breaking news
Sports
-
సత్తా చాటిన భారత బౌలర్లు.. స్వల్ప స్కోర్కే పరిమితమైన శ్రీలంక
ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శ్రీలంక మహిళా జట్టుతో విశాఖ వేదికగా ఇవాళ (డిసెంబర్ 23) జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా బౌలర్లు సత్తా చాటారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. శ్రీలంకను స్వల్ప స్కోర్కే పరిమితం చేసింది. దీప్తి శర్మ స్థానంలో జట్టులో వచ్చిన స్నేహ్ రాణా (4-1-11-1) అద్బుతంగా బౌలింగ్ చేసింది. వైష్ణవి శర్మ (4-0-32-2), శ్రీ చరణి (4-0-23-2), క్రాంతి గౌడ్ (3-02-1) కూడా రాణించారు. అరుంధతి రెడ్డి (3-0-22-0), అమన్జోత్ కౌర్ (2-0-11-0) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లు సమిష్టిగా రాణించడంతో లంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్లో భారత ఫీల్డర్డు కూడా చెలరేగిపోయారు. ఏకంగా ముగ్గురిని రనౌట్ చేశారు. అమన్జోత్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి వికెట్ కీపర్ రిచా ఘోష్కు అద్భుతమైన త్రోలు అందించి ముగ్గురిని రనౌట్ చేశారు. లంక ఇన్నింగ్స్లో హర్షిత సమరవిక్రమ (33) టాప్ స్కోరర్గా నిలిచింది. కెప్టెన్ చమారి (31), హాసిని పెరీరా (22), కవిష దిల్హరి (14), కౌషిని (11) అతి కష్టంమీద రెండంకెల స్కోర్లు చేశారు. విష్మి గౌతమ్ (1), నీలాక్షి (2), కావ్యా కవింది (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. శశిని డకౌటైంది. కాగా, ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో కూడా శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసి స్వల్ప స్కోర్కే పరిమితమైంది. ఇదే విశాఖ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్లో 1-0 ఆధ్యింలోకి వెళ్లింది.తుది జట్లు.. శ్రీలంక: విష్మి గుణరత్నే, చమరి అతపత్తు(సి), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, నీలాక్షి డి సిల్వా, కవిషా దిల్హరి, కౌషని న్యూత్యాంగన(w), మల్కీ మదార, ఇనోకా రణవీర, కావ్య కావింది, శశిని గిమ్హనైభారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ (సి), రిచా ఘోష్ (w), అమంజోత్ కౌర్, స్నేహ రాణా, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, శ్రీ చరణి -
ఆల్ ఫార్మాట్ ప్లేయర్గా ఉండటం కలేనా..?
ఇటీవలికాలంలో భారత పురుషుల క్రికెట్లో విపరీతమైన పోటీ నెలకొంది. ఒక్కో స్థానం కోసం పదుల సంఖ్యలో పోటీపడుతున్నారు. దీంతో ఫార్మాట్కు ఒక్క జట్టు సరిపోదనే వాదన వినిపిస్తుంది. ఓ దశలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) రెండు జట్లతో ప్రయోగం కూడా చేసింది.1998 సెప్టెంబర్లో తొలిసారి సీనియర్ పురుషుల క్రికెట్ జట్లు రెండు వేర్వేరు అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొన్నాయి. అజయ్ జడేజా నేతృత్వంలో ఓ జట్టు మలేసియాలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనగా.. మొహమ్మద్ అజారుద్దీన్ సారథ్యంలో మరో జట్టు కెనడాలో పాకిస్తాన్తో సహారా కప్ ఆడింది. కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్న జట్టులో సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే లాంటి స్టార్ ఆటగాళ్లు ఉండగా.. సహారా కప్ జట్టుకు రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ లాంటి స్టార్లు ప్రాతినిథ్యం వహించారు. ఇలాంటి ప్రయోగమే 2021లో మరోసారి జరిగింది. షెడ్యూల్ క్లాష్ కావడంతో రెండు వేర్వేరు భారత జట్లు ఇంగ్లండ్, శ్రీలంక దేశాల్లో పర్యటించాయి. విరాట్ కోహ్లి నేతృత్వంలోని జట్టు ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ ఆడగా.. శిఖర్ ధవన్ సారథ్యంలోని జట్టు శ్రీలంకలో పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడింది.పై రెండు సందర్భాల్లో ఒకే సమయంలో రెండు వేర్వేరు భారత జట్లు ఆడటమనేది షెడ్యూల్ క్లాష్ కావడం వల్ల జరిగింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో విషయం అది కాదు. షెడ్యూల్ క్లాష్ కాకపోయినా భారత్కు రెండు వేర్వేరు జట్ల ఆవశ్యకత ఉంది. ఎందుకంటే 11 బెర్త్ల కోసం విపరీతమైన పోటీ ఉంది. ఏ స్థానం తీసుకున్నా, అర్హులైన ఆటగాళ్లు కనీసం పదుల సంఖ్యలో ఉన్నారు.వీరిలో ఒకరికి న్యాయం చేస్తే, మిగతా తొమ్మిది మందికి అన్యాయం జరుగుతుంది. అందుకే మల్టిపుల్ జట్ల ప్రస్తావన మళ్లీ తెరపైకి వస్తుంది. ఇలా చేస్తే, అర్హులైన ప్రతి ఒక్కరికి దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం కల్పించినట్లవుతుంది. అలాగే వారి టాలెంట్కు కూడా న్యాయం చేసినట్లవుతుంది.ఇటీవలికాలంలో మూడు ఫార్మాట్ల భారత జట్లలో ఒకరిద్దరికి క్రమం తప్పకుండా అన్యాయం జరుగుతూ వస్తుంది. ఈ ప్రస్తావన రాగానే ముందుగా గుర్తుకొచ్చే పేరు సంజూ శాంసన్. సంజూ టీ20 ఫార్మాట్లో ఓపెనర్గా క్రమం తప్పకుండా రాణిస్తున్నా, శుభ్మన్ గిల్ కారణంగా అతడికి అవకాశాలు రాలేదు. తాజాగా భారత సెలెక్షన్ కమిటీ సంజూకి న్యాయం (గిల్ను పక్కన పెట్టి టీ20 వరల్డ్కప్కు ఎంపిక) చేసినప్పటికీ.. వేరే కోణంలో విమర్శలు మొదలయ్యాయి.తీవ్రమైన పోటీ కారణంగా ప్లేయింగ్ ఎలెవెన్లో స్థానం దక్కని ఆటగాళ్లు సంజూ కాకుండా చాలామంది ఉన్నారు. రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, పడిక్కల్, ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, సిరాజ్, షమీ, చహల్, రవి బిష్ణోయ్, ఆకాశ్దీప్ లాంటి వారు అర్హులై, క్రమంగా రాణిస్తున్నా తుది జట్లలో అవకాశాలు రావడం లేదు. వచ్చినా ఏదో ఒక ఫార్మాట్కు మాత్రమే పరిమితమవుతున్నారు.బెర్త్లు పదకొండే కావడంతో స్టార్ ప్లేయర్లకు కూడా కొన్ని ఫార్మాట్లలో ఈ కష్టాలు తప్పడం లేదు. కేఎల్ రాహుల్ లాంటి ఆటగాడు వాస్తవానికి ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అయినా అతనికి టీ20 జట్టులో అవకాశం దక్కడం లేదు. అలాగే శ్రేయస్ అయ్యర్ కూడా ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అయినా, అతనిదీ ఇదే అనుభవం. రిషబ్ పంత్ లాంటి డాషింగ్ బ్యాటర్ పరిస్థితి అయితే మరీ దారుణం. అతన్ని కేవలం టెస్ట్ల్లో మాత్రమే చూడాల్సి వస్తుంది. వాస్తవానికి అతనికి ఉన్న దూకుడుకు పరిమిత ఓవర్ల ఫార్మాట్లో సెట్ ప్లేయర్. అయినా పరిమిత బెర్త్ల కారణంగా పంత్ సింగిల్ ఫార్మాట్కే పరిమితమయ్యాడు. బౌలింగ్లో సిరాజ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, ఆకాశ్దీప్ లాంటి వారి పరిస్థితి కూడా ఇదే. షమీ లాంటి వారికైతే మూడు ఫార్మాట్లలో విశేషంగా రాణిస్తున్నా కనీసం ఒక్క ఫార్మాట్ జట్టులోనూ చోటు దక్కడం లేదు.మూడు ఫార్మాట్లలో మూడు వేర్వేరు జట్లను ఎంపిక చేస్తుంటేనే పరిస్థితి ఇలా ఉంది. అదే.. గతంలో మాదిరి మూడు ఫార్మాట్లకు ఒకే జట్టు ఉంటే సెలెక్టర్లకు ఊపిరి తీసుకోవడం సాధ్యమయ్యేదా..? ఏ ప్లేయర్ అయినా తాను ఏదో ఒక్క ఫార్మాట్కు మాత్రమే పరిమితం కావాలని అనుకోడు. మూడు ఫార్మాట్లలో జాతీయ జట్టుకు ప్రాతినథ్యం వహించాలని ప్రతి ఒక్కరు కలగంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫార్మాట్కు ఒక జట్టు ఎంపిక చేసే దానికంటే, పోటీ దృష్ట్యా ఒక్కో ఫార్మాట్కు ఒకటికి మించిన జట్లను ఎంపిక చేయడం మంచిదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇలా చేయడం వల్ల అర్హుడైన ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా ఉంటుంది. అయితే ఇలా చేసేటప్పుడు సీనియర్ జట్టు, జూనియర్ జట్టు అన్న తేడాలు ఉండకుండా చూసుకుంటే మంచింది. ఎందుకంటే, ఏ టాలెండెడ్ ఆటగాడైనా తాను ఎక్కువ-తక్కువగా ఉండాలని అనుకోడు.చిన్న జట్లు, పెద్ద జట్లు అన్న తేడా లేకుండా అన్ని జట్లు సమానంగా మ్యాచ్లు ఆడాలి. మరి ఇలాంటి ప్రయోగానికి బీసీసీఐ ఎప్పుడు శ్రీకారం చుడుతుందో వేచి చూడాలి. -
శ్రీలంకతో రెండో టీ20.. టీమిండియా స్టార్ ప్లేయర్ దూరం
ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శ్రీలంక మహిళా జట్టుతో విశాఖ వేదికగా ఇవాళ (డిసెంబర్ 23) జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ ఓ మార్పు చేయగా.. శ్రీలంక తొలి మ్యాచ్లో ఆడిన జట్టునే కొనసాగించింది. స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మ స్వల్ప అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్ ఆడటం లేదని భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తెలిపింది. దీప్తి స్థానంలో స్నేహ్ రాణా తుది జట్టులోకి వచ్చింది.కాగా, ఇదే విశాఖ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్లో 1-0 ఆధ్యింలోకి వెళ్లింది. తుది జట్లు.. శ్రీలంక: విష్మి గుణరత్నే, చమరి అతపత్తు(సి), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, నీలాక్షి డి సిల్వా, కవిషా దిల్హరి, కౌషని న్యూత్యాంగన(w), మల్కీ మదార, ఇనోకా రణవీర, కావ్య కావింది, శశిని గిమ్హనైభారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ (సి), రిచా ఘోష్ (w), అమంజోత్ కౌర్, స్నేహ రాణా, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, శ్రీ చరణి -
ఐసీసీ ప్రీమియర్ పార్ట్నర్గా హ్యుందాయ్
హ్యుందాయ్ మోటార్ కంపెనీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)తో కొత్త ఒప్పందం కుదుర్చుకుంది. 2026-2027 మధ్యలో జరిగే అన్ని ఐసీసీ పురుషులు మరియు మహిళల క్రికెట్ టోర్నమెంట్లకు ప్రీమియర్ పార్ట్నర్గా వ్యవహరించనుంది. ఈ ఒప్పందంలోకి 2027 పురుషుల వన్డే వరల్డ్కప్ సహా మొత్తం ఆరు ఐసీసీ ప్రధాన టోర్నీలు వస్తాయి.ఈ ఒప్పందంతో హ్యుందాయ్కు లభించే ప్రత్యేక హక్కులు..- మ్యాచ్డే కాయిన్ టాస్లో భాగస్వామ్యం - స్టేడియంలో ప్రత్యేక బ్రాండింగ్ - అభిమానుల కోసం ప్రత్యేక అనుభవాలు (fan zones, vehicle showcases, digital engagement) ఐసీసీతో ఒప్పందం ఖరారయ్యాక హ్యుందాయ్ సీఈవో జోస్ మునోజ్ మాట్లాడుతూ.. క్రికెట్ మరియు హ్యుందాయ్ రెండూ నిరంతరం మెరుగుపడే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రెండు బిలియన్ అభిమానులతో కనెక్ట్ కావడం గర్వకారణం. ముఖ్యంగా భారత్లో క్రికెట్ జీవనశైలి. ఈ భాగస్వామ్యం మా కస్టమర్లతో సంబంధాన్ని మరింత బలపరుస్తుందని అన్నారు. హ్యుందాయ్ ఇండియా సీఈవో డెసిగ్నేట్ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ.. ఈ భాగస్వామ్యం భారత మార్కెట్ ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని మూలలా కమ్యూనికేషన్ స్ట్రాటజీతో అభిమానులను చేరుకుంటామని అన్నాడు. ఐసీసీ అధ్యక్షుడు జై షా మాట్లాడుతూ.. ప్రపంచంలో క్రికెట్ అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ. ఐసీసీ ఈవెంట్స్లో అభిమానులను డిజిటల్, స్టేడియం అనుభవాల ద్వారా ఆకర్షించడానికి హ్యుందాయ్ భాగస్వామ్యం గొప్ప అవకాశమని అన్నాడు. కాగా, హ్యుందాయ్ మోటర్ ఐసీసీతో జతకట్టడం ఇది మొదటిసారి కాదు. 2011–2015 మధ్యలో కూడా ప్రీమియర్ పార్ట్నర్గా వ్యవహరించింది. -
ఘోర ప్రమాదం మెస్సీ సోదరికి తీవ్ర గాయాలు, పెళ్లి వాయిదా
ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ, అతని కుటుంబం కష్టకాలంలో ఉన్నారు. ఆయన సోదరి 32 ఏళ్ల మరియా సోల్ ఒక భయంకరమైన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయ పడ్డారు. మరియా కారు మయామి రోడ్డుపై నియంత్రణ కోల్పోయి కాంక్రీట్ గోడను ఢీకొట్టడంతో ఆమెకు తీవ్ర గాయాలైనాయి. దీంతో త్వరలోజరగాల్సిన పెళ్లి వాయిదా పడింది. దీంతో మెస్సీ అభిమానులు ఆందోళనలో మునిగిపోయారు.ఈ ప్రమాదంలో ఆమెకు రెండు వెన్నుపూసలు విరిగిపోయాయి, మడమ విరిగింది, చేయి విరిగింది, తీవ్రమైన కాలిన గాయాలయ్యాయి. అయితే ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇంటర్ మయామి అండర్-19 జట్టు కోచ్ జూలియన్ 'తులి' అరెల్లానోతో తన వివాహానికి మరియా సిద్ధమవుతోంది. జనవరి 3, 2026న వీరి వివాహం జరగాల్సి ఉంది. అర్జెంటీనా టీవీ జర్నలిస్ట్, ప్రెజెంటర్ ఏంజెల్ డి బ్రిటో, తాను మరియా సోల్ తల్లితో మాట్లాడానని, తన కుమార్తె ప్రమాదం నుండి బయటపడిందని తెలిపారని వెల్లడించారు.🚨🏥 María Sol (Lionel Messi’s sister) was involved in a car accident while driving in Miami and has been forced to postpone her wedding, which was scheduled for January 3, 2026.According to confirmed reports, she lost control of the vehicle and crashed into a wall. As a result… pic.twitter.com/Sae2Uy4Q1Q— FC Barcelona Fans Nation (@fcbfn_live) December 23, 2025 లియోనెల్ మెస్సీ సోదరి మరియా ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న వ్యాపారవేత్త డిజైనర్. అంతర్జాతీయ రంగంలో విజయవంతమైన ఫ్యాషన్ బ్రాండ్ బికినిస్ రియో వ్యవస్థాపకురాలు. ఈ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా పలువురి ఫ్యాషన్ ప్రియులను ఆకర్షించింది. -
రెండో వివాహం చేసుకున్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ రెండో వివాహం చేసుకున్నాడు. ఏడేళ్ల క్రితం (2018లో) అరుదైన ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా మొదటి భార్య రూత్ను కోల్పోయిన స్ట్రాస్.. తాజాగా ఆంటోనియా లిన్నేయస్ పీట్ (30) అనే మాజీ పీఆర్ ఎగ్జిక్యూటివ్ను మనువాడాడు.వీరి వివాహం అతి కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో స్ట్రాస్ జన్మస్థలమైన దక్షిణాఫ్రికాలోని (ఫ్రాన్స్హోక్) ఓ వైన్ యార్డ్లో జరిగింది. లిన్నేయస్ పీట్తో వివాహ సమాచారాన్ని స్ట్రాస్ సోషల్మీడియా వేదికగా పంచుకున్నాడు.వివాహ ఫోటోలను షేర్ చేస్తూ, భార్య లిన్నేయస్ను ఉద్దేశిస్తూ ఈ సందేశాన్ని రాసుకొచ్చాడు. “మన ప్రియమైన ప్రదేశంలో అత్యంత ప్రత్యేకమైన రోజు జరుపుకున్నాం. నన్ను, నా పిల్లలను ప్రేమించి, నిజమైన ఆనందాన్ని చూపించినందుకు ధన్యవాదాలు. నేను ఎంతో అదృష్టవంతుడిని. మన జీవితంలో ఎన్నో అందమైన జ్ఞాపకాలు ఉండాలని కోరుకుంటున్నాను”స్ట్రాస్ భార్య ప్రస్తుతం లిన్నేయస్ అనే ఫైన్ ఆర్ట్ అడ్వైజరీ సంస్థ నిర్వహిస్తుంది. 48 ఏళ్ల స్ట్రాస్ ఇటీవల ఈసీబీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా పని చేసి పదవీ విరమణ చేశాడు. స్ట్రాస్ ఇంగ్లండ్ జాతీయ జట్టుకు మూడు ఫార్మాట్లలో కెప్టెన్గా వ్యవహరించాడు. లెఫ్ట్ ఆర్మ్ ఓపెనింగ్ బ్యాటర్ అయిన స్ట్రాస్.. 2003-2012 మధ్యలో 100 టెస్ట్లు, 127 వన్డేలు ఆడాడు. ఇందులో 27 సెంచరీలు, 54 హాఫ్ సెంచరీల సాయంతో 11000 పైచిలుకు పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాలో యాషెస్ సిరీస్ గెలిచిన అతి కొద్ది మంది ఇంగ్లండ్ కెప్టెన్లలో స్ట్రాస్ ఒకరు.స్ట్రాస్.. మొదటి భార్య రూత్ జ్ఞాపకార్థం Ruth Strauss Foundation స్థాపించాడు. ఈ ఫౌండేషన్ కుటుంబాలకు మద్దతు ఇవ్వడమే కాకుండా, క్యాన్సర్ పరిశోధనలకు నిధులు సమకూరుస్తుంది. ఈ సేవలకు గాను స్ట్రాస్కు 2019లో నైట్హుడ్ లభించింది. -
రవీంద్ర జడేజా కీలక నిర్ణయం
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ-2025లో భాగమయ్యేందుకు సిద్ధమయ్యాడు. సొంత జట్టు సౌరాష్ట్ర తరపున జడ్డూ రెండు మ్యాచ్లు ఆడనున్నాడు.ఈ విషయాన్ని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. కర్ణాటకలోని ఆలూర్లో జనవరి 6, 8న జరిగే మ్యాచ్లలో సౌరాష్ట్ర జట్టుకు జడేజా ప్రాతినిథ్యం వహిస్తాడని టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.ఆసీస్ టూర్కు ఎంపిక చేయలేదుఈ క్రమంలో ప్రస్తుతం వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్న జడ్డూను.. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన నుంచి సెలక్టర్లు తప్పించారు. వన్డే జట్టులో అతడికి స్థానం కల్పించలేదు. దీంతో వన్డే వరల్డ్కప్-2027 ప్రణాళికల్లో జడ్డూ లేడా అన్న సందేహాలు నెలకొన్నాయి.ఈ విషయంపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) నాడు స్పందిస్తూ.. ‘‘మా ప్రణాళికల్లో అతడు భాగమే. చాంపియన్స్ ట్రోఫీ జట్టులోనూ అతడు ఉన్నాడు. నాడు పిచ్ పరిస్థితులకు అనుగుణంగా అదనపు స్పిన్నర్లకు జట్టులో చోటిచ్చాం.అయితే, ఆసీస్టూర్లో జట్టు సమతూకంగా ఉండేలా చూసుకోవాలి. కాబట్టి వాషీ, కుల్దీప్లతో మేము ముందుకు వెళ్తున్నాం. ఒక్కోసారి ఆటగాళ్ల మధ్య తీవ్రమైన పోటీ ఉన్నపుడు ఇలాంటి నిర్ణయాలు తప్పవు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో పిచ్ పరిస్థితులకు తగ్గట్లే జట్టును ఎంపిక చేశాము’’ అని జడ్డూను తప్పించడానికి గల కారణాన్ని వెల్లడించాడు.సఫారీలతో సిరీస్లో సత్తా చాటిన జడ్డూఅయితే, ఈ టూర్ తర్వాత స్వదేశంలో ఇటీవల సౌతాఫ్రికా (IND vs SA) తో జరిగిన వన్డే సిరీస్కు జడేజాను ఆడించింది యాజమాన్యం. తొలి వన్డేలో 20 బంతుల్లోనే 32 పరుగులు చేసిన జడ్డూ.. రెండో వన్డేలో 24 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే, ఈ సిరీస్లో ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్.. కేవలం ఒకే ఒక్క వికెట్ తీయగలిగాడు.కాగా టీమిండియా తరఫున విధుల్లో లేని సమయంలో ఆటగాళ్లంతా దేశీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఇటీవలే కచ్చితమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. గాయం, ఫిట్నెస్ సమస్యలు ఉన్నవాళ్లకు మాత్రమే ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కూడా తమ జట్లు ముంబై, ఢిల్లీ తరఫున బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు.ఇక కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, శుబ్మన్ గిల్, అర్ష్దీప్ సింగ్, అభిషేక్ శర్మ తదితరులు కూడా తమ జట్ల తరఫున ఆడేందుకు సిద్ధం కాగా.. తాజాగా జడ్డూ కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. కాగా లిస్-ఎ క్రికెట్లో లెఫ్టాండర్ జడేజా 260 మ్యాచ్లు ఆడి.. 3911 పరుగులు చేయడంతో పాటు 293 వికెట్లు కూడా పడగొట్టాడు. కాగా విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొన్న తర్వాత.. టీమిండియా స్టార్లు.. న్యూజిలాండ్తో సిరీస్తో బిజీ అవుతారు.చదవండి: Virat Kohli: చరిత్రకు ఒక్క పరుగు దూరంలో.. -
పాక్ అభిమానుల చిల్లర చేష్టలు.. వైభవ్ సూర్యవంశీ ఏం చేశాడంటే..
పాకిస్తాన్ క్రికెట్ జట్టు అభిమానులు మరోసారి తమ వక్రబుద్ధిని చాటుకున్నారు. భారత అండర్-19 క్రికెటర్లపై విద్వేష విషం చిమ్మారు. ప్రధానంగా పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీని టార్గెట్ చేస్తూ చిల్లర చేష్టలకు దిగారు.ఫైనల్లో పాక్ గెలుపుఏసీసీ మెన్స్ ఆసియా కప్ (యూత్ వన్డే)-2025 టోర్నమెంట్ దుబాయ్ (Dubai) వేదికగా ఇటీవలే ముగిసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దాయాదులు భారత్- పాకిస్తాన్.. గ్రూప్-ఎ నుంచి పోటీపడ్డాయి. లీగ్ దశలో పాక్ను భారత్ ఓడించగా.. ఫైనల్లో పాకిస్తాన్ 191 పరుగుల తేడాతో యువ భారత జట్టుపై గెలిచి చాంపియన్గా నిలిచింది.ఇక ఆసియా కప్ అండర్-19 టైటిల్ను భారత్ ఇప్పటికే ఎనిమిదిసార్లు గెలవగా.. పాక్ తాజాగా రెండోసారి ట్రోఫీని ముద్దాడింది. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా పాక్ ఆటగాళ్లు.. భారత ప్లేయర్లను రెచ్చగొట్టగా అందుకు ధీటుగా సమాధానమిచ్చారు. ముఖ్యంగా విధ్వంసకర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ.. పాక్ ఆటగాళ్లకు వారి శైలిలోనే ఘాటుగా జవాబిచ్చాడు.చిల్లర చేష్టలు.. వైభవ్ సూర్యవంశీ ఏం చేశాడంటే..ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం భారత అండర్-19 ఆటగాళ్లు టీమ్ బస్ ఎక్కే వేళ.. అక్కడికి చేరుకున్న పాక్ అభిమానులు.. యువ క్రికెటర్లను హేళన చేస్తూ కామెంట్లు చేశారు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)పై అనుచిత రీతిలో కామెంట్లు చేస్తూ రాక్షసానందం పొందారు. అయితే, ఇక్కడ వైభవ్ హుందాగా ప్రవర్తించడం విశేషం.ఓవైపు.. వయసులో పెద్ద అయిన పాక్ ఫ్యాన్స్ తన పట్ల విద్వేషం ప్రదర్శిస్తున్నా.. వైభవ్ మాత్రం అసలు ఆ వైపు కూడా చూడకుండా పక్కవాళ్లతో మాట్లాడుతూ వెళ్లి బస్సు ఎక్కాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.చిన్నపిల్లాడిపై ఇంత విద్వేషమా?ఈ నేపథ్యంలో.. ‘‘పద్నాలుగేళ్ల వయసులోనే క్రికెట్లో సంచలనాలు సృష్టిస్తున్న వైభవ్ను సిగ్గు లేకుండా హేళన చేస్తున్నారు. అండర్-19 ఆసియా కప్ గెలిస్తే ఏదో ప్రపంచ చాంపియన్లు అయినట్లు ఆ బిల్డప్ ఎందుకు?చిన్నపిల్లాడి పట్ల మీరు ప్రవర్తించిన తీరు మీ సంస్కారానికి అద్దం పడుతోంది. మరీ ఇంత అసూయ పనికిరాదు. ఇప్పటికైనా మీ వక్రబుద్ధిని మార్చుకోండి. చిన్నపిల్లాడే అయినా అతడు ఎంత హుందాగా ఉన్నాడో చూడండి. తనని చూసైనా నేర్చుకోండి’’ అని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. కాగా ఆసియా కప్ టోర్నీలో వైభవ్ సూర్యవంశీ 252 పరుగులు సాధించాడు. ఇందులో ఓ భారీ శతకం (171) ఉంది.చదవండి: వరల్డ్కప్లో టీమిండియా ఫినిషర్ ఎవరు?Pakistan’s fans are acting shamelessly and they have no sense of shame whatsoever.👀These people are booing 14-year-old Vaibhav Suryavanshi just because Pakistan won a ‘cheap’ U19 Asia Cup. They’re acting like Pakistan won the World Cup.🤦🏻This is why Pakistani people have no… pic.twitter.com/D1X6lgshr0— Mention Cricket (@MentionCricket) December 22, 2025 -
మరో టీ20 లీగ్.. ఐపీఎల్ తర్వాత ఏ లీగ్కు ఆదరణ ఎక్కువ..?
పొట్టి క్రికెట్ ప్రేమికులను అలరించేందుకు మరో లీగ్ సిద్దమైంది. యూఏఈ వేదికగా వచ్చే ఏడాది చివరి త్రైమాసికంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ (APL T20) ప్రారంభం కానుంది. వాస్తవానికి ఈ లీగ్ 2018లోనే ప్రారంభమైంది. అయితే వేర్వేరు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తూ, చివరికి ఆరేళ్ల తర్వాత రీఎంట్రీకి సిద్దమైంది. ఈ మేరకు తాజాగా ప్రకటన విడదలైంది.APL T20 లీగ్ యూఏఈలో జరుగనున్నా, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఆథ్వర్యంలోనే జరుగుతుంది. తొలి ఎడిషన్ తరహాలోనే 2026 ఎడిషన్లోనూ ఐదు ఫ్రాంచైజీలు (బాల్ఖ్ లెజెండ్స్, కాబూల్ జ్వానన్, కందహార్ నైట్స్, నంగర్హార్ లియోపార్డ్స్, పక్తియా పాంథర్స్) పాల్గొంటాయి. తొలి ఎడిషన్లో బల్క్ లెజెండ్స్ విజేతగా నిలిచింది. ఈ లీగ్లో కూడా ఇతర లీగ్ల్లో లాగే భారత ఆటగాళ్లు మినహా ప్రపంచవాప్తంగా ఉండే ఆటగాళ్లు పాల్గొంటారు.ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ రీఎంట్రీ వార్త నేపథ్యంలో ప్రైవేట్ టీ20 లీగ్లకు సంబంధించిన ఓ ఆసక్తికర చర్చ మళ్లీ మొదలైంది. ప్రస్తుతం ఐసీసీ ఫుల్టైమ్ మెంబర్గా ఉండే ప్రతి దేశంలో ఓ ప్రైవేట్ టీ20 లీగ్ జరుగుతుంది. వీటిలో భారత్లో జరిగే ఐపీఎల్కే ఆదరణ ఎక్కువన్నది కాదనలేని సత్యం. అయితే, ఐపీఎల్ తర్వాత రెండో స్థానం ఏ లీగ్దన్నదే ప్రస్తుత చర్చ.ఆదరణ ప్రకారం చూసినా, బిజినెస్ పరంగా చూసినా ఐపీఎల్ తర్వాత ఆస్ట్రేలియాలో జరిగే బిగ్బాష్ లీగ్దే రెండో స్థానమన్నది బహిరంగ రహస్యం. ఐపీఎల్ మొదలైన మూడేళ్ల తర్వాత పురుడుపోసుకున్న ఈ లీగ్, ప్రారంభ దినాల్లో పెద్దగా సక్సెస్ కాకపోయినా, క్రమంగా ఆదరణ చూరగొంది. ఈ లీగ్లో ఆస్ట్రేలియా జాతీయ జట్ల స్టార్లందరూ పాల్గొనడంతో పాటు భారత్ మినహా ప్రపంచ క్రికెట్ స్టార్లంతా పాల్గొంటారు. ఐపీఎల్ తరహాలోనే ఈ లీగ్ కూడా సదీర్ఘంగా సాగుతుంది.ఐపీఎల్, బీబీఎల్ తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన లీగ్ ఏదంటే.. 2023లో ప్రారంభమైన సౌతాఫ్రికా టీ20 లీగ్ అని చెప్పాలి. ఈ లీగ్లో కూడా బీబీఎల్ తరహాలోనే స్థానిక స్టార్లు, విదేశీ స్టార్లు పాల్గొంటారు. SA20లో ఫ్రాంచైజీలన్నీ ఐపీఎల్ ఆధారిత ఫ్రాంచైజీలే కావడం విశేషం. పారితోషికాల విషయంలో ఈ లీగ్ ఐపీఎల్కు దగ్గరగా ఉంటుంది. ఈ లీగ్ పుణ్యమా అని సౌతాఫ్రికా టీ20 జట్టు చాలా పటిష్టంగా తయారయ్యిందనే టాక్ ఉంది.సౌతాఫ్రికా టీ20 లీగ్ తర్వాత ఇంచుమించు అదే స్థాయి ఆదరణ కలిగిన లీగ్గా ఇంటర్నేషనల్ టీ20 లీగ్కు పేరుంది. దుబాయ్లో జరిగే ILT20, సౌతాఫ్రికా టీ20 లీగ్ ప్రారంభమైన 2023వ సంవత్సరంలోనే ప్రారంభమైంది. ఈ లీగ్లో కూడా చాలావరకు ఐపీఎల్ ఆధారిత ఫ్రాంచైజీలే ఉన్నాయి. ప్రస్తుతం ఈ లీగ్ నాలుగో ఎడిషన్ నడుస్తుంది.SA20, ILT20 తర్వాత ఇప్పుడిప్పుడే యూఎస్ఏలో జరిగే మేజర్ లీగ్ క్రికెట్ (MLC), ఇంగ్లండ్లో జరిగే ద హండ్రెడ్ లీగ్లకు ఆదరణ పెరుగుతోంది. మేజర్ లీగ్ క్రికెట్ 2023లో ప్రారంభం కాగా.. హండ్రెడ్ లీగ్ 2021లో మొదలైంది. హండ్రెడ్ లీగ్ 100 బంతుల ఫార్మాట్లో జరిగినా టీ20 ఫార్మాట్ పరిధిలోకే వస్తుంది.ఈ లీగ్ల కంటే చాలా ముందుగానే ప్రారంభమైనా పాకిస్తాన్లో జరిగే పాకిస్తాన్ సూపర్ లీగ్ (2016), బంగ్లాదేశ్లో జరిగే బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (2012), వెస్టిండీస్లో జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్ (2013), శ్రీలంకలో జరిగే లంక ప్రీమియర్ లీగ్ (2020) పెద్దగా సక్సెస్ కాలేదు. పైన పేర్కొన్న లీగ్లతో పోలిస్తే ఈ లీగ్ల్లో ఆటగాళ్ల పారితోషికాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ కారణంగా స్టార్ క్రికెటర్లు ఈ లీగ్ల్లో పాల్గొనేందుకు పెద్దగా సుముఖత చూపారు. దీంతో ఆటోమేటిక్గా ఈ లీగ్లకు ఆదరణ తక్కువగా ఉంటుంది. పీఎస్ఎల్ లాంటి లీగ్ ఐపీఎల్కు తాము సమానమని జబ్బలు చరుచుకుంటున్నా, ఆ లీగ్లో ఆడేందుకు చాలామంది విదేశీ స్టార్లు ఇష్టపడరు. భద్రతా కారణాలు, సదుపాయాల లేమి, పారితోషికాలు తక్కువగా ఉండటం లాంటి కారణాల చేత విదేశీ ప్లేయర్లు ఈ లీగ్ ఆడేందుకు రారు.ఐపీఎల్తో పోలిస్తే ఆటగాళ్ల పారితోషికాలు పీఎస్ఎల్లో కనీసం పావు శాతం కూడా ఉండవు. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో కెమరూన్ గ్రీన్కు రికార్డు స్థాయిలో రూ. 25.20 కోట్ల భారీ మొత్తం దక్కింది. పీఎస్ఎల్లో ఇంత మొత్తంలో పది శాతం కూడా ఆ దేశ స్టార్ క్రికెటర్కు దక్కదు. -
Virat Kohli: చరిత్రకు ఒక్క పరుగు దూరంలో..
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి దాదాపు పదిహేనేళ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీ ఆడనున్నాడు. సొంత జట్టు ఢిల్లీ తరఫున ఈ దేశీ వన్డే టోర్నమెంట్ బరిలో దిగనున్నాడు. ఆంధ్ర జట్టుతో బుధవారం (డిసెంబరు 24) నాటి మ్యాచ్ సందర్భంగా కోహ్లి మరోసారి ఢిల్లీ జెర్సీలో కనిపించనున్నాడు. ఈ జట్టుకు టీమిండియా స్టార్ రిషభ్ పంత్ కెప్టెన్.ఇక ఐపీఎల్లో కోహ్లి ప్రాతినిథ్యం వహించే ఆర్సీబీకి సొంత మైదానం అయిన.. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఇందుకు వేదిక కావడం మరో విశేషం. కాగా 2010లో కోహ్లి చివరగా విజయ్ హజారే ట్రోఫీ (VHT) టోర్నీ ఆడాడు. సర్వీసెస్తో మ్యాచ్లో ఢిల్లీ తరఫున 16 పరుగులు సాధించాడు.వరుస సెంచరీలుఇక ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి (Virat Kohli).. కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో తొలి రెండు వన్డేల్లో డకౌట్ అయిన కోహ్లి.. మూడో వన్డేలో ధనాధన్ ఫిఫ్టీతో ఫామ్లోకి వచ్చాడు.అనంతరం సౌతాఫ్రికాతో స్వదేశంలో వన్డే సిరీస్లో వరుస సెంచరీలతో చెలరేగి ఆకట్టుకున్నాడు. ప్రొటిస్తో తొలి వన్డేల్లో ఏకంగా 135 పరుగులు సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో వన్డేలోనూ 102 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో 53 శతకాలతో ఆల్టైమ్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఇక ప్రొటిస్తో మూడో వన్డేలోనూ కేవలం 45 బంతుల్లో 65 పరుగులతో అజేయంగా నిలిచాడు కోహ్లి.చరిత్రకు ఒక్క పరుగు దూరంలోఅంతర్జాతీయ వన్డే కెరీర్లో 14557 పరుగులు చేసిన కోహ్లి.. తద్వారా లిస్ట్-ఎ క్రికెట్లో ఓవరాల్గా ఇప్పటికి 15,999 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఆంధ్రతో బుధవారం నాటి విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్కు ముందు చరిత్రకు ఒక్క పరుగు దూరంలో నిలిచాడు. సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి ఆంధ్రతో మ్యాచ్లో ఒక్క రన్ చేస్తే.. లిస్ట్-ఎ క్రికెట్లో 16 వేల పరుగుల మైలురాయి అందుకున్న భారత రెండో క్రికెటర్గా నిలుస్తున్నాడు.ఈ జాబితాలో సచిన్ టెండుల్కర్ కోహ్లి కంటే ముందు వరుసలో ఉన్నాడు. లిస్ట్-ఎ క్రికెట్లో 21,999 పరుగులు సాధించాడు. కాగా వన్డేలతో పాటు విజయ్ హజారే ట్రోఫీ, భారత్-ఎ, జోనల్ జట్ల తరఫున సాధించిన పరుగులను లిస్ట్-ఎ జాబితాలో చేర్చుతారు. కాగా ఓవరాల్గా ఈ లిస్టులో ఇంగ్లండ్ క్రికెటర్ గ్రాహమ్ గూచ్ 22,211 పరుగులతో టాప్లో ఉన్నాడు.లిస్ట్-ఎ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాటర్లు👉సచిన్ టెండుల్కర్- 538 ఇన్నింగ్స్లో 21,999 రన్స్👉విరాట్ కోహ్లి- 329 ఇన్నింగ్స్లో 15,999 రన్స్👉సౌరవ్ గంగూలీ- 421 ఇన్నింగ్స్లో 15,622 రన్స్ 👉రోహిత్ శర్మ- 338 ఇన్నింగ్స్లో 13,758 రన్స్👉శిఖర్ ధావన్- 298 ఇన్నింగ్స్లో 12,074 రన్స్.చదవండి: వరల్డ్కప్లో టీమిండియా ఫినిషర్ ఎవరు? -
అక్కడేమో సెంచరీల మోత.. ఇక్కడేమో ఇలా..!
భారత పురుషుల అండర్-19 జట్టు కెప్టెన్ ఆయుశ్ మాత్రే తాజాగా ముగిసిన ఆసియా కప్లో దారుణంగా విఫలమై అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశాడు. ఈ టోర్నీలో సహచరులంతా రాణించినా (పాక్తో జరిగిన ఫైనల్ మినహా) మాత్రే ఒక్క మ్యాచ్లో కూడా సత్తా చాటలేకపోయాడు. ఐదు ఇన్నింగ్స్ల్లో కలిపి 13 సగటున, 112 స్ట్రయిక్రేట్తో కేవలం 65 పరుగులు మాత్రమే చేశాడు.ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో దారుణ పరాజయం వరకు మాత్రే వ్యక్తిగతంగా విఫలమైనా, జట్టును విజయవంతంగా నడిపించాడన్న తృప్తి ఉండేది. అయితే ఫైనల్లో వ్యక్తిగత వైఫల్యాలను కొనసాగించడంతో పాటు టాస్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవడంతో భారత క్రికెట్ అభిమానులకు మాత్రే టార్గెట్ అయ్యాడు. పిచ్ను అంచనా వేయడంలో విఫలమైన మాత్రే టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకోవడంతో జట్టు భారీ మూల్యం చెల్లించుకుంది.బ్యాటింగ్కు స్వర్గధామమైన పిచ్పై మాత్రే టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోకుండా బౌలింగ్ ఎంచుకొని ప్రత్యర్దికి భారీ పరుగులు చేసే ఆస్కారమిచ్చాడు. ఆతర్వాత లక్ష్య ఛేదనలో నిర్లక్ష్యమైన షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. మాత్రే వికెట్తోనే టీమిండియా పతనం మొదలైంది. పాక్ నిర్దేశించిన 348 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 156 పరుగులకే చాపచుట్టేసి 191 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.ఈ ఓటమి తర్వాత టోర్నీ మొత్తంలో వ్యక్తిగతంగా, ఫైనల్లో కెప్టెన్గానూ విఫలమైన ఆయుశ్ మాత్రేపై ముప్పేటదాడి మొదలైంది. దాయాది చేతిలో ఘెరంగా ఓడినందుకుగానూ భారత క్రికెట్ అభిమానులు అతన్ని సోషల్మీడియా వేదికగా టార్గెట్ చేస్తున్నారు. ఎంతో గొప్ప ఆటగాడు, కెప్టెన్ అవుతాడనుకుంటే పాక్ చేతిలో ఘోరంగా ఓడి భారత్ పరువు తీశాడంటూ అభిమానులు అక్షింతలు వేస్తున్నారు. ఈ ఓటమి మాత్రే కెరీర్పై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు.వాస్తవానికి ఆయుశ్ మాత్రే స్థాయి ఇది కాదు. టెక్నికల్గా వైభవ్ సూర్యవంశీ లాంటి వారి కంటే చాలా బెటర్ బ్యాటర్. అయినా ఆసియా కప్లో మాత్రే ఎందుకో రాణించలేకపోయాడు. కొద్ది రోజుల ముందు సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో విధ్వంసకర ఇన్నింగ్స్లతో పరుగుల వరద పారించిన అతను.. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాల్సి వచ్చే సరికి తేలిపోయాడు. ముస్తాక్ అలీ టోర్నీలో మాత్రే 6 ఇన్నింగ్స్ల్లో 108.33 సగటున, 166.67 స్ట్రయిక్రేట్తో 325 పరుగులు చేసి రఫ్ఫాడించాడు. ఇందులో 2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఆసియా కప్కు వచ్చే సరికి మాత్రే ఈ సూపర్ ఫామ్ను కొనసాగించలేకపోయాడు. ఇది గమనించిన అభిమానులు రోజుల వ్యవధిలో ఇంత మార్పేంటని అనుకుంటున్నారు. మొత్తంగా ఆసియా కప్లో మాత్రే వ్యక్తిగతంగా, కెప్టెన్గా విఫలమై కెరీర్లో మాయని మచ్చను తెచ్చుకున్నాడు. ఈ వైఫల్యాలు ఈ యువ బ్యాటర్పై ఎలా ప్రభావం చూపుతాయో చూడాలి. ముంబైకి చెందిన 18 ఏళ్ల మాత్రే ఇప్పుడిప్పుడే దేశవాలీ క్రికెట్, ఐపీఎల్లో పేరు తెచ్చుకుంటున్నాడు. గత సీజన్లోనే ఐపీఎల్ అరంగేట్రం చేసిన మాత్రే సీఎస్కే తరఫున మెరుపు ఇన్నింగ్స్లు ఆడి ఆకట్టుకున్నాడు. ఫలితంగా సీఎస్కే అతన్ని తదుపరి సీజన్కు కూడా రీటైన్ చేసుకుంది. మాత్రే ఇప్పటివరకు 13 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 660 పరుగులు.. 7 లిస్ట్-ఏ మ్యాచ్ల్లో 2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 458 పరుగులు.. 13 టీ20ల్లో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 565 పరుగులు చేశాడు. -
అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త చరిత్ర
అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త చరిత్ర సృష్టించబడింది. ఓ బౌలర్ ఒకే ఓవర్లో హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లు తీశాడు. అంతర్జాతీయ టీ20ల చరిత్రలో ఇలాంటి ఫీట్ నమోదు కావడం ఇదే తొలిసారి. గతంలో గరిష్టంగా ఓ ఓవర్లో నాలుగు వికెట్ల ఫీట్ నమోదైంది. శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగ 2019లో న్యూజిలాండ్పై నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశాడు.ఓవరాల్గా (అంతర్జాతీయం, దేశవాలీ, ప్రైవేట్ టీ20 లీగ్లు) చూస్తే.. ఓ ఓవర్లో ఐదు వికెట్ల ఘనత ఇదివరకే రెండు సార్లు నమోదైంది. దేశవాలీ టీ20 మ్యాచ్ల్లో బంగ్లాదేశ్కు చెందిన అల్-అమిన్ హొసైన్, కర్ణాటకకు చెందిన అభిమన్యు మిథున్ ఈ ఘనత సాధించారు.చరిత్ర సృష్టించిన గెడే ప్రియందనాఅంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఓవర్లో, అందులోనూ తన తొలి ఓవర్లోనే ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్గా (పురుషులు లేదా మహిళలు) ఇండొనేషియాకు చెందిన గెడే ప్రియందనా చరిత్ర సృష్టించాడు. బాలి వేదికగా కాంబోడియాతో జరిగిన మ్యాచ్లో ప్రియందనా ఈ చారిత్రక ఘనత సాధించాడు.ఇండోనేషియా నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని కాంబోడియా చేధించే క్రమంలో ఈ ఫీట్ నమోదైంది. కాంబోడియా స్కోర్ 15 ఓవర్లలో 106/5 వద్ద ఉండగా.. మీడియం పేసర్ అయిన ప్రియందనా ఒక్కసారిగా చెలరేగిపోయాడు. 16వ ఓవర్ తొలి మూడు బంతుల్లో వరుసగా షా అబ్రార్ హుస్సేన్, నర్మల్జిత్ సింగ్, చాంతోయున్ రథనక్లను ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. ఆతర్వాత నాలుగో బంతికి పరుగులేమీ రాకపోగా.. ఐదు, ఆరు బంతుల్లో మాంగ్దారా సోక్, పెల్ వెన్నక్లను ఔట్ చేసి ఐదు వికెట్లు పూర్తి చేశాడు. ఈ ఓవర్లో ఒక్క రన్ (వైడ్) మాత్రమే వచ్చింది. ప్రియందనా ఉన్నపళంగా కాంబోడియా ఇన్నింగ్స్ను కుప్పకూల్చడంతో ఇండోనేషియా 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు ధర్మ కేసుమా విధ్వంసకర శతకంతో (68 బంతుల్లో 110 నాటౌట్) చెలరేగడంతో ఇండోనేషియా నిర్ణీత 20 ఓవర్లలో 167 పరుగులు చేసింది. -
వైభవ్.. దూకుడు ఒక్కటే కాదు!
వైభవ్ సూర్యవంశీ.. క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. కేవలం 14 ఏళ్ల వయస్సులోనే విధ్వంసకర బ్యాటింగ్తో మొత్తం క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకొన్న యువ సంచలనం అతడు. ఐపీఎల్ చరిత్రలోనే అమ్ముడైన అతి పిన్న వయష్కుడైన ఆటగాడిగా నుంచి.. అండర్-19 స్థాయిలో మెరుపు సెంచరీలు బాదడం వరకు అతడి ప్రయాణం నిజంగా ఒక అద్భుతం. అయితే అంతర్జాతీయ అరంగేట్రానికి అడుగు దూరంలో నిలిచిన వైభవ్.. కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరముంది. వైభవ్కు అద్భుతమైన టాలెంట్ ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ జూనియర్ క్రికెట్కు సీనియర్ క్రికెట్కు చాలా తేడా ఉంటుంది.హిట్టింగ్ ఒక్కటే కాదు..క్రికెట్ ఒక చదరంగం వంటిది. ఎక్కడ ఎత్తుకు పై ఎత్తు వేయాలో.. ఎక్కడ తగ్గాలో స్పష్టంగా తెలియాలి. సీనియర్ స్ధాయిలో రాణించాలంటే కేవలం హిట్టింగ్ చేసే సత్తా ఉంటే సరిపోదు. వీరేంద్ర సెహ్వాగ్ వంటి దిగ్గజాలు విధ్వంసకర ఆటగాళ్లగా పేరు గాంచినప్పటికి.. తమ శైలికి విరుద్దంగా ఆడి జట్టును గెలిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల ముగిసిన అండర్-19 ఆసియాకప్నే ఉదాహరణగా తీసుకుందాం.యూఏఈ, మలేషియా వంటి పసికూనలపై విధ్వసంకర బ్యాటింగ్తో విరుచుకుపడ్డ వైభవ్.. కీలకమైన ఫైనల్లో పాకిస్తాన్పై మాత్రం విఫలమయ్యాడు. కేవలం పది బంతుల్లో 26 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో జట్టుకు కావాల్సింది ఇది కాదు. నిలకడగా ఆడి తన లభించిన ఆరంభాలను భారీ స్కోర్లగా మలుచుకోవాలి. అప్పుడే జట్టు విజయాల్లో సదరు ఆటగాడు భాగం అవుతాడు. వైభవ్ త్వరగా ఔట్ కావడం కూడా భారత్ ఓటమికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అదే వైభవ్ ఒక పది పదేహేను ఓవర్ల పాటు కాస్త ఆచితూచి ఆడి క్రీజులో నిలబడి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. పరిస్థితికి తగ్గట్టు ఆడడం నేర్చుకోవాలి. ఎప్పుడు డిఫెన్సివ్గా ఆడాలి.. ఎప్పుడు ఎటాక్ చేయాలో తెలుసుకోవాలి. ఈ విషయంలో అతడు ఇంకా పరిణితి చెందాలి. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్లో సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేయడం,షార్ట్ బంతులను ఎదుర్కోవడంలో సూర్యవంశీ ఇంకా మెరుగుపడాలి.టాలెంట్ ఉంటే సరిపోదు..క్రికెట్ వంటి జేంటిల్ మ్యాన్ గేమ్లో నిలదొక్కకోవాలంటే కేవలం ప్రతిభ ఉంటే సరిపోదు.. మన ప్రవర్తన కూడా ముఖ్యం. ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్ బౌలర్ అలీ రాజా- వైభవ్ సూర్యవంశీ మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర చర్చనీయాంశమైంది. వైభవ్ను ఔట్ చేసిన అనంతరం అలీ రాజా స్లెడ్జ్ చేశాడు. అయితే తన సహనాన్ని కోల్పోయి వైభవ్.. తన కాలి షూ వైపు చూపిస్తూ దుర్భాషలాడాడు. ఈ విషయంపై బీసీసీఐ కూడా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే మైదానంలో దూకుడు అవసరమే కానీ.. అది హుందాతనాన్ని దాటకూడదు.హద్దు దాటకూడదు..కాగా క్రికెటర్గా చిన్నవయసులో వచ్చిన కీర్తి ప్రతిష్ఠలను, డబ్బును హ్యాండిల్ చేయడం అంత సులువు కాదు. వైభవ్ అతి పిన్న వయస్సులోనే రాజస్తాన్ రాయల్స్ తరపున ఐపీఎల్ కాంట్రాక్ట్ పొందాడు. దీంతో ఈ బిహార్ ఆటగాడు ఓవర్నైట్ కోటీశ్వరుడిగా మారిపోయాడు. అంతేకాకుండా పేరు ప్రతిష్ఠలను కూడా సంపాదించుకున్నాడు. కాబట్టి ఒక హోదా పొందిన వైభవ్ తన కెరీర్ పక్క త్రోవపట్టకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. ఈ జాబితాలో వినోద్ కాంబ్లీ, పృథ్వీ షా లాంటి ఆటగాళ్లు ఉన్నారు. పృథ్వీ షాను తన కెరీర్ ఆరంభంలో భారత క్రికెట్కు మరో సచిన్ టెండూల్కర్ దొరికాడని అంతా భావించారు. అందుకు తగ్గట్టే తన అరంగేట్ర టెస్టులోనే సెంచరీ, ఐపీఎల్లో విధ్వంసకర బ్యాటింగ్తో అతడి పేరు మారుమ్రోగింది. కానీ కొన్నాళ్లకే తన లభించిన డబ్బును, కీర్తి ప్రతిష్ఠలను హ్యాండిల్ చేయలేక ఒక సాధారణ క్రికెటర్గా మిగిలిపోయాడు.జైశ్వాల్ ఒక రోల్ మోడల్..వైభవ్ సూర్య వంశీ.. తన రాజస్తాన్ రాయల్స్ టీమ్ యశస్వి జైశ్వాల్ను ఆదర్శంగా తీసుకోవాలి. జైశ్వాల్ అతి తక్కువ కాలంలోనే ఒక స్టార్ క్రికెటర్గా ఎదిగినా.. తన వినయాన్ని, ఆటపై ఫోకస్ను ఎప్పుడూ కోల్పోలేదు. ఐపీఎల్ అనేది ఒక వేదిక మాత్రమే.. అదే చివరి లక్ష్యం కాదని వైభవ్ గుర్తించాలి. ఇటీవలే దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో తొలి రెండు మ్యాచ్లలో విఫలమైన జైశ్వాల్ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కానీ అతడు ఎక్కడా తన విశ్వాసాన్ని కోల్పోలేదు. చివరి వన్డేలో సెంచరీతో సత్తాచాటి భారత్కు సిరీస్ను అందించాడు. ఇది కదా ఒక ఛాంపియన్ క్రికెటర్ లక్షణం.ఓవర్ కాన్ఫడెన్స్ వద్దు..వైభవ్ ఆటలో అతి విశ్వాసం కన్పిస్తోంది. అయితే సిక్స్.. లేదంటే అవుట్ అనే ధోరణిలో అతడు బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రతి బంతిని బౌండరీకి తరలించాలనే ప్రయత్నంలో అతడు తన వికెట్ను కోల్పోతున్నాడు. కానీ క్రికెట్ వంటి మాస్టర్ మైండ్ గేమ్లో అది ఏ మాత్రం పనికిరాదు. వికెట్ విలువ తెలిసి ఆడినవాడే గొప్ప బ్యాటర్ అవుతాడు. కఠినమైన బంతులను ఆచితూడి ఆడుతూ.. సులువైన బంతులను ఫనిష్ చేసేవాడే వరల్డ్ క్లాస్ బ్యాటర్ కాగలడు. -
వరల్డ్కప్లో టీమిండియా ఫినిషర్ ఎవరు?
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో నలుగురు ఆల్రౌండర్లకు చోటు దక్కింది.పేస్ బౌలింగ్లో హార్దిక్ పాండ్యా, శివం దూబే.. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. వీరికి తోడు టాపార్డర్లో ఉన్న ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma), తిలక్ వర్మ (Tilak Varma) .. లోయర్ ఆర్డర్లో రింకూ సింగ్ కూడా అవసరమైన వేళ బౌలింగ్పరంగానూ సేవలు అందించగలరు.ఇటీవల సౌతాఫ్రికాతో స్వదేశంలో ముగిసిన టీ20 సిరీస్లో ఫినిషర్గా సత్తా చాటిన జితేశ్ శర్మకు ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదన్న విషయం తెలిసిందే. మరి వరల్డ్కప్ టోర్నీలో టీమిండియాకు ఉన్న ఫినిషింగ్ ఆప్షన్లు ఏవి?రింకూ సింగ్ఐపీఎల్లో సత్తా చాటి టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన అనతి కాలంలోనే రింకూ.. నయా ఫినిషర్గా పేరు తెచ్చుకున్నాడు. లోయర్ ఆర్డర్లో ధనాధన్ దంచికొట్టడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. ఐపీఎల్-2023లో కేకేఆర్ తరఫున గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో యశ్ దయాళ్ బౌలింగ్లో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదడం ఇందుకు ఉదాహరణ.ఇటీవల సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్ ఆడిన జట్టులో రింకూకు చోటే లేదు. అయితే, ఫినిషర్గా అతడు సత్తా చాటగలడు కాబట్టి ప్రపంచకప్ జట్టులో సెలక్టర్లు అతడికి స్థానం కల్పించారు. అయితే, తుదిజట్టులో చోటు కోసం అతడు ఎదురుచూడకతప్పదు. ఇప్పటికి టీమిండియా తరఫున 35 టీ20 మ్యాచ్లు ఆడిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 550 పరుగులు చేశాడు.శివం దూబేఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు ఆడుతున్న శివం దూబే.. సాధారణంగా మిడిలార్డర్లో బ్యాటింగ్ చేసేవాడు. అయితే, టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్ వచ్చిన తర్వాత ఎక్కువగా లోయర్ ఆర్డర్లోనే అతడి సేవలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు.ఇటీవలి కాలంలో ఈ ముంబై ఆల్రౌండర్ కేవలం బ్యాటింగ్కే పరిమితం కాకుండా.. స్లో మీడియం పేస్తో బౌలింగ్తోనూ సత్తా చాటుతున్నాడు. లోయర్ ఆర్డర్లో ఆల్రౌండర్గా శివం దూబే మంచి ఆప్షన్. ఇటీవల సౌతాఫ్రికాతో సిరీస్లో సత్తా చాటి ఫామ్లో ఉండటం అతడికి సానుకూలాంశం. తొలి రెండు మ్యాచ్లలో విఫలమైనా.. (11, 1, 10 నాటౌట్, 10 నాటౌట్, రెండు వికెట్లు) తర్వాత ఆఖర్లో మెరుపులు మెరిపించాడు.హార్దిక్ పాండ్యాపరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియాకు నెంబర్ వన్ ఫినిషర్ అంటే ఠక్కున గుర్తుకువచ్చే పేరు హార్దిక్ పాండ్యా. గాయం నుంచి కోలుకుని.. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్తో రీఎంట్రీ ఇచ్చిన ఈ ఆల్రౌండర్.. సూపర్ ఫామ్లో ఉన్నాడు. మూడు ఇన్నింగ్స్లోనే 142 పరుగులు సాధించాడు. ముఖ్యంగా సఫారీలతో ఆఖరి టీ20లో కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన హార్దిక్.. మొత్తంగా 25 బంతుల్లో 63 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి.గతే ప్రపంచకప్-2024 టోర్నీలో టీమిండియా చాంపియన్గా నిలవడంలో హార్దిక్ పాండ్యాదే కీలక పాత్ర. మూడు ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసి 89 రన్స్ చేసిన పాండ్యా.. మొత్తంగా పదకొండు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ముఖ్యంగా సౌతాఫ్రికాతో ఫైనల్లో అద్భుత ప్రదర్శన (3/20) కనబరిచాడు. ఈసారి కూడా ఫినిషర్గా హార్దిక్ పాండ్యానే ఫస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ అనడంలో సందేహం లేదు. ఇక పై ముగ్గురు పిచ్, మ్యాచ్ పరిస్థితులను బట్టి ఐదు నుంచి ఏడో స్థానంలో బరిలోకి దిగుతారు.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత జట్టు సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, రింకూ సింగ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్).చదవండి: IND vs NZ: భారత్తో వన్డే సిరీస్.. విలియమ్సన్ సంచలన నిర్ణయం! -
నా దగ్గర బుల్లెట్ ప్రూఫ్ కారు ఉంది: స్టార్ క్రికెటర్
ఉపఖండ దేశాల్లో క్రికెట్కు ఉన్న ఆదరణ మరే ఇతర క్రీడకు లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా అఫ్గనిస్తాన్లోనూ క్రికెట్, క్రికెటర్లకు క్రేజ్ ఎక్కువ. తమ అభిమాన ఆటగాడిని చూసేందుకు ఫ్యాన్స్ ఒక్కోసారి ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటారు.ముఖ్యంగా క్రికెట్ను మతంగా భావించే భారత్లో విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) వంటి దిగ్గజాలను నేరుగా కలవాలని పిచ్లోకి దూసుకువెళ్లి... ఇబ్బందులపాలైన వీరాభిమానులను ఇటీవలి కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఒక్కోసారి అభిమానం శ్రుతిమించితే సదరు ఆటగాళ్లకు కూడా కష్టమే.లండన్లోనే కోహ్లిఅందుకే కోహ్లి తన పిల్లలు ఇద్దరినీ లండన్లోనే ఎక్కువగా పెంచుతున్నాడు. ఇంత వరకు వాళ్ల ఫొటోలు కూడా రివీల్ చేయలేదు. సోషల్ మీడియాకు దూరంగా.. సెలబ్రిటీల పిల్లల్లా కాకుండా సాధారణ పిల్లల మాదిరే వారిని పెంచుతున్నాడు. కోహ్లి సైతం లండన్ వీధుల్లో ఎలాంటి ఇబ్బంది, హంగూ ఆర్భాటాలు లేకుండా స్వేచ్చగా తిరగగలుగుతున్నాడు.తన పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాంటిదే అంటున్నాడు అఫ్గనిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ (Rashid Khan). సొంత దేశంలో ఇంటి నుంచి కాలు బయటపెట్టాలన్నా అతడికి భయమే. అయితే, కోహ్లి మాదిరి కేవలం క్రేజ్ కారణంగా మాత్రమే అతడికి ఈ పరిస్థితి తలెత్తలేదు. దేశంలోని అనిశ్చితులు ఇందుకు ప్రధాన కారణం.నా దగ్గర బుల్లెట్ ప్రూఫ్ కారు ఉందిఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్తో మాట్లాడుతూ రషీద్ ఖాన్ ఈ విషయం గురించి స్పందించాడు. అఫ్గనిస్తాన్ వీధుల్లో స్వేచ్ఛగా విహరించగలవా? అని పీటర్సన్ అడుగగా.. ‘‘లేదు. నేనసలు అఫ్గన్ వీధుల్లో నడవలేను. నా దగ్గర బుల్లెట్ ప్రూఫ్ కార్ ఉంది. అందులోనే బయటకు వెళ్తా’’ అని రషీద్ ఖాన్ బదులిచ్చాడు.‘‘కాబూల్లో బుల్లెట్ ప్రూఫ్ కారా? ఎందుకు?’’ అని పీటర్సన్ ఆశ్చర్యం వ్యక్తం చేయగా.. ‘‘భద్రతా కారణాల దృష్ట్యా నేను ఆ కారునే వాడతాను. ఉండకూడని సమయంలో.. ఉండకూడని చోట ఉంటే అంతే సంగతులు.అయినా అఫ్గనిస్తాన్లో ఇవన్నీ సాధారణమే. దాదాపు ప్రతి ఆటగాడి దగ్గర బుల్లెట్ ప్రూఫ్ కారు ఉంటుంది’’ అని రషీద్ ఖాన్ వెల్లడించాడు. తద్వారా తనకు కారు అనేది కేవలం విలాస వస్తువు కాదని.. వ్యక్తిగత భద్రత కోసం తప్పక వాడతానని స్పష్టం చేశాడు. కాగా అఫ్గన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన అనతికాలంలోనే ప్రపంచ స్థాయి స్పిన్నర్గా ఎదిగాడు రషీద్ ఖాన్. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్లలో ప్రస్తుతం తిరుగులేని బౌలర్గా సత్తా చాటుతున్నాడు. ఇక అఫ్గన్ తరఫున రషీద్ ఖాన్ 117 వన్డేలు, 108 టీ20లు, 6 టెస్టులు ఆడి.. 210, 182, 45 వికెట్లు కూల్చాడు.చదవండి: ఆ ముగ్గురిని వాడుకోవాల్సింది: టీమిండియా సెలక్టర్లపై మాజీ క్రికెటర్ ఫైర్ -
పాక్ చేతిలో ఓటమి.. టీమిండియాపై బీసీసీఐ సీరియస్
అండర్-19 ఆసియాకప్ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో భారత యువ జట్టు ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. టోర్నీ అసాంతం అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా.. తుది పోరులో మాత్రం పూర్తిగా తేలిపోయింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లో విఫలమైన ఆయూష్ మాత్రే అండ్ కో.. ఏకంగా 191 పరుగుల తేడాతో ఘోర పరాభావన్ని మూటకట్టుకుంది.దాయాది చేతిలో ఓటమి పాలవ్వడాన్ని భారత అభిమానులు, మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఈ ఘోర ఓటమిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కూడా సీరియస్ అయింది. ఈ ఓటమిపై సమీక్ష నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. డిసెంబర్ 22న వర్చవల్గా జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జట్టు హెడ్ కోచ్ హృషికేష్ కనిత్కర్, కెప్టెన్ ఆయుష్ మాత్రే, టీమ్ మేనేజర్ నుండి బోర్డు వివరణ కోరనున్నట్లు క్రిక్బజ్ తమ కథనంలో పేర్కొంది. బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడాన్ని బోర్డు తప్పుబడుతోంది. అదేవిధంగా ఫైనల్ మ్యాచ్ సందర్భంగా భారత ఆటగాళ్ల ప్రవర్తనపై వచ్చిన నివేదికలు కూడా బీసీసీఐ దృష్టిలో పడినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై కూడా ఆటగాళ్లతో బీసీసీఐ చర్చిస్తుందో లేదో ఇంకా క్లారిటీ లేదు."గతంలో భారత జట్లు క్రికెట్ను గౌరవించేవి. కానీ ఇప్పుడు అలా లేదు. భారత జట్ల ప్రవర్తన క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటుంది" అని సర్ఫరాజ్ పేర్కొన్నాడు. కాగా మ్యాచ్ ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లు పాకిస్థాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి నిరాకరించారు. తమ సీనియర్ ఆటగాళ్లనే జూనియర్స్ కూడా ఫాలో అయ్యారు.కాగా ఈ తుది పోరులో భారత ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రేలు ప్రవర్తన కూడా చర్చనీయాంశమైంది. పాక్ పేసర్ అలీ రజా వీరిని ఔట్ చేశాడు. ఔటైన తర్వాత వైభవ్, ఆయుష్.. పాక్ బౌలర్ను దుర్భాషలాడారు. ముఖ్యంగా వైభవ్ అయితే తన షూను చూపిస్తూ ఫైరయ్యాడు. అయితే వీరికి భారత అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు. పాక్ బౌలర్ స్లెడ్జ్ చేయడంతోనే వైభవ్ అలా ప్రవర్తించాడని పోస్ట్లు పెడుతున్నారు.చదవండి: విరాట్ కోహ్లి ఫ్యాన్స్కు భారీ షాక్ -
చిన్నస్వామిలో మ్యాచ్లపై సమీక్ష
బెంగళూరు: ఇటీవల ప్రాణాంతకమైన తొక్కిసలాట జరిగిన బెంగళూరు చిన్నస్వామి క్రీడా మైదానంలో మళ్లీ క్రికెట్ మ్యాచ్లను నిర్వహించే విషయం పరిశీలనకు కమిటీని నియమించినట్లు హోం మంత్రి జీ.పరమేశ్వర్ తెలిపారు. సోమవారం విధానసౌధలో క్రికెట్ సంఘం అధికారులు, పోలీసు అధికారులతో ఆయన భేటీ జరిపారు. 24న విజయ్ హజారె టోర్నీ జరపడానికి క్రికెట్ సంఘం అనుమతి కోరిందన్నారు. జీబీఏ కమిషనర్ నేతృత్వంలో పలు ప్రభుత్వ శాఖలతో కమిటీని ఏర్పాటు చేశామని, స్టేడియాన్ని పరిశీలించి మార్పులు చేర్పుల గురించి ప్రభుత్వానికి నివేదికను ఇస్తుందని, దానిని బట్టి చర్యలు తీసుకుంటామన్నారు. -
టీమిండియా సెలక్టర్లపై మాజీ క్రికెటర్ ఫైర్
టీమిండియా సెలక్టర్ల తీరుపై భారత మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ మండిపడ్డాడు. ప్రపంచకప్ టోర్నమెంట్కు సన్నద్ధమయ్యే క్రమంలో పిచ్చి ప్రయోగాలతో ఆటగాళ్లను గందరగోళానికి గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కనీసం రెండు నుంచి మూడు నెలల కాలం వృథా చేశారంటూ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తీరును తప్పుబట్టాడు.గిల్పై వేటుఅసలు విషయమేమిటంటే.. భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్య ఇస్తున్న టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి బీసీసీఐ ఇటీవలే తమ జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అనూహ్య రీతిలో వైస్ కెప్టెన్గా ఉన్న శుబ్మన్ గిల్ (Shubman Gill)పై వేటు వేసిన యాజమాన్యం.. జితేశ్ శర్మను కూడా జట్టు నుంచి తప్పించింది.గిల్, జితేశ్ స్థానాల్లో రింకూ సింగ్, ఇషాన్ కిషన్ (Ishan Kishan)లను మేనేజ్మెంట్ ఎంపిక చేసింది. ఈ రెండు మార్పులు మినహా సౌతాఫ్రికాతో స్వదేశంలో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్లో ఆడిన జట్టునే వరల్డ్కప్ టోర్నీకీ కొనసాగించింది. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ మొహమ్మద్ కైఫ్ స్పందిస్తూ.. గిల్ విషయంలో మేనేజ్మెంట్ చేసిన తప్పును ఎత్తి చూపాడు.సెలక్టర్లు తప్పు చేశారు‘‘మెరుగైన ఆటగాళ్లు ఎవరో వాళ్లకు (సెలక్టర్లకు) ముందుగానే తెలుసు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్కు ఎవరు సరిపోతారో వారికి ఓ అవగాహన ఉంది. గిల్ కంటే పొట్టి క్రికెట్లో బాగా ఆడే వాళ్లున్నారని వాళ్లకు తెలుసు. అయినప్పటికీ సెలక్టర్లు తప్పు చేశారు.వారి తప్పు వల్ల భారత క్రికెట్ వెనుకబడింది. గత రెండు- మూడు నెలలుగా గిల్కు బదులు వాళ్లు యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, జితేశ్ శర్మలను ఎక్కువగా ఆడించాల్సింది’’ అని కైఫ్ పేర్కొన్నాడు.కాగా ఆసియా టీ20 కప్-2025 టోర్నీతో గిల్ టీ20 జట్టులో పునరాగమనం చేయగా.. ఓపెనింగ్ జోడీగా ఉన్న అభిషేక్ శర్మ- సంజూ శాంసన్లను విడదీయాల్సి వచ్చింది. సంజూ స్థానంలో గిల్ ఓపెనర్గా వచ్చి వరుస మ్యాచ్లలో విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో పాటు హెడ్కోచ్ గౌతం గంభీర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.భవిష్య సారథినే తప్పించారుఈ క్రమంలో అనూహ్య రీతిలో గిల్పై వేటు వేసిన యాజమాన్యం.. ప్రపంచకప్ జట్టుకు వైస్ కెప్టెన్గా అక్షర్ పటేల్ను తిరిగి నియమించింది. కాగా టీమిండియా టెస్టు, వన్డే జట్లకు గిల్ కెప్టెన్గా ఉన్న విషయం తెలిసిందే. టీ20 జట్టుకు కూడా భవిష్య సారథిగా అతడే ఉంటాడని బీసీసీఐ వర్గాలు గతంలో వెల్లడించాయి. కానీ బ్యాటర్గా వరుస మ్యాచ్లలో విఫలమైన నేపథ్యంలో మేనేజ్మెంట్ అతడిని జట్టు నుంచే తప్పించడం గమనార్హం.చదవండి: కెప్టెన్గా ఇషాన్ కిషన్ -
విరాట్ కోహ్లి ఫ్యాన్స్కు భారీ షాక్
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దాదాపు ఏడు నెలల తర్వాత ఓ క్రికెట్ మ్యాచ్కు ఆతిథ్యమివ్వనుంది. విజయ్ హాజారే ట్రోఫీ 2025-26లో తొమ్మిది లీగ్ మ్యాచ్లకు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఉంది. తొలుత ఈ ప్రతిష్టాత్మక మైదానంలో డిసెంబర్ 24న ఆంధ్ర-ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.ఢిల్లీ జట్టు తరపున విరాట్ కోహ్లి(Virat kohli), రిషబ్ పంత్ స్టార్ ప్లేయర్లు ఆడనున్నారు. అయితే చిన్నస్వామి స్టేడియంలో కోహ్లిని మళ్లీ చూడాలనుకున్న అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. చిన్నస్వామి స్టేడియంలో జరిగే విఎచ్టి మ్యాచ్లకు ప్రేక్షకులను అనుమతించకూడదని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది.ఈ మ్యాచ్లకు సుమారు 2,000 నుండి 3,000 మంది వరకు అభిమానులను అనుమతించాలని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతిపాదించింది. కానీ భద్రతా కారణాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. గతంలో జరిగిన విషాద ఘటన దృష్ట్యా సిద్ధరామయ్య సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.కాగా ఐపీఎల్-2025 విజయోత్సవ వేడుకల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వెలుపుల జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటన తర్వాత చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణను నిలిపివేశారు. అయితే ఇటీవలే చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ల నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాస్తవానికి ఈ దేశవాళీ వన్డే టోర్నీలోని గ్రూపు-డి మ్యాచ్లకు బెంగళూరులోని అలూర్ క్రికెట్ స్టేడియం వేదికగా ఉంది.కానీ కోహ్లి, పంత్ వంటి స్టార్ ప్లేయర్లు ఆడుతుండడంతో అలూర్ వంటి చిన్న వేదికలో మ్యాచ్లు నిర్వహిస్తే భద్రత, లాజిస్టికల్ సవాళ్లు తలెత్తే అవకాశం ఉందని కేసీఎ భావించింది. ఈ క్రమంలోనే గ్రూపు-డి మ్యాచ్ల వేదికను అలూర్ నుంచి చిన్నస్వామి స్టేడియంకు మార్చారు.చదవండి: IND vs NZ: భారత్తో వన్డే సిరీస్.. విలియమ్సన్ సంచలన నిర్ణయం! -
కెప్టెన్గా ఇషాన్ కిషన్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మరోసారి జార్ఖండ్ జట్టుకు నాయకత్వం వహించేందుకు సిద్దమయ్యాడు. విజయ్ హాజారే ట్రోఫీ 2025-26కు కోసం జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్గా కిషన్ ఎంపికయ్యాడు. కిషన్ ఇటీవలే జార్ఖండ్కు తొలి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని అందించాడు. ఇప్పుడు దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హాజారే ట్రోఫీలో తన జట్టును విజయ పథంలో నడిపించేందుకు కిషన్ ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ టోర్నీలో కిషన్కు డిప్యూటీగా వికెట్ కీపర్ బ్యాటర్ కుమార్ కుషాగ్రా వ్యవహరించనున్నాడు. అదేవిధంగా ఈ జట్టులో విరాట్ సింగ్, అనుకుల్ రాయ్, రాబిన్ మింజ్ వంటి టాలెంటెడ్ ఆటగాళ్లకు చోటు దక్కింది. జార్ఖండ్ తమ తొలి మ్యాచ్లో డిసెంబర్ 24న కర్ణాటకతో తలపడనుంది.ఇక టీ20 ప్రపంచకప్-2026కు ఎంపిక చేసిన భారత జట్టులో ఇషాన్ కిషన్కు చోటు దక్కింది. దేశవాళీ క్రికెట్ టోర్నీలో అద్భుత ప్రదర్శన కారణంగా అతడిని సెకెండ్ వికెట్ కీపర్ బ్యాటర్గా సెలక్టర్లు ఎంపిక చేశారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కిషన్ దుమ్ములేపాడు. ఈ టోర్నీలో 10 మ్యాచ్లు ఆడిన ఈ పాకెట్ డైన్మైట్ 57.44 సగటుతో 571 పరుగులు చేశాడు. ఫైనల్లో కూడా సెంచరీతో సత్తాచాటాడు. ఈ క్రమంలోనే రెండేళ్ల తర్వాత జాతీయ జట్టుకు అతడు ఎంపికయ్యాడు.విజయ్ హాజారే ట్రోఫీకి జార్ఖండ్ జట్టుఇషాన్ కిషన్ (కెప్టెన్), విరాట్ సింగ్, ఉత్కర్ష్ సింగ్, కుమార్ కుషాగ్రా (వైస్ కెప్టెన్), రాబిన్ మింజ్, అనుకుల్ రాయ్, శరణదీప్ సింగ్, శిఖర్ మోహన్, పంకజ్ కుమార్, బాల కృష్ణ, మహ్మద్ కౌనైన్ ఖురైషీ, శుభ్ శర్మ, అమిత్ కుమార్, మనీషి, అభినవ్ శరణ్, సుశాంత్ మిశ్రా, వికాస్ సింగ్, సౌరభ్ శేఖర్, రాజందీప్ సింగ్, శుభమ్ సింగ్.చదవండి: IND vs NZ: భారత్తో వన్డే సిరీస్.. విలియమ్సన్ సంచలన నిర్ణయం! -
ఆసీస్ జట్టులో ఊహించని మార్పులు.. నాలుగేళ్ల తర్వాత అతడి రీఎంట్రీ
యాషెస్ సిరీస్ 2025-26లో భాగంగా బాక్సింగ్ డే టెస్టు డిసెంబర్ 26 నుంచి మెల్బోర్న్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును మంగళవారం ప్రకటించింది. అయితే ఆసీస్ జట్టులో అనుహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మ్యాచ్కు రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ దూరమయ్యాడు. అతడి స్దానంలో తిరిగి వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ జట్టును నడిపించనున్నాడు. అనారోగ్యం కారణంగా మూడో టెస్టుకు ఆఖరి నిమిషంలో దూరమైన స్మిత్.. తిరిగి పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ఇక కమ్మిన్స్తో పాటు స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ కూడా అందుబాటులో లేడు.అడిలైడ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో లియోన్ తొడ కండరాల గాయం బారిన పడ్డాడు. దీంతో అతడు ఆఖరి రెండు టెస్టులకు కూడా దూరమయ్యాడు. అతడి స్ధానంలో యువ స్పిన్నర్ టాడ్ మర్ఫీ జట్టులోకి వచ్చాడు. మాట్ కుహ్నెమాన్, కోరీ రోచిసియోలి వంటి స్పిన్నర్లు ఉన్నప్పటికి సెలక్టర్లు మర్ఫీ వైపే మొగ్గు చూపారు. ఈ విక్టోరియన్ ఆఫ్ స్పిన్నర్ గతంలో లియోన్ గైర్హాజరీలో తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇక కమ్మిన్స్ స్ధానంలో జే రిచర్డ్సన్కు చోటు దక్కింది. ఈ వెస్ట్ ఆస్ట్రేలియా స్పీడ్ స్టార్ చివరగా ఆసీస్ తరపున టెస్టు మ్యాచ్ 2021లో ఆడాడు. ఇప్పుడు మళ్లీ నాలుగేళ్ల తర్వాత అతడి రీ ఎంట్రీ ఇవ్వడం విశేషం. కాగా తొలి మూడు టెస్టుల్లో విజయం సాధించిన ఆసీస్.. యాషెస్ సిరీస్ను ఇప్పటికే 3-0 తేడాతో సొంతం చేసుకుంది.బాక్సింగ్ డే టెస్టుకు ఆసీస్ జట్టు ఇదే..స్టీవ్ స్మిత్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, బ్రెండన్ డాగెట్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, టాడ్ మర్ఫీ, మైఖేల్ నేజర్, జే రిచర్డ్సన్, మిచెల్ స్టార్క్, జేక్ వెదరాల్డ్, బ్యూ వెబ్స్టర్ -
క్రికెటర్ల మ్యాచ్ ఫీజులను భారీగా పెంచిన బీసీసీఐ
దేశవాళీ మహిళా క్రికెటర్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) తీపి కబురు అందించింది. మహిళా క్రికెటర్ల మ్యాచ్ ఫీజులను భారీగా పెంచుతూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశవాళీ స్థాయిలోనూ పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లు వేతనాలు అందుకోనున్నారు. గతంతో పోలిస్తే మ్యాచ్ ఫీజులు దాదాపు 2.5 రెట్లు పెరిగాయి. సోమవారం (డిసెంబర్ 22) వర్చువల్గా జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టారు.కొత్త ఫీజుల ప్రకారం.. సీనియర్ మహిళా క్రికెటర్లు వన్డే, బహుళ రోజుల టోర్నీలలో ప్లేయింగ్ ఎలెవన్లో ఉంటే ఇకపై రోజుకు రూ. 50 వేలు అందుకుంటారు. ప్రస్తుతం ఇది రూ. 20 వేలుగా ఉంది. అంటే దాదాపు రూ. 30 వేలు పెరిగింది. తుది జట్టులోని లేని సభ్యులకు ఒక్కో మ్యాచ్కు రూ. 25,000(ప్రస్తుతం రూ.12,500) లభించనుంది.అదే విధంగా సీనియర్ క్రికెటర్లు టీ20ల్లో ఇకపై రోజుకు రూ.25 వేలు మ్యాచ్ ఫీజుల రూపంలో లభించనుంది. ప్రస్తుతం ఈ ఫీజు పది వేలుగా ఉంది. ఇక రిజర్వ్ ఆటగాళ్లకు రూ.12.500 లభిస్తాయి. గతంలో ఒక సీనియర్ మహిళా క్రికెటర్ అన్ని ఫార్మాట్లలో కలిపి లీగ్ మ్యాచ్లు ఆడితే దాదాపు రూ.3 లక్షలకు వరకు సంపాదించేవారు. ఇప్పుడు ఆ మెత్తం గణనీయంగా పెరగనుంది.జూనియర్లకు బంపరాఫర్..జూనియర్ ఉమెన్స్ క్రికెటర్ల జీతాలు కూడా బీసీసీఐ పెంచింది. జూనియర్ క్రికెట్ టోర్నమెంట్ల(వన్డే, మల్టీ డేస్)లో ప్లేయింగ్ ఎలెవన్లో ఉన్న ఆటగాళ్లకు ఒక రోజు ఆడితే రూ. 25,000 అందుకోనున్నారు. ప్రస్తుతం ఇది పది వేలుగా ఉంది. రిజర్వ్ ఆటగాళ్లకు రూ. 12,500 లభిస్తాయి. అదేవిధంగా టీ20 మ్యాచ్లలో ఆడే ఆటగాళ్లకు రూ. 12,500, రిజర్వ్ ఆటగాళ్లు రూ. 6250 అందనుంది.కేవలం ఆటగాళ్లకే కాకుండా అంపైర్లు, మ్యాచ్ రెఫరీల ఫీజులను కూడా బీసీసీఐ పెంచింది. క్రిక్బజ్ రిపోర్ట్ ప్రకారం.. లీగ్ మ్యాచ్ల కోసం రోజుకు రూ.40,000, నాకౌట్ మ్యాచ్ల కోసం రోజుకు రూ.50,000 నుంచి రూ.60,000 వరకు అందుకోనున్నారు.చదవండి: IND vs NZ: భారత్తో వన్డే సిరీస్.. విలియమ్సన్ సంచలన నిర్ణయం! -
భారత్తో వన్డే సిరీస్.. విలియమ్సన్ సంచలన నిర్ణయం!
