథిగా పీటర్ సీలర్ స్థానాన్ని భర్తీ చేశాడు. ఎడ్వర్డ్స్ తన కెరీర్లో 56 వన్డేలకు కెప్టెన్గా వ్యవహరించగా.. ఇందులో నెదర్లాండ్స్ 24 మ్యాచ్లు గెలిచి.. 29 ఓడిపోయింది.ఇక అంతర్జాతీయ కెరీర్లో మొత్తంగా ఇప్పటికి 74 వన్డేలు, 86 టీ20 మ్యాచ్లు ఆడిన స్కాట్ ఎడ్వర్డ్స్.. వన్డేల్లో 2391, టీ20లలో 1316 పరుగులు సాధించాడు. ఈ 29 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాటర్ ఖాతాలో వన్డేల్లో 24, టీ20లలో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి.అందుకే ఈ నిర్ణయంఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ లీగ్-2 మధ్యలోనే కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నట్లు స్కాట్ ఎడ్వర్డ్స్ ప్రకటించాడు. ఈ విషయం గురించి సహచర సభ్యులతో మాట్లాడుతూ.. ‘‘అకస్మాత్తుగా మీకు ఈ విషయం చెబుతున్నందుకు క్షమించండి. ఈ క్షణం నుంచి నేను కెప్టెన్గా వైదొలుగుతున్నాను.ఆటగాడిగా జట్టుకు మరింత ఉపయోగపడటమే నా లక్ష్యం. అందుకే ఈ నిర్ణయం. ఈ బృందం ప్రత్యేకం. గత నాలుగేళ్లలో మీరు అందించిన సహకారం మరువలేనిది. జాతీయ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించడం నాకు దక్కిన అతిపెద్ద గౌరవం’’ అని స్కాట్ ఎడ్వర్డ్స్ ఉద్వేగానికి లోనయ్యాడు. ఇదిలా ఉంటే.. నెదర్లాండ్స్ జట్టు కొత్త కెప్టెన్గా 26 ఏళ్ల ఆల్రౌండర్ బాస్ డీ లీడే ఎంపికయ్యాడు.చదవండి: ఇంగ్లండ్ గడ్డ మీద ఇరగదీస్తున్న కుల్దీప్ యాదవ్ -
Asmita Dey: సైకిల్ మెకానిక్ కూతురి నుంచి.. బంగారు పతకం వరకు
ఒక వైపు కటిక పేదరికం.. మరోవైపు దేశం గర్వించదగ్గ అథ్లెట్గా ఎదగాలన్న కల. ఈ కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఏమాత్రం ఆమె పట్టుదలను సడలించలేకపోయాయి. ఆ కష్టాలనే సాధనాలుగా మార్చుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. సైకిల్ మెకానిక్ కూతురిగా సాధారణ కుటుంబంలో జన్మించిన ఆ అమ్మాయి.. ఈ రోజు ప్రతిష్టాత్మక కామన్మెల్త్ గేమ్స్లో భారత జెండాను రెపరెపలాడించింది. ఆమే 23 ఏళ్ల జూడో సంచలనం అస్మితా డే.గ్లాస్కో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో అస్మితా బంగారు పతకంతో మెరిసింది. జూడో మహిళల 48 కేజీల విభాగంలో ఆమె ఈ గోల్డ్మెడల్ కైవసం చేసుకుంది. దీంతో మహిళల విభాగంలో భారత్కు తొలి కామన్వెల్త్ స్వర్ణం అందించిన జూడోకాగా అస్మిత చరిత్ర పుటలకెక్కింది.ఉత్కంఠ పోరులో విజయంకెనడాకు చెందిన హెయిడీ క్వాచ్తో జరిగిన ఈ ఫైనల్ పోరు అభిమానులను ఆఖరి వరకు మునివేళ్లపై నిలబెట్టింది. మ్యాచ్ ప్రారంభంలోనే అస్మిత 'యుకో' పాయింట్తో పాటు ఒక పెనాల్టీని ఎదుర్కొని వెనుకబడింది. ఆ తర్వాత అస్మిత అద్భుతమైన పునరాగమనం ఇచ్చింది.అస్మిత ఏ మాత్రం ఒత్తిడికి గురికాకుండా ప్రత్యర్ధికి గట్టిగా బదులిచ్చింది. దీంతో ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి స్కోర్ను 1-1తో సమం చేసింది. అనంతరం నిర్ణీత 4 నిమిషాల సమయం ముగిసేసరికి ఇద్దరూ సమంగా నిలవడంతో మ్యాచ్ 'గోల్డెన్ స్కోర్'కు దారితీసింది. విజేతను నిర్ణయించే ఈ రౌండ్లో అస్మిత అద్భుతం చేసింది. ఏ మాత్రం ఏకాగ్రతను కోల్పోకుండా వ్యూహత్మకంగా వ్యవహరించి మరొక 'యూకో' పాయింట్ దక్కించుకుంది. దీంతో 2-1 తేడాతో విజయం సాధించి భారత్కు గోల్డ్మెడల్ అందించింది.సైకిల్ మెకానిక్ కూతురి నుంచి..23 ఏళ్ల అస్మిత త్రిపురలోని బెలోనియా అనే ఒక చిన్న పట్టణంలో జన్మించింది. ఆమెకు చిన్నతనం నుంచి క్రీడలపై మక్కువ ఎక్కువ. కానీ ఆమె తండ్రి ఒక సైకిల్ మెకానిక్ కావడంతో ఆమె కలలకు ఆర్ధిక ఇబ్బందిలు అడ్డంకిగా మారాయి. అయినప్పటికి అతడు మాత్రం తన కూమర్తెను ఎలాగైనా ఒక మంచి అథ్లెట్ను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.సైకిల్ మెకానిక్గా పనిచేస్తూనే అస్మితను జూడోలో చేర్పించి శిక్షణ ఇప్పించాడు. కానీ అస్మిత తన కెరీర్లో అత్యంత కీలకమైన సమయంలో మోకాలి గాయానికి గురైంది. శస్రచికిత్స కారణంగా ఆమె దాదాపు కొన్ని నెలల పాటు తనకు ఇష్టమైన జుడో క్రీడకు దూరమైంది. అయితే ఆమె తీవ్రంగా శ్రమించి సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ మ్యాట్పై అడుగుపెట్టింది.అస్మిత అద్భుతమైన కమ్బ్యాక్లో తన తండ్రిది కూడా కీలక పాత్ర. గాయంతో ఆటకు దూరంగా ఉన్న సమయంలో ఆమెకు తన తండ్రి ఎంతో సపోర్ట్గా నిలిచాడు. ఆమె ఏ మాత్రం మానసిక ఒత్తిడి గురువ్వకుండా చూసుకున్నాడు. అయితే ఈ రోజు దేశం గర్వించేలా అస్మిత సాధించిన విజయాన్ని చూసేందుకు అతడు లేడు. గత డిసెంబర్లో అస్మిత తండ్రి బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోయాడు. పతకం గెలుచుకున్న అనంతరం అస్మిత తన తండ్రిని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంది.రన్నర్ నుంచి జుడుకోగాకాగా అస్మిత తన క్రీడా ప్రయాణాన్ని ఒక రన్నర్గా ప్రారంభించింది. 800 మీటర్ల రన్నింగ్ ట్రాక్పై ఆమె ప్రాక్టీస్ చేసింది. అయితే ఆమెలోని అసలైన ప్రతిభను గుర్తించిన మొదటి కోచ్.. తనను జూడో వైపు నడిపించారు. ఆ తర్వాత ఆమె జుడుకోగా అద్భుత విజయాలను సాధించింది. ఆఫ్రికన్ ఓపెన్, జూనియర్ ఆసియా కప్ జూడోలో ఆమె బంగారు పతకాలను కైవసం చేసుకుంది. -
ఎస్ఆర్హెచ్ కీలక నిర్ణయం..!? ఆ ఐదుగురికి గుడ్బై?
ఐపీఎల్-2027 సీజన్ మినీ వేలానికి ముందు సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) బాటలోనే ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ కూడా తమ ఆటగాళ్లకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించేందుకు సిద్దమైనట్లు సమాచారం. ఆటగాళ్ల ఫిట్నెస్ స్ధాయిలను అంచనా వేసి వారిని జట్టులో కొనసాగించాలా? లేదా వేలంలోకి విడిచిపెట్టాలా? అని సన్రైజర్స్ నిర్ణయం తీసుకోనుంది. కాగా సన్రైజర్స్ హైదరాబాద్ గత 12 ఏళ్లగా తమ రెండో టైటిల్ కోసం వేట కొనసాగిస్తోంది. 2016 సీజన్లో ఛాంపియన్గా నిలిచిన సన్రైజర్స్ హైదరాబాద్.. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా విజతేగా నిలవలేదు. ఆరెంజ్ ఆర్మీ 2018, 2024 సీజన్లలో ఫైనల్కు చేరినప్పటికి రన్నరప్తో సరిపెట్టుకుంది. ఐపీఎల్-2026లో ప్లేఆఫ్స్లోనే తమ ప్రయాణాన్ని ముగించింది. దీంతో ఐపీఎల్-2027 కోసం బలమైన జట్టును సిద్దం చేయాలని ఆరెంజ్ ఆర్మీ యాజమాన్యం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఫిట్నెస్, ఫామ్, ప్రెస్ అధారంగా ఐపీఎల్-2027 మినీ వేలానికి ముందు సన్రైజర్స్ విడిచిపెట్టేందుకు అస్కారమున్న ఐదుగురు ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం.శివమ్ మావిఐపీఎల్-2026 వేలంలో శివమ్ మావిని సన్రైజర్స్ రూ. 75 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ అతడు తొడ కండరాల గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అతడి ఫిట్నెస్పై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ వంటి యువ పేసర్లు రాణిస్తుండడంతో పదేపదే గాయపడే మావిని సన్రైజర్స్ జట్టు నుంచి రిలీజ్ చేసే అవకాశముంది.జాక్ ఎడ్వర్డ్స్బిగ్బాష్ లీగ్-2026లో అదరగొట్టిన ఆస్ట్రేలియా ఆల్రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ను రూ.3 కోట్లకు సన్రైజర్స్ సొంతం చేసుకుంది. కానీ అతడు పాదం గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత పునరాగమనంలో దారుణంగా విఫలమయ్యాడు. మేజర్ లీగ్ క్రికెట్-2026లో ఎడ్వర్డ్స్ వాషింగ్టన్ ఫ్రీడమ్ తరఫున కేవలం 12 పరుగులు మాత్రమే చేసి, బౌలింగ్లో 10.12 ఎకానమీతో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అతడిని ఎస్ఆర్హెచ్ జట్టులో కొనసాగించే అవకాశాలు తక్కువ.డేవిడ్ పేన్జాక్ ఎడ్వర్డ్స్ స్థానంలో ప్రత్యామ్నాయంగా వచ్చిన ఇంగ్లండ్ వెటరన్ పేసర్ డేవిడ్ పేన్(రూ.1.5 కోట్లు) కూడా రెండు మ్యాచ్లకే గాయం బారిన పడ్డాడు. కాలిమడమ గాయంతో అతడు సీజన్ మధ్యలోనే వైదొలిగాడు. ఈ క్రమంలో వయసు, ఫిట్నెస్ సమస్యల దృష్ట్యా పేన్కు కూడా ఎస్ఆర్హెచ్ గుడ్బై చెప్పే అవకాశముంది. అతడి స్ధానంలో మరో యువ పేసర్ను వెతికే పనిలో సన్రైజర్స్ పడింది.హర్షల్ పటేల్ ఐపీఎల్లో రెండు సార్లు పర్పుల్ క్యాప్ విజేతగా నిలిచిన భారత వెటరన్ పేసర్ హర్షల్ పటేల్.. గత రెండు సీజన్లగా మాత్రం పూర్తిగా తేలిపోతున్నాడు. ఐపీఎల్-2025 వేలంలో అతడిని రూ. 8 కోట్ల భారీ ధరకు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. కానీ అతడు మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. అతడి కంటే యువ పేసర్లు ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్లు అద్భుతంగా రాణించారు. దీంతో అతడిని వేలంలో విడిచిపెట్టి ఆ మొత్తాన్ని యువ ఆటగాళ్లపై ఖర్చు చేయాలని సన్రైజర్స్ ప్రణాళికలు రచిస్తోంది.లియామ్ లివింగ్స్టోన్ఐపీఎల్-2026 వేంలో ఇంగ్లీష్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్పై ఎస్ఆర్హెచ్ భారీ ధర వెచ్చింది. రూ.13 కోట్లకు అతడిని సొంతం చేసింది. కానీ అతడికి సీజన్ మొత్తంలో కేవలం రెండు మ్యాచ్ల్లో మాత్రమే ఆడే అవకాశం లభించింది. ఆ రెండు మ్యాచ్ల్లో కూడా లివింగ్స్టోన్ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో అతడిని విడిచిపెట్టి వేలంలో ఇతర విదేశీ ఆల్రౌండర్లపై దృష్టి పెట్టే యోచనలో ఎస్ఆర్హెచ్ ఉంది. -
ఇంగ్లండ్ గడ్డపై ఇరగదీస్తున్న కుల్దీప్ యాదవ్
ఇంగ్లండ్ డొమాస్టిక్ వన్డే కప్-2026లో భారత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో యార్క్షైర్ క్లబ్కు ప్రాతినిథ్యం వహిస్తున్న కుల్దీప్.. ప్రతీ మ్యాచ్లోనూ తన స్పిన్ మయాజాలాన్ని ప్రదర్శిస్తున్నాడు. తాజాగా డర్హామ్తో జరిగిన గ్రూప్-బి మ్యాచ్లో అతడు మ్యాచ్ విన్నింగ్ స్పెల్ బౌలింగ్ చేశాడు. తన 10 ఓవర్ల కోటాలో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, డర్హామ్ లెజెండ్ బెన్ స్టోక్స్ను కుల్దీప్ అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు. ఈ భారత స్టార్ స్పిన్నర్ బౌలింగ్ను ఎదుర్కోవడానికి స్టోక్స్ తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలో కుల్దీప్ బౌలింగ్లోనే రివర్స్ స్వీప్ షాట్కు ప్రయత్నించి స్టోక్స్ ఔటయ్యాడు. షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతి టాప్ ఎడ్జ్ తీసుకుని బ్యాక్వర్డ్ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న జార్జ్ హిల్ చేతిలోకి వెళ్లింది. స్టోక్స్ 39 బంతుల్లో కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. స్టోక్స్ ఔటైన తర్వాత డర్హామ్ వికెట్ల పతనం మొదలైంది. 48.1 ఓవర్లలో కేవలం 165 పరుగులకే డర్హామ్ కుప్పకూలింది. యార్క్షైర్ బౌలర్లలో బెంజమిన్ క్లిఫ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్తో పాటు డొమానిక్ బీస్ చెరో రెండు వికెట్లు సాధించారు. అనంతరం ఈ లక్ష్యాన్ని యార్క్షైర్ 41 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. జేమ్స్ వార్టన్(68 నాటౌట్), వైట్మాన్(52 నాటౌట్) హాఫ్ సెంచరీలతో మ్యాచ్ ఫినిష్ చేశారు.కాగా కుల్దీప్ ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడి 8 వికెట్లు పడగొట్టాడు. మరో మ్యాచ్ ఆడి అతడు తిరిగి భారత్కు పయనం కానున్నాడు. శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు ఎంపిక చేసిన భారత జట్టులో కుల్దీప్ సభ్యునిగా ఉన్నాడు. -
12 వేదికల్లో ప్రపంచకప్
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ వేదికలు ఖరారయ్యాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ వరల్డ్కప్లో మొత్తం 12 వేదికల్లో మ్యాచ్లు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఐసీసీ అధ్యక్షుడు జై షా వెల్లడించారు. 2027 వరల్డ్ కప్ లోగోనూ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా క్రికెట్ సంఘాల అధ్యక్షులతో కలిసి జై షా ఆవిష్కరించారు. చివరగా 2003లో దక్షిణాఫ్రికా వేదికగా వన్డే ప్రపంచకప్ జరగగా... మళ్లీ 24 ఏళ్ల తర్వాత అక్కడ ఈ మెగా టోర్నీ జరగనుంది. మొత్తం 12 వేదికల్లో ఎనిమిది (జొహన్నెస్బర్గ్, సెంచూరియన్, డర్బన్, గెబ్రా, కుగొంపో సిటీ, కేప్టౌన్, పార్ల్, బ్లూమ్ఫాంటైన్) దక్షిణాఫ్రికాలో ఉన్నాయి. ఇక్కడే 54 మ్యాచ్లు నిర్వహించనున్నారు. జింబాబ్వేలోని హరారే, బులవాయో, విక్టోరియా ఫాల్స్లోని మూడు మైదానాలు కూడా వరల్డ్కప్ మ్యాచ్లకు ఆతిథ్యమివ్వనున్నాయి. ఇక్కడ 7 నుంచి 10 మ్యాచ్లు జరిగే అవకాశంఉంది. ఇక మరో ఆతిథ్య దేశం నమీబియాలోని ఏకైక మైదానంలో కనీసం 3 మ్యాచ్లు నిర్వహించవచ్చు. ఈ వేదికలన్నీ గతంలోనే నిర్ణయించగా... విక్టోరియా ఫాల్స్ మైదానాన్ని కొత్తగా చేర్చారు. అక్కడ కొత్తగా నిర్మించిన 10 వేల మంది అభిమానుల సామర్థ్యం గల స్టేడియంలో వరల్డ్కప్ మ్యాచ్లు జరగనున్నాయి. కాగా మ్యాచ్ల పూర్తి షెడ్యూల్ మాత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
‘ఫిఫా’ అధ్యక్షుడిపై తిరుగుబాటు
జెనీవా: ప్రపంచ ఫుట్బాల్ సమాఖ్య (ఫిఫా) అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినో చేపట్టిన కొత్త పెట్టుబడి ప్రణాళికపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ‘ఫిఫా’ ప్రపంచకప్ లాభాలను ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకు విక్రయించాలనే ఇన్ఫాంటినో నిర్ణయాన్ని సభ్య దేశాలన్ని తప్పుపడుతున్నాయి. ఇప్పటికే యూరప్, ఉత్తర అమెరికా ఫుట్బాల్ సమాఖ్యలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించగా... తాజాగా ఆసియా ఫుట్బాల్ సమాఖ్య (ఏఎఫ్సీ) కూడా ఆ జాబితాలో చేరింది. దీంతో ఇన్ఫాంటినోపై ఒత్తిడి మరింత పెరిగింది. ఈ వివాదం ముదురుతున్న తరుణంలో ఇన్ఫాంటినోకు అత్యంత సన్నిహితుడు, సీనియర్ సలహాదారు కార్లోస్ కార్డెరో తన పదవికి రాజీనామా చేశాడు. వైట్హౌస్ వరల్డ్కప్ టాస్క్ ఫోర్స్లో ‘ఫిఫా’ ప్రతినిధిగా వ్యవహరించిన కార్డెరో... ఇన్ఫాంటినో ప్రతిపాదన ఫుట్బాల్కు ఏమాత్రం మంచిది కాదని వెల్లడించాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ సోదరుడైన జోషువా కుష్నర్ సంస్థ కోసమే ‘ఫిఫా’ ఈ కొత్త ప్రతిపాదనను రూపొందించింది. కాగా... దీనిపై స్పందించిన ఫిఫా ‘ఫుట్బాల్ను అమ్మేయడానికి ఎవరూ ప్రయత్నించడం లేదు’ అని ప్రకటించిన గంటల వ్యవధిలోనే... కోర్డెరో ‘ప్రపంచకప్ లాభాల్లో వాటాలను అమ్మాలని ‘ఫిఫా’ ప్రయత్నిస్తుంటే చూస్తూ ఊరుకోలేను’ అంటూ సంచలన ప్రకటన చేశాడు. ఈ రహస్య ఒప్పందంతో తనకు ఎలాంటి సబంధం లేదని తేల్చిచెప్పాడు. ట్రంప్ అల్లుడి సోదరుడి కోసం! ఇటీవల కెనడా, మెక్సికో, అమెరికా వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక వరల్డ్కప్ విజయవంతం కాగా... దాని ద్వారా వచ్చిన లాభాలతో ట్రంప్ సన్నిహితులకు ఆయాచిత లబ్ది చేకూర్చేందుకు ‘ఫిఫా’ అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినో ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. ‘ఫిఫా’ తన వాణిజ్య వ్యాపారాలను ఒక అనుబంధ సంస్థగా మార్చి అందులో 20 శాతం వాటాను ప్రైవేట్ పెట్టుబడిదారులకు విక్రయించాలని భావిస్తోంది. అయితే సరైన సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయం ‘ఫిఫా’ పాలనా వైఫల్యాలను ఎత్తిచూపుతోందని ఆసియా ఫుట్బాల్ సమాఖ్య ఆరోపించింది. ఈ ప్రణాళికను విరమించుకునేంత వరకు ‘ఫిఫా’ అన్నీ టోర్నమెంట్లను బహిష్కరించనున్నట్లు యూరోపియన్ సాకర్ సంస్థ హెచ్చరించింది. తప్పుడు ప్రచారం వల్లే ఈ సమస్య తలెత్తిందని ‘ఫిఫా’ వివరణ ఇచ్చినప్పటికీ... వచ్చే ఏడాది ‘ఫిఫా’ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఇన్ఫాంటినో భవితవ్యంపై ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. 2016 నుంచి గియాని ఇన్ఫాంటినో ఈ పదవిలో కొనసాగుతున్నారు. 2019, 2023 ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన... వచ్చే ఏడాది మార్చిలో మొరాకో వేదికగా జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో చివరిసారి పోటీ చేయనున్నారు. ‘ఫిఫా’లో మొత్తం 211 సభ్య దేశాలు ఉండగా... యూరప్, దక్షిణామెరికాలోని 90 దేశాలతో పాటు ఆసియా ఫుట్బాల్ సమాఖ్యలోని 46 దేశాలు కూడా ఇన్ఫాంటినో ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఎన్నికలపై దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. -
ఖేలో ఇండియాకు రూ. 29 వేల కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో క్రీడాభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఖేలో ఇండియా’ పథకంతో పాటు జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)లకు భారీగా నిధులు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాబోయే ఐదేళ్లలో దేశంలో క్రీడల కోసం రూ. 36,441 కోట్ల బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో ఒక్క ‘ఖేలో ఇండియా’ పథకానికే రూ. 29,054 కోట్లు కేటాయించారు. గతంతో పోలిస్తే ఇది ఎనిమిది రెట్లు అధికం కావడం గమనార్హం. గ్రామీణ స్థాయి క్రీడాకారుల్లో నైపుణ్యాలను పెంచడం... ప్రతిభావంతులను గుర్తించి వారిని అంతర్జాతీయ స్థాయికి తగ్గట్లు తీర్చిదిద్దడానికి ఇవి తోడ్పడనున్నాయి. ఇక 2030లో భారత్లో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ, 2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల కోసం బిడ్డింగ్ దాఖలు చేసిన నేపథ్యంలో దేశాన్ని గ్లోబల్ స్పోర్టింగ్ హబ్గా తీర్చిదిద్దే దిశగా కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసినట్లయింది. ‘గత ‘ఖేలో ఇండియా’ పథకానికి కేటాయించిన నిధుల కంటే దాదాపు ఎనిమిది రెట్లు అధిక నిధులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది దేశాన్ని ప్రపంచస్థాయి క్రీడా శక్తిగా మార్చాలన్న ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తోంది’ అని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. చదువుతోపాటు ఆటలు... రాబోయే ఐదేళ్లలో జాతీయ క్రీడా సమాఖ్యలకు రూ. 7,387 కోట్లు కేటాయించారు. పాఠశాల స్థాయిలోనే క్రీడలను ప్రోత్సహించేందుకు ‘ఖేలో ఇండియా ఫీడర్ స్కూల్స్’ (కేఐఎఫ్ఎస్), ‘ఖేలో ఇండియా ఉత్కృష్ట విద్యాలయ’ (కేఐయూవీ) అనే రెండు కొత్త కార్యక్రమాలను కేంద్రం ప్రవేశపెట్టింది. దీంతో చదువుతో పాటు ఆటలకు సమాన ప్రాధాన్యం లభించనుంది. మహిళా క్రీడాకారిణులు, పారా అథ్లెట్లు, దేశీయ సాంప్రదాయ క్రీడలకు ఈ పథకంలో ప్రత్యేక ప్రాధాన్యం కల్పించారు. అథ్లెట్ల సమగ్ర వివరాలు, మౌలిక వసతులు, శిక్షణ వనరులు, ప్రతిభాన్వేషణ ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు డిజిటల్ స్పోర్టింగ్ ప్లాట్ఫారమ్ను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న అథ్లెట్ల ప్రోగ్రామ్తో పాటు ‘ఎమర్జింగ్ ఖేలో ఇండియా అథ్లెట్స్’ అనే కొత్త కేటగిరీని ప్రవేశపెట్టారు. దీని ద్వారా వేలాది మంది యువ క్రీడాకారులకు నిపుణుల పర్యవేక్షణలో శాస్త్రీయ శిక్షణ లభించనుంది. 2017లో ఖేలో ఇండియా పథకాన్ని ప్రారంభించగా... ప్రస్తుతం దీని కింద 2800 మంది అథ్లెట్లు మెరుగైన శిక్షణ పొందుతున్నారు. దేశవ్యాప్తంగా ‘ఖేలో ఇండియా సెంటర్స్ ఆఫ్ ఎక్స్లెన్స్’ (కేఐసీఓఈ), ‘ఖేలో ఇండియా అక్రెడిటెడ్ అకాడెమీస్’ (కేఐఏఏ), ‘ఖేలో ఇండియా సెంటర్స్’ (కేఐసీ), యూత్ స్పోర్ట్స్ కంపెనీస్ (వైఎస్సీ)లో అథ్లెట్లు శిక్షణ పొందుతున్నారు. -
జూడోలో బంగారు ధగధగ
గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల్లో 1990లో జూడోను మెడల్ ఈవెంట్గా ప్రవేశపెట్టగా... భారత్కు ఒక్కసారి కూడా స్వర్ణం లభించలేదు. ఈసారి ఆ లోటును తీరుస్తూ ఒకే రోజు ఇద్దరు భారత జూడో ప్లేయర్లు బంగారు పతకాలు అందించారు. పురుషుల విభాగంలో హర్ష్ సింగ్ (60 కేజీలు), మహిళల 48 కేజీల విభాగంలో అస్మిత డే ఈ ఘనత సాధించారు. శుక్రవారం జరిగిన 60 కేజీల ఫైనల్లో 23 ఏళ్ల హర్ష్ 10–0 ఆ్రస్టేలియాకు చెందిన జోషువా కట్జ్ను చిత్తు చేశాడు. నిర్ణీత నాలుగు నిమిషాల సమయంకంటే మరో 41 సెకన్లు మిగిలి ఉండగానే ప్రత్యర్థి ఆటను ముగించడంలో హర్ష్ సఫలమయ్యాడు. మహిళల విభాగంలో భారత్కు తొలి కామన్వెల్త్ స్వర్ణం అందించిన జూడోకాగా అస్మిత నిలిచింది. 48 కేజీల ఫైనల్లో అస్మిత 2–1తో హీడీ క్వాచ్ (కెనడా)ను ఓడించింది. జూడోలో మనకు మూడో స్వర్ణం గెలుచుకునే అవకాశం చేజారింది. మహిళల 57 కేజీల ఫైనల్లో యామిని మౌర్య ఓడి రజతంతో సంతృప్తి చెందింది. ఇంగ్లండ్కు చెందిన అసీలియా టోప్రాక్ 100–0 (ఇపాన్ స్కోరింగ్)తో యామినిపై గెలుపొందింది. రేపటితో ముగియనున్న కామన్వెల్త్ గేమ్స్లో ప్రస్తుతం భారత్ 5 స్వర్ణాలు, 11 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి మొత్తం 20 పతకాలతో తొమ్మిదో స్థానంలో ఉంది. తొలిసారి కామన్వెల్త్ బరిలోకి దిగి... కామన్వెల్త్ క్రీడల అథ్లెటిక్స్లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. మహిళల డిస్కస్ త్రోలో సీమా కాలిరామ్నా కాంస్యం నెగ్గింది. తొలిసారి కామన్వెల్త్ గేమ్స్లో బరిలోకి దిగిన సీమా డిస్్కను 58.65 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచింది. లవ్ప్రీత్కు రజతం... వెయిట్లిఫ్టింగ్ పురుషుల ప్లస్ 110 కేజీల కేటగిరీలో భారత లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ రజతం దక్కించుకున్నాడు. స్నాచ్లో 176 కేజీలు, క్లీన్ అండ్ జర్క్లో 212 కేజీలు కలిపి మొత్తం 388 కేజీల బరువెత్తిన లవ్ప్రీత్ రెండో స్థానంతో ముగించాడు. దీంతో కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్లిఫ్టింగ్ పోటీలు ముగిశాయి. భారత్ 1 స్వర్ణం, 6 రజతాలు, 1 కాంస్యంతో మొత్తం 8 పతకాలు గెలుచుకుంది.తండ్రి అండగా నిలవగా... అస్మిత డే స్వస్థలం త్రిపురలోని బెలోనియా. తండ్రి సైకిల్ మెకానిక్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించాడు. అయితే కూతురు ఆసక్తి చూపించడంతో ఆమెను జూడోలో చేర్పించి శిక్షణ ఇప్పించాడు. ఆర్థిక సమస్యలతో సతమతమైనా... ఆమె ఆటకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నాడు. ఒకదశలో మోకాలి గాయంతో కెరీర్ ఇబ్బందుల్లో పడినా ఢిల్లీలో చికిత్స అందించి ప్రోత్సహించాడు. అయితే అస్మిత కామన్వెల్త్లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన విషయాన్ని పంచుకునేందుకు ఆయన లేడు. గత డిసెంబర్లో అస్మిత తండ్రి బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోయాడు. పతకం గెలుచుకున్న అనంతరం అస్మిత కన్నీళ్ళతో తన తండ్రిని గుర్తు చేసుకుంది. ‘క్రీడల్లోకి వెళ్లాలనే ఆలోచన కూడా రాని ఊరునుంచి నేను వచ్చాను. కానీ నాన్న మాత్రం నన్ను నమ్మి అన్ని విధాలా అండగా నిలిచాడు. ఆయన అంత్యక్రియలు ముగిసిన పది రోజులకే నాన్న కల నెరవేర్చమంటూ అమ్మ నన్ను మళ్లీ శిక్షణకు పంపించింది. ఈ పతకం కోసం నేను చాలా కష్టపడ్డాను. నా బౌట్ల గురించి ఆలోచిస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఇక్కడికి వచ్చాక ఎంతో ఒత్తిడికి గురయ్యాను. చివరకు స్వర్ణం సాధించగలిగా’ అని అస్మిత చెప్పింది. ‘పసిడి’ పంచ్లకు గెలుపు దూరంలో భారత బాక్సర్లు తమపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ దూసుకుపోతున్నారు. వేర్వేరు విభాగాల్లో సత్తా చాటిన ఏడుగురు భారత బాక్సర్లు ఫైనల్లోకి ప్రవేశించారు. తద్వారా కనీసం స్వర్ణం లేదా రజతాన్ని ఖాయం చేశారు. మహిళల సెమీఫైనల్స్లో అరుంధతి (70 కేజీలు) 4–0తో డిఫెండింగ్ చాంపియన్ రోజీ ఎకెల్స్ (వేల్స్)పై, వరల్డ్ చాంపియన్ జైస్మిన్ (57 కేజీలు) ‘రిఫరీ స్టాప్స్ ద కాంటెస్ట్’తో రాపెలాంగ్ మస్లెలా (లెసోతో)పై, ప్రీతి పవార్ (54 కేజీలు) 5–0తో కాథరీన్ ఎంవాపె (జాంబియా)పై, సాక్షి (51 కేజీలు) 5–0తో అంబర్ జేన్వాల్ (కెనడా)పై , ప్రియ (60 కేజీలు) 5–0తో లూసీ (ఇంగ్లండ్)పై నెగ్గి తుది పోరుకు అర్హత సాధించారు. పురుషుల సెమీఫైనల్స్లో జాదూమణి సింగ్ (55 కేజీలు) 5–0తో ఫిలిప్ హోసెబ్ (నమీబియా)ను, అంకుశ్ (80 కేజీలు) 5–0తో ఒఫోరి (కెనడా)ను చిత్తు చేసి ఫైనల్లోకి అడుగు పెట్టారు. -
అమ్మ... ఆర్థరైటిస్... కామన్వెల్త్ మెడల్
కళ్లద్దాలు, నుదుటిపై బొట్టు, చలి నుంచి తట్టుకునేందుకు చెవుల వరకు చిన్న సైజు టోపీ... డిస్కస్ త్రో ఈవెంట్ ప్రారంభానికి ముందు నిలబడిన అథ్లెట్ల వరుసలో ఆమెను చూస్తే మైదానంలో ఒక ప్లేయర్లాగా కాకుండా ఒక టీచర్ తరహాలో కనిపించింది. పొరపాటున అటువైపు వచ్చినట్లుగా అనిపించిన ఈ అథ్లెట్ మరికొద్ది సేపు తర్వాత పతకధారిగా పోడియంపై నిలిచింది. ఈ ప్రస్తావన అంతా భారత డిస్కస్ త్రోయర్ సీమా కాలిరామ్నా గురించి. !కామన్వెల్త్ క్రీడల డిస్కస్ త్రోలో పతకం గెలిచిన నాలుగో భారత ప్లేయర్గా 27 ఏళ్ల సీమా నిలిచింది. చదువులోనూ తగ్గని ఆమె వ్యాయామ విద్యలో పీహెచ్డీ చేస్తోంది. తల్లిగా మారిన తర్వాత పలు ప్రతికూలతలను అధిగమించి ఇప్పుడు మెడల్తో మెరిసింది. హరియాణాలోని భివానీ పట్టణం సీమా స్వస్థలం. సైన్యంలో పని చేసిన తండ్రి వ్యక్తిగతంగా మంచి బాస్కెట్బాల్ ఆటగాడు, జావెలిన్ త్రోయర్ కూడా. ఆయన ప్రోత్సాహంతో అటు చదువు, ఇటు ఆటల్లో కూడా సీమా సమాంతరంగా మంచి ఫలితాలు రాబడుతూ ఎదిగింది. స్కూల్ స్థాయిలో ఆటలపై పెరిగిన ఆసక్తి ఆపై జిల్లా, రాష్ట్ర స్థాయిలో విజయాలు సాధిస్తూ పూర్తి స్థాయి అథ్లెట్గా మారడం వరకు చేరింది. మాజీ డిస్కస్ త్రోయర్ రవీందర్ కాలిరామ్నాతో వివాహం తర్వాత ఆమె కెరీర్ మరింత ఊపందుకుంది. రవీందర్ కోచ్గా మారి సీమాకు మార్గనిర్దేశనం చేశాడు. ఇప్పుడు సాధించిన కామన్వెల్త్ మెడల్ సీమా అంతర్జాతీయ కెరీర్లో మొదటి పతకం కావడం విశేషం. 2022లో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సీమా ప్రసవానంతరం సమస్యలు ఎదుర్కొంది. దాంతో పాటు ‘ఆర్థరైటిస్’ బారిన పడి తీవ్ర మోకాలి నొప్పితో బాధపడింది. దీని నుంచి కోలుకునేందుకు డాక్టర్లు స్టెరాయిడ్ ఇంజక్షన్లను సిఫారసు చేశారు. అయితే ఇందుకు దంపతులిద్దరూ అంగీకరించలేదు. సహజరీతిలో స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ ఎక్సర్సైజ్లు, డైట్లతో పాటు స్వల్ప ఆయుర్వేద చికిత్సతో ఆమె శారీరక పరిస్థితి మెరుగవుతూ వచ్చింది.కొడుకు పుట్టిన రెండేళ్ల తర్వాత 2024 జాతీయ క్రీడల్లో సీమా పునరాగమనంలో స్వర్ణం గెలిచింది. ఆపై జాతీయ చాంపియన్షిప్లో అత్యుత్తమ ప్రదర్శన (59.73 మీటర్లు) ఆమె నమోదు చేసింది. ‘అథ్లెట్ల ప్రదర్శనలో ఊహాత్మక ప్రభావం–సానుకూల దృక్పథం’ అనే అంశంపై పీహెచ్డీ చేస్తోన్న సీమా పోటీల సమయంలో దానినే తనకు అన్వయించుకుంది. ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించాలని ఆమె పట్టుదలగా ఉంది. -
6న విజయవాడలో హైదరాబాద్ బ్లాక్హాక్స్ సెలక్షన్ ట్రయల్స్
సాక్షి, హైదరాబాద్: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) ఫ్రాంచైజీ హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఈనెల 6వ తేదీన అండర్–21సెలక్షన్ ట్రయల్స్, సీనియర్ ఓపెన్ ట్రయల్స్ నిర్వహించనుంది. విజయవాడలోని వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ ఇండోర్ స్టేడియంలో ఈ ట్రయల్స్ జరుగుతాయి. ఉదయం ఎనిమిది గంటలకు అండర్–21 పురుషుల కేటగిరీ కోసం... సాయంత్రం ఐదు గంటలకు పీవీఎల్ వచ్చే సీజన్లో పాల్గొనే హైదరాబాద్ బ్లాక్హాక్స్ ప్రధాన జట్టు కోసం ట్రయల్స్ ఏర్పాటు చేశారు.పీవీఎల్ తదుపరి సీజన్లో హైదరాబాద్ బ్లాక్హాక్స్ ప్రధాన జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్లేయర్లు ఓపెన్ ట్రయల్స్కు హాజరుకావచ్చు. ‘ఈ సీజన్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్లు బ్లాక్హాక్స్కు ప్రాతినిధ్యం వహించాలన్నదే మా కోరిక. ఓపెన్ ట్రయల్స్ వారికి ఈ అవకాశం కల్పిస్తుంది’ అని హైదరాబాద్ బ్లాక్హాక్స్ ప్రధాన యజమాని కంకణాల అభిషేక్ రెడ్డి తెలిపారు. అండర్–21 ట్రయల్స్ ఎంట్రీలు ముగియగా... ఓపెన్ ట్రయల్స్లో పాల్గొనాలనుకునేవారు తమ పేర్లను primevolleyballleague.com/player-registration వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి. -
కామన్వెల్త్ గేమ్స్.. నీరజ్ చోప్రాకు రజతం
కామన్వెల్త్ గేమ్స్లో భారత జావెలిన్ త్రోయర్స్ సత్తా చాటారు. ఒలింపిక్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ అయిన నీరజ్ చోప్రా (85.83 మీటర్లు) మరోసారి తానేంటో నిరూపించుకున్నారు. ఇవాళ జరిగిన ఫైనల్లో నీరజ్ రెండో స్థానంలో నిలిచి రజతం సాధించారు. ఈ ఫైనల్లో శ్రీలంకకు చెందిన రుమేష్ తరంగ పతిరాగే 89.75 మీటర్లు విసిరి అగ్రస్థానంతో పాటు స్వర్ణం కైవసం చేసుకున్నాడు.ఇదే ఫైనల్లో మన దేశానికే చెందిన మరో జావెలిన్ త్రోయర్ యశ్వీర్ సింగ్ (85.41 మీ) విసిరి మూడోస్థానంలో నిలిచారు. ఈ ప్రదర్శనతో కాంస్యం పతకం దక్కించుకున్నారు. యశ్వీర్ తన కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఇండియాకే చెందిన మరో జావెలిన్ త్రోయర్ రోహిత్ యాదవ్(81.56 మీటర్లు) ఆరోస్థానంతో సరిపెట్టుకున్నారు. ఈ ప్రదర్శనతో కామన్ వెల్త్ గేమ్స్లో భారత్ పతకాల సంఖ్య 23కు చేరుకుంది. -
జూడోలో మరో పతకం.. భారత్ ఖాతాలో 20వ మెడల్
కామన్వెల్త్ గేమ్స్లో భారత్ సత్తా చాటుతోంది. ఇవాళ ఒక్క రోజే ఇండియన్ ప్లేయర్స్ అదరగొట్టేశారు. జూడోలో ఏకంగా ఒక్క రోజే మూడు పతకాలు సాధించారు. జూడో మహిళల విభాగంలో అస్మితా స్వర్ణం గెలవగా, తాజాగా జూడో పురుషుల 60 కేజీల విభాగంలో హర్ష్ సింగ్ బంగారు పతకాన్ని అందుకున్నాడు. తాజాగా జూడో మహిళల విభాగంలో యామిన్ మౌర్య రజతం సాధించింది. ఈ పతకాలతో జూడోలో ఓకే రోజు మూడు పతకాలు సాధించి చరిత్ర సృష్టించారు. ఇలా జూడోలో మూడు ఓకే రోజు మూడు పతకాలు రావడం తొలిసారి కావడం విశేషం.ఓకే రోజు మూడు మెడల్స్.. మొత్తానికి 9వ రోజు జూడో అథ్లెట్లు పతకాల పంట పండించారు. జూడో మహిళలు, పురుషుల విభాగాల నుంచి భారత్ ఖాతాలో పతకాలు సాధించారు. జూడో మహిళల 57 కేజీల విభాగంలో యామిన్ మౌర్య.. ఇంగ్లండ్కు చెందిన ఎసీలా టోప్రక్ చేతిలో పోరాడి ఓడింది. దీంతో రజతం కైవసం చేసుకుంది. దీంతో ఓవరాల్గా భారత్ పతకాల సంఖ్య 20కి చేరినట్లయింది. అంతకుముందే జూడో మహిళల విభాగంలో అస్మితా స్వర్ణం గెలిచి.. జూడోలో స్వర్ణం సాధించిన తొలి మహిళా ప్లేయర్గా రికార్డులకెక్కింది. అంతేకాకుండా పురుషుల 60 కేజీల విభాగంలో హర్ష్ సింగ్ బంగారు పతకాన్ని అందుకున్నాడు. ఫైనల్ బౌట్లో హర్ష్ సింగ్ ఆస్ట్రేలియాకు చెందిన జోషజవా కట్జ్ను చిత్తు చేసి పసిడి పతకం ఒడిసిపట్టాడు. తద్వారా కామన్వెల్త్ గేమ్స్లో పురుషుల జూడో విభాగంలో స్వర్ణం గెలిచిన తొలి అథ్లెట్గా హర్ష్ సింగ్ నిలిచాడు. ఇప్పటి వరకు భారత్కు ఐదు స్వర్ణాలు చేరాయి. -
జూడోలో మరో స్వర్ణం.. భారత్ ఖాతాలో 19వ పతకం
కామన్వెల్త్ గేమ్స్లో భారత్ ఖాతాలో 9వ రోజు రెండో స్వర్ణం వచ్చి చేరింది. ఇప్పటికే జూడో మహిళల విభాగంలో అస్మితా స్వర్ణం గెలవగా, తాజాగా జూడో పురుషుల 60 కేజీల విభాగంలో హర్ష్ సింగ్ బంగారు పతకాన్ని అందుకున్నాడు. 4 నిమిషాల పాటు జరిగిన ఫైనల్ బౌట్లో హర్ష్ సింగ్ ఆస్ట్రేలియాకు చెందిన జోషజవా కట్జ్ను చిత్తు చేసి పసిడి పతకం ఒడిసిపట్టాడు. తద్వారా కామన్వెల్త్ గేమ్స్లో పురుషుల జూడో విభాగంలో స్వర్ణం గెలిచిన తొలి అథ్లెట్గా హర్ష్ సింగ్ నిలిచాడు. ఇది భారత్కు ఐదో స్వర్ణం కాగా, ఓవరాల్గా పతకాల సంఖ్య 19కి చేరినట్లయింది. ఇప్పటికే జూడోలో మహిళల 48 కేజీల విభాగంలో అస్మితా దే స్వర్ణం సాధించింది. జూడోలో స్వర్ణం సాధించిన తొలి మహిళా ప్లేయర్గా అస్మితా రికార్డులకెక్కింది.ఇక కామన్వెల్త్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. ఇప్పటివరకు భారత్ 19 పతకాలు (5 స్వర్ణాలు, 10 రజతాలు, 4 కాంస్యాలు) సాధించి పట్టికలో 19వ స్థానంలో కొనసాగుతోంది. అయితే గేమ్స్లో 9వ రోజైన శుక్రవారం ఒక్కరోజే భారత్ ఖాతాలో 13 పతకాలు ఖరారయ్యాయి. ఇందులో బాక్సింగ్ నుంచి 10 పతకాలు ఉంటే, జూడో నుంచి మరో మూడు పతకాలు ఉన్నాయి. HARSH SINGH CREATES HISTORY | GOLDHe became Indian first ever male CWG Judo champion pic.twitter.com/gsgc6jJ2zC— IndiaSportsHub (@IndiaSportsHub) July 31, 2026#WATCH | Glasgow | Indian Judo Athlete and gold medallist Harsh Singh says, “I am feeling really happy to win this medal for the country... We prepared to win today... I dedicate this medal to my mother... If qualified, I will prepare well for the Asian Games and give my best to… https://t.co/9XbewAgl6U pic.twitter.com/lgn5bvMYka— ANI (@ANI) July 31, 2026Read: జూడోలో భారత్కు స్వర్ణం.. ఒక్కరోజే 13 పతకాలు ఖరారు! -
జూడోలో భారత్కు స్వర్ణం.. ఒక్కరోజే 13 పతకాలు ఖరారు!
కామన్వెల్త్ గేమ్స్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం వచ్చి చేరింది. జూడోలో మహిళల 48 కేజీల విభాగం ఫైనల్లో కెనడాకు చెందిన హెల్దీ క్వాచ్పై 4-0తో విజయం సాధించిన అస్మితా దే స్వర్ణం సాధించింది. జూడోలో భారత్కు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. ఇక జూడోలో స్వర్ణం సాధించిన తొలి మహిళా ప్లేయర్గా అస్మితా రికార్డులకెక్కింది. ఈ గేమ్స్లో ఇది భారత్కు 4వ స్వర్ణం కాగా, ఓవరాల్గా భారత్కు ఇది 18వ పతకం. ఇక కామన్వెల్త్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. ఇప్పటివరకు భారత్ 18 పతకాలు (4 స్వర్ణాలు, 10 రజతాలు, 4 కాంస్యాలు) సాధించింది. అయితే గేమ్స్లో భాగంగా 9వ రోజైన శుక్రవారం ఒక్కరోజే భారత్ ఖాతాలో 13 పతకాలు ఖరారయ్యాయి. ఇందులో బాక్సింగ్ నుంచి 10 పతకాలు ఉంటే, జూడో నుంచి మరో మూడు పతకాలు ఉన్నాయి. జూడో గేమ్లో హర్ష్ సింగ్, యామిని మౌర్య, అస్మితా దే ఫైనల్కు దూసుకెళ్లారు. ఫైనల్లో గెలిస్తే స్వర్ణం లేదంటే రజతాలు దక్కనున్నాయి. ఇక బాక్సింగ్లో భారత్ పంచ్ పవర్ అదుర్స్ అనిపిస్తోంది. భారత బాక్సర్లలో ప్రీతి పవార్, అంకుశ్ పంగల్, జాస్మిన్ లంబోరియా, జాదుమణి సింగ్, అరుంధతీ చౌదరీలు శనివారం ఫైనల్ మ్యాచ్లు ఆడనున్నారు. గెలిస్తే ఐదు స్వర్ణాలు.. ఓడితే ఐదు రజతాలు భారత్ ఖాతాలో చేరనున్నాయి. ఇక మరో ఐదుగురు భారత బాక్సర్లు సెమీస్కు అర్హత సాధించడంతో కనీసం కాంస్యం ఖరారు చేసుకున్నారు. ఇక ఇవాళ అర్ధరాత్రి దాటిన తర్వాత జావెలిన్ త్రో ఫైనల్ జరగనుంది. అందరి కళ్లు నీరజ్ చోప్రాపైనే ఉన్నాయి. నీరజ్ కచ్చితంగా స్వర్ణం లేదా కనీసం రజతమైనా ఒడిసిపడతడని అంతా భావిస్తున్నారు. నీరజ్తో పాటు మరో ఇద్దరు భారత జావెలిన్ త్రోయర్లు కూడా బరిలో ఉండడంతో పతకాలపై ఆశలు మరింత పెరుగుతున్నాయి. ఇలా శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 13 పతకాలకు పైగా ఖరారు కావడంతో భారత్కు ఆదివారం లోగా 30 నుంచి 31 పతకాలు వచ్చే అవకాశాలైతే మెండుగా ఉన్నాయి. ఇవాళ జూడో మహిళల విభాగంలో అస్మితా దే (48 కేజీల విభాగంలో), యామిన్ మౌర్య (57 కేజీల విభాగంలో) ఫైనల్ ఆడనుండగా, పురుషుల విభాగంలో హర్ష్ సింగ్ (60 కేజీలు) ఫైనల్లో ఆడనుండడంతో భారత్ పతకాల సంఖ్య 20కి చేరనుంది. 🇮🇳🥹 India's first-ever Commonwealth Games Gold Medal in Judo.Asmita Dey has etched her name into Indian sporting history! 🥇She defeats Canada's Heidi Quach 2-1 to win the Women's -48kg Judo Gold at the Commonwealth Games 2026.pic.twitter.com/4KEKWaDmXG— Sports Apna 🇮🇳 (@sportsapna1) July 31, 2026 𝐀𝐒𝐌𝐈𝐓𝐀 𝐃𝐄𝐘 𝐂𝐑𝐄𝐀𝐓𝐄𝐒 𝐇𝐈𝐒𝐓𝐎𝐑𝐘! 🇮🇳🥇 Becomes the FIRST-EVER Indian JUDOKA (male or female) to win a Commonwealth Games GOLD medal! Defeats Heidi Quach in 48kg Final. #Glasgow2026 #Glasgow2026withIAS pic.twitter.com/Ux3mQQ8Jf3— India_AllSports (@India_AllSports) July 31, 2026 -
మెడ విరిగినా వెనక్కి తగ్గలేదు.. ఒలింపిక్ గోల్డ్ను ముద్దాడాడు!
సంకల్పానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచిపోయిన అథ్లెట్లలో అమెరికా రెజ్లర్ కర్ట్ ఆంగిల్ (Kurt Angle) ఒకరు. అయితే డబ్ల్యూడబ్ల్యూఎఫ్ రెజ్లర్గా విశేష ఆదరణ పొందిన కర్ట్ ఆంగిల్ జీవితం ఒక ఆదర్శం. డబ్ల్యూడబ్ల్యూఎఫ్(WWF/WWE)లో చీటింగ్ ప్లేయర్గా పేరు పొందిన కర్ట్ ఆంగిల్, రెజ్లింగ్లో మాత్రం నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమని చెప్పొచ్చు. అందుకే డబ్ల్యూడబ్ల్యూఎఫ్లో కొనసాగినంత కాలం మెడలో అట్లాంటా ఒలింపిక్స్లో సాధించిన గోల్డ్ మెడల్ను వేసుకునే వచ్చేవాడు కర్ట్ ఆంగిల్.1996 అట్లాంటా ఒలింపిక్స్లో కర్ట్ ఆంగిల్ సాధించిన స్వర్ణ పతకం కేవలం విజయం మాత్రమే కాదు.. అసాధారణ పోరాట స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం. తీవ్రమైన మెడ గాయంతో బాధపడుతూనే బరిలోకి దిగి ప్రత్యర్థులను ఓడించి బంగారు పతకాన్ని సొంతం చేసుకున్న ఆయన కథ నేటికీ ప్రపంచ క్రీడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది.అట్లాంటా ఒలింపిక్స్కు కొన్ని నెలల ముందు కర్ట్ ఆంగిల్కు మెడలో తీవ్ర గాయం అయింది. సర్వైకల్ వెన్నెముకలోని C6, C7 వెర్టీబ్రాల వద్ద గాయం కావడంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. సాధారణంగా ఇలాంటి గాయంతో అథ్లెట్ కెరీర్కే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. కానీ ఒలింపిక్ స్వర్ణమే తన జీవిత లక్ష్యమని భావించిన కర్ట్ ఆంగిల్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తీవ్ర నొప్పిని భరిస్తూనే ప్రత్యేకమైన చికిత్స, కఠిన సాధనతో తిరిగి పోటీలకు సిద్ధమయ్యాడు.1996 జూలై 31న జరిగిన పురుషుల 100 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఫైనల్లో కర్ట్ ఆంగిల్ ఇరాన్కు చెందిన అబ్బాస్ జదిదిని ఎదుర్కొన్నాడు. గాయం ప్రభావం ఉన్నప్పటికీ అసాధారణ పట్టుదలతో పోరాడి 1-0 తేడాతో విజయం సాధించాడు. ఆ విజయంతో ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. ఆ క్షణం ఆయన వ్యక్తిగత విజయమే కాదు.. పట్టుదల ముందు శారీరక బాధ కూడా ఓడిపోతుందనే సందేశంగా నిలిచిపోయింది.ఆ తర్వాత కర్ట్ ఆంగిల్ ప్రొఫెషనల్ రెజ్లింగ్లోకి అడుగుపెట్టి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించాడు. WWEలో అనేక ప్రపంచ ఛాంపియన్షిప్లు గెలుచుకుని అత్యుత్తమ రెజ్లర్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు. తన ప్రసంగాల్లో "I won an Olympic gold medal with a broken freaking neck" అనే వ్యాఖ్యతో ఆయన తన పోరాట గాథను ఎన్నోసార్లు గుర్తు చేశారు.కర్ట్ ఆంగిల్ సాధించిన ఈ ఘనతకు నేటితో 30 ఏళ్లు పూర్తయ్యాయి. మూడు దశాబ్దాలు గడిచినా ఆయన విజయం ఇప్పటికీ అథ్లెట్లకు స్ఫూర్తిదాయకంగానే నిలిచింది. శరీరం ఎంత బలహీనపడినా, మనసు బలంగా ఉంటే అసాధ్యాన్ని కూడా సాధ్యం చేయవచ్చని కర్ట్ ఆంగిల్ తన జీవితంతో నిరూపించాడు. ఒలింపిక్ చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోవడానికి కారణం కేవలం గోల్డ్ మెడల్ కాదు.. ఆ స్వర్ణం వెనుక ఉన్న అచంచల సంకల్పం, అపారమైన ధైర్యమే. థాంక్యూ ఆల్ టైమ్ గ్రేట్.. కర్ట్ ఆంగిల్.#OnThisDayInWWE 30 years ago:Kurt Angle wins Olympic gold - with a broken freakin' neck! pic.twitter.com/tUTrYua4Zc— On This Day in WWE (@OTD_in_WWE) July 31, 2026 30 Years Ago Today🏅It’s hard to believe that it’s been three decades since I stood on that podium, proudly winning the Gold Medal against Abbas Jadidi. Coming from humble I grew up a laborer’s son from Dormont Pittsburgh, I never imagined my dreams would ever come true.This… pic.twitter.com/B6rC4of5pA— Kurt Angle (@RealKurtAngle) July 31, 2026On This Day 30 Years Ago:🚨Kurt Angle made his nation proud in the 1996 Summer Olympics by winning an Olympic gold medal in freestyle wrestling, WITH A BROKEN FREAKIN NECK🏆Kurt then went on to have a hall of fame career in the WWE & TNA👏 A true legend in the game. Thank… pic.twitter.com/1ztQ82CI7e— GP TALKS (@GPTALKLAFAMILIA) July 31, 2026 చదవండి: కొత్త లుక్లో రోహిత్ శర్మ.. వయసులో పదేళ్లు వెనక్కి! -
కొత్త లుక్లో రోహిత్ శర్మ.. వయసులో పదేళ్లు వెనక్కి!
