Siddipet
-
సూర్య నమస్కారాలతో మానసిక ప్రశాంతత
గజ్వేల్రూరల్: నడక, ధ్యానం, యోగా, సూర్య నమస్కారాలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరడంతో పాటు రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చని అదనపు సీఐ ముత్యంరాజు అన్నారు. సూర్యనమస్కారాల బృందం 9వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు కొంత సమయం వ్యాయామానికి కేటాయించాలన్నారు. కార్యక్రమంలో సూర్య నమస్కారాల బృందం సభ్యులు సుభాష్రెడ్డి, బాల్చంద్రం, సుదర్శన్చారి, నర్సింహులు, కృష్ణ, భిక్షపతి, రవికుమార్, శ్రీకాంత్, యాదగిరి, ల్యాబ్ రమేశ్, బాల్కుమార్, మధు, విశ్వనాథం, జితేందర్, హరి తదితరులు పాల్గొన్నారు. చెడు వ్యసనాలకు బానిసలు కావద్దు యువత చెడు వ్యసనాలకు బానిసలై విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని సూర్య నమస్కారాల బృందం సభ్యులు సూచించారు. డ్రగ్స్, ఇతర మత్తుపదార్థాలకు అలవాటు పడితే కలిగే అనర్థాలపై అవగాహన కలిగించేందుకు ఇన్స్ఫైర్ గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 19న నిర్వహించతలపెట్టిన 3కే రన్కు సంబంధించిన పోస్టర్ను ఆదివారం ఆవిష్కరించారు. గజ్వేల్లో సూర్య నమస్కారాల బృందం, వాలీబాల్ క్రీడాకారుల ఆధ్వర్యంలో వేర్వేరుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత తాము ఎంచుకున్న లక్ష్యం దిశగా ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో గోపాల్, కేతోజి వినోద్కుమార్, నవీన్, స్వామి, భాస్కర్, సాయి తదితరులు పాల్గొన్నారు. అదనపు సీఐ ముత్యంరాజు -
వైభవంగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
బెజ్జంకి(సిద్దిపేట): బెజ్జంకి లక్ష్మీనర్సింహస్వామి కల్యాణ వేడుకలు ఆదివారం వైభంగా నిర్వహించారు. అర్చకుడు శేషం మధుసూదనాచారి ఆధ్వర్యంలో వందలాది మంది భక్తుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ జెల్ల ప్రభాకర్, సర్పంచ్ శ్రీధర్, దంపతులు, పాలకవర్గ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. హుస్నాబాద్రూరల్: పలువురు లబ్ధిదారులకు మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను ఆదివారం అందజేసినట్లు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బంక చందు తెలిపారు. పోతారం(ఎస్), పందిల్ల, మహ్మదాపూర్ గ్రామాలకు చెందిన 29 మందికి ఆదివారం చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్లు మామిడి చంద్రకళ, రమేశ్, తిరుమల, ఉపసర్పంచ్ బొమ్మగాని రాజ్కుమార్ పాల్గొన్నారు. -
వెంచర్ వేసి..
కాలువను పూడ్చి..● అనుమతి లేకుండా ఏర్పాటు ● ఇబ్బందులు పడుతున్న అన్నదాతలు ● జీపీ తీర్మానాన్ని లెక్కచేయని కార్యదర్శి కొండపాక(గజ్వేల్): అక్రమ వెంచర్ల ఏర్పాటుతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. ఎలాంటి అనుమతి లేకపోయినా చర్యలు ఎవరూ పట్టించుకోకపోవడంతో అనేక అనుమానాలకు తావిస్తోంది. కుకునూరుపల్లి మండలంలోని లకుడారం గ్రామంలో ఆరేళ్ల కిందట ఎలాంటి అనుమతి లేకుండా వెంచర్ ఏర్పాటు చేశారు. సర్వే నంబర్లు 3/ఆ/1, 3/ఆ/2, 343/ఆ, 344/2, 335/ఆ/3 లోని సుమారు 3.32 ఎకరాల వ్యవసాయ భూమిలో వెంచర్ వేసి ప్లాట్ల రూపంలో సుమారు 90 శాతం విక్రయించారు. నిర్లక్ష్యంగా కార్యదర్శి వెంచర్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు, ఇతర అవసరాల కోసం ఏ మాత్రం భూమిని వదిలిపెట్టకుండా ప్లాట్లు వేసి విక్రయించారు. కొందరు అప్పట్లోనే ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్నారు. మరి కొందరు ప్రస్తుతం నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ఈ అక్రమ లేఔట్లో ఎలాంటి నిర్మాణాలు చేయవద్దంటూ సర్పంచ్ శిల్పతో పాటు పంచాయతీ పాలక వర్గం తీర్మానం చేశారు. ఆ పనిని పంచాయతీ కార్యదర్శికి అప్పగించారు. కానీ ఆ తీర్మానాన్ని లెక్క చేయకుండా వ్యవహరించడంతో కార్యదర్శిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని సర్పంచ్ శిల్ప తెలిపారు. అధికారుల పరిశీలన రైతులు, గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో ఇరిగేషన్శాఖ ఏఈ శ్రీనివాస్, ఎంపీఓ విష్ణు వెంచర్ ప్రదేశాన్ని, ఇళ్ల నిర్మాణ తీరును నెల రోజుల క్రితం పరిశీలించారు. వర్షపు నీరు బయటకు పోయేలా ఇది వరకు ఉన్న ఫీడర్ చానల్ కాలువ నిర్మించేలా చూడాలని ఇరిగేషన్శాఖ ఏఈ శ్రీనివాస్కు సూచించారు. ఎల్ఆర్ఎస్ ద్వారా ప్లాటును రెగ్యులరైజేషన్ కోసం ధరఖాస్తు చేసుకున్న వారు ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్మాణాలు చేసుకునేలా చూసుకోవాలని ఎంపీఓ విష్ణు పంచాయతీ కార్యదర్శికి సూచించారు. ఈ విషయపై డీఎల్పీఓ లతను వివరణ కోరగా ఈ వెంచర్ విషయంపై విచారణ చేయిస్తామని చెప్పారు. గోడ నిర్మించి.. కానీ వ్యవసాయ భూమిని నాన్ అగ్రికల్చరల్ భూమిగా మార్చుకొనేందుకు పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతిని పొందలేదు. వెంచర్ వేసిన భూమికి సుమారు 500 గజాల దూరంలో మల్లారెడ్డి చెరువు ఉంది. వర్షాకాలంలో చెరువులో నుంచి వరద నీరు పోయేందుకు ఈ వెంచర్ వేసిన భూమిలోంచి ఫీడర్ చానల్ కాలువ ఉండేది. ఆ కాలువను పూడ్చి వేశారు. అలాగే అడ్డంగా రాతితో గోడ నిర్మించారు. దీంతో వర్షాకాలంలో చెరువు నుంచి వచ్చే నీరు వెంచరుపై భాగంలో ఉన్న వ్యవసాయ భూముల్లో నిలిచిపోతోంది. పంట నీట మునిగిపోతుండంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. -
ఏఎంసీ చైర్మన్గా మీసం మహేందర్
చిన్నకోడూరు(సిద్దిపేట)/నంగునూరు(సిద్దిపేట): చిన్నకోడూరు, నంగునూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల పేర్లను రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదివారం ప్రకటించారు. చిన్నకోడూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా అల్లీపూర్ గ్రామానికి చెందిన మీసం మహేందర్ను నియమించారు. అలాగే నంగునూరు మార్కెట్ కమిటీ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దేవులపల్లి యాదగిరిని నియమించారు. ఈ మేరకు మంత్రి వివేక్, నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ, కాంగ్రెస్ నాయకులు వారికి నియామక పత్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మీసం మహేందర్ మాట్లాడుతూ రైతులకు నిత్యం అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందిస్తానన్నారు. ప్రభుత్వ పథకాలు రైతులకు చేరవేయడంలో తనవంతు కృషి చేస్తానన్నారు. -
ఉత్సవ కమిటీ చైర్మన్గా కమలాకర్
మద్దూరు(హుస్నాబాద్): తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడైన దొడ్డి కొమురయ్య జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్గా రేబర్తి గ్రామానికి చెందిన డాక్టర్ జంగిటి కమలాకర్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా కమలాకర్ ఆదివారం మాట్లాడుతూ కురుమలు దొడ్డి కొమురయ్య ఆశయాలను సాధించుకోవాలన్నారు. 3న రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా నిర్వహిస్తున్న దొడ్డి కొమురయ్య జయంతిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తన నియామకానికి సహకరించిన కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, క్యామ మల్లేశంకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
మైనార్టీ ఉద్యోగుల సంఘం కార్యవర్గం ఎన్నిక
ప్రశాంత్నగర్(సిద్దిపేట): రాష్ట్ర మైనార్టీ ఉద్యోగుల సేవా సంఘం జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం జిల్లా కేంద్రంలో ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు పారుఖ్ అహ్మద్, గౌరవ అధ్యక్షుడు మహమ్మద్ జాకీర్హుస్సేన్, కార్యదర్శి మహమ్మద్ అక్తర్ల ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా సయ్యద్ సందాని, వర్కింగ్ ప్రెసిడెంట్గా షేక్ ఇమ్రాన్, జనరల్ సెక్రెటరీగా అబ్దుల్ మోయిజ్, కోశాధికారిగా సయ్యద్ ఖాజా నవాజ్ అహ్మద్తో పాటు పలువురిని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో విజయ్కుమార్, షబానాజ్, సబిహా తహసీన్ తదితరులు పాల్గొన్నారు. -
స్వశక్తి మహిళలకు పరీక్షలు
హుస్నాబాద్రూరల్: స్వశక్తి సంఘాల్లోని నిరక్షరాస్య మహిళలకు ఆదివారం ఓపెన్ స్కూల్ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించినట్లు ఏపీఎం తిరుపతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ చదవడం, రాయడం రావాలనే లక్ష్యంతో ప్రభుత్వం సెర్ప్ సహకారంతో మహిళ సంఘాల్లో నిరక్షరాస్యులను గుర్తించామన్నారు. వారికి వాలంటీర్లను నియమించి అక్షరాలు నేర్పించి పరీక్షలకు సిద్ధం చేశామని చెప్పారు. 17 గ్రామాల్లో 606 మంది మహిళలు ఆయా గ్రామాల్లో నిర్వహించిన పరీక్షలకు హాజరయ్యారు. మిగతా మహిళలంతా కూడా రాయడం నేర్చుకోవాలని సూచించారు. నంగునూరు(సిద్దిపేట): ఆర్ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ మండల నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ముదిగొండ రమేశ్, ఉపాధ్యక్షుడిగా నకీర్తి రాజమల్లు, ప్రధాన కార్యదర్శిగా మల్లమారి శంకర్తో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ ఆర్ఎంపీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తాన్నారు. మిరుదొడ్డి(దుబ్బాక): నైపుణ్య ఆర్గనైజేషన్, సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం మిరుదొడ్డిలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం వారు మాట్లాడుతూ యువత రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి ప్రాణం పోయాలన్నారు. కార్యక్రమంలో ఐలయ్య, నునిగాని రాజు, బీజేపీ జిల్లా నాయకుడు ఎల్ముల దేవరాజు, టెలికం బోర్డు సభ్యుడు మల్లేశం, వార్డు సభ్యులు రాజు, సదానందరెడ్డి, విజయ్, సుధాకర్, రాజు తదితరులు పాల్గొన్నారు. హుస్నాబాద్రూరల్: ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో పందిల్ల వార్డు సభ్యుడు పోలవేని మహేశ్ చలివేంద్రం ఏర్పాటు చేశారు. పందిల్ల స్టేజీ వద్ద ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని సర్పంచ్ రమేశ్ ఆదివారం ప్రారంభించారు. ప్రయాణికులకు మినరల్ వాటర్ అందిస్తున్న మహేశ్ దంపతులను గ్రామస్తులు అభినందించారు. కొండపాక(గజ్వేల్): కుకునూరుపల్లిలో ఆదివారం మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు మల్లగల్ల యాదగిరి కుటుంబానికి పలువురు నేతలు అండగా నిలిచారు. మృతుడి కుటుంబాన్ని పంచాయతీ పాలకవర్గం పరామర్శించి ఓదార్చారు. సర్పంచ్ మల్లం కనకవ్వ రూ.5 వేలు, ఉపసర్పంచ్ దొంతి సత్తయ్య రూ.5 వేలు, వార్డు సభ్యురాలు ప్రేమలత రూ.2 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించి భరోసా ఇచ్చారు. సందర్భంగా కనకవ్వ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మేఘన ఫౌండేషన్ ట్రస్టు నిర్వాహకుడు మల్లం ఐలయ్య, మాజీ పీఏసీఎస్ వైస్ చైర్మన్ పిస్క అమరేందర్ తదితరులు పాల్గొన్నారు. రాములోరి శోభాయాత్ర మిరుదొడ్డి(దుబ్బాక): శ్రీరామనవమిని పురస్కరించుకుని మండల కేంద్రమైన మిరుదొడ్డిలో శనివారం రాత్రి రాములోరి రథోత్సవ శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి రథోత్సవానికి స్వాగతం పలుకుతూ ప్రత్యేక పూజలు చేశారు. శోభాయాత్రలో చిన్నారుల ఆట పాటలు, మహిళలు కోలాటం అందరినీ ఆకట్టుకున్నాయి. -
మద్యం తాగి వాహనాలు నడపొద్దు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్ హెచ్చరించారు. సిద్దిపేటలో టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై ఆదివారం అవగాహ న కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ వాహనం నడిపేటపుడు కచ్చితంగా సీట్బెల్ట్ ధరించాలన్నారు. అతివేగంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురికావద్దని, గమ్యస్థానం చేరే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాహనానికి సంబంధించిన ధ్రువపత్రాలను తమ వెంట ఉంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ అఖిల్, మహేశ్, టాక్సీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అబ్బు, రమేశ్, డ్రైవర్లు పాల్గొన్నారు.ట్రాఫిక్ ఎస్ఐ విజయ్భాస్కర్ -
నీట మునిగి 8 మంది మృతి
కొండపాక (గజ్వేల్): రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో నీట మునిగి 8 మంది మృతిచెందారు. వీరిలో ఆరుగురు ఈతకు వెళ్లి మరణించగా, మరో ఇద్దరు చెరువులో మునిగి చనిపోయారు. గజ్వేల్ మండలంలోని కొడకండ్ల గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు (వరుసకు అక్కా తమ్ముడు) రిషిక (13), కుక్కల మనీష్ అలియాస్ లక్కీ (11) మామ వరుసైన గణేశ్తో కలిసి వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. గణేశ్ పశువులను మేతకు తీసుకెళ్లగా మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్కు వెళ్లే కాలువలో మనీష్ ఈత కోసం దిగాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోతుండగా రిషిక కాపాడేందుకు కాలువలోకి దిగగా ఇద్దరూ మృతి చెందారు. రుషిక కొడకండ్ల ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతుండగా, మనీష్ 7వ తరగతి చదువుతున్నాడు. కుటుంబీకులు, గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఎస్హెచ్ఓ, ట్రైనీ ఐపీఎస్ అయేషా ఫాతిమా ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను బయటకు తీయించారు. ఇదిలాఉండగా హైదరాబాద్లోని మల్కాజ్గిరి బాలాజినగర్కు చెందిన రాములు కుకునూరుపల్లి మండలంలోని ముద్దాపూర్, రాంచంద్రాపూర్ శివారులో కొంత వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. దీంతో రాములు కొడుకు రాజుతోపాటు 8 మంది స్నేహితులతో కలిసి సరదా కోసం వ్యవసాయ బావి వద్దకు వచ్చారు. విజయ్కుమార్తోపాటు మరో నలుగురు మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్కు వెళ్లే కాలువలో ఈత కోసం దిగారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతోపాటు ఈత రాకపోవడంతో విజయ్కుమార్ నీటిలో మునిగిపోతుండగా స్నేహితులు కాపాడే ప్రయత్నం చేశారు.. అయినా ఫలించలేదు. దీంతో విజయ్కుమార్ మృతి చెందాడు. విజయ్ కుమార్ ఆర్మీ క్యాంటీన్లో కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తున్నాడన్నారు. ఈ మేరకు మృతుల కుటుంబీకుల మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో విషాదంసత్తుపల్లి టౌన్: ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎన్టీఆర్ నగర్లో నివాసం ఉంటున్న వేంసూరు మండలం కుంచపర్తికి చెందిన ఒంగూరి జానకి, వెంకటేశ్వరరావు కుమారుడు నాగబాబు (12) రేజర్ల సమీపాన మామిడి తోటలో గేదెలు మేపేందుకు వెళ్లాడు. నాగబాబుతోపాటు అదే కాలనీకి చెందిన వంటిపులి దేవ (11), షేక్ సైదులు కూడా వెళ్లారు. ఈ క్రమంలో పక్కనే నీళ్లు ఉన్న మట్టి క్వారీ గుంత వద్దకు వెళ్లి ఈత కొట్టేందుకు దూకారు. అయితే క్వారీ గుంతలో నీళ్ల లోతును అంచనా వేయలేక మునిగిపోతూ కేకలు వేశారు. సమీపంలో గేదెలు మేపుతున్న దేశినేని సుధారాణి తన చున్నీ విసిరి భుజాల వరకు నీట మునిగిన షేక్ సైదులును కాపాడింది. మిగతా ఇద్దరు నీళ్లల్లో పూర్తిగా మునిగిపోవడంతో మరణించారు. చెరువులో మునిగి ఇద్దరు మృతికోనరావుపేట (వేములవాడ): చెరువులో మునిగి ఇద్దరు చనిపోయిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారంలో విషాదం నింపింది. ధర్మారం గ్రామానికి చెందిన ముడికె లక్ష్మీరాజం (65), కుమ్మం మొండయ్య (55) అనే గొర్రె కాపరులు తమ జీవాలను తీసుకుని గ్రామ శివారులోని పెద్దచెరువు వైపు వెళ్లారు. గొర్లను చెరువులోకి తీసుకెళ్లి స్నానం చేయించేందుకు దిగగా లక్ష్మీరాజం ప్రమాదవశాత్తు చెరువులో జారిపడ్డాడు. గమనించిన మొండయ్య అతడిని కాపాడేందుకు చెరువులోకి దిగాడు. ఈక్రమంలో లక్ష్మీరాజం.. మొండయ్య మెడను గట్టిగా పట్టుకోవడంతో ఈత వచ్చినా కూడా ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. కోనరావుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కుంటలో మునిగి...అబ్దుల్లాపూర్మెట్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడలో నివసిస్తున్న నాగనా థ్ పంచాల్ కుమారుడు నరేష్ నాగనాథ్ (14) కోహెడ జెడ్పీ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. శనివారం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన నరేష్ ఈత కొట్టేందుకు బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేక పోయింది. ఆదివారం ఉదయం సంఘీనగర్ నుంచి గండిచెరువుకు వెళ్లే దారిలో ఉన్న సమల గడ్డ కుంట వద్ద నరేష్ దుస్తులు, చెప్పులు కనిపించడంతో కుంటలో పరిశీలించగా మృతదేహం నీటిపై తేలుతూ కనిపించింది. అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
డీసీసీ కార్యవర్గం ఎప్పుడో?
పచ్చని అందాలు మహబూబ్ సాగర్ చెరువు కింద వరి పొలాలన్నీ పచ్చని తివాచీలాదర్శనమిస్తున్నాయి. వివరాలు IIలో uజిల్లా కాంగ్రెస్ కమిటీ పూర్తి కార్యవర్గం ఎప్పుడు ప్రకటిస్తారని పార్టీ నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఉగాది సందర్భంగా రాష్ట్రంలోని 14 డీసీసీ పూర్తిస్థాయి కమిటీలను నియమించింది. సిద్దిపేటను మాత్రం పెండింగ్లో పెట్టింది. కార్యవర్గం ఏర్పాటు కోసం నేతల మధ్య సమన్వయం కుదరపోవడమే కారణమని ఆ పార్టీ నేతలు జోరుగా చర్చించుకుంటున్నారు. – సాక్షి, సిద్దిపేట గతేడాది నవంబర్ 22న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా తూంకుంట ఆంక్షారెడ్డిని అధిష్టానం నియమించిన విషయం తెలిందే. గత నాలుగు నెలలుగా అధ్యక్షురాలు ఒక్కరే కొనసాగుతున్నారు. డీసీసీ పూర్తి స్థాయి కమిటీ కోసం టీపీసీసీ నుంచి మల్లాది పవన్, రోహిత్రావులను నియమించారు. కార్యవర్గం నియామకం కోసం నియోజకవర్గ ముఖ్యనేతలతో వారు సమావేశాలు నిర్వహించారు. అయితే నియోజకవర్గ నేతల మధ్య సమన్వయం లేకపోవడంతోనే డీసీసీ కమిటీని ప్రకటించలేదని తెలుస్తోంది. డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి తోడుగా గట్టి టీం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నేతలు తమ అనుచరులకు పార్టీ పదవులు ఇప్పించుకోవాలని పోటీ పడుతున్నారు. పోటీ ఎక్కువే.. కాంగ్రెస్లో సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తూనే మహిళలు, యువతకు పదవుల్లో పెద్దపీట వేయాలని అధిష్టానం నిర్ణయించింది. ఇకపై పార్టీ కమిటీలే అన్ని నిర్ణయాల్లో కీలక పాత్ర వహిస్తాయనే సంకేతాలతో వీటిని దక్కించుకునేందుకు నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. డీసీసీ కమిటీ, మండల, బ్లాక్ కమిటీలే ఇక పార్టీలో క్రియాశీలక పాత్ర వహిస్తాయని సంకేతాలివ్వడంతో పదవులను దక్కించుకునేందుకు నేతల్లో పోటీ మొదలైంది. ఒక్కో బ్లాక్కు ఇద్దరు ఉపాధ్యక్షులు, ఇద్దరు ప్రధాన కార్యదర్శులను నియమించాలని పార్టీ నాయకత్వం సూచించినట్లు సమాచారం. ప్రతి మండలం నుంచి ఒక కార్యదర్శి, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒక అధికార ప్రతినిధి ఉండేలా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా కార్యవర్గ సభ్యులను దాదాపు 15 మంది వరకు నియమించనున్నారు. దీంతో ఇప్పటికే మంత్రులు, నియోజకవర్గ ఇన్చార్జిలతో పలువురు నేతలు డీసీసీలో చోటు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పలువురు రాష్ట్ర నాయకులు నేతల పేర్లను సైతం సిఫార్సు చేసినట్లు సమాచారం.ఆశగా ఎదురుచూపులు కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో జిల్లా పదవుల కోసం పలువురు నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. పార్టీ పదవి ఉంటే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అలాగే త్వరలో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ టికెట్ల ఎంపికలో కీలక పాత్ర పోషించవచ్చని, దీంతో పదవిని దక్కించుకునేందుకు తీవ్ర ప్రయ త్నాలు చేస్తున్నారు. -
పిల్లల బంగారు భవిష్యత్ మీదే
కలెక్టర్ హైమావతి సిద్దిపేటరూరల్: అధికారికంగా దత్తత తీసుకున్న దంపతులు పిల్లల బంగారు భవిష్యత్కు బంగారు బాటలు వేయాలని కలెక్టర్ హైమావతి అన్నారు. శనివారం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 4 సంవత్సరాల బాబును ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన దంపతులకు, 6 నెలల ఆడశిశువును నిజామాబాద్ జిల్లాకు చెందిన దంపతులకు దత్తత ఇచ్చారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలను బాగా చదివించాలని, వారికి ఇష్టమైన రంగంలో ప్రోత్సహించాలన్నారు. పిల్లలను భవిష్యత్ నిర్మాణ పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు. జిల్లాలో పిల్లలు లేని దంపతులు ఎవరైనా దత్తత తీసుకోవాలంటే సిద్దిపేట శిశుగృహ, బాలల పరిరక్షణ విభాగం ద్వారా అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తద్వారా న్యాయపరమైన ఇబ్బందులు ఉండవన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి శారధ, బాలరక్షాభవన్ కోఆర్డినేటర్ మమత, డీసీపీఓ రాము, శిశు గృహ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కవిత, కాంగ్రెస్ ఒకటే: ఎంపీ రఘునందన్ సంగారెడ్డి: కవిత కాంగ్రెస్ ఒకటేనని, ఆమె నూతన పార్టీ ఏర్పాటు చేస్తారని తాను ఏడాది క్రితమే చెప్పానని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. శనివారం ఆయన సంగారెడ్డిలో విలేకరులతో మాట్లాడుతూ అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ నాలుగు ముక్కలు అవుతుందని తాను అప్పుడే జోస్యం చెప్పానన్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ కనుమరుగవుతుందని, కాంగ్రెస్ – బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని విమర్శించారు. -
ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026
ఆధునిక సాగుతో అధిక లాభాలు: వీసీ ములుగు(గజ్వేల్): రైతులు ఆధునిక పరిజ్ఞానాన్ని సాగులో ఉపయోగించడం ద్వారా ఖర్చులు తగ్గి అధిక దిగుబడిని పొందవచ్చని కొండాలక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ రాజిరెడ్డి అన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం పరిధిలోని షెడ్యూల్ కులాల ఉప ప్రణాళిక కింద శనివారం రైతు విజ్ఞాన యాత్రను ప్రారంభించి మాట్లాడారు. భవిష్యత్తులో ఉద్యాన పంటలకు మరింత ఆదరణ ఉంటుందని తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా మేలైన వర్షాలతో రైతులు పత్తి, వరి పంటలను అధికంగా సాగు చేస్తున్నారని, ఎల్నినో నేపథ్యంలో అన్ని పంటలతో పోలిస్తే కూరగాయల సాగే తక్కువ నీటితో సాధ్యమన్నారు. గోదావరి, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పరిధిలోని భూములు సారవంతంగా, నీటి లభ్యత పుష్కలంగా ఉండటంతో ఈ ప్రాంతంలో కూరగాయల సాగు ఇంకా లాభదాయకమని వివరించారు. రైతులు రసాయనాలు తగ్గించి జీవన ఎరువులు తయారు చేసుకోవాలని సూచించారు. బిందు సేధ్యంతో తక్కువ నీటితో వేసవిలో సైతం ఎక్కువ విస్తీర్ణంలో కూరగాయలు సాగు చేసుకోచ్చునని తెలిపారు. కార్యక్రమంలో వర్సిటీ అధికారులు, రైతులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.పొరుగు జిల్లాల్లో ఖరారు నేతల మధ్య సమన్వయం లేకసిద్దిపేట పెండింగ్ నాలుగు నెలలుగా అధ్యక్షురాలు ఒక్కరే.. చోటు కోసం ఆశగాఎదురుచూస్తున్న పార్టీ నేతలు -
ఏప్రిల్ 2 నుంచి గ్రామసభలు
అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ సిద్దిపేటరూరల్: ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఏప్రిల్ 2 నుంచి జిల్లావ్యాప్తంగా గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ అబ్దుల్హమీద్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించి వారి నుంచి అవసరమైన సలహాలు, సూచనలు స్వీకరించాలన్నారు. జిల్లా, డివిజన్, మండలం, గ్రామస్థాయి వరకు కేటాయించిన విధులు సక్రమంగా నిర్వహించాలన్నారు. అదేవిధంగా గ్రామాల్లో చేపట్టిన పనులు ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ నాగరాజమ్మ, డీఆర్డీఓ జయదేవ్ఆర్యా, జెడ్పీ సీఈఓ రమేశ్, డీపీఓ రవీందర్, ఆర్డీఓ లక్ష్మణ్, డీఈఓ శ్రీనివాస్రెడ్డి, డీడబ్ల్యూఓ శారద, హౌసింగ్ పీడీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు ఇబ్బంది కలగకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు, తాగునీటి సరాఫరా సక్రమంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. -
అనుసంధానం ఇంకెన్నేళ్లు?
తరచూ చర్చనీయాంశం..గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి కంఠహారంగా నిర్మించిన ‘రింగు రోడ్డు’ అంశం తరుచూ వార్తల్లోకెక్కుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య చర్చకు దారితీస్తోంది. రూ.233కోట్ల వ్యయంతో ఈ రింగ్ రోడ్డు నిర్మించి పదేళ్లు కావొస్తోంది. అయినా కేవలం 150మీటర్ల పని పెండింగ్ వల్ల పూర్తిస్థాయి అనుసంధానానికి నోచుకోవడంలేదు. అసెంబ్లీలోనే కాదు.. ఈనెల 22న జిల్లాలో జరిగిన ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ దృష్టికి సైతం ఈ అంశం వెళ్లింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ స్పందనపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉన్నది. – గజ్వేల్ మాజీ సీఎం కేసీఆర్ చొరవ ఫలితంగా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ రింగు రోడ్డు మంజూరైంది. 23కిలోమీటర్ల మేర 2015లో పనులు మొదలయ్యాయి. ఆగుతూ... సాగిన ఈ పనుల నిర్మాణ వ్యయం రూ.233కోట్లకు చేరింది. పనులు వందశాతం పూర్తికాకుండానే 2023 అక్టోబర్లో అధికారికంగా ప్రారంభించారు. ఈ రింగు రోడ్డు రాష్ట్రంలోనే మోడల్గా తీర్చిదిద్దారు. ఒక పట్టణ అవసరాలకు రింగు రోడ్డు నిర్మించడం ఇదే తొలిసారి. ఈ క్రమంలోనే ఈ రోడ్డుకు అంతర్జాతీయ ప్రమాణాలద్దారు. రింగు రోడ్డుకు అనుసంధానంగా మరో నాలుగు రేడియల్ రోడ్లు 12.5కిలోమీటర్ల మేర నిర్మాణం జరిగింది. మరెన్నో ప్రత్యేకతలను ఈ రోడ్డు సొంతం చేసుకున్నది. మొత్తం 12 సర్కిళ్లతో ఈ రోడ్డు నిర్మాణం జరిగింది. రింగు రోడ్డు నిర్మాణం వల్ల గజ్వేల్–ప్రజ్ఞాపూర్ చుట్టూ ఉన్న రోడ్డుకు వెలుపలు, బయట భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. మరోవైపు ఈ రోడ్డును ఆనుకొని విల్లాలు, అపార్ట్మెంట్లు వెలుస్తున్నాయి. అంతేకాకుండా వ్యాపార, వాణిజ్య సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లు విరివిగా ఏర్పాటు చేస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ రోడ్డు కేవలం 150మీటర్ల పనుల పెండింగ్ వల్ల పదేళ్లుగా వందశాతం అనుసంధానానికి నోచుకోకపోవడం ఆందోళన కలిగిస్తున్నది.గజ్వేల్ రింగ్ రోడ్డుకు పదేళ్లు.. 23కిలోమీటర్ల మేర అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం రూ.233కోట్లతో సాగిన పనులు సీఎం రేవంత్రెడ్డి దృష్టికి వ్యవహారం ప్రభుత్వ స్పందన కోసం ఎదురుచూపులు -
విద్యుత్ సరఫరాలో సర్కార్ విఫలం
గజ్వేల్: రైతులకు నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ విమర్శించారు. శుక్రవారం గజ్వేల్ మండలం అహ్మదీపూర్ విద్యుత్ సబ్స్టేషన్ను రైతులతో కలిసి ముట్టడించారు. ఈ సందర్భంగా విద్యుత్శాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో రైతులకు 24గంటలపాటు నిరంతర విద్యుత్ సరఫరాను ఇచ్చి అండగా నిలిస్తే నేడు.. రాష్ట్రంలో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి విద్యుత్ కోతలు, సరఫరాలో లోవోల్టేజీ సమస్యలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులను ఇబ్బంది పెడితే సహించేదిలేదని, వారి పక్షాన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రభాకర్, రైతుబంధు సమితి గజ్వేల్ మండలశాఖ మాజీ అధ్యక్షుడు రాజిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రమేష్గౌడ్, అహ్మద్, నిజామొద్దీన్, గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వారసంత వేలం రూ.1.10 కోట్లు
హుస్నాబాద్: మున్సిపల్ కార్యాలయంలో గురువారం రెండోసారి వారసంత వేలం చైర్ పర్సన్ దండి లక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. మొదటిసారి జరిగిన వేలంలో రూ.2 కోట్లకు దక్కించుకున్న కాంట్రాక్టర్ గడువు లోగా మూడో వంతు డిపాజిట్ చెల్లించకపోవడంతో వేలం పాటను రద్దు చేశారు. దీంతో కాంట్రాక్టర్ డిపాజిట్ కింద చెల్లించిన రూ.10 లక్షలు జప్త్ చేసినట్లు కమిషనర్ మల్లికార్జున్ తెలిపారు. వేలంలో ఉప్పుల రాంరెడ్డి అనే కాంట్రాక్టర్ రూ.1.10 కోట్లకు వారసంతను దక్కించుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. -
ఐటీ టవర్లపై పట్టింపేదీ?
● కాంగ్రెస్ పాలనలో నిర్లక్ష్యం ● అసెంబ్లీలో మాజీమంత్రి హరీశ్రావు సిద్దిపేటజోన్: ఐటీ రంగాన్ని క్షేత్ర స్థాయిలో విస్తరించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఐటీ టవర్లను ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వాటిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అందుకు సిద్దిపేట ఐటీ టవరే ఉదాహరణ అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ హరీశ్రావు మండిపడ్డారు. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో సిద్దిపేట ఐటీ టవర్ సమస్యలపై ప్రస్తావించారు. ఇటీవల సిద్దిపేట ఐటీ టవర్ సందర్శించగా అనేక ఇబ్బందులు ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో 18 కంపెనీలు పనిచేస్తే ప్రస్తుతం 7కంపెనీలు వెళ్లిపోయి 11 మాత్రమే ఉన్నాయన్నారు. నెట్బిల్లు లేక ఐటీ టవర్కు ఇంటర్ నెట్ కనెక్షన్ కట్ చేశారని, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడంతో 4నెలలుగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న కంపెనీలకు మూడు నెలల ఫ్రీ రెంటల్ సౌకర్యం కల్పించాలని, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాలు విడుదల చేయాలని, కొత్త కంపెనీలను ఆహ్వానించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. కుంటల, చెరువుల మరమ్మతులకు నిధులు నియోజకవర్గ పరిధిలోని చెరువుల, కుంటల మరమ్మతులకు నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే హరీశ్రావు తెలిపారు. నీటిపారుదల శాఖకు సంబంధించి రూ.కోటి7లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయన్నారు. ఇంద్రగూడెం పల్లె కుంట, మొండి కుంట మరమ్మతులకు రూ.48లక్షల20వేలు, మిట్టపల్లి నుంచి గుండ్ల చెరువు ఫిడర్ ఛానల్ వద్ద బ్రిడ్జి కూలిపోవడంతో నూతన బ్రిడ్జి కోసం ప్రతిపాదనలు పంపించగా రూ.47లక్షల20వేలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. మెరుపు కుంట శాశ్వత మరమ్మతుల కోసం రూ.12లక్షల 45వేలు మంజూరు చేసినట్టు తెలిపారు. పనులను త్వరితగతిన ప్రారంభించాలని సూచించారు. -
శుక్రవారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2026
రుణలక్ష్యం చేరాల్సిందేసిద్దిపేటరూరల్: ఆర్థిక సంవత్సరం రుణ లక్ష్యాన్ని నెలాఖరులోగా సాధించాలని కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ. 10,736 కోట్ల రుణాలు లక్ష్యంగా నిర్ణయించగా 2025 డిసెంబర్ నాటికి రూ. 7,309 కోట్ల రుణాలు అందించినట్లు తెలిపారు. అదేవిధంగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి ఆయా బ్యాంకుల రుణ నిల్వలు, మార్కెట్ షేర్ ఆధారంగా బ్యాంకులవారీగా ఏప్రిల్ నెలలో ప్రయారిటీ, నాన్ ప్రయారిటీ రుణాల లక్ష్యాలను నిర్దేశిస్తామన్నారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాల మంజూరుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల, పరిశ్రమల శాఖ, వ్యవసాయ రుణాలను నిర్దేశిత లక్ష్యం మేరకు అందించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఎల్డీఎం హరిబాబు, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, ఈడీఎస్సీ కార్పొరేషన్ విజయ్ భార్గవ్, జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం సహించేది లేదు దుబ్బాకటౌన్: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ హైమావతి వైద్య సిబ్బందిని హెచ్చరించారు. రాయపోల్లోని పీహెచ్సీని ఆకస్మికంగా సందర్శించారు. హాజరు రిజిస్టర్ తనిఖీ చేశారు. వైద్యాధికారి అరెపల్లిలో ఫీల్డ్ విజిట్ లో ఉన్నట్లు సిబ్బంది తెలపగా వీడియో కాల్ చేసి నిజనిర్ధారణ చేశారు. ఏదో ఒక సాకు చెబుతూ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని మండిపడ్డారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించారు. అనతంరం దౌల్తాబాద్ మండలం శేరిపల్లి బందారంలోని గురుకులకు వెళ్లి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. వంటలు నాసిరకంగా ఉండటంతో వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘డివిజన్’ సాధించితీరుతాం
● అక్రమ అరెస్టులతో అణచివేత తగదు ● జేఏసీ నాయకుల స్పష్టీకరణచేర్యాల(సిద్దిపేట): చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధించితీరుతామని, అక్రమ అరెస్టులతో అణచివేత తగదని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. డివిజన్ ఏర్పాటు చేయాలని కోరుతూ గురువారం జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన అసెంబ్లీ ముట్టడికి చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, దూల్మిట్ట మండలాల పరిధిలోని పలు గ్రామాల నాయకులు తరలివెళ్లారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపేందుకు వెళ్లిన వారందరినీ పోలీసులు అరెస్టు చేసి సమీపంలోని పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమ ప్రాంత చిరకాల కోరిక అయిన చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేందుకు వచ్చిన తమను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్స్టేషన్లకు తరలించడం అన్యాయమన్నారు. అరెస్టయిన వారిలో జేఏసీ నాయకులు నర్సయ్య, మల్లారెడ్డి, బాల్నర్సయ్య, కరుణాకర్, వెంకట్రెడ్డి, యెల్లారెడ్డి, ఉపేంధర్రెడ్డి, సంతోష్, యాదగిరి, చందు, మల్లేశం తదితరులున్నారు. -
యుద్ధమంట