న్యూజిలాండ్ పురుషల క్రికెట్ జట్టు వచ్చే ఏడాది జనవరిలో భారత పర్యటనకు రానుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్లో కివీస్ తలపడనుంది. తొలుత వన్డే సిరీస్ జరగనుంది. ఈ క్రమంలో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్స్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. టీమిండియాతో వన్డే సిరీస్కు విలియమ్సన్ను దూరంగా ఉండనున్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్లో ఆడేందుకు కేన్ ఇప్పటికే డర్బన్ సూపర్ జెయింట్స్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ లీగ్ డిసెంబర్ 26 నుండి జనవరి 26 వరకు జరగనుంది. ఈ లీగ్ కారణంగానే అతడు భారత్తో జరిగే వన్డేలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. భారత్ వర్సెస్ న్యూజిలాండ్ వన్డే సిరీస్ జనవరి 11న ప్రారంభమై.. జనవరి 18న ముగియనుంది.ఇప్పటికే అంతర్జాతీయ టీ20 క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విలియమ్సన్.. ప్రస్తుతం వన్డే, టెస్టు ఫార్మాట్లలోనే కొనసాగుతున్నాడు. సెంట్రల్ కాంట్రాక్ట్ను కూడా వదులుకున్నాడు. ఎక్కవగా కుటంబంతో సమయం గడిపేందుకే కేన్ మామ ప్రాధాన్యత ఇస్తున్నాడు. గత నెలలలో వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్కు కూడా అతడు దూరమయ్యాడు. కానీ ఈ కివీ మాజీ కెప్టెన్ విండీస్తో టెస్టు సిరీస్లో మాత్రం మాడాడు. మౌంట్మంగనూయ్ వేదికగా విండీస్-న్యూజిలాండ్ మూడో టెస్టు ముగిసిన అనంతరం విలియమ్సన్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు."ఒక్కో సిరీస్కు కాస్త విరామం తీసుకుని మళ్లీ జాతీయ జట్టుకు ఆడుతాను. నా కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాను. ముఖ్యంగా పిల్లలతో గడపడం నాకు చాలా ముఖ్యం. అయితే క్రికెట్ పట్ల నాకున్న మక్కువ ఇసుమంత కూడా తగ్గలేదు. కానీ నా వ్యక్తిగత జీవితాన్ని, నా ప్రొపిషనల్ లైఫ్ను బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నా" అని విలియమ్సన్ పేర్కొన్నాడు. ఐపీఎల్-2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టుకు వ్యూహాత్మక సలహాదారుగా కేన్ వ్యవహరించనున్నాడు. -
అప్పటివరకు భయపడ్డా.. హర్మన్ చాలా సపోర్ట్ చేసింది: వైష్ణవి
అరంగేట్రంలోనే ఆకట్టుకున్న భారత మహిళా జట్టు స్పిన్నర్ వైష్ణవి శర్మ తన ఆటతీరు పట్ల సంతృప్తిని వెలిబుచ్చింది. విశాఖ వేదికగా ఆదివారం శ్రీలంకతో జరిగిని తొలి టీ20 మ్యాచ్లో 20 ఏళ్ల పంజాబీ స్పిన్నర్ కట్టుదిట్టమైన బౌలింగ్తో అదరగొట్టింది. పూర్తి కోటా (4 ఓవర్లు) బౌలింగ్ చేసిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ 16 పరుగులే ఇచి్చంది. వికెట్ తీయలేకపోయినప్పటికీ టి20లో ఇంత పొదుపుగా బౌలింగ్ చేయడం కూడా గొప్ప విషయం.పైగా ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో ఆమె స్పెల్ (4–0–16–0) దోహదపడింది. మెయిడిన్ ఓవర్ లేకపోయినా... ఓవర్కు 4 పరుగుల ఎకానమీ రేట్ టి20ల్లో కచ్చితంగా ఉత్తమ ప్రదర్శనే అవుతుంది. ఇంత బాగా బౌలింగ్ చేసినప్పటికీ వికెట్ దక్కకపోవడం ఏమాత్రం నిరాశ కలిగించలేదని వైష్ణవి పేర్కొంది.జట్టు సహచరులు, డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం అంతా సానుకూల దృక్పథాన్ని అలవర్చిందని చెప్పుకొచ్చింది. మంగళవారం ఇదే వేదికపై భారత్, శ్రీలంక మహిళల జట్ల మధ్య రెండో టి20 జరుగనుంది. సిరీస్లో ప్రస్తుతం హర్మన్ప్రీత్ కౌర్ సేన 1–0తో ఆధిక్యంలో ఉంది. హర్మన్ ప్రోత్సహించింది!"నా ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. వికెట్ తీయలేదన్న నిరాశ ఏ మూలన కూడా లేదు. నిజం చెబుతున్నా నేననుకున్న విధంగా నా ప్రణాళికల్ని అమలు చేయగలిగాను. ప్రత్యర్థి బ్యాటర్లను నిలువరించాను. ఒక్క మ్యాచ్తోనే అయిపోలేదుగా... ఇంకా నాలుగు మ్యాచ్లున్నాయి. మ్యాచ్ మొదలయ్యేందుకు ముందు కాస్త భయపడిన మాట వాస్తవమే! కానీ జాతీయ గీతం ఆలాపించాకా ఆ బెరుకు, భయం తొలగింది. మనసు నిర్మలమైంది. అందువల్లేనేమో నా పని నేను సానుకూల దృక్పథంతో చేసుకోగలిగాను. కెపె్టన్ హర్మన్ప్రీత్, జట్టు మేనేజ్మెంట్ నన్నెంతగానో ప్రోత్సహించారు" అని వైష్ణవి శర్మ వివరించింది.చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్కు కొత్త కెప్టెన్లు..? -
మరో విజయం లక్ష్యంగా...
సాక్షి, విశాఖపట్నం: వన్డే ప్రపంచకప్ గెలుచు కొచ్చిన ఉత్సాహంతో ఉన్న భారత మహిళల జట్టు శ్రీలంకతో మొదలైన టి20 సిరీస్లో శుభారంభం చేసింది. ఇప్పుడు ఇదే జోరుతో వరుస విజయాలతో ఆధిక్యాన్ని పెంచుకోవాలని ఆశిస్తోంది. తద్వారా సిరీస్లో పట్టు సాధించాలని చూస్తోంది. మరోవైపు లంక అమ్మాయిలు పటిష్టమైన భారత్కు ఎలాగైనా కళ్లెం వేయాలని, ఈ మ్యాచ్లో గెలిచి 1–1తో సమం చేయాలని పట్టుదలతో ఉన్నారు. గట్టి ప్రత్యరి్థని ఓడించేందుకు పకడ్బందీ ఎత్తుగడలను అమలు చేయాలని లంక జట్టు కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖ తీరంలోనే జరిగే ఈ రెండో టి20 ఆసక్తికరంగా జరిగే అవకాశముంది. ఫీల్డింగ్తోనే సమస్య హర్మన్ప్రీత్ బృందం మొదటి మ్యాచ్లో బాగానే ఆడింది. ప్రత్యరి్థని ఓడించింది. ఐదు టి20ల సిరీస్లో శుభారంభం చేసింది. అంతమాత్రాన భారత జట్టు అన్ని విభాగాల్లోనూ ప్రత్యరి్థకంటే అగ్రగామిగా ఉందనుకుంటే పొరపాటు. బౌలింగ్, బ్యాటింగ్ బాగున్నప్పటికీ ఫీల్డింగ్ చాలా ఘోరంగా ఉంది. తొలి మ్యాచ్లో చెత్త ఫీల్డింగ్తో విసుగు తెప్పించింది. సులువైన క్యాచుల్ని నేలపాలు చేసింది. అంతిమంగా విజయమే ముఖ్యమైనా... ఘోరమైన ఫీల్డింగ్ను అది మూసి పెట్టలేదు. ఇదే విషయాన్ని కెపె్టన్ హర్మన్ సైతం అంగీకరించింది. తప్పకుండా ఫీల్డింగ్ లోపాలపై దృష్టి పెడతామని, నెట్స్లో క్యాచింగ్పైనే అతిగా ప్రాక్టీస్ చేశామని కూడా చెప్పింది. బ్యాటింగ్లో స్మృతి మంధాన మెరుగ్గా ఆడింది. జెమీమా రోడ్రిగ్స్ విలువైన అర్ధసెంచరీతో అజేయంగా నిలిచింది. వీరితో పాటు షఫాలీ వర్మ కూడా రాణిస్తే పరుగులకు, భారీస్కోరుకు ఏమాత్రం ఇబ్బంది వుండదు. బౌలింగ్లో క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, దీప్తి శర్మ, శ్రీచరణి ఆకట్టుకున్నారు. కొత్తమ్మాయి వైష్ణవి శర్మ అరంగేట్రంలోనే అదరగొట్టింది. వికెట్ తీయలేకపోయినా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. సమం చేసే పనిలో... సొంతగడ్డపై భారత్ పైచేయిగా ఉన్నప్పటికీ... ఆతిథ్య జట్టులోని లోపాలను సొమ్ము చేసుకొని సిరీస్ రేసులో నిలవాలని శ్రీలంక చూస్తోంది. భారత్ ఆధిక్యాన్ని ఇక్కడే సమం చేయాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్లో కెప్టెన్ చమరి ఆటపట్టు, నీలాక్షికల వైఫల్యం కూడా జట్టుకు ప్రతికూలంగా మారింది. ఈ 20 ఓవర్ల మ్యాచ్లో రెండు, మూడు ఓవర్లు చాలు మ్యాచ్గతినే మార్చడానికి. అందరు ఆడాల్సిన పనిలేదు. ఏ ఇద్దరు దంచేసినా చాలు ఆతిథ్య జట్టుకు గట్టి బదులు ఇవ్వొచ్చని శ్రీలంక ఆశిస్తోంది. తుది జట్లు (అంచనా) భారత్: హర్మన్ప్రీత్ కౌర్ (కెపె్టన్), షఫాలీ, స్మృతి మంధాన, జెమీమా, రిచా ఘోష్, దీప్తిశర్మ, అమన్జోత్, అరుంధతి, క్రాంతి గౌడ్, వైష్ణవి, శ్రీచరణి. శ్రీలంక: చమరి ఆటపట్టు (కెపె్టన్), విష్మీ గుణరత్నే, హాసిని, హర్షిత, కవీషా, ఇమేశ దులాని, నీలాక్షిక, కౌశిని, ఇనోక రణవీర, మాల్కి మదర, కావ్య, శషిని. -
‘షాన్దార్’గా మళ్లీ జట్టులోకి...
భారత క్రికెట్ జట్టులో ఒక్కసారి స్థానం కోల్పోయిన తర్వాత పునరాగమనం చేయడం అంత సులువు కాదు. పైగా కేవలం ప్రదర్శన బాగా లేక చోటు దక్కకపోతే దేశవాళీలో పరుగుల వరద పారించైనా తిరిగి రావచ్చు. కానీ ప్రవర్తన బాగా లేదనే పేరు వస్తే మాత్రం అందరి దృష్టిలో అతనికి నెగెటివ్ మార్కులు పడినట్లే. రాహుల్ ద్రవిడ్లాంటి సౌమ్యుడికి కూడా తన క్రమశిక్షణారాహిత్యంతో కోపం తెప్పించాడంటే ఆ ఆటగాడు శాశ్వతంగా చెడ్డ పేరు సంపాదించుకున్నట్లే. అయితే ఇషాన్ వీటన్నింటిని అధిగమించాడు. జట్టులో స్థానం కోల్పోయి, ఆపై బీసీసీఐ కాంట్రాక్ట్ కోల్పోయి అన్ని అవకాశాలు కోల్పోయాడని అనిపించిన దశలో మళ్లీ పైకి లేచాడు. క్రికెట్ మైదానంలోనే సత్తా చాటి అనూహ్యంగా ప్రపంచ కప్లో పాల్గొనే భారత టి20 టీమ్లో స్థానం సంపాదించుకున్నాడు. సాక్షి క్రీడా విభాగం ‘వ్యక్తిగత కారణాలతో’ భారత జట్టుకు దూరమైన తర్వాత 2024 ఐపీఎల్లో ఇషాన్ కిషన్ ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగి రాణించాడు. ఆ సమయంలో 2024 టి20 వరల్డ్ కప్ కోసం జట్టు ఎంపిక జరగాల్సి ఉంది. తన అవకాశాలపై స్పందిస్తూ... ‘నేను అసలు ఇప్పుడు వరల్డ్ కప్ గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు. దేనినీ సీరియస్గా తీసుకోకుండా ప్రశాంతంగా ఉన్నాను. ఒక్కసారి ఆట నుంచి విరామం తీసుకుంటే జనం మన గురించి చాలా తప్పుడు మాటలు మాట్లాడతారు. అయితే ప్రతీది ఆటగాళ్ల చేతుల్లో ఉండదనే విషయం వారికి అర్థం కాదు’... అని అతను వ్యాఖ్యానించాడు. అప్పటికి రెండు నెలల క్రితమే బీసీసీఐ కూడా తమ కాంట్రాక్ట్ జాబితా నుంచి కిషన్ పేరును తొలగించింది. గత కొంత కాలంగా జరిగిన పరిణామాలతో ఆవేదన చెందిన అతను తన అసంతృప్తిని ఈ రకంగా వ్యక్తపర్చినట్లుంది. అయితే ఇంతటి తీవ్ర నిరాశ మధ్య అతను ఆగిపోలేదు. తనకు తెలిసిన బ్యాటింగ్తోనే తనను తాను నిరూపించుకోవాలని భావించిన ఇషాన్ దేశవాళీ క్రికెట్పై దృష్టి పెట్టాడు. గతి తప్పినట్లు కనిపించిన కెరీర్ను సరైన దిశలో మార్చుకున్నాడు. ఇషాన్ కిషన్ కెరీర్ ఆరంభం నుంచి సంచలనాలతో సాగింది. భారీ హిట్టింగ్ సామర్థ్యం ఉన్న ఎడంచేతి వాటం వికెట్ కీపర్, అదీ ఓపెనర్గా ఉండటం అంటే అరుదైన కాంబినేషన్గా చెప్పవచ్చు. అలాంటి అరుదైన ప్రతిభతోనే ఈ జార్ఖండ్ కుర్రాడు మొదటి నుంచి అందరి దృష్టిలో పడ్డాడు. 16 ఏళ్లకే రంజీ ట్రోఫీ బరిలోకి దిగిన అతను అండర్–19 వరల్డ్ కప్లో పంత్, సర్ఫరాజ్, సుందర్ సభ్యులుగా ఉన్న జట్టుకు కెపె్టన్గా వ్యవహరించాడు. భారత జట్టు తరఫున ప్రదర్శనకంటే ఐపీఎల్ ద్వారా ముందుగా గుర్తింపు తెచ్చుకున్న ఆటగాళ్లలో ఒకడైన ఇషాన్ కిషన్ ముంబై తరఫున కీలక విజయాలలో భాగమై ఏడు సీజన్ల పాటు ఆడాడు. 23 ఏళ్ల వయసులో టీమిండియా తరఫున అరంగేట్రం చేసి మూడు ఫార్మాట్లలోనూ ఆడే అవకాశం దక్కించుకున్నాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన అరుదైన ఆటగాళ్ల జాబితాలో ఇషాన్ కిషన్ పేరు కూడా చేరింది. క్రమశిక్షణ తప్పి... 2023 దక్షిణాఫ్రికా పర్యటన సమయంలో ఇషాన్ కిషన్ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ‘మానసిక సమస్యల’ కారణంగా సిరీస్ మధ్యలోనే తప్పుకున్న అతను కొంత కాలం పాటు ఆటకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అయితే క్రమశిక్షణ తప్పడంతో టీమ్ మేనేజ్మెంటే అతడిని తప్పించినట్లు వార్తలు వచ్చాయి. స్వదేశంలో ఫిట్గా మారిన తర్వాత కూడా దేశవాళీ క్రికెట్ను పట్టించుకోకుండా ప్రయివేట్ టోర్నీ డీవై పాటిల్లో ఆడటం కూడా బోర్డుకు ఆగ్రహం కలిగించింది. దాంతో 2024 ఫిబ్రవరిలో అతడి కాంట్రాక్ట్ రద్దయింది. అప్పటి నుంచి కిషన్ను ఎవరూ సీరియస్గా తీసుకోలేదు. పంత్ కోలుకొని రావడం, ధ్రువ్ జురేల్ టెస్టుల్లో నిరూపించుకోవడంతో పాటు వన్డేల్లో కేఎల్ రాహుల్ కీపింగ్ చేయడం, టి20ల్లో సంజూ సామ్సన్, జితేశ్ శర్మ అందుబాటులో ఉండటంతో ఇప్పట్లో కిషన్ తిరిగి వచ్చే అవకాశాలు కనిపించలేదు. కానీ 27 ఏళ్ల ఈ జార్ఖండ్ కుర్రాడు పోరాడేందుకు సిద్ధమయ్యాడు. దేశవాళీలో చెలరేగి... ముందుగా 2024–25 సీజన్ దేశవాళీ క్రికెట్లో బరిలోకి దిగడం తప్పనిసరి అనే విషయాన్ని కిషన్ గుర్తించాడు. గత ఏడాది ఐపీఎల్ ముగిసిన తర్వాత జార్ఖండ్ తరఫున రంజీ ట్రోఫీలో బరిలోకి దిగాడు. ఆ తర్వాత ఎక్కడ అవకాశం లభించినా దానిని వదులుకోకుండా ప్రతీ మ్యాచ్లో బరిలోకి దిగేందుకు ప్రయతి్నంచాడు. దులీప్ ట్రోఫీ, చాలెంజర్ టోరీ్నలలో కూడా సత్తా చాటాడు. ఐపీఎల్ 2025 సీజన్లో సన్రైజర్స్ తరఫున తొలి మ్యాచ్లోనే సెంచరీతో అదరగొట్టి తనేంటో చూపించాడు. అక్కడితో ఆగిపోకుండా అసలు లక్ష్యం ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం సిద్ధమయ్యాడు. అంచనాలకు అనుగుణంగా చెలరేగుతూ ఏకంగా 197 స్ట్రయిక్ రేట్తో 517 పరుగులు సాధించడమే కాదు... కెపె్టన్గా జార్ఖండ్ను తొలిసారి విజేతగా నిలిపాడు. ‘గీతాపఠనం’ ద్వారా మానసికంగా మరింత దృఢంగా మారి పరిణతి చెందిన ఆటగాడిగా తనను తాను మలచుకున్నాడు. 2025 ఏప్రిల్లో ప్రకటించిన బీసీసీఐ కొత్త కాంట్రాక్ట్లో మళ్లీ చోటు లభించింది. ఇప్పుడు అనూహ్యంగా భారత జట్టులో తిరిగి అవకాశం దక్కడం అతని అరంగేట్రంకంటే గొప్ప ఘనత అనడంలో సందేహం లేదు. -
ఢిల్లీ క్యాపిటల్స్కు కొత్త కెప్టెన్లు..?
ఐపీఎల్, డబ్ల్యూపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ కెప్టెన్లను మార్చనుందని సోషల్మీడియా కోడై కూస్తుంది. ఐపీఎల్లో అక్షర్ పటేల్ స్థానంలో కేఎల్ రాహుల్.. డబ్ల్యూపీఎల్లో మెగ్ లాన్నింగ్ స్థానంలో జెమీమా రోడ్రిగ్స్ డీసీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నారని సమాచారం. 2026 సీజన్ ప్రారంభం నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నట్లు తెలుస్తుంది. కెప్టెన్ల మార్పు విషయాన్ని డీసీ యాజమాన్యం అధికారికంగా ప్రకటించనప్పటికీ.. ఐపీఎల్ వర్గాల్లో సైతం జోరుగా ప్రచారం జరుగుతుంది.గత ఐపీఎల్ సీజన్లో డీసీ అక్షర్ పటేల్ నేతృత్వంలో ఆశించిన స్థాయి ప్రదర్శనలు చేయలేకపోయింది. వాస్తవానికి గత సీజన్లోనే కేఎల్ రాహుల్ను కెప్టెన్గా ఎంపిక చేసినప్పటికీ.. అతను సుముఖత వ్యక్తం చేయలేదని ప్రచారం జరిగింది. ఈసారి ఎలాగైనా కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవాలని మేనేజ్మెంట్ రాహుల్పై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అక్షర్ పటేల్ నేతృత్వంలో డీసీ గత సీజన్లో 14 మ్యాచ్ల్లో సగం గెలిచినా ప్లే ఆఫ్స్ అవకాశాలను తృటిలో (ఐదో స్థానం) కోల్పోయింది. రానున్న సీజన్లో ఎలాగైనా ప్లే ఆఫ్స్కు చేరాలనే ఉద్దేశంలో భాగంగా కెప్టెన్ మార్పు జరిగినట్లు సమాచారం.డబ్ల్యూపీఎల్ విషయానికొస్తే.. గత సీజన్లో డీసీ అద్బుతమైన ప్రదర్శనలు కనబర్చి ఫైనల్కు చేరినా, తుది పోరులో ముంబై ఇండియన్స్ చేతిలో స్వల్ప తేడాతో ఓడి, మరోసారి రన్నరప్తో సరిపెట్టుకుంది. డబ్ల్యూపీఎల్లో కెప్టెన్ మార్పు అవసరం లేకపోయినా.. స్వదేశీ ప్లేయర్ కెప్టెన్గా ఉండాలనే ఉద్దేశంతో డీసీ మేనేజ్మెంట్ జెమీమా రోడ్రిగ్స్కు కెప్టెన్సీ అప్పజెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుత కెప్టెన్ మెగ్ లాన్నింగ్ను తప్పిస్తారని సమాచారం. జెమీమా ఎంపికకు ఆమె ప్రపంచకప్ ప్రదర్శనలను కూడా కొలమానంగా తీసుకున్నట్లు తెలుస్తుంది. జెమీమా తాజాగా ముగిసిన వన్డే ప్రపంచకప్లో అద్భుతమైన ప్రదర్శనలు చేసి టీమిండియా టైటిల్ గెలవడంలో ప్రధానపాత్ర పోషించింది. ముఖ్యంగా ఆసీస్తో జరిగిన సెమీస్లో జెమీమా చేసిన సూపర్ సెంచరీ చరిత్రలో నిలిచిపోయేదిగా ఉంది. -
రిటైర్మెంట్ ప్రకటించిన ఐపీఎల్ క్రికెటర్
ఐపీఎల్ క్రికెటర్, కర్ణాటక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ కృష్ణప్ప గౌతమ్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు ఇవాళ (డిసెంబర్ 22) రిటైర్మెంట్ ప్రకటించాడు. రైట్ హ్యాండ్ ఆఫ్ స్పిన్నర్ కమ్ బ్యాటర్ అయిన 37 ఏళ్ల గౌతమ్ 2021లో టీమిండియా తరఫున ఒకే ఒక వన్డే ఆడాడు. అప్పటి నుంచి మరో అవకాశం రాని గౌతమ్.. దేశవాలీ క్రికెట్కు, ఐపీఎల్కు మాత్రమే పరిమితమయ్యాడు.గౌతమ్కు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. కర్ణాటక తరఫున అతను 32 మ్యాచ్లు ఆడి 116 వికెట్లు తీశాడు. అలాగే ఓ సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు కూడా సాధించాడు. లిస్ట్-ఏ క్రికెట్లోనూ గౌతమ్ ఓ మోస్తరు రికార్డు కలిగి ఉన్నాడు. 32 మ్యాచ్ల్లో 51 వికెట్లు తీసి, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 400 పరుగులు చేశాడు. పొట్టి ఫార్మాట్లో 49 మ్యాచ్లు ఆడిన గౌతమ్ 32 వికెట్లు తీయడంతో పాటు 2 హాఫ్ సెంచరీల సాయంతో 454 పరుగులు సాధించాడు.గౌతమ్కు ఐపీఎల్లో అత్యంత ఖరీదైన అవకాశం దక్కింది. 2017లో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేసిన గౌతమ్ను 2021 సీజన్లో సీఎస్కే ఏకంగా రూ. 9.25 కోట్ల ధర వెచ్చించి సొంతం చేసుకుంది. అప్పట్లో ఓ అన్ క్యాప్డ్ ప్లేయర్కు దక్కిన అతి భారీ మొత్తం ఇదే. ఐపీఎల్ కెరీర్లో ముంబై ఇండియన్స్, సీఎస్కేతో పాటు రాజస్థాన్ రాయల్స్ (2018), లక్నో సూపర్ జెయింట్స్కు (2022-24) ఆడిన గౌతమ్.. మొత్తంగా 36 మ్యాచ్లు ఆడి 21 వికెట్లు తీశాడు. -
ఈ ఏడాది క్రికెట్లో బద్దలైన భారీ ప్రపంచ రికార్డులు ఇవే..!
అంతర్జాతీయ క్రికెట్లో 2025 సంవత్సరం చరిత్రాత్మకంగా నిలిచిపోయింది. ఈ ఏడాది చాలా ప్రపంచ రికార్డులు చేతులు మారాయి. దిగ్గజాలు తమ వారసత్వాన్ని మరింత బలపరుచుకోగా, కొత్త తరం ఆటగాళ్లు సరికొత్త రికార్డులు నెలకొల్పారు. పురుషుల క్రికెట్లో విరాట్ కోహ్లి, జో రూట్.. మహిళల క్రికెట్లో స్మృతి మంధన లాంటి వారు వేర్వేరు విభాగాల్లో ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టారు. జట్ల పరంగా పురుషుల క్రికెట్లో ఇంగ్లండ్ జట్టు.. మహిళల క్రికెట్లో టీమిండియా సరికొత్త వరల్డ్ రికార్డ్స్ నెలకొల్పాయి. తిలక్ వర్మ 318 నాటౌట్ఈ ఏడాది టీమిండియా ఆటగాడే ప్రపంచ రికార్డుల బోణీ కొట్టాడు. జనవరిలో భారత యువ బ్యాటర్ తిలక్ వర్మ అంతర్జాతీయ టీ20ల్లో ఔట్ కాకుండా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తిలక్ టీ20ల్లో ఔట్ కాకుండా 318 పరుగులు (19*, 120*, 107*, 72*) చేసి విరాట్ కోహ్లి పేరిట ఉండిన రికార్డును తన పేరిట బదిలీ చేసుకున్నాడు. విరాట్ కోహ్లి @ ఫాస్టెస్ట్ 14000 రన్స్ఈ ఏడాది ఫిబ్రవరిలో (ఛాంపియన్స్ ట్రోఫీ) విరాట్ కోహ్లి ఓ భారీ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. పురుషుల వన్డేల్లో అత్యంత వేగంగా 14000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. సచిన్ ఈ మైలురాయిని 350 ఇన్నింగ్స్ల్లో చేరుకుంటే, కోహ్లి కేవలం 287 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనత సాధించాడు.సింగిల్ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలుఇదే ఏడాది విరాట్ మరో భారీ ప్రపంచ రికార్డును కూడా సాధించాడు. ఓ సింగిల్ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. సచిన్ టెస్ట్ల్లో 51 సెంచరీలు చేయగా.. విరాట్ ఖాతాలో ప్రస్తుతం 53 వన్డే శతకాలు ఉన్నాయి. అరంగేట్రం మ్యాచ్లో అత్యధిక స్కోర్సౌతాఫ్రికా ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్కే తన తొలి అంతర్జాతీయ మ్యాచ్లోనే ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వన్డే అరంగేట్రంలో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా డెస్మండ్ హేన్స్ రికార్డును బద్దలు కొట్టాడు. హేన్స్ 1978లో తన వన్డే అరంగేట్రంలో 148 పరుగులు చేయగా.. బ్రీట్జ్కే 150 పరుగులు చేసి సరికొత్త ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.రోహిత్ శర్మ.. క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడుఈ ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాను ఫైనల్స్కు చేర్చడంతో రోహిత్ శర్మ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. నాలుగు మేజర్ ఐసీసీ టోర్నీల్లో ఓ జట్టును ఫైనల్స్కు చేర్చిన తొలి కెప్టెన్గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. రోహిత్ టీమిండియాను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, వన్డే, టీ20 వరల్డ్కప్, ఛాంపియన్స్ ట్రోఫీల ఫైనల్స్కు చేర్చాడు. వీటిలో డబ్ల్యూటీసీ మినహా అన్ని టైటిళ్లు కైవసం చేసుకున్నాడు.అనామక బ్యాటర్ ఖాతాలో ప్రపంచ రికార్డుఆస్ట్రియాకు చెందిన అనామక బ్యాటర్ కరణ్బీర్ సింగ్ ఖాతాలో ఓ భారీ ప్రపంచ రికార్డు చేరింది. అంతర్జాతీయ టీ20ల్లో ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు (1488) చేసిన బ్యాటర్గా కరణ్బీర్ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.ఓ ఓవర్లో ఏకంగా 39 పరుగులుసమోవా జట్టు ఓ అంతర్జాతీయ టీ20 మ్యాచ్లో ఓ ఓవర్లో అత్యధిక పరుగులు (39) సాధించిన జట్టుగా ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. సమోవాకు చెందిన డారియస్ విస్సర్ ఓ ఓవర్లో 6 సిక్సర్లు కొట్టి 36 పరుగులు పిండుకోగా.. 3 పరుగులు నో బాల్స్ రూపంలో వచ్చాయి.రూట్ @ 213టెస్ట్ క్రికెట్లో బ్యాటింగ్కు సంబంధించి వరుసగా రికార్డును బద్దలు కొడుతున్న ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్.. ఈ ఏడాది ఫీల్డింగ్లో ఓ భారీ రికార్డును బద్దలు కొట్టాడు. రూట్ టెస్ట్ అత్యధిక క్యాచ్లు పట్టిన ఫీల్డర్గా (213) రాహుల్ ద్రవిడ్ (210) రికార్డును బ్రేక్ చేశాడు. చరిత్ర సృష్టించిన స్టార్క్ఆసీస్ స్పీడ్ గన్ మిచెల్ స్టార్క్ టెస్ట్ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డు సాధించే క్రమంలో స్టార్క్ (420) పాకిస్తాన్ దిగ్గజం వసీం అక్రమ్ (414) పేరిట ఉండిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.వన్డేల్లో అతి భారీ విజయంఇంగ్లండ్ పురుషుల క్రికెట్ జట్టు వన్డేల్లో అతి భారీ విజయాన్ని నమోదు చేసిన జట్టుగా ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్లో ఈ జట్టు సౌతాఫ్రికాపై 342 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. వన్డే క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇదే భారీ విజయం. గతంలో ఈ రికార్డు టీమిండియా పేరిట ఉండేది. 2023 జనవరిలో భారత్ శ్రీలంకపై 317 పరుగుల తేడాతో గెలుపొందింది.మంధన ఖాతాలో భారీ రికార్డుభారత మహిళా జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధన ఖాతాలో ఓ భారీ ప్రపంచ రికార్డు చేరింది. మహిళల వన్డేల్లో అత్యంత వేగంగా 5000 పరుగులు పూర్తి చేసిన ప్లేయర్గా వెస్టిండీస్ ప్లేయర్ స్టెఫానీ టేలర్ రికార్డును బద్దలు కొట్టింది. టేలర్ 5000 పరుగులు పూర్తి చేసేందుకు 129 ఇన్నింగ్స్లు తీసుకోగా.. మంధన కేవలం 112 ఇన్నింగ్స్ల్లోనే ఈ మైలురాయిని తాకింది.టీమిండియా సరికొత్త ప్రపంచ రికార్డుమహిళల వన్డే క్రికెట్లో టీమిండియా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ ఫార్మాట్ చరిత్రలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా ఆసీస్ పేరిట ఉండిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఈ ఏడాది జరిగిన ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ ఆసీస్పై ఈ భారీ రికార్డు సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 339 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మరో 9 బంతులు మిగిలుండగానే ఛేదించి, సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్లో గెలిచి ఫైనల్కు చేరిన భారత్.. ఫైనల్లో సౌతాఫ్రికాను చిత్తు చేసి తొలిసారి ప్రపంచకప్ను కైవసం చేసుకుంది. -
చీలిన దిగ్గజ ఆటగాడి కుటుంబం?.. కోడలి రాకతో..
డేవిడ్ బెక్హామ్.. ఈ పేరకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇంగ్లండ్ ఫుట్బాల్ దిగ్గజాల్లో ఒకడైన ఈ మాజీ సారథికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. మాంచెస్టర్ యునైటెడ్, రియల్ మాడ్రిడ్, పారిస్ సెయింట్- జెర్మేన్.. ఇలాంటి ప్రతిష్టాత్మక జట్టకు ప్రాతినిథ్యం వహించిన డేవిడ్.. మూడు ప్రపంచకప్ టోర్నీల్లోనూ భాగమయ్యాడు.పాతికేళ్ల కాపురంఇక వ్యక్తిగత జీవితంలోనూ డేవిడ్ బెక్హామ్ సక్సెస్ఫుల్ ఫ్యామిలీమేన్గా కొనసాగుతున్నాడు. మాజీ పాప్ స్టార్ విక్టోరియా ఆడమ్స్తో ప్రేమలో పడ్డ డేవిడ్ బెక్హామ్.. 1999లో ఆమెను పెళ్లాడాడు. ఐర్లాండ్లోని డబ్లిన్లో గల లట్రెల్స్టౌన్లో అత్యంత వైభవోపేతంగా వీరి వివాహం జరిగింది.ఇప్పటికి పాతికేళ్లకు పైగా వైవాహిక బంధంలో కొనసాగుతూ ఆదర్శంగా నిలుస్తున్న డేవిడ్- విక్టోరియా జంటకు.. నలుగురు సంతానం. ముగ్గురు కుమారులు బ్రూక్లిన్ బెక్హామ్, రోమియో బెక్హామ్, క్రూజ్ బెక్హామ్.. కుమార్తె హార్పర్ సెవెన్ బెక్హామ్. 26 ఏళ్ల బ్రూక్లిన్ ఫొటోగ్రాఫర్, మోడల్, చెఫ్.ఇక 2002లో జన్మించిన రోమియో ఫుట్బాలర్గా అదృష్టం పరీక్షించుకుంటుండగా.. ఇరవై ఏళ్ల క్రూజ్ తల్లి మాదిరి సంగీత రంగంలో ఉన్నాడు. పద్నాలుగేళ్ల హార్పర్ పాఠశాల విద్య ఇంకా పూర్తి కాలేదు. కాగా పెళ్లైన తర్వాత విక్టోరియా వ్యాపారవేత్తగా, ఫ్యాషన్ డిజైనర్గా కెరీర్ కొనసాగిస్తోంది.పెద్ద కుమారుడి వివాహం.. కోడలి రాకతోఅమెరికా బిలియనీర్ కుమార్తె, నటి నికోలా పెల్ట్జ్ను 2022లో పెళ్లి చేసుకున్నాడు బ్రూక్లిన్. అప్పటి నుంచే తల్లిదండ్రులతో అతడికి విభేదాలు తలెత్తినట్లు సమాచారం.పెళ్లిలో వేసుకునేందుకు విక్టోరియా.. కోడలు నికోలా కోసం గౌన్ డిజైన్ చేయగా.. ఆమె దానిని ధరించేందుకు నిరాకరించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ విషయం గురించి నికోలా స్పందిస్తూ.. విక్టోరియా డిజైన్ చేసిన డ్రెస్ తనకు సరిపడలేదని అందుకే వేరే గౌను వేసుకోవాల్సి వచ్చిందని స్పష్టతనిచ్చింది.అన్ఫాలో చేశాడు అయినప్పటికీ అత్తా-కోడలి మధ్య గొడవ అన్న వదంతికి చెక్పడలేదు. చినికి చినికి గాలివానలా మారిన ఈ వివాదం బ్రూక్లిన్ తన తల్లిదండ్రులతో విడిపోయేదాకా చేరిందనే రూమర్లు వినిపిస్తున్నాయి. తాజాగా.. తన తల్లిదండ్రులను బ్రూక్లిన్ సోషల్ మీడియాలో అన్ఫాలో చేశాడన్న వార్తలు ఇందుకు కారణం.తండ్రి పుట్టినరోజున రాలేదు.. మామకు విషెస్అంతేకాదు గత కొంతకాలంగా బ్రూక్లిన్.. డేవిడ్- విక్టోరియాలతో పాటు తన తమ్ముళ్లు, చెల్లెలికి కూడా దూరంగా ఉంటున్నాడు. ముఖ్యంగా కుటుంబమంతా కలిసి చేసుకునే వేడుకలక అతడు గైర్హాజరు అవుతున్నాడు. డేవిడ్ బెక్హామ్ ఇటీవలే 50వ పుట్టినరోజు జరుపుకోగా.. బ్రూక్లిన్- నికోలాలకు ఆహ్వానం ఇచ్చినా వారు రాలేదు.అంతేకాదు.. ఇటీవల న్యూయార్క్లో బ్రూక్లిన్- నికోలా మరోసారి పెళ్లినాటి ప్రమాణాలు చేయగా.. ఈ వేడుకలో బెక్హామ్ ఫ్యామిలీ కనిపించనే లేదు. ఇక క్రీడారంగంలో సేవలు అందించినందుకు గానూ.. కింగ్ చార్లెస్ III ఈ ఏడాది నవంబరులో డేవిడ్ బెక్హామ్కు ‘సర్’ బిరుదును ప్రదానం చేశారు. ఈ నైట్హుడ్ సెర్మనీకి కూడా బ్రూక్లిన్ రాలేదు.ఈ ఏడాది క్రిస్మస్ సెలవులను కూడా బ్రూక్లిన్.. నికోలా కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. తన పుట్టినరోజు(మే 2)న బ్రూక్లిన్ను మిస్ అయినట్లు తండ్రి డేవిడ్ పోస్ట్ పెట్టాడు. అయితే, ఫాదర్స్ డే సందర్భంగా బ్రూక్లిన్ తన తండ్రికి కనీసం విషెస్ కూడా చెప్పలేదు. అయితే, తన మామగారి (భార్య) తండ్రి ఫొటో పంచుకుంటూ హ్యాపీ ఫాదర్స్ డే అంటూ అతడి పట్ల అభిమానం చాటుకున్నాడు. భార్యనే సర్వస్వంఅదే విధంగా.. తన భార్యనే తనకు సర్వస్వం అని.. ప్రపంచంలో ఆమె కంటే తనకు ఎక్కువ ఎవరూ కాదంటూ పోస్ట్ పెట్టాడు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా బ్రూక్లిన్ తల్లిదండ్రులను అన్ఫాలో చేయడం గమనార్హం. ఏదేమైనా కోడలి గౌన్ గొడవతో మొదలైన వివాదం.. బెక్హామ్ కుటుంబం నుంచి పెద్ద కొడుకు విడిపోయేదాకా చేరినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా డేవిడ్- విక్టోరియా- కోడలు నికోలా మధ్య సత్సంబంధాలు లేకపోవడమే ఇందుకు కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి.ఏదేమైనా దిగ్గజ ఆటగాడి కుటుంబం ఇలా చీలిపోతుండటం పట్ల అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కాగా డేవిడ్- విక్టోరియా బెక్హామ్ల నికర ఆస్తుల విలువ రూ. 8 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా.చదవండి: వాషీ, ఇషాన్ కిషన్ దండగ!.. ప్రపంచకప్ జట్టులో అవసరమా? -
యంగ్ ఇండియాకు ఏమైంది.. తుది సమరాల్లో ఏమిటీ తడబాటు..?
నిన్న (డిసెంబర్ 21) జరిగిన అండర్-19 ఆసియా కప్ 2025 ఫైనల్లో యంగ్ ఇండియా పాకిస్తాన్ చేతిలో 191 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలై, భారత క్రికెట్ అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించింది. ఈ టోర్నీ ఫైనల్ వరకు అజేయ జట్టుగా నిలిచిన భారత్.. తుది మెట్టుపై బోల్తా పడటాన్ని, అందులోనూ పాక్ చేతిలో ఓడిపోవడాన్ని సగటు భారతీయుడు జీర్ణించుకోలేకపోతున్నాడు.అంతవరకు తిరుగులేని శక్తిగా కనిపించిన భారత్.. అమీతుమీ పోరులో ఎందుకలా చతికిలబడిందని అంతా లెక్కలేసుకుంటున్నారు. కారణాలు ఏంటని విశ్లేషిస్తే.. ఒత్తిడే ప్రధాన కారణంగా తెలుస్తుంది. అయినా యువ భారత జట్టుకు ఆసియా కప్ ఫైనల్లో ఒత్తిడికి చిత్తవడం ఇది కొత్తేమీ కాదు. గత ఎడిషన్ ఫైనల్లోనూ బంగ్లాదేశ్ చేతిలో ఇలానే చిత్తైంది.స్టార్ ప్లేయర్లకు ఏమాత్రం తీసిపోని టాలెంట్ ఉన్న ఆటగాళ్లు ఉన్నా.. ఎందుకో యంగ్ ఇండియాకు ఫైనల్ ఫోబియా పట్టుకుంది. ఒత్తిడి మినహా కారణాలేమీ కనబడటం లేదు. ఎందుకంత ఒత్తిడా అన్ని పరిశీలిస్తే.. తాజా ఉదంతంలో (2025 ఎడిషన్ ఫైనల్లో) భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకొని భారీ స్కోర్ సమర్పించుకోవడం కారణంగా తెలుస్తుంది.అలాగని బౌలింగ్ విభాగం బాగా లేదా అని చూస్తే అదీ లేదు. హెనిల్ పటేల్, దీపేశ్ దేవేంద్రన్ లాంటి సీనియర్ స్థాయి మీడియం పేసర్లు.. కనిష్క్ చౌహాన్, ఖిలన్ పటేల్ లాంటి నాణ్యమైన స్పిన్నర్లు జట్టులో ఉన్నారు. పిచ్ నుంచి సరైన సహకారం లభించకపోవడం భారత్ భారీ స్కోర్ సమర్పించుకోవడానికి కారణమని తెలుస్తుంది. భారత కెప్టెన్ ఆయుశ్ మాత్రే టాస్ గెలిచినా పిచ్ను అంచనా వేయడంలో విఫలమయ్యాడని టాక్ వినిపిస్తుంది. ఇదే భారత్ కొంపముంచిదని అనిపిస్తుంది. పిచ్ నుంచి సహకారం లభించకపోయినా భారత బౌలర్లు చివరి ఓవర్లలో పుంజుకున్నారు. ఓ దశలో పాక్ 400 స్కోర్ దాటేలా కనిపించినా 347 పరుగులకే పరిమితం చేయగలిగారు.భారీ లక్ష్య ఛేదనను సైతం భారత్ ఆత్యవిశ్వాసంతోనే ప్రారంభించింది. తొలి బంతినే చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ సిక్సర్గా మలిచి పాక్ శిబిరంలో ఆందోళన రేకెత్తించాడు. ఇక్కడే పాక్ బౌలర్లు మైండ్ గేమ్ మొదలుపెట్టారు. భారత బ్యాటర్లను, ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీని బంతితో కట్టడి చేయలేమని తెలిసి నోటికి పని చెప్పారు. పదేపదే కెప్టెన్ ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీని మాటలతో, దురుసు ప్రవర్తనతో రెచ్చగొట్టారు. దీంతో ఏకాగ్రత కోల్పోయిన యంగ్ ఇండియా బ్యాటర్లు వరుస పెట్టి వికెట్లు పారేసుకొని పెవిలియన్కు క్యూ కట్టారు. భారత ఓటమి తొలి 10 ఓవర్లలోనే ఖరారైపోయింది. టాప్-5 ప్లేయర్లు 9.4 ఓవర్లలో 68 పరుగులకే ఔటైపోయారు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఏదో ఆడాలని ఆడటంతో భారత్ 150 పరుగుల మార్కునైనా దాటగలిగింది.మొత్తంగా చూస్తే.. నిన్నటి రోజున భారత్కు ఏదీ కలిసి రాలేదు. పిచ్ను అంచనా వేయడం నుంచి పాక్ ఆటగాళ్ల స్లెడ్జింగ్ వలలో పడటం, అలాగే ఒత్తిడి లోనవడం వంటివి జరిగిపోయాయి. ఈ టోర్నీలో అరివీర భయంకరమైన ఫామ్లో ఉండిన వైభవ్ సూర్యవంశీ, అభిగ్యాన్ కుందు అంతిమ పోరులో సత్తా చాటలేకపోవడం భారత ఓటమికి మరో కారణం. గ్రూప్ దశలో పాకిస్తాన్ను చిత్తు చేసిన యంగ్ ఇండియా అదే విశ్వాసాన్ని తుది సమరంలో కొనసాగించలేకపోవడం ఇంకో కారణం. అంతిమంగా భారత్ అన్ని విధాల అర్హమైన ఆసియా కప్ టైటిల్ను కోల్పోవాల్సి వచ్చింది. వరుసగా రెండు ఎడిషన్లలో ఫైనల్స్ వరకు వచ్చి ఓడిపోవడం భారత క్రికెట్ అభిమానులకు చాలా బాధ కలిగిస్తుంది. ఈ టోర్నీ చరిత్ర చూస్తే.. భారత్ అత్యంత విజయవంతమైన జట్టుగా ఉంది. ఇప్పటివరకు 12 ఎడిషన్లు జరగ్గా భారత్ 8 సార్లు ఛాంపియన్గా నిలిచింది. చివరిగా 2021 ఎడిషన్లో టైటిల్ సాధించింది. ఆ ఎడిషన్ ఫైనల్లో శ్రీలంకను చిత్తుగా ఓడించి ఆసియా ఛాంపియన్గా అవతరించింది. -
భారత క్రికెట్ అభిమానులకు ఈ ఏడాది 'చివరి కిక్'
మరో రెండు రోజుల్లో భారత క్రికెట్ అభిమానులకు ఈ ఏడాది చివరి కిక్ అందనుంది. దేశవాలీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో దాదాపుగా అందరూ టీమిండియా స్టార్లు పాల్గొంటున్నారు. ఏడాది చివర్లో భారత క్రికెట్ అభిమానులను అలరించేందుకు వీరంతా సిద్దంగా ఉన్నారు.టెస్ట్, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కూడా ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. రోహిత్ ముంబై జట్టులో, కోహ్లి ఢిల్లీ జట్టులో చోటు దక్కించుకున్నారు. వీరే కాక ప్రస్తుత టీమిండియా కెప్టెన్లు శుభ్మన్ గిల్ (పంజాబ్), సూర్యకుమార్ యాదవ్ (ముంబై) కూడా వారివారి జట్లకు ప్రాతినిథ్యం వహించనున్నారు.ముంబై జట్టుకు రోహిత్తో పాటు శార్దూల్ ఠాకూర్ (కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్ లాంటి టీమిండియా స్టార్లు ప్రాతినిథ్యం వహించనుండగా.. ఢిల్లీ జట్టులో కోహ్లితో పాటు రిషబ్ పంత్ (కెప్టెన్), హర్షిత్ రాణా, ఇషాంత్ శర్మ, నవ్దీప్ సైనీ లాంటి టీమిండియా ప్లేయర్లు, ప్రియాంశ్ ఆర్మ లాంటి ఐపీఎల్ స్టార్లు ఉన్నారు.ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, నితీశ్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్ లాంటి టీమిండియా యువ కెరటాలు వారివారి జట్లకు ప్రాతినిథ్యం వహించనున్నారు. వీరిలో ఇషాన్ కిషన్ జార్ఖండ్కు, రుతురాజ్ గైక్వాడ్ మహారాష్ట్రకు, నితీశ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ జట్టుకు సారధులుగా వ్యవహరించనున్నారు. శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్షదీప్ సింగ్ పంజాబ్ జట్టుకు ఆడనున్నారు.వీరే కాక సంజూ శాంసన్ (కేరళ), మహ్మద్ షమీ (బెంగాల్), కేఎల్ రాహుల్ (కర్ణాటక), తిలక్ వర్మ (హైదరాబాద్) లాంటి టీమిండియా స్టార్లు కూడా విజయ్ హజారే ట్రోఫీకి అందుబాటులో ఉండనున్నారు. అయితే జాతీయ విధుల దృష్ట్యా వీరు కొన్ని మ్యాచ్లకు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. జనవరి 11 నుంచి టీమిండియా న్యూజిలాండ్తో పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడనున్న నేపథ్యంలో ఈ సిరీస్లకు ఎంపికైన ఆటగాళ్లు మినహా మిగతా ఆటగాళ్లంతా తమతమ దేశవాలీ జట్లకు అందుబాటులో ఉంటారు.టీమిండియాలోని ప్రతి ఒక్క క్రికెటర్ విజయ్ హజారే ట్రోఫీకి అందుబాటులో ఉండాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదేశించిన విషయం తెలిసిందే. కుదిరితే అన్ని మ్యాచ్లు.. లేకపోతే కనీసం రెండు మ్యాచ్లైనా ఆడాలని అల్టిమేటం జారీ చేసింది. ఒకవేళ ఎవరైనా ఆటగాడు గాయంతో బాధపడుతూ ఆడలేని స్థితిలో ఉంటే.. వారు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి అన్ఫిట్ అన్న సర్టిఫికెట్ పొందితేనే మినహాయింపు ఇస్తామని పేర్కొంది. -
Ashes: ‘ఆసీస్’ చెత్త జట్టు.. ఇప్పటికీ అదే మాట అంటాను!
ఇంగ్లండ్కు మరోసారి ఘోర పరాభవం ఎదురైంది. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ను వరుసగా రెండోసారి ఆస్ట్రేలియాకు కోల్పోయింది. సొంతగడ్డపై ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన కంగారూలు... మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే సిరీస్ను చేజిక్కించుకున్నారు. దీంతో ఇంగ్లండ్ బిక్కముఖం వేయాల్సి వచ్చింది.సంపూర్ణ ఆధిపత్యంఐదు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి రెండు మ్యాచ్లలో ఇంగ్లండ్పై సంపూర్ణ ఆధిపత్యంతో గెలిచిన ఆసీస్.. మూడో టెస్టులోనూ దుమ్ములేపింది. అడిలైడ్ వేదికగా ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్లో ఆసీస్ 82 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను చిత్తుచేసింది. ఆసీస్ విధించిన 435 పరుగుల విజయలక్ష్యంతో ఓవర్నైట్ స్కోరు 207/6తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్... చివరకు 102.5 ఓవర్లలో 352 పరుగుల వద్ద ఆలౌటైంది.ఇక 2011 నుంచి సొంతగడ్డపై ‘యాషెస్’ సిరీస్ కోల్పోని కంగారూలు... ఈసారి కూడా పూర్తి ఆధిపత్యం కనబర్చగా... అప్పటి నుంచి కనీసం ఒక్క మ్యాచ్లో అయినా విజయం సాధించాలనుకుంటున్న ఇంగ్లండ్ జట్టుకు మరోసారి నిరాశ తప్పలేదు. చెలరేగిన బౌలర్లుఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ (83 బంతుల్లో 60; 7 ఫోర్లు, 2 సిక్స్లు) కాస్త పోరాడగా... అతడికి విల్ జాక్స్ (137 బంతుల్లో 47; 3 ఫోర్లు), బ్రైడన్ కార్స్(64 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) సహకరించారు.జేమీ స్మిత్తో కలిసి ఏడో వికెట్కు 91 పరుగులు జోడించిన జాక్స్... ఎనిమిదో వికెట్కు కార్స్తో 52 పరుగులు జతచేశాడు. దీంతో ఒకదశలో ఇంగ్లండ్కు ఆశలు చిగురించగా... స్టార్ పేసర్ స్టార్క్... స్మిత్, జాక్స్, ఆర్చర్ (3)లను ఆవుట్ చేసి ఇంగ్లండ్కు పరాజయం ఖాయం చేశాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కమిన్స్, లయన్ తలా మూడు వికెట్లు పడగొట్టారు.అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 371 పరుగులు చేయగా... ఇంగ్లండ్ 286 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ 349 పరుగులు చేసి ప్రత్యర్థికి రికార్డు లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే, ఇంగ్లండ్ పని పూర్తి చేయలేక సిరీస్ ఓటమి రూపంలో మరోసారి చేదు అనుభవం ఎదుర్కొంది.అత్యంత చెత్త జట్టు ఇదిఈ నేపథ్యంలో ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్.. సిరీస్ విజేత ఆసీస్ జట్టును ఉద్దేశించి.. ‘చెత్త’ అంటూ చేసిన వ్యాఖ్యలను సమర్థించుకోవడం గమనార్హం. కాగా యాషెస్ సిరీస్కు ముందు బ్రాడ్ మాట్లాడుతూ.. ‘‘2010-11 తర్వాత యాషెస్ సిరీస్ ఆడుతున్న ఆస్ట్రేలియా అత్యంత చెత్త జట్టు ఇది. ఇదొక ఆప్షన్ కాదు. ఇదే నిజం’’ అని స్టువర్ట్ బ్రాడ్ పేర్కొన్నాడు.ఇప్పటికీ ఇదే మాట అంటానుఈ క్రమంలో మరోసారి సిరీస్ గెలుచుకున్న అనంతరం ఆస్ట్రేలియా ఆటగాళ్లు.. బ్రాడ్కు పరోక్షంగా కౌంటర్లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మరోసారి తన వ్యాఖ్యలపై స్పందించిన బ్రాడ్.. ‘‘నేను పశ్చాత్తాపపడుతున్నానా? అస్సలు కాదు.ఆస్ట్రేలియా అత్యంత చెత్తగా ఆడాల్సింది. ఇంగ్లండ్ అతి గొప్పగా ఆడాల్సింది. అయితే, ఆసీస్ మరీ అంత చెత్తగా ఆడలేదు. ఇంగ్లండ్ కూడా గొప్పగా ఏమీ ఆడలేదు’’ అని ‘ది లవ్ ఆఫ్ క్రికెట్’ పాడ్కాస్ట్లో పేర్కొన్నాడు. కాగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్తో పాటు మరో స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్ కూడా తొలి రెండు టెస్టులకు దూరమయ్యారు. అయితే, మిచెల్ స్టార్క్ అద్భుత రీతిలో చెలరేగి వారు లేని లోటు కనబడకుండా చేశాడు. ఇక మూడో టెస్టుతో కమిన్స్ తిరిగి రాగా.. హాజిల్వుడ్ మాత్రం గాయం వల్ల సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. చదవండి: వాషీ, ఇషాన్ కిషన్ దండగ!.. ప్రపంచకప్ జట్టులో అవసరమా? -
ప్రపంచ బ్యాటర్లకు సరికొత్త ముప్పు
ప్రపంచ బ్యాటర్లకు సరికొత్త తలనొప్పి వచ్చి పడింది. అతడి పేరు జేకబ్ డఫీ. ఈ 31 ఏళ్ల కివీ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ప్రస్తుతం ప్రపంచ బ్యాటర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. డఫీ పేరు తలచుకుంటేనే అగ్రశ్రేణి బ్యాటర్లు సైతం బెంబేలెత్తిపోతున్నారు. డఫీ ప్రదర్శనలు ఆ స్థాయిలో ఉన్నాయి మరి.ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శనలు కనబర్చడంతో పాటు లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచిన డఫీ అంతర్జాతీయ క్రికెట్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారాడు. విమర్శకులు, విశ్లేషకులు, మాజీలు డఫీ ప్రదర్శనలు చూపి ఔరా అంటున్నారు. బ్యాటింగ్ ప్రపంచానికి సరికొత్త ముప్పు ముంచుకొచ్చిందని అభిప్రాయపడుతున్నారు.డఫీకి పేస్తో పాటు స్వింగ్ చేయగల సామర్థ్యం కూడా ఉన్నందున మంచినీళ్ల ప్రాయంగా వికెట్లు తీయగలుగుతున్నాడు. విండీస్తో తాజాగా ముగిసిన మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఇది నిరూపితమైంది. ఈ సిరీస్లో డఫీని ఎదుర్కొనేందుకు విండీస్ బ్యాటర్లు తెగ ఇబ్బంది పడ్డారు. డఫీ వరుసగా మూడు మ్యాచ్ల్లో ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేసి ఏకంగా 23 వికెట్లు పడగొట్టాడు. డఫీ విజృంభణతో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను న్యూజిలాండ్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది.విండీస్తో టెస్ట్ సిరీస్లో డఫీ ప్రదర్శనలు..తొలి టెస్ట్: 5-34 & 3-122రెండో టెస్ట్: 1-33 & 5-38మూడో టెస్ట్: 4-86 & 5-42టెస్ట్ల్లో విశ్వరూపం2020లో టీ20 అరంగేట్రం, 2022లో వన్డే అరంగేట్రం చేసిన డఫీ.. ఈ ఏడాదే టెస్ట్ అరంగేట్రం చేశాడు. టెస్ట్ల్లోకి వచ్చీ రాగానే డఫీ విశ్వరూపం ప్రదర్శించాడు. అప్పటిదాకా కొనసాగిన స్టార్క్, బుమ్రా, సిరాజ్, కమిన్స్ లాంటి ఫాస్ట్ బౌలర్ల హవాకు గండికొట్టాడు. డఫీ ప్రదర్శనల ముందు పై నలుగురు ప్రదర్శనలు చిన్నబోయాయి. స్టార్క్ కొద్దోగొప్పో పోటీ ఇవ్వగలిగాడు కానీ, మిగతా ముగ్గురు డఫీ ముందు తేలిపోయారు.లీడింగ్ వికెట్టేకర్టెస్ట్ల్లో పట్టపగ్గాల్లేకుండా దూసుకుపోయిన డఫీ.. ఈ ఏడాది పరిమిత ఓవర్ల ఫార్మాట్లలోనూ తన మార్కు చూపించాడు. టీ20ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగి, వన్డేల్లోనూ సత్తా చాటాడు. ఈ క్రమంలో ఈ ఏడాది లీడింగ్ వికెట్ టేకర్గా (మూడు ఫార్మాట్లలో) అవతరించాడు. డఫీ ఈ ఏడాది మొత్తం 81 వికెట్లు తీసి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. రెండో స్థానంలో ఉన్న జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీకి (65), న్యూజిలాండ్కే చెందిన మ్యాట్ హెన్రీకి (65) డఫీకి మధ్య 16 వికెట్ల తేడాతో ఉంది. ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన న్యూజిలాండ్ బౌలర్గానూ డఫీ రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఈ రికార్డు రిచర్డ్ హ్యాడ్లీ (1985లో 79 వికెట్లు) ఉండేది.ఫార్మాట్లవారీగా ఈ ఏడాది డఫీ ప్రదర్శనలు..టీ20లు- 35 వికెట్లుటెస్ట్లు- 25 వికెట్లువన్డేలు- 21 వికెట్లుఓ క్యాలెండర్ ఇయర్లో న్యూజిలాండ్ తరఫున అత్యుత్తమ ప్రదర్శనలు..జేకబ్ డఫీ (2025లో 81 వికెట్లు)రిచర్డ్ హ్యాడ్లీ (1985లో 79)డేనియల్ వెటోరి (2008లో 76)ట్రెంట్ బౌల్ట్ (2015లో 72)ఈ ఏడాది డఫీ ప్రదర్శనలకు చాలామంది మాజీల లాగే టీమిండియా మాజీ రవిచంద్రన్ అశ్విన్ కూడా ముగ్దుడయ్యాడు. ఆశ్విన్ తాజాగా ఓ ట్వీట్ చేస్తూ డఫీ ప్రదర్శనలను ఆకాశానికెత్తాడు. టెస్ట్ల్లో సూపర్ ఫామ్లో ఉన్న డఫీ, ప్రస్తుతం టీ20ల్లో నంబర్ వన్ బౌలర్గా కొనసాగుతున్నాడు. డఫీని ఇటీవల జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో ఆర్సీబీ రూ. 2 కోట్ల బేస్ ధరకు సొంతం చేసుకుంది. డఫీ ఇప్పటివరకు 4 టెస్ట్లు, 19 వన్డేలు, 38 టీ20లు ఆడి వరుసగా 25, 35, 53 వికెట్లు తీశాడు. -
వాళ్లిద్దరు దండగ!.. ప్రపంచకప్ జట్టులో అవసరమా?
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎంపిక చేసిన జట్టుపై మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. సెలక్టర్ల నిర్ణయంతో తాను ఏకీభవించడం లేదన్నాడు. వరల్డ్కప్ జట్టులో వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్లకు చోటు ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాడు.గిల్, జితేశ్లపై వేటుకాగా ఫిబ్రవరి 7 నుంచి భారత్- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్ టోర్నీ మొదలుకానున్న విషయం తెలిసిందే. ఇందుకోసం బీసీసీఐ శనివారం తమ జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కెప్టెన్సీలో ఆడే 15 మంది సభ్యులతో కూడిన ఈ టీమ్ నుంచి అనూహ్య రీతిలో వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill), వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ (Jitesh Sharma)లను తప్పించింది.వైస్ కెప్టెన్గా అక్షర్ పటేల్వీరిద్దరి స్థానంలో రింకూ సింగ్, ఇషాన్ కిషన్లను ఎంపిక చేసింది. లోయర్ ఆర్డర్లో రింకూను.. బ్యాకప్ ఓపెనర్, వికెట్ కీపర్గా ఇషాన్కు స్థానం ఇచ్చింది. రింకూ చాన్నాళ్లుగా టీ20 జట్టులో భాగం కాగా.. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సత్తా చాటి ఇషాన్ పునరాగమనం చేశాడు. అదే విధంగా.. వైస్ కెప్టెన్గా అక్షర్ పటేల్కు అవకాశం ఇచ్చింది బీసీసీఐ.వాళ్లిద్దరు దండగ!ఈ నేపథ్యంలో వసీం జాఫర్ స్పందిస్తూ.. ‘‘ఈ జట్టులో యశస్వి జైస్వాల్, జితేశ్ శర్మ ఎందుకు లేరు?.. ఇషాన్, వాషీ స్థానాల్లో నేనైతే వారినే ఎంపిక చేస్తా. అక్షర్ వైస్ కెప్టెన్ కాబట్టి అతడు కచ్చితంగా తుదిజట్టులో ఉంటాడు.కాబట్టి వరుణ్ చక్రవర్తి లేదంటే కుల్దీప్ యాదవ్ను కాదని మీరు వాషీని ఆడించలేరు కదా!.. ఇక జితేశ్ శర్మ.. జట్టు నుంచి తప్పించేంతంగా అతడు ఏమంత పెద్ద తప్పు చేశాడు? యశస్వి ఓపెనర్గా జట్టులో ఎందుకు ఉండకూడదో ఒక్క కారణమైనా చెప్పండి’’ అంటూ ఎక్స్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.మిశ్రమ స్పందనఇందుకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ‘‘ఇషాన్ ఇటీవల దేశీ టీ20 టోర్నీలో 500కు పైగా పరుగులు చేసి.. సూపర్ ఫామ్లో ఉన్నాడు. జార్ఖండ్కు కెప్టెన్గా తొలి టీ20 టైటిల్ అందించాడు. జైస్వాల్ చాన్నాళ్లుగా భారత టీ20 జట్టులో ప్రధాన సభ్యుడిగా లేడు. ఇక సంజూకు బ్యాకప్గా ఇషాన్ ఉంటాడు కాబట్టే జితేశ్ను తప్పించారు.శ్రీలంకలోని స్లో పిచ్లపై వాషీ వంటి ఆల్రౌండర్ అవసరం ఎక్కువగా ఉంటుంది. మీ అభిప్రాయంతో మేము ఏకీభవించడం లేదు’’ అంటూ చాలా మంది టీమిండియా అభిమానులు వసీం జాఫర్కు బదులిస్తున్నారు.టీ20 ప్రపంచకప్-2026కు భారత జట్టుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్).చదవండి: అద్భుతమైన ఆటగాడు.. అయినా ఎందుకు వేటు?.. ఇదే సరైన నిర్ణయం! -
కలిసి బరిలోకి దిగనున్న టీమిండియా యువ కెరటాలు
టీమిండియా యువ కెరటాలు శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్షదీప్ సింగ్ మరోసారి కలిసి బరిలోకి దిగనున్నారు. అయితే ఈసారి వారు ప్రాతినిథ్యం వహించనున్నది టీమిండియాకు కాదు. ఈ ముగ్గురు యువ తారలు విజయ్ హజారే వన్డే ట్రోఫీ (VHT) కోసం పంజాబ్ తరఫున బరిలోకి దిగనున్నారు.డిసెంబర్ 24 నుంచి ప్రారంభంకాబోయే విజయ్ హజారే ట్రోఫీ కోసం 18 మంది సభ్యుల పంజాబ్ జట్టును ఇవాళ (డిసెంబర్ 22) ప్రకటించారు. ఈ జట్టులో శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్షదీప్ సింగ్తో పాటు రమన్దీప్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, ప్రభ్సిమ్రన్ సింగ్, నమన్ ధిర్ లాంటి ఐపీఎల్ స్టార్లు కూడా చోటు దక్కించుకున్నారు.ఈ జట్టుకు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (PCA) కెప్టెన్ను ప్రకటించకపోవడం విశేషం. గత సీజన్లో అభిషేక్ శర్మ కెప్టెన్గా వ్యవహరించగా.. ఈ సీజన్లో టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ జట్టులో ఉండటంతో PCA ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. బహుశా చివరి నిమిషంలో కెప్టెన్ పేరును ప్రకటించే అవకాశం ఉంది.కాగా, VHTలో భాగంగా పంజాబ్ డిసెంబర్ 24నే తమ తొలి మ్యాచ్ ఆడనుంది. జైపూర్ వేదికగా జరిగే ఆ మ్యాచ్లో రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని మహారాష్ట్ర జట్టును ఢీకొట్టనుంది. భారత్-న్యూజిలాండ్ సిరీస్ కారణంగా గిల్, అభిషేక్ VHT మొత్తానికి అందుబాటులో ఉండరు. గిల్ వన్డే సిరీస్ సమయానికి.. అభిషేక్ టీ20 సిరీస్ సమయంలో పంజాబ్ జట్టుకు అందుబాటులో ఉండడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26 కోసం పంజాబ్ జట్టు.. శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్ష్దీప్ సింగ్, ప్రభ్సిమ్రన్ సింగ్ (వికెట్కీపర్), హర్నూర్ పన్ను, అన్మోల్ప్రీత్ సింగ్, ఉదయ్ సహరన్, నమన్ ధిర్, సలిల్ అరోరా (వికెట్కీపర్), సన్వీర్ సింగ్, రమన్దీప్ సింగ్, జషన్ప్రీత్ సింగ్, గుర్నూర్ బ్రార్, హర్ప్రీత్ బ్రార్, రఘు శర్మ, కృష్ణ భగత్, గౌరవ్ చౌధరి, సుఖ్దీప్ బజ్వా. -
గెలుపు జోష్లో ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్..!
యాషెస్ సిరీస్ 2025-26ను సొంతం చేసుకుని గెలుపు జోష్లో ఉన్న ఆస్ట్రేలియాకు ఊహించని షాక్ తగిలింది. ఈ సిరీస్లో మిగిలిన రెండు మ్యాచ్లకు ఆ జట్టు స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ గాయం కారణంగా దూరం కానున్నట్లు తెలుస్తోంది. అడిలైడ్ వేదికగా మూడో టెస్టు ఐదో రోజు ఆటలో ఫీల్డింగ్ చేస్తుండగా లియోన్ తొడ కండరాలు పట్టేశాయి.దీంతో అతడు తీవ్ర ఇబ్బంది పడ్డాడు. వెంటనే ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు. అయితే మ్యాచ్ ముగిసిన లియోన్ క్రచెస్ (ఊత కర్రల) సహాయంతో నడుస్తూ కనిపించడం అందరిని షాక్కు గురిచేసింది. దీని బట్టి అతడి గాయం తీవ్రమైనదిగా పరిగణించవచ్చు. ఇప్పటికే జోష్ హాజిల్వుడ్, స్టీవ్ స్మిత్ వంటి స్టార్ ప్లేయర్లు గాయాల బారిన పడ్డారు. అయితే డిసెంబర్ 26 నుంచి మెల్బోర్న్ వేదికగా జరగనున్న బాక్సింగ్ డే టెస్టుకు స్మిత్ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. అతడు తిరిగి వస్తే జాక్ వెదరాల్డ్పై వేటు పడే అవకాశముంది.ఇక లియోన్ గాయంపై ఆసీస్ స్పీడ్ స్టార్ మిచెల్ స్టార్క్ స్పందించాడు. "నాథన్ లియోన్కి ఇలా జరగడం చాలా బాధాకరం. అడిలైడ్ టెస్టు విజయంలో అతడిది కీలక పాత్ర. కచ్చితంగా అతడికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. నాథన్ తిరిగి రిహాబిలిటేషన్ సెంటర్కు వెళ్లనున్నాడు.గతంలో కూడా అతడి పిక్క గాయం కారణంగా రిహాబిలిటేషన్లో ఉన్నాడు. కాబట్టి ఎలా కోలుకోవాలన్నదానిపై అతడికి అవగాహన ఉంది. మరికొన్నాళ్ల పాటు క్రికెట్ ఆస్ట్రేలియాకు తన సేవలను అతడు అందించాలనుకుంటున్నాడు. నాథర్ వేగంగా కోలుకుని తిరిగి మైదానంలో అడుగుపెట్టాలని ఆశిస్తున్నాను" అని స్టార్క్ పేర్కొన్నాడు. మూడో టెస్టులో లియోన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 5 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ ఓటమిని శాసించాడు. కాగా తొలి మూడు టెస్టులో విజయం సాధించిన ఆస్ట్రేలియా.. యాషెస్ సిరీస్ను 3-0 తేడాతో రిటైన్ చేసుకుంది.చదవండి: పాకిస్తాన్ ఓవరాక్షన్!.. అసలు కప్పు గెలిస్తే ఇంకేమైనా ఉందా? -
పాకిస్తాన్ ఓవరాక్షన్!.. దీనికే ఇంత చేశారంటే..
మొట్టమొదటిసారిగా 2012లో అండర్-19 ఆసియాకప్ టైటిల్ గెలిచింది పాకిస్తాన్. దాదాపు పదమూడేళ్ల తర్వాత మరోసారి తాజాగా ట్రోఫీని ముద్దాడింది. కాగా ఆసియా కప్-2025లో గ్రూప్-ఎ నుంచి భారత్, యూఏఈ, మలేషియా జట్లతో తలపడ్డ పాక్.. భారత్ మినహా మిగతా రెండు జట్లపై గెలిచింది. తద్వారా సెమీ ఫైనల్కు అర్హత సాధించింది.ఈ క్రమంలో సెమీస్లో బంగ్లాదేశ్ను చిత్తు చేసి ఫైనల్ చేరిన పాకిస్తాన్.. టైటిల్ పోరులో దాయాది భారత్ (IND vs PAK)ను ఢీకొట్టింది. దుబాయ్ వేదికగా ఆదివారం నాటి ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 347 పరుగులు చేసింది.ఓపెనర్ సమీర్ మిన్హాస్ భారీ శతకం (113 బంతుల్లో 172)తో చెలరేగగా.. అహ్మద్ హుసేన్ హాఫ్ సెంచరీ (56)తో రాణించాడు. భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్ 3 వికెట్లు పడగొట్టగా... హెనిల్ పటేల్, ఖిలాన్ పటేల్ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. కీలక మ్యాచ్లో దారుణ వైఫల్యంఅయితే, ఈ టోర్నీ ఆసాంతం దంచికొట్టిన భారత యువ తారలు... కీలక మ్యాచ్లో మాత్రం విఫలమయ్యారు. ఫలితంగా భారీ లక్ష్యఛేదనలో భారత జట్టు 26.2 ఓవర్లలో కేవలం 156 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. దీంతో 191 పరుగుల తేడాతో గెలిచిన పాక్ చాంపియన్గా నిలిచింది.భారత ఓపెనర్లలో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi- 10 బంతుల్లో 26) వేగంగా ఆడే ప్రయత్నం చేయగా.. కెప్టెన్ ఆయుశ్ మాత్రే (Ayush Mhatre- 2) దారుణంగా విఫలమయ్యాడు. ఆరోన్ జార్జ్ (16), విహాన్ మల్హోత్రా (7), వేదాంత్ త్రివేది (9), అభిజ్ఞాన్ కుందు (13) తేలిపోయారు. పదోస్థానంలో వచ్చిన దీపేశ్ 16 బంతుల్లో 36 పరుగులతో కాసేపు పోరాడాడు. అయితే, అప్పటికి పరిస్థితి చేజారి ఓటమి ఖరారైంది.పాక్ బౌలర్లలో అలీ రజా 4 వికెట్లు తీయగా... మొహమ్మద్ సయ్యమ్, అబ్దుల్ సుభాన్, హుజైఫా తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఓపెనింగ్ బ్యాటర్ సమీర్ మన్హాస్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. ఘన స్వాగతంఇదిలా ఉంటే.. అండర-19 ఆసియా కప్ గెలిచిన పాక్ యువ జట్టుకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ఇస్లామాబాద్ విమానాశ్రయంలో దిగగానే జట్టును అభిమానులు చుట్టుముట్టారు. అనంతరం ఇస్లామాబాద్లో విక్టరీ పరేడ్ నిర్వహించారు. ప్రపంచకప్ గెలిచినంతగా సంబరాలు చేసుకున్నారు.దీనికే ఇంత చేశారంటే..ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘‘మీ ఓవరాక్షన్ ఆపండి.. అండర్-19 స్థాయిలో ఆసియా కప్ గెలిస్తేనే ఈ స్థాయిలో సెలబ్రేషన్స్ చేసుకుంటారా?.. ఒకవేళ మీ ప్రధాన జట్టు ప్రపంచకప్ గెలిస్తే అసలు తట్టుకుంటారా?.. దేశ ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న పేదరికం.. ఇలాంటి వాటిపై కాస్త దృష్టి పెట్టండి.. ఇలాంటి అతి ఎప్పుడూ పనికిరాదు’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. చదవండి: అద్భుతమైన ఆటగాడు.. అయినా ఎందుకు వేటు?.. ఇదే సరైన నిర్ణయం!THE CRAZE OF CRICKET IN PAKISTAN😍🇵🇰Imagine what the scene would be like if the main team brought the trophy home.pic.twitter.com/7SWpww9Fxh— junaiz (@dhillow_) December 22, 2025 -
పెట్టిన సొమ్ముకు.. అతడి ఆటకు సంబంధమే లేదు! అయినా..
కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్ ప్రయాణం ముగిసింది. ఐపీఎల్-2026లో అతడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున బరిలోకి దిగనున్నాడు. ఇటీవల అబుదాబిలో జరిగిన మినీ వేలంలో వెంకటేశ్ కోసం లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, కేకేఆర్, ఆర్సీబీ మధ్య పోటీ నెలకొంది.ఈ క్రమంలో రూ. 3.2 కోట్ల ధర దాటిని తర్వాత లక్నో, గుజరాత్ తప్పుకోగా.. కేకేఆర్ (KKR) రూ. 6.8 కోట్ల వరకు బిడ్ వేసింది. అయితే, ఆఖరికి రూ. 7 కోట్లకు ఆర్సీబీ అతడిని సొంతం చేసుకుంది. కాగా 2021లో కేకేఆర్ తరఫున అరంగేట్రం చేసిన మధ్యప్రదేశ్ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer).. 2025 వరకు అదే జట్టుతో కొనసాగాడు.ధరలో హై జంప్రూ. 20 లక్షల కనీస ధరతో కేకేఆర్లో చేరిన వెంకీ అద్భుత ప్రదర్శన కనబరచగా.. మరుసటి ఏడాది వేలానికి ముందు ఏకంగా రూ. 8 కోట్లకు జట్టు రిటైన్ చేసుకుంది. 2023, 24 సీజన్లలోనూ ఈ మేర భారీ మొత్తమే చెల్లించింది. అయితే, 2024లో జట్టు విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన వెంకీ వేలానికి ముందు జట్టును వీడాడు.అనూహ్య రీతిలో రూ. 23.75 కోట్లుఈ క్రమంలో ఆక్షన్లో అతడి కోసం కేకేఆర్ ఏకంగా రూ. 23.75 కోట్లు ఖర్చు చేసింది. నిజానికి అతడి స్థాయికి అది మించిన ధరే అని చెప్పవచ్చు. అయినప్పటికీ కేకేఆర్ వెంకీ కోసం పర్సు నుంచి భారీ మొత్తమే వెచ్చించి అతడిని మళ్లీ జట్టులో చేర్చుకుంది. అయితే, ఈసారి అతడు కనీస స్థాయి ప్రదర్శన కూడా కనబరచలేదు.పెట్టిన సొమ్ముకు.. అతడి ఆటకు సంబంధమే లేకుండా పోయింది. పదకొండు మ్యాచ్లు ఆడి కేలం 142 పరుగులే చేశాడు. ఇక ఈ పేస్ ఆల్రౌండర్ ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ వేయలేదు. ఈ నేపథ్యంలో 2026 మినీ వేలానికి ముందు కేకేఆర్ అతడిని విడిచిపెట్టింది. అయినప్పటికీ తిరిగి తెచ్చుకోవాలని భావించగా.. ఆర్సీబీ ఈసారి పట్టు వీడకుండా అతడిని తమ సొంతం చేసుకుంది.తక్కువ ధరకే కొందాం అనుకొన్నాంఈ పరిణామాల నేపథ్యంలో కేకేఆర్ హెడ్కోచ్ అభిషేక్ నాయర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ ఎల్లప్పుడూ తమ ఆటగాళ్ల వెంటే పడుతుందని పేర్కొన్నాడు. జియోహాట్స్టార్తో మాట్లాడుతూ.. ‘‘తన కెరీర్ ఆరంభం నుంచి వెంకటేశ్ అయ్యర్ మా ఫ్రాంఛైజీతోనే ఉన్నాడు.అతడిని తిరిగి సొంతగూటికి తీసుకురావాలని మేము ప్రయత్నించాము. వైవిధ్యభరితమైన ఆటగాళ్ల కోసం ఫ్రాంఛైజీలు తమ డబ్బును సేవ్ చేసుకుంటాయని అనుకున్నాము. కాబట్టి వెంకటేశ్ను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చని భావించాము.ఆర్సీబీ మా వాళ్ల వెంటే పడుతుందిఅయితే, ఆర్సీబీ ఎల్లప్పుడూ మా ఆటగాళ్ల వెంటే పడుతుంది కదా!.. ఈసారి ఎట్టకేలకు అతడిని సొంతం చేసుకుంది. చాలా ఏళ్లుగా వెంకటేశ్ మా జట్టుతో ఉన్నాడు. ఐపీఎల్లో అతడి కొత్త ప్రయాణం సజావుగా సాగాలని కోరుకుంటున్నా’’ అని అభిషేక్ నాయర్ పేర్కొన్నాడు.కాగా అభిషేక్ నాయర్ చెప్పినట్లు ఆర్సీబీ మరీ కేకేఆర్ ఆటగాళ్ల వెంబడే పడినట్లు ఎప్పుడూ కనిపించలేదు. అయితే, కేకేఆర్ మాజీ ప్లేయర్లు ఫిల్ సాల్ట్, క్రిస్ గేల్, సూయశ్ శర్మ తదితరులు ఆర్సీబీ ఆడారు. ఫ్రాంఛైజీ క్రికెట్లో ఇలాంటివి సహజమే. ఇక వెంకటేశ్ అయ్యర్కు బదులు కేకేఆర్ ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ను జట్టులో చేర్చుకుంది. ఇందుకోసం ఏకంగా రూ. 25.20 కోట్లు ఖర్చుపెట్టింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా గ్రీన్ నిలిచాడు.చదవండి: Rohit Sharma: చాలా బాధపడ్డాను.. క్రికెట్ వదిలేయాలనుకున్నా -
భారత జట్టులోకి నయా స్పిన్ సంచలనం.. ఎవరీ వైష్ణవి శర్మ?
భారత మహిళల క్రికెట్ జట్టులోకి మరో యువ సంచలనం అడుగుపెట్టింది. మధ్యప్రదేశ్కు చెందిన 20 ఏళ్ల యంగ్ స్పిన్నర్ వైష్ణవి శర్మ.. టీమిండియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. అందుకు వైజాగ్లోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఇంటర్ననేషనల్ స్టేడియం వేదికైంది. ఆదివారం శ్రీలంక మహిళల జట్టుతో జరిగిన తొలి టీ20లో వైష్ణవి డెబ్యూ చేసింది. భారత కెప్టెన్ చేతుల హర్మన్ప్రీత్ కౌర్ చేతుల మీదుగా ఆమె డెబ్యూ క్యాప్ను అందుకుంది. అరంగేట్రంలో వైష్ణవి శర్మ తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. నాలుగు ఓవర్ల కోటాలో వికెట్ సాధించినప్పటికి కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి ప్రత్యర్థిని కట్టడి చేసింది. లెఫ్ట్-ఆర్మ్ స్లో ఆర్థోడాక్స్ స్పిన్తో లంక బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టింది. ఈ క్రమంలో వైష్ణవి శర్మ గురుంచి తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ ఆసక్తి చూపుతున్నారు.ఎవరీ వైష్ణవి శర్మ..?20 ఏళ్ల వైష్ణవి శర్మ.. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జన్మించింది. వైష్ణవి ఈ స్ధాయికి చేరుకోవడంలో తన తండ్రి నరేంద్ర శర్మది కీలక పాత్ర. నరేంద్ర శర్మగ్వాలియర్లోని జివాజీ విశ్వవిద్యాలయంలో అస్ట్రాలజీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. వైష్ణవిని చిన్నతనం నుంచే క్రికెటర్ చేయాలని ఆయన కలలు కనేవాడు. వైష్ణవి జాతకం చూసి క్రికెట్లో గొప్ప స్థాయికి ఆమె చేరుకుంటుందని ఆయన చిన్నప్పుడే ఊహించారు."నువ్వు డాక్టర్ అయితే జిల్లా లేదా ఈ నగరానికే పరిమితమవుతావు. అదే నువ్వు క్రీడల్లో విజయం సాధిస్తే ప్రపంచమే నిన్ను గుర్తిస్తందని "నరేంద్ర శర్మ తన కుమార్తెకు ఎప్పుడూ చెబుతూనే ఉండేవాడు. తన తండ్రి ఆశయం దిశగా ఆమె కూడా అడుగులు వేసింది.ఇప్పుడు తన తండ్రి మాటలను వైష్ణవి నిజం చేసింది. వైష్ణవి 2021లో మధ్యప్రదేశ్ అండర్-19 జట్టు తరపున ప్రొఫిషనల్ క్రికెట్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత దేశవాళీ టోర్నీల్లో కూడా మెరుగ్గా రాణించింది. ఈ ఏడాది జరిగిన అండర్-19 ప్రపంచ కప్లో వైష్ణవి దుమ్ములేపింది. మలేషియాపై కేవలం 5 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి ఆమె చరిత్ర సృష్టించింది.ఇందులో ఒక అద్భుతమైన హ్యాట్రిక్ కూడా ఉంది. అండర్-19 ప్రపంచ కప్ టోర్నీలో హ్యాట్రిక్ తీసిన తొలి భారత్ స్పిన్నర్గా ఆమె నిలిచింది. మొత్తం టోర్నమెంట్లో 17 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్గా ఆమె నిలిచింది. 2025 డొమెస్టిక్ సీజన్లో 21 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా కూడా వైష్ణవి నిలిచింది. ఈ సంచలన ప్రదర్శనల కారణంగానే ఆమె జాతీయ సెలక్టర్ల దృష్టిలో పడింది. కాగా ఆమె అద్భుతమైన ప్రతిభకు గుర్తింపుగా బీసీసీఐ ఆమెను 'జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ' (ఉత్తమ జూనియర్ మహిళా క్రికెటర్)తో సత్కరించింది. అయితే డబ్ల్యూపీఎల్-2026 వేలంలో మాత్రం వైష్ణవి అన్సోల్డ్గా మిగిలిపోయింది. రూ.20 లక్షల బెస్ప్రైస్తో వేలంలోకి వచ్చిన ఆమెను ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తిచూపలేదు. -
అద్భుతమైన ఆటగాడు.. అయినా ఎందుకు వేటు?
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించిన జట్టు గురించే భారత క్రికెట్ వర్గాల్లో ప్రధానంగా చర్చ నడుస్తోంది. ఏకంగా వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్పైనే వేటు వేసిన యాజమాన్యం.. వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మను కూడా తప్పించింది.ఇది సరైన నిర్ణయమే!అయితే, భవిష్య కెప్టెన్గా నీరాజనాలు అందుకున్న గిల్ (Shubman Gill).. టీ20 జట్టులో పునరాగమనం చేసిన నాటి నుంచి వరుసగా విఫలమవుతూనే ఉన్నాడు. అతడి కోసం సంజూ శాంసన్ (Sanju Samson)ను బలి చేయడం.. అందుకు తగ్గ మూల్యం చెల్లించడం జరిగాయి. కాబట్టి గిల్ను ప్రపంచకప్ జట్టు నుంచి పక్కనపెట్టడం సముచితమేనని మెజారిటి మంది విశ్లేషకుల అభిప్రాయం.కానీ జితేశ్ శర్మ విషయంలో మాత్రం మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం సరైందేనా? లేదా? అన్న విషయంపై మాత్రం ఏకాభిప్రాయం కుదరడం లేదు. టాపార్డర్ నుంచి సంజూని తప్పించిన తర్వాత వికెట్ కీపర్ బ్యాటర్గా జితేశ్కు యాజమాన్యం పెద్ద పీట వేసింది. లోయర్ ఆర్డర్లో హార్దిక్ పాండ్యా (Hardik Pandya)తో కలిసి ఫినిషర్గా పనికివస్తాడనే కారణంతో ఇలా చేసింది.గిల్ను తప్పించడంతోఅయితే, గిల్ను తప్పించడంతో జట్టు కూర్పులో తేడా రావడంతో జితేశ శర్మ స్థానం గల్లంతైంది. నిజానికి జితేశ్ శర్మ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్-2025లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున అతడు సత్తా చాటాడు. పదకొండు మ్యాచ్లలో కలిపి 261 పరుగులు చేసిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. స్ట్రైక్రేటు 176కు పైగా ఉండటం విశేషం.టీ20లలో తిరుగులేని ఆటగాడుబ్యాటర్గా రాణిస్తూనే.. రజత్ పాటిదార్ గైర్హాజరీలో కెప్టెన్గానూ సత్తా చాటి ఆర్సీబీ మొట్టమొదటిసారి ట్రోఫీని ముద్దాడంలో జితేశ్ కీలక పాత్ర పోషించాడు. ఇక టీమిండియా తరపున తనకు అడపాదడపా వచ్చిన అవకాశాలను కూడా అతడు సద్వినియోగం చేసుకున్నాడు.ఇప్పటికి 12 అంతర్జాతీయ టీ20లు ఆడిన జితేశ్ శర్మ.. 151కి పైగా స్ట్రైక్రేటుతో 162 పరుగులు సాధించాడు. ఓవరాల్గా పొట్టి ఫార్మాట్లో 142 మ్యాచ్లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 3163 పరుగులు చేశాడు. ఓవరాల్గా నిలకడైన ఆటతో టీ20లలో తనను తాను ఇప్పటికే మ్యాచ్ విన్నర్గా నిరూపించుకున్నాడు జితేశ్ శర్మ.కచ్చితంగా అర్హుడే.. కానీఈ గణాంకాలు, ప్రదర్శన ఆధారంగా సొంతగడ్డపై జరిగే ప్రపంచకప్-2026లో పాల్గొనే భారత జట్టులో ఉండేందుకు జితేశ్ శర్మ వందకు వంద శాతం అర్హుడు. అయితే, గిల్ స్థానంలో ఆల్రౌండర్ రింకూ సింగ్కు సెలక్టర్లు చోటిచ్చారు. లోయర్ ఆర్డర్లో ఫినిషర్గా రింకూ సేవలు అందిస్తాడు. మరోవైపు.. గిల్ లేడు కాబట్టి అభిషేక్ శర్మ- సంజూ శాంసన్లకు తోడుగా మరో బ్యాకప్ ఓపెనర్ కావాలి. ఓవైపు రింకూ రాక.. మరోవైపు.. ఓపెనింగ్ స్థానం కోసం రిజర్వు ప్లేయర్ను ఎంపిక చేయాల్సిన తరుణంలో జితేశ్ శర్మపై వేటుపడక తప్పలేదు. బ్యాకప్ ఓపెనర్గా దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ను సెలక్టర్లు తిరిగి జాతీయ జట్టుకు ఎంపిక చేశారు.అయినా అందుకే వేటుసంజూ మొదటి ప్రాధాన్య ఓపెనర్, వికెట్ కీపర్గా ప్రపంచకప్ టోర్నీలో సేవలు అందించనుండగా.. ఇషాన్ అతడికి బ్యాకప్గా ఉంటాడు. ఊహించని రీతిలో గిల్పై వేటు, ఇషాన్ కిషన్ రాకతో.. కాంబినేషన్ల కోసం జితేశ్ శర్మను పక్కనపెట్టాల్సి వచ్చింది. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కూడా ఈ విషయాన్ని అంగీకరించాడు. జితేశ్ అద్భుతమైన ఆటగాడే అయినా.. కూర్పు కోసం పక్కనపెట్టాల్సి వచ్చిందని స్పష్టం చేశాడు. ఏదేమైనా తొలి వరల్డ్కప్ ఆడాలన్న 32 ఏళ్ల జితేశ్ శర్మ కలకు ఇప్పటికి ఇలా బ్రేక్ పడింది.చదవండి: IND vs SL: చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. తొలి ప్లేయర్గా -
టాప్-2కు దూసుకొచ్చిన న్యూజిలాండ్.. మరి టీమిండియా?
మౌంట్ మాంగనుయ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో వెస్టిండీస్ను 323 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చిత్తు చేసింది. 462 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక కరేబియన్ జట్టు చతికల పడింది. దీంతో మూడు టెస్టు సిరీస్ను 2-1 తేడాతో కివీస్ సొంతం చేసుకుంది.ఈ మ్యాచ్ ఫలితంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025-27 సైకిల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ విజయంతో కివీస్ జట్టు పాయింట్ల పట్టికలో భారత్, దక్షిణాఫ్రికా లను వెనక్కి నెట్టి రెండో స్థానానికి దూసుకెళ్లింది. ప్రస్తుత సైకిల్లో న్యూజిలాండ్ ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడి రెండు విజయాలు సాధించగా.. మరో మ్యాచ్ను డ్రా చేసుకుంది. కివీస్ ఖాతాలో ప్రస్తుతం 28 పాయింట్ల ఉండగా.. పీసీటీ మాత్రం 77.78గా ఉంది.టాప్లో ఆస్ట్రేలియా..డబ్ల్యూటీసీ సైకిల్ 2025-27 ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. అడిలైడ్ వేదికగా జరిగిన యాషెస్ మూడో టెస్టులో 82 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసిన ఆసీస్.. పాయింట్ల పట్టికలో తమ అగ్రస్ధానాన్ని మరింత పదిలం చేసుకుంది. ప్రస్తుత సైకిల్లో ఆసీస్ ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్లలోనూ విజయం సాధించింది. కంగారుల ఖాతాలో 72 పాయింట్లు ఉండగా.. పీసీటీ మాత్రం వంద శాతంగా ఉంది. సౌతాఫ్రికా మూడో స్ధానంలో ఉండగా.. శ్రీలంక, పాకిస్తాన్ తర్వాత స్ధానాల్లో ఉన్నాయి. ఇక దక్షిణాఫ్రికా చేతిలో సిరీస్ ఓటమి చవిచూసిన టీమిండియా 48.15 శాతంతో ఆరో స్థానానికి పడిపోయింది. ఫైనల్ రేసులో ఉండాలంటే భారత్ తమ తదుపరి మ్యాచ్ల్లో తప్పక గెలవాల్సి ఉంటుంది. బంగ్లాదేశ్ (16.67%), వెస్టిండీస్ (4.17%) చివరి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.చదవండి: ఇన్నాళ్లు దాగున్న రహస్యం: తండ్రైన టీమిండియా క్రికెటర్ -
ఇన్నాళ్లు దాగున్న రహస్యం: తండ్రైన టీమిండియా క్రికెటర్
టీమిండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ శుభవార్త పంచుకున్నాడు. తన భార్య మిథాలి పారుల్కర్ పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపాడు. మొదటి సంతానంగా తమకు కుమారుడు జన్మించాడని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.ఇన్నాళ్లు దాగున్న రహస్యంఈ మేరకు.. ‘‘తల్లిదండ్రుల హృదయాల్లో.. నిశ్శబ్దంతో ఇన్నాళ్లు దాగున్న ఓ రహస్యం ఎట్టకేలకు బయటపడింది. తొమ్మిది నెలల అందమైన కలల ప్రయాణం తర్వాత మా కుమారుడు ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. మా నమ్మకం, అంతులేని ప్రేమకు స్వాగతం పలుకుతున్నాం’’ అని శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) సంతోషం వ్యక్తం చేశాడు.ఈ సందర్భంగా భార్య మిథాలి పారుల్కర్ (Mittali Parulkar) బేబీ బంప్తో ఉన్న ఫొటోలను శార్దూల్ ఠాకూర్ షేర్ చేశాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన మిథాలి- శార్దూల్ దంపతులకు శ్రేయోభిలాషులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ సతీమణి అతియా శెట్టి, భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప భార్య శీతల్, జహీర్ ఖాన్ సతీమణి సాగరిక ఘట్కే తదితరులు కంగ్రాట్స్ అంటూ విష్ చేశారు.ఐపీఎల్లోనూ..కాగా మహారాష్ట్రకు చెందిన టీమిండియా తరఫున ఇప్పటికి 13 టెస్టులు, 47 వన్డేలు, 25 టీ20 మ్యాచ్లు ఆడిన శార్దూల్ ఠాకూర్.. ఆయా ఫార్మాట్లలో 33, 65, 33 వికెట్లు కూల్చాడు. ఈ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ఖాతాలో 377 టెస్టు రన్స్, 329 వన్డే రన్స్, 69 టీ20 రన్స్ కూడా ఉన్నాయి. ఇక ఐపీఎల్లో ఇప్పటికి 105 మ్యాచ్లు పూర్తి చేసుకున్న ఈ కుడిచేతి వాటం ఆల్రౌండర్.. 325 పరుగులు చేయడంతో పాటు.. 107 వికెట్లు పడగొట్టాడు.ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్లో రీప్లేస్మెంట్గా చేరి సత్తా చాటిన శార్దూల్ను.. వేలానికి ముందు ఆ ఫ్రాంఛైజీ వదిలేసింది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ శార్దూల్ ఠాకూర్ను ట్రేడ్ చేసుకుంది. ఇదిలా ఉంటే.. దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టు కెప్టెన్గా ప్రమోషన్ పొందిన శార్దూల్.. వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీతో బిజీ కానున్నాడు.కాగా మిథాలిని ప్రేమించిన శార్దూల్ ఠాకూర్ 2021లో ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ జంట 2023లో పెళ్లి పీటలు ఎక్కింది. శార్దూల్ క్రికెటర్గా సత్తా చాటుతుండగా.. మిథాలి ప్రొఫెషనల్ బేకర్గా రాణిస్తోంది.చదవండి: IND vs SL: చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. తొలి ప్లేయర్గా -
చాలా బాధపడ్డాను.. క్రికెట్ వదిలేయాలనుకున్నా: రోహిత్ శర్మ
నవంబర్ 19, 2023.. భారత క్రికెట్ అభిమానులకు గుండె కోత మిగిల్చిన రోజు. అదే రోజు రాత్రి కోట్లాది భారతీయుల కలలు, ఆశలు ఒక్క ఓటమితో అవిరయ్యాయి. వన్డే వరల్డ్కప్-2023 టోర్నీ ఆధ్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా.. అనూహ్యంగా ఆఖరి మెట్టుపై బోల్తా పడింది.అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి పాలైంది. అయితే ఆ ఓటమిని ఇప్పటికీ అప్పటి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ జీర్ణించుకోలేకపోతున్నాడు. తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన రోహిత్ అప్పటి చేదు జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నాడు. ఆ ఓటమి తనను ఎంతగానో కృంగదీసిందని హిట్మ్యాన్ భావోద్వేగానికి గురయ్యాడు."2023 వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత నేను మానసికంగా కుంగిపోయాను. ఇకపై క్రికెట్ ఆడకూడదని, వెంటనే తప్పుకోవాలని అనుకున్నాను. ఎందుకంటే ఆ టోర్నీ కోసం నేను ఎంతగానో కష్టపడ్డాను. ఇక సాధించడానికి ఏమి మిగిల లేదన్పించింది. 2022లో కెప్టెన్సీ చేపట్టినప్పటి నుండి ప్రపంచకప్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నాను.అటువంటిది ట్రోఫీకి అడుగుదూరంలో నిలిచిపోవడం నేను జీర్ణించుకోలేకపోయాను. మళ్లీ నాకు నేనే ధైర్యం చెప్పుకొని నెమ్మదిగా ఆ బాధ నుంచి బయటకు వచ్చాను. మరోసారి లక్ష్యంగా దిశగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నాను. జీవితం అక్కడితో అగిపోదు.. కొత్తగా నా ప్రయాణాన్ని ప్రారంభించాలనుకున్నాను. ఆ పట్టుదలే 2024 టీ20 ప్రపంచ కప్ విజేతగా మమ్మల్ని నిలబెట్టింది" అని మాస్టర్స్ యూనియన్ కార్యక్రమంలో రోహిత్ పేర్కొన్నాడు.చదవండి: IND vs SL: చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. తొలి ప్లేయర్గా -
వెస్టిండీస్పై న్యూజిలాండ్ ఘన విజయం
మౌంట్ మాంగనుయ్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన మూడో టెస్టులో 323 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్ను 2-0 తేడాతో కివీస్ సొంతం చేసుకుంది. 462 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో 138 పరుగులకే కుప్పకూలింది.43/0 ఓవర్నైట్ స్కోర్తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన కరేబియన్ జట్టు.. 95 పరుగుల వ్యవధిలోనే మొత్తం పది వికెట్లు కోల్పోయింది. కివీస్ బౌలర్ల ధాటికి విండీస్ బ్యాటర్లు విల్లవిల్లాడారు. ఓపెనర్ బ్రాండెన్ కింగ్(67) మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫీ మరోసారి 5 వికెట్లతో సత్తాచాటగా.. అజాజ్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టారు.దుమ్ములేపిన ఓపెనర్లు..ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 575 పరుగులు చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే(367 బంతుల్లో 31 ఫోర్లతో 227 పరుగులు) డబుల్ సెంచరీతో చెలరేగగా.. టామ్ లాథమ్(137) కదం తొక్కాడు. అనంతరం విండీస్ తొలి ఇన్నింగ్స్లో 420 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (63), జాన్ కాంప్బెల్ (45) మంచి ఆరంభం ఇవ్వగా.. కవేమ్ హాడ్జ్ (123) అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లోనూ కివీస్ ఓపెనర్లు దంచికొట్టారు. కాన్వే(101), లాథమ్(101) సెంచరీలతో మెరిశారు. దీంతో కివీస్ రెండో ఇన్నింగ్స్ను 306/2 వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో లభించిన ఆధిక్యాన్ని జోడించి విండీస్ ముందు 452 లక్ష్యాన్ని బ్లాక్ క్యాప్స్ ఉంచింది. ఈ భారీ లక్ష్యాన్ని చేధించలేక కరేబియన్ జట్టు చతకిల పడింది.కాన్వే, లాథమ్ 879 పరుగులు... ఈ సిరీస్లోని ఆరు ఇన్నింగ్స్ల్లో కలిపి డెవాన్ కాన్వే 75.3 సగటుతో 452 పరుగులు (0, 37, 60, 28, 227, 100) చేయగా... టామ్ లాథమ్ 71.1 సగటుతో 427 పరుగులు (24, 145, 11, 9, 137, 101) చేశాడు. "వాళ్ల (లాథమ్, కాన్వే) కష్టానికి ప్రతిఫలం ఇది. చాన్నాళ్లుగా వాళ్లు ఇలాంటి ప్రదర్శన చేసేందుకు కఠోర సాధన చేస్తున్నారు. మెండైన ఆత్మవిశ్వాసం వల్లే ఇది సాధ్యం. రెండో ఇన్నింగ్స్లో వేగంగా ఆడి ప్రత్యర్థి ముందు మంచి లక్ష్యాన్ని నిర్దేశించారు. పిచ్ కూడా బ్యాటింగ్కు అనుకూలంగా ఉంది" అని న్యూజిలాండ్ బ్యాటింగ్ కోచ్ ల్యూక్ రోంచీ అన్నాడు.చదవండి: IND vs SL: చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. తొలి ప్లేయర్గా -
మేము అనుకున్నది జరగలేదు.. కానీ గర్వంగా ఉంది: మాత్రే
అసియాకప్ టైటిల్ను తొమ్మిదోసారి ముద్దాడాలనుకున్న భారత అండర్-19 జట్టుకు నిరాశే ఎదురైంది. అండర్-19 ఆసియాకప్ 2025 టోర్నీలో అజేయంగా ఫైనల్కు చేరిన భారత జట్టు.. తుది మెట్టుపై బోల్తా పడింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత జట్టు 191 పరుగుల తేడాతో పాకిస్తాన్ చేతిలో ఓడింది. గ్రూప్ దశలో పాకిస్తాన్పై అలవోక విజయం సాధించిన యంగ్ ఇండియా... ఫైనల్లో అదే జోరు కనబర్చడంలో విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. సమీర్ మిన్హాస్ (113 బంతుల్లో 172; 17 ఫోర్లు, 9 సిక్స్లు) భారీ సెంచరీతో కదంతొక్కాడు. అతడితో పాటు ఉస్మాన్ ఖాన్ (35; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు.బౌలర్లలో దీపేశ్ మూడు వికెట్లు పడగొట్టగా... హెనిల్ పటేల్, ఖిలాన్ పటేల్ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో భారత జట్టు 26.2 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌటైంది. పదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన దీపేశ్ దేవేంద్రన్ (16 బంతుల్లో 36; 6 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా... 14 ఏళ్ల ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (10 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్స్లు) మెరుగైన ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు.పాకిస్తాన్ బౌలర్లలో అలీ రజా 4 వికెట్లు పడగొట్టగా... మొహమ్మద్ సయ్యమ్, అబ్దుల్ సుభాన్, హుజైఫా తలా రెండు వికెట్లు తీశారు. సమీర్ మన్హాస్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. ఈ ఓటమిపై భారత కెప్టెన్ ఆయుష్ మాత్రే స్పందించాడు. పాకిస్తాన్ అద్భుతంగా ఆడిందని, ఈ మ్యాచ్లో తమకు ఏది కలిసిరాలేదని అతడు చెప్పుకొచ్చాడు."టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవాలని ముందే నిర్ణయించుకున్నాము. కానీ మేము అన్ని విభాగాల్లో విఫలమయ్యాము. మాకు ఏది కలిసిరాలేదు. ఫీల్డింగ్లో మాకు ఇది బ్యాడ్ డే. ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతుంటాయి. కానీ ప్రత్యర్ధి జట్టు మాకంటే మెరుగైన ప్రదర్శన చేసింది. బ్యాటింగ్ కూడా బాగా చేశారు. మా బౌలర్లను సరైన లైన్ అండ్ లెంగ్త్లో బౌలింగ్ చేయలేకపోయారు.వారు తమ ప్రణాళికలను అమలు చేయడంలో సక్సెస్ అయ్యారు. మా ముందు భారీ లక్ష్యం ఉన్నప్పటికి 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయాలనేది టార్గెట్గా పెట్టుకున్నాము. కానీ బ్యాటింగ్లో దారుణంగా విఫలమయ్యాము. అయితే ఓటమి ఎదురైనప్పటికి మా జట్టుకు చాలా సానుకూల అంశాలు లభించాయి. టోర్నీ అసాంతం మా బాయ్స్ బాగా ఆడారు. ఈ టోర్నీ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాము" అని మాత్రే పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో పేర్కొన్నాడు.చదవండి: IND vs SL: చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. తొలి ప్లేయర్గా -
చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. తొలి ప్లేయర్గా
భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ టీ20ల్లో 4000 పరుగుల మైలురాయిని అత్యంతవేగంగా అందుకున్న మహిళా క్రికెటర్గా మంధాన చరిత్ర సృష్టించింది. ఆదివారం వైజాగ్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో మంధాన ఈ ఫీట్ నమోదు చేసింది.స్మృతి ఈ రికార్డును కేవలం 3227 బంతుల్లోనే అందుకుంది. ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ సుజీ బేట్స్ పేరిట ఉండేది. బేట్స్ 3675 బంతుల్లో ఈ ఘనత సాధించింది. తాజా ఇన్నింగ్స్తో కివీ ఓపెనర్ను స్మృతి అధిగమించింది. మంధాన ఇప్పటివరకు తన టీ20 కెరీర్లో 29.90 సగటుతో 4007 పరుగులు చేసింది.ఆమె అత్యధిక వ్యక్తిగా స్కోర్గా 112 పరుగులగా ఉంది. అయితే మహిళల టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో సుజీ బేట్స్(4716) అగ్రస్ధానంలో ఉంది. ఆ తర్వాత స్ధానాల్లో మంధాన(4007), హర్మన్ప్రీత్ కౌర్(3657) ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది.తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. ఓపెనర్ విష్మి గుణరత్నే (39) టాప్ స్కోరర్గా నిలిచింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ, క్రాంతి గౌడ్, శ్రీచరణి తలో వికెట్ పడగొట్టగా.. ముగ్గురు శ్రీలంక బ్యాటర్లు రన్ అవుట్ అయ్యారు. అనంతరం 122 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 14.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జెమిమా కేవలం 44 బంతుల్లో 69 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చింది.చదవండి: నితీశ్ రెడ్డి సారథ్యంలో... -
సింగిల్స్ విజేతలు ఆన్ సె యంగ్, క్రిస్టో పొపోవ్
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్ సింగిల్స్ విభాగంలో ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా), క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్) విజేతలుగా నిలిచారు. చైనాలోని హాంగ్జౌలో ఆదివారం ఈ టోర్నీ ముగిసింది. 96 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్వన్ ఆన్ సె యంగ్ 21–13, 18–21, 21–10తో ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ జి యి (చైనా)పై గెలిచింది. ఈ ఏడాది ఆన్ సె యంగ్కిది 11వ టైటిల్ కావడం విశేషం. 45 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ తుది పోరులో ప్రపంచ 8వ ర్యాంకర్ క్రిస్టో పొపోవ్ 21–19, 21–9తో ప్రపంచ నంబర్వన్ షి యు కి (చైనా)పై విజయం సాధించాడు. తద్వారా వరల్డ్ టూర్ ఫైనల్స్ టోరీ్నలో టైటిల్ నెగ్గిన తొలి ఫ్రాన్స్ ప్లేయర్గా పొపోవ్ చరిత్ర సృష్టించాడు. ఈ టైటిల్ గెలిచే క్రమంలో పొపోవ్ ప్రపంచ 2వ ర్యాంకర్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్లాండ్), ప్రపంచ 3వ ర్యాంకర్ ఆంటోన్సెన్ (డెన్మార్క్), ప్రపంచ 5వ ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)లను ఓడించడం విశేషం. విజేతలుగా నిలిచిన ఆన్ సె యంగ్, క్రిస్టో పొపోవ్లకు 2,40,000 డాలర్ల (రూ. 2 కోట్ల 14 లక్షలు) చొప్పున ప్రైజ్మనీ లభించింది. -
నితీశ్ రెడ్డి సారథ్యంలో...
సాక్షి, విశాఖపట్నం: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనే ఆంధ్ర క్రికెట్ జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన ఆంధ్ర జట్టుకు భారత క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి సారథ్యం వహిస్తాడు. ఆంధ్ర జట్టు తమ మ్యాచ్లను బెంగళూరులో ఆడుతుంది. గ్రూప్ ‘డి’లో ఢిల్లీ, రైల్వేస్, ఒడిశా, సౌరాష్ట్ర, గుజరాత్, హరియాణా, సర్వీసెస్ జట్లతో ఆంధ్ర తలపడుతుంది. ఈనెల 24న తమ తొలి మ్యాచ్లో ఢిల్లీతో ఆంధ్ర ‘ఢీ’కొంటుంది. ఆంధ్ర వన్డే జట్టు: నితీశ్ కుమార్ రెడ్డి (కెప్టెన్), రికీ భుయ్, కోన శ్రీకర్ భరత్, అశ్విన్ హెబ్బర్, షేక్ రషీద్, మారంరెడ్డి హేమంత్ రెడ్డి, ఎస్డీఎన్వీ ప్రసాద్, వై.సందీప్, ఎం.ధనుశ్, సౌరభ్ కుమార్, బి.వినయ్ కుమార్, టి.వినయ్, చీపురుపల్లి స్టీఫెన్, పీవీ సత్యనారాయణ రాజు, కేఎస్ఎన్ రాజు, జె.సాకేత్ రామ్, సీఆర్ జ్ఞానేశ్వర్, సీహెచ్ సందీప్. -
హైదరాబాద్ జట్టు కెప్టెన్గా రాహుల్
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనే హైదరాబాద్ జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన హైదరాబాద్ జట్టుకు రాహుల్ సింగ్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. రాహుల్ బుద్ధిని వైస్ కెప్టెన్గా ఎంపిక చేశారు. ఈనెల 24 నుంచి జనవరి 18వ తేదీ వరకు విజయ్ హజారే ట్రోఫీ టోర్నీ దేశంలోని నాలుగు నగరాల్లో (బెంగళూరు, జైపూర్, రాజ్కోట్, అహ్మదాబాద్) జరుగుతుంది. హైదరాబాద్ జట్టు తమ మ్యాచ్లను రాజ్కోట్లో ఆడుతుంది. గ్రూప్ ‘బి’లో జమ్మూ కశీ్మర్, విదర్భ, బెంగాల్, బరోడా, అస్సాం, ఉత్తరప్రదేశ్, చండీగఢ్ జట్లతో హైదరాబాద్ తలపడుతుంది. ఈనెల 24న జరిగే తొలి మ్యాచ్లో ఉత్తరప్రదేశ్ను హైదరాబాద్ ‘ఢీ’ కొంటుంది. హైదరాబాద్ వన్డే జట్టు: జి.రాహుల్ సింగ్ (కెప్టెన్), రాహుల్ బుద్ధి (వైస్ కెప్టెన్), తన్మయ్ అగర్వాల్, తనయ్ త్యాగరాజన్, పేరాల అమన్ రావు, ఎం.అభిరథ్ రెడ్డి, కె.నితేశ్ రెడ్డి, ఎ.వరుణ్ గౌడ్, ఎం.సాయి ప్రజ్ఞయ్ రెడ్డి (వికెట్ కీపర్), ఎ.ప్రతీక్ రెడ్డి (వికెట్ కీపర్), ఎన్.నితిన్ సాయి యాదవ్, సి.రక్షణ్ రెడ్డి, కార్తికేయ కక్, ఇల్యాన్ సథాని, మొహమ్మద్ అర్ఫాజ్. స్టాండ్ బై: పి.నితీశ్ రెడ్డి, కె.హిమతేజ, అనికేత్ రెడ్డి, రాహుల్ రాదేశ్, పున్నయ్య. వినోద్ కుమార్ (మేనేజర్), డీబీ రవితేజ (హెడ్ కోచ్), అభిజిత్ చటర్జీ (అసిస్టెంట్ కోచ్), రొనాల్డ్ రాయ్ రోడ్రిగ్స్ (ఫీల్డింగ్ కోచ్), రంజిత్ కుమార్ (ట్రెయినర్), సంతోష్ కందుకూరి (ఫిజియో), కృష్ణా రెడ్డి (ఎనలిస్ట్). -
గుల్వీర్ రికార్డు
కోల్కతా: టాటా స్టీల్ వరల్డ్ 25 కిలోమీటర్ల రేసులో భారత అథ్లెట్ల కేటగిరీలో భారత రన్నర్ గుల్వీర్ సింగ్ జాతీయ రికార్డు సృష్టించి విజేతగా నిలిచాడు. గుల్వీర్ 25 కిలోమీటర్ల దూరాన్ని 1 గంట 12 నిమిషాల 06 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. ఈ క్రమంలో 2024లో 1 గంట 14 నిమిషాల 10 సెకన్లతో తానే నెలకొల్పిన రికార్డును గుల్వీర్ సవరించాడు. హర్మంజోత్ సింగ్ (1గం:15ని:11 సెకన్లు) రజతం, సావన్ బర్వాల్ (1గం:15ని:25 సెకన్లు) కాంస్యం సొంతం చేసుకున్నారు. ఓవరాల్ పురుషుల విభాగంలో రెండుసార్లు ఒలింపిక్ చాంపియన్ జోషువా కిప్తెగయ్ (ఉగాండా; 1గం:11ని:49 సెకన్లు) విజేతగా అవతరించి పసిడి పతకాన్ని గెలిచాడు. అల్ఫోన్స్ ఫెలిక్స్ సింబు (టాంజానియా; 1గం:11ని:56 సెకన్లు) రజతం, టెబెల్లో రామకొంగోనా (లెసెతో; 1గం:11ని:59 సెకన్లు) కాంస్యం కైవసం చేసుకున్నారు. -
జెమీమా జోరు...
మహిళల వన్డే ప్రపంచకప్ ట్రోఫీ చేజిక్కించుకున్న తర్వాత తొలిసారి మైదానంలో అడుగుపెట్టిన భారత జట్టు చాంపియన్ ఆటతీరు కనబర్చింది. శ్రీలంకతో తొలి టి20లో టీమిండియా ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. మొదట కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థి ని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన హర్మన్ప్రీత్ బృందం... స్వల్ప లక్ష్యాన్ని మరో 32 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి సిరీస్లో బోణీ కొట్టింది. వరల్డ్కప్ సెమీఫైనల్ స్టార్ జెమీమా రోడ్రిగ్స్ అజేయ అర్ధశతకంతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. సాక్షి, విశాఖపట్నం: వన్డే ప్రపంచకప్ విజయం సాధించిన నెల రోజుల విరామం తర్వాత మైదానంలో అడుగు పెట్టిన భారత మహిళల జట్టు సమష్టి ఆటతీరుతో మెరిపించింది. శ్రీలంకతో ఐదు మ్యాచ్ల టి20 సిరీస్లో భాగంగా విశాఖపట్నం వేదికగా ఆదివారం జరిగిన తొలి పోరులో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. విశ్మీ గుణరత్నే (43 బంతుల్లో 39; 1 ఫోర్, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... హాసిని పెరీరా (20; 2 ఫోర్లు), హర్షిత (21; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, దీప్తి శర్మ, నల్లపురెడ్డి శ్రీచరణి తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత జట్టు 14.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెమీమా రోడ్రిగ్స్ (44 బంతుల్లో 69 నాటౌట్; 10 ఫోర్లు) అజేయ అర్ధశతకంతో దుమ్మురేపగా... వైస్ కెపె్టన్ స్మృతి మంధాన (25; 4 ఫోర్లు), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (15 నాటౌట్) ఆమెకు అండగా నిలిచారు. ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన లెఫ్టార్మ్ స్పిన్నర్ వైష్ణవి శర్మ వికెట్ పడగొట్టకపోయినా పొదుపుగా బౌలింగ్ చేసి ఆకట్టుకుంది. ఇరు జట్ల మధ్య రెండో టి20 మంగళవారం ఇక్కడే జరగనుంది. శుభారంభం లభించకున్నా... స్వల్ప లక్ష్యఛేదనలో టీమిండియాకు శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన షఫాలీ వర్మ (9) మరుసటి ఓవర్లో అవుట్ కాగా.. స్మృతి, జెమీమా ఇన్నింగ్స్ను ముందుకు నడిపించారు. చమరి ఓవర్లో స్మృతి రెండు ఫోర్లు కొట్టగా ... శషిని ఓవర్లో జెమీమా వరుసగా రెండు ఫోర్లు బాదింది. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి భారత్ 55/1తో లక్ష్యం దిశగా సాగింది. కాసేపటికి స్మృతి అవుటైనా... హర్మన్ప్రీత్ అండతో జెమీమా దూసుకెళ్లింది. శషిని వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో జెమీమా నాలుగు ఫోర్లు కొట్టడం విశేషం. ఈ క్రమంలో 34 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్న ఆమె... చివరి వరకు అజేయంగా నిలిచి జట్టును గెలిపించింది. స్మృతితో రెండో వికెట్కు 54 పరుగులు జోడించిన జెమీమా... హర్మన్తో మూడో వికెట్కు అజేయంగా 55 పరుగులు జత చేసింది. బౌలర్లు అదుర్స్... శ్రీలంక ఇన్నింగ్స్లో పెద్దగా మెరుపులు కనిపించలేదు. ఆరంభం నుంచే మన బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లంకేయులు స్వేచ్ఛగా ఆడలేకపోయారు. మూడు ఫోర్లతో మంచి టచ్లో కనిపించిన కెపె్టన్ చమరి (15) మూడో ఓవర్లోనే వెనుదిరగగా... విశ్మీ, హాసిని, హర్షిత తలా కొన్ని పరుగులు సాధించారు. అయితే వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టిన టీమిండియా... లంకను భారీ స్కోరు చేయకుండా అడ్డుకుంది. ఈ మ్యాచ్లో మూడు రనౌట్లు చేసిన మన అమ్మాయిలు ఫీల్డింగ్లో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 15వ ఓవర్ చివరి బంతికి హర్షిత కొట్టిన బంతిని అందుకునే క్రమంలో జెమీమా అమాంతం గాల్లోకి ఎగిరిన విధానం అబ్బురపరిచింది.2 మహిళల టి20 క్రికెట్లో 4000 పరుగులు పూర్తి చేసుకున్న రెండో ప్లేయర్గా స్మృతి మంధాన (154 మ్యాచ్ల్లో 4007) నిలిచింది. న్యూజిలాండ్ ప్లేయర్ సుజీ బేట్స్ (177 మ్యాచ్ల్లో 4716) అగ్రస్థానంలో... హర్మన్ప్రీత్ కౌర్ (183 మ్యాచ్ల్లో 3669) మూడో స్థానంలో ఉన్నారు.89 భారత్ తరఫున మహిళల అంతర్జాతీయ టి20ల్లో అరంగేట్రం చేసిన 89వ ప్లేయర్గా వైష్ణవి శర్మ గుర్తింపు పొందింది. శ్రీచరణి, క్రాంతి గౌడ్ తర్వాత టి20 ఫార్మాట్లో భారత్ నుంచి ఈ ఏడాది అరంగేట్రం చేసిన మూడో ప్లేయర్గా వైష్ణవి నిలిచింది. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: విశ్మీ గుణరత్నే (రనౌట్) 39; చమరి ఆటపట్టు (బి) క్రాంతి 15; హాసిని (సి) క్రాంతి (బి) దీప్తి 20; హర్షిత (బి) శ్రీచరణి 21; నీలాక్షిక (రనౌట్) 8; కవిశ (రనౌట్) 6; కౌశిని (నాటౌట్) 9; ఎక్స్ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు)121. వికెట్ల పతనం: 1–18, 2–49, 3–87, 4–103, 5–108, 6–121. బౌలింగ్: క్రాంతి గౌడ్ 3–0–23–1; అరుంధతి రెడ్డి 4–0–23–0; దీప్తి శర్మ 4–1–20–1; వైష్ణవి శర్మ 4–0–16–0; శ్రీచరణి 4–0–30–1; అమన్జ్యోత్కౌర్ 1–0–8–0. భారత్ ఇన్నింగ్స్: స్మృతి (సి) నీలాక్షిక (బి) ఇనోక 25; షఫాలీ (సి) శషిని (బి) కావ్య 9; జెమీమా (నాటౌట్) 69; హర్మన్ప్రీత్ (నాటౌట్) 15; ఎక్స్ట్రాలు 4; మొత్తం (14.4 ఓవర్లలో 2 వికెట్లకు) 122. వికెట్ల పతనం: 1–13, 2–67. బౌలింగ్: మల్కి మదార 2–0–19–0; కావ్య 3–0–20–1; చమరి 2–0–16–0; శషిని 2–0–32–0; ఇనోక 3.4–0–17–1; కవిశ 2–0–18–0. -
పరిమిత ఓవర్ల ఫార్మాట్లో హిట్.. టెస్ట్ల్లో ఫట్..!
2025.. భారత పురుషుల క్రికెట్కు మిశ్రమ ఫలితాలు మిగిల్చిన సంవత్సరం. ఈ ఏడాది టీమిండియాకు మూడు ఫార్మాట్లలో వేర్వేరు అనుభవాలు ఎదురయ్యాయి. టెస్ట్ క్రికెట్లో చతికిలబడిన భారత్.. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో మాత్రం సత్తా చాటింది.షాకిచ్చిన దిగ్గజాలుఈ ఏడాది దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు. ఈ ఇద్దరు ఇంగ్లండ్ పర్యటనకు ముందు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.అప్పటికే (2024 టీ20 వరల్డ్కప్ విజయం తర్వాత) పొట్టి ఫార్మాట్ నుంచి వైదొలిగిన రో-కో.. టెస్ట్ క్రికెట్ నుంచి కూడా తప్పుకున్నట్లు ప్రకటించారు. వారం వ్యవధిలో ఇది జరిగిపోయింది. భారత క్రికెట్ అభిమానులకు 2025లో ఇదే అతి పెద్ద షాక్. సుదీర్ఘ అనుభవం కలిగిన రోహిత్, కోహ్లి ఒకేసారి నిష్క్రమించడంతో, టెస్ట్ల్లో భారత్కు పెద్ద దిక్కు లేకుండా పోయింది. టెస్ట్ల నుంచి వైదొలుగుతూనే రోహిత్ వన్డే కెప్టెన్సీకి కూడా గుడ్బై చెప్పేశాడు. సాధారణ ఆటగాడిగా కొనసాగుతానని ప్రకటించాడు.గిల్ జమానా షురూదీంతో టెస్ట్, వన్డే ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్గా శుభ్మన్ గిల్ శకం మొదలైంది. అయితే రోహిత్, కోహ్లి గైర్హాజరీలో గిల్కు టెస్ట్ జట్టు బాధ్యతలు మోయడం కాస్త కష్టమైంది. టెస్ట్ కెప్టెన్గా తొలి పర్యటనలో గిల్కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. చావుతప్పి కన్ను లొట్ట బోయిందన్న చందంగా ఇంగ్లండ్లో ఐదు మ్యాచ్ల సిరీస్ను 2-2తో డ్రా చేసుకోగలిగాడు. కానీ, ఈ సిరీస్లో రోహిత్, కోహ్లి లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఈ సిరీస్లో గిల్ వ్యక్తిగతంగా అత్యుత్తమంగా రాణించాడు.5 మ్యాచ్ల్లో 75.40 సగటున, నాలుగు శతకాల సాయంతో (ఓ డబుల్ సెంచరీ) 754 పరుగులు సాధించాడు. ఓ భారత క్రికెటర్ విదేశీ గడ్డపై కనబర్చిన అత్యుత్తమ ప్రదర్శన ఇది. ఈ సిరీస్లో కేఎల్ రాహుల్, పంత్, జైస్వాల్, సుందర్, సిరాజ్, బుమ్రా, ఆకాశదీప్ లాంటి వాళ్లు కూడా రాణించినా, రోహిత్, కోహ్లి లోటు మాత్రం భర్తీ చేయలేనిదిగా కనిపించింది.ఓటమితో ప్రారంభం2025 సంవత్సరాన్ని టీమిండియా ఓటమితో ప్రారంభించింది. ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో (బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ) భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి మ్యాచ్ను 6 వికెట్ల తేడాతో కోల్పోయింది. ఈ ఓటమితో సిరీస్ను 1-3 తేడాతో కోల్పోయింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టెస్ట్ జెర్సీల్లో కనిపించిన చివరి సిరీస్ ఇదే.విండీస్ను క్లీన్ స్వీప్ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ సిరీస్లు అయిన తర్వాత ఈ ఏడాది భారత్ స్వదేశంలో విండీస్తో రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడింది. ఈ సిరీస్ను టీమిండియా 2-0తో క్లీన్ స్వీప్ చేసింది.సొంతగడ్డపై పరాభవంఈ ఏడాది భారత్కు టెస్ట్ల్లో సొంతగడ్డపైనే ఘోర పరాభవం ఎదురైంది. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్ల సిరీస్ను భారత్ 0-2 తేడాతో కోల్పోయింది. ఓవరాల్గా చూస్తే, ఈ ఏడాది భారత్కు విండీస్పై మినహా ఒక్క టెస్ట్ సిరీస్ విజయం కూడా దక్కలేదు.వన్డేల్లో తిరుగలేని భారత్ఈ ఏడాది భారత్ వన్డే ఫార్మాట్లో అద్బుత ప్రదర్శనలు చేసింది. స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసి, ఈ ఏడాది ఘనంగా బోణీ కొట్టింది.మూడోసారి ఛాంపియన్అనంతరం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలోనూ భారత్ జయకేతనం ఎగురవేసింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఫైనల్లో న్యూజిలాండ్పై ఘన విజయం సాధించి, ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.ఆసీస్ చేతిలో భంగపాటుఈ ఏడాది ఇంగ్లండ్ను క్లీన్ స్వీప్ చేసి, అనంతరం ఛాంపియన్స్ ట్రోఫీని కూడా కైవసం చేసుకున్న భారత వన్డే జట్టుకు ఆస్ట్రేలియా చేతిలో భంగపాటు ఎదురైంది. ఆసీస్లో జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్ను 1-2తో కోల్పోయింది.రెచ్చిపోయిన రోహిత్.. నిరాశపరిచిన కోహ్లిఈ సిరీస్లో రోహిత్ శర్మ సెంచరీ, హాఫ్ సెంచరీతో అద్భుతమైన కమ్బ్యాక్ ఇచ్చాడు. విరాట్ మాత్రం వరుసగా రెండు మ్యాచ్ల్లో డకౌటై నిరాశపరిచాడు. అయితే కోహ్లి మూడో వన్డేలో అర్ద సెంచరీతో రాణించి తిరిగి ఫామ్లోకి వచ్చాడు.పూనకాలు తెప్పించిన కోహ్లి.. సౌతాఫ్రికాకు చుక్కలుఆస్ట్రేలియా పర్యటనలో ఇబ్బందిపడిన కోహ్లి స్వదేశంలో సౌతాఫ్రికా జరిగిన వన్డే సిరీస్లో పూనకాలు తెప్పించాడు. వరుసగా రెండు సెంచరీలు చేసి ప్రత్యర్ధికి చుక్కలు చూపించాడు. ఈ సిరీస్లో రోహిత్ శర్మ కూడా పర్వాలేదనిపించాడు. రో-కో చెలరేగడంతో భారత్ ఈ సిరీస్ను 2-1 తేడాతో కైసవం చేసుకుంది. తద్వారా ఈ ఏడాది వన్డే ఫార్మాట్ను ఘనంగా ముగించింది. ఆసీస్తో సిరీస్ మినహా టీమిండియా ఈ ఏడాది వన్డేల్లో అత్యుత్తమంగా రాణించింది. ఇంగ్లండ్, సౌతాఫ్రికాపై సిరీస్ విజయాలతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీని కూడా కైవసం చేసుకుంది.పొట్టి ఫార్మాట్లో తిరుగులేని భారత్ పొట్టి ఫార్మాట్లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఈ ఏడాదిని ప్రారంభించిన భారత్.. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాకు తగ్గట్టుగానే అద్భుతంగా రాణించింది. స్వదేశంలో ఇంగ్లండ్పై 4-1 తేడాతో జైత్రయాత్రను ప్రారంభించి.. సౌతాఫ్రికాపై 3-1 గెలుపుతో ఈ ఏడాదిని ఘనంగా ముగించింది.ఈ మధ్యలో భారత్ ఆసియా కప్ను కైవసం చేసుకుంది. ఆ టోర్నీలో టీమిండియా పాక్ను (ఫైనల్ సహా) ముచ్చటగా మూడుసార్లు ఓడించి ట్రోఫీని ఎగరేసుకుపోయింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ టోర్నీలో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అలాగే టైటిల్ గెలిచాక ఆసియా క్రికెట్ కౌన్సిల్కు బాస్గా ఉన్న పాకిస్తానీ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని కూడా తీసుకోలేదు. నఖ్వీ భారత ఆటగాళ్లకు ఇప్పటివరకు ట్రోఫీ ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు.ఆసియా కప్ తర్వాత భారత్ ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో 2-1 తేడాతో ఓడించింది. ఓవరాల్గా చూస్తే.. భారత్ ఈ ఏడాది పొట్టి ఫార్మాట్లో తిరుగులేని శక్తిగా నిలిచింది. -
శ్రీలంకతో తొలి టీ20.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?
వన్డే ప్రపంచకప్ గెలిచాక ఆడుతున్న తొలి మ్యాచ్లో భారత మహిళా క్రికెట్ జట్టు సత్తా చాటింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శ్రీలంకతో ఇవాళ (డిసెంబర్ 21) జరుగుతున్న తొలి టీ20లో భారత బౌలర్లు చెలరేగిపోయారు. విశాఖ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా ప్రత్యర్ధిని 121 పరుగులకే పరిమితం చేసింది (6 వికెట్ల నష్టానికి).దీప్తి శర్మ (4-1-20-1) పొదుపుగా బౌలింగ్ చేసి లంక బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టింది. అరంగేట్రం బౌలర్ వైష్ణవి శర్మ (4-0-16-0) అంచనాలకు తగ్గట్టుగా రాణించి శభాష్ అనిపించింది. మరో బౌలర్ అరుంధతి రెడ్డి (4-0-23-0) కూడా పర్వాలేదనిపించింది. శ్రీచరణి (4-0-30-1), క్రాంతి గౌడ్ (3-0-23-1) కూడా రాణించారు.భారత బౌలర్ల ధాటికి లంక ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. 39 పరుగులు చేసిన విష్మి గౌతమ్ టాప్ స్కోరర్గా నిలిచింది. ఈమె కాకుండా కెప్టెన్ చమారి (15), హాసిని పెరీరా (20), హర్షిత సమరవిక్రమ (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఈ మ్యాచ్లో భారత ఫీల్డర్లు కూడా అద్బుతమైన ప్రదర్శన చేశారు. నిలాక్షి డిసిల్వ (8), కవిష దిల్హరిని (6) రనౌట్ చేశారు.తుది జట్లు..శ్రీలంక: విష్మి గుణరత్నే, చమరి అతపత్తు(కెప్టెన్), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, నీలాక్షి డి సిల్వా, కౌషని నుత్యంగన(వికెట్కీపర్), కవిషా దిల్హరి, మల్కీ మదార, ఇనోకా రణవీర, కావ్య కావింది, శశిని గిమ్హనైటీమిండియా: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్కీపర్), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, శ్రీ చరణి -
హైదరాబాద్లో టాలీవుడ్ ప్రో లీగ్ ప్రారంభం
హైదరాబాద్: హైదరాబాద్ నగర వేదికగా టాలీవుడ్ ప్రో లీగ్ (TPL) అధికారికంగా ప్రారంభమైంది. ఈబీజీ గ్రూప్ ఆధ్వర్యంలో సరికొత్త క్రికెట్ లీగ్ ఆరంభమైంది. ఈ లాంచింగ్ కార్యక్రమాన్ని నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్ ప్రో లీగ్కు హానరరీ చైర్మన్గా దిల్రాజు వ్యవరించనున్నారు. క్రికెట్-సినిమా రంగాల కలయికగా ఈ లీగ్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్, సురేశ్ రైనా తదితరులు హాజరయ్యారు.ఇక సినిమా రంగం నుంచి హాజరైన పలువురిలో మురళీ శర్మ, ఆశిష్ విద్యార్థి, అనిల్ రావిపూడి, నాగవంశీ, బన్నీ వాసు, వైవా హర్ష, రాశీఖన్నా తదితరులు ఉన్నారు. * * * -
శ్రీలంకతో తొలి టీ20.. తొలుత బౌలింగ్ చేయనున్న టీమిండియా
వన్డే ప్రపంచకప్ గెలిచాక భారత మహిళల క్రికెట్ జట్టు తొలి సిరీస్ ఆడుతుంది. ఇవాల్టి నుంచి (డిసెంబర్ 21) స్వదేశంలో శ్రీలంకతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది. విశాఖ వేదికగా మరికాసేపట్లో ప్రారంభం కానున్న తొలి టీ20లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్లో భారత్ ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగుతుంది. మంచు ప్రభావం కారణంగా భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ టాస్ గెలవగానే సంకోచించకుండా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్తో వైష్ణవి శర్మ అరంగేట్రం చేయనుంది. మిగతా జట్టంతా యధాతథంగా కొనసాగనుంది.మరోవైపు టాస్ ఓడిన శ్రీలంక కూడా పూర్తి స్థాయి జట్టుతోనే బరిలోకి దిగుతుంది. ఆ జట్టు కెప్టెన్ చమరి అతపత్తు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తామంటూ ధీమా వ్యక్తం చేసింది. 17 ఏళ్ల శశిని గిమ్హనై అందరి దృష్టిని ఆకర్శిస్తుందని తెలిపింది.తుది జట్లు..శ్రీలంక: విష్మి గుణరత్నే, చమరి అతపత్తు(కెప్టెన్), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, నీలాక్షి డి సిల్వా, కౌషని నుత్యంగన(వికెట్కీపర్), కవిషా దిల్హరి, మల్కీ మదార, ఇనోకా రణవీర, కావ్య కావింది, శశిని గిమ్హనైటీమిండియా: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్కీపర్), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, శ్రీ చరణి -
పాక్ బౌలర్కు ఇచ్చిపడేసిన వైభవ్ సూర్యవంశీ
భారత్, పాకిస్తాన్ మధ్య ఇవాళ (డిసెంబర్ 21) జరిగిన అండర్-19 పురుషుల ఆసియా కప్ ఫైనల్లో ఉద్రికత్త చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో 348 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తుండగా భారత బ్యాటర్లను పాక్ బౌలర్ అలీ రజా రెచ్చగొట్టాడు. తొలుత భారత కెప్టెన్ ఆయుశ్ మాత్రేను టార్గెట్ చేసిన రజా.. ఆతర్వాత చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీని గెలికాడు. ఇద్దరూ తగు రీతిలో రజాకు సమాధానం చెప్పడంతో వాతావరణం వేడెక్కింది.ఏమన్నావురా..?భారీ లక్ష్య ఛేదనలో భారత కెప్టెన్ ఆయుశ్ మాత్రే పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. ఈ దశలో అలీ రజా అద్బుతమైన బంతితో మాత్రేను ఔట్ చేశాడు. ఔట్ చేసిన ఆనందంలో రజా మాత్రే పట్ల దురుసుగా స్పందించాడు. ఇక చాలు వెళ్లు అన్నట్లు హావభావాలు ప్రదర్శించాడు. దీంతో చిర్రెత్తిపోయిన మాత్రే ఏమన్నావురా అన్నట్లు రజా మీదికి వెళ్లాడు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.वैभव सूर्यवंशी पाकिस्तानियों को उनकी औकात बताते हुए ।#INDvsPAK #vaibhavsuryavanshi pic.twitter.com/NpoPl5hBFA— सनातन सर्वोच्च🚩 मोदी का परिवार (@sanatani58) December 21, 2025నీ స్థాయి నా కాళ్ల కింద..!మాత్రేని గెలికి చీవాట్లు తిన్న రజా వైభవ్ సూర్యవంశీతో కూడా అలాగే ప్రవర్తించాడు. సిక్సర్తో ఛేదన ప్రారంభించిన సూర్యవంశీని (10 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు) ఔట్ చేసిన రజా ఓవరాక్షన్ చేశాడు. సూర్యవంశీకి ఫియరీ సెండాఫ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. రజా ఓవరాక్షన్కు సూర్యవంశీ కూడా తగు రీతిలో బదులిచ్చాడు. నీ స్థాయి నా కాళ్ల కింద అన్నట్లు రజాకు బుద్ది చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది.టీమిండియాకు పరాభవం348 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా తడబడింది. ఆది నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ ఓటమిని కొని తెచ్చుకుంది. 26.2 ఓవర్లలో 156 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఫలితంగా 191 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది. పాక్ బౌలర్లలో అలీ రజా 4 వికెట్లు తీసి భారత పతనాన్ని శాశించాడు. మొహమ్మద్ సయ్యమ్, అబ్దుల్ సుభాన్, సుజైఫా ఎహసాన్ తలో 2 వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టారు.భారత్ తరఫున చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (10 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు) సిక్సర్తో ఛేదనను ప్రారంభించినా కొద్ది సేపటికే ఔటయ్యాడు. అంతకుముందే కెప్టెన్ ఆయుశ్ మాత్రే (2), స్టార్ ప్లేయర్ ఆరోన్ జార్జ్ (16) పెవిలియన్కు చేరారు. 86 పరుగులకే 6 వికెట్లు కోల్పోవడంతో ఆదిలోనే భారత ఓటమి ఖరారైంది.ఆఖర్లో దీపేశ్ దేవేంద్రన్ (36) కంటితుడుపుగా బ్యాట్ ఝులిపించాడు. భారత ఇన్నింగ్స్లో ఇతనే టాప్ స్కోరర్. మిగతా ఆటగాళ్లలో విహాన్ మల్హోత్రా 7, వేదాంత్ త్రివేది 9, అభిగ్యాన్ కుందు 13, కనిష్క్ చౌహాన్ 9, ఖిలన్ పటేల్ 19, హెనిల్ పటేల్ 6 పరుగులు చేసి ఔటయ్యారు.అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. ఓపెనర్ సమీర్ మిన్హాస్ (113 బంతుల్లో 172; 17 ఫోర్లు, 9 సిక్సర్లు) భారీ శతకంతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. అహ్మద్ హుసేన్ (56), ఉస్మాన్ ఖాన్ (35) పర్వాలేదనిపించారు. ఓ దశలో పాక్ 400 పరుగుల మార్కు దాటుందని అనిపించింది. అయితే భారత బౌలర్లు పుంజుకోవడంతో పాక్ ఆఖర్లో త్వరితగతిన 5 వికెట్లు కోల్పోయింది. ఇదే సమయంలో స్కోర్ కూడా నెమ్మదించింది.భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్ 3 వికెట్లు పడగొట్టగా.. హెనిల్ పటేల్, ఖిలన్ పటేల్ తలో 2, కనిష్క్ చౌహాన్ ఓ వికెట్ తీశారు. కాగా, ఈ టోర్నీ సెమీఫైనల్లో భారత్ శ్రీలంకను.. పాక్ బంగ్లాదేశ్ను ఓడించి ఫైనల్స్కు చేరాయి. గత ఎడిషన్లోనూ ఫైనల్లోనే ఓడిన (బంగ్లాదేశ్) భారత్ మరోసారి రన్నరప్తోనే సరిపెట్టుకుంది. -
న్యూజిలాండ్ ఓపెనర్ల ప్రపంచ రికార్డు
న్యూజిలాండ్ ఓపెనర్లు డెవాన్ కాన్వే, టామ్ లాథమ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఒకే టెస్ట్ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేసిన తొలి ఓపెనింగ్ జోడీగా ప్రపంచ రికార్డు నెలకొల్పారు. వెస్టిండీస్తో జరుగుతున్న మూడో టెస్ట్లో ఈ ఘతన సాధించారు. టెస్ట్ క్రికెట్లోనే కాదు, యావత్ ఫస్ట్క్లాస్ చరిత్రలోనే ఒకే మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేసిన తొలి ఓపెనింగ్ జోడీగా కాన్వే, లాథమ్ చరిత్ర సృష్టించారు.ఈ మ్యాచ్లో లాథమ్ తొలి ఇన్నింగ్స్లో 137, రెండో ఇన్నింగ్స్లో 101 పరుగులు చేయగా.. కాన్వే తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ (227), రెండో ఇన్నింగ్స్లో 100 పరుగులు చేశాడు. వ్యక్తిగతంగా కాన్వే మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. ఒకే టెస్ట్ మ్యాచ్లో ద్విశతకం, శతకం సాధించిన తొలి న్యూజిలాండ్ బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. ప్రపంచవాప్తంగా ఈ ఫీట్ను మరో తొమ్మిది మంది మాత్రమే సాధించారు.మ్యాచ్ విషయానికొస్తే.. మౌంట్ మాంగనూయ్ వేదికగా న్యూజిలాండ్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుంది. 462 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో విండీస్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. బ్రాండన్ కింగ్ 37, జాన్ క్యాంప్బెల్ 2 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో విండీస్ గెలవాలంటే మరో 419 పరుగులు చేయాలి.అంతకుముందు కివీస్ సెకెండ్ ఇన్నింగ్స్ను 306/2 వద్ద డిక్లేర్ చేసింది. కాన్వే, లాథమ్ శతక్కొట్టారు. దీనికి ముందు విండీస్ కూడా తమ మొదటి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (63), జాన్ కాంప్బెల్ (45) మంచి ఆరంభం ఇవ్వగా.. కవేమ్ హాడ్జ్ (123) అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో విండీస్ తొలి ఇన్నింగ్స్లో 420 పరుగులకు ఆలౌట్ అయింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 575 పరుగుల భారీ స్కోర్ చేసింది. కాన్వే డబుల్ సెంచరీ, లాథమ్ సెంచరీ చేయగా.. రచిన్ రవీంద్ర (72 నాటౌట్) రాణించాడు. -
టీమిండియాకు ఘోర పరాభవం
ఏసీసీ మెన్స్ అండర్-19 ఆసియా కప్-2025ను పాకిస్తాన్ కైవసం చేసుకుంది. దుబాయ్ వేదికగా ఇవాళ (డిసెంబర్ 21) జరిగిన ఫైనల్లో పాక్ భారత్ను 191 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. ఓపెనర్ సమీర్ మిన్హాస్ (113 బంతుల్లో 172; 17 ఫోర్లు, 9 సిక్సర్లు) భారీ శతకంతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్ ఆది నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ ఓటమిని కొని తెచ్చుకుంది. 26.2 ఓవర్లలో భారత్ 156 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. పాక్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. అలీ రజా 4 వికెట్లు తీసి భారత పతనాన్ని శాశించాడు. మొహమ్మద్ సయ్యమ్, అబ్దుల్ సుభాన్, సుజైఫా ఎహసాన్ తలో 2 వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టారు.భారత్ తరఫున చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (10 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు) సిక్సర్తో ఛేదనను ప్రారంభించినా కొద్ది సేపటికే ఔటయ్యాడు. అంతకుముందే కెప్టెన్ ఆయుశ్ మాత్రే (2), స్టార్ ప్లేయర్ ఆరోన్ జార్జ్ (16) పెవిలియన్కు చేరారు. 86 పరుగులకే 6 వికెట్లు కోల్పోవడంతో ఆదిలోనే భారత ఓటమి ఖరారైంది. ఆఖర్లో దీపేశ్ దేవేంద్రన్ (36) కంటితుడుపుగా బ్యాట్ ఝులిపించాడు. భారత ఇన్నింగ్స్లో ఇతనే టాప్ స్కోరర్. మిగతా ఆటగాళ్లలో విహాన్ మల్హోత్రా 7, వేదాంత్ త్రివేది 9, అభిగ్యాన్ కుందు 13, కనిష్క్ చౌహాన్ 9, ఖిలన్ పటేల్ 19, హెనిల్ పటేల్ 6 పరుగులు చేసి ఔటయ్యారు.అంతకుముందు పాక్ ఇన్నింగ్స్లో సమీర్ మిన్హాస్ మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేదు. అహ్మద్ హుసేన్ (56), ఉస్మాన్ ఖాన్ (35) పర్వాలేదనిపించారు. ఓ దశలో పాక్ 400 పరుగుల మార్కు దాటుందని అనిపించింది. అయితే భారత బౌలర్లు పుంజుకోవడంతో పాక్ 347 పరుగులతో సరిపెట్టుకుంది. భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్ 3 వికెట్లు పడగొట్టగా.. హెనిల్ పటేల్, ఖిలన్ పటేల్ తలో 2, కనిష్క్ చౌహాన్ ఓ వికెట్ తీశారు. కాగా, ఈ టోర్నీ సెమీఫైనల్లో భారత్ శ్రీలంకను.. పాక్ బంగ్లాదేశ్ను ఓడించి ఫైనల్స్కు చేరాయి. గత ఎడిషన్లోనూ ఫైనల్లోనే ఓడిన (బంగ్లాదేశ్) భారత్ మరోసారి రన్నరప్తోనే సరిపెట్టుకుంది. -
మెస్సీ మోజులో 'మన హీరో'పై చిన్నచూపు..!
అంతర్జాతీయ ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ ఇటీవల (డిసెంబర్ 13-15) గోట్ టూర్ పేరిట భారత్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ టూర్ ఆధ్యాంతం అద్భుతంగా సాగింది. మెస్సీని చూసేందుకు లక్షల సంఖ్యలో అభిమానులు ఎగబడ్డారు. ఈ పర్యటనలో మెస్సీ కోల్కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాలను సందర్శించాడు. ప్రతి చోటా మెస్సీకి అనూహ్యమైన ఆదరణ లభించింది. కోల్కతాలో 70 అడుగుల మెస్సీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మొత్తంగా చూస్తే భారత్లో మెస్సీ పర్యటన విజయవంతమైంది.ఇంతవరకు అంతా బాగానే ఉంది. అయితే మెస్సీ పర్యటనలో భారత స్టార్ ఫుట్బాలర్ సునీల్ ఛెత్రీకి అవమానం జరిగిందని ఫుట్బాల్ ప్రేమికులు వాపోతున్నారు. ముంబైలో జరిగిన ప్రొగ్రాంలో నిర్వహకులు ఛెత్రీ పట్ల అవమానకరంగా ప్రవర్తించారని వారంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ముంబైలోని జరిగిన కార్యక్రమంలో నిర్వహకులు ఛెత్రీని అస్సలు పట్టించుకోలేదు.వీఐపీలంతా మెస్సీతో ఫోటోలకు ఫోజులిస్తుంటే, ఛెత్రీ మాత్రం తన వారి మధ్యే అనామకుడిలా స్టేజీ కింద నిల్చుండిపోయాడు. అంతర్జాతీయ స్థాయిలో నాలుగో టాప్ గోల్ స్కోరర్ అయిన ఛెత్రీని నిర్వహకులు మెస్సీ ఫోటో ఉన్న టీ షర్ట్ వేయించి మరింత అవమానించారు. అంతర్జాతీయ స్థాయిలో మెస్సీది, ఛెత్రీది ఇంచుమించు ఒకే స్థాయి. అయినా మెస్సీ ఏదో గొప్ప అయినట్లు అతని ఫోటోను మన హీరో ధరించిన టీ షర్ట్పై వేయించడం అవమానకరమని చాలామంది ఫీలవుతున్నారు.ముంబై ప్రొగ్రామ్లో వీఐపీలంతా స్టేజీపై అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటే ఛెత్రీ స్టేజీ కింద సామాన్యుడిలా అటు ఇటూ తిరుగుతున్న వీడియో సోషల్మీడియాలో వైరలైంది. ఈ వీడియోను చూసిన వారంతా ఛెత్రీకి అతని స్థాయి గౌరవం దక్కలేదని అభిప్రాయపడుతున్నారు. మెస్సీ గొప్ప ఆటగాడే, అయినా మన దేశంలో ఫుట్బాల్ ఉనికిని కాపాడిన ఛెత్రీకి కూడా సమాంతర గౌరవం లభించాలన్నది వారి భావన. విదేశీయుల మోజులో పడి 20 ఏళ్లు భారత్లో ఫుట్బాల్ వ్యాప్తికి కృషి చేసిన మన హీరోని చిన్నచూపు చూడటం సమంజసం కాదని ప్రతి ఒక్కరి అభిప్రాయం.నిర్వహకులు, పాలకులు సరైన గౌరవాన్ని ఇవ్వకపోయినా మెస్సీ మాత్రం ఛెత్రీ పట్ల చాలా మర్యాదగా ప్రవర్తించి అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. మెస్సీ స్వయంగా ఛెత్రీని పలకరించి, హత్తుకుని, తన సంతకం చేసిన అర్జెంటీనా జెర్సీని బహుమతిగా ఇచ్చాడు. ఈ దృశ్యం భారత ఫుట్బాల్ అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతుంది. భారత ఫుట్బాల్ దిగ్గజాన్ని నిర్వహకులు పట్టించుకోకపోయినా మెస్సీ మాత్రం సరైన రీతిలో గౌరవించాడని ఫ్యాన్స్ అంటున్నారు. కాగా, అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక గోల్స్ చేసిన ఫుట్బాలర్ల జాబితాలో ఛెత్రీ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో లాంటి దిగ్గజాలు మాత్రమే ఛెత్రీ కంటే కాస్త ముందున్నారు. 2024 జూన్లో అంతర్జాతీయ ఫుట్బాల్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఛెత్రీ 151 మ్యాచ్ల్లో 94 గోల్స్ చేసి ఆల్టైమ్ హయ్యెస్ట్ గోల్ చేసిన ఆటగాళ్లలో ముఖ్యుడిగా నిలిచాడు. -
అత్యంత అరుదైన మైలురాయిని తాకిన మిచెల్ స్టార్క్
ఆసీస్ వెటరన్ స్పీడ్స్టర్ మిచెల్ స్టార్క్ అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత అరుదైన మైలురాయిని తాకాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 750 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. క్రికెట్ చరిత్రలో స్టార్క్కు ముందు కేవలం 12 మంది మాత్రమే ఈ ఘనత సాధించారు. ఆసీస్ తరఫున కేవలం ఇద్దరే 750 వికెట్ల మార్కును తాకారు. ఇంగ్లండ్తో ఇవాళ ముగిసిన మూడో యాషెస్ టెస్ట్లో స్టార్క్ ఈ ఘనత సాధించాడు.ఫార్మాట్లవారీగా స్టార్క్ ప్రదర్శనలు..103 టెస్ట్ల్లో 424 వికెట్లు130 మ్యాచ్ల్లో 247 వికెట్లు65 టీ20ల్లో 79 వికెట్లుఅంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..మురళీథరన్-1347షేన్ వార్న్-1001జిమ్మీ ఆండర్సన్-991అనిల్ కుంబ్లే-956గ్లెన్ మెక్గ్రాత్-949వసీం అక్రమ్-916స్టువర్ట్ బ్రాడ్-847షాన్ పొల్లాక్-829వకార్ యూనిస్-789టిమ్ సౌథీ-776రవిచంద్రన్ అశ్విన్-765చమింద వాస్-761మిచెల్ స్టార్క్-750అడిలైడ్ వేదికగా ఇవాళ ముగిసిన యాషెస్ మూడో టెస్ట్లో స్టార్క్ 4 వికెట్లతో రాణించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో బ్యాట్తోనూ (54) సత్తా చాటాడు. ఈ సిరీస్ తొలి రెండు టెస్ట్ల్లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. పెర్త్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో 10 వికెట్ల ప్రదర్శన (7,3) నమోదు చేసిన అతను.. బ్రిస్బేన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్లో 8 వికెట్లతో (6,2) సత్తా చాటాడు.రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో స్టార్క్ బ్యాటింగ్లోనూ (77 పరుగులు) రాణించాడు. తొలి రెండు టెస్ట్ల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచిన స్టార్క్ ఈ సిరీస్లో ఇప్పటివరకు జరిగిన 3 మ్యాచ్ల్లో 22 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు.మూడో టెస్ట్లో స్టార్క్తో పాటు అలెక్స్ క్యారీ (106, 5 క్యాచ్లు, 72, ఓ స్టంప్, ఓ క్యాచ్) విజృంభించడంతో ఆసీస్ ఇంగ్లండ్పై 82 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో ఆసీస్ మరో 2 మ్యాచ్లు మిగిలుండగానే 3-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. తొలి రెండు టెస్ట్ల్లో కూడా ఆసీసే విజయం సాధించింది. ఈ సిరీస్లోని నాలుగో టెస్ట్ మ్యాచ్ మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ 26న మొదలవుతుంది.చదవండి: Ashes Series 2025: మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం -
Asia Cup Final: పాకిస్తాన్ భారీ స్కోర్
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఏసీసీ మెన్స్ అండర్-19 ఆసియా కప్-2025 ఫైనల్లో భారత్, పాకిస్తాన్ అమీతుమీ తేల్చుకుంటున్నాయి. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ ఓడి టీమిండియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ సమీర్ మిన్హాస్ (113 బంతుల్లో 172; 17 ఫోర్లు, 9 సిక్సర్లు) భారీ శతకంతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది.పాక్ ఇన్నింగ్స్లో సమీర్ మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేదు. సమీర్ ఒక్కడే వన్ మ్యాన్ షో చేశాడు. అహ్మద్ హుసేన్ (56) సమీర్కు అండగా నిలిచాడు. ఉస్మాన్ ఖాన్ (35) పర్వాలేదనిపించాడు. ఓ దశలో పాక్ 400 పరుగుల మార్కు దాటుందని అనిపించింది. అయితే భారత బౌలర్లు పుంజుకోవడంతో పాక్ ఆఖర్లో త్వరితగతిన 5 వికెట్లు కోల్పోయింది. ఇదే సమయంలో స్కోర్ కూడా నెమ్మదించింది.చివరి మూడు ఓవర్లలో పాక్ టెయిలెండర్లు నికాబ్ షఫీక్ (12 నాటౌట్), మొహమ్మద్ సయ్యమ్ (13 నాటౌట్) మరో వికెట్ పడకుండా జగ్రత్తగా ఆడి జట్టు స్కోర్ను 350 పరుగుల మార్కు వరకు తీసుకెళ్లారు. భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్ 3 వికెట్లు పడగొట్టగా.. హెనిల్ పటేల్, ఖిలన్ పటేల్ తలో 2, కనిష్క్ చౌహాన్ ఓ వికెట్ తీశారు. కాగా, ఈ టోర్నీ సెమీఫైనల్లో భారత్ శ్రీలంకను.. పాక్ బంగ్లాదేశ్ను ఓడించి ఫైనల్స్కు చేరాయి. చదవండి: చరిత్ర సృష్టించిన డెవాన్ కాన్వే.. తొలి న్యూజిలాండ్ బ్యాటర్గా -
మాట వినలేదని జట్టు నుంచి తీసేశారు..! ఇప్పుడు ఏకంగా వరల్డ్కప్ జట్టులోనే
రెండేళ్ల కిందట ఓ భారత ఆటగాడు బీసీసీఐ ఆదేశాలను దిక్కరించినందుకు ఊహించని పరిణామాలు ఎదుర్కొన్నాడు. జట్టులో చోటుతో పాటు సెంట్రల్ కాంట్రాక్ట్నూ కోల్పోయాడు. అతడిపై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. కానీ సదరు ఆటగాడు ఎక్కడా తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఎటువంటి బహిరంగ వ్యాఖ్యలు చేయకుండా.. మైదానంలోనే తన ప్రతాపం చూపాలని నిర్ణయించుకున్నాడు. ఎప్పటికైనా జాతీయ జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వాలన్నదే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఎట్టకేలకు అతడి శ్రమకు ఫలితం దక్కింది. తిరిగి భారత జెర్సీ ధరించేందుకు ఆ ఆటగాడు సిద్దమయ్యాడు. అతడే పాకెట్ డైనమైట్, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్. టీ20 ప్రపంచకప్-2026కు ఎంపిక చేసిన జట్టులో కిషన్ చోటు దక్కించుకున్నాడు. కెరీర్ ముగిసిపోయిందన్న స్టేజి నుంచి ప్రపంచకప్ జట్టులోకి రావడం అతడు ప్రయాణం నిజంగా ఒక అద్భుతం. ఈ క్రమంలో అతడి కమ్బ్యాక్ స్టోరీపై లుక్కేద్దాం.బీసీసీఐ అగ్రహం..ఇషాన్ కిషన్ 2023 ఏడాది ఆఖరిలో భారత జట్టుతో పాటు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాడు. కానీ ఇషాన్ ‘మానసికంగా ఇబ్బందిపడుతున్నా’ అంటూ మధ్యలోనే స్వదేశానికి వచ్చేశాడు. అయితే స్వదేశానికి వచ్చేసిన కిషన్ విశ్రాంతి తీసుకోకుండా ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేస్తూ కన్పించాడు. దీంతో అతని ప్రవర్తనపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. జాతీయ జట్టులో లేనప్పుడు దేశవాళీ క్రికెట్లో ఆడాల్సిందేనని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది.కానీ కిషన్ మాత్రం బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించాడు. దీంతో అతడిని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బోర్డు తప్పించింది. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్ కిషన్ ఆడాడు. రంజీ ట్రోఫీతో పాటు విజయ్ హాజారే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్కు సారథ్యం వహించాడు. అడపాదడపా పరుగులు చేస్తూ రాణించినా జాతీయ జట్టు నుంచి పిలుపు రాలేదు. కానీ సెంట్రల్ కాంట్రాక్ట్ మాత్రం తిరిగి దక్కించుకున్నాడు. అయితే ఇంగ్లండ్ పర్యటనలో రిషబ్ గాయపడడంతో కిషన్కు అవకాశం వస్తుందని అంతా భావించారు. కానీ అదే సమయంలో కిషన్ కూగా గాయం బారిన పడడంతో ఛాన్స్ మిస్సయ్యాడు.ఎట్టకేలకు..అయితే దాదాపు రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కిషన్ నిరీక్షణ ఫలింది. ఏకంగా ఇప్పుడు టీ20 వరల్డ్కప్ వంటి మెగా టోర్నీలో ఆడేందుకు ఇషాన్ సిద్దమయ్యాడు. సెకెండ్ వికెట్ కీపర్ బ్యాటర్గా ఈ జార్ఖండ్ డైన్మైట్ను జట్టులోకి తీసుకున్నారు. ఇషాన్ కిషన్ రీఎంట్రీకి ప్రధాన మార్గం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ -2025 నిలిచింది. ఈ టోర్నీలో కిషన్ దుమ్ములేపాడు. కెప్టెన్గా, ఒక ఆటగాడిగా జార్ఖండ్కు తొలిసారి ముస్తాక్ అలీ ట్రోఫీ టైటిల్ను అందించాడు. ఈ టోర్నీలో 10 ఇన్నింగ్స్ల్లో 517 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్గా కిషన్ నిలిచాడు. ఈ ప్రదర్శనల కారణంగానే కిషన్ను భారత జట్టుకు ఎంపిక చేశారు.స్పందించిన కిషన్..తన రీ ఎంట్రీపై కిషన్ స్పందించాడు. తిరిగి జట్టులోకి రావడం చాలా సంతోషంగా ఉంది. అందుకోసం గతేడాదిగా చాలా కష్టపడ్డాను. జార్ఖండ్కు ముస్తాక్ అలీ ట్రోఫీ టైటిల్ వచ్చినందుకు కూడా ఆనందంగా ఉంది. వరల్డ్ కప్ కోసం ఆతృతగా ఎదుచూస్తున్నాను అని ఎఎన్ఐతో కిషన్ పేర్కొన్నాడు. బ్యాకప్ ఓపెనర్గా కిషన్ జట్టులో ఉండనున్నాడు.టీ20 వరల్డ్ కప్ 2026 - భారత జట్టు:సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ( వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ఇషాన్ కిషన్ (కీపర్), వరుణ్ చక్రవర్తి. -
మొదటి మ్యాచ్లోనే ముద్ర.. వార్నర్ వికెట్తో వార్తల్లోకెక్కాడు
తెనాలి: ఐపీఎల్లో అరంగేట్రం మ్యాచ్లోనే అద్భుతమైన వికెట్తో సంచలనం సృష్టించిన తెలుగు యువ క్రికెటర్ యర్రా పృథ్వీరాజ్ గాయాలతో రెండు సీజన్ల విరామం తర్వాత పునరాగమనం చేశాడు. దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన సత్తాను చాటిన ఈ ఎడంచేతి ఫాస్ట్ బౌలర్ను తాజా ఐపీఎల్ వేలంలో గుజరాత్ టైటాన్ రూ.30 లక్షలకు దక్కించుకుంది. ఐపీఎల్ నుంచి టీమిండియాకు ఆడాలన్న కలను ఈసారి నెరవేర్చుకోవాలనే పట్టుదలతో ఉన్న ఈ యువతేజం వివరాల్లోకి వెళితే...పృథ్వీరాజ్ జన్మస్థలం తెనాలి సమీపంలోని దుగ్గిరాల. తల్లి జంపాల కృష్ణకుమారి విశాఖపట్నంలోని ఏపీఈపీడీసీఎల్లో జూనియర్ అకౌంట్స్ అధికారిగా రిటైరయ్యారు. తండ్రి యర్రా శ్రీనివాసరావు సివిల్ ఇంజినీరు, ప్రభుత్వ కాంట్రాక్టరు. తల్లి ఉద్యోగరీత్యా విశాఖలో పెరిగిన పృథ్వీరాజ్ ప్రస్తుతం అక్కడే ఇంజినీరింగ్ చేశాడు. 2011 నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి జట్టుకు వివిధ విభాగాల్లో ఆడుతూ వచ్చాడు. తండ్రికి కజిన్ అయిన ఆంధ్రా యూనివర్సిటీ హెచ్ఓడీ, డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ ఎన్.విజయమోహన్ తొలి గురువు. క్రికెట్లో ఓనమాలు నేర్పారాయన. ఇప్పటికీ పృథ్వీరాజ్ శిక్షణను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. తండ్రి వారసత్వంగా క్రికెట్పై ఆసక్తి... పృథ్వీరాజ్ కు ఆట వారసత్వం అనుకోవచ్చు. తాత ప్రసాదరావు పహిల్వాన్. తండ్రి యర్రా శ్రీనివాసరావు స్వస్థలం చీరాల. బాపట్లలో ఇంజినీరింగ్ కాలేజీలో చదివేటపుడు క్రీడల్లో యాక్టివ్గా ఉన్నారు. రెండేళ్లు కాలేజీ చాంపియన్. 1985లో గుంటూరు జిల్లా అండర్–19 క్రికెట్ జట్టులో ఆడారు. 1986లో జావలిన్ త్రోలో బంగారు పతకం సాధించారు. ఈ నేపథ్యమే పృథ్వీరాజ్కు క్రికెట్పై ఆసక్తిని కలిగించింది. విజయమోహన్ వ్యక్తిగత శిక్షణలో సాధన ఆరంభించి, విజయశిఖరాలను అధిరోహిస్తూ వచ్చాడు. 2011 నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు అండర్–14 నుంచి వివిధ వయసు విభాగాల్లో ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ స్కూల్స్ జాతీయ పోటీలకు ఆడిన జట్టుకు కెప్టెన్ గా చేశాడు. 19 ఏళ్లకే దేశవాళీ క్రికెట్లోకి... 2017 అక్టోబరులో 19 ఏళ్ల వయసులో రంజీ ట్రోఫీకి ఎంపికైన పృథ్వీరాజ్ రెండు మ్యాచ్ల్లో పన్నెండు వికెట్లు తీసి సత్తా చాటాడు. 2018 జులైలో బీసీసీఐ ఆధ్వర్యంలో జాతీయ క్రికెట్ అకాడమీ నిర్వహించే ఇండియన్ స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్స్ క్యాంప్కు ఇండియా నుంచి ఏడుగురిని ఎంపిక చేయగా, అందులో పృథ్వీరాజ్ కు అవకాశం దక్కింది. అక్కడ శిక్షణ అనంతరం ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోపీలో ఇండియా రెడ్ టీమ్కు ఆడాడు. 2018 అక్టోబరులో బీసీసీఐ విజయ్ హజారే ట్రోఫీకి నేరుగా క్వార్టర్ ఫైనల్స్కు ఆడి, హైదరాబాద్పై రెండు వికెట్లు తీశాడు. 2019లో వన్డేలోనే ప్రొఫెసర్ ధియోధర్ ట్రోఫీకి ఆడారు. అదే ఏడాది డిసెంబరులో రంజీ ట్రోఫీలో రెండు మ్యాచ్లు ఆడి తొమ్మిది వికెట్లు తీశాడు. వార్నర్ వికెట్తో సంచలనం అక్కడ్నుంచి పృథ్వీరాజ్ పయనం ప్రతిష్టాకరమైన ఐపీఎల్కు చేరింది. వేలంలో కేకేఆర్ యాజమాన్యం కొనుగోలు చేసినప్పటికీ తుది 11 మంది జట్టులో స్థానం కల్పించలేదు. హైదరాబాద్తో మ్యాచ్తోనే జట్టులో బెర్త్ దక్కింది. అందులో మొదటి, మూడో ఓవర్లో పృథీ్వరాజ్ బౌలింగ్లో రెండు క్యాచ్లను జారవిడిచారు. అయినప్పటికీ మెయిడెన్ వికెట్గా వార్నర్ను బౌల్డ్ చేయడంతో వార్తల్లోకెక్కాడు, అంతకుముందు ఫిబ్రవరి 28న మూలపాడులో జరిగిన బీసీసీఐ సయ్యద్ ముస్తాఫ్ఆలీ టీ20 టోర్నమెంటులో జార్ఖండ్పై నాలుగు ఓవర్లలో 28 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్లో జరిగిన వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్కు నెట్ బౌలర్గా పృథీ్వరాజ్, కోల్కతా నుంచి ఆకాశ్దీప్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. తర్వాత ఆకాశ్దీప్ ఇండియా జట్టుకు అన్ని ఫార్మట్లలోనూ ఆడారు. సెలక్షన్స్ టైములో గాయాల కారణంగా అవకాశం కోల్పోయాడు. రంజీ ట్రోఫీల్లో సత్తా మళ్లీ గత రెండు సీజన్లలోనూ దేశవాళీ క్రికెట్లో రెడ్ బాల్, వైట్ బాల్లోనూ సత్తా చాటుతున్నాడు. 2023లో రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్లో మధ్యప్రదేశ్పై రెండు ఇన్నింగ్స్లో ఏడు వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నా, ఆంధ్ర జట్టు ఓటమి చెందింది. గతేడాది విజయ్ హజారే ట్రోఫీలో మూడు మ్యాచ్లు ఆడి ఏడు వికెట్లు తీశాడు. రెండు రంజీ ట్రోఫీల్లో పది వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు పృథ్వీరాజ్. 2025–26 సీజన్ తొలి దశ రంజీట్రోఫీలో మూడు మ్యాచ్ల్లో తొమ్మిది వికెట్లు తీశాడు. సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ టీ20లో ఆంధ్ర జట్టు తరఫున ఆడిన తొమ్మిది మ్యాచ్లో ఏడు పరుగుల సగటుతో 12 వికెట్లు తీయటం మరో ప్రత్యేకత. ఎడమ చేతివాటం ఫాస్ట్ బౌలింగ్ ప్రత్యేకత ఎడమ చేతివాటం ఫాస్ట్ బౌలింగ్ పృథ్వీరాజ్ ప్రత్యేకత. 145–150 కి.మీ. వేగంతో బౌల్ చేయటం, బంతిని రెండువైపులా స్వింగ్ చేయటం, మెరుపుల్లాంటి బౌన్సర్లు వేయగల నేర్పు ఉన్నాయి. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్లో ప్రముఖ శిక్షకుడు సీడీ థాంప్సన్ మెలకువలు నేర్చారు. ఈ ప్రత్యేకతలతోనే గాయాలతో కొన్ని సీజన్లు వైట్బాల్కు దూరంగా ఉన్నా, మళ్లీ ఘనంగా గుజరాత్ టైటాన్తో పునరాగమనం చేయగలిగాడు పృథీ్వరాజ్. గుజరాత్ టైటాన్ జట్టు ఆడిన తొలి ఐపీఎల్లోనే కప్ను గెలుచుకుందనీ, ఆ జట్టులో ఆటతో టీమిండియాకు ఆడే రోజులు త్వరలోనే వస్తాయని ఆశిస్తున్నాడు. -
చరిత్ర సృష్టించిన డెవాన్ కాన్వే.. తొలి న్యూజిలాండ్ బ్యాటర్గా
మౌంట్ మాంగనుయ్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న మూడో టెస్టులో న్యూజిలాండ్ స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే దుమ్ములేపాడు. తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీతో చెలరేగిన కాన్వే.. రెండో ఇన్నింగ్స్లోనూ శతక్కొట్టాడు. దీంతో ఒకే టెస్టు మ్యాచ్లో ద్విశతకం, సెంచరీ సాధించిన తొలి న్యూజిలాండ్ బ్యాటర్గా కాన్వే చరిత్ర సృష్టించారు.ఇప్పటివరకు ఏ కివీ ఆటగాడు కూడా ఈ ఫీట్ సాధించలేదు. ఓవరాల్గా ప్రపంచ క్రికెట్లో ఈ ఫీట్ సాధించిన 10వ బ్యాటర్గా కాన్వే నిలిచాడు. తొలి ఇన్నింగ్స్లో 367 బంతుల్లో 31 ఫోర్లతో 227 పరుగులు చేసిన కాన్వే.. రెండో ఇన్నింగ్స్లో వంద పరుగులు చేశాడు. గత రెండేళ్లుగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డ కాన్వే ఈ ఏడాది మాత్రం అదరగొట్టాడు. ఐదు టెస్టు మ్యాచ్ల్లో 87.12 సగటుతో 697 పరుగులు సాధించారు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 452 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ తమ సెకెండ్ ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. కరేబియన్ జట్టు విజయానికి ఇంకా 419 పరుగులు కావాలి. క్రీజులో బ్రాండెన్ కింగ్(37), క్యాంప్బెల్(2) ఉన్నారు. అంతకుముందు కివీస్ తమ సెకెండ్ ఇన్నింగ్స్ను 306/2 వద్ద డిక్లేర్ చేసింది. కివీస్ బ్యాటర్లలో కాన్వేతో పాటు టామ్ లాథమ్ కూడా శతక్కొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో లభించిన ఆధిక్యాన్ని జోడించి విండీస్ ముందు 452 లక్ష్యాన్ని బ్లాక్ క్యాప్స్ ఉంచింది.ఇక విండీస్ కూడా తమ మొదటి ఇన్నింగ్స్లో అద్భుతంగా పోరాడింది. ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (63), జాన్ కాంప్బెల్ (45) మంచి ఆరంభం ఇవ్వగా.. కవేమ్ హాడ్జ్ (123) అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో విండీస్ తొలి ఇన్నింగ్స్లో 420 పరుగులకు ఆలౌట్ అయింది. అదేవిధంగా న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్లో 575 పరుగుల భారీ స్కోర్ చేసింది.చదవండి: చాలా చాలా బాధగా ఉంది.. మా కల చెదిరిపోయింది: బెన్ స్టోక్స్ -
చాలా చాలా బాధగా ఉంది.. మా కల చెదిరిపోయింది: బెన్ స్టోక్స్
యాషెస్ సిరీస్ 2025-26ను మరో రెండు మ్యాచ్లు మిగిలూండగానే 3-0 తేడాతో ఇంగ్లండ్ కోల్పోయింది. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో 82 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన ఇంగ్లండ్ జట్టు.. ఈ ఘోర పరభావాన్ని మూట కట్టుకుంది. 435 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ తమ సెకెండ్ ఇన్నింగ్స్లో 352 రన్స్కు ఆలౌటైంది.లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే (85) అద్భుతంగా పోరాడినప్పటికీ.. మిడిలార్డర్ నుంచి ఆశించిన సహకారం లభించలేదు. ఆఖరిలో జామీ స్మిత్(60), విల్ జాక్స్(47), కార్స్(39 నాటౌట్) జట్టును గెలిపించేందుకు తమ వంతు ప్రయత్నం చేశారు. ఆసీస్ బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, లియోన్ తలా మూడు వికెట్లతో ఇంగ్లీష్ జట్టు ఓటమిని శాసించారు."సిరీస్ను ఎలాగైనా కాపాడుకోవాలనే లక్ష్యంతో అడిలైడ్లో అడుగుపెట్టాము. కానీ మా కల ఇప్పుడు చెదిరిపోయింది. ఈ ఓటమి జట్టులోని ప్రతీ ఒక్కరిని ఎంతో బాధకు గురి చేస్తోంది. చాలా చాలా ఎమోషనల్గా ఉన్నారు. ఆస్ట్రేలియాకు కచ్చితంగా క్రెడిట్ ఇవ్వాల్సిందే. గెలుపు అనేది మూడు విభాగాల్లో రాణించడంపై ఆధారపడి ఉంటుంది.ఈ మ్యాచ్లో ఆసీస్ మాకంటే మెరుగైన ప్రదర్శన చేసింది. వారు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడింటిలోనూ మాపై పైచేయి సాధించారు. నాలుగో ఇన్నింగ్స్లో మా ముందు భారీ లక్ష్యం ఉన్నప్పటికి మేము ఆఖరివరకు పోరాడాము. విల్ జాక్స్, జేమీ స్మిత్ ఆడిన తీరు చూసి మేము గెలుస్తామని భావించాను. కానీ అది సాధ్యం కాలేదు. టాస్ ఓడినప్పటికి ఆసీస్ను తొలి ఇన్నింగ్స్లో ఓ మోస్తార్ స్కోర్కే కట్టడి చేయడంలో మేము విజయవంతమయ్యాము. అయితే ఆ తర్వాత మేము భారీ స్కోర్ చేయడంలో విఫలమయ్యాము. రెండో ఇన్నింగ్స్లో కూడా కేవలం 60 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు పడగొట్టాము. మాకు చాలా సానుకూల ఆంశాలు ఉన్నాయి. ముఖ్యంగా మా లోయర్ ఆర్డర్ బ్యాటర్లు చూపిన పోరాటపటిమ నిజంగా అద్బుతం. నేను ఆశించిన పట్టుదల వారిలో కన్పించింది. సిరీస్ కోల్పోయినప్పటికి మిగిలిన రెండు టెస్టుల్లో విజయం సాధించించేందుకు ప్రయత్నిస్తాము" అని పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్లో స్టోక్స్ పేర్కొన్నాడు.చదవండి: సంజూ శాంసన్ కీలక నిర్ణయం -
పాక్తో ఫైనల్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
అండర్-19 ఆసియా కప్ 2025 ఫైనల్లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ బ్లాక్ బ్లాస్టర్ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత తమ తుది జట్టులో ఎటువంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగింది. పాక్ మాత్రం ఒక్క మార్పు చేసింది.డానియల్ అలీ ఖాన్ స్ధానంలో నిఖాబ్ షఫీక్ ప్లేయింగ్ ఎలెవన్లోకి వచ్చాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఓటమెరుగని టీమిండియా.. తుది పోరులో కూడా తమ జోను కొనసాగించాలని పట్టుదలతో ఉంది. వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, అభిజ్ఞాన్ కుందు సూపర్ ఫామ్లో ఉన్నారు. బౌలింగ్లో కూడా దీపేష్ దేవేంద్రన్, కిషన్ కుమార్ సింగ్ దుమ్ములేపుతున్నారు.తుది జట్లుపాకిస్తాన్: సమీర్ మిన్హాస్, ఉస్మాన్ ఖాన్ , అహ్మద్ హుస్సేన్, ఫర్హాన్ యూసఫ్ (కెప్టెన్), హంజా జహూర్ (వికెట్ కీపర్), హుజైఫా అహ్సాన్, నికాబ్ షఫీక్, మహ్మద్ షయాన్, అలీ రజా, అబ్దుల్ సుభాన్, మహ్మద్ సయామ్భారత్: ఆయుష్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేష్ దేవేంద్రన్, కిషన్ కుమార్ సింగ్ -
మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం
అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన యాషెస్ మూడో టెస్టులో 82 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో మరో రెండు మ్యాచ్లు మిగిలూండగానే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ను 3-0 తేడాతో ఆసీస్ సొంతం చేసుకుంది. 435 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ తమ సెకెండ్ ఇన్నింగ్స్లో 352 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జాక్ క్రాలీ (151 బంతుల్లో 85; 8 ఫోర్లు), విల్ జాక్స్(47), బ్రైడన్ కార్స్(39), జేమీ స్మిత్(60) పోరాడినప్పటికి తమ జట్టును ఓటమి నుంచి గట్టెక్కించ లేకపోయారు. రికార్డు లక్ష్యఛేదనలో ఇంగ్లండ్కు శుభారంభం దక్కలేదు. రెండో ఓవర్లోనే ఓపెనర్ బెన్ డకెట్ (4) అవుట్ కాగా... కాసేపటికే ఒలీ పోప్ (17) కూడా వెనుదిరిగాడు. పోరాటానికి మారుపేరైన జో రూట్ (63 బంతుల్లో 39; 5 ఫోర్లు) కీలక దశలో వెనుదిరిగాడు. ఈ మూడు వికెట్లు ఆసీస్ సారథి కమిన్స్ ఖాతాలోకే వెళ్లాయి. అయితే బ్రూక్ (56 బంతుల్లో 30; 2 ఫోర్లు) అండతో క్రాలీ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. నాలుగో వికెట్కు 68 పరుగులు జోడించాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు ఒక దశలో 177/3తో పటిష్టంగా కనిపించింది. ఇలాంటి దశలో ఆసీస్ స్పిన్నర్ లయన్ ఆ జట్టును దెబ్బ తీశాడు. స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు పడగొట్టి మ్యాచ్ను ఆ్రస్టేలియా వైపు తిప్పాడు. బ్రూక్, స్టోక్స్ (18 బంతుల్లో 5; 1 ఫోర్)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. కాసేపటికే క్రాలీ స్టంపౌట్ అయ్యాడు. దీంతో ఇంగ్లండ్ 194/6తో కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్లో సహచరుల నుంచి పెద్దగా సహకారం దక్కకపోయినా మొండిగా పోరాడిన కెప్టెన్ బెన్ స్టోక్స్ ఈ సారి అలాంటి ప్రదర్శన కనబర్చలేకపోయాడు. అయితే జేమీ స్మిత్, విల్ జాక్స్ నిలకడగా ఆడి ఇంగ్లండ్ శిబిరంలో ఆశలు రెకెత్తించారు. స్మిత్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కార్స్ కూడా ఆకట్టుకున్నాడు. కానీ జాక్స్ ఔటయ్యాక ఇంగ్లండ్ ఓటమి ఖాయమైంది. కార్స్ నాటౌట్గా నిలవగా.. ఆర్చర్, టంగ్ వెంటవెంటనే పెవిలియన్కు చేరాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్, నాథన్ లియోన్ తలా మూడేసి వికెట్లు పడగొట్టాడు.హెడ్ భారీ సెంచరీ అంతకుముందు ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 349 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్ (219 బంతుల్లో 170; 16 ఫోర్లు, 2 సిక్స్లు) భారీ సెంచరీతో కదంతొక్కగా... అలెక్స్ కేరీ (128 బంతుల్లో 72; 6 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. మిగిలిన వాళ్లు పెద్దగా తోడ్పాటు అందించలేకపోవడంతో ఆసీస్ జట్టు ఆశించిన స్కోరు కంటే ముందే ఆలౌటైంది. జోష్ ఇన్గ్లిస్ (10), కెపె్టన్ ప్యాట్ కమిన్స్(6) విఫలమయ్యారు. ఈ సిరీస్లో అటు బ్యాట్తోనూ దుమ్మురేపుతున్న స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ 7 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 4 వికెట్లు పడగొట్టగా... బ్రైడన్ కార్స్3 వికెట్లు తీశాడు. -
సంజూ శాంసన్ కీలక నిర్ణయం
టీ20 వరల్డ్కప్-2026కు ఎంపికైన భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ-2025లో ఆడేందుకు శాంసన్ సిద్దమయ్యాడు. విజయ్ హజారే ట్రోఫీ కోసం కేరళ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన జట్టులో సంజూకు చోటు దక్కింది.ఈ జట్టుకు యువ ఓపెనర్ రోహన్ కున్నుమ్మల్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ తరపున రాణించిన స్పిన్నర్ విఘ్నేష్ పుత్తూర్ ఈ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. కేరళ జట్టులో ఎండీ నిదీష్, విష్ణు వినోద్, మహ్మద్ అజారుద్దీన్, వంటి అనుభవం ఉన్న ప్లేయర్లు ఉన్నారు. ఈ టోర్నీలో కేరళ జట్టు గ్రూపు-ఈలో ఉంది. ఈ గ్రూప్లో కేరళతో పాటు త్రిపుర, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, పాండిచ్చేరి, తమిళనాడు జట్లు ఉన్నాయి.వన్డే జట్టులోకి వచ్చేందుకు..భారత టీ20 టీ20 జట్టులో తన స్ధానాన్ని పదిలం చేసుకున్న సంజూ శాంసన్.. ఇప్పుడు వన్డే జట్టులోకి కూడా రావాలని తహతహలాడుతున్నాడు. వాస్తవానికి సంజూకు వన్డేల్లో అద్భుతమైన రికార్డు ఉంది. ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ ఇప్పటివరకు భారత్ తరపున 16 వన్డేలు ఆడి 56.67 సగటుతో 510 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ విజయ్ హజారే ట్రోఫీలో సంజూ రాణిస్తే, భారత వన్డే జట్టులోకి రీఎంట్రీకి మార్గం సుగమం అవుతుంది. కాగా ఈ ఏడాది దేశవాళీ వన్డే టోర్నీలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు ఆడనున్నారు.విజయ్ హజారే ట్రోఫీకి కేరళ జట్టు:రోహన్ కున్నుమ్మల్ (కెప్టెన్), సంజు శాంసన్, విష్ణు వినోద్ (వికెట్ కీపర్), మహమ్మద్ అజహరుద్దీన్ (వికెట్ కీపర్), అహమ్మద్ ఇమ్రాన్, సల్మాన్ నిజార్, అభిషేక్ జె. నాయర్, కృష్ణ ప్రసాద్, అఖిల్ స్కారియా, అభిజిత్ ప్రవీణ్ వి, బిజు నారాయణన్, అంకిత్ శర్మ, బాబా అపరాజిత్, విఘ్నేష్ పుత్తూర్, నిదీష్ ఎండి, ఆసిఫ్ కెఎమ్, అభిషేక్ పి. నాయర్, షరాఫుద్దీన్ ఎన్ఎమ్, ఎడెన్ ఆపిల్ టామ్.చదవండి: 'అతడి రీ ఎంట్రీ చాలా సంతోషంగా ఉంది' -
అతడి రీ ఎంట్రీ చాలా సంతోషంగా ఉంది: హర్భజన్
జాతీయ జట్టు సెలెక్టర్ల పని ఎప్పుడూ కత్తిమీద సామే. వారు ఎంపిక చేసిన జట్టు గెలిస్తే శెభాష్ అంటారు. అదే ఒక్క ఓటమి ఎదురైనా చాలు విమర్శలు వెల్లువెత్తుతాయి. తాజాగా టీ20 ప్రపంచకప్-2026కు ఎంపిక చేసిన భారత జట్టుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ మెగా టోర్నీకి జట్టు ఎంపిక సందర్భంగా అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అనుహ్య నిర్ణయాలు తీసుకుంది. స్టార్ బ్యాటర్, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్పై వేటు పడింది. పేలవ ఫామ్తో సతమతమవుతున్న గిల్ను జట్టు నుంచి తప్పించారు. అతడి స్దానంలో రింకూ సింగ్.. జితేష్ శర్మ ప్లేస్లో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ను జట్టులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్కు పదికి పది మార్కులు వేశాడు. కిషన్తో పాటు ఫినిషర్ రింకూ సింగ్ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు."టీ20 వరల్డ్కప్కు అద్భుతమైన జట్టును ఎంపిక చేశారు. అజిత్ అగార్కర్, మెనెజ్మెంట్కు 10కి 10 మార్కులు ఇవ్వాలనుకుంటున్నాను. అయితే శుభ్మన్ గిల్ను పక్కన పెట్టడం కష్టమైన నిర్ణయమైనప్పటికి.. జట్టు కూర్పుకే సెలెక్టర్లు ప్రాధాన్యత ఇచ్చారు. కానీ టీ20ల్లో ఇదే అతడికి చివరి అవకాశం కాదు. గిల్ తిరిగొస్తాడన్న నమ్మకం నాకు ఉంది.రింకూ సింగ్ తిరిగి జట్టులోకి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. అతడికి రాక జట్టుతో మరింత పటిష్టంగా మారింది. అదేవిధంగా జితేష్ శర్మ స్ధానంలో సెకెండ్ వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్ను ఎంపిక చేయడం సరైన నిర్ణయమే. ఎందుకంటే 7 లేదా 8వ స్థానాల్లో ఆడే బ్యాటర్లు ఇప్పటికే జట్టులో చాలా మంది ఉన్నారు. టాప్ ఆర్డర్లో మెరుపులు మెరిపించే పవర్ హిట్టర్ జట్టుకు కావాలి. ఆ బాధ్యతను ఇషాన్ నెరవేరుస్తాడన్న నమ్ముతున్నాను" అని భజ్జీ పేర్కొన్నాడు. -
టి20 సమరానికి సై
సాక్షి, విశాఖపట్నం: వన్డే వరల్డ్కప్ నెగ్గిన అనంతరం భారత మహిళల క్రికెట్ జట్టు తొలిసారి మైదానంలో అడుగు పెట్టనుంది. శ్రీలంకతో ఐదు మ్యాచ్ల టి20 సిరీస్లో భాగంగా ఆదివారం విశాఖ వేదికగా తొలి పోరు జరగనుంది. వచ్చే ఏడాది ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్ జరగనుండగా... దానికి ముందు టీమిండియా 11 టి20 మ్యాచ్లు ఆడనుంది. గతేడాది జరిగిన టి20 వరల్డ్కప్లో గ్రూప్ దశలోనే వెనుదిరిగిన భారత జట్టు... ఈసారి మెగా టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తుంది. అందుకు లంకతో సిరీస్ను ప్రాక్టీస్గా వినియోగించుకోవాలని చూస్తోంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, షఫాలీ వర్మతో భారత జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. ఇక ఈ సిరీస్ కోసం యంగ్ ప్లేయర్లు కమలిని, వైష్ణవి శర్మను ఎంపిక చేశారు. 17 ఏళ్ల కమలిని ఇప్పటికే అండర్–19 ప్రపంచకప్తో పాటు మహిళల ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్ తరఫున సత్తాచాటింది. తమిళనాడుకు చెందిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక మరోవైపు వైష్ణవి అండర్–19 ప్రపంచకప్లో 17 వికెట్లు పడగొట్టి జాతీయ జట్టులోకి వచి్చంది. రాధ యాదవ్ గైర్హాజరీలో ఈ 19 ఏళ్ల మీడియం పేసర్ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో చూడాలి. ఇక తెలుగమ్మాయి శ్రీచరణి మరోసారి కీలకం కానుంది. ప్రపంచకప్ నెగ్గిన అనంతరం వ్యక్తిగత జీవితంలో పలు అడ్డంకులు ఎదుర్కొన్న స్మృతి మంధాన ఎలాంటి ప్రదర్శన చేస్తుందోచూడాలి. క్రికెట్ కన్నా తనకు ఏదీ ఎక్కువ కాదని ఇప్పటికే స్పష్టం చేసిన స్మృతిపై అందరి దృష్టి నిలవనుంది. ఇక అనూహ్యంగా వన్డే ప్రపంచకప్లో చోటు దక్కించుకొని ఫైనల్లో అదరగొట్టిన షఫాలీ ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. మరోవైపు చమరి ఆటపట్టు సారథ్యంలోని శ్రీలంక జట్టు సైతం యువ ప్లేయర్లను పరీక్షించనుంది. 17 ఏళ్ల శశి్నని, 19 ఏళ్ల రషి్మక, 23 ఏళ్ల కావ్యను ఈ మ్యాచ్లో బరిలోకి దింపే అవకాశం ఉంది. -
సెమీస్లో సాత్విక్–చిరాగ్ జోడీ ఓటమి
హాంగ్జౌ: వరల్డ్ టూర్ ఫైనల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్కు నిరాశ తప్పలేదు. ప్రతిష్టాత్మక ఈ టోర్నీలో సెమీఫైనల్కు చేరిన తొలి భారత పురుషుల ద్వయం సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి పరాజయం పాలయ్యారు. శనివారం జరిగిన సెమీస్లో సాత్విక్–చిరాగ్ శెట్టి జంట 21–10, 17–21, 13–21తో లియాంగ్ వె కెంగ్–వాంగ్ చాంగ్ (చైనా) ద్వయం చేతిలో పోరాడి ఓడింది. గ్రూప్ దశలో ఈ జోడీపై సులువుగా గెలిచిన భారత జంట... సెమీస్లో అదే ఆటతీరు కనబర్చడంలో విఫలమైంది. తొలి గేమ్ గెలిచి ఆధిక్యంలో ఉన్న తర్వాత... అనవసర తప్పిదాలతో వరుసగా రెండు గేమ్లు కోల్పోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి గేమ్ ఆరంభం నుంచే దూకుడు కనబర్చిన భారత షట్లర్లు ప్రత్యర్థి కి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగారు. అదే జోరులో తొలి గేమ్ సొంతం చేసుకున్న సాత్విక్–చిరాగ్ దాన్ని కొనసాగించలేకపోయారు. రెండో గేమ్లో 3–6తో వెనుకబడిన భారత ప్లేయర్లు ఆ తర్వాత 7–7, 11–11తో స్కోరు సమం చేశారు. దీంతో మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లు సాగగా కీలక దశలో పాయింట్లు సాధించిన చైనా జంట గేమ్ను చేజిక్కించుకుంది. ఇక అదే జోరులో మూడో గేమ్ ఆరంభం నుంచే ప్రత్యర్థి రెచ్చిపోగా... భారత జంట పోటీనివ్వలేక పరాజయం వైపు నిలిచింది. -
పోరాడుతున్న వెస్టిండీస్
మౌంట్ మాంగనీ (న్యూజిలాండ్): టాపార్డర్ రాణించడంతో న్యూజిలాండ్తో మూడో టెస్టులో వెస్టిండీస్ పోరాడుతోంది. మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా ఆతిథ్య న్యూజిలాండ్ 1–0తో ఆధిక్యంలో ఉండగా... చివరిదైన ఈ పోరులో పరుగుల వరద పారుతోంది. మొదట న్యూజిలాండ్ 575/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా... ఓవర్నైట్ స్కోరు 110/0తో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన వెస్టిండీస్... మూడో రోజు ఆట ముగిసే సమయానికి 113 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది. కవెమ్ హడ్జ్ (254 బంతుల్లో 109 బ్యాటింగ్; 14 ఫోర్లు) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. బ్రాండన్ కింగ్ (104 బంతుల్లో 63; 10 ఫోర్లు) హాఫ్సెంచరీ చేయగా... జాన్ క్యాంప్బెల్ (67 బంతుల్లో 45; 7 ఫోర్లు), అలిక్ అథనాజె (57 బంతుల్లో 45; 8 ఫోర్లు), జస్టిన్ గ్రేవ్స్ (69 బంతుల్లో 43; 6 ఫోర్లు) రాణించారు. క్రితం రోజు స్కోరుకు ఒక్క పరుగు మాత్రమే జోడించి క్యాంప్బెల్ అవుట్ కాగా... కాసేపటికే బ్రాండన్ కింగ్ వెనుదిరిగాడు. వికెట్ కీపర్ టెవిన్ ఇమ్లాచ్ (67 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) సాయంతో హడ్జ్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఇక గాడినపడ్డట్లే అనుకుంటున్న సమయంలో ఇమ్లాచ్ అవుట్ కాగా... అలిక్ అథనజె, జస్టిన్ గ్రేవ్స్ సాయంతో హడ్జ్ చక్కటి భాగస్వామ్యాలు నమోదు చేశాడు. దీంతో వెస్టిండీస్ జట్టు ఫాలోఆన్ ప్రమాదాన్ని అధిగమించి మెరుగైన స్కోరు చేయగలిగింది. ఈ క్రమంలో హడ్జ్ 224 బంతుల్లో టెస్టుల్లో రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఏమాత్రం తొందరపాటుకు పోని హడ్జ్ నింపాదిగా అచ్చమైన టెస్టు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. సెంచరీ అనంతరం కూడా అతడు పూర్తి సంయమనంతో బ్యాటింగ్ చేశాడు. కెపె్టన్ రోస్టన్ చేజ్ (2) విఫలం కాగా... హడ్జ్తో పాటు అండర్సన్ ఫిలిప్ (12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. చేతిలో 4 వికెట్లు ఉన్న విండీస్ జట్టు ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 194 పరుగులు వెనుకబడి ఉంది. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న స్టార్ బ్యాటర్ షై హోప్... మూడో రోజు కూడా మైదానంలోకి దిగలేదు. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ, ఎజాజ్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మరో రెండు రోజు ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్లో విండీస్ మరెన్ని పరుగులు జోడిస్తుందనేది ఆసక్తికరం. -
శుబ్మన్ గిల్ అవుట్!
టి20 వరల్డ్ కప్ జట్టు ఎంపికకు సంబంధించి సెలక్టర్లు అనూహ్య షాక్ ఇచ్చారు. వరుసగా విఫలమవుతున్నా, అంచనాలకు తగినట్లుగా ఆడలేకపోతున్నా పదే పదే తాము అండగా నిలిచిన శుబ్మన్ గిల్పై సరిగ్గా ప్రపంచ కప్కు ముందు వేటు వేశారు. భారత టెస్టు, వన్డే కెప్టెన్ అయిన ఆటగాడికి కనీసం ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టిన ఇషాన్ కిషన్ ప్రదర్శనను గుర్తిస్తూ జట్టులోకి తీసుకున్న సెలక్టర్లు, ఇప్పటికే రెండో కీపర్గా నిలదొక్కుకున్న జితేశ్పై వేటు వేశారు. ఫలితంగా ఫినిషర్గా మరోసారి రింకూ సింగ్కే అవకాశం దక్కింది. 2024లో విజేతగా నిలిచిన జట్టులోని ఎనిమిది మంది ఆటగాళ్లు ఈ సారి తమ స్థానాలు నిలబెట్టుకున్నారు.ముంబై: డిఫెండింగ్ చాంపియన్ హోదాలో సొంతగడ్డపై టి20 వరల్డ్ కప్ బరిలోకి దిగేందుకు భారత సైన్యం సిద్ధమైంది. టైటిల్ నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉన్న టీమిండియా జట్టుకు సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహిస్తాడు. 15 మంది సభ్యుల ఈ జట్టును అజిత్ అగార్కర్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. బ్యాటింగ్ ఫామ్తో సంబంధం లేకుండా కెప్టెన్సీ విషయంలో సూర్యకుమార్పైనే నమ్మకం ఉంచగా, వైస్ కెప్టెన్గా అక్షర్ పటేల్ను ఎంపిక చేశారు. ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంకలలో 2026 వరల్డ్ కప్ జరుగుతుంది. రెండేళ్ల తర్వాత... ఇషాన్ కిషన్ 2023 నవంబర్లో చివరిసారి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత వేర్వేరు కారణాలతో అతను జట్టుకు దూరమయ్యాడు. ప్రదర్శనపరంగా కాకుండా నాటి కోచ్ ద్రవిడ్ దృష్టిలో క్రమశిక్షణ తప్పిన కుర్రాడిగా ముద్ర పడింది. దేశవాళీ మ్యాచ్లు ఆడకపోవడంతో బీసీసీఐ హెచ్చరికకు కూడా గురయ్యాడు. ఇక భారత జట్టులో అటు పంత్, ఇటు సామ్సన్లతో పాటు జురేల్, జితేశ్ కూడా నిలదొక్కుకోవడంతో ప్రాధాన్యతపరంగా కిషన్ వెనుకబడిపోయాడు. దాంతో అతను తనను తాను మార్చుకున్నాడు. వరుసగా దేశవాళీ మ్యాచ్లు ఆడటంతో పాటు ఫిట్గా మారి నిలకడైన ప్రదర్శన కనబర్చాడు. క్రమశిక్షణ విషయంలో కూడా మరో ఫిర్యాదు రాకుండా జాగ్రత్తపడ్డాడు. చివరకు ఇటీవలి ముస్తాక్ అలీ ట్రోఫీతో ఒక్కసారిగా పైకెగిసాడు. ఏకంగా 517 పరుగులు చేయడంతో పాటు కెప్టెన్గా జార్ఖండ్ను చాంపియన్గా నిలపడంతో అందరి దృష్టీ పడేలా చేశాడు. ఫలితంగా అతను కూడా ఊహించని విధంగా వరల్డ్ కప్ టీమ్లో స్థానం లభించింది. ప్రత్యామ్నాయ ఓపెనర్ కం కీపర్గా అతను సిద్ధమయ్యాడు. ఆ ఇద్దరు ఇలా... దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్లో రింకూ సింగ్పై వేటు పడినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. అతని గురించి చెప్పేందుకు వైఫల్యాలేమీ లేవు. తనకు లభించిన పరిమిత అవకాశాల్లో అతను బాగానే ఆడాడు. కానీ వికెట్ కీపర్గా జితేశ్ను ఎంపిక చేస్తూ సెలక్టర్లు అతడిని ఫినిషర్ పాత్రను కూడా ఇచ్చారు. దాంతో రింకూకు అవకాశం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు గిల్పై వేటు సామ్సన్కు ఓపెనింగ్ స్థానం ఖాయం చేశారు. ఫలితంగా ఫినిషర్గా జితేశ్కంటే రింకూ మెరుగైన ఆటగాడని అగార్కర్ బృందం భావించింది. దాంతో జట్టులోకి మళ్లీ పిలుపు రాగా...పెద్దగా ప్రభావం చూపలేకపోయిన జితేశ్ను పక్కన పెట్టక తప్పలేదు.7 మార్పులు... 2024 చాంపియన్ జట్టులోని ఏడుగురు ఆటగాళ్లు ఈ సారి కనిపించడం లేదు. రోహిత్, కోహ్లి, జడేజా అప్పుడే రిటైర్మెంట్ ప్రకటించగా...జైస్వాల్, పంత్, చహల్, సిరాజ్ తమ స్థానాలు కోల్పోయారు. హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మకు ఇదే తొలి టి20 వరల్డ్ కప్ కానుంది.‘నిప్పు–నిప్పు కావాలి’అగార్కర్ సెలక్టర్గా వచ్చిన దగ్గరినుంచి గిల్ను అసాధారణ ఆటగాడిగా చెబుతూ అండగా నిలుస్తూ వచ్చాడు. చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత కూడా రోహిత్ను కాదని గిల్కు వన్డే కెప్టెన్సీ అప్పగించడంతో పాటు త్వరలోనే మూడు ఫార్మాట్లలో కూడా కెప్టెన్ అంటూ ప్రచారం చేశారు. ఐపీఎల్లో అతని నిలకడైన ప్రదర్శన కూడా టి20ల్లోనూ నమ్మకం కలిగించింది. ఇదే క్రమంలో దాదాపు ఏడాది తర్వాతి జట్టులోకి వచ్చినా నేరుగా అతనికి ఆసియా కప్ వైస్ కెప్టెన్సీ అప్పగించారు. అయితే బ్యాటింగ్ పరంగా ఓపెనింగ్లో గిల్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయా డు. ఒక వైపు అభిషేక్ శర్మ చెలరేగుతుండగా, మరో వైపు గిల్ నెమ్మదిగా ఆడుతూ వచ్చాడు. దీనికి ఆరంభంలో ‘నిప్పు–నీరు’ అంటూ కాంబినేషన్ గురించి సానుకూల వ్యాఖ్యలు చేసినా...ప్రస్తుతం టి20ల్లో ఓపెనింగ్ అంటే ‘నిప్పు–నిప్పు’గానే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. గిల్కు ఓపెనింగ్ ఇవ్వడంతో మూడు అంతర్జాతీయ టి20 సెంచరీల తర్వాత కూడా సంజు సామ్సన్ను పక్కన పెట్టాల్సి వచ్చింది. అతడిని అలవాటు లేని మిడిలార్డర్కు తీసుకురావడంతో సామ్సన్ కూడా ఆశించిన విధంగా ఆడకపోవడంతో గిల్పై విమర్శలు మొదలయ్యాయి. అయినా సరే టీమ్ మేనేజ్మెంట్ సమర్థిస్తూ వచ్చింది. స్ట్రయిక్ రేట్ తక్కువగా ఉండటమే కాదు అసలు పరుగులు రావడమే గగనంగా మారిపోయింది. గత 18 ఇన్నింగ్స్లలో ఓపెనర్గా ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయకపోవడం పరిస్థితిని చూపిస్తోంది. శుక్రవారం దక్షిణాఫ్రికాపై గిల్ స్థానంలో వచ్చిన సామ్సన్ దూకుడుగా ఆడి తన విలువను మళ్లీ చూపించాడు. మరో వైపు సూర్యకుమార్ కూడా ఘోరంగా విఫలమవుతున్నా...కీలక టోర్నీకి ముందు ఇద్దరినీ ఒకే సారి తప్పించలేని పరిస్థితి వచ్చింది. పైగా ఇప్పుడు ఫామ్లో లేకపోయినా...అంతకు ముందే టి20ల్లో తన స్థాయిని సూర్యకుమార్ నిరూపించుకున్నాడు కాబట్టి అతనిపై ఎంతో కొంత నమ్మకం మిగిలి ఉంది. దాంతో గిల్పై వేటు పడింది. టీమ్ కాంబినేషన్ కారణంగానే 2024 టి20 వరల్డ్ కప్లో కూడా గిల్కు చోటు దక్కలేదు.భారత జట్టు వివరాలుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్ ), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు సామ్సన్, ఇషాన్ కిషన్, తిలక్వర్మ, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రాణా. -
క్రికెట్ నుంచి ఎన్బీఏ వరకు.. ఈ ఏడాది క్రీడా రంగాన్ని కుదిపేసిన వివాదాలు ఇవే
2025 సంవత్సరం.. క్రీడా రంగంలో అనేక విజయాలతో పాటు వివాదాలకు కూడా వేదికైంది. ఆసియాకప్ నో షేక్ హ్యాండ్ నుంచి ఎన్బీఏ (NBA) బెట్టింగ్ స్కామ్ వరకు చాలా వివాదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో టాప్-5 కాంట్రవర్సీలపై ఓ లుక్కేద్దాం.నో హ్యాండ్ షేక్..ఆసియాకప్-2025లో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా 'నో హ్యాండ్షేక్' వివాదం క్రీడా ప్రపంచంలో పెను సంచలనం సృష్టించింది. సాధారణంగా టాస్ సమయంలో, మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు, ఆటగాళ్లు కరచాలనం చేసుకోవడం ఒక సంప్రదాయం. కానీ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ సమయంలో పాక్ కెప్టెన్తో కరచాలనం చేయడానికి నిరాకరించారు. సూర్య బాటలోనే మిగితా భారత ప్లేయర్లు కూడా నడిచారు. టోర్నీ అసాంతం పాక్ ఆటగాళ్లతో భారత జట్టు అంటిముట్టనట్టుగానే వ్యవహరిచింది. ఈ వివాదంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి కూడా ఫిర్యాదు చేసింది. మ్యాచ్ రిఫరీని తప్పించాలని పీసీబీ డిమాండ్ చేసింది. కానీ ఐసీసీ మాత్రం పాక్ క్రికెట్ బోర్డు అందుకు అంగీకరించలేదు.ఆ తర్వాత ఆసియా కప్ గెలిచిన తర్వాత ఏసీసీ చైర్మెన్ మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి టీమిండియా నిరాకరించింది. నఖ్వీ ఏసీసీ చైర్మెన్తో పాటు పాకిస్తాన్ మంత్రిగా ఉండడంతో భారత్ ఆ నిర్ణయం తీసుకుంది. అయితే ఆసియాకప్లో చోటు చేసుకున్న ఉద్రిక్తల కారణంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాక్ పేసర్ హారిస్ రౌఫ్పై ఐసీసీ చర్యలు తీసుకుంది.ఈ ఏడాది అక్టోబర్లో అంతర్జాతీయ బాస్కెట్బాల్ అసోసియేషన్ (NBA)ని బెట్టింగ్ కుంభకోణం కుదిపేసింది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) చేసిన దాడులలో కొంతమంది బాస్కెట్బాల్ దిగ్గజాలు.. మాఫియా ముఠాలతో సంబంధం కలిగి ఉన్నట్లు తేలింది. ఆటగాళ్లు మాఫియా ముఠాలతో కలిసి ఇన్సైడర్ సమాచారాన్ని బెట్టింగ్ కోసం వాడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో మొత్తం 34 మందిని అరెస్టు చేశారు. ఈ కుంభకోణంలో చాన్సీ బిలప్స్, టెర్రీ రోజియర్, డామన్ జోన్స్ వంటి దిగ్గజాలు నిందితులగా ఉన్నారు.'గ్రోవెల్' (Grovel) వివాదంఈ ఏడాది నవంబర్లో భారత్తో జరిగిన రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 2-0 తేడాతో సౌతాఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. అయితే రెండో టెస్టు నాలుగో రోజు ఆటలో దక్షిణాఫ్రికా హెడ్ కోచ్ షుక్రీ నాడ్.. భారత జట్టును ఉద్దేశించి "గ్రోవెల్" (మా ముందు సాష్టాంగపడేలా చేస్తాం) అనే పదాన్ని వాడటం పెద్ద రచ్చకు దారితీసింది. ఇది జాత్యహంకారానికి ప్రతీకగా పరిగణించబడింది. దీనిపై సౌతాఫ్రికా మాజీ ఆటగాడు డేల్ స్టెయిన్ సైతం తప్పుబట్టాడు. ఆ తర్వాత షుక్రీ నాడ్ క్షమాపణలు చెప్పాడు.మెద్వెదేవ్ ఆగ్రహంయూఎస్ ఓపెన్ 2025 తొలి రౌండ్లోనే రష్యా టెన్నిస్ ఆటగాడు డానియిల్ మెద్వెదేవ్ వెనుదిరిగాడు. ఫ్రాన్స్ ప్లేయర్ బెంజమిన్ బోంజి చేతిలో ఓడిపోడంతో మెద్వెదేవ్ అసహనానికి గురయ్యాడు. అతడు తన రాకెట్ను అక్కడే విరగ్గొట్టాడు. అంతకుముందు కోర్టులో ప్రేక్షకులతోను అనుచితంగా ప్రవర్తించాడు. అంపైర్లతో కూడా వాగ్వాదానికి దిగాడు. దీంతో అతడికి 42,500 డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 37 లక్షలు) జరిమానాను నిర్వాహకులు విధించారు.హర్భజన్ సింగ్ అనుచిత వ్యాఖ్యలుఐపీఎల్-2025 సీజన్ సమయంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. వ్యాఖ్యాతగా వ్యహరించిన హర్భజన్.. ఇంగ్లండ్ ఫాస్ట్బౌలర్ జోఫ్రా ఆర్చర్ను లండన్లోని 'నల్ల టాక్సీ' (Kaali Taxi) తో పోల్చాడు. దీంతో జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడని భజ్జీపై విమర్శల వర్షం కురిసింది. -
'అతడు వరల్డ్ క్లాస్ బ్యాటర్.. నిజంగా ఇదొక సర్ప్రైజ్'
టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్కు టీ20 వరల్డ్కప్-2026 జట్టులో చోటు దక్కలేదు. మొన్నటివరకు వైస్ కెప్టెన్గా గిల్ను ఇప్పుడు ఏకంగా జట్టు నుంచే తప్పించారు. పేలవ ఫామ్ కారణంగా అతడిపై సెలక్టర్లు వేటు వేశారు. ఈ ఏడాది ఆసియాకప్తో తిరిగి టీ20 జట్టులోకి వచ్చిన గిల్ తన మార్క్ చూపించడంలో విఫలమయ్యాడు.అతడి కోసం ఇన్ ఫామ్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ను టీమ్ మెనెజ్మెంట్ పక్కన పెట్టింది. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికి గిల్పై మెనెజ్మెంట్ నమ్మకం ఉంచింది. కానీ ఆ నమ్మకాన్ని శుభ్మన్ నిలబెట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే అతడిని జట్టు నుంచి తప్పించారు.అయితే సెలక్టర్లు తీసుకున్న ఈ నిర్ణయంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గిల్ ప్రస్తుత ఫామ్ ఆందోళనకరంగా ఉన్నప్పటికి.. అతడిలోని టాలెంట్ ఎప్పటికి పోదు అని గవాస్కర్ అన్నారు."నిజంగా ఇది సర్ప్రైజ్. గిల్ ఒక క్వాలిటీ బ్యాటర్. టీ20 ప్రపంచకప్-2024 తర్వాత అతడు అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్లో కూడా పరుగులు సాధించాడు. అయితే దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్లో అతడు విఫలమయ్యాడు. అందుకు నేను అంగీకరిస్తా.కానీ ఫామ్ అనేది తాత్కాలికం, క్లాస్ అనేది శాశ్వతం. టీ20 ఫార్మాట్కు చాలా కాలం దూరంగా ఉండటం వల్లే గిల్ తన రిథమ్ను కోల్పోయాడు. టెస్టు క్రికెట్లో దుమ్ములేపుతున్న గిల్కు టీ20 శైలి అలవడటానికి కొంత సమయం పడుతుందని" స్టార్ స్పోర్ట్స్ షోలో గవాస్కర్ పేర్కొన్నాడు. కాగా శుభ్మన్ గిల్ స్ధానంలో జట్టులోకి వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ వచ్చాడు. రెండేళ్ల తర్వాత అతడికి సెలక్టర్లు పిలుపునిచ్చారు.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత జట్టు సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్.చదవండి: బీసీసీఐ సంచలన నిర్ణయం..! సూర్యకుమార్కు ఊహించని షాక్? -
విజయానికి చేరువలో ఆస్ట్రేలియా.. అదే జరిగితే?
అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న యాషెస్ మూడో టెస్టులో విజయానికి ఆస్ట్రేలియా 4 వికెట్ల దూరంలో నిలిచింది. 435 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్స్లోనూ దారుణ ప్రదర్శన కనబరిచింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఇంకా 228 రన్స్ వెనుకంజలో ఉంది. పర్యాటక జట్టు విజయం సాధించాలంటే ఏదైనా అద్భుతం జరగాలి. క్రీజులో జెమ్మీ స్మిత్ (2), విల్ జాక్స్ (11) ఉన్నారు. భారీ లక్ష్య చేధనలో ఇంగ్లీష్ జట్టును ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ దెబ్బకొట్టాడు. కీలకమైన మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ను బ్యాక్ఫుట్లో ఉంచాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జాక్ క్రాలీ(85) టాప్ స్కోరర్గా నిలవగా.. జోరూట్ (39) కాస్త ఫర్వాలేదన్పించాడు. ఆసీస్ బౌలర్లలో లియోన్తో పాటు పాట్ కమిన్స్ మూడు వికెట్లు పడగొట్టాడు.హెడ్ సూపర్ సెంచరీ..అంతకుముందు ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్లో 349 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్లో లభించిన ఆధిక్యాన్ని జోడించి ఇంగ్లండ్ ముందు 435 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (219 బంతుల్లో 170 , 16 ఫోర్లు, 2 సిక్స్లు) అద్భుత సెంచరీతో చెలరేగగా.. అలెక్స్ కారీ 72 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఐదు టెస్టుల సిరీస్లో ఆసీస్ 2-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్లో కూడా గెలిస్తే మరో రెండు టెస్టులు మిగిలూండగానే యాషెస్ సిరీస్ను కంగారులు సొంత చేసుకోనున్నారు.చదవండి: బీసీసీఐ సంచలన నిర్ణయం..! సూర్యకుమార్కు ఊహించని షాక్? -
బీసీసీఐ సంచలన నిర్ణయం..! సూర్యకుమార్కు ఊహించని షాక్?
టీ20 ప్రపంచకప్-2026కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. ఈ క్రమంలో వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్పై బీసీసీఐ సెలక్షన్ కమిటీ వేటు వేసింది. అతడి స్ధానంలో ఆల్రౌండర్ అక్షర్పటేల్ను తిరిగి వైస్ కెప్టెన్గా నియమించారు. అయితే ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న సూర్యకుమార్ యాదవ్ను మాత్రం కెప్టెన్గా సెలక్టర్లు కొనసాగించారు. కానీ వచ్చే ఏడాది ప్రపంచకప్ తర్వాత కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్ను తప్పించేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు తెలుస్తోంది.పేలవ ఫామ్లో సూర్య..స్కై కెప్టెన్గా జట్టును విజయపథంలో నడిపిస్తున్నప్పటికీ.. బ్యాటర్గా మాత్రం అట్టర్ప్లాప్ అయ్యాడు. ఒకప్పుడు టీ20 వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్గా కొనసాగిన ఈ ముంబై ఆటగాడు.. ఇప్పుడు రెండెంకెల స్కోర్ చేయడానికి కూడా కష్టపడుతున్నాడు. గత 14 నెలల్లో 24 టీ20 మ్యాచ్లు ఆడి ఒక్క హాఫ్ సెంచరీ కూడా సూర్య సాధించలేకపోయాడు. కెప్టెన్సీ భారం అతడి బ్యాటింగ్పై పడుతున్నట్లు బీసీసీఐ భావిస్తోంది.దీంతో అతడి స్దానంలో మరో ఆటగాడికి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలని బోర్డు నిర్ణయించుకున్నట్లు ఇండియా టూడే తమ కథనంలోపేర్కొంది. వాస్తవానికి సూర్యను కెప్టెన్సీ నుంచి ముందే తొలగించాలని భావించినప్పటికీ.. మరికొద్ది రోజుల్లోనే టీ20 ప్రపంచకప్ ఉండడంతో సెలక్టర్లు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు సమాచారం. మెగా టోర్నీ ముందు ప్రయోగాలు చేయడం ఇష్టం లేక సూర్యనే కెప్టెన్గా ఎంపిక చేశారు. సూర్యకు కెప్టెన్గా ఇదే చివరి ప్రపంచకప్ కావచ్చు.కెప్టెన్సీ రికార్డు అదర్స్..సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఇప్పటివరకు 35 మ్యాచ్లు ఆడిన భారత్.. ఏకంగా 28 విజయాలు సాధించింది. 5 మ్యాచ్ ఓడిపోగా.. మరో రెండింట ఫలితం రాలేదు. అతడి విజయశాతం 84.9%గా ఉంది. కానీ అతడి పేలవ ఫామ్ను టీమ్ మెనెజ్మెంట్ను ఆందోళన కలిగిస్తోంది.కెప్టెన్సీ రేసులో అక్షర్, హార్దిక్..!అయితే మూడు ఫార్మాట్లలో కెప్టెన్గా శుభ్మన్ గిల్ను ఎంపిక చేయాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అతడు ఏకంగా జట్టులోనే చోటు కోల్పోయాడు. అటువంటిది గిల్ను టీ20 కెప్టెన్గా చేస్తారంటే నమ్మశక్యం కావడం లేదు. టీ20 కెప్టెన్సీ రేసులో స్టార్ ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే అక్షర్ను తిరిగి వైస్ కెప్టెన్గా నియమించారని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరికొంతమంది హార్దిక్కు కెప్టెన్గా అనుభవం ఉందని, తిరిగి అతడికి జట్టు ప్గాలు అప్పగిస్తారని అంచనా వేస్తున్నారు. భారత జట్టుకు తదుపరి టీ20 కెప్టెన్ ఎవరో తెలియాలంటే ప్రపంచకప్ ముగిసే వరకు అగాల్సిందే.చదవండి: అతడొక అద్భుతం.. అయినా పక్కన పెట్టాల్సి వచ్చింది: అగార్కర్ -
సెలక్టర్ల కీలక నిర్ణయం.. మహ్మద్ షమీకి ఛాన్స్
జాతీయ జట్టుకు దూరంగా ఉన్న టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ మరోసారి దేశవాళీ క్రికెట్లో సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. విజయ్ హజారే ట్రోఫీ- 2025 వన్డే టోర్నీ కోసం బెంగాల్ జట్టుకు షమీ ఎంపికయ్యాడు. రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కనబరిచిన ఫామ్ను.. ఈ దేశవాళీ వన్డే టోర్నీలో కూడా కొనసాగించాలని షమీ భావిస్తున్నాడు. ఈ బెంగాల్ స్పీడ్ స్టార్ ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నాడు. డొమాస్టిక్ క్రికెట్లో అద్భుతాలు చేస్తున్నాడు. ప్రస్తుత దేశవాళీ సీజన్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 36 వికెట్లు పడగొట్టాడు. రంజీ ట్రోఫీలో నాలుగు మ్యాచ్లు ఆడి 20 వికెట్లు పడగొట్టిన షమీ.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 16 వికెట్లు తీసి బెంగాల్ తరఫున లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచాడు.బెంగాల్ జట్టులో షమీతో పాటు భారత పేసర్లు ఆకాశ్ దీప్, ముఖేష్ కుమార్ సైతం చోటు దక్కించుకున్నారు. ఈ జట్టు కెప్టెన్గా వెటనర్ అభిమన్యు ఈశ్వరన్ వ్యవహరించనున్నాడు. బెంగాల్ ఎలైట్ గ్రూప్-బిలో ఉంది. బెంగాల్ తమ తొలి మ్యాచ్లో 24న రాజ్కోట్ వేదికగా తలపడనుంది.షమీ విషయానికి వస్తే.. చివరగా భారత్ తరపున ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆడాడు. అప్పటి నుంచి ఫిట్నెస్ సమస్యలు అంటూ అతడిని తీసుకోవడం లేదు. కానీ షమీ మాత్రం దేశవాళీ క్రికెట్లో క్రమం తప్పకుండా ఆడుతున్నాడు. ప్రస్తుతం భారత జట్టులో సీనియర్ ఫాస్ట్ బౌలర్లు లేని లోటు స్పష్టంగా కన్పిస్తోంది.విజయ్ హజారే ట్రోఫీకి బెంగాల్ జట్టుఅభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), అనుస్తుప్ మజుందార్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సుదీప్ ఘరామి, సుమంత్ గుప్తా, సుమిత్ నాగ్ (వికెట్ కీపర్), చంద్రహాస్ డాష్, షాబాజ్ అహ్మద్, కరణ్ లాల్, మహ్మద్ షమీ, ఆకాశ్ దీప్, ముఖేష్ కుమార్, సయన్ ఘోష్, రవి కుమార్, అమీర్ ఘనీ, విశాల్ భాటి, అంకిత్ మిశ్రా.చదవండి: అతడొక అద్భుతం.. అయినా పక్కన పెట్టాల్సి వచ్చింది: అగార్కర్ -
అతడొక అద్భుతం.. అయినా పక్కన పెట్టాల్సి వచ్చింది: అగార్కర్
టీ20 ప్రపంచకప్-2026 కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయితే అజిత్ అగార్కర్ నేతృత్వంలోని కమిటీ బీసీసీఐ సెలక్షన్ కమిటీ వరల్డ్కప్ జట్టులో ఊహించని మార్పులు చేసింది. ఏకంగా వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్పైనే వేటు వేశారు. ఈ మెగా టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో గిల్కు చోటు దక్కలేదు.అతడి స్దానంలో అక్షర్ పటేల్ను తిరిగి వైస్ కెప్టెన్గా ఎంపిక చేశారు. అదేవిధంగా సెలక్టర్లు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాదాపు రెండేళ్లగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్కు పిలిపునిచ్చారు. దీంతో నిన్నటివరకు జట్టులో ఉన్న వికెట్ కీపర్ జితీష్ శర్మను పక్కన పెట్టేశారు.తను ఆడిన ప్రతీ మ్యాచ్లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచిన జితీష్పై వేటు వేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే జితేష్ శర్మను ఎంపిక చేయకపోవడంపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు. జట్టు కాంబినేషన్ల కోసమే జితీష్ను పక్కన పెట్టినట్లు అజిత్ తెలిపాడు."టీ20ల్లో శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా ఉన్నాడు. కానీ ఇప్పుడు జట్టు కాంబినేషన్ల దృష్ట్యా అతడికి వరల్డ్కప్ జట్టులో చోటు దక్కలేదు. అదేవిధంగా టాప్ ఆర్డర్లో ఆడే వికెట్ కీపర్ మాకు కావాలి. సంజూ శాంసన్ మాకు ప్రధాన వికెట్ కీపర్, ఓపెనర్గా ఉన్నాడు. సంజూకు బ్యాకప్ ఓపెనర్, వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్ సరైనోడు అని భావించాము.అతడికి ఓపెనర్గా అనుభవం ఉంది. అందుకే జితేష్కు బదులుగా కిషన్ను జట్టులో తీసుకున్నాడు. అలాగే లోయార్డర్లో రింకూ సింగ్ ఫినిషర్గా ఉంటాడు. బ్యాటింగ్ ఆర్డర్లో జితీష్ స్ధానాన్ని రింకూ భర్తీ చేస్తాడు. జితీష్ అద్బుతమైన ప్లేయర్ అయినప్పటికి జట్టు కాంబినేషన్ కోసం ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు" అని ప్రెస్ కాన్ఫరెన్స్లో అగార్కర్ పేర్కొన్నాడు. కాగా సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్కు రింకూ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.అతడి స్ధానంలో జితీష్ ఫినిషర్గా కొనసాగాడు. ఇప్పుడు వరల్డ్కప్లో రింకూ ఫినిషర్గా బాధ్యతలు తీసుకోనున్నాడు. ఇక కిషన్ కూడా ప్రస్తుతం అద్భతమైన ఫామ్లో ఉన్నాడు. ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) కిషన్ దుమ్ములేపాడుఏ. 10 మ్యాచ్లలో 57.44 సగటుతో 571 పరుగులు చేశాడు. ఫైనల్లో సంచలన సెంచరీతో చెలరేగిన కిషన్.. జార్ఖండ్కు తొలిసారి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని అందించాడు.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత జట్టు సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్. -
అందుకే గిల్ను సెలక్ట్ చేయలేదు: అజిత్ అగార్కర్
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. వరుస మ్యాచ్లలో విఫలమవుతున్నా ఇన్నాళ్లు టీ20 జట్టు ఓపెనర్గా కొనసాగించిన శుబ్మన్ గిల్ (Shubman Gill)పై ఎట్టకేలకు వేటు వేసింది. ఊహించని రీతిలో ప్రపంచకప్-2026 జట్టు నుంచి అతడిని తప్పించింది.వైస్ కెప్టెన్గా రీఎంట్రీటీమిండియా టెస్టు, వన్డే జట్ల కెప్టెన్గా.. టీ20 జట్టు వైస్ కెప్టెన్గా ఉన్న గిల్ విషయంలో బీసీసీఐ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. కాగా ఆసియా టీ20 కప్-2025 టోర్నమెంట్తో వైస్ కెప్టెన్గా భారత జట్టులో రీఎంట్రీ ఇచ్చాడు గిల్.దీంతో దాదాపు ఏడాది కాలంపాటు అభిషేక్ శర్మ (Abhishek Sharma)తో కలిసి ఓపెనర్గా సత్తా చాటిన సంజూ శాంసన్కు కష్టాలు మొదలయ్యాయి. గిల్ను అభిషేక్ జోడీగా ఆడించిన యాజమాన్యం.. సంజూను తొలుత వన్డౌన్లో.. ఆ తర్వాత మిడిలార్డర్కు పంపింది. క్రమక్రమంగా తుదిజట్టు నుంచే తప్పించింది.వరుస మ్యాచ్లలో విఫలం వికెట్ కీపర్గానూ సంజూకు బదులు ఫినిషర్గా ఉపయోగపడే జితేశ్ శర్మకు ప్రాధాన్యం ఇచ్చింది. అయితే, సంజూ స్థానంలో ఓపెనర్గా తిరిగి వచ్చిన గిల్ వరుస మ్యాచ్లలో విఫలమయ్యాడు. అంతకు ముందు కూడా అతడి ప్రదర్శన అంతంత మా త్రమే.గత ఇరవై ఒక్క ఇన్నింగ్స్లో గిల్ సాధించిన స్కోర్లు వరుసగా.. 20(9), 10(7), 5(8), 47(28), 29(19), 4(3), 12(10), 37*(20), 5(10), 15(12), 46(40), 29(16), 4(2), 0(1).చివరగా సౌతాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్లో తొలి రెండు మ్యాచ్లలో తీవ్రంగా నిరాశపరిచిన గిల్ (4(2), 0(1)).. మూడో టీ20లో 28 బంతుల్లో 28 పరుగులు చేయగలిగాడు. అయితే, పాదానికి గాయమైన కారణంగా ఆఖరి రెండు టీ20ల నుంచి అతడు తప్పుకొన్నాడు. ఈ క్రమంలో నాలుగో టీ20 పొగమంచు వల్ల రద్దు కాగా.. ఐదో టీ20తో సంజూ తుదిజట్టులోకి వచ్చాడు.నిరూపించుకున్న సంజూఅహ్మదాబాద్ వేదికగా ధనాధన్ ఇన్నింగ్స్ (22 బంతుల్లో 37) ఆడి తన సత్తాను మరోసారి నిరూపించుకున్నాడు సంజూ. గిల్ మూడు మ్యాచ్లలో కలిపి చేసిన పరుగుల కంటే ఒక్క ఇన్నింగ్స్లోనే సంజూనే ఎక్కువ పరుగులు చేయడం విశేషం.ఈ పరిణామాల నేపథ్యంలో మరోసారి మేనేజ్మెంట్ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. గిల్ కోసం ఇంకెన్నాళ్లు సంజూను బలిచేస్తారని రవిశాస్త్రి వంటి మాజీ క్రికెటర్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఏకంగా ప్రపంచకప్ జట్టు నుంచే గిల్ను తప్పించడం సంచలనంగా మారింది.అందుకే గిల్ను సెలక్ట్ చేయలేదుఈ విషయం గురించి జట్టు ప్రకటన సందర్భంగా టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు. విలేకరుల ప్రశ్నకు బదులిస్తూ... ‘‘శుబ్మన్ గిల్ పరుగులు రాబట్టడంలో వెనుకబడ్డాడు. 2024 వరల్డ్కప్ జట్టులోనూ అతడు లేడు.మీ, నా అభిప్రాయాలు వేర్వేరుగా ఉండవచ్చు. కొన్నిసార్లు జట్టు ఎంపిక అత్యంత క్లిష్టంగా ఉంటుంది. గిల్ ఇప్పటకీ నాణ్యమైన ఆటగాడే అని మేము నమ్ముతున్నాం. ఫామ్ విషయంలో ప్రతి ఒక్కరి కెరీర్లో ఎత్తుపళ్లాలు సహజమే.అయితే, జట్టు కూర్పునకు అనుగుణంగా ఆటగాళ్లను ఎంపిక చేయాల్సి ఉంటుంది. అలాంటపుడు కొందరికి స్థానం దక్కదు. అతడు మెరుగైన ఆటగాడు కాదు కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకున్నామని అనుకోకూడదు. అదృష్టవశాత్తూ భారత క్రికెట్లో మనకెన్నో మంచి మంచి ఆప్షన్లు ఉన్నాయి’’ అని అగార్కర్ స్పష్టం చేశాడు. చదవండి: రోహిత్ శర్మ యూటర్న్! -
గిల్కు భారీ షాక్.. వరల్డ్ కప్ జట్టులోకి ఎవరూ ఊహించని ప్లేయర్
టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్కు బీసీసీఐ భారీ షాకిచ్చింది. టీ20 ప్రపంచకప్-2026కు ప్రకటించిన భారత జట్టులో గిల్కు చోటు దక్కలేదు. అతడి స్ధానంలో తిరిగి ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను వైస్ కెప్టెన్గా బీసీసీఐ సెలక్షన్ కమిటీ నియమించింది.ఈ ఏడాది ఆసియాకప్తో తిరిగి టీ20 జట్టులోకి వచ్చిన గిల్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. సౌతాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచ్ల సిరీస్లో కూడా గిల్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. తొలి మూడు మ్యాచ్లలో ఘోరంగా విఫలమైన గిల్ను ఆఖరి రెండు టీ20లకు గాయం పేరిట టీమ్ మెనెజ్మెంట్ పక్కన పెట్టింది. దీంతో అతడి స్దానంలో జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్ మరోసారి తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దీంతో ఇకపై సంజూను ఓపెనర్గా కొనసాగించాలని మెనెజ్మెంట్ నిర్ణయించారు. ఈ కారణంతోనే గిల్ను వరల్డ్కప్ జట్టు నుంచి పక్కన పెట్టారు. ఈ విషయాన్ని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ సైతం ధ్రువీకరించాడు. గిల్ పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్నాడని, గత టీ20 వరల్డ్కప్లో కూడా అతడు ఆడలేదని అగార్కర్ వెల్లడించాడు.కిషన్కు ఛాన్స్..!ఇక వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ రెండేళ్ల తర్వాత భారత జట్టుకు ఎంపికయ్యాడు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ కిషన్ను వరల్డ్కప్ జట్టులోకి తీసుకుంది. అయితే నిన్నటి వరకు టీ20 జట్టులో భాగంగా ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్ జితీష్ శర్మపై సెలక్టర్లు వేటు వేశారు. అతడి స్ధానంలోనే సెకెండ్ వికెట్ కీపర్గా కిషన్ను సెలక్ట్ చేశారు. అదేవిధంగా సౌతాఫ్రికా సిరీస్కు దూరంగా ఉన్న ఫినిషర్ రింకూ సింగ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ రెండు మార్పులు మినహా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడిన జట్టునే వరల్డ్కప్ టోర్నీకి ఎంపిక చేశారు. ఇదే జట్టు న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో తలపడనుంది.కిషన్ చివరగా భారత్ తరపున 2023లో ఆడాడు. దేశవాళీ టోర్నీల్లో అద్భుతప్రదర్శన కనబరుస్తుండడంతో సెలక్టర్లు తిరిగి జట్టులోకి తీసుకున్నారు. కాగా టీ20 వరల్డ్కప్-2026 ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత జట్టు సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్. -
BCCI: వరల్డ్కప్ టోర్నీకి భారత జట్టు ప్రకటన.. గిల్ అవుట్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తమ జట్టును ప్రకటించింది. సొంతగడ్డపై జరిగే ఈ ఐసీసీ ఈవెంట్లో పాల్గొనే పదిహేను మంది సభ్యులతో కూడిన వివరాలను శనివారం వెల్లడించింది. స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లోనూ ఇదే జట్టు ఆడుతుందని బోర్డు స్పష్టం చేసింది. ఇక అనూహ్య రీతిలో.. వైస్ కెప్టెన్గా ఉన్న గిల్ (Shubman Gill)కు ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కలేదు. అతడి స్థానంలో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel) సూర్య డిప్యూటీగా నియమితుడయ్యాడు. మరోవైపు.. జితేశ్ శర్మ విషయంలోనూ యాజమాన్యం ఊహించని నిర్ణయం తీసుకుంది.జితేశ్కూ దక్కని చోటు.. దూసుకు వచ్చిన ఇషాన్తుదిజట్టులో గిల్ ఉండేలా.. సంజూ ఓపెనింగ్ స్థానం త్యాగం చేయించిన మేనేజ్మెంట్.. వికెట్ కీపర్గా జితేశ్కు పెద్ద పీట వేసి లోయర్ ఆర్డర్లో ఆడించింది. అయితే, ప్రపంచకప్ జట్టు నుంచి జితేశ్ను తప్పించి.. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ కెప్టెన్గా, బ్యాటర్గా దుమ్ములేపిన ఇషాన్ కిషన్ను తీసుకువచ్చింది. అతడిని బ్యాకప్ ఓపెనర్గా ఉపయోగించుకుంటామని తెలిపింది.అదే విధంగా.. నయా ఫినిషర్గా పేరొందిన రింకూ సింగ్ను మేనేజ్మెంట్ కనికరించింది. మరోసారి వరల్డ్కప్ జట్టులో భాగమయ్యే అవకాశం ఇచ్చింది. ఇక వరుస వైఫల్యాల నేపథ్యంలోనే గిల్ను జట్టు నుంచి తప్పించినట్లు స్పష్టమవుతోంది. కాగా భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న వరల్డ్కప్ టోర్నీకి ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య షెడ్యూల్ ఖరారైంది. కొత్తగా బీసీసీఐ కార్యదర్శిఈసారి బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా.. టీమిండియా టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆయనే జట్టును కూడా ప్రకటించడం విశేషం.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత జట్టు సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్.చదవండి: WC 2026: ఒకప్పుడు విలన్.. ఈసారి హీరో అవుతాడా?.. ‘ఎక్స్ ఫ్యాక్టర్’ ఎవరంటే? -
ఒకప్పుడు విలన్.. ఈసారి హీరో అవుతాడా?
టీ20 ప్రపంచకప్-2021లో ఆడింది మూడు మ్యాచ్లు.. పదకొండు ఓవర్ల బౌలింగ్లో 75 పరుగులు సమర్పించుకున్నాడు.. అయితే, కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. పాకిస్తాన్తో మ్యాచ్లో ఏకంగా 33 పరుగులు ఇచ్చుకున్న సదరు భారత బౌలర్.. న్యూజిలాండ్తో మ్యాచ్లో 23, అఫ్గనిస్తాన్తో మ్యాచ్లో 19 పరుగులు ఇచ్చాడు.మిస్టరీ స్పిన్నర్తో ఫలితాలు రాబట్టవచ్చని జట్టులోకి తీసుకుంటే అతడి వల్ల జట్టుకు పెద్దగా ప్రయోజనమేమీ చేకూరలేదు. అలా తొలి ప్రపంచకప్ టోర్నీయే అతడికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. కీలక మ్యాచ్లలో వికెట్లు తీయకపోవడంతో కొందరు అభిమానులు సైతం అతడిని ఓ భారంగా, విలన్గా అభివర్ణించారు కూడా!ఇక అతడి పని అయిపోయినట్లేనని అంతా భావించారు. అనుకున్నట్లుగానే జాతీయ జట్టులో చోటు కరువైంది. కానీ అతడు ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. పట్టుదలగా శ్రమించాడు. ఐపీఎల్లో సత్తా చాటి తనను తాను మరోసారి నిరూపించుకున్నాడు. అతడు ప్రాతినిథ్యం వహించిన జట్టుకు మెంటార్గా ఉన్న వ్యక్తి టీమిండియా హెడ్కోచ్గా రావడంతో అతడి పునరాగమనానికి బాటలు పడ్డాయి.ముఖ్యంగా టీ20 జట్టులో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈసారి 2.0 వర్షన్ చూపించాడు అతడు!.. ఈ ఏడాది టీమిండియా 20 టీ20లలో ఏకంగా 36 వికెట్లు కూల్చాడు. తద్వారా టెస్టు హోదా ఉన్న దేశాలపై ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక వికెట్లు కూల్చిన రెండో బౌలర్గా నిలిచాడు.రీఎంట్రీలో సూపర్ హిట్అవును.. ఈ ఉపోద్ఘాతమంగా వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) గురించే!.. గత కొంతకాలంగా భారత టీ20 జట్టులో ఈ మిస్టరీ స్పిన్నర్దే కీలక పాత్ర. పరిస్థితులకు అనుగుణంగా ఆడుతూ... మ్యాచ్ను తమవైపు తిప్పగల సత్తా ఉందని నమ్మిన మేనేజ్మెంట్కు అందుకు తగ్గ ఫలితాలు చూపించాడు. మొత్తంగా రీఎంట్రీలో అతడు ఏకంగా 49 వికెట్లు కూల్చడం అతడి నిలకడైన ప్రదర్శనకు నిదర్శనం.తాజాగా సౌతాఫ్రికాతో ముగిసిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లోనూ వరుణ్ చక్రవర్తి అదరగొట్టాడు. తన వైవిధ్యభరితమైన బౌలింగ్తో గూగ్లీ, క్యారమ్ బాల్, స్లేడర్.. ఇలా వివిధ రీతుల్లో బంతులు సంధిస్తూ బ్యాటర్లను తిప్పలు పెడుతూ వికెట్లు పడగొట్టాడు. అతడి లైన్ అండ్ లెంగ్త్ కూడా ఓ పట్టాన బ్యాటర్కు అర్థం కాదు.అద్భుతమైన ఆట తీరుతో ప్రత్యర్థిని ఒత్తిడికి గురిచేసి.. భారీ భాగస్వామ్యాలను విడదీయడంలోనూ వరుణ్ దిట్ట. వికెట్లు తీయడం మీద మాత్రమే అతడి దృష్టి మొత్తం కేంద్రీకృతమై ఉంటుంది. 2025లో అతడి ఎకానమీ 6.7గా ఉంది.తాజాగా అహ్మదాబాద్లో ఐదో టీ20లోనూ వరుణ్ చక్రవర్తి నాలుగు వికెట్లు కూల్చి సత్తా చాటాడు. ఓవరాల్గా ఈ సిరీస్లో నాలుగు మ్యాచ్లలో కలిపి పది వికెట్లు పడగొట్టి.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.ఒకప్పుడు విలన్.. ఇపుడు హీరోఇక ఈసారి టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత్- శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఉపఖండ పిచ్లపై జరిగే ఈ మెగా టోర్నీలో టీమిండియాకు వరుణ్ చక్రవర్తి ‘ఎక్స్’ ఫ్యాక్టర్ కాబోతున్నాడు. ఆటలో నైపుణ్యమే కాదు.. ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న వరుణ్.. డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా మరోసారి విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించడం పక్కా. గత ఏడాది కాలంగా అతడి గణాంకాలు, నిలకడైన ఆటే ఇందుకు నిదర్శనం.అట్లు ఇటీవల ఆసియా కప్-2025 టీ20లో భారత్ చాంపియన్గా నిలవడంలో వరుణ్దే ముఖ్య పాత్ర. పవర్ ప్లే, మిడిల్ ఓవర్లలో ప్రభావం చూపిన ఈ రైటార్మ్ లెగ్బ్రేక్ స్పిన్నర్ మొత్తంగా తొమ్మిది వికెట్లు కూల్చి.. టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఆ తర్వాత కూడా వరుసమ్యాచ్లలో అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుని.. ఐసీసీ నంబర్ వన్ టీ20 బౌలర్గా ఈ ఏడాదిని ముగించాడు.కాగా 2021 టీ20 ప్రపంచకప్ టోర్నీలో కనీసం సెమీస్ చేరకుండానే నిష్క్రమించిన టీమిండియా 2022లో సెమీ ఫైనల్ చేరినా ఆఖరి వరకు పోరాడలేకపోయింది. 2024లో అత్యుత్తమ ప్రదర్శనతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి టైటిల్ గెలుచుకుంది. చదవండి: రోహిత్ శర్మ యూటర్న్! -
T20 Match: భారత్– శ్రీలంక జట్లు ముమ్మర ప్రాక్టీస్
విశాఖ స్పోర్ట్స్ : భారత్ – శ్రీలంక మహిళా జట్ల మధ్య టీ20 సిరీస్ కోసం రంగం సిద్ధమైంది. తొలి మ్యాచ్ ఆదివారం జరగనుండగా.. రెండో మ్యాచ్ 23న జరగనుంది. శుక్రవారం వైఎస్సార్ స్టేడియంలో ఇరు జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేశాయి. వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్కు సన్నాహకంగా భావిస్తున్న ఈ సిరీస్లో తొలి రెండు మ్యాచ్లు విశాఖ వేదికగా ఫ్లడ్లైట్ల వెలుతురులో జరగనుండగా మిగిలిన మూడు మ్యాచ్లు తిరువనంతపురంలో నిర్వహించనున్నారు. శ్రీలంక జట్టు ఈసారి యువ స్పిన్నర్లతో భారత్ను కట్టడి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ముఖ్యంగా రెండు చేతులతోనూ స్పిన్ చేయగల సామర్థ్యం ఉన్న శశినితో పాటు కావ్య, రష్మిక వంటి యువ క్రీడాకారిణులు ఆ జట్టుకు అదనపు బలంగా మారారు. కెప్టెన్ చమరి ఆటతో పాటు ఇనోకా బౌలింగ్ కూడా లంకకు కీలకం కానుంది. బ్యాటింగ్ విభాగంలో ఇటీవల వరల్డ్ కప్లో రాణించిన హాసిని, విష్మి, హరిషత, నీలాక్షిక వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో శ్రీలంక పటిష్టంగా కనిపిస్తోంది.బలంగా టీమిండియామరోవైపు భారత జట్టు కూడా సిరీస్ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా జట్టులో కీలక మార్పులు చేసింది. రాధ, యాస్టికా, నయాలి స్థానాల్లో వికెట్ కీపర్ బ్యాటర్ కమలిని, స్పిన్నర్ వైష్ణవిలను తుది జట్టులోకి తీసుకుంది. ప్రాక్టీస్ సెషన్లో చురుగ్గా పాల్గొన్న వీరిద్దరూ విశాఖ వేదికగా టీ20 అరంగేట్రం చేయబోతున్నారు. భారత జట్టుకు హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్గా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు దీప్తి, షఫాలీ, జెమిమా, రిచా వంటి స్టార్ క్రీడాకారిణులు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించనున్నారు. తొలి మ్యాచ్లో విజయం సాధించి సిరీస్లో శుభారంభం చేయాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. -
గిల్ గాయపడితే ఇతడిని ఆడిస్తారా?: రవిశాస్త్రి ఫైర్
గత ఏడాది కాలంగా భారత టీ20 జట్టులో సంజూ శాంసన్ కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు. అభిషేక్ శర్మకు సరైన ఓపెనింగ్ జోడీగా వచ్చి వరుస శతకాలతో అలరించాడు. కానీ ఆసియా టీ20 కప్-2025 సందర్భంగా వైస్ కెప్టెన్గా శుబ్మన్ గిల్ రీఎంట్రీ ఇవ్వడంతో సంజూ స్థానం గల్లంతైంది.గిల్ వరుస వైఫల్యాలుగిల్ను ఆడించే క్రమంలో సంజూను తొలుత మూడో స్థానంలో.. ఆ తర్వాత మిడిలార్డర్లో ఒకటీ రెండు మ్యాచ్లలో ఆడించి.. అనంతరం తుదిజట్టు నుంచే తప్పించింది యాజమాన్యం. మరోవైపు.. గిల్ (Shubman Gill) పునరాగమనంలో దారుణంగా విఫలమయ్యాడు. ఇప్పటి వరకు కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు.సంజూ ధనాధన్సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లో మూడు మ్యాచ్లలో కలిపి గిల్ కేవలం 33 పరుగులే చేశాడు. ఇందులో ఓ గోల్డెన్ డక్ కూడా ఉంది. ఇక పాదానికి గాయమైన కారణంగా గిల్ సౌతాఫ్రికా (IND vs SA)తో ఆఖరిదైన ఐదో టీ20కి దూరమయ్యాడు. దీంతో సంజూ (Sanju Samson)కు తుదిజట్టులో చోటు ఇచ్చిన మేనేజ్మెంట్ ప్రయోగాలకు వెళ్లకుండా ఈసారి అతడిని ఓపెనర్గానే పంపింది.వచ్చిన అవకాశాన్ని సంజూ సద్వినియోగం చేసుకున్నాడు. కేవలం 22 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 37 పరుగులు సాధించాడు. అయితే, జార్జ్ లిండే అద్భుత బంతితో సంజూను బౌల్డ్ చేశాడు. కాగా గిల్ మూడు మ్యాచ్లలో కలిపి చేసిన పరుగుల కంటే కూడా సంజూ ఈ ఒక్క ఇన్నింగ్స్లో చేసిన పరుగులే ఎక్కువ కావడం గమనార్హం.గిల్ గాయపడితే ఇతడిని ఆడిస్తారా?ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి మేనేజ్మెంట్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కామెంట్రీలో భాగంగా మాట్లాడుతూ.. ‘‘తుదిజట్టులో అతడు అసలు ఎందుకు లేడు? ఇలాంటి ఆటగాడిని పక్కనపెడతారా? ఓ ఆటగాడు గాయపడితే అతడి స్థానంలో ఇతడిని ఆడిస్తారా?టాపార్డర్లో సంజూ సహజమైన శైలిలో ఆడగలడు. సౌతాఫ్రికా గడ్డ మీద టీ20 క్రికెట్లో వరుస సెంచరీలు బాదాడు. అతడొక విధ్వంసకర బ్యాటర్, డేంజరస్ ప్లేయర్. అద్భుతమైన షాట్లు ఆడటంలో దిట్ట. అయినా సరే అతడిని పక్కనపెడతారా?’’ అంటూ రవిశాస్త్రి యాజమాన్యం విధానాలను తప్పుబట్టాడు.కాగా అహ్మదాబాద్తో సౌతాఫ్రికాతో ఐదో టీ20 సందర్భంగా సంజూ శాంసన్ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన పద్నాలుగో భారత బ్యాటర్గా నిలిచాడు. ఓవరాల్గా టీ20 క్రికెట్లో 8 వేల పరుగుల మార్కును అందుకుని.. ఈ ఫీట్ నమోదు చేసిన ఏడో భారత బ్యాటర్గా అరుదైన జాబితాలో చోటు సంపాదించాడు. చదవండి: రోహిత్ శర్మ యూటర్న్!1000 T20I runs ✅8000 T20 runs ✅@IamSanjuSamson crosses some big milestones in splendid style! 🤩#INDvSA 5th T20I | LIVE NOW 👉 https://t.co/adG06ykx8o pic.twitter.com/F8O8ZAUz19— Star Sports (@StarSportsIndia) December 19, 2025 -
అతడు ఎక్కడో తప్పిపోయాడు.. వీళ్లు అద్భుతం: సూర్యకుమార్
సౌతాఫ్రికాతో ఐదో టీ20లో గెలిచిన టీమిండియా ఈ ఏడాదిని విజయంతో ముగించింది. స్వదేశంలో సత్తా చాటి ప్రొటిస్ జట్టును 3-1తో ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది. ఈ ఐదు మ్యాచ్ల సిరీస్ ఆసాంతం బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలతో విమర్శలు మూటగట్టుకున్న టీమిండియా విజయంతోనే సమాధానమిచ్చింది.అయితే, ఈ సిరీస్ మొత్తంలో బ్యాటర్గా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) విఫలమయ్యాడు. టీ20 సారథిగా పూర్తిస్థాయిలో బాధ్యతలు చేపట్టిన తర్వాత గత 14 నెలలుగా అతడి ఫామ్ ఆందోళనకరంగా మారింది. సౌతాఫ్రికాతో తాజా సిరీస్లో మొత్తం కలిపి కేవలం 34 పరుగులు (నాలుగు ఇన్నింగ్స్) మాత్రమే చేయడం గమనార్హం.దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నాంసౌతాఫ్రికాతో ఐదో టీ20లో విజయానంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ తన ఫామ్పై స్పందించాడు. ‘‘ఈ సిరీస్లో ఎలా ఆడాలని అనుకున్నామో.. ఆది నుంచి అదే విధంగా ఆడి ఫలితాన్ని రాబట్టాము. మేమేమీ కొత్తగా ట్రై చేయలేదు. ప్రతి విభాగంలోనూ పటిష్టం కావాలని భావించాము. అందుకు తగ్గ ఫలితం మీ కళ్ల ముందే ఉంది.దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నాం. ఈరోజు అది అద్భుతమైన ఫలితం ఇచ్చింది. బుమ్రా (Jasprit Bumrah)తో పవర్ ప్లేలో ఒక్క ఓవర్ మాత్రమే వేయించి.. డెత్ ఓవర్లలోనూ వాడాలని అనుకున్నాము. ఈ సిరీస్లో మేము ప్రయత్నించాలనుకున్న ప్రతి ఒక్కటి ప్రయత్నించి చూశాము.అతడు ఎక్కడో తప్పిపోయాడుఅయితే, ‘సూర్య ది బ్యాటర్’ని మాత్రం మేము మిస్సయ్యాము. అతడు ఎక్కడో తప్పిపోయాడు. త్వరలోనే స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇస్తాడు’’ అని సూర్యకుమార్ యాదవ్ బ్యాటర్గా తన వైఫల్యాన్ని అంగీకరించాడు. ఏదేమైనా జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నానని.. కష్టాల్లో ఉన్న ఎవరో ఒక ఆటగాడు ముందుకు వచ్చి బాధ్యత తీసుకోవడం గొప్ప విషయమని సహచర ఆటగాళ్లను ప్రశంసించాడు. కాగా ఐదో టీ20లో సూర్య ఐదు పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు.టెస్టులలో వైట్వాష్.. వైట్బాల్ సిరీస్లు కైవసంకాగా స్వదేశంలో సౌతాఫ్రికా చేతిలో టెస్టుల్లో 2-0తో వైట్వాష్కు గురైన టీమిండియా.. వన్డే సిరీస్ను 2-1తో గెలుచుకుంది. తాజాగా అహ్మదాబాద్లో శుక్రవారం నాటి ఐదో టీ20లో గెలిచి 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది. తదుపరి న్యూజిలాండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ అనంతరం.. భారత టీ20 జట్టు సొంతగడ్డపై జరిగే ప్రపంచకప్-2026 టోర్నమెంట్ బరిలో దిగనుంది. Team India seal it in style! 🇮🇳🏆 A 3–1 series win and their 8th straight bilateral T20I series triumph.#INDvSA 5th T20I Match Highlights 👉 https://t.co/Sp7QQIzWtp pic.twitter.com/MyM6LVIHTE— Star Sports (@StarSportsIndia) December 19, 2025చదవండి: రోహిత్ శర్మ యూటర్న్! -
మరోసారి మెగా ఫైనల్లో భారత్ X పాకిస్తాన్
మరోసారి మెగా ఫైనల్లో భారత్- పాకిస్తాన్ తలపడనున్నాయి. ఏసీసీ మెన్స్ ఆసియా కప్-2025 టోర్నీ టైటిల్ పోరులో దాయాదులు అమీతుమీ తేల్చుకోనున్నాయి. కాగా దుబాయ్ వేదికగా శుక్రవారం జరిగిన తొలి సెమీస్లో ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) సారథ్యంలోని భారత్ 8 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయఢంకా మోగించిన విషయం తెలిసిందే. ఐసీసీ అకాడమీ గ్రౌండ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. పవర్ప్లేలో 28 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన లంకను కాసేపు కెప్టెన్ విమత్ దిన్సార (32; 4 ఫోర్లు), చమిక హీనతిగల (42; 3 ఫోర్లు) ఆదుకున్నారు. ఇద్దరు తర్వాతి 6 ఓవర్ల పాటు వికెట్ పడనీయకుండా నాలుగో వికెట్కు 45 పరుగులు జతచేశారు.ఆఖర్లో సేత్మిక సేనెవిరత్నే (22 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో లంక 130 పైచిలుకు స్కోరు చేయగలిగింది. యువ భారత ఓపెనర్లు ఆయుశ్ మాత్రే (7), వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi- 9)లు విఫలమయ్యారు. 25/2 స్కోరు వద్ద లంక పండగ చేసుకుంది.విహాన్ మల్హోత్ర, ఆరోన్ జార్జ్ ధనాధన్అయితే, వైస్ కెప్టెన్ విహాన్ మల్హోత్ర (45 బంతుల్లో 61 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు), హైదరాబాదీ బ్యాటర్ ఆరోన్ జార్జ్ (49 బంతుల్లో 58 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధ శతకాలతో లంకేయుల ఆశలపై నీళ్లు చల్లారు. ఇద్దరు జట్టును గెలిపించేదాకా క్రీజును అట్టిపెట్టుకోవడంతో లంక బౌలర్లు ఆపసోపాలు పడ్డారు.అబేధ్యమైన మూడో వికెట్కు విహాన్, ఆరోన్ 114 పరుగులు జోడించారు. మూడు రోజుల క్రితం జరిగిన ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో లెఫ్ట్హ్యాండ్ బ్యాటర్ విహాన్ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీ ప్రాథమిక ధర రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. కాగా వర్షం వల్ల ఈ యూత్ వన్డేను 20 ఓవర్లకు కుదించారు.పదకొండేళ్ల తర్వాతఇక మరో సెమీఫైనల్లో దుబాయ్లోని ది సెవెన్స్ స్టేడియంలో పాకిస్తాన్ కూడా 8 వికెట్ల తేడాతోనే బంగ్లాదేశ్పై గెలుపొందింది. వర్షం కారణంగా 27 ఓవర్లకు మ్యాచ్ కుదించగా.. బంగ్లాదేశ్ 26.3 ఓవర్లలో 121 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం 16.3 ఓవర్లలోనే పాకిస్తాన్ కేవలం రెండు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని పూర్తి చేసింది. తద్వారా ఫైనల్కు అర్హత సాధించింది.కాగా పదకొండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత యువ చిరకాల ప్రత్యర్థులు భారత్- పాక్ (అండర్–19లో) ఆసియా కప్ ఫైనల్లో తలపడనున్నాయి. చివరిసారిగా 2014లో జరిగిన ఆసియాకప్ ఫైనల్లో పాక్ను ఓడించిన యువ భారత్ టైటిల్ సాధించింది. కాగా తాజా ఆసియా కప్ లీగ్ దశ మ్యాచ్లో భారత్ పాక్ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.వేదిక, టైమింగ్స్.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటేభారత్- పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్కు దుబాయ్లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్ వేదిక. భారత కాలమానం ప్రకారం ఉదయం 10.30 నిమిషాలకు మ్యాచ్ మొదలు అవుతుంది. సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ (టీవీ), సోనీ లివ్ (డిజిటల్) యాప్లో ప్రత్యక్ష ప్రసారం.చదవండి: విరాట్ కోహ్లి ఫ్యాన్స్కు శుభవార్త.. కెప్టెన్గా రిషభ్ పంత్ -
వరల్డ్కప్ జట్టు ప్రకటన నేడే.. అతడికి నో ఛాన్స్!
స్వదేశంలో జరిగే టీ20 వరల్డ్ కప్-2026లో పాల్గొనే భారత జట్టును శనివారం ఎంపిక చేయనున్నారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యుల టీమ్ను ప్రకటించనుంది. ఈ మెగా టోర్నమెంట్కు ముందు న్యూజిలాండ్తో జరిగే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో కూడా వరల్డ్ కప్నకు ఎంపికయ్యే జట్టే ఆడుతుంది.కాగా ఫిబ్రవరి 7న మొదలయ్యే వరల్డ్ కప్లో భారత జట్టు డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతోంది. టీ20 వరల్డ్ కప్-2024లో చాంపియన్గా నిలిచిన తర్వాతి నుంచి తాజాగా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ వరకు భారత జట్టు అద్భుత ప్రదర్శనను (35 మ్యాచ్లలో 26 విజయాలు) చూస్తే టీమ్ ఎంపికలో ఎలాంటి సంచలనాలు ఉండే అవకాశం లేదు.కెప్టెన్సీకి ఎలాంటి ఢోకా లేదుకెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటర్గా ఏడాదికి పైగా విఫలమవుతున్నా సరే... టోర్నీకి చాలా తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో అతడి కెప్టెన్సీకి ఎలాంటి ఢోకా లేదు. విధ్వంసకర ఓపెనర్గా అదరగొడుతున్న అభిషేక్ శర్మకు.. వరుసగా విఫలమవుతున్నా సరే వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్నే జోడీగా కొనసాగించే అవకాశం ఉంది. ఇక రిజర్వు ఓపెనర్, వికెట్ కీపర్గా సంజూ శాంసన్ కూడా అందుబాటులో ఉన్నాడు కాబట్టి టాపార్డర్లో యశస్వి జైస్వాల్కు చోటు కష్టమే.రింకూ సింగ్కు మొండిచేయి!మరోవైపు.. ఆల్రౌండర్ కోటాలో వాషింగ్టన్ సుందర్కు స్థానం ఇస్తే.. నయా ఫినిషర్గా సత్తా చాటిన రింకూ సింగ్కు మొండిచేయి తప్పకపోవచ్చు. అతడి స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ ఫినిషర్గా రాణిస్తున్నాడు. మరోవైపు.. జస్ప్రీత్ బుమ్రా నాయకత్వంలోని పేస్ దళంలో అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణాలతో పాటు ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివం దూబే కూడా తమ వంతు సాయం అందించనున్నారు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత జట్టు (అంచనా)అభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), జితేశ్ శర్మ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా.చదవండి: విరాట్ కోహ్లి ఫ్యాన్స్కు శుభవార్త.. కెప్టెన్గా రిషభ్ పంత్ -
రోహిత్ శర్మ యూటర్న్!
టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ-2025లో ఆడేందుకు అతడు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయం గురించి ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) వర్గాలు వార్తా సంస్థ PTIకి వెల్లడించాయి.కాగా టీమిండియాకు టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిళ్లను అందించిన రోహిత్ శర్మ (Rohit Sharma).. తొలుత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు.. అనంతరం టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అనూహ్య రీతిలో ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనకు ముందు అతడిని వన్డే కెప్టెన్సీ తప్పించింది బీసీసీఐ.మునుపెన్నడూ లేని విధంగాఈ క్రమంలో ఫిట్నెస్పై దృష్టి సారించిన రోహిత్ శర్మ.. దాదాపు 10 కిలోల బరువు తగ్గాడు. మునుపెన్నడూ లేని విధంగా మరింత ఫిట్గా మారి.. ఆసీస్ గడ్డ మీద శతకంతో చెలరేగిన హిట్మ్యాన్.. సౌతాఫ్రికాతో స్వదేశంలో వన్డేల్లోనూ అదరగొట్టాడు. అయితే, ప్రస్తుతం రోహిత్తో పాటు మరో దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు.ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్కప్-2027కి సిద్ధమయ్యే క్రమంలో రో-కో మ్యాచ్ ప్రాక్టీస్ గురించి చర్చలు వచ్చాయి. ఇలాంటి సమయంలో బీసీసీఐ భారత జట్టులోని ప్రతి సభ్యుడు కచ్చితంగా కనీసం రెండు దేశీ మ్యాచ్లు అయినా ఆడాలని ఆదేశించింది. రో-కోలకే కాకుండా ప్రతి ఒక్క ఆటగాడికి ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.ఢిల్లీ జట్టులో విరాట్ కోహ్లి అయితే, ఎంసీఏ చీఫ్ సెలక్టర్ సంజయ్ పాటిల్ శుక్రవారం మాట్లాడుతూ.. రోహిత్ శర్మ ముంబై జట్టుకు అందుబాటులో లేడని తెలిపాడు. ఈ క్రమంలోనే ఢిల్లీ విజయ్ హజారే ట్రోఫీకి ప్రకటించిన జట్టులో తొలి రెండు మ్యాచ్లకు విరాట్ కోహ్లి అందుబాటులో ఉంటాడని స్పష్టం చేసింది. ఈ పరిణాల క్రమంలో శుక్రవారం రాత్రి ఎంసీఏ వర్గాలు మరోసారి రోహిత్ శర్మ విషయంపై స్పందిస్తూ.. అతడు కనీసం రెండు మ్యాచ్లకు అవైలబుల్గా ఉంటాడని స్పష్టం చేశాయి. కోహ్లి పేరు ప్రకటన తర్వాత రోహిత్ సైతం ఈ మేర యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ముంబై జట్టుకు చెందిన టీమిండియా స్టార్లు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఆల్రౌండర్ శివం దూబే విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లకు అందుబాటులో ఉండటం లేదు. టీ20 ప్రపంచకప్-2026 దృష్ట్యా వారిద్దరికి మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, ముంబై మాజీ కెప్టెన్ అజింక్య రహానే అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత జట్టుతో చేరే అవకాశం ఉంది. కాగా డిసెంబరు 24 నుంచి విజయ్ హజారే ట్రోఫీ టోర్నీ మొదలుకానుంది.చదవండి: విరాట్ కోహ్లి ఫ్యాన్స్కు శుభవార్త.. కెప్టెన్గా రిషభ్ పంత్ -
శిబిరానికి రాకుంటే జట్టులోకి రారు!
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) కొత్త సెలక్షన్ పాలసీని తీసుకొచి్చంది. సమాఖ్య ఏర్పాటు చేసే జాతీయ శిక్షణ శిబిరాలకు హాజరైన వారినే ఇక మీదట భారత జట్టుకు ఎంపిక చేస్తామని ప్రకటించింది. ఇకపై శిబిరాల్లో క్రమం తప్పకుండా పాల్గొన్న వారినే ఎంపిక కోసం పరిగణిస్తామని, శిబిరాలను బేఖాతరు చేసే రెజ్లర్లను భారత జట్టుకు ఎంపిక చేయబోమని డబ్ల్యూఎఫ్ఐ ప్రకటించింది. అహ్మదాబాద్లో ఇటీవల డబ్ల్యూఎఫ్ఐ జనరల్ కౌన్సిల్లో జరిగిన సుదీర్ఘ చర్చలో ఇదే విషయాన్ని కౌన్సిల్ సభ్యులు కూడా సూచించినట్లు డబ్ల్యూఎఫ్ఐ అధికారి ఒకరు వెల్లడించారు. నో క్యాంప్... నో జెర్సీ! ఎలైట్ రెజ్లర్లయినా, ఐకానిక్ ఆటగాళ్లయినా, ఒలింపిక్ పతక విజేతలు ఎవరైనా సరే జాతీయ శిక్షణ శిబిరాలకు రావాల్సిందే. శిబిరాలకు ఎంపికైన రెజ్లర్లు డబ్ల్యూఎఫ్ఐ ఏర్పాటు చేసిన జాతీయ క్యాంప్లో కచి్చతంగా పాల్గొనాలి. వ్యక్తిగతంగా మరో చోట శిక్షణ తీసుకుంటామంటే కుదరదు. సాకులతో శిబిరాలకు గైర్హాజరయ్యే రెజ్లర్లు ఎంతటి వారైనా సరే భారత జట్టుకు ఎంపిక చేయనే చేయరు. శిబిరాలకు ప్రాధాన్యత ఇచ్చి కోచ్ మార్గదర్శనంలో శిక్షణ పొందిన, అర్హత గల రెజ్లర్లకు మాత్రమే భారత టీమ్ జెర్సీ (బెర్తు) లభిస్తుంది. ట్రయల్స్ ‘పోటీ’తోనే అంతర్జాతీయ ఈవెంట్లకు... అంతర్జాతీయ ఈవెంట్లలో పోటీపడాలనుకునే రెజ్లర్లు ఇక మీదట తప్పనిసరిగా సెలక్షన్ ట్రయల్స్లోనూ పోటీపడాల్సి ఉంటుంది. గత పతక ఘనతలు, ర్యాంకింగ్ను ఏమాత్రం పరిగణించరు. కేవలం ప్రస్తుత ఫామ్, సెలక్షన్ ట్రయల్స్లో సత్తా చాటితేనే భారత జట్టుకు ఎంపిక చేస్తారు. -
పంత్ కెప్టెన్సీలో కోహ్లి
న్యూఢిల్లీ: దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి... ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో రెండు సెంచరీలతో విజృంభించిన విరాట్... న్యూజిలాండ్తో సిరీస్కు ముందు ఈ టోర్నీలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్ ఆరంభ మ్యాచ్ల్లో కోహ్లి బరిలోకి దిగనున్నాడు. ఈ టోర్నీలోని తొలి రెండు మ్యాచ్ల కోసం శుక్రవారం ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) 20 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ టీమ్కు భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. కోహ్లి, పంత్తో పాటు సీనియర్ పేసర్లు ఇషాంత్ శర్మ, నవ్దీప్ సైనీ కూడా ఈ టోర్నీలో ఆడనున్నారు. పేస్ ఆల్రౌండర్ హర్షిత్ రాణా అందుబాటులో ఉన్న సమయంలో టోర్నీలో పాల్గొననున్నట్లు ప్రకటించాడు. గ్రూప్ ‘డి’లో భాగంగా ఢిల్లీ జట్టు డిసెంబర్ 24 నుంచి జనవరి 8 మధ్య ఏడు మ్యాచ్లు ఆడనుంది. ఆ తర్వాత జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో భారత జట్టు వన్డే సిరీస్ ఆడనుంది. దీంతో ఫామ్, ఫిట్నెస్ కాపాడుకునేందుకు కోహ్లికి ఈ టోర్నమెంట్ ఉపయోగపడనుంది. ఆయుశ్ బదోనీ ఢిల్లీ జట్టు వైస్ కెప్టెన్గా వ్యవహరించనుండగా... యశ్ ధుల్, ప్రియాన్ష్ ఆర్య, నితీశ్ రాణా వంటి ప్రతిభావంతులు జట్టులో ఉన్నారు. ఆరంభ మ్యాచ్లకు రోహిత్ దూరం మరోవైపు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, టి20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో పాటు యశస్వి జైస్వాల్, అజింక్యా రహానే, శివమ్ దూబే... విజయ్ హజారే టోర్నీ ఆరంభ మ్యాచ్లకు దూరం కానున్నారు. యువ ఆటగాళ్లను పరీక్షించాలనే ఉద్దేశంతో స్టార్ ఆటగాళ్లను తొలి రెండు మ్యాచ్లకు ఎంపిక చేయడం లేదని ముంబై చీఫ్ సెలెక్టర్ సంజయ్ పాటిల్ పేర్కొన్నాడు. ‘రోహిత్, జైస్వాల్, దూబే, రహానే కనీసం తొలి రెండు మ్యాచ్లకు ముంబై జట్టులో ఉండరు. సెలెక్షన్ కమిటీ యువ ఆటగాళ్లను పరీక్షించాలని భావిస్తోంది. జైస్వాల్ కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలో యువకులకు అవకాశం ఇవ్వాలని భావించాం’ అని సంజయ్ వెల్లడించారు. ఈ టోర్నీ గ్రూప్ ‘సి’లో ఉన్న ముంబై జట్టు ఈ నెల 24న తొలి మ్యాచ్లో సిక్కీంతో తలపడనుంది. -
హెడ్ అజేయ శతకం
అడిలైడ్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో ఆ్రస్టేలియా జట్టు మరో విజయానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఓపెనర్ ట్రవిస్ హెడ్ (196 బంతుల్లో 142 బ్యాటింగ్; 13 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయ సెంచరీతో చెలరేగడంతో ఆ్రస్టేలియా జట్టు రెండో ఇన్నింగ్స్లో భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి రెండు మ్యాచ్ల్లో నెగ్గి 2–0తో ఆధిక్యంలో ఉన్న ఆతిథ్య ఆ్రస్టేలియా... మూడో టెస్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 66 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. మిడిలార్డర్ నుంచి ఓపెనర్గా ప్రమోషన్ దక్కించుకున్న హెడ్... ఈ సిరీస్లో రెండో సెంచరీ ఖాతాలో వేసుకోవడంతో ఆసీస్ భారీ స్కోరు చేసింది. మరో ఓపెనర్ జాక్ వెదరాల్డ్ (1), మార్నస్ లబుõÙన్ (13), కామెరాన్ గ్రీన్ (7) విఫలం కాగా... తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో అలెక్స్ కేరీ (91 బంతుల్లో 52 బ్యాటింగ్; 4 ఫోర్లు) అజేయ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. ఉస్మాన్ ఖ్వాజా (51 బంతుల్లో 40; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. మరో వైపు నుంచి వికెట్లు పడుతున్నా... హెడ్ మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడుతూ పాడుతూ పరుగులు సాధించాడు. మంచి బంతులను గౌరవిస్తూనే... చెత్త బంతులను బౌండరీలకు తరలించాడు. 72 బంతుల్లో హాఫ్సెంచరీ పూర్తి చేసుకున్న హెడ్... 146 బంతుల్లో శతకం తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే తనకు అలవాటైన రీతిలో గాల్లోకి ఎగిరి సంబరాలు చేసుకునే హెడ్... ఈసారి మాత్రం అందుకు భిన్నంగా పిచ్ను ముద్దాడి ఆనందంలో మునిగిపోయాడు. సెంచరీకి ఒక పరుగు ముందు హెడ్ ఇచ్చిన క్యాచ్ను గల్లీలో హ్యారీ బ్రూక్ వదిలేశాడు. ఆ తర్వాత కొన్ని ఉత్కంఠ క్షణాలు ఎదుర్కొన్న హెడ్ ఎట్టకేలకు సెంచరీ పూర్తిచేసుకున్నాడు. టెస్టుల్లో అతడికిది 11వ శతకం. అబేధ్యమైన ఐదో వికెట్కు కేరీతో కలిసి హెడ్ 122 పరుగులు జోడించాడు.చేతిలో 6 వికెట్లు ఉన్న ఆ్రస్టేలియా.... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 85 పరుగులతో కలుపుకొని ఓవరాల్గా 356 పరుగుల ముందంజలో ఉంది. ఈ మ్యాచ్లో మరో రెండు రోజుల ఆట మిగిలుండగా... శనివారం మరింత స్కోరు చేసి ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిలపాలని ఆసీస్ భావిస్తోంది. స్టోక్స్–ఆర్చర్ రికార్డు భాగస్వామ్యం... అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 213/8తో శుక్రవారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ చివరకు 87.2 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. కెపె్టన్ బెన్ స్టోక్స్ (198 బంతుల్లో 83; 8 ఫోర్లు) పట్టుదలగా పోరాడగా... జోఫ్రా ఆర్చర్ (105 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్స్) కీలక హాఫ్సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో స్టోక్స్ 159 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో అతడికిదే నెమ్మదైన అర్ధ శతకం. ఈ జోడీ తొమ్మిదో వికెట్కు రికార్డు స్థాయిలో 106 పరుగులు జోడించడంతో ఆ్రస్టేలియాకు తొలి ఇన్నింగ్స్లో ఎక్కువ ఆధిక్యం దక్కలేదు. ఒక్కసారి స్టోక్స్ అవుట్ అయ్యాక... ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. ఆ్రస్టేలియా బౌలర్లలో కమిన్స్, బోలాండ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. -
సాత్విక్–చిరాగ్ జోడీ చరిత్ర
కొన్నేళ్లపాటు భారత బ్యాడ్మింటన్లో సింగిల్స్లో షట్లర్లు దేశ ప్రతిష్ట పెంచారు. ‘చైనా’ గోడకు ఎదురునిలిచి సంచలన విజయాలు, ఒలింపిక్ పతకాలు, ప్రపంచ చాంపియన్షిప్ విజయాలు, ప్రపంచనంబర్వన్ ర్యాంకింగ్స్తో షట్లర్లు ఘనతకెక్కారు. అయితే డబుల్స్లో మాత్రం ఆ స్థాయికి చేరలేదనే బెంగ ఉండేది. కానీ ఇప్పుడది గతం! వర్తమానంలో సాత్విక్–చిరాగ్ జోడీ చెలరేగిపోతోంది. డబుల్స్ భవిష్యత్తును బంగారం చేయబోతోంది. హాంగ్జౌ: భారత డబుల్స్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలు కొత్త చరిత్ర లిఖించారు. ప్రతిష్టాత్మక వరల్డ్ టూర్ ఫైనల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. తద్వారా ఈ మెగా టోర్నీలో సెమీస్ చేరిన తొలి భారత పురుషుల ద్వయంగా సాత్విక్–చిరాగ్ ఘనతకెక్కింది. ఈ టోర్నీలో ఈ జోడీ ఎదురేలేకుండా దూసుకెళుతోంది. ప్రపంచ అత్యుత్తమ, టాప్–8 జంటలే బరిలోకి దిగే ఈ మేటి టోర్నీలో గ్రూప్ ‘బి’లో ఉన్న సాత్విక్–చిరాగ్ జోడీ అజేయంగా నాకౌట్ దశకు అర్హత సంపాదించింది. చైనా గడ్డపై ప్రత్యర్థి జంటలను గడగడలాడిస్తోంది. ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ వరుసగా గెలిచి ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. శుక్రవారం జరిగిన ఈ గ్రూపులోని ఆఖరి మూడో మ్యాచ్లో మూడో సీడ్ సాత్విక్–చిరాగ్ జోడీ 17–21, 21–18, 21–15తో మలేసియాకు చెందిన రెండో సీడ్ అరోన్ చియా–సో వుయ్ యిక్లపై చెమటోడ్చి నెగ్గింది. పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతక విజేతలైన చియా– సో వుయ్లకు అసాధారణ పోరాటంతో చెక్పెట్టింది. ముఖాముఖీ పోటీల్లో 5–11తో వెనుకబడి వున్నప్పటికీ శుక్రవారం మాత్రం భారత జోడీ ప్రదర్శన మరో స్థాయిలో నిలిపింది. మింగుడు పడని ప్రత్యర్థి ద్వయం చేతిలో తొలి గేమ్ను కోల్పోయిన భారత జోడీ ఏమాత్రం నిరాశపడకుండా తదుపరి గేముల్లో పట్టుదల కనబరిచింది. పాయింట్ పాయింట్కు చెమటోడ్చి రెండో గేమ్ను వశం చేసుకొని మ్యాచ్లో నిలిచింది. ఇక నిర్ణాయక మూడో గేమ్లో అయిన చిరాగ్–సాత్విక్ల ఆటతీరుకు మలేసియన్ జోడీ తలొగ్గకతప్పలేదు. నేడు జరిగే సెమీఫైనల్లో భారత ద్వయం చైనాకు చెందిన లియాంగ్ వి కెంగ్–వాంగ్ చంగ్ జంటను ఢీకొట్టనుంది. -
చాంపియన్స్ సాహితి, శ్రీకాంత్
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు నిర్వహించిన యూబీఎస్ అథ్లెటిక్స్ కిడ్స్ కప్ విజయవంతంగా ముగిసింది. జీఎంసీ బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియంలో నిర్వహించిన ఈ టోర్నీలో... 7 నుంచి 15 ఏళ్ల విభాగాల్లో వేర్వేరుగా ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలు నిర్వహించారు. హైదరాబాద్ వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో నిర్వహించిన ప్రాథమిక రౌండ్లలో సత్తాచాటిన 500 మంది అథ్లెట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారు. బాలికల అండర్–15 విభాగంలో సత్యం ఇంటర్నేషనల్ స్కూల్కు చెందిన వర్ష ప్రథమ బహుమతి దక్కించుకోగా... సాహితి (ఎంఎన్ఆర్ హై స్కూల్), పర్విన్ జేబా (అంబర్పేట్ గవర్నమెంట్ హై స్కూల్) వరుసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచారు. బాలికల అండర్–14 విభాగంలో నాగార్జున గ్రామర్ హై స్కూల్కు చెందిన శ్రీజెనా మొదటి స్థానం దక్కించుకోగా... ప్రణవి (శ్లోక స్కూల్), భువనేశ్వరి (కృష్ణవేణి ట్యాలెంట్ స్కూల్) రెండో, మూడో బహుమతులు దక్కించుకున్నారు. బాలుర అండర్–15 విభాగంలో గంగోత్రి పబ్లిక్ స్కూల్కు చెందిన శ్రీకాంత్ అగ్రస్థానంలో నిలవగా... సమీర్ హుసేన్ (బ్రైట్ కాన్సెప్ట్ హైస్కూల్), రాహుల్ శెట్టి (గౌతమి టెక్నో స్కూల్) వరుసగా ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. అండర్–14 విభాగంలో పల్లవి మోడల్ స్కూల్కు చెందిన హర్షిత్ మొదటి స్థానం దక్కించుకోగా... మొహమ్మద్ అయాన్ ఖాన్ (పల్లవి మోడల్ స్కూల్), సూరజ్ కుమార్ (సెయింట్ థామస్ హై స్కూల్) వరుసగా రెండో, మూడో బహుమతులు దక్కించుకున్నారు. విజేతలకు రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, క్రీడా మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి శుక్రవారం బహుమతులు ప్రదానం చేశారు. -
వ్రిత్తి అగర్వాల్కు పసిడి పతకం
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత అంతర్ యూనివర్సిటీ అక్వాటిక్స్ చాంపియన్షిప్లో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన వ్రిత్తి అగర్వాల్ పసిడి పతకంతో మెరిసింది. ఇప్పటికే జాతీయ స్థాయిలో పలు టోర్నీల్లో లెక్కకు మిక్కిలి పతకాలతో సత్తా చాటిన వ్రిత్తి... చెన్నైలోని ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీలో జరిగిన పోటీల్లో మరో స్వర్ణం ఖాతాలో వేసుకుంది. మహిళల 1500 మీటర్ల ఫ్రీ స్టయిల్ విభాగంలో శుక్రవారం వ్రిత్తి 18 నిమిషాల 1.04 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానం దక్కించుకుంది. విశ్వేశ్వర టెక్నాలజీ యూనివర్సిటీకి చెందిన షీరీన్ (18 నిమిషాల 10.97 సెకన్లు) రజత పతకం గెలుచుకోగా... అశ్విత చంద్ర (18 నిమిషాల 24.11 సెకన్లు; జైన్ యూనివర్సిటీ బెంగళూరు) కాంస్య పతకం సాధించింది. -
విజయంతో ముగింపు
టెస్టు సిరీస్లో 0–2తో ఓటమి, వన్డేల్లో 2–1తో గెలుపు, ఇప్పుడు టి20ల్లో 3–1తో ఘన విజయం...సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన పోరులో భారత జట్టు ప్రదర్శన ఇది. చాలా కాలం తర్వాత ఒకే పర్యటనలో భాగంగా మూడు ఫార్మాట్లలో జరిగిన సిరీస్లలో టీమిండియా పైచేయి సాధించింది. టెస్టు సిరీస్ ఫలితం బాధపెట్టేదే అయినా ఓవరాల్గా 5–4తో మన జట్టు పైచేయి సాధించింది. సిరీస్ ఓడిపోయే ప్రమాదం లేని స్థితిలో చివరి టి20లో బరిలోకి దిగిన భారత్ భారీ స్కోరుతో ప్రత్యరి్థకి చెక్ పెట్టింది. పాండ్యా అద్భుత బ్యాటింగ్, తిలక్ మెరుపులు ఇందులో కీలక పాత్ర పోషించాయి. డికాక్ జోరుతో సఫారీలు ఛేదన వైపు సాగినట్లు అనిపించినా అది కొన్ని ఓవర్లకే పరిమితమైంది. చేయాల్సిన రన్రేట్ పెరిగిపోయి ఒత్తిడిలో జట్టు చిత్తయింది. టి20ల్లో భారత్కు ఇది వరుసగా 8వ సిరీస్ విజయం కావడం విశేషం. అహ్మదాబాద్: దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్ను భారత్ 3–1తో సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన చివరిదైన ఐదో మ్యాచ్లో భారత్ 30 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హార్దిక్ పాండ్యా (25 బంతుల్లో 63; 5 ఫోర్లు, 5 సిక్స్లు), తిలక్ వర్మ (42 బంతుల్లో 73; 10 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు చేశారు. అనంతరం దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులకే పరిమితమైంది. క్వింటన్ డికాక్ (35 బంతుల్లో 65; 9 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించగా, వరుణ్ చక్రవర్తికి 4 వికెట్లు దక్కాయి. రాణించిన సామ్సన్... భారత్కు సంజు సామ్సన్ (22 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్స్లు), అభిషేక్ శర్మ (21 బంతుల్లో 34; 6 ఫోర్లు, 1 సిక్స్) శుభారంభం అందించారు. అభిషేక్ తనదైన శైలిలో దూకుడుగా మొదలు పెట్టగా, గిల్ గైర్హాజరులో దక్కిన అవకాశాన్ని సామ్సన్ సమర్థంగా వాడుకున్నాడు. యాన్సెన్ ఓవర్లో తొలి మూడు బంతులను అభిషేక్ ఫోర్లుగా మలచగా, చివరి బంతికి సామ్సన్ సిక్స్ బాదడంతో మొత్తం 19 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత బార్ట్మన్ ఓవర్లో సామ్సన్ మూడు ఫోర్లు కొట్టాడు. అభిషేక్ వికెట్ కోల్పోయి పవర్ప్లే ముగిసే సరికి భారత్ 67 పరుగులు చేసింది. తొలి బంతికే ఫోర్తో మొదలు పెట్టిన తిలక్ కూడా తన ధాటిని ప్రదర్శించడంతో స్కోరు దూసుకుపోయింది. సామ్సన్ వెనుదిరిగాక మరో సారి సూర్యకుమార్ (5) వైఫల్యం కొనసాగింది. ఈ దశలో జత కలిసిన తిలక్, హార్దిక్ ద్వయం దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడింది. చూడచక్కటి ఫోర్లు కొట్టిన తిలక్ 30 బంతుల్లో అర్ధసెంచరీని అందుకున్నాడు. వీరిద్దరు నాలుగో వికెట్కు 44 బంతుల్లోనే 105 పరుగులు జోడించి స్కోరును 200 దాటించారు. చివర్లో దూబే (10 నాటౌట్) కూడా సిక్స్, ఫోర్తో తాను ఓ చేయి వేశాడు. డికాక్ అర్ధ సెంచరీ... భారీ లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికాకు డికాక్ మెరుపు ఆరంభాన్ని ఇస్తూ అద్భుత షాట్లతో చెలరేగిపోయాడు. అర్ష్ దీప్ తొలి ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన అతను...అతని తర్వాతి ఓవర్లో మరో మూడు ఫోర్లు, సిక్స్ బాదడం విశేషం. పవర్ప్లే సఫారీ టీమ్ కూడా సరిగ్గా 67 పరుగులే సాధించింది. హెన్డ్రిక్స్ (13) వెనుదిరిగాక 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న డికాక్కు మరో ఎండ్లో బ్రెవిస్ (17 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్స్లు) అండగా నిలిచాడు. పాండ్యా బౌలింగ్లో బ్రెవిస్ వరుసగా 4, 6, 4 కొట్టడం విశేషం. 10.1 ఓవర్లలో 120/1తో దక్షిణాఫ్రికా పటిష్టంగా కనిపించింది. అయితే ఆ తర్వాత ఒక్కసారిగా కథ మారిపోయింది. డికాక్, బ్రెవిస్ రెండు పరుగుల వ్యవధిలో వెనుదిరిగాక ఇన్నింగ్స్ కుప్పకూలింది. మిగతా బ్యాటర్లలో ఎవరూ నిలవలేకపోయారు.ఆ 16 బంతులు... తొలి బంతికే సూపర్ సిక్స్...మెరుపు వేగంతో దూసుకొచి్చన బంతి భుజానికి తగలడంతో కెమెరామన్ అల్లాడిపోయాడు. టీమ్ ఫిజియో వెళ్లి చికిత్స చేయాల్సి వచి్చంది. అలా మొదలైన హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ అంతే విధ్వంసకరంగా సాగింది. తాను ఎదుర్కొన్న తర్వాతి రెండు బంతుల్లో సింగిల్, ఫోర్ కొట్టిన పాండ్యా... లిండే వేసిన 14వ ఓవర్లో వరుస బంతుల్లో 4, 6, 6, 4 బాదాడు. ఇంత పెద్ద మైదానంలో అతను కొట్టిన భారీ సిక్స్లు బౌండరీకి దగ్గర్లో కాకుండా ఎక్కడో గ్యాలరీల్లో పడ్డాయంటే ఆ వాడి ఎలాంటిదో అర్థమవుతుంది. తర్వాతి ఐదు బంతులు కాస్త జాగ్రత్తగా ఆడుతూ 7 పరుగులే రాబట్టినా...బాష్ ఓవర్లో మళ్లీ జోరు కనిపించింది. ఈ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టిన అతను అదే ఓవర్లో డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్స్ బాదడంతో 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తయింది. స్కోరు వివరాలుభారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (బి) లిండే 37; అభిషేక్ (సి) డికాక్ (బి) బాష్ 34; తిలక్ (రనౌట్) 73; సూర్యకుమార్ (సి) మిల్లర్ (బి) బాష్ 5; పాండ్యా (సి) హెన్డ్రిక్స్ (బి) బార్ట్మన్ 63; దూబే (నాటౌట్) 10; జితేశ్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 231. వికెట్ల పతనం: 1–63, 2–97, 3–115, 4–220, 5–227. బౌలింగ్: ఎన్గిడి 4–0–29–0, యాన్సెన్ 4–0–50–0, బార్ట్మన్ 3–0–39–1, బాష్ 3–0–44–2, ఫెరీరా 2–0–20–0, లిండే 4–0–46–1. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (సి) అండ్ (బి) బుమ్రా 65; హెన్డ్రిక్స్ (సి) దూబే (బి) వరుణ్ 13; బ్రెవిస్ (సి) సుందర్ (బి) పాండ్యా 31; మిల్లర్ (సి) సామ్సన్ (బి) అర్ష్ దీప్ 18; మార్క్రమ్ (ఎల్బీ) (బి) వరుణ్ 6; ఫెరీరా (బి) వరుణ్ 0; లిండే (బి) వరుణ్ 16; యాన్సెన్ (సి) సామ్సన్ (బి) బుమ్రా 14; బాష్ (నాటౌట్) 17; ఎన్గిడి (నాటౌట్) 7; ఎక్స్ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–69, 2–120, 3–122, 4–135, 5–135, 6–154, 7–163, 8–177. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–47–1, సుందర్ 4–0–30–0, బుమ్రా 4–0–17–2, వరుణ్ 4–0–53–4, పాండ్యా 3–0–41–1, 1–0–13–0.2: భారత్ తరఫున టి20ల్లో పాండ్యా రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (16 బంతుల్లో) సాధించాడు. యువరాజ్ సింగ్ (12 బంతుల్లో) పేరిట టాప్ రికార్డు ఉంది. -
విరాట్ కోహ్లి వచ్చేశాడు.. కెప్టెన్గా రిషభ్ పంత్
దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ-2025కి ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) తమ జట్టును ప్రకటించింది. టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి తొలి రెండు మ్యాచ్లకు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. అదే విధంగా భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ రిషభ్ పంత్.. ఈ టోర్నీలో ఢిల్లీ కెప్టెన్గా వ్యవహరిస్తాడని తెలిపింది.ఇక మరో టీమిండియా స్టార్ పేసర్ హర్షిత్ రాణా వీలు చిక్కినపుడు మ్యాచ్లకు వస్తాడని తెలిపిన డీడీసీఏ.. భారత మాజీ స్టార్ బౌలర్ ఇషాంత్ శర్మ, నవదీప్సైనీ కూడా ఈసారి జట్టులో భాగం కానున్నారని తెలిపింది. కాగా పంత్ డిప్యూటీగా ఆయుశ్ బదోని వ్యవహరించనుండగా.. తేజస్వి సింగ్ వికెట్ కీపర్గా సేవలు అందించనున్నాడు.2010లో చివరిసారిగాకాగా 2010లో చివరిసారిగా విరాట్ కోహ్లి తన సొంత జట్టు ఢిల్లీ తరఫున విజయ్ హజారే ట్రోఫీ ఆడాడు. వన్డే క్రికెట్లో రారాజుగా వెలుగొందుతూ అత్యధిక సెంచరీల (53) వీరుడిగా రికార్డులకెక్కిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ దేశీ క్రికెట్ బరిలో దిగనున్నాడు. ప్రతి ఒక్క ఆటగాడు కనీసం రెండు దేశీ మ్యాచ్లు అయినా ఆడాలన్న బీసీసీఐ నిబంధనల నేపథ్యంలో కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ముంబై తరఫున ఆరంభ మ్యాచ్లకు మాత్రం రోహిత్ శర్మ అందుబాటులో ఉండటం లేదని ఎంసీఏ చీఫ్ సెలక్టర్ సంజయ్ పాటిల్ తాజాగా వెల్లడించాడు.విజయ్ హజారే ట్రోఫీ-2025 మ్యాచ్లకు ఢిల్లీ జట్టురిషబ్ పంత్ (కెప్టెన్), ఆయుష్ బదోని (వైస్ కెప్టెన్), అర్పిత్ రాణా, విరాట్ కోహ్లి, హర్షిత్ రాణా, నితీష్ రాణా, యశ్ ధుల్, సార్థక్ రంజన్, నవదీప్ సైనీ, ఇషాంత్ శర్మ, హృతిక్ షోకీన్, తేజస్వి సింగ్ (వికెట్ కీపర్), హర్ష్ త్యాగి, సిమర్జీత్ సింగ్, ప్రిన్స్ యాదవ్, ఆయుశ్ దొసేజా, దివిజ్ మెహ్రా, వైభవ్ కంద్పాల్, రోహన్ రాణా, అనూజ్ రావత్. చదవండి: ఊహించని షాకిచ్చిన రోహిత్ శర్మ! -
హార్దిక్ పాండ్యా ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. తిలక్ విధ్వంసం
సౌతాఫ్రికాతో ఐదో టీ20లో టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా అదరగొట్టాడు. అహ్మదాబాద్ వేదికగా ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో కేవలం పదహారు బంతుల్లోనే హార్దిక్ పాండ్యా అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.ఫాస్టెస్ట్ ఫిఫ్టీతద్వారా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన రెండో ఆటగాడిగా హార్దిక్ పాండ్యా నిలిచాడు. ఈ క్రమంలో అభిషేక్ శర్మను అధిగమించి.. యువరాజ్ సింగ్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. కాగా ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో సౌతాఫ్రికాపై 2-1తో ఆధిక్యంలో ఉంది టీమిండియా.తిలక్ వర్మ విధ్వంసంఇక శుక్రవారం అహ్మదాబాద్లోనూ గెలిచి సిరీస్ను 3-1తో గెలుచుకోవాలనే సంకల్పంతో బరిలోకి దిగింది. నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు సంజూ శాంసన్ (22 బంతుల్లో 37), అభిషేక్ శర్మ (21 బంతుల్లో 34) శుభారంభం అందించగా.. వన్డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ విధ్వంసకర హాఫ్ సెంచరీతో దుమ్ములేపాడు..@TilakV9 is not holding back! Brings up a quick-fire half century! 💪#INDvSA 5th T20I | LIVE NOW 👉 https://t.co/adG06ykx8o pic.twitter.com/P4cz4TX7lc— Star Sports (@StarSportsIndia) December 19, 2025నాలుగో స్థానంలో వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (5) మరోసారి తీవ్రంగా నిరాశపరచగా.. అతడు అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపించాడు. వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి, స్టాండ్స్లోకి తరలించి అభిమానులను ఉర్రూతలూగించాడు. నాలుగు ఫోర్లు, ఐదు సిక్స్లు బాది 16 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు దాటేశాడు. అనూహ్య రీతిలోమొత్తంగా 25 బంతులు ఎదుర్కొన్న పాండ్యా.. 5 ఫోర్లు, 5 సిక్స్ల సాయంతో 63 పరుగులు సాధించాడు. అయితే, ఒట్నీల్ బార్ట్మన్ బౌలంగ్లో షాట్ ఆడే క్రమంలో రీజా హెండ్రిక్స్కు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్గా వెనుదిరిగాడు. Watch out! The ball is being powered across the ground today. ⚡️@hardikpandya7 starts his innings with a maximum! 🙌#INDvSA 5th T20I | LIVE NOW 👉 https://t.co/adG06ykx8o pic.twitter.com/NjCNUJh71c— Star Sports (@StarSportsIndia) December 19, 2025ఇక తిలక్ వర్మ (42 బంతుల్లో 73) అనూహ్య రీతిలో పందొమ్మిదో ఓవర్ ఐదో బంతికి రనౌట్ కాగా.. శివం దూబే మూడు బంతుల్లో పది పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి భారత్ 231 పరుగుల భారీ స్కోరు సాధించింది. సఫారీ బౌలర్లలో కార్బిన్ బాష్ రెండు వికెట్లు తీయగా.. జార్జ్ లిండే, ఒట్నీల్ బార్ట్మన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.భారత్ తరఫున ఫాస్టెస్ట్ టీ20 ఫిఫ్టీలు నమోదు చేసింది వీరే🏏యువరాజ్ సింగ్- 2007 వరల్డ్కప్లో ఇంగ్లండ్ మీద 12 బంతుల్లో ఫిఫ్టీ🏏హార్దిక్ పాండ్యా- 2025లో సౌతాఫ్రికా మీద 16 బంతుల్లో ఫిఫ్టీ🏏అభిషేక్ శర్మ- 2025లో ఇంగ్లండ్ మీద 17 బంతుల్లో ఫిఫ్టీ🏏కేఎల్ రాహుల్- 2021లో స్కాట్లాండ్ మీద 18 బంతుల్లో ఫిఫ్టీ🏏సూర్యకుమార్ యాదవ్- 2022లో సౌతాఫ్రికా మీద 18 బంతుల్లో ఫిఫ్టీ.చదవండి: ఊహించని షాకిచ్చిన రోహిత్ శర్మ! -
కోహ్లి ఆల్టైమ్ రికార్డు జస్ట్ మిస్!
టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఒకే టీ20 క్యాలెండర్ ఇయర్లో పదహారు వందల మార్కు చేరుకున్న రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. అంతకు ముందు టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి ఈ ఘనత సాధించాడు.కాగా ఐపీఎల్-2025లో సన్రైజర్స్ తరఫున అదరగొట్టిన అభిషేక్ శర్మ 14 మ్యాచ్లలో కలిపి 439 పరుగులు సాధించాడు. అదే విధంగా.. దేశీ టీ20 టోర్నీలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో పంజాబ్ కెప్టెన్గా బరిలోకి దిగిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. ఆరు మ్యాచ్లలో కలిపి 304 పరుగులు సాధించాడు.ఇక టీమిండియా తరఫున ఈ ఏడాది అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లోనూ అభిషేక్ శర్మ దుమ్ములేపాడు. 21 మ్యాచ్లలో కలిపి 859 పరుగులు చేశాడు. ఈ క్రమంలో మొత్తంగా 2025లో టీ20లలో 1602 పరుగులు పూర్తి చేసుకున్న అభిషేక్ శర్మ.. కోహ్లి ఆల్టైమ్ రికార్డును సమం చేసేందుకు కేవలం పన్నెండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.2016లో విరాట్ కోహ్లి ఐపీఎల్, టీమిండియా తరఫున కలిపి 1614 పరుగులు చేయగా.. అభిషేక్ ఈ ఏడాది 1602 పరుగులతో ముగించాడు. ఈ జాబితాలో సూర్యకుమార్ యాదవ్ (2022లో 1503, 2023లో 1338 పరుగులు), యశస్వి జైస్వాల్ (2023లో 1297 పరుగులు) ఉన్నారు.కాగా సౌతాఫ్రికాతో అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం ఐదో టీ20లో టాస్ ఓడిన భారత జట్టు తొలుత బ్యాటింగ్కు దిగింది. ఈ క్రమంలో ఆదిలో ఆచితూచి ఆడిన అభిషేక్ శర్మ.. ఆ తర్వాత గేరు మార్చాడు. అయితే, ఆరో ఓవర్ నాలుగో బంతికి కార్బిన్ బాష్ బౌలింగ్లో అభిషేక్ శర్మ అవుటయ్యాడు. వికెట్ కీపర్ క్వింటన్ డికాక్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ 21 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ బాది 34 పరుగులు సాధించి నిష్క్రమించాడు. -
Asia Cup 2025: ఫైనల్కు దూసుకెళ్లిన భారత్
ఏసీసీ మెన్స్ అండర్-19 ఆసియా కప్-2025 టోర్నమెంట్లో భారత్ ఫైనల్కు దూసుకువెళ్లింది. సెమీ ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈ ఖండాంతర టోర్నీలో ఆయుశ్ మాత్రే సారథ్యంలోని భారత జట్టు గ్రూప్-ఎలో భాగంగా యూఏఈ, పాకిస్తాన్, మలేసియా జట్లను ఓడించి అజేయంగా సెమీస్కు చేరింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి తొలి సెమీ ఫైనల్లో శ్రీలంకతో తలపడింది.దుబాయ్లో వాన పడిన కారణంగా టాస్ ఆలస్యమైంది. ఎట్టకేలకు వరుణుడు కరుణించినా.. అవుట్ ఫీల్డ్ చిత్తడిగా ఉన్న కారణంగా ఈ యూత్ వన్డేను 20 ఓవర్లకు కుదించారు. ఇక టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. శ్రీలంక బ్యాటింగ్కు దిగింది. భారత బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 138 పరుగులే చేసింది.లంక ఓపెనర్లు విరాన్ చముదిత (19), దుల్నిత్ సిగెరా (1) విఫలం కాగా... వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ విమత్ దిన్సారా (32) ఫర్వాలేదనిపించాడు. మిగిలిన వారిలో చమిక హీనతిగల 42 పరుగులతో లంక తరఫున టాప్ రన్ స్కోరర్గా నిలవగా.. లోయర్ ఆర్డర్లో సెత్మిక సెనెవిరత్నె 30 పరుగులతో రాణించాడు. మిగిలిన వారిలో కవిజ గమాగే (2), కిత్మా వితనపతిరన (7), ఆధమ్ హిల్మీ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం అయ్యారు.భారత బౌలర్లలో హెనిల్ పటేల్, కనిష్క్ చౌహాన్ చెరో రెండు వికెట్లు తీయగా.. దీపేశ్ దేవేంద్రన్, కిషన్ కుమార్, ఖిలన్ పటేల్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు.. ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లలో కెప్టెన్ ఆయుశ్ శర్మ (7), వైభవ్ సూర్యవంశీ (9) దారుణంగా విఫలమయ్యారు. రసిత్ నిమ్సారా వీరిద్దరిని పెవిలియన్కు పంపాడు.అయితే, వన్డౌన్ బ్యాటర్ ఆరోన్ జార్జ్, విహాన్ మల్హోత్రాతో కలిసి ధనాధన్ దంచికొట్టాడు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు బాదారు. ఆరోన్ 49 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 58 పరుగులతో.. విహాన్ 45 బంతుల్లోనే 4 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 61 పరుగులతో అజేయంగా నిలిచారు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా భారత్ 18 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే నష్టపోయి 139 పరుగులు చేసింది. ఫలితంగా ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్కు దూసుకువెళ్లింది. ఆరోన్, విహాన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు పంచుకున్నారు.అండర్-19 ఆసియా కప్-2025 సెమీ ఫైనల్-1 స్కోర్లు👉టాస్: భారత్.. తొలుత బౌలింగ్👉వాన వల్ల ఆలస్యంగా పడిన టాస్.. వెట్ఫీల్డ్ కారణంగా 20 ఓవర్లకు కుదించిన మ్యాచ్👉శ్రీలంక స్కోరు: 138/8 (20)👉భారత్: 139/2 (18)👉ఫలితం: ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్లో భారత్ -
IND vs SA: దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు
దక్షిణాఫ్రికాపై 30 పరుగుల తేడాతో భారత్ గెలుపు. స్కోర్లు: భారత్ 231/5(20), దక్షిణాఫ్రికా 201/8(20)దక్షిణాఫ్రికాకు 12 బంతుల్లో 47 పరుగులు అవసరం. విజయానికి చేరువగా భారత్.180 పరుగులకు 8 వికెట్లను కోల్పోయి దక్షిణాఫ్రికా ఓటమికి దగ్గర్లో ఉంది.వరుసగా మరో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా. 177 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా 8వ వికెట్ను కోల్పోయింది. దక్షిణాఫ్రికాకు 19 బంతుల్లో 55 పరుగులు అవసరం.దక్షిణాఫ్రికా ఏడోవ వికెట్ కోల్పోయింది. 15.2 ఓవర్లకు 163 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా మరో వికెట్ కోల్పోయింది. దక్షిణాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది. 15 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికాకు 33 బంతుల్లో 78 పరుగులు అవసరం.దక్షిణాఫ్రికా విజయానికి 38 బంతుల్లో 85 పరుగులు అవసరం.టీమిండియాతో ఐదో టీ20లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. అహ్మదాబాద్ వేదికగా ఆతిథ్య భారత్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి భారత్ 231 పరుగులు చేసింది. భారత్ విధించిన 232 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా.. హైలైట్స్👉10 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 118-1విజయానికి 60 బంతుల్లో 114 కావాలి. బ్రెవిస్ 14 బంతుల్లో 29, డికాక్ 34 బంతుల్లో 65 పరుగులతో ఉన్నారు.👉6.3 తొలి వికెట్ డౌన్: వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో హెండ్రిక్స్ (13) అవుట్. స్కోరు: 70-1(7). డెవాల్డ్ బ్రెవిస్ క్రీజులోకి వచ్చాడు.👉ఐదు ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 60-0హెండ్రిక్స్ 10, డికాక్ 42 పరుగులతో ఉన్నారు.భారత్ భారీ స్కోరు: 231-5(20)ఓపెనర్లు సంజూ శాంసన్ (37), అభిషేక్ శర్మ (34) రాణించగా.. తిలక్ వర్మ (42 బంతుల్లో 73), హార్దిక్ పాండ్యా (25 బంతుల్లో 63) మెరుపు అర్ధ శతకాలతో మెరిశారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (5) మరోసారి విఫలం అయ్యాడు.ఆఖర్లో శివం దూబే 3 బంతుల్లో 10 పరుగులతో అజేయంగా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కార్బిన్ బాష్ రెండు వికెట్లు తీయగా.. జార్జ్ లిండే, ఒట్నీల్ బార్ట్మన్ చెరొక వికెట్ పడగొట్టారు. ప్రొటిస్ జట్టు లక్ష్యం 232 పరుగులు.భారత్ బ్యాటింగ్.. హైలైట్స్👉19.3 నాలుగో వికెట్ డౌన్: బార్ట్మన్ బౌలింగ్లో రీజా హెండ్రిక్స్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన హార్దిక్ పాండ్యా (25 బంతుల్లో 63). క్రీజులోకి వచ్చిన శివం దూబే. స్కోరు: 226-4(19.4)19.3 నాలుగో వికెట్ డౌన్: బార్ట్మన్ బౌలింగ్లో రీజా హెండ్రిక్స్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన హార్దిక్ పాండ్యా (25 బంతుల్లో 63). క్రీజులోకి వచ్చిన శివం దూబే. స్కోరు: 226-4(19.4)👉16 బంతుల్లో హార్దిక్ పాండ్యా అర్ధ శతకంబాష్ బౌలింగ్లో సిక్స్ బాది 50 పరుగులు పూర్తి చేసుకున్న హార్దిక్👉15 ఓవర్లలో టీమిండియా స్కోరు: 170-3తిలక్ 57, హార్దిక్ 8 బంతుల్లో 32 పరుగులతో ఉన్నారు.👉14.4 తిలక్ వర్మ హాఫ్ సెంచరీ: ఎంగిడి బౌలింగ్లో ఫోర్ బాది.. ఆరో టీ20 హాఫ్ సెంచరీ నమోదు చేసిన తిలక్ వర్మ (30 బంతుల్లో).👉12.1 మూడో వికెట్ డౌన్: బాష్ బౌలింగ్లో మిల్లర్కు క్యాచ్ ఇచ్చి సూర్య (5) అవుట్. క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా. స్కోరు: 115-3(12.1)👉పది ఓవర్లలో టీమిండియా స్కోరు: 101-2తిలక్ 24, సూర్య 2 పరుగులతో ఉన్నారు.👉9.1 రెండో వికెట్ డౌన్: లిండే బౌలింగ్లో శాంసన్ బౌల్డ్ (22 బంతుల్లో 37; 4ఫోర్లు, 2 సిక్సర్లు). రెండో వికెట్ డౌన్. క్రీజులోకి సూర్యకుమార్ యాదవ్. 👉8.4: సంజూ బాదిన షాట్తో అంపైర్కు గాయంఫెరీరా బౌలింగ్లో స్ట్రెయిట్ షాట్ ఆడేందుకు సంజూ ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడు ఇచ్చిన క్యాచ్ను ఫెరీరా డ్రాప్ చేయగా.. అంపైర్ రోహన్ పండిట్ మోకాలికి తలిగింది. దీంతో అతడు నొప్పితో విలవిల్లాడుతూ మైదానంలో కుప్పకూలిపోగా.. ఫిజియోలు వచ్చి చెక్ చేశారు.👉పవర్ ప్లేలో భారత్ స్కోరు: 67-1(6)సంజూ 27, తిలక్ వర్మ 4 పరుగులతో ఉన్నారు.👉5.4- తొలి వికెట్ డౌన్: కార్బిన్ బాష్ బౌలింగ్లో కీపర్ డికాక్కు క్యాచ్ ఇచ్చి అవుటైన అభిషేక్ శర్మ (21 బంతుల్లో 34; ఆరు ఫోర్లు, ఒక సిక్స్) అవుట్. తొలి వికెట్ డౌన్. క్రీజులోకి తిలక్ వర్మ. స్కోరు: 63-1(5.4)👉ఐదు ఓవర్లలో భారత్ స్కోరు: 56-0👉అభిషేక్ శర్మ 17 బంతుల్లో 28, సంజూ శాంసన్ 13 బంతుల్లో 27 పరుగులతో క్రీజులో ఉన్నారు.తుదిజట్లలో మార్పులు ఇవేఈ మ్యాచ్లో సౌతాఫ్రికా తమ తుదిజట్టులో ఒక మార్పు చేసింది. అన్రిచ్ నోర్జే స్థానంలో జార్జ్ లిండేను ప్లేయింగ్ ఎలెవన్లో చేర్చింది. మరోవైపు.. టీమిండియా ఏకంగా మూడు మార్పులతో బరిలోకి దిగింది. జస్ప్రీత్ బుమ్రా తిరిగి రాగా.. హర్షిత్ రాణా బెంచ్కే పరిమితమయ్యాడు. మరోవైపు.. కుల్దీప్ యాదవ్, శుబ్మన్ గిల్ గాయాల బెడదతో దూరం కాగా.. వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్ వారి స్థానాలను భర్తీ చేశారు.కాగా ఐదు మ్యాచ్ల సిరీస్లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. కటక్లో భారత్, ముల్లన్పూర్లో సౌతాఫ్రికా గెలవగా.. ధర్మశాలలో భారత్ మరోసారి జయకేతనం ఎగురవేసింది. లక్నోలో నాలుగో టీ20 పొగమంచు వల్ల రద్దైపోగా.. అహ్మదాబాద్లో గెలిచి 3-1తో సిరీస్ గెలవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. టీమిండియా వర్సెస్ సౌతాఫ్రికా ఐదో టీ20 తుదిజట్లుటీమిండియాఅభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్సౌతాఫ్రికాక్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డోనోవాన్ ఫెరీరా, జార్జ్ లిండే, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, లుంగి ఎన్గిడి, ఒట్నీల్ బార్ట్మన్. -
టీ20 వరల్డ్కప్-2026 జట్టు ప్రకటన.. కెప్టెన్పై వేటు
టీ20 ప్రపంచకప్ టోర్నీ-2026కు ముందు శ్రీలంక క్రికెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్గా చరిత్ అసలంకను తప్పించింది. మాజీ సారథి దసున్ షనకకే మరోసారి టీ20 జట్టు పగ్గాలు అప్పగించింది.అందుకే కెప్టెన్ని చేశాంకాగా భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ప్రపంచకప్ టోర్నీకి లంక క్రికెట్ బోర్డు శుక్రవారం తమ ప్రాథమిక జట్టును ప్రకటించింది. ఇందులో భాగంగా దసున్ షనకకు సారథిగా పెద్ద పీట వేయడంపై చీఫ్ సెలక్టర్గా తిరిగి వచ్చిన ప్రమోదయ విక్రమసింఘ స్పందించాడు.‘‘షనక ఆల్రౌండర్ పాత్ర పోషిస్తాడు. నేను సెలక్టర్గా దిగిపోయేనాటికి షనకనే కెప్టెన్గా ఉన్నాడు. అప్పుడు చరిత్ మా దీర్ఘకాలిక ప్రణాళికల్లో ఒకడిగా ఉన్నాడు. కెప్టెన్ అయిన తర్వాత చరిత్ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేదు.సనత్ జయసూర్యతో చర్చించిన తర్వాతేఇటీవల అతడు బ్యాటింగ్లో ఫామ్ కోల్పోయాడు. త్వరలోనే తిరిగి ఫామ్లోకి వస్తాడని భావిస్తున్నాం. హెడ్కోచ్ సనత్ జయసూర్యతో చర్చించిన తర్వాతే ఈ జట్టును ఎంపిక చేశాము. వరల్డ్కప్ వంటి మెగా టోర్నీకి ముందు పెద్దగా మార్పులు చేయాలని మేము అనుకోలేదు’’ అని ప్రమోదయ విక్రసింఘ తెలిపాడు.ఇక నిరోషన్ డిక్విల్లాను తిరిగి జట్టుకు ఎంపిక చేయడంపై స్పందిస్తూ.. ‘‘ఓపెనర్గా.. రిజర్వు వికెట్ కీపర్గా.. మిడిలార్డర్ బ్యాటర్గా అతడు బహుముఖ పాత్రలు పోషించగలడు’’ అని విక్రమసింఘ తెలిపాడు. కాగా 2021లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ టోర్నీలో చివరగా డిక్విల్లా లంక టీ20 జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. తిరిగి సారథిగా..కాగా 2021- 24 వరకు శ్రీలంక వన్డే, టీ20 జట్లకు దసున్ షనక సారథిగా ఉన్నాడు. అయితే, కెప్టెన్గా వరల్డ్కప్ టోర్నీలో విఫలం కావడంతో అతడిని తప్పించి.. అసలంకకు బాధ్యతలు ఇచ్చారు. అయితే, అసలంక సారథ్యంలో ముఖ్యంగా టీ20లలో శ్రీలంక చెత్త ప్రదర్శన నమోదు చేసింది. ఆసియా టీ20 కప్-2025లోనూ తేలిపోయింది. బ్యాటర్గానూ అతడు విఫలమయ్యాడు.ఈ పరిణామాల నేపథ్యంలో అనుభవానికి పెద్ద పీట వేస్తూ.. సెలక్షన్ కమిటీ దసున్ షనకపైనే మరోసారి నమ్మకం ఉంచింది. కాగా గత ఆసియా కప్ (టీ20) టోర్నీలో లంకను అతడు చాంపియన్గా నిలిపాడు. కాగా ఇటీవల పాకిస్తాన్ పర్యటన సందర్భంగా అసలంక భద్రతా కారణాలు చూపి మధ్యలోనే తప్పుకొన్నాడు. ఈ క్రమంలో షనక తాత్కాలిక సారథిగా వ్యవహరించాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి శ్రీలంక ప్రకటించిన ప్రాథమిక జట్టుదసున్ షనక (కెప్టెన్), పాతుమ్ నిసాంక, కుశాల్ మెండిస్, కామిల్ మిశారా, కుశాల్ పెరీరా, ధనంజయ డి సిల్వ, నిరోషన్ డిక్విల్లా. జనిత్ లియానగే, చరిత్ అసలంక, కమిందు మెండిస్, పవన్ రత్మనాయకే, సహాన్ అరాచిగే, వనిందు హసరంగ, దునిత్ వెల్లలగే, మిలన్ రత్ననాయకే, నువాన్ తుషార, ఇషాన్ మలింగ, దుష్మంత చమీర, ప్రమోద్ మదూషాన్, మతీశ పతిరణ, దిల్షాన్ మధుషాంక, మహీశ్ తీక్షణ, దుషాన్ హేమంత, విజయకాంత్ వియస్కాంత్, త్రవీణ్ మాథ్యూ.చదవండి: ఊహించని షాకిచ్చిన రోహిత్ శర్మ! -
చవక ధరకే బెస్ట్ ప్లేయర్లు.. వేలంలో సూపర్ హిట్!
ఐపీఎల్-2026 మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అనుసరించిన వ్యూహాలపై భారత మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ స్పందించాడు. ఈసారి వేలంపాటలో అందరి కంటే ఢిల్లీ ప్రదర్శన అద్భుతంగా ఉందని ప్రశంసించాడు. ఎక్కువగా ఖర్చు పెట్టకుండానే మెరుగైన ఆటగాళ్లను జట్టులో చేర్చుకున్నారని కొనియాడాడు.రూ. 21.80 కోట్ల పర్సు వాల్యూతోఅబుదాబి వేదికగా మంగళవారం మినీ వేలం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రూ. 21.80 కోట్ల పర్సు వాల్యూతో ఢిల్లీ క్యాపిటల్స్ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో అత్యధికంగా జమ్మూ కశ్మీర్ ఎక్స్ప్రెస్ ఆఖిబ్ నబీ కోసం రూ. 8.40 కోట్లు ఖర్చు చేసిన యాజమాన్యం.. అతి తక్కువగా సాహిల్ పరాఖ్ కోసం రూ. 30 లక్షలు వెచ్చించింది.చవక ధరకే బెస్ట్ ప్లేయర్లుఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ ఎస్. బద్రీనాథ్ మాట్లాడుతూ.. ‘‘ఈసారి వేలంలో సింగిల్ డిజిట్ స్కోర్ (కోట్లలో)తోనే వాళ్లు ఆటగాళ్లందరినీ కొనుగోలు చేశారు. ఒక్కరి కోసం అంతకుమించి ఖర్చుపెట్టలేదు. అంటే.. వారు ఈసారి వేలంపాటలో మంచి ప్రదర్శన ఇచ్చారని అర్థం.వేలంలో చవక ధరకే డేవిడ్ మిల్లర్, బెన్ డకెట్, ఆఖిబ్ నబీ వంటి ప్లేయర్లను కొనుగోలు చేసిన తీరు నిజంగా అద్భుతం. దీనిని బట్టే వారు వేలం కోసం ఏ స్థాయిలో సన్నద్ధమయ్యారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం పేపర్ మీదైతే వాళ్ల జట్టు సమతూకంగా ఉంది.ఇక మైదానంలో దిగిన తర్వాత ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి. 13-14 మంది ప్లేయర్లతో బృందాన్ని ఏర్పాటు చేసుకుని.. వారికే తరచూ అవకాశాలు ఇస్తూ ఆత్మవిశ్వాసం నింపాలి. ఈ జట్టుతో ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తే ఢిల్లీ ఈసారి టాప్-4లో ఉండటం ఖాయం’’ అని పేర్కొన్నాడు. కాగా ఆఖరి నిమిషంలో ఢిల్లీ తమ మాజీ ఆటగాడు పృథ్వీ షాను రూ. 75 లక్షల కనీస ధరకు కొనుగోలు చేయడం విశేషం.వేలంలో ఢిల్లీ కొనుగోలు చేసిన ఆటగాళ్లు- ధరఆఖిబ్ నబీ (రూ.8.40 కోట్లు), పాతుమ్ నిసాంక (రూ.4 కోట్లు), కైలీ జేమీసన్ (రూ.2 కోట్లు), లుంగీ ఎన్గిడి (రూ.2 కోట్లు), బెన్ డకెట్ (రూ. 2 కోట్లు), డేవిడ్ మిల్లర్ (రూ. 2 కోట్లు), పృథ్వీ షా (రూ. 75 లక్షలు), సాహిల్ పరాఖ్ (రూ.30 లక్షలు)వేలానికి ముందు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లుఅక్షర్ పటేల్, ముకేశ్ కుమార్, దుష్మంత చమీర, నితీశ్ రాణా (రాజస్తాన్ నుంచి ట్రేడింగ్), కరుణ్ నాయర్, సమీర్ రిజ్వి, కేఎల్ రాహుల్, టి.నటరాజన్, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, త్రిపురాణ విజయ్, అజయ్ మండల్, మాధవ్ తివారి, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోశ్ శర్మ, మిచెల్ స్టార్క్, విప్రజ్ నిగమ్.చదవండి: ఊహించని షాకిచ్చిన రోహిత్ శర్మ! -
పాటిదార్ అవుట్.. కెప్టెన్గా వెంకటేశ్ అయ్యర్
వెంకటేశ్ అయ్యర్కు కెప్టెన్గా ప్రమోషన్ వచ్చింది. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ-2025 సీజన్లో అతడు మధ్యప్రదేశ్ జట్టుకు సారథిగా వ్యవహరించనున్నాడు. కాగా 2015లో మధ్యప్రదేశ్ తరఫున దేశీ క్రికెట్లో అడుగుపెట్టిన వెంకీ.. ఇప్పటికి ఫస్క్లాస్ క్రికెట్లో 20, లిస్ట్-ఎ క్రికెట్లో 48, టీ20లలో యాభైకి పైగా మ్యాచ్లు ఆడాడు.పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా సత్తా చాటుతూ పరుగులు రాబట్టడంతో పాటు ఆయా ఫార్మాట్లలో వికెట్లు కూల్చాడు. ఈ క్రమంలో ఐపీఎల్లోనూ అడుగుపెట్టిన వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer).. ఇప్పటి దాకా కోల్కతా నైట్ రైడర్స్ (KKR)తో కొనసాగాడు. 2024లో ట్రోఫీ గెలిచిన జట్టులోనూ అతడు సభ్యుడు. ఈ నేపథ్యంలో ఈ ఆల్రౌండర్ను 2025 వేలానికి ముందు రిలీజ్ చేసిన కేకేఆర్.. ఏకంగా రూ. 23.75 కోట్ల భారీ ధరకు తిరిగి కొనుగోలు చేసింది.రూ. 7 కోట్లకు ఆర్సీబీ సొంతంఅయితే, తాజా ఎడిషన్లో వెంకటేశ్ బ్యాట్, బంతితో పూర్తిగా తేలిపోయాడు. చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో 2026 మినీ వేలానికి ముందు అతడిని విడిచిపెట్టగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) రూ. 7 కోట్లకు సొంతం చేసుకుంది.ఇదిలా ఉంటే.. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లోనూ వెంకటేశ్ అయ్యర్ స్థాయికి తగ్గట్లు రాణించలేదు. అయినప్పటికీ ఆర్సీబీ ఈ మేర భారీ మొత్తమే చెల్లించగా.. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సైతం మరోసారి నమ్మకం ఉంచి ఏకంగా కెప్టెన్గా నియమించింది.పాటిదార్ అవుట్.. కెప్టెన్గా వెంకటేశ్ అయ్యర్అయితే, ఆర్సీబీకి తొలి ఐపీఎల్ టైటిల్ అందించిన సారథి, మధ్యప్రదేశ్కు గతేడాది విజయ్ హజారే ట్రోఫీ అందించిన రజత్ పాటిదార్ ఈ జట్టులో లేడు. కెప్టెన్గా అతడి స్థానాన్ని వెంకటేశ్ అయ్యర్ భర్తీ చేశాడు. ఇక ఈ ఇద్దరు ఆర్సీబీ బాయ్స్తో పాటు జట్టులో కొత్తగా చేరిన మరో మధ్యప్రదేశ్ ఆటగాడు మంగేశ్ యాదవ్ కూడా దేశీ వన్డే టోర్నీ ఆడబోతున్నాడు. కాగా పాటిదార్ గత కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు.ఈ క్రమంలో కోలుకున్న అతడు భారత క్రికెట్ నియంత్రణ మండలి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ కూడా పొందాడు. అయినప్పటికీ మధ్యప్రదేశ్ జట్టుకు దూరమయ్యాడు. ఇందుకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. కాగా డిసెంబరు 14- జనవరి 8 మధ్య విజయ్ హజారే ట్రోఫీ లీగ్ దశ నిర్వహించనున్నారు.విజయ్ హజారే ట్రోఫీ 2025-26కు మధ్యప్రదేశ్ జట్టువెంకటేశ్ అయ్యర్ (కెప్టెన్), హర్ష్ గావ్లీ, హిమాన్షు మంత్రి (వికెట్ కీపర్), యశ్ దూబే, శుభమ్ శర్మ, హర్ప్రీత్ సింగ్, రిషబ్ చౌహాన్, రితిక్ తడా, కుమార్ కార్తికేయ, సారాంశ్ జైన్, శివంగ్ కుమార్, ఆర్యన్ పాండే, రాహుల్ బాథమ్, త్రిపురేష్ సింగ్, మంగేశ్ యాదవ్, మాధవ్ తివారి (ఫిట్నెస్ ఆధారంగా).చదవండి: IPL 2026: 'పెళ్లి, హానీమూన్ అన్నాడు.. అందుకే అతడిని వదిలేశాము' -
ఊహించని షాకిచ్చిన రోహిత్ శర్మ!
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఊహించని షాకిచ్చాడు. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ-2025 సీజన్కు అతడు అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ సంజయ్ పాటిల్ స్వయంగా వెల్లడించాడు.కాగా ప్రస్తుత టీమిండియాలోని ప్రతి ఒక్క క్రికెటర్ విజయ్ హజారే ట్రోఫీకి అందుబాటులో ఉండాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదేశించిన విషయం తెలిసిందే. కుదిరితే ఈ టోర్నీలోని అన్ని మ్యాచ్లు ఆడాలని.. లేదంటే తమ దేశవాళీ జట్ల తరఫున కనీసం రెండు మ్యాచ్లైనా ఆడాలని ఆదేశించింది.ప్రతి ఒక్కరు ఈ నిబంధన పాటించాల్సిందేడిసెంబరు 24 నుంచి ఈ దేశీ వన్డే టోర్నీ మొదలుకానున్న నేపథ్యంలో టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) సహా ప్రతి ఒక్కరు ఈ నిబంధన పాటించాలని బీసీసీఐ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఒకవేళ ఎవరైనా ఆటగాడు గాయంతో బాధపడుతూ ఆడలేని స్థితిలో ఉంటే.. వారు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి అన్ఫిట్ అన్న సర్టిఫికెట్ పొందితేనే మినహాయింపు ఇస్తామని పేర్కొంది.ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రాబబుల్స్ జట్టులో కోహ్లి పేరు కనిపించింది. మరోవైపు.. తాజాగా ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) మాత్రం టీమిండియా సీనియర్లలో చాలా మంది విజయ్ హజారే ట్రోఫీకి అందుబాటులో లేరని తెలిపింది. ముఖ్యంగా భారత జట్టు దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ప్రశ్న ఎదురుకాగా ఎంసీఏ సెలక్షన్ కమిటీ చైర్మన్ సంజయ్ పాటిల్ మాట దాటవేశాడు.అందుబాటులో లేరుటైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ముంబై జట్టుకు చెందిన టీమిండియా ఆటగాళ్లలో ప్రస్తుతానికి ఎవరూ మాకు అందుబాటులో లేరు. అలాంటపుడు వారిని జట్టులో చేర్చడం సరికాదు కదా!.. వారికి బదులు యువ ఆటగాళ్లకు జట్టులో చోటునిస్తాం’’ అని సంజయ్ పాటిల్ తెలిపాడు.కాగా రోహిత్ శర్మ ప్రస్తుతం పూర్తి ఫిట్గా.. మనుపటి కంటే సన్నబడి మంచి ఫామ్లో ఉన్నాడు. ఇటీవల సౌతాఫ్రికాతో వన్డేల్లోనూ అదరగొట్టాడు. అయితే, విజయ్ హజారే ట్రోఫీకి అతడు ఎందుకు అందుబాటులో లేడన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో సిరీస్తో బిజీగా ఉన్న టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో పాటు శివం దూబే కూడా ముంబై జట్టులో ఉండటం లేదు.వారికే సడలింపుటీ20 ప్రపంచకప్-2026 నాటి వీరు పూర్తిస్థాయి ఫిట్గా ఉండటం.. గాయాల బారిన పడకుండా ఉండటం అత్యంత ముఖ్యం. అందుకే వీరికి సడలింపు దొరికినట్లు తెలుస్తోంది. మరోవైపు.. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడిన టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ అనారోగ్యం వల్ల ఆరంభ మ్యాచ్లకు దూరం కానున్నాడు.ఇక గాయం నుంచి కోలుకుంటున్న ముంబై మాజీ సారథి అజింక్య రహానే సైతం ఈ టోర్నీకి దూరం కానుండగా.. శ్రేయస్ అయ్యర్దీ ఇదే పరిస్థితి అని సమాచారం. ఈ నేపథ్యంలో శార్దూల్ ఠాకూర్ కెప్టెన్సీలోని ముంబై జట్టులో సర్ఫరాజ్ ఖాన్, అతడి తమ్ముడు ముషీర్ ఖాన్ తదితరులు చోటు దక్కించుకున్నారు. ఇషాన్ ముల్చందానికి తొలిసారిగా ఈ జట్టులో చోటు దక్కింది. కాగా డిసెంబరు 24- జనవరి 8 వరకు విజయ్ హజారే ట్రోఫీ గ్రూప్ దశ జరుగనుంది.చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్ -
శతక్కొట్టిన హెడ్.. అరుదైన జాబితాలో చోటు
యాషెస్ సిరీస్ 2025-26లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో హెడ్ సెంచరీతో సత్తాచాటాడు. తన హోమ్ గ్రౌండ్ అయిన అడిలైడ్ ఓవల్లో ఇంగ్లండ్ బౌలర్లను ఉతికారేశాడు. ఈ క్రమంలో 146 బంతుల్లో తన 11వ టెస్టు సెంచరీని పూర్తి చేసుకున్నాడు. హెడ్ 142 పరుగులతో ఇంకా క్రీజులో ఉన్నాడు. రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఆసీస్కు ఓపెనర్ వెథరాల్డ్ (1) ఔట్ కావడంతో ఆదిలోనే షాక్ తగిలింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మార్నస్ లబుషేన్ (13) ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయాడు. ఈ సమయంలో హెడ్.. వెటరన్ ప్లేయర్ ఉస్మాన్ ఖవాజా(40) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అనంతరం ఖవాజా పెవిలియన్కు చేరాడు. అయితే ఒకవైపు వికెట్లు పడుతున్నా.. హెడ్ మాత్రం ఏ మాత్రం తడబడకుండా ఇంగ్లండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డు పరుగులు పెట్టించాడు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. కంగారూ జట్టు ప్రస్తుతం 356 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజులో హెడ్తో పాటు అలెక్స్ కారీ(52) ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన హెడ్ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.హెడ్ సాధించిన రికార్డులు ఇవే..👉అడిలైడ్ ఓవల్లో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన మూడో ప్లేయర్గా ఆసీస్ దిగ్గజాలు డేవిడ్ వార్నర్, అలన్ బోర్డర్, డేవిడ్ బూన్ సరసన హెడ్ నిలిచాడు. ఈ మైదానంలో హెడ్కు ఇది నాలుగో టెస్టు సెంచరీ. ఈ జాబితాలో హెడ్ కంటే ముందు మైఖేల్ క్లార్క్ (7), రికీ పాంటింగ్ (6) ఉన్నారు.👉ఆస్ట్రేలియాలోని ఒకే వేదికలో వరుసగా నాలుగు టెస్టు సెంచరీలు చేసిన ఐదో ప్లేయర్గా హెడ్ నిలిచాడు. అడిలైడ్లో హెడ్కు ఇది వరుసగా నాలుగో టెస్టు సెంచరీ. ఈ జాబితాలో డాన్ బ్రాడ్మాన్, వాలీ హమ్మండ్, మైఖేల్ క్లార్క్, స్టీవ్ స్మిత్ వంటి లెజెండ్స్ ఉన్నారు. -
రూ.25 కోట్ల ఆటగాడు అట్టర్ ప్లాప్
ఐపీఎల్ 2026 మినీ వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్గా రికార్డు సృష్టించిన ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ యాషెస్ సిరీస్లో తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. తొలి రెండు టెస్టుల్లో దారుణంగా విఫలమైన గ్రీన్.. ఇప్పుడు అడిలైడ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో అదే తీరును కనబరిచాడు. మొదటి ఇన్నింగ్స్లో డకౌటైన గ్రీన్.. రెండో ఇన్నింగ్స్లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. జోష్ టంగ్ బౌలింగ్లో హ్యారీ బ్రూక్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. బౌలింగ్లోనూ కేవలం ఒక్క వికెట్ పడగొట్టాడు.కేకేఆర్కు హెడ్ఎక్..ఇటీవల దుబాయ్లో జరిగిన మినీ వేలంలో గ్రీన్ను రూ. 25.20 కోట్ల భారీ ధరకు కోల్కతా నైట్రైడర్స్ కొనుగోలు చేసింది. గ్రీన్ను ఒక కంప్లీట్ ఆల్రౌండర్గా జట్టులోకి తీసుకున్న కేకేఆర్.. అతడిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. బ్యాట్తో పాటు బంతితోనూ రాణిస్తాడని నైట్రైడర్స్ ఆశిస్తోంది. కానీ రెడ్ బాల్ క్రికెట్లో అతడి ప్రస్తుత ఫామ్ కోల్కతా మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. ముఖ్యంగా ఒత్తిడి సమయాల్లో ఆడలేక వికెట్ పారేసుకోవడం చర్చనీయంగా మారింది.భారీ ఆధిక్యం దిశగా ఆసీస్..అయితే ఈ మ్యాచ్లో ఆసీస్ జోరు కొనసాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. కంగారూ జట్టు ప్రస్తుతం 356 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ అడిలైడ్ టెస్టులో ట్రావిస్ హెడ్ సెంచరీతో సత్తాచాటాడు. 142 పరుగులతో హెడ్ నాటౌట్గా ఉన్నాడు. అతడితో పాటు అలెక్స్ కారీ(52) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 286 పరుగులకు ఆలౌటైంది.చదవండి: IPL 2026: 'పెళ్లి, హానీమూన్ అన్నాడు.. అందుకే అతడిని వదిలేశాము' -
టీ20 ప్రపంచకప్కు భారత జట్టు ఇదే! స్టార్ ప్లేయర్కు నో ఛాన్స్?
టీ20 ప్రపంచకప్-2026కు భారత జట్టును బీసీసీఐ శనివారం(డిసెంబర్ 20) ప్రకటించనుంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ముంబైలోని వాంఖడే స్టేడియంలో సమావేశం కానున్నారు. అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్లో అగార్కర్ జట్టును ప్రకటించనున్నాడు. ఈ మెగా టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 7 నుంచి ఈ పొట్టి ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీ గ్రూపు-ఎలో టీమిండియా ఉంది. టీమిండియాతో పాటు పాకిస్తాన్, యూఎస్ఎ, నమీబియా, నెదర్లాండ్స్ ఉన్నాయి. ఈ మెగా ఈవెంట్కు ముందు భారత్ ఇంకా 6 టీ20 మ్యాచ్లు ఆడింది. సౌతాఫ్రికాతో ఒక్క మ్యాచ్.. కివీస్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో టీమిండియా తలపడనుంది. ఈ సిరీస్ ముగిశాక మెన్ ఇన్ బ్లూ నేరుగా టీ20 ప్రపంచకప్లో అడుగుపెట్టనుంది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత్.. తమ తొలి మ్యాచ్లో ఫిబ్రవరి 7న యూఏఈతో తలపడనుంది.ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మెగా టోర్నీ కోసం భారత జట్టును మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఎంపిక చేశాడు. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ను చోప్రా ఎంపిక చేశాడు. అదేవిధంగా మిడిలార్డర్లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలకు అతడు చోటిచ్చాడు. వికెట్ కీపర్లగా సంజూ శాంసన్, జితేష్ శర్మలు ఉన్నారు. ఆల్రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లకు అవకాశం దక్కింది. స్పెషలిస్టు స్పిన్నర్లగా వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్లను ఎంపిక చేయగా.. ఫాస్ట్ బౌలర్లగా జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణాలు ఉన్నారు. అయితే చోప్రా ఎంపిక చేసిన జట్టులో స్టార్ ఫినిషర్ రింకూ సింగ్కు చోటు దక్కకపోవడం గమనార్హం. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్కు కూడా రింకూను ఎంపిక చేయలేదు.చదవండి: IPL 2026: 'పెళ్లి, హానీమూన్ అన్నాడు.. అందుకే అతడిని వదిలేశాము' -
సెంచరీ చేసిన తొలి భారత ప్లేయర్ ఎవరో తెలుసా?
ప్రస్తుత టీ20 క్రికెట్ యుగంలో సెంచరీలు చేయడం సర్వసాధారణం అయిపోయింది. కానీ ఒకప్పుడు క్రికెట్ మైదానంలో సెంచరీ సాధించడం ఒక అరుదైన ఘనత. సచిన్ టెండూల్కర్ నుంచి విరాట్ కోహ్లి వరకు ఎంతో కష్టపడి ఒక్కో శతకాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. అందుకే అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా సచిన్ కొనసాగుతున్నాడు. అందుకే అతడిని గాడ్ ఆఫ్ క్రికెట్గా పిలుస్తారు. అయితే ఈ సెంచరీల ప్రవాహానికి బీజం పడింది ఎప్పుడో తెలుసా? భారత తరపున తొలి అంతర్జాతీయ సెంచరీ చేసింది ఎవరో తెలుసా? తెలియకపోతే ఈ కథనం చదవాల్సిందే.డిసెంబర్ 15, 1933.. భారత క్రికెట్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభమైంది. అదే రోజున భారత క్రికెట్ జట్టు స్వదేశంలో తమ తొలి టెస్టు మ్యాచ్ ఆడింది. డగ్లస్ జార్డైన్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్టు మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు భారత పర్యటనకు వచ్చింది. తొలి టెస్టు మ్యాచ్కు ముంబైలోని బాంబే జింఖానా మైదానం వేదికైంది. ఈ చారిత్రత్మక మ్యాచ్లో భారత జట్టుకు సి.కె. నాయుడు నాయకత్వం వహించారు.తొలి సెంచరీ..ఈ మ్యాచ్లో భారత క్రికెట్ దిగ్గజాలు విజయ్ మర్చంట్, లక్ష్మిదాస్ జైలతో పాటు 22 ఏళ్ల పంజాబ్ కుర్రాడు అరంగేట్రం చేశాడు. ఆ 22 ఏళ్ల కుర్రాడు తన పేరును భారత క్రికెట్ చరిత్రలో లిఖించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో 32 పరుగులు చేసి సత్తాచాటిన ఆ యువ సంచలనం.. రెండో ఇన్నింగ్స్లో సెంచరీతో చెలరేగాడు. అతడే లెజెండరీ లాలా అమర్నాథ్. అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా, అరంగేట్రం టెస్టులోనే శతకం బాదిన మొదటి ఇండియన్గా అమర్నాథ్ రికార్డు సృష్టించాడు.అమర్నాథ్ విధ్వంసం..219 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన భారత్ కేవలం 21 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన ఆ కుర్రాడు.. కెప్టెన్ సి.కె. నాయుడుతో కలిసి ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతడిని ఆపడం ఇంగ్లీష్ బౌలర్ల తరం కాలేదు. కేవలం రెండు గంటల వ్యవధిలోనే 21 ఫోర్ల సాయంతో 118 పరుగులు సాధించాడు.అప్పటిలో బంతులు కాకుండా నిమిషాలను పరిగణలోకి తీసుకునేవారు. అమర్నాథ్ సెంచరీ పూర్తి చేయగానే మైదానంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆ వార్త బయటకు వెళ్లడంతో జనం స్టేడియానికి పోటెత్తారు. అభిమానులు మైదానంలోకి దూసుకొచ్చి ఆయనకు పూలమాలలు వేశారు.మహిళా గ్యాలరీలోని కొందరు అభిమానులు ఆయనపై నగలు, నగదును కురిపించడం ఆ రోజుల్లో ఒక సంచలనంగా మారింది. అయితే ఈ మ్యాచ్లో భారత్ పరాజయం పాలైనప్పటికి.. ఆ ఓటమి అమర్నాథ్ సెంచరీ ముందు చిన్నబోయింది. నేడు భారత్ ప్రపంచ క్రికెట్లో అగ్రగామిగా ఉండటానికి.. బ్యాటింగ్ పవర్హౌస్గా పేరుగాంచడానికి పునాది అమర్నాథ్ సెంచరీతోనే పడింది. భారత క్రికెట్లో ఎన్ని సెంచరీలు నమోదైనా.. అమర్నాథ్ బ్యాట్ నుంచి వచ్చిన సెంచరీ చరిత్రలో నిలిచిపోతుంది.అమర్నాథ్ తన కెరీర్లో 24 మ్యాచ్లు ఆడి 878 పరుగులు చేశాడు. ఆయన పేరిట 45 వికెట్లు కూడా ఉన్నాయి. ఇక ఫస్ట్క్లాస్ క్రికెట్లో అయితే అమర్నాథ్కు ఘనమైన రికార్డు ఉంది. 10426 పరుగులతో పాటు 463 వికెట్లు పడగొట్టారు. 2000 సంవతర్సంలో ఆయన అనారోగ్యం కారణాల వల్ల తుది శ్వాస విడిచారు. ఆయన తనయుడు సురీందర్ అమర్నాథ్ సైతం భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. -
చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్..
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025 విజేతగా జార్ఖండ్ నిలిచింది. గురువారం జరిగిన ఫైనల్లో హర్యానాను 69 పరుగుల తేడాతో చిత్తు చేసిన జార్ఖండ్.. తొలిసారి ఈ దేశవాళీ టీ20 టోర్నీ టైటిల్ను ముద్దాడింది. జార్ఖండ్ ఛాంపియన్గా నిలవడంలో ఆ జట్టు కెప్టెన్ ఇషాన్ కిషన్ది కీలక పాత్ర.తుది పోరులో కిషన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన కిషన్ ప్రత్యర్ధి బౌలర్లను ఊతికారేశాడు. ఎంసీఎ స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో అతడు కేవలం 45 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 49 బంతులు ఎదుర్కొన్న కిషన్.. 6 ఫోర్లు, 10 సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. అతడితో పాటు కుషాగ్ర(81) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో జార్ఖండ్ 6 వికెట్ల నష్టానికి ఏకంగా 262 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో హర్యానా 18.3 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. ఇక ఈ మ్యాచ్లో సెంచరీతో సత్తాచాటిన కిషన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.కిషన్ సాధించిన రికార్డులు ఇవే..👉సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలో ఫైనల్ మ్యాచ్లో సెంచరీ సాధించిన మొట్టమొదటి కెప్టెన్గా ఇషాన్ కిషన్ రికార్డు సృష్టించాడు.👉ఒకే టీ20 టోర్నమెంట్లో (అంతర్జాతీయ లేదా డొమెస్టిక్) అత్యధిక సిక్సర్లు బాదిన వికెట్ కీపర్ కెప్టెన్గా ఇషాన్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ టోర్నీలో అతడు 33 సిక్సర్లు బాదాడు. గతంలో ఈ రికార్డు ఎంఎస్ ధోని (30), నికోలస్ పూరన్ (30) పేరిట ఉండేది.👉టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత వికెట్ కీపర్గా సంజూ శాంసన్(5) రికార్డును ఇషాన్ బ్రేక్ చేశాడు. కిషన్ ఇప్పటివరకు టీ20ల్లో 6 సెంచరీలు చేశాడు. ఓవరాల్ వరల్డ్ క్రికెట్లో ఈ ఫీట్ సాధించిన రెండో వికెట్ కీపర్గా కిషన్ నిలిచాడు. తొలి స్ధానంలో క్వింటన్ డికాక్(7) ఉన్నాడు.👉సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా అభిషేక్ శర్మ రికార్డును ఇషాన్ సమం చేశారు. ఈ దేశవాళీ టోర్నీలో వీరిద్దరూ ఇప్పటివరకు చెరో ఐదు సెంచరీలు నమోదు చేశాడు.👉ఒకే టోర్నమెంట్లో వికెట్ కీపర్ కెప్టెన్గా రెండు సార్లు సెంచరీలు సాధించిన మొదటి ప్లేయర్గా ఇషన్ నిలిచాడు.కిషన్ చివరగా 2023లో భారత్ తరపున ఆడాడు. దేశవాళీ క్రికెట్లో ఆడాలన్న తమ ఆదేశాలను ధిక్కరించడంతో బీసీసీఐ అతడిని సెంట్రల్ కాంట్రాక్ నుంచి తప్పించింది. ఆ తర్వాత మళ్లీ అతడు డొమాస్టిక్ క్రికెట్ ఆడడంతో తిరిగి సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కింది. కానీ జట్టులోకి మాత్రం ఇంకా పునరాగమనం చేయలేదు.చదవండి: IPL 2026: 'పెళ్లి, హానీమూన్ అన్నాడు.. అందుకే అతడిని వదిలేశాము' -
'పెళ్లి, హానీమూన్ అన్నాడు.. అందుకే అతడిని వదిలేశాము'
ఐపీఎల్-2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిష్పై కాసుల వర్షం కురిసింది. కేవలం నాలుగు మ్యాచ్లకు మాత్రమే అందుబాటులో ఉంటాడని తెలిసినప్పటికీ.. లక్నో సూపర్ జెయింట్స్ అతడిని రూ. 8.6 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.ఇంగ్లిష్ కోసం లక్నోతో పాటు సన్రైజర్స్ హైదరాబాద్ కూడా తీవ్రంగా శ్రమించింది. కాగా ఇంగ్లిస్ వచ్చే ఏడాది ఏప్రిల్లో వివాహం చేసుకోబోతున్నాడు. ఈ కారణంగా అతను ఐపీఎల్ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండనని, కేవలం 4 మ్యాచ్లు మాత్రమే ఆడుతానని ముందుగానే ప్రకటించాడు. దీంతో పంజాబ్ కింగ్స్ అతడిని రిటైన్ చేసుకోకుండా వేలంలోకి విడిచిపెట్టింది.హనీమూన్ వాయిదా?అయితే ఇప్పుడు భారీ ధరకు అమ్ముడుపోవడంతో కేవలం నాలుగు మ్యాచ్ల ఆడాలన్న తన నిర్ణయాన్ని ఇంగ్లిష్ మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 18న వివాహం తర్వాత వెంటనే హనీమూన్కు వెళ్లాలనుకున్న ప్లాన్ను వాయిదా వేసి..నేరుగా లక్నో క్యాంప్లో చేరాలని అతను భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.అయినప్పటికి అతడు ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లకు దూరమయ్యే అవకాశముంది. ఇదే విషయంపై పంజాబ్ కింగ్స్ కో-ఓనర్ నెస్ వాడియా స్పందించారు. ఇంగ్లిష్ తీరును అతడు తప్పుబట్టాడు."మేము జోష్ ఇంగ్లిష్ను రిటైన్ చేసుకోవాలనుకున్నాము. కానీ అతడు రిటెన్షన్ గడువు ముగియడానికి కేవలం 45 నిమిషాల ముందు తన వ్యక్తిగత కారణాల గురించి తెలియజేశాడు. తన పెళ్లి, హానీమూన్ కారణంగా కేవలం మూడు మ్యాచ్లకే మాత్రమే అందుబాటులో ఉంటానని చెప్పాడు. అందుకే అతడిని వదులుకోవాల్సి వచ్చింది. ఇది ఏమాత్రం ప్రొఫెషన్లిజం కాదు. కానీ నేను అతడికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అతడు అద్భుతమైన ఆటగాడు. ఆస్ట్రేలియా తరపున కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. మరి ఇప్పుడు ఐపీఎల్లో అన్ని మ్యాచ్లు ఆడుతాడో లేదో చూద్దం" అని వాడియా ఓ ప్రకటనలో పేర్కొన్నారు.కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో ఇంగ్లిష్ను రూ. 2.60 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగొలు చేసింది. తన ధరకు తగ్గ న్యాయం అతడు చేశాడు. 11 మ్యాచ్లు ఆడి 162.57 స్ట్రైక్ రేట్తో 278 పరుగులు చేశాడు. అయితే ఇప్పుడు అతడు ఏకంగా రూ.8.60 కోట్లు అందుకోనున్నాడు. అంటే దాదాపు 230.77% పెరుగుదల అనే చెప్పాలి.చదవండి: ఐపీఎల్ వేలంలో అన్సోల్డ్.. కట్ చేస్తే! అక్కడ డబుల్ సెంచరీతో -
ఐపీఎల్ వేలంలో అన్సోల్డ్.. కట్ చేస్తే! అక్కడ డబుల్ సెంచరీతో
మౌంట్ మౌంగానుయి వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న మూడో టెస్టులో న్యూజిలాండ్ స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 316 బంతుల్లో తన రెండో టెస్టు డబుల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు.178 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన కాన్వే దూకుడుగా ఆడి తన ద్విశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్గా 367 బంతులు ఎదుర్కొన్న కాన్వే.. 31 ఫోర్ల సాయంతో 508 పరుగులు చేశాడు. ఇంతకుముందు డెవాన్ ఇంగ్లండ్పై తన తొలి డబుల్ సెంచరీని సాధించాడు.కాన్వే-లాథమ్ వరల్డ్ రికార్డు..ఈ మ్యాచ్లో డెవాన్ కాన్వేతో పాటు కెప్టెన్ టామ్ లాథమ్ కూడా (246 బంతుల్లో 137; 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో కదం తొక్కాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్కు 323 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తద్వారా న్యూజిలాండ్ గడ్డపై అత్యధిక ఓపెనింగ్ పార్ట్నర్షిప్ సాధించిన జోడీగా లాథమ్- కాన్వే చరిత్ర సృష్టించారు. అదేవిధంగా డబ్ల్యూటీసీ చరిత్రలో ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం కావడం విశేషం. సౌతాఫ్రికాతో టెస్టులో 2019లో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ- మయాంక్ అగర్వాల్ తొలి వికెట్కు 317 పరుగులు జోడించగా.. లాథమ్- కాన్వే ఈ రికార్డును బ్రేక్ చేశారు. తొలి ఇన్నింగ్స్లో కివీస్ భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. 145 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 508 పరుగుల భారీ స్కోర్ చేసింది.ఐపీఎల్ వేలంలో అన్సోల్డ్..కాగా డబుల్ సెంచరీ వీరుడు డెవాన్ కాన్వే ఇటీవల జరిగిన ఐపీఎల్-2026 మినీ వేలంలో అన్సోల్డ్గా మిగిలిపోయాడు. రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన కాన్వేను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. ఐపీఎల్లో కూడా మంచి రికార్డును డెవాన్ను ఎవరూ తీసుకోకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. గతంలో అతడు సీఎస్కే ప్రాతినిథ్యం వహించాడు.చదవండి: Ashes 2025: స్టోక్స్, ఆర్చర్ విరోచిత పోరాటం.. ఇంగ్లండ్ ఆలౌట్ -
స్టోక్స్, ఆర్చర్ విరోచిత పోరాటం.. ఇంగ్లండ్ ఆలౌట్
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ మూడో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 213/8 ఓవర్ నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్లో 286 పరుగుల వద్ద ఆలౌటైంది.టాపార్డర్ విఫలమైనప్పటికి.. కెప్టెన్ బెన్ స్టోక్స్ (198 బంతుల్లో 83), లోయార్డర్ బ్యాటర్ జోఫ్రా ఆర్చర్(105 బంతుల్లో 51) విరోచిత పోరాటం కనబరిచారు. ‘బాజ్బాల్’ ఆటతీరును పక్కన పెట్టిన స్టోక్స్... సంప్రదాయ టెస్టు క్రికెట్ ఫార్మాట్లో ఓవర్లకు ఓవర్లు క్రీజులో పాతుకుపోయి బ్యాటింగ్ చేశాడు.ఈ క్రమంలో బ్రూక్తో ఐదో వికెట్కు 56 పరుగులు జోడించిన స్టోక్స్... తొమ్మిదో వికెట్కు ఆర్చర్తో 106 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆర్చర్ కూడా ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 85 పరుగులు వెనకబడింది.శాంతించిన స్టార్క్..గత రెండు మ్యాచ్ల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు దక్కించుకున్న మిచెల్ స్టార్క్ ఈసారి కాస్త శాంతించగా... ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ తలా 3 వికెట్లతో సత్తా చాటారు. నాథన్ లయన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో ఆ్రస్టేలియా బౌలర్గా లయన్ నిలిచాడు. పేస్ దిగ్గజం మెక్గ్రాత్ను అతడు అధిగమించాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 326/8తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆ్రస్టేలియా... చివరకు 91.2 ఓవర్లలో 371 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ స్టార్క్ (75 బంతుల్లో 54; 9 ఫోర్లు) హాఫ్సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 5 వికెట్లు పడగొట్టగా... కార్స్, జాక్స్ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు.చదవండి: సమమా... సొంతమా! -
విజేతకు రూ. 450 కోట్లు
దోహా: మరో ఏడు నెలల్లో జరగనున్న ప్రపంచకప్ పురుషుల ఫుట్బాల్ టోర్నమెంట్కు సంబంధించి ప్రైజ్మనీ వివరాలను అంతర్జాతీయ ఫుట్బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా) గురువారం వెల్లడించింది. ఈసారి విజేత జట్టుకు 5 కోట్ల డాలర్లు (రూ. 450 కోట్లు) ప్రైజ్మనీగా లభిస్తాయి. రన్నరప్ జట్టు ఖాతాలో 3 కోట్ల 30 లక్షల డాలర్లు (రూ. 297 కోట్లు) చేరుతాయి. 2026 ఫుట్బాల్ ప్రపంచకప్ ఓవరాల్ ప్రైజ్మనీ 65 కోట్ల 50 లక్షల డాలర్లు (రూ. 5,905 కోట్లు) కావడం విశేషం. 2022లో ఖతర్లో జరిగిన ప్రపంచకప్తో పోలిస్తే ఈసారి మొత్తం ప్రైజ్మనీలో 48.9 శాతం పెరుగుదల ఉంది. 2022 ప్రపంచకప్ మొత్తం ప్రైజ్మనీ 44 కోట్లు కావడం గమనార్హం. 2022 ప్రపంచకప్లో టైటిల్ నెగ్గిన అర్జెంటీనా జట్టుకు 4 కోట్ల 20 లక్షల డాలర్లు... రన్నరప్ ఫ్రాన్స్ జట్టుకు 3 కోట్ల 80 లక్షల డాలర్లు లభించాయి. 2026 ప్రపంచకప్ జూన్ 11 నుంచి జూలై 19 వరకు అమెరికా, మెక్సికో, కెనడాలలో నిర్వహిస్తారు. తొలిసారి 48 జట్లతో ఈ మెగా ఈవెంట్ను నిర్వహిస్తున్నారు. దోహాలో జరిగిన ‘ఫిఫా’ కౌన్సిల్ సమావేశంలో ప్రైజ్మనీ వివరాలకు ఆమోదం లభించింది. ఎప్పటిలాగే టోర్నీకి అర్హత సాధించిన అన్ని జట్లకు ‘ఫిఫా’ నుంచి భారీ మొత్తం అందనుంది. మెగా ఈవెంట్కు అర్హత పొందినందుకు 48 జట్లకు 90 లక్షల డాలర్ల (రూ. 8 కోట్ల 11 లక్షలు) చొప్పున పార్టిసిపేషన్ ఫీజు... ప్రపంచకప్ సన్నాహాల ఖర్చుల కింద 15 లక్షల డాలర్ల (రూ. 1 కోటీ 35 లక్షలు) చొప్పున ‘ఫిఫా’ చెల్లిస్తుంది. ‘ఫిఫా’ చెల్లించే మొత్తం ఆయా దేశాల ఫుట్బాల్ సమాఖ్యలకు వెళుతుంది. తమ క్రీడాకారులకు ఎంత మొత్తం చెల్లించాలో ఆయా దేశాల సమాఖ్యలే నిర్ణయం తీసుకుంటాయని ‘ఫిఫా’ వివరించింది. ఎవరికెంత ప్రైజ్మనీ అంటే...విజేత: 5 కోట్ల డాలర్లు (రూ. 450 కోట్లు) రన్నరప్: 3 కోట్ల 30 లక్షల డాలర్లు (రూ. 297 కోట్లు) మూడో స్థానం: 2 కోట్ల 90 లక్షల డాలర్లు (రూ. 261 కోట్లు) నాలుగో స్థానం: 2 కోట్ల 70 లక్షల డాలర్లు (రూ. 243 కోట్లు) 5 నుంచి 8 స్థానాల్లో నిలిచిన జట్లకు 1 కోటీ 90 లక్షల డాలర్ల చొప్పున (రూ. 171 కోట్లు చొప్పున) 9 నుంచి 16 స్థానాల్లో నిలిచిన జట్లకు 1 కోటీ 50 లక్షల డాలర్ల చొప్పున (రూ. 135 కోట్లు చొప్పున) 17 నుంచి 32 స్థానాల్లో నిలిచిన జట్లకు 1 కోటీ 10 లక్షల డాలర్ల చొప్పున (రూ. 99 కోట్లు చొప్పున) 33 నుంచి 48 స్థానాల్లో నిలిచిన జట్లకు 90 లక్షల డాలర్ల చొప్పున (రూ. 81 కోట్లు చొప్పున) -
మన ఫుట్బాల్ సంగతేంటి?
న్యూఢిల్లీ: భారత ఫుట్బాల్ జట్టుపై గురువారం రాజ్యసభలో ఆసక్తికరచర్చ జరిగింది. 1 లక్షా 58 వేల జనాభా మాత్రమే ఉన్న కురసావ్ దేశం జట్టు వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నీకి అర్హత సాధించింది. అయితే 143 కోట్ల జనభా ఉన్న భారత్ సంగతేంటని కేరళకు చెందిన కాంగ్రెస్ సభ్యులు జోస్ కె. మణి రాజ్యసభలో ప్రశ్నించారు. మన ఫుట్బాల్ జట్టు ప్రగతిపై దీర్ఘకాలిక ప్రణాళికలేవైనా ఉన్నాయా అని కూడా అడిగారు. దీనిపై కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ స్పందిస్తూ కురసావ్ దేశం పేరెత్తకుండా బదులిచ్చారు. ‘ఫుట్బాల్ ప్రపంచకప్కు అర్హత సాధించడం అంతర్జాతీయ ఫుట్బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా) నిర్దేశించిన ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది’ అని అన్నారు. ఏదైనా ప్రపంచకప్ లేదంటే ప్రపంచ చాంపియన్íÙప్లలో పాల్గొనడానికి, అర్హత సంపాదించడానికి సంబంధిత జాతీయ క్రీడా సమాఖ్య చూసుకోవాల్సిన అంశమని, ఆయా క్రీడల నిర్దిష్ట అభివృద్ధికి సంబంధిత సమాఖ్యలదే బాధ్యతని ఆయన సభకు వివరించారు. అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) దేశంలో క్రీడాభివృద్ధికి, ఆదరణ పెంచేందుకు, ప్రతిభగల ఫుట్బాలర్లను మరింత సానబెట్టేందుకు, పురుషులు, మహిళల జట్టు ‘ఫిఫా’ మెగా ఈవెంట్కు అర్హత సాధించేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్తాయని మంత్రి మాండవీయ వివరించారు. తమ ప్రభుత్వ పరంగా ‘ఖేలో ఇండియా’ పేరుతో చేపట్టిన బృహత్తర కార్యక్రమం ద్వారా ప్రతిభావంతులైన అథ్లెట్లు ఎందరో వెలుగులోకి వచ్చారని, 20 వేల పైచిలుకు క్రీడాకారులు ఈ ఖేలో ఇండియాతో ప్రయోజనం పొందారని చర్చ సందర్భంగా జవాబిచ్చారు. దేశంలో ఉన్న 991 ఖేలో ఇండియా కేంద్రాల్లో 28,214 మంది క్రీడాకారులు ప్రత్యేక శిక్షణ పొందుతున్నారని చెప్పారు. -
ఈ ఏటి మేటి షోలో సామ్రాట్ ‘స్వర్ణ’ గురి
న్యూఢిల్లీ: భారత షూటర్ సామ్రాట్ రాణా ప్రపంచ చాంపియన్షిప్లో కనబరిచిన స్వర్ణ పతక ప్రదర్శనకు అరుదైన గుర్తింపు దక్కింది. అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) విడుదల చేసిన ఈ ఏడాది మేటి ఐదు ప్రదర్శనల్లో మన షూటర్ ఘనత కూడా నిలిచింది. హరియాణాకు చెందిన 20 ఏళ్ల యువ షూటర్ సామ్రాట్ గత నెల కైరోలో జరిగిన ఈవెంట్లో బంగారు పతకం సాధించాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో అసాధారణ గురితో ‘స్వర్ణ’ధరికి చేరాడు. తన తండ్రి ఇచ్చిన ప్రోత్సాహం, సొంత వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన చిన్నపాటి షూటింగ్ కేంద్రమే సామ్రాట్ను ప్రపంచ చాంపియన్గా మలిచింది. ఈ సందర్భంగా ఐఎస్ఎస్ఎఫ్ సామ్రాట్ పసిడి పతక ప్రదర్శనను ఆకాశానికెత్తింది. అద్భుతమని కితాబిచ్చి ంది. అక్కడ అతనేం చేశాడంటే... పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్స్కు సామ్రాట్ అర్హత సాధించాడు. కానీ అక్కడ ప్రపంచ నంబర్వన్ హు కై (చైనా) ఉన్నాడు. పైగా ఈ ఏడాది అతను ఎవరి చేతిలోనూ ఓడలేదు. అలాంటి అజేయ షూటర్ స్వర్ణం లక్ష్యంగా బుల్లెట్లను ఫైర్ చేశాడు. ఇంకో నాలుగైదు షాట్లే మిగిలున్నాయి. చైనా షూటర్ స్పష్టమైన అధిక్యంలో ఉన్నాడు. ఇలాంటి దశలో ఒత్తిడి లేకుండా సామ్రాట్ తన కంటికి లక్ష్యబిందువు తప్ప ఇంకేది కనపడనీయలేదు. ట్రిగ్గర్ నొక్కి కచ్చి తత్వంతో కూడిన రెండు వరుస షాట్లు (10.2 పాయింట్లు, 10.6 పాయింట్లు) హరియాణా షూటర్కు అసాధారణ విజయాన్ని కట్టబెట్టాయి. -
సమమా... సొంతమా!
అహ్మదాబాద్: సిరీస్ సాధించడమే లక్ష్యంగా భారత జట్టు శుక్రవారం దక్షిణాఫ్రికాతో చివరి టి20 మ్యాచ్ బరిలోకి దిగనుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా టీమిండియా రెండు విజయాలు సాధించగా... దక్షిణాఫ్రికా ఒక మ్యాచ్ నెగ్గింది. మరో మ్యాచ్ పొగమంచు కారణంగా రద్దు అయింది. దీంతో ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత్ 2–1తో ముందంజలో ఉంది. చివరి మ్యాచ్లో నెగ్గి సిరీస్ సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తుండగా... సుదీర్ఘ పర్యటనను విజయంతో ముగించి సిరీస్ను సమం చేయాలని సఫారీలు చూస్తున్నారు. ఈ టూర్లో భాగంగా దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ నెగ్గగా... టీమిండియా వన్డే సిరీస్ సొతం చేసుకుంది. ఇప్పుడిక టి20 విజేతను తేల్చే మ్యాచ్కు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం సిద్ధమైంది. గాయం కారణంగా గత మ్యాచ్కు దూరమైన భారత వైస్ కెపె్టన్ శుబ్మన్ గిల్... జట్టుతో పాటు అహ్మదాబాద్ చేరుకున్నాడు. దీంతో తుది జట్టులో సామ్సన్కు చోటు దక్కుతుందా లేక గిల్ను కొనసాగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు సఫారీ జట్టు సిరీస్ సమం చేసి సగర్వంగా స్వదేశానికి తిరిగి వేళ్లాలని చూస్తోంది. అహ్మదాబాద్ పిచ్ అటు బ్యాటింగ్కు, ఇటు బౌలింగ్కు సమానంగా సహకరించనున్న నేపథ్యంలో హోరాహోరీ పోరు ఖాయమే! సూర్యకుమార్ సత్తా చాటేనా! స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతున్న భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై ఒత్తిడి అధికంగా ఉంది. ఈ ఏడాది ఆడిన 18 ఇన్నింగ్స్ల్లో సూర్యకుమార్ 14.20 సగటుతో 213 పరుగులు మాత్రమే చేశాడు. అతడు తనకు అలవాటైన మూడో స్థానంలో బరిలోకి దిగి భారీ ఇన్నింగ్స్తో అనుమానాలను పటాపంచలు చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న టి20 వరల్డ్కప్నకు ముందు టీమిండియా మరో ఆరు మ్యాచ్లు మాత్రమే ఆడనున్న నేపథ్యంలో... అటు ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు ఇటు సిరీస్ చేజిక్కించుకోవాలని టీమ్ మేనేజ్మెంట్ వ్యూహాలు రచిస్తోంది. విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మ మంచి ఆరంభాలను భారీ ఇన్నింగ్స్లుగా మలచడంలో విఫలమవుతున్నాడు. అతడు కాసేపు క్రీజులో నిలిస్తే చాలు ప్రత్యర్థి బౌలర్ల గణాంకాలు తారుమారు కావడం ఖాయమే. ఇక మరో ఓపెనర్గా గిల్, సామ్సన్లో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి. హైదరాబాద్ ప్లేయర్ ఠాకూర్ తిలక్ వర్మ నిలకడ కొనసాగిస్తున్నా... బ్యాటింగ్లో మరింత వేగం పెంచాల్సిన అవసరముంది. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేశ్ శర్మ, హర్షిత్ రాణా భారీ షాట్లు ఆడగల సమర్థులే. అయితే వీరంతా కలిసి కట్టుగా రాణించాల్సిన అవసరముంది. బుమ్రా రాకతో బౌలింగ్ విభాగం పటిష్టమవగా... మరోసారి వరుణ్ చక్రవర్తి కీలకం కానున్నాడు. మార్క్రమ్పై ఆశలు టెస్టు సిరీస్ విజయంతో ఈ పర్యటనను ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు టి20 సిరీస్ను సమం చేయడంతో... ముగించాలని చూస్తోంది. బ్యాటింగ్లో నైపుణ్యానికి కొదవ లేకపోయినా... వారంతా సమష్టిగా రాణించలేకపోవడమే సఫారీ జట్టును ఇబ్బంది పెడుతోంది. ఓపెనర్ రీజా హెండ్రిక్స్ లయ దొరకబుచ్చుకోలేక ఇబ్బంది పడుతుంటే... మరో ఓపెనర్ డికాక్ నిలకడలేమితో సతమతమవుతున్నాడు. ఈ నేపథ్యంలో డికాక్తో కలిసి మార్క్రమ్ ఇన్నింగ్స్ను ఆరంభించవచ్చు. భారత పిచ్లపై మంచి అవగాహన ఉన్న డికాక్, మార్క్రమ్ రాణిస్తే సఫారీ జట్టుకు తిరుగుండదు. బ్రెవిస్, మిల్లర్, ఫెరీరా, యాన్సెన్, కార్బిన్ బాష్ రూపంలో మిడిలార్డర్ పటిష్టంగా ఉంది. బౌలింగ్లో యాన్సెన్, ఎన్గిడి, బాష్, బార్ట్మన్ కీలకం కానున్నారు.తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, గిల్/సామ్సన్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, హర్షిత్ రాణా/వాషింగ్టన్ సుందర్, అర్ష్ దీప్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి. దక్షిణాఫ్రికా: మార్క్రమ్ (కెప్టెన్), డికాక్, హెండ్రిక్స్, బ్రెవిస్, మిల్లర్, ఫెరీరా, యాన్సెన్, బాష్, లిండే/కేశవ్, ఎన్గిడి, బార్ట్మన్. -
ధీరజ్కు రెండు పతకాలు
సాక్షి, హైదరాబాద్: ఎన్టీపీసీ జాతీయ సీనియర్ ఆర్చరీ చాంపియన్షిప్లో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఎస్ఎస్సీబీ)కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ రెండు పతకాలతో మెరిశాడు. రికర్వ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించిన ధీరజ్... టీమ్ విభాగంలో రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో గురువారం ముగిసిన ఈ పోటీల్లోపురుషుల రికర్వ్ వ్యక్తిగత ఫైనల్లో ధీరజ్ 6–0తో పార్థ్ సుశాంత్ సాలుంకే (మహారాష్ట్ర)పై గెలిచి జాతీయ చాంపియన్గా అవతరించాడు. టీమ్ విభాగంలో ధీరజ్, రాహుల్, సుఖ్చెయిన్ సింగ్లతో కూడిన సర్వీసెస్ జట్టు ఫైనల్లో అభ్యుదయ్, పార్థ్ సాలుంకే, సాహిల్లతో కూడిన మహారాష్ట్ర జట్టు చేతిలో ఓడిపోయింది. గౌరవ్, యశ్దీప్, పవన్లతో కూడిన రైల్వేస్ స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఆర్ఎస్పీబీ) జట్టుకు కాంస్య పతకం దక్కింది. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ) అధ్యక్షుడు అర్జున్ ముండా ముఖ్యఅతిథిగా విచ్చేసి విజేతలకు పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఆర్చరీ చాంపియన్షిప్ నిర్వహణ కోసం భారత్ బిడ్ దాఖలు చేస్తుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ మాట్లాడుతూ తెలంగాణలో జాతీయ, అంతర్జాతీయ టోర్నీలు నిర్వహించేందుకు ముందుకొచ్చే క్రీడా సంఘాలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్చరీ సంఘం అధ్యక్షుడు టి.రాజు, జనరల్ సెక్రటరీ అరవింద్, ఆర్చరీ డెవలప్మెంట్ సభ్యుడు పుట్టా శంకరయ్య, హైదరాబాద్ ఆర్చరీ సంఘానికి చెందిన అశ్విన్ రావు, బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ గుస్తీ నోరియా, కమిటీ సభ్యుడు మర్రి ఆదిత్య రెడ్డి పాల్గొన్నారు. -
సాత్విక్–చిరాగ్ జోడీకి రెండో విజయం
హాంగ్జౌ: వరల్డ్ టూర్ ఫైనల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. గురువారం జరిగిన గ్రూప్ ‘బి’ రెండో లీగ్ మ్యాచ్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–11, 16–21, 21–11తో ఫజర్ అల్ఫియాన్–షోహిబుల్ ఫిక్రి (ఇండోనేసియా) జంటను ఓడించింది. గంటపాటు జరిగిన ఈ మ్యాచ్లో తొలి గేమ్ను అలవోకగా నెగ్గిన భారత జోడీ రెండో గేమ్లో తడబడింది. నిర్ణాయక మూడో గేమ్లో మళ్లీ లయలోకి వచ్చి విజయాన్ని ఖాయం చేసుకుంది. మరో మ్యాచ్లో లియాంగ్ వె కెంగ్–వాంగ్ చాంగ్ (చైనా) జంట 21–14, 21–18తో ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా) జోడీపై గెలిచింది. నేడు జరిగే మ్యాచ్ల్లో ఆరోన్ చియా–సో వుయ్ యిక్లతో సాత్విక్–చిరాగ్; లియాంగ్–వాంగ్ చాంగ్ (చైనా)లతో అల్ఫియాన్–ఫిక్రి తలపడతారు. -
రెండు రోజుల్లో 2 కిలోలు తగ్గాడు.. జైస్వాల్కు ఏమైంది?
టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్డేట్ అందింది. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడని.. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సన్నిహితులు జాతీయ మీడియాకు వెల్లడించారు. కాగా సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత జైసూ.. దేశీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో ముంబై తరపున బరిలోకి దిగాడు.మొత్తంగా మూడు మ్యాచ్లు ఆడి 145 పరుగులు సాధించాడు జైసూ (Yashasvi Jaiswal). ఇందులో ఓ శతకం కూడా ఉంది. అయితే, రాజస్తాన్తో జరిగిన మ్యాచ్కు ముందు జైస్వాల్ అస్వస్థతకు గురయ్యాడు. అయినప్పటికీ పుణె వేదికగా రాజస్తాన్తో మ్యాచ్ బరిలో దిగి.. 15 పరుగులు చేసి అవుటయ్యాడు. తీవ్రమైన కడుపు నొప్పిఅయితే, ఈ సూపర్ లీగ్ మ్యాచ్ తర్వాత జైస్వాల్ తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డాడు. ఈ క్రమంలో వెంటనే హుటాహుటిన పుణెలోని ఆదిత్య బిర్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షల అనంతరం పొట్టలో తీవ్రమైన ఇన్షెక్షన్ ఉన్నట్లు వైద్యులు తేల్చారు.ఈ నేపథ్యంలో విశ్వసనీయ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఫుడ్ పాయిజన్ (Food Poison) అయింది. పుణె హోటళ్లో జైస్వాల్ తిన్న కలుషిత ఆహారమే ఇందుకు దారితీసింది. తీవ్రమైన నొప్పితో అతడు విలవిల్లాడాడు.రెండు రోజుల్లో 2 కిలోలు తగ్గాడుఅయితే, వైద్యుల చికిత్స తర్వాత నెమ్మదిగా కోలుకుంటున్నాడు. రెండు రోజుల్లోనే రెండు కిలోల బరువు తగ్గిపోయాడు. పూర్తిగా కోలుకోవడానికి 7- 10 రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు’’ అని పేర్కొన్నాయి.ఈ నేపథ్యంలో జైస్వాల్ దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. న్యూజిలాండ్తో సిరీస్ నాటికి 23 ఏళ్ల ఈ యువ ఓపెనర్ తిరిగి టీమిండియాతో చేరే అవకాశం ఉంది. కాగా రాజస్తాన్తో సూపర్ లీగ్ మ్యాచ్లో ముంబై గెలిచినప్పటికీ.. నెట్ రన్ రేటు తక్కువగా ఉన్న కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఈ టోర్నీలో పుణె వేదికగా గురువారం జరిగిన ఫైనల్లో హర్యానాను ఓడించి జార్ఖండ్ విజేతగా నిలిచింది.చదవండి: AUS vs ENG: ఆర్చర్పై స్టోక్స్ ఫైర్!.. చెంప చెళ్లుమనిపించేలా రిప్లై -
కెప్టెన్ ఇషాన్ కిషన్ కొట్టేశాడు!
దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025 టైటిల్ను జార్ఖండ్ గెలుచుకుంది. హర్యానాతో గురువారం నాటి ఫైనల్లో గెలిచి తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ క్రమంలో దేశీ టోర్నీల్లో ఓవరాల్గా రెండోసారి చాంపియన్గా నిలిచింది.పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా టైటిల్ పోరులో హర్యానా- జార్ఖండ్ (Haryana Vs Jharkhand) తలపడ్డాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన హర్యానా.. జార్ఖండ్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనర్లలో కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.101 పరుగులుమరో ఓపెనర్ విరాట్ సింగ్ (2) విఫలమైనా.. ఇషాన్ (Ishan Kishan) మాత్రం నిలకడగా ఆడాడు. 45 బంతుల్లోనే శతక్కొట్టిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. మొత్తంగా 49 బంతుల్లో ఆరు ఫోర్లు, పది సిక్స్లు బాది 101 పరుగులు సాధించాడు. ఇతడికి తోడుగా వన్డౌన్లో వచ్చిన కుమార్ కుశాగ్రా మెరుపు హాఫ్ సెంచరీ (38 బంతుల్లో 81)తో ఆకట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్కు ఏకంగా 177 పరుగులు జోడించారు.ధనాధన్ ఇన్నింగ్స్అనంతరం అనుకుల్ రాయ్ (20 బంతుల్లో 40), రాబిన్ మింజ్ (14 బంతుల్లో 31) కూడా ధనాధన్ ఇన్నింగ్స్తో ఆఖరి వరకు అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో జార్ఖండ్ మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి 262 పరుగుల భారీ స్కోరు సాధించింది. హర్యానా బౌలర్లలో అన్షుల్ కాంబోజ్, సమంత్ జేఖర్, సుమిత్ కుమార్ తలా ఒక వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హర్యానా 18.3 ఓవర్లో 193 పరుగులు చేసి ఆలౌట్ అయింది. జార్ఖండ్ బౌలర్ల ధాటికి టాపార్డర్ కుదేలు అయింది. ఓపెనర్లలో అర్ష్ రంగా (17) ఓ మోస్తరుగా ఆడగా.. కెప్టెన్ అంకిత్ కుమార్, వన్డౌన్లో వచ్చిన ఆశిష్ సివాజ్ డకౌట్ అయ్యారు.పోరాడిన మిడిలార్డర్ఇలాంటి దశలో మిడిలార్డర్లో యశ్వర్ధన్ దలాల్ (22 బంతుల్లో 53), నిషాంత్ సింధు (15 బంతుల్లో 31), సమంత్ జేఖర్ (17 బంతుల్లో 38) ధనాధన్ ఆడి.. ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే, జార్ఖండ్ బౌలర్లు వారిని వరుస విరామాల్లో పెవిలియన్కు పంపారు.ఆఖర్లో పార్త్ వట్స్ (4), సుమిత్ కుమార్ (5), అన్షుల్ కాంబోజ్ (11) తడబడగా.. అమిత్ రాణా (13 నాటౌట్), ఇషాంత్ భరద్వాజ్ (17) కాసేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. హర్యానా 193 పరుగులకే ఆలౌట్ కావడంతో జార్ఖండ్ 69 పరుగుల తేడాతో గెలిచింది.జార్ఖండ్ బౌలర్లలో సుశాంత్ మిశ్రా, బాల్ క్రిష్ణ చెరో మూడు వికెట్లు కూల్చగా.. వికాస్ సింగ్, అనుకుల్ రాయ్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. కాగా గతంలో దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2010-11 టైటిల్ గెలుచుకున్న జార్ఖండ్.. తాజాగా ఇషాన్ కిషన్ కెప్టెన్సీలో దేశీ టీ20 ట్రోఫీని కైవసం చేసుకుంది.చదవండి: చరిత్ర సృష్టించిన కివీస్ ప్లేయర్లు.. ప్రపంచ రికార్డు That winning feeling! 🥳Time for celebration in the Jharkhand camp as they win the Syed Mushtaq Ali Trophy for the first time 🙌Scorecard ▶️ https://t.co/3fGWDCTjoo#SMAT | @IDFCFIRSTBank pic.twitter.com/qJB0b2oS0Y— BCCI Domestic (@BCCIdomestic) December 18, 2025 -
ఒలంపిక్స్ పతకాలే లక్ష్యం
బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో గత ఆరు రోజులుగా నిర్వహిస్తున్న 45వ సీనియర్ జాతీయ ఆర్చరీ ఛాంపియన్షిప్- 2025 పోటీలు గురువారం ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు, జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అర్జున్ ముండా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మట్లాడుతూ.. 2028 ఒలంపిక్స్తో పాటు.. భవిష్యత్తులో జరిగే అన్ని ప్రపంచ స్థాయి పోటీల్లో ఆర్చరీ విభాగంలో పతకాలు సాధించడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు.అదే విధంగా.. వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్నకు ఆతిథ్యం ఇవ్వడానికి ఆర్చరీ ఫెడరేషన్ సంసిద్ధతను వ్యక్తం చేస్తుందని అర్జున్ ముండా అన్నారు. భారతదేశ పురాతన క్రీడ అయిన విలువిద్యకు గౌరవస్థానం దక్కేందుకు ప్రణాళిక బద్ధమైన కృషి ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఇక ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ.. ‘‘జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీల నిర్వహణ ద్వారా నూతన ప్రతిభ కు ప్రోత్సాహం లభిస్తుంది. జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడానికి ముందుకు వచ్చే క్రీడా సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం తోడ్పాటు ఇస్తుంది’’ అని తెలిపారు.అదే విధంగా.. తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షులు టి రాజు మాట్లాడుతూ.. ‘‘48 సంవత్సరాల తర్వాత సీనియర్ జాతీయ ఛాంపియన్షిప్ నిర్వహించుకోవడం.. దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి మొత్తం 44 జట్లు.. దాదాపు 25 మంది అర్జున అవార్డు గ్రహీతలు 971 మంది జాతీయస్థాయి ఆర్చరీ క్రీడాకారులు ఇందులో పాల్గొనడం.. ఎటువంటి లోపం లేకుండా ఈ జాతీయ స్థాయి పోటీలను నిర్వహించడం సంతోషం కలిగిస్తోంది’’ అని అన్నారు. ఈ పోటీల నిర్వహణకు అన్ని విధాలుగా సహకరించిన ఎన్టీపీసీ బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యజమాన్యం, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యజమాన్యం స్పోర్ట్స్ అథారిటీకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్చరీ సంఘం ప్రధాన కార్యదర్శి అరవింద్, ఆర్చరీ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు పుట్టా శంకరయ్య, హైదరాబాద్ ఆర్చరీ అసోసియేషన్ అశ్విన్ రావు, బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ గుస్తీ నోరియా, సభ్యులు మర్రి ఆదిత్య రెడ్డి ఆర్చరీ ఫెడరేషన్ సభ్యులు వివిధ రాష్ట్ర కమిటీ అధ్యక్ష కార్యదర్శులు పలువురు పాల్గొన్నారు. -
Year Ender 2025: వైభవ్, దివ్య, శీతల్.. మరెన్నో విజయాలు
భారత క్రీడా రంగంలో ఈ ఏడాది యువ ప్లేయర్లు దుమ్ములేపారు. ఐపీఎల్-2025లో పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీతో పాటు ఆయుశ్ మాత్రే సంచలన ప్రదర్శనలు నమోదు చేయగా.. చెస్లో దివ్యా దేశ్ముఖ్ మహిళల వరల్డ్కప్ విజేతగా నిలిచి సత్తా చాటింది. వీరితో పాటు 2025లో అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్న భారత యువ ఆటగాళ్లు, వారి విజయాలను నెమరు వేసుకుందాం!దూసుకొచ్చిన యువ కెరటంభారత క్రికెట్లో నయా సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi). హర్యానాకు చెందిన ఈ పద్నాలుగేళ్ల చిచ్చర పిడుగు రికార్డులు సృష్టించడమే పనిగా పెట్టుకున్నాడు. ఐపీఎల్ వేలంలో రాజస్తాన్ రాయల్స్ అతడిని ఏకంగా 1.10 కోట్లకు కొనుగోలు చేసింది.ఈ క్రమంలో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన వైభవ్ గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో కేవలం 38 బంతుల్లోనే 101 పరుగులు సాధించాడు. తద్వారా అత్యంత పిన్న వయసులో ఐపీఎల్లో శతక్కొట్టిన ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. అదే విధంగా క్యాష్ రిచ్ లీగ్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగానూ రికార్డు సాధించాడు. ఆ తర్వాత భారత్ అండర్-19 జట్టు తరఫునా యూత్ వన్డే, టెస్టుల్లో సెంచరీలతో చెలరేగాడు.ఆయుశ్ మాత్రేమహారాష్ట్రకు చెందిన ఆయుశ్ మాత్రే ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్లో అడుగుపెట్టాడు. గుజరాత్తో మ్యాచ్లో ఒకే ఓవర్లో 28 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. వైభవ్ మాదిరే సెంచరీ బాదాలని చూసిన ఆయుశ్ ఆర్సీబీతో మ్యాచ్లో 48 బంతుల్లోనే 94 పరుగులు చేశాడు. అయితే తృటిలో శతకం చేజార్చుకున్నాడు.ఇక వైభవ్ బ్యాటర్గా భారత అండర్-19 జట్టు తరఫున సత్తా చాటుతుండగా.. పదిహేడేళ్ల ఆయుశ్ అతడికి ఓపెనింగ్ జోడీగా ఉంటూనే కెప్టెన్గానూ కీలక బాధ్యతను సమర్థవంతంగా నెరవేరుస్తున్నాడు.దివ్య దేశ్ముఖ్భారత చెస్ రంగంలో సరికొత్త సంచలన దివ్య దేశ్ముఖ్. ఫిడే మహిళల వరల్డ్కప్-2025లో ఈ మహారాష్ట్ర అమ్మాయి అద్భుత విజయం సాధించింది. సీనియర్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపిని ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది.తద్వారా అత్యంత పిన్నవయసులోనే (19 ఏళ్లు) ఈ ఘనత సాధించిన చెస్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. అంతేకాదు.. గ్రాండ్ మాస్టర్ హోదా పొందడానికి ముందే ఈ ఫీట్ అందుకున్న ప్లేయర్గానూ రికార్డు సాధించింది. వరల్డ్కప్ విజయంతోనే దివ్యకు గ్రాండ్ మాస్టర్ హోదా దక్కింది. ఓవరాల్గా ఇండియాలో 88వ, మహిళలలో 44వ గ్రాండ్ మాస్టర్గా దివ్య నిలిచింది.ఇక వరల్డ్కప్ చాంపియన్గా నిలవడంతో పాటు ఫిడే మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్-2026కు కూడా దివ్య దేశ్ముఖ్ అర్హత సాధించింది.డి. గుకేశ్గతేడాది వరల్డ్చెస్ చాంపియన్గా నిలిచిన దొమ్మరాజు గుకేశ్ ఈ ఏడాదిని ఫిడే గ్రాండ్ స్విస్-2025లో విజయం సాధించాడు. అంతేకాదు.. తొలిసారిగా తన కెరీర్లో అత్యుత్తమంగా ఫిడే క్లాసికల్ రేటింగ్ లిస్టులో వరల్డ్ నంబర్ 3గా ఈ చెన్నై చిన్నోడు నిలిచాడు. ఆర్. ప్రజ్ఞానంద, వైశాలి రమేశ్బాబుచెన్నైకి చెందిన అక్కాతమ్ముళ్లైన ఈ చెస్ గ్రాండ్మాస్టర్లు ఈ ఏడాది కూడా తమ హవా కొనసాగించారు. ప్రజ్ఞానంద టాటా స్టీల్ చెస్-2025లో గుకేశ్ను టై బ్రేకర్లో ఓడించి టైటిల్ సాధించాడు.తద్వారా ఫిడే రేటింగ్స్లో అత్యుత్తమంగా వరల్డ్ నంబర్ 8 ర్యాంకు సాధించాడు. ఈ ఏడాది నిలకడైన ప్రదర్శనతో అతడు ఆకట్టుకున్నాడు.ఇక వైశాలి రమేశ్ బాబు వరుసగా రెండో ఏడాది ఫిడే గ్రాండ్ స్విస్ 2025 టైటిల్ గెలుచుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా చెస్ ప్లేయర్గా నిలిచింది. ఈ ప్రదర్శన నేపథ్యంలో వుమెన్స్ క్యాండిడేట్స్కు అర్హత సాధించింది. ఆమె కంటే ముందు హంపి, దివ్య ఈ క్వాలిఫై అయ్యారు.టాటా స్టీల్ చాలెంజర్స్లోనూ సత్తా చాటిన వైశాలి రమేశ్బాబు మహిళల రేటింగ్స్లో ఇండియా నంబర్ 2గా నిలిచింది. వీరితో పాటు తెలంగాణ స్టార్ అర్జున్ ఇరిగేసి కూడా ఈ ఏడాది మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు.మరెన్నో విజయాలుఫ్రీస్టైల్ చెస్ గ్రాండ్స్లామ్ ఫైనల్స్లో మాగ్నస్ కార్ల్సన్నే ఓడించి నాకౌట్కు చేరాడు. అంతేకాదు.. రాపిడ్ రౌండ్ రాబిన్ స్టేజ్లోనూ మరోసారి అతడికి ఓటమిని రుచి చూపించాడు. అయితే, క్వార్టర్ఫైనల్స్లో విన్సెంట్ కెమెర్ చేతిలో ఓడిపోవడంతో అర్జున్ సెమీస్ చేరే అవకాశాన్ని కోల్పోయాడు.ఇక ఇతరులలో పారా ఆర్చర్ శీతల్ దేవి ఈ ఏడాది వరల్డ్ ఆర్చరీ పారా చాంపియన్షిప్స్ గెలిచింది. మరోవైపు.. షూటర్ సామ్రాట్ రాణా ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ చాంపియన్స్షిప్స్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ విభాగంలో టైటిల్ గెలిచి.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ అథ్లెట్గా నిలిచాడు.వీరితో పాటు పారా అథ్లెట్ సుమిత్ ఆంటిల్, అథ్లెట్ అనిమేశ్ కుజూర్ చెప్పుకోదగ్గ విజయాలు సాధించారు. మరోవైపు.. టీమ్ ఈవెంట్లలో భారత్ తొలిసారి మహిళల క్రికెట్ వన్డే వరల్డ్కప్ గెలవగా.. ఖో-ఖో పురుషుల, మహిళలు.. కబడ్డీ పురుషులు, మహిళా జట్లు చాంపియన్లుగా నిలిచి సత్తా చాటాయి. మహిళల అంధుల క్రికెట్ జట్టు టీ20 వరల్డ్కప్ గెలిచింది. చదవండి: Year-Ender 2025: విరాట్ కోహ్లి నుంచి జాన్ సీనా వరకు.. -
ఫైనల్లో ఇషాన్ కిషన్ విధ్వంసకర శతకం.. వీడియో
దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఎలైట్-2025 ముగింపు దశకు చేరుకుంది. పుణె వేదికగా గురువారం నాటి ఫైనల్తో ఈ సీజన్ విజేత ఎవరో తేలనుంది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో హర్యానాతో టైటిల్ పోరులో టాస్ ఓడిన జార్ఖండ్ తొలుత బ్యాటింగ్కు దిగింది.ఓపెనర్లలో విరాట్ సింగ్ (2) విఫలం కాగా.. కెప్టెన్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) మాత్రం విధ్వంసకర ఇన్నింగ్స్తో హర్యానా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 24 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించాడు.శతక్కొట్టిన ఇషాన్ కిషన్.. కుశాగ్రా ధనాధన్మొత్తంగా 49 బంతులు ఎదుర్కొన్న ఇషాన్ కిషన్ ఆరు ఫోర్లు, పది సిక్సర్ల సాయంతో 101 పరుగులు సాధించాడు. అయితే, శతకం పూర్తి చేసుకున్న వెంటనే.. సుమిత్ కుమార్ బౌలింగ్లో ఇషాన్ బౌల్డ్ అయ్యాడు. మరోవైపు.. వన్డౌన్ బ్యాటర్ కుమార్ కుశాగ్రా (Kumar Kushagra) మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. మొత్తంగా 38 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఐదు సిక్స్లు బాది 81 పరుగులు సాధించాడు.అనుకుల్, రాబిన్ మింజ్ ధనాధన్ఇషాన్ కిషన్, కుమార్ కుశాగ్రాకు తోడు అనుకుల్ రాయ్, రాబిన్ మింజ్ ధనాధన్ దంచికొట్టారు. అనుకుల్ రాయ్ 20 బంతుల్లో 40 (3 ఫోర్లు, 2 సిక్స్లు).. రాబిన్ మింజ్ 14 బంతుల్లోనే 31 పరుగుల (3 సిక్సర్లు)తో అజేయంగా నిలిచారు.ఫలితంగా హర్యానాతో ఫైనల్లో జార్ఖండ్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి ఏకంగా 262 పరుగులు సాధించింది. హర్యానా బౌలర్లలో అన్షుల్ కాంబోజ్, సుమిత్ కుమార్, సమంత్ జేఖర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.చదవండి: IND vs SA: డబ్బు తిరిగి ఇచ్చేయండి.. స్పందించిన బీసీసీఐLeading from the front! 🫡Ishan Kishan with a magnificent hundred in the #SMAT final 💯The Jharkhand captain walks back for 1⃣0⃣1⃣(49) 👏Updates ▶️ https://t.co/3fGWDCTjoo@IDFCFIRSTBank | @ishankishan51 pic.twitter.com/PJ7VI752wp— BCCI Domestic (@BCCIdomestic) December 18, 2025 -
ఆర్చర్పై స్టోక్స్ ఫైర్!.. చెంప చెళ్లుమనిపించేలా రిప్లై!
యాషెస్ మూడో టెస్టులో ఇంగ్లండ్పై ఆస్ట్రేలియా రెండోరోజూ ఆధిపత్యం కొనసాగించింది. అడిలైడ్ వేదికగా గురువారం ఆట పూర్తయ్యే సరికి.. ఇంగ్లండ్ ఎనిమిది వికెట్ల నష్టానికి కేవలం 213 పరుగులే చేసింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ కంటే ఇంకా 158 పరుగులు వెనుకబడింది. ఆసీస్ బౌలర్ల ధాటికి ఇంగ్లిష్ జట్టు బ్యాటర్లు పెవిలియన్కు వరుస కట్టారు.ఓపెనర్లు జాక్ క్రాలీ (9), బెన్ డకెట్ (29) నిరాశపరచగా.. ఓలీ పోప్ (3), జో రూట్ (19) కూడా విఫలం అయ్యారు. ఇలాంటి దశలో హ్యారీ బ్రూక్ (45), కెప్టెన్ బెన్ స్టోక్స్ (45 నాటౌట్) మెరుగైన ఆటతో జట్టు పరువు కాపాడే ప్రయత్నం చేశారు. మిగిలిన వారిలో జేమీ స్మిత్ 22 పరుగులు చేయగా.. విల్ జాక్స్ (6), బ్రైడన్ కార్స్ (0) ఇలా వచ్చి అలా వెళ్లారు. ఆఖర్లో టెయిలెండర్ జోఫ్రా ఆర్చర్ 30 పరుగులతో అజేయంగా నిలవడంతో.. స్కోరు 200 అయినా దాటగలిగింది.ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) మూడు వికెట్లతో చెలరేగగా.. స్కాట్ బోలాండ్ రెండు, నాథన్ లియోన్ రెండు, కామెరాన్ గ్రీన్ ఒక వికెట్ దక్కించుకున్నారు. స్టార్క్ అర్ధ శతకంఇదిలా ఉంటే.. అంతకు ముందు 326/8తో రెండో రోజు ఆట మొదలుపెట్టిన ఆసీస్ 371 పరుగులకు ఆలౌట్ అయింది. టెయిలెండర్ మిచెల్ స్టార్క్ అర్ధ శతకం(54)తో అదరగొట్టడంతో కంగారూలకు ఈ మేర స్కోరు సాధ్యమైంది.ఇంగ్లండ్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన స్టార్క్ వరుస విరామాల్లో ఫోర్లు బాదుతూ యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. అయితే, అతడిని నిలువరించేందుకు ఇంగ్లండ్ సారథి స్టోక్స్ తన వ్యూహాలన్నీ అమలు చేసి విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే తమ జట్టు స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ (Jofra Archer)పై అసహనం ప్రదర్శించాడు.ఇందుకు ఆర్చర్ తన ఆటతోనే సమాధానం ఇచ్చాడు. ఆసీస్ ఇన్నింగ్స్లో 86వ ఓవర్లో బంతితో రంగంలో దిగిన ఆర్చర్.. స్టార్క్ను అద్భుత రీతిలో బౌల్డ్ చేశాడు. దెబ్బకు లెగ్ స్టంప్ కూడా ఎగిరిపోయింది.చెంప చెళ్లుమనిపించేలా రిప్లై!ఈ క్రమంలో ఆర్చర్ను సహచరులు అభినందిస్తుండగా.. స్టోక్స్ మాత్రం.. ‘‘నువ్వు ప్రతిసారి ఫీల్డింగ్ ప్లేస్మెంట్ల గురించి ఫిర్యాదు చేయకు. సరైన లైన్ అండ్ లెంగ్త్తో బౌల్ చేయి’’ అని చెప్పినట్లుగా ఉంది. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం ముదిరే వేళ సహచరులు వారిని విడదీశారు.ఈ నేపథ్యంలో ఆర్చర్.. ‘‘నాకే సలహా ఇస్తున్నాడు చూడు’’ అన్నట్లుగా ఇచ్చిన ఎక్స్ప్రెషన్ వైరల్గా మారింది. కాగా ఈ మ్యాచ్లో ఆర్చర్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయడం విశేషం. కాగా స్టోక్స్- ఆర్చర్ వాగ్వాదం గురించి కామెంటేటర్, ఆసీస్ దిగ్గజ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ స్పందిస్తూ..‘‘ఇది మరింత ముదిరే అవకాశం లేకపోలేదు. స్టోక్స్ నేరుగా అతడి దగ్గరికి వెళ్లి క్లాస్ తీసుకున్నాడు. అయితే, ఇందుకు ఆర్చర్ చెంప మీద కొట్టినట్లుగా వికెట్తో సమాధానం ఇచ్చాడు’’ అని పాంటింగ్ పేర్కొన్నాడు. కాగా సొంతగడ్డపై ఇంగ్లండ్తో ఐదు టెస్టుల యాషెస్ సిరీస్లో ఆసీస్ 2-0తో ఆధిక్యంలో ఉంది. రెండు మ్యాచ్లలోనూ అద్భుత ప్రదర్శనతో పేసర్ స్టార్క్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవడం విశేషం.చదవండి: చరిత్ర సృష్టించిన కివీస్ ప్లేయర్లు.. ప్రపంచ రికార్డుBen Stokes saying to Archer Mate don't complain about the field placings when you bowl."Bowl on the stumps" he says and yep and look what happens.#ashes25 #AUSvENG pic.twitter.com/jrB46LSlyF— Bemba Tavuma 𝕏 🐐 (@gaandfaadtits) December 18, 2025 -
డబ్బు తిరిగి ఇచ్చేయండి.. బీసీసీఐ స్పందన ఇదే
భారత్- దక్షిణాఫ్రికా మధ్య నాలుగో టీ20 రద్దైన నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై విమర్శల వర్షం కురుస్తోంది. లక్నోలో పొగమంచు కారణంగా టాస్ పడకుండానే మ్యాచ్ను ముగించాల్సి వచ్చింది. ఆరుసార్లు మైదానంలోకి వచ్చి.. పరిస్థితిని సమీక్షించిన అంపైర్లు ఆఖరికి 9.30 నిమిషాల సమయంలో.. ప్రతికూల వాతావరణం వల్ల మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.అయితే, ఉత్తర భారతంలో పరిస్థితులు తెలిసి కూడా బీసీసీఐ (BCCI) ఇలా మ్యాచ్ను షెడ్యూల్ చేయడం ఏమిటని విమర్శలు వస్తున్నాయి. నవంబరు, డిసెంబరు నెలల్లో అక్కడ కాలుష్యం, పొగమంచు ఏ స్థాయిలో ఉంటుందో తెలిసినా లక్నోలో మ్యాచ్ ఎలా షెడ్యూల్ చేశారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. స్పందించిన బీసీసీఐమరోవైపు.. లక్నో మ్యాచ్ కోసం టికెట్ల రూపంలో డబ్బులు ఖర్చుచేసిన ప్రేక్షకులు తమ డబ్బు తిరిగి ఇచ్చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. ఈ మ్యాచ్ నిర్వహణకు ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (UPCA) బాధ్యత వహిస్తుందని తెలిపారు.‘‘ఈ మ్యాచ్ టికెట్ల విక్రయాన్ని రాష్ట్ర అసోసియేషన్ చూసుకుంది. బీసీసీఐ మ్యాచ్ నిర్వహణ హక్కులను మాత్రమే వారికి ఇచ్చింది. మిగతా విషయాలన్ని యూపీసీఏ పరిధిలోనే ఉంటాయి’’ అని IANSకు గురువారం దేవజిత్ సైకియా తెలిపారు. తద్వారా ప్రేక్షకులకు టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చే విషయంలో యూపీసీఏదే పూర్తి బాధ్యత అని చెప్పకనే చెప్పారు. రీఫండ్ నిబంధనల ప్రకారం.. కాగా బీసీసీఐ రీఫండ్ నిబంధనల ప్రకారం.. ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దైతే టికెట్లు కొనుక్కున్న వారు.. ఆ మొత్తాన్ని తిరిగి పొందేందుకు అర్హులు అవుతారు. ఇప్పుడు బంతి యూపీసీఏ కోర్టులో ఉందన్నమాట! కాగా సొంతగడ్డపై టీమిండియా సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా తొలుత కటక్లో భారత్ 101 పరుగులతో గెలవగా.. ముల్లన్పూర్లో జరిగిన రెండో టీ20లో ప్రొటిస్ జట్టు 51 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో ధర్మశాలలో మూడో టీ20లో భారత్ గెలిచి.. 2-1తో ఆధిక్యం సంపాదించింది. లక్నోలోని ఏకనా స్టేడియంలో నాలుగో టీ20 జరగాల్సి ఉండగా.. పొగమంచు వల్ల రద్దైపోయింది. ఇరుజట్ల మధ్య ఆఖరి, ఐదో టీ20కి అహ్మదాబాద్ వేదిక.చదవండి: తల్లి నగలు, ప్లాట్లు, పొలం అమ్మేశారు.. ఇప్పుడిలా! -
వేలంలో అన్సోల్డ్.. కట్చేస్తే!.. ప్రపంచ రికార్డు
న్యూజిలాండ్ స్టార్లు టామ్ లాథమ్, డెవాన్ కాన్వే సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ చరిత్రలో తొలి వికెట్కు అత్యుత్తమ భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనింగ్ జోడీగా నిలిచారు. వెస్టిండీస్తో గురువారం మొదలైన మూడో టెస్టు సందర్భంగా ఈ ఘనత సాధించారు.డబ్ల్యూటీసీ (WTC) 2025-27లో భాగంగా కివీస్ జట్టు స్వదేశంలో విండీస్తో మూడు టెస్టుల సిరీస్ ఆడుతోంది. అసాధారణ పోరాటంతో వెస్టిండీస్ తొలి టెస్టు డ్రా చేసుకోగా.. రెండో టెస్టులో న్యూజిలాండ్ తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది. ఇరుజట్ల మధ్య గురువారం ‘బే ఓవల్’ వేదికగా మూడో టెస్టు మొదలైంది.ఓపెనింగ్ జోడీగా వచ్చి.. శతకాలతో చెలరేగిటాస్ గెలిచిన ఆతిథ్య కివీస్.. పర్యాటక విండీస్ను బౌలింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనింగ్ జోడీగా వచ్చిన కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ (Tom Latham), డెవాన్ కాన్వే సెంచరీలతో చెలరేగారు. లాథమ్ 246 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 137 పరుగులు చేసి.. రోచ్ బౌలింగ్లో రోస్టన్ చేజ్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.మరోవైపు.. తొలిరోజు ఆట ముగిసే సరికి కాన్వే 279 బంతుల్లో 178 పరుగులతో (25 ఫోర్లు) అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా నైట్ వాచ్మన్ జేకబ్ డఫీ (Jacob Duffy) 9 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఫలితంగా గురువారం నాటి మొదటిరోజు ఆటలో న్యూజిలాండ్ 90 ఓవర్లలో వికెట్ నష్టానికి 334 పరుగులు సాధించింది.ప్రపంచ రికార్డుఇదిలా ఉంటే.. తొలి వికెట్కు లాథమ్, కాన్వే కలిసి 520 బంతుల్లో ఏకంగా 323 పరుగులు జతచేశారు. డబ్ల్యూటీసీ చరిత్రలో ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం కావడం విశేషం. సౌతాఫ్రికాతో టెస్టులో 2019లో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ- మయాంక్ అగర్వాల్ తొలి వికెట్కు 317 పరుగులు జోడించగా.. లాథమ్- కాన్వే తాజాగా ఈ రికార్డును సవరించారు.అంతేకాదు.. సొంతగడ్డపై టెస్టుల్లో అత్యధిక ఓపెనింగ్ పార్ట్నర్షిప్ సాధించిన జోడీగానూ లాథమ్- కాన్వే చరిత్రకెక్కారు. గతంలో ఈ రికార్డు చార్లెస్ స్టెవర్ట్ డెంప్స్టర్- జాన్ ఎర్నెస్ట్ మిల్స్ పేరిట ఉండేది. వీరిద్దరు కలిసి ఇంగ్లండ్పై 1930లో 276 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇదిలా ఉంటే.. అబుదాబిలో మంగళవారం జరిగిన ఐపీఎల్-2026 మినీ వేలంలో అన్సోల్డ్గా మిగిలి పోయిన కాన్వే.. వేలం తర్వాత తన తొలి మ్యాచ్లోనే రికార్డు సెంచరీ సాధించడం విశేషం.చదవండి: IPL 2026 Auction: స్టీవ్ స్మిత్, కాన్వేలకు షాక్.. వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లు వీరే -
నగలు, ప్లాట్లు, పొలం అమ్మేశారు.. ఇప్పుడిలా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎంతో మంది ప్రతిభావంతులైన క్రికెటర్లను వెలుగులోకి తెచ్చింది. క్యాష్ రిచ్ లీగ్లోని ఫ్రాంఛైజీలు తమ జట్లను పటిష్ట పరచుకునే క్రమంలో మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసి.. ఒక రకంగా వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేశాయి. ఐపీఎల్-2026 మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి అలాంటి నిర్ణయమే తీసుకుంది.రూ. 14.20 కోట్లుఅన్క్యాప్డ్ ఆటగాళ్లు అయిన కార్తిక్ శర్మ (Kartik Sharma), ప్రశాంత్ వీర్ (Prashant Veer)లపై చెరో రూ. 14.20 కోట్లు కుమ్మరించి మరీ కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ప్రపంచంలోని టాప్ టీ20 లీగ్లో వీరిద్దరు నయా సెన్సేషన్లుగా నిలిచారు. ఇద్దరిదీ మధ్య తరగతి కుటుంబమే. తల్లిదండ్రుల త్యాగాలతోనే ఆటగాళ్లుగా ఎదిగిన కార్తిక్, ప్రశాంత్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన అన్క్యాప్డ్ ప్లేయర్లుగా చరిత్ర సృష్టించారు.వీరిద్దరిలో కార్తిక్ శర్మ కుటుంబం ఒకానొక దశలో దయనీయ పరిస్థితులు ఎదుర్కొంది. ఈ విషయాన్ని అతడి కుటుంబమే స్వయంగా IANSకు తెలిపింది. పందొమ్మిదేళ్ల కార్తిక్ స్వస్థలం రాజస్తాన్లోని భరత్పూర్. అతడి తల్లిదండ్రులు మనోజ్ శర్మ, రాధ. వారిది సాధారణ మధ్యతరగతి కుటుంబం.అయితే, కుమారుడిని క్రికెటర్ చేయాలన్నది కార్తిక్ తల్లిదండ్రుల కల. ముఖ్యంగా అతడి తల్లి రాధ కొడుకు ఏదో ఒకరోజు కచ్చితంగా ఆటగాడిగా ఎదుగుతాడని బలంగా నమ్మేవారు. అందుకోసం భర్తతో కలిసి ఆమె ఎన్నో త్యాగాలు చేశారు. ఈ విషయం గురించి కార్తిక్ తండ్రి మనోజ్ శర్మ మాటల్లోనే..నగలు, ప్లాట్లు, పొలం అమ్మేశారు‘‘మా ఆదాయం అంతంతమాత్రమే. అయితే, నా భార్య రాధకు మాత్రం ఓ కల ఉండేది. ఎట్టిపరిస్థితుల్లోనైనా కార్తిక్ను క్రికెటర్ చేయాలని ఆమె అంటూ ఉండేది. ఎంత ఖర్చు అయినా పర్లేదు.. మా కుమారుడు క్రికెటర్ అయితే చాలు అనుకునేది.కార్తిక్ శిక్షణ కోసం మేము మాకున్న చిన్నపాటి ప్లాట్లు, బరేనా గ్రామంలో మాకున్న పొలం అమ్మేశాము. రాధ తన నగలు కూడా అమ్మేసింది. మా జీవితాల్లో అదొక అత్యంత కఠినమైన దశ. అయితే, ఆర్థిక ఇబ్బందుల ప్రభావం కార్తిక్పై పడకుండా మేము చూసుకున్నాము.గ్వాలియర్లో టోర్నమెంట్ ఆడేందుకు కార్తిక్ను నేను అక్కడికి తీసుకువెళ్లాను. నాలుగైదు మ్యాచ్లలోనే జట్టు ఇంటిబాట పడుతుందని అనుకున్నాము. అయితే, కార్తిక్ ప్రదర్శన కారణంగా జట్టు ఫైనల్ చేరింది. అయితే, ఆ మ్యాచ్ అయ్యేంత వరకు గ్వాలియర్లోనే ఉండేందుకు మా దగ్గర సరిపడా డబ్బు లేదు.ఖాళీ కడుపుతోనేఅప్పుడు మేము ఓ నైట్ షెల్టర్లో ఉన్నాము. తినడానికి ఏమీ లేదు. ఖాళీ కడుపుతోనే ఆరోజు నిద్రపోయాము. తర్వాత ఫైనల్లో మ్యాచ్ గెలిచిన తర్వాత కార్తిక్కు వచ్చిన ప్రైజ్మనీతోనే మేము తిరిగి ఇంటికి చేరుకోగలిగాము’’ అని తాము పడిన కష్టాలను గుర్తు చేసుకున్నారు.అదే విధంగా.. ‘‘రెండున్నరేళ్ల వయసులోనే నా కుమారుడు బ్యాట్తో బంతిని బాది రెండు ఫొటోఫ్రేములను పగులగొట్టాడు. అది మాకెంతో ప్రత్యేకం. ఆరోజే మేము తన భవిష్యత్తు గురించి ఓ అంచనాకు వచ్చేశాము. నిజానికి క్రికెటర్ కావాలని నేనూ కలగన్నాను. అయితే, నా కోరిక తీరలేదు. నా కుమారుడి రూపంలో ఇప్పుడు ఆ కల నెరవేరింది’’ అని మనోజ్ శర్మ తెలిపారు.చదువునూ కొనసాగిస్తాకాగా దేశీ క్రికెట్లో సత్తా చాటిన వికెట్ కీపర్ బ్యాటర్ కార్తిక్ శర్మ కోసం వేలంలో గట్టి పోటీ ఎదురైనా చెన్నై మాత్రం అతడిని వదల్లేదు. భారీ ధరకు అతడిని సొంతం చేసుకుంది. పన్నెండో తరగతి పూర్తి చేసిన కార్తిక్.. క్రికెట్తో పాటు చదువునూ కొనసాగిస్తానని చెబుతున్నాడు. ఇక కార్తిక్ పెద్ద తమ్ముడు చదువుపైనే ఎక్కువగా దృష్టి పెట్టగా.. చిన్న తమ్ముడు మాత్రం క్రికెట్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.సంకల్పం బలంగా ఉంటే.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా లక్ష్యాన్ని చేరవచ్చని ఇప్పటికే ఎంతో మంది యువ క్రీడాకారులు నిరూపించారు. ఇప్పుడీ జాబితాలో కార్తిక్ శర్మ కూడా చేరాడు. తల్లిదండ్రుల త్యాగాలకు ప్రతిఫలంగా.. టీమిండియా అరంగేట్రానికి బాటలు వేసే ఐపీఎల్కు అతడు సెలక్ట్ అయ్యాడు. చెన్నై వంటి చాంపియన్ జట్టు అతడిని ఏరికోరి కొనుక్కోవడం అతడి ప్రతిభకు నిదర్శనం.చదవండి: IND vs SA: 'ఇంతకంటే దారుణ పరిస్థితుల్లో ఆడాను.. అంపైర్ల నిర్ణయంతో షాకయ్యాను' -
పోరాడుతున్న ఇంగ్లండ్.. రెండో రోజు ఆసీస్దే
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ మూడో టెస్టులో ఇంగ్లండ్ పోరాడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు 8 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ బెన్ స్టోక్స్(45), జోఫ్రా ఆర్చర్(30) ఉన్నారు. వీరిద్దరూ తొమ్మిదో వికెట్కు 45 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇంగ్లండ్ జట్టు ఇంకా 158 పరుగుల వెనకంజలో ఉంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్లో ఇంగ్లండ్ బ్యాటర్ల పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో స్టోక్స్, ఆర్చర్తో పాటు హ్యారీ బ్రూక్ (45), బెన్ డకెట్ (29) ఫర్వాలేదన్పించారు. వైస్ కెప్టెన్ పోప్(3), క్రాలీ(9), రూట్(19) తీవ్ర నిరాశపరిచారు.ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. లియోన్, బోలాండ్ తలా రెండు వికెట్లు సాధించారు. మరో వికెట్ గ్రీన్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అంతకుముందు 326/8 ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ 371 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (143 బంతుల్లో 106; 8 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్గా నిలవగా..ఖవాజా(82), స్టార్క్(54) రాణించారు.డీఆర్ఎస్ వివాదం..కాగా ఈ మ్యాచ్లో డీఆర్ఎస్ వివాదం చోటు చేసుకుంది. ఆసీస్ ఇన్నింగ్స్లో అలెక్స్ క్యారీ బ్యాటింగ్ చేస్తుండగా బంతి స్పష్టంగా బ్యాట్కు తాకినప్పటికి.. స్నికోమీటర్ సాంకేతిక లోపం వల్ల స్పైక్ రాలేదు. ఇంగ్లండ్ రివ్యూ తీసుకున్నప్పటికి స్నికోమీటర్లో స్పైక్ చూపించకపోవడంతో థర్డ్ అంపైర్ నాటౌట్గా ప్రకటించారు. అయితే ఈ విషయంపై ఐసీసీ స్పందించింది. సాంకేతిక అంగీకరిస్తూ.. ఇంగ్లండ్ కోల్పోయిన రివ్యూను తిరిగి ఇచ్చింది -
గిల్కు గాయం.. అతడికి వరం! భారత తుది జట్టు ఇదే
అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం దక్షిణాఫ్రికాతో ఐదో టీ20లో తలపడేందుకు భారత జట్టు సిద్దమవుతోంది. లక్నోలో జరగాల్సిన నాలుగో టీ20.. పొగమంచు కారణంగా రద్దు కావడంతో చివరిదైన ఐదో టీ20 టీమిండియాకు కీలకంగా మారింది.ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను 3-1 తేడాతో సొంతం చేసుకోవాలని భారత్ పట్టుదలతో ఉంది. మరోవైపు సఫారీలు కూడా ఈ మ్యాచ్లో ఆతిథ్య జట్టును ఓడించి సిరీస్ను సమం చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ నిర్ణయాత్మక పోరులో టీమిండియా కొన్ని కీలక మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది.సంజూకు లక్కీ ఛాన్స్!ఈ మ్యాచ్కు భారత వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయం కారణంగా దూరమయ్యాడు. నాలుగో టీ20కు ముందు ప్రాక్టీస్ చేస్తుండగా గిల్ పాదానికి గాయమైంది. దీంతో చివరి రెండు టీ20లకు అతడు దూరంగా ఉండనున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.గిల్ గైర్హజరీలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తిరిగి తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అభిషేక్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్ను సంజూ ప్రారంభించనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ సిరీస్లో ఇప్పటివరకు బెంచ్కే పరిమితమైన శాంసన్.. 2026 టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో తన ఫామ్ను నిరూపించుకోవడానికి ఇది మంచి అవకాశం.బుమ్రా రీఎంట్రీ!మరోవైపు ఈ కీలక మ్యాచ్కు స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా అందుబాటులో ఉండవచ్చు. వ్యక్తిగత కారణాల వల్ల మూడో మ్యాచ్కు దూరమైన అతను.. నాలుగో మ్యాచ్ సందర్భంగా జట్టుతో కలిసి కనిపించాడు. కాబట్టి ఇప్పుడు ఐదో టీ20లో అతడు ఆడే సూచనలు కన్పిస్తున్నాయి.ఒకవేళ అతడు జట్టుతో కలిస్తే హర్షిత్ రాణా ప్లేయింగ్ ఎలెవన్లో ఉండకపోవచ్చు. అదేవిధంగా అక్షర్ పటేల్ స్ధానంలో ప్రధాన జట్టులోకి వచ్చిన ఆల్రౌండర్ షాబాజ్ అహ్మద్కు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కకపోవచ్చు.భారత తుది జట్టు (అంచనా):అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, బుమ్రా/ హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్.చదవండి: IND vs SA: క్రికెట్ వర్సెస్ కాలుష్యం.. నిజంగా ఇది సిగ్గు చేటు! -
మయాంక్ కెప్టెన్సీలో ఆడనున్న కేఎల్ రాహుల్
విజయ్ హజారే ట్రోఫీ 2025–26 సీజన్ కోసం 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును కర్ణాటక క్రికెట్ అసోసియేషిన్ ప్రకటించింది. ఈ జట్టులో టీమిండియా స్టార్ ప్లేయర్లు కేఎల్ రాహుల్, ప్రసిద్ద్ కృష్ణలు ఉన్నారు. దీంతో కర్ణాటక జట్టు మరింత పటిష్టంగా మారింది.బీసీసీఐ అదేశాలతో వీరిద్దరూ దేశవాళీ వన్డే టోర్నీ బరిలోకి దిగనున్నారు. ఇక ఈ జట్టు కెప్టెన్గా స్టార్ మయాంక్ అగర్వాల్ ఎంపికయ్యాడు. అతడి డిప్యూటీగా కరుణ్ నాయర్ వ్యవహరించనున్నాడు. అదేవిధంగా అండర్-23 టోర్నీలో కర్ణాటక తరపున అదరగొట్టిన హర్షిల్ ధర్మాని, ధ్రువ్ ప్రభాకర్లకు సీనియర్ జట్టులో చోటు లభించింది.ఈ టోర్నీలో ధర్మాని తమిళనాడుపై 142 పరుగులు, ప్రభాకర్ విదర్భపై 126 పరుగులతో రాణించి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించారు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా శ్రీష ఆచార్ చోటు దక్కించుకున్నాడు. కర్ణాటక తమ గ్రూప్ దశ మ్యాచ్లన్నీ అహ్మదాబాద్లో ఆడనుంది.ఈ టోర్నీలో కర్ణాటక జట్టు డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగనుంది. కర్ణాటక టీమ్ తొలి మ్యాచ్లో డిసెంబర్ 24న జార్ఖండ్తో తలపడనుంది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి దిగ్గజాల సైతం ఈ టోర్నీలో ఆడనున్నారు.విజయ్ హజారే ట్రోఫీ 2025-26 కోసం కర్ణాటక జట్టు: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, కరుణ్ నాయర్ (వైస్ కెప్టెన్), స్మరణ్, శ్రీజిత్, అభినవ్ మనోహర్, శ్రేయాస్ గోపాల్,వ్యాషాక్, మన్వంత్ కుమార్ , శ్రీషా S ఆచార్, అభిలాష్ శెట్టి, శరత్ , హర్షిల్ ధర్మాని, కేఎల్ రాహుల్, ప్రభాకర్ చదవండి: Year-Ender 2025: విరాట్ కోహ్లి నుంచి జాన్ సీనా వరకు.. -
Year-Ender 2025: విరాట్ కోహ్లి నుంచి జాన్ సీనా వరకు..
2025 ఏడాదిలో క్రీడల్లో ఒక శకం ముగిసింది. మైదానంలో తమ అసాధారణ ప్రతిభతో అభిమానులను మంత్రముగ్ధులను చేసిన ఎందరో సూపర్ స్టార్లు ఈ ఏడాది (2025) తమ కెరీర్ను ముగించారు. ఈ క్రమంలో ఏడాది రిటైర్మెంట్ ప్రకటించిన క్రీడా దిగ్గజాలపై ఓ లుక్కేద్దాం.రోహిత్ శర్మ..టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ఈ ఏడాది మేలో టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి షాకిచ్చాడు. 2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత పొట్టి ఫార్మాట్కు గుడ్ బై చెప్పిన రోహిత్.. ఇంగ్లండ్ టూర్కు ముందు రెడ్బాల్ క్రికెట్ నుంచి తప్పుకొన్నాడు. తన టెస్టు కెరీర్లో 67 టెస్టు మ్యాచ్లు ఆడిన రోహిత్ 40.58 సగటుతో 4301 పరుగులు చేశాడు. అందులో 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించిన భారత టెస్టు కెప్టెన్గా శుభ్మన్ గిల్ ఎంపికయ్యాడు. రోహిత్ ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు.విరాట్ కోహ్లి..క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరైన విరాట్ కోహ్లి కూడా రోహిత్ శర్మ బాటలోనే నడిచాడు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన వారం రోజులకే కింగ్ కూడా టెస్టుల నుంచి తప్పుకొన్నాడు. టెస్ట్ క్రికెట్ అంటే తనకు అమితమైన ఇష్టమని, భారత్ తరపున ఆడినంత కాలం ఈ ఫార్మాట్లో కొనసాగుతానని కోహ్లి ఎన్నోసార్లు చెప్పారు. కానీ సడన్గా రిటైర్మెంట్ ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచాడు. సుదీర్ఘ ఫార్మాట్ నుంచి కోహ్లి తప్పుకోవడంతో భారత టెస్ట్ క్రికెట్లో 'రో-కో' శకం ముగిసింది. విరాట్ కోహ్లి తన టెస్టు కెరీర్లో 123 మ్యాచ్లు ఆడి 9230 పరుగులు చేశాడు. 30 సెంచరీలు, 31 ఆర్ధ శతకాలు ఉన్నాయి. విరాట్ కూడా ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నాడు.ఛతేశ్వర్ పుజారాభారత టెస్ట్ క్రికెట్ లో 'నయా వాల్' గా పేరుగాంచిన ఛతేశ్వర్ పుజారా.. ఈ ఏడాది ఆగస్టులో అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల నుండి తప్పుకొన్నాడు. గత కొన్నేళ్లగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నప్పటికి.. దేశవాళీ క్రికెట్లో మాత్రం పుజారా అద్భుతంగా రాణిస్తుండేవాడు. కానీ యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చేందుకు తన కెరీర్ను ఛతేశ్వర్ ముగించాడు. పుజారా తన కెరీర్లో 7195 పరుగులు చేశాడు. 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయ.స్టీవ్ స్మిత్, మాక్సీ గుడ్బైఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్లు స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్ వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకొని అందరికి షాకిచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 అనంతరం స్మిత్ తన నిర్ణయాన్ని వెల్లడించగా.. మాక్సీ ఈ ఏడాది జూన్లో తన రిటైర్మెంట్ను ప్రకటించాడు.హెన్రీచ్ క్లాసెన్సౌతాఫ్రికా స్టార్ హెన్రిచ్ క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్కు సడన్గా వీడ్కోలు పలికి అందరిని ఆశ్చర్యపరిచాడు. బోర్డుతో విభేదాల కారణంగా క్లాసెన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. క్లాసెన్ తన అంతర్జాతీయ కెరీర్లో 3245 పరుగులు చేశాడు.నికోలస్ పూరన్: వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ కేవలం 29 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకొని అందరినీ షాక్కు గురిచేశాడు. ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్ల మోజులో పడి పూరన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.జాన్ సీనా..స్టార్ రెజ్లర్, WWE దిగ్గజం జాన్ సీనా ఈ ఏడాది డిసెంబర్లో ప్రొఫెషనల్ రెజ్లింగ్కు వీడ్కోలు పలికారు. జాన్ సీనా తన చివరి మ్యాచ్లో ఓడిపోయినప్పటికి.. ప్రపంచ రెజ్లింగ్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. జాన్ సీనా తన కెరీర్లో మొత్తం 17 వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్స్ను సొంతం చేసుకున్నాడు.ఈ లెజెండరీ రెజ్లర్ ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలపై దృష్టి సారించారు. ఇప్పటికే 'పీస్మేకర్' (Peacemaker) వంటి సిరీస్లతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జాన్సీనా.సెర్గియో బుస్కెట్స్ (ఫుట్బాల్)స్పెయిన్ మిడ్ఫీల్డ్ మాంత్రికుడు సెర్గియో బుస్కెట్స్ మేజర్ లీగ్ సాకర్ సీజన్ ముగిసిన తర్వాత ఫుట్బాల్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మయామి ఇంటర్నేషనల్ ఫుట్బాల్ క్లబ్ తరపున లియోనెల్ మెస్సీతో కలిసి సెర్గియో ఆడాడు.పర్దీప్ నర్వాల్ (కబడ్డీ)కబడ్డీ లెజెండ్, 'డూ ఆర్ డై' స్పెషలిస్ట్ పర్దీప్ నర్వాల్ 2025 ప్రో కబడ్డీ లీగ్ (PKL) వేలంలో అమ్ముడుపోకపోవడంతో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రొఫెషనల్ కబడ్డీకి రిటైర్మెంట్ ప్రకటించి షాకిచ్చాడు. అయితే కోచ్గా పనిచేసేందుకు తన సిద్దంగా ఉన్నట్లు నర్వాల్ తెలిపాడు. -
చరిత్ర సృష్టించిన నాథన్ లియోన్..! మెక్గ్రాత్ రియాక్షన్ వైరల్
ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం నాథన్ లియోన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆస్ట్రేలియా బౌలర్గా లియోన్ నిలిచాడు. యాషెస్ సిరీస్లో భాగంగా ఆడిలైడ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో లియోన్ ఈ ఫీట్ సాధించాడు. అతడు ఇప్పటివరకు 141 మ్యాచ్లలో 564 వికెట్లు పడగొట్టాడు.ఇంతకుముందు ఈ అరుదైన రికార్డు లెజెండరీ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్గ్రాత్(563) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో మెక్గ్రాత్ను లియోన్ అధిగమించాడు. అగ్రస్దానంలో దివంగత స్పిన్నర్ షేన్ వార్న్(708) ఉన్నాడు. ఇక ఓవరాల్గా టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో లియోన్ ఆరో స్ధానానికి ఎగబాకాడు. ఈ లిస్ట్లో ముత్తయ్య మురళీధరన్ (800) టాప్ ప్లేస్లో ఉండగా.. షేన్ వార్న్ 708, జేమ్స్ అండర్సన్ 704, అనిల్ కుంబ్లే 619, స్టువర్ట్ బ్రాడ్ 604 తర్వాతి స్ధానాల్లో ఉన్నారు. ఈ దిగ్గజ బౌలర్లు అందరూ రిటైర్డ్ కాగా.. లయన్ ఒక్కడే టెస్టుల్లో కొనసాగుతున్నాడు.మెక్గ్రాత్ రియాక్షన్ వైరల్..!కాగా తన రికార్డును బ్రేక్ చేసిన సమయంలో గ్లెన్ మెక్గ్రాత్ కామెంటరీ బాక్స్లో ఉన్నాడు. ఈ సందర్భంగా మెక్గ్రాత్ స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. లియోన్ వికెట్ తీయగానే.. మెక్గ్రాత్ సరదగా ‘కుర్చీని విసిరేస్తున్నట్లు’రియాక్ట్ అయ్యాడు. ఆ తర్వాత వెంటనే ఈ లెజెండరీ ఫాస్ట్ బౌలర్ నవ్వుతూ లియోన్ను అభినందించాడు.And with that absolute beauty, Nathan Lyon has passed Glenn McGrath for Test wickets! 564 😱#Ashes | #MilestoneMoment | @nrmainsurance pic.twitter.com/wTofukUsYD— cricket.com.au (@cricketcomau) December 18, 2025చదవండి: IND vs SA: క్రికెట్ వర్సెస్ కాలుష్యం.. నిజంగా ఇది సిగ్గు చేటు! -
అజేయంగా కెరీర్కు వీడ్కోలు
న్యూయార్క్: అమెరికా ప్రొఫెషనల్ బాక్సర్ టెరెన్స్ క్రాఫోర్డ్ కెరీర్కు వీడ్కోలు పలికాడు. ప్రొఫెషనల్ కెరీర్లో పోటీపడిన 42 బౌట్లలోనూ విజయాలు సాధించిన 38 ఏళ్ల క్రాఫోర్డ్... ఈ ఏడాది సెపె్టంబర్లో చివరిసారి బరిలోకి దిగాడు. నాలుగు వేర్వేరు విభాగాల్లో టైటిల్స్ నెగ్గిన ఈ అమెరికా బాక్సర్... అపజయమన్నదే లేకుండా బుధవారం కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ‘ప్రతి బాక్సర్కు ఇలాంటి ఒక సమయం వస్తుంది. కెరీర్లో ఎన్నో సాధించా. ఏమీ లేకుండా రింగ్లో అడుగుపెట్టా. ఒక దశలో కేవలం గ్లౌవ్స్ ఉంటే చాలు అనే దగ్గరి నుంచి అన్నీ సమకూరే స్థాయికి చేరుకున్నా. మొదట్లో కుటుంబం కోసం బాక్సింగ్ను ఎంచుకున్నా... ఆ తర్వాత అంచలంచెలుగా ఈ స్థాయికి చేరుకున్నా. బాక్సింగ్ నాకు అన్నీ ఇచ్చింది. ఇప్పుడు వీడ్కోలు పలకాల్సిన సమయం వచి్చంది’ అని క్రాఫోర్డ్ వీడ్కోలు సందేశంలో పేర్కొన్నాడు. 2008లో ప్రొఫెషనల్గా మారిన క్రాఫోర్డ్... కెరీర్లో 31 నాకౌట్ విజయాలు సాధించడం విశేషం. చివరగా కానెలో అల్వరెజ్పై విజయం సాధించిన క్రాఫోర్డ్ కెరీర్లో లైట్ వెయిట్, సూపర్ లైట్ వెయిట్, వెల్టర్ వెయిట్, సూపర్ వెల్టర్ వెయిట్ విభాగాల్లో పోటీ పడి విజయాలు సాధించాడు. -
'ఇంతకంటే దారుణ పరిస్థితుల్లో ఆడాను.. అంపైర్ల నిర్ణయంతో షాకయ్యాను'
లక్నో వేదికగా బుధవారం జరగాల్సిన భారత్-దక్షిణాఫ్రికా మధ్య నాలుగో టీ20 భారీ పొగమంచు కారణంగా రద్దయింది. కనీసం టాస్ వేసేందుకు వీలు పడలేదు. సాయంత్రం 6:30 గంటలకు పడాల్సిన టాస్.. పొగమంచు కారణంగా పదేపదే వాయిదా పడుతూ వచ్చింది. పొగ మంచు దుప్పటిలా కప్పేయడంతో విజిబిలిటీ తీవ్రంగా తగ్గిపోయింది. సాయత్రం 6:50 నుండి 9:25 గంటల వరకు అంపైర్లు దాదాపు ఆరుసార్లు పిచ్ను పరిశీలించారు. చివరకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో రాత్రి 9:25 గంటలకు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. గాలి నాణ్యత సూచీ 400 దాటిపోవడంతో ఆటగాళ్ల ఆరోగ్య భద్రతా దృష్ట్యా అంపైర్లు ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ మ్యాచ్కు కామెంటేటర్ ఉన్న భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప అంపైర్ల నిర్ణయంపై మండిపడ్డాడు."అంపైర్ల నిర్ణయం నన్ను షాక్కు గురిచేసింది. సమయం గడిచేకొద్దీ పొగమంచు తగ్గుతుందని అనుకోవడం పొరపాటు. నేను దీనికంటే దారుణమైన పరిస్థితుల్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాను. ఇక్కడ పరిస్థితులు కాస్త మెరుగ్గానే ఉన్నాయి" అని ఉతప్ప పేర్కొన్నాడు. కాగా ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ సిరీస్లో ఆఖరి మ్యాచ్ శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్లో భారత్ గెలిస్తే 3-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకోనుంది. ఒకవేళ సౌతాఫ్రికా గెలిస్తే సిరీస్ సమం కానుంది. అయితే ఈ సిరీస్కు భారత స్టార్ ప్లేయర్లు అక్షర్ పటేల్, శుభ్మన్ గిల్ దూరమయ్యాడు. అనారోగ్యం కారణంగా అక్షర్ పటేల్ మూడో టీ20కే ముందు జట్టు నుంచి తప్పుకోగా.. తాజాగా గిల్ కాలికి గాయమైంది. దీంతో అతడు ఐదో టీ20కు అందుబాటులో లేడు. అతడి స్ధానంలో సంజూ శాంసన్ తుది జట్టులోకి రానున్నారు.చదవండి: IND vs SA: క్రికెట్ వర్సెస్ కాలుష్యం.. నిజంగా ఇది సిగ్గు చేటు! -
శ్రీలంక ఫీల్డింగ్ కోచ్గా శ్రీధర్
భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ను శ్రీలంక జట్టు ఫీల్డింగ్ కోచ్గా నియమించుకుంది. వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న ఐసీసీ టి20 ప్రపంచకప్ వరకు అతడి సేవలు వినియోగించుకోనున్నట్లు శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2014 నుంచి 2021 వరకు టీమిండియా ఫీల్డింగ్ కోచ్గా వ్యవహరించిన శ్రీధర్... ఈ ఏడాది ఆరంభంలో లంకలో 10 రోజుల ప్రత్యేక ఫీల్డింగ్ క్యాంప్ నిర్వహించాడు. ‘శ్రీధర్ను ఫీల్డింగ్ కోచ్గా నియమించాం. టి20 వరల్డ్కప్ వరకు అతడు ఈ బాధ్యతలు నిర్వర్తిస్తాడు. 300కు పైగా అంతర్జాతీయ మ్యాచ్లకు శ్రీధర్ ఫీల్డింగ్ కోచ్గా వ్యవహరించాడు.బీసీసీఐ లెవల్–3 అర్హత ఉన్న శ్రీధర్ అనుభవం మా జట్టుకు ఎంతో ఉపయోగ పడుతుంది. మా ఆటగాళ్ల ఫీల్డింగ్ ప్రమాణాలు పెంచేందుకు అతడు సహకరిస్తాడు. పాకిస్తాన్, ఇంగ్లండ్ పర్యటనల్లోనూ అతడి సేవలు వినియోగించుకుంటాం’ అని ఎస్ఎల్సీ తెలిపింది. దీనిపై శ్రీధర్ స్పందిస్తూ లంక జట్టుతో కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించాడు. ‘ఆటగాళ్ల తీరుకు తగ్గట్లు కోచింగ్ ఉంటుంది. సహజంగా లంకేయులు క్యాచ్లు పట్టడంలో చురుకుగా వ్యవహరిస్తారు. ఇక ఫీల్డింగ్ నైపుణ్యాలను మెరుగు పరచడం అనేది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ఎవరి శరీర తీరును బట్టి వాళ్ల ప్రయత్నం ఉంటుంది. దానికి అవసరమైన తోడ్పాటు అందించేందుకు ప్రయత్నిస్తా’ అని శ్రీధర్ అన్నాడు. -
క్రికెట్ వర్సెస్ కాలుష్యం.. నిజంగా ఇది సిగ్గు చేటు!
లక్నోలోని ఏకనా స్టేడియం వేదికగా బుధవారం భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన నాలుగో టీ20 ప్రతికూల వాతావరణం కారణంగా రద్దయ్యింది. పొగమంచు కమ్మేయడంతో కనీసం టాస్ పడకుండానే మ్యాచ్ను ముగించాల్సి వచ్చింది. లక్నోలో గాలి నాణ్యత సూచీ (AQI) 400 దాటి 'హానికర' స్థాయికి చేరుకుంది.దీంతో మొత్తంగా ఆరు సార్లు మైదానంలోకి వచ్చి పరిస్థితిని సమీక్షించిన అంపైర్లు.. చివరిసారిగా రాత్రి 9.25 సమయంలో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో బీసీసీఐ షెడ్యూల్ తీవ్రస్ధాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి.ప్రణాళిక లోపం..!వాతావరణంపై పూర్తి నియంత్రణ ఎవరి చేతిలోనూ ఉండదు. కానీ ఉత్తర భారతదేశంలో నవంబర్, డిసెంబర్ నెలల్లో కాలుష్యం, పొగమంచు తీవ్రత ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇది కొత్త విషయం ఏమీ కాదు. గతంలో దీపావళి తర్వాత ఢిల్లీలో జరగాల్సిన టెస్ట్ మ్యాచ్ను కాలుష్యంగా కారణంగా బీసీసీఐ కోల్కతాకు మార్చింది. అంటే బోర్డుకు అక్కడి పరిస్థితులపై స్పష్టమైన అవగాహన ఉంది. కానీ ఈసారి మాత్రం ముందస్తు జాగ్రత్త తీసుకోవడంలో బీసీసీఐ విఫలమైంది. దేశవ్యాప్తంగా ఇంకా ఎన్నో వేదికలు ఉన్నప్పటికి లక్నోలోనే షెడ్యూల్ చేయాల్సిన అవసరం ఏముందని బీసీసీఐపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇంతటి కాలుష్యంలో ఆడటం ఆటగాళ్లకు ప్రేక్షకులకు, అధికారులకు ప్రాణసంకటమే. ఈ మైదానంలో హార్డిక్ పాండ్యా వంటి ఆటగాళ్లు మాస్కులు ధరించి తిరగాల్సి వచ్చింది. ఈ సిరీస్లో ధర్మశాల వేదికగా జరిగిన మూడో టీ20లోనూ భారత ఆటగాళ్లు చాలా ఇబ్బంది పడ్డారు. ఇంతటి చలిలో ఆడడం ఇదే తొలిసారి అని స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి చెప్పుకొచ్చాడు.ఇప్పటికైనా మారాల్సిందే..భారత్లో క్రికెట్ కేవలం ఒక క్రీడ మాత్రమే కాదు.. కోట్లాది మంది భావోద్వేగం. తమ ఆరాధ్య క్రికెటర్లను చూసేందుకు టిక్కెట్లు తీసుకుని మరి మైదానంకు వచ్చిన అభిమానులకు నిరాశ ఎదురవ్వడం చాలా బాధాకారం. ఇకనైనా బీసీసీఐ షెడ్యూలింగ్ చేసేటప్పుడు.. వాతావరణ పరిస్థితులు, కాలుష్య స్థాయిలను పరిగణనలోకి తీసుకుని వేదికలను ఎంపిక చేయాలని క్రీడా విశ్లేషకులు సూచిస్తున్నారు.అయితే వచ్చే ఏడాది జనవరిలో న్యూజిలాండ్తో జరిగే వైట్బాల్ సిరీస్లకు దక్షిణ, పశ్చిమ భారత నగరాలు వేదికలగా ఉన్నాయి. ఒక్క మూడో టీ20 నార్త్ ఈస్ట్(అస్సాం)లో జరగనుంది. ఈ మ్యాచ్ వేదికను బీసీసీఐ మార్చే అవకాశముంది. కాగా ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉంది. ఐదో టీ20 శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.ఇది రెండోసారి..అంతర్జాతీయ క్రికెట్లో పొగమంచు కారణంగా మ్యాచ్ రద్దు కావడం ఇది రెండోసారి. 1998లో ఫైసలాబాద్లో పాకిస్తాన్, జింబాబ్వే మధ్య జరగాల్సిన టెస్ట్ మ్యాచ్ పొగమంచు కారణంగా రద్దు అయింది. ఆశ్చర్యకరంగా ఐదు రోజులూ ఆట సాధ్యం కాలేదు.చదవండి: అంధుల మహిళల క్రికెట్ జట్టుకు సచిన్ అభినందన -
భారత ఫుట్బాల్కు ఉజ్వల భవిత: మెస్సీ
న్యూఢిల్లీ: భారత్లో ఫుట్బాల్కు ఉజ్వల భవిష్యత్తు ఉందని అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లయోనల్ మెస్సీ అన్నాడు. ‘మీ ఆదరణ, మీరు పంచిన ప్రేమాభిమానాలను నాతోపాటు తీసుకెళ్తున్నా. మ్యాచ్ ఆడేందుకైనా... మరో కార్యక్రమానికైనా ఇంకోసారి భారత్కు రావాలని గట్టిగా కోరుకుంటున్నాను. కచ్చితంగా తిరిగి వచ్చే ఆలోచనైతే నాకుంది’ అని మెస్సీ అన్నాడు. తను సందర్శించిన ప్రాంతాల్ని, కలుసుకున్న భారత దిగ్గజాలతో ఉన్న ఒక నిమిషం నిడివిగల వీడియోను మెస్సీ తన సోషల్ మీడియా అకౌంట్లో పంచుకున్నాడు. ఈ వీడియోలో భారత ప్రముఖ క్రీడాకారులు, సినీ స్టార్లు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులెందరో ఉన్నారు. కానీ... హైదరాబాద్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం«దీలతో ఉన్న ఫుటేజీ మాత్రం క్షణమైనా కనిపించలేదు. భారత్లో తన ఐదు రోజుల పర్యటన అద్భుతంగా సాగిందన్నాడు. బుధవారం ముంబై నుంచే మయామికి బయలుదేరాడు. 38 ఏళ్ల అర్జెంటీనా స్ట్రయికర్ తన మయామి క్లబ్ జట్టు సహచరులు స్వారెజ్, రోడ్రిగో డి పాల్లతో కలిసి 13, 14, 15 తేదీల్లో మూడు రోజుల పర్యటన నిమిత్తం వచ్చాడు. అయితే మరో రెండు రోజులు పొడిగించాడు. భారత్లోని వివిధ రంగాల ప్రముఖులను, క్రికెట్, ఫుట్బాల్, సినీ స్టార్లను కలుసుకున్నాడు. ముంబైలో సచిన్, మెస్సీల భేటీ వాంఖెడే మైదానానికే వన్నె తెచ్చింది. బాలీవుడ్ స్టార్లు షారుక్ ఖాన్, కరీనా కపూర్, భారత ఫుట్బాల్ మాజీ కెపె్టన్ సునీల్ ఛెత్రి తదితరులు మెస్సీని కలిసిన వారిలో ఉన్నారు. మంగళవారం దేశీ కార్పోరేట్ సంస్థ రిలయన్స్ యాజమాన్యం వంతారాలో అచ్చెరువొందే సదుపాయాలతో ఏర్పాటు చేసిన వన్యప్రాణుల సంరక్షిత ప్రాంతాన్ని సందర్శించాడు. ఈ సందర్భంగా పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ... మెస్సీకి ఆత్మీయ స్వాగతం పలికి ఆతిథ్యమిచ్చాడు. ప్రముఖ క్రీడా ఉపకరణాల సంస్థ అడిడాస్ నిర్వహించిన ఫొటో షూట్లోనూ పాల్గొన్నాడు. ఈ ఫొటో షూట్లో మెస్సీతోపాటు తెలంగాణ స్టార్ బాక్సర్, ప్రపంచ మాజీ చాంపియన్ నిఖత్ జరీన్, క్రికెటర్లు కుల్దీప్ యాదవ్, రేణుక సింగ్, పారాథ్లెట్స్ నిశాద్ కుమార్, సుమింత్ అంటిల్ పాల్గొన్నారు. -
అంధుల మహిళల క్రికెట్ జట్టుకు సచిన్ అభినందన
ముంబై: అంధుల మహిళల టి20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టును క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభినందించాడు. తొలిసారి నిర్వహించిన ఈ మెగాటోర్నీలో భారత జట్టు అజేయంగా ట్రోఫీ చేజిక్కించుకుంది. తాజాగా వరల్డ్కప్ నెగ్గిన భారత జట్టు... మంగళవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సచిన్ను కలిసింది. ఈ సందర్భంగా ప్రపంచకప్లో మన అమ్మాయిలు చూపిన ప్రతిభాపాటవాలను మాస్టర్ బ్లాస్టర్ కొనియాడాడని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. ‘కఠోర శ్రమ, అకుంఠిత దీక్షతోనే మన జట్టు ప్రపంచకప్ గెలిచింది. ఇది ఆరంభం మాత్రమే. మున్ముందు కూడా ఇదే నిలకడ కొనసాగిస్తూ... మరిన్ని విజయాలు సాధించాలి. ఈ విజయం అందరి బాధ్యతను మరింత పెంచింది. ప్రపంచ కప్ ట్రోఫీ ఎంతో మందిలో స్ఫూర్తి నింపింది’ అని సచిన్ పేర్కొన్నాడని నిర్వాహకులు తెలిపారు.వరల్డ్కప్ గెలిచిన భారత జట్టు కెపె్టన్ దీపిక మాట్లాడుతూ... ‘సచిన్ మాటలు మాకు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. మేము మైదానంలోకి దిగిన ప్రతిసారీ ఎంతో అంకితభావం, ఆత్మవిశ్వాసంతో ఆడాం. దానికి తగ్గ ప్రతిఫలం వరల్డ్ కప్ రూపంలో దక్కింది. సచిన్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వినడంతో మా మనసు ఉప్పొంగుతోంది’ అని దీపిక పేర్కొంది. -
కేరీ సూపర్ సెంచరీ
అడిలైడ్: వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (143 బంతుల్లో 106; 8 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా ఇంగ్లండ్తో ప్రతిష్టాత్మక ‘యాషెస్ సిరీస్’ మూడో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే తొలి రెండు టెస్టులు గెలిచి 2–0తో ఆధిక్యంలో ఉన్న ఆ్రస్టేలియా... సిరీస్ చేజిక్కించుకునే దిశగా కీలక పోరులోనూ మంచి ప్రదర్శన చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన ఆ్రస్టేలియా... బుధవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 83 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. అలెక్స్ కేరీ ‘శత’క్కొట్టగా... ఉస్మాన్ ఖ్వాజా (126 బంతుల్లో 82; 10 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. గాయం కారణంగా గత రెండు టెస్టులకు దూరమైన ఆ్రస్టేలియా రెగ్యులర్ కెపె్టన్ ప్యాట్ కమిన్స్ ఈ మ్యాచ్ బరిలోకి దిగగా... టాస్ వేయడానికి 45 నిమిషాల ముందు స్టీవ్ స్మిత్ అనూహ్యంగా జట్టు నుంచి తప్పుకున్నాడు. అనారోగ్యం కారణంగా అతడు ఈ మ్యాచ్కు దూరమయ్యాడని క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) వెల్లడించింది. ఐపీఎల్–2026 మినీ వేలంలో రికార్డు ధర దక్కించుకున్న పేస్ ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ (0) డకౌట్గా వెనుదిరిగాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టగా... కార్స్, జాక్స్ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. కేరీ కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్కు సహకరిస్తున్న పిచ్పై భారీ జన సందోహం మధ్య తొలుత బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియాకు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో జేక్ వెదరాల్డ్ (18)ను ఆర్చర్ అవుట్ చేయగా... మరుసటి ఓవర్లో ట్రావిస్ హెడ్ (10) కూడా వెనుదిరిగాడు. తన శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడిన హెడ్ను కార్స్ బుట్టలో వేసుకున్నాడు. ఈ దశలో లబుషేన్ (19)తో కలిసి ఉస్మాన్ ఖ్వాజా కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. స్మిత్ గైర్హాజరీతో చివరి నిమిషంలో జట్టులో చోటు దక్కించుకున్న ఖ్వాజా చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. అయితే లంచ్ అనంతరం ఆర్చర్ మూడు బంతుల వ్యవధిలో రెండు వికెట్లు పడగొట్టి మరోసారి ఆసీస్ను కష్టాల్లోకి నెట్టాడు. అతడి ధాటికి లబుషేన్, హెడ్ పెవిలియన్ బాటపట్టారు. దీంతో ఆసీస్ 94/4తో నిలిచింది. ఈ దశలో అడిలైడ్ ‘లోకల్ బాయ్’ కేరీ గొప్ప సంయమనం కనబర్చాడు. మరో ఎండ్లో ఖ్వాజా కూడా పట్టువదలకుండా ప్రయతి్నంచాడు. ఈ జంట ఐదో వికెట్కు 91 పరుగులు జత చేసింది. తొలి రోజు ఆటకు రికార్డు స్థాయిలో 56,298 మంది అభిమానులు హాజరయ్యారు. అడిలైడ్ మైదానంలో ఇదే అత్యధికం. ‘ఈ రోజుల్లో ఇంత పెద్ద సంఖ్యలో అభిమానులు టెస్టు మ్యాచ్ చూసేందుకు తరలి రావడం అద్భుతంగా ఉంది. సొంత మైదానంలో 56 వేల పైచిలుకు జనం ముందు సెంచరీ చేయడం ఎంతో ప్రత్యేకం’ అని కేరీ అన్నాడు. జోష్ ఇన్గ్లిస్తో ఆరో వికెట్కు 59 పరుగులు జోడించిన కేరీ... ఎనిమిదో వికెట్కు మిచెల్ స్టార్క్ (63 బంతుల్లో 33 బ్యాటింగ్; 4 ఫోర్లు)తో కలిసి 50 పరుగులు జోడించాడు. 135 బంతుల్లో ‘యాషెస్ సిరీస్’ల్లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్న కేరీ... కాసేపటికే పెవిలియన్ చేరాడు. స్టార్క్తో పాటు లయన్ (18 బంతుల్లో 0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. తొలి రోజు అడిలైడ్లో 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా... నేడు మరింత ఎండ తీవ్రత ఉండనుంది. సిడ్నీ బాండీ బీచ్లో జరిగిన ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి సంతాపంగా ఇరు జట్ల ఆటగాళ్లు ఈ మ్యాచ్లో చేతికి నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగారు. -
మ్యాచ్ పాయింట్ కాపాడుకొని...
హాంగ్జౌ: బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ప్రతిష్టాత్మక వరల్డ్ టూర్ ఫైనల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ శుభారంభం చేసింది. బుధవారం మొదలైన ఈ టోర్నీలో ప్రపంచ ర్యాంకింగ్స్లో టాప్–8లో ఉన్న వాళ్లుమాత్రమే పాల్గొనేందుకు అర్హులు. పురుషుల సింగిల్స్, డబుల్స్, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో మ్యాచ్లను లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. భారత్ నుంచి పురుషుల డబుల్స్లో సాత్విక్–చిరాగ్ ద్వయం మాత్రమే ఈ టోర్నీకి అర్హత సాధించింది. గ్రూప్ ‘బి’ తొలి లీగ్ మ్యాచ్లో ప్రపంచ మూడో ర్యాంక్ జంట సాత్విక్–చిరాగ్ 12–21, 22–20, 21–14తో ప్రపంచ ఐదో ర్యాంక్ జోడీ లియాంగ్ వె కెంగ్–వాంగ్ చాంగ్ (చైనా)పై విజయం సాధించింది. గత ఏడాది పారిస్ ఒలింపిక్స్లో రజత పతకం గెలిచిన లియాంగ్–వాంగ్ చాంగ్ ద్వయం ఈ మ్యాచ్లో తొలి గేమ్ను అలవోకగా నెగ్గింది. అయితే రెండో గేమ్లో భారత జోడీ పుంజుకుంది. 18–12తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో చైనా జంట అనూహ్యంగా విజృంభించి వరుసగా ఏడు పాయింట్లు గెలిచి 19–18తో ఆధిక్యంలోకి వచ్చిం ది. ఆ తర్వాత 20–19తో విజయానికి పాయింట్ దూరంలో నిలిచింది. మరో పాయింట్ కోల్పోతే ఓడిపోయే స్థితిలో సాత్విక్–చిరాగ్ ద్వయం ఆందోళన చెందకుండా సంయమనంతో ఆడి వరుసగా మూడు పాయింట్లు గెలిచి రెండో గేమ్ను 22–20తో సొంతం చేసుకొని మ్యాచ్లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్లో ఒకదశలో 7–9తో వెనుకబడిన సాత్విక్–చిరాగ్ జంట తమ లోపాలను వెంటనే సరిచేసుకొని వరుసగా ఐదు పాయింట్లు సాధించి 12–9తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని భారత జోడీ విజయాన్ని ఖరారు చేసుకుంది. నేడు జరిగే రెండో లీగ్ మ్యాచ్లో ఫజర్ అల్ఫియాన్–షోహిబుల్ ఫిక్రి (ఇండోనేసియా) జంటతో ల్ఫిసాత్విక్–చిరాగ్ ద్వయం తలపడుతుంది. -
మ్యాచ్కు ‘పొగ’బెట్టిన ‘మంచు’
వర్షం కారణంగా... మైదానం చిత్తడిగా ఉండటం మూలంగా... ప్రమాదకర పిచ్లు రూపొందించినందుకు... తమ జట్ల పేలవ ప్రదర్శనకు నిరసనగా అభిమానుల ఆగ్రహాంతో... అంతర్జాతీయ క్రికెట్లో అర్ధంతరంగా మ్యాచ్లు రద్దయిన సంఘటనలు చూశాం. కానీ బుధవారం భారత్–దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన టి20 మ్యాచ్కు పైవేవీ ఆటంకం కలిగించలేదు. ఊహించని విధంగా మితిమీరిన పొగమంచు అడ్డంకిలా మారింది. దాంతో కనీసం టాస్ కూడా వేయకుండానే మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఫలితంగా దక్షిణాఫ్రికాపై టి20 సిరీస్ నెగ్గాలంటే రేపు అహ్మదాబాద్లో జరిగే చివరి మ్యాచ్లో భారత్ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లక్నో: ఇక ఈ టి20 సిరీస్ భారత్ గెలవొచ్చు. లేదంటే పర్యాటక దక్షిణాఫ్రికాతో పంచుకోవచ్చు. ఎందుకంటే ఆఖరి పోరులో గెలిస్తే సిరీస్ 3–1తో టీమిండియా వశమవుతుంది. కానీ ఓడితే 2–2తో సమమవుతుంది. మొత్తానికి పొగమంచు సిరీస్ ఫలితాన్ని సైతం అటుఇటూ కాకుండా చేసేసింది. బుధవారం భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇక్కడి ఎకానా స్టేడియంలో జరగాల్సిన నాలుగో టి20 మ్యాచ్ రద్దయ్యింది. పొగమంచు, ప్రతికూల వాతావరణం మ్యాచ్కు అవరోధంగా నిలిచింది. మొదట టాస్ ఆలస్యం అని టీవీల్లో బోర్డు కనిపించింది. సమయం గడుస్తున్నకొద్దీ ఫీల్డ్ అంపైర్లు అనంత పద్మనాభన్, రోహన్ పండిట్లు మ్యాచ్ నిర్వహణ కోసం మైదానాన్ని, మంచు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నారు. కనీసం 6 ఓవర్ల చొప్పున మ్యాచ్ నిర్వహించాలని వేచి చూశారు. చివరకు రాత్రి 9 గంటల 25 నిమిషాలకు ఆరోసారి మైదానాన్ని సమీక్షించి మ్యాచ్ నిర్వహించడం సాధ్యపడదని ప్రకటించారు. మంచు దుప్పటి కప్పేసింది! భారత్లో శీతాకాలం సీజన్ ఇది. పైగా డిసెంబర్ మధ్య నుంచి జనవరి అసాంతం చలి పులిలా పంజా విసురుతుంది. ఇక ఉత్తర భారతమైతే సూర్యుడు ఉదయించాక కూడా వణుకు తప్పదు. ఉదయం, రాత్రి పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. పొగమంచు కమ్ముతుంది. కంటికేది కనిపించదు. బుధవారం రాత్రి కూడా సరిగ్గా ఇదే జరిగింది. గరం గరం చేసే హైమాస్ట్ ఫ్లడ్లైట్లు అన్నీ వెలిగించినా కూడా మంచుదుప్పటి ముందు ఆ వెలుగు కూడా దిగదుడుపే అయ్యింది. పొగమంచు మ్యాచ్ జరగకుండా మైదానాన్ని కప్పేయడంతో ఫీల్డు అంపైర్లు పలుమార్లు సమీక్షించి మ్యాచ్ రద్దుకు నిర్ణయించారు. చివరిసారిగా రాత్రి 9.25 గంటలకు మైదానంలోని పరిస్థితిని సమీక్షించాక ఇక మ్యాచ్ జరిగే అవకాశం లేదని ఫీల్డ్ అంపైర్లు తేల్చారు. ఇంతటి చలిని లెక్కచేయకుండా, మంచు కురిసే వేళలో మ్యాచ్ కోసం నిరీక్షిస్తున్న ప్రేక్షకుల్ని ఏ మాత్రం ఇబ్బంది పెట్టకూడదని నిర్ణయించుకున్న అంపైర్లు అనంత పద్మనాభన్, రోహన్లు ఆలస్యం చేయకుండా మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అప్పటివరకు జెండాలు, అభిమాన క్రికెటర్ల ఫొటోలు, 4, 6 బోర్డులను ఊపుతూ ఉత్సాహంగా కనిపించిన ప్రేక్షకులు నిరాశగా వెనుదిరగడం మొదలు పెట్టారు. గిల్ అవుట్ భారత టెస్టు, వన్డేల కెపె్టన్ శుబ్మన్ గిల్ కూడా ప్రస్తుత సిరీస్కు దూరమయ్యాడు. అసలే ఈ ఓపెనర్ ఫామ్లేమీతో తంటాలు పడుతున్నాడు. ట్రెయినింగ్ సెషన్లో అతని బొటనవేలికి గాయమైంది. దీంతో ఈ నాలుగో టి20తో పాటు రేపు అహ్మదాబాద్లో జరిగే ఆఖరి మ్యాచ్కూ అందుబాటులో లేకుండా పోయాడు. ఇతని స్థానంలో సంజూ సామ్సన్ బరిలోకి దిగుతాడు. ఇప్పటికే పేస్ ఎక్స్ప్రెస్ బుమ్రా, స్పిన్నర్ అక్షర్ పటేల్ సైతం ఈ సిరీస్కు దూరమమైన సంగతి తెలిసిందే. టిక్కెట్ల డబ్బులు తిరిగి చెల్లింపు మ్యాచ్ మొదలవకుండానే రద్దయ్యింది. కనీసం టాస్కు కూడా నోచుకోలేదు. దీంతో నిబంధనల ప్రకారం టిక్కెట్లకు ప్రేక్షకులు వెచ్చించిన రుసుమును తిరిగి చెల్లించే ఏర్పాట్లు చేస్తామని స్టేడియం వర్గాలు వెల్లడించాయి. -
ఎట్టకేలకు!.. టాస్ పడకుండానే మ్యాచ్ రద్దు
టీమిండియా- సౌతాఫ్రికా మధ్య టీ20 సిరీస్ విజేత తదుపరి మ్యాచ్లో తేలనుంది. లక్నో వేదికగా బుధవారం జరగాల్సిన నాలుగో టీ20 టాస్ పడకుండానే రద్దై పోయింది. అయితే, ఎప్పటిలా వర్షం వల్ల కాకుండా.. ఈసారి పొగమంచు కారణంగా మ్యాచ్ మొదలుకాకుండానే ముగిసిపోయింది.స్టేడియాన్ని పొగమంచు కమ్మేయడంతో వరుస విరామాల్లో మైదానానికి వచ్చిన అంపైర్లు.. పరిస్థితిని పర్యవేక్షించారు. భారత కాలమానం ప్రకారం.. బుధవారం 6.30 నిమిషాలకు టాస్ పడాల్సి ఉండగా.. ఈ కారణం వల్లే తొలుత ఆలస్యమైంది. ఈ క్రమంలో వరుస విరామాల్లో అంపైర్లు వచ్చి సమీక్ష నిర్వహించారు. మైదానమంతా కలియదిరుగుతూ బ్యాటర్, బౌలర్, ఫీల్డర్ల స్థానాల నుంచి బంతి స్పష్టంగా కనబడుతుందా? లేదా? అని పరిశీలించారు.పదే.. పదేఇందులో భాగంగా 6.50 నిమిషాలకు ఓసారి.. 7.30 నిమిషాలకు మరోసారి.. ఆపై.. 8 గంటలకు.. అనంతరం 8.30 నిమిషాలకు.. మైదానంలోకి వచ్చిన అంపైర్లు పరిస్థితిని సమీక్షించారు. ఈ క్రమంలో పిచ్పై కవర్లు కప్పి ఉంచాలని సూచించారు. ఈసారి బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాతోనూ వారు మాట్లాడటం గమనార్హం.అనంతరం 9 గంటలకు మరోసారి రివ్యూ చేసిన అంపైర్లు.. ప్రేక్షకుల సహనానికి మరోసారి పరీక్ష పెట్టారు. ఈసారి 9.25 నిమిషాలకు మరోసారి రివ్యూ చేస్తామని చెప్పి మైదానం వీడారు. ఈ పరిణామాల నేపథ్యంలో స్టేడియంలోని ప్రేక్షకులు కంగుతిన్నారు. మ్యాచ్ సాగుతుందా? లేదా? అన్న అంశంపై త్వరగా తేల్చకుండా ఇదేం తీరు అనేలా రియాక్షన్స్ ఇచ్చారు.మరోవైపు.. లక్నోలో పొగమంచు కమ్ముకున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ సాగదని తెలిసినా ఎందుకు సాగదీస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. ఇక కామెంటేటర్లు కూడా దాదాపుగా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.ఎట్టకేలకుఈ క్రమంలో... 9.25 నిమిషాలకు మరోసారి మైదానంలోకి వచ్చి పరిస్థితి పరిశీలించిన తర్వాత మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో అభిమానులు నిరాశగా వెనుదిరిగారు.కాగా ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. తొలుత కటక్లో భారత్ 101 పరుగుల తేడాతో జయభేరి మోగించగా.. ముల్లన్పూర్లో జరిగిన రెండో మ్యాచ్లో సౌతాఫ్రికా 51 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో సిరీస్ 1-1తో సమం కాగా.. ధర్మశాల వేదికగా మూడో టీ20లో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది.. 2-1తో ముందంజ వేసింది. ఇరుజట్ల మధ్య బుధవారం లక్నోలోని ఏకనా స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ టాస్ పడకుండానే ఇలా ముగిసిపోయింది. ఇక సిరీస్ విజేతను తేల్చే శుక్రవారం నాటి మ్యాచ్కు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక.చదవండి: నాలుగో టీ20 నుంచి గిల్ అవుట్! -
మరోసారి ఐపీఎల్లో.. సర్ఫరాజ్ స్పందన ఇదే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఎట్టకేలకు తిరిగి అడుగుపెట్టాడు టీమిండియా స్టార్ సర్ఫరాజ్ ఖాన్. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 2023లో చివరి సారిగా ఐపీఎల్ ఆడిన ఈ ముంబైకర్.. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ క్యాష్ రిచ్లో పునరాగమనం చేయనున్నాడు.ఐదుసార్లు చాంపియన్ జట్టు అయిన చెన్నై సూపర్ కింగ్స్.. సర్ఫరాజ్ ఖాన్ను కొనుక్కుంది. అబుదాబి వేదికగా మంగళవారం నాటి మినీ వేలంలో కనీస ధర రూ. 75 లక్షలు వెచ్చించి అతడిని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.సర్ఫరాజ్ స్పందన ఇదేసోషల్ మీడియా వేదికగా తన భావాలను పంచుకుంటూ.. ‘‘కొత్త జీవితం ఇచ్చినందుకు ధన్యవాదాలు సీఎస్కే’’ అంటూ సర్ఫరాజ్ ఖాన్ చెన్నై యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ మేరకు ఇన్స్టా స్టోరీలో నాని ‘జెర్సీ’ సినిమాలోని ఎమోషనల్ సీన్కు సంబంధించిన దృశ్యాలను జతచేశాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ వేలంలో తిరిగి అమ్ముడుపోవడంపై స్పందించిన తీరు వైరల్గా మారింది.కాగా దేశవాళీ క్రికెట్లో రన్ మెషీన్గా గుర్తింపు పొందినా కూడా భారత టెస్టు జట్టుకు కూడా దూరమయ్యాడు సర్ఫరాజ్ ఖాన్. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం జరుగుతున్న ముస్తాక్ అలీ ట్రోఫీలో అతడు భాగమయ్యాడు. ఇక ఇప్పటికి.. సర్ఫరాజ్ 7 ఇన్నింగ్స్లలో కలిపి ఏకంగా 203.08 స్ట్రయిక్రేట్తో 329 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అయితే, ఐపీఎల్ వేలంలో ముందుగా రూ.75 లక్షల కనీస ధరకు అతడిని ఎవరూ తీసుకోలేదు. మళ్లీ అతడి పేరు వచ్చినప్పుడు ఇదే మొత్తానికి చెన్నై ఎంచుకుంది. కాగా సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటి వరకు ఐపీఎల్లో యాభై మ్యాచ్లు ఆడి.. 585 పరుగులు సాధించాడు. ఇందులో ఓ అర్ధ శతకం ఉంది. మరోవైపు.. సర్ఫరాజ్ మిత్రుడు పృథ్వీ షాను కూడా ఢిల్లీ తీసుకోవడం విశేషం. అతడిని ఢిల్లీ కనీస ధర రూ. 75 లక్షలకే కొనుక్కుంది.అమ్ముడుపోని స్టార్లు వీరేఐపీఎల్లో గతంలో ఆడిన లేదా అంతర్జాతీయ క్రికెట్లో గుర్తింపు ఉన్న పలువురు ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు. ఈ జాబితాలో ఉన్న ప్రముఖ విదేశీ క్రికెటర్లలో డెవాన్ కాన్వే, జేక్ ఫ్రేజర్, గస్ అట్కిన్సన్, జేమీ స్మిత్, గెరాల్డ్ కొయెట్జీ, ముజీబుర్ రహమాన్, మహీశ్ తీక్షణ, స్టీవ్ స్మిత్, డారిల్ మిచెల్, షాయీ హోప్... టామ్ కరన్, అల్జారీ జోసెఫ్, నవీన్ ఉల్ హక్, రహ్మనుల్లా గుర్బాజ్, వియాన్ ముల్డర్, జానీ బెయిర్స్టో, ఫజల్హఖ్ తదితరులు ఉన్నారు. భారత క్రికెటర్లలో ఉమేశ్ యాదవ్, దీపక్ హుడా, మయాంక్ అగర్వాల్, కరణ్ శర్మ, మనన్ వోహ్రాను ఎవరూ పట్టించుకోలేదు. Sarfaraz Khan’s emotional Instagram story after being sold for ₹75 lakh to Chennai Super Kings in the auction for IPL 2026.🥹❤️This shows that if you work hard, you will definitely get the reward for it. God never disappoints those who work hard. pic.twitter.com/X3Z81AmB0g— Mention Cricket (@MentionCricket) December 16, 2025 -
నాలుగో టీ20 నుంచి గిల్ అవుట్!
భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్కు పొగమంచు అంతరాయం కలిగించింది. ఫలితంగా ఇరుజట్ల మధ్య నాలుగో టీ20కి టాస్ ఆలస్యంగా పడనుంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్కు టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ దూరమైనట్లు సమాచారం.పేలవ ప్రదర్శనకాగా ఆసియా టీ20 కప్-2025 టోర్నమెంట్ సందర్భంగా భారత టీ20 జట్టులో పునరాగమనం చేసిన గిల్.. నాటి నుంచి ఓపెనర్గా పేలవ ప్రదర్శనలతో తేలిపోతున్నాడు. అంతకు ముందు కూడా అంత గొప్పగా ఏమీ ఆడలేదు. గత ఇరవై ఇన్నింగ్స్లో అతడు సాధించిన స్కోర్లు వరుసగా.. 20(9), 10(7), 5(8), 47(28), 29(19), 4(3), 12(10), 37*(20), 5(10), 15(12), 46(40), 29(16), 4(2), 0(1).తాజాగా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లో తొలి రెండు మ్యాచ్లలో తీవ్రంగా నిరాశపరిచిన గిల్ (4(2), 0(1)).. చివరగా ధర్మశాలలో ఫర్వాలేదనిపించాడు. ఓపెనర్గా వచ్చి 28 బంతుల్లో 28 పరుగులు చేసి.. మార్కో యాన్సెన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. కాగా గిల్ కోసం.... విజయవంతమైన ఓపెనింగ్ జోడీగా కొనసాగుతున్న అభిషేక్ శర్మ- సంజూ శాంసన్లను యాజమాన్యం విడదీసింది.సంజూను పక్కనపెట్టేసి మరీ..అభిషేక్ను ఓపెనర్గా కొనసాగిస్తూ అతడికి గిల్ను జతచేసి.. సంజూను పక్కనపెట్టింది. ఈ నేపథ్యంలో గిల్ వరుస వైఫల్యాలు, అయినా అతడినే కొనసాగిస్తున్న మేనేజ్మెంట్ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా నాలుగో టీ20కి మాత్రం గిల్ దూరమైనట్లు క్రిక్బజ్ వెల్లడించింది. అయితే, పాదానికి గాయమైన కారణంగానే అతడు తప్పుకొన్నట్లు పేర్కొంది.కాగా స్వదేశంలో సౌతాఫ్రికాతో తొలి టెస్టు సందర్భంగా గాయపడ్డ గిల్.. రెండో టెస్టుతో పాటు మూడు వన్డేల సిరీస్కూ దూరమయ్యాడు. టీ20 సిరీస్తో రీఎంట్రీ ఇచ్చిన అతడు మరోసారి గాయపడటం గమనార్హం. ఇక టీమిండియా టెస్టు, వన్డేలకు గిల్ కెప్టెన్ కాగా.. టీ20లలో సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.చదవండి: నంబర్ 1: చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి -
IND vs SA: టాస్ పడలేదు.. మ్యాచ్ రద్దు
టీమిండియా- సౌతాఫ్రికా మధ్య నాలుగో టీ20లో టాస్ పడకుండానే మ్యాచ్ ముగిసిపోయింది. లక్నోలో పొగమంచు అధికంగా ఉన్న నేపథ్యంలో అంపైర్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం.. సాయంత్రం 6.30 నిమిషాలకు టాస్ వేయాల్సి ఉండగా పొగమంచు కమ్ముకుంది. దీంతో 6.50 నిమిషాలకు మరోసారి పరిస్థితిని సమీక్షించగా ఎలాంటి మార్పూ లేదు. దీంతో 7.30 నిమిషాలకు మరోసారి రివ్యూ చేయగా.. అభిమానులకు మరోసారి నిరాశే మిగిలింది. రాత్రి 8 గంటలకు మరోసారి పరిస్థితిని పర్యవేక్షించి అందుకు అనుగుణంగా అంపైర్లు మ్యాచ్ నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామన్నారు.వీడిన సస్పెన్స్ఈసారి అంపైర్లు మైదానం కలియదిరుగుతూ పొగమంచు ప్రభావం ఎలా ఉందో గమనించారు. బ్యాటర్, బౌలర్, ఫీల్డర్ల పొజిషన్ల నుంచి బంతి స్పష్టంగా కనబడుతుందా? లేదా? అన్న విషయాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో చర్చల అనంతరం 8.30 నిమిషాలకు మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అప్పుడూ అంపైర్లు ఓ నిర్ణయానికి రాలేకపోయారు. దీంతో 9 గంటలకు మరోసారి రివ్యూ జరుగగా.. ఈసారీ స్పష్టత రాలేదు. 9.25 నిమిషాలకు మరోసారి పరిస్థితిని పర్యవేక్షించిన అంపైర్లు మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించి సస్పెన్స్కు తెరదించారు.రీప్లేస్మెంట్గా షాబాజ్ అహ్మద్కాగా ఈ మ్యాచ్కు ముందు ఆల్రౌండర్ అక్షర్ పటేల్ టీమిండియాకు దూరమయ్యాడు. అనారోగ్యం కారణంగా మిగిలిన రెండు టీ20ల నుంచి అతడు తప్పుకోగా.. బీసీసీఐ షాబాజ్ అహ్మద్ను రీప్లేస్మెంట్గా ప్రకటించింది. అదే విధంగా వ్యక్తిగత కారణాలతో మూడో టీ20కి దూరమైన పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా తిరిగి వచ్చాడు. నాలుగో టీ20లో అతడు బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు.ఇదిలా ఉంటే.. ఐదు టీ20 సిరీస్ల భాగంగా కటక్లో తొలి మ్యాచ్లో భారత్ 101 పరుగులతో గెలవగా.. ముల్లన్పూర్లో సౌతాఫ్రికా 51 పరుగులతో గెలిచింది. తద్వారా 1-1తో సిరీస్ సమం చేసింది. అయితే, ధర్మశాలలో మరోసారి జయభేరి మోగించిన టీమిండియా 2-1తో ఆధిక్యంలోకి దూసుకువచ్చింది. లక్నో వేదికగా బుధవారం నాటి మ్యాచ్లోనూ గెలిచి.. మరో టీ20 మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని సూర్య సేన పట్టుదలగా ఉంది. అంతకు ముందు టెస్టుల్లో సఫారీలు టీమిండియాను 2-0తో వైట్వాష్ చేయగా.. వన్డే సిరీస్ను భారత్ 2-1తో గెలుచుకుంది.చదవండి: నంబర్ 1: చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి -
నంబర్ 1: చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి
టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీ20 ర్యాంకింగ్స్లో అత్యుత్తమ రేటింగ్ సాధించిన భారత బౌలర్గా నిలిచాడు. ఈ క్రమంలో పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) పేరిట ఉన్న రికార్డును వరుణ్ చక్రవర్తి బద్దలు కొట్టాడు.అత్యుత్తమంగా 32 వికెట్లుకాగా 2021 టీ20 ప్రపంచకప్ టోర్నీలో పేలవ ప్రదర్శన తర్వాత వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) టీమిండియాకు దూరమయ్యాడు. అయితే, ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన కనబరిచి రీఎంట్రీ ఇచ్చిన ఈ రైటార్మ్ స్పిన్నర్.. అసాధారణ ప్రతిభతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికి 19 టీ20 మ్యాచ్లలో కలిపి వరుణ్ చక్రవర్తి అత్యుత్తమంగా 32 వికెట్లు కూల్చాడు.సౌతాఫ్రికాతో స్వదేశంలో తాజా టీ20 సిరీస్లోనూ వరుణ్ చక్రవర్తి అదరగొడుతున్నాడు. ఇప్పటికి సఫారీలతో జరిగిన మూడు మ్యాచ్లలో రెండేసి వికెట్ల చొప్పున ఆరు వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో ఓవరాల్గా 6.75 ఎకానమీతో వికెట్లు తీసిన వరుణ్.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్లోనూ దుమ్ములేపాడు.818 రేటింగ్ పాయింట్లుటీ20 బౌలర్ల ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న వరుణ్ చక్రవర్తి.. రేటింగ్ను భారీగా మెరుగుపరచుకున్నాడు. కెరీర్లోనే అత్యుత్తమంగా ఏకంగా 818 రేటింగ్ పాయింట్లు సాధించి.. రెండో ర్యాంకర్ జేకబ్ డఫీ (699 పాయింట్లు)కి అందనంత దూరంలో నిలిచాడు.అదే విధంగా.. అంతర్జాతీయ టీ20లలో అత్యుత్తమ రేటింగ్ సాధించిన భారత బౌలర్గానూ వరుణ్ చక్రవర్తి నిలిచాడు. అంతకుముందు.. 2017లో బుమ్రా కెరీర్ బెస్ట్ 783 రేటింగ్ పాయింట్లతో ఈ ఘనత సాధించగా.. వరుణ్ ఇప్పుడు దానిని అధిగమించాడు.అంతేకాదు.. అత్యుత్తమ టీ20 రేటింగ్ పాయింట్లు కలిగి ఉన్న టాప్-10 ఓవరాల్ బౌలర్ల జాబితాలోనూ చోటు సంపాదించాడు. కాగా ఈ ఏడాది సెప్టెంబరులో వరుణ్ తొలిసారి టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్లో అగ్రస్థానం పొందిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ టాప్ ర్యాంకు నిలబెట్టుకోగా.. తిలక్ వర్మ రెండు స్థానాలు ఎగబాకి.. నాలుగో ర్యాంకులో నిలిచాడు.పురుషుల అంతర్జాతీయ టీ20లలో బెస్ట్ బౌలర్ రేటింగ్స్👉ఉమర్ గుల్ (పాకిస్తాన్)- 865👉శామ్యూల్ బద్రీ (వెస్టిండీస్-) 864👉డేనియల్ వెటోరి (న్యూజిలాండ్)- 858👉సునీల్ నరైన్ (వెస్టిండీస్)- 832👉రషీద్ ఖాన్ (అఫ్గనిస్తాన్)- 828👉తబ్రేజ్ షంసీ (దక్షిణాఫ్రికా)- 827👉షాహిద్ అఫ్రిది (పాకిస్థాన్)- 822👉వరుణ్ చక్రవర్తి (ఇండియా)- 818👉షాదాబ్ ఖాన్ (పాకిస్తాన్)- 811👉వనిందు హసరంగా (శ్రీలంక)- 809.చదవండి: IPL 2026: కనక వర్షం.. ‘మినీ’ వేలంలో ఎవరికి ఎంత? పది జట్ల వివరాలు -
ఒకప్పుడు ‘డాడీస్ ఆర్మీ’.. ఇప్పుడు కుర్రాళ్లకు కోట్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తీసుకున్న నిర్ణయాలు సంచలనాత్మకంగా మారాయి. క్యాష్ రిచ్ లీగ్లో అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు పొందిన చెన్నై ఈసారి మినీ వేలంలో ఓ రకంగా ప్రకంపనలు సృష్టించింది. సాధారణంగా అనుభవానికి పెద్దపీట వేసే సీఎస్కే ... ఈసారి మాత్రం భవిష్యత్తుపై భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టింది.ఐపీఎల్ చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా... అన్క్యాప్డ్ ఆటగాళ్ల కోసం చెన్నై ఫ్రాంచైజీ కోట్ల రూపాయలను మంచి నీళ్ల ప్రాయంలా ఖర్చు పెట్టింది. ఒకప్పుడు ‘డాడీస్ ఆర్మీ’గా ముద్రపడ్డ చెన్నై సూపర్ కింగ్స్... ఐపీఎల్ వేలంలో ప్రశాంత్ వీర్ (Prashant Veer), కార్తీక్ శర్మను రూ. 14.20 కోట్ల చొప్పున వెచ్చించి కొనుగోలు చేసుకుంది.రంజీ ట్రోఫీ, ముస్తాక్ అలీ టోర్నీ, భారత్ ‘ఎ’, అండర్–19, అండర్–23 ఇలా ఏ స్థాయిలోనూ పెద్దగా ఆకట్టుకోకపోయినా... కేవలం నైపుణ్యాన్ని నమ్మి యువ ఆటగాళ్ల కోసం భారీగా వెచ్చిచండం విశేషం. ప్రతిభకు పెద్ద పీట వేసే చెన్నై జట్టు ఇంత భారీ ఖర్చు పెట్టడంతో... కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్ల గురించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా వీరిద్దరి నేపథ్యాలను పరిశీలిస్తే...ధోనీకి ప్రత్యామ్నాయమా! ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరంభం నుంచి... ఏవో కొన్ని మ్యాచ్లు తప్ప... దాదాపు అన్నీ సమయాల్లో మహేంద్ర సింగ్ ధోనినే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) వికెట్ కీపర్గా దర్శనమిచ్చాడు. అయితే గత కొన్నాళ్లుగా బ్యాటింగ్ ఆర్డర్లో ఆఖర్లో వస్తున్న ధోని... ఇంకెంతో కాలం ఐపీఎల్లో కొనసాగే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో వికెట్ల వెనక సమర్థవంతంగా విధులు నిర్వర్తించడంతో పాటు... లోయర్ ఆర్డర్లో ధాటిగా షాట్లు ఆడగల ప్లేయర్ను ఎంపిక చేసుకోవాలనే ఉద్దేశంతో చెన్నై ఫ్రాంచైజీ వేలంలో అడుగు పెట్టింది.అంతకుముందే టీమిండియా ప్లేయర్ సంజూ శాంసన్(Sanju Samson)ను ట్రేడింగ్లో తీసుకున్నా... భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని యువకులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో రాజస్తాన్కు చెందిన 19 ఏళ్ల కార్తీక్ శర్మ కోసం కోట్లు కుమ్మరించింది. జడేజా స్థానాన్ని భర్తీ చేసేందుకు... ఐపీఎల్ వేలానికి ముందే ట్రేడింగ్లో రవీంద్ర జడేజాను వదిలేసుకున్న చెన్నై జట్టు అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు ఉత్తర ప్రదేశ్కు చెందిన 20 ఏళ్ల ప్రశాంత్ వీర్ను ఎంపిక చేసుకుంది. ఎడంచేతి వాటం స్పిన్నర్ అయిన ప్రశాంత్... లోయర్ ఆర్డర్లో ధాటిగా ఆడగల సమర్థుడు. ఉత్తర ప్రదేశ్ లీగ్లో మంచి ప్రదర్శనలు కనబర్చిన ప్రశాంత్... ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 2 మ్యాచ్లాడి 2 వికెట్లు తీశాడు. ఇక టి20ల్లో 9 మ్యాచ్లాడి 160కి పైగా స్ట్రయిక్ రేట్తో 112 పరుగులు చేయడంతో పాటు 12 వికెట్లు పడగొట్టాడు. ప్రాధమిక ధర రూ. 30 లక్షలతో వేలంలో అడుగపెట్టిన ప్రశాంత్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ రూ. 14.20 కోట్లు ఖర్చు చేసింది. చదవండి: IPL 2026: కనక వర్షం.. ‘మినీ’ వేలంలో ఎవరికి ఎంత? పది జట్ల వివరాలు