టీమిండియా సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మ కొత్త లుక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది. శుక్రవారం భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రితో కలిసి దిగిన ఫొటోలో రోహిత్ శర్మ క్లీన్ షేవ్తో కనిపించి ఆశ్చర్యపరిచాడు. దీంతో వయసులో రోహిత్ శర్మ ఒక పదేళ్లు వెనక్కి మళ్లినట్లుగా అనిపించింది. ఇక రవిశాస్త్రి కూడా రోహిత్ కొత్త లుక్పై ఆసక్తికర పోస్టును పెట్టాడు. రోహిత్ను ఇలా చూస్తుంటే చాలా రిలాక్స్గా అనిపిస్తోంది అని కామెంట్ చేశాడు.ఇటీవలే ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లో రోహిత్ శర్మ సూపర్ సెంచరీతో మెరిశాడు. ఇంగ్లండ్తో జరిగిన చివరి వన్డేలో 39 ఏళ్ల రోహిత్ 110 బంతుల్లో 138 పరుగులతో రాణించాడు. అయితే ఇంగ్లండ్తో వన్డే సిరీస్ సమయంలోనే అతడి రిటైర్మెంట్పై ఊహాగానాలు వచ్చాయి. రోహిత్ శర్మ తనపై వచ్చిన వార్తలను కొట్టిపారేయగా, బీసీసీఐ కూడా 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్ టీమిండియా జట్టులో సభ్యుడిగా ఉంటాడని కుండబద్దలు కొట్టడంతో రిటైర్మెంట్ వార్తలన్నీ పుకార్లేనని తేలిపోయింది. ఇక కోహ్లితో పాటు రోహిత్ 2027 వన్డే ప్రపంచకప్ ఆడనున్నాడు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న వన్డే ప్రపంచకప్ వచ్చే ఏడాది అక్టోబర్-నవంబర్లో జరగనుంది. ఇక రోహిత్ శర్మ సెప్టెంబర్లో వెస్టిండీస్తో జరగనున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో దర్శనమివ్వనున్నాడు. Great bumping into a relaxed Shaaaarma on a stroll in London @ImRo45 pic.twitter.com/g3NSLef3n5— Ravi Shastri (@RaviShastriOfc) July 31, 2026His transformation is WOW. He is definitely aiming- The unfinished man is more dangerous than a new potential man.— Vinod Joshi (@Vinod_Joshii) July 31, 2026Rohit looks young, just like before pic.twitter.com/sqxZLQpwOv— GB (@GB80000) July 31, 2026చదవండి: ఇటలీ దిగ్గజ ఫుట్బాలర్ కన్నుమూత -
ఇటలీ దిగ్గజ ఫుట్బాలర్ కన్నుమూత
ఫుట్బాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇటలీ దిగ్గజ ఫుట్బాలర్ ఫ్రాంకో బరెసి (66) కన్నుమూశారు. ఫుట్బాల్లో బెస్ట్ డిఫెండర్స్లో ఒకడిగా పేరు పొందిన ఫ్రాంకో బరెసి ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. 1982లో ఫిఫా ప్రపంచకప్ విజేతగా నిలిచిన ఇటలీ జట్టులో ఫ్రాంకో సభ్యుడిగా ఉన్నాడు. 22 ఏళ్ల వయసులోనే ఇటలీ జాతీయ జట్టుకు కెప్టెన్గా ఎంపికై ఫ్రాంకో బరెసి చరిత్ర సృష్టించాడు.ఇటలీలోని ట్రావగ్లియాటో అనే చిన్న పట్టణంలో 1960 మే 8న జన్మించిన బరేసి, చిన్నతనంలోనే తల్లిందడ్రులను కోల్పోయారు. అనాథగా ఎన్నో కష్టాలను దాటుకొని అత్యుత్తమ ఫుట్బాలర్గా ఎదిగిన తీరు అందరికి ఆదర్శం. ఇక ఫ్రాంకో ఏడుసార్లు బాలన్ డి'ఓర్కు నామినేట్ అయ్యి, 1989లో రెండో స్థానంలో నిలిచారు. 2013లో ఇటాలియన్ ఫుట్బాల్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్నారు.మూడు ఫిఫా ప్రపంచకప్లుఫ్రాంకో బరేసీ తన మొత్తం ప్రొఫెషనల్ కెరీర్లో ఏసీ మిలాన్, ఇటలీ రెండు జట్లకు మాత్రమే ప్రాతినిధ్యం వహించాడు. ఆయన ఇటలీ తరపున 81 మ్యాచ్లు ఆడాడు. అందులో 1982, 1990, 1994 మూడు ఫిఫా ప్రపంచ కప్లలో ఇటలీకి ప్రాతినిధ్యం వహించాడు. ముఖ్యంగా 1994 ప్రపంచ కప్లో జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి ఫైనల్కు చేర్చాడు. అయితే ఫైనల్లో ఇటలీ పోరాడి ఓడిపోయింది. ఫైనల్లో బ్రెజిల్ పెనాల్టీ షూటౌట్లో 3-2తో ఇటలీపై నెగ్గి టైటిల్ను ముద్దాడింది.ఒకే ఫుట్బాల్ క్లబ్కు ప్రాతినిధ్యంఫ్రాంకో బరేసి తన జీవితంలో ఇటలీ జాతీయ జట్టుతో పాటు ఒకే ఫుట్బాల్ క్లబ్కు ఆడడం విశేషం. వరుసగా 20 సీజన్ల పాటు ఏసీ మిలాన్ క్లబ్కే తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఈ సమయంలో ఆరు సెరీ ఏ (స్కూడెట్టోలు), మూడు యూరోపియన్ కప్లు, రెండు ఇంటర్కాంటినెంటల్ కప్లు, రెండు యూఈఎఫ్ఏ సూపర్ కప్లు, నాలుగు ఇటాలియన్ సూపర్ కప్లు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 1997లో ఆయన కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆయన గౌరవార్థం ఏసీ మిలాన్ ఆయన ప్రసిద్ధ నంబర్ 6 జెర్సీని శాశ్వతంగా రిటైర్ చేసింది. ఆయన 2020 నుంచి క్లబ్ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతూ వస్తున్నారు. తాజాగా ఫ్రాంకో మరణవార్త ఫుట్బాల్ అభిమానులను విషాదంలోకి నెట్టివేసింది. ఇక గతంలో నాలుగుసార్లు ఫిఫా చాంపియన్గా నిలిచిన ఇటలీ 2026 ఫిఫా ప్రపంచకప్కు అర్హత సాధించడంలో విఫలమైంది. ఇటలీ గతంలో 4 సార్లు (1934, 1938, 1982, 2006) ఫిఫా ప్రపంచకప్ టైటిల్స్ను కైవసం చేసుకుంది. One of the greatest defenders of all time.Here's Franco Baresi in the 1994 World Cup final at 34-years-old, putting in an incredible performance 24 days after suffering a severe meniscus tear that required surgery. RIPpic.twitter.com/s8sPRil1Rs— 90s Football (@90sfootball) July 31, 2026United in remembrance ❤️In Perth, Rúben Amorim, his staff and the entire team observed a minute of silence in memory of Franco Baresi ❤️ pic.twitter.com/Btbhv017tM— AC Milan (@acmilan) July 31, 2026La Storia del Milan è in lacrime per la scomparsa di Franco Baresi. Il suo esempio e la sua profondità saranno, per sempre come la sua maglia numero 6, parte integrante e fondamentale del DNA e del cammino di tutto il Club. Le condoglianze che AC Milan porge alla famiglia tutta… pic.twitter.com/a8wNOCUc2o— AC Milan (@acmilan) July 31, 2026Read: శతక్కొట్టిన లంక బ్యాటర్.. చిత్తుగా ఓడిన పాకిస్తాన్ -
శతక్కొట్టిన లంక బ్యాటర్.. చిత్తుగా ఓడిన పాకిస్తాన్
సొంతగడ్డపై శ్రీలంక మహిళల జట్టు గర్జించింది. డంబుల్లా వేదికగా జరిగిన తొలి టీ20లో శ్రీలంక ఓపెనర్ ఇమేషా దులాని (64 బంతుల్లో 101 నాటౌట్) అజేయ సెంచరీ చేయడంతో పాకిస్తాన్పై ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఇమేషాకు తోడుగా కెప్టెన్ చమేరి ఆటపట్టు (22 బంతుల్లో 39) రాణించడంతో పాక్ విధించిన 177 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పాక్ బౌలర్లలో నష్రా సంధు 2 వికెట్లు తీసింది.కాగా తన టీ20 కెరీర్లో తొలి సెంచరీ సాధించి ఇమేషా దులాని లంక తరఫున టీ20 క్రికెట్లో సెంచరీ సాధించిన రెండో మహిళా క్రికెటర్గా నిలిచింది. ఇంతకముందు 2024లో మలేషియాతో జరిగిన మ్యాచ్లో చమేరి ఆటపట్టు (119 నాటౌట్) లంక తరఫున శతక్కొట్టిన తొలి వుమెన్ బ్యాటర్గా నిలిచింది. సమరవిక్రమ (86 నాటౌట్, 2024లో ఐర్లాండ్పై) మూడో స్థానంలో ఉంది.అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ వుమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఓపెనర్లు షావాల్ జుల్ఫికర్ (41 బంతుల్లో 63) అర్ధసెంచరీ చేయగా, మునీబా అలీ (24 బంతుల్లో 42) రాణించింది. ఎమన్ నసీర్ (21), అయేషా జఫర్ (17) పర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో కవిషా దిల్హరి 2 వికెట్లు తీయగా, కాయా కవింది, సుగందిక, చమోడి ప్రబోద తలా ఒక వికెట్ తీశారు. ఇరుజట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ఆదివారం జరగనుంది. A sensational unbeaten century! 💯🔥Imesha Dulani stands tall with a magnificent 101* runs, guiding Sri Lanka Women with a classy batting masterclass. 🇱🇰🏏#SriLankaCricket #SLvPAK pic.twitter.com/2aMMTCsbtx— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 31, 2026చదవండి: CWG 2026: ఫైనల్లో ప్రీతి.. బాక్సింగ్లో పతకం ఖాయం -
అందుకే వైస్ కెప్టెన్గా వైభవ్: కుండబద్దలు కొట్టిన సెలక్టర్
టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి దక్కిన ప్రమోషన్ పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పదిహేనేళ్ల ఈ బిహారీ పిల్లాడు ప్రతిష్టాత్మక దులిప్ ట్రోఫీ టోర్నీలో ఈస్ట్ జోన్కు వైస్ కెప్టెన్గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఇషాన్ కిషన్ సారథ్యంలో వైభవ్ అతడికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు.అయితే, వైభవ్ సూర్యవంశీకి ఏకంగా వైస్ కెప్టెన్గా బాధ్యతలు ఇవ్వడం పట్ల కామెంటేటర్ హర్షా భోగ్లే అభ్యంతరం వ్యక్తం చేశాడు. రెడ్బాల్ క్రికెట్లో పెద్దగా అనుభవం లేని పిల్లాడిని కీలక పదవికి ఎలా ఎంపిక చేస్తారని సెలక్టర్లను ప్రశ్నించాడు. అందుకే అతడిని వైస్ కెప్టెన్ని చేశాముఈ నేపథ్యంలో ఒడిశా మాజీ క్రికెటర్, ఈస్ట్ జోస్ సెలక్షన్ కమిటీలో భాగమైన ప్రవంజన్ ములిక్ స్పందించాడు. క్రిక్బజ్తో మాట్లాడుతూ.. ‘‘వైభవ్ను కెప్టెన్గా నియమించలేదు కదా!.. అతడు ఇప్పుడు కేవలం వైస్ కెప్టెన్ మాత్రమే. ఆ జట్టుకు ఇషాన్ కిషన్ సారథి. అయితే, ఇషాన్ వికెట్ కీపర్ కూడా!రోజంతా ఇషాన్ యాక్టివ్గానే ఉంటాడు. కాబట్టి వైభవ్కు పెద్దగా పనేమీ ఉండదు. అయితే, ఇషాన్కు డిప్యూటీగా అతడు ఎంతో కొంత నేర్చుకుంటాడు. మరింత పరిణతి సాధిస్తాడు. అందుకే అతడిని వైస్ కెప్టెన్గా ఎంపిక చేశాము. ఏదో ఒకరోజు టీమిండియా కెప్టెన్ అవుతాడుదులిప్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలో ఉప నాయకుడిగా ఉండటం గొప్ప అవకాశం. అతడు టీమిండియా తరఫున బాగా ఆడాలని కోరుకుంటున్నాడు. మేము కూడా యువ ఆటగాళ్లకు సరైన సమయంలో అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నాము. ఎవరికి తెలుసు.. ఏదో ఒకరోజు వైభవ్ టీమిండియా కెప్టెన్ కూడా అవ్వొచ్చు.ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకునే మేము అతడికి వైస్ కెప్టెన్గా అవకాశం ఇచ్చాము. ఇంతకు ముందు భారత అండర్-19 జట్టుకు, బిహార్ ఫస్ట్క్లాస్ క్రికెట్ జట్టుకు అతడు వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు. దులిప్ ట్రోఫీ సందర్భంగా జాతీయ సెలక్టర్లు అతడి ఆటను తప్పక పరిశీలిస్తారు. అతడు త్వరలోనే భారత టెస్టు జట్టుకు కూడా ఎంపికయ్యే అవకాశాలు లేకపోలేదు కదా!’’ అని ప్రవంజన్ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు.చదవండి: టీమిండియాకు శుభవార్త -
CWG 2026: ఫైనల్లో ప్రీతి.. బాక్సింగ్లో పతకం ఖాయం
కామన్వెల్త్ గేమ్స్లో భారత మహిళా బాక్సర్ ప్రీతి పవార్ దేశానికి పతకం ఖాయం చేసింది. సెమీస్ చేరినప్పుడే పతకం ఖాయమైనప్పటికీ తాజాగా మహిళల 54 కేజీల విభాగంలో ప్రపంచ మూడో ర్యాంకర్ ప్రీతి పవార్ ఫైనల్లో అడుగుపెట్టడంతో భారత్ ఖాతాలో స్వర్ణం లేదా రజతం ఖరారు కానుంది. శుక్రవారం మహిళల 54 కేజీల విభాగంలో సెమీఫైనల్లో ప్రీతి పవార్ 5-0తో జాంబియాకు చెందిన కేథరిన్ వేప్ను చిత్తుగా ఓడించి ఫైనల్కు చేరుకుంది. స్వర్ణ పతకం కోసం జరిగే పోరులో కెనడాకు చెందిన స్కార్లెట్ డెల్గాడోతో తలపడనుంది. ఫైనల్లో ప్రీతి ఓడినప్పటికీ భారత్కు రజతం దక్కనుంది. హర్యానాలోని భివానీకి చెందిన ప్రీతి పవార్ 2022 ఆసియా గేమ్స్లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. సెమీస్లో విజయం తర్వాత ప్రీతి పవార్ మాట్లాడుతూ.."నేను అనుకున్నది సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. స్వర్ణ పతకం గెలవడానికి రేపు నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలి. నేను నా పోటీదారులను ఎప్పుడూ తక్కువ అంచనా వేయను. కామన్వెల్త్ గేమ్స్లో నా ప్రతీ ఫైట్కు ముందు కోచ్తో పర్యవేక్షణలో ప్రత్యేకంగా సన్నద్ధమవుతాను. ఆ ప్రణాళికలను సరిగ్గా అమలు చేయగలుగుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది.'' అని ప్రీతి పవార్ తెలిపింది.జూడో క్వార్టర్స్లో భారత ప్లేయర్లుజూడోలో రోహిత్ బసిర్, శ్రద్ధా చొపాడేలు క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టారు. మొజాంబిక్కు చెందిన సామ్యూల్ రిబెరియోను ఇప్పోన్ ద్వారా ఓడించి క్వార్టర్స్ బెర్తును ఖరారు చేసుకున్నాడు. మరోవైపు జేన్ మసాక్వియోను ఇప్పోన్లో ఓడించిన శ్రద్ధా కూడా క్వార్టర్స్ చేరుకుంది. VIDEO | Glasgow, Scotland: Indian boxer Preeti Pawar in 54 kg category sailed into the Commonwealth Games final by out-punching Zambia's Catherine Mwape in the last-four stage.She says, "I am very happy that I have managed to do what I prepared for. I have to give my best… pic.twitter.com/O1pRkyvgF0— Press Trust of India (@PTI_News) July 31, 2026Read: క్యాచ్ మిస్ కొంపముంచింది.. జట్టును గెలిపించిన జెమీమా! -
టీమిండియాకు శుభవార్త
శ్రీలంకతో టెస్టు సిరీస్కు ముందు టీమిండియాకు శుభవార్త అందింది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. లంక పర్యటనకు అతడు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారి ఒకరు ఈ విషయాన్ని ధ్రువీకరించారు.పీటీఐతో సదరు అధికారి మాట్లాడుతూ.. ‘‘జస్ప్రీత్ బుమ్రా మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందాడు. శ్రీలంకతో రెండు టెస్టులకు అతడు అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నాం. జట్టు ప్రణాళికల్లో భాగంగా అతడు రెండు మ్యాచ్లు ఆడే అవకాశాలు ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. కీలక సిరీస్..కాగా ఆగష్టు 15 నుంచి 27 మధ్య టీమిండియా శ్రీలంకతో రెండు టెస్టు మ్యాచ్లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు గాలె, కొలంబో వేదికలు. ప్రపంచకప్ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సైకిల్లో ఈ సిరీస్ భాగం. ప్రస్తుత సమీకరణల దృష్ట్యా టీమిండియా ఫైనల్ రేసులో ఉండాలంటే.. మిగిలి ఉన్న తొమ్మిది టెస్టుల్లో కచ్చితంగా ఏడు విజయాలు సాధించాలి.ఈ నేపథ్యంలో శ్రీలంకను 2-0తో వైట్వాష్ చేయడం టీమిండియా ప్రస్తుత ప్రధాన లక్ష్యంగా మారింది. ఆ తర్వాత న్యూజిలాండ్తో తలపడాల్సి ఉంది కాబట్టి లంక గడ్డ మీద విజయాలు సాధిస్తే ఒత్తిడి కాస్త తగ్గుతుంది. ఇలాంటి కీలక సిరీస్లో ప్రధాన బుమ్రా ఫిట్నెస్ ఆధారంగా ఆడతాడని బీసీసీఐ తొలుత తెలిపింది.గాయాల బెడదఇక ఇప్పటికే యువ ఆటగాళ్లు హర్షిత్ రాణా, నితీశ్ రెడ్డి గాయాల వల్ల జట్టుకు దూరం కాగా.. వాషింగ్టన్ సుందర్ ఇంకా కోలుకోని కారణంగా శ్రీలంకతో తొలి టెస్టుకు దూరమయ్యాడు. కాగా బుమ్రా సైతం మోకాలి గాయం వల్ల ఇంగ్లండ్తో ఆఖరిదైన మూడో వన్డేకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం అతడు గాయం నుంచి కోలుకోవడంతో టీమిండియా ఊపిరిపీల్చుకుంది.శ్రీలంకతో టెస్టు సిరీస్కు భారత జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవ్దత్ పడిక్కల్, సారాంశ్ జైన్.చదవండి: ఇదేం బ్యాటింగ్ బ్రో! -
క్యాచ్ మిస్ కొంపముంచింది.. జట్టును గెలిపించిన జెమీమా!
హండ్రెడ్ వుమెన్స్ కాంపిటీషన్ 2026లో భారత బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ విధ్వంసం జోరుగా కొనసాగుతోంది. టోర్నీలో సదరన్ బ్రేవ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జెమీమా వరుసగా మూడో మ్యాచ్లోనూ మెరిసింది. గురువారం రాత్రి బర్మింగ్హమ్ ఫోనిక్స్తో జరిగిన మ్యాచ్లో 24 పరుగుల తేడాతో సదరన్ బ్రేవ్ వరుసగా నాలుగో విజయాన్ని అందుకొని టేబుల్ టాపర్లుగా నిలవగా, ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ ఓటమి చవిచూసిన బర్మింగ్హమ్ మాత్రం విజయం కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తూనే ఉంది. అయితే సదరన్ బ్రేవ్ విజయంలో జెమీమా మరోసారి కీలకపాత్ర పోషించింది. ఆఖర్లో బ్యాటింగ్కు వచ్చిన జెమీమా 18 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 28 పరుగులతో అజేయంగా నిలిచింది. అయితే క్రీజులోకి వచ్చిన వెంటనే క్యాచ్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న జెమీమా తనకు వచ్చిన రెండో చాన్స్ను రెండు చేతులా ఒడిసిపట్టింది. మూడు ఫోర్లతో చివర్లో సదరన్ బ్రేవ్ భారీ స్కోరు చేయడంలో సహాయపడింది. ఒకవేళ జెమీమా ఆరంభంలోనే ఔటయ్యి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన సదరన్ బ్రేవ్ వుమెన్ జట్టు 100 బంతుల్లో 3 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ఓపెనర్లు మయియా బౌచర్ (31 బంతుల్లో 45), లిజెల్లే లీ (28 బంతుల్లో 43) ధాటిగా ఆడారు. వీరిద్దరు ఔటైన తర్వాత జెమీమా (18 బంతుల్లో 28 నాటౌట్) అజేయంగా నిలిచింది. బర్మింగ్హమ్ బౌలర్లలో లారెన్ ఫైలర్, అలానా కింగ్, అలిస్ కాప్సీ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బర్మింగ్హమ్ ఫోనిక్స్ 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 116 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ డేవినా పెర్రిన్ (43 బంతుల్లో 52) అర్ధసెంచరీ వృథాగా మారగా, టామీ బ్యూమౌంట్ (22) పర్వాలేదనిపించింది. సదరన్ బౌలర్లలో సోఫీ మొలినెక్స్ రెండు వికెట్లు తీయగా, టిల్లీ కొర్టీన్, సారా గ్లెన్, లారెన్ బెల్లు తలా ఒక వికెట్ తీశారు. Never give #JemimahRodrigues a second chance! 🫣She powered three boundaries to wrap up the innings on a high for Southern Brave! ⚡#TheHundred 2026 👉 Southern Brave vs Birmingham Phoenix | LIVE NOW pic.twitter.com/KqBGgsVVen— Star Sports (@StarSportsIndia) July 30, 2026Read: రహానే వీడ్కోలుపై లేటుగా స్పందించిన రోహిత్! -
రహానే వీడ్కోలుపై లేటుగా స్పందించిన రోహిత్!
అజింక్య రహానే రిటైర్మెంట్పై భారత సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మ ఆలస్యంగా స్పందించాడు. రోహిత్తో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా రహానేకు బెస్ట్ విషెస్ చెప్పాడు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ.. రహానేతో కలిసి గడిపిన రోజులను గుర్తు చేసుకుంటూ భావోద్వేగంతో స్పందించాడు. 'మేమిద్దరం చాలా ఏళ్ల పాటు డ్రెస్సింగ్ రూమ్ను పంచుకున్నాం. రహానే ఎంత కష్టపడతాడో నాకు బాగా తెలుసు. నువ్వు సాధించిన విజయాలు అద్భుతం. నీ నిబద్ధత, వృత్తిపట్ల అంకితభావం నిజంగా ప్రత్యేకమైనవి. అద్భుతమైన కెరీర్కు అభినందనలు. నీ భవిష్యత్తు మరింత విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్' అని రోహిత్ వెల్లడించాడు.ఇక టీమిండియా టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్ కూడా రహానేకు భావోద్వేగ సందేశం పంపాడు. 'అజ్జూ భాయ్.. నీతో కలిసి మైదానంలోనూ, డ్రెస్సింగ్ రూమ్లోనూ గడపడం నాకు గౌరవంగా భావిస్తున్నా. నీ ప్రశాంత స్వభావం, ఆటపట్ల అంకితభావం అద్భుతం. నువ్వు ఎప్పుడూ మాకు స్ఫూర్తిగా నిలిచావు. నీ జీవితంలోని రెండో ఇన్నింగ్స్ కూడా అంతే విజయవంతంగా, సంతోషంగా సాగాలని నీకు, నీ కుటుంబ సభ్యులకు ఇదే నా ప్రత్యేక శుభాకాంక్షలు' అని సూర్య చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రహానే హండ్రెడ్ కాంపిటీషన్లో కామెంటేటర్గా వ్యవహరిస్తున్నాడు. అక్కడి నుంచే తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా రిటైర్మెంట్ వార్తను పంచుకున్నాడు. జెర్సీ నెంబర్ 278కి వీడ్కోలు అంటే రహానే ఒక వీడియోను సోషల్మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఆ తర్వాత తన రిటైర్మెంట్పై భావోద్వేగ సందేశాన్ని వినిపించాడు. ఈ సందర్భంగా అతడి సహచరులు, దిగ్గజ క్రికెటర్లు రహానే కెరీర్ను కొనియాడుతూ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.ఫస్ట్ క్లాస్లో నిలకడగా రాణించిన రహానే 2013లో ఆస్ట్రేలియాపై మ్యాచ్తో టెస్టులో అరంగేట్రం చేశాడు. తన డిఫెన్స్, నిబద్ధతో రహానే అనతికాలంలోనే జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో రహానే 85 టెస్టుల్లో 5,077 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 26 అర్ధసెంచరీలున్నాయి. ఇక 90 వన్డే మ్యాచ్ల్లో 2,962 పరుగులు సాధించిన రహానే ఖాతాలో మూడు సెంచరీలు, 24 అర్ధశతకాలు ఉన్నాయి. టీ20 క్రికెట్లో 20 మ్యాచ్లాడిన రహానే 375 పరుగులు సాధించాడు. ఇందులో ఒక ఫిఫ్టీ ఉంది. We've shared the dressing room for so many years and I know how much hard work has gone into everything you've achieved. Your commitment and professionalism have always set you apart. Congratulations on a wonderful career. Best wishes! @ajinkyarahane88 pic.twitter.com/r7eXb1yrUz— Rohit Sharma (@ImRo45) July 30, 2026Read: పక్కలో బల్లెంలా తయారయ్యాడు.. పంత్ కెరీర్కు ఎండ్కార్డ్! -
టీమిండియా ‘కాషాయ’ జెర్సీ వివాదంలో ట్విస్ట్!
హాకీ ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనే భారత పురుషుల, మహిళల జట్ల కోసం హాకీ ఇండియా రూపొందించిన కొత్త జెర్సీ వివాదంలో మరో మలుపు చోటు చేసుకుంది. ఈ విషయం గురించి వివరణ ఇవ్వాల్సిందిగా హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కి ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులకు లేఖ రాశాడు.కాగా సుదీర్ఘ కాలంగా నీలం రంగు జెర్సీలోనే భారత జట్టు బరిలోకి దిగుతుండగా... ఈసారి మాత్రం జెర్సీని పూర్తిగా కాషాయ రంగులోకి మార్చారు. దీంతో రాజకీయంగానూ ఇది వివాదానికి దారితీసింది. ఒడిషా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్.. ప్రస్తుతం ఒడిషాలో బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి వల్లే ఈ మార్పు జరిగి ఉంటుందని ఆరోపించారు.ఇక కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా సైతం జెర్సీ రంగు కాషాయంలోకి మారడం వెనుక రాజకీయ కోణం ఉందని ఆరోపించారు. అయితే, హాకీ ఇండియా మాత్రం తమ నిర్ణయాన్ని సమర్థించుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కి ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్లకు రాసిన లేఖ సంచలనంగా మారింది.ఈ మేరకు.. ‘‘భారత జాతీయ హాకీ జట్టు జెర్సీ రంగులో మార్పు గురించి చర్చించాలనుకుంటున్నాను. ఎగ్జిక్యూటివ్ బోర్డు ముందు ప్రతిపాదన లేకుండానే.. నా దృష్టికి రాకుండానే ఈ నిర్ణయం జరిగిపోయిందనిపిస్తోంది.జెర్సీని కాషాయ రంగులోకి మార్చడం ఒక్కటే నా లేఖకు కారణం కాదు. ఇది దేశానికి ప్రాతినిథ్యం వహించే జాతీయ జట్టు గుర్తింపుతో ముడిపడి ఉన్న అంశం. ఇలాంటి ప్రాధాన్య అంశం గురించి ఎన్నికైన నాయకత్వం వద్ద చర్చించకపోవడం సరికాదు.ఈ విషయం గురించి మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. దురదృష్టవశాత్తూ రాజకీయంగానూ ఇది చర్చనీయాంశంగా మారింది. ప్రపంచకప్ టోర్నీకి సమయం ఆసన్నమవుతున్న వేళ ఇలాంటి రచ్చ జరుగుతోంది.అయితే, ఇది కేవలం క్రీడాపరంగా మాత్రమే తీసుకున్న నిర్ణయమని నేను స్పష్టం చేయాలనుకుంటున్నా. ఒడిషా ప్రభుత్వం ఈ విషయం గురించి నన్ను వివరణ కోరింది. కాబట్టి హాకీ ఇండియా అధికారులు నాకు వివరణ ఇవ్వాల్సి ఉటుంది.కొత్త జెర్సీ రంగు ఎంపిక వెనుక కారణం, రంగు మార్పు ప్రక్రియ, ఎలాంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయాన్ని ఆమోదించారు. దీనిని ఎలా అమలు చేశారన్న అంశాలపై నాకు వివరణ కావాలి’’ అని టిర్కి తన లేఖలో పేర్కొన్నాడు. జెర్సీ రంగు మార్పు గురించి బహిరంగంగా ప్రకటన చేసేందుకు ముందుగా తనకు గానీ, ఎగ్జిక్యూటివ్ బోర్డుకు గానీ ఎందుకు తెలపలేదని ప్రశ్నించాడు. -
టీమ్లో సెలెక్ట్ చేయలేదని యువ క్రికెటర్ ఆత్మహత్య
మైదానంలో బ్యాట్ పట్టి దేశం మెచ్చే క్రికెటర్గా ఎదగాలని, అమ్మానాన్నల కళ్లలో ఆనందం చూడాలని ఆ అమ్మాయి ఎన్నో కలలు కనింది. కానీ సెలక్టర్లు తీసుకున్న నిర్ణయం ఆమె ఆశలను అడియాసలు చేసింది. జట్టులో చోటు దక్కలేదన్న మనస్తాపంతో.. కేవలం 17 ఏళ్లకే తన ఆశల ప్రయాణానికి ముగింపు పలుకుతూ ప్రాణాలు తీసుకుంది. ఈ విషాదకర సంఘటన నాగ్పూర్లోని బజాజ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని అకోలా జిల్లాకు చెందిన అదితి చౌఖాండే ఇటీవల ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. అయితే అదితికి తన చిన్నతనం నుంచి క్రికెట్పై మక్కువ ఎక్కువ. తన అన్నయ్యకు కూడా క్రికెట్ అంటే పిచ్చి. కానీ వారు నివసించే అకోలాలో మంచి క్రికెట్ అకాడమీలు లేకపోవడంతో, వారిద్దరూ రెండేళ్ల కిందట నాగపూర్కు మకాం మార్చారు. వారి తండ్రి వృత్తి రీత్యా అకోలాలో ఉండిపోయినప్పటికి.. తల్లి మాత్రం పిల్లలతో పాటు నాగపూర్కు వెళ్లింది. అప్పటి నుంచి అదితి స్ధానికంగా ఓ క్రికెట్ ఆకాడమీలో శిక్షణపొందుతోంది. ఆమె గత రెండేళ్ల నుంచి కఠోర సాధన చేస్తూ.. క్రికెట్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలలు కనేది. అయితే బుధవారం రాత్రి అదితి తల్లితో కలిసి భోజనం చేసిన అనంతరం తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది.ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా.. ఆమె ఫ్యాన్కు ఊరి వేసుకుని కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్ధలానికి చేరుకున్నారు. పోలీసులు ఆమె గదిలో ఒక సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. తాను పెద్ద జట్టుకు ఎంపిక కాకపోవడం వల్ల తల్లిదండ్రులను గర్వపడేలా చేయలేకపోతున్నానని అదితి అందులో తన బాధను వ్యక్తం చేసింది. అంతేకాకుండా తన అన్నయ్యను ఉద్దేశించి కూడా ఆ లెటర్లో ఆమె భావోద్వేంగా రాసుకొచ్చింది.ప్రియమైన అన్నయ్యా.. నువ్వు నాకంటే చాలా బాగా ఆడతాడు. భవిష్యత్తులో గొప్ప క్రికెటర్ అవుతావు నేను నమ్ముతున్నా. . మన తల్లిదండ్రులు గర్వపడేలా చెయ్. నేను ఎంపిక కాలేకపోయినందుకు చాలా బాధగా ఉంది" అని ఆ లేఖలో పేర్కొంది. ఉన్నత స్థాయి జట్టులో చోటు దక్కకపోవడమే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని ఇన్స్పెక్టర్ చేతన్ చౌహాన్ తెలిపారు. కాగా ఇటీవల విదర్భ క్రికెట్ అసోసియేషన్ ఓ టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో ఆమెకు చోటు దక్కకపోవడమే ఇందుకు కారణమని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. -
అన్నీ తెలిసి అలా మాట్లాడతావా?: విండీస్ స్టార్ ఫైర్
వెస్టిండీస్ హెడ్కోచ్ డారెన్ సామీ వ్యాఖ్యలపై ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ అల్జారీ జోసెఫ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన గురించి అవాస్తవాలు మాట్లాడటం సరికాదని హితవు పలికాడు. అన్నీ తెలిసి కూడా సామీ తనపై ఎందుకు నింద వేశాడో అర్థం కావడం లేదన్నాడు.కాగా వెస్టిండీస్ ప్రస్తుతం స్వదేశంలో పాకిస్తాన్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య తొలి టెస్టులో విండీస్.. పాక్ను 90 పరుగుల తేడాతో చిత్తు చేసి.. సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.ఇదిలా ఉంటే.. ఈ సిరీస్కు అల్జారీ జోసెఫ్ దూరమయ్యాడు. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ వ్యక్తిగత కారణాల వల్లే అతడు ఈ సిరీస్ ఆడటం లేదని విండీస్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. అయితే, హెడ్కోచ్ డారెన్ సామీ మాత్రం భిన్నంగా స్పందించాడు. అల్జారీ జోసెఫ్ సెలక్షన్కు అందుబాటులో లేకుండా పోయాడని.. పాక్తో ఆడటానికి అతడు నిరాకరించాడనే విధంగా వ్యాఖ్యలు చేశాడు.ఈ విషయంపై అల్జారీ జోసెఫ్ తాజాగా స్పందించాడు. జోజో స్పోర్ట్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఈ సిరీస్కు ముందు హెడ్కోచ్తో నేను చర్చించాను. విండీస్ బోర్డుతో కూడా మాట్లాడాను. ఆ సమయంలోనే బోర్డు నేను వ్యక్తిగత కారణాల వల్ల దూరమయ్యానని ప్రకటించింది.మరి అన్ని విషయాలు తెలిసి కూడా సామీ ఆ విధంగా ఎందుకు మాట్లాడాడో నాకు అర్థం కావడం లేదు. అతడి వ్యాఖ్యలు దేనికి దారితీస్తాయో తెలుసు. తెలిసీ ఇలా మాట్లాడటం ఎందుకు?.. నిజానికి ఈ ఏడాది నేను ఆటకు దూరంగానే ఉన్నాను. కండరాల నొప్పి కారణంగా శరీరం సహకరించడం లేదు.టెస్టు సిరీస్ ఆడేందుకు నేను ఏమాత్రం సిద్ధంగా లేను. అయినా సరే సామీ ఆ వివాదాస్పద స్టేట్మెంట్ ఇచ్చాడు. సమయం సందర్భం లేకుండా ఇలా ఎలా మాట్లాడగలరు?’’ అని అల్జారీ జోసెఫ్ సామీ వ్యాఖ్యల్ని ఖండించాడు. ఫిట్నెస్ సమస్యల కారణంగానే తాను పాకిస్తాన్తో టెస్టు సిరీస్కు దూరంగా ఉన్నట్లు స్పష్టం చేశాడు. -
టీమిండియా యువ క్రికెటర్ సంచలన నిర్ణయం!
టీమిండియా యువ ఆల్రౌండర్ మానవ్ సుతార్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. 23 ఏళ్ల సుతార్ తిరిగి ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో వార్విక్షైర్ తరపున ఆడేందుకు సిద్దమయ్యాడు. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ముగిసిన వెంటనే అతడి ఇంగ్లండ్కు పయనం కానున్నాడు. ఈ విషయాన్ని వార్విక్షైర్ క్రికెట్ క్లబ్ ఎక్స్ వేదికగా ధ్రువీకరించింది. ప్రస్తుతం జరుగుతున్న కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ వన్ టోర్నీలో వార్విక్షైర్ ఆడే చివరి 4 మ్యాచ్లకు మానవ్ అందుబాటులో ఉండనున్నాడు. కాగా ఈ సీజన్ ఆరంభంలోనూ వార్విక్షైర్ తరఫున మానవ్ రెండు మ్యాచ్లు ఆడాడు. సమర్సెట్తో జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. యార్క్షైర్తో మ్యాచ్లోనూ తన స్పిన్ మయాజాలాన్ని ప్రదర్శించాడు. మొత్తంగా రెండు మ్యాచ్ల్లో 11 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఈ రాజస్తాన్ స్పిన్నర్ బ్యాటింగ్లో కూడా 98 పరుగులు చేశాడు. మళ్లీ ఇప్పుడు ఇంగ్లీష్ గడ్డపై ఇరగదీసేందుకు సుతార్ ఉవ్విళ్లూరుతున్నాడు.అరంగేట్రంలో అదుర్స్కాగా మానవ్ సుతార్ గత నెలలో ముల్లాన్పూర్ వేదికగా అఫ్గానిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత్ తరపున అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్లోనే అతడు అదరగొట్టాడు. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ రాణించాడు. డెబ్యూ మ్యాచ్లోనే 5 వికెట్ల హాల్ సాధించి అందరి ప్రశంసలను అందుకున్నాడు. ఈ క్రమంలోనే సుతార్ను రవీంద్ర జడేజా అందుబాటులో వచ్చినప్పటికి శ్రీలంక పర్యటనకు ఎంపిక చేశారు. అతడికి తుది జట్టులో కూడా చోటు దక్కే అవకాశముంది.చదవండి: LPL 2026: ఇదేమి బ్యాటింగ్ బ్రో? అక్కడ కూడా పరువు తీస్తున్నావుగా? -
వన్డే వరల్డ్కప్-2027: భారత జట్టులో ఊహించని పేరు!
వచ్చే ఏడాది మరో ఐసీసీ మెగా టోర్నమెంట్ క్రికెట్ ప్రేమికులను అలరించనుంది. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా అక్టోబరు- నవంబరు మధ్య వన్డే ప్రపంచకప్-2027 నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మపైనే కళ్లన్నీ నిలిచాయి.రో-కో ఆడతారా?వీరిద్దరు ఈ మెగా టోర్నీ ఆడతారా? లేదా అన్న సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి. అయితే, ఇటీవల మంచి ఫామ్తో అలరిస్తున్న రో-కో తాము మాత్రం ప్రపంచకప్ టోర్నీకి సిద్ధంగా ఉన్నామని బలమైన సంకేతాలు ఇచ్చారు. యాజమాన్యం కూడా అనుభవానికి పెద్దపీట వేసి రోహిత్- కోహ్లిని ఆడించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.ఊహించని పేరు!ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వెటరన్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ను వన్డే ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనే భారత జట్టుకు ఎంపిక చేయాలని సెలక్టర్లకు విజ్ఞప్తి చేశాడు. సౌతాఫ్రికాలో భువీ సేవలు జట్టుకు అవసరమని అభిప్రాయపడ్డాడు.ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘అవును భువనేశ్వర్ కుమార్ ప్రపంచకప్ జట్టులో ఉండాలి. నేను అతడితో ఈ విషయం గురించి మాట్లాడతాను. దేశీ క్రికెట్లో భువీ అన్ని టోర్నీలు ఆడాలి. ఫస్ట్క్లాస్ క్రికెట్, వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ.. ఇలా అన్నీ ఆడాలి.అక్కడ సత్తా చాటితే సౌతాఫ్రికాకు తప్పక వెళ్లగలడు. అక్కడ జట్టుకు అతడి అవసరం ఎంతగానో ఉంటుంది’’ అని అశూ పేర్కొన్నాడు. కాగా 36 ఏళ్ల భువనేశ్వర్ కుమార్ 2022లో చివరగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత దేశీ క్రికెట్, ఐపీఎల్పై దృష్టి పెట్టిన భువీ.. ఆయా టోర్నీల్లో సత్తా చాటుతున్నాడు.నిలకడగా రాణిస్తున్న భువీముఖ్యంగా ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండు ట్రోఫీలు గెలవడంలో స్వింగ్ సుల్తాన్ భువీది కీలక పాత్ర. ఆర్సీబీ తరఫున 2025, 2026 సీజన్లలో కలిపి ఈ రైటార్మ్ పేసర్ 45 వికెట్లు కూల్చాడు. ఇక సౌతాఫ్రికాలో బౌన్సీ పిచ్లు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అశ్విన్ భువీని వరల్డ్కప్లో ఆడిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.వన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి అశూ ఎంచుకున్న భారత జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్రిజర్వు ప్లేయర్లు: యశస్వి జైస్వాల్, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా, అర్ష్దీప్ సింగ్.చదవండి: వైభవ్ను వైస్ కెప్టెన్గా ఎలా ఎంపిక చేస్తారు? -
ఇదేమి బ్యాటింగ్ బ్రో? అక్కడ కూడా పరువు తీస్తున్నావుగా?
లంకా ప్రీమియర్ లీగ్ (LPL)-2026లో క్యాండీ రాయల్స్ ప్లే ఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. గురువారం పల్లెకలే వేదికగా జాఫ్నా కింగ్స్తో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో 21 పరుగుల తేడాతో క్యాండీ రాయల్స్ ఓటమి పాలైంది. క్యాండీ ప్రస్తుతానికి నాలుగో స్ధానంలో ఉన్నప్పటికి వారి ప్లే ఆఫ్స్ భవితవ్యం దంబుల్లా సిక్సర్పై ఆధారపడి ఉంది. ఆదివారం జాఫ్నా కింగ్స్తో జరిగిన మ్యాచ్లో దంబుల్లా ఓటమిపాలైతే క్యాండీ ప్లే ఆఫ్స్ చేరేందుకు మార్గం సుగమవుతుంది.ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన జాఫ్నా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 221 పరుగుల భారీ స్కోరు సాధించింది. జాఫ్నా బ్యాటర్లలో చమిందు విక్రమసింహే(15 బంతుల్లో 43), కమిల్ మిశ్రా(26 బంతుల్లో 49) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. క్యాండీ బౌలర్లలో మొయిన్ అలీ, హసరంగా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. అవిష్క ఫెర్నాండో, జహీర్ ఖాన్ చెరో వికెట్ సాధించారు.చేతులేత్తేసిన శంకర్అనంతరం 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన క్యాండీ రాయల్స్కు ఓపెనర్లు లహిరు ఉదార(30), పవన్ సందేశ్(48) అద్భుతమైన ఆరంభం ఇచ్చారు. వీరిద్దరూ ఔటయ్యాక క్యాండీ వికెట్ల పతనం మొదలైంది. అయితే మధ్యలో షాహీన్ అఫ్రిది(14 బంతుల్లో 24), కెప్టెన్ హసరంగ(24) దూకుడుగా ఆడడంతో క్యాండీ తిరిగి గేమ్లోకి వచ్చింది. కానీ వీరిద్దరి వికెట్లను క్యాండీ వరుస ఓవర్లలో కోల్పోయింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన భారత మాజీ క్రికెటర్, క్యాండీ ఆల్రౌండర్ విజయ్ శంకర్ జిడ్డు బ్యాటింగ్ చేశాడు. గల్లీ క్రికెటర్ కంటే దారుణంగా ఆడుతూ ఫ్యాన్స్ను నిరాశపరిచాడు. ఈ విజయ్ శంకర్ చివరి ఓవర్ వరకు బ్యాటింగ్ చేసినప్పటికి జట్టును గెలిపించలేకపోయాడు. ఆఖరి ఓవర్లో క్యాండీ రాయల్స్ విజయానికి చివరి ఓవర్లో 22 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో విజయ్ శంకర్ ఉండగా.. మరోవైపు జాఫ్నా కెప్టెన్ బంతిని దిల్షాన్ మదుశంకకు అందించాడు. అయితే మదుశంక అద్భుతంగా బౌలింగ్ చేసి శంకర్కు చుక్కలు చూపించాడు. విజయ్ శంకర్ తొలి ఐదు బంతుల్లో కేవలం ఒక్క ఫోర్ కూడా బాదలేకపోయాడు. అలా అని నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న నువాన్ తుషారాకు స్ట్రైక్ ఇవ్వలేదు. స్ట్రైక్ తన వద్దే అంటి పెట్టుకుని తొలి ఐదు బంతులను డాట్ చేశాడు. ఆఖరి బంతికి ఔటై క్యాండీ ఓటమికి పరోక్షంగా కారణమయ్యాడు. 21 బంతులు ఎదుర్కొన్న విజయ్ శంకర్.. 3 ఫోర్ల సాయంతో 25 పరుగులు చేశాడు. దీంతో అతడిని నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇదేమి బ్యాటింగ్ అన్నా? శ్రీలంకలో కూడా పరువు తీస్తున్నావుగా? అంటూ ఓ యూజర్ ఎక్స్లో పోస్ట్ పెట్టాడు. కాగా భారత క్రికెట్తో పూర్తిగా తెగదింపులు చేసుకున్న విజయ్ శంకర్.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే క్యాండీ రాయల్స్కు అతడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. -
వైభవ్ సూర్యవంశీని వైస్ కెప్టెన్గా ఎలా ఎంపిక చేస్తారు?
టీమిండియా యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి ఊహించని ప్రమోషన్ దక్కింది. ఇటీవల జింబాబ్వే గడ్డ మీద టీ20 సిరీస్లో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన ఈ 15 ఏళ్ల కుర్రాడు... దులీప్ ట్రోఫీలో పాల్గొనే ఈస్ట్ జోన్ జట్టుకు ఎంపికయ్యాడు. ఏకంగా వైస్ కెప్టెన్గా అతడు నియమితుడయ్యాడు. అభిమానుల హర్షంభవిష్యత్తులో వైభవ్ను అన్ని ఫార్మాట్ల ప్లేయర్గా తీర్చిదిద్దే దిశగా ఇది తొలి అడుగు కానుంది. ఈ నేపథ్యంలో చిన్న వయసులోనే వైభవ్కు ప్రతిష్టాత్మక టోర్నీలోని జుట్టుకు ఉపనాయకుడిగా వ్యవహరించే అవకాశం రావడం పట్ల అభిమానులు హర్షం చేస్తున్నారు.అదే విధంగా.. ‘వైభవ్ పిన్న వయసులోనే ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్గా ఎంపికవడం బిహార్ క్రికెట్కు గర్వకారణం. అతడి అద్భుత ప్రదర్శనపై సెలక్టర్లు నమ్మకముంచారు’ అని బిహార్ రాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు హర్షవర్ధన్ కూడా సంతోషం వ్యక్తం చేశాడు.వైస్ కెప్టెన్గా ఎలా ఎంపిక చేస్తారు?అయితే, ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే మాత్రం ఈ విషయంపై భిన్నంగా స్పందించాడు. రెడ్బాల్ క్రికెట్లో అంతగా అనుభవం లేని ఈ పదిహేనేళ్ల పిల్లాడిని సీనియర్ జట్టుకు వైభవ్ను వైస్ కెప్టెన్గా ఎలా నియమిస్తారని సెలక్టర్ల నిర్ణయాన్ని ప్రశ్నించాడు.ఈ మేరకు ఎక్స్ వేదికగా.. ‘‘సీనియర్ రెడ్బాల్ జట్టుకు వైభవ్ సూర్యవంశీని వైస్ కెప్టెన్గా ఎంపిక చేయడానికి గల కారణం ఏమిటో నాకర్థం కావడం లేదు. నిజానికి ఈ విషయం నన్ను ఆశ్చర్యపరిచింది. అతడు ఇప్పటి వరకు రెడ్బాల్ క్రికెట్లో కేవలం 12 ఇన్నింగ్స్ ఆడి.. 207 పరుగులు చేశాడు.అతడి ప్రతిభ అసాధారణం. కానీ ఇప్పుడిప్పుడే అతడు ఎదుగుతున్నాడు. నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది. ముఖ్యంగా రెడ్బాల్ క్రికెట్లో అతడు ఇంకా మొదటి దశలోనే ఉన్నాడు’’ అని హర్షా భోగ్లే సెలక్టర్ల నిర్ణయాన్ని విమర్శించాడు.ఇషాన్ కిషన్ సారథ్యంలోకాగా ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 6 వరకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో దులిప్ ట్రోఫీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకోసం ఇషాన్ కిషన్ సారథ్యంలో 15 మందితో కూడిన ఈస్ట్ జోన్ జట్టును బుధవారం ప్రకటించారు. కాగా ఫస్ట్క్లాస్ క్రికెట్లో వైభవ్ ఇప్పటి వరకు 8 మ్యాచ్లాడి 207 పరుగులు చేశాడు. ఇక సూర్యవంశీకి ఇదే తొలి దులీప్ ట్రోఫీ కాగా... సీనియర్ పేసర్ మహ్మద్ షమీ, ముకేశ్ కుమార్ , షహబాజ్ అహ్మద్, అభిమన్యు ఈశ్వరన్ ఈస్ట్ జోన్ జట్టులో చోటు దక్కించుకున్నారు.దులిప్ ట్రోఫీ తాజా ఎడిషన్కు ఈస్ట్ జోన్ జట్టు: ఇషాన్ కిషన్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిమన్యు ఈశ్వరన్, సుదీప్ ఘరామి, షహబాజ్ అహ్మద్, సూరజ్ జైస్వాల్, మహ్మద్ షమీ, ముకేశ్ కుమార్, కుమార్ కుషాగ్ర, షిక్జార్ మోహన్, అనుకూల్ రాయ్, విరాట్ సింగ్, శుభ్రంసు సేనాపతి, డేనిశ్ దాస్, అభిజిత్ సర్కార్. చదవండి: శ్రీలంకతో టెస్టులకు పంత్ను ఎలా సెలక్ట్ చేశారు?: డివిలియర్స్I wonder what the thinking is behind making Sooryavanshi vice-captain of a senior red ball team. He has played 12 innings for 207 runs @ 17.25. His talent is extraordinary but there is a learning curve and he is at the bottom of it in red ball cricket.— Harsha Bhogle (@bhogleharsha) July 30, 2026 -
ప్రపంచ ఫుట్బాల్లో మహా సంక్షోభం.. ఫిఫాకు యూఈఎఫ్ఏ షాక్
ప్రపంచ ఫుట్బాల్లో మహా సంక్షోభం నెలకొంది. అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య (FIFA) తీసుకున్న ఒక వివాదాస్పద ఆర్థిక నిర్ణయంపై యూరోపియన్ ఫుట్బాల్ సమాఖ్య (UEFA) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫుట్బాల్ వరల్డ్ కప్ వాణిజ్య హక్కుల కోసం 20 బిలియన్ డాల్లరతో కొత్త సంస్థను ఏర్పాటు చేసి, అందులో 20 శాతం వాటాను ప్రైవేట్ కంపెనీలకు అమ్మాలని ఫిఫా చూస్తోంది.ఈ నేపథ్యంలో ఫిఫా తన ప్రతిపాదనను వెనక్కి తీసుకోపోతే రాబోయే వరల్డ్ కప్లతో సహా అన్ని పోటీలను బహిష్కరిస్తామని యూఈఎఫ్ఏకు 55 సభ్య దేశాలు ఏకగ్రీవంగా హెచ్చరించాయి.యూఈఎఫ్ఏ, అందులోని సభ్య దేశాల సంఘాలు ఏకతాటిపై నిలిచాయి. వరల్డ్ కప్, ఫిఫా నిర్వహించే ఇతర పోటీల యాజమాన్య హక్కులను ప్రైవేట్ పెట్టుబడిదారులకు బదిలీ చేయాలనే ఫిఫా ప్రతిపాదనను మేమందరం ఏకగ్రీవంగా తిరస్కరిస్తున్నాం. వరల్డ్ కప్ను ఒక వ్యాపార వస్తువుగా పరిగణించలేము. అది తరతరాలుగా ఆటగాళ్లు, అభిమానులు నిర్మించుకున్న గొప్ప క్రీడా వారసత్వం. ఇందులో ఏ భాగాన్ని కూడా ఎప్పుడూ ప్రైవేట్ పెట్టుబడిదారులకు అప్పగించకూడదు. ప్రపంచ కప్ అమ్మకానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోము అని యూఈఎఫ్ఏ ఓ ప్రకటనలో పేర్కొంది. -
వన్డే వరల్డ్ కప్ వేదికలు ఖరారు.. ఫైనల్ మ్యాచ్ ఎక్కడంటే?
వన్డే ప్రపంచకప్-2027కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమిచ్చే వేదికలను ఐసీసీ ఖారారు చేసింది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాల్లోని 12 మైదానాల్లో జరగనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. జోహన్నెస్బర్గ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఐసీసీ చీఫ్ జైషా మాట్లాడుతూ.. "వన్డే వరల్డ్కప్-2027కు సంబంధించి మరో కీలక అడుగు పడింది. 24 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఈ మెగా టోర్నమెంట్ ఆఫ్రికా ఖండానికి తిరిగి రావడం క్రికెట్ చరిత్రలోనే ఒక చారిత్రాత్మక ఘట్టం. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు తమ ఆత్మీయత, క్రీడాభిమానంతో క్రికెట్ ప్రేమికులకు మరపురాని జ్ఞాపకాలను అందిస్తాయని ఆశిస్తున్నాం" అని అన్నారు.కాగా ఈ టోర్నీలో మెజారిటీ భాగం మ్యాచ్లు సౌతాఫ్రికాలోనే జరగనున్నాయి. ఆధునిక స్టేడియాల, మౌలిక వసతులు, ప్రేక్షకుల ఆదరణ దృష్ట్యా అక్కడే 8 నగరాలను ఐసీసీ ఎంపిక చేసింది. జింబాబ్వేలో 3 వేదికలు, నమీబియా రాజధాని విండ్హాక్లో ఒక వేదికలో మ్యాచ్లు నిర్వహించనున్నారు. జోహన్నెస్బర్గ్లోని చారిత్రాత్మక 'వాండరర్స్ స్టేడియం' లో ఈ టోర్నీ ప్రారంభ వేడుకలతో పాటు ఫైనల్ పోరు జరగనుంది.ఈసారి 50 ఓవర్ల వరల్డ్కప్ను కొత్త ఫార్మాట్లో నిర్వహించనున్నారు. మొత్తం 14 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో 57 మ్యాచ్లు జరుగుతాయి. పోటీతత్వాన్ని పెంచేందుకు మూడు దశల విధానాన్ని ఐసీసీ ప్రవేశపెట్టనుంది. 12 నుంచి 14వ ర్యాంకులో ఉన్న జట్ల మధ్య జరిగే 'సూపర్ సిరీస్'తో టోర్నీ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించి గ్రూప్ స్టేజ్ నిర్వహిస్తారు. అనంతరం 'సూపర్ 7' రౌండ్, సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్లు ఉంటాయి. ఈ వన్డే ప్రపంచకప్ అక్టోబర్ 4న ప్రారంభం కానుంది.వేదికల వివరాలుదక్షిణాఫ్రికా: వాండరర్స్ (జొహన్నెస్బర్గ్), సెంచూరియన్ (ష్వానే), న్యూలాండ్స్ (కేప్ టౌన్), కింగ్స్మీడ్ (డర్బన్), సెయింట్ జార్జ్ పార్క్ (గెబెర్హా), మంగాంగ్ ఓవల్ (బ్లూమ్ఫోంటెన్), బోలాండ్ పార్క్ (పార్ల్), బఫెలో పార్క్ (కుగోంపో సిటీ).జింబాబ్వే: హరారే స్పోర్ట్స్ క్లబ్ (హరారే), క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ (బులవాయో), ఫాలే మోసీ-ఓ-తున్యా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (విక్టోరియా ఫాల్స్). నమీబియా: నమీబియా క్రికెట్ గ్రౌండ్ (విండ్హోక్).చదవండి: PAK vs WI: పాకిస్తాన్కు భారీ షాక్.. ఇక అంతే సంగతి? -
పాకిస్తాన్కు భారీ షాక్.. ఇక అంతే సంగతి?
వెస్టిండీస్తో తొలి టెస్ట్లో ఓటమిపాలై బాధలో ఉన్న పాకిస్తాన్కు మరో భారీ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ షాన్ మసూద్ వేలి గాయం కారణంగా రెండో టెస్ట్కు దూరమయ్యాడు. ట్రినిడాడ్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో మసూద్ గాయపడ్డాడు.విండీస్ పేసర్ జేడెన్ సీల్స్ బౌలింగ్లో ఓ రాకాసి బౌన్సర్ మసూద్ ఎడమచేతి చూపుడు వేలికి బలంగా తాకింది. దీంతో అతడు నొప్పితో బాధపడుతూనే తన బ్యాటింగ్ను కొనసాగించాడు. మ్యాచ్ అనంతరం నిర్వహించిన వైద్య పరీక్షలలో మసూద్ గాయం తీవ్రమైనది తేలింది. ఈ క్రమంలోనే అతడిని రెండో టెస్టు నుంచి తప్పించినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. షాన్ మసూద్ ఆగస్టు 19న ఇంగ్లండ్తో ప్రారంభమయ్యే తొలి టెస్ట్కు దూరమయ్యే అవకాశముంది. ఇక విండీస్తో తొలి టెస్టులో ఘోర ఓటమి పాలైన పాకిస్తాన్ తిరిగి పుంజుకోవాలని పట్టుదలతో ఉంది. ఆదివారం నుంచి జరగనున్న రెండో టెస్ట్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను 1-1తో సమం చేయాలని బాబర్ సేన భావిస్తోంది. తుది జట్టులో షాన్ మసూద్కు బదులుగా అబ్దుల్లా షఫీక్, సౌద్ షకీల్లలో ఒకరికి అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. వీరితో పాటు అన్క్యాప్డ్ బ్యాటర్ అవైస్ జఫర్ కూడా రేసులో ఉన్నాడు. కాగా తొలి టెస్ట్లో పాక్ పరాజయం పాలైనప్పటికి.. మసూద్ మాత్రం అద్భుతమైన సెంచరీతో కదం తొక్కాడు. సూపర్ ఫామ్లో ఉన్న బ్యాటర్ దూరం కావడం పాక్కు నిజంగా గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పాలి.చదవండి: బ్రెజిల్తో భారత్ ఫుట్బాల్ మ్యాచ్.. ఎప్పుడంటే? -
బ్రెజిల్తో భారత్ ఫుట్బాల్ మ్యాచ్.. ఎప్పుడంటే?