ధరల సెగ.. సామాన్యుడు విలవిలఅంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరుగుదల.. రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. యుద్ధం కారణంగా దిగుమతులు నెమ్మదించడం, షిప్పింగ్ ధరలు పెరగడంతో మార్కెట్లో ప్రతి వస్తువు ధర పెరిగింది. దీనికి తోడు కొందరు వ్యాపారులు యుద్ధాన్ని బూచిగా చూపుతూ ధరలు పెంచి వినియోగదారులపై అదనపు భారం మోపుతున్నారు. పెరిగిన ధరలతో పేద, మధ్య తరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 10.12లక్షల మంది జనాభా ఉండగా 4లక్షలకు పైగా కుటుంబాలున్నాయి. ఒక్కో కుటుంబ సగటున రోజుకు 100 మిల్లీలీటర్ల వంట నూనె వినియోగిస్తున్నట్లు అంచనా. ప్రస్తుతం అన్ని రకాలపైనా లీటరుకు రూ.25 నుంచి రూ.35 పెరిగింది. ఈ లెక్కన రోజుకు జిల్లా ప్రజలపై దాదాపు రూ.5లక్షలకు పైగా భారం పడుతోందని అంచనా. వంట నూనెల వ్యాపారం చేసే వారు జీరో బిల్లులే ఇస్తున్నారు. ఒరిజినల్ బిల్లు అడిగితే మరుసటి రోజే వంట నూనెల సరఫరా ఆలస్యం చేస్తున్నారు. బ్రాండెడ్ నూనెల కోసం తప్పని పరిస్థిలలో జీరో బిల్లులోనే నూనెలను తీసుకోవాల్సి వస్తోందని పలువురు చిరు వ్యాపారులు అంటున్నారు. సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాలలతో పాటు మండల కేంద్రాలలో ఎక్కువగా ఈ నూనెల అమ్మకాలు జరుగుతున్నాయి. జీరో బిల్లులపై జీఎస్టీ అధికారులు ఒక్కసారి సైతం తనిఖీలు చేసిన సందర్భాలు లేవు. కొన్ని సంవత్సరాలుగా ఈ దందానే కొనసాగుతోంది. పూటగడవడం కష్టంగా ఉంది యుద్ధం ఏమో కానీ నిత్యావసర సరుకుల ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నూనె ధరలు అధికంగా పెరిగాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలకు పూట గడవడం కష్టంగా మారింది. ప్రభుత్వం దృష్టి సారించి ధరలను నియంత్రించాలి. –రేపాక పుష్పలత, గృహిణి ఇలా అయితే బతికేదెట్లా..ఏ వస్తువు కొనుగోలు చేయాలన్నా ధరలు మండి పోతున్నాయి. అక్కడెక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ మండిపోతున్నాయి. ధరల పెరుగుదలతో ఏమీ కొనలేకపోతున్నాం. ప్రభుత్వాలు దృష్టి సారించి రేషన్ షాప్ల ద్వారా నిత్యావసర సరుకులను అందించాలి. –మహేశ్వరి, మిట్టపల్లికృత్రిమ కొరత సృష్టించి.. నిత్యావసర వస్తువులు కృత్రిమ కొరతను వ్యాపారులు సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. బ్లాక్ మార్కెట్కు తరలించిన, అధిక ధరలకు అమ్మినా మండల, డివిజన్, జిల్లా స్థాయిలో ఉన్న నియంత్రణ కమిటీలు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. అవన్నీ మొక్కుబడిగా మారాయి. అధికారులు వీటిపై దృష్టి సారించడం లేదు. హోల్సేల్ వ్యాపారాలు, పెద్ద కిరాణం షాపులను తనిఖీ చేస్తే అధిక ధరలకు అమ్మకుండా నియంత్రణలో ఉంటారు. ఇప్పటికై నా అధికారులు దృష్టి సారించాలని వినియోగదారులు కోరుతున్నారు. -
జాతీయ లోక్అదాలత్ను సద్వినియోగం చేసుకోండి
సృజనాత్మకత.. పలు మండలాల్లోని అంగన్వాడీల్లో బాళమేళాలు చేపట్టారు. విద్యార్థులకు ఆటలు, పాటలు చేపట్టారు. వివరాలు 9లో uజిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవిసిద్దిపేటకమాన్: జిల్లా కోర్టు ప్రాంగణంలో ఈ నెల 28న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి తెలిపారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. అవకాశం ఉన్న కేసులు రాజీ కుదుర్చుకోవాలన్నారు. దీంతో సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు. గురువారం నుంచే కక్షిదారులు కోర్టులో కేసులు రాజీ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. జిల్లాలో మొత్తం 2,340 కేసులు రాజీ కుదుర్చుకునేందుకు అవకాశం ఉందన్నారు. అదేవిధంగా జిల్లా కోర్టులో బ్యాంకు అధికారులతో న్యాయమూర్తి సంతోష్కుమార్ సమావేశం నిర్వహించారు. -
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బడ్జెట్ రూ.40.31కోట్లు
● ఏకగ్రీవంగా ఆమోదించిన పాలకవర్గం ● సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ యాదవరెడ్డిగజ్వేల్: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి 2026–27 ఆర్థిక సంవత్సరానికిగానూ రూ.40.31 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బుధవారం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో చైర్పర్సన్ గంగిశెట్టి చందన అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బడ్జెట్ వివరాలను జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ విమల చదివి వినిపించారు. మున్సిపాలిటీకి అంచనా ఆదాయం రూ.40.31 కోట్లుగా, వ్యయం రూ.39.88 కోట్లుగా చూపి.. మిగులు రూ.49.63 కోట్లుగా ఉంటుందని వెల్లడించారు. బడ్జెట్ నిధులను ప్రాధాన్యత రంగాలకు ఖర్చుపెడతామని చైర్పర్సన్ తెలిపారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్, వైస్ చైర్పర్సన్ కళ్యన్కర్ పద్మాబాయి, అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
దరఖాస్తు చేసుకోండి
ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఎస్సీ కార్యాచరణ ప్రణాళికాలో భాగంగా స్వయం ఉపాఽధి పథకాలు, శిక్షణా కార్యక్రమాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విజయభార్గవ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎలక్ట్రికల్ టూ విలర్, త్రీ వీలర్, అగ్రిడోన్ సేవలు, వ్యవసాయ యాంత్రిక ఉమ్మడి కేంద్రం, సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్, వ్యవసాయ అనుబంధ విభాగం, పాడిగేదెల పథకం, సెరికల్చర్, ఉద్యాన సంబంధిత, చిన్ననీటి పారుదల బోర్వెల్ విద్యుదీకరణ పంప్ సెట్లు, సబ్ మెర్సిబుల్ పంప్ సెట్, సర్వీస్ కనెక్షన్ చార్జీలు, బోర్వెల్ వేయడానికి అయ్యే ఖర్చులో సబ్సిడీలో అందించనున్నట్లు తెలిపారు. ఆసక్తి కల్గిన ఎస్సీ అభ్యర్థులు ఏప్రిల్ 2 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే శిక్షార్హులు సిద్దిపేటఅర్బన్: కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో నిర్లక్ష్యం చేయడం నైతికంగా తప్పే కాకుండా చట్టపరంగా శిక్షార్హులవుతారని సిద్దిపేట త్రీటౌన్ సీఐ టాటా లక్ష్మీబాబు హెచ్చరించారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేసిన కుమారులకు బుధవారం పోలీస్ స్టేషన్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. త్రీటౌన్ పరిధిలోని ఖమ్మంపల్లికి చెందిన పాముకుంట నర్సయ్య, ఎల్లవ్వ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. ముగ్గురికి సమానంగా ఆస్తులను పంచి ఇచ్చారు. అయినప్పటికి వారిని పోషించకుండా వదిలేయడంతో ఈ నెల 18న ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన సీఐ బుధవారం ముగ్గురు కుమారులను పిలిపించి తల్లిదండ్రుల సమక్షంలో వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. తల్లిదండ్రుల బాధ్యత ప్రతి కుమారుడి ప్రాథమిక బాధ్యత అని హితబోధ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలుప్రశాంత్నగర్(సిద్దిపేట): రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకో నున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి బుధవారం తెలిపారు. జిల్లాలోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో ఒంటిపూట పాఠశాలలు నిర్వహించకుండా, పూర్తి స్థాయి (ఫుల్డే) నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నా రు. జిల్లాలోని అన్ని పాఠశాలలు ఏప్రిల్ 23 వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలన్నారు. -
ఆర్ఎంపీ క్లినిక్లలో వైద్యాధికారుల తనిఖీలు
చేర్యాల(సిద్దిపేట): మండలంలోని ఆకునూరులో వైద్య విద్యార్హతలు లేకపోయినా కొందరు వ్యక్తులు ప్రజలకు వైద్యం చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై ఉన్నతాధికారులు స్పందించారు. ఈ మేరకు బుధవారం టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు పలు ఆర్ఎంపీ క్లినిక్లలో తనిఖీలు నిర్వహించారు. గ్రామంలో వైద్యం చేస్తున్నట్లు గుర్తించిన శ్రీధర్, యాదగిరి, రాజేష్, విజయ్కుమార్ క్లినిక్లలో తనిఖీలు నిర్వహించిన అనంతరం వారు మాట్లాడారు. కలెక్టర్, జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టామన్నారు. యాదగిరి అనే వ్యక్తి వద్ద నార్కోటిక్ డ్రగ్యాక్ట్ కిందకు వచ్చే పలు యాంటీ బయోటిక్స్, స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ గుర్తించామన్నారు. రాజేష్ అనే వ్యక్తి క్వాలిఫైడ్ నర్సు. తాను ప్రాక్టీస్ చేయడం మానేసినట్లు తెలిపారని, అతడి నర్సింగ్ కోర్స్ సర్టిఫికెట్, నర్సింగ్ కౌన్సిల్ సర్టిఫికెట్స్ పరిశీలించినట్లు తెలిపారు. విజయ్కుమార్ అనే వ్యక్తి క్లినిక్లో యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్, వాడిన ఐవి సెట్స్, సర్జరీకి ఉపయోగించే పరికరాలు గుర్తించామన్నారు. శ్రీధర్ అనే వ్యక్తి అందుబాటులో లేకపోవడంతో అతడి క్లినిక్ పరిశీలించలేదన్నారు. ఇరువురి వద్ద లభించిన వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. తనిఖీల్లో టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు ఇన్చార్జి ఎంపీడీఓ ప్రకాశ్, ఎస్ఐ అపూర్వరెడ్డి, ఆర్ఐ రాజేందర్రెడ్డి, ముస్త్యాల పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ ప్రశాంత్రెడ్డి పాల్గొన్నారు. -
ప్రకృతిని పరిరక్షిస్తూ పరిశోధనలు చేయాలి
ఐఐసీటీ సైంటిస్ట్ వసుంధరసిద్దిపేటఎడ్యుకేషన్: ఆవశ్యకతనే ఆవిష్కరణలకు తల్లి అని, అవసరం ఉన్నప్పుడే మనిషి కొత్త ఆవిష్కరణల వైపు అడుగులు వేస్తారని ఐఐసీటీ సైంటిస్టు వసుంధర అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో ఫిజిక్స్ విభాగం ఆధ్వర్యంలో ‘ఎమర్జింగ్ మెటీరియల్ ఫర్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ అప్లికేషన్స్’ అనే అంశపై రెండ్రోజుల జాతీయ సదస్సు బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శాస్త్రవేత్తలు సమాజ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రకృతిని పరిరక్షిస్తూ పరిశోధనలు చేసి శాసీ్త్రయ అభివృద్ధిని సాధించాలని సూచించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో శాస్త్రవేత్త డాక్టర్ చంద్రబోస్, సదస్సు కన్వీనర్ డాక్టర్ మహేశ్కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మధుసూదన్, వైస్ ప్రిన్సిపాల్ పాల్గొన్నారు. -
జిల్లాలో ఇంధన కొరత లేదు
తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు సీపీ రష్మీ పెరుమాళ్ సిద్దిపేటకమాన్: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెట్రోల్ బంకుల్లో సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందన్నారు. ప్రజలు అనవసర అందోళనకు గురై ఒకేసారి బంకులకు చేరుకోవడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు సాధారణ పంపిణీకి అంతరాయం కలుగుతుందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దన్నారు. అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని సూచించారు. -
బూత్ స్థాయి ఏజెంట్లను నియమించండి
● కలెక్టర్, ఎన్నికల అధికారి హైమావతి ● రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం సాక్షి, సిద్దిపేట: ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించేందుకు త్వరగా బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలని అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హైమావతి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంపై చర్చించి సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు నమోదు ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులు, ఏజెంట్ల పాత్ర చాలా ముఖ్యమన్నారు. 2002లోని ఓటరు జాబితా, 2025 ఓటరు జాబితా సరిపోల్చుకొని జాబితాలో తీసివేతలు, కొత్త ఓటరు నమోదుకు సంబంధించిన ప్రక్రియ జరగనుందన్నారు. అలాగే రాజకీయ పార్టీల ప్రతినిధుల అభ్యర్థన మేరకు బూత్ స్థాయి ఏజెంట్లకు, అధికారులకు శాసనసభ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక ఓటరు నమోదుపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు మోహన్ లాల్, భైరీ శంకర్, అనిల్ కుమార్, మునీర్, కలెక్టరేట్ ఎలక్షన్ సూపరింటెండెంట్ బాలరాజ్లు పాల్గొన్నారు. -
నో
బుధవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2026గంటన్నర పాటు లైన్లో ఉంటే.. పెట్రోల్ కోసం ముస్తాబాద్ చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు వచ్చా. మూడు బంక్లు బంద్ ఉన్నాయి. పాత బస్టాండ్ బంక్ వద్ద గంటన్నర పాటు లైన్లో ఉంటే రూ.200 పెట్రోల్ పోశారు. రోజు ఇంటింటికి వెళ్లి బట్టలు ఉతుకుతాను. రోజుకు రూ.100 పెట్రోల్ ఖర్చు అవుతుంది. ఒక వైపు గ్యాస్.. మరో వైపు పెట్రోల్ కోసం ఇబ్బంది పడుతున్నాం. –బాలకిషన్, సిద్దిపేట ఇబ్బందులే.. ఫ్యామిలీతో బయటకు వచ్చాను. పెట్రోల్ పోయించుకుందామని అన్నీ పెట్రోల్ బంక్లు తిరిగా.. ఎక్కడా దొరకలేదు. ఇక్కడ ఉందని తెలిసి బంకుకు చేరుకున్నా. రోజు రూ.300 పెట్రోల్ ఖర్చు అవుతుంది. పెట్రోల్ కొరత ఏర్పడితే కరెంట్ బిల్లు చెల్లించేందుకు సైతం ఇబ్బందే.. – అరవింద్, గాడిచర్లపల్లిజిల్లాలో మొత్తం 193 పెట్రోల్ బంక్లు ఉన్నాయి. వీటికి ఇండియన్ ఆయిల్, హెచ్పీ, బీపీ ఆయిల్ కంపెనీల నుంచి పెట్రోల్, డీజిల్ సరఫరా అవుతోంది. జిల్లాకు సుమారు రోజూ లక్ష లీటర్ల పెట్రోల్, 3లక్షల లీటర్ల డీజిల్ సరఫరా జరుగుతోంది. కానీ మూడు రోజులుగా సరఫరా భారీగా తగ్గిపోయింది. దీంతో పలుచోట్ల బంకులు తాత్కాలికంగా మూసివేశారు. నోస్టాక్ బోర్డులు పెట్టారు. పెట్రో కొరత ఏర్పడిందనే వార్త దావానలంలా వ్యపించడంతో అందరూ బంకుల వద్ద బారులుతీరారు. పెట్రోల్ కోసం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్టాక్ ఉన్న బంకుల వద్దకు వాహనదారులు పెద్ద ఎత్తున పోటెత్తుతుండటంతో రద్దీ నెలకొంది. అవసరం లేకున్నా రోజువారి కంటే రెండింతలు పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేశారు. బంకులు బంద్ కావడంతో అవసరం ఉన్న చాలా మంది వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. బండ్లు మధ్యలోనే ఆగిపోవడంతో చాలా మంది బాటిళ్లలో తీసుకెళ్లారు. కృత్రిమ కొరతా? బంకుల యజమానులకు కంపెనీలు రూ.20 లక్షల వరకు క్రెడిట్ ఇచ్చేవి. ఇప్పుడు మొత్తం డిపాజిట్ చేస్తేనే పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. అది కూడా సమయం తీసుకుంటున్నట్లు తెలిసింది. దీంతో డీలర్లు ఎప్పటికప్పుడు డిపాజిట్ చేయకపోవడంతో కంపెనీలు సరఫరా నిలిపివేస్తున్నాయి. మరోవైపు పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఇంధనం రావడం లేదనే ప్రచారం కూడా జరుగుతోంది. పెట్రో ఉత్పత్తుల ధరలు పెరుగుతాయనే డీలర్లు పెట్రోల్, డీజిల్లను కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా అధికారులు చూడాలని వాహనదారులు కోరుతున్నారు. జిల్లాలో ఇంధన కొరత తీవ్ర రూపం దాలుస్తోంది. గృహాలు, హోటళ్లలో గ్యాస్ కొరతతో వంటలు.. పెట్రోల్, డీజిల్ కొరతతో రోడ్లపైనే వాహనాలు నిలిచిపోతున్నాయి. మంగళవారం పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయి. స్టాక్ ఉన్న బంకుల వద్ద బారులు తీరుతున్నారు. చాలా మంది తమ వాహనాలకు ఫుల్ ట్యాంకు చేయిస్తుండగా, మరికొందరు బాటిళ్లలో, క్యాన్లలో తీసుకెళ్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి, సిద్దిపేట -
నియోజకవర్గాల పునర్విభజన!
● జిల్లాలో ఐదుకు చేరనున్న అసెంబ్లీ స్థానాలు ● కొత్తగా ఏర్పడనున్న కొమురవెల్లి/చేర్యాల ● మారనున్న రాజకీయ ముఖచిత్రంసాక్షి, సిద్దిపేట: జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో పాటు ఒక అసెంబ్లీ స్థానం పెరిగే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. లోక్సభ, అసెంబ్లీ స్థానాలు 50శాతం మేర పెంచేలా కీలక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ నిర్ణయం అమలైతే జిల్లా రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారనుంది. ప్రస్తుతం ఉన్న నాలుగు నియోజకవర్గాల సంఖ్య ఐదుకు పెరిగే అవకాశం ఉంది. కొత్తగా కొమురవెల్లి/చేర్యాల జిల్లా వ్యాప్తంగా 2011 జనాభా లెక్కల ప్రకారం 10.12లక్షల జనాభా ఉంది. ప్రస్తుతం 26 మండలాలు ఉండగా సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రాలున్నాయి. జనగామలోని నాలుగు మండలాలు, మానకొండూరులోని ఒక మండలం ఉంది. అలాగే గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలోని పలు మండలాలు మెదక్ జిల్లాలో ఉన్నాయి. నాలుగు నియోజకవర్గాలు జనరల్ స్థానాలే ఉన్నాయి. హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో ఐదు నియోజకవర్గాలు అయ్యే అవకాశాలున్నాయి. దీంతో కొమురవెల్లి/ చేర్యాల కేంద్రంగా నూతనంగా నియోజకవర్గం ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. అలాగే పాత నియోజకవర్గాల్లో ఒకటి మహిళకు రిజర్వ్ అవుతుందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. జిల్లాలో మూడు లోకసభ నియోజకవర్గాల పరిధిలో పలు మండలాలున్నాయి. దీంతో జిల్లా మొత్తం కలిపి ఒకటే నియోజకవర్గం ఉండేలా చేస్తే సిద్దిపేట లోకసభ నియోజకవర్గం ఏర్పడే అవకాశాలున్నాయి. మారనున్న రాజకీయ సమీకరణలు జిల్లాలోని రాజకీయ సమీకరణలు సమూలంగా మారుతాయి. నియోజవర్గాల సంఖ్య పెరిగితే జిల్లాలోని పాత సరిహద్దులు మారుతాయి. దీంతో భౌగోళికంగా నియోజకవర్గాల స్వరూపం మారుతుంది. స్థానాల పెంపుతో రిజర్వేషన్ల ప్రక్రియలో భారీ మార్పులు వస్తాయి. నియోజకవర్గాల మార్పుతో ప్రస్తుత ఎమ్మెల్యేల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. మొత్తానికి పునర్విభజన ఎలా ఉంటుందో అని రాజకీయ నేతలు ఆందోళన చెందుతున్నారు. -
రాములోరి కల్యాణానికి రండి..
