breaking news
Sports
-
T20 WC : సౌతాఫ్రికాపై టీమిండియా గ్రాండ్ విక్టరీ
టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకాల్లో భాగంగా నవీముంబై వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్లో టీమిండియా విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 240 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా ఏడు వికెట్లు కోల్పోయి 210 పరుగుల వద్దే నిలిచింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో ఐదెన్ మార్క్రమ్ 38 పరుగులు, ర్యాన్ రెకెల్టెన్ 44 పరుగులు చేశారుభారత్ ఇన్నింగ్స్లో ఇషాన్ కిషన్ 20 బంతుల్లోనే రెండు ఫోర్లు, ఏడు సిక్సర్లు బాది 53 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (18 బంతుల్లో 24) స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. వీరిద్దరు ధనాధన్ దంచికొట్టి రిటైర్డ్ అవుట్గా వెనుదిరిగారు.ఇక మూడో స్థానంలో వచ్చిన తిలక్ వర్మ 19 బంతుల్లోనే మూడు ఫోర్లు, మూడు సిక్స్లు బాది 45 పరుగులు సాధించాడు. అయితే, ప్రొటిస్ పేసర్ మార్కో యాన్సెన్ బౌలింగ్లో బౌల్డ్ అయిన తిలక్ హాఫ్ సెంచరీ చేయకుండానే పెవిలియన్ చేరాడు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయిన టీమిండియా 240 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, అన్రిచ్ నోర్జే, క్వెనా మఫాకా తలా ఒక వికెట్ పడగొట్టారు.కాగా భారత్- శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్ మొదలుకానుంది. ఇందులో భాగంగా టీమిండియా తొలి రోజు పసికూన అమెరికాతో తలపడుతుంది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి టీమిండియా జగజ్జేతగా అవతరించిన సంగతి తెలిసిందే. -
చరిత్ర సృష్టించిన భారత్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
భారత అండర్-19 క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐసీసీ అండర్ వరల్డ్కప్ టోర్నమెంట్లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా నిలిచింది. ఏకంగా 310 పరుగులకు పైగా టార్గెట్ను పూర్తి.. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డు సాధించింది.జింబాబ్వే వేదికగా జరుగుతున్న వరల్డ్కప్-2026 టోర్నీ రెండో సెమీ ఫైనల్లో భారత్.. అఫ్గనిస్తాన్తో తలపడింది. హరారేలో టాస్ గెలిచిన అఫ్గన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి ఏకంగా 310 పరుగులు సాధించింది. ఫైజల్ షినోజాదా (110), ఉజైరుల్లా నియాజాయ్ (101 నాటౌట్) శతకాల వల్ల ఈ మేర భారీ స్కోరు సాధ్యమైంది.కొండంత లక్ష్యం కొండంత లక్ష్యం ముందున్నా దూకుడుగా ఇన్నింగ్స్ మొదలుపెట్టిన యువ భారత్ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది. ఓపెనర్లలో ఆరోన్ జార్జ్ శతక్కొట్టగా (104 బంతుల్లో 115; 15 ఫోర్లు, 2 సిక్స్లు).. వైభవ్ సూర్యవంశీ (33 బంతుల్లో 68) మెరుపు అర్ధ శతకం సాధించాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన కెప్టెన్ ఆయుశ్ మాత్రే కూడా హాఫ్ సెంచరీ (59 బంతుల్లో 62) సాధించాడు.ఇదే అత్యధిక లక్ష్య ఛేదనవీరికి తోడు విహాన్ మల్హోత్రా (47 బంతుల్లో 38), వేదాంత్ త్రివేది (6 బంతుల్లో 5) అజేయంగా నిలిచి భారత్ విజయాన్ని ఖరారు చేశారు. ఈ క్రమంలో కేవలం 41.1 ఓవర్లలోనే యువ భారత్ 311 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి వరల్డ్కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఆరోన్కు లభించింది. కాగా అండర్-19 వరల్డ్కప్ టోర్నీలో ఇదే అత్యధిక లక్ష్య ఛేదన.ఇంతకుముందు 2006లో న్యూజిలాండ్ ఐర్లాండ్ విధించిన 305 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేయగా.. 2022లో సౌతాఫ్రికా బంగ్లాదేశ్ ఇచ్చిన 294 పరుగుల టార్గెట్ను ఫినిష్ చేసింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికి పదహారు ఎడిషన్లు పూర్తి కాగా.. భారత్ ఫైనల్ చేరడం ఇది పదోసారి కావడం విశేషం.ఇంగ్లండ్ వర్సెస్ భారత్మరో సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. బులవాయోలో మంగళవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్ 27 పరుగుల తేడాతో ఆసీస్ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. మొదట ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 277 పరుగులు చేసింది.ఇంగ్లండ్ కెప్టెన్ థామస్ ర్యూ (107 బంతుల్లో 110; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించాడు. అనంతరం 278 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా అండర్–19 జట్టు 47.3 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. కెప్టెన్ ఒలివర్ పీక్ (88 బంతుల్లో 100; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. ఇక శుక్రవారం జరిగే వరల్డ్కప్ ఫైనల్లో భారత్- ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకుంటాయి.Highest successful run-chase ✔️Stunning batting display ✔️10th final calling ✔️Team India colts deliver a clinical show to set up a finals date with England! 🇮🇳🫰🏻NEXT ON ICC MEN'S U19 World Cup 👉 FINAL | #INDvENG | FRI, 6th FEB, 1 PM #ENGvIND pic.twitter.com/LMRhFgBzST— Star Sports (@StarSportsIndia) February 4, 2026 -
ఇషాన్, తిలక్ వర్మ విధ్వంసం.. టీమిండియా భారీ స్కోరు
టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకాల్లో భాగంగా సౌతాఫ్రికాతో వార్మప్ మ్యాచ్లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. ఓపెనర్గా ప్రమోట్ అయిన ఇషాన్ కిషన్తో పాటు.. రీఎంట్రీ ఇచ్చిన వన్డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ విధ్వంసకర ఇన్నింగ్స్తో దుమ్ములేపారు.ఇషాన్, తిలక్ వర్మ విధ్వంసంనవీ ముంబై వేదికగా టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. ఇషాన్ కిషన్ 20 బంతుల్లోనే రెండు ఫోర్లు, ఏడు సిక్సర్లు బాది 53 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (18 బంతుల్లో 24) స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. వీరిద్దరు ధనాధన్ దంచికొట్టి రిటైర్డ్ అవుట్గా వెనుదిరిగారు.ఇక మూడో స్థానంలో వచ్చిన తిలక్ వర్మ 19 బంతుల్లోనే మూడు ఫోర్లు, మూడు సిక్స్లు బాది 45 పరుగులు సాధించాడు. అయితే, ప్రొటిస్ పేసర్ మార్కో యాన్సెన్ బౌలింగ్లో బౌల్డ్ అయిన తిలక్ హాఫ్ సెంచరీ చేయకుండానే పెవిలియన్ చేరాడు.CRUNCHING STROKE! 💥In the slot, and Tilak Varma deposits it deep into the stands! 🙌🏻ICC Men's #T20WorldCup | Warm-Up Match | 👉 #INDvSA | LIVE NOW ➡️ https://t.co/KpRezrTaFe pic.twitter.com/htSk1AxhpZ— Star Sports (@StarSportsIndia) February 4, 2026రాణించిన సూర్య, అక్షర్, హార్దిక్మరోవైపు.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (16 బంతుల్లో 30) వేగంగా ఆడే ప్రయత్నంలో.. క్వెనా మఫాకా బౌలింగ్లో జార్జ్ లిండేకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మిగిలిన వారిలో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ (23 బంతుల్లో 35 నాటౌట్), హార్దిక్ పాండ్యా (10 బంతుల్లో 30) రాణించారు. రింకూ సింగ్ 13 బంతుల్లో 16 పరుగులు చేశాడు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయిన టీమిండియా 240 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, అన్రిచ్ నోర్జే, క్వెనా మఫాకా తలా ఒక వికెట్ పడగొట్టారు. కాగా భారత్- శ్రీలంక వేదికలుగా ఫిబ్రరి 7 నుంచి టీ20 ప్రపంచకప్ మొదలుకానుంది. ఇందులో భాగంగా టీమిండియా తొలి రోజు పసికూన అమెరికాతో తలపడుతుంది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి టీమిండియా జగజ్జేతగా అవతరించిన సంగతి తెలిసిందే.చదవండి: T20 WC 2026: ‘భారత్- పాక్ మ్యాచ్ జరుగుతుంది’ -
WC 2026: వరల్డ్కప్ ఫైనల్కు దూసుకెళ్లిన భారత్
ఐసీసీ అండర్-19 వరల్డ్కప్ టోర్నీ-2026లో భారత యువ జట్టు ఫైనల్కు దూసుకువెళ్లింది. హరారే వేదికగా సెమీ ఫైనల్లో అఫ్గనిస్తాన్ను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. జింబాబ్వే వేదికగా జనవరి 15న ప్రపంచకప్ టోర్నీ మొదలైన విషయం తెలిసిందే.ఆది నుంచి అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్న భారత జట్టు.. సూపర్ సిక్స్ దశలో నాలుగింటికి నాలుగు మ్యాచ్లు గెలిచి సత్తా చాటింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఓడించి సెమీస్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో రెండో సెమీ ఫైనల్లో బుధవారం అఫ్గన్ జట్టుతో తలపడింది.ఇద్దరు శతకాలు బాదిహరారేలో టాస్ ఓడిన భారత్ తొలుత బౌలింగ్ చేసింది. అయితే, వికెట్లు తీయలేక భారత బౌలర్లు ఆపసోపాలు పడ్డారు. అఫ్గన్ బ్యాటర్లలో ఫైజల్ షినోజాదా (110), ఉజైరుల్లా నియాజాయ్ (101 నాటౌట్) శతకాలతో చెలరేగి.. అఫ్గన్ను పటిష్ట స్థితిలో నిలిపారు.వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి అఫ్గనిస్తాన్ 310 పరుగుల భారీ స్కోరు సాధించింది. వరల్డ్కప్ తాజా ఎడిషన్లో ఇదే అత్యధిక స్కోరు. భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ తలా రెండు వికెట్లు తీశారు. ఈ క్రమంలో 311 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆయుశ్ మాత్రే సేన ఆది నుంచే దూకుడుగా ఆడింది. శతక్కొట్టిన హైదరాబాదీ బ్యాటర్ఓపెనర్లలో వైభవ్ సూర్యవంశీ (33 బంతుల్లో 68) ధనాధన్ దంచికొట్టగా... హైదరాబాదీ బ్యాటర్ ఆరోన్ జార్జ్ శతకం (104 బంతుల్లో 115; 15 ఫోర్లు, 2 సిక్స్లు)తో సత్తా చాటాడు. వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ ఆయుశ్ మాత్రే 59 బంతుల్లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 62 పరుగులు సాధించాడు.మిగతా వారిలో విహాన్ మల్హోత్రా (47 బంతుల్లో 38), వేదాంత్ త్రివేది (6 బంతుల్లో 5) అజేయంగా నిలిచి భారత్ గెలుపును ఖరారు చేశారు. టాపార్డర్ దంచికొట్టడంతో అఫ్గన్ విధించిన లక్ష్యాన్ని భారత్ 41.1 ఓవర్లలోనే ఊదేసింది. కేవలం మూడు వికెట్లు నష్టపోయి 311 పరుగులు సాధించి.. ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా వరల్డ్కప్ ఫైనల్కు దూసుకువెళ్లింది. అఫ్గనిస్తాన్ బౌలర్లలో నూరిస్తాని ఒమర్జాయ్ రెండు వికెట్లు తీయగా.. వహీదుల్లా జద్రాన్కు ఒక వికెట్ దక్కింది. కాగా తొలి సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి ఇంగ్లండ్ ఫైనల్లో అడుగుపెట్టింది. భారత్- ఇంగ్లండ్ మధ్య శుక్రవారం ఫైనల్ జరుగనుంది. చదవండి: Ricky Ponting: వద్దని మొత్తుకున్నా వినలేదు.. అతడిని వదిలేశారుHighest successful run-chase ✔️Stunning batting display ✔️10th final calling ✔️Team India colts deliver a clinical show to set up a finals date with England! 🇮🇳🫰🏻NEXT ON ICC MEN'S U19 World Cup 👉 FINAL | IND 🆚 ENG | FRI, 6th FEB, 1 PM pic.twitter.com/Pzay5mAdoI— Star Sports (@StarSportsIndia) February 4, 2026 -
T20 WC: ఓపెనర్గా వచ్చి.. దంచికొట్టిన ఇషాన్ కిషన్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు టీమిండియా సిద్ధమైంది. సన్నాహకాల్లో భాగంగా బుధవారం సౌతాఫ్రికాతో వార్మప్ మ్యాచ్తో బరిలో దిగింది. ఈ మ్యాచ్లో సంజూ శాంసన్ స్థానంలో ఇషాన్ కిషన్ ఓపెనర్గా వచ్చాడు.6, 6, 4, 6విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మకు జోడీగా వచ్చిన ఇషాన్.. ధనాధన్ దంచికొట్టాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ముఖ్యంగా ఐదో ఓవర్లో ప్రొటిస్ పేసర్ అన్రిచ్ నోర్జే రంగంలోకి దిగగా.. ఇషాన్ అతడి బౌలింగ్ను చితక్కొట్టాడు. మూడు, నాలుగు బంతుల్లో సిక్సర్ బాదిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఐదో బంతిని బౌండరీకి తరలించాడు. ఆరో బంతిని మళ్లీ సిక్సర్గా మలిచాడు. అలా నాలుగు బంతుల్లోనే 22 పరుగులు పిండుకున్నాడు.20 బంతుల్లోనేఈ క్రమంలో 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ (53) పూర్తి చేసుకున్నాడు ఇషాన్ కిషన్. సిక్సర్తో యాభై పరుగుల మార్కు దాటిన ఈ ఓపెనింగ్ బ్యాటర్ రిటైర్డ్ అవుట్గా వెనుదిరిగాడు. ఇషాన్ ఇన్నింగ్స్లో ఏడు సిక్స్లు, రెండు ఫోర్లు ఉన్నాయి.కాగా టీ20 వరల్డ్కప్ వార్మప్ మ్యాచ్లో భాగంగా నవీ ముంబైలో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (18 బంతుల్లో 24), ఇషాన్ కిషన్ (20 బంతుల్లో 53) రిటైర్డ్ అవుట్గా నిష్క్రమించారు. టీ20 వరల్డ్కప్-2026 జట్లు భారత్అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ,సంజు శాంసన్,హార్దిక్ పాండ్యా,రింకూ సింగ్,శివం దూబే,అక్షర్ పటేల్,అర్ష్దీప్ సింగ్,వరుణ్ చక్రవర్తి,జస్ప్రీత్ బుమ్రా,వాషింగ్టన్ సుందర్,హర్షిత్ రాణా,కుల్దీప్ యాదవ్.సౌతాఫ్రికాఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్),క్వింటన్ డి కాక్,ర్యాన్ రికెల్టన్ (వారం),డెవాల్డ్ బ్రెవిస్,ట్రిస్టన్ స్టబ్స్,జాసన్ స్మిత్,డేవిడ్ మిల్లర్,మార్కో యాన్సెన్,జార్జ్ లిండే,కార్బిన్ బాష్,కేశవ్ మహారాజ్,క్వేనా మఫాకా,లుంగీ ఎన్గిడి,అన్రిచ్ నోర్ట్జే,కగిసో రబడ.చదవండి: WC 2026: వరల్డ్కప్ సెమీస్లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసంT20 WC IND vs USA: భారత తుదిజట్టు ఇదే.. ఇషాన్కు నో ఛాన్స్!When you’re in form, everything goes your way!😮💨ICC Men's #T20WorldCup | Warm-Up Match | 👉 #INDvSA | LIVE NOW ➡️ https://t.co/KpRezrTaFe pic.twitter.com/51Mr18qE1g— Star Sports (@StarSportsIndia) February 4, 2026 -
T20 WC 2026: ‘భారత్- పాక్ మ్యాచ్ జరుగుతుంది’
భారత్- పాకిస్తాన్ మ్యాచ్కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాయాదులు తలపడుతుంటే ఇరు దేశాల అభిమానులే కాదు.. క్రికెట్ ప్రపంచం మొత్తం స్క్రీన్లకే అతుక్కుపోతుందనడంలో సందేహం లేదు. అయితే, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా ద్వైపాక్షిక సిరీస్లు జరిగి దశాబ్దకాలానికి పైగా గడిచిపోయింది.ప్రస్తుతం ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్లో మాత్రమే భారత్- పాక్ ముఖాముఖి తలపడుతున్నాయి. ఇక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 తర్వాత నుంచి ఈ రెండు దేశాల్లో ఒకటి ఆతిథ్యం ఇస్తే.. తటస్థ వేదికపైనే మ్యాచ్లు జరిగేలా ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ భారత్లో జరుగుతుండగా.. పాక్ శ్రీలంకలో తమ మ్యాచ్లు ఆడనుంది.పాక్ ఓవరాక్షన్అయితే, బంగ్లాదేశ్కు మద్దతుగా తాము టీమిండియాతో మ్యాచ్ బహిష్కరిస్తామని పాక్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో చిరకాల ప్రత్యర్థుల పోరుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ మాత్రం టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్ వందకు వంద శాతం జరిగితీరుందని అభిప్రాయపడ్డాడు.వందకు వంద శాతం జరుగుతుంది‘‘వచ్చే మూడు- నాలుగు రోజుల్లో పాక్ నిర్ణయం తారుమారు అవుతుంది. వందకు వంద శాతం భారత్- పాక్ మ్యాచ్ జరుగుతుందని నేను కచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే అందరిలాగే నేనూ దాయాదుల పోరును చూడాలని గట్టిగా అనుకుంటున్నాను.ఈ మ్యాచ్ కేంద్రంగా పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతుంది. అంతేకాదు.. పాక్ ఇప్పుడు తప్పుకొంటే ఆర్థికంగా బాగా నష్టపోవాల్సి ఉంటుంది. తమ వల్ల కలిగిన నష్టాన్ని బ్రాడ్కాస్టర్లకు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు.. ఈ టోర్నీలో మిగతా దేశాలు కూడా ఉన్నాయి.ఇతర బోర్డులకూ నష్టమేపాక్ వల్ల తాము కూడా నష్టపోవాల్సి వస్తుందని ఐసీసీ సమావేశంలో ఆయా దేశాల బోర్డులు వాదిస్తాయి. త్వరలోనే పాకిస్తాన్ సూపర్ లీగ్ కూడా జరుగనుంది. ఈ ఈవెంట్కు తమ ఆటగాళ్లను వెళ్లకుండా నిలువరించే అవకాశాలు కూడా ఉన్నాయి.అయినా ఈసారి పాక్ భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తామని చెప్పడం సమంజసమే కాదు. ఈసారి పాక్ తటస్థవేదిక మీదే పాక్ తమ మ్యాచ్లు ఆడబోతోంది. అయినా సరే టోర్నీలో ఒక్క జట్టుతో మాత్రమే ఆడము అని చెప్పడం ఏరకంగానూ ఆమోదయోగ్యనీయం కాదు. పూర్తిగా తప్పుకోకుండా ఒక్క జట్టుతో మ్యాచ్ను బహిష్కరించడం టెక్నికల్గా సరికాదు’’ అని అశూ పేర్కొన్నాడు.ఇప్పటికే బంగ్లా అవుట్కాగా భారత్- బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో.. భద్రతా కారణాలు సాకుగా చూపుతూ తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాల్సిందిగా బంగ్లాదేశ్ ఐసీసీని కోరింది. అయితే, బంగ్లా వాదనలో నిజం లేదంటూ ఐసీసీ ఇందుకు నిరాకరించింది. గడువు ఇచ్చినా బంగ్లా వైఖరి మారకపోడంతో టోర్నీ నుంచి ఆ జట్టును తప్పించింది. అయితే, పాక్ బంగ్లాదేశ్కు వంతపాడుతూ భారత్తో మ్యాచ్ బహిష్కరణ అంటూ నాటకానికి తెరతీసింది. కాగా ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్- పాక్ మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: T20 WC 2026: పాకిస్తాన్కు మరో ఎదురుదెబ్బ.. మేఘం కురిస్తే... -
World Cup 2026: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
భారత చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్తో మెరిశాడు. ఐసీసీ అండర్-19 ప్రపంచకప్-2026 సెమీ ఫైనల్లో భాగంగా అఫ్గనిస్తాన్పై.. ఈ పద్నాలుగేళ్ల పిల్లాడు ధనాధన్ దంచికొట్టాడు.24 బంతుల్లోనే..కేవలం 24 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్న వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించాడు. మొత్తంగా 33 బంతులు ఎదుర్కొన్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 68 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి.𝐅𝐀𝐒𝐓. 𝐅𝐄𝐀𝐑𝐋𝐄𝐒𝐒. 𝐅𝐈𝐅𝐓𝐘.Vaibhav Sooryavanshi goes full throttle in the SEMI-FINAL chase! 🚀#ICCMensU19WC | Semi-Final 2 | #INDvAFG 👉 LIVE NOW ➡️ https://t.co/BH7PyKi0Hq pic.twitter.com/skcIOVMznz— Star Sports (@StarSportsIndia) February 4, 2026సుడిగాలి ఇన్నింగ్స్వైభవ్ సూర్యవంశీ సుడిగాలి ఇన్నింగ్స్ కారణంగా భారత్ తొమ్మిది ఓవర్లలోనే 84 పరుగులు చేసింది. అయితే, భారత ఇన్నింగ్స్ పదో ఓవర్లో నూరిస్తాని ఒమర్జాయ్ బౌలింగ్లో మూడో బంతికి.. ఒస్మాన్ సదాత్కు క్యాచ్ ఇవ్వడంతో వైభవ్ సూర్యవంశీ పెవిలియన్ చేరాడు. కాగా ఓపెనర్ ఆరోన్ జార్జ్తో కలిసి మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తొలి వికెట్కు 57 బంతుల్లో 90 పరుగులు జోడించాడు.311 పరుగుల లక్ష్యంకాగా వరల్డ్కప్ రెండో సెమీ ఫైనల్లో భాగంగా జింబాబ్వేలోని హరారే వేదికగా టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఫైజల్ షినోజాదా (110), ఉజైరుల్లా నియాజాయ్ (101 నాటౌట్) శతకాలతో చెలరేగారు.ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి అఫ్గనిస్తాన్ 310 పరుగులు సాధించింది. అఫ్గన్ విధించిన 311 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్కు శుభారంభమే లభించింది. పది ఓవర్ల ఆట పూర్తయ్యే సరికి యువ భారత జట్టు వికెట్ నష్టానికి 91 పరుగులు చేసింది.చదవండి: Ricky Ponting: వద్దని మొత్తుకున్నా వినలేదు.. అతడిని వదిలేశారు -
T20 WC: పాకిస్తాన్కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి..
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ ఆరంభానికి ముందే పాకిస్తాన్ క్రికెట్ జట్టు వార్తల్లో నిలుస్తోంది. తొలుత బంగ్లాదేశ్కు మద్దతుగా టోర్నీ నుంచే వైదొలుగుతామని బీరాలు పలికిన పాక్.. తాజాగా భారత్తో మ్యాచ్ బహిష్కరిస్తున్నామంటూ కొత్త నాటకానికి తెరతీసింది.భారత్ ఈ మెగా ఈవెంట్కు ఆతిథ్యం ఇస్తుండగా.. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) పాక్ కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేసింది. అయినప్పటికీ పాక్ క్రికెట్ బోర్డు (PCB) ఓవరాక్షన్ చేస్తూ వ్యవహారాన్ని తెగేదాకా లాగేందుకు ప్రయత్నిస్తోంది.భారత్తో మ్యాచ్ రద్దు చేసుకుంటే..ఇక ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే ఒకవేళ పాక్.. టీమిండియాతో మ్యాచ్ రద్దు చేసుకుంటే.. ఐసీసీ నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పాక్ క్రికెట్ భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ విషయం పక్కనపెడితే.. ప్రస్తుతానికి ఈ టోర్నీలో కనీసం సూపర్ 8 చేరే అవకాశాలను కూడా పాక్ కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది.కాగా ఇరవై జట్లు భాగమైన వరల్డ్కప్ టోర్నీలో పాక్.. భారత్, యూఎస్ఏ, నెదర్లాండ్స్, నమీబియాతో కలిసి గ్రూప్-ఎలో ఉంది. ఇందులో భాగంగా టోర్నీ ఆరంభం రోజున అంటే శనివారం (ఫిబ్రవరి 7) పాక్.. తొలి మ్యాచ్లో నెదర్లాండ్స్తో తలపడాల్సి ఉంది. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ ఇందుకు వేదిక.వాన పడే అవకాశంఅయితే, ఆక్యూవెదర్ నివేదిక ప్రకారం.. ఈ మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉంది. మ్యాచ్ రోజు వాన పడే అవకాశం 90 శాతం ఉంది. ఇక ఫిబ్రవరి 15న రెండో మ్యాచ్లో భారత్ను ఢీకొట్టాల్సి ఉండగా.. పాక్ ఆ మ్యాచ్ను రద్దు చేసుకుంటామని ప్రగల్భాలు పలుకుతోంది.ఇక లీగ్ దశలో ఆఖరిగా పాక్.. నమీబియాతో ఫిబ్రవరి 18న సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్కు కూడా వరణుడు అంతరాయం కలిగించే అవకాశాలు 25 శాతం ఉన్నాయి. కాగా టీమిండియాతో మ్యాచ్ ఆడకపోతే పాక్ రెండు పాయింట్లు కోల్పోతుంది. అదే సమయంలో సూర్య సేనకు రెండు పాయింట్లు ఉచితంగా వస్తాయి.నెట్రన్రేటుపై ప్రభావంమరోవైపు.. వర్షం వల్ల నెదర్లాండ్స్, నమీబియాలతో మ్యాచ్లకు ఆటంకం కలిగితే నెట్రన్ రేటుపైనా ప్రభావం పడుతుంది. దీంతో ఫిబ్రవరి 10న అమెరికాతో మ్యాచ్లో పాక్ తప్పక గెలవాల్సిన పరిస్థితి. గత ఎడిషన్లో పసికూన అయిన అమెరికా చేతిలో పాక్ ఓడిపోయి సూపర్-8 కూడా చేరకుండా నిష్క్రమించిన విషయం తెలిసిందే.తాజా ఎడిషన్లోనూ పాక్కు చిక్కులు తప్పేలా లేవు. టీమిండియాతో మ్యాచ్ రద్దు.. రెండు మ్యాచ్లకు వర్షం ఆటంక కలిగించే సూచనలు.. వెరసి ఈసారి కూడా పాక్ సూపర్-8 చేరడం కష్టమే అనిపిస్తోంది. చదవండి: Ricky Ponting: వద్దని మొత్తుకున్నా వినలేదు.. అతడిని వదిలేశారు -
WC 2026: భారత బౌలర్లు విఫలం.. అఫ్గనిస్తాన్ భారీ స్కోరు
ఐసీసీ అండర్-19 వరల్డ్కప్-2026 టోర్నమెంట్ సెమీ ఫైనల్లో భారత బౌలర్లు తేలిపోయారు. అఫ్గనిస్తాన్తో బుధవారం నాటి మ్యాచ్లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఇందుకు తోడు భారత జట్టు ఫీల్డింగ్ తప్పిదాలతో అఫ్గన్ బ్యాటర్లుకు లైఫ్ ఇచ్చింది. ఫలితంగా అఫ్గనిస్తాన్ భారీ స్కోరు సాధించింది.శతక్కొట్టిన ఫైజల్ షినోజాదాజింబాబ్వేలోని హరారే వేదికగా వరల్డ్కప్ రెండో సెమీస్ మ్యాచ్లో టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుని.. భారత్ను బౌలింగ్కు ఆహ్వానించింది. ఓపెనర్లు ఒస్మాన్ సదాత్ (39), ఖలీద్ అహ్మద్జాయ్ (31) శుభారంభం అందించగా.. వన్డౌన్ బ్యాటర్ ఫైజల్ షినోజాదా (Faisal Shinozada) ఆకాశమే హద్దుగా చెలరేగాడు.ఉజైరుల్లా అజేయ శతకంమొత్తంగా 93 బంతులు ఎదుర్కొన్న ఫైజల్.. 15 ఫోర్ల సాయంతో 110 పరుగులు సాధించాడు. మరోవైపు.. రనౌట్ ప్రమాదాల నుంచి తప్పించుకున్న నాలుగో నంబర్ బ్యాటర్ ఉజైరుల్లా నియాజాయ్ (Uzairullah Niazai) సైతం శతకం పూర్తి చేసుకున్నాడు. కేవలం 86 బంతుల్లోనే 12 ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 101 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఫైజల్- ఉజైరుల్లా కలిసి మూడో వికెట్కు 130 బంతుల్లో 148 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా అఫ్గనిస్తాన్ ఆఖరి పది ఓవర్లలో ఏకంగా 111 పరుగులు రాబట్టింది. మొత్తంగా నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయిన అఫ్గన్ జట్టు ఏకంగా 310 పరుగులు సాధించింది.𝙄𝙩 𝙩𝙤𝙤𝙠 𝙨𝙤𝙢𝙚𝙩𝙝𝙞𝙣𝙜 𝙨𝙥𝙚𝙘𝙞𝙖𝙡 𝙩𝙤 𝙨𝙩𝙤𝙥 𝙨𝙤𝙢𝙚𝙩𝙝𝙞𝙣𝙜 𝙨𝙥𝙚𝙘𝙞𝙖𝙡 ✨Deepesh Devendran goes through the gate to hand #TeamIndia a vital wicket 👊#ICCMensU19WC | Semi-Final 2 | #INDvAFG 👉 LIVE NOW ➡️ https://t.co/BH7PyKi0Hq pic.twitter.com/eVzeiSfryl— Star Sports (@StarSportsIndia) February 4, 2026ఈ ఎడిషన్లో ఇదే అత్యధిక స్కోరుఅండర్-19 వరల్డ్కప్ నాకౌట్ మ్యాచ్లలో తాజా ఎడిషన్లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఇక భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ చెరో రెండు వికెట్లు తీశారు. అఫ్గన్ విధించిన 311 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తేనే భారత్ ఫైనల్లో అడుగుపెట్టగలదు.ఇదిలా ఉంటే.. మంగళవారం నాటి తొలి సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి ఇంగ్లండ్ ఫైనల్కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.చదవండి: WC 2026: ఆసీస్ అవుట్.. వరల్డ్కప్ ఫైనల్లో ఇంగ్లండ్ -
వద్దని మొత్తుకున్నా వినలేదు.. అతడిని వదిలేశారు!
టీ20 ఫార్మాట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు టీమిండియా స్టార్ అభిషేక్ శర్మ. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున సత్తా చాటి.. భారత జట్టులోకి వచ్చిన ఈ పంజాబీ ఆటగాడు.. అనతికాలంలోనే ఓపెనర్గా పాతుకుపోయాడు.విధ్వంసకర ఇన్నింగ్స్కు మారుపేరుగా మారి ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు అభిషేక్ శర్మ (Abhishek Sharma). ఇప్పటికే తన ధనాధన్ ఆటతో ఎన్నో రికార్డులు సాధించిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. టీ20 ప్రపంచకప్-2026లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.మొదటి ఐపీఎల్ కోచ్ను నేనేఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ (Ricky Ponting) అభిషేక్ శర్మ గురించి ఆసక్తికర విషయం వెల్లడించాడు. ఈ విధ్వంసకర బ్యాటర్కు మొదటి ఐపీఎల్ కోచ్ను తానేనని.. అతడు భవిష్యత్తు సూపర్స్టార్గా ఎదుగుతాడని నాడే అంచనా వేశానని పేర్కొన్నాడు.కాగా అభిషేక్ శర్మ 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. అప్పుడు పాంటింగ్ ఢిల్లీ కోచ్గా ఉన్నాడు. ఇక ఆర్సీబీతో తన తొలి మ్యాచ్లోనే అభిషేక్ శర్మ.. ఆరో స్థానంలో వచ్చి 19 బంతుల్లోనే 46 పరుగులతో అజేయంగా నిలిచాడు.టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో తాజాగా నాటి విషయాలు గుర్తు చేసుకున్న రిక్కీ పాంటింగ్.. అభిషేక్ శర్మను దూరం చేసుకోవద్దని తాను ఢిల్లీ యాజమాన్యానికి ఎంతగానో చెప్పిచూశానని తెలిపాడు. అయితే, మేనేజ్మెంట్ మాత్రం 2019 వేలానికి ముందు అతడిని ట్రేడ్ చేసిందని వెల్లడించాడు.భవిష్య సూపర్స్టార్.. వద్దని మొత్తుకున్నా వినలేదు"అతడికి మొదటి ఐపీఎల్ కోచ్ నేనే. నా మార్గదర్శనంలోనే అతడు అరంగేట్రం చేశాడు. పదిహేడేళ్ల వయసులో ఢిల్లీ తరఫున రంగంలోకి దిగి.. ఆరంభంలోనే అదరగొట్టాడు. తొలి బంతినే బౌలర్ మీదుగా స్ట్రెయిట్గా బౌండరీకి తరలించాడు. క్లాసీ షాట్లతో అలరించాడు.అప్పుడే అతడు ఓ ప్రత్యేకమైన ఆటగాడని నాకు అర్థమైంది. కానీ ఢిల్లీ యాజమాన్యం మాత్రం అతడిని ట్రేడ్ చేయాలని ఫిక్సైంది. అప్పుడు నేను అలా చేయవద్దని మొత్తుకున్నా వినలేదు. భవిష్య సూపర్స్టార్ ఇతడేనని బలంగా నమ్మాను. అదే విషయం వాళ్లకి చెప్పాను. అతడిపై నాకు భారీ అంచనాలు ఉండేవి’’ అని రిక్కీ పాంటింగ్ ఐసీసీ రివ్యూతో పేర్కొన్నాడు.ధావన్ కోసం ట్రేడ్ చేసిన ఢిల్లీకాగా శిఖర్ ధావన్ కోసం ఒప్పందం చేసుకునే క్రమంలో ఢిల్లీ అభిషేక్ శర్మను సన్రైజర్స్కు ట్రేడ్ చేసింది. ఇక సన్రైజర్స్కు మారిన తర్వాత అభిషేక్ సృష్టించిన పరుగుల సునామీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికి 71 ఇన్నింగ్స్లో 162కు పైగా స్ట్రైక్రేటుతో 1753 పరుగులు సాధించాడు. అదే విధంగా.. టీమిండియా తరఫున ఇప్పటికి 38 మ్యాచ్లు ఆడి 1297 రన్స్ రాబట్టిన అభిషేక్ శర్మ ఖాతాలో రెండు సెంచరీలు ఉన్నాయి.చదవండి: భారత్-పాక్ టీ20 ప్రపంచకప్ వార్.. కీలక వ్యక్తిని రంగంలోకి దించిన జై షా -
IND vs USA: భారత తుదిజట్టు ఇదే.. ఇషాన్కు నో ఛాన్స్!
పొట్టి క్రికెట్ సమరానికి రంగం సిద్ధమైంది. భారత్- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు శనివారం (ఫిబ్రవరి 7)న తెరలేవనుంది. ఈ ఐసీసీ ఈవెంట్లో తొలి రోజు మూడు మ్యాచ్లు జరుగుతాయి. తొలుత కొలంబో వేదికగా పాకిస్తాన్- నెదర్లాండ్స్.. ఆ తర్వాత కోల్కతాలో వెస్టిండీస్- స్కాట్లాండ్.. అనంతరం ముంబై వేదికగా టీమిండియా- అమెరికా (IND vs USA) జట్లు తలపడతాయి.ఇందుకోసం ఇప్పటికే జట్లన్నీ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశాయి. ఈ నేపథ్యంలో భారత తుదిజట్టు ఎలా ఉండబోతుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా సంజూ శాంసన్ (Sanju Samson)ను ఓపెనర్గా కొనసాగిస్తారా? లేదా? అన్నది చర్చనీయాంశమైంది.వరుస వైఫల్యాలుగత కొన్నాళ్లుగా సంజూ ఫామ్లేమి (10, 6, 0, 24, 6)తో సతమతమవుతుండటం ఇందుకు కారణం. అదే సమయంలో.. చాన్నాళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన మరో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ దుమ్ములేపుతున్నాడు. న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో వన్డౌన్లో వచ్చి ఆఖరి మ్యాచ్లో సెంచరీ (103)తో అదరగొట్టాడు.తిలక్ వర్మ పునరాగమనంకాగా తిలక్ వర్మ గాయం కారణంగా జట్టుకు దూరమైనంద వల్ల ఇషాన్ అతడి స్థానంలో వన్డౌన్లో వచ్చాడు. అయితే, వరల్డ్కప్ టోర్నీతో తిలక్ వర్మ పునరాగమనం చేయనున్నాడు. దీంతో ఇషాన్ను ఓపెనర్గా ప్రమోట్ చేసి.. సంజూపై మేనేజ్మెంట్ వేటు వేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇషాన్కు నో ఛాన్స్ఇలాంటి తరుణంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ ఆసక్తికర అంచనాతో ముందుకు వచ్చాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. అమెరికాతో తలపడే భారత తుదిజట్టును ఎంచుకున్న చహల్.. ఇషాన్ కిషన్ను పక్కనపెట్టడం విశేషం. అభిషేక్ శర్మతో కలిసి సంజూ శాంసన్ ఓపెనింగ్ చేయాలని అతడు అభిప్రాయపడ్డాడు.ఇక మూడో స్థానంలోకి తిలక్ వర్మ తిరిగివస్తాడన్న చహల్.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ యథావిధిగా నాలుగో నంబర్ బ్యాటర్గా బరిలోకి దిగుతాడని పేర్కొన్నాడు. హార్దిక్ పాండ్యా, శివం దూబే, రింకూ సింగ్.. మిడిలార్డర్, ఫినిషర్ పాత్రలు పోషిస్తారని తెలిపాడు.కుల్దీప్నకు కూడా మొండిచేయితన జట్టులో ఇద్దరు స్పిన్నర్లు అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తికి చోటిచ్చిన చహల్.. ఇద్దరు స్పెషలిస్టు సీమర్లుగా జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్లను ఎంచుకున్నాడు. ఈ క్రమంలో టాపార్డర్లో ఇషాన్ కిషన్తో పాటు.. స్పిన్ దళంలో కుల్దీప్ యాదవ్కు చహల్ మొండిచేయి చూపాడు. కాగా వరల్డ్కప్ టోర్నీలో ఇరవై జట్లు పాల్గొంటుండగా డిఫెండింగ్ చాంపియన్ భారత్.. పాకిస్తాన్, యూఎస్ఏ, నెదర్లాండ్స్, నమీబియాలతో కలిసి గ్రూప్-‘ఎ’లో ఉంది.టీ20 వరల్డ్కప్-2026లో అమెరికాతో మ్యాచ్కు చహల్ ఎంచుకున్న భారత తుదిజట్టుఅభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.చదవండి: ఇషాన్ కిషన్కు అండగా విరాట్ కోహ్లి.@yuzi_chahal picks his playing XI for India’s opening fixture! 👀 💪🏻Just 4 days to go before the defending champions begin their journey on T20 cricket’s biggest stage with one clear mission: 𝗥𝗘𝗣𝗘𝗔𝗧 & 𝗗𝗘𝗙𝗘𝗔𝗧 history 🔥🤩ICC Men’s #T20WorldCup 2026 👉 #INDvUSA |… pic.twitter.com/X9KsBx2CjQ— Star Sports (@StarSportsIndia) February 3, 2026 -
'ఫోర్స్ మజ్యూర్' క్లాజ్ను చూసుకొని ధీమాగా ఉన్న పాక్
టీ20 వరల్డ్కప్ 2026లో భారత్–పాకిస్తాన్ పోరు చుట్టూ పెద్ద వివాదం నడుస్తుంది. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన ఈ మ్యాచ్ను పాకిస్తాన్ ప్రభుత్వం బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడంతో ఈ వివాదం మొదలైంది. పాక్ ముందస్తు వ్యూహాల్లో భాగంగానే ఈ బాయ్కాట్ డ్రామాకు తెరలేపింది. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లు ఆడేందుకు భారత్ పాక్కు రాలేదని, అందుకు ప్రతిగా చివరి నిమిషంలో ఈ బాయ్కాట్ అంశాన్ని తెరపైకి తెచ్చింది. దీని వల్ల బీసీసీఐ, ఐసీసీకి నష్టం చేకూర్చాలన్నదే పాక్ ముఖ్య ఉద్దేశం. అయితే ఇక్కడ తాము కూడా నష్టపోతామని తెలిసినా పాక్ ఈ సాహసానికి పూనుకుంది. ఇందుకు కారణం ఫోర్స్ మజ్యూర్ క్లాజ్.ఏంటా ఫోర్స్ మజ్యూర్ క్లాజ్..? ఫోర్స్ మజ్యూర్ క్లాజ్ (Force Majeure Clause) అనేది ఒప్పందాల్లో ఉండే ఓ నిబంధన. ఈ నిబంధన అనుకోని మరియు నియంత్రణలో లేని పరిస్థితులు ఏర్పడితే, సంబంధిత పక్షం తన బాధ్యత నుంచి విముక్తి పొందే అవకాశం ఇస్తుంది. ఉదాహరణకు సహజ విపత్తులు, యుద్ధం, మహమ్మారి లేదా ప్రభుత్వ నిషేధాలు వంటి పరిస్థితులు ఏర్పడితే, ఈ ఒప్పందాన్ని అమలు చేయడం అసాధ్యం అవుతుంది. అప్పుడు సంబంధిత పక్షం తన బాధ్యత నుంచి విముక్తి పొందుతుంది. ఈ నిబంధనను ఆసరాగా చేసుకొనే పాక్ భారత్తో వరల్డ్కప్ మ్యాచ్ రద్దు విషయంలో డ్రామాలాడుతుంది. దీన్ని అడ్డుపెట్టుకొనే ప్రపంచం ముందు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. ఈ క్లాజ్ తమను చట్టపరంగా కాపాడుతుందని భావిస్తుంది. అయితే ఇక్కడే పాక్ ఓ సున్నితమైన విషయాన్ని విస్మరిస్తుంది. ప్రపంచకప్ మొత్తం ఆడి, భారత్తో గ్రూప్ స్టేజీ మాత్రమే బహిష్కరిస్తామని స్పష్టం చేసి, పప్పులో కాలేసింది. ఇలా ఒక్క మ్యాచ్ను మాత్రమే బాయ్కాట్ చేస్తామనేది ఐసీసీ-పాక్ క్రికెట్ బోర్డు చేసుకున్న ఒప్పందాలకు విరుద్దం.ఒప్పందాల్లో పాక్ భారత్తో తటస్థ వేదికలపై ఆడేందుకు ఒప్పుకుంది. ఇప్పుడు ఒక్క మ్యాచ్ను మాత్రమే బహిష్కరిస్తామనేది ఒప్పందాలకు విరుద్ధం. ఇక్కడ పీసీబీ ఫోర్స్ మజ్యూర్ క్లాజ్ను చూపించి తప్పించుకోవచ్చని ధీమాగా ఉంది. అయితే ఐసీసీ-పీసీబీ మధ్య జరిగిన ముందస్తు ఒప్పందంలో ఫోర్స్ మజ్యూర్ క్లాజ్ లేదని ఐసీసీ వర్గాలు అంటున్నాయి. పాక్ జట్టు మొత్తం టోర్నమెంట్ ఆడుతోంది. కేవలం భారత్తో మ్యాచ్ను మాత్రమే బహిష్కరిస్తోంది. ఇది అసాధ్యత కాదు, ఎంచుకున్న అసౌకర్యం. ఫోర్స్ మజ్యూర్ క్లాజ్ selective participationకి వర్తించదని ఐసీసీ స్పష్టం చేయడంలో పాక్ వర్గాల్లో భయం మొదలైంది. భారత్తో మ్యాచ్ జరగడానికి ఇంకా చాలా సమయం ఉన్నందుకు రద్దు అంశాన్ని రద్దు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. ఈ విషయాన్ని పీసీబీ ఐసీసీకి ఇంకా లిఖితపూర్వకంగా తెలియజేయలేదు కాబట్టి రద్దుపై పాక్ యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంది. లేదు ఇలాగే ముందుకెళ్దాం అని పాక్ భావిస్తే మాత్రం తిప్పలు తప్పవు. ఆ జట్టు చరిత్రలో కనీవినీ ఎరుగని భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ప్రపంచకప్ సెమీఫైనల్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్
అండర్ 19 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 4) రెండో సెమీఫైనల్ జరుగుతుంది. హరారే వేదికగా భారత్-ఆఫ్ఘనిస్తాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ మహబూబ్ ఖాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత్ ఎలాంటి మార్పులు చేయలేదు. గత మ్యాచ్లో పాక్తో ఆడిన జట్టునే కొనసాగించారు. నిన్న జరిగిన తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్ డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై విజయం సాధించి ఫైనల్కు చేరుకుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫిబ్రవరి 6న ఇంగ్లండ్ తాడోపేడో తేల్చుకుంటుంది.తుది జట్లు..ఆఫ్ఘనిస్తాన్: ఉస్మాన్ సదాత్, ఖలీద్ అహ్మద్జాయ్, ఫైసల్ షినోజాదా, ఉజైరుల్లా నియాజై, మహబూబ్ ఖాన్(w/c), అజీజుల్లా మియాఖిల్, అబ్దుల్ అజీజ్, ఖతీర్ స్టానిక్జాయ్, రూహుల్లా అరబ్, నూరిస్తానీ ఒమర్జాయ్, వహిదుల్లా జద్రాన్భారత్: ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మ్హత్రే(సి), వేదాంత్ త్రివేది, విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుందు(w), RS అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేష్ దేవేంద్రన్ -
భారత్-పాక్ టీ20 ప్రపంచకప్ వార్.. కీలక వ్యక్తిని రంగంలోకి దించిన జై షా
భారత్-పాకిస్తాన్ మధ్య టీ20 ప్రపంచకప్ పంచాయితీలో ఐసీసీ జోక్యం చేసుకుంది. ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్తో జరగాల్సిన గ్రూప్ స్టేజీ మ్యాచ్ను పాక్ బాయ్కాట్ చేసుకున్న నేపథ్యంలో ఐసీసీ అధ్యక్షుడు జై షా రంగప్రవేశం చేశారు. ఈ సున్నితమైన అంశాన్ని పరిష్కరించేందుకు ఓ మధ్యవర్తిని నియమించారు. సింగపూర్ క్రికెట్ అసోసియేషన్కు చెందిన అనుభవజ్ఞుడైన నిర్వాహకుడు ఇమ్రాన్ ఖ్వాజాను ప్రత్యేక ప్రతినిధిగా అపాయింట్ చేశారు. ఖ్వాజా గతంలో ఐసీసీ తాత్కాలిక చైర్మన్గా పనిచేసి, అన్ని ప్రధాన క్రికెట్ బోర్డులతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. ఇప్పుడు ఆయన పీసీబీతో చర్చలు జరిపి, పాకిస్తాన్ నిర్ణయాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఖ్వాజా మధ్యవర్తిత్వంతో పాకిస్తాన్ తమ నిర్ణయాన్ని మార్చుకొని, భారత్తో మ్యాచ్ ఆడుతుందని ఐసీసీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఒకవేళ పాక్ ఖ్వాజా మధ్యవర్తిత్వాన్ని కూడా బేఖాతరు చేస్తే, ఐసీసీ నిబంధనలను సైతం పక్కకు పెట్టి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంలో జై షా చాలా ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. పాక్కు చివరి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో అతను ఖ్వాజాను మధ్యవర్తిత్వానికి పంపాడు. టెక్నికల్గా ఉండే లూప్ హోల్స్ను వాడుకుంటూ పాక్ డ్రామాలు ఆడుతుందన్నది షా వాదన. ఈ విషయమై పీసీబీ లిఖితపూర్వక సమాచారం ఇవ్వకుండా తప్పించుకుంటుంది. ఒకవేళ ఐసీసీ చేసే అన్ని ప్రయత్నాలు విఫలమై పాక్ భారత్తో గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఆడకూడదనే నిర్ణయానికి కట్టుబడి ఉంటే, ఆ జట్టే తీవ్రంగా నష్టపోతుంది. ప్రపంచకప్ వరకు మ్యాచ్ పాయింట్లు కోల్పోతుంది. అలాగే ఈ మ్యాచ్ జరగకపోవడం వల్ల కలిగే నష్టాలకు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అనంతరం ఆర్దిక, పాలనా పరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 7 నుంచి ప్రపంచకప్ పోటీలు ప్రారంభమవుతాయి. అదే రోజు భారత్, పాక్ తమ తొలి మ్యాచ్లు ఆడతాయి. పాక్ నెదర్లాండ్స్తో.. భారత్ యూఎస్ఏతో తలపడతాయి. పాక్ తమ మ్యాచ్లన్నీ శ్రీలంకలో ఆడుతుంది. -
ఈ జట్టుతో మామూలుగుండదు.. అత్యంత ప్రమాదకరమైంది..!
త్వరలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోని టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించాడు. పొట్టి ప్రపంచకప్లో భారత్ అత్యంత ప్రమాదకరమైన జట్లలో ఒకటిగా అభివర్ణించాడు. ఈ జట్టులో అవసరమైన అన్ని అంశాలు (అనుభవం, బలమైన బ్యాటింగ్, అద్భుతమైన బౌలింగ్) సమగ్రంగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. అయితే రాత్రి వేళల్లో తేమ ప్రభావం ఆందోళన కలిగిస్తుందని అన్నాడు. ఈ విషయంలో టీమిండియా అలర్ట్గా ఉండాలని హెచ్చరించాడు. టాస్ చాలా కీలకమవుతుందని అంచనా వేశాడు. మాహి అన్ప్లగ్డ్ అనే కార్యక్రమం సందర్భంగా ధోని ఈ విషయాలను షేర్ చేసుకున్నాడు.కోహ్లి, రోహిత్ ఎందుకు ఆడకూడదు..?ఇదే కార్యక్రమం సందర్భంగా ఇంటర్వూయర్ ధోనిని విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ గురించి అడిగాడు. వారిద్దరు 2027 వన్డే వరల్డ్కప్ ఆడగలరా అని ప్రశ్నించాడు. దీనిపై ధోని స్పందిస్తూ.. ఆటగాళ్లకు వయసు ఎప్పుడూ ప్రమాణం కాదు. ప్రదర్శన మరియు ఫిట్నెస్ మాత్రమే అసలు ప్రమాణాలు. దేశం కోసం కృషి చేయాలనుకున్నప్పుడు ఎవరినైనా ఎందుకు ఆపాలి.అనుభవం ఒక్కసారిగా రాదు. 20 ఏళ్ల ఆటగాడికి అనుభవం ఉండదు, సచిన్ టెండూల్కర్ లాంటి అసాధారణ ప్రతిభ తప్ప. కాబట్టి అందరినీ సమానంగా చూడాలి. ప్రదర్శన ఉంటే జట్టులో ఉంటారు, లేకపోతే ఉండరు అని అన్నాడు.ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్లో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుంది. ఇటీవలికాలంలో ధోని చెప్పినట్లుగానే టీమిండియా చాలా ప్రమాదకరంగా ఉంది. అక్టోబర్ 2023 నుంచి ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ల్లో 51-8 విన్-లాస్ రికార్డు సాధించింది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో టీమిండియా అన్ని విభాగాల్లో అత్యంత పటిష్టమైన జట్టుగా ఉంది. బ్యాటింగ్లో కెప్టెన్ సూర్యతో పాటు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శివమ్ దూబే అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తున్నారు. జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి ఉరకలేస్తున్నారు. ప్రపంచకప్లో వీరిని ఆపడం ఏ జట్టుకైనా సామర్థ్యానికి మించిన పనే అవుతుంది. భారత్ తమ వరల్డ్కప్ ప్రయాణాన్ని ఫిబ్రవరి 7న యూఎస్ఏతో జరిగే మ్యాచ్తో మొదలుపెడుతుంది. భారత్.. పాకిస్తాన్, యూఎస్ఏ, నమీబియా, నెదర్లాండ్స్ జట్లతో గ్రూప్-ఏలో ఉంది. ఫిబ్రవరి 15న పాకిస్తాన్తో మ్యాచ్ అనుమానంగా ఉంది. భద్రతా కారణాలంటూ ఈ మ్యాచ్ను పాక్ బాయ్కాట్ చేసుకుంది. -
చరిత్ర తిరగరాసిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్
మహిళల ఐపీఎల్లో (WPL) ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ నందిని శర్మ చరిత్ర తిరగరాసింది. లీగ్ చరిత్రలో (సింగిల్ ఎడిషన్లో) అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా అవతరించింది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ బౌలర్ సైకా ఇషాఖీ పేరిట ఉండిన రికార్డును బద్దలు కొట్టింది. ఇషాఖీ 2023 ఎడిషన్లో 15 వికెట్లు తీయగా.. ప్రస్తుత ఎడిషన్లో (2026) నందిని 16 వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. నిన్న (ఫిబ్రవరి 3) గుజరాత్ జెయింట్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో నందిని శర్మ ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్లో ఆమె 2 వికెట్లు తీసింది.డబ్ల్యూపీఎల్ చరిత్రలో ఓ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు (టాప్-4)నందిని శర్మ (ఢిల్లీ క్యాపిటల్స్)- 16 వికెట్లు (2026)సైకా ఇషాఖీ (ముంబై ఇండియన్స్)- 15 (2023)శ్రీచరణి (ఢిల్లీ క్యాపిటల్స్)- 14 (2026)శ్రేయాంక పాటిల్ (ఆర్సీబీ)- 13 (2024)హ్యాట్రిక్ఈ సీజన్లో గుజరాత్ జెయింట్స్తో జరిగిన తొలి లీగ్ మ్యాచ్లో నందిని హ్యాట్రిక్తో మెరిసింది. ఆ మ్యాచ్లో ఢిల్లీ ఓడినా నందిని హ్యాట్రిక్ సహా ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసి సత్తా చాటింది. ఈ సీజన్లో ఢిల్లీ సాధించిన విజయాల్లో నందినిది కీలకపాత్ర. 24 ఏళ్ల ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ను ఢిల్లీ ఈ సీజన్ వేలంలో 20 లక్షలకు సొంతం చేసుకుంది.నిన్న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ విషయానికొస్తే.. ఢిల్లీ గుజరాత్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, వరుసగా నాలుగో ఎడిషన్లోనూ ఫైనల్కు చేరింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. బెత్ మూనీ (62 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో చినెల్ హెన్రీ 3, నందిని శర్మ 2, మిన్ను మణి ఓ వికెట్ తీశారు.అనంతరం 169 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 15.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఆడుతూపాడుతూ ఛేదించింది. లిజెల్ లీ (43), జెమీమా రోడ్రిగ్స్ (41) ఢిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించారు. రేపు (ఫిబ్రవరి 5) వడోదరలో జరుగబోయే ఫైనల్లో ఢిల్లీ ఆర్సీబీతో తలపడనుంది. -
యంగ్ ఇండియా చరిత్ర కొనసాగిస్తుందా..?
అండర్-19 ప్రపంచకప్ 2026 ఎడిషన్లో యంగ్ ఇండియా ఫైనల్ ఫోర్కు చేరింది. ఇవాళ (ఫిబ్రవరి 4) జరిగే రెండో సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ను ఢీకొట్టేందుకు సిద్దంగా ఉంది. ఈ మ్యాచ్ హరారే వేదికగా భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో ఆయుశ్ మాత్రే నేతృత్వంలోని యువ భారత్ హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది. యంగ్ ఇండియా ఈ మ్యాచ్లో కూడా గెలిస్తే.. ఫిబ్రవరి 6న జరిగే ఫైనల్లో ఇంగ్లండ్తో అమీతుమీ తేల్చుకుంటుంది. నిన్న జరిగిన తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్ డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై విజయం సాధించి ఫైనల్కు చేరుకుంది.యంగ్ ఇండియా ఆరో టైటిల్కు రెండు అడుగుల దూరంలో ఉన్న నేపథ్యంలో అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో భారత ప్రస్థానంపై ఓ లుక్కేద్దాం. యువకుల క్రికెట్కు సంబంధించి ఈ టోర్నీ చాలా ప్రాముఖ్యం కలిగింది. ఈ టోర్నీ చరిత్రలో భారత్ అత్యంత విజయవంతమైన జట్టుగా చలామణి అవుతుంది. ఇప్పటివరకు జరిగిన 15 ఎడిషన్లలో 5 టైటిళ్లు సాధించి, టోర్నీ చరిత్రలో అత్యధిక టైటిళ్లు సాధించిన జట్టుగా నిలిచింది. అలాగే నాలుగు సార్లు రన్నరప్గానూ నిలిచి, మొత్తం తొమ్మిది సార్లు ఫైనల్కు చేరిన ఏకైక జట్టుగా చరిత్ర సృష్టించింది. గతం ఇంత ఘనంగా కలిగిన భారత జట్టు మరో టైటిల్ను సొంతం చేసుకుంటుందో లేదో తేలియాలంటే మరో రెండు రోజుల వేచి చూడాలి. భారత్ ఆరో టైటిల్ను సాధించాలని ఆకాంక్షించే ముందు అండర్-19 ప్రపంచకప్ టోర్నీల్లో భారత ప్రస్థానంపై ఓ లుక్కేద్దాం. ఈ టోర్నీ 1988లో ప్రారంభం కాగా.. భారత్ తమ తొలి టైటిల్ను 2000లో సాధించింది.2000 - మొహమ్మద్ కైఫ్శ్రీలంకలో జరిగిన ఆ ఎడిషన్లో మొహమ్మద్ కైఫ్ నేతృత్వంలోని యంగ్ ఇండియా ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసి తొలి అండర్-19 ప్రపంచ్కప్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ టోర్నీ ద్వారానే యువరాజ్ సింగ్ వంటి స్టార్లు అంతర్జాతీయ క్రికెట్ సమాజానికి పరిచయమయ్యారు.2008 – విరాట్ కోహ్లీ 2008లో మలేషియాలో జరిగిన ప్రపంచకప్లో విరాట్ కోహ్లీ నాయకత్వంలో భారత్ రెండోసారి టైటిల్ గెలిచింది. ఆ జట్టులో రవీంద్ర జడేజా, మనీష్ పాండే వంటి ఆటగాళ్లు ఉన్నారు. ఈ విజయం తర్వాత కోహ్లీ సీనియర్ జట్టులోకి ప్రవేశించి, భారత క్రికెట్ చరిత్రలో గొప్ప ఆటగాడిగా ఎదిగాడు. 2012 – ఉన్ముక్త్ చంద్ 2012లో ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచకప్లో ఉన్ముక్త్ చంద్ నాయకత్వంలో భారత్ మూడో టైటిల్ గెలిచింది. ఫైనల్లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయాన్ని సాధించింది. ఆ జట్టులో కేఎల్ రాహుల్, హనుమ విహారి వంటి ఆటగాళ్లు ఉన్నారు. 2018 – పృథ్వీ షా2018లో న్యూజిలాండ్లో జరిగిన ప్రపంచకప్లో పృథ్వీ షా నాయకత్వంలో భారత్ నాలుగో టైటిల్ గెలిచింది. శుభ్మన్ గిల్ అద్భుత ప్రదర్శనతో వెలుగులోకి వచ్చాడు. ఈ జట్టు అత్యంత బలమైన జట్టుగా గుర్తింపు పొందింది. 2022 – యష్ ధుల్ 2022లో వెస్టిండీస్లో జరిగిన ప్రపంచకప్లో యష్ ధుల్ నాయకత్వంలో భారత్ ఐదో టైటిల్ గెలిచింది. ఫైనల్లో ఇంగ్లాండ్ను ఓడించి, మరోసారి యువ క్రికెట్ శక్తిని ప్రపంచానికి చూపించింది. 2024 – ఫైనల్లో పరాజయం 2024లో దక్షిణాఫ్రికాలో జరిగిన ప్రపంచకప్లో భారత్ ఫైనల్కి చేరినా, ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఈ ఎడిషన్లో యంగ్ ఇండియా ఓడిపోయినప్పటికీ, అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంది. దీనికి ముందు భారత్ 2006, 2016, 2020 ఎడిషన్లలోనూ రన్నరప్తో సరిపెట్టుకుంది. -
ఇషాన్ కిషన్కు అండగా విరాట్ కోహ్లి
న్యూజిలాండ్ టీ20 సిరీస్లో అనూహ్యంగా జట్టులోకి వచ్చి అద్భుతాలు చేసిన టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ఒకనొక దశలో మానసికంగా కృంగిపోయి ఉన్నప్పుడు టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి తనకు అండగా నిలబడ్డాడని గుర్తు చేసుకున్నాడు. ఆ క్షణాలు జీవితంలో మరిచిపోలేనివని అన్నాడు. విరాట్ ఓదార్పు తనను కెరీర్లో తిరిగి పుంజుకునేలా చేసిందని తెలిపాడు.మానసికంగా విరిగిపోయిన సమయంఇషాన్ 2020 ఐపీఎల్ ఎడిషన్లో ముంబై ఇండియన్స్ తరఫున 516 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు. కానీ 2021లో పరిస్థితి పూర్తిగా మారింది. 10 మ్యాచ్ల్లో కేవలం 241 పరుగులు మాత్రమే సాధించాడు. అతని ఆటలో ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం స్పష్టంగా కనిపించింది. ఆ సమయంలో వ్యాఖ్యాత ఇయాన్ బిషప్ అతన్ని “బ్రోకెన్ యంగ్ మాన్” అని వ్యాఖ్యానించారు. విరాట్ కోహ్లీ ఇచ్చిన మానసిక బలం ఆ సమయంలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ ఇషాన్ దగ్గరకు వెళ్లి మాట్లాడాడు. ఆ క్షణం ఇషాన్ జీవితంలో మరపురాని అనుభవంగా నిలిచింది. “నేను కన్నీళ్లు ఆపుకుంటూ ఉన్నాను. విరాట్ భాయ్ వచ్చి నన్ను ఓదార్చారు. ఆ సమయంలో నాకు ఆ మాటలు చాలా అవసరం అయ్యాయి” అని ఇషాన్ ఇటీవల ఒక పోడ్కాస్ట్లో చెప్పాడు. బాధను విజయంగా మార్చిన క్షణం విధి చాలా నాటకీయమైంది. 2022లో ఇషాన్ కిషన్ 121 బంతుల్లో డబుల్ సెంచరీ (ఫాస్టెస్ట్) సాధించినప్పుడు, నాన్-స్ట్రైకర్ ఎండ్లో నిలిచింది విరాట్ కోహ్లీనే. ఇద్దరూ కలిసి 290 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత జట్టుకు చరిత్రాత్మక విజయాన్ని అందించారు. ఒకప్పుడు కన్నీళ్లు ఆపుకున్న ఆటగాడు, అదే కోహ్లీ సాక్షిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.నమ్మకముంచిన ముంబై ఇండియన్స్ ఇషాన్ 2021లో విఫలమైనప్పటికీ, ముంబై ఇండియన్స్ అతనిపై నమ్మకముంచింది. 2022 వేలంలో రూ. 15.25 కోట్ల భారీ మొత్తానికి అతన్ని తిరిగి కొనుగోలు చేసింది. ఎంఐ విశ్వాసాన్ని ఇషాన్ నిలబెట్టుకున్నాడు. ఆ ఎడిషన్లో 14 ఇన్నింగ్స్ల్లో 133.88 స్ట్రైక్రేట్తో 418 పరుగులు చేసి, ముంబై ఇండియన్స్ తరఫున అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచాడు.ఇషాన్ 2.0ఐపీఎల్ అనుభవాలు పక్కన పెడితే, ఇషాన్ అంతర్జాతీయ కెరీర్లోనూ అద్భుతమైన పునరాగమనం చేశాడు. రెండేళ్ల కిందట అతనికి టీమిండియాలో స్థానమే ఉండేది కాదు. స్వయంకృతాపరాధాల వల్ల జట్టులో స్థానం కోల్పోవడంతో పాటు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా కోల్పోయాడు. అయితే ఇషాన్ తిరిగి అద్భుత రీతిలో పుంజుకున్నాడు.గడిచిన రెండేళ్లలో దేశీయ క్రికెట్లో విశేషంగా రాణించి, ఇటీవల న్యూజిలాండ్ టీ20 సిరీస్కు అనూహ్యంగా జట్టులోకి వచ్చాడు. ఈ వెర్షన్ ఇషాన్లోని 2.0 వెర్షన్. రీఎంట్రీలో ఇషాన్ మరింత చెలరేగిపోయాడు. మొదటి మూడు మ్యాచ్ల్లోనే వరుసగా 76, 28, 103 పరుగుల స్కోర్లు చేశాడు. ఈ ప్రదర్శనల తర్వాత అతను త్వరలో ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్కప్లో అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయడం ఖరారైపోయింది. -
పతకాల వేటలో ఆర్టీసీ కండక్టర్ స్వరాజ్యలక్ష్మి
లక్ష్యాలు ఎన్ని నిర్దేశించుకున్నా.. వాటిని సాధించడంలో చాలా మంది విఫలమవుతుంటారు. కృషి, పట్టుదల లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఇంకొందరు లక్ష్యాలను ఎంచుకున్నా.. సమయం లేదని సాకులు చెబుతుంటారు.. వీటన్నింటినీ ఐదు పదుల వయసులో అధిగమించారు ఆర్టీసీ కండక్టర్ స్వరాజ్యలక్ష్మి. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటూ అనేక పతకాలు గెలుచుకుని అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అల్వాల్ మచ్చ»ొల్లారంలో నివసించే బైరి స్వరాజ్యలక్ష్మికి చిన్న తనం నుంచి పరుగు పందెం అంటే అమితమైన ఇష్టం. అయితే మధ్య తరగతి కుటుంబం కావడంతో ఆ మక్కువకు ప్రాథమిక స్థాయిలోనే ముగింపు పడింది. చదువు, వివాహం, అనంతరం సంతానం.. ఇలా అందరిలానే బాధ్యతల మధ్య చిక్కుకుపోయారు. అయితే భర్త ధనరాజ్తో తన ఆసక్తిని పంచుకున్నారు. దీంతో ఆమె అభిరుచిని గుర్తించి ప్రోత్సహించారు. ఇంతలోనే ఆరీ్టసీలో కండక్టర్గా ఉద్యోగం వచి్చంది. ఓవైపు ఇంటిపని, వంటపనితో పాటు మరోవైపు ఉద్యోగం చేస్తూ తన ఆసక్తిని నెరవేర్చుకోవడం కోసం పరుగు మొదలుపెట్టారు. ఆసరా అందిస్తే మరిన్ని పతకాలు.. క్రీడాకారులకు ప్రభుత్వరంగ సంస్థల్లో అధికంగా ప్రాధాన్యం ఉంటుంది. ఉద్యోగ నియామకాల్లో సైతం స్పోర్ట్స్ కోటా ఉండటమే ఇందుకు నిదర్శనం. రోజూ ఉద్యోగం చేసి ఇంటికి వచి్చన అనంతరం తరీ్ఫదు పొందడం పరిపాటి. ఇతర పోటీల్లో పాల్గొనాలంటే సెలవు పెట్టుకోవాల్సిన పరిస్థితి. దీంతో సరైన శిక్షణ లేకుండానే పాల్గొనాల్సి వస్తుందని స్వరాజ్యలక్ష్మి చెబుతున్నారు. అధికారులు, సిబ్బంది ప్రోత్సాహం అందిస్తున్నప్పటికీ ఉన్నత స్థాయి లక్ష్యాలను చేరుకోడానికి ఇది సరిపోవడం లేదంటున్నారు.12 ఏళ్లలో 70కి పైగా పతకాలు.. 12 సంవత్సరాల నుండి జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటూ పతకాల వేట సాగించారు. 70కి పైగా జాతీయ పతకాలు, నాలుగు అంతర్జాతీయ పతకాలు సాధించారు. ఇటీవల రాజస్థాన్లోని అజ్మీర్ లో జరిగిన ఏడో జాతీయ మాస్టర్ అథ్లెటిక్ చాంపియన్íÙప్ పోటీల్లో పాల్గొని 400 మీటర్ల విభాగంలో రజత పతకం, 800 మీటర్ల విభాగంలో కాంస్య పతకం సాధించారు. -
ఇంగ్లండ్ ‘క్లీన్స్వీప్’
పల్లెకెలె: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన ఇంగ్లండ్ జట్టు... శ్రీలంకపై టి20 సిరీస్ను ‘క్లీన్ స్వీప్’ చేసింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మంగళవారం జరిగిన ఆఖరి టి20లో ఇంగ్లండ్ 12 పరుగుల తేడాతో ఆతిథ్య శ్రీలంకను చిత్తు చేసింది. ఈ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్ను 2–1తో సొంతం చేసుకున్న ఇంగ్లండ్... టి20 సిరీస్ను 3–0తో చేజిక్కించుకుంది. చివరి మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిరీ్ణత 20 ఓవర్లలో 9 వికెట్లకు 128 పరుగులు చేసింది. సామ్ కరన్ (48 బంతుల్లో 58; 6 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్సెంచరీతో రాణించగా... జోస్ బట్లర్ (25), లియామ్ డాసన్ (14) మాత్రమే రెండంకెల స్కరు చేశారు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (4), బెన్ డకెట్ (0), జాకబ్ బెథెల్ (3), టామ్ బాంటన్ (7), విల్ జాక్స్ (3) విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో దుశ్మంత చమీరా 24 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా... పతిరణకు 2 వికెట్లు దక్కాయి. అనంతరం ఛేదనలో లంక 19.3 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటైంది. నిషాంక (23), కుషాల్ మెండిస్ (26) కాస్తా పోరాడగా... తక్కినవాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెథెల్ 4, జాక్స్ 3 వికెట్లు పడగొట్టారు. సామ్ కరన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. -
మెరుపుల పండక్కి భారత సంతతి!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టి20 ప్రపంచకప్లో ఒక్కో జట్టు నుంచి 11 మంది ప్లేయర్లు మాత్రమే మైదానంలో అడుగు పెడతారు. కానీ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న వరల్డ్కప్లో మాత్రం లెక్కకు మిక్కిలి భారత ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. అదేంటి ఏ జట్టుకైనా ఒకటే నిబంధన కదా అనే అనుమానం రాకమానదు. ఇక్కడే అసలు మెలిక ఉంది. టీమిండియా తరఫున ఆడేది పదకొండు మందే... కానీ, ప్రపంచకప్లో బరిలోకి దిగుతున్న 20 జట్లలో భారత్తో పాటు మరో తొమ్మిది జట్ల తరఫున మనదేశ సంతతి ఆటగాళ్లు ఆడనున్నారు. రెండోసారి టి20 ప్రపంచకప్నకు అర్హత సాధించిన కెనడా జట్టులో అత్యధికంగా 11 మంది భారత సంతతి ప్లేయర్లు ఉండగా... అమెరికా జట్టులో 9 మంది మనవాళ్లు ఉన్నారు. ప్రవాస భారతీయులు అధికంగా ఉండే ఒమన్, యూఏఈ నుంచి ఏడుగురు చొప్పున మన మూలాలున్న ప్లేయర్లు వరల్డ్కప్ ఆడనుండగా... ఇష్ సోధి, రచిన్ రవీంద్ర రూపంలో న్యూజిలాండ్ నుంచి ఇద్దరు భారత సంతతి ఆటగాళ్లు పోటీపడనున్నారు. ఇక దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఇటలీ, నెదర్లాండ్స్ నుంచి ఒక్కొక్కరు చొప్పున వరల్డ్కప్లో ఆడనున్నారు. ఇందులో కెనడా, అమెరికా, ఒమన్ జాతీయ జట్లకు సారథ్యం వహిస్తుంది కూడా మనవాళ్లే కావడం విశేషం. మరో మూడు రోజుల్లో టి20 వరల్డ్కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వివిధ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత సంతతి ఆటగాళ్లపై ఓ కన్నేద్దాం! పాకిస్తాన్ పనిపట్టి... సౌరభ్ నేత్రావల్కర్... ఈ పేరు గత టి20 ప్రపంచకప్ సమయంలో బాగా వినిపించింది. అమెరికా వేదికగా జరిగిన ఆ టోర్నమెంట్లో మాజీ చాంపియన్ పాకిస్తాన్ను అమెరికా ఓడించడంలో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కీలక పాత్ర పోషించాడు. గ్రూప్ దశలో పాకిస్తాన్, అమెరికా మధ్య జరిగిన పోరులో స్కోర్లు సమం కాగా... సూపర్ ఓవర్లో బౌలింగ్ చేసిన నేత్రావల్కర్... పాక్ బ్యాటర్లను కట్టడి చేశాడు. అంతకుముందు మ్యాచ్లోనూ 4 ఓవర్లలో కేవలం 18 పరుగులకే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ముంబైలో పుట్టి పెరిగి... ఒకప్పుడు అండర్–19 స్థాయిలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సౌరభ్ ప్రస్తుతం ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డాడు. లెఫ్టార్మ్ మీడియం పేస్ బౌలింగ్తో రాణించి అమెరికా జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. గత వరల్డ్కప్లో అమెరికా జట్టు ‘సూపర్–8’ దశకు చేరడంతో కీలకంగా వ్యవహరించిన 34 ఏళ్ల సౌరభ్... సాఫ్ట్వేర్ ఉద్యోగానికి సెలవు పెట్టి మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ఒకప్పుడు సూర్యకుమార్ యాదవ్తో కలిసి మ్యాచ్లు ఆడిన సౌరభ్ ఈ శనివారం ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా అతడికి ప్రత్యర్థిగా బరిలోకి దిగనున్నాడు. ‘ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు. కానీ, ఇది చాలా భావోద్వేగ క్షణం. జీవితం ఒక చక్రం లాంటిది. నేను ఇక్కడే క్రికెట్ ఆడటం ప్రారంభించా... మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇక్కడే టీమిండియతో మ్యాచ్ ఆడతానని ఎప్పుడూ ఊహించలేదు’ అని నేత్రావల్కర్ అన్నాడు. మోనాంక్ పటేల్ భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో కలిసి ఒకప్పుడు మ్యాచ్లు ఆడిన మోనాంక్ పటేల్... ప్రస్తుతం అమెరికా జట్టుకు కెప్టెన్గా వరల్డ్కప్నకు సిద్ధమయ్యాడు. 2024 టి20 వరల్డ్కప్లో పాకిస్తాన్తో పోరులో చక్కటి అర్ధశతకంతో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన మోనాంక్... ఈసారి కూడా మెగా టోర్నీలో తనదైన ముద్ర వేయాలని భావిస్తున్నాడు. గుజరాత్లో పుట్టి పెరిగిన 32 ఏళ్ల మోనాంక్... అండర్–19 స్థాయిలో బుమ్రాతో మ్యాచ్లు ఆడాడు. ‘మేమిద్దరం చిన్నప్పుడు కలిసి మ్యాచ్లు ఆడాం. ఆ తర్వాత ఇద్దరి దారులు వేరయ్యాయి. బుమ్రా ఇప్పుడు ప్రపంచ అత్యుత్తమ స్థాయికి ఎదిగాడు. టీమిండియాతో మ్యాచ్లో అతడి బౌలింగ్ను ఎదుర్కోవడం చాలా కష్టం అని తెలుసు. మా వరకు ఉత్తమ ప్రదర్శన కనబర్చాలని అనుకుంటున్నాం’ అని మోనాంక్ అన్నాడు. జస్ప్రీత్ సింగ్ మొదటిసారి ఐసీసీ టి20 ప్రపంచకప్ ఆడనున్న ఇటలీ జట్టులో పంజాబ్లో పుట్టి పెరిగిన జస్ప్రీత్ సింగ్ చోటు దక్కించుకున్నాడు. ఇరవై ఏళ్ల క్రితం మెరుగైన జీవనోపాధి కోసం కుటుంబంతో కలిసి ఇటలీకి వలస వెళ్లిన జస్ప్రీత్... అక్కడ క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూనే క్రికెట్ కొనసాగించాడు. తన ప్రదర్శనతో జాతీయ జట్టుకు ఎంపికైన 32 ఏళ్ల జస్ప్రీత్... వరల్డ్కప్ కోసం ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాడు. ఆర్యన్ దత్ ఇప్పటికే 2023 వన్డే ప్రపంచకప్ సందర్భంగా నెదర్లాండ్స్ తరఫున భారత్లో మ్యాచ్లాడిన ఆర్యన్ దత్... ఇప్పుడు టి20 వరల్డ్కప్నకు సిద్ధమవుతున్నాడు. 22 ఏళ్ల ఈ ఆఫ్ స్పిన్నర్ భారత్లో పుట్టకపోయినా... అతడి తల్లిదండ్రులది పంజాబే. మెరుగైన జీవనోపాధి కోసం ఆర్యన్ కుటుంబం నెదర్లాండ్స్కు వలస వెళ్లగా... అక్కడ తన స్పిన్తో సత్తాచాటిన ఆర్యన్ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. దిల్ప్రీత్ బాజ్వా వరల్డ్కప్లో బరిలోకి దిగనున్న కెనడా జట్టయితే పూర్తిగా భాతర సంతతి ఆటగాళ్లతో నిండి ఉంది. ఆ జట్టుకు సారథ్యం వహిస్తున్న దిల్ప్రీత్ బాజ్వా ఇటీవలే కెనడాకు వలస వెళ్లాడు. అనతి కాలంలోనే తన ప్రతిభతో అక్కడి జాతీయ జట్టుకు కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఏజ్ గ్రూప్ క్రికెట్లో పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన దిల్ప్రీత్... కెనడా గ్లోబల్ టి20 లీగ్లో విజృంభించి వెలుగులోకి వచ్చాడు. జతిందర్ సింగ్ పంజాబ్లోని లుధియానాలో పుట్టి పెరిగిన జతిందర్ సింగ్... ఈ ప్రపంచకప్లో ఒమన్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. దశాబ్దానికి పైగా భారత దేశవాళీల్లో ఆడిన 36 ఏళ్ల జతిందర్... అవకాశాలు రాకపోవడంతో ఒమన్కు వలసవెళ్లి ఆ దేశ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అతడితో పాటు వినాయక్ శుక్లా, కరణ్ సోనావాలె, జై, ఆశిష్, వసీం, జితేన్ రామనంది ఇలా ఏడుగురు భారత సంతతి ఆటగాళ్లు ఒమన్ తరఫున బరిలోకి దిగనున్నారు. టి20 ప్రపంచకప్లో భారత సంతతి ఆటగాళ్లు కెనడా (11): దిల్ప్రీత్ బాజ్వా (కెప్టెన్ ), అజయ్వీర్ హుండల్, అంశ్ పటేల్, హర్ష్ థాకెర్, జస్కరణ్దీప్ బుట్టర్, కన్వర్పాల్ తత్ఘుర్, నవ్నీత్ ధలీవాల్, రవీందర్పాల్ సింగ్, శివం శర్మ, శ్రేయస్ మొవ్వ, యువరాజ్ సామ్రా. అమెరికా (9): మోనాంక్ పటేల్ (కెప్టెన్ ), జెస్సీ సింగ్, మిలింద్ కుమార్, నోస్తుష్ కెంజిగె, సాయితేజ ముక్కామల, సంజయ్ కృష్ణమూర్తి, హర్మీత్ సింగ్, సౌరభ్ నేత్రావల్కర్, శుభం రంజనె. ఒమన్ (7): జతిందర్ సింగ్ (కెప్టెన్), వినాయక్ శుక్లా, కరణ్ సోనావాలె, జై ఒడెద్రా, ఆశిష్ ఒడెద్రా, వసీం అలీ, జితేన్ రామనంది. యూఏఈ (7): అలీషాన్ షరాఫు, ఆర్యాంశ్ శర్మ, ధ్రువ్ పరాశర్, హర్షిత్ కౌశిక్, మయాంక్ కుమార్, సిమ్రన్జీత్ సింగ్, సొహైబ్ ఖాన్. న్యూజిలాండ్ (2): ఇష్ సోధి, రచిన్ రవీంద్ర దక్షిణాఫ్రికా (1): కేశవ్ మహరాజ్ వెస్టిండీస్ (1): గుడకేశ్ మోతీ ఇటలీ (1): జస్ప్రీత్ సింగ్ నెదర్లాండ్స్ (1): ఆర్యన్ దత్ తెలుగువాళ్లు కూడా...అమెరికా తరఫున ఆడుతున్న ముక్కామల సాయితేజ రెడ్డి... కెనడా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రేయస్ మొవ్వ తెలుగు మూలాలున్న ఆటగాళ్లే. అమెరికాలోనే పుట్టి పెరిగిన సాయితేజ రెడ్డి అమెరికా జాతీయ జట్టు ఓపెనర్గా 37 వన్డేలు, 18 టి20లు ఆడాడు. మంచి స్ట్రయిక్ ప్లేయర్గా గుర్తింపు తెచ్చుకున్న సాయితేజ... ఈ మెగాటోర్నీలో ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. భారత్లో పుట్టి కెనడాకు వలస వెళ్లిన శ్రేయస్ మొవ్వ ఆ దేశ జట్టు తరఫున ఇప్పటి వరకు 24 వన్డేలు, 24 టి20లు ఆడాడు. -
చాంపియన్ హరియాణా థండర్స్
న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)లో హరియాణా థండర్స్ జట్టు వరుసగా రెండోసారి చాంపియన్గా నిలిచింది. ఫైనల్లో హరియాణా 5–4 పాయింట్ల తేడాతో ఢిల్లీ దంగల్ వారియర్స్పై గెలిచింది. ఇప్పటి వరకు ఈ లీగ్ ఐదుసార్లు నిర్వహించగా... అందులో హరియాణా జట్టు రెండోసారి ట్రోఫీ చేజిక్కించుకుంది. చివరగా 2019లో జరిగిన లీగ్లో హరియాణా జట్టు టైటిల్ నెగ్గింది. తాజా లీగ్లో హోరాహోరీగా సాగిన తుదిపోరులో ఎనిమిది బౌట్లు ముగిసేసరికి ఇరు జట్లు 4–4తో సమంగా నిలిచాయి. చివరగా జరిగిన మహిళల 62 కేజీల పోరులో పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత ఇరినా కొలియాడెన్కో ఒత్తిడిని అధిగమిస్తూ... అంజలిని చిత్తుచేసింది. దీంతో హరియాణా థండర్స్ విజేతగా నిలిచింది. అంతకుముందు పురుషుల 74 కేజీల విభాగంలో జరిగిన తొలి బౌట్లో బైరమోవ్ (ఢిల్లీ) 8–2తో ప్రవిందర్ (హరియాణా)పై... రెండో బౌట్గా జరిగిన మహిళల 76 కేజీల పోరులో కాజల్ (హరియాణా) 3–1తో అనస్తసియా అల్పియోవా (ఢిల్లీ)పై... మూడో బౌట్ పురుషుల 65 కేజీల ఈవెంట్లో సుజీత్ కల్కల్ (ఢిల్లీ) 8–6తో తుముర్ ఒచిర్ తుల్గా (హరియాణా)పై... నాలుగో బౌట్ మహిళల 53 కేజీల పోరులో యీ సుసకీ (హరియాణా) 5–0తో సారిక (ఢిల్లీ)పై... ఐదో బౌట్ పురుషుల 86 కేజీల విభాగంలో హాది భక్తియార్ 11–0తో అశిరోవ్ అష్రఫ్ (హరియాణా)పై... ఆరో బౌట్ పురుషుల 57 కేజీల పోరులో అక్షయ్ ఢేరె (హరియాణా) 16–0తో అమిత్ (ఢిల్లీ)పై... ఏడో బౌట్గా జరిగిన పురుషుల 125 కేజీల పోరులో రోనక్ 12–1తో అనిరుధ్ (హరియాణా)పై గెలిచారు.ఎనిమిదో బౌట్ మహళల 57 కేజీల విభాగంలో నేహ (హరియాణా) 8–2తో అంజలి (ఢిల్లీ)పై గెలిచారు. ఢిల్లీ దంగల్ వారియర్స్కు చెందిన యువ రెజ్లర్ తురాన్ బైరమోవ్ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు దక్కించుకున్నాడు. పురుషుల 57 కేజీల విభాగంలో పోటీపడిన అతడు... ఆడిన ఏడు బౌట్లలోనూ విజయాలు సాధించడం విశేషం. హరియాణా థండర్స్ రెజ్లర్ నేహా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ... ఢిల్లీ దంగల్ వారియర్స్కు చెందిన రోనక్ (125 కేజీలు) ‘ఫైటర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నారు. పంజాబ్ రాయల్స్కు చెందిన చంద్రమోహన్ లీగ్లో అత్యధిక పాయింట్లు సాధించిన రెజ్లర్గా నిలిచాడు. హరియాణా థండర్స్కు చెందిన అక్షయ్ ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు. -
యువ భారత్ను ఆపతరమా!
హరారే: అండర్–19 ప్రపంచకప్లో అజేయంగా దూసుకెళ్తున్న యువ భారత్ ఇదే జోరుతో ఫైనల్ చేరాలని ఆశిస్తోంది. నేడు జరిగే రెండో సెమీఫైనల్లో భారత జట్టు అఫ్గానిస్తాన్తో తలపడుతుంది. ఫామ్ పరంగా చూసినా, మొత్తం టీమ్ ప్రదర్శన చూసినా ఆయుశ్ మాత్రే సారథ్యంలోని భారత్ను అడ్డుకోవడం అఫ్గాన్కు సాధ్యమయ్యే పనైతే కాదు. అండర్–19 ప్రపంచకప్ల చరిత్రలోనే ఐదు టైటిళ్లతో అత్యంత విజయవంతమైన జట్టుగా నిరూపించుకున్న యువ భారత్... 2000, 2008, 2012, 2018, 2022 సరసన ఈ ఏడాదిని కూడా చేర్చాలని ఆరాటపడుతోంది. మన కుర్రాళ్లు ఆడుతున్న తీరు, గెలుస్తున్న వైనం చూస్తుంటే ఇదేమంత కష్టం కానేకాదు. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ తిరుగులేని విజయాలు సాధించింది. ఇలాంటి దుర్బేధ్యమైన భారత సేనను ఎదుర్కోవాలంటే అఫ్గానిస్తాన్ పెద్ద కసరత్తే చేయాలి. ఇక గెలవాలంటే మాత్రం ఓ సంచలనం నమోదవ్వాలి. అయితే ప్రత్యేకించి ఈ టోర్నీలో అఫ్గానిస్తాన్ కూడా బాగా ఆడింది. భారత కుర్రాళ్లు ఐదు గెలిస్తే... అఫ్గాన్ కేవలం ఒకటి ఓడి, నాలుగు విజయాలతో సత్తా చాటుకుంది. ఇలాంటి మేటి ప్రదర్శన కనబరిచిన అఫ్గాన్ను తక్కువ అంచనా వేయకూడదని ఆయుశ్ బృందానికి బాగా తెలుసు. ఆదమరుపు లేకుండా ఎప్పటిలాగే మరో మ్యాచ్ విజయం కోసం చెమటోడ్చాలని యువ బృందం పట్టుదలతో ఉంది. టీనేజ్ సంచలనం, ఓపెనింగ్ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ సహా టాపార్డర్ బ్యాటర్లు ప్రత్యర్థి బౌలర్ల భరతం పడుతున్నారు. ఆల్రౌండర్ విహాన్ మల్హోత్రా బ్యాట్తో, కెప్టెన్ ఆయుశ్ మాత్రే బంతితో ప్రత్యర్థి జట్ల పని పడుతున్నారు. వీరితో పాటు పేసర్లు హేనిల్ పటేల్, అంబరీశ్ నిప్పులు చెరుగుతుండటం బౌలింగ్ దళానికి వెన్నుదన్నుగా ఉంది. అఫ్గానిస్తాన్ కూడా మ్యాచ్మ్యాచ్కు రాటుదేలుతున్నప్పటికీ భారత్లాంటి ఆల్రౌండ్ సామర్థ్యమున్న జట్టును ఓడించాలంటే సర్వశక్తులు ఒడ్డినా సరిపోదేమో!ఆ్రస్టేలియాపై గెలిచి ఫైనల్లో ఇంగ్లండ్మంగళవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్ 27 పరుగుల తేడాతో ఆ్రస్టేలియాను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. మొదట ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 277 పరుగులు చేసింది. కెప్టెన్ థామస్ ర్యూ (107 బంతుల్లో 110; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించాడు. అనంతరం 278 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా అండర్–19 జట్టు 47.3 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. కెప్టెన్ ఒలివర్ పీక్ (88 బంతుల్లో 100; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. భారత్, అఫ్గానిస్తాన్ మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో శుక్రవారం జరిగే ఫైనల్లో ఇంగ్లండ్ తలపడుతుంది. -
వికెట్పడ్డా.. టెస్టుల్లో ఇక ఆఖరి ఓవర్లో 6 బంతులు పడాల్సిందే!
లండన్: క్రికెట్ నియమావళి మారింది. కొత్త మార్పులు ఈ ఏడాది నుంచే అమలవుతాయని మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) వెల్లడించింది. నియమావళిలో ఏకంగా 73 సవరణలు జరిగినప్పటికీ ప్రధానంగా టెస్టుల్లో ఇకపై ఆఖరి ఓవర్ను తప్పనిసరిగా పూర్తి చేయాలన్న నిబంధన అమలుకానుంది. దశాబ్దాలుగా సంప్రదాయ ఫార్మాట్లో ఆ రోజు చివరి ఓవర్లో వికెట్ పడితే అక్కడితోనే ఆట ముగిస్తున్నారు. మరో బ్యాటర్ రావడం... మిగతా బంతులు ఆడటం జరగట్లేదు. బ్యాడ్లైట్ లాంటి ప్రతికూల వాతావరణం లేకుంటే ఇకపై బ్యాటర్ క్రీజులోకి రావాల్సిందే... మిగిలిన బంతులు ఆడాల్సిందేనని ఎంసీసీ సవరించిన నియమావళి చెబుతోంది. ఆఖరి ఓవర్ డ్రామాను అర్ధంతరంగా ముగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కొత్త మార్పులు, నియమావళిని ఈ అక్టోబర్ నుంచి అమలు చేయనున్నట్లు ఎంసీసీ పేర్కొంది. ల్యామినేటెడ్ బ్యాట్లకు సై పురుషులు ఆడే క్లబ్ క్రికెట్లో ఇకపై ల్యామినేటెడ్ బ్యాట్లను అనుమతిస్తారు. ల్యామినేటెడ్ బ్యాట్లకు దూరంగా ఉన్న ఎంసీసీ తొలిసారిగా 2017లో జూనియర్ క్రికెట్లో అనుమతించింది. ఇప్పుడు సీనియర్ క్రికెట్లో సై అంటున్నారు. బంతిని ఆడే క్రమంలో బ్యాటర్ తనను తాను నియంత్రించుకోకుండా వికెట్లను తగిలితే హిట్ వికెట్గా అవుట్ ఇస్తారు. ఇది యథాతథం. అయితే బ్యాటర్ ప్రమేయం లేకుండా ఫీల్డర్ల పొరపాటు వల్ల వికెట్లను తాకితే ఇకమీదట ఆ బ్యాటర్ను హిట్ వికెట్గా పెవిలియన్కు పంపించరు. -
మళ్లీ ఢిల్లీనే...
వడోదర: ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ ఫైనల్ చేరింది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో మంగళవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్పై ఘనవిజయం సాధించింది. వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరిన జట్టుగా ఢిల్లీ ఘనత వహించింది. గురువారం జరిగే టైటిల్ పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో క్యాపిటల్స్ తలపడుతుంది. 2024లోనూ ఇరు జట్లు టైటిల్ కోసం ఢీకొనగా ఆర్సీబీ విజేతగా నిలిచింది. మొదట గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఓపెనర్ బెత్ మూనీ (51 బంతుల్లో 62 నాటౌట్; 6 ఫోర్లు) ఒంటరి పోరాటం చేయగా, జార్జియా వేర్హమ్ (25 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడింది. స్టార్ ఆల్రౌండర్ సోఫీ డివైన్ (0), కెప్టెన్ యాష్లీ గార్డ్నర్ (0) విఫలమయ్యారు. చినెల్లి హెన్రీ 3 వికెట్లు, నందిని శర్మ 2 వికెట్లు తీశారు. అనంతరం ఢిల్లీ 15.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసి గెలిచింది. లిజెల్లీ లీ (24 బంతుల్లో 43; 8 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ (23 బంతుల్లో 41; 4 ఫోర్లు, 1 సిక్స్) దంచేశారు. షఫాలీ వర్మ (21 బంతుల్లో 31; 7 ఫోర్లు), లౌరా వోల్వార్డ్ (24 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు. వేర్హమ్కు 2 వికెట్లు దక్కాయి.స్కోరు వివరాలుగుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: బెత్ మూనీ (నాటౌట్) 62; సోఫీ డివైన్ (సి) లిజెల్లీ (బి) హెన్రీ 6; అనుష్క (సి) హెన్రీ (బి) నందిని 16; యాష్లీ గార్డ్నర్ (సి) స్నేహ్ రాణా (బి) నందిని 0; కనిక (స్టంప్డ్) లిజెల్లీ (బి) మిన్ను మణి 6; వేర్హమ్ (సి) వోల్వార్డ్ (బి) హెన్రీ 35; భారతి (సి అండ్ బి) హెన్రీ 0; కాశ్వీ గౌతమ్ (రనౌట్) 18; తనూజ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 25; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 168. వికెట్ల పతనం: 1–9, 2–38, 3–38, 4–59, 5–120, 6–125, 7–164. బౌలింగ్: మరిజాన్ కాప్ 4–0–32–0, చినెల్లీ హెన్రీ 4–0–35–3, నందిని శర్మ 4–0–44–2, మిన్ను మణి 4–0–23–1, స్నేహ్ రాణా 1–0–3–0, శ్రీచరణి 3–0–25–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: లిజెల్లీ లీ (ఎల్బీడబ్ల్యూ) (బి) వేర్హమ్ 43; షఫాలీ వర్మ (బి) వేర్హమ్ 31; వోల్వార్డ్ (నాటౌట్) 32; జెమీమా (సి) సోఫీ (బి) రాజేశ్వరి 41; మరిజాన్ కాప్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 18; మొత్తం (15.4 ఓవర్లలో 3 వికెట్లకు) 169. వికెట్ల పతనం: 1–89, 2–92, 3–160. బౌలింగ్: రేణుక 2–0–27–0, కాశ్వీ గౌతమ్ 2–0–17–0, రాజేశ్వరి 3–0–33–1, సోఫీ డివైన్ 3–0–35–0, జార్జియా వేర్హమ్ 3.4–0–28–2, తనూజ 1–0–5–0, యాష్లీ గార్డ్నర్ 1–0–15–0. -
WPL Eliminator: దంచికొట్టిన బెత్ మూనీ
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2026 తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫైనల్ చేరగా.. మరో బెర్తు కోసం గుజరాత్ జెయింట్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోటీ నెలకొంది.దంచికొట్టిన బెత్ మూనీఇందులో భాగంగావడోదరలోని కొటాంబి స్టేడియంలో మంగళవారం నాటి ఎలిమినేటర్ మ్యాచ్లో ఇరుజట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. గుజరాత్ బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్ బెత్ మూనీ అజేయ అర్ధ శతకం (51 బంతుల్లో 62) మెరవగా.. మరో ఓపెనర్ సోఫీ డివైన్ (6), వన్డౌన్ బ్యాటర్ అనుష్క శర్మ (16) నిరాశపరిచారు.ఇక కెప్టెన్ ఆష్లే గార్డ్నర్, భారతి ఫల్మలి డకౌట్గా వెనుదిరగగా.. కనిక అహుజా సైతం 6 పరుగులకే అవుటైంది. జార్జియా వారేహమ్ (25 బంతుల్లో 35), కశ్వీ గౌతం (10 బంతుల్లో 18) మెరుగ్గా రాణించారు. ఫలితంగా గుజరాత్ 150 పరుగుల మార్కు దాటగలిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.ఢిల్లీ బౌలర్లలో చినెల్లి హెన్రీ మూడు వికెట్లతో చెలరేగగా.. నందాని శర్మ రెండు, మిన్ను మణి ఒక వికెట్ పడగొట్టారు. గుజరాత్ విధించిన 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్కు చేరాలని ఢిల్లీ పట్టుదలగా ఉంది.డబ్ల్యూపీఎల్-2026 ఎలిమినేటర్ మ్యాచ్ గుజరాత్ వర్సెస్ ఢిల్లీతుదిజట్లుగుజరాత్బెత్ మూనీ (వికెట్ కీపర్), సోఫీ డివైన్, అనుష్క శర్మ, ఆష్లే గార్డ్నర్ (కెప్టెన్), జార్జియా వరేహమ్, భారతి ఫల్మలి, కనిక అహుజా, కశ్వీ గౌతం, తనుజా కన్వేర్, రేణుకా సింగ్ ఠాకూర్, రాజేశ్వరి గైక్వాడ్.ఢిల్లీలిజెల్లి లీ (వికెట్ కీపర్), షఫాలి వర్మ, లారా వల్వర్ట్, జెమీమా రోడ్రిగ్స్ (కెప్టెన్), మరిజానే కాప్, చినెల్లి హెన్రీ, నికీ ప్రసాద్, స్నేహ్ రాణా, మిన్ను మణి, శ్రీచరణి, నందాని శర్మ. Beth Mooney dances down the track and puts it away for a much-needed boundary 👊Will Mooney anchor Gujarat Giants to a big total in this eliminator clash? 👀#TATAWPL Eliminator | #GGvDC 👉 LIVE NOW ➡️ https://t.co/Bd8nlT8AGe pic.twitter.com/YO8yPWT0VJ— Star Sports (@StarSportsIndia) February 3, 2026 -
T20 WC 2026: తోపు జట్టు ఇదే.. వివరాలు, విశ్లేషణ
టీ20 ప్రపంచ కప్-2026 టోర్నీకి శనివారం (ఫిబ్రవరి 7) తెరలేవనుంది. పొట్టి ఫార్మాట్ క్రికెట్లో మెరుపు వేగంతో పరుగుల వరద మొదలవ్వనుంది. ఈ పరుగుల సునామీలో టాప్లో ఉండేదెవరు? తోపుగా నిలిచేదెవరు? ఈ సారి కొత్త రికార్డులు నమోదవుతాయా? ఆటగాళ్లు తమ రికార్డులను తిరిగి బ్రేక్ చేస్తారా? ఈసారీ టీమిండియా హాట్ ఫేవరెట్గా ఉన్నా.. భారత్ ఎదుర్కొనే సవాళ్లు ఏమిటి?టీమిండియా బలాలు, బలహీనతలుఏమిటి?? గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? క్రికెట్ అభిమానుల్లో నెలకొన్న ప్రశ్నలివి. ఈ ప్రశ్నలకు సమాధానంగా సాక్షి స్పోర్ట్స్ పలు పారామితులతో, అల్గారిథమ్లతో ఓ విశ్లేషణను రూపొందించింది. టీ20 ప్రపంచకప్ పోటీలు 2007లో ప్రారంభమయ్యాయి. 2010 నుంచి ప్రతీ రెండేళ్లకోసారి ఈ టోర్నీలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు పొట్టి ఫార్మాట్లో జరిగిన ప్రపంచకప్ను మూడు జట్లు రెండేసి మార్లు గెలుచుకున్నాయి. అవే.. భారత్, వెస్టిండీస్, ఇంగ్లండ్. పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా తలోసారి ట్రోఫీ సాధించాయి. ఇక టీమ్ ఇండియా ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్. 2024 ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి.. టైటిల్ను చేజిక్కించుకుంది. ప్రస్తుతం భారత జట్టు బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్.. ఇలా అన్ని విభాగాల్లో ముందంజలో ఉండడం కలిసి వచ్చే అంశం..!ఒక్క ఫైనల్ కూడా ఓడిపోని ఏకైక జట్టు ఇదేఅయితే.. ఇప్పటి వరకు ఈ టైటిల్ గెలిచిన ఆరు జట్లలో ఒక్క ఫైనల్ కూడా ఓడిపోని ఏకైక జట్టుగా వెస్టిండీస్ నిలిచింది. భారత్, ఇంగ్లండ్ జట్లు చెరోసారి తో రన్నరప్గా.. పాకిస్థాన్, శ్రీలంక రెండేసిసార్లు ఫైనల్లో ఓటమిపాలయ్యాయి. అయితే.. తాజా ప్రదర్శనలను బట్టి మాజీ చాంపియన్లు టీమిండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా హాట్ ఫేవరెట్గా కనిపిస్తున్నాయి. ఇందులోనూ డిఫెండింగ్ చాంపియన్ టీమిండియానే టాప్ఇప్పటి వరకు జరిగిన తొమ్మిది టీ-20 ప్రపంచ కప్లలో ప్రతీ జట్టు 45 నుంచి 55 మ్యాచులు ఆడింది. వీటిలో టీమిండియా విజయ శాతం అత్యద్భుతంగా ఉంది. ఆడిన 52 మ్యాచుల్లో.. 35 విజయాలను నమోదు చేసుకుంది. అంటే.. టీమిండియాకు 63శాతం విజయం రేటు ఉందన్నమాట. ఇప్పుడు దక్షిణాఫ్రికా.. ఆస్ట్రేలియా జట్లకు కూడా ఇదే రేట్ ఉండడం గమనార్హం..! అయినా.. ఈ పారామితిలో టీమిండియానే నంబర్-1 అని చెప్పవచ్చు.60 శాతానికి పైగా గెలుపు రేటుకేవలం ప్రపంచకప్ టోర్నీలోనే కాకుండా.. పొట్టి ఫార్మాట్ ద్వైపాక్షిక సిరీస్లలోనూ టీమిండియా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది. అగ్రశ్రేణి జట్లు 200కు పైగా టీ-20 మ్యాచులు ఆడాయి. వీటిలో 60 శాతానికి పైగా గెలుపు రేటును సాధించిన ఏకైక జట్టు టీమిండియా మాత్రమే..! 268 మ్యాచుల్లో భారత్ 67 శాతం విన్నింగ్ రేట్తో ముందంజలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో పాకిస్థాన్, ఆస్ట్రేలియా వరుసగా ఉన్నాయి. ఈ పారామితిలోనూ టీమిండియానే హాట్ ఫేవరేట్..!ఇక సొంత దేశంలో మ్యాచులు ఆడడానికి, విదేశాల్లోని మైదానాలకు తేడా ఉంటుంది. పలు జట్లు విదేశాల్లో పెద్దగా రాణించవు. కానీ, టీమిండియా మాత్రం ఈ పారామితిలోనూ ముందంజలో ఉంది. భారత్ విదేశాల్లో 165 మ్యాచులు ఆడగా.. విజయ శాతం 66గా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో పాకిస్థాన్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. అయితే.. ఈ రెండు జట్ల విజయ శాతం 55 మాత్రమే..!విదేశాల్లోని మైదానాల్లో పరిస్థితిని పక్కనపెడితే.. సొంత గడ్డపైనా భారత్ ముందంజలో ఉండడం గమనార్హం..! సంప్రదాయ క్రికెట్ టెస్టుల్లో, వన్డేలలో పరిస్థితి వేరు. కానీ, టీ-20 శకంలో మాత్రం పరిస్థితులు కొంచెం భిన్నంగా ఉంటాయి. ఆటగాళ్ల ఊపు.. ధనాధన్ బాదుడే విజయాన్ని నిర్దేశిస్తాయి. భారతే హాట్ ఫేవరేట్..!అయితే.. ఈ సారి టీ-20 ప్రపంచకప్ భారత్తోపాటు.. శ్రీలంకలో జరగనుంది. ఈ రెండు దేశాల్లోని మైదానాలు భారత్కు కొట్టిన పిండి అని చెప్పవచ్చు.ఇక స్వదేశాల్లో విజయాల విషయానికి వస్తే.. భారత్ ఆడిన 103 టీ-20 ఫార్మాట్లలో 70 విజయాలను సాధించింది. అంటే.. గెలుపు శాతం 68గా ఉంటుంది. ఈ విషయంలో భారత్కు పాకిస్థాన్ 0.10శాతం వెనుకంజలో ఉంది. అంటే.. ఈ పారామితిలోనూ భారతే హాట్ ఫేవరేట్..!టీ20 మ్యాచులు సంప్రదాయ వన్డేలకు పూర్తిగా భిన్నమైనవి. ఇక్కడ స్కోరు అత్యంత కీలకం. సిక్సర్లు, ఫోర్లతో.. బంతిబంతికీ బౌండరీ ఉంటేనే విజయలక్ష్మి వరించే అవకాశాలుంటాయి. ఈ విషయంలోనూ టీమిండియాదే ఆధిపత్యం..! ఇప్పటి వరకు టీమిండియా ఆడిన టీ-20 మ్యాచుల్లో 46 సార్లు 200కు పైగా స్కోర్ చేసింది. అంతేకాదు.. నాలుగుసార్లు 250+ స్కోరును తన ఖాతాలో వేసుకుంది. మరే ఇతర జట్టు కూడా 200+ స్కోరును 30 సార్లు కూడా అందుకోలేకపోయింది.అయితే.. భారత్ తర్వాతి స్థానంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. ఈ రెండు జట్లు 28 సార్లు చొప్పున 200+ స్కోరును సాధించడం గమనార్హం..! ఇక 250+ స్కోరు విషయానికి వస్తే.. కేవలం ఇంగ్లండ్, వెస్టిండీస్ మాత్రమే.. భారత్ తర్వాత ఈ స్కోరును సాధించాయి. ఇప్పటి వరకు 20 సెంచరీలుభారత్ నాలుగు సార్లు ఈ ఘనతను సాధిస్తే.. ఈ రెండు జట్లు రెండేసి సార్లు మాత్రమే ఆ స్కోరును దాటగలిగాయి. అన్నింటికీ మించి.. 200+ టార్గెట్ను సులభంగా ఛేదించగలమని భారత జట్టు పలుమార్లు రుజువు చేసింది. ఈ పారామితిలోనూ భారతే తోపు అని చెప్పవచ్చు..!టీ20 ఫార్మాట్లో జట్టు విజయాన్ని బౌండరీలే శాసిస్తాయి. అందుకే దీన్ని బ్యాటర్ల ఆట అంటారు. ఇలాంటి ఫార్మాట్లోనూ సెంచరీలు చేయడం అంత ఆశామాషీ కాదు. అయితే.. భారత బ్యాటర్లు టీ-20ల్లో ఇప్పటి వరకు 20 సెంచరీలు చేసి.. జట్టును ముందంజలో నిలిపారు. ఆ తర్వాతి స్థానాల్లో చెరో 13 సెంచరీలతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆటగాళ్లు ఉన్నారు. ఈ పారామితిలోనూ భారతే తోపు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు..! సాక్షి డిజిటల్ స్పోర్ట్స్ బృందం పరిశీలించిన అల్గారిథమ్లు, పారామితుల్లో భారత్ మాత్రమే టీ-20లో ముందంజలో ఉండే అవకాశాలున్నట్లు స్పష్టమైంది. -
WC 2026: ఆసీస్ అవుట్.. వరల్డ్కప్ ఫైనల్లో ఇంగ్లండ్
ఐసీసీ అండర్-19 వరల్డ్కప్-2026 టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాకు చేదు అనుభవం ఎదురైంది. ఉత్కంఠగా సాగిన సెమీస్ మ్యాచ్లో ఆసీస్ను 27 పరుగుల తేడాతో చిత్తు చేసి ఇంగ్లండ్ ఫైనల్కు దూసుకువెళ్లింది.జింబాబ్వే వేదికగా జరుగుతున్న వరల్డ్కప్ టోర్నీలో సూపర్ సిక్స్ గ్రూపు-1 నుంచి ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్ సెమీ ఫైనల్కు అర్హత సాధించగా.. గ్రూప్-2 నుంచి భారత్ , ఇంగ్లండ్ బెర్తు ఖరారు చేసుకున్నాయి. ఈ క్రమంలో తొలి సెమీ ఫైనల్లో ఆసీస్- ఇంగ్లండ్ మంగళవారం తలపడ్డాయి.థామస్ రూ కెప్టెన్ ఇన్నింగ్స్బులవాయోలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో బెన్ డాకిన్స్ (1) విఫలం కాగా.. జోసెఫ్ మూర్స్ 25 పరుగులు.. వన్డౌన్లో వచ్చిన బెన్ మేయ్స్ 24 రన్స్ చేశారు. టాపార్డర్ ఇలా నామమాత్రపు స్కోర్లకే పరిమితం కాగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన థామస్ రూ కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరిశాడు.శతకంతో చెలరేగిన థామస్.. మొత్తంగా 107 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 110 పరుగులు సాధించాడు. మిగతావాళ్లలో కలేబ్ ఫాల్కనర్ 40 పరుగులతో రాణించగా.. ఫర్హాన్ అహ్మద్ 28 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఇంగ్లండ్ ఏడు వికెట్ల నష్టానికి 277 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది.ఆసీస్ బౌలర్లలో హేడెన్ షీలర్, నడేన్ కూరే చెరో రెండు వికెట్లు తీయగా.. విల్ బైరమ్, ఆర్యన్ శర్మ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. కెప్టెన్ ఒలీవర్ పీక్ ఒంటరి పోరాటంఓపెనర్ విల్ మలాజుక్ 15, వన్డౌన్ బ్యాటర్ 3 పరుగుల చేసి అవుటయ్యారు. మరో ఓపెనర్ నితేశ్ సామ్యూల్ 83 బంతుల్లో 47 పరుగులు చేయగా.. వికెట్ కీపర్ అలెక్స్ లీ యంగ్ (3), జేడన్ డ్రేపర్ (12) నిరాశపరిచారు.ఇలాంటి కఠిన పరిస్థితుల్లో నాలుగో నంబర్ బ్యాటర్, కెప్టెన్ ఒలీవర్ పీక్ ఒంటరి పోరాటం చేశాడు. 88 బంతుల్లో పది ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్న ఒలీవర్ పదో వికెట్గా వెనుదిరిగడంతో ఇంగ్లండ్ గెలుపు ఖరారైంది. టార్గెట్ ఛేదనలో 47.3 ఓవర్లలో 250 పరుగులకే పరిమితమై ఆసీస్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. ఇంగ్లండ్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. థామస్ రూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇక రెండో సెమీ ఫైనల్లో భారత్- అఫ్గనిస్తాన్ బుధవారం తలపడతాయి.అండర్-19 వరల్డ్కప్ ఆసీస్ వర్సెస్ ఇంగ్లండ్ స్కోర్లు👉ఇంగ్లండ్-277/7(50)👉ఆస్ట్రేలియా- 250(47.3). చదవండి: ICC vs PCB: పాకిస్తాన్కు భారీ షాక్! -
భారత ప్రధాని ఒక్క మాట చెబితే మన ఖేల్ ఖతం: రమీజ్ రాజా
క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వైఖరి గురించేప్రధానంగా చర్చ నడుస్తోంది. తమకు అవసరం లేని విషయంలో తలదూర్చి పాక్ కష్టాలు కొని తెచ్చుకుంటోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ నుంచి ఐసీసీ బంగ్లాదేశ్ను ఇప్పటికే తప్పించిన విషయం తెలిసిందే.కోరికోరి వివాదాలుభారత్లో తమకు భద్రత ఉండదంటూ ఆరోపణలకు దిగిన బంగ్లా.. మరో వేదికైన శ్రీలంకలో తమ మ్యాచ్లు ఆడించాలని ఐసీసీని కోరింది. అయితే, ఈ వాదనలో నిజం లేదంటూ కొట్టిపారేసిన ఐసీసీ.. బంగ్లా అభ్యర్థనను తిరస్కరించింది. అయినప్పటికీ బంగ్లా పట్టువీడకపోవడంతో.. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ను తీసుకువచ్చింది.అయితే, బంగ్లాదేశ్కు అన్యాయం జరిగిందంటూ తాము కూడా టోర్నీలో పాల్గొనమని బెదిరింపు ధోరణి అవలంబించిన పాకిస్తాన్.. తెగేదాకా లాగితే మొదటికే మోసం వస్తుందనేమో.. కేవలం భారత్తో మ్యాచ్ బహిష్కరిస్తామని ప్రకటించింది. తటస్థ వేదికల ఏర్పాటుకాగా భారత్- పాక్ మధ్య దైపాక్షిక సిరీస్లు జరిగి దశాబ్దకాలానికి పైగా అవుతోంది. ఈ నేపథ్యంలో ఐసీసీ ఈవెంట్లు, ఆసియా కప్ టోర్నీలో ముఖాముఖి తలపడుతున్న దాయాదుల మధ్య 2024లో ఐసీసీ ఓ ఒప్పందం కుదిర్చింది.ఇరు దేశాల్లో ఒకటి ఆతిథ్య దేశంగా ఉంటే.. మరో జట్టు కోసం తటస్థ వేదికను ఏర్పాటు చేయాలి. అందుకు అనుగుణంగానే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి పాక్ ఆతిథ్యం ఇవ్వగా.. టీమిండియా దుబాయ్లో మ్యాచ్లు ఆడింది. ఆ తర్వాత ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 టోర్నీ భారత్లో జరుగగా.. పాక్ శ్రీలంకలో తమ మ్యాచ్లు ఆడింది. తాజాగా టీ20 వరల్డ్కప్లోనూ పాక్ పురుషుల జట్టు శ్రీలంకలో మ్యాచ్లు ఆడాల్సి ఉంది.భారత్తో పెట్టుకుంటే అంతేఅయినప్పటికీ బంగ్లాదేశ్ కోసమంటూ పాక్.. భారత్ను ఢీకొట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో పీసీబీ మాజీ చైర్మన్ రమీజ్ రాజా.. భారత్తో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని గతంలో హెచ్చరించిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది.సెనేట్ స్టాండింగ్ కమిటీ ముందు 2021లో పీసీబీ చైర్మన్ హోదాలో మాట్లాడుతూ.. ‘‘నేను చెప్పే విషయాలు భయపెట్టేవని నాకు తెలుసు. ఐసీసీ నుంచి వచ్చే 50 శాతం నిధులతోనే పాక్ బోర్డు తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇతర బోర్డు మెంబర్లతో కలిసి టోర్నమెంట్లు నిర్వహించడం ద్వారా ఐసీసీకి ఆదాయం వస్తుంది.90 శాతం ఆదాయం అక్కడి నుంచేఇక ఐసీసీకి వచ్చే ఆదాయంలో 90 శాతం ఇండియన్ మార్కెట్ల నుంచే వస్తుంది. అంటే ఒకరకంగా.. భారత్లోని వ్యాపారం వల్లే పాకిస్తాన్ క్రికెట్ మనుగడ కొనసాగిస్తోంది. ఒకవేళ భవిష్యత్తులో భారత ప్రధాని పాకిస్తాన్ క్రికెట్కు ఫండింగ్ ఆపేయమని చెబితే.. పీసీబీ కుప్పకూలుతుంది’’ అని రమీజ్ రాజా వ్యాఖ్యానించాడు. అయితే, ఈ వీడియో ఫేక్ కావొచ్చు అంటూ పాక్ అభిమానులు అంటుండగా... ఏదేమైనా ఈ మాటలు మాత్రం నిజమేనంటూ టీమిండియా ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తున్నారు. చదవండి: ICC vs PCB: పాకిస్తాన్కు భారీ షాక్!#WATCH : Throwback Video Of Ramiz Raja Warned PCB Could ‘Collapse’ If India Pulls SupportAn old video of former Ramiz Raja, made during his tenure as chairman of the Pakistan Cricket Board, has resurfaced on social media, drawing renewed attention amid ongoing cricket diplomacy… pic.twitter.com/BCkNgzyI2z— upuknews (@upuknews1) February 3, 2026 -
T20 WC: శ్రీలంకకు షాకిచ్చిన పసికూన!
టీ20 ప్రపంచకప్-2026 సన్నాహక మ్యాచ్లో ఒమన్ శ్రీలంకకు ఊహించని షాకిచ్చింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో రాణించి లంక-'ఎ' జట్టును ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. కాగా భారత్- శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7న వరల్డ్కప్ టోర్నీ ఆరంభంకానున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో సోమవారం నుంచి వార్మప్ మ్యాచ్లు మొదలయ్యాయి. ఇందులో భాగంగా మంగళవారం శ్రీలంక-'ఎ' జట్టు మంగళవారం ఒమన్తో తలపడింది. కొలంబో వేదికగా టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 145 పరుగులకే పరిమితంఅయితే, ఒమన్ బౌలర్ల ధాటికి తాళలేక 145 పరుగులకే పరిమితమైంది. టాపార్డర్లో ఓపెనర్ సినెత్ జయవర్దన (9), వన్డౌన్ బ్యాటర్ పులిందు పెరిరా (9) విఫలం కాగా.. మరో ఓపెనర్ దుల్నిత్ సిగెర (20) ఫర్వాలేదనిపించాడు.మిగిలిన వారిలో గుణశేఖర (21), వనుజ సహాన్ (29) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి శ్రీలంక 145 పరుగులు చేసింది. ఒమన్ బౌలర్లో షా ఫైజల్, షకీల్ అహ్మద్, జే ఒడెరా రెండేసి వికెట్లు పడగొట్టగా.. నదీం ఖాన్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.ఆమీర్ కలీమ్ ధనాధన్ అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఒమన్ 18 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు కోల్పోయి 146 పరుగులు సాధించింది. ఓపెనర్, 44 ఏళ్ల వెటరన్ ప్లేయర్ ఆమీర్ కలీమ్ (47 బంతుల్లో 80) ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. అతడికి తోడుగా వికెట్ కీపర్ బ్యాటర్ వినాయక్ శుక్లా (24 బంతుల్లో 39 నాటౌట్) రాణించాడు. మిగిలిన వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం అయ్యారు. లంక బౌలర్లలో వనుజ సహాన్ మూడు వికెట్లు కూల్చగా.. కెప్టెన్ లాహిరు సమరకూన్, కవిజ గమేజ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.చదవండి: T20 WC 2026: ఆందోళనలో టీమిండియా! -
మెట్టు దిగిన ఆటగాళ్లు.. ఫీజుల కోతకు అంగీకారం
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీ నిర్వహణ కోసం ఆటగాళ్లు ఓ మెట్టు దిగారు. సునీల్ ఛెత్రి నేతృత్వంలోని బెంగళూరు ఫుట్బాల్ క్లబ్ (FC) ఆటగాళ్లు తమ మ్యాచ్ ఫీజుల తగ్గింపునకు సమ్మతించారు. పలు సమస్యలతో ఐఎస్ఎల్ గతేడాది జరగలేదు. ఏడాది విరామం తర్వాత మొత్తానికి సమస్యలు పరిష్కరించుకొని ఇటు లీగ్ నిర్వాహకులు, ఫ్రాంచైజీ యాజమాన్యాలు ఈ ఏడాది నుంచి తిరిగి ఎప్పటిలాగే టోర్నీని నిర్వహించాలనే ఒప్పందానికి వచ్చారు.ఈ నెల 14 నుంచే ఫుట్బాల్ లీగ్ జరుగుతుంది. సజావుగా టోర్నీ నిర్వహణకు ఫుట్బాలర్లు సైతం తమ మ్యాచ్ ఫీజుల కోతకు అంగీకరించారు. దీనిపై బెంగళూరు యజమాని పార్థ్ జిందాల్ సంతోషం వ్యక్తం చేశారు. లీగ్ ఒడిదొడుకులను అర్థం చేసుకొని టోర్నీ నిర్వహణ కోసం తమ ఫీజుల్ని తగ్గించుకున్న ఆటగాళ్లను ఆయన అభినందించారు. రూ.కోట్లు పోయి లక్షలు ఐఎస్ఎల్ ప్రసార హక్కుల్ని చాలా తక్కువ మొత్తానికే ‘ఫ్యాన్కోడ్’ యాప్ చేజిక్కించుకుంది. మొత్తం 91 మ్యాచ్లున్న ఫుట్బాల్ ఈవెంట్ ప్రపంచవ్యాప్త ప్రసార హక్కుల్ని రూ. 8.62 కోట్లకే దక్కించుకుంది. అంటే ఒక్కో మ్యాచ్కు సగటున రూ.9.5 లక్షలకే గ్లోబల్ మీడియా రైట్స్ పొందింది. 2024–25 సీజన్లో రూ.275 కోట్లు రాగా అప్పుడు 163 మ్యాచ్లు జరిగాయి. అంటే మ్యాచ్కు రూ. 1.68 కోట్లు వచ్చాయి. కానీ ప్రస్తుత సీజన్కు వచ్చేసరికి రూ.కోట్లు పోయి రూ.9.5 లక్షలకు పడిపోయింది. ఇదీ చదవండి: భారత జట్టు ఓటమి నేపాల్ వేదికగా దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య (శాఫ్) అండర్–19 మహిళల చాంపియన్షిప్లో పోటీపడుతున్న భారత యువ జట్టుకు బంగ్లాదేశ్ చేతిలో చుక్కెదురైంది. ఏఎఫ్సీ అండర్–17 మహిళల ఆసియా కప్కు సన్నద్ధమయ్యేందుకు ఈ అండర్–19 టోరీ్నలో భారత్ అండర్–17 జట్టును బరిలోకి దింపింది.టీనేజ్ జట్టు తొలి మ్యాచ్లో 1–0తో ఆతిథ్య నేపాల్పై గెలిచింది. కానీ సోమవారం జరిగిన పోరులో భారత అమ్మాయిల జట్టు 0–2 స్కోరుతో బంగ్లాదేశ్ చేతిలో కంగుతింది. ఈ మ్యాచ్లో భారత్ అసలు ఖాతానే తెరువలేదు. బంగ్లా జట్టులో అర్పిత బిస్వాస్ (29వ నిమిషంలో), అల్పి అక్తర్ (40వ ని.) చెరో గోల్ చేశారు. -
ICC vs PCB: పాకిస్తాన్కు భారీ షాక్!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి కౌంట్డౌన్ మొదలైనా పాకిస్తాన్ మొండివైఖరి వీడటం లేదు. బంగ్లాదేశ్ కోసమంటూ నాటకానికి తెరతీసిన పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ).. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)నే ఢీకొట్టేందుకు సిద్ధమైంది. పాక్ మ్యాచ్ల కోసం తటస్థ వేదికగా శ్రీలంకను ఏర్పాటు చేసినా.. భారత్తో మ్యాచ్ బహిష్కరిస్తామంటూ మరో డ్రామాకు తెరలేపింది.బంగ్లాదేశ్కు ఇప్పటికే షాక్తమ ప్రభుత్వం నిర్ణయం ప్రకారమే నడుచుకుంటామని.. అందుకే టీమిండియాతో మ్యాచ్ ఆడబోమని పీసీబీ పేర్కొంది. అయితే, ఐసీసీకి మాత్రం ఇంతవరకు అధికారికంగా మాత్రం ఇ-మెయిల్ పంపలేదు. కాగా భారత్లో తమకు భద్రత లేదంటూ గగ్గోలు పెట్టిన బంగ్లాదేశ్కు ఇప్పటికే ఐసీసీ గట్టి షాకిచ్చిన విషయం తెలిసిందే.తమ పరిశీలన బృందం నివేదిక ప్రకారం భారత్లో బంగ్లా జట్టుకు వచ్చిన ముప్పేమీ లేదని.. అందుకే వేదికను శ్రీలంకకు మార్చలేమని ఐసీసీ స్పష్టం చేసింది. అయినా సరే బంగ్లాదేశ్ పంతం వీడకపోవడంతో ఆ జట్టును తప్పించి.. స్కాట్లాండ్ను వరల్డ్కప్ టోర్నీలో చేర్చింది. టోర్నీ నుంచి వైదొలుగుతామని బీరాలుఈ అంశమై ఓటింగ్ నిర్వహించగా.. బంగ్లాదేశ్కు మద్దతుగా ఆ దేశంతో పాటు పాక్ మాత్రమే అనుకూలంగా ఓటు వేయగా.. మిగతా ఐసీసీ సభ్య దేశాలు మాత్రం వ్యతిరేకించాయి.దీంతో పాకిస్తాన్ తాము సైతం టోర్నీ నుంచి వైదొలుగుతామని మొదట బీరాలు పలికినా.. ఆ తర్వాత టీమిండియాతో మ్యాచ్ మాత్రమే ఆడమని ప్రకటించింది. ఇందుకు భద్రతా కారణాలు సాకుగా చూపడం గమనార్హం. శ్రీలంకలో ఆడే మిగతా మ్యాచ్లకు లేని భద్రతా సమస్యలు.. టీమిండియాతో మ్యాచ్కు ఉంటాయని చెప్పడం విమర్శలకు దారితీసింది.ఆ అధికారం, హక్కు మాకు లేవుఈ నేపథ్యంలో పాక్ బోర్డు.. ఇతర దేశాల బోర్డులను సంప్రదించి తమకు అనుకూలంగా మాట్లాడాల్సిందిగా కోరినట్లు సమాచారం. ఐసీసీతో సమావేశంలో తమకు, బంగ్లాదేశ్కు అనుకూలంగా వ్యవహరించాలని బతిమాలినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంలో పాక్కు చేదు అనుభవం ఎదురైనట్లు సమాచారం.డబుల్ గేమ్ ఎందుకు?రెవ్స్పోర్ట్స్ కథనం ప్రకారం.. ఈ అంశాల్లో తలదూర్చే అధికారం, హక్కు తమకు లేవని ఆయా బోర్డులు పీసీబీకి స్పష్టం చేసినట్లు సమాచారం. ఐసీసీ, బీసీబీ మధ్య వివాదంలో తాము దూరలేమని పేర్కొన్న బోర్డులు.. పీసీబీ ద్వంద్వ వైఖరిని కూడా ఎండగట్టినట్లు తెలుస్తోంది.కాగా ఇటీవల అండర్-19 వరల్డ్కప్ టోర్నీలో పాక్.. భారత్తో మ్యాచ్ ఆడింది. యువ భారత జట్టు చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అంతేకాదు.. పాక్ మహిళల ‘ఎ’ జట్టు.. ఫిబ్రవరి 15న భారత మహిళల ‘ఎ’ జట్టుతో తలపడనుంది. బ్యాంకాక్లో జరిగే రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026లో భాగంగా ఈ మ్యాచ్ జరుగనుంది. అయితే, పాక్ ఈ మ్యాచ్లో యథావిధిగా ఆడనుంది.పాక్కు గట్టి షాక్ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఐసీసీ సభ్య దేశాలకు బోర్డులు.. పీసీబీకి తాము అండగా ఉండలేమని కుండబద్దలు కొట్టినట్లు చెప్పినట్లు సమాచారం. కాగా భారత్- శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య జరుగనుంది. భారత్- పాక్ మ్యాచ్ను కొలంబోలో ఫిబ్రవరి 15న నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు కాగా.. పీసీబీ ఇలా బాయ్కాట్ అంటూ సాగదీస్తోంది.చదవండి: T20 WC 2026: ఆందోళనలో టీమిండియా! -
బుమ్రా కాదు!.. ఈసారి టాప్ వికెట్ టేకర్ అతడే!
పొట్టి క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెపుడా అని ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. భారత్- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి శనివారం (ఫిబ్రవరి 7) తెరలేవనుంది. ఇందులో భాగంగా తొలిరోజు ముంబైలోని వాంఖడే వేదికగా టీమిండియా అమెరికాతో తలపడనుంది.నాలుగు గ్రూపులుఇక అదే రోజు కొలంబోలో పాకిస్తాన్- నెదర్లాండ్స్, కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో వెస్టిండీస్- స్కాట్లాండ్ మ్యాచ్లు జరుగుతాయి. ఇక ఈసారి ఈ మెగా టోర్నీలో ఇరవై జట్లు పాల్గొంటున్నాయి. వీటిని ఐదేసి జట్ల చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించారు.గ్రూప్-ఎ నుంచి డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా, పాకిస్తాన్, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ .. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియాతో పాటు ఐర్లాండ్, ఒమన్, శ్రీలంక, జింబాబ్వే పోటీలో ఉన్నాయి. గ్రూప్-సిలో ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్ల, ఇటలీ.. గ్రూప్-డిలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, యూఏఈ, కెనడా బరిలో నిలిచాయి.ఉపఖండ పిచ్లపై వరల్డ్కప్ఇక ఈసారి ఉపఖండ పిచ్లపై వరల్డ్కప్ జరగడం స్పిన్నర్లకు అనుకూలించే అంశం. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ గ్లెన్ మెగ్రాత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి అఫ్గనిస్తాన్ మేటి స్పిన్నర్ అత్యధిక వికెట్ల వీరుడిగా నిలుస్తాడని అంచనా వేశాడు. రేసులో వారు సైతంఅయితే, టాప్ వికెట్ టేకర్ల పోటీలో టీమిండియా పేస్దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా, ఆసీస్ స్టార్లు జోష్ హాజిల్వుడ్, ఆడం జంపా, ఇంగ్లండ్ ఆటగాడు సామ్ కర్రాన్ కూడా ఉంటాడని మెగ్రాత్ పేర్కొన్నాడు.టీ20 టాప్ బౌలర్కాగా రషీద్ ఖాన్ అంతర్జాతీయ టీ20లలో అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటికి 111 మ్యాచ్లలో కలిపి 187 వికెట్లు కూల్చాడు. మరోవైపు.. టీ20 ప్రపంచకప్-2024లో టాప్ వికెట్ టేకర్గా నిలిచి "ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు" అందుకున్న బుమ్రా ఖాతాలో.. 102 అంతర్జాతీయ టీ20 వికెట్లు ఉన్నాయి.అభిషేక్ శర్మకే ఇద్దరి ఓటుఇదిలా ఉంటే. ఆసీస్ మాజీ పేసర్ డెమేన్ ఫ్లెమింగ్ మాత్రం వరల్డ్కప్లో అత్యధిక వికెట్ల వీరుడిగా బుమ్రాకే ఓటు వేశాడు. ఇక ఈసారి టాప్ రన్ స్కోరర్గా టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మను మెగ్రాత్ ఎంచుకోగా.. ఫ్లెమింగ్ కూడా అతడికి మద్దతు పలికాడు. కాగా గత కొన్నాళ్లుగా సూపర్ ఫామ్లో ఉన్న అభిషేక్ శర్మ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో నంబర్ వన్ బ్యాటర్గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. చదవండి: టీమిండియాతో ఆడకున్నా.. ఆ మూడు మ్యాచ్లు గెలుస్తాం: పాక్ కెప్టెన్ -
T20 WC 2026: ఆందోళనలో టీమిండియా!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతోంది టీమిండియా. ఈసారి కూడా సత్తా చాటి.. సొంతగడ్డపై పొట్టి క్రికెట్ వరల్డ్కప్ ట్రోఫీ గెలిచిన తొలి జట్టుగా అవతరించాలని పట్టుదలగా ఉంది. ఇందుకు సూర్యకుమార్ సేనకు అన్ని అర్హతలు ఉన్నాయి.ద్వైపాక్షిక సిరీస్లలో అద్భుత ఆట తీరుతో దుమ్ములేపిన టీమిండియా స్వదేశంలో మెగా టోర్నీ జరుగనుండటం సానుకూలాంశం. అయితే, వరల్డ్కప్ ఆరంభానికి ముందు భారత ఆటగాళ్లు వరుసగా గాయాలపాలైన విషయం తెలిసిందే. అక్షర్ పటేల్ (Axar Patel), తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ గాయాలబారిన పడ్డారు.పూర్తిగా కోలుకున్న తిలక్వీరిలో వేలి నొప్పితో బాధపడిన అక్షర్ న్యూజిలాండ్తో టీ20 సిరీస్ (IND vs NZ)లో ఆఖరి మ్యాచ్లకు అందుబాటులోకి వచ్చాడు. ఇక వన్డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ (Tilak Varma) కూడా పూర్తిగా కోలుకున్నాడు. వరల్డ్ కప్ జట్టు సభ్యుడైన ఈ హైదరాబాదీకి ఇటీవలే శస్త్రచికిత్స జరిగింది. అనంతరం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో రీహాబిలిటేషన్లో ఉన్న తిలక్ మ్యాచ్ ఫిట్గా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు.ఈ క్రమంలో ప్రపంచకప్ అసలు పోరుకు ముందు జరిగే రెండు వార్మప్ మ్యాచ్ల ద్వారా తిలక్ వర్మకు ప్రాక్టీస్ కల్పించాలని భావించిన సెలక్టర్లు భారత ‘ఎ’ జట్టులో చోటు ఇచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం అమెరికా జట్టుతో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్ సందర్భంగా ఈ లెఫ్టాండర్ బ్యాటర్ రీఎంట్రీ ఇచ్చాడు. మొత్తంగా 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 38 పరుగులు చేసి.. వరల్డ్కప్ టోర్నీకి తాను పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నానని సంకేతాలు ఇచ్చాడు.వాషీ విషయంలో ఆందోళనఅయితే, ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ మాత్రం ఇంకా పూర్తిగా కోలుకోలేదని సమాచారం. దైనిక్ జాగరణ్ కథనం ప్రకారం.. వాషీ వేగంగా కోలుకుంటున్నా వరల్డ్కప్ లీగ్ దశ మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉంది."వాషింగ్టన్ సుందర్ ఇంకా పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించలేదు. అతడి పక్కటెముకలో ఫ్రాక్చర్ ఉంది. అయితే, అతడు వేగంగానే కోలుకుంటున్నాడు. ఇప్పటికే నాలుగు బ్యాటింగ్ సెషన్లు పూర్తి చేసుకున్నాడు.సోమవారం (ఫిబ్రవరి 2) స్పాట్ బౌలింగ్లో నాలుగు ఓవర్లు బౌలింగ్ కూడా చేశాడు. బుధవారం మరోసారి బౌలింగ్ సెషన్లో వాషీ పాల్గొంటాడు. దీని ఆధారంగానే అతడు మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడా? లేదా? అన్న అంశంపై అంచనాకు రావొచ్చు’’ అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. వారికి లైన్క్లియర్కాగా వాషింగ్టన్ సుందర్ ప్రస్తుతం బెంగళూరులోని CoEలో ఉన్నాడు. తిలక్ వర్మ, మయాంక్ యాదవ్, రియాన్ పరాగ్ కూడా ఇక్కడే పునరావాసం పొందారు. వీళ్లందరూ పూర్తి ఫిట్గా ఉన్నట్లు ఫిజియోలు ఇటీవలే ప్రకటించారు. కాగా లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడంతో పాటు స్వదేశీ స్పిన్ పిచ్ల మీద రాణించగల సత్తా వాషీకి ఉంది. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ వంటి స్టార్ స్పిన్నర్లు ఉన్నా వాషీ లేకపోవడం కూడా లోటు లాంటిదే. కాగా ఫిబ్రవరి 7న భారత్- శ్రీలంక వేదికగా మొదలయ్యే వరల్డ్కప్ టోర్నీ మార్చి 8న ఫైనల్తో ముగుస్తుంది. చదవండి: టీమిండియాతో ఆడకున్నా.. ఆ మూడు మ్యాచ్లు గెలుస్తాం: పాక్ కెప్టెన్ -
పాకిస్తాన్ సూపర్ లీగ్లో స్టీవ్ స్మిత్
ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు సంబంధించిన ఓ వార్త సోషల్మీడియాలో వైరలవుతుంది. స్టీవ్ను రానున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ ఎడిషన్ కోసం సియాల్కోట్ స్టాలియన్జ్ అనే ఫ్రాంచైజీ దక్కించుకున్నట్లు తెలుస్తుంది. స్టాలియన్జ్ స్టీవ్ను డైరెక్ట్ సైనింగ్ ద్వారా ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.ఈ వార్త పాక్ అభిమానుల సోషల్మీడియా గ్రూప్ల్లో హల్చల్ చేస్తుంది. పాక్ ఫ్యాన్స్ స్టీవ్కు స్వాగతం పలుకుతున్నారు. స్టీవ్ ఇప్పటివరకు పీఎస్ఎల్లో ఆడలేదు. స్టీవ్ రాక పీఎస్ఎల్కు కల తెచ్చిపెడుతుంది. ప్రస్తుతం స్టీవ్ మంచి ఫామ్లో ఉన్నాడు.తాజాగా ముగిసిన బిగ్ బాష్ లీగ్ (BBL) 15వ సీజన్లో సిడ్నీ సిక్సర్స్ తరఫున ఆడుతూ 6 మ్యాచ్ల్లో 299 పరుగులు (సగటు 59.80, స్ట్రైక్ రేట్ 167.97) చేశాడు. ఇందులో 42 బంతుల్లో శతకం కూడా ఉంది. మొత్తం టీ20 కెరీర్లో 272 మ్యాచ్లు ఆడిన స్టీవ్.. 6,242 పరుగులు, 5 శతకాలు, 30 అర్ధశతకాలు సాధించాడు. కాగా, పాకిస్తాన్ సూపర్ లీగ్ తదుపరి ఎడిషన్ ప్రారంభానికి ముందు పలు కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. వీటి ప్రకారం, ప్రతి ఫ్రాంచైజీకి ఒక విదేశీ ఆటగాడిని నేరుగా సంతకం చేసుకునే అవకాశం ఉంది. గత ఎడిషన్లో ఆడని ఆటగాడిని మాత్రమే ఈ విధానం ద్వారా తీసుకోవచ్చు. స్టాలియన్జ్ ఈ అవకాశాన్ని వినియోగించి స్టీవ్ను చేజిక్కించుకుంది. స్టాలియన్జ్ PSLలో కొత్తగా ప్రవేశించిన రెండు జట్లలో ఒకటి.2026 జనవరి 8న జిన్నా కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఫ్రాంచైజీల వేలంలో OZ Developers (హమ్జా మజీద్, కామిల్ ఖాన్) స్టాలియన్జ్ను రూ.1.85 బిలియన్ రికార్డు ధరకు కొనుగోలు చేశారు. PSL చరిత్రలో ఇదే అత్యంత ఖరీదైన ఫ్రాంచైజీగా నిలిచింది. -
IND vs PAK: ఆ మూడు మ్యాచ్లు గెలుస్తాం: పాక్ కెప్టెన్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో భారత్తో మ్యాచ్ బహిష్కరించడంపై పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా స్పందించాడు. తాము కేవలం కాంట్రాక్టు ఆటగాళ్లమని.. ప్రభుత్వం నిర్ణయానుసారమే నడుచుకుంటామని తెలిపాడు. వరల్డ్కప్ టోర్నీలో టీమిండియాతో మ్యాచ్ ఆడరాదని తమ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. ఇందులో ఆటగాళ్లు చేసేదేమీ లేదని పేర్కొన్నాడు. ఎవరైనా ప్రభుత్వ ఆదేశానికి కట్టుబడి ఉండాల్సిందేనని సల్మాన్ ఆఘా వ్యాఖ్యానించాడు.ఆసీస్ను క్లీన్స్వీప్ చేసి..అదే విధంగా.. గ్రూప్ దశలో మ్యాచ్ రద్దు కారణంగా పాయింట్లు కోల్పోయే అంశం మీద కూడా సల్మాన్ ఆఘా స్పందించాడు. లీగ్ దశలో మిగిలిన మ్యాచ్లలో గెలిచి ముందడుగు వేస్తామని ధీమా వ్యక్తం చేశాడు. కాగా ప్రపంచకప్ టోర్నీకి ముందు సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో పాకిస్తాన్ మూడు టీ20ల సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. ఆసీస్ జట్టు దాదాపు ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగగా.. పాక్ ఈ మేర విజయం సాధించింది.ప్రపంచకప్ అంటే భారత్తో మ్యాచ్ మాత్రమే కాదుఈ నేపథ్యంలో ఆసీస్తో మూడో టీ20లో విజయం తర్వాత సల్మాన్ ఆఘా (Salman Agha) భారత్తో మ్యాచ్ (IND vs PAK) రద్దు విషయం గురించి మాట్లాడాడు. ‘‘‘మేం బోర్డుతో కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లం. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి మేం కట్టుబడి ఉండాల్సిందే. ప్రపంచకప్ అంటే భారత్తో మ్యాచ్ మాత్రమే కాదు కదా!..లీగ్ దశలో మరో మూడు మ్యాచ్లు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ గెలిచి ముందంజ వేసేందుకు ప్రయత్నిస్తాం’ అని సల్మాన్ పేర్కొన్నాడు. కాగా టీమిండియాతో ఆడరాదనే పాకిస్తాన్ ప్రభుత్వ నిర్ణయాన్ని పాక్ మాజీ క్రికెటర్లు షాహిత్ ఆఫ్రిది, యూసుఫ్, రషీద్ లతీఫ్, మొయిన్ ఖాన్, సర్ఫరాజ్ అహ్మద్ సమర్థించారు.మిగిలిన మూడు జట్లు అవేకాగా ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య భారత్- శ్రీలంక వేదికలుగా టీ20 ప్రపంచకప్ టోర్నీ జరుగనున్న విషయం తెలిసిందే. ఇరవై జట్లు పాల్గొంటున్న ఈ ఈవెంట్లో భారత్, అమెరికా, నమీబియా, నెదర్లాండ్తో పాటు పాకిస్తాన్ గ్రూప్-‘ఎ’లో ఉంది. అయితే, భారత్లో తమకు భద్రత లేదంటూ బంగ్లాదేశ్.. తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలంటూ ఓవరాక్షన్ చేయగా.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నిరాకరించింది. దీంతో బంగ్లాకు మద్దతుగా పాకిస్తాన్ కూడా ముందుగా టోర్నీ నుంచి వైదొలుగుతామని బీరాలు పలికింది. చివరగా భారత్తో మ్యాచ్ ఆడకూడదని నిర్ణయం తీసుకుంది. అపుడు అమెరికా చేతిలో ఓడిఅయితే, ఈ విషయంపై ఐసీసీకి ఇంతవరకు అధికారికంగా తెలియజేయకపోవడం పాక్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024లో పసికూన అమెరికా చేతిలో లీగ్ మ్యాచ్లో పాక్ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే.చదవండి: IPL 2026: సన్రైజర్స్ హైదరాబాద్కు గుడ్ న్యూస్! -
పొట్టి ప్రపంచకప్ రికార్డులు, విశేషాలు
టీ20 ప్రపంచకప్ 10వ ఎడిషన్ భారత్, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పొట్టి ప్రపంచకప్లో ఇప్పటివరకు జరిగిన విశేషాలు, రికార్డులపై ఓ లుక్కేద్దాం. ఈ మెగా టోర్నీ తొలి ఎడిషన్ 2007లో ప్రారంభమైంది. నాడు ఈ టోర్నీ ICC World Twenty20 పేరుతో జరిగింది. 2018లో దీనిని ICC Men’s T20 World Cupగా పునర్నామకరణం చేశారు. 2007 నుంచి 2009 వరకు ప్రతి బేసి (ODD) సంవత్సరంలో, 2010 నుంచి ప్రతి జత (EVEN) సంవత్సరంలో ఈ టోర్నమెంట్ జరిగింది. 2018, 2020లో మాత్రం జరగలేదు. ఈ టోర్నీ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లుగా భారత్, వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి. ఈ మూడు జట్లు తలో రెండుసార్లు ఛాంపియన్లుగా నిలిచాయి. భారత్ 2007, 2024 ఎడిషన్లలో.. ఇంగ్లండ్ 2010, 2022లో.. వెస్టిండీస్ 2012, 2016 ఎడిషన్లలో ట్రోఫ్రీలు దక్కించుకున్నాయి. పాక్ (2009), శ్రీలంక (2014), ఆస్ట్రేలియా (2022) తలోసారి ఛాంపియన్లుగా అవతరించాయి.టోర్నీ చరిత్రలో అత్యుత్తమ రికార్డులు..అత్యధిక ఎడిషన్లలో పాల్గొన్న ఆటగాళ్లు- రోహిత్ శర్మ, షకీబ్ అల్ హసన్ (9)అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడు- రోహిత్ శర్మ (47)అత్యధిక మ్యాచ్ల్లో కెప్టెన్సీ చేసిన రికార్డు- ఎంఎస్ ధోని (33 మ్యాచ్లు)అత్యధిక పరుగులు- విరాట్ కోహ్లి (1292)అత్యధిక వ్యక్తిగత స్కోర్- బ్రెండన్ మెక్కల్లమ్ (123)అత్యధిక సగటు- విరాట్ కోహ్లి (58.72)అత్యధిక స్ట్రయిక్రేట్- సూర్యకుమార్ యాదవ్ (158.94 స్ట్రయిక్రేట్)అత్యధిక సెంచరీలు- క్రిస్ గేల్ (2)అత్యధిక 50 ప్లస్ స్కోర్లు- విరాట్ కోహ్లి (15)అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు- విరాట్ కోహ్లీ (8)ఫాస్టెస్ట్ ఫిఫ్టి- యువరాజ్ సింగ్ (12)ఫాస్టెస్ట్ సెంచరీ- క్రిస్ గేల్ (47)అత్యధిక సిక్సర్లు- గేల్ (63)అత్యధిక బౌండరీలు- రోహిత్ శర్మ (115)ఓ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు- గేల్ (11)ఓ ఇన్నింగ్స్లో అత్యధిక ఫోర్లు- గిబ్స్ (14)ఓ సింగిల్ ఎడిషన్లో అత్యధిక పరుగులు- విరాట్ కోహ్లి (2014లో 319 పరుగులు)అత్యధిక వికెట్లు- షకీబ్ (50)అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు- అజంత మెండిస్ (6-8)అత్యుత్తమ ఎకానమీ- సునీల్ నరైన్ (5.17)ఓ సింగిల్ ఎడిషన్లో అత్యధిక వికెట్లు- అర్షదీప్, ఫజల్హక్ ఫారూఖీ (2024లో తలో 17 వికెట్లు)హ్యాట్రిక్లు- మొత్తం 9 (బ్రెట్ లీ, కర్టిస్ క్యాంఫర్, హసరంగ, రబాడ, కార్తిక్ మైయప్పన్, జోష్ లిటిల్, కమిన్స్, క్రిస్ జోర్డన్) నమోదు కాగా.. కమిన్స్ ఒక్కడే రెండు (2024) తీశాడు.అత్యధిక క్యాచ్లు- డేవిడ్ వార్నర్ (25)అత్యధిక మ్యాచ్లు ఆడిన జట్టు- శ్రీలంక (54)అత్యధిక విజయాల శాతం కలిగిన జట్టు- భారత్ (67.30)అత్యధిక స్కోర్ చేసిన జట్టు- ఇంగ్లండ్ (2016లో సౌతాఫ్రికాపై 230-8)అత్యల్ప స్కోర్ చేసిన జట్టు- నెదర్లాండ్స్ (39 ఆలౌట్, 2014లో శ్రీలంకపై)అత్యధిక స్కోర్ నమోదైన మ్యాచ్- ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా (2016లో 459 పరుగులు)అత్యధిక మార్జిన్తో (పరుగులు) గెలిచిన జట్టు- శ్రీలంక (2007లో కెన్యాపై 172 పరుగుల తేడాతో)అత్యధిక ఛేదన- ఇంగ్లండ్ (2016లో సౌతాఫ్రికాపై 230 పరుగులు)అత్యధిక టైటిళ్లు సాధించిన కెప్టెన్- డారెన్ సామీ (2012, 2016) -
భారత్తో మ్యాచ్ రద్దు.. పాక్పై ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు..!
టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియాతో జరగాల్సిన గ్రూప్ స్టేజీ మ్యాచ్ను పాక్ జట్టు రద్దు చేసుకుంటున్నట్లు ఆ దేశ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ జట్టుపై తీవ్రమైన చర్యలు ఉంటాయని గత రెండ్రోజులగా ప్రచారం జరుగుతుంది. అయితే, ఈ ప్రచారాన్ని ఐసీసీ మరియు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) మాజీ ఛైర్మన్ ఎహసాన్ మణి కొట్టిపారేశాడు. ఈ విషయంలో ఐసీసీ పాక్ జట్టును ఏమీ చేసుకోలేదని వివరణ ఇచ్చాడు.ఈ నిర్ణయం పీసీబీ కాకుండా పాక్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తీసుకోవడం వల్లే ఐసీసీ ఎలాంటి శిక్షలు విధించలేదని వెల్లడించాడు. ఆయన మాటల్లో.. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించినప్పుడు ఏ దేశానికీ శిక్షలు ఉండవు. ఇదే కారణంతో (భద్రత) టీమిండియా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లను పాక్లో ఆడేందుకు నిరాకరించింది. అప్పుడు టీమిండియాపై ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు పాక్ జట్టు విషయంలోనూ అంతే. ఒకే సమస్యకు రెండు విధానాలు ఉండకూడదని అన్నారు. కాగా, తాజా పరిస్థితి ఐసీసీకి పెద్ద సవాలుగా మారింది. ఓవైపు అభిమానుల ప్రయోజనాలు, ప్రపంచ క్రికెట్ సమగ్రత దెబ్బతింటున్నాయి. మరోవైపు ప్రభుత్వ నిర్ణయాలను బోర్డులు తప్పనిసరిగా పాటించాల్సి రావడం వల్ల ఐసీసీకి శిక్షలు విధించే అధికారం తగ్గిపోతోంది. ఈ లూప్ హోల్ను ఆసరాగా తీసుకొనే పీసీబీ డ్రామాలాడుతుంది. భారత్తో మ్యాచ్ రద్దుపై ఇప్పటివరకు ఐసీసీకి అధికారిక సమాచారం కూడా ఇవ్వలేదు. కేవలం ప్రభుత్వ మాటగా కాలయాపన చేస్తుంది. ఐసీసీ నియమాలను అడ్డు పెట్టుకొని రోజుకో డ్రామాకు తెరలేపుతుంది.మరోవైపు ఐసీసీ అధ్యక్షుడిగా జై షా ఉండటంతో పాక్పై సంచలన నిర్ణయాలు తీసుకోవచ్చనే ప్రచారం కూడా జరుగుతుంది. షా.. రూల్స్ను పక్కన పెట్టి పాక్పై కఠిన చర్యలు తీసుకుంటాడని ఐసీసీ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ షా తన పరపతిని ఉపయోగిస్తే పాక్ జట్టుకు అంత భారీ శిక్షలు కాకపోయినా, ఓ మోస్తరు శిక్షలు అయినా పడే అవకాశం ఉంది. పాక్ జట్టు భారీ జరిమానాతో పాటు ఐసీసీ సభ్య దేశాల నుంచి అంక్షలు ఎదుర్కోవచ్చు. పాక్పై ఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటుందోనని యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. -
సన్రైజర్స్ హైదరాబాద్కు గుడ్ న్యూస్!
టీ20 ప్రపంచకప్-2026కు ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ ప్యాట్ కమ్మిన్స్ దూరమైన సంగతి తెలిసిందే. తొలుత ప్రకటించిన జట్టులో ఉన్నప్పటికి.. ఇంకా గాయం నుంచి కోలుకోకపోవడంతో ఆఖరి నిమిషంలో కమ్మిన్స్ తప్పుకొన్నాడు. అతడి స్దానంలో బెన్ దుర్హనియస్ను జట్టులోకి సెలెక్టర్లు తీసుకున్నారు.కమ్మిన్స్ గత జూలై నుంచి వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. ఇటీవల జరిగిన యాషెస్ సిరీస్లో కూడా అతడు కేవలం ఒకే టెస్టు మ్యాచ్ ఆడాడు. అయితే వరల్డ్కప్ సమయానికి కమ్మిన్స్ పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని క్రికెట్ ఆస్ట్రేలియా ఆశించింది. కానీ అతడు కోలు కోవడానికి 4 నుంచి 8 వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే అతడు కీలక టోర్నీ కి దూరమయ్యాడు. అయితే వరల్డ్కప్ నుంచి తప్పుకొన్న ప్యాట్ కమ్మిన్స్.. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు మాత్రం గుడ్ న్యూస్ చెప్పాడు. ఐపీఎల్-2026 అందుబాటులో ఉంటానని కమ్మిన్స్ హింట్ ఇచ్చాడు."వరల్డ్కప్ టోర్నీ నుంచి వైదొలగడం నిజంగా దురదృష్టకరం. అడిలైడ్ టెస్టు తర్వాత నా గాయం తిరగబెట్టింది. అయితే 4 వారాల్లోనే కోలుకుంటానని అనుకున్నాను. కానీ తాజా స్కాన్ తర్వాత మరికొన్ని వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. అందుకే ఈ మెగా ఈవెంట్కు దూరంగా ఉండాల్సి వచ్చింది. మరి కొన్ని రోజుల్లో మళ్లీ స్కాన్ చేయించుకుంటాను. ఒకవేళ ఆ రిపోర్ట్ గనుక సానుకూలంగా వస్తే, అప్పటి నుండి నెమ్మదిగా ప్రాక్టీస్ మొదలుపెడతాను. త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తాను" అని కమ్మిన్స్ ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్గా కమ్మిన్స్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కావ్య మారన్ మరోసారి అతడిపై నమ్మకం ఉంచారు. -
క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని అద్భుతం
క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని అద్భుతం చోటు చేసుకుంది. ఓ ఆటగాడు 20 ఏళ్ల కిందట ఓ దేశం తరఫున హాకీ ప్రపంచకప్ ఆడి.. త్వరలో మరో దేశం తరఫున క్రికెట్ ప్రపంచకప్ (టీ20) ఆడబోతున్నాడు. క్రికెట్ పుట్టినప్పటి నుంచి ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదు. ఒకే ఆటగాడు రెండు వేర్వేరు దేశాల తరఫున ఆడాడు కానీ, వేర్వేరు దేశాల తరఫున వేర్వేరు క్రీడల్లో ప్రపంచకప్ టోర్నీల్లో మాత్రం ఒక్కరు కూడా పాల్గొనలేదు.ఇలాంటి చారిత్రక గౌరవం సౌతాఫ్రికాలో పుట్టి, ఇటలీ తరఫున టీ20 ప్రపంచకప్ ఆడనున్న 42 ఏళ్ల వేన్ మ్యాడ్సన్కు దక్కింది. మ్యాడ్సన్ సౌతాఫ్రికా తరఫున 2006 హాకీ ప్రపంచకప్ ఆడి.. ఇటలీ తరఫున 2026 టీ20 ప్రపంచకప్ ఆడేందుకు సిద్దంగా ఉన్నాడు. తొలిసారి ప్రపంచకప్కు అర్హత సాధించిన ఇటలీ జట్టుకు మ్యాడ్సన్ కెప్టెన్గానూ వ్యవహరించనున్నాడు. టీ20 ప్రపంచకప్ ఆడబోయే 20 జట్లలో ఇటలీ ఒకటి. ఈ యూరోపియన్ జట్టు క్వాలిఫయర్స్ ద్వారా ప్రపంచకప్ బెర్త్ దక్కించుకుంది. ఇటలీకి ప్రపంచకప్ బెర్త్ దక్కడంలో ఆసీస్ మాజీ ఆటగాడు జో బర్న్స్ కీలకపాత్ర పోషించాడు. బర్న్స్ పలు చారిత్రక ఇన్నింగ్స్లు ఆడి ఇటలీకి ప్రపంచకప్ బెర్త్ దక్కేలా చేశాడు. వాస్తవానికి బర్న్స్నే ఇటలీ ప్రపంచకప్ జట్టుకు కెప్టెన్గా ప్రకటిస్తారని అంతా అనుకున్నారు. అయితే ఇటలీ సెలెక్టర్లు బర్న్స్ను అనూహ్యంగా తప్పించి మ్యాడ్సన్కు ఇటలీ పగ్గాలు అప్పజెప్పారు. మ్యాడ్సన్ 2023లో ఇటలీ తరఫున అరంగేట్రం చేసి 7 టీ20 మ్యాచ్లు ఆడాడు. వాస్తవానికి మ్యాడ్సన్ క్రికెట్నే కెరీర్గా ఎంచుకొని 2003లోనే దేశవాలీ అరంగేట్రం చేశాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్లో కౌంటీ క్రికెట్తో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా టీ20 క్రికెట్ లీగ్లు (పాకిస్తాన్ సూపర్ లీగ్, హండ్రెడ్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్) ఆడాడు. అయితే హాకీలో కూడా ప్రొఫెషనల్ అయిన మ్యాడ్సన్కు 2006లో సౌతాఫ్రికా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం లభించింది. ఆ ఏడాది అతను హాకీ ప్రపంచకప్తో పాటు కామన్వెల్త్ గేమ్స్లోనూ ఆడాడు. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత వేరే దేశం తరఫున క్రికెట్ ప్రపంచకప్ ఆడనున్నాడు.ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరుగబోయే టీ20 ప్రపంచకప్లో మ్యాడ్సన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలువనున్నాడు. ఇటలీ గ్రూప్-సిలో ఇంగ్లండ్, నేపాల్, స్కాట్లాండ్, వెస్టిండీస్ జట్లతో పోటీపడనుంది. ఈ జట్టు తమ తొలి ప్రపంచకప్ మ్యాచ్ను ఫిబ్రవరి 9న స్కాట్లాండ్తో ఆడుతుంది. -
మొన్న పుజారా.. నిన్న శిఖర్ ధవన్
టీమిండియా తాజా మాజీ క్రికెటర్లు శిఖర్ ధవన్, ఛతేశ్వర్ పుజారా లేటు వయసులోనూ చెలరేగిపోతున్నారు. అంతర్జాతీయ కెరీర్లు ముగిసాక కూడా వీరిద్దరూ సత్తా చాటుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది స్టార్ క్రికెటర్లతో కలిసి వరల్డ్ లెజెండ్స్ ప్రో టీ20 లీగ్లో ఆడుతున్న ధవన్, పుజారా.. తాజాగా జరిగిన మ్యాచ్ల్లో తృటిలో సెంచరీలను కోల్పోయారు. ఈ టోర్నీలో గుర్గ్రామ్ థండర్కు ఆడుతున్న పుజారా దుబాయ్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 60 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్ సాయంతో 99 పరుగులు చేసి ఔటయ్యాడు. నిన్న మహారాష్ట్ర టైకూన్స్తో జరిగిన మ్యాచ్లో దుయాబ్ రాయల్స్ తరఫున శిఖర్ ధవన్ 48 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 99 పరుగులతో అజేయంగా నిలిచాడు. ధవన్, పుజారా ఈ టోర్నీలో సత్తా చాటడం ఇదే తొలిసారి కాదు. దీనికి ముందు వేర్వేరు మ్యాచ్ల్లోనూ ఈ ఇద్దరూ చెలరేగిపోయారు. తలో హాఫ్ సెంచరీ సాధించి, తమతమ జట్ల విజయాలకు దోహదపడ్డారు.కాగా, వరల్డ్ లెజెండ్స్ ప్రో టీ20 లీగ్ ఈ ఎడిషన్తోనే అరంగేట్రం చేసింది. ఈ లీగ్లో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు (ఢిల్లీ వారియర్స్, దుబాయ్ రాయల్స్, గుర్గ్రామ్ థండర్స్, మహారాష్ట్ర టైకూన్స్, పూణే పాంథర్స్, రాజస్థాన్ లయన్స్) పాల్గొంటున్నాయి.జనవరి 26న మొదలై పది రోజుల పాటు సాగే ఈ లీగ్లో మొత్తం 18 మ్యాచ్లు జరుగనున్నాయి. ఈ లీగ్లో హర్భజన్ సింగ్, శిఖర్ ధవన్, ఇర్ఫాన్ పఠాన్, షేన్ వాట్సన్, డేల్ స్టెయిన్, ఇయాన్ మోర్గాన్ తదితర 90 మంది దిగ్గజాలు పాల్గొంటున్నారు.గోవా వేదికగా జరుగుతున్న ఈ లీగ్లో ఇప్పటికే సెమీస్ బెర్త్లు ఖరారయ్యాయి. ఇయాన్ మోర్గాన్ సారథ్యంలోని రాజస్థాన్ లయన్స్, కీరన్ పోలార్డ్ నేతృత్వంలోని పూణే పాంథర్స్, గుర్కీరత్ సింగ్ మాన్ కెప్టెన్సీలోని ఢిల్లీ వారియర్స్, శిఖర్ ధనవ్ నేతృత్వంలోని దుబాయ్ రాయల్స్ సెమీస్కు అర్హత సాధించాయి. ఇవాళే (ఫిబ్రవరి 3) ఈ సెమీస్ మ్యాచ్లు జరుగనున్నాయి. తొలి సెమీస్లో రాజస్థాన్, పూణే.. రెండో సెమీస్లో ఢిల్లీ, దుబాయ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. తొలి సెమీస్ మధ్యాహ్నం 2:30 గంటలకు.. రెండో సెమీస్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. -
పాక్, సౌతాఫ్రికా కాదు.. సెమీస్కు చేరే జట్లు ఇవే
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీ20 ప్రపంచకప్-2026కు మరో నాలుగు రోజుల్లో తెరలేవనుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ.. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది.ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గోనున్నాయి. అయితే ఈ పొట్టి ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు రాజకీయ ఉద్రిక్తల కారణంగా ఆఖరి నిమిషంలో తప్పుకొంది. దీంతో బంగ్లా స్ధానాన్ని స్కాట్లాండ్తో ఐసీసీ భర్తీ చేసింది. తాజాగా పాకిస్తాన్ కూడా భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ ఏడాది వరల్డ్కప్ ఆరంభానికి ముందే తీవ్ర చర్చనీయాంశమైంది.ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మెగా టోర్నీలో సెమీఫైనల్కు చేరే నాలుగు జట్లను ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ వెల్లడించాడు. టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ రన్నరప్గా నిలిచిన దక్షిణాఫ్రికాకు వాన్ షాకిచ్చాడు. తను ఎంచుకున్న టాప్-4 జట్ల జాబితాలో సౌతాఫ్రికాకు వాన్ చోటు ఇవ్వలేదు. భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీస్కు చేరుతాయని అతడు అంచనా వేశాడు. టీ20ల్లో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తుండడంతో భారత్కు వాన్ మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం పాకిస్తాన్ను కూడా పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం.మరోవైపు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా భారత్కే టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మెగా టోర్నీ సన్నాహల్లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో భారత్ దుమ్ములేపింది.చదవండి: పాక్కు ఇదేమి కొత్త కాదు.. కచ్చితంగా వెనక్కి తగ్గుతుంది: గావస్కర్ -
పాక్కు ఇదేమి కొత్త కాదు.. కచ్చితంగా వెనక్కి తగ్గుతుంది: గావస్కర్
టీ20 ప్రపంచకప్-2026లో భారత్తో మ్యాచ్ను బాయ్కట్ చేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో ఆడుతామని, భారత్తో మాత్రం తలపడబోమని పాక్ సర్కార్ స్పష్టం చేసింది. ఈ అనుహ్య నిర్ణయంపై అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో మిశ్రమ స్పందన వస్తోంది.చాలా మంది పాక్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ఇదే విషయంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయం త్వరలోనే మారిపోతుందని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అంచనా వేస్తున్నారు. "నాలుగు రోజుల పాటు ఈ అంశంపై స్పందనలు చూసిన తర్వాత పీసీబీ తమ నిర్ణయం మార్చుకుంటుంది. ఇందులో కొత్తేమీ లేదు. పాక్ క్రికెటర్లంతా రిటైర్మెంట్ ప్రకటించడం... కొద్ది రోజులకే అభిమానులు మా ఆటను ఇంకా చూడాలనుకుంటున్నారు అంటూ రిటైర్మెంట్ ప్రకటన వెనక్కి తీసుకోవడం ఎన్నోసార్లు జరిగింది. పీసీబీ నిర్ణయంపై ఐసీసీ చర్య కూడా తీసుకోవచ్చు" అని గావస్కర్ పేర్కొన్నారు.మరోవైపు పాక్ ఆడబోమని చెబుతున్నా...నిబంధనల ప్రకారం భారత జట్టు మ్యాచ్ కోసం కొలంబోకు ప్రయాణించాల్సి ఉంటుంది. మైదానానికి వెళ్లిన తర్వాత మరో జట్టు ఆడటం లేదని నిర్ధారణ అయ్యాకే ఐసీసీ రిఫరీ అధికారిక ప్రకటనతో మ్యాచ్ రద్దు అవుతుంది.చదవండి: భారత్, పాక్ మ్యాచ్ జరగకపోతే రూ.2,289 కోట్ల నష్టం! -
భారత్లో మళ్లీ ఫార్ములావన్?
సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఢిల్లీలోని బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో ‘రయ్... రయ్’ మోత మోగింది. రేస్ ప్రియుల ఫేవరెట్ ‘ఫార్ములావన్ గ్రాండ్ప్రి’ జరిగింది. 2011లో మొదలైన ఈ ఎఫ్1 రేసు మూడేళ్ల పాటు జరిగింది. 2013 రేసు అనంతరం మనకు ఈ ‘ఫార్ములా’ దూరమైంది! కారణాలు ఏవైనా మళ్లీ ప్రతిష్టాత్మక ఫార్ములావన్ ఆతిథ్య భాగ్యం భారత్కు దక్కలేదు. ఇప్పుడు పుష్కరకాలం తర్వాత ‘రయ్ రయ్’ మోత మోగించాలని కేంద్ర క్రీడాశాఖ చొరవ చూపిస్తోంది.గ్రేటర్ నోయిడాలోని బుద్ధ సర్క్యూట్ను ఇటీవలే క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ సందర్శించారు. అంతేకాదు, సంబంధిత వర్గాలతోనూ చర్చించినట్లు క్రీడాశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. బుద్ధ సర్క్యూట్ యజమాని జేపీ గ్రూప్. ఈ కార్పొరేట్ సంస్థ దివాళా తీసింది. ఇప్పుడు సర్క్యూట్ బాధ్యతల్ని ‘యమునా ఎక్స్ప్రెస్వే ఇండ్రస్టియల్ డెవలప్మెంట్ అథారిటీ’ చూస్తోంది.ఈ అథారిటీ వర్గాలతోనే క్రీడల మంత్రి భేటీ అయినట్లు తెలిసింది. అప్పుల్లో కూరుకుపోయిన జేపీ గ్రూప్ నుంచి బుద్ధ సర్క్యూట్ను అదానీ గ్రూప్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తోంది. ప్రాథమిక దశలో చర్చలు జరిగినట్లు తెలిసింది. ఈ యాజమాన్య బదిలీ ప్రక్రియ పూర్తయితే తిరిగి భారత్లో ‘ఫార్ములావన్’ రేసుకు చేపట్టాల్సిన కార్యాచరణ మొత్తం చకచకా జరిగిపోతుందని భావిస్తున్నారు.అయితే యాజమాన్య బదిలీ జరగకపోయినా... కనీసం రెండు, మూడేళ్లు ఈ ట్రాక్ బాధ్యతల్ని క్రీడా సమాఖ్యకు అప్పగించాలని మంత్రి మాండవీయ సంబంధిత వర్గాలను కోరినట్లు తెలిసింది. పన్ను, అధికారిక సమస్యల్ని పరిష్కరించి సాధ్యమైనంత తొందరగా ఫార్ములావన్ను తిరిగి భారత్ ట్రాక్లో నిర్వహించే ప్రణాళికతో క్రీడాశాఖ ఉంది. భారత మోటార్స్పోర్ట్స్ సమాఖ్య (ఎఫ్ఎంఎస్సీఐ) మాజీ అధ్యక్షుడు విక్కీ చందోక్ తాజా ప్రభుత్వ చర్యలపై హర్షం వ్యక్తం చేశారు. తిరిగి ఎఫ్1 భారత్కు తిరిగొస్తే అంతకుమించిన ఆనందం మరొటి ఉండదని అన్నారు. ఆయన కృషివల్లే 2011లో ఫార్ములావన్ జరిగింది. -
భారత్, పాక్ మ్యాచ్ జరగకపోతే రూ.2,289 కోట్ల నష్టం!
క్రికెట్ ప్రపంచంలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్కు ఉన్న క్రేజ్ వేరు. ఈ రెండు జట్లు ఎప్పుడెప్పుడూ తలపడతాయా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. రాజకీయ ఉద్రిక్తల కారణంగా చిరకాల ప్రత్యర్ధులు కేవలం ఐసీసీ ఈవెంట్లు, ఏసీసీ టోర్నీల్లో మాత్రమే ముఖాముఖి తలపడతున్నాయి. అయితే మరోసారి దాయాదుల పోరు చూడాలనుకున్న అభిమానులకు నిరాశే ఎదురయ్యే అవకాశముంది.టీ20 ప్రపంచకప్-2026లో భారత్తో జరగాల్సిన లీగ్ మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. టోర్నీలో ఇతర జట్లతో ఆడుతామని, కానీ భారత్తో మాత్రం తలపడబోమని పాక్ స్పష్టం చేసింది. దీంతో ఐసీసీ రంగంలోకి దిగింది. పాక్ తన నిర్ణయాన్ని వెనుక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐసీసీ హెచ్చరించింది.ఐసీసీకి భారీ నష్టం..ఒకవేళ భారత్-పాక్ మ్యాచ్ రద్దు అయితే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్కు భారీ నష్టం వాటిల్లే అవకాశముంది. ఐసీసీ ప్రసార హక్కుల విలువ సుమారు 3 బిలియన్ డాలర్లు (రూ. 27,465 కోట్లు)గా ఉంది. ఇందులో 40 శాతం కంటే ఎక్కువ ఆదాయం ఒక్క భారత్-పాక్ మ్యాచ్ల నుంచే వస్తుంది.గత మూడేళ్లలో జరిగిన ప్రతీ భారత్-పాక్ మ్యాచ్ విలువ సుమారు 250 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 2,289 కోట్లు)గా ఉంది. అదేవిధంగా టోర్నీ బ్రాడ్కాస్టర్ జియోస్టార్ ఈ మ్యాచ్ ద్వారా వచ్చే భారీ యాడ్స్ రెవెన్యూ కోల్పోతుంది. 10 సెకన్ల ప్రకటన విలువ సుమారు రూ. 40 లక్షల వరకు ఉంటుంది. దీంతో ప్రసారకర్తలకు నేరుగా రూ.250 కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశముంది. పాక్ తమ మొండి పట్టు వీడకపోతే ఆ నష్టాన్ని వారి నుంచే ఐసీసీ రాబట్టనుంది.చదవండి: T20 WC 2026: భారత్తో మ్యాచ్ బాయ్కట్.. పాకిస్తాన్ మరో కొత్త డ్రామా -
హెచ్సీఏ నూతన అధ్యక్షుడిగా అమర్నాథ్
హైదరాబాద్ క్రికెట్ అసోయేషిన్ అధ్యుక్షుడిగా అమర్నాథ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఈ మేరకు రిటైర్డ్ చీఫ్ జస్టిస్, ప్రస్తుత అంబుడ్స్మన్ సురేష్ కుమార్ కైత్ ఉత్తర్వలు జారీ చేశారు. 2023లో జరిగిన ఎన్నికల్లో జగన్ మోహన్ రావ్ చేతిలో అమర్నాథ్ కేవలం ఒక్క ఓటుతో ఓడిపోయాడు.అయితే ఈ ఎన్నికల్లో విజయం సాధించిన జగన్ మోహన్ రావ్ అవినీతి ఆరోపణలు కేసులో అరెస్ట్ అయ్యాడు. అతడు ప్రస్తుతం బెయిల్పై ఉన్నాడు. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు అతడు అర్హుడు కాదని అంబుడ్స్మన్ స్పష్టం చేసింది.దీంతో హెచ్సీఏ అధ్యక్ష బాధ్యతలను అమర్నాథ్కు అప్పగించారు. ప్రస్తుతం హెచ్సీఏ తాత్కాలిక అధ్యక్షుడిగా సర్దార్ దల్జీత్ సింగ్ ఉన్నారు. మరో వారం రోజుల్లో అతడి స్ధానాన్ని అమర్నాథ్ భర్తీ చేయనున్నారు. ఐపీఎల్ సమీపిస్తుండటంతో ఈ నూతన ప్రెసిడెంట్ నియమాకం అనివార్యమైంది.దాదాపు ఏడాది నుంచి హైదరాబాద్లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా జరగలేదు. ఆఖరికి ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ హోం మ్యాచ్లను కూడా వేరే చోటకు తరలించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అమర్నాథ్ కొత్త ప్రెసిడెంట్గా ఎంపిక కావడంతో పరిస్థితులు మారే అవకాశముంది.చదవండి: T20 WC 2026: రీఎంట్రీలో అదరగొట్టిన తిలక్ వర్మ -
ఎవరిదో ‘ఫైనల్’ బెర్త్?
వడోదర: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఇప్పటి వరకు మూడు సీజన్లు జరగ్గా ఢిల్లీ క్యాపిటల్స్ మూడు సార్లూ ఫైనల్కు చేరింది. అయితే దురదృష్టవశాత్తూ ప్రతీసారి ఓడి రన్నరప్ తో సరిపెట్టుకుంది. ఇప్పుడు మరోసారి ఫైనల్ చేరాలని ఆ జట్టు పట్టుదలగా ఉంది. మరోవైపు గుజరాత్ జెయింట్స్ తొలి రెండు సీజన్లలో ఆఖరి స్థానానికే పరిమితం కాగా... గత ఏడాది మాత్రం రెండో స్థానంతో ఎలిమినేటర్కు అర్హత సాధించినా ... అదే మ్యాచ్లో ఓడి ని్రష్కమించింది. ఈసారైనా ఆ దశను దాటి తొలిసారి తుది పోరుకు చేరాలని జట్టు భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీ, గుజరాత్ జట్ల మధ్య ‘ఎలిమినేటర్’ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో గురువారం జరిగే ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడుతుంది. స్పిన్నర్లు కీలకం... గత మూడు సీజన్లలో గ్రూప్ దశలో అగ్రస్థానంతో ఢిల్లీ ఫైనల్కు చేరింది. ఈసారి కాస్త తడబాటును ప్రదర్శించిన జట్టు ఇప్పుడు ఫైనల్ కోసం ఎలిమినేటర్లో ఆడుతోంది. బ్యాటింగ్ పరంగా చూస్తే టాప్–5తో జట్టు మెరుగ్గా కనిపిస్తోంది. ఓపెనర్లు లిజెల్ లీ, షఫాలీ వర్మ శుభారంభం అందిస్తే జట్టుకు విజయావకాశాలు మెండుగా ఉంటాయి. తర్వాతి బ్యాటర్లలో లారా వోల్వార్ట్, కెప్టెన్ జెమీమా, మరిజాన్ కాప్ చకచకా పరుగులు రాబట్టగలరు. అయితే టీమ్ ప్రధానంగా స్పిన్నర్లపై ఆధారపడుతోంది. శ్రీచరణి, స్నేహ్ రాణా, నందిని శర్మ ప్రత్యర్థి బ్యాటర్లను నిలువరించగల సమర్థులు సమష్టి ప్రదర్శనపై భారం... విదేశీ క్రికెటర్ల ప్రదర్శనతోనే తాజా సీజన్లో గుజరాత్ జెయింట్స్ ముందంజ వేసిందనడంలో సందేహం లేదు. ముగ్గురు ఆ్రస్టేలియన్లు కెపె్టన్ యాష్లీ గార్డ్నర్, బెత్ మూనీ, జార్జియా వేర్హామ్ తమ ఆటతో ప్రతీసారి ప్రభావం చూపించగా, న్యూజిలాండ్ సీనియర్ స్టార్ ప్లేయర్ సోఫీ డివైన్ ఆల్రౌండర్గా సత్తా చాటింది. మరోసారి జెయింట్స్ ఈ ప్లేయర్లపైనే ఆధారపడుతోంది. భారత ఆటగాళ్లలో అనుష్క శర్మ మాత్రమే మూడో స్థానంలో చెప్పుకోదగ్గ రీతిలో రాణించింది. గుజరాత్ ఈ సీజన్లో ఐదు మ్యాచ్లు గెలవగా... ఐదుసార్లు తొలుత బ్యాటింగ్ చేసి విజయాన్నందుకోవడం విశేషం. -
‘ఆడకుంటే మీకే నష్టం’
దుబాయ్: టి20 వరల్డ్ కప్లో భారత్తో మ్యాచ్ ఆడమంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీసుకున్న నిర్ణయంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) స్పందించింది. ఇప్పటికిప్పుడే దీనిపై తీవ్రంగా జవాబివ్వకపోయినా... వాస్తవ పరిస్థితులు వెల్లడిస్తూ పాక్కు ఒక రకమైన హెచ్చరిక జారీ చేసింది. వరల్డ్ కప్ మ్యాచ్ నుంచి అర్ధాంతరంగా తప్పుకుంటే మున్ముందు పాక్ క్రికెట్కే నష్టం జరుగుతుందని స్పష్టం చేసింది. ‘క్రీడా స్ఫూర్తి, పోటీతత్వం, పారదర్శకతపై ఆధారపడి ఐసీసీ టోరీ్నలు జరుగుతాయి. ఎంపిక చేసుకున్న మ్యాచ్లలో ఆడతామంటే దాని విశ్వసనీయత దెబ్బ తింటుంది. పోటీకి అర్హత సాధించిన అన్ని జట్లూ ఒకే తరహా నిబంధనల ప్రకారం బరిలోకి దిగాలని ఐసీసీ ఆశిస్తోంది. జాతీయ విధానాల ప్రకారం ప్రభుత్వ జోక్యం ఉండటాన్ని మేం గౌరవిస్తాం కానీ ఇది ఆటకే కాకుండా క్రికెట్ వ్యవస్థ ద్వారా ప్రయోజనం పొందే పాక్ క్రికెట్కు కూడా మంచిది కాదు. జట్టుపై ఇది దీర్ఘ కాలం ప్రభావం చూపిస్తుందనే విషయాన్ని పీసీబీ అర్థం చేసుకోవాలి. ప్రపంచకప్ను సమర్థంగా నిర్వహించడంలో ఐసీసీతో పాటు పీసీబీకి కూడా బాధ్యత ఉంది. అందరికీ ఆమోదయోగ్యమయ్యే పరిష్కార మార్గాన్ని పాక్ కనుక్కుంటే అందరికీ మేలు చేస్తుంది’ అని ఐసీసీ ప్రకటన జారీ చేసింది. అయితే తాజా పరిణామాలపై చర్చించేందుకు ఐసీసీ బోర్డు సమావేశమయ్యే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. 12 శాశ్వత దేశాల ప్రతినిధులు, 3 అసోసియేట్ జట్లకు చెందిన ప్రతినిధులు ఐసీసీ బోర్డులో భాగంగా ఉన్నారు. ఇప్పటి వరకైతే ఐసీసీ అత్యవసర సమావేశంపై ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈ అంశంపై చర్చ జరిగినా లేదా ఏదైనా చర్య తీసుకునేందుకు సిఫారసు చేసినా ఈ బోర్డు సమావేశంలోనే జరుగుతుంది. భారీ నష్టానికి అవకాశం... భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే కేవలం ప్రసారకర్తలు, ప్రకటనల గురించే కాదు... ఆ మ్యాచ్ కారణంగా ప్రభావం చూపించే ఇతర అంశాలన్నీ కలిపితే మ్యాచ్ విలువ సుమారు 250 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2200 కోట్లు) ఉంటుందని అంచనా. 10 సెకన్ల ప్రకటన విలువ సుమారు రూ. 40 లక్షల వరకు ఉంటుంది కాబట్టి ప్రసారకర్తలకు నేరుగా రూ.250 కోట్ల వరకు నష్టం వాటిల్లవచ్చు. పీసీబీ వార్షిక ఆదాయం 35.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.324 కోట్లు) మాత్రమే. ఇలాంటి స్థితిలో ఐసీసీ చర్య తీసుకుంటే పాక్ కోలుకునే అవకాశం ఉండదు. టోర్నీలో కూడా మ్యాచ్ ఆడకుండా 2 పాయింట్లు కోల్పోయేందుకు పాక్ సిద్ధమవుతున్నా... ఐసీసీ మ్యాచ్ నిబంధనల ప్రకారం పాయింట్లు మాత్రమే కాదు, రన్రేట్లో కూడా ఆ జట్టు పూర్తిగా వెనుకబడిపోతుంది. -
శ్రీలంకకు ఊహించని షాక్
టీ20 ప్రపంచకప్-2026కు ముందు శ్రీలంకకు భారీ షాక్ తగిలింది. స్టార్ బౌలర్ ఎషాన్ మలింగ భుజం గాయం కారణంగా ఈ మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆదివారం పల్లెకెలె వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో టీ20లో మలింగ భుజానికి గాయమైంది. దీంతో అతడు ఆట మధ్యలోనే మైదానాన్ని వీడాడు.అతడు తన గాయం నుంచి కోలుకోవడానికి 4 నుండి 6 వారాల సమయం పట్టనున్నట్లు శ్రీలంక క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. మలింగ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్-2025 సీజన్లో ఎస్ఆర్హెచ్ తరపున 13 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. జాతీయ జట్టు తరపున కూడా నిలకడగా రాణిస్తున్నాడు.ఈ క్రమంలోనే అతడికి వరల్డ్కప్ జట్టులో సెలెక్టర్లు చోటు ఇచ్చారు. కానీ ఇప్పుడు అనుహ్యంగా గాయపడడంతో టోర్నీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతడి స్ధానంలో దిల్షాన్ మధుశంక జట్టులోకి వచ్చే అవకాశముంది.టీ20 ప్రపంచకప్ కోసం శ్రీలంక జట్టుపాతుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్, కుశాల్ పెరీరా, చరిత్ అసలంక, కమిల్ మిషార, పవన్ రత్నాయకే, జనిత్ లియానగే, దసున్ షనక (కెప్టెన్), కమిందు మెండిస్, దుష్మంత చమీర, మతీషా పతిరణ, ఎషాన్ మలింగ, వణిందు హసరంగా, మహేశ్ వెల్లలగే, మహేష్ తీక్షణ -
కుర్రాళ్లు కుమ్మేశారు.. అమెరికాపై భారత్ ఘన విజయం
టీ20 వరల్డ్కప్-2026 వార్మప్ మ్యాచ్లు సోమవారం నుంచి షురూ అయ్యాయి. ఈ క్రమంలో అమెరికాతో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్లో 38 పరుగుల తేడాతో ఇండియా ‘ఏ’ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఓపెనర్ నారాయణ్ జగదీశన్(55 బంతుల్లో 104: 11 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు కెప్టెన్ అయుష్ బదోని( 26 బంతుల్లో 60 పరుగులు) మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. గాయం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన తిలక్ వర్మ 24 బంతుల్లో 38 పరుగులు చేసి తన ఫిట్నెస్ను నిరూపించుకున్నాడు. అమెరికా బౌలర్లలో అలీ ఖాన్, శుభమ్, జస్దీప్ సింగ్ తలా వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య చేధనలో అమెరికా 19.4 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ బ్యాటర్ ఆండ్రీస్ గౌస్ (44) టాప్ స్కోరర్గా నిలవగా.. సంజయ్ కృష్ణమూర్తి (41),శుభమ్ (28), హర్మీత్ సింగ్ (25), మహ్మద్ మోసిన్ (21) రాణించారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ 3 వికెట్లతో సత్తాచాటగా.. ఖలీల్ అహ్మద్, తిలక్ వర్మ తలా రెండు వికెట్లు పడగొట్టారు. కాగా ఫిబ్రవరి 4న సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా సౌతాఫ్రికాతో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. తిలక్ వర్మ మంగళవారం సీనియర్ జట్టుతో కలవనున్నాడు.చదవండి: T20 WC 2026: భారత్తో మ్యాచ్ బాయ్కట్.. పాకిస్తాన్ మరో కొత్త డ్రామా -
భారత్తో మ్యాచ్ బాయ్కట్.. పాకిస్తాన్ మరో కొత్త డ్రామా
టీ20 ప్రపంచకప్-2026 మరో ఐదు రోజుల్లో ఆరంభం కానుంది. అయితే ఈ టోర్నీ ప్రారంభానికి ముందు పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం క్రికెట్ ప్రపంచంలో పెను సంచలనంగా మారింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఫిబ్రవరి 15న భారత్తో జరగాల్సిన లీగ్ స్టేజ్ మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాక్ ప్రభుత్వం ఆదివారం ఎక్స్వేదికగా ప్రకటించింది. దీంతో ఆఖరి నిమిషంలో పాకిస్తాన్ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వాత్ర విమర్శల వర్షం కురుస్తోంది.అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా గట్టిగానే స్పందించింది. నచ్చిన మ్యాచ్లు మాత్రమే ఆడుతాము అనేది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని ఐసీసీ పేర్కొంది. ఒకవేళ పాక్ తమ నిర్ణయాన్ని మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐసీసీ హెచ్చరించింది. కాగా భారత్-పాక్ మ్యాచ్ రద్దయితే ఐసీసీకి, బ్రాడ్కాస్టర్లకు సుమారు రూ. 200 కోట్లకు పైగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఈ నష్టాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి ఐసీసీ వసూలు చేసే అవకాశముంది.'ఈమెయిల్' డ్రామాకాగా ఈ బాయ్కట్ గురుంచి పీసీబీ నుంచి ఐసీసీకి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు. పలు రిపోర్ట్లు ప్రకారం..ఎలాంటి అధికారిక ఈమెయిల్ ఐసీసీకి పంపకూడదని పీసీబీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో పీసీబీపై ఐసీసీ తదుపరి చర్యలు తీసుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. పాక్ క్రికెట్ బోర్డు ఉద్దేశపూర్వకంగానే సమాచారం ఇవ్వడం లేదు. ఏదేమైనప్పటికి పాక్ తమ వైఖరిని మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొక తప్పదు. అయితే ఇదే విషయం చర్చించడానికి ఐసీసీ బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.చదవండి: ఇదంతా బీసీసీఐ వల్లే: ఐసీసీ మాజీ అధికారి సంచలన వ్యాఖ్యలు -
T20 WC: ఐసీసీ మాజీ అధికారి సంచలన వ్యాఖ్యలు
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ ఆరంభానికి ముందే వివాదాలు మొదలయ్యాయి. శ్రీలంకతో కలిసి భారత్ ఆతిథ్యం ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తుండగా.. బంగ్లాదేశ్- పాకిస్తాన్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)కి తలనొప్పిగా మారాయి.ఇందుకు కారణం.. భారత్- బంగ్లాదేశ్ (IND vs BAN), భారత్- పాకిస్తాన్ (IND vs PAK) దౌత్య సంబంధాలలో ఉద్రిక్తతలు... పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్తో మెగా ఈవెంట్లలో తలపడే విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తోంది. మరోవైపు.. ఇన్నాళ్లు భారత్ సాయం పొందిన బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులపై దాడులతో పాటు భారత్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నాయకుల సంఖ్య పెరిగిపోయింది.అప్పుడు మొదలుఈ పరిణామాల నేపథ్యంలో ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ ఫాస్ట్బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్ను తొలగించాలనే డిమాండ్లు పెరరగా.. బీసీసీఐ అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి బీసీసీఐ కార్యదర్శి అధికారికంగా ప్రకటించారు కూడా! అంతేకాదు.. టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనను కూడా నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఈ క్రమంలో భారత్లో తమకు భద్రత లేదంటూ.. తమ మ్యాచ్ల వేదికను శ్రీలంకకు మార్చాల్సిందిగా బంగ్లా పట్టుబట్టింది. అయితే, ఐసీసీ ఇందుకు నిరాకరించి.. గడువు ఇచ్చినా పంతం వీడకపోవడంతో బంగ్లాను తప్పించింది. ఆ స్థానంలో స్కాట్లాండ్ను చేర్చింది.బంగ్లాకు మద్దతుగా పాక్ఇక ఆ తర్వాత బంగ్లాకు మద్దతుగా తామూ టోర్నీని బహిష్కరిస్తామని బీరాలు పలికిన పాకిస్తాన్.. ఇప్పుడు కేవలం భారత్తో మ్యాచ్ ఆడబోమంటూ ప్రకటించింది. అయితే, ఇందుకు సంబంధించి ఐసీసీకి అధికారికంగా మెయల్ చేయలేదు. ఈ పరిణామాలపై ఐసీసీ కమ్యూనికేషన్స్ మాజీ హెడ్ సమీ ఉల్ హసన్ బర్నే స్పందిస్తూ.. తప్పంతా బీసీసీఐపైకి నెట్టాడు.బీసీసీఐ నిందలు‘‘ఈ విషయంలో క్రికెట్ బోర్డులు మరింత ఆచితూచి వ్యవహరించాల్సింది. ముఖ్యంగా ముస్తాఫిజుర్ను తొలగించిన విషయాన్ని బీసీసీఐ బహిరంగంగా చెప్పకుండా ఉండాల్సింది. కేకేఆర్కు ప్రైవేటుగా విషయం చెప్పి అతడిని రిలీజ్ చేయమని చెప్పాల్సింది.కొన్నిసార్లు ఇలాంటి చిన్న విషయాలే పెద్దగా మారతాయి. జనవరి 3న వాళ్లు (బీసీసీఐ) చేసిన ప్రకటనే వీటన్నిటికీ మూలం. అయితే, బంగ్లాదేశ్ విషయంలో పాక్ చేస్తున్న పోరాటం సరైంది కావచు... కాకపోనూ వచ్చు. ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగానే ఏ బోర్డు అయినా నడుచుకుంటుంది.ఏదేమైనా పాక్ తదుపరి పరిణామాలకు సిద్ధపడే ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటుంది. న్యాయ బృందంతో చర్చించి.. ఈ విషయంపై ఎలా ముందుకు సాగాలో వారు ఆలోచించుకునే ఉంటారు’’ అని సమీ ఉల్ హసన్ బర్నే పేర్కొన్నాడు. కాగా పాక్ కోసం శ్రీలంకను ఐసీసీ తటస్థ వేదికగా ఏర్పాటు చేసినప్పటికీ.. భద్రతా కారణాలు అంటూ పాక్ భారత్ మ్యాచ్ను బహిష్కరిస్తామనడం గమనార్హం. అందుకే ఐసీసీ ఈసారి పాక్కు గట్టిగానే బుద్ధి చెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: పాక్ ఓవరాక్షన్.. ఐసీసీ కీలక సమావేశం! -
రీఎంట్రీలో అదరగొట్టిన తిలక్ వర్మ
టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ తన రీఎంట్రీలో సత్తాచాటాడు. టీ20 ప్రపంచకప్-2026 ఆరంభానికి ముందు నవీ ముంబై వేదికగా అమెరికాతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్లో తిలక్ అదరగొట్టాడు. ఈ మ్యాచ్లో ఇండియా-ఎకు ప్రాతినిథ్యం వహిస్తున్న తిలక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన తిలక్.. కేవలం 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 38 పరుగులు చేశాడు. తొలుత 8 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేసి కాస్త ఆచితూచి ఆడిన తిలక్.. హర్మీత్ సింగ్ బౌలింగ్లో వరుసగా ఫోర్, సిక్స్ బాది ఒక్కసారిగా జోరు పెంచాడు. వికెట్ కీపర్ నారాయణ్ జగదీశన్తో కలిసి తిలక్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే మంచి టచ్లో కన్పించిన తిలక్, అమెరికా పేసర్ శుభమ్ రంజన్ బౌలింగ్లో వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ మ్యాచ్ తర్వాత తిలక్ మంగళవారం(ఫిబ్రవరి 3)న జట్టుతో కలవనున్నాడు. తిలక్ దాదాపు నెల రోజుల నుంచి పోటీ క్రికెట్కు దూరంగా ఉన్నాడు. అయినప్పటికి గాయం నుంచి కోలుకుని తిరిగొచ్చిన తొలి మ్యాచ్లోనే ఈ తరహా ప్రదర్శన చేయడం గమనార్హం.భారత్ భారీ స్కోర్కాగా జగదీశన్ నారయణ్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. కేవలం 55 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్లతో 104 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ ఆయూష్ బదోని(60) అజేయ హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-ఎ జట్టు మూడు వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అమెరికా బౌలర్లలో అలీ ఖాన్, శుభమ్, జస్దీప్ సింగ్ తలా వికెట్ పడగొట్టారు. -
‘క్షమించండి.. నా మాజీ భర్త గురించే అలా మాట్లాడాను’
భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ క్షమాపణలు చెప్పారు. ఎవరినీ కించపరిచే ఉద్దేశం తనకి లేదని స్పష్టం చేశారు. దయచేసి తన పరిస్థితిని అర్థం చేసుకోవాలని.. పురుషులందరినీ తక్కువ చేసేలా తాను మాట్లాడానంటూ వదంతులు ప్రచారం చేయవద్దని కోరారు. అసలేం జరిగిందంటే...విడాకులు.. వివాదాలుగత కొన్ని రోజులుగా మేరీ కోమ్ (Mary Kom) వ్యక్తిగత జీవితం గురించి నెట్టింట చర్చ నడుస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న మేరీ కోమ్- కరుంగ్ ఓన్కోలర్ కోమ్ అనూహ్య రీతిలో విడిపోవడం.. అనంతరం పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకోవడం ఇందుకు కారణం.గల్లీల్లో చాలా మంది ఉన్నారువిడాకుల గురించి అధికారిక ప్రకటన చేసిన తర్వాత చాన్నాళ్లు మౌనంగా ఉన్న మేరీ కోమ్.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాజీ భర్తను ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తన కోసం కెరీర్ త్యాగం చేశానని కరుంగ్ అంటున్నాడని.. దేశంలో గల్లీల్లో చాలా మంది ఫుట్బాల్ ఆడుతుంటారని ఎద్దేవా చేశారు.సంపాదన లేని భర్తఅంతేకాదు.. కరుంగ్ చిల్లగవ్వ కూడా సంపాదించలేదని.. తనపై ఆధారపడి బతికాడని మేరీ కోమ్ తన మాజీ భర్తను నిందించారు. ఈ నేపథ్యంలో కరుంగ్ సైతం ఘాటుగా స్పందించాడు. తన భార్య బాక్సింగ్ ప్రయాణం సజావుగా సాగేందుకు తాను ఎన్నో త్యాగాలు చేశానని.. ప్రొఫెషనల్ ఫుట్బాలర్గా కెరీర్ను వదిలేశానని చెప్పాడు.సంచనల ఆరోపణలునలుగురు పిల్లల ఆలనాపాలనా కూడా తానే చూసుకొన్నానని.. ఇంటి బాధ్యతలన్నీ తానొక్కడినే నెరవేర్చానని కరుంగ్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. గతంలో ఓ జూనియర్ బాక్సర్తో వివాహేతర సంబంధం కొనసాగించిన మేరీ కోమ్.. ఆ తర్వాత తమ అకాడమీలో ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తితో సంబంధం పెట్టుకుందని ఆరోపించాడు. వారిద్దరి వాట్సాప్ చాట్లు కూడా తన దగ్గర ఉన్నాయని తెలిపాడుఅయితే, మేరీ కోమ్ ఫుట్బాల్ ప్లేయర్లు, భార్య కెరీర్లో ఎదిగేందుకు వీలుగా ఇంటి పట్టున ఉండి కుటుంబాన్ని చక్కదిద్దే భర్తలను తక్కువ చేసి మాట్లాడిందంటూ భారీ ఎత్తున ట్రోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో మేరీ కోమ్ తన వ్యాఖ్యలపై స్పష్టతనిస్తూ తాజాగా ఓ వీడియో విడుదల చేశారు.హుందాగానే ప్రవర్తించాను‘‘నా పెళ్లి పూర్తిగా చేదు అనుభవాన్ని మిగిల్చిందని నేను చెప్పను. చాలా ఏళ్ల పాటు అంతా సజావుగా సాగిపోయింది. అయితే, ఒక్కసారి నమ్మకం కోల్పోయిన తర్వాత అంతా మారిపోయింది 2025 ఏప్రిల్లో నా విడాకుల గురించి ప్రకటించినపుడు కూడా నాకై నేను నేరుగా మీడియాతో మాట్లాడలేదుఎల్లప్పుడూ నేను హుందాగానే ప్రవర్తించాను. నా మాటలు సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం అయ్యాయి. ఇది దురదృష్టకరం. యూత్ ఫుట్బాల్కు నేను ఎంతమాత్రం వ్యతిరేకం కాదు. ఫుట్బాల్ సంస్కృతిని నేను కించపరచలేదు.నేనొక బాక్సర్ని. అయినప్పటికీ నాకు ఫుట్బాల్ ఆడటం అంటే ఎంతో ఇష్టం. నా వ్యాఖ్యలతో క్రీడలను, క్రీడాకారులను కించపరచాలని అనుకోలేదు. ప్రతి ఒక్కరి ప్రయాణం గల్లీ నుంచే మొదలవుతుంది. కఠిన శ్రమ, అంకితభావంతో పనిచేస్తే సునిల్ ఛెత్రి, భాయ్చుంగ్ భుటియా లాంటి వాళ్లు పుట్టుకొస్తారు.పురుష సమాజానికి క్షమాపణలునా కోసం తన కెరీర్ త్యాగం చేశానని నా మాజీ భర్త అన్నాడు. అతడు షిల్లాంగ్లో ఫుట్బాల్ ఆడేవాడు. ఆ తర్వాత ఆటను వదిలేసి ఢిల్లీకి వచ్చిన తర్వాతే నన్ను కలిశాడు అదే విధంగా.. నా భర్తకు సంపాదన లేదని నేను అన్న మాటలను.. పురుష సమాజాన్ని కించపరచాలని మాట్లాడినట్లు అన్వయించుకుంటున్నారు.నా ఈ మాటలతో ఎవరైనా బాధపడి ఉంటే క్షమించమని చేతులు జోడించి అర్థిస్తున్నా. ఇది కేవలం మా మధ్య జరిగిన విషయానికి సంబంధించినది మాత్రమే. చాలా ఏళ్ల పాటు అనుభవించిన బాధ, డిప్రెషన్.. ద్రోహం కారణంగా నాలో పెల్లుబుకిన అసహనం అది. అంతేకానీ మగవాళ్లను తక్కువ చేసి మాట్లాడే ఉద్దేశం నాకు లేదు’’ అని మేరీ కోమ్ స్పష్టతనిచ్చారు.చదవండి: చక్కటి సంసారం.. ‘వివాహేతర సంబంధం’ చిచ్చు.. ఆఖరికి! View this post on Instagram A post shared by Dr Mangte Mary Kom (@mcmary.kom) -
భారత తుది జట్టు ఇదే.. స్టార్ ప్లేయర్కు నో ఛాన్స్?
టీ20 ప్రపంచకప్-2026కు కౌంట్ డౌన్ మొదలైంది. ఫిబ్రవరి 7 నుంచి శ్రీలంక, భారత్ వేదికలగా ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఈ పొట్టి ప్రపంచకప్లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది. ఈసారి కూడా ఎలాగైనా గెలిచి టైటిల్ను రిటైన్ చేసుకోవాలని మెన్ ఇన్ బ్లూ పట్టుదలతో ఉంది.ఈ టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్లో ఫిబ్రవరి 7న వాంఖడే స్టేడియం వేదికగా యూఎస్ఎతో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టును టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్ధివ్ పటేల్ అంచనా వేశాడు. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్కు అతడు అవకాశమిచ్చాడు. సంజూ శాంసన్ పేలవ ఫామ్ కనబరుస్తుండడంతో వికెట్ కీపర్ బ్యాటర్గా ఇషాన్ వైపే పార్ధివ్ మొగ్గు చూపాడు. కివీస్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో శాంసన్ కేవలం 46 పరుగులు మాత్రమే చేశాడు. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు మూడో స్దానంలో, గాయం నుంచి కోలుకున్న తిలక్ వర్మకు నాలుగో స్ధానంలో పటేల్ ఛాన్స్ ఇచ్చాడు. పార్ధివ్ ఎంపిక చేసిన జట్టులో ఆల్రౌండర్లగా శివం దూబే,హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చోటు దక్కించుకున్నాడు. ఫినిషర్గా రింకూ సింగ్ ఉన్నాడు. ఇక ఫాస్ట్ బౌలర్ల కోటాలో బుమ్రా, అర్ష్దీప్ సింగ్ను పార్ధివ్ ఎంపిక చేశాడు. యువ పేసర్ హర్షిత్ రాణాకు మాత్రం అతడు ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కలేదు. ఈ జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తికి అవకాశం లభించింది.పార్ధివ్ పటేల్ ఎంపిక చేసిన ఇండియన్ ప్లేయింగ్ ఎలెవన్అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శివమ్ దూబే ,హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి -
పాక్ ఓవరాక్షన్.. ఐసీసీ కీలక సమావేశం!
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీసుకున్న నిర్ణయం పట్ల అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్కప్ టోర్నీ ఆరంభానికి సమయం సమీపించిన తరుణంలో భారత్తో మ్యాచ్ బహిష్కరిస్తున్నామంటూ పాక్ ప్రభుత్వం చేసిన ప్రకటన ఐసీసీకి ఆగ్రహం తెప్పించింది.అత్యవసర సమావేశంఈ నేపథ్యంలో పాక్ వైఖరి పట్ల కఠిన నిర్ణయం తీసుకునేందుకు ఐసీసీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం అత్యవసరంగా బోర్డు సమావేశం ఏర్పాట్లు చేసినట్లు టైమ్స్నౌ వెల్లడించింది. పీసీబీ గనుక పట్టువీడకపోతే తగిన విధంగా బుద్ధి చెప్పాలనే యోచనలో ఐసీసీ ఉన్నట్లు సమాచారం.కాగా భారత్- శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7న మొదలయ్యే పురుషుల టీ20 ప్రపంచకప్పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తమ నిర్ణయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా బంగ్లాదేశ్కు బాసటగా నిలిచేందుకు ఈ మెగా ఈవెంట్నే బహిష్కరిస్తామని బీరాలు పలికిన పాక్ ఇప్పుడు ప్రపంచకప్ ఆడేందుకు సిద్ధమైంది.భారత్తో మాత్రం ఆడబోముఅయితే భారత్తో మాత్రం మ్యాచ్ ఆడబోమని ప్రకటించింది. నిజానికి జట్లు ఎంపిక, ప్రకటనకు ఐసీసీ ఇచ్చిన తుదిగడువుకు ముందే పీసీబీ తమ జట్టును ప్రకటించింది. కానీ.. తమ ప్రభుత్వం ఆమోదం తెలిపితేనే ప్రపంచకప్ ఆడతామని జట్టును ఎంపిక చేసిన సందర్భంలో తెలిపింది. ప్రపంచకప్లో ఆడేందుకు అనుమతి ఇచ్చిన పాకిస్తాన్ ప్రభుత్వం భారత్తో జరిగే మ్యాచ్ను మాత్రం బహిష్కరించాలని నిర్ణయం తీసుకుంది. దాంతో వరల్డ్కప్ ఆడతామని ఆదివారం స్పష్టం చేసిన పీసీబీ ఈ నెల 15న కొలంబో (శ్రీలంక) వేదికగా భారత్తో జరిగే మ్యాచ్లో బరిలోకి దిగబోమని తెలిపింది.పెద్ద ఎత్తున నష్టాలుఈ నేపథ్యంలో పీసీబీపై ఐసీసీ తీసుకోబోయే చర్యలు ఎలా ఉండబోతున్నాయంటూ క్రికెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కాగా దాయాదుల ‘ప్రపంచ’ సమరం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే, పాక్ ప్రకటన వారికి షాకిచ్చింది. భారత్తో ఆడబోమంటూ పాక్ చేసిన ప్రకటన.. ఫ్యాన్స్పైనే కాదు దీని తక్షణ ప్రభావం గ్లోబల్ బ్రాడ్కాస్టర్లపై కూడా పడుతుంది. అసలే 20 జట్లు ఆడుతున్న ఈ మెగా టోర్నీలో ఇక ఒక్క మ్యాచ్కు కూడా కిక్కిరిసే మైదానం కనబడక... టికెట్ రెవెన్యూ యాడ్ రెవెన్యూ, ఓ ప్రపంచకప్కు వీక్షకుల సంఖ్య, ఇలా అన్నింటిపైనా ప్రభావం ఉంటుంది. ఇదే జరిగితే ఐసీసీకి పెద్ద ఎత్తున నష్టాలు వస్తాయి. ఫలితంగా పాక్ బోర్డు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు చవిచూడక తప్పదు. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ సైతం భద్రతా కారణాలు అంటూ.. భారత్లో మ్యాచ్ ఆడలేమని పట్టుబట్టగా ఆ జట్టును టోర్నీ నుంచి తప్పించింది ఐసీసీ. ఇపుడు పాక్కు కూడా ఇలాంటి భారీ షాక్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.చదవండి: విచారకరం: షాహిద్ ఆఫ్రిది పోస్ట్ వైరల్ -
వారికి ఒక న్యాయం.. మాకొక న్యాయమా: పీసీబీ మాజీ చైర్మెన్
టీ20 ప్రపంచకప్-2026 ప్రారంభానికి ముందే పలు వివాదాలతో హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే బంగ్లాదేశ్ ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకోగా.. తాజాగా భారత్తో మ్యాచ్ను బాయ్కట్ చేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా పాకిస్తాన్-భారత్ మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ ఇప్పుడు పాక్ సర్కార్ నిర్ణయంతో ఈ హైవోల్టోజ్ మ్యాచ్ జరిగే సూచనలు కన్పించడం లేదు. అయితే పాకిస్తాన్ నిర్ణయంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆంసతృప్తి వ్యక్తం చేసింది. పాక్ ప్రభుత్వ నిర్ణయం ప్రపంచ క్రీడా నియమాలకు విరుద్ధమని తెలిపింది. దీనిపై పీసీబీ నుంచి ఇప్పటివరకు తమకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని ఐసీసీ పేర్కొంది. తాజాగా ఇదే విషయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మెన్ ఎహసాన్ మణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్తో మ్యాచ్ను బహిష్కరించినందుకు పాకిస్తాన్పై చర్యలు తీసుకునే హక్కు ఐసీసీకి లేదని అతడు అన్నాడు."ఏ దేశ క్రికెట్ బోర్డు అయినా తమ ప్రభుత్వ ఆదేశాలకు లోబడి ఉండాలి. ప్రభుత్వ సూచనలను పాటిస్తే సదరు క్రికెట్ బోర్డుపై ఎటువంటి చర్యలు తీసుకోలేము. ఇప్పుడు పీసీబీ విషయంలో అదే జరిగింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు భారత్తో మ్యాచ్ను బాయ్కాట్ చేసింది.గతంలో భారత్ కూడా ఇలానే వ్యవహరించింది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గోనేందుకు పాకిస్తాన్కు వచ్చేందుకు నిరాకరించింది. భారత ప్రభుత్వం అనుమతించలేదనే కారణాన్ని ఐసీసీ అంగీకరించింది. అప్పుడు బీసీసీఐపై ఎలాంటి చర్యలు తీసుకోనప్పుడు.. ఇప్పుడు పాకిస్తాప్పై ఆంక్షలు విధిస్తే అది కచ్చితంగా ఐసీసీ ద్వంద్వ ప్రమాణాలు పాటించినట్లే అవుతోంది. మొహ్సిన్ నఖ్వీ కేవలం పాక్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడే కాదు, పాక్ ప్రభుత్వంలో కీలక మంత్రి కూడా. ఆయన మొదటి నుంచే ఐసీసీ నిర్ణయాలపై ఆసంతృప్తిగా ఉన్నారు. ఈ విషయాన్ని ఐసీసీ ముందుగానే పసిగట్టడంలో విఫలమైంది. ఐసీసీ కేవలం ప్రేక్షక పాత్ర పోషించిందని" స్పోర్ట్ స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మణి పేర్కొన్నారు.ఎహసాన్ మణి గతంలో ఐసీసీ చైర్మెన్గా కూడా పనిచేశారు. కాగా 'పరస్పర అంగీకారం'తో సమస్యను పరిష్కరించుకోవాలని పాకిస్తాన్ను ఐసీసీ కోరింది. ఒకవేళ వేళ పాక్ తమ మొండిపట్టు వీడకపోతే, ఐసీసీకి భారీ ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఐసీసీ ఆదాయంలో మెజారిటీ వాటా భారత్-పాక్ మ్యాచ్ల నుంచే వస్తుంది. ఇదే విషయంపై ఐసీసీ మరో రెండు రోజుల్లో బోర్డు సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.చదవండి: విచారకరం: షాహిద్ ఆఫ్రిది పోస్ట్ వైరల్ -
విచారకరం: షాహిద్ ఆఫ్రిది పోస్ట్ వైరల్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తూ పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ విషయంలో పాక్ అనవసరంగా రాద్దాంతం చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ దిగ్గజ ఆల్రౌండర్ షాహిద్ ఆఫ్రిది స్పందించిన తీరు వైరల్గా మారింది.పహల్గామ్ ఉగ్రదాడి తర్వాతగతంలో శ్రీలంకపై జట్టు పాక్లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఇలాంటి దశలో తమకు భద్రత ఉండదంటూ.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడేందుకు పాక్ వెళ్లేందుకు టీమిండియా నిరాకరించింది. దీంతో ఐసీసీ తటస్థ వేదికైన దుబాయ్లో మ్యాచ్లు ఆడించింది. ఇక పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.ఓ పాడైన కోడిగుడ్డు ..ఈ క్రమంలో వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్లో పాక్తో మ్యాచ్ను భారత వెటరన్ జట్టు బహిష్కరించింది. సెమీస్లో కూడా పాకిస్తాన్తో మ్యాచ్కు నిరాకరించి టోర్నీ నుంచే తప్పుకొంది. ఆ సమయంలో షాహిద్ ఆఫ్రిది భారత ఆటగాళ్లను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు.ముఖ్యంగా శిఖర్ ధావన్ను ఉద్దేశించి.. ‘‘ఓ పాడైన కోడిగుడ్డు మిగతా వాటినీ చెడగొడుతుంది’’ అంటూ ఆఫ్రిది ధావన్ను నిందించాడు. అంతేకాదు.. క్రీడల్లో రాజకీయాలు ఏమిటి? అంటూ మరోసారి భారత్పై అక్కసు వెళ్లగక్కాడు. అయితే, తాజాగా పాకిస్తాన్ ప్రభుత్వం భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు చేసిన ప్రకటన నేపథ్యంలో ఆఫ్రిది చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.విచాకరమే.. కానీ‘‘రాజకీయాలు దౌత్య సంబంధాలకు ముగింపు పలికినపుడు క్రికెట్.. అందుకు అనుకూలమైన ద్వారాలను తెరుస్తుందని నేను ఎల్లప్పుడూ విశ్వసిస్తాను. టీ20 ప్రపంచకప్ టోర్నీలో పాకిస్తాన్ ఇండియాతో మ్యాచ్ ఆడకపోవడం విచారకరం.అయితే, మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. ఇలాంటి సమయంలోనే ఐసీసీ తానేంటో నిరూపించుకోవాలి. ప్రతి సభ్య దేశం పట్ల పారదర్శకంగా వ్యవహరించాలి. అందరికీ న్యాయం దక్కేలా చూడాలి’’ అంటూ షాహిద్ ఆఫ్రిది పేర్కొన్నాడు. మ్యాచ్ ఆడకపోవడం విచారకరం అంటూనే.. ప్రభుత్వం నిర్ణయం సరైందేనన్నట్లుగా ఆఫ్రిది మాట్లాడటం ట్రోల్స్కు దారితీసింది.వారెవ్వా.. డబల్ యాక్షన్‘‘ఎల్లప్పుడూ భారత ఆర్మీ, టీమిండియాపై అవాకులు, చెవాకులు పేలుతావు కదా!.. షేక్హ్యాండ్ విషయంలోనూ మీరంతా రాద్దాంతం చేశారు. మరి ఇప్పుడు తటస్థ వేదికపైన మ్యాచ్లు నిర్వహిస్తున్నా తప్పుకొంటామని బెదిరించి నవ్వులపాలై.. ఇప్పుడేమో ఇండియా మ్యాచ్ ఒక్కటి భద్రత లేదంటూ బహిష్కరిస్తామనడం ఏమిటి?పీసీబీ మీ ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకోవడాన్ని సమర్థించే నువ్వు.. బీసీసీఐని ఎలా నిందించావు? భారత ప్రభుత్వం చెప్పినట్లుగానే బీసీసీఐ కూడా నడుచుకుంటుంది’’ అంటూ షాహిద్ ఆఫ్రిదికి నెటిజన్లు కౌంటర్లు ఇస్తున్నారు.చదవండి: పాక్ సెమీస్, ఫైనల్స్ను కూడా రద్దు చేసుకుంటుందా..? -
జైస్వాల్ రీఎంట్రీ
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ దేశవాలీ క్రికెట్లో ముంబై తరఫున రీఎంట్రీ ఇచ్చాడు. ఫిబ్రవరి 6 నుంచి కర్ణాటకతో జరిగే రంజీ ట్రోఫీ 2025-26 క్వార్టర్ ఫైనల్ కోసం ఎంపిక చేసిన 16 మంది సభ్యుల జట్టులో అతనికి చోటు లభించింది. జైస్వాల్ ఈ సీజన్లో ఒక్క రంజీ మ్యాచ్ కూడా ఆడలేదు. అంతర్జాతీయ బాధ్యతలు లేకపోయినా జైస్వాల్ ముంబై జట్టులో లేకపోవడం కొద్ది రోజుల కిందటి వరకు చర్చనీయాంశంగా ఉండింది. ఎట్టకేలకు అతనికి ముంబై జట్టులో చోటు దక్కడంతో ఊహాగానాలకు తెరపడింది. తాజాగా ప్రకటించిన జట్టులో జైస్వాల్తో పాటు శార్దూల్ ఠాకూర్కు కూడా చోటు దక్కింది. శార్దూల్ గాయాల కారణంగా గత కొన్ని మ్యాచ్లకు దూరమయ్యాడు. శార్దూల్ ముంబై జట్టుకు రెగ్యులర్ కెప్టెన్గానూ ఉన్నాడు. రహానే వైదొలగడంతో శార్దూల్కు కెప్టెన్సీ లభించింది. జైస్వాల్, శార్దూల్ చేరికతో ముంబై జట్టు పటిష్టంగా కనిపిస్తుంది. కర్ణాటకతో జరిగే క్వార్టర్ ఫైనల్ కోసం ముంబై జట్టు.. - శార్దూల్ ఠాకూర్ (కెప్టెన్) - యశస్వి జైస్వాల్- ముషీర్ ఖాన్ - అఖిల్ హెర్వడ్కర్ - సిద్ధేశ్ లాడ్ - సర్ఫరాజ్ ఖాన్ - ఆకాష్ ఆనంద్ (wk) - హార్దిక్ తమోరే (wk) - సైరాజ్ పటిల్ - శంస్ ములానీ - తనుష్ కోటియన్ - తుషార్ దేశ్పాండే - మోహిత్ అవస్థ - ఓంకార్ తర్మలే - దివ్యేష్ సక్సేనా - సూర్యాంశ్ షెడ్గే -
ఆస్ట్రేలియాకు మరో భారీ షాక్..
టీ20 ప్రపంచకప్-2026కు ముందు ఆస్ట్రేలియాకు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే స్టార్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్ గాయం కారణంగా ఈ టోర్నీ మొత్తానికి దూరం కాగా.. తాజాగా ఈ జాబితాలో మరో కీలక బౌలర్ జోష్ హాజిల్వుడ్ చేరాడు. హాజిల్వుడ్ ప్రస్తుతం కాలి మడమ గాయంతో బాధపడుతున్నాడు. ఈ గాయం కారణంగానే అతడు కీలక యాషెస్ సిరీస్కు కూడా దూరమయ్యాడు. అతడు పూర్తిగా కోలుకోవడానికి మరో రెండు వారాల సమయం పట్టనున్నట్లు తెలస్తోంది.ఈ క్రమంలోనే పొట్టి ప్రపంచకప్ టోర్నీ ఆరంభ మ్యాచ్లకు హాజిల్వుడ్ దూరం కానున్నట్లు ఆసీస్ క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ఈ ఆసీస్ స్పీడ్ స్టార్ జట్టుతో పాటు కొలంబోకు వెళ్లకుండా సిడ్నీలోనే ఉండనున్నాడు. పూర్తి ఫిట్నెస్ సాధించిన తర్వాత జట్టుతో కలిసే అవకాశముంది.ఒకవేళ హాజిల్వుడ్ దూరమైతే కంగారులకు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ఆస్ట్రేలియా ప్రధాన పేసర్లు ఎవరూ లేకుండానే బరిలోకి దిగాల్సి వస్తుంది. హాజిల్వుడ్ ఇంకా ఫిట్నెస్ సాధించకపోవడంతో సెలెక్టర్లు షాన్ అబాట్ను ట్రావెలింగ్ రిజర్వ్గా జట్టులోకి తీసుకున్నారు.అయితే బిగ్బాష్ లీగ్లో గాయపడ్డ విధ్వంసకర బ్యాటర్ టిమ్ డేవిడ్ మాత్రం పూర్తి ఫిట్నెస్ సాధించాడు. అతడు కొలంబోలో జట్టుతో కలవనున్నాడు. ఈ మెగా ఈవెంట్ సన్నాహాల్లో భాగంగా ఆసీస్ జట్టు పాక్ పర్యటనకు వెళ్లింది. అయితే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఆసీస్ క్లీన్స్వీప్కు గురైంది. ఆస్ట్రేలియా ఫిబ్రవరి 11న ఐర్లాండ్తో తమ తొలి వరల్డ్కప్ మ్యాచ్ ఆడనుంది.ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ జట్టు (అప్డేటడ్): మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, జేవియర్ బార్ట్లెట్, జోష్ హేజిల్వుడ్, కూపర్ కాన్లీ, జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ కుహ్నెమన్, బెన్ ద్వార్షుయిస్, గ్లెన్ మాక్స్వెల్, కామెరూన్ గ్రీన్, మాథ్యూ రెన్షా, నాథన్ ఎల్లిస్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా. (రిజర్వ్: షాన్ అబాట్).చదవండి: ఇదేం ప్రశ్న?.. పాక్ రిపోర్టర్కు ఇచ్చి పడేసిన ఆసీస్ కెప్టెన్ -
పాక్ ఆటగాడిపై ఆగ్రహంతో ఊగిపోయిన వైభవ్ సూర్యవంశీ
అండర్-19 ప్రపంచకప్లో నిన్న జరిగిన కీలకమైన సూపర్ సిక్స్ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్పై 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సెమీస్లోని ప్రవేశించింది. ఈ దెబ్బతో పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించి, ఇంటిబాట పట్టింది. ఫిబ్రవరి 4న జరిగే రెండో సెమీస్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. 3న జరిగే తొలి సెమీస్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకుంటాయి.ఇదిలా ఉంటే, నిన్నటి భారత్-పాక్ మ్యాచ్కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతుంది. ఇందులో భారత చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ పాక్ ఆటగాడు అలీ బలోచ్పై ఊగిపోతూ కనిపించాడు. Vihaan sprinting like Usain boult to save a Pakistani player from Vaibhav Suryavanshi. 😭https://t.co/2thurxK3QC— Gangadhar (@90_andypycroft) February 1, 2026పాక్ ఇన్నింగ్స్ 37వ ఓవర్లో విహాన్ మల్హోత్రా బలోచ్ను ఔట్ చేసిన తర్వాత సూర్యవంశీ అతనిపైకి దూసుకెళ్లాడు. విహాన్ వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చాడు. ఆ సమయంలో వైభవ్ ఉగ్రం చూస్తే పాక్ ప్లేయర్ బుర్ర బద్దలు కొట్టేలా అనిపించింది. దీనికి సంబంధించిన వీడియోనే ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది.మరోసారిపహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి జరిగిన ప్రతి క్రికెట్ మ్యాచ్లో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. తాజా మ్యాచ్లోనూ అదే పరిస్థితి కొనసాగింది. ఇరు జట్ల ఆటగాళ్లు మ్యాచ్ అయిపోగానే ఎవరి దారిన వాళ్లు పెవిలియన్ వైపు వెళ్లారు.నిన్నటి మ్యాచ్ పూర్తి వివరాల్లోకి వెళితే... తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. వేదాంత్ త్రివేది (68) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో భారత్కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఆఖర్లో కనిష్క్ చౌహాన్ (35), ఖిలన్ పటేల్ (21) కీలక ఇన్నింగ్స్లు ఆడారు.భారత బ్యాటర్లలో ఆరోన్ జార్జ్ (16), కెప్టెన్ ఆయుశ్ మాత్రే (0), అభిగ్యాన్ కుందు (16), దీపేశ్ దేవేంద్రన్ (1) విఫలం కాగా.. వైభవ్ సూర్యవంశీ (30), విహాన్ మల్హోత్రా (21), అంబ్రిష్ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.పాక్ బౌలర్లలో అబ్దుల్ సుభాన్ 3, మొహమ్మద్ సయ్యద్ 2, అలీ రజా, అహ్మద్ హుసేన్, మొమిన్ ఖమార్, అలీ హస్సన్ బలోచ్ తలో వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో పాక్ తొలుత విజయం దిశగా సాగింది. అయితే మధ్యలో భారత స్పిన్నర్లు ఖిలన్ పటేల్ (9.2-1-35-3), ఆయుశ్ మాత్రే (8-0-21-3), కనిష్క్ చౌహాన్ (10-1-30-1), విహాన్ మల్హాత్రా (4-0-15-1) చెలరేగడంతో పాక్కు ఓటమి తప్పలేదు. పేసర్లు అంబ్రిష్ (5-0-26-1), హెనిల్ పటేల్ (5-0-30-1) కూడా రాణించడంతో పాక్ 46.2 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది.పాక్ ఇన్నింగ్స్లో ఉస్మాన్ ఖాన్ (66) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. హమ్జా జహూర్ (42), కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్ (38) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. -
ఇదేం ప్రశ్న?.. పాక్ రిపోర్టర్కు ఇచ్చి పడేసిన మార్ష్
పాకిస్తాన్ జర్నలిస్టుకు ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చాడు. తనను వివాదంలోకి లాగాలని చూసిన సదరు విలేఖరికి సున్నితంగానే చివాట్లు పెట్టాడు. అదే సమయంలో.. తమ క్రికెట్ బోర్డు పట్ల తనకు అపారమైన నమ్మకం ఉందని.. కాబట్టి తాము భద్రత విషయంలో ఎలాంటి ఆందోళన చెందబోమని గట్టిగానే ఇచ్చి పడేశాడు.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య భారత్- శ్రీలంక వేదికలుగా జరుగనున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ తమ మ్యాచ్లన్నీ తటస్థ వేదికైన శ్రీలంకలో ఆడాల్సి ఉండగా.. భద్రతా కారణాలు అంటూ భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాక్ ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. ఈ అంశంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.శ్రీలంకతో భారత్తో మ్యాచ్కు ఉన్న సోకాల్డ్ ముప్పు.. మిగతా జట్లతో ఆడినప్పుడు ఉండదా? అని నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇదిలా ఉంటే.. విదేశీ ఆటగాళ్లను వివాదంలోకి లాగాలని చూడటం పాక్లో ఇటీవలి కాలంలో ఎక్కువైంది. ఇందులో భాగంగానే ఓ జర్నలిస్టు.. ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ను.. భారత్తో పాక్ మ్యాచ్ బహిష్కరిస్తోందని.. ఈ విషయంపై అభిప్రాయం చెప్పాలని కోరారు.పాక్ రిపోర్టర్కు ఇచ్చి పడేసిన మార్ష్ఈ మేరకు.. ‘‘ఫిబ్రవరి 15న జరగాల్సిన ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ గురించి ఇప్పుడే తెలిసింది. పాకిస్తాన్ ఈ మ్యాచ్ను బాయ్కాట్ చేయబోతోంది. ఈ విషయంపై మీ స్పందన’’ అని సదరు రిపోర్టర్ అడిగారు.ఇందుకు బదులుగా.. ‘‘ఈ అంశం గురించి నేను ఇప్పుడు మాట్లాడాలని అనుకోవడం లేదు. అసలు ఆ అవసరమే లేదు. మా జట్టు గురించి మాత్రమే మాకు పట్టింపు ఉంటుంది. వరల్డ్కప్లో మా ప్రదర్శన ఎలా ఉండాలన్న దానిపై మాత్రమే మా దృష్టి ఉంది’’ అని మార్ష్ పేర్కొన్నాడు.మేము సేఫ్.. మాకు నమ్మకం ఉందిఅయినప్పటికీ వెనక్కి తగ్గని సదరు రిపోర్టర్.. ‘‘ఐసీసీ ఫుల్ మెంబర్ బంగ్లాదేశ్ కూడా ఈసారి భద్రతా కారణాల వల్ల ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనడం లేదు. ఓ ఆటగాడిగా ఫుల్ మెంబర్ జట్టు ఇలా తప్పుకోవడాన్ని ఎలా చూస్తారు?’’ అని ప్రశ్నించారు.ఇందుకు మార్ష్ స్పందిస్తూ.. ‘‘గత ప్రశ్నకు ఇచ్చిన సమాధానమే దీనికీ వర్తిస్తుంది. వరల్డ్కప్ గెలవాలన్న లక్ష్యంతో మాత్రమే మేము వరల్డ్కప్ టోర్నీలో అడుగుపెడుతున్నాం. మా దృష్టి మొత్తం దాని మీదే కేంద్రీకృతమైంది. మమ్మల్ని భద్రంగా ఉంచుతారని మా బోర్డు పట్ల మాకు అపారమైన నమ్మకం ఉంది. ఈ ఒక్కటే నేను మీకు చెప్పగలను’’ అంటూ పరోక్షంగా పాక్ క్రికెట్ బోర్డుకు కూడా చురక వేశాడు.ఆసీస్కు ఘోర పరాభవంకాగా టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందు ఆసీస్ జట్టు పాక్లో పర్యటించింది. అయితే, స్టార్ ఆటగాళుల లేకుండా ప్రయోగాలు చేసిన ఆసీస్.. సొంతగడ్డపై పాక్ను ఓడించలేకపోయింది. ఈ మూడు మ్యాచ్ల సిరీస్ను పాకిస్తాన్ 3-0తో క్వీన్స్వీప్ చేసింది. లాహోర్లోఓ ఆదివారం చివరి మ్యాచ్లో 111 పరుగుల తేడాతో ఆసీస్ను ఓడించింది. కాగా టీ20ల్లో పరుగుల తేడా పరంగా ఆస్ట్రేలియాకు ఇదే అతిపెద్ద పరాజయం. చదవండి: T20 WC: మ్యాచ్ రద్దు చేసుకున్న పాక్.. స్పందించిన బీసీసీఐ! -
ప్రపంచకప్ మ్యాచ్లకు భారత జట్టు ప్రకటన
టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్ల కోసం భారత-ఏ జట్టును ఇవాళ (ఫిబ్రవరి 2) ప్రకటించారు. ఈ జట్టు ఫిబ్రవరి 2న యూఎస్ఏతో (నవీ ముంబై), 6న నమీబియాతో (బెంగళూరు) మ్యాచ్లు ఆడనుంది. ఈ మ్యాచ్ల కోసం 15 మంది సభ్యుల జట్టును ప్రకటించారు. ఈ జట్టులో టీమిండియా స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ తిలక్ వర్మ ప్రత్యేక ఆకర్శనగా ఉన్నాడు. తిలక్ కడుపులో సమస్యతో న్యూజిలాండ్ సిరీస్కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. తిలక్ రీఎంట్రీ ఎలా ఉంబోతుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వార్మప్ మ్యాచ్లతో తిలక్ ఫామ్లోకి రావాలని వారు కోరుకుంటున్నారు.ఈ జట్టుకు కెప్టెన్గా ఢిల్లీ ఆటగాడు ఆయుశ్ బదోని ఎంపిక కాగా.. ప్రియాంశ్ ఆర్య, అషుతోష్ శర్మ లాంటి ఐపీఎల్ స్టార్లు చోటు దక్కించుకున్నారు. టీమిండియా ఆటగాళ్లు రవి బిష్ణోయి, రియాన్ పరాగ్ కూడా ఈ జట్టుకు ఎంపికయ్యారు. మయాంక్ యాదవ్, నమన్ ధీర్, ఎన్ జగదీశన్, ఉర్విల్ పటేల్ వంటి దేశీయ స్టార్లు ఈ జట్టులో ఉన్నారు. వరల్డ్కప్ మ్యాచ్ల కోసం భారత-ఏ జట్టు.. అయుష్ బదోని (c), తిలక్ వర్మ, నమన్ ధీర్, అశుతోష్ శర్మ, ప్రియాంశ్ ఆర్యా, ఎన్ జగదీశన్ (wk), రియాన్ పరాగ్, మనవ్ సుతార్, అశోక్ శర్మ, ఉర్విల్ పటేల్ (wk), గుర్జప్నీత్ సింగ్, విప్రాజ్ నిగమ్, రవి బిష్ణోయి, ఖలీల్ అహ్మద్, మయాంక్ యాదవ్. ఇదిలా ఉంటే, వార్మప్ మ్యాచ్ల్లో భాగంగా టీమిండియా కూడా ఓ మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 4న భారత జట్టు సౌతాఫ్రికాతో తలపడుతుంది. ఫిబ్రవరి 7 నుంచి ప్రపంచకప్ రెగ్యులర్ మ్యాచ్లు మొదలవుతాయి. టోర్నీ ఓపెనర్లో పాక్, నెదర్లాండ్స్ కొలొంబో వేదికగా తలపడనున్నాయి. అదే రోజు భారత్ కూడా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ముంబైలోని వాంఖడేలో టీమిండియా యూఎస్ఏతో తలపడుతుంది. -
పాక్ సెమీస్, ఫైనల్స్ను కూడా రద్దు చేసుకుంటుందా..?
టీ20 ప్రపంచకప్-2026లో పాకిస్తాన్ భారత్తో ఆడాల్సిన గ్రూప్ స్టేజీ మ్యాచ్ను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఒకవేళ పాక్ సెమీస్లో కాని, ఫైనల్స్లో కాని భారత్తో తలపడాల్సి వస్తే పరిస్థితి ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇదే విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ వద్ద ప్రస్తావించగా పూర్తి స్పష్టతనిచ్చాడు. సెమీఫైనల్ లేదా ఫైనల్లో భారత్తో తలపడాల్సి వస్తే పాకిస్తాన్ తప్పక బరిలోకి దిగుతుందని తేల్చి చెప్పాడు. నాకౌట్ మ్యాచ్ల్లో ఆడేందుకు తమకెలాంటి అభ్యంతరాలు లేవని అన్నాడు. జట్టు శక్తిపై నమ్మకాన్ని వ్యక్తపరుస్తూ.. భారత్ను గెలిచి చూపిస్తామని బీరాలు పలికాడు. ప్రపంచకప్ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు.నఖ్వీ నేతృత్వంలోని పీసీబీ అవళంబిస్తున్న ఈ భిన్న వైఖరిపై ఐసీసీతో పాటు క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ దశలో వచ్చే భద్రతా సమస్యలు నాకౌట్ మ్యాచ్లు ఆడే సమయంలో ఎదురవ్వవా అని అంటున్నారు. కొందేమో పాక్కు నాకౌట్ దశకు చేరేంత సీన్ లేదని, అందుకే ఈ తలతిక్క డ్రామాలాడుతుందని కామెంట్లు చేస్తున్నారు. అసలు పాక్ను ప్రపంచకప్ మొత్తం నుంచే బహిష్కరించి, వేరే టీమ్కు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.కాగా, టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా ఫిబ్రవరి 15న కొలొంబో వేదికగా పాకిస్తాన్ భారత్తో గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఆడాల్సి ఉంది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ పాక్ ఈ మ్యాచ్ను రద్దు చేసుకుంది. తాజాగా ఈ ఒక్క మ్యాచ్ మినహా మిగతా మ్యాచ్లు తప్పక ఆడతామని స్పష్టం చేసింది. పాక్ గ్రూప్-ఏలో భారత్, నమీబియా, నెదర్లాండ్స్, యూఎస్ఏతో తలపడాల్సి ఉంది. వీరి మిగతా గ్రూప్ మ్యాచ్లు ఫిబ్రవరి 7 (నెదర్లాండ్స్), 10 (యూఎస్ఏ), 18 తేదీల్లో (నమీబియా) కొలొంబో వేదికగా జరుగనున్నాయి. ఒకవేళ పాక్ గ్రూప్ దశ దాటి తదుపరి దశకు చేరితే ఆ మ్యాచ్లు కూడా కొలొంబోలోనే జరుగుతాయి.ఐసీసీ ఆగ్రహం పాక్ భారత్తో గ్రూప్ స్టేజీ మ్యాచ్ను మాత్రమే రద్దు చేసుకోవడంపై ఐసీసీ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇలా చేయడం క్రీడా సూత్రాలకు విరుద్దమని పేర్కొంది. ఇప్పటికైతే పీసీబీ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని తెలిపింది. పీసీబీ నుంచి స్పష్టత వచ్చాక తమ వైఖరి కూడా ప్రకటిస్తామని ఘాటుగా స్పందించింది. -
మ్యాచ్ రద్దు చేసుకున్న పాక్.. స్పందించిన బీసీసీఐ!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో టీమిండియాతో మ్యాచ్ను బహిష్కరిస్తూ పాకిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందుకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చే అవకాశాలు ఉన్నా.. ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే నడుచుకునేందుకు పాక్ క్రికెట్ బోర్డు (PCB) సిద్ధమైంది.శ్రీలంకలో పాక్ మ్యాచ్లుకాగా టీ20 వరల్డ్కప్ టోర్నీకి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే, ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం.. తటస్థ వేదికైన శ్రీలంకలో పాకిస్తాన్ తమ మ్యాచ్లు ఆడేలా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) షెడ్యూల్ ఖరారు చేసింది.భద్రతా కారణాలా?ఇందులో భాగంగా భారత్- పాకిస్తాన్ ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా తలపడాల్సి ఉంది. అయితే, తమకు అవసరం లేని విషయంలో తలదూర్చి.. బంగ్లాదేశ్కు మద్దతు పలుకుతూ పాక్తో భారత్తో మ్యాచ్ను బహిష్కరించాలనే నిర్ణయం తీసుకుంది. ఇందుకు భద్రతా కారణాలు సాకుగా చూపడం గమనార్హం.కఠిన చర్యలకు సిద్ధం ఈ నేపథ్యంలో శ్రీలంకలో మిగతా మ్యాచ్లకు లేని ఈ సాకు.. కేవలం టీమిండియాతో మ్యాచ్కు మాత్రమే ఉందనడి చెప్పడం పాక్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, పాక్ వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్న ఐసీసీ.. కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.దేవజిత్ సైకియా ఏమన్నారంటేఈ పరిణామాలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియాను స్పందించాల్సిందిగా మీడియా కోరింది. ఇందుకు బదులుగా.. ‘‘ఈ విషయం గురించి మాకు అధికారిక సమాచారం వచ్చేంతవరకు నేను ఎలాంటి వ్యాఖ్య చేయలేను. మ్యాచ్ రద్దు విషయమై స్పష్టమైన సమాచారం లేనందున ఈ అంశం గురించి మాట్లాడే హక్కు నాకైతే ప్రస్తుతానికి లేదు’’ అని న్యూస్18తో పేర్కొన్నారు.ఐసీసీ చెప్పినట్లే..అయితే, బీసీసీఐ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా స్పందిస్తూ.. ‘‘ఐసీసీ ఓ కీలక ప్రకటన జారీ చేసింది. క్రీడా స్పూర్తి గురించి ఐసీసీ మాట్లాడింది. ఐసీసీతో మేము ఏకీభవిస్తున్నాం. ఐసీసీతో చర్చించిన తర్వాతే మేము ఈ విషయంపై కామెంట్ చేయగలము’’ అని పేర్కొన్నారు. కాగా పాక్ తమ నిర్ణయం గురించి తమకు అధికారికంగా తెలియజేయలేదని పేర్కొన్న ఐసీసీ.. సెలక్టివ్గా మ్యాచ్లు ఎంచుకోవడం సరికాదని కౌంటర్ ఇచ్చింది. బంగ్లాదేశ్ కూడా ఇలాగే తెగేదాకా లాగితే... ఆ జట్టును టోర్నీ నుంచి తప్పించిన ఐసీసీ.. ఆ స్థానంలో స్కాట్లాండ్ను చేర్చిన విషయం తెలిసిందే. చదవండి: భారత్తో మ్యాచ్ రద్దు.. పాకిస్తాన్కు తప్పదు భారీ మూల్యం #WATCH | Delhi: On Pakistan to boycott its match against India in the ICC Men’s T20 World Cup 2026, BCCI vice president and Congress MP Rajeev Shukla says, "ICC has issued a big statement, they have spoken about sportsmanship. We completely agree with the ICC. BCCI won't make any… pic.twitter.com/qRgwHzgDls— ANI (@ANI) February 2, 2026 -
‘క్రీడా’ బడ్జెట్ 2026: కీలక అంశాలు
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో ఈసారి క్రీడలకు కాస్త ప్రాధాన్యం పెరిగింది. గతంతో పోలిస్తే సుమారు రూ.1133 కోట్లకు పైగా నిధుల్ని పెంచారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో క్రీడలు, యువజన సర్వీసులకు రూ. 4479.88 కోట్లు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరం రూ. 3346.54 కోట్లు నిధులివ్వగా తాజా బడ్జెట్లో రూ.1133.34 కోట్ల మేర హెచ్చింపు చేశారు.దేశ వ్యాప్తంగా క్రీడా కేంద్రాల నిర్వహణ, శిబిరాలు ఏర్పాటు చేసే భారత స్పోర్ట్స్ అథారిటీకి రూ. 917.38 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో రూ.880 కోట్లు ఇవ్వగా కాస్త పెంచారు. అయితే డోప్ పరీక్షల ల్యాబోరేటరీతో పాటు జాతీయ డోపింగ్ నిరోధక ఏజెన్సీ (NADA) నిధుల్లో కోత పెట్టారు. డోపింగ్ టెస్టులకు క్రితం ఏడాది రూ.28.55 కోట్లు ఇస్తే... ప్రస్తుతం రూ.23 కోట్లకు కుదించారు. జాతీయ స్పోర్ట్స్ యూనివర్సిటీకి గతంలో రూ. 78.64 కోట్లు విదిల్చిన ఆర్థిక మంత్రి తాజాగా రూ.46.98 కోట్లే కేటాయించారు.ఇక 1998లో ఏర్పాటు చేసిన జాతీయ క్రీడాభివృద్ధి నిధిని రూ. 3 కోట్ల నుంచి రూ.5 కోట్లకు పెంచారు. అలాగే క్రీడాకారుల ప్రోత్సాహకాలను రూ. 28 కోట్ల నుంచి రూ. 40 కోట్లకు పెంచారు. జాతీయ క్రీడా సమాఖ్యలకు ఇచ్చే నిధుల్ని రూ. 400 కోట్ల నుంచి 425 కోట్లకు హెచ్చింపు చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘ఖేలో ఇండియా’కు రూ.924.35 కోట్లు కేటాయించారు. గతేడాది రూ. 1000 కోట్లు నిధులివ్వగా... కేవలం రూ.700 కోట్లే వెచ్చించడంతో ఇప్పుడు దానిని తగ్గించారు. -
భారత్తో మ్యాచ్ రద్దు.. పాక్పై టీమిండియా ఫ్యాన్స్ సెటైర్లు
పాకిస్తాన్ క్రికెట్ జట్టు భారత్తో టీ20 ప్రపంచకప్ మ్యాచ్ రద్దు చేసుకోవడంపై క్రికెట్ అభిమానులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. పాక్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటించినప్పటి నుంచి సోషల్మీడియా వేదికగా పాక్ జట్టును ఏకి పారేస్తున్నారు. పాక్ భారత్ చేతిలో పరాభవాన్ని ముందే ఊహించి జారుకుందని కామెంట్లు చేస్తున్నారు. అభిషేక్ శర్మ భయంతో పారిపోయారని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. పాక్ తమతో మ్యాచ్ ఆడపోవడం వల్ల కలిగే నష్టం ఏమీ ఉండదని అంటున్నారు. భారత్తోనే కాదు, టోర్నీ మొత్తానే బాయ్కాట్ చేసుంటే పీడా పోయేదని చర్చించుకుంటున్నారు. భారత్తో మ్యాచ్ను రద్దు చేసుకున్నందుకు ఐసీసీ కఠిన శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, గతేడాది పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ టోర్నీలో టీమిండియా తప్పక ఆడింది కానీ, చాలా మంది భారతీయులకు పాక్తో తలపడటం అస్సలు ఇష్టం లేదు. మెజారిటీ శాతం భారతీయుల అభిమతానికి అనుగుణంగానే టీమిండియా ప్లేయర్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అలాగే ఆసియా కప్ గెలిచిన తర్వాత పీసీబీ అధ్యక్షుడు, ఆసియా క్రికెట్ కౌన్సిల్కు చీఫ్ కూడా అయిన మొహిసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని స్వీకరించలేదు. భారత ఆటగాళ్లు ట్రోఫీని అందుకోవడం నిరాకరించినందుక నఖ్వీ ట్రోఫీ ఎత్తుకెళ్లిపోయిన విషయం విధితమే. ఇప్పటికీ అతను భారత్కు ఆ ట్రోఫీని అప్పగించలేదు. ఈ వివాదం కొనసాగుతుండగానే భారత్-బంగ్లాదేశ్ అంతర్గత విషయంలో పాక్ తలదూర్చింది. బంగ్లాదేశ్కు వత్తాసుగా ప్రపంచకప్ను బహిష్కరిస్తామని బెదిరింపులకు దిగింది. చివరికి భారత్తో మ్యాచ్ను మాత్రమే రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఐసీసీ చాలా సీరియస్గా పరిగణించే అవకాశం ఉంది. క్రికెట్కు సంబంధించి పాక్ను అష్టదిగ్బంధనం చేయవచ్చు. ఆర్దిక, పాలనాపరమైన చాలా శిక్షలను పీసీబీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. పాక్ జట్టును ప్రపంచకప్ నుంచి బహిష్కరించినా, ఆశ్చర్యపోనక్కర్లేదు.ఒకవేళ పాక్ ప్రపంచకప్లో కొనసాగితే భారత్తో మ్యాచ్ రద్దు చేసుకున్నందుకు రెండు పాయింట్లు కోల్పోతుంది. భారత్కు మ్యాచ్ ఆడకుండానే రెండు పాయింట్లు లభిస్తాయి. ఒకవేళ పాక్ అదృష్టం బాగుండి, తదుపరి దశకు చేరినా, అంతకంటే ముందుకు వెళ్లే సీన్ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పాక్ భారత్తో మ్యాచ్ ఆడినా, ఆడకపోయినా పెద్ద తేడా ఉండదని భారతీయ క్రికెట్ అభిమానులు అంటున్నారు. -
ఆకట్టుకుంటున్న ఉన్ని కృష్ణన్ టీ20 ప్రపంచకప్ గీతం
ప్రముఖ గాయకులు ఉన్నీ కృష్ణన్, పాలఘాట్ ఆర్. రాంప్రసాద్, సిక్కిల్ గురుచరణ్ ఆలపించిన టీ20 ప్రపంచకప్ 2026 గీతం క్రికెట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. 2023 వన్డే ప్రపంచకప్ కోసం వీరు రూపొందించిన Cricket Endraal Bharatham అనే గీతానికి ఇది ఎక్స్టెన్షన్గా గత నెలలో (జనవరి) విడుదలైంది. View this post on Instagram A post shared by Palghat Ramprasad (@palghat_ramprasad)T20 వెర్షన్ 2.0 పేరిట విడుదలైన తాజా గీతం సోషల్మీడియాలో విశేషమైన ప్రజాదరణ పొందుతుంది. 2023లో విడుదలైన వెర్షన్ కూడా క్రికెట్ ఫ్యాన్స్ను ఊర్రూతలూగించింది. కర్ణాటక శైలిలోని సాగే తాజా గీతం దేశవ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతోంది.గీతం ప్రత్యేకతలు - 2.0 వెర్షన్లో తాజా సాహిత్యం మరియు సరికొత్త స్వరరచనను ఉపయోగించారు. - T20 క్రికెట్కి తగిన ఉత్సాహభరితమైన, వేగవంతమైన సంగీత నోట్స్తో పాటను తీర్చిదిద్దారు. - కర్ణాటక రాగాల సౌందర్యాన్ని ఆధునిక తాళాలతో మేళవించి, క్రికెట్ ఉత్సాహాన్ని ప్రతిబింబించేలా ఈ గీతాన్ని రూపొందించారు. జాతీయ స్పూర్తి ఈ గీతం కేవలం సంగీత కృషి మాత్రమే కాదు, దేశభక్తి, క్రికెట్ పట్ల ఉన్న ప్రేమను ప్రతిబింబించే సాంస్కృతిక ఉత్సవం. టీ20 ఫార్మాట్లో భారత జట్టు విజయాన్ని ఆకాంక్షిస్తూ, అభిమానుల్లో ఉత్సాహాన్ని రగిలించేందుకు ఈ గీతం రూపొందించబడింది. కాగా, టీ20 ప్రపంచకప్ 2026 కోసం అధికారిక గీతం కూడా రూపొందిచబడింది. ఈ గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ స్వరపరిచాడు. Feel the thrill పేరిట సాగే ఈ గీతం కూడా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తుంది. టీ20 ప్రపంచకప్ ఓపెనింగ్ సెర్మనీలో ఈ గీతాన్ని ప్రత్యేకంగా ఆలపించనున్నారు. మెగా టోర్నీ భారత్, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. -
భారత్తో మ్యాచ్ రద్దు.. పాకిస్తాన్కు తప్పదు భారీ మూల్యం
భారత్తో టీ20 ప్రపంచకప్ మ్యాచ్ రద్దు చేసుకొని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చాలా పెద్ద సాహసం చేసింది. ఈ చర్య వల్ల ఐసీసీకి కలిగే నష్టం మాట అటుంచితే, పీసీబీ మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై ఐసీసీ తీవ్రంగానే స్పందించింది. పీసీబీ ఇంకా అధికారికంగా తమ వైఖరిని తెలియజేయలేదని ప్రకటిస్తూనే.. ఈ నిర్ణయం పాకిస్తాన్ క్రికెట్ భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. క్రీడా సమగ్రతను దెబ్బతీసే ఇలాంటి చర్యలను అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో పీసీబీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. ఐసీసీ తీసుకోబోయే చర్యలపై ఒకటి రెండు రోజుల్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.కాగా, పాకిస్తాన్ ప్రభుత్వం భద్రతా కారణాలను సాకుగా చూపుతూ ఫిబ్రవరి 15న కొలొంబో వేదికగా భారత్తో జరగాల్సిన మ్యాచ్ను (గ్రూప్ స్టేజీ) రద్దు చేసుకుంటున్నట్లు నిన్న సాయంత్రం అధికారికంగా ప్రకటించింది. తొలుత మెగా టోర్నీ మొత్తం నుంచి వైదొలుగుతామని బెదిరించిన పీసీబీ, చివరికి భారత్తో మ్యాచ్ మాత్రమే బాయ్కాట్ చేసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.వివాదం ఎక్కడ మొదలైదంటే..?ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ రెహ్మన్ను తప్పించడంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వరల్డ్కప్ కోసం తమ జట్టును భారత్కు పంపించేందుకు నిరాకరించింది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ తమ మ్యాచ్లను శ్రీలంకకు తరలించాలని ఐసీసీని బీసీబీ కోరింది. కానీ బీసీబీ విజ్ఞప్తిని ఐసీసీ తిరస్కరించింది.భద్రత పరంగా పూర్తి స్ధాయి హామీ ఇచ్చినా బీసీబీ మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో ఐసీసీ వరల్డ్కప్ నుంచి బంగ్లాను తప్పించి వారి స్దానంలో స్కాట్లాండ్ను చేర్చింది. ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ, బంగ్లాదేశ్కు మద్దతుగా పాకిస్థాన్ కూడా టోర్నీ నుంచి తప్పుకుంటామని పరోక్షంగా హెచ్చరించింది. చివరికి భారత్తో మ్యాచ్ను మాత్రమే రద్దు చేసుకుంటున్న ప్రకటించింది.భారత్–పాకిస్తాన్ పోటీ ప్రాముఖ్యత - ఈ రెండు జట్ల మధ్య పోటీని “మదర్ ఆఫ్ ఆల్ బ్యాటిల్స్” అని పిలుస్తారు. - ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఈ మ్యాచ్ను ఉత్కంఠగా వీక్షిస్తారు.ఆర్థిక నష్టం అంచనా - ఈ మ్యాచ్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా జరిగే వ్యాపారం వందల కోట్లలో ఉంటుంది.- పాకిస్తాన్ నిర్ణయం ఐసీసీకి భారీ ఆర్థిక నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. - క్రిక్బజ్ నివేదిక ప్రకారం.. ప్రతి భారత్ మ్యాచ్ విలువ సుమారు 10–11 మిలియన్ అమెరికన్ డాలర్లు (దాదాపు ₹100 కోట్లు) ఉంటుంది. - పాకిస్తాన్తో మ్యాచ్కు వచ్చే సరికి ఈ ఆదాయం మరింత పెరుగుతుంది. - ఫిబ్రవరి 15న జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్ ద్వారా రూ. 200 కోట్లకు మించి ఆదాయం వస్తుందని నిర్వహకులు అంచనా వేశారు.- మ్యాచ్ జరగకపోతే, ఐసీసీతో పాటు ప్రసార సంస్థలు భారీ నష్టాన్ని ఎదుర్కొంటాయి. దీని అంచనా రూ. 500 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది.పాకిస్తాన్కు కలిగే నష్టాలు- భారత్తో మ్యాచ్ను రద్దు చేసుకోవడం వల్ల పాక్ క్రికెట్ బోర్డు ఆర్దికపరమైన నష్టాలతో పాటు పరిపాలనాపరమైన మరెన్నో కఠనమైన శిక్షలు ఎదుర్కొనే అవకాశం ఉంది. - టోర్నీలో పాల్గొన్నందుకు ఇచ్చే 250,000 డాలర్లు(రూ. 2 కోట్లు పైమాటే) పార్టిసిపేషన్ ఫీజును పీసీబీ కోల్పోవాల్సి ఉంటుంది.- పాక్ సెమీఫైనల్ చేరితే 790,000 డాలర్లు(సుమారు రూ. 7 కోట్లు), రన్నరప్ అయితే 1.6 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.15 కోట్లు), ఒకవేళ విజేతగా నిలిస్తే 3 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 25 కోట్లు) కోల్పోతారు.- ఐసీసీ ప్రతి ఏటా తమ సభ్యదేశాలకు ఇచ్చే రెవెన్యూ వాటాను కూడా నిలిపివేసే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే పాక్ క్రికెట్ బోర్డు దివాళా తీయాల్సిందే. - ఫైనల్గా పాకిస్తాన్ తమ ప్రదర్శన బట్టి 250,000 డాలర్లు(సుమారు రూ.2.29 కోట్లు) నుంచి 4.42 మిలియన్ల డాలర్లు(సుమారు రూ. 38 కోట్లు) ప్రైజ్ మనీని కోల్పోయే ప్రమాదం ఉంది.- PSLకు ఇతర బోర్డులు NOCలు ఇవ్వకుండా ఆపుతుంది.- ఆసియా కప్ నుంచి పాకిస్తాన్ను తొలగించే అవకాశం ఉంది. -
బ్రూక్ విధ్వంసం.. టీ20 సిరీస్ కూడా ఇంగ్లండ్దే
టీ20 ప్రపంచకప్ 2026కు ముందు ఇంగ్లండ్ అదిరిపోయే ప్రదర్శనలతో దూసుకుపోతుంది. శ్రీలంక పర్యటనలో భాగంగా తొలుత వన్డే సిరీస్ను (2-1) కైవసం చేసుకున్న ఈ జట్టు.. తాజాగా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే చేజిక్కించుకుంది. పల్లెకెలె వేదికగా జరిగిన రెండో టీ20లో డక్వర్త్ లూయిస్ పద్దతిలో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఛేదన సమయంలో వర్షం అంతరాయం కలిగించడంతో ఇంగ్లండ్ లక్ష్యాన్ని 17 ఓవర్లలో 168 పరుగులుగా సెట్ చేశారు. ఈ లక్ష్యాన్ని ఇంగ్లండ్ 16.4 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. టామ్ బాంటన్ (54 నాటౌట్) అజేయ అర్ద శతకంతో.. హ్యారీ బ్రూక్ (12 బంతుల్లో 36; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లండ్ను గెలిపించారు. ఈ సిరీస్లో నామమాత్రపు మూడో టీ20 ఫిబ్రవరి 3న జరుగనుంది.రాణించిన రత్నాయకేలంక ఇన్నింగ్స్లో పవన్ రత్నాయకే (22 బంతుల్లో 40) ఓ మోస్తరు స్కోర్తో రాణించాడు. మిగతా బ్యాటర్లలో నిస్సంక (34), కమిల్ మిషారా (36), , కుసాల్ మెండిస్ (32), అసలంక (28 నాటౌట్) కూడా పర్వాలేదనిపించారు. ఆఖర్లో కెప్టెన్ దసున్ షనక (6 బంతుల్లో 1) బంతులు వృధా చేసి నిరాశపరిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2, విల్ జాక్స్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీశారు.విధ్వంసం సృష్టించిన బ్రూక్డక్వర్త్ లూయిస్ పద్దతిలో ఇంగ్లండ్ లక్ష్యాన్ని కుదించాక ఇంగ్లండ్ బ్యాటర్లు టామ్ బాంటన్ (33 బంతుల్లో 54 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), హ్యారీ బ్రూక్ (12 బంతుల్లో 36; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), సామ్ కర్రన్ (14 బంతుల్లో 20 నాటౌట్; సిక్స్, ఫోర్) చెలరేగిపోయారు. జోస్ బట్లర్ (39) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడాడు. లంక బౌలర్లలో పతిరణ 2, షనక, వెల్లాలగే తలో వికెట్ తీశారు. -
అర్జున్కు 13వ స్థానం
విక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్లు నిరాశపరిచారు. ఆదివారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత్ నుంచి నలుగురు గ్రాండ్మాస్టర్లు దొమ్మరాజు గుకేశ్, ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, అరవింద్ చిదంబరం పోటీపడ్డారు. 14 మంది మేటి గ్రాండ్మాస్టర్ల మధ్య 13 రౌండ్లపాటు ఈ టోర్నీ జరిగింది. భారత నంబర్వన్, తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ 4.5 పాయింట్లతో 13వ స్థానంలో నిలిచాడు.చివరిదైన 13వ రౌండ్ గేమ్లో అర్జున్ 55 ఎత్తుల్లో నొదిర్బెక్ అబ్దుసత్తరోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. క్లాసికల్ ఫార్మాట్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ గుకేశ్ 6.5 పాయింట్లతో 9వ స్థానంలో, ప్రజ్ఞానంద 5.5 పాయింట్లతో 11వ స్థానంలో, అరవింద్ 4.5 పాయింట్లతో 12వ స్థానంలో నిలిచారు. 9 పాయింట్లతో నొదిర్బెక్ విజేతగా అవతరించాడు. -
దేవిక ధమాకా
బ్యాంకాక్: అంచనాలకు మించి రాణించిన భారత రైజింగ్ స్టార్ షట్లర్ దేవిక సిహాగ్ తన కెరీర్లోనే గొప్ప విజయాన్ని అందుకుంది. ఆదివారం ముగిసిన థాయ్లాండ్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో దేవిక చాంపియన్గా అవతరించింది. హరియాణాకు చెందిన 20 ఏళ్ల దేవిక కెరీర్లో ఇదే తొలి సూపర్–300 టైటిల్ కావడం విశేషం. ప్రపంచ 68వ ర్యాంకర్, రెండుసార్లు జూనియర్ వరల్డ్ చాంపియన్ గో జిన్ వె (మలేసియా)తో జరిగిన ఫైనల్లో దేవిక తొలి గేమ్ను 21–8తో సొంతం చేసుకుంది. రెండో గేమ్లో 6–3తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో గాయం కారణంగా గో జిన్ వె మ్యాచ్ నుంచి వైదొలిగింది. దాంతో దేవికకు టైటిల్ ఖరారైంది. విజేత దేవికకు 18,750 డాలర్ల (రూ. 17 లక్షల 19 వేలు) ప్రైజ్మనీతోపాటు 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. పీవీ సింధు, సైనా నెహ్వాల్ తర్వాత థాయ్లాండ్ సూపర్–300 టైటిల్ నెగ్గిన మూడో భారతీయ క్రీడాకారిణిగా దేవిక గుర్తింపు పొందింది. టైటిల్ గెలిచే క్రమంలో దేవిక తన ప్రత్యర్థులకు ఒక్క గేమ్ కూడా కోల్పోకపోవడం విశేషం. ఈ టైటిల్తో ప్రపంచ 63వ ర్యాంకర్ దేవిక మంగళవారం విడుదల చేసే ప్రపంచ ర్యాంకింగ్స్లో టాప్–40లో చోటు సంపాదిస్తుంది. ‘చాలా ఆనందంగా ఉంది. నా కెరీర్లో ఇదే తొలి సూపర్–300 లెవెల్ టైటిల్. ఈ సీజన్లో మరిన్ని టోర్నీలు ఆడతాను. థాయ్లాండ్ ఓపెన్లో అన్ని మ్యాచ్లు బాగా ఆడాను. కొత్త పాఠాలు నేర్చుకున్నాను. ఫైనల్లో గెలుపోటములు గురించి ఆలోచించలేదు. నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే లక్ష్యంతో బరిలోకి దిగాను’ అని దేవిక వ్యాఖ్యానించింది. బెంగళూరులోని పదుకొనే–ద్రవిడ్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్లెక్స్లో ఉమేంద్ర రాణా వద్ద దేవిక శిక్షణ తీసుకుంటోంది. -
విష్ణువర్ధన్ ఖాతాలో 48వ డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: భారత డేవిస్కప్ జట్టు మాజీ సభ్యుడు, లండన్ ఒలింపిక్స్లో పోటీపడ్డ హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ విష్ణువర్ధన్ తన కెరీర్లో 48వ డబుల్స్ టైటిల్ను సాధించాడు. జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఎం15 టోర్నీలో తెలంగాణకే చెందిన గంటా సాయికార్తీక్ రెడ్డితో కలిసి విష్ణువర్ధన్ డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. 25 ఏళ్ల సాయికార్తీక్ రెడ్డికిది 11వ డబుల్స్ టైటిల్ కావడం విశేషం. డబుల్స్ ఫైనల్లో విష్ణువర్ధన్–సాయికార్తీక్ ద్వయం 6–1, 6–4తో ఇషాక్ ఇక్బాల్–దేవ్ జావియా (భారత్) జంటపై గెలిచింది. 67 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో విష్ణు–సాయికార్తీక్ ఐదు ఏస్లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్లు చేశారు. తొలి సర్వీస్లో 23 పాయింట్లు, రెండో సర్వీస్లో 9 పాయింట్లు స్కోరు చేశారు. తమ సర్వీస్ను ఒక్కసారి కూడా కోల్పోకుండా, ప్రత్యర్థుల సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేశారు. తొలి రౌండ్లో విష్ణు–సాయికార్తీక్ 6–3, 6–4తో నైషిక్ రెడ్డి గణగామ–మాచెర్ల తీర్థ శశాంక్ (భారత్)లపై, క్వార్టర్ ఫైనల్లో 6–3, 7–5తో అర్జున్–కహీర్ (భారత్)లపై, సెమీఫైనల్లో 5–7, 7–6 (7/4), 10–8తో ఆదిత్య–అథర్వ (భారత్)లపై విజయం సాధించారు. 38 ఏళ్ల విష్ణు వేర్వేరు భాగస్వాములతో కలిసి 2008లో 1... 2009లో 6... 2010లో 3 ... 2011లో 5... 2012లో 1... 2013లో 1... 2014లో 3... 2015లో 4... 2016లో 5... 2017లో 10... 2018లో 2... 2021లో 1... 2023లో 3... 2024లో 2... 2026లో 1 డబుల్స్ టైటిల్ గెలిచాడు. -
అల్కరాజ్ కొత్త చరిత్ర
మెల్బోర్న్: పురుషుల టెన్నిస్ చరిత్రలో స్పెయిన్ స్టార్, ప్రపంచ నంబర్వన్ అల్కరాజ్ కొత్త రికార్డు నెలకొల్పాడు. టెన్నిస్లోని నాలుగు గ్రాండ్స్లామ్ టోర్నీల టైటిల్స్ను సాధించిన అతిపిన్న వస్కుడిగా (22 ఏళ్ల 272 రోజులు) అల్కరాజ్ చరిత్ర సృష్టించాడు. ఆదివారం ముగిసిన ఆ్రస్టేలియన్ ఓపెన్ టోర్నీలో ఈ స్పెయిన్ స్టార్ తొలిసారి విజేతగా అవతరించాడు. 10 సార్లు చాంపియన్, 24 గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన సెర్బియా దిగ్గజం జొకోవిచ్తో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో అల్కరాజ్ 2–6, 6–2, 6–3, 7–5తో గెలుపొందాడు. విజేత అల్కరాజ్కు 41,50,000 ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 26 కోట్ల 55 లక్షలు), రన్నరప్ జొకోవిచ్కు 21,50,000 ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 13 కోట్ల 75 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. అల్కరాజ్ కెరీర్లో ఇది ఏడో గ్రాండ్స్లామ్ టైటిల్. ఇప్పటికే అతను ఫ్రెంచ్ (2024, 2025), వింబుల్డన్ (2023, 2024), యూఎస్ ఓపెన్ (2022, 2025)లను రెండుసార్లు చొప్పున గెలిచాడు. తాజా ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్తో అల్కరాజ్ ‘కెరీర్ గ్రాండ్స్లామ్’ పూర్తి చేసుకున్న అతిపిన్న వయసు్కడిగా గుర్తింపు పొందాడు. వరాల్గా డాన్ బడ్జ్ (అమెరికా; 22 ఏళ్ల 363 రోజులు; 1938లో) పేరిట ఉన్న రికార్డును.... ఓపెన్ శకం (1968) మొదలయ్యాక నాదల్ (స్పెయిన్; 24 ఏళ్ల 88 రోజులు; 2010లో) పేరిట ఉన్న రికార్డులను ఈ స్పెయిన్ స్టార్ సవరించాడు. తాజా ఓటమితో అత్యధిక గ్రాండ్స్లామ్ టైటిల్స్ (25) నెగ్గిన ఏకైక ప్లేయర్గా రికార్డు నెలకొల్పాలని ఆశించిన జొకోవిచ్కు నిరాశ ఎదురైంది. తొలి సెట్ కోల్పోయినా... ఆ్రస్టేలియన్ ఓపెన్లో ఫైనల్ చేరిన 10 సార్లూ విజేతగా నిలిచిన జొకోవిచ్కు తుది పోరులో తొలి సారి ఓటమి ఎదురైంది. సెమీస్లో డిఫెండింగ్ చాంపియన్ సినెర్ (ఇటలీ)పై ఐదు సెట్ల పోరులో గెలిచిన జొకోవిచ్ తొలి సెట్ను గెలిచి ఫైనల్లో శుభారంభం చేశాడు. అయితే 38 ఏళ్ల జొకోవిచ్తో పోలిస్తే ఎక్కువ ఫిట్గా ఉన్న అల్కరాజ్ రెండో సెట్ నుంచి తన అసలు ఆటతీరును ప్రదర్శించాడు. రెండో సెట్లో రెండుసార్లు... మూడో సెట్లో రెండుసార్లు జొకోవిచ్ సర్వీస్ను బ్రేక్ చేసి అతను ఈ రెండు సెట్లు గెలిచాడు. నాలుగో సెట్లోని 12వ గేమ్లో జొకోవిచ్ సర్వీస్ను బ్రేక్ చేసిన అల్కరాజ్ సెట్తోపాటు విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. 9 పురుషుల టెన్నిస్లో ‘కెరీర్ గ్రాండ్స్లామ్’ పూర్తి చేసుకున్న 9వ ప్లేయర్ అల్కరాజ్. ఈ జాబితాలో ఫ్రెడ్ పెర్రీ (బ్రిటన్; 1935లో), డాన్ బడ్జ్ (అమెరికా; 1938లో), రాడ్ లేవర్ (ఆస్ట్రేలియా; 1962లో), రాయ్ ఎమర్సన్ (ఆస్ట్రేలియా; 1964లో), అగస్సీ (అమెరికా; 1999లో), ఫెడరర్ (స్విట్జర్లాండ్; 2009లో), నాదల్ (స్పెయిన్; 2010లో), జొకోవిచ్ (సెర్బియా; 2016లో) ఉన్నారు. -
‘ఎలిమినేటర్’కు ఢిల్లీ క్యాపిటల్స్
వడోదర: మహిళల ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ‘ఎలిమినేటర్’ పోరుకు అర్హత పొందింది. ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో జెమీమా రోడ్రిగ్స్ సారథ్యంలోని ఢిల్లీ 5 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్పై నెగ్గింది. తొలుత యూపీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. దీప్తి శర్మ (24; 4 ఫోర్లు, 1సిక్స్), సిమ్రన్ షేక్ (22; 3 ఫోర్లు), శిఖా పాండే (23; 3 ఫోర్లు) రెండు పదులు స్కోర్లు చేశారు. మరిజాన్ కాప్ 3, హెన్రీ, శ్రీచరణి చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత ఢిల్లీ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసి గెలిచింది. వోల్వార్డ్ (47; 7 ఫోర్లు) రాణించింది. వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ మంగళవారం జరిగే గుజరాత్తో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతుంది. ఇప్పటికే బెంగళూరు నేరుగా ఫైనల్ చేరింది. చివరి లీగ్ మ్యాచ్లో యూపీ వారియర్స్పై విజయం -
పాక్ను చిత్తుగా ఓడించిన భారత్
అండర్ 19 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 1) జరిగిన మ్యాచ్లో భారత్ పాకిస్తాన్పై 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ సెమీఫైనల్కు కూడా అర్హత సాధించింది.బులవాయో వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. వేదాంత్ త్రివేది (68) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో భారత్కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఆఖర్లో కనిష్క్ చౌహాన్ (35), ఖిలన్ పటేల్ (21) కీలక ఇన్నింగ్స్లు ఆడారు.భారత బ్యాటర్లలో ఆరోన్ జార్జ్ (16), కెప్టెన్ ఆయుశ్ మాత్రే (0), అభిగ్యాన్ కుందు (16), దీపేశ్ దేవేంద్రన్ (1) విఫలం కాగా.. వైభవ్ సూర్యవంశీ (30), విహాన్ మల్హోత్రా (21), అంబ్రిష్ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో అబ్దుల్ సుభాన్ 3, మొహమ్మద్ సయ్యద్ 2, అలీ రజా, అహ్మద్ హుసేన్, మొమిన్ ఖమార్, అలీ హస్సన్ బలోచ్ తలో వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో పాక్ తొలుత విజయం దిశగా సాగింది. అయితే మధ్యలో భారత స్పిన్నర్లు ఖిలన్ పటేల్ (9.2-1-35-3), ఆయుశ్ మాత్రే (8-0-21-3), కనిష్క్ చౌహాన్ (10-1-30-1), విహాన్ మల్హాత్రా (4-0-15-1) చెలరేగడంతో పాక్కు ఓటమి తప్పలేదు. పేసర్లు అంబ్రిష్ (5-0-26-1), హెనిల్ పటేల్ (5-0-30-1) కూడా రాణించడంతో పాక్ 46.2 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్లో ఉస్మాన్ ఖాన్ (66) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. హమ్జా జహూర్ (42), కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్ (38) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఈ ఓటమితో పాక్ ప్రపంచకప్ నుంచి నిష్క్రమించగా.. గ్రూప్-2 నుంచి భారత్, ఇంగ్లండ్ సెమీస్కు అర్హత సాధించాయి. గ్రూప్-1 నుంచి ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ బెర్త్లు దక్కించుకున్నాయి. ఫిబ్రవరి 4న జరిగే రెండో సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ భారత్ను ఢీకొంటుంది. 3న జరిగే తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియా,ఇంగ్లండ్ తలపడతాయి. -
పాక్ ప్రభుత్వం సంచలన ప్రకటన
టీ20 ప్రపంచకప్-2026 నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. మెగా టోర్నీలో భాగంగా ఫిబ్రవరి 15న భారత్తో జరగాల్సిన మ్యాచ్ను రద్దు చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ హై–వోల్టేజ్ పోరుకు పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అయితే, పాక్ జట్టు ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరిగే మిగతా ప్రపంచకప్ మ్యాచ్ల్లో పాల్గొంటుందని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం పాక్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నక్వీ ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ను కలిసిన కొన్ని గంటల తర్వాత వెలువడింది. పాక్ ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనతో ఇరు దేశాల క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. భారత్-పాక్ ఇప్పటివరకు కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడేవి. ఇప్పుడు అది కూడా లేకపోవడం ఫ్యాన్స్ను తీవ్రంగా కలిచి వేస్తుంది. పాక్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఐసీసీ ఏరకంగా స్పందిస్తుందో వేచి చూడాలి. భారత్-పాక్ మ్యాచ్ రద్దు వల్ల అభిమానులకే కాదు, వాణిజ్యానికి కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. పాక్ తీసుకున్న ఈ నిర్ణయం ఇరు దేశాల మధ్య రాజకీయ, ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది.కాగా, భద్రతా కారణాలను సాకుగా చూపుతూ బంగ్లాదేశ్ జట్టు ఇదివరకే ప్రపంచకప్ నుంచి వైదొలిగింది. ఇప్పుడు పాక్ కూడా అదే కారణాన్ని సాకుగా చూపుతూ భారత్తో మ్యాచ్ను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మొత్తం ఎపిసోడ్ ఇటీవలికాలంలో బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో మొదలైంది. ఈ కారణంగా బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్ను ఐపీఎల్ నుంచి తొలగించగా.. ఇందుకు ప్రతిగా బంగ్లాదేశ్ భారత్లో జరగాల్సిన లీగ్ మ్యాచ్లు ఆడమని భీష్మించుకు కూర్చుంది. వేదికలను శ్రీలంకకు మార్చాలని కోరగా ఐసీసీ ససేమిరా అంది. ఈ విషయంలో పాక్ బంగ్లాదేశ్కు మొదటి నుంచి వంత పాడుతూ వచ్చింది. బంగ్లాదేశ్ ప్రపంచకప్ నుంచి వైదొలగడంతో స్కాట్లాండ్కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించింది. కాగా, ప్రపంచకప్లో పాక్ తమ మ్యాచ్లను శ్రీలంకలో ఆడనున్న విషయం తెలిసిందే. భారత్-పాక్ మ్యాచ్ కూడా శ్రీలంకలోనే షెడ్యూలై ఉండింది. -
మూడో టీ20లోనూ ఆసీస్ను చిత్తు చేసిన పాక్
టీ20 ప్రపంచకప్కు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను పాకిస్తాన్ క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్లో పాక్ 111 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, 3-0 తేడాతో ఆసీస్ను వైట్వాష్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో 207 పరుగులు (6 వికెట్ల నష్టానికి) చేసిన పాక్.. అనంతరం ఆసీస్ను 16.5 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూల్చి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది.రాణించిన బాబర్, సైమ్పాక్ ఇన్నింగ్స్లో సైమ్ అయూబ్ (56), బాబర్ ఆజమ్ (50 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. ఆఖర్లో షాదాబ్ ఖాన్ (19 బంతుల్లో 46; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా పాక్ ఆటగాళ్లలో ఫకర్ జమాన్ 10, కెప్టెన్ సల్మాన్ అఘా 5, ఖ్వాజా నఫే 21, మొహమ్మద్ నవాజ్ 5, ఫహీం అష్రాఫ్ 10 (నాటౌట్) పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో డ్వార్షుయిస్ 2, గ్రీన్, కన్నోలీ, షార్ట్, కుహ్నేమన్ తలో వికెట్ తీశారు.తిప్పేసిన నవాజ్అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్ చేతులెత్తేసింది. మొహమ్మద్ నవాజ్ (4-0-18-5) అద్భుత ప్రదర్శనతో ఆసీస్ను చావుదెబ్బ కొట్టాడు. ఆసీస్ ఇన్నింగ్స్లో గ్రీన్ (22), స్టోయినిస్ (23), జోష్ ఫిలిప్ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మార్ష్ (1), షార్ట్ (2), రెన్షా (1), ఓవెన్ (8), కన్నోలీ (0), కుహ్నేమన్ (5) దారుణంగా విఫలమయ్యారు. ఆడమ్ జంపా బ్యాటింగ్కు దిగలేదు. పాక్ ఈ సిరీస్లోని తొలి రెండు మ్యాచ్ల్లో కూడా భారీ విజయాలు సాధించింది. ఈ సిరీస్కు ఆసీస్ ద్వితియ శ్రేణి జట్టుతో బరిలోకి దిగింది. ప్రపంచకప్ దృష్ట్యా సీనియర్లకు విశ్రాంతినిచ్చింది. -
విరాట్ కోహ్లి పేరిట ఉండిన భారీ రికార్డును బద్దలు కొట్టిన బాబర్ ఆజమ్
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ భారత దిగ్గజం విరాట్ కోహ్లి పేరిట ఉండిన ఓ భారీ రికార్డును బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియాతో ఇవాళ (ఫిబ్రవరి 1) జరుగుతున్న మూడో టీ20లో హాఫ్ సెంచరీ చేసిన బాబర్.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక అర్ద సెంచరీలు (39) చేసిన ఆటగాడిగా అవతరించాడు. ఈ రికార్డు విరాట్ కోహ్లి (38) పేరిట ఉండేది. తాజాగా బాబర్ తన పేరిట బదలాయించుకున్నాడు. ఈ జాబితాలో బాబర్, విరాట్ తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ (32), మొహమ్మద్ రిజ్వాన్ (30), డేవిడ్ వార్నర్ (28), జోస్ బట్లర్ (28) ఉన్నారు.మరో రికార్డుతాజా హాఫ్ సెంచరీతో బాబర్ మరో రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాపై ఆరు సార్లు 50+ స్కోర్లు చేసిన ఆటగాడిగా వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ (8) అగ్రస్థానంలో ఉన్నాడు.ఫామ్లోకి వచ్చిన బాబర్BBL 2025–26లో సిడ్నీ సిక్సర్స్ తరఫున నిరాశాజనకమైన ప్రదర్శనలు (11 ఇన్నింగ్స్ల్లో 202 పరుగులు) చేసిన బాబర్.. ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చాడు. ఆస్ట్రేలియాపై చివరి టీ20లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి, ఫామ్లోకి వచ్చాడు.మ్యాచ్ పరిస్థితి లాహోర్ వేదికగా జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్లో పాక్ తొలుత బ్యాటింగ్ చేసిన 207 పరుగుల (6 వికెట్ల నష్టానికి) భారీ స్కోర్ చేసింది. సైమ్ అయూబ్ (56), బాబర్ ఆజమ్ (50 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో షాదాబ్ ఖాన్ (19 బంతుల్లో 46; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్ బౌలర్లలో డ్వార్షుయిస్ 2, గ్రీన్, కన్నోలీ, షార్ట్, కుహ్నేమన్ తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్ చేతులెత్తేసింది. 15.5 ఓవర్ల తర్వాత 8 వికెట్ల నష్టానికి 92 పరుగులు మాత్రమే చేసి ఘోర ఓటమి దిశగా పయనిస్తుంది. మొహమ్మద్ నవాజ్ (4-0-18-5) అద్భుత ప్రదర్శనతో ఆసీస్ను చావుదెబ్బ కొట్టాడు. ఈ సిరీస్లోని తొలి రెండు మ్యాచ్లు గెలిచిన పాక్ ఇదివరకే సిరీస్ను కైవసం చేసుకుంది. -
తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పడిక్కల్ విధ్వంసకర శతకం
కర్ణాటక బ్యాటర్ దేవదత్ పడిక్కల్ దేశవాలీ క్రికెట్లో అరివీర భయంకర ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఇటీవల విజయ్ హజారే వన్డే టోర్నీలో 9 ఇన్నింగ్స్ల్లో 90కి పైగా సగటుతో 4 సెంచరీల సాయంతో 725 పరుగులు చేసిన అతను.. తాజాగా రంజీ ట్రోఫీలో పంజాబ్పై విధ్వంసకర శతకంతో చెలరేగాడు. క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్లో పడిక్కల్ ఉగ్రరూపం దాల్చాడు. 40 ఓవర్లలో 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 85 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 120 పరుగులు చేసి, తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్లో పడిక్కల్ కర్ణాటక కెప్టెన్గానూ వ్యవహరించాడు. కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే సెంచరీ సహా మ్యాచ్ను గెలిపించి చిరస్మరణీయం చేసుకున్నాడు. ఛేదనలో పడిక్కల్కు మయాంక్ అగర్వాల్ (53), శ్రేయస్ గోపాల్ (33) సహకరించారు. ఈ ఇన్నింగ్స్లో టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ 13 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. పడిక్కల్ విధ్వంసకర శతకంతో కదంతొక్కడంతో కర్ణాటక 27.5 ఓవర్లలోనే (5 వికెట్లు కోల్పోయి) లక్ష్యాన్ని ఛేదించింది. పంజాబ్ బౌలర్లలో అన్మోల్జీత్ సింగ్ 3 వికెట్లు తీయగా.. సుఖ్దీప్, ఎమన్జోత్ చహల్ తలో వికెట్ దక్కించుకున్నారు.అంతకుముందు పంజాబ్ తొలి ఇన్నింగ్స్లో 256 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఉదమ్ సహారన్ 93 పరుగులతో రాణించాడు. పంజాబ్ ఇన్నింగ్స్లో సహారన్ మినహా ఎవ్వరూ రాణించలేదు. అన్మోల్ప్రీత్ (44), అభిజీత్ (33), హర్ప్రీత్ బ్రార్ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కర్ణాటక బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, శ్రేయస్ గోపాల్ తలో 3 వికెట్లు తీయగా.. శిఖర్ షెట్టి 2, విధ్యాదర్ పాటిల్, మొహిసిన్ ఖాన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.దీనికి ముందు కర్ణాటక తొలి ఇన్నింగ్స్లో 316 పరుగులకు ఆలౌటైంది. శ్రేయస్ గోపాల్ (77), కేఎల్ రాహుల్ (59) అర్ద సెంచరీలతో రాణించారు. మయాంక్ అగర్వాల్ (32), విధ్యాదర్ పాటిల్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ 4, సుఖ్దీప్ 3, అన్మోల్ 2, చహల్ ఓ వికెట్ తీశారు. అంతకుముందు పంజాబ్ తొలి ఇన్నింగ్స్లో 309 పరుగులకు ఆలౌటైంది. అభిజీత్ (81), చహల్ (83) అర్ద సెంచరీలతో రాణించగా.. సహారన్ (44) ఓ మోస్తరు స్కోర్తో పర్వాలేదనిపించాడు. విధ్యాదర్ పాటిల్ 4, శ్రేయస్ గోపాల్ 3, మొహిసిన్ ఖాన్ 2, ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ తీశారు. -
టీ20 ప్రపంచకప్కు మరో రెండు జట్లు
ఈ ఏడాది ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరుగనున్న మహిళల టీ20 వరల్డ్కప్కు స్కాట్లాండ్, ఐర్లాండ్ అర్హత సాధించాయి. నేపాల్లో జరుగుతున్న క్వాలిఫయర్ పోటీల ద్వారా ఈ రెండు జట్లు ప్రపంచకప్ బెర్త్ దక్కించుకున్నాయి. ఈ టోర్నీ నుంచి బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లు కూడా ప్రపంచకప్ అర్హత సాధించాయి.ఇవాళ (ఫిబ్రవరి 1) జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్లో అమెరికా పై విజయం సాధించడంతో స్కాట్లాండ్ ప్రపంచకప్ బెర్త్ను కన్ఫర్మ్ చేసుకుంది. ఈ మ్యాచ్లో స్కాట్లండ్ ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటి అమెరికాను మట్టికరిపించింది.మరోవైపు థాయ్లాండ్పై గెలుపుతో ఐర్లాండ్ ప్రపంచకప్కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో ఐర్లాండ్ తక్కువ స్కోరే చేసిన, దాన్ని విజయవంతంగా కాపాడుకుంది. కాగా, ఈ గ్లోబల్ క్వాలిఫయర్ టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొనగా.. బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, ఐర్లాండ్ టాప్-4లో నిలిచి ప్రపంచకప్ టికెట్ దక్కించుకున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్తాన్, శ్రీలంక నేరుగా ప్రపంచకప్ అర్హత సాధించాయి.కాగా, జూన్ 12న బర్మింగ్హామ్ వేదికగా ఇంగ్లండ్-శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్తో మహిళల టీ20 ప్రపంచకప్ 2026 మొదలవుతుంది. ఈ టోర్నీలో జూన్ 14న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరుగనుంది. ఈ టోర్నీలో న్యూజిలాండ్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది. చివరిగా జరిగిన 2024 ఎడిషన్లో న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. మహిళల టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు ఇదే తొలి టైటిల్. ఆ ఎడిషన్ ఫైనల్లో న్యూజిలాండ్ సౌతాఫ్రికాను ఓడించి, జగజ్జేతగా అవతరించింది. -
పాకిస్తాన్తో కీలక మ్యాచ్.. టీమిండియా గౌరవప్రదమైన స్కోర్
అండర్–19 ప్రపంచకప్-2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 1) భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య కీలకమైన సూపర్ సిక్స్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. పాకిస్తాన్ భారీ విజయం సాధిస్తేనే టోర్నీలో నిలబడుతుంది. భారత్ ఇప్పటికే సెమీఫైనల్ దిశగా అడుగులు వేసినా, పాక్ చేతిలో భారీ ఓటమి ఎదురైతే టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం కూడా ఉంది. బులవాయో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేస్తుంది. పాక్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన భారత్ ఆదిలో తడబడినా, మధ్యలో కోలుకుంది. వేదాంత్ త్రివేది (68) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో భారత్ను గౌరవప్రదమైన స్కోర్ దిశగా నడిపించాడు. ఆఖర్లో కనిష్క్ చౌహాన్ (35), ఖిలన్ పటేల్ (21) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. మొత్తంగా భారత్ నిర్ణీత 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది.భారత బ్యాటర్లలో ఆరోన్ జార్జ్ (16), కెప్టెన్ ఆయుశ్ మాత్రే (0), అభిగ్యాన్ కుందు (16), దీపేశ్ దేవేంద్రన్ (1) విఫలం కాగా.. వైభవ్ సూర్యవంశీ (30), విహాన్ మల్హోత్రా (21), అంబ్రిష్ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో అబ్దుల్ సుభాన్ 3, మొహమ్మద్ సయ్యద్ 2, అలీ రజా, అహ్మద్ హుసేన్, మొమిన్ ఖమార్, అలీ హస్సన్ బలోచ్ తలో వికెట్ తీశారు. -
ఆడవాళ్లపై ఇలాంటి ట్రోల్సా? చెండాలం: యాంకర్ ఫైర్
ఒకప్పుడు ఆడ, మగ క్లోజ్గా కనిపిస్తే చాలు వాళ్ల మధ్య సమ్థింగ్ సమ్థింగ్ జరుగుతోందని రూమర్స్ వచ్చేవి. కానీ, ఇప్పుడు కేవలం కలిసి కనిపించినా సరే.. ఇద్దరి మధ్య ఏదో వ్యవహారం నడుస్తోందని ప్రచారం చేస్తున్నారు. క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, యాంకర్ షెఫాలి బగ్గా డిన్నర్కు వెళ్లడంతో వీరు లవ్లో ఉన్నారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఒక ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) పోస్టర్ వైరలవుతోంది.యాంకర్ ఫైర్ఇందులో చాహల్ కుర్చీలో కూర్చోగా అతడి పక్కన మాజీ భార్య ధనశ్రీ వర్మ, ఆర్జే మహవశ్, షెఫాలి ఉన్నారు. ఈ ఫోటో మొదట చాహల్ కంట పడింది. అది చూసిన అతడు ఇంకో ఇద్దరు ముగ్గుర్ని మిస్ అయ్యారంటూ సెటైర్లు వేశాడు. తాజాగా ఈ ఏఐ పోస్టర్పై షెఫాలి మండిపడింది. ఇదెంత చెండాలం.. ఆడవారిని ఇలా చూపించడం సిగ్గుచేటు. మీ మనస్తత్వం ఎలాంటిదో ఇక్కడే తెలిసిపోతుంది. మీ పనేదో మీరు చూసుకుంటే బెటర్ అని కౌంటరిచ్చింది.పెళ్లి- విడాకులుఇకపోతే చాహల్.. కొరియోగ్రాఫర్, డ్యాన్సర్ ధనశ్రీ వర్మను 2020లో పెళ్లి చేసుకున్నాడు. విభేదాలు రావడంతో 2024లో విడిపోయారు. 2025లో విడాకులు తీసుకున్నారు. తర్వాత యాంకర్ ఆర్జే మహవశ్తో కొంతకాలం రిలేషన్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, సడన్గా ఇద్దరూ ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడంతో బ్రేకప్ అయిపయిందని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు. బిగ్బాస్తో ఫేమస్అనంతరం షెఫాలీతో కనిపించడంతో మళ్లీ ప్రేమలో పడ్డాడని పలువురు భావించారు. కానీ ఇప్పుడు యాంకర్ ఇచ్చిన కౌంటర్తో అదంతా ఉట్టి ప్రచారమే అని తేలిపోయింది. కాగా షెఫాలి న్యూస్ యాంకర్. హిందీ బిగ్బాస్ 13వ సీజన్లో పార్టిసిపేట్ చేయడంతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.చదవండి: అల్లు శిరీష్ బ్యాచిలర్ పార్టీ -
భారత్తో మ్యాచ్.. పాక్ హెడ్ కోచ్ ఘోర తప్పిదం
అండర్–19 ప్రపంచకప్-2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 1) భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య కీలకమైన సూపర్ సిక్స్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. పాకిస్తాన్ భారీ విజయం సాధిస్తేనే టోర్నీలో నిలబడుతుంది. భారత్ ఇప్పటికే సెమీఫైనల్ దిశగా అడుగులు వేసినా, పాక్ చేతిలో భారీ ఓటమి ఎదురైతే టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం కూడా ఉంది. బులవాయో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేస్తుంది. పాక్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన భారత్ ఆదిలో తడబడినా, మధ్యలో కోలుకుంది. వేదాంత్ త్రివేది (68) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో భారత్ను గౌరవప్రదమైన స్కోర్ దిశగా నడిపించాడు. ఆఖర్లో కనిష్క్ చౌహాన్ (35), ఖిలన్ పటేల్ (21) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. మొత్తంగా భారత్ నిర్ణీత 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది.భారత బ్యాటర్లలో ఆరోన్ జార్జ్ (16), కెప్టెన్ ఆయుశ్ మాత్రే (0), అభిగ్యాన్ కుందు (16), దీపేశ్ దేవేంద్రన్ (1) విఫలం కాగా.. వైభవ్ సూర్యవంశీ (30), విహాన్ మల్హోత్రా (21), అంబ్రిష్ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో అబ్దుల్ సుభాన్ 3, మొహమ్మద్ సయ్యద్ 2, అలీ రజా, అహ్మద్ హుసేన్, మొమిన్ ఖమార్, అలీ హస్సన్ బలోచ్ తలో వికెట్ తీశారు.ఇదిలా ఉంటే, భారత ఇన్నింగ్స్ సందర్భంగా పాకిస్తాన్ హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్ చేసిన ఓ పని వివాదాస్పదమైంది. ఇన్నింగ్స్ 25వ ఓవర్ తర్వాత అతను డ్రెస్సింగ్ రూమ్లో మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ కనిపించాడు. ఐసీసీ నియమాల ప్రకారం, PMOA (Player and Match Officials Area)లో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు లేదా ఇతర కమ్యూనికేషన్ పరికరాలు వాడటం పూర్తిగా నిషేధం. ఇవి మ్యాచ్ ఫలితాలను ప్రభావితం (ఫిక్సింగ్ లేదా చీటింగ్) చేసే అవకాశం ఉందని ఐసీసీ ఈ నిబంధనను అమలు చేస్తుంది. ఆర్టికల్ 4.1.1 ప్రకారం PMOAలో ఎవరూ మొబైల్ ఫోన్ వాడకూడదు. ఆర్టికల్ 4.1.2 ప్రకారం ల్యాప్టాప్లు లేదా ఇతర కమ్యూనికేషన్ పరికరాలు కూడా వాడకూడదు. -
టీ20 ప్రపంచకప్ నుంచి తొలగింపు.. బంగ్లాదేశ్ కీలక అడుగు
టీ20 ప్రపంచకప్ నుంచి తొలగించబడిన తర్వాత బంగ్లదేశ్ క్రికెట్ బోర్డు కీలక అడుగు వేసింది. ప్రపంచకప్ గ్యాప్ను కవర్ చేసుకునేందుకు స్వదేశంలో కొత్త టీ20 టోర్నీని ప్రకటించింది. ఈ టోర్నీకి ఓడొమ్మో (ODOMMO) బంగ్లాదేశ్ టీ20 కప్గా నామకరణం చేసింది. మూడు జట్లు (ధూమకేతు XI, దుర్బార్ XI, దురొంటో XI) పోటీ పడే ఈ టోర్నీ ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం కానుంది. టోర్నీ లాంచ్ విషయాన్ని ఆ దేశ యువజన మరియు క్రీడా మంత్రిత్వ శాఖ కార్యదర్శి మహ్బూబ్–ఉల్–ఆలమ్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచకప్ ఆడకపోయినా, ఆటగాళ్లకు పరిహారం ఇవ్వాలనే అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిపారు.కాగా, భారత్లో భద్రతా సమస్యల కారణంగా బంగ్లాదేశ్ జట్టు ప్రపంచకప్కు వెళ్లేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్కు వరల్డ్కప్ బెర్త్ దక్కింది.ODOMMO టోర్నీ వివరాలు - జట్లు: ధూమకేతు XI, దుర్బార్ XI, దురొంటో XI - కెప్టెన్లు: లిటన్ దాస్ (ధూమకేతు), నజ్ముల్ హొసైన్ షాంటో (దుర్బార్), అక్బర్ అలీ (దురొంటో) - మ్యాచ్లు: గ్రూప్ స్టేజ్ ఫిబ్రవరి 5, 6, 7; ఫైనల్ ఫిబ్రవరి 9 - ప్రారంభం: ప్రతి మ్యాచ్ రోజు సాయంత్రం 4 గంటలకు సాంస్కృతిక కార్యక్రమం, 6 గంటలకు మ్యాచ్ - ప్రైజ్ మనీ: మొత్తం 2.5 కోట్లు టాకా, ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులు కూడా ఇవ్వబడతాయి -
భారీ ట్రోలింగ్ను ఎదుర్కొంటున్న వైభవ్ సూర్యవంశీ, ఆయుశ్ మాత్రే
భారత యువ జట్టు కెరటాలు ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ సోషల్మీడియా వేదికగా భారీ ట్రోలింగ్ను ఎదుర్కొంటున్నాడు. అండర్-19 ప్రపంచకప్ 2026లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న సూపర్ సిక్స్ మ్యాచ్లో దారుణంగా విఫలమైనందుకు టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతున్నారు. చోకర్స్ అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. సూర్యవంశీతో పోలిస్తే మాత్రేపై ట్రోలింగ్ ధాటి అధికంగా ఉంది. ప్రతి కీలక మ్యాచ్లో విఫలమవుతాడు, ఇతన్ని ఎలా కెప్టెన్గా కొనసాగిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ మ్యాచ్లో మాత్రే రెండు బంతులు ఆడి ఖాతా కూడా తెరవలేకపోగా.. చిన్న జట్లపై చెలరేగిపోయే వైభవ్ సూర్యవంశీ కీలకమైన మ్యాచ్లో సత్తా చాటలేకపోయారు. వైభవ్ 22 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 30 పరుగులు చేసి ఔటయ్యాడు. వాస్తవానికి వైభవ్ చేసిన ఈ స్కోర్ అంత తీసి పాడేయాల్సిందేమీ కాకపోయినప్పటికీ.. కీలకమైన సూపర్ సిక్స్ మ్యాచ్ కావడం, అందులోనూ ప్రత్యర్ధి పాక్ కావడం వల్ల అభిమానులు ఆగ్రహిస్తున్నారు. రెండు లైఫ్లు లభించిన తర్వాత కూడా జాగ్రత్త పడకపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వైభవ్పై కట్టలు తెంచుకుంది.వీరిద్దరితో పాటు మరో ఓపెనర్ ఆరోన్ జార్జ్ (16) కూడా విఫలం కావడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ కష్టాల్లో పడింది. ఈ ముగ్గురు ఒకే స్కోర్ (47 పరుగులు) వద్ద, నాలుగు బంతుల వ్యవధిలో ఔట్ కావడం అభిమానులకు మరింత ఆగ్రహం తెప్పించింది. పాక్ పేసర్ మొహమ్మద్ సయ్యమ్ భారత టాపార్డర్ను కూల్చడంలో సఫలీకృతుడయ్యాడు. మరో 62 పరుగుల తర్వాత భారత్ మరో వికెట్ కోల్పోయింది. 109 పరుగుల వద్ద విహాన్ మల్హోత్రా (21) అహ్మద్ హుస్సేన్ బౌలింగ్లో అతనికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 30 ఓవర్ల తర్వాత భారత్ 4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసి ఎదురీదుతుంది. వేదాంత్ త్రివేది (50), అభిగ్యాన్ కుందు (12) భారత్కు గౌరవప్రదమైన స్కోర్ అందించే ప్రయత్నం చేస్తున్నారు.కెప్టెన్సీ నుంచి తీసేయండి..!ఇటీవలికాలంలో ఆయుశ్ మాత్రే ప్రదర్శలు చాలా దారుణంగా ఉన్నాయి. ప్రస్తుత ప్రపంచకప్లో అతను ఇప్పటివరకు 99 పరుగులు మాత్రమే చేశాడు. అందులో 53 పరుగులు న్యూజిలాండ్పై చిన్న లక్ష్యాన్ని ఛేదించే సమయంలో వచ్చాయి. దీనికి ముందు ఆసియా కప్లోనూ అతని ప్రదర్శనలు దారుణంగా ఉన్నాయి. ఆ టోర్నీలో ఐదు ఇన్నింగ్స్ల్లో 65 పరుగులు మాత్రమే చేశాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో మాత్రేను కెప్టెన్సీ నుంచి తొలగించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. -
టీ20 వరల్డ్కప్ టోర్నీకి శ్రీలంక జట్టు ప్రకటన
టీ20 ప్రపంచకప్ 2026 కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు ఆల్రౌండర్ దసున్ షనక సారథ్యం వహించనున్నాడు. లంక వరల్డ్కప్ జట్టులో పాతుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్, కుశాల్ పెరీరా, వానిందు హసరంగ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు.అదేవిధంగా యువ పేసర్ ఈషాన్ మలింగకు కూడా జట్టులో చోటు దక్కింది. దుష్మంత చమీర, మతీష పతిరణ, ప్రమోద్ మదుషన్లతో కలిసి మలింగ పేస్ బౌలింగ్ బాధ్యతలను పంచుకోనున్నాడు. ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో సత్తాచాటిన యువ బ్యాటర్ పవన్ రత్నాయకేకు కూడా సెలెక్టర్లు అవకాశమిచ్చారు. ఇక స్పిన్ విభాగంలో హసరంగ, తీక్షణ, వెల్లలాగే వంటి ఉన్నారు. సొంతగడ్డపై మ్యాచ్లు జరగనుండడంతో ఈ స్పిన్ త్రయం శ్రీలంకకు కీలకం కానుంది.అసలంకపై వేటు..కాగా ఈ మెగా టోర్నీ కోసం లంక సెలెక్టర్లు గత డిసెంబర్లో 25 మంది సభ్యులతో కూడిన ప్రాథమిక జట్టును ఎంపిక చేశారు. ఈ సందర్భంగా చరిత్ అసలంకను సారథ్య బాధ్యతల నుంచి తప్పించారు. అతని స్థానంలో అనుభవజ్ఞుడైన దాసున్ శనకను తిరిగి కెప్టెన్గా ఎంపిక చేశారు.షనక కెప్టెన్గా గతంలో లంకకు ఆసియాకప్ను అందించారు. ఇప్పుడు మరోసారి తన అనుభవంతో జట్టును నడిపించేందుకు సిద్దమయ్యాడు. ఈ మెగా టోర్నీలో శ్రీలంక తమ తొలి మ్యాచ్లో ఫిబ్రవరి 8న కొలంబో వేదికగా ఐర్లాండ్తో తలపడనుంది. లంకేయులు ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడతున్నారు.టీ20 ప్రపంచకప్ కోసం శ్రీలంక జట్టుపాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, కుశాల్ పెరీరా, చరిత్ అసలంక, కమిల్ మిషార, పవన్ రత్నాయకే, జనిత్ లియానగే, దసున్ షనక (కెప్టెన్), కమిందు మెండిస్, దుష్మంత చమీర, మతీషా పతిరణ, ఎషాన్ మలింగ, వణిందు హసరంగా, మహేశ్ వెల్లలగే, మహేష్ తీక్షణ -
హెట్మైర్, హోప్ మెరుపులు.. విండీస్కు ఓదార్పు విజయం
జోహన్నెస్బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో వెస్టిండీస్ 6 పరుగుల తేడాతో (డక్వర్త్ లూయిస్ పద్దతి) విజయం సాధించింది. దీంతో క్లీన్ స్వీప్ ప్రమాదం నుంచి పర్యాటక విండీస్ తప్పించుకుంది. వర్షం, మెరుపులు కారణంగా ఈ మ్యాచ్ను 10 ఓవర్లకు కుదించారు.తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. విండీస్ ఇన్నింగ్స్లో కెప్టెప్ షాయ్ హోప్(25 బంతుల్లో 48), షిమ్రాన్ హెట్మైర్ (22 బంతుల్లో 48 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. సఫారీ బౌలర్లలో ఎంగిడీ, మఫాక, కేశవ్ మహారాజ్ తలా వికెట్ సాధించారు.అనంతరం డీఎల్ఎస్ పద్దతి ప్రకారం.. దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 10 ఓవర్లలో 125 పరుగులుగా నిర్ణయించారు. లక్ష్య చేధనలో కెప్టెన్ ఐడైన్ మార్క్రమ్ త్వరగా ఔటైనప్పటికి క్వింటన్ డికాక్ (28) శుభారంభం ఇచ్చాడు. కానీ వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో ప్రోటీస్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.విండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సఫారీలు 6 వికెట్లు కోల్పోయి 118 పరుగులకే పరిమితమయ్యారు. కరేబియన్ బౌలర్లలో గుడికేష్ మోటీ మూడు వికెట్లతో సత్తాచాటాడు. అయితే తొలి రెండు టీ20ల్లో విజయం సాధించిన సౌతాఫ్రికా.. సిరీస్ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. -
పాక్తో మ్యాచ్.. తొలుత బ్యాటింగ్ చేయనున్న భారత్
అండర్-19 ప్రపంచకప్ 2026లో మరో హైవోల్టేజ్ మ్యాచ్కు తెరలేచింది. సూపర్ సిక్స్లో భాగంగా బులవాయో వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ కీలక మ్యాచ్కు పాక్ ఆటగాడు మహ్మద్ షయాన్ గాయం కారణంగా దూరమయ్యాడు.అతడి స్దానంలో అలీ హసన్ బలోచ్కు తుది జట్టులో చోటు దక్కింది. మరోవైపు భారత్ కూడా తమ తుది జట్టులో ఓ మార్పు చేసింది. ఉదవ్ మోహన్ స్దానంలో దీపేష్ ప్లేయింగ్ ఎలెవన్లోకి వచ్చాడు. కాగా ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి ఆసియాకప్ ఫైనల్లో ఎదురైన పరాభావానికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది.తుది జట్లుపాకిస్తాన్: సమీర్ మిన్హాస్, హంజా జహూర్ (వికెట్ కీపర్), ఉస్మాన్ ఖాన్, అహ్మద్ హుస్సేన్, ఫర్హాన్ యూసఫ్ (కెప్టెన్), హుజైఫా అహ్సన్, అలీ హసన్ బలోచ్, అబ్దుల్ సుభాన్, మోమిన్ కమర్, మొహమ్మద్ సయామ్, అలీ రజాభారత్ : ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే (కెప్టెన్), విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్), అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), వేదాంత్ త్రివేది, ఆర్ ఎస్ అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేష్ దేవేంద్రన్ -
వికెట్ కీపర్గా సంజూకు నో ఛాన్స్.. క్లారిటీ ఇచ్చిన సూర్యకుమార్
టీ20 వరల్డ్కప్లో భారత జట్టు వికెట్ కీపర్ ఎవరు? సంజు శాంసన్కు తుది జట్టులో చోటు దక్కుతుందా? అన్న ప్రశ్నలు క్రికెట్ అభిమానుల్లో ఉత్పన్నమవుతున్నాయి. శాంసన్ పేలవ ఫామే ఇందుకు ప్రధాన కారణం. ఈ మెగా టోర్నీ సన్నాహాల్లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో శాంసన్ దారుణ ప్రదర్శన కనబరిచాడు.ఈ సిరీస్ మొత్తంగా అతడు కేవలం 46 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో తిలక్ వర్మ తుది జట్టులోకి సంజూపై వేటు పడడం ఖాయమన్పిస్తోంది. అతడి స్ధానంలో ఇషాన్ కిషన్ భారత ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశముంది. తిలక్ యధావిధిగా మూడో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. దాదాపు రెండేళ్ల తర్వాత భారత జట్టులోకి వచ్చిన ఇషాన్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.తిరువనంతపురం వేదికగా కివీస్తో జరిగిన ఐదో టీ20లో ఇషాన్ సెంచరీతో మెరిశాడు. అంతకుముందు మ్యాచ్లలో కూడా విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడాడు. దీంతో అతడికి ఓపెనర్గా అవకాశమివ్వాలని చాలా మంది మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. అయితే ఆఖరి టీ20లో సంజు శాంసన్ జట్టులో ఉన్నప్పటికి ఇషాన్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టడం అందరిని ఆశ్చర్యపరిచింది.ఈ క్రమంలో సంజూ వరల్డ్కప్లో ఆడడం ఇక కష్టమేనన్న ఊహాగానాలు మొదలు అయ్యాయి. అయితే ఇదే విషయంపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. వికెట్ కీపింగ్ మార్పుపై తాము ముందే నిర్ణయం తీసుకున్నామని సూర్య చెప్పుకొచ్చాడు."తిలక్ వర్మ అందుబాటులో లేకపోవడంతో ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లకు ప్లేయింగ్ ఎలెవన్లో అవకాశం దక్కింది. అయితే కీపింగ్ బాధ్యతలను పంచుకోవడం సిరీస్ ప్రారంభానికి ముందే నిర్ణయించాము మొదటి మూడు మ్యాచ్లలో శాంసన్, చివరి రెండు మ్యాచ్లలో కిషన్కు వికెట్ కీపింగ్ చేసే అవకాశమివ్వాలని మేనేజ్మెంట్ నిర్ణయించింది.కానీ కిషన్ చిన్న గాయం కారణంగా నాలుగో టీ20లో ఆడలేదు, లేదంటే ఆ మ్యాచ్లో కూడా అతడే వికెట్ కీపింగ్ చేయాల్సింది ఉండేది. ఇప్పుడు కిషన్ తిరిగి రావడంతో వికెట్ల వెనక తన బాధ్యతలను నిర్వర్తించాడు" అని సూర్య మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు.చదవండి: IND vs NZ: టీమిండియా వరల్డ్ రికార్డు -
భారత్కు గుడ్ న్యూస్.. ఫిట్నెస్ టెస్టు క్లియర్ చేసిన తిలక్
టీ20 ప్రపంచకప్-2026కు ముందు భారత జట్టుకు శుభవార్త. హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ పూర్తి స్థాయిలో కోలుకున్నాడు. గాయం కారణంగా న్యూజిలాండ్తో సిరీస్కు దూరమైన తిలక్... బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడు. సీఓఈలో నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షలలో అతడు ఉత్తీర్ణీత సాధించాడు.దీంతో తిలక్కు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ వైద్య బృందం క్లియరెన్స్ ఇచ్చింది. అతడు మంగళవారం(ఫిబ్రవరి3) ముంబైలో టీమిండియాతో కలవనున్నాడు. భారత్ ఆడబోయే రెండు వార్మప్ మ్యాచ్లలో తిలక్ భాగం కానున్నాడు. ఇక కివీస్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో ఆకట్టుకోలేకపోయిన సంజు శాంసన్ స్థానంలో టీ20 ప్రపంచకప్లో ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ను ప్రారంభించడం ఖాయం కాగా... తిలక్ వర్మ మూడో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. ఈ పొట్టి ప్రపంచకప్లో భారత్ తమ తొలి మ్యాచ్లో ఫిబ్రవరి 7న నవీ ముంబై వేదికగా యూఎస్ఎతో తలపడనుంది. అంతకుముందు ఫిబ్రవరి 2న అమెరికా, ఫిబ్రవరి 4న దక్షిణాఫ్రికాతో మెన్ ఇన్ బ్లూ వార్మప్ మ్యాచ్లలో ఆడనుంది.టీ20 ప్రపంచకప్ 2026కు భారత జట్టు:సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్, శివమ్ దూబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్. -
ఆస్ట్రేలియా ఓపెన్ సింగిల్స్ ఫైనల్.. ఎవరు గెలిచినా చరిత్రే
ఆస్ట్రేలియా ఓపెన్-2026లో రసవత్తర పోరుకు రంగం సిద్దమైంది. ఆదివారం మెల్బోర్న్లోని రాడ్ లేవర్ ఎరీనాలో జరగనున్న మెన్స్ సింగిల్స్ ఫైనల్లో సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్, టాప్సీడ్ కార్లోస్ అల్కరాజ్ అమీతుమీ తెల్చుకోనున్నారు. ఈ మ్యాచ్లో ఎవరు గెలిచినా చరిత్రే అవుతుంది. ఈ తుది పోరులో జొకోవిచ్ గెలిస్తే తన 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ను సాధిస్తాడు.తద్వారా జోకోవిచ్ టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్ స్లామ్స్ గెలిచిన ప్లేయర్గా మార్గరెట్ కోర్ట్ (24 టైటిల్స్)ను అధిగమిస్తాడు. అదేవిధంగా అతడికి ఇది 11వ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ అవుతుంది. మరోవైపు 22 ఏళ్ల అల్కరాజ్ ఈ టైటిల్ను కైవసం చేసుకుంటే, టెన్నిస్ చరిత్రలో నాలుగు వేర్వేరు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టిస్తాడు.ఇప్పటివరకు వీరిద్దరూ 9 సార్లు తలపడగా, జొకోవిచ్ 5-4తో స్వల్ప ఆధిక్యంలో ఉన్నాడు. అయితే గ్రాండ్ స్లామ్ ఫైనల్స్లో అల్కరాజ్ 2-0తో (రెండు సార్లు వింబుల్డన్లో) జొకోవిచ్పై పైచేయి సాధించాడు. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:00 గంటలకు ప్రారంభమవుతుంది. -
టీమిండియా వరల్డ్ రికార్డు
టీ20 ప్రపంచకప్-2026కు ముందు టీమిండియా భీకర ఫామ్లో ఉంది. ఈ మెగా టోర్నీ సన్నాహల్లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ అదరగొట్టింది. ఈ సిరీస్ను 4-1 తేడాతో మెన్ ఇన్ బ్లూ సొంతం చేసుకుంది. శనివారం తిరువనంతపురం వేదికగా జరిగిన ఆఖరి టీ20లోనూ టీమిండియా దుమ్ములేపింది.కివీస్ను 46 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 271 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 43 బంతుల్లోనే 103 పరుగులు చేసి కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.అతడితో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(30 బంతుల్లో 61) సైతం సత్తాచాటాడు. 272 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బ్లాక్ క్యాప్స్ ఆఖరివరకు పోరాడింది. ఓపెనర్ ఫిన్ అలెన్ (38 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 80 పరుగులు) టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 5 వికెట్లతో మెరిశాడు. ఈ మ్యాచ్లో భారీ స్కోర్తో విరుచుకుపడ్డ టీమిండియా పలు అరుదైన రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది.ఇంగ్లండ్ వరల్డ్ రికార్డు బ్రేక్..అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సార్లు 250 ప్లస్ పరుగులు సాధించిన జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. టీమిండియా ఇప్పటివరకు నాలుగు సార్లు 250 పైగా పరుగులు చేసింది. దీంతో జింబాబ్వే(3) రికార్డును టీమిండియా బ్రేక్ చేసింది. అదేవిధంగా ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్లో అత్యధిక సిక్స్లు(69) కొట్టిన జట్టుగా భారత్ నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ పేరిట(64) ఉండేది.చదవండి: 'స్కై' మళ్లీ నీలి రంగులోకి మారింది.. చాలా సంతోషంగా ఉంది: సూర్య -
'స్కై' మళ్లీ నీలి రంగులోకి మారింది.. చాలా సంతోషంగా ఉంది: సూర్య
టీ20 ప్రపంచకప్-2026కు ముందు న్యూజిలాండ్తో జరిగిన ఆఖరి పోరు(ఐదో టీ20)లో టీమిండియా సత్తాచాటింది. తిరువనంతపురం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో కివీస్ను 46 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 271 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్(43 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్స్లతో 103) శతక్కొట్టగా.. సూర్యకుమార్ యాదవ్(63), హార్దిక్ పాండ్యా(42) రాణించారు. అనంతరం భారీ లక్ష్య చేధనలో కివీస్ 225 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 5 వికెట్లతో చెలరేగాడు. ఇషాన్ కిషన్కు ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ నిలవగా.. సూర్యకుమార్కు ప్లేయర్ ఆఫ్ది సిరీస్ అవార్డు దక్కింది. గతేడాది మొత్తం పేలవ ఫామ్తో ఇబ్బందిపడిన సూర్య.. కొత్త ఏడాదిలో మాత్రం దుమ్ములేపుతున్నాడు. ఈ ఐదు మ్యాచ్ల సిరీస్లో అతడు మూడు హాఫ్ సెంచరీలతో సత్తాచాటాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన సూర్యకుమార్ తన ఫామ్ను తిరిగి అందుకోవడంపై సంతోషం వ్యక్తం చేశాడు."ఈ క్షణం కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. నా రిథమ్ను తిరిగి అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. స్కై ఉన్నప్పుడు భయం ఎందుకని మురళీ కార్తీక్ గత సిరీస్లోనే చెప్పారు. నేను కొత్తగా ఏమీ ప్రయత్నించలేదు. నా బ్యాటింగ్లో కూడా ఎటువంటి మార్పులు చేసుకోలేదు.ఎందుకంటే నేను 'అవుట్ ఆఫ్ ఫామ్' లో లేను, కేవలం 'అవుట్ ఆఫ్ రన్స్'లో ఉన్నానని నాకు తెలుసు ఒక మంచి ఇన్నింగ్స్తో నా రిథమ్ తిరిగి అందుకోవచ్చన్న థీమాతో ఉండేవాడిని. ఇప్పుడు ఎట్టకేలకు ఈ సిరీస్లో నా ఫామ్ను తిరిగి సాధించాను.వరల్డ్కప్ వంటి మెగా టోర్నీకి ముందు తిరిగి ట్రాక్లో పడడం ఆనందంగా ఉంది. గత ఏడాది కాలంగా ఆకాశం(స్కై) నీలి రంగులో కన్పించలేదు. కానీ ఒక క్రీడాకారుడి జీవితంలో ఎత్త పల్లాలు సహజం. ఇటువంటి సమయంలో అసలు ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకుంటే తిరిగి కమ్బ్యాక్ ఇవ్వవచ్చు. ఇప్పుడు నేను అదే పనిచేశాను. గత సిరీస్ తర్వాత దొరికిన విరామంలో సన్నిహితులతో గడిపాను. వారు చెప్పిన కొన్ని కీలక విషయాలు నన్ను ప్రేరేపించాయి. ఇక గెలిచినా, ఓడినా ప్రతి మ్యాచ్ నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటాం. ముంబైలో సౌత్ ఆఫ్రికాతో జరిగే వార్మప్ మ్యాచ్ తర్వాత, మాలో ఏవైనా లోపాలు ఉంటే సరిదిద్దుకుంటాము. మిగితా ఫార్మాట్లతో పోలిస్తే టీ20 ఫార్మాట్ బౌలర్లకు ఒక కఠిన పరీక్ష వంటిది. మనం భారీ స్కోరు చేసినప్పుడు, ప్రత్యర్థి జట్టు కూడా అంతే ధీటుగా బదులు ఇస్తోంది. కెప్టెన్, బౌలింగ్ యూనిట్పై ఒత్తిడి ఉంటుంది. ఈ సమయంలో సరైన ప్రణాళికలతో ముందుకు వెళ్లడమే ఏకైక మార్గం" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో సూర్య పేర్కొన్నాడు.చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. -
పాకిస్తాన్దే సిరీస్
లాహోర్: ఐసీసీ టి20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందు పాకిస్తాన్ జట్టు ఆ్రస్టేలియాపై సిరీస్ విజయం సాధించింది. మూడు మ్యాచ్ల టి20 సిరీస్లో భాగంగా శనివారం జరిగిన రెండో పోరులో పాకిస్తాన్ 90 పరుగుల తేడాతో ఆ్రస్టేలియాను చిత్తు చేసింది. మొదట పాకిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 198 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సల్మాన్ ఆగా (76; 8 ఫోర్లు, 4 సిక్స్లు), ఉస్మాన్ ఖాన్ (53; 4 ఫోర్లు, 2 సిక్స్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం ఆ్రస్టేలియా 15.4 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. కామెరాన్ గ్రీన్ (20 బంతుల్లో 35; 1 ఫోర్, 2 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలినవాళ్లు ప్రభావం చూపలేక పోయారు. అబ్రార్ అహ్మద్, షాదాబ్ ఖాన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. -
హైదరాబాద్ 631 ఆలౌట్
సాక్షి, హైదరాబాద్: బ్యాటర్లు దంచికొట్టడంతో రంజీ ట్రోఫీ చివరి లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు భారీ స్కోరు చేసింది. గ్రూప్ ‘డి’లో భాగంగా సికింద్రాబాద్ జింఖానా మైదానంలో ఛత్తీస్గఢ్తో జరుగుతున్న మ్యాచ్లో ఓవర్నైట్ స్కోరు 415/4తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ 154 ఓవర్లలో 631 పరుగులకు ఆలౌటైంది. ప్రజ్ఞయ్ రెడ్డి (126; 14 ఫోర్లు, 4 సిక్స్లు) సెంచరీతో కదం తొక్కగా... క్రితం రోజే శతకం పూర్తి చేసుకున్న హిమతేజ (258 బంతుల్లో 171; 18 ఫోర్లు, 1 సిక్స్) డబుల్ సెంచరీ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఛత్తీస్గఢ్ శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 39 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. జ్ఞానేశ్వర్ డబుల్ సెంచరీ రంజీ ట్రోఫీ గ్రూప్ ‘ఎ’లో భాగంగా నాగాలాండ్తో సావోమిలో జరుగుతున్న మ్యాచ్లో ఆంధ్ర జట్టు భారీ స్కోరు చేసింది. ఓవర్నైట్ స్కోరు 267/5తో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టు చివరకు 130 ఓవర్లలో 9 వికెట్లకు 536 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. సీఆర్ జ్ఞానేశ్వర్ (227 నాటౌట్; 21 ఫోర్లు, 4 సిక్స్లు) అజేయ డబుల్ సెంచరీతో కదంతొక్కాడు. శశికాంత్ (138 బంతుల్లో 60; 5 ఫోర్లు), త్రిపురాన విజయ్ (94 బంతుల్లో 58; 2 ఫోర్లు, 2 సిక్స్లు) అతడికి సహకారం అందించారు. అనంతరం నాగాలాండ్ శనివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 33 ఓవర్లలో 4 వికెట్లకు 85 పరుగులు చేసింది. -
ఢిల్లీ గెలిస్తే ‘ఎలిమినేటర్’కు అర్హత
వడోదర: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో ఓడిపోవడం ఢిల్లీ క్యాపిటల్స్ అవకాశాల్ని మెరుగుపరిచాయి. టోర్నీలో మూడు సార్లు రన్నరప్గా నిలిచిన క్యాపిటల్స్కే ‘ఎలిమినేటర్’ చాన్స్ ఉంది. నేడు యూపీ వారియర్స్తో జరిగే చివరి లీగ్ పోరులో ఢిల్లీ గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా నేరుగా గుజరాత్ జెయింట్స్తో ఎలిమినేటర్ ఆడే అర్హత సాధిస్తుంది. అయితే ఓడినా ముందంజ వేసేందుకు స్వల్ప అవకాశం ఉంది. పాయింట్ల పట్టికలో ముంబై, ఢిల్లీకి ప్రస్తుతం సమానంగా 6 పాయింట్లు ఉన్నాయి. అయితే ముంబైకంటే ఢిల్లీ రన్రేట్ చాలా తక్కువగా ఉంది. రన్రేట్ మైనస్లో ఉంది. అయితే నెట్ రన్రేట్ను మెరుగుపరుచుకుంటే ఢిల్లీ ముందుకెళుతుంది. షఫాలీ, లిజెల్లీ, లారా వోల్వార్డ్లతో కూడిన టాపార్డర్ ధాటిగా పరుగులు చక్కబెడితే యూపీపై భారీస్కోరును సునాయాసంగానే సాధించవచ్చు. కెపె్టన్ జెమీమా, మరిజాన్, నికీ ప్రసాద్లు కూడా ధనాధన్ ఆట ఆడేయగలరు. బౌలింగ్లో షినెల్ హెన్రీ, మరిజాన్, నందిని, శ్రీచరణిలు ఢిల్లీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు అట్టడుగున ఉన్న యూపీ కేవలం రెండే మ్యాచ్ల్లో గెలిచింది. -
భారత్ x పాకిస్తాన్
బులావాయో (జింబాబ్వే): అండర్–19 ప్రపంచకప్లో యువ భారత జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. సెమీఫైనల్లో చోటు దక్కించుకునేందుకు ఆదివారం ‘సూపర్ సిక్స్’ గ్రూప్–2లో దాయాది పాకిస్తాన్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్లో ఆడిన అన్నీ మ్యాచ్ల్లో గెలిచి అజేయంగా కొనసాగుతున్న ఆయుశ్ మాత్రే సారథ్యంలోని భారత జట్టు... చిరకాల ప్రత్యర్థిపై కూడా అదే జోరు కొనసాగిస్తూ సెమీఫైనల్కు చేరాలని భావిస్తోంది. ఇటీవల ఆసియాకప్ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో పరాజయం పాలైన భారత్ ఆ ఓటమికి బదులు తీర్చుకోవడంతో పాటు... ఆరో సారి వరల్డ్కప్ చేజిక్కించుకునే దిశగా మరో ముందడుగు వేయాలని చూస్తోంది. టోర్నీ ఆరంభ మ్యాచ్లో అమెరికాపై ఆ తర్వాత బంగ్లాదేశ్, న్యూజిలాండ్పై విజయాలు సాధించిన యువభారత్... సూపర్ సిక్స్ తొలి మ్యాచ్లో జింబాబ్వేపై గెలిచింది. ఇప్పుడు పాక్పై కూడా నెగ్గితే గ్రూప్–2 నుంచి నేరుగా సెమీఫైనల్కు చేరనుంది. ఓడినా భారత జట్టుకు అవకాశాలు ఉన్నాయి. గ్రూప్లో మూడో స్థానంలో ఉన్న పాకిస్తాన్... భారత జట్టుపై భారీ తేడాతో గెలిస్తే తప్ప సెమీస్ చేరడం కష్టమే. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, ఆయుశ్ మాత్రే, వేదాంత్ త్రివేది, విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుందుతో భారత జట్టు బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. బౌలింగ్లో అంబరీశ్, ఉధవ్ మోహన్, హెనిల్ పటేల్ కీలకం కానున్నారు. మరోవైపు పాకిస్తాన్ జట్టులో ఓపెనర్ సమీర్ మిన్హాస్ ఫుల్ఫామ్లో ఉన్నాడు. ఆసియాకప్ ఫైనల్లో భారత జట్టుపై భారీ సెంచరీతో మ్యాచ్ను లాగేసుకున్న అతడిని త్వరగా పెవిలియన్కు పంపాల్సిన అవసరముంది. -
భారత్ ధనాధన్ ‘షో’
తిరువనంతపురం: పొట్టి ప్రపంచకప్కు ముందు భారత్ పెద్ద పండగే చేసుకుంది. న్యూజిలాండ్తో జరిగిన ఆఖరి మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగింది. శనివారం జరిగిన ఐదో టి20లో టీమిండియా 46 పరుగులతో కివీస్ను ఓడించింది. 4–1 ఆధిక్యంతో సిరీస్ను ముగించింది. మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 271 పరుగుల భారీ స్కోరు చేసింది. టి20ల్లో భారత్కిది మూడో అత్యధిక స్కోరు కావడం విశేషం. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఇషాన్ కిషన్ (43 బంతుల్లో 103; 6 ఫోర్లు, 10 సిక్స్లు) కెరీర్లో తొలి సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ సూర్యకుమార్ (30 బంతుల్లో 63; 4 ఫోర్లు, 6 సిక్స్లు), హార్దిక్ పాండ్యా (17 బంతుల్లో 42; 1 ఫోర్, 4 సిక్స్లు) కూడా సిక్సర్ల మోత మోగించారు. అనంతరం న్యూజిలాండ్ 19.4 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది. అలెన్ (38 బంతుల్లో 80; 8 ఫోర్లు, 6 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. అర్ష్ దీప్ కు 5 వికెట్లు దక్కాయి. మెరుపు భాగస్వామ్యం... అభిషేక్ శర్మ (16 బంతుల్లో 30; 4 ఫోర్లు, 2 సిక్స్లు) సిక్స్తో ఖాతా తెరిచిన భారత్ తొలి ఓవర్లో మరో 2 ఫోర్లతో 14 పరుగులు సాధించింది. రెండో ఓవర్లోనూ 2 ఫోర్లు, ఓ సిక్స్తో 15 పరుగులు పిండుకుంది. సొంత మైదానంలోనూ సామ్సన్ (6) మరో అవకాశాన్ని వృథా చేసుకొని నిరాశపర్చాడు. పవర్ప్లేలో భారత్ స్కోరు 54/2. ఆ తర్వాత ఇషాన్ కిషన్ దంచేయడంతో మైదానం హోరెత్తింది. సాంట్నర్ పదో ఓవర్లో సూర్య ఓ సిక్స్ కొడితే స్ట్రయిక్ అందుకున్న కిషన్ 4, 6 కొట్టాడు. దీంతో ఈ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. జట్టు స్కోరు కూడా వంద దాటింది. ఓ వైపు నుంచి ఇషాన్, మరోవైపు నుంచి కెప్టెన్ సూర్యకుమార్ కివీస్ బౌలర్లను నిర్దయగా బాదేశారు. 28 బంతుల్లో ఇషాన్ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత ఇష్ సోధి వేసిన 12వ ఓవరైతే ప్రతి బంతి లైన్ అవతలే! మొదటి బంతి వైడ్ అయి ఊపిరి పీల్చుకుంటే తర్వాతి బంతుల్ని కిషన్ 4, 4, 4, 6, 4, 6లుగా బాదేశాడు. ఈ ఒక్క ఓవర్లోనే 29 పరుగులొచ్చాయి. బౌలర్లు ఎంతమంది మారినా... కిషన్ ధాటి మారనేలేదు. 26 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాక సూర్య నిష్క్రమించాడు. హార్దిక్ పాండ్యా కూడా దూకుడుగా ఆడటంతో 16వ ఓవర్లోనే భారత్ 200 మార్క్ చేరుకుంది. సాంట్నర్ 17వ ఓవర్లో పాండ్యా 6, 2, 4, 1 ధాటిని ప్రదర్శిస్తే మిగిలిన 2 బంతుల్ని సిక్స్లు బాదిన కిషన్ 42 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. ఫెర్గూసన్ వేసిన మూడో ఓవర్లో (2 పరుగులు, 1 వికెట్), సాంట్నర్ వేసిన 8వ ఓవర్లో మాత్రమే (5 పరుగులు) భారత్ బౌండరీ రాబట్టలేకపోయింది. అలెన్ అర్ధ సెంచరీ... ఆరంభంలోనే సీఫర్ట్ (5) అవుటైనా... అలెన్, రచిన్ రవీంద్ర (17 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్) న్యూజిలాండ్ స్కోరును పరుగెత్తించారు. రెండో వికెట్కు సరిగ్గా 100 పరుగులు జోడించాక అలెన్ దూకుడుకు అక్షర్ అడ్డుకట్ట వేశాడు. తర్వాత అర్‡్షదీప్, అక్షర్ కట్టుదిట్టమైన బౌలింగ్కు 20 పరుగుల వ్యవధిలో ఫిలిప్స్ (7), రచిన్, సాంట్నర్ (0) వికెట్లను కోల్పోవడంతో కివీస్ పనైపోయింది. మిచెల్ (26), ఆఖర్లో ఇష్ సోధి (15 బంతుల్లో 33; 1 ఫోర్, 3 సిక్స్లు) ధాటిగా ఆడటంతో న్యూజిలాండ్ 200 పైచిలుకు పరుగులు దాటగలిగింది.తిలక్ వర్మ రెడీ... టి20 ప్రపంచకప్నకు ముందు భారత జట్టుకు శుభవార్త. హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ పూర్తి స్థాయిలో కోలుకున్నాడు. గాయం కారణంగా న్యూజిలాండ్తో సిరీస్కు దూరమైన తిలక్... బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడు. అతడు మంగళవారం ముంబైలో టీమిండియాతో కలవనున్నాడు. కివీస్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో ఆకట్టుకోలేకపోయిన సంజు సామ్సన్ స్థానంలో టి20 ప్రపంచకప్లో ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ను ప్రారంభించడం ఖాయం కాగా... తిలక్ వర్మ మూడో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. 3 టి20ల్లో భారత్కు ఇది మూడో అత్యధిక స్కోరు. గతంలో 297/6 (బంగ్లాదేశ్పై), 283/1 (దక్షిణాఫ్రికాపై) సాధించింది.3 రోహిత్, కోహ్లి తర్వాత అంతర్జాతీయ టి20ల్లో 3 వేల పరుగులు పూర్తి చేసుకున్న మూడో భారత ఆటగాడిగా సూర్యకుమార్ (3030) నిలిచాడు. ఓవరాల్గా ఈ మైలురాయిని దాటిన 12 మందిలో అతి తక్కువ బంతుల్లో (1822) సూర్య ఈ ఘనతను అందుకోవడం విశేషం.1 అర్ష్ దీప్ కెరీర్లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన (5/51) నమోదు చేశాడు.స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ (బి) ఫెర్గూసన్ 30; సామ్సన్ (సి) జాకబ్స్ (బి) ఫెర్గూసన్ 6; ఇషాన్ కిషన్ (సి) ఫిలిప్స్ (బి) డఫీ 103; సూర్యకుమార్ (స్టంప్డ్) సీఫర్ట్ (బి) సాంట్నర్ 63; పాండ్యా (సి) జాకబ్స్ (బి) జేమీసన్ 42; రింకూ నాటౌట్ 8; దూబే నాటౌట్ 7; ఎక్స్ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 271. వికెట్ల పతనం: 1–31, 2–48, 3–185, 4–233, 5–261. బౌలింగ్: డఫీ 4–0–53–1, జేమీసన్ 4–0–59–1, ఫెర్గూసన్ 4–0–41–2, ఇష్ సోధి 3–0–48–0, ఫిలిప్స్ 1–0–10–0, సాంట్నర్ 4–0–60–1. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: సీఫర్ట్ (సి) పాండ్యా (బి) అర్ష్ దీప్ 5; అలెన్ (సి) రింకూ (బి) అక్షర్ 80; రచిన్ (సి) అక్షర్ (బి) అర్ష్ దీప్ 30; ఫిలిప్స్ (సి) రింకూ (బి) అక్షర్ 7; మిచెల్ (బి) అర్ష్ దీప్ 26; సాంట్నర్ (సి) సూర్య (బి) అర్ష్ దీప్ 0; జాకబ్స్ (బి) వరుణ్ 7; జేమీసన్ (బి) అర్ష్ దీప్ 9; ఇష్ సోధి (సి) అర్ష్ దీప్ (బి) రింకూ 33; ఫెర్గూసన్ (బి) అక్షర్ 3; డఫీ నాటౌట్ 9; ఎక్స్ట్రాలు 16; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్) 225 వికెట్ల పతనం: 1–17, 2–117, 3–131, 4–137, 5–137, 6–166, 7–179, 8–180, 9–191, 10–225. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–51–5, పాండ్యా 2–0–15–0, బుమ్రా 4–0–58–0, వరుణ్ 4–0–36–1, అక్షర్ 4–0–33–3, అభిషేక్ 1–0–13–0, రింకూ సింగ్ 0.4–0–7–1. -
చరిత్ర సృష్టించిన సూర్యకుమార్..
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. తిరువనంతపురం వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదో టీ20లో సూర్య మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగాడు. తన అద్భుత బ్యాటింగ్తో ఒకప్పటి సూర్యను గుర్తు చేశాడు. మైదానం నలుమూలల షాట్లు ఆడుతూ అభిమానులను అలరించాడు. కేవలం 30 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ఈ ముంబైకర్.. 4 ఫోర్లు, 6 సిక్స్లతో 63 పరుగులు చేశాడు. ఈ సిరీస్లో సూర్యకు ఇది మూడో అర్ధశతకం. రాయపూర్, గువహటి వేదికగా జరిగిన టీ20ల్లోనూ హాఫ్ సెంచరీలతో సత్తాచాటాడు. ఏదేమైనప్పటికీ టీ20 ప్రపంచకప్కు ముందు సూర్యకుమార్ తన ఫామ్ను తిరిగి అందుకోవడంతో టీమ్ మెనెజ్మెంట్ ఊపిరి పీల్చుకుంది. కాగా ఈ మ్యాచ్లో సూపర్ ఇన్నింగ్స్ ఆడిన సూర్య ఓ అరుదైన ఘనత సాధించాడు.అంతర్జాతీయ టీ20ల్లో బంతులు పరంగా అత్యంతవేగంగా 3000 పరుగుల మార్కును అందుకున్న ఆటగాడిగా సూర్య చరిత్ర సృష్టించాడు. ఈ ఫీట్ను స్కై కేవలం 1822 బంతుల్లోనే సాధించాడు. ఇంతుకుముందు ఈ రికార్డు యూఏఈ ఆటగాడు ముహమ్మద్ వసీమ్(1947) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో వసీంను సూర్య అధిగమించాడు. ఈ రికార్డును విరాట్ కోహ్లి (2169 బంతులు), రోహిత్ శర్మ (2149 బంతులు) వంటి దిగ్గజాల కంటే త్వరగా సూర్య అందుకోవడం గమనార్హం. కాగా ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 271 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (43 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్స్లతో 103 పరుగులు) అద్భుతమైన శతకంతో మెరిశాడు. -
టీమిండియా బ్యాటర్ల విధ్వంసం.. న్యూజిలాండ్ టార్గెట్ 272
తిరువనంతపురం వేదికగా న్యూజిలాండ్ జరుగుతున్న ఐదో టీ20లో టీమిండియా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 271 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సంజూ శాంసన్ ఆరంభంలోనే ఔటైనప్పటికి మిగితా బ్యాటర్లు మాత్రం కివీస్ బౌలర్లను ఉతికారేశారు.వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ విధ్వంసకర సెంచరీతో మెరిశాడు. సంజూ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన ఇషాన్ ప్రత్యర్ధి బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఓవరాల్గా 43 బంతులు ఎదుర్కొన్న ఇషాన్.. 4 ఫోర్లు, 10 సిక్స్లతో 103 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్(30 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 63) మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. అదేవిధంగా హార్దిక్ పాండ్యా(17 బంతుల్లో 1 ఫోర్లు, 4 సిక్స్లతో 42), అభిషేక్ శర్మ(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 30) దూకుడుగా ఆడారు. కివీస్ బౌలర్లలో ఫెర్గూసన్ రెండు, శాంట్నర్, జేమిసన్, డఫీ తలా వికెట్ సాధించారు. -
ఇషాన్ కిషన్ ఊచకోత.. 4 ఫోర్లు, 10 సిక్స్లతో వీర విహారం
తిరువనంతపురం వేదికగా న్యూజిలాండ్ జరుగుతున్న ఐదో టీ20లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. గ్రీన్ ఫీల్డ్ మైదానంలో కిషన్ సిక్సర్ల వర్షం కురిపించాడు. బౌలర్ ఎవరైనా తనకు తెలిసింది హిట్టింగ్ ఒక్కటే అన్నట్లగా కిషన్ ఇన్నింగ్స్ కొనసాగింది.ఈ క్రమంలో కిషన్ కేవలం 42 బంతుల్లోనే తొలి టీ20 అంతర్జాతీయ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. మొత్తంగా 43 బంతులు ఎదుర్కొన్న ఇషాన్.. 4 ఫోర్లు, 10 సిక్స్లతో 103 పరుగులు చేశాడు. అతడి మెరుపు బ్యాటింగ్కు ప్రత్యర్ధి ప్లేయర్లు సైతం ఫిదా అయిపోయారు.అతడితో పాటు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్(30 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 63) మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. అదేవిధంగా హార్దిక్ పాండ్యా(17 బంతుల్లో 1 ఫోర్లు, 4 సిక్స్లతో 42), అభిషేక్ శర్మ(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 30) దూకుడుగా ఆడారు. ఫలితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ఏకంగా 271 పరుగుల భారీ స్కోర్ సాధించింది. -
తీరు మారని సంజూ శాంసన్.. హోం గ్రౌండ్లోనూ
టీ20 వరల్డ్కప్-2026కు ముందు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. తిరువనంతపురం వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదో టీ20లో కూడా సంజూ దారుణ ప్రదర్శన కనబరిచింది. సొంత ప్రేక్షకుల ముందు శాంసన్ అట్టర్ ప్లాప్ అయ్యాడు.6 బంతులు ఎదుర్కొన్న శాంసన్ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి తీవ్ర నిరాశపరిచాడు. ఫెర్గూసన్ బౌలింగ్లో జాకబ్స్కు క్యాచ్ ఇచ్చి సంజూ ఔటయ్యాడు. ఈ సిరీస్ మొత్తంగా శాంసన్ కేవలం 46 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిని నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు.తిలక్ వర్మ పునరాగమనం చేస్తే తుది జట్టులో సంజూ స్ధానం గల్లంతే అంటూ పోస్ట్లు పెడుతున్నారు. గాయం కారణంగా న్యూజిలాండ్తో సిరీస్కు దూరంగా ఉన్న మిడిలార్డర్ బ్యాటర్ తిలక్ వర్మ.. త్వరలోనే జట్టులో చేరనున్నాడు. తిలక్ జట్టులోకి వస్తే ఇషాన్ కిషన్ లేదా సంజూ శాంసన్లో ఎవరో బెంచ్కే పరిమితమవ్వాలి. అయితే ఇషాన్ తన రీఎంట్రీలో సత్తాచాటుతున్నాడు. శాంసన్ కంటే ఈ జార్ఖండ్ వికెట్ కీపర్ బ్యాటర్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అంతేకాకుండా ఓపెనర్గా కూడా కిషన్కు మంచి రికార్డు ఉంది. ఈ నేపథ్యంలో సంజూపై వేటు పడడం ఖాయమన్పిస్తోంది. ఇషాన్ కిషన్.. అభిషేక్తో కలిసి భారత ఇన్నింగ్స్ను ప్రారంభించే అవకాశముంది.అంతకుముందు శుభ్మన్ గిల్ టీ20ల్లో రీఎంట్రీ ఇవ్వడంతో సంజూను బెంచ్కే పరిమితం చేశారు. ఆసియాకప్, సౌతాఫ్రికా సిరీస్లో ఇదే సీన్ రిపీట్ అయింది. దీంతో టీమ్మెనెజ్మెంట్పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో గిల్ను టీ20ల నుంచి తప్పించి మళ్లీ ఓపెనర్గా శాంసన్కు అవకాశమిచ్చారు. కానీ తనకు వచ్చిన ఛాన్స్ను ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ ఉపయోగించుకోలేకపోయాడు. -
ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల విజేతగా రిబకినా
ఆస్ట్రేలియా ఓపెన్-2026 మహిళల సింగిల్స్ విజేతగా కజకిస్తాన్ స్టార్ ఎలెనా రిబకినా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్ పోరులో ప్రపంచ నంబర్ 1 ఆర్యనా సబలెంకాపై 6-4, 4-6, 6-4 తేడాతో విజయం సాధించిన రిబకినా.. తొలి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ ఫైనల్ మ్యాచ్ ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగింది.తొలి సెట్లో నిలకడైన ఆటతో 6-4 తేడాతో రిబకినా గెలచుకుంది. అనంతరం సబలెంకా తన మార్కు పవర్ హిట్టింగ్తో పుంజుకుంది. ఈ సెట్లో రిబకినాను 6-4 తేడాతో ఓడించిన సబలెంక.. మ్యాచ్ను నిర్ణయాత్మక మూడో సెట్కు తీసుకెళ్లింది. నిర్ణయాత్మక సెట్లో కూడా సబలెంకా సత్తా చాటింది. వరుస గేమ్లు గెలుస్తూ 3-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లి టైటిల్ దిశగా సాగింది. అయితే ఆదే సమయంలో ఎలెనా రిబకినా అద్భుతమైన పోరాట పటిమ కనబరిచింది. సబలెంకా సర్వీస్ను వరుసగా రెండుసార్లు బ్రేక్ చేసిన రిబకినా, 6-4 తేడాతో సెట్ను సొంతం చేసుకుంది. తద్వారా తొలి ఆసీస్ ఓపెన్ టైటిల్ ఆమె ఖాతాలో చేరింది. -
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. స్టార్ ప్లేయర్ రీఎంట్రీ
తిరువనంతపురం వేదికగా ఐదో టీ20లో భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ ఆఖరి పోరులో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. గాయం నుంచి కోలుకున్న స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ తిరిగి జట్టులోకి వచ్చాడు.అదేవిధంగా గత మ్యాచ్కు దూరంగా ఉన్న ఇషాన్ కిషన్, వరుణ్ చక్రవర్తిలు కూడా పునరాగమనం చేశారు. అయితే వరుసగా నాలుగు మ్యాచ్లలో విఫలమైన వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్కు మరోసారి టీమ్మెనెజ్మెంట్ అవకాశమిచ్చింది. తన సొంతమైదానంలో సంజూ సత్తాచాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు కివీస్ ఏకంగా తమ జట్టులో నాలుగు మార్పులు చేసింది. లాకీ ఫెర్గూసన్, అలెన్, నీషమ్,జాకబ్స్ జట్టులోకి వచ్చారు.తుది జట్లున్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), ఫిన్ అలెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, బెవాన్ జాకబ్స్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), కైల్ జామిసన్, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీభారత్: అభిషేక్ శర్మ, సంజు సామ్సన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా -
సామ్ కరన్ హ్యాట్రిక్.. శ్రీలంకపై ఇంగ్లండ్ ఘన విజయం
టీ20 వరల్డ్కప్-2026కు ముందు ఇంగ్లండ్ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. శుక్రవారం పల్లెకెలె వేదికగా జరిగిన తొలి టీ20లో 11 పరుగుల తేడాతో(డక్ వర్త్ లూయిస్) ఇంగ్లండ్ విజయం సాధించింది. తొలుత వర్షం కారణంగా మ్యాచ్ను 17 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 16.2 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌటైంది.శ్రీలంక బ్యాటర్లలో కుశాల్ మెండిస్(37) టాప్ స్కోరర్గా నిలవగా.. పాతుమ్ నిస్సంక (23), షనక(20) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కరన్ హ్యాట్రిక్ వికెట్లతో మెరిశాడు. 16 ఓవర్ వేసిన కరన్ దాసున్ షనక, మహీష్ తీక్షణ, మతీష పతిరాణ వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. టీ20ల్లో హ్యాట్రిక్ సాధించిన రెండో ఇంగ్లండ్ బౌలర్గా నిలిచాడు.అతడితో పాటు అదిల్ రషీద్ మూడు, డాసన్ రెండు, ఓవర్టన్ తలా రెండు వికెట్లు సాధించారు. అనంతరం లక్ష్య చేధనలో ఇంగ్లండ్ 15 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. అయితే 15 ఓవర్ల తర్వాత భారీ వర్షం పడటంతో ఆట సాధ్యం కాలేదు.అప్పటికే డక్వర్త్ లూయిస్ పార్ స్కోర్ కంటే ఇంగ్లండ్ 11 పరుగులు ముందంజలో ఉండటంతో విజేతగా ప్రకటించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఓపెనర్ ఫిల్ సాల్ట్ (46) టాప్ స్కోరర్గా నిలవగా.. టామ్ బాంటన్ (29), బట్లర్(17) రాణించాడు. శ్రీలంక బౌలర్లలో ఇషాన్ మలింగ రెండు వికెట్లు సాధించాడు. -
విరాట్ కోహ్లి వికెట్ తీస్తే.. ఏం చేస్తానంటే?
ఐపీఎల్-2026లో ఉత్తరప్రదేశ్కు చెందిన యువ స్పిన్నర్ విశాల్ నిషాద్ సత్తాచాటేందుకు ఉవ్విళ్ళూరుతున్నాడు. గతేడాది డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో నిషాద్ను రూ. 30 లక్షల కనీస ధరకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఒక్క ఫస్ట్క్లాస్ మ్యాచ్ ఆడిన అనుభవం లేనప్పటికి అతడిపై పంజాబ్ యాజమాన్యం అతడిపై నమ్మకం ఉంచింది.అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నిషాద్.. తన స్పిన్ మయాజాలంతో అందరిని ఆకట్టుకున్నాడు. 2024 యూపీ టీ20 ప్రిమియర్ లీగ్ విశాల్ కెరీర్ను మలుపు తిప్పింది. ఈ టోర్నీలో గోరఖ్పూర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అతడు.. అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.గతేడాది సీజన్లో అతడు ఐపీఎల్లో ఆడుతాడని అంతా భావించారు. కానీ దురుదృష్టవశాత్తూ అప్పుడు అవకాశం లభించలేదు. అయితే ఇప్పుడు మాత్రం పంజాబ్ కింగ్స్ సువర్ణ అవకాశం కల్పించింది. తాజాగా ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిషాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి తనకు రోల్మోడల్ అని అతడు చెప్పుకొచ్చాడు.విరాట్ కోహ్లి నాకు ఆదర్శం. అతడు ఆడే ఫియర్ లెస్ క్రికెట్, కవర్ డ్రైవ్ షాట్లు నాకెంతో ఇష్టం. ఒకవేళ నేను కోహ్లి వికెట్ తీస్తే, సెలబ్రేషన్స్ చేసుకోను. అతడు నా రోల్ మోడల్ కాబట్టి నేరుగా వెళ్లి తన పాదాలకు నమస్కరిస్తాను. నేను ఎన్నో కష్టాలు పడి ఈ స్దాయికి చేరుకున్నాను. మా నాన్నతో పాటు పనికి వెళ్లేవాడిని. ఒకనొక సమయంలో క్రికెట్ వదిలేయాలని కూడా అనుకున్నాను. క్రికెటర్ కావడం చాలా కష్టమని, వేరే ఏదైనా వర్క్ చేసుకోమని మా అమ్మ సూచించింది. కానీ నేను మాత్రం నా ఆశయాన్ని వదులుకోలేదు. ఏదో ఒక రోజు కచ్చితంగా విజయం సాధిస్తాను అని మా అమ్మతో అన్నాను. ఆ తర్వాత నా కుటంబం కూడా సపోర్ట్ చేసింది. అందరి సహకరంతో ఇప్పుడు నా కలను నేరవేర్చుకున్నా అని 20 ఏళ్ల నిషాద్ పేర్కొన్నాడు. -
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం.. వరల్డ్కప్లో ఆడేది డౌటే?
టీ20 ప్రపంచకప్-2026కు రంగం సిద్దమైంది. ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలగా ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. అయితే ఈ టోర్నీలో పాకిస్తాన్ ఆడుతుందా? లేదా అన్నది? ఇంకా క్లారిటీ లేదు. ఓ వైపు వరల్డ్కప్ కోసం తమ జట్టును శ్రీలంకకు పంపేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వార్తలు వస్తుండగా.. మరోవైపు ప్రభుత్వ అనుమతి కోసం ఇంకా పీసీబీ ఎదురు చూస్తున్నట్లు ప్రచారం జరగుతోంది.ఒకవేళ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఫిబ్రవరి 2న శ్రీలంకకు పాక్ పయనం కానుంది. అయితే ఈ మెగా టోర్నీ కోసం తమ కొత్త జెర్సీని ఆసీస్తో రెండో టీ20 సందర్భంగా విడుదల చేస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ముందుగా ప్రకటించింది. అయితే ఇప్పుడు తమ జెర్సీ కిట్ లాంచ్ కార్యక్రమాన్ని పీసీబీ రద్దు చేసింది.ఇందుకు ప్రధాన కారణం పాక్ ప్రభుత్వం నుండి ఇంకా అనుమతి లభించకపోవడమేనని తెలుస్తోంది. పాక్ వరల్డ్కప్లో పాల్గొనడంపై తుది నిర్ణయం సోమవారం(ఫిబ్రవరి 2) వెలువడే అవకాశం ఉంది. కాగా ఈ మెగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్ ఇప్పటికే తప్పుకొన్న సంగతి తెలిసిందే.అయితే బంగ్లాదేశ్కు మద్దతుగా నిలుస్తూ పీసీబీ కూడా టోర్నీని బహిష్కరిస్తుమని ఉడత బెదరింపులకు దిగింది. కానీ ఐసీసీ జోక్యం చేసుకోవడంతో పీసీబీ వెనుక్కి తగ్గింది. కానీ టోర్నీలో పాల్గోనడంపై మాత్రం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. పాకిస్తాన్ ప్రస్తుతం స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడుతోంది.వరల్డ్కప్ టోర్నీకి పాక్ జట్టు ఇదేసల్మాన్ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖవాజా నఫే, మహ్మద్ నవాజ్, సల్మాన్ మీర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, షాహీన్ షా ఆఫ్రిది, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, ఉస్మాన్ తారీక్ -
ఆరోజు అందుకే అబద్ధం చెప్పాను: హ్యారీ బ్రూక్
ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మాట మార్చాడు. నైట్క్లబ్ గొడవ విషయంలో గతంలో తాను అబద్ధం చెప్పినట్లు అంగీకరించాడు. సహచర క్రికెటర్లను కాపాడుకునేందుకు మాత్రమే తాను ఆరోజు అలా మాట్లాడినట్లు తాజాగా స్పష్టం చేశాడు.దెబ్బలు తిన్న బ్రూక్గతేడాది ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య మూడో వన్డేకు ముందు (అక్టోబరు 31 రాత్రి) హ్యారీ బ్రూక్ (Harry Brook) ఓ నైట్క్లబ్కు వెళ్లాడు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. మద్యం తాగాడనే అనుమానంతో ఓ బౌన్సర్ అతడిని అడ్డుకున్నాడు. దీంతో బ్రూక్ వాగ్వాదానికి దిగగా.. సదరు బౌన్సర్ అతడిని కొట్టినట్లు వార్తలు వచ్చాయి.హద్దుమీరి ప్రవర్తించానుఈ ఘటన జరిగిన రెండు నెలల తర్వాత.. యాషెస్ టెస్టు సిరీస్ సమయంలో వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై స్పందిస్తూ.. ‘‘ఆరోజు నేను హద్దుమీరి ప్రవర్తించాను. అందుకు క్షమాపణలు చెబుతున్నాను. నా ప్రవర్తన నా జట్టు, దేశానికి తలవంపులు తీసుకువచ్చింది.కెప్టెన్గా నాకు దక్కిన గౌరవానికి భంగం కలగకుండా ఇకపై ఇలాంటి తప్పులు చేయబోను’’ అని బ్రూక్ మీడియా ముఖంగా తెలియజేశాడు. ఆ సమయంలో నైట్క్లబ్కు తాను ఒక్కడినే వెళ్లినట్లు పేర్కొన్నాడు. అయితే, ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు.. బ్రూక్కు రూ. 33 లక్షల మేర జరిమానా విధించింది. అంతేకాదు.. ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.జేకబ్ బెతెల్, జోష్ టంగ్ కూడాఅయితే, ఈ విషయంపై టెలిగ్రాఫ్ తాజాగా ఓ కథనం ప్రచురించింది. బ్రూక్తో పాటు జేకబ్ బెతెల్, జోష్ టంగ్ కూడా ఉన్నారని.. వారికి కూడా ఫైన్ పడిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో శ్రీలంకతో శుక్రవారం నాటి తొలి టీ20లో విజయం తర్వాత ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ స్పందించాడు.‘‘వెల్లింగ్టన్లో నా చర్యలకు నేనే పూర్తి బాధ్యత వహిస్తాను. ఆరోజు నాతో పాటు ఇతరులు కూడా ఉన్నారని నేను అంగీకరిస్తున్నా. గతంలో నేను చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నా.గుణపాఠాలు నేర్చుకుంటున్నాఅయితే, ఆరోజు నా సహచర క్రికెటర్లను కాపాడుకునేందుకు మాత్రమే అలా అబద్ధం చెప్పాను. వారిని వివాదంలోకి లాగవద్దని భావించాను. ఈ విషయంలో నేను మళ్లీ క్షమాపణలు కోరుతున్నా. నా కెరీర్లో ఇప్పుడు కఠిన, సవాలుతో కూడిన దశ నడుస్తోంది. దీని నుంచి నేను ఎన్నో గుణపాఠాలు నేర్చుకుంటున్నా’’ అని హ్యారీ బ్రూక్ వెల్లడించాడు.చదవండి: WC 2026: భారత్తో మ్యాచ్కు ముందు పాకిస్తాన్కు భారీ షాక్ -
T20 WC 2026: ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతడితో పాటు టాపార్డర్ బ్యాటర్ మాథ్యూ షార్ట్ కూడా అందుబాటులో లేకుండా పోయాడు.కమిన్స్ స్థానంలో అతడేకమిన్స్, షార్ట్ గాయాల నుంచి కోలుకోని కారణంగా టోర్నీకి దూరమైనట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (CA) శనివారం ధ్రువీకరించింది. ఈ విషయం గురించి సెలక్టర్ టోనీ డోడ్మేడ్ మాట్లాడుతూ.. ‘‘వెన్నునొప్పి నుంచి కోలుకోవడానికి ప్యాట్ కమిన్స్కు ఇంకాస్త సమయం పడుతుంది. అందుకే టోర్నీలో పాల్గొనడం లేదు.కమిన్స్ స్థానంలో లెఫ్టార్మ్ పేసర్ బెన్ డ్వార్షుయిస్ను ఎంపిక చేశాము. ఫీల్డింగ్లో రాణించడంతో పాటు లోయర్ ఆర్డర్లో హిట్టింగ్ కూడా చేయగలడు. బంతి బాగా స్వింగ్ చేయగల బెన్ రాక పేస్ దళానికి మరింత వైవిధ్యం తీసుకువస్తుంది’’ అని తెలిపాడు.మాథ్యూ షార్ట్కు బదులు అతడేఅదే విధంగా.. మాథ్యూ షార్ట్ స్థానంలో మ్యాట్ రెన్షాను వరల్డ్కప్ జట్టులో చేర్చినట్లు టోనీ ఈ సందర్భంగా వెల్లడించాడు. ‘‘ఆస్ట్రేలియా తరఫున వైట్బాల్ క్రికెట్లో, బిగ్బాష్ లీగ్లో రెన్షా అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. మిడిలార్డర్లో అతడు జట్టుకు బలంగా మారుతాడు’’ అని పేర్కొన్నాడు.కాగా భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్య ఇస్తున్న టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య జరుగనుంది. మిచెల్ మార్ష్ సారథ్యంలో ఆసీస్ ఈ మెగా టోర్నీ బరిలో దిగనుంది.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి ఆస్ట్రేలియా జట్టు (Updated)మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్వెల్, మ్యాట్ రెన్షా, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.చదవండి: WC 2026: భారత్తో మ్యాచ్కు ముందు పాకిస్తాన్కు భారీ షాక్ -
T20 WC: అభిషేక్ శర్మ కాదు!.. ఈసారి అతడే టాప్!
పొట్టి క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి ఫిబ్రవరి 7న తెరలేవనుంది. భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా ఈవెంట్లో ఇరవై జట్లు పాల్గొంటున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈసారి బరిలోకి దిగుతున్న.. అద్భుత ఫామ్తో ఈసారీ హాట్ ఫేవరెట్గా మారింది.ఇక ఇప్పటికే మెగా టోర్నీకి భారత్ తమ జట్టును ప్రకటించింది. అదే జట్టుతో స్వదేశంలో న్యూజిలాండ్తో ఐదు టీ20ల సిరీస్ను 3-1తో కైవసం చేసుకుంది. మూడు విభాగాల్లోనూ ఆటను మెరుగుపరచుకుంటూ ప్రత్యర్థి జట్లకు కఠిన సవాలుగా మారింది సూర్య సేన.అభిషేక్ శర్మ కాదు!.. ఈ నేపథ్యంలో మెజారిటీ మంది మాజీ క్రికెటర్లు ఈసారి టీమిండియా సెమీస్ చేరడం ఖాయమని.. టైటిల్ పోరుకు కూడా అర్హత సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ స్టార్ స్పోర్ట్స్ షోలో భాగంగా.. టాప్ రన్ స్కోరర్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీమెంట్ అవార్డుల విజేతల గురించి తన అంచనాలు తెలియజేశాడు.ఈసారీ అతడే టాప్!గత ఎడిషన్ మాదిరే ఈసారి కూడా టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలుస్తాడని చహల్ పేర్కొన్నాడు. ఇక భారత విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మను టాప్ రన్ స్కోరర్గా అంచనా వేసిన యుజీ.. ఈసారి అత్యధిక సిక్సర్లు బాదేది అతడే అని పేర్కొన్నాడు.భారత్- పాక్ ముఖాముఖి పోటీఅదే విధంగా.. టాప్ వికెట్ టేకర్గా బుమ్రాకు పట్టం కట్టాడు చహల్. ఇక ఈ మెగా టోర్నీలో తాను భారత్- పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానన్న చహల్.. జట్ల అత్యధిక స్కోరును 240 పరుగులుగా అంచనా వేశాడు. కాగా కొలంబో వేదికగా ఫిబ్రవరి 15న భారత్- పాక్ ముఖాముఖి తలపడతాయి.ఇదిలా ఉంటే.. 35 ఏళ్ల చహల్ 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు. అయితే, ఈ టోర్నీలో అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా బెంచ్కే పరిమితం అయ్యాడు. మరోవైపు.. టోర్నీ ఆసాంతం అదరగొట్టిన బుమ్రా.. ఎనిమిది మ్యాచ్లలో కలిపి పదిహేను వికెట్లు కూల్చాడు. టీమిండియా చాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. చదవండి: WC 2026: భారత్తో మ్యాచ్కు ముందు పాకిస్తాన్కు భారీ షాక్ -
పాకిస్తాన్కు ఘోర అవమానం
గత కొంతకాలంగా విదేశీ జట్లు పాకిస్తాన్కు పర్యటనకు వచ్చి ఆల్ఫార్మాట్ సిరీస్లు ఆడుతున్నాయి. బంగ్లాదేశ్, శ్రీలంక వంటి ఆసియా జట్లతో పాటు.. SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.కెప్టెన్ సహా కీలక ప్లేయర్లు దూరంఈ క్రమంలో తాజాగా ఆస్ట్రేలియా పాక్ పర్యటనకు వెళ్లింది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి సన్నాహకంగా ఆతిథ్య జట్టుతో మూడు టీ20లకు షెడ్యూల్ ఖరారు కాగా.. లాహోర్లో తొలి టీ20లో పాక్ గెలిచింది. అయితే, ఈ మ్యాచ్కు ఆసీస్ రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ మార్ష్ దూరంగా ఉన్నాడు. అతడి స్థానంలో ట్రవిస్ హెడ్ జట్టును ముందుకు నడిపించాడు.మార్ష్తో పాటు మార్కస్ స్టొయినిస్, జోష్ ఇంగ్లిస్, బెన్ డ్వార్షుయిస్ తదితర స్టార్లు కూడా ఈ మ్యాచ్కు దూరంగా ఉన్నారు. ఇక ఈ సిరీస్కు ముందే ప్యాట్ కమిన్స్, జోష్ హాజిల్వుడ్, టిమ్ డేవిడ్, గ్లెన్ మాక్స్వెల్, నాథన్ ఎల్లిస్ వంటి కీలక ఆటగాళ్లకు క్రికెట్ ఆస్ట్రేలియా (CA) విశ్రాంతినిచ్చింది. వీళ్లంతా ఇప్పుడిప్పుడే గాయాల నుంచి కోలుకున్నందున సీఏ ఈ నిర్ణయం తీసుకుందని భావించవచ్చు.ముగ్గురి అరంగేట్రంఅంతేకాదు పాక్తో తొలి టీ20 సందర్భంగా ఆసీస్ ఏకంగా ముగ్గురు ఆటగాళ్లను అరంగేట్రం చేయించింది. మహ్లి బియర్డ్మాన్, జాక్ ఎడ్వర్డ్స్లకు తొలిసారి క్యాపులు అందించిన సీఏ.. మ్యాట్ రెన్షాకు తొలి టీ20 అవకాశం ఇచ్చింది. అయితే, అంతకుముందు మిగిలిన SENA దేశాల జట్లు కూడా తమ కీలక ఆటగాళ్లను కాకుండా.. మెజారిటీ భాగం ద్వితీయ శ్రేణి జట్లతోనే పాక్లో పర్యటించాయి.ఘోర అవమానం ఇదిఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ స్థాయి దిగజారిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పాక్ను తేలికగా తీసుకుంటున్నందునే ఈ మేటి జట్లు తమ కీలక ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగుతున్నాయనే అభిప్రాయాలు పెరిగాయి. పాక్ క్రికెట్ విశ్లేషకుడు ఒమైర్ అలవి కూడా ఇదే మాట అంటున్నాడు.‘‘తమ జట్టులోని కొంతమంది ప్రధాన ఆటగాళ్లు లేకుండానే ఆస్ట్రేలియా ఇక్కడికి వచ్చింది. అదే విధంగా.. తొలి టీ20లో వారి అత్యుత్తమ ప్లేయర్లను ఆడించనేలేదు. నా దృష్టిలో పాకిస్తాన్ క్రికెట్ అభిమానులకు ఇది ఘోర అవమానం’’ అని ఒమైర్ విచారం వ్యక్తం చేశాడు.వీకెండ్ జట్లతో పాకిస్తాన్కుఇక పాక్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ కూడా ఇలాగే స్పందించాడు. ‘‘ఇటీవల కాలంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా దేశాలు తమ వీకెండ్ జట్లతో పాకిస్తాన్కు వచ్చాయి. ఏదో సిరీస్ ఆడాలి కాబట్టి మొక్కుబడిగా ఈ పని చేస్తున్నాయని అనిపిస్తోంది’’ అని ఒక రకంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తీరును ఎద్దేవా చేశాడు.సిరీస్ గెలిస్తే చాలుఅయితే, పాక్ జట్టు మాజీ చీఫ్ సెలక్టర్ హారూన్ రషీద్ మాత్రం అవమానంలో కూడా మంచి వెదికే ప్రయత్నం చేశాడు. ‘‘సిరీస్లో ఏ ఆటగాళ్లు ఆడుతున్నారన్న అంశంతో సంబంధం లేదు. ప్రత్యర్థి ఎవరైనా.. ఎలా ఉన్న ద్వైపాక్షిక సిరీస్ గెలిచామన్న సంతోషం ఉంటుంది. వాళ్లు బెస్ట్ ప్లేయర్లను పంపినా.. ఇంకెవరిని పంపినా మనకేమీ ఇబ్బంది లేదు. సిరీస్ గెలిస్తే చాలు’’ అని పాక్ ఆట తీరును కొనియాడుతూనే.. తెలియకుండానే పాక్ ప్రస్తుత జట్టును తక్కువ చేసేలా మాట్లాడాడు. కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య టీ20 ప్రపంచకప్ టోర్నీ జరుగనుండగా.. భారత్లో కాకుండా.. తటస్థ వేదికైన శ్రీలంకలో పాక్ తమ మ్యాచ్లు ఆడుతుంది.చదవండి: WC 2026: భారత్తో మ్యాచ్కు ముందు పాకిస్తాన్కు భారీ షాక్ -
IND vs NZ: అతడికి ఇదే లాస్ట్ ఛాన్స్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు ముందు టీమిండియా న్యూజిలాండ్తో ఆఖరి మ్యాచ్కు సిద్ధమైంది. తిరువనంతపురం వేదికగా భారత్- కివీస్ మధ్య శనివారం ఐదో టీ20కి షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో అందరి కళ్లు స్థానిక ఆటగాడు సంజూ శాంసన్పైనే ఉన్నాయి.గతేడాది కాలంలో టీమిండియా టీ20 ఓపెనర్గా రాణించిన సంజూ (Sanju Samson).. కివీస్తో గత నాలుగు మ్యాచ్లలో మాత్రం తేలిపోయాడు. ముఖ్యంగా వరల్డ్కప్ వంటి మెగా టోర్నీకి ముందు అతడు ఇలా విఫలం కావడం ఆందోళనకరంగా మారింది.మరోవైపు.. ఇషాన్ కిషన్ (Ishan Kishan) రూపంలో సంజూకు పోటీ తీవ్రతరమైంది. కివీస్ ఆఖరి మ్యాచ్లోనూ ఈ కేరళ స్టార్ విఫలమైతే.. ప్రపంచకప్ టోర్నీలో వికెట్ కీపర్గా.. ఓపెనర్గా అతడి స్థానాన్ని ఇషాన్ భర్తీ చేసే అవకాశాలు పెరుగుతాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు.మరింత ఒత్తిడి "తిరువనంతపురంలో ఆఖరి మ్యాచ్. హోం బాయ్ సంజూ శాంసన్కు కూడా బహుశా ఇదే చివరి అవకాశం కావొచ్చు. ఈ మ్యాచ్లో అతడిపై ఒత్తిడి మరింత పెరగడం ఖాయం. గత కొన్నాళ్లుగా అతడు పరుగులు రాబట్టడంలో ఇబ్బంది పడుతున్నాడు.ఆత్మవిశ్వాసంతో షాట్లు ఆడలేకపోతున్నాడు. మరోవైపు.. ఇషాన్ కిషన్ దుమ్ములేపుతున్నాడు. కాబట్టి కివీస్తో ఐదో టీ20లో సంజూ బాగానే ఆడినా.. టీ20 ప్రపంచకప్లో ఓపెనర్గా అతడి స్థానం సుస్థిరం అని చెప్పలేము.అలా అనుకుంటే తప్ప చోటు కష్టమేఒకవేళ టాపార్డర్లో ముగ్గురు ఎడమచేతి వాటం బ్యాటర్లు వద్దు అని మేనేజ్మెంట్ అనుకుంటే మాత్రమే సంజూ.. ఇషాన్ను దాటి తుదిజట్టులోకి రాగలడు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా గత నాలుగు మ్యాచ్లలో సంజూ చేసిన స్కోర్లు 10, 6, 0, 24.ఇదిలా ఉంటే.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మతో పాటు వన్డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ కూడా లెఫ్టాండర్ బ్యాటర్ అన్న సంగతి తెలిసిందే. ఇషాన్ కూడా ఎడమచేతి వాటం ఆటగాడే. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా పైవిధంగా వ్యాఖ్యలు చేశాడు. కాగా తిలక్ వర్మ గాయం నుంచి కోలుకుని వరల్డ్కప్తో నేరుగా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్ మొదలుకానుంది. ఇందుకు భారత్- శ్రీలంక వేదికలు.చదవండి: WC 2026: భారత్తో మ్యాచ్కు ముందు పాకిస్తాన్కు భారీ షాక్ -
T20 WC 2026: సెమీస్ చేరే జట్లు ఇవే: రషీద్ ఖాన్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఐసీసీ ఈవెంట్లో తాము తప్పక సెమీ ఫైనల్ చేరతామని ధీమా వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా.. ఆస్ట్రేలియా స్టార్ ప్యాట్ కమిన్స్ను సరదాగా ట్రోల్ చేశాడు రషీద్ ఖాన్.టీ20 వరల్డ్కప్ గత ఎడిషన్ అమెరికా- వెస్టిండీస్ వేదికగా 2024లో జరిగిన విషయం తెలిసిందే. నాటి టోర్నీలో అఫ్గనిస్తాన్ అనూహ్య రీతిలో సెమీస్ చేరి సత్తా చాటింది. అయితే, సెమీ ఫైనల్లో సౌతాఫ్రికా చేతిలో ఓడిపోవడంతో నిరాశగా ఇంటిబాట పట్టింది.ఇదిలా ఉంటే.. భారత్- శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య వరల్డ్కప్ 2026 ఎడిషన్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్తక్తో మాట్లాడిన రషీద్ ఖాన్ (Rashid Khan)కు.. ‘ఈసారి సెమీ ఫైనలిస్టులు ఎవరు అనుకుంటున్నారు?’ అనే ప్రశ్న ఎదురైంది.ఓ వ్యక్తి ఒక్క టీమ్ పేరు మాత్రమే చెప్పి..ఇందుకు బదులిస్తూ 2024లో ప్యాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలను రషీద్ ఖాన్ గుర్తు చేశాడు. ‘‘మీకు గుర్తుందా? 2024 వరల్డ్కప్ సమయంలో ఓ ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి ఒక్క టీమ్ పేరు మాత్రమే చెప్పి.. మిగిలినవి మిమ్మల్నే ఎంచుకోమన్నాడు’’ అంటూ కమిన్స్ను టీజ్ చేశాడు.కాగా గతంలో కమిన్స్ (Pat Cummins) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఆస్ట్రేలియా కచ్చితంగా సెమీస్ చేరుతుంది. మిగిలిన మూడు జట్లు ఏవైనా మాకు సంబంధం లేదు. డోంట్ కేర్’’ అని పేర్కొన్నాడు. రషీద్ ఖాన్ తాజాగా కమిన్స్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. అఫ్గనిస్తాన్ తప్పక సెమీస్ చేరుతుందని చెప్పకనే చెప్పాడు.సెమీస్ చేరే జట్లు ఇవేఅయితే, టోర్నీ ఆరంభంలోనే ఈ అంచనాలు సరికావన్న రషీద్ ఖాన్.. పిచ్ పరిస్థితులు, జట్ల బలాబలాల దృష్ట్యా సెమీ ఫైనల్ చేరే నాలుగు జట్లను ఎంచుకున్నాడు. అఫ్గనిస్తాన్తో పాటు టీమిండియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ టాప్-4లో నిలుస్తాయని రషీద్ ఖాన్ జోస్యం చెప్పాడు.కాగా ఇరవై జట్లు పాల్గొంటున్న టీ20 ప్రపంచకప్ టోర్నీలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా, కెనడా, యూఏఈలతో కలిసి అఫ్గనిస్తాన్ గ్రూప్-డిలో ఉంది. ఈ ఐసీసీ ఈవెంట్లో భాగంగా.. ఫిబ్రవరి 8న కివీస్తో.. ఫిబ్రవరి 11న సఫారీలతో.. ఫిబ్రవరి 16న యూఏఈతో.. ఫిబ్రవరి 19న కెనడాతో అఫ్గన్ తలపడుతుంది. చదవండి: ICC vs BCB: బంగ్లాదేశ్కు షాక్.. తొలిసారి స్పందించిన శ్రీలంకThat "don't care" was personal 😭 pic.twitter.com/SLFoz0fGFK— EngiNerd. (@mainbhiengineer) June 15, 2024 -
World Cup 2026: పాకిస్తాన్కు భారీ షాక్!
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భారత్తో కీలక మ్యాచ్కు ముందు వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ షయాన్ గాయపడ్డాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా ప్రపంచకప్ టోర్నీలో మిగిలిన మ్యాచ్లకు అతడు దూరమయ్యాడు.మూడు బెర్తులు ఖరారుజింబాబ్వే వేదికగా ఐసీసీ అండర్-19 వరల్డ్కప్-2026 టోర్నీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే సూపర్ సిక్స్ దశలో గ్రూప్-1 నుంచి ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్.. గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్ సెమీ ఫైనల్కు అర్హత సాధించాయి.నాలుగో జట్టు ఏది?ఇక నాలుగో బెర్తు కోసం చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ మధ్య ఆదివారం బులవాయో వేదికగా మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఇప్పటికి ఆడిన మూడింటికి మూడు మ్యాచ్లలో గెలిచి భారత యువ జట్టు ఆరు పాయింట్లు సాధించగా.. పాక్ మూడింట రెండు గెలిచి నాలుగు పాయింట్లతో ఉంది.ముక్కుకు గాయంఇక నెట్రన్రేటు పరంగానూ భారత్ (+3.337) పాకిస్తాన్ కంటే (+1.484) మెరుగైన స్థితిలో ఉంది. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్కు భారీ షాక్ తగిలింది. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ షయాన్ ప్రాక్టీస్ మ్యాచ్లో గాయపడ్డాడు. ఫాస్ట్బౌలర్ వేసిన బంతి కారణంగా అతడి ముక్కుకు గాయమైంది. ఆస్పత్రికి తరలించి స్కానింగ్ చేయించగా ఫ్రాక్చర్ ఉన్నట్లు తేలింది. ఇందుకు సంబంధించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది. సచిన్ సూచనలుమరోవైపు.. హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న భారత్.. పాక్తో కీలక సమరానికి ముందు టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్తో వర్చువల్గా భేటీ అయింది. ఆన్లైన్లో యువ ఆటగాళ్లను పలకరించిన సచిన్.. ఆటకు సంబంధించిన టెక్నిక్స్తో పాటు క్రమశిక్షణ, అంకితభావం గురించి మాట్లాడుతూ వారిలో స్ఫూర్తి నింపాడు. చదవండి: భారీ శతకం బాదిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్.. ట్రోలింగ్ కూడా భారీగానే..! -
అభిరథ్ రెడ్డి, హిమతేజ సెంచరీలు
సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్గఢ్తో జింఖానా మైదానంలో రంజీ ట్రోఫీ గ్రూప్ ‘డి’ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. ఓవర్నైట్ స్కోరు 56/0తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 105 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 415 పరుగులు చేసింది. ఓపెనర్ అభిరథ్ రెడ్డి (121; 16 ఫోర్లు, 1 సిక్స్), మిడిలార్డర్ బ్యాటర్ కొడిమెల హిమతేజ (125 బ్యాటింగ్; 13 ఫోర్లు) సెంచరీలు సాధించారు. అమన్ రావు (52; 8 ఫోర్లు, 1 సిక్స్)తో తొలి వికెట్కు 96 పరుగులు జోడించిన అభిరథ్... మూడో వికెట్కు హిమతేజతో 147 పరుగులు జత చేశాడు. ప్రజ్ఞయ్ రెడ్డి (52 బ్యాటింగ్; 8 ఫోర్లు, 1 సిక్స్), హిమతేజ ఐదో వికెట్కు అజేయంగా 91 పరుగులు జోడించాడు. శుక్రవారం నాటి రెండో రోజు ఆట ముగిసేసరికి హైదరాబాద్ 132 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆంధ్ర 267/5 నాగాలాండ్ జట్టుతో సొవిమాలో జరుగుతున్న గ్రూప్ ‘ఎ’ రంజీ ట్రోఫీ లీగ్ మ్యాచ్లో... రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు కోల్పోయి 267 పరుగులు చేసింది. అభిషేక్ రెడ్డి (51; 7 ఫోర్లు), కరణ్ షిండే (51; 5 ఫోర్లు, 1 సిక్స్), సీఆర్ జ్ఞానేశ్వర్ (87 బ్యాటింగ్; 11 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. ప్రస్తుతం నాగాలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 366కు ఆంధ్ర మరో 99 పరుగుల దూరంలో ఉంది. జ్ఞానేశ్వర్తో కలిసి శశికాంత్ (31 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. -
ముగ్గురు భారత అంపైర్లకు చోటు
దుబాయ్: ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరిగే టి20 ప్రపంచ కప్లో పని చేయనున్న అంపైర్లు, రిఫరీలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించింది. 24 మంది అంపైర్లతో పాటు ఆరుగురు మ్యాచ్ రిఫరీలు ఈ జాబితాలో ఉన్నారు. భారత మాజీ పేసర్, సీనియర్లలో ఒకడైన జవగల్ శ్రీనాథ్ రిఫరీగా కొనసాగనుండగా...అతనితో పాటు డీన్ కోస్కర్, డేవిడ్ గిల్బర్ట్, రంజన్ మదుగలే, ఆండ్రూ పైక్రాఫ్ట్, రిచీ రిచర్డ్సన్ రిఫరీ బాధ్యతలు నిర్వర్తిస్తారు. అంపైర్లలో భారత్ నుంచి నితిన్ మేనన్, అనంత పద్మనాభన్, జె.మదన్ గోపాల్లకు అవకాశం దక్కింది. ఐసీసీ ఎలీట్ ప్యానెల్ అంపైర్ల జాబితాలో ఉన్న ఏకైక భారతీయుడైన నితిన్ మేనన్కు ఇది నాలుగో టి20 వరల్డ్ కప్ కానుంది. గతంలో అతను 2021, 2022, 2024లలో కూడా అంపైర్గా వ్యవహరించాడు. భారత్, న్యూజిలాండ్ సిరీస్లో భాగంగా నేడు జరిగే మ్యాచ్లో అంపైర్గా బాధ్యతలు నిర్వహించనున్న 42 ఏళ్ల మేనన్కు ఇది మూడు ఫార్మాట్లలో కలిపి 150 అంతర్జాతీయ (పురుషుల) మ్యాచ్ కానుంది. ఈ ఘనత సాధించిన తొలి భారత అంపైర్గా అతను నిలవనున్నాడు. మదన్గోపాల్కు ఇది రెండో టి20 వరల్డ్ కప్ కాగా, పద్మనాభన్కు తొలిసారి ప్రపంచ కప్ చాన్స్ లభించింది. రోలండ్ బ్లాక్, క్రిస్ బ్రౌన్, కుమార్ ధర్మసేన, క్రిసన్ గాఫ్నీ, ఆడ్రియన్ హోల్డ్స్టాక్, రిచర్డ్ ఇల్లింగ్వర్త్, రిచర్డ్ కెటిల్బరో, వేన్ నైట్స్, డొనొవాన్ కాచ్, స్యామన్ నొగాస్కీ, అల్లావుద్దీన్ పలేకర్, అహ్సాన్ రజా, లెస్లీ రీఫర్, పాల్ రీఫెల్, లాంగ్టన్ రూసెర్, షర్ఫుద్దౌలా షాహిద్, గాజీ సొహెల్, రాడ్నీ టకర్, అలెక్స్ వార్స్, రవీంద్ర విమలసిరి, ఆసిఫ్ యాఖూబ్ కూడా అంపైర్లుగా టి20 వరల్డ్ కప్లో పని చేయనున్నారు. -
పీటీ ఉష ఇంట్లో విషాదం
కోజికోడ్: దిగ్గజ అథ్లెట్, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉష ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త వి.శ్రీనివాసన్ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. తమ నివాసంలో అనూహ్యంగా కుప్పకూలిన శ్రీనివాసన్ను సన్నిహితులు ఆస్పత్రికి తీసుకెళ్లినా... అప్పటికే ఆయన మరణించారు. స్వతహాగా కబడ్డీ క్రీడాకారుడు అయిన శ్రీనివాసన్ సెంట్రల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)లో డిప్యూటీ ఎస్పీగా పని చేసి రిటైరయ్యారు. ఉష కెరీర్లో అన్ని విధాలా సహకారం అందిస్తూ ప్రోత్సహించడంతో పాటు ఆమె పురోగతిలో భర్త కీలక పాత్ర పోషించారు. 90వ దశకంలో ఉష రిటైర్మెంట్ ప్రకటించి ఆటకు దూరమైన తర్వాత మళ్లీ 1998 ఆసియా చాంపియన్షిప్ ద్వారా ఆమె ట్రాక్పైకి పునరాగమనం చేసేందుకు శ్రీనివాసన్ అండగా నిలిచారు. రిటైర్మెంట్ తర్వాత ఆయన ఉష స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ నిర్వహణా వ్యవహారాలు చూస్తున్నారు. వీరిద్దరికి ‘ఉజ్వల్’ అనే ఒక కుమారుడు ఉన్నాడు. ఉషతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ ఆమె భర్త మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. -
క్రమశిక్షణ తప్పినందుకే...
న్యూఢిల్లీ: ప్రొ లీగ్ టోర్నీ కోసం గురువారం 33 మంది ప్రాబబుల్స్తో ప్రకటించిన భారత హాకీ జట్టులో స్టార్ ప్లేయర్ మన్ప్రీత్ సింగ్కు చోటు దక్కకపోవడం చర్చకు దారి తీసింది. మన్ప్రీత్తో పాటు మరో ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు దిల్ప్రీత్ సింగ్, కృషన్ బహదూర్ పాఠక్లను టీమ్ నుంచి తప్పించారు. అయితే వీరంతా తీవ్ర క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడినందుకు ఈ చర్య తీసుకున్నట్లు హాకీ ఇండియా (హెచ్ఐ) వర్గాలు వెల్లడించాయి. ఇటీవల డిసెంబరులో భారత జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించినప్పుడు వారు నిబంధనలు ఉల్లంఘించారని హెచ్ఐ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఈ టూర్లో 3 మ్యాచ్లు ఆడిన భారత్ 2 ఓడి, ఒక మ్యాచ్ను ‘డ్రా’ చేసుకుంది. ‘జట్టు సమావేశానికి ఒక ఆటగాడు గైర్హాజరు కావడంతో వివరాలు తెలుసుకునేందుకు ప్రయతి్నంచాం. అప్పుడు మరింత తీవ్రమైన అంశాలు బయటకు వచ్చాయి. మన్ప్రీత్, దిల్ప్రీత్, కృషన్ కలిసి ఆ ఆటగాడికి నిషేధిత ఉత్ప్రేరకం కలిపిన చూయింగ్ గమ్ను ఇచ్చారు. దానిని వాడిన అతను స్పృహ కోల్పోయి టీమ్ మీటింగ్కు దూరమయ్యాడు. దాని ప్రభావం రాత్రంతా ఉండటంతో పాటు తర్వాతి ఉదయం కూడా సాధారణ స్థితికి రాలేకపోయాడు. విచారణ చేస్తే ఆ ముగ్గురి పాత్ర ఉన్నట్లు తేలింది. వీరంతా ఆ తర్వాత క్షమాపణలు చెప్పినా... వచ్చే టోర్నీ కోసం జరిగే శిబిరానికి వీరిని ఎంపిక చేయరాదనే నిర్ణయం అప్పుడే జరిగిపోయింది’ అని ఆయన వివరించారు. అయితే దీనిపై కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ హాకీ ఇండియాకు ఎలాంటి రాత పూర్వక ఫిర్యాదు మాత్రం చేయలేదు. పైగా మన్ప్రీత్కు మద్దతు పలుకుతూ జట్టు నుంచి తప్పించరాదని కూడా ఫుల్టన్ డిమాండ్ చేశారు. ఈ ఏడాది ఎన్నో కీలక టోర్నీలు ఉన్న నేపథ్యంలో ఎంతో అనుభవం ఉన్న మన్ప్రీత్ అవసరం జట్టుకు ఉందని... అతడిని తొలగిస్తే తానూ రాజీనామా చేస్తానని కూడా కోచ్ హెచ్చరించినట్లు తెలిసింది. అయితే హాకీ ఇండియా అధ్యక్ష, కార్యదర్శులు దిలీప్ తిర్కీ, భోలానాథ్ సింగ్, చీఫ్ సెలక్టర్ ఆర్పీ సింగ్ చివరకు కోచ్ను ఒప్పించడంలో సఫలమయ్యారు. -
చరిత్ర పుటల్లో చోటు కోసం...
మెల్బోర్న్: ఒక్క విజయం సాధిస్తే... సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్... ప్రపంచ నంబర్వన్, స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ చరిత్ర పుటల్లో తమ పేరును లిఖించుకుంటారు. టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్స్లామ్ టోర్నీ ఆ్రస్టేలియన్ ఓపెన్లో జొకోవిచ్ 11వసారి... అల్కరాజ్ తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఆదివారం జరిగే ఫైనల్లో జొకోవిచ్తో అల్కరాజ్ తలపడతాడు. తుది పోరులో జొకోవిచ్ గెలిస్తే టెన్నిస్ చరిత్రలోనే అత్యధికంగా 25 గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన ఏకైక ప్లేయర్గా అవతరిస్తాడు. అల్కరాజ్ నెగ్గితే ‘కెరీర్ గ్రాండ్స్లామ్’ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టిస్తాడు. శుక్రవారం జరిగిన రెండు అసాధారణ సెమీఫైనల్స్లో అద్భుత ఫలితాలు వచ్చాయి. 5 గంటల 27 నిమిషాలపాటు జరిగిన మొదటి సెమీఫైనల్లో అల్కరాజ్ 6–4, 7–6 (7/5), 6–7 (3/7), 6–7 (4/7), 7–5తో మూడో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ)పై విజయం సాధించాడు. నిర్ణాయక ఐదో సెట్లో 5–4తో ఆధిక్యంలో నిలిచిన జ్వెరెవ్ పదో గేమ్లో తన సర్వీస్ను నిలబెట్టుకొని ఉంటే గెలిచేవాడు. కానీ పదో గేమ్లో జ్వెరెవ్ సర్వీస్ను బ్రేక్ చేసిన అల్కరాజ్ స్కోరును 5–5తో సమం చేశాడు. ఆ తర్వాత తన సర్వీస్ను కాపాడుకొని 12వ గేమ్లో జ్వెరెవ్ సర్వీస్ను మరోసారి బ్రేక్ చేసి 7–5తో గెలుపు సొంతం చేసుకున్నాడు. అతిపెద్ద వయస్కుడిగా... డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సినెర్ (ఇటలీ)తో 4 గంటల 9 నిమిషాలపాటు జరిగిన రెండో సెమీఫైనల్లో 10సార్లు విజేత జొకోవిచ్ 3–6, 6–3, 4–6, 6–4, 6–4తో విజయం సాధించాడు. 12 ఏస్లు సంధించిన జొకోవిచ్ 46 విన్నర్స్ కొట్టాడు. 16 సార్లు తన సర్వీస్లో బ్రేక్ పాయింట్లను కాపాడుకున్నాడు. ఆ్రస్టేలియన్ ఓపెన్లో ఫైనల్ చేరిన 10 సార్లూ టైటిల్ గెలిచిన జొకోవిచ్ ఈ టోర్నీ చరిత్రలో తుది పోరుకు అర్హత పొందిన అతిపెద్ద వయస్కుడిగా (38 ఏళ్ల 241 రోజులు) రికార్డు సృష్టించాడు. కెన్ రోజ్వాల్ (37 ఏళ్ల 54 రోజులు –1972లో) పేరిట ఉన్న రికార్డును అతను బద్దలు కొట్టాడు. నేడు ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్సబలెంకా x రిబాకినామధ్యాహ్నం 2 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం -
ప్రపంచ కప్కు ముందు ఆఖరి పోరు
తిరువనంతపురం: టి20 ప్రపంచ కప్కు ముందు ఆడుతున్న ఆఖరి సిరీస్లో భారత్ ఇప్పటికే తమ అస్త్రశ్రస్తాలు అన్నింటినీ పరీక్షించుకుంది. న్యూజిలాండ్పై తొలి మూడు మ్యాచ్లలో అద్భుత ప్రదర్శన కనబర్చిన జట్టు 3–0తో సిరీస్ను గెలుచుకుంది. విశాఖపట్నంలో జరిగిన గత మ్యాచ్లో అనూహ్యంగా ఓడినా...ఆందోళన చెందాల్సిన పరిస్థితేమీ లేదు. అయితే మెగా పోరుకు ముందు మిగిలిన ఒక మ్యాచ్లో మళ్లీ చెలరేగాలని జట్టు పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో నేడు గ్రీన్ఫీల్డ్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య చివరిదైన ఐదో టి20కి రంగం సిద్ధమైంది. మరోవైపు సిరీస్ కోల్పోయిన తర్వాత గత మ్యాచ్లో రాణించిన క్లీన్స్వీప్ నుంచి తప్పించుకున్న కివీస్ కూడా విజయంతో ముగించాలని భావిస్తోంది. భారత్లోనే జరిగే వరల్డ్ కప్కు ముందు ఈ గెలుపు ఆ టీమ్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం ఖాయం. సిరీస్లో జట్టు ప్రదర్శనను బట్టి చూస్తే ఒక్క సంజు సామ్సన్ ఫామ్ విషయంలోనే మేనేజ్మెంట్ కొంత ఇబ్బంది పడుతోంది. తన సొంత మైదానంలో అశేష అభిమానుల మధ్య బరిలోకి దిగనున్న సామ్సన్ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడేందుకు ఇంతకంటే సరైన వేదిక, సమయం ఉండదు. తొలి టి20 ఆడుతూ గాయంతో తప్పుకున్న అక్షర్ పటేల్ తర్వాతి మ్యాచ్లకు దూరమయ్యాడు. అతను పూర్తిగా కోలుకుంటే ఆడతాడు. స్వల్ప గాయంతో వైజాగ్ మ్యాచ్ ఆడని ఇషాన్ కిషన్ కూడా ఫిట్గా ఉంటే మళ్లీ తుది జట్టులోకి రావచ్చు. మరోవైపు కివీస్ కూడా ఒక మార్పుతో ఆడే అవకాశం ఉంది. ఓపెనర్, వికెట్ కీపర్ ఫిన్ అలెన్ అందుబాటులో రావడంతో సీఫెర్ట్ను విశ్రాంతినిచ్చి అతడిని ఆడించే అవకాశం ఉంది. తిరువనంతపురంలో పిచ్ బ్యాటింగ్కు అనుకూలం. కాబట్టి భారీ స్కోర్లకు అవకాశం ఉంది. ఇక్కడా మంచు ప్రభావం ఉంది. గతంలో ఈ మైదానంలో 4 టి20లు ఆడిన భారత్ 3 గెలిచి, ఒక మ్యాచ్లో ఓడింది. చివరిసారిగా 2023 నవంబర్లో ఆ్రస్టేలియాతో జరిగిన పోరులో భారత్ 235 పరుగులు నమోదు చేసింది. -
‘ఎలిమినేటర్’కు గుజరాత్
వడోదర: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ జెయింట్స్ ‘ఎలిమినేటర్’కు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్లో గుజరాత్ 11 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్పై నెగ్గింది. లీగ్ చరిత్రలో ముంబైతో తలపడిన ఎనిమిది సార్లూ ఓటమి చవి చూసిన గుజరాత్ 9వ ప్రయత్నంలో తొలిసారి గెలుపు రుచి చూసింది. ఆడిన 8 మ్యాచ్ల్లో 5 గెలిచి, 3 ఓడిన గుజరాత్ 10 పాయింట్లతో రెండో స్థానాన్ని ఖాయం చేసుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. యాష్లీ గార్డ్నర్ (28 బంతుల్లో 46; 7 ఫోర్లు, 1 సిక్స్), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జార్జ్ వేర్హామ్ (26 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు) జట్టు స్కోరులో కీలక పాత్ర పోషించగా... అనుష్క శర్మ (31 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్), సోఫీ డివైన్ (21 బంతుల్లో 25; 3 ఫోర్లు) రాణించారు. అమేలియా కెర్కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లకు 156 పరుగులే చేయగలిగింది. కెపె్టన్ హర్మన్ప్రీత్ కౌర్ (48 బంతుల్లో 82 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్లు) చివరి వరకు పోరాడినా... విజయం మాత్రం దక్కలేదు. ఆఖరి 2 ఓవర్లలో 37 పరుగులు చేయాల్సి ఉండగా, హర్మన్ 2 ఫోర్లు, 2 సిక్స్ల సహాయంతో 24 పరుగులు రాబట్టగలిగింది. ఈ మ్యాచ్లో ఓడినా... ఎలిమినేటర్కు క్వాలిఫై అయ్యే అవకాశాలు ముంబైకి ఇంకా ఉన్నాయి. నేడు విశ్రాంతి దినం. ఆదివారం జరిగే చివరి లీగ్ మ్యాచ్లో యూపీ వారియర్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతుంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ కచి్చతంగా గెలవడంతోపాటు రన్రేట్లో ప్రస్తుతం తమకంటే (–0.164) ఎంతో ముందున్న ముంబైను (+0.059) కూడా దాటాల్సి ఉంటుంది. స్కోరు వివరాలు గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: మూనీ (సి) సజన (బి) షబ్నిమ్ 5; సోఫీ డివైన్ (సి) కెర్ (బి) సివర్ బ్రంట్ 25; అనుష్క (సి) షబ్నిమ్ (బి) కెర్ 33; గార్డ్నర్ (స్టంప్డ్) ఫిర్దోస్ (బి) కెర్ 46; వేర్హామ్ (నాటౌట్) 44; భారతి (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 167. వికెట్ల పతనం: 1–21, 2–69, 3–71, 4–142. బౌలింగ్: షబి్నమ్ 4–0–29–1, సివర్ బ్రంట్ 4–0–36–1, వైష్ణవి 2–0–21–0, అమన్జోత్ 2–0–13–0, అమేలియా కెర్ 4–0–26–2, మాథ్యూస్ 4–0–40–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: సజన (సి) భారతి (బి) కాశ్వీ 26; మాథ్యూస్ (బి) డివైన్ 6; సివర్ బ్రంట్ (సి) అనుష్క (బి) డివైన్ 2; హర్మన్ప్రీత్ (నాటౌట్) 82; అమేలియా కెర్ (సి) మూనీ (బి) వేర్హామ్ 20; అమన్జోత్ (స్టంప్డ్) మూనీ (బి) రాజేశ్వరి 13; సంస్కృతి (ఎల్బీ) (బి) వేర్హామ్ 0; పూనమ్ (సి అండ్ బి) గార్డ్నర్ 2; ఫిర్దోస్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 156. వికెట్ల పతనం: 1–23, 2–33, 3–37, 4–82, 5–126, 6–127, 7–155. బౌలింగ్: రేణుక సింగ్ 2–0–11–0, కాశ్వీ గౌతమ్ 2–0–12–1, రాజేశ్వరి గైక్వాడ్ 4–0–46–1, సోఫీ డివైన్ 4–1–23–2, జార్జియా వేర్హామ్ 4–0–26–2, యాష్లీ గార్డ్నర్ 3–0–26–1, తనూజ 1–0–11–0. -
రాణించిన గార్డ్నర్, వేర్హమ్.. గుజరాత్ స్కోర్ ఎంతంటే..?
డబ్ల్యూపీఎల్ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్తో ఇవాళ (జనవరి 30) జరుగుతున్న కీలక మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ ఓ మోస్తరు స్కోర్ చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. కెప్టెన్ ఆష్లే గార్డ్నర్ (46), అనుష్క శర్మ (33), సోఫీ డివైన్ (25) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. ఆఖర్లో జార్జియా వేర్హమ్ (44 నాటౌట్) బ్యాట్ ఝులిపించింది. భారతి ఫుల్మాలి 5 పరుగులతో అజేయంగా నిలిచింది. గుజరాత్ ఇన్నింగ్స్లో బెత్ మూనీ (5) మినహా ప్రతి ఒక్కరు ఓ మోస్తరు స్కోర్ చేశారు. ముంబై బౌలర్లలో అమేలియా కెర్ (4-0-26-2) అద్భుతంగా బౌలింగ్ చేసింది. షబ్నిమ్ ఇస్మాయిల్ (4-0-29-1), నాట్ సీవర్ బ్రంట్ (4-0-36-1) కూడా పర్వాలేదనిపించారు. హేలీ మాథ్యూస్ (4-0-40-0), వైష్ణవి శర్మ (2-0-21-0) ధారాళంగా పరుగులు సమర్పించుకోగా.. అమన్జోత్ కౌర్ (2-0-13-0) పర్వాలేదనిపించింది. ఈ మ్యాచ్లో గుజరాత్ గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకుంటుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో ఆర్సీబీ తర్వాత రెండో స్థానంలో ఉంది. ఆర్సీబీ 8 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించి నేరుగా ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ప్రస్తుతం మిగిలిన రెండు బెర్త్ల కోసం గుజరాత్తో పాటు ముంబై ఇండియన్స్ (7 మ్యాచ్ల్లో 3 విజయాలు), ఢిల్లీ క్యాపిటల్స్ (7 మ్యాచ్ల్లో 3 విజయాలు) పోటీ పడుతున్నాయి. యూపీ వారియర్జ్ 7 మ్యాచ్ల్లో రెండే విజయాలతో టేబుల్ చివరి స్థానంలో ఉంది. -
భారీ శతకం బాదిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్.. ట్రోలింగ్ కూడా భారీగానే..!
అండర్-19 ప్రపంచకప్ 2026లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ఫైసల్ షినోజాదా భారీ సెంచరీతో కదంతొక్కాడు. ఐర్లాండ్తో ఇవాళ (జనవరి 30) జరిగిన మ్యాచ్లో 142 బంతులు ఎదుర్కొని 18 ఫోర్లు, సిక్సర్ సాయంతో 163 పరుగులు చేశాడు. ఫైసల్తో పాటు కెప్టెన్ మహబూబ్ ఖాన్ (89) కూడా సత్తా చాటడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 315 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం భారీ లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో ఆఫ్ఘన్ బౌలర్లు చెలరేగిపోయారు. కలిసికట్టుగా రాణించి ఐర్లాండ్ను 40.4 ఓవర్లలో 124 పరుగులకే కుప్పకూల్చారు. తద్వారా ఈ మ్యాచ్లో ఆఫ్ఘన్లు 191 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించారు. ఈ గెలుపుతో ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ 1 (సూపర్ సిక్స్) నుంచి సెమీఫైనల్ (ఆస్ట్రేలియాతో పాటు) బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ గెలుపుతో అప్పటిదాకా సెమీస్ రేసులో ఉండిన శ్రీలంక టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ గ్రూప్ నుంచి వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఐర్లాండ్ కూడా ఇంటిముఖం పట్టాయి. గ్రూప్-2 విషయానికొస్తే.. ఈ గ్రూప్లో ఇంగ్లండ్ ఒక్కటే ఇప్పటివరకు సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. మరో బెర్త్ కోసం భారత్, పాకిస్తాన్ జట్లు పోటీపడుతున్నాయి. ఈ గ్రూప్ నుంచి బంగ్లాదేశ్, న్యూజిలాండ్, జింబాబ్వే జట్లు నిష్క్రమించాయి.ఇదిలా ఉంటే, ఐర్లాండ్తో మ్యాచ్లో భారీ శతకం బాదిన ఫైసల్ షినోజాదాపై సోషల్మీడియా వేదికగా భారీ ట్రోలింగ్ జరుగుతుంది. ఫైసల్ను చూసిన వారు ఇతను 17 ఏళ్ల పిల్లాడేంటీ అని అవాక్కవుతున్నారు. వయసు తక్కువగా చూపించుకొని, తప్పుడు ధృవపత్రాలతో అతను అండర్-19 విభాగంలో ఆడుతున్నాడని కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా పాకిస్తాన్ ఆటగాళ్ల విషయంలో ఇలాంటి ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. అయితే ఈసారి ఆఫ్ఘనివస్తాన్ ఆటగాడు దీనికి బలయ్యాడు. వాస్తవానికి ఫైసల్ను చూస్తే నిజంగానే ఎవరూ 17 ఏళ్ల కుర్రాడంటే ఒప్పుకోరు. అతని ఆహార్యం మధ్యవయస్కుడిలా కనిపిస్తుంది. భారత చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ కూడా ఇలాంటి ట్రోలింగ్నే ఎదుర్కొన్నాడు. అతను భారీ షాట్లు ఆడే విధానం చూసి, గిట్టని వారు వ్యతిరేక కామెంట్లు చేశారు. -
టీ20 ప్రపంచకప్ 2026లో పాల్గొనే అన్ని జట్ల పూర్తి వివరాలు
ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ 2026కు సర్వం సిద్దమయ్యాయి. ఈ మెగా టోర్నీలో 20 దేశాలు పాల్గొంటుండగా.. అన్నీ దేశాలు తమ జట్లను ప్రకటించాయి. ఆ జట్ల పూర్తి వివరాలను ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూద్దాం.ఆఫ్ఘనిస్తాన్: రషీద్ ఖాన్ (సి), నూర్ అహ్మద్, అబ్దుల్లా అహ్మద్జాయ్, సెదిఖుల్లా అటల్, ఫజల్హాక్ ఫరూకీ, రహ్మానుల్లా గుర్బాజ్, నవీన్ ఉల్ హక్, మహ్మద్ ఇషాక్, షాహిదుల్లా కమల్, మహ్మద్ నబీ, గుల్బాదీన్ నయీబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, దర్విష్ రసూల్, ఇబ్రహీం జద్రాన్. రిజర్వ్లు: AM ఘజన్ఫర్, ఇజాజ్ అహ్మద్జాయ్ మరియు జియా ఉర్ రెహ్మాన్ షరీఫీ.ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (సి), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.కెనడా: దిల్ప్రీత్ బజ్వా (సి), అజయ్వీర్ హుందాల్, అన్ష్ పటేల్, దిలోన్ హేలిగర్, హర్ష్ థాకర్, జస్కరన్దీప్ బుట్టర్, కలీమ్ సనా, కన్వర్పాల్ తాత్గూర్, నవనీత్ ధాలివాల్, నికోలస్ కిర్టన్, రవీందర్పాల్ సింగ్, సాద్ బిన్ జాఫర్, శివమ్ శర్మ, శ్రేయాస్ మొవ్వ, యువ్రాజ్ సమ్రా.ఇంగ్లండ్: హ్యారీ బ్రూక్ (సి), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, సామ్ కర్రాన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్.భారత్: సూర్యకుమార్ యాదవ్ (సి), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్, శివమ్ దూబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్.ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), మార్క్ అడైర్, రాస్ అడైర్, బెన్ కాలిట్జ్, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, మాథ్యూ హంఫ్రీస్, జోష్ లిటిల్, బారీ మెక్కార్తీ, హ్యారీ టెక్టర్, టిమ్ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్.ఇటలీ: వేన్ మాడ్సెన్ (కెప్టెన్), మార్కస్ కాంపియానో, జియాన్ పియరో మీడే, జైన్ అలీ, అలీ హసన్, క్రిషన్ జార్జ్, హ్యారీ మానెంటి, ఆంథోనీ మోస్కా, జస్టిన్ మోస్కా, సయ్యద్ నఖ్వీ, బెంజమిన్ మానెంటి, జస్ప్రీత్ సింగ్, JJ స్మట్స్, గ్రాంట్ స్టీవర్ట్, థామస్ డ్రాకా.నమీబియా: గెర్హార్డ్ ఎరాస్మస్ (సి), జేన్ గ్రీన్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, రూబెన్ ట్రంపెల్మన్, జెజె స్మిత్, జాన్ ఫ్రైలింక్, లౌరెన్ స్టీన్క్యాంప్, మలన్ క్రుగర్, నికోల్ లాఫ్టీ-ఈటన్, జాక్ బ్రాసెల్, బెన్ షికోంగో, జెసి బాల్ట్, డైలాన్ లీచర్, డబ్యూపీ మైబుర్గ్, మ్యాక్స్ హెయింగో రిజర్వ్: అలెగ్జాండర్ వోల్స్చెంక్.నేపాల్: రోహిత్ పౌడెల్ (సి), దీపేంద్ర సింగ్ ఐరీ, సందీప్ లమిచానే, కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్, సందీప్ జోరా, ఆరిఫ్ షేక్, బసీర్ అహమద్, సోంపాల్ కమీ, కరణ్ కెసి, నందన్ యాదవ్, గుల్షన్ ఝా, లలిత్ రాజ్బన్షి, షేర్ మల్లా, లోకేశ్ బామ్.నెదర్లాండ్స్: స్కాట్ ఎడ్వర్డ్స్ (సి), కోలిన్ అకెర్మాన్, నోహ్ క్రోస్, బాస్ డి లీడ్, ఆర్యన్ దత్, ఫ్రెడ్ క్లాసెన్, కైల్ క్లైన్, మైఖేల్ లెవిట్, జాక్ లయన్-కాచెట్, మాక్స్ ఓ'డౌడ్, లోగాన్ వాన్ బీక్, టిమ్ వాన్ డెర్ గుగ్టెన్, రోల్ఫ్ వాన్డర్ మెర్వ్, పాల్ వాన్ మీకెరెన్, సాకిబ్ జుల్ఫికర్.న్యూజిలాండ్: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, కైల్ జామిసన్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి, బెన్ సియర్స్ (రిజర్వ్).ఒమన్: జతీందర్ సింగ్ (కెప్టెన్), వినాయక్ శుక్లా, మొహమ్మద్ నదీమ్, షకీల్ అహ్మద్, హమ్మద్ మీర్జా, వసీం అలీ, కరణ్ సోనావాలే, షా ఫైసల్, నదీమ్ ఖాన్, సుఫ్యాన్ మెహమూద్, జే ఒడెద్రా, షఫీక్ జాన్, ఆశిష్ ఒడెదర, జితెన్ రామనంది, హస్నైన్ అలీ షా.పాకిస్తాన్: సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ అజామ్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖవాజా మొహమ్మద్ నఫాయ్, మొహమ్మద్ నవాజ్, మొహమ్మద్ సల్మాన్ మీర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, షాహీన్ షా అఫ్రిది, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, ఉస్మాన్ తారిక్.స్కాట్లాండ్: రిచీ బెరింగ్టన్ (కెప్టెన్), టామ్ బ్రూస్, మాథ్యూ క్రాస్, బ్రాడ్లీ క్యూరీ, ఆలివర్ డేవిడ్సన్, క్రిస్ గ్రీవ్స్, జైనుల్లా ఇహ్సాన్, మైఖేల్ జోన్స్, మైఖేల్ లీస్క్, ఫిన్లే మెక్క్రీత్, బ్రాండన్ మెక్ముల్లెన్, జార్జ్ మున్సే, సఫ్యాన్ షరీఫ్, మార్క్ వాట్, బ్రాడ్లీ వీల్. రిజర్వ్లు: జాస్పర్ డేవిడ్సన్, జాక్ జార్విస్, మెకెంజీ జోన్స్, క్రిస్ మెక్బ్రైడ్, చార్లీ టియర్.దక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, క్వింటన్ డి కాక్, మార్కో జాన్సెన్, జార్జ్ లిండే, కేశవ్ మహారాజ్, క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, లుంగి న్గిడి, అన్రిచ్ నార్ట్జే, కగిసో రబాడా, ర్యాన్ రికెల్టన్, జాసన్ స్మిత్ మరియు ట్రిస్టన్ స్టబ్స్.శ్రీలంక: దసున్ షనక (సి), పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, కమిల్ మిషార, కుసల్ పెరీరా, ధనంజయ డి సిల్వా, నిరోషన్ డిక్వెల్లా, జనిత్ లియానగే, చరిత్ అసలంక, కమిందు మెండిస్, పవన్ రత్ననాయక్, సహన్ అరాచిత్వెల్లంగా, రాంత్నిలంగా, రవాణి వాన్గే, నువాన్ తుషార, ఎషాన్ మలింగ, దుష్మంత చమీర, ప్రమోద్ మదుషన్, మతీషా పతిరణ, దిల్షన్ మధుశంక, మహేశ్ తీక్షణ, దుషన్ హేమంత, విజయ్కాంత్ వియాస్కాంత్, ట్రవీన్ మాథ్యూయూఏఈ: ముహమ్మద్ వసీమ్ (సి), అలీషాన్ షరాఫు, ఆర్యన్ష్ శర్మ, ధ్రువ్ పరాశర్, హైదర్ అలీ, హర్షిత్ కౌశిక్, జునైద్ సిద్ధిక్, మయాంక్ కుమార్, ముహమ్మద్ అర్ఫాన్, ముహమ్మద్ ఫరూక్, మహ్మద్ జవదుల్లా, ముహమ్మద్ జోహైబ్, రోహిత్ ఖాన్, సోహైబ్ సింగ్, సిమ్రాన్జీత్ ఖాన్, సిమ్రాన్జీత్.యూఎస్ఏ: మోనాంక్ పటేల్ (సి), జెస్సీ సింగ్, ఆండ్రీస్ గౌస్, షెహన్ జయసూర్య, మిలింద్ కుమార్, షయాన్ జహంగీర్, సాయితేజ ముక్కామల, సంజయ్ కృష్ణమూర్తి, హర్మీత్ సింగ్, నోస్తుష్ కెంజిగే, షాడ్లీ వాన్ షాల్క్విక్, సౌరభ్ నేత్రవల్కర్, అలీ ఖాన్, మొహమ్మద్ మొహిసిన్, శుభమ్ రంజనే.వెస్టిండీస్: షాయ్ హోప్ (సి), షిమ్రాన్ హెట్మెయర్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, షామర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, గుడాకేష్ మోటీ, రోవ్మన్ పావెల్, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్, క్వెంటిన్ సాంప్సన్, జేడన్ సీల్స్, రొమారియో షెపర్డ్.జింబాబ్వే: సికందర్ రజా (సి), బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, గ్రేమ్ క్రీమర్, బ్రాడ్లీ ఎవాన్స్, క్లైవ్ మదాండే, టినోటెండా మపోసా, తడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, టోనీ మునియోంగా, తషింగా ముసెకివా, రిచార్డాన్ మైగర్రాబనీ, బ్లెస్సింగ్ ముజరబానీ, డియాన్ మేయర్స్, రిచర్డ్ నగరవ, బ్రెండన్ టేలర్ -
ఫైనల్లో ఆర్సీబీ.. మరి ఆ రెండు బెర్తులు దక్కేదెవరికి?
మహిళల ప్రీమియర్ లీగ్-2026 సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఈ ఏడాది సీజన్లో ఇంకా కేవలం రెండు లీగ్ మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ టోర్నీలో భాగంగా గురువారం యూపీ వారియర్స్తో జరిగిన కీలక మ్యాచ్లో ఘన విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని నేరుగా ఫైనల్కు దూసుకెళ్లింది. ఇప్పుడు మరో రెండు స్ధానాల కోసం నాలుగు జట్లు పోటీ పడతున్నాయి. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్ సమీకరణాలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.పాయింట్ల పట్టికలో ఆర్సీబీ(12) అగ్రస్ధానంలో ఉంది. ఆ తర్వాత స్దానంలో గుజరాత్ జెయింట్స్(8 పాయింట్లు), ముంబై ఇండియన్స్(6), ఢిల్లీ క్యాపిటల్స్(6), యూపీ వారియర్స్(4) ఉన్నాయి.గుజరాత్ జెయింట్స్గుజరాత్ జట్టు శక్రవారం వడోదర వేదికగా ముంబై ఇండియన్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో గుజరాత్ గెలిస్తే మిగితా జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా నేరుగా ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తోంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం యూపీ వారియర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఫలితం వరకు ఎదురు చూడాలి. ఈ మ్యాచ్లో ఢిల్లీ ఓడిపోతే గుజరాత్కు ప్లే ఆఫ్స్కు చేరే అవకాశముంటుంది.ముంబై ఇండియన్స్గుజరాత్తో జరిగే మ్యాచ్ ముంబై జట్టుకు చాలా కీలకం. ఈ మ్యాచ్లో ముంబై గెలిస్తే పాయింట్ల పరంగా గుజరాత్తో సమంగా నిలుస్తోంది. అయితే గుజరాత్(-0.271) కంటే ముంబై(+0.146) రన్రేట్ మెరుగ్గా ఉన్నుందన హర్మన్ సేన ప్లే ఆఫ్స్కు చేరుకుంటుంది.ఢిల్లీ క్యాపిటల్స్జేమీమా రోడ్రిగ్స్ సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ తమ చివరి మ్యాచ్లో యూపీ వారియర్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ భారీ విజయం సాధించాలి. అదేవిధంగా ముంబై వర్సెస్ గుజరాత్ మ్యాచ్ ఫలితం కూడా ఢిల్లీ ప్లే ఆఫ్ రేసును ప్రభావితం చేస్తుంది. ఢిల్లీ రన్రేట్ ప్రస్తుతం -0.164 ఉంది. భారీ విజయం సాధిస్తేనే 2 పాయింట్లతో పాటు రన్రేట్ కూడా గణనీయంగా మెరుగపడుతోంది.యూపీ వారియర్స్ఇక యూపీ వారియర్స్ ప్లే ఆఫ్స్ చేరే దారులు దాదాపు మూసుకుపోయినట్లే. యూపీ ఖాతాలో ప్రస్తుతం 4 పాయింట్లే ఉన్నాయి. ఢిల్లీతో జరిగే మ్యాచ్లో యూపీ భారీ విజయం సాధించాలి. అలాగే ముంబై ఇండియన్స్ గుజరాత్తో మ్యాచ్లో దారుణంగా ఓడిపోవాలి. అప్పుడు 6 పాయింట్లతో ముంబై, యూపీ, ఢిల్లీ సమంగా నిలుస్తాయి. ఆ సమయంలో రన్రేట్ ఆధారంగా మూడింటిలో ఓ జట్టు ఫ్లేప్స్లో అడుగుపెడుతోంది -
టీ20 ప్రపంచకప్ కోసం యూఎస్ఏ జట్టు ప్రకటన
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ 2026 కోసం 15 మంది సభ్యుల యూఎస్ఏ జట్టును ఇవాళ (జనవరి 30) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా మోనాంక్ పటేల్ ఎంపికయ్యాడు. గత ఎడిషన్లో (2024) ఆడిన 10 మంది ఆటగాళ్లు, ఈసారి కూడా చోటు దక్కించుకున్నారు. కొత్తగా శుభమ్ రంజనే, మహ్మద్ మొహ్సిన్, షేహాన్ జయసూర్య ప్రపంచకప్ జట్టులోకి వచ్చారు.యూఎస్ఏకు ఇది రెండో టీ20 ప్రపంచకప్. గత ఎడిషన్లో ఈ జట్టు పాకిస్తాన్ను చిత్తు చేసి సంచలనం సృష్టించింది. ఆ మ్యాచ్లో సూపర్ ఓవర్లో విజయం సాధించి, సూపర్-8కు కూడా అర్హత సాధించింది. ఈసారి కూడా యూఎస్ఏ సంచలనాలు సృష్టించే అవకాశం ఉంది. ఆ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉంది. ఆండ్రీస్ గౌస్, మోనాంక్ పటేల్ ఆ జట్టు ప్రధాన బ్యాటర్లుగా ఉన్నారు. బౌలింగ్లో నేత్రవల్కర్, నోస్తుష్ కెన్జిగే, అలీ ఖాన్ కీలకమయ్యే అవకాశం ఉంది.గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్ లాంటి జట్లతో పోటీపడాల్సి ఉన్న యూఎస్ఏ.. ఇదే గ్రూప్లోని నమీబియా, నెదర్లాండ్స్పై సంచలన విజయాలు సాధించే ఆస్కారం ఉంది. ఫిబ్రవరి 7న టీమిండియా మ్యాచ్తో యూఎస్ఏ తమ రెండో ప్రపంచకప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది.టీ20 ప్రపంచకప్ 2026 కోసం యూఎస్ఏ జట్టు.. మోనాంక్ పటేల్ (కెప్టెన్), జెస్సీ సింగ్, ఆండ్రీస్ గౌస్, షేహాన్ జయసూర్య, మిలింద్ కుమార్, షయాన్ జహంగీర్, సాయితేజ ముక్కమల, సంజయ్ కృష్ణమూర్తి, హర్మీత్ సింగ్, నోస్తుష్ కెన్జిగే, షాడ్లీ వాన్ స్కాల్క్విక్, సౌరభ్ నేత్రవల్కర్, అలీ ఖాన్, మహ్మద్ మొహ్సిన్, శుభమ్ రంజనే. గ్రూప్-ఏలో యూఎస్ఏ మ్యాచ్లు - ఫిబ్రవరి 7: ఇండియా vs USA (ముంబై) - ఫిబ్రవరి 10: పాకిస్తాన్ vs USA (కొలంబో) - ఫిబ్రవరి 13: నెదర్లాండ్స్ vs USA (చెన్నై) - ఫిబ్రవరి 15: నమీబియా vs USA (చెన్నై) -
టీ20 ప్రపంచ కప్ చరిత్రలో అతి పెద్ద సంచలనాలు ఇవే..!
టీ20 ఫార్మాట్లో ఎప్పుడు ఏ జట్టు గెలుస్తుందో అంచనా వేయడం కష్టం. ఎందుకంటే, తక్కువ వ్యవధిలో ఆట స్వరూపమే మారిపోతుంది. ఒక్క చిన్న తప్పిదం.. ఒక్క ఆటగాడి అద్భుత ప్రదర్శన మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేస్తుంది. ఇక్కడ చిన్న జట్టు, పెద్ద జట్టు అన్న తేడా పెద్దగా ఉండదు. ఆ సమయానికి ఎవరిది పైచేయి అయితే, వారే మ్యాచ్ గెలుస్తారు. చిన్న జట్లతో పోలిస్తే పెద్ద జట్లే అధిక అంచనాల ఒత్తిడిలో ఉంటాయి. ఈ కారణంగానే ఫలితాలు తారుమారవుతాయి. పొట్టి ఫార్మాట్లో ఇలాంటి ఘటనలను తరుచూ చూస్తుంటాం.మెగా టోర్నీ అయిన ప్రపంచకప్ కూడా ఇందుకు అతీతమేమీ కాదు. ఈ టోర్నీ తొలి ఎడిషన్ నుంచే ఇలాంటి సంచలనాలు నమోదవుతూ వచ్చాయి. త్వరలో ప్రారంభం కానున్న 2026 ఎడిషన్ నేపథ్యంలో పొట్టి ప్రపంచకప్ చరిత్రలో నమోదైన టాప్-5 అతి పెద్ద సంచలనాలపై ఓ లుక్కేద్దాం.తొలి ఎడిషన్లోనే..!పురుషుల టీ20 ప్రపంచకప్ తొలి ఎడిషన్లోనే (2007) అతి పెద్ద సంచలనం నమోదైంది. కేప్టౌన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో పసికూన జింబాబ్వే 5 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. జింబాబ్వే ఆటగాళ్లు బ్రెండన్ టేలర్ (60*), ఎల్టన్ చిగుంబురా (3/20) ఈ మ్యాచ్ హీరోలుగా నిలిచారు.ఇంగ్లండ్కు నెదర్లాండ్స్ షాక్రెండో ఎడిషన్లో (2009) మరో సంచలనం నమోదైంది. లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్పై చిన్న జట్టు నెదర్లాండ్స్ 4 వికెట్ల తేడాతో అనూహ్య విజయం సాధించింది. ఇక్కడ గమనించదగ్గ మరో విశేషమేమిటంటే.. నెదర్లాండ్స్ ఇంగ్లండ్ను వారి స్వదేశంలోనే ఓడించడం. టామ్ డి గ్రోత్ (49), ర్యాన్ టెన్ డోషాటే (2/35) నెదర్లాండ్స్ హీరోలుగా నిలిచారు.పెను సంచలనాల ఎడిషన్2022 ఎడిషన్లో రెండు భారీ సంచలనాలు నమోదయ్యాయి. శ్రీలంకకు నమీబియా.. సౌతాఫ్రికాకు నెదర్లాండ్స్ ఊహించని షాక్లు ఇచ్చాయి. నమీబియా తరఫున జాన్ ఫ్రైలింక్ (44), డేవిడ్ వీజ్, బెర్నార్డ్ స్కోల్జ్ (తలో 2 వికెట్లు) హీరోలుగా నిలువుగా.. నెదర్లాండ్స్ తరఫున కాలిన్ అకర్మాన్ (41*), బ్రాండన్ గ్లోవర్ (3/9) అద్భుతం చేశారు.పాక్ను మట్టికరిపించిన పసికూన2024 ఎడిషన్లో మరో పెను సంచలనం నమోదైంది. తొలిసారి ప్రపంచకప్కు అర్హత సాధించిన యూఎస్ఏ.. బలాడ్యులమని విర్రవీగే పాక్కు కర్రు కాల్చి వాత పెట్టింది. ఈ మ్యాచ్లో యూఎస్ఏ ఆటగాళ్లు మోనాంక్ పటేల్ (50), సౌరభ్ నేత్రవల్కర్ (2/18 + సూపర్ ఓవర్ ) అద్భుత ప్రదర్శనలు చేసి యూఎస్ఏకు చారిత్రక విజయాన్ని అందించారు. ఇదే ఎడిషన్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు కూడా పెను సంచలనాలు నమోదు చేసింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి మెగా జట్లకు షాకిచ్చి సెమీఫైనల్ వరకు వెళ్లింది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు త్వరలో ప్రారంభం కాబోయే 2026 ఎడిషన్లోనూ పెను సంచలనాలు సృష్టించే ఆస్కారం ఉంది. ఆఫ్ఘన్తో పాటు యూఎస్ఏ, నేపాల్ కూడా పెద్ద జట్లకు షాకిచ్చే అవకాశం ఉంది. -
టీ20 వరల్డ్ కప్లో 300 కొట్టే సత్తా వారికే ఉంది: రవి శాస్త్రి
టీ20 ప్రపంచకప్-2026కి మరో వారం రోజుల్లో తెరలేవనుంది. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి శ్రీలంక, భారత్ వేదికలగా షురూ కానుంది. ఈ పొట్టి ప్రపంచకప్లో మొత్తం 20 జట్లు పాల్గోనున్నాయి. ఈ 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో ఐదు జట్ల చొప్పున ఉంటాయి. భారత్, పాక్ గ్రూప్-ఎలో పోటీపడనున్నాయి.ఆఖరి నిమిషంలో బంగ్లాదేశ్ తప్పుకోవడంతో స్కాట్లాండ్కు ఐసీసీ అవకాశమిచ్చింది. భారత్ తమ తొలి మ్యాచ్లో ఫిబ్రవరి 7న యూఎస్ఎతో తలపడనుంది. సొంతగడ్డపై జరగనుండడంతో టీమిండియా ఈ టోర్నీలో టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది.అదేవిధంగా రన్నరప్ సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి జట్లు కూడా పటిష్టంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మెగా ఈవెంట్లో 300 పరుగుల భారీ మార్కును దాటే సత్తా ఉన్న జట్లు ఏవనే విషయంపై శాస్త్రి తన అభిప్రాయాలను పంచుకున్నాడు."ఆస్ట్రేలియా, భారత జట్లకు 300 పరుగులు మార్క్ దాటే సత్తా ఉంది. ఈ రెండు రెండు జట్లలోనూ విధ్వంసం సృష్టించే ఆటగాళ్లు ఉన్నారు. ముఖ్యంగా టాప్ ఆర్డర్లో ఎవరైనా ఒకరు సెంచరీ సాధిస్తే, జట్టు స్కోరు 300కు చేరువవ్వడం కష్టమేమీ కాదు. ఇక భారత్ ఢిపెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతోంది. టైటిల్ను రిటైన్ చేసుకునేందుకు మెన్ ఇన్ బ్లూ ప్రయత్నిస్తుంది. అంతుకుతోడు ఈ టోర్నీ సొంతగడ్డపై జరగుతోంది. కాబట్టి భారత జట్టుపై కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. టీ20 ఫార్మాట్లో పది నుంచి పదిహేను నిమిషాలు ఆట మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తుంది. ఆ సమయంలో భారత్ ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటుందన్నపై విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.అయితే భారత జట్టులో బ్యాటింగ్ డెప్త్ ఎక్కువగా ఉంది. కాబట్టి బ్యాటింగ్ పరంగా పెద్దగా సమస్యలు తలెత్తకపోవచ్చు" అని ఐసీసీ రివ్యూలో రవిశాస్త్రి పేర్కొన్నాడు. కాగా అంతర్జాతీయ టీ20 మ్యాచ్లో 300 పరుగులు పైగా చేసిన ఏకైక జట్టుగా ఇంగ్లండ్ కొనసాగుతోంది. -
ఆస్ట్రేలియన్ ఓపెన్లో సంచలనం.. 37 ఏళ్ల రికార్డు బద్దలు
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026లో సంచలనం నమోదైంది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో స్థానిక జోడీ ఒలివియా గడెకీ-జాన్ పియర్స్ టైటిల్ గెలిచింది. ఇదే జోడీ గతేడాది కూడా టైటిల్ ఎగరేసుకుపోయింది. తద్వారా వరుసగా రెండు ఎడిషన్లలో టైటిల్ గెలిచిన జోడీగా 37 ఏళ్ల కిందటి రికార్డును బద్దలు కొట్టింది. 1988-89లో యానా నవోత్న-జిమ్ పగ్ జోడీ వరుసగా రెండు ఆస్ట్రేలియా ఓపెన్ టైటిళ్లు గెలిచింది.తాజా టైటిల్తో ఒలివియా గడెకీ-జాన్ పియర్స్ మరో రికార్డు కూడా సొంతం చేసుకుంది. మార్గరెట్ కోర్ట్-కెన్ ఫ్లెచర్ జోడీ (1963-64) తర్వాత స్వదేశంలో వరుసగా రెండు ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్ టైటిళ్లు సాధించిన జోడీగా చరిత్ర సృష్టించింది.రాడ్ లేవర్ ఎరీనాలో ఇవాళ జరిగిన ఫైనల్లో ఒలివియా గడెకీ-జాన్ పియర్స్ జోడీ ఫ్రెంచ్ జంట క్రిస్టినా మ్లాడెనోవిక్-మాన్యుయెల్ గినార్డ్పై 4-6, 6-3, 10-8 తేడాతో గెలుపొందింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో గడెకీ-పియర్స్ జోడీ టైబ్రేక్లో 5-7 వెనుకబడినప్పటికీ, చివరి ఆరు పాయింట్లలో ఐదు గెలిచి టైటిల్ను సొంతం చేసుకుంది. -
టీమిండియాకు గుడ్ న్యూస్.. డేంజరస్ బ్యాటర్ వచ్చేస్తున్నాడు!
టీ20 ప్రపంచకప్-2026కు టీమిండియాకు గుడ్ న్యూస్. గాయం కారణంగా న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు దూరమైన స్టార్ బ్యాటర్, హైదరాబాదీ తిలక్ వర్మ.. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. అబ్డోమినల్ సర్జరీ తర్వాత తిలక్ బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో శిక్షణ పొందుతున్నాడు.అయితే శుక్రవారం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో జరిగే సిమ్యులేషన్ మ్యాచ్లో తిలక్ పాల్గోనున్నాడు. ఈ మ్యాచ్లో తిలక్ వర్మ తన ఫిట్నెస్ను నిరూపించుకుంటే బోర్డు నుంచి క్లియరెన్స్ లభిస్తుంది. ఒకవేళ బోర్డు నుంచి క్లియరెన్స్ లభిస్తే తిలక్.. ఫిబ్రవరి 3న భారత జట్టుతో కలిసే అవకాశముందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.కాగా తొలుత న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదు టీ20 సిరీస్లో ఆఖరి రెండు మ్యాచ్లకు తిలక్ అందుబాటులో ఉంటాడని వార్తలు వచ్చాయి. కానీ పూర్తిగా కోలుకుండా అతడి ఆడించి రిస్స్ తీసుకోడదని బీసీసీఐ భావించింది. ఈ క్రమంలోనే తిలక్ స్ధానంలో జట్టులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ను ఆఖరి రెండు టీ20లకూ కొనసాగించారు. తిలక్ తిరిగి రీఎంట్రీ ఇస్తే జట్టు మిడిల్ ఆర్డర్ మరింత బలోపేతం కానుంది. మయాంక్ ఫిట్..మరోవైపు వెన్నునొప్పి కారణంగా దాదాపు ఏడాది కాలంగా ఆటకు దూరంగా ఉన్న ఢిల్లీ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ కూడా పూర్తి ఫిట్నెస్ సాధించాడు. వరల్డ్ కప్ సన్నాహకాల్లో భాగంగా జరిగే వార్మప్ మ్యాచ్లలో ఇండియా-ఎ తరపున మయాంక్ బరిలోకి దిగనున్నాడు. అదేవిధంగా కుడి భుజం గాయం నుంచి కోలుకున్న అస్సాం ఆటగాడు రియాన్ పరాగ్ యో-యో టెస్టు పాస్ అయ్యాడు.అతడు కూడా తిలక్తో కలిసి సిమ్యులేషన్ మ్యాచ్లో భాగం కానున్నాడు. ఇక కివీస్తో వన్డే సిరీస్లో గాయపడిన ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ పూర్తిగా కోలుకోవడానికి కాస్త సమయం పడుతోంది. అతడికి ఫిబ్రవరి 4న ఫిట్నెస్ పరీక్ష నిర్వహించనున్నారు. టీ20 వరల్డ్కప్ లీగ్ మ్యాచ్లకు వాషీ దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.చదవండి: వరల్డ్కప్ నుంచి సౌతాఫ్రికా అవుట్ -
T20 WC: మూడు మ్యాచ్లు అప్పుడే.. ఆ జట్టుకు లాభం!
టీ20 ప్రపంచకప్-2024లో అండర్డాగ్గా బరిలోకి దిగిన అఫ్గనిస్తాన్ అంచనాలకు మించి రాణించింది. గ్రూప్ దశలో న్యూజిలాండ్పై సంచలన రీతిలో 84 పరుగుల తేడాతో గెలిచి క్రికెట్ ప్రేమికులను ఆశ్చర్యపరిచింది రషీద్ ఖాన్ బృందం.సంచలన రీతిలో సెమీస్లోకిఇక సూపర్-8లో ఏకంగా ఆస్ట్రేలియాను 21 పరుగుల తేడాతో ఓడించి.. అఫ్గనిస్తాన్ సంచలనం సృష్టించింది. అనంతరం బంగ్లాదేశ్పై 8 పరుగుల స్వల్ప తేడాతో గెలిచి తొలిసారి టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్కు అర్హత సాధించింది. అయితే, సెమీస్లో మాత్రం సౌతాఫ్రికా చేతిలో తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడటంతో ఫైనల్ చేరాలన్న అఫ్గన్ ఆశలు కరిగిపోయాయి.ఏదేమైనా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి మేటి జట్లను ఓడించిన అఫ్గనిస్తాన్కు ప్రశంసలైతే దక్కాయి. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో అఫ్గనిస్తాన్పై ఓ మోస్తరుగా అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఉపఖండ పిచ్లపై ఈ ఈవెంట్ జరుగనుండటం వారికి సానుకూలాంశంగా మారింది.షెడ్యూల్, మ్యాచ్ టైమింగ్స్ కలిసివస్తాయా?కాగా భారత్- శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు టీ20 వరల్డ్కప్ జరుగనున్న విషయం తెలిసిందే. ఇందులో ఇరవై జట్లు పాల్గొంటుండగా.. నాలుగు గ్రూపులుగా విభజించారు. న్యూజిలాండ్, సౌతాఫ్రికా, యూఏఈ, కెనడాలతో కలిసి అఫ్గనిస్తాన్ గ్రూప్-డిలో ఉంది.అయితే, ఈసారి లీగ్ దశలో షెడ్యూల్, మ్యాచ్ టైమింగ్స్ కూడా అఫ్గనిస్తాన్కు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. న్యూజిలాండ్, సౌతాఫ్రికా, యూఏఈలతో మ్యాచ్లు మధ్యాహ్నం వేళ (ఉదయం 11 గంటలకు ఆరంభం) జరుగనున్నాయి. ఇందుకు చెన్నై, అహ్మదాబాద్, ఢిల్లీ ఇందుకు వేదికలు. కాగా రాత్రి మ్యాచ్లలో మంచు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.అందుకు భిన్నంగా డే మ్యాచ్లలో తేమ ప్రభావం తక్కువగా ఉంటుంది. కాబట్టి.. తమకు ప్రధాన బలమైన స్పిన్ దళంతో అఫ్గన్ అనుకున్న ఫలితాలు రాబట్టే అవకాశాలు మెరుగుపడతాయి. ముఖ్యంగా చెన్నై పిచ్ స్పిన్కు ఎంత అనుకూలమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మేటి స్పిన్ దళంప్రస్తుతం అఫ్గనిస్తాన్ జట్టులో కెప్టెన్ రషీద్ ఖాన్ వంటి మేటి స్పిన్నర్తో పాటు నూర్ అహ్మద్, మహ్మద్ నబీ వంటి క్వాలిటీ స్పిన్ బౌలర్లు ఉన్నారు. వీరికి తోడు ముజీబ్ ఉర్ రహమాన్ కూడా ఉండనే ఉన్నాడు. ప్రస్తుతం ఇంతకంటే అత్యుత్తమ స్పిన్ దళం ఉన్న మరో జట్టు లేదనే చెప్పవచ్చు. కాబట్టి మంచు ప్రభావం లేని మధ్యాహ్న మ్యాచ్లలో వీరు తమ స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి జట్లను కట్టడి చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.ఆల్రౌండర్ల బలంఅదే విధంగా జట్టులో మెరుగైన ఆల్రౌండర్లు ఉండటం కూడా అఫ్గనిస్తాన్కు కలిసి వచ్చే అంశం. గుల్బదిన్ నైబ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ బ్యాట్తోనూ సత్తా చాటగలరు. ఇక అజ్మతుల్లా ఒమర్జాయ్ కూడా లోయర్ ఆర్డర్లో సేవలు అందించగలడు. కాబట్టి ఈసారి ఉపఖండ పిచ్లపై జరిగే వరల్డ్కప్ టోర్నీలో అఫ్గనిస్తాన్కు స్పిన్నర్లుగానే కాకుండా.. ఆల్రౌండర్లుగా రెండు పాత్రలు పోషించగల ఆటగాళ్లు ప్రధాన బలంగా మారనున్నారని ఆకాశ్ చోప్రా వంటి మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. కాగా గత వరల్డ్కప్ ఎడిషన్లోనూ స్పిన్ ఫ్రెండ్లీ అయిన అమెరికా- వెస్టిండీస్ పిచ్లను సమర్థవంతంగా ఉపయోగించుకున్న అఫ్గన్ సెమీస్ వరకు చేరిన విషయం తెలిసిందే. చదవండి: ICC vs BCB: బంగ్లాదేశ్కు షాక్.. తొలిసారి స్పందించిన శ్రీలంక -
అల్కరాజ్ అదరహో.. ఫైనల్లో అడుగుపెట్టిన స్పెయిన్ సంచలనం
ఆస్ట్రేలియన్ ఓపెన్-2026లో స్పెయిన్ సంచలనం, ప్రపంచ నంబర్ 1 కార్లోస్ అల్కరాజ్ తన జోరును కొనసాగిస్తున్నాడు. అల్కరాజ్ శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో అలెగ్జాండర్ జ్వెరెవ్ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టాడు. హోరాహోరీ సాగిన ఈ పోరులో 6-4, 7-6(5), 6-7(3), 6-7(4), 7-5 తేడాతో అల్కరాజ్ విజయం సాధించాడు.మొదటి రెండు సెట్లను అల్కరాజ్ గెలుచుకున్నప్పటికి.. జ్వెరెవ్ గట్టి పోటీనిస్తూ తర్వాతి రెండు సెట్లను టై బ్రేకర్లలో సొంతం చేసుకున్నాడు. దీంతో విజేతను తేల్చేందుకు ఐదో సెట్ను నిర్వహించారు.అల్కరాజ్ అద్బుత పోరాటం..అయితే ఈ మ్యాచ్ మూడో సెట్లో అల్కరాజ్ కుడి కాలికి గాయం కావడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఒక దశలో కదలడానికి కూడా ఇబ్బంది పడిన అల్కరాజ్.. మ్యాచ్ మధ్యలోనే వైదొలగడతాడని అంతా భావించారు. కానీ అల్కరాజ్ మాత్రం అద్భుతమైన పోరాటం కనబరిచాడు.మెడికల్ టైమ్ అవుట్ తీసుకుని తిరిగి కోర్టులో అడుగుపెట్టాడు. నిర్ణయాత్మక ఐదో సెట్లో 3-5తో అల్కరాజ్ వెనుకబడినప్పటికీ.. తర్వాత తన మార్క్ షాట్లతో పుంజుకుని సెట్తో పాటు మ్యాచ్ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరగనున్న ఫైనల్ పోరులో అల్కరాజ్.. రెండు సార్లు డిఫెండింగ్ ఛాంపియన్ జానిక్ సినర్ లేదా నోవాక్ జోకోవిచ్లతో తలపడే అవకాశముంది. సెకెండ్ సెమీఫైనల్లో శనివారం జానిక్ సినర్, జోకోవిచ్లు అమీతుమీ తెల్చుకోనున్నారు. -
సత్తా చాటిన కేఎల్ రాహుల్
టీమిండియా మోస్ట్ ప్రామిసింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ దేశవాలీ క్రికెట్లోనూ సత్తా చాటుతున్నాడు. జాతీయ విధులకు దూరంగా ఉండటంతో రంజీ బాట బట్టిన ఈ కర్ణాటక వికెట్కీపర్ బ్యాటర్.. పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో (87 బంతుల్లో 59; 9 ఫోర్లు) మెరిశాడు. క్వార్టర్ ఫైనల్కు చేరాలంటే కర్ణాటక ఈ మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాలి.Highlights of KL Rahul’s 59 (87) in the Ranji Trophy. pic.twitter.com/AeV5DXI2aQ— Mufaddal Vohra (@mufaddal_vohra) January 30, 2026కీలకమైన ఈ మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన రాహుల్.. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్తో కలిసి తొలి వికెట్కు 102 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. రాహుల్, మయాంక్ రాణించినా, ఈ మ్యాచ్లో కర్ణాటక ఎదురీదుతోంది. రెండో రోజు టీ విరామం సమయానికి సగం వికెట్ల నష్టానికి 199 పరుగులు మాత్రమే చేయగలిగింది. పంజాబ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు చేరుకోవాలంటే ఇంకా 110 పరుగులు చేయాల్సి ఉంది.శ్రేయస్ గోపాల్ (17), కృతిక్ కృష్ణ (20) కర్ణాటకను గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ ఔటయ్యాక కర్ణాటక స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్తో కెప్టెన్గా అరంగేట్రం చేసిన దేవదత్ పడిక్కల్, స్మరణ్ రవిచంద్రన్ తలో 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యారు. వన్డౌన్లో వచ్చిన కేవీ అనీశ్ (32) క్రీజ్లో కుదురుకున్న సమయంలో ఔటయ్యాడు. హర్ప్రీత్ బ్రార్ 4 వికెట్లు తీసి కర్ణాటకను దారుణంగా దెబ్బకొట్టాడు. ఎమన్జోత్ సింగ్ చహల్ కీలకమైన మయాంక్ అగర్వాల్ వికెట్ తీశాడు.అంతకుముందు పంజాబ్ తొలి ఇన్నింగ్స్లో 309 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ అభిజీత్ గార్గ్ (81), ఎమన్జోత్ సింగ్ చహల్ (83) అర్ద సెంచరీలతో రాణించారు. కెప్టెన్ ఉదయ్ సహారన్ (44) ఓ మోస్తరుగా రాణించగా.. అన్మోల్ మల్హోత్రా (25), ఆయుశ్ గోయల్ (23), సుఖ్దీప్ బజ్వా (20) రెండంకెల స్కోర్లు చేశారు. కర్ణాటక బౌలర్లలో విద్యాదర్ పాటిల్ 4, శ్రేయస్ గోపాల్ 3, మొహిసిన్ ఖాన్ 2, ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ తీశారు. -
న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్కు ఊహించని అవకాశం
న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ బెన్ సియర్స్కు ఊహించని అవకాశం దక్కింది. గతేడాది గాయాలతో సతమతమైన అతనికి ఊహించని విధంగా టీ20 ప్రపంచకప్ బెర్త్ దక్కింది. ట్రావెలింగ్ రిజర్వ్గా కైల్ జేమీసన్ స్థానాన్ని సియర్స్ భర్తీ చేస్తాడు. ఈ మేరకు న్యూజిలాండ్ క్రికెట్ ఓ ప్రకటన విడుదల చేసింది.ఆడమ్ మిల్నే గాయపడటంతో అప్పటివరకు ట్రావెలింగ్ రిజర్వ్గా ఉన్న జేమీసన్ ప్రధాన జట్టులోకి ప్రమోట్ అయ్యాడు. ఇప్పుడు జేమీసన్ స్థానాన్ని సియర్స్ భర్తీ చేశాడు. సియర్స్ ఫిబ్రవరి 5న ముంబైలో అమెరికాతో జరగబోయే వార్మప్ మ్యాచ్లోపు జట్టుతో కలుస్తాడు. సియర్స్కు ప్రపంచకప్ అవకాశం కల్పించడంపై న్యూజిలాండ్ కోచ్ రాబ్ వాల్టర్ హర్షం వ్యక్తం చేశాడు. సియర్స్ చాలా కష్టపడి ఫిట్నెస్ సాధించాడని కితాబునిచ్చాడు. ప్రధాన జట్టులో ఎవరికైనా గాయాలైతే సియర్స్ మొదటి ఆప్షన్గా ఉంటాడని స్పష్టం చేశాడు.తాజాగా ముగిసిన న్యూజిలాండ్ టీ20 టోర్నీ సూపర్ స్మాష్లో సియర్స్ అద్భుత ప్రదర్శన చేశాడు. 9 మ్యాచ్ల్లో 15 వికెట్లు తీసి, రెండో అత్యధిక వికెట్ టేకర్గా నిలిచాడు. దీనికి ముందు కౌంటీ డివిజన్ వన్ టోర్నీలోనూ అతను సత్తా చాటాడు. రెండు మ్యాచ్ల్లో ఏడు వికెట్లతో రాణించాడు. ఇప్పటివరకు 22 అంతర్జాతీయ టీ20లు ఆడిన సియర్స్ 23 వికెట్లు తీశాడు. 140 కిమీకు పైగా వేగంతో బంతులు సంధించడం సియర్స్ ప్రత్యేకత. బౌన్స్ అతని అదనపు బలం.టీ20 ప్రపంచకప్కు న్యూజిలాండ్ జట్టు మిచెల్ సాంట్నర్ (c), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గుసన్, మ్యాట్ హెన్రీ, కైల్ జేమిసన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫర్ట్, ఇష్ సోధీ, బెన్ సియర్స్ (రిజర్వ్)ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరుగబోయే టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్ జట్టు గ్రూప్-డిలో ఉంది. ఈ గ్రూప్లో అఫ్గనిస్తాన్, కెనడా, దక్షిణాఫ్రికా, యూఏఈ మిగతా జట్లుగా ఉన్నాయి. న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 8న చెన్నైలో అఫ్ఘనిస్తాన్తో ఆడుతుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు భారత్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్లో ఇప్పటికే నాలుగు మ్యాచ్లు పూర్తి కాగా.. భారత్ 3-1తో సిరీస్ను కైవసం చేసుకుంది. ఐదో టీ20 తిరువనంతపురం వేదికగా జనవరి 31న జరుగనుంది. -
న్యూజిలాండ్తో ఐదో టీ20.. భారత తుది జట్టులోకి స్టార్ ప్లేయర్?
టీ20 ప్రపంచకప్-2026కు ముందు చివరి మ్యాచ్ ఆడేందుకు టీమిండియా సిద్దమైంది. శనివారం తిరువనంతపురం వేదికగా న్యూజిలాండ్తో ఐదో టీ20లో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచి నాలుగో టీ20లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని మెన్ ఇన్ బ్లూ భావిస్తోంది. అయితే ఈ ఆఖరి మ్యాచ్ కోసం భారత తుది జట్టులో పలు మార్పులు చోటు చేసుకునే అవకాశముంది.అక్షర్ పటేల్ రీఎంట్రీ?నాగ్పూర్లో జరిగిన తొలి టీ20లో గాయపడిన భారత స్టార్ ఆల్రౌండర్, వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ తిరిగి పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. అక్షర్ ప్రస్తుతం నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. . 4వ టీ20 టాస్ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ మాట్లాడుతూ.. అక్షర్ కోలుకుంటున్నాడని, వరల్డ్ కప్నకు ముందు అతడికి మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమని పేర్కొన్నాడు. దీంతో తిరువనంతపురం టీ20కు అతడు అందుబాటులో ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి.హార్దిక్కు విశ్రాంతి..అదేవిధంగా సీనియర్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం. వైజాగ్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో పాండ్యా కేవలం స్పెషలిస్ట్ బ్యాటర్గానే ఆడాడు. ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు. అతడి స్ధానంలోనే అక్షర్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు నాలుగో టీ20కు దూరమైన ఇషాన్ కిషన్ కూడా ప్లేయింగ్ ఎలెవన్లోకి రానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. గత మ్యాచ్లో భారీగా పరుగులు సమర్పించుకున్న హర్షిత్ రాణాపై వేటు పడే అవకాశం ఉంది. ఐదుగురు స్పెషలిస్టు బ్యాటర్లతో భారత్ బరిలోకి దిగే సూచనలు కన్పిస్తున్నాయి. కాగా ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 3-1 తేడాతో సొంతం చేసుకుంది.భారత తుది జట్టు(అంచనా)అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శివం దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి -
పాక్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు.. నేనే వస్తానంటూ ప్రకటన
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్లో పాకిస్తాన్ శుభారంభం చేసింది. లాహోర్ వేదికగా పర్యాటక జట్టును 22 పరుగుల తేడాతో ఓడించింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా తాము టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఆడే విషయాన్ని పరోక్షంగా ధ్రువీకరించాడు.నేను మూడో స్థానంలోనే వస్తాఆసీస్తో తొలి టీ20లో తాను వన్డౌన్లో వచ్చానన్న సల్మాన్.. వరల్డ్కప్ టోర్నీలోనూ ఇదే కొనసాగిస్తానని స్పష్టం చేశాడు. ‘‘ఈ మ్యాచ్లో మా బ్యాటింగ్ ముందు నుంచి బాగుంది. అయితే, అనుకున్న రీతిలో భారీ స్కోరు సాధించలేకపోయాము.పది ఓవర్ల ఆట ముగిసిన తర్వాత బంతి బ్యాట్ మీదకు రాలేదు. నేను మూడో స్థానంలోనే కొనసాగుతాను. మున్ముందు మేము ఎక్కువగా స్పిన్ బౌలింగ్నే ఎదుర్కోబోతున్నాం. అందుకే పవర్ ప్లేలో నేను ఆధిపత్యం కొనసాగించగలనని భావిస్తున్నా.ఈ మ్యాచ్లో 170 పరుగులు మెరుగైన స్కోరు అని భావించాను. ఇంకో 10- 15 పరుగులు ఎక్కువగా చేసినా బాగుండేది. ఈరోజు అబ్రార్ అద్భుతంగా ఆడాడు. మా స్పిన్నర్లు అదరగొట్టడం ఖాయం’’ అని సల్మాన్ ఆఘా పేర్కొన్నాడు.బాబర్కు షాక్కాగా టీ20లలో సల్మాన్ ఆఘా సాధారణంగా టాప్-6లో బ్యాటింగ్కు వచ్చేవాడు. వన్డౌన్లో బాబర్ ఆజం బ్యాటింగ్ చేసేవాడు. అయితే, ఆసీస్తో తొలి టీ20లో సల్మాన్ తనను తాను టాప్-3కి ప్రమోట్ చేసుకోగా.. బాబర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్కు మద్దతుగా తాము వరల్డ్కప్ నుంచి వైదొలుగుతామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రగల్బాలు పలుకుతున్న వేళ.. కెప్టెన్ సల్మాన్ ఆఘా మాత్రం తాను టీ20 వరల్డ్కప్ టోర్నీలో మూడో స్థానంలో బ్యాటింగ్కు వస్తానని చెప్పడం గమనార్హం.సయీమ్ అయూబ్ ధనాధన్ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఆసీస్తో తొలి టీ20లో మొదట పాకిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సయీమ్ అయూబ్ (22 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా... కెప్టెన్ సల్మాన్ ఆఘా (39; 1 ఫోర్, 4 సిక్స్లు), బాబర్ ఆజమ్ (24; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా తడబడింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులకే పరిమితమైంది. కామెరాన్ గ్రీన్ (36; 3 ఫోర్లు, 1 సిక్స్), జేవియర్ బార్ట్లెట్ (34 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. కెప్టెన్ హెడ్ (13 బంతుల్లో 23; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించగా... మిగిలినవాళ్లు విఫలమయ్యారు. పాకిస్తాన్ బౌలర్లలో సయీమ్ అయూబ్, అబ్రార్ అహ్మద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య శనివారం ఇక్కడే రెండో టీ20 జరగనుంది. చదవండి: ICC vs BCB: బంగ్లాదేశ్కు షాక్.. తొలిసారి స్పందించిన శ్రీలంక -
వరల్డ్కప్ నుంచి సౌతాఫ్రికా అవుట్
అండర్–19 పురుషుల వన్డే వరల్డ్కప్లో సౌతాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో శ్రీలంక విజయం సాధించింది. తద్వారా శ్రీలంక సెమీఫైనల్ చేరే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 261 పరుగులు సాధించింది.ఓపెనర్ జోరిచ్ వాన్ వాన్ షాల్క్విక్ (116; 13 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీ చేశాడు. అతడితో పాటు అద్నాన్ లగాడియన్(46), జేమ్స్(47) రాణించారు. శ్రీలంక బౌలర్లలో విఘ్నేశ్వరన్ ఆకాశ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం శ్రీలంక 46 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ విరాన్ చముదిత (110; 13 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించి శ్రీలంక విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఐర్లాండ్తో నేడు జరిగే ‘సూపర్ సిక్స్’ మ్యాచ్లో అఫ్గానిస్తాన్ ఓడిపోతేనే శ్రీలంక సెమీఫైనల్ చేరుకుంటుంది. అఫ్గానిస్తాన్ గెలిస్తే మాత్రం సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంటుంది. గ్రూప్–1 నుంచి ఇప్పటికే ఆస్ట్రేలియా సెమీఫైనల్ చేరుకుంది.సౌతాఫ్రికా అవుట్కాగా ఈ ఓటమితో వరల్డ్కప్ నుంచి సౌతాఫ్రికా నిష్క్రమించింది. సూపర్-6లో ప్రోటీస్ ఆడిన నాలుగు మ్యాచ్లలోనూ పరాజయం పాలైంది. దీంతో గ్రూపు-1 నుంచి దక్షిణాఫ్రికాతో పాటు ఐర్లాండ్ జట్లు ఇంటిముఖం పట్టాయి. ఈ టోర్నీ అసాంతం సఫారీలు దారుణ ప్రదర్శన కనబరిచారు. లీగ్ స్టేజిలోనూ కేవలం ఒక్క మ్యాచ్లోనే దక్షిణాఫ్రికా విజయం సాధించింది.చదవండి: SA vs WI 2nd T20I: డికాక్ విధ్వంసకర సెంచరీ.. 222 టార్గెట్ హాంఫట్ -
ఆసీస్ దిగ్గజం కన్నుమూత
మెల్బోర్న్: ఆస్ట్రేలియా మాజీ హాకీ ప్లేయర్ మైకేల్ నాబ్స్ కన్నుమూశారు. ఆయన గతంలో భారత పురుషుల హాకీ జట్టుకు కోచ్గా పనిచేశారు. నాబ్స్ శిక్షణలోనే భారత జట్టు లండన్లో జరిగిన 2012 ఒలింపిక్స్కు అర్హత సంపాదించింది. కాగా 72 ఏళ్ల నాబ్స్ కొంతకాలంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన భార్య లీ కేప్స్ కూడా మాజీ హాకీ ప్లేయర్. ఆస్ట్రేలియా మహిళల జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. కుమార్తె కైట్లిన్ కూడా హాకీరూస్ స్టార్గా ఎదిగింది.ఇక ఆటగాడిగా నాబ్స్ భారత్ ఆతిథ్యమిచ్చిన 1981 హాకీ ప్రపంచకప్, 1984లో జరిగిన లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో పోటీపడ్డారు. తదనంతరం కోచ్గా మారారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్కు భారత్ అర్హత సాధించడంలో విఫలమైంది. దీంతో 2011లో భారత కోచ్గా నాబ్స్ నియమితులయ్యారు. లండన్ మెగా ఈవెంట్కు అర్హత సాధించినప్పటికీ ఆ విశ్వక్రీడల్లో భారత్ అట్టడుగున నిలవడంతో ఆయనపై వేటు పడింది. నాబ్స్ భారత్తో పాటు జపాన్ జట్టుకు కోచ్గా పనిచేశారు. కాగా నాబ్స్ మృతి పట్ల హాకీ ఆస్ట్రేలియా సంతాపం వ్యక్తం చేసింది. అత్యంత ప్రభావంతమైన ఒలింపియన్ను కోల్పోయామంటూ నివాళులు అర్పించింది. -
డికాక్ విధ్వంసకర సెంచరీ.. 222 టార్గెట్ హాంఫట్
టీ20 ప్రపంచకప్-2026 సన్నాహాల్లో భాగంగా వెస్టిండీస్తో జరుగుతున్న టీ20 సిరీస్లో సౌతాఫ్రికా దుమ్మలేపుతోంది. గురువారం సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో టీ20లో విండీస్ను 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చిత్తు చేసింది. దీంతో మూడు టీ20ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలూండగానే ప్రోటీస్ సొంతం చేసుకుంది.ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన కరేబియన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ సాధించింది. విండీస్ బ్యాటర్లలో షిమ్రాన్ హెట్మైర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 42 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 75 పరుగులు చేశాడు. అతడితో పాటు రూథర్ఫోర్డ్(24 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 57) విధ్వంసం సృష్టించాడు. సఫారీ బౌలర్లలో కేశవ్ మహారాజ్ రెండు, రబాడ, జాన్సెన్ తలా వికెట్ సాధించారు.దంచి కొట్టిన డికాక్..అనంతరం తన కెరీర్లో వందో టీ20 ఆడిన క్వింటన్ డికాక్ విధ్వంసకర సెంచరీతో మెరిశాడు. భారీ లక్ష్య చేధనలో డికాక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ సూపర్స్పోర్ట్ పార్క్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. డికాక్ 49 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్సర్లతో 115 పరుగులు చేశాడు. అతడితో పాటు ర్యాన్ రికెల్టన్ కూడా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ర్యాన్ రికెల్టన్ 36 బంతుల్లో 77 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్కు 162 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో 222 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రోటీస్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 17.3 ఓవర్లలో ఊదిపడేసింది. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో టీ20 శనివారం జోహన్నెస్బర్గ్ వేదికగా జరగనుంది.చదవండి: T20 WC: వరల్డ్కప్లో ఈసారి సెంచరీ చేసేది అతడే: రైనా -
T20 WC: వరల్డ్కప్లో ఈసారి సెంచరీ చేసేది అతడే: రైనా
టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో శతకం సాధించిన భారత ఏకైక క్రికెటర్గా సురేశ్ రైనా కొనసాగుతున్నాడు. సుమారుగా పదహారేళ్ల క్రితం 2010 నాటి వరల్డ్కప్ టోర్నీలో సౌతాఫ్రికా మీద రైనా శతక్కొట్టాడు. వెస్టిండీస్ వేదికగా లీగ్ దశలో సఫారీలతో మ్యాచ్లో 59 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. మొత్తంగా 60 బంతుల్లో 101 పరుగులు చేసి నిష్క్రమించాడు.రైనా ఆడిన నాటి శతక ఇన్నింగ్స్లో తొమ్మిది ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్లో టీమిండియా 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, ఆ తర్వాత భారత్ తరఫున ఇంత వరకు ఒక్క ఆటగాడు కూడా టీ20 ప్రపంచకప్లో సెంచరీ చేయలేదు. తాజా ఎడిషన్ సందర్భంగా తన రికార్డును సమం చేయగల సత్తా ఉన్న ఆటగాడి పేరును సురేశ్ రైనా (Suresh Raina) తాజాగా వెల్లడించాడు.వరల్డ్కప్లో ఈసారి సెంచరీ చేసేది అతడేటీమిండియా టీ20 ఓపెనర్ సంజూ శాంసన్ (Sanju Samson)ఈసారి వరల్డ్కప్ టోర్నీలో సెంచరీ చేస్తాడని రైనా అంచనా వేశాడు. ‘‘సంజూ ఓపెనింగ్ బ్యాటర్. సెంచరీ చేయగల సత్తా అతడికి ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ టీ20లలో అతడి పేరిట రెండు శతకాలు ఉన్నాయి.సౌతాఫ్రికా మీద రెండుసార్లు సంజూ శతక్కొట్టాడు. ఇక సంజూతో పాటు ఈసారి అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ కూడా ఈ జాబితాలో చేరే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే నా ఓటు సంజూ శాంసన్కే’’ అని రైనా వెల్లడించాడు. కాగా సంజూ గత కొన్నాళ్లుగా ఫామ్లేమితో సతమతమవుతున్న విషయం తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్తో తాజా టీ20 సిరీస్లో అతడు చేసిన స్కోర్లు 10. 6. 0, 24. ఇలాంటి తరుణంలో రైనా సంజూకు మద్దతుగా నిలవడం విశేషం.సంజూ క్లాస్ బ్యాటర్“ఫామ్ తాత్కాలికం. సంజూ క్లాస్ బ్యాటర్. టీమిండియా తరఫున, ఓవరాల్గా టీ20 క్రికెట్లో అతడు భారీ ఎత్తున పరుగులు సాధించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా చాలాకాలంగా ఫామ్లేమితో ఇబ్బందిపడ్డాడు.అయినప్పటికీ హెడ్కోచ్ అతడికి అండగా ఉన్నాడు. సంజూ విషయంలోనూ ఇదే జరగాలి. అతడికి ఒక్క ఛాన్స్ దొరికితే తిరిగి విజృంభించడం ఖాయం’’ అని రైనా ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్కు అండగా నిలిచాడు.చదవండి: ICC vs BCB: బంగ్లాదేశ్కు షాక్.. తొలిసారి స్పందించిన శ్రీలంక -
రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు బ్రేక్
ఐర్లాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం రోహిత్ శర్మ పేరిట ఉన్న అరుదైన టీ20 ప్రపంచ రికార్డును అతడు బద్దలు కొట్టాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో తొలి టీ20 సందర్భంగా స్టిర్లింగ్ ఈ ఘనత సాధించాడు. ఇంతకీ ఆ రికార్డు ఏమిటంటారా?!టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకాల్లో భాగంగా రెండు మ్యాచ్లు ఆడేందుకు ఐర్లాండ్ జట్టు.. యూఏఈ పర్యటనకు వెళ్లింది. ఇరుజట్ల మధ్య రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా.. గురువారం తొలి టీ20 జరిగింది. దుబాయ్ వేదికగా టాస్ గెలిచిన ఐర్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది.మెరుపు ఇన్నింగ్స్ఓపెనర్లలో కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ (8) విఫలం కాగా.. రాస్ అడేర్ (39) మెరుగ్గా రాణించాడు. మిగిలిన వారిలో వికెట్ కీపర్ బ్యాటర్ లోర్కాన్ టకర్ (25 బంతుల్లో 38), కర్టిస్ కాంఫర్ (25) ఫర్వాలేదనిపించగా.. బెంజమిన్ కలిజ్ (12 బంతుల్లో 26 నాటౌట్), జార్జ్ డాక్రేల్ (10 బంతుల్లో 22 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐర్లాండ్ ఆరు వికెట్ల నష్టానికి 178 పరుగులు సాధించింది. యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్దిఖి, హైదర్ అలీ చెరో రెండు.. ముహమ్మద్ అర్ఫాన్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో 19.5 ఓవర్లలో 121 పరుగులకే యూఏఈ ఆలౌట్ అయింది.57 పరుగుల తేడాతో విజయం ఐర్లాండ్ బౌలర్లు మాథ్యూ హాంప్రేస్, గరేత్ డెలాని తలా మూడు వికెట్లు పడగొట్టి యూఏఈ బ్యాటింగ్ ఆర్డర్ను కుదేలు చేయగా.. బారీ మెకార్తి రెండు వికెట్లు పడగొట్టాడు. జార్జ్ డాక్రేల్, మార్క్ అడేర్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో తొలి టీ20లో ఐర్లాండ్ 57 పరుగుల తేడాతో విజయం సాధించి 1-0తో సిరీస్లో ఆధిక్యంలో నిలిచింది.ఇక పాల్ స్టిర్లింగ్కు అంతర్జాతీయ స్థాయిలో ఇది 160వ టీ20 మ్యాచ్ కావడం విశేషం. తద్వారా ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ పొట్టి ఫార్మాట్లో.. అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా.. భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) పేరిట ఉన్న ఆల్టైమ్ రికార్డును స్టిర్లింగ్ బద్దలు కొట్టాడు. కాగా 2024లో టీమిండియాకు టీ20 వరల్డ్కప్ అందించిన తర్వాత అంతర్జాతయ టీ20లకు రోహిత్ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక టీ20 మ్యాచ్లు ఆడిన క్రికెటర్లుపాల్ స్టిర్లింగ్ (ఐర్లాండ్): 2009- 2026*- 160 మ్యాచ్లురోహిత్ శర్మ (ఇండియా): 2007-2024- 159 మ్యాచ్లుజార్జ్ డాక్రేల్ (ఐర్లాండ్): 2010-2026*- 153 మ్యాచ్లుమహ్మద్ నబీ (అఫ్గనిస్తాన్): 2010-2026- 148 మ్యాచ్లుజోస్ బట్లర్ (ఇంగ్లండ్): 2011-2025- 144 మ్యాచ్లు.చదవండి: Kohli Instagram Deactivate: ఇన్స్టాకు గుడ్బై ?.. కంగారుపడ్డ విరాట్ కోహ్లి ఫ్యాన్స్! -
T20 WC: బంగ్లా అవుట్.. తొలిసారి స్పందించిన శ్రీలంక
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు భారత్తో పాటు శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్య దేశంగా ఉంది. ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ ఆడే మ్యాచ్లన్నీ లంకలోనే నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, బంగ్లాదేశ్ సైతం శ్రీలంకలో తమ మ్యాచ్లు ఆడతామంటూ మొండిపట్టు పట్టి మూల్యం చెల్లించింది.భారత్- బంగ్లాదేశ్ మధ్య గత కొంతకాలంగా దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో.. ఐపీఎల్ నుంచి బంగ్లా ఫాస్ట్బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్ (Mustafizur Rahman)ను బీసీసీఐ తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ జట్టుకు భారత్లో భద్రత లేదని.. వరల్డ్కప్లో తమ మ్యాచ్లు భారత్లో కాకుండా లంకలో ఆడతామని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) పంతం పట్టింది.బంగ్లాదేశ్ను తప్పించి..అయితే, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) మాత్రం ఇందుకు నిరాకరించింది. భారత్లో బంగ్లా ఆటగాళ్లు, సిబ్బందికి వచ్చిన ముప్పేమీ లేదని తేల్చి చెప్పగా.. బీసీబీ మాత్రం పట్టువీడలేదు. ఫలితంగా 24 గంటల తుది గడువు తర్వాత.. బంగ్లాదేశ్ను తప్పిస్తూ ఆ స్థానంలో స్కాట్లాండ్ను మెగా టోర్నీలో చేర్చింది ఐసీసీ.మాకు స్నేహపూర్వక దేశాలుఈ పరిణామాలపై శ్రీలంక క్రికెట్ బోర్డు తాజాగా స్పందించింది. లంక క్రికెట్ బోర్డు కార్యదర్శి బందులా దిస్సనాయకే AFPతో మాట్లాడుతూ.. "ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వివాదాల విషయంలో మాది తటస్థ వైఖరి. ఈ మూడూ మాకు స్నేహపూర్వక దేశాలు.మా దేశంలో మున్ముందు కూడా ఇలాంటి టోర్నీలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాము. ఏ దేశం అడిగినా మేము సానుకూలంగా స్పందిస్తాము’’ అని పేర్కొన్నాడు. మరోవైపు.. బంగ్లాదేశ్కు మద్దతుగా తాము కూడా టోర్నీని బహిష్కరిస్తామని ప్రగల్బాలు పలుకుతూ ఓవరాక్షన్ చేసిన పాకిస్తాన్.. ఇప్పటికే లంకకు టికెట్లు బుక్ చేసుకున్నట్లు సమాచారం.ఈ మ్యాచ్ మాకు అత్యంత ముఖ్యంఈ నేపథ్యంలో భారత్- పాకిస్తాన్ మ్యాచ్ సాఫీగా సాగేందుకు తాము ప్రత్యేకమైన, మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు శ్రీలంక క్రీడా శాఖా మంత్రి సునిల్ కుమార గమేజ్ తెలిపారు. ఈ మ్యాచ్ తమకు ప్రథమ ప్రాధాన్యం అని.. ఎలాంటి అవాంతరాలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య టీ20 వరల్డ్కప్ టోర్నీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: ఆస్ట్రేలియాకు ఊహించని షాకిచ్చిన పాకిస్తాన్ -
పీటీ ఉష భర్త హఠాన్మరణం
రాజ్యసభ ఎంపీ, భారత ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషా ఇంట విషాదం నెలకొంది. ఆమె భర్త వెంగలిల్ శ్రీనివాసన్(63) గుండెపోటుతో కన్నుమూశారు.గురువారం అర్ధరాత్రి దాటాక.. 12.30 గంటల ప్రాంతంలో తిక్కోడి పెరుమాళ్పురంలోని నివాసంలో శ్రీనివాసన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ను పెరుమాళ్పురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఉష ఢిల్లీలో ఉన్నారు. భర్త మరణంతో ఆమె హుటాహుటిన కేరళ బయల్దేరారు. శ్రీనివాసన్ సీఐఎస్ఎఫ్ (Central Industrial Security Force)లో ఇన్స్పెక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. పరుగుల రాణి, పయ్యోలి ఎక్స్ప్రెస్గా పేర్లున్న పీటీ ఉష.. 1991లో దగ్గరి బంధువైన శ్రీనివాసన్ను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఉజ్జ్వల్ విఘ్నేష్ అనే కుమారుడు ఉన్నాడు. శ్రీనివాసన్ మృతి గురించి సమాచారం అందిన ప్రధాని నరేంద్ర మోదీ పీటీ ఉషతో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. శ్రీనివాసన్ మృతికి సంతాపం తెలిపినట్లు తెలుస్తోంది. మరోవైపు.. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు సైతం ఉష కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
గుడ్బై చెప్పాడా?.. కంగారుపడ్డ విరాట్ కోహ్లి ఫ్యాన్స్!
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లికి ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం భారత్లోనే కాకుండా ఈ రన్మెషీన్కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలోనూ కోహ్లి ఫాలోయింగ్ ఎక్కువే.274 మిలియన్ల ఫాలోవర్లుముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో కోహ్లి (Virat Kohli)కి 274 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఎక్కువగా వాణిజ్యపరమైన పోస్టులు పెట్టే ఈ ఢిల్లీ బ్యాటర్... భార్య అనుష్క శర్మ (Anushka Sharma), ఇతర కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటోలను అరుదుగా షేర్ చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి.. ముఖ్యంగా అనుష్కతో ఉన్న ఫొటోలను షేర్ చేస్తే మిలియన్ల కొద్దీ లైకులతో గంటల్లోనే ఆ పోస్టు వైరల్గా మారుతుంది. ఇటీవల కొ త్త ఏడాది సందర్భంగా విరుష్క ఫొటోకు 15 మిలియన్లకు పైగా లైకులు వచ్చాయి. కోహ్లి ఉన్న క్రేజ్కు ఇది నిదర్శనం.కాసేపు డీయాక్టివేట్అయితే, శుక్రవారం ఉదయం కోహ్లి అభిమానులు.. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవాళ్లు కాసేపు ఆందోళనకు గురయ్యారు. అతడి ఇన్స్టా అకౌంట్ కాసేపు డీయాక్టివేట్ అయిపోయింది. దీంతో కంగారుపడ్డ కింగ్ ఫ్యాన్స్.. అనుష్క శర్మ ఇన్స్టా అకౌంట్లోకి వెళ్లి.. ఆరా తీశారు.వదినమ్మా.. అసలేం జరిగింది? ‘‘వదినమ్మా.. అసలేం జరిగింది? భయ్యా అకౌంట్ కనపడటం లేదు. కంగారుగా ఉంది. రిప్లై ఇవ్వండి’’ అంటూ అనుష్క ఇదివరకు పెట్టిన పోస్టుల కింద కామెంట్ల వర్షం కురిపించారు. ఈ క్రమంలో కాసేపటికే కోహ్లి అకౌంట్ రీయాక్టివేట్ అయింది. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.వన్డేల రారాజుకాగా బాలీవుడ్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శర్మకు కూడా ఇన్స్టాలో భారీ ఎత్తున ఫాలోవర్లు ఉన్నారు. 68 మిలియన్లకు పైగా ఆమెను అనుసరిస్తున్నారు. అనుష్కతో ప్రేమలో పడిన కోహ్లి 2017లో ఆమెను వివాహమాడిన సంగతి తెలిసిందే. ఈ జంటకు కుమార్తె వామిక, కుమారుడు అకాయ్ సంతానం. ఇక ప్రస్తుతం వన్డేలలో మాత్రమే కొనసాగుతున్న కోహ్లి చివరగా.. సొంతగడ్డపై న్యూజిలాండ్తో సిరీస్లో ఆడాడు. ఆఖరి వన్డేలో సెంచరీ సాధించి.. యాభై ఓవర్ల ఫార్మాట్లో తన శతకాల సంఖ్యను 54కు పెంచుకుని ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli)చదవండి: నిప్పులు చెరిగిన సిరాజ్ View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
బ్రిజ్భూషణ్కు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు, బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ట్రయల్ కోర్టు విచారణపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఆయనపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో కింది కోర్టు ప్రొసిడింగ్స్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరమే లేదని పిటిషనర్ తరఫు లాయర్కు స్పష్టం చేసింది. భారతీయ జనతా పార్టీ (BJP) మాజీ ఎంపీ కూడా అయిన బ్రిజ్భూషణ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పలువురు రెజ్లర్లు రోడ్డెక్కారు. రోజుల తరబడి నిరసన దీక్ష చేపట్టారు. సర్వోన్నత న్యాయస్థానం ‘సుప్రీం’ కల్పించుకోవడంతో ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు 2023, మే నెలలో అప్పటి అధికారపార్టీ ఎంపీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏడాది తర్వాత 2024, మే 21న ట్రయల్ కోర్టు ఆయనపై లైంగిక వేధింపులు, బెదిరింపులు, మహిళల అణచివేత అభియోగాలు మోపి విచారణ చేపట్టింది. దీనిపై అదే ఏడాది బ్రిజ్భూషణ్ హైకోర్టును ఆశ్రయించారు. పలుమార్లు వాయిదా పడిన ఈ కేసులో తనకు అనుకూలంగా స్టే ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వినతిని హైకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా కింది కోర్టులో ఎప్పుడో విచారణ మొదలైందని, ఈ కేసు ప్రొసిడింగ్స్లో తక్షణ జోక్యం చేసుకోవాల్సిన అవసరంగానీ, స్టే ఇవ్వాల్సిన అవసరం గానీ లేవని జస్టిస్ స్వర్ణ కాంత శర్మ స్పష్టం చేస్తూ తీర్పునిచ్చారు. దీంతో ట్రయల్ కోర్టులో ఏప్రిల్ 21న తదుపరి విచారణ జరగనుంది. -
నార్వే చెస్ టోర్నీకి దివ్య
స్టావెంజర్ (నార్వే): ప్రపంచకప్ చాంపియన్, భారత గ్రాండ్మాస్టర్ దివ్య దేశ్ముఖ్ నార్వే చెస్ టోర్నీలో అరంగేట్రం చేయనుంది. మహిళల ఈవెంట్లో 19 ఏళ్ల భారత ప్లేయర్ తలపడనుంది. రెండేళ్ల క్రితం 2024లో మొదలైన ఈ టోర్నీలో పోటీపడనున్న యువ క్రీడాకారిణిగా ఆమె నిలువనుంది. మే 25 నుంచి జూన్ 5 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. ప్రపంచకప్తో పాటు గ్రాండ్మాస్టర్ టైటిల్, మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్కు అర్హతతో గతేడాదిని చిరస్మరణీయం చేసుకున్న ఆమె అదే ఉత్సాహాన్ని ఈ ఏడాది కొనసాగించాలని ఆశిస్తోంది. దివ్యతో పాటు ప్రపంచ మేటి చెస్ ప్లేయర్లంతా నార్వే చెస్ ఈవెంట్లో పాల్గొననున్నారు. ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్ బిబిసారా అసబయేవా (కజకిస్తాన్), డిఫెండింగ్ నార్వే చెస్ మహిళల చాంపియన్ అన ముజిచుక్ (ఉక్రెయిన్) తదితరులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ‘నార్వే ఈవెంట్లో పాల్గొనేందుకు చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. అక్కడికి వెళ్లనుండటం కూడా ఇదే మొదటిసారి. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో పోటీపడేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని దివ్య పేర్కొంది. గతేడాది జరిగిన ఈవెంట్లో భారత గ్రాండ్మాస్టర్లు కోనేరు హంపి, వైశాలి పాల్గొన్నారు. ఈ ఏడాది ఓపెన్ కేటగిరీలో ప్రజ్ఞానంద పోటీపడనున్నాడు. -
మన్ప్రీత్ సింగ్పై వేటు
భారత హాకీ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆటగాడు... నాలుగుసార్లు ఒలింపిక్స్లో పాల్గొన్న అనుభవం... ఒకసారి కెప్టెన్గా జట్టుకు పతకం అందించిన రికార్డు సహా రెండు ఒలింపిక్ కాంస్యాలు గెలుచుకున్న జట్లలో సభ్యుడు... అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) వార్షిక అవార్డుల్లో అత్యుత్తమ ఆటగాడిగా నిలవడంతో పాటు అర్జున, ఖేల్రత్న పురస్కారాల విజేత... ఈ ఘనతలన్నీ సాధించిన మన్ప్రీత్ సింగ్పై వేటు పడింది. వచ్చేనెలలో జరిగే ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ సీజన్ కోసం 33 మంది ప్రాబబుల్స్తో ప్రకటించిన భారత హాకీ జట్టులో మన్ప్రీత్కు చోటు దక్కలేదు. ‘విశ్రాంతి’ అని కోచ్ చెబుతున్నా... సుమారు 34 ఏళ్ల వయసు ఉన్న మన్ప్రీత్ను పక్కన పెట్టడం అంటే అతని అంతర్జాతీయ కెరీర్ ముగింపునకు చేరువైనట్లే. న్యూఢిల్లీ: మిడ్ఫీల్డర్ మన్ప్రీత్ సింగ్ తన 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో భారత్ తరఫున 411 మ్యాచ్లు ఆడాడు. మరో మ్యాచ్ ఆడి ఉంటే మన దేశం తరఫున ఎక్కువ మ్యాచ్లు ఆడిన దిలీప్ తిర్కీ (412) రికార్డును అతను సమం చేసేవాడు. అయితే అనూహ్యంగా మన్ప్రీత్ జట్టులో స్థానం కోల్పోయాడు. ఫిబ్రవరి 10 నుంచి 16 వరకు రూర్కెలాలో జరిగే ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ హాకీ సీజన్ కోసం ఎంపిక చేసిన 33 ప్రాబబుల్స్లో అతనికి చోటు దక్కలేదు. గత ఐదేళ్లలో అతను టీమ్కు దూరం కావడం ఇదే మొదటిసారి. మన్ప్రీత్తో పాటు సీనియర్ గోల్ కీపర్ కృషన్ బహదూర్ పాఠక్పై కూడా వేటు పడింది. ఇటీవల జరిగిన హాకీ ఇండియా లీగ్లో ప్రదర్శనను బట్టి అనేక మంది కొత్త, యువ ఆటగాళ్లను జట్టులోకి ఎంపిక చేశారు. పూవన్న చందూరా బాబీ, యశ్దీప్ సివాచ్, అమన్దీప్ లక్డాలకు అవకాశం దక్కగా, జూనియర్ ఆసియా కప్లో ఆకట్టుకున్న ప్రిన్స్దీప్ సింగ్, రోషన్ కుజూర్ కూడా తొలిసారి సీనియర్ టీమ్లోకి వచ్చాడు. భారత్లో తొలి అంచె ప్రొ లీగ్ పోటీలతో జట్టు కొత్త సీజన్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మన బృందం హోబర్ట్కు వెళ్లి స్పెయిన్, ఆ్రస్టేలియాలతో రెండేసి మ్యాచ్లు ఆడుతుంది. అనంతరం ప్రొ లీగ్ రెండో అంచె టోర్నీ జూన్లో యూరప్లో జరుగుతుంది. సరైన సమయం: కోచ్ ఫుల్టన్ 2026లో హాకీ వరల్డ్ కప్తో పాటు ఆసియా క్రీడల వంటి ప్రధాన ఈవెంట్లు ఉన్న నేపథ్యంలో జట్టులో ‘రొటేషన్’ విధానాన్ని అనుసరించనున్నామని, కొత్త నిర్ణయాలు తీసుకునేందుకు ఇదే సరైన సమయంగా భావించినట్లు భారత జట్టు హెడ్ కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ అన్నారు. ‘పని భారం తగ్గించేందుకు మేం కొంత మంది సీనియర్లకు విశ్రాంతినిచ్చాం. మరికొందరు యువ ఆటగాళ్ల చక్కటి ప్రదర్శనకు గుర్తింపు కూడా దక్కింది. ప్రొ లీగ్తో పాటు ఆ్రస్టేలియాలో ప్రదర్శనను బట్టి ప్రపంచ కప్, ఆసియా కప్లలో పాల్గొనే జట్లను ఎంపిక చేస్తాం’ అని ఆయన వెల్లడించారు. హర్మన్ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టుకు ప్రొ లీగ్కు ముందు ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు ప్రత్యేక శిక్షణా శిబిరం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 11న జరిగే తొలి మ్యాచ్లో బెల్జియంతో భారత్ తలపడుతుంది. భారత హాకీ ప్రాబబుల్స్: పవన్, సూరజ్ కర్కెరా, మోహిత్, ప్రిన్స్దీప్ సింగ్ (గోల్కీపర్లు), అమిత్ రోహిదాస్, జర్మన్ప్రీత్ సింగ్, సంజయ్, హర్మన్ప్రీత్ సింగ్ (కెపె్టన్), జుగ్రాజ్ సింగ్, సుమీత్, పూవన్న చందూరా బాబీ, యశ్దీప్ సివాచ్, నీలమ్ సంజీప్, అమన్దీప్ లక్డా (డిఫెండర్లు), రాజీందర్ సింగ్, మన్మీత్ సింగ్, హార్దిక్ సింగ్, రవిచంద్ర సింగ్, వివేక్ సాగర్, విష్ణుకాంత్ సింగ్, రాజ్ కుమార్ పాల్, నీలకాంత శర్మ, రోషన్ కుజూర్ (మిడ్ ఫీల్డర్లు), అభిషేక్, సుఖ్జీత్ సింగ్, శిలానంద్ లక్డా, మన్దీప్ సింగ్, అరిజీత్ సింగ్ హుండల్, అంగద్ వీర్ సింగ్, ఉత్తమ్ సింగ్, సెల్వమ్ కార్తీ, ఆదిత్య అర్జున్, మణీందర్ సింగ్ (ఫార్వర్డ్స్).మన్ప్రీత్ సింగ్ కెరీర్ అంతర్జాతీయ అరంగేట్రం: 2011 మొత్తం మ్యాచ్లు: 411 చేసిన గోల్స్: 45 ఒలింపిక్స్లో రెండు కాంస్యాలు (2020 టోక్యో, 2024 పారిస్), కామన్వెల్త్ గేమ్స్లో 2 రజతాలు, ఆసియా క్రీడల్లో 2 స్వర్ణాలు, 1 కాంస్యం, చాంపియన్స్ ట్రోఫీలో 2 రజతాలు, ఆసియా కప్లో 2 స్వర్ణాలు, 1 రజతం, ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో 4 స్వర్ణాలు, 1 కాంస్యం, వరల్డ్ లీగ్లో 2 కాంస్యాలు గెలుచుకున్న జట్లలో సభ్యుడు. భారత్ తరఫున అతను నాలుగు ప్రపంచ కప్లు కూడా ఆడాడు.