ఇండియన్ ఫుట్బాల్ అభిమానులకు శుభవార్త! ఐదుసార్లు వరల్డ్కప్ చాంపియన్ బ్రెజిల్ జట్టు భారత గడ్డపై తొలిసారి అడుగుపెట్టబోతోంది. అక్టోబర్ 3న కోల్కతాలోని చారిత్రాత్మక సాల్ట్ లేక్ స్టేడియంలో భారత్తో బ్రెజిల్ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది. ఈ విషయాన్ని అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్), బ్రెజిల్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ (సీబీఎఫ్) ఈ విషయాన్ని గురువారం సామాజిక మాధ్యమాల ద్వారా ధ్రువీకరించాయి. సీనియర్ పురుషుల విభాగంలో టీమిండియా, బ్రెజిల్ జట్లు తలపడడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.అంతేకాకుండా 1992లో ఫిఫా ప్రపంచ ర్యాంకింగ్స్ను తీసుకొచ్చిన తర్వాత.. భారత్ ఎదుర్కోనున్న అత్యధిక ర్యాంకింగ్ కలిగిన జట్టు బ్రెజిలే కావడం విశేషం. బ్రెజిల్ ప్రస్తుతం వరల్డ్ ర్యాంకింగ్స్లో ఐదో స్దానంలో ఉంది.కాగా కోల్కతాకు బ్రెజిల్ ఫుట్బాల్కూ విడదీయరాని అనుబంధం ఉంది. ఫిఫా ప్రపంచకప్ సమయంలో కోల్కతా నగరంలోని ప్రతి వీధి పసుపు, ఆకుపచ్చ రంగుల జెండాలు, దిగ్గజ ఆటగాళ్ల భారీ కటౌట్లతో నిండిపోతుంది. ఇప్పుడు మరోసారి సిటీ ఆఫ్ జాయ్ పసుపు, ఆకుపచ్చ రంగుల సముద్రంగా మారిపోయింది. తమ అభిమాన జట్టుకు గ్రాండ్ వెలకమ్ పలికేందుకు ఫ్యాన్స్ సిద్దమవుతున్నారు. కాగా కోల్కతాతో బ్రెజిల్ అనుబంధం 1977లో ప్రారంభమైంది. ఫుట్బాల్ లెజెండ్ పెలే తన 'న్యూయార్క్ కాస్మోస్' క్లబ్ తరఫున కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో స్థానిక మోహున్ బగాన్ జట్టుతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు.ఆ మ్యాచ్ భారత ఫుట్బాల్ చరిత్రలోనే అత్యంత కీలకమైన ఘట్టాలలో ఒకటిగా నిలిచిపోయింది. ఇక ఇటీవల ముగిసిన ఫిఫా ప్రపంచకప్లో బ్రెజిల్ నిరాశాజనక రీతిలో రౌండ్ ఆఫ్ 16లోనే నిష్క్రమించింది. -
అదరగొడుతున్న భారత అథ్లెట్స్.. లవ్ప్రీత్కు రజతం! సీమాకు కాంస్యం
గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2026లో భాతర అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. పురుషుల వెయిట్లిఫ్టింగ్ 110+ కేటగిరీలో లవ్ప్రీత్ సింగ్ రజత పతకం సాధించగా.. మహిళల డిస్కస్ త్రోలో సీమా కళిరామ్న కాంస్య పతకాన్ని కైసవం చేసుకుంది. మరోవైపు జావలిన్ త్రోలో నీరజ్ చోప్రా, రోహిత్ యాదవ్, యష్వీర్ సింగ్లు ఫైనల్కు అర్హత సాధించారు.పంజాబ్కు చెందిన లవ్ప్రీత్ తన కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. స్నాచ్ విభాగంలో 176 కేజీలను ఎత్తి కామన్వెల్త్ గేమ్స్ రికార్డును తిరగరాశాడు. అనంతరం క్లీన్ అండ్ జెర్క్లో 212 కేజీల బరువు ఎత్తి ఔరా అనిపించాడు. మొత్తంగా అతడు 388 కేజీల వెయిట్ను లిప్ట్ చేసి రెండో స్ధానంలో నిలిచాడు. స్నాచ్ రౌండ్ ముగిసేసరికి లవ్ప్రీత్ 10 కేజీల ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. చివరి రౌండ్లో న్యూజిలాండ్కు చెందిన డేవిడ్ ఆండ్రూ లిటి క్లీన్ అండ్ జెర్క్లో అద్భుతంగా పుంజుకున్నాడు. అతడు మొత్తం 389 కేజీలతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.కేవలం ఒక్క కిలోగ్రామ్ తేడాతో లవ్ప్రీత్ గోల్డ్మెడల్ కోల్పోయాడు. అయితే వెయిట్లిఫ్టింగ్లో భారత్కు ఇది ఎనిమిదవ మెడల్ కావడం గమనార్హం.పోరాడి కాంస్యం నెగ్గిన సీమ ఇక మహిళల డిస్కస్ త్రోలో 27 ఏళ్ల సీమా కళిరామ్న అద్భుతంగా పోరాడి కాంస్య పతకం సొంతం చేసుకుంది. పోటీలో వరుసగా మూడు ఫౌల్స్ నమోదైనప్పటికీ, మూడో రౌండ్లో ఆమె చేసిన త్రో పతకాన్ని ఖాయం చేసింది. దీంతో భారత్ పతకాల సంఖ్య 17కు చేరింది. -
భారత హాకీ జెర్సీపై ‘కాషాయ’ వివాదం
న్యూఢిల్లీ: హాకీ ప్రపంచకప్లో పాల్గొనే భారత పురుషుల, మహిళల జట్ల కోసం హాకీ ఇండియా (హెచ్ఐ) రూపొందించిన కొత్త జెర్సీ వివాదానికి దారి తీసింది. సుదీర్ఘ కాలంగా నీలం రంగు జెర్సీలోనే భారత్ (మెన్ ఇన్ బ్లూ) బరిలోకి దిగుతుండగా... ఈసారి దానిని పూర్తిగా కాషాయ రంగులోకి మార్చారు. కొత్త జెర్సీ ప్రకటన రాగానే దీనిపై తీవ్ర చర్చ మొదలైంది. దేశవ్యాప్తంగా పలువురు అభిమానులతో పాటు మాజీ కెప్టెన్లు ధన్రాజ్ పిళ్లై, వీరేన్ రస్కిన్హా, పర్గత్ సింగ్, అజిత్పాల్ సింగ్ హెచ్ఐ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దశాబ్దాలుగా నీలం రంగు జెర్సీనే భారత జట్టుకు పర్యాయపదంగా ఉంది. మేం ఎన్నో ఏళ్లు దీనిని సగర్వంగా ధరించాం. ఇదే రంగులో అభిమానులు కూడా టీమ్ను చూడటానికి ఇష్టపతారు. ఇప్పుడు మార్చాల్సిన అవసరం ఏముంది’ అని రస్కిన్హా వ్యాఖ్యానించాడు. జెండాలోని త్రివర్ణాల్లో కాషాయం ఒకటి అయినా... ఇది ఏనాడూ భారత హాకీ టీమ్ సాంప్రదాయ రంగు కాదని పిళ్లై అభిప్రాయపడ్డాడు. ఇష్టం వచ్చిన రంగులు ధరించేందుకు ఇది ఫ్రాంచైజీ లీగ్ కాదని అతను అన్నాడు. భారత హాకీని కూడా కాషాయీకరణ చేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించిన పర్గత్ సింగ్... హెచ్ఐ సరైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. జెర్సీపై అశోక చక్రను కాకుండా సుదర్శన చక్రాన్ని ఉంచడాన్ని కూడా వీరంతా ప్రశ్నిస్తున్నారు. ‘రంగు మార్పు కొత్తేమీ కాదు’ తాజా వివాదంపై హాకీ ఇండియా స్పందించింది. జెర్సీ రంగులో మార్పులు కొత్తేమీ కాదని, గతంలోనూ భారత్ నీలం రంగు కాకుండా వేరే రంగులతో బరిలోకి దిగిందని గుర్తు చేసింది. ‘ఆటగాళ్లు, సహాయక సిబ్బందితో చర్చించిన తర్వాతే వారి సూచనలతో జెర్సీ రంగు మార్చాం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాకీ సింథటిక్ మైదానాలు పూర్తిగా నీలం రంగులోనే ఉంటున్నాయి. అందులో కలిసిపోవడం వల్ల స్పష్టత లేక పలుమార్లు ఇబ్బంది అవుతోందనే అభిప్రాయం వ్యక్తం అయింది. కాషాయం కూడా త్రివర్ణ పతాకంలోని ఒక రంగు అని మర్చిపోవద్దు. జెర్సీ రంగులో మార్పులు గతంలోనూ జరిగాయి. 2014 ప్రపంచ కప్లో పసుపు రంగుతో ఆడిన భారత్ 2018లో లేత నీలం రంగు జెర్సీతో బరిలోకి దిగింది’ అని హెచ్ఐ తమ వాదనను సమర్థించుకుంది. దీనిపై కూడా పలు విమర్శలు వచ్చాయి. పుష్కర కాలం క్రితమే హాకీ కోర్టులు నీలం రంగులోకి మారాయని, అప్పుడు రాని సమస్య ఇప్పుడు ఎలా వచ్చిందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. గత రెండు ఒలింపిక్ పతకాలను బ్లూ టర్్ఫపైనే గెలిచిన విషయాన్ని వారు గుర్తు చేశారు. మరోవైపు భారత హాకీకి ప్రధాన స్పాన్సర్లో ఒడిషా ప్రభుత్వం వ్యవహరించడంలో కీలక పాత్ర పోషించిన నాటి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘భారత హాకీ జెర్సీ రంగు నీలం నుంచి కాషాయానికి మారడం నన్ను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. ఎన్నో ఏళ్లుగా నీలం రంగుతో భావోద్వేగాలు ముడిపడి ఉన్నాయి. జాతీయ పతాకంలోని అశోక చక్రంనుంచి నీలి రంగును ఎంచుకున్నాం. ఒడిషా ప్రస్తుత ప్రభుత్వ ఒత్తిడితోనే రంగు మారిందని మేం భావిస్తున్నాం’ అని పట్నాయక్ అన్నారు. -
మనోధైర్యమే పెట్టుబడిగా...
సాక్షి క్రీడావిభాగం : కేరళకు చెందిన మురళీ శ్రీశంకర్కు కామన్వెల్త్ గేమ్స్ పతకం కొత్తేమి కాదు. ఆ మాటకొస్తే అతడు గతంలోనే ఇంతకన్నా గొప్ప ఘనతలు సాధించాడు. 2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లో రజతం గెలిచిన ఈ లాంగ్జంపర్... అదే ఏడాది హాంగ్జౌ ఆసియా క్రీడల్లోనూ సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. 2023 ఆసియా చాంపియన్షి ప్లో రతజం గెలిచిన శ్రీశంకర్... ఆసియా జూనియర్ చాంపియన్షిప్ (2018)లో కాంస్యం నెగ్గాడు. మరి అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించిన శ్రీశంకర్... గ్లాస్గోలో పతకం నెగ్గిన తర్వాత భావోద్వేగానికి గురవ్వడం వెనక బలమైన కారణం ఉంది. సరిగ్గా రెండేళ్ల క్రితం 2024 పారిస్ ఒలింపిక్స్కు సిద్ధమవుతున్న సమయంలో శ్రీశంకర్ గాయపడ్డాడు. పాలక్కాడ్లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతడి ఎడమ మోకాలికి గాయమైంది. దీంతో ఆసుపత్రికి తరలించగా... వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అనంతరం ‘ఇక మీదట లాంగ్జంప్ కాదు కదా... కనీసం తిరిగి పరిగెత్తడం కూడా కష్టమే’ అని వైద్యులు తేల్చి చెప్పారు. ఈ మాటతో శ్రీశంకర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతడు కట్టుకున్న కోటలన్నీ పేకమేడలా నేలకూలాయి. ఊత కర్రలతో నడిచి... మోకాలి చిప్ప పూర్తిగా దెబ్బతినడంతో దాన్ని మార్చాల్సి వచ్చింది. దీంతో నెలల పాటు మంచానికే పరిమితమయ్యాడు. ఆ సమయంలో కనీసం లేచి నడిస్తే చాలు అని అతడి కుటుంబ సభ్యులు ఆవేదనకు గురయ్యారు. ‘సర్జరీ తర్వాత శ్రీశంకర్ ఊత కర్రల సాయం లేకుండా నడిస్తే చాలు అని ఎంతో అనుకున్నా. అలాంటిది రెండేళ్లు తిరిగేసరికి అంతర్జాతీయ స్థాయిలో పతకం సాధించాడు అంటే ఇదంతా అతడి మనోధైర్యమే.వైద్యులు కాలు కిందపెట్టినా ఇబ్బందే అని చెప్పడంతో ఈ రెండేళ్లలో అతడు పడ్డ కష్టం మామూలుది కాదు. ఇది కేవలం అతడికే సాధ్యం. శ్రీశంకర్ మానసికంగా చాలా బలంగా ఉంటాడు. ఓటమిని అంత త్వరగా ఒప్పుకోడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా విజయం సాధించేందుకే ప్రయత్నిస్తాడు. అందుకోసం ఎంత కష్టానికైనా వెనుకాడడు. ఈ పతకం దానికి నిదర్శనం’ అని శ్రీశంకర్ తండ్రి మురళీ వెల్లడించారు. 650 రోజుల తర్వాత తిరిగి బరిలోకి దిగిన శ్రీశంకర్ గ్లాస్గోలో 8.09 మీటర్ల దూరం దూకి పునరాగమనం తర్వాత తొలి అంతర్జాతీయ పతకం ఖాతాలో వేసుకున్నాడు. ఒకవైపు గాయం నుంచి కోలుకున్న తర్వాత 29 ఏళ్ల శ్రీశంకర్ పాల్గొన్న తొలి టోర్నమెంట్ ఇదే కాగా... మరోవైపు గ్లాస్గో పరిస్థితులు అతడిని మరింత ఇబ్బంది పెట్టాయి. అసలే మోకాలికి శస్త్రచికిత్స జరిగి ఉండటంతో జాగ్రత్త వహించాలని శ్రీశంకర్ భావించగా... టోర్నీ నిర్వాహకులు మాత్రం భారీ వర్షంలోనే పోటీలు నిర్వహించారు. వర్షం, శీతల గాలులు, అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇలా ఎన్నో ప్రతికూలతలను దాటి శ్రీశంకర్ రెండోసారి పతకం గెలుచుకున్నాడు. కెరీర్లో ఈ రజతం తనకు చాలా ప్రత్యేకమన్న శ్రీశంకర్... గత రెండేళ్లుగా కష్టకాలం అనుభవించి ఇప్పుడు విజయం సాధించడం సంతోషంగా ఉందని పతకం నెగ్గిన అనంతరం పేర్కొన్నాడు. కఠిన పరిస్థితుల్లో తనకు అండగా నిలిచిన వారికి ఈ పతకం అంకితమిస్తున్నట్లు శ్రీశంకర్ వెల్లడించాడు. -
భారత జట్లకే రెండు టైటిల్స్
న్యూఢిల్లీ: కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ చాంపియన్షిప్లో భారత పురుషుల, మహిళల జట్లు విజేతలుగా నిలిచాయి. హోరాహోరీగా సాగిన పురుషుల విభాగం ఫైనల్లో భారత్ 3–2 తేడాతో మలేసియాపై విజయం సాధించగా... మహిళల జట్టు కూడా 3–0తో మలేసియానే చిత్తు చేసింది. విజేతగా నిలిచిన మహిళల జట్టులో తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ సభ్యురాలిగా ఉంది. విజేతగా నిలిచిన జట్లకు 10 వేల డాలర్ల (రూ. 9 లక్షల 55 వేలు) చొప్పున ప్రైజ్మనీ లభించింది. పురుషుల ఫైనల్లో ముందుగా మానవ్ ఠక్కర్ 12–10, 11–7, 5–11, 11–5తో జావెన్ చూంగ్పై, మనుశ్ షా 11–13, 11–9, 11–7, 2–11, 11–7తో షెన్ వాంగ్పై గెలుపొందడంతో భారత్ 2–0తో ముందంజలో నిలిచింది. అయితే భారత సీనియర్ స్టార్ సత్యన్ జ్ఞానశేఖరన్ 7–11, 8–11, 10–12తో హాంగ్ యూ టే చేతిలో అనూహ్యంగా ఓడిపోయాడు. హర్మీత్ దేశాయ్ను భారత్ పక్కన పెట్టడంతో మళ్లీ బరిలోకి దిగిన మానవ్ 11–4, 8–11, 11–8, 7–11, 1–11తో వాంగ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. దాంతో స్కోరు 2–2తో సమమైంది. చివరి మ్యాచ్లో చెలరేగిన మనుశ్ 11–7, 11–4, 11–4తో చూంగ్పై గెలుపొంది జట్టుకు టైటిల్ ఖాయం చేశాడు. మహిళల ఫైనల్లో భారత్ ఏకపక్ష విజయం సాధించింది. వరుస మ్యాచ్లలో స్వస్తిక ఘోష్ 11–7, 11–2, 9–11, 11–9తో జిన్ టీపై, ఆకుల శ్రీజ 9–11, 11–6, 11–4, 5–11, 11–3తో లైన్ అనాక్పై, యశస్విని 7–11, 11–3, 17–15, 11–5తో అలైస్ లీ సియాన్పై గెలుపొందారు. -
గిరిజన వీరుడు... పరుగులో ధీరుడు
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా తొరన్ డోంగ్రీ గ్రామానికి చెందిన దిలీప్ మహాడు గావిత్... ఆరేళ్ల వయసులో చేయి కోల్పోయాడు. తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్న దిలీప్ చెట్టుపై నుంచి కిందపడగా... పసరు వైద్యాన్నే నమ్ముకున్న అతడి ఆదివాసీ తల్లిదండ్రులు సకాలంలో వైద్యం అందించలేకపోయారు. దీంతో అతడి కుడి చేతిని మోచేయి కింది వరకు తొలగించాల్సి వచ్చింది. అసలే కూలీనాలీ చేసుకునే కుటుంబంలో ఒక చేయి కోల్పోవడంతో దిలీప్ మరింత కుంగిపోయాడు. ఆత్మన్యూనత భావంతో చదువుకన్నా ఎక్కువ మైదానంలోనే గడిపేవాడు. ఈ సమయంలోనే ప్రముఖ కోచ్ వైజనాథ్ కాలే దృష్టి అతడిపై పడింది. సాధారణ పిల్లలతో పోటీపడి పరుగులు తీస్తున్న అతడిలో ఏదో ప్రత్యేకత ఉందని వైజనాథ్ గుర్తించారు. ‘అతడిని ఓ పాఠశాలలో చూశాను. పదకొండేళ్ల ప్రాయంలో అతడు పరుగు తీస్తున్న తీరు నన్నెంతగానో ఆకట్టుకుంది. సరైన కోచింగ్ ఇస్తే అద్భుతాలు చేయగలడనిపించింది. ఇదే విషయాన్ని అతడి తల్లిదండ్రులకు చెప్పినా వారు అర్థం చేసుకోలేకపోయారు. పారా పోటీలు ఉంటాయనే విషయమే వారికి తెలియదు. దీంతో కేవలం మెరుగైన జీవితం అందిస్తానని చెప్పి అతడిని నా వెంట తీసుకొచ్చా. అప్పటి నుంచి అన్నీ నేనే అయి పెంచాను. దత్తత తీసుకున్నా. ఇంటి పేరు లేకున్నా అతడు నా కుమారుడే’ అని వైజనాథ్ గర్వంగా చెప్పారు. కోచ్ సూచనలను తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకు సాగిన దిలీప్... అనతికాలంలోనే మంచి గుర్తింపు సాధించాడు. అండర్–18 స్థాయిలో పలు పతకాలు సాధించిన దిలీప్... ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో మెరిశాడు. తాజాగా గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల పురుషుల 100 మీటర్ల టి47 విభాగంలో దిలీప్ 10.71 సెకన్లలో లక్ష్యాన్ని చేరి స్వర్ణ పతకం సాధించాడు. రేసు ముగిసిన వెంటనే అగ్రస్థానంలో నిలిచిన దిలీప్ను తమ కెమెరాల్లో బంధించేందుకు ఫొటోగ్రాఫర్లు పోటీపడుతుండగా... అతడు మాత్రం తన గురువు కోసం వెతుక్కుంటూ కనిపించాడు. ఒక్కసారిగా అతడు కనిపించగానే పట్టరాని ఆనందంతో ఎగిరి గంతేశాడు. ‘ఆశించిన స్థాయిలో రేసును ప్రారంభించలేకపోయా. అయినా ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా చివర్లో వేగం పెంచి ఫలితం రాబట్టా’ అని దిలీప్ పేర్కొన్నాడు. భారీ వర్షంలో జరిగిన ఫైనల్ రేసులో పరిస్థితులు పరీక్షిస్తున్నా... మొక్కవోని దీక్షతో ముందుకు సాగిన దిలీప్ అగ్రస్థానం దక్కించుకోవడం విశేషం. ‘ఈ విజయంతో ఆగిపోవాలని అనుకోవడం లేదు. ప్రస్తుతానికి ఉద్యోగం చేయాలనే ఆలోచన లేదు. దేశానికి వీలైనన్ని ఎక్కువ పతకాలు సాధించడమే నా ముందున్న లక్ష్యం. సెపె్టంబర్లో జరగనున్న పారా ఆసియా క్రీడలతో పాటు, 2028 లాస్ ఏంజెలిస్ పారాలింపిక్స్లో పతకాలు సాధించేందుకు కృషి చేస్తా. పారా ఆసియా క్రీడల్లో 100 మీటర్లతో పాటు 400 మీటర్ల విభాగంలోనూ పోటీ పడతా.నా పతకం వెనక కర్త, కర్మ, క్రియ... నా గురువు వైజనాథ్. ఆయనే లేకుంటే నేను ఈ రోజు ఎక్కడ ఉండేవాడినో. 11 ఏళ్ల వయసు నుంచి నాకు అన్నీ ఆయనే. వాళ్లింట్లోనే పెరిగా. మెరుగైన జీవితాన్నిస్తా అని ఆయన ఇచ్చిన మాటకు బదులుగా ఈ రోజు నేను కామన్వెల్త్ స్వర్ణాన్ని గురువుకు అంకితమిస్తున్నా. ఈ పతకం మాత్రమే కాదు ఈ జీవితం కూడా ఆయానదే. గురు పూర్ణిమ రోజు తండ్రిలాంటి గురువుకు అంతర్జాతీయ పతకం కానుకగా ఇవ్వడం ఆనందంగా ఉంది’ అని దిలీప్ భావోద్వేగానికి గురయ్యాడు. – సాక్షి క్రీడా విభాగం -
తరుణ్ ఓటమి
తైపీ సిటీ: తైపీ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ తరుణ్ మన్నేపల్లి పోరాటం ముగిసింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో తరుణ్ 15–21, 16–21తో భారత్కే చెందిన కిరణ్ జార్జి చేతిలో ఓడిపోయాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత అగ్రశ్రేణి ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్ 9–21, 19–21తో జేసన్ గుణవాన్ (హాంకాంగ్) చేతిలో ఓటమి చవిచూశాడు. మహిళల సింగిల్స్లో తన్వీ శర్మ, ఉన్నతి హుడా, దేవిక సిహాగ్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... అన్మోల్ ఖరబ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. ప్రిక్వార్టర్ ఫైనల్స్లో తన్వీ 21–17, 22–20తో థలిత రమధాని వీర్యవాన్ (ఇండోనేసియా)పై, ఉన్నతి 21–19, 21–12తో భారత్కే చెందిన తాన్యా హేమంత్పై గెలిచారు. దేవిక 21–16, 21–15తో ని కడెక్ ధిండా అమర్త్య ప్రతివి (ఇండోనేసియా)ను ఓడించింది. అన్మోల్ 10–21, 20–22తో లిన్ సియాంగ్ టి (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలైంది. -
హారిక డబుల్ ధమాకా...
ఆసియా మహిళల చెస్ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్షిప్లో హైదరాబాద్ గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక అదరగొట్టింది. హాంకాంగ్లో గురువారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో హారిక ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్లలో విజేతగా నిలిచింది. 50 మంది ప్లేయర్లు పోటీపడ్డ ర్యాపిడ్ ఫార్మాట్లో హారిక, అనా షుఖ్మన్ (రష్యా) నిర్ణీత 11 రౌండ్ల తర్వాత 8.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరుతో హారికకు టైటిల్ ఖరారైంది. అనా షుఖ్మన్ రన్నరప్ ట్రోఫీ దక్కించుకుంది. హారిక ఆరు గేముల్లో గెలిచి, ఐదు గేమ్లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచింది. మరోవైపు బ్లిట్జ్ ఫార్మాట్లో 46 మంది క్రీడాకారిణులు పోటీపడ్డారు. నిర్ణీత 13 రౌండ్ల తర్వాత హారిక 10.5 పాయింట్లతో చాంపియన్గా అవతరించింది. హారిక తొమ్మిది గేముల్లో గెలిచి, మూడు గేమ్లను ‘డ్రా’ చేసుకొని, ఒక గేమ్లో ఓటమి పాలైంది. 10 పాయింట్లతో వాలెంటీనా గునీనా (రష్యా) రెండో స్థానం పొందింది. ఇదే టోర్నీ పురుషుల ర్యాపిడ్, బ్లిట్జ్ విభాగాలలో భారత గ్రాండ్మాస్టర్ గౌతమ్ కృష్ణకు రెండో స్థానం దక్కించి. -
ఖేలో ఇండియా యూత్ గేమ్స్కు తెలంగాణ సిద్ధం
హైదరాబాద్: ఖేలో ఇండియా యూత్ గేమ్స్ (కేఐవైజీ) నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో, రాష్ట్ర క్రీడాకారులను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర క్రీడా సంఘాలతో వ్యూహాత్మక సమావేశాల శ్రేణిని ప్రారంభించింది. స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్ డా. ఎ. సోనిబాలా దేవి, ఐఎఫ్ఎస్ అధ్యక్షతన జరిగిన తొలి సమావేశంలో అథ్లెటిక్స్, సైక్లింగ్, ఆర్చరీ, జిమ్నాస్టిక్స్, బ్యాడ్మింటన్, మల్లఖంబ్, గట్కా, కలరిపయట్టు తదితర రాష్ట్ర క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి పతకాల సాధనకు అవకాశమున్న ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారికి శాస్త్రీయ విధానంలో శిక్షణ అందించే కార్యాచరణపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా ఎంపిక ప్రక్రియను మూడు దశల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ముందుగా సెలెక్షన్ ట్రయల్స్, అనంతరం ఫస్ట్ లెవల్ క్యాంప్, చివరగా కోర్ క్యాంప్ నిర్వహించేలా ప్రణాళికను రూపొందించారు. ప్రతి దశకు సంబంధించిన కాలవ్యవధి, శిక్షణా ప్రణాళిక, అవసరమైన మౌలిక వసతులు, క్రీడా సామగ్రి, కోచ్ల నియామకం తదితర అంశాలను సమీక్షించారు.ఈ సందర్భంగా డా. ఎ. సోనిబాలా దేవి మాట్లాడుతూ, ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో స్వరాష్ట్రంలోనే తెలంగాణ క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచేలా ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను గుర్తించి, వారికి వ్యవస్థీకృత శిక్షణ అందించేందుకు ఎస్ఏటీజీ కట్టుబడి ఉందన్నారు.రాష్ట్రానికి పతకాల అవకాశాలు అధికంగా ఉన్న క్రీడలను గుర్తించి, వాటికి అనుగుణంగా ప్రత్యేక శిక్షణా శిబిరాలు, కోచింగ్, అవసరమైన సహాయ సహకారాన్ని అందించే దిశగా క్రీడల వారీగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా మిగిలిన రాష్ట్ర క్రీడా సంఘాలతోనూ దశలవారీగా సమావేశాలు నిర్వహించి సన్నాహాలను మరింత వేగవంతం చేయనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో డిప్యూటీ డైరెక్టర్లు రవీందర్, శ్రీనివాస్, అశోక్, పి ఆర్ ఓ సురేష్ కాలేరు, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి మల్లారెడ్డి, ప్రతినిధి ప్రవీణ్తో పాటు వివిధ రాష్ట్ర క్రీడా సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రతినిధులు పాల్గొన్నారు. -
పక్కలో బల్లెంలా తయారయ్యాడు.. పంత్ కెరీర్కు ఎండ్కార్డ్!
అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ, శ్రీలంకతో జరగబోయే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించింది. ఊహించిన విధంగానే, దక్షిణాఫ్రికా టెస్ట్ పర్యటనలో నిరాశాజనక ప్రదర్శన, ఆఫ్ఘనిస్తాన్పై సాధారణ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ , ప్రధాన వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే మరోవైపు ధ్రువ్ జురెల్ రెండో వికెట్ కీపర్గా ఎంపికయ్యాడు. పంత్కు బ్యాకప్గా ప్రతీ సిరీస్కు ఎంపికవుతూ వస్తున్న ధ్రువ్ జురేల్ సిరీస్ సిరీస్కు రాటుదేలుతూ పంత్కు పక్కలో బల్లెంలా తయారయ్యాడనిపిస్తోంది. టెస్టు క్రికెట్లో ఇప్పటికైతే టీమిండియా వికెట్ కీపర్గా మొదటి ప్రాధాన్యత పంతకే ఉన్నప్పటికీ, జురేల్ రాకతో పోటీ తీవ్రమయింది. జురెల్ తనకు అవకాశాలు వచ్చినప్పుడల్లా బ్యాటింగ్తో పాటు వికెట్ల వెనుక కూడా నిలకడ ప్రదర్శిస్తూ జట్టులో తన స్థానాన్ని సుస్ధిరం చేసుకునే పనిలో పడ్డాడు.Photo Credit: BCCI Twitterఈ నేపథ్యంలోనే పంత్ స్థానాన్ని భర్తీ చేయడానికి జురెల్ నిజంగా అర్హుడేనా అని చూస్తే మాత్రం తొలి 10 టెస్టుల్లో పంత్ 727 పరుగులు చేస్తే, ధ్రువ్ జురెల్ 478 పరుగులు సాధించాడు. అయితే పంత్ టెస్టుల్లో ప్రధానంగా ఐదో స్థానంలో బ్యాటింగ్కు వస్తాడు. కానీ జురెల్ జట్టులో ఉంటే అతడి బ్యాటింగ్ స్థానం ఆరు లేదా ఏడు. దీనివల్ల జట్టులో స్పెషలిస్ట్ బ్యాటర్లంతా ఔటైన తర్వాత కానీ ధ్రువ్ జురెల్కు అవకాశం రావడం లేదు. దీంతో అతడు పెద్ద ఇన్నింగ్స్లు ఆడేందుకు అవకాశాలు పెద్దగా రావడం లేదు. అయితే ఒత్తిడి పరిస్థితులు ఉన్నప్పుడు సంయమనం పాటించడంలో పంత్తో పోలిస్తే జురెల్ ఒక మెట్టుపైనే ఉంటాడు. ఇక జురెల్తో పోలిస్తే పంత్ ప్రతీ 100 బంతులకు 18 పరుగులు వేగంగా సాధించడంలో దిట్ట. ఇంగ్లండ్లో జేమ్స్ అండర్సన్, ఆస్ట్రేలియాలో నాథన్ లయన్ ఇలా విదేశీ గడ్డపై ఎలాంటి బౌలర్లనైనా తన దూకుడైన బ్యాటింగ్తో పరుగులు సాధించడంలో ముందుంటాడు. అయితే పంత్తో పోలిస్తే ధ్రువ్ జురెల్ది పూర్తిగా భిన్నమైన బ్యాటింగ్. టెక్నికల్గా బ్యాటింగ్ ఆడడంలో నేర్పరి అయిన ధ్రువ్ జురెల్ వికెట్ కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇస్తాడు. తర్వాత ఓపికతో బ్యాటింగ్ చేస్తూ ఇన్నింగ్స్లు నిర్మించడంలోనూ జురెల్ ముందు వరుసలో ఉంటాడు.బ్యాటింగ్ సంగతి పక్కనబెడితే, వికెట్కీపింగ్ నైపుణ్యంలో మాత్రం పంత్, జురెల్ సమానంగానే కనిపిస్తున్నారు. పది టెస్టుల తర్వాత పంత్ వికెట్ల వెనుక 47 డిస్మిసల్స్ చేస్తే, జురెల్ 15 నమోదు చేశాడు. ఇది పంత్కు అనుకూలంగా కనిపిస్తున్నప్పటికీ, పంత్ కీపర్గా లేని 10 ఇన్నింగ్స్ల్లో మాత్రమే కీపింగ్ చేశాడు. అదీగాక జురెల్ తుదిజట్టులో ఉన్నప్పటికీ, అనేక మ్యాచ్ల్లో కేఎల్ రాహుల్ లేదా పంత్లో ఒకరు గ్లోవ్స్ చేపట్టేవారు. అయితే 2026లో దేశీయంగా జురెల్ పేలవమైన ప్రదర్శన చేసినప్పటికీ, విదేశీ పర్యటనలన్నింటిలోనూ పంత్కు ప్రత్యామ్నాయంగా జురెల్ను ఎంపిక చేస్తూ ఉండడం, అతడి వికెట్కీపింగ్ సామర్థ్యాలపై యాజమాన్యానికి నమ్మకం పెరుగుతోందనిపిస్తోంది.Read: ‘కంగ్రాట్స్ జింక్స్.. నువ్వు నా ఫెవరెట్ బ్యాటింగ్ పార్టనర్’ -
‘కంగ్రాట్స్ జింక్స్.. నువ్వు నా ఫెవరెట్ బ్యాటింగ్ పార్టనర్’
అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన అజింక్య రహానేకు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి అభినందనలు తెలిపాడు. సుదీర్ఘ కాలం దేశానికి ప్రాతినిధ్యం వహించిన అతడి కెరీర్ గొప్పగా సాగిందని పేర్కొన్న విరాట్.. ఇకపై కూడా అతడికి అంతా మంచే జరగాలని ఆకాంక్షించాడు. ఎన్నో ఏళ్లు తామిద్దరం కలిసి దేశానికి ఆడామని, జింక్స్ తన పార్టనర్ అవ్వడం చాలా సంతోషంగా ఉందని కోహ్లి తెలిపాడు. ‘జింక్స్.. నీ క్రికెట్ కెరీర్ గొప్పగా సాగినందుకు అభినందనలు. భారత క్రికెటర్గా నువ్వు అద్భుతాలు చేశావు. నీ ఈ ప్రయాణం పట్ల నువ్వు చాలా గర్వపడాలి. స్లిప్లో నీ చేతులు చాలా సురక్షితమైనవి. టెస్టుల్లో నాకు ఇష్టమైన భాగస్వామివి నువ్వే. నువ్వు ఎల్లప్పుడూ బాగుండాలి. దేవుడి ఆశీర్వాదం నీకు ఉంటుంది’ అని కోహ్లీ తన పోస్ట్లో వెల్లడించాడు.కోహ్లి హయాంలోనే స్టార్ హోదా..ఇక కోహ్లీ కెప్టెన్సీలోనే రహానే కెరీర్ గొప్పగా సాగింది. కోహ్లి హయాంలోనే అతడు వైస్ కెప్టెన్గా, మిడిలార్డర్ బ్యాటర్గానూ స్థిరంగా రాణించాడు. కోహ్లి, రహానేలు కలిసి టీమిండియా తరఫున 67 టెస్టుల్లో ఆడారు. వీరిద్దరు కలిసి 3,661 పరుగులు జోడించారు. ఇందులో 10 శతక భాగస్వామ్యాలున్నాయి. ఈ ఇద్దరి మధ్య టెస్టుల్లో అత్యధిక పరుగుల భాగస్వామ్యం 2016లో న్యూజిలాండ్తో టెస్టులో (365 పరుగులు) నమోదయ్యింది. ఇక ఇద్దరు కలిసి 33 వన్డేలు ఆడి 1717 పరుగులు జోడించారు. ఇందులో ఆరు శతక భాగస్వామ్యాలున్నాయి. అయితే మూడేళ్ల క్రితం వరకు కోహ్లి, పుజారా, రహానే, రోహిత్.. వీళ్లు లేని భారత టెస్టు జట్టును ఊహించలేం. ఎందుకంటే.. సుదీర్గ అనుభమున్న ఈ నలుగురికి కష్ట సమయంలో ఇన్నింగ్స్ నిర్మించడం, ప్రత్యర్ధి బౌలర్లను విసిగించడం ఎలాగో బాగా తెలుసు. టీమిండియా వరుసగా రెండుసార్లు డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరడంలో ఈ నలుగురు కీలక పాత్ర పోషించారు. అంతేకాదు టెస్టుల్లో రోహిత్ సేన అగ్రస్థానంలో నిలవడంలో వీళ్ల పాత్ర మరువలేనిది.ఫస్ట్ క్లాస్లో నిలకడగా రాణించిన రహానే 2013లో ఆస్ట్రేలియాపై మ్యాచ్తో టెస్టులో అరంగేట్రం చేశాడు. తన డిఫెన్స్, నిబద్ధతో రహానే అనతికాలంలోనే జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో రహానే 85 టెస్టుల్లో 5,077 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 26 అర్ధసెంచరీలున్నాయి. ఇక 90 వన్డే మ్యాచ్ల్లో 2,962 పరుగులు సాధించిన రహానే ఖాతాలో మూడు సెంచరీలు, 24 అర్ధశతకాలు ఉన్నాయి. టీ20 క్రికెట్లో 20 మ్యాచ్లాడిన రహానే 375 పరుగులు సాధించాడు. ఇందులో ఒక ఫిఫ్టీ ఉంది. Jinks, congratulations on a great career, buddy. You’ve done wonders for Indian cricket, and you can be very proud of your journey. The safest pair of hands in the slips and my favourite Test batting partner. Wishing you well always. God bless. 🤝🇮🇳@ajinkyarahane88 pic.twitter.com/bHGaas41gO— Virat Kohli (@imVkohli) July 30, 2026 -
రహానే స్థాయిని అమాంతం పెంచిన టాప్-5 ఇన్నింగ్స్లు!
టీమిండియా సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే గురువారం అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. 90వ దశకం నుంచి 2010 వరకు సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, గంగూలీ తరం భారత టెస్టు క్రికెట్ను నిలబెట్టారు. ఆ తర్వాత వీరి లెగసీని కోహ్లి, రోహిత్, రహానే, పుజారాలు విజయవంతంగా కొనసాగించారు. ద్రవిడ్ తర్వాత అజింక్య రహానే భారత్కు ఎన్నో ఇన్నింగ్స్లో ఆపద్భాందవుడి పాత్రను పోషించాడు. వన్డేలు, టెస్టుల్లో ఎన్నో మైలురాయి ఇన్నింగ్స్లు ఆడాడు. అయితే వాటిలో ఒక ఐదు ఇన్నింగ్స్లు మాత్రం రహానే స్థాయిని అమాంతం పెంచేశాయి. రహానే టాప్-5 బెస్ట్ ఇన్నింగ్స్లపై ఇప్పుడు ఒక లుక్కేద్దాం.👉112 పరుగులు(2020 మెల్బోర్న్ టెస్టులో, ఆసీస్పై)Photo Credit: BCCI Twitterఅజింక్య రహానే కెరీర్లోనే మైలురాయిగా నిలిచిపోయిన ఇన్నింగ్స్కు మెల్బోర్న్ వేదికగా నిలిచింది. అప్పటికే అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ (డే అండ్ నైట్) టెస్టులో 36 పరుగులకే ఆలౌటై టీమిండియా పరువు పోగొట్టుకుంది. ఈ మ్యాచ్ తర్వాత కోహ్లి కూడా తన కూతురు తొలి బర్త్డే కోసమని ఇండియాకు వెళ్లిపోయాడు. దీంతో రహానే కెప్టెన్సీ బాధ్యతను తీసుకున్నాడు. తొలి టెస్టులో ఘోర ఓటమితో పూర్తి ఒత్తిడిలో మునిగిపోయిన టీమిండియాను తన కెప్టెన్సీతో పూర్తిగా మార్చేశాడు. తొలి ఇన్నింగ్స్లో ఎంతో ఓపికగా ఆడిన రహానే 223 బంతుల్లో 112 పరుగుల వీరోచిత సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించడమే కాదు ఆ తర్వాత సిరీస్ను కూడా 2-1తో గెలుచుకొని రహానే సారథ్యంలో చారిత్రక విజయాన్ని అందుకుంది.👉103 పరుగులు (లార్డ్స్ టెస్ట్, 2014లో ఇంగ్లండ్పై)Photo Credit: BCCI Twitterమెల్బోర్న్ వేదికగా సాధించిన సెంచరీ కంటే ముందు, ఆరేళ్ల క్రితమే లార్డ్స్ గడ్డపై రహానే మరో వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. మెల్బోర్న్ లేకపోయుంటే లార్డ్స్దే రహానే కెరీర్లో అత్యుత్తమ ఇన్నింగ్స్ అని బల్లగుద్ది చెప్పొచ్చు. మెల్బోర్న్ టెస్టుకు ఏమాత్రం తీసిపోని లార్డ్స్ టెస్టులో 154 బంతుల్లో 103 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. జేమ్స్ అండర్సన్ బంతితో నిప్పులు చెరుగుతున్న వేళ భారత టాప్ బ్యాటర్లంతా ఒక్కొక్కరుగా పెవిలియన్కు క్యూ కట్టారు. కానీ రహానే మాత్రం ఓపికను ప్రదర్శిస్తూ సాధికారిక ఇన్నింగ్స్ ఆడాడు. ఇదే మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ (36) తన కెరీర్ అత్యధిక స్కోరు సాధించడం విశేషం.అయితే ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించడంతో రహానే ఇన్నింగ్స్ ఎవర్గ్రీన్గా నిలిచిపోయింది.👉ఢిల్లీ టెస్టులో రెండు సెంచరీలు (2015లో సౌతాఫ్రికాపై)Photo Credit: BCCI Twitter2015లో సౌతాఫ్రికా జట్టు భారత్లో పర్యటించింది. ఢిల్లీ వేదికగా ఇరుజట్లు నాలుగో టెస్టు మ్యాచ్ ఆడాయి. స్పిన్నర్లకు విపరీతంగా అనుకూలిస్తున్న పిచ్పై రహానే రెండు సెంచరీలతో చెలరేగిపోయాడు. తొలి ఇన్నింగ్స్లో 127 పరుగులు సాధించిన రహానే.. రెండో ఇన్నింగ్స్లో కోహ్లితో కలిసి మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యం నెలకొల్పాడు. పనిలో పనిగా అజేయ సెంచరీ (100 నాటౌట్) సాధించిన రహానే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్నాడు. అంతేకాదు సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ను సొంతం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించిన రహానే సిరీస్ మొత్తంలో రెండు దేశాల తరఫున సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్గా రహానే నిలవడం విశేషం.👉79 పరుగులు (2015 వన్డే ప్రపంచకప్, సౌతాఫ్రికాపై)Photo Credit: BCCI Twitterకెరీర్ ఆరంభంలో వరుసగా వన్డే మ్యాచ్లు ఆడిన రహానే ఆ తర్వాత టెస్టులకే ఎక్కువగా పరిమితమయ్యాడు. అయితే 2015 వన్డే ప్రపంచకప్లో సౌతాఫ్రికాపై ఆడిన 79 పరుగుల ఇన్నింగ్స్ మాత్రం టాప్-5లో ఒకటిగా నిలుస్తోంది. ఆ మ్యాచ్లో రహానే 60 బంతుల్లోనే 79 పరుగులు సాధించడంతో టీమిండియా 300 పరుగుల మార్క్ను దాటింది. మ్యాచ్లో సౌతాఫ్రికా ఓటమికి పరోక్షంగా రహానే ఆడిన ఇన్నింగ్స్ కారణమైంది.👉39 బంతుల్లో 61 పరుగులు (2011లో ఇంగ్లండ్పై టీ20 మ్యాచ్లో)Photo Credit: BCCI Twitterరహానే అంటే క్లాస్ ఆటకు మారుపేరు అని ముద్ర పడిన రోజుల్లో తనలో మాస్ యాంగిల్ ఉందని నిరూపించిన ఇన్నింగ్స్ ఇది. ఇంగ్లండ్ గడ్డపై మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడేందుకు వెళ్లిన టీమిండియా, టీ20 సిరీస్లో భాగంగా ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్లో ఓపెనర్గా వచ్చిన రహానే ఆరంభం నుంచే ఇంగ్లీష్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 39 బంతుల్లోనే 61 పరుగులు చేసిన రహానే ఇంగ్లండ్ గడ్డపై టీ20ల్లో హాఫ్ సెంచరీ సాధించిన తొలి బ్యాటర్గా రికార్డులకెక్కాడు. ఇవేగాక రహానే బ్యాట్ నుంచి జాలువారిన అమోఘమైన ఇన్నింగ్స్లు చాలానే ఉన్నప్పటికీ, మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ ఇన్నింగ్స్లను చూసుకుంటే ఈ ఐదు కచ్చితంగా టాప్లోనే ఉంటాయి.చదవండి: పాకిస్తానీ కాదు.. ‘రియల్ పెద్ది’తోనే నీరజ్కు సవాల్! -
పాకిస్తానీ కాదు.. ‘రియల్ పెద్ది’తోనే నీరజ్కు సవాల్!
గ్లాస్కో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపై ఈసారి భారీ అంచనాలున్నాయి. రెండు వరుస ఒలింపిక్స్లో పతకాలు కొల్లగొట్టిన నీరజ్ చోప్రా ఈసారి కామన్వెల్త్ గేమ్స్లో జావెలిన్ త్రోలో దేశానికి స్వర్ణం అందిస్తాడని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ రౌండ్ ముగిసింది. అందరి అంచనాలను అందుకుంటూ భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్చోప్రా ఫైనల్ చేరినప్పటికీ, అంతా అనుకుంటున్నట్లుగా నెంబర్వన్ స్థానంలో కాకుండా ఐదో స్థానంలో మెడల్ రౌండ్కు అర్హత సాధించాడు. నీరజ్ చోప్రా తొలి ప్రయత్నంలో ఈటెను 76.28 మీటర్ల దూరం విసిరాడు. ఇక రెండో ప్రయత్నంలో అత్యుత్తమంగా 79.61 మీటర్ల దూరం ఈటెను విసిరి ఐదో స్థానం దక్కించుకున్నాడు. కాగా మొత్తంగా 18 మంది జావెలిన్ త్రోయర్లు క్వాలిఫయింగ్లో పోటీపడ్డారు.అయితే, ఇందులో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 12 మంది మాత్రమే ఫైనల్కు అర్హత సాధిస్తారు. నీరజ్ చోప్రాతో పాటు రోహిత్ యాదవ్, యశ్వీర్ సింగ్ కూడా టాప్-12లో నిలిచి ఫైనల్లో అడుగుపెట్టారు. శ్రీలంకకు చెందిన జావెలిన్ త్రోయర్ రుమేశ్ తరంగ పతిరగే (రియల్ పెద్ది) 82.84 మీటర్ల దూరం విసిరి తొలి స్థానంలో నిలిచాడు.కాగా గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్స్ 81.29 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో, సౌతాఫ్రికాకు చెందిన డౌ స్మిత్ 80.64 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో, ఇంగ్లండ్కు చెందిన బెన్ ఈస్ట్ (80.38 మీటర్లు) విసిరి నాలుగో స్థానంలో నిలిచారు. ఇక భారత్ నుంచి నీరజ్ చోప్రానే కాకుండా రోహిత్ యాదవ్ అత్యుత్తమంగా ఈటెను 78.37 మీటర్ల దూరం విసరగా.. యశ్వీర్ సింగ్ 78.36 మీటర్ల దూరం విసిరి వరుసగా తొమ్మిది, పది స్థానాల్లో నిలిచి ఫైనల్కు అర్హత సాధించారు. మరోవైపు.. పాకిస్తాన్ జావెలిన్ త్రోయర్, పారిస్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అర్షద్ నదీమ్ (78.63 మీటర్ల) దూరం బల్లాన్ని విసిరి టాప్-7లో నిలిచాడు. కాగా భారత కాలమానం ప్రకారం జూలై 31న రాత్రి 10.15 గంటలకు జావెలిన్ త్రో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.అర్షద్ కాదు అతడితోనే పోటీఅయితే నీరజ్ చోప్రాకు ఈసారి స్వర్ణ పతకం అంత ఈజీగా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. క్వాలిఫయింగ్ పోటీల్లో పీటర్స్ అండర్సన్, అర్షద్ నదీమ్లను కూడా వెనక్కి నెట్టిన శ్రీలంక స్టార్ రుమేశ్ తరంగ తొలి స్థానంలో నిలిచి నీరజ్కు సవాల్గా మారాడు. దీంతో ఈసారి ఫైనల్లో నీరజ్ చోప్రాకు అర్షద్ నదీమ్, అండర్సన్ పీటర్స్తో పాటు రుమేశ్ తరంగ రూపంలో మరో బలమైన ప్రత్యర్థి ఎదురవ్వనున్నాడు. దీంతో నీరజ్కు ఈసారి అర్షద్ నదీమ్ నుంచి కాకుండా రియల్ పెద్ది (క్రాస్ ఓవర్ అథ్లెట్) అనిపించుకున్న రుమేశ్తోనే మెడల్ కోసం టఫ్ ఫైట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది.ఫైనల్ కోసం దాచుకున్నాడా?కామన్వెల్త్ గేమ్స్లో బరిలోకి దిగిన నీరజ్ చోప్రా జావెలిన్ త్రో క్వాలిఫయింగ్ రౌండ్లో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమయ్యాడు. తొలి ప్రయత్నంలో ఈటెను 76.28 మీటర్ల దూరం విసిరాడు. ఇక రెండో ప్రయత్నంలో అత్యుత్తమంగా 79.61 మీటర్ల దూరం ఈటెను విసిరి ఐదో స్థానం దక్కించుకున్నాడు. ఆటోమేటిక్ క్వాలిఫయింగ్ మార్క్ అయిన 84 మీటర్ల మార్క్ను నీరజ్ అందుకోలేకపోయాడు. అయితే ఫైనల్లో తన అసలైన పవర్ను బయటికి తీస్తాడని, అక్కడే తన అత్యుత్తమ ప్రదర్శన చేస్తాడని అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు రుమేశ్ తరంగ క్వాలిఫయింగ్ రౌండ్లోనే ఈటెను 82.84 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నాడు.క్వాలిఫయింగ్లో తొలి స్థానం ఇచ్చిన కిక్తో ఫైనల్లో రికార్డు ప్రదర్శన చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని క్రీడా నిపుణులు పేర్కొంటున్నారు. అవసరమైతే నీరజ్ చోప్రా రికార్డును కూడా బద్దలు కొట్టే సత్తా రేమేశ్ తరంగలో కనిపిస్తోందని జోస్యం చెబుతున్నారు. మరి వీళ్లంతా వేస్తున్న లెక్కలు నిజమవుతాయా లేదా అన్నది ఫైనల్ రౌండ్తో తేలిపోనుంది. Neeraj Chopra books his place in the Men's Javelin Final with a 79.61m throw despite challenging conditions. 👏Watch the Golden Boy in action on 1st August, 12:45 AM onwards, LIVE on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #Glasgow2026… pic.twitter.com/M4kYPIuCTJ— Sony Sports Network (@SonySportsNetwk) July 30, 2026 Rumesh Tharanga qualifies for Javelin Finals at Commonwealth Games Full Story: https://t.co/4qSMn90KjA pic.twitter.com/lwt3lINSfx— NewsWire 🇱🇰 (@NewsWireLK) July 30, 2026చదవండి: రియల్ పెద్ది షాకింగ్ జర్నీ -
సూపర్ కింగ్స్ కొత్త కోచ్గా ఆల్బీ మోర్కెల్
దక్షిణాఫ్రికా టీ20 లీగ్ (SA20) ఫ్రాంచైజీ జోబర్గ్ సూపర్ కింగ్స్ తమ కొత్త ప్రధాన కోచ్గా మాజీ ఆల్రౌండర్ ఆల్బీ మోర్కెల్ను నియమించింది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ యాజమానం ఇవాళ అధికారికంగా ప్రకటించింది.ఆల్బీ మోర్కెల్ గత సీజన్లలో జోబర్గ్ సూపర్ కింగ్స్కు సహాయ కోచ్, బ్యాటింగ్ కోచ్గా సేవలందించాడు. జట్టు వ్యవస్థపై పూర్తి అవగాహనతో పాటు ఆటగాళ్లతో సన్నిహితంగా పనిచేసిన అనుభవం ఉండటంతో అతనికి ప్రధాన కోచ్ బాధ్యతలు అప్పగించారు.చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్లో విజయవంతమైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్న మోర్కెల్కు సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీతో చాలా కాలంగా అనుబంధం ఉంది. ఆటగాడిగా సాధించిన విజయాల అనంతరం కోచ్గా కూడా అదే వ్యవస్థలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. 46 ఏళ్ల ఆల్బీ ప్రస్తుతం టీమిండియా బౌలింగ్ కోచ్గా వ్యవహరిస్తున్న మోర్నీ మోర్కెల్కు సోదరుడు (పెద్దవాడు).ఆల్బీ మోర్కెల్ కెరీర్ విశేషాలుఆల్బీ తన హార్డ్ హిట్టింగ్ బ్యాటింగ్, వేగవంతమైన బౌలింగ్తో అంతర్జాతీయ క్రికెట్లో ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఎడమచేతి బ్యాటింగ్, కుడిచేతి మీడియం ఫాస్ట్ బౌలింగ్ చేసే ఆల్బీ.. సౌతాఫ్రికా తరఫున 58 టెస్ట్లు, 117 వన్డేలు, 50 టీ20లు ఆడాడు. టెస్ట్ల్లో 1,300కు పైగా పరుగులు, 50 వికెట్లు.. వన్డేల్లో 1,500కు పైగా పరుగులు, 100కు పైగా వికెట్లు.. టీ20ల్లో 500కు పైగా పరుగులు, 26 వికెట్లు సాధించాడు.ఐపీఎల్ కెరీర్* 2008 నుంచి 2013 వరకు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.* అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్), రైజింగ్ పుణే సూపర్జెయింట్స్ వంటి జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.* ఐపీఎల్లో అత్యుత్తమ ఫినిషర్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు.గుర్తుండిపోయే ఘనత2012 ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్లో విరాట్ కోహ్లీ బౌలింగ్లో వరుసగా భారీ సిక్సర్లు బాది చెన్నై సూపర్ కింగ్స్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఆ ఇన్నింగ్స్ అతని కెరీర్లో అత్యంత గుర్తుండిపోయే ప్రదర్శనగా నిలిచింది.కోచింగ్ ప్రయాణం* ఆటకు వీడ్కోలు అనంతరం కోచింగ్లోకి అడుగుపెట్టాడు.* జోబర్గ్ సూపర్ కింగ్స్కు సహాయ కోచ్, బ్యాటింగ్ కోచ్గా పనిచేశాడు.* 2026లో జోబర్గ్ సూపర్ కింగ్స్ ప్రధాన కోచ్గా నియమితుడయ్యాడు.* సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీతో ఆటగాడిగా ప్రారంభమైన అనుబంధాన్ని కోచ్గా కూడా విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. -
ఫైనల్కు అర్హత సాధించిన నీరజ్ చోప్రా
భారత స్టార్ ప్లేయర్ నీరజ్ చోప్రా కామన్వెల్త్ గేమ్స్-2026 జావెలిన్ త్రో క్వాలిఫయింగ్లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఐదోస్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించాడు. కాగా స్కాట్లాండ్లోని గ్లాస్గో వేదికగా కామన్వెల్త్ క్రీడలు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా గురువారం మధ్యాహ్నం జావెలిన్ త్రో క్వాలిఫయింగ్ రౌండ్ నిర్వహించారు. నీరజ్ చోప్రాతో పాటు భారత్కే చెందిన రోహిత్ యాదవ్, యశ్వీర్ సింగ్ కూడా ఇందులో పాల్గొన్నారు. ఇందులో భాగంగా నీరజ్ చోప్రా తొలి ప్రయత్నంలో ఈటెను 76.28 మీటర్ల దూరం విసిరాడు.12 మందికి అర్హతఇక రెండో ప్రయత్నంలో అత్యుత్తమంగా 79.61 మీటర్ల దూరం ఈటెను విసిరి ఐదో స్థానం దక్కించుకున్నాడు. కాగా మొత్తంగా 18 మంది జావెలిన్ త్రోయర్లు క్వాలిఫయింగ్లో పోటీపడ్డారు. అయితే, ఇందులో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 12 మంది మాత్రమే ఫైనల్కు అర్హత సాధిస్తారు. నీరజ్ చోప్రాతో పాటు రోహిత్ యాదవ్, యశ్వీర్ సింగ్ కూడా టాప్-12లో నిలిచి ఫైనల్లో అడుగుపెట్టారు.రోహిత్ యాదవ్ అత్యుత్తమంగా ఈటెను 78.37 మీటర్ల దూరం విసరగా.. యశ్వీర్ సింగ్ 78.36 మీటర్ల దూరం విసిరాడు. ఈ క్రమంలో వీరిద్దరు తొమ్మిది, పదో స్థానాల్లో నిలిచారు. అగ్రస్థానం అతడిదేఇక శ్రీలంకకు చెందిన రుమేశ్ తరంగ పతిరగే 82.84 మీటర్ల దూరం ఈటెను విసిరి తొలి స్థానం దక్కించుకున్నాడు. మరోవైపు.. పాకిస్తాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ 78.63 మీటర్ల దూరం బల్లాన్ని విసిరి టాప్-7లో నిలిచాడు. కాగా భారత కాలమానం ప్రకారం ఆగష్టు 1న ఉదయం 12.45 గంటలకు జావెలిన్ త్రో ఫైనల్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. -
జూనియర్ ఏబీ విధ్వంసం.. బంతిని చూడకుండానే!
హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్లో లండన్ స్పిరిట్ తొలి విజయాన్ని నమోదు చేసింది. బుధవారం ఎంఐ లండన్తో జరిగిన మ్యాచ్లో లండన్ స్పిరిట్స్ 7 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. మ్యాచ్లో ప్రిటోరియస్ సంచలన ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే ప్రిటోరియస్తో పాటు జూనియర్ డివిలియర్స్ డెవాల్డ్ బ్రెవిడ్ ఇన్నింగ్స్ కూడా మ్యాచ్లో హైలైట్ అని చెప్పొచ్చు.18 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేసి అజేయంగా నిలిచిన బ్రెవిస్ జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే ఇన్నింగ్స్లో డెవాల్డ్ బ్రెవిస్ కొట్టిన నో-లుక్ సిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇన్నింగ్స్ 68వ బంతికి ఈ అద్భుతం చోటుచేసకుంది. ఓలీ స్టోన్ వేసిన బంతిని ముందే అంచనా వేసిన డెవాల్డ్ బ్రెవిస్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ కొట్టాడు. ఈ క్రమంలో బంతి స్టాండ్స్ దిశగా వెళ్తున్న సమయంలో డెవాల్డ్ బ్రెవిస్ ఒక్కసారి కూడా తాను కొట్టిన షాట్ను చూడకుండా గ్రౌండ్నే చూడడం హైలైట్గా మారింది. ఇది చూసిన అభిమానులు @నీ కాన్ఫిడెన్స్కు సలాం.. బ్రెవిస్*, ఇదెక్కడి మాస్ రా మావ.. అని కామెంట్లు పెట్టేశారు. ఇంకెందుకు ఆలస్యం బ్రెవిస్ నో లుక్ సిక్స్ను మీరు కూడా వీక్షించండి. ఇక మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ లండన్ 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. విల్ జాక్స్ (44 బంతుల్లో 65), రూథర్ఫోర్డ్ (19 బంతుల్లో 41) ధాటిగా ఆడారు. లండన్ స్పిరిట్ బౌలర్లలో జేమీ ఓవర్టన్ 3 వికెట్లు తీయగా, ఆండ్రూ టై, జేమ్స్ కోల్స్ చెరొక వికెట్ తీశారు.అనంతరం లండన్ స్పిరిట్ మరో 11 బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ప్రిటోరియస్ (28 బంతుల్లో 64), బ్రెవిస్ (18 బంతుల్లో 37 నాటౌట్) భారీ ఇన్నింగ్స్లతో జట్టుకు విజయాన్ని అందించారు. Simply sensational from Dewald Brevis 🤯Watch his head position as he hits the ball...#TheHundred pic.twitter.com/eWOtOJlVXo— The Hundred (@thehundred) July 29, 2026Dewald Brevis. No-look six. Enjoy. 🥶 pic.twitter.com/qgQoBKwvkz— Lord's Cricket Ground (@HomeOfCricket) July 29, 2026Read: రహానే రిటైర్మెంట్పై బీసీసీఐ తొలి స్పందన -
IND vs BAN: ‘బంగ్లాదేశ్ సేఫ్ కంట్రీ.. ప్లీజ్ రండి’
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాతో ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని.. అయితే, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నుంచి ఇంకా ఆమోదం రాలేదని తెలిపాడు. కాగా టీ20 ప్రపంచకప్-2026 ఆరంభానికి ముందు భారత్- బంగ్లా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.నాటి ప్రభుత్వ మొండి వైఖరి కారణంగా..ఈ నేపథ్యంలో ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ పేస్ బౌలర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ను బీసీసీఐ తొలగించింది. దీంతో వరల్డ్కప్ ఆడేందుకు తాము భారత్కు రాబోమని బీసీబీ భీష్మించుకుని కూర్చుంది. దీంతో ఐసీసీ రంగంలోకి దిగి డెడ్లైన్ విధించగా.. బీసీబీ మాత్రం భారత్లో తమకు భద్రత ఉండదంటూ ఆరోపించింది. ఈ క్రమంలో టోర్నీ నుంచే నిష్క్రమించింది.అయితే, నాటి బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం చర్యల కారణంగా ఈ మేరకు బీసీబీ- బీసీసీఐ మధ్య విభేదాలు తలెత్తగా.. బంగ్లా టూర్ను బీసీసీఐ రద్దు చేసుకుంది. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వం రాగానే బీసీబీ అధ్యక్షుడిగా మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ పదవి చేపట్టాడు.నాటి నుంచి బీసీబీ- బీసీసీఐ మధ్య సంబంధాల పునరుద్ధరణ కోసం తమీమ్ ఇక్బాల్ కృషి చేస్తోంది. ఈ విషయంపై తాజాగా స్పందిస్తూ.. ‘‘దురదృష్టవశాత్తూ భారత్- బంగ్లాదేశ్ సిరీస్ గురించి ఇంతవరకు నా వద్ద ఎలాంటి అధికారిక సమాచారం లేదు. బీసీసీఐతో మేము చర్చలు కొనసాగిస్తున్నాము. ఇరు బోర్డు అధికారుల మధ్య ఇ-మెయిళ్ల మార్పిడి జరుగుతోంది.అత్యంత భద్రమైన దేశంటీమిండియా- బంగ్లాదేశ్ సిరీస్ అంటే.. అన్ని వర్గాల నుంచి ఆదరణ ఉంటుంది. బంగ్లాదేశ్ అత్యంత భద్రమైన దేశం. టీమిండియా మా దేశ పర్యటనకు వస్తుందని నమ్ముతున్నా. అందుకోసం మా వైపు నుంచి ఏం చేయాలో అన్నీ చేస్తాం. అయితే, బీసీబీ అధ్యక్షుడిగా నాకంటూ కొన్ని పరిధులు ఉంటాయి. నేను వాటిని దాటకూడదు. త్వరలోనే టీమిండియాతో సిరీస్ ఉంటుందని ఆశిస్తున్నా’’ అని తమీమ్ ఇక్బాల్ చెప్పుకొచ్చాడు. చదవండి: గిల్ సంచలన నిర్ణయం! -
బీసీసీఐ కీలక నిర్ణయం
భారత క్రికెట్లో వయో మోసాన్ని (Age Fraud) అరికట్టేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కఠిన చర్యలు చేపట్టింది. వయో విభాగాల క్రికెట్లో పారదర్శకత పెంచేందుకు స్వతంత్ర సంస్థను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.అండర్-16, అండర్-19, అండర్-23 విభాగాల్లో ఆడే క్రికెటర్ల పత్రాలన్నింటినీ ఈ స్వతంత్ర సంస్థ పరిశీలించనుంది. ఆటగాళ్ల ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, పాఠశాల రికార్డులు వంటి వివరాలను సంబంధిత అధికారులు, విద్యాసంస్థలతో సరిపోల్చి వాటి ప్రామాణికతను నిర్ధారించనుంది.పత్రాల్లో ఏవైనా తేడాలు లేదా తారుమార్లు ఉన్నట్లు తేలితే, సంబంధిత ఆటగాడిని బీసీసీఐ వయో విభాగాల టోర్నీల్లో తన రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించకుండా అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే చర్యలు తీసుకునే ముందు ఆటగాళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, తమ వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా కల్పించనుంది.ఇకపై అన్ని వయో విభాగాల క్రికెటర్లకు బయోమెట్రిక్ ధ్రువీకరణ కూడా తప్పనిసరి చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. గతంలో వయో మోసం ఆరోపణలతో రసిఖ్ సలామ్, ప్రిన్స్ యాదవ్, మంజోత్ కల్రా, నితీష్ రాణా వంటి పలువురు ఆటగాళ్లు బీసీసీఐ చర్యలను ఎదుర్కొన్నారు.ఆధార్లో చిరునామా మార్చాలిఅలాగే 2026-27 సీజన్కు రాష్ట్ర సంఘాన్ని మార్చుకోవాలనుకునే ఆటగాళ్లు సెప్టెంబర్ 1లోపు తమ ఆధార్ కార్డులో చిరునామాను నవీకరించి బీసీసీఐకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం ఒక సంవత్సరం నిరీక్షణ కాలం పూర్తయిన తర్వాతే వారు కొత్త రాష్ట్రం తరఫున ఆడేందుకు అర్హత పొందుతారు. -
కోచ్గా ఫ్లెమింగ్.. కెప్టెన్గా రూట్.. అధికారిక ప్రకటన
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు టెస్టు జట్టుకు కొత్త ప్రధాన కోచ్గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ను నియమించింది. అదే సమయంలో స్టార్ బ్యాటర్ జో రూట్ను మరోసారి టెస్టు జట్టు కెప్టెన్గా ప్రకటించింది.53 ఏళ్ల ఫ్లెమింగ్ ఇప్పటివరకు ఏ జాతీయ జట్టుకూ ప్రధాన కోచ్గా పనిచేయలేదు. అయితే 2009లో ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత ఫ్రాంచైజీ క్రికెట్లో అత్యంత విజయవంతమైన కోచ్గా గుర్తింపు పొందాడు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్కు 17 ఏళ్లుగా ప్రధాన కోచ్గా కొనసాగి, ఐదు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిళ్లను అందించాడు.ఇటీవల వరుస పరాజయాలు, మైదానం వెలుపల జరిగిన వివాదాల నేపథ్యంలో ఇంగ్లండ్ టెస్టు కోచ్ పదవి నుంచి బ్రెండన్ మెకల్లమ్ను తొలగించారు. అయితే ఆయన వైట్బాల్ జట్ల కోచ్గా కొనసాగనున్నారు.మరోవైపు, జో రూట్ 2017 నుంచి 2022 వరకు ఇంగ్లండ్ టెస్టు జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. ఆ కాలంలో 65 టెస్టులకు నాయకత్వం వహించి, రికార్డు స్థాయిలో 27 విజయాలు అందించాడు.కొత్త బాధ్యతపై స్పందించిన ఫ్లెమింగ్, "ప్రపంచ క్రికెట్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కోచింగ్ పదవుల్లో ఇది ఒకటి. ఈ బాధ్యత దక్కడం గౌరవంగా భావిస్తున్నాను" అని అన్నాడు.పాక్ సిరీస్కు అందుబాటులో ఉండడుఆగస్టు 19 నుంచి పాకిస్తాన్తో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్కు ఫ్లెమింగ్ అందుబాటులో ఉండడు. ఆ సిరీస్లో సహాయ కోచ్ మార్కస్ ట్రెస్కోతిక్ తాత్కాలిక ప్రధాన కోచ్గా వ్యవహరించనున్నాడు.స్వదేశంలో కుటుంబంతో కొంత సమయం గడిపిన అనంతరం ఫ్లెమింగ్ ఇంగ్లండ్కు చేరుకుని డిసెంబర్లో జరిగే దక్షిణాఫ్రికా టెస్టు పర్యటనకు జట్టును సిద్ధం చేయనున్నాడు. -
రహానే రిటైర్మెంట్పై బీసీసీఐ తొలి స్పందన
టీమిండియా సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే గురువారం తన 15 ఏళ్ల క్రికెట్ కెరీర్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. దశాబ్దంన్నర పాటు భారత క్రికెట్లో తన కంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన రహానే ఇటీవలే ఫామ్ కోల్పోయి జాతీయ జట్టుకు దూరమయ్యాడు. వయసు మీదపడడం, ఫామ్ లేమి, జట్టులో యువకుల రాక పెరగడం వెరసి రహానే క్రమంగా టీమిండియాకు దూరమవుతూ వచ్చాడు. అయితే ఐపీఎల్లో మాత్రం రహానే ఇప్పటికీ యాక్టివ్గానే ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన రహానే వచ్చే ఐపీఎల్ సీజన్లో మనకు మరోసారి కనిపించొచ్చు. ఇదిలా ఉంటే రహానే రిటైర్మెంట్ పోస్టుపై బీసీసీఐ తొలిసారి తన స్పందన వ్యక్తం చేసింది. భారత క్రికెట్కు రహానే అందించిన సేవలకు కృతజ్క్షతలు తెలుపుతూ 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేసింది. 'ఒక అద్భుతమైన కెరీర్ ముగిసింది. క్రికెటర్గా భారత క్రికెట్కు మీరు అందించిన సేవలకు ప్రత్యేక కృతజ్ఞతలు అజింక్య రహానే. క్రికెటర్గా మీరు సాధించిన అద్భుత విజయాలు ఒక జ్ఞాపకాలుగా ఎప్పటికీ గుర్తుండిపోతాయనడంలో సందేహం లేదు. రిటైర్మెంట్ తర్వాతి చాప్టర్కు ‘ఆల్ ది బెస్ట్ రహానే'’ అంటూ బీసీసీఐ ఎమోషనల్ ట్వీట్ చేసింది..15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో రహానే 85 టెస్టుల్లో 5,077 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 26 అర్ధసెంచరీలున్నాయి. ఇక 90 వన్డే మ్యాచ్ల్లో 2,962 పరుగులు సాధించిన రహానే ఖాతాలో మూడు సెంచరీలు, 24 అర్ధశతకాలు ఉన్నాయి. టీ20 క్రికెట్లో 20 మ్యాచ్లాడిన రహానే 375 పరుగులు సాధించాడు. ఇందులో ఒక ఫిఫ్టీ ఉంది. రహానేకు టెస్టు కెప్టెన్గా అజేయమైన రికార్డు ఉంది. అతడి కెప్టెన్సీలో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకపోవడం విశేషం. 2020-21 బోర్డర్ గావస్కర్ ట్రోఫీని రహానే సారథ్యంలోనే టీమిండియా 2-1 తేడాతో చారిత్రక సిరీస్ విజయాన్ని అందుకుంది. అంతేకాదు 2017లో ధర్మశాలలో ఆస్ట్రేలియాపై టెస్టు విజయం, 2018లో అఫ్గానిస్తాన్పై విజయంలో రహానే కెప్టెన్గా, బ్యాటర్గా కీలకపాత్ర పోషించాడు. An illustrious career comes to an end 🇮🇳Thank you @ajinkyarahane88 for your immense contribution to Indian cricket and all the memories that will be cherished forever Wishing you the very best in your next chapter #TeamIndia | #ThankYouAjinkya pic.twitter.com/Gbi7sIcgwS— BCCI (@BCCI) July 30, 2026 AJINKYA RAHANE IN TEARS 🥹- The moment ajji announced his retirement, Cap 278 Signing off forever 🥹❤️ pic.twitter.com/jgCCXh8kv8— Sam (@cricsam02) July 30, 2026Read: జెమీమా విధ్వంసం.. పరుగు తేడాతో థ్రిల్లింగ్ విజయం -
ఆడమ్ జంపా సంచలన నిర్ణయం.. ఆ జట్టుకు గుడ్బై
ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఆస్ట్రేలియా డొమాస్టిక్ సీజన్ 2026-27 ముందు అతడు తన హోమ్ టీమ్ 'న్యూ సౌత్ వేల్స్'కు గుడ్బై చెప్పాడు. ఇకపై అతడు క్వీన్స్లాండ్ బుల్స్కు ప్రాతినిథ్యం వహించనున్నాడు.34 ఏళ్ల జంపా గతంలో సౌత్ ఆస్ట్రేలియా, న్యూ సౌత్ వేల్స్లకు ఆడాడు. ఇప్పుడు అతడికి క్వీన్స్లాండ్ మూడో డొమాస్టిక్ జట్టు కానుంది. ఈ విషయాన్ని క్వీన్స్లాండ్ హై పెర్ఫార్మెన్స్ జనరల్ మేనేజర్ బెన్నెట్ కింగ్ ధ్రువీకరించారు."జంపా ఒక వరల్డ్ క్లాస్ బౌలర్. అతడు మా జట్టుతో ఒప్పందం కుదుర్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. అతని అనుభవం, సూచనలు మా జట్టుకు ఎంతగానో ఉపయోగపడతాయి. అతడు ఆస్ట్రేలియా తరపున అత్యున్నత స్ధాయిలో మరింత కాలం రాణించేందుకు మా వంతు సహకారం అందిస్తామని" బెన్నెట్ కింగ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఈ ఆసీస్ సూపర్ స్టార్ ప్రస్తుతం దిహాండ్రెడ్ 2026 టోర్నీలో లండన్ స్పిరిట్ జట్టు తరపున ఆడుతున్నాడు. త్వరలోనే క్వీన్స్లాండ్ జట్టుతో కలుస్తాడు. అయితే అంతర్జాతీయ మ్యాచ్ల కమిట్మెంట్ కారణంగా అతడు డొమెస్టిక్ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండకపోవచ్చు. జంపా తన కెరీర్లో 198 వన్డే, 153 టీ20 వికెట్లు పడగొట్టాడు.చదవండి: కరేబియన్ గడ్డ మీద చరిత్ర సృష్టించిన వెస్టిండీస్- పాక్ టెస్టు మ్యాచ్ -
చరిత్ర సృష్టించిన వెస్టిండీస్- పాక్ టెస్టు మ్యాచ్
వెస్టిండీస్- పాకిస్తాన్ మధ్య జరిగిన తొలి టెస్టు కరేబియన్ గడ్డపై సరికొత్త చరిత్రకు నాంది పలికింది. ఈ మ్యాచ్ సందర్భంగానే వెస్టిండీస్లో తొలిసారి ఒక టెస్టు మ్యాచ్లో పేసర్లు అత్యధికంగా నలభై వికెట్లు కూల్చారు. కాగా ఒకప్పుడు పేస్ బౌలర్లకు స్వర్గధామంగా నిలిచిన కరీబియన్ పిచ్లపై చాలా రోజుల తర్వాత విండీస్- పాక్ మధ్య ట్రినిడాడ్ వేదికగా తొలి టెస్టు సందర్భంగా మళ్లీ ఆ దృశ్యం కనిపించింది.90 పరుగుల తేడాతోఆద్యంతం ఫాస్ట్ బౌలర్లు ఆధిపత్యం చలాయించిన ఈ మ్యాచ్లో వెస్టిండీస్ 90 పరుగుల తేడాతో పాకిస్తాన్ జట్టును మట్టికరిపించింది. తద్వారా రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఆతిథ్య విండీస్ 1–0తో ముందంజ వేసింది. కాగా వెస్టిండీస్ విధించిన 211 పరుగుల లక్ష్యఛేదనలో పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్లో 40.2 ఓవర్లలో 120 పరుగులకే ఆలౌటైంది.కెప్టెన్ బాబర్ ఆజమ్ (107 బంతుల్లో 58 నాటౌట్; 9 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. ఇతర బ్యాటర్లందరూ విఫలం కాగా... ఆఖరి వికెట్గా క్రీజులోకి అడుగుపెట్టిన మొహమ్మద్ అబ్బాస్ (23; 4 ఫోర్లు) జట్టులో రెండో అత్యధిక స్కోరు చేశాడు. బాబర్–అబ్బాస్ 49 పరుగులు జోడించడం విశేషం. పాక్ ఇన్నింగ్స్లో ఇదే అతిపెద్ద భాగస్వామ్యం. అజాన్ అవైస్ (3), ఇమాముల్ హక్ (3), సల్మాన్ ఆఘా (0), మహమ్మద్ రిజ్వాన్ (11), ఆమేర్ జమాల్ (0), అలీ ఉస్మాన్ (2), షాన్ మసూద్ (3) పెవిలియన్కు క్యూ కట్టారు.బాబర్ రాణించినా...ఇక తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గాయపడ్డ షాన్ మసూద్ జట్టుకు అత్యవసర దశలో ఎనిమిదో స్థానంలో క్రీజులోకి వచ్చినా... ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఈ సిరీస్ ద్వారానే తిరిగి పాకిస్తాన్ టెస్టు జట్టు పగ్గాలు అందుకున్న బాబర్ ఆజమ్ ఒకవైపు క్రీజులో పాతుకుపోయినా... మరోవైపు అతడికి అండగా నిలిచే వారు లేకపోయారు.తొలి ఇన్నింగ్స్లో ఒక దశలో 244/4తో పటిష్ట స్థితిలో కనిపించిన పాకిస్తాన్ ఆ తర్వాత 38 పరుగుల తేడాతో 6 వికెట్లు కోల్పోగా... రెండో ఇన్నింగ్స్లో 71 పరుగులకే తొలి 9 ఇకెట్లు కోల్పోవడం గమనార్హం. వెస్టిండీస్ బౌలర్లలో జైడెన్ సీల్స్ 5 వికెట్లు పడగొట్టగా... రోచ్, గ్రీవ్స్ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్ నాలుగు ఇన్నింగ్స్ల్లో కలిపి నేలకూలిన 40 వికెట్లు పేసర్ల ఖాతాలోకే వెళ్లడం విశేషం.గ్రీవ్స్ దెబ్బఅంతకుముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 311 పరుగులు చేయగా... పాకిస్తాన్ 282 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో 181 పరుగులు చేసిన ఆతిథ్య విండీస్... పాక్ జట్టు ముందు ఊరించే లక్ష్యాన్ని ఉంచింది. అయితే బ్యాటర్ల వైఫల్యంతో పాక్ జట్టు స్వల్ప స్కోరుకే పరిమితమై పరాజయం మూటగట్టుకుంది. విండీస్ పేసర్ జస్టిన్ గ్రీవ్స్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఆదివారం నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది. మొత్తంగా ఆరోసారి.. కరేబియన్ గడ్డపై ఇదే తొలిసారిటెస్టు క్రికెట్ చరిత్రలో ఒక మ్యాచ్లో మొత్తం 40 వికెట్లను పేస్ బౌలర్లే తీయడం ఇది ఆరోసారి. గత నెలలో లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మ్యాచ్లో ఈ అద్భుతం నమోదైంది. అంతకుముందు ఇంగ్లండ్–వెస్టిండీస్ (1984) టెస్టులో, పాకిస్తాన్–జింబాబ్వే (1993) టెస్టులో, ఇంగ్లండ్–దక్షిణాఫ్రికా (1998) టెస్టులో, భారత్–దక్షిణాఫ్రికా (2018) టెస్టులో 40 వికెట్లు పేస్ బౌలర్ల ఖాతాలోకి వెళ్లాయి.అయితే, కరేబియన్ గడ్డపై 96 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఇలా పేసర్లే ఓ టెస్టు మ్యాచ్లో 40 వికెట్లు కూల్చడం ఇదే తొలిసారి. అంతేకాదు.. వెస్టిండీస్- పాక్ మధ్య జరిగిన తొలి టెస్టు విండీస్లో జరిగిన 273వ మ్యాచ్ కాగా.. టరూబా వేదికగా నిర్వహించిన తొలి టెస్టు మ్యాచ్ ఇదే. ఇదిలా ఉంటే.. ఒక టెస్టు మ్యాచ్లో మొత్తం 40 వికెట్లు స్పిన్నర్ల ఖాతాలోకి ఇప్పటి వరకు వెళ్లలేదు. వెస్టిండీస్ గడ్డ మీద టెస్టు మ్యాచ్లో పేసర్లు అత్యధిక వికెట్లు తీసిన సందర్భాలువెస్టిండీస్ వర్సెస్ పాకిస్తాన్- 2026లో బ్రియన్ లారా స్టేడియంలో 40 వికెట్లువెస్టిండీస్ వర్సెస్ ఆస్ట్రేలియా- 2025లో సబీనా పార్కులో 38 వికెట్లువెస్టిండీస్ వర్సెస్ భారత్- 1997లో కింగ్స్టన్ ఓవల్లో 38 వికెట్లువెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్- 1990లో కింగ్స్టన్ ఓవల్లో 37 వికెట్లు వెస్టిండీస్ వర్సెస్ పాకిస్తాన్- 2021లో సబీనా పార్కులో 37 వికెట్లు.చదవండి: గిల్ సంచలన నిర్ణయం! -
టీమిండియాకు గుడ్ బై.. కేకేఆర్లోకి రీఎంట్రీ
అంతా ఊహించిందే జరిగింది. భారత క్రికెట్ జట్టు మాజీ అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే... తిరిగి సొంత గూటికి చేరాడు. డస్కటేను ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ‘హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీ’గా నియమించుకుంది. రెండేళ్లుగా టీమిండియాతో కలిసి పనిచేసిన డస్కటే కాంట్రాక్ట్ ఇంగ్లండ్ పర్యటనతో ముగియగా... బీసీసీఐ అతడికి పొడిగింపు ఇవ్వకూడదని నిర్ణయించింది. ఈ క్రమంలోనే అతడు కేకేఆర్తో జతకట్టాడు. ఈ మేరకు ఫ్రాంచైజీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. "ఇది గొప్ప అవకాశం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా ఫ్రాంచైజీలను మరింత బలోపేతం చేసేందుకు నావంతు కృషిచేస్తా. దీర్ఘకాలం ఫలితాలను దృష్టిలో పెట్టుకొని స్ట్రాటజీలను రూపొందించేందుకు కృషి చేయడంతో పాటు యువ నైపుణ్యానికి మరింత పదును పెడతా" అని నెదర్లాండ్స్కు చెందిన 46 ఏళ్ల డస్కటే పేర్కొన్నాడు. ఫ్రాంచైజీ సీఈవో వెంకీ మైసూర్ మాట్లాడుతూ... "ఆటపై అతడికున్న అవగాహన ఫ్రాంచైజీకి ఉపయోగపడుతుంది. డస్కటే అనుభవం ఈ పదవికి సరిగ్గా సరిపోతుంది" అని అన్నాడు. డస్కటేకు కేకేఆర్ జట్టుతో సుదీర్ఘ అనుబంధం ఉంది. కోల్కతా జట్టు రెండు (2012, 2014)సార్లు ఐపీఎల్ ట్రోఫీలు సాధించిన సమయంలో ఆ జట్టులో ప్లేయర్గా ఉన్న డస్కటే... ఆ తర్వాత్ కేకేఆర్ ఫీల్డింగ్ కోచ్గా ఆ జట్టుకు మూడో (2024) టైటిల్ అందించాడు.అదే సమయంలో కేకేఆర్ మెంటార్గా ఉన్న గౌతమ్ గంభీర్ అనంతరం కాలంలో... భారత జట్టు హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టడంతో... అతడితో ఉన్న అనుబంధం కారణంగా డస్కటే టీమిండియా కోచింగ్ బృందంలో భాగమయ్యాడు. అయితే రెండేళ్లుగా జట్టుతో కలిసి ఉన్నప్పటికీ డస్కటేకు ఎలాంటి నిర్దేశిత బాధ్యతలు అప్పగించలేదు. -
Ajinkya Rahane: ఓటమెరుగని ‘సారథి’.. ధోనీ, కోహ్లి, రోహిత్ వల్ల కాలేదు
భారత క్రికెట్లో ఒక శకం ముగిసింది. సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్కు గురువారం రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే రహనే తన 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో కేవలం ఒక ప్లేయర్గా మాత్రమే కాదు కెప్టెన్గా కూడా విజయవంతమయ్యాడు.సహచరులు ప్రేమగా ‘జింక్స్’ అని పిలుచుకునే ఈ స్టార్ బ్యాటర్.. నిజంగానే ఆస్ట్రేలియా గడ్డపై భారత్కు ఉన్న ‘జింక్స్’ (దురదృష్టం)కు చెక్పెట్టాడు. అతడి సారథ్యంలోనే ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(2020-21)ని టీమిండియా సొంతం చేసుకుంది.ఓటమెరుగని సారథివిరాట్ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు 2020 ఏడాది ఆఖరిలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తలపడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా కేవలం 36 పరుగులకే ఆలౌటై ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది. అయితే ఈ ఓటమి తర్వాత కెప్టెన్ కోహ్లి వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి తిరిగి వచ్చాడు.ఆ క్లిష్ట సమయంలో జట్టు బాధ్యతలను రహానే భుజానెత్తుకున్నాడు. నాలుగు టెస్టుల సిరీస్లోని మిగిలిన మూడు మ్యాచ్ల్లో జట్టును ముందుండి నడిపించి, 2-1తో భారత్కు చారిత్రత్మక విజయాన్ని అందించాడు. మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో టెస్టులో అతడు సాధించిన వీరోచిత సెంచరీ సగటు క్రికెట్ అభిమాని ఎప్పటికి మర్చిపోడు. అయితే తన కెరీర్లో ఎక్కువ భాగం లీడర్షిప్ గ్రూప్లో ఉన్నప్పటికీ.. ఈ ముంబై క్రికెటర్కు భారత జట్టు పూర్తి స్థాయి కెప్టెన్గా వ్యవహరించే అవకాశం ఎప్పుడూ లభించలేదు. రెగ్యులర్ కెప్టెన్లు అందుబాటులో లేని చాలా సందర్భాల్లో జట్టును రహానే నడిపించాడు. అయితే కెప్టెన్లగా ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మకు కూడా సాధ్యం కాని ఓ రికార్డును రహానే సాధించాడు. కనీసం 5 టెస్టు మ్యాచ్లకు సారథ్యం వహించిన భారత కెప్టెన్లలో అత్యధిక గెలుపు శాతాన్ని కలిగి ఉన్న రికార్డును రహానే సొంతం చేసుకున్నాడు. అతడి నాయకత్వంలో ఆరు టెస్టులు ఆడిన భారత్.. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు.ఇందులో 4 విజయాలు, 2 డ్రాలు ఉన్నాయి. వన్డేల్లోనూ కెప్టెన్గా తన మార్క్ను చూపించాడు. వన్డేల్లో జింబాబ్వేపై మూడు మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించి మూడింట్లోనూ గెలిపించాడు. టీ20ల్లో అతడి సారథ్యంలో భారత్ ఒక విజయం, ఒక ఓటమి నమోదు చేసింది. మొత్తంగా రహానే భారత జట్టును 11 అంతర్జాతీయ మ్యాచ్ల్లో నడిపించగా, కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే ఓటమి చవిచూశాడు.కెప్టెన్గా అజింక్య రహానే ట్రాక్ రికార్డు:వన్డే (vs జింబాబ్వే): గెలుపు (4 పరుగుల తేడాతో)వన్డే (vs జింబాబ్వే): గెలుపు (62 పరుగుల తేడాతో)వన్డే (vs జింబాబ్వే): గెలుపు (83 పరుగుల తేడాతో)టి20 (vs జింబాబ్వే): గెలుపు (54 పరుగుల తేడాతో)టి20 (vs జింబాబ్వే): ఓటమి (10 పరుగుల తేడాతో)టెస్టు (vs ఆస్ట్రేలియా): గెలుపు (8 వికెట్లతో)టెస్టు (vs అఫ్గానిస్తాన్): గెలుపు (ఇన్నింగ్స్ & 262 పరుగులతో)టెస్టు (vs ఆస్ట్రేలియా): గెలుపు (8 వికెట్లతో)టెస్టు (vs ఆస్ట్రేలియా): డ్రాటెస్టు (vs ఆస్ట్రేలియా): గెలుపు (3 వికెట్లతో)టెస్టు (vs న్యూజిలాండ్): డ్రా -
పాకిస్తాన్కు గుడ్బై.. అంతలోనే..
పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్లు, కోచ్ల విషయంలో నిలకడ ఉండదు. ఎప్పుటికప్పుడు సారథులు, మార్గ నిర్దేశకులు మారుతూనే ఉంటారు. ఇందులో భాగంగా ఇటీవలే టెస్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి షాన్ మసూద్ను తప్పించిన పాక్ బోర్డు.. మళ్లీ బాబర్ ఆజంకే పగ్గాలు అప్పగించింది.పాకిస్తాన్కు గుడ్బైఇక పాక్ జట్టు కోచింగ్ విభాగంలోనూ ఇటీవలే ఓ మార్పు చోటుచేసుకుంది. ఫీల్డింగ్ కోచ్గా పనిచేసిన షేన్ మెక్డెర్మాట్ ఇటీవలే ఆ జట్టుకు గుడ్బై చెప్పాడు. తాజాగా అతడు అఫ్గానిస్తాన్ క్రికెట్ సీనియర్ జట్టు అసిస్టెంట్, ఫీల్డింగ్ కోచ్గా నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని అఫ్గాన్ బోర్డు తాజాగా ప్రకటించింది.ఆగష్టు 1 నుంచి ఐర్లాండ్తో మొదలయ్యే ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్ నుంచి మెక్డెర్మాట్ అఫ్గాన్ కోచ్గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. కాగా గతంలోనూ మెక్డెర్మాట్ అఫ్గాన్ కోచ్గా పనిచేశాడు. 2024 జనవరి నుంచి 2025 జూలై వరకు బాధ్యతలు నిర్వర్తించిన అతడు..ఆ తర్వాత పాక్ కోచ్గ వెళ్లాడు. అయితే, స్వల్ప కాలంలోనే పాక్ జట్టు కోచింగ్ బాధ్యతల నుంచి వైదొలిగాడు. గతంలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా జట్లకు సహాయక కోచ్గానూ మెక్డెర్మాట్ పనిచేశాడు.వాళ్లు సైతం...ఇదిలా ఉంటే.. మెక్డెర్మాట్ కంటే ముందు గ్యారీ కిర్స్టన్, జేసన్ గిల్లెస్పి పాక్ హెడ్కోచ్ పదవుల నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు తాత్కాలిక కోచ్లను నియమించిన పాక్ బోర్డు.. ఆ తర్వాత మైక్ హసన్ను పూర్తిస్థాయి హెడ్కోచ్గా నియమించింది. అయితే, పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ- మైక్ హసన్ మధ్య విభేదాలు మొదలయ్యాయని.. త్వరలోనే అతడూ పాక్ జట్టును వీడటం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా పాక్ క్రికెట్ జట్టు ఇటు ఆటలోనూ.. అటు కోచింగ్ సభ్యుల విషయంలోనూ నిలకడ లేకుండా ఛిన్నాభిన్నం అవుతోందన్న చర్చ జరుగుతోంది. చదవండి: శుబ్మన్ గిల్ సంచలన నిర్ణయం! -
టీమిండియా జెర్సీని కాషాయం రంగులోకి మార్చడంపై మాజీ కెప్టెన్ ఫైర్
భారత హాకీ జట్టు కొత్త జెర్సీ రంగుపై మాజీ కెప్టెన్, ఒలింపియన్ వీరెన్ రస్క్విన్హా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత హాకీ జట్టు గుర్తింపు, వారసత్వం ఎప్పుడూ నీలం (బ్లూ) రంగుతోనే ముడిపడి ఉందని, అలాంటప్పుడు ఆరెంజ్ జెర్సీని తీసుకురావడం వెనుక ఉన్న కారణమేంటని ప్రశ్నించారు.ఎఫ్ఐహెచ్ పురుషులు, మహిళల హాకీ ప్రపంచకప్లకు ముందు హాకీ ఇండియా భారత జట్ల కోసం కొత్త ఆరెంజ్ జెర్సీని ఆవిష్కరించింది. దీనిపై స్పందించిన రస్క్విన్హా, భారత హాకీ అభివృద్ధికి హాకీ ఇండియా ఎన్నో మంచి పనులు చేసినా, జాతీయ జట్టు తొలి జెర్సీ రంగును మార్చడం మాత్రం నిరాశ కలిగించిందన్నారు."భారత జట్టు గుర్తింపు, వారసత్వం ఎప్పుడూ బ్లూ జెర్సీతోనే ఉంటుంది. ఎన్నో సంవత్సరాలు ఆ నీలిరంగు జెర్సీ ధరించి గర్వపడ్డాను. అభిమానులు కూడా భారత జట్టును బ్లూ జెర్సీలోనే చూడాలని కోరుకుంటారు. మరి ఆరెంజ్ జెర్సీ వెనుక లాజిక్ ఏంటి..?"** అని ఆయన సోషల్ మీడియాలో ప్రశ్నించారు.తన వ్యాఖ్యలకు రాజకీయ రంగు పులుముతున్నారని పేర్కొన్న రస్క్విన్హా, తన ఉద్దేశం పూర్తిగా జట్టు సంప్రదాయం, గుర్తింపు గురించి మాత్రమేనని స్పష్టం చేశారు. "హాకీలో భారత్కు ఉన్న స్థానం, ఫుట్బాల్లో అర్జెంటీనాకు ఉన్న స్థానం లాంటిదే. అర్జెంటీనా తన సంప్రదాయ నీలం-తెలుపు చారల జెర్సీని వదిలి ఆరెంజ్ రంగు జెర్సీ ధరిస్తుందా..?" అని ఉదాహరణ ఇచ్చారు.మరోవైపు, కొత్త జెర్సీ రూపకల్పన వెనుక భావనను హాకీ ఇండియా వివరించింది. కాషాయ రంగు ధైర్యం, త్యాగం, విజయానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపింది. జెర్సీపై మండల నమూనాలు భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయని, అశోక చక్రం స్ఫూర్తితో రూపొందించిన నేవీ బ్లూ డిజైన్ శాంతి, పురోగతి, ఏకాగ్రతను సూచిస్తుందని పేర్కొంది. సుదర్శన చక్రం స్ఫూర్తితో రూపొందించిన ఛాతీ భాగంలోని డిజైన్ బలం, ఐక్యత, పురోగమనానికి చిహ్నమని వివరించింది.కాగా, ఆగస్టు 14 నుంచి బెల్జియం, నెదర్లాండ్స్లో జరిగే పురుషుల హాకీ ప్రపంచకప్లో భారత్ పూల్-డిలో ఇంగ్లండ్, వేల్స్, చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడనుంది. మహిళల జట్టు ఆగస్టు 16న చైనాతో తమ ప్రపంచకప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. -
ఇంగ్లండ్ గడ్డపై కుల్దీప్ మెరుపులు
భారత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఇంగ్లండ్ గడ్డపై మెరుపులు మెరిపిస్తున్నాడు. అక్కడి వన్డే కప్లో యార్క్షైర్ కౌంటీ తరఫున నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ల్లో ఆరు వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.టోర్నీ తొలి మ్యాచ్లో గ్లామోర్గన్పై 10 ఓవర్లు బౌలింగ్ చేసి 39 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ఇది కుల్దీప్కు వన్డే కౌంటీల్లో అరంగేట్రం మ్యాచ్.అనంతరం రెండో మ్యాచ్లో సస్సెక్స్పై 6.5 ఓవర్లలో 58 పరుగులు ఇచ్చి మరోసారి రెండు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఆతర్వాత వోర్సెస్టర్షైర్పై మూడోసారి రెండు వికెట్ల ప్రదర్శన (2-34) నమోదు చేసి టూ వికెట్స్ హ్యాట్రిక్ సాధించాడు.కుల్దీప్ వరుస సక్సెస్లతో దూసుకుపోవడంతో అతడి జట్టు యార్క్షైర్ కూడా మంచి విజయాలు సాధిస్తుంది. ఇంగ్లండ్ పరిస్థితులకు త్వరగా అలవాటు పడిన కుల్దీప్ యార్క్షైర్ బౌలింగ్ విభాగానికి కీలక బలంగా మారాడు.2027 వన్డే ప్రపంచకప్కు ఎంపిక దృష్ట్యా ఈ ప్రదర్శనలు కుల్దీప్ ఎంతో సానుకూలత కలగజేస్తాయి. కుల్దీప్కు ఇటీవలికాలంలో టీమిండియా తరఫున పెద్దగా అవకాశాలు రావడం లేదు.ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లో అతడు జట్టులో ఉన్నా, ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. తాజాగా జింబాబ్వే టీ20 సిరీస్లోనూ అవకాశం దక్కలేదు.దీంతో కుల్దీప్ తనను తాను నిరూపించుకునేందుకు ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ బాట పట్టాడు. కుల్దీప్ టీమిండియాలో అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే, రవి బిష్ణోయ్ తదితర స్పిన్నర్ల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నాడు. వైవిధ్యభరితమైన చైనామన్ శైలి కూడా అతడికి అవకాశాలు తెచ్చిపెట్టడం లేదు. -
శుబ్మన్ గిల్ సంచలన నిర్ణయం!
టీమిండియా టెస్టు, వన్డే జట్ల కెప్టెన్ శుబ్మన్ గిల్ గత కొంతకాలంగా ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా ఎక్కువసేపు బ్యాటింగ్ చేస్తే అతడి కండరాలు పట్టేస్తున్నాయి. తరచూ మెడ నొప్పి కారణంగానూ అతడు ఇబ్బంది పడుతున్నాడు.ఇటీవల ఇంగ్లండ్తో వన్డే సిరీస్ సందర్భంగానూ గిల్ అసౌకర్యానికి గురైన సంగతి తెలిసిందే. ఎడ్జ్బాస్టన్లో తొలి వన్డేలో బ్యాటింగ్ చేస్తున్న వేళ కండరాల నొప్పితో గిల్ 80 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. అంతకుముందు స్వదేశంలో వెస్టిండీస్తో టెస్టు, ఐపీఎల్ సందర్భంగా మెడ నొప్పితో మ్యాచ్లు మిస్సయ్యాడు.అక్కడ ఎలా ఆడగలరు?విరామం లేని షెడ్యూల్, ఒత్తిడి ఇందుకు కారణాలుగా చెప్పవచ్చు. ఇక రానున్న ఏడాది కాలంలో టీమిండియా మరింత బిజీ కానుంది. ముఖ్యంగా వన్డే వరల్డ్కప్-2027 వంటి మేజర్ ఐసీసీ టోర్నీలో తలపడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఫిట్నెస్ సమస్యల గురించి గిల్ మాట్లాడిన సంగతి తెలిసిందే.ఒకటి, రెండు మ్యాచ్లు ఆడిన తర్వాత గాయపడి.. జట్టుకు దూరమయ్యే వాళ్లు వరల్డ్కప్లో వరుసగా ఏడు- ఎనిమిది మ్యాచ్లు ఎలా ఆడగలరని ప్రశ్నించాడు. జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లను దృష్టిలో పెట్టుకొని ఇంగ్లండ్ చేతిలో సిరీస్ ఓటమి తర్వాత ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.శుబ్మన్ గిల్ సంచలన నిర్ణయంఅయితే, స్వయంగా గిల్ సైతం గాయాల బారిన పడటాన్ని ఇంగ్లండ్ దిగ్గజం స్టువర్ట్ బ్రాడ్ ప్రశ్నించాడు. డెబ్బై పరుగులు చేయగానే కండరాలు పట్టేయడం.. మైదానం నుంచి నిష్క్రమించడం గిల్కు అలవాటైపోయిందని విమర్శించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో శుబ్మన్ గిల్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.బీసీసీఐ వైద్య బృందాన్ని కాదని.. ఫిట్నెస్ సమస్యలకు పరిష్కారం కనుగొనే క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వైద్య బృందాన్ని కాదని.. బయటి డాక్టర్ల వద్ద గిల్ చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ..‘‘చాన్నాళ్లుగా గిల్ మెడ నొప్పితో బాధపడుతున్నాడు. రోజురోజుకీ పరిస్థితి దిగజారిపోతోందని భావించాడు. అందుకే బీసీసీఐ వైద్యబృందాన్ని కాదని.. బయటి డాక్టర్ల దగ్గర చికిత్స తీసుకున్నాడు. పరిస్థితి ఇప్పుడు చాలా వరకు మెరుగుపడింది. అయితే ఇది నిరంతర ప్రక్రియ’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.చదవండి: 30 ఏళ్లు దాటినా తగ్గేదేలే!.. టీమిండియాలో రీఎంట్రీకి సై! -
'స్టార్ ప్లేయర్స్నే భయపెట్టాడు.. అయినా జట్టులో నో ఛాన్స్'
శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే టీమిండియాలో చోటు కోసం ఎదురు చూస్తున్న జమ్మూ కాశ్మీర్ పేస్ సంచలనం ఆకిబ్ నబీకి మరోసారి నిరాశే ఎదురైంది. అతడిని జట్టు ఎంపిక కోసం సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. ఈ జట్టులో నలుగురు స్పెషలిస్ట్ పేసర్లకు సెలక్టర్లు అవకాశం కల్పించినప్పటికి.. గత రంజీ సీజన్లో లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచిన నబీకి మాత్రం చోటు దక్కక పోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ నేపథ్యంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీపై భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ విమర్శలు గుప్పించాడు."ఆకిబ్ నబీని ఎందుకు ఎంపిక చేయలేదో నాకైతే తెలియదు. అతడి వద్ద పేస్ తక్కువగా ఉండడంతోనే సెలక్ట్ చేయలేదని చాలా మంది చెబుతున్నారు. వాస్తవానికి పేస్తో పనిలేదు, ఒక బౌలర్ సరైన లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేస్తున్నాడా? లేదా అన్నది ముఖ్యం. దేశవాళీ క్రికెట్లో ఇప్పటికే నబీ టాలెంట్ను మనం చూశాం. రంజీ సీజన్ అసాంతం అద్భుతంగా రాణించాడు. రంజీ ట్రోఫీ ఫైనల్లో కూడా అతడు కేఎల్ రాహుల్ వంటి సీనియర్ బ్యాటర్ను సైతం ఇబ్బంది పెట్టాడు. కాబట్టి అతడి ప్రదర్శనకు తగిన గుర్తింపు దక్కాల్సిందే. అతడు మంచి రిథమ్లో ఉన్నాడు. అతడిని వీలైనంత త్వరగా జట్టులోకి తీసుకుంటారని ఆశిస్తున్నాను" అని స్పోర్ట్స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పఠాన్ పేర్కొన్నాడు. కాగా రంజీ ట్రోఫీ టైటిల్ను జమ్ముకాశ్మీర్ తొలిసారి సొంతం చేసుకోవడంలో నబీది కీలక పాత్ర. ఫైనల్లో 5 వికెట్లతో సత్తాచాటాడు. అతడు ఇప్పటివరకు 43 ఫస్ట్-క్లాస్ మ్యాచ్లలో 18.63 సగటుతో 162 వికెట్లు పడగొట్టాడు. అందులో పదిహేను ఫైవ్ వికెట్ల హాల్స్ ఉండడం గమనార్హం. -
30 ఏళ్లు దాటినా తగ్గేదేలే!.. టీమిండియాలో రీఎంట్రీకి సై!
ముప్పై మూడేళ్ల వయసులో తొలిసారి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు సారాంశ్ జైన్. దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణించినప్పటికీ ఈ మధ్యప్రదేశ్ స్పిన్ ఆల్రౌండర్ సెలక్టర్ల పిలుపు కోసం సుమారు పన్నెండేళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. జట్టు కూర్పు, పోటీ.. ఏదైతేనేమి ఎట్టకేలకు ఒక్కసారైనా జాతీయ జట్టుకు ఎంపిక కావాలన్న అతడి చిరకాల కోరిక తాజాగా నెరవేరింది.వాషింగ్టన్ సుందర్ గాయం సారాంశ్ జైన్ పాలిట వరంగా మారింది. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్కు వాషీ స్థానంలో సెలక్టర్లు ఈ ఆఫ్ స్పిన్నర్ను ఎంపికచేశారు. దీనిని బట్టి అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ జట్టుకు అవసరమైన సమయంలో దేశవాళీ క్రికెట్లో మెరిసిన ఆటగాళ్ల నైపుణ్యాలకే పెద్దపీట వేస్తూ.. వారి వయసును పెద్దగా పట్టించుకోమనే సంకేతాలు ఇచ్చినట్లయింది.ఈ నేపథ్యంలో ముప్పై ఏళ్లు దాటినప్పటికీ తమను తాము నిరూపించుకుంటే.. ఆపై అదృష్టం కలిసివస్తే ఈ ఐదుగురు క్రికెటర్లకు కూడా టీమిండియా తలుపులు తెరిచే ఉంటాయనిపిస్తోంది. మరి వారెవరో చూసేద్దామా?!భువనేశ్వర్ కుమార్36 ఏళ్ల భువనేశ్వర్ కుమార్ ఒకప్పుడు టీమిండియా పేస్ దళంలో కీలక సభ్యుడు. అయితే, 2022 తర్వాత అతడికి టీమిండియాలో అవకాశాలు కనుమరుగయ్యాయి. ఈ క్రమంలో దేశీ క్రికెట్, ఐపీఎల్పై దృష్టి సారించిన భువీ.. ఆర్సీబీ వరుసగా రెండు టైటిళ్లు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.ఐపీఎల్ 2025, 2026 సీజన్లలో మొత్తంగా 45 వికెట్లు కూల్చి ఆర్సీబీ చాంపియన్గా నిలవడంలో భువీ సహకారం అందించాడు. నిలకడగా, పొదుపుగా బౌలింగ్ చేస్తున్న ఈ స్వింగ్ సుల్తాన్ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల వ్యాఖ్యానించాడు. ఐసీసీ టోర్నీల్లో భువీని ఆడిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.రజత్ పాటిదార్పదిహేడేళ్లుగా ఐపీఎల్ తొలి టైటిల్ కోసం ముఖం వాచిపోయిన ఆర్సీబీకి.. వరుసగా రెండు ట్రోఫీలు అందించి అభిమానులకు విందుభోజనం పెట్టిన కెప్టెన్ రజత్ పాటిదార్. 2024లో తొలిసారి టీమిండియాకు ఆడిన పాటిదార్కు ఇంత వరకు భారత టీ20 జట్టులో మాత్రం చోటు దక్కలేదు.అయితే, ఐపీఎల్లో బ్యాటర్గా, కెప్టెన్గా సత్తా చాటుతున్న 33 ఏళ్ల రజత్ పాటిదార్కు సెలక్టర్లు పిలుపునివ్వాలని భారత మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ ఏడాది ఐపీఎల్లో అతడు 15 మ్యాచ్లలో కలిపి 501 పరుగులు సాధించాడు.యజువేంద్ర చహల్టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ చివరగా 2023లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అయితే, గౌతం గంభీర్ హెడ్కోచ్గా వచ్చిన తర్వాత చహల్ తిరిగి రావడం మరింత కష్టమైపోయింది.వైవిధ్యమైన నైపుణ్యాలున్న కుల్దీప్ యాదవ్ వంటి స్పిన్నర్లకు పెద్దపీట వేసిన గంభీర్ బృందం.. యుజీ చహల్ను పూర్తిగా పక్కనపెట్టేసింది. అయితే, దేశీ క్రికెట్, కౌంటీ, ఐపీఎల్లో రాణిస్తున్న 36 ఏళ్ల చహల్.. తన బౌలింగ్లో పదును తగ్గలేదని సెలక్టర్లకు గుర్తుచేస్తూనే ఉన్నాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్ల వీరుడి (233)గా చహల్ ఇప్పటికీ కొనసాగుతుండటం అతడి ఆటలో నిలకడకు నిదర్శనం.కృనాల్ పాండ్యాస్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్గా, గన్ ఫీల్డర్గా కృనాల్ పాండ్యాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. చివరగా 2021లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన ఈ బరోడా ప్లేయర్.. ఐపీఎల్లో మాత్రం సత్తా చాటుతున్నాడు.ఆర్సీబీ వరుసగా రెండుసార్లు (2025,2026) టైటిల్ గెలవడంలో కృనాల్ తన వంతు పాత్ర పోషించాడు. 35 ఏళ్ల ఈ ఆల్రౌండర్ టీమిండియాలో పునరాగమనం చేయగలననే నమ్మకంతో ఉన్నాడు.సూర్యకుమార్ యాదవ్ఈ ఏడాది టీమిండియాకు టీ20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. అయితే, వ్యక్తిగత వైఫల్యాల కారణంగా ఈ ఐసీసీ టోర్నీ తర్వాత మేనేజ్మెంట్ అనూహ్య రీతిలో అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించడమే కాకుండా జట్టులోనే చోటు లేకుండా చేసింది.సూర్య వయసు 35 ఏళ్లు కావడం కూడా ఇందుకు ఓ కారణం. అయితే, దేశీ క్రికెట్లో గనుక సత్తా చాటితే సూర్య తిరిగి జాతీయ జట్టులోకి తప్పక వస్తాడని ఇటీవలే బీసీసీఐ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. సూర్య సైతం అందుకు తగ్గట్లుగానే తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడు. గంటల కొద్దీ నెట్స్లో శ్రమిస్తూ పునర్వైభవం పొందేదిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. -
రిటైర్మెంట్ ప్రకటించిన అజింక్య రహానే
టీమిండియా వెటరన్ క్రికెటర్ అజింక్య రహానే కీలక నిర్ణయం తీసుకున్నాడు. 38 ఏళ్ల రహానే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఈ ముంబై క్రికెటర్ గురువారం సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. కాగా రహానే భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో విదేశీ గడ్డపై అతడి రికార్డు అత్యద్భుతం. ఈ సీనియర్ క్రికెటర్ కెప్టెన్గా కూడా తన మార్క్ చూపించాడు. ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై 2-1తో తేడాతో ఓడించి భారత్కు ప్రతిష్టాత్మక బోర్డర్-గావస్కర్ ట్రోఫీ(2020-21) అందించిన ఘనత అతడిది.రహానే తన 15 ఏళ్ల కెరీర్లో భారత్ తరపున 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 8414 పరుగులు చేశాడు. అందులో 5077 రన్స్ టెస్ట్ క్రికెట్లో సాధించినవే కావడం గమనార్హం. అతడి పేరిట 12 టెస్టు సెంచరీలు ఉన్నాయి."ఈ రోజుతో క్యాప్ నంబర్ 278కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాను. చిన్నతనంలో దొంబివ్లీలో ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు క్రికెట్ కోసం సర్వస్వాన్ని ధారపోశాను. ప్రతీ రోజు, ప్రతీ ఇన్నింగ్స్, బ్యాటింగ్ చేసే అవకాశం లభించినప్పుడల్లా భారత్కు ప్రాతినిధ్యం వహించాలనేది నా ఏకైక కలగా ఉండేది. నా కల పదిహేనేళ్ల కిందట నేరవేరింది. తొలిసారి భారత జెర్సీ ధరించినప్పుడు కలిగిన అనుభూతి ఎప్పటికి మర్చిపోలేను. నేను ఈ ఆటను పూర్తి నిబద్ధతతో, నిజాయితీతో ఆడాను. మన ఉద్దేశం సరైనదైతే, ఈ ఆట మనల్ని ఎల్లప్పుడూ గౌరవిస్తుందని నమ్మాను. నేను ఫస్ట్-క్లాస్ క్రికెటర్గా అరంగేట్రం చేసినప్పటి నుంచి భారత క్రికెట్ అంచెలంచెలుగా ఎదిగింది. గత 20 ఏళ్లలో ఆ ఎదుగుదలలో నేను కూడా ఒక భాగంగా ఉన్నందుకు ఎంతో గర్వంగా ఉంది. భారత క్రికెటర్గా నా ప్రస్ధానం ముగిసినప్పటికి, నాకిష్టమైన ఈ క్రీడలో మాత్రం కొనసాగుతాను. ఈ అద్భుత ప్రయాణంలో మద్దతుగా నిలిచిన బీసీసీఐ, ఎంసీఎ, నా సహచర ఆటగాళ్లు, కోచ్లు, అభిమానులు అందరికి ధన్యవాదాలు" అంటూ తన రిటైర్మెంట్ నోట్లో రహానే పేర్కొన్నాడు. కాగా రహానే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికి ఐపీఎల్లో మాత్రం కొనసాగనున్నాడు. -
ఎవరికీ భయపడేదే లేదు!.. వైభవ్ సూర్యవంశీ కీలక వ్యాఖ్యలు
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 15 వయస్సులోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నిన్నటి వరకు జూనియర్ క్రికెట్ టోర్నీలు, ఐపీఎల్లో సత్తాచాటిన వైభవ్.. ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై తన మార్క్ను చూపించాడు. ఇటీవల జింబాబ్వేతో మూడు మ్యాచ్ల సిరీస్లో వైభవ్ రెండు హాఫ్ సెంచరీలు సాధించి ప్లేయర్ ఆఫ్ది సిరీస్గా నిలిచాడు.ఈ పర్యటనలో బ్లెస్సింగ్ ముజార్బానీ, రిచర్డ్ నగరావ వంటి స్టార్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కాగా సూర్యవంశీ తన అద్భుత ప్రదర్శనలతో భారత స్టార్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ స్ధానానికి ఎసరు పెట్టాడు. ఈ చిచ్చరపిడుగు ఎంట్రీతో సంజూ జట్టులో చోటు కోల్పోయాడు.సెప్టెంబర్లో జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడలకు సంజూ ఎంపికైనప్పటికి ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కుతుందన్న గ్యారెంటీ అయితే లేదు. ఇక జింబాబ్వే టూర్లో అదరగొట్టిన సూర్యవంశీ బీసీసీఐ ప్రమోషన్ ఇచ్చింది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ టోర్నమెంట్ కోసం ఈస్ట్ జోన్ జట్టు వైస్ కెప్టెన్గా సూర్యవంశీ ఎంపికయ్యాడు. ఈ టోర్నీలో ఇషాన్ కిషన్కు డిప్యూటీగా సూర్య వంశీ వ్యవహరించనున్నాడు. బీసీసీఐ అతడిని అన్ని ఫార్మాట్ల ఆటగాడిగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే అతడికి వైస్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. దీంతో సూర్యవంశీపై బీహార్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు హర్ష్ వర్ధన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంత చిన్న వయస్సులోనే వైభవ్ సూర్యవంశీ ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్ కావడం బీహార్ క్రికెట్కు ఎంతో గర్వకారణమని హర్ష వర్ధన్ కొనియాడాడు,.ఇక ఇది ఇలా ఉండగా.. ఈ బిహార్ వండర్ కిడ్ తాజాగా రాజస్తాన్ రాయల్స్ తరపున జడేజాతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వైభవ్కు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. "మీరు ఏ బౌలర్ను ఎదుర్కోవడానికి భయపడతారు? అని హోస్ట్ వైభవ్ను ప్రశ్నించాడు. ఇందుకు వైభవ్ ఇచ్చిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది. "ఇప్పటి వరకు అయితే ఎవరికీ లేదు" అని నాలుగు పదాల్లో తేల్చి చేప్పేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్తాన్ రాయల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా సూర్యవంశీ ఐపీఎల్లో జస్ప్రీత్ బుమ్రా, హాజిల్వుడ్, కమిన్స్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను సైతం వదల్లేదు. -
సౌతాఫ్రికా యువ ఆటగాడి విధ్వంసం.. వణికి పోయిన ముంబై బౌలర్లు
ది హండ్రెడ్ 2026లో లండన్ స్పిరిట్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. బుధవారం ది ఓవల్ మైదానం వేదికగా ఎంఐ లండన్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో లండన్ స్పిరిట్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఎంఐ లండన్ నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్ విల్ జాక్స్ (44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 65 పరుగులు) అద్భుతమైన హాఫ్ సెంచరీతో సత్తాచాటగా.. చివర్లో షెర్ఫేన్ రూథర్ఫోర్డ్ (19 బంతుల్లో 41 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. లండన్ స్పిరిట్ బౌలర్లలో జేమీ ఓవర్టన్ మూడు, టై, కోల్స్ తలా వికెట్ సాధించారు.ప్రిటోరియస్ విధ్వంసంఅనంతరం 165 పరుగుల లక్ష్యాన్ని లండన్ స్పిరిట్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 11 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ భారీ లక్ష్య చేధనలో 20 ఏళ్ల దక్షణాఫ్రికా యువ సంచలనం లువాన్-డ్రే ప్రిటోరియస్ విధ్వంసం సృష్టించాడు. ఓవల్ మైదానంలో అతడు సిక్సర్ల వర్షం కురిపించాడు. బౌల్ట్ వంటి సీనియర్ బౌలర్లను సైతం ఈ యువ ఆటగాడు వదల్లేదు.ఈ క్రమంలో ప్రిటోరియస్ కేవలం 23 బంతుల్లోనే హండ్రెడ్లో తన తొలి అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్గా 28 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ప్రిటోరియస్.. 3 ఫోర్లు, 7 సిక్స్లతో 64 పరుగులు చేశాడు. అతడితో పాటు డెవిల్ బ్రెవిస్ కూడా(18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 37 నాటౌట్) తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఎంఐ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, గ్లీసన్, స్టోన్ తలా వికెట్ సాధించారు.