ములుగు(గజ్వేల్): జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు, క్షీరసాగర్ సర్పంచ్ కొన్యాల బాల్రెడ్డి నగరంలోని సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిశారు. క్షీరసాగర్లో ఈ నెల 27 అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్న కోదండ రామస్వామి కల్యాణ మహోత్సవానికి సంబంధించిన అహ్వాన పత్రికను సీఎం చేతులమీదుగా ఆవిష్కరింపజేశారు. అనంతరం సీఎంకు ఆహ్వానపత్రిక అందజేసి స్వామివారి కల్యాణానికి రావాలంటూ ఆహ్వానించారు. అందుకు సానుకూ లంగా స్పందించిన సీఎం.. తప్పకుండా వస్తానని చెప్పినట్లు ఆయన తెలిపారు. -
చేర్యాల వార్షిక బడ్జెట్.. రూ.23.03 కోట్లు
కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానంచేర్యాల(సిద్దిపేట): మున్సిపల్ వార్జిక బడ్జెట్ రూ.23.03 కోట్లను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ ముస్త్యాల అరుణ అధ్యక్షతన వార్షిక బడ్జెట్ సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ సమక్షంలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రాంట్లను కలుపుకొని రూ.23.03 కోట్లు అంచనా బడ్జెట్ను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. సాధారణ అంచనా ఆదాయం రూ.4.36 కోట్లు.. వ్యయం 4.35కోట్లు.. మిగిలిన మొత్తం రూ.1.23లక్షలు. మిగులులో 3వవంతు బలహీనవర్గాలకు కేటాయిస్తూ బడ్జెట్ రూపొందించారు. వార్షిక బడ్జెట్ను సీనియర్ అకౌంటెంట్ రేణుక చదివి వినిపించగా పాలకవర్గ సభ్యులు చేతులు ఎత్తి ఆమోదించారు. సమావేశంలో వైస్ చైర్పర్సన్ మేడిశెట్టి ఉమ, కౌన్సిలర్లు ఒగ్గు వెంకటమ్మ, కమలాపురం గీతాంజలి, కొమ్ము రాజేశ్వరి, నిమ్మ సుప్రజ, వెలుగల దుర్గయ్య, పోతుగంటి ప్రసాద్, బుదరి సురేష్, వీరబత్తిని సదానందం, ఎజాజ్అహ్మద్, షరీఫాబేగం, కమిషనర్ ఎస్.నాగేందర్, మేనేజర్ ప్రభాకర్, సీనియర్ అసిస్టెంట్ కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. -
పాలక మండలి తీర్మానం
మల్లన్న ఆలయ పరిసరాలలో వాహన ఫీజు వసూలు చేసేందుకు పంచాయతీ చర్యలు చేపట్టింది. ఇందుకు పంచాయతీ పాలక మండలి సైతం తీర్మానం చేసింది. తీర్మానాన్ని పైఅధికారుల అనుమతి కోసం పంపించాం. అనుమతి రాగానే వాహన ఫీజు వసూలు చేసేందుకు టెండర్ నిర్వహిస్తాం. – శ్రీనివాస వర్మ, ఎంపీఓ మరోసారి ఆలోచించాలిమల్లన్న ఆలయ పరిసరాలలో వాహనాల ఫీజు వసూలు చేసేందుకు బారికేడ్స్ (గేట్లు) ఏర్పాటు చేస్తే భక్తులతోపాటు స్థానికులకు ఇబ్బందే. మరోసారి ఆలోచించాలి. గతంలో కొమురవెల్లి పంచాయతీ అధికారులు టోల్ వసూలు చేశారు. భక్తులకు, టోల్ నిర్హాహకులకు గొడవలు కావడంతో అధికారులు రద్దు చేశారు. –తేలు ఇస్తారి, అయినాపూర్ -
గోటి తలంబ్రాలు సిద్ధం
గజ్వేల్రూరల్: భద్రాచలంలోని సీతారాముల కల్యాణోత్సవంలో వినియోగించే గోటి తలంబ్రాలను భక్తులు సిద్ధం చేశారు. గజ్వేల్కు చెందిన రామకోటి భక్తసమాజం వ్వవస్థాపక అధ్యక్షుడు రామకోటి రామరాజు ఈ బృహత్కర కార్యానికి శ్రీకారం చుట్టగా గోటి తలంబ్రాల దీక్షలో వేలాది మంది భక్తులు పాల్గొని రామనామ స్మరణతో భక్తులు గోటి తలంబ్రాలను సిద్ధం చేస్తూ భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. గజ్వేల్–ప్రజ్ఞాఫూర్ మున్సిపాలిటీతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో భక్తులు గోటి తలంబ్రాల దీక్షలో పాల్గొన్నారు. సోమవారం పట్టణంలోని మురళీకృష్ణాలయం నుంచి భద్రాచలంలోని సీతారాముల దేవస్థానంలో గోటి తలంబ్రాలను తరలించనున్నారు. ఈమేరకు రామకోటి రామరాజుకు గోటి తలంబ్రాల కలశాలతో అందజేశారు. కేసీఆర్, హరీశ్రావు ఫ్లెక్సీకి క్షీరాభిషేకంనంగునూరు(సిద్దిపేట): నర్మేటలోని ఆయిల్పామ్ ఫ్యాక్టరీ వద్ద సోమవారం బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్రావు ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. జిల్లా అధ్యక్షుడు యాదగిరి, పట్టణ సమన్వయకర్త నరేశ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఫ్యాక్టరీకి తరలిరావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఫ్యాక్టరీ నిర్మాణానికి కేసీఆర్, హరీశ్రావు ఎంతో కృషి చేశారన్నారు. కార్యక్రమంలో నాయకులు పర్శరాములు, రమేశ్, చింటూ, గఫూర్, కిరణ్గౌడ్, రమేశ్, అనిల్రెడ్డి, శ్రవణ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. యాప్లో కాదు షాపులో ఉంచండిరైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి చిన్నకోడూరు(సిద్దిపేట): రైతులకు సరిపడా యూరియా యాప్లో కాదని.. షాపుల్లో ఉంచాలని, యూరియా కొరతతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి మండిపడ్డారు. సోమవారం చిన్నకోడూరులో రైతు సంఘం మహాసభ నిర్వహించారు. ఆయన యూరియా యాప్ల బుకింగ్తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. నకిలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం లేదన్నారు. రైతులకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు వెంకట్, శ్రీనివాస్, బాల్రెడ్డి, హనుమంతారెడ్డి, రాజిరెడ్డి, ఎల్లారెడ్డి, కిష్టారెడ్డి తదితరులు ఉన్నారు. -
మల్లన్నసాగర్ కాల్వలు పూర్తి చేయండి
అసెంబ్లీలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాక: మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్అండ్ఆర్ ప్యాకేజీతో పాటు కాలువల నిర్మాణాలు పూర్తి చేయాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి కోరారు. సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తర సమయంలో ఇరిగేషన్పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్లకు సంబంధించి 90 శాతానికి పైగా కాలువల నిర్మాణాలు పూర్తికాగా ఇంకా 10 శాతం పనులు పెండింగ్లో ఉన్నాయన్నారు. దీంతో పంటలకు నీరందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉప్పరిపల్లి కెనాల్తో పాటు పలు కాలువలు భూసేకరణ, కోర్టు సమస్యతో మధ్యలోనే ఆగిపోయాయన్నారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు దృష్టిసారించి సమస్యను పరిష్కరిస్తే వేల ఎకరాలకు నీరందుతుందన్నారు. గత ప్రభుత్వంలో చేపట్టిన మిషన్ కాకతీయ పథకాన్ని పునరుద్ధరించి చెరువులను అభివృద్ధి చేయాలని కోరారు. -
తీరు మారకపోతే చర్యలు
● వైద్యులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం తగదు ● కలెక్టర్ హైమావతి ● గజ్వేల్లోని మాతాశిశు సంరక్షణ ఆస్పత్రి తనిఖీ గజ్వేల్: కొంతమంది వైద్యులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని, తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ హైమావతి హెచ్చరించారు. సోమవారం గజ్వే ల్లోని మాతాశిశు సంరక్షణ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో వార్డు లను కలియ తిరిగారు. అటెండెన్స్ రిజిష్టర్ను పరి శీలించారు. అనుమతి లేనిదే ఎవరూ సెలవు తీసు కోవద్దన్నారు. గర్భిణుల్లో మనోధైర్యం నింపు తూ మంచి ఆహారపు నియమాలపై అవగాహన కల్పించాలని సూచించారు. నార్మల్ డెలివరీల సంఖ్య పెరిగేలా వైద్యులు, సిబ్బంది పనిచేయాలని ఆదేశించారు. అప్పుడే పుట్టిన పిల్లలకు టీకాలను సక్రమంగా అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ అన్నపూర్ణ ఉన్నారు. -
రైతు భరోసా.. రూ.431.17 కోట్లు జమ
బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం కుకునూరుపల్లిలో కొలువైన సీతారామచంద్రస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. వివరాలు 9లో uతొలి విడతగా ఉమ్మడి మెదక్ జిల్లాకు నిధులు విడుదల● 7,19,500 ఎకరాలకు యాసంగి సాగు పెట్టుబడి సాయం ● త్వరలో మిగతా సాగు భూములకు సైతంసాక్షి, సిద్దిపేట: వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు యాసంగి సాగు కోసం ఒక్కో ఎకరం చొప్పున రైతు భరోసా రూ.6వేలు బ్యాంక్ ఖాతాల్లో సోమవారం జమ అయ్యాయి. నర్మేట ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి తొలి విడత రైతు భరోసా నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే. పెట్టుబడి సాయం కింద ప్రతి సీజన్కు ఎకరానికి రూ.6 వేల చొప్పున ఆర్థిక సాయం రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోంది. అందులో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో 9,33,046 మంది రైతులకు 7,19,500 ఎకరాలకు రూ.431.17కోట్లు జమ అయ్యాయి. ఏప్రిల్లో పూర్తిగా.. తొలి విడతలో ప్రతి రైతుకు ఎకరం భూమికి రైతు భరోసా అందజేశారు. మరో 20 రోజుల్లో 3 ఎకరాల వరకు, ఏప్రిల్లో అందరికీ రైతు భరోసాను అందజేయనున్నారు. యాసంగి సాగు కోసం రైతు భరోసా డబ్బులు ఎంతో ఉపయోగపడనున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేశారు. -
ప్రొటోకాల్ అమలయ్యేలా చూడండి
ఆర్డీఓకు మున్సిపల్ చైర్పర్సన్, పాలకవర్గం ఫిర్యాదు గజ్వేల్: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని మున్సిపల్ చైర్పర్సన్ గంగిశెట్టి చందన, వైస్ చైర్పర్సన్ కళ్యన్కర్ పద్మాబాయితోపాటు బీఆర్ఎస్ కౌన్సిలర్లు సోమవారం గజ్వేల్ ఆర్డీఓ వీవీఎల్ చంద్రకళకు ఫిర్యాదు చేశారు. పట్టణంలో ఇటీవల నిర్వహించిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమాన్ని తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కాంగ్రెస్ నేతలు నిర్వహించారని ఆరోపించారు. అంతేకాకుండా ప్రొటోకాల్ లేని నాయకులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు దీనిని ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. -
పార్కింగ్కు ఇక పైసా వసూల్
కొమురవెల్లి మల్లన్న భక్తులకు ఇక ఆర్థిక భారమే ● ప్రతీ వాహనానికి రూ.50 నుంచి రూ.100 ఫీజు వసూలుకు చర్యలు ● నాలుగు చోట్ల ‘గేట్లు’ ఏర్పాటు చేసే యోచనలో పంచాయతీ ● ఇప్పటికే పాలకమండలి తీర్మానం ● టెండర్ నిర్వహణకు ప్రతిపాదనలు సిద్ధం కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులకు ఆర్థిక భారం తెప్పేలా లేదు. ఆటో, నాలుగు చక్రాల వాహనాలపై వచ్చే భక్తులకు ఫీజు వసూలు చేసేందుకు కొమురవెల్లి పంచాయతీ సిద్ధమైంది. ఇందుకు కసరత్తు చేస్తోంది. పాత కమాన్ నుంచి వచ్చే భక్తులకు మల్లన్న చెరువు మత్తడిలో, హన్మకొండ నుంచి వచ్చే భక్తులకు కిష్టంపేట రోడ్డులో ఉన్న గోశాల వద్ద, తిమ్మారెడ్డిపల్లి కమాన్ నుంచి వచ్చే వారికి పోలీస్స్టేషన్, రాంసాగర్ రోడ్డు నుంచే వచ్చే భక్తులకు కురుమ సత్రం వద్ద ఫీజు వసూలు చేసేలా గేట్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు పంచాయతీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించారు. అనుమతి రాగానే టెండర్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రతి వాహనానికి రూ.50నుంచి రూ.100 వసూలు చేయనున్నట్లు సమాచారం. దీంతో భక్తులపై మరింత ఆర్థిక భారం పడనుంది. పార్కింగ్కు స్థల మేదీ? కొమురవెల్లిలోకి వచ్చిన వాహనాలకు సరిపడా పార్కింగ్ స్థలం పంచాయతీకి లేదు. ప్రస్తుతం ఆలయ పరిసరాలలో ఉన్న ప్రయివేట్ వెంచర్లలో ఫ్రీగా భక్తులు పార్కింగ్ చేస్తున్నారు. ఫీజు వసూలు చేస్తే ప్రయివేటు వ్యక్తులు తమ వెంచర్లలోకి వాహనాలను అనుమతించక పోవచ్చు. దీంతో భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉన్నతాధికారులు స్పందించి, ఇబ్బంది తలెత్తకుండా ఉండేలా వాహన ఫీజుపై పునరాలోచించాలని స్థానికులు కోరుతున్నారు. స్థానికులకు ఇబ్బందే.. వాహన ఫీజు వసూలు చేసేందుకు గేట్లు ఏర్పాటు చేస్తే స్థానికులకు సైతం ఇబ్బందులే.. మండలంలోని గురువన్నపేట, పోసన్పల్లి, అయినాపూర్, తపాస్పల్లి వారు చేర్యాలకు.. చేర్యాలనుంచి హైదరాబాద్కు వెళ్లేందుకు తిప్పలు తప్పవుమల్లన్నను దర్శించుకున్న సీపీ కొమురవెల్లి మల్లికార్జున స్వామిని పోలీస్కమిషనర్ రష్మీపెరుమాళ్ సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాన్ని, శేషవస్త్రాలు అందించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా అభివృద్ధి బాధ్యత నాదే
సిద్దిపేటజోన్/నంగునూరు: సిద్దిపేటపై ఎలాంటి వివక్ష లేదు.. అన్ని నియోజకవర్గాలు మాకు సమానమే.. సిద్దిపేట అభివృద్ధి బాధ్యత నాదే.. అన్ని వర్గాలకూ అండగా ఉంటా..’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. మీ హయాంలో.. మా పాలనలో జరిగిన వివక్షపై లెక్కలు తీద్దామా? అందుకు సిద్ధమా? అంటూ పరోక్షంగా బీఆర్ఎస్ అగ్రనాయకులకు సవాల్ విసిరారు. ఆదివారం నర్మేటలో సీఎం రేవంత్.. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేక్తో కలిసి ఆయిల్పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. ప్రారంభోత్సవ సభలో సీఎం మాట్లాడుతూ రాజకీయాలు ఎన్నికల వరకు మాత్రమే ఉండాలని, తరువాత అభివృద్ధికి అంకితమవుదామన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పని చేద్దామని పరోక్షంగా బీఆర్ఎస్ అగ్రనాయకత్వానికి సూచించారు. వివక్ష ఉంటే ఇక్కడ ప్రారంభించిన ఆయిల్పామ్ ఫ్యాక్టరీని కొడంగల్కు తరలించేవాడినని అన్నారు. సీఎం హోదాలో కొడంగల్లో సైతం ఇలాంటి ఆయిల్పామ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మలను ఇదే వేదిక ద్వారా కోరిన విషయాన్ని గుర్తు చేశారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ భూసేకరణ విషయంలో ఏటిగడ్డ కిష్టాపూర్ భూనిర్వాసితులకు అండగా దీక్ష చేసినట్లు గుర్తు చేశారు. సీఎంగా సిద్దిపేటకు వచ్చానని 2029లో కూడా గెలిచి మళ్లీ వస్తానని, ఈ ప్రాంత అభివృద్ధికి నిధులు ఇస్తానన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా రైతుల్లో వాణిజ్య పంటల సాగు పట్ల చైతన్యం ఉందని, పసుపు, చెరుకు, కందులు, మొక్కజొన్న లాంటి పంటలను పండిస్తున్నారన్నారు. ఇదే స్ఫూర్తితో లాభాదాయక పంట ఆయిల్పామ్ ద్వారా వ్యవసాయ రంగంలో మార్పు రావాలని పిలుపునిచ్చారు. రాజకీయాలు ఎన్నికల వరకే.. అన్ని వర్గాలకు అండగా ఉంటా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నర్మేటలో పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభం -
రైతే రాజు కావాలి: సీఎం రేవంత్
సాక్షి, సిద్దిపేట: ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం సుభిక్షంగా ఉండదని తాను బలంగా నమ్ముతానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. రాష్ట్రాన్ని ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతున్నా రైతుల విషయంలో వెనుకంజ వేయకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రైతును రాజు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. రైతుభరోసా కింద 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందించేందుకు రూ.9 వేల కోట్లను ప్రభుత్వం సమకూర్చిందని తెలిపారు. తొలి విడత పెట్టుబడి సాయం కింద సీఎం నిధులు విడుదల చేశారు.ఆదివారం సెలవు కావడంతో సోమవారంఅన్నదాతల ఖాతాల్లో జమవుతాయని చెప్పారు. ఆదివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో పామాయిల్ ఫ్యాక్టరీని ఆయన ప్రారంభించారు. ఫ్యాక్టరీని రైతులకు అంకితమిచ్చారు. అలాగే రూ 475.72 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రైతు మహోత్సవాలలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. పంట మార్పిడిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.. ‘రాష్ట్రంలో 2.58 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసి తెలంగాణ దేశంలోనే నంబర్ వన్గా నిలిచింది. అయితే రైతుల ఆదాయం పెరగాలంటే వరి పండించడం ఒక్కటే పరిష్కారం కాదు. ప్రతి రైతు కారు కొనుక్కునేలా ఆదాయం పెరగాలి. బంగారు తెలంగాణ అంటే ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందడమే. రాష్ట్రంలో పంటల విధానంలో మరిన్ని మార్పులు రావాలి. పంట మార్పిడితోనే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. అందుకు అనుగుణంగా రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. తృణధాన్యాలు (మిల్లెట్స్), ఆకు కూరలు, పామాయిల్ సాగుపై రైతులు దృష్టి పెట్టాలి. రైతులకు మంచి ధర వచ్చేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాం. 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ పండించినా కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సిద్దిపేటలో నిర్మించిన ఫ్యాక్టరీ కొడంగల్లోనూ నిర్మించాలని మంత్రి తుమ్మలకు విజ్ఞప్తి చేస్తున్నా. నాకు వ్యవసాయం చేయడం తెలుసు. చీడపీడలకు ఏ మందు వేయాలో కూడా తెలుసు..’ అని సీఎం చెప్పారు. అంకాపూర్ రైతులను ఆదర్శంగా తీసుకోవాలి ‘నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్ రైతులను ఆదర్శంగా తీసుకుని 12,728 గ్రామాల్లోని రైతులంతా ముందుకెళ్లాలి. ప్రభుత్వం కూడా పంటలను ఎగుమతి చేసే దిశగా కృషి చేస్తోంది. రైతుల కోసం ఇప్పటివరకు రూ.1.40 లక్షల కోట్లు ఖర్చు చేశాం. గతంలో 114 నెలల్లో కేసీఆర్ సగటున ఒక్కో నెలకు రూ2,535 కోట్లు ఖర్చు చేస్తే 28 నెలల కాలంలో ప్రజా ప్రభుత్వం సగటున నెలకు రూ 5,,500 కోట్లను రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేసింది. తాజాగా రైతు భరోసా తొలి విడత విడుదల చేశాం. 20 రోజుల తర్వాత రెండో విడతలో రూ.2,650 కోట్లు, మూడో విడతలో రూ.2,760 కోట్లు విడుదల చేస్తాం. యూరియా కొరత వచ్చేలా ఉంది.. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల రాబోయే రోజుల్లో మనకు యూరియా కొరత వచ్చేలా ఉంది. రామగుండం ఫ్యాక్టరీ యూరియా అంతా మనకే దక్కేలా, ప్రధాని మోదీని కలిసి మన రాష్ట్రానికి ఎక్కువ యూరియా తెచ్చుకునేందుకు బీజేపీ ఎంపీలు సహకరించాలి. సిద్దిపేటలో కాంగ్రెస్ గెలిస్తే మంత్రి పదవి వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలోనూ కాంగ్రెస్ గెలవాలి. ఇక్కడి నుంచి గెలిచిన వ్యక్తికి మంత్రి పదవి ఇస్తాం. 1984 నుంచి 2029 వరకు ఒకే కుటుంబానికి చెందిన వారినే ఎమ్మెల్యేను చేశారు. మార్చి చూడండి మంచి జరుగుతుంది. పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్లకు అప్పగిస్తున్నా..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రత్యర్థి పార్టీ నియోజకవర్గమనే వివక్ష ఉండదు.. ‘ప్రజలకు ఇచ్చే నిధుల విషయంలో వివక్ష చూపను. ప్రత్యర్థి పార్టీ నేతల గురించి ఆలోచిస్తే ప్రజలకు అన్యాయం జరుగుతుంది. గత పాలకులు ఈ విధంగా విపక్ష నేతల నియోజకవర్గాల పట్ల వివక్ష చూపించారు. కానీ నేను నేతలతో వ్యతిరేకిస్తాను గానీ, ప్రజల పట్ల వివక్ష చూపను. సిద్దిపేటకు కూడా నిధులు భారీగా ఇచ్చా. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావుతో రాజకీయాంగా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ ఆ నియోజకవర్గాల ప్రజల అభివృద్ధి కోసం కూడా పని చేస్తాం. వివక్ష చూపే వ్యక్తినయితే.. ఆయిల్పామ్ ఫ్యాక్టరీని కొడంగల్కే తీసుకెళ్లేవాడిని. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ కూడా పాల్గొని తన నియోజక వర్గం పరిధిలో ఉన్న సమస్యలను నా దృష్టికి తెచ్చారు..’ అని రేవంత్ చెప్పారు. ‘ప్రైవేట్ పాఠశాలల మోజులకు పోకండి.. ఆర్థికంగా నష్టపోకండి.. ప్రైవేట్ పాఠశాల కంటే నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాలల ద్వారా అందిస్తున్నాం. అందుకే ఆ శాఖ నాదగ్గరే ఉంచుకున్నా..’ అని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. రైతుల కళ్లల్లో ఆనందమే లక్ష్యం: మంత్రి తుమ్మల సిద్దిపేటజోన్/నంగునూరు(సిద్దిపేట): రైతు సంక్షేమ ప«థకాలను అమలు చేసి వారి కళ్లల్లో ఆనందం చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. రానున్న మూడేళ్లలో దేశంలోనే అత్యధికంగా ఆయిల్పామ్ సాగు చేసే రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల ఎకరాల్లో సాగు చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేట అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారని, అవసరమైతే ప్రత్యేకంగా నిధుల మంజూరుకు సీఎం సిద్ధంగా ఉన్నట్లు మంత్రి వివేక్ తెలిపారు. ప్రకృతి పరంగా రైతుకు ఎలాంటి ఇబ్బందులు కలిగించని ఆయిల్పామ్ సాగుతో బోలెడు ఆదాయం పొందవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు పంట మార్పిడిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందనిమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో పారదర్శకంగా ఉందని, పారీ్టలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ పథకం అమలు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీనీ కచి్చతంగా అమలు చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి రైతు పక్షపాతిగా దూరదృష్టితో పని చేస్తున్నారన్నారు. -
‘సిద్ధిపేటలో కాంగ్రెస్ ఎమ్మెల్యేను గెలిపించండి’
నర్మెట్ట: సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో సీఎం రేవంత్ పర్యటనలో భాగంగా ఆయిల్ఫామ్ ప్యాక్టరీని ప్రారంభించారు. ఈ మేరకు రైతు భరోసా నిధులను విడుదల చేశారు సీఎం రేవంత్. దీనిలో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ 70 లక్షల మందికి రైతు భరోసా నిధులను జమ చేశాం. రైతును రాజును చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నం చేస్తోంది. పంటలకు మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్గా ఇస్తాం. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నాం. 2029లో సిద్ధిపేట నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేను గెలిపిస్తే మంత్రిని చేస్తా. 1984 నుంచి 2029 వరకూ ఇక్కడ ఒకే కుటుంబం అధికారంలో ఉంది. 2029 మళ్లీ వస్తాం.. సిద్ధిపేటలో మళ్లీ సమావేశం పెడతాం. కొంతమంది అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. ప్రభుత్వానికి ప్రతిపక్షాలు సూచనలు చేయాలి. అభివృద్ధికి అడ్డుపడతామంటే ఎలా?, చెట్టుకు పట్టిన పురుగును ఎలా వదిలించాలో తెలుసు. అన్ని నియోజకవర్గాలను సమాన దృష్టితో చూస్తాం’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.సీఎం రేవంత్ కామెంట్స్.. ‘రైతు భరోసాకి 3600 కోట్ల రూపాయలను 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో వేశాము. రేపు మీ ఖాతాల్లో డబ్బులు పడతాయి. మరో 45 రోజుల్లో రైతు భరోసా అందరికి వస్తుంది. ఉగాది రోజున ఇందిరమ్మ చీర ఇస్తే నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన అక్కలకు కృతజ్ఞతలు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అన్న నానుడి నిజం. అందుకే రైతు పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. 114 నెలలు సీఎంగా కేసీఆర్ ఉన్నారు. రైతుల కోసం రూ. 2533 కోట్లు ప్రతి నెల కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు చేసింది. 28 నెలల్లో ప్రతి నెల రూ. 5500 కోట్ల రూపాయలు రైతు సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నాం. తుపాన్కి కామారెడ్డి ప్రాంతాల్లో పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. రైతుకి పంట నష్టం జరిగితే ఎకరానికి 10 వేల పరిహారం ఇచ్చాము. ఈ 28 నెలల్లో రైతుల కోసం లక్షా 40 వేల కోట్లు ఖర్చు చేశాం’ అని అన్నారు.సీఎం రేవంత్ పర్యటనపై బీఆర్ఎస్వీ నిరసనసీఎం రేవంత్ నర్మెట్ట పర్యటనపై బీఆర్ఎస్వీ(బీఆర్ఎస్ విద్యార్ధి విభాగం) నిరసన వ్యక్తం చేసింది. ఫ్లకార్డులు ప్రదర్శించి సిద్ధిపేట అభివృద్ధి ఏది అంటూ నిరసన తెలిసింది. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు.. కటింగ్ మాస్టర్ అంటూ ఫ్లకార్డులను బీఆర్ఎస్వీ ప్రదర్శించింది. సిద్ధిపేట నియోజకవర్గానికి నిధులేవి అని ప్రశ్నించింది. సిద్ధిపేట అభివృద్ధిపై వివక్ష అంటూ ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేసింది. -
నేడు సీఎం రాక
సాక్షి, సిద్దిపేట: సీఎం రేవంత్రెడ్డి ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం అయిన తర్వాత రెండో సారి సిద్దిపేట నియోజకవర్గానికి వస్తున్నారు. ఈ సందర్భంగా పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మధ్యాహ్నం 2.30గంటలకు నర్మేటలోని పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తారు. అక్కడే వర్చువల్గా పలువాటికి శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడనున్నారు. రూ.300 కోట్ల వ్యయంతో పామాయిల్ ఫ్యాక్టరీని అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించారు. గంటకు 120 టన్నుల పామాయిల్ గెలలను క్రష్ చేసి నూనె తీయనుంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఈనెల 19న రైతు మహోత్సవ ప్రారంభం సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల పోటాపోటీ నినాదాలతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ముందస్తు చర్యలలో భాగంగా ఐజీ చంద్రశేఖర్ నేతృత్వంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రారంభ ఏర్పాట్లను ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, కలెక్టర్ హైమావతి, ఐజీ చంద్రశేఖర్, సీపీ రష్మీ పెరుమాళ్ పర్యవేక్షించారు. 900 మంది పోలీస్ సిబ్బంది, అధికారులతో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను గుర్తించి ముందస్తుగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అభివృద్ధి పనులకు మోక్షం కల్పించరూ..సీఎం రేవంత్రెడ్డికి జిల్లా ప్రజల లేఖ సిద్దిపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు అర్ధంతరంగా నిలిచిపోయి వెక్కిరిస్తున్నాయి. జిల్లాలో వెయ్యి పడకల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి, నర్సింగ్ కళాశాలకు స్వల్పంగా నిధులు కేటాయిస్తే అవి అందుబాటులోకి రానున్నాయి. అలాగే రంగనాయకసాగర్ వద్ద చేపట్టిన పర్యాటక అభివృద్ధి, కోమటిచెరువు శిల్పారామం, బీజేఆర్ చౌరస్తాలో మోడల్ మార్కెట్, వెటర్నరీ కళాశాల భవన నిర్మాణం పనులు సైతం మధ్యలోనే నిలిచిపోయాయి. 1000 పడకల ఆస్పత్రి నిర్మాణం పూర్తి అయితే సిద్దిపేట, కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్ జిల్లాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. పర్యాటకంగా ఎంతో అభివృద్ధి పరిచేందుకు రూ.100 కోట్లతో రంగనాయకసాగర్ వద్ద వివిధ పనులను చేపట్టారు. ఆ పనులు మఽధ్యలో నిలిచిపోయాయి. నర్సింగ్ కళాశాల భవనం దాదాపు పూర్తి కావచ్చింది. నిధులు కేటాయిస్తే నిర్మాణం పూర్తి కానుంది. దీంతో నర్సింగ్ విద్యార్థుల ఇబ్బందులు తప్పనున్నాయి. సీఎం రాక సందర్భంగానైనా మోక్షం లభిస్తుందా? అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వాలు మారినా అభివృద్ధిని నిలిపివేయకుండా కొనసాగించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఇట్లు సిద్దిపేట ప్రజలు జిల్లాలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు.. పోలీసుల పటిష్ట బందోబస్తు -
పోరాటాల ఫలితమే..
సిద్దిపేటజోన్: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ గట్టిగా వత్తిడి చేయడం వల్లే సర్కారు దిగివచ్చిందని, మా పోరాటాల ఫలితమే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పత్తి మార్కెట్ యార్డులో మొక్కజొన్న, పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొక్కజొన్న క్వింటాల్కు రూ.2400 మద్దతు ధర ఉండగా, సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో చాలా మంది రైతులు దళారులకు రూ.1600 నుంచి రూ.1700 అమ్మి తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికే 25శాతం మొక్కజొన్న దళారుల చేతుల్లోకి వెళ్లిపోయిందన్నారు. ఇప్పటికై నా రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సన్ఫ్లవర్ క్వింటాల్కు రూ.7,721 మద్దతు ధర ఉందని, తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు. ఒకప్పుడు సిద్దిపేట నియోజకవర్గంలో 8వేల ఎకరాల్లో యాసంగికి సాగు ఉండేదని, కాళేశ్వరం పుణ్యమా అని పదింతలు పెరిగి 80 వేల ఎకరాల్లో సాగు జరుగుతోందన్నారు. కాళేశ్వరం వచ్చాక కరువు అనే పదం లేదన్నారు. జిల్లా వ్యవసాయ రూపురేఖలు మార్చిన ఘనత కాళేశ్వరానికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వేణుగోపాల్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్స్, పట్టణ పార్టీ అధ్యక్షుడు సంపత్రెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు రెడ్డి ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.● బీఆర్ఎస్ ఒత్తిడి వల్లే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ● మాజీ మంత్రి హరీశ్రావు -
సంక్షేమ పద్దు
బడ్జెట్లో జిల్లాకు ప్రత్యేక కేటాయింపుల్లేవ్ట్రిపుల్ ఆర్కు రూ.1,525 కోట్లు.. రీజనల్ రింగ్ రోడ్ కోసం రూ. 1,525 కోట్లను కేటాయించారు. ఉత్తరభాగం పరిధిలో నర్సాపూర్ నుంచి తూప్రాన్, గజ్వేల్, జగదేవ్పూర్, భువనగిరి, చౌటుప్పల్ వరకు 161.2 కిలో మీటర్లు ఉంది. దక్షిణభాగం చౌటుప్పల్ లో ప్రారంభమై అమనగల్లు, షాద్నగర్, మీదుగా సంగారెడ్డి వరకు 189 కిలో మీటర్లు ఉండనుంది. దీని కోసం గత బడ్జెట్లలో సైతం నిధులు కేటాయించారు. ఈ సారి సైతం కేటాయించడంతో రీజినల్ రింగ్ రోడ్ పనులు మరింత వేగం పెరగనుంది. సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ జిల్లా ప్రజలను నిరాశపరిచింది. జిల్లాకు ప్రత్యేకంగా కేటాయింపులు ఏమీ లేనప్పటికీ పలు నూతన పథకాల అమలుతో కొందరు లబ్ధిపొందనున్నారు. మరోవైపు బడ్జెట్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాకు మంజూరైన పశువైద్య కళాశాల నిర్మాణం పనులు రెండేళ్లుగా నిలిచిపోయాయి. మల్లన్నసాగర్, రంగనాయకసాగర్ నుంచి దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లోని పంటలకు సాగు నీటిని అందించే కాలువలు లేకపోవడంతో సాగు నీటి ఇబ్బందులు తప్పడంలేదు. అలాగే గౌరవెల్లి రిజర్వాయర్ కాలువల నిర్మాణం కావాల్సి ఉంది. దుబ్బాక, చేర్యాల రెవెన్యూ డివిజన్లు కావాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. జిల్లాకు నిధులు కేటాయించకపోవడంతో ప్రజలు నిరాశ చెందారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని వర్తింపజేయాలని రాష్ట్ర బడ్జెట్లో రూ.4వేల కోట్లను కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా 3,33,332 కుటుంబాలుండగా వారికి జీవిత బీమా వర్తించనుంది. దీంతో కుటుంబాలకు రూ.5లక్షల బీమా ఉండనుంది. కుటుంబంలో ఎవరైనా మరణిస్తే వారికి ఆర్థికంగా భరోసా లభించనుంది. రాజీవ్ యువ వికాసానికి మోక్షం రాజీవ్ యువ వికాసానికి ఎట్టకేలకు మోక్షం కలగనుంది. నిరుద్యోగ యువత ఉపాధి కోసం ఆర్థిక భరోసా కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకం తీసుకవచ్చింది. అందులో భాగంగా యువత నుంచి దరఖాస్తులను స్వీకరించారు. దీని కోసం జిల్లా వ్యాప్తంగా 59వేల మంది యువత దరఖాస్తు చేసుకున్నారు. మొదట రూ.50వేల వారికి ఇవ్వాలని గతంలో నిర్ణయించినప్పటికీ ఇవ్వలేదు. యంగ్ ఇండియా స్కూల్స్ నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా స్కూల్ను ఏర్పాటు చేయాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం రూ.5వేల కోట్లను బడ్జెట్లో కేటాయించారు. ఇప్పటికే హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి రూ.250 కోట్ల వ్యయంతో కోహెడలో నిర్మాణం జరుగుతుంది. గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించి కొండపాకలో యంగ్ ఇండియా స్కూల్ను నిర్మించనున్నారు. ఇప్పటికే స్థలం గుర్తించారు. ఈ నెల 22న సీఎం చేతుల మీదుగా నర్మేటలోనే శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. అలాగే దుబ్బాక, సిద్దిపేటలలో సైతం రానుంది. పట్టణాభివృద్ధికి పెద్దపీట జిల్లాలోని పట్టణాలు అభివృద్ధి చెందనున్నాయి. పట్టణాభివృద్ధికి రూ.17,907 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో 115 వార్డులకు సైతం నిధులు రానున్నాయి. అలాగే పల్లెల అభివృద్ధి కోసం రూ.33, 688 కోట్లను కేటాయించగా జిల్లాలోని 508 గ్రామ పంచాయతీలకు నిధుల వరద పారనుంది. విద్యార్థులకు అల్పాహారం ప్రీ ప్రై మరీ నుంచి ఇంటర్ వరకు 1.10లక్ష మంది విద్యార్థులకు ఇక అల్పాహారం అందించనున్నారు. దీంతో విద్యార్థులు ఉదయం పాఠశాలకు రాగానే అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించనున్నారు. అలాగే ఇంటర్ విద్యార్థులకు సైతం భోజనం అందించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 20వేల మంది విద్యార్థులకు అందనుంది. ఐటీఐ విద్యార్థులకు రూ.2వేల ఉపకారవేతనం అందనుంది. ఉద్యోగులకు ఆరోగ్య భరోసా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత ఆరోగ్య భద్రతా పథకం వర్తింపజేయనున్నారు. ఇందు కోసం ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డును అందించనున్నారు. పీఆర్సీ ప్రస్తావన ఏదీ? రాష్ట్ర బడ్జెట్లో పీఆర్సీ ప్రస్తావన లేకపోవడంతో శోచనీయం. ఉద్యోగ ఉపాధ్యాయులకు ఆరోగ్య పథకం ప్రవేశపెట్టడం హర్షణీయం. నగదు రహిత వైద్య సేవలను వెంటనే ప్రారంభించాలి. పేదవాళ్లకు సరైన విద్య అందించాలంటే కామన్ స్కూల్ విధానం తీసుకురావాలి. బడ్జెట్లో విద్యాశాఖకు కేవలం 8.2శాతం మాత్రమే నిధులు కేటాయించారు. – ఆదరాసుపల్లి శశిధర్, పీఆర్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శిమిశ్రమ బడ్జెట్ ఇది మిశ్రమ బడ్జెట్. ప్రజలకు ఆశించిన ప్రయోజనాలు లేవు. ముఖ్యంగా పెన్షన్ల పెంపు, గీతకార్మికులకు, యాదవులు, ముదిరాజ్, చేనేత కార్మికులకు వంటి వత్తి సంఘాలకు బడ్జెట్లో ప్రస్తావన లేదు. బడ్జెట్ కేవలం అసెంబ్లీ ప్రసంగాలకు పరిమితం కాకుండా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తోడ్పడేలా ఉండాలి. – మంద పవన్, జిల్లా కార్యదర్శి, సీపీఐప్రజాపాలనకు నిదర్శనం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజాపాలనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా ఉంది. ఆరు గ్యారంటీలతో పాటు విద్యార్థులకు అల్పాహారం అందిచడం మంచిది. అలాగే కుటుంబానికి భరోసాను కల్పించేందుకు బీమా పథకాన్ని వర్తింపజేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంకెల్లో కాకుండా చేతుల్లో చేసి చూపిస్తుంది. సీఎం రేవంత్రెడ్డి లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారని, ఆయనకు ప్రజల ఆశీర్వాదం తప్పక ఉంటుంది. – అత్తు ఇమామ్, పట్టణ అధ్యక్షుడు, కాంగ్రెస్ కమిటీ నిలిచిపోయిన అభివృద్ధి పనులపై దృష్టి సారించని రాష్ట్రం ఇందిరమ్మ జీవిత బీమాతో 3.3లక్షల కుటుంబాలకు భరోసా రాజీవ్ యువ వికాసంలో 59వేల దరఖాస్తులకు మోక్షం సర్వత్రా భిన్నాభిప్రాయాలు మరిచిన రెవెన్యూ డివిజన్ల హామీలు నూతన పథకాల అమలుతో కొందరికి మేలు -
పండుగలా రైతు మహోత్సవం
భారీ సంఖ్యలో తరలివచ్చిన రైతులునంగునూరు(సిద్దిపేట): నర్మేట ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లు అన్నదాతలను ఆకట్టుకుంటున్నాయి. ఉద్యాన, ఇరిగేషన్, మార్క్ఫెడ్, వ్యయసాయ, పట్టు పరిశ్రమ, పశుసంవర్ధక, మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆసక్తిగా పరిశీలించారు. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, వరంగల్, నల్లగొండ, జనగాం, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల నుంచి వచ్చిన రైతులు ఒక్కో స్టాల్ తిరుగుతూ పనిముట్లు, పంటసాగుపై ఆరా తీశారు. ఒక్కో స్టాల్ వద్ద ఆయా కంపెనీల ప్రతినిధులు రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను వివరించారు. ఆయిల్పామ్ సాగు తోపాటు బిందు సేద్యానికి ప్రాధాన్యత పెరగడంతో స్టాల్లో ఏర్పాటు చేసిన డ్రిప్ పరికరాలను అన్నదాతలు ఆసక్తిగా గమనించారు. ఆధునిక పద్ధతులు, మొక్కలు నాటే విధానం, మొక్కల మధ్య ఉంచాల్సిన దూరాన్ని రైతులకు వివరించారు. ఎరువులు, మందులు డ్రిప్ ద్వారా వదలడం ఎలాగో ప్రదర్శిస్తూ వివరించారు. తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సౌర విద్యుత్ తయారీ, విద్యుత్ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం పూర్తి సబ్సిడీ అను రైతులకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్ట్ కింద 80 గ్రామాలను ఎంపిక చేసి 6 నెలల్లోపు 16,800 సోలార్ విద్యుత్ సెట్టులను బిగించే ప్రాజెక్ట్ నడుస్తోందని సంస్థ ప్రతినిధులు రవీందర్, వినోద్ వివరించారు. దీనికి రైతుల నుంచి మంచి స్పందన లబించడంతో త్వరలోనే రాాష్ట్ర అమలు చేస్తారని వారు వివరించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వ విద్యాలయం విద్యార్థులు ఆధుక వ్యవసాయం, స్వయం ఉపాధిపై ఏర్పాటు చేసిన ప్రదర్శన మహిళలు ఆసక్తిగా గమనించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పుట్టగొడుగు, మిల్లేట్ పంటలు, యూనియర్సీటిలో సృష్టిస్తున్న కొత్త వంగడాలు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించే పంటలపై విద్యార్థులు అవగాహక కల్పించారు.ఆకట్టుకున్న పాల యంత్రం పీవీ నరసింహారావు తెలంగాణ యూనివర్సిటీ కాలేజీ విద్యార్థులు విద్యుత్తో నడిచే మీగడ తయారీ యంత్రంలో పాలు పోసి చేసే విధానాన్ని ప్రదర్శించారు. యంత్రంలో పోసిన పాలను వివిధ రూపాల్లో వేడి చేయడం ద్వారా గంటలో పెరుగు, నెయ్యి, పాలకోవ, మజ్జిగ, పన్నీర్, మిల్క్పౌడర్, జున్ను పాల ఉత్పత్తులను ఏలా తయారు చేయవచ్చో వివరించారు. చిన్న పరిశ్రమలు పెట్టుకునే వారికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని కళాశాల విద్యార్థి రైతులకు వివరించారు.ఫ్లెక్సీల తొలగింపు నర్మేట ఆయిల్పామ్ ఫ్యాక్టరీలో రైతు మహోత్సవం ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన గొడవ వివాదాస్పదంగా మారింది. శుక్రవారం ఉన్నత స్థాయి అధికారులు ఫ్యాక్టరీని సందర్శించి పరిస్థితులపై సమీక్షించారు. ప్రోటోకాల్ పాటించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈమేరకు ఫ్యాక్టరీ ఆవరణలో కట్టిన ఫ్లెక్సీలను సిబ్బంది తొలగించారు. -
రంజాన్కు సర్వం సిద్ధం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ శనివారం నిర్వహించుకునేందుకు జిల్లాలోని ముస్లింలు సిద్ధమయ్యారు. మసీదులు, ఈద్గాల వద్ద నిర్వహించే ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు చేశారు. షామియానాలు, తాగునీరు, తదితర ఏర్పాట్లను మున్సిపల్, గ్రామ పంచాయతీ నిర్వాహకుల ఆధ్వర్యంలో చేపట్టారు. మసీదుల వద్ద పోలీస్శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో తనిఖీలు చేశారు.అల్లా దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలిప్రశాంత్నగర్(సిద్దిపేట): ఈద్ ఉల్ ఫితర్ పర్వదినం సందర్భంగా ముస్లింలకు మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా జరుపుకొనే అతిపెద్ద గొప్ప పండుగల్లో రంజాన్ ఒకటని కొనియాడారు.ఈ పవిత్ర మాసం దీక్షలు, ప్రేమ, దయ సౌభ్రాతృత్వ గుణాలను పంచుతుందన్నారు. గంగా జమునా తెహజీబ్కు తెలంగాణ ప్రతీక అన్నారు. లౌకికవాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ, దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. అల్లా దయతో రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తున్నానన్నారు. ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు సఫలం కావాలని, అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. -
రెచ్చిపోయిన పిచ్చికుక్క
దుబ్బాక: పిచ్చికుక్క దాడిలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో శుక్రవారం జరిగిన ఈ సంఘటన వివరాలివి. పట్టణంలోని 16వ వార్డులో పోలీస్స్టేషన్ సమీపంలో పిచ్చికుక్క కనిపించిన వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. పిచ్చికుక్క దాడిలో 15 మంది గాయపడ్డారు. కాగా వీరిలో పర్స బాలయ్యకు తీవ్రగాయాలు కావడంతో సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు.మిగతా 14 మంది దుబ్బాక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పిచ్చికుక్క కనిపించిన వారందరిపై దాడి చేసి.. కరవడంతో తీవ్ర రక్త స్రావాలయ్యాయి. పట్టణంలోని 16 వార్డుకు చెందిన 12 మంది, 1, 20 వార్డులకు చెందిన ముగ్గురిపై దాడి చేసింది. అనంతరం ప్రజలు పిచ్చికుక్కను చంపారు. కౌన్సిలర్ రాజు, నాయకులు శ్రీరాం రవీందర్, సాయితేజగౌడ్ గాయపడిన వారికి చికిత్స చేయించారు. -
అందరికీ శుభాలు కలగాలి
హుస్నాబాద్: ఉగాది పర్వదినాన ప్రజలందరికీ శుభాలు కలగాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. గురువారం ఉగాది పండుగ వేళ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, పట్టణంలోని కాశీ మరకత లింగేశ్వర ఆలయం వద్ద ఉగాది పంచాంగ శ్రవణ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శివపార్వతుల ఆశీర్వాదం అందరిపై ఉంటుందన్నారు. ఎలాంటి ఆటంకం లేకుండా అభివృద్ధి, ప్రజల సంక్షేమం జరగాలన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతిపక్ష నాయకులు కూడా అభివృద్ధికి సహకరించాలని, గ్రామాలను అభివృద్ధి చేసుకుందామన్నారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, కమిషనర్ మల్లికార్జున్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
ఆయిల్పామ్కు అధిక ప్రాధాన్యత
● మీ చెంతనే ఫ్యాక్టరీ.. సాగు పెంచుదాం ● వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు నంగునూరు(సిద్దిపేట): అన్నదాతలు అధిక లాభాలు గడించే ఆయిల్పామ్ పంటకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని, సాగు విస్తీర్ణం పెంచాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పిలుపునిచ్చారు. నంగునూరు మండలం నర్మేటలో ఏర్పాటు చేసిన రైతు మహోత్సవాన్ని గురువారం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, స్పీకర్ ప్రసాద్కుమార్, మంత్రులు వివేక్, శ్రీహరి, పొన్నం ప్రభాకర్, నాగేశ్వర్రావు, ఎమ్మెల్యేలు హరీశ్రావు, ప్రభాకర్రెడ్డి, ఎంపీ రఘునందన్రావు, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, దేశపతి శ్రీనివాస్, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఆయిల్ఫెడ్ చైర్మన్ రాఘవరెడ్డిలు ప్రారంభించారు. అనంతరం స్టాళ్లను పరిశీలించి ఏర్పాట్లపై ఆరా తీశారు. మంత్రి నాగేశ్వర్రావు మాట్లాడుతూ తెలంగాణకు అన్ని రకాలుగా అందుబాటులో ఉన్న సిద్దిపేట ప్రాంతంలో ఆయిల్ఫ్యాక్టరీ, రిఫైనరీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. మంత్రి శ్రీహరి మాట్లాడుతూ రైతాంగంపై ప్రేమతో శాసన మండలి, శాసన సభాపతి పండగ పూట మీ వద్దకు వచ్చారన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మూడు రోజుల పాటు నిర్వహించే రైతు మేళాకు చుట్టుపక్కల జిల్లాల రైతులు వచ్చి స్టాళ్లను పరిశీలించి అవగా హన పెంచుకోవాలన్నారు. హుస్నాబాద్ నియోజక వర్గంలో ఆయిల్పామ్ పంటను సాగు చేయిస్తామన్నారు. ఎమ్మెల్యే హరీశ్రావు మాట్లాడుతూ ఆయిల్పామ్ సాగుకు అనుకూలంగా లేని ఈ ప్రాంతానికి కళేశ్వరం నీరు రావడంతోనే తేమ శాతం పెరిగి సాగుకు అనుకూలంగా మారిందన్నారు. ఎంపీ రఘునందన్రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎకరా ఆయిల్పామ్ సాగుకు ప్రతి యేటా రూ.4,200 రైతు అకౌంట్లో జమ చేస్తోందన్నారు. ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ ప్రారంభంలో ఆయిల్పామ్ సాగు చేయాలని చెబితేనే భయం వేసేదని, ఈ ప్రాంతానికి ఫ్యాక్టరీ రావడం సంతోషంగా ఉందన్నారు. ఉప్పొంగిన ఉత్సాహం.. ‘జిల్లాకు ఆయిల్పామ్ మొక్కను తెచ్చింది మీరు.. ఫ్యాక్టరీకి పునాది వేసింది మీరే’ అంటూ హరీశ్రావును చూసిన ఆనందంలో రైతులు జైకొట్టారు. రైతుల బాగు కోసం పాటు పడిన మీ వెంటే మేమంటూ ఉద్వేగం.. ఉత్సాహంతో ఆయన వెంట తిరుగుతూ షేక్హ్యాండ్ ఇచ్చేందుకు పోటీ పడ్డారు. కాలువ వద్ద హరీశ్ సెల్ఫీ కాలువల ద్వారా కాళేశ్వరం నీరు పారడంతో కార్యకర్తలతో కలిసి హరీశ్రావు సెల్ఫీ దిగి సంతోషం వ్యక్తం చేశారు. కేసీఆర్ కృషితో వేసవి కాలంలో నీరు పారుతూ రైతన్నల కళ్లలో అంతులేని ఉత్సాహం నెలకొందని ట్వీట్ చేశారు. -
దేవుడి ఆశీస్సులు అందరిపై ఉండాలి
ప్రశాంత్నగర్(సిద్దిపేట): ప్రజలందరూ సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, భగవంతుని ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసార కోరుకున్నట్లు మంత్రి వివేక్ తెలిపారు. గురువారం ఉగాది పర్వదిన వేడుకలు జిల్లా కేంద్రంలోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందరికీ అందాలని, మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వానికి బలాన్ని ఇవ్వాలని దేవుడిని వేడుకున్నానన్నారు. కార్యక్రమంలో హరికృష్ణ, అత్తు ఇమామ్, బొమ్మల యాదగిరి, కలీముద్దీన్ అహ్మద్, ఎల్లం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
కష్టాలు.. వరుసకట్టె
గ్యాస్ కొరత.. హోటళ్ల మెనూలో కోతఉమ్మడి జిల్లాలోని చాలా హోటళ్లలో వంట గ్యాస్ ఎక్కువగా ఖర్చయ్యే వంటకాలను మెనూ నుంచి తొలగిస్తున్నారు. సాంబార్ తయారు చేసేందుకు పప్పు ఉడకబెట్టడంతో పాటు, బాగా మరిగించాలి. దీంతో గ్యాస్ ఎక్కువగా ఖర్చవుతుంది. పలు హోటళ్లలో సాంబార్ తయారు చేయడం బంద్ చేశారు. వినియోగదారులకు సాంబార్ లేకుండానే ఇడ్లీ, వడాలు అందజేస్తున్నారు. అలాగే పలు టిఫిన్ సెంటర్లలో దోసె, పూరీలను మెనూ నుంచి తొలగించారు. మెస్, హోటళ్లలో మీల్స్తో పాటు అందించే ఫ్రై ఐటమ్స్, పులుసు లేకుండా అందిస్తున్నారు. ఇండక్షన్ స్టౌలను చాలా చోట్ల వినియోగిస్తున్నారు. గ్యాస్ కొరతతో కమర్షియల్ సిలిండర్లు లభించక ఇబ్బందులు పడుతున్నారు. సాధారణ రోజుల్లో రూ.1,850 ఉన్న కమర్షియల్ సిలిండర్ ధర బ్లాక్లో రూ.3,500 పెట్టి కొనుగోలు చేస్తున్నారు. దీంతో టిఫిన్స్ ఒక్కో దానిపై రూ.10 పెంచి వసూలు చేస్తున్నారు. ఒక్కో టిఫిన్పై ధరలు పెంచామని, ఇందుకు సహకరించాలని పోస్టర్లను అంటించారు. గ్యాస్ కొరతతో పలు హోటళ్లను బంద్ చేస్తుండగా.. అందులో పని చేసే కార్మికులు రోడ్డున పడుతున్నారు. కొన్ని ఐటమ్స్ చేస్తలేం.. గ్యాస్ ఎక్కువగా వినియోగమయ్యే కొన్ని ఐటమ్స్ బంద్ చేస్తున్నాం. బొండా, పూరీ, దోసెలకు ఎక్కువగా ఖర్చవుతుంది. కొన్నింటిని బట్టీ పొయ్యి పెట్టుకొని వాటిని తయారు చేస్తున్నాం. ఎంత కష్టమైనా గ్యాస్ తీసుకొచ్చి హోటల్ నడుపుతున్నాం. –నర్సింహారెడ్డి, ఆనంద్ దర్శిని హోటల్, సిద్దిపేట మళ్లీ గ్యాస్ దొరికితేనే.. గ్యాస్ కమర్షియల్, డొమెస్టిక్ సిలిండర్లు లభించడం లేదు. బంధువులు, తెలిసిన వారిని అడుగుతున్నా లభించడం లేదు. గ్యాస్ అయిపోవడంతో హోటల్ బంద్ చేద్దాం అనుకుంటున్నాం. గ్యాస్ కొరతను ప్రభుత్వం తీర్చాలి. గ్యాస్ సరఫరాను వేగిరం చేయాలి. – మనిష్, దుర్గమాత టిఫిన్స్ కట్టెల పొయ్యి.. బట్టీలు హోటళ్లలో మళ్లీ పాత పద్ధతిలో వంటలు చేయడం ప్రారంభించారు. పలు హోటళ్లలో కట్టెల పొయ్యి.. బట్టీలతో టిఫిన్లు, వంటలు చేస్తున్నారు. గ్యాస్ అందుబాటులోకి రావడంతో కట్టెల పొయ్యి, బట్టీలను బంద్ చేశారు. ఇప్పుడు గ్యాస్ కొరతతో మళ్లీ పాత వాటికి మరమ్మతులు చేయించి పునఃప్రారంభించారు. -
నాగరాజుశర్మకు ఉగాది పురస్కారం
రాష్ట్రస్థాయికి నాచగిరి ఖ్యాతి వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం నాచగిరి దేవస్థాన పురోహితుడు యాయవరం నాగరాజుశర్మకు రాష్ట్రస్థాయి ఉగాది పురస్కారం వరించింది. గురువారం హైదరాబాద్ రవీంద్రభారతి వేదికగా దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, కమిషనర్ హన్మంతరావు చేతుల మీదుగా పురస్కారం అందజేసి ఘన సన్మానం చేశారు. వర్గల్ మండలం వేలూరుకు చెందిన యాయవరం నాగరాజుశర్మ మూడు దశాబ్దాలుగా దేవస్థాన పురోహితునిగా సేవలందిస్తున్నారు. ఆయనకు రాష్ట్ర పురస్కారం వరించడం పట్ల ఆలయ చైర్మన్ రవీందర్గుప్తా, ఈఓ రంగాచారి, ధర్మకర్తలు, ఆలయ అర్చక పురోహితులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. తనకు పురస్కారం దక్కడంపై నాగరాజుశర్మ సంతోషం వ్యక్తం చేశారు. -
నేత్రపర్వం.. శతఘటాభిషేకం
నాచగిరిలో బ్రహ్మోత్సవాలు సంపూర్ణం వర్గల్(గజ్వేల్): ఉగాది పర్వదిన శుభవేళ దేవదేవుని అష్టోత్తర శతకలశ మహాభిషేకం నేత్రపర్వం చేసింది. నాచగిరీశుడు లక్ష్మీనృసింహుని దివ్యదర్శనంతో భక్తజనావళి తరించింది. సుప్రసిద్ధపుణ్యక్షేత్రం నాచగిరిలో ఆధ్యాత్మిక అనుభూతులు పంచిన బ్రహ్మోత్సవాలు గురువారం అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగిశాయి. ఆలయ ఈఓ బెల్లంకొండ రంగాచారి, చైర్మన్ రవీందర్గుప్తా పర్యవేక్షణ, ధర్మకర్తలు, తీర్థజనుల సమక్షంలో ఉదయం అర్చకులు ఆలయ మండపంలో 108 కలశాలు స్థాపన చేశారు. కలశ పూజ నిర్వహించారు. హోమం జరిపారు. పూర్ణ కలశంతో ఆలయ ప్రదక్షిణ చేసి నృసింహ నామార్చనలు, మంత్రోచ్ఛారణల మధ్య గర్భగుడిలో మూలవిరాట్టులకు మహాభిషేకం జరిపారు. పట్టువస్త్రాలు, పూలమాలికలు, సర్వాభరణాలతో శ్రీ లక్ష్మీ సమేత నృసింహస్వామివారిని కమనీయంగా అలంకరించారు. భక్తులు నాచగిరీశుని దివ్యమంగళరూపం దర్శించుకుని తరించారు. షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి తీర్థం స్వీకరించారు. క్షేత్రంలో పంచాంగ శ్రవణం నూతన సంవత్సరాదికి స్వాగతం పలుకుతూ నాచగిరిలో సాయంత్రం ఉగాది పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ ఆస్థాన పురోహితులు త్రిగుళ్ల గోపాలకృష్ణశర్మ పంచాంగ శ్రవణం చేశారు. -
రైతుమేళాలో రగడ..ఇరుపార్టీల మధ్య తోపులాట
సిద్ధిపేట: జిల్లాలోని నర్మెట్ట ఆయిల్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈరోజు(గురువారం, మార్చి 19వ తేదీ) ఇక్కడ ఏర్పాటు చేసిన రైతుమేళా ప్రారంభోత్సవంలో కాంగ్రెస్-బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావారణం చోటు చేసుకుంది. ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం ప్రధాన కార్యక్రమంగా ఈ రైతుమేళాను ఏర్రాటు చేయగా, ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరుపార్టీలకు చెందిన కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలతో హోరెత్తించారు. ఆ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను అడ్డుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణులను హరీష్రావు వారించగా, కాంగ్రెస్ కార్యకర్తలను మంత్రులు పొన్నం, తుమ్మలలు వారించారు. గొడవ చేస్తున్న వారిని బయటకు పంపించేయాలని పొన్నం సూచించారు. రైతుమేళా ఉద్దేశ్యంఆధునిక వ్యవసాయ సాంకేతికత ప్రదర్శనపంటల వైవిధ్యం (వరి నుండి ప్రత్యామ్నాయ పంటలకు మార్పు)వ్యవసాయ యంత్రాలు, విత్తనాలు, ఎరువులు ప్రదర్శనహార్టికల్చర్, పశుసంవర్ధక, కోళ్లు, వెటర్నరీ సేవలుఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్ (IFS) పై అవగాహనఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రాజెక్ట్నిర్మాణ వ్యయం: రూ. 300 కోట్లుప్రయోజనం: రైతులకు ఆయిల్ పామ్ సాగు ద్వారా స్థిరమైన ఆదాయంప్రభుత్వ లక్ష్యం: పంటల వైవిధ్యం పెంచడం, ఎగుమతులు ప్రోత్సహించడంరైతుమేళా రైతులకు కొత్త సాంకేతికతలు, పంటల మార్పు అవకాశాలు చూపించడానికి వేదిక.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చి 22వ తేదీన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తారు. -
ట్రిపుల్ఆర్ బాధితులకు బాసట
గజ్వేల్: ట్రిపుల్ఆర్ నిర్మాణంలో భూములను కోల్పోతున్న బాధితులకు అండగా ఉంటామని కలెక్టర్ హైమావతి అన్నారు. సోమవారం గజ్వేల్లోని ఐఓసీ (ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్)లో జగదేవ్పూర్ మండలం చేబర్తి, అలిరాజపేట, పీర్లపల్లి, ఇటిక్యాల గ్రామాలకు చెందిన ట్రిపుల్ఆర్ భూబాధితులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ట్రిపుల్ఆర్ నిర్మాణంతో భారీ అభివృద్ధి జరగనుందని చెప్పారు. భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడం శుభపరిణామని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి అందాల్సిన నష్ట పరిహారం త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో గజ్వేల్ ఆర్డీఓ చంద్రకళ, తహాశీల్దార్ నిర్మల తదితరులు పాల్గొన్నారు. 22న ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ప్రారంభంనంగునూరు(సిద్దిపేట): నర్మేటలో నిర్మించిన ఆయిల్పామ్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈనెల 22న ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సోమవారం కలెక్టర్ హైమావతి, పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ల అధికార యంత్రాంగంతో సమీక్షించారు. రైతుమేళా స్టాల్, హెలిప్యాడ్, బహిరంగ సభ, పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయిల్పామ్ ఫ్యాక్టరీతో పాటు సిద్దిపేటలో జిల్లా జైలును సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. నర్మేట ఫ్యాక్టరీలో వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్ధకశాఖ ఆధ్వర్యంలో 120 స్టాళ్లను ఏర్పాటు చేసి మూడు రోజుల పాటు రైతు మేళా నిర్వహించాలన్నారు. ప్రతిరోజు మూడు నుంచి ఐదు వేల మంది రైతులు వచ్చే అవకాశం ఉందని, భోజన, తాగునీటి వసతి, వైద్యశిబిరం, తాత్కాలిక టాయిలెట్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ కమి రష్మీ పెరుమాళ్ల భద్రతా ఏర్పాట్లలో భాగంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు కుషాల్కర్, సుభాష్ చంద్రబోస్, ఆర్డీఓ సదానందం తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణికి 217 అర్జీలు సిద్దిపేటరూరల్: ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని కోరారు. వచ్చిన అర్జీలు పునరావృతం కాకుండా అధికారులు చొరవ చూపాలన్నారు. మొత్తం 217 అర్జీలు వచ్చాయి. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్హమీద్, డీఆర్ఓ నాగరాజమ్మ, ఏఓ రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ హైమావతి -
యోగముద్రలో నారసింహుడు
వర్గల్(గజ్వేల్): బ్రహ్మోత్సవ సిరులతో నాచగిరి అలరారుతున్నది. హరిద్రా తీరం ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్నది. అంగరంగ వైభవంగా సాగుతున్న ఉత్సవ వేడుకలు తీర్థజనులను భక్తిపారవశ్యంలో ముంచెత్తుతున్నాయి. స్వామివారి దివ్యమంగళరూపం దర్శించుకుని భక్తజనులు పునీతులవుతున్నారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి పొన్న వాహనోత్సవ సేవ భక్తజనావళిని నేత్రపర్వం చేసింది. కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువు పొన్నవృక్షమే వాహనంగా యోగముద్రలో నృసింహస్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కాగా బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన రథోత్సవ ఘట్టం మంగళవారం రాత్రి ప్రారంభమవుతుంది. రథప్రతిష్ఠ అనంతరం బుధవారం తెల్లవారుజామున స్వామివారి దివ్య విమాన రథోత్సవ ఊరేగింపు కనుల పండువగా జరుగుతుంది. ఇందుకు అనుగుణంగా తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ చైర్మన్ పల్లెర్ల రవీందర్గుప్తా, ఈఓ బెల్లంకొండ రంగాచారి పేర్కొన్నారు. -
మొగులు.. గుబులు
భయపెడుతున్న అకాల వర్షాలు ● వాతావరణ మార్పులతో రైతుల్లో కలవరం ● పాలు పోసుకునే దశలో వరిచేలుదుబ్బాక: రైతుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా మారింది. 20 రోజుల క్రితం గాలివాన, వడగళ్ల బీభత్సంతో జిల్లాలో పెద్దఎత్తున పంటలకు నష్టం వాటిల్లింది. ఈదెబ్బ నుంచి ఇంకా కోలుకోకముందే మళ్లీ వాతావరణంలో మార్పులు అన్నదాతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఈనెల 20 వరకు గాలివానతో కూడిన భారీ వర్షాలు, వడగళ్లు పడతాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నుంచి గాలిదుమారంతో పాటు చిరు జల్లులు కురిశాయి. వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో వడగళ్లు పడుతాయన్న భయంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పంటలకు తీవ్ర నష్టం 20 రోజుల క్రితం గాలివాన, వడగళ్ల బీభత్సంతో జిల్లాలోని వివిధ మండలాల్లో వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పొద్దుతిరుగుడు, మొక్కజొ న్న, బీర్నీస్, కూరగాయ, మామిడి తోటలకు భారీగా నష్టం ఏర్పడింది. ఆ నష్టం నుంచి కోలుకోకముందే మళ్లీ వర్షాలు పడుతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు కలవరపాటుకు గురవుతున్నారు.పొట్టకొచ్చిన వరి జిల్లాలో 60 శాతానికి పైగా వరి పంటలు పాలు పోసుకునే దశలో ఉన్నాయి. ఇప్పుడు గాలివాన, వడగళ్లు పడితే తీవ్ర నష్టం వాటిళ్లే అవకాశం ఉంది. జిల్లాలో ఈయాసంగిలో 5 లక్షలకు పైగా ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా, ఇందులో 3.53 లక్షల ఎకరాల్లో వరి పంటలను రైతులు వేశారు. మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మ సాగర్ జలశయాల్లో సంమృద్ధిగా నీరు ఉండడంతో పెద్ద ఎత్తునవరి సాగు చే శారు. రూ. లక్షలు పెట్టుబడి పెట్టి పంటలు వేసుకోగా, చేతికొచ్చే దశలో ప్రకృతి ఆగం జేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
వచ్చే నెలలో భారీ జాబ్ మేళా
సిద్దిపేటకమాన్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో వచ్చే నెలలో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పలు కంపెనీల ప్రతినిధులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జాబ్మేళాలో భాగస్వామ్యం కావడానికి ఇప్పటికే 20కి పైగా ప్రముఖ కంపెనీల ముందుకువచ్చాయన్నారు. 18 ఏళ్లు నిండిన యువత హాజరుకావాలని సూచించారు. విద్యార్హతలకు అనుగుణంగా అవకాశాలు కల్పిస్తామన్నారు. ఆసక్తి గలవారు ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.16ఎస్డీపీ121: -
మిల్లర్ల మాయాజాలం
మిల్లులో ఒడ్లను మర ఆడిస్తున్న దృశ్యంప్రభుత్వం సేకరించిన ఒడ్లను మిల్లుల ద్వారా బియ్యంగా మార్చి వాటిని పేదలకు పంపిణీ చేసేందుకు ఉద్దేశించిన సీఎంఆర్ ప్రక్రియ అభాసుపాలవుతోంది. ఈ సీఎంఆర్ను కొందరు రైస్మిల్లర్లు అక్రమ సంపాదనకు మార్గంగా మార్చుకుని ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యాన్ని గుట్టుగా పక్కదారి పట్టించి కోట్లు దండుకుంటున్నారు. అయితే జిల్లాలోని పలు రైస్మిల్లుల్లో అధికారులు ఇటీవల చేపట్టిన తనిఖీల్లో ఈ అక్రమార్కుల గుట్టు రట్టైంది. దీంతో వారిపై చర్యలు తీసుకునేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.ఒత్తిడి చేస్తేనే చెల్లింపులు జిల్లాలో 2023–24 సంవత్సరం సైతం దాదాపు 11 రైస్ మిల్లులకు నోటీసులు జారీ చేశారు. వారిపై అధికారులు ఒత్తిడి తెచ్చి, ధాన్యం అందించాలని అధికారులు హుకుం జారీ చేయడంతో బకాయిగా ఉన్న బియ్యాన్ని అప్పగించారు. ఇలా చేయడంతోనే ఆ ఏడాదికి చెందిన బియ్యంను త్వరగా అందించారు. 2024–25కు సంబంధించిన ధాన్యాన్ని సైతం అందించాలని అధికారులు ఒత్తిడి పెంచనున్నారు.రూ.10 కోట్ల విలువ చేసే ధాన్యం మాయం 2024–25కిగాను 5వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పెండింగ్ రెండురోజుల్లో నోటీసులు జారీ గతంలో ఒత్తిడి పెంచితేనే బకాయిల చెల్లింపు -
ఆద్యంతం.. భక్తి పారవశ్యం
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అగ్నిగుండాల కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం వేకువజామున వరకు ఈ కార్యక్రమం ఉత్కంఠ భరితంగా సాగింది. మల్లన్న నామస్మరణతో ఆ ప్రాంతం మారుమోగింది. భారీ సంఖ్యలో భక్తులు అగ్నిగుండాలను దాటారు. స్వామివారి కల్యాణ వేదిక ప్రాంగణంలో ఆదివారం రాత్రి 7.15 గంటలకు వీరభద్ర ప్రస్థానం, భద్రకాళి పూజ, 9 గంటలకు బియ్యం సుంకు పట్టుట. 12 గంటలకు అగ్నిగుండాల ప్రజ్వలన కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున ఐదు గంటలకు గురుపూజ, బలిహరణ, అగ్నిగుండాల ప్రవేశం, విజయోత్సవం, 11 గంటలకు స్వామి అమ్మవార్లకు ఏకాదశ రుద్రాభిషేకం, మహామంగళహారతి, మంత్రపుష్పం.. అనంతరం తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. అగ్నిగుండాల కార్యక్రమం శివశంకర శివాచార్య మహాస్వామి సేడం పీఠాధీశుల ఆధ్వర్యంలో కొనసాగింది. కాగా, ఈ ఉత్సవాల్లో సుమారు 12లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని అంచనా. భక్తిశ్రద్ధలతో అగ్నిగుండాల ప్రవేశం మార్మోగిన మల్లన్న నామస్మరణం ముగిసిన కొమురవెల్లి బ్రహ్మోత్సవాలు -
‘ఉపాధి’ని నిర్వీర్యం చేస్తున్న కేంద్రం
వర్గల్(గజ్వేల్): గ్రామీణ కూలీలకు, రైతులకు కడుపునింపుతున్న ఉపాధిహామీ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి విమర్శించారు. వర్గల్, తున్కిఖాల్సా తదితర గ్రామాలలో సోమవారం ఉపాధిహామీ కూలీలతో విధానసభలు ఏర్పాటు చేసి ఆమె మాట్లాడారు. మహాత్మాగాంధీ జాతీయగ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును దుర్బుద్ధితో వీబీజీ రాంజీగా మార్చారని, కేంద్ర నిధుల్లో కోత విధించేందుకు 60, 40శాతం కేంద్ర, రాష్ట్ర నిధులంటున్నారని ఎద్దేవా చేశారు.జాతీయ ఉపాధి హామీ చట్టం రద్దుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ ఉపాధి హామీ కూలీలతో విధాన సభలు, సమావేశాలు నిర్వహించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆమె వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రంగారెడ్డి, మోహన్, వెంకటేష్, యాదగిరి, నర్సారెడ్డి, గోవర్ధన్రెడ్డి, రాజశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి -
నేటి నుంచి రెండో విడత మూల్యాంకనం
సిద్దిపేటఎడ్యుకేషన్: సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో ఎడ్యుకేషన్)లో కొనసాగుతున్న ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం సాఫీగా సాగుతుందని క్యాంపు ఆఫీసర్ రవీందర్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండో విడత మంగళవారం ఫిజిక్స్, ఎకనామిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల మూల్యాంకనం ప్రారంభం అవుతుందని, సంబంధిత అధ్యాపకులు విధిగా హాజరు కావాలన్నారు. ఎగ్జామినర్ల నియామక ఉత్తర్వులు ఆయా కళాశాలల లాగిన్లో ఉన్నాయని, ప్రిన్సిపాల్స్ అధ్యాపకులను రిలీవ్ చేసి క్యాంపునకు హాజరయ్యేలా చూడాలన్నారు. ఉపాధి హామీలో అక్రమాలురూ.79.485 రికవరీకి ఆదేశం చిన్నకోడూరు(సిద్దిపేట): గ్రామాల్లో చేపట్టిన ఉపాధి హామీలో పనులు చేయకుండానే మస్టర్లు రూపొందించి నిధులు కాజేయడం.. అధికారుల పర్యవేక్షణ లోపం, రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదని అధికారులు గుర్తించారు. చిన్నకోడూరులో సోమవారం నిర్వహించిన ఉపాధి హామీ పనుల సామాజిక తనిఖీలో పలువురి అక్రమాలు బహిర్గతమయ్యాయి. అడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాస్, సామాజిక తనిఖీ బృందం అధికారులు మండలంలో రూ. 6.83 కోట్ల వ్యయంతో 2024 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 2025 మార్చి 31 వరకు చేపట్టిన 967 రకాల పనులపై తనిఖీ బృందం ప్రజావేదికలో వెల్లడించింది. అక్రమాలకు పాల్పడిన వారి నుంచి రూ.79,485 రికవరీకి ఆదేశించినట్లు తెలిపారు. రూ.46వేలు జరిమాన విధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో క్యాలిటీ కంట్రోల్ సంతోష్ రెడ్డి, విజిలెన్స్ ఆపీసర్ గణేష్, డీఈ బ్రహ్మం, ఎంపీడీఓ జనార్దన్, ఏపీఓ రమేష్, ఈసీ రవి తదితరులు పాల్గొన్నారు. ఉపాధి కూలీల హక్కులను కాలరాస్తే సహించండీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ గజ్వేల్: ఉపాధిహామీ కూలీల హక్కులను కాలరాస్తే సహించేది లేదని, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతామని దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) జాతీయ కార్యదర్శి పి.శంకర్ హెచ్చరించారు. సోమవారం గజ్వేల్లోని అంబేద్కర్ భవన్లో ఉపాధిహామీ పథకం అమలు తీరుపై డీబీఎఫ్ అధ్వర్యంలో సదస్సు జరిగింది. శంకర్ మాట్లాడుతూ.. కూలీల హక్కులను హరిస్తూ.. ఉపాధిహామీ పథకం స్థానంలో వీబీరామ్జీ చట్టాన్ని తీసుకొచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు పోరాటాలను ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ కులవివక్ష కొనసాగుతున్నదని చెప్పారు. సామాజిక సేవకురాలు సుల్తానా మాట్లాడుతూ హక్కుల కోసం మహిళలు నడంబిగించాలన్నారు. కార్యక్రమంలో డీబీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంజీవ్, రాష్ట్ర కార్యదర్శి ఏగొండస్వామి, జిల్లా కార్యదర్శి వేణు, మండల శాఖ అధ్యక్షుడు చంద్రం తదితరులు పాల్గొన్నారు. ద్రవ్యోల్బణం అంచనా కోసం సర్వేబెజ్జంకి(సిద్దిపేట): దేశంలో ద్రవ్యోల్బణం స్థాయిని గుర్తించేందుకు వినియోగదారుల ధర సూచిక సర్వేను నిర్వహిస్తున్నట్లు గణాంక శాఖ కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధికారి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. బెజ్జంకి మండల కేంద్రంలోని నిత్యావసర వస్తువులు, కూరగాయలు, రేషన్ దుకాణాలను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా పలు వస్తువుల ధరల పెరుగుదల, వినియోగం వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెదక్జోన్: సఖీ, భరోసా సెంటర్లు మహిళలకు రక్షణగా నిలుస్తున్నాయని లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ కరుణాకర్ తెలిపారు. సోమవారం పట్టణంలోని సఖీ, భరోసా కేంద్రాలతో పాటు బాలసదన్ చిల్డ్రన్ హోమ్ను సందర్శించారు. చిన్నారులతో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. -
నేటి నుంచి ఒంటిపూట బడులు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): వేసవికాలం దృష్ట్యా ఒంటిపూట బడులను నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోని 980 ప్రభుత్వ పాఠశాలలు, 250 ప్రైవేట్ పాఠశాలల్లో 1.3లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. సోమవారం నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట పాఠశాలలు నిర్వహించనున్నారు. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు తరగతులు కొనసాగనున్నాయి. పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్న పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. చక్కగా చదివి ఉన్నతస్థాయికి చేరాలినంగునూరు(సిద్దిపేట): విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా చక్కగా చదివి ప్రయోజకులు కావాలని డీఈఓ శ్రీనివాస్రెడ్డి అన్నారు. పాలమాకులలోని స్కూల్ వార్షికోత్సవం పురస్కరించుకొని ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. టీఈడీఎస్ ఆధ్వర్యంలో జాతీయస్థాయి చిల్డ్రన్లీగ్ ఒలింపియాడ్లో మూడో ర్యాంక్ సాధించిన పాఠశాల విద్యార్థి చైత్రకు డీఈఓ బహుమతి అందజేశారు. కార్యక్రమంలో ఎంఈఓ దేశిరెడ్డి, ఎస్ఐ వివేక్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం ఎంపీ రఘునందన్రావు గజ్వేల్: లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని మెదక్ ఎంపీ రఘునందన్రావు కొనియాడారు. ఆదివారం గజ్వేల్లోని ప్రజ్ఞా గార్డెన్స్లో లయన్స్ క్లబ్ సిద్దిపేట రీజియన్ స్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక అంశాలను ప్రాతిపదికగా తీసుకొని సేవా కార్యక్రమాలను చేపడుతూ లయన్స్ క్లబ్ ప్రతినిధులు అందరి మన్ననలనూ చూరగొంటున్నారన్నారు. సేవా కార్యక్రమాలకు తనవంతు సహకారమందిస్తానని చెప్పారు. ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ డైరెక్టర్ బాబురావు మాట్లాడుతూ ప్రపంచంలోని 200దేశాల్లో తమ క్లబ్ సేవలు కొనసాగుతున్నాయని చెప్పారు. రీజియన్ చైర్మన్ సంజయ్ గుప్త అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో మహిళా విభాగం అధ్యక్షురాలు సుమలత గుప్త, లయన్స్ క్లబ్ జాతీయ నాయకులు అమర్నాథ్, ప్రకాశ్రావు, విజయలక్ష్మీ, నర్సింహ్మారాజు, సూర్యారావు, స్థానిక ప్రతినిధులు ఉప్పల మెట్టయ్య, సత్యనారాయణ, పరమేశ్వరాచారి తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన ఆహారం అందించండి
కలెక్టర్ హైమావతి ప్రశాంత్నగర్(సిద్దిపేట): విద్యార్థినులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని కలెక్టర్ హైమావతి వసతి గృహ వార్డెన్లను ఆదేశించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని వెనుకబడిన, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలోని పోస్ట్ మెట్రిక్ బాలికల వసతి గృహాలను ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ బాలికల భద్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కామన్ డైట్ మెనూ పాటిస్తూ రుచికరంగా ఆహారం అందించాలన్నారు. స్టోర్ రూమ్ లో సరుకులు తనిఖీ చేస్తూ నాణ్యమైన ఆహార పదార్థాలు మాత్రమే వాడాలని సూచించారు. స్టాక్ రిజిస్టర్ సరిగ్గా నిర్వహించాలని, విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని ఆదేశించారు. -
సమస్యల చెంత.. వారసంత
హుస్నాబాద్: సిద్దిపేట, కరీంనగర్ జిల్లాలోనే అతి పెద్ద సంత (అంగడి). గుండు పిన్నీసు నుంచి మొదలుకొని ఇంటికి అవసరమైన ప్రతి వస్తువు ఈ సంతలో దొరుతుంది. వీటితో పాటుగా పశువుల క్రయ విక్రయాలు జోరుగా సాగుతాయి. అతిపెద్ద సంత అసౌకర్యాలకు నిలయంగా మారింది. హుస్నాబాద్ పట్టణంలో ప్రతి శుక్రవారం వారసంత జరుగుతుంది. తాజా కూరగాయలు, ఉప్పు, పప్పు, మాల్ మసాల ప్రతి వస్తువు చౌకగా లభిస్తాయి. రైతులు పండించిన పంటలను సైతం ఇక్కడ అమ్ముకుంటారు. రోడ్లపైనే విక్రయాలు.. సంత నిర్వాహణకు సొంత స్థలం లేకపోవడంతో రోడ్ల పైనే కూరగాయల క్రయ విక్రయాలు జరుపుతారు. చిరు వ్యాపారులు ఎండకు ఎండుతూ, వానకు నానుతూ అష్టకష్టాలు పడుతున్నారు. తాగడానికి మంచి నీళ్లు, నీడ సౌకర్యం లేకున్నా చిరు వ్యాపారుల నుంచి గుత్తెదారులు జబర్దస్త్గా రుసుం వసూలు చేస్తారు. దాదాపు 50 ఏళ్లుగా రోడ్ల పైనే వారసంత నిర్వాహణ కొనసాగుతోంది. ఈ అంగడి ద్వారా మున్సిపల్కు లక్షల్లో ఆదాయం సమకూరుతున్నా సౌకర్యలపై అధికారులు దృష్టిసారించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువు కట్ట కింద పశువుల సంత.. హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు కట్ట కింద పశువుల క్రయ విక్రయాలు జోరుగా సాగుతాయి. హైదరాబాద్, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి పశువుల వ్యాపారులు, రైతులు వస్తుంటారు. వారసంత రోజు లక్షల రూపాయల వ్యాపారం జరుగుతుంది. వందలాది వాహనాల్లో పశువులను కొనుగొలు చేసి పట్టణాలకు తరలిస్తారు. గొర్రెలు, మేకల సంఖ్యకు లెక్కేలేదు. పశువుల సంతలో గేదే, ఆవు, బర్రెలు కొనుగొలు చేసిన వారి నుంచి, అమ్మిన వారి నుంచి రూ.250 చొప్పున రుసుం వసూలు చేస్తారు. వందలాది మంది వ్యాపారులు, రైతులకు కనీస నీడ సౌకర్యం లేదు. నామికే వస్తేగా చిన్నపాటి షెడ్డును నిర్మించారు. వేల సంఖ్యలో వచ్చే పశువుల కోసం ఒకే ఒక్కటి నీటి తొట్టెను నిర్మించారు. వ్యాపారం ముగిసే వరకు చెట్ల కింద సావాసం చేయాల్సి ఉంటుంది. అంగడి సంపాదించే లక్షల రూపాయలు కావాలే కానీ, సౌకర్యాలు కల్పించాలనే ఆలోచన రాకపోవడం శోచనీయం. కొలువుదీరిన కొత్త పాలకవర్గమైన అంగడిని పట్టించుకొని సౌకర్యాలు కల్పించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. గుత్తేదారుల పోటీ.. హుస్నాబాద్లో జరిగే వారసంతను దక్కించుకునేందుకు గుత్తేదారులు పోటీ పడుతుంటారు. వివిధ ప్రాంతాల నుంచి గుత్తెదారులు వారసంత వేలంలో పాల్గొంటారు. ఒక్కో గుత్తేదారుడు రూ.10లక్షలు ధరావత్ సొమ్ముతో పాటుగా రూ. 5వేలు దరఖాస్తు ఫీజు చెల్లించి వేలంలో పాల్గొంటారు. గత ఏడాది వారసంత రూ.92.20 లక్షలు వేలం పాటపాడారు. ఈసారి ఈ నెల 18న వారసంత వేలం వేయనున్నారు.ఆదాయం ఫుల్.. సౌకర్యాలు నిల్ హుస్నాబాద్కు సంత అతిపెద్ద ఆదాయ వనరు గతేడాది వేలం రూ.92.20లక్షలు ఈ నెల 18న బహిరంగ వేలం -
చెరువుల్లోకి మురుగు
ఉద్యోగులంటే సర్కార్కు చిన్నచూపుయూజీడీ(అండర్ గ్రౌండ్ డ్రైనేజీ) వ్యవస్థ అందుబాటులోకి వచ్చినా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో మురుగు ఏరులై పారుతూనే ఉంది. మురుగంతా కాల్వల ద్వారా చెరువుల్లో చేరి ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారింది. యూజీడీ ద్వారా ఇంకా పూర్తిస్థాయి కనెక్షన్లు ఇవ్వకపోవడం, లీకేజీలే ఇందుకు కారణమని స్పష్టమవుతోంది. – గజ్వేల్ గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో రూ.155కోట్ల వ్యయంతో యూజీడీ పనులు పూర్తయ్యాయి. 130 కిలోమీటర్ల మేర పైప్లైన్ల నిర్మాణం, నాలుగు చోట్ల ఎస్టీపీ(సేవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్)లను ఏర్పాటు చేశారు. విలీన గ్రామాలు ముట్రాజ్పల్లి, క్యాసారం, ఆర్అండ్ఆర్ కాలనీ, రాజిరెడ్డిపల్లి, సంగుపల్లి, సంగాపూర్ మినహా గజ్వేల్, ప్రజ్ఞాపూర్లలో ఈ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. యూజీడీ నిర్మాణం జరిగాక.. పట్టణం మురుగురహితంగా మారుతుందని అంతా భావించారు. కానీ పరిస్థితి భిన్నంగా తయారైంది. పైప్లైన్లకు లీకేజీలు యూజీడీ పనులు లోపభూయిష్టంగా సాగటం వల్ల పలు కాలనీల్లో నిర్మించిన పైప్లైన్లకు లీకేజీలు ఏర్పడ్డాయి. మరోవైపు కొన్ని చోట్ల చాంబర్లు ధ్వంసమయ్యాయి. ఫలితంగా జనావాసాల్లోకి మురుగునీరు పారుతోంది. ఎక్కడైనా యాజీడీ చాంబర్ల నిండితే.. వాటిని క్లియర్ చేయాల్సిన జెట్టింగ్ యంత్రం ఈ మున్సిపాలిటీకి అందుబాటులో లేదు. రూ.155కోట్లతో పనులు చేపట్టిన కాంట్రాక్ట్ ఏజెన్సీకి రూ.30కోట్లకుపైగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఈ సాకుతో సదరు కాంట్రాక్ట్ ఏజెన్సీ మున్సిపాలిటీకి జెట్టింగ్ యంత్రం సమకూర్చలేదు. ఫలితంగా యూజీడీ నిండినా, లీకేజీల ఏర్పడితే సరిగా క్లియర్ చేయడం లేదు. యూజీడీ పనులు పూర్తయిన గజ్వేల్, ప్రజ్ఞాపూర్లలో 11వేలకు ఇండ్లు ఉండగా.. కేవలం 9వేల లోపు కనెక్షన్లు ఇచ్చారు. యూజీడీ కనెక్షన్లు లేని ఇళ్ల నుంచి మురుగు వీధుల్లో పారుతోంది. ప్రజ్ఞాపూర్లోని మురుగు రాజిరెడ్డిపల్లి కుంట అక్కడి నుంచి క్యాసారం కుంటలోకి చేరుతోంది. జాలిగామ బైపాస్ ప్రాంతం, తూప్రాన్ రోడ్డు వైపున ఉన్న పెట్రోల్ బంకుల వద్ద నుంచి మురుగునీరు పాండవుల చెరువులోకి చేరుతోంది. అంతేకాకుండా పార్శికుంట, ప్రజ్ఞాపూర్లోని ఊర చెరువుల్లోకి సైతం మురుగు వెళ్తోంది. భరించలేని దుర్గంధం గతంలో ఈ చెరువులు, కుంటలను పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దారు. పాండవుల చెరువును మినీ ట్యాంక్బండ్గా మార్చారు. కానీ ఈ చెరువు వద్ద ఆహ్లాదం కోసం వెళ్తే దుర్గంధమే వ్యాపిస్తోంది. మిగతా చెరువులు, కుంటల్లోనూ ఇదే దుస్థితి. ఈ దుస్థితి మారాలంటే పూర్తిస్థాయిలో యూజీడీ కనెక్షన్లు ఇవ్వడమేకాకుండా, లీకేజీలను నివారించాల్సి ఉంది. చర్యలు చేపడతాం పట్టణంలోని యూజీడీ నిర్వహణలో లోపాలను గుర్తిస్తాం. మున్సిపాలిటీలోని చెరువుల్లోకి మురుగునీరు చేరడానికి కారణాలపై పరిశీలన జరుపుతాం. దీనిపై త్వరలోనే చర్యలు తీసుకుంటాం. – వెంకటగోపాల్, మున్సిపల్ కమిషనర్ రిటైర్డ్ ఉద్యోగులను రోడ్లపైకి తెచ్చారు మాజీ మంత్రి హరీశ్రావుప్రజారోగ్యానికి పెనుముప్పు రూ.155కోట్లతో యూజీడీ నిర్మించినా ప్రయోజనం శూన్యం పూర్థిసాయి కనెక్షన్లు ఇవ్వకపోవడం.. లీకేజీలే కారణం గజ్వేల్ మున్సిపాలిటీ దుస్థితి -
కొమురవెల్లి అభివృద్ధికి మాస్టర్ప్లాన్
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న ఆలయ అభివృద్ధికి త్వరలోనే మాస్టర్ప్లాన్ రూపొందించనున్నట్లు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఆదివారం మంత్రి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదం, చిత్రపటాన్ని అందించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. బండగుట్టపై నిర్మించిన 50 వసతి గదులు, క్యూకాంప్లెక్స్ ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. మరో 100 వసతి గదులు నిర్మించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కొమురవెల్లి మల్లన్న తమ ఇలవేల్పు అని ప్రతి సంవత్సరం స్వామివారిని దర్శించుకుని కల్యాణం జరిపిస్తామన్నారు. త్వరలోనే చర్యలు చేపడతాం మంత్రి కొండా సురేఖ వెల్లడి -
చివరి వారం.. పోటెత్తిన భక్తజనం
మల్లన్న నామస్మరణతో మార్మోగిన కొమురవెల్లికొమురవెల్లి మల్లన్నస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి వారం భక్తులు పోటెత్తారు. ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మారుమోగాయి. వేకువజామునే భక్తులు పుష్కరిణిలో స్నానమాచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. కొంత మంది భక్తులు గంగిరేణు చెట్టువద్ద ముడుపులు, పట్నాలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. కాగా ఆదివారం అర్ధరాత్రి నిర్వహించిన అగ్నిగుండాలతో ఉత్సవాలు ముగిశాయి. – కొమురవెల్లి(సిద్దిపేట) -
తొలిరోజు 99.19% హాజరు
పది పరీక్షలు షురూ..● పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్, డీఈఓజిల్లా వ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 15,332 మంది విద్యార్థులకు 15,318 మంది హాజరయ్యారు. 99.19శాతం హాజరు నమోదైంది. తొలిరోజు తెలుగు పరీక్షను రాశారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాశారు. నిర్ణీత సమయం కంటే ముందే పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. జిల్లా కేంద్రంలోని రంగధాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్షల నిర్వహణను కలెక్టర్ హైమావతి, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో డీఈఓ శ్రీనివాస్రెడ్డి పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు. – ప్రశాంత్నగర్(సిద్దిపేట) -
గరుడోత్సవ వైభవం
● గరుడాళ్వారుపై లక్ష్మీనృసింహుని దివ్యదర్శనం ● నాచగిరిలో భక్తిపారవశ్యంబ్రహ్మోత్సవ వైభవంతో నాచగిరి అలరారుతోంది. శనివారం రాత్రి లక్ష్మీనృసింహుని పెద్దగరుడోత్సవసేవ నేత్రపర్వం చేసింది. ఆలయ చైర్మన్ పల్లెర్ల రవీందర్గుప్తా, ఈఓ బెల్లంకొండ రంగాచారి పర్యవేక్షణలో అర్చకులు మొదట విష్ణుమూర్తి ప్రతినిధి, వేద స్వరూపుడైన గరుత్మంతుడిని పట్టువస్త్రాలు, వివిధ రకాల పూలమాలికలతో కమనీయంగా అలంకరించారు. విశేషపూజలు చేశారు. లక్ష్మీ నారసింహులకు దంపతి సేవ, సభామండపంలో సదస్యం నిర్వహించారు. అనంతరం విశేషాలంకృతులైన లక్ష్మీసమేత స్వామివారు గరుడ వాహనాసీనులై పురవీధులలో ఊరేగుతూ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. నేత్రపర్వంగా సాగిన గరుడోత్సవంలో భక్తులు పాల్గొని తరించారు. –వర్గల్(గజ్వేల్) -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
గజ్వేల్రూరల్: మహిళలకు సమాన అవకాశాల కోసం చేపట్టిన పోరాటాలతో పుట్టిందే అంతర్జాతీయ మహిళా దినోత్సవమని సీఐటీయూ, యూటీఎఫ్, ఎస్ఎఫ్ఐ సంఘాల నాయకులు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం గజ్వేల్ పట్టణంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కుటుంబంలో పిల్లలు లింగ వివక్షత లేకుండా సమానంగా పెంచాలని, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వచ్చినపుడే ఆర్థిక స్వాతంత్య్రం, గౌరవం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎస్కే వలీ, జిల్లా కార్యదర్శి వెంకటకిరణ్, ప్రభావతి, ఎస్ఎఫ్ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
పేదలకు అధునాతన వైద్య సేవలు
దుబ్బాక: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు అధునాతనమైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎంపీ రఘునందన్రావు అన్నారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ వంద పడకల ఆస్పత్రిలో ఎన్టీపీసీ సహకారంతో సీఎస్ఆర్ నిధులు రూ.25 లక్షలతో ఏర్పాటైన ల్యాప్రోస్కోపిక్ సర్జరి పరికరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే దుబ్బాక ఆస్పత్రి ఎన్నో క్రిటికల్ సర్జరీలతో పేదల ప్రాణాలు కాపాడుతూ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. మారుమూల ప్రాంతంలోని పేదప్రజలకు అధునాతనమైన వైద్యసేవలు అందించాలన్న సంకల్పంతోనే కేంద్ర ప్రభుత్వం చొరవతో ఆస్పత్రుల్లో సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. దుబ్బాక ఆస్పత్రిలో అన్ని రకాల వైద్యసౌకర్యాలు కల్పించేందుకు తన వంతుగా కృషి చేస్తానన్నారు. అనంతరం ఆస్పత్రిలో 14 ఏళ్ల బాలికలకు వేస్తున్న హెచ్పీవీ టీకా కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సంగీత, వైస్ చైర్పర్సన్ సులోచన, కౌన్సిలర్ దేవుని రాజు, ఆస్పత్రి సూపరింటెండెంట్ హేమరాజ్సింగ్, ప్రజాప్రతినిధులు భానుప్రసాద్, సాయికుమార్గౌడ్ తదితరులు ఉన్నారు. ఎంపీ మాధవనేని రఘునందన్రావు దుబ్బాక ఆస్పత్రిలో ల్యాప్రోస్కోపి పరికరాలు ప్రారంభం -
‘ప్రగతి ప్రణాళిక’ పక్కాగా చేపట్టాలి
నంగునూరు(సిద్దిపేట): ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో చేపట్టిన 99 రోజుల ప్రణాళికను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ హైమా వతి ఆదేశించారు. శనివారం నర్మేటలోని పల్లె ప్రకృతి వన నర్సరీ, కస్తూర్బా గాంధీ పాఠశాలను తనఖీ చేశారు. ఈసందర్భంగా నర్సరీలో పెంచుతున్న మునగ, గన్నెరు, కానుగ, తంగేడు మొక్కలను పరిశీలించారు. మునగ కాయలను హాస్టళ్లకు అందజేయాలన్నారు. రోడ్ల వెంట కానుగ మొక్కలను నాటడం ద్వారా వేసవిలో రోడ్ల వెంట చల్లదనం నెలకొంటుందన్నారు. అనంతరం హాస్టల్ను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ పాటించడంతో పాటు ఆహారాన్ని రుచికరంగా వండాలని నిర్వాహకులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు తప్పనిసరి పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద మాస్ కాపీయింగ్ జరగకుండా గట్టి బందోబస్తు నిర్వహించాలని కలెక్టర్ హైమావతి పోలీసులను ఆదేశించారు. రాజగోపాల్పేల పరీక్షా కేంద్రాన్ని శనివారం కలెక్టర్ తనఖీ చేశారు. విద్యార్థులకు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా చర్యలు చేపట్టాలన్నారు. పరీక్ష గదిలో చార్టులు, ఉండకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. కలెక్టర్ హైమావతి -
నేడు మల్లన్న చివరి వారం
భారీగా తరలిరానున్న భక్తులు కొమురవెల్లి(సిద్దిపేట): తొమ్మిది వారాలపాటు కొనసాగిన మల్లన్న బ్రహ్మోత్సవాలు ఆదివారం ముగియనున్నాయి. సంక్రాంతి తర్వాత వచ్చే ఆదివారం మొదలుకొని ఉగాదికి ముందు వచ్చే ఆదివారం రాత్రి అగ్నిగుండాల కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ముగింపు వారం భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. అర్ధరాత్రి12 గంటలకు అగ్నిగుండాల కార్యక్రమం ప్రారంభమవుతుంది. సోమవారం తెల్లవారుజాము వరకు కొనసాగుతాయి. చివరి వారానికి కావాల్సిన ఏర్పాట్లను పూర్తిచేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. సంపూర్ణ పారిశుద్ధ్యానికి సహకరించండిగజ్వేల్: సంపూర్ణ పారిశుద్ధ్య సాధనకు అంతా సహకరించాలని గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ గంగిశెట్టి చందన అన్నారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలోని 4, 6వ వార్డుల్లో నిర్వహించిన 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య వాహనాలకు అందించాలని కోరారు. ఇళ్లల్లో పేరుకుపