Sports
-
'అగార్కర్.. వెంటనే అతడిని టీమిండియాలోకి తీసుకో'
క్రికెట్ ప్రపంచానికి ప్రస్తుతం ఒకే ఒక్క గాడ్ ఉన్నాడు. అతడే భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్. అయితే రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో 'సెమీ-గాడ్'గా అవతరిస్తాడని టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ జోస్యం చెప్పాడు. అదేవిధంగా 15 ఏళ్ల వైభవ్ను వీలైనంత త్వరగా జాతీయ ఎంపిక చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మెన్ అజిత్ అగార్కర్ను అతడు సూచించాడు."వైభవ్ సూర్యవంశీ నిజంగా ఒక అద్భుతం. అతడి టాలెంట్కు ఫిదా అయిపోయాను. ఇలాంటి ప్రతిభ ఉన్న క్రికెటర్లు చాలా అరుదుగా ఉంటారు. అతడు బ్యాట్ స్పీడ్, షాట్ సెలక్షన్ గురుంచి ఎంత చెప్పుకొన్న తక్కువే. అజిత్ తొందరగా ఆ కుర్రాడిని జాతీయ జట్టులోకి తీసుకో. అతడు భారత్ ఆడబోయే తదుపరి సిరీస్కు వైభవ్ జట్టులో కచ్చితంగా ఉండాలి. నిజానికి ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ జట్టులోనే అతడు ఉండాల్సింది.ప్లేయింగ్ ఎలెవన్లో కాకపోయినా, కనీసం జట్టుతో ట్రావిల్ చేసి ఉన్న బాగుండేది. అతడికి అంతర్జాతీయ క్రికెట్పై ఒక అవగాహన వచ్చేది. వైభవ్కు జాతీయ జట్టు తరపున కూడా రాణించే సత్తాఉంది. బుమ్రా లాంటి బౌలర్కు మొదటి బంతికి వైభవ్ సిక్స్ బాదాడు. ఆ తర్వాత హేజిల్వుడ్ను ఓ ఆడుకున్నాడు. బౌలర్ ఎవరనేది అతడికి సంబంధం లేదు. నేను కెప్టెన్గా ఉన్నప్పుడు 16 ఏళ్ల యంగ్ టాలెంటెడ్ క్రికెటర్ భారత జట్టులోకి వచ్చాడు. అతనే సచిన్ టెండూల్కర్. ఈ రోజు అతడిని క్రికెట్ దేవుడిగా ఆరాధిస్తున్నారు. వైభవ్కు క్రికెట్లో తదుపరి 'సెమీ-గాడ్' అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి" అని దీ వీక్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీకాంత్ పేర్కొన్నాడు. ఈ ఏడాది సీజన్లో వైభవ్ కేవలం 7 మ్యాచ్ల్లో 220.87 స్ట్రైక్ రేట్తో 254 పరుగులు చేశాడు.చదవండి: IPL 2026: ఆ టీమ్కు భారీ షాక్.. ఉన్నపళంగా ఇంటికి వెళ్లిపోయిన విధ్వంసకర ప్లేయర్ -
డ్రగ్స్ టెస్టులో దొరికిపోయిన స్టార్ క్రికెటర్.. భారీ షాకిచ్చిన పీసీబీ!
పాకిస్తాన్ క్రికెట్లో మరో వివాదం చెలరేగింది. ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్ సందర్భంగా నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో పాక్ స్టార్ ఆల్రౌండర్ మొహ్మద్ నవాజ్ పట్టుబడ్డాడు. అతడు వినోదం కోసం వాడే మాదకద్రవ్యాలను వాడినట్లు తేలింది.ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ పాక్ క్రికెట్ బోర్డుకు తెలియజేసింది. దీంతో అతడిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విచారణ మొదలు పెట్టింది. ఈ విషయాన్ని పీసీబీ సీనియర్ అధికారి ఒకరు తెలియజేశారు. నవాజ్ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్లో ముల్తాన్ సుల్తాన్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ ఏడాది పీఎస్ఎల్ సీజన్లో మిగిలిన మ్యాచ్లకు నవాజ్ దూరం కానున్నాడు.నవాజ్కు భారీ షాక్..అదేవిధంగా నవాజ్కు మరో భారీ షాక్ తగిలింది. వాస్తవానికి నవాజ్ వచ్చే నెలలో ఇంగ్లండ్ టీ20 బ్లాస్ట్ టోర్నీలో సర్రే క్లబ్కు ప్రాతినిథ్యం వహించాల్సి ఉంది. ఇప్పటికే పీసీబీ అతడికి నిరభ్యంతర పత్రం (NOC) కూడా మంజారు చేసింది. కానీ ఈ వివాదం కారణంగా పీసీబీ ఎన్వోసీని నిలిపివేసినట్లు సమాచారం. కాగా నవాజ్ పాక్ జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు.భారత్, శ్రీలంక వేదికలగా జరిగిన టీ20 ప్రపంచకప్లో 7 మ్యాచ్లు ఆడి 7 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్గా టీ20 ఫార్మాట్లో నవాజ్కు ఘనమైన రికార్డు ఉంది. టీ20ల్లో పాకిస్తాన్ తరపున అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో నవాజ్(101) నాలుగో స్ధానంలో ఉన్నాడు. టీ20ల్లో రెండుసార్లు 5 వికెట్ల ఘనత సాధించిన ఏకైక పాక్ బౌలర్ కూడా నవాజ్నే కావడం గమనార్హం. ఒకవేళ విచారణలో నవాజ్ దోషిగా తేలితే పీసీబీ కఠిన చర్యలు తీసుకునే అవకాశముంది. కాంట్రాక్ట్ రద్దుతో పాటు నిషేధం విధించే ఛాన్స్ ఉంది.చదవండి: IPL 2026: సన్రైజర్స్ కెప్టెన్సీ నుంచి ఇషాన్ కిషన్ అవుట్? -
రాజస్తాన్ వర్సెస్ లక్నో లైవ్ అప్డేట్స్
IPL 2026 RR vs LSG Live updates: ఐపీఎల్-2026లో ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడతున్నాయి. రాజస్తాన్ ఐదో వికెట్ డౌన్రాజస్తాన్ రాయల్స్ వికెట్ల పతనం కొనసాగుతోంది. 22 పరుగులు చేసిన షిమ్రాన్ హెట్మైర్.. మోహ్షిన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 10.4 ఓవర్లలో రాయల్స్ స్కోర్: 78-5రాజస్తాన్ నాలుగో వికెట్ డౌన్20 పరుగులు చేసిన రియాన్ పరాగ్.. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 9 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 62/4రాజస్తాన్ మూడో వికెట్రాజస్తాన్ రాయల్స్ మూడో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులో షిమ్రాన్ హెట్మైర్ వచ్చాడు. 4 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 32/3నిప్పులు చెరుగుతున్న షమీరాజస్తాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో స్టార్ పేసర్ మహ్మద్ షమీ నిప్పులు చెరుగుతున్నాడు. మూడో ఓవర్ వేసిన షమీ బౌలింగ్లో రాజస్తాన్ వరుస బంతుల్లో జైశ్వాల్(22), ధ్రువ్ జురెల్(0) పెవిలియన్కు చేరారు.ఐపీఎల్-2026లో ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన లక్నో తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ కీలక పోరులో లక్నో రెండు మ్యాచ్లతో బరిలోకి దిగింది.అవేష్ ఖాన్, సిద్దార్ధ్ స్ధానాల్లో దిగ్వేష్, మయాంక్ యాదవ్ తుది జట్టులోకి వచ్చారు. వరుస మ్యాచ్లలో విఫలమవుతున్న నికోలస్ పూరన్కు లక్నో మరో అవకాశమిచ్చింది. ఇక రాజస్తాన్ మాత్రం తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. తుది జట్లురాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ, నాంద్రే బర్గర్లక్నో సూపర్ జెయింట్స్ : మిచెల్ మార్ష్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్(వికెట్ కీపర్), నికోలస్ పూరన్, ఐడెన్ మర్క్రమ్, ముకుల్ చౌదరి, మహమ్మద్ షమీ, మొహసిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, మయాంక్ యాదవ్ -
ఆ టీమ్కు భారీ షాక్.. ఉన్నపళంగా ఇంటికి వెళ్లిపోయిన విధ్వంసకర ప్లేయర్
ఐపీఎల్-2026లో అజేయంగా దూసుకుపోతున్న పంజాబ్ కింగ్స్కు భారీ షాక్ తగిలింది. ఈ ధనాధన్ లీగ్లో పంజాబ్ తమ తదుపరి మ్యాచ్లో ఏప్రిల్ 25న అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్కు ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ కూపర్ కనోలీ దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.కనోలీ ప్రస్తుతం పంజాబ్ క్యాంప్ను వీడి ఫిట్నెస్ పరీక్షల కోసం ఆస్ట్రేలియాకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆల్రౌండర్ అయిన కనోలీకి ఐపీఎల్లో వెన్ను గాయం కారణంగా కేవలం బ్యాటింగ్ చేసేందుకు మాత్రమే క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతి ఇచ్చింది. ఏప్రిల్ చివరి నాటికి బౌలింగ్ చేయడానికి అనుమతి లభించే అవకాశమున్నట్లు ఈ ఏడాది సీజన్ ఆరంభానికే ముందు పలు రిపోర్ట్లు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే ఫిట్నెస్ పరీక్షలను నిర్వహించేందుకు అతడిని క్రికెట్ ఆస్ట్రేలియా వెనక్కి పిలిపించింది. ఇందులో అతడు ఉత్తీర్ణత సాధిస్తే బౌలింగ్ చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా క్లియరెన్స్ ఇవ్వనుంది. కనోలీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. తన తొలి ఐపీఎల్ మ్యాచ్లోనే గుజరాత్ టైటాన్స్పై 72 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.చివరగా లక్నో సూపర్ జెయింట్స్పై కూడా కేవలం 46 బంతుల్లో 87 పరుగులు చేసి అందరిని ఆకట్టుకున్నాడు. కనోలీ ప్రస్తుతం 6 మ్యాచ్లలో 223 పరుగులు చేసి పంజాబ్ కింగ్స్ లీడింగ్ రన్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. ఇక శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్ల్లో ఐదింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో ఉంది.చదవండి: IPL 2026: సన్రైజర్స్ కెప్టెన్సీ నుంచి ఇషాన్ కిషన్ అవుట్? -
‘అందుకే రోహిత్ను పక్కన పెట్టాల్సి వచ్చింది’
టీమిండియాకు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ. టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిళ్లను అతడి సారథ్యంలోనే భారత్ గెలుచుకుంది. దిగ్గజ కెప్టెన్గా ఎదిగిన రోహిత్కు.. కెరీర్ ఆరంభంలో ఒకానొకనాడు జట్టులో చోటే కరువైంది.ముఖ్యంగా 2011 వన్డే వరల్డ్కప్ సమయంలో సెలక్టర్లు రోహిత్ శర్మను పక్కనపెట్టారు. ఈ విషయం గురించి టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాడు రోహిత్ను ఎంపిక చేయకపోవడానికి గల కారణాలు వెల్లడిస్తూ.. అతడిని క్షమాపణలు కోరాడు. బాధపడుతూనే ఉన్నాను‘‘ప్రతి ఇంటర్వ్యూలో తాను 2011 వరల్డ్కప్ ఆడటం మిస్సయ్యానని రోహిత్ చెబుతూ ఉన్నాడు. నిజంగా అతడి విషయంలో ఆరోజు జరిగిన దానిపట్ల నేటికీ నేను బాధపడుతూనే ఉన్నాను. గతేడాది అతడిని కలిసి.. ‘సారీ బాస్.. ఆనాడు మేము ఉద్దేశపూర్వకంగా ఏదీ చేయలేదు’ అని చెప్పాను.అప్పుడు మేము ఆల్రౌండ్ ప్రతిభ గల వాళ్లకే పెద్దపీట వేయాలని భావించాము. 1983 మాదిరే ఈ టోర్నీలో ఆడించాలనే ఆలోచనతో ఉన్నాము. మేము ఊహించినట్లుగానే ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ నిలిచాడు.అందుకే రోహిత్ను పక్కనపె ట్టాల్సి వచ్చిందికొన్ని మ్యాచ్లలో హాఫ్ ఆల్రౌండర్లు కూడా రాణించారు. సెహ్వాగ్, సచిన్, సురేశ్ రైనా కూడా కొన్ని ఓవర్లు బౌలింగ్ చేశారు. యూసఫ్ పఠాన్ సైతం హాఫ్ ఆల్రౌండరే. ఈ హాఫ్ ఆల్రౌండర్ కాన్సెప్టులో పడి రోహిత్ శర్మను పక్కనపెట్టాల్సి వచ్చింది.పాపం అతడికి జట్టులో చోటు దక్కలేదు. నిజానికి 2011 వరల్డ్కప్ టోర్నీలో ఆడేందుకు అతడు అర్హుడే. కానీ జట్టు ప్రయోజనాల దృష్ట్యా అతడిని ఎంపిక చేయలేకపోయాము’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా పేర్కొన్నాడు. కాగా 2011లో ధోని సారథ్యంలో టీమిండియా టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే.చదవండి: బంధం తెంచుకున్న కోహ్లి!.. రెస్టారెంట్ మూసివేత -
సన్రైజర్స్ కెప్టెన్సీ నుంచి ఇషాన్ కిషన్ అవుట్?
ఐపీఎల్-2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్రైజర్స్ హైదరాబాద్కు అదిరిపోయే వార్త అందింది. ఏప్రిల్ 25న జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరగనున్న మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ బరిలోకి దిగనున్నాడు. దీంతో తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరిస్తున్న ఇషాన్ కిషన్ తన బాధ్యతలను కమ్మిన్స్కు అప్పగించనున్నాడు.కమ్మిన్స్ వెన్ను గాయం కారణంగా ఇప్పటివరకు ఎస్ఆర్హెచ్ ఆడిన ఏడు మ్యాచ్లకు అందుబాటులో లేడు. అతడు ఇటీవలే క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి ఎస్ఆర్హెచ్ క్యాంప్లో చేరాడు. మంగళవారం ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లోనే కమ్మిన్స్ ఆడుతాడని అంతా భావించారు.కానీ కాస్త ఆసౌకర్యంగా ఉండడంతో టీమ్ సెలెక్షన్ అందుబాటులేకపోయాడు. అయితే రాజస్తాన్తో మ్యాచ్లో మాత్రం కమ్మిన్స్ ఆడడం దాదాపు ఖాయమైంది. అతడు ఇప్పటికే తన ప్రాక్టీస్ను కూడా మొదలు పెట్టాడు. కాగా కమ్మిన్స్ గైర్హజారీలో ఇషాన్ జట్టును అద్భుతంగా నడిపించాడు.అతడి కెప్టెన్సీలో ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడిన ఆరెంజ్ ఆర్మీ నాలుగింట విజయం సాధించింది. సన్రైజర్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్ధానంలో కొనసాగుతోంది. కమ్మిన్స్ సారథిగానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శనల పరంగా ఆకట్టుకుంటున్నాడు. కిషన్ 7 మ్యాచ్లలో 238 పరుగులు చేశాడు. అయితే కమ్మిన్స్ జట్టులోకి వచ్చినప్పటికి ఇషాన్ కిషన్నే కెప్టెన్గా కొనసాగించాలని సంజయ్ బంగర్, హార్భజన్ సింగ్ వంటి భారత మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.చదవండి: ధోనికి ఆ హోదా ఇవ్వడం మొదట్లో నచ్చలేదు: మాజీ లెఫ్టినెంట్ జనరల్ -
సన్రైజర్స్కు వరంలా మారిన సాకిబ్ హుస్సేన్
ఐపీఎల్ 2026లో సన్రైజర్స్ హైదరాబాద్ అనూహ్యంగా పుంజుకుంది. ఆరంభ మ్యాచ్ల్లో తడబడినా, ఆతర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ఎస్ఆర్హెచ్ జోరు చూస్తేంటే ఈ సీజన్ టైటిల్ గెలవడం ఖాయంగా కనిపిస్తుంది.సీజన్ ప్రారంభంలో బౌలింగ్లో చాలా ఇబ్బంది పడిన ఈ జట్టు యువ పేసర్ సాకిబ్ హుస్సేన్ రాకతో ఒక్కసారిగా టైటిల్ ఫేవరెట్గా మారిపోయింది. సాకిబ్ తొలి మ్యాచ్లోనే అబ్బురపరిచే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఆ మ్యాచ్లో సాకిబ్ 4 ఓవర్లలో కేవలం 24 పరుగులిచ్చి ఏకంగా నాలుగు వికెట్లు తీశాడు.అనంతరం సీఎస్కేతో జరిగిన మ్యాచ్లోనూ సాకిబ్ సత్తా చాటాడు. 4 ఓవర్లలో 32 పరుగులిచ్చి ఓ వికెట్ తీశాడు. తాజాగా (ఏప్రిల్ 21) ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో సాకిబ్ మరోసారి జూలు విదిల్చాడు. 4 ఓవర్లలో 29 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ తీశాడు. రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం బౌలింగ్ చేసే 21 ఏళ్ల సకీబ్ అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతూ ఎస్ఆర్హెచ్ పాలిట వరంలా మారాడు. అతను ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా 6 వికెట్లు తీసి సన్రైజర్స్ గెలుపుయాత్రలో ప్రధాన భాగమయ్యాడు. సాకిబ్ ఆడిన 3 మ్యాచ్ల్లో సన్రైజర్స్ గెలిచింది. అలాగే సాకిబ్ 3 మ్యాచ్లు ఆడినా ఒక్క సిక్సర్ కూడా ఇవ్వలేదు. ఇదే అతన్ని ప్రత్యేకంగా నిలుపుతుంది. సకీబ్ ఇప్పటివరకు వేసిన 72 బంతుల్లో కేవలం 85 పరుగులు మాత్రమే ఇచ్చి అత్యంత పిసినారి బౌలర్గా పేరు తెచ్చుకున్నాడు. మొత్తంగా సకీబ్ రాక సన్రైజర్స్ ఫేట్ను మార్చేసింది. ఇతను ఇదే జోరును కొనసాగిస్తే, ఈ సీజన్లో సన్రైజర్స్ను టైటిల్ గెలవకుండా ఆపడం కష్టం.సకీబ్కు మరో యువ పేసర్ ప్రఫుల్ హింగే కూడా తోడయ్యాడు. అతను కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అయితే అతను సకీబ్ లాగా పొదుపుగా బౌలింగ్ చేయలేకపోతున్నాడు. తొలి మ్యాచ్లో సకిబ్తో పాటు అద్భుత ప్రదర్శన (4-34) చేసిన హింగే ఆతర్వాతి మ్యాచ్లో ధారాళంగా (1-60) పరుగులు సమర్పించుకున్నాడు. సకీబ్, ప్రఫుల్ మాత్రమే కాకుండా ఈ సీజన్లో మరో ఇద్దరు సన్రైజర్స్ బౌలర్లు సత్తా చాటుతున్నారు. శ్రీలంకకు చెందిన పేసర్ ఎషాన్ మలింగ, లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ శివాంగ్ కుమార్ అద్భుతంగా రాణిస్తూ సన్రైజర్స్ విజయాల్లో ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. వాస్తవానికి సీజన్ ప్రారంభానికి ముందు సన్రైజర్స్కు బౌలింగే ప్రధాన సమస్యగా ఉండేది. రెగ్యులర్ కెప్టెన్, జట్టు ప్రధాన పేసర్ పాట్ కమిన్స్ గాయం కారణంగా సగం సీజన్కు దూరమయ్యాడు. సీనియర్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ఇలాంటి తరుణంలో ప్రఫుల్, సకీబ్, శివాంగ్ లాంటి దేశీయ బౌలర్లు వచ్చి సన్రైజర్స్ ఫేట్నే మార్చేశారు. త్వరలో కమిన్స్ కూడా వీరికి జత కలిస్తే సన్రైజర్స్ను ఆపడం చాలా కష్టమవుతుంది. ఈ జట్టు బ్యాటింగ్ బలం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అత్యంత ప్రమాదకర బ్యాటింగ్ లైనప్ ఈ జట్టు సొంతం. ఫీల్డింగ్లో కాస్త మెరుగుపడితే ఈ సీజన్లో సన్రైజర్స్ గెలుపు తధ్యం. -
బంగ్లాదేశ్కు షాకిచ్చిన ఐసీసీ!
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) షాకిచ్చింది. న్యూజిలాండ్తో రెండో వన్డేలో నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందున.. మ్యాచ్ ఫీజులో కోత విధించింది. మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు న్యూజిలాండ్ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 17న తొలి వన్డే జరుగగా కివీస్ గెలుపొందింది.198 పరుగులకు ఆలౌట్ఈ క్రమంలో సోమవారం రెండో వన్డే జరుగగా బంగ్లాదేశ్ జయభేరి మోగించింది. యువ పేసర్ నహీద్ రాణా (5/32) కెరీర్ అత్యుత్తమ గణాంకాలతో చెలరేగి బంగ్లాకు విజయం అందించాడు. అంతర్జాతీయ స్థాయిలో అంతగా అనుభవం లేని ఆటగాళ్లతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసి.. 48.4 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. చెలరేగిన నహీద్ఓపెనర్ నిక్ కెల్లీ (102 బంతుల్లో 83; 14 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా... తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. కెప్టెన్ టామ్ లాథమ్ (14), హెన్రీ నికోల్స్ (13), విల్ యంగ్ (2), మొహమ్మద్ అబ్బాస్ (19), డీన్ ఫోక్స్ క్రాఫ్ట్ (15), క్లార్క్సన్ (6) ఒకరి వెంట ఒకరు పెవిలియన్కు చేరారు. తన్జిద్, షంటో హాఫ్ సెంచరీలుబంగ్లా బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నహీద్ ఐదు వికెట్లతో సత్తా చాటాడు. మిగిలిన వారిలో షరీఫుల్ ఇస్లామ్ 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 35.3 ఓవర్లలో 4 వికెట్లకు 199 పరుగులు చేసింది. తన్జిద్ హసన్ (58 బంతుల్లో 76; 10 ఫోర్లు, 4 సిక్స్లు), నజ్ముల్ హసన్ షంటో (71 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్స్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. సైఫ్ హసన్ (8), సౌమ్య సర్కార్ (8), లిటన్ దాస్ (7) విఫలమైనా... లక్ష్యం చిన్నది కావడంతో బంగ్లాదేశ్కు ఎక్కువ ఇబ్బంది కాలేదు. న్యూజిలాండ్ బౌలర్లలో జైడన్ లెనాక్స్ 2 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ గెలుపొందింది.ఫీజులో 10 శాతం కోతఅయితే, న్యూజిలాండ్తో రెండో వన్డేలో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసినందున ఐసీసీ బంగ్లాకు షాకిచ్చింది. బంగ్లా జట్టు మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనుందన ఈ మేరకు శిక్ష వేసింది. కాగా బంగ్లాదేశ్- న్యూజిలాండ్ మధ్య నిర్ణయాత్మక ఆఖరి వన్డే గురువారం జరగనుంది. చట్టోగ్రామ్ ఇందుకు వేదిక.చదవండి: పీసీబీ నెత్తిన పాలు పోసిన బంగ్లా క్రికెట్ బోర్డుpic.twitter.com/3kSqC7iEUy 🚨 BANGLADESH WIN 🚨BAN vs NZ — 2nd ODI | Sher-e-Bangla, DhakaBangladesh chase down 199 with 6 wickets in hand!The heroes of the win:-Nahid Rana — 5 wickets, dismantled the NZ batting lineup-Tanzid Hasan Tamim — 76 off 58 balls, set the chase on…— Suresh N (@TheDugoutStats) April 20, 2026 -
డ్రగ్స్ టెస్ట్లో దొరికిపోయిన పాక్ క్రికెటర్
పాకిస్తాన్ క్రికెట్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కీలక ఆల్రౌండర్ మొహమ్మద్ నవాజ్ డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్గా తేలాడు. ఈ వ్యవహారంపై పాక్ క్రికెట్ బోర్డు విచారణ ప్రారంభించింది. నవాజ్ కాంట్రాక్ట్ను రద్దు చేసింది. నవాజ్ ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్లో డ్రగ్స్ వాడినట్లు నిరూపితమైంది. ఆ మెగా టోర్నీలో అతను 7 మ్యాచ్ల్లో 7 వికెట్లతో పర్వాలేదనిపించాడు. నవాజ్ రాణించినా, ప్రపంచకప్లో పాక్ ఘోరంగా విఫలమై సూపర్-8 దశలోనే ఇంటిముఖం పట్టింది. పీసీబీ విచారణలోనూ నవాజ్ నేరం రుజువైతే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. శాశ్వత నిషేధం అదనంగా భారీ జరిమానా విధించవచ్చు.కాగా, క్రికెట్లో డ్రగ్స్ వినియోగంపై కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. వినోదం కోసం అయినా నిషేధిత పదార్థాలు వాడితే తీవ్ర శిక్షలు తప్పవు. ఈ ఘటన మరోసారి క్రికెట్లో క్రమశిక్షణ, ప్రొఫెషనల్ ప్రవర్తన ఎంత ముఖ్యమో గుర్తు చేసింది. -
ధోనికి ఆ హోదా ఇవ్వడం నచ్చలేదు.. కానీ: మాజీ లెఫ్టినెంట్ జనరల్
టీమిండియా దిగ్గజ కెప్టెన్గా పేరుగాంచాడు మహేంద్ర సింగ్ ధోని. భారత్కు 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే వరల్డ్కప్, 2013లో చాంపియన్స్ ట్రోఫీ అందించిన ఘనుడు. తద్వారా దేశానికి మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన కెప్టెన్గా నేటికీ కొనసాగుతున్నాడు ధోని.సాహసోపేత నిర్ణయాలతో భారత జట్టు భవితవ్యాన్ని మార్చివేసిన ధోని (MS Dhoni).. జట్టు అవసరాల దృష్ట్యా కొన్నిసార్లు వ్యక్తిగత జీవితాన్ని సైతం త్యాగం చేశాడు. ముఖ్యంగా తనకు కుమార్తె జన్మించిన సమయంలో భార్య దగ్గర ఉండాల్సి ఉన్నా.. జట్టుతోనే ఉండిపోయాడు ధోని. ఇలాంటి త్యాగాలెన్నో అతడి కెరీర్లో ఉన్నాయి.గౌరవ ఆర్మీ ర్యాంకుఈ క్రమంలోనే భారత సైన్యంలో ధోనికి గొప్ప గౌరవం లభించింది. పారాచూట్ రెజిమెంట్లో 2011లో అతడికి లెఫ్టినెంట్ హోదా ఇచ్చి ఆర్మీ సుముచిత గౌరవం కల్పించింది. ఆ తర్వాత కఠినమైన పారాచూట్ శిక్షణ పూర్తి చేసుకున్న ధోని.. ప్రతిష్టాత్మక ‘మెరూన్ బెరెట్’ (headgear) సొంతం చేసుకున్నాడు.మొదట్లో నాకు నచ్చలేదుఈ నేపథ్యంలో రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ వినోద్ భాటియా ధోనికి నాడు దక్కిన గౌరవం గురించి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధోనికి అసలు ఆ అర్హత ఉందా? అనే సందేహం తనను తొలచివేసిందన్నారు. తాను ధోనికి ఈ హోదా ఇవ్వడాన్ని తాను తొలుత కాస్త వ్యతిరేకించానని.. అయితే, ఆ తర్వాత తన అభిప్రాయం తప్పని తేలిందన్నారు.ఈ మేరకు.. ‘‘అప్పట్లో మా చీఫ్ జనరల్ వీకే సింగ్. అప్పటి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనికి గౌరవ ర్యాంకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కానీ నేను మాత్రం అందుకు సుముఖంగా లేను. మెరూన్ బెరెట్ ఎంతో ప్రతిష్టాత్మకమైనది.పారాట్రూపర్ కావాలంటే కచ్చితంగా ఆర్నెళ్ల పాటు ప్రొబేషన్ చేయాల్సి ఉంటుంది. ఇదిలా చాలా కఠినంగా ఉంటుంది. ఇందులో సెలక్షన్ రేటు కేవలం 20 శాతం మాత్రమే. అలాంటిది ఎలాంటి శిక్షణా పొందని వ్యక్తికి మెరూన్ బెరెట్ ఇవ్వడం చాలా తప్పు అని అనిపించింది. ఆ తర్వాత నా అభిప్రాయం మారిపోయింది.నిజమైన సైనికుడుధోని దేశం కోసం చాలా చేశాడు. అతడి విజయాల పట్ల నేను కూడా గర్విస్తున్నాను. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండే కెప్టెన్ కూల్. బాగా ఎత్తైన ప్రదేశాలంటే భయమని అతడు నాతో చెప్పాడు. అయినప్పటికీ పారాట్రూపర్గా శిక్షణలో ఎత్తుల మీద నుంచి దూకేశాడు.యూనిఫామ్ ధరించినపుడు అతడిలో ఓ గర్వం ఉండేది. అతడు అచ్చంగా సైనికుడిలాగే కవాతు చేసేవాడు. సైనికుడి మాదిరే వ్యవహరించేవాడు. మనసు నిండా అతడు ఆర్మీని నింపుకొన్నాడని.. తనను తాను నిజమైన సోల్జర్గా భావిస్తున్నాడని నాకు తెలిసింది.ఇంకో విషయం.. ధోని జమ్మూ కశ్మీర్లో మా విభాగాలతో కలిసి అక్కడ పనిచేశాడు. లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి మా సైనికులతో కలిసి ప్రయాణాలు చేసేవాడు. నిజంగా అతడు స్ఫూర్తిదాయకమైన వ్యక్తి’’ అని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ వినోద్ భాటియా ఓ పాడ్కాస్ట్లో భాగంగా ధోనిని కొనియాడారు.చదవండి: బంధం తెంచుకున్న కోహ్లి!.. రెస్టారెంట్ మూసివేతThe story behind how MS Dhoni earned the Maroon Beret 🇮🇳 🪖."He went and Served in J&K with our soldiers , He went to the Border" pic.twitter.com/GXMM3cdeHX— MAHIYANK™ (@Mahiyank_78) April 21, 2026 -
అతడు వైభవ్ సూర్యవంశీ కంటే సమర్దుడు..!
భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇద్దరు యువ క్రికెటర్లను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ కంటే పంజాబ్ యువ కెరటం ప్రియాంశ్ ఆర్య చాలా సమర్థుడని అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. ప్రియాంశ్ను ప్రత్యేకంగా ప్రశంసించాడు. వైభవ్, అయుశ్ మాత్రే వంటి యువ ఆటగాళ్లతో పోలిస్తే ప్రియాంశ్ ఓ మెట్టు ముందున్నాడని అన్నాడు. ఎవరినీ తక్కువ చేయడం లేదని చెబుతూనే.. ప్రియాంశ్ వద్ద ఉన్న షాట్ల వైవిధ్యం, పెద్ద ఇన్నింగ్స్లు ఆడగల సామర్థ్యం ఉందని కితాబునిచ్చాడు. ఈ లక్షణాలు ప్రియాంశ్ను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయని తెలిపాడు.కాగా, అశ్విన్ పొగడ్తలకు ఆనుగుణంగానే ప్రియాంశ్ ఈ ఐపీఎల్ సీజన్లో చెలరేగి ఆడుతున్నాడు. 5 మ్యాచ్ల్లో 248.24 స్ట్రయిక్రేట్తో 211 పరుగులు చేసి లీడింగ్ రన్స్కోరర్ల జాబితాలో ముందువరుసలో ఉన్నాడు. ఈ సీజన్లో పంజాబ్ సాధిస్తున్న వరుస విజయాల్లో ప్రియాంశ్ది ప్రధానపాత్ర. తాజాగా లక్నో 37 బంతుల్లో 93 పరుగులు చేసిన ఇన్నింగ్స్ అతని కెరీర్ మొత్తంలో హైలైట్గా నిలిచింది. ఇలాంటి ప్రదర్శనలే అశ్విన్ వంటి సీనియర్ ఆటగాళ్లను ఆకట్టుకున్నాయి.వైభవ్ విషయానికొస్తే.. ఈ బుడ్డోడు కూడా తక్కువేమీ తినలేదు. ఈ సీజన్లో దాదాపు ప్రతి మ్యాచ్లో రెచ్చిపోయాడు. సీఎస్కే, ఆర్సీబీపై చేసిన మెరుపు హాఫ్ సెంచరీలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా ఆర్సీబీపై ఆడిన ఇన్నింగ్స్ (26 బంతుల్లో 78 పరుగులు) అతని టాలెంట్ను ప్రపంచానికి మరోసారి రుచి చూపించింది. అయితే ఇటీవల మ్యాచ్లలో అతని జట్టు విజయం సాధించకపోవడం కొంత నిరాశ కలిగించింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడిన వైభవ్.. 236.54 స్ట్రయిక్రేట్తో 246 పరుగులు చేసి టాప్-5 లీడింగ్ స్కోరర్ల జాబతాలో ఉన్నాడు.మాత్రే విషయానికొస్తే.. ఇతగాడు కూడా ఈ సీజన్లో మంచి ఫామ్లో ఉన్నాడు. అయితే దురదృష్టవశాత్తు గాయం కారణంగా సీజన్ మొత్తానికే దూరమయ్యాడు. ఆయుశ్ ఈ సీజన్లో ఆడిన 6 మ్యాచ్ల్లో 201 పరుగులు చేసి సీఎస్కే తరఫున నిలకడ ప్రదర్శనలు చేసిన ఆటగాడిగా నిలిచాడు.మొత్తంగా అశ్విన్ వ్యాఖ్యలు ఎవరిని తగ్గించడానికి చేసినవిగా కనిపించలేదు. ప్రతిభను గుర్తించడంలో భాగంగా చేసినవిగా స్పష్టమయ్యాయి. ప్రియాంశ్తో పోలిస్తే వైభవ్కు అధిక హైప్ దక్కింది. టాలెంట్ విషయం పక్కన పెడితే, ఏజ్ అతనికి అడ్వాంటేజ్గా మారింది. 14-15 ఏళ్ల వయసులో వైభవ్ రెచ్చిపోతున్న విధానం అందరిని ఆకట్టుకుంటుంది. అతడు షాట్లు ఆడే స్టైల్ చూడముచ్చటగా ఉంటుంది. ప్రియాంశ్ సైతం ఇలాగే ఆడుతున్నా, వయసులో వైభవ్ కంటే కాస్త పెద్ద వాడు (24) కావడం, అతనికి ఆశించిన గుర్తింపు దక్కనివ్వలేదు. -
ఐపీఎల్ జోరు.. పీఎస్ఎల్ బేజారు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026, పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 ఏకకాలంలో జరుగుతున్న నేపథ్యంలో ఏ లీగ్ జోరుగా సాగుతుంది..? ఏ లీగ్ బేజారుగా సాగుతుందన్న విషయాలను ఈ కథనంలో పరిశీలిద్దాం.పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గత సీజన్ నుంచి ఐపీఎల్కు పోటీగా పీఎస్ఎల్ను ఒకే సమయంలో షెడ్యూల్ చేసింది. పీసీబీ తీసుకున్న ఈ తలతిక్క నిర్ణయం పీఎస్ఎల్ అన్ని విధాల నష్టపోతుంది. ఐపీఎల్కు పోటీ కాదు కదా, కనుచూపుమేరల్లో కూడా లేకుండా పోయింది.రెండు లీగ్లు ఒకేసారి జరుగుతుండటం వల్ల సహజంగానే ఐపీఎల్కు ప్రజాదరణ ఎక్కువగా ఉంది. స్వదేశీ, విదేశీ స్టార్లంతా ఇదే లీగ్లో ఉండటంతో ప్రపంచవాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఈ లీగ్నే ఫాలో అవుతున్నారు. పీఎస్ఎల్ విషయానికొస్తే.. ఈ లీగ్లో స్వదేశీ ఆటగాళ్లు, ఔట్ డేటెడ్ విదేశీ ఆటగాళ్లు మాత్రమే పాల్గొంటున్నారు. దీంతో ఈ లీగ్ పరిధి కేవలం పాక్కు మాత్రమే పరిమితమైంది. బయటి దేశాల్లో పీఎస్ఎల్ను ఫాలో అయ్యే వారి సంఖ్య వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు.ప్రస్తుత సీజన్లో పీఎస్ఎల్తో పోలిస్తే ఐపీఎల్కు అధిక పాపులారిటీ దక్కడానికి మరో కారణం ఐపీఎల్లో జరుగుతున్న విధ్వంసం. ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్లు పోటాపోటీగా సాగాయి. దాదాపుగా ప్రతి మ్యాచ్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. బౌలర్లు సైతం ఈ సీజన్లో పని చక్కబెట్టుకున్నారు. అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసాలు, కళ్లు చెదిరే క్యాచ్లకు ఈ సీజన్ ప్రత్యేకమైన వేదిక అయ్యింది.ఈ సీజన్లో 31 మ్యాచ్లు పూర్తి కాగా.. భారీ సంఖ్యలో సిక్సర్లు, బౌండరీలు నమోదయ్యాయి. 4 సెంచరీలు, పదుల సంఖ్యలో అర్ద సెంచరీలు రికార్డయ్యాయి. ఎన్నో పాత రికార్డులు బద్దలయ్యాయి, మరెన్నో కొత్త రికార్డులు సృష్టించబడ్డాయి. ఏ మాత్రం అంచనాలు లేని బౌలర్లు ఈ సీజన్లో చెలరేగిపోతున్నారు. రొటీన్కు భిన్నంగా పేసర్లు స్పిన్నర్ల కంటే మెరుగ్గా రాణిస్తున్నారు.జట్ల విషయంలోనూ అంచనాలు లేని జట్లే ఈ సీజన్లో దూసుకుపోతున్నాయి. భారీ అంచనాలు ఉన్న జట్లు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానాల్లో పడి ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో ఓటమి ఎరుగక దూసుకుపోతుంది. ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, రాజస్థాన్ రాయల్స్ కూడా అంచనాలకు మించి రాణిస్తున్నాయి. భారీ అంచనాలు ఉన్న ముంబై ఇండియన్స్ గత మూడు నాలుగు సీజన్ల తరహాలోనే స్లో స్టార్ట్ మోడ్లో సాగుతుంది. ఎల్ఎస్జీ, ఢిల్లీ, గుజరాత్ పేపర్పై బలంగా కనిపిస్తున్నా, ఆన్ ఫీల్డ్లో అంచనాలను చేరుకోలేకపోతుంది. సీఎస్కే పరిస్థితి ముంబై ఇండియన్స్ లాగే ఉంది.అంచనాలు ఉన్న జట్లు విఫలమవుతున్నా, అంచనాలు లేని జట్లు అద్భుతాలు చేస్తూ ఈ సీజన్ను రక్తి కట్టిస్తున్నారు. లీగ్ మే 31 వరకు సాగనున్న నేపథ్యంలో మరిన్ని సిత్రాలు చూసే అవకాశం ఉంటుంది. మొత్తంగా ఐపీఎల్ ఈ సీజన్లో గతానికి కాస్త భిన్నంగా సాగుతూ అత్యంత ప్రజాదరణ కలిగిన క్రీడా పోటీల రేసులో దూసుకుపోతుంది.పీఎస్ఎల్ విషయానికొస్తే.. ఆ లీగ్ ముగింపుకు దగ్గరగా వచ్చింది. ఇప్పటివరకు ఐపీఎల్ లాగే 31 మ్యాచ్లు జరిగినా చెప్పుకోదగ్గ ఒక్క ప్రదర్శన లేదు. బ్యాటింగ్ విభాగం సప్పగా, వన్డే క్రికెట్ను తలపిస్తుండగా.. నాణ్యత లేని బౌలింగ్ జనాలకు బోర్ కొట్టిస్తుంది. ఫీల్డింగ్ గురించి చెప్పుకోకుంటేనే మంచిది. ప్రపంచంలో ఎక్కడా లేని ఫీల్డింగ్ సిత్రాలన్నీ ఈ లీగ్లోనే కనిపిస్తాయి. పాక్ ఆటగాళ్ల ఫీల్డింగ్ చూస్తే నవ్వు ఆపుకోక తప్పదు. వీరి కంటే గల్లీ క్రికెటర్లు నయం అనిపిస్తుంది.ఈ లీగ్ ఆడుతున్నది అతి తక్కువ మంది విదేశీ ప్లేయర్లు, వీరిలో ఒక్కరు కూడా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో ఇదే పరిస్థితి. అడపాదడపా లోకల్ ఆటగాళ్లే కాస్త నయం అనిపిస్తుంది. పాక్కు ఈ లీగ్ వల్ల దక్కే ఊరట ఏదైనా ఉందా అంటే, అది బాబర్ ఆజమ్ ఫామ్లోకి రావడం. ఈ పాక్ స్టార్ బ్యాటర్ ఈ పీఎస్ఎల్ సీజన్లో విశేషంగా రాణిస్తున్నాడు. తాజాగా ఓ సెంచరీ కూడా చేశాడు.ఇది మినహా పీఎస్ఎల్ మొత్తం మూకీ డ్రామాలాగా సప్పగా సాగుతుంది. ఇప్పటికి పెషావర్ జల్మీ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించగా.. ముల్తాన్ సుల్తాన్స్, ఇస్లామాబాద్ యునైటెడ్, లాహోర్ ఖలందర్స్ రేసులో ముందు వరుసలో ఉన్నాయి. -
బంధం తెంచుకున్న కోహ్లి!.. రెస్టారెంట్ మూసివేత
టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి బ్రాండ్ వాల్యూ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెట్ ద్వారా కీర్తిని గడించిన ఈ ఢిల్లీ స్టార్.. వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాడు. స్వయంగా ఎన్నో బ్రాండ్లు కూడా కలిగి ఉన్నాడు. వన్8 కమ్యూన్ ద్వారా ఆతిథ్య రంగంలోనూ కోహ్లి అడుగుపెట్టాడు.దేశ వ్యాప్తంగాదేశ వ్యాప్తంగా ఈ రెస్టారెంట్ చైన్ వ్యాపించి ఉంది. ఢిల్లీ, గురుగ్రామ్, పుణె, కోల్కతా, నోయిడా, హైదరాబాద్ వంటి సిటీల్లో వన్8 కమ్యూన్కు శాఖలు ఉన్నాయి. అయితే, బెంగళూరులో ఉన్న వన్8 కమ్యూన్ బ్రాంచీ కోర్టు ఆదేశాలతో మూతపడింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం..అద్దె కట్టకుండా..బెంగళూరులో చిన్నస్వామి స్టేడియానికి సమీపంలో వన్8 కమ్యూన్ రెస్టారెంట్ ఉంది. ట్రియో హిల్స్ హాస్పిటాలిటీ దీనిని నిర్వహిస్తూ కోహ్లితో భాగస్వామ్యంలో ఉంది. అయితే, గత ఆర్నెళ్లుగా అద్దె చెల్లించడంలో ట్రియో హిల్స్ విఫలమైంది. మెయింటెనెన్స్ కూడా బాకీ పడింది. దీంతో సదరు భవన నిర్మాణ యజమాని ఈ విషయమై సివిల్ కోర్టును ఆశ్రయించారు.ఈ నేపథ్యంలో అద్దె చెల్లించి, యజమానితో సమస్యలు పరిష్కారం చేసుకునేంత వరకు రెస్టారెంట్ను మూసివేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. వివిధ నిబంధనల ఉల్లంఘన కారణంగా బృహత్ బెంగళూరు మహానగర పాలికే కూడా ఇప్పటికే ఈ రెస్టారెంట్కు పలుమార్లు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. బంధం తెంచుకున్న కోహ్లిఈ రెస్టారెంట్ అగ్రి పమాద భద్రతకు సంబంధించి నిరభ్యంతర పత్రం (NOC) కూడా పొందలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి ఇప్పటికే తన బ్రాండ్ పేరును తొలగించాల్సిందిగా ట్రియో హిల్స్కు చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కస్టమర్ల రాక తగ్గిపోయి ఆర్థికంగానూ సదరు రెస్టారెంట్ నష్టాల్లో కూరుకుపోయినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. కోహ్లి ప్రస్తుతం ఐపీఎల్-2026తో బిజీగా ఉన్నాడు. ఆర్సీబీ తరఫున ఇప్పటికి ఆడిన ఆరు మ్యాచ్లలో కలిపి 247 పరుగులు సాధించాడు. మరోవైపు.. ఆర్సీబీ ఆరింట నాలుగు విజయాలతో జోరు మీద ఉంది.చదవండి: పీసీబీ నెత్తిన పాలు పోసిన బంగ్లా క్రికెట్ బోర్డు -
హార్దిక్తో విభేదాలు నిజమే!.. కృనాల్ రిప్లై వైరల్
భారత స్టార్ క్రికెటర్లు కృనాల్ పాండ్యా- హార్దిక్ పాండ్యా మధ్య విభేదాలు తలెత్తినట్లు గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు ప్రాణంగా మెదిలిన ఈ అన్నదమ్ములు.. తాజాగా పరస్పరం ఎదురుపడినా పెద్దగా పలకరించుకోకపోవడం ఇందుకు కారణం. ఐపీఎల్-2026లో భాగంగా డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు కృనాల్ పాండ్యా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.ఒకప్పటి ఆ ప్రేమ కనబడటం లేదుమరోవైపు మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్కు హార్దిక్ పాండ్యా (Hardik Pandya) కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఇద్దరు వేర్వేరు జట్లలో ఉన్నా.. ఇరుజట్లు ముఖాముఖి తలపడినపుడు అన్నదమ్ములు ఆప్యాయంగా మెలగడం గతంలో కనిపించేది. అయితే తాజా ఎడిషన్లో ఇటీవల ముంబైతో ఆర్సీబీ తలపడగా.. హార్దిక్ అవుటైన సమయంలో కృనాల్ వైల్డ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు.ఆమె విషయంలోనే విభేదాలు? అంతేకాదు మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఈ తోబుట్టువులు ఎడముఖం- పెడముఖంగానే కనిపించారు. ఇక హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా స్టాంకోవిక్ ఇటీవల వీరి తల్లిని కలిసింది. ఆ సమయంలో కృనాల్ కుటుంబం కూడా ఆమెతోనే ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. హార్దిక్ నటాషా నుంచి విడిపోయిన కొన్నాళ్లకే మహీక శర్మ అనే మోడల్తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. అంతేకాదు నటాషాతో తనకు కలిగిన కుమారుడు అగస్త్యను కూడా మహీకకే అప్పగించినట్లుగా వదంతులు వస్తున్నాయి.ఈ పరిణామాలే పాండ్యా బ్రదర్స్ మధ్య విభేదాలకు కారణమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మహీక విషయంలో కృనాల్ హార్దిక్పై సీరియస్గా ఉన్నాడని వాటి సారాంశం. ఈ విషయం గురించి తాజాగా కృనాల్ పాండ్యా నర్మగర్భంగా స్పందించాడు.విభేదాలు నిజమే? కృనాల్ రిప్లై వైరల్ఆర్సీబీ పాడ్కాస్ట్లో భాగంగా హోస్ట్ డానిష్ సైత్ కృనాల్ పాండ్యాను పరోక్షంగా హార్దిక్ గురించి అడిగాడు. ‘‘అంతా ఒకేనా? ఏదైనా యుద్ధం జరుగుతోందా?’’ అని ప్రశ్నించాడు. ఇందుకు కృనాల్ గట్టిగా నవ్వేశాడు తప్ప బదులివ్వలేదు. ఇక ‘‘కుటుంబ సభ్యుడినైన నన్ను కలవలేదు’’ అని డానిష్ జోక్ చేయగా.. ‘‘కొన్నిసార్లు కుటుంబంలో ఎక్కువ మంది సభ్యులు ఉన్నపుడు ఒక్కోసారి కొందరిని మిస్ అవడం సహజమే’’ అని కృనాల్ బదులిచ్చాడు.𝗔𝘂𝗿𝗮 + 𝗩𝗶𝗯𝗲𝘀: 𝗞𝗿𝘂𝗻𝗮𝗹 𝗣𝗮𝗻𝗱𝘆𝗮 🤝 𝗠𝗿. 𝗡𝗮𝗴𝘀 😂🥶✌️Krunal’s hairstyles, business ventures, on field tactics & antics, and some personal life secrets - Mr. Nags bowls bouncers to Krunal Pandya on this latest episode of @bigbasket_com presents RCB Insider.… pic.twitter.com/iI4U3KofMI— Royal Challengers Bengaluru (@RCBTweets) April 22, 2026ఇందుకు సమాధానంగా.. ‘‘మీ తమ్ముడిలాగా’’ అని డానిష్ అనడంతో.. కృనాల్ నవ్వుతూ ముఖం దాచేసుకున్నాడు. అంతే తప్ప మధ్య విభేదాలు లేవని మాత్రం స్పష్టంగా చెప్పలేకపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా విజయం తర్వాత హార్దిక్కు కృనాల్ శుభాకాంక్షలు చెప్పలేదు. అదే విధంగా కృనాల్ బర్త్డేకు హార్దిక్ విష్ చేయలేదు.చదవండి: పీసీబీ నెత్తిన పాలు పోసిన బంగ్లా క్రికెట్ బోర్డు -
స్మోకింగ్ చేస్తూ పట్టుబడ్డ గుజరాత్ ప్లేయర్
గుజరాత్ టైటాన్స్ స్టార్ బౌలర్ కగిసో రబాడ వివాదంలో చిక్కుకున్నాడు. టీమ్ హోటల్ పరిసరాల్లో సిగరెట్ కాలుస్తూ కెమెరా కంటికి చిక్కాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది చూసి అభిమానులు రబాడపై చర్యలుంటాయా అని ఆరా తీస్తున్నారు.ఐపీఎల్ కాంట్రాక్ట్లో స్మోకింగ్పై స్పష్టమైన నిషేధం లేదు. అంటే సిగరెట్ తాగడం నిబంధనలకు వ్యతిరేకం కాదు. అయితే ఆటగాళ్ల ఫిట్నెస్, ప్రొఫెషనల్ ప్రవర్తన దృష్ట్యా ఇది విమర్శలకు దారి తీస్తోంది.🚨 KAGISO RABADA IS SMOKING !🤯- Kagiso Rabada was smoking and got caught on camera while doing so. At that moment, Rashid Khan and the rest of the staff came and asked him, “What is this?” 👀pic.twitter.com/kF65xT8Mxl— lndian Sports Netwrk (@IS_Netwrk29) April 22, 2026రబాడాకు డోపింగ్ ఉల్లంఘన నేపథ్యం ఉన్నందున ఈ ఘటనను బీసీసీఐ యాంటీ-డోపింగ్ విభాగం పరిశీలించే అవకాశం ఉంది. అతను వాడింది కేవలం సిగరెట్ మాత్రమేనా? లేక మరేదైనా నిషేధిత పదార్థమా? అన్నది నిర్ధారించాల్సి ఉంటుంది.ఇదిలా ఉంటే, ఈ సీజన్లో రబాడ అద్భుత ఫామ్లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో 10 వికెట్లు తీసి లీడింగ్ వికెట్టేకర్ల జాబితాలో ముందువరుసలో ఉన్నాడు. జట్టు విషయానికొస్తే.. గుజరాత్ ఈ సీజన్లో మధ్యస్త ప్రదర్శనలతో మమ అనిపిస్తుంది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో 3 విజయాలు, 3 అపజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. -
పీసీబీ నెత్తిన పాలు పోసిన బంగ్లా క్రికెట్ బోర్డు
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు స్వదేశంలో న్యూజిలాండ్తో పరిమిత ఓవర్ల సిరీస్తో బిజీగా ఉంది. కివీస్తో సొంతగడ్డపై బంగ్లా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇప్పటికే రెండు వన్డేలు పూర్తి కాగా కివీస్, బంగ్లా తలా ఒక మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి.ఫామ్లో ఉన్న వాళ్లకు విశ్రాంతి?ఈ క్రమంలో న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తమ జట్టును తాజాగా ప్రకటించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టు నుంచి నహీద్ రాణా, ముస్తాఫిజుర్ రహమాన్, టస్కిన్ అహ్మద్లను తప్పించింది. అబ్దుల్ గఫార్ సక్లెయిన్ అనే అన్క్యాప్డ్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్కు మాత్రం తొలిసారి జట్టులో చోటు కల్పించింది.అదే విధంగా.. ఆసియా క్రీడలు-2023లో బంగ్లాకు ఆడిన రిపర్ మొండాల్కు కూడా మళ్లీ పిలుపునిచ్చారు సెలక్టర్లు. ఈ జట్టుకు లిటన్ దాస్ కెప్టెన్గా వ్యవహరించనుండగా.. మొహమ్మద్ సైఫ్ హసన్ వైస్ కెప్టెన్.పీసీబీ నెత్తిన పాలు పోసిన బంగ్లా క్రికెట్ బోర్డుబంగ్లా పేసర్ నహీద్ రాణా ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నాడు. కివీస్తో తొలి వన్డేలో ఒక వికెట్ తీయగలిగిన 23 ఏళ్ల ఈ రైటార్మ్ పేసర్.. రెండో వన్డేలో ఐదు వికెట్లతో చెలరేగాడు. న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించి బంగ్లాకు గెలుపు అందించాడు.అలాంటి ఆటగాడిని బంగ్లా బోర్డు టీ20 జట్టు నుంచి తప్పించడం గమనార్హం. కాగా పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) ప్లే ఆఫ్స్ మ్యాచ్లు ఆడేందుకే నహీద్కు జాతీయ జట్టు నుంచి విశ్రాంతినిచ్చినట్లు తెలుస్తోంది. కాగా పీఎస్ఎల్-2026లో నహీద్ రాణా పెషావర్ జెల్మీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.జాతీయ జట్టును కాదని.. PSL వైపు మొగ్గుఇప్పటికే ఆ జట్టు తరఫున నాలుగు మ్యాచ్లు ఆడి ఏడు వికెట్లు తీశాడు. అయితే, వన్డే సిరీస్ ఆడేందుకు స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఇదిలా ఉంటే.. పెషావర్ జెల్మీ ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరింది. ఈ నేపథ్యంలోనే టీ20 సిరీస్ను కాదని మరీ.. పీఎస్ఎల్ కోసం నహీద్ను పాకిస్తాన్కు పంపనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ముస్తాఫిజుర్ విషయంలోనూ ఇదే జరిగినట్లు సమాచారం. కాగా చమురు సంక్షోభం కారణంగా పీఎస్ఎల్ను స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే నిర్వహిస్తోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB).ఇక సీజన్ ఆరంభానికి ముందు అఫ్గనిస్తాన్పై పాక్ దాడుల నేపథ్యంలో సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు నెలకొనగా విదేశీ ఆటగాళ్లు ఇక్కడికి వచ్చేందుకు భయపడ్డారు. ఈ క్రమంలో కరాచీ, లాహోర్ వేదికలకు మాత్రమే మ్యాచ్లను పరిమితం చేసింది. ఇలాంటి సమయంలో నహీద్ రాణా వంటి ఫామ్లో ఉన్న ఆటగాళ్లను పంపడం ద్వారా పీఎస్ఎల్కు కాస్త ఊరట దక్కేలా చేసింది బంగ్లా బోర్డు.న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు బంగ్లాదేశ్ జట్టులిటన్ దాస్ (కెప్టెన్), మొహమ్మద్ పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, తాంజిద్ హసన్ తమీమ్, మొహమ్మద్సైఫ్ హసన్ (వైస్ కెప్టెన్), షమీమ్ హొస్సేన్ పట్వారీ, తౌహిద్ హృదయ్, క్వాజీ నూరుల్ హసన్ సోహన్, మహేదీ హసన్, నసుమ్ అహ్మద్, రిషాద్ హొసేన్, షోరిఫుల్ ఇస్లాం, తాంజిమ్ హసన్ సకీబ్, రిపన్ మొండాల్, మొహమ్మద్ సైఫుద్దీన్, అబ్దుల్ గఫార్ సక్లెయిన్.చదవండి: SRH vs DC: ఆ రెండు తప్పులే మా కొంపముంచాయి -
డివిలియర్స్ తరహాలో రెచ్చిపోయిన స్టీవ్ స్మిత్
ఆస్ట్రేలియా వెటరన్ స్టార్ స్టీవ్ స్మిత్ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026లో చెలరేగిపోయాడు. ఈ లీగ్లో ముల్తాన్ సుల్తాన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న స్టీవ్.. నిన్న (ఏప్రిల్ 21) రావల్పిండిజ్తో జరిగిన మ్యాచ్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 167 పరుగుల ఛేదనలో 31 బంతులు ఆడి 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 56 పరుగులు చేసి తన విజయంలో ప్రధానపాత్ర పోషించాడు.4,6,6,6 - MADNESS BY STEVE SMITH. 🔥 pic.twitter.com/aEBz2VEXzT— Sheri. (@CallMeSheri1_) April 21, 2026ఈ ఇన్నింగ్స్లో స్టీవ్ యువ పేసర్ రజావుల్లాపై చేసిన దాడి మ్యాచ్ మొత్తానికే హైలైట్గా నిలిచింది. రజావుల్లా వేసిన ఓ ఓవర్లో స్టీవ్ వరుసగా ఓ బౌండరీ, మూడు సిక్సర్లు బాది వీరంగం సృష్టించాడు. ఈ నాలుగు షాట్లు అభిమానులను ఉర్రూతలూగించాయి. ఇందులో వికెట్ కీపర్పై నుంచి కొట్టిన ర్యాంప్ షాట్ దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ను గుర్తు చేసింది.ఈ హాఫ్ సెంచరీ స్టీవ్కు సీజన్లో రెండవది. ఈ సీజన్లో తొలి మ్యాచ్ నుంచే మంచి ఫామ్లో ఉన్న స్టీవ్.. ముల్తాన్ సాధించిన ప్రతి విజయంలో కీలకపాత్ర పోషించాడు. ముల్తాన్ ఈ సీజన్లో 8 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరోవైపు రావల్పిండిజ్ ఈ మ్యాచ్లో ఓటమితో లీగ్ నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్తోనే పీఎస్ఎల్ అరంగేట్రం చేసిన ఈ జట్టు ఆడిన 8 మ్యాచ్ల్లో బోణీ కొట్టని ఏకైక జట్టుగా నిలిచింది.ముల్తాన్-రావల్పిండిజ్ మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పిండిజ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (58 నాటౌట్), డియాన్ ఫారెస్టర్ (37 నాటౌట్) రాణించారు. అనంతరం బరిలోకి దిగిన ముల్తాన్ స్టీవ్ స్మిత్ (56), ఆస్టన్ టర్నర్ (37 నాటౌట్) చెలరేగడంతో 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి, లక్ష్యాన్ని ఛేదించింది. -
ఫిల్ హ్యూస్ తరహా ఘటన
క్రికెట్ వెస్టిండీస్ ఆథ్వర్యంలో జరుగుతున్న వెస్టిండీస్ ఛాంపియన్షిప్లో భయానక ఘటన చోటు చేసుకుంది. సర్ వివియన్ స్టేడియం వేదికగా లీవార్డ్ ఐలాండ్స్–ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో పిచ్ ప్రమాదకరంగా మారడంలో మ్యాచ్ను మధ్యలోనే నిలిపివేశారు.ట్రినిడాడ్ పేసర్ జేడన్ సీల్స్ వేసిన బంతి, లీవార్డ్ ఐలాండ్స్ బ్యాటర్ జెర్మియా లూయిస్ హెల్మెట్ను బలంగా తాకింది. అసమాన బౌన్స్ కారణంగా బంతి ఒక్కసారిగా తలపైకి దూసుకువచ్చి లూయిస్ను కిందపడేసింది. ఈ ఘటనతో మైదానంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.Jayden Seales has claimed the first seven wickets to fall in an innings for Trinidad & Tobago against Leeward Islands, but looks set to be denied the chance to take 10 with the game halted due to a dangerous pitch. The last ball before the suspension is not for the faint-hearted pic.twitter.com/o4G5ULiSAh— Ben Gardner (@Ben_Wisden) April 21, 2026లూయిస్ కొద్దిసేపటి తర్వాత లేచినప్పటికీ, తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ హెల్మెట్ను కాలితో తన్నడం, పిచ్ను కొట్టడం కనిపించింది. అనంతరం అతడిని స్ట్రెచర్పై ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు సమాచారం.ఈ ఘటన తర్వాత మ్యాచ్ అధికారులతో పాటు అంపైర్లు చర్చలు జరిపి పిచ్ ప్రమాదకరంగా ఉందని తేల్చారు. ఆట కొనసాగితే ఆటగాళ్లకు గాయాలు తప్పవని తెలిసి మ్యాచ్ను డ్రాగా ప్రకటించారు.మూడో రోజు వరకు పిచ్ అస్థిరంగా ఉండటం వల్ల ఇప్పటికే అనేక వికెట్లు పడిపోయాయి. బంతి ఎలా బౌన్స్ అవుతుందో అంచనా వేయడం బ్యాటర్లకు కష్టమైంది.ఈ ఘటన క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన ఆస్ట్రేలియా ఆటగాడు ఫిల్ హ్యూస్ ఘటనను గుర్తు చేసింది. హ్యూస్ మెడకు బంతి తగిలి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇప్పటి ఘటనలో లూయిస్ సురక్షితంగా బయటపడటం ఊరట కలిగించినప్పటికీ, పిచ్ పరిస్థితులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.ఈ ఘటన ఆటగాళ్ల భద్రత ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేసింది. సాంకేతిక పరిజ్ఞానం, రక్షణ పరికరాలు మెరుగుపడినా పిచ్ నాణ్యతలో లోపాలు ఉంటే ప్రమాదాలు తప్పవని స్పష్టం చేసింది. -
క్రెడిట్ మొత్తం అతడికే.. క్లాసెన్ అదరగొట్టాడు: ఇషాన్ కిషన్
ఐపీఎల్-2026లో సన్రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ గెలుపు నమోదు చేసింది. సొంతమైదానం ఉప్పల్లో మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించి.. వరుసగా మూడోసారి జయభేరి మోగించింది. తద్వారా ఏడింట నాలుగో విజయంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.ఈ నేపథ్యంలో జట్టు ప్రదర్శన పట్ల సన్రైజర్స్ కెప్టెన్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) సంతృప్తి వ్యక్తం చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో అభిషేక్ శర్మ అద్భుతంగా రాణించాడని కొనియాడాడు. ‘‘అభిషేక్ మ్యాచ్ ఆసాంతం అదరగొట్టాడు. క్లాసెన్ మంచి ఫినిషింగ్ ఇచ్చాడు. ఇలాంటి వికెట్ మీద 200కు పైగా స్కోరు చేయడం గొప్ప విషయం.క్రెడిట్ మొత్తం అతడికే.. నిజానికి ఈ పిచ్ మీద ఆరంభంలో బ్యాటర్లకు తడబాటు తప్పదు. అయినా సరే అభిషేక్ అదరగొట్టాడు. మా విజయంలో క్రెడిట్ మొత్తం అతడికే దక్కుతుంది. ప్రణాళికలకు తగినట్లుగా ఆడుతూ ఫలితాలు రాబడుతున్నాము’’ అని ఇషాన్ కిషన్ పేర్కొన్నాడు.ఇక ఆఖరి ఓవర్లో హర్ష్ దూబేకు బంతి ఇవ్వడంపై స్పందిస్తూ.. ‘‘అతడు మెరుగా బౌలింగ్ చేయగలడని నాకు తెలుసు. అతడొక తెలివైన బౌలర్. కీలక ఓవర్లు నువ్వే వేయాల్సి ఉంటుందని నేను ముందుగానే అతడికి చెప్పాను. సరైన సమయంలో మనం అత్యుత్తమం అనుకున్న బౌలర్లను రంగంలోకి దించాలి. ఈరోజు మాకు ఇది కలిసి వచ్చింది’’ అని ఇషాన్ కిషన్ పేర్కొన్నాడు.కాగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 242 పరుగులు సాధించింది. అభిషేక్ శర్మ 68 బంతుల్లో 10 ఫోరు, 10 సిక్సర్ల సాయంతో 135 పరుగులతో అజేయంగా నిలిచాడు. హెన్రిచ్ క్లాసెన్ 13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 37 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు.మలింగ అద్భుతస్పెల్లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 195 పరుగులకే పరిమితమైంది. సన్రైజర్స్ బౌలర్లలో ఇషాన్ మలింగ అద్భుత స్పెల్ వేశాడు. నాలుగు కీలక వికెట్లు కూల్చి ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. హర్ష్ దూబే ఆఖరి ఓవర్లోఇక హర్ష్ దూబే ఆఖరి ఓవర్లో మూడు వికెట్లతో సత్తా చాటాడు. మిగిలిన వారిలో దిల్షాన్ మధుషాంక, సకీబ్ హుసేన్ ఒక వికెట్ దక్కించుకున్నారు. కాగా ఈ సీజన్లో ఢిల్లీకి ఆరింట ఇది మూడో పరాజయం.చదవండి: ‘మమ్మల్ని ఆపడం ఎవరివల్లా కాదు’Explosive with the bat 🔥Lethal with the ball ⚡#SRH clinch a 4️⃣7️⃣-run win to make it three-in-a-row at home 🧡Updates ▶️ https://t.co/VgUjXDlrDh#TATAIPL | #KhelBindaas | #SRHvDC | @SunRisers pic.twitter.com/Vcmp5r5sh1— IndianPremierLeague (@IPL) April 21, 2026 -
SRH vs DC: ఆ రెండు తప్పులే మా కొంపముంచాయి
సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో పరాజయంపై ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ స్పందించాడు. అభిషేక్ శర్మ విషయంలో తాము చేసిన ఫీల్డింగ్ తప్పిదాలే కొంపముంచాయని పేర్కొన్నాడు. ఐపీఎల్-2026లో భాగంగా ఉప్పల్ వేదికగా ఢిల్లీ మంగళవారం సన్రైజర్స్తో తలపడింది.సొంతమైదానంలో టాస్ ఓడిన సన్రైజర్స్ ఢిల్లీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్ అభిషేక్ శర్మ అజేయ సెంచరీ (68 బంతుల్లో 135)తో చెలరేగగా.. హెన్రిచ్ క్లాసెన్ మెరుపులు (13 బంతుల్లో 37 నాటౌట్) మెరిపించాడు. ఫలితంగా సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది.రెండుసార్లు మిస్అయితే, తొమ్మిదో ఓవర్లో అక్షర్ పటేల్ బౌలింగ్లో తొలి బంతికి అభిషేక్ను రనౌట్ చేసే అవకాశం రాగా.. ఢిల్లీ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ ఛాన్స్ మిస్ చేశాడు. ఈ క్రమంలో 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్.. 14వ ఓవర్లో నటరాజన్ బౌలింగ్లో బంతిని గాల్లోకి లేపగా.. నితీశ్ రాణా క్యాచ్ మిస్ చేశాడు.ఆ రెండు తప్పులే మా కొంపముంచాయిఅనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి కేవలం 195 పరుగులే చేసింది. దీంతో 47 పరుగుల తేడాతో సన్రైజర్స్ గెలుపొందింది. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం ఢిల్లీ సారథి అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. ‘‘అభిషేక్ను రనౌట్ చేసే అవకాశం వదులుకున్నాం. క్యాచ్ కూడా జారవిడిచాము. ఈ రెండు తప్పిదాల వల్లే మేము మూల్యం చెల్లించాల్సి వచ్చింది.ఒకవేళ ఈ రెండింటిలో ఒక్క సందర్భంలో మేము అవకాశం సద్వినియోగం చేసుకుంటే పరిస్థితి వేరుగా ఉండేది. అయితే, అతడు మా తప్పిదాలను తనకు అనుకూలంగా మలచుకుని పరుగులు రాబట్టాడు. మేము ఇంకాస్త మెరుగ్గా ఫీల్డింగ్ చేయాల్సింది. కానీ ఈరోజు అలా చేయలేకపోయాము’’ అని అక్షర్ పటేల్ విచారం వ్యక్తం చేశాడు.చదవండి: ‘మమ్మల్ని ఆపడం ఎవరివల్లా కాదు’𝐀𝐛𝐡𝐢-cadabra… & it’s a HUNDRED off just 47 balls 🪄🤯2nd TATA IPL Century ✅9th century in T20s - also the joint-most centuries by an Indian ✅Fastest Indian to 9 T20 hundreds (184 innings) ✅#AbhishekSharma | #TATAIPL 2026 | #SRHvDC | LIVE NOW 👉… pic.twitter.com/YHeoeyyahv— Star Sports (@StarSportsIndia) April 21, 2026 -
అభిషేక్ విధ్వంసం.. సెంచరీతో ఉప్పల్లో ఉప్పెన!
ఐపీఎల్లో అభిషేక్ మళ్లీ విధ్వంసం సృష్టించాడు. తనకే సాధ్యమైన రీతిలో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడిన అతను సెంచరీతో ఉప్పల్ మైదానంలో ఉప్పెన సృష్టించాడు. బౌండరీలతోనే సరిగ్గా 100 పరుగులు రాబట్టిన అభిషేక్కు క్లాసెన్, ఇషాన్ కిషన్, హెడ్ కూడా అండగా నిలవడంతో హైదరాబాద్ భారీ స్కోరుతో ప్రత్యర్థికి సవాల్ విసిరింది. అయితే ఢిల్లీ బ్యాటింగ్ ఏమాత్రం రైజర్స్కు సరితూగలేకపోయింది. ఏ దశలోనూ కావాల్సిన దూకుడును ప్రదర్శించని క్యాపిటల్స్ లక్ష్యానికి చాలా దూరంలో నిలిచిపోయింది. సమష్టి బౌలింగ్తో రైజర్స్ ఢిల్లీని పడగొట్టి వరుసగా మూడో విజయాన్ని అందుకుంది. సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై సన్రైజర్స్ హైదరాబాద్ హ్యట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఉప్పల్ స్టేడియంలో దాదాపు ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో రైజర్స్ 47 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అభిషేక్ శర్మ (68 బంతుల్లో 135 నాటౌట్; 10 ఫోర్లు, 10 సిక్స్లు) ఐపీఎల్లో తన రెండో సెంచరీతో చెలరేగగా... హెన్రిచ్ క్లాసెన్ (13 బంతుల్లో 37 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు), ట్రవిస్ హెడ్ (26 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 195 పరుగులు సాధించింది. నితీశ్ రాణా (30 బంతుల్లో 57; 7 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీ చేయగా... సమీర్ రిజ్వీ (28 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్స్లు), కేఎల్ రాహుల్ (23 బంతుల్లో 37; 1 ఫోర్, 3 సిక్స్లు) ఫర్వాలేదనిపించారు. సన్రైజర్స్ బౌలర్ ఇషాన్ మలింగకు 4 వికెట్లు దక్కాయి. THE HUNDRED CELEBRATION BY ABHISHEK SHARMA. 🔥- Proud father and Kavya Maran cheering. ❤️ pic.twitter.com/pbBYLZViiL— Mufaddal Vohra (@mufaddal_vohra) April 21, 2026భారీ భాగస్వామ్యాలు... తొలి నాలుగు ఓవర్లలో 6 ఫోర్లతో 36 పరుగులు రాబట్టిన రైజర్స్ ఇన్నింగ్స్ నితీశ్ రాణా వేసిన ఐదో ఓవర్తో ఊపందుకుంది. ఈ ఓవర్లో అభిషేక్, హెడ్ కలిసి 3 సిక్స్లు బాదడంతో 20 పరుగులు వచ్చాయి. పవర్ప్లేలో టీమ్ 67 పరుగులు సాధించింది. అనంతరం 25 బంతుల్లో అభిõÙక్ అర్ధసెంచరీ పూర్తి కాగా, అక్షర్ ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించి హెడ్ వెనుదిరిగాడు. అయితే మరోవైపు అభిషేక్ దూకుడు కొనసాగగా, ఇషాన్ కిషన్ (13 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా తన ధాటిని ప్రదర్శించాడు. వీరిద్దరు కలిసి కుల్దీప్ ఓవర్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 22 పరుగులు రాబట్టారు. 86 పరుగుల వద్ద డీప్ బ్యాక్వర్డ్లెగ్లో రాణా క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన అభిషేక్ శర్మ... రాణా ఓవర్లో వరుసగా 6, 6, 4 బాదాడు. ఈ క్రమంలో 47 బంతుల్లో అతని సెంచరీ పూర్తయింది. అయితే అదే ఓవర్లో దురదృష్టవశాత్తూ రిటర్న్లో బౌలర్ చేతికి తగిలిన బంతి నాన్స్ట్రయికింగ్ స్టంప్స్ను పడగొట్టడంతో కిషన్ రనౌటయ్యాడు. అయితే చివరి ఐదు ఓవర్లలో అభిషేక్ ను ఆపడంలో ఢిల్లీ సఫలం అయింది. ఈ 30 బంతుల్లో 17 బంతులు ఆడిన అభిషేక్ 2 ఫోర్లతో 20 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మరోవైపు ఉన్న క్లాసెన్ మాత్రం తనదైన శైలిలో చెలరేగడంతో భారీ స్కోరు సాధ్యమైంది. ఎన్గిడి ఓవర్లో రెండు వరుస సిక్స్లు కొట్టిన అతను... ముకేశ్ వేసిన చివరి ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టాడు. మిల్లర్ విఫలం... ఈ మ్యాచ్తోనే ఐపీఎల్లో అడుగు పెట్టిన పేసర్ మదుషంక చక్కటి బౌలింగ్ ప్రదర్శన కనబర్చాడు. తన 3 ఓవర్ల తొలి స్పెల్లో 24 పరుగులే ఇచి్చన అతను నిసాంక (8) వికెట్ తీశాడు. మరోవైపు నితీశ్ రెడ్డి వేసిన రెండు ఓవర్లలో రాణా, రాహుల్ కలిసి 2 సిక్స్లు, 3 ఫోర్లతో 29 పరుగులు రాబట్టడంతో పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 59 పరుగులకు చేరింది. శివాంగ్ ఓవర్లో వరుసగా 6, 6, 4 కొట్టిన రాణా 27 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే రాహుల్ను సాకిబ్ వెనక్కి పంపించగా, తర్వాతి ఓవర్లో మలింగ వరుస బంతుల్లో రాణా, మిల్లర్ (0)లను అవుట్ చేయడంతో రైజర్స్ పైచేయి సాధించింది. ఆ తర్వాత రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్ (16 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్) కలిసి పోరాడినా లాభం లేకపోయింది. 26 బంతుల్లో 77 పరుగులు చేయాల్సిన దశలో స్టబ్స్ అవుట్ కావడంతో ఢిల్లీ గెలుపు దారులు మూసుకుపోయాయి. స్కోరు వివరాలుసన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (నాటౌట్) 135; హెడ్ (సి) రిజ్వీ (బి) అక్షర్ 37; ఇషాన్ కిషన్ (రనౌట్) 25; క్లాసెన్ (నాటౌట్) 37; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 242. వికెట్ల పతనం: 1–97, 2–176. బౌలింగ్: ముకేశ్ కుమార్ 4–0–53–0, నితీశ్ రాణా 4–0–55–0, ఎన్గిడి 4–0–41–0, అక్షర్ పటేల్ 2–0–23–1, కుల్దీప్ 2–0–30–0, నటరాజన్ 4–0–40–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: నిసాంక (సి) (సబ్) లివింగ్స్టోన్ (బి) మదుషంక 8; రాహుల్ (సి) అభిషేక్ (బి) సాకిబ్ 37; నితీశ్ రాణా (సి) అభిషేక్ (బి) మలింగ 57; రిజ్వీ (సి) మదుషంక (బి) దూబే 41; మిల్లర్ (బి) మలింగ 0; స్టబ్స్ (సి) సాకిబ్ (బి) మలింగ 27; అశుతోష్ (సి) అనికేత్ (బి) మలింగ 14; అక్షర్ (సి) నితీశ్ (బి) దూబే 2; కుల్దీప్ (నాటౌట్) 1; ఎన్గిడి (సి) మదుషంక (బి) దూబే 0; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 195. వికెట్ల పతనం: 1–21, 2–107, 3–107, 4–107, 5–166, 6–186, 7–192, 8–195, 9–195. బౌలింగ్: మదుషంక 4–0–36–1, నితీశ్ రెడ్డి 4–0–57–0, ఇషాన్ మలింగ 4–0–32–4, సాకిబ్ 4–0–29–1, శివాంగ్ 2–0–28–0, హర్‡్ష దూబే 2–0–12–3. -
బెస్ట్ అల్కరాజ్, సబలెంకా
మాడ్రిడ్: క్రీడా ప్రపంచంలో అస్కార్ అవార్డులుగా భావించే లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక ఈ కార్యక్రమం జరిగింది. 2025 సంవత్సరానికి గాను పురుషుల విభాగంలో ఉత్తమ క్రీడాకారుడిగా స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్... మహిళల విభాగంలో ఉత్తమ క్రీడాకారిణిగా బెలారూస్ టెన్నిస్ స్టార్ సబలెంకా పురస్కారాలు అందుకున్నారు. 2000 సంవత్సరం నుంచి లారియస్ అవార్డులు ప్రతియేటా ఇస్తున్నారు. గత ఏడాది అల్కరాజ్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టైటిల్స్తోపాటు మరో ఆరు టోర్నీల్లో విజేతగా నిలిచాడు. ఆ్రస్టేలియన్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్ చేరిన ఈ స్పెయిన్ స్టార్, వింబుల్డన్ టోర్నీలో రన్నరప్గా నిలిచాడు. ఓవరాల్గా 71 మ్యాచ్ల్లో గెలిచి, 9 మ్యాచ్ల్లో ఓడిపోయాడు. 2026 సీజన్ను కూడా అల్కరాజ్ ఘనంగా ప్రారంభించాడు. ఆ్రస్టేలియన్ ఓపెన్లో తొలిసారి టైటిల్ గెలిచి టెన్నిస్లోని నాలుగు గ్రాండ్స్లామ్ టైటిల్స్ సొంతం చేసుకొని ‘కెరీర్ గ్రాండ్స్లామ్’ ఘనత సాధించాడు. గతవారం బార్సిలోనా ఓపెన్ టోర్నీలో మణికట్టు గాయానికి గురైన అల్కరాజ్ మాడ్రిడ్ మాస్టర్స్ టోర్నీ నుంచి వైదొలిగాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకుంటేనే ఫ్రెంచ్ ఓపెన్ బరిలోకి దిగుతానని 22 ఏళ్ల అల్కరాజ్ వ్యాఖ్యానించాడు. రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), రాఫెల్ నాదల్ (స్పెయిన్) తర్వాత ‘లారియస్ స్పోర్ట్స్మన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు గెల్చుకున్న నాలుగో టెన్నిస్ ప్లేయర్గా అల్కరాజ్ గుర్తింపు పొందాడు. మరోవైపు మహిళల టెన్నిస్ నంబర్వన్ సబలెంకా కూడా గతేడాది నిలకడగా రాణించింది. యూఎస్ ఓపెన్లో టైటిల్ నెగ్గిన సబలెంకా ఆ్రస్టేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్లో రన్నరప్గా నిలిచింది. సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీలోనూ రన్నరప్ ట్రోఫీ అందుకుంది. ఓవరాల్గా సీజన్లో నాలుగు టైటిల్స్ సొంతం చేసుకున్న ఆమె 63 మ్యాచ్ల్లో గెలిచి, 12 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ‘వరల్డ్ టీమ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు ఫ్రాన్స్కు చెందిన ఫుట్బాల్ క్లబ్ పారిస్ సెయింట్ జెర్మయిన్ (పీఎస్జీ) గెల్చుకుంది. గత ఏడాది పీఎస్జీ జట్టు తొలిసారి ప్రతిష్టాత్మక చాంపియన్స్ లీగ్ టైటిల్ను సాధించింది. ‘టీమ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు విభాగంలో భారత మహిళల క్రికెట్ జట్టు కూడా నామినేట్ అయింది. గత ఏడాది హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు తొలిసారి వన్డే వరల్డ్కప్ను సాధించింది. అయితే తుదకు ఈ అవార్డు పీఎస్జీ జట్టుకు లభించింది. రొమేనియా దిగ్గజ జిమ్నాస్ట్ నాడియా కొమనెసికి లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు దక్కింది. 64 ఏళ్ల నాడియా ఒలింపిక్స్ క్రీడల్లో 10కి 10 పాయింట్లు స్కోరు చేసిన తొలి జిమ్నాస్ట్గా రికార్డు నెలకొల్పింది. 1976 మాంట్రియల్ ఒలింపిక్స్లో ఆల్ అరౌండ్, అన్ఈవెన్ బార్స్, బ్యాలెన్స్ బీమ్ ఈవెంట్లలో నాడియా ‘పర్ఫెక్ట్ 10’ స్కోరుతో స్వర్ణ పతకాలు సాధించింది. అంతర్జాతీయ కెరీర్లో నాడియా మొత్తం తొమ్మిది ఒలింపిక్ పతకాలు, నాలుగు ప్రపంచ చాంపియన్షిప్ పతకాలు, మూడు వరల్డ్కప్ ఫైనల్ పతకాలు గెలుచుకుంది. లారియస్ అవార్డు విజేతల జాబితావరల్డ్ స్పోర్ట్స్మన్ ఆఫ్ ద ఇయర్: కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్, టెన్నిస్) వరల్డ్ స్పోర్ట్స్ఉమన్ ఆఫ్ ద ఇయర్: సబలెంకా (బెలారూస్, టెన్నిస్) వరల్డ్ టీమ్ ఆఫ్ ద ఇయర్: పారిస్ సెయింట్ జెర్మయిన్ (ఫ్రాన్స్, ఫుట్బాల్) వరల్డ్ బ్రేక్థ్రూ ఆఫ్ ద ఇయర్: లాండో నోరిస్ (బ్రిటన్, ఫార్ములావన్) వరల్డ్ కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్: రోరీ మెకిల్రాయ్ (నార్తర్న్ ఐర్లాండ్, గోల్ఫ్) వరల్డ్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ (దివ్యాంగులు): గాబ్రియెల్ అరుజో సాంతోస్ (బ్రెజిల్, స్విమ్మింగ్) వరల్డ్ యాక్షన్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్: చోల్ కిమ్ (అమెరికా, స్నో బోర్డ్) వరల్డ్ యంగ్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్: లామినె యామల్ (స్పెయిన్, ఫుట్బాల్) స్పోర్టింగ్ ఇన్స్పిరేషన్ అవార్డు: టోనీ క్రూస్ (జర్మనీ, ఫుట్బాల్) లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు: నాడియా కొమనెసి (రొమేనియా, జిమ్నాస్టిక్స్) స్పోర్ట్ ఫర్ గుడ్ అవార్డు: ఫుట్బాల్ మాస్ -
‘మమ్మల్ని ఆపడం ఎవరివల్లా కాదు’
న్యూఢిల్లీ: ముంబై ఇండియన్స్ జట్టులో చాలా మంది ప్రపంచకప్ విజేతలు ఉన్నారని... వారు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే తమ జట్టును ఆపడం ఎవరి వల్లా కాదని మిడిలార్డర్ బ్యాటర్ తిలక్ వర్మ అన్నాడు. ఐపీఎల్లో భాగంగా సోమవారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై జయభేరి మోగించడంలో తిలక్ వర్మ కీలక పాత్ర పోషించాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన ఈ హైదరాబాదీ లెఫ్ట్ హ్యాండర్... ఆ తర్వాత భారీ షాట్లతో రెచ్చిపోయి అజేయ సెంచరీతో ముంబై జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఆ తర్వాత బౌలర్లు సమష్టి కృషితో సత్తాచాటడంతో గుజరాత్పై ముంబై ఘనవిజయం సాధించింది. మ్యాచ్ అనంతరం తిలక్ మాట్లాడుతూ... ‘ఈ ప్రదర్శన నాకు, జట్టుకు ఎంతో ముఖ్యమైంది. గత నాలుగైదు మ్యాచ్ల్లో ఏదీ కలిసిరాలేదు. ఎక్కువ సమయం క్రీజులో గడిపేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. దీంతో గుజరాత్తో మ్యాచ్లో పరిస్థితులకు తగ్గట్లు ఆడాలని అనుకున్నా... అది ఫలితాన్నిచ్చింది’ అని అన్నాడు. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్లో విజయం సాధించిన అనంతరం వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడిన ముంబై ఇండియన్స్... తిలక్ మెరుపులతో తిరిగి గెలుపు బాట పట్టింది. తిలక్ వర్మకు ఐపీఎల్లో ఇదే తొలి శతకం కాగా... ఈ జోరు సీజన్ మొత్తం కొనసాగించాలనుకుంటున్నట్లు అతడు వెల్లడించాడు. ‘అహ్మదాబాద్ వేదికగా ముంబై మ్యాచ్ ఎప్పుడు జరిగినా... ఇలాంటి పిచ్పైనే సాగుతుంది. ఇతర పిచ్లతో పోల్చుకుంటే అది కాస్త నెమ్మదిగా ఉంది. బంతి తక్కువ ఎత్తులో వస్తుండటంతో స్ట్రెయిట్గా ఆడాలని నిర్ణయించుకున్నా. దీంతో సులువుగా పరుగులు రాబట్టగలిగా. సాధారణంగా మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడాన్ని ఇష్టపడతా. కానీ జట్టుకు అవసరమైనప్పుడు పరిస్థితులకు తగ్గట్లు ఎక్కడైనా ఆడేందుకు సిద్ధంగా ఉన్నా. చిన్నప్పటి నుంచి దీని కోసం ఎంతో సాధన చేశా. ఎక్కువ ఆలోచించడం లేదు. చిన్నచిన్న లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని అందుకోవడమే మా పని. ఒక్కో మ్యాచ్పైనే దృష్టి పెట్టాం. మా సామర్థ్యం ఏంటో మాకు తెలుసు. జట్టులో చాలా మంది ప్రపంచకప్ గెలిచిన ప్లేయర్లు ఉన్నారు. అనుభవం, నైపుణ్యానికి కొదవలేదు. మేమంతా కలిసికట్టుగా రాణిస్తే... ముంబై ఇండియన్స్ను ఆపడం ఎవరి తరం కాదు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో హార్దిక్ పాండ్యా ఉత్సాహపరిచాడు. ‘నువ్వు చేయగలవు’ అని పదే పదే చెప్తూ నాలో ఆత్మవిశ్వాసం నింపాడు. ఆ సమయంలో ‘ప్రశాంతంగా ఉండు... మిగిలిందంతా నేను చూసుకుంటా’ అని చెప్పాను. మొత్తానికి ఈ విజయం జట్టులో జోష్ నింపింది’ అని తిలక్ వివరించాడు. -
ఆరో స్థానంలో షఫాలీ
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా పర్యటనలో ఆకట్టు కుంటున్న భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ షఫాలీ వర్మ... అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టి20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ముందంజ వేసింది. సఫారీ జట్టుతో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టి20 సిరీస్లో జట్టుకు మెరుగైన ఆరంభాలు అందిస్తున్న షఫాలీ వర్మ ర్యాంకింగ్స్లో రెండు స్థానాలు ఎగబాకి... ఆరో ర్యాంక్కు చేరింది. డర్బన్ వేదికగా జరిగిన రెండో టి20లో షఫాలీ 38 బంతుల్లోనే 57 పరుగులు చేసింది. అంతకుముందు తొలి మ్యాచ్లో షఫాలీ 34 పరుగులతో మెరిసింది. ఈ రెండు మ్యాచ్ల్లోనూ టీమిండియా పరాజయం పాలైంది. ఈ ప్రదర్శనతో తాజా ర్యాంకింగ్స్లో షఫాలీ 731 పాయింట్లతో ఆరో ‘ప్లేస్’కు చేరింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (762 పాయింట్లు) ఒక స్థానం కోల్పోయి నాలుగో ర్యాంక్కు పరిమితమైంది. టాప్–10 ర్యాంకింగ్స్లో భారత్ నుంచి ఈ ఇద్దరే చోటు దక్కించుకున్నారు. ఆ్రస్టేలియా ప్లేయర్ జార్జియా వాల్ (815 పాయింట్లు) అగ్రస్థానంలో ఉండగా... బెత్ మూనీ (788 పాయింట్లు; ఆ్రస్టేలియా), హేలీ మాథ్యూస్ (767 పాయింట్లు; వెస్టిండీస్) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (639 పాయింట్లు) రెండు స్థానాలు మెరుగు పరుచుకొని 11వ ర్యాంక్కు చేరగా... జెమీమా రోడ్రిగ్స్ (637 పాయింట్లు) నాలుగు ర్యాంక్లు కోల్పోయి 14వ స్థానంలో ఉంది. బౌలర్ల విభాగంలో దీప్తి శర్మ (705 పాయింట్లు) రెండు స్థానాలు కోల్పోయి ఐదో ర్యాంక్కు చేరగా... రేణుక సింగ్ (699 పాయింట్లు) నాలుగు స్థానాలు చేజార్చుకొని 9వ ర్యాంక్లో నిలిచింది. ఆల్రౌండర్ల జాబితాలో దీప్తి శర్మ మూడో ర్యాంక్లో కొనసాగుతోంది. -
శివ నర్వాల్ పసిడి గురి
కైరో: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) జూనియర్ ప్రపంచకప్ టోర్నీలో తొలి రోజు భారత్కు మూడు పతకాలు లభించాయి. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ శివ నర్వాల్ స్వర్ణ పతకం సొంతం చేసుకోగా... చిరాగ్ శర్మ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో శివ నర్వాల్ 241.8 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. 240 పాయింట్లతో సోదిక్జోన్ అబ్దుల్లాయెవ్ రజత పతకం... 218.9 పాయింట్లతో చిరాగ్ శర్మ కాంస్య పతకం నెగ్గారు. ఫైనల్లో పోటీపడ్డ భారత మూడో షూటర్ అభినవ్ దేశ్వాల్ 136.7 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచాడు. జూనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో భారత షూటర్ పనాహ్ బుగ్రా రజత పతకం సంపాదించింది. ఫైనల్లో పనాహ్ 250.6 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది. -
పంజాబ్ క్రీడాకారులకు హాకీ దిగ్గజం బోవెలాండర్ పాఠాలు!
చండీగఢ్: నెదర్లాండ్స్ హాకీ దిగ్గజం ఫ్లోరిస్ జాన్ బోవెలాండర్తో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ భేటీ అయ్యారు. ప్రతిష్టాత్మక ఆసియా చాంపియన్స్ ట్రోఫీకి ముందు రాష్ట్రంలో హాకీని మరింత బలోపేతం చేయడానికి బోవెలాండర్ సేవలను వినియోగించుకోవాలని ఆయన ప్రతిపాదించారు. ప్రస్తుతం నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్న భగవంత్ మాన్... ఇందులో భాగంగా హాకీపై బోవెలాండర్తో సుదీర్ఘంగా చర్చించారు. హాకీకి పునరై్వభవం తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా బోవెలాండర్ అసాధారణ ప్రతిభను మాన్ ప్రశంసించారు. ఆయన క్రీడా ప్రయాణం ప్రపంచ వ్యాప్తంగా యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబర్లో జరగనున్న ఆసియా చాంపియన్స్ ట్రోఫీకి పంజాబ్ ఆతిథ్యమివ్వనుంది. ప్లేయర్ల నైపుణ్యాన్ని మరింత మెరుగు పరిచేందుకు పంజాబ్కు రావాల్సిందిగా బోవెలాండర్ను భగవంత్ మాన్ ఆహ్వానించారు. దీనికి డచ్ దిగ్గజం సుముఖత వ్యక్తం చేశాడు. చాంపియన్స్ ట్రోఫీకి ముందు బోవెలాండర్ భారత్కు రానున్నట్లు మాన్ వెల్లడించారు. ‘క్రీడా ప్రతిభను పెంపొందించడానికి, హాకీని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి పంజాబ్ కట్టుబడి ఉంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీకి తొలిసారి పంజాబ్ ఆతిథ్యమివ్వనుంది. భారత హాకీలో ఎప్పటి నుంచో పంజాబ్ కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. 50 మందికి పైగా పంజాబ్ ప్లేయర్లు హాకీలో ఒలింపిక్ పతకాలు సాధించారు. పది మందికిపైగా పంజాబ్ ప్లేయర్లు విశ్వక్రీడల్లో దేశానికి నాయకత్వం వహించారు. పంజాబీ ప్లేయర్ లేకుండా భారత హాకీ జట్టును ఊహించడం కష్టం. పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలిచిన భారత జట్టులోనూ పది మంది పంజాబీ ప్లేయర్లు ఉన్నారు. అలాంటి ఘనచరిత్ర ఉన్న ప్లేయర్లకు దిశానిర్దేశం చేసేందుకు నెదర్లాండ్స్ హాకీ దిగ్గజం బోవెలాండర్ అంగీకరించారు. ఆసియా చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆయన మన ప్లేయర్లలో స్ఫూర్తినింపనున్నారు’ అని భగవంత్ మాన్ వెల్లడించారు. -
ఆసియా క్రీడల ప్రసార హక్కులు సోనీ నెట్వర్క్కు
న్యూఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్ వేదికగా జరగనున్న 20వ ఆసియా క్రీడల ప్రసార హక్కులను సోనీ పిక్చర్స్ నెట్వర్క్ కైవసం చేసుకుంది. దీంతో ఏషియన్ గేమ్స్ను సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ చానల్స్తో పాటు సోనీ లివ్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. చైనా వేదికగా జరిగిన గత ఆసియా క్రీడల్లో భారత్ 107 పతకాలతో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. ‘ఆసియా క్రీడా మహోత్సవ ప్రసార హక్కులు దక్కించుకోవడం గర్వంగా ఉంది. సోనీ టీవీకి ఈ అవకాశం రావడం ఇది మూడోసారి’ అని సోనీ నెట్వర్క్ ప్రతినిధి రాజేశ్ కౌల్ అన్నారు. జపాన్ వేదికగా జరగనున్న ఏషియన్ గేమ్స్లో మొత్తం 41 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఇందులో 32 ఒలింపిక్ క్రీడలు ఉన్నాయి. వీటితో పాటు మిక్స్డ్ మార్షల్, సర్ఫింగ్ వంటి కొత్త క్రీడలను సైతం ఇందులో చేర్చారు. ఈ క్రీడల్లో భాగంగా క్రికెట్, టెన్నిస్, కబడ్డీ, సెపక్తక్రా, కురాశ్ వంటి పలు క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి. ‘గత ఆసియా క్రీడల్లో భారత్ అద్భుత ప్రదర్శన కనబర్చంది. తొలిసారి వంద పతకాల మైలురాయిని దాటింది. ఇది దేశంలో పెరుగుతున్న క్రీడా సంస్కృతికి నిదర్శనం. ఈసారి అంతకుమించిన ప్రదర్శనతో రికార్డులు తిరగరాయడం ఖాయమే. అలాంటి స్ఫూర్తిదాయక క్షణాలను ప్రసారం చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’ అని రాజేశ్ వెల్లడించారు. -
సమర్పిస్తారా... సత్తా చాటుతారా!
జొహన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా భారత మహిళల క్రికెట్ జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి రెండు మ్యాచ్ల్లో పరాజయం పాలైన హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు... బుధవారం మూడో మ్యాచ్ బరిలోకి దిగనుంది. ఇప్పటికే సిరీస్లో 0–2తో వెనుకబడి ఉన్న టీమిండియా ఈ మ్యాచ్లో ఓడితే సిరీస్ కోల్పోతుంది. ఈ నేపథ్యంలో జట్టు మొత్తం కలిసికట్టుగా కదంతొక్కాలని భావిస్తోంది.టి20 ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్లో భారత బ్యాటర్లు షఫాలీ వర్మ, హర్మన్ప్రీత్ కౌర్ ఫర్వాలేదనిపిస్తుండగా... మిగిలిన వాళ్లు ఆకట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన వైఫల్యం జట్టును ఇబ్బంది పెడుతోంది. సిరీస్ కోల్పోయే ప్రమాదంలో ఉన్న తరుణంలో స్మృతి, జెమీమా, షఫాలీ, హర్మన్ప్రీత్, రిచా ఘోష్, దీప్తి శర్మ సమష్టిగా సత్తా చాటాల్సిన అవసరముంది. ‘ఈ సిరీస్లో తొలి రెండు మ్యాచ్లను పరిశీలిస్తే ఆరంభంలో మా బ్యాటింగ్ బాగానే సాగింది. కానీ చివర్లో వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో బ్యాటర్లు విఫలమయ్యారు. ఈ సారి ఆ తప్పిదాలను అధిగమిస్తాం. దీప్తికి అపార అనుభవం ఉంది. ఒకటీ రెండు మ్యాచ్ల్లో ప్రదర్శన బాగాలేనంత మాత్రానే ఆమె ప్రతిభను తక్కువ అంచనా వేయలేం. వరల్డ్కప్ ప్రారంభానికి ముందు అన్నీ విధాలుగా సిద్ధమవుతాం’ అని టీమిండియా బౌలింగ్ కోచ్ అవిష్కార్ సాల్వీ అన్నాడు. మరోవైపు వరుస విజయాలతో జోరు మీదున్న దక్షిణాఫ్రికా ఇక్కడే సిరీస్ చేజిక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. -
తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగా శ్రీధర్ బాబు
సాక్షి, హైదరాబాద్: వచ్చే నాలుగేళ్ల కాలానికి తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం (బీఏటీ) నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. హైదరాబాద్లో జరిగిన వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశంలో కొత్త కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయింది. తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా వి.చాముండేశ్వరనాథ్, వై.ఉపేందర్ రావు, జి.వెంకట రావు, పి.రమేశ్ రెడ్డి, ఉప్పాల శ్రీనివాస్ గుప్తా ఎన్నికయ్యారు. జనరల్ సెక్రటరీగా భారత జట్టు హెడ్ కోచ్ పుల్లెల గోపీచంద్, కోశాధికారిగా కానూరి వంశీధర్ నియమితులయ్యారు. సంయుక్త కార్యదర్శులుగా ఎల్.రవికుమార్, పి.మనోజ్ కుమార్, ఎం.జితేందర్ రెడ్డి, యు.వి.ఎన్.బాబు వ్యవహరిస్తారు. ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా పి.రాంమోహన్ రావు, తోట రంగారావు, కె.శ్రీనివాస రావు, పుల్లూరి సుధాకర్, కొల్లి నాగవేణి ఎన్నికయ్యారు. సలహాదారుడిగా లక్ష్మణ్ కొసరాజు వ్యవహరిస్తారు. -
అభిషేక్ విధ్వంసం.. ఎస్ఆర్హెచ్ హ్యాట్రిక్ విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) సొంతగడ్డపై హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 47 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 243 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 195 పరుగులకు పరిమితమైంది. నితీశ్ రానా 57 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. సమీర్ రిజ్వీ 41 పరుగులు సాధించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ 4, హర్ష్దూబే మూడు వికెట్లు తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 242 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (68 బంతుల్లో 135 నాటౌట్) సెంచరీతో విధ్వంసం సృష్టించడంతో ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో తొలిసారి 240 పరుగుల ప్లస్ మార్కును దాటింది. చివర్లో క్లాసెన్ (13 బంతుల్లో 37 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్తో అలరించాడు. హెడ్ 37, ఇషాన్ కిషన్ 25 పరుగులు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశాడు. అజేయ సెంచరీతో ఢిల్లీ పని పట్టిన అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్నాడు.242లో సగం స్కోరు అభిషేక్దే..టాస్ గెలిచి ఎస్ఆర్హెచ్ను బ్యాటింగ్కు ఆహ్వానించడంతోనే ఢిల్లీ క్యాపిటల్స్ కష్టాలు మొదలయ్యాయి. ఆరంభం నుంచే ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు దూకుడుగా ఆడారు. అభిషేక్ శర్మ, హెడ్లు పోటీపడి బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించారు. ఆ తర్వాత జట్టు స్కోరు 97 పరుగుల వద్ద హెడ్ వెనుదిరగడంతో ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. మరో ఎండ్లో మాత్రం అభిషేక్ శర్మ తన విధ్వంసాన్ని కొనసాగించాడు. గత రెండు మ్యాచ్ల్లో అర్థశతకాలు సాధించినప్పటికీ వాటిని సెంచరీలుగా మలచడంలో విఫలమయ్యాడు. కానీ ఈసారి మాత్రం ఆది నుంచే ధాటిగా ఆడిన అభిషేక్ ఢిల్లీ బౌలర్లను చీల్చి చెండాడి సెంచరీ మార్క్ను అందుకున్నాడు. చివరి వరకు నిలిచిన అభిషేక్ క్లాసెన్, ఇషాన్లతో కలిసి మంచి భాగస్వామ్యాలు నమోదు చేశాడు. అయితే జట్టు సాధించిన 242 పరుగుల్లో అభిషేక్ ఒక్కడివే 135 పరుగులు ఉండడం గమనార్హం. అతడి ఇన్నింగ్స్లో 10 ఫోర్లు, 10 సిక్సర్లు ఉండడం విశేషం.తడబడిన ఢిల్లీ..భారీ లక్ష్యంతో బరిలోకి దిగినప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయినప్పటికీ కేఎల్ రాహుల్ (37), నితీశ్ రానా (57) రెండో వికెట్కు 86 పరుగులు జోడించి ఢిల్లీ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. అయితే స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరు వెనుదిరగడం ఢిల్లీని కష్టాల్లోకి నెట్టేసింది. ఆ తర్వాత వచ్చిన మిల్లర్ గోల్డెన్ డకౌట్ కావడంతో మరింత కష్టాల్లో పడింది. ఈ దశలో సమీర్ రిజ్వీ, స్టబ్స్ (27) ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ ఎస్ఆర్హెచ్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. సీజన్లో ఎస్ఆర్హెచ్కు ఇది నాలుగో విజయం కాగా, సొంతగడ్డపై మాత్రం హ్యాట్రిక్ విక్టరీ. ఈ గెలుపుతో ఎస్ఆర్హెచ్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలోకి దూసుకెళ్లింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన ఆరు మ్యాచ్ల్లో ఇది మూడో పరాజయం. దీంతో ఆ జట్టు పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.Explosive with the bat 🔥Lethal with the ball ⚡#SRH clinch a 4️⃣7️⃣-run win to make it three-in-a-row at home 🧡Updates ▶️ https://t.co/VgUjXDlrDh#TATAIPL | #KhelBindaas | #SRHvDC | @SunRisers pic.twitter.com/Vcmp5r5sh1— IndianPremierLeague (@IPL) April 21, 2026 -
IPL 2026: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ సెంచరీతో మెరిశాడు. ఆది నుంచి దూకుడుగా ఆడిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 47 బంతుల్లో సెంచరీ మార్కు అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్లో తన రెండో శతకాన్ని నమోదు చేశాడు.ఈ క్రమంలో అభిషేక్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి పేరిట ఉన్న టీ20 సెంచరీల రికార్డును సమం చేశాడు. కోహ్లి తర్వాత పొట్టి క్రికెట్లో అత్యధిక శతకాలు బాదిన భారత క్రికెటర్గా చరిత్రకెక్కాడు.అభిషేక్ ధనాధన్..కాగా ఐపీఎల్-2026లో భాగంగా సొంతమైదానం ఉప్పల్లో టాస్ ఓడిన సన్రైజర్స్.. ఢిల్లీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగింది. ఆది నుంచి అభిషేక్ శర్మ తనదైన శైలిలో చెలరేగాడు. 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతడు.. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించి శతక మార్కు అందుకున్నాడు.కాగా ఐపీఎల్లో అభిషేక్కు ఇది రెండో సెంచరీ కాగా.. ఓవరాల్గా టీ20 ఫార్మాట్లో తొమ్మిదవ సెంచరీ. దేశవాళీ క్రికెట్లో పంజాబ్ తరఫున ఐదు శతకాలు బాదిన అభిషేక్.. టీమిండియా తరఫునా రెండుసార్లు శతక్కొట్టాడు.క్లాసెన్ ఫటాఫట్ఇక ఢిల్లీతో మ్యాచ్లో సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 68 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్సర్లు బాది 135 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోవైపు హెన్రిచ్ క్లాసెన్ 13 బంతుల్లో 37 పరుగులతో దుమ్ములేపాడు.Incredible knock, iconic celebration 🙌An Abhishek Sharma special lights up Hyderabad 💯Updates ▶️ https://t.co/VgUjXDlrDh#TATAIPL | #KhelBindaas | #SRHvDC | @SunRisers | @OfficialAbhi04 pic.twitter.com/QUWtkWuX0D— IndianPremierLeague (@IPL) April 21, 2026టీ20 క్రికెట్లో అత్యధిక సెంచరీల వీరులు🏏క్రిస్ గేల్ (వెస్టిండీస్)- 22 సెంచరీలు🏏బాబర్ ఆజం (పాకిస్తాన్)- 12 సెంచరీలు🏏డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)- 10 సెంచరీలు🏏క్వింటన్ డికాక్ (సౌతాఫ్రికా)- 9 సెంచరీలు🏏విరాట్ కోహ్లి (ఇండియా)- 9 సెంచరీలు🏏రిలీ రొసోవ్ (సౌతాఫ్రికా)- 9 సెంచరీలు🏏సాహిబ్జాదా ఫర్హాన్ (పాకిస్తాన్)- 9 సెంచరీలు🏏అభిషేక్ శర్మ (ఇండియా)-9 సెంచరీలు.చదవండి: తిలక్ వర్మపై హార్దిక్ పాండ్యా సీరియస్.. స్పందించిన స్టార్ -
ముంబై ఇండియన్స్కు శుభవార్త.. బిగ్ బూస్ట్
ముంబై ఇండియన్స్కు శుభవార్త. ఇంగ్లండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్ అందుబాటులోకి వచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా అతడు ముంబై తరఫున బరిలోకి దిగే అవకాశం ఉంది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో విల్ జాక్స్ అద్భుత ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే.వరల్డ్కప్లో సూపర్హిట్ఇంగ్లండ్ తరఫున ఎనిమిది మ్యాచ్లలో కలిపి 226 పరుగులు చేసిన విల్ జాక్స్ (Will Jacks).. తొమ్మిది వికెట్లు కూల్చాడు. ఈ టోర్నీలో ఇంగ్లండ్ సెమీస్ ప్రయాణానికి దోహదం చేసిన ఈ ఆల్రౌండర్ నాలుగుసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు. ఈ పవర్ హిట్టర్ను ముంబై ఇండియన్స్ రూ. 5.25 కోట్లకు కొనుగోలు చేసింది.వ్యక్తిగత సెలవుఅయితే, వరల్డ్కప్ తర్వాత వ్యక్తిగత సెలవుపై వెళ్లిన విల్ జాక్స్ ముంబై ఆరంభ మ్యాచ్లకు మాత్రమే దూరమవుతాడని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, ఆరు మ్యాచ్లు పూర్తైనా అతడు జట్టుతో చేరలేదు. తాజా సమాచారం ప్రకారం విల్ జాక్స్ తదుపరి మ్యాచ్కు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అతడు భారత్లో అడుగుపెట్టినట్లు సమాచారం. కాగా ముంబై ఇండియన్స్ ఇప్పటికి ఆరు మ్యాచ్లు ఆడి కేవలం రెండే గెలిచింది. ఇలాంటి తరుణంలో స్టార్ ఆల్రౌండర్ విల్ జాక్స్ జట్టుతో చేరనుండటం సానుకూలాంశం. కాగా ముంబై గురువారం చెన్నై జట్టుతో తలపడనుంది. ఇందుకు వాంఖడే వేదిక.చదవండి: తిలక్ వర్మపై హార్దిక్ పాండ్యా సీరియస్.. స్పందించిన స్టార్ -
కోహ్లి ‘టేస్ట్’పై కామెంట్.. మాజీ ‘గర్ల్ఫ్రెండ్’ స్పందన ఇదే!
విరాట్ కోహ్లి.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టీమిండియా దిగ్గజ బ్యాటర్, రన్మెషీన్గా పేరొందిన ఈ ఢిల్లీ స్టార్.. క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్కు వీడ్కోలు పలికిన కోహ్లి.. వన్డేల్లో మాత్రం ‘రారాజు’గానే కొనసాగుతున్నాడు.ప్రస్తుతం ఐపీఎల్-2026లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)కు ఆడుతూ బిజీగా ఉన్నాడు కోహ్లి. అయితే, గత కొంతకాలంగా ఆట కంటే కూడా వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం జర్మన్ ఇన్ఫ్లూయెన్సర్ లిజ్లాజ్ ఫొటోకు కోహ్లి లైక్ కొట్టినట్లు వార్తలు రాగా.. కాసేపటికే అతడు ఆ ఫొటోను డిస్లైక్ చేసినట్లు తెలిసింది.ఈ విషయంపై లిజ్లాజ్ స్పందిస్తూ.. కోహ్లి వల్ల తనకు ప్రచారరం లభించినా అతడు మాత్రం ఇబ్బంది పడాల్సి వచ్చిందని విచారం వ్యక్తం చేసింది. గతంలో అవనీత్ కౌర్ అనే ఇన్ఫ్లూయెన్సర్ ఫొటోకు కూడా కోహ్లి లైక్ చేసినట్లు వార్తలు రాగా.. అల్గారిథమ్ పొరపాటు వల్లే ఇలా జరిగిందని అతడు వివరణ ఇచ్చాడు.అభ్యంతరకర కామెంట్ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇన్స్టాగ్రామ్ పేజ్లో బ్రెజిల్ మోడల్ ఇసబెల్ల లియట్, కోహ్లి భార్య అనుష్క శర్మ, అవనీత్ కౌర్, లిజ్లాజ్ ఫొటోలను పోస్ట్ చేస్తూ.. ‘‘మహిళల విషయంలో విరాట్ కోహ్లి అభిరుచి ఎప్పుడూ గొప్పగానే ఉంటుందన్న విషయాన్ని ఎవరూ కాదనలేరు’’ అని అభ్యంతరకర కామెంట్ పెట్టారు.ఈ పోస్టుపై ఇసబెల్ల స్పందించింది. ‘‘పన్నెండు ఏళ్ల కాలం గడిచిపోయింది. ఇప్పటికీ మీరెందుకు ఆ విషయం నుంచి బయటకు రావడం లేదు’’ అంటూ ఇసబెల్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కాగా అనుష్క శర్మ పరిచయం కాకముందు కోహ్లి 2012-2104 మధ్య ఇసబెల్లతో డేటింగ్ చేశాడనే వదంతులు ఉన్నాయి.కాగా 2014లో తన మూవీ ప్రమోషన్లో భాగంగా కోహ్లి- అనుష్క గురించి ప్రశ్న ఎదురు కాగా.. ‘‘నేను ఇక్కడ నా సినిమా గురించి మాట్లాడటానికి మాత్రమే ఉన్నాను. విరాట్ కోహ్లి గురించి నేనింక మాట్లాడటానికి ఏమీ లేదు’’ అని ఇసబెల్ల కౌంటర్ ఇచ్చింది.ఇదిలా ఉంటే.. ఇసబెల్ల పంజాబీ సినిమాలతో పాటు తెలుగు సినిమాల్లోనూ కనిపించింది. విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో ఆమె తళుక్కుమంది. ఇక 2017లో పెళ్లి బంధంతో ఒక్కటైన కోహ్లి- అనుష్క తమ వైవాహిక జీవితంలో సంతోషంగా ముందుకు సాగుతున్నారు. ఈ జంట ఇటీవలే బృందావన్లోని ప్రేమానంద్జీ మహరాజ్ను దర్శించి ఆశీసులు తీసుకుంది.చదవండి: ‘విరాట్ కోహ్లిని చూస్తే బాధగా ఉంది’ -
ఢిల్లీ క్యాపిటల్స్పై ఎస్ఆర్హెచ్ ఘన విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) సొంతగడ్డపై హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 47 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 243 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 195 పరుగులకు పరిమితమైంది. నితీశ్ రానా 57 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ 4, హర్ష్దూబే మూడు వికెట్లు తీశారు. అంతకముందు అభిషేక్ సెంచరీతో విధ్వంసం సృష్టించడంతో ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 242 పరుగుల భారీ స్కోరు చేసింది.18 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపటల్స్ 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. సమీర్ రిజ్వీ 38, అక్షర్ పటేల్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఒకే ఓవర్లో రెండు వికెట్లుఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కష్టాల్లో పడింది. ఇషాన్ మలింగ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత 57 పరుగుల చేసిన నితీశ్ రానాను వెనక్కి పంపిన మలింగ మరుసటి బంతికి డేవిడ్ మిల్లర్ను క్లీన్బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది.8 ఓవర్లలో ఢిల్లీ 86-18 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. రాహుల్ (27), నితీశ్ రానా (47) క్రీజులో ఉన్నారు.పవర్ ప్లేలో ఢిల్లీ స్కోరు: 59-1(6)రాహుల్ 22, నితీశ్ 27 రన్స్తో ఉన్నారు. విజయానికి 84 బంతుల్లో 184 పరుగులు అవసరం.ఐదు ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 54-1కేఎల్ రాహుల్ 21, నితీశ్ రాణా 23 పరుగులతో ఉన్నారు. విజయానికి 90 బంతుల్లో 189 పరుగులు కావాలి.ఢిల్లీ తొలి వికెట్ డౌన్2.1: దిల్షాన్ మధుషాంక బౌలింగ్లో తొలి వికెగ్గా వెనుదిరిగిన పాతుమ్ నిస్సాంక (6 బంతుల్లో 8). కేఎల్ రాహుల్ 12 పరుగులతో ఉండగా.. నితీశ్ రాణా క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 21-1(2.1).ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు సాధించింది. సొంతమైదానం ఉప్పల్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలోకేవలం రెండు వికెట్లు నష్టపోయి ఏకంగా 242 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ అజేయ సెంచరీ (68 బంతుల్లో 135)తో రాణించగా.. హెన్రిచ్ క్లాసెన్ మెరుపు ఇన్నింగ్స్ (13 బంతుల్లో 37 నాటౌట్) ఆడాడు. ట్రవిస్ హెడ్ 37, ఇషాన్ కిషన్ 25 పరుగులతో ఫర్వాలేదనిపించారు. సన్రైజర్స్ విధించిన 243 పరుగుల లక్ష్యంతో ఢిల్లీ క్యాపిటల్స్ బరిలోకి దిగింది. సన్రైజర్స్ స్కోరు: 242-2(20)సన్రైజర్స్ డబుల్ సెంచరీ: స్కోరు: 202-2(17)అభిషేక్ 127, క్లాసెన్ ఆరు పరుగులతో ఉన్నారు16 ఓవర్లలో సన్రైజర్స్ స్కోరు: 189-2 రెండో వికెట్ కోల్పోయిన సన్రైజర్స్ 14.4: ఇషాన్ కిషన్ రనౌట్ (13 బంతుల్లో 25). అభిషేక్ 108 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 176-2(14.4)అభిషేక్ శర్మ సెంచరీ47 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్ శర్మ13 ఓవర్లలో సన్రైజర్స్ స్కోరు: 151-1అభిషేక్ 86, ఇషాన్ 23 రన్స్తో ఉన్నారు.పది ఓవర్లలో సన్రైజర్స్ స్కోరు: 104-1అభిషేక్ 60, ఇషాన్ 4 పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ డౌన్8.5: అక్షర్ పటేల్ బౌలింగ్లో సమీర్ రిజ్వీకి క్యాచ్ ఇచ్చి ట్రవిస్ హెడ్ (26 బంతుల్లో 37) అవుట్. స్కోరు: 97-1(8.5). అభిషేక్ 27 బంతుల్లో 58 పరుగులతో ఉన్నాడు.👉25 బంతుల్లో అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీరఫ్పాడించిన అభిషేక్’ పవర్ ప్లేలో ‘అభిషేక్’ రఫ్పాడించారు. హెడ్ 17 బంతుల్లో 23 పరుగులు చేయగా.. అభిషేక్ 19 బంతుల్లోనే 42 పరుగులతో దుమ్ములేపాడు. ఫలితంగా పవర్ ప్లేలో సన్రైజర్స్ వికెట్ నష్టపోకుండా 67 పరుగులు చేసింది. స్కోరు: 67-0 (6)ఐదు ఓవర్లలో సన్రైజర్స్ స్కోరు: 56-0ఓపెనర్లు అభిషేక్ శర్మ 15 బంతుల్లో 34, ట్రవిస్హెడ్ 15 బంతుల్లో 21 పరుగులతో ఉన్నారు. తద్వారా ‘ట్రావిషేక్’ యాభై పరుగుల భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నారు.టాస్ గెలిచిన ఢిల్లీఐపీఎల్-2026లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో మంగళవారం నాటి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచింది. తొలుత బౌలింగ్ ఎంచుకుని ఇషాన్ సేనను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్కు హైదరాబాద్లోని ఉప్పల్ వేదిక. తుదిజట్టు మార్పులుఈ మ్యాచ్లో తాము ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ తెలిపాడు. ఆకిబ్ నబీ స్థానంలో నితీశ్ రాణా తుదిజట్టులోకి వచ్చినట్లు వెల్లడించాడు. ఇక సన్రైజర్స్ కెప్టెన్ ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. హర్ష్ దూబేను ప్లేయింగ్ ఎలెవన్లోకి తీసుకున్నట్లు తెలిపాడు. అదే విధంగా ప్రఫుల్ హింగేను ఆడించే విషయంలో తమకు స్పష్టత లేదని ఇషాన్ పేర్కొన్నాడు. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపాడు. కాగా సన్రైజర్స్ తరఫున అరంగేట్రంలోనే నాలుగు వికెట్లతో చెలరేగిన ప్రఫుల్ హింగే.. గత మ్యాచ్లో మాత్రం తేలిపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో నాలుగు ఓవర్లలో ఏకంగా 60 పరుగులు ఇచ్చి ఒకే ఒక్క వికెట్ తీశాడు. సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ తుదిజట్లుసన్రైజర్స్అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివంగ్ కుమార్, హర్ష్ దూబే, సాకిబ్ హుస్సేన్, ఇషాన్ మలింగఇంపాక్ట్ సబ్స్టిట్యూట్స్: స్మరణ్ రవిచంద్రన్, ప్రఫుల్ హింగే, లియామ్ లివింగ్స్టోన్, దిల్షాన్ మధుషాంక, హర్షల్ పటేల్ఢిల్లీపాతుమ్ నిస్సాంక, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), సమీర్ రిజ్వీ, నితీశ్ రాణా, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, టి.నటరాజన్, లుంగీ ఎంగిడిఇంపాక్ట్ సబ్స్టిట్యూట్స్: కరుణ్ నాయర్, దుష్మంత చమీర, అశుతోశ్ శర్మ, త్రిపురాణ విజయ్, ఆకిబ్ నబీ. -
‘ఎవరిని.. ఎలా.. వాడుకోవాలో.. నాకు తెలుసు’
జస్ప్రీత్ బుమ్రా విషయంలో తనను విమర్శిస్తున్న వారికి ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఎవరి సేవలను ఎప్పుడు ఎలా వాడుకోవాలో తనకు తెలుసు అన్నాడు. బుమ్రా వికెట్లు తీయకపోతే తనను విమర్శించడం ఏమిటని ప్రశ్నించాడు.ఐపీఎల్-2026లో ముంబై ప్రధాన పేసర్ బుమ్రా (Jasprit Bumrah) దారుణంగా విఫలమవుతున్న సంగతి తెలిసిందే. ఐదు మ్యాచ్ల వరకు ఒక్క వికెట్ తీయలేకపోయిన అతడు.. గుజరాత్ టైటాన్స్ (MI vs GT)తో సోమవారం నాటి మ్యాచ్లో మాత్రం మెరుగ్గా రాణించాడు. తొలి ఓవర్లో రంగంలోకి దిగి గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ను గోల్డెన్ డకౌట్గా వెనక్కి పంపాడు.Guess who’s back? 🔥#JaspritBumrah makes a statement with his first wicket of the season, putting #MI on 🔝#TATAIPL 2026 | #GTvMI | LIVE NOW 👉 https://t.co/EXwHuATomY pic.twitter.com/eQJ9QHheuX— Star Sports (@StarSportsIndia) April 20, 2026బుమ్రా తొలి వికెట్.. హార్దిక్పై విమర్శలుతద్వారా ఈ సీజన్లో బుమ్రా తొలి వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్లో మొత్తంగా మూడు ఓవర్లలో 15 పరుగులు ఇచ్చిన అతడు కీలక వికెట్ తీశాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. బుమ్రాకు కొత్త బంతిని ఇచ్చి ఆరంభంలో రంగం దించితే ఫలితం ఇలా ఉంటుందని.. కానీ పాండ్యా అతడిని నిర్లక్ష్యం చేస్తూ మూల్యం చెల్లిస్తున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.బుమ్రా ఎప్పుడూ అంతేగాఈ నేపథ్యంలో గుజరాత్పై విజయానంతరం హార్దిక్ పాండ్యా ఘాటుగా స్పందించాడు. ‘‘చాలా మంది జస్ప్రీత్ బుమ్రాకు తొలి ఓవర్లోనే బంతి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇది నాకు కూడా ఆసక్తికరంగానే ఉంది. అయితే, ఇప్పటికి ముంబై తరఫున 151 మ్యాచ్లు ఆడితే అందులో ఎనిమిది లేదంటే తొమ్మిదిసార్లు మాత్రమే బుమ్రా తొలి ఓవర్ బౌల్ చేయడం మీరు గమనించాలి.నా వల్ల ఎలాంటి సమస్యా లేదుఇందులో నా వల్ల వచ్చిన సమస్య ఏమీ లేదు. జస్ప్రీత్ ప్రత్యేకమైన బౌలర్. జట్టుకు అవసరమైన వేళ అతడి సేవలను ఎలా ఉపయోగించుకోవాలో నాకు తెలుసు. ఈరోజు అతడి సేవలు ఆరంభంలోనే అవసరం అని భావించాము. కొత్త బంతితో ప్రభావం చూపగలడని భావించాము. జట్టులో అతడి కంటే ఉత్తమమైన బౌలర్ ఎవరూ లేరు’’ అని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు.కాగా అహ్మదాబాద్ వేదికగా సోమవారం నాటి మ్యాచ్లో ముంబై గుజరాత్ జట్టును 99 పరుగుల తేడాతో చిత్తు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో గుజరాత్ 100 పరుగులకే ఆలౌట్ అయి చిత్తుగా ఓడింది. కాగా ఈ సీజన్లో ముంబైకి ఆరింట ఇదే రెండో గెలుపు.చదవండి: తిలక్ వర్మపై హార్దిక్ పాండ్యా సీరియస్.. స్పందించిన స్టార్ -
పిచ్చి పట్టినట్లుగా పిచ్ తొక్కించేశాడు.. మ్యాచ్ రద్దు!
క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి ట్రాక్టర్తో మైదానంలోకి దూసుకువచ్చాడు.. పిచ్చి పట్టినట్లుగా క్రికెట్ పిచ్ మొత్తాన్ని ట్రాక్టర్తో తొక్కించేశాడు.. ఫలితంగా.. ఫలితం తేలకుండానే మ్యాచ్ అర్ధంతరంగా ముగిసిపోయింది.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఈ ఘటన మహారాష్ట్రలోని జలగావ్లో జరిగింది. జలగావ్ రూరల్ ఎంఎల్ఏ కప్ టోర్నమెంట్లో ఫైనల్ మ్యాచ్ జరుగుతుండగా.. ఓ యువకుడు ట్రాక్టర్పై అకస్మాత్తుగా మైదానంలోకి వచ్చాడు.నిస్సహాయంగాఏం జరుగుతుందో అర్థం కాక ఆటగాళ్లు చెల్లాచెదురై పోయారు. ఇంతలో అతడు వేగంగా పిచ్ మీదకు దూసుకువచ్చి.. ట్రాక్టర్తో పిచ్ మొత్తాన్ని ధ్వంసం చేశాడు. ఆటగాళ్లు, అంపైర్లు ఏమీ చేయలేక నిస్సహాయంగా అలా చూస్తుండిపోయారు. దీంతో మైదానంలో గందరగోళం నెలకొంది.కాగా ఈ ఘటన వెనుక రాజకీయ కోణం ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక వ్యక్తి ఒకరిని ఫైనల్ మ్యాచ్కు ఆహ్వానించకపోవడంతో సదరు వ్యక్తి ఇలా చేయించినట్లు సమాచారం. అనూహ్య ఘటనతో మ్యాచ్ రద్దైపోగా.. పిచ్ను తొక్కించిన వ్యక్తిపై మాత్రం ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. ఇక ఈ దృశ్యాలు వైరల్ కాగా.. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.ఎవరిది బాధ్యత‘‘బహుశా ఆ మైదానం అతడిదే అయి ఉంటుంది. ఓనర్నే మ్యాచ్కు ఆహ్వానించకపోతే ఎలా? అందుకే ఇలా చేశాడు’’ అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. మరికొందరు మాత్రం.. ‘‘ఇలాంటి చర్యలను ఉపేక్షించకూడదు. ట్రాక్టర్తో వేగంగా దూసుకువచ్చిన సమయంలో ఎవరికైనా ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత. ఇలాంటి వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందే’’ అని పేర్కొంటున్నారు. Tractor Driver plows the cricket pitch mid-final in Jalgaon after the driver wasn’t invited to the tournament 😭 pic.twitter.com/LLS61mkRWJ— Ghar Ke Kalesh (@gharkekalesh) April 18, 2026 -
సీఎస్కేకు భారీ షాక్.. టోర్నీ నుంచి అతడు అవుట్
వరుస ఓటములతో నిరాశలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు తరఫున నిలకడగా రాణిస్తున్న ఏకైక ఆటగాడు ఆయుశ్ మాత్రే టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఇందుకు సంబంధించి సీఎస్కే మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.టోర్నీ మొత్తానికి దూరం‘‘సన్రైజర్స్ హైదరాబాద్తో ఏప్రిల్ 18 నాటి మ్యాచ్ సందర్భంగా ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) తొడ కండరాలు పట్టేశాయి. ఆయుశ్ ఈ గాయం నుంచి కోలుకోవడానికి సుమారు 6-12 వారాల సమయం పడుతుంది. కాబట్టి ఐపీఎల్-2026లో మిగిలిన సీఎస్కే మ్యాచ్లన్నింటికీ అతడు దూరమయ్యాడు’’ అని సీఎస్కే తమ ప్రకటనలో పేర్కొంది.కాగా తాజా ఎడిషన్లో సీఎస్కే తరపున వన్డౌన్లో బ్యాటింగ్కు దిగిన ఆయుశ్ మాత్రే.. ఆరు మ్యాచ్లు ఆడి 201 పరుగలు సాధించాడు. అత్యధిక స్కోరు 73. ముంబైకి చెందిన ఆయుశ్ మాత్రే భారత అండర్-19 జట్టుకు కెప్టెన్గా ఇటీవలే వరల్డ్కప్ అందించాడు.గతేడాది రీప్లేస్మెంట్ ప్లేయర్గా సీఎస్కేలో చేరిన ఆయుశ్ మాత్రే ఓపెనర్గా రాణించాడు. ఈ ఏడాది సంజూ శాంసన్- రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్లుగా రాగా.. ఆయుశ్ వన్డౌన్లో బ్యాటింగ్కు దిగి అదరగొట్టాడు. చివరగా సన్రైజర్స్తో మ్యాచ్లో 13 బంతుల్లోనే 30 పరుగులతో దుమ్ములేపాడు.ఆయుశ్ స్థానంలో ఎవరు?అయితే, ఆ సమయంలోనే అతడి తొడ కండరాలు పట్టేశాయి. అయినప్పటికీ కాసేపు క్రీజులో ఉన్న ఆయుశ్.. ఆ తర్వాత నొప్పి తాళలేక మైదానం వీడాడు. ఇక మంచి ఫామ్లో ఉన్న ఆయుశ్ సేవలను కోల్పోయిన సీఎస్కేకు.. అతడి బ్యాటింగ్ స్థానాన్ని భర్తీ చేయడం అంత తేలికేమీ కాదు. ఆయుశ్ స్థానంలో ఉర్విల్ పటేల్ లేదంటే కార్తిక్ శర్మను తుదిజట్టులో ఆడించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఎంఎస్ ధోని ఫిట్నెస్ లేక ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. మరోవైపు ఖలీల్ అహ్మద్ కూడా జట్టుకు దూరమయ్యాడు. ఇలాంటి తరుణంలో ఆయుశ్ కూడా జట్టును వీడటంతో సీఎస్కేకు భారీ షాక్ తగిలింది. ఇప్పటికి ఈ సీజన్లో సీఎస్కే.. ఆరు మ్యాచ్లు ఆడి రెండే గెలిచింది.చదవండి: టీమిండియాలోకి సంచలన ఫాస్ట్ బౌలర్! -
తిలక్ వర్మపై హార్దిక్ పాండ్యా సీరియస్.. స్పందించిన స్టార్
గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ స్టార్ తిలక్ వర్మ అదరగొట్టాడు. విధ్వంసకర అజేయ సెంచరీ (45 బంతుల్లో 101)తో రాణించి తమ జట్టుకు విజయం అందించాడు. అయితే, అహ్మదాబాద్ వేదికగా సోమవారం నాటి మ్యాచ్లో పేలవ ఆరంభం... పవర్ప్లేలో సాధారణ స్కోరు... గత మ్యాచ్ల తరహాలోనే మరోసారి ముంబై ఇన్నింగ్స్ పతనం దిశగా సాగిపోతున్నట్లుగా అనిపించింది... ఇలాంటి స్థితిలో తిలక్ వర్మ ఒక్కసారిగా ఆటను మార్చేశాడు.తీవ్ర ఒత్తిడి మధ్య నిలదొక్కుకునేందుకు కొంత సమయం తీసుకున్నా... ఆఖర్లో ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం సృష్టిస్తూ తొలి సెంచరీతో కదం తొక్కాడు. 19 సీజన్ల ఐపీఎల్ చరిత్రలో ఏ బ్యాటర్కూ సాధ్యం కాని రీతిలో చివరి 6 ఓవర్లలో ఒక్కడే 82 పరుగులు సాధించి జట్టుకు భారీ స్కోరును అందించాడు. అనంతరం ఛేదనలో మొదటి బంతికే వికెట్ కోల్పోయిన గుజరాత్ ఆ తర్వాత కోలుకోలేకపోయింది. బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేయడంతో తిలక్ స్కోరును కూడా అందుకోలేక మూడు వరుస విజయాల తర్వాత ఓటమిని ఆహ్వానించింది.తిలక్ వర్మపై హార్దిక్ సీరియస్ఇదిలా ఉంటే.. గుజరాత్తో ఈ మ్యాచ్ను కూడా జాగ్రత్తగా మొదలు పెట్టిన తిలక్ వర్మ వేగంగా ఆడటంలో బాగా ఇబ్బంది పడ్డాడు. 14వ ఓవర్ ముగిసేసరికి అతను 22 బంతులు ఆడితే చేసింది 19 పరుగులే... ఒక్క బౌండరీ కూడా లేదు!.. ఇలాంటి పరిస్థితుల్లో మరో ఎండ్లో ఉన్న ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా తిలక్ వర్మపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసినట్లు కనిపించింది. Tilak Varma-ಗೆ ಹುರಿದುಂಬಿಸುತ್ತಿರುವ Hardik Pandya! 🗣️🤝🏻ವೀಕ್ಷಿಸಿ | #TATAIPL2026 👉 #GTvsMI | LIVE NOW | ನಿಮ್ಮ Star Sports ಕನ್ನಡ & JioHotstar ನಲ್ಲಿ.#TATAIPL pic.twitter.com/0TDzA1kNzM— Star Sports Kannada (@StarSportsKan) April 20, 2026‘‘ఇలా ఆడితే ఎలా? అసలేం ఏం చేస్తున్నావు? ఇలా ఆడితే గెలుపు సాధ్యమేనా?’’ అన్నట్లుగా హార్దిక్ బాగా సీరియస్ అయినట్లు వీడియోలో కనిపించింది. ఆ సమయంలో ఎంతో సంయమనం పాటించిన తిలక్ వర్మ.. ప్రసిధ్ వేసిన 15వ ఓవర్తో గేమ్ను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఈ ఓవర్లో తొలి మూడు బంతుల్లో వరుసగా 6, 4, 4 బాదిన తిలక్... రషీద్ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టాడు.దంచికొట్టిన తిలక్ఆ తర్వాత యువ పేస్ అశోక్ శర్మ ఓవర్లో తిలక్ చెలరేగిపోయాడు. ఈ ఓవర్ తొలి బంతికి సిక్స్ బాది 33 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న అతను... ఇదే ఓవర్ తర్వాతి నాలుగు బంతుల్లో వరుసగా 4, 4, 6, 6తో ఆధిపత్యం ప్రదర్శించాడు. 19వ ఓవర్ ముగిసేసరికి అతను 80 పరుగుల వద్ద ఉన్నాడు. ఐపీఎల్లో తిలక్ మొదటి సెంచరీ సాధిస్తాడా అనే ఉత్కంఠ నెలకొన్న సమయంలో దూకుడైన బ్యాటింగ్తో తిలక్ దానిని చేసి చూపించాడు.ప్రసిధ్ వేసిన చివరి ఓవర్ తొలి రెండు బంతుల్లో 4, 6 కొట్టిన అతను ఆఖరి రెండు బంతుల్లో కూడా మళ్లీ 6, 4 బాదాడు. షార్ట్ బంతికి స్క్వేర్ లెగ్ దిశగా బౌండరీకి తరలించడంతో తిలక్ శతకం పూర్తయింది. ఒక్క ప్రసిధ్ బౌలింగ్లోనే అతను 43 పరుగులు రాబట్టాడు. తాను ఆడిన చివరి 23 బంతుల్లో తిలక్ ఏకంగా 82 పరుగులు బాదడం విశేషం.నాలో కసి పెంచేందుకే అలాఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా తనతో వ్యవహరించిన తీరుపై తిలక్ వర్మ తాజాగా స్పందించాడు. ఐపీఎల్ వైబ్సైట్తో మాట్లాడుతూ.. ‘‘హార్దిక్ భాయ్ ఎంత దూకుడుగా ఉంటాడో అందరికీ తెలిసిందే. మరోవైపు.. నేనేమో ప్రశాంతంగా పనిచేసుకుపోయే రకం.అందుకే భాయ్ అప్పుడు నాలో కసిని పెంచాలని అలా చేశాడు. ‘నువ్వు చేయగలవు. నువ్విది చేస్తేనే మనం గెలుస్తాము’ అని నన్ను ఉత్సాహపరిచాడు. అందుకు నేనేమో.. ‘పర్లేదు.. ఇది జరిగితీరుతుంది. జట్టు కోసం చేయగలిగినదంతా చేస్తాను.. కచ్చితంగా చేస్తాను’ అని భాయ్కు చెప్పాను’’ అని తిలక్ వర్మ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2026లో తొలి ఐదు మ్యాచ్లలో తిలక్ వర్మ వరుసగా 20, 0, 14, 1, 8 స్కోర్లు చేశాడు. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ సమష్టి వైఫల్యంలో భాగంగా ఉన్న తిలక్పై కూడా విమర్శలు వచ్చాయి. వాటన్నింటికీ సెంచరీ ఇన్నింగ్స్తో తిలక్ బదులిచ్చినట్లు అయింది.చదవండి: టీమిండియాలోకి సంచలన ఫాస్ట్ బౌలర్ -
కేడీ జాదవ్కు ‘పద్మవిభూషణ్’పై తేల్చండి!
ముంబై: ప్రతిష్టాత్మక ఒలింపిక్ క్రీడల్లో భారత్కు తొలి వ్యక్తిగత పతకాన్ని అందించిన మహారాష్ట్ర రెజ్లర్ ఖషాబా దాదాసాహెబ్ (కేడీ) జాదవ్కు ‘పద్మవిభూషణ్’ పురస్కారం అందించే విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని బాంబే హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. దీనికి సంబంధించి గడువునిస్తూ మే 4లోగా తేల్చాలని స్పష్టం చేసింది. 1952 హెల్సింకీ ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన జాదవ్ 1984లో మృతి చెందారు.మరణాంతరం 2001లో ప్రభుత్వం ఆయనకు ‘అర్జున అవార్డు’ను ప్రకటించింది. అయితే దేశంలో రెండో అత్యుత్తమ పౌర పురస్కారం ‘పద్మవిభూషణ్’ను ఆయనకు ప్రకటించాలని కోరుతూ కుస్తీవీర్ ఖషాబా జాదవ్ ఫౌండేషన్ బాంబే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాఖ్యం దాఖలు చేసింది. జాదవ్ కుమారుడు రంజిత్ ఈ ఫౌండేషన్ను ఏర్పాటు చేశాడు.గతంలో పలుమార్లు అవార్డు విషయంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో ఇప్పుడు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. ఈ అంశంపై విచారించిన బాంబే హైకోర్టు (కొల్హాపూర్ బ్రాంచ్) న్యాయమూర్తులు జస్టిస్ మాధవ్ జామ్దార్, జస్టిస్ ప్రవీణ్ పాటిల్ కేంద్ర ప్రభుత్వానికి తాజాగా సూచనలు చేస్తూ కేసును మే 5కు వాయిదా వేశారు. -
నా ఫేవరెట్ నేనే...
సాధారణంగా ఏ రంగంలో అయినా... ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకునే వాళ్లు... ‘రోల్ మోడల్స్’ను ఆదర్శంగా తీసుకోవడం పరిపాటి! కానీ భారత యువ రెజ్లర్ సుజీత్ కల్కల్ మాత్రం తన అభిమాన ఆటగాడు తానే అని అంటున్నాడు. ప్రాక్టీస్లో భాగంగా ఇతర సీనియర్ రెజ్లర్ల వీడియోలకు బదులు తన వీడియోలే చూసి స్ఫూర్తి పొందుతానని చెబుతున్నాడు. కాగా 2025 జూన్లో జరిగిన అండర్–23 ఆసియా చాంపియన్షిప్ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు 65 కేజీల విభాగంలో పరాజయం ఎరగకుండా ముందుకు సాగుతున్న సుజీత్... బరిలోకి దిగిన ప్రతి టోర్నమెంట్లో పసిడి పతకం చేజిక్కించుకున్నాడు.ఇటీవల కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్లో జరిగిన ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో తొలిసారి స్వర్ణం నెగ్గిన సుజీత్... తనను ఎవరూ ఓడించలేరు అనే భ్రమలో మాత్రం లేనని వెల్లడించాడు.ఆ వివరాలు అతడి మాటల్లోనే...‘‘నేను ఎవరినీ అభిమానించను. ఇంకా చెప్పాలంటే నా అభిమాన రెజ్లర్ను నేనే. నా వీడియోలే ఎక్కువ చూస్తాను. ఆదివారం మొత్తం అదే పని పెట్టుకుంటా... నా ప్రాక్టీస్ బౌట్ల వీడియోలు చూసి స్వీయ విశ్లేషణ చేసుకుంటా. అప్పుడప్పుడూ యోగేశ్వర్ దత్, బజరంగ్ పూనియా, అమిత్ ధన్కర్ వంటి సీనియర్ల బౌట్లను పరిశీలిస్తా. వారి వేగం, బలం గమనిస్తా. కానీ ఎక్కువ శాతం మాత్రం నా బౌట్ వీడియోలే చూస్తా. దానికి ఇంకో కారణం కూడా ఉంది. ప్రాక్టీస్కే అధిక సమయం పోతుంది. ఆదివారం మాత్రమే వీలు దొరకుతుంది. అప్పుడు నా బౌట్లు చూసి అందులో లోపాలను గుర్తించి వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తుంటా. నన్ను ఎవరూ ఓడించలేరు అనే భ్రమలో లేను. ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాలను చేరుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తుంటారు. ఆ రోజు పోటీలో ఎవరు మెరుగైన ప్రదర్శన కనబర్చారు అనేదానిపైనే విజయం ఆధారపడి ఉంటుంది. నా వరకైతే ఈ జోరు కొనసాగిస్తూ దేశానికి మరిన్ని పతకాలు అందించాలనుకుంటున్నా. గత రెండేళ్లుగా భారత రెజ్లర్ల చేతిలో ఒక్క బౌట్లోనూ ఓడలేదు. కానీ ఆసియా క్రీడల్లో ఇరాన్, జపాన్ రెజ్లర్లతో గట్టి పోటీ ఎదురవడం ఖాయం. దాని కోసం ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నా. మెరుగవ్వాల్సిన అంశాలపై దృష్టి పెట్టా. రెజ్లింగ్లో డిఫెన్స్దే కీలకపాత్ర. నా ప్రధాన బలం కూడా అదే. అటాకింగ్ గేమ్ పెంపొందించుకునేందుకు సాధన చేస్తున్నా. ఓర్పు పెంచుకుంటూ ప్రతిదాడిలో మరింత మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తున్నా. భారత ఫ్రీస్టయిల్ హెడ్ కోచ్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలోని జాతీయ శిబిరం ఎంతో ఉపయుక్తకరంగా ఉంది. ప్రతి అంశంలో మరింత మెరుగయ్యేందుకు కోచ్లు అనునిత్యం సాధన చేయిస్తున్నారు. దాని ఫలితాలు మున్ముందు మీరంతా చూస్తారు. నా బరువు కేటగిరీ రెజ్లర్లతోనే కాకుండా... నా కంటే ఎక్కువ బరువున్న వారితోనూ సాధన చేస్తున్న. దాని వల్ల శక్తిని పెంపొందించుకోవడంతో పాటు... మరిన్ని మెలకువలు నేర్చుకోవచ్చు. ఈ ఏడాది ఆసియా క్రీడలతో పాటు ప్రపంచ చాంపియన్షిప్ జరగనున్నాయి. ఆ రెండు నాకు ఎంతో ముఖ్యం. నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఆసియా క్రీడల్లో వంద శాతం కష్టపడతా. ఇక గత ప్రపంచ చాంపియన్షిప్లో త్రుటిలో పతకం కోల్పోయా. ఈసారి అలాంటి తప్పిదాలకు తావివ్వకుండా పతకంతో తిరిగి వస్తా. అండర్–23 విభాగానికి సీనియర్ స్థాయికి పెద్ద తేడా ఏమీ లేదు. అందులోనూ ఇలాంటి పోటీనే ఉంటుంది. అయితే ప్రపంచ చాంపియన్షిప్ స్థాయి అన్నిటికంటే పెద్దది. అక్కడ పోటీ తీవ్రత అధికం. మామూలుగా ఎవరైనా మట్టిలో రెజ్లింగ్ ప్రారంభిస్తారు. కానీ నేను కెరీర్ ప్రారంభం నుంచే మ్యాట్పై పోటీపడటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడిని. మా నాన్న నన్ను ఆ దిశగా ప్రోత్సహించారు. దాని వల్ల నా డిఫెన్స్ మెరుగైంది. సీనియర్ వరల్డ్ చాంపియన్షిప్లో 10–15 సెకన్లు చేసిన చిన్న తప్పిదం వల్ల పతకం దక్కలేదు. కొన్నిసార్లు ఒత్తిడి కూడా ఫలితంపై ప్రభావం చూపుతుంది. ఇక మీదట అలాంటి తప్పులు చేయను. అభిమానుల ఆదరణ అమోఘం. వారు నా నుంచి మరిన్ని పతకాలు ఆశిస్తున్నారు. తప్పక వారి కోరిక నెరవేరుస్తా. నా వరకైతే నేను పతకాలు సాధించగలనని వంద శాతం నమ్ముతున్నా. కానీ భవిష్యత్తును ఎవరూ అంచనా వేయలేరు కదా!సంగీతంతో సేదతీరుతా...రోజులో ఎక్కువ శాతం మ్యాట్పై కుస్తీ పట్టడంతోనే సరిపోతుంది. అయితే ఖాళీ దొరికితే మాత్రం సంగీతం వింటాను. అప్పుడప్పుడు సినిమాలు చూస్తుంటా. అయితే అవన్నీ రెజ్లింగ్ తర్వాతే. కొన్ని సార్లు రిఫ్రెష్ అవడానికి పాటలు ఉపయోగపడతాయి. దేశానికి పతకాలు సాధించాలనే లక్ష్యంతో జీవితంలో ఎన్నో ఇష్టమైన విషయాలను పక్కన పెట్టా. కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడపడం చాలా తక్కువ. కెరీర్ కోసం నచ్చిన ఆహారాన్ని కూడా వదులుకున్నా. ఇవన్నీ రెజ్లింగ్ కోసమే. నాన్న దయానంద్ రెజ్లింగ్ కోచ్ కావడంతో ఇంట్లో కూడా ఆటకు సంబంధించిన చర్చ నడుస్తుంది. ఏ క్రీడలోనైనా నిలకడ ముఖ్యం. అదే ఇతరులతో మనల్ని భిన్నంగా చూపుతుంది’’ అని సుజీత్ కల్కల్ పేర్కొన్నాడు.– సాక్షి క్రీడా విభాగం -
గిల్ స్థానంలో కెప్టెన్గా పంత్..?
ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాత స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే ఏకైక టెస్ట్ కోసం భారత సెలెక్టర్లు సీనియర్లకు విశ్రాంతినివ్వడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. సీనియర్ల జాబితాలో కెప్టెన్ శుభ్మన్ గిల్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఉన్నట్లు సమాచారం.ఒకవేళ గిల్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్కు దూరమైతే అతని స్థానంలో కెప్టెన్ ఎవరన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ నేపథ్యంలో గిల్కు ప్రత్యామ్నాయంగా ముగ్గురి పేర్లు పరిశీలను రావచ్చు. వీరిలో ముందుగా రిషబ్ పంత్ పేరు ఉంటుంది. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా పేర్లు కూడా పరిశీలనలో ఉంటాయి.రిషబ్ పంత్ విషయానికొస్తే.. ప్రస్తుతం అతను భారత టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్గా ఉన్నాడు. ఈ కారణంగా గిల్ స్థానంలో అతడే సహజమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడు. దూకుడు నాయకత్వం, మ్యాచ్ను ఒంటరిగా మలుపు తిప్పగల సామర్థ్యం పంత్ ప్రత్యేకత. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా దేశాల్లోని కఠిన పిచ్లపై సెంచరీలు సాధించడం అతని స్థాయి తెలియజేస్తుంది. ఇప్పటికే నాయకత్వ అనుభవం ఉండటం కూడా అతనికి అదనపు బలం.కేఎల్ రాహుల్భారత సెలెక్టర్లు ఒకవేళ పంత్కు కూడా విశ్రాంతినివ్వాలని భావిస్తే, తదుపరి ప్రత్యామ్నాయంగా కేఎల్ రాహుల్ ఉంటాడు. రాహుల్కు గతంలో భారత టెస్ట్ జట్టుకు సారథ్యం వహించిన అనుభవం ఉంది. 2022 బంగ్లాదేశ్ పర్యటనలో జట్టును విజయవంతంగా నడిపించడం అతని నాయకత్వ నైపుణ్యాన్ని నిరూపించింది.గిల్కు మూడో ప్రత్యామ్నాయ ఆప్షన్గా రవీంద్ర జడేజా ఉంటాడు. జడ్డూ జట్టులో అత్యంత అనుభవజ్ఞుల్లో ఒకరు. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ కీలక పాత్ర పోషించే ఆల్రౌండర్గా జడేజా ఎప్పుడూ జట్టుకు ఆధారంగా ఉంటాడు. గతంలో వైస్ కెప్టెన్గా పనిచేసిన అనుభవం ఉంది. -
వర్ష సూచన.. సన్రైజర్స్-ఢిల్లీ మ్యాచ్ జరిగేనా..?
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 21) సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగబోయే ఈ పోరు హై స్కోరింగ్ థ్రిల్లర్గా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ పిచ్ బ్యాటర్లకు స్వర్గధామంగా చెప్పవచ్చు.అయితే ఆసక్తికరంగా ఇక్కడ పేసర్లు అధికంగా ప్రభావం చూపుతున్నారు. సుమారు 72 శాతం వికెట్లు వీరే తీశారు. ప్రారంభ ఓవర్లలో స్వల్ప స్వింగ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొత్త బంతితో బౌలర్లు కచ్చితమైన లెంగ్త్లో బౌలింగ్ చేస్తే వికెట్లు తీసే అవకాశం ఉంటుంది.ప్రారంభ ఒత్తిడిని ఎదుర్కొని బ్యాటర్లు సెటిల్ అయితే మాత్రం భారీ స్కోర్లు సాధించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్ చేయడానికి మొగ్గు చూపవచ్చు.వాతావరణ నివేదికఈ మ్యాచ్కు వాతావరణం అనుకూలంగా కనిపిస్తోంది. మధ్యాహ్నం సమయంలో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. అయితే మ్యాచ్ సమయానికి పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది. సాయంత్రం సమయంలో ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్గా ఉండవచ్చు. వాతావరణం మేఘావృతంగా ఉంటే మాత్రం పేసర్ల అధిక సహకారం లభిస్తుంది. మొత్తంగా మ్యాచ్ సమయంలో వర్షం వచ్చే అవకాశం కేవలం 2 శాతంగా మాత్రమే ఉంది. -
సెలెక్టర్ల పరిధిలో లేని గిల్, బుమ్రా
ఐపీఎల్ ముగిసిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా ఎంపికను భారత సెలెక్టర్లు ఇప్పటి నుంచే పరిశీలిస్తున్నారు. జూన్ 6 నుంచి న్యూ చంఢీఘడ్లో జరుగబోయే ఈ మ్యాచ్ కోసం సీనియర్లకు విశ్రాంతినివ్వాలని వారు యోచిస్తున్నారు. సీనియర్ల జాబితాలో కెప్టెన్ శుభ్మన్ గిల్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మ్యాచ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగం కాకపోవడంతో సెలెక్టర్లు ఈ మేరకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. వర్క్లోడ్ మరో కారణంగా తెలుస్తుంది.భారత పర్యటనలో ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ మ్యాచ్తో పాటు మూడు వన్డేలు కూడా ఆడనుంది. ఆతర్వాత భారత జట్టు రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్కు వెళ్లనుంది. అనంతరం భారత్ 5 టీ20లు, 3 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్కు వెళ్లనుంది. ఇంగ్లండ్ సిరీస్ నేపథ్యంలో భారత సెలెక్టర్లు గిల్, బుమ్రాకు విశ్రాంతినివ్వాలని అనుకుంటున్నారు. టీమిండియా-ఇంగ్లండ్ సిరీస్ జులై 1 నుంచి ప్రారంభమవుతుంది.ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్ సిరీస్లకు గిల్, బుమ్రాకు విశ్రాంతినివ్వడానికి సెలెక్టర్ల వద్ద మరో కారణం కూడా ఉంది. 2027 వన్డే వరల్డ్కప్కు వీరిద్దరు కీలకం కాబటి, మెగా టోర్నీకి ముందు వీలైనంత విశ్రాంతినివ్వవచ్చు. గిల్, బుమ్రా ఇటీవల తరుచూ గాయాల బారిన పడుతుండటంతో సెలెక్టర్లు వీరి విషయంలో రిస్క్ తీసుకునే సాహసం చేయరు. ఒకవేళ ప్రపంచకప్ దృష్ట్యా వన్డేల్లో ఆడించాలని అనుకుంటే మాత్రం ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు ఎంపిక చేయవచ్చు.బుమ్రా, గిల్ గైర్హాజరీలో ఆకిబ్ నబీ, దేవదత్ పడిక్కల్, నితీశ్ కుమార్ రెడ్డి తదితర పేర్లను సెలెక్టర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. వీరిలో నబీ పేరు ఖరారైందని సమాచారం. -
టీమిండియాలోకి సంచలన ఫాస్ట్ బౌలర్
రాబోయే అంతర్జాతీయ సీజన్ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత (జూన్లో) ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే సిరీస్ (టెస్ట్, మూడు వన్డేలు) కోసం సీనియర్లకు విశ్రాంతినిచ్చి యువ ప్రతిభకు అవకాశాలు ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ ఫాస్ట్ బౌలర్ అకిబ్ నబీని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. నబీ ఎంపిక దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. నబీ ఈ సీజన్ రంజీ ట్రోఫీలో విశేషంగా రాణించి 60 వికెట్లు తీసి, లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. నబీ సంచలన ప్రదర్శనల కారణంగా జమ్మూ కశ్మీర్ తమ తొలి రంజీ ట్రోఫీని కైవసం చేసుకుంది. నబీ స్థిరమైన వేగంతో పాటు బంతిని ఇరు వైపుల స్వింగ్ చేయగల సమర్దుడు. 41 మ్యాచ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో అతను 156 వికెట్లు తీశాడు.భారత టెస్టు జట్టులో గత కొంతకాలంగా పేస్ బౌలింగ్ భారం ఎక్కువగా బుమ్రాపైనే పడుతుంది. ఇతర బౌలర్లు కూడా కొంతమేరకు సహకరించినప్పటికీ, స్థిరమైన ప్రత్యామ్నాయం అవసరం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నబీ వంటి యువ బౌలర్ జట్టులోకి వస్తే బుమ్రాపై ఒత్తిడి తగ్గడమే కాకుండా బౌలింగ్ విభాగానికి లోతు పెరుగుతుంది.అందుకే భారత సెలెక్టర్లు నబీని సిద్దం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇక్కడ ఓ సమస్య ఉంది. నబీ బౌలింగ్ శైలి సుదీర్ఘ ఫార్మాట్కు మాత్రమే పనికొచ్చేలా కనిపిస్తుంది. దేశవాలీ క్రికెట్లో అద్భుత ప్రదర్శనల కారణంగా ఐపీఎల్ ఛాన్స్ కొట్టేసిన నబీ.. ఇక్కడ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అతను 2 మ్యాచ్ల్లో వికెట్లు తీయలేకపోగా.. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. మరి సెలెక్టర్లు నబీని టెస్ట్లకే పరిమితం చేస్తారో లేక పరిమిత ఓవర్ల ఫార్మాట్లోనూ అవకాశాలు ఇస్తారో చూడాలి. -
రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్పై నిషేధం
రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్, శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ దసున్ షనకపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంది. పాకిస్తాన్ సూపర్ లీగ్లోని లాహోర్ ఖలందర్స్ ఫ్రాంచైజీతో ఒప్పందాన్ని ఉల్లఘించినందుకు ఒక సంవత్సరం నిషేధం విధించింది. దీంతో షనక వచ్చే పీఎస్ఎల్ సీజన్ (2027)లో పాల్గొనలేరు.పీసీబీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, లాహోర్ ఖలందర్స్తో చేసుకున్న ఒప్పందాన్ని షనక ఉల్లఘించాడు. మార్చి 21న టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఇందుకు అతను చూపించిన కారణాలు ఒప్పంద పరిధిలో చెల్లుబాటు కావు. కాబట్టి లీగ్ ప్రతిష్ఠను కాపాడేందుకు షనకపై ఏడాది నిషేధం విధించారు.పీసీబీ తనపై విధించిన నిషేధాన్ని షనక పరోక్షంగా అంగీకరించాడు. ఓ ప్రకటన విడుదల చేస్తూ, తన విచారాన్ని వ్యక్తం చేశాడు. "హెచ్బీఎల్ పీఎస్ఎల్ నుంచి తప్పుకోవడం నా తప్పు. పాకిస్థాన్ అభిమానులు, లాహోర్ ఖలందర్స్ అభిమానులను నిరాశపరిచినందుకు క్షమాపణలు కోరుతున్నాను. ఆ సమయంలో మరో టోర్నమెంట్లో ఆడాలనే ఉద్దేశం నాకు లేదు. పాకిస్థాన్లో ఆడటం నాకు ఎప్పుడూ ఆనందమే" అని పేర్కొన్నాడు. భవిష్యత్తులో తిరిగి ఈ లీగ్లో పాల్గొనే అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.కాగా, షనక పీఎస్ఎల్ నుంచి తప్పుకున్న తర్వాత ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన రాజస్థాన్ రాయల్స్తో ఒప్పందం చేసుకున్నాడు. సామ్ కర్రన్ గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరం కావడంతో రాయల్స్ షనకను ప్రత్యామ్నాయ ఆటగాడిగా ఎంపిక చేసుకుంది. షనకకు రాయల్స్ బేస్ ధర రూ. 2 కోట్లకు సొంతం చేసుకుంది.ఈ సీజన్లో షనక రాయల్స్ తరఫున ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. -
రషీద్ ఖాన్పై చర్యలు ఉంటాయా..?
భారత్, ఆస్ట్రేలియా దేశాలు తనకు పౌరసత్వం ఆఫర్ చేశాయని, వారి దేశాల తరఫున క్రికెట్ అవకాశాలు కూడా కల్పిస్తామని ముందుకువచ్చాయని, అయితే తాను వాటిని సున్నితంగా తిరస్కరించారని ఆఫ్ఘనిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ తన పుస్తకం "Rashid Khan: From Streets to Stardom" ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ అంశం ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భారత పౌరసత్వం ఆఫర్ను బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తన ముందు ఉంచారని రషీద్ పేర్కొనడంతో బోర్డు పాత్రపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.గోప్యంగా ఉంచాల్సిన విషయాన్ని బహిర్గతం చేసిన నేపథ్యంలో రషీద్పై బీసీసీఐ చర్యలు తీసుకుంటుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ అంశాన్ని లోతుగా పరిశీలించగా.. రషీద్ చేసిన పనికి చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకమైన నిబంధనలేవీ లేదని తెలుస్తుంది. అయితే బోర్డు ప్రతిష్ఠకు భంగం కలిగిందని భావిస్తే మాత్రం బీసీసీఐ వివరణ కోరే అవకాశం ఉంది. అవసరమైతే ఆధారాలు చూపాలని కూడా కోరవచ్చు.కఠిన చర్యలు తీసుకునే అవకాశాన్ని కూడా నిపుణులు కొట్టిపారేయడం లేదు. చర్యల్లో భాగంగా ఐపీఎల్లో పాల్గొనడంపై పరిమితులు విధించడం లేదా నిషేధం విధించడం వంటి చర్యలు ఉండవచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి చర్యలకు బలమైన ఆధారాలు అవసరం అవుతాయి. ప్రస్తుతానికి బీసీసీఐ ఈ అంశాన్ని పక్కను పెట్టిందని తెలుస్తుంది. ఒకవేళ పరిశీలనలోకి వస్తే మాత్రం ఏమైనా జరగవచ్చు. బోర్డు పెద్దల్లో చాలామందికి రషీద్పై సానుకూల అభిప్రాయం ఉంది కాబట్టి వార్నింగ్తో సరిపెట్టవచ్చు. ఐపీఎల్ ముగిసిన తర్వాత బీసీసీఐ ఈ అంశాన్ని పరిశీలించే అవకాశం ఉంది.కాగా, రషీద్ ప్రస్తుతం ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ తరఫున బిజీగా ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో 6 వికెట్లు తీసి, ఓ మోస్తరు ప్రదర్శనలు చేస్తున్నాడు. తాజాగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో తన కోటా 4 ఓవర్లలో వికెట్ తీయలేకపోయినా పొదుపుగా (31 పరుగులు) బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్లో గుజరాత్ ముంబై చేతిలో చిత్తుగా ఓడింది. -
గుజరాత్ను వారి ఇలాకాలో ఓడించిన అనంతరం హార్దిక్ వ్యాఖ్యలు
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 21) జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్ను వారి సొంత ఇలాకాలో (అహ్మదాబాద్) చిత్తుగా ఓడించింది. హ్యాట్రిక్ విజయాల తర్వాత గుజరాత్కు ఎదురైన తొలి ఓటమి ఇది. మరోవైపు ముంబైకు నాలుగు వరుస పరాజయాల తర్వాత వచ్చిన తొలి గెలుపు ఇది. ఈ మ్యాచ్లో తిలక్ వర్మ (101 నాటౌట్) రికార్డు శతకంతో ముంబై ఇండియన్స్ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై తిలక్ శతక్కొట్టుడుతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. అనంతరం 200 పరుగుల లక్ష్య ఛేదనలో అశ్వనీ కుమార్ (4-0-24-4), ఘజన్ఫర్ (2.5-0-17-2), సాంట్నర్ (3-0-16-2) ధాటికి గుజరాత్ 15.5 ఓవర్లలో 100 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.ఈ గెలుపుపై ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా చాలా ఆనందం వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. అహ్మదాబాద్ లాంటి కఠిన వేదికపై గెలవడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ మైదానంలో ముంబై ఇండియన్స్కు గతంలో పెద్దగా విజయాలు లేవు. ఈసారి మంచి క్రికెట్ ఆడి విజయం సాధించడం ప్రత్యేకంగా అనిపించింది. ఈ గెలుపు జట్టుకు అత్యంత అవసరమైంది.మ్యాచ్లో కీలక మలుపు 14వ ఓవర్ టైమ్ఔట్ తర్వాత వచ్చింది. ఆ సమయంలో తిలక్ వర్మకు ఓ సందేశం ఇచ్చాను. బంతిని గమనించి, ధైర్యంగా కొట్టు అని చెప్పాను. తిలక్ ప్రతిభపై పూర్తి నమ్మకం ఉంది, అతను తన సహజ ఆట ఆడితే చాలు అన్న భావనతో ప్రోత్సహించాను. చివరికి తిలక్ అద్భుతంగా ఆడి జట్టుకు మంచి స్కోర్ అందించాడు.బౌలింగ్లో బుమ్రా వినియోగంపై పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుమ్రాను ఎప్పుడైనా ఉపయోగించవచ్చని, అతను ప్రత్యేకమైన బౌలర్ కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా అతన్ని వినియోగించడం ముఖ్యమని అన్నాడు. ఈ మ్యాచ్లో కొత్త బంతితోనే ప్రభావం చూపాలని నిర్ణయించి, బుమ్రాను ప్రారంభంలోనే బౌలింగ్కు తీసుకురావడం విజయానికి దోహదపడిందని తెలిపాడు.ఈ మ్యాచ్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించాడు. అరంగేట్రం బౌలర్ కృష్ మంచి లైన్, లెంగ్త్తో బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడని, అశ్వనీ కుమార్ కీలక సమయంలో వికెట్లు తీసి మ్యాచ్ మలుపు తిప్పాడని పేర్కొన్నాడు. గత సీజన్లో కూడా అతను ఇదే తరహా ప్రదర్శన చేసినట్లు గుర్తు చేశాడు. అదనంగా ఫీల్డింగ్లో కూడా జట్టు మెరుగ్గా రాణించిందని, ముఖ్యంగా నమన్ ప్రదర్శనను ప్రశంసించాడు. మొత్తంగా ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్కు టర్నింగ్ పాయింట్ అవుతుందని పాండ్యా అభిప్రాయపడ్డాడు. ఇక దూసుకుపోతామని పరోక్షంగా చెప్పాడు. -
ముంబై చేతిలో పరాజయాన్ని బౌలర్లపై నెట్టిన గిల్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 20) జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చేతిలో గుజరాత్ టైటాన్స్ 99 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది. తిలక్ వర్మ (101 నాటౌట్) రికార్డు శతకంతో ముంబై ఇండియన్స్ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. నాలుగు వరుస పరాజయాల తర్వాత ముంబైకి వచ్చిన మొదటి గెలుపు ఇది. ఈ మ్యాచ్లో ముంబై గెలిచి ఉండకపోయుంటే ప్లే ఆఫ్స్ అవకాశాలు చాలా సంక్లిష్టం అయ్యేవి. మరోవైపు గుజరాత్కు ఇది హ్యాట్రిక్ విజయాల తర్వాత తొలి పరాజయం. ఈ మ్యాచ్లో ముంబై నిర్దేశించిన 200 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ చేతులెత్తేసింది. అశ్వనీ కుమార్ (4-0-24-4), ఘజన్ఫర్ (2.5-0-17-2), సాంట్నర్ (3-0-16-2) ధాటికి 15.5 ఓవర్లలో 100 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.మ్యాచ్ అనంతరం కెప్టెన్ శుభ్మన్ గిల్ ఓటమిపై సమీక్షిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. మధ్య ఓవర్లలో ఎక్కువ పరుగులు ఇవ్వడం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపిందని అభిప్రాయపడ్డాడు.గిల్ మాటల్లో.. ఈ పిచ్పై 160-170 పరుగుల స్కోర్ చాలా ఎక్కువ. మా బౌలర్లు మధ్య ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయలేకపోవడం వల్ల ప్రత్యర్థి జట్టు అదనపు పరుగులు సాధించింది. ఈ మ్యాచ్ నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. వాటిని భవిష్యత్తులో అమలు చేయాల్సిన అవసరం ఉంది.ఈ ఓటమిని పెద్ద సమస్యగా చూడదలచుకోలేదు. చిన్న అవాంరంగానే పరిగణిస్తాం. ఇకపై బయట మైదానాల్లో జరిగే మ్యాచ్ల్లో తిరిగి విజయాల బాట పడతాం. జట్టు ప్రదర్శనను మెరుగుపరుచుకోవడానికి అవసరమైన మార్పులు చేసుకుంటాము.పిచ్పై మాట్లాడుతూ.. వికెట్ కొంచెం నెమ్మదిగా ఉంది. బంతి సరిగా బ్యాట్పైకి రాకపోవడం బౌలర్లకు సవాలుగా మారింది. కొన్ని బంతులు వేగంగా, మరికొన్ని నెమ్మదిగా, ఇంకొన్ని తక్కువ ఎత్తులో ఉండటం వల్ల సరైన లెంగ్త్ను నిరంతరం కొనసాగించలేకపోయాము. ముఖ్యంగా మధ్య ఓవర్లలో ఒకే లెంగ్త్ను కచ్చితంగా పాటించలేకపోవడం మా ప్రధాన లోపం.ప్రత్యర్థి బ్యాటింగ్ సమయంలో పిచ్లో మార్పులపై ప్రశ్నించగా.. పెద్దగా తేడా లేదని చెప్పాడు. అయితే తమ బ్యాటింగ్ సమయానికి కొంత మంచు ప్రభావం ఉండిందని అన్నాడు. ఇది ముంబై బౌలర్లకు కలిసొచ్చిందని పరోక్షంగా తెలిపాడు.మొత్తంగా, గిల్ ఈ మ్యాచ్లో జరిగిన తప్పిదాలను గుర్తించి, వాటిని సరిదిద్దుకుంటే మళ్లీ విజయాల బాట వచ్చని నమ్మకం వ్యక్తం చేశాడు. కెప్టెన్గా తన జట్టును మళ్లీ సమతుల్యంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తానని స్పష్టం చేశాడు. -
సన్రైజర్స్ను ఢిల్లీ ఆపగలదా!
సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై గత రెండు మ్యాచ్లు గెలిచి జోరు మీదున్న సన్రైజర్స్ హైదరాబాద్ ‘హ్యాట్రిక్’ విజయంపై గురి పెట్టింది. ఐపీఎల్లో భాగంగా నేడు ఉప్పల్ స్టేడియంలో జరిగే లీగ్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో రైజర్స్ తలపడుతుంది. మరోవైపు రెండు వరుస పరాజయాల అనంతరం డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరును బెంగళూరులోనే ఓడించడంతో ఢిల్లీ టీమ్లో కూడా ఆత్మవిశ్వాసం పెరిగింది. పాయింట్ల పట్టికలో పెద్ద తేడా లేకుండా దాదాపు సమానంగా ఉన్న ఈ రెండు టీమ్లలో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరం. గత రెండు మ్యాచ్ల ఫలితాలను బట్టి చూస్తే సన్రైజర్స్ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది. అభిõÙక్ శర్మ, క్లాసెన్ మెరుపు బ్యాటింగ్తో పాటు టాప్–5లో హెడ్, ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి కూడా చెలరేగితే బ్యాటింగ్లో తిరుగుండదు. బౌలింగ్లో యువ ఆటగాళ్లంతా సమష్టింగా రాణిస్తుండటం జట్టు బలం. ప్రఫుల్ హింగే, సాకిబ్, శివాంగ్లతో పాటు ఇషాన్ మలింగ కూడా గత మ్యాచ్లో సత్తా చూపించాడు. ఢిల్లీ జట్టులో కేఎల్ రాహుల్ ఫామ్లోకి రావడం సానుకూలాంశం కాగా... స్టబ్స్, డేవిడ్ మిల్లర్లతో మిడిలార్డర్ పటిష్టంగా ఉంది. ముకేశ్, ఎన్గిడి, కుల్దీప్లతో పాటు అక్షర్ పటేల్, నటరాజన్ బౌలింగ్ భారం మోస్తారు. గత మ్యాచ్లో విఫలమైనా... పేసర్ ఆకిబ్ నబీకి మరో అవకాశం దక్కవచ్చు. -
భారత 95వ గ్రాండ్మాస్టర్గా అరోణ్యక్ ఘోష్
రెండేళ్ల నిరీక్షణకు తెరదించుతూ బెంగాల్కు చెందిన యువ చెస్ ప్లేయర్ అరోణ్యక్ ఘోష్ గ్రాండ్మాస్టర్ (జీఎం) హోదా సంపాదించాడు. బ్యాంకాక్ చెస్ క్లబ్ ఓపెన్ టోర్నమెంట్లో 22 ఏళ్ల ఈ కోల్కతా ప్లేయర్ జీఎం హోదా ఖరారు కావడానికి అవసరమైన మూడో నార్మ్ను సాధించాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత అరోణ్యక్ ఏడు పాయింట్లు స్కోరు చేసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. 2023లో సాంట్స్ ఓపెన్లో తొలి జీఎం నార్మ్ పొందిన అరోణ్యక్... 2024లో అనెమాస్ మాస్టర్స్ టోర్నీలో రెండో జీఎం నార్మ్ దక్కించుకున్నాడు. ర్యాపిడ్ ఫార్మాట్లో జాతీయ చాంపియన్గా ఉన్న అరోణ్యక్ గత ఏడాది ప్రపంచకప్ టోరీ్నకి అర్హత సాధించాడు. తొలి రౌండ్లో మటెసుజ్ బార్టెల్ (పోలాండ్)ను ఓడించిన అతను రెండో రౌండ్లో లెవోన్ అరోనియన్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్లో 401వ ర్యాంక్లో ఉన్న అరోణ్యక్ ఖాతాలో 2533 ఎలో రేటింగ్ పాయింట్లున్నాయి. -
ముంబై చేతిలో చిత్తుగా ఓడిన గుజరాత్
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. సోమవారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 99 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 15.5 ఓవర్లలో 100 పరుగులకే కుప్పకూలి దారుణ ఓటమిని మూటగట్టుకుంది. వాషింగ్టన్ సుందర్ 26 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ముంబై బౌలర్లలో అశ్వనీ కుమార్ 4 వికెట్లతో చెలరేగగా, గజన్ఫర్, మిచెల్ సాంట్నర్ 2 వికెట్లు పడగొట్టారు. సొంతగడ్డపై ఆడిన గుజరాత్ ముంబై బౌలర్ల ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. టాపార్డర్ విఫలమైనప్పటికీ మిడిలార్డర్లో తిలక్ వర్మ (101 నాటౌట్) సెంచరీతో విధ్వంసం చెలరేగగా, నమన్ ధిర్ (45) బాధ్యతాయుతంగా ఆడారు. గుజరాత్బౌలర్లలో రబాడ 3 వికెట్లు తీయగా, సిరాజ్, ప్రసిధ్ క్రిష్ణ చెరొక వికెట్ తీశారు. సెంచరీతో చెలరేగిన తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. సీజన్లో రెండో విజయం సాధించిన ముంబై 4 పాయింట్లతో పట్టికలో ఏడో స్థానానికి ఎగబాకింది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ ఆడిన 6 మ్యాచ్ల్లో మూడు విజయాలు, మూడు పరాజయాలతో పట్టిలకలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. -
చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. ఫాస్టెస్ట్ సెంచరీ
ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ ఎట్టకేలకు తన ఫామ్ను అందుకున్నాడు. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో తిలక్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. నరేంద్ర మోడీ స్టేడియంలో తిలక్ విధ్వంసం సృష్టించాడు.ముంబై ఇండియన్స్ 44 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన తిలక్.. తొలుత ఆచితూచి ఆడాడు. ఈ హైదరాబాదీ తను ఎదుర్కొన్న తొలి 22 బంతుల్లో కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత తిలక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గుజరాత్ బౌలర్లను ఉతికారేశాడు. అతడిని ఆపడం ఎవరి తరం కాలేదు. తొలి 50 పరుగులను 33 బంతుల్లో పూర్తి చేసిన తిలక్.. చివరి 50 పరుగులను కేవలం 12 బంతుల్లోనే బాది తన మొదటి ఐపీఎల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. మొత్తంగా 45 బంతులు ఎదుర్కొన్న తిలక్ వర్మ 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో 8 ఫోర్లు, 7 సిక్స్లు ఉన్నాయి.ఫాస్టెస్ట్ సెంచరీఈ మ్యాచ్లో 45 బంతుల్లోనే శతకొట్టిన తిలక్ వర్మ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ముంబై ఇండియన్స్ తరపున ఫాస్టెస్ సెంచరీ చేసిన ఆటగాడిగా సనత్ జై సూర్య రికార్డును తిలక్ సమం చేశాడు. జైసూర్య 2008 సీజన్లో సీఎస్కేపై 45 బంతుల్లోనే శతక్కొట్టాడు.ఇప్పుడు మళ్లీ 18 ఏళ్ల తర్వాత తిలక్ 45 బంతుల్లో సెంచరీ చేశాడు. ముంబై ఇండియన్స్ తరపున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఇండియన్ మాత్రం తిలక్ వర్మనే కావడం గమనార్హం.అదేవిధంగా ముంబై ఇండియన్స్ తరపున సెంచరీ చేసిన రెండువ అతి పిన్నవయష్కుడిగా తిలక్ నిలిచాడు. 23 ఏళ్ల 163 రోజుల్లో తిలక్ ఈ ఫీట్ సాధించాడు. ఈ జాబితాలో కామోరూన్ గ్రీన్(22 ఏళ్ల 352 రోజులు) అగ్రస్ధానంలో ఉన్నాడు.చదవండి: IPL 2026: ఐపీఎల్ చరిత్రలోనే సూపర్ బాల్.. దెబ్బకు స్టంప్స్ ఎగిరిపోయాయిONE OF THE CRAZIEST HUNDREDS IN THE IPL BY TILAK VARMA IN 45 BALLS. 🤯🔥- The hundred celebration was ice cold. 🥶 pic.twitter.com/DhMfH0UlgM— Mufaddal Vohra (@mufaddal_vohra) April 20, 2026 -
ఆ టీమ్కు భారీ షాక్.. ఉన్నపళంగా ఇంటికి వెళ్లిపోయిన స్టార్ ప్లేయర్
ఐపీఎల్-2026లో వరుస ఓటములతో సతమతమవుతున్న లక్నో సూపర్ జెయింట్స్కు భారీ షాక్ తగిలింది. సౌతాఫ్రికా స్పీడ్ అన్రిచ్ నోకియా సీజన్ మధ్యలోనే లక్నో జట్టును వదిలి స్వదేశానికి వెళ్లిపోయాడు. అతడి భార్య త్వరలోనే కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నట్లు సమాచారం. దీంతో తన భార్య వద్ద ఉండేందుకు నోర్జే పితృత్వ సెలవు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏడాది సీజన్లో నోకియా ఇప్పటివరకు కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్లో ఒక్క వికెట్ కూడా తీయకుండా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.దీంతో తర్వాత మ్యాచ్లలో అతడికి ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కలేదు. ఇక లక్నో విషయానికి వస్తే.. ఈ ఏడాది సీజన్లో కూడా పంత్ టీమ్కు ఏదీ కలిసి రావడంలేదు. లక్నో బౌలింగ్ పరంగా కాస్త బలంగా ఉన్నప్పటికి, బ్యాటింగ్లో మాత్రం తేలిపోతుంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్ల్లో కేవలం రెండింటిలో మాత్రమే గెలిచి, పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. లక్నో తమ తదుపరి మ్యాచ్లో ఏప్రిల్ 22న ఏకానా స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్తో తలపడనుంది.చదవండి: అతడిని ఎంత పొగిడినా తక్కువే.. కచ్చితంగా స్టార్ అవుతాడు: శ్రేయస్ -
ఐపీఎల్ చరిత్రలోనే సూపర్ బాల్.. దెబ్బకు స్టంప్స్ ఎగిరిపోయాయి
ఐపీఎల్-2026లో టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో సూర్య తీవ్ర నిరాశపరిచాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్కు కగిసో రబాడ ఆరంభంలోనే బిగ్ షాకిచ్చాడు.అతడు బౌలింగ్ ధాటికి ఓపెనర్లు వికెట్లు కోల్పోయి ముంబై కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్పై ముంబై ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టే 6 ఓవర్ వేసిన రబాడ బౌలింగ్లో సూర్య ఓ సిక్స్, ఫోర్ బాది మంచి టచ్లో కన్పించాడు. కానీ అదే ఓవర్లో రబాడ అద్భుతమైన బంతితో సూర్యకుమార్ను బోల్తా కొట్టించాడు.ఐదో బంతిని రబాడ లెంగ్త్ బాల్ సంధించాడు. ఆ డెలివరీని సూర్య స్ట్రైట్ డ్రైవ్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి ఇన్ స్వింగ్ అయ్యి బ్యాట్, ప్యాడ్ మధ్య నుంచి వెళ్లి స్టంప్స్ను గిరాటేసింది. దీంతో సూర్య కేవలం 15 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఈ వికెట్ సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.Quinton de Kock ✅Surya Kumar Yadav ✅Kagiso Rabada with a fine piece of new-ball bowling 👌Updates ▶️ https://t.co/cawFoZABvQ#TATAIPL | #KhelBindaas | #GTvMI | @gujarat_titans pic.twitter.com/Xw2QlE4kZF— IndianPremierLeague (@IPL) April 20, 2026 -
అతడిని ఎంత పొగిడినా తక్కువే.. కచ్చితంగా స్టార్ అవుతాడు: శ్రేయస్
ఐపీఎల్-2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతున్నాడు. ఆదివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో కూడా వైభవ్ బ్యాట్ ఝుళిపించాడు. కేవలం 28 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 46 పరుగులు చేశాడు.ఓవరాల్గా ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడిన వైభవ్ సూర్యవంశీ 236.54 స్ట్రైక్ రేట్తో 246 పరుగులు చేశాడు. కాగా ఈ యంగ్ కిడ్ బ్యాటింగ్కు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫిదా అయిపోయాడు. వైభవ్ ఒక ఫ్యూచర్ స్టార్ అని శ్రేయస్ కొనియాడాడు.వైభవ్ సూర్యవంశీ ఒక భిన్నమైన ఆటగాడు. అతడి వద్ద అద్బుతమైన టాలెంట్ ఉంది. అతడిని ఎంత పొగిడినా తక్కువే. అతడి బ్యాట్ ఫ్లో, బంతి పడకముందే అతను సృష్టించుకునే రిథమ్, మొమెంటం అద్భుతం. కచ్చితంగా అతడు కచ్చితంగా భవిష్యత్ స్టార్ అవుతాడనే చెప్పాలి" అని జియోస్టార్ నిర్వహించిన 'బిలీవ్' కార్యక్రమంలో అయ్యర్ పేర్కొన్నాడు.ఇక ఈ ఏడాది సీజన్లో శ్రేయస్ అయ్యర్ కూడా కెప్టెన్, బ్యాటర్గా అదరగొడుతున్నాడు. శ్రేయస్ ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు ఆడి 208 పరుగులు సాధించాడు. అతడి కెప్టెన్సీలో పంజాబ్ ఆడిన ఆరు మ్యాచ్ల్లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది.చదవండి: NZ vs BAN 2nd ODI: న్యూజిలాండ్కు షాకిచ్చిన బంగ్లాదేశ్ -
గుజరాత్పై ముంబై ఇండియన్స్ విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. సోమవారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 99 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 15.5 ఓవర్లలో 100 పరుగులకే కుప్పకూలి దారుణ ఓటమిని మూటగట్టుకుంది. వాషింగ్టన్ సుందర్ 26 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ముంబై బౌలర్లలో అశ్వనీ కుమార్ 4 వికెట్లతో చెలరేగగా, గజన్ఫర్, మిచెల్ సాంట్నర్ 2 వికెట్లు పడగొట్టారు. సొంతగడ్డపై ఆడిన గుజరాత్ ముంబై బౌలర్ల ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.గుజరాత్ మూడో వికెట్ డౌన్గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన శుభ్మన్ గిల్.. అశ్విన్ కుమార్ బౌలింగ్లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 45/3గుజరాత్ రెండో వికెట్ డౌన్గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన జోస్ బట్లర్.. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు.గుజరాత్ టైటాన్స్కు భారీ షాక్200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్కు భారీ షాక్ తగిలింది. బుమ్రా వేసిన మొదటి ఓవర్లో తొలి బంతికే సాయిసుదర్శన్ పెవిలియన్కు చేరాడు.తిలక్ వర్మ విధ్వంసంఅహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. కేవలం 45 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్లతో 101 పరుగులు చేశాడు. తిలక్ వర్మకు ఇదే తొలి ఐపీఎల్ సెంచరీ. అతడితో పాటు నమన్ ధీర్(32 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్తో 45) రాణించాడు. ఫలితంగా టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో కగిసో రబాడ మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలా వికెట్ సాధించారు.తిలక్ వర్మ హాఫ్ సెంచరీతిలక్ వర్మ ఎట్టకేలకు తన ఫామ్ను అందుకున్నాడు. అహ్మాదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో తిలక్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. 59 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు.దూకుడుగా ఆడుతున్న తిలక్16 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. క్రీజులో తిలక్ వర్మ(37), హార్దిక్ పాండ్యా(7) ఉన్నారు.ముంబై నాలుగో వికెట్ డౌన్98 పరుగుల వద్ద ముంబై నాలుగో వికెట్ కోల్పోయింది. 45 పరుగులు చేసిన నమన్ధీర్.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో ఔటయ్యాడు. 14 ఓవర్లు ముగిసే సరికి ముంబై స్కోర్: 103/4ముంబై మూడో వికెట్ డౌన్44 పరుగుల వద్ద ముంబై మూడో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. రబాడ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడుముంబై రెండో వికెట్ డౌన్23 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన క్వింటన్ డికాక్.. కగిసో రబాడ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు.తొలి వికెట్ డౌన్టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్కు ఆదిలోనే షాక్ తగిలింది. అరంగేట్ర ఆటగాడు డానిష్ మాలెవర్(2).. రబాడ బౌలింగ్లో ఔటయ్యాడు. 3 ఓవర్లకు ముంబై స్కోర్: 21/1ఐపీఎల్-2026 సీజన్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు కూడా ముంబై స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ దూరమయ్యాడు.కాగా ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తరపున యువ ఆటగాళ్లు డానిష్ మలేవార్, క్రిష్ భగత్ అరంగేట్రం చేశాడు. అదేవిధంగా మిచెల్ శాంట్నర్ తిరిగి జట్టులోకి వచ్చాడు. గుజరాత్ టైటాన్స్ మాత్రం తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.తుది జట్లుగుజరాత్ టైటాన్స్ : శుభ్మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(వికెట్కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, మహ్మద్ సిరాజ్, కగిసో రబడ, ప్రసిద్ధ్ కృష్ణ, అశోక్ శర్మముంబై ఇండియన్స్ : డానిష్ మాలెవార్, క్వింటన్ డి కాక్(వికెట్కీపర్), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(సి), తిలక్ వర్మ, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్, మిచెల్ సాంట్నర్, క్రిష్ భగత్, జస్ప్రీత్ బుమ్రా, ఘజన్ఫర్ -
న్యూజిలాండ్కు షాకిచ్చిన బంగ్లాదేశ్
న్యూజిలాండ్తో తొలి వన్డేలో ఎదురైన ఓటమికి బంగ్లాదేశ్ బదులు తీర్చుకుంది. సోమవారం ఢాకా వేదికగా జరిగిన రెండో వన్డేలో కివీస్పై 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను బంగ్లా జట్టు 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 48.4 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బ్యాటర్లలో నిక్ కెల్లీ (102 బంతుల్లో 83 పరుగులు, 14 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా కెల్లీ మాత్రం ఒంటరిపోరాటం చేశాడు. మిగితా బ్యాటర్ల నుంచి అతడి సహకారం లభించలేదు. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ స్పీడ్ స్టార్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. రాణా 5 వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ వెన్ను విరిచాడు. అతడితో పాటు షోర్ఫుల్ ఇస్లాం రెండు.. రిషాద్, టాస్కిన్ అహ్మద్, సౌమ్య సర్కార్ తలా వికెట్ సాధించారు.తాంజిద్ మెరుపులుఅనంతరం 199 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 35.3 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. బంగ్లా బ్యాటర్లలో ఓపెనర్ తాంజిద్ హసన్ (58 బంతుల్లో, 76 పరుగులు, 10 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడితో నజ్ముల్ హొస్సేన్ శాంటో(50) హాఫ్ సెంచరీతో రాణించాడు. కివీస్ బౌలర్లలో జేడెన్ లెనాక్స్ రెండు వికెట్లు పడగొట్టగా.. స్మిత్, ఓ రూర్క్ తలా వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మకమైన మూడో వన్డే ఏప్రిల్ 23న ఛటోగ్రామ్లో జరగనుంది.చదవండి: IPL 2026: అతడిపై మీకు నమ్మకం లేదా? ఇదేమి కెప్టెన్సీరా బాబోయ్! -
‘రూ. 32 కోట్లు అయినా.. దయచేసి మీరే కొనుక్కోండి’
లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకాకు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా ఆ జట్టు అభిమానులు గోయెంకాకు కృతజ్ఞతలు చెప్పిన తీరు వైరల్గా మారింది. కాగా ఐపీఎల్లో 2022లో చేరిన లక్నో జట్టు కేఎల్ రాహుల్ సారథ్యంలో ప్లే ఆఫ్స్ చేరింది.రూ. 27 కోట్ల భారీ ధరకుఅయితే, సంజీవ్ గోయెంకా వైఖరితో విసిగిపోయిన కేఎల్ రాహుల్ (KL Rahul).. 2025 వేలానికి ముందు లక్నోను వీడాడు. గౌరవం లేని చోట తాను ఉండలేనని వెళ్లిపోయాడు. ఈ క్రమంలో మెగా వేలంలో రూ. 27 కోట్ల భారీ ధరకు లక్నో టీమిండియా మరో స్టార్ రిషభ్ పంత్ను కొనుగోలు చేసింది.రూ. 26.75 కోట్లకు పంజాబ్ సొంతంమరోవైపు.. 2024లో తమ జట్టుకు టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ను కోల్కతా నైట్ రైడర్స్ వదిలేసింది. ఈ క్రమంలో అయ్యర్ కోసం కూడా ఫ్రాంఛైజీలు ఎగబడగా.. పంజాబ్ రూ. 26.75 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో పంత్, శ్రేయస్ ఖరీదైన ఆటగాళ్లుగా నిలవగా.. ఇద్దరికీ తమ ఫ్రాంఛైజీలు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాయి.కెప్టెన్గా.. బ్యాటర్గా సూపర్ హిట్.. పంత్ విఫలంఅయితే, శ్రేయస్ ఇటు కెప్టెన్గా.. అటు బ్యాటర్గా సూపర్ హిట్ అయ్యాడు. గతేడాది 604 పరుగులు చేసిన ఈ ముంబైకర్ జట్టును ఫైనల్కు చేర్చాడు. మరోవైపు.. పంత్ మాత్రం దారుణంగా విఫలమై విమర్శలు మూటగట్టుకున్నాడు. గతేడాది కేవలం 269 పరుగులు చేసిన పంత్.. కెప్టెన్గానూ ఫెయిలై జట్టును ఏడోస్థానంలో నిలిపాడు.ఇక తాజాగా ఐపీఎల్-2026లోనూ పంజాబ్ జైత్రయాత్ర కొనసాగిస్తుండగా.. లక్నో వరుస వైఫల్యాలతో సతమతమవుతూ ఉంది. ముల్లన్పూర్లో ఆదివారం ఇరుజట్లు తలపడగా.. పంజాబ్ లక్నోను 54 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ క్రమంలో స్టాండ్స్లో ఉన్న సంజీవ్ గోయెంకాకు పంజాబ్ అభిమాని దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చాడు.రూ. 32 కోట్లు అయినా.. దయచేసి మీరే కొనుక్కోండి‘‘గోయెంకా సాబ్! పంత్ను మీ జట్టులోకి తీసుకున్నందు వేలవేల దండాలు భాయ్.. అతడు పంజాబ్ కెప్టెన్గా రానందుకు మాకెంతో సంతోషంగా ఉంది. ఒకవేళ తదుపరి వేలంలో రూ. 32 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చినా దయచేసి పంత్ను మీతోనే ఉంచుకోండి’’ అని సదరు అభిమాని గట్టిగా అరిచాడు.అయితే, ఇందుకు గోయెంకా మాత్రం థాంక్యూ అన్నట్లుగా నవ్వుతూ అభివాదం చేశారు. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఐపీఎల్-2025 మెగా వేలం ముగిసిన తర్వాత రిషభ్ పంత్ చేసిన వ్యాఖ్యలే.. ఇప్పుడు ఒక రకంగా గోయెంకాకు ఎదురైన అవమానానికి కారణం.PBKS fan: Goenka sahab! Thank you for taking Pant, paaji many, many thanks! Shukar hai captain saadi Punjab team ch nahi aaya!Paaji, even if you have to give 32 crores, don't let Pant go, keep him with you!😭Meanwhile,blud Sanjeev Goenka laughing and giving a thumbs up🤣🙏 pic.twitter.com/dKB7s8ouIt— Rohan💫 (@rohann__45) April 20, 2026ఆరోజు పంత్ అన్న మాటనే తిప్పి కొట్టి..వేలం సందర్భంగా.. ‘‘నాకు ఒకటే టెన్షన్.. పంజాబ్కు మాత్రం అస్సలు వెళ్లకూడదు అని మొక్కుకున్నా.. నేను ఆడకూడదనుకునే ఒకే ఒక్క టీమ్ అది’’ అని పంత్ వ్యాఖ్యానించాడు. దీంతో అప్పటి నుంచి పంజాబ్ జట్టు ఫ్యాన్స్ అతడిపై గుర్రుగా ఉన్నారు. అందుకే ఇప్పుడు పంజాబ్లో పంజాబ్ చేతిలో పంత్ సేన ఓడిన తర్వాత గోయెంకాకు ఇలా పంత్ గురించి సలహా ఇచ్చారు.చదవండి: BCCI: వైభవ్ సూర్యవంశీకి బిగ్ ప్రమోషన్! -
అతడిపై మీకు నమ్మకం లేదా? ఇదేమి కెప్టెన్సీరా బాబోయ్!
ఐపీఎల్-2026 సీజన్లో వరుసగా నాలుగు విజయాలతో మంచి జోష్లో కన్పించిన రాజస్తాన్ రాయల్స్ ఇప్పుడు ఢీలా పడింది. ఆదివారం ఈడెన్గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో కేకేఆర్ ఓటమి పాలైంది. రాజస్తాన్కు ఇది వరుసగా రెండో ఓటమి కావడం గమనార్హం.మొన్నటి వరకు పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగిన రాయల్స్.. ఇప్పుడు మూడో స్ధానానికి పడిపోయింది. అయితే సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ సరిగ్గా ఉపయోగించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ ఏడాది సీజన్కు ముందు సీఎస్కే నుంచి జడేజాను రాజస్తాన్ ట్రేడ్ చేసుకుంది.కానీ జడేజా లాంటి ఆల్రౌండర్ సేవలను ఉపయోగించుకోవడంలో రాజస్తాన్ విఫలమైందనే చెప్పుకోవాలి. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడిన జడ్డూ..కేవలం 10 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. అప్పటికి ఐదు వికెట్లు జడేజా పడగొట్టాడు. ఓ రెండు మ్యాచ్ల్లో అతడితో పూర్తిగా ఒక్క ఓవర్ కూడా వేయించలేదు.కేకేఆర్తో మ్యాచ్లో కూడా జడేజా అద్బుత ప్రదర్శన కనబరిచాడు. మూడు ఓవర్లు వేసిన జడేజా, కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అయినప్పటికి అతడితో నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేయించలేదు. ఈ నేపథ్యంలో రాజస్తాన్ కెప్టెన్ రియాన్ పరాగ్పై భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విమర్శలు గుప్పించాడు. జడేజాలాంటి సీనియర్ స్పిన్నర్తో పూర్తి కోటాను పూర్తి చేయించకపోవడాన్ని అశ్విన్ తప్పుబట్టాడు."రవీంద్ర జడేజా రూపంలో అద్భుతమైన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మీ జట్టులో ఉన్నాడు. అతడి గణంకాలను చూస్తే ఎలాంటి బౌలరో మీకే ఆర్ధమవుతోంది. కేకేఆర్ మ్యాచ్లో జడ్డూ మూడు ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అతడి బౌలింగ్లో రింకూ సింగ్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయినప్పటికి అతడితో మరో ఓవర్ వేయించకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఇద్దరు ఎడమ చేతి వాటం బ్యాటర్లు క్రీజులో ఉన్నారని బహుశా జడేజాకు బౌలింగ్ ఇవ్వలేదనుకుంటా. రవి బిష్ణోయ్ వంటి రైట్ ఆర్మ్ లెగ్ బౌలర్ అయితే బాగా బౌలింగ్ చేస్తాడని కెప్టెన్ ఆశించాడు. కానీ చివరి ఏమి జరిగింది. బిష్ణోయ్ వేసిన ఒకే ఓవర్లో 19 పరుగులు వచ్చాయి. దీని బట్టి జడేజా బౌలింగ్పై మీకు నమ్మకం లేదని నాకు ఆర్ధమైంది" అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.చదవండి: BCCI: వైభవ్ సూర్యవంశీకి బిగ్ ప్రమోషన్! -
చరిత్ర సృష్టించిన బాబర్ ఆజం.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
పాకిస్తాన్ సూపర్ లీగ్-2026లో పెషావర్ జల్మీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఆదివారం కరాచీ స్టేడియం వేదికగా క్వెట్టా గ్లాడియేటర్స్తో జరిగిన మ్యాచ్లో బాబర్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో బాబర్ తన శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేశాడు.గ్లాడియేటర్స్ బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 52 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో బాబర్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 12,000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్గా బాబర్ ఆజం రికార్డులకెక్కాడు.బాబర్ కేవలం 338 ఇన్నింగ్స్లలో ఈ ఫీట్ను అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్(344) పేరిట ఉండేది. గేల్ తర్వాతి స్ధానంలో విరాట్ కోహ్లి (360 ఇన్నింగ్స్లు) ఉండేవాడు. తాజాగా ఇన్నింగ్స్తో వీరిద్దరిని బాబర్ అధిగమించాడు. కాగా బాబర్కు ఇది 12వ సెంచరీ.టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో బాబర్ రెండో స్ధానంలో ఉన్నాడు. మొదటి స్ధానంలో క్రిస్ గేల్ (22 సెంచరీలు) కొనసాగుతున్నాడు. ఇక ఈ మ్యాచ్లో బాబర్ మరో అరుదైన ఘనత సాధించాడు. ఒక ఇన్నింగ్స్ 50 కంటే ఎక్కువ బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క డాట్ బాల్ ఆడిన మొదటి ఆటగాడిగా బాబర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో బాబర్ ఎదుర్కొన్న 52 బంతుల్లో ఒకే డాట్ బాల్ ఉంది.చదవండి: BCCI: వైభవ్ సూర్యవంశీకి బిగ్ ప్రమోషన్! -
PSL: తప్పు ఒప్పుకొన్న పాక్ బోర్డు.. ఊహించని ట్విస్ట్!
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీరుపై విమర్శలు కొనసాగుతున్నాయి. జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజర్బానీ పట్ల పీసీబీ వ్యవహారశైలి ఇందుకు కారణం. టీ20 ప్రపంచకప్-2026లో ఆస్ట్రేలియా జట్టుపై సత్తా చాటడంతో ముజర్బానీకి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)కు చెందిన ఇస్లామాబాద్ యునైటెడ్ ఫ్రాంఛైజీ ముజర్బానీని సొంతం చేసుకునే దిశగా ప్రయత్నాలు చేసింది. వెస్టిండీస్ యువ పేసర్ షమార్ జోసెఫ్ స్థానంలో ఈ జింబాబ్వే పేసర్ను తమ జట్టులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది.కేకేఆర్లో చేరిన ముజర్బానీఅయితే.. ఆ తర్వాత అనూహ్య రీతిలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) నుంచి ముజర్బానీకి పిలుపువచ్చింది. బంగ్లాదేశ్తో ఉద్రికత్తల నేపథ్యంలో తమ జట్టు నుంచి తొలగించిన ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్ స్థానాన్ని కోల్కతా నైట్ రైడర్స్.. ముజర్బానీతో భర్తీ చేయాలని భావించింది.రెండేళ్ల నిషేధంఈ నేపథ్యంలో ఐపీఎల్ వైపు మొగ్గుచూపిన ముజర్బానీ.. పీఎస్ఎల్ను వీడి కేకేఆర్లో చేరాడు. దీంతో పీసీబీ సంచలన ప్రకటన చేసింది. ‘‘ఫ్రాంచైజీ లీగ్లలో ఆడేవాళ్లు పారదర్శకంగా, స్థిరంగా ఉండాలి. ముందుగా ఒప్పందం కుదుర్చుకొని అది అమలులో ఉండగా... దానికి విరుద్ధమైన ఒప్పందంలోకి ప్రవేశించడం ఆట ప్రమాణాలను పాటించకపోవడమే. ముజర్బానీపై రెండేళ్లు నిషేధం విధిస్తున్నాం’’ అని పేర్కొంది. దీంతో అతడిపై పాక్ ఫ్యాన్స్ విద్వేష విషం చిమ్మారు.ఈ క్రమంలో ముజర్బానీ ఏజెంట్ తాజాగా ఘాటుగా స్పందించాడు. అసలు ముజర్బానీ ఏ కాంట్రాక్టుపైనా సంతకం చేయలేదని.. అలాంటి ఆటగాడిపై నిషేధం ఎలా విధిస్తారని ప్రశ్నించాడు. అంతేకాదు.. అభిమానుల ముసుగులో పిరికిపందలు అతడిపై విషం చిమ్ముతూ ఉంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించాడు. అకారణంగా బ్లెస్సింగ్పై చర్యలు తీసుకున్నారని.. వెంటనే నిషేధం ఎత్తివేయాలని పీసీబీకి విజ్ఞప్తి చేశాడు.తప్పు ఒప్పుకొన్న పాక్ బోర్డు.. ఊహించని ట్విస్ట్!దీంతో వివాదం ముదిరిపోగా.. పీసీబీ స్పందించినట్లు తెలుస్తోంది. PTI అందించిన వివరాల ప్రకారం.. ముజర్బానీ ఏజెంట్ చేసిన ఆరోపణలు నిజమేనని పీసీబీ ధ్రువీకరించింది. పీసీబీ గానీ.. ఇస్లామాబాద్ గానీ ఈ జింబాబ్వే పేసర్తో రాతపూర్వక ఒప్పందం చేసుకోలేదని అంగీకరించింది.అయితే, మౌఖికంగా మాత్రం అతడు పీఎస్ఎల్లో ఆడేందుకు ఆమోదం తెలిపాడని పేర్కొంది. ఏదేమైనా ముజర్బానీ నిబంధనలను ఉల్లంఘించాడని.. అందుకే అతడిపై నిషేధం కొనసాగుతుందని పీసీబీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో పీసీబీ తప్పును సగమే ఒప్పుకొందని.. అకారణంగా ముజర్బానీపై చర్యలు తీసుకుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ముజర్బానీతో పాటు ఈ ఏడాది శ్రీలంక కెప్టెన్ దసున్ షనక, ఆస్ట్రేలియా స్టార్ స్పెన్సర్ జాన్సన్ కూడా పీఎస్ఎల్ను వీడి ఐపీఎల్లో చేరిన సంగతి తెలిసిందే.చదవండి: టీ20 క్రికెట్ లీగ్ ఫ్రాంఛైజీ ఓనర్గా క్రిస్ గేల్ -
వైభవ్ సూర్యవంశీకి బిగ్ ప్రమోషన్!
ఐపీఎల్ 2026 సీజన్ అనంతరం భారత అండర్-19, అండర్-23 జట్లు శ్రీలంక టూర్కు వెళ్లనున్నాయి. ఈ పర్యటనలో భాగంగా భారత యువ జట్లు శ్రీలంక అండర్-19, లయన్స్ టీమ్స్తో నాలుగు రోజుల రెడ్ బాల్ మ్యాచ్లు ఆడనున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ త్వరలోనేఖరారు చేయనుంది.అయితే శ్రీలంక పర్యటనకు వెళ్లే జట్లను ఎంపిక చేసేందుకు బీసీసీఐ జూన్లో ఒక ప్రత్యేక టోర్నమెంట్ను నిర్వహించనుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 64 మంది యువ ఆటగాళ్లు బోర్డు షార్ట్ లిస్ట్ చేసింది. వీరింతా ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ ఆఫ్ ఎక్సలెన్స్లో శిక్షణ పొందుతున్నారు.ఈ యువ ఆటగాళ్లు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ పర్యవేక్షణలో రాటుదేలుతున్నారు. ఈ టోర్నీలో అత్యుత్తుమ ప్రదర్శన ఆటగాళ్లు శ్రీలంక వెళ్లే విమానం ఎక్కనున్నారు. ఐపీఎల్-2026లో ఆడుతున్న యంగ్ కిడ్స్ వైభవ్ సూర్యవంశీ, అయూశ్ మాత్రే కూడా సీజన్ ముగిసిన తర్వాత ఈ క్యాంప్లో చేరనున్నారు.కెప్టెన్గా వైభవ్ సూర్యవంశీ?అయితే శ్రీలంక టూర్కు ముందు భారత అండర్-19 కెప్టెన్ అయూష్ మాత్రే గాయపడడం సెలక్టర్లు తలనొప్పిగా మారింది. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో సీఎస్కేకు ప్రాతినిథ్యం వహిస్తున్న మాత్రే తొడ కండరాలు (హ్యామ్స్ట్రింగ్) పట్టేశాయి. దీంతో అతడు వికెట్ల మధ్య పరిగెత్తేందుకు ఇబ్బంది పడ్డాడు. అతడు గాయం తీవ్రమైనదిగా తెలుస్తోంది. ఒకవేళ మాత్రే గాయం గ్రేడ్-3లో ఉన్నట్లయితే పూర్తిగా కోలుకోవడానికి రెండు నెలల సమయం పడుతోంది. అదే జరిగితే రోహిత్ ఐపీఎల్-2026 సీజన్ మధ్యలోనే వైదొలగడంతో పాటు శ్రీలంక పర్యటనకు కూడా మాత్రే దూరమయ్యే అవకాశముంది. మరోవైపు అండర్-19 వైస్ కెప్టెన్ వియాన్ మల్హోత్రా కూడా స్వల్ప గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వియాన్ మల్హోత్రాను ఐపీఎల్-2026 వేలంలో ఆర్సీబీ కొనుగోలు చేసింది. కానీ ఇప్పటివరకు అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఒకవేళ శ్రీలంక టూర్కు మాత్రే, వియాన్ ఇద్దరు అందుబాటులో లేకపోతే భారత జట్టు కెప్టెన్గా వైభవ్ సూర్యవంశీ అవకాశముంది. సూర్యవంశీ గతంలో సౌతాఫ్రికా పర్యటనలో భారత జట్టు కెప్టెన్గా వ్యవహరించాడు. అతడి నేతృత్వంలోని యంగ్ ఇండియా ఆ సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. మళ్లీ ఇప్పుడు వైభవ్ తన కెప్టెన్సీని నిరూపించుకునే సమయం వచ్చిందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.చదవండి: PSL: పిరికిపందలు.. ఎక్స్ట్రాలు వద్దు.. పాక్ బోర్డుకు ఘాటు కౌంటర్ -
టీ20 క్రికెట్ లీగ్ ఫ్రాంఛైజీ ఓనర్గా క్రిస్ గేల్
వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ క్రిస్ గేల్ కీలక ముందడుగు వేశాడు. ది యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL)లో యూనివర్సల్ బాస్ భాగమయ్యాడు. గ్లాస్గో ముగాఫియాన్స్ అనే జట్టుకు సహ యజమానిగా గేల్ వ్యవహరించనున్నాడు.జట్టు కొనుగోలుది యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్లో ఆరు జట్లు భాగం కానుండగా.. స్కాట్లాండ్ దేశం నుంచి గ్లాస్గో ముగాఫియాన్స్ (Glasgow Mugafians) ప్రాతినిథ్యం వహిస్తోంది. భారత మహిళా వ్యాపారవేత్త తన్షా బాత్రాతో కలిసి క్రిస్ గేల్ ఈ జట్టును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ ఫ్రాంఛైజీకి గేల్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నట్లు సమాచారం.కాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీ20 లీగ్లన్నింటిలో కలిపి క్రిస్ గేల్ ఏకంగా 463 మ్యాచ్లు ఆడాడు. ఇప్పుడు ఫ్రాంఛైజీ ఓనర్గా కొత్త అధ్యాయం ప్రారంభించాడు. ఇదిలా ఉంటే.. ది యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ ఈ ఏడాది ఆరంభం కానుంది. బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ఈ లీగ్ సహయజమానిగా ఉన్నాడు.ది యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్లో క్రికెట్ ఐర్లాండ్, క్రికెట్ స్కాట్లాండ్, రాయల్ డచ్ క్రికెట్ అసోసియేషన్ భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. గ్లాస్గో, ఆమ్స్టర్డ్యామ్, ఎడిన్బర్గ్, డబ్లిన్, బెల్ఫాస్ట్, రాటర్డ్యామ్ రూపంలో ఆరు జట్లు ఈ లీగ్లో భాగంగా ఉన్నాయి.యజమానులుగా మాజీ క్రికెటర్లుఆమ్స్టర్డ్యామ్ ఫ్రాంఛైజీని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా, హాకీ స్టార్ జేమీ డైయర్ సొంతం చేసుకున్నారు. ఈ జట్టుకు ఆసీస్ టీ20 కెప్టెన్ మిచెల్ మార్ష్ సారథి.బెల్ఫాస్ట్ జట్టుకు గ్లెన్ మాక్స్వెల్ సహ యజమానిగా ఉండగా.. ఎడిన్బర్గ్ ఫ్రాంఛైజీని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్లు కైలీ మిల్స్, నాథన్ మెకల్లమ్ దక్కించుకున్నారు. ఈ జట్టుకు న్యూజిలాండ్ సారథి మిచెల్ సాంట్నర్ కెప్టెన్.చదవండి: PSL: పిరికిపందలు.. ఎక్స్ట్రాలు వద్దు.. పాక్ బోర్డుకు ఘాటు కౌంటర్ -
పంజాబ్ విజయ రహస్యం 'సర్పంచ్ సాబ్'
పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆ జట్టు ఫేట్ మారిపోయింది. గత సీజన్లో పగ్గాలు చేపట్టిన అతను.. తొలి ప్రయత్నంలోనే పంజాబ్ను ఫైనల్కు చేర్చాడు. దురదృషవశాత్తు ఫైనల్లో ఓడింది కానీ, టైటిల్కు పూర్తిగా అర్హమైన జట్టు అని అందరిచే ప్రశంసలందుకుంది.గత సీజన్లో తృటిలో చేజారిన టైటిల్ను పంజాబ్ ఈ సీజన్లో ఎలాగైనా సాధించాలని పట్టుదలగా ఉంది. మరోసారి శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో తమ తొలి టైటిల్ దిశగా దూసుకుపోతుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో ఐదు విజయాలతో (ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది) పాయింట్ల పట్టకలో అగ్రస్థానంలో కొనసాగుతుంది.ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో ఓటమెరుగని జట్టు ఏదైనా ఉందా అంటే అది పంజాబ్ మాత్రమే. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ఈ జట్టు భారీ విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్లో 254 పరుగులు చేసి, ఆతర్వాత ఆ స్కోర్ను విజయవంతంగా కాపాడుకుంది. ఈ మ్యాచ్లో పంజాబ్ చేసిన స్కోర్ సీజన్లోనే అత్యధికం.వరుస విజయాలతో దూసుకుపోతున్న పంజాబ్ విజయ రహస్యం ఏంటా అని పరిశీలిస్తే, అది వారి కెప్టెనేనని తెలుస్తుంది. శ్రేయస్ ఈ సీజన్లో మునుపెన్నడూ లేనంత పట్టుదలగా ఉన్నాడు. కెప్టెన్గా ఎంతో పరిణితి ప్రదర్శిస్తూ జట్టు విజయాలకు ప్రధాన కారకుడిగా నిలుస్తున్నాడు.శ్రేయస్ కెప్టెన్సీ శైలి ఇతర నాయకులతో పోలిస్తే భిన్నంగా ఉంది. ఆటగాళ్లపై ఒత్తిడి లేకుండా, వారికి స్వేచ్ఛ ఇచ్చి ఆడేలా చేయడం అతని ప్రత్యేకత. ప్రతి ఆటగాడి వ్యక్తిగత శైలి, రొటీన్ను గౌరవించడం ద్వారా జట్టులో విశ్వాసాన్ని పెంచాడు. ఈ విధానం కారణంగా బ్యాటర్లు నిర్భయంగా ఆడుతూ, మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా వేగాన్ని పెంచగలుగుతున్నారు.పంజాబ్ విజయాల్లో బ్యాటింగ్ విభాగం వారి ప్రధాన బలం. టాపార్డర్ నుంచి మిడిలార్డర్ వరకు దూకుడైన ఆట కనిపిస్తోంది. ముఖ్యంగా సిక్సర్లు కొట్టడంపై ఆ జట్టు ప్రత్యేక దృష్టి పెట్టింది. శ్రేయస్ ఆటగాళ్ల మధ్య సిక్సర్ల పోటీ పెట్టి, జట్టులో ఉత్సాహాన్ని నింపాడు. ఇది కేవలం వినోదాత్మక అంశంగా కాకుండా, మ్యాచ్లలో స్కోరింగ్ రేట్ పెంచడానికి దోహదపడుతోంది. ఫలితంగా, పంజాబ్ జట్టు భారీ స్కోర్లు చేస్తూ ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచుతోంది.బౌలింగ్ విభాగంలోనూ పంజాబ్ సమతుల్యంగా ఉంది. అంతర్జాతీయ స్థాయి అనుభవం కలిగిన బౌలర్లు జట్టుకు బలం చేకూరుస్తున్నారు. మ్యాచ్కు ముందు ప్రత్యర్థి ఆటగాళ్లపై ప్రత్యేక వ్యూహాలు రూపొందించి, వాటిని కచ్చితంగా అమలు చేయడంలో బౌలర్లు విజయవంతమవుతున్నారు. ముఖ్యంగా మధ్య ఓవర్లలో వికెట్లు తీసి మ్యాచ్ను తమ వైపు తిప్పుకోవడం పంజాబ్ ప్రత్యేకతగా మారింది.ఫీల్డింగ్లో కూడా జట్టు మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. కీలక సమయాల్లో క్యాచ్లు పట్టడం, రనౌట్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం వంటి అంశాలు మ్యాచ్ ఫలితాలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ సమగ్ర ప్రదర్శన వల్లే పంజాబ్ కింగ్స్ ఓటమి లేకుండా ముందుకు సాగుతోంది.శ్రేయస్ కేవలం కెప్టెన్గానే కాకుండా, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో సత్తా చాటుతూ తన సహచరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. పంజాబ్ అభిమానులు ముద్దుగా 'సర్పంచ్ సాబ్' అని పిలుచుకునే శ్రేయస్.. ఈ సీజన్లో బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అద్బుత ప్రదర్శనలు కనబరుస్తున్నాడు. ఇటీవల శ్రేయస్ పట్టిన ఓ క్యాచ్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమమైన క్యాచ్లలో ఒకటిగా చెప్పవచ్చు. మొత్తంగా, శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో టైటిల్ ఫేవరెట్గా దూసుకుపోతుంది. ఇప్పటివరకు ప్రదర్శించిన జోరును ఇకపై కూడా కొనసాగిస్తే, పంజాబ్ తమ తొలి టైటిల్ సొంతం చేసుకోవడం ఖాయం. -
శశాంక్ సింగ్ పరువు తీసిన శ్రేయస్ అయ్యర్!
ఐపీఎల్-2026లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో గతేడాది ఫైనల్ చేరిన పంజాబ్.. ఈసారి కూడా ప్లే ఆఫ్స్ దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా పంజాబ్ కింగ్స్తో ఆదివారం నాటి మ్యాచ్లోనూ శ్రేయస్ సేన దుమ్ములేపింది.సొంత వేదిక ముల్లన్పూర్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో రికార్డు స్థాయిలో 254 పరుగులు సాధించింది. ప్రియాన్ష్ ఆర్య (37 బంతుల్లో 93) విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడగా.. కూపర్ కన్నోలి (46 బంతుల్లో 87) మరోసారి ఆకట్టుకున్నాడు.రాణించిన బౌలర్లుఇక లక్ష్య ఛేదనలో లక్నోను పంజాబ్ 200 పరుగులకే పరిమితం చేసింది. మార్కో యాన్సెన్ రెండు, అర్ష్దీప్ సింగ్, విజయ్ కుమార్ వైశాఖ్, యజువేంద్ర చహల్ తలా ఒక వికెట్ తీసి పంత్ సేనను కట్టడి చేశారు. ఫలితంగా పంజాబ్ 54 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.మూడు క్యాచ్లు జారవిడిచాడుఅయితే, పంజాబ్ స్టార్ శశాంక్ సింగ్ లక్నోతో మ్యాచ్లో ఫీల్డింగ్లో దారుణంగా విఫలమయ్యాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు క్యాచ్లు జారవిడిచాడు. ముఖ్యంగా లక్నో ఇన్నింగ్స్లో 18వ ఓవర్లో పంజాబ్ పేసర్ అర్ష్దీప్ సింగ్ బంతితో రంగంలోకి దిగగా.. ఐడెన్ మార్క్రమ్ భారీ షాట్ ఆడాడు.A brainfade moment for Shashank Singh. 😄 pic.twitter.com/AxJEiBOie7— Mufaddal Vohra (@mufaddal_vohra) April 19, 2026ఈ క్రమంలో స్వీపర్ కవర్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న శశాంక్ సింగ్ బంతిని అందుకునేందుకు పరిగెత్తుకు వచ్చాడు. ఆల్మోస్ట్ క్యాచ్ పడతాడని భావించగా.. అక్కడే అలా నిలుచుండిపోయాడు. దీంతో మార్క్రమ్ ఖాతాలో సిక్సర్ చేరగా.. అర్ష్దీప్ సింగ్తో పాటు డగౌట్లో ఉన్న హెడ్కోచ్ రిక్కీ పాంటింగ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.మార్క్రమ్తో పాటు ముకుల్ చౌదరీతో పాటు నికోలస్ పూరన్ల క్యాచ్లను శశాంక్ జారవిడిచాడు. ఈ ముగ్గరూ డేంజరస్ ప్లేయర్లే. అయితే, పంజాబ్ బౌలర్లను వాళ్లను సరిగ్గా కుదురుకోనివ్వలేదు కాబట్టి సరిపోయింది లేదంటే ఫలితంపై ప్రభావం పడేది. ఈ నేపథ్యంలో శశాంక్ సింగ్పై విమర్శల వర్షం కురుస్తుండగా.. మ్యాచ్ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చేసిన పని నెటిజన్లను ఆకర్షిస్తోంది.ఇదిగో ఈ క్యాప్ అడ్డుపెట్టుకోవిజయం తర్వాత ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకునే సమయంలోశ్రేయస్ శశాంక్ను ఆటపట్టించాడు. సరదాగా శశాంక్ భుజంపై చెయ్యి వేసిన శ్రేయస్ అయ్యర్... ‘‘మన జట్టు సభ్యులకు నీ ముఖం చూపించలేవులే.. మనోళ్లను కదిలించేంత దమ్ము ఇపుడు లేకపోవచ్చు... ఇదిగో ఈ క్యాప్ అడ్డుపెట్టుకో’’ అన్నట్లుగా క్యాప్ అతడి ముఖానికి అడ్డుపెట్టి నడిపించాడు. పాంటింగ్ సైతం శశాంక్ భుజం తట్టి నవ్వులు చిందించాడు. ఈ నేపథ్యంలో.. ‘‘శ్రేయస్ భయ్యా పాపం శశాంక్ పరువు తీసేశావుగా!.. ఏదేమైనా ఈరోజు శశాంక్ అదృష్టం బాగుంది’’ అంటూ అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. కాగా శశాంక్ ఈ మ్యాచ్లో ఆరు బంతుల్లో 17 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. పంజాబ్ ఇప్పటికి ఆడిన ఆరు మ్యాచ్లలో ఒకటి వర్షం వల్ల రద్దుకాగా.. మిగిలిన ఐదూ గెలిచి పట్టికలో అగ్రస్థానంలో ఉంది.చదవండి: PSL: పిరికిపందలు.. ఎక్స్ట్రాలు వద్దు.. పాక్ బోర్డుకు ఘాటు కౌంటర్𝘼𝙡𝙡'𝙨 𝙬𝙚𝙡𝙡 𝙩𝙝𝙖𝙩 𝙚𝙣𝙙𝙨 𝙬𝙚𝙡𝙡 😃Only smiles on the faces of skipper Shreyas Iyer, coach Ricky Ponting and.. Shashank Singh! #TATAIPL | #KhelBindaas | #PBKSvLSG | @PunjabKingsIPL pic.twitter.com/SQU5z3zNdy— IndianPremierLeague (@IPL) April 19, 2026 -
చరిత్ర సృష్టించిన జోఫ్రా ఆర్చర్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 19) రాత్రి కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఓ చారిత్రక ఘనత సాధించాడు. వరుసగా మూడు మ్యాచ్ల్లో ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఆటగాడు ఈ ఘనత సాధించలేదు. ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా ఆర్చర్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు.కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో 155 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో అర్చర్ ఇన్నింగ్స్ తొలి బంతికే టిమ్ సీఫర్డ్ వికెట్ తీశాడు. దీనికి ముందు రెండు మ్యాచ్ల్లో ఇదే తరహాలో ఇన్నింగ్స్ తొలి బంతులకే ఆర్సీబీ ఫిల్ సాల్ట్, ఎస్ఆర్హెచ్ అభిషేక్ శర్మను ఔట్ చేశాడు. కేవలం 10 రోజుల్లోనే అభిషేక్ ఈ ఘనత సాధించడం మరో విశేషం.టిమ్ సీఫర్ట్ వికెట్తో ఆర్చర్ మరో ఆల్టైమ్ ఐపీఎల్ రికార్డును కూడా సమం చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఇన్నింగ్స్ మొదటి బంతికే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా (5 వికెట్లు) మొహమ్మద్ షమీ సరసన నిలిచాడు. ఆర్చర్ తన ఐపీఎల్ కెరీర్లో పృథ్వీ షా, ప్రియాంశ్ ఆర్య, ఫిల్ సాల్ట్, అభిషేక్ శర్మ, టిమ్ సీఫర్ట్ను ఇన్నింగ్స్ మొదటి బంతికే ఔట్ చేశాడు.ఈ రికార్డు విభాగంలో షమీ, ఆర్చర్ తర్వాతి స్థానాల్లో ట్రెంట్ బౌల్ట్, ఉమేశ్ యాదవ్, లసిత్ మలింగ, భువనేశ్వర్ కుమార్, పాట్ కమిన్స్ ఉన్నారు. వీరంతా తలో మూడు సార్లు ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్లు తీశారు.మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్స్ 20 ఓవర్లలో 155 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ (46), యశస్వి జైస్వాల్ (39) మంచి ఆరంభాన్ని ఇచ్చినా, మధ్యలో వికెట్లు కోల్పోవడంతో స్వల్ప స్కోర్కే పరిమితమైంది. వరుణ్ చక్రవర్తి, కార్తీక్ త్యాగి తలో 3.. సునీల్ నరైన్ 2 వికెట్లు తీసి రాయల్స్ ఆటగాళ్లను కట్టడి చేశారు.అనంతరం ఛేదనలో కేకేఆర్ సైతం తడబడినా.. రింకూ సింగ్ (53 నాటౌట్), అనుకూల్ చౌదరి (29 నాటౌట్) అసాధారణ ప్రదర్శనతో తమ జట్టుకు సీజన్ తొలి విజయాన్ని అందించారు. -
మరోసారి కన్నీళ్లు పెట్టుకున్న వైభవ్ సూర్యవంశీ
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 19) మధ్యాహ్నం జరిగిన కేకేఆర్-రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ భావోద్వేగాలకు వేదికైంది. సీజన్లో 6 మ్యాచ్ల తర్వాత తొలి విజయాన్ని అందుకోవడంతో కేకేఆర్ ఆటగాళ్లు సంబురాలు చేసుకున్నారు. కొందరు ఆనందంలో ఏడ్చేసినంత పని చేశారు. మరోవైపు రాజస్థాన్ బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ ఓటమిని జీర్ణంచుకోలేక మైదానంలో ఓ మూలన కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. క్యాప్తో ముఖాన్ని దాచుకుంటూ బాధను వ్యక్తం చేశాడు. ఈ సమయంలోకేకేఆర్ సిబ్బందిలో ఒకరు అతని వద్దకు వచ్చి ఓదార్చారు. అతని పక్కన కూర్చుని కాసేపు మాట్లాడి, ఆలింగనం చేసుకొని ధైర్యం చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో హల్చల్ చేస్తోంది.Yesterday Vaibhav Sooryavanshi was spotted crying after the game… This guy is unbelievable! Whether he gets out early or the team loses, he wears his heart on his sleeve. Honestly, that’s that 15-year-old mindset I know I would’ve been doing the exact same thing at that age! 🤣… pic.twitter.com/Ug6X4gVqks— OldMonkOfCricket (@OldMonkOfCric) April 20, 2026వైభవ్ ఇలా బాధపడటం కొత్తేమీ కాదు. ఔటైనప్పుడు, జట్టు ఓడినప్పుడు తాను ప్రొఫెషనల్ క్రికెటర్ని అన్న విషయాన్ని మరిచిపోయి ఏడ్చేస్తాడు. ఇది ఓ రకంగా అభిమానులను ఆకట్టుకుంటుంది. 52, 78, 39 లాంటి స్కోర్లు చేసినా, వైభవ్ తన తప్పులను విశ్లేషించుకుంటూ బాధపడ్డ పడ్డాడు. మొత్తంగా వైభవ్ క్రికెటర్గా ఎంత పరిణితి చెందినా, అతనిలోని పిల్లాడు భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోతున్నాడు.తాజాగా కేకేఆర్ చేతిలో రాజస్థాన్ ఓడిన మ్యాచ్లో వైభవ్ 28 బంతుల్లో 46 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. యశస్వి జైస్వాల్తో కలిసి ఇన్నింగ్స్ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. అయితే మధ్య ఓవర్లలో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, కార్తీక్ త్యాగి అద్భుతంగా బౌలింగ్తో రాజస్థాన్ బ్యాటింగ్ను కుదిపేశారు. ఫలితంగా రాజస్థాన్ స్వల్ప స్కోర్కే పరిమితమైంది. అనంతరం ఛేదనలో కేకేఆర్ సైతం తడబడినా.. రింకూ సింగ్ (53 నాటౌట్), అనుకూల్ చౌదరి (29 నాటౌట్) అసాధారణ ప్రదర్శనతో తమ జట్టుకు సీజన్ తొలి విజయాన్ని అందించారు.సూపర్ ఫామ్లో వైభవ్ప్రస్తుత సీజన్లో వైభవ్ అద్భుత ఫామ్లో ఉన్నాడు. ఇప్పటివరకు 246 పరుగులు చేసి జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతని స్ట్రైక్ రేట్ 236.54 కాగా, సగటు 41.00గా ఉంది. ఒకే ఒక్క మ్యాచ్లో మాత్రమే అతను డకౌటయ్యాడు. మిగతా మ్యాచ్ల్లో స్థిరంగా రాణించాడు. ఆరెంజ్ క్యాప్ పోటీలోనూ వైభవ్ టాప్-5లో ఉన్నాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ (283 పరుగులు) వద్ద ఆరెంజ్ క్యాప్ ఉంది. -
అతడు కాదా!.. నిర్ణయం మార్చుకున్న CSK?
గతేడాది కాలంగా చెన్నై సూపర్ కింగ్స్కు కలిసి రావడం లేదు. ఐపీఎల్-2025లో ఎన్నడూ లేని విధంగా పాయింట్ల పట్టికలో చిట్టచివరగా పదో స్థానంలో నిలిచిన చెన్నై.. ఈ ఏడాది కూడా వైఫల్యాలు కొనసాగిస్తోంది.గాయాల బెడద ఇప్పటికి ఈ సీజన్లో ఆరు మ్యాచ్లు ఆడిన రుతురాజ్ గైక్వాడ్ సేన.. కేవలం రెండు మాత్రమే గెలిచి.. నాలుగు ఓడిపోయింది. మరోవైపు.. మూలిగే నక్కమీద తాటిపండు పడినట్లు గాయాల బెడద కూడా సీఎస్కేకు తలనొప్పిగా మారింది. దిగ్గజ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) ఫిట్నెస్ సమస్యల వల్ల ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.ఆయుశ్ దూరంసన్రైజర్స్ హైదరాబాద్తో శనివారం నాటి మ్యాచ్ సందర్భంగా ఫామ్లో ఉన్న ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) గాయపడ్డాడు. పవర్ప్లేలో దూకుడుగా ఆడుతున్న సమయంలో ఆయుశ్ కండరాలు పట్టేశాయి. దీంతో అతడు తదుపరి మ్యాచ్లకు దూరం కానున్నాడు. ‘ఇది చాలా బాధాకరం. ఆయుశ్ చక్కటి ఫామ్లో ఉన్నాడు. అతడు జట్టుకు దూరం కావడం చాలా ఇబ్బందికరం. అయితే గాయం తీవ్రతపై స్పష్టత రావాల్సి ఉంది. ఎప్పటిలోగా కోలుకుంటాడనేది ఇప్పుడే చెప్పలేం’ అని చెన్నై బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ ఇప్పటికే స్పష్టం చేశాడు.ఇక ఆయుశ్ కంటే ముందు సీఎస్కే పేసర్ ఖలీల్ అహ్మద్ కూడా గాయపడి జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆకాశ్ మధ్వాల్తో అతడి స్థానం భర్తీ చేయాలని సీఎస్కే యాజమాన్యం తొలుత భావించినట్లు సమాచారం. ఇందుకోసం అతడిని ట్రయల్స్కు పిలిపించినట్లు తెలుస్తోంది.అతడు కాదా!.. నిర్ణయం మార్చుకున్న CSK?దీంతో ఆకాశ్ ఆగమనం ఫిక్సైపోయిందనే వార్తలు రాగా.. తాజా సమాచారం ప్రకారం తమ మాజీ బౌలర్ రాజవర్దన్ హంగర్గేకర్ను కూడా చెన్నై యాజమాన్యం ట్రయల్స్కు పిలిచినట్లు క్రిక్బజ్ కథనం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆకాశ్ కంటే కూడా రాజవర్దన్ వైపే మేనేజ్మెంట్ మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ధోని కోలుకుంటున్నాడని.. అయితే, అతడు ఎప్పుడు బరిలోకి దిగుతాడనే విషయంపై తనకు కూడా స్పష్టత లేదని సీఎస్కే కోచ్ మైక్ హస్సీ పేర్కొనడం గమనార్హం.చదవండి: PSL: పిరికిపందలు.. ఎక్స్ట్రాలు వద్దు.. పాక్ బోర్డుకు ఘాటు కౌంటర్ -
భారత ఐపీఎల్ ఆటగాళ్లకు విదేశీ అంతర్జాతీయ జట్టులో చోటు
భారత్, ఆస్ట్రేలియా దేశాలు తనకు పౌరసత్వం ఆఫర్ చేశాయని, వారి దేశాల తరఫున క్రికెట్ అవకాశాలు కూడా కల్పిస్తామని ముందుకువచ్చాయని, అయితే తాను వాటిని సున్నితంగా తిరస్కరించారని ఆఫ్ఘనిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ సంచలన విషయాలను తన పుస్తకం "Rashid Khan: From Streets to Stardom" ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై క్రికెట్ సమాజంలో చర్చలు జరుగుతుండగానే, ఐసీసీ అసోసియేట్ మెంబర్ అయిన యూఏఈ (UAE) పలువురు విదేశీ క్రికెటర్లకు పౌరసత్వం ఇచ్చి చర్చను మరింత విస్తృతం చేసింది.యూఏఈ తొలిసారి ఐదుగురు విదేశీ క్రికెటర్లకు ఒకేసారి పౌరసత్వం మంజూరు చేయడంతో పాటు తమ జాతీయ జట్టుకు ఆడే అవకాశాన్ని కూడా కల్పించి సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో విదేశీ ఆటగాళ్లు యూఏఈ క్రికెట్ జట్టుకు ఆడాలంటే మూడు సంవత్సరాల నివాసం అర్హతగా ఉండేది. తాజాగా ఆ దేశం రూల్స్ను సవరించి పౌరసత్వం ఇవ్వడంతో పాటు నేరుగా జాతీయ జట్టులోకి తీసుకొని సరికొత్త సంప్రదాయానికి తెరలేపింది.యూఏఈ పౌరసత్వం పొంది, ఆ జట్టులో చోటు దక్కించుకున్న ఆటగాళ్లలో ఖుజైమా తన్వీర్, అజయ్ కుమార్, అదీబ్ ఉస్మానీతో పాటు ఆకాశ్దీప్ నాథ్, హర్ప్రీత్ భాటియా లాంటి ఐపీఎల్ ఆటగాళ్లు ఉన్నారు. యూఏఈ జట్టు త్వరలో నేపాల్ పర్యటనకు వెళ్లనుండగా, ఈ ఆటగాళ్లు 17 సభ్యుల జట్టులో చోటు దక్కించుకున్నారు.అక్షదీప్ నాథ్ ఐపీఎల్ సహా ఉత్తరప్రదేశ్ తరఫున 200కి పైగా మ్యాచ్లు ఆడి 6500కి పైగా పరుగులు సాధించాడు. హర్ప్రీత్ భాటియా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ జట్ల తరఫున భారీ అనుభవం కలిగిన బ్యాటర్గా గుర్తింపు పొందాడు.మొత్తంగా చూస్తే, ఒకవైపు రషీద్ ఖాన్ వంటి ఆటగాళ్లు దేశం పట్ల నిబద్ధతను చూపుతుండగా, మరోవైపు యూఏఈ వంటి దేశాలు విదేశీ ప్రతిభను ఆకర్షిస్తూ తమ దేశ క్రికెట్ను బలోపేతం చేసుకునే పనిలో పడ్డాయి. ఈ పరిణామాలు భవిష్యత్తులో అంతర్జాతీయ క్రికెట్ దిశను ప్రభావితం చేసే అవకాశముంది. -
BCCI బిగ్ప్లాన్.. 35 మంది ప్లేయర్లు.. కెప్టెన్గా అతడు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా ఇప్పటికే ఎంతో మంది ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా నుంచి.. వైభవ్ సూర్యవంశీ, ఆయుశ్ మాత్రే వరకు ఈ జాబితాలో ఉన్నారు.ఇక ఈ టోర్నీలో ఓవైపు సీనియర్లు ఫామ్ కొనసాగిస్తుండగా.. యువ ఆటగాళ్లు సైతం దుమ్మురేపుతున్నారు. దీంతో టీమిండియా సెలక్టర్లకు తల నొప్పులు తప్పడంలేదు. ఇదిలా ఉంటే.. టీమిండియా షెడ్యూల్ ఎంతగా కిక్కిరిసిపోయి ఉంటుందో తెలిసిందే. ఏడాదంతా భారత పురుషుల జట్టు బిజీబిజీగా గడుపుతుంది.పూర్తిస్థాయిలో రెండు జట్లు!ఇటీవలే అదనంగా ముందుగా షెడ్యూల్లో లేని ఐర్లాండ్, జింబాబ్వే పర్యటనలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు.. ఆసియా క్రీడలు- 2026 (Asian Games) టోర్నీకి కూడా జట్టును పంపాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ రెండు టీ20 జట్లను తయారు చేస్తున్నట్లు సమాచారం.సెలక్టర్ల రాడార్లో 30-35 మంది ఆటగాళ్లుఅంతర్జాతీయ షెడ్యూల్తో ఆసియా క్రీడల షెడ్యూల్ క్లాష్ అవుతున్న తరుణంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ అధికారి ఒకరు ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘ఒకే సమయంలో ఆసియా క్రీడలు, వెస్టిండీస్ సిరీస్కు జట్లను పంపాల్సి ఉంది. కాబట్టి ఈసారి కూడా రెండు జట్లను సిద్ధం చేస్తున్నాం.అంతర్జాతీయ క్రికెట్కు ఎంపిక చేసే క్రమంలో 30-35 మంది ఆటగాళ్ల పేర్లను పరిగణనలోకి తీసుకునే యోచనలో ఉన్నాము. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆసియా క్రీడల దాకా ఈ విధానం కొనసాగుతుంది’’ అని పేర్కొన్నారు. గతంలో ఇలా..కాగా 2023 ఆసియా క్రీడల్లో భాగంగా తొలిసారి బీసీసీఐ తమ పురుష, మహిళా జట్లను చైనాకు పంపింది. టీ20 ఫార్మాట్లో నిర్వహించిన ఈ ఈవెంట్లో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో పురుషుల జట్టు.. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలో మహిళా జట్టు పసిడి పతకాలు గెలిచాయి. అప్పుడు టీమిండియా ద్వైపాక్షిక సిరీస్లతో బిజీగా ఉండగా.. రుతు కెప్టెన్సీలో ద్వితీయశ్రేణి జట్టు ఆసియా క్రీడల్లో పాల్గొని గోల్డ్ మెడల్ గెలిచింది.రేసుగుర్రాలుకాగా ఈసారి నయా సంచలనం వైభవ్ సూర్యవంశీతో పాటు టెస్టు స్పెషలిస్టు యశస్వి జైస్వాల్, ప్రియాన్ష్ ఆర్య, అంగ్క్రిష్ రఘువన్షీ ఆసియా క్రీడల నేపథ్యంలో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించనున్నారు. రజత్ పాటిదార్, ఆయుశ్ బదోని, అనుకుల్ రాయ్, ఖలీల్ అహ్మద్, కార్తిక్ త్యాగి తదితరులు కూడా రేసులో ఉన్నారు.కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్!ఈసారి ఆసియా క్రీడల జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా అతడు టీ20 ఫార్మాట్లో దుమ్ములేపుతున్నాడు. 2024 ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ను చాంపియన్గా నిలిపిన ఈ ముంబైకర్.. గతేడాది కెప్టెన్గా పంజాబ్ కింగ్స్ను ఫైనల్కు చేర్చాడు. తాజా ఎడిషన్లోనూ సారథి, బ్యాటర్గా శ్రేయస్ అయ్యర్ హవా కొనసాగుతోంది. కాగా 2023 డిసెంబరులో చివరగా అయ్యర్ టీమిండియా తరఫున టీ20లు ఆడాడు. అయితే, ఈసారి ఆసియా క్రీడల ద్వారా రీఎంట్రీ ఇచ్చి తనను తాను మరోసారి నిరూపించుకుంటే.. టీమిండియా కెప్టెన్గానూ సూర్యకుమార్ స్థానాన్ని భర్తీ చేసే అవకాశాలు లేకపోలేదన్నది విశ్లేషకుల మాట.చదవండి: PSL: పిరికిపందలు.. ఎక్స్ట్రాలు వద్దు.. పాక్ బోర్డుకు ఘాటు కౌంటర్ -
ఎట్టకేలకు శతక్కొట్టిన బాబర్ ఆజమ్
పొట్టి క్రికెట్లో పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ ఎట్టకేలకు సెంచరీ చేశాడు. ఈ ఫార్మాట్లో 67 ఇన్నింగ్స్ల్లో అతనికిది మొదటి శతకం. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 19) క్వెట్టా గ్లాడియేటర్స్తో జరిగిన మ్యాచ్లో బాబర్ శతక్కొట్టాడు. ఈ సెంచరీ అతనికి టీ20 ఫార్మాట్లో 12వది. ఈ సెంచరీతో బాబర్ టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో తన రెండో స్థానాన్ని మరింత మెరుగుపర్చుకున్నాడు. ఈ జాబితాలో విండీస్ యోధుడు క్రిస్ గేల్ (22) టాప్ ప్లేస్లో ఉండగా.. బాబర్ తర్వాత మూడో స్థానంలో డేవిడ్ వార్నర్ (10) ఉన్నాడు. వీరి తర్వాత సాహిబ్జాదా ఫర్హాన్, రిలీ రొస్సో, విరాట్ కోహ్లి, క్వింటన్ డికాక్ తలో 9 సెంచరీలతో నాలుగో స్థానంలో ఉన్నారు.బాబర్ తాజా సెంచరీ విషయానికొస్తే.. ఈ సెంచరీని అతను కేవలం 52 బంతుల్లో పూర్తి చేశాడు. ఈ సెంచరీ కూడా బాబర్కు అత్యంత నాటకీయ పరిస్థితుల్లో వచ్చింది. ఇన్నింగ్స్ చివరి బంతి మిగిలుండగా బాబర్ మూడంకెల మార్కును అందుకునేందుకు 2 పరుగులు కావాలి. అయితే ఆ బంతికి బాబర్ ఆడిన షాట్కు ఒక్క పరుగు మాత్రమే వచ్చేలా కనిపించింది. అయినప్పటికీ బాబర్ సాహసం చేసి రెండు పరుగులు తీసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీ తర్వాత బాబర్ గర్జిస్తూ సంబురాలు చేసుకున్నాడు. చాలాకాలం తర్వాత వచ్చిన సెంచరీ కావడంతో బాబర్ ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి.ప్రస్తుత పాక్ సూపర్ లీగ్లో బాబర్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఈ సెంచరీకి ముందు 2 భారీ అర్ద సెంచరీలు చేశాడు. ఈ సీజన్లో బాబర్ సగటు 100కుపైగా ఉంది. స్ట్రయిక్రేట్ 143.73గా ఉంది. పీఎస్ఎల్కు ముందు బాబర్ టీ20 భవితవ్యంపై అనేక అనుమానాలు ఉండేవి. అతను టీ20ల నుంచి తప్పుకోవాలని డిమాండ్లు వినిపించాయి. అయితే తాజాగా ప్రదర్శనతో అతను అందరి నోళ్లు మూయించాడు.బాబర్ తాజా సెంచరీ కారణంగా అతని జట్టు పెషావర్ జల్మీ క్వెట్టా గ్లాడియేటర్స్పై 118 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జల్మీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. బాబర్తో పాటు కుసాల్ మెండిస్ (83) రాణించాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో గ్లాడియేటర్స్ చేతులెత్తేసింది. 18.1 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. అలీ రజా, బాసిత్ తలో 3, హార్డీ 2, బ్రేస్వెల్, ముఖీమ్ చెరో వికెట్ తీసి గ్లాడియేటర్స్ను కుప్పకూల్చారు. -
PSL: పిరికిపందలు.. పాక్ క్రికెట్ బోర్డుకు దిమ్మతిరిగే కౌంటర్
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజర్బానీ ఏజెంట్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఇప్పటికే పీసీబీ ఘర్షణ వాతావరణం నెలకొనేలా చేసిందని.. తాము మాత్రం అలాంటి పనులకు వ్యతిరేకం అన్నాడు. అకారణంగా ముజర్బానీపై ద్వేషం ప్రదర్శించవద్దని విజ్ఞప్తి చేశాడు.ఐపీఎల్ కోసం భారత్కుకాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో జింబాబ్వే తరఫున మంచి ప్రదర్శన కనబర్చిన ముజర్బానీ (Blessing Muzarabani)ని పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)కు చెందిన ఇస్లామాబాద్ యునైటెడ్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసుకుంది. అయితే ఆ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) నుంచి పిలుపు రావడంతో ఈ పేస్ బౌలర్ పీఎస్ఎల్ను వీడి.. ఐపీఎల్ కోసం భారత్కు వచ్చేశాడు.రెండేళ్ల నిషేధం ఈ నేపథ్యంలో పీసీబీ కఠిన నిర్ణయం తీసుకుంది. ముజర్బానీపై రెండేళ్ల నిషేధం విధించింది. ‘‘ఫ్రాంచైజీ లీగ్లలో ఆడేవాళ్లు పారదర్శకంగా, స్థిరంగా వ్యవహరించాలి. ముందుగా ఒప్పందం కుదుర్చుకొని అది అమలులో ఉండగా... దానికి విరుద్ధమైన ఒప్పందంలోకి ప్రవేశించడం ఆట ప్రమాణాలను పాటించకపోవడమే.ఇలాంటి ప్రవర్తనను అనుమతించేది లేదు. అందుకు గాను అతడిపై రెండేళ్ల నిషేధం విధిస్తున్నాం’ అని పీఎస్ఎల్ పాలక మండలి గత మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ముజర్బానీ ఏజెంట్ తాజాగా స్పందించాడు.మేము మీలా కాదు‘‘గత ఆరు వారాలుగా మేము బహిరంగంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఎందుకంటే మేము ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వాలనుకోవడం లేదు. ఈ విషయంలో పీఎస్ఎల్, పీసీబీ ఇప్పటికే ఘర్షణపూరిత వాతావరణం సృష్టించింది. అయితే, మాకు అలా చేయడం ఇష్టం లేదు.బ్లెస్సింగ్ మీద సోషల్ మీడియాలో పీఎస్ఎల్ అభిమానులు విషం చిమ్ముతున్నారు. అతడిని విమర్శించడం తప్పుకాదు. కానీ విమర్శిస్తున్న వంక మీద ఇష్టారీతిన కామెంట్లు చేస్తే ఇకపై సహించేది లేదు.మీరంతా పిరికిపందలుబ్లెస్సింగ్ ఎక్కడ ఆడినా అక్కడి అభిమానులను ఎంతగానో ప్రేమిస్తాడు. ఫ్యాన్స్ కోసం సమయం కేటాయిస్తాడు. తను అద్భుతమైన వ్యక్తి. వరల్డ్క్లాస్ క్రికెటర్గా పరిణతి చెందుతున్నాడు. ఇలాంటి సమయంలో కొందరు సోకాల్డ్ ఫ్యాన్స్ కామెంట్ల రూపంలో అతడిపై విద్వేష విషం చిమ్ముతున్నారు.మీరంతా పిరికిపందలు. మీకసలు మానవత్వం అన్న పదానికి అర్థం కూడా తెలియదు. అయినా గతంలో.. పీఎస్ఎల్ కాంట్రాక్టు వదిలేసుకున్న ఆటగాళ్లపై పీసీబీ ఎప్పుడూ ఇలాంటి చర్యలు తీసుకోలేదు. అంతేకాదు పీఎస్ఎల్ను వదులుకున్న విషయంలో గతంలో ఏ ఆటగాడు కూడా ఇంతగా విమర్శలకు గురికాలేదు.ఇది మీవైపు నుంచి జరిగిన తప్పుఇందులో అసలు అతడి తప్పేముంది? అసలు అతడు కాంట్రాక్టు మీద సంతకం చేయనేలేదు కదా!.. పరిస్థితులను అర్థం చేసుకుని పీసీబీ నిషేధం ఎత్తివేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది వారి పాలక మండలి తప్పిదం అని అనుకుంటున్నా. ఇంతకంటే ఎక్కువగా చెప్పాల్సిందేమీ లేదు’’ అని బ్లెస్సింగ్ ముజర్బానీ ఏజెంట్ పీసీబీకి ఘాటు సమాధానం ఇచ్చాడు. కాగా ముజర్బానీ ప్రస్తుతం ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.చదవండి: లక్నోను మట్టికరిపించిన అనంతరం శ్రేయస్ వ్యాఖ్యలివే..! -
సంచలన విషయాలను వెల్లడించిన రషీద్ ఖాన్
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ సంచలన విషయాలను వెల్లడించాడు. భారత్, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన పౌరసత్వ ఆఫర్లను తిరస్కరించినట్లు తెలిపాడు. ఈ విషయాలను తన రాబోయే పుస్తకం "Rashid Khan: From Streets to Stardom"లో ప్రస్తావించాడు. 2023 ఐపీఎల్ సీజన్ సందర్భంగా ఈ ఆఫర్లు వచ్చినట్లు పేర్కొన్నాడు. భారత్, ఆస్ట్రేలియా నుండి పౌరసత్వంతో పాటు వారి జట్లకు ఆడే అవకాశం ఇచ్చినా, తాను వాటిని సున్నితంగా తిరస్కరించానని తెలిపాడు. నేను నా దేశానికి ఆడకపోతే, మరే దేశానికి ఆడనని స్పష్టం చేసినట్లు పుస్తకంలో చెప్పాడు.భారత్ నుంచి వచ్చిన ఆఫర్ గురించి రషీద్ విపులంగా వివరించాడు. ఐపీఎల్ 2023 సమయంలో భారత క్రికెట్ బోర్డు ఉన్నతాధికారి ఒకరు తనను కలిశారని తెలిపాడు. ఆ సమావేశంలో ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితులు క్లిష్టంగా ఉన్నాయని, భారత్లోనే స్థిరపడాలని, పౌరసత్వం ఇవ్వడంతో పాటు క్రికెట్ అవకాశాలు కూడా కల్పిస్తామని సూచించారని పేర్కొన్నాడు. అయితే ఆ ఆఫర్కు కృతజ్ఞతలు తెలుపుతూ, తాను ఆఫ్ఘనిస్తాన్కే ప్రాతినిధ్యం వహిస్తానని చెప్పినట్లు వివరించాడు.కాగా, రషీద్ ఖాన్ దేశభక్తి గతంలో కూడా వార్తల్లో నిలిచింది. 2018 ఐపీఎల్ సమయంలో భారత అభిమానులు ఆయనకు పౌరసత్వం ఇవ్వాలని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఈ అంశంపై అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందిస్తూ, పౌరసత్వ నిర్ణయాలు హోం మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటాయని తెలిపారు. అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ రషీద్ను దేశ గర్వంగా అభివర్ణిస్తూ, అతన్ని కోల్పోమని స్పష్టం చేశారు.ఆఫ్ఘనిస్తాన్లోని నంగర్హార్ వీధుల నుంచి అంతర్జాతీయ క్రికెట్లో అగ్రస్థానానికి ఎదిగిన రషీద్ ఖాన్ ప్రయాణం ఎంతో ప్రేరణాత్మకంగా ఉంటుంది. తన ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన, 2020లో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది డికేడ్గా కూడా నిలిచాడు. అయినప్పటికీ, ఎన్ని అవకాశాలు వచ్చినా తన దేశం పట్ల ఉన్న నిబద్ధతను విడువకపోవడం ఆయన వ్యక్తిత్వాన్ని మరింత గొప్పగా నిలబెడుతోంది. మొత్తంగా రషీద్ ఖాన్ తీసుకున్న ఈ నిర్ణయం దేశభక్తి, విలువలపై నిలబడే ధైర్యానికి ప్రతీకగా నిలుస్తోంది. -
లక్నోను మట్టికరిపించిన అనంతరం శ్రేయస్ వ్యాఖ్యలివే..!
శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లోనూ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. గత సీజన్లో రన్నరప్తో సరిపెట్టుకున్న ఈ జట్టు ఈ సీజన్లో ఎలాగైనా టైటిల్ సాధించాలని పట్టుదలగా ఉంది. వరుస విజయాలతో దూసుకుపోతూ పాయింట్ల పట్టికలో అగ్రపీఠంపై తిష్ట వేసింది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్ల్లో ఐదింట విజయాలు సాధించింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.తాజాగా లక్నో సూపర్ జెయింట్స్పై 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసి.. ప్రియాంశ్ ఆర్య (93), కూపర్ కన్నోల్లీ (87) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ చేసింది.అనంతరం కష్ట సాధ్యమైన లక్ష్య ఛేదనలో లక్నో చేతులెత్తేసింది. ఆ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగుల వద్ద ఆగిపోయింది. మార్ష్ (40), బదోని (35), పంత్ (43), మార్క్రమ్ (42) మంచి ఆరంభాలు లభించినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. జన్సెన్ (4-0-37-2), విజయ్కుమార్ వైశాఖ్ (4-0-30-1), చహల్ (4-0-36-1) లక్నో బ్యాటర్లకు పగ్గాలు వేశారు.మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. తమ బ్యాటర్లు, బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు.అతని మాటల్లోనే.. ఆ భాగస్వామ్యం అసాధారణంగా ఉంది. కొన్ని షాట్లు చూసినప్పుడు ఆశ్చర్యపోయాను. ఫాస్ట్ బౌలర్లను బ్యాక్ ఫుట్పై స్ట్రైట్గా ఆడటం, స్పిన్నర్లపై కూడా అదే ధైర్యంతో దాడి చేయడం గొప్ప నైపుణ్యం. ముఖ్యంగా మధ్య ఓవర్లలో ఆ భాగస్వామ్యం జట్టుకు బలమైన పునాది వేసింది. ఆ సమయంలో ఒత్తిడి ఉన్నప్పటికీ ఆటగాళ్లు చూపిన ధైర్యం, స్థిరత్వం ప్రశంసనీయం.జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు ఒక సరదా పోటీ పెట్టుకున్నాం. జట్టులో ఎవరు ఎక్కువ సిక్సర్లు కొడితే వారికి నా బ్యాట్ బహుమతిగా ఇస్తానని చెప్పాను. ఇది పెద్ద బహుమతి కాకపోయినా, ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెంచి, స్వేచ్ఛగా ఆడేలా చేస్తుంది. ఆటగాళ్లను ఎక్కువగా నియంత్రించకుండా స్వేచ్ఛ ఇస్తే వారు తమ ప్రతిభను మెరుగ్గా ప్రదర్శిస్తారన్నది నా అభిప్రాయం.బౌలింగ్ విభాగంపై కూడా అయ్యర్ ప్రశంసలు కురిపించాడు. జట్టులోని బౌలర్లు అంతర్జాతీయ స్థాయి అనుభవం కలిగిన వారని, వారు ఇప్పటికే తమ దేశాల తరఫున అద్భుత ప్రదర్శనలు ఇచ్చారని గుర్తుచేశారు. మ్యాచ్కు ముందు వ్యూహాలు చర్చించి, వాటిని అమలు చేయడమే ముఖ్యమని అన్నారు. ఈ సీజన్ మొత్తం బౌలర్లు స్థిరంగా రాణిస్తున్నారని, అదే ఫామ్ను కొనసాగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఇక న్యూ చండీగఢ్ మైదానాన్ని “కంచుకోట”గా మార్చడంపై కూడా ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గత సీజన్లో ఎదురైన సవాళ్లను దృష్టిలో పెట్టుకుని, ఈసారి పిచ్ తయారీపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. బ్యాటర్లు, బౌలర్లకు సమానంగా సహకరించేలా మైదానాన్ని రూపొందించామని, ఇప్పటివరకు ఫలితాలు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. -
పంజాబ్ చేతిలో ఓటమి అనంతరం పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 19) రాత్రి జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ 54 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ అతి భారీ స్కోర్ (254-7) చేసింది. ప్రియాంశ్ ఆర్య (93), కూపర్ కన్నోల్లీ (87) ఆకాశమే హద్దుగా చెలరేగారు.అనంతరం కష్ట సాధ్యమైన లక్ష్య ఛేదనలో లక్నో చేతులెత్తేసింది. ఒక్కరు కూడా భారీ స్కోర్ చేయలేకపోవడంతో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగుల వద్ద ఆగిపోయింది. మార్ష్ (40), బదోని (35), పంత్ (43), మార్క్రమ్ (42) మంచి ఆరంభాలు లభించినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు.జన్సెన్ (4-0-37-2), విజయ్కుమార్ వైశాఖ్ (4-0-30-1), చహల్ (4-0-36-1) లక్నో బ్యాటర్లను కట్టడి వేశారు. ఈ ఓటమి లక్నోకు వరుసగా మూడవది. 6 మ్యాచ్ల్లో రెండే విజయాలు సాధించిన ఈ జట్టు పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి పడిపోయింది. మరోవైపు పంజాబ్ ఓటమనేదే ఎరుగక, వరుస విజయాలతో దూసుకుపోతూ పాయింట్ల పట్టికలో అగ్రపీఠంపై తిష్ట వేసింది. ఈ జట్టు ఆరింట ఐదు విజయాలు సాధించింది.మ్యాచ్ అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ జట్టు ప్రదర్శన, తన గాయం, బ్యాటింగ్ ప్లాన్స్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గాయం గురించి మాట్లాడతూ.. పాత గాయం (Left elbow) మానుతుంది. ఈ లోపే కొత్త గాయం (right hand) జతకలిసింది. అయినా పాజిటివ్గా తీసుకుంటాను (నవ్వుతూ).ఓటమిపై విశ్లేషిస్తూ.. ఒక్కటని చెప్పలేము. బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. బ్యాటింగ్లో మాత్రం కొన్ని సమస్యలు ఉన్నాయి. నెగిటివ్స్ మాత్రమే కాకుండా పాజిటివ్స్కు ఉన్నాయి. వాటిని బిల్డ్ చేసుకోవాలి. పంజాబ్ కింగ్స్ చాలా బాగా ఆడింది. వారికి క్రెడిట్ ఇవ్వాలి. బదోనిని ఓపెనర్గా పంపడంపై మాట్లాడుతూ.. ఇది ఈ మ్యాచ్కు ముందు తీసుకున్న నిర్ణయం కాదు. చాలా రోజుల క్రితమే అనుకున్నాము. టాపార్డర్కు ఫ్రీడం ఇవ్వాలని, మిడిలార్డర్ వారికి మద్దతుగా ఉండాలన్నదే మా ప్లాన్.జట్టు ప్రదర్శన గురించి మాట్లాడుతూ.. మా జట్టుపై నమ్మకం ఉంది. ప్రతి మ్యాచ్లో పాజిటివ్గా ఆడి, మెరుగుపడాలనుకుంటున్నాము.పంత్ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. వరుస ఓటములు ఎదురైనా పాజిటివ్గా ఉండాలని అనుకున్నట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా అతని గాయంపై కూడా అప్డేట్ ఇచ్చాడు. బౌలింగ్ బాగానే ఉందని చెబుతూ, బ్యాటింగ్లో లోపాలను ప్రస్తావించాడు. బదోనిని ఓపెనర్గా పంపడాన్ని సమర్దించుకున్నాడు. ప్రతి మ్యాచ్లో మెరుగుపడాలని ఆకాంక్షిస్తున్నాడు. -
రెజ్లింగ్ ఫ్యాన్స్కు బిగ్ షాక్!
డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లింగ్ అభిమానులకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ రెజ్లర్ బ్రాక్ లెస్నర్ (Brock Lesnar) అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించారు. రెజ్లిమేనియా 42 ఈవెంట్లో భాగంగా.. యువ రెజ్లర్ ఒబా ఫెమి చేతిలో లెస్నర్ ఓటమి పాలయ్యాడు. తదనంతరం లెస్నర్ చర్యతో ఫ్యాన్స్ దిగ్భ్రాంతికి లోనయ్యారు. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(WWE) అనేది ‘స్క్రిప్టెడ్ రెజ్లింగ్’ అనేది అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ఫైటింగ్లో పాల్గొనే రెజ్లర్లు నిపుణుల సమక్షంలోనే ప్రాక్టీస్ చేసి స్టేజ్ ప్రదర్శనలు ఇస్తుంటారు. భారత కాలమానం ప్రకారం.. సోమవారం వేకువ జామున నెవెడా స్టేట్ లాస్ వెగాస్లో అలెజెయింట్ స్టేడియం వేదికగా రెజ్లిమేనియా 42 మెయిన్ ఈవెంట్ జరిగింది. అయితే.. ఆద్యంతం ఆకట్టుకుంటుందని భావించిన లెస్నర్-ఒబా మ్యాచ్.. నిమిషాల వ్యవధిలో ముగియడం రెజ్లింగ్ ఫ్యాన్స్ను నిరాశపరిచింది. డబ్ల్యూడబ్ల్యూఈలో ఇంతకాలం పవర్హౌస్గా పేరున్న లెస్నర్ ఏ దశలోనూ ఒబాకు పోటీ ఇవ్వలేకపోయాడు. తన ఫినిషింగ్ మూవ్ ఎఫ్-5 ఇచ్చినా.. ఒబా ఫెమి లేచి నిల్చోవడంతో అంతా షాక్లో ఉండిపోయారు. ఆ వెంటనే తన పవర్ బాంబ్ మూవ్తో ఒబా మ్యాచ్ను ముగించాడు. 48 ఏళ్ల వయసున్న బ్లాక్ లెస్నర్.. 27 ఏళ్ల నైజీరియా రెజ్లర్ ఒబా ఫెమి చేతిలో ఓటమితో అభిమానులు షాక్కు గురయ్యారు. ఆ వెంటనే స్టేజ్పైనే కూర్చుండిపోయిన లెస్నర్ తన గ్లౌస్, షూస్ను వదిలి అక్కడి ప్రేక్షకులకు అభివాదం చేస్తూ వీడ్కోలు సందేశం ఇచ్చాడు. తన మేనేజర్ పాల్ హేమన్ను కౌగిలించుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ పరిణామాలు లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూఈ కెరీర్ ముగింపు కావచ్చని భావిస్తున్నప్పటికీ.. ఈ ఏడాది సమ్మర్స్లామ్ ఈవెంట్లో లెస్నర్ చివరి మ్యాచ్ అడొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. BROCK LESNAR RETIRING? 👀Brock left his gear in the ring and hugged Paul Heyman as the crowd cheered thank you after his match at #WrestleMania pic.twitter.com/8ts2gJWYpR— SportsCenter (@SportsCenter) April 19, 2026ఇక.. డబ్ల్యూడబ్ల్యూఈకే ప్రధాన ఈవెంట్గా చెప్పుకునే రెజ్లిమేనియా ఈసారి చప్పగా సాగింది. ఏప్రిల్ 18–19 తేదీల్లో రెండు రోజులపాటు సాగాయి మ్యాచ్లు. లక్ష మందికి పైగా అభిమానులు హాజరైన ఈ ఈవెంట్కు రెజ్లర్(రిటైర్డ్)-యాక్టర్ జాన్ సీనా హోస్ట్గా వ్యవహరించాడు. అయితే మ్యాచ్ ఫలితాలు చాలా వరకు అభిమానులు పెదవి విరుస్తున్నారు. మరీ ముఖ్యంగా లెస్నర్ను అంత దారుణంగా ఓడిపోయేలా స్క్రిప్ట్ రాయడంపై మండిపడుతున్నారు. అన్డిస్ప్యుటెడ్ చాంపియన్షిప్ కోసం జరిగిన మ్యాచ్లో కోడి రోడ్స్.. రాండీ ఆర్టన్ను ఓడించాడు. తద్వారా కోడి రోడ్స్ తన చాంపియన్షిప్ను విజయవంతంగా కాపాడుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ ఫలితంపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక రోమన్ రేన్స్, సీఎం పంక్ను ఓడించి హెవీవెయిట్ టైటిల్ను నెగ్గాడు. ఉమెన్స్ వరల్డ్ చాంపియన్షిప్ పోరులో లివ్ మోర్గాన్ స్టెఫనీ వాక్వర్పై విజయం సాధించింది. బెక్కీ లించ్, ఏజే లీను ఓడించి ఉమెన్స్ ఇంటర్కాంటినెంటల్ టైటిల్ను గెలుచుకుంది. జేకబ్ ఫాటూ, డ్రూ మెక్ఇంటైర్పై విజయం సాధించాడు. ఉసోస్ & ఎల్ఏ నైట్లు ది విజన్-ఐషోస్పీడ్(ప్రముఖ య్యూట్యూబర్)ను ఓడించారు. రియా రిప్లీ, జేడ్ కార్గిల్ను ఓడించి మహిళల చాంపియన్షిప్ టైటిల్ను గెలిచింది. ట్రిక్ విలియమ్స్, సామీ జేన్ను ఓడించి యూస్ చాంపియన్షిప్ టైటిల్ను గెలిచాడు. ఫిన్ బాలర్, డొమినిక్ మిస్టీరియోను ఓడించాడు. గుంథర్, సెత్ రోలిన్స్ను ఓడించాడు. అయితే గుంథర్-రోలిన్స్ మ్యాచ్ ఒక్కటే ఈ ఈవెంట్కు హైలైట్గా నిలిచింది. -
పంజాబ్ పరుగుల పండగ
గత నాలుగు మ్యాచ్ల్లో లక్ష్యఛేదనలో సత్తా చాటిన పంజాబ్ కింగ్స్... ఈసారి మొదట బ్యాటింగ్లో దుమ్మురేపింది. లక్నో బౌలింగ్ను చీల్చిచెండాడుతూ ఈ సీజన్లో అత్యధిక స్కోరును తమ పేరిట లిఖించుకుంది. ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కనొలీ పోటీపడి సిక్స్లు కొట్టడంతో పంజాబ్ కొండంత స్కోరు చేయగా... ఛేదనలో పలు ప్రయోగాలు చేసిన లక్నో విజయానికి 54 పరుగుల దూరంలో నిలిచిపోయింది. న్యూ చండీగఢ్: ఐపీఎల్ 19వ సీజన్లో పంజాబ్ కింగ్స్ జోరు సాగుతోంది. ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ ముందుకు సాగుతున్న శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ తమ ఖాతాలో ఐదో విజయం వేసుకుంది. ఆదివారం జరిగిన పోరులో పంజాబ్ 54 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ను మట్టికరిపించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 254 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య (37 బంతుల్లో 93; 4 ఫోర్లు, 9 సిక్స్లు), కూపర్ కనోలీ (46 బంతుల్లో 87; 8 ఫోర్లు, 7 సిక్స్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఈ జోడీ రెండో వికెట్కు 80 బంతుల్లోనే 182 పరుగులు జోడించడం విశేషం. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్, సిద్ధార్థ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులకు పరిమితమైంది. మిచెల్ మార్ష్ (28 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్స్లు), ఆయుశ్ బదోనీ (21 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్), కెపె్టన్ రిషభ్ పంత్ (23 బంతుల్లో 43; 1 ఫోర్, 4 సిక్స్లు), మార్క్రమ్ (22 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్స్లు) తలా కొన్ని పరుగులు చేశారు. సాధించాల్సిన లక్ష్యం మరీ ఎక్కువగా ఉండగా... లక్నో ఏ దశలోనూ ఆ వేగం అందుకలోకపోయింది. పంజాబ్ బౌలర్లలో యాన్సెన్ 2 వికెట్లు తీశాడు. ధనాధన్.. ఈ సీజన్లో తొలిసారి మొదట బ్యాటింగ్కు దిగిన పంజాబ్... లక్నో బౌలర్లపై తమ ప్రతాపం చూపింది. ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ (0)ను షమీ తొలి ఓవర్లోనే అవుట్ చేయగా... అక్కడి నుంచి పంజాబ్ ఊచకోత మొదలైంది. మరో ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వీలుచిక్కినప్పుడల్లా భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. ఆరో ఓవర్లో ఆర్య 4, 6, 6 బాదగా... పవర్ప్లే ముగిసేసరికి పంజాబ్ 63/1తో నిలిచింది. బదోనీ ఓవర్లో కూపర్ 4, 6 కొట్టగా... ఆర్య 19 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. షమీ ఓవర్లో రెండు సిక్స్లతో కూపర్ కూడా హాఫ్సెంచరీ మార్క్ దాటాడు. బౌలర్తో సంబంధం లేకుండా ఈ జోడీ దంచి కొట్టడంతో పంజాబ్ స్కోరు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. మార్క్రమ్ వేసిన 13వ ఓవర్లో అయితే ఈ ఇద్దరు పండగ చేసుకున్నారు. తొలి మూడు బంతులను కూపర్ సిక్స్లుగా మలిస్తే... చివరి రెండు బంతులకు ఆర్య సిక్స్లు కొట్టాడు. దీంతో 32 పరుగులు వచ్చాయి. ఫలితంగా 13 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ 179/1తో మరింత భారీ స్కోరు చేసేలా కనిపించింది. ఆఖర్లో కాస్త తేరుకున్న లక్నో బౌలర్లు ఈ ఇద్దరితో పాటు శ్రేయస్ అయ్యర్ (5), నేహల్ వధేరా (13) వికెట్లు తీసి పరుగుల వేగాన్ని నియంత్రించారు. స్టొయినిస్ (16 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్లు), శశాంక్ సింగ్ (6 బంతుల్లో 17; 1 ఫోర్, 2 సిక్స్లు) చివర్లో ధాటిగా ఆడారు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ ఆర్య (సి) మార్ష్ (బి) సిద్ధార్థ్ 93; ప్రభ్సిమ్రన్ (సి) మార్ష్ (బి) షమీ 0; కూపర్ (సి) సిద్ధార్థ్ (బి) ప్రిన్స్ 87; శ్రేయస్ (సి) షమీ (బి) మొహసిన్ 5; స్టొయినిస్ (రనౌట్) 29; వధేరా (సి) పూరన్ (బి) సిద్ధార్థ్ 13; శశాంక్ (సి) మార్క్రమ్ (బి) ప్రిన్స్ 17; యాన్సెన్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 254. వికెట్ల పతనం: 1–3, 2–185, 3–187, 4–193, 5–208, 6–252, 7–254. బౌలింగ్: షమీ 4–0–56–1; మొహసిన్ 4–0–43–1; ప్రిన్స్4–0–25–2; బదోనీ 1–0–14–0; అవేశ్ 3–0–46–0; సిద్ధార్థ్ 3–0–35–2; మార్క్రమ్ 1–0–32–0. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్ష్ (సి) బార్ట్లెట్ (బి) చాహల్ 40; బదోనీ (సి) బార్ట్లెట్ (బి) వైశాక్ 35; పంత్ (సి) ప్రభ్సిమ్రన్ (బి) అర్ష్ దీప్ 43; పూరన్ (సి) శ్రేయస్ (బి) యాన్సెన్ 9; మార్క్రమ్ (సి) స్టొయినిస్ (బి) యాన్సెన్ 42; ముకుల్ (నాటౌట్) 21; హిమ్మత్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 200. వికెట్ల పతనం: 1–61, 2–109, 3–128, 4–139, 5–199. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–41–1; బార్ట్లెట్ 4–0–54–0; యాన్సెన్ 4–0–37–2; వైశాక్ 4–0–30–1; చాహల్ 4–0–36–1. ఐపీఎల్లో నేడుగుజరాత్ X ముంబై వేదిక: అహ్మదాబాద్రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
భారత్కు రెండో పరాజయం
డర్బన్: దక్షిణాఫ్రికా పర్యటనలో భారత మహిళల క్రికెట్ జట్టు వరుసగా రెండో పరాజయం మూటగట్టుకుంది. ఐదు టి20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో ఓడిన హర్మన్ప్రీత్ సారథ్యంలోని టీమిండియా... ఆదివారం జరిగిన రెండో పోరులో 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో ప్రస్తుతం హర్మన్ బృందం సిరీస్లో 0–2తో వెనుకబడి ఉంది. టి20 ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్లో టీమిండియా అటు బ్యాటింగ్లో, ఇటు బౌలింగ్లో ఏమాత్రం ఆకట్టుకోలేకపోతోంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. షఫాలీ వర్మ (38 బంతుల్లో 57; 7 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధశతకం సాధించగా... ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆఫ్స్పిన్ ఆల్రౌండర్ అనుష్క శర్మ (31 బంతుల్లో 28; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. కెపె్టన్ హర్మన్ప్రీత్ కౌర్, వైస్ కెపె్టన్ స్మృతి మంధాన చెరో 12 పరుగులు చేయగా... జెమీమా రోడ్రిగ్స్ (2), దీప్తి శర్మ (1), రిచా ఘోష్ (3) విఫలమయ్యారు. సఫారీ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ చోల్ ట్రయాన్, టుమి సెఖుఖునె చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా అమ్మాయిలు దంచి కొట్టారు. 17.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 148 పరుగులు చేశారు. కెపె్టన్ లౌరా వోల్వార్ట్ (34 బంతుల్లో 54; 7 ఫోర్లు, 1 సిక్స్), సునె లుస్ (46 బంతుల్లో 57; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలతో రాణించారు. ఈ జంట తొలి వికెట్కు 106 పరుగులు జోడించడంతో సఫారీ జట్టు సునాయాసంగా గెలుపొందింది. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్ రెండు వికెట్లు పడగొట్టింది. ఇరు జట్ల మధ్య బుధవారం జొహన్నెస్బర్గ్లో మూడో టి20 జరగనుంది.స్కోరు వివరాలు భారత మహిళల ఇన్నింగ్స్: షఫాలీ (సి) డిక్లెర్క్ (బి) ఎమ్లాబా 57; స్మృతి (సి) బాష్ (బి) ట్రయాన్ 12; జెమీమా (సి) సెఖుఖునె (బి) ట్రయాన్ 2; అనుష్క శర్మ (సి) బ్రిట్స్ (బి) ట్రయాన్ 28; హర్మన్ప్రీత్ (రనౌట్) 12; దీప్తి శర్మ (సి) జాఫ్తా (బి) సెఖుఖునె 1; రిచా (సి) వోల్వార్ట్ (బి) డిక్లెర్క్ 3; అరుంధతి రెడ్డి (రనౌట్) 14; శ్రేయాంక (ఎల్బీ) సెఖుఖునె 0; క్రాంతి (సి) డిక్లెర్క్ (బి) సెఖుఖునె 4; శ్రీచరణి (నాటౌట్) 7; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 147. వికెట్ల పతనం: 1–22, 2–46, 3–99, 4–109, 5–111, 6–119, 7–127, 8–128, 9–132, 10–147. బౌలింగ్: టుమి సెఖుఖునె 4–0–31–3; ఖాక 4–0–45–0; చోల్ ట్రయాన్ 4–0–22–3; డిక్లెర్క్ 2–0–14–1; ఎమ్లాబా 4–0–17–1; డెర్క్సెన్ 2–0–17–0. దక్షిణాఫ్రికా మహిళల ఇన్నింగ్స్: వోల్వార్ట్ (సి) అరుంధతి (బి) శ్రేయాంక 54; లుస్ (సి) క్రాంతి (బి) శ్రేయాంక 57; బ్రిట్స్ (నాటౌట్) 20; డెర్క్సెన్ (నాటౌట్) 12; ఎక్స్ట్రాలు 5; మొత్తం (17.1 ఓవర్లలో 2 వికెట్లకు) 148. వికెట్ల పతనం: 1–106, 2–124. బౌలింగ్: క్రాంతి 2–0–20–0; శ్రేయాంక 4–0–35–2; శ్రీచరణి 4–0–39–0; దీప్తి శర్మ 3–0–23–0; అరుంధతి 4–0–27–0; అనుష్క శర్మ 0.1–0–4–0. -
రఫ్ఫాడించిన రింకూ
ఐపీఎల్లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న మాజీ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ ఎట్టకేలకు ఈ సీజన్లో గెలుపు రుచి చూసింది. ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరులో నైట్రైడర్స్ను విజయం వరించింది. గత నెల 28న లీగ్ ప్రారంభం కాగా... దాదాపు 20 రోజుల తర్వాత ఏడో మ్యాచ్లో కోల్కతా బోణీ కొట్టింది. మొదట స్పిన్నర్లు సత్తా చాటడంతో రాజస్తాన్ను తక్కువ పరుగులకే కట్టడి చేసిన రహానే బృందం... స్వల్ప లక్ష్యఛేదనలోనూ తడబడ్డా కష్ట కాలంలో ‘ఫినిషర్’ రింకూ సింగ్ అజేయ అర్ధశతకంతో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. కోల్కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ తొలి విజయం నమోదు చేసుకుంది. ఆదివారం ‘డబుల్ హెడర్’లో భాగంగా జరిగిన తొలి పోరులో కోల్కతా 4 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్పై గెలుపొందింది. స్పిన్నర్లు సత్తా చాటడంతో... ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసిన నైట్రైడర్స్ ఆ తర్వాత స్వల్ప స్కోరును ఛేదించేందుకు కూడా తీవ్రంగా ఇబ్బందిపడి చివరి ఓవర్లో గట్టెక్కింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్... నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ (28 బంతుల్లో 46; 6 ఫోర్లు, 2 సిక్స్లు), యశస్వి జైస్వాల్ (29 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్స్లు) తమకు అలవాటు అయిన శైలిలో దూకుడుగా ఆడగా... మిగిలిన వాళ్లు ఆకట్టుకోలేకపోయారు. కోల్కతా స్పిన్నర్లు కట్టిపడేయడంతో రాయల్స్ భారీ స్కోరు చేయలేకపోయింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 14 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా... కార్తీక్ త్యాగి ఖాతాలో 3 వికెట్లు చేరాయి. నరైన్ 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో కోల్కతా 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగులు చేసింది. రింకూ సింగ్ (34 బంతుల్లో 53 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయ అర్ధశతకంతో జట్టును గెలిపించాడు. అనుకూల్ రాయ్ (16 బంతుల్లో 29; 1 ఫోర్, 2 సిక్స్లు) విలువైన పరుగులు చేశాడు. రాయల్స్ బౌలర్లలో జడేజా 3 ఓవర్లలో 8 పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. చివరి 10 ఓవర్లలో 60/8 రాయల్స్ ఇన్నింగ్స్ను రెండు భాగాలుగా చూడొచ్చు. ఓపెనర్లు దంచికొట్టడంతో ఆరంభంలో మెరుపు వేగంతో దూసుకెళ్లిన రాజస్తాన్... 10 ఓవర్లు ముగిసేసరికి 95/1తో నిలిచింది. ఆ తర్వాత కోల్కతా స్పిన్నర్లు పట్టు బిగించడంతో పరుగుల రాక గగనం కావడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి తదుపరి ఓవర్లలో 60 పరుగులు మాత్రమే చేసి 8 వికెట్లు కోల్పోయింది. ధ్రువ్ జురేల్ (5), పరాగ్ (12), హెట్మైర్ (15), డొనోవాన్ ఫెరీరా (7), జడేజా (9) పెవిలియన్కు వరుస కట్టారు. 85/6 నుంచి... స్వల్ప లక్ష్యఛేదనలోనూ కోల్కతా తడబడింది. ఓపెనర్ సీఫెర్ట్ (0) ఇన్నింగ్స్ తొలి బంతికే క్లీన్ బౌల్డ్ కాగా... కెపె్టన్ అజింక్య రహానే (0) కూడా డకౌట్గా వెనుదిరిగాడు. అంగ్క్రిష్ రఘువంశీ (10) విఫలం కాగా... జురేల్ చేసిన మెరుపు స్టంపౌట్కు గ్రీన్ (13 బంతుల్లో 27; 4 ఫోర్లు, 1 సిక్స్) పెవిలియన్ బాటపట్టాడు. రావ్మన్ పావెల్ (20 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్), రమణ్దీప్ (10) ఎక్కువసేపు నిలవలేకపోయారు. దీంతో నైట్రైడర్స్ 85/6తో ఓటమి అంచుల్లో నిలిచింది. ఈ దశలో రింకూ సింగ్ చెలరేగిపోయాడు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ భారీ షాట్లతో లక్ష్యాన్ని కరిగించాడు. అతడికి అనుకూల్ నుంచి చక్కటి సహకారం దక్కింది. కోల్కతా విజయానికి 6 బంతుల్లో 9 పరుగులు అవసరం కాగా... బ్రిజేశ్ వేసిన చివరి ఓవర్లో రింకూ 4, 4, 6తో జట్టును గెలిపించాడు. రింకూ క్యాచ్ మిస్రింకూ సింగ్ 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా బౌలింగ్లో ఇచ్చిన సులువైన క్యాచ్ను బర్గర్ వదిలేశాడు. అప్పటికే ప్రధాన ఆటగాళ్లందరూ పెవిలియన్ చేరిపోయిన ఆ సమయంలో రింకూ వికెట్ కోల్పోయి ఉంటే... నైట్రైడర్స్ పరిస్థితి ఎలా ఉండేదో!1 ఐపీఎల్లో అత్యధిక (12) సార్లు డకౌట్ అయిన ఓపెనర్గా రహానే చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. పార్థివ్ పటేల్ (11), శిఖర్ ధావన్ (10), గౌతమ్ గంభీర్ (10) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) రహానే (బి) నరైన్ 39; వైభవ్ (సి) రమణ్దీప్ (బి) వరుణ్ 46; జురేల్ (స్టంప్డ్) సైఫెర్ట్ (బి) వరుణ్ 5; పరాగ్ (బి) వరుణ్ 12; హెట్మైర్ (సి) రఘువంశీ (బి) త్యాగి 15; డొనోవాన్ (సి అండ్ బి) నరైన్ 7; జడేజా (సి) గ్రీన్ (బి) త్యాగి 9; ఆర్చర్ (రనౌట్) 8; రవి బిష్ణోయ్ (సి) సీఫెర్ట్ (బి) త్యాగి 0; బ్రిజేశ్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–81, 2–97, 3–99, 4–117, 5–124, 6–144, 7–146, 8–146, 9–155. బౌలింగ్: వైభవ్ అరోరా 4–0–37–0; కార్తీక్ త్యాగి 4–0–22–3; గ్రీన్ 2–0–27–0; నరైన్4–0–26–2; వరుణ్ చక్రవర్తి 4–0–14–3; రమణ్దీప్ 2–0–26–0. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: సీఫెర్ట్ (బి) ఆర్చర్ 0; రహానే (సి) జురేల్ (బి) బర్గర్ 0; రఘువంశీ (ఎల్బీ) (బి) జడేజా 10; గ్రీన్ (స్టంప్డ్) జురేల్ (బి) రవి బిష్ణోయ్ 27; పావెల్ (సి) డొనోవాన్ (బి) జడేజా 23; రింకూ సింగ్ (నాటౌట్) 53; రమణ్దీప్ (బి) యశ్ రాజ్ 10; అనుకూల్ రాయ్ (నాటౌట్) 29; ఎక్స్ట్రాలు 9; మొత్తం (19.4 ఓవర్లలో 6 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1–0, 2–5, 3–37, 4–52, 5–70, 6–85. బౌలింగ్: ఆర్చర్ 4–0–35–1; బర్గర్ 2–0–20–1; బిష్ణోయ్ 4–0–41–1; యశ్ రాజ్ 4–0–25–1; జడేజా 3–0–8–2; పరాగ్ 1–0–10–0; బ్రిజేశ్ 1.4–0–21–0. -
బాలాజీ జోడీకి డబుల్స్ టైటిల్
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ డబుల్స్ ప్లేయర్ శ్రీరామ్ బాలాజీ తన కెరీర్లో 18వ ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్ను సాధించాడు. పోర్చుగల్లో జరిగిన ఒయిరాస్ ఏటీపీ–125 చాలెంజర్ టోర్నీలో శ్రీరామ్ బాలాజీ (భారత్)–నీల్ ఒబెర్లేట్నర్ (ఆ్రస్టియా) ద్వయం విజేతగా నిలిచింది. బారియెంటోస్ (కొలంబియా)–బెహర్ (గ్రీస్) జోడీతో జరిగిన ఫైనల్లో బాలాజీ–ఒబెర్లేట్నర్ జంట 6–7 (7/9), 6–4, 11–9తో ‘సూపర్ టైబ్రేక్’లో గెలిచింది. ఈ ఏడాది బాలాజీ–ఒబెర్లేట్నర్లకు నాలుగో డబుల్స్ టైటిల్ కావడం విశేషం. ఒక గంట 49 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో బాలాజీ, ఒబెర్లేట్నర్ ఏడు ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు సాధించింది. తొలి సర్వీస్లో 38 పాయింట్లు, రెండో సర్వీస్లో 19 పాయింట్లు సంపాదించింది. టైటిల్ గెలిచిన బాలాజీ–ఒబెర్లేట్నర్లకు 9,010 యూరోల (రూ. 9 లక్షల 81 వేలు) ప్రైజ్మనీతోపాటు 125 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
జు వెన్జున్తో పోరుకు సిద్ధం: వైశాలి
చెన్నై: మహిళల ప్రపంచ చెస్ చాంపియన్షి ప్ టైటిల్ పోరు కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని భారత గ్రాండ్మాస్టర్ వైశాలి వ్యాఖ్యానించింది. సైప్రస్లో గతవారం ముగిసిన క్యాండిడేట్స్ టోర్నీ మహిళల విభాగంలో తమిళనాడుకు చెందిన 24 ఏళ్ల వైశాలి విజేతగా నిలిచింది. ఆదివారం ఉదయం స్వస్థలం చెన్నైకు చేరుకున్న వైశాలికి ఘనస్వాగతం లభించింది. క్యాండిడేట్స్ టోర్నీ విజేత హోదాలో వైశాలికి ప్రస్తుత ప్రపంచ చాంపియన్ జు వెన్జున్ (చైనా)తో ప్రపంచ చాంపియన్షిప్ మ్యాచ్లో తలపడే అవకాశం లభించింది. క్లాసికల్ ఫార్మాట్లో జు వెన్జున్ 2018 నుంచి విశ్వవిజేతగా కొనసాగుతోంది. ‘నా కల నిజమైనట్లు అనిపిస్తోంది. నేను ఎన్నో ప్రపంచ చాంపియన్షి ప్ మ్యాచ్లను చూశాను. ఇప్పుడు నేనే ప్రపంచ చాంపియన్షి ప్ మ్యాచ్ ఆడబోతున్నాను. ఈ పోరు కోసం నేను ఎదురుచూస్తున్నాను’ అని వైశాలి తెలిపింది. ఈ ఏడాది పురుషుల, మహిళల విభాగాల్లో ప్రపంచ చాంపియన్షి ప్ టైటిల్ పోరులో భారత గ్రాండ్మాస్టర్లు, తమిళనాడు ప్లేయర్లు (గుకేశ్, వైశాలి) బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ చాంపియన్షి ప్ మ్యాచ్ల ఆతిథ్య హక్కుల కోసం బిడ్ దాఖలు చేయాలని అఖిల భారత చెస్ సమాఖ్య నిర్ణయం తీసుకుంది. -
ప్రియాన్ష్, కూపర్ విధ్వంసం.. పంజాబ్కు ఐదో విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ ఐదో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం ముల్లన్పూర్ వేదికగా లక్నో సూపర్జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 54 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులకే పరిమితమైంది. మార్కరమ్ (42 ), రిషబ్ పంత్ (43), మార్ష్ (40) పరుగులు సాధించారు. అయితే ఛేదించాల్సిన లక్ష్యం ఎక్కువగా ఉండడంతో లక్నో చేతులెత్తేసింది. పంజాబ్బౌలర్లలో మార్కో యాన్సెన్ 2 వికెట్లు తీశాడు. అంతకముందు పంజాబ్ యువ బ్యాటర్లు ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కన్నోలీ విధ్వంసంతో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు చేసింది. ప్రియాన్ష్ (93), కన్నోలి (87) తమ కెరీర్లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో స్టోయినిస్ 29 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడి పంజాబ్ భారీ స్కోరుకు బాటలు వేశాడు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్,మణిమరన్ సిద్ధార్థ్ చెరో 2 వికెట్లు తీశాడు. లక్నోతో మ్యాచ్ ద్వారా ఈ సీజన్లో అత్యధిక స్కోరు చేసిన పంజాబ్ ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్ల్లో ఐదింట గెలిచి (వర్షంతో ఒక మ్యాచ్ రద్దు) 11 పాయింట్లతో పాయింట్ల పట్టికలో తన అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.𝘼𝙡𝙡'𝙨 𝙬𝙚𝙡𝙡 𝙩𝙝𝙖𝙩 𝙚𝙣𝙙𝙨 𝙬𝙚𝙡𝙡 😃Only smiles on the faces of skipper Shreyas Iyer, coach Ricky Ponting and.. Shashank Singh! #TATAIPL | #KhelBindaas | #PBKSvLSG | @PunjabKingsIPL pic.twitter.com/SQU5z3zNdy— IndianPremierLeague (@IPL) April 19, 2026 -
‘మాటలు రావడం లేదు.. ఆ ఇద్దరి వల్లే గెలిచాం’
ఐపీఎల్ 2026 సీజన్లో కేకేఆర్ తొలి విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్లో డకౌట్గా వెనుదిరిగిన రహానే సీజన్లో కెప్టెన్గా తొలి విజయాన్ని అందుకున్నాడు. రాజస్తాన్పై విజయం తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందన్నాడు. రింకూ సింగ్, అనుకుల్ రాయ్ల వల్లే కేకేఆర్ గెలిచిందంటూ వారిపై ప్రశంసలు కురిపించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం రహానే మాట్లాడుతూ.. 'నాకు చాలా ఆనందంగా ఉంది. మంచి ఫీలింగ్ ఇది. ఈ మ్యాచ్లో చాలా భావోద్వేగాలు ఉన్నాయి. రింకు సింగ్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి ప్రదర్శనపై చాలా సంతోషంగా ఉంది. రింకు, అనుకుల్ ఇద్దరూ అద్భుత భాగస్వామ్యం నెలకొల్పారు. ఇద్దరి బ్యాటింగ్ సూపర్బ్. నాకు ఆటగాళ్లతో వ్యక్తిగతంగా మాట్లాడటం ఇష్టం. పరిస్థితులను బాగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ విజయం జట్టుకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. బ్యాటింగ్ పరంగా ఇంకా మెరుగవ్వాల్సి ఉంది. కార్తీక్ త్యాగి అద్భుతంగా ఆడుతున్నాడు. తన సామర్థ్యం గురించి అతనికి స్పష్టత ఉంది. ఇలాంటి యువ ఆటగాడు జట్టులో ఉండటం గొప్ప విషయం. అతను ఆత్మవిశ్వాసం రోజురోజుకు పెరుగుతోంది. అది చూడటం చాలా ఆనందంగా ఉంది. త్యాగి బౌలింగ్ చేస్తున్న వేగం అద్భుతం. ప్రతి మ్యాచ్ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. అదే క్రికెట్ అవగాహనను పెంచుతుంది. కొన్నిసార్లు స్ట్రైక్రేట్కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని నాకు అనిపిస్తుంది. కానీ మ్యాచ్ను చివరివరకు తీసుకెళ్లడం ముఖ్యం. ఈరోజు ఏమి జరిగిందో మనం చూశాం. ఈ విజయం మాకు ఒక పెద్ద ఉపశమనం లాంటిది. జట్టు ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ప్రతి మ్యాచ్ నుంచి పాఠాలు నేర్చుకోవడం అవసరం. జట్టు సభ్యుల మధ్య స్పష్టమైన కమ్యూనికేషన్ ఉండాలి. అందరూ కలిసి కృషి చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. డ్రెస్సింగ్ రూమ్లో వాతావరణం అద్భుతంగా ఉంది. అభిమానులు కూడా బాగా మద్దతు ఇచ్చారు. ఈ విజయం వాళ్లకే అంకితం. జట్టులో చాలా సానుకూల వాతావరణం ఉంది' అని రహానే చెప్పుకొచ్చాడు.SENSATIONAL FINISH 🤯Rinku Singh & Anukul Roy, take a bow! 💜Scorecard ▶️ https://t.co/776nTdODZL#TATAIPL | #KhelBindaas | #KKRvRR | @KKRiders pic.twitter.com/HY9R9Kh0lT— IndianPremierLeague (@IPL) April 19, 2026చదవండి: కేకేఆర్ రాత మార్చిన రింకూ సింగ్! -
కేకేఆర్ రాత మార్చిన రింకూ సింగ్!
ఐపీఎల్ 2026 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ ఎట్టకేలకు తొలి విజయాన్ని సాధించింది. ఐదు పరాజయాలతో అట్టడుగు స్థానంలో నిలిచిన కేకేఆర్ ఆదివారం రాజస్తాన్ రాయల్స్పై గెలుపు రుచి చూసింది. ఒక దశలో 85 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన కేకేఆర్ ఈ మ్యాచ్లో కూడా ఓటమి చవిచూస్తుందని అంతా భావించారు. కానీ జట్టు వైస్కెప్టెన్ రింకూ సింగ్ తన సహచర బ్యాటర్ అనుకుల్ రాయ్తో కలిసి వరుస ఓటములతో ఢీలా పడిన కేకేఆర్ రాతను మార్చాడు. 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తనకు లభించిన లైఫ్ను రింకూ సింగ్ చక్కగా వినియోగించుకున్నాడు. రింకూ సింగ్ ఇచ్చిన క్యాచ్ను నండ్రీ బర్గర్ వదిలేయడం మ్యాచ్కు టర్నింగ్ పాయింట్ ఇదే అని చెప్పొచ్చు. మొత్తంగా రింకూ సింగ్ 34 బంతుల్లో 53 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.తనకు లైఫ్ వస్తే ఎంత డేంజర్ అనేది రింకూ సింగ్ రాజస్తాన్ బౌలర్లకు రుచి చూపించాడు.ఈ సీజన్లో ఒక్క మ్యాచ్లోనూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడని రింకూ సింగ్ రాజస్తాన్తో మ్యాచ్లో తన విలువను చూపించాడు. అనుకుల్ రాయ్ క్రీజులోకి వచ్చేసరికి కేకేఆర్ 6 వికెట్ల నష్టానికి 85 పరుగులతో ఉంది. విజయానికి ఆరు ఓవర్లలో 69 పరుగులు కావాలి. అనుకుల్ రాయ్ నుంచి మంచి సహకారం అందడంతో రింకూ సింగ్ స్వేచ్ఛగా బ్యాట్ను ఝలిపించాడు. ఈ ఇద్దరు ఏడో వికెట్కు 37 బంతుల్లోనే 76 పరుగుల విన్నింగ్ భాగస్వామ్యం నమోదు చేసి కేకేఆర్కు సీజన్లో మొదటి విజయాన్ని అందించారు. మ్యాచ్ అనంతరం రింకూ సింగ్ మాట్లాడాడు. ‘కొన్నిసార్లు అదృష్టం కూడా కలిసి వస్తుందంటారు. ఇవాళ మ్యాచ్లో నా విషయంలో అదే జరిగింది. నిజానికి 8 పరుగుల వద్ద నాకు లైఫ్ లభించినప్పుడు అదృష్టం ఇవాళ నాతోనే ఉందని భావించాను. 85 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి మేము దాదాపు ఓటమి అంచున నిలిచాం. అయితే నాకు లభించిన లైఫ్ను రెండో చాన్స్ అనుకుని ఆడాను. అనుకుల్ రాయ్ నుంచి మంచి సపోర్ట్ లభించింది. తొలుత నిలదొక్కుకునేందుకు ప్రయత్నించాను. ఈ సీజన్లో బ్యాటింగ్లో పెద్ద ఇన్నింగ్స్లు ఆడడంలో విఫలమయ్యాను. అయితే ఒక పెద్ద ఇన్నింగ్స్ కోసం ఎదురుచూస్తూ వచ్చాను. అది ఈరోజు నెరవేరింది. బ్యాటింగ్లో నాకు నిర్ధిష్టమైన స్థానమంటూ లేదు. జట్టుకు అవసరమైనప్పుడు ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటాను. ఇవాళ్టి ఇన్నింగ్స్ పట్ల పూర్తి సంతోషంగా ఉన్నా. సీజన్లో మా జట్టకు ఇదే తొలి విజయం కాబట్టి, మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని చెప్పొచ్చు. ఇదే ఊపును రాబోయే మ్యాచ్ల్లోనూ కొనసాగిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా.’ అని చెప్పుకొచ్చాడు. ఇక రింకూకు సపోర్ట్ ఇచ్చిన అనుకుల్ రాయల్ (16 బంతుల్లో 29 నాటౌట్) జీవితంలో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు.SENSATIONAL FINISH 🤯Rinku Singh & Anukul Roy, take a bow! 💜Scorecard ▶️ https://t.co/776nTdODZL#TATAIPL | #KhelBindaas | #KKRvRR | @KKRiders pic.twitter.com/HY9R9Kh0lT— IndianPremierLeague (@IPL) April 19, 2026చదవండి: ఒకే ఓవర్లో 32 పరుగులు.. లక్నో బౌలర్కు చుక్కలు -
ఒకే ఓవర్లో 32 పరుగులు.. లక్నో బౌలర్కు చుక్కలు
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్జెయింట్స్తో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ విధ్వంసకర బ్యాటింగ్తో రెచ్చిపోయింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య, వన్డౌన్ బ్యాటర్ కూపర్ కన్నోలి లక్నో బౌలర్లకు చుక్కలు చూపించారు. ప్రియాన్ష్ ఆర్య 37 బంతుల్లో 93 పరుగులు చేయగా, కూపర్ 47 బంతుల్లో 87 పరుగులు చేశాడు. అయితే ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన మార్కరమ్కు ఈ ఇద్దరు పీడకలను మిగిల్చారు. 13వ ఓవర్ స్ట్రైకింగ్ తీసుకున్న కూపర్ కన్నోలి మార్కరమ్ మొదటి బంతిని సిక్సర్గా మలిచాడు. రెండో బంతిని ఈసారి లాంగాన్ దిశగా సిక్సర్ కొట్టిన కన్నోలి మూడో బంతిని కూడా సిక్సర్గా మలిచాడు. ఆ తర్వాతి బంతిని వైడ్ వేయగా, నాలుగో బంతికి కూపర్ సింగిల్ తీయడంతో ప్రియాన్ష్ స్ట్రైక్లోకి వచ్చాడు. ఇక ప్రియాన్ష్ కూడా చివరి రెండు బంతులకు సిక్సర్లు కొట్టాడు. దీంతో ఆ ఓవర్లో మొత్తం 5 సిక్సర్లు, వైడ్ సహా సింగిల్ మొత్తం 32 పరుగులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మార్కరమ్ ఒక చెత్త రికార్డును తన పేరిట మూటగట్టుకున్నాడు. లక్నో తరఫున ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్గా మార్కరమ్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు రవి బిష్ణోయ్ పేరిట ఉంది. 2022లో ఆర్సీబీతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో రవి బిష్ణోయ్ 27 పరుగులు సమర్పించుకున్నాడు.ఇక 2026 సీజన్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ కూడా మార్కరమ్ మాత్రమే. ఈ సీజన్లోనూ ఇదే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఓవర్ అని చెప్పొచ్చు. 2025 సీజన్లో ఖలీల్ అహ్మద్ (సీఎస్కే) ఆర్సీబీతో మ్యాచ్లో 33 పరుగులు, మొయిన్ అలీ (కేకేఆర్) రాజస్తాన్తో మ్యాచ్లో 32 పరుగులు సమర్పించుకున్నారు.3️⃣2️⃣ runs of pure destruction 💥🎥 Relive this carnage 👉 https://t.co/EpOcpY1lLb#TATAIPL | #KhelBindaas | #PBKSvLSG | @PunjabKingsIPL pic.twitter.com/eI5tuleNYM— IndianPremierLeague (@IPL) April 19, 2026చదవండి: 'క్యాచ్లు జారవిడవడం మా కొంపముంచింది’ -
'క్యాచ్లు జారవిడవడం మా కొంపముంచింది’
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆదివారం కేకేఆర్ చేతిలో రాజస్తాన్ రాయల్స్ 4 వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది. మ్యాచ్ ఓటమిపై పరాగ్ స్పందించాడు. క్యాచ్లు జారవిడవడం తమ కొంప ముంచిందని రాజస్తాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ తెలిపాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం పరాగ్ మాట్లాడుతూ.. ‘బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తొలి నాలుగు ఓవర్లు ముగిసేసరికి ఈ పిచ్పై 170 పరుగులు చేస్తే విజయం సాధించొచ్చు అని భావించాం. కానీ 10 పరుగులు వెనుకబడ్డాం. మా బౌలర్లు కష్టపడ్డారు. కానీ ఫీల్డింగ్లో కొన్ని తప్పులు చేశాం. క్యాచ్లు జారవిడవడం మా కొంపముంచింది. అయితే ఈడెన్ గార్డెన్స్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంది. కానీ మా జట్టులో ఇవాళ పేసర్లు ఎక్కువగా ఉండడం, బిష్ణోయ్ మాత్రమే రెగ్యులర్ స్పిన్నర్గా ఉండడం మాకు ప్రతికూలంగా మారింది. బ్రిజేశ్ శర్మ ఇవాళ చాలా బాగా బౌలింగ్ వేశాడు. 14, 16వ ఓవర్లో అతను సూపర్గా బౌలింగ్ చేశాడు. బిష్ణోయ్ బౌలింగ్ పూర్తైన తర్వాత క్రీజులో ఇద్దరు ఎడమచేతి బ్యాటర్లు ఉండడం, ఆ సమయంలో మా వద్ద స్పిన్ బౌలర్ లేకపోవడం కూడా ఓటమికి దారి వేసిందని చెప్పొచ్చు. ఇవాళ బ్యాటింగ్లో కూడా ఆశించినంత స్థాయిలో రాణించలేకపోయాం. రెండు ఓటములు వచ్చినంత మాత్రాన వెనక్కి తగ్గినట్లు కాదు. మళ్లీ ఫుంజుకుంటాం. ఇక ’ అని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. అనంతరం కేకేఆర్ 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి విజయం సాధించింది. -
ఎట్టకేలకు బోణీ కొట్టిన కేకేఆర్.. రాజస్తాన్పై విజయం
ఐపీఎల్-2026లో కోల్కతా నైట్రైడర్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఆదివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో కేకేఆర్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ(46), యశస్వి జైశ్వాల్(39) తొలి వికెట్కు 81 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కానీ ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు మాత్రం దారుణంగా విఫలమయ్యారు. కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఎట్టుకేలకు తన రిథమ్ను అందుకున్నాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో వరుణ్ కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు కార్తీక్ త్యాగి మూడు, సునీల్ నరైన్ రెండు వికెట్లు సాధించాడు.గెలిపించిన రింకూ, అనుకుల్అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్లు టిమ్ సీఫర్ట్, రహానే ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత గ్రీన్(27) కాస్త దూకుడుగా ఆడి రాజస్తాన్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేశాడు.దూకుడుగా ఆడిన గ్రీన్ కూడా బిష్ణోయ్ బౌలింగ్లో స్టంపౌటయ్యాడు. వెంటనే రఘువంశీ కూడా ఔటయ్యాడు. ఈ క్రమంలో రింకూ సింగ్, పావెల్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. పావెల్(23) కూడా భారీ షాట్కు ప్రయత్నించి తన వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రమణ్దీప్(10) ప్రభావం చూపలేకపోయాడు.దీంతో కేకేఆర్కు మరో ఓటమి ఖాయమని అంతా భావించారు. కానీ రింకూ సింగ్(53 నాటౌట్), అనుకుల్ రాయ్(29 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్లు ఆడి తమ జట్టుకు తొలి విజయాన్ని అందించారు. ఫలితంగా 156 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. -
IPL 2026: లక్నోపై పంజాబ్ ఘన విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ ఐదో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం ముల్లన్పూర్ వేదికగా లక్నో సూపర్జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 54 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులకే పరిమితమైంది. మార్కరమ్ (42 ), రిషబ్ పంత్ (43), మార్ష్ (40) పరుగులు సాధించారు. అంతకముందు పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ప్రియాన్ష్ (93), కూపర్ (87) పరుగులు చేశారు. 18 ఓవర్లలో లక్నో 179/418 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్జెయింట్స్ 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. మార్కరమ్ 28, ముకుల్ 16 పరుగులతో ఆడుతున్నారు.పంత్ (43) ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన లక్నోపంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో లక్నో సూపర్జెయింట్స్ 128 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 43 పరుగులు చేసిన పంత్ అర్ష్దీప్ బౌలింగ్లో ప్రబ్సిమ్రన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 8 ఓవర్లలో లక్నో 89/18 ఓవర్లు ముగిసేసరికి లక్నో వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. మార్ష్ (35), పంత్ (18) క్రీజులో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన లక్నోపంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో లక్నో సూపర్జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన ఆయుశ్ బదోని విజయ్ కుమార్ బౌలింగ్లో బార్ట్లెట్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం లక్నో వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది.255 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో ఛేదనను ధాటిగానే ఆరంభించింది. 4 ఓవర్లు ముగిసేసరికి లక్నో వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. మార్ష్ 23, ఆయుశ్ బదోని 20 పరుగులతో క్రీజులో ఉన్నారు.లక్నో ముంగిట 255 పరుగుల లక్ష్యంఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ అత్యధిక స్కోరు సాధించింది. లక్నో సూపర్జెయింట్స్తో మ్యాచ్లో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య (93), కూపర్ కన్నోలి (87) విధ్వంసం సృష్టించారు. చివర్లో స్టోయినిస్ (29) కీలక ఇన్నింగ్స్ ఆడి పంజాబ్ భారీ స్కోరుకు బాటలు వేశాడు. పంజాబ్ బ్యాటర్ల ధాటికి లక్నో బౌలర్లు దారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ప్రిన్స్ యాదవ్, మనిమరన్ సిద్దార్థ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఈ సీజన్లో పంజాబ్దే అత్యధిక స్కోరు. ఇంతకముందు ఇదే సీజన్లో సీఎస్కేతో మ్యాచ్లో ఆర్సీబీ 250 పరుగులు చేసింది.18 ఓవర్లలో పంజాబ్ 230/518 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. స్టోయినిస్ 19 పరుగులు, శశాంక్ సింగ్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.శ్రేయస్ అయ్యర్ (5) రూపంలో పంజాబ్ నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 15 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. అంతకముందు 93 పరుగులు చేసిన ప్రియాన్ష్ ఆర్య సిద్దార్థ్ బౌలింగ్లో మిచెల్ మార్ష్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగాడు. దీంతో పంజాబ్ 187 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. కూపర్ (87) ఔట్పంజాబ్ కింగ్స్ 185 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న కూపర్ 46 బంతుల్లో 7 సిక్సులు 8 ఫోర్ల సాయంతో 87 పరుగులు చేసి ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో మణిమరన్ సిర్థార్థ్కు క్యాచ్ ఇచ్చుకున్నాడు.9 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య 19 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ను అందుకున్నాడు. కన్నోలి 40 పరుగులతో ఆడుతున్నాడు.ప్రియాన్ష్ మెరుపులు.. పంజాబ్ 63/1పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఆరు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. ప్రియాన్ష్ 40, కూపర్ కన్నోలి 23 పరుగులతో ఆడుతున్నారు.5 ఓవర్లలో పంజాబ్ 43/15 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. కూపర్ కన్నోలి 15, ప్రియాన్ష్ ఆర్య 21 పరుగులతో క్రీజులో ఉన్నారు.ప్రబ్సిమ్రన్ డకౌట్.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్కు ఆదిలోనే షాక్ తగిలింది. మహ్మద్ షమీ బౌలింగ్లో ఓపెనర్ ప్రబ్సిమ్రన్ సింగ్ డకౌట్గా వెనుదిరిగాడు.టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నోఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఆదివారం ముల్లన్పూర్ వేదికగా 29వ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్జెయింట్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన లక్నో సూపర్జెయింట్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు పంజాబ్ ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగింది. మరోవైపు లక్నో ఒక మార్పు చేసింది. దిగ్వేశ్ రాఠీ స్థానంలో సిద్దార్థ్ మణిరమన్ జట్టులోకి వచ్చాడు.పంజాబ్ కింగ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.లక్నో సూపర్జెయింట్స్: ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(కెప్టెన్), నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, ముకుల్ చౌదరి, మహ్మద్ షమీ, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, మణిమారన్ సిద్ధార్థ్, మొహ్సిన్ ఖాన్ -
రేసింగ్లో విషాదం.. ఏడు కార్లు ఒకదానితో ఒకటి ఢీ!
ఫార్ములావన్ రేసింగ్లో విషాదం చోటుచేసుకుంది. శనివారం జర్మనీలోని నుర్బుర్గ్ రింగ్లో జరిగిన నుర్బుర్గ్ రింగ్ లాంగ్స్రెకెన్ సిరీస్ (ఎన్ఎస్ఎల్) క్వాలిఫయింగ్ రేసు విషాదాంతమైంది. ఏడు రేసింగ్ కార్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టడంతో వెటరన్ రేసింగ్ డ్రైవర్ 66 ఏళ్ల జుహా మియెట్టినెన్ ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం జుహా మియెట్టియెన్ బీఎండబ్ల్యూ 325ఐ రేసింగ్ కారుకు డ్రైవర్గా ఉన్నాడు. ఇక ఇదే రేసులో పాల్గొన్న నాలుగుసార్లు ఫార్ములా వన్ చాంపియన్ మాక్స్ వెర్స్టాపెన్ సహా మిగతా డ్రైవర్లు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. నాలుగు గంటలపాటు జరగాల్సిన ఈవెంట్లో రేస్ ప్రారంభమైన 25 నిమిషాలకే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ట్రాక్లోని క్లోస్టర్టాల్ వద్ద ఎత్తులో ఉన్నప్పుడు సెకన్ల వ్యవధిలో ఏడు కార్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే రేసును నిలిపేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పారా మెడికల్ సిబ్బంది జుహా మియెట్టియెన్ను కారులో నుంచి బయటికి తీసినప్పటికీ అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మిగతా వారిని ఆసుపత్రికి తరలించారు. ఇందులో వెర్స్టాపెన్ కూడా ఉన్నాడు. కాగా మియెట్టియెన్ మరణంపై ఎన్ఎస్ఎల్ నిర్వాహకులు విచారం వ్యక్తం చేశారు. ఇక మోటార్ స్పోర్ట్స్ నియంత్రణ సంస్థ (ఎఫ్ఐఏ) విచారం వ్యక్తం చేసింది. మియెట్టియెన్ మృతికి సంతాపం తెలిపిన ఎఫ్ఐఏ అతని కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలిపింది. ఇక షెడ్యూల్ ప్రకారం ఆదివారం రేస్ జరుగుతుందని ఎన్ఎస్ఎల్ తెలిపింది. అయితే రేస్ ప్రారంభానికి ముందు మియెట్టియెన్ మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించనున్నారు. ఈ రేసులో మాక్స్ వెర్స్టాపెన్తో పాటు మెర్సిడెస్ రేసర్ లుకాస్ ఆర్ కూడా పాల్గొననున్నాడు. కాగా జుహా మియెట్టియెన్ మరణంపై మాక్స్ వెర్స్టాపెన్ స్పందించాడు. ‘మియెట్టియెన్ మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’ అని పోస్టు పెట్టాడు. View this post on Instagram A post shared by 24hNürburgring (@24hnbr) -
అజింక్య రహానే చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
ఐపీఎల్-2026లో కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ ధనాధన్ లీగ్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో రహానే ఖాతా తెవకుండానే పెవిలియన్కు చేరాడు. రాజస్తాన్ పేసర్ నండ్రీ బర్గర్ బౌలింగ్లో వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి రహానే ఔటయ్యాడు.అంతకుముందు గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో కూడా రహానే గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. తద్వారా ఈ వెటరన్ ఆటగాడు ఓ అవాంఛనీయ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఓపెనర్గా రహానే నిలిచాడు. రహానే ఇప్పటివరకు 12 సార్లు ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఇంతకుముందు ఈ రికార్డు మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్ధివ్ పటేల్(11) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో పార్ధివ్ను రహానే అధిగమించాడు.ఐపీఎల్లో అత్యధిక సార్లు డకౌటైన ఓపెనర్లు వీరే12 - అజింక్య రహానే*11 - పార్థివ్ పటేల్10 - శిఖర్ ధావన్10 - గౌతమ్ గంభీర్9 - డేవిడ్ వార్నర్ -
'ఆడందే ఆరెంజ్ క్యాప్ రేసులో ఉంటానా?'
సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన స్ట్రైక్రేట్పై వస్తున్న విమర్శలకు క్లాసెన్ గట్టిగానే బదులిచ్చాడు. తన పని బ్యాటింగ్ చేయడం మాత్రమేనని, స్ట్రైక్రేట్ ఇతర విషయాలు పెద్దగా పట్టించుకోనని తెలిపాడు. అయితే స్ట్రైక్రేట్ విషయంలో విమర్శలు వస్తున్నప్పటికీ ఐపీఎల్ 2026 సీజన్లో ఆరు మ్యాచ్ల్లో 283 పరుగులు సాధించిన క్లాసెస్ ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉండడం కొసమెరుపు. ఈ నేపథ్యంలోనే సీఎస్కేతో మ్యాచ్ అనంతరం క్లాసెన్ మాట్లాడాడు. 'నా పని బ్యాటింగ్ చేయడమే. ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వ ర్తిస్తున్నా. అయితే ఈ సీజన్లో నా స్ట్రైక్రేట్ విషయంలో విమర్శలు వస్తున్న సంగతి నాకు తెలుసు. కానీ నా బ్యాటింగ్తో జట్టుకు ఎంత ఉపయోగపడుతున్నాననేదే నాకు ముఖ్యం. స్ట్రైక్రేట్పై చింత లేదు. ఎందుకంటే క్రీజులో కుదురుకుంటేనే పరుగుల వస్తాయి. అంతేకానీ కేవలం స్ట్రైక్రేట్పైనే దృష్టి సారిస్తే పరుగులు చేయడం సంగతి అటుంచితే జట్టుకు నష్టం చేకూరుతుంది. పరిస్థితులకు తగ్గట్లు ఆడుతానే తప్ప ప్రతీసారి బ్యాట్ నుంచి మెరుపులు రావాలంటే కష్టమే. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బాధ్యతగా ఆడాలి. ఆ పనిని నేను సరిగ్గానే చేస్తున్నా. అయినా నేను ఆడందే ఆరెంజ్క్యాప్ రేసులో టాప్లో ఉంటానా? ఇక కేప్టౌన్లోని ఐ జిమ్లో కండ్లకు సంబంధించి నేను తీసుకున్న శిక్షణ ఒత్తిడిని దూరం చేసింది. కేవలం రోజు 10 నిమిషాల పాటు క్రమం తప్పకుండా శిక్షణ తీసుకోవడం చాలా ఉపయోగపడింది.' అని చెప్పుకొచ్చాడు. సీజన్లో భాగంగా ఎస్ఆర్హెచ్ మూడో విజయాన్ని నమోదు చేసకుంది. శనివారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అభిషేక్, క్లాసెన్లు అర్థసెంచరీలతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 184 పరుగులకు పరిమితమైంది. మూడు విజయాలతో పట్టికలో నాలుగో స్థానానికి చేరిన ఎస్ఆర్హెచ్ తన తర్వాతి మ్యాచ్ ఏప్రిల్ 21న ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడనుంది.చదవండి: బుడ్డోడి వికెట్తో మిస్టరీ స్పిన్నర్ అరుదైన రికార్డు! -
చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. ఒకే ఒక్కడు
ఐపీఎల్-2026లో ఢిల్లీ క్యాపిటల్స్ తిరిగి గెలుపు బాట పట్టింది. శనివారం (ఏప్రిల్ 18) చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. ఈ విజయంలో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ది కీలక పాత్ర. తన 34వ పుట్టినరోజున రాహుల్ అద్భుత హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.34 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 57 పరుగులు చేశాడు. ఈ క్రమంలో రాహుల్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో రెండుసార్లు తన పుట్టినరోజున హాఫ్ సెంచరీ బాదిన తొలి ఆటగాడిగా రాహుల్ రికార్డు సృష్టించాడు.గతంలో 2021 సీజన్లో (29వ పుట్టినరోజున) పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతూ ఢిల్లీపై హాఫ్ సెంచరీతో మెరిశాడు. మళ్లీ ఇప్పుడు తన బర్త్డే రోజున హాఫ్ సెంచరీ సాధించడంతో ఈ అరుదైన ఫీట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడిన రాహుల్.. 168 పరుగులు సాధించాడు.ఐపీఎల్లో పుట్టిన రోజున అర్ద సెంచరీ చేసిన ఆటగాళ్లుమైక్ హస్పీడేవిడ్ వార్నర్కేఎల్ రాహుల్(రెండు సార్లు) -
బుడ్డోడి వికెట్తో మిస్టరీ స్పిన్నర్ అరుదైన రికార్డు!
టీ20 క్రికెట్లో కోల్కతా నైట్రైడర్స్ బౌలర్ వరుణ్ చక్రవర్తి మరో రికార్డు అందుకున్నాడు. పొట్టి ఫార్మాట్లో 200 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ వికెట్ తీయడం ద్వారా ఈ మిస్టరీ స్పిన్నర్ తన ఖాతాలో 200వ వికెట్ జమ చేసుకున్నాడు. కాగా టీ20 క్రికెట్లో 200 వికెట్ల మైలురాయిని అందుకోవడానికి వరుణ్ చక్రవర్తి 155 మ్యాచ్లు తీసుకున్నాడు. అత్యంత వేగంగా 200 వికెట్ల మార్క్ను చేరుకున్న రెండో భారత బౌలర్గా వరుణ్ చక్రవర్తి నిలిచాడు. తొలి స్థానంలో టీమిండియా పేసర్ అర్ష్దీప్ సింగ్ (151 మ్యాచ్లు ఉన్నాడు. 2019లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన వరుణ్ చక్రవర్తి తొలుత పంజాబ్ కింగ్స్కు ఆడాడు. ఆ తర్వాత కేకేఆర్కు మారిన ఈ మిస్టరీ స్పిన్నర్ అప్పటి నుంచి అదే జట్టులో కొనసాగుతున్నాడు. అయితే వరుణ్ చక్రవర్తి ఈ సీజన్లోనే గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో కేకేఆర్ తరఫున వంద వికెట్లు సాధించాడు. కేకేఆర్ తరఫున వంద వికెట్లు తీసిన మూడో బౌలర్గా నిలిచాడు. గతంలో సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్లు ఈ ఘనత సాధించారు. ఓవరాల్గా వరుణ్ చక్రవర్తి ఐపీఎల్లో 89 మ్యాచ్ల్లో 105 వికెట్లు పడగొట్టాడు. ఇక టీమిండియా తరఫున వరుణ్ చక్రవర్తి 45 టీ20ల్లో 73 వికెట్లు పడగొట్టాడు. రెండుసార్లు ఐదు వికెట్ల హాల్ను అందుకున్నాడు.WICKET x 2️⃣!🎥 Spinners spinning #KKR back into the contest ☝️☝️Updates ▶️ https://t.co/776nTdPbPj#TATAIPL | #KhelBindaas | #KKRvRR | @KKRiders pic.twitter.com/TyU5HsJuGv— IndianPremierLeague (@IPL) April 19, 2026 చదవండి: తలతిక్క నిర్ణయాలతో కొంపముంచిన పటీదార్! -
సూర్యకుమార్పై వేటు..! టీమిండియా కెప్టెన్గా విధ్వంసకర ప్లేయర్?
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై వేటు పడనుందా? అంటే అవునానే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. సారథిగా టీమిండియాకు అద్భుతమైన విజయాలు అందించిన సూర్య.. బ్యాటర్గా మాత్రం అతడి ప్రదర్శన రోజు రోజుకు దిగజారుతోంది. దాదాపు ఏడాది పాటు టీ20ల్లో నంబర్ వన్ బ్యాటర్ కొనసాగిన సూర్యకుమార్.. ఇప్పుడు రెండెంకెల స్కోర్ చేయడానికి కూడా కష్టపడుతున్నాడు. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాక మాత్రం బ్యాటర్గా అతడు విఫలమవవుతున్నాడు.గతేడాది దాదాపు 25కు పైగా టీ20లు ఆడిన సూర్య కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా సాధించలేకపోయాడు. కెప్టెన్సీ భారం అతడి బ్యాటింగ్పై పడుతున్నట్లు క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే సూర్యను కెప్టెన్సీ నుంచి తప్పించాలని బోర్డు యోచిస్తున్నట్లు సమాచారం. లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ 2028తో పాటు తదుపరి రెండు టీ20 ప్రపంచకప్లను దృష్టిలో ఉంచుకొని బోర్డు జట్టును సిద్దం చేయాలనే ఆలోచనలో ఉంది. దీంతో సూర్య స్ధానంలో మరో ముంబై ఆటగాడు శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్గా నియమించేందుకు భారత క్రికెట్ బోర్డు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీ20ల్లో నంబర్ 4 స్థానానికి అయ్యర్ సరైన ప్రత్యామ్నాయమని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి.శ్రేయస్ అయ్యర్కు బంపరాఫర్!శ్రేయస్ అయ్యర్ ఇప్పటివరకు జాతీయ జట్టుకు సారథ్యం వహించనప్పటికి.. దేశవాళీ క్రికెట్తో పాటు ఐపీఎల్లో కెప్టెన్గా అతడికి అనుభవం ఉంది. శ్రేయస్ ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. అంతకుముందు ఐపీఎల్-2024 సీజన్లో కేకేఆర్ను అయ్యర్ ఛాంపియన్గా నిలిపాడు. గత సీజన్లో పంజాబ్ కింగ్స్ను ఫైనల్ చేర్చాడు. ఈ ఏడాది కూడా అతడి సారథ్యంలోని పంజాబ్ జట్టు అద్భుత విజయాలతో దూసుకుపోతుంది. అంతేకాకుండా శ్రేయస్ డొమాస్టిక్ క్రికెట్లో కూడా ముంబై జట్టుకు ఎన్నో సంచలన విజయాలను అయ్యర్ అందించాడు. దీంతో అయ్యర్కు జాతీయ జట్టును నడిపించే సత్తా కూడా ఉందని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.అయ్యర్ చివరిసారిగా 2023లో టీ20 మ్యాచ్ ఆడాడు. ప్రస్తుత టీ20 సెటప్లో అతడు లేడు. కానీ అతడిని తిరిగి తీసుకొచ్చి నేరుగా కెప్టెన్సీ ఇచ్చే అవకాశముందని బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాయి.అయ్యర్ ప్రస్తుతం కేవలం వన్డే జట్టులో మాత్రమే భాగంగా ఉన్నాడు. అయితే శ్రేయస్ పొట్టి క్రికెట్లో దుమ్ములేపుతున్నాడు. కాబట్టి అతడిని భారత టీ20 జట్టులోకి తీసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. -
కేకేఆర్కు తొలి విజయం.. రాజస్తాన్పై గెలుపు
IPL 2026 KKR vs RR Live updates: ఐపీఎల్-2026 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో కేకేఆర్ గెలుపొందింది. 156 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయింది.కేకేఆర్ విజయంలో రింకూ సింగ్(53 నాటౌట్), అనుకుల్ రాయ్(29 నాటౌట్) కీలక పాత్ర పోషించారు. రాజస్తాన్ రాయల్స్ బౌలర్లలో రవీంద్ర జడేజా రెండు వికెట్లు పడగొట్టగా.. ఆర్చర్,బర్గర్, బిష్ణోయ్, యశ్రాజ్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.తీవ్ర ఉత్కంఠకేకేఆర్ విజయానికి చివరి రెండు ఓవర్లలో 21 పరుగులు కావాలి. క్రీజులో రింకూ సింగ్(37), అనుకుల్ రాయ్(19) ఉన్నారు.కేకేఆర్ స్కోరెంతంటే?16 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 116/6. కేకేఆర్ విజయానికి 24 బంతుల్లో 40 పరుగులు కావాలి. క్రీజులో రింకూ సింగ్(26), అనుకుల్ రాయ్(13) ఉన్నారు.కేకేఆర్ ఆరో వికెట్ డౌన్కేకేఆర్ ఆరో వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన రమణ్దీప్.. యశ్రాజ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 14 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 87/6కేకేఆర్ ఐదో వికెట్ డౌన్70 పరుగుల వద్ద కేకేఆర్ ఐదో వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన పావెల్.. జడేజా బౌలింగ్లో ఔటయ్యాడు. కేకేఆర్ విజయానికి 54 బంతుల్లో 82 పరుగులు కావాలి. 11 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 74/5కేకేఆర్ నాలుగో వికెట్ డౌన్కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన రఘువంశీ.. రవీంద్ర జడేజా బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి రింకూ సింగ్ వచ్చాడు.కేకేఆర్ మూడో వికెట్ డౌన్37 పరుగుల వద్ద కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 27 పరుగులు చేసిన కామెరూన్ గ్రీన్.. రవి బిష్ణయ్ బౌలింగ్లో స్టంపౌటయ్యాడు.కేకేఆర్ రెండో వికెట్ డౌన్కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ అజింక్య రహానే(0) మరోసారి ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు.టిమ్ సీఫెర్ట్ గోల్డెన్ డక్రాజస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో కేకేఆర్ ఖాతా తెరవకుండానే తొలి వికెట్ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో టిమ్ సీఫెర్ట్ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు.చెలరేగిన కేకేఆర్ బౌలర్లు.. రాజస్తాన్ స్కోరెంతంటే?ఈడెన్గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశీ(46) టాప్ స్కోరర్గా నిలవగా.. జైశ్వాల్(39) రాణించాడు. మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో కార్తీక్ త్యాగి, వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టగా.. సునీల్ నరైన్ రెండు వికెట్లు సాధించాడు.ఒకే ఓవర్లో మూడు వికెట్లు18 ఓవర్ వేసిన కార్తీక్ త్యాగి బౌలింగ్లో రాజస్తాన్ రాయల్స్ ఏకంగా మూడు వికెట్లు కోల్పోయింది. తొలుత రవీంద్ర జడేజా(9), షిమ్రాన్ హెట్మైర్(15), బిష్ణోయ్(0) ఔటయ్యాడు.రాజస్తాన్ ఐదో వికెట్ డౌన్124 పరుగుల వద్ద రాజస్తాన్ ఐదో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన ఫెరీరా.. సునీల్ నరైన్ బౌలింగ్లో ఔటయ్యాడు.రాజస్తాన్ నాలుగో వికెట్ డౌన్117 పరుగుల వద్ద రాజస్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన రియాన్ పరాగ్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు.రాజస్తాన్ మూడో వికెట్ డౌన్రాజస్తాన్ రాయల్స్ మూడో వికెట్ కోల్పోయింది. 39 పరుగులు చేసిన యశస్వి జైశ్వాల్.. సునీల్ నరైన్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులో షిమ్రాన్ హెట్మైర్ వచ్చాడు. 13 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 109/3రాజస్తాన్ రెండో వికెట్ డౌన్97 పరుగుల వద్ద రాజస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన ధ్రువ్ జురుల్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఔటయ్యాడు.రాజస్తాన్ తొలి వికెట్ డౌన్81 పరుగుల వద్ద రాజస్తాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 46 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి ధ్రువ్ జురెల్ వచ్చాడు.6 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 63/06 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ రాయల్స్ వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. క్రీజులో వైభవ్ సూర్యవంశీ(21 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 38), యశస్వి జైశ్వాల్(21) ఉన్నారు.3 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 20/03 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. క్రీజులో వైభవ్ సూర్యవంశీ(11), యశస్వి జైశ్వాల్(9) ఉన్నారు.ఐపీఎల్-2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో రాజస్తాన్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. హెట్మైర్, బ్రిజేష్ శర్మ తిరిగి జట్టులోకి వచ్చారు. కేకేఆర్ మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.తుది జట్లుకోల్కతా నైట్ రైడర్స్ : అజింక్యా రహానే(కెప్టెన్), టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, రోవ్మన్ పావెల్, రింకు సింగ్, సునీల్ నరైన్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి, వరుణ్ చకరవర్తిఇంపాక్ట్ సబ్లు: మనీష్ పాండే, ఫిన్ అలెన్, అంగ్క్రిష్ రఘువంశీ, తేజస్వి సింగ్, నవదీప్ సైనీరాజస్థాన్ రాయల్స్: వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, రవి బిష్ణోయ్ఇంపాక్ట్ సబ్స్: సందీప్ శర్మ, శుభమ్ దూబే, లువాన్-డ్రే ప్రిటోరియస్, రవి సింగ్, యష్ పుంజా -
చరిత్ర సృష్టించిన అభిషేక్.. సరికొత్త ప్రపంచ రికార్డు
ఎస్ఆర్హెచ్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టీ20 ఫార్మాట్లో ఆరు సార్లు 20 బంతుల్లోపే హాఫ్ సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. యావత్ పొట్టి క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఆటగాడూ కనీసం ఐదు సార్లు కూడా 20 బంతుల్లోపు హాఫ్ సెంచరీలు చేయలేదు. ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్గా అభిషేక్ సరికొత్త చరిత్ర లిఖించాడు. ఈ రికార్డుతో పాటు అభిషేక్ ఖాతాలో మరో రికార్డు కూడా చేరింది. అతని టీ20 కెరీర్లో 15 అంతకంటే తక్కువ బంతుల్లో నాలుగు సార్లు హాఫ్ సెంచరీలు పూర్తి చేశాడు. ఈ ఘనతను సాధించిన ఏకైక ఆటగాడు కూడా అతనే.తాజాగా అభిషేక్ ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 18) సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అతని ఐపీఎల్ కెరీర్లో ఇది అత్యంత వేగవంతమైనది. ఈ ఇన్నింగ్స్లో అతను మొత్తంగా 22 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 59 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్ కారణంగానే సీఎస్కేపై సన్రైజర్స్ గెలుపొందింది.అభిషేక్ ఇచ్చిన మెరుపు ఆరంభం ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్కు గట్టి పునాది వేసింది. అతను అర్ద సెంచరీ తర్వాత ఔటైనా క్లాసెన్ స్కోర్ను 200 మార్కు దగ్గరికి (194-9) తీసుకెళ్లాడు. అనంతరం ఛేదనలో సగం మ్యాచ్ వరకు గెలుపు దిశగా సాగిన సీఎస్కే, ఆతర్వాత ఎస్ఆర్హెచ్ బౌలర్లు చెలరేగడంతో లక్ష్యానికి 11 పరుగుల దూరంలో నిలిచిపోయి, 10 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఎషాన్ మలింగ (4-0-29-3), నితీశ్ కుమార్ రెడ్డి (4-0-31-2), సాకిబ్ హుస్సేన్ (4-0-32-1), శివాంగ్ కుమార్ (3-0-18-1) అద్భుతంగా బౌలింగ్ చేసి సీఎస్కే గెలుపును అడ్డుకున్నారు.ఈ మ్యాచ్లో అభిషేక్ చేసిన హాఫ్ సెంచరీకి మరో ప్రాముఖ్యత కూడా ఉంది. ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ తరఫున ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (15). ఇదే ఇన్నింగ్స్తో అభిషేక్ ఐపీఎల్లో 2000 పరుగులు (1192 బంతులు) కూడా పూర్తి చేశాడు. ఈ మైలురాయిని అత్యంత వేగంగా తాకిన ఆటగాళ్ల జాబితాలో ఆండ్రీ రసెల్ (1120 బంతులు) తర్వాతి స్థానంలో నిలిచాడు. -
సన్రైజర్స్ మ్యాచ్లో బ్లాక్ మ్యాజిక్..! అందుకే సీఎస్కే ఓడిపోయింది?
ఐపీఎల్-2026 సన్రైజర్స్ హైదరాబాద్ మూడో విజయాన్ని అందుకుంది. శనివారం ఉప్పల్ మైదానం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 10 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ గెలుపొందింది. ఈ విజయంతో సన్రైజర్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్ధానానికి చేరుకుంది. ఆరెంజ్ ఆర్మీ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ రెండింటిలోనూ అదరగొట్టింది.అయితే ఈ మ్యాచ్ ఫలితం కంటే.. సీఎస్కే ఇన్నింగ్స్ సందర్భంగా జరిగిన ఓ ఆసక్తికర సంఘటన ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. సీఎస్కే బ్యాటర్ దూబే క్రీజులో ఉన్నప్పుడు గ్యాలరీలో ఉన్న ఒక ఎస్ఆర్హెచ్ అభిమాని నిమ్మకాయ చేతిలో పట్టుకుని ఏవో మంత్రాలు చదువుతున్నట్లు కెమెరా కంటికి చిక్కాడు.వెంటనే శివమ్ దూబే.. సాకిబ్ హుస్సేన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో సదరు అభిమాని సంబరాల్లో మునిగితేలిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు బ్లాక్ మ్యాజిక్ కారణంగానే దుబే ఔట్ అయ్యాడని సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు.మరి కొంతమంది మంత్రాలకు చింతకాయలు రాలవంటూ మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సంఘటనపై సీఎస్కే యాజమాన్యం బీసీసీఐకి ఫిర్యాదు చేసిందంటూ ఓ లెటర్ హెడ్ సోషల్ మీడియాలో వైరలవుతుంది.చదవండి: BCCI: అజిత్ అగార్కర్ భవితవ్యంపై బీసీసీఐ సంచలన నిర్ణయంpic.twitter.com/u3BSpB3sXa— gocvideo (@gocvideo) April 19, 2026 -
అజిత్ అగార్కర్ భవితవ్యంపై బీసీసీఐ సంచలన నిర్ణయం
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI).. సీనియర్ మెన్స్ సెలక్షన్ కమిటీ చైర్మెన్గా అజిత్ అగార్కర్ పదవీకాలాన్ని పొడిగించేందుకు సిద్దమైంది. కొత్త కాంట్రాక్ట్ ప్రకారం అగార్కర్ తన పదవిలో వన్డే వరల్డ్కప్-2027 వరకు కొనసాగనున్నాడు. వాస్తవానికి అగార్కర్ కాంట్రాక్ట్ ఈ ఏడాది చివర్లలో ముగియాల్సి ఉంది.కానీ వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్కప్ దృష్టిలో పెట్టుకుని చీఫ్ సెలక్టర్గా అగార్కర్నే కొనసాగించాలని బోర్డు నిర్ణయించింది. అగార్కర్ హయాంలో టీమిండియా అద్భుత విజయాలు సాధించింది. ఈ ముంబైకర్ బీసీసీఐ చీఫ్ సెలక్టర్గా 2023 జూలైలో బాధ్యతలు చేపట్టగా.. అప్పటి నుంచి భారత జట్టు వైట్-బాల్ క్రికెట్లో తిరుగులేని శక్తిగా ఎదిగింది.అతడి నేతృత్వంలో భారత్ మూడు ప్రధాన ఐసీసీ టోర్నీలను కైవసం చేసుకుంది. వరుసగా రెండు టీ20 ప్రపంచకప్(2024, 2026)లతో పాటు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా సొంతం చేసుకుంది. ఈ కారణాలతో అతడి కాంట్రాక్ట్ను బీసీసీఐ పొడిగించనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ధ్రువీకరించారు."అగార్కర్ హయంలో భారత జట్టు చారిత్రత్మక విజయాలను అందుకుంది. అతడి నేతృత్వంలో సెలక్షన్ కమిటీ కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంది. జట్టులో కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అతడి పని తీరు పట్ల బోర్డు సంతృప్తిగా ఉంది. అగార్కర్నే చైర్మెన్ కొనసాగించాలని బోర్డు భావిస్తోంది. ఐపీఎల్-2026 సందర్భంగా బీసీసీఐ కార్యవర్గ సభ్యులు సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటారు" అని సదరు అధికారి ఇండియన్ ఎక్స్ప్రెస్తో పేర్కొన్నారు.చదవండి: ఆ మూడు ఓవర్లే కొంపముంచాయి: రుతురాజ్ -
మహ్మద్ రిజ్వాన్ సంచలన వ్యాఖ్యలు
పాకిస్తాన్ స్టార్ వికెట్కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్లో పేలవ ఫామ్లో ఉన్న అతను.. విలేకరుల నుంచి రిటైర్మెంట్పై ఎదురైన ప్రశ్నలపై స్పందిస్తూ, తానెప్పుడు దానికి రెడీ అంటూ ఆసక్తికర సమాధానం చెప్పాడు.ఈ పీఎస్ఎల్ సీజన్లో కొత్త ఫ్రాంచైజీ రావల్పిండ్జ్కు సారథ్యం వహిస్తున్న రిజ్వాన్.. కెప్టెన్గా, వ్యక్తిగతంగా దారుణంగా విఫలమయ్యాడు. భారీ అంచనాల మధ్య పీఎస్ఎల్లోకి అడుగుపెట్టిన రావల్పిండ్జ్ ఈ సీజన్లో ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఓడి పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలిచింది. తద్వారా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగానూ నిలిచింది.రిజ్వాన్ ఈ సీజన్లో ఆడిన 7 మ్యాచ్ల్లో కేవలం 107 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా విఫలమయ్యాడు. తాజాగా లాహోర్ ఖలందర్స్ చేతిలో ఓటమి అనంతరం విలేకరులు రిజ్వాన్ రిటైర్మెంట్ ప్రస్తావన తెచ్చారు. ఇందుకు ఆయన బదులిస్తూ.. అవును నా ప్రదర్శన బాగా లేదు. ఇందుకు అంగీకరిస్తాను. నేను విమర్శలకు భయపడను. ప్రజలు నేను రిటైరవ్వాలనుకుంటే తప్పక వైదొలుగుతాను. ఈ విషయాన్ని గతంలోనూ చాలా సార్లు చెప్పాను. నేను ప్రశ్నలకు గానీ, మీడియాకు కానీ భయపడను. నా లోపం ఉంటే తప్పక అంగీకరిస్తానని అన్నాడు.కాగా, రిజ్వాన్ పీఎస్ఎల్లోనే కాక అంతర్జాతీయ స్థాయిలో సైతం గత కొంతకాలంగా దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ కారణంగా అతను టీ20 జట్టులో చోటును కూడా కోల్పోయాడు. విదేశీ లీగ్ల్లో సైతం తేలిపోతున్నాడు. రిజ్వాన్ పీఎస్ఎల్లో కెప్టెన్గా గత 17 మ్యాచ్ల్లో 16 మ్యాచ్లు ఓడిపోయాడు. -
సీఎస్కేకు కోలుకోలేని దెబ్బ
ఐపీఎల్ 2026లో సీఎస్కేకు కోలుకోలేని దెబ్బ తగిలింది. నిన్న (ఏప్రిల్ 18) ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ సందర్భంగా గాయపడిన (hamstring tear) యువ బ్యాటర్ ఆయుశ్ మాత్రే సీజన్ మొత్తానికి దూరమయ్యాడని తెలుస్తుంది. మాత్రే గాయంపై ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ అధికారక ప్రకటన చేశాడు. మాత్రే గాయం చాలా తీవ్రమైందని ఆయన ధృవీకరించాడు. హస్సీ ప్రకటనతో మాత్రే సీజన్ మొత్తానికి దూరమవుతున్న విషయం స్పష్టమవుతుంది.ఈ సీజన్లో మాత్రే అద్భుతమైన టచ్లో ఉన్నాడు. దాదాపు ప్రతి మ్యాచ్లో తనవంతు కర్తవ్యాన్ని సమర్దవంతంగా నిర్వర్తించాడు. సీఎస్కే సాధించిన రెండు విజయాల్లోనూ తనదైన పాత్ర పోషించాడు. ఇలాంటి సమయంలో అతను జట్టుకు దూరం కావడం సీఎస్కేకు భారీ ఎదురుదెబ్బే అవుతుంది. ఎస్ఆర్హెచ్ మ్యాచ్లోనే మాత్రే చాలా ఇబ్బందిపడుతూ బ్యాటింగ్ చేశాడు.మాత్రే గాయం తీవ్రత స్కానింగ్స్లో తెలుస్తుంది. ఈ సీజన్లో మాత్రే ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో 178 స్ట్రయిక్రేట్తో 201 పరుగులు చేసింది. ఇందులో 2 అర్ద సెంచరీలు, రెండు 30 ప్లస్ స్కోర్లు ఉన్నాయి. తదుపరి మ్యాచ్ల్లో మాత్రే స్థానాన్ని ఉర్విల్ పటేల్తో భర్తీ చేసే అవకాశం ఉంది. మాత్రే గాయం సీఎస్కే గాయాల జాబితాను మరింత పెద్దది చేసింది. ఇప్పటికే ధోని, ఖలీల్ అహ్మద్, నాథన్ ఎలిస్, స్పెన్సర్ జాన్సన్ ఈ జాబితాలో ఉన్నారు.నిన్నటి ఎస్ఆర్హెచ్-సీఎస్కే మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో సీఎస్కే 10 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. హ్యాట్రిక్ పరాజయాలు, రెండు వరుస విజయాల తర్వాత సీఎస్కేకు ఎదురైన మరో పరాజయం ఇది. వాస్తవానికి ఈ మ్యాచ్లో సీఎస్కే గెలవాల్సింది. అయితే ఆ జట్టు చేజేతులా ఈ అవకాశాన్ని జారవిడ్చుకుంది. తొలుత బౌలింగ్లో సన్రైజర్స్ను భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేసిన సీఎస్కే బౌలర్లు.. ఆతర్వాత ఛేదనలో సగం వరకు మ్యాచ్పై పట్టు నిలుపుకున్నారు. అయితే అనూహ్యంగా సన్రైజర్స్ బౌలర్లు మ్యాచ్పై పట్టుబిగించి సీఎస్కే గెలుపును అడ్డుకున్నారు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (59), క్లాసెన్ (59) అర్ద సెంచరీలతో రాణించారు. సీఎస్కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్ (3-0-22-3), జేమీ ఓవర్టన్ (4-0-37-3), ముకేశ్ చౌదరి (2-0-21-2), గుర్జప్నీత్ సింగ్ (4-0-34-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు.అనంతరం బరిలోకి దిగిన సీఎస్కే ఓ దశ వరకు సునాయాసంగా గెలిచేలా కనిపించినా, చివరికి ఓటమిపాలైంది. ఎస్ఆర్హెచ్ బౌలర్లు ఎషాన్ మలింగ (4-0-29-3), నితీశ్ కుమార్ రెడ్డి (4-0-31-2) సీఎస్కేకు అడ్డుకట్ట వేశారు. వీరి ధాటికి సీఎస్కే 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. -
సీఎస్కే ఫ్యాన్స్ నోళ్లు మూయించిన కావ్యా మారన్.. వైరల్ వీడియో
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 18) రాత్రి జరిగిన మ్యాచ్లో సీఎస్కేపై సన్రైజర్స్ 10 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపు అనంతరం మైదానంలోని స్టాండ్స్లో ఓ ఆసక్తికర సన్నివేశం తారసపడింది. సన్రైజర్స్ యజమాని కావ్యా మారన్ తనదైన శైలిలో సంబురాలు చేసుకుంటూ కనిపించింది. భావోద్వేగాలను ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోలేని కావ్యా, సన్రైజర్స్ గెలవగానే చిన్నపిల్లలా ఎగిరిగంతులేసింది. ఈ క్రమంలో అప్పటికే అల్లరి చేస్తున్న సీఎస్కే అభిమానుల నోళ్లు మూయించింది. నోటిపై వేలు పెట్టి సైలెన్స్ అంటూ విరాట్ కోహ్లి స్టయిల్లో గెస్టర్ ఇచ్చింది. Kavya Maran doing Silence gesture🤫🔥🔥🔥 pic.twitter.com/C5FDifkPej— Eagle_Riser 🦅 (@UnpairedElect17) April 18, 2026విరాట్ కూడా అభిమానులు ఎక్కువ హడావుడి చేస్తే నోటిపై వేలు పెట్టి సైలెన్స్ అంటూ గెశ్చర్స్ ఇస్తాడు. కావ్యా సీఎస్కే అభిమానుల నోళ్లు మూయించిన వీడియోలు సోషల్మీడియాలో వైరలవుతున్నాయి. వీటిని చూసి తమిళ ప్రజలు కావ్యా మారన్పై మండిపడుతున్నారు. తమిళురాలై ఉండి, తమిళ అభిమానుల నోళ్లు మూయించడమేంటని ఫైరవుతున్నారు.కాగా, నిన్నటి మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (59), క్లాసెన్ (59) అర్ద సెంచరీలతో రాణించారు. సీఎస్కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్ (3-0-22-3), జేమీ ఓవర్టన్ (4-0-37-3), ముకేశ్ చౌదరి (2-0-21-2), గుర్జప్నీత్ సింగ్ (4-0-34-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు.అనంతరం బరిలోకి దిగిన సీఎస్కే ఓ దశ వరకు సునాయాసంగా గెలిచేలా కనిపించినా, చివరికి అనూహ్యంగా ఓటమిపాలైంది. ఎస్ఆర్హెచ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి సీఎస్కే గెలుపును అడ్డుకున్నారు. ముఖ్యంగా ఎషాన్ మలింగ (4-0-29-3), నితీశ్ కుమార్ రెడ్డి (4-0-31-2) సీఎస్కేకు అడ్డుకట్ట వేశారు. సాకిబ్ హుస్సేన్ (4-0-32-1), శివాంగ్ కుమార్ (3-0-18-1) కూడా పర్వాలేదనిపించారు. వీరి ధాటికి సీఎస్కే 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. సీఎస్కే ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. 34 పరుగులు చేసిన మాథ్యూ ఫార్ట్ ఆ జట్టులో టాప్ స్కోరర్. ఈ మ్యాచ్లో గెలుపుతో సన్రైజర్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. -
సీఎస్కే చెత్త రికార్డు
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 18) రాత్రి జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ 10 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (59), క్లాసెన్ (59) అర్ద సెంచరీలతో రాణించారు. సీఎస్కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్ (3-0-22-3), జేమీ ఓవర్టన్ (4-0-37-3), ముకేశ్ చౌదరి (2-0-21-2), గుర్జప్నీత్ సింగ్ (4-0-34-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు.అనంతరం బరిలోకి దిగిన సీఎస్కే ఓ దశ వరకు సునాయాసంగా గెలిచేలా కనిపించినా, చివరికి అనూహ్యంగా ఓటమిపాలైంది. ఎస్ఆర్హెచ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి సీఎస్కే గెలుపును అడ్డుకున్నారు. ముఖ్యంగా ఎషాన్ మలింగ (4-0-29-3), నితీశ్ కుమార్ రెడ్డి (4-0-31-2) సీఎస్కేకు అడ్డుకట్ట వేశారు. సాకిబ్ హుస్సేన్ (4-0-32-1), శివాంగ్ కుమార్ (3-0-18-1) కూడా పర్వాలేదనిపించారు. వీరి ధాటికి సీఎస్కే 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. సీఎస్కే ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. 34 పరుగులు చేసిన మాథ్యూ షార్ట్ ఆ జట్టులో టాప్ స్కోరర్.హ్యాట్రిక్ ఓటములు, రెండు వరుస విజయాల తర్వాత సీఎస్కే మూటగట్టుకున్న మరో ఓటమి ఇది. ఈ ఓటమితో సీఎస్కే పలు చెత్త రికార్డులను సొంతం చేసుకుంది.2019 తర్వాత ఆ జట్టు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్లో కూడా 180 ప్లస్ టార్గెట్ను ఛేదించలేదు. 14 ప్రయత్నాల్లో ఓటమినే చవిచూసింది. సీఎస్కే చివరిసారిగా 180 ప్లస్ టార్గెట్ను 2018 సీజన్లో ఇదే ఎస్ఆర్హెచ్పై ఛేదించింది.ఇది కాక సీఎస్కే మరో చెత్త రికార్డును కూడా కొనసాగించింది. నిన్న ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ జరిగిన వేదికపై (హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియం) సీఎస్కే ఎనిమిదేళ్లుగా ఒక్క గెలుపూ నమోదు చేయలేదు. ఈ వేదికపై సీఎస్కేకు అతి చెత్త రికార్డు ఉంది. కాగా, నిన్నటి పరాజయం తర్వాత సీఎస్కే పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉండగా.. ఎస్ఆర్హెచ్ నాలుగో స్థానానికి ఎగబాకింది. -
ఆ మూడు ఓవర్లే కొంపముంచాయి: రుతురాజ్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 18) రాత్రి జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ 10 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్లో సీఎస్కే బౌలర్లు అద్భుతమైన కమ్బ్యాక్ ఇచ్చి ఎస్ఆర్హెచ్ బ్యాటర్లను కట్టడి చేసినప్పటికీ.. ఆతర్వాత బ్యాటర్లు లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమయ్యారు. ఒక్క బ్యాటర్ కుదురుగా క్రీజ్లో నిలబడినా, ఈ మ్యాచ్లో సీఎస్కే గెలిచేదే.ఛేదనలో సగం మ్యాచ్ వరకు పట్టు నిలుపుకున్న సీఎస్కే, ఆతర్వాత అనూహ్యంగా ఒత్తిడికి చిత్తై లక్ష్యానికి 11 పరుగుల దూరంలో నిలిచిపోయింది. 195 పరుగుల ఛేదనలో సీఎస్కే స్కోర్ 10 ఓవర్ల తర్వాత 111-3గా ఉండింది. ఈ దశలో ఆ జట్టు గెలుపు నల్లేరుపైనడకే అనుకున్నారు. అయితే ఆతర్వాత మూడు ఓవర్లు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాయి. 11, 12, 13 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఆ ఓవర్లలో సీఎస్కే కేవలం 9 పరుగులు మాత్రమే చేసి 2 వికెట్లు కోల్పోయింది.ఆతర్వాత ఓవర్లలోనూ సీఎస్కే బ్యాటర్లు అడపాదడపా పరుగులు చేసి గెలుపుపై ఆశలు సజీవంగానే ఉంచారు. అయితే చివరి ఓవర్లలో ఎస్ఆర్హెచ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి సీఎస్కే బ్యాటర్లను కట్టడి చేశారు. ఛేదించదగ్గ లక్ష్యమే (6 బంతుల్లో 18 పరుగులు) కళ్ల ముందు ఉన్నా, సీఎస్కే బ్యాటర్లు దాన్ని అందుకోలేకపోయారు. ఫలితంగా సునాయాసంగా గెలుస్తుందనుకున్న మ్యాచ్లో సీఎస్కే ఓడింది.ఈ ఓటమి అనంతరం సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఇలా అన్నాడు. ఇలాంటి పిచ్పై 195 పరుగుల లక్ష్యం ఏ రోజైనా సాధ్యమే. తొలుత 220–230 స్కోరు వచ్చేలా అనిపించింది. కానీ మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి 30-40 పరుగులు నిరోధించగలగారు. 10 ఓవర్ల తర్వాత 80 పరుగులు మాత్రమే అవసరం. 6 వికెట్లు చేతిలో ఉన్నాయి. ఒక్క భాగస్వామ్యం నెలకొల్పగలిగినా మ్యాచ్ మాదే. కానీ ఆతర్వాత 3 ఓవర్లలో కేవలం 9 పరుగులే రావడం మ్యాచ్ స్వరూపాన్ని మర్చేసింది. డెత్ ఓవర్లలో 12–13 రన్స్ ఛేజ్ చేయడం కష్టంగా మారింది.మా బౌలింగ్ యూనిట్ను ప్రశంసించాలి. వరుసగా మూడు మ్యాచ్ల్లో అద్భుతంగా బౌలింగ్ చేశారు. పవర్ప్లేలో అభిషేక్ శర్మ బాగా ఆడినా, ఆతర్వాత మొమెంటమ్ తిరిగి పొందాం. జేమీ ఓవర్టన్, గుర్జప్నీత్ సింగ్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్.. అందరూ బాగా బౌలింగ్ చేశారు.ముఖ్యంగా అన్షుల్ డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇందు కోసం అతను చాలా కష్టపడి పనిచేస్తున్నాడు. చాలా స్పష్టంగా తన ప్లాన్స్ చెప్పి, కెప్టెన్ నేను ఇలా చేస్తానని నమ్మకంగా చెప్పే బౌలర్లు చాలా అరుదుగా ఉంటారు. మొత్తంగా అన్షుల్ ప్రతిరోజూ మెరుగుపడుతున్నాడు. రుతురాజ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. ఈ మ్యాచ్లో ఓడినా, అతని బౌలర్లపై సంతృప్తిగానే ఉన్నాడు. ఛేదించదగ్గ లక్ష్యమే అయినా, కొద్ది ఓవర్లు కొంపముంచాయని అభిప్రాయపడ్డాడు. మొత్తంగా సీఎస్కే హ్యాట్రిక్ ఓటములు, రెండు వరుస విజయాల తర్వాత మరో ఓటమిని మూటగట్టుకొని పాయింట్ల పట్టికలో ఏదో స్థానంలో కొనసాగుతుంది. -
ప్లాన్ ప్రకారం చేస్తున్నారు: ఇషాన్ కిషన్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 18) రాత్రి జరిగిన మ్యాచ్లో సీఎస్కేపై సన్రైజర్స్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ను బౌలర్లు గెలిపించారు. తొలుత బ్యాటింగ్ చేసి 194 పరుగులు చేసిన సన్రైజర్స్, ఆతర్వాత లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. ఎషాన్ మలింగ (4-0-29-3), నితీశ్ కుమార్ రెడ్డి (4-0-31-2), సాకిబ్ హుస్సేన్ (4-0-32-1), శివాంగ్ కుమార్ (3-0-18-1) అద్భుతంగా బౌలింగ్ చేసి సీఎస్కేను గెలుపును అడ్డుకున్నారు.మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ తమ బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇషాన్ మాటల్లో..యువ బౌలర్లు ప్లాన్ ప్రకారం బౌలింగ్ చేస్తున్నారు. వారు తమ ప్లాన్లను అమలు చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. వారు స్వయంగా ప్లాన్లు తయారు చేసుకోవడంతో కెప్టెన్గా ఫీల్డ్ సెట్ చేయడంలో ఒత్తిడి తగ్గింది. ప్రాక్టీస్ సెషన్స్లో వారు కష్టపడి మెరుగుపడుతున్నారు. అందుకే వారిపై పూర్తి నమ్మకం ఉంచి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాము.బ్యాటింగ్లో లోటుపై మాట్లాడుతూ.. అభిషేక్ శర్మ త్వరగా ఔట్ కావడంతో 20–30 పరుగులు తక్కువ చేశామని అనిపించింది. సాధారణంగా మా టాప్-3లో ఒకరు పెద్ద స్కోరు చేస్తారు. కానీ ఈ మ్యాచ్లో అది జరగలేదు. పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉండింది. కాబట్టి 220–230 పరుగులు చేసి ఉండవచ్చు.పాయింట్స్ టేబుల్పై మాట్లాడుతూ.. మేము పాయింట్స్ టేబుల్ గురించి ఆలోచించడం లేదు. ఇది చాలా సుదీర్ఘమైన టోర్నీమెంట్. ఏ మ్యాచ్కు ఆ మ్యాచ్ను టార్గెట్గా పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నాము. ప్రతి మ్యాచ్ను ఆస్వాదిస్తూ, అగ్రెసివ్గా ఆడటమే మా కర్తవ్యం.ఇషాన్ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. బౌలర్ల ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నట్లు స్పష్టమైంది. అలాగే బ్యాటింగ్లో మరిన్ని పరుగులు సాధించాలనే ఉద్దేశం బయటపడింది. మొత్తంగా జట్టు ప్రదర్శన పట్ల ఇషాన్ సంతోషంగా ఉన్నారు. ఈ గెలుపు తర్వాత సన్రైజర్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఏప్రిల్ 21న జరిగే తదుపరి మ్యాచ్లో ఈ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ కూడా ఎస్ఆర్హెచ్ సొంత మైదానం హైదరాబాద్లోనే జరుగనుంది. -
సన్రైజర్స్ అదరహో
సన్రైజర్స్ బ్యాటింగ్ మొదలైన తీరును బట్టి జట్టు కనీసం 220కు పైగా స్కోరు చేస్తుందని అనిపించింది. అయితే చివర్లో బ్యాటర్ల వైఫల్యంతో స్కోరు 200 కూడా దాటలేదు. చెన్నై ఇన్నింగ్స్లో ఆయుశ్ మాత్రే ఆటను చూస్తేసునాయాసంగా ఆ జట్టు లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. కానీ రైజర్స్ బౌలర్లు ఒక్కసారిగా చెలరేగిపోయారు. బంతిపై పట్టు చేజారనీయకుండా ప్రత్యర్థిని కట్టిపడేశారు. ఐదుగురు బౌలర్లు కనీసం ఒక వికెట్ తీయడంతో చెన్నై చతికిలపడింది. హైదరాబాద్ ఖాతాలో మూడో గెలుపు చేరింది. అంతకుముందు అభిషేక్ శర్మ, క్లాసెన్ మెరుపులతో చెన్నైపై హైదరాబాద్ తమ అత్యధిక స్కోరును నమోదు చేసింది. సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై జోరును ప్రదర్శిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ రెండో వరుస విజయాన్ని అందుకుంది. శనివారం ఉప్పల్ స్టేడియంలో చివరి వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో రైజర్స్ 10 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (22 బంతుల్లో 59; 6 ఫోర్లు, 4 సిక్స్లు), క్లాసెన్ (39 బంతుల్లో 59; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీలు సాధించగా... అన్షుల్ కంబోజ్, ఒవర్టన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులకే పరిమితమైంది. మాథ్యూ షార్ట్ (30 బంతుల్లో 34; 3 ఫోర్లు), ఆయుశ్ మాత్రే (13 బంతుల్లో 30; 5 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించగా, ఇషాన్ మలింగకు 3 వికెట్లు... నితీశ్ కుమార్ రెడ్డికి 2 వికెట్లు దక్కాయి. ఆఖరి ఓవర్లో చెన్నై విజయానికి 18 పరుగులు అవసరం రాగా, ప్రఫుల్ హింగే 7 పరుగులే ఇచ్చాడు. కెప్టెన్ విఫలం... షార్ట్ వేసిన తొలి ఓవర్లో 4 పరుగులే రావడంతో రైజర్స్ ఇన్నింగ్స్ ప్రశాంతంగా మొదలైంది. అయితే ఆ తర్వాత అభిషేక్ శర్మ దూకుడు మొదలైంది. తర్వాతి రెండు ఓవర్లలో ఒక్కో సిక్స్ బాదిన అభిషేక్... కంబోజ్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. అయితే మరో ఎండ్లో ముకేశ్ ఓవర్లో 3 ఫోర్లు బాది ధాటిని పెంచినట్లు కనిపించిన ట్రవిస్ హెడ్ (20 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. హెడ్ను అవుట్ చేసిన ముకేశ్ తర్వాతి బంతికే కెప్టెన్ ఇషాన్ కిషన్ (0) వికెట్ కూడా తీయడంతో పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 75 పరుగులకు చేరింది. కొద్దిసేపటికే ఒవర్టన్ తన తొలి ఓవర్లోనే అభిషేక్ను వెనక్కి పంపించాడు. ఈ దశలో క్లాసెన్ కొన్ని చక్కటి షాట్లతో స్కోరు పెంచే బాధ్యత తీసుకున్నాడు. మరోవైపు అనికేత్ వర్మ (2) ప్రభావం చూపలేకపోగా, ఉప్పల్లో గత రెండు మ్యాచ్లలో రాణించిన నితీశ్ కుమార్ రెడ్డి (12; 1 సిక్స్) ఈసారి విఫలమయ్యాడు. నూర్ అహ్మద్ ఓవర్లో భారీ సిక్స్ కొట్టిన క్లాసెన్ 32 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. చివర్లో సీఎస్కే బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు వేసి ప్రత్యర్థిని నిలువరించడంలో సఫలమయ్యారు. ఆఖరి 4 ఓవర్లలో రైజర్స్ 31 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు చేజార్చుకుంది. మాత్రే మినహా... ఛేదనలో చెన్నై ఆరంభంలోనే సంజు సామ్సన్ (7) వికెట్ కోల్పోయింది. తొలి బంతికే సిక్స్ కొట్టినా అతను ఎక్కువసేపు నిలవలేకపోయాడు. సున్నా వద్ద తాను ఇచ్చిన క్యాచ్ను క్లాసెన్ వదిలేయడంతో బతికిపోయిన మాత్రే ఆ తర్వాత దూకుడు ప్రదర్శించాడు. హింగే ఓవర్లోనే అతను 4 ఫోర్లు, 1 సిక్స్ బాది 22 పరుగులు రాబట్టడం విశేషం. అయితే క్లాసెన్ అద్భుత క్యాచ్తో మాత్రే ఇన్నింగ్స్ ముగియగా, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (19) వైఫల్యం ఈ మ్యాచ్లోనూ కొనసాగింది. పవర్ప్లేలో జట్టు 76 పరుగులు చేసింది. ఆ తర్వాత ఒక్క బ్యాటర్ కూడా బాధ్యతతో జట్టును నడిపించలేకపోయాడు. సర్ఫరాజ్ ఖాన్ (19 బంతుల్లో 25; 3 ఫోర్లు) తడబడుతూనే ఆడగా, షార్ట్ కూడా దూకుడు చూపించలేదు. హైదరాబాద్ మెరుగైన బౌలింగ్తో ఒత్తిడి పెరిగి జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. శివమ్ దూబే (16 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్)పై ఆశలు ఉండగా... 20 బంతుల్లో 41 పరుగులు చేయాల్సిన దశలో అతను అవుట్ కావడంతో గెలుపు దారులు మూసుకుపోయాయి. స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) సామ్సన్ (బి) ఒవర్టన్ 59; హెడ్ (సి) రుతురాజ్ (బి) ముకేశ్ 23; ఇషాన్ కిషన్ (సి) రుతురాజ్ (బి) ముకేశ్ 0; క్లాసెన్ (బి) కంబోజ్ 59; అనికేత్ (సి) నూర్ (బి) ఒవర్టన్ 2; నితీశ్ రెడ్డి (సి) షార్ట్ (బి) ఒవర్టన్ 12; అరోరా (సి) బ్రెవిస్ (బి) గుర్జప్నీత్ 13; లివింగ్స్టోన్ (సి) బ్రెవిస్ (బి) కంబోజ్ 1; శివాంగ్ (సి) గుర్జప్నీత్ (బి) కంబోజ్ 12; హింగే (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 194. వికెట్ల పతనం: 1–75, 2–75, 3–93, 4–112, 5–147, 6–177, 7–179, 8–193, 9–194. బౌలింగ్: షార్ట్ 3–0–38–0, ముకేశ్ చౌదరి 2–0–21–2, కంబోజ్ 3–0–22–3, నూర్ 4–0–33–0, ఒవర్టన్ 4–0–37–3, గుర్జప్నీత్ 4–0–34–1. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) క్లాసెన్ (బి) నితీశ్ రెడ్డి 7; రుతురాజ్ (సి) అరోరా (బి) మలింగ 19; మాత్రే (సి) క్లాసెన్ (బి) నితీశ్ రెడ్డి 30; షార్ట్ (సి) అనికేత్ (బి) మలింగ 34; సర్ఫరాజ్ (సి) నితీశ్ రెడ్డి (బి) మలింగ 25; బ్రెవిస్ (సి) లివింగ్స్టోన్ (బి) శివాంగ్ 0; దూబే (బి) సాకిబ్ 21; ఒవర్టన్ (సి) లివింగ్స్టోన్ (బి) హింగే 16; కంబోజ్ (నాటౌట్) 13; నూర్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 184. వికెట్ల పతనం: 1–15, 2–66, 3–66, 4–112, 5–113, 6–148, 7–154, 8–182. బౌలింగ్: ప్రఫుల్ హింగే 4–0–60–1, నితీశ్ రెడ్డి 4–0–31–2, సాకిబ్ 4–0–32–1, ఇషాన్ మలింగ 4–0–29–3, శివాంగ్ 3–0–18–1, అభిషేక్ 1–0–13–0.షార్ట్పై అభిషేక్ దాడి... ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన మాథ్యూ షార్ట్ బ్యాటర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. 3 బంతులాడిన అభిషేక్ 2 పరుగులే చేయగలిగాడు. అయితే ఆ తర్వాత అభిషేక్ తానేంటో షార్ట్కు చూపించాడు. అతని రెండో ఓవర్లో ఒక సిక్స్ కొట్టిన అతను... మూడో ఓవర్లో చెలరేగిపోయాడు. తొలి బంతికి హెడ్ సింగిల్ తీయగా... తర్వాతి ఐదు బంతుల్లో వరుసగా 4, 4, 4, 6, 6 బాది 20 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో 15 బంతుల్లోనే అభిషేక్ అర్ధసెంచరీ పూర్తయింది. ఆ తర్వాత 51 పరుగుల వద్ద దూబే అతని క్యాచ్ను వదిలేసినా...దాని వల్ల ఎక్కువ ప్రయోజనం కలగలేదు.ధోని ఆడలేదు... భారత స్టార్ మహేంద్ర సింగ్ ధోని ఆటను చూసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులకు నిరాశ తప్పలేదు. గాయం కారణంగా టోర్నీ ఆరంభం నుంచి ఒక్క మ్యాచ్ కూడా ఆడని ధోని టీమ్తో పాటు హైదరాబాద్కు వచ్చాడు. శుక్రవారం ప్రాక్టీస్లో కూడా అతను పాల్గొన్నాడు. దాంతో బరిలోకి దిగవచ్చని అనిపించింది. అయితే మరోసారి ధోని పెవిలియన్కే పరిమితమయ్యాడు. 2025 సీజన్ షెడ్యూల్లో భాగంగా ఉప్పల్లో హైదరాబాద్, చెన్నై మధ్య మ్యాచే జరగలేదు. ఈసారి ఆ మ్యాచ్ వచ్చినా... ధోని ఆట మాత్రం నగర ఫ్యాన్స్ చూడలేకపోయారు. 2024లో ఆడిన మ్యాచ్లో ధోని 2 బంతులే ఎదుర్కొన్నాడు! -
ఢిల్లీ ధమాకా
బెంగళూరు: సొంతగడ్డపై ఈ ఐపీఎల్ సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు తొలి ఓటమి చవిచూసింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్ల తేడాతో బెంగళూరు జట్టును బోల్తా కొట్టించింది. ముందుగా కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని సాధారణ స్కోరుకే కట్టడి చేసిన ఢిల్లీ... ఛేదనలో చివరి వరకు పోరాడి విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన బెంగళురు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (38 బంతుల్లో 63; 4 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా... విరాట్ కోహ్లి (13 బంతుల్లో 19; 3 ఫోర్లు) సహా తక్కినవాళ్లు విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్, ఎన్గిడి, కుల్దీప్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 19.5 ఓవర్లలో 4 వికెట్లకు 179 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రిస్టన్ స్టబ్స్ (47 బంతుల్లో 60 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), కేఎల్ రాహుల్ (34 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధశతకాలతో అదరగొట్టారు. భువనేశ్వర్ (3/26) ధాటికి 18 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో ఈ జోడీ నిలబడి ఢిల్లీని ఆదుకుంది. ఆఖర్లో డేవిడ్ మిల్లర్ (10 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్లు) ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. మిల్లర్ 6, 6, 4 ఛేదనలో ఢిల్లీకి శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్ నాలుగో బంతికి నిసాంక (1)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న భువనేశ్వర్... ఇన్నింగ్స్ మూడో ఓవర్లో రెండు వికెట్లతో సత్తా చాటాడు. కరుణ్ నాయర్ (5) సమీర్ రిజ్వీ (2)లను పెవిలియన్ బాటపట్టించి ఢిల్లీని ఆత్మరక్షణలోకి నెట్టాడు. ఈ దశలో స్టబ్స్తో కలిసి ‘బర్త్డే బాయ్’ రాహుల్ ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. 30 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న అనంతరం రాహుల్ అవుట్ కాగా... అక్షర్ పటేల్ (19 బంతుల్లో 26; 3 ఫోర్లు) కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. ఢిల్లీ విజయానికి చివరి ఓవర్లో 15 పరుగులు అవసరం కాగా... షెఫర్డ్ తొలి రెండు బంతులకు రెండు పరుగులే ఇచ్చాడు. ఉత్కంఠ పెరుగుతున్న సమయంలో మిల్లర్ 6, 6, 4 కొట్టి జట్టును గెలిపించాడు. సాల్ట్ ఒక్కడే... అంతకుముందు ఆర్సీబీ ఇన్నింగ్స్ ప్రారంభమైన తీరుకు... ముగిసిన విధానానికి పొంతనే లేదు. ఓపెనర్లు సాల్ట్, కోహ్లి ధాటిగా ఆడటంతో... 5 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. ఆ తర్వాత కోహ్లి అవుట్ కాగా... దేవదత్ పడిక్కల్ (18), కెపె్టన్ రజత్ పాటీదార్ (8), టిమ్ డేవిడ్ (26), జితేశ్ శర్మ (14), షెఫర్డ్ (1), కృనాల్ పాండ్యా (12) పెవిలియన్కు క్యూ కట్టారు. పేస్ బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కొన్న ఆర్సీబీ బ్యాటర్లు స్పిన్ను ఎదుర్కోవడంలో తడబడ్డారు. అక్షర్ పటేల్, కుల్దీప్ కట్టిపడేయడంతో పరుగుల రాక గగనమైంది. దీంతో ఒత్తిడికి గురైన ఆర్సీబీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ఆర్సీబీ ఈ మ్యాచ్లో ఆకుపచ్చ రంగు జెర్సీతో బరిలోకి దిగింది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి) స్టబ్స్ (బి) కుల్దీప్ 63; కోహ్లి (సి) నిసాంక (బి) ఎన్గిడి 19; పడిక్కల్ (సి) మిల్లర్ (బి) అక్షర్ 18; పాటీదార్ (సి) రాహుల్ (బి) ముకేశ్ 8; డేవిడ్ (సి) నటరాజన్ (బి) అక్షర్ 26; జితేశ్ (సి) మిల్లర్ (బి) ఎన్గిడి 14; షెఫర్డ్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 1; కృనాల్ పాండ్యా (రనౌట్) 12; రసిక్ సలామ్ (నాటౌట్) 0; భువనేశ్వర్ (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 175. వికెట్ల పతనం: 1–52, 2–99, 3–105, 4–131, 5–146, 6–149, 7–172, 8–172. బౌలింగ్: అఖీబ్ నబీ 3–0–36–0; ముకేశ్ 4–0–32–1; ఎన్గిడి 4–0–39–2; కుల్దీప్ 4–0–32–2; నటరాజన్ 2–0–16–0; అక్షర్ 3–0–18–2. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: నిసాంక (ఎల్బీ) (బి) భువనేశ్వర్ 1; కేఎల్ రాహుల్ (సి) కోహ్లి (బి) కృనాల్ 57; కరుణ్ నాయర్ (సి) సాల్ట్ (బి) భువనేశ్వర్ 5; సమీర్ రిజ్వీ (సి) జితేశ్ (బి) భువనేశ్వర్ 2; స్టబ్స్ (నాటౌట్) 60; అక్షర్ (రిటైర్డ్ హర్ట్) 26; మిల్లర్ (నాటౌట్) 22; ఎక్స్ట్రాలు 6; మొత్తం (19.5 ఓవర్లలో 4 వికెట్లకు) 179. వికెట్ల పతనం: 1–2, 2–16, 3–18, 4–87. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–26–3; హాజల్వుడ్ 4–0–38–0; రసిక్ 4–0–40–0; కృనాల్ 4–0–24–1; సుయాశ్ 3–0–31–0; షెఫర్డ్ 0.5–0–17–0.100హోం గ్రౌండ్లో 100 మ్యాచ్లు ఆడిన తొలి ఐపీఎల్ జట్టుగా ఆర్సీబీ గుర్తింపు పొందింది. సరిగ్గా 19 ఏళ్ల క్రితం ఏప్రిల్ 18న చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, కోల్కతా నైట్రైడర్స్ మధ్య మ్యాచ్తో ఐపీఎల్ మొదలైంది. ఈ వేదికపై మొదటి మ్యాచ్, 50వ మ్యాచ్, 100వ మ్యాచ్లోనూ ఆర్సీబీ జట్టుకు ఓటమి ఎదురుకావడం గమనార్హం. హోం గ్రౌండ్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన జాబితాలో కోల్కతా నైట్రైడర్స్ (ఈడెన్ గార్డెన్స్లో 98 మ్యాచ్లు), ముంబై ఇండియన్స్ (వాంఖడే స్టేడియంలో 95 మ్యాచ్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. -
లెక్క సరిచేసేందుకు...
డర్బన్: దక్షిణాఫ్రికా పర్యటనను పరాజయంతో ప్రారంభించిన భారత మహిళల క్రికెట్ జట్టు... నేడు రెండో మ్యాచ్ ఆడనుంది. టి20 ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా జరుగుతున్న ఈ ఐదు మ్యాచ్ల సిరీస్ను సమం చేయాలని హర్మన్ప్రీత్ కౌర్ బృందం భావిస్తోంది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఓడింది. భారత జట్టు నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత ఇన్నింగ్స్లో హర్మన్ప్రీత్, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ ఫర్వాలేదనిపించగా... స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన, రిచా ఘోష్ విఫలమయ్యారు. ఒక దశలో పటిష్ట స్థితిలో కనిపించిన టీమిండియా... జోరు పెంచాల్సిన దశలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. అనంతరం బౌలింగ్లోనూ ఎలాంటి మ్యాజిక్ చేయలేక ఓటమి వైపు నిలిచింది. అయితే తొలి మ్యాచ్ లోపాలను సరిదిద్దుకొని ఈ మ్యాచ్లో సమష్టిగా సత్తా చాటేందుకు టీమిండియా రెడీ అయింది. బౌలింగ్లో తెలుగమ్మాయిలు శ్రీచరణి, అరుంధతి రెడ్డి తొలి మ్యాచ్లో ఫర్వాలేదనిపించగా... వీరితో పాటు సీనియర్ బౌలర్లు దీప్తి శర్మ, రేణుక సింగ్ కలిసికట్టుగా కదంతొక్కాల్సిన అవసరముంది. ఇటీవల ఆ్రస్టేలియా, శ్రీలంకపై టి20 సిరీస్లు గెలిచిన టీమిండియా... నెల రోజుల విశ్రాంతి అనంతరం సఫారీ పర్యటనకు వెళ్లింది. తొలి మ్యాచ్ ఫ్లడ్లైట్ల వెలుతురులో జరగగా... ఆదివారం ‘డే మ్యాచ్’ నిర్వహించనున్నారు. మరోవైపు గత మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆతిథ్య సఫారీ జట్టు అదే జోరు కొనసాగిస్తూ సిరీస్లో మరింత ముందంజ వేయాలని చూస్తోంది. కెప్టెన్ వోల్వార్ట్తో పాటు, డెర్క్సన్, బ్రిట్స్, లుస్ మంచి ఫామ్లో ఉన్నారు. సఫారీ బ్యాటర్లను మన బౌలర్లు ఏమాత్రం కట్టడి చేస్తారనే దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. -
విభిన్న మస్కట్లకు ఆహ్వానం
న్యూఢిల్లీ: భారత్ వేదికగా జరగనున్న ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ కోసం ప్రత్యేక మస్కట్ రూపొందించేందుకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) దేశవ్యాప్త పోటీని ప్రకటించింది. 17 ఏళ్ల తర్వాత భారత్లో జరుగనున్న ఈ పోటీలకు ‘బాయ్’ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో అభిమానులు, దేశ ప్రజలను భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో విభిన్న ఆలోచనలు, సరికొత్త ఆకృతులకు ఆహ్వానం పలుకుతోంది. ఈ ఏడాది ఆగస్టు 17–23 మధ్య న్యూఢిల్లీ వేదికగా ఈ చాంపియన్షిప్ జరగనుంది. గత దశాబ్దంలో ఈ చాంపియన్షిప్లో భారత షట్లర్లు 15 పతకాలు సాధించారు. పీవీ సింధు 2019లో చారిత్రాత్మక స్వర్ణం గెలవగా... గతేడాది సాత్విక్–చిరాగ్ జంట కాంస్యం నెగ్గింది. దేశ క్రీడా ప్రగతిని, సాంస్కృతిక వైభవాన్ని, బ్యాడ్మింటన్ విజయ యాత్రను ప్రతిబింబించే విధంగా మస్కట్ రూపకల్పన ఉండాలని ‘బాయ్’ భావిస్తోంది. వచ్చేనెల 10 వరకు జరగనున్న ఈ పోటీలో ఆసక్తిగల వారు ‘బాయ్’ అధికారిక వెబ్సైట్ https://www. badmintonindia.org/ ద్వారా పేరు నమోదు చేసుకోవచ్చు. విజేతకు రూ. 25 వేల నగదుతో పాటు... ఫైనల్ మ్యాచ్ వీఐపీ పాస్లు ఇవ్వనున్నారు. ‘దేశంలో బ్యాడ్మింటన్కు ఆదరణ బాగా పెరిగింది. ప్రాంతం, సంస్కృతి, నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతీచోట బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. ప్రపంచ చాంపియన్షిప్ వంటి ప్రతిష్టాత్మక ఈవెంట్ను మన దేశంలో నిర్వహిస్తున్న సందర్భంగా... అభిమానులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతోనే మస్కట్ పోటీ ప్రారంభించాం’ అని ‘బాయ్’ కార్యదర్శి సంజయ్ మిశ్రా అన్నారు. -
2–2తో సమం
బ్యూనస్ ఎయిర్స్: ప్రపంచకప్, ఆసియా క్రీడలకు సన్నాహాల్లో భాగంగా అర్జెంటీనాలో పర్యటించిన భారత మహిళల హాకీ జట్టు ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. నాలుగు మ్యాచ్ల సిరీస్ను 2–2తో సమంగా ముగించింది. తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిపోయిన భారత జట్టు తదుపరి రెండు మ్యాచ్ల్లో గెలిచి సిరీస్ను ‘డ్రా’ చేసుకుంది. తొలి మ్యాచ్లో భారత జట్టు 2–4తో ఓడిపోయింది. భారత్ తరఫున నవ్నీత్ కౌర్, అన్ను ఒక్కో గోల్ చేశారు. రెండో మ్యాచ్ను టీమిండియా 1–2తో చేజార్చుకుంది. భారత్ తరఫున ఇషిక ఏకైక గోల్ చేసింది. మూడో మ్యాచ్లో భారత బృందం 2–1తో గెలిచింది. భారత జట్టుకు నవ్నీత్ కౌర్, నేహా ఒక్కో గోల్ అందించారు. చివరిదైన నాలుగో మ్యాచ్లో భారత జట్టు ‘షూటౌట్’లో 3–2తో నెగ్గింది. -
ఎస్ఆర్హెచ్ను గెలిపించిన బౌలర్లు
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. శనివారం సీఎస్కేతో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే నిర్ణీ త 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్ (34) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ 3 వికెట్లతో ఆకట్టుకోగా, నితీశ్ కుమార్ 2 వికెట్లు తీశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (59) మెరుపు అర్థసెంచరీతో ఆకట్టుకోగా, క్లాసెన్ (59) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు మినహా మిగతావారు పరుగులు చేయడంలో విఫలం కావడంతో ఎస్ఆర్హెచ్ 200 స్కోరు మార్కును దాటలేకపోయింది. సీఎస్కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్, జేమి ఓవర్టన్లు చెరో మూడు వికెట్లు తీయగా, ముకేశ్ చౌదరీ 2 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత ఛేదనను సీఎస్కే ధాటిగానే ఆరంభించింది. ఆరంభంలోనే ఓపెనర్ సంజూ శాంసన్ ఔటైనప్పటికీ వన్డౌన్లో వచ్చిన ఆయుశ్ మాత్రే 13 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 30 పరుగులు సాధించాడు. మిడిలార్డర్లో సర్ఫరాజ్ ఖాన్ (25), మాథ్యూ షార్ట్ (34) పరుగులతో పర్వాలేదనిపించారు. ఆఖర్లో ఓవర్టన్ (16) కాస్త ప్రతిఘటించినప్పటికీ ఎస్ఆర్హెచ్ బౌలర్లు కఠినంగా బంతులేయడంతో సీఎస్కే ఓటమి దిశగా పయనించింది. -
తలతిక్క నిర్ణయాలతో కొంపముంచిన పటీదార్!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు శనివారం ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో ఓటమిని కొనితెచ్చుకుంది. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ తలా తోక లేని నిర్ణయాలతో జట్టు ఓటమికి బాటలు వేశాడు. అదెలాగంటే 15 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఈ సమయంలో అక్షర్ పటేల్ కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. ఆర్సీబీకి భువనేశ్వర్ కుమార్, హాజిల్వుడ్ ప్రధాన బౌలర్లు. మ్యాచ్లో గెలిచే దశలో ఉన్న సమయంలో ప్రధాన బౌలర్లను చివరి ఓవర్లలో బౌలింగ్ చేయించాలి. కానీ ఇక్కడే పటిదార్ తెలివితక్కువ పని చేశాడు. ఈ మ్యాచ్లో భువనేశ్వర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 3 ఓవర్లు ముగిసేరికి 14 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. మరోవైపు హాజిల్వుడ్ వికెట్లేమీ తీయకపోయినప్పటికీ 3 ఓవర్ల వరకు ఎకానమీ రేటు బాగానే ఉంది. అయితే పటీదార్ డెత్ ఓవర్ల వరకు వీరిని అంటిపెట్టుకోకుండా మధ్యలోనే కోటా పూర్తి చేయించాడు. ఇదే ఆర్సీబీని దెబ్బకొట్టిందని చెప్పొచ్చు. భువనేశ్వర్, హాజిల్వుడ్ కోటా పూర్తవ్వడం, సుయాశ్ శర్మ ప్రభావం చూపించకపోవడంతో పటీదార్ రసిక్ సలామ్ చేతిలో బంతిని పెట్టాడు.గత మ్యాచ్లో మెరిసిన రసిక్ సలామ్ ఈ మ్యాచ్లో పూర్తిగా తేలిపోయాడు. 4 ఓవర్లు వేసి వికెట్ తీయకపోగా 40 పరుగులిచ్చాడు. ఆఖరి ఓవర్ వేసిన షెపర్డ్ ఒత్తిడిలో సరిగ్గా బౌలింగ్ చేయలేక 17 పరుగులు సమర్పించుకొని జట్టు ఓటమికి కారణమయ్యాడు. అదే భువనేశ్వర్ లేదా హాజిల్వుడ్లలో ఒకరితో చివరి ఓవర్ వేయించి ఉంటే ఆర్సీబీ గెలిచి ఉండేదేమో. ఏది ఏమైనా పటీదార్ తన తిక్క నిర్ణయంతో చేజేతులా ఆర్సీబీకి ఓటమి మూటగట్టుకోవాల్సి వచ్చింది. మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ను అందుకుంది. -
ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ చెత్త రికార్డు
ఐపీఎల్ 2026 సీజన్లో శనివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో పర్యావరణ పరిరక్షణ హితం కోసం ఆర్సీబీ గ్రీన్ జెర్సీతో బరిలోకి దిగింది. అయితే గ్రీన్ జెర్సీ ఆర్సీబీకి కలసిరాదన్న విషయం మరోసారి నిరూపితమైంది. ఈ సంగతి పక్కనబెడితే చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్ ఆర్సీబీకి వందోది కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఆర్సీబీ అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ తాము ఆడిన తొలి మ్యాచ్తో పాటు 50వ మ్యాచ్, తాజాగా వందో మ్యాచ్లోనూ ఓటమిపాలవ్వడం గమనార్హం. ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008లో చిన్నస్వామి స్టేడియంలో కేకేఆర్తో జరిగిన తొలి మ్యాచ్లో ఆర్సీబీ ఓడిపోయింది. ఈ మ్యాచ్లోనే మెక్కల్లమ్ సెంచరీ బాదాడు. ఇక 2016లో ఇదే చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ డేర్డెవిల్స్తో ఆర్సీబీ 50వ మ్యాచ్ ఆడింది. తాజాగా యాదృశ్చికంగా ఢిల్లీ క్యాపిటల్స్తో చిన్నస్వామి స్టేడియంలో తన వందో మ్యాచ్ ఆడిన ఆర్సీబీకి మరోసారి ఓటమే ఎదురయ్యింది. ఇక 2011 నుంచి ప్రతీ సీజన్లో ఒక మ్యాచ్కు ఆర్సీబీ గ్రీన్ జెర్సీతో బరిలోకి దిగడం ఆనవాయితీగా చేసుకుంది. అయితే ఆర్సీబీ ఇప్పటివరకు గ్రీన్ జెర్సీలో 15 మ్యాచ్లు ఆడితే అందులో తొమ్మిదింట ఓడి కేవలం ఐదింట మాత్రమే నెగ్గింది. -
వారెవ్వా మిల్లర్.. ఆరోజు ఏడ్చి.. ఈరోజు నవ్వి!
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ గుర్తుండే ఉంటుంది. అభిమానులను మునివేళ్లపై నిలబెట్టిన మ్యాచ్ అది. కేవలం ఒక్క పరుగుతో గుజరాత్ టైటాన్స్ థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోవడానికి డేవిడ్ మిల్లర్ ప్రధాన కారణమయ్యాడు. ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరమైన దశలో అనవసర ఒత్తిడికి పోయిన మిల్లర్ ఢిల్లీకి చేజేతులా ఓటమిని అందించాడు. ఈ చర్య మిల్లర్ను కంటతడి పెట్టేలా చేసింది. మరో అవకాశం వస్తే ఢిల్లీకి విజయాన్ని అందించి తన తప్పును సరిదిద్దుకుంటానని మిల్లర్ పేర్కొన్నాడు. అయితే తన తప్పు సరిదిద్దుకునే రోజు ఇంత తొందరగా వస్తుందని బహుశా మిల్లర్ కూడా ఊహించి ఉండడు. ఇవాళ చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన మ్యాచ్ మరోసారి ఆఖరి ఓవర్ వరకు వెళ్లింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కు ఆఖరి ఓవర్లో 15 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో మిల్లర్తో పాటు స్టబ్స్ ఉన్నాడు. తొలి బంతికి మిల్లర్ సింగిల్ తీశాడు. రెండో బంతికి స్టబ్స్ సింగిల్ తీశాడు. ఇక 4 బంతుల్లో 13 పరుగులు అవసరం. స్ట్రైక్లో ఉన్న మిల్లర్ ఈసారి ఢిల్లీని గెలిపించాలని కంకణం కట్టుకున్నాడు. షెపర్డ్ వేసిన మూడో బంతిని మిల్లర్ డీప్ మిడ్వికెట్ మీదుగా సిక్సర్ కొట్టాడు. ఇక మరుసటి బంతిని ఈసారి మిల్లర్ ఎక్స్ట్రా కవర్స్ మీదుగా మరో సిక్సర్ సంధించాడు. దీంతో సమీకరణం రెండు బంతుల్లో ఒక పరుగుకు మారిపోయింది. గుజరాత్తో మ్యాచ్లో చేసిన పొరపాటును మళ్లీ చేయకుండా షెపర్డ్ వేసిన ఐదో బంతిని డీప్ మిడ్వికెట్ దిశగా బౌండరీ కొట్టి ఢిల్లీని గెలిపించాడు. మొత్తం మీద గుజరాత్తో మ్యాచ్లో ఢిల్లీ ఓటమికి తానే కారణమని ఏడ్చిన మిల్లర్ ఇవాళ మాత్రం తన జట్టును గెలిపించి లెక్క సరిచేశాడు. మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఫిలిప్ సాల్ట్ 63, టిమ్ డేవిడ్ 26 పరుగులు చేశారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. 6,6,4 BY DAVID MILLER WHEN DELHI NEEDED 13 FROM 4 🥶- DC got David Miller for Base Price. pic.twitter.com/9HVbfezmuI— Johns. (@CricCrazyJohns) April 18, 2026చదవండి: సీఎస్కే కొత్త కెప్టెన్ సంజూ శాంసన్! -
ఉత్కంఠ పోరు.. ఢిల్లీని గెలిపించిన డేవిడ్ మిల్లర్
ఐపీఎల్-2026 వరుస విజయాలతో దూసుకుపోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఢిల్లీ క్యాపిటల్స్ షాకిచ్చింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో ఆర్సీబీపై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఆర్సీబీ ఇన్నింగ్స్లో ఫిల్ సాల్ట్(63) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. మిగితా ప్లేయర్లంతా నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో లుంగి ఎంగిడీ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించగా.. ముఖేష్ కుమార్ ఓ వికెట్ పడగొట్టాడు.మిల్లర్.. కిల్లర్అనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కు ఆర్సీబీ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆరంభంలోనే భారీ షాకిచ్చాడు. భువీ ధాటికి ఢిల్లీ 18 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో కేఎల్ రాహుల్(57), ట్రిస్టన్ స్టబ్స్(60 నాటౌట్) అద్భుతమైన బ్యాటింగ్తో ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. అయితే రాహుల్ ఔటయ్యాక ఆర్సీబీ తిరిగి గేమ్లోకి వచ్చింది. క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్(26 రిటైర్డ్ హార్ట్) భారీ షాట్ల ఆడడంలో విఫలమయ్యాడు.అతడితో పాటు స్టబ్స్ కూడా కాస్త నెమ్మదించాడు. దీంతో ఢిల్లీ కావాల్సిన రన్రేట్ పెరుగుతూ వచ్చింది. అయితే అక్షర్ పటేల్ తొడ కండరాలు పట్టేయంతో రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. అతడి స్ధానంలో క్రీజులోకి వచ్చిన మిల్లర్ కూడా బంతిని స్ట్రైక్ చేయడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో చివరి రెండు ఓవర్లలో ఢిల్లీ విజయానికి 25 పరుగులు అవసరమయ్యాయి. రషీక్ ధార్ సలాం వేసిన 19 ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. దీంతో ఢిల్లీ విజయ సమీకరణం 6 బంతుల్లో 15 పరుగులగా మారింది.ఆర్సీబీ కెప్టెన్ ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను రొమోరియా షెఫర్డ్కు అప్పగించాడు. తొలి రెండు బంతుల్లో కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. చివరి నాలుగు బంతుల్లో ఢిల్లీ విజయానికి 13 పరుగులు అవసరమయ్యాయి. వరుసగా మూడు, నాలుగు బంతులను భారీ సిక్సర్లగా మిల్లర్ మలిచాడు. ఐదో బంతిని బౌండరీ బాది మ్యాచ్ను ఫినిష్ చేశాడు. ఫలితంగా 176 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. మిల్లర్ 10 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్లతో 22 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టగా.. కృనాల్ పాండ్యా ఓ వికెట్ సాధించాడు. ట్రిస్టన్ స్టబ్స్కు ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు దక్కింది. -
సీఎస్కే కొత్త కెప్టెన్ సంజూ శాంసన్!
ఐపీఎల్ 2026 సీజన్లో ఆరంభంలో వరుస పరాజయాలతో ఇబ్బంది పడినప్పటికీ వరుసగా రెండు విజయాలు సాధించి సీఎస్కే గాడిన పడింది. కానీ కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ మాత్రం పూర్తిగా విఫలమవుతున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సీఎస్కే కెప్టెన్సీ విషయమై సంచలన వ్యాఖ్యలు చేశాడు. సంజూ శాంసన్ సీఎస్కేకు కొత్త కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నాడు. అది ఈ సీజన్ మధ్యలోనే జరిగే అవకాశముందని కూడా అభిప్రాయపడ్డాడు. ఒకవేళ ఈ సీజన్లో కాకపోయినా భవిష్యత్తులో మాత్రం శాంసన్ సీఎస్కేను శాసిస్తాడని జోస్యం చెప్పాడు. ప్రస్తుతం వరుస పరాజయాలతో సతమతమవుతున్న సీఎస్కేకు కెప్టెన్సీ అనుభవం ఉన్న ఆటగాడు అవసరమని, ఈ విషయంలో సీఎస్కేకు మొదటి చాయిస్ సంజూనే అని తెలిపాడు. ఇప్పటికే సంజూ శాంసన్ రాజస్తాన్ రాయల్స్కు కెప్టెన్గా వ్యవహరించడంతో పాటు ఫైనల్ చేర్చినట్లు గుర్తుచేశాడు. దీంతో సీఎస్కే యాజమాన్యం ఈ సీజన్ మధ్యలోనే రుతురాజ్ను తప్పించి శాంసన్కు బాధ్యతలు అప్పగించినా ఆశ్చర్చపోనవసరం లేదని తెలిపాడు. ఫామ్లేమితో సతమతమవుతున్న రుతురాజ్ ఈ సీజన్లోనే కెప్టెన్సీ వదిలేసే అవకాశాలు కూడా ఉన్నాయని జోస్యం చెప్పడం గమనార్హం.ప్రస్తుతం అశ్విన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక ఎంఎస్ ధోని సారధ్యంలో చెన్నై సూపర్కింగ్స్ ఐదుసార్లు చాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక సీఎస్కే ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ధోని తర్వాత కెప్టెన్లు ఎందరు మారినా సీఎస్కే మరో టైటిల్ కొట్టడంలో మాత్రం విఫలమయ్యింది. 2022 సీజన్లో ధోని స్థానంలో రవీంద్ర జడేజాను కెప్టెన్గా నియమించింది. కానీ కెప్టెన్గా ఒత్తిడిని తట్టుకోలేక జడేజా దానిని మధ్యలోనే వదిలేశాడు. దీంతో గత్యంతరం లేక మళ్లీ ధోనికే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. అలా 2023 సీజన్లోనూ సీఎస్కేను నడిపించిన ధోని ఐదోసారి చాంపియన్గా నిలిపాడు. ఆ తర్వాత 2024 సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ను కెప్టెన్గా నియమించింది. కానీ ఆ సీజన్లో ప్లేఆఫ్స్ చేరడంలో విఫలమైంది. ఇక 2025 సీజన్లో రుతురాజ్ సారథ్యంలోని సీఎస్కే దారుణ ఆటతీరుతో అట్టడుగు స్థానంలో నిలిచి టోర్నీ నుంచి నిష్క్రమించింది.చదవండి: పరిస్థితి విషమం.. ఐసీయూలో మాజీ స్టార్ క్రికెటర్! -
ఐపీఎల్ తరహాలో తెలంగాణ టీ20 లీగ్.. జట్ల కోసం టెండర్లు ఆహ్వానం
మొట్ట మొదటి తెలంగాణ టీ20 లీగ్ ఎడిషన్ను నిర్వహించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సన్నద్దమైంది. జూన్లో జరగనున్న ఈ టోర్నమెంట్లో జట్ల యాజమాన్యం కోసం టెండర్ ప్రక్రియను హెచ్సీఏ ప్రారంభించింది. జట్టు యాజమాన్య హక్కులు మొదటి 5 ఏళ్ల కాలానికి ఇవ్వబడతాయి.ఆ తర్వాత ప్రతి 3 ఏళ్లకు ఒకసారి రెన్యూవల్ చేస్తారు. ఒక్కో జట్టుకు కనీస బిడ్ ధర రూ. 3 కోట్లుగా నిర్ణయించారు. ఆటగాళ్ల జీతాలు, సిబ్బంది ఖర్చులు, వసతి, జెర్సీల ఖర్చులను ఫ్రాంచైజీ యజమానులే భరించాలి. కొత్త జట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఉన్న సంస్థలు ఏప్రిల్ 28లోపు టెండర్ పత్రాలు సమర్పించాలి. ఏప్రిల్ 30న షార్ట్లిస్ట్ చేసిన ఫ్రాంచైజీలను ప్రకటించనున్నారు. ఈ టోర్నీలో మొత్తం 8 ఫ్రాంచైజీలు పాల్గోనున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మెదక్, ఆదిలాబాద్ ,మహబూబ్నగర్ ప్రాంతాలను ప్రాతిపాదించారు. ఆఖరికి బిడ్డింగ్ ద్వారా 8 జట్లను ఖరారు చేస్తారు. ఈ టోర్నీ 21 రోజులు పాటు ఉప్పల్ మైదానం వేదికగా జరగనుంది. మొత్తంగా 32 మ్యాచ్లు జరుగుతాయి. -
సీఎస్కేపై ఎస్ఆర్హెచ్ ఘన విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. శనివారం సీఎస్కేతో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్ (34) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ 3 వికెట్లతో ఆకట్టుకోగా, నితీశ్ కుమార్ 2 వికెట్లు తీశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (59) మెరుపు అర్థసెంచరీతో ఆకట్టుకోగా, క్లాసెన్ (59) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.150 పరుగుల వద్ద సీఎస్కే ఆరో వికెట్ కోల్పోయింది. 34 పరుగుల చేసిన మాథ్యూ షార్ట్ ఇషాన్ మలింగ బౌలింగ్లో అనికేత్ వర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 14 ఓవర్లలో సీఎస్కే 135/514 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే ఐదు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్ 32, శివమ్ దూబే 10 పరుగులతో ఆడు తున్నారు.బ్రెవిస్ డకౌట్113 పరుగుల వద్ద సీఎస్కే ఐదో వికెట్ కోల్పోయింది. దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ను శివాంగ్ డకౌట్గా పెవిలియన్ చేర్చాడు.ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో సీఎస్కే 112 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్ ఇషాన్ మలింగ బౌలింగ్లో వెనుదిరిగాడు. 11 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే నాలుగు వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. 66 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. ఇషాన్ మలింగ బౌలింగ్లో కెప్టెన్ రుతురాజ్ (19) వెనుదిరిగాడు. అంతకముందు ధాటిగా ఆడుతున్న ఆయుశ్ మాత్రే నితీశ్రెడ్డి బౌలింగ్లో క్లాసెన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.దంచికొడుతున్న సీఎస్కేఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో సీఎస్కే దంచికొడుతుంది. 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. ఆయుశ్ మాత్రే (30), రుతురాజ్ (14) క్రీజులో ఉన్నారు.195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే 15 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఏడు పరుగులు చేసిన శాంసన్ నితీశ్కుమార్ రెడ్డి బౌలింగ్లో క్లాసెన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సీఎస్కే టార్గెట్ 195 పరుగులుసీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (59), క్లాసెన్ (59) అర్థసెంచరీలతో రాణించారు. వీరిద్దరు రాణించినప్పటికీ మిగతావారు విఫలం కావడంతో ఎస్ఆర్హెచ్ 200 స్కోరును దాటలేకపోయింది. సీఎస్కే బౌలర్లలో జేమి ఓవర్టన్, అన్షుల్ కంబోజ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.ఏడో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్సీఎస్కేతో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 179 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన సాహిల్ అరోరా గుర్జప్నీత్ సింగ్ బౌలింగ్లో డెవాల్డ్ బ్రెవిస్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.ఎస్ఆర్హెచ్ 177 పరుగుల వద్ద 6వ వికెట్ కోల్పోయింది. 18వ ఓవర్లో క్లాసెన్ (59) కంబోజ్ బౌలింగ్లో ఔటయ్యాడు.ఎస్ఆర్హెచ్ 150 పరుగుల వద్ద 5వ వికెట్ కోల్పోయింది. 13వ ఓవర్లో నితీష్కుమార్ (12) ఓవర్టన్ బౌలింగ్లో ఔటయ్యాడు.12 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ 4 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. క్లాసెన్ 30, నితీశ్రెడ్డి 4 పరుగులతో ఆడు తున్నారు.సీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. 59 పరుగులు చేసిన అభిషేక్ శర్మ జేమీ ఓవర్టన్ బౌలింగ్లో శాంసన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 8 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ మూడు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది.ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ముకేశ్ చౌదరీ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించిన ఇషాన్ రుతురాజ్కే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది.అభిషేక్ హాఫ్ సెంచరీ..సీఎస్కేతో మ్యాచ్లో అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టిస్తున్నాడు. కేవలం 15 బంతుల్లోనే అర్థశతకం సాధించాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోయి 75 పరుగులు చేసింది. 22 పరుగులు చేసిన హెడ్ ముకేశ్చౌదరీ బౌలింగ్లో రుతురాజ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 4 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టపోకుండా 38 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 26, హెడ్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా శనివారం ఉప్పల్ వేదికగా 27వ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్కింగ్స్ తలపడు తున్నాయి. టాస్ గెలిచిన సీఎస్కే బౌలింగ్ ఎంచుకుంది. ఇరుజట్లు ఎలాంటి మార్పులు చేయలేదు. ఐపీఎల్ చరిత్రలో ముఖాముఖి పోరులో ఇరుజట్లు 22 సార్లు తలపడ్డాయి. ఇందులో సీఎస్కే 15 విజయాలలు, ఎస్ఆర్హెచ్ 7 విజయాలు సాధించాయి. చివరి ఐదు మ్యాచ్ల విషయానికొస్తే ఎస్ఆర్హెచ్ 3, సీఎస్కే రెండింట నెగ్గాయి.సన్రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్, ఇషాన్ మలింగచెన్నై సూపర్ కింగ్స్ : సంజు శాంసన్ (వికెట కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, మాథ్యూ షార్ట్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్ -
పరిస్థితి విషమం.. ఐసీయూలో మాజీ స్టార్ క్రికెటర్!
38 ఏళ్ల అఫ్గానిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షాపుర్ జద్రన్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. తెల్లరక్త కణాల సంఖ్య పడిపోవడంతో ప్రస్తుతం షాపుర్ జద్రన్ భారత్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్నాడు. తెల్లరక్త కణాల సంఖ్య చాలా తక్కువగా ఉండడంతో అతడి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. మరో 18 గంటలు గడిస్తే కానీ షాపుర్ జద్రన్ ఆరోగ్య పరిస్థితి ఏంటనేది చెప్పలేమని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న షాపుర్ జద్రన్ త్వరగా కోలుకోవాలని అతని కుటుంబసభ్యులతో పాటు అఫ్గానిస్తాన్ క్రికెట్ అభిమానులు దేవుడిని ప్రార్థిస్తున్నారు. సోషల్మీడియాలో కూడా షాపుర్ జర్దన్ త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షిస్తున్నారు. అయితే కొన్ని వారాల కిందటే తీవ్ర అనారోగ్యానికి గురైన షాపుర్ జద్రన్ చాలా రోజుల ఆసుపత్రిలోనే చికిత్స పొందాడు. ఇటీవలే డిశ్చార్జి అయిన అతడు మరోసారి ఆసుపత్రి పాలవ్వడం ఆందోళనకు గురి చేస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న షాపుర్ జద్రన్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. జద్రన్ తనకు మంచి మిత్రుడని, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. పాక్కు చెందిన మరో మాజీ క్రికెట్ షాహిద్ అఫ్రిది కూడా షాపుర్ జద్రన్ ఆరోగ్య పరిస్థితి విషయం తెలుసుకొని బాధపడ్డాడు. అతని కుటుంబసభ్యులతో మాట్లాడిన షాహిద్ అఫ్రిది తన చిరకాల మిత్రుడు షాపుర్ జద్రన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నాడు. క్రికెట్లో అఫ్గానిస్తాన్ ఎదుగుదలలో షాపుర్ జద్రన్ కీలక పాత్ర పోషించాడు. దశాబ్దానికి పైగా ఆఫ్గన్కు ప్రాతినిధ్యం వహించిన షాపుర్ జద్రన్ నిప్పులు చెరిగే బంతులతో ప్రపంచ మేటి బ్యాటర్లను వణికించాడు. స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్ వంటి బ్యాటర్లను తన స్వింగ్ బౌలింగ్తో ముప్పతిప్పలు పెట్టి పెవిలియన్ చేర్చాడు. 2009లో స్కాట్లాండ్తో వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన షాపుర్ జద్రన్ అప్గానిస్తాన్ తరఫున 43 వన్డేల్లో 43 వికెట్లు, 32 టీ20ల్లో 27 వికెట్లు పడగొట్టాడు. అఫ్గానిస్తాన్ తరఫున మూడు టీ20 ప్రపంచకప్పుల్లో పాల్గొన్న షాపుర్ జద్రన్ 2015 వన్డే ప్రపంచకప్లో స్కాట్లాండ్పై విజయం సాధించి ఐసీసీ టోర్నీల్లో తొలి విజయాన్ని నమోదు చేసిన అఫ్గానిస్తాన్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.Zardan brother is like a buddy to me. I am wishing him speedy recovery. Ameen🤲 pic.twitter.com/8oGPUVwHai— Umar Akmal (@Umar96Akmal) April 17, 2026చదవండి: స్టేడియంలో కనిపించని ప్రీతిజింటా.. అసలేమైంది? -
సర్పంచ్ సాబ్!.. అర్థమేంటో తెలియదు: శ్రేయస్ అయ్యర్
శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ విజయవంతమైన జట్టుగా పేరు తెచ్చుకుంటోంది. ఐపీఎల్-2025లో ఫైనల్కు చేరిన పంజాబ్.. ఈ ఏడాది వరుస విజయాలతో జోరు మీద ఉంది. ఇప్పటికి ఐదు మ్యాచ్లు పూర్తి చేసుకోగా.. ఇందులో ఒకటి వర్షం వల్ల రద్దు కాగా.. మిగిలిన నాలుగూ గెలిచింది.అగ్రస్థానంలోతద్వారా తొమ్మిది పాయింట్లు సాధించి.. ప్రస్తుతానికి పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక ఐపీఎల్లో గత కొన్నేళ్లుగా శ్రేయస్ అయ్యర్ జోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కోల్కతా నైట్ రైడర్స్కు 2024లో టైటిల్ అందించిన శ్రేయస్.. 2025లో పంజాబ్ను ఫైనల్కు చేర్చాడు.కేవలం కెప్టెన్గానే కాకుండా బ్యాటర్గానూ అలరిస్తూ ముందుకు సాగుతున్నాడు శ్రేయస్ అయ్యర్. గతేడాది 604 పరుగులు సాధించిన ఈ ముంబైకర్.. ఈ ఏడాది ఇప్పటికి నాలుగు ఇన్నింగ్స్లో కలిపి 203 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. శ్రేయస్ పంజాబ్ ఫ్రాంఛైజీతో చేరిననాటి నుంచి ఆ జట్టు అభిమానులు తమ కెప్టెన్ను ముద్దుగా సర్పంచ్ సాబ్ అని పిలుచుకుంటున్నారు.అర్థం ఏమిటో తెలియదుఅయితే, ఫ్యాన్స్ తనను అలా ఎందుకు పిలిచేవారో ముందుగా అర్థం కాలేదన్నాడు శ్రేయస్ అయ్యర్. ఆ తర్వాత జట్టు సభ్యులను అడిగితే అసలు విషయం తెలిసిందన్నాడు. జియోస్టార్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఆ పిలుపు నాకెంతగానో నచ్చింది. అయితే, పంజాబ్ కింగ్స్తో ప్రయాణం మొదలుపెట్టినపుడు సర్పంచ్ సాబ్ అంటే అర్థం ఏమిటో నాకు తెలియదు.అప్పడు నా సహచర ఆటగాళ్లను అడుగగా.. ‘సర్పంచ్ అంటే.. ఇంటి పెద్ద లేదంటే ఓ సమూహానికి పెద్ద అని అర్థం.. జిల్లా పెద్దను ఇలాగే పిలుస్తారు’ అని చెప్పారు. అప్పటి నుంచి ఈ బిరుదును మరింత ఎక్కువగా ఆస్వాదిస్తున్నాను’’ అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. చదవండి: ‘విరాట్ కోహ్లిని చూస్తే బాధగా ఉంది’ -
చరిత్ర సృష్టించిన ఆర్సీబీ.. తొలి జట్టుగా రికార్డు
ఐపీఎల్-2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అరుదైన మైలు రాయిని అందుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీకి ఇది వందో మ్యాచ్. తద్వారా ఐపీఎల్ చరిత్రలో ఒకే వేదికపై 100 మ్యాచ్లు ఆడిన తొలి జట్టుగా బెంగళూరు రికార్డులకెక్కింది. ఐపీఎల్ తొట్ట తొలి సీజన్(2008) ఆర్సీబీ హోం గ్రౌండ్గా చిన్నస్వామి స్టేడియం ఉంది. ఇప్పటివరకు ఈ మైదానంలో బెంగళూరు జట్టు ఇప్పటివరకు 48 మ్యాచ్ల్లో విజయం సాధించగా.. 46 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. ఓ మ్యాచ్ టై కాగా.. మరో నాలుగు మ్యాచ్లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి.ఈ మైదానంలో ఆర్సీబీకి అద్భుతమైన రికార్డు ఉంది. 2013 సీజన్లో ఇదే స్టేడియంలో పూణే వారియర్స్పై ఆర్సీబీ 263 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక ఆర్సీబీ తర్వాత స్ధానంలో కోల్కతా నైట్రైడర్స్ ఉంది. కేకేఆర్ ఈడెన్ గార్డెన్స్లో ఇప్పటివరకు 98 మ్యాచ్లు ఆడింది.ఇక ఈ ఏడాది సీజన్ విషయానికి వస్తే.. ఆర్సీబీ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ నాలుగింట విజయాలు సాధించగా, ఓ మ్యాచ్లో ఓటమి పాలైంది. బెంగళూరు జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్ధానంలో కొనసాగుతోంది.చదవండి: IPL 2026: సీఎస్కేతో మ్యాచ్.. సన్రైజర్స్ జట్టులోకి యార్కర్ల కింగ్? -
స్టేడియంలో కనిపించని ప్రీతిజింటా.. అసలేమైంది?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్యా మారన్.. పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతిజింటా.. ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ.. కేకేఆర్ సహ భాగస్వామి జూహీ చావ్లా, ఆమె కూతురు జాన్వి మెహతా వీరంతా క్యాష్రిచ్ లీగ్కు అదనపు ఆకర్షణ. వీరంతా తమ జట్లు ఆడే ప్రతీ మ్యాచ్కు హాజరయ్యి ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూనే తమ అందంతో అభిమానుల హృదయాలను కట్టిపడేస్తుంటారు. అయితే వీరందరిలో పంజాబ్ కింగ్స్ కో-ఓనర్ ప్రీతిజింటాది ప్రత్యేక శైలి. యువరాజ్ సింగ్, మ్యాక్స్వెల్ సహా చాలా మంది పంజాబ్ ఆటగాళ్లకు ఫ్లైయింగ్ కిస్లు ఇస్తూ ఉత్సాహపరుస్తుండేది. ఇలా ఐపీఎల్ ఆరంభం నుంచి ప్రతీ సీజన్లో పంజాబ్ను ప్రోత్సహిస్తూ మ్యాచ్లకు హాజరయ్యే ప్రీతి జింటా ఐపీఎల్ 19వ సీజన్లో మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. మరోవైపు ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో టైటిల్ రేసులో దూసుకెళ్తోంది. సీజన్లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో 4 విజయాలు (ఒక మ్యాచ్ రద్దు) సాదించిన పంజాబ్ 9 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కూడా కొనసాగుతుంది. పంజాబ్ కింగ్స్ ఇంతలా రెచ్చిపోతున్న సమయంలో ప్రీతి జింటా మైదానంలో కనబడకపోయేసరికి పంజాబ్ అభిమానులు చిన్న బోతున్నారు. తాజాగా ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో పంజాబ్ విజయం సాధించిన అనంతరం ప్రీతిజింటా తన సామాజిక మాధ్యమంలో జట్టును అభినందిస్తూ పోస్ట్ చేసిందే తప్ప బయటకు రాలేదు. మరి ప్రీతిజింటాకు ఏమైనట్లు అని అభిమానులు ఆరా తీస్తున్న సమయంలో ఆమెనే స్వయంగా స్పష్టత ఇచ్చింది. ‘చాలా కాలంగా నా పిల్లలకు దూరంగా ఉండి షూటింగ్లు, ఇతర పనులతో బిజీగా గడిపాను. ప్రస్తుతం వాళ్లకు సెలవులు ఉన్నాయి. అందుకే ఈ విలువైన సమయాన్ని నా పిల్లలతో గడపాలని నిర్ణయించుకున్నాను. తల్లిగా వాళ్లతో ఉండటం నా బాధ్యత, అందుకే మ్యాచ్లకు హాజరు కాలేకపోతున్నాను. అయితే పిల్లలతో సెలవులు ముగియగానే మళ్లీ స్టేడియానికి వచ్చి జట్టుతో పాటు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాను’ అని చెప్పుకొచ్చారు.పంజాబ్ జట్టు ఈసారి పాయింట్ల పట్టికలో టాప్లో ఉండటం, దీనికి తోడు త్వరలోనే ప్రీతి జింటా ఎంట్రీ ఇవ్వనుండటంతో అభిమానుల జోష్ డబుల్ కానుంది. పంజాబ్ కింగ్స్ తన తర్వాతి మ్యాచ్ ఆదివారం లక్నో సూపర్జెయింట్స్తో తలపడనుంది.Yes Yes Yessss !!!! Congratulations @PunjabKingsIPL for this win 👊So much maturity from @prabhsimran01 & wow @arshdeepsinghh Happy to see you shine 🤩 Amazing team work under the capable leadership of Sadda Sarpanch @ShreyasIyer15 & @RickyPonting 🔥 That was an awesome catch… pic.twitter.com/MNPsG1U1qU— Preity G Zinta (@realpreityzinta) April 16, 2026చదవండి: చెన్నై జట్టులోకి చిచ్చరపిడుగు! -
గుడ్ న్యూస్ చెప్పిన రషీద్ ఖాన్
అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్, గుజరాత్ టైటాన్స్ వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్ తండ్రయ్యాడు. అతడి భార్య పండింటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ గుడ్ న్యూస్ను రషీద్ ఎక్స్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. తన చిన్నారికి 'అస్లాన్ ఖాన్' అని పేరు పెట్టినట్లు రషీద్ వెల్లడించాడు. ఈ ప్రపంచంలోకి నా లిటిల్ ప్రిన్స్కు స్వాగతం అంటూ రషీద్ ఓ పోస్ట్ పెట్టాడు. దీంతో అతడికి నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా రషీద్ ఖాన్ గతేడాది ఆగస్టులో రెండో పెళ్లి చేసుకున్నాడు. అంతకంటే ముందు 2024 అక్టోబర్లో పష్తూన్ ఆచారాల ప్రకారం రషీద్ మొదటి పెళ్లి జరిగింది. రషీద్ వివాహ వేడుకకు అఫ్గానిస్తాన్ క్రికెటర్లంతా హాజరయ్యారు. కానీ ఏడాది తిరగకుముందే వ్యక్తిగత కారణాల చేత వారిద్దరూ విడిపోయారు. ఇప్పుడు తన రెండో భార్యకు మగ బిడ్డ జన్మించడంతో రషీద్ తండ్రయ్యాడు. రషీద్ ప్రస్తుతం ఐపీఎల్-2026లో బిజీబిజీగా ఉన్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడిన రషీద్ 5 వికెట్లు పడగొట్టాడు.చదవండి: ‘విరాట్ కోహ్లిని చూస్తే బాధగా ఉంది’ -
నటిపై చాహల్ పరువు నష్టం దావా.. వీళ్ల మధ్య అసలేమైంది?
ప్రస్తుతం ఐపీఎల్లో ఆడుతున్న క్రికెటర్ చాహల్, నటి తానియా ఛటర్జీ మధ్య చిన్నపాటి వివాదం నడుస్తోంది. చాహల్ తనకు వ్యక్తిగతంగా మెసేజులు పంపిస్తున్నాడని ఆమె చెప్పడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా చాహల్.. ఈమెపై పరువు నష్టం దావా వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ వీళ్లిద్దరి మధ్య ఏం జరుగుతోంది?(ఇదీ చదవండి: కాళ్లకు మెట్టెలతో రష్మిక కఠిన శిక్షణ.. రోజుకు 8 గంటలకు పైనే!)స్వతహాగా సోషల్ మీడియాలో ఇన్ఫ్లూయెన్సర్ అయిన తానియా ఛటర్జీ.. 'ఫ్లాట్ మేట్స్' అనే ఒక్క సినిమాలో నటించింది. తాజాగా ఈమె మాట్లాడుతూ.. చాహల్ తనకు వ్యక్తిగత మెసేజులు చేసినట్లు స్క్రీన్ షాట్స్ మీడియాకు చూపించింది. ఈ వీడియో వైరల్ కావడంతో చాలామంది నెటిజన్లు.. చాహల్పై విమర్శలు చేశారు. అతడి పీఆర్ టీమ్.. ఈ వీడియోని తీసేయమని కోరారని తానియా చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే చాహల్.. ఈమెపై పరువు నష్టం దావా వేశాడు.దీని గురించి స్పందించిన తానియా.. ఈ విషయంలో తనని మాత్రమే ట్రోల్ చేస్తున్నారని, చాహల్ని ఎవరూ ఏం అడగట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇది ఇంతలా వైరల్ అవుతుందనుకోలేదు. నన్నే ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు. పరువు పోయింది నాది. కానీ ఇప్పుడు నా మీదే పరువు నష్టం దావా వేశారు. అతడి వ్యక్తిత్వాన్ని నేను తప్పు పట్టాలని అనుకోలేదు. నాకు చాహల్పై గౌరవం ఉందని తానియా పేర్కొంది. అయితే ఇదంతా సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం ఈమె చేస్తోందా? అనే సందేహం కలుగుతోంది.చాహల్ విషయానికొస్తే గతంలో నటి, ఇన్ఫ్లూయెన్సర్ ధనశ్రీ వర్మని పెళ్లి చేసుకున్నాడు. కానీ మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. గతేడాది ఆర్జే మహ్వశ్తో చాహల్ జంటగా కనిపించాడు. ఇప్పుడు ఆమె కూడా ఇతడికి దూరమైందా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా) -
‘విరాట్ కోహ్లిని చూస్తే బాధగా ఉంది’
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి పరిస్థితి చూస్తే బాధగా ఉందని జర్మన్ ఇన్ఫ్లూయెన్సర్ లిజ్లాజ్ పేర్కొంది. ఏదేమైనా అతడు తనకు మద్దతుగా నిలిచిన తీరును జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని తెలిపింది. కాగా సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే లిజ్లాజ్.. సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ ఆద్వైత్ వైద్యతో ఫొటోషూట్ చేసింది.కోహ్లి లైక్ కొట్టిన ఈ అమ్మాయి ఎవరు?భారత్లోని వివిధ నగరాల్లో ఫొటోలు దిగుతూ వాటిని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. వీటిలో ఓ పోస్టుకు కోహ్లి లైక్ కొట్టినట్లు కనిపించింది. దీంతో లిజ్లాజ్ ( LizLaz) ఒక్కసారిగా ట్రెండింగ్లోకి వచ్చింది. కోహ్లి లైక్ కొట్టిన ఈ అమ్మాయి ఎవరా? అంటూ నెటిజన్లు ఆరాతీశారు.అయితే, కాసేపటికే కోహ్లి నుంచి వచ్చిన లైక్ మాయమైపోయింది. ఈ నేపథ్యంలో కోహ్లిపై మీమ్స్ పేలాయి. గతంలో అవనీత్ కౌర్ అనే ఇన్ఫ్యూయెన్సర్ ఫొటోకు కూడా కోహ్లి లైక్ కొట్టినట్లు కనిపించగా వైరల్ అయింది. అయితే, తన ఇన్స్టా ఫీడ్ క్లియర్ చేస్తుండగా అనుకోకుండా అల్గారిథమ్ వల్లే అలా జరిగిందని కోహ్లి వివరణ ఇచ్చాడు.ఆ విషయాన్ని తాజాగా గుర్తుచేస్తూ కోహ్లి ఇప్పుడు కూడా ఇదే చెబుతాడంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏదేమైనా కోహ్లి పుణ్యమా అని లిజ్లాజ్ మాత్రం ట్రెండ్ అయింది. ఈ నేపథ్యంలో హిందుస్తాన్ టైమ్స్తో మాట్లాడిన ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.విరాట్ కోహ్లిని చూస్తే బాధగా ఉంది‘‘నిద్రలేస్తూనే నేను ట్రెండ్ అవుతున్నానని తెలిసి ఆనందంతో ఎగిరి గంతేశా. అసలు కోహ్లి నా ఫొటోను లైక్ చేశాడని నాకే తెలియదు. వార్తల్లో చూసి ఈ విషయం తెలుసుకున్నా. నా గురించి ఎన్నో ఆర్టికల్స్ వచ్చాయి.ఎంతో మంది సందేశాలు పంపించారు. అయితే, కోహ్లి విషయంలో జరిగినదానికి మాత్రం నేను బాధపడుతున్నాను. ఆయన నా ఫొటోను లైక్ కొట్టినందుకు సంతోషమే. కానీ ఇది అంతగా వైరల్ అవుతుందని ఊహించలేదు. ఇది ఆయన ఉద్దేశపూర్వకంగా చేసి ఉండకపోవచ్చు. కానీ ఆయన లైక్ వల్ల నాకు ఎంతో మద్దతు, ప్రచారం లభించాయి’’ అని లిజ్లాజ్ చెప్పుకొచ్చింది.చదవండి: నాకు అప్పులు ఉన్నాయి.. ఆదుకోమన్న క్రిస్ గేల్! -
ఉత్కంఠ పోరులో ఆర్సీబీపై ఢిల్లీ విజయం
IPL 2026 RCB vs DC Live updates: చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఉత్కంఠ పోరులో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. చివరి ఓవర్లో ఢిల్లీ విజయానికి 15 పరుగులు అవసరం కాగా.. డేవిడ్ మిల్లర్ వరుసగా సిక్సర్లు బాది మ్యాచ్ను ఫినిష్ చేశాడు. ఫలితంగా 176 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఢిల్లీ బ్యాటర్లలో మిల్లర్(10 బంతుల్లో 22)తో పాటు కేఎల్ రాహుల్(34 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 57), ట్రిస్టన్ స్టబ్స్(47 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్తో 60) అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టగా.. కృనాల్ పాండ్యా ఓ వికెట్ సాధించాడు.👉ఢిల్లీ విజయానికి 12 బంతుల్లో 25 పరుగులు కావాలి. క్రీజులో స్టబ్స్, మిల్లర్ ఉన్నారు. 16 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 135/416 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ఢిల్లీ విజయానికి 24 బంతుల్లో 41 పరుగులు కావాలి. అక్షర్పటేల్ గాయం కారణంగా రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు.కేఎల్ రాహుల్ ఔట్..దూకుడుగా ఆడుతున్న కేఎల్ రాహుల్ (57) కృనాల్ పాండ్యా బౌలింగ్లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఢిల్లీ 11 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది.8 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 74/38 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 3 వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(45), స్టబ్స్(12) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న కేఎల్ రాహుల్5 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ 3 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(30), స్టబ్స్(5) ఉన్నారు.నిప్పులు చెరుగుతున్న భువనేశ్వర్భువనేశ్వర్ కుమార్ నిప్పులు చెరుగుతున్నాడు. 3 ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో ఆర్సీబీ రెండు వికెట్లు కోల్పోయింది. కరుణ్ నాయర్(5), సమీర్ రిజ్వీ(2) వరుస క్రమంలో పెవిలియన్కు చేరారు.ఢిల్లీ తొలి వికెట్ డౌన్176 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన ఫాథుమ్ నిస్సాంక..భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో ఔటయ్యాడు.ఆర్సీబీ స్కోరెంతంటే?చిన్నస్వామి స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన చేయలేకపోయారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్(63) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. మిగితా ప్లేయర్లంతా నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో లుంగి ఎంగిడీ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించగా.. ముఖేష్ కుమార్ ఓ వికెట్ పడగొట్టాడు.ఆర్సీబీ ఆరో వికెట్ డౌన్ఆర్సీబీ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన రోమారియో షెపర్డ్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు.ఆర్సీబీ ఐదో వికెట్ డౌన్ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన డేవిడ్.. అక్షర్ పటేల్ బౌలింగ్లో ఔటయ్యాడు. 15.2 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 146-5ఆర్సీబీ నాలుగో వికెట్ డౌన్ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన పాటిదార్.. ముఖేష్ కుమార్ బౌలింగ్లో ఔటయ్యాడు. 12.4 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్ 131-4ఆర్సీబీ మూడో వికెట్ డౌన్ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. 63 పరుగులు చేసిన ఫిల్ సాల్ట్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఔటయ్యాడు.ఆర్సీబీ రెండో వికెట్ డౌన్ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన రజత్ పాటిదార్.. అక్షర్ పటేల్ బౌలింగ్లో ఔటయ్యాడు. 10 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 99/2దూకుడుగా ఆడుతున్న సాల్ట్8 ఓవర్లకు ఆర్సీబీ వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది. క్రీజులో ఫిల్ సాల్ట్(45), పడిక్కల్(11) ఉన్నారు.ఆర్సీబీ తొలి వికెట్ డౌన్52 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. ఎంగిడీ బౌలింగ్లో ఔటయ్యాడు.3 ఓవర్లకు ఆర్సీబీ స్కోరెంతంటే?3 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుంగా 29 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(14), సాల్ట్(10) ఉన్నాడు.ఐపీఎల్-2026 సీజన్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు ఎటువంటి మార్పులు లేకుండా ఆడుతున్నాయి. కాగా ఈ మ్యాచ్లో ఆర్సీబీ గ్రీన్ జెర్సీ ధరించి బరిలోకి దిగింది. సమాజంలో పర్యావరణంపై అవగాహన కల్పించేందుకే ఆర్సీబీ గ్రీన్ జెర్సీతో ఆడుతోంది.తుది జట్లు:ఢిల్లీ క్యాపిటల్స్: పాతుమ్ నిస్సాంక, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, ఔకిబ్ నబీ దార్, లుంగి ఎన్గిడి, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, ముఖేష్ కుమార్ఇంపాక్ట్ సబ్స్: విప్రజ్ నిగమ్, అశుతోష్ శర్మ, కరుణ్ నాయర్, దుష్మంత చమీర, నితీష్ రాణారాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హాజిల్వుడ్ఇంపాక్ట్ సబ్స్: రసిఖ్ సలాం దార్, వెంకటేష్ అయ్యర్, జోర్డాన్ కాక్స్, , మంగేష్ యాదవ్, విక్కీ ఓస్ట్వాల్ -
ఔటైయ్యాననే కోపంతో పాక్ కెప్టెన్ ఏం చేశాడో తెలుసా?
పాకిస్తాన్ సూపర్ లీగ్ -2026లో లాహోర్ ఖలందర్స్ ఓటుమల పరంపర కొనసాగుతోంది. శుక్రవారం క్వెట్టా గ్లాడియేటర్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో లహోర్ ఓటమి పాలైంది. షాహీన్ షా అఫ్రిది సారథ్యంలోని లహోర్ ఖలందర్స్కు ఇది నాలుగో ఓటమి కావడం గమనార్హం. నిన్న జరిగిన మ్యాచ్లో లహోర్ బ్యాటర్లు తీవ్ర నిరాశపరిచారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన లహోర్ 19.5 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది.లహోర్ ఇన్నింగ్స్లో హసీబుల్లా ఖాన్( 33) మినహా మిగితా బ్యాటర్లందరూ విఫలమయ్యారు. క్వెట్టా గ్లాడియేటర్స్ బౌలర్లు ఉస్మాన్ తారీఖ్, జునైద్ ఖాన్ తలా మూడు వికెట్లు పడగొట్టి లహోర్ పతనాన్ని శాసించారు. అనంతరం 135 పరుగుల లక్ష్యాన్ని క్వెట్టా గ్లాడియేటర్స్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 16.2 ఓవర్లలో ఊదిపడేసింది. క్వెట్టా ఫస్ట్ డౌన్ బ్యాటర్ రిలీ రుసో(60) అజేయంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. అయితే ఈ మ్యాచ్లో లాహోర్ ఖలందర్స్ కెప్టెన్ షాహీన్ షా అఫ్రిది తన సహనాన్ని కోల్పోయాడు.ఏమి జరిగిందంటే?మొదట బ్యాటింగ్కు దిగిన లహోర్ ఖలందర్స్.. క్వెట్టా గ్లాడియేటర్స్ బౌలర్ల ధాటికి 60 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో ఇన్నింగ్స్ను చక్కదిద్దేందుకు కెప్టెన్ షాహీన్ అఫ్రిది తనను తానుగా ప్రమోట్ చేసుకుని ముందుగా బ్యాటింగ్కు వచ్చాడు.సికిందర్ రజా, డానియల్ సామ్స్ను కాదని అఫ్రిది ముందుగా బ్యాటింగ్ రావడం అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే షాహీన్ తన ఆడిన మొదటి బంతికే స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్లో ఔటయ్యాడు. దీంతో గోల్డెన్ డకౌట్ అయిన బాధలో షాహీన్ సహనాన్ని కోల్పోయాడు.డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లే క్రమంలో బౌండరీ లైన్ దగ్గర ఉన్న టైర్లపై,సైడ్ స్క్రీన్పై తన బ్యాట్ను బలంగా బాదాడు. అంతేకాకుండా మెట్లకు కూడా తన బ్యాట్ను బలంగా కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.చదవండి: T20 WC 2026: మ్యాచ్ ఫిక్సింగ్!.. మరో సంచలన వార్తShaheen Shah Afridi broke his bat after getting out for duck 🦆. #LHQVQTG pic.twitter.com/DYzLMCFe9f— Nibraz Ramzan (@nibraz88cricket) April 17, 2026 -
పంత్పై తిట్ల దండకం.. వివరణ ఇచ్చిన గొయెంకా
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ను ఆ ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గొయెంకా తిట్టాడని గత కొద్ది రోజులుగా సోషల్మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై గొయెంకా ఎట్టకేలకు స్పందించారు. తాజాగా ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. పంత్ లాంటి ఆటగాడిని తిట్టే పరిస్థితి ఎప్పుడూ ఉండదని వివరణ ఇచ్చాడు. నేను ఏది చేసినా వైరలవుతుంది, సోషల్మీడియాకు నేనో పంచింగ్ బ్యాగ్లాగా మారానని అన్నారు. బయట ఎన్ని ప్రచారాలు ఉన్నా, డ్రెస్సింగ్ రూమ్లో మాత్రం ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు. తన హావభావాలు పదేపదే తప్పుగా అర్దమవుతున్నాయి. ఇక నుంచి చేతులు వెనుక పెట్టుకుని మాట్లాడటం నేర్చుకుంటానని హాస్యంగా చెప్పారు.ఇదే సందర్భంగా ఆటలో తన జోక్యంపై కూడా వివరణ ఇచ్చారు. నేను ప్రొఫెషనల్ క్రికెట్ ఎప్పుడూ ఆడలేదు. ఆటగాళ్లకు నేను క్రికెట్ పాఠాలు నేర్పాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. టెక్నికల్ వాళ్లు ఆ పనిని చూసుకుంటారు. నా రోల్ జట్టుకు సపోర్ట్ చేయడం మాత్రమే. నేను ఆటలో జోక్యం చేసుకుంటానన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. కాగా, ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఢిల్లీతో మ్యాచ్ పూర్తైన తర్వాత గొయెంకా పంత్ను తిట్టాడని సోషల్మీడియా కోడై కూసింది. ఆ మ్యాచ్లో లక్నో ఓటమి అనంతరం బౌండరీ లైన్ వద్ద పంత్ను తిడుతున్నట్లు ఉన్న వీడియోలు సోషల్మీడియాలో వైరలయ్యాయి. దీనికిపై అప్పుడే లక్నో అధికారిక సోషల్మీడియా ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసి వివరణ ఇచ్చారు. అందులో గొయెంకా-పంత్ సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే ఈ వీడియోలను నెటిజన్లు నమ్మలేదు. ఫేక్ వీడియోలని కొట్టిపారేశారు. గొయెంకాకు కెప్టెన్లను తిట్టిన చరిత్ర ఉంది. గతంలో కేఎల్ రాహుల్ను కూడా దూషించాడు. ఇప్పుడు పంత్ను కూడా తిట్టాడని చర్చించుకున్నారు. తాజాగా గొయెంకా స్వయంగా వివరణ ఇచ్చినా నెటిజన్లు అతని మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరు.ఇదిలా ఉంటే, ప్రస్తుత సీజన్లో లక్నో పరిస్థితి హాట్ అండ్ కోల్డ్గా ఉంది. ఈ సీజన్లో ఆ జట్టు 5 మ్యాచ్ల్లో 2 విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. కెప్టెన్గా రిషబ్ పంత్ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. ఒక్క మ్యాచ్ మినహా వ్యక్తిగతంగానూ విఫలమవుతూ వస్తున్నాడు. లక్నో రేపు జరుగబోయే తమ తదుపరి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. -
T20 WC 2026: వెలుగులోకి సంచలన విషయం
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలకు సంబంధించి మరో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఇందులో పంజాబీ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. కాగాఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య భారత్- శ్రీలంక వేదికలుగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ జరిగిన సంగతి తెలిసిందే.న్యూజిలాండ్తో మ్యాచ్లో ఇలాఈ మెగా ఈవెంట్లో కెనడా.. న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో కలిసి గ్రూప్-డి నుంచి పోటీపడింది. ఒక్క విజయం కూడా నమోదు చేయలేక చెత్త ప్రదర్శనతో వెనుదిరిగింది. అయితే, న్యూజిలాండ్తో మ్యాచ్లో మాత్రం కెనడా మెరుగ్గా ఆడింది.అనూహ్య నిర్ణయంచెన్నైలో కివీస్తో తలపడ్డ కెనడా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఓపెనర్ యువరాజ్ సమ్రా అద్భుత సెంచరీ (65 బంతుల్లో 110) కారణంగా ఈ స్కోరు సాధ్యమైంది. ఇక లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఆదిలో తడబడగా.. కెనడా కెప్టెన్ దిల్ప్రీత్ బజ్వా అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు.రెగ్యులర్ బౌలర్ కానప్పటికీ తానే స్వయంగా పవర్ ప్లేలో బంతితో రంగంలోకి దిగాడు బజ్వా. మొత్తంగా రెండు ఓవర్లలో 26 రన్స్ ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు. బ్యాటర్గానూ అతడు విఫలమయ్యాడు. 39 బంతులు ఎదుర్కొని కేవలం 36 పరుగులే చేశాడు.ఈ నేపథ్యంలో దిల్ప్రీత్ బజ్వా వ్యవహారశైలిని ఉటంకిస్తూ ‘ది ఫిఫ్త్ స్టేట్’ అనే కెనడా ఇన్వెస్టిగేటివ్ డాక్యుమెంటరీ ప్రోగ్రామ్లో అతడిపై ఆరోపణలు చేసింది. ‘అవినీతి.. నేరం.. క్రికెట్’ అనే డాక్యుమెంటరీలో కెనడా క్రికెట్ బోర్డు, కెప్టెన్ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించింది.రంగంలోకి ఐసీసీ.. విచారణకు ఆదేశంఈ క్రమంలో ఐసీసీ అవినీతి నిరోధక విభాగం రంగంలోకి దిగి విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ‘అవినీతి.. నేరం.. క్రికెట్’ డాక్యుమెంటరీ ద్వారా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. పంజాబీ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ సభ్యులు కెనడా బోర్డును బెదిరించినట్లు తెలుస్తోంది.లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ బెదిరింపులుడాక్యుమెంటరీలో ఉన్న వివరాల ప్రకారం.. ‘‘మా ఆదేశాలను పాటించకపోతే మీరు, మీ కుటుంబ సభ్యులు ప్రమాదంలో పడతారు. నేను చెప్పిన ఆటగాళ్లను జట్టు నుంచి అస్సలు తప్పించకూడదు. ఒకవేళ అలా చేశారంటే మీకు చిక్కులు తప్పవు’’ అని లారెన్స్ బిష్ణోయి బెదిరింపులుకు పాల్పడ్డట్లు తెలుస్తోంది.ఈ విషయం గురించి క్రికెట్ కెనడా సన్నిహిత వర్గాలు CBCతో మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి ఘటనలు జరిగినపుడు క్రికెటర్లు కూడా భయపడతారు. వాళ్లేమీ ఇందుకు అతీతులు కాదు. వాళ్లు చాలా భయపడిపోయారు. అందుకే ఈ విషయం గురించి ఎవరికీ ఏమీ చెప్పలేదు’’ అని పేర్కొన్నాయి.సీనియర్లు ఉండగా అతడికే ఎందుకు కెప్టెన్సీ?కెనడా కెప్టెన్ దిల్ప్రీత్ బజ్వాపై అనుమానాలు బలపడుతున్నాయి. సీనియర్లు ఉండగా బోర్డు 23 ఏళ్ల ఈ ఆటగాడిని.. అది కూడా టోర్నీకి దాదాపు వారం రోజుల ముందు సారథిగా నియమించడం సందేహాలకు తావిచ్చింది.అయితే, బయటి వ్యక్తుల ఆదేశాలతోనే అతడు ఫిక్సింగ్కు పాల్పడి ఉంటాడని సదరు వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. ఇదిలా ఉంటే.. బిష్ణోయ్ గ్యాంగ్ను కెనడా ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చిన సంగతి తెలిసిందే.చదవండి: అందుకే IPL కాదని.. PSLలో ఆడుతున్నా: మొయిన్ అలీ -
హాల్ ఆఫ్ 'షేమ్'లో రహానే
ఐపీఎల్ 2026లో వరుస పరాజయాల కారణంగా ముప్పేటదాడిని ఎదుర్కొంటున్న కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే మరో ఘోర అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త కెప్టెన్గా అపవాదును సొంతం చేసుకున్నాడు. కనీసం 25 మ్యాచ్లకు కెప్టెన్సీ చేసిన ఆటగాళ్లను పరిగణలోకి తీసుకుంటే, అత్యధిక పరాజయాల శాతం కలిగిన కెప్టెన్గా రహానే అందరికంటే ముందున్నాడు.రహానే తన ఐపీఎల్ కెరీర్ మొత్తంలో 44 మ్యాచ్ల్లో కెప్టెన్గా వ్యవహరించి 14 మ్యాచ్ల్లోనే (28 పరాజయాలు, 2 ఫలితం రాలేదు) తన జట్టును గెలిపించాడు. ఈ లెక్కన అతని విజయాల శాతం కేవలం 31.83 మాత్రమే. ఐపీఎల్లో కనీసం 25 మ్యాచ్ల్లో కెప్టెన్సీ చేసిన ఆటగాళ్లలో ఇంత తక్కువ విన్నింగ్ పర్సంటేజ్ ఎవరికీ లేదు. రహానే తర్వాతి స్థానాల్లో.. మహేళ జయవర్దనే (30 మ్యాచ్ల్లో 10 విజయాలు, 33.33 విన్నింగ్ పర్సంటేజ్),కుమార సంగక్కర (47 మ్యాచ్ల్లో 17 విజయాలు, 36.2),శిఖర్ ధవన్ (27 మ్యాచ్ల్లో 10 విజయాలు, 37),సౌరవ్ గంగూలీ (42 మ్యాచ్ల్లో 17 విజయాలు, 40.5) ఉన్నారు.మొత్తం కెప్టెన్సీ కెరీర్లోనే ఈ ట్రాక్ రికార్డు కలిగిన రహానే, కేకేఆర్ కెప్టెన్గా మరింత దారుణమైన రికార్డును కలిగి ఉన్నాడు. 2025 ఎడిషన్లో కేకేఆర్ సారధిగా (14 మ్యాచ్ల్లో 5 విజయాలు) బాధ్యతలు చేపట్టిన రహానే, ఇప్పటివరకు ఈ ఫ్రాంచైజీ తరఫున 19 మ్యాచ్ల్లో కెప్టెన్సీ వహించి ఏకంగా 12 మ్యాచ్ల్లో తన జట్టును పరాజయం బాట పట్టించాడు. కేకేఆర్ తరఫున అతని విజయాల శాతం కేవలం 26.31 మాత్రమే. కేకేఆర్కు ముందు రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్గా వ్యవహరించిన రహానే, ఆ ఫ్రాంచైజీ తరఫున కూడా చెత్త రికార్డు కలిగి ఉన్నాడు. రాయల్స్ కెప్టెన్గా 24 మ్యాచ్ల్లో కేవలం తొమ్మిదే విజయాలు సాధించాడు.కాగా, రహానే సారథ్యంలో కేకేఆర్ తాజాగా గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడింది. ఈ ఓటమి ఈ సీజన్లో ఆ జట్టుకు ఐదవది (6 మ్యాచ్ల్లో). పంజాబ్తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోవడంతో ఆ జట్టు ఖాతాలో ఓ పాయింట్ ఉంది. ఏప్రిల్ 19న జరిగే తదుపరి మ్యాచ్లో కేకేఆర్ పటిష్టమైన రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది. -
సన్రైజర్స్ జట్టులోకి యార్కర్ల కింగ్?
ఐపీఎల్-2026లో సన్రైజర్స్ హైదరాబాద్ మరో కీలక పోరుకు సిద్దమైంది. శనివారం ఉప్పల్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో ఎస్ఆర్హెచ్ తలపడనుంది. గత మ్యాచ్లో రాజస్తాన్పై ఘన విజయం సాధించిన ఎస్ఆర్హెచ్.. ఇప్పుడు అదే జోరును సీఎస్కేపై కొనసాగించాలని పట్టుదలతో ఉంది.అయితే ఫిట్నెస్ టెస్టు క్లియర్ చేసి ఎస్ఆర్హెచ్ జట్టుతో కలిసిన కెప్టెన్ పాట్ కమ్మిన్స్.. ఈ మ్యాచ్కు మాత్రం అందుబాటులో లేడు. ఏప్రిల్ 25న రాజస్తాన్ రాయల్స్తో జరిగే మ్యాచ్లో కమ్మిన్స్ ఆడనున్నాడు. కాగా సీఎస్కేతో మ్యాచ్కు ఎస్ఆర్హెచ్ తుది జట్టులో ఓ కీలక మార్పు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.భారీగా పరుగులు సమర్పించుకుంటున్న పేసర్ ఇషాన్ మలింగను పక్కన పెట్టాలని సన్రైజర్స్ మేనెజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. గత సీజన్లో తన అద్భుత బౌలింగ్తో ఆకట్టుకున్న మలింగ.. ప్రస్తుత సీజన్లో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు.ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడిన మలింగ.. 10.40 ఏకానమీతో ఏకంగా 156 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలోనే అతడి స్ధానంలో మరో శ్రీలంక స్పీడ్ స్టార్ దిల్షాన్ మధుశంకకు అవకాశమివ్వాలని ఎస్ఆర్హెచ్ భావిస్తుందంట. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అయిన మధుశంకకు అద్భుతమైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. పవర్ప్లేతో పాటు డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసే సత్తా కూడా ఉంది. ముఖ్యంగా అతడు పిన్ పాయింట్ యార్కర్లు బౌలింగ్ చేయగలడు. మధుశంక ఇటీవలే బ్రైడన్ కార్స్ స్ధానంలో జట్టులోకి చేరాడు. గత మ్యాచ్లో సత్తాచాటిన ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్తో మధుశంక బంతిని పంచుకునే అవకాశముంది. ఒకవేళ నలుగురు పేసర్లతో ఎస్ఆర్హెచ్ ఆడాలని భావిస్తే మలింగకు బదులుగా స్పిన్నర్ హర్ష్ దూబేను పక్కన పెట్టే ఛాన్స్ ఉంది.సీఎస్కేతో మ్యాచ్కు ఎస్ఆర్హెచ్ తుది జట్టు(అంచనా)ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్( కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, సలీల్ అరోరా, హర్ష్ దూబే, శివంగ్ కుమార్, దిల్షాన్ మధుశంక, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే(ఇంపాక్ట్ సబ్)చదవండి: BAN vs PAK: పాక్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం.. ఒకేసారి నలుగురికి! -
మీ కెప్టెన్, వైస్ కెప్టెన్ శుద్ధ దండగ: మాజీ క్రికెటర్ ఫైర్
కోల్కతా నైట్ రైడర్స్ కథ మారలేదు. ఐపీఎల్-2026లో కేకేఆర్ ఐదో ఓటమిని నమోదు చేసింది. గుజరాత్ టైటాన్స్తో శుక్రవారం నాటి మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో ఇంత వరకు ఈ సీజన్లో ఇప్పటి వరకు గెలుపున్నదే ఎరుగని ఏకైక జట్టుగా కేకేఆర్ కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ కేకేఆర్ నాయకత్వ బృందంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. సారథి అజింక్య రహానే, వైస్ కెప్టెన్ రింకూ సింగ్ జట్టులో శుద్ధ దండగ అంటూ మండిపడ్డాడు. కాగా గుజరాత్తో మ్యాచ్లో రహానే డకౌట్ కాగా.. రింకూ ఒకే ఒక్క పరుగు చేశాడు.వీరిద్దరి వైఫల్యం కారణంగా మిగతా బ్యాటర్ల మీద భారం పడగా.. వాళ్లు ఒత్తిడిలో చిత్తయ్యారు. రూ. 25 కోట్ల ఆటగాడు కామెరాన్ గ్రీన్ 79 పరుగులతో కేకేఆర్ టాప్ రన్స్కోరర్గా నిలిచాడు. ఈ నేపథ్యంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్ కేకేఆర్ తీరును విమర్శించాడు.మీ కెప్టెన్, వైస్ కెప్టెన్ శుద్ధ దండగ‘‘వాళ్లు కనీసం 200 పరుగులైనా చేసి ఉంటే మ్యాచ్ గెలిచేవాళ్లు. ఫైనల్ ఓవర్లలో కేకేఆర్ పూర్తిగా తడబడింది. ఇక కెప్టెన్ అజింక్య రహానే, వైస్ కెప్టెన్ రింకూ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు.ఇద్దరూ దారుణంగా విఫలమయ్యారు. అసలు ఏం చేస్తున్నామన్న సోయి కూడా ఉన్నట్లు కనిపించలేదు. ఇద్దరూ ఫామ్లేమితో సతమతమవుతున్నారు. జట్టు కెప్టెన్, వైస్ కెప్టెన్ శుద్ధ దండగ అయినప్పుడు ఇక జట్టు సభ్యులు ఎలా ఆడతారో మనం అర్థం చేసుకోవచ్చు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు.దారుణంగా విఫలమవుతున్న రింకూకాగా అహ్మదాబాద్లో గుజరాత్తో మ్యాచ్లో టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బ్యాటింగ్కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులు చేసి ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ 19.4 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో రహానే ఇప్పటికి 152 పరుగులు చేయగా.. రింకూ కేవలం 79 పరుగులే చేశాడు.చదవండి: నాకు అప్పులు ఉన్నాయి.. ఆదుకోమన్న క్రిస్ గేల్!2⃣ points in the bag ✅Hat-trick of wins ✅@gujarat_titans wrap a fantastic all-round show at home 🥳🏠 Scorecard ▶️ https://t.co/FACeUzse3B#TATAIPL | #KhelBindaas | #GTvKKR pic.twitter.com/mVnSg3ZI5p— IndianPremierLeague (@IPL) April 17, 2026 -
పాకిస్తాన్ సూపర్ లీగ్లో గందరగోళం
పాకిస్తాన్ సూపర్ 2026లో గందరగోళం నెలకొంది. క్వెట్టా గ్లాడియేటర్స్ అనే ఫ్రాంచైజీ ఒకే మ్యాచ్లో బెవాన్ జాకబ్స్, అతని ప్రత్యామ్నాయంగా ప్రకటించిన దినేశ్ చండీమల్ను బరిలోకి దించి అందరినీ అవాక్కయ్యేలా చేసింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. న్యూజిలాండ్కు చెందిన బెవాన్ జాకబ్స్ జాతీయ విధుల నిమిత్తం (బంగ్లాదేశ్తో సిరీస్) జట్టుకు అందుబాటులో ఉండడని గ్లాడియేటర్స్ యాజమాన్యం ఏప్రిల్ 16న ప్రకటించింది. అదే సమయంలో అతనికి ప్రత్యామ్నాయంగా శ్రీలంకకు చెందిన దినేశ్ చండీమల్ పేరును కూడా వెల్లడించింది.అయితే లాహోర్ ఖలందర్స్తో నిన్న (ఏప్రిల్ 17) జరిగిన మ్యాచ్లో జాకబ్స్, చండీమల్ ఇద్దరి పేర్లు ప్లేయింగ్ ఎలెవెన్లో కనిపించాయి. దీంతో అందరూ అవాక్కయ్యారు. ఒకే మ్యాచ్లో జాకబ్స్, అతని రీప్లేస్మెంట్ ఎలా బరిలోకి దిగుతారని చర్చించుకున్నారు.ఈలోపు గ్లాడియేటర్స్ యాజమాన్యం నాలుక కరుచుకుని చండీమల్ జాకబ్స్కు ప్రత్యామ్నాయం కాదు, టామ్ కర్రన్కు అంటూ ప్రకటన చేసింది. కర్రన్ అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్లో ఆడలేకపోయాడు. అతని స్థానంలో చండీమల్ జట్టులోకి వచ్చాడని పేర్కొంది.ఈ గందరగోళం చూసి ఏం జరుగుతుందో అర్దం కాక గ్లాడియేటర్స్ అభిమానులే జుట్టు పీక్కున్నారు. నెటిజన్లు అయితే ఇలాంటి సిత్రాలన్నీ పాకిస్తాన్లో మాత్రమే సాధ్యమంటూ కామెంట్లు చేస్తున్నారు. ఘోర తప్పిదం జరిగిన ఈ మ్యాచ్లో ఖలందర్స్పై గ్లాడియేటర్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చండీమల్ (3) విఫలం కాగా.. జాకబ్స్ (14 నాటౌట్) గ్లాడియేటర్స్ను విజయతీరాలకు చేర్చాడు. -
పాక్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం.. ఒకేసారి నలుగురికి!
బంగ్లాదేశ్తో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు వెటరన్ బ్యాటర్ షాన్ మసూద్ నాయకత్వం వహించనున్నాడు. అదేవిధంగా ,అబ్దుల్లా ఫజల్, అమాద్ బట్, అజాన్ అవైస్, ముహమ్మద్ ఘాజీ ఘోరి వంటి యువ ఆటగాళ్లకు తొలిసారి పాక్ జాతీయ జట్టులో చోటు దక్కింది.ఇమామ్ ఉల్ హక్, షాహీన్ షా అఫ్రిది, బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ వంటి సీనియర్ ప్లేయర్లు ఈ జట్టులో ఉన్నారు. మరోవైపు ఈ బంగ్లా టూర్లో పాకిస్తాన్ హెడ్ కోచ్గా మాజీ టెస్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ వ్యవహరించనున్నాడు. అదేవిధంగా మాజీ క్రికెటర్లు అసద్ షఫీక్, ఉమర్ గుల్ బ్యాటింగ్, బౌలింగ్ కోచ్లగా సేవలందించనున్నారు.ఇక ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2025-27లో భాగంగా ఈ రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ జరగనుంది. వచ్చే నెల 8 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు మ్యాచ్ ఢాకా వేదికగా జరగనుండగా.. రెండో టెస్టుకు సిల్హెట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఈ సిరీస్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే లహోర్లోని ఎన్సీఎలో శిక్షణా శిబిరం ఏర్పాటు చేసింది. ఇందులో అజాన్ అవైస్, ఇమామ్-ఉల్-హక్, ముహమ్మద్ ఘాజీ ఘోరి, నోమన్ అలీ,సాజిద్ ఖాన్ వంటి వారు పాల్గొంటున్నారు. మరో ట్రైనింగ్ క్యాంప్ ఏప్రిల్ 27 నుంచి ప్రారంభం కానుంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడుతున్న టెస్టు జట్టు సభ్యులు, తమ షెడ్యూల్ ముగించుకుని ట్రైనింగ్ క్యాంప్లో చేరుతారు. ఏ జట్లైతే ఫైనల్కు చేరుకుంటాయో, ఆ ఆటగాళ్లు టోర్నమెంట్ ముగిసిన తర్వాత నేరుగా బంగ్లాదేశ్కు చేరుకుంటారు.బంగ్లా టూర్కు పాక్ జట్టుషాన్ మసూద్ (కెప్టెన్), అబ్దుల్లా ఫజల్, అమద్ బట్, అజాన్ అవైస్, బాబర్ అజామ్, హసన్ అలీ, ఇమామ్-ఉల్-హక్, ఖుర్రం షాజాద్, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్), ముహమ్మద్ ఘాజీ ఘోరీ (వికెట్), నోమన్ అలీ, సాజిద్ షకీల్, సాజిద్ అగ్హా, సల్మాన్ అలీ.చదవండి: అందుకే IPL కాదని.. PSLలో ఆడుతున్నా: మొయిన్ అలీ -
కేకేఆర్ ఘోర వైఫల్యాలకు కారణాలు ఇవే..!
ఐపీఎల్ 2026లో కేకేఆర్ జట్టు చెత్తగా ఆడుతుంది. వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్లోనూ గెలవలేదు. వారికి లభించిన ఏకైక పాయింట్ పంజాబ్తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం వల్ల వచ్చింది. తాజాగా గుజరాత్ చేతిలో పరాజయం అనంతరం ఆ జట్టు మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ప్లేఆఫ్స్ చేరుకోవాలంటే మిగిలిన 8 మ్యాచ్ల్లో కనీసం 7 గెలవాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రకారం ఇది అంత ఈజీగా జరిగే పని కాదు. వరుస పరాజయాలతో ఆ జట్టు నీరసించిపోయింది. కాన్ఫిడెన్స్ లోపించి అపజయాలను అలవాటు చేసుకుంది.కేకేఆర్కు ఈ దుస్థితి రావడానికి కారణాలేంటా అని పరిశీలిస్తే ఛాంతాడం చిట్టా బయటపడుతుంది. వీరికి దెబ్బలు సీజన్ ప్రారంభానికి ముందే పడ్డాయి. కోట్లు పోసి కొనుక్కున్న బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రాజకీయ కారణాల చేత తొలగించబడ్డాడు. ఆతర్వాత దేశీయ పేసర్లు హర్షిత్ రాణా, ఆకాశ్దీప్ గాయాల కారణంగా సీజన్ మొత్తానికే దూరమయ్యారు. దీనికంటే ముందే యాజమాన్యం వ్యూహాత్మక తప్పిదం చేసింది. కెప్టెన్ను ఎంచుకునే విషయంలో తప్పులో కాలేసింది. గత సీజన్ చేదు అనుభవాలను పట్టించుకోకుండా రహానేను కెప్టెన్గా కొనసాగించి ఘోర తప్పిదం చేసింది. ఖచ్చితంగా మాట్లాడుకుంటే, రహానే టీ20 ఆటగాడు కాదు. పైగా అతను నాలుగు పదుల వయసుకు దగ్గర పడుతున్నాడు. ఇలాంటి ఆటగాడిని ఏ ఫ్రాంచైజీ కనీసం జట్టులో కూడా తీసుకోదు. అలాంటి కేకేఆర్ ఏకంగా కెప్టెన్గా కొనసాగించి చేతులు కాల్చుకుంటుంది. ఇక్కడ రహానేను నిందించడం పాయింట్ కాదు. అతని ఔట్ డేటెడ్ కెప్టెన్సీ వూహ్యాలు ప్రస్తుత టీ20 యుగానికి పనికిరావన్నదే విషయం. ఇప్పటికీ అతను శక్తివంచన లేకుండా జట్టును విజయపథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నా, ఇతర ఆటగాళ్ల నుంచి అతనికి సహకారం లభించడం లేదు. గ్రీన్ లాంటి అత్యంత ఖరీదైన ఆటగాడు దారుణంగా విఫలమవుతున్నారు. కోట్లు పోసి కొనుక్కున్న మతీష పతిరణ ఇంకా అందుబాటులోకి రాలేదు. ఫిన్ అలెన్ మంచి ఆరంభాలు లభిస్తున్నా, సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సామర్థ్యం మేరకు రాణించలేకపోతున్నాడు. మిడిలార్డర్ బ్యాటింగ్లో రింకూ సింగ్ చేతులెత్తేశాడు. రహానే వ్యక్తిగతంగానూ శ్రమిస్తున్నప్పటికీ సఫలం కాలేకపోతున్నాడు. ఊరట కలిగించే ఆటగాళ్లు ఎవరైనా ఉన్నారా అంటే అది అంగ్కృష్ రఘువంశీ, సునీల్ నరైన్, అడపాదడపా కార్తీక్ త్యాగి మాత్రమే.ఇవి కాకుండా కేకేఆర్ వ్యూహాత్మకమైన ఎన్నో తప్పిదాలు చేస్తుంది. బౌలింగ్–బ్యాటింగ్ కాంబినేషన్లో లోపాలు స్పష్టంగా కనినిస్తున్నాయి. పవర్ప్లేలో వికెట్లు తీయలేకపోవడం, మిడిల్ ఓవర్లలో ఒత్తిడి పెంచలేకపోవడం, డెత్ ఓవర్లలో ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం ప్రధాన సమస్యగా మారింది. మిడిలార్డర్ బ్యాటింగ్లో కన్సిస్టెన్సీ లేదు. దీన్ని వల్ల ఓ మోస్తరు ఆరంభాలు లభించినా ఉపయోగం లేకుండా పోతుంది.మొత్తంగా వరుస ఓటములతో ఆ జట్టు మానసిక స్థితి పూర్తిగా దెబ్బతింది. ఆటగాళ్లు ఒత్తిడిలో కూరుకుపోయారు. సాహసించి ఏ అడుగు వేయలేకపోతున్నారు. మరికొద్ది మ్యాచ్ల వరకు పరిస్థితిలో మార్పు వచ్చే దాఖలాలు కనిపించడం లేదు. కేకేఆర్ అభిమానులు మరో బ్యాడ్ సీజన్ అనుకొని సరిపెట్టుకోవడం తప్పించి చేసేదేమీ ఉండదు. ఏదైనా మార్పు రావాలంటే, బ్యాటింగ్-బౌలింగ్ కాంబినేషన్ను సరి చేయాలి. పవర్ ప్లేలో దూకుడుగా ఆడాలి. వికెట్లు తీయగలగాలి. డెత్ ఓవర్లలో ప్రత్యర్దిని కట్టడి చేయగలగాలి. మిడిలార్డర్ నిలకడ ప్రదర్శించాలి. మొత్తంగా మానసిక స్థితి మెరుగుపడాలి. ఇలా జరిగితే, మిగతా మ్యాచ్ల్లో అయినా సత్ఫలితాలు రావచ్చు. -
నాకు అప్పులు ఉన్నాయి.. ఆదుకోమన్న క్రిస్ గేల్!
వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ గురించి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సృష్టికర్త లలిత్ మోదీ ఆసక్తికర విషయం వెల్లడించాడు. తన వల్ల గేల్కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)కు ఆడే అవకాశం దక్కిందని పేర్కొన్నాడు. ఆ తర్వాత గేల్ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదని.. ఆర్థికంగానూ బాగానే స్థిరపడ్డాడని తెలిపాడు.వేలంలో అమ్ముడుపోలేదుకాగా ఐపీఎల్ 2008లో మొదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆరంభ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్కు ఆడిన క్రిస్ గేల్.. 2009, 2010 ఎడిషన్లలో కూడా అదే జట్టుతో కొనసాగాడు. అయితే, నిలకడలేని ప్రదర్శనల కారణంగా 2011 వేలంలో ఎవరూ అతడిని కొనుగోలు చేయలేదు.ఆ సమయంలో తానే క్రిస్ గేల్కు సాయం చేసినట్లు లలిత్ మోదీ తాజాగా వెల్లడించాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నేను ఐపీఎల్ వదిలేసి లండన్కు వచ్చిన రోజులు అవి. నాకు ఇష్టుడైన నా స్నేహితుడు గేల్ అప్పట్లో వేలంలో అమ్ముడుపోలేదు.అప్పులు ఉన్నాయి.. ఆదుకోమన్న క్రిస్ గేల్!అప్పుడు నాకు అతడు కాల్ చేశాడు. తనను ఎవరూ కొనలేదని చెప్పాడు. అందుకు బదులుగా.. ‘నువ్వు బాగా ఆడలేదు కాబట్టే ఎవరూ కొనలేదు. నిజానికి నువ్వు మంచి ఆటగాడికి. కానీ బద్దకం వల్ల ఇలా తయారయ్యావు’ అని చెప్పాను.ఇందుకు సమాధానంగా.. ‘నాకు భారీగా అప్పులు ఉన్నాయి. బిల్స్ కట్టాలంటే నేను ఐపీఎల్లో తప్పక ఆడాల్సిందే’ అని గేల్ తన ఆర్థిక పరిస్థితి గురించి చెప్పాడు. అప్పుడు చాలా మందికి కాల్ చేశాను. గేల్ను జట్టులోకి తీసుకోమని కోరాను.కానీ ఎవరూ సానుకూలంగా స్పందించలేదు. అప్పుడు నేను విజయ్ మాల్యా ఇంటికి వెళ్లాను. గేల్కు ఒక్క అవకాశం ఇవ్వమని కోరాను. డిరిక్ నాన్స్ గాయపడినట్లు తెలిసింది. అతడి స్థానంలో గేల్ను ఆడించమన్నాను.ఖాళీ చెక్కుపై తలరాతఅప్పుడు విజయ్ ఓ కండిషన్ పెట్టాడు. గేల్ బాగా ఆడితేనే డబ్బులు చెల్లిస్తానని చెప్పాడు. అయితే, గేల్ మా నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అద్భుత ఆట తీరుతో అలరించి.. తనకు ఇచ్చిన ఖాళీ చెక్కుపై తన తలరాతను రాసుకున్నాడు. కోట్లాది రూపాయల విలువ గల కాంట్రాక్టులు దక్కించుకున్నాడు’’ అని లలిత్ మోదీ చెప్పుకొచ్చాడు.కాగా 2011లో 12 మ్యాచ్లు ఆడిన గేల్ 608 పరుగులతో దుమ్ములేపాడు. తద్వారా అత్యధిక పరుగుల వీరుడిగా యూనివర్సల్ బాస్ ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. 2017 వరకు ఆర్సీబీతోనే గేల్ కొనసాగాడు. ఇదిలా ఉంటే.. ఇటు లలిత్ మోదీ.. అటు విజయ్ మాల్యా ఆర్థిక నేరగాళ్లుగా ముద్రపడి ప్రస్తుతం లండన్లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే.చదవండి: ‘ఏ క్షణమైనా బ్రెయిన్స్ట్రోక్.. సిగరెట్లు అడుక్కుంటున్నాడు’ -
అందుకే IPL కాదని.. PSLలో ఆడుతున్నా: మొయిన్ అలీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అమ్ముడుపోని విదేశీ క్రికెటర్లలో చాలా మంది పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో చేరతారు. ఒకవేళ మళ్లీ ఐపీఎల్ నుంచి గనుక ఆఫర్ వస్తే భారత్కు వచ్చేస్తారు. తాజా ఎడిషన్లో జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజర్బానీ, శ్రీలంక కెప్టెన్ దసున్ షనక, ఆస్ట్రేలియా స్టార్ స్పెన్సర్ పీఎస్ఎల్ను వీడి ఐపీఎల్లో చేరారు.నాకిప్పుడు 38 ఏళ్లుఅయితే, తాను మాత్రం ఈ కోవకు చెందినవాడిని కాదంటున్నాడు ఇంగ్లండ్ వెటరన్ క్రికెటర్ మొయిన్ అలీ (Moeen Ali). తాను కావాలనే IPLను కాదని PSLను ఎంచుకున్నట్లు తెలిపాడు. ‘‘నాకిప్పుడు 38 ఏళ్లు. అయినప్పటికీ నేనింకా క్రికెట్ ఆడాలనే అనుకుంటున్నాను. వీలైనంతగా నా కెరీర్ను పొడిగించుకోవాలని భావిస్తున్నాను.షార్ట్టైమ్ టోర్నీకరాచీ కింగ్స్లో నాకు ఈ స్వేచ్ఛ దొరికింది. ముఖ్యంగా పీఎస్ఎల్ తక్కువ వ్యవధిలోనే ముగిసిపోయే టోర్నీ. కాబట్టి ఆటగాడిగా నా లక్ష్యాన్ని నెరవేర్చుకుంటూనే కుటుంబానికి తగిన సమయం కేటాయించే వీలు దొరుకుతుంది.గతేడాది నేను ఐపీఎల్లో ఆడాను. అయితే సగం మ్యాచ్లలో కూడా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. బహుశా రెండుసార్లు నేను బ్యాటింగ్ చేసి ఉంటాను. నిజానికి నాకు బ్యాటింగ్ చేయడం ఇష్టం. నా కెరీర్ చరమాంకంలోనూ ఎక్కువగా బ్యాటింగ్ చేయాలని కోరుకుంటున్నా.అయితే, ఏ జట్టులోనైనా ప్లేయింగ్ ఎలెవన్లో చోటుకు గ్యారెంటీ ఉండదు. పీఎస్ఎల్లో కూడా అంతే. అయితే, ఆటను వీలైనంతగా ఆస్వాదించాలని భావిస్తున్నా. ఒక్కసారైనా పీఎస్ఎల్ ఆడాలని అనుకున్నా.షెడ్యూల్ క్లాష్ కానీ.. దురదృష్టవశాత్తూ ఐపీఎల్తో పీఎస్ఎల్ షెడ్యూల్ క్లాష్ అవుతోంది. అందుకే ఈ సారి ఐపీఎల్కు దూరమయ్యాను’’ అని మొయిన్ అలీ తన నిర్ణయానికి గల కారణాలు వెల్లడించాడు.కాగా ఐపీఎల్- 2025 మెగా వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ ఇంగ్లండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీని రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక ఈ ఏడాది పీఎస్ఎల్లో కరాచీకి ఆడుతున్న అతడు రూ. 2 కోట్లకు పైగా జీతం అందుకుంటున్నాడు. కాగా ఈ సీజన్లో అతడు ఇప్పటికి 126 పరుగులు చేసి.. మూడు వికెట్లు తీయగలిగాడు. ఇక 2024లో మొయిన్ అలీ అంతర్జాతీయ కెరీర్కు గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. చదవండి: చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి -
సన్రైజర్స్లోకి సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలింగ్ సంచలనం
సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలింగ్ సంచలనం గెరాల్డ్ కొయెట్జీకి ఊహించని విధంగా ఐపీఎల్ 2026 ఆఫర్ దక్కింది. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ గాయపడిన డేవిడ్ పేన్ స్థానంలో కొయెట్జీని జట్టులోకి తీసుకుంది. గతంలో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్కు ఆడిన కొయెట్జీని ఈ సీజన్ వేలంలో ఏ ఫ్రాంచైజీ తీసుకోకపోగా.. సీజన్ మధ్యలో సన్రైజర్స్ రూ. 2 కోట్ల మొత్తం వెచ్చించి సొంతం చేసుకుంది.కొయెట్జీ ఐపీఎల్లో 14 మ్యాచ్లు ఆడి 15 వికెట్లు సాధించాడు. ఇతని రాక సన్రైజర్స్లో కొత్త జోష్ నింపింది. ఈ సీజన్లో సన్రైజర్స్ బౌలింగ్లో చాలా బలహీనంగా ఉంది. బ్యాటింగ్లో పటిష్టంగా ఉన్నా బౌలింగ్లో తేలిపోవడంతో గెలవాల్సిన మ్యాచ్ల్లోనూ ఓడింది. కొయెట్జీ రాక సన్రైజర్స్ బౌలింగ్ కష్టాలను తీరుస్తుందని అంతా భావిస్తున్నారు. త్వరలో ఈ జట్టులో ఫుల్ టైమ్ కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా జట్టులోకి చేరనున్నాడు. దీంతో సన్రైజర్స్ బౌలింగ్ మరింత బలపడనుంది.సన్రైజర్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో 2 విజయాలు, 3 పరాజయాలతో 4 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ప్రస్తుతం ఆ జట్టు రన్రేట్ 0.576గా ఉంది. తాజాగా పటిష్టమైన రాజస్థాన్ రాయల్స్ను సొంతగడ్డపై మట్టికరిపించిన సన్రైజర్స్ ఇవాళ (ఏప్రిల్ 18) సొంతగడ్డపైనే సీఎస్కేతో తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. -
దిగ్గజాలు విరాట్, రోహిత్ను అధిగమించిన మంధాన
భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన టీ20 క్రికెట్లో చారిత్రాత్మక ఘనత సాధించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో 13 పరుగులు చేసి ఆమె.. భారత తరఫున (పురుషులు, మహిళలు) టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా రికార్డుల్లోకెక్కింది. ఈ క్రమంలో పురుషుల విభాగంలో దిగ్గజాలైన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మను అధిగమించింది. విరాట్ 125 మ్యాచ్ల టీ20 కెరీర్లో 4188 పరుగులు.. రోహిత్ తన 159 మ్యాచ్ల టీ20 కెరీర్లో 4231 పరుగులు చేయగా.. మంధాన 161 మ్యాచ్ల టీ20 కెరీర్లో 4244 పరుగులు చేసింది.భారత మహిళల విభాగం ఒక్కటే తీసుకుంటే.. మంధన తర్వాతి స్థానాల్లో హర్మన్ప్రీత్ కౌర్ (191 మ్యాచ్ల్లో 3854 పరుగులు), జెమీమా రోడ్రిగ్స్ (119 మ్యాచ్ల్లో 2587 పరుగులు), షఫాలీ వర్మ (99 మ్యాచ్ల్లో 2553 పరుగులు) ఉన్నారు.ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. మహిళల విభాగంలో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ సూజీ బేట్స్ (181 మ్యాచ్ల్లో 4717 పరుగులు) టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా కొనసాగుతుండగా.. మంధాన రెండో స్థానంలో ఉంది. పురుషుల విషయానికొస్తే.. పాక్ బ్యాటర్ బాబర్ ఆజమ్ (145 మ్యాచ్ల్లో 4596 పరుగులు) టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.కాగా, ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా సౌతాఫ్రికాతో నిన్న జరిగిన తొలి టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన టీమిండియా... నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (33 బంతుల్లో 47 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... జెమీమా రోడ్రిగ్స్ (29 బంతుల్లో 36; 2 ఫోర్లు, 1 సిక్స్), షఫాలీ వర్మ (20 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) తలా కొన్ని పరుగులు చేశారు. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (13), రిచా ఘోష్ (5), కాశ్వి గౌతమ్ (10) విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఖాకా 3 వికెట్లు పడగొట్టగా... టుమీ రెండు వికెట్లు తీసింది.అనంతరం బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ లారా వోల్వార్ట్డ్ (51), అన్నెరీ డెర్క్సన్ (44 నాటౌట్) సౌతాఫ్రికాను గెలిపించారు. సూన్ లస్ 13, తజ్మిన్ బ్రిట్స్ 10, అన్నెకే బాష్ 8, క్లో ట్రయాన్ 18 (నాటౌట్) పరుగులు చేశారు. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 2, అరుంధతి రెడ్డి, శ్రీచరణి తలో వికెట్ తీశారు. రెండో టీ20 ఏప్రిల్ 19న ఇదే డర్బన్ వేదికగా జరుగనుంది. -
రూ.కోట్లు కాజేశాడు.. జల్సా చేస్తున్నాడు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సృష్టికర్త, వివాదాస్పద వ్యాపారవేత్త లలిత్ మోడీ మరోసారి వార్తల్లో నిలిచారు. విలాసవంతమైన జీవనశైలికి పెట్టింది పేరుగా నిలిచే మోడీ, తన కుమారుడికి ఇచ్చే ఖరీదైన బహుమతుల గురించి సంచలన విషయాలను పంచుకున్నారు. ఇటీవల మాజీ క్రికెటర్ మైఖేల్ వాఘన్తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, తన కుమారుడి వద్ద ఉన్న అరుదైన కార్ల సేకరణ గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ప్రతి పుట్టినరోజుకూ ఒక ఫెరారీ!తన చిన్నతనంలో తండ్రి తనకు కారు కొనివ్వలేదన్న వెలితిని గుర్తు చేసుకుంటూ తన కుమారుడికి అలాంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మోడీ తెలిపారు. ‘నేను ఎదుగుతున్న క్రమంలో మా నాన్న నాకు ఫెరారీ కొనివ్వడానికి ఎప్పుడూ నిరాకరించేవారు. అది చాలా వేగంగా వెళ్తుందని, ప్రమాదకరమని ఆయన భావించేవారు. కానీ నాకు ఫెరారీ అంటే ప్రాణం. నా 40వ పుట్టినరోజున మా బంధువు నాకు మొదటి కారును బహుమతిగా ఇచ్చారు. అప్పుడే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నా కుమారుడికి 21 ఏళ్లు నిండినప్పటి నుంచి ప్రతి పుట్టినరోజుకూ ఒక ఫెరారీ కారును బహుమతిగా ఇస్తున్నాను’ అన్నారు.ప్రస్తుతం మోడీ కుమారుడి వయస్సు 32 ఏళ్లు. అంటే, గత 11 ఏళ్లుగా వరుసగా ఆయనకు ఫెరారీ కార్లు అందుతూనే ఉన్నాయి. ఫలితంగా, ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ, ఎక్కువ ఫెరారీ కార్ల సేకరణ కలిగిన వ్యక్తుల్లో ఒకరిగా ఆయన నిలిచారు.లండన్లో తలదాచుకుంటున్న మోడీఒకవైపు కొడుకు కోసం కోట్లు కుమ్మరిస్తూ వార్తల్లో నిలుస్తున్న లలిత్ మోడీ, మరోవైపు భారత చట్టాల నుంచి తప్పించుకుని లండన్లో తలదాచుకుంటున్నారు. వివిధ అంచనాల ప్రకారం మోడీ నికర ఆస్తి విలువ 500 మిలియన్ డాలర్ల నుంచి 600 మిలియన్ డాలర్ల (సుమారు రూ.4,000 - రూ.5,000 కోట్లు) వరకు ఉంటుందని సమాచారం. అయితే విదేశాల్లో ఉన్న పెట్టుబడుల కారణంగా దీనిపై కచ్చితమైన అధికారిక లెక్కలు లేవు.ఐపీఎల్ ఛైర్మన్గా ఉన్న సమయంలో ఆర్థిక అవకతవకలకు, నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలతో 2013లో బీసీసీఐ ఆయనపై జీవితకాల నిషేధం విధించింది. 2010 నుంచి లండన్లో నివసిస్తున్న మోడీ తనపై ఉన్న ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమని కొట్టిపారేస్తున్నారు. మనీలాండరింగ్ కేసుల్లో ఆయనను భారత్ రప్పించేందుకు దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాజేశారనే ఆరోపణలు ఒకవైపు, విదేశీ గడ్డపై విలాసవంతమైన జీవితం, ఖరీదైన కార్ల వేలంపాటలు మరోవైపు.. లలిత్ మోడీ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. భారత చట్టాలకు చిక్కకుండా ఆయన సాగిస్తున్న ఈ రాయల్ జీవితంపై సామాన్యుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఇదీ చదవండి: అంతర్జాలంలో సగానికి పైగా ఏఐ రాతలే! -
చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి
ఐపీఎల్ 2026లో కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి చరిత్ర సృష్టించాడు. తన ఫ్రాంచైజీ చరిత్రలో 100 వికెట్లు తీసిన తొలి భారతీయుడిగా చారిత్రక ఘనత సాధించాడు. నిన్న (ఏప్రిల్ 17) గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఈ ఘనత నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో అతను 2 వికెట్లు తీయగా.. అందులో మొదటి వికెట్తోనే ఈ ఘనత సాధించాడు. జోస్ బట్లర్ వికెట్ వరుణ్కు ఐపీఎల్లో 100వ వికెట్. వరుణ్ కాకుండా కేకేఆర్ తరఫున 100 వికెట్లు తీసిన బౌలర్లుగా సునీల్ నరైన్ (214), ఆండ్రీ రసెల్ (124) ఉన్నారు. వీరిద్దరూ విదేశీ క్రికెటర్లే. వరుణ్ తన ఐపీఎల్ కెరీర్లో (పంజాబ్, కేకేఆర్ తరఫున) ఇప్పటివరకు 87 మ్యాచ్లు ఆడి అందులో 102 వికెట్లు (పంజాబ్ తరఫున ఒకటి) తీశాడు. తద్వారా ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో పంజాబ్ పేసర్ అర్షదీప్ సింగ్తో కలిసి సంయుక్తంగా 28వ స్థానంలో ఉన్నారు. స్పిన్నర్ల విభాగంలో 11వ లీడింగ్ వికెట్ టేకర్గా ఉన్నాడు.దారుణ ఫామ్వరుణ్ గత కొంతకాలంగా దారుణమైన ఫామ్లో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్ రెండో అర్దభాగంలో మొదలైన పేలవ ప్రదర్శన గుజరాత్ మ్యాచ్ ముందు వరకు కొనసాగింది. ఈ ఐపీఎల్ సీజన్లో వరుణ్ తొలి 3 మ్యాచ్ల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. పైగా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. గుజరాత్ మ్యాచ్తోనే అతను వికెట్ల ఖాతా తెరిచాడు. ఈ మ్యాచ్లో వరుణ్ ఓ మోస్తరు ప్రదర్శన (4-0-34-2) చేసినప్పటికీ కేకేఆర్ ఓటమిపాలైంది.కోల్'కథ' కంచికే..!వరుణ్ ఫ్రాంచైజీ కేకేఆర్ ఈ సీజన్లో ఘోర ప్రదర్శనలు చేస్తుంది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో ఏకంగా 5 పరాజయాలు ఎదుర్కొని పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే కోల్'కథ' కంచికి చేరినట్లే.తాజాగా గుజరాత్తో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. తొలుత బ్యాటింగ్ చేస్తూ.. గ్రీన్ (79) సీజన్లో తొలి సారి రాణించడంతో 180 పరుగులు చేసిన కేకేఆర్.. ఆతర్వాత లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. శుభ్మన్ గిల్ (86) సత్తా చాటి గుజరాత్ను గెలిపించాడు. గుజరాత్ మరో 2 బంతులు మిగిలుండగానే సగం వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కేకేఆర్ తమ తదుపరి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్తో ఆడనుంది. -
కోల్ ‘కథ’ మారలేదు
అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్లో మాజీ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు మ్యాచ్ల్లో ఓడిన రహానే సారథ్యంలోని నైట్రైడర్స్... మరో ఓటమిని తమ ఖాతాలో వేసుకుంది. శుక్రవారం జరిగిన పోరులో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో కోల్కతాను చిత్తుచేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. పాతిక కోట్ల విలువైన ప్లేయర్ కామెరాన్ గ్రీన్ (55 బంతుల్లో 79; 7 ఫోర్లు, 4 సిక్స్లు) ఎట్టకేలకు రాణించగా... తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. రషీద్ ఖాన్ను లక్ష్యంగా చేసుకున్న గ్రీన్ భారీ షాట్లతో పరుగులు రాబట్టాడు. గుజరాత్ ఫీల్డింగ్ లోపాలు కూడా అతడికి కలిసి రావడంతో ఈ సీజన్లో తొలి అర్ధశతకం తన పేరిట లిఖించుకున్నాడు. పావెల్ (27; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ఫర్వాలేదనిపించగా... కెప్టెన్ అజింక్యా రహానే (0), రఘువంశీ (8), సీఫెర్ట్ (19), అనుకూల్ రాయ్ (9), రింకూ సింగ్ (1) పెవిలియన్కు క్యూ కట్టారు. గుజరాత్ బౌలర్లలో రబాడ 3 వికెట్లు పడగొట్టగా... సిరాజ్, అశోక్ శర్మ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ టైటాన్స్ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 181 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శుబ్మన్ గిల్ (50 బంతుల్లో 86; 8 ఫోర్లు, 4 సిక్స్లు) కెప్టెన్ ఇన్నింగ్స్తో జట్టును గెలిపించాడు. కోల్కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్లో టైటాన్స్కిది మూడో విజయం. శుబ్మన్ దూకుడు... ఓపెనర్లు చెలరేగడంతో గుజరాత్కు శుభారంభం దక్కింది. తొలి ఓవర్లో ఓ ఫోర్ కొట్టిన శుబ్మన్, రెండో ఓవర్లో మరో రెండు ఫోర్లు బాదాడు. మూడో ఓవర్లో గిల్, సాయి సుదర్శన్ (16 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్) కలిసి 3 సిక్స్లు కొట్టడంతో 20 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత కూడా గిల్ దూకుడు కొనసాగడంతో పవర్ప్లేలో గుజరాత్ 71 పరుగులు చేసి సుదర్శన్ వికెట్ కోల్పోయింది. వచ్చీ రావడంతోనే 4, 6, 4 కొట్టిన బట్లర్ (15 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్లు)... వరుణ్ బౌలింగ్లో అవుటయ్యాడు. ఈ క్రమంలో గిల్ 27 బంతుల్లో హాఫ్సెంచరీ సాధించాడు. బట్లర్, సుందర్ (13) వెనుదిరిగినా... ఛేదించాల్సిన లక్ష్యం పెద్దది కాకపోవడంతో గుజరాత్కు ఇబ్బంది లేకుండా పోయింది. సెంచరీ చేసేలా కనిపించిన గిల్... గ్రీన్ పట్టిన చక్కటి క్యాచ్కు పెవిలియన్ బాటపట్టాడు. స్కోరు వివరాలు కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: సైఫెర్ట్ (సి) ఫిలిప్స్ (బి) రబాడ 19; రహానే (సి) రబాడ (బి) సిరాజ్ 0; రఘువంశీ (సి) బట్లర్ (బి) రబాడ 8; గ్రీన్ (సి) బట్లర్ (బి) రషీద్ 79; పావెల్ (సి) సిరాజ్ (బి) అశోక్ 27; రాయ్ (సి) బట్లర్ (బి) ప్రసిధ్ 9; రింకూ (సి) బట్లర్ (బి) రబాడ 1; రమణ్దీప్ (సి) సిరాజ్ (బి) అశోక్ 17; నరైన్ (సి) ఫిలిప్స్ (బి) సిరాజ్ 0; కార్తీక్ (రనౌట్) 6; వైభవ్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లో ఆలౌట్) 180. వికెట్ల పతనం: 1–5, 2–21, 3–32, 4–87, 5–147, 6–148, 7–165, 8–166, 9–173, 10–180. బౌలింగ్: సిరాజ్ 4–0–23–2; రబాడ 4–0–29–3; ప్రసిధ్ 4–0–32–1; అశోక్ 4–0–45–2; రషీద్ 4–0–44–1. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సుదర్శన్ (సి) కార్తీక్ (బి) నరైన్ 22; గిల్ (సి) గ్రీన్ (బి) అరోరా 86; బట్లర్ (సి) గ్రీన్ (బి) వరుణ్ 25; సుందర్ (సి) కార్తీక్ (బి) వరుణ్ 13; ఫిలిప్స్ (సి) రింకూ (బి) రమణ్దీప్ 19; తెవాటియా (నాటౌట్) 7; షారుక్ (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 6; మొత్తం (19.4 ఓవర్లలో 5 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–57, 2–95, 3–141, 4–158, 5–177. బౌలింగ్: వైభవ్ 4–0–35–1; కార్తీక్ 4–0–40–0; అనుకూల్ రాయ్ 3–0–37–0; నరైన్ 4–0–28–1; వరుణ్ 4–0–34–2; రమణ్దీప్ 0.4–0–5–1. -
సన్రైజర్స్ x సూపర్ కింగ్స్
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. నేడు (శనివారం) జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగే మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ తలపడుతుంది. సొంత మైదానంలో గత మ్యాచ్లో చెలరేగి రాజస్తాన్ను చిత్తు చేసిన రైజర్స్ అదే జోరును కొనసాగించి మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని పట్టుదలగా ఉంది. మరో వైపు తొలి మూడు మ్యాచ్లలో ఓటముల తర్వాత కోలుకున్న సీఎస్కే వరుస రెండు విజయాలతో ఫామ్లోకి వచ్చింది. ఇరు జట్లు ఐదు మ్యాచ్ల తర్వాత రెండేసి విజయాలతో సమంగా ఉన్న నేపథ్యంలో పైచేయి ఎవరు సాధిస్తారనేది చూడాలి. 2025 సీజన్లో హైదరాబాద్, చెన్నై మధ్య ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగలేదు. కుర్రాళ్లు మళ్లీ చెలరేగేనా... గత మ్యాచ్లో యువ బౌలర్లు ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ పదునైన బౌలింగ్తో సన్రైజర్స్ను గెలిపించారు. ఉప్పల్ స్టేడియంలో వీరిద్దరు మళ్లీ అదే తరహా ప్రదర్శనను పునరావృతం చేయాలని జట్టు కోరుకుంటోంది. స్పిన్నర్లు శివాంగ్, హర్ష్ దూబే కూడా ప్రత్యర్థిని నిలువరించగలరు. అయితే మెరుగైన బౌలింగ్ వనరులు కనిపిస్తున్నా...టీమ్ మళ్లీ తమ బ్యాటింగ్ బలాన్నే నమ్ముకుంది. ఈ సీజన్లో సొంతగడ్డపై రెండు మ్యాచ్లలో ‘డకౌట్’ అయిన అభిషేక్ శర్మ ఈ సారైనా చెలరేగాలని మేనేజ్మెంట్ కోరుకుంటోంది. హెడ్ కూడా ఇంకా తన స్థాయి ప్రదర్శనను చూపించలేదు. కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుత ఫామ్లో ఉండటం సానుకూలాంశం. రెండు మ్యాచ్లలో కీలక భాగస్వామ్యాలతో జట్టును ఆదుకున్న క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి మళ్లీ సత్తా చాటాల్సి ఉంది. ముఖ్యంగా క్లాసెన్ స్ట్రయిక్రేట్లో గతంతో పోలిస్తే తక్కువగా ఉంటోంది. దీనిని అతను అధిగమిస్తే భారీ ఇన్నింగ్స్ ఖాయం. నితీశ్ మాత్రం ప్రతీ మ్యాచ్లో అంచనాలను అందుకుంటున్నాడు. రుతురాజ్ రాణించేనా... చెన్నై గత రెండు విజయాల్లో ఓపెనర్గా సంజు సామ్సన్ కీలక పాత్ర పోషించగా, యువ బ్యాటర్ ఆయుశ్ మాత్రమే చక్కటి ఇన్నింగ్స్లు ఆడాడు. బ్రెవిస్, సర్ఫరాజ్ కూడా అంచనాలకు అనుగుణంగా దూకుడుగా ఆడుతున్నారు. టాప్–5లో ఈ నలుగురు బ్యాటింగ్తోనే సీఎస్కే మెరుగైన ఫలితాలు రాబట్టగలిగింది. అయితే జట్టును ఆందోళనపరుస్తున్న అంశం కెప్టెన్ రుతురాజ్ ఫామ్ మాత్రమే. ఐదు మ్యాచ్లలో రుతురాజ్ వరుసగా 6, 28, 7, 15, 7 పరుగులు మాత్రమే సాధించాడు. ఇలాంటి స్థితిలో కెప్టెన్నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ను జట్టు కోరుకుంటోంది. చివర్లో దూబే, ఒవర్టన్ కూడా ధాటిగా ఆడితే చెన్నై భారీ స్కోరు చేయడం ఖాయం. బౌలింగ్లో సీఎస్కే కొంత బలహీనంగానే కనిపిస్తోంది. స్పిన్నర్లు నూర్, అకీల్ మెరుగ్గానే బౌలింగ్ చేస్తున్నా...పేసర్లు గుర్జప్నీత్ సింగ్, ఒవర్టన్, కంబోజ్ భారీగా పరుగులిస్తున్నారు. ఈ సీజన్లో మెరుగ్గా ఆడిన ఖలీల్ అహ్మద్ గాయంతో టోర్నీకి దూరం కావడం చెన్నైని ఇబ్బంది పెట్టే అంశం. అతని స్థానంలో ఎవరికి చోటిస్తారనేది చూడాలి. ఐపీఎల్లో నేటి మరో మ్యాచ్బెంగళూరు X ఢిల్లీ వేదిక: బెంగళూరుమధ్యహ్నం 3: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
హర్మన్ మెరుపులు
డర్బన్: టి20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టి20 సిరీస్లో భారత మహిళల జట్టు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఐదు మ్యాచ్లో సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన టీమిండియా... నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (33 బంతుల్లో 47 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... జెమీమా రోడ్రిగ్స్ (29 బంతుల్లో 36; 2 ఫోర్లు, 1 సిక్స్), షఫాలీ వర్మ (20 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) తలా కొన్ని పరుగులు చేశారు. మూడో వికెట్కు జెమీమాతో కలిసి హర్మన్ 71 పరుగులు జోడించింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (13), రిచా ఘోష్ (5), కాశ్వి గౌతమ్ (10) విఫలమయ్యారు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన హర్మన్ బృందం... టి20లకు అవసరమైనంత వేగంగా ఆడటంలో విఫలమైంది. ఆఖరి ఐదు ఓవర్లలో టీమిండియా 33 పరుగులే చేసి 3 వికెట్లు కోల్పోయింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఖాకా 3 వికెట్లు పడగొట్టగా... టుమీ రెండు వికెట్లు తీసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా కడపటి వార్తలు అందేసరికి 10 ఓవర్లలో 2 వికెట్లకు 88 పరుగులు చేసింది. -
ఉబెర్ కప్నుంచి తప్పుకున్న గాయత్రి – ట్రెసా జోడి
ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్ ఉబెర్ కప్లో భారత అవకాశాలకు దెబ్బ పడింది. భారత డబుల్స్ జోడి పుల్లెల గాయత్రి – ట్రెసా జాలీ ఈ టోర్నీనుంచి తప్పుకుంది. ట్రెసా మడమకు గాయం కావడంతో టీమ్ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆసియా చాంపియన్షిప్కు బయల్దేరే ముందు ప్రాక్టీస్లో తన సహచర ప్లేయర్ పాదంపై ట్రెసా కాలు పడటంతో ఆమెకు గాయమైందని భారత డబుల్స్ కోచ్ బి. సుమీత్ రెడ్డి వెల్లడించాడు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ట్రెసా రీహాబిలిటేషన్ తర్వాత కోలుకునే అవకాశం ఉంది. గాయత్రి – ట్రెసా స్థానంలో ఉబెర్ కప్లో భారత్కు ప్రాతినిధ్యం వహించేందుకు శ్రుతి మిశ్రా – ప్రియ కొంజెన్బమ్లను ఎంపిక చేశారు. 2023లో జాతీయ చాంపియన్గా నిలిచిన ఈ జోడి 2024లో ఆసియా చాంపియన్షిప్ గెలిచిన జట్టులో సభ్యులుగా ఉన్నారు. డెన్మార్క్లోని హార్సెన్స్ వేదికగా ఏప్రిల్ 24 నుంచి మే 3 వరకు థామస్, ఉబెర్ కప్ టోర్నీలు జరుగుతాయి. మరో వైపు ఈ టోర్నీలో సాధన కోసం భారత పురుషుల డబుల్స్ జోడి సాతి్వక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి డెన్మార్క్ బయల్దేరుతున్నారు. -
గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 181 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.కెప్టెన్ గిల్ (86) సూపర్ ఇన్నింగ్స్తో గుజరాత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. బట్లర్ (25), సాయి సుదర్శన్ (22) పర్వాలేద నిపించారు. గిల్ ఔటయ్యాక కాస్త ఉత్కంఠ నెలకొన్నప్పటికీ చివర్లో గ్లెన్ ఫిలిప్స్ (17), రాహుల్ తెవాటియా (7 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీయగా, సునీల్ నరైన్, రమన్దీప్, వైభవ్ అరోరాలు ఒక్కో వికెట్ పడగొట్టారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. గ్రీన్ (79) టాప్ స్కోరర్గా నిలిచాడు. గ్రీన్ మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో రబాడ 3 వికెట్లు తీయగా, సిరాజ్, అశోక్ శర్మలు చెరో 2 వికెట్ల పడగొట్టారు. ఈ విజయంతో గుజరాత్ పట్టికలో నాలుగో స్థానానికి చేరుకోగా, కేకేఆర్ వరుసగా ఐదో పరాజయంతో అట్టడుగు స్థానంలో నిలిచింది.2⃣ points in the bag ✅Hat-trick of wins ✅@gujarat_titans wrap a fantastic all-round show at home 🥳🏠 Scorecard ▶️ https://t.co/FACeUzse3B#TATAIPL | #KhelBindaas | #GTvKKR pic.twitter.com/mVnSg3ZI5p— IndianPremierLeague (@IPL) April 17, 2026 -
బంగ్లా 221 ఆలౌట్.. న్యూజిలాండ్దే తొలి వన్డే
బంగ్లాదేశ్ టూర్ను న్యూజిలాండ్ ఘనంగా ఆరంభించింది. ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. హెన్రీ నికోలస్ (68) టాప్ స్కోరర్గా నిలవగా, డియాన్ ఫాక్స్ క్రాఫ్ట్ (59) అర్థసెంచరీ సాధించాడు. బంగ్లా బౌలర్లలో రిషద్ హొసెన్, షోరిపుల్ ఇస్లామ్, తస్కిన్ అహ్మద్లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 48.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. సైఫ్ హసన్ (57), తౌహిద్ హృదోయ్ (55) అర్థసెంచరీలు సాధించారు. లిటన్ దాస్ (46) పర్వాలేదనిపించాడు. అయితే వీరు ఔటైన తర్వాత బంగ్లా ఇన్నింగ్స్ పేకమేడను తలపించింది. న్యూజిలాండ్ బౌలర్లలో బ్లెయిర్ టిక్నర్ 4 వికెట్లతో చెలరేగగా, నాథన్ స్మిత్ 3 వికెట్లు తీశాడు. బ్యాటింగ్లో అర్థసెంచరీ, బౌలింగ్లో ఒక వికెట్ తీసి ఆల్రౌండ్ ప్రదర్శన కనరబరిచిన డియాన్ ఫాక్స్క్రాఫ్ట్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఇరుజట్ల మధ్య రెండో వన్డే సోమవారం జరగనుంది. -
హమ్మయ్య.. ఇన్నాళ్లకు న్యాయం చేశాడు!
ఐపీఎల్ 2026 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ ఆటగాడు కామెరున్ గ్రీన్ ఎట్టకేలకు మెరిశాడు. సీజన్లో కామెరున్ గ్రీన్ తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో అర్థసెంచరీ సాధించిన గ్రీన్ మొత్తంగా 55 బంతుల్లో 79 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే.. గ్రీన్ దంచికొడుతున్న సమయంలో కేకేఆర్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. అయితే ఇన్నింగ్స్ ఆఖరి వరకు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ చివరి రెండు ఓవర్లలో తనకే స్ట్రైక్ వచ్చినప్పటికీ పరుగులు చేయడంలో విఫల మయ్యాడు.ఇక గతేడాది జరిగిన వేలంలో గ్రీన్ను కేకేఆర్ రూ. 25 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అధిక ధరకు అమ్ముడైన గ్రీన్ ఈ సీజన్లో మాత్రం ఒక్క మ్యాచ్లోనూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. దీంతో అతడిపై విమర్శలు పెరిగిపోయాయి. 23 కోట్లు దండగంటూ అభిమానులు సోషల్ మీడియాలో గ్రీన్ను ఏకిపారేశారు. అభిమానుల మాటలు గ్రీన్ మనుసుకు తగిలాయేమో కానీ గుజరాత్తో మ్యాచ్లో చివరిదాకా నిలబడి కేకేఆర్ గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్లో గ్రీన్ ఐదు మ్యాచ్ల్లో వరుసగా 18, 2, 4, 32, 0 పరుగులు సాధించాడు. Making a strong statement 💪Cameron Green getting a move on for #KKR 💜 Updates ▶️ https://t.co/FACeUzse3B#TATAIPL | #KhelBindaas | #GTvKKR | @KKRiders pic.twitter.com/utzOHFRbGx— IndianPremierLeague (@IPL) April 17, 2026 -
సంచలనం.. వైభవ్ సూర్యవంశీకి రూ.150 కోట్లు!?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సృష్టికర్త లలిత్ మోదీ మరోసారి తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. 2030 నాటికి ఐపీఎల్ ప్రపంచ క్రీడారంగంలో ఎన్బీ , ఎన్ఎఫ్ఎల్ వంటి దిగ్గజ లీగ్లతో సమానంగా నిలుస్తుందని మోదీ అంచనా వేశాడు. అంతేకాకుండా టాప్ ఆటగాళ్లు ఒక్కో సీజన్కు రూ. 130 నుంచి రూ. 150 కోట్ల వరకు సంపాదిస్తారని అతడు జోస్యం చెప్పాడు. లలిత్ మోదీ తాజాగా ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ మైఖల్ వాన్తో కలిసి 'ది ఓవర్ల్యాప్' పాడ్కాస్ట్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగానే ఒక్కో ఫ్రాంచైజీకి రూ.125 కోట్లుగా ఉన్న ప్లేయర్ పర్స్ విలువ, రాబోయే నాలుగేళ్లలో ఏడు రెట్లకు పైగా పెరగనుందని అతడు చెప్పుకొచ్చాడు."ఐపీఎల్ ప్రపంచంలోనే తిరుగులేని ఆర్థిక శక్తిగా మారుతోంది. ఫ్రాంచైజీలకు ఆటగాళ్లపై ఖర్చు చేయడానికి ఒక నిర్దిష్ట మొత్తం ఉంటుంది. ప్రస్తుతం పర్స్ విలువ రూ.125 కోట్లుగా ఉంది. కానీ 2030 నాటికి ఈ మొత్తం ఏకంగా 100 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 932 కోట్లు) చేరుకుంటుంది. దీంతో సీజన్లో 16 మ్యాచ్లు ఆడే అగ్రశ్రేణి ఆటగాళ్లు, ఒక్కో మ్యాచ్కు ఒక మిలియన్ డాలర్ (రూ. 8 కోట్లు) చొప్పున పారితోషకం అందుకుంటారు. అంటే మొత్తంగా 16 మ్యాచ్లకు సుమారుగా రూ. 140 నుంచి రూ.150 కోట్లు దక్కనుంది" అని లలిత్ మోదీ పేర్కొన్నాడు.ఈ భారీ మొత్తాన్ని అందుకునే సత్తా ఉన్న 'ఎక్స్-ఫాక్టర్' ప్లేయర్లుగా ఇద్దరు యువ ఆటగాళ్లను మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒకరు రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కాగా.. మరొకరు ఇంగ్లండ్ యంగ్ క్రికెటర్ జాకబ్ బెథెల్. ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ దుమ్ములేపుతున్నాడు. తన సంచలన బ్యాటింగ్తో బుమ్రా, హేజిల్వుడ్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లకు సైతం వైభవ్ చుక్కలు చూపించాడు. ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడిన వైభవ్ 263.16 స్ట్రైక్ రేటుతో 200 పరుగులు చేశాడు. కాగా ఐపీఎల్-2027 మెగా వేలానికి ముందు రాజస్తాన్ రాయల్స్ వైభవ్ను విడిచిపెడితే అతడిని భారీ ధరకు దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.చదవండి: IPL 2026: వరుస ఓటములు.. హార్దిక్ పాండ్యా సంచలన నిర్ణయం! -
చెన్నై జట్టులోకి చిచ్చరపిడుగు!
ఐపీఎల్ 2026 సీజన్కు సీఎస్కే బౌలర్ ఖలీల్ అహ్మద్ గాయంతో దూరమైన సంగతి తెలిసిందే. దీంతో ఖలీల్ అహ్మద్ స్థానంలో ఆకాశ్ మధ్వల్ను తీసుకోనున్నట్లు సమాచారం. గతంలో ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్కు ఆకాశ్ మధ్వల్ ప్రాతినిధ్యం వహించాడు. ఇక మంగళవారం కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఖలీల్ అహ్మద్ తొడ కండరాల గాయానికి గురయ్యాడు. అతను కోలుకోవడానికి 10 నుంచి 12 వారాల సమయం పట్టనుండడంతో ఖలీల్ అహ్మద్ దాదాపు సీజన్ మొత్తానికి దూరమైనట్లే. అందుకే సీఎస్కే ఖలీల్ స్థానంలో ఆకాశ్ను జట్టులోకి తీసుకోనుంది. అయితే శనివారం సీఎస్కే ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ ఆడనుంది. ఇక తొలుత ముంబై ఇండియన్స్కు నెట్ బౌలర్గా వ్యవహరించిన ఆకాశ్ మధ్వల్ 2023 ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు కీలక బౌలర్గా ఉన్నాడు. ఆ సీజన్లో 8 మ్యాచ్లాడిన ఆకాశ్ 14 వికెట్లు పడగొట్టాడు. లక్నో సూపర్జెయింట్స్తో జరిగిన ప్లేఆఫ్స్ మ్యాచ్లో ఆకాశ్ మధ్వల్ 5 పరుగులకే 5 వికెట్లు పడగొట్టి సంచలన ప్రదర్శన నమోదు చేశాడు.చదవండి: అచ్చిరాని జెర్సీ.. గెలుపు కంటే ఓటములే ఎక్కువ! -
అచ్చిరాని జెర్సీ.. గెలుపు కంటే ఓటములే ఎక్కువ!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2011 సీజన్ నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కచ్చితంగా ఒక మ్యాచ్లో గ్రీన్జెర్సీలో బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. 'గో గ్రీన్' కార్యక్రమంలో భాగంగా ఆర్సీబీ దీనిని పాటిస్తూ వస్తోంది. పచ్చదనాన్ని పరిరక్షించాలనే సందేశాన్ని ఇవ్వడానికే తమ రెగ్యులర్ జెర్సీని లేత ఆకుపచ్చ రంగులోకి మార్చుకుంది. ఈ సంప్రదాయాన్ని ఆర్సీబీ 2026 సీజన్లోనూ కంటిన్యూ చేయనుంది. ఈ నేపథ్యంలోనే శనివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరగనున్న పోరులో ఆర్సీబీ ఆటగాళ్లు గ్రీన్ జెర్సీలతో దర్శనమివ్వనున్నారు. ఈ సీజన్లో మంచి జోష్ మీదున్న ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో4 విజయాలతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.అచ్చిరాని జెర్సీ..అయితే ఆర్సీబీకి ఈ గ్రీన్ జెర్సీ మ్యాచ్లు పెద్దగా కలిసి రాలేదు. ఇప్పటివరకు 15మ్యాచ్ల్లో ఆర్సీబీ గ్రీన్జెర్సీతో బరిలోకి దిగింది. కానీ ఇందులో ఐదు మ్యాచ్ల్లోనే విజయం సాధించి.. మరో 9 మ్యాచ్ల్లో ఓటమి పాలయ్యింది. మరొక మ్యాచ్ మాత్రం రద్దయ్యింది. 2015లో ఢిల్లీ క్యాపిటల్స్తో గ్రీన్ డే మ్యాచ్ వర్షంతో తుడిచిపెట్టుకుపోయింది.2011 నుంచి 'గ్రీన్ జెర్సీ' మ్యాచ్లను ఆడడం ప్రారంభించిన ఆర్సీబీకి పెద్దగా కలిసిరాలేదు. గత సీజన్లో రాజస్తాన్తో జరిగిన మ్యాచ్ వరకు 15 మ్యాచ్లు ఆడింది. ఇందులో ఐదు మ్యాచ్ల్లో ఆర్సీబీ గెలిచినప్పటికీ విరాట్ కోహ్లి రెండుసార్లు డకౌట్ కాగా, ఒక మ్యాచ్లో సెంచరీ, మరో మ్యాచ్లో కీలకమైన 27 పరుగులు చేశాడు.గ్రీన్జెర్సీతో ఆర్సీబీ విజయాలు..ఐపీఎల్ 2011లో కొచ్చి టస్కర్స్తో మ్యాచ్లో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కొచ్చి 125/9 స్కోరుకే పరిమితం కాగా.. ఆర్సీబీ 13.1 ఓవర్లలోనే 128/1 స్కోరు చేసి గెలుపొందింది. విరాట్ (27*) నాటౌట్గా నిలిచాడు.2016 సీజన్లో గుజరాత్ లయన్స్పై 144 పరుగుల భారీ తేడాతో ఆర్ సీబీ గెలిచింది. ఈ మ్యాచ్లోనే విరాట్ కోహ్లి (109) సెంచరీ బాదాడు. ఏబీ డివిలియర్స్ (129*) కూడా శతకం చేయడంతో ఆర్సీబీ మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 248 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం గుజరాత్ లయన్స్ 104 పరుగులకే ఆలౌటైంది.2022 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 67 పరుగుల తేడాతో విజయం సాధించి మూడో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో కోహ్లి గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. అయితే డుప్లెసిస్ (73*), రజత్ పటీదార్ (48) రాణించడంతో 192 పరుగుల చేసింది. లక్ష్య ఛేదనలో హైదరాబాద్ 125 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది.2023 సీజన్లో రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్ చివరి ఓవర్ వరకూ ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్లోనూ కోహ్లి గోల్డెన్ డక్ అవ్వడం విశేషం. అయితే మ్యాక్స్వెల్ (77*), డుప్లెసిస్ (62) విజృంభణతో రాజస్తాన్ ముందు 190 పరుగుల టార్గెట్ను ఉంచింది. అయితే ఛేదనలో రాజస్తాన్ పోరాడినప్పటికీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులకు పరిమితమైంది.గత సీజన్లోనూ రాజస్తాన్ రాయల్స్తోనే గ్రీన్ జెర్సీలో ఆర్సీబీతో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అనంతరం ఆర్సీబీ 17.3 ఓవర్లలోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. విరాట్ కోహ్లి (62 నాటౌట్) అజేయ అర్థసెంచరీ సాధించి ఆర్సీబీని గెలిపించాడు.𝗜𝘁’𝘀 𝘁𝗵𝗮𝘁 𝘁𝗶𝗺𝗲 𝗼𝗳 𝘁𝗵𝗲 𝘆𝗲𝗮𝗿 𝗮𝗴𝗮𝗶𝗻 - 𝗹𝗲𝘁’𝘀 𝗚𝗼 𝗚𝗿𝗲𝗲𝗻! 😍💚More than a tradition. A purpose we wear with pride. 🙌Tomorrow, our boys take the field donning the Green Jersey against Delhi, to raise awareness by pledging to protect the… pic.twitter.com/UzvgUdXllf— Royal Challengers Bengaluru (@RCBTweets) April 17, 2026 చదవండి: వైభవ్ సేఫ్.. రోమి భిందర్కు బీసీసీఐ షాక్!


