Sports
-
IPL 2025: కేకేఆర్ చెత్త రికార్డులు
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మార్చి 31) వాంఖడేలో జరిగిన మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ ముంబై ఇండియన్స్ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ ఓటమితో కేకేఆర్ పలు చెత్త రికార్డులు మూటగట్టుకుంది. ఐపీఎల్లో ఓ జట్టు (ముంబై ఇండియన్స్) చేతిలో అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న జట్టుగా తమ పేరిటే ఉన్న చెత్త రికార్డును మరింత మెరుగుపర్చుకుంది. తాజా ఓటమితో ముంబై ఇండియన్స్ చేతిలో కేకేఆర్ పరాజయాల సంఖ్య 24కు చేరింది. ఐపీఎల్లో ఏ జట్టూ ఓ జట్టు చేతిలో ఇన్ని మ్యాచ్లు ఓడిపోలేదు. కేకేఆర్ తర్వాత ఈ చెత్త రికార్డు ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ పేరిట ఉంది. ఆర్సీబీ సీఎస్కే చేతిలో.. పంజాబ్ కేకేఆర్ చేతిలో తలో 21 మ్యాచ్లు ఓడిపోయాయి.ఐపీఎల్లో ఓ జట్టు చేతిలో అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న జట్లు..కేకేఆర్- 24 ముంబై ఇండియన్స్ చేతిలోఆర్సీబీ- 21 సీఎస్కే చేతిలోపంజాబ్- 21 కేకేఆర్ చేతిలోసీఎస్కే- 20 ముంబై ఇండియన్స్ చేతిలోఆర్సీబీ- 20 కేకేఆర్ చేతిలోనిన్నటి ఓటమితో కేకేఆర్ మరో చెత్త రికార్డు కూడా తమ ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్లో ఓ వేదికపై ఓ జట్టు చేతిలో అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న జట్టుగా నిలిచింది. కేకేఆర్ వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ చేతిలో అత్యధికంగా 10 పరాజయాలు ఎదుర్కొంది. ఓ వేదికపై ఓ జట్టు చేతిలో అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న జట్ల జాబితాలో పంజాబ్, ఆర్సీబీ, ఢిల్లీ కేకేఆర్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.ఐపీఎల్లో ఓ వేదికపై ఓ జట్టు చేతిలో అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న జట్లు..కేకేఆర్- 10 వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ చేతిలోపంజాబ్-9 ఈడెన్ గార్డెన్స్లో కేకేఆర్ చేతిలోఆర్సీబీ- 8 వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ చేతిలోఆర్సీబీ- 8 చిన్నస్వామి స్టేడియంలో ముంబై ఇండియన్స్ చేతిలోఆర్సీబీ- 8 చెపాక్ స్టేడియంలో సీఎస్కే చేతిలోఢిల్లీ- 8 ఈడెన్ గార్డెన్స్లో కేకేఆర్ చేతిలోమ్యాచ్ విషయానికొస్తే.. ముంబై ఇండియన్స్ చేతిలో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయం ఎదుర్కొంది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. అరంగేట్రం పేసర్ అశ్వనీ కుమార్ (3-0-24-4) చెలరేగడంతో కేకేఆర్ను 116 పరుగులకే కుప్పకూల్చింది. కేకేఆర్ను మట్టికరిపించడంలో ముంబై బౌలర్లు దీపక్ చాహర్ (2-0-19-2), బౌల్ట్ (4-0-23-1), హార్దిక్ పాండ్యా (2-0-10-1), విజ్ఞేశ్ పుతుర్ (2-0-21-1), సాంట్నర్ (3.2-0-17-1) తలో చేయి వేశారు.కేకేఆర్ ఇన్నింగ్స్లో రఘువంశీ (26) టాప్ స్కోరర్ కాగా.. రమణ్దీప్ (22), మనీశ్ పాండే (19), రింకూ సింగ్ (17), రహానే (11) రెండంకెల స్కోర్లు చేశారు. డికాక్ (1), సునీల్ నరైన్ (0), వెంకటేశ్ అయ్యర్ (3), రసెల్ (5) దారుణంగా విఫలమయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్.. ర్యాన్ రికెల్టన్ (41 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), సూర్యకుమార్ (9 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటడంతో 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. కేకేఆర్ బౌలర్లలో ఆండ్రీ రసెల్కు 2 వికెట్లు దక్కాయి. ఈ సీజన్లో రెండు వరుస పరాజయాల తర్వాత ముంబై ఇండియన్స్కు లభించిన తొలి విజయం ఇది. కేకేఆర్ విషయానికొస్తే.. ఈ జట్టుకు ఈ సీజన్లో ఇది రెండో పరాజయం. తొలి మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో ఓడిన ఈ జట్టు.. ఆతర్వాతి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై విజయం సాధించి, తాజాగా ముంబై ఇండియన్స్ చేతిలో ఓడింది. -
IPL 2025, MI VS KKR: చరిత్ర పుటల్లో సూర్యకుమార్
భారత టీ20 జట్టు కెప్టెన్, ముంబై ఇండియన్స్ విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర పుటల్లోకెక్కాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, సురేశ్ రైనా తర్వాత టీ20ల్లో 8000 పరుగులు పూర్తి చేసుకున్న ఐదో భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. నిన్న (మార్చి 31) కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అనంతరం స్కై ఈ ఘనత సాధించాడు. నిన్నటి మ్యాచ్తో కలుపుకుని సూర్య ఇప్పటివరకు టీ20ల్లో (అంతర్జాతీయ మ్యాచ్లు, దేశవాలీ, ఐపీఎల్) 8007 పరుగులు చేశాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా చలామణి అవుతున్న విరాట్ ఖాతాలో 12976 పరుగులు ఉన్నాయి.టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లువిరాట్ కోహ్లి- 12976రోహిత్ శర్మ- 11851శిఖర్ ధవన్- 9797సురేశ్ రైనా- 8654సూర్యకుమార్ యాదవ్- 8007మ్యాచ్ విషయానికొస్తే.. కేకేఆర్తో నిన్న జరిగిన మ్యాచ్లో సూర్య 9 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 27 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కేకేఆర్పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్లో రెండు వరుస పరాజయాల తర్వాత ముంబై సాధించిన తొలి విజయం ఇది. ముంబై గెలుపులో సూర్య తనవంతు పాత్ర పోషించాడు. కేకేఆర్ నిర్దేశించిన 117 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో స్కై తన సహజ శైలిలో బ్యాట్ను ఝులిపించాడు. ఈ సీజన్లో తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైన ర్యాన్ రికెల్టన్ (41 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఈ మ్యాచ్లో సత్తా చాటాడు. రోహిత్ శర్మ (12 బంతుల్లో 13) పేలవ ప్రదర్శన కొనసాగగా.. విల్ జాక్స్ (17 బంతుల్లో 16) నిరాశపరిచాడు. ముంబై 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి కేకేఆర్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించింది. కేకేఆర్ బౌలర్లలో ఆండ్రీ రసెల్కు 2 వికెట్లు దక్కాయి.అంతకుముందు అరంగేట్రం పేసర్ అశ్వనీ కుమార్ (3-0-24-4) చెలరేగడంతో కేకేఆర్ 116 పరుగులకే కుప్పకూలింది. ముంబై బౌలర్లలో దీపక్ చాహర్ (2-0-19-2), బౌల్ట్ (4-0-23-1), హార్దిక్ పాండ్యా (2-0-10-1), విజ్ఞేశ్ పుతుర్ (2-0-21-1), సాంట్నర్ (3.2-0-17-1) కూడా రాణించారు.కేకేఆర్ ఇన్నింగ్స్లో రఘువంశీ చేసిన 26 పరుగులే (16 బంతుల్లో) అత్యధికం. ఆఖర్లో రమణ్దీప్ (12 బంతుల్లో 22) బ్యాట్ ఝులిపించడంతో కేకేఆర్ అతి కష్టం మీద 100 పరుగుల మార్కును దాటింది. కేకేఆర్ ఇన్నింగ్స్లో రఘువంశీ, రమణ్దీప్తో పాటు మనీశ్ పాండే (19), రింకూ సింగ్ (17), రహానే (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. గత మ్యాచ్లో (రాజస్థాన్) ఒంటిచేత్తో కేకేఆర్ను గెలిపించిన డికాక్ ఈ మ్యాచ్లో తేలిపోయాడు. సునీల్ నరైన్ డకౌటయ్యాడు. కోట్టు పెట్టి కొన్న వెంకటేశ్ అయ్యర్ (3) తుస్సుమనిపించాడు. విధ్వంసకర వీరుడు రసెల్ (11 బంతుల్లో 5) విఫలమయ్యాడు. -
ఐపీఎల్లో నేడు (ఏప్రిల్ 1) విధ్వంసకర వీరుల సమరం.. గెలిచేది ఎవరు..?
ఐపీఎల్-2025లో ఇవాళ (ఏప్రిల్ 1) రెండు విధ్వంసకర జట్ల మధ్య పోటీ జరుగనుంది. హార్డ్ హిట్టర్లతో నిండిన లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచే జట్టును అంచనా వేయడం చాలా కష్టం. ఇరు జట్లలో సమాంతరమైన మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. సొంత మైదానంలో ఆడటం ఎల్ఎస్జీకి కాస్త అడ్వాంటేజ్ అవుతుంది. అలాగని పంజాబ్ను తక్కువ అంచనా వేయలేము. ఆ జట్టులో ఉన్న ఆటగాళ్లు చెలరేగితే ఎక్కడైనా, ఏ జట్టుపై అయినా విజయం సాధించగలరు.ఈ సీజన్లో పంజాబ్ ఇప్పటివరకు ఆడిన ఏకైక మ్యాచ్లో అద్భుత విజయం సాధించింది. గుజరాత్పై 11 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో పంజాబ్ కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చెలరేగిపోయాడు. 42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 97 పరుగులు చేసి సెంచరీ చేసే అవకాశమున్నా జట్టు ప్రయోజనాల కోసం వద్దనుకున్నాడు. ఈ మ్యాచ్లో అరంగేట్రం కుర్రాడు ప్రియాంశ్ ఆర్య (23 బంతుల్లో 47), శశాంక్ సింగ్ (16 బంతుల్లో 44 నాటౌట్) కూడా సత్తా చాటారు. మెరుపు వీరులు మ్యాక్స్వెల్ (0), స్టోయినిస్ (20) విఫలమైనా ఈ మ్యాచ్లో పంజాబ్ 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో గుజరాత్ కూడా అద్భుతంగా పోరాడింది. లక్ష్యానికి కేవలం 12 పరుగుల దూరంలో నిలిచిపోయింది. బ్యాటింగ్కు అనుకూలించే అహ్మదాబాద్ పిచ్ కావడంతో ఈ మ్యాచ్లో ఇరు జట్ల బౌలర్లు తేలిపోయారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ (4-0-36-2), స్పిన్నర్ విజయ్కుమార్ వైశాక్ (3-0-28-0) మాత్రమే పర్వాలేదనిపించారు. కీలక సమయంలో వైశాక్ అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థికి మ్యాచ్ను దూరం చేశాడు. నేడు లక్నోతో జరుగబోయే మ్యాచ్లో తొలి మ్యాచ్లో సత్తా చాటిన ఆటగాళ్లతో పాటు మ్యాక్సీ, స్టోయినిస్ కూడా రాణిస్తే పంజాబ్ను ఆపడం కష్టమవుతుంది.లక్నో విషయానికొస్తే.. ఈ జట్టు ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓ దాంట్లో ఓడి, మరో మ్యాచ్లో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో గెలవాల్సింది. అయితే ఆ మ్యాచ్లో ఢిల్లీ ఆటగాళ్లు అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్ మెరుపు ఇన్నింగ్స్లు ఆడి లక్నో నుంచి మ్యాచ్ను లాగేసుకున్నారు. ఈ మ్యాచ్లో లక్నో విధ్వంసకర బ్యాటర్లు మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరిద్దరు మెరుపు అర్ద సెంచరీలు చేసి తమ జట్టు భారీ స్కోర్కు (209) దోహదపడ్డారు. మరో డేంజర్ బ్యాటర్ కిల్లర్ మిల్లర్ కూడా ఓ మోస్తరు మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్లో భారీ అంచనాలు పెట్టుకున్న కొత్త కెప్టెన్ రిషబ్ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. మరో హార్డ్ హిట్టర్ మార్క్రమ్ కూడా సత్తా చాటలేకపోయాడు. మొహిసిన్ ఖాన్కు ప్రత్యామ్నాయ ఆటగాడిగా ఎల్ఎస్జీలో చేరిన శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో పర్వాలేదనిపించాడు. దేశీయ బౌలర్లు మణిమారన్ సిద్దార్థ్, దిగ్వేశ్ రతీ కూడా రాణించారు. సీనియర్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు.ఈ సీజన్లో తమ రెండో మ్యాచ్లో లక్నో పిచ్చ కొట్టుడు కొట్టి సన్రైజర్స్ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో తొలుత శార్దూల్ ఠాకూర్ (4-0-34-4) బంతితో చెలరేగిపోయాడు. ఆతర్వాత మార్ష్, పూరన్ విధ్వంసం సృష్టించారు. ఫలితంగా సన్రైజర్స్ సెట్ చేసిన 191 పరుగుల లక్ష్యాన్ని ఎల్ఎస్జీ 16.1 ఓవర్లలోనే ఊదేసింది. పంజాబ్తో నేడు జరుగబోయే మ్యాచ్లో పూరన్, మార్ష్ మరోసారి విజృంభిస్తే లక్నో విజయం ఖాయం. పంజాబ్తో పోలిస్తే లక్నోలో భారీ హిట్టర్ల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంది. మార్క్రమ్, పంత్, ఆయుశ్ బదోని కూడా టచ్లోకి వస్తే లక్నోకు తిరుగుండదు. గతేడాది సన్రైజర్స్ తరఫున విధ్వంసం సృష్టించిన అబ్దుల్ సమద్ ఈ సీజన్లో లక్నోతో ఉన్నాడు. శార్దూల్ కూడా లోయర్ ఆర్డర్లో మెరుపు ఇన్నింగ్స్లు ఆడగలదు.పంజాబ్, లక్నో జట్లలో భారీ హిట్టర్లు ఉండటంతో నేటి మ్యాచ్లో పరుగుల వరద ఖాయమైపోయింది. ఎవరు పైచేయి సాధిస్తారనేది చూడాలి. చరిత్ర చూస్తే ఇరు జట్ల ఇప్పటివరకు నాలుగు సార్లు ఎదురెదురుపడగా.. లక్నో 3, పంజాబ్ ఒక మ్యాచ్లో గెలిచాయి. నేటి మ్యాచ్లో లక్నోకు అనుకూలంగా ఉండే ఆనవాయితీనే కొనసాగుతుందని చెప్పలేము. పంజాబ్లో కూడా మెరుపు వీరుల సంఖ్య తక్కువ లేదు.తుది జట్లు (అంచనా)..లక్నో: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్/వికెట్కీపర్), ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, దిగ్వేశ్ రతీ, ప్రిన్స్ యాదవ్పంజాబ్: ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్కీపర్), ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్వెల్, సూర్యాంశ్ షెడ్జ్, లాకీ ఫెర్గూసన్/అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ -
MI VS KKR: అతడు అద్భుతం.. క్రెడిట్ వాళ్లకే.. రసెల్ వికెట్ కీలకం: హార్దిక్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. నిన్న (మార్చి 31) సొంత మైదానంలో కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి రెండు మ్యాచ్ల్లో సీఎస్కే, గుజరాత్ చేతుల్లో ఘోరంగా ఓడిన ఎంఐ.. కేకేఆర్తో మ్యాచ్లో అనూహ్యంగా పుంజుకుని సంతృప్తి పొందే విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముంబై గెలుపులో అరంగేట్రం పేసర్ అశ్వనీ కుమార్ కీలకపాత్ర పోషించాడు. అశ్వనీ 3 ఓవర్లలో 24 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అశ్వనీతో పాటు దీపక్ చాహర్ (2-0-19-2), బౌల్ట్ (4-0-23-1), హార్దిక్ పాండ్యా (2-0-10-1), విజ్ఞేశ్ పుతుర్ (2-0-21-1), సాంట్నర్ (3.2-0-17-1) కూడా రాణించడంతో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ముంబై కేకేఆర్ను 116 పరుగులకే కుప్పకూల్చింది.కేకేఆర్ ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా రాణించలేకపోయారు. రఘువంశీ చేసిన 26 పరుగులే (16 బంతుల్లో) అత్యధికం. ఆఖర్లో రమణ్దీప్ (12 బంతుల్లో 22) బ్యాట్ ఝులిపించడంతో కేకేఆర్ అతి కష్టం మీద 100 పరుగుల మార్కును దాటింది. కేకేఆర్ ఇన్నింగ్స్లో రఘువంశీ, రమణ్దీప్తో పాటు మనీశ్ పాండే (19), రింకూ సింగ్ (17), రహానే (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. గత మ్యాచ్లో (రాజస్థాన్) సత్తా చాటిన డికాక్ ఈ మ్యాచ్లో తేలిపోయాడు. సునీల్ నరైన్ డకౌటయ్యాడు. కోట్టు పెట్టి కొన్న వెంకటేశ్ అయ్యర్ (3) తుస్సుమనిపించాడు. విధ్వంసకర వీరుడు రసెల్ (11 బంతుల్లో 5) విఫలమయ్యాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఆడుతూపాడుతూ విజయం సాధించింది. తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైన ర్యాన్ రికెల్టన్ (41 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఈ మ్యాచ్లో సత్తా చాటాడు. సూర్యకుమార్ (9 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) తన సహజ శైలిలో విధ్వంసం సృష్టించాడు. రోహిత్ శర్మ (12 బంతుల్లో 13) పేలవ ప్రదర్శన కొనసాగగా.. విల్ జాక్స్ (17 బంతుల్లో 16) నిరాశపరిచాడు. ముంబై 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కేకేఆర్ బౌలర్లలో ఆండ్రీ రసెల్కు 2 వికెట్లు దక్కాయి.మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఈ గెలుపు సంతృప్తికరంగా ఉంది. హోం గ్రౌండ్లో గెలవడం మరింత ప్రత్యేకం. సమిష్టిగా రాణించాం. ప్రతి ఒక్కరు గెలుపులో భాగమయ్యారు. వికెట్ మేము ఊహించిన దానికంటే ఎక్కువగానే మాకు అనుకూలించింది. అశ్వనీ కూమార్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పిచ్ను పరిశీలించాక అశ్వనీ తన సహజ శైలిలో బౌలింగ్ చేసినా సత్ఫలితాలు వస్తాయని అనుకున్నాము. అదే జరిగింది. అశ్వనీ లాంటి ఆణిముత్యాన్ని వెలికి తీసినందుకు మా స్కౌట్స్ను అభినంధించాలి. ముంబై ఇండియన్స్ స్కౌట్స్ దేశం నలుమూలలా తిరిగి విజ్ఞేశ్ పుతుర్, అశ్వనీ కుమార్ లాంటి టాలెంటెడ్ కిడ్స్ను ఎంపిక చేశారు. ప్రాక్టీస్ సమయంలోనే అశ్వనీలోని టాలెంట్ను గమనించాము. అతని బౌలింగ్లో ప్రత్యేకమైన లేట్ స్వింగ్ ఉంది. పైగా అతను లెఫ్ట్ హ్యాండర్. అశ్వనీ తీసిన రసెల్ వికెట్ చాలా కీలకం. అతడు డికాక్ క్యాచ్ను అందుకున్న తీరు కూడా అద్భుతం. ఓ ఫాస్ట్ బౌలర్ అంత ఎత్తుకు ఎగిరి క్యాచ్ పట్టడం ఆషామాషీ కాదు. ముందు చెప్పినట్లు, సమిష్టిగా రాణించడం శుభసూచకం. -
MI VS KKR: సమిష్టి వైఫల్యం.. రహానే ఆవేదన
డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన కేకేఆర్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో స్థాయికి తగ్గట్టుగా ఆడటం లేదు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండింట ఓటమిపాలైంది. తొలి మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో చావుదెబ్బ తిన్న ఆ జట్టు.. ఆతర్వాతి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై ఏకపక్ష విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. తాజాగా నిన్న (మార్చి 31) ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొని సీజన్లో రెండో ఓటమిని మూటగట్టుకుంది.ఈ మ్యాచ్లో కేకేఆర్ బ్యాటింగ్లో ఘోరంగా విఫలమైంది. ముంబై ఇండియన్స్ అరంగేట్రం పేసర్ అశ్వనీ కుమార్ (3-0-24-4) ధాటికి 116 పరుగులకే కుప్పకూలింది. కేకేఆర్ ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా రాణించలేదు. అంగ్క్రిష్ రఘువంశీ చేసిన 26 పరుగులే అత్యధికం. ఆఖర్లో రమణ్దీప్ సింగ్ (12 బంతుల్లో 22; ఫోర్, 2 సిక్సర్లు) బ్యాట్ ఝులిపించకపోయుంటే 100 పరుగులు కూడా వచ్చేవి కాదు. రఘువంశీ, రమణ్దీప్తో పాటు మనీశ్ పాండే (19), రింకూ సింగ్ (17), రహానే (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. డికాక్ (1), నరైన్ (0), వెంకటేశ్ అయ్యర్ (3), ఆండ్రీ రసెల్ (5) దారుణంగా విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో అశ్వనీ కుమార్తో పాటు దీపక్ చాహర్ (2-0-19-2), బౌల్ట్ (4-0-23-1), హార్దిక్ పాండ్యా (2-0-10-1), విజ్ఞేశ్ పుతుర్ (2-0-21-1), సాంట్నర్ (3.2-0-17-1) కూడా సత్తా చాటారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనుకు దిగిన ముంబై ఇండియన్స్ సునాయాసంగా విజయం సాధించింది. తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైన ర్యాన్ రికెల్టన్ (41 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఈ మ్యాచ్లో సత్తా చాటాడు. సూర్యకుమార్ (9 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) తన సహజ శైలిలో విధ్వంసం సృష్టించాడు. రోహిత్ శర్మ (12 బంతుల్లో 13) పేలవ ప్రదర్శన కొనసాగగా.. విల్ జాక్స్ (17 బంతుల్లో 16) నిరాశపరిచాడు. మొత్తంగా ముంబై 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కేకేఆర్ బౌలర్లలో ఆండ్రీ రసెల్కు 2 వికెట్లు దక్కాయి.మ్యాచ్ అనంతరం లూజింగ్ కెప్టెన్ అజింక్య రహానే ఇలా అన్నాడు. సమిష్టిగా బ్యాటింగ్లో విఫలమయ్యాం. టాస్లో చెప్పినట్లుగానే ఈ వికెట్ బ్యాటింగ్ చేయడానికి బాగుంది. 180-190 పరుగులు చేసుంటే మంచి స్కోర్ అయ్యుండేది. వికెట్పై మంచి బౌన్స్ కూడా ఉంది. కొన్నిసార్లు బౌన్స్ను, పేస్ను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఈ ఆట నుండి చాలా వేగంగా నేర్చుకోవాలి. బంతితో కూడా పెద్దగా రాణించలేకపోయాము. బౌలర్లు శక్తి మేరకు ప్రయత్నించారు కానీ, బోర్డుపై ఓ మోస్తరు స్కోరైనా లేదు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాము. పవర్ప్లేలో నాలుగు వికెట్లు కోల్పోయాక కోలుకోవడం కష్టం. మంచి భాగస్వామ్యాలు కొనసాగుండాల్సింది. చివరి వరకు ఓ బ్యాటర్ క్రీజ్లో ఉండటం అవసరం. -
IPL 2025: రూ. 23.75 కోట్లు దండగ.. ఇంత దానికి కెప్టెన్సీ కూడా కావాలట..!
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా నిన్న (మార్చి 31) కేకేఆర్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్లో ముంబైకి ఇది తొలి విజయం. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ అరంగేట్రం పేసర్ అశ్వనీ కుమార్ అద్భుత ప్రదర్శన చేశాడు. 3 ఓవర్లలో 24 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు. అశ్వనీ విజృంభణకు తోడు దీపక్ చాహర్ (2-0-19-2), బౌల్ట్ (4-0-23-1), హార్దిక్ పాండ్యా (2-0-10-1), విజ్ఞేశ్ పుతుర్ (2-0-21-1), సాంట్నర్ (3.2-0-17-1) కూడా రాణించడంతో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ముంబై కేకేఆర్ను 116 పరుగులకే కుప్పకూల్చింది. కేకేఆర్ బ్యాటర్లు అశ్వనీ కుమార్ సహా మిగతా ముంబై బౌలర్లను ఎదుర్కొనేందుకు ఆపసోపాలు పడ్డారు. ఆ జట్టు ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. రఘువంశీ చేసిన 26 పరుగులే (16 బంతుల్లో) అత్యధికం. ఆఖర్లో రమణ్దీప్ (12 బంతుల్లో 22) బ్యాట్ ఝులిపించడంతో కేకేఆర్ అతి కష్టం మీద 100 పరుగుల మార్కును దాటింది. కేకేఆర్ ఇన్నింగ్స్లో రఘువంశీ, రమణ్దీప్తో పాటు మనీశ్ పాండే (19), రింకూ సింగ్ (17), రహానే (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. గత మ్యాచ్లో (రాజస్థాన్) సత్తా చాటిన డికాక్ ఈ మ్యాచ్లో తేలిపోయాడు. సునీల్ నరైన్ డకౌటయ్యాడు. కోట్టు పెట్టి కొన్న వెంకటేశ్ అయ్యర్ (3) తుస్సుమనిపించాడు. విధ్వంసకర వీరుడు రసెల్ (11 బంతుల్లో 5) విఫలమయ్యాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. ఆడుతూపాడుతూ విజయం సాధించింది. తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైన ర్యాన్ రికెల్టన్ (41 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఈ మ్యాచ్లో సత్తా చాటాడు. సూర్యకుమార్ (9 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) తన సహజ శైలిలో విధ్వంసం సృష్టించాడు. రోహిత్ శర్మ (12 బంతుల్లో 13) పేలవ ప్రదర్శన కొనసాగగా.. విల్ జాక్స్ (17 బంతుల్లో 16) నిరాశపరిచాడు. ముంబై 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కేకేఆర్ బౌలర్లలో ఆండ్రీ రసెల్కు 2 వికెట్లు దక్కాయి.కాగా, ఈ మ్యాచ్లో ఘోరంగా విఫలమైన కేకేఆర్ బ్యాటర్లపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. రూ. 23.75 కోట్ల భారీ మొత్తం పెట్టి కొన్న వైస్ కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్ను కేకేఆర్ అభిమానులే టార్గెట్ చేస్తున్నారు. ఫ్రాంచైజీ నమ్మకాన్ని వమ్ము చేశాడని కామెంట్లు చేస్తున్నారు. భారీ మొత్తం పెట్టి కొనుగోలు చేయడంతో వైస్ కెప్టెన్సీ అప్పగిస్తే ఇదేనా నువ్వు చేసేదంటూ మండిపడుతున్నారు. ఈ మ్యాచ్లో9 బంతులు ఎదుర్కొన్న అయ్యర్ కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్ తొలి మ్యాచ్లోనూ అయ్యర్ విఫలమయ్యాడు. ఆర్సీబీపై కేవలం 6 పరుగులు (7 బంతుల్లో) మాత్రమే చేశాడు. ఆల్రౌండర్గా పని కొనస్తాడనుకుంటే అస్సలు బౌలింగే చేయడం లేదు. పైగా ఈ సీజన్కు ముందు కెప్టెన్సీ కూడా కావాలని మారాని చేశాడు. చెత్త ప్రదర్శనలతో అయ్యర్ ప్రస్తుతం కేకేఆర్ అభిమానులకు టార్గెట్గా మారాడు. నీ కంటే కొత్తగా వచ్చిన కుర్రాళ్లు అనికేత్ వర్మ (సన్రైజర్స్), విప్రాజ్ నిగమ్ (ఢిల్లీ) చాలా మేలని కామెంట్లు చేస్తున్నారు. నీపై పెట్టిన పెట్టుబడి దండగ అని అంటున్నారు. ఇంత దానికి కెప్టెన్సీ కూడా కావాలా అని ప్రశ్నిస్తున్నారు. పనిలో పనిగా రింకూ సింగ్, ఆండ్రీ రసెల్ను కూడా ఏకి పారేస్తున్నారు. వీరిపై పెట్టిన పెట్టుబడి కూడా బూడిదలో పోసిన పన్నీరే అని అంటున్నారు. ఈ సీజన్కు ముందు రింకూను 13 కోట్లకు, రసెల్ను 12 కోట్లకు కేకేఆర్ రీటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. అయ్యర్ ఐపీఎల్ చరిత్రలోనే నాలుగో కాస్ట్లీ ప్లేయర్ అన్న విషయం కూడా తెలిసిందే. మొత్తంగా తొలి 3 మ్యాచ్ల్లో రెండింట పరాజయాలు ఎదుర్కోవడంతో కేకేఆర్ అభిమానులు డిఫెండింగ్ ఛాంపియన్స్ అని చెప్పుకునేందుకు కూడా సిగ్గు పడుతున్నారు. -
అంతర్జాతీయ స్కేటింగ్లో జెస్సీరాజ్ ప్రతిభ
దెందులూరు: ఏలూరు జిల్లా దెందులూరు మండలం జోగన్నపాలేనికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని మాత్రపు జెస్సీరాజ్ ఇంటర్నేషనల్ స్కేటింగ్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచింది. మార్చి 26 నుంచి 31 వరకు తైవాన్లో జరిగిన ఆర్టిస్టిక్ స్కేటింగ్ చాంపియన్ షిప్–2025 పోటీల్లో ఆల్రౌండ్ సత్తా చాటింది. సోలో డ్యాన్స్, కపుల్ డ్యాన్స్ విభాగాల్లో రెండు బంగారు పతకాలు, పెయిర్ స్కేటింగ్లో వెండి, ఇన్లైన్ ఫ్రీస్టైల్ విభాగంలో కాంస్య పతకం సాధించి భారతీయ జెండాను రెపరెపలాడించింది.సోమవారం తైవాన్లో జెస్సీరాజ్కు ఏషియన్ ఆర్టిస్టిక్ స్కేటింగ్ చైర్మన్ అలెక్స్ వాంగ్ చేతులమీదుగా పతకాలను అందజేశారు. ఈ సందర్భంగా జెస్సీరాజ్ను రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ నరేశ్ వర్మ, ఆర్టిస్టిక్ స్కేటింగ్ ఇండియా చైర్మన్ ఎం.ప్రదీప్ అభినందించారు. -
వెస్టిండీస్ టెస్టు జట్టు కెప్టెన్సీకి బ్రాత్వైట్ గుడ్బై
సెయింట్ జాన్స్: నాలుగేళ్ల నుంచి వెస్టిండీస్ టెస్టు జట్టుకు కెప్టెన్గా ఉన్న క్రెయిగ్ బ్రాత్వైట్ ఆ బాధ్యతల నుంచి వైదొలిగాడు. 32 ఏళ్ల బ్రాత్వైట్ 2021లో జేసన్ హోల్డర్ నుంచి పూర్తిస్థాయిలో టెస్టు పగ్గాలు అందుకున్నాడు. తాను టెస్టు ఫార్మాట్కు గుడ్బై చెప్పేలోపు విండీస్ జట్టుకు నిలదొక్కుకున్న కెప్టెన్ ఉండాలనే ఉద్దేశంతో బ్రాత్వైట్ ఈ నిర్ణయం తీసుకున్నాడని విండీస్ బోర్డు తెలిపింది. జూన్ నెలలో స్వదేశంలో ఆ్రస్టేలియాతో జరిగే మూడు టెస్టుల సిరీస్ కోసం విండీస్ టెస్టు జట్టుకు త్వరలోనే కొత్త కెప్టెన్ను ఎంపిక చేస్తామని విండీస్ బోర్డు ప్రకటించింది. ఇప్పటికే 98 టెస్టులు ఆడిన బ్రాత్వైట్ ఆ్రస్టేలియాతో జరిగే సిరీస్ సందర్భంగా 100 టెస్టుల మైలురాయిని అందుకోనున్నాడు. బ్రాత్వైట్ 98 టెస్టులు ఆడి 5,935 పరుగులు సాధించాడు. ఇందులో 12 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు ఉన్నాయి. బ్రాత్వైట్ సారథ్యంలో 39 టెస్టులు ఆడిన విండీస్ 10 టెస్టుల్లో గెలిచి, 22 టెస్టుల్లో ఓడిపోయి, 7 టెస్టులను ‘డ్రా’ చేసుకుంది. బ్రాత్వైట్ నాయకత్వంలోని విండీస్ జట్టు 27 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ గత ఏడాది ఆ్రస్టేలియా గడ్డపై టెస్టు విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది ఆరంభంలో బ్రాత్వైట్ సారథ్యంలో పాకిస్తాన్లో పర్యటించిన విండీస్ జట్టు 34 ఏళ్ల తర్వాత పాక్ జట్టుతో సిరీస్ను 1–1తో ‘డ్రా’ చేసుకుంది. మరోవైపు ప్రస్తుతం వెస్టిండీస్ వన్డే జట్టుకు కెప్టెన్గా ఉన్న షై హోప్ను టి20 ఫార్మాట్ నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. 2023 మే నుంచి విండీస్ టి20 జట్టుకు రావ్మన్ పావెల్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. పావెల్ స్థానంలో ఇక నుంచి టి20ల్లో విండీస్ జట్టుకు షై హోప్ కెప్టెన్గా ఉంటాడు. -
‘పటౌడీ ట్రోఫీ’కి మంగళం!
లండన్: ఇంగ్లండ్ గడ్డపై భారత్–ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే ద్వైపాక్షిక టెస్టు సిరీస్ను 2007 నుంచి మన్సూర్ అలీఖాన్ (ఎంఏకే) పటౌడీ ట్రోఫీ పేరిట నిర్వహించడం జరుగుతోంది. అయితే ‘పటౌడీ ట్రోఫీ’కి గుడ్బై చెప్పాలని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) భావిస్తోంది. ఈ ఏడాది జూన్లో ఇంగ్లండ్లో భారత్ పర్యటన నుంచి దీనిని అమలు చేయాలనే ఆలోచనలో ఈసీబీ ఉందని సమాచారం. ‘పటౌడీ ట్రోఫీ’కి మంగళం పాడేందుకు కచ్చితమైన కారణాన్ని ఈసీబీ ఇంకా వెల్లడించకపోయినా... ‘పటౌడీ’ పేరు బదులుగా రెండు దేశాల నుంచి ఇద్దరు దిగ్గజాల పేరుతో సరికొత్త ట్రోఫీ తెరపైకి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ‘పటౌడీ ట్రోఫీ’కి ముగింపు పలికే విషయంపై ఈసీబీ అధికారులు ఎలాంటి వ్యాఖ్యలు చేయడంలేదు. ‘పటౌడీ ట్రోఫీ’ మార్పు ఉండదని చెప్పడంలేదు. ఎంఏకే పటౌడీ 1961 నుంచి 1975 మధ్యకాలంలో భారత జట్టు తరఫున 46 టెస్టులు ఆడారు. ‘పటౌడీ ట్రోఫీ’కి వీడ్కోలు పలుకుతున్నామనే విషయాన్ని పటౌడీ కుటుంబసభ్యులకు ఇప్పటికే ఈసీబీ సమాచారం ఇచ్చిందని తెలిసింది. ‘కొంతకాలం తర్వాత ఆయా వ్యక్తుల పేర్లతో నిర్వహించే ట్రోఫీలకు ముగింపు పలకడం సహజం’ అని పటౌడీ కుటుంటానికి సన్నిహితులు వ్యాఖ్యానించడం గమనార్హం. క్రికెట్లో ‘ట్రోఫీ’లు రిటైర్ కావడం సహజమే. గతంలో ఇంగ్లండ్–వెస్టిండీస్ జట్ల మధ్య ‘విజ్డెన్ ట్రోఫీ’తో సిరీస్లు జరిగాయి. ఆ తర్వాత కొన్నాళ్లకు ‘విజ్డెన్ ట్రోఫీ’కి రిటైర్మెంట్ ఇచ్చేసి దాని బదులుగా రెండు జట్ల మధ్య ‘రిచర్డ్స్–బోథమ్ ట్రోఫీ’తో సిరీస్లు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయా దేశాల మధ్య నాలుగు ట్రోఫీల టెస్టు సిరీస్లు నిర్వహిస్తున్నారు. భారత్–ఆ్రస్టేలియా జట్ల మధ్య 1996 నుంచి ‘బోర్డర్–గావాస్కర్ ట్రోఫీ’... వెస్టిండీస్–ఆస్ట్రేలియా జట్ల మధ్య 1960 నుంచి ‘ఫ్రాంక్ వోరెల్ ట్రోఫీ’... ఆ్రస్టేలియా–శ్రీలంక జట్ల మధ్య 2007 నుంచి ‘వార్న్–మురళీథరన్ ట్రోఫీ’... న్యూజిలాండ్–ఇంగ్లండ్ జట్ల మధ్య 2024 నుంచి ‘క్రో–థోర్ప్ ట్రోఫీ’లను నిర్వహిస్తున్నారు. ఇంగ్లండ్ పర్యటన సమయంలో భారత్–ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ 2007 నుంచి ‘పటౌడీ ట్రోఫీ’తో జరుగుతోంది. భారత్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య టెస్టు సిరీస్ను 1951 నుంచి బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ‘ఆంథోనీ డి మెల్లో ట్రోఫీ’ పేరుతో నిర్వహిస్తున్నారు. -
పరాగ్పై రూ. 12 లక్షలు జరిమానా
గువాహాటి: రాజస్తాన్ రాయల్స్ జట్టు తాత్కాలిక కెప్టెన్ రియాన్ పరాగ్పై రూ. 12 లక్షల జరిమానా విధించారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ఆదివారం గువాహాటిలో జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ జట్టు నిరీ్ణత సమయంలో పూర్తి ఓవర్ల కోటా పూర్తి చేయడంలో విఫలమైంది. ఈ సీజన్లో తొలిసారి రాజస్తాన్ జట్టు స్లో ఓవర్ రేట్ నమోదు చేయడంతో... ఐపీఎల్ నియమావళి ప్రకారం ఆ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్పై రూ. 12 లక్షలు జరిమానా విధించారు. -
Miami Open 2025: జొకోవిచ్కు చుక్కెదురు
ఫ్లోరిడా: కెరీర్లో 100వ సింగిల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్కు నిరాశ ఎదురైంది. 2019 తర్వాత పాల్గొన్న మయామి ఓపెన్ ఏటీపీ మాస్టర్స్–1000 సిరీస్ టెన్నిస్ టోర్నీలో జొకోవిచ్ రన్నరప్గా నిలిచాడు. చెక్ రిపబ్లిక్కు చెందిన 19 ఏళ్ల జాకుబ్ మెన్సిక్ అసాధారణ ఆటతీరు కనబరిచి జొకోవిచ్కు షాక్ ఇచ్చాడు. 2 గంటల 3 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో మెన్సిక్ 7–6 (7/4), 7–6 (7/4)తో గతంలో ఆరుసార్లు మయామి ఓపెన్ చాంపియన్గా నిలిచిన జొకోవిచ్ను బోల్తా కొట్టించాడు. 6 అడుగుల 4 అంగుళాల ఎత్తు, 83 కేజీల బరువున్న మెన్సిక్ 14 ఏస్లతో అదరగొట్టాడు. ఇద్దరూ తమ సర్వీస్లను ఒక్కోసారి కోల్పోగా... టైబ్రేక్లలో మెన్సిక్ పైచేయి సాధించి తన కెరీర్లో గొప్ప విజయాన్ని అందుకున్నాడు. విజేతగా నిలిచిన మెన్సిక్కు 11,24,380 డాలర్ల (రూ. 9 కోట్ల 61 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ జొకోవిచ్కు 5,97,80 డాలర్ల (రూ. 5 కోట్ల 11 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ విజయంతో మెన్సిక్ ఏటీపీ సింగిల్స్ ర్యాంకింగ్స్లో ఏకంగా 30 స్థానాలు పురోగతి సాధించి కెరీర్ బెస్ట్ 24వ ర్యాంక్కు చేరుకున్నాడు. -
IPL 2025: ముంబై బోణీ
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్ జట్టు 18వ సీజన్లో గెలుపు బోణీ కొట్టింది. డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ జట్టుతో సోమవారం వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఎడంచేతి వాటం యువ పేస్ బౌలర్ అశ్వని కుమార్ ఐపీఎల్ అరంగేట్రం మ్యాచ్లో చిరస్మరణీయ ప్రదర్శనతో అదరగొట్టాడు. పంజాబ్కు చెందిన అశ్వని తన ప్రతిభతో ముంబై జట్టుకు ఈ సీజన్లో తొలి విజయాన్ని అందించాడు. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్కు దిగిన కోల్కతా నైట్రైడర్స్ 16.2 ఓవర్లలో కేవలం 116 పరుగులకే కుప్పకూలింది. 23 ఏళ్ల అశ్వని 3 ఓవర్లలో 24 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. కోల్కతాను తక్కువ స్కోరుకే కట్టడి చేశాడు. అనంతరం ముంబై ఇండియన్స్ జట్టు ఆద్యంతం దూకుడుగా ఆడింది. కేవలం 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్ రికెల్టన్ (41 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్స్లు) ధనాధన్ ఆటతీరుతో అజేయ అర్ధ సెంచరీ సాధించాడు. ముంబై గెలుపుతో ప్రస్తుత సీజన్లో మొత్తం 10 జట్లూ పాయింట్ల ఖాతా తెరిచినట్టయింది. ఐపీఎల్ అరంగేట్రం మ్యాచ్లోనే నాలుగు వికెట్లు పడగొట్టిన తొలి భారతీయ బౌలర్గా ఘనత వహించిన అశ్వని కుమార్కే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. తడబడుతూనే... కోల్కతాకు శుభారంభం లభించలేదు. తొలి ఓవర్లో నరైన్ (0)ను బౌల్ట్ డకౌట్ చేయగా... రెండో ఓవర్లో డికాక్ (1)ను దీపక్ చహర్ పెవిలియన్కు పంపించాడు. మూడో ఓవర్లో అశ్వని తాను వేసిన తొలి బంతికే కెప్టెన్ రహానేను అవుట్ చేశాడు. అశ్వని వేసిన వైడ్ బంతిని రహానే వేటాడి భారీ షాట్ ఆడగా... డీప్ మిడ్వికెట్ వద్ద తిలక్ వర్మ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. దాంతో కోల్కతా 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కోల్కతాను ఆదుకుంటాడని భావించి వెంకటేశ్ అయ్యర్ (3) మళ్లీ నిరాశపరచగా... క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా ఆడిన రఘువంశీ (16 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) పాండ్యా బౌలింగ్లో వెనుదిరిగాడు. దాంతో 7 ఓవర్లు ముగిసేసరికి కోల్కతా సగంజట్టు పెవిలియన్ చేరింది. ఈ దశలో ఆరో వికెట్కు 29 పరుగులు జోడించి... క్రీజులో నిలదొక్కుకున్నట్లు కనిపించిన రింకూ సింగ్ (14 బంతుల్లో 17; 1 ఫోర్, 1 సిక్స్), మనీశ్ పాండే (14 బంతుల్లో 19; 2 ఫోర్లు, 1 సిక్స్)లను అశ్వని ఒకే ఓవర్లో అవుట్ చేయడంతో కోల్కతా కోలుకోలేకపోయింది. చివరి ఆశాకిరణం రసెల్ (5)ను అశ్వని 13వ ఓవర్లో బౌల్డ్ చేయడంతో కోల్కతా స్కోరు 100 దాటుతుందా లేదా అనుమానం కలిగింది. అయితే రమణ్దీప్ సింగ్ (12 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్లు) పుణ్యమాని కోల్కతా స్కోరు వంద దాటింది. 17వ ఓవర్లో చివరి వికెట్గా రమణ్దీప్ వెనుదిరగడంతో కోల్కతా ఇన్నింగ్స్ ముగిసింది. రోహిత్ విఫలం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టుకు ఓపెనర్లు రికెల్టన్, రోహిత్ శర్మ (12 బంతుల్లో 13; 1 సిక్స్) తొలి వికెట్కు 46 పరుగులు జోడించి శుభారంభం అందించారు. అయితే ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ వరుసగా మూడో మ్యాచ్లోనూ విఫలమయ్యాడు. రోహిత్ అవుటైనా మరోవైపు రికెల్టన్ తన ధాటిని కొనసాగించడంతో ముంబైకు ఏ దశలోనూ ఇబ్బంది కాలేదు. విల్ జాక్స్ (17 బంతుల్లో 16; 1 సిక్స్)తో రికెల్టన్ రెండో వికెట్కు 45 పరుగులు జోడించాడు. జాక్స్ అవుటయ్యాక వచ్చిన సూర్యకుమార్ (9 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్లు) ధనాధన్ ఇన్నింగ్స్తో 13వ ఓవర్లోనే ముంబైను లక్ష్యానికి చేర్చాడు. స్కోరు వివరాలు కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: క్వింటన్ డికాక్ (సి) అశ్వని కుమార్ (బి) దీపక్ చహర్ 1; సునీల్ నరైన్ (బి) బౌల్ట్ 0; అజింక్య రహానే (సి) తిలక్ వర్మ (బి) అశ్వని కుమార్ 11; అంగ్క్రిష్ రఘువంశీ (సి) నమన్ ధీర్ (బి) హార్దిక్ పాండ్యా 26; వెంకటేశ్ అయ్యర్ (సి) రికెల్టన్ (బి) దీపక్ చహర్ 3; రింకూ సింగ్ (సి) నమన్ ధీర్ (బి) అశ్వని కుమార్ 17; మనీశ్ పాండే (బి) అశ్వని కుమార్ 19; ఆండ్రీ రసెల్ (బి) అశ్వని కుమార్ 5; రమణ్దీప్ సింగ్ (సి) హార్దిక్ పాండ్యా (బి) సాంట్నెర్ 22; హర్షిత్ రాణా (సి) నమన్ ధీర్ (బి) విఘ్నేశ్ 4; స్పెన్సర్ జాన్సన్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 7; మొత్తం (16.2 ఓవర్లలో ఆలౌట్) 116. వికెట్ల పతనం: 1–1, 2–2, 3–25, 4–41, 5–45, 6–74, 7–80, 8–88, 9–99, 10–116. బౌలింగ్: ట్రెంట్ బౌల్ట్ 4–0–23–1, దీపక్ చహర్ 2–0–19–2, అశ్వని కుమార్ 3–0–24–4, హార్దిక్ పాండ్యా 2–0–10–1, విఘ్నేశ్ పుథుర్ 2–0–21–1, మిచెల్ సాంట్నెర్ 3.2–0–17–1. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) హర్షిత్ రాణా (బి) రసెల్ 13; రికెల్టన్ (నాటౌట్) 62; విల్ జాక్స్ (సి) రహానే (బి) రసెల్ 16; సూర్యకుమార్ యాదవ్ (నాటౌట్) 27; ఎక్స్ట్రాలు 3; మొత్తం (12.5 ఓవర్లలో 2 వికెట్లకు) 121. వికెట్ల పతనం: 1–46, 2–91. బౌలింగ్: స్పెన్సర్ జాన్సన్ 2–0–14–0, హర్షిత్ రాణా 2–0–28–0, వరుణ్ చక్రవర్తి 3–0–12–0, రసెల్ 2.5–0–35–2, సునీల్ నరైన్ 3–0–32–0. -
వెస్టిండీస్ టీ20 కెప్టెన్గా స్టార్ ప్లేయర్.. పావెల్పై వేటు
వెస్టిండీస్ క్రికెట్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. వెస్టిండీస్ టెస్టు జట్టు కెప్టెన్సీకి క్రెయిగ్ బ్రాత్వైట్ రాజీనామా చేశాడు. ఈ విషయాన్ని విండీస్ క్రికెట్ బోర్డు సోమవారం ధ్రువీకరించింది. మార్చి 2021లో జాసన్ హోల్డర్ స్థానంలో వెస్టిండీస్ టెస్ట్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన బ్రాత్వైట్.. నాలుగేళ్ల పాటు నాయకుడిగా తన సేవలను అందించాడు."ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్కు ముందు కొత్త కెప్టెన్కు అవకాశమిచ్చేందుకు బ్రాత్వైత్ తన రాజీనామాను సమర్పించాడు. వెస్టిండీస్ క్రికెట్కు ఎన్నో అద్బుతమైన టెస్టు విజయాలను అందించింనందుకు అతడికి కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నాము. కెప్టెన్గా అతని సేవలు ఎప్పటికీ మరవలేనివి. వెస్టిండీస్ క్రికెట్ పట్ల అతని అంకితభావాన్ని మాటల్లో వర్ణించలేము" అని విండీస్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది.బ్రాత్వైట్ విండీస్కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. అతడి సారథ్యంలోనే ఆస్ట్రేలియాలో 27 ఏళ్ల తర్వాత విండీస్ తొలి టెస్టు విజయాన్ని అందుకుంది. అదేవిధంగా బ్రాత్వైట్ కెప్టెన్సీలోనే 34 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డపై టెస్టు సిరీస్ను విండీస్ సమం చేసింది. మరోవైపు టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి రోవ్మన్ పావెల్ను వెస్టిండీస్ క్రికెట్ తప్పించింది. అతడి స్ధానంలో వన్డే కెప్టెన్గా ఉన్న షాయ్ హోప్కు టీ20 పగ్గాలను కూడా విండీస్ క్రికెట్ అప్పగించింది. -
రికెల్టన్, సూర్య మెరుపులు.. బోణీ కొట్టిన ముంబై ఇండియన్స్
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. వాఖండే వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. 117 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 13 ఓవర్లలోనే చేధించింది. ముంబై బ్యాటర్లలో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్(40 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 61 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. ఆఖరిలో సూర్యకుమార్ యాదవ్(7 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 27) మ్యాచ్ను ఫినిష్ చేశాడు. రోహిత్ శర్మ(13) మరోసారి నిరాశపరిచాడు. కేకేఆర్ బౌలర్లలో రస్సెల్ ఒక్కడే రెండు వికెట్లు సాధించాడు. నాలుగేసిన అశ్వినీ..అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. ముంబై ఇండియన్స్ బౌలర్ల దాటికి కేవలం 16.2 ఓవర్లలో కేవలం 116 పరుగులకే కుప్పకూలింది. ముంబై బౌలర్లలో అరంగేట్ర పేసర్ అశ్వినీ కుమార్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. దీపక్ చాహర్ రెండు, బౌల్ట్, శాంట్నర్, హార్దిక్, విఘ్నేష్ తలా వికెట్ సాధించారు. కేకేఆర్ బ్యాటర్లలో రఘువంశీ(26) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.చదవండి: IPL 2025: ఐపీఎల్ అరంగేట్రంలోనే సరికొత్త చరిత్ర.. ఎవరీ అశ్వినీ కుమార్? -
ఐపీఎల్ అరంగేట్రంలోనే సరికొత్త చరిత్ర.. ఎవరీ అశ్వినీ కుమార్?
ముంబై ఇండియన్స్ మరో యువ సంచలానాన్ని క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసింది. ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన యువ పేస్ బౌలర్ అశ్వనీ కుమార్.. తన తొలి మ్యాచ్లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్-2025లో భాగంగా వాఖండే వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో అశ్వనీ కుమార్ నిప్పలు చేరిగాడు. తన పేస్ బౌలింగ్తో కేకేఆర్ బ్యాటర్లను చుక్కలు చూపించాడు. రహానే, రింకూ సింగ్, రస్సెల్ వంటి స్టార్ బ్యాటర్లను ఈ యువ పేసర్ బోల్తా కొట్టించాడు. తన తొలి బంతికే కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానేను ఔట్ చేసి తన డెబ్యూను ఘనంగా చాటుకున్నాడు. ఈ మ్యాచ్లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన అశ్వినీ కుమార్.. కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఎవరీ అశ్వినీ కుమార్ అని నెటిజన్లు తెగవేతికేస్తున్నారు.ఎవరీ అశ్వినీ కుమార్..?అశ్వనీ కుమార్ పంజాబ్కు చెందిన ఎడమచేతి వాటం పేసర్. 23 ఏళ్ల అశ్వనీ కుమార్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పంజాబ్కే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అతడికి అద్భుతమైన యార్కర్లు, బౌన్సర్లు వేసే సత్తా ఉంది. డెత్ బౌలింగ్లో కూడా అతడు రాణించగలడు. గతేడాది పంజాబ్ వేదికగా జరిగిన షేర్ ఈ పంజాబ్ టీ20 ట్రోఫీలో అశ్వనీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. దీంతో ముంబై ఇండియన్స్ సౌట్ల దృష్టిలో పడ్డాడు. ఈ టోర్నీలో డెత్ బౌలింగ్లో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2025 మెగా వేలంలో అశ్వని కుమార్ను ముంబై ఇండియన్స్ రూ. 30 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. గత ఏడాది ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టులో ఉన్నప్పటికీ అతనికి ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. అశ్విని కుమార్ 2022లో సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో పంజాబ్ తరపున టీ20 అరంగేట్రం చేశాడు. ఆ టోర్నీలో 4 టీ20లు ఆడి మూడు వికెట్లు పడగొట్టాడు. అశ్వనీ పంజాబ్ తరపున 2 ఫస్ట్-క్లాస్, 4 లిస్ట్-ఎ మ్యాచ్లు కూడా ఆడాడు.👉ఈ మ్యాచ్లో నాలుగు వికెట్లతో చెలరేగిన అశ్వినీ కుమార్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ డెబ్యూ మ్యాచ్ లో నాలుగు వికెట్లు పడగొట్టిన ఫస్ట్ ఇండియన్ బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. అదేవిధంగా అరంగేట్రంలో ముంబై ఇండియన్స్ తరుపన తొలి బంతికే వికెట్ తీసిన రెండో బౌలర్గా అశ్వినీ నిలిచాడు. ఈ జాబితాలో అగ్రస్ధానంలో అల్జారీ జోషఫ్ ఉన్నాడు.చదవండి: PAK vs NZ: 'వారిని బూట్లతో కొట్టాలి.. పాక్ క్రికెట్ను నాశనం చేశారు' -
కేకేఆర్ను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్..
MI vs KKR live Updates And highlights: ఐపీఎల్-2025లో వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.కేకేఆర్ను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్..ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. వాఖండే వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. 117 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 12.5 ఓవర్లలోనే చేధించింది. ముంబై బ్యాటర్లలో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్(40 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 62 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. ఆఖరిలో సూర్యకుమార్ యాదవ్(7 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 27) మ్యాచ్ను ఫినిష్ చేశాడు.దూకుడుగా ఆడుతున్న రికెల్టన్10 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది. క్రీజులో ర్యాన్ రికెల్టన్(45), విల్ జాక్స్(12) ఉన్నారు.ముంబై ఇండియన్స్ తొలి వికెట్ డౌన్..రోహిత్ శర్మ రూపంలో ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. రస్సెల్ బౌలింగ్లో ఔటయ్యాడు. 6 ఓవర్లు ముగిసే సరికి ముంబై వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. క్రీజులో రికెల్టన్(31), విల్ జాక్స్(8) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న ముంబై ఓపెనర్లుముంబై ఇండియన్స్ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. 5 ఓవర్లు ముగిసే సరికి ముంబై వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. క్రీజులో రికెల్టన్(29), రోహిత్ శర్మ(13) ఉన్నారు.2 ఓవర్లకు ముంబై స్కోర్: 15/02 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(12), రికెల్టన్(1) ఉన్నారు.116 పరుగులకే 10 వికెట్లు..16.2 ఓవర్లో శాంట్నర్ బౌలింగ్లో రమణ్ దీప్ సింగ్ వికెట్ కోల్పోయాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 117పరుగులు చేయాల్సి ఉంది. 97 పరుగులకే 9 వికెట్లు.. హర్షిత్ రాణా ఔట్97 పరుగుల వద్ద కేకేఆర్ తన తొమ్మిదవ వికెట్ను కోల్పోయింది. హర్షిత్ రాణా (4) పరుగులకే ఔటయ్యాడు. విఘ్నేష్ వేసిన 14వ ఓవర్లో పెవీలియన్ బాట పట్టాడు. 88 పరుగులకే 8 వికెట్లు.. రసెల్ ఔట్88 పరుగుల వద్ద కేకేఆర్ తన ఎనిమిదో వికెట్ ను కోల్పోయింది. రసెల్(5) ఔటయ్యాడు. అశ్వనీ కుమార్ వేసిన 13 ఓవర్ లో రసెల్ పెవిలియన్ చేరాడు. అశ్వనీ కుమార్ వేసిన ఆ ఓవర్ నాల్గో బంతికి రసెల్ బౌల్డ్ అయ్యాడు.80 పరుగులకే 7 వికెట్లు.. పీకల్లోతు కష్టాల్లో కేకేఆర్రింకూ సింగ్(17), మనీష్ పాండే(19)లు వరుసగా పెవిలియన్ చేరారు. అశ్వనీ కుమార్ వేసిన 11 ఓవర్ లో వీరిద్దరూ పెవిలియన్ చేరారు. 11 ఓవర్ మూడో బంతికి రింకూ సింగ్ అవుట్ కాగా, ఆ ఓవర్ చివరి బంతికి పాండే పెవిలియన్ చేరాడు.కష్టాల్లో కేకేఆర్.. 45 పరుగులకే 5 వికెట్లు ముంబై ఇండియన్స్ బౌలర్లు నిప్పులు చేరుగుతున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కేకేఆర్.. 45 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. రఘువంశీ(26) రూపంలో కేకేఆర్ ఐదో వికెట్ కోల్పోయింది.కేకేఆర్ మూడో వికెట్ డౌన్..ముంబై ఇండియన్స్ బౌలర్లు నిప్పులు చేరుగుతున్నారు. అజింక్య రహానే రూపంలో కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన రహానే.. అశ్వని కుమార్ బౌలింగ్లో ఔటయ్యాడు. 4 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ మూడు వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది.కేకేఆర్ రెండో వికెట్ డౌన్..క్వింటన్ డికాక్ రూపంలో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన డికాక్.. దీపక్ చాహర్ బౌలింగ్లో ఔటయ్యాడు. 3 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ 26 పరుగులు చేసింది. క్రీజులోకి రఘువన్షి(9), అజింక్య రహానే(12) ఉన్నారు.కేకేఆర్ తొలి వికెట్ డౌన్.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కేకేఆర్కు ఆదిలోనే బిగ్షాక్ తగిలింది. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో సునీల్ నరైన్.. ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. క్రీజులోకి అజింక్య రహానే వచ్చాడు.తుది జట్లుకోల్కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, అజింక్య రహానే (కెప్టెన్), రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, అశ్వనీ కుమార్, విఘ్నేష్ పుత్తూర్. -
'వారిని బూట్లతో కొట్టాలి.. పాక్ క్రికెట్ను నాశనం చేశారు'
అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్ ఓటముల పరంపర కొనసాగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో దారుణ ప్రదర్శన అనంతరం పాకిస్తాన్ జట్టు.. వైట్బాల్ సిరీస్లు ఆడేందుకు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. అక్కడ కూడా పాక్ జట్టు ఆటతీరు ఏ మాత్రం మారలేదు. తొలుత కివీస్తో జరిగిన ఐదు టీ20ల సిరీస్ను 4-1 తేడాతో కోల్పోయిన పాకిస్తాన్.. ఇప్పుడు వన్డే సిరీస్లో కూడా అదే దిశగా కొనసాగుతోంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా నేపియర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో 73 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 345 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడంలో రిజ్వాన్ సేన చతకలపడింది. లక్ష్య చేధనలో మంచి ఆరంభం లభించినప్పటికి మిడిలార్డర్ విఫలమం కావడంతో పాక్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఫిలిప్స్, కాన్వే, హెన్రి వంటి స్టార్ ప్లేయర్లు కివీస్ జట్టులో లేనప్పటికి.. పాకిస్తాన్ ఓడిపోవడాన్ని ఆ దేశ మాజీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో పాక్ జట్టుపై మాజీ క్రికెటర్ బాసిత్ అలీ విమర్శల వర్షం గుప్పించాడు. అదేవిధంగా స్టార్ క్రికెటర్ బాబర్ ఆజం బ్యాటింగ్ పొజిషన్పై కూడా అలీ కీలక వ్యాఖ్యలు చేశాడు."బాబర్ ఎందుకు మూడో స్థానంలో బ్యాటింగ్ చేయాలి?. ఛాంపియన్స్ ట్రోఫీలో అతడు ఓపెనింగ్ చేశాడు. చాలా మంది ఓపెనర్గానే బాబర్ రావాలని సూచించారు. అసలు ఎవరా క్రికెట్ ప్రొఫెసర్స్? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? వారి వాళ్లే బాబర్ ఓపెనర్గా బ్యాటింగ్కు వచ్చాడు. ఇప్పుడు మూడో స్ధానంలో వచ్చి బాబర్ ఎలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు? క్రికెట్ ప్రొఫెసర్స్ ఇప్పుడు బయటకు వచ్చి దేశానికి క్షమాపణలు చెప్పాలి. ఇప్పుడు ఎవరూ బయటకు రారు. ఇలా క్రికెట్ ప్రొఫెసర్స్ అవ్వాలనుకునేవారిని బూట్లతో కొట్టాలి. బాబర్, రిజ్వాన్లను ఓపెనర్లుగా చేసిన వారే పాకిస్తాన్ క్రికెట్ను నాశనం చేశారు. పాకిస్థాన్ జట్టు ఫ్రాంచైజీ జట్టుగా మారిపోయింది" అని అలీ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.చదవండి: IPL 2025: ఏంటి పరాగ్ బ్రో ఇది.. ఎందుకంత యాటిట్యూడ్? వీడియో వైరల్ -
SRH Vs HCA వివాదంపై సీఎం రేవంత్ సీరియస్
సాక్షి,హైదరాబాద్ : హెచ్సీఏ- సన్ రైజర్స్ హైదరాబాద్ వివాదంపై సీఎం రేవంత్రెడ్డి సీరియస్ అయ్యారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్నివేధింపులు గురి చేసి పాసులు అడిగిన విషయంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పాసుల విషయంలో బెదిరించిన అంశంపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని సూచించారు. విజిలెన్స్ డీజీ కొత్తకోట శశ్రీకాంత్కు ఆదేశాలు జారీ చేశారు.ఎస్ఆర్హెచ్ను పాసులు విషయంలో ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే పాసుల వ్యవహారంపై సీఎంఓ కార్యాలయం వివరాలు సేకరించింది. తాజా, ఇదే అంశంపై సీఎం రేవంత్ సైతం స్పందించారు. అసలేం జరిగిందంటే?ఉచిత పాస్ల విషయంలో (ఐపీఎల్ 2025) సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మధ్య గొడవలు తారా స్థాయికి చేరాయి. పాసుల కోసం హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తీవ్రంగా వేధిస్తున్నాడని సన్రైజర్స్ మేనేజ్మెంట్ సంచలన ఆరోపణలు చేసింది. ఇలా చేస్తే హైదరాబాద్ నుంచి వెళ్లిపోతామని బెదిరించింది. ఈ అంశానికి సంబంధించి సన్రైజర్స్ జనరల్ మేనేజర్ టిబి శ్రీనాథ్ హెచ్సీఏ కోశాధికారి సీజే శ్రీనివాస్ రావు ఓ ఘాటు లేఖ రాశారు.ఇలాంటి ప్రవర్తన సహించంఉచిత పాస్ల కోసం హెచ్సీఏ ఉన్నతాధికారులు, ముఖ్యంగా అధ్యక్షుడు జగన్మోహన్ రావు వేధింపులు తీవ్రమయ్యాయి. ఇలాంటి ప్రవర్తనను మేము ఏమాత్రం సహించం. ఇలాగే కొనసాగితే మేము వేదికను మార్చుకునేందుకు మేం వెనకాడం. మేము ఉప్పల్ స్టేడియంను హోం గ్రౌండ్గా ఎంచుకుని మ్యాచ్లు ఆడటం వారికి ఇష్టం లేనట్లుంది. ఇలా అయితే లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరుతున్నాం. తద్వారా ఈ విషయాన్ని బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వం, మా యాజమాన్యానికి తెలియజేయగలరు. మీకు ఇష్టం లేకపోతే మీరు కోరుకున్నట్లే హైదరాబాద్ నుంచి తరలిపోతామని సన్రైజర్స్ ప్రతినిథి హెచ్సీఏ కోశాధికారికి రాసిన ఈ-మెయిల్లో పేర్కొన్నారు. గత 12 సంవత్సరాలుగా హెచ్సీఏతో కలిసి పనిచేస్తున్నాము. గత సీజన్ నుండి మాత్రమే ఈ సమస్యలు, వేధింపులు ఎదుర్కొంటున్నాము. ముందుగా చేసుకున్న ఒప్పందంలో భాగంగా వారికి ప్రతి సీజన్లో 50 కాంప్లిమెంటరీ టికెట్లు (F12A బాక్స్) ఇస్తున్నాము. ఈ ఏడాది వారు అదనంగా మరో 20 టికెట్లు అడుతున్నారు. ఈ విషయం మా దృష్టికి వచ్చినప్పుడు పరస్పరం చర్చించి స్నేహపూర్వక పరిష్కారానికి వస్తామని వారికి తెలియజేసాము.హెచ్సీఏ ప్రతినిథులు ఓవరాక్షన్అయినా పట్టించుకోకుండా హెచ్సీఏ ప్రతినిథులు ఓవరాక్షన్ చేశారు. SRH-LSG మ్యాచ్ రోజున సీటింగ్ బాక్స్కు (F3) తాళం వేశారు. మేము అడిగిన అదనపు టికెట్లు ఇవ్వకపోతే తాళం తెరవమని బెదిరించారు. గత రెండేళ్లలో హెచ్సీఏ నుంచి మా సిబ్బందికి ఇలాంటి బెదిరింపులు చాలా వచ్చాయి. అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఈ ఏడాదే చాలాసార్లు మా వారిని బెదిరించారు. ఇది ఏమాత్రం సహించరానిది. మేము స్టేడియంకు అద్దె చెల్లిస్తున్నాము. ఐపీఎల్ సమయంలో స్టేడియం మా ఆధీనంలో ఉండాలి అని శ్రీనాథ్ తన ఈ-మెయిల్లో హైలెట్ చేశారు. కాగా, ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం) హోం గ్రౌండ్గా ఉన్న విషయం తెలిసిందే. -
ఏంటి పరాగ్ బ్రో ఇది.. ఎందుకంత యాటిట్యూడ్? వీడియో వైరల్
రాజస్తాన్ రాయల్స్ స్టాండ్-ఇన్ కెప్టెన్ రియాన్ పరాగ్ మరోసారి నెటిజన్ల అగ్రహనికి గురయ్యాడు. అతడి ప్రవర్తనపై అభిమానులు మండిపడుతున్నారు. ఎందకంత యాటిట్యూడ్ అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అసలేమి జరిగిందంటే.. ఐపీఎల్-2025లో భాగంగా ఆదివారం గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి.ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో 6 పరుగుల తేడాతో రాజస్తాన్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పరాగ్ పర్వలేదన్పించాడు. తొలుత బ్యాటింగ్లో 37 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన పరాగ్.. అనంతరం ఫీల్డింగ్లోనూ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. రాజస్తాన్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక్కడ వరకు అంతబాగానే ఉన్నా.. మ్యాచ్ అనంతరం అతడు గ్రౌండ్ స్టాప్తో ప్రవర్తించిన తీరు విమర్శలకు దారి తీసింది. మ్యాచ్ ముగిశాక బర్సాపర క్రికెట్ గ్రౌండ్ సిబ్బంది పరాగ్ వద్దకు వచ్చి వచ్చి సెల్ఫీ అడిగారు. గ్రౌండ్ స్టాఫ్ మొత్తం వచ్చి నిల్చొని పరాగ్ చేతికి ఫోన్ ఇచ్చిన తర్వాత.. వారివైపు కాస్త డిఫెరెంట్గా అతడు చూశాడు. సెల్పీ దిగిన అనంతరం వారి మొబైల్ను చేతికి ఇవ్వకుండా విసిరేసాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ మెయింటేన్ చేసినందుకు రియాన్ పరాగ్పై బీసీసీఐ రూ.12 లక్షల జరిమానా విధించింది.Attitude 🗿 Performance 🤡 pic.twitter.com/tNBZgSpRMA— Sonu (@heyysonu_) March 31, 2025 చదవండి: IPL 2025: ముంబై ఇండియన్స్కు గుడ్ న్యూస్.. ప్రాక్టీస్ మొదలు పెట్టిన బుమ్రాRIYAN PARAG - ONE OF THE BEST CATCHES IN IPL EVER 👌 pic.twitter.com/hPm6S4tOgj— Johns. (@CricCrazyJohns) March 30, 2025 -
ముంబై ఇండియన్స్కు గుడ్ న్యూస్.. ప్రాక్టీస్ మొదలు పెట్టిన బుమ్రా
ఐపీఎల్-2025లో వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్కు ఓ గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ పేసర్, టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమవుతున్నాడు. వెన్ను గాయంతో బాధపడుతున్న బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పునరావసం పొందుతున్నాడు.ఈ క్రమంలో జస్ప్రీత్ నెట్స్లో బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. తాజాగా బుమ్రా ప్రాక్టీస్కు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. దీంతో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆఖరి టెస్టులో గాయపడిన బుమ్రా.. అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉంటున్నాడు.ఈ క్రమంలోనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు బుమ్రా దూరమయ్యాడు. అయితే బుమ్రా రీ ఎంట్రీపై ఇంకా క్లారిటీ లేదు. బుమ్రా ఫిట్నెస్పై తాజాగా ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ జయవర్దనే కూడా స్పందించాడు. "బుమ్రా తన రోజూ ప్రాక్టీస్ చేస్తున్నాడు. త్వరలోనే ఆ స్పీడ్ స్టార్ కోలుకుంటాడని ఆశిస్తున్నాము. ఎప్పుడొస్తాడు అనేది మాత్రం చెప్పలేము" అని జయవర్దనే పేర్కొన్నాడు. కాగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లోని వైద్యబృందం బుమ్రాకు ఈ వారంలో ఫిట్నెస్ టెస్టు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ టెస్టును బుమ్రా క్లియర్ చేసినట్లైతే త్వరలోనే ముంబై జట్టులో బుమ్రా చేరే అవకాశముంది. బుమ్రా గతేడాది అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. టీమిండియా టీ20 వరల్డ్కప్ గెలవడంలో బుమ్రాదే కీలక పాత్ర. ఆ తర్వాత బీజీటీని భారత్ కోల్పోయినప్పటికి బుమ్రా మాత్రం 32 వికెట్లతో లీడిగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. దీంతో అతడికి 2024 ఏడాదికి గాను ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు వరించాయి. ఇక ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓటమి పాలైంది.చదవండి: RR VS CSK: చివరి ఓవర్లో ధోని ఔట్.. సీఎస్కే ఫ్యాన్ గర్ల్ రియాక్షన్ చూడండి..!Bumrah has started bowling in NCA. Don't know when he will get the clearance but feeling better after watching this clip. pic.twitter.com/FTpnuVoJoW— R A T N I S H (@LoyalSachinFan) March 30, 2025 -
IPL 2025: రాయల్స్ చేతిలో పరాజయం.. సెంచరీ కొట్టిన సీఎస్కే
ఐపీఎల్లో ఫైవ్ టైమ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ పరాజయాల సెంచరీని పూర్తి చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమితో సీఎస్కే ఈ ల్యాండ్ మార్కును తాకింది. తద్వారా ఐపీఎల్లో 100 పరాజయాలు పూర్తి చేసుకున్న ఏడో జట్టుగా నిలిచింది. సీఎస్కేకు ముందు ఢిల్లీ (134), పంజాబ్ (133), ఆర్సీబీ (128), కేకేఆర్ (118), ముంబై ఇండియన్స్ (117), రాజస్థాన్ రాయల్స్ (108) 100 పరాజయాల మార్కును తాకాయి. మధ్యలో రెండు సీజన్లు మినహా ఐపీఎల్ మొత్తంలో పాల్గొన్న సీఎస్కే ఇప్పటివరకు 242 మ్యాచ్లు ఆడి 139 విజయాలు, 100 పరాజయాలను ఎదుర్కొంది. ఐపీఎల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో సీఎస్కే రెండో స్థానంలో ఉంది. ముంబై (142) టాప్లో ఉండగా.. సీఎస్కే (139), కేకేఆర్ (131), ఆర్సీబీ (123), ఢిల్లీ (114), రాజస్థాన్ (111), పంజాబ్ (110) వరుస స్థానాల్లో ఉన్నాయి.కాగా, ఐపీఎల్-2025లో భాగంగా నిన్న (మార్చి 30) రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో సీఎస్కే 6 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. ఈ సీజన్లో తొలి మ్యాచ్ గెలిచిన ఆ జట్టుకు ఇది వరుసగా రెండో ఓటమి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్.. నితీశ్ రాణా (36 బంతుల్లో 81; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. రాయల్స్ ఇన్నింగ్స్లో నితీశ్తో పాటు శాంసన్ (16 బంతుల్లో 20; ఫోర్, సిక్స్), రియాన్ పరాగ్ (28 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), హెట్మైర్ (16 బంతుల్లో 19; ఫోర్, సిక్స్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ (4-0-28-2), పతిరణ (4-0-28-2), ఖలీల్ అహ్మద్ (4-0-38-2) అద్భుతంగా బౌలింగ్ చేశారు. జడ్డూ, అశ్విన్ తలో వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్కే.. రుతురాజ్ (44 బంతుల్లో 63; 7 ఫోర్లు, సిక్స్), జడేజా (22 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్), ధోని (11 బంతుల్లో 16; ఫోర్, సిక్స్) పోరాడినా లక్ష్యానికి 7 పరుగుల దూరంలో నిలిచిపోయింది. రాయల్స్ బౌలర్లలో హసరంగ (4-0-35-4), ఆర్చర్ (3-1-13-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. చివరి ఓవర్లో సీఎస్కే గెలుపుకు అవసరం కాగా.. సందీప్ శర్మ 13 పరుగులకే ఇచ్చి రాయల్స్కు ఈ సీజన్లో తొలి గెలుపును అందించాడు. -
RR VS CSK: చివరి ఓవర్లో ధోని ఔట్.. సీఎస్కే ఫ్యాన్ గర్ల్ రియాక్షన్ చూడండి..!
ఐపీఎల్ 2025లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో నిన్న (మార్చి 30) జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చివరి వరకు పోరాడి 6 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో సీఎస్కే 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ 176 పరుగుల వద్ద ఆగిపోయింది. ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ధోని చెన్నైని గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు.Shimron Hetmeyer took a brilliant catch in the final over to dismiss MS Dhoni and potentially save the match for Rajasthan !! 👏👏#RRvCSK #RRvsCSK pic.twitter.com/AGhS9ZM2cU— Cricketism (@MidnightMusinng) March 30, 2025చివరి ఓవర్లో 20 పరుగులు చేయాల్సి ఉండగా.. ధోని తొలి బంతికే ఔటయ్యాడు. సందీప్ శర్మ బౌలింగ్లో హెట్మైర్ బౌండరీ లైన్ వద్ద అద్బుతమైన క్యాచ్ పట్టాడు. ఇది చూసి ధోనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓ ఫ్యాన్ గర్ల్ తట్టుకోలేకపోయింది. ఎంత పని చేశావు రా అన్నట్లు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. హెట్మైర్ పక్కనే ఉంటే ఆ అభిమాని చేతిలో తన్నులు తినుండే వాడు. ఈ ఫ్యాన్ గర్ల్ రియాక్షన్ ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. దీనిపై రకరకాల మీమ్స్ వస్తున్నాయి.Reaction of a Dhoni fan when Hetmyer took his catch! Thala for a reason! 🔥 pic.twitter.com/0RmHT4kfcw— Keh Ke Peheno (@coolfunnytshirt) March 31, 2025కాగా, ధోని ఔటైన అనంతరం గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో నిశ్శబ్దం ఆవహించింది. ఈ మ్యాచ్లో ధోని సీఎస్కేను గెలిపిస్తాడని అంతా అనుకున్నారు. రాయల్స్ సైతం ధోనికి బయపడుతూనే సందీప్ శర్మకు చివరి ఓవర్ ఇచ్చింది. అప్పటికే 10 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 16 పరుగులు చేసిన ధోని మంచి టచ్లో ఉన్నట్లు కనిపించాడు. Wake up babe new meme template just dropped #CSKvsRR #Dhoni pic.twitter.com/J5jMnZKp4W— Ganeshan (@ganeshan_iyer) March 30, 2025అయితే హెట్మైర్ డీప్ మిడ్ వికెట్ వద్ద అద్భుతమైన డైవింగ్ క్యాచ్ పట్టి చెన్నై అభిమానుల ఆశలను అడియాసలు చేశాడు. ధోని ఔటైన వెంటనే సీఎస్కే ఓటమి ఖరారైపోయింది. నాలుగో బంతికి ఓవర్టన్ సిక్సర్ కొట్టినా ఎలాంటి ప్రయోజనం లేదు.ఛేదనలో సీఎస్కే ఆదిలోనే ఇన్ ఫామ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర వికెట్ కోల్పోయినా కెప్టెన్ రుతురాజ్ చక్కటి అర్ద సెంచరీతో ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. అయితే అతనికి మరో ఎండ్ నుంచి సహకారం లభించలేదు. ఆఖర్లో జడేజా (22 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) పోరాడినా ఫలితం లేదు. ఇన్నింగ్స్ మధ్యలో హసరంగ ప్రతి ఓవర్లో ఓ వికెట్ తీసి సీఎస్కేను దెబ్బకొట్టాడు. శివమ్ దూబే లాంటి భారీ హిట్టర్ కొన్ని ఓవర్ల పాటు క్రీజ్లో ఉండివుంటే ఫలితం వేరేలా ఉండేది. కానీ దూబేను రియాన్ పరాగ్ అద్బుతమైన క్యాచ్తో పెవిలియన్కు పంపాడు.అంతకుముందు నితీశ్ రాణా (36 బంతుల్లో 81; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) శివాలెత్తిపోవడంతో రాయల్స్ 182 పరుగులు చేసింది. వాస్తవానికి రాయల్స్ ఇంకా భారీ స్కోర్ చేయాల్సింది. అయితే నితీశ్ను ఔట్ చేశాక సీఎస్కే బౌలర్లు నూర్ అహ్మద్ (4-0-28-2), పతిరణ (4-0-28-2), ఖలీల్ అహ్మద్ (4-0-38-2) పరిస్థితికి అదుపులోకి తెచ్చుకున్నారు. ఈ మ్యాచ్లో ఓటమితో సీఎస్కే రన్రేట్ కూడా బాగా దెబ్బతినింది. ఈ సీజన్లో ఆ జట్టుకు మూడు మ్యాచ్ల్లో ఇది రెండో ఓటమి. తొలి మ్యాచ్లో ముంబైపై విజయం సాధించిన ఎల్లో ఆర్మీ.. ఆతర్వాత వరుసగా ఆర్సీబీ, రాయల్స్ చేతుల్లో పరాజయంపాలైంది. -
Riyan Parag: మ్యాచ్ గెలిచినా సుఖం లేదు..!
ఐపీఎల్ 2025లో భాగంగా సీఎస్కేతో నిన్న (మార్చి 30) జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్లో రెండు పరాజయాల తర్వాత (సన్రైజర్స్, కేకేఆర్) రాయల్స్ సాధించిన తొలి విజయం ఇది. సారధిగా రియాన్ పరాగ్కు కూడా ఇదే తొలి గెలుపు. కెప్టెన్గా తొలి మ్యాచ్ గెలిచిన ఆనందం రియాన్కు ఎంతో సేపు నిలబడలేదు. జట్టు స్లో ఓవర్రేట్కు బాధ్యుడిని చేస్తూ రియాన్కు 12 లక్షల జరిమానా విధించారు. ఈ సీజన్లో రాయల్స్కు ఇది తొలి స్లో ఓవర్రేట్ తప్పిదం. Pink Prevail in a sea of Yellow 🙌#RR held their nerve to record their first win of the season by 6 runs 👍Scorecard ▶️ https://t.co/V2QijpWpGO#TATAIPL | #RRvCSK | @rajasthanroyals pic.twitter.com/FeD5txyCUs— IndianPremierLeague (@IPL) March 30, 2025స్లో ఓవర్ రేట్ (నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయలేకపోవడం) అనేది ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22ని ఉల్లంఘన కిందికి వస్తుంది. గత సీజన్ వరకు ఓ సీజన్లో ఓ జట్టు మూడు సార్లు స్లో ఓవర్రేట్ తప్పిదం చేస్తే కెప్టెన్పై ఓ మ్యాచ్ నిషేధం (భారీ జరిమానాతో పాటు) విధించేవారు. అయితే ఈ రూల్ను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ సీజన్లో రద్దు చేసింది. కెప్టెన్లపై నిషేధాస్త్రాన్ని ఎత్తి వేసి కేవలం జరిమానాతో సరిపెట్టింది. గత సీజన్లో మూడు సార్లు స్లో ఓవర్రేట్ మెయింటైన్ చేసినందుకు గానూ ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ సీజన్లో ఓ మ్యాచ్ నిషేధాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ సీజన్లో కూడా హార్దిక్ తన తొలి మ్యాచ్లో స్లో ఓవర్రేట్ తప్పిదానికి బాధ్యుడయ్యాడు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ స్లో ఓవర్రేట్ మెయింటైన్ చేయడంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు 12 లక్షల జరిమానా విధించారు.కాగా, సీఎస్కేతో నిన్న జరిగిన మ్యాచ్లో రాయల్స్ చివరి ఓవర్లో విజయాన్ని ఖరారు చేసుకుంది. 183 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునేందుకు రాయల్స్ బౌలర్లు చివరి వరకు పోరాడారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నితీశ్ రాణా (36 బంతుల్లో 81; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) శివాలెత్తిపోవడంతో 182 పరుగులు చేసింది. వాస్తవానికి రాయల్స్ ఇంకా భారీ స్కోర్ చేయాల్సింది. అయితే నితీశ్ను ఔట్ చేశాక సీఎస్కే బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేసి పరిస్థితికి అదుపులోకి తెచ్చుకున్నారు. అనంతరం సీఎస్కే ఛేదనలో తడబడినా చివరి ఓవర్ వరకు గెలుపు కోసం ప్రయత్నించింది. ఆఖరి ఓవర్లో 20 పరుగులు చేయాల్సి ఉండగా.. 13 పరుగులకే పరిమితమై సీజన్లో వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. రాయల్స్ బౌలర్లలో హసరంగ (4-0-35-4), జోఫ్రా ఆర్చర్ (3-1-13-1) సీఎస్కేను దెబ్బకొట్టారు. కెప్టెన్గా తొలి విజయం సాధించిన రియాన్ ఈ మ్యాచ్లో వ్యక్తిగతంగానూ రాణించాడు. బ్యాటింగ్లో కీలకమైన ఇన్నింగ్స్ (28 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడి ఓ అద్భుతమైన క్యాచ్ (శివమ్ దూబే) అందుకున్నాడు. -
ఐపీఎల్-2025లో నేడు (మార్చి 31) బిగ్ ఫైట్.. ముంబై ఇండియన్స్ ఖాతా తెరిచేనా..?
ఐపీఎల్-2025లో ఇవాళ (మార్చి 31) బిగ్ ఫైట్ జరుగనుంది. ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ను కోల్కతా నైట్రైడర్స్ వారి సొంత మైదానం వాంఖడేలో ఢీకొట్టనుంది. ఈ సీజన్లో ఇంకా బోణీ కొట్టని ముంబై ఇండియన్స్ సొంత అభిమానుల మధ్య ఖాతా తెరవాలని పట్టుదలగా ఉంది. ఎంఐ తొలి రెండు మ్యాచ్ల్లో సీఎస్కే, గుజరాత్ చేతుల్లో పరాజయంపాలైంది. కేకేఆర్ విషయానికొస్తే.. ఈ జట్టు సీజన్ను ఓటమితో ప్రారంభించింది. తొలి మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో చిత్తైంది. రెండు మ్యాచ్లో రాజస్థాన్పై ఘన విజయం సాధించి బోణీ కొట్టింది.హెడ్ టు హెడ్ రికార్డ్స్..కేకేఆర్పై ముంబైకు ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఈ రెండు జట్లు తలపడిన 34 సందర్భాల్లో 23 సార్లు ముంబై విజయం సాధించింది. కేవలం 11 మ్యాచ్ల్లో మాత్రమే కేకేఆర్ గెలుపొందింది. అయితే ఇరు జట్లు చివరిగా తలపడిన 6 సందర్భాల్లో మాత్రం కేకేఆర్ 5 సార్లు జయకేతనం ఎగురవేసింది. చివరిగా వాంఖడేలో తలపడిన మ్యాచ్లో కూడా కేకేఆర్నే విజయం వరించింది. 12 ఏళ్ల తర్వాత కేకేఆర్ ముంబైని వారి సొంత ప్రేక్షకుల మధ్య ఓడించింది.బలాబలాల విషయానికొస్తే.. ఈ సీజన్లో ఇరు జట్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇరు జట్లలో భారీ హైప్ ఉన్న ఆటగాళ్లు ఉన్నా ఫలితం కనిపించడం లేదు. ముంబైతో పోలిస్తే కేకేఆర్ కాస్త పర్వాలేదనిపిస్తుంది. ఈ సీజన్లో ఆ జట్టు ఓ మ్యాచ్ కూడా గెలిచింది.బ్యాటింగ్నే ప్రధాన ఆయుధంగా నమ్ముకున్న ముంబై ఇండియన్స్ను ఆ జట్టు బ్యాటర్లు పూర్తిగా నిరాశపరుస్తున్నారు. రోహిత్, రికెల్టన్, సూర్యకుమార్, తిలక్ వర్మ సామర్థ్యం మేరకు రాణించలేకపోతున్నారు. బౌలింగ్లో హార్దిక్ గత మ్యాచ్లో పర్వాలేదనిపించినా బ్యాటర్గా తేలిపోయాడు. నమన్ ధీర్ గత సీజన్లో వచ్చిన హైప్ను రీచ్ కాలేదు. యువ ఆటగాడు రాబిన్ మింజ్కు అవకాశాలిస్తే రెండు మ్యాచ్ల్లో తేలిపోయాడు. బ్యాటర్గా దీపక్ చాహర్ తొలి మ్యాచ్లో పర్వాలేదనిపించాడు. బ్యాటర్గా సత్తా చాటేందుకు మిచెల్ సాంట్నర్కు సరైన అవకాశం లభించలేదు. బౌలింగ్ విషయానికొస్తే.. బౌల్ట్, సాంట్నర్ స్థాయికి తగ్గట్టు రాణించలేదు. దీపక్ చాహర్ పర్వాలేదనిస్తున్నాడు. ఆంధ్ర కుర్రాడు సత్యనారాయణ రాజు తేలిపోయాడు. తొలి మ్యాచ్లో విజ్ఞేశ్ పుతుర్ అద్భుతంగా బౌలింగ్ చేసినా రెండో మ్యాచ్లో అతన్ని ఆడించలేదు.కేకేఆర్ విషయానికొస్తే.. ఈ జట్టుకు కూడా బ్యాటింగే ప్రధాన బలం. బౌలింగ్ డిపార్ట్మెంట్లో వరుణ్ చక్రవర్తి కాస్త అనుభవజ్ఞుడిలా కనిపిస్తాడు. తొలి మ్యాచ్లో బ్యాట్తో, బంతితో సత్తా చాటిన సునీల్ నరైన్ అస్వస్థత కారణంగా రెండో మ్యాచ్ ఆడలేదు. తొలి మ్యాచ్లో అర్ద సెంచరీతో రాణించిన రహానే రెండో మ్యాచ్లో విఫలమయ్యాడు. రాయల్స్తో జరిగిన మ్యాచ్లో డికాక్ సెంచరీకి చేరువై ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు. డికాక్ ఫామ్లోకి రావడం కేకేఆర్కు శుభసూచకం. రాయల్స్తో మ్యాచ్లో నరైన్కు ప్రత్యామ్నాయంగా వచ్చిన మొయిన్ అలీ బంతితో సత్తా చాటాడు. వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్లు తమపై పెట్టిన పెట్టుబడికి న్యాయం చేయలేకపోతున్నారు. రసెల్, రమన్దీప్కు సరైన అవకాశాలు రావాల్సి ఉంది. బౌలింగ్లో స్పెన్సర్ జాన్సన్ ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. యువ పేసర్లు హర్షిత్ రాణా, వైభవ్ అరోరా పర్వాలేదనిపించారు.నేటి మ్యాచ్లో కేకేఆర్ బ్యాటర్లు రాణిస్తే ఆ జట్టుకే విజయావకాశాలు అధికంగా ఉంటాయి. అయితే ముంబైని వారి సొంత ఇలాకాలో ఓడించడం అంత ఈజీ కాదు. రోహిత్, సూర్యకుమార్ చెలరేగితే ముంబైకి పట్టపగ్గాలు ఉండవు.తుది జట్లు (అంచనా)..ముంబై: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, విఘ్నేష్ పుతుర్, సత్యనారాయణ రాజుకేకేఆర్: క్వింటన్ డి కాక్, వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, సునీల్ నరైన్, స్పెన్సర్ జాన్సన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ,అంగ్క్రిష్ రఘువంశీ -
RR VS CSK: 20 పరుగులు తక్కువ చేశామనిపించింది.. ఫీల్డింగ్తో కవర్ చేశాము: రియాన్ పరాగ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తొలి విజయం నమోదు చేసింది. సీఎస్కేపై గెలుపుతో రాయల్స్ ఖాతాను ఓపెన్ చేసింది. సొంత మైదానంలో నిన్న (మార్చి 30) జరిగిన మ్యాచ్లో రాయల్స్ 6 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసి 182 పరుగులు చేసిన ఆ జట్టు.. ఆతర్వాత లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. ఈ మ్యాచ్లో రాయల్స్కు లభించిన మెరుపు ఆరంభాన్ని బట్టి చూస్తే ఇంకా భారీ స్కోర్ చేసుండాలి. కానీ సీఎస్కే బౌలర్లు పరిస్థితులను అదుపులోకి తెచ్చుకున్నారు. నితీశ్ రాణా (36 బంతుల్లో 81; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) పవర్ ప్లేలో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. రాణా ఔటయ్యాక రాయల్స్ ఇన్నింగ్స్ ఢీలా పడింది. శాంసన్ (16 బంతుల్లో 20; ఫోర్, సిక్స్), రియాన్ పరాగ్ (28 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), హెట్మైర్ (16 బంతుల్లో 19; ఫోర్, సిక్స్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. నూర్ అహ్మద్ (4-0-28-2), పతిరణ (4-0-28-2) మరోసారి అద్భుతమైన స్పెల్స్ వేశారు. ఖలీల్ అహ్మద్ (4-0-38-2) పర్వాలేదనిపించాడు. జడ్డూ, అశ్విన్ తలో వికెట్ తీశారు. ఓవర్టన్ (2-0-30-0), అశ్విన్ (4-0-46-1) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.అనంతరం ఛేదనకు దిగిన సీఎస్కేకు ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్ ఫామ్ బ్యాటర్ రచిన్ రవీంద్రను జోఫ్రా ఆర్చర్ డకౌట్ చేశాడు. అనంతరం రుతురాజ్ (44 బంతుల్లో 63; 7 ఫోర్లు, సిక్స్) పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే అతనికి మరో ఎండ్ నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. హసరంగ (4-0-35-4) తన స్పెల్ ప్రతి ఓవర్లో వికెట్ తీసి సీఎస్కేను ఇరకాటంలో పడేశాడు. అయినా సీఎస్కేకు గెలుపు అవకాశాలు ఉండేవి. చివరి 3 ఓవర్లలో 45 పరుగులు చేయాల్సి ఉండింది. ధోని, జడ్డూ భారీ షాట్లు ఆడిన సీఎస్కే లక్ష్యానికి 7 పరుగుల దూరంలో నిలిచిపోయింది. చివరి ఓవర్లో 20 పరుగులు కాపాడుకోవాల్సిన తరుణంలో ఆర్చర్కు (3-1-13-1) బౌలింగ్ ఇవ్వకుండా సందీప్ శర్మకు బంతినప్పగించి రియాన్ పెద్ద సాహసమే చేశాడు. ఇది వర్కౌటైంది. సందీప్ 13 పరుగులు మాత్రమే ఇవ్వడంతో రాయల్స్ ఊపిరిపీల్చుకుంది.మ్యాచ్ అనంతరం రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. సమయం తీసుకున్నా ఈ గెలుపు ఆనందానిచ్చింది. తొలి రెండు మ్యాచ్లు కఠినంగా సాగాయి. 20 పరుగులు తక్కువ చేశామని భావించాము. మిడిల్ ఓవర్లలో బాగానే ఆడినప్పటికీ.. వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోర్ చేయలేకపోయాము.మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. వారు మా ప్రణాళికలను విజయవంతంగా అమలు చేశారు. తొలి మ్యాచ్లో 287 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయాము. రెండో మ్యాచ్లో 151 పరుగల టార్గెట్ను కాపాడుకోలేకపోయాము. అదృష్టవశాత్తు ఈ రోజు ఆటలో మాకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. నితీశ్తో పాటు నేను కూడా బాగానే ఆడానుకుంటున్నాను. చివరి ఓవర్ను ఆర్చర్కు కాకుండా సందీప్ శర్మకు ఇవ్వడంపై స్పందిస్తూ.. కెప్టెన్గా నాకు అనిపించి చేశాను. బ్యాటింగ్లో తక్కువ చేశామని భావిస్తున్న 20 పరుగులను ఫీల్డింగ్లో కవర్ చేశాము. ఫీల్డింగ్ కోచ్ దిశాంత్ యాగ్నిక్తో కలిసి చాలా వర్కౌట్ చేశాము. ఫలితం వచ్చింది. -
RR VS CSK: మేము చరుగ్గా లేము.. అందుకు సంతోషమే: రుతురాజ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో ఓటమి మూటగట్టుకుంది. నిన్న (మార్చి 30) రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 6 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. గౌహతిలో జరిగిన ఈ ఉత్కంఠ పోరులో రాయల్స్ కీలకమైన క్షణాలన్నిటినీ అధిగమించి విజేతగా నిలిచింది. ఈ సీజన్లో రాయల్స్కు ఇది తొలి విజయం.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. వాస్తవానికి ఈ మ్యాచ్లో రాయల్స్ ఇంకా భారీ స్కోర్ చేసుండాల్సింది. నితీశ్ రాణా (36 బంతుల్లో 81; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) రాయల్స్కు మెరుపు ఆరంభాన్ని అందించాడు. అయితే మిగతా బ్యాటర్ల నుంచి పెద్దగా సహకారం లేకపోవడంతో రాయల్స్ ఊహించిన దానికంటే 20-30 పరుగులు తక్కువ చేసింది. రాయల్స్ ఇన్నింగ్స్లో నితీశ్తో పాటు శాంసన్ (16 బంతుల్లో 20; ఫోర్, సిక్స్), రియాన్ పరాగ్ (28 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), హెట్మైర్ (16 బంతుల్లో 19; ఫోర్, సిక్స్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. నితీశ్ను ఔట్ చేశాక సీఎస్కే పరిస్థితులను తమ అదుపులోకి తెచ్చుకుంది. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లు తీసింది. నూర్ అహ్మద్ (4-0-28-2), పతిరణ (4-0-28-2) మరోసారి అద్భుతమైన స్పెల్స్ వేశారు. ఖలీల్ అహ్మద్ (4-0-38-2) పర్వాలేదనిపించాడు. జడ్డూ, అశ్విన్ తలో వికెట్ తీశారు. ఓవర్టన్ (2-0-30-0), అశ్విన్ (4-0-46-1) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్కేకు ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్ ఫామ్ బ్యాటర్ రచిన్ రవీంద్రను ఈ సీజన్లో చెత్త ఫామ్లో ఉన్న జోఫ్రా ఆర్చర్ డకౌట్ చేశాడు. అనంతరం రుతురాజ్ (44 బంతుల్లో 63; 7 ఫోర్లు, సిక్స్) పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే అతనికి మరో ఎండ్ నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. హసరంగ (4-0-35-4) తన స్పెల్ ప్రతి ఓవర్లో వికెట్ తీసి సీఎస్కేను ఇరకాటంలో పడేశాడు. సీఎస్కే గెలుపుకు చివరి 3 ఓవర్లలో 45 పరుగులు కావాల్సి ఉండింది. ధోని, జడ్డూ క్రీజ్లో ఉన్నారు. వీరిద్దరు నిలబడితే సీఎస్కే ఎలాగైనా గెలుస్తుందని అంతా అనుకున్నారు. అయితే ఇక్కడే తీక్షణ మ్యాజిక్ చేశాడు. 18వ ఓవర్లో అతను కేవలం 6 పరుగులే ఇచ్చి సీఎస్కేకు లక్ష్యాన్ని మరింత దూరం చేశాడు. 19వ ఓవర్లో తుషార్ దేశ్పాండే బౌలింగ్లో జడ్డూ, ధోని చెలరేగగా (బౌండరీ, 2 సిక్సర్లు) చివరి ఓవర్లో సీఎస్కే లక్ష్యం 20 పరుగులుగా మారింది. ఈ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన ఆర్చర్కు (3-1-13-1) చివరి ఓవర్ ఇవ్వకుండా రాయల్స్ కెప్టెన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆర్చర్కు బదులుగా సందీప్ శర్మను నమ్ముకోగా.. అతను కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు. తొలి బంతికే ధోని వికెట్ తీసి ఆతర్వాత రెండు బంతులను సింగిల్స్ మాత్రమే ఇచ్చాడు. దీంతో సీఎస్కే గెలుపుకు చివరి మూడు బంతుల్లో మూడు సిక్సర్లు అవసరమయ్యాయి. అక్కడికీ ఓవర్టన్ నాలుగో బంతికి సిక్సర్ బాది సీఎస్కే గెలుపు ఆశలను సజీవంగా ఉంచాడు. అయితే ఐదో బంతికి రెండు పరుగులే రావడంతో సీఎస్కే ఓటమి ఖరారైపోయింది. చివరి ఓవర్ను సందీప్ శర్మకు ఇవ్వడంతో టెన్షన్ పడ్డ రాయల్స్ అభిమానులు చివరికి ఊపిరి పీల్చుకున్నారు. ఎట్టకేలకు (రెండు మ్యాచ్ల తర్వాత) రియాన్ పరాగ్ కెప్టెన్గా తన తొలి విజయాన్ని నమోదు చేశాడు. ఈ గెలుపు సొంత అభిమానుల మధ్య దక్కడం అతనికి మరింత స్పెషల్.మ్యాచ్ అనంతరం లూజింగ్ కెప్టెన్ రుతురాజ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. నితీశ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. పవర్ ప్లేలో అతని ఆటతీరు అమోఘం. నితీశ్ ఎక్కువగా వెనుక భాగంలో షాట్లు ఆడుతున్నాడని తెలిసి కూడా మేము చురుగ్గా లేము. అతన్ని వికెట్కు ముందు ఆడించే ప్రయత్నం చేసుండాల్సింది. మిస్ ఫీల్డ్ల ద్వారా అదనంగా 8-10 పరుగులు సమర్పించుకున్నాము. ఫీల్డింగ్లో చాలా మెరుగుపడాలి. ఈ వికెట్పై 180 పరుగులు ఛేదించదగ్గ టార్గెటే. ఇన్నింగ్స్ బ్రేక్లో సంతోషపడ్డాను. వారు 210 పరుగులకు పైగా స్కోర్ చేస్తారని అనుకున్నాను. మా బౌలర్లు బాగా కంట్రోల్ చేశారు. జరగాల్సిన నష్టం ఆదిలోనే జరిగిపోయింది. మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడంపై స్పందిస్తూ.. గత కొన్ని సీజన్లలో రహానే 3వ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రాయుడు మిడిల్ ఓవర్ల బాధ్యత తీసుకునేవాడు. నేను కూడా మిడిల్ ఓవర్ల బాధ్యత తీసుకోవడానికి కొంచెం ఆలస్యంగా వస్తే మంచిదని భావించాము. అయితే అది వర్కౌట్ కాలేదు. మూడు మ్యాచ్ల్లోనూ ఆట ప్రారంభంలోనే బ్యాటింగ్కు దిగాల్సి వచ్చింది. వేలం సమయంలోనే నేను మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగాలని నిర్ణయించబడింది. ఈ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. దురదృష్టవశాత్తు ఈ సీజన్లో మాకు మంచి ఆరంభాలు లభించడం లేదు. ఒక్కసారి మా ఓపెనర్లిద్దరూ టచ్లోకి వస్తే పరిస్థితులు మారతాయి. ఎప్పటిలాగే నూర్ బాగా బౌలింగ్ చేశాడు. ఖలీల్, జడ్డూ కూడా సత్తా చాటారు. బౌలింగ్ విభాగంలో కొంత ఊపు అవసరం ఉంది. అందరం కలిసికట్టుగా రాణిస్తే మా జట్టుకు తిరుగుండదు. -
ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన.. షెడ్యూల్ విడుదల
ఈ ఏడాది చివర్లో భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడనుంది. 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్లు అక్టోబర్ 19న ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది హోం సమ్మర్ షెడ్యూల్ను క్రికెట్ ఆస్ట్రేలియా నిన్న (మార్చి 30) విడుదల చేసింది. ఈసారి హోం సమ్మర్లో ఆస్ట్రేలియా ప్రతి రాష్ట్రాన్ని, టెరిటరీని కవర్ చేస్తుంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ మ్యాచ్లు జరుగనున్నాయి.భారత్తో సిరీస్లకు ముందు ఆస్ట్రేలియా సౌతాఫ్రికాకు ఆతిథ్యమివ్వనుంది. సౌతాఫ్రికా.. ఆస్ట్రేలియాతో 3 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఆగస్ట్ 10న ఈ సిరీస్లు ప్రారంభం కానున్నాయి. ఈ సిరీస్లతో డార్విన్ అంతర్జాతీయ క్రికెట్ మైదానం పునఃప్రారంభం కానుంది. 17 ఏళ్ల క్రితం ఈ గ్రౌండ్లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. 2008లో ఈ మైదానం బంగ్లాదేశ్ను హోస్ట్ చేసింది. డార్విన్లో ఆస్ట్రేలియా సౌతాఫ్రికాతో తొలి రెండు టీ20లు ఆడనుంది. ఆతర్వాత మూడో టీ20, తొలి వన్డే కెయిన్స్లో జరుగనున్నాయి. చివరి రెండు వన్డేలు మెక్కేలో జరుగుతాయి.సౌతాఫ్రికాతో సిరీస్ల తర్వాత ఆసీస్ భారత్తో పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడుతుంది. ఈ రెండు సిరీస్లకు మధ్య దాదాపు రెండు నెలల గ్యాప్ ఉంది. భారత్తో సిరీస్ల అనంతరం ఆస్ట్రేలియా ఇంగ్లండ్తో యాషెస్ సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్కు సంబంధించిన షెడ్యూల్ను ఇదివరకే విడుదల చేశారు. నవంబర్ 21న తొలి యాషెస్ టెస్ట్ పెర్త్లో జరుగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న టీ20 వరల్డ్కప్ను దృష్టిలో పెట్టుకుని ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికా, భారత్లతో టీ20 సిరీస్లను ప్లాన్ చేసింది.ఆస్ట్రేలియాలో సౌతాఫ్రికా పర్యటన షెడ్యూల్..ఆగస్ట్ 10- తొలి టీ20- డార్విన్ఆగస్ట్ 12- రెండో టీ20- డార్విన్ఆగస్ట్ 16- మూడో టీ20- కెయిన్స్ఆగస్ట్ 19- తొలి వన్డే (డే అండ్ నైట్)- కెయిన్స్ఆగస్ట్ 22- రెండో వన్డే (డే అండ్ నైట్)- మెక్కేఆగస్ట్ 24- మూడో వన్డే (డే అండ్ నైట్)- మెక్కేఆస్ట్రేలియాలో భారత్ పర్యటన షెడ్యూల్..అక్టోబర్ 19- తొలి వన్డే (డే అండ్ నైట్)- పెర్త్అక్టోబర్ 23- రెండో వన్డే (డే అండ్ నైట్)- అడిలైడ్అక్టోబర్ 25- మూడో వన్డే (డే అండ్ నైట్)- సిడ్నీఅక్టోబర్ 29- తొలి టీ20- కాన్బెర్రాఅక్టోబర్ 31- రెండో టీ20- మెల్బోర్న్నవంబర్ 2- మూడో టీ20- హోబర్ట్నవంబర్ 6- నాలుగో టీ20- గోల్డ్ కోస్ట్నవంబర్ 8- ఐదో టీ20- బ్రిస్బేన్ -
‘మయామి’ క్వీన్ సబలెంకా
ఫ్లోరిడా: ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ హోదాకు తగ్గట్టు రాణించిన బెలారస్ టెన్నిస్ స్టార్ సబలెంకా తన కెరీర్లో 19వ సింగిల్స్ టైటిల్ను సాధించింది. ఆదివారం ముగిసిన మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 లెవెల్ టోరీ్నలో సబలెంకా తొలిసారి చాంపియన్గా అవతరించింది. 88 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సబలెంకా 7–5, 6–2తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ జెస్సికా పెగూలా (అమెరికా)పై గెలిచింది. విజేత సబలెంకాకు 11,24,380 డాలర్ల (రూ. 9 కోట్ల 61 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ పెగూలాకు 5,97,890 డాలర్ల (రూ. 5 కోట్ల 11 లక్షలు) ప్రైజ్మనీ 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. టైటిల్ గెలిచే క్రమంలో సబలెంకా తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం గమనార్హం. సబలెంకా సాధించిన 19 టైటిల్స్లో 17 టైటిల్స్ హార్డ్కోర్టులపై రావడం విశేషం. -
Asian Wrestling 2025: భారత రెజ్లర్లకు మూడు పతకాలు
అమ్మాన్ (జోర్డాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో చివరిరోజు ఆదివారం భారత్కు మూడు పతకాలు లభించాయి. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో దీపక్ పూనియా (92 కేజీలు), ఉదిత్ (61 కేజీలు) రజత పతకాలు నెగ్గగా... దినేశ్ (125 కేజీలు) కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్స్లో దీపక్ పూనియా 0–10 పాయింట్ల తేడాతో అమీర్హుస్సేన్ (ఇరాన్) చేతిలో... ఉదిత్ 4–6 పాయింట్ల తేడాతో టకారా సుడా (జపాన్) చేతిలో ఓడిపోయారు. కాంస్య పతక బౌట్లో దినేశ్ తుర్క్మెనిస్తాన్ రెజ్లర్ సపరోవ్ను ఓడించాడు. ఆసియా చాంపియన్షిప్ చరిత్రలో 25 ఏళ్ల దీపక్ పూనియాకిది ఐదో పతకం కావడం విశేషం. 2021, 2022లలో రజతాలు నెగ్గిన దీపక్... 2019, 2020లలో కాంస్య పతకాలు సాధించాడు. -
రాజస్తాన్ ఖాతా తెరిచింది
గువాహాటి: ఐపీఎల్ సీజన్లో వరుసగా రెండు ఓటముల నుంచి రాజస్తాన్ రాయల్స్ కోలుకుంది. తమ మూడో మ్యాచ్లో విజయంతో పాయింట్ల పట్టికలో బోణీ చేసింది. ఆదివారం చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో రాజస్తాన్ 6 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్పై విజయం సాధించింది. చెన్నైకిది వరుసగా రెండో పరాజయం. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. నితీశ్ రాణా (36 బంతుల్లో 81; 10 ఫోర్లు, 5 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, రియాన్ పరాగ్ (28 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. కెపె్టన్ రుతురాజ్ గైక్వాడ్ (44 బంతుల్లో 63; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా... రవీంద్ర జడేజా (22 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. రాణా మెరుపులు... తొలి ఓవర్లోనే యశస్వి జైస్వాల్ (4) వెనుదిరగ్గా... సంజు సామ్సన్ (16 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్), రాణా కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. ముఖ్యంగా రాణా ఏ బౌలర్నూ వదలకుండా చెలరేగిపోయాడు. ఒవర్టన్ వరుస రెండు ఓవర్లలో కలిపి 3 ఫోర్లు, సిక్స్ కొట్టాక అశ్విన్ ఓవర్లో అతను వరుసగా 6, 6, 4 బాదాడు. ఆ తర్వాత ఖలీల్ ఓవర్లోనూ 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన రాణా 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. సామ్సన్ అవుటయ్యాక కొద్దిసేపు రాణాకు పరాగ్ అండగా నిలిచాడు. అశ్విన్ ఓవర్లో మళ్లీ వరుసగా 6, 4 కొట్టాక తర్వాతి బంతికి స్టంపౌట్ కావడంతో రాణా మెరుపు ఇన్నింగ్స్ ముగిసింది. అయితే అతను అవుటయ్యాక పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. చెన్నై బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించడంతో రాయల్స్ ఆశించిన స్కోరుకు చాలా దూరంలో ఆగిపోయింది. రాణా వెనుదిరిగాక 51 బంతుల్లో 58 పరుగులు మాత్రమే చేయగలిగిన జట్టు 6 వికెట్లు చేజార్చుకుంది. పవర్ప్లేలో 79 పరుగులు చేసిన రాజస్తాన్ మిగిలిన 14 ఓవర్లలో కలిపి 103 పరుగులు మాత్రమే సాధించింది. రుతురాజ్ హాఫ్ సెంచరీ... ఛేదనలో చెన్నై మొదటి ఓవర్లోనే రచిన్ రవీంద్ర (0) వికెట్ కోల్పోగా, ఐదు బంతుల వ్యవధిలో 3 ఫోర్లు, సిక్స్ కొట్టి ధాటిని ప్రదర్శంచిన రాహుల్ త్రిపాఠి (19 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. మరోవైపు రుతురాజ్ మాత్రం కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. సందీప్ ఓవర్లో అతను 3 ఫోర్లు కొట్టాడు. పరాగ్ అద్భుత క్యాచ్కు శివమ్ దూబే (18) వెనుదిరగ్గా, విజయ్శంకర్ (9) విఫలమయ్యాడు. 37 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన రుతురాజ్ను కీలక సమయంలో హసరంగ అవుట్ చేశాడు. 25 బంతుల్లో 54 పరుగులు చేయాల్సిన స్థితిలో ధోని (11 బంతుల్లో 16; 1 ఫోర్, 1 సిక్స్) క్రీజ్లోకి వచ్చాడు. అయితే అతనూ ప్రభావం చూపలేకపోగా, మరో ఎండ్లో జడేజా కూడా జట్టును గెలిపించడంలో సఫలం కాలేకపోయాడు. ఆఖరి 2 ఓవర్లలో విజయానికి 39 పరుగులు అవసరం కాగా, చెన్నై 32 పరుగులు రాబట్టగలిగింది. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) అశ్విన్ (బి) అహ్మద్ 4; సామ్సన్ (సి) రచిన్ (బి) నూర్ 20; నితీశ్ రాణా (స్టంప్డ్) ధోని (బి) అశ్విన్ 81; పరాగ్ (బి) పతిరణ 37; జురేల్ (సి) పతిరణ (బి) నూర్ 3; హసరంగ (సి) శంకర్ (బి) జడేజా 4; హెట్మైర్ (సి) అశ్విన్ (బి) పతిరణ 19; ఆర్చర్ (సి) గైక్వాడ్ (బి) అహ్మద్ 0; కార్తికేయ (రనౌట్) 1; తీక్షణ (నాటౌట్) 2; దేశ్పాండే (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–4, 2–86, 3–124, 4–134, 5–140, 6–166, 7–174, 8–175, 9–176. బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 4–0–38–2, ఒవర్టన్ 2–0–30–0, అశ్విన్ 4–0–46–1, నూర్ అహ్మద్ 4–0–28–2, పతిరణ 4–0–28–2, జడేజా 2–0–10–1. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రచిన్ (సి) జురేల్ (బి) ఆర్చర్ 0; త్రిపాఠి (సి) హెట్మైర్ (బి) హసరంగ 23; రుతురాజ్ (సి) జైస్వాల్ (బి) హసరంగ 63; శివమ్ దూబే (సి) పరాగ్ (బి) హసరంగ 18; విజయ్శంకర్ (బి) హసరంగ 9; జడేజా (నాటౌట్) 32; ధోని (సి) హెట్మైర్ (బి) సందీప్ 16; ఒవర్టన్ (నాటౌట్) 11; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–0, 2–46, 3–72, 4–92, 5–129, 6–164. బౌలింగ్: జోఫ్రా ఆర్చర్ 3–1–13–1, తుషార్ దేశ్పాండే 4–0–45–0, సందీప్ శర్మ 4–0–42–1, మహీశ్ తీక్షణ 4–0–30–0, హసరంగ 4–0–35–4, కార్తికేయ 1–0–10–0. -
IPL 2025: ‘సన్’కు స్టార్క్ స్ట్రోక్
సన్రైజర్స్ ‘విధ్వంసక’ బ్యాటింగ్ బృందం మరోసారి నిరాశపర్చింది. సొంతగడ్డపై ఓటమి తర్వాత వైజాగ్ చేరిన రైజర్స్ ఆట మాత్రం మారలేదు. బ్యాటింగ్ వైఫల్యంతో ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది. అనికేత్ వర్మ సిక్సర్లతో జోరు ప్రదర్శించినా అది సరిపోలేదు. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ అలవోకగా విజయతీరం చేరింది. తొలి వికెట్కు 55 బంతుల్లోనే 81 పరుగులు వచ్చాక లక్ష్యం సునాయాసమైపోయింది. ఫలితంగా ఢిల్లీ ఖాతాలో వరుసగా రెండో విజయం చేరగా, హైదరాబాద్ వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. సాక్షి, విశాఖపట్నం: ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో పరాజయాన్ని ఎదుర్కొంది. ఆదివారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో హైదరాబాద్పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ 18.4 ఓవర్లలో 163 పరుగులకే ఆలౌటైంది. అనికేత్ వర్మ (41 బంతుల్లో 74; 5 ఫోర్లు, 6 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించగా... హెన్రిచ్ క్లాసెన్ (19 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిచెల్ స్టార్క్ (5/35) ఐదు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీయగా, కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఢిల్లీ 16 ఓవర్లలో 3 వికెట్లకు 166 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఫాఫ్ డుప్లెసిస్ (27 బంతుల్లో 50; 3 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్ సెంచరీ చేయగా... జేక్ ఫ్రేజర్ (32 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్స్లు), అభిషేక్ పొరేల్ (18 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడిన సన్రైజర్స్ లెగ్స్పిన్నర్ జీషాన్ అన్సారీకే మూడు వికెట్లు దక్కాయి. కీలక భాగస్వామ్యం... స్టార్క్ వేసిన తొలి ఓవర్లో ట్రవిస్ హెడ్ (12 బంతుల్లో 22; 4 ఫోర్లు) రెండు ఫోర్లు కొట్టి జోరుగా మొదలుపెట్టినా, దురదృష్టవశాత్తూ అదే ఓవర్లో అభిషేక్ శర్మ (1) రనౌటయ్యాడు. హెడ్ బంతిని ఆడి సింగిల్ కోసం ప్రయత్నించగా నెమ్మదిగా స్పందించిన అభిషేక్ క్రీజ్కు చేరుకునేలోగా నిగమ్ విసిరిన త్రో వికెట్లను పడగొట్టింది. ఇషాన్ కిషన్ (2) ఈ మ్యాచ్లోనూ విఫలం కాగా, ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య గ్రౌండ్లోకి వచ్చిన ‘లోకల్ బాయ్’ నితీశ్ కుమార్ రెడ్డి (0) తీవ్రంగా నిరాశపర్చాడు. స్టార్క్ బౌలింగ్లో తాను ఎదుర్కొన్న రెండో బంతినే భారీ షాట్ ఆడబోయి గాల్లోకి లేపగా అక్షర్ పటేల్ చేతికి చిక్కాడు. స్టార్క్ తర్వాతి హెడ్ కూడా అవుట్ కావడంతో రైజర్స్ స్కోరు 4.1 ఓవర్లలో 37/4 వద్ద నిలిచింది. ఈ దశలో అనికేత్, క్లాసెన్ కలిసి జట్టును ఆదుకున్నారు. అప్పటికీ నాలుగు వికెట్లు కోల్పోయినా... వీరిద్దరు దూకుడు మాత్రం తగ్గించకుండా ఓవర్కు 11 రన్రేట్తో పరుగులు రాబట్టారు. 6 పరుగుల వద్ద పొరేల్ క్యాచ్ వదిలేయడంతో అనికేత్కు లైఫ్ లభించింది. స్టార్క్ ఓవర్లో క్లాసెన్ వరుసగా 6, 4 కొట్టగా, నిగమ్ ఓవర్లో అనికేత్ వరుసగా 4, 6 బాదాడు. ఆ తర్వాత అక్షర్ ఓవర్లో అనికేత్ వరుసగా రెండు భారీ సిక్స్లు బాదాడు. ఈ జోడీ 42 బంతుల్లో 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా, నిగమ్ అద్భుత క్యాచ్తో క్లాసెన్ వెనుదిరిగాడు. 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అనికేత్ మరింత చెలరేగిపోతూ అక్షర్ ఓవర్లో వరుసగా 4, 6, 6 బాదడం విశేషం. అయితే ఇతర బ్యాటర్లంతా విఫలం కావడంతో మరో 8 బంతులు మిగిలి ఉండగానే జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. ఆరంభం నుంచే దూకుడు... ఛేదనలో ఢిల్లీకి ఏ దశలోనూ ఇబ్బంది ఎదురుకాలేదు. ఓపెనర్లు జేక్ ఫ్రేజర్, డుప్లెసిస్ ధాటిగా ఇన్నింగ్స్ను మొదలు పెట్టారు. దాంతో పవర్ప్లే ముగిసేసరికి ఢిల్లీ 3 ఫోర్లు, 3 సిక్స్లతో 52 పరుగులు చేసింది. ఈ క్రమంలో జేక్ ఫ్రేజర్ తనకు వచ్చిన రెండు ‘లైఫ్’లను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. 26 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న డుప్లెసిస్... 40 ఏళ్లు దాటిన తర్వాత ఐపీఎల్లో హాఫ్ సెంచరీ అరుదైన ఆటగాళ్లు గిల్క్రిస్ట్, గేల్, ద్రవిడ్ సరసన నిలిచాడు. అన్సారీ వేసిన 10వ ఓవర్ ఆసక్తికరంగా సాగింది. తొలి బంతికి అతను డుప్లెసిస్ను అవుట్ చేయగా, రెండో బంతికి పొరేల్ సింగిల్ తీశాడు. తర్వాతి మూడు బంతుల్లో వరుసగా 4, 4, 6 బాదిన జేక్ ఫ్రేజర్ చివరి బంతికి అవుటయ్యాడు. షమీ వేసిన తర్వాతి ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన కేఎల్ రాహుల్ (5 బంతుల్లో 15; 2 ఫోర్లు, 1 సిక్స్)ను కూడా అన్సారీనే వెనక్కి పంపించాడు. 52 బంతుల్లో 49 పరుగులు చేయాల్సిన ఈ స్థితిలో పొరేల్, స్టబ్స్ (14 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు) ఇక ఆలస్యం చేయలేదు. ఫటాఫట్గా 28 బంతుల్లోనే అభేద్యంగా 51 పరుగులు జత చేసి మ్యాచ్ను ముగించారు. ఆకట్టుకున్న అన్సారీ సన్రైజర్స్ జట్టు తరఫున ఈ మ్యాచ్లో 25 ఏళ్ల లెగ్స్పిన్నర్ జీషాన్ అన్సారీ ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఉత్తరప్రదేశ్లోని లక్నో స్వస్థలం. 5 ఫస్ట్క్లాస్ మ్యాచ్లలో బరిలోకి దిగిన అతను ఐపీఎల్కు ముందు యూపీ తరఫున ఒకే ఒక టి20 మ్యాచ్ ఆడాడు. 2016 అండర్–19 వరల్డ్ కప్లో రన్నరప్గా నిలిచిన భారత జట్టులో రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, సర్ఫరాజ్లతో పాటు అన్సారీ కూడా సభ్యుడిగా ఉన్నాడు. గత ఏడాది యూపీ టి20 లీగ్లో మీరట్ మావెరిక్స్ తరఫున ఆడి అత్యధిక వికెట్లు (24) తీయడంతో అందరి దృష్టిలో పడ్డాడు. ‘గూగ్లీ’ అతని ప్రధాన బలం. వేలంలో సన్రైజర్స్ జట్టు విప్రాజ్ నిగమ్తో పాటు అన్సారీ కోసం పోటీ పడింది. నిగమ్ను ఢిల్లీ సొంతం చేసుకోగానే అన్సారీని రైజర్స్ ఎంచుకుంది.స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (రనౌట్) 1; హెడ్ (సి) కేఎల్ రాహుల్ (బి) స్టార్క్ 22; ఇషాన్ కిషన్ (సి) స్టబ్స్ (బి) స్టార్క్ 2; నితీశ్ కుమార్ రెడ్డి (సి) అక్షర్ పటేల్ (బి) స్టార్క్ 0; అనికేత్ (సి) జేక్ ఫ్రేజర్ (బి) కుల్దీప్ 74; క్లాసెన్ (సి) నిగమ్ (బి) మోహిత్ 32; మనోహర్ (సి) డుప్లెసిస్ (బి) కుల్దీప్ 4; కమిన్స్ (సి) జేక్ ఫ్రేజర్ (బి) కుల్దీప్ 2; ముల్డర్ (సి) డుప్లెసిస్ (బి) స్టార్క్ 9; హర్షల్ పటేల్ (సి) అక్షర్ పటేల్ (బి) స్టార్క్ 5; షమీ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 11; మొత్తం (18.4 ఓవర్లలో ఆలౌట్) 163. వికెట్ల పతనం: 1–11, 2–20, 3–25, 4–37, 5–114, 6–119, 7–123, 8–148, 9–162, 10–163. బౌలింగ్: మిచెల్ స్టార్క్ 3.4–0–35–5, ముకేశ్ కుమార్ 2–0–17–0, అక్షర్ పటేల్ 4–0–43–0, విప్రాజ్ నిగమ్ 2–0–21–0, మోహిత్ శర్మ 3–0–25–1, కుల్దీప్ యాదవ్ 4–0–22–3. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: జేక్ ఫ్రేజర్ (సి అండ్ బి) అన్సారి 38; డుప్లెసిస్ (సి) ముల్డర్ (బి) అన్సారి 50; పొరేల్ (నాటౌట్) 34; కేఎల్ రాహుల్ (బి) అన్సారి 15; స్టబ్స్ (నాటౌట్) 21; ఎక్స్ట్రాలు 8; మొత్తం (16 ఓవర్లలో 3 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–81, 2–96, 3–115. బౌలింగ్: మొహమ్మద్ షమీ 3–0–31–0, అభిషేక్ శర్మ 3–0–27–0, ప్యాట్ కమిన్స్ 2–0–27–0, హర్షల్ పటేల్ 3–0–17–0, జీషాన్ అన్సారి 4–0–42–3, వియాన్ ముల్డర్ 1–0–16–0. -
చరిత్ర సృష్టించిన స్టార్క్.. ప్రపంచంలోనే తొలి బౌలర్గా
ఐపీఎల్-2025లో భాగంగా వైజాగ్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్లో 5 వికెట్లతో స్టార్క్ చెలరేగాడు. తన సంచలన పేస్ బౌలింగ్తో ఎస్ఆర్హెచ్ బ్యాటర్ల దూకుడును కట్టడి చేశాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే స్టార్క్ నిప్పులు చేరిగాడు. 3.4 ఓవర్లు బౌలింగ్ చేసిన స్టార్క్.. 35 పరుగులిచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.స్టార్క్కు ఇది తొలి ఐపీఎల్ ఫైవ్ వికెట్ హాల్ కావడం గమనార్హం. అదేవిధంగా అంతకుముందు 2023లో ఇదే విశాఖపట్నంలో భారత్తో జరిగిన వన్డే మ్యాచ్లో స్టార్క్ 5 వికెట్లతో మెరిశాడు. ఈ క్రమంలో స్టార్క్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఒకే మైదానంలో వన్డే, ఐపీఎల్లో ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్గా స్టార్క్ నిలిచాడు. ప్రంపచంలో ఏ బౌలర్ ఇప్పటివరకు ఈ ఫీట్ సాధించలేకపోయాడు. అంతేకాకుండా ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి విదేశీ బౌలర్గా మిచెల్ స్టార్క్ నిలిచాడు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఎస్ఆర్హెచ్పై 7 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో అనికేత్ వర్మ(74) టాప్ స్కోరర్గా నిలవగా.. క్లాసెన్(32), హెడ్(22) పరుగులతో రాణించారు.ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్తో పాటు కుల్దీప్ యాదవ్ మూడు, మొహిత్ శర్మ ఒక్క వికెట్ సాధించారు. అనంతరం 164 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఢిల్లీ బ్యాటర్లలో ఫాఫ్ డుప్లెసిస్(50) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. జాక్ ఫ్రెజర్ మెక్గర్క్(38), అభిషేక్ పోరెల్(34) రాణించారు. -
అదే మా కొంపముంచింది.. లేదంటే విజయం మాదే: ఎస్ఆర్హెచ్ కెప్టెన్
ఐపీఎల్-2025లో సన్రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. తొలి మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్పై విజయం సాధించిన ఎస్ఆర్హెచ్.. ఆ తర్వాత వరుసగా రెండు ఓటములను చవిచూసింది. తాజాగా వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఆరెంజ్ ఆర్మీ విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో అనికేత్ వర్మ(74) టాప్ స్కోరర్గా నిలవగా.. క్లాసెన్(32), హెడ్(22) పరుగులతో రాణించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు కుల్దీప్ యాదవ్ మూడు, మొహిత్ శర్మ ఒక్క వికెట్ సాధించారు. అనంతరం బౌలింగ్లోనూ సన్రైజర్స్ తేలిపోయింది. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఢిల్లీ బ్యాటర్లలో ఫాఫ్ డుప్లెసిస్(50) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. జాక్ ఫ్రెజర్ మెక్గర్క్(38), అభిషేక్ పోరెల్(34) రాణించారు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫలమ్యే తమ ఓటమికి కారణమని కమ్మిన్స్ చెప్పుకొచ్చాడు."మేము అన్ని విభాగాల్లో విఫలమయ్యాము. తొలుత స్కోర్ బోర్డులో తగనన్ని పరుగులు ఉంచలేకపోయాము. కొన్ని తప్పు షాట్లు ఆడి మా వికెట్లను కోల్పోయాము. డీప్లో క్యాచ్లు అందుకోవడం ఈ ఫార్మాట్లో సర్వ సాధారణమే. ఇదే మా ఓటమికి కారణమని నేను అనుకోను. గత రెండు మ్యాచ్ల్లో మాకు ఏదీ కలిసి రాలేదు. కచ్చితంగా ఈ ఓటములపై సమీక్ష చేస్తాము. మాకు అందుబాటులో ఉన్న అప్షన్స్ను పరిశీలిస్తాము. అనికేత్ వర్మ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ టోర్నమెంట్కు కూడా డొమాస్టిక్ క్రికెట్లో అతడు తన ప్రదర్శనతో అందరని ఆకట్టుకున్నాడు. ఇప్పుడు అదే ఫామ్ను ఇక్కడ కొనసాగిస్తున్నాడు. ప్రాక్టీస్ సెషన్స్లో కూడా అతడు తన బ్యాటింగ్తో మైమరిపించాడు. ఈ రెండు ఓటములపై మేము పెద్దగా ఆందోళన చెందడం లేదు. ఈ టోర్నీలో మాకు ఇంకా చాలా మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. తదుపరి మ్యాచ్ల్లో తిరిగి పుంజుకుంటామని" పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్లో కమ్మిన్స్ పేర్కొన్నాడు.చదవండి: IPL 2025: సన్రైజర్స్ను చిత్తు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. -
సన్రైజర్స్ను చిత్తు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్..
ఐపీఎల్-2025లో సన్రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పరాజయం పాలైంది. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఢిల్లీ బ్యాటర్లలో ఫాఫ్ డుప్లెసిస్(50) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. జాక్ ఫ్రెజర్ మెక్గర్క్(38), అభిషేక్ పోరెల్(34) రాణించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో జీషన్ అన్సారీ ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టాడు. మిగితా బౌలర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. స్టార్ పేసర్ మహ్మద్ షమీ మరోసారి తేలిపోయాడు. తన స్దాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన షమీ.. వికెట్ ఏమీ తీయకుండా 31 పరుగులు సమర్పించుకున్నాడు.ఐదేసిన స్టార్క్..ఈ మ్యాచ్లో బ్యాటింగ్లోనూ ఎస్ఆర్హెచ్ తేలిపోయింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో అనికేత్ వర్మ(74) టాప్ స్కోరర్గా నిలవగా.. క్లాసెన్(32), హెడ్(22) పరుగులతో రాణించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు కుల్దీప్ యాదవ్ మూడు, మొహిత్ శర్మ ఒక్క వికెట్ సాధించారు.చదవండి: IPL 2025: వైజాగ్లో అనికేత్ వర్మ విధ్వంసం.. వీడియో వైరల్ -
IPL 2025: బోణీ కొట్టిన రాజస్తాన్ రాయల్స్..
CSK vs RR live updates and highlights: ఐపీఎల్-2025లో భాగంగా గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడతున్నాయి.బోణీ కొట్టిన రాజస్తాన్ రాయల్స్..ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్ బోణీ కొట్టింది. గౌహతి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 6 పరుగుల తేడాతో రాజస్తాన్ విజయం సాధించింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులకే పరిమితమైంది. సీఎస్కే బ్యాటర్లలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(63) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. రవీంద్ర జడేజా(32) పర్వాలేదన్పించాడు.రాజస్తాన్ బౌలర్లలో వనిందు హసరంగా నాలుగు వికెట్లతో చెలరేగగా.. ఆర్చర్, సందీప్ శర్మ ఓ వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో నితీష్ రాణా(36 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్లతో 81) టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడితో పాటు కెప్టెన్ రియాన్ పరాగ్(37), శాంసన్(20) పరుగులతో రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో ఖాలీల్ అహ్మద్, పతిరాన, నూర్ ఆహ్మద్ తలా రెండు వికెట్లు సాధించగా.. జడేజా, అశ్విన్ ఓ వికెట్ పడగొట్టారు.సీఎస్కే ఐదో వికెట్ డౌన్.. గైక్వాడ్ ఔట్రుతురాజ్ గైక్వాడ్(63) రూపంలో సీఎస్కే ఐదో వికెట్ కోల్పోయింది. హసరంగా బౌలింగ్లో గైక్వాడ్ ఔటయ్యాడు. 16 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 129/5సీఎస్కే నాలుగో వికెట్ డౌన్.. శంకర్ ఔట్92 పరుగుల వద్ద సీఎస్కే నాలుగో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన విజయ్ శంకర్.. హసరంగా బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. 14 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే నాలుగు వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. క్రీజులో జడేజా(8), గైక్వాడ్(55) ఉన్నారు.సీఎస్కే మూడో వికెట్ డౌన్..ఇంపాక్ట్ ప్లేయర్ శివమ్ దూబే రూపంలో సీఎస్కే మూడో వికెట్ కోల్పోయింది.18 పరుగులు చేసిన దూబే.. హసరంగా బౌలింగ్లో ఔటయ్యాడు.సీఎస్కే రెండో వికెట్ డౌన్..రాహుల్ త్రిపాఠి రూపంలో సీఎస్కే నాలుగో వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన త్రిపాఠి.. హసరంగా బౌలింగ్లో ఔటయ్యాడు. 9 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే రెండు వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. క్రీజులో దూబే(8), గైక్వాడ్ ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న రుతురాజ్..6 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే వికెట్ నష్టానికి 40 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(20), రాహుల్ త్రిపాఠి(21) ఉన్నారు.సీఎస్కే తొలి వికెట్ డౌన్.. రవీంద్ర ఔట్183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. సూపర్ ఫామ్లో ఉన్న రచిన్ రవీంద్ర.. ఆర్చర్ బౌలింగ్లో ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. క్రీజులోకి రుతురాజ్ గైక్వాడ్ వచ్చాడు.నితీష్ రాణా సూపర్ హాఫ్ సెంచరీ.. సీఎస్కే టార్గెట్ ఎంతంటే?గౌహతి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్లు రాణించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో నితీష్ రాణా(36 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్లతో 81) టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడితో పాటు కెప్టెన్ రియాన్ పరాగ్(37), శాంసన్(20) పరుగులతో రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో ఖాలీల్ అహ్మద్, పతిరాన, నూర్ ఆహ్మద్ తలా రెండు వికెట్లు సాధించగా.. జడేజా, అశ్విన్ ఓ వికెట్ పడగొట్టారు.రాజస్తాన్ ఆరో వికెట్ డౌన్..రియాన్ పరాగ్ రూపంలో రాజస్తాన్ ఆరో వికెట్ కోల్పోయింది. 37 పరుగులు చేసిన పరాగ్.. పతిరాన బౌలింగ్లో ఔటయ్యాడు. 18 ఓవర్లకు రాజస్తాన్ 6 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది.రాజస్తాన్ నాలుగో వికెట్ డౌన్.. జురెల్ ఔట్ధ్రువ్ జురెల్ రూపంలో రాజస్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన జురెల్.. నూర్ అహ్మద్ బౌలింగ్లో ఔటయ్యాడు.రాజస్తాన్ మూడో వికెట్ డౌన్..నితీష్ రాణా రూపంలో రాజస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన రాణా(36 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్లతో 81).. అశ్విన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 12 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 129/3రాజస్తాన్ రెండో వికెట్ డౌన్.. శాంసన్ ఔట్సంజూ శాంసన్ రూపంలో రాజస్తాన్ రాయల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన శాంసన్.. నూర్ ఆహ్మద్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి కెప్టెన్ పరాగ్ వచ్చాడు. 8 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్.. రెండు వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. క్రీజులో నితీష్ రాణా(61), రియాన్ పరాగ్(1) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న రాణా..5 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ రాయల్స్ వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. క్రీజులో నితీష్ రాణా(44), సంజూ శాంసన్(15) ఉన్నారు.రాయల్స్ తొలి వికెట్ డౌన్..టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ రాయల్స్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. 4 పరుగులు చేసిన యశస్వి జైశ్వాల్.. ఖాలీల్ అహ్మద్ బౌలింగ్లో అశ్విన్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఐపీఎల్-2025లో భాగంగా గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సీఎస్కే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో సీఎస్కే రెండు మార్పులతో బరిలోకి దిగింది. సామ్ కుర్రాన్, దీపక్ హుడా స్ధానాల్లో ఓవర్టన్, విజయ్ శంకర్ వచ్చారు. రాయల్స్ మాత్రం తమ తుది జట్టులో ఎటువంటి మార్పు చేయలేదు.తుది జట్లుచెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవన్: రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), విజయ్ శంకర్, జామీ ఓవర్టన్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), నూర్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరణరాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ XI: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్పాండే, సందీప్ శర్మ -
వైజాగ్లో అనికేత్ వర్మ విధ్వంసం.. వీడియో వైరల్
ఐపీఎల్-2025లో వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు అనికేత్ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కిషన్, అభిషేక్ శర్మ, హెడ్ వంటి స్టార్ ప్లేయర్లు విఫలమైన చోట అనికేత్.. తన విరోచిత బ్యాటింగ్తో ఎస్ఆర్హెచ్ టీమ్ను ఆదుకున్నాడు.టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్ కేవలం 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన అనికేత్.. ప్రత్యర్ది బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ముఖ్యంగా అక్షర్ పటేల్ వంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్ను అనికేత్ ఊతికారేశాడు. తన విధ్వసంకర బ్యాటింగ్తో బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో అనికేత్ కేవలం 34 బంతుల్లోనే తన తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు.హాఫ్ సెంచరీ తర్వాత కూడా తన దూకుడును వర్మ కొనసాగించాడు. స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో సిక్సర్ బాదిన అనికేత్.. ఆ తర్వాత బంతికి భారీ షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఓవరాల్గా 41 బంతులు ఎదుర్కొన్న వర్మ.. 5 ఫోర్లు, 6 సిక్స్లతో 74 పరుగులు చేశాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 163 పరుగుల ఫైటింగ్ స్కోర్ చేయగల్గింది. అతడితో క్లాసెన్(32) పరుగులతో రాణించాడు.ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు కుల్దీప్ యాదవ్ మూడు, మొహిత్ శర్మ ఒక్క వికెట్ సాధించారు. కాగా అద్భుత ఇన్నింగ్స ఆడిన అనికేత్పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎస్ఆర్హెచ్కు మరో సరికొత్త హిట్టర్ దొరికాడని పోస్టులు పెడుతున్నారు. ఐపీఎల్-2025 మెగా వేలంలో రూ.30 లక్షల బేస్ ప్రైస్కు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది.చదవండి: IPL 2025: అభిషేక్ శర్మ రనౌట్.. తప్పు ఎవరిది? వీడియో వైరల్ -
అభిషేక్ శర్మ రనౌట్.. తప్పు ఎవరిది? వీడియో వైరల్
ఐపీఎల్-2025లో వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మను దురదృష్టం వెంటాడింది. తోటి బ్యాటర్ ట్రావిస్ హెడ్తో సమన్వయ లోపం వల్ల అభిషేక్ రనౌటయ్యాడు. తొలి రెండు మ్యాచ్ల్లో నిరాశపరిచిన అభిషేక్.. ఈ మ్యాచ్లో కూడా సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితం కావాల్సి వచ్చింది. అభిషేక్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు.అసలేం జరిగిందంటే?ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన మిచెల్ స్టార్క్ బౌలింగ్లో ఆఖరి బంతిని ట్రావిస్ హెడ్ కవర్స్ దిశగా ఆడాడు. హెడ్ షాట్ ఆడిన వెంటనే క్విక్ సింగిల్ కోసం నాన్స్టైకర్ ఎండ్ వైపు పరిగెత్తాడు. కానీ నాన్ స్టైక్ ఎండ్లో అభిషేక్ మాత్రం పరుగుకు సిద్దంగా లేడు. అతడు హెడ్ను ఆపడానికి చేయి పైకెత్తాడు. కానీ హెడ్ మాత్రం అభిషేక్ను గమనించకుండా బంతిని చూస్తూ పరుగు కోసం ముందుకు వచ్చాడు. దీంతో అభిషేక్ కాస్త ఆలస్యంగా పరిగెత్తడం ప్రారంభించాడు. ఈ క్రమంలో బంతిని అందుకున్న ఢిల్లీ ఫీల్డర్ విప్రజ్ నిగమ్ అద్భుతమైన త్రోతో స్టంప్స్ను గిరాటేశాడు. ఫలితంగా అభిషేక్ శర్మ రనౌట్ రూపంలో పెవిలియన్కు చేరాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఐదేసిన స్టార్క్..ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్.. 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో అనికేత్ వర్మ(74) టాప్ స్కోరర్గా నిలవగా.. క్లాసెన్(32), హెడ్(22) పరుగులతో రాణించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు కుల్దీప్ యాదవ్ మూడు, మొహిత్ శర్మ ఒక్క వికెట్ సాధించారు. SRH ನ ಮೊದಲ ವಿಕೆಟ್ ಪತನ 👏ರನ್ ಔಟ್ ಮೂಲಕ Abhishek Sharma ತಮ್ಮ ವಿಕೆಟ್ ಕೈಚೆಲ್ಲಿದ್ದಾರೆ 👀📺 ವೀಕ್ಷಿಸಿ | TATA IPL 2025 | #DCvSRH | LIVE NOW | ನಿಮ್ಮ JioHotstar & Star Sports ಕನ್ನಡದಲ್ಲಿ.#IPLOnJioStar #IPL2025 #TATAIPL pic.twitter.com/tKwl18nYPF— Star Sports Kannada (@StarSportsKan) March 30, 2025చదవండి: IPL 2025: హార్దిక్ పాండ్యాకు మరో షాక్ -
IPL 2025: ఎస్ఆర్హెచ్ ఘోర ఓటమి..
SRH Vs Delhi Capitals Match Updates: ఎస్ఆర్హెచ్ ఘోర ఓటమి.. ఐపీఎల్-2025లో ఎస్ఆర్హెచ్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పరాజయం పాలైంది. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఢిల్లీ బ్యాటర్లలో ఫాఫ్ డుప్లెసిస్(50) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. జాక్ ఫ్రెజర్ మెక్గర్క్(38), అభిషేక్ పోరెల్(34) రాణించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో జీషన్ అన్సారీ ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టాడు. మిగితా బౌలర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. ఢిల్లీ క్యాపిటల్స్ మూడో వికెట్ డౌన్.. కేఎల్ రాహుల్ రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ మూడో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన రాహుల్.. జీషన్ అన్సారీ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి ట్రిస్టన్ స్టబ్స్ వచ్చాడు.ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ డౌన్..ఢిల్లీ క్యాపిటల్స్ వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. జీషన్ అన్సారీ బౌలింగ్లో తొలి బంతికి ఫాఫ్ డుప్లెసిస్(50) ఔట్ కాగా.. ఆఖరి బంతికి జాక్ ఫ్రేజర్ మెక్గర్క్(38) ఔటయ్యాడు. క్రీజులోకి కేఎల్ రాహుల్ వచ్చాడు. 10 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ రెండు వికెట్లు నష్టానికి 96 పరుగులు చేసింది.దూకుడుగా ఆడుతున్న ఢిల్లీ..164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడుగా ఆడుతోంది. 5 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 48 పరుగులు చేసింది. క్రీజులో జేక్ ఫ్రెజర్ మెక్గర్క్(8), ఫాఫ్ డుప్లెసిస్(29) ఉన్నారు.163 పరుగులకు ఎస్ఆర్హెచ్ ఆలౌట్ఐపీఎల్-2025లో భాగంగా వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు తడబడ్డారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్.. 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో అనికేత్ వర్మ(74) టాప్ స్కోరర్గా నిలవగా.. క్లాసెన్(32), హెడ్(22) పరుగులతో రాణించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు కుల్దీప్ యాదవ్ మూడు, మొహిత్ శర్మ ఒక్క వికెట్ సాధించారు.ఎస్ఆర్హెచ్ ఎనిమిదో వికెట్ డౌన్.. అనికేత్ ఔట్అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అనికేత్ వర్మ(41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్లతో 74).. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 16 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.ఏడో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్ఎస్ఆర్హెచ్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. 12 ఓవర్లో అభినవ్ మనోహర్(4) ఔట్ కాగా.. ఆ తర్వాత 14 ఓవర్లో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఔటయ్యాడు. ఈ ఇద్దరు కూడా కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 14 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 7 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. క్రీజులో అనికేత్ వర్మ(50) ఉన్నాడు. వియాన్ ముల్డర్ ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగాడు.ఎస్ఆర్హెచ్ ఐదో వికెట్ డౌన్.. క్లాసెన్ ఔట్హెన్రిచ్ క్లాసెన్ రూపంలో ఎస్ఆర్హెచ్ ఐదో వికెట్ కోల్పోయింది. 32 పరుగులు చేసిన క్లాసెన్.. మొహిత్ శర్మ బౌలింగ్లో ఔటయ్యాడు. 11 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 5 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. క్రీజులో అనికేత్ వర్మ(47) ఉన్నాడు.అనికేత్ ఆన్ ఫైర్.. ఎస్ఆర్హెచ్ యువ సంచలనం అనికేత్ వర్మ మరోసారి దూకుడుగా ఆడుతున్నాడు. కేవలం 20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 40 పరుగులు చేసి ఆజేయంగా ఉన్నాడు. అతడితో పాటు హెన్రిచ్ క్లాసెన్(24) ఉన్నాడు. 9 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 4 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది.ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ డౌన్..ట్రావిస్ హెడ్ రూపంలో ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్.. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి క్లాసెన్ వచ్చాడు.29 పరుగులకే 3 వికెట్లు.. కష్టాల్లో ఎస్ఆర్హెచ్వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు తడబడుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్ కేవలం 29 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 4 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ మూడు వికెట్లు కోల్పోయి 37 పరుగులు చేసింది. క్రీజులో హెడ్(22), అనికేత్(5) ఉన్నారు.ఐపీఎల్-25 లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తో విశాఖ వేదికగా డా. వైఎస్ రాజశేఖర్రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ముందుగా బ్యాటింగ్ కు మొగ్గుచూపాడు.ఇక ఇరుజట్ల మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ అత్యంత హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఇరు జట్లలో భయంకరమైన హిట్టర్లు ఉన్నారు. విశాఖ పిచ్పై పరుగుల వరద పారిన చరిత్ర ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు సమతూకంగా ఉన్నాయి. తొలి మ్యాచ్లో పోలిస్తే ఢిల్లీ ఈ మ్యాచ్లో మరింత బలపడనుంది. పితృత్వ సెలవుపై ఉండిన ఆ జట్టు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ జట్టులో చేరాడు.ఈ సీజన్లో ఢిల్లీ తమ తొలి మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై సంచలన విజయం సాధించి జోష్ మీద ఉంది. సన్రైజర్స్ తమ తొలి మ్యాచ్లో రాయల్స్పై అద్భుత విజయం సాధించి, ఆతర్వాతి మ్యాచ్లో లక్నో చేతిలో పరాభవం ఎదుర్కొంది. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు 24 మ్యాచ్ల్లో తలపడగా.. సన్రైజర్స్ 13, ఢిల్లీ 11 మ్యాచ్ల్లో గెలుపొందాయి.ఎస్ఆర్ హెచ్ తుది జట్టుప్యాట్ కమిన్స్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్, అంకిత్ వర్మ, అభినవ్ మనోహర్, జీషన్ అన్సారీ, హర్షల్ పటేల్, మహ్మద్ షమీఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టుఅక్షర్ పటేల్(కెప్టెన్), జేక్ ప్రేజర్, డుప్లిసెస్, అభిషేక్ పార్కెల్, కేఎల్ రాహుల్, ట్రిస్టాన్ స్టబ్స్, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముకేష్ కుమార్ -
IPL 2025: అత్యంత దయనీయంగా సీఎస్కే బ్యాటింగ్.. ఆ ఇద్దరికి ప్రత్యామ్నాయాలు కూడా లేరు..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ చాలా బలహీనంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు ఆ జట్టు ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓపెనర్ రచిన్ రవీంద్ర ఒక్కడే రాణించాడు. తొలి మ్యాచ్లో రచిన్ సత్తా చాటడంతో సీఎస్కే ముంబైను ఓడించింది. ఆ మ్యాచ్లో రుతురాజ్ కూడా రాణించినా.. ఆర్సీబీతో మ్యాచ్లో డకౌటయ్యాడు. సీఎస్కే తరఫున రెండు మ్యాచ్ల్లో ఓపెనర్గా దిగిన రాహుల్ త్రిపాఠి దారుణంగా విఫలమయ్యాడు. దీపక్ హుడా పరిస్థితి కూడా అలాగే ఉంది. రాజస్థాన్ రాయల్స్తో నేడు జరుగబోయే మ్యాచ్లో త్రిపాఠి, హుడాలకు ప్రత్యామ్నాయాలను వెతుక్కోకపోతే సీఎస్కే భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుంది. వీరిద్దరిని ఇలాగే కొనసాగిస్తే రాయల్స్ చేతిలో కూడా పరాభవం (ఆర్సీబీ చేతిలో ఓడింది) తప్పకపోవచ్చు.ఆల్రౌండర్ సామ్ కర్రన్ కూడా తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమయ్యాడు. అతనిపై కూడా సీఎస్కే మేనేజ్మెంట్ దృష్టి సారించాలి. సామ్ బౌలర్గా కూడా విఫలమయ్యాడు. మరో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సైతం ఈ సీజన్లో అంతంతమాత్రంగానే ఉన్నాడు. బౌలర్గా పూర్తిగా విఫలమైన జడ్డూ బ్యాటింగ్లో మమ అనిపించాడు. గత సీజన్లో సీఎస్కే తరఫున మెరుపులు మెరిపించిన శివమ్ దూబే ఈ సీజన్లో పూర్తిగా తేలిపోయాడు. దూబే కూడా రెండు మ్యాచ్ల్లో నిరాశపరిచాడు. అశ్విన్ లాంటి బౌలింగ్ ఆల్రౌండర్ నుంచి బ్యాటింగ్లో మెరుపులు ఆశించడం అత్యాశే అవుతుంది.తొలి మ్యాచ్లో రెండు బంతులు ఎదుర్కొని ఖాతా ఓపెన్ చేయని ధోని.. ఆర్సీబీతో మ్యాచ్లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి బ్యాట్ ఝులిపించాడు. ధోని ఇదే తరహా హిట్టింగ్ను మున్ముందు కూడా కొనసాగిస్తే సీఎస్కే మేలవుతుంది. ఇక మిగిలింది బౌలర్లు. వారి విభాగం వరకు వారు పర్వాలేదనిపించారు. నూర్ అహ్మద్ అద్భుతంగా రాణిస్తూ లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు. ఖలీల్ అహ్మద్ కూడా పర్వాలేదనిపిస్తున్నాడు. ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో ఆడే అవకాశం దక్కని పతిరణ.. ఆర్సీబీతో మ్యాచ్లో 2 వికెట్లతో రాణించాడు. సీనియర్ స్పిన్ ద్వయం అశ్విన్, జడ్డూ స్థాయికి తగ్గట్టు రాణించలేకపోతున్నారు. వీరిద్దరు ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో పాటు వికెట్లు కూడా తీయలేకపోతున్నారు. సీఎస్కే మేనేజ్మెంట్ వీరిద్దరి ప్రత్యామ్నాయాలపై కూడా దృష్టి పెట్టాలి.బెంచ్ కూడా బలహీనమేఈ సీజన్లో సీఎస్కే జట్టు ఎంపిక అస్సలు బాగోలేదు. ఆ జట్టు బెంచ్ కూడా చాలా బలహీనంగా ఉంది. తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైన రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడాలను తప్పిస్తే.. ఆ జట్టులో ప్రత్యామ్నాయ ఆటగాళ్లు కూడా లేరు. ప్రస్తుతం విజయ్ శంకర్ ఒక్కడే వీరికి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడు. విదేశీ బ్యాటర్ డెవాన్ కాన్వేను తుది జట్టులోకి తెద్దామనుకుంటే నలుగురు ఆటగాళ్ల నియమం అడ్డొస్తుంది. మిగిలిన ఆటగాళ్లలో షేక్ రషీద్, ఆండ్రీ సిద్దార్థ్, వన్ష్ బేడి మాత్రమే స్పెషలిస్ట్ బ్యాటర్లు. ఈ లెక్కన చూస్తే.. వరుసగా విఫలమవుతున్నా త్రిపాఠి, హుడాలలో ఒకరిని ఖచ్చితంగా తుది జట్టులో ఆడించాల్సిన పరిస్థితి ఉంది. సీఎస్కేలా బ్యాటింగ్ వనరుల కొరత ఈ సీజన్లో ఏ ఫ్రాంచైజీకి లేదు. ఈ జట్టుతో సీఎస్కే ఆరోసారి టైటిల్ గెలవాలనుకోవడం అత్యాశే అవుతుంది.సీఎస్కే పూర్తి జట్టు..రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఎంఎస్ ధోని (వికెట్కీపర్), రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, సామ్ కర్రన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, మతీషా పతిరణ, ఖలీల్ అహ్మద్, కమలేష్ నాగర్కోటి, విజయ్ శంకర్, జామీ ఓవర్టన్, షేక్ రషీద్, శ్రేయస్ గోపాల్, డెవాన్ కాన్వే, ముఖేష్ చౌదరి, అన్షుల్ కాంబోజ్, నాథన్ ఎల్లిస్, గుర్జప్నీత్ సింగ్, రామకృష్ణ ఘోష్, ఆండ్రీ సిద్దార్థ్ సి, వంశ్ బేడి -
IPL 2025: హార్దిక్ పాండ్యాకు మరో షాక్
ఓటమి బాధలో (గుజరాత్ చేతిలో) ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు మరో షాక్ తగిలింది. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు గానూ హార్దిక్కు 12 లక్షల జరిమానా విధించారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం హార్దిక్కు ఈ ఫైన్ విధించబడింది. ఈ సీజన్లో హార్దిక్ జట్టు చేసిన మొదటి తప్పిదం కాబట్టి 12 లక్షల జరిమానాతో సరిపుచ్చారు.హార్దిక్ ఈ సీజన్ తొలి మ్యాచ్లోనే స్లో ఓవర్ రేట్ తప్పిదాలకు సంబంధించిన నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. గత సీజన్లో హార్దిక్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ మూడు సార్లు స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసింది. ఇందుకు గానూ హార్దిక్పై ఓ మ్యాచ్ నిషేధం పడింది. గత సీజన్ వరకు ఓ జట్టు మూడు సార్లు (ఒకే సీజన్లో) స్లో ఓవర్రేట్ మెయింటైన్ చేస్తే కెప్టెన్పై ఓ మ్యాచ్ నిషేధించేవారు. అయితే ఈ సీజన్ ప్రారంభానికి ముందు ఆ రూల్ను ఎత్తి వేశారు. ఈ సీజన్లో స్లో ఓవర్ రేట్ తప్పిదాల కారణంగా కెప్టెన్లపై నిషేధం ఉండదు. కేవలం జరిమానాలు మాత్రమే ఉంటాయి.ఇదిలా ఉంటే, గుజరాత్ టైటాన్స్తో నిన్న (మార్చి 29) జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 36 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్కు ఇది వరుసగా రెండో ఓటమి. తొలి మ్యాచ్లో ముంబై సీఎస్కే చేతిలో ఓడింది. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో ముంబై బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో తేలిపోయింది. తొలుత బౌలింగ్ చేసి గుజరాత్ను భారీ స్కోర్ (196/8) చేయనిచ్చిన ఆ జట్టు.. ఆతర్వాత ఛేదనలో (160/6) చేతులెత్తేసింది. గుజరాత్ బౌలర్లు సొంత పిచ్ అడ్వాన్టేజ్ను వినియోగించుకుని ముంబై బ్యాటర్లను కట్టడి చేశారు. ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా (4-0-29-2) బౌలింగ్లో రాణించినప్పటికీ.. బ్యాటింగ్లో తేలిపోయాడు. ఛేదన కీలక దశలో బంతులు వృధా (17 బంతుల్లో 11) చేసి జట్టు ఓటమిని ఖరారు చేశాడు. ఈ మ్యాచ్లో హార్దిక్ (కెప్టెన్గా) చేసిన ప్రయోగాలు కూడా బెడిసికొట్టాయి. రాబిన్ మింజ్ను తనకంటే ముందు బ్యాటింగ్కు పంపిన హార్దిక్ పెద్ద తప్పిదమే చేశాడు. మింజ్ కీలక దశలో బంతులను వృధా చేసి (6 బంతుల్లో 3) చీప్గా ఔటయ్యాడు. తుది జట్టు ఎంపికలోనూ హార్దిక్ పెద్ద తప్పులే చేశాడు. తొలి మ్యాచ్లో అద్భుతం చేసిన విజ్ఞేశ్ పుతుర్ను, భారీ హిట్టర్.. అందులోనే గత సీజన్లో అహ్మదాబాద్లో సెంచరీ చేసిన విల్ జాక్స్కు తప్పించి భారీ మూల్యం చెల్లించుకున్నాడు. -
IPL 2025: గుజరాత్ బౌలర్పై నోరు పారేసుకున్న హార్దిక్.. వైరల్ వీడియో
గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య నిన్న (మార్చి 29) జరిగిన మ్యాచ్ సందర్భంగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ముంబై ఇండియన్స్ లక్ష్యాన్ని ఛేదిస్తుండగా ఇన్నింగ్స్ 15వ ఓవర్లో హార్దిక్ పాండ్యా, గుజరాత్ స్పిన్నర్ సాయి కిషోర్ గొడవ పడ్డారు. ముంబై ఓటమి ఖరారైన దశలో తొలుత సాయి కిషోర్ హార్దిక్ను గెలికాడు. డాట్ బాల్ వేసిన ఆనందంలో ముంబై కెప్టెన్ వైపు బిర్రుగా చూశాడు. GAME 🔛Hardik Pandya ⚔ Sai Kishore - teammates then, rivals now! 👀🔥Watch the LIVE action ➡ https://t.co/VU1zRx9cWp #IPLonJioStar 👉 #GTvMI | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, & JioHotstar pic.twitter.com/2p1SMHQdqc— Star Sports (@StarSportsIndia) March 29, 2025ఇందుకు హార్దిక్ కూడా ధీటుగా స్పందించాడు. సాయి కిషోర్తో కంటితో యుద్దం చేస్తూనే దుర్భాషలాడాడు. అంపైర్ల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. మ్యాచ్ అనంతరం హార్దిక్, సాయి కిషోర్ ఒకరినొకరు హగ్ చేసుకోవడం కొసమెరుపు. హార్దిక్, సాయి కిషోర్ గతంలో కలిసి గుజరాత్కు ఆడిన విషయం తెలిసిందే. హార్దిక్తో గొడవపై సాయి కిషోర్ ప్రజెంటేషన్ సందర్భంగా కూడా స్పందించాడు. హార్దిక్ నాకు మంచి మిత్రుడని అన్నాడు. మైదానంలో ఇలాగే ఉండాలి. అక్కడ ఎవరైనా ప్రత్యర్థులే. మేము విషయాలను వ్యక్తిగతంగా తీసుకోము. మేము మంచి పోటీదారులం. ఆట ఇలాగే ఉండాలని అనుకుంటున్నానని అన్నాడు.కాగా, ఈ మ్యాచ్లో సాయి కిషోర్ యావరేజ్గా బౌలింగ్ చేసి ఓ వికెట్ తీయగా.. హార్దిక్ బౌలింగ్లో రాణించి, బ్యాటింగ్లో తేలిపోయాడు. ఈ మ్యాచ్లో గుజరాత్ 36 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ను ఓడించింది. స్లో వికెట్పై తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ భారీ స్కోర్ (196/8) చేసింది. సాయి సుదర్శన్ (41 బంతుల్లో 63; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), శుభ్మన్ గిల్ (27 బంతుల్లో 38; 4 ఫోర్లు, సిక్స్), జోస్ బట్లర్ (24 బంతుల్లో 39; 5 ఫోర్లు, సిక్స్) సత్తా చాటారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా (4-0-29-2) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బౌల్ట్ (4-0-34-1), దీపక్ చాహర్ (4-0-39-1), సాంట్నర్ (3-0-25-0) పర్వాలేదనిపించగా.. ముజీబ్ రెహ్మాన్ (2-0-28-1), యువ పేసర్ సత్యనారాయణ రాజు (3-0-40-1) భారీగా పరుగులు సమర్పించుకున్నారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఆదిలోనే తడబడింది. సిరాజ్ తొలి ఓవర్లోనే ముంబైని దెబ్బకొట్టాడు. రెండు బౌండరీలు బాది జోరుమీదున్న రోహిత్ శర్మను (8) క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం ఐదో ఓవర్లో సిరాజ్ మరోసారి చెలరేగాడు. ఈసారి మరో ఓపెనర్ రికెల్టన్ను (6) రోహిత్ తరహాలోనే క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆతర్వాత క్రీజ్లోకి వచ్చిన తిలక్ వర్మ (36 బంతుల్లో 39; 3 ఫోర్లు, సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 48; ఫోర్, 4 సిక్సర్లు) ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ దశలో గుజరాత్ ప్రస్దిద్ద్ కృష్ణను బరిలోకి దించింది. ప్రసిద్ద్ అద్భుతంగా బౌలింగ్ చేసి క్రీజ్లో కుదురుకున్న తిలక్, స్కైలను ఔట్ చేశాడు. ఇక్కడే ప్రసిద్ద్ ముంబై చేతుల్లో నుంచి మ్యాచ్ను లాగేసుకున్నాడు.ప్రసిద్ద్ అద్భుతమైన స్లో బాల్స్తో ముంబై బ్యాటర్లను ఇరుకునపెట్టాడు. తిలక్, స్కై ఔటయ్యాక హార్దిక్ బ్యాటింగ్కు దిగకుండా రాబిన్ మింజ్ను పంపి తప్పు చేశాడు. మింజ్ (6 బంతుల్లో 3), హార్దిక్ (17 బంతుల్లో 11) బంతులు వృధా చేసి ముంబై ఓటమిని ఖరారు చేశారు. ఆఖర్లో నమన్ ధీర్ (11 బంతుల్లో 18 నాటౌట్), సాంట్నర్ (9 బంతుల్లో 18 నాటౌట్) భారీ షాట్లు ఆడినా అప్పటికే ముంబై ఓటమి ఖరారైపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. పొదుపుగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసిన ప్రసిద్ద్ కృష్ణకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. గుజరాత్ బౌలరల్లో ప్రసిద్ద్, సిరాజ్ చెరో 2, రబాడ, సాయికిషోర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో గుజరాత్ ఈ సీజన్లో బోణీ కొట్టింది. ముంబై వరుసగా తమ రెండో మ్యాచ్లో కూడా పరాజయంపాలైంది. -
ఐపీఎల్-2025లో నేడు (మార్చి 30) రెండు భారీ మ్యాచ్లు.. ఢిల్లీతో సన్రైజర్స్ 'ఢీ'
ఐపీఎల్-2025లో ఇవాళ (మార్చి 30) రెండు మ్యాచ్లు జరుగనున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ను ఢీకొట్టనుండగా.. రాత్రి 7:30 గంటలకు జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్కింగ్స్తో అమీతుమీ తేల్చుకుంటుంది. ఎస్ఆర్హెచ్, ఢిల్లీ మ్యాచ్కు వైజాగ్ వేదిక కానుండగా.. సీఎస్కే, రాయల్స్ మ్యాచ్ గౌహతిలో జరుగనుంది.ఎస్ఆర్హెచ్, ఢిల్లీ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ అత్యంత హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఇరు జట్లలో భయంకరమైన హిట్టర్లు ఉన్నారు. విశాఖ పిచ్పై పరుగుల వరద పారిన చరిత్ర ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు సమతూకంగా ఉన్నాయి. తొలి మ్యాచ్లో పోలిస్తే ఢిల్లీ ఈ మ్యాచ్లో మరింత బలపడనుంది. పితృత్వ సెలవుపై ఉండిన ఆ జట్టు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ జట్టులో చేరాడు.ఈ సీజన్లో ఢిల్లీ తమ తొలి మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై సంచలన విజయం సాధించి జోష్ మీద ఉంది. సన్రైజర్స్ తమ తొలి మ్యాచ్లో రాయల్స్పై అద్భుత విజయం సాధించి, ఆతర్వాతి మ్యాచ్లో లక్నో చేతిలో పరాభవం ఎదుర్కొంది. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు 24 మ్యాచ్ల్లో తలపడగా.. సన్రైజర్స్ 13, ఢిల్లీ 11 మ్యాచ్ల్లో గెలుపొందాయి.జట్లు (అంచనా)..సన్రైజర్స్: ట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్కీపర్), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ, సిమర్జీత్ సింగ్, ఆడమ్ జంపాఢిల్లీ: జేక్ ఫ్రేజర్-మెక్గర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్ (వికెట్కీపర్), కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్సీఎస్కే, రాయల్స్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ కూడా హోరీహోరీగా సాగే అవకాశం ఉంది. బ్యాటింగ్కు పెద్దగా సహకరించని ఈ పిచ్పై ఏ జట్టు ఆధిపత్యం సాధిస్తుందో చూడాలి. ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉన్నా బౌలర్లే కీలకపాత్ర పోషించవచ్చు. రాజస్థాన్ ఈ సీజన్లో ఆడిన రెండు మ్యాచ్ల్లో పరాజయంపాలై పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. సీఎస్కే రెండింట ఒక మ్యాచ్లో విజయం సాధించింది. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు 29 మ్యాచ్ల్లో తలపడగా.. రాయల్స్ 13, సీఎస్కే 16 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి.తుది జట్లు (అంచనా).. రాజస్థాన్: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్ (కెప్టెన్), నితీష్ రాణా, ధృవ్ జురెల్ (వికెట్కీపర్), షిమ్రోన్ హెట్మెయర్, శుభమ్ దూబే, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్పాండే, కుమార్ కార్తికేయ/సందీప్ శర్మసీఎస్కే: రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), శివమ్ దూబే, దీపక్ హుడా/విజయ్ శంకర్, సామ్ కర్రాన్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్కీపర్), ఆర్ అశ్విన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరణ -
GT VS MI: మొదటి మ్యాచ్కు ముందే 'ఆ' నిర్ణయం తీసుకున్నాం.. ప్రసిద్ద్ బౌలింగ్ అద్భుతం: గిల్
ఐపీఎల్ 2025లో భాగంగా ముంబై ఇండియన్స్తో నిన్న (మార్చి 29) జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్లో గుజరాత్ అన్ని విభాగాల్లో సత్తా చాటింది. తొలుత బ్యాటింగ్కు దిగి భారీ స్కోర్ (196/8) చేసిన ఆ జట్టు.. ఆతర్వాత లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. ఈ మ్యాచ్లో గుజరాత్ టాప్-3 బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా సాయి సుదర్శన్ (41 బంతుల్లో 63; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) తన క్లాస్ను ప్రదర్శించాడు. శుభ్మన్ గిల్ (27 బంతుల్లో 38; 4 ఫోర్లు, సిక్స్), జోస్ బట్లర్ (24 బంతుల్లో 39; 5 ఫోర్లు, సిక్స్) భారీ స్కోర్లు చేయకపోయిన బాగా ఆడారు. స్లోగా ఉన్న పిచ్పై ఈ ముగ్గురు సూపర్గా బ్యాటింగ్ చేశారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా (4-0-29-2) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బౌల్ట్ (4-0-34-1), దీపక్ చాహర్ (4-0-39-1), సాంట్నర్ (3-0-25-0) పర్వాలేదనిపించగా.. ముజీబ్ రెహ్మాన్ (2-0-28-1), యువ పేసర్ సత్యనారాయణ రాజు (3-0-40-1) భారీగా పరుగులు సమర్పించుకున్నారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఆదిలోనే తడబడింది. సిరాజ్ తొలి ఓవర్లోనే ముంబైని దెబ్బకొట్టాడు. రెండు బౌండరీలు బాది జోరుమీదున్న రోహిత్ శర్మను (8) క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం ఐదో ఓవర్లో సిరాజ్ మరోసారి చెలరేగాడు. ఈసారి మరో ఓపెనర్ రికెల్టన్ను (6) రోహిత్ తరహాలోనే క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆతర్వాత క్రీజ్లోకి వచ్చిన తిలక్ వర్మ (36 బంతుల్లో 39; 3 ఫోర్లు, సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 48; ఫోర్, 4 సిక్సర్లు) ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ దశలో గుజరాత్ ప్రస్దిద్ద్ కృష్ణను బరిలోకి దించింది. ప్రసిద్ద్ అద్భుతంగా బౌలింగ్ చేసి క్రీజ్లో కుదురుకున్న తిలక్, స్కైలను ఔట్ చేశాడు. ఇక్కడే ప్రసిద్ద్ ముంబై చేతుల్లో నుంచి మ్యాచ్ను లాగేసుకున్నాడు.ప్రసిద్ద్ అద్భుతమైన స్లో బాల్స్తో ముంబై బ్యాటర్లను ఇరుకునపెట్టాడు. తిలక్, స్కై ఔటయ్యాక హార్దిక్ బ్యాటింగ్కు దిగకుండా రాబిన్ మింజ్ను పంపి తప్పు చేశాడు. మింజ్ (6 బంతుల్లో 3), హార్దిక్ (17 బంతుల్లో 11) బంతులు వృధా చేసి ముంబై ఓటమిని ఖరారు చేశారు. ఆఖర్లో నమన్ ధీర్ (11 బంతుల్లో 18 నాటౌట్), సాంట్నర్ (9 బంతుల్లో 18 నాటౌట్) భారీ షాట్లు ఆడినా అప్పటికే ముంబై ఓటమి ఖరారైపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. పొదుపుగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసిన ప్రసిద్ద్ కృష్ణకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. గుజరాత్ బౌలరల్లో ప్రసిద్ద్, సిరాజ్ చెరో 2, రబాడ, సాయికిషోర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో గుజరాత్ ఈ సీజన్లో బోణీ కొట్టింది. ముంబై వరుసగా తమ రెండో మ్యాచ్లో కూడా పరాజయంపాలైంది.మ్యాచ్ అనంతరం విన్నింగ్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఈ మ్యాచ్ను బ్లాక్ సాయిల్ పిచ్పై ఆడాము. ఇది మాకు కలిసొచ్చింది. మొదటి మ్యాచ్కు ముందే ఈ పిచ్పై ఆడాలని నిర్ణయించుకున్నాము. ఈ వికెట్ మాకు సూటైంది. బంతి పాతబడిన తర్వాత ఈ పిచ్పై బ్యాటింగ్ చేయడం కష్టం. అందుకే పవర్ ప్లేలోపే వీలైనన్ని పరుగులు సాధించేందుకు ప్రయత్నించాము. మనందరం ప్రణాళికలు వేసుకుంటాము. కొన్ని వర్కౌట్ అవుతాయి. మరికొన్ని కావు. రషీద్ ఖాన్ను తన కోటా నాలుగు ఓవర్లు వేయించకపోవడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. వాస్తవానికి రషీద్ను ఆఖర్లో బౌలింగ్ చేయిద్దామనే అనుకున్నాను. కానీ పేసర్లు బాగా బౌలింగ్ చేస్తుండటంతో అతన్ని బరిలోకి దించలేదు. ప్రసిద్ద్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. -
IPL 2025: ఇలా అయితే హైదరాబాద్ను వదిలి వెళ్లిపోతాం: సన్రైజర్స్ యాజమాన్యం
ఉచిత పాస్ల విషయంలో (ఐపీఎల్ 2025) సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మధ్య గొడవలు పతాకస్థాయికి చేరాయి. పాస్ల కోసం హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తీవ్రంగా వేధిస్తున్నాడని సన్రైజర్స్ మేనేజ్మెంట్ సంచలన ఆరోపణలు చేసింది. ఇలా చేస్తే హైదరాబాద్ నుంచి వెళ్లిపోతామని బెదిరించింది. ఈ అంశానికి సంబంధించి సన్రైజర్స్ జనరల్ మేనేజర్ టిబి శ్రీనాథ్ హెచ్సీఏ కోశాధికారి సీజే శ్రీనివాస్ రావు ఓ ఘాటు లేఖ రాశారు.ఉచిత పాస్ల కోసం హెచ్సీఏ ఉన్నతాధికారులు, ముఖ్యంగా అధ్యక్షుడు ఏ జగన్మోహన్ రావు వేధింపులు తీవ్రమయ్యాయి. ఇలాంటి ప్రవర్తనను మేము ఏమాత్రం సహించం. ఇలాగే కొనసాగితే మేము వేదికను మార్చుకునేందుకు కూడా వెనకాడము. వారి ప్రవర్తన చూస్తే మేము ఉప్పల్ స్టేడియంను హోం గ్రౌండ్గా ఎంచుకుని మ్యాచ్లు ఆడటం వారికి ఇష్టం లేనట్లుంది. ఇలా అయితే లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరుతున్నాను. తద్వారా ఈ విషయాన్ని బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వం మరియు మా యాజమాన్యానికి తెలియజేయగలము. మీకు ఇష్టం లేకపోతే మీరు కోరుకున్నట్లే హైదారబాద్ నుంచి తరలిపోతామని సన్రైజర్స్ ప్రతినిథి హెచ్సీఏ కోశాధికారికి రాసిన ఈ-మెయిల్లో పేర్కొన్నారు. సన్రైజర్స్ జనరల్ మేనేజర్ టిబి శ్రీనాథ్ ఈ విషయాలను కూడా తన ఈ-మెయిల్లో రాశారు. గత 12 సంవత్సరాలుగా హెచ్సీఏతో కలిసి పనిచేస్తున్నాము. గత సీజన్ నుండి మాత్రమే ఈ సమస్యలు, వేధింపులు ఎదుర్కొంటున్నాము. ముందుగా చేసుకున్న ఒప్పందంలో భాగంగా వారికి ప్రతి సీజన్లో 50 కాంప్లిమెంటరీ టికెట్లు (F12A బాక్స్) ఇస్తున్నాము. ఈ ఏడాది వారు అదనంగా మరో 20 టికెట్లు అడుతున్నారు. ఈ విషయం మా దృష్టికి వచ్చినప్పుడు పరస్పరం చర్చించి స్నేహపూర్వక పరిష్కారానికి వస్తామని వారికి తెలియజేసాము.అయినా పట్టించుకోకుండా హెచ్సీఏ ప్రతినిథులు ఓవరాక్షన్ చేశారు. SRH-LSG మ్యాచ్ రోజున సీటింగ్ బాక్స్కు (F3) తాళం వేశారు. మేము అడిగిన అదనపు టికెట్లు ఇవ్వకపోతే తాళం తెరవమని బెదిరించారు. గత రెండేళ్లలో హెచ్సీఏ నుంచి మా సిబ్బందికి ఇలాంటి బెదిరింపులు చాలా వచ్చాయి. అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఈ ఏడాదే చాలాసార్లు మా వారిని బెదిరించారు. ఇది ఏమాత్రం సహించరానిది. మేము స్టేడియంకు అద్దె చెల్లిస్తున్నాము. ఐపీఎల్ సమయంలో స్టేడియం మా ఆధీనంలో ఉండాలి అని శ్రీనాథ్ తన ఈ-మెయిల్లో పేర్కొన్నారు.కాగా, ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం) హోం గ్రౌండ్గా ఉన్న విషయం తెలిసిందే. -
GT VS MI: మేము ప్రొఫెషనల్గా ఆడలేదు.. రెండిటిలోనూ విఫలమయ్యాం: హార్దిక్ పాండ్యా
ఐపీఎల్-2025లో భాగంగా నిన్న (మార్చి 29) గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. హోం గ్రౌండ్లో (అహ్మదాబాద్) జరిగిన ఈ మ్యాచ్లో గుజరాత్ ముంబైని చిత్తు చేసింది. స్లోగా ఉన్న పిచ్పై తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ (196/8) చేసిన గుజరాత్.. ఆతర్వాత దాన్ని అద్భుతంగా డిఫెండ్ చేసుకుంది. ఈ మ్యాచ్ గెలుపుకు గుజరాత్ బ్యాటర్లు, బౌలర్లకు క్రెడిట్ ఇవ్వాలి. తొలుత బ్యాటింగ్లో వారు ఎక్కువ రిస్క్ చేయకుండానే పరుగులు రాబట్టారు. సాయి సుదర్శన్ (41 బంతుల్లో 63; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మరోసారి తనలోని క్లాస్ను ప్రదర్శించాడు. శుభ్మన్ గిల్ (27 బంతుల్లో 38; 4 ఫోర్లు, సిక్స్), జోస్ బట్లర్ (24 బంతుల్లో 39; 5 ఫోర్లు, సిక్స్) కూడా బాగా ఆడారు. వీరు చేసింది తక్కువ పరుగులే అయినా ఇన్నింగ్స్కు మంచి పునాది వేశారు. ఆతర్వాత వచ్చిన షారుఖ్ ఖాన్ (9), షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (18), రాహుల్ తెవాటియా (0), రషీద్ ఖాన్ (6), రబాడ (7 నాటౌట్), సాయి కిషోర్ (1) నిరాశపర్చినా చివరికి గుజరాత్ మంచి స్కోరే చేసింది. సాయి సుదర్శన్ చివరి వరకు క్రీజ్లో ఉండి ఉంటే గుజరాత్ ఇంకా భారీ స్కోర్ చేసేది. ముంబై ప్రధాన పేసర్లు బౌల్ట్ (4-0-34-1), దీపక్ చాహర్ (4-0-39-1) బాగానే బౌలింగ్ చేసినా స్పిన్నర్ ముజీబ్ రెహ్మాన్ (2-0-28-1), యువ పేసర్ సత్యనారాయణ రాజు (3-0-40-1) భారీగా పరుగులు సమర్పించుకున్నారు. సాంట్నర్ (3-0-25-0) పర్వాలేదనిపించగా.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (4-0-29-2) అద్భుతంగా బౌలింగ్ చేశాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ముంబైను గుజరాత్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఆదిలోనే దెబ్బ కొట్టాడు. సిరాజ్ ఇద్దరు ముంబై ఓపెనర్లను పవర్ ప్లేలోనే ఔట్ చేశాడు. తొలుత రోహిత్ను (8) క్లీన్ బౌల్డ్ చేసిన సిరాజ్.. ఆతర్వాత మరో ఓపెనర్ రికెల్టన్ను (6) కూడా అదే తరహాలో పెవిలియన్కు పంపాడు. ఆతర్వాత క్రీజ్లోకి వచ్చిన తిలక్ వర్మ (36 బంతుల్లో 39; 3 ఫోర్లు, సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 48; ఫోర్, 4 సిక్సర్లు) ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యతను భుజాన వేసుకున్నారు. ఈ దశలో గుజరాత్ తమ ఏస్ పేసర్ ప్రస్దిద్ద్ కృష్ణను బరిలోకి దించింది. ప్రసిద్ద్ అద్భుతంగా బౌలింగ్ చేసి క్రీజ్లో కుదురుకున్న తిలక్, స్కైలను ఔట్ చేశాడు. ఇక్కడే ప్రసిద్ద్ ముంబై చేతుల్లో నుంచి మ్యాచ్ను లాగేసుకున్నాడు. ప్రసిద్ద్ అద్భుతమైన స్లో బాల్స్తో ముంబై బ్యాటర్లను బెంబేలెత్తించాడు. తిలక్, స్కై ఔటయ్యాక హార్దిక్ బ్యాటింగ్కు దిగకుండా రాబిన్ మింజ్ను పంపి తప్పు చేశాడు. మింజ్ (6 బంతుల్లో 3), హార్దిక్ (17 బంతుల్లో 11) ఇద్దరూ బంతులు వృధా చేసి ముంబై ఓటమిని ఖరారు చేశారు. ఆఖర్లో నమన్ ధీర్ (11 బంతుల్లో 18 నాటౌట్), సాంట్నర్ (9 బంతుల్లో 18 నాటౌట్) భారీ షాట్లు ఆడినా అప్పటికే ముంబై ఓటమి ఖరారైపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. పొదుపుగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసిన ప్రసిద్ద్ కృష్ణకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. గుజరాత్ బౌలరల్లో ప్రసిద్ద్, సిరాజ్ చెరో 2, రబాడ, సాయికిషోర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో గుజరాత్ ఈ సీజన్లో బోణీ కొట్టింది. ముంబై వరుసగా తమ రెండో మ్యాచ్లో కూడా పరాజయంపాలైంది.మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ఇలా అన్నాడు. మేము ప్రొఫెషనల్గా ఆడలేదు. బ్యాటింగ్, బౌలింగ్ రెండిటిలోనూ విఫలమయ్యాం. రెండు విభాగాల్లో 15-20 పరుగులు తక్కువ పడ్డాయని అనుకుంటున్నాను. ఫీల్డ్లో ప్రాథమిక తప్పులు చేసాము. దానికి వల్ల ప్రత్యర్థులకు 20-25 పరుగులు అదనంగా వచ్చాయి. టీ20ల్లో మ్యాచ్ ఫలితాన్ని ఈ పరుగులే నిర్దేశిస్తాయి. గుజరాత్ ఓపెనర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వారు ఛాన్స్లు ఎక్కువగా తీసుకోలేదు. పిచ్ కఠినంగా ఉందని వారికి కూడా తెలుసు. వారు ప్రమాదకర షాట్లు ఆడకుండా పరుగులు సాధించగలిగారు. ఈ పరాజయానికి మేమంతా బాధ్యత తీసుకోవాలి. ఇంకా ప్రారంభ దశల్లోనే ఉన్నాము. బ్యాటర్లు టచ్లోకి రావాలి. వారు త్వరలోనే సామర్థ్యం మేరకు రాణిస్తారని ఆశిస్తున్నాను. గుజరాత్ బౌలర్లు స్లో డెలివరీలను అద్భుతంగా బౌల్ చేశారు. వాటిని ఎదుర్కోవడం చాలా కష్టమైంది. కొన్ని బంతులు నేరుగా వికెట్లపైకి వచ్చాయి. కొన్ని బౌన్స్ అయ్యాయి. ఇలాంటి బంతులను ఎదుర్కోడం బ్యాటర్లకు చాలా కష్టం. గుజరాత్ బౌలర్లు నేను బంతితో చేసిందే చేసి సఫలమయ్యారు. -
నేడు వైజాగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ X సన్రైజర్స్ హైదరాబాద్
విశాఖపట్నం వేదికగా ఐపీఎల్లో నేడు మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగే ఈ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ తలపడుతుంది. ఇక్కడే జరిగిన గత మ్యాచ్లో లక్నోపై విజయం సాధించిన ఢిల్లీకి ఇది రెండో ‘హోం మ్యాచ్’ కానుంది. మరో వైపు ఆడిన రెండు మ్యాచ్లలో ఒకటి గెలిచి మరొకటి ఓడిన సన్రైజర్స్ లీగ్లో మళ్లీ గెలుపు బాట పట్టాలని పట్టుదలగా ఉంది. లక్నోతో మ్యాచ్లో దాదాపుగా ఓటమికి చేరువై అశుతోష్ అసాధారణ బ్యాటింగ్తో గెలుపు అందుకున్న అక్షర్ పటేల్ బృందం సమష్టిగా రాణిస్తేనే మరో విజయానికి అవకాశం ఉంటుంది. మరో వైపు తొలి మ్యాచ్లో రాజస్తాన్పై అద్భుత బ్యాటింగ్తో చెలరేగిన రైజర్స్ బ్యాటర్లు తర్వాతి పోరులో తడబడ్డారు.అయితే అంచనాలకు అనుగుణంగా హెడ్, అభిషేక్, ఇషాన్ కిషన్, క్లాసెన్ సత్తా చాటితే జట్టు భారీ స్కోరు సాధించడం ఖాయం. వైజాగ్కు చెందిన నితీశ్ కుమార్ రెడ్డి సన్రైజర్స్ తరఫున బరిలోకి దిగుతుండటంతో అభిమానులు కూడా మ్యాచ్ పట్ల ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. -
గుజరాత్ గెలుపు బోణీ
మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ తాజా సీజన్లో తొలి విజయాన్ని అందుకుంది. మొదటి మ్యాచ్లో పంజాబ్ చేతిలో ఓడిన టీమ్ సొంతగడ్డపై పాయింట్ల ఖాతా తెరిచింది. బ్యాటింగ్లో సాయిసుదర్శన్, బౌలింగ్లో ప్రసిధ్, సిరాజ్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. మరో వైపు గత మ్యాచ్లాగే అన్ని రంగాల్లో విఫలమైన ముంబై వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. బ్యాటింగ్లో ఆ జట్టు కనీస ప్రదర్శన కూడా ఇవ్వలేకపోయింది. అహ్మదాబాద్: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన గుజరాత్ టైటాన్స్ గెలుపు బోణీ చేసింది. శనివారం జరిగిన మ్యాచ్లో టైటాన్స్ 36 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (41 బంతుల్లో 63; 4 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీ చేయగా...జోస్ బట్లర్ (24 బంతుల్లో 39; 5 ఫోర్లు, 1 సిక్స్), శుబ్మన్ గిల్ (27 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులే చేయగలిగింది. సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 48; 1 ఫోర్, 4 సిక్స్లు), తిలక్వర్మ (36 బంతుల్లో 39; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ప్రసిధ్ కృష్ణ (2/18), సిరాజ్ (2/34) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. కీలక భాగస్వామ్యాలు... గుజరాత్ ఇన్నింగ్స్లో టాప్–3 నెలకొల్పిన రెండు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు జట్టు స్కోరులో కీలకంగా నిలిచాయి. తొలి వికెట్తో గిల్తో 78 పరుగులు (51 బంతుల్లో) జోడించిన సుదర్శన్, రెండో వికెట్కు బట్లర్తో 51 పరుగులు (32 బంతుల్లో) జత చేశాడు. సుదర్శన్, గిల్ ధాటిగా ఆడుతూ 7 ఫోర్లు, 2 సిక్స్లు కొట్టడంతో పవర్ప్లే ముగిసే సరికి స్కోరు 66 పరుగులకు చేరింది. గిల్ వెనుదిరిగిన తర్వాత వచ్చిన బట్లర్ కూడా కొద్ది సేపు ధాటిని ప్రదర్శించాడు. 33 బంతుల్లో వరుసగా రెండో మ్యాచ్లో సుదర్శన్ అర్ధ సెంచరీ పూర్తయింది. షారుఖ్ ఖాన్ (9)ను ముందుగా పంపిన ప్రయత్నం ఫలితం ఇవ్వకపోగా, రూథర్ఫోర్డ్ (18) రాజు ఓవర్లో రెండు సిక్సర్లు బాదాడు. 18వ ఓవర్ చివరి బంతికి సుదర్శన్ను బౌల్ట్ అవుట్ చేయడంతో గుజరాత్ జోరుక బ్రేక్ పడింది. చివరి 2 ఓవర్లలో ఆ జట్టు 17 పరుగులు మాత్రమే సాధించి 4 వికెట్లు చేజార్చుకుంది. దాంతో స్కోరు 200 పరుగులు దాటలేకపోయింది. ముంబై తరఫున రెండో మ్యాచ్ ఆడిన ఆంధ్ర పేస్ బౌలర్ పెన్మత్స సత్యనారాయణ రాజు ఐపీఎల్లో తన తొలి వికెట్ సాధించడం విశేషం. రాణించిన తిలక్... ఛేదనలో ముంబై పూర్తిగా తడబడింది. తిలక్వర్మ, సూర్యకుమార్ క్రీజ్లో ఉన్న సమయంలోనే జట్టు గెలుపుపై ఆశలు ఉండగా...ఇది మినహా మిగతా ఇన్నింగ్స్ పేలవంగా సాగింది. సిరాజ్ వేసిన తొలి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన రోహిత్ శర్మ (8) తర్వాతి బంతికి వెనుదిరగ్గా, రికెల్టన్ (6)ను కూడా సిరాజ్ బౌల్డ్ చేశాడు. తిలక్ మాత్రం కొన్ని చక్కటి షాట్లతో అలరించాడు. రబాడ ఓవర్లో అతను వరుసగా 4, 4, 6 కొట్టాడు. మరో ఎండ్లో సూర్య కూడా తనదైన శైలిలో ధాటిగా ఆడాడు. మూడో వికెట్కు 42 బంతుల్లో 62 పరుగులు జత చేసిన తర్వాత తిలక్ను ప్రసిధ్ వెనక్కి పంపాడు. 51 బంతుల్లో 100 పరుగులు చేయాల్సిన ఈ స్థితినుంచి ముంబై కోలుకోలేకపోయింది. 27 పరుగుల వ్యవధిలో తర్వాతి 4 వికెట్లు కోల్పోయిన జట్టు ఓటమిని ఆహ్వానించింది. స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (ఎల్బీ) (బి) బౌల్ట్ 63; శుబ్మన్ గిల్ (సి) నమన్ (బి) పాండ్యా 38; బట్లర్ (సి) రికెల్టన్ (బి) ముజీబ్ 39; షారుఖ్ (సి) తిలక్ (బి) పాండ్యా 9; రూథర్ఫోర్డ్ (సి) సాంట్నర్ (బి) చహర్ 18; తెవాటియా (రనౌట్) 0; రషీద్ (సి) పాండ్యా (బి) రాజు 6; రబాడ (నాటౌట్) 7; సాయికిషోర్ (రనౌట్) 1; ఎక్స్ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–78, 2–129, 3–146, 4–179, 5–179, 6–179, 7–194, 8–196. బౌలింగ్: ట్రెంట్ బౌల్ట్ 4–0–34–1, దీపక్ చహర్ 4–0–39–1, ముజీబ్ 2–0–28–1, హార్దిక్ పాండ్యా 4–0–29–2, సాంట్నర్ 3–0–25–0, సత్యనారాయణ రాజు 3–0–40–1. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) సిరాజ్ 8; రికెల్టన్ (బి) సిరాజ్ 6; తిలక్వర్మ (సి) తెవాటియా (బి) ప్రసిధ్ 39; సూర్యకుమార్ (సి) గిల్ (బి) ప్రసిధ్ 48; మిన్జ్ (సి) ఇషాంత్ (బి) సాయికిషోర్ 3; పాండ్యా (సి) సిరాజ్ (బి) రబాడ 11; నమన్ (నాటౌట్) 18; సాంట్నర్ (నాటౌట్) 18; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 160. వికెట్ల పతనం: 1–8, 2–35, 3–97, 4–108, 5–120, 6–124. బౌలింగ్: సిరాజ్ 4–0–34–2, రబాడ 4–0–42–1, ఇషాంత్ 2–0–17–0, రషీద్ 2–0–10–0, సాయికిషోర్ 4–0–37–1, ప్రసిధ్ 4–0–18–2. ఐపీఎల్లో నేడుఢిల్లీ X హైదరాబాద్వేదిక: విశాఖపట్నంమధ్యాహ్నం 3: 30 గంటల నుంచి రాజస్తాన్ X చెన్నై వేదిక: గువాహటిరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
శరత్ కమల్ శకం ముగిసె...
చెన్నై: భారత టేబుల్ టెన్నిస్ ఆల్టైమ్ గ్రేట్ ప్లేయర్ ఆచంట శరత్ కమల్ తన ఆట ముగించాడు. వరల్డ్ టేబుల్ టెన్నిస్ స్టార్ కంటెండర్ టోర్నీ పురుషుల సింగిల్స్లో పరాజయంతో అతను రిటైర్ అయ్యాడు. ఈ టోర్నీ ప్రిక్వార్టర్స్ మ్యాచ్లో సూరావజ్జుల స్నేహిత్ (తెలంగాణ) చేతిలో శరత్ కమల్ 0–3తో ఓటమిపాలయ్యాడు. 25 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో స్నేహిత్ 11–9, 11–8, 11–9తో విజయం సాధించాడు. శరత్ కమల్ చివరి మ్యాచ్ చూడటం కోసం నెహ్రూ స్టేడియానికి పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చారు. మ్యాచ్ ముగిసిన తర్వాత వారందరికీ అభివాదం చేస్తూ అతను కృతజ్ఞతలు తెలిపాడు. అంతకు ముందే పురుషుల డబుల్స్ విభాగంలో స్నేహిత్తోనే కలిసి శరత్ డబుల్స్ సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడాడు. ఈ పోరులో కొరియా జోడి లిమ్ జాంగూన్ – ఆన్ జీహున్ చేతిలో 11–9, 8–11, 9–11, 6–11 స్కోరుతో శరత్ – స్నేహిత్ ఓడిపోయారు. 17 ఏళ్ల వయసులో చెన్నైలోనే జరిగిన ఆసియా జూనియర్స్ టోర్నీతో తొలిసారి ప్రొఫెషనల్ టేబుల్ టెన్నిస్ బరిలోకి దిగిన శరత్ కమల్ రెండు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించాడు. అసాధారణ రీతిలో 10 సార్లు జాతీయ చాంపియన్గా నిలిచిన శరత్ అంతర్జాతీయ మెగా ఈవెంట్లలో పెద్ద సంఖ్యలో పతకాలు గెలుచుకున్నాడు.కామన్వెల్త్ క్రీడల్లో 7 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు గెలిచిన అతను ఆసియా క్రీడల్లో 2 కాంస్యాలు సాధించాడు. ఆసియా చాంపియన్షిప్లో కూడా అతని ఖాతాలో 4 కాంస్యాలు ఉన్నాయి. 2004 నుంచి 2024 మధ్య ఐదు ఒలింపిక్స్లలో పాల్గొన్న శరత్ కమల్ను భారత ప్రభుత్వం పద్మశ్రీ, ఖేల్రత్న పురస్కారాలతో గౌరవించింది. -
నిప్పులు చెరిగిన సిరాజ్, ప్రసిద్ద్.. ముంబైను చిత్తు చేసిన గుజరాత్
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 36 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులకే పరిమితమైంది.ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(48) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. తిలక్ వర్మ(39) పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా కీలక సమయంలో బ్యాటింగ్కు వచ్చిన హార్దిక్ పాండ్యా చేతులేత్తేశాడు. 17 బంతుల్లో 11 పరుగులు చేసిన హార్దిక్ ముంబై ఓటమికి పరోక్షంగా కారణమయ్యాడు.గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. రబాడ, సాయికిషోర్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో సాయిసుదర్శన్(63) టాప్ స్కోరర్గా నిలవగా.. శుబ్మన్ గిల్(38), జోస్ బట్లర్(39) రాణించారు. ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టగా.. బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ తలా వికెట్ సాధించారు. -
సిరాజ్ సూపర్ బాల్.. రోహిత్ మైండ్ బ్లాంక్! వీడియో వైరల్
ఐపీఎల్-2025లో టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్ వరుసగా రెండో మ్యాచ్లోనూ విఫలమయ్యాడు. సీఎస్కేతో జరిగిన తొలి మ్యాచ్లో డకౌటైన రోహిత్ శర్మ.. ఇప్పుడు అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్పై అదే తీరును కనబరిచాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి హిట్మ్యాన్ ఔటయ్యాడు. గుజరాత్ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ అద్బుతమైన బంతితో రోహిత్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ముంబై ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన సిరాజ్ బౌలింగ్లో రోహిత్.. వరుసగా రెండు బంతుల్లో బౌండరీలు బాది మంచి టచ్లో కన్పించాడు. కానీ సిరాజ్ అదే ఓవర్లో ఐదో బంతిని రోహిత్కు ఆఫ్ స్టంప్ దిశగా గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని రోహిత్ శర్మ డిఫెండ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ బంతి అద్బుతంగా టర్న్ అయ్యి బ్యాట్, ప్యాడ్ మధ్యలో నుంచి వెళ్లి స్టంప్స్ను గిరాటేసింది. దీంతో రోహిత్ ఒక్కసారిగా బిత్తరపోయాడు. రోహిత్ను ఔట్ చేసిన వెంటనే సిరాజ్ క్రిస్టియానో రొనాల్డో వింటేజ్ ''కాల్మా స్టైల్లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ తర్వాత ర్యాన్ రికెల్టన్ను కూడా సిరాజ్ బోల్తా కొట్టించాడు. కాగా మహ్మద్ సిరాజ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.Siraj is not effective🤣🤣pic.twitter.com/7cueS6DmvT— Mayank. (@PrimeKohlii) March 29, 2025 -
అదొక చెత్త నిర్ణయం.. హార్దిక్ పాండ్యాతో అట్లుంటది మరి!?
ఐపీఎల్-2025లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో యువ స్పిన్నర్ విఘ్నేష్ పుతూర్కు మంబై ఇండియన్స్ తుది జట్టులో చోటు దక్కలేదు. తన అరంగేట్రంలో సీఎస్కేపై మూడు వికెట్లతో సత్తాచాటినప్పటికి విఘ్నేష్ పుతూర్ను ముంబై ఇండియన్స్ పక్కన పెట్టడం అందరిని ఆశ్యర్యపరిచింది.అతడి స్ధానంలో స్పిన్నర్గా ముజీబ్ ఆర్ రెహ్మాన్ను ముంబై మెనెజ్మెంట్ ఆడించింది. జట్టులోకి వచ్చిన రెహ్మాన్ తన మార్క్ చూపించలేకపోయాడు. రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన ముజీబ్.. 28 పరుగులిచ్చి ఓ వికెట్ సాధించాడు. ఈ క్రమంలో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై నెటిజన్లు విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. తొలి మ్యాచ్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన విఘ్నేష్ను ఎందుకు పక్కన పెట్టారాని ప్రశ్నలు సంధిస్తున్నారు. మరి కొంతమంది ఇదొక చెత్త నిర్ణయమని పోస్టలు పెడుతున్నారు. కాగా సీఎస్కే తో మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన విఘ్నేష్ తన 4 ఓవర్ల కోటాలో 32 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఆ మ్యాచ్తో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు.I'm so furious seeing this playing 11/12 of Mumbai Indians, brainless decision making. Chutiye left both the departments weak by leaving Will Jacks & Vignesh Puthur out. Absolutely pathetic.— Vipul 🇮🇳 (@Vipul_Espeaks) March 29, 2025ఇక ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో సాయిసుదర్శన్(63) టాప్ స్కోరర్గా నిలవగా.. శుబ్మన్ గిల్(38), జోస్ బట్లర్(39) రాణించారు. ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టగా.. బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ తలా వికెట్ సాధించారు.చదవండి: IPL 2025: శుబ్మన్ గిల్ అరుదైన ఫీట్.. డేవిడ్ వార్నర్ రికార్డు బద్దలు -
శుబ్మన్ గిల్ అరుదైన ఫీట్.. డేవిడ్ వార్నర్ రికార్డు బద్దలు
ఐపీఎల్-2025లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో ఒకే వేదికలో అతి తక్కువ ఇన్నింగ్స్లలో 1000 పరుగులు మైలు రాయిని అందుకున్న రెండో ప్లేయర్గా గిల్ నిలిచాడు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గిల్ వెయ్యి ఐపీఎల్ పరుగులను పూర్తి చేసుకున్నాడు.తద్వారా ఈ ఫీట్ను గిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్, సన్రైజర్స్ మాజీ సారథి డేవిడ్ వార్నర్ పేరిట ఉండేది. వార్నర్ హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ మైదానంలో 22 ఇన్నింగ్స్లలో 1000 పరుగులు మైలు రాయిని అందుకున్నాడు.తాజా మ్యాచ్తో వార్నర్ రికార్డును గిల్ బ్రేక్ చేశాడు. ఇక అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ అగ్రస్ధానంలో ఉన్నాడు. గేల్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో 19 ఇన్నింగ్స్లలోనే ఈ ఫీట్ను అందుకున్నాడు. ఇక శుబ్మన్ గిల్ ఓవరాల్గా తన ఐపీఎల్ కెరీర్లో ఇప్పటివరకు 105 మ్యాచ్లు ఆడి 3287 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో 4 సెంచరీలు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్లో గిల్ 38 పరుగులు చేసి ఔటయ్యాడు. 11 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది.తుది జట్లుముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, సత్యనారాయణ రాజు, ముజీబ్ ఉర్ రెహమాన్, ట్రెంట్ బౌల్ట్గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ XI: శుభమన్ గిల్ (కెప్టెన్), B సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షెర్ఫానే రూథర్ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణచదవండి: IND vs ENG: టీమిండియా కెప్టెన్గా శుబ్మన్ గిల్..!? -
ముంబైపై గుజరాత్ టైటాన్స్ విజయం
IPL 2025 MI vs GT live updates and highlights: ముంబైపై గుజరాత్ టైటాన్స్ విజయంఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 36 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులకే పరిమితమైంది.ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(48) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. తిలక్ వర్మ(39) పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా కీలక సమయంలో బ్యాటింగ్కు వచ్చిన హార్దిక్ పాండ్యా చేతులేత్తేశాడు. 17 బంతుల్లో 11 పరుగులు చేసిన హార్దిక్ ముంబై ఓటమికి పరోక్షంగా కారణమయ్యాడు.ముంబై ఐదో వికెట్ డౌన్..సూర్యకుమార్ యాదవ్ రూపంలో ముంబై ఇండియన్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 48 పరుగులు చేసిన సూర్య.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో ఔటయ్యాడు. ముంబై విజయానికి 24 బంతుల్లో 77 పరుగులు కావాలి. క్రీజులోకి నమాన్ ధీర్ వచ్చాడు.ముంబై మూడో వికెట్ డౌన్..తిలక్ వర్మ రూపంలో ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. 39 పరుగులు చేసిన తిలక్ వర్మ.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి ఇంపాక్ట్ ప్లేయర్గా రాబిన్ మింజ్ వచ్చాడు. ముంబై విజయానికి 50 బంతుల్లో 100 పరుగులు కావాలి. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(37) ఉన్నారు.9 ఓవర్లకు ముంబై ఇండియన్స్ స్కోర్: 86/29 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 2 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(25), తిలక్ వర్మ(35) ఉన్నారు.సిరాజ్ ఆన్ ఫైర్.. ముంబై రెండో వికెట్ డౌన్ర్యాన్ రికెల్టన్ రూపంలో ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన రికెల్టన్.. సిరాజ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ చేశాడు. 5 ఓవర్లు ముగిసే సరికి ముంబై.. రెండు వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. క్రీజులో తిలక్ వర్మ(18), సూర్యకుమార్(8) ఉన్నారు.రోహిత్ శర్మ ఔట్.. ముంబై తొలి వికెట్ డౌన్రోహిత్ శర్మ రూపంలో ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. మహ్మద్ సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి తిలక్ వర్మ వచ్చాడు.సుదర్శన్ హాఫ్ సెంచరీ.. ముంబై ముందు భారీ టార్గెట్అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు సమిష్టగా రాణించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో సాయిసుదర్శన్(63) టాప్ స్కోరర్గా నిలవగా.. శుబ్మన్ గిల్(38), జోస్ బట్లర్(39) రాణించారు. ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టగా.. బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ తలా వికెట్ సాధించారు.19 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 186/6గుజరాత్ టైటాన్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది. 18 ఓవర్లో ఆఖరి బంతికి బౌల్ట్ బౌలింగ్లో సుదర్శన్(63) ఔట్ కాగా.. 19 ఓవర్లో వరుస క్రమంలో రాహుల్ తెవాటియా, రూథర్ ఫర్డ్ ఔటయ్యారు. 19 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.గుజరాత్ మూడో వికెట్ డౌన్.. షారూఖ్ ఔట్షారూఖ్ ఖాన్ రూపంలో గుజరాత్ టైటాన్స్ మూడో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన షారూఖ్.. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ఔటయ్యాడు. 16 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ మూడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.గుజరాత్ రెండో వికెట్ డౌన్..జోస్ బట్లర్ రూపంలో గుజరాత్ టైటాన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 39 పరుగులు చేసిన బట్లర్.. ముజీబ్ ఉర్ రెహ్మన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 14 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ రెండు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. క్రీజులో సాయిసుదర్శన్(49), షారూఖ్ ఖాన్(0) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న జోస్ బట్లర్..12 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. క్రీజులో సాయి సుదర్శన్(42), బట్లర్(26) ఉన్నారు.తొలి వికెట్ డౌన్.. శుబ్మన్ గిల్ ఔట్శుబ్మన్ గిల్ రూపంలో గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. 38 పరుగులు చేసిన గిల్.. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి జోస్ బట్లర్ వచ్చాడు. 9 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది.దూకుడుగా ఆడుతున్న గిల్, సుదర్శన్గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు సాయిసుదర్శన్(32), శుబ్మన్ గిల్(32) దూకుడుగా ఆడుతున్నారు. 6 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 66 పరుగులు చేసింది.నిలకడగా ఆడుతున్న గుజరాత్ ఓపెనర్లుటాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు శుబ్మన్ గిల్(13), సాయిసుదర్శన్(13) ఉన్నారు.ఐపీఎల్-2025లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి వచ్చాడు. గుజరాత్ మాత్రం తమ జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు.తుది జట్లుముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, సత్యనారాయణ రాజు, ముజీబ్ ఉర్ రెహమాన్, ట్రెంట్ బౌల్ట్గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ XI: శుభమన్ గిల్ (కెప్టెన్), B సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షెర్ఫానే రూథర్ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ -
టీమిండియా కెప్టెన్గా శుబ్మన్ గిల్..!?
ఐపీఎల్-2025 సీజన్ ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడేందుకు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. అయితే ఈ టూర్కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. పేలవ ఫామ్ కారణంగా ఇంగ్లండ్తో సిరీస్కు దూరంగా ఉండాలని రోహిత్ శర్మ నిర్ణయించుకున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.రోహిత్ ఇప్పటికే తన నిర్ణయాన్ని బీసీసీఐ తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. అతడు ఇంకా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో ఉన్నాడు. ఐపీఎల్-2025లో బుమ్రా ఆడేది అనుమానమే మారింది.బుమ్రా పూర్తి ఫిట్నెస్ సాధించడానికి మరింత సమయం పట్టే అవకాశముంది. ఒకవేళ రోహిత్, బుమ్రా దూరమైతే.. ఇంగ్లండ్ పర్యటనలో భారత కెప్టెన్గా ఎవరు బాధ్యతలు చేపడాతరన్న ప్రశ్న అందరి మెదడలను తొలుస్తున్న ప్రశ్న. ఈ క్రమంలో రోహిత్, బుమ్రా బ్యాకప్గా శుబ్మన్ గిల్ పేరును సెలక్టర్లు పరిశీలిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.కాగా గిల్ ప్రస్తుతం వన్డేల్లో భారత జట్టు వైస్ కెప్టెన్గా ఉన్నాడు. అదేవిధంగా ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఇక భారత క్రికెట్ జట్టు ఏడాది జూన్ 20న ఇంగ్లాండ్ పర్యటనను ప్రారంభిస్తుంది. మొదటి టెస్ట్ మ్యాచ్ హెడింగ్లీలోని లీడ్స్ వేదికగా జరుగనుంది.తదుపరి నాలుగు టెస్ట్లు ఎడ్జ్బాస్టన్, లార్డ్స్, ఓల్డ్ ట్రాఫోర్డ్, కెన్నింగ్టన్ ఓవల్ వేదికలపై జరగనున్నాయి. అంతకంటే ముందు భారత-ఎ జట్టు రెండు అనాధికారిక టెస్టు మ్యాచ్లు ఆడనుంది. ఐపీఎల్-2025 చివరి వారంలో ఇంగ్లండ్ టూర్కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించే అవకాశముంది.చదవండి: సీఎస్కే బౌలర్ ‘ఓవరాక్షన్’.. ఇచ్చిపడేసిన కోహ్లి! నవ్వేసిన జడ్డూ -
ఆర్సీబీ ఇక కోహ్లిపై ఆధారపడదు: భారత మాజీ క్రికెటర్
ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. వరుసగా రెండో మ్యాచ్లోనూ ఆర్సీబీ విజయం సాధించింది. శుక్రవారం చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్లో 50 పరుగుల తేడాతో సీఎస్కేను ఆర్సీబీ చిత్తు చేసింది. దీంతో సీఎస్కే కంచుకోటను ఆర్సీబీ బద్దలు కొట్టింది. 2008 సీజన్ తర్వాత చెపాక్లో సీఎస్కేను ఆర్సీబీ ఓడించడం ఇదే తొలిసారి.అయితే ఈ మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. 30 బంతులు ఎదుర్కొని కేవలం 31 పరుగులు మాత్రమే చేసి విరాట్ ఔటయ్యాడు. ఈ నేపథ్యంలో కోహ్లి ఇన్నింగ్స్పై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు."ఈ మ్యాచ్లో చెన్నై బౌలర్లను ఎదుర్కొనేందుకు విరాట్ కోహ్లి ఇబ్బందిపడ్డాడు. తను ఎదుర్కొన్న తొలి బంతి నుంచే కోహ్లి అంత కంఫార్ట్గా కన్పించలేదు. ఎక్కువగా లెగ్ సైడ్ షాట్లు ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతిని మిడిల్ చేయలేకపోయాడు. పతిరానా బౌలింగ్లో తన హెల్మెట్కు బంతి బలంగా తగిలింది. వెంటనే ఓ సిక్స్, ఫోరు కొట్టి టచ్లోకి వచ్చినట్లు కన్పించాడు. కానీ వెంటనే నూర్ అహ్మద్ బౌలింగ్లో లాఫ్టెడ్ స్వీప్ ఆడుతూ డీప్ స్క్వేర్ లెగ్లో దొరికిపోయాడు. అస్సలు ఇది కోహ్లి ఇన్నింగ్సే కాదు. కోహ్లి ఫెయిల్ అయినప్పటికి మిగితా ప్లేయర్లు అద్బుతంగా రాణించారు.విరాట్ 30 బంతుల్లో 31 పరుగులు చేస్తే.. మిగిలిన ప్లేయర్ చెలరేగడంతో ఆర్సీబీ 196 పరుగులు చేసింది. అంటే కోహ్లి 5 ఓవర్లు ఆడినప్పటికి.. మిగితా ప్లేయర్ల 15 ఓవర్లలో జట్టుకు 166 పరుగులు అందించారు. గతంలో కోహ్లి బాగా ఆడితే మిగితా ఆర్సీబీ బ్యాటర్లు నిరాశపరిచేవారు.దీంతో ప్రతీసారి జట్టు 15 నుంచి 20 పరుగులు వెనకబడి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కోహ్లి ఇబ్బంది పడుతున్నప్పటికీ.. మిగితా ప్లేయర్లు ఎటాక్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ అద్భుతంగా ఉంది" అని తన యూట్యూబ్ ఛానల్లో చోప్రా పేర్కొన్నాడు.చదవండి: PAK vs NZ: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ ప్లేయర్.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా -
సీఎస్కే బౌలర్ ‘ఓవరాక్షన్’.. ఇచ్చిపడేసిన కోహ్లి! నవ్వేసిన జడ్డూ
ఐపీఎల్-2025లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)- చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య పోరు ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ముఖాముఖి పోటీలో సీఎస్కేదే పైచేయి అయినా.. ఈసారి మాత్రం ఆర్సీబీ అదరగొట్టింది. చెన్నై కంచుకోటను బద్దలు కొట్టి 2008 తర్వాత మొదటిసారి చెపాక్లో జయకేతనం ఎగురవేసింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 196 పరుగులు సాధించింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్(32), విరాట్ కోహ్లి (Virat Kohli- 31) ఫర్వాలేదనిపించగా.. దేవదత్ పడిక్కల్(14 బంతుల్లో 27), కెప్టెన్ రజత్ పాటిదార్ (32 బంతుల్లో 51), టిమ్ డేవిడ్ (8 బంతుల్లో 22 నాటౌట్) రాణించారు.ఇక చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా.. మతీశ పతిరణకు రెండు వికెట్లు దక్కాయి. మిగతా వాళ్లలో ఖలీల్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో చెన్నై 146 పరుగులకే పరిమితం కావడంతో ఆర్సీబీ 50 పరుగుల తేడాతో గెలుపొందింది. Back 2️⃣ back wins! 🔥Chat, how are we feeling? 🤩pic.twitter.com/8xT6VaS7hf— Royal Challengers Bengaluru (@RCBTweets) March 28, 2025 చెన్నై బ్యాటర్లలో రచిన్ రవీంద్ర (31 బంతుల్లో 41), రవీంద్ర జడేజా (19 బంతుల్లో 25), మహేంద్ర సింగ్ ధోని (16 బంతుల్లో 30 నాటౌట్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.జడేజాతో ముచ్చట్లుఇదిలా ఉంటే.. మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లి.. చెన్నై స్టార్ రవీంద్ర జడేజాతో కలిసి ముచ్చట్లు పెట్టాడు. ఆ సమయంలో కోహ్లి కాస్త సీరియస్గా మాట్లాడుతున్నట్లు కనిపించగా.. జడ్డూ మాత్రం నవ్వులు చిందించాడు. ఇంతలో అక్కడికి చెన్నై పేసర్ ఖలీల్ అహ్మద్ రాగానే కోహ్లి మరింత సీరియస్ అయినట్లు కనిపించింది. అతడితో వాదనకు దిగిన కోహ్లి.. ఖలీల్ ఏం చెప్తున్నా పట్టించుకోకుండా తన పాటికి తాను ఏదో మాట్లాడుతూనే కనిపించాడు.కోహ్లి చేయి పట్టుకుని మరీ ఖలీల్ అతడిని అనునయించేందుకు ప్రయత్నించగా.. అతడు మాత్రం అందుకు సుముఖంగా కనిపించలేదు. ఇంతలో కోహ్లికి డ్రెస్సింగ్రూమ్ నుంచి పిలుపు రావడటంతో వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.సీఎస్కే బౌలర్ ‘ఓవరాక్షన్’కాగా చెన్నై బౌలింగ్ అటాక్ను ఆరంభించిన ఖలీల్.. ఆర్సీబీ ఇన్నింగ్స్లో మూడో ఓవర్ కూడా తానే వేశాడు. ఆ ఓవర్ తొలి బంతికే కోహ్లిని ఎల్బీడబ్ల్యూ(లెగ్ బిఫోర్ వికెట్) చేసినట్లుగా భావించిన ఖలీల్.. సంబరాలు మొదలుపెట్టేశాడు. కానీ ఫీల్డ్ అంపైర్ మాత్రం నాటౌట్ ఇచ్చాడు.అయితే, అంపైర్ నిర్ణయంతో సంతృప్తి చెందని ఖలీల్.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ను ఒప్పించి డీఆర్ఎస్కు వెళ్లాడు. కానీ అక్కడ చెన్నైకి విరుద్ధంగా థర్డ్ అంపైర్ తీర్పు వచ్చింది. బంతి లెగ్ స్టంప్ ఆవలి దిశగా పిచ్ అయినట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో కోహ్లి సేవ్ అవ్వగా.. సీఎస్కే ఓ రివ్యూను కోల్పోయింది. ఈ నేపథ్యంలో కోహ్లి ఇదే విషయమై ఖలీల్తో సీరియస్గా చర్చించి ఉంటాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చదవండి: MS Dhoni: బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే! Kohli mere bacche shant hoja 😭😭 pic.twitter.com/yGITzOsOXr— n (@humsuffer_) March 29, 2025 -
చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ ప్లేయర్.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా
పాకిస్తాన్తో మూడు వన్డేల సిరీస్ను న్యూజిలాండ్ ఘనంగా ఆరంభించింది. నేపియర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో పాక్పై 73 పరుగుల తేడాతో కివీస్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఆల్రౌండర్ మహ్మద్ అబ్బాస్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. అరంగేట్ర మ్యాచ్లోనే అబ్బాస్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టాడు.తొలుత బ్యాటింగ్లో దుమ్ములేపిన అబ్బాస్.. అనంతరం బౌలింగ్లో ఓ కీలక వికెట్ కూడా పడగొట్టాడు. ఆరో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన అబ్బాస్.. ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 24 బంతుల్లోనే తన తొలి అంతర్జాతీయ హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 26 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 52 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అబ్బాస్ ఓ వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.వన్డే అరంగేట్రంలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా అబ్బాస్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా అల్రౌండర్ కృనాల్ పాండ్యా పేరిట ఉండేది. కృనాల్ పాండ్యా 2021లో ఇంగ్లండ్పై తన వన్డే అరంగేట్రంలో 26 బంతుల్లో ఆర్ధశతకం సాధించాడు. తాజా మ్యాచ్లో 24 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన అబ్బాస్.. పాండ్యా ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. కాగా కివీస్ తరుపన డెబ్యూచేసిన అబ్బాస్.. పాకిస్తాన్ మూలాలు ఉన్న ఆటగాడు కావడం గమనార్హం.చాప్మన్ సూపర్ సెంచరీ..ఇక ఈమ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో మార్క్ చాప్మన్ (111 బంతుల్లో 132; 13 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. అతడితో నపా డారిల్ మిచెల్ (84 బంతుల్లో 76; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ద సెంచరీతో రాణించాడు.పాక్ బౌలర్లలో ఇర్ఫాన్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. రౌఫ్, జావిద్ తలా రెండు వికెట్లు సాధించారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 44.1 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో బాబర్ ఆజం(76) టాప్ స్కోరర్గా నిలవగా.. మొహమ్మద్ రిజ్వాన్ (30), సల్మాన్ అఘా (58) పర్వాలేదన్పించారు. న్యూజిలాండ్ బౌలర్లలో నాథన్ స్మిత్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. డఫీ రెండు, బ్రెస్వెల్ తలా వికెట్ సాధించారు.చదవండి: MI vs GT: 41 బంతుల్లో సెంచరీ చేశాడు.. అతడిని కొనసాగించండి! -
అసాధారణ విజయాలు.. మేమంతా అందుకు అర్హులమే: రోహిత్ శర్మ
గత ఏడాది కాలంలో తాము అద్భుత విజయాలు సాధించామని.. ఇందుకు 2022లోనే పునాది పడిందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అన్నాడు. నాటి టీ20 ప్రపంచకప్ టోర్నీలో చేసిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుని.. ఐసీసీ ఈవెంట్లలో వరుస విజయాలతో సత్తా చాటామని పేర్కొన్నాడు. పరాజయాలకు పొంగిపోకుండా.. తమ బలాన్ని గుర్తించడం వల్లే ఇది సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశాడు.ఎన్నో ఎత్తుపళ్లాలుఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశామని.. వరుసగా రెండు ఐసీసీ టోర్నీలు గెలవడం ఆటగాళ్ల అంకితభావానికి నిదర్శనమని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2022లో సెమీస్లోనే నిష్క్రమించిన టీమిండియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.కెప్టెన్గా రోహిత్ శర్మ, హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) తప్పుకోవాలనే డిమాండ్లు వినిపించాయి. అయితే, మరుసటి ఏడాది నుంచి భారత జట్టు రాత మారిపోయింది. సొంతగడ్డపై అజేయంగా వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్ చేరిన రోహిత్ సేన.. ఆఖరి మెట్టుపై మాత్రం తడబడింది. ఇక ఆ తర్వాత టీ20 ప్రపంచకప్-2024లో మాత్రం ఈ తప్పిదాన్ని పునరావృతం చేయలేదు.పరాజయమన్నదే లేకుండా దూసుకుపోయి చాంపియన్గా అవతరించింది. అనంతరం ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లోనూ ఇదే తరహాలో టైటిల్ సాధించింది. లీగ్ దశలో మూడింటికి మూడు గెలిచిన టీమిండియా.. సెమీస్లో ఆస్ట్రేలియాను, ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి ట్రోఫీ సాధించింది.అప్పుడే మాకు స్పష్టత వచ్చింది..ఈ జ్ఞాపకాలను తాజాగా నెమరు వేసుకున్న టీమిండియా సారథి రోహిత్ శర్మ.. ‘‘2022లో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్లో మేము సెమీస్లోనే ఓడిపోయాం. ఆ సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే, అప్పుడే మాకో స్పష్టత వచ్చింది.జట్టులోని ప్రతి సభ్యుడి నుంచి మేము ఎలాంటి ప్రదర్శన ఆశిస్తున్నామో చెప్పాము. జట్టులో వారి పాత్ర ఏమిటో వివరించాం. అప్పటి నుంచి మా జట్టు దృక్పథం మారిపోయింది. పరాజయాలకు కుంగిపోకుండా.. మరింత గొప్పగా కమ్బ్యాక్ ఇచ్చాము.ఈ ప్రయాణంలో ఎన్నో కఠిన సవాళ్లు ఎదురయ్యాయి. అయితే, వాటన్నింటినీ అధిగమించి మా సత్తా ఏమిటో చూపించాం. కాబట్టి విజయాలను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాం. వరుస ఐసీసీ టోర్నమెంట్లలో 24 మ్యాచ్లకు గానూ 23 గెలవడం అసాధారణ విషయం.మేమంతా అందుకు అర్హులమేమేము దానిని సాధ్యం చేసి చూపించాం. బయటి నుంచి చూసే వాళ్లకు కూడా ఇది బాగానే అనిపిస్తుంది. కానీ మేము ఇందుకోసం ఎంత కష్టపడ్డామో మాకే తెలుసు. మూడు పెద్ద టోర్నమెంట్లలో జట్టు సాధించిన ఈ విజయాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ఈవెంట్లలో ఆడిన ప్రతి ఒక్క ఆటగాడు అన్ని రకాల గౌరవాలకు అర్హుడు’’ అంటూ రోహిత్ శర్మ ఉద్వేగానికి లోనయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ షేర్ చేసింది.కాగా ఐపీఎల్-2025లోనూ రోహిత్ ముంబైకే ఆడుతున్నాడు. ఈ సీజన్లో తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిన ముంబై.. శనివారం నాటి పోరులో గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది.చదవండి: MS Dhoni: బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే! View this post on Instagram A post shared by Mumbai Indians (@mumbaiindians) -
గురీందర్వీర్ సింగ్ జాతీయ రికార్డు
బెంగళూరు: భారత యువ అథ్లెట్ గురీందర్వీర్ సింగ్ 100 మీటర్ల పరుగులో జాతీయ రికార్డు నెలకొల్పాడు. పంజాబ్కు చెందిన 24 ఏళ్ల గురీందర్వీర్ సింగ్.. ఇండియన్ గ్రాండ్ ప్రిలో ఈ ఘనత సాధించాడు. శుక్రవారం జరిగిన పోటీల్లో అతను10.20 సెకన్ల్లలో లక్ష్యాన్ని చేరాడు. గతంలో ఈ రికార్డు మణికంఠ హోబ్లిధార్ (10.23 సెకన్లు) పేరిట ఉండగా... తాజాగా గురీందర్ ఆ రికార్డును బద్దలు కొట్టాడు.2021లో 10.27 సెకన్లలో వంద మీటర్లు పరిగెత్తిన ఈ పంజాబ్ స్ప్రింటర్... ఇప్పుడు దాన్ని సరిచేశాడు. ఇదే పోటీల్లో మణికంఠ 10.21 సెకన్లలో గమ్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచాడు. అతడికిదే వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన. గత కొంతకాలంగా ఈ ఇద్దరి మధ్య రసవత్తర పోరు సాగుతోంది. అమ్లన్ బొర్గోహై (10.43 సెకన్లు) మూడో స్థానంతో రేసును ముగించాడు. గురీందర్వీర్ సింగ్ 2021, 2024లో ఇంటర్ స్టేట్ చాంపియన్షిప్లలో పసిడి పతకాలు సాధించాడు.చెన్నై, మధురైలో జూనియర్ హాకీ వరల్డ్కప్ చెన్నై: ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న ఎఫ్ఐహెచ్ జూనియర్ పురుషుల హాకీ ప్రపంచకప్నకు సంబంధించిన వేదికలు ఖరారయ్యాయి. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 10 వరకు జరగనున్న ఈ టోర్నీని చెన్నై, మధురై నగరాల్లో నిర్వహించనున్నట్లు హాకీ ఇండియా (హెచ్ఐ) శుక్రవారం వెల్లడించింది. 24 జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వనుండటం ఇది మూడోసారి. 2016లో లక్నో వేదికగా, 2021లో భువనేశ్వర్లో జూనియర్ పురుషుల హాకీ ప్రపంచకప్ జరిగింది.‘చెన్నై, మధురై నగరాల్లో పోటీలు నిర్వహిస్తాం. వరల్డ్కప్లో మొత్తం 24 జట్లు పాల్గొంటున్నాయి. మధురైలో అంతర్జాతీయ మ్యాచ్లు జరగడం ఇదే తొలిసారి. భిన్నమైన నగరాలకు ఆటను విస్తరించాలనే ఉద్దేశంతోనే మధురైను వేదికగా ఎంపిక చేశాం’ అని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ పేర్కొన్నాడు. భారత్లో చివరిసారిగా 2021లో జరిగిన ప్రపంచకప్లో అర్జెంటీనా జట్టు విజేతగా నిలవగా... 2023లో కౌలాలంపూర్లో జరిగిన వరల్డ్కప్లో జర్మనీ చాంపియన్గా నిలిచింది. సెమీఫైనల్లో ఓడిన భారత్ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. మరి ఈసారి స్వదేశంలో జరగనున్న టోర్నీలో అయినా యువభారత్ విజేతగా నిలుస్తుందా చూడాలి. అనాహత్కు టైటిల్ ముంబై: జేఎస్డబ్ల్యూ ఇండియన్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో యువ క్రీడాకారణి అనాహత్ సింగ్ చాంపియన్గా నిలిచింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో భారత నంబర్వన్ ర్యాంకర్ అనాహత్ సింగ్ 3–0 (11–9, 11–5, 11–8)తో హలెన్ టాంగ్ (హాంకాంగ్)పై విజయం సాధించింది. ఈ విజయంతో అనాహత్ 300 ర్యాంకింగ్ పాయింట్లు ఖాతాలో వేసుకుంది. 17 ఏళ్ల అనాహత్కు ఇది వరుసగా ఆరో టైటిల్ కాగా... ఓవరాల్గా 11వది. మరోవైపు పురుషుల సింగిల్స్లో భారత స్టార్ ప్లేయర్ అభయ్ సింగ్ రన్నరప్గా నిలిచాడు. శుక్రవారం జరిగిన ఫైనల్లో అభయ్ సింగ్ 1–3 (10–12, 4–11, 11–7, 10–12)తో కరీమ్ (ఈజిప్ట్) చేతిలో ఓటమి పాలయ్యాడు.పుణేలో మహిళల చెస్ గ్రాండ్ ప్రి పుణే: ఫిడే మహిళల గ్రాండ్ ప్రి ఐదో అంచె పోటీలకు పుణే ఆతిథ్యమివ్వనుంది. వచ్చే నెల 13 నుంచి 24 వరకు జరగనున్న ఈ టోర్నీలో ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్ కోనేరు హంపి, ఒలింపియాడ్ స్వర్ణ పతక విజేతలు ద్రోణవల్లి హారిక, వైశాలి, దివ్య దేశ్ముఖ్ తదితరులు పాల్గొననున్నారు. మహారాష్ట్ర చెస్ సంఘం నిర్వహించనున్న ఈ టోర్నీలో చైనా గ్రాండ్మాస్టర్ జూ జినెర్, పొలినా షువలోవా (రష్యా), అలీనా కష్లిన్స్క్యా (పోలాండ్), సలిమోవా నుర్గుల్ (బల్గేరియా), బక్తుయాగ్ (మంగోలియా), మెలియా సలోమె (జార్జియా) పాల్గొననున్నారు. ఫిడే గ్రాండ్ ప్రి సిరీస్లో 14 మంది టాప్ ప్లేయర్లతో పాటు... ఆరుగురు ప్లేయర్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పాల్గొంటారు. గత సిరీస్ల ఆధారంగా ప్లేయర్ల ఎంపిక జరుగుతుంది. భారత్ యువ ప్లేయర్ ఇంటర్నేషనల్ మాస్టర్ దివ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఈ టోరీ్నలో పోటీపడనుంది. శరత్ కమల్ జోరు చెన్నై: భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) దిగ్గజం ఆచంట శరత్ కమల్... తన చివరి టోర్నీలో చక్కటి విజయాలతో దూసుకెళ్తున్నాడు. చెన్నై వేదికగా జరుగుతున్న డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నమెంట్లో శరత్ కమల్ ప్రిక్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో శరత్ 3–0 (11–8, 11–8, 11–9)తో పదో సీడ్ నికోలస్ లుమ్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించాడు. 42 ఏళ్ల శరత్... తనకంటే 23 సంవత్సరాలు చిన్నవాడైన ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం కనబర్చాడు.దేశం తరఫున ఐదుసార్లు ఒలింపిక్స్లో పాల్గొన్న శరత్ కమల్ బ్యాక్హ్యాండ్, ఫోర్ హ్యాండ్ షాట్లతో ఆకట్టుకొని వరుస గేమ్ల్లో విజయం సాధించాడు. శరత్తో పాటు పురుషుల విభాగంలో భారత్ నుంచి తెలంగాణ ప్యాడ్లర్ స్నేహిత్ సురావజ్జుల, మానవ్ ఠక్కర్ ప్రిక్వార్టర్స్కు చేరగా... మహిళల విభాగంలో కృతి్వక రాయ్ ముందంజ వేసింది. స్నేహిత్ 3–2 (8–11, 11–13, 11–9, 11–7, 12–10)తో యుకియా ఉడా (జపాన్)పై, మానవ్ 3–1 (11–4, 7–11, 11–5, 11–8)తో పిన్ లూ (ఆస్ట్రేలియా)పై గెలిచారు. మహిళల విభాగంలో పదో సీడ్ తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ 2–3 (6–11, 9–11, 11–6, 11–4, 7–11)తేడాతో కృత్వికరాయ్ చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో శరత్–స్నేహిత్ జంట 1–3 (11–9, 8–11, 9–11, 6–11)తో ఆస్ట్రేలియా జోడీ చేతిలో ఓడింది. -
ఈ ఆర్సీబీకి ఏమైంది.. వరుసగా మ్యాచ్లు గెలిచేస్తుంది.. టైటిల్ కూడా గెలుస్తుందా ఏంది..?
ఐపీఎల్ 2025లో ఆర్సీబీ గత 17 సీజన్లతో పోలిస్తే కాస్త భిన్నంగా కనిపిస్తుంది. ఈ సీజన్లో ఆ జట్టు తొలి మ్యాచ్ నుంచే విజయాల బాట పట్టింది. సాధారణంగా ఆర్సీబీ తొలి మ్యాచ్లను పెద్దగా పట్టించుకోదు. ఆ జట్టు ప్లే ఆఫ్స్కు చేరిన ప్రతిసారి ఆఖరి మ్యాచ్ల్లోనే విజయాలు సాధించింది. ఈ సీజన్లో ఆర్సీబీ వరుసగా కేకేఆర్, ముంబై ఇండియన్స్పై విజయాలు నమోదు చేసింది. ఈ రెండు విజయాలు ప్రత్యర్థుల అడ్డాలో రావడం మరింత ప్రత్యేకం. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన కేకేఆర్ను ఆర్సీబీ ఈడెన్ గార్డన్స్లో ఓడించింది. ఐదు సార్లు ఛాంపియన్ అయిన సీఎస్కేను 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చెపాక్లో మట్టికరిపించింది.ఈ సీజన్లో ఆర్సీబీ జట్టుగా కూడా బలంగా కనిపిస్తుంది. గత సీజన్లలోలా ఒకరిద్దరిపై ఆధారపడినట్లు కనిపించడం లేదు. కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ కామ్గా ఉంటూ ఆశ్చర్యకర రీతిలో వ్యూహాలు పన్నుతుకున్నాడు. పాటిదార్ కెప్టెన్సీ కూడా ఈసారి ఆర్సీబీ టైటిల్ గెలుపును సూచిస్తుంది. పాటిదార్ వ్యక్తిగతంగా కూడా రాణించడం ఆర్సీబీకి మరో శుభ సూచకం. ఈ సీజన్లో ఆర్సీబీ గెలిచిన రెండు మ్యాచ్ల్లో పాటిదార్ చాలా మూల్యమైన ఇన్నింగ్స్లు ఆడాడు. పాటిదార్ బలంగా షాట్లు ఆడుతూ స్పిన్నర్లను బెంబేలెత్తిస్తున్నాడు. పాటిదార్ ఇదే ఫామ్ను కొనసాగిస్తే.. ఆర్సీబీ ఈసారి ఖచ్చితంగా అద్భుతం చేస్తుంది.ఈ సీజన్లో ఆర్సీబీకి మరో శుభ సూచకం హాజిల్వుడ్ ఫామ్. హాజిల్వుడ్ ఈ సీజన్లో భీకర ఫామ్లో ఉన్నాడు. ఆర్సీబీ గెలిచిన రెండు మ్యాచ్ల్లో అతడు కీలకపాత్ర పోషించాడు. ఈ రెండు మ్యాచ్ల్లో హాజిల్వుడ్ ఆదిలోనే వికెట్లు తీసి ప్రత్యర్ధులను డిఫెన్స్లో పడేశాడు. ఈ సీజన్లో ఆర్సీబీకి లభించిన మరో ఎక్స్ ఫ్యాక్టర్ ఫిల్ సాల్ట్. సాల్ట్ ఈ సీజన్లో ఆడిన తొలి రెండు మ్యాచ్ల్లో సుడిగాలి ఇన్నింగ్స్లు ఆడి జట్టుకు బలమైన పునాది వేశాడు. తొలి మ్యాచ్లో అర్ద సెంచరీతో మెరిసిన విరాట్.. సీఎస్కేతో జరిగిన మ్యాచ్లోనూ పర్వాలేదనిపించాడు.తొలి మ్యాచ్లో తన స్పిన్ బౌలింగ్తో అద్బుతం చేసిన కృనాల్ పాండ్యా కూడా ఈ సీజన్లో ఆర్సీబీకి టైటిల్ అందించేలా ఉన్నాడు. దేవ్దత్ పడిక్కల్, జితేశ్ శర్మ కూడా లైన్లోకి వస్తే ఆర్సీబీ బ్యాటింగ్ యూనిట్ మరింత పటిష్టంగా తయారవుతుంది. విదేశీ విధ్వంకర వీరులు లివింగ్స్టోన్, టిమ్ డేవిడ్ తమ సామర్థ్యం మేరకు రాణిస్తే ఈ సీజన్లో టైటిల్ గెలవకుండా ఆర్సీబీని ఎవ్వరూ ఆపలేరు. ఆర్సీబీలో దేశీయ బౌలింగ్ విభాగం కూడా చాలా పటిష్టంగా ఉంది. భువనేశ్వర్ కుమార్ చేరిక ఆర్సీబీ పేస్ విభాగానికి మరింత ఊపునిచ్చింది. యశ్ దయాల్ సీఎస్కేతో మ్యాచ్లో ఒకే ఒవర్లో రెండు వికెట్లు తీసి మంచి టచ్లో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. స్పిన్నర్ సుయాశ్ శర్మ తొలి మ్యాచ్లో మ్యాజిక్ చేశాడు. సీఎస్కేతో మ్యాచ్లో సుయాశ్ వికెట్లు తీయనప్పటికీ.. పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఓవరాల్గా ఆర్సీబీ ఈ సీజన్లో చాలా పటిష్టంగా కనిపిస్తుంది. ప్రతి సీజన్కు ముందు ఈ సాలా కప్ నమ్మదే అని డప్పు కొట్టుకునే ఆర్సీబీ ఫ్యాన్స్ గతానికి భిన్నంగా ఈసారి ఎక్కువగా హడావుడి చేయడం లేదు. ఇదీ ఓ రకంగా ఆర్సీబీ టైటిల్ గెలుపుకు సూచకంగా తీసుకోవచ్చు. అన్నిటి కంటే ఎక్కువగా ఈ సారి అంకెల కో ఇన్సిడెన్స్ ఆర్సీబీకి కలిసొస్తుందేమో అనిపిస్తుంది. ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి జెర్సీ నంబర్ 18 కాగా.. ఈ ఐపీఎల్ సీజన్ సంఖ్య కూడా పద్దెనిమిదే కావడం విశేషం. మరి 18 సీజన్ ఆర్సీబీ టైటిల్ విన్నింగ్ సీజన్ అవుతుందో లేదో వేచి చూడాలి. -
IPL 2025: భువీ వరల్డ్ రికార్డు
ఐపీఎల్-2025 సీజన్లో భాగంగా నిన్న (మార్చి 28) జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ, సీఎస్కే తలపడ్డాయి. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఆర్సీబీ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ అన్ని విభాగాల్లో సత్తా చాటి సీజన్లో వరుసగా రెండో విజయం నమోదు చేసింది. సీజన్ ఆరంభ మ్యాచ్లో ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్ను మట్టికరిపించిన విషయం తెలిసిందే. రెండు వరుస విజయాల తర్వాత ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.సీఎస్కేతో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. రజత్ పాటిదార్ (32 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫిల్ సాల్ట్ (16 బంతుల్లో 32; 5 ఫోర్లు, సిక్స్), పడిక్కల్ (14 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (8 బంతుల్లో 22 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ (4-0-36-3), పతిరణ (4-0-36-2), ఖలీల్ అహ్మద్ (4-0-28-1) బాగానే బౌలింగ్ చేసినా అశ్విన్ (2-0-22-1), జడ్డూ (3-0-37-0) సామర్థ్యం మేరకు రాణించలేక ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో సీఎస్కే ఆదిలోనే చేతులెత్తేసింది. 8 పరుగులకే (రెండో ఓవర్లో) 2 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు.. ఆతర్వాత కూడా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారు. హాజిల్వుడ్ (4-0-21-3), లవింగ్స్టోన్ (4-0-28-2), యశ్ దయాల్ (3-0-18-2) వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేసి సీఎస్కేను కట్టడి చేశారు. ఫలితంగా ఆర్సీబీ సీఎస్కేను 17 ఏళ్ల తర్వాత వారి సొంత ఇలాకాలో ఓడించింది. సీఎస్కే ఇన్నింగ్స్లో రచిన్ రవీంద్ర (41) టాప్ స్కోరర్గా నిలువగా.. ఆఖర్లో ధోని (16 బంతుల్లో 30 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టు విజయానికి ఉపయోగపడని మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.ఈ మ్యాచ్లో అర్ద సెంచరీ సాధించిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. తదుపరి మ్యాచ్లో ఆర్సీబీ గుజరాత్ టైటాన్సను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 2న ఆర్సీబీ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో జరుగనుంది. సీఎస్కే విషయానికొస్తే.. తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ను చిత్తు చేసిన ఈ జట్టు.. తమ మూడో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ మార్చి 30న గౌహతిలో జరుగనుంది.భువీ వరల్డ్ రికార్డుఈ మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వరల్డ్ రికార్డు సాధించాడు. టీ20ల్లో ఓ జట్టు తరఫున ఆడేందుకు అత్యధిక గ్యాప్ తీసుకున్న ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 2009లో ఆర్సీబీ తరఫున తన ఆఖరి మ్యాచ్ ఆడిన భువీ.. 238 మ్యాచ్ల తర్వాత మళ్లీ ఆ జట్టుకు (ఐపీఎల్ 2025లో సీఎస్కేతో మ్యాచ్) ఆడాడు.దాదాపు 16 ఏళ్లు ఆర్సీబీకి దూరం ఉన్న భువీ.. ఈ సీజన్ మెగా వేలంలో తిరిగి ఆర్సీబీ పంచన చేరాడు. 35 ఏళ్ల ఈ మీరట్ బౌలర్ను ఆర్సీబీ ఈ సీజన్ మెగా వేలంలో రూ. 10.75 కోట్లకు దక్కించుకుంది. 2009లో ఆర్సీబీ వీడాక భువీ పూణే వారియర్స్, సన్రైజర్స్ హైదరాబాద్కు ఆడాడు. భువీ సన్రైజర్స్కు పదేళ్లు ప్రాతినిథ్యం వహించాడు. భువీ.. 2016 సీజన్లో టైటిల్ గెలిచిన సన్రైజర్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆ సీజన్లో అతను 23 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ హోల్డర్గా నిలిచాడు.టీ20ల్లో ఓ జట్టు తరఫున ఆడేందుకు అత్యధిక గ్యాప్ (మ్యాచ్లు) తీసుకున్న ఆటగాళ్లు..238 మ్యాచ్లు - RCB తరపున భువనేశ్వర్ కుమార్ (2009-2025)*225 - RCB తరపున కర్ణ్ శర్మ (2009-2023)206 - KKR తరపున మన్దీప్ సింగ్ (2010-2023)164 - హాంప్షైర్ తరపున బెన్నీ హోవెల్ (2011-2023)155 - DD/DC తరపున శిఖర్ ధవన్ (2008-2019) -
MI vs GT: 41 బంతుల్లో సెంచరీ చేశాడు.. అతడిని కొనసాగించండి!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025లో మరో ఆసక్తికరపోరుకు రంగం సిద్ధమైంది. మాజీ చాంపియన్లు ముంబై ఇండియన్స్ (MI)- గుజరాత్ టైటాన్స్ (GT) శనివారం అహ్మదాబాద్ వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్తో ముంబై ప్రస్తుత, గుజరాత్ మాజీ సారథి హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఐపీఎల్ తాజా ఎడిషన్లో ఎంట్రీ ఇవ్వనున్నాడు.అయితే, హార్దిక్ రాకతో ముంబై తుదిజట్టులో ఎవరిపై వేటు పడుతుందనే అంశంపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కెప్టెన్ ఆగమనం వల్ల ముంబై మరింత పటిష్టంగా మారుతుందని.. అయితే, రియాన్ రికెల్టన్ లేదంటే.. విల్ జాక్స్ సేవలను జట్టు కోల్పోతుందని పేర్కొన్నాడు.జాక్స్కే ఓటు వేస్తాఈ ఇద్దరిలో ఎవరిని కొనసాగించాలంటే తాను మాత్రం జాక్స్కే ఓటు వేస్తానని ఆకాశ్ చోప్రా స్పష్టం చేశాడు. ఈ మేరకు.. ‘‘హార్దిక్ పాండ్యా జట్టులోకి రావడం ముంబైకి భారీ ఉపశమనం. కెప్టెన్గా, బ్యాటర్గా అతడు లేని లోటు గత మ్యాచ్లో స్పష్టంగా కనిపించింది.హార్దిక్ రాక వల్ల మిడిలార్డర్లో స్థిరత్వం చేకూరుతుంది. అయితే, అతడు వచ్చాడు కాబట్టి రియాన్ రికెల్టన్ లేదంటే విల్ జాక్స్.. ఈ ఇద్దరిలో ఒకరు తప్పుకోక తప్పదు. నేనైతే విల్ జాక్స్ను కొనసాగించాలని చెబుతా.రికెల్టన్ను తప్పించండిఎందుకంటే గతంలో అతడు ఈ వేదికపై విధ్వసంకర శతకం బాదాడు. మేటి స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్లో సిక్సర్లు బాదాడు. అప్పుడు అతడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడేవాడు. ఏదేమైనా.. రికెల్టన్ను తప్పించి.. విల్ జాక్స్ను కొనసాగిస్తూ.. రికెల్టన్ స్థానంలో రాబిన్ మింజ్ను వికెట్ కీపర్గా వాడుకుంటే సరిపోతుంది’’ అని కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.ఇక బౌలింగ్ విభాగం గురించి ప్రస్తావిస్తూ.. ‘‘పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా రాకతో బౌలింగ్ యూనిట్ కూడా బలపడుతుంది. ట్రెంట్ బౌల్ట్, మిచెల్ సాంట్నర్లతో పాటు రీస్ టాప్లీను ఆడించవచ్చు. హార్దిక్ రాకతో ముంబై తుదిజట్టులో భారీ మార్పులు ఖాయం’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.అందుకే తొలి మ్యాచ్కు దూరంఇదిలా ఉంటే.. విల్ జాక్స్ గతేడాది ఆర్సీబీకి ఆడుతూ.. గుజరాత్తో మ్యాచ్లో 41 బంతుల్లోనే అజేయ శతకంతో మెరిశాడు. మరోవైపు.. గతేడాది ఆఖరి లీగ్ మ్యాచ్లో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా.. హార్దిక్ పాండ్యాపై నిషేధం పడింది. అందుకే ఐపీఎల్-2025లో ముంబై ఆరంభ మ్యాచ్కు అతడు దూరమయ్యాడు. కాగా ఈ ఏడాది తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్తో తలపడ్డ ముంబై.. నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది.ఐపీఎల్-2025లో తమ తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తుదిజట్టురోహిత్ శర్మ, రియాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, నమన్ ధీర్, రాబిన్ మింజ్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, సత్యనారాయణ రాజు.బెంచ్: విఘ్నేశ్ పుతూర్, అశ్వనీ కుమార్, రాజ్ బవా, కార్బిన్ బాష్, కర్ణ్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రీస్ టాప్లీ, ముజీబ్ ఉర్ రెహమాన్, హార్దిక్ పాండ్యా, క్రిష్ణన్ శ్రీజిత్, అర్జున్ టెండుల్కర్, బెవాన్ జేకబ్స్.చదవండి: ఇంత త్వరగా వస్తాడనుకోలేదు: ధోనిపై సెహ్వాగ్ ఘాటు విమర్శలు -
ఐపీఎల్-2025 షెడ్యూల్లో మార్పు
ఐపీఎల్ 2025 షెడ్యూల్లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఏప్రిల్ 6న (ఆదివారం) ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ ఏప్రిల్ 8కి వాయిదా పడింది. ఏప్రిల్ 8న (మంగళవారం) ఈ మ్యాచ్ అదే వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) కోల్కతా పోలీసుల విజ్ఞప్తి మేరకు బీసీసీఐ షెడ్యూల్ను సవరించింది. ఏప్రిల్ 6న శ్రీ రామ నవమి కావడంతో కోల్కతాలో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అదే రోజు మ్యాచ్ జరుగనుండటంతో కోల్కతా పోలీసులకు మ్యాచ్ భద్రతా ఏర్పాట్లు చేయడం కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ తేదీని వాయిదా వేయాలని క్యాబ్, కోల్కతా పోలిసులు బీసీసీఐని కోరారు. వారి అభ్యర్ధన మేరకు బీసీసీఐ షెడ్యూల్ను మార్చింది. కేకేఆర్, లక్నో మ్యాచ్ వాయిదా పడిన విషయాన్ని బీసీసీఐ నిన్న అధికారికంగా ప్రకటించింది. ఈ మ్యాచ్ మినహా మిగతా షెడ్యూల్లో ఎలాంటి మార్పులుండవని స్పష్టం చేసింది.ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 6న రెండు మ్యాచ్లు జరగాల్సి ఉన్నాయి. కేకేఆర్, లక్నో మ్యాచ్ మధ్యాహ్నం షెడ్యూలై ఉండగా.. అదే రోజు రాత్రి (7:30) సన్రైజర్స్, గుజరాత్ మ్యాచ్ హైదరాబాద్లో జరగాల్సి ఉంది. సవరించిన షెడ్యూల్ ప్రకారం కేకేఆర్, లక్నో మ్యాచ్ వాయిదా పడగా.. గుజరాత్, సన్రైజర్స్ మ్యాచ్ యధాతథంగా జరుగనుంది. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 8న రెండు మ్యాచ్లు జరుగనున్నాయి. మధ్యాహ్నం కేకేఆర్, లక్నో మ్యాచ్ జరుగనుండగా.. రాత్రి (7:30) చండీఘడ్లో పంజాబ్, సీఎస్కే ఢీకొంటాయి.ఇదిలా ఉంటే, ఐపీఎల్లో ఇవాళ (మార్చి 29) అహ్మదాబాద్ వేదికగా ముంబై, గుజరాత్ తలపడనున్నాయి. ఈ సీజన్లో ఇరు జట్లకు ఇది రెండో మ్యాచ్. ఇరు జట్లు తమతమ తొలి మ్యాచ్ల్లో పరాజయాలు ఎదుర్కొన్నాయి. ముంబై సీఎస్కే చేతిలో.. గుజరాత్ పంజాబ్ చేతిలో భంగపడ్డాయి. నేటి మ్యాచ్లో ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో అత్యంత సఫలమైన జట్టుగా ఆర్సీబీ ఉంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. -
ఇంత త్వరగా వస్తాడనుకోలేదు: ధోనిపై సెహ్వాగ్ ఘాటు విమర్శలు
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) స్టార్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) ఆట తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తో మ్యాచ్లో ‘తలా’ అంత త్వరగా బ్యాటింగ్కు వస్తాడని ఊహించలేదన్నాడు. ఇందుకు కారణమేమిటో తనకు అర్థంకాలేదంటూ సీఎస్కే బ్యాటర్లపై జోకులు వేశాడు.ఐపీఎల్-2025లో భాగంగా సీఎస్కే శుక్రవారం ఆర్సీబీతో తలపడింది. సొంతమైదానం చెపాక్లో టాస్ గెలిచిన చెన్నై.. ప్రత్యర్థిని తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 196 పరుగులు చేసింది. అయితే, లక్ష్య ఛేదనలో చెన్నై 146 పరుగులకే పరిమితమైంది.ఓపెనర్లలో రచిన్ రవీంద్ర (31 బంతుల్లో 41) ఫర్వాలేదనిపించగా.. రాహుల్ త్రిపాఠి (5) మరోసారి విఫలమయ్యాడు. వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరీ ఘోరంగా డకౌట్ అయ్యాడు. ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేసిన దీపక్ హుడా 4, సామ్ కర్రన్ 8, శివం దూబే 19 పరుగులకు వెనుదిరిగారు.తొమ్మిదో స్థానంలో ధోనిఈ క్రమంలో ఏడో స్థానంలో రవీంద్ర జడేజా (19 బంతుల్లో 25) రాగా.. రవిచంద్రన్ అశ్విన్(8 బంతుల్లో 11) ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. ఇక పవర్ఫుల్ ఫినిషర్గా పేర్కొంది ధోని తొమ్మిదో నంబర్లో బ్యాట్తో రంగంలోకి దిగి 16 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. A never ending story 😊Last over 🤝 MS Dhoni superhits 🔥Scorecard ▶ https://t.co/I7maHMwxDS #TATAIPL | #CSKvRCB | @ChennaiIPL pic.twitter.com/j5USqXvf7r— IndianPremierLeague (@IPL) March 28, 2025అతడి ధనాధన్ ఇన్నింగ్స్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. అయితే, జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ ఆల్రౌండర్ల తర్వాత ధోని బ్యాటింగ్కు రావడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.43 ఏళ్ల ధోనిని కేవలం వికెట్ కీపర్ బ్యాటర్గా మాత్రమే జట్టులో ఉంచితే.. సీఎస్కే మున్ముందు మరిన్ని చేదు అనుభవాలు చూస్తుందనే హెచ్చరికలు వస్తున్నాయి. జట్టుకు అవసరమైన వేళనైనా తలా ఇంకాస్త ముందుగా బ్యాటింగ్కు రావాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, మనోజ్ తివారి ధోనిపై క్రిక్బజ్ షోలో జోకులు వేశారు. సెహ్వాగ్ మాట్లాడుతూ.. ‘‘ఈసారి చాలా తొందరగానే బ్యాటింగ్కు వచ్చాడే!’’ అని సెటైర్ వేయగా.. ‘‘అవును.. నేనైతే అతడు పదో స్థానంలో వస్తాడేమో అనుకున్నా’’ అని బదులిచ్చాడు.అతడు తొందరగా బ్యాటింగ్కు వచ్చాడా?ఇందుకు స్పందిస్తూ.. ‘‘16 ఓవర్ల ఆట పూర్తైన తర్వాత వచ్చాడు. మామూలుగా అయితే, 19 లేదా 20వ ఓవర్లోనే అతడు బ్యాటింగ్కు వస్తాడు. అందుకే త్వరగా వచ్చాడని అన్నాను. మీకూ అలాగే అనిపిస్తోందా?అతడు తొందరగా బ్యాటింగ్కు వచ్చాడా? లేదంటే మిగతా బ్యాటర్లు త్వరత్వరగా వికెట్లు కోల్పోయి అతడిని రప్పించారా?’’ అని సెహ్వాగ్ వ్యంగ్యంగా కామెంట్లు చేశాడు. కాగా ధోని ఈ మ్యాచ్లో 30 పరుగులు చేసిన క్రమంలో.. సీఎస్కే తరఫున అత్యధిక పరుగులు (204 ఇన్నింగ్స్లో 4699) సాధించిన క్రికెటర్గా చరిత్రకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు సురేశ్ రైనా పేరిట ఉండేది. అతడు చెన్నై తరఫున 171 ఇన్నింగ్స్ ఆడి 4687 పరుగులు చేశాడు. ఐపీఎల్-2025: చెన్నై వర్సెస్ బెంగళూరు👉 బెంగళూరు స్కోరు: 196/7 (20)👉చెన్నై స్కోరు: 146/8 (20)👉ఫలితం: యాభై పరుగుల తేడాతో చెన్నైపై బెంగళూరు విజయం.చదవండి: ఇదేం ప్రశ్న? ఆఖర్లో ఎవరు గెలుస్తారో చూడాలి: సీఎస్కే కోచ్ ఆగ్రహం -
NZ VS PAK 1st ODI: శతక్కొట్టిన చాప్మన్.. వన్డేల్లోనూ మారని పాక్ తీరు
పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం న్యూజిలాండ్లో పర్యటిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు వరుస పరాజయాలతో దూసుకుపోతుంది. ఈ పర్యటనలో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 1-4 తేడాతో కోల్పోయిన పాక్.. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను కూడా ఘోర పరాజయంతో ప్రారంభించింది. నేపియర్ వేదికగా ఇవాళ (మార్చి 29) జరిగిన తొలి వన్డేలో పాక్ 73 పరుగుల తేడాతో ఓడింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఆ జట్టు ప్రత్యర్ధిని భారీ స్కోర్ చేయనిచ్చింది. టీ20 సిరీస్లో రాణించిన హరీస్ రౌఫ్ (10-1-38-2) ఒక్కడే ఈ మ్యాచ్లోనూ రాణించాడు. ఇర్ఫాన్ ఖాన్ (5-0-51-3), అకీఫ్ జావెద్ (10-1-55-2), నసీం షా (10-1-60-1), మొహమ్మద్ అలీ (10-0-53-1) వికెట్లు తీసినా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఫలితంగా న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది.న్యూజిలాండ్ బ్యాటర్లలో మార్క్ చాప్మన్ (111 బంతుల్లో 132; 13 ఫోర్లు, 6 సిక్సర్లు) శతక్కొట్టాడు. డారిల్ మిచెల్ (84 బంతుల్లో 76; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ద సెంచరీతో రాణించాడు. కెరీర్లో తొలి మ్యాచ్ ఆడుతున్న పాక్ జాతీయుడు ముహమ్మద్ అబ్బాస్ తన జన్మ దేశంపై విరుచుకుపడ్డాడు. అబ్బాస్ 26 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. 50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన న్యూజిలాండ్ను చాప్మన్, మిచెల్ ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 199 పరుగులు జోడించి జట్టు భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో పాక్కు శుభారంభం లభించింది. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ (36), ఉస్మాన్ ఖాన్ (39) తొలి వికెట్కు 83 పరుగులు జోడించారు. అయితే వీరిద్దరు 5 పరుగుల వ్యవధిలో ఔటయ్యారు. ఆతర్వాత బాబర్ ఆజమ్ (76).. మొహమ్మద్ రిజ్వాన్ (30), సల్మాన్ అఘా (58) సాయంతో ఇన్నింగ్స్ను నిర్మించాడు. బాబర్ 249 పరుగుల స్కోర్ వద్ద నాలుగో వికెట్గా వెనుదిరిగాడు. అనంతరం పాక్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. 22 పరుగుల వ్యవధిలో ఆ జట్టు మిగతా ఆరు వికెట్లు కోల్పోయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. బాబర్ క్రీజ్లో ఉన్నంత సేపు ఈ మ్యాచ్లో పాక్ విజయం సాధించేలా కనిపించింది. చాలాకాలం తర్వాత బాబర్ సెంచరీ చేసేలా కూడా కనిపించాడు. అయితే బాబర్ ఔట్ కావడంతో పాక్ ఇన్నింగ్స్ ఒక్కసారిగా పతనమైంది. పాక్ చివరి వరుస ఆటగాళ్లలో ముగ్గురు ఒక్క పరుగు చేయగా.. ఇద్దరు డకౌట్లయ్యారు. చివర్లో నాథన్ స్మిత్ (8.1-0-60-4) చెలరేగి పాక్ ఇన్నింగ్స్ను కుప్పకూల్చాడు. న్యూజిలాండ్ బౌలర్లలో డఫీ 2, విలియమ్ ఓరూర్కీ, బ్రేస్వెల్, ముహమ్మద్ అబ్బాస్ తలో వికెట్ తీశారు. ఈ సిరీస్లో రెండో వన్డే ఏప్రిల్ 2న హ్యామిల్టన్లో జరుగుతుంది. -
పతిరణ షార్ప్ డెలివరీ.. ఇదీ నా పవర్! కోహ్లి రియాక్షన్ వైరల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) అద్భుత విజయం సాధించింది. 2008 తర్వాత తొలిసారి చెన్నై సూపర్ కింగ్స్ను చెపాక్లో ఓడించింది. ఏకంగా యాభై పరుగుల తేడాతో సీఎస్కేను చిత్తు చేసి చిదంబరం స్టేడియంలో గెలుపు జెండా ఎగురవేసింది.ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఓపెనర్లలో ఫిల్ సాల్ట్ (16 బంతుల్లో 32) ధనాధన్ దంచికొట్టగా.. విరాట్ కోహ్లి (Virat Kohli) మాత్రం ఆచితూచి ఆడాడు. 30 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 31 పరుగులు మాత్రమే రాబట్టగలిగాడు. అయితే, తాను సిక్స్ కొట్టిన సందర్భంగా.. కోహ్లి ఇచ్చిన రియాక్షన్ వింటేజ్ కింగ్ను గుర్తు చేసింది.హెల్మెట్కు బలంగా తాకిన బంతిఅసలేం జరిగిందంటే.. సీఎస్కేతో శుక్రవారం నాటి మ్యాచ్లో టాస్ ఓడిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో పదకొండో ఓవర్లో చెన్నై పేసర్ మతీశ పతిరణ బంతితో రంగంలోకి దిగాడు. అప్పుడు కోహ్లి క్రీజులో ఉండగా.. పతిరణ పదునైన షార్ట్ డెలివరీ సంధించగా.. కోహ్లి హెల్మెట్కు బంతి బలంగా తాకింది. ఫలితంగా.. ఒకవేళ కంకషన్ సబ్స్టిట్యూట్ అవుతుందేమోనని చెక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.క్లాసీ కౌంటర్.. మాస్ రియాక్షన్అయితే, తాను బాగానే ఉన్నానని చెప్పిన కోహ్లి.. పతిరణ సంధించిన రెండో బంతికి భారీ షాట్ బాదాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్ సంధించిన షార్ట్ బాల్ను ఫైన్ లెగ్ మీదుగా బౌండరీవైపు తరలించి ఆధిపత్యం చాటుకున్నాడు. ఈ క్రమంలో.. ‘‘ఇదీ నా పవర్’’ అన్నట్లుగా పతిరణ వైపు కింగ్ గుర్రుగా చూసిన విధానం అభిమానులను ఆకర్షించింది. ఇక అదే ఓవర్లో మరుసటి బంతికి కోహ్లి ఫోర్ కూడా బాదడం విశేషం. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.1st ball – 😮💨2nd ball – 6️⃣ That’s what it’s like facing the GEN GOLD! ❤Classy counter from #ViratKohli! 🙌🏻Watch LIVE action ➡ https://t.co/MOqwTBm0TB#IPLonJioStar 👉 #CSKvRCB | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star Sports 3 & JioHotstar! pic.twitter.com/MzSQTD1zQc— Star Sports (@StarSportsIndia) March 28, 2025 పాటిదార్, పడిక్కల్, డేవిడ్ అదరహోఇక మ్యాచ్ విషయానికొస్తే.. సాల్ట్, కోహ్లిలు ఫర్వాలేదనిపించగా.. దేవదత్ పడిక్కల్ (14 బంతుల్లో 27), కెప్టెన్ రజత్ పాటిదార్ (32 బంతుల్లో 51) దుమ్ములేపారు. మిగతా వాళ్లలో టిమ్ డేవిడ్ (8 బంతుల్లో 22 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా ఆర్సీబీ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ మూడు, మతీశ పతిరణ రెండు, ఖలీల్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.హాజిల్వుడ్ తీన్మార్ లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్ల ముగిసే సరికి ఎనిమిది వికెట్ల నష్టానికి కేవలం 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో యాభై పరుగుల తేడాతో ఆర్సీబీ చేతిలో ఓటమిపాలైంది. సీఎస్కే బ్యాటర్లలో రచిన్ రవీంద్ర (41), రవీంద్ర జడేజా(25), మహేంద్ర సింగ్ ధోని(16 బంతుల్లో 30 నాటౌట్) రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హాజిల్వుడ్ మూడు వికెట్ల(3/21)తో సత్తా చాటగా.. లియామ్ లివింగ్స్టోన్, యశ్ దయాళ్ రెండేసి వికెట్లు కూల్చారు. భువనేశ్వర్కుమార్కు ఒక వికెట్ దక్కింది. ఐపీఎల్-2025: సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ👉టాస్: సీఎస్కే.. బౌలింగ్👉ఆర్సీబీ స్కోరు: 196/7 (20)👉సీఎస్కే స్కోరు: 146/8 (20)👉ఫలితం: యాభై పరుగుల తేడాతో సీఎస్కేపై ఆర్సీబీ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రజత్ పాటిదార్.చదవండి: MS Dhoni: బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే! -
ఇదేం ప్రశ్న? ఆఖర్లో ఎవరు గెలుస్తారో చూడాలి: సీఎస్కే కోచ్ ఆగ్రహం
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కంచుకోటను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఎట్టకేలకు బద్దలు కొట్టింది. పదిహేడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చెపాక్లో జయకేతనం ఎగురవేసింది. ఫలితంగా ఆర్సీబీ ఆటగాళ్లతో పాటు అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి.మరోవైపు.. సొంతగడ్డపై ఆర్సీబీ చేతిలో పరాభవాన్ని సీఎస్కే జీర్ణించుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడిన చెన్నై జట్టు హెడ్కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్కు చేదు అనుభవం ఎదురైంది. రుతురాజ్ సేన బ్యాటింగ్ తీరును ఉద్దేశించి ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్న అతడికి ఆగ్రహం తెప్పించింది.కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025లో తమ ఆరంభ మ్యాచ్లో చెన్నై.. చిరకాల ప్రత్యర్థి ముంబై ఇండియన్స్తో తలపడింది. చెపాక్లో ఈ మాజీ చాంపియన్ల మధ్య జరిగిన పోరులో చెన్నై నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత ముంబైని 155 పరుగులకు కట్టడి చేసిన సీఎస్కే.. 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.పాటిదార్, టిమ్ డేవిడ్ మెరుపులుతాజాగా ఆర్సీబీతో శుక్రవారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 196 పరుగుల మేర మంచి స్కోరు రాబట్టింది.ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (16 బంతుల్లో 32), విరాట్ కోహ్లి (30 బంతుల్లో 31)లతో పాటు దేవదత్ పడిక్కల్ (14 బంతుల్లో 27) రాణించగా.. కెప్టెన్ రజత్ పాటిదార్ (32 బంతుల్లో 51), టిమ్ డేవిడ్ (8 బంతుల్లో 22) మెరుపులు మెరిపించారు.అయితే, లక్ష్య ఛేదనలో చెన్నై ఆరంభం నుంచే తడబడింది. టాపార్డర్లో ఓపెనర్ రాహుల్ త్రిపాఠి (5), వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (0) పూర్తిగా విఫలం కాగా.. మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర (31 బంతుల్లో 41) ఫర్వాలేదనిపించాడు.ధోని ధనాధన్ సరిపోలేదుమిగతా వాళ్లలో రవీంద్ర జడేజా (19 బంతుల్లో 25), మహేంద్ర సింగ్ ధోని (16 బంతుల్లో 30 నాటౌట్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 146 పరుగుల వద్ద చెన్నై నిలిచిపోయింది. ఫలితంగా యాభై పరుగుల తేడాతో ఆర్సీబీ చేతిలో ఓడిపోయింది.A never ending story 😊Last over 🤝 MS Dhoni superhits 🔥Scorecard ▶ https://t.co/I7maHMwxDS #TATAIPL | #CSKvRCB | @ChennaiIPL pic.twitter.com/j5USqXvf7r— IndianPremierLeague (@IPL) March 28, 2025అవుట్డేటెడ్ అంటూ సెటైర్లుఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మీడియా ముందుకు రాగా.. ‘‘తొలి మ్యాచ్లో 20 ఓవర్లలో మీరు 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. ఈరోజు 146 పరుగులు చేశారు.మీ బ్రాండ్ క్రికెట్ ఇలాగే ఉంటుందని తెలుసు. కానీ ఇది పాతబడి పోయిందని మీకు అనిపించడం లేదా?’’ అని ఓ రిపోర్టర్ ప్రశ్నించారు.ఇందుకు బదులుగా.. ‘‘నా బ్రాండ్ క్రికెట్ అంటే ఏమిటి? మీరు ఫైర్ పవర్ గురించి మాట్లాడుతున్నారా? మా జట్టు సత్తా ఏమిటో అందరికీ తెలుసు. అసలు మీ ప్రశ్న ఏమిటో నాకు అర్థం కావడమే లేదు.మమ్మల్ని తక్కువ చేయకండితొలి బంతి నుంచే మేము స్వింగ్ చేయడం లేదని మీరిలా అంటున్నారా? మా వ్యూహాల గురించి సానుకూలంగా ఆలోచించడంలో తప్పేముంది? గెలుపు కోసమే ఎవరైనా ప్రయత్నిస్తారు. దీనినే సానుకూల దృక్పథం (పాజిటివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్) అంటారు.మమ్మల్ని తక్కువగా అంచనా వేయడం.. మా గురించి తక్కువగా మాట్లాడటం చేయకండి. ఆఖర్లో ఎవరు గెలుస్తారో చూడండి! ’’ అని ఫ్లెమింగ్ ఒకింత అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఇందుకు సదరు జర్నలిస్టు.. ‘‘నేను మిమ్మల్ని తక్కువ చేసి చూపడటం లేదు’’అని సమాధానమిచ్చారు. దీంతో.. ‘‘మీరు అలాగే మాట్లాడుతున్నారు.. అర్థంపర్థంలేని ప్రశ్నలు వేస్తున్నారు’’ అని ఫ్లెమింగ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు. అదే విధంగా.. చెపాక్లో ఆడటం వల్ల తమకు అదనపు ప్రయోజనాలేమీ ఉండవని.. ఇతర వేదికలపై తమ జట్టు సత్తా చాటిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఫ్లెమింగ్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. చదవండి: MS Dhoni: బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే! -
ఐపీఎల్లో నేటి (మార్చి 29) మ్యాచ్.. ముంబైతో గుజరాత్ 'ఢీ'
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మార్చి 29) ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ గుజరాత్ హోం గ్రౌండ్ నరేంద్ర మోదీ స్టేడియంలో (అహ్మదాబాద్) జరుగనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్దంగా ఉన్నాయి.ఈ సీజన్లో ఇరు జట్లు తమ తొలి మ్యాచ్ల్లో ఓటమిపాలై నిరాశగా ఉన్నాయి. ముంబై సీఎస్కే చేతిలో.. గుజరాత్ పంజాబ్ చేతిలో పరాజయం పాలయ్యాయి. సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో ముంబై బ్యాటింగ్లో దారుణంగా విఫలమైంది. జట్టు నిండా స్టార్లు ఉన్నా ఒక్కరు కూడా సామర్థ్యం మేరకు రాణించలేకపోయారు. రోహిత్ శర్మ డకౌట్ కాగా.. విదేశీ విధ్వంసకర ఆటగాళ్లు రికెల్టన్ (13), విల్ జాక్స్ (11) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. స్కై (29), తిలక్ వర్మ (31) పర్వాలేదనిపించినా అవి వారి స్థాయికి తగ్గ ఇన్నింగ్స్లు కావు. ఈ మ్యాచ్కు హార్దిక్ పాండ్యా దూరంగా ఉన్నాడు. గత సీజన్లో స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ ఈ సీజన్ తొలి మ్యాచ్లో నిషేధం ఎదుర్కొన్నాడు. గుజరాత్తో నేటి మ్యాచ్కు హార్దిక్ అందుబాటులో ఉంటాడు. హార్దిక్ ఎంట్రీతో రాబిన్ మింజ్ తప్పుకోవాల్సి ఉంటుంది. సీఎస్కేతో మ్యాచ్ ద్వారా ముంబై ఇండియన్స్కు ఓ అణిముత్యం దొరికాడు. 24 ఏళ్ల స్పిన్నర్ విజ్ఞేశ్ పుతుర్ సీఎస్కేతో మ్యాచ్లో మ్యాజిక్ చేశాడు. కేరళకు చెందిన పుతుర్ జాతీయ స్థాయిలో ఎలాంటి మ్యాచ్లు ఆడకుండా నేరుగా ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చి తన తొలి మ్యాచ్లో 3 వికెట్లు తీశాడు. సీఎస్కేతో మ్యాచ్లో ముంబైకు పుతుర్ అద్భుతమైన బౌలింగ్ మినహా ఎలాంటి ఊరట లభించలేదు. పుతుర్ రాణించినా స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో ముంబై బౌలర్లు చేతులెత్తేశారు. ట్రెంట్ బౌల్ట్, మిచెల్ సాంట్నర్ సామర్థ్యం మేరకు రాణించలేదు. ఈ మ్యాచ్లో దీపక్ చాహర్ ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలుత బ్యాటింగ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన చాహర్.. ఆతర్వాత బౌలింగ్లో ఓ వికెట్ తీశాడు. నేటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు ఇలా ఉండే అవకాశం ఉంది.ర్యాన్ రికెల్టన్ (వికెట్కీపర్), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, సత్యనారాయణ రాజు, విఘ్నేశ్ పుతుర్గుజరాత్ టైటాన్స్ విషయానికొస్తే.. ఈ జట్టు సీజన్ తొలి మ్యాచ్లో పంజాబ్ చేతిలో పరాజయంపాలైనప్పటికీ.. బ్యాటింగ్లో అదరగొట్టింది. భారీ లక్ష్య ఛేదనలో ఆ జట్టు టాపార్డర్ బ్యాటర్లు సాయి సుదర్శన్ (74), శుభ్మన్ గిల్ (33), బట్లర్ (54), రూథర్ఫోర్డ్ (46) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. మధ్య ఓవర్లలో గుజరాత్ బ్యాటర్లు కాస్త వేగంగా ఆడి ఉంటే ఈ మ్యాచ్లో ఆ జట్టు గెలిచేదే. ఈ మ్యాచ్లో ఆ జట్టు ప్రధాన బౌలర్లందరూ నిరాశపరిచారు. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన సిరాజ్, రబాడ.. గుజరాత్ తురుపుముక్క రషీద్ ఖాన్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ప్రసిద్ద్ కృష్ణ అదే స్థాయిలో పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్లో సాయి కిషోర్ ఒక్కడే రాణించాడు. అతను 4 ఓవర్లలో కేవలం 30 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ముంబైతో జరుగబోయే నేటి మ్యాచ్లో గుజరాత్ జట్టు ఇలా ఉండే అవకాశం ఉంది.శుభ్మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్, సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, కగిసో రబడ, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్హెడ్ టు హెడ్ రికార్డులు..ఐపీఎల్లో గుజరాత్, ముంబై ఇప్పటివరకు ఐదు సార్లు తలపడ్డాయి. ఇందులో గుజరాత్ 3, ముంబై రెండు మ్యాచ్ల్లో గెలుపొందాయి. గుజరాత్కు ముంబైపై సొంత మైదానంలో ఘనమైన రికార్డు ఉంది. ఆ జట్టు ముంబైపై సాధించిన మూడు విజయాలు అహ్మదాబాద్లో వచ్చినవే. ఇరు జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే గెలుపొందాయి. అహ్మదాబాద్ పిచ్పై మరోసారి పరుగుల వరద పారడం ఖాయం. ఈ పిచ్పై గత మ్యాచ్లో పంజాబ్ 243 పరుగులు చేయగా.. ఛేదనలో గుజరాత్ 232 పరుగులు చేసింది. -
చరిత్ర సృష్టించిన జడ్డూ భాయ్.. ఐపీఎల్లో తొలి మొనగాడు
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో 100 వికెట్లతో పాటు 3000 పరుగులు పూర్తి చేసి తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. నిన్న (మార్చి 28) ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో జడ్డూ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో 19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 25 పరుగులు చేసిన జడేజా.. తన చివరి పరుగు వద్ద ఐపీఎల్లో 3000 పరుగుల మార్కును తాకాడు. జడేజా ఖాతాలో 160 ఐపీఎల్ వికెట్లు కూడా ఉన్నాయి. జడ్డూ తన ఐపీఎల్ కెరీర్లో 242 మ్యాచ్లు ఆడాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు, ఓ ఐదు వికెట్ల ఘనత ఉంది.ఐపీఎల్లో ఇప్పటివరకు 27 మంది 3000 పరుగులు స్కోర్ చేయగా.. అందులో జడేజా మాత్రమే 100కుపైగా వికెట్లు కూడా తీశాడు. 3000 పరుగులు చేసిన మరో ఇద్దరు మాత్రమే 50కి పైగా వికెట్లు తీశారు. వీరిలో ఒకరు షేన్ వాట్సన్ కాగా.. మరొకరు కీరన్ పోలార్డ్. వాట్సన్ 145 ఐపీఎల్ మ్యాచ్ల్లో 3874 పరుగులతో పాటు 92 వికెట్లు తీయగా.. పోలార్డ్ 189 ఐపీఎల్ మ్యాచ్ల్లో 3412 పరుగులు చేసి 69 వికెట్లు పడగొట్టాడు.మ్యాచ్ విషయానికొస్తే.. నిన్న జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ 50 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్లో సీఎస్కే అన్ని విభాగాల్లో ఘోరంగా విఫలమైంది. తొలుత బౌలింగ్ చేసి 20-30 పరుగులు అదనంగా సమర్పించుకోవడంతో పాటు కీలక సమయాల్లో క్యాచ్లు వదిలేసింది. అనంతరం బ్యాటింగ్లో కనీస పోరాటం కూడా చూపలేక ప్రత్యర్థికి దాసోహమైంది.తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. రజత్ పాటిదార్ (32 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫిల్ సాల్ట్ (16 బంతుల్లో 32; 5 ఫోర్లు, సిక్స్), పడిక్కల్ (14 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (8 బంతుల్లో 22 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్లోగా ఉన్న పిచ్పై ఇది చాలా మంచి స్కోర్. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ (4-0-36-3), పతిరణ (4-0-36-2), ఖలీల్ అహ్మద్ (4-0-28-1) బాగానే బౌలింగ్ చేసినా అశ్విన్ (2-0-22-1), జడ్డూ (3-0-37-0) సామర్థ్యం మేరకు రాణించలేక ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో సీఎస్కే ఆదిలోనే చేతులెత్తేసింది. 8 పరుగులకే (రెండో ఓవర్లో) 2 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు.. ఆతర్వాత కూడా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 148 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారు. హాజిల్వుడ్ (4-0-21-3), లవింగ్స్టోన్ (4-0-28-2), యశ్ దయాల్ (3-0-18-2) వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేశారు. ఫలితంగా ఆర్సీబీ సీఎస్కేను 17 ఏళ్ల తర్వాత వారి సొంత ఇలాకాలో ఓడించింది. సీఎస్కే ఇన్నింగ్స్లో రచిన్ రవీంద్ర (41) టాప్ స్కోరర్గా నిలువగా.. ఆఖర్లో ధోని (16 బంతుల్లో 30 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. -
మంచి స్కోర్ చేశాము.. సీఎస్కేను వారి సొంత ఇలాకాలో ఓడించడం చాలా ప్రత్యేకం: పాటిదార్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. సీఎస్కేతో నిన్న (మార్చి 28) జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ అన్ని విభాగాల్లో సత్తా చాటింది. కష్ట సాధ్యమైన పిచ్పై తొలుత బ్యాటింగ్ చేసి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం అద్భుతంగా బౌలింగ్ చేసి విజయంవంతంగా లక్ష్యాన్ని కాపాడుకుంది. బ్యాటింగ్లో రజత్ పాటిదార్ (32 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫిల్ సాల్ట్ (16 బంతుల్లో 32; 5 ఫోర్లు, సిక్స్), పడిక్కల్ (14 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (8 బంతుల్లో 22 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) సత్తా చాటగా.. బౌలింగ్లో హాజిల్వుడ్ (4-0-21-3), లవింగ్స్టోన్ (4-0-28-2), యశ్ దయాల్ (3-0-18-2) మ్యాజిక్ చేశారు. ఫలితంగా ఆర్సీబీ సీఎస్కేను 17 ఏళ్ల తర్వాత వారి సొంత ఇలాకాలో ఓడించింది.ఈ మ్యాచ్లో ఆర్సీబీ అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకోగా.. సీఎస్కే స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక ఓటమిపాలైంది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన సీఎస్కే కీలక సమయాల్లో క్యాచ్లు జారవిడచడంతో పాటు ఫీల్డింగ్లో అనవసర తప్పిదాలు చేసి అదనపు పరుగులు సమర్పించుకుంది. నూర్ అహ్మద్ (4-0-36-3), పతిరణ (4-0-36-2), ఖలీల్ అహ్మద్ (4-0-28-1) బాగానే బౌలింగ్ చేసినా మిగతా బౌలర్లు సామర్థ్యం మేరకు రాణించలేక ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. స్లోగా ఉన్న పిచ్పై సీఎస్కే బౌలర్లు 20-30 పరుగులు అదనంగా ఇచ్చారు.అనంతరం కష్ట సాధ్యమైన ఛేదనలో సీఎస్కే బ్యాటర్లు ఆదిలోనే చేతులెత్తేశారు. కనీస పోరాటం కూడా చూపలేక మ్యాచ్ను ఆర్సీబీకి అప్పగించారు. ఓ పక్క వికెట్లు పడుతున్నా రచిన్ రవీంద్ర (41) ఒక్కడే క్రీజ్లో నిలబడి ఏదో చేసే ప్రయత్నం చేశాడు. ఆఖర్లో ధోని (16 బంతుల్లో 30 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) భారీ షాట్లు ఆడినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సీఎస్కేకు పిచ్ నుంచి కూడా ఎలాంటి సహకారం లభించలేదు. వికెట్ చాలా స్లోగా ఉండింది. కొత్త బంతి కూడా వారికి కలిసి రాలేదు.మ్యాచ్ అనంతరం విన్నింగ్ కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఈ వికెట్పై మంచి స్కోర్ చేశాము. వికెట్ చాలా స్లోగా ఉండింది. బ్యాటర్లకు ఇది అంత సులభం కాదు. సీఎస్కేను వారి సొంత అభిమానుల మధ్య ఓడించడం చాలా ప్రత్యేకం. ఈ వికెట్పై ఛేజింగ్ చేయడం అంత సులభం కాదని తెలుసు. అందుకే 200 పరుగులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. నేను క్రీజ్లో ఉన్నంత సేపు ప్రతి బంతికి భారీ షాట్ ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఓ రకంగా సఫలమయ్యాను. స్పిన్నర్లకు ఈ ట్రాక్ చాలా ఉపయోగకరంగా ఉండింది. అందుకే ముందుగానే స్పిన్నర్లను బరిలోకి దించాలని అనుకున్నాము. లివింగ్స్టోన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. హాజిల్వుడ్ తన తొలి ఓవర్లో, ఆతర్వాత కొత్త బంతితో మ్యాజిక్ చేశాడు. ఈ రెండు సందర్భాలు మ్యాచ్ను మాకు అనుకూలంగా మార్చాయి. మేము పరుగులు సాధించగలిగినా వారి బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. -
ఈ పిచ్పై 170 పరుగులే ఎక్కువ.. ఇంకా భారీ తేడాతో ఓడిపోనందుకు సంతోషించాలి: రుతురాజ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ను చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్పై గెలుపుతో ప్రారంభించింది. అయితే రెండో మ్యాచ్లో మాత్రం సీఎస్కే బొక్క బోర్లా పడింది. నిన్న (మార్చి 28) సొంత మైదానం చెపాక్లో జరిగిన మ్యాచ్లో రుతురాజ్ సేన ఆర్సీబీ చేతిలో ఘోర పరాజయాన్ని (50 పరుగుల తేడాతో) ఎదుర్కొంది. ఈ మ్యాచ్లో ఫైవ్ టైమ్ ఛాంపియన్ అయిన సీఎస్కే స్థాయి తగ్గట్టుగా ఆడలేకపోయింది. తొలుత బౌలింగ్లో పట్టులేక ప్రత్యర్ధిని 196 పరుగులు చేయనిచ్చింది. ఆతర్వాత ఛేదనలో కనీస పోరాటం కూడా ప్రదర్శించలేక 146 పరుగులకే పరిమితమైంది. బౌలింగ్తో పోలిస్తే సీఎస్కే బ్యాటింగ్లో దారుణంగా విఫలమైంది. రచిన్ రవీంద్ర (41) ఒక్కడే కాస్త పోరాడే ప్రయత్నం చేశాడు. చివర్లో ధోని (16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 30 నాటౌట్) మెరుపులు మెరిపించినా అప్పటికే సీఎస్కే ఓటమి ఖరారైపోయింది. ఈ మ్యాచ్లో సీఎస్కే ఫీల్డింగ్లోనూ దారుణంగా విఫలమైంది. కీలక సమయాల్లో క్యాచ్లు వదిలేయడంతో పాటు లేని పరుగులు సమర్పించుకుంది.మ్యాచ్ అనంతరం సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. వాస్తవానికి ఈ వికెట్పై 170 పరుగులే చాలా ఎక్కువ. అలాంటిది ఆర్సీబీ 196 పరుగులు చేసి, మా బ్యాటింగ్ను మరింత సంక్లిష్టం చేసింది. వారి బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఈ రోజు ఫీల్డింగ్లోనూ మేము గొప్పగా లేము. అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నాం. ఊహించిన దానికంటే అదనంగా 20 పరుగులను ఛేదిస్తున్నప్పుడు పవర్ ప్లేలో మా బ్యాటింగ్ స్టయిల్ భిన్నంగా ఉండాల్సింది. కానీ అలా జరగలేదు. తొలి ఐదు ఓవర్లు కొత్త బంతి కూడా ఇబ్బంది పెట్టింది. ఇలా ఎందుకు జరిగిందో తెలియడం లేదు. రాహుల్ త్రిపాఠి, నేను చాలా కాన్ఫిడెంట్గా షాట్లు ఆడాము. కానీ వర్కౌట్ కాలేదు. మా స్పిన్ త్రయాన్ని ఆర్సీబీ బ్యాటర్లు అద్భుతంగా ఎదుర్కొన్నారు. కీలక సమయాల్లో క్యాచ్లు వదిలేశాము. అది కూడా మా ఓటమికి కారణమైంది. తదుపరి మ్యాచ్ కోసం మానసికంగా సిద్దంగా ఉండాలి. ఐపీఎల్ లాంటి టోర్నీల్లో బ్యాటింగ్, బౌలింగ్లో చెడు రోజు ఉంటుంది. మేము ఫీల్డింగ్లో చాలా మెరుగుపడాలి.రచిన్ సరిగ్గా ముందుకు సాగలేకపోయాడు. హుడా పరిస్థితి కూడా అలాగే ఉండింది. దూబే నుంచి ప్రామిసింగ్ ఇన్నింగ్స్ ఆశించాము. యశ్ దయాల్ డబుల్ స్ట్రయిక్ (ఒకే ఓవర్లో 2 వికెట్లు) మా ఓటమిని ఖరారు చేసింది. చివర్లో జడేజా, ధోని భారీ షాట్లు ఆడినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఓవరాల్గా ఆర్సీబీ అద్భుత ప్రదర్శన చేసింది. -
వద్దనుకున్నవాడే... ఆపద్బాంధవుడయ్యాడు!
ఐపీఎల్ 2024లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ను అభిమానులు అంత త్వరగా మరచిపోలేరు. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేస్తే... ఛేదనలో చెలరేగిపోయిన రైజర్స్ 9.4 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా 167 పరుగులు చేసి విజయం సాధించింది!దూకుడే మంత్రంగా సాగుతున్న సన్రైజర్స్ హైదరాబాద్... ఈ సీజన్లో రాజస్తాన్తో ఆడిన తొలి మ్యాచ్లోనూ 286 పరుగులతో విజృంభించింది. రెండో మ్యాచ్లో లక్నోతో తలపడాల్సి రావడంతో మరింత భారీ స్కోరు ఖాయమే అని అభిమానులంతా అంచనాకు వచ్చేశారు. అందుకు తగ్గట్లే రైజర్స్కు మొదట బ్యాటింగ్ చేసే అవకాశం దక్కింది. ఇంకేముంది మరోసారి పరుగుల వరద ఖాయం అనుకుంటే... ఒకే ఒక్కడు హైదరాబాద్ జోరుకు అడ్డుకట్ట వేశాడు!! ఐపీఎల్ వేలంలో ఏ జట్టు కొనుగోలు చేయని ఆ ప్లేయర్... అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులతో ఒడిసిపట్టుకున్నాడు. సొంతగడ్డపై ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న రైజర్స్ జోరుకు కళ్లెం వేశాడు. ప్రమాదకర ఓపెనర్ అభిషేక్ శర్మతో పాటు క్రితం మ్యాచ్ సెంచరీ హీరో ఇషాన్ కిషన్ను వరుస బంతుల్లో పెవిలియన్కు పంపి ఆరెంజ్ ఆర్మీని నిలువరించాడు. చివర్లో మరో రెండు వికెట్లు తీసిన అతడే భారత సీనియర్ ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్. అనూహ్య అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకుంటున్న శార్దుల్పై ప్రత్యేక కథనం... జాతీయ జట్టు తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి 80కి పైగా మ్యాచ్లు ఆడిన అనుభవం... మీడియం పేస్తో పాటు లోయర్ ఆర్డర్లో విలువైన పరుగులు చేయగల నైపుణ్యం... తాజా రంజీ ట్రోఫీలో అటు బంతితో పాటు ఇటు బ్యాట్తో చక్కటి ప్రదర్శన చేసినప్పటికీ... శార్దుల్ ఠాకూర్ను ఐపీఎల్ వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసుకోలేదు. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన శార్దుల్పై ఏ జట్టు ఆసక్తి కనబర్చలేదు. దీంతో కౌంటీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమవుతున్న ఈ ఆల్రౌండర్కు... భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ నుంచి పిలుపు వచ్చిoది. ‘ప్రయత్నాలు విడిచిపెట్టకు. నిన్ను జట్టులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రిప్లేస్మెంట్గా నువ్వు టీమ్లో చేరితే తొలి మ్యాచ్ నుంచే బరిలోకి దిగాల్సి ఉంటుంది’ అని లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ జహీర్ ఖాన్ చెప్పిన మాటలతో శార్దుల్ తనను తాను టి20 ఫార్మాట్కు సిద్ధం చేసుకున్నాడు. లక్నో పేసర్ మొహసిన్ ఖాన్ గాయంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్కు దూరం కావడంతో... అతడి స్థానంలో ప్రత్యామ్నాయంగా శార్దుల్ను జట్టులోకి తీసుకున్నారు. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్న శార్దుల్ తొలి మ్యాచ్ నుంచే తనదైన ముద్ర వేశాడు. తొలి మ్యాచ్లో 2 ఓవర్లే... విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన పోరులో శార్దుల్ తన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. భారీ స్కోర్లు నమోదైన ఆ మ్యాచ్లో తొలి ఓవర్లోనే శార్దుల్ 2 వికెట్లు పడగొట్టి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. ఇన్నింగ్స్ మూడో బంతికి మెక్గుర్క్ను ఔట్ చేసిన ఈ ముంబైకర్... ఐదో బంతికి అభిõÙక్ పొరెల్ను బుట్టలో వేసుకున్నాడు. దీంతో భారీ ఛేదనలో ఢిల్లీ ఆరంభంలోనే తడబడింది. అయితే ఆ మ్యాచ్లో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్... శార్దుల్ను సరిగ్గా వినియోగించుకోలేదు. 2 ఓవర్ల తర్వాత అతడికి అసలు తిరిగి బౌలింగే ఇవ్వలేదు. దీంతో పంత్ సారథ్యంపై సర్వత్ర విమర్శలు వ్యక్తం కాగా... రెండో మ్యాచ్లో హైదరాబాద్పై దాన్ని పునరావృతం కానివ్వకుండా చూసుకున్నాడు. దాని ఫలితమే శార్దుల్ ఐపీఎల్లో తన అత్యుత్తమ గణాంకాలు (4/34) నమోదు చేసుకోవడంతో పాటు లీగ్లో 100 వికెట్ల మైలురాయిని సైతం దాటాడు. షార్ట్బాల్తో అబిషేక్కు బైబై చెప్పిన శార్దుల్... తదుపరి బంతికే ఇషాన్ను కీపర్ క్యాచ్గా పెవిలియన్ బాట పట్టించాడు. చివర్లో మరోసారి బౌలింగ్కు వచి్చన అతడు... అభినవ్ మనోహర్, మొహమ్మద్ షమీని ఔట్ చేశాడు. రైజర్స్కు కళ్లెం... హిట్టర్లతో దట్టంగా ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్కు ముందు పక్కా ప్రణాళికతో బరిలోకి దిగినట్లు శార్దుల్ వెల్లడించాడు. ‘రైజర్స్ బ్యాటర్లు ప్రత్యర్థి బౌలర్లపై తీవ్ర ఒత్తిడి పెంచి భారీ షాట్లు ఆడుతూ మ్యాచ్ను లాగేసుకుంటున్నారు. అలాంటిది వారిపై ఒత్తిడి పెంచితే ఫలితాలు రాబట్టవచ్చు అని ముందే అనుకున్నా. చాన్స్ తీసుకోవాలనుకున్నా.ఫ్లాట్ పిచ్పై ఆరంభంలోనే ప్రత్యర్థి నుంచి మ్యాచ్ను లాగేసుకోవడం సన్రైజర్స్ ప్లేయర్లకు అలవాటు. అలాంటిది వారిని భారీ స్కోరు చేయకుండా మొదట్లోనే అడ్డుకోవాలని భావించా. నా ప్రణాళికలకు తగ్గట్లే బౌలింగ్ చేశాను. మెరుగైన ఫలితాలు రావడం ఆనందంగా ఉంది. నేనెప్పుడు వ్యక్తిగత ప్రదర్శనను పట్టించుకోను. జట్టు విజయంలో నా వంతు పాత్ర ఉండాలని భావిస్తా’ అని శార్దుల్ అన్నాడు. ఐపీఎల్లోని అన్నీ జట్లలో బౌలింగ్ లైనప్ బలహీనంగా ఉందని విమర్శలు మూటగట్టుకున్న లక్నో... ఇప్పుడు శార్దుల్ మ్యాజిక్తో ముందుకు సాగుతోంది. లీగ్లో మున్ముందు కూడా ఇదే ప్రదర్శన కొనసాగించాలనుకుంటున్నుట్లు ఈ ఆల్రౌండర్ వెల్లడించాడు. జహీర్ ఫోన్ కాల్తో.. ఐపీఎల్ వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసుకోకపోవడంతో... శార్దుల్ దేశవాళీల్లో మరింత పట్టుదలగా ఆడాడు. 2024–25 రంజీ సీజన్లో ముంబై జట్టు తరఫున ఈ ఆల్రౌండర్ 35 వికెట్లు తీయడంతో పాటు లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు దిగి 500 పైచిలుకు పరుగులు చేశాడు. ‘రంజీ నాకౌట్ మ్యాచ్ల సమయంలో జహీర్ ఖాన్ నుంచి ఫోన్ వచ్చింది. దీంతో సాధన కొనసాగించా. వేరే జట్లు కూడా సంప్రదించినప్పటికీ... జహీర్ ముందు ఫోన్ చేయడంతో అతడి మాటకు విలువ ఇచ్చి లక్నో జట్టులో చేరేందుకు అంగీకరించా’ అని శార్దుల్ చెప్పాడు. ఐపీఎల్ వేలంలో కొనుగోలు ఏ జట్టు కొనుగోలు చేసుకోక పోవడంతో ఏమాత్రం నిరుత్సాహానికి గురికాని శార్దుల్... మరింత క్రమశిక్షణతో తన బౌలింగ్ అ్రస్తాలను పెంచుకొని ఫలితాలు రాబడుతున్నాడు. –సాక్షి, క్రీడావిభాగం -
జొకోవిచ్ అరుదైన రికార్డు
ఫ్లోరిడా: సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. మయామి ఓపెన్ ఏటీపీ–1000 మాస్టర్స్ టోర్నీలో సెమీఫైనల్కు చేరాడు. తద్వారా ఏటీపీ మాస్టర్స్–1000 టోర్నీ సెమీఫైనల్కు చేరిన పెద్ద వయసు్కడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) పేరిట ఉంది. 37 ఏళ్ల జొకోవిచ్ శుక్రవారం పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 6–3, 7–6 (7/4)తో సెబాస్టియన్ కొర్డా (అమెరికా)పై విజయం సాధించాడు. 1 గంట 24 నిమిషాల పాటు సాగిన పోరులో నాలుగో సీడ్ జొకోవిచ్ 11 ఏస్లు కొట్టగా... కోర్డా ఏడు ఏస్లకు పరిమితమయ్యాడు. సెర్బియా వీరుడు రెండు బ్రేక్ పాయింట్లు కాచుకోవడంతో పాటు ఒక దశలో వరుసగా 12 పాయింట్లు సాధించి ఆధిక్యం కనబర్చాడు. ఇప్పటికే ఆరుసార్లు మయామి ఓపెన్ టైటిల్ చేజిక్కించుకున్న జొకోవిచ్ ఏడోసారి చాంపియన్గా నిలిచేందుకు రెండడుగుల దూరంలో ఉన్నాడు. సీజన్ ఆరంభ గ్రాండ్స్లామ్ టోర్నీ ఆ్రస్టేలియా ఓపెన్ మధ్యలో గాయం కారణంగా తప్పుకున్న జొకోవిచ్... ఇటీవల ఇండియన్ వెల్స్ టోర్నీ తొలి రౌండ్లో పరాజయం పాలయ్యాడు. గ్రాండ్స్లామ్ చాంపియన్ పీటర్ కొర్డా కుమారుడైన సెబాస్టియన్ కొర్డా... రెండో సెట్ ఆరంభంలో 4–1తో ఆధిక్యంలో నిలిచినా... దాన్ని చివరి వరకు కొనసాగించలేకపోయాడు. మరోవైపు మహిళల సింగిల్స్లో ప్రపంచ నంబర్వన్ సబలెంక (బెలారస్) 6–2, 6–2తో జాస్మిన్ పావోలిని (ఇటలీ)పై గెలుపొందింది. తద్వారా తొలిసారి మయామి ఓపెన్ ఫైనల్లో అడుగుపెట్టింది. -
మనీషాకు స్వర్ణం
అమ్మాన్ (జోర్డాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్ మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత రెజ్లర్ మనీషా భన్వాల్ పసిడి పతకంతో మెరిసింది. హోరాహోరీగా సాగిన మహిళల 62 కేజీల విభాగం ఫైనల్లో శుక్రవారం మనీషా 8–7 పాయింట్ల తేడాతో ఓక్ జే కిమ్ (కొరియా)పై విజయం సాధించింది. ఒక దశలో 2–7తో వెనుకంజలో నిలిచిన మనీషా... ఆఖరి నిమిషంలో అసమాన పోరాటంతో వరుసగా 6 పాయింట్లు సాధించి స్వర్ణం కైవసం చేసుకుంది. ఆసియా చాంపియన్షిప్లో 3 కాంస్యాలు గెలిచిన మనీషాకు ఇదే తొలి స్వర్ణం కాగా... సెమీఫైనల్లో మనీషా 5–1తో బిలిమ్బెక్ కైజీపై విజయం సాధించింది. అంతకుముందు టైనిస్ డుబెక్ (కజకిస్తాన్), హన్బిట్ లీ (కొరియా)పై ఏకపక్ష విజయాలతో మనీషా సెమీస్కు చేరింది. 2021 ఆసియా చాంపియన్షిప్ తర్వాత ఈ పోటీల్లో భారత్కు ఇదే తొలి పసిడి పతకం. ఆ పోటీల్లో భారత్ తరఫున వినేశ్ ఫొగాట్, సరితా మోర్ భారత్ తరఫున స్వర్ణాలు గెలిచారు. మరోవైపు యువ రెజ్లర్ అంతిమ్ పంఘాల్ మహిళల 53 కేజీల విభాగంలో కాంస్యం కైవసం చేసుకుంది. సెమీఫైనల్లో జపాన్కు చెందిన మోయో కియోకా చేతిలో ఓడిన అంతిమ్... కాస్య పతక పోరులో సత్తాచాటింది. నేహ శర్మ (57 కేజీలు), మోనిక (65 కేజీలు), జ్యోతి బెరివాల్ (72 కేజీలు) మెడల్ రౌండ్స్కు అర్హత సాధించలేకపోయారు. ఈ టోర్నీలో భారత్ 1 స్వర్ణం, 1 రజతం, 6 కాంస్యాలతో మొత్తం 8 పతకాలు సాధించగా... పురుషుల ఫ్రీస్టయిల్ పోటీలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. -
చెన్నైని గెలిచారు...
ఎప్పుడో 2008లో తొలి ఐపీఎల్లో చెపాక్ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలిచింది. ఆ తర్వాత ఈ మైదానంలో తలపడిన ఎనిమిది మ్యాచుల్లోనూ చెన్నై చేతిలో ఓటమిపాలైంది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఎట్టకేలకు చెన్నై గడ్డపై సీఎస్కేపై ఆర్సీబీ పైచేయి సాధించింది. ముందుగా బ్యాటింగ్లో మెరుగైన స్కోరు సాధించిన బెంగళూరు, ఆపై పదునైన బౌలింగ్తో ప్రత్యర్థిని పూర్తిగా కట్టిపడేసింది. స్పిన్నర్ల రాజ్యం సాగే నెమ్మదైన తన సొంత మైదానంలో చెన్నై జట్టు ప్రభావం చూపించ లేకపోగా...స్ఫూర్తిదాయక బౌలింగ్ ప్రదర్శనతో ఆర్సీబీ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. చెన్నై: ఐపీఎల్ సీజన్లో బెంగళూరు వరుసగా రెండు ప్రత్యర్థి వేదికలపై వరుస విజయాలు అందుకుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 50 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన రాయల్ చాలెంజర్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రజత్ పాటీదార్ (32 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించగా...ఫిల్ సాల్ట్ (16 బంతుల్లో 32; 5 ఫోర్లు, 1 సిక్స్), విరాట్ కోహ్లి (30 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 146 పరుగులకే పరిమితమైంది. రచిన్ రవీంద్ర (31 బంతుల్లో 41; 5 ఫోర్లు), ఎమ్మెస్ ధోని (16 బంతుల్లో 30 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) ఫర్వాలేదనిపించారు. పాటీదార్ అర్ధ సెంచరీ... ఓపెనర్ సాల్ట్ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించగా, మరో ఎండ్లో కోహ్లి మాత్రం కాస్త తడబడ్డాడు. తన స్థాయికి తగినట్లుగా వేగంగా ఆడలేకపోయాడు. ఖలీల్ వేసిన తొలి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన సాల్ట్...అశి్వన్ వేసిన తర్వాత ఓవర్లో సిక్స్, 2 ఫోర్లు బాదాడు. అయితే ధోని అద్భుత స్టంపింగ్కు సాల్ట్ వెనుదిరగ్గా, దేవ్దత్ పడిక్కల్ (14 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్లు) క్రీజ్లో ఉన్నంత సేపు ధాటిని ప్రదర్శించాడు.జడేజా ఓవర్లోనే అతను 2 ఫోర్లు, సిక్స్ కొట్టాడు. ఎట్టకేలకు పతిరణ ఓవర్లో కోహ్లి వరుసగా సిక్స్, ఫోర్ కొట్టినా...నూర్ బౌలింగ్లో అవుటై నిరాశగానే వెనుదిరిగాడు. మరో వైపు జడేజా ఓవర్లో సిక్స్, 2 ఫోర్లతో పాటీదార్ తన జోరును కొనసాగించాడు. ఈ క్రమంలో 30 బంతుల్లో అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. ఇలాంటి స్థితిలో ఐదు పరుగుల వ్యవధిలో జితేశ్ శర్మ (12), పాటీదార్, కృనాల్ పాండ్యా (0) వికెట్లు తీసి బెంగళూరును కొద్ది సేపు చెన్నై నిలువరించగలిగింది. అయితే స్యామ్ కరన్ వేసిన ఆఖరి ఓవర్లో టిమ్ డేవిడ్ (8 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్లు) వరుసగా మూడు సిక్సర్లు బాది స్కోరును 200కు చేరువగా తీసుకొచ్చాడు. సమష్టి వైఫల్యం... ఛేదనలో చెన్నై తీవ్రంగా ఇబ్బంది పడింది. రచిన్ కొన్ని చక్కటి షాట్లు ఆడటం మినహా ఒక్క బ్యాటర్ కూడా కనీస ప్రదర్శన ఇవ్వలేదు. చెప్పుకోదగ్గ భాగస్వామ్యం కూడా లేకుండా తక్కువ వ్యవధిలో సీఎస్కే వరుసగా వికెట్లు కోల్పోయింది. ఒకే స్కోరు వద్ద రాహుల్ త్రిపాఠి (5), రుతురాజ్ గైక్వాడ్ (0) వెనుదిరగ్గా, దీపక్ హుడా (4), స్యామ్ కరన్ (8) పూర్తిగా విఫలమయ్యారు. శివమ్ దూబే (15 బంతుల్లో 19; 2 ఫోర్లు, 1 సిక్స్), రవీంద్ర జడేజా (19 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. ఆర్సీబీ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ చెన్నైపై ఒత్తిడిని కొనసాగించారు. ఆరంభంలో పవర్ప్లే ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 30 పరుగులు మాత్రమే చేసిన చెన్నై ఆ తర్వాత కోలుకోలేకపోయింది. ఆఖర్లో 28 బంతుల్లో 98 పరుగులు చేయాల్సిన స్థితిలో బరిలోకి దిగిన ధోని అభిమానులను అలరించే కొన్ని షాట్లు కొట్టడం మినహా అవి జట్టుకు ఏమాత్రం ఉపయోగపడలేదు. కృనాల్ వేసిన చివరి ఓవర్లో ధోని 2 సిక్స్లు, ఫోర్ కొట్టడానికి చాలా ముందే ఓటమి ఖాయమైపోయింది! స్కోరు వివరాలు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (స్టంప్డ్) ధోని (బి) నూర్ 32; కోహ్లి (సి) రచిన్ (బి) నూర్ 31; పడిక్కల్ (సి) గైక్వాడ్ (బి) అశ్విన్ 27; పాటీదార్ (సి) కరన్ (బి) పతిరణ 51; లివింగ్స్టోన్ (బి) నూర్ 10; జితేశ్ (సి) జడేజా (బి) అహ్మద్ 12; డేవిడ్ (నాటౌట్) 22; కృనాల్ (సి) హుడా (బి) పతిరణ 0; భువనేశ్వర్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–45, 2–76, 3–117, 4–145, 5–172, 6–176, 7–177. బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 4–0–28–1, రవిచంద్రన్ అశ్విన్ 2–0–22–1, స్యామ్ కరన్ 3–0–34–0, నూర్ అహ్మద్ 4–0–36–3, రవీంద్ర జడేజా 3–0–37–0, పతిరణ 4–0–36–2. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రచిన్ రవీంద్ర (బి) దయాళ్ 41; త్రిపాఠి (సి) సాల్ట్ (బి) హాజల్వుడ్ 5; గైక్వాడ్ (సి) (సబ్) భాందగే (బి) హాజల్వుడ్ 0; హుడా (సి) జితేశ్ (బి) భువనేశ్వర్ 4; స్యామ్ కరన్ (సి) కృనాల్ (బి) లివింగ్స్టోన్ 8; శివమ్ దూబే (బి) దయాళ్ 19; జడేజా (సి) సాల్ట్ (బి) హాజల్వుడ్ 25; అశ్విన్ (సి) సాల్ట్ (బి) లివింగ్స్టోన్ 11; ధోని (నాటౌట్) 30; నూర్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1–8, 2–8, 3–26, 4–52, 5–75, 6–80, 7–99, 8–130. బౌలింగ్: భువనేశ్వర్ 3–0–20–1, హాజల్వుడ్ 4–0–21–3, యశ్ దయాళ్ 3–0–18–2, లివింగ్స్టోన్ 4–0–28–2, సుయాశ్ శర్మ 4–0–32–0, కృనాల్ పాండ్యా 2–0–26–0. ఐపీఎల్లో నేడుగుజరాత్ X ముంబైవేదిక: అహ్మదాబాద్రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
చరిత్ర సృష్టించిన ధోని.. ప్రాణ మిత్రుడి రికార్డు బద్దలు
ఐపీఎల్-2025లో చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్లో 50 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలైంది. 197 పరుగుల భారీ లక్ష్యాన్ని సీఎస్కే చేధించలేక చతికలపడింది. చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 146 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్లో సీఎస్కే ఓటమి పాలైనప్పటికి .. ఆ జట్టు లెజెండరీ వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోని మాత్రం తన మెరుపు ఇన్నింగ్స్తో అభిమానులను అలరించాడు. తొమ్మిదో స్ధానంలో బ్యాటింగ్కు దిగిన ధోని తనదైన స్టైల్లో షాట్లూ ఆడుతూ స్టేడియాన్ని హోరెత్తించాడు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆఖరి ఓవర్ వేసిన కృనాల్ పాండ్యా బౌలింగ్లో మిస్టర్ కూల్.. రెండు సిక్స్లు, 1 ఫోర్తో 16 పరుగులు రాబాట్టాడు. ఓవరాల్గా కేవలం 16 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ధోని.. 3 ఫోర్లు, 2 సిక్స్లతో 30 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో ధోని ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో సీఎస్కే తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ధోరి రికార్డులకెక్కాడు. ధోని ఇప్పటివరకు సీఎస్కే తరపున 236 మ్యాచ్లు ఆడి 4693 పరుగులు చేశాడు. ఇంతకుముందు వరకు రికార్డు మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా పేరిట ఉండేది. రైనా సీఎస్కే తరపున 4,687 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్లో 19 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద తన మిత్రుడి రికార్డును తలైవా బ్రేక్ చేశాడు. కాగా రైనా చాలా సీజన్ల పాటు సీఎస్కేకే ప్రాతినిథ్యం వహించాడు. ధోనికి రైనాకు మంచి అనుబంధం ఉంది. అప్పటిలో అతడిని చిన్న తలా అని అభిమానులు పిలుచుకునే వారు. చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు..ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సీఎస్కే బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(41) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హాజిల్ వుడ్ మూడు వికెట్లు పడగొట్టగా.. యశ్ దయాల్, లివింగ్స్టోన్ తలా రెండు వికెట్లు సాధించారు.చెపాక్లో సీఎస్కేపై ఆర్సీబీ విజయం సాధించడం 2008 సీజన్ తర్వాత ఇదే తొలిసారి. దీంతో సీఎస్కే కంచుకోటను పాటిదార్ సారథ్యంలోని ఆర్సీబీ బద్దలు కొట్టింది. 2008 సీజన్ తర్వాత ఏ ఆర్సీబీ కెప్టెన్ కూడా చెపాక్లో సీఎస్కేపై తన జట్టును గెలిపించకలేకపోయాడు. ఇప్పుడు అది పాటిదార్కు సాధ్యమైంది. -
#RCB: సీఎస్కే కంచు కోట బద్దలు.. 17 ఏళ్ల తర్వాత తొలి విజయం
ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో విజయం సాధించింది. ఈ టోర్నీలో భాగంగా చెపాక్ వేదికగా జరిగిన చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 50 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. సీఎస్కే బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(41) టాప్ స్కోరర్గా నిలవగా.. ఆఖరిలో ధోని(16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 30) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హాజిల్ వుడ్ మూడు వికెట్లు పడగొట్టగా.. యశ్ దయాల్, లివింగ్స్టోన్ తలా రెండు వికెట్లు సాధించారు.చెపాక్లో సీఎస్కేపై ఆర్సీబీ విజయం సాధించడం 2008 సీజన్ తర్వాత ఇదే తొలిసారి. దీంతో సీఎస్కే కంచుకోటను పాటిదార్ సారథ్యంలోని ఆర్సీబీ బద్దలు కొట్టింది. 2008 సీజన్ తర్వాత ఏ ఆర్సీబీ కెప్టెన్ కూడా చెపాక్లో సీఎస్కేపై తన జట్టును గెలిపించకలేకపోయాడు. ఇప్పుడు అది పాటిదార్కు సాధ్యమైంది. కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్ పాటిదార్(51) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. ఫిల్ సాల్ట్(32), విరాట్ కోహ్లి(31), పడిక్కల్(27) రాణించారు. ఆఖరి ఓవర్లో టిమ్ డేవిడ్( 8 బంతుల్లో 1ఫోర్లు, 3 సిక్స్లతో 22) మెరుపులు మెరిపించాడు. సీఎస్కే బౌలర్లలో నూర్ ఆహ్మద్ మూడు వికెట్లు పడగొట్టగా.. పతిరానా రెండు, ఖాలీల్ అహ్మద్, అశ్విన్ తలా వికెట్ సాధించారు. -
అందుకే సన్రైజర్స్ వదిలేసింది.. అక్కడ కూడా అదే ఆటనా?
ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రాహుల్ త్రిపాఠి వరుసగా రెండో మ్యాచ్లోనూ విఫలమయ్యాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో త్రిపాఠి దారుణ ప్రదర్శన కనబరిచాడు. మరోసారి ఓపెనర్గా బరిలోకి దిగిన త్రిపాఠి కేవలం 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. జోష్ హాజిల్ వుడ్ బౌలింగ్లో చెత్త షాట్కు ప్రయత్నించి తన వికెట్ను కోల్పోయాడు. అంతకుముందు ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కూడా త్రిపాఠి కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో త్రిపాఠిని సీఎస్కే ఫ్యాన్స్ దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఈ చెత్త ఆడినందుకే సన్రైజర్స్ వదిలేసింది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాగా రాహుల్ త్రిపాఠి గత కొన్ని సీజన్లగా ఎస్ఆర్హెచ్కు ప్రాతినిథ్యం వహించాడు. కానీ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మెగా వేలానికి ముందు ఎస్ఆర్హెచ్ విడిచిపెట్టింది. దీంతో వేలంలోకి వచ్చిన అతడిని సీఎస్కే రూ. 3.40 కోట్లకు కొనుగోలు చేసింది. తన ధరకు తగ్గ న్యాయం త్రిపాఠి చేయలేకపోతున్నాడు. ఇక ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.చదవండి: #MS Dhoni: వారెవ్వా ధోని..కళ్లు మూసి తెరిచేలోపే! వీడియో వైరల్ -
IPL 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..
ఐపీఎల్-2025లో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పర్వాలేదన్పించాడు. ఈ మ్యాచ్లో కోహ్లి 30 బంతులు ఎదుర్కొన్న విరాట్.. 2 ఫోర్లు, 1 సిక్సర్తో 31 పరుగులు చేశాడు. తద్వారా కింగ్ కోహ్లి ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి నిలిచాడు.కోహ్లి ఇప్పటివరకు సీఎస్కేపై 34 మ్యాచ్ల్లో 1068 పరుగులు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ శిఖర్ ధావన్ పేరిట ఉండేది. ధావన్ చెన్నైపై 29 మ్యాచ్ల్లో 44.04 సగటుతో మొత్తం 1,057 పరుగులు చేశాడు. అందులో ఓ సెంచరీతో పాటు, 8 అర్ధ సెంచరీలు ఉన్నాయి. తాజా మ్యాచ్లో 3 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ధావన్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో కోహ్లి, ధావన్ తర్వాతి స్దానాల్లో వరుసగా రోహిత్ శర్మ(896), డేవిడ్ వార్నర్(696), కీరన్ పొలార్డ్(583) ఉన్నారు. ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్ పాటిదార్(51) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. ఫిల్ సాల్ట్(32), విరాట్ కోహ్లి(31), పడిక్కల్(27) రాణించారు. ఆఖరి ఓవర్లో టిమ్ డేవిడ్( 8 బంతుల్లో 1ఫోర్లు, 3 సిక్స్లతో 22) మెరుపులు మెరిపించాడు. సీఎస్కే బౌలర్లలో నూర్ ఆహ్మద్ మూడు వికెట్లు పడగొట్టగా.. పతిరానా రెండు, ఖాలీల్ అహ్మద్, అశ్విన్ తలా వికెట్ సాధించారు. -
వారెవ్వా ధోని..కళ్లు మూసి తెరిచేలోపే! వీడియో వైరల్
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం ఎంఎస్ ధోని మరోసారి వికెట్ల వెనక అద్బుతం చేశాడు. ఐపీఎల్-2025లో భాగంగా చెపాక్ వేదికగా రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో ధోని సంచలన స్టంపింగ్తో మెరిశాడు. మిస్టర్ కూల్ మెరుపు స్టంపింగ్తో ఆర్సీబీ ఓపెనర్ ఫిల్ సాల్ట్ను పెవిలియన్కు పంపాడు.ఆర్సీబీ ఇన్నింగ్స్ ఐదో ఓవర్ వేసిన స్పిన్నర్ నూర్ ఆహ్మద్.. ఆఖరి బంతిని సాల్ట్కు గూగ్లీగా సంధించాడు. ఆ బంతిని సాల్ట్ ఫ్రంట్ ఫుట్కు వచ్చి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి సాల్ట్ బ్యాట్ను మిస్స్ అయ్యి వికెట్ల వెనక ఉన్న ధోని చేతికి వెళ్లింది. వెంటనే ధోని రెప్ప పాటు వేగంతో స్టంప్స్ను గిరాటేశాడు. ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్కు రిఫర్ చేసినప్పటికి.. ధోని స్టంప్స్ను పడగొట్టేటప్పటికి సాల్ట్ బ్యాక్ఫుట్ గాల్లో ఉన్నట్లు రిప్లేలో కన్పించింది. దీంతో సాల్ట్(32) నిరాశతో పెవిలియన్కు చేరక తప్పలేదు. ధోని స్టంపింగ్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అంతకుముందు ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లోనూ ఈ తరహాలోనే సూర్యకుమార్ యాదవ్ను పెవిలియన్కు పంపాడు. ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్ పాటిదార్(51) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. ఫిల్ సాల్ట్(32), విరాట్ కోహ్లి(31), పడిక్కల్(27) రాణించారు. ఆఖరి ఓవర్లో టిమ్ డేవిడ్( 8 బంతుల్లో 1ఫోర్లు, 3 సిక్స్లతో 22) మెరుపులు మెరిపించాడు. సీఎస్కే బౌలర్లలో నూర్ ఆహ్మద్ మూడు వికెట్లు పడగొట్టగా.. పతిరానా రెండు, ఖాలీల్ అహ్మద్, అశ్విన్ తలా వికెట్ సాధించారు2️⃣ moments of magic 2️⃣ ultra fast stumpings ⚡Which one did you enjoy the most? 🤔Scorecard ▶ https://t.co/I7maHMwxDS #TATAIPL | #CSKvRCB pic.twitter.com/SxPcEphB6Y— IndianPremierLeague (@IPL) March 28, 2025 Less Than 1 Seconds And Dhoni Stumped Philip Salt 🥶⚡#CSKvsRCB #Dhoni pic.twitter.com/Y3hwNRCDp7— $achin Nayak (@SachinN18342436) March 28, 2025 -
హెడ్, క్లాసెన్ కాదు.. టీ20 క్రికెట్లో అతడే బెస్ట్ ప్లేయర్: హర్భజన్
ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ తొలి విజయాన్ని అందుకుంది. గురువారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ను 5 వికెట్ల తేడాతో లక్నో చిత్తు చేసింది. ఈ విజయంలో లక్నో ఆటగాడు నికోలస్ పూరన్ది కీలక పాత్ర. 191 పరుగుల లక్ష్య చేధనలో పూరన్ విధ్వంసం సృష్టించాడు.కేవలం 26 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 70 పరుగలు చేశాడు. ఈ క్రమంలో పూరన్పై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుత టీ20 క్రికెట్లో పూరన్ మించిన వారు లేరని అశ్విన్ కొనియాడాడు. ఢిల్లీతో జరిగిన తొలి మ్యాచ్లో లక్నో ఓటమి పాలైనప్పటికి.. ఆ మ్యాచ్లో కూడా పూరన్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఇటీవల కాలంలో పూరన్ టీ20ల్లో మాత్రం సంచలన ప్రదర్శన చేస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్లో పూరన్ ఆడుతున్నాడు. ఆడిన ప్రతీ చోట తన మార్క్ను నిక్కీ చూపిస్తున్నాడు. ప్రస్తుతం టీ20 ఫార్మాట్లో నికోలస్ పూరన్ అత్యుత్తమ ఆటగాడు అంటూ లక్నో-ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అనంతరం భజ్జీ ఎక్స్లో రాసుకొచ్చాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పూరన్ 145 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా కొనసాగుతున్నాడు. అదేవిధంగా కేఎల్ రాహుల్ తర్వాత లక్నో తరపున 1000 పరుగుల మైలురాయిని రెండవ ఆటగాడిగా పూరన్ నిలిచాడు. అతడు కేవలం 31 మ్యాచ్ల్లోనే ఈ ఘనతను సాధించాడు. ఈ కరేబియన్ స్టార్ ప్లేయర్ లక్నో తరపున 31 మ్యాచ్ల్లో 1002 పరుగులు చేశాడు. కాగా టీ20 క్రికెట్లో హార్డ్ హిట్టర్లగా పేరు గాంచిన ట్రావిస్ హెడ్, హెన్రిస్ క్లాసెన్లను కాకుండా పూరన్ను బెస్ట్ ప్లేయర్గా భజ్జీ ఎంచుకోవడం గమనార్హం.చదవండి: IPL 2025: ట్రావిస్ హెడ్నే బెంబేలెత్తించాడు.. ఎవరీ ప్రిన్స్ యాదవ్? -
సీఎస్కేపై ఆర్సీబీ ఘన విజయం..
IPL2025 Csk Vs Rcb live Updates and Highlights: సీఎస్కేపై ఆర్సీబీ ఘన విజయం..ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో విజయం సాధించింది. ఈ టోర్నీలో భాగంగా చెపాక్ వేదికగా జరిగిన చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 50 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. సీఎస్కే బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(41) టాప్ స్కోరర్గా నిలవగా.. ఆఖరిలో ధోని(16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 30) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హాజిల్ వుడ్ మూడు వికెట్లు పడగొట్టగా.. యశ్ దయాల్, లివింగ్స్టోన్ తలా రెండు వికెట్లు సాధించారు. చెపాక్లో సీఎస్కేపై ఆర్సీబీ విజయం సాధించడం 2008 సీజన్ తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్ పాటిదార్(51) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. ఫిల్ సాల్ట్(32), విరాట్ కోహ్లి(31), పడిక్కల్(27) రాణించారు. ఆఖరి ఓవర్లో టిమ్ డేవిడ్( 8 బంతుల్లో 1ఫోర్లు, 3 సిక్స్లతో 22) మెరుపులు మెరిపించాడు. సీఎస్కే బౌలర్లలో నూర్ ఆహ్మద్ మూడు వికెట్లు పడగొట్టగా.. పతిరానా రెండు, ఖాలీల్ అహ్మద్, అశ్విన్ తలా వికెట్ సాధించారు. కష్టాల్లో సీఎస్కే.. 81 పరుగులకే 6 వికెట్లుసీఎస్కే 81 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 13వ ఓవర్ వేసిన యశ్ దయాల్ బౌలింగ్లో తొలి బంతికి రచిన్ రవీంద్ర(41).. ఐదో బంతికి శివమ్ దూబే(19) ఔటయ్యాడు. 14 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే 6 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది.సీఎస్కే నాలుగో వికెట్ డౌన్.. సామ్ కుర్రాన్ రూపంలో సీఎస్కే నాలుగో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన సామ్ కుర్రాన్.. లివింగ్ స్టోన్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి శివమ్ దూబే వచ్చాడు. 10 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే 4 వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది.సీఎస్కే మూడో వికెట్ డౌన్.. దీపక్ హుడా ఔట్దీపక్ హుడా రూపంలో సీఎస్కే మూడో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన హుడా.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో ఔటయ్యాడు. 4.4 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 26/3సీఎస్కేకు భారీ షాక్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కేకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. రెండో ఓవర్ వేసిన జోష్ హాజిల్ వుడ్ బౌలింగ్లో రెండో బంతికి రాహుల్ త్రిపాఠి(5) ఔట్ కాగా.. ఆఖరి బంతికి రుతురాజ్ గైక్వాడ్(0) పెవిలియన్కు చేరాడు.పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్.. సీఎస్కే ముందు భారీ టార్గెట్చెపాక్ వేదికగా చెన్నైసూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్లు చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్ పాటిదార్(51) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. ఫిల్ సాల్ట్(32), విరాట్ కోహ్లి(31), పడిక్కల్(27) రాణించారు. ఆఖరి ఓవర్లో టిమ్ డేవిడ్( 8 బంతుల్లో 1ఫోర్లు, 3 సిక్స్లతో 22) మెరుపులు మెరిపించాడు. సీఎస్కే బౌలర్లలో నూర్ ఆహ్మద్ మూడు వికెట్లు పడగొట్టగా.. పతిరానా రెండు, ఖాలీల్ అహ్మద్, అశ్విన్ తలా వికెట్ సాధించారు.ఆర్సీబీ ఐదో వికెట్ డౌన్..జితేశ్ కుమార్ రూపంలో ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన జితేశ్.. ఖాలీల్ అహ్మద్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. క్రీజులోకి టిమ్ డేవిడ్ వచ్చాడు.16 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్16 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 4 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. క్రీజులో జితేశ్ శర్మ(7), రజిత్ పాటిదార్(38) ఉన్నారు.ఆర్సీబీ మూడో వికెట్ డౌన్.. విరాట్ కోహ్లి ఔట్విరాట్ కోహ్లి రూపంలో ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. నూర్ ఆహ్మద్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. 13 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ మూడు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. క్రీజులో పాటిదార్(21), లివింగ్ స్టోన్(1) ఉన్నారు.హిట్టింగ్ మొదలెట్టిన కోహ్లి11 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. క్రీజులో రజిత్ పాటిదార్(16), విరాట్ కోహ్లి(27) ఉన్నారు. ఇప్పటివరకు నెమ్మదిగా ఆడిన కోహ్లి.. తన హిట్టింగ్ను మొదలుపెట్టాడు.ఆర్సీబీ రెండో వికెట్ డౌన్.. పడిక్కల్ ఔట్దేవదత్త్ పడిక్కల్ రూపంలో ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 27 పరుగులతో దూకుడుగా ఆడిన పడిక్కల్.. అశ్విన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 8 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 2 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(12) ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. సాల్ట్ ఔట్.. ఫిల్ సాల్ట్ రూపంలో ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 32 పరుగులు చేసిన సాల్ట్.. నూర్ ఆహ్మద్ బౌలింగ్లో స్టంపౌట్గా వెనుదిరిగాడు. వికెట్ల వెనక ధోని మరోసారి అద్భుతం చేశాడు. క్రీజులోకి దేవదత్త్ పడిక్కల్ వచ్చాడు. 6 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(11), పడిక్కల్(9) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న ఆర్సీబీ ఓపెనర్లు..టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. 2 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. క్రీజులో ఫిల్ సాల్ట్(24), విరాట్ కోహ్లి(1) ఉన్నారు.ఐపీఎల్-2025లో మరో కీలక పోరుకు సమయం అసన్నమైంది. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సీఎస్కే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. సీఎస్కే జట్టులోకి మతీషా పతిరానా రాగా.. ఆర్సీబీ జట్టులోకి భువనేశ్వర్ కుమార్ వచ్చాడు.తుది జట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్(కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్వుడ్, యశ్ దయాల్చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, సామ్ కుర్రాన్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, మతీషా పతిరణ, ఖలీల్ అహ్మద్ -
ట్రావిస్ హెడ్నే బెంబేలెత్తించాడు.. ఎవరీ ప్రిన్స్ యాదవ్?
ఐపీఎల్-2025లో ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన అరంగేట్ర మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై విఫలమైన ప్రిన్స్ యాదవ్.. రెండో మ్యాచ్లో మాత్రం ప్రత్యర్ధి ముప్పు తిప్పలు పెట్టాడు. ఎస్ఆర్హెచ్ను భారీ స్కోర్ సాధించకుండా ఆపడంలో ప్రిన్స్ది కీలక పాత్ర. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 29 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. ఎస్ఆర్హెచ్ విధ్వసంకర ఆటగాడు ట్రావిస్ హెడ్ను ఈ యువ పేసరే ఔట్ చేశాడు. ప్రిన్స్ యాదవ్ అద్భుతమైన బంతితో హెడ్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. యాదవ్ వేసిన బంతికి హెడ్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. అతడి వేసిన డెలివరికి హెడ్ బిత్తర పోయాడు. హెడ్ వికెటే కాకుండా హెన్రిచ్ క్లాసెన్ రనౌట్ కావడంలో కూడా ప్రిన్స్దే కీకల పాత్ర. ఈ క్రమంలో ఎవరీ ప్రిన్స్యాదవ్ అని నెటిజన్లు తెగవేతికేస్తున్నారు.ఎవరీ ప్రిన్స్ యాదవ్?23 ఏళ్ల ప్రిన్స్ యాదవ్.. దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ తరపున ఆడుతున్నాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2024లో పురానీ ఢిల్లీ తరపున ఆడిన ప్రిన్స్.. 10 మ్యాచ్ల్లో 13 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఢిల్లీ వైట్ బాల్ జట్టులో ప్రిన్స్ చోటు దక్కించుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో కూడా ఈ యువ బౌలర్ సత్తాచాటాడు. ఈ టోర్నీలో ప్రిన్స్ 11 వికెట్లు పడగొట్టి.. ఢిల్లీ సెమీస్కు చేరడంలో ప్రధాన పాత్ర పోషించాడు. విజయ్ హజారే ట్రోఫీలో ప్రిన్స్ 11 వికెట్లు సాధించాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ స్కౌట్స్ దృష్టిలో ఈ ప్రిన్స్ యాదవ్ పడ్డాడు. గత డిసెంబర్లో జరిగిన మెగా వేలంలో రూ. 30 లక్షల కనీస ధరకు అతడిని ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. అతడికి అద్భుతమైన వైడ్ యార్కర్ డెలివరీలు బౌలింగ్ చేసే సత్తా ఉంది. అంతేకాకుండా గుడ్ లైన్ అండ్ లెంగ్స్తో కూడా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ యువ పేసర్ కచ్చితంగా ఫ్యూచర్ స్టార్గా మారుతాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్పై 44 పరుగుల తేడాతో లక్నో ఘన విజయం సాధించింది.చదవండి: అది ప్రపంచంలోనే బెస్ట్ వికెట్.. వాళ్లు అద్భుతంగా ఆడారు: కమిన్స్ -
కోహ్లితో పాటు అతడిని కట్టడి చేస్తే విజయం మాదే: CSK హెడ్కోచ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025లో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఐదుసార్లు చాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK)- ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య శుక్రవారం మ్యాచ్ జరుగనుంది. అయితే, ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారడానికి కారణం టీమిండియా దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోని- విరాట్ కోహ్లి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.2008 తర్వాత అక్కడ నో విన్!అయితే, ఇందుకు మరో కారణం.. వేదిక. అవును.. సీఎస్కే సొంత మైదానం చెపాక్ స్టేడియం ఈ హై రేంజ్ మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తోంది. ఇక్కడ ఆరంభ సీజన్లో అంటే 2008లో తొలిసారి గెలిచిన ఆర్సీబీ.. ఇంత వరకు ఒక్కసారి కూడా మళ్లీ గెలుపు రుచిచూడలేదు. ఇప్పటి వరకు చిదంబరం స్టేడియంలో ఏడు మ్యాచ్లు ఆడి అన్నింటా ఓటమిపాలైంది.ఇక ముఖాముఖి పోరులోనూ ఇప్పటి వరకు చెన్నైతో జరిగిన 33 మ్యాచ్లలో 11 మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో శుక్రవారం నాటి మ్యాచ్లో అందరి దృష్టి ఆర్సీబీ సూపర్స్టార్ విరాట్ కోహ్లి మీదే కేంద్రీకృతమై ఉంది. జట్టు పరిస్థితి ఎలా ఉన్నా.. కోహ్లి మాత్రం సీఎస్కే మీద మెరుగై రికార్డు కలిగి ఉన్నాడు.ఇప్పటి వరకు సీఎస్కే 33 మ్యాచ్లలో ఆడిన కోహ్లి 1053 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్కు ముందు మీడియా ముందుకు వచ్చిన చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కోహ్లితో ప్రమాదం ఉందని భావిస్తున్నారా ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ ఈ సీజన్లో ఆర్సీబీ ఇప్పటికి ఒక్క మ్యాచ్ ఆడింది. దానిని బట్టి ఇప్పుడే అంచనాకు రాలేము.కోహ్లితో పాటు అతడిని కట్టడి చేస్తే విజయం మాదేగతేడాదితో పోలిస్తే ఈసారి సీఎస్కే- ఆర్సీబీ సరికొత్తగా ఉన్నాయి. గత రికార్డుల గురించి ప్రస్తావన అప్రస్తుతం. ఏదేమైనా ఆర్సీబీకి కోహ్లి అత్యంత కీలకమైన ఆటగాడు. వాళ్ల జట్టు కూడా గతం కంటే మరింత పటిష్టంగా మారింది.ఒకవేళ మేము కోహ్లి, పాటిదార్లను కట్టడి చేయగలిగితే.. అది మా విజయానికి దోహం చేస్తుంది’’ అని స్టీఫెన్ ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. కాగా తాజా ఎడిషన్లో ఆర్సీబీ తొలుత డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడింది. ఆ మ్యాచ్లో కోహ్లి 36 బంతుల్లో 59 పరుగులతో అజేయంగా నిలవగా.. కెప్టెన్ రజత్ పాటిదార్ 16 బంతుల్లోనే 34 రన్స్ చేశాడు. ఫలితంగా 16.2 ఓవర్లలోనే 175 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేసి ఆర్సీబీ గెలిచింది.ఇక సీఎస్కే తమ తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా ఆర్సీబీకి గతంలో కోహ్లి కెప్టెన్గా వ్యవహరించగా.. చెన్నైని ముందుండి నడిపించిన ధోని.. గతేడాది తన బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించాడు.చదవండి: MS Dhoni: బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే! -
SRH: ‘రోడ్ల’ మీద బౌలింగ్ చేయించడం మానుకోండి: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యానికి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ (Michael Vaughan) కీలక సూచనలు చేశాడు. ‘రోడ్ల’పై బౌలింగ్ చేయించే వైఖరికి స్వస్తి పలకాలని.. బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించకూడదని హితవు పలికాడు. మేటి బౌలర్లు జట్టులో ఉన్నా.. బౌలింగ్ కోసం స్పెషలిస్టు బ్యాటర్ల మీద ఆధారపడాల్సిన దుస్థితి ఇందుకు నిదర్శమని పేర్కొన్నాడు.కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025లో సన్రైజర్స్ తమ ఆరంభ మ్యాచ్లో అదరగొట్టిన విషయం తెలిసిందే. సొంత మైదానం ఉప్పల్లో రాజస్తాన్ రాయల్స్పై 286 పరుగులు స్కోరు చేసింది. అయితే, రాయల్స్ కూడా అంత తేలికగ్గా తలవంచలేదు. 242 రన్స్ చేసింది.రైజర్స్కు చేదు అనుభవంఇక రెండో మ్యాచ్లో మాత్రం రైజర్స్కు చేదు అనుభవం ఎదురైంది. లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants)తో ఉప్పల్లో గురువారం నాటి మ్యాచ్లో కమిన్స్ బృందం 190 పరుగులకే కుప్పకూలింది. మరోవైపు.. రైజర్స్ బ్యాటింగ్ పవర్ రుచిని వారికే చూపిస్తూ.. ఆట అంటే ఇట్టా ఉండాలి అన్నట్లుగా లక్నో స్టార్ నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.ఈ పవర్ హిట్టర్ను కట్టడి చేయాలని రైజర్స్ బౌలర్లు ఎంతగా కష్టపడినా ఫలితం లేకుండా పోయింది. 26 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 70 పరుగులు సాధించాడు. ఆఖరికి కమిన్స్ అద్భుత బంతితో అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో ఎట్టకేలకు సన్రైజర్స్కు బ్రేక్ దొరికింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 16.1 ఓవర్లలోనే లక్నో లక్ష్యాన్ని ఛేదించింది.Raining sixes in Hyderabad... but by #LSG 🌧Nicholas Pooran show guides LSG to 77/1 after 6 overs 👊Updates ▶ https://t.co/X6vyVEvxwz#TATAIPL | #SRHvLSG | @LucknowIPL pic.twitter.com/K2Dlk5AXQw— IndianPremierLeague (@IPL) March 27, 2025 400కు పైగా పరుగులుఇక తొలి రెండు మ్యాచ్లలో సన్రైజర్స్ బ్యాటర్ల గురించి పక్కనపెడితే.. బౌలర్లు మాత్రం బాధితులుగా మిగిలిపోయారు. మహ్మద్ షమీ, కమిన్స్, హర్షల్ పటేల్, ఆడం జంపా.. ఇలా జట్టులోని బౌలింగ్ విభాగం అంతా కలిసి ఇప్పటికే 400 (242, 193)కు పైగా పరుగులు సమర్పించుకున్నారు.కాగా లక్నోతో మ్యాచ్లో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కూడా బౌలింగ్కు రావడం గమనార్హం. అతడు ఒకే ఒక్క బంతి వేయగా ప్రత్యర్థి బ్యాటర్ ఫోర్ బాదాడు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ మైకేల్ వాన్ మాట్లాడుతూ.. ‘‘ఎస్ఆర్హెచ్ ఇకనైనా జాగ్రత్తగా ఉండాలి.తమ బౌలర్లు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్లు రోడ్లమీద బౌలింగ్ చేస్తున్నారు. జంపా ఆటను నాశనం చేశారు. షమీ ఓవర్కు 12 పరుగుల చొప్పున ఇచ్చాడు. అందుకే సన్రైజర్స్ జాగ్రత్త పడాలి.రోడ్ల మీద బౌలింగ్ చేయించడం మానుకోండిసొంత మైదానంలో రోడ్ల మీద బౌలింగ్ చేయించే పనులు మానుకోవాలి. ఇది ఇలాగే కొనసాగితే వేరే వేదికలపై మీ బౌలర్లు రాణించలేరు. అప్పటికే వాళ్లు ఆత్మవిశ్వాసం కోల్పోయి.. వేరే చోట బౌలింగ్ చేయాలంటే భయపడిపోయే స్థితికి వస్తారు’’ అని వాన్ చురకలు అంటించాడు.ఇక లక్నోతో మ్యాచ్లో ఇషాన్ కిషన్తో బ్యాటింగ్ చేయడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘నాకు తెలిసి కమిన్స్కు కొత్త బౌలర్ దొరికి ఉంటాడు. వాళ్లు సొంత గ్రౌండ్లో ఐదో మ్యాచ్ ఆడే సరికి ఇషాన్ కిషన్ మరిన్ని ఓవర్లు బౌలింగ్ చేయాల్సి వస్తదేమో!.. ఎందుకంటే మిగతా బౌలర్లు ..‘ఈ రోడ్ల మీద మేము బౌలింగ్ చేయలేము అని చేతులెత్తేస్తారు’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. క్రిక్బజ్ షోలో ఈ మేరకు వాన్ వ్యాఖ్యలు చేశాడు.చదవండి: BCCI: అతడికి ఈసారి టాప్ గ్రేడ్.. తొలిసారి వీళ్లకు వార్షిక కాంట్రాక్టులు! -
MS Dhoni: బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే!
మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni).. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings).. ఈ రెండూ పర్యాయ పదాలు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆరంభం నుంచి చెన్నై ఐకాన్గా ఉన్న ధోని.. ‘తలా’గా అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. సీఎస్కేను ఐదుసార్లు చాంపియన్గా నిలిపిన ధోనికి ఉన్న క్రేజ్ గురించి మాటల్లో వర్ణించడం సాధ్యం కాదంటే అతిశయోక్తి కాదు.అతడు మైదానంలో అడుగుపెట్టాడంటే ప్రేక్షకులు ఇంకెవరినీ పట్టించుకోరు. ముఖ్యంగా తలా బ్యాట్తో రంగంలోకి దిగాడంటే.. నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న తమ జట్టు ఆటగాడైనా సరే అవుటై.. ధోనికి ఫినిషింగ్ చేసే అవకాశం ఇవ్వాలని ప్రార్థిస్తారు. అయితే, ఒక్కోసారి ఈ వీరాభిమానం వల్ల ధోని సొంత జట్టు ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెన్నై మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు.ధోని క్రేజ్ వల్ల ఇతర ఆటగాళ్లు ఇబ్బంది పడుతున్నారని.. దీనికి ‘తలా’నే స్వయంగా స్వస్తి పలకాలని రాయుడు విజ్ఞప్తి చేశాడు. అంతేకాదు.. ధోని ఒక్కడి చుట్టే జట్టును అభివృద్ధి చేసిన చెన్నై.. కొత్త ఆటగాళ్లకు ఇవ్వాల్సిన స్థాయిలో అవకాశాలు ఇవ్వలేదని అభిప్రాయపడ్డాడు. కేవలం ధోని ఒక్కడినే నమ్ముకున్న చెన్నై యాజమాన్యం.. అతడి నిష్క్రమణ తర్వాత ఇబ్బందులపాలు కాకతప్పదని చెప్పుకొచ్చాడు.రచిన్ రవీంద్రపై విమర్శలుకాగా ఐపీఎల్-2025లో చెన్నై శుభారంభం చేసిన విషయం తెలిసిందే. సొంతమైదానం చెపాక్లో ముంబై ఇండియన్స్పై గెలిచి ఈ సీజన్లో బోణీ కొట్టింది. అయితే, ఈ మ్యాచ్లో లక్ష్య ఛేదనలో భాగంగా యువ ఓపెనర్ రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65 నాటౌట్)తో కలిసి ధోని క్రీజులో ఉన్నాడు.పందొమ్మిదవ ఓవర్లో క్రీజులోకి వచ్చిన ధోని రెండు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. ఈ క్రమంలో మరుసటి ఓవర్ తొలి బంతికే సిక్సర్ బాది రచిన్ సీఎస్కేను గెలుపుతీరాలకు చేర్చాడు. దీంతో చెన్నై మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.ఈ నేపథ్యంలో చెన్నై విజయానికి సంతోషిస్తూనే రచిన్ను కొంతమంది పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ధోనికి ఫినిషింగ్ చేసే అవకాశం ఇవ్వలేదంటూ అతడిని సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. ఇక సీఎస్కే తదుపరి మ్యాచ్లో ఇదే వేదికపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో శనివారం తలపడనుంది.బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే!ఈ నేపథ్యంలో ధోని క్రేజ్ గురించి అంబటి రాయుడు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘ఇది చాలా విచిత్రమైన విషయం. చాలా మంది సీఎస్కే కంటే ముందు ధోని అభిమానులు. కానీ వారి అభిమానం వల్ల కొత్త ఆటగాళ్లు చాలాసార్లు ఇబ్బంది పడాల్సివస్తోంది.ధోని రాగానే బిగ్గరగా అరుస్తారు. వేరే వాళ్లకు అది అసౌకర్యంగా ఉంటుంది. ఫ్రాంఛైజీ అతడి చుట్టూనే జట్టును నిర్మించింది. చాలా ఏళ్లుగా అతడినే హైలైట్ చేస్తూ వస్తోంది. అందుకే ‘తలా’గా అతడు ప్రసిద్ధి పొందాడు.చెన్నై ఫ్రాంఛైజీకి కూడా తిప్పలు తప్పవుఅతడంటే చాలా మందికి పిచ్చి ప్రేమ. అందుకే తమ జట్టు ఆటగాళ్లనే అవుట్ కావాలని కోరుకుంటూ ఉంటారు. దీంతో చాలా మంది ప్లేయర్లు ఇబ్బంది పడ్డారు. వాళ్లు బయటకు వచ్చి చెప్పకపోవచ్చు కానీ ఇదే సత్యం. దీనికి ధోని మాత్రమే చెక్ పెట్టగలడు.ఆయన బయటకు వచ్చి.. ‘వీళ్లంతా మన వాళ్లే.. నాలాగే బ్యాటింగ్ చేసేందుకు వస్తారు. వాళ్లను కూడా నాలాగే ఆదరించండి’ అని చెప్పాలి. లేదంటే.. చెన్నై ఆటగాళ్లకే కాదు.. భవిష్యత్తులో చెన్నై ఫ్రాంఛైజీకి కూడా తిప్పలు తప్పవు.స్టేడియం నిండిపోవడానికి, జనాన్ని పోగు చేయడానికి ధోని క్రేజ్ ఉపయోగపడుతుంది. ఫ్రాంఛైజీ కూడా ఎప్పుడూ అతడి మీదే ఫోకస్ ఉంచుతుంది. బ్రాండ్ వాల్యూ కోసం అలా చేస్తుంది. కానీ .. ఆ తర్వాత.. ధోని జట్టుతో లేకుంటే.. అప్పుడు పరిస్థితి ఏమిటి?.. కాబట్టి వాళ్లు కాస్త విశాలంగా ఆలోచించాలి’’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: అది ప్రపంచంలోనే బెస్ట్ వికెట్.. వాళ్లు అద్భుతంగా ఆడారు: కమిన్స్ -
ఇగ్నిషియో క్రికెట్ సిరీస్ విజేతగా ‘బ్యాట్ కేవ్’ జట్టు
ఎస్ఎస్కే స్పోర్ట్స్ అకాడమీ నిర్వహించిన ఇగ్నిషియో స్టార్ వార్ సీజన్ 2 విజేతగా ది బ్యాట్ కేవ్ జట్టు నిలిచింది. నానక్ రామ్ గూడ లో శుక్రవారం నిర్వహించిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్లో క్లాసిక్ కల్ట్ స్టార్స్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 163/5 స్కోరు చేయగా, ది బ్యాట్ కేవ్ జట్టు 16.5 ఓవర్లలో 165/5 స్కోరు చేసి విజేతగా నిలిచింది.టోర్నమెంట్కు ది బ్యాట్ కేవ్, వావ్ కాజ్. కామ్, హైరింగ్ ఐ, టాలెంట్ కన్సల్టింగ్ స్పాన్సర్స్ గా, ఇగ్నిటియో చైల్డ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరించాయి. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా ప్రణీత్ కళ్లేపు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా మోహన్, బెస్ట్ బ్యాట్స్మెన్ గా ప్రణీత్ కళ్లేపు, బెస్ట్ బౌలర్ గా రాధా నిలిచారు. ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ సీనియర్ సైకాలజిస్ట్ కృష్ణ భరత్ విజేతల ట్రోఫీని అందజేశారు. చిన్నతనంలో సరైన మార్గదర్శకత్వం, శిక్షణ, అభివృద్ధి ఎంతో ముఖ్యం అని చెప్పారు. ప్రత్యేక అవసరాల పిల్లలకు ఇగ్నిషియో అత్యుత్తమ సేవలను అందిస్తున్నదని తెలిపారు. అందరూ ఆటను ఆస్వాదిస్తూ కొనసాగించాలని ప్రోత్సహించారు. -
అది ప్రపంచంలోనే బెస్ట్ వికెట్.. వాళ్లు అద్భుతంగా ఆడారు: కమిన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025లో సన్రైజర్స్ హైదరాబాద్కు తొలి ఓటమి ఎదురైంది. క్యాష్ రిచ్ లీగ్ తాజా ఎడిషన్లో తమ ఆరంభ మ్యాచ్లో అద్భుతంగా ఆడిన కమిన్స్ బృందం.. రెండో మ్యాచ్లో మాత్రం పేలవ ప్రదర్శన కనబరిచింది. బ్యాటర్లు, బౌలర్ల సమిష్టి వైఫల్యం కారణంగా లక్నో సూపర్ జెయింట్స్తో గురువారం నాటి మ్యాచ్లో పరాజయం చవిచూసింది.ఈ నేపథ్యంలో సన్రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) మాట్లాడుతూ.. ఉప్పల్ పిచ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘మొన్నటికి.. ఇప్పటికి వికెట్ వేరుగా ఉంది. నిజానికి మేము మరికొన్ని పరుగులు చేయాల్సింది.ప్రపంచంలోనే అత్యుత్తమ పిచ్గత మ్యాచ్లోని పిచ్ ప్రపంచంలోనే అత్యుత్తమ పిచ్. ఇక ఈ మ్యాచ్లో మేము 190 పరుగులు చేయగలడం సానుకూల అంశమే. ఈరోజు వికెట్ బాగానే ఉంది. దీనిని రెండో అత్యుత్తమ పిచ్గా చెప్పవచ్చు’’ అని పేర్కొన్నాడు.కాగా సొంతమైదానం ఉప్పల్లో తొలుత రాజస్తాన్ రాయల్స్తో తలపడిన సన్రైజర్స్.. 286 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో రాయల్స్ను 242 పరుగులకే కట్టడి చేసి.. 44 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. కానీ గురువారం సీన్ రివర్స్ అయింది.లక్నోతో మ్యాచ్లో టాస్ ఓడిన సన్రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ప్రత్యర్థి జట్టు బౌలర్ల ధాటికి రైజర్స్ 190 పరుగులకే పరిమితమైంది. ట్రవిస్ హెడ్ (28 బంతుల్లో 47), నితీశ్ రెడ్డి (28 బంతుల్లో 32), క్లాసెన్ (17 బంతుల్లో 26), కమిన్స్ (4 బంతుల్లో 18) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. యువబ్యాటర్ అనికేత్ వర్మ (Aniket Verma) మాత్రం అద్భుత ఇన్నింగ్స్(13 బంతుల్లో 36) ఆడాడు. లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ ఉత్తమంగా (4/34) రాణించాడు. 3⃣6⃣ runs5⃣ massive sixes 🔥Aniket Verma's explosive cameo gave #SRH the much-needed late flourish 🧡Updates ▶ https://t.co/X6vyVEvxwz#TATAIPL | #SRHvLSG | @SunRisers pic.twitter.com/21gh3f2jZR— IndianPremierLeague (@IPL) March 27, 2025 ఇక లక్ష్య ఛేదనకు దిగిన లక్నోను రైజర్స్ బౌలర్ల కట్టడి చేయలేకపోయారు. ఆరంభంలోనే ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్(1)ను అవుట్ చేసినా.. మిచెల్ మార్ష్ (31 బంతుల్లో 52), నికోలస్ పూరన్(26 బంతుల్లో 72)ల దూకుడుకు కళ్లెం వేయలేకపోయారు. వీరి అద్భుత అర్ధ శతకాల కారణంగా లక్నో 16.1 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు నష్టపోయి గెలుపొందింది.లక్నో బ్యాటర్లు అద్భుతంగా ఆడారుఈ క్రమంలో ఓటమి తర్వాత ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. ‘‘లక్నో బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. వాళ్ల బౌలర్లు కూడా రాణించారు. ఏదేమైనా మేము 190 పరుగులు స్కోరు చేయడం మంచి విషయమే. ప్రతి మ్యాచ్ సరికొత్తగానే ఉంటుంది. గత మ్యాచ్లో ఇషాన్ కిషన్ శతకంతో చెలరేగాడు.ఈసారి అతడు డకౌట్ అయ్యాడంటే.. అది లక్నో బౌలర్ల ప్రతిభ వల్లే. వారు మాకు ఏ దశలోనూ అవకాశం ఇవ్వలేదు. ఇలాంటివి ఆటలో సహజం. దీనికే మేము కుంగిపోవాల్సిన పనిలేదు. మా జట్టులో ఎనిమిది మంది బ్యాటర్లు ఉన్నారు. వారిలో ఒకరో ఇద్దరో కచ్చితంగా ప్రభావం చూపిస్తారు. అయితే, ఈరోజు మేము మరింత గొప్పగా ఆడాల్సింది.తదుపరి మ్యాచ్పై దృష్టి పెడతాంటోర్నీలో ఇంకా చాలా మ్యాచ్లు మిగిలే ఉన్నాయి. ఈ పరాజయం నుంచి త్వరగా కోలుకుని.. తదుపరి మ్యాచ్పై దృష్టి పెడతాం’’ అని పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్లో కమిన్స్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడటంతో పాటు.. కీలకమైన మార్ష్, పూరన్ల వికెట్లను దక్కించుకున్నాడు. ఇక తదుపరి సన్రైజర్స్ ఆదివారం (మార్చి 30) ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడుతుంది. ఇందుకు ఢిల్లీ సెకండ్ హోం గ్రౌండ్ విశాఖపట్నంలోని డాక్టర్ వైస్సార్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదిక.చదవండి: BCCI: అతడికి ఈసారి టాప్ గ్రేడ్.. తొలిసారి వీళ్లకు వార్షిక కాంట్రాక్టులు! -
మొన్న అలా.. ఇప్పుడిలా! లక్నో జట్టు యజమాని చర్య వైరల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో వివిధ ఫ్రాంఛైజీ యజమానుల తీరు భిన్నంగా ఉంటుంది. అయితే గత సీజన్లో వివాదాస్పదంగా నిలిచి వార్తలలోకి ఎక్కిన యజమాని ఎవరంటే.. నిస్సందేహంగా లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజయ్ గోయెంకా(Sanjeev Goenka)నే. గత సీజన్ లో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో ఓడిపోయిన తర్వాత గోయెంకా స్టేడియంలోనే నిలబడి రాహుల్పై విమర్శలు గుప్పించారు.నాటి కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul)తో గోయెంకా చేసిన ఈ యానిమేటెడ్ చాట్ అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. గోయెంకా వ్యవహార శైలిపై అప్పట్లో అనేకమంది విమర్శలు గుప్పించారు. దీని ఫలితంగా చివరికి రాహుల్ ఫ్రాంచైజ్ నుంచి తప్పుకొన్నాడనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి.రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లు తర్వాత మెగా వేలంలో భారత్ వికెట్టుకీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ను లక్నో రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లు ఖర్చు కొనుగోలు చేసి కెప్టెన్గా నియమించింది. కానీ ఈ వికెట్ కీపర్-బ్యాటర్ తన పూర్వ ఫ్రాంచైజ్ ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో తడబడ్డాడు. పంత్ ఆరు బంతులు ఆడి చివరికి తన ఖాతాను కూడా తెరవకుండా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్ లో లక్నో పరాజయం చవిచూసిన తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా మళ్ళీ అదే రీతిలో కెప్టెన్ పంత్, ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్తో సమావేశమయ్యారు.Hyderabad conquered ✅Win secured ✅#LSG get their first 𝐖 of #TATAIPL 2025 with a comfortable victory over #SRH 💙Scorecard ▶ https://t.co/X6vyVEvxwz#SRHvLSG | @LucknowIPL pic.twitter.com/7lI4DESvQx— IndianPremierLeague (@IPL) March 27, 2025ఈసారి వీరి సంభాషణ కొద్దిగా స్నేహపూర్వకంగా వాతావరణంలో జరిగినట్లు కనిపించింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం అభిమానులు గోయెంకా మాజీ కెప్టెన్ కెఎల్ రాహుల్తో చేసిన వివాదాస్పద సంభాషణ తో పోలుస్తూ ఈ వీడియో ని బాగా వైరల్ చేసారు.పంత్ను గట్టిగా కౌగిలించుకొనిఅయితే ఈసారి కథనం నాటకీయ మలుపు తీసుకుంది. గురువారం జరిగిన మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ పై లక్నో పూర్తి ఆధిపత్యం చెలాయించి సొంత గడ్డ పై ప్రత్యర్థి ని అయిదు వికెట్ల తేడాతో.. అదీ ఇంకా 23 బంతులు మిగిలి ఉండగానే ఓడించింది. దీంతో గోయెంకా ఆనందాన్ని పట్టలేక కెప్టెన్ రిషబ్ పంత్ను గట్టిగా కౌగిలించుకోవడం కనిపించింది. గత సంవత్సరం రాహుల్ కెప్టెన్సీలో ఇదే జట్టుపై ఓటమి తర్వాత గోయెంకా జరిపిన సంభాషణకు.. తాజా దృశ్యాలు పూర్తి విరుద్ధంగా కనిపించాయి. గోయెంకా ప్రవర్తనలో ఈ మార్పును అభిమానులు గ్రహించి సోషల్ మీడియాలో ఈ సంభాషను పోలుస్తూ మీమ్లతో ముంచెత్తారు. ఈ సందర్భంగా భారత మాజీ పేసర్, లక్నో బౌలింగ్ కోచ్ జహీర్ ఖాన్ కూడా నవ్వుతూ కనిపించారు. ఈ విజయం లక్నో ఫ్రాంచైజ్ లోని అందరికీ చాలా ఉపశమనం ఇచ్చినట్టు స్పష్టంగా కనిపించింది.Sanjiv Goenka gives a tight hug to Rishabh Pant. pic.twitter.com/yHcnCCmxXP— Mufaddal Vohra (@mufaddal_vohra) March 27, 2025 వ్యక్తిగత ఒడిదుడుకుల మధ్య పంత్ కెప్టెన్సీతన జట్టును విజయపథంలో నడిపించినప్పటికీ, రిషబ్ పంత్ బ్యాటింగ్ ఫామ్ ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉంది. వ్యక్తిగతంగా చూస్తే తన తొలి మ్యాచ్లో డకౌట్ అయిన పంత్ ఈ మ్యాచ్లో 15 బంతుల్లో 15 పరుగులు చేసాడు. అయితే, బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్ పై ముందుగా బౌలింగ్ చేయాలన్న పంత్ దృఢ సంకల్పం అతని నాయకత్వ ధోరణిని చెప్పకనే చెబుతుంది.చదవండి: Kavya Maran: క్యాచ్ డ్రాప్.. చిన్న పిల్లలా కేరింతలు.. కానీ పాపం ఆఖరికి! -
BCCI: అతడికి ఈసారి టాప్ గ్రేడ్.. తొలిసారి వీళ్లకు చోటు!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవల మహిళల సీనియర్ జట్టుకు సంబంధించిన వార్షిక కాంట్రాక్టులను విడుదల చేసింది. అయితే, పురుషుల సీనియర్ టీమ్ సెంట్రల్ కాంట్రాక్టుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున కాస్త జాప్యం జరుగుతోందని బోర్డు వర్గాలు వెల్లడించాయి. తాజా సమాచారం ప్రకారం మరికొన్ని రోజుల్లోనే బీసీసీఐ ఈ అంశంపై తుదినిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా.. టీమిండియా ప్రధాన కోచ్ గౌతం గంభీర్తో శనివారం సమావేశం కానున్నట్లు సమాచారం. కాగా బీసీసీఐ టీమిండియా ఆటగాళ్లను A+, A, B, C గ్రేడ్లుగా విభజించి వార్షిక వేతనాలు అందచేస్తోన్న విషయం తెలిసిందే. రోహిత్, కోహ్లిల కొనసాగింపు!కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా అత్యుత్తమ గ్రేడ్ అయిన A+లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.అయితే, టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్గా నిలిచిన తర్వాత రోహిత్, కోహ్లి, జడ్డూ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికారు. ప్రస్తుతం ఈ ముగ్గురు కేవలం వన్డే, టెస్టుల్లో మాత్రమే కొనసాగుతున్నారు. కాబట్టి వీరిని A+ గ్రేడ్ నుంచి తప్పించాలని బోర్డు నిర్ణయించినట్లు గతంలో వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే, టైమ్స్ ఆఫ్ ఇండియా అందించిన తాజా సమాచారం ప్రకారం.. ఈ ముగ్గురితో పాటు బుమ్రాను A+ గ్రేడ్లోనే కొనసాగించనున్నారు.అంతేకాదు..టీ20 జట్టు వైస్ కెప్టెన్గా ఉన్న స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్కు ఈసారి ప్రమోషన్ దక్కనుంది. B గ్రేడ్ నుంచి అతడిని A గ్రేడ్కు ప్రమోట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాదు.. క్రమశిక్షణారాహిత్యం వల్ల సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తిరిగి ఈ జాబితాలో చేరనున్నాడు.అంతేకాదు.. టాప్ గ్రేడ్లో అతడిని చేర్చేందుకు బీసీసీఐ నాయకత్వ బృందం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత టాప్ రన్ స్కోరర్గా నిలిచి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినందుకు అతడికి ఈ మేర రిటర్న్గిఫ్ట్ లభించనున్నట్లు తెలుస్తోంది. అయితే, శ్రేయస్ మాదిరి అనూహ్యంగా సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన ఇషాన్ కిషన్ విషయంలో మాత్రం బీసీసీఐ ఇంకా గుర్రుగానే ఉన్నట్లు తెలుస్తోంది.టాప్ క్లాస్లో అతడి పేరుఈ విషయాల గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు మాట్లాడుతూ.. ‘‘శ్రేయస్ తిరిగి వార్షిక కాంట్రాక్టు దక్కించుకోబోతున్నాడు. అది కూడా టాప్ క్లాస్లో అతడి పేరు చేరనుంది. ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇషాన్ కిషన్ విషయంలో మాత్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు’’ అని పేర్కొన్నాయి.తొలిసారి వీళ్లకు చోటుఇక ఈసారి మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ కొత్తగా బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులు దక్కించుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా బీసీసీఐ కాంట్రాక్టు దక్కించుకోవాలంటే.. ఒక క్యాలెండర్ ఇయర్లో టీమిండియా తరఫున మూడు టెస్టులు లేదంటే.. ఎనిమిది వన్డేలు.. లేదా పది అంతర్జాతీయ టీ20లు ఆడి ఉండాలి. తద్వారా మరుసటి ఏడాది సదరు ఆటగాళ్లకు బోర్డు వార్షిక కాంట్రాక్టు ఇస్తుంది.ఇక బీసీసీఐ A+ గ్రేడ్లో ఉన్న ఆటగాళ్లకు ఏడాదికి రూ. 7 కోట్లు, A గ్రేడ్లో ఉన్నవారికి రూ. 5 కోట్లు, B గ్రేడ్లో ఉన్నవారికి రూ. 3 కోట్లు, C గ్రేడ్లో ఉన్నవారికి రూ. కోటి వార్షిక జీతంగా ఇస్తుంది.గతేడాది కాలానికి (2023-24) గానూ బీసీసీఐ ప్రకటించిన కాంట్రాక్టుల జాబితాగ్రేడ్- A+: రోహిత్ శర్మ,విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాగ్రేడ్- A: రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుబ్మన్ గిల్, హార్దిక్ పాండ్యాగ్రేడ్- B: సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్గ్రేడ్- C: రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివం దూబే, రవి బిష్ణోయి, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముకేశ్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ కృష్ణ, ఆవేశ్ ఖాన్,రజత్ పాటిదార్. -
Kavya Maran: క్యాచ్ డ్రాప్.. చిన్న పిల్లలా కేరింతలు.. కానీ పాపం ఆఖరికి!
సొంత మైదానంలో సన్రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) మరోసారి బ్యాటింగ్ పవర్ చూపిస్తుందనుకుంటే.. ఆరెంజ్ ఆర్మీకి నిరాశే మిగిలింది. లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants)తో మ్యాచ్.. ఈసారి మూడు వందలు పక్కా అని మురిసిపోయిన అభిమానులు.. రైజర్స్ కనీసం 200 పరుగుల స్కోరు దాటకపోవడంతో ఉసూరుమన్నారు.ఈసారి బౌలర్లను నమ్ముకుందాంపర్లేదు.. ఈసారి బౌలర్లను నమ్ముకుందాం.. నామమాత్రపు స్కోరును మన కెప్టెన్ కమిన్స్ మామ, షమీ భయ్యా, హర్షల్ అన్న.. జంపా మావ కాపాడుతారులే అని సరిపెట్టుకున్నారు. కానీ ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను కట్టడి చేయడంలో వీళ్లంతా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఫలితంగా రైజర్స్ ఓటమిపాలు కాగా.. ఆరెంజ్ ఆర్మీ హృదయం ముక్కలైంది.లీగ్ మ్యాచ్.. అందులోనూ ఈ సీజన్లో రెండోదే అయినప్పటికీ హోం గ్రౌండ్లో రైజర్స్.. తమదైన శైలి బ్యాటింగ్ను.. ప్రత్యర్థి తమపైనే ప్రయోగించి సఫలం కావడాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఇక ఈ మ్యాచ్ ఆసాంతం అభిమానులు కూడా భావోద్వేగ డోలికల్లో తేలిపోయారు.కావ్యా మారన్ ఎమోషనల్ రోలర్కోస్టర్ఓసారి సంతోషం.. మరోసారి బాధ.. ఆఖరికి ఓటమి.. ఇలా ప్రతి సమయంలో తమ భావాలను వ్యక్తం చేస్తూ కెమెరాలకు చిక్కారు. సన్రైజర్స్ యజమాని కావ్యా మారన్ (Kavya Maran) కూడా ఇందుకు అతీతం కాదు. మ్యాచ్ మొదలైనప్పటి నుంచి ముగిసేంత వరకు ఆమె హావభావాలను కెమెరా కన్ను ఒడిసిపట్టింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వీక్షకులను ఆకర్షించాయి.ట్రవిస్ హెడ్ ఇచ్చిన క్యాచ్ను లక్నో ఫీల్డర్లు డ్రాప్ చేసినప్పుడు చిన్నపిల్లలా గంతులేసిన కావ్య.. అతడు అవుట్ కాగానే బుంగమూతి పెట్టుకుంది. హెన్రిచ్ క్లాసెన్ రనౌట్ కాగానే ఆమె కోపం కట్టలుతెంచుకుంది. ఇక లక్ష్య ఛేదనలో లక్నో సూపర్స్టార్ నికోలస్ పూరన్ పవర్ ప్లేలోనే విశ్వరూపం చూపించడంతో.. కావ్య తీవ్ర నిరాశకు గురైంది.Kavya maran has more expressions than all bollywood heroines combined 🔥❤️Kavya maran >>heroines pic.twitter.com/IWzfyIQZI7— Mask 🎭 (@Mr_LoLwa) March 27, 2025 తమ బౌలింగ్ను చితక్కొడుతూ పూరన్ ఉప్పల్లో బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించడంతో కావ్య నెత్తికి చేతులు పెట్టుకుంది. సాధారణంగా తమ బ్యాటర్ల నుంచి వచ్చే ఈ పవర్ఫుల్ ఇన్నింగ్స్.. ప్రత్యర్థి నుంచి రావడం చూడలేక ముఖం తిప్పేసుకుంది. అప్పుడు ఇలా ఆనందంఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక గత మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్పై రైజర్స్ ఘన విజయం సాధించగా.. కావ్యా ఆనందంతో గంతులేసిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.An epic run-fest goes the way of @SunRisers 🧡The Pat Cummins-led side registers a 4️⃣4️⃣-run win over Rajasthan Royals 👏Scorecard ▶ https://t.co/ltVZAvInEG#TATAIPL | #SRHvRR pic.twitter.com/kjCtGW8NdV— IndianPremierLeague (@IPL) March 23, 2025లక్నోతో మ్యాచ్ విషయానికొస్తే..కాగా గురువారం ఉప్పల్లో లక్నోతో జరిగిన మ్యాచ్లో టాస్ ఓడిన సన్రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ(6)తో పాటు గత మ్యాచ్లో విధ్వంసకర శతకం బాదిన ఇషాన్ కిషన్ (0) ఈసారి పూర్తిగా విఫలమయ్యాడు. మరో ఓపెనర్ ట్రవిస్ హెడ్ (28 బంతుల్లో 47) తనదైన షాట్లతో కాసేపు అలరించగా.. నితీశ్ రెడ్డి(28 బంతుల్లో 32) ఫర్వాలేదనిపించాడు.అయితే, జోరు మీదున్న హెన్రిక్ క్లాసెన్ (17 బంతుల్లో 26) రనౌట్ కాగా.. తుపాన్ ఇన్నింగ్స్తో చెలరేగిన అనికేత్ వర్మ (13 బంతుల్లో 36)కు దిగ్వేశ్ రాఠీ చెక్ పెట్టాడు. శార్దూల్ ఠాకూర్ ఫోర్ఆఖర్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (4 బంతుల్లో 18) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. ఆవేశ్ ఖాన్ అతడికి కళ్లెం వేశాడు. ఫలితంగా నిర్ణీత ఇరవై ఓవర్లలో రైజర్స్ తొమ్మిది వికెట్ల నష్టానికి 190 పరుగులే చేయగలిగింది.లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లతో రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. ఆవేశ్ ఖాన్, దిగ్వేశ్ రాఠీ, రవి బిష్ణోయి, ప్రిన్స్ యాదవ్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. మరోవైపు.. లక్ష్య ఛేదనకు దిగిన లక్నోకు రైజర్స్ పేసర్ మహ్మద్ షమీ.. ఐడెన్ మార్క్రమ్(1)ను ఆదిలోనే అవుట్ చేసి షాకిచ్చాడు.పూరన్ను పూనకాలుఅయితే, మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ (31 బంతుల్లో 52), నికోలస్ పూరన్ (26 బంతుల్లో 70) ఆ ఆనందాన్ని ఎక్కువసేపు నిలవనీయలేదు. ధనాధన్ ఇన్నింగ్స్తో రైజర్స్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి అర్ధ శతకాలతో దుమ్ములేపారు. ఈ క్రమంలో 16.1 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 193 పరుగులు చేసిన లక్నో.. ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. శార్దూల్ ఠాకూర్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.చదవండి: IPL 2025: నికోలస్ పూరన్ ఫాస్టెస్ట్ ఫిప్టీ! వీడియో వైరల్ -
మా బెస్ట్ ఇవ్వలేకపోయాం.. గెలిచినందుకు సంతోషం: పంత్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025లో లక్నో సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో గురువారం జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. విధ్వంసకర బ్యాటింగ్కు మారుపేరైన రైజర్స్కే షాకిస్తూ.. సొంతమైదానంలోనే కమిన్స్ బృందానికి చుక్కలు చూపించింది. బిగ్ రిలీఫ్ఇటు బౌలర్లు.. అటు బ్యాటర్లు.. సమిష్టి ప్రదర్శనతో రాణించగా.. లక్నో కెప్టెన్గా టీమిండియా స్టార్ రిషభ్ పంత్కు తొలి గెలుపు దక్కింది. ఈ నేపథ్యంలో విజయానంతరం పంత్ హర్షం వ్యక్తం చేశాడు. ‘‘నిజంగా మాకు ఎంతో ఉపశమనాన్ని ఇచ్చే ఫలితం ఇది. గెలిచినప్పుడు పొంగిపోయి.. ఓడినపుడు కుంగిపోయే రకం మేము కాదు. జట్టుగా మా నియంత్రణలో ఉన్న అంశాలపైనే దృష్టి పెడతాం. మా మెంటార్ ప్రతిసారీ ఇదే చెబుతారు. మన పరిధిలో ఉన్న అంశాల గురించి మాత్రమే ఆలోచించాలని.. వాటి ద్వారా లబ్ది పొందేందుకు అత్యుత్తమ మార్గాలు అన్వేషించాలని అంటారు. ఈరోజు నేను అదే చేశాను.మా బెస్ట్ ఇవ్వలేకపోయాం.. పర్లేదు గెలిచాంమా బౌలర్లు ప్రిన్స్, ఠాకూర్ అద్భుతంగా ఆడారు. ఇక పూరన్ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతడిని మూడో స్థానంలో ఆడిస్తే బాగుంటుందని అనుకున్నాం. తనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చాం. ఈరోజు అతడు అత్యద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.మా జట్టు మొత్తం రాణించింది. మా స్థాయికి తగ్గ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయాం. అయినప్పటికీ గెలుపొందినందుకు సంతోషంగా ఉంది’’ అని రిషభ్ పంత్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2025లో లక్నో తమ తొలి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడింది. విశాఖపట్నంలో ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో లక్నో ఒక్క వికెట్ తేడాతో ఓటమిపాలైంది. వికెట్ కీపర్గా పంత్ చేసిన తప్పిదం కారణంగా భారీ మూల్యమే చెల్లించుకుంది.రైజర్స్ దూకుడుకు లక్నో బౌలర్ల కళ్లెం ఈ నేపథ్యంలో తాజాగా తదుపరి సన్రైజర్స్తో మ్యాచ్ ఆడిన లక్నో ఉప్పల్ మైదానంలో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసింది. సొంత గ్రౌండ్లో రైజర్స్ బ్యాటింగ్ సత్తా ఏమిటో తెలిసీ పంత్ ఈ నిర్ణయం తీసుకోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. అయితే, కెప్టెన్ నమ్మకాన్ని లక్నో బౌలర్లు నిలబెట్టారు.రైజర్స్ పవర్ హిట్టర్లు అభిషేక్ శర్మ(6), ఇషాన్ కిషన్(0)లను శార్దూల్ ఠాకూర్ వెనువెంటనే పెవిలియన్కు పంపగా.. ప్రమాదకర బ్యాటర్లు ట్రవిస్ హెడ్ (28 బంతుల్లో 47)ను అవుట్ చేసిన ప్రిన్స్ యాదవ్.. హెన్రిచ్ క్లాసెన్(26)ను రనౌట్గా వెనక్కి పంపాడు. ఈ క్రమంలో అనికేత్ వర్మ(13 బంతుల్లో 36) మెరుపులు మెరిపించగా.. దిగ్వేశ్ రాఠీ అతడిని అవుట్ చేశాడు.అయితే, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (4 బంతుల్లో 18) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి స్కోరును 200 దాటించే ప్రయత్నం చేయగా.. ఆవేశ్ ఖాన్ అతడి దూకుడుకు కళ్లెం వేశాడు. ఈ క్రమంలో రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో శార్దూల్ (4/34) నాలుగు వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్, దిగ్వేశ్ రాఠీ, రవి బిష్ణోయి, ప్రిన్స్ యాదవ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.నికోలస్ పూరన్ తుపాన్ ఇన్నింగ్స్ఇక లక్ష్య ఛేదనలో ఓపెనర్ మిచెల్ మార్ష్ (31 బంతుల్లో 52) లక్నోకు శుభారంభం అందించాడు. మరో ఓపెనర్ ఐడైన్ మార్క్రమ్(1) మరోసారి విఫలం కాగా.. వన్డౌన్లో వచ్చిన నికోలస్ పూరన్ తుపాన్ ఇన్నింగ్స్తో దుమ్ములేపాడు. కేవలం 26 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 70 పరుగులు సాధించాడు. మిగతా వాళ్లలో డేవిడ్ మిల్లర్ (7 బంతుల్లో 13), అబ్దుల్ సమద్ (8 బంతుల్లో 22) ధనాధన్ బ్యాటింగ్తో అజేయంగా నిలిచి లక్నోను విజయతీరాలకు చేర్చారు.ఐపీఎల్-2025: సన్రైజర్స్ వర్సెస్ లక్నో👉వేదిక: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం, హైదరాబాద్👉టాస్: లక్నో.. తొలుత బౌలింగ్👉సన్రైజర్స్ స్కోరు: 190/9 (20)👉లక్నో స్కోరు: 193/5 (16.1)👉ఫలితం: ఐదు వికెట్ల తేడాతో సన్రైజర్స్పై లక్నో గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శార్దూల్ ఠాకూర్ (4/34).చదవండి: IPL 2025: 13 బంతుల్లో విధ్వంసం.. ఎస్ఆర్హెచ్ నయా హీరో! ఎవరీ అనికేత్? Hyderabad conquered ✅Win secured ✅#LSG get their first 𝐖 of #TATAIPL 2025 with a comfortable victory over #SRH 💙Scorecard ▶ https://t.co/X6vyVEvxwz#SRHvLSG | @LucknowIPL pic.twitter.com/7lI4DESvQx— IndianPremierLeague (@IPL) March 27, 2025 -
వారెవ్వా ఇయాలా
క్రీడాభిమానులకు ఫిలిప్పీన్స్ దేశం గుర్తుకు రాగానే ముందుగా వారి మదిలో మెదిలేది దిగ్గజ బాక్సర్ మ్యానీ పకియావ్ పేరు. రానున్న రోజుల్లో ఈ స్టార్ బాక్సర్ సరసన అభిమానులు మరో పేరు కూడా ప్రస్తావిస్తారంటే అతిశయోక్తి కాదు. ఖరీదైన టెన్నిస్ క్రీడలో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఒక్కసారిగా అందరి దృష్టిలో పడిన ఆ యువతార ఎవరో కాదు 19 ఏళ్ల అలెగ్జాండ్రా ఇయాలా... స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఈ ఫిలిప్పీన్స్ టీనేజర్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టోర్నీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగిన ఇయాలా సెమీఫైనల్ చేరుకునే క్రమంలో ముగ్గురు గ్రాండ్స్లామ్ చాంపియన్స్ను ఓడించడం విశేషం. జెస్సికా పెగూలాతో జరిగే సెమీఫైనల్లో ఇయాలా విజయం సాధిస్తే... నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన మయామి ఓపెన్లో ‘వైల్డ్ కార్డు’తో అడుగు పెట్టి ఫైనల్ చేరిన తొలి క్రీడాకారిణిగా గుర్తింపు పొందుతుంది. ఫ్లోరిడా: అనామకురాలిగా బరిలోకి దిగి రౌండ్ రౌండ్కూ సంచలన విజయాలు సాధిస్తున్న ఫిలిప్పీన్స్ టీనేజర్ అలెగ్జాండ్రా ఇయాలా...మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 ప్రీమియర్ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 140వ ర్యాంకర్ ఇయాలా 6–2, 7–5తో ప్రపంచ రెండో ర్యాంకర్, ఐదు గ్రాండ్స్లామ్ టైటిల్స్ నెగ్గిన పోలాండ్ స్టార్ ప్లేయర్ ఇగా స్వియాటెక్ను బోల్తా కొట్టించింది. 1 గంట 37 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ఇయాలా ప్రత్యర్థి సర్వీస్ను ఎనిమిది సార్లు బ్రేక్ చేసి, తన సర్వీస్ను ఐదుసార్లు కోల్పోయింది. 19 ఏళ్ల ఇయాలా గత ఏడేళ్లుగా స్పెయిన్లోని రాఫెల్ నాదల్ అకాడమీలో శిక్షణ తీసుకుంటోంది. ఈ టోర్నీలో ‘వైల్డ్ కార్డు’తో అడుగు పెట్టిన ఇయాలా రెండో రౌండ్లో 2017 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా)పై 7–6 (7/2), 7–5తో గెలుపొందగా... మూడో రౌండ్లో 6–4, 6–2తో ఈ ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్, ఐదో సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా)ను కంగుతినిపించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఇయాలాకు పదో సీడ్ పౌలా బదోసా (స్పెయిన్) నుంచి ‘వాకోవర్’ లభించింది. ‘నమ్మశక్యంగా లేదు. నా సంతోషాన్ని మాటల్లో వర్ణించలేను. నా జీవితంలోనే ఇది గొప్ప విజయం’ అని ఇయాలా వ్యాఖ్యానించింది. సెమీఫైనల్లో ఐదో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా)తో ఆడనున్న ఇయాలా విజయం సాధిస్తే... మయామి ఓపెన్లో ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగి ఫైనల్ చేరుకున్న తొలి క్రీడాకారిణిగా గుర్తింపు పొందుతుంది. రెండో సెమీఫైనల్లో ప్రపంచ నంబర్వన్ సబలెంకా (బెలారస్)తో పావోలిని (ఇటలీ) తలపడుతుంది. -
CSK vs RCB: 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించేనా?.. ధోని, కోహ్లిపై అందరి కళ్లు
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ 18వ సీజన్లో ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం చెపాక్ స్టేడియం వేదికగా ఐదుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఆడుతుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల్లో చెన్నై జట్టుదే స్పష్టమైన ఆధిక్యం కాగా... చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్పై బెంగళూరు జట్టు ఒకే ఒక్కసారి విజయం సాధించింది. అది కూడా 17 ఏళ్ల క్రితం. లీగ్ ఆరంభ సీజన్ (2008)లో చెన్నైలో బెంగళూరు జట్టు గెలుపొందింది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఏడు మ్యాచ్లు ఆడినా అన్నింట్లో ఆర్సీబీకి పరాజయమే ఎదురైంది. ఓవరాల్గా ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 33 మ్యాచ్లు జరగ్గా... అందులో చెన్నై 22 మ్యాచ్ల్లో గెలవగా... బెంగళూరు 11 మ్యాచ్ల్లో నెగ్గింది. చెన్నైకి ధోని అనుభవం... బెంగళూరుకు విరాట్ కోహ్లి దూకుడే ప్రధాన బలాలు.వీరిద్దరూ సారథులు కాకపోయినా... జట్టు జయాపజయాలు నిర్ణయించేది మాత్రం ఈ ఇద్దరు పాతకాపులే! చెన్నై పిచ్ స్పిన్కు అనుకూలించనున్న నేపథ్యంలో అశ్విన్, రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్ బౌలింగ్ను ఎదుర్కోవడంపైనే ఆర్సీబీ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. స్పిన్నే బలంగా... బంతి నెమ్మదిగా వచ్చే చెన్నై పిచ్పై... స్పిన్నర్లు దట్టంగా ఉన్న సూపర్ కింగ్స్ను ఎదుర్కోవడం కష్టమైన పనే. ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లరకు తోడు రచిన్ రవీంద్ర కూడా ఉపయుక్తమైన ఆల్రౌండరే కావడం చెన్నైకి మరింత బలాన్నిస్తోంది. ఇక బ్యాటింగ్లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, శివమ్ దూబే, స్యామ్ కరన్, జడేజా కీలకం కానున్నారు. గత మ్యాచ్ చివర్లో క్రీజులోకి దిగిన ధోని... పరుగులేమి చేయకపోయినా ‘తలా’ మైదానంలో అడుగు పెడుతున్న సమయంలో స్టేడియం ‘మోత’ మోగిపోయింది. మరి మహీ బ్యాట్ నుంచి ఆ మెరుపులు చూసే అవకాశం ఈ మ్యాచ్లో అయినా అభిమానులకు దక్కుతుందేమో చూడాలి. ముంబైతో ఆడిన తొలి మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చిన సూపర్ కింగ్స్... దాన్నే కొనసాగించాలని చూస్తోంది. బౌలింగ్లో మరోసారి నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ కీలకం కానున్నారు. విరాట్పైనే భారం సీజన్ ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్)పై గెలిచి బోణీ కొట్టిన బెంగళూరు దాన్ని కొనసాగించాలని చూస్తోంది. అయితే చెన్నైలో మెరుగైన రికార్డు లేకపోవడం ఆర్సీబీని ఇబ్బంది పెడుతోంది. లీగ్ ఆరంభం నుంచి ఒకే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ప్లేయర్గా చరిత్రతెక్కిన విరాట్ కోహ్లిపైనే బెంగళూరు జట్టు ఎక్కువ ఆధారపడుతోంది. ఫిల్ సాల్ట్తో కలిసి అతడిచ్చే ఆరంభం జట్టుకు ప్రధానం కానుంది. పడిక్కల్, రజత్ పాటీదార్, లివింగ్స్టోన్, జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్ కృనాల్ పాండ్యా రూపంలో మిడిలార్డర్లో మెరుగైన ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. స్పిన్ను సమర్థవంతంగా ఎదుర్కోగల కోహ్లి ప్రదర్శనపైనే ఆర్సీబీ జట్టు ఆశలు పెట్టుకుంది. బౌలింగ్లో హాజల్వుడ్, యశ్ దయాళ్ కీలకం కానుండగా... గత మ్యాచ్లో తిప్పేసిన కృనాల్పై భారీ అంచనాలు ఉన్నాయి. తుది జట్లు (అంచనా) చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ (కెప్టెన్), రచిన్, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, శివమ్ దూబే, సామ్ కరన్, జడేజా, ధోని, అశ్విన్, ఎలీస్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటీదార్ (కెప్టెన్), కోహ్లి, సాల్ట్, పడిక్కల్, లివింగ్స్టోన్, జితేశ్ శర్మ, డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్/స్వప్నిల్ సింగ్, హాజల్వుడ్, యశ్ దయాళ్, సుయశ్ శర్మ. -
పోరాడి ఓడిన యూకీ జోడీ
ఫ్లోరిడా: కెరీర్లో ఆడిన రెండో ఏటీపీ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలోనూ భారత అగ్రశ్రేణి ఆటగాడు యూకీ బాంబ్రీ ఆకట్టుకున్నాడు. రెండు వారాల క్రితం ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరిన యూకీ... అదే జోరును కొనసాగిస్తూ మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలోనూ క్వార్టర్ ఫైనల్ వరకు వచ్చాడు. అయితే క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అతను అధిగమించలేకపోయాడు. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ విభాగం క్వార్టర్ ఫైనల్లో యూకీ బాంబ్రీ (భారత్)–నూనో బోర్జెస్ (పోర్చుగల్) ద్వయం 6–7 (1/7), 6–3, 8–10తో ‘సూపర్ టైబ్రేక్’లో ఆరో సీడ్ లాయిడ్ గ్లాస్పూల్–జూలియన్ క్యాష్ (బ్రిటన్) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. 90 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో యూకీ–బోర్జెస్ నాలుగు ఏస్లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్లు చేశారు. తమ సర్వీస్ను ఒక్కసారి కూడా కోల్పోకుండా రెండో సెట్లో ప్రత్యర్థి జంట సర్వీస్ను ఒక్కసారి బ్రేక్ చేశారు. మరోవైపు గ్లాస్పూల్–జూలియన్ క్యాష్ తొమ్మిది ఏస్లు సంధించడంతోపాటు నిర్ణాయక ‘సూపర్ టైబ్రేక్’లో కీలకదశలో పాయింట్లు నెగ్గి సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకున్నారు. క్వార్టర్ ఫైనల్లో ఓడిన యూకీ–బోర్జెస్ జోడీకి 65,000 డాలర్ల (రూ. 55 లక్షల 73 వేలు) ప్రైజ్మనీతోపాటు 180 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ప్రదర్శనతో 33 ఏళ్ల యూకీ బాంబ్రీ వచ్చే సోమవారం విడుదల చేసే అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ర్యాంకింగ్స్లో కెరీర్ బెస్ట్ 26వ ర్యాంక్కు చేరుకోనున్నాడు. అంతేకాకుండా 2019 నుంచి భారత నంబర్వన్గా కొనసాగుతున్న రోహన్ బోపన్నను దాటేసి యూకీ అధికారికంగా భారత డబుల్స్ కొత్త నంబర్వన్గా అవతరించనున్నాడు. -
గ్రూప్ ‘బి’లో భారత్కు చోటు
న్యూఢిల్లీ: ఆసియా కప్ మహిళల ఫుట్బాల్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్ ‘డ్రా’ విడుదలైంది. భారత జట్టుకు గ్రూప్ ‘బి’లో చోటు లభించింది. మలేసియా రాజధాని కౌలాలంపూర్లో గురువారం ‘డ్రా’ కార్యక్రమం జరిగింది. ఆసియా కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో గ్రూప్ ‘బి’ మ్యాచ్లకు జూన్ 23 నుంచి జూలై 5 వరకు థాయ్లాండ్ ఆతిథ్యమిస్తుంది. భారత్తోపాటు థాయ్లాండ్, మంగోలియా, తిమోర్లెస్తె, ఇరాక్ జట్లు గ్రూప్ ‘బి’లో ఉన్నాయి. గ్రూప్ విజేత వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే ఆసియా కప్ ప్రధాన టోర్నమెంట్కు అర్హత సాధిస్తుంది. మొత్తం 34 జట్లను ఎనిమిది గ్రూప్లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’... గ్రూప్ ‘బి’లలో ఐదు జట్ల చొప్పున ఉన్నాయి. మిగతా ఆరు గ్రూపుల్లో నాలుగు జట్ల చొప్పున ఉన్నాయి. మొత్తం ఎనిమిది గ్రూప్ల విజేత జట్లు ఆసియా కప్ ప్రధాన టోర్నీకి అర్హత సాధిస్తాయి. ఆతిథ్య ఆస్ట్రేలియాతోపాటు 2022 ఆసియాకప్లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన చైనా, కొరియా, జపాన్ జట్లు ఇప్పటికే ఆసియా కప్–2026 టోర్నీకి నేరుగా అర్హత పొందాయి. -
SRH Vs LSG: జెయింట్స్ సూపర్ విక్టరీ
ఉప్పల్ స్టేడియంలో మళ్లీ పరుగులు వరద పారింది. దాదాపు 400 పరుగులు కూడా నమోదయ్యాయి. కానీ ఫలితం మాత్రం పూర్తి భిన్నంగా వచ్చింది. ప్రతీసారి విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగుతూ ప్రత్యర్థిని ఊపిరాడకుండా చేసే సన్రైజర్స్ ఈసారి ఓటమి పక్షాన నిలిచింది. బలహీన బౌలింగ్గా అనిపించిన లక్నో పట్టుదలగా ఆడి రైజర్స్ను 200 గీత దాటకుండా చేస్తే... ఆపై లక్నో బ్యాటర్లు పూరన్, మిచెల్ మార్ష్లు సన్రైజర్స్కు వారి బ్యాటింగ్ దెబ్బనే రుచి చూపించారు. ఫలితంగా హైదరాబాద్కు అనూహ్య ఓటమి ఎదురుకాగా... లక్నో గెలుపు బోణీ చేసింది. ఏడాది క్రితం ఇదే మైదానంలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న లక్నో టీమ్ ఇప్పుడు బదులు తీర్చుకుంది. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్లో సన్రైజర్స్కు సొంతగడ్డపై తొలి పరాజయం ఎదురైంది. గురువారం జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్ల తేడాతో హైదరాబాద్పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (28 బంతుల్లో 47; 5 ఫోర్లు,3 సిక్స్లు), అనికేత్ వర్మ (13 బంతుల్లో 36; 5 సిక్స్లు), నితీశ్ కుమార్ రెడ్డి (28 బంతుల్లో 32; 2 ఫోర్లు) జట్టు ఇన్నింగ్స్లో కీలక పరుగులు సాధించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శార్దుల్ ఠాకూర్ 34 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్నో 16.1 ఓవర్లలో 5 వికెట్లకు 193 పరుగులు చేసి గెలిచింది. నికోలస్ పూరన్ (26 బంతుల్లో 70; 6 ఫోర్లు, 6 సిక్స్లు), మిచెల్ మార్ష్ (31 బంతుల్లో 52; 7 ఫోర్లు, 2 సిక్స్లు) కలిసి జట్టును గెలిపించారు. వీరిద్దరు రెండో వికెట్కు 43 బంతుల్లోనే 116 పరుగులు జోడించారు. అభిషేక్, ఇషాన్ విఫలం సన్రైజర్స్కు ఈసారి సరైన ఆరంభం లభించలేదు. శార్దుల్ వరుస బంతుల్లో అభిషేక్ శర్మ (6), గత మ్యాచ్ సెంచరీ హీరో ఇషాన్ కిషన్ (0)లను వెనక్కి పంపడంతో 15 పరుగులకే జట్టు 2 వికెట్లు కోల్పోయింది. అయితే హెడ్ మాత్రం తన జోరు తగ్గించలేదు. అవేశ్ ఓవర్లో అతను 2 సిక్స్లు, ఫోర్తో చెలరేగాడు. రవి బిష్ణోయ్ ఓవర్లో 35 పరుగుల వద్ద హెడ్ ఇచ్చిన సునాయాస క్యాచ్ను పూరన్ వదిలేశాడు. అదే ఓవర్లో బిష్ణోయ్ కూడా కఠినమైన మరో రిటర్న్ క్యాచ్ను అందుకోలేకపోయాడు. అయితే దాని వల్ల ఎక్కువ నష్టం జరగలేదు. మరో 12 పరుగులు జోడించిన హెడ్ను ప్రిన్స్ యాదవ్ అద్భుత బంతితో క్లీన్»ౌల్డ్ చేశాడు. ప్రిన్స్కు ఐపీఎల్లో ఇది తొలి వికెట్ కావడం విశేషం. మరో ఎండ్లో బాగా తడబడిన నితీశ్ ధాటిగా ఆడటంలో విఫలమయ్యాడు. క్రీజ్లో ఉన్నంత సేపు దూకుడు ప్రదర్శించిన క్లాసెన్ (17 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్) దురదృష్టవశాత్తూ రనౌటయ్యాడు. అయితే అనికేత్, ప్యాట్ కమిన్స్ (4 బంతుల్లో 18; 3 సిక్స్లు) సిక్సర్లు స్కోరును 200 పరుగులకు చేరువగా తెచ్చారు. బిష్ణోయ్ ఓవర్లో రెండు వరుస సిక్స్లు బాదిన అనికేత్...రాఠీ ఓవర్లోనూ వరుసగా రెండు సిక్సర్లతో చెలరేగాడు. అయితే తర్వాతి బంతికీ ఇదే ప్రయత్నంలో క్యాచ్ ఇచ్చి అతను వెనుదిరిగాడు. చివరి 2 ఓవర్లలో కలిపి 10 పరుగులే చేయగలిగిన హైదరాబాద్ ఆఖరి 16 బంతుల్లో ఒక్క బౌండరీ కూడా లేకపోవడం గమనార్హం. మెరుపు భాగస్వామ్యం... షమీ తన తొలి ఓవర్లో మార్క్రమ్ (1)ను అవుట్ చేసిన ఆనందం రైజర్స్ శిబిరంలో ఎంతోసేపు నిలవలేదు. అక్కడి నుంచి మార్ష్, పూరన్ కలిసి రైజర్స్ బౌలర్ల భరతం పట్టారు. సిమర్జీత్ ఓవర్లో పూరన్ ఫోర్, 2 సిక్స్లు బాదగా, షమీ ఓవర్లో మార్ష్ 2 సిక్స్లు కొట్టాడు. అభిషేక్ ఓవర్లో కూడా పూరన్ 2 సిక్స్లు కొట్టడంతో పవర్ప్లేలో లక్నో స్కోరు 77 పరుగులకు చేరింది. ఆ తర్వాత పూరన్ మరింత చెలరేగిపోయాడు. 18 బంతుల్లోనే ఈ సీజన్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పూరన్ అవుటైన తర్వాత 29 బంతుల్లో మార్ష్ అర్ధ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాత తక్కువ వ్యవధిలో బదోని (6), పంత్ (15) అవుటైనా... మిల్లర్ (13 నాటౌట్), సమద్ (8 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) కలిసి విజయాన్ని పూర్తి చేశారు. మూడు బంతులు, మూడు సిక్సర్లు... సన్రైజర్స్ కెప్టెన్ కమిన్స్ బ్యాటింగ్ ఆసక్తికరంగా సాగింది. తాను ఎదుర్కొన్న తొలి 3 బంతులను అతను సిక్సర్లుగా మలిచాడు. శార్దుల్ ఓవర్లో రెండు సిక్స్లు కొట్టిన అతను, అవేశ్ ఓవర్లో తొలి బంతిని సిక్సర్ కొట్టి తర్వాతి బంతికే వెనుదిరిగాడు. అనూహ్య రనౌట్... టాప్–3 బ్యాటర్లు వెనుదిరిగిన తర్వాత రైజర్స్ ఆశలన్నీ క్లాసెన్పైనే ఉన్నాయి. అతనూ అప్పటికే చక్కటి షాట్లతో ధాటిని ప్రదర్శిస్తున్నాడు. అయితే ప్రిన్స్ యాదవ్ ఓవర్లో అతను రనౌట్ కావడం జట్టు తుది స్కోరుపై ప్రభావం చూపించింది. ప్రిన్స్ వేసిన బంతిని నితీశ్ బలంగా బాదగా బౌలర్ దానిని క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. అయితే అది విఫలం కాగా, బంతి చేతులను తాకి నాన్ స్ట్రయికింగ్ స్టంప్స్ వైపు వెళ్లింది. అప్పటికే పరుగు కోసం క్రీజ్ దాటిన క్లాసెన్ రనౌటవక తప్పలేదు. ఎవరీ అనికేత్ వర్మ...? ఐదు సిక్సర్లతో సన్రైజర్స్ అభిమానులను ఆకట్టుకున్న అనికేత్ వర్మ గత మ్యాచ్తోనే ఐపీఎల్లోకి అడుగు పెట్టాడు. రాజస్తాన్తో పోరులో తన రెండో బంతికే అతను సిక్స్ కొట్టాడు. ఐపీఎల్కు ముందు అతను సీనియర్ స్థాయిలో ఒకే ఒక టి20 మ్యాచ్ ఆడాడు. మధ్యప్రదేశ్ తరఫున బరిలోకి దిగిన అనికేత్ హైదరాబాద్తో జరిగిన ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్లో తొలి బంతికే డకౌటయ్యాడు. అయితే అండర్–23 స్థాయి తన దూకుడైన ప్రదర్శనతో అతను అందరి దృష్టిలో పడ్డాడు. దేశవాళీ అండర్–23 వన్డే టోర్నీలో 7 మ్యాచ్లలో 16 సిక్సర్లు బాదాడు. మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్లో కూడా చెలరేగిన తీరును చూసి సన్రైజర్స్ వేలంలో కనీస విలువ రూ. 30 లక్షలకు అనికేత్ను తీసుకుంది. పుట్టింది ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలోనే అయినా మెరుగైన అవకాశాల కోసం సరిహద్దు రాష్ట్రం మధ్యప్రదేశ్ చేరుకొని అక్కడే ఆటను మొదలు పెట్టాడు. ఐపీఎల్లో నేడుచెన్నై X బెంగళూరువేదిక: చెన్నైరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారంస్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (బి) ప్రిన్స్ 47; అభిషేక్ (సి) పూరన్ (బి) శార్దుల్ 6; ఇషాన్ కిషన్ (సి) పంత్ (బి) శార్దుల్ 0; నితీశ్ రెడ్డి (బి) రవి బిష్ణోయ్ 32; క్లాసెన్ (రనౌట్) 26; అనికేత్ (సి) మిల్లర్ (బి) రాఠీ 36; అభినవ్ మనోహర్ (సి) సమద్ (బి) శార్దుల్ 2; కమిన్స్ (సి) రాఠీ (బి) అవేశ్ 18; హర్షల్ (నాటౌట్) 12; షమీ (సి) బదోని (బి) శారుŠద్ల్ 1; సిమర్జీత్ (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 190. వికెట్ల పతనం: 1–15, 2–15, 3–76, 4–110, 5–128, 6–156, 7–156, 8–176, 9–181. బౌలింగ్: శార్దుల్ ఠాకూర్ 4–0–34–4, అవేశ్ ఖాన్ 4–0–45–1, దిగ్వేశ్ రాఠీ 4–0–40–1, రవి బిష్ణోయ్ 4–0–42–1, ప్రిన్స్ యాదవ్ 4–0–29–1. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్ష్ (సి) నితీశ్ రెడ్డి (బి) కమిన్స్ 52; మార్క్రమ్ (సి) కమిన్స్ (బి) షమీ 1; పూరన్ (ఎల్బీ) (బి) కమిన్స్ 70; పంత్ (సి) షమీ (బి) హర్షల్ 15; బదోని (సి) హర్షల్ (బి) జంపా 6; మిల్లర్ (నాటౌట్) 13; సమద్ (నాటౌట్) 22; ఎక్స్ట్రాలు 14; మొత్తం (16.1 ఓవర్లలో 5 వికెట్లకు) 193. వికెట్ల పతనం: 1–4, 2–120, 3–138, 4–154, 5–164. బౌలింగ్: అభిషేక్ శర్మ 2–0–20–0, షమీ 3–0–37–1, సిమర్జీత్ సింగ్ 2–0–28–0, కమిన్స్ 3–0–29–2, ఆడమ్ జంపా 4–0–46–1, హర్షల్ పటేల్ 2–0–28–1, ఇషాన్ కిషన్ 0.1–0–4–0. -
పూరన్, మార్ష్ విధ్వంసం.. సన్రైజర్స్ను చిత్తు చేసిన లక్నో
ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో లక్నో ఘన విజయం సాధించింది. 191 పరుగుల భారీ లక్ష్యాన్ని లక్నో కేవలం 16.1 ఓవర్లలో ఊదిపడేసింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పూరన్.. 6 ఫోర్లు, 6 సిక్స్లతో 70 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు.అతడితో పాటు ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన మిచెల్ మార్ష్ సైతం తన బ్యాట్కు పనిచెప్పాడు. 31 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 52 పరుగులు చేశాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమ్మిన్స్ రెండు వికెట్లు పడగొట్టగా.. జంపా, హర్షల్ పటేల్, షమీ తలా వికెట్ సాధించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లు తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. భారీగా పరుగులు సమర్పించుకున్నారు.నాలుగేసిన శార్ధూల్..ఇక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. లక్నో బౌలర్లు అద్బుతంగా రాణించారు. లక్నో పేసర్ శార్ధూల్ ఠాకూర్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్ తలా వికెట్ సాధించారు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్(47) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. అనికేత్ వర్మ(36), నితీశ్ కుమార్ రెడ్డి(32),క్లాసెన్(26) రాణించారు.చదవండి: IPL 2025: నికోలస్ పూరన్ ఊచకోత.. ఫాస్టెస్ట్ ఫిప్టీ! వీడియో వైరల్ -
SRH Vs LSG: నికోలస్ పూరన్ ఫాస్టెస్ట్ ఫిప్టీ! వీడియో వైరల్
ఐపీఎల్-2025లో ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ ప్లేయర్ నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించాడు. 191 పరుగుల లక్ష్య చేధనలో పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వన్ డౌన్లో బ్యాటింగ్కు దిగిన నికోలస్.. ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. కెప్టెన్ కమ్మిన్స్తో సహా ఏ బౌలర్ను పూరన్ విడిచిపెట్టలేదు.ఉప్పల్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో ఈ కరేబియన్ బ్యాటర్ కేవలం 18 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. తద్వారా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్గా పూరన్ నిలిచాడు. ఓవరాల్గా కేవలం 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పూరన్.. 6 ఫోర్లు, 6 సిక్స్లతో 70 పరుగులు చేశాడు. అతడి విధ్వంసం ఫలితంగా లక్నో లక్ష్యాన్ని కేవలం లక్నో కేవలం 16.1 ఓవర్లలో ఛేదించింది. లక్నో బ్యాటర్లలో పూరన్తో పాటు మార్ష్(52) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమ్మిన్స్ రెండు వికెట్లు పడగొట్టగా.. జంపా, హర్షల్ పటేల్, షమీ తలా వికెట్ సాధించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లు తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.లక్నో బౌలర్లు అద్బుతంగా రాణించారు. లక్నో పేసర్ శార్ధూల్ ఠాకూర్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్ తలా వికెట్ సాధించారు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్(47) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. అనికేత్ వర్మ(36), నితీశ్ కుమార్ రెడ్డి(32),క్లాసెన్(26) రాణించారు. Raining sixes in Hyderabad... but by #LSG 🌧Nicholas Pooran show guides LSG to 77/1 after 6 overs 👊Updates ▶ https://t.co/X6vyVEvxwz#TATAIPL | #SRHvLSG | @LucknowIPL pic.twitter.com/K2Dlk5AXQw— IndianPremierLeague (@IPL) March 27, 2025 -
13 బంతుల్లో విధ్వంసం.. ఎస్ఆర్హెచ్ నయా హీరో! ఎవరీ అనికేత్?
ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు మరో కొత్త హిట్టర్ దొరికేశాడు. అతడు యువ ఆటగాడు అనికేత్ వర్మ. ఐపీఎల్-2025లో భాగంగా ఉప్పల్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో అనికేత్ వర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆరో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన అనికేత్.. ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు.కేవలం 13 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అనికేత్.. 5 సిక్స్లతో 36 పరుగులు చేశాడు. ఎస్ఆర్హెచ్ లక్నో ముందు ఫైటింగ్ స్కోర్ ఉంచడంలో అనికేత్ది కీలక పాత్ర. ఈ క్రమంలో ఎవరీ అనికేత్ అని నెటిజన్లు తెగవేతికేస్తున్నారు. ఎవరీ అనికేత్ వర్మ..?23 ఏళ్ల అనికేత్ వర్మ.. ఫిబ్రవరి 5, 2002న ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో జన్మించాడు. కానీ అతడు దేశవాళీ క్రికెట్లో మాత్రం మధ్యప్రదేశ్ తరపున ఆడుతున్నాడు. కుడిచేతి వాటం బ్యాటర్ అయిన వర్మ.. పవర్ హిట్టింగ్కు పెట్టింది పేరు. మీడియం పేస్ బౌలింగ్ కూడా చేయగలడు. అనికేత్ వర్మ ఇప్పటికే దేశవాళీ క్రికెట్లో తనను తను నిరూపించుకున్నాడు.ఫెయిత్ క్రికెట్ క్లబ్ తరపున 44 బంతుల్లో 120 చేసిన వర్మ.. మధ్యప్రదేశ్ లీగ్ (MPL) టీ20 లీగ్లో కేవలం 41 బంతుల్లో 123 పరుగులు చేశాడు. అదేవిధంగా పురుషుల అండర్-23 స్టేట్ A ట్రోఫీలో సైతం ఆజేయ సెంచరీతో మెరిశాడు. ఈ క్రమంలోనే అతడిని ఐపీఎల్-2025 మెగా వేలంలో రూ. 30 లక్షల బేస్ ప్రైస్కు సన్రైజర్స్ కొనుగోలు చేసింది. ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్ 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. లక్నో బౌలర్లు అద్బుతంగా రాణించారు. లక్నో పేసర్ శార్ధూల్ ఠాకూర్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్ తలా వికెట్ సాధించారు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్(47) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. అనికేత్ వర్మ(36), నితీశ్ కుమార్ రెడ్డి(32),క్లాసెన్(26) రాణించారు.చదవండి: #Ishan Kishan: నిన్న సెంచరీ.. కట్ చేస్తే! నేడు తొలి బంతికే ఔట్ -
SRH Vs LSG: నిన్న సెంచరీ.. కట్ చేస్తే! నేడు తొలి బంతికే ఔట్
ఐపీఎల్-2025లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున తన తొలి మ్యాచ్లోనే సెంచరీ చేసిన ఇషాన్ కిషన్.. రెండో మ్యాచ్లో మాత్రం తీవ్ర నిరాశపరిచాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా ఉప్పల్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో కిషన్ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు.క్రీజులోకి వచ్చిన తొలి బంతికే కిషన్ ఔటయ్యాడు. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన శార్థూల్ ఠాకూర్ బౌలింగ్లో తొలి బంతికి అభిషేక్ శర్మ ఔట్ కాగా.. రెండో బంతికి కిషన్ పెవిలియన్కు చేరాడు. ఆ ఓవర్లో శార్ధూల్ రెండో బంతిని కిషన్కు లెగ్ సైడ్ డెలివరీగా సంధించాడు.ఆ బంతిని ఇషాన్ లెగ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి మాత్రం బ్యాట్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ చేతికి వెళ్లింది. దీంతో కిషన్ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. ఇక మ్యాచ్లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో కిషన్ను రూ.11 కోట్లకు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది.తుది జట్లులక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ XI: ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్), ఆయుష్ బడోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, దిగ్వేష్ సింగ్ రాఠీ, శార్దూల్ ఠాకూర్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ ఎలెవన్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్ (కెప్టెన్), సిమర్జీత్ సింగ్, మహమ్మద్ షమీ, హర్షల్ పటేల్చదవండి: IND vs ENG: రోహిత్ శర్మ కీలక నిర్ణయం.. ఆ సిరీస్కు దూరం! -
IPL 2025 LSG vs SRH: ఎస్ఆర్హెచ్ ఘోర ఓటమి..
SRH vs LSG Live Updates And Highlights: ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడతున్నాయి.ఎస్ఆర్హెచ్ ఘోర ఓటమి..ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో లక్నో ఘన విజయం సాధించింది. 191 పరుగుల భారీ లక్ష్యాన్ని లక్నో కేవలం 16.1 ఓవర్లలో ఊదిపడేసింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పూరన్.. 6 ఫోర్లు, 6 సిక్స్లతో 70 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడితో పాటు ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన మిచెల్ మార్ష్ సైతం తన బ్యాట్కు పనిచెప్పాడు. 31 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 52 పరుగులు చేశాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమ్మిన్స్ రెండు వికెట్లు పడగొట్టగా.. జంపా, హర్షల్ పటేల్, షమీ తలా వికెట్ సాధించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లు తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. భారీగా పరుగులు సమర్పించుకున్నారు.విజయానికి చేరువలో లక్నోలక్నో తొలి విజయానికి చేరువైంది. 30 బంతుల్లో 15 పరుగులు కావాలి. క్రీజులో సమద్(11), మిల్లర్(8) ఉన్నారు.వరుసగా రెండు వికెట్లు డౌన్..లక్నో వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. 13వ ఓవర్ వేసిన జంపా బౌలింగ్లో బదోని ఔట్ కాగా.. 15 ఓవర్లో హర్షల్ పటేల్ బౌలింగ్లో పంత్ ఔటయ్యాడు.లక్నో మూడో వికెట్ డౌన్..మార్ష్ రూపంలో లక్నో సూపర్ జెయింట్స్ మూడో వికెట్ కోల్పోయింది. 52 పరుగులు చేసిన మార్ష్.. కమ్మిన్స్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి ఆయూష్ బదోని వచ్చాడు. 11 ఓవర్లు ముగిసే సరికి ఎల్ఎస్జీ 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.రెండో వికెట్ డౌన్.. పూరన్ ఔట్120 పరుగుల వద్ద లక్నో రెండో వికెట్ కోల్పోయింది. 70 పరుగులు చేసిన పూరన్.. కమ్మిన్స్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. 10 ఓవర్లకు ఎల్ఎస్జీ రెండు వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది.క్రీజులో మార్ష్(44),పంత్(2) ఉన్నారు.నికోలస్ పూరన్ విధ్వసం..నికోలస్ పూరన్ విధ్వసం సృష్టిస్తున్నాడు. కేవలం 18 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. పూరన్ (24 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 67) తన బ్యాటింగ్ను తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. 8 ఓవర్లకు లక్నో వికెట్ నష్టానికి 111 పరుగులు చేసింది. క్రీజులో పూరన్తో పాటు మార్ష్(32) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న మార్ష్,పూరన్..6 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది. క్రీజులో నికోలస్ పూరన్(44), మిచెల్ మార్ష్(25) ఉన్నారు. వీరిద్దరూ దూకుడుగా ఆడుతున్నారు.తొలి వికెట్ కోల్పోయిన లక్నో..191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన ఐడైన్ మార్క్రమ్..మహ్మద్ షమీ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి నికోలస్ పూరన్ వచ్చాడు.నాలుగేసిన శార్థూల్.. ఎస్ఆర్హెచ్ స్కోరంతంటే?ఉప్పల్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు పర్వాలేదన్పించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్ 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. లక్నో బౌలర్లు అద్బుతంగా రాణించారు. బ్యాటింగ్ అనుకూలించే వికెట్పై సన్రైజర్స్ బ్యాటర్లను బౌలర్లు కట్టడి చేశారు. లక్నో పేసర్ శార్ధూల్ ఠాకూర్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్ తలా వికెట్ సాధించారు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్(47) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. అనికేత్ వర్మ(36), నితీశ్ కుమార్ రెడ్డి(32),క్లాసెన్(26) రాణించారు.ఎనిమిది వికెట్ డౌన్.. కమ్మిన్స్ ఔట్ప్యాట్ కమ్మిన్స్(4 బంతుల్లో 18) రూపంలో ఎస్ఆర్హెచ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 18 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 180/8ఎస్ఆర్హెచ్ ఆరో వికెట్ డౌన్.. అనికేత్ ఔట్అనికేత్ వర్మ రూపంలో ఎస్ఆర్హెచ్ ఆరో వికెట్ కోల్పోయింది. 36 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన అనికేత్.. దిగ్వేష్ బౌలింగ్లో ఔటయ్యాడు. 17 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 169/7ఎస్ఆర్హెచ్ ఐదో వికెట్ డౌన్.. నితీశ్ రెడ్డి ఔట్నితీశ్ కుమార్(32) రూపంలో ఎస్ఆర్హెచ్ ఐదో వికెట్ కోల్పోయింది. రవి బిష్ణోయ్ బౌలింగ్లో నితీశ్ క్లీన్ బౌల్డయ్యాడు.ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ డౌన్.. క్లాసెన్ ఔట్హెన్రిచ్ క్లాసెన్ రూపంలో ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన హెన్రిచ్ క్లాసెన్.. దురుదృష్టవశాత్తూ రనౌట్ రూపంలో పెవిలియన్కు చేరాడు. 13 ఓవర్లు ముగిసే సరికి సన్రైజర్స్ 4 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. క్రీజులో నితీశ్ కుమార్ రెడ్డి(30), అంకిత్ వర్మ(7) పరుగులతో ఉన్నారు.ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ డౌన్.. హెడ్ ఔట్ట్రావిస్ హెడ్ రూపంలో ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. 47 పరుగులు చేసిన హెడ్.. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి హెన్రిచ్ క్లాసెన్ వచ్చాడు.7 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 71/27 ఓవర్లు ముగిసే సరికి సన్రైజర్స్ హైదరాబాద్ రెండు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. క్రీజులో ట్రావిస్ హెడ్(47), నితీశ్ కుమార్ రెడ్డి(15) ఉన్నారు.ఒకే ఓవర్లో రెండు వికెట్లు..టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన శార్థూల్ ఠాకూర్ బౌలింగ్లో తొలి బంతికి అభిషేక్ శర్మ ఔట్ కాగా.. రెండో బంతికి ఇషాన్ కిషన్ ఔటయ్యాడు. 3 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ రెండు వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది. క్రీజులో ట్రావిస్ హెడ్(14), నితీశ్ కుమార్ రెడ్డి(5) ఉన్నారు.ఐపీఎల్-2025లో మరో రసవత్తర పోరుకు తెరలేచింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.తుది జట్లులక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ XI: ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్), ఆయుష్ బడోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, దిగ్వేష్ సింగ్ రాఠీ, శార్దూల్ ఠాకూర్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ ఎలెవన్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్ (కెప్టెన్), సిమర్జీత్ సింగ్, మహమ్మద్ షమీ, హర్షల్ పటేల్ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్టిట్యూట్స్:లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, మణిమారన్ సిద్ధార్థ్, ఆకాష్ సింగ్సన్రైజర్స్ హైదరాబాద్: సచిన్ బేబీ, వియాన్ ముల్డర్, ఆడమ్ జంపా, జయదేవ్ ఉనద్కట్, జీషన్ అన్సారీ -
రోహిత్ శర్మ కీలక నిర్ణయం.. ఆ సిరీస్కు దూరం!
ఐపీఎల్-2025 ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడేందుకు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. అయితే ఈ సిరీస్కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.రెడ్ బాల్ క్రికెట్లో పేలవ ఫామ్ కారణంగా ఈ సిరీస్కు దూరంగా ఉండాలని రోహిత్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రోహిత్ ఇప్పటికే బీసీసీఐకి తెలియజేసినట్లు సమాచారం. అదేవిధంగా బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో విఫలమైన కోహ్లి మాత్రం ఇంగ్లండ్ సిరీస్లో ఆడనున్నట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ న్యూజిలాండ్తో టెస్టు సిరీస్తో పాటు బీజీటీలోనూ దారుణ ప్రదర్శన కనబరిచాడు.ఆసీస్తో సిరీస్లో తొలి మ్యాచ్కు వ్యక్తిగత కారణాలతో దూరమైన హిట్ మ్యాన్.. తర్వాత రెండో టెస్టు నుంచి అందుబాటులోకి వచ్చాడు. కానీ తన మార్క్ను చూపించలేకపోయాడు. మూడు మ్యాచ్లలో అతను 6.20 సగటుతో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. కెప్టెన్గా కూడా రోహిత్ విఫలమయ్యాడు. ఈ క్రమంలో సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్టు నుంచి రోహిత్ శర్మ తనంతట తానే తప్పుకున్నాడు. ఆ మ్యాచ్ అనంతరం రోహిత్ టెస్టులకు విడ్కోలు పలకనున్నాడని ఊహగానాలు వినిపించాయి. కానీ రోహిత్ మాత్రం ఇప్పటిలో నకు రిటైరయ్యే ఉద్దేశ్యం లేదని పుకార్లకు చెక్ పెట్టాడు. కానీ ఇప్పుడు కొన్ని రోజుల పాటు టెస్టులకు దూరంగా ఉండాలని రోహిత్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ హిట్మ్యాన్ అందుబాటులేకపోతే జస్ప్రీత్ బుమ్రా జట్టు పగ్గాలను చేపట్టే అవకాశముంది. అయితే మరి కొన్ని రిపోర్ట్లు మాత్రం రోహిత్ ఇంగ్లండ్ సిరీస్కు అందుబాటులో ఉండనున్నాడని పేర్కొంటున్నాయి. రోహిత్ ఆడుతాడా, తప్పుకుంటాడా అన్నది మరి కొన్ని రోజుల్లో తేలిపోనుంది. ఇక భారత క్రికెట్ జట్టు ఏడాది జూన్ 20న ఇంగ్లాండ్ పర్యటనను ప్రారంభిస్తుంది. మొదటి టెస్ట్ మ్యాచ్ హెడింగ్లీలోని లీడ్స్ వేదికగా జరుగనుంది. తదుపరి నాలుగు టెస్ట్లు ఎడ్జ్బాస్టన్, లార్డ్స్, ఓల్డ్ ట్రాఫోర్డ్, కెన్నింగ్టన్ ఓవల్ వేదికలపై జరగనున్నాయి. అంతకంటే ముందు భారత-ఎ జట్టు రెండు అనాధికారిక టెస్టు మ్యాచ్లు ఆడనుంది.చదవండి: IPL 2025: రియాన్ పరాగ్ చెత్త రికార్డు.. తొలి ప్లేయర్గా -
IPL 2025: రియాన్ పరాగ్ చెత్త రికార్డు.. తొలి ప్లేయర్గా
ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్ వరుసగా రెండో మ్యాచ్లో ఓటమి చవిచూసింది. గౌహతి వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో రాజస్తాన్ పరాజయం పాలైంది. అంతకుముందు సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మొదటి మ్యాచ్లోనూ రాజస్తాన్ది ఇదే కథ.ఈ మ్యాచ్లో44 పరుగుల తేడాతో రాయల్స్ను ఎస్ఆర్హెచ్ చిత్తు చేసింది. అయితే ఈ రెండు మ్యాచ్ల్లోనూ రెగ్యూలర్ కెప్టెన్ సంజూ శాంసన్ లేని లోటు స్ఫష్టంగా కన్పించింది. శాంసన్ చేతి వేలి గాయం కారణంగా మొదటి మూడు మ్యాచ్లకు దూరమయ్యాడు. అతడి స్ధానంలో యువ బ్యాటర్ రియాన్ పరాగ్ రాజస్తాన్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. సంజూ ఇంపాక్ట్ ప్లేయర్గా కేవలం బ్యాటింగ్కు మాత్రమే వస్తున్నాడు. రియాన్ పరాగ్ మాత్రం కెప్టెన్సీ పరంగా పూర్తిగా తేలిపోయాడు. మైదానంలో వ్యూహత్మకంగా వ్యవహరించలేకపోతున్నాడు. ఈ క్రమంలో పరాగ్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.ఐపీఎల్లో వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓటమి చవిచూసిన తొలి రాజస్తాన్ కెప్టెన్గా పరాగ్ నిలిచాడు. ఇప్పటివరకు ఏ రాజస్తాన్ కెప్టెన్ కూడా వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓటమి చవిచూడలేదు. రాజస్తాన్ ఫ్రాంచైజీకి పరాగ్ ఏడువ కెప్టెన్ కావడం గమనార్హం.పరాగ్ కంటే ముందు షేన్ వార్న్, షేన్ వాట్సన్, రాహుల్ ద్రవిడ్, స్టీవ్ స్మిత్, అజింక్య రహానే, సంజు శాంసన్ రాయల్స్కు కెప్టెన్లగా వ్యవహరించారు. మరో మ్యాచ్ తర్వాత సంజూ తిరిగి రాజస్తాన్ పగ్గాలు చేపట్టే అవకాశముంది.చదవండి: 300 సాధ్యమే.. లక్నో బ్యాటింగ్ ఆర్డర్ కూడా ప్రమాదకరమైందే: SRH కోచ్ -
300 సాధ్యమే.. లక్నో బ్యాటింగ్ ఆర్డర్ కూడా ప్రమాదకరమైందే: SRH కోచ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025లో తమ ఆరంభ మ్యాచ్లోనే సన్రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. విధ్వంసకర బ్యాటింగ్కు మారుపేరుగా మారిన ఈ జట్టు.. రాజస్తాన్ రాయల్స్పై 286 పరుగుల స్కోరు నమోదు చేసింది. ఇక తదుపరి మ్యాచ్లో భాగంగా గురువారం లక్నో సూపర్ జెయింట్స్తో రైజర్స్ తలపడనుంది.ఈ నేపథ్యంలో సొంతమైదానం ఉప్పల్ చెలరేగి ఆడే సన్రైజర్స్.. 300 పరుగుల మార్కును అందుకుంటుందా? అనే చర్చ జరుగుతోంది. ఈ విషయంపై సన్రైజర్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్ జేమ్స్ ఫ్రాంక్లిన్ (James Franklin) స్పందించాడు.300 సాధ్యమే.. ‘‘ఇలా జరగదని.. నేను ఎన్నటికీ చెప్పను. ఈ సీజన్లో ఇప్పటికే రెండు మ్యాచ్లలో 230, 240 స్కోర్లు దాటాయి. కాబట్టి తాజా ఎడిషన్లో 300 పరుగుల మార్కు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మా జట్టు ఈ స్కోరుకు దగ్గరగా వచ్చింది. కాబట్టి.. 300 స్కోరు అనే మాటను కొట్టిపారేయలేం’’ అని రైజర్స్- లక్నో మ్యాచ్కు ముందు ఫ్రాంక్లిన్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.లక్నో బ్యాటింగ్ ఆర్డర్ కూడా ప్రమాదకరమైందేఅదే విధంగా లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ ఆర్డర్ గురించి ప్రస్తావన రాగా... ‘‘ఎల్ఎస్జీ బ్యాటింగ్ విభాగం ప్రమాదకరమైనది. ఆ జట్టులో టాపార్డర్ బ్యాటర్లు అద్భుతమైన ఆటగాళ్లు. వారిని ఎదుర్కోవాలంటే మూస తరహా వ్యూహాలు సరిపడవు. మేము కాస్త సృజనాత్మకంగా ఆలోచించాల్సి ఉంటుంది. వారి బ్యాటర్లను కట్టడి చేయడానికి మా బౌలింగ్ విభాగం బాగానే కష్టపడాల్సి ఉంటుంది’’ అని జేమ్స్ ఫ్రాంక్లిన్ చెప్పుకొచ్చాడు.కాగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్తో పాటు టీమిండియా స్టార్ మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, సిమ్రన్జిత్ సింగ్లతో సన్రైజర్స్ పేస్ దళం పటిష్టంగా ఉంది. మరోవైపు లక్నో జట్టులో ఐడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, కెప్టెన్ రిషభ్ పంత్, డేవిడ్ మిల్లర్ రూపంలో పవర్ హిట్టర్లు ఉన్నారు.ఇక ఐపీఎల్ తాజా ఎడిషన్లో తమ తొలి మ్యాచ్లో సన్రైజర్స్ గెలుపొందగా.. లక్నో మాత్రం పరాజయాన్ని చవిచూసింది. విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ఒక్క వికెట్ తేడాతో పరాజయం పాలైంది.ఐపీఎల్-2025లో సన్రైజర్స్ జట్టుట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, సచిన్ బేబి, జయదేవ్ ఉనాద్కట్, జీషన్ అన్సారీ, ఆడం జంపా, వియాన్ ముల్దర్, రాహుల్ చహర్, కమిందు మెండిస్, అథర్వ టైడే, ఈషన్ మలింగలక్నో సూపర్ జెయింట్స్ జట్టుఐడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుశ్ బదోని, రిషభ్ పంత్(కెప్టెన్/వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేశ్ రాఠీ, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయి, మణిమరన్ సిద్ధార్థ్, అబ్దుల్ సమద్, హిమ్మత్ సింగ్, ఆర్ఎస్ హంగ్రేకర్, ఆకాశ్ మహరాజ్ సింగ్, అర్షిన్ కులకర్ణి, యువరాజ్ చౌదరి, మయాంక్ యాదవ్.చదవండి: ‘అతడిని ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా? ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగదు’ -
పాకిస్తాన్ కెప్టెన్ను ట్రోల్ చేసిన ఇషాన్ కిషన్.. వీడియో వైరల్
భారత మాజీ అంపైర్ అనిల్ చౌదరి.. ఇప్పుడు కామెంటేటర్గా సరికొత్త అవతారమెత్తాడు. ఐపీఎల్-2025 సీజన్లో హర్యాన్వి బాషలో చౌదరి వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నాడు. అయితే అనిల్ చౌదరి తాజాగా టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్తో తను మాట్లాడిన ఓ వీడియో క్లిప్ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోలో చౌదరి, కిషన్ మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం చర్చానీయంశమైంది. అందుకు కారణం పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ను కిషన్ విమర్శించడమే. మహ్మద్ రిజ్వాన్ పదే పదే వికెట్ల వెనక అప్పీల్ చేయడాన్ని కిషన్ ట్రోల్ చేశాడు.అసలేం జరిగిందంటే?అంపైర్ అనిల్ చౌదరి: కిషన్.. నువ్వు ఆడిన చాలా మ్యాచ్ల్లో నేను అంపైర్గా వ్యవహరించాను. ఇప్పుడు నీవు చాలా పరిణితి చెందిన ఆటగాడిగా మారావు. గతంలో వికెట్ కీపింగ్ చేసే పదే పదే అప్పీల్ చేసి అంపైర్లు చిరాకు తెప్పించేవాడివి. కానీ ఇప్పుడు మాత్రం అవసరమైనప్పుడు మాత్రమే అప్పీలు చేస్తున్నావు. ఈ మార్పు నీలో ఎలా వచ్చింది?ఇషాన్ కిషన్: ఇప్పుడు అంపైర్లు చాలా తెలివిగా ఉన్నారు. మనం ప్రతిసారీ అప్పీల్ చేస్తే అంపైర్ అవుట్కు కూడా నాటౌట్ ఇస్తాడు. అంపైర్లకు వారి తీసుకున్న నిర్ణయాలపై నమ్మకం ఉండాలంటే సరైన సమయంలో అప్పీల్ చేస్తే బెటర్. లేకపోతే మహ్మద్ రిజ్వాన్ లాగా పదపదే అప్పీల్ చేస్తే.. అంపైర్లు ఒక్కొసారి ఔటైనా కూడా నాటౌట్ ఇస్తారని కిషన్ ఫన్నీగా సమాధనమిచ్చాడు. ఈ సందర్భంగా అంపైరింగ్ కోసం కిషన్ మాట్లాడాడు. కొత్తగా వచ్చే అంపైర్లు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మరింత నమ్మకంగా ఉండాలని కిషన్ పేర్కొన్నాడు. కాగా ఈ జార్ఖండ్ డైన్మేట్ ప్రస్తుతం ఐపీఎల్-2025లో సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.ఆడిన తొలి మ్యాచ్లోనే సెంచరీతో మెరిశాడు. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఇషాన్ కిషన్ 106 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అయితే దేశవాళీ క్రికెట్, ఫ్రాంచైజీ లీగ్లలో దుమ్ములేపుతున్న కిషన్.. జాతీయ జట్టుకు మాత్రం గత కొంత కాలంగా దూరంగా ఉన్నాడు.చదవండి: టిమ్ సీఫర్ట్ ప్రపంచ రికార్డు.. పాక్పై చితక్కొట్టి అరుదైన ఘనత View this post on Instagram A post shared by Anil Chaudhary (@anilchaudhary.13) -
టిమ్ సీఫర్ట్ ప్రపంచ రికార్డు.. పాక్పై చితక్కొట్టి అరుదైన ఘనత
న్యూజిలాండ్ ఓపెనర్ టిమ్ సీఫర్ట్ (Tim Seifert) సరికొత్త చరిత్ర సృష్టించాడు. పాకిస్తాన్తో ఐదో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగి ప్రపంచ రికార్డు సాధించాడు. లక్ష్య ఛేదనలో అత్యధిక స్ట్రైక్ రేటుతో.. తొంభై పరుగుల మార్కు చేరుకున్న తొలి క్రికెటర్గా నిలిచాడు.ఇంగ్లండ్ పవర్ హిట్టర్ లియామ్ లివింగ్స్టోన్ (Liam Livingstone) పేరిట ఉన్న రికార్డును సీఫర్ట్ బద్దలు కొట్టి సీఫర్ట్ ఈ అరుదైన ఘనత సాధించాడు. కాగా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు పాకిస్తాన్ న్యూజిలాండ్లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో తొలి, రెండు టీ20లలో కివీస్ గెలవగా.. మూడో మ్యాచ్లో పాకిస్తాన్ గెలిచింది. ఆ తర్వాత మళ్లీ పైచేయి సాధించిన న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది.ఈ క్రమంలో ఇరుజట్ల (New Zealand Vs Pakistan) మధ్య బుధవారం నామమాత్రపు ఐదో టీ20 జరిగింది. వెల్లింగ్టన్ వేదికగా టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. కెప్టెన్ సల్మాన్ ఆఘా (39 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించగా... షాదాబ్ ఖాన్ (28; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. హరీస్ (11), నవాజ్ (0), యూసుఫ్ (7), ఉస్మాన్ ఖాన్ (7), అబ్దుల్ సమద్ (4) విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో నీషమ్ 5 వికెట్లతో విజృంభించగా... జాకబ్ డఫీ 2 వికెట్లు తీశాడు.బాదుడే బాదుడు... స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్ తొలి ఓవర్ నుంచే పాక్ బౌలర్లపై ప్రతాపం చూపింది. తొలి ఓవర్లో ఓపెనర్ టిమ్ సీఫర్ట్ 4, 6, 6 కొడితే... రెండో ఓవర్లో అలెన్ 4, 4, 6 బాదాడు. మూడో ఓవర్లో సీఫర్ట్ 4, 6... నాలుగో ఓవర్లో ఇద్దరు కలిసి 3 ఫోర్లు కొట్టడంతో స్కోరు బోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. జహాందాద్ ఖాన్ వేసిన ఆరో ఓవర్లో సీఫెర్ట్ 6, 4, 6, 2, 6, 1 కొట్టడంతో 23 బంతుల్లోనే అతడి హాఫ్సెంచరీ పూర్తయింది. పాక్ యువ బౌలర్ ముఖీమ్ రెండు ఓవర్లలో 6 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసినప్పటికీ... సీఫెర్ట్ జోరును మాత్రం అడ్డుకోలేకపోయాడు. షాదాబ్ వేసిన పదో ఓవర్లో 6, 6, 6, 6 కొట్టిన సీఫర్ట్ మ్యాచ్ను ముగించాడు. ఫలితంగా న్యూజిలాండ్ 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసి గెలిచింది. తొలి బంతి నుంచే సీఫర్ట్ వీరవిహారం చేయగా... ఫిన్ అలెన్ (12 బంతుల్లో 27; 5 ఫోర్లు, 1 సిక్స్) ఉన్నంతసేపు ధాటిగా ఆడటం కలిసివచ్చింది. పాక్ బౌలర్లలో ముఖీమ్ 2 వికెట్లు తీశాడు. నీషమ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, సీఫర్ట్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి.టిమ్ సీఫర్ట్ ప్రపంచ రికార్డుఇక ఈ మ్యాచ్లో టిమ్ సీఫర్ట్ మొత్తంగా 38 బంతుల్లో 97 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇన్నింగ్స్లో ఆరు ఫోర్లతో పాటు ఏకంగా పది సిక్సర్లు ఉండగా.. స్ట్రైక్రేటు 255.26గా నమోదైంది.ఈ నేపథ్యంలో.. అంతర్జాతీయ టీ20 మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దిగి.. అత్యధిక స్ట్రైక్రేటుతో తొంభైకి పైగా పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా సీఫర్ట్ చరిత్రకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ స్టార్ లియామ్ లివింగ్స్టోన్ పేరిట ఉండేది. లివింగ్స్టోన్ 2021లో పాకిస్తాన్పై నాటింగ్హామ్ వేదికగా 239.53 స్ట్రైక్రేటుతో 103 పరుగులు సాధించాడు. ఇక అంతర్జాతీయ టీ20లలో 250కి పైగా స్ట్రైక్రేటుతో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగానూ సీఫర్ట్ చరిత్రపుటల్లో తన పేరును లిఖించుకోవడం మరో విశేషం.చదవండి: ‘అతడిని ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా? ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగదు’ -
రూ. 4 కోట్లా? ప్రభుత్వ ఉద్యోగమా?.. స్థలమా?.. ఏది కావాలి?
ప్యారిస్ ఒలింపిక్స్-2024 (Paris Olympics)లో సత్తా చాటిన భారత రెజ్లర్, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే వినేశ్ ఫొగట్ (Vinesh Phogat)కు.. హర్యానా ప్రభుత్వం మూడు ఆప్షన్లు ఇచ్చింది. ‘‘రూ. 4 కోట్లా? ప్రభుత్వ ఉద్యోగమా?.. లేదంటే ప్లాట్’’.. వీటిలో ఆమెకు ఏదీ కావాలో చెప్పాలని కోరింది. కాగా వినేశ్ ఫొగట్ తృటిలో ఒలింపిక్ పతకాన్ని చేజార్చుకున్న విషయం తెలిసిందే.మహిళల యాభై కిలోల కుస్తీ విభాగంలో అద్భుత ప్రదర్శనలతో ఫైనల్కు చేరిన వినేశ్.. ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్గా చరిత్ర సృష్టించారు. అయితే, అనూహ్య రీతిలో టైటిల్ పోరుకు ముందు.. పోటీలో పాల్గొనకుండా ఆమెపై వేటు పడింది. నిర్ణీత బరువు కంటే వంద గ్రాములు ఎక్కువగా ఉన్న కారణంగా పతకం కోసం పోటీ పడే అవకాశం చేజారింది.కనీసం రజతమైనా ఇవ్వాలని అప్పీలుఆ తర్వాత స్పోర్ట్స్ కోర్టులో కనీసం రజతమైనా ఇవ్వాలని అప్పీలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఒక్క గ్రాము బరువు ఎక్కువగా ఉన్నా పోటీకి, పతకానికి అనర్హులే అంటూ కోర్టు వినేశ్ ఫొగట్ పిటిషన్ను కొట్టి వేయడంతో ఆమెతో పాటు యావత్ భారతావనికి నిరాశే మిగిలింది.అయితే, ఫైనల్ వరకు వినేశ్ చేరిన తీరును ప్రశంసిస్తూ అభినందలు వెల్లువెత్తాయి. ఓడినా మనసులు గెలిచిందంటూ ఆమెపై ప్రశంసల జల్లు కురిసింది. నాడు.. ప్రస్తుత హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ సైతం.. ‘‘హర్యానాకు గర్వకారణమైన ఫొగట్ గౌరవాన్ని మేము మరింత పెంచుతాం’’ అని ట్వీట్ చేశారు.కుస్తీకి వీడ్కోలు పలికి..రాజకీయ రంగ ప్రవేశంఅంతేకాదు.. రాష్ట్ర క్రీడా విధానాన్ని అనుసరించి ఒలింపిక్స్లో రజతం గెలిచిన ఆటగాళ్లకు ఇచ్చే నజరానాను వినేశ్కు అందిస్తామనే హామీ అందింది. అయితే, ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అనూహ్య రీతిలో పతకం చేజారిన చేదు అనుభవాన్ని జీర్ణించుకోలేక వినేశ్ ఫొగట్ కుస్తీకి వీడ్కోలు పలికి..రాజకీయ రంగ ప్రవేశం చేశారు.కాంగ్రెస్ పార్టీ నుంచి ఝులానా నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె.. అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ క్రమంలో క్రీడాకారుల కోటాలో తనకు అందాల్సిన నజరానా గురించి ఇటీవల విధాన సభలో ప్రస్తావించారు.హామీ మరిచారా?‘‘వినేశ్ ఫొగట్ మా కూతురు. ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్కు ఇచ్చే రివార్డును ఆమెకు అందజేస్తాం అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ ఇంత వరకు ఆ హామీని పూర్తి చేయలేకపోయారు.ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు. గౌరవానికి సంబంధించిన అంశం. ఈ రాష్ట్రంలో చాలా మంది క్రీడాకారులకు ఇప్పటికే రివార్డులు అందజేశారు’’ అని వినేశ్ ఫొగట్ బీజేపీ ప్రభుత్వ తీరును విమర్శించారు.ఈ నేపథ్యంలో మంగళవారం నాటి కేబినెట్ సమావేశంలో వినేశ్ ఫొగట్ రివార్డుకు సంబంధించి ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ నిర్ణయం తీసుకున్నారు. ‘‘వినేశ్ ఫొగట్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. తన క్యాష్ రివార్డుకు సంబంధించిన అంశాన్ని ఆమె విధాన సభలో లేవనెత్తారు.ఈ మూడింటిలో ఏది కావాలి?అందుకే కేబినెట్ ప్రత్యేకంగా ఈ విషయంపై చర్చింది. స్పోర్ట్స్ పాలసీ ప్రకారం ఆమెకు ప్రయోజనాలు చేకూర్చాలని నిశ్చయించింది’’ అని తెలిపారు. నిబంధనల ప్రకారం.. రూ. 4 కోట్ల క్యాష్ ప్రైజ్.. లేదంటే ప్రభుత్వ ఉద్యోగం.. లేదా హర్యానా షహరీ వికాస్ ప్రాధికారణ్ పథకం కింద ప్లాట్.. ఈ మూడింటిలో ఏదో ఒకటి తీసుకోవాలని కేబినెట్ వినేశ్ ఫొగట్కు ఆఫర్ ఇచ్చింది. అయితే, ఆమె ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం. ఇక తాను తల్లి కాబోతున్నట్లు ఇటీవలే వినేశ్ ఫొగట్.. తన భర్త, రెజ్లర్ సోమ్వీర్ రాఠీతో కలిసి శుభవార్త పంచకున్న విషయం తెలిసిందే.చదవండి: ‘విడాకులు మాత్రమే కావాలి.. నేనేమీ బికారిని కాదు.. ఆ దెయ్యం డబ్బు నాకొద్దు’ -
Quinton de Kock: వచ్చాడు.. రెండో మ్యాచ్లోనే భారీ రికార్డు పట్టాడు..!
కేకేఆర్ తరఫున తన రెండో మ్యాచ్లోనే క్వింటన్ డికాక్ ఓ భారీ రికార్డు సాధించాడు. నిన్న (మార్చి 26) రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 61 బంతుల్లో 97 పరుగులు చేసిన అతడు.. కేకేఆర్ తరఫున విజయవంతమైన ఛేదనల్లో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు మనీశ్ పాండే పేరిట ఉండేది. మనీశ్ 2014 సీజన్ ఫైనల్లో పంజాబ్పై 94 పరుగులు చేశాడు.విజయవంతమైన లక్ష్య ఛేదనల్లో కేకేఆర్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్లు97* - క్వింటన్ డికాక్ vs RR, గౌహతి, 202594 - మనీశ్ పాండే vs PBKS, బెంగళూరు, 2014 ఫైనల్93* - క్రిస్ లిన్ vs GL, రాజ్కోట్, 201792 - మన్వీందర్ బిస్లా vs CSK, చెన్నై, 201390* - గౌతమ్ గంభీర్ vs SRH, హైదరాబాద్, 2016కాగా, రాయల్స్తో జరిగిన నిన్నటి మ్యాచ్లో డికాక్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి కేకేఆర్ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్.. కేకేఆర్ బౌలర్లు మొయిన్ అలీ (4-0-23-2), వరుణ్ చక్రవర్తి (4-0-17-2), హర్షిత్ రాణా (4-0-36-2), వైభవ్ అరోరా (4-0-33-2) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాయల్స్ బ్యాటర్లలో ధృవ్ జురెల్ (33) టాప్ స్కోరర్గా కాగా.. జైస్వాల్ 29, రియాన్ పరాగ్ 25, సంజూ శాంసన్ 13, జోఫ్రా ఆర్చర్ 16 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో డికాక్ బాధ్యతాయుతంగా ఆడి కేకేఆర్ను గెలిపించాడు. 61 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 97 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కెప్టెన్ రహానే (18), రఘువంశీ (22 నాటౌట్) సహకారంతో కేకేఆర్ను విజయతీరాలకు చేర్చాడు. కేకేఆర్ మరో 15 బంతులు మిగిలుండగానే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. తద్వారా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో డికాక్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. గత సీజన్లో లక్నోకు ఆడిన డికాక్.. కేకేఆర్ తరఫున ఆడిన తొలి మ్యాచ్లో ప్రభావం చూపనప్పటికీ.. రెండో మ్యాచ్లో సత్తా చాటాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు నాలుగు ఫ్రాంచైజీలకు (ఢిల్లీ, ముంబై, లక్నో, ఢిల్లీ) ఆడిన డికాక్.. నాలుగింటి తరఫున ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో నాలుగు ఫ్రాంచైజీల తరఫున ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఏకైక ప్లేయర్ డికాకే. -
టీమిండియాలోకి కరుణ్ నాయర్..?
ఐపీఎల్ 2025 తర్వాత ఇంగ్లండ్తో జరిగే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఎంపిక చేసే భారత జట్టుకు దేశవాలీ స్టార్ క్రికెటర్ కరుణ్ నాయర్ (భారత జట్టుకు) ఎంపిక కానున్నాడని తెలుస్తుంది. కరుణ్ను నేరుగా భారత జట్టులోకి కాకుండా తొలుత భారత్-ఏ జట్టుకు ఎంపిక చేస్తారని సమాచారం. ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు ముందు భారత్-ఏ ఇంగ్లండ్ లయన్స్తో రెండు నాలుగు రోజుల మ్యాచ్లు ఆడుతుంది. ఈ రెండు మ్యాచ్లకు కరుణ్ను ఎంపిక చేసి, ఇక్కడ సత్తా చాటితే టీమిండియాకు ఎంపిక చేయాలని భారత్ సెలెక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇంగ్లండ్ పర్యటనకు, దానికి ముందు ఇంగ్లండ్ లయన్స్తో జరిగే మ్యాచ్లకు భారత జట్ల ప్రకటనకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ.. కరుణ్ విషయంలో సెలెక్టర్లు సానుకూలంగా ఉన్నారని టాక్ నడుస్తుంది. మరోవైపు ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మనే కొనసాగిస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. రోహిత్ న్యూజిలాండ్, ఆసీస్తో జరిగిన టెస్ట్ సిరీస్ల్లో కెప్టెన్గా, ఆటగాడిగా దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత టెస్ట్ జట్టు నుంచి రోహిత్ను తప్పిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంలో నిజం లేదని తాజాగా వెలువడిన రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి. తాజాగా జరిగిన సెలెక్టర్ల సమావేశంలో రోహిత్నే ఇంగ్లండ్ టూర్కు కెప్టెన్గా కొనసాగించాలని డిసైడ్ చేశారట.కాగా, ఐపీఎల్ 2025 తర్వాత భారత క్రికెట్ జట్టు 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటన జూన్ 20న జరిగే తొలి టెస్ట్ మ్యాచ్ను ప్రారంభమవుతుంది. దీనికి ముందు భారత్-ఏ, ఇంగ్లండ్ లయన్స్ మధ్య రెండు నాలుగు రోజుల మ్యాచ్లు జరుగుతాయి. ఇంగ్లండ్ లయన్స్, ఇంగ్లండ్తో జరిగే మ్యాచ్ల కోసం మే చివరి వారంలో భారత జట్లను ప్రకటించే అవకాశం ఉంది.అరివీర భయంకర ఫామ్లో కరుణ్కరుణ్ నాయర్ దేశవాలీ సీజన్లో అరివీర భయంకర ఫామ్లో ఉన్నాడు. తాజాగా ముగిసిన రంజీ సీజన్లో 57.33 సగటున 4 సెంచరీల సాయంతో 860 పరుగులు చేసి కరుణ్.. విదర్భ జట్టు చాంపియన్గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుమందు కరుణ్ విజయ్ హజారే ట్రోఫీలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆ టోర్నీలో 9 మ్యాచ్లు ఆడిన కరుణ్ 389.50 సగటుతో 779 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి. కరుణ్ ప్రస్తుతం ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడుతున్నాడు. -
ఒక్క సిరీస్ ఓడితే ఏంటి? మా లక్ష్యం వరల్డ్కప్ మాత్రమే: పాక్ కెప్టెన్
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు గత కొంతకాలంగా ఇంటా.. బయటా పరాభవాలే ఎదురవుతున్నాయి. తొలుత న్యూజిలాండ్- సౌతాఫ్రికాతో సొంతగడ్డపై త్రైపాక్షిక సిరీస్లో ఓటమిపాలైన పాక్.. ఆ తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లోనూ చేదు అనుభవాలు ఎదుర్కొంది.ఈ మెగా వన్డే టోర్నీకి ఆతిథ్యమిచ్చిన పాకిస్తాన్.. కనీసం ఒక్క విజయం లేకుండానే నిష్క్రమించింది. అనంతరం న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్ (NZ vs PAK T20 Series)లో చిత్తుగా ఓడిపోయింది. కివీస్తో బుధవారం నాటి ఐదో టీ20లో ఓడి.. 4-1తో సిరీస్లో పరాజయం పాలైంది.ఒక్క సిరీస్ ఓడితే ఏంటి? మా లక్ష్యం వరల్డ్కప్ మాత్రమేఅయితే, ఓటమి అనంతరం పాకిస్తాన్ టీ20 జట్టు కొత్త కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా (Salman Ali Agha) చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఇలాంటి సిరీస్లలో ఓడిపోయినా ఫర్వాలేదని.. తమ దృష్టి మొత్తం ఆసియా కప్, వరల్డ్కప్ టోర్నీల మీదనే ఉందని అతడు వ్యాఖ్యానించాడు. ‘‘న్యూజిలాండ్ జట్టు అద్భుతంగా ఆడింది.సిరీస్ ఆసాంతం వాళ్లు అదరగొట్టారు. అయినా మాకూ కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయి. మూడో టీ20లో హసన్ నవాజ్ అద్భుత శతకం సాధించాడు. ఐదో టీ20లో సూఫియాన్ సూపర్గా బౌలింగ్ చేశాడు.వన్డే సిరీస్లో మేము రాణిస్తాంమేము ఇక్కడికి వచ్చినప్పుడు మా దృష్టి మొత్తం ఆసియా కప్, ప్రపంచకప్లపైనే కేంద్రీకృతమై ఉంది. ఈ సిరీస్లో ఓడినంత మాత్రాన పెద్దగా నిరాశపడాల్సిందేమీ లేదు. ఇక పొట్టి ఫార్మాట్కు, వన్డే ఫార్మాట్కు ఏమాత్రం పొంతన ఉండదని తెలిసిందే. వన్డే సిరీస్లో మేము రాణిస్తాం’’ అని సల్మాన్ ఆఘా పేర్కొన్నాడు.అపుడు డకెట్ కూడా ఇలాగేఈ నేపథ్యంలో సల్మాన్ ఆఘా కామెంట్లపై సోషల్ మీడియాలో సైటైర్లు పేలుతున్నాయి. ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ డకెట్తో పోలుస్తూ నెటిజన్లు సల్మాన్ను ట్రోల్ చేస్తున్నారు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీకి ముందు ఇంగ్లండ్ భారత్లో పర్యటించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో టీమిండియా చేతిలో ఇంగ్లండ్ క్లీన్స్వీప్ అయింది. అయితే.. ఈ ఘోర ఓటమి తర్వాత బెన్ డకెట్ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి సిరీస్లలో పరాజయాలు పెద్దగా లెక్కలోకి రావు. మేమే చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత దీనిని అందరూ మర్చిపోతారు’’ అని పేర్కొన్నాడు.రెండు జట్లదీ ఒకే పరిస్థితిఅయితే, చాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ కనీసం ఒక్క విజయం కూడా సాధించలేదు. అఫ్గనిస్తాన్ చేతిలోనూ చిత్తుగా ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు సల్మాన్ ఆఘా తమ ఫోకస్ ఆసియా కప్, వరల్డ్కప్ మాత్రమే అని చెప్పడం గమనార్హం. అన్నట్లు చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ తొలుత న్యూజిలాండ్.. తర్వాత టీమిండియా చేతిలో చిత్తుగా ఓడింది. ఆఖరి మ్యాచ్లో బంగ్లాదేశ్పై గెలుద్దామనుకుంటే వర్షం వల్ల.. ఆ మ్యాచ్ రద్దైంది. దీంతో ఇంగ్లండ్ మాదిరే ఒక్క గెలుపు లేకుండానే పాకిస్తాన్ ఈ వన్డే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.చదవండి: NZ vs Pak: టిమ్ సీఫర్ట్ విధ్వంసం.. పాకిస్తాన్కు అవమానకర ఓటమిపాక్తో వన్డే సిరీస్కు ముందు న్యూజిలాండ్కు భారీ షాక్ -
IPL 2025: ఏంటి.. రియాన్ పరాగ్కు కూడా కాళ్లు మొక్కే ఫ్యాన్స్ ఉన్నారా..?
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా నిన్న (మార్చి 26) రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్ మధ్య మ్యాచ్ జరిగింది. గౌహతి వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ రాయల్స్ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో రాయల్స్ అన్ని విభాగాల్లో ఘోరంగా విఫలమై అవమానకర ఓటమిని మూటగట్టుకుంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు జరిగిన ఆరు మ్యాచ్ల్లో ఏకపక్షంగా సాగిన మ్యాచ్ ఇదే. ఈ మ్యాచ్లో రాయల్స్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్ డికాక్ 61 బంతుల్లో 97 పరుగులు చేసి ఒంటిచేత్తో కేకేఆర్ను గెలిపించాడు. తొలి మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో భంగపడ్డ కేకేఆర్ ఈ మ్యాచ్లో గెలుపుతో విజయాల ఖాతా తెరిచింది. ఈ సీజన్లో రాయల్స్కు ఇది వరుసగా రెండో ఓటమి.Fan breaches security to meet Riyan Parag! Cricket fever at its peak!🏃[ Video Credits: @JioHotstar, @IPL #RiyanParag #RRvsKKR ] pic.twitter.com/xzlrQW44uq— ◉‿◉ (@nandeeshbh18) March 26, 2025కాగా, చప్పగా సాగుతున్న నిన్నటి మ్యాచ్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి అమాంతం మైదానంలోకి దూసుకొచ్చి బౌలింగ్ చేస్తున్న రియాన్ పరాగ్ కాళ్లపై పడ్డాడు. ఆ తర్వాత రియాన్ను కౌగిలించుకున్నాడు. ఈలోపు సెక్యూరిటీ సిబ్బంది వచ్చి ఆ పిచ్ ఇన్వేడర్ను లాక్కెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది.So, Riyan Parag hired a boy and paid him 10,000 Rs to come onto the ground and touch his feet.What an attention seeker this guy is!#RRvsKKR pic.twitter.com/0w7gfW7lAC— Dr Nimo Yadav 2.0 (@niiravmodi) March 26, 2025ఇది చూసి జనాలు రియాన్కు కూడా కాళ్లు మొక్కే ఫ్యాన్స్ ఉన్నారా అని కామెంట్లు చేస్తున్నారు. రియానే ఆ వ్యక్తికి డబ్బిచ్చి అలా చేయమని ఉంటాడని మరికొందరంటున్నారు. రియాన్ కాళ్లు మొక్కి జైలుకి (మ్యాచ్ జరిగే సమయంలో మైదానంలోకి వస్తే జరిమానా, జైలు శిక్ష లేదా స్టేడియం నుంచి బహిష్కరణ లాంటి శిక్షలు వేస్తారు) వెళ్లే సాహసం ఎవరు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరేమో రియాన్ లోకల్ హీరో కాబట్టి ఫ్యాన్స్ ఉండటంలో తప్పేముందని అంటున్నారు. రియాన్ రాయల్స్కు కెప్టెన్ కూడా అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.సోషల్మీడియాలో ఎలాంటి కామెంట్లు వస్తున్నా.. రియాన్ రాయల్స్కు స్టార్ ఆటగాడు. పైగా అతను జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. రియాన్ పుట్టి పెరిగింది కూడా నిన్న మ్యాచ్ జరిగిన గౌహతిలోనే. జాతీయ స్థాయిలో, ఐపీఎల్లో ఆ రాష్ట్రానికి (అసోం) ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైక ఆటగాడు అతనే. అలాంటప్పుడు అతనికి ఫ్యాన్స్ ఉంటే తప్పేముంది. సోషల్మీడియా యూజర్స్కు నచ్చినా నచ్చకపోయినా రియాన్ ఓ స్టార్ ఆల్రౌండర్. అతనిలో ఎంత టాలెంట్ లేకుంటే అతన్ని రాయల్స్ గత సీజన్కు ముందు రిటైన్ చేసుకుంటుంది..? అంత మంది సీనియర్లు ఉన్నా అతన్నే ఎందుకు కెప్టెన్ చేస్తుంది..?No way you risk getting fined, jailed or probably banned from the stadium to touch Riyan Parag's feet? 😭 pic.twitter.com/lPKgS9dJEB— Heisenberg ☢ (@internetumpire) March 26, 2025 -
‘అతడిని ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?.. ఇలాంటి వింత చూడలేదు’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025లో రాజస్తాన్ రాయల్స్ పరాజయాలు కొనసాగుతున్నాయి. తమ ఆరంభ మ్యాచ్లో సన్రైజర్స్ చేతిలో చిత్తుగా ఓడిన పింక్ జట్టు.. రెండో మ్యాచ్లోనూ ఓటమిని చవిచూసింది. కోల్కతా నైట్ రైడర్స్తో బుధవారం నాటి మ్యాచ్లో ఎనిమిది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. రాజస్తాన్ రాయల్స్ మేనేజ్మెంట్ తీరును విమర్శించాడు. బ్యాటింగ్ ఆర్డర్లో చేసిన మార్పుల వల్లే రాయల్స్కు భంగపాటు ఎదురైందని అభిప్రాయపడ్డాడు. టీ20 ఫార్మాట్లో ప్యూర్ బ్యాటర్ను ఎనిమిదో స్థానంలో పంపే ఏకైక జట్టు రాయల్స్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.బ్యాటింగ్ ఆర్డరే ఓ డిజార్డర్ఈ మేరకు.. ‘‘కోల్కతాతో మ్యాచ్లో రాజస్తాన్ బ్యాటింగ్ ఆర్డరే ఓ డిజార్డర్. మీరు తొలుత బ్యాటింగ్ చేయాల్సి ఉంది. కానీ గత మ్యాచ్లో 11 లేదా 12 బంతుల్లోనే 35 పరుగులు సాధించిన బ్యాటర్ శుభమ్ దూబేకు.. మీరు తుదిజట్టులో స్థానం ఇవ్వలేదు.ఆల్రౌండర్ వనిందు హసరంగను ఐదో స్థానంలో బ్యాటింగ్కు పంపించారు. అతడు పట్టుమని పది పరుగులు చేయకుండా అవుటయ్యాడు. ఆ తర్వాతైనా మీరు సరైన నిర్ణయం తీసుకున్నారా అంటే అదీ లేదు. శుభమ్ను ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దించారు.పవర్ హిట్టర్ షిమ్రన్ హెట్మెయిర్ను కాదని శుభమ్ను ఏడో స్థానంలో పంపించారు. అతడు విఫలమయ్యాడు. మరోవైపు.. ఎనిమిదో స్థానంలో వచ్చిన హెట్మెయిర్ కూడా చేతులెత్తేశాడు.ఇలాంటి వింత చూడలేదుస్పెషలిస్టు బ్యాటర్.. అదీ టీ20 క్రికెట్లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేయడం ప్రపంచంలో ఎక్కడైనా చూశారా? నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. రాయల్స్ బ్యాటింగ్ ఆర్డర్పై ఏమని స్పందించాలో కూడా తెలియడం లేదు. వాళ్ల వింత నిర్ణయాలు ఎవరికీ అంతుపట్టడం లేదు’’ అని ఆకాశ్ చోప్రా రాజస్తాన్ నాయకత్వ బృందంపై ఘాటు విమర్శలు చేశాడు.కాగా రాయల్స్ రెగ్యులర్ కెప్టెన్ సంజూ శాంసన్ గాయం వల్ల గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఐపీఎల్-2025తో రీఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఆరంభ మ్యాచ్లలో సారథ్య బాధ్యతలకు అతడు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో యువ ఆల్రౌండర్ రియాన్ పరాగ్ రాయల్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.బ్యాటర్ల వైఫల్యంపరాగ్ నాయకత్వంలో తొలుత రైజర్స్చేతిలో ఓడిన రాయల్స్.. రెండో మ్యాచ్లో కేకేఆర్తో తలపడింది. గువాహతి వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడిన రాయల్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (29), సంజూ శాంసన్ (13) నిరాశపరచగా.. పరాగ్ (15 బంతుల్లో 25) కాసేపు అలరించాడు.ఇక, నితీశ్ రాణా(8) పూర్తిగా విఫలం కాగా... రాయల్స్ తరఫున అరంగేట్రం చేసిన హసరంగ ఐదో స్థానంలో వచ్చి 4 పరుగులకే నిష్క్రమించాడు. వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్(28 బంతుల్లో 33) నిలదొక్కుకునే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు.అయితే, గత మ్యాచ్లో అదరగొట్టిన శుభమ్ దూబేకు ప్లేయింగ్ ఎలెవన్లో చోటివ్వని రాయల్స్.. ఇంపాక్ట్ప్లేయర్గా ఏడో స్థానంలో ఆడించింది. అతడు 12 బంతులు ఎదుర్కొని కేవలం 9 పరుగులే చేసి అవుటయ్యాడు. మరోవైపు.. హెట్మెయిర్ 8 బంతుల్లో 7 రన్స్ చేయగా.. ఆఖర్లో టెయిలెండర్ జోఫ్రా ఆర్చర్ (7 బంతుల్లో 16) కాస్త వేగంగా ఆడాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో రాజస్తాన్ తొమ్మిది వికెట్ల నష్టానికి 151 పరుగులు చేయగలిగింది.డికాక్ వన్మ్యాన్ షోఇక లక్ష్య ఛేదనలో కేకేఆర్ అదరగొట్టింది. ఆరంభంలోనే ఓపెనర్ మొయిన్ అలీ(5) వికెట్ కోల్పోయినా.. మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ దుమ్ములేపాడు. 61 బంతుల్లో 97 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. Q for Quality, Q for Quinton 👌👌A sensational unbeaten 9⃣7⃣ runs to seal the deal ✅Scorecard ▶ https://t.co/lGpYvw87IR#TATAIPL | #RRvKKR | @KKRiders pic.twitter.com/kbjY1vbjNL— IndianPremierLeague (@IPL) March 26, 2025మిగతా వాళ్లలో కెప్టెన్ అజింక్య రహానే 18, అంగ్క్రిష్ రఘువన్షీ 22 (నాటౌట్) పరుగులు సాధించారు. ఈ క్రమంలో 17.3 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసిన కేకేఆర్.. ఈ సీజన్లో తొలి విజయం నమోదు చేసింది. అంతకు ముందు కోల్కతా.. ఆర్సీబీ చేతిలో ఓటమిపాలైంది. చదవండి: శ్రేయస్ కాదు!.. అతడే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అశ్విన్ -
ఐపీఎల్-2025లో ఆసక్తికర విషయం.. వాళ్లే హీరోలయ్యారు..!
ఐపీఎల్ 2025 సీజన్లో ఇప్పటివరకు (మార్చి 26) ఆరు మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇందులో తొలి ఐదు మ్యాచ్లు ధనాధన్ బ్యాటింగ్ విన్యాసాలతో సాగగా.. నిన్న జరిగిన ఆరో మ్యాచ్ ఎలాంటి మెరుపులు లేకుండా చప్పగా ముగిసింది. ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన ఆరు మ్యాచ్ల్లో ఓ ఆసక్తికర విషయం చోటు చేసుకుంది. ఆరు మ్యాచ్ల్లో ఫ్రాంచైజీలు మారి వచ్చిన ఆటగాళ్లే తమ కొత్త జట్లను గెలిపించారు.సీజన్ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్పై ఆర్సీబీ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలుపులో లక్నో నుంచి వలస వచ్చిన కృనాల్ పాండ్యా కీలకపాత్ర పోషించాడు. కృనాల్ ఆర్సీబీ తరఫున తన తొలి మ్యాచ్లోనే మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ మ్యాచ్లో అతను 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.సీజన్ రెండో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై సన్రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ విధ్వంసకర సెంచరీ చేసి సన్రైజర్స్ విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. గత సీజన్ వరకు ముంబై ఇండియన్స్కు ఆడిన ఇషాన్.. సన్రైజర్స్ తరఫున తన తొలి మ్యాచ్లోనే మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.మూడో మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముంబై బ్యాటింగ్ లైనప్కు కుప్పకూల్చిన నూర్ అహ్మద్ సీఎస్కే గెలుపులో కీలకంగా వ్యవహరించాడు. గత సీజన్ వరకు గుజరాత్ టైటాన్స్కు ఆడిన నూర్.. సీఎస్కే తరఫున తన తొలి మ్యాచ్లోనే అద్భుత ప్రదర్శన చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు.సీజన్ నాలుగో మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఆశుతోష్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్ విన్యాసాలు ప్రదర్శించి ఢిల్లీకి ఊహించని విజయాన్నందించాడు. గత సీజన్లో పంజాబ్కు ఆడిన అశుతోష్.. ఢిల్లీ తరఫున తొలి మ్యాచ్లోనే అదగొట్టాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.ఐదో మ్యాచ్లో గుజరాత్పై పంజాబ్ సూపర్ విక్టరీ నమోదు చేసింది. ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ సెంచరీ త్యాగం చేసి మరీ తన కొత్త ఫ్రాంచైజీ పంజాబ్ను గెలిపించాడు. గత సీజన్లో కేకేఆర్కు టైటిల్ అందించిన శ్రేయస్.. పంజాబ్ తరఫున తన తొలి మ్యాచ్లో వీరంగం సృష్టించాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. నిన్న జరిగిన ఆరో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై కేకేఆర్ గెలుపొందింది. ఈ మ్యాచ్లో కేకేఆర్ను డికాక్ ఒంటిచేత్తో గెలిపించాడు. గత సీజన్లో లక్నోకు ఆడిన డికాక్.. కేకేఆర్ తరఫున తన రెండో మ్యాచ్లోనే అదరగొట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యాడు.ఈ ట్రెండ్ ప్రకారం చూస్తే.. నేడు జరుగబోయే సన్రైజర్స్, లక్నో మ్యాచ్లో కూడా ఫ్రాంచైజీ మారి వచ్చిన ఆటగాడే తన కొత్త జట్టును గెలిపించే అవకాశం ఉంది. ఆ ఆటగాడు ఎవరవుతారని అనుకుంటున్నారు. మరోసారి ఇషాన్ అయితే A.. పంత్ అయితే B.. మిచెల్ మార్ష్ అయితే C.. మార్క్రమ్ అయితే D అని కామెంట్ చేయండి. -
IPL 2025: అశ్విన్, చహల్ను వదులుకొని రాయల్స్ తప్పు చేసిందా..?
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. తొలి మ్యాచ్లో సన్రైజర్స్ చేతిలో పరాజయం ఎదుర్కొన్న ఆ జట్టు.. నిన్న (మార్చి 26) ఆడిన రెండో మ్యాచ్లో కేకేఆర్ చేతిలో చావుదెబ్బ తినింది. ఈ సీజన్లో రాయల్స్ వరుసగా రెండు పరాజయాలు ఎదుర్కోవడానికి ప్రధాన కారణం వారి జట్టు. గత సీజన్తో పోలిస్తే ఈ సీజన్లో వారి జట్టు చాలా బలహీనంగా ఉంది. బ్యాటింగ్లో పర్వాలేదనిపిస్తున్నా బౌలింగ్లో మాత్రం దారుణంగా ఉంది. గత సీజన్ వరకు వారి విజయాల్లో కీలకపాత్ర పోషించిన రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చహల్, ట్రెంట్ బౌల్ట్ను వదులుకుని రాయల్స్ పెద్ద తప్పు చేసింది. వీరి ప్రత్యామ్నాయంగా వచ్చిన బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. రాయల్స్ యాష్, చహల్కు ప్రత్యామ్నాయంగా లంక స్పిన్ ద్వయం మహీశ్ తీక్షణ, వనిందు హసరంగలను అక్కున చేర్చుకుంది. వీరు మంచి బౌలర్లే అయినా యాష్, చహల్ అంత ప్రభావం చూపలేకపోతున్నారు. తొలి రెండు మ్యాచ్ల్లోనే ఈ విషయం తేలిపోయింది. రాయల్స్ మరో ఇన్ ఫామ్ పేసర్ ఆవేశ్ ఖాన్ను కూడా వదిలేసి మూల్యం చెల్లించుకుంటుంది. బౌల్ట్ స్థానాన్ని భర్తీ చేస్తాడనుకున్న జోఫ్రా ఆర్చర్ గల్లీ బౌలర్ కంటే దారుణంగా తయారయ్యాడు. సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్చర్ ఏకంగా 76 పరుగులిచ్చాడు (4 ఓవర్లలో). జట్టులోకి కొత్తగా వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ యువ పేసర్ ఫజల్ హక్ ఫారూకీ ఏం చేస్తున్నాడో అతనికే తెలియడం లేదు. అనుభవజ్ఞుడైన సందీప్ శర్మలో మునుపటి జోరు కనిపించడం లేదు. కొత్తగా వచ్చిన దేశీయ పేసర్ తుషార్ దేశపాండే ఒక్కడే కాస్త పర్వాలేదనిపిస్తున్నాడు. మొత్తంగా చూస్తే ఈ సీజన్లో అశ్విన్, చహల్, బౌల్ట్ లేని లోటు రాయల్స్లో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుత బౌలింగ్ యూనిట్తో రాయల్స్ ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి. బ్యాటింగ్నే నమ్ముకొని అద్భుతాలు చేద్దామన్నా, ఈ సీజన్లో రాయల్స్ బ్యాటర్లు ఫామ్లో ఉన్నట్లు కనిపించడం లేదు. తొలి మ్యాచ్లో జురెల్, శాంసన్ పర్వాలేదనిపించినా రెండో మ్యాచ్లో వారిద్దరూ తేలిపోయారు. స్టార్ ఓపెనర్ జైస్వాల్ తన స్థాయికి తగ్గట్లు ఆడటం లేదు. ఏదో చేస్తాడనుకున్న నితీశ్ రాణా దారుణంగా విఫలమవుతున్నాడు. గత సీజన్లో సంచలన ఇన్నింగ్స్లు ఆడిన రియాన్ పరాగ్లో ఆ మెరుపులు కనిపించడం లేదు. హెట్మైర్ను పరిశీలించాల్సి ఉంది. ఈ బ్యాటింగ్ విభాగంతో రాయల్స్ ప్లే ఆఫ్స్కు చేరాలని ఆశించడం కూడా అత్యాశే అవుతుంది.కాగా, కేకేఆర్తో నిన్న జరిగిన మ్యాచ్లో రాయల్స్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమై 8 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. సన్రైజర్స్తో జరిగిన తొలి మ్యాచ్లో ఆకట్టుకున్న రాయల్స్ బ్యాటర్లు ఈ మ్యాచ్లో తేలిపోయారు. కనీసం ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునేందుకు రాయల్స్ బౌలర్లు కూడా ఏమాత్రం ప్రతిఘటించలేదు. పార్ట్ టైమ్ బౌలర్ అయిన రియాన్ పరాగ్ ఒక్కడు కాస్త పర్వాలేదనిపించాడు. డికాక్ 61 బంతుల్లో 97 పరుగులు చేసి ఒంటిచేత్తో కేకేఆర్ను విజయతీరాలకు చేర్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేయగా.. కేకేఆర్ మరో 15 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. రాయల్స్ తమ తదుపరి మ్యాచ్లో సీఎస్కేను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ గౌహతి వేదికగా మార్చి 30న జరుగనుంది. -
IND vs ENG: రోహిత్ భవిష్యత్తుపై నిర్ణయం.. జట్టు ప్రకటన అప్పుడే!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy)- 2025 ముగిసిన వెంటనే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) రూపంలో మరో క్రికెట్ పండుగ సందడి మొదలైంది. మార్చి 22న మొదలైన ఈ క్యాష్ రిచ్ లీగ్.. మే 25న ఫైనల్తో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు అంతర్జాతీయ క్రికెట్ నుంచి దాదాపు రెండు నెలలకు పైగా విరామం లభించింది.ఇక ఐపీఎల్-2025 తర్వాత భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు పయనం కానుంది. జూన్ ఆఖరి వారం నుంచి ఇంగ్లిష్ జట్టుతో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ మొదలుపెట్టనుంది. ఇందుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మే చివరి వారంలో జట్టును ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాదు.. ఈ కీలక టెస్టు సిరీస్కు రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా కొనసాగించాలని సెలక్షన్ కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బృందం మూకుమ్మడిగా హిట్మ్యాన్కు ఓటువేసినట్లు తెలుస్తోంది.రోహిత్ భవిష్యత్తుపై నిర్ణయం.. జట్టు ప్రకటన అప్పుడే!ఈ విషయాల గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు మాట్లాడుతూ.. ‘‘న్యూజిలాండ్తో సిరీస్లో, ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమైనప్పటికీ.. ఇంగ్లండ్తో టెస్టులకూ రోహిత్ శర్మనే కెప్టెన్గా కొనసాగించే అవకావాలు ఉన్నాయి. జట్టు ప్రకటనకు చాలా సమయం ఉంది. ఐపీఎల్ నాకౌట్ మ్యాచ్ల నాటికి సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఆ తర్వాత ఏ క్షణమైన ప్రకటన రావొచ్చు’’ అని పీటీఐతో పేర్కొన్నాయి.ఘోర పరాభవాలుకాగా టెస్టు క్రికెట్లో గత కొంతకాలంగా రోహిత్ శర్మ వైఫల్యాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్తో టెస్టులో అతడి నాయకత్వంలో భారత జట్టు.. 3-0తో క్లీన్స్వీప్ అయింది. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఇలా.. విదేశీ జట్టు చేతిలో సొంతగడ్డపై మూడు మ్యాచ్ల సిరీస్లో వైట్వాష్కు గురికావడం ఇదే తొలిసారి.ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలోనూ రోహిత్ సేనకు భంగపాటే ఎదురైంది. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్లోనూ టీమిండియా ఓడిపోయింది. ఐదు టెస్టుల సిరీస్లో 3-1తో పరాజయం పాలై.. పదేళ్ల తర్వాత తొలిసారి ఆసీస్కు ఈ ట్రోఫీని చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC)- 2023-25 ఫైనల్కు చేరకుండానే నిష్క్రమించింది.ఈ రెండు సిరీస్లలో కెప్టెన్గా.. బ్యాటర్గా రోహిత్ శర్మ ఘోరంగా విఫలమయ్యాడు. ఆ తర్వాత రంజీ బరిలో ముంబై తరఫున ఓపెనర్గా వచ్చి అక్కడా పేలవ ప్రదర్శన కనబరిచాడు. దీంతో అతడిని టెస్టు కెప్టెన్సీ నుంచి, జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్లు పెరిగాయి.తిరిగి ఫామ్లోకిఅయితే, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో రోహిత్ శర్మ ప్రదర్శన తర్వాత సీన్ మారిపోయింది. ఈ వన్డే టోర్నమెంట్లో బ్యాటర్గా, సారథిగా రాణించి భారత్కు టైటిల్ అందించాడు హిట్మ్యాన్. తద్వారా తన ఖాతాలో రెండో ఐసీసీ టైటిల్ చేర్చుకోవడంతో పాటు.. భారత్కు పుష్కరకాలం తర్వాత చాంపియన్స్ ట్రోఫీని అందించాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మకు టెస్టుల్లోనూ మరొక్క అవకాశం ఇవ్వాలని సెలక్టర్లు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.కాగా టీ20 ప్రపంచకప్-2024లో భారత్ను చాంపియన్గా నిలిపిన తర్వాత రోహిత్ శర్మ.. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో కొనసాగుతున్న హిట్మ్యాన్.. ఐపీఎల్-2025లో భాగంగా ముంబై ఇండియన్స్ తరఫున మరోసారి బరిలోకి దిగాడు. చదవండి: అంతా డికాకే చేశాడు.. తప్పులు ఒప్పుకుంటాం.. రిపీట్ చేయం: రియాన్ పరాగ్ -
పాక్తో వన్డే సిరీస్కు ముందు న్యూజిలాండ్కు భారీ షాక్
పాకిస్తాన్తో వన్డే సిరీస్కు ముందు న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) విధుల నేపథ్యంలో బిజీగా ఉండగా.. అతడి స్థానంలో టామ్ లాథమ్ (Tom Latham)ను సెలక్టర్లు తాత్కాలిక సారథిగా ఎంపిక చేశారు. అయితే, ఈ వికెట్ కీపర్ బ్యాటర్ తాజాగా గాయపడ్డాడు.బ్రేస్వెల్కే సారథ్య బాధ్యతలుపాక్తో సిరీస్ సన్నాహకాల్లో భాగంగా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో టామ్ లాథమ్ కుడిచేయి ఫ్రాక్చర్ అయింది. దీంతో పాకిస్తాన్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ మొత్తానికి లాథమ్ దూరమయ్యాడు. అతడి స్థానంలో హెన్రీ నికోల్స్ జట్టులోకి రాగా.. ఆల్రౌండర్ మైకేల్ బ్రేస్వెల్ సారథ్య బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో న్యూజిలాండ్ అద్భుత ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. అయితే, ఈ వన్డే టోర్నమెంట్ టైటిల్ పోరులో మాత్రం చేతులెత్తేసింది. టీమిండియా చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలై.. రెండోసారి ట్రోఫీని ముద్దాడే అవకాశాన్ని చేజార్చుకుంది.ఈ మెగా ఈవెంట్ కంటే ముందు త్రైపాక్షిక వన్డే సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్లో పర్యటించిన కివీస్ జట్టు.. దక్షిణాఫ్రికా, ఆతిథ్య పాక్లను ఓడించి విజేతగా నిలిచింది. 4-1తో పాక్ను చిత్తు చేసిన కివీస్ఇక, చాంపియన్స్ ట్రోఫీ తర్వాత మళ్లీ స్వదేశంలో పాకిస్తాన్తో టీ20, వన్డే సిరీస్లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారు కాగా.. పొట్టి సిరీస్లో పాక్పై అద్భుత విజయం సాధించింది. మైకేల్ బ్రేస్వెల్ కెప్టెన్సీలో 4-1తో సల్మాన్ ఆఘా బృందంపై గెలుపొంది సిరీస్ సొంతం చేసుకుంది.ఈ క్రమంలో శనివారం (మార్చి 29) నుంచి న్యూజిలాండ్- పాకిస్తాన్ మధ్య వన్డే సిరీస్ మొదలుకానుంది. ఇక ఐపీఎల్ కారణంగా డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ తదితరులు జట్టుకు దూరం కాగా.. కీలక పేసర్ మ్యాట్ హెన్రీ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. మరోవైపు.. పాక్తో వన్డే సిరీస్ నేపథ్యంలో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కైలీ జెమీషన్కు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు.అన్క్యాప్డ్ ప్లేయర్లకు చోటుఈ నేపథ్యంలో.. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటుతున్న నిక్ కెల్లీ, మహ్మద్ అబ్బాస్లకు తొలిసారి న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కింది. ఇక టామ్ లాథమ్ స్థానంలో జట్టులోకి వచ్చిన హెన్రీ నికోల్స్ ఇప్పటి వరకు 78 వన్డేలు ఆడాడు. అయితే, మోకాలి గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న అతడు.. దేశవాళీ క్రికెట్తో పునరాగమనం చేశాడు. ఆరు ఇన్నింగ్స్లో ఐదు 50 ప్లస్ స్కోర్లు సాధించాడు.మరోవైపు.. విల్ యంగ్ పాక్తో తొలి వన్డేకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు. అతడి భార్య తమ తొలి సంతానానికి జన్మనివ్వనున్న నేపథ్యంలో రెండు, మూడో వన్డేలకు అతడు దూరంగా ఉండనున్నట్లు సెలక్టర్లు ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ కవర్గా రైస్ మరియూకు తొలిసారి పిలుపునిచ్చినట్లు తెలిపారు.పాకిస్తాన్ వన్డే సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టుమైకేల్ బ్రేస్వెల్ (కెప్టెన్), మహ్మద్ అబ్బాస్, ఆది అశోక్, విల్ యంగ్/రైస్ మరియూ, మార్క్ చాప్మన్, జేకబ్ డఫీ, మిచ్ హే, నిక్ కెల్లీ, డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్కే, బెన్ సియర్స్, నాథన్ స్మిత్.న్యూజిలాండ్తో వన్డేలకు పాకిస్తాన్ జట్టుమహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), సల్మాన్ అలీ ఆఘా (వైస్ కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, ఆకిఫ్ జావేద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, ఇమామ్ ఉల్ హక్, ఖుష్దిల్ షా, మహ్మద్ అలీ, ముహమ్మద్ వాసిం జూనియర్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, సూఫియాన్ ముఖీమ్, తయ్యాబ్ తాహిర్.చదవండి: NZ vs Pak: టిమ్ సీఫర్ట్ విధ్వంసం.. పాకిస్తాన్కు అవమానకర ఓటమి -
ఐపీఎల్లో నేడు (మార్చి 27) సన్రైజర్స్ మ్యాచ్.. 300 చూడగలమా..?
ఐపీఎల్-2025లో ఇవాళ (మార్చి 27) ఆసక్తికర సమరం జరుగనుంది. అరివీర భయంకరమైన ఫామ్లో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్.. తొలి మ్యాచ్లో ఢిల్లీ చేతిలో ఊహించని పరాజయాన్ని ఎదుర్కొన్న లక్నో సూపర్ జెయింట్స్ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ హోం గ్రౌండ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది.ఈ మ్యాచ్ కోసం సన్రైజర్స్ అభిమానులు కళ్లకు వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. వై నాట్ 300 అని టార్గెట్ పెట్టుకున్న తమ జట్టు ఈ మ్యాచ్లో తప్పక టార్గెట్ను రీచ్ అవుతుందని గంపెడాశలు పెట్టుకున్నారు. సన్రైజర్స్ ఈ సీజన్లో తమ తొలి మ్యాచ్లోనే టార్గెట్ 300ను దాదాపుగా రీచ్ అయినంత పని చేసింది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఆరెంజ్ ఆర్మీ 286 పరుగులు చేసింది.తొలి మ్యాచ్లో మిస్ అయిన టార్గెట్ 300ను నేటి మ్యాచ్లో తప్పక రీచ్ అవ్వాలని ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు కూడా పట్టుదలగా ఉన్నారు. ఐపీఎల్లో ఇప్పటివరకు ఏ జట్టు 300 పరుగులు చేయలేదు. ఐపీఎల్లో టాప్-3 అత్యధిక స్కోర్లు (287, 286, 277) సన్రైజర్స్ ఖాతాలోనే ఉన్నాయి. ఈ సీజన్లో సన్రైజర్స్ తప్పక 300 మార్కును తాకుతుందని క్రికెట్ పండితులు జోస్యం చెబుతున్నారు. దీని కోసమే సన్రైజర్స్ ఆడే ప్రతి మ్యాచ్ను అభిమానులు ఫాలో అవుతున్నారు.నేడు మ్యాచ్ జరుగబోయే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం పిచ్ బ్యాటర్లకు స్వర్గధామం. ప్రస్తుతం సన్రైజర్స్ ఆటగాళ్లు ఉన్న ఫామ్ను బట్టి చూస్తే.. నేటి మ్యాచ్లో మరోసారి పరుగుల వరద పారడం ఖాయమని తెలుస్తుంది. నాలుగు రోజుల క్రితం ఇక్కడ జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ 286 పరుగులు చేయగా.. ఛేదనలో రాయల్స్ కూడా ఏమాత్రం తగ్గకుండా 242 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో రాయల్స్ 44 పరుగుల తేడాతో ఓడినా అద్భుతంగా పోరాడింది.రాయల్స్ మ్యాచ్తో సన్రైజర్స్ తరఫున అరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్.. విధ్వంసకర సెంచరీతో విరుచుకుపడ్డాడు. 47 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 106 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో మిగతా సన్రైజర్స్ ఆటగాళ్లు కూడా 200పైగా స్ట్రయిక్రేట్తో పరుగులు సాధించారు. హెడ్ అర్ద సెంచరీ చేశాడు. అభిషేక్, క్లాసెన్ తమదైన శైలిలో ఉన్న కాసేపు విధ్వంసం సృష్టించారు. నితీశ్ రెడ్డి కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.ఐపీఎల్లో సన్రైజర్స్, లక్నో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడాయి. ఇందులో లక్నో మూడు గెలువగా.. సన్రైజర్స్ కేవలం ఒకే మ్యాచ్లో విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య చివరిగా జరిగిన మ్యాచ్లో సన్రైజర్సే విజయం సాధించింది. గత సీజన్లో జరిగిన ఈ మ్యాచ్లో లక్నో నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని సన్రైజర్స్ తొలి అర్ద భాగంలోనే ఛేదించి, 10 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఈ సీజన్లో సన్రైజర్స్, లక్నో రెండూ బలంగా కనిపిస్తున్నాయి. ఇరు జట్లలో విధ్వంసకర వీరులున్నారు. సన్రైజర్స్లో అభిషేక్, హెడ్, ఇషాన్, క్లాసెన్, నితీశ్ ఉంటే.. లక్నోలో మిచెల్ మార్ష్, పూరన్, మార్క్రమ్, మిల్లర్, పంత్ ఉన్నారు. ఈ సీజన్ తొలి మ్యాచ్లో ఓడినా లక్నో బ్యాటింగ్లో అదరగొట్టింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో మార్ష్, పూరన్ సుడిగాలి అర్ద శతకాలతో విరుచుకుపడ్డారు. ఈ మ్యాచ్లో లక్నో బౌలర్లు కూడా రాణించారు. అయితే ప్రత్యర్ధి ఆటగాళ్లు అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్ లక్నో చేతుల్లో నుంచి మ్యాచ్ను లాగేసుకున్నారు. గత మ్యాచ్తో పోలిస్తే నేటి మ్యాచ్లో లక్నో బౌలింగ్ మరింత బలపడనుంది. గాయం కారణంగా తొలి మ్యాచ్కు దూరంగా ఉన్న ఆవేశ్ ఖాన్ నేటి మ్యాచ్లో బరిలోకి దిగవచ్చు.తుది జట్లు (అంచనా)..సన్రైజర్స్: అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ , అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, ఆడమ్ జంపా, మహమ్మద్ షమీ, సిమర్జీత్ సింగ్లక్నో: ఐడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, శార్దూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, దిగ్వేష్ రాఠీ, అవేష్ ఖాన్, మణిమారన్ సిద్దార్థ్ -
RR VS KKR: అంతా డికాకే చేశాడు.. తప్పులు ఒప్పుకుంటాం.. రిపీట్ చేయం: రియాన్ పరాగ్
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా కేకేఆర్తో నిన్న (మార్చి 26) జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో ఘెర పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్లో రాయల్స్ అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమైంది. తొలుత బ్యాటింగ్లో చేతులెత్తేసింది. ఆతర్వాత స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో ఏ మాత్రం ప్రతిఘటించలేకపోయింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన రాయల్స్ అతి కష్టం మీద 151 పరుగులు (9 వికెట్ల నష్టానికి) చేయగలిగింది. బౌలర్లకు అనుకూలంగా ఉన్న పిచ్పై కేకేఆర్ బౌలర్లు చెలరేగిపోయారు. మొయిన్ అలీ (4-0-23-2), వరుణ్ చక్రవర్తి (4-0-17-2), హర్షిత్ రాణా (4-0-36-2), వైభవ్ అరోరా (4-0-33-2) అద్భుతంగా బౌలింగ్ చేసి రాయల్స్ బ్యాటర్లను కట్టడి చేశారు.రాయల్స్ బ్యాటర్లలో ధృవ్ జురెల్ (33) టాప్ స్కోరర్గా నిలువగా.. జైస్వాల్ 29, రియాన్ పరాగ్ 25, సంజూ శాంసన్ 13, జోఫ్రా ఆర్చర్ 16 పరుగులు చేశారు. ఇన్నింగ్స్ చివర్లో ఆర్చర్ 2 సిక్సర్లు బాదడంతో రాయల్స్ 150 పరుగుల మార్కును తాకగలిగింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన కేకేఆర్ను క్వింటన్ డికాక్ ఒంటిచేత్తో గెలిపించాడు. డికాక్ 61 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 97 పరుగులు (నాటౌట్) చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. డికాక్ మరో ఎండ్ నుంచి రహానే (18), రఘువంశీ (22 నాటౌట్) సహకారం తీసుకుని మ్యాచ్ను ముగించాడు. డికాక్ రెచ్చిపోవడంతో మ్యాచ్పై పట్టు సాధించేందుకు రాయల్స్ ఏ ఒక్క అవకాశం రాలేదు. డికాక్ బాధ్యతాయుతంగా ఆడి రాయల్స్ నుంచి మ్యాచ్ను లాగేసుకున్నాడు. రాయల్స్ కెప్టెన్ ఏడుగురు బౌలర్లను ప్రయోగించినా ఎలాంటి ఉపయోగం లేదు. ఒక్కరు కూడా డికాక్ను కంట్రోల్ చేయలేకపోయారు.వాస్తవానికి రాయల్స్ బ్యాటింగ్ చేసే సమయంలోనే మ్యాచ్ను కోల్పోయింది. ఆ జట్టు కనీసం 170-180 పరుగులు చేసుండాల్సింది. కేకేఆర్ బౌలర్లలో మొయిన్ అలీ, వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ చేశారు. కేకేఆర్ గెలుపుకు వీరు ఆదిలోనే బీజం వేశారు.మ్యాచ్ అనంతరం లూజింగ్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. మేము 170 పరుగులు స్కోర్ చేసుంటే బాగుండేది. కానీ అలా జరగలేదు. వ్యక్తిగతంగా నాకు ఈ వికెట్ (గౌహతి పిచ్) గురించి తెలుసు కాబట్టి కాస్త తొందరపడ్డాను. వేగంగా పరుగులు సాధించే క్రమంలో నేను చేయాల్సిన దాని కంటే 20 పరుగులు తక్కువ చేశాను. నేను అదనంగా 20 పరుగులు చేసుంటే బౌలర్లకు ఫైటింగ్ చేసే అవకాశం ఉండేది.డికాక్ అద్భుతంగా ఆడాడు. అతన్ని త్వరగా ఔట్ చేయాలన్నదే మా ప్రణాళిక. కానీ అది జరగలేదు. మిడిల్ ఓవర్లలోనైనా మ్యాచ్ను మా నియంత్రణలోకి తెచ్చుకుందామనుకున్నాము. అదీ జరగలేదు. డికాక్ మాకు ఏ ఒక్క అవకాశం ఇవ్వకుండా ఒంటిచేత్తో మ్యాచ్నులాగేసుకున్నాడు. 3వ స్థానంలో బ్యాటింగ్ చేయడంపై స్పందిస్తూ.. గత సీజన్లో జట్టు నన్ను 4వ స్థానంలో బ్యాటింగ్ చేయాలని కోరింది. అలాగే చేశాను. ఈ సీజన్లో మేనేజ్మెంట్ నన్ను 3వ స్థానంలో బ్యాటింగ్ చేయమంది. జట్టు అవసరాల కోసం ఎక్కడ బ్యాటింగ్ చేసేందుకైనా నేను సిద్దంగా ఉండాలి.గత సీజన్తో పోలిస్తే ఈ సీజన్లో మాకు యువ జట్టు ఉంది. మేము చిన్న దశల్లో బాగా రాణిస్తున్నాము. దీన్నే మ్యాచ్ మొత్తంలో కొనసాగిస్తే ఫలితాలు మాకు అనుకూలంగా వస్తాయి. ఈ పరాజయాల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటాము. మా తప్పులను ఒప్పుకుంటాము. వాటిని మళ్ళీ పునరావృతం చేయకుండా చూసుకుంటాము. కొత్త ఆలోచనలతో చెన్నైతో మ్యాచ్లో బరిలో నిలుస్తాము.కాగా, రియాన్ సారథ్యంలో రాయల్స్ వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. రెగ్యులర్ కెప్టెన్ సంజూ శాంసన్ పూర్తిగా ఫిట్గా లేకపోవడంతో రియాన్ను తాత్కాలిక కెప్టెన్గా నియమించారు. కెప్టెన్గా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రియాన్ను ఇంకో అవకాశం ఉంది. నాలుగో మ్యాచ్ నుంచి శాంసన్ తిరిగి కెప్టెన్సీ పగ్గాలు చేపడతాడు. రాయల్స్ మార్చి 30న ఇదే గౌహతిలో సీఎస్కేతో తలపడనుంది. -
RR VS KKR: మొయిన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.. క్రెడిట్ బౌలర్లకే దక్కుతుంది: రహానే
ధనాధన్ బ్యాటింగ్ విన్యాసాలతో తొలి ఐదు రోజులు జోరుగా సాగిన ఐపీఎల్ 2025 ఆరో రోజు చప్పబడింది. గౌహతి వేదికగా కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ మధ్య నిన్న (మార్చి 26) జరిగిన మ్యాచ్ పేలగా సాగింది. ఛేదనలో కేకేఆర్ ఓపెనర్ డికాక్ (61 బంతుల్లో 97 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) భారీ ఇన్నింగ్స్ ఆడినా మ్యాచ్లో అంత మజా రాలేదు. మ్యాచ్ ఏకపక్షంగా సాగడంతో అభిమానులు బోర్ ఫీలయ్యారు. మ్యాచ్ ఇంత చప్పగా సాగడానికి పిచ్తో పాటు గౌహతిలో వాతావరణం కారణం. పిచ్ నుండి బ్యాటర్లకు పెద్దగా సహకారం లభించలేదు. రెండో ఇన్నింగ్స్లో మంచు ప్రభావం చూపింది. మొత్తంగా రాయల్స్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ సునాయాసంగా ఛేదించింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్.. కేకేఆర్ బౌలర్లు రెచ్చిపోవడంతో అతి కష్టం మీద 151 పరుగులు చేసింది (9 వికెట్ల నష్టానికి). మొయిన్ అలీ (4-0-23-2), వరుణ్ చక్రవర్తి (4-0-17-2), హర్షిత్ రాణా (4-0-36-2), వైభవ్ అరోరా (4-0-33-2) రాయల్స్ బ్యాటర్లను బాగా కట్టడి చేశారు. స్పిన్నర్లు మొయిన్ అలీ, వరుణ్ చక్రవర్తి ఆదిలోనే వికెట్లు తీసి రాయల్స్పై ఒత్తిడి తెచ్చారు. ఓ దశలో రాయల్స్ కనీసం 120 పరుగులైనా చేస్తుందా అనిపించింది. ఎలాగో ముక్కిమూలిగి చివరికి 150 పరుగుల మార్కును తాకగలిగింది. రాయల్స్ బ్యాటర్లలో ధృవ్ జురెల్ (33) టాప్ స్కోరర్గా కాగా.. జైస్వాల్ 29, రియాన్ పరాగ్ 25, సంజూ శాంసన్ 13, జోఫ్రా ఆర్చర్ 16 పరుగులు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో కేకేఆర్ కూడా నిదానంగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. పవర్ ప్లేలో ఆ జట్టు 41 పరుగులు మాత్రమే చేసిన ఓపెనర్గా వచ్చిన మొయిన్ అలీ (12 బంతుల్లో 5) వికెట్ కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ డికాక్ బాధ్యతాయుతంగా ఆడి, కెప్టెన్ రహానే (18), రఘువంశీ (22 నాటౌట్) సహకారంతో కేకేఆర్ను విజయతీరాలకు చేర్చాడు. కేకేఆర్ మరో 15 బంతులు మిగిలుండగానే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుని 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. సెకెండ్ ఇన్నింగ్స్లో (కేకేఆర్ బ్యాటింగ్ చేస్తుండగా) మంచు ప్రభావం కారణంగా రాయల్స్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఆ జట్టు తరఫున హసరంగ ఒక్కడే వికెట్ (రహానే) తీయగలిగాడు. మొయిన్ అలీ రనౌటయ్యాడు.మ్యాచ్ అనంతరం విన్నింగ్ కెప్టెన్ అజింక్య రహానే మాట్లాడుతూ ఇలా అన్నాడు. తొలి ఆరు ఓవర్లలో మేము బాగా బౌలింగ్ చేసాము. మిడిల్ ఓవర్లు కూడా కీలకమైనవే. స్పిన్నర్లు పరిస్థితులను నియంత్రించిన విధానం బాగుంది. మొయిన్ తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అతను చాలా బాగా బౌలింగ్ చేశాడు. ఆటగాళ్లు నిర్భయంగా ఆడాలని కోరుకునే ఫార్మాట్ ఇది. వారికి స్వేచ్ఛ ఇవ్వాలనుకుంటున్నాము.క్రెడిట్ మా బౌలింగ్ యూనిట్కు దక్కుతుంది. వారు ప్రతి బంతికి వికెట్ తీయాలనే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మొయిన్. మొయిన్ ఓ నాణ్యమైన ఆల్రౌండర్. గతంలో కూడా అతను ఓపెనింగ్ చేశాడు. బ్యాట్తో అతను ఆశించిన సఫలత సాధించలేకపోయినా.. బంతితో రాణించిన విధానం పట్ల సంతోషంగా ఉంది. ప్రతి మ్యాచ్లో ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాగా, డిఫెండింగ్ ఛాంపియన్ అయిన కేకేఆర్ సీజన్ ఆరంభ మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో భంగపడ్డ విషయం తెలిసిందే. కేకేఆర్ నెక్స్ట్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ను ఢీకొటుంది. ఈ మ్యాచ్ మార్చి 31న వాంఖడేలో జరుగనుంది. -
త్రిష ఆల్రౌండ్ షో
డెహ్రాడూన్: జాతీయ సీనియర్ చాలెంజర్ ట్రోఫీలో తెలంగాణ ఆల్రౌండర్ గొంగడి త్రిష (137 బంతుల్లో 93; 15 ఫోర్లు, 1 సిక్స్) సత్తా చాటింది. టీమ్ ‘డి’కి ప్రాతినిధ్యం వహిస్తున్న త్రిష... టీమ్ ‘సి’తో జరుగుతున్న మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఎర్రబంతితో మూడు రోజుల పాటు జరుగుతున్న ఈ మ్యాచ్లో బుధవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ ‘డి’ 99 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. త్రిష త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... ధారా గుజ్జర్ (212 బంతుల్లో 103 బ్యాటింగ్; 15 ఫోర్లు) అజేయ శతకంతో చెలరేగింది. కెప్టెన్ స్నేహ్ రాణా (28; 3 ఫోర్లు), నందిని (32; 5 ఫోర్లు), అమన్జ్యోత్ కౌర్ (34 బంతుల్లో 39 బ్యాటింగ్; 6 ఫోర్లు) రాణించారు. అంతకుముందు టీమ్ ‘సి’ 405/9 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. హసబ్నిస్ (185 బంతుల్లో 169; 20 ఫోర్లు, 6 సిక్స్లు), షఫాలీ వర్మ (104 బంతుల్లో 108; 19 ఫోర్లు) సెంచరీలతో కదంతొక్కారు. టీమ్ ‘డి’ బౌలరల్లో త్రిష, కాశ్వీ గౌతమ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. నేడు ఆటకు ఆఖరి రోజు కాగా... ప్రస్తుతం చేతిలో 5 వికెట్లు ఉన్న టీమ్ ‘డి’... ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 83 పరుగులు వెనుకబడి ఉంది. ధారా గుజ్జర్తో పాటు అమన్జ్యోత్ కౌర్ క్రీజులో ఉంది. -
తొలిసారి పసిడి మెరుపులు
పాట్నా: సెపక్తక్రా ప్రపంచకప్లో భారత జట్టు చాంపియన్గా నిలిచింది. బీహార్ రాజధాని పట్నా వేదికగా జరిగిన వరల్డ్కప్లో పురుషుల రెగూ ఈవెంట్లో భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది. సెపక్తక్రా ప్రపంచకప్లో భారత్కు ఇదే తొలి పసిడి పతకంకాగా... స్వదేశంలో జరిగిన ఈ టోర్నీలో మన ప్లేయర్లు మొత్తం 7 పతకాలు సాధించారు. పురుషుల ‘రెగూ’ ఫైనల్లో భారత్ 11–15, 15–11, 17–14 తేడాతో జపాన్పై విజయం సాధించి బంగారు పతకం కైవసం చేసుకుంది. తొలి సెట్లో ఓడి వెనుకబడిన భారత జట్టు ఆ తర్వాత పుంజుకొని వరుసగా రెండు సెట్లు నెగ్గి విజేతగా నిలిచింది. దేశంలో పెద్దగా ఆదరణ లేని ఈ క్రీడలో భారత జట్టు చక్కటి ప్రదర్శన కనబర్చింది. కేవలం స్వర్ణంతో సరిపెట్టుకోకుండా... ఈ వరల్డ్కప్లో మరో 6 పతకాలు కూడా గెలుచుకుంది. మహిళల డబుల్స్ విభాగంలో రజతం... పురుషుల డబుల్స్, మహిళల రెగూ, మిక్స్డ్ క్వాడ్, మహిళల క్వాడ్, పురుషుల క్వాడ్ విభాగాల్లో కాంస్య పతకాలు నెగ్గింది. ‘స్వదేశంలో జరిగిన సెపక్తక్రా ప్రపంచకప్లో చక్కటి ప్రదర్శన కనబర్చిన బృందానికి అభినందనలు. రెగూ జట్టు స్వర్ణంతో పాటు మొత్తం 7 పతకాలు సాధించి భవిష్యత్తుపై భరోసా పెంచింది’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. -
అటు అర్జెంటీనా ఇటు ఇరాన్
బ్యూనస్ ఎయిర్స్: తమ కెప్టెన్... దిగ్గజ ప్లేయర్ లయోనల్ మెస్సీ లేకపోయినా... అర్జెంటీనా జోరు తగ్గించలేదు. ఐదుసార్లు విశ్వవిజేత బ్రెజిల్ జట్టును అలవోకగా ఓడించిన అర్జెంటీనా దర్జాగా ప్రపంచకప్ టోర్నమెంట్కు 19వసారి అర్హత సాధించింది. దక్షిణ అమెరికా జోన్ నుంచి ప్రపంచకప్ టోర్నీకి ఆరు జట్లకు నేరుగా అర్హత పొందే అవకాశం ఉంది. తొలి బెర్త్ను డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా జట్టు సొంతం చేసుకుంది. వాస్తవానికి బ్రెజిల్ జట్టుతో మ్యాచ్కు ముందే అర్జెంటీనాకు వరల్డ్కప్ బెర్త్ ఖరారైంది. ఉరుగ్వే జట్టుతో మ్యాచ్ను బొలీవియా జట్టు 0–0తో ‘డ్రా’ చేసుకోవడంతో అర్జెంటీనాకు ప్రపంచకప్ బెర్త్ లభించింది. ఫలితంతో సంబంధం లేకుండా వరల్డ్కప్ బెర్త్ దక్కడంతో... బ్రెజిల్తో జరిగిన పోరులో అర్జెంటీనా అదరగొట్టింది. మెస్సీ గైర్హాజరీలో నికోలస్ ఒటామెండీ సారథ్యంలో బరిలోకి దిగిన అర్జెంటీనా 4–1 గోల్స్ తేడాతో బ్రెజిల్ను చిత్తుగా ఓడించింది. అర్జెంటీనా తరఫున జూలియన్ అల్వారెజ్ (4వ నిమిషంలో), ఎంజో ఫెర్నాండెజ్ (12వ నిమిషంలో), అలెక్సిస్ మాక్ అలిస్టర్ (37వ నిమిషంలో), గిలియానో సిమోన్ (71వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. బ్రెజిల్ జట్టుకు మాథ్యూస్ కున్హా (26వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. దక్షిణ అమెరికా జోన్ నుంచి మొత్తం 10 జట్లు (అర్జెంటీనా, ఈక్వెడార్, ఉరుగ్వే, బ్రెజిల్, పరాగ్వే, కొలంబియా, వెనిజులా, బొలీవియా, పెరూ, చిలీ) డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో పోటీపడుతున్నాయి. ఒక్కో జట్టు మిగతా జట్లతో రెండేసి మ్యాచ్లు ఆడుతుంది.ఇప్పటి వరకు 14 రౌండ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం అర్జెంటీనా 31 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరో ఐదు బెర్త్లు ఖరారు కావాల్సి ఉన్నాయి. ఏడో స్థానంలో నిలిచిన జట్టుకు ‘ప్లే ఆఫ్’ మ్యాచ్ ద్వారా ప్రపంచకప్కు అర్హత పొందే అవకాశం లభిస్తుంది. ఇరాన్ వరుసగా నాలుగోసారి... మరోవైపు ఆసియా జోన్ నుంచి ఇరాన్ జట్టు వరుసగా నాలుగోసారి ప్రపంచకప్ టోర్నమెంట్కు అర్హత సాధించింది. ఉజ్బెకిస్తాన్ జట్టుతో జరిగిన మూడో రౌండ్ గ్రూప్ ‘ఎ’ మ్యాచ్ను ఇరాన్ జట్టు 2–2తో ‘డ్రా’ చేసుకుంది. 1978లో తొలిసారి ప్రపంచకప్లో ఆడిన ఇరాన్ ఆ తర్వాత 1998లో రెండోసారి ఈ మెగా ఈవెంట్లో పోటీపడింది. 2006లో మూడోసారి ప్రపంచకప్లో ఆడిన ఇరాన్ 2010లో జరిగిన ప్రపంచకప్కు అర్హత సాధించలేదు. 2014లో నాలుగోసారి వరల్డ్కప్లో బరిలోకి దిగిన ఇరాన్ ఆ తర్వాత 2018లో, 2022లోనూ పోటీపడింది. ఈసారి మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే ఓవరాల్గా ఏడోసారి ప్రపంచకప్ బెర్త్ను ఖరారు చేసుకుంది. 2026 ప్రపంచకప్ టోర్నీకి అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. తొలిసారి 48 జట్లు ప్రపంచకప్లో ఆడనున్నాయి. ఆసియా నుంచి 8 జట్లు నేరుగా అర్హత సాధిస్తాయి. ప్లే ఆఫ్ టోర్నీ ద్వారా మరో జట్టుకు అర్హత పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మూడు (అమెరికా, కెనడా, మెక్సికో) ఆతిథ్య దేశాలతోపాటు జపాన్, ఇరాన్, న్యూజిలాండ్, అర్జెంటీనా జట్లు వరల్డ్కప్కు అర్హత పొందాయి. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీతో క్వాలిఫయింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.19 ప్రపంచకప్ టోర్నీకి ఇప్పటి వరకు అర్జెంటీనా 19 సార్లు అర్హత సాధించింది. మూడుసార్లు (1978, 1986, 2022) విజేతగా నిలిచింది. మరో మూడుసార్లు (1930, 1990, 2014) ఫైనల్లో ఓడి రన్నరప్తో సంతృప్తి పడింది. ఐదుసార్లు క్వార్టర్ ఫైనల్లో... నాలుగుసార్లు గ్రూప్ దశలో... మూడుసార్లు ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. -
భారత గడ్డపై మళ్లీ మెస్సీ... ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనున్న అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం
న్యూఢిల్లీ: ఫుట్బాల్ ‘ఆల్టైమ్ గ్రేట్’లలో ఒకడైన లయోనల్ మెస్సీ ఆటను మరోసారి ప్రత్యక్షంగా చూసే అవకాశం భారత అభిమానులకు కలగనుంది. 14 సంవత్సరాల తర్వాత అతను మళ్లీ భారత్లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఏడాది అక్టోబరులో కేరళలోని కొచి్చలో మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా జట్టు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనుంది. దీనిపై చాలా కాలం క్రితమే కేరళ క్రీడాశాఖ మంత్రి అబ్దుర్రహమాన్ ప్రకటన చేసినా... ఇప్పుడు దానికి అధికారిక ముద్ర పడింది. ప్రముఖ బ్యాంక్ ‘హెచ్ఎస్బీసీ’ ఈ పర్యటనలో అర్జెంటీనా టీమ్కు ప్రధాన స్పాన్సర్గా వ్యవహరిస్తోంది. భారత్లో పుట్బాల్ను ప్రమోట్ చేసేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడిస్తూ అర్జెంటీనా రాకను హెచ్ఎస్బీసీ హెడ్ సందీప్ బత్రా ఖరారు చేశారు. 2025లో భారత్తో పాటు సింగపూర్లో కూడా మ్యాచ్లు ఆడేందుకు అర్జెంటీనా ఫుట్బాల్ సంఘం ‘హెచ్ఎస్బీసీ’తో ఒప్పందం చేసుకుంది. 2011లో వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్ ఆడేందుకు మెస్సీ మొదటిసారి భారత్కు వచ్చాడు. కోల్కతాలో జరిగిన ఈ మ్యాచ్లో వెనిజులాతో తలపడిన అర్జెంటీనా 1–0తో విజయం సాధించింది. -
KKR Vs RR: డికాక్ ధమాకా
ఐపీఎల్లో పరుగుల వరద పారిన రెండు వరుస మ్యాచ్ల తర్వాత ఆ జోరుకు కాస్త విరామం. పొడిగా, బ్యాటింగ్కు అనుకూలంగా లేని పిచ్పై సాగిన మ్యాచ్లో సీజన్లో తక్కువ స్కోరు నమోదు కాగా, డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) పైచేయి సాధించి తొలి విజయాన్ని నమోదు చేసింది. వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ కట్టుదిట్టమైన స్పిన్తో ముందుగా రాజస్తాన్ను నైట్రైడర్స్ తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. ఆ తర్వాత డికాక్ దూకుడైన బ్యాటింగ్తో లక్ష్యఛేదనను సునాయాసం చేసేశాడు. 15 బంతులు మిగిలి ఉండగానే కేకేఆర్ విజయాన్నందుకుంది. అన్ని రంగాల్లో విఫలమైన రాజస్తాన్ రాయల్స్ తమ ‘హోం గ్రౌండ్’లో పేలవ ప్రదర్శనతో వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. గువహాటి: డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ ఈ ఐపీఎల్ సీజన్లో గెలుపు బోణీ చేసింది. గత మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిన నైట్రైడర్స్ బుధవారం జరిగిన పోరులో 8 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ధ్రువ్ జురేల్ (28 బంతుల్లో 33; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా, యశస్వి జైస్వాల్ (24 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్లు), తాత్కాలిక కెప్టెన్ రియాన్ పరాగ్ (15 బంతుల్లో 25; 3 సిక్స్లు) ఫర్వాలేదనిపించారు.స్పిన్కు అనుకూలించిన పిచ్పై వరుణ్, మొయిన్ అలీ 8 ఓవర్లలో 40 పరుగులకే 4 వికెట్లు తీసి రాయల్స్ను దెబ్బ కొట్టారు. వైభవ్ అరోరా, హర్షిత్ కూడా చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం కోల్కతా 17.3 ఓవర్లలో 2 వికెట్లకు 153 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ క్వింటన్ డికాక్ (61 బంతుల్లో 97 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్స్లు) త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. సునీల్ నరైన్ అనారోగ్యం కారణంగా మ్యాచ్కు దూరం కావడంతో మొయిన్ అలీకి కోల్కతా చోటు కల్పించగా, ఫారుఖీ స్థానంలో రాజస్తాన్ జట్టులోకి హసరంగ వచ్చాడు.సమష్టి వైఫల్యం... రాజస్తాన్ ఇన్నింగ్స్ ఆసాంతం ఒకే తరహాలో సాదాసీదాగా సాగింది. ఆశించిన స్థాయిలో దూకుడైన బ్యాటింగ్ లేకపోగా, ఒక్కటీ సరైన భాగస్వామ్యం రాలేదు. జైస్వాల్ ధాటిగానే మొదలు పెట్టినా... మరోవైపు సంజు సామ్సన్ (11 బంతుల్లో 13; 2 ఫోర్లు) ఎక్కువ సేపు నిలవలేదు. ‘లోకల్ బాయ్’ పరాగ్ తన తొలి 7 బంతుల్లో 2 సిక్సర్లు బాది అభిమానులను ఆకట్టుకున్నాడు. వరుణ్ ఓవర్లోనూ డీప్ మిడ్వికెట్ మీదుగా భారీ సిక్స్ బాదిన అతను...అదే ఓవర్లో మరో షాట్కు ప్రయత్నించి వెనుదిరగడంతో మైదానంలో నిశ్శబ్దం ఆవరించింది. ఆ తర్వాత హసరంగ (4)ను ముందుగా పంపిన ప్రయోగం ఫలితం ఇవ్వకపోగా, నితీశ్ రాణా (9 బంతుల్లో 8), శుభమ్ దూబే (12 బంతుల్లో 9; 1 ఫోర్) కూడా విఫలమయ్యారు. 67/1తో మెరుగైన స్థితిలో కనిపించిన రాజస్తాన్ 15 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయి 82/5కి చేరింది. దాంతో ‘ఇంపాక్ట్ సబ్’గా అదనపు బ్యాటర్ను శుభమ్ దూబే రూపంలో ఏడో స్థానంలో బరిలోకి దింపింది. అయితే ఒత్తిడిలో అతనూ ప్రభావం చూపలేకపోయాడు. ఈ దశలో జురేల్ కొన్ని చక్కటి షాట్లతో జట్టును ఆదుకున్నాడు. హర్షిత్ రాణా వరుస ఓవర్లలో అతను రెండేసి ఫోర్లు కొట్టాడు. అయితే హర్షిత్ తన తర్వాతి ఓవర్లో జురేల్, ప్రమాదకర బ్యాటర్ హెట్మైర్ (8 బంతుల్లో 7; 1 ఫోర్)లను వెనక్కి పంపించాడు. చివర్లో ఆర్చర్ (7 బంతుల్లో 16; 2 సిక్స్లు) కొట్టిన రెండు సిక్సర్లతో రాజస్తాన్ స్కోరు 150 పరుగులు దాటింది. డికాక్ మెరుపులు... ఛేదనలో డికాక్ ఆరంభం నుంచే ధాటిగా ఆడాడు. పవర్ప్లేలో జట్టు స్కోరు 40 పరుగులు కాగా, డికాక్ ఒక్కడే 4 ఫోర్లు, 2 సిక్స్లతో 34 పరుగులు సాధించాడు. మరోవైపు కేకేఆర్ తరఫున ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడిన మొయిన్ అలీ (5) రనౌట్ కావడంతో జట్టు మొదటి వికెట్ను కోల్పోయింది. కెప్టెన్ అజింక్య రహానే (15 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయినా, డికాక్ జోరుతో స్కోరు వేగంగా సాగిపోయింది. 35 బంతుల్లోనే డికాక్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అతనికి గెలుపు దిశగా అంగ్కృష్ రఘువంశీ (17 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు) సహకరించాడు. దూకుడు తగ్గించని డికాక్ శతకం దిశగా దూసుకుపోయాడు. చివరి 3 ఓవర్లలో నైట్రైడర్స్ విజయానికి 17 పరుగులు, డికాక్ సెంచరీకి 19 పరుగులు అవసరం కాగా, ఆర్చర్ ఓవర్లో డికాక్ ఒక ఫోర్, 2 సిక్స్లు బాదినా... చివరకు 97 వద్దే అతను ఆగిపోవాల్సి వచ్చింది. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) హర్షిత్ రాణా (బి) అలీ 29; సామ్సన్ (బి) అరోరా 13; పరాగ్ (సి) డికాక్ (బి) వరుణ్ 25; నితీశ్ రాణా (బి) అలీ 8; హసరంగ (సి) రహానే (బి) వరుణ్ 4; జురేల్ (బి) హర్షిత్ రాణా 33; శుభమ్ (సి) రసెల్ (బి) అరోరా 9; హెట్మైర్ (సి) రఘువంశీ (బి) హర్షిత్ రాణా 7; ఆర్చర్ (బి) జాన్సన్ 16; తీక్షణ (నాటౌట్) 1; తుషార్ దేశ్పాండే (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 151. వికెట్ల పతనం: 1–33, 2–67, 3–69, 4–76, 5–82, 6–110, 7–131, 8–138, 9–149. బౌలింగ్: స్పెన్సర్ జాన్సన్ 4–0–42–1, వైభవ్ అరోరా 4–0–33–2, హర్షిత్ రాణా 4–0–36–2, మొయిన్ అలీ 4–0–23–2, వరుణ్ 4–0–17–2. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: మొయిన్ అలీ (రనౌట్) 5; డికాక్ (నాటౌట్) 97; రహానే (సి) దేశ్పాండే (బి) హసరంగ 18; రఘువంశీ (నాటౌట్) 22; ఎక్స్ట్రాలు 11; మొత్తం (17.3 ఓవర్లలో 2 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1–41, 2–70. బౌలింగ్: జోఫ్రా ఆర్చర్ 2.3–0–33–0, మహీశ్ తీక్షణ 4–0–32–0, రియాన్ పరాగ్ 4–0–25–0, సందీప్ శర్మ 2–0–11–0, హసరంగ 3–0–34–1, నితీశ్ రాణా 1–0–9–0, తుషార్ 1–0–7–0.ఐపీఎల్లో నేడుహైదరాబాద్ X లక్నోవేదిక: హైదరాబాద్రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
KKR Vs RR: డికాక్ వన్ మ్యాన్ షో.. రాజస్తాన్ను చిత్తు చేసిన కేకేఆర్
ఐపీఎల్-2025లో కోల్కతా నైట్రైడర్స్ తొలి విజయం సాధించింది. గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో కేకేఆర్ గెలుపొందింది. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్.. 17.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. కోల్కతా విజయంలో క్వింటన్ డికాక్ కీలక పాత్ర పోషించాడు.ఓపెనర్గా బరిలోకి దిగిన డికాక్ ఆఖరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్ను ముగించాడు. 60 బంతులు ఎదుర్కొన్న డికాక్.. 8ఫోర్లు, 5 సిక్స్లతో 97 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు రఘువంశీ(22), రహానే(18) పరుగులతో రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో హసరంగా ఒక్కడే ఓ వికెట్ సాధించగా.. మరో వికెట్ రనౌట్ రూపంలో వచ్చింది.చెతులేత్తేసిన బ్యాటర్లు..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. కేకేఆర్ స్పిన్నర్ల దాటికి రాజస్తాన్ బ్యాటర్లు విల్లవిల్లాడారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ ఆరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ తలా రెండు వికెట్లు సాధించారు. రాజస్తాన్ బ్యాటర్లలో ధ్రువ్ జురెల్(33) టాప్ స్కోరర్గా నిలవగా.. యశస్వి జైశ్వాల్(29), రియాన్ పరాగ్(25) పరుగులతో రాణించారు. కాగా రాజస్తాన్కు ఇది వరుసగా మూడో ఓటమి కావడం గమనార్హం.చదవండి: IPL 2025: డికాక్ మాస్టర్ మైండ్.. హెల్మెట్ను తీసి మరి! వీడియో వైరల్ -
డికాక్ మాస్టర్ మైండ్.. హెల్మెట్ను తీసి మరి! వీడియో వైరల్
ఐపీఎల్-2025లో భాగంగా గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ సంచలన క్యాచ్తో మెరిశాడు. అద్భుతమైన క్యాచ్తో రాజస్తాన్ స్టాండ్ ఇన్ కెప్టెన్ రియాన్ పరాగ్ను డికాక్ పెవిలియన్కు పంపాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్ 8 ఓవర్ వేసిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో మూడో బంతిని పరాగ్ భారీ సిక్సర్గా మలిచాడు. ఆ తర్వాత బంతిని పరాగ్ డిఫెన్స్ ఆడాడు. ఈ క్రమంలో ఐదో బంతిని వరుణ్ చక్రవర్తి.. పరాగ్కు ఔట్సైడ్ ఆఫ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని పరాగ్ మరో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి టాప్ ఎడ్జ్ తీసుకుని చాలా ఎత్తుగా గాల్లోకి లేచింది. ఈ క్రమంలో వికెట్ల వెనక ఉన్న డికాక్ తన కీపింగ్ స్కిల్స్ను ప్రదర్శించాడు. బంతి గాల్లోకి లేచిన వెంటనే డికాక్ క్యాచ్ కాల్ ఇచ్చాడు. క్లియర్ వ్యూ కోసం హెల్మెట్ను తీసి మరి బంతిని అద్భుతంగా అందుకున్నాడు. వెంటనే సహచర ఆటగాళ్లు అతడి వద్దకు వచ్చి అభినంధించారు. దీంతో 25 పరుగులు చేసిన పరాగ్ నిరాశతో పెవిలియన్కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో ధ్రువ్ జురెల్(33) టాప్ స్కోరర్గా నిలవగా.. యశస్వి జైశ్వాల్(29), రియాన్ పరాగ్(25) పరుగులతో రాణించారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ ఆరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ తలా రెండు వికెట్లు సాధించారు. Spinners casting their magic 🪄First Varun Chakravarthy and then Moeen Ali 💜Updates ▶ https://t.co/lGpYvw7zTj#TATAIPL | #RRvKKR | @KKRiders pic.twitter.com/EfWc2iLVIx— IndianPremierLeague (@IPL) March 26, 2025 -
రీ ఎంట్రీ ఇవ్వనున్న అలిస్టర్ కుక్.. !
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, లెజెండరీ క్రికెటర్ అలిస్టర్ కుక్.. ఏడేళ్ల తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్-2025లో ఇంగ్లండ్ తరపున కుక్ ఆడనున్నాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ ఛాంపియన్స్ కెప్టెన్ ఇయోన్ మోర్గాన్ ధ్రువీకరించాడు."అలిస్టర్ తిరిగి జట్టులోకి రావడం చాలా సంతోషంగా ఉంది. మేము అతడితో మరిన్ని కొత్త జ్ఞాపకాలను సృష్టించబోతున్నాము" అని మోర్గాన్ పేర్కొన్నాడు. అదేవిధంగా కుక్ మాట్లాడుతూ.. "నా దేశం తరపున తిరిగి ఆడే అవకాశం చాలా ఆనందంగా ఉంది. ఇయోన్ మెర్గాన్, ఇతర ఇంగ్లీష్ క్రికెటర్లతో కలిసి ఆడేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.2018లో భారత్తో జరిగిన టెస్ట్ మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్కు విడ్కోలు పలికిన కుక్.. తన పేరును ఇంగ్లండ్ క్రికెట్లో సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. తన ఆడిన చివరి ఇన్నింగ్స్లో కూడా కుక్ సెంచరీ సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కుక్ తన కెరీర్ను ముగించాడు. అలిస్టర్ కుక్ ఇంగ్లండ్ తరఫున 161 టెస్టులు ఆడాడు. అందులో 33 సెంచరీలతో సహా 12,472 పరుగులు చేశాడు. కుక్ తన అద్భుతమైన క్రికెట్ కెరీర్లో.. అతను 92 వన్డేలు 4 టీ20లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా కుక్ 2023 వరకు ఎసెక్స్ తరపున కౌంటీ క్రికెట్ ఆడాడు.వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ రెండో సీజన్ ఈ ఏడాది జూలైలో ప్రారంభం కానుంది. ఈ లీగ్లో యువరాజ్ సింగ్ నేతృత్వంలోని భారత్ డిఫెండింగ్ ఛాంపియన్స్గా బరిలోకి దిగనుంది. అయితే ఇండియా ఛాంపియన్స్ మేనేజ్మెంట్ కెప్టెన్గా యువీని ఎంపిక చేసినప్పటికి.. జట్టును ఇంకా ఖారారు చేయలేదు.గత సీజన్లో పాల్గొన్న భారత ఛాంపియన్స్ జట్టు..అంబటి రాయుడు, గురుకీరత్ మాన్, సౌరభ్ తివారి, సురేశ్ రైనా, యూసఫ్ పఠాన్, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, పవన్ నేగి, రాబిన్ ఉతప్ప, నమన్ ఓఝా, అనురీత్ సింగ్, ధవల్ కులకర్ణి, హర్భజన్ సింగ్, రాహుల్ శుక్లా, రాహుల్ శర్మ, ఆర్పీ సింగ్, వినయ్ కుమార్చదవండి: IPL 2025: రాసిపెట్టుకోండి.. ఐపీఎల్లో 300 ప్లస్ రన్స్ కొట్టేది ఆజట్టే! ఎప్పుడంటే? -
ఎస్ఆర్హెచ్తో మ్యాచ్.. ఢిల్లీ క్యాపిటల్స్కు గుడ్ న్యూస్
ఐపీఎల్-2025 సీజన్ తమ తొలి మ్యాచ్లో సంచలన విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ తమ రెండో మ్యాచ్లో మార్చి 30న ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. ఈ మ్యాచ్కు ఢిల్లీ జట్టుకు అదిరిపోయే వార్త అందింది.తొలి మ్యాచ్కు వ్యక్తిగత కారణాల వల్ల దూరమైన స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్.. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో ఆడనున్నాడు. రాహుల్ ఇప్పటికే ఢిల్లీ జట్టుతో కలిశాడు. కాగా ఇటీవలే రాహుల్ భార్య అతియా శెట్టి తొలి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్కు రాహుల్ దూరమయ్యాడు.రాహుల్ లేనిప్పటికి ఢిల్లీ బ్యాటర్లు అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ చేధించింది. ఇప్పుడు రాహుల్ కూడా అందుబాటులోకి రావడంతో ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ మరింత పటిష్టంగా మారనుంది.ఐపీఎల్-2025 మెగా వేలంలో రూ.14 కోట్ల భారీ ధరకు రాహుల్ను ఢిల్లీ కొనుగోలు చేసింది. రాహుల్ గత మూడు సీజన్లలో లక్నో సూపర్ జెయింట్స్కు సారథ్యం వహించాడు. అయితే ఫ్రాంచైజీ యాజమాన్యంతో విభేదాల వల్ల రాహుల్ బయటకు వచ్చేశాడు. ఈ క్రమంలో ఢిల్లీ గూటికి రాహుల్ చేరాడు. రాహుల్ తన ఐపీఎల్ కెరీర్లో 132 మ్యాచ్లు ఆడి 4683 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో 4 సెంచరీలు ఉన్నాయి.లక్నో సూపర్ జెయింట్స్ జట్టుఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాఠీ, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, మణిమారన్ సిద్ధార్థ్ బెంచ్: అబ్దుల్ సింగ్, సమద్, అక్గర్రాజ్, హిమ్మత్ కులకర్ణి, షమర్ జోసెఫ్, అవేష్ ఖాన్, ఆకాష్ దీప్, మాథ్యూ బ్రీట్జ్కే, ఆర్యన్ జుయల్, యువరాజ్ చౌదరి, మయాంక్ యాదవ్ -
చెలరేగిన డికాక్.. రాజస్తాన్పై కేకేఆర్ ఘన విజయం
KKR vs RR Live Updates And Highlights: రాజస్తాన్పై కేకేఆర్ ఘన విజయంగౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో కేకేఆర్ విజయం సాధించింది. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్.. 17.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. కోల్కతా విజయంలో క్వింటన్ డికాక్ కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన డికాక్ ఆఖరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్ను ముగించాడు. 61 బంతులు ఎదుర్కొన్న డికాక్.. 8ఫోర్లు, 5 సిక్స్లతో 97 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు రఘువంశీ(22), రహానే(18) పరుగులతో రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో హసరంగా ఒక్కడే ఓ వికెట్ సాధించగా.. మరో వికెట్ రనౌట్ రూపంలో వచ్చింది. 16 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 125/216 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ రెండు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. క్రీజులో డికాక్(79), రఘువంశీ(20) పరుగులతో ఉన్నారు.10 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 70/010 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది. క్రీజులో డికాక్(45), రహానే(18) ఉన్నారు.5 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 35/05 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టపోకుండా 35 పరుగులు చేసింది. క్రీజులో క్వింటన్ డికాక్(30), మొయిన్ అలీ(4) ఉన్నారు.రాణించిన కేకేఆర్ బౌలర్లు.. గౌహతి వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ తడబడ్డారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో ధ్రువ్ జురెల్(33) టాప్ స్కోరర్గా నిలవగా.. యశస్వి జైశ్వాల్(29), రియాన్ పరాగ్(25) పరుగులతో రాణించారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ ఆరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ తలా రెండు వికెట్లు సాధించారు.17 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 123/617 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ రాయల్స్ 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. క్రీజులో ధ్రువ్ జురెల్(32), హెట్మైర్(2) పరుగులతో ఉన్నారు.పీకల్లోతు కష్టాల్లో రాజస్తాన్..టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ రాయల్స్ తడబడుతోంది. కేవలం 82 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి రాజస్తాన్ కష్టాల్లో పడింది. కేకేఆర్ స్పిన్నర్లు రాజస్తాన్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడుతున్నారు. ప్రస్తుతం క్రీజులో ధ్రువ్ జురెల్, శుభమ్ దూబే ఉన్నారు.రాజస్తాన్ మూడో వికెట్ డౌన్యశస్వీ జైశ్వాల్ రూపంలో రాజస్తాన్ రాయల్స్ మూడో వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన జైశ్వాల్.. మెయిన్ అలీ బౌలింగ్లో ఔటయ్యాడు. 9 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 71/3రాజస్తాన్ రెండో వికెట్ డౌన్..రియాన్ పరాగ్ రూపంలో రాజస్తాన్ రాయల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన పరాగ్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి నితీష్ రాణా వచ్చాడు. 8 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 67/2రాజస్తాన్ తొలి వికెట్ డౌన్..సంజూ శాంసన్ రూపంలో రాజస్తాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన సంజూ శాంసన్.. వైభవ్ అరోరా బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. 4 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 34/12 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 14/0టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ రాయల్స్ రెండో ఓవర్ ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. క్రీజులో యశస్వి జైశ్వాల్(7), సంజూ శాంసన్(7) ఉన్నారు.ఐపీఎల్-2025లో సెకెండ్ రౌండ్ మొదలైంది. రెండో రౌండ్ తొలి మ్యాచ్లో గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్కు కేకేఆర్ స్టార్ ప్లేయర్ సునీల్ నరైన్ గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్దానంలో మెయిన్ అలీ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు రాజస్తాన్ తుది జట్టులోకి ఫరూఖీ స్ధానంలో హసరంగా వచ్చాడు.తుది జట్లుకోల్కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ XI: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, మొయిన్ అలీ, రమణదీప్ సింగ్, వైభవ్ అరోరా, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తిరాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ XI: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్పాండే, సందీప్ శర్మ -
BCCI Contracts: రుతురాజ్ గైక్వాడ్కు భారీ షాక్.. !
భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) 2025-26 ఏడాదికి గాను ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశముంది. ఈసారి ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్లో పలు మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. గతేడాది కాంట్రాక్టు కోల్పోయిన శ్రేయస్ అయ్యర్కు ప్రమోషన్ దక్కనున్నట్లు సమాచారం. అతని సెంట్రల్ కాంట్రాక్ట్ను పునరుద్దరించేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు వినికిడి.అదేవిధంగా ఏ కేటగిరీలో ఉన్న టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ను A+ కేటగిరీకి బీసీసీఐ ప్రమోట్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా టీ20లకు విడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు A+ కేటగిరీలు కోల్పోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే A+ కేటగిరీలో కొనసాగాలంటే మూడు ఫార్మాట్లో ఆడాల్సిందే. రుతురాజ్ గైక్వాడ్కు భారీ షాక్.. !ఇక ఇది ఇలా ఉండగా.. టీమిండియా ఓపెనర్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కు భారీ షాక్ తగిలే అవకాశముంది. అతడిని సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి తప్పించేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.రుతురాజ్ గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. అతడికి వచ్చిన అవకాశాలను కూడా గైక్వాడ్ సద్వినియోగ పరుచుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే అతడిని కాంట్రాక్ట్ నుంచి తప్పించాలని నిర్ణయించుకున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. గతేడాది అతడు భారత్ తరపున కేవలం 4 టీ20లు మాత్రమే ఆడాడు. చివరగా జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్లో టీమిండియా తరపున రుతురాజ్ ఆడాడు. ఈ సిరీస్లో 4 మ్యాచ్లు ఆడి 133 పరుగులు చేశాడు. ఓవరాల్గా గైక్వాడ్ తన కెరీర్లో ఇప్పటివరకు భారత్ తరపున 6 వన్డేలు, 23 టీ20లు ఆడాడు. కాగా గైక్వాడ్కు ఎక్కువ అవకాశాలు ఇవ్వలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.కేటగిరి వారీగా ఆటగాళ్లకు దక్కే మొత్తం ఎంతంటే?ఏ ప్లస్ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లకు వార్షిక వేతనం కింద యేటా రూ. 7 కోట్లు దక్కనున్నాయి. ‘ఏ’ కేటగిరీలోని క్రికెటర్లకు రూ. 5 కోట్లు..‘బి’ కేటగిరిలో ఉన్న వారికి రూ. 3 కోట్లు.. ‘సి’ కేటగిరిలో ఉన్న క్రికెటర్లకు కోటి రూపాయల వార్షిక వేతనం లభించనుంది. -
రాసిపెట్టుకోండి.. ఐపీఎల్లో 300 ప్లస్ రన్స్ కొట్టేది ఆజట్టే! ఎప్పుడంటే?
ఐపీఎల్-2025 సీజన్ను సన్రైజర్స్ హైదరాబాద్ ఘనంగా ఆరంభించిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో ఆడిన తొలి మ్యాచ్లోనే రాజస్తాన్ రాయల్స్పై 44 పరుగుల తేడాతో భారీ విజయాన్ని ఎస్ఆర్హెచ్ అందుకుంది. ఇషాన్ కిషన్ అద్భుతమైన సెంచరీతో రాణించగా.. ట్రావిస్ హెడ్, క్లాసెన్ మెరుపులతో సన్రైజర్స్ 6 వికెట్ల నష్టానికి ఏకంగా 286 పరుగుల భారీ స్కోర్ చేసింది.ఓ దశలో 300 పరుగుల మార్క్ అందుకునేట్లు కన్పించిన ఆరెంజ్ ఆర్మీ.. ఆఖరి ఓవర్లో వికెట్లు కోల్పోవడంతో 286 పరుగుల వద్దే ఆగిపోయింది. అయితే ఈ ఏడాది సీజన్లో 300 పరుగుల స్కోర్ను సన్రైజర్స్ కచ్చితంగా సాధిస్తుందని చాలా మంది మాజీలు అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం డేల్ స్టెయిన్ చేరాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా ఏప్రిల్ 17న వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్తో జరగనున్న మ్యాచ్లో హైదరాబాద్ 300 పరుగుల మార్క్ను అందుకుంటుందని స్టెయిన్ జోస్యం చెప్పాడు."ఏప్రిల్ 17న మనం ఐపీఎల్లో తొలిసారి 300 పరుగుల స్కోర్ను చూడబోతున్నాము. వాంఖడేలో సన్రైజర్స్ సాధిస్తుందని అంచనా వేస్తున్నాను. అది చూడటానికి నేను ఆ రోజున స్టేడియంలో కూడా ఉండవచ్చు" అని ఎక్స్లో స్టెయిన్ రాసుకొచ్చాడు. గత సీజన్లో ముంబై ఇండియన్స్తో ఆడినప్పుడు సన్రైజర్స్ ఏకంగా 3 వికెట్ల నష్టానికి 277 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ మ్యాచ్లో హెడ్, అభిషేక్ శర్మ,హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసం సృష్టించారు. మొత్తంగా ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ఏకంగా 17 సిక్సర్లు బాదారు. కాగా ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ ఇప్పటికే నాలుగు సార్లు 250 ప్లస్ స్కోర్లు నమోదు చేయడం గమనార్హం. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ప్రస్తుతం ఉన్న ఫామ్కు 300 పరుగుల స్కోర్ ఆసాధ్యమేమి కాదు. ఎస్ఆర్హెచ్ తమ రెండో మ్యాచ్లో హైదరాబాద్ వేదికగా మార్చి 27న లక్నోతో తలపడనుంది.సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు: కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అథర్వ తైడె, అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, సచిన్ బేబీ, హర్షల్ పటేల్, కమిందు మెండిస్, ముల్డర్, షమీ, రాహుల్ చాహర్, ఆడమ్ జాంపా, సిమర్జీత్ సింగ్, జీషాన్ అన్సారీ, జైదేవ్ ఉనాద్కట్, ఇషాన్ మలింగ. -
శ్రేయస్ కాదు!.. అతడే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అశ్విన్
పంజాబ్ కింగ్స్ పేసర్ విజయ్కుమార్ వైశాఖ్ (Vijaykumar Vyshak)పై టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ప్రశంసలు కురిపించాడు. ఆఖరి ఐదు ఓవర్ల ఆటలో అద్భుతం చేసి జట్టును గెలిపించాడని కొనియాడాడు. గుజరాత్ టైటాన్స్ (GT)- పంజాబ్ కింగ్స్ (PBKS) మ్యాచ్కు సంబంధించి.. తన దృష్టిలో వైశాఖ్ అత్యంత విలువైన ఆటగాడని పేర్కొన్నాడు.శ్రేయస్ అయ్యర్ తుపాన్ ఇన్నింగ్స్ఐపీఎల్-2025లో భాగంగా గుజరాత్- పంజాబ్ మంగళవారం తలపడిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ దుమ్ములేపింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (23 బంతుల్లో 47), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (42 బంతుల్లో 97 నాటౌట్), శశాంక్ సింగ్ (16 బంతుల్లో 44 నాటౌట్) అద్భుతంగా బ్యాటింగ్ చేశారు.ఫలితంగా నిర్ణీత ఇరవై ఓవర్లలో పంజాబ్ ఐదు వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో గుజరాత్ విజయానికి చేరువగా వచ్చింది. సాయి సుదర్శన్ మెరుపు ఇన్నింగ్స్ (41 బంతుల్లో 74) ఆడగా.. జోస్ బట్లర్ (33 బంతుల్లో 54), షెర్ఫానే రూథర్ఫర్డ్ (28 బంతుల్లో 46) పంజాబ్ నుంచి మ్యాచ్ను లాగేసుకునే ప్రయత్నం చేశారు.ఇంపాక్ట్ ప్లేయర్అయితే, సరిగ్గా అదే సమయంలో పంజాబ్ ఇంపాక్ట్ ప్లేయర్గా విజయ్కుమార్ వైశాఖ్ను రంగంలోకి దించింది. దాదాపు పద్నాలుగు ఓవర్ల పాటు బెంచ్ మీద ఉన్న అతడు.. పదిహేనో ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. కేవలం ఐదు పరుగులే ఇచ్చాడు. అనంతరం పదిహేడో ఓవర్లో మళ్లీ బరిలోకి దిగి ఇదే ప్రదర్శనను పునరావృతం చేశాడు. ఆ తర్వాత పందొమ్మిదో ఓవర్లో(18 రన్స్)నూ ఫర్వాలేదనిపించాడు.ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘శ్రేయస్ అయ్యర్ ప్రదర్శన ఈ విజయానికి మూలం. అయితే, ఓ ఆటగాడు డగౌట్లో కూర్చుని.. మైదానంలోని ఆటగాళ్ల కోసం నీళ్లు తీసుకువస్తూ కనిపించాడు.ఆ సమయంలో గుజరాత్ మొమెంటమ్లోకి వచ్చేసింది. రూథర్ఫర్డ్, బట్లర్ మ్యాజిక్ చేసేలా కనిపించారు. అప్పుడు ఎంట్రీ ఇచ్చాడు విజయ్కుమార్ వైశాఖ్. దాదాపు పద్నాలుగు ఓవర్లపాటు మ్యాచ్కు దూరంగా అతడిని పిలిపించి.. మ్యాచ్ను మనవైపు తిప్పమని మేనేజ్మెంట్ చెప్పింది.‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అతడికే ఇవ్వాల్సిందిపదిహేడు, పందొమ్మిదో ఓవర్లో అతడు పరిణతితో బౌలింగ్ చేశాడు. అతడు వికెట్ తీయకపోవచ్చు. కానీ డెత్ ఓవర్లలో అద్బుతంగా బౌలింగ్ చేశాడు. తన ప్రణాళికలను తూచా తప్పకుండా అమలు చేశాడు. అద్భుతమైన యార్కర్లతో అలరించాడు.తన బౌలింగ్లో వైడ్లు, ఫుల్ టాస్లు ఉండవచ్చు. కానీ అతడి కట్టుదిట్టమైన బౌలింగ్ వల్లే గుజరాత్ వెనుకడుగు వేసింది. నా దృష్టిలో అతడు అత్యంత విలువైన ఆటగాడు. నిజానికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు విజయ్కుమార్ వైశాఖ్కు దక్కాల్సింది’’ అని పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్లో పంజాబ్ పదకొండు పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇదిలా ఉంటే.. మొత్తంగా మూడు ఓవర్ల బౌలింగ్లో విజయ్ 28 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు.చదవండి: NZ vs Pak: టిమ్ సీఫర్ట్ విధ్వంసం.. పాకిస్తాన్కు అవమానకర ఓటమిPunjab Kings hold their nerves in the end to clinch a splendid win against Gujarat Titans ❤️Scorecard ▶ https://t.co/PYWUriwSzY#TATAIPL | #GTvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/0wy29ODStQ— IndianPremierLeague (@IPL) March 25, 2025 -
నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. ఆ జట్టుకు కప్ తీసుకువస్తా: యువరాజ్ తండ్రి
భారత మాజీ క్రికెటర్, ప్రపంచ కప్ హీరో యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ తన వ్యాఖ్యలతో ఇటీవల తరుచుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా యోగరాజ్ మరోసారి తన కామెంట్స్తో హాట్టాపిక్గా నిలిచాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ను ఉద్దేశించి యోగరాజ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.తనకు ఒక్క సీజన్లో పంజాబ్ కింగ్స్ కోచ్గా అవకాశం ఇస్తే.. ఆ జట్టుకు తొలి ఐపీఎల్ ట్రోఫీ అందిస్తాని ఆయన చాలా నమ్మకంగా చెప్పుకొచ్చారు. ఒకవేళ కోచ్గా విఫలమైతే అభిమానుల నుంచి వచ్చే ఏ డిమాండ్ను అయినా స్వీకరించేందుకు తను సిద్దమని ఆయన అన్నారు. తన కోచింగ్ సామర్థ్యాలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని యోగరాజ్ పేర్కొన్నారు. కాగా పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ తొలి సీజన్ నుంచి ఆడుతున్నప్పటికి ఒక్కసారి కూడా టైటిల్ను ముద్దాడలేకపోయింది. ప్రతీ సీజన్లోనూ ఎన్నో అంచనాలతో బరిలోకి దిగడం.. లీగ్ స్టేజిలోనో, ప్లే ఆఫ్స్లోనో ఇంటిముఖం పట్టడం పంజాబ్కు పరిపాటుగా మారింది. అయితే తాజా ఐపీఎల్ ఎడిషన్ను మాత్రం పంజాబ్ విజయంతో ప్రారంభించింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్పై 11 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. కొత్త సారథి శ్రేయస్ అయ్యర్ అయినా కింగ్స్ ఫ్రాంచైజీకి తొలి టైటిల్ను అందిస్తాడో లేదో చూడాలి.ఇక యోగరాజ్ విషయానికి వస్తే.. సొంతంగా ఆయన క్రికెట్ అకాడమీని నిర్వహిస్తున్నారు. భారత్ తరపున గొప్ప క్రికెటర్లలో ఒకడిగా ఎదిగిన తన కుమారుడు యువరాజ్ సింగ్తో సహా అనేక మంది యువ ఆటగాళ్లకు మోంటార్గా యోగరాజ్ పనిచేశారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కూడా ఆయన దగ్గర శిక్షణ పొందాడు. 1980లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన యోగరాజ్.. భారత్ తరఫున ఒక టెస్టు, 6 వన్డేలు ఆడాడు.చదవండి: ఆర్సీబీ స్పిన్నర్లు భేష్.. కేకేఆర్ బౌలర్లు ఏం చేశారు?: రహానేకు పిచ్ క్యూరేటర్ కౌంటర్ -
ఆర్సీబీ స్పిన్నర్లు భేష్.. కేకేఆర్ బౌలర్లు ఏం చేశారు?: రహానేకు పిచ్ క్యూరేటర్ కౌంటర్
కోల్కతా నైట్ రైడర్స్ (KKR) జట్టును ఉద్దేశించి ఈడెన్ గార్డెన్స్ పిచ్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను ఇక్కడ క్యూరేటర్గా ఉన్నంత కాలం పిచ్లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశాడు. పిచ్ రూపకల్పన గురించి సలహాలు ఇచ్చే అధికారం ఫ్రాంఛైజీలకు లేదని పేర్కొన్నాడు.ఏడు వికెట్ల తేడాతో ఓటమికాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ ఆదిలోనే చుక్కెదురైన విషయం తెలిసిందే. లీగ్ ఆరంభ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) చేతిలో ఏకంగా ఏడు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్లో స్థాయికి తగ్గట్లు రాణించలేక చేతులెత్తేసింది.ఆర్సీబీతో మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్య రహానే (31 బంతుల్లో 56) ఒక్కడే అర్ధ శతకం సాధించాడు. కృనాల్ పాండ్యాకు మూడుఇక ఆర్బీసీ బౌలర్లలో స్పిన్నర్లు కృనాల్ పాండ్యా మూడు, సూయశ్ శర్మ ఒక వికెట్ తీయగా.. పేసర్లు జోష్ హాజిల్వుడ్ రెండు, యశ్ దయాళ్, రసిఖ్ ధార్ సలాం ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీ 16.2 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి పనిపూర్తి చేసింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (31 బంతుల్లో 56), విరాట్ కోహ్లి (36 బంతుల్లో 59 నాటౌట్), కెప్టెన్ రజత్ పాటిదార్ (16 బంతుల్లో 34) రాణించారు. ఇక కేకేఆర్ బౌలర్లలో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునిల్ నరైన్ ఒక్కో వికెట్ తీయగా.. పేసర్ వైభవ్ అరోరా ఒక వికెట్ పడగొట్టాడు.రహానే కామెంట్స్ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే మాట్లాడుతూ.. ‘‘పిచ్ స్పిన్ బౌలర్లకు సహకరిస్తుందని అనుకున్నాం. కానీ నిన్నటి నుంచి పిచ్ను కవర్లతో కప్పేసి ఉంచారు. నిజానికి మా జట్టులో ఉన్న ఇద్దరు స్పిన్నర్లు అద్భుతంగా ఆడతారు. ఎలాంటి వికెట్ మీదైనా రాణిస్తారు. కానీ ఈరోజు పరిస్థితి అంతగొప్పగా లేదు’’ అని పేర్కొన్నాడు.రహానే వ్యాఖ్యలపై ఈడెన్ గార్డెన్స్ పిచ్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీ తాజాగా స్పందించాడు. రెవ్స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. ‘‘నేను ఇక్కడ ఉన్నంత కాలం ఈడెన్ గార్డెన్స్ పిచ్ ఇలాగే ఉంటుంది. ఇందులో ఎటువంటి మార్పూ లేదు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం పిచ్ ఎలా ఉండాలో చెప్పే అధికారం ఫ్రాంఛైజీలకు లేదు.ఆర్సీబీ స్పిన్నర్లు భేష్.. కేకేఆర్ బౌలర్లు ఏం చేశారు?నేను గతంలో ఎలా ఉన్నానో.. ఇప్పుడూ అలాగే ఉన్నాను. అందుకే మరీ మరీ చెప్తున్నా.. ఈడెన్ గార్డెన్స్ వికెట్లో ఇప్పుడు.. అదే విధంగా భవిష్యత్తులోనూ ఎలాంటి మార్పులు ఉండబోవు.అయినా ఆర్సీబీ స్పిన్నర్లు మొత్తంగా నాలుగు వికెట్లు తీశారు. మరి కేకేఆర్ స్పిన్నర్లు ఏం చేశారు? ఆర్సీబీలో కృనాల్ మూడు, సూయశ్ ఒక వికెట్ పడగొట్టారు’’ అని సుజన్ ముఖర్జీ కేకేఆర్ స్పిన్నర్ల తీరును విమర్శించాడు.ఇక ఈ సీజన్లో తమ రెండో మ్యాచ్ ఆడేందుకు కేకేఆర్ గువాహతికి పయనమైంది. రాజస్తాన్ రాయల్స్తో బుధవారం నాటి పోరులో గెలిచి బోణీ కొట్టాలని పట్టుదలగా ఉంది. అనంతరం వాంఖడేలో మార్చి 31న ముంబైతో తలపడుతుంది. మళ్లీ హోం గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్లో కేకేఆర్.. ఏప్రిల్ 3న సన్రైజర్స్ హైదరాబాద్ను ఢీకొట్టనుంది.చదవండి: 4 ఓవర్లలో 76 రన్స్ ఇచ్చాడు.. జట్టులో అవసరమా?: భారత మాజీ క్రికెటర్ -
NZ vs Pak: టిమ్ సీఫర్ట్ విధ్వంసం.. పాకిస్తాన్కు అవమానకర ఓటమి
పాకిస్తాన్తో ఐదో టీ20లో న్యూజిలాండ్ (New Zealand Vs Pakistan) క్రికెట్ జట్టు అద్భుత విజయం సాధించింది. పర్యాటక జట్టును చిత్తుగా ఓడించి.. 4-1తో సిరీస్ ముగించింది. ఆద్యంతం ఆధిపత్యం కొనసాగించి సల్మాన్ ఆఘా బృందానికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. కేవలం పది ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి తమ సత్తా ఏమిటో మరోసారి నిరూపించుకుంది.మళ్లీ పాత కథేకాగా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ పర్యటన (Pakistan Tour Of New Zealand)కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య మార్చి 16న టీ20 సిరీస్ మొదలుకాగా.. తొలి రెండు మ్యాచ్లలో కివీస్ గెలుపొందింది. అయితే, మూడో టీ20లో పాక్ అనూహ్య సంచలన విజయం సాధించింది.. ఫామ్లోకి వచ్చినట్లే కనిపించింది.కానీ తర్వాత మళ్లీ పాత కథే. నాలుగో టీ20లో కివీస్ చేతిలో ఏకంగా 115 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడిన పాక్.. సిరీస్ను చేజార్చుకుంది. ఈ క్రమంలో ఐదో టీ20లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావించగా భంగపాటే ఎదురైంది. వెల్లింగ్టన్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్లో టాస్ ఓడిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది.సల్మాన్ ఆఘా కెప్టెన్ ఇన్నింగ్స్ టాపార్డర్లో ఓపెనర్లు మహ్మద్ హారిస్ (11), హసన్ నవాజ్ (0).. వన్డౌన్ బ్యాటర్ ఒమర్ యూసఫ్ (7) పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో సల్మాన్ ఆఘా (Salman Agha) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 39 బంతుల్లో 51 పరుగులు సాధించాడు. అయితే, అతడికి మిగతా వారి నుంచి సహకారం అందలేదు.ఆఖర్లో షాదాబ్ ఖాన్ 20 బంతుల్లో 28 రన్స్తో ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ తొమ్మిది వికెట్లు నష్టపోయి 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. కివీస్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ జేమ్స్ నీషమ్ ఐదు వికెట్లు(5/22) కూల్చి పాకిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. మిగతా వాళ్లలో జేకబ్ డఫీ రెండు, బెన్ సీర్స్, ఇష్ సోధి ఒక్కో వికెట్ పడగొట్టారు.38 బంతుల్లోనే 97 రన్స్ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ పది ఓవర్లలోనే టార్గెట్ను ఊదేసింది. ఓపెనర్ టిమ్ సీఫర్ట్ ఆకాశమే హద్దుగా దూసుకుపోయాడు. 23 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఏకంగా పది సిక్సర్లు, ఆరు ఫోర్ల సాయంతో 38 బంతుల్లోనే 97 రన్స్తో అజేయంగా నిలిచాడు.మరో ఓపెనర్ ఫిన్ అలెన్ (12 బంతుల్లో 27) వేగంగా ఆడగా.. మార్క్ చాప్మన్(3) మాత్రం నిరాశపరిచాడు. ఏదేమైనా టిమ్ విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా మరో పది ఓవర్లు మిగిలి ఉండగానే కివీస్ లక్ష్యాన్ని ఛేదించింది. టిమ్ సీఫర్ట్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ ఆసాంతం అద్బుతంగా ఆడిన జేమ్స్ నీషమ్కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.చదవండి: 4 ఓవర్లలో 76 రన్స్ ఇచ్చాడు.. జట్టులో అవసరమా?: భారత మాజీ క్రికెటర్ -
సెంచరీ త్యాగం చేసిన శ్రేయస్.. గతంలో సెంచరీ కోసం కోహ్లి పాకులాడిన తీరును గుర్తు చేసుకున్న ఫ్యాన్స్
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో నిన్న (మార్చి 25) జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. పంజాబ్ గెలుపులో ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కీలక భూమిక పోషించాడు. ఈ మ్యాచ్లో 97 పరుగులతో అజేయంగా నిలిచిన శ్రేయస్కు సెంచరీ చేసే అవకాశమున్నా జట్టు ప్రయోజనాల కోసం దాన్ని వద్దనుకున్నాడు.పంజాబ్ ఇన్నింగ్స్ చివరి ఓవర్కు ముందు శ్రేయస్ 97 పరుగులతో అజేయంగా ఉన్నాడు. ఆ ఓవర్లో కనీసం ఒక్క బంతి ఎదుర్కొన్నా శ్రేయస్ సెంచరీ చేసేవాడు. కానీ అతను స్ట్రయిక్ కోసం పాకులాడలేదు. శశాంక్ మంచి టచ్లో ఉన్న విషయాన్ని గమనించి అతన్నే స్ట్రయిక్ తీసుకోమన్నాడు. శశాంక్ స్వయంగా వచ్చి స్ట్రయిక్ రొటేట్ చేస్తానన్నా శ్రేయస్ వినలేదు. ఆ ఓవర్ అంతా సింగిల్స్కు కాకుండా బౌండరీలు, సిక్సర్లకు ప్రయత్నించమని చెప్పాడు.శశాంక్.. తన కెప్టెన్ చెప్పినట్లుగా చేసే క్రమంలో 5 బంతులు బౌండరీలకు తరలి వెళ్లగా.. ఓ బంతికి రెండు పరుగులు (రెండో బంతి) వచ్చాయి. వాస్తవానికి ఇక్కడ శ్రేయస్ స్ట్రయిక్ తీసుకుని (సింగిల్ తీసుంటే) ఉండవచ్చు. కానీ అతను అలా చేయలేదు. జట్టు ప్రయోజనాల కోసం సెంచరీ త్యాగం చేసిన అనంతరం యావత్ క్రికెట్ ప్రపంచం శ్రేయస్పై ప్రశంసల వర్షం కురిపించింది.ఈ క్రమంలో విరాట్ కోహ్లికి సంబంధించిన ఓ ఉదంతాన్ని క్రికెట్ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. 2019 ఐపీఎల్ సీజన్లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో కోహ్లి సెంచరీ చేశాడు. ఆ సెంచరీ కోసం కోహ్లి పడ్డ తాపత్రయాన్ని ఫ్యాన్స్ శ్రేయస్ ఉదంతంతో పోల్చుకుంటున్నారు. అప్పుడు కోహ్లి తన వ్యక్తిగత మైలురాయి కోసం జట్టుకు అదనంగా వచ్చే పరుగును వద్దన్నాడు. సెంచరీకి ముందు కోహ్లి ఆడిన ఓ షాట్కు రెండు పరుగులు వచ్చేవి. నాన్ స్ట్రయికర్ ఎండ్లో ఉన్న స్టోయినిస్ కూడా రెండో పరుగుకు వచ్చేందుకు సుముఖత చూపాడు. కానీ కోహ్లి మళ్లీ తనే స్ట్రయిక్ తీసుకునేందుకు రెండో రన్ వద్దన్నాడు. తిరిగి స్ట్రయిక్లోకి వచ్చిన తర్వాత కోహ్లి బౌండరీ బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు.ఆ మ్యాచ్లో కోహ్లి సెంచరీ చేసి, అతని జట్టు ఆర్సీబీ గెలిచినా అభిమానులు కోహ్లిని తప్పుబట్టారు. జట్టుకు వచ్చే అదనపు పరుగు కంటే కోహ్లి తన సెంచరీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడా అన్న చర్చ అప్పట్లో జరిగింది. ఆ మ్యాచ్లో కోహ్లి 58 బంతుల్లో సెంచరీ చేయడంతో ఆర్సీబీ భారీ స్కోరు (213/4) చేసింది.ఛేదనలో ఆండ్రీ రస్సెల్ (65), నితీష్ రాణా (85*) విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడినా కేకేఆర్ 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.శ్రేయస్ విషయానికొస్తే.. సెంచరీ గురించి పట్టించుకోకపోవడంతో పంజాబ్ భారీ స్కోర్ చేసి గెలిచింది. శ్రేయస్ కూడా కోహ్లిలా సెంచరీ కోసం పాకులాడి ఉంటే పంజాబ్ 243 పరుగుల భారీ స్కోర్ చేసుండేది కాదు. శ్రేయస్ సెంచరీ త్యాగం చేసి పంజాబ్ అంత భారీ స్కోర్ చేసినా గుజరాత్ అద్భుతంగా పోరాడి లక్ష్యానికి కేవలం 11 పరుగుల దూరంలో మాత్రమే నిలిచిపోయింది. ఈ మ్యాచ్లో శ్రేయస్ సెంచరీ వదులుకుని హీరో అయ్యాడు.. ఆ రోజు కోహ్లి సెంచరీ చేసి కూడా విమర్శలపాలయ్యాడు. -
ద్రవిడ్ గొప్పోడు.. గంభీర్ మాత్రం స్పందించడం లేదు: టీమిండియా దిగ్గజం
టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) గురించి భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గౌతీ.. రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) బాటలో నడుస్తున్నాడా? లేదా? అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదని పేర్కొన్నాడు. ద్రవిడ్ మాదిరి గౌతీకి పెద్ద మనసు ఉందో లేదో తెలియడం లేదంటూ విమర్శనాస్త్రాలు సంధించాడు. ఇంతకీ విషయం ఏమిటంటే....భారత జట్టు ఇటీవలే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)గెలుచుకున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చిన ఈ మెగా వన్డే టోర్నీలో రోహిత్ సేన.. తమ మ్యాచ్లన్నీ దుబాయ్లోనే ఆడింది. రూ. 58 కోట్ల క్యాష్ రికార్డుగ్రూప్ దశలో మూడింటికి మూడు గెలిచి సెమీస్లో అడుగుపెట్టిన టీమిండియా.. కీలక పోరులో ఆస్ట్రేలియాను ఓడించింది. అనంతరం టైటిల్ పోరులో న్యూజిలాండ్పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచి ట్రోఫీని ముద్దాడింది.తద్వారా కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో రెండో ఐసీసీ టైటిల్ చేరగా.. భారత్కు పుష్కర కాలం తర్వాత చాంపియన్స్ ట్రోఫీ దక్కింది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) టీమిండియాకు భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. రూ. 58 కోట్ల క్యాష్ రికార్డు ఇవ్వనున్నట్లు మార్చి 20న పత్రికా ప్రకటన విడుదల చేసింది.గంభీర్కు రూ. 3 కోట్లుఈ మొత్తంలో చాంపియన్స్ ట్రోఫీ జట్టులోని ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ. 3 కోట్ల చొప్పున.. అదే విధంగా హెడ్కోచ్ గంభీర్కు రూ. 3 కోట్లు ఇవ్వనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. సహాయక కోచ్లు, మిగతా సిబ్బందికి రూ. 50 లక్షల నగదు బహుమానం అందజేయనున్నట్లు తెలిపారు.ఈ విషయంపై సునిల్ గావస్కర్ తాజాగా తనదైన శైలిలో స్పందించాడు. ద్రవిడ్తో గంభీర్ను పోలుస్తూ స్పోర్ట్స్స్టార్కు రాసిన కాలమ్లో వింత వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన తర్వాత బీసీసీఐ భారీ స్థాయిలో ప్రైజ్మనీ ప్రకటించింది. అప్పటి హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్కు ఆటగాళ్లతో సమానంగా బహుమతి ఇవ్వాలని భావించింది.ద్రవిడ్ గొప్పోడు.. గంభీర్ మాత్రం స్పందించడం లేదుకానీ అతడు అందుకు అంగీకరించలేదు. సహాయక కోచ్లతో పాటూ తానూ సమానమేనని.. వారికి ఇచ్చినంతే తనకూ ఇవ్వాలని బోర్డుకు విజ్ఞప్తి చేశాడు. లేదంటే.. తనకు దక్కిన మొత్తాన్ని సహచర కోచ్లతో పంచుకుంటానని చెప్పాడు. చెప్పిందే చేశాడు కూడా!ఇక చాంపియన్స్ ట్రోఫీలో భారత్ గెలిచిన నేపథ్యంలో బీసీసీఐ క్యాష్ రివార్డు ప్రకటించి.. రోజులు గడుస్తున్నాయి. అయినా.. ఇప్పటి వరకు ప్రస్తుత హెడ్కోచ్ నుంచి ప్రైజ్మనీ తీసుకునే విషయంలో ఎలాంటి ప్రకటనా రాలేదు.అతడు ద్రవిడ్ మాదిరి కోచ్లందరితో సమానంగా నగదు తీసుకుంటాడా? లేదా? లేదంటే.. ద్రవిడ్ ఓ మంచి రోల్ మోడల్ కాదంటారా?!’’ అని గావస్కర్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.శుభపరిణామంఅదే విధంగా.. బీసీసీఐ జట్టుకు ఈ మేర భారీ ప్రోత్సాహకాలు అందించడం గొప్ప విషమమని గావస్కర్ బోర్డును ప్రశంసించాడు. ‘‘ఐసీసీ టీ20 ప్రపంచకప్ గెలిచినప్పుడు బీసీసీఐ రూ. 125 కోట్ల మేర భారీ రివార్డు ప్రకటించింది. సెలక్టర్లు, సహాయక సిబ్బందికి కూడా తగిన రీతిలో బహుమానం అందజేసింది.ఇక ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీ గెలిచినందుకు రూ. 58 కోట్లు ఇవ్వడం శుభపరిణామం. ఈసారి కూడా సెలక్షన్ కమిటీ, సహాయక సిబ్బందిని దృష్టిలో పెట్టుకుంది. నిజంగా ఇది గొప్ప విషయం. అంతేకాదు.. ఐసీసీ ప్రకటించిన ప్రైజ్మనీ మొత్తాన్ని కూడా ఆటగాళ్లకే పంచడం.. వారికి తగిన రీతిలో ప్రోత్సాహకాలు అందించడం సానుకూల వాతావరణాన్ని కల్పిస్తుంది’’ అని గావస్కర్ పేర్కొన్నాడు.చదవండి: 4 ఓవర్లలో 76 రన్స్ ఇచ్చాడు.. జట్టులో అవసరమా?: భారత మాజీ క్రికెటర్ -
తీరు మార్చుకోని పాకిస్తాన్.. మరోసారి చెత్త ప్రదర్శన
పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం న్యూజిలాండ్లో పర్యటిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు చెత్త ప్రదర్శనలను కొనసాగిస్తుంది. ఈ పర్యటనలో తొలుత ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతున్న పాక్.. ఇప్పటివరకు పూర్తయిన నాలుగు మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్లో మాత్రమే మెరుగైన ప్రదర్శన చేసింది. మిగతా మూడు మ్యాచ్ల్లో గల్లీ జట్ల కంటే ఘోరంగా ఆడిన పాక్.. మరోసారి తమ చెత్త ప్రదర్శనను రిపీట్ చేసింది.వెల్లింగ్టన్ వేదికగా ఇవాళ (మార్చి 26) జరుగుతున్న నామమాత్రపు ఐదో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన దాయాది జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి అతి కష్టం మీద 128 పరుగులు చేయగలిగింది. పాక్ ఇన్నింగ్స్లో కెప్టెన్ సల్మాన్ అఘా (39 బంతుల్లో 51) అర్ద సెంచరీతో రాణించాడు. మరో ఇద్దరు (మహ్మద్ హ్యారిస్ (11), షాదాబ్ ఖాన్ (28)) మాత్రమే రెండంకెల స్కోర్లు సాధించారు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. హసన్ నవాజ్, సూఫియాన్ ముఖీమ్ ఖాతా కూడా తెరవలేకపోగా.. ఒమైర్ యూసఫ్ 7, ఉస్మాన్ ఖాన్ 7, అబ్దుల్ సమద్ 4, జహందాద్ ఖాన్ 1 పరుగు చేశారు. హరీస్ రౌఫ్ 6, మహ్మద్ అలీ 0 పరుగులతో అజేయంగా నిలిచారు.ఐదేసిన నీషమ్న్యూజిలాండ్ బౌలర్లలో జేమ్స్ నీషమ్ ఐదు వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాశించాడు. తన కోటా 4 ఓవర్లలో నీషమ్ కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు. జేకబ్ డఫీ 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా.. బెన్ సియర్స్, ఐష్ సోధి తలో 4 ఓవర్లలో వరుసగా 25, 32 పరుగులిచ్చి చెరో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.విరుచుకుపడుతున్న ఓపెనర్లు129 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. మెరుపు వేగంతో ఇన్నింగ్స్ను ప్రారంభించింది. ఓపెనర్లు టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్ విరుచుకుపడుతున్నారు. వీరిద్దరు తొలి మూడు ఓవర్లలోనే 45 పరుగులు పిండుకున్నారు. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలవాలంటే మరో 84 పరుగులు మాత్రమే కావాలి.ఇదివరకే సిరీస్ కైవసం చేసుకున్న న్యూజిలాండ్ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో 1, 2, 4 టీ20లు గెలిచిన న్యూజిలాండ్ ఈ మ్యాచ్కు ముందే సిరీస్ను కైవసం చేసుకుంది. సిరీస్ ఫలితం తేలిపోవడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగుతుంది. ఈ మ్యాచ్ అనంతరం మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. తొలి వన్డే మార్చి 29న నేపియర్ వేదికగా జరుగనుంది. -
IPL 2025: చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో నిన్న (మార్చి 25) జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఓ అల్టిమేట్ రికార్డును సాధించాడు. ఈ మ్యాచ్లో సెంచరీ చేసే అవకాశమున్నా జట్టు ప్రయోజనాల కోసం వదులుకున్న అయ్యర్.. లీగ్ చరిత్రలో రెండు వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున కెప్టెన్సీ అరంగేట్రంలో 90 ప్లస్ స్కోర్లు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృషించాడు. 2018 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ డెబ్యూలో అజేయమైన 93 పరుగులు (కేకేఆర్పై) చేసిన అయ్యర్.. తాజాగా పంజాబ్ కెప్టెన్గా అరంగేట్రంలో 97 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో శ్రేయస్ మరో విషయంలోనూ రికార్డుల్లోకెక్కాడు. కెప్టెన్సీ అరంగేట్రంలో మూడో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా తన రికార్డును తనే మెరుగుపర్చుకున్నాడు. ఐపీఎల్లో ఓ ఫ్రాంచైజీ కెప్టెన్గా తొలి మ్యాచ్లో అత్యధిక స్కోర్ చేసిన ఘనత సంజూ శాంసన్కు దక్కుతుంది. సంజూ 2021లో రాయల్స్ కెప్టెన్గా తన తొలి మ్యాచ్లో (పంజాబ్పై) 119 పరుగులు చేశాడు. కెప్టెన్గా అరంగేట్రంలో సెంచరీ చేసిన ఏకైక ఆటగాడు సంజూ శాంసన్ మాత్రమే.ఐపీఎల్లో కెప్టెన్సీ అరంగేట్రంలో అత్యధిక స్కోర్లు..119 - సంజు శాంసన్ (RR vs PBKS, వాంఖడే, 2021)99* - మయాంక్ అగర్వాల్ (PBKS vs DC, అహ్మదాబాద్, 2021)97* - శ్రేయస్ అయ్యర్ (PBKS vs GT, అహ్మదాబాద్, 2025*)93* - శ్రేయస్ అయ్యర్ (DC vs KKR, ఢిల్లీ, 2018)88 - ఫాఫ్ డుప్లెసిస్ (RCB vs PBKS, ముంబై, 2022)గుజరాత్తో మ్యాచ్లో శ్రేయస్ మరో మైలురాయిని కూడా తాకాడు. శ్రేయస్ టీ20ల్లో 6000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.మూడు జట్లకు కెప్టెన్గా..ఐపీఎల్లో శ్రేయస్ ఖాతాలో మరో ఘనత కూడా వచ్చి చేరింది. ఈ ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్.. ఐపీఎల్లో మూడు ఫ్రాంచైజీలకు కెప్టెన్గా వ్యవహరించిన నాలుగో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. శ్రేయస్ ఐపీఎల్లో ఢిల్లీ, కేకేఆర్, పంజాబ్ జట్లకు కెప్టెన్గా వ్యవహరించాడు. శ్రేయస్కు ముందు మహేళ జయవర్దనే, కుమార సంగక్కర, స్టీవ్ స్మిత్ కూడా ఐపీఎల్లో మూడు ఫ్రాంచైజీలకు సారథ్యం వహించారు.మ్యాచ్ విషయానికొస్తే.. పంజాబ్ కెప్టెన్గా శ్రేయస్ తన తొలి మ్యాచ్లోనే సఫలమయ్యాడు. శ్రేయస్ వ్యక్తిగతంగానూ సత్తా చాటడంతో గుజరాత్పై పంజాబ్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. శ్రేయస్ (42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 97 పరుగులు నాటౌట్), శశాంక్ సింగ్ (16 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 44 పరుగులు నాటౌట్), ప్రియాంశ్ ఆర్య (23 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 47 పరుగులు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ 232 పరుగులకే పరిమితమై 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. గుజరాత్ ఇన్నింగ్స్లో సాయి సుదర్శన్ (41 బంతుల్లో 74; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), శుభ్మన్ గిల్ (14 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), జోస్ బట్లర్ (33 బంతుల్లో 54; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రూథర్ఫోర్డ్ (28 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తా చాటినా ప్రయోజనం లేకుండా పోయింది. -
మళ్లీ ప్రేమకు సిద్ధం: హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాసా స్టాంకోవిక్
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాసా స్టాంకోవిక్ ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హార్దిక్ నుంచి విడిపోయాక మళ్లీ ప్రేమలో పడేందుకు సిద్దంగా ఉన్నానని అంది. ప్రేమ, మాతృత్వం, కెరీర్ గురించి మాట్లాడుతూ.. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించాలో చెప్పుకొచ్చింది. నటి మరియు మోడల్ అయిన నటాసా కొత్త దశలోకి అడుగుపెట్టబోతున్నానని తెలిపింది. గతేడాది జులైలో హార్దిక్ పాండ్యా నుంచి విడిపోయిన నటాసా.. కెరీర్లో ముందుకు సాగడంపై దృష్టి పెడుతున్నానని చెప్పింది. పెళ్లి తర్వాత నాలుగేళ్లు కలిసి ఉన్న నటాసా, హార్దిక్కు అగస్త్య అనే నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. విడిపోయాక వీరిద్దరు అగస్త్యకు కో-పేరెంట్స్గా ఉన్నారు. అగస్త్య తల్లి సంరక్షణలో పెరుగుతున్నాడు.ఇంటర్వ్యూ సందర్భంగా నటాసా తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఇలా అంది. నేను మళ్లీ ప్రేమలో పడేందుకు వ్యతిరేకం కాదు. జీవితం ఏది ఇచ్చినా స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నాను. ప్రేమ విషయానికి వస్తే.. ఖచ్చితంగా కొత్త అనుభవాల కోసం ఓపెన్గా ఉన్నాను. సరైన సమయం వచ్చినప్పుడు ప్రేమ అదంతట అదే పుడుతుందని నమ్ముతాను. నమ్మకం మరియు పరస్పర అవగాహన కలిగిన అర్థవంతమైన బంధాలకు విలువ ఇస్తానని తెలిపింది.హార్దిక్ నుంచి విడిపోయాక గతేడాది చాలా కఠినంగా గడిచిందని నటాసా పేర్కొంది. సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే ఎదుగుదల సాధిస్తామని చెప్పింది. గతేడాది చెడుతో పాటు మంచి అనుభవాలు కూడా ఉన్నాయని అంది. వయసుతో కాకుండా అనుభవాలతోనే పరిణతి చెందుతామని చెప్పుకొచ్చింది.కెరీర్ గురించి మాట్లాడుతూ.. హార్దిక్తో పెళ్లి తర్వాత ప్రొఫెషన్కు ఐదేళ్లు దూరంగా ఉన్నాను. తిరిగి కెరీర్ను పునఃప్రారంభించాలని అనుకుంటున్నాను. ఐదేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ కెరీర్ను మొదలు పెట్టడం అంత ఈజీ కాదు. కష్టపడి పని చేస్తూ, నన్ను నేను మెరుగుపర్చుకునేందుకు ఇష్టపడే వ్యక్తిని కాబట్టి నా ప్రయత్నాలు కొనసాగిస్తాను. ఏదీ వీలు కాకపోతే మరో కెరీర్ను ఎంచుకుంటాను.నటాసా మార్చి 4వ తేదీన తన 33వ పుట్టిన రోజు జరుపుకుంది. దీనిపై మాట్లాడుతూ.. ఈ పుట్టిన రోజు నాకు చాలా స్పెషల్. అగస్త్యతో చాలా సరదాగా గడిపాను. నాకు ఇష్టమైన వ్యక్తులతో ఆనందంగా ఉన్నాను. ఈ ఏడాది నాకు కెరీర్పరంగా, పర్సనల్గా చాలా ప్రత్యేకమైంది.సెర్బియాకు చెందిన నటాసాను హార్దిక్ పాండ్యా 2020లో ప్రేమించి వివాహం చేసుకున్నాడు. నటాసాను విడిపోయాక హార్దిక్ క్రికెట్తో బిజీ అయిపోయాడు. ఇటీవలే టీమిండియా సభ్యుడిగా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన హార్దిక్.. ప్రస్తుతం ఐపీఎల్లో బిజీగా ఉన్నాడు. హార్దిక్ గత సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. -
4 ఓవర్లలో 76 రన్స్ ఇచ్చాడు.. జట్టులో అవసరమా?: భారత మాజీ క్రికెటర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) -2025లో రాజస్తాన్ రాయల్స్కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది. సన్రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)తో ఆదివారం నాటి మ్యాచ్లో రాయల్స్ 44 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రాజస్తాన్ బౌలింగ్ను రైజర్స్ బ్యాటర్లు చితక్కొట్టారు. విధ్వంసకర బ్యాటింగ్తో విరుచుకుపడి.. రాయల్స్ బౌలర్లకు పీడకల మిగిల్చారు.ఫలితంగా ఆ జట్టు ఏకంగా 286 పరుగులు సాధించింది. అయితే, లక్ష్య ఛేదనలో రాయల్స్ 242 పరుగులకే పరిమితం కావడంతో ఓటమి తప్పలేదు. ఇక తమ రెండో మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. ఇరుజట్లకు ఈ మ్యాచ్ కీలకంగువాహతి వేదికగా బుధవారం కేకేఆర్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇక గత మ్యాచ్లో కోల్కతా (ఆర్సీబీ చేతిలో) కూడా ఓడిపోవడంతో ఇరుజట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజస్తాన్ రాయల్స్ బౌలర్ల వైఫల్యం కొనసాగితే మాత్రం ఆ జట్టుకు మరో ఓటమి తప్పదని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా విదేశీ పేసర్లు జోఫ్రా ఆర్చర్, ఫజల్హక్ ఫారూకీలను తుదిజట్టులో కొనసాగించే అంశంపై యాజమాన్యం తీసుకునే నిర్ణయమే కీలకం కానుందని పేర్కొన్నాడు.4 ఓవర్లలో 76 రన్స్ ఇచ్చాడు.. జట్టులో అవసరమా?‘‘బౌలింగ్ విభాగంలో రాజస్తాన్ రాయల్స్కు ఆందోళన తప్పదు. ముఖ్యంగా జోఫ్రాపైనే ప్రస్తుతం అందరూ దృష్టి పెట్టారు. నిజానికి రాయల్స్ జట్టులో ఆరుగురు విదేశీ ప్లేయర్లు ఉన్నారు. మిగతా జట్లలో ఎనిమిది మంది ఉన్నారు. అయితే, తమకున్న ఆరుగురిలో రాజస్తాన్ ఇద్దరు ఫాస్ట్ బౌలర్లను కలిగి ఉంది.వాళ్లు గత మ్యాచ్లో ఆడారు. ఒకరేమో (జోఫ్రా) నాలుగు ఓవర్లలో ఏకంగా 76 పరుగులు ఇచ్చి ఐపీఎల్ చరిత్రలోనే నాసిరకమైన స్పెల్తో అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. మరొకరు ఫజల్హక్ ఫారూకీ.. జోఫ్రాతో పాటు అతడి బౌలింగ్నూ ప్రత్యర్థి బ్యాటర్లు చితక్కొట్టారు.ప్రతి బౌలర్ కెరీర్లో ఎప్పుడో ఒకసారి ఇలాంటి చేదు అనుభవం ఉండటం సహజమే. అయితే, జట్టులో ఉన్న ఇద్దరు విదేశీ బౌలర్లు ఇలా ధారాళంగా పరుగులు ఇచ్చుకుంటే ఏం చేయాలన్న అంశంపై యాజమాన్యానికి స్పష్టత కొరవడుతుంది. వాళ్లిద్దరిలో ఒకరిపై వేటు వేస్తేనే బెటర్.మఫాకాను ఆడించండిసౌతాఫ్రికా యువ బౌలర్ క్వెనా మఫాకాను జోఫ్రా లేదంటే ఫారూకీ స్థానంలో ఆడించండి. అయినా సరే.. రాజస్తాన్ బౌలింగ్ విభాగం కచ్చితంగా రాణిస్తుందని చెప్పలేం’’ అని ఆకాశ్ చోప్రా సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు వెల్లడించాడు. ఇక రాజస్తాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ గురించి ప్రస్తావిస్తూ.. ఈసారి అతడు ఆరెంజ్ క్యాప్(అత్యధిక పరుగులు) సాధిస్తాడని అంచనా వేశాడు.‘‘రాజస్తాన్ రాయల్స్ జట్టులో ఇద్దరు యువ ఆటగాళ్లు నా దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఒకరేమో కెప్టెన్ రియాన్ పరాగ్. మరొకరు యశస్వి జైస్వాల్. ఈసారి జైసూ ఆరెంజ్ క్యాప్ గెలుపొందినా ఆశ్చర్యం లేదు. గత సీజన్లో అతడి ఫామ్ బాగాలేదు. అయినంత మాత్రాన ప్రతిసారి అలాగే ఉంటుందని భావించలేము’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.కాగా గత మ్యాచ్లో జైస్వాల్ ఐదు బంతులు ఎదుర్కొని కేవలం ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. మరోవైపు జోఫ్రా నాలుగు ఓవర్లలో ఏకంగా 76 పరుగులు ఇవ్వగా.. ఫారూకీ మూడు ఓవర్లు పూర్తి చేసి 49 రన్స్ సమర్పించుకున్నాడు. మహీశ్ తీక్షణ(2/52), సందీప్ శర్మ 2/51) పరుగులు ఇచ్చినా రెండేసి వికెట్లు తీయగలిగారు.చదవండి: ఇదేం కెప్టెన్సీ గిల్? ఏమీ పట్టనట్టే ఉన్నావు ఎందుకు?: సెహ్వాగ్ -
ఐపీఎల్-2025లో నేడు (మార్చి 26) మరో బిగ్ ఫైట్.. ఏ జట్టు బోణీ కొడుతుంది..?
ఐపీఎల్ 2025లో ఇవాళ (మార్చి 26) మరో బిగ్ ఫైట్ జరుగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్.. రాజస్థాన్ రాయల్స్ను ఢీకొట్టనుంది. గౌహతి వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్లో గెలిచి బోణీ విజయం సాధించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఈ సీజన్లో కేకేఆర్, రాయల్స్ తమతమ తొలి మ్యాచ్ల్లో ఓటమిపాలయ్యాయి. కేకేఆర్.. ఆర్సీబీ చేతిలో, రాయల్స్ సన్రైజర్స్ చేతిలో పరాజయం పాలయ్యాయి.డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన కేకేఆర్ ఆర్సీబీతో మ్యాచ్లో తడబడింది. ఆ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అంచనాలను అందుకోలేకపోయింది. బ్యాటింగ్లో కొత్త కెప్టెన్ అజింక్య రహానే పర్వాలేదనిపించగా.. సునీల్ నరైన్ ఆల్రౌండర్గా రాణించాడు. డికాక్, వైస్ కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, రసెల్ నిరాశపరిచారు. భారీ అంచనాల మధ్యలో బరిలోకి దిగిన వరుణ్ చక్రవర్తి తేలిపోయాడు. ఆర్సీబీ బ్యాటర్లు వరుణ్ను ఆటాడుకున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ వైభవ్ అరోరా, మరో పేసర్ స్పెన్సర్ జాన్సన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. హర్షిత రాణాను ప్రత్యర్ధి బ్యాటర్లు ఉతికి ఆరేశారు. మొత్తంగా తొలి మ్యాచ్లో అన్ని విభాగాల్లో విఫలమైన కేకేఆర్ నేడు రాయల్స్తో జరుగబోయే మ్యాచ్లో సత్తా చాటాలని భావిస్తుంది.రాయల్స్ విషయానికొస్తే.. ఈ జట్టు బ్యాటర్లు సన్రైజర్స్తో జరిగిన తమ తొలి మ్యాచ్లో భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ కూడా సత్తా చాటారు. గాయం కారణంగా ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన రెగ్యులర్ కెప్టెన్ సంజూ శాంసన్, వికెట్ కీపర్ దృవ్ జురెల్ మెరుపు అర్ద సెంచరీలతో విరుచుకుపడ్డారు. హెట్మైర్, శుభమ్ దూబే కూడా ధనాధన్ బ్యాటింగ్ చేశారు. భారీ అంచనాలకు కలిగిన యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, నితీశ్ రాణా మాత్రం నిరాశపరిచారు. బౌలరల్లో జోఫ్రా ఆర్చర్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. అతను 4 ఓవర్లలో ఏకంగా 76 పరుగులిచ్చాడు. ఫజల్ హక్ ఫారూకీ, తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే కూడా ఊహించిన దానికంటే ఎక్కువ పరుగులు ఇచ్చారు. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ చిచ్చరపిడుగుల ముందు రాయల్స్ బౌలర్లు తేలిపోయారు. కేకేఆర్తో జరుగబోయే నేటి మ్యాచ్లో బౌలింగ్ లోపాలను అధిగమించాలని రాయల్స్ భావిస్తుంది.హెడ్ టు హెడ్ రికార్డుల విషయానికొస్తే.. ఇరు జట్లకు ఇప్పటివరకు 30 మ్యాచ్ల్లో తలపడగా.. తలో 14 మ్యాచ్లు గెలిచాయి. రెండు మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు. ఇరు జట్ల మధ్య చివరిసారి జరిగిన మ్యాచ్ రద్దైంది. ఆ మ్యాచ్ కూడా నేటి మ్యాచ్ జరుగబోయే గౌహతిలో జరగాల్సి ఉండింది. దీనికి ముందు గత సీజన్లోనే జరిగిన మరో మ్యాచ్లో కేకేఆర్ నిర్దేశించిన 224 పరుగుల భారీ లక్ష్యాన్ని రాయల్స్ చివరి బంతికి ఛేదించింది. ఆ మ్యాచ్లో జోస్ బట్లర్ సూపర్ సెంచరీ చేసి రాయల్స్ను గెలిపించాడు. అదే మ్యాచ్లో కేకేఆర్ తరఫున సునీల్ నరైన్ కూడా శతక్కొట్టాడు. పూర్తి జట్లు..కోల్కతా నైట్ రైడర్స్: క్వింటన్ డికాక్, సునీల్ నరైన్, అజింక్య రహానే(కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, అన్రిచ్ నోర్జే, మనీశ్ పాండే, వైభవ్ అరోరా, అనుకూల్ రాయ్, లవ్నిత్ సిసోడియా, చేతన్ సకారియా, రహ్మానుల్లా గుర్బాజ్, మయాంక్ మార్కండే, రోవ్మన్ పావెల్, మొయిన్ అలీరాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, నితీష్ రాణా, రియాన్ పరాగ్(కెప్టెన్), దృవ్ జురెల్, షిమ్రోన్ హెట్మెయర్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్పాండే, సందీప్ శర్మ, ఫజల్హాక్ ఫరూఖీ, సంజూ శాంసన్, కునాల్ సింగ్ రాథోడ్, ఆకాశ్ మధ్వాల్, కుమార్ కార్తికేయ, క్వేనా మఫాకా, వనిందు హసరంగ, యుధ్వీర్ సింగ్ చరక్, అశోక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ -
ఇదేం కెప్టెన్సీ గిల్? ఏమీ పట్టనట్టే ఉన్నావు ఎందుకు?: సెహ్వాగ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) -2025 సీజన్ను గుజరాత్ టైటాన్స్ పరాజయంతో ప్రారంభించింది. తమ తొలి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో తలపడి పదకొండు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఫలితంగా పంజాబ్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తొలి విజయం అందుకోగా.. గుజరాత్ సారథిగా శుబ్మన్ గిల్ (Shubman Gill)కు మరోసారి చేదు అనుభవమే ఎదురైంది.శ్రేయస్ అటు బ్యాటర్గా.. ఇటు కెప్టెన్గా తనదైన ముద్ర వేయగా.. గిల్ మాత్రం రెండు పాత్రల్లోనూ తేలిపోయాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ గిల్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో గిల్ కెప్టెన్సీ తప్పిదాలే ఓటమికి పరోక్ష కారణాలంటూ విమర్శించాడు.పవర్ ప్లేలో బౌలర్ల మార్పులుముఖ్యంగా బౌలర్ల సేవలను వినియోగించుకోవడంలో గుజరాత్ సారథి విఫలమయ్యాడని వీరూ భాయ్ అభిప్రాయపడ్డాడు. ‘‘ఈ మ్యాచ్లో శుబ్మన్ గిల్ కెప్టెన్సీ అతడి స్థాయికి తగినట్లుగా లేదు. అసలు తను మైదానంలో చురుగ్గా ఉన్నట్లే కనిపించలేదు. సిరాజ్ బాగానే బౌలింగ్ చేస్తున్నాడులే అనుకునే సరికి.. అర్షద్ ఖాన్ను తీసుకువచ్చాడు.ఏమీ పట్టనట్టే ఉన్నావు ఎందుకు?అతడేమో పవర్ ప్లేలోనే ఏకంగా 21 పరుగులు ఇచ్చాడనుకుంటా! అదే పంజాబ్కు మొమెంటమ్ను ఇచ్చింది. ఒకవేళ సిరాజ్ గనుక కొత్త బంతితో రాణిస్తే.. అతడిని డెత్ ఓవర్ల వరకు వేచి ఉంచాల్సిన పనిలేదు. నిజం చెప్పాలంటే ఆఖర్లోనూ సిరాజ్ బౌలింగ్లో పంజాబ్ బ్యాటర్లు భారీగానే పరుగులు పిండుకున్నారు’’ అని వీరేంద్ర సెహ్వాగ్ క్రిక్బజ్ షోలో పేర్కొన్నాడు.కెప్టెన్గా పరిస్థితులకు తగ్గట్లు మార్పులు చేయాలని.. కానీ శుబ్మన్ గిల్ మాత్రం తనకేమీ పట్టదన్నట్లుగా ఉండిపోయాడని సెహ్వాగ్ ఈ సందర్భంగా విమర్శించాడు. ఓ బౌలర్ మెరుగ్గా రాణిస్తున్న వేళ.. అతడిని తప్పించి మరొకరిని తీసుకురావడం సరికాదని పేర్కొన్నాడు. గిల్ ఇకనైనా తన ప్రణాళికలు, వ్యూహాల అమలులలో పరిస్థితికి తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోవాలని.. లేదంటే మున్ముందు గుజరాత్కు కష్టాలు తప్పవని పేర్కొన్నాడు.సిరాజ్ ధారాళంగాకాగా గుజరాత్ టైటాన్స్ తమ సొంతమైదానం అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్తో మంగళవారం మ్యాచ్ ఆడింది. నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ గెలిచిన టైటాన్స్.. పంజాబ్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో టైటాన్స్ బౌలింగ్ ఎటాక్ ఆరంభించిన టీమిండియా పేసర్ సిరాజ్.. తొలి ఓవర్లో కేవలం ఎనిమిది పరుగులే ఇచ్చాడు.మరుసటి ఓవర్లో సౌతాఫ్రికా స్పీడ్స్టర్ కగిసో రబడను గిల్ బరిలోకి దించగా.. అతడు 8 పరుగులు మాత్రమే ఇచ్చుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ సిరాజ్ రంగంలోకి దిగి.. 12 పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాత రబడ ఓవర్లో తొలి వికెట్ దక్కించుకుంది టైటాన్స్.అయితే, వీరిద్దరిని పక్కనపెట్టిన గిల్.. ఐదో ఓవర్లో అర్షద్ ఖాన్ను తీసుకురాగా.. అతడు ఏకంగా 21 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక మళ్లీ పదిహేనో ఓవర్ దాకా గిల్ సిరాజ్ చేతికి బంతినివ్వలేదు. మళ్లీ ఆఖరి ఓవర్లో సిరాజ్ను రంగంలోకి దించగా.. ఈసారి ఏకంగా 23 పరుగులు ఇచ్చేశాడు. మొత్తంగా నాలుగు ఓవర్ల కోటాలో 54 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.శ్రేయస్ ధనాధన్ఈ నేపథ్యంలో సెహ్వాగ్ గిల్ కెప్టెన్సీ తీరుపై పైవిధంగా స్పందించాడు. ఇదిలా ఉంటే.. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. అరంగేట్ర ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(23 బంతుల్లో 47) మెరుపులు మెరిపించగా.. వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ శ్రేయస్ 42 బంతుల్లో 97 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇక మార్కస్ స్టొయినిస్ (15 బంతుల్లో 20) ఫర్వాలేదనిపించగా.. ఆఖర్లో శశాంక్ సింగ్ మెరుపులు(16 బంతుల్లోనే 44 నాటౌట్) మెరిపించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ కేవలం ఐదు వికెట్లు నష్టపోయి 243 పరుగులు నమోదు చేసింది. లక్ష్య ఛేదనను ఘనంగా ఆరంభించిన గుజరాత్.. ఆఖరి వరకు పోరాడి ఓడిపోయింది.టైటాన్స్ బ్యాటర్లలో ఓపెనర్ సాయి సుదర్శన్ (41 బంతుల్లో 74), జోస్ బట్లర్ (33 బంతుల్లో 54) అర్ధ శతకాలతో రాణించగా.. శుబ్మన్ గిల్(14 బంతుల్లో 33), షెర్ఫానే రూథర్ఫర్డ్(28 బంతుల్లో 46) వేగంగా ఆడే క్రమంలో వికెట్లు కోల్పోయారు. ఈ నేపథ్యంలో 232 పరుగులకే పరిమితమైన టైటాన్స్కు ఓటమి తప్పలేదు.చదవండి: అస్సలు జీర్ణించుకోలేకపోయా.. అయినా భాయ్కు అంతా తెలుసు: సిరాజ్Punjab Kings hold their nerves in the end to clinch a splendid win against Gujarat Titans ❤️Scorecard ▶ https://t.co/PYWUriwSzY#TATAIPL | #GTvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/0wy29ODStQ— IndianPremierLeague (@IPL) March 25, 2025 -
ICC: ఎలైట్ ప్యానెల్ అంపైర్ల జాబితా విడుదల.. ఆ ఇద్దరికి దక్కని చోటు
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2025–2026 సీజన్కుగాను పన్నెండు మందితో కూడిన ఎలైట్ అంపైర్ల ప్యానెల్ జాబితాను ప్రకటించింది. భారత్కు చెందిన నితిన్ మేనన్ తన స్థానాన్ని నిలబెట్టుకోగా... మైకేల్ గాఫ్ (ఇంగ్లండ్), జోయల్ విల్సన్ (ట్రినిడాడ్) చోటు కోల్పోయారు. మైకేల్ గాఫ్, జోయల్ విల్సన్ స్థానాల్లో అల్లావుద్దీన్ పాలేకర్ (దక్షిణాఫ్రికా), అలెక్స్ వార్ఫ్ (ఇంగ్లండ్) తొలిసారి ఎలైట్ అంపైర్ల జాబితాలోకి వచ్చారు. ఇదిలా ఉంటే.. మధ్యప్రదేశ్కు చెందిన 41 ఏళ్ల నితిన్ 23 ఏళ్లకే అంపైర్గా మారాడు. ఇప్పటి వరకు నితిన్ పురుషుల విభాగంలో 30 టెస్టులు, 60 వన్డేలు, 50 టి20 మ్యాచ్ల్లో... మహిళల విభాగంలో 20 టి20 మ్యాచ్ల్లో అంపైర్గా విధులు నిర్వర్తించాడు.ఇక భారత్కే చెందిన జయరామన్ మదనగోపాల్కు ఎమర్జింగ్ అంపైర్ల ప్యానెల్లోకి ప్రమోషన్ లభించింది. ‘ఎమర్జింగ్’ జాబితాలో ఉన్న వారికి విదేశాల్లో జరిగే అంతర్జాతీయ మ్యాచ్ల్లో కూడా అంపైరింగ్ చేసే అవకాశం లభిస్తుంది. తమిళనాడుకు చెందిన 50 ఏళ్ల జయరామన్ ఇప్పటి వరకు ఒక టెస్టు, 22 వన్డేలు, 42 అంతర్జాతీయ టి20 మ్యాచ్ల్లో అంపైరింగ్ చేశారు. ఎలైట్ అంపైర్ల జాబితానితిన్ మేనన్ (భారత్), కుమార్ ధర్మసేన (శ్రీలంక), రిచర్డ్ కెటిల్బరో (ఇంగ్లండ్), క్రిస్టోఫర్ గాఫ్నీ (న్యూజిలాండ్), ఆడ్రియన్ హోల్డ్స్టాక్ (దక్షిణాఫ్రికా), రిచర్డ్ ఇలింగ్వర్త్ (ఇంగ్లండ్), ఎహసాన్ రజా (పాకిస్తాన్), పాల్ రీఫెల్ (ఆస్ట్రేలియా), షర్ఫుద్దౌలా షాహిద్ (బంగ్లాదేశ్), రాడ్నీ టకర్ (ఆ్రస్టేలియా), అల్లావుద్దీన్ పాలేకర్ (దక్షిణాఫ్రికా), అలెక్స్ వార్ఫ్ (ఇంగ్లండ్). నిలకడగా తమీమ్ ఆరోగ్యం ఢాకా: బంగ్లాదేశ్ మాజీ క్రికెట్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. సోమవారం ఢాకా ప్రీమియర్ లీగ్ (డీపీఎల్) మ్యాచ్ ఆడుతున్న సమయంలో 36 ఏళ్ల తమీమ్కు గుండెపోటు వచ్చింది. దీంతో ఆస్పత్రికి తరలించగా... వైద్యులు ఏంజియోప్లాస్టీ నిర్వహించారు. ప్రస్తుతానికి అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని... మరో 48 గంటలు పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు తెలిపారు.ఆ తర్వాత కూడా విశ్రాంతి అవసరమని వెల్లడించారు. ‘అతడి గుండె పనితీరు మెరుగ్గానే ఉంది. అయితే ఎలాంటి చాన్స్ తీసుకోవాలనుకోవడం లేదు. తమీమ్ మా జాతీయ ఆస్తి. మరో రెండు మూడు రోజులు పర్యవేక్షణలో ఉంచుతాం’ అని డాక్టర్ అబ్దుల్ వదూద్ అన్నారు.ప్రస్తుతానికి విశ్రాంతి అవసరమని... ఎలాంటి అంశాలకైనా అతిగా స్పందించకూడదని సూచించాడు. మూడు నెలల తర్వాత తమీమ్ తిరిగి క్రికెట్ ఆడొచ్చని పేర్కొన్నారు. మొహమ్మదాన్ స్పోరి్టంగ్ క్లబ్కు తమీమ్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. సోమవారం షినెపుకార్ జట్టుతో మ్యాచ్ సందర్భంగా అస్వస్థతకు గురికాగా... వైద్య సిబ్బంది ఏంజియోప్లాస్టీ నిర్వహించారు.క్లిష్ట సమయంలో అండగా నిలిచిన వారికి తమీమ్ ధన్యవాదాలు తెలిపాడు. ‘ఆ దేవుడి దయ, మీ అందరి ప్రార్థనలతో తిరిగి బతికాను. ఇలాంటి మంచి మనుషుల మధ్య ఉండటం నా అదృష్టం. తోటివాళ్లకు అండగా నిలవడం చాలా గొప్ప విషయం. ప్రతి ఒక్కరూ ఇలాగే ఉండాలి. అందరికీ ధన్యవాదాలు’ అని తమీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. -
ODI WC Qualifiers: విండీస్ జట్టు ప్రకటన.. స్టార్ ఆల్రౌండర్ అవుట్
బ్రిడ్జ్టౌన్: వచ్చే నెలలో జరిగే మహిళల క్రికెట్ వన్డే వరల్డ్కప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో పాల్గొనే వెస్టిండీస్ జట్టును విండీస్ బోర్డు ప్రకటించింది. స్టార్ ఆల్రౌండర్ డియాండ్ర డాటిన్ గాయం కారణంగా ఈ టోర్నీకి దూరమైనట్లు తెలిపింది. కాగా భారత్లో జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ టోర్నీ సందర్భంగా డాటిన్ గాయపడిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. గత ఏడాది టీ20 వరల్డ్కప్లో డాటిన్ విండీస్ తరఫున టాప్ స్కోరర్(ఐదు మ్యాచ్లలో కలిపి 120 పరుగులు)గా నిలిచింది. ఇక తాజా వన్డే వరల్డ్కప్ క్వాలిఫయింగ్ టోర్నీ ఆడే పదిహేను మంది సభ్యులతో కూడిన వెస్టిండీస్ జట్టుకు.. మరో ఆల్రౌండర్ హేలీ మాథ్యూస్ నాయకత్వం వహిస్తుంది. ఏప్రిల్ 9 నుంచి 19వ తేదీ వరకు పాకిస్తాన్లోని లాహోర్ నగరంలో ఈ టోర్నీ జరుగుతుంది.ఈ టోర్నీలో వెస్టిండీస్తో పాటు పాకిస్తాన్, స్కాట్లాండ్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, థాయ్లాండ్ జట్లు పోటీపడనున్నాయి. ఈ టోర్నీలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెప్టెంబరు–అక్టోబర్లలో భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్కప్ టోర్నీకి అర్హత సాధిస్తాయి. ఇదిలా ఉంటే.. డియాండ్ర డాటిన్ మహిళల ప్రీమియర్ లీగ్-2025లో గుజరాత్ జెయింట్స్కు ప్రాతినిథ్యం వహించింది. ఈ స్టార్ ఆల్రౌండర్ను గుజరాత్ ఏకంగా రూ. 1.70 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, ముంబై ఇండియన్స్ వుమెన్ టీమ్తో కీలక ఎలిమినేటర్ మ్యాచ్కు ముందు డాటిన్ గాయపడింది. ఈ మ్యాచ్లో గుజరాత్ ఓడి ఇంటిబాట పట్టగా.. ముంబై ఫైనల్కు చేరి రెండోసారి చాంపియన్గా అవతరించింది.వెస్టిండీస్ జట్టు: హేలీ మాథ్యూస్ (కెప్టెన్), షెర్మయిన్ క్యాంప్బెల్, అలియా అలెన్, అఫీ ఫ్లెచర్, చెర్రీ ఆన్ ఫ్రేజర్, షబీకా గజ్నబీ, జనీలియా గ్లాస్గో, చినెల్లీ హెన్రీ, జైదా జేమ్స్, కియానా జోసెఫ్, మాండీ మంగ్రూ, అష్మిని మునిసార్, కరిష్మా రాంహరాక్, స్టెఫానీ టేలర్, రషాదా విలియమ్స్. -
GT VS PBKS: నిస్వార్థమైన కెప్టెన్, సెంచరీ ముఖ్యం కాదన్నాడు: శ్రేయస్పై శశాంక్ ప్రశంసలు
ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో నిన్న (మార్చి 25) జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సెంచరీని త్యాగం చేసి మరీ తన జట్టును గెలిపించాడు. శ్రేయస్కు సెంచరీ చేసే అవకాశం ఉన్నా జట్టు ప్రయోజనాల కోసం శశాంక్ సింగ్కు స్ట్రయిక్ ఇచ్చి నిస్వార్దమైన కెప్టెన్ అనిపించుకున్నాడు. కెప్టెన్ త్యాగాన్ని శశాంక్ వృధా కానివ్వలేదు. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఏకంగా 23 పరుగులు సాధించాడు. ఫలితంగా పంజాబ్ భారీ స్కోర్ చేసింది. చివరి ఓవర్లో శశాంక్ చేసిన పరుగులే అంతిమంగా పంజాబ్ గెలుపుకు దోహదపడ్డాయి.ఒకవేళ శ్రేయస్ జట్టు ప్రయోజనాలు పట్టించుకోకుండా సెంచరీనే ముఖ్యమనుకునే ఉంటే ఈ మ్యాచ్లో పంజాబ్ ఓటమిపాలయ్యేది. ఎందుకంటే గుజరాత్, పంజాబ్ మధ్య పరుగుల తేడా కేవలం 11 పరుగులు మాత్రమే. శ్రేయస్ వ్యక్తిగత స్వార్దం చూసుకుని సెంచరీ కోసం ప్రయత్నించి ఉంటే చివరి ఓవర్లో మహా అయితే 10-15 పరుగులు వచ్చేవి. ఇదే జరిగి ఉంటే పంజాబ్ 230-235 పరుగులకు పరిమితం కావాల్సి వచ్చేది. అప్పుడు గుజరాత్ సునాయాసంగా లక్ష్నాన్ని ఛేదించి ఉండేది.పంజాబ్ ఇన్నింగ్స్ చివరి ఓవర్కు ముందు శ్రేయస్ 97 పరుగులతో అజేయంగా ఉన్నాడు. ఆ ఓవర్లో కనీసం ఒక్క బంతి ఎదుర్కొన్నా శ్రేయస్ సెంచరీ చేసేవాడు. కానీ అతను స్ట్రయిక్ కోసం పాకులాడలేదు. శశాంక్ మంచి టచ్లో ఉన్న విషయాన్ని గమనించి అతన్నే స్ట్రయిక్ తీసుకోమన్నాడు. శశాంక్కు సైతం స్ట్రయిక్ రొటేట్ చేసే అవకాశం రాలేదు. భారీ షాట్టు ఆడే క్రమంలో 5 బంతులు బౌండరీలకు తరలి వెళ్లగా.. ఓ బంతికి రెండు పరుగులు (రెండో బంతి) వచ్చాయి. వాస్తవానికి ఇక్కడ శ్రేయస్ స్ట్రయిక్ తీసుకుని (సింగిల్ తీసుంటే) ఉండవచ్చు. కానీ అతను అలా చేయలేదు.జట్టు ప్రయోజనాల కోసం సెంచరీ త్యాగం చేసిన అనంతరం యావత్ క్రికెట్ ప్రపంచం శ్రేయస్పై ప్రశంసల వర్షం కురిపిస్తుంది. శశాంక్ సింగ్ సైతం మ్యాచ్ అనంతరం తన కెప్టెన్ను కొనియాడాడు. శశాంక్ మాటల్లో.. టీ20ల్లో, ముఖ్యంగా ఐపీఎల్లో సెంచరీ చేసే అవకాశం అంత ఈజీగా రాదు. కానీ మా కెప్టెన్ సెంచరీ చేసే అవకాశం ఉన్నా జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఆ అవకాశాన్ని వదులుకున్నాడు. చివరి ఓవర్ మొత్తం నన్నే స్ట్రయిక్ తీసుకొని భారీ షాట్లు ఆడమన్నాడు. తన సెంచరీ గురించి ఆలోచించొద్దని చెప్పాడు. నేను స్వయంగా స్ట్రయిక్ రొటేట్ చేస్తానని చెప్పాను. కానీ అతను నాకు సెంచరీ ముఖ్యం కాదని చెప్పాడు. ఇలా చెప్పాలంటే ఏ కెప్టెన్కు అయినా చాలా గట్స్ ఉండాలి. మా కెప్టెన్కు ఆ గట్స్ ఉన్నాయి. శ్రేయస్ నన్ను ప్రతి బంతిని సిక్సర్ లేదా బౌండరీ కొట్టేందుకు ప్రయత్నించమని చెప్పాడు. అది నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. కెప్టెన్ ఇచ్చిన ఫ్రీ హ్యాండ్తో నేను రెచ్చిపోయాను.కాగా, శ్రేయస్ (42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 97 పరుగులు నాటౌట్), శశాంక్తో పాటు (16 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 44 పరుగులు నాటౌట్), ప్రియాంశ్ ఆర్య (23 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 47 పరుగులు) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ 232 పరుగులకే పరిమితమై 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. గుజరాత్ ఇన్నింగ్స్లో సాయి సుదర్శన్ (41 బంతుల్లో 74; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), శుభ్మన్ గిల్ (14 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), జోస్ బట్లర్ (33 బంతుల్లో 54; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రూథర్ఫోర్డ్ (28 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తా చాటారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ 2, జన్సెన్, మ్యాక్స్వెల్ తలో వికెట్ పడగొట్టారు. -
IPL 2025: అతడి యార్కర్లు అద్భుతం.. మా విజయావకాశాలను మేమే వదులుకున్నాం: గిల్
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మార్చి 25) జరిగిన మ్యాచ్లో గుజరాత్పై పంజాబ్ 11 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ (97 నాటౌట్) సెంచరీ చేసే అవకాశం ఉన్నా, వదలుకుని తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆరంభంలో ప్రియాంశ్ ఆర్య, ఆఖర్లో శశాంక్ సింగ్ మెరుపు ఇన్నింగ్స్లు ఆడి పంజాబ్ భారీ స్కోర్ చేసేందుకు దోహద పడ్డారు.భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ కూడా అద్భుతంగా పోరాడింది. అయితే మధ్య ఓవర్లలో పంజాబ్ బౌలర్లు వారిని దెబ్బకొట్టారు. ఇన్నింగ్స్ 15, 16, 17 ఓవర్లలో గుజరాత్ కేవలం 18 పరుగులే చేయగలిగింది. ఇక్కడే ఆ జట్టు మ్యాచ్ను కోల్పోయింది. పంజాబ్ బౌలర్లలో విజయ్కుమార్ వైశాక్, అర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. కీలక సమయంలో వరుస యార్కర్లతో విరుచుకుపడి గుజరాత్ బ్యాటర్లను కట్టడి చేశారు. గుజరాత్ తరఫున సాయి సుదర్శన్, రూథర్ఫోర్డ్ మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడ్డారు. అయినా వారి మెరుపులు సరిపోలేదు. ఇన్నింగ్స్ మధ్యలో పరుగులు రాబట్టలేకపోవడమే గుజరాత్ కొంపముంచింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. శ్రేయస్ 42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 97 పరుగులు (నాటౌట్), శశాంక్ 16 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 44 పరుగులు (నాటౌట్), ప్రియాంశ్ ఆర్య 23 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేశారు. మ్యాక్స్వెల్ డకౌట్ కాగా.. ఒమర్జాయ్ 16, స్టోయినిస్ 20 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో సాయికిషోర్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో కేవలం 30 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీయగా.. రబాడ, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 232 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుజరాత్ ఆటగాళ్లలో సాయి సుదర్శన్ (41 బంతుల్లో 74; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), శుభ్మన్ గిల్ (14 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), జోస్ బట్లర్ (33 బంతుల్లో 54; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రూథర్ఫోర్డ్ (28 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తా చాటారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ 2, జన్సెన్, మ్యాక్స్వెల్ తలో వికెట్ పడగొట్టారు.మ్యాచ్ అనంతరం గుజరాత్ కెప్టెన్ శుభ్న్ గిల్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. బౌలింగ్, బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మంచి అవకాశాలు లభించాయి. అయితే మేము వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాం. చాలా పరుగులు ఇచ్చామని అనుకుంటున్నాను. మా విజయావకాశాలను చేజేతులా వదులుకున్నాం. 15, 16, 17 ఓవర్లలో కేవలం 18 పరుగులే చేసాము. మొదటి మూడు ఓవర్లు కూడా ఎక్కువ పరుగులు చేయలేకపోయాము. ఇక్కడే మేము ఆటను కోల్పోయాము. చాలా సానుకూల అంశాలు కూడా ఉన్నాయి. సీజన్కు మంచి ప్రారంభం లభించిందని అనుకుంటున్నాను.విజయ్ కుమార్ వైశాక్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 15 ఓవర్లు బెంచ్పై కూర్చొని, ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి యార్కర్లు వేయడం అంత సులభం కాదు. వరుసగా యార్కర్లు వేయగలిగినందుకు వారికి (పంజాబ్ బౌలర్లు) క్రెడిట్ ఇవ్వాలి. ఈ వికెట్ బ్యాటింగ్ చేసేందుకు చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఈజీగా 240-250 పరుగులు స్కోర్ చేయవచ్చు. అయితే ఆ స్కోర్ను కాపాడుకోవాల్సి ఉంటుంది. -
సెంచరీ త్యాగం చేసినందుకు బాధ లేదు.. ఆ పరుగులే మమ్మల్ని గెలిపించాయి: శ్రేయస్
పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ తొలి మ్యాచ్లోనే తన మార్కు చూపించాడు. సెంచరీ చేసే అవకాశం ఉన్నా, త్యాగం చేసి మరీ తన జట్టును గెలిపించాడు. శ్రేయస్ కెప్టెన్సీ ప్రభావం ఈ మ్యాచ్లో కొట్టొచ్చినట్లు కనిపించింది. బౌలర్లను మార్చడం, ఫీల్డ్ను సెట్ చేయడం, వ్యూహాలు పన్నడంలో శ్రేయస్ తిరుగులేని నాయకుడని మరోసారి నిరూపితమైంది. అర్షదీప్ సింగ్, విజయ్కుమార్ వైశాక్లను శ్రేయస్ అద్భుతంగా వాడుకున్నాడు. వ్యక్తిగతంగా సఫలమైన శ్రేయస్ సహచరుల్లో స్పూర్తి నింపడంలో కూడా సక్సెస్ అయ్యాడు. ఫలితంగా పంజాబ్ ఐపీఎల్లో తమ రెండో అత్యధిక స్కోర్ను నమోదు చేసి దాన్ని విజయవంతంగా కాపాడుకుంది.అహ్మదాబాద్ వేదికగా నిన్న (మార్చి 25) జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ను 11 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ చేసింది. గుజరాత్ నిర్ణయం తప్పని అరంగేట్రం ఆటగాడు ప్రియాంశ్ ఆర్య ఆదిలోనే నిరూపించాడు. 24 ఏళ్ల ఈ గవర్నమెంట్ టీచర్ కొడుకు (ఆర్య) తొలి మ్యాచ్ ఆడుతున్నాననే బెరుకు ఏమాత్రం లేకుండా గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 23 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. మరో ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ (8 బంతుల్లో 8; ఫోర్) ఆదిలోనే ఔటైనా శ్రేయస్ అయ్యర్ ఆర్యతో జతకట్టి ఇన్నింగ్స్ను నిర్మించాడు. వీరిద్దరి ధాటికి పంజాబ్ పవర్ ప్లేలో 73 పరుగులు చేసింది.బౌండరీతో ఖాతా ఓపెన్ చేసిన శ్రేయస్ ప్రసిద్ద్ కృష్ణ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో బీస్ట్ మోడ్లోకి వచ్చాడు. 3 సిక్సర్లు, బౌండరీ సహా 24 పరుగులు పిండుకున్నాడు. 19వ ఓవర్ తొలి బంతికే బౌండరీ బాది 95 పరుగులకు చేరిన శ్రేయస్.. ఆతర్వాత సెంచరీ చేసే అవకాశమున్నా (11 బంతులు మిగిలున్నాయి) శాశాంక్ సింగ్కు స్ట్రయిక్ ఇచ్చి అతని చేత విధ్వంసం సృష్టింపజేశాడు. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో పూనకాలు వచ్చినట్లు ఊగిపోయిన శశాంక్.. 5 బౌండరీలు సహా 23 పరుగులు పిండుకున్నాడు. ఫలితంగా పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. శ్రేయస్ 42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 97 పరుగులు చేసి అజేయంగా నిలువగా.. శశాంక్ 16 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 44 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. పంజాబ్ ఆటగాళ్లలో మ్యాక్స్వెల్ డకౌట్ కాగా.. ఒమర్జాయ్ 16, స్టోయినిస్ 20 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో సాయికిషోర్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 30 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీయగా.. రబాడ, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్కు సైతం మెరుపు అరంభమే లభించినప్పటికీ.. లక్ష్యం మరీ పెద్దది కావడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. గుజరాత్ ఆటగాళ్లలో సాయి సుదర్శన్ (41 బంతుల్లో 74; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), శుభ్మన్ గిల్ (14 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), జోస్ బట్లర్ (33 బంతుల్లో 54; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రూథర్ఫోర్డ్ (28 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తా చాటారు. 14 ఓవర్ల వరకు గుజరాత్ టార్గెట్ను ఛేజ్ చేసేలా కనిపించింది. ఈ దశలో పంజాబ్ బౌలర్లు విజయ్కుమార్ వైశాక్, జన్సెన్, అర్షదీప్ గుజరాత్ బ్యాటర్ల జోరుకు కళ్లెం వేశారు. విజయ్కుమార్ గుజరాత్ బ్యాటర్లను బాగా కట్టడి చేశాడు. అంతిమంగా గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 232 పరుగులు మాత్రమే చేయగలిగింది. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ 2, జన్సెన్, మ్యాక్స్వెల్ తలో వికెట్ పడగొట్టారు.మ్యాచ్ అనంతరం శ్రేయస్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. సీజన్ తొలి మ్యాచ్లోనే 97 పరుగులతో నాటౌట్గా నిలవడం శుభపరిణామం. తొలి బంతికే బౌండరీ కొట్టాను. అదే నన్ను ముందుకు నడిపించింది. రబాడ బౌలింగ్లో ఫ్లిక్ సిక్స్ కాన్ఫిడెన్స్ను పెంపొందించింది. చివరి ఓవర్లో శశాంక్ చేసిన పరుగులు చాలా కీలకం. సెంచరీ మిస్ చేసుకున్నందుకు బాధ లేదు. మేము ఓ టార్గెట్ను సెట్ చేసుకున్నాము. దాని కోసం ముందుకు వెళ్లాము. వైశాక్ అద్భుతంగా రాణించాడు. తొలి బంతి నుంచే యార్కర్లు వేయడం ప్రారంభించాడు. యార్కర్ల ప్లాన్ అమలు చేయడంలో అర్షదీప్ కీలకపాత్ర పోషించాడు. బంతి రివర్స్ స్వింగ్ అవుతుందని అర్షదీప్ చెప్పాడు. బంతికి ఉమ్ము రాయడం కలిసొచ్చిందని అనుకుంటున్నాను. అర్షదీప్ సాయి సుదర్శన్ను ఔట్ చేయడంతో మా గెలుపుకు బీజం పడింది. ఇదే ఊపును తదుపరి మ్యాచ్ల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నాము. -
2032 తర్వాత ‘గాబా’ కనుమరుగు
బ్రిస్బేన్: ఆ్రస్టేలియాలోని ప్రఖ్యాత క్రికెట్ స్టేడియం ‘గాబా’ కనుమరుగు కానుంది. సుదీర్ఘకాలంగా ఎన్నో చిరస్మరణీయ మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చిన బ్రిస్బేన్లోని ‘గాబా’ మైదానాన్ని 2032 ఒలింపిక్స్ తర్వాత కూల్చివేయనున్నారు. 2028 ఒలింపిక్స్కు లాస్ ఏంజెలిస్ ఆతిథ్యమిస్తుండగా... మరో నాలుగేళ్ల తర్వాత బ్రిస్బేన్ వేదికగా విశ్వక్రీడలు జరగనున్నాయి. దాని కోసం ఆ్రస్టేలియా ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా... క్వీన్స్లాండ్ ప్రభుత్వం వేదికలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఒలింపిక్స్ కోసం విక్టోరియా పార్క్లో 63 వేల మంది ప్రేక్షకుల సామర్థ్యంతో కూడిన నూతన అధునాతన స్టేడియం నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఇందులోనే ఒలింపిక్స్ ఆరంభ, ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు. విశ్వక్రీడలు ముగిసిన అనంతరం ‘గాబా’ మైదానాన్ని పూర్తిగా పడగొట్టి ఒలింపిక్స్ కోసం నిర్మించిన కొత్త స్టేడియంలోనే క్రికెట్ మ్యాచ్లు జరపనున్నారు. ఒకవేళ 2032 ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ మెడల్ ఈవెంట్గా కొనసాగితే క్రికెట్ ఈవెంట్ స్వర్ణ పతక పోరుకు మాత్రం పాత ‘గాబా’ మైదానమే ఆతిథ్యమివ్వనుంది. ‘గాబా స్టేడియానికి ఎంతో చరిత్ర ఉంది. దశాబ్దాలుగా ఇక్కడ ఎన్నో మరపురాని మ్యాచ్లు జరిగాయి. ఆటగాళ్లకు, అభిమానులకు ఈ మైదానంతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి.అయితే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈ మైదానాన్ని కూల్చివేయనున్నారు. దీని స్థానంలో క్వీన్స్ల్యాండ్లో మరో కొత్త స్టేడియం సిద్ధమవుతుంది. అందులో ఐసీసీ ఈవెంట్లు, యాషెస్ సిరీస్, ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ వంటి ప్రతిష్టాత్మక మ్యాచ్లు యధావిధిగా జరుగుతాయి’ అని క్వీన్స్ల్యాండ్ క్రికెట్ సీఈవో టెర్రీ స్వెన్సన్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. » 1931 నుంచి టెస్టు మ్యాచ్లకు ఆతిథ్యమిస్తున్న ‘గాబా’ స్టేడియంలో ఇప్పటి వరకు 67 పురుషుల టెస్టు మ్యాచ్లు, 2 మహిళల టెస్టులు జరిగాయి. »పేస్కు పెట్టింది పేరైన ‘గాబా’ పిచ్పై ఆ్రస్టేలియా జట్టు 1988 నుంచి 2021 వరకు ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఓడలేదు. 2020–21 పర్యటనలో భాగంగా ఆతిథ్య ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధించింది. »2032 ఒలింపిక్స్ ప్రణాళికల్లో భాగంగా ‘గాబా’ మైదానాన్ని ఆధునీకికరించాలని తొలుత భావించారు. అయితే అధిక వ్యయం కారణంతో ఆ ప్రణాళికను పక్కన పెట్టి పార్క్ల్యాండ్ ఇన్నర్ సిటీలో కొత్త స్టేడియం నిర్మాణం చేపడుతున్నారు. »ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులు దక్కించుకున్న సమయంలో ‘గాబా’ మైదానాన్ని మరింత మెరుగు పరచాలని భావించినా... ఇప్పటికి నాలుగేళ్లు గడిచినా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. »విశ్వక్రీడలకు మరో ఏడేళ్ల సమయమే ఉండటంతో కొత్త స్టేడియం నిర్మాణానికే మొగ్గుచూపారు. »ఇటీవల ఐఓసీ అధ్యక్షురాలిగా ఎన్నికైన క్రిస్టీ కొవెంట్రీ ప్రణాళికల విషయంలో పక్కాగా ఉండటంతో... ఆ్రస్టేలియా ప్రభుత్వం వేదికల నిర్మాణాన్ని వేగవంతం చేసింది.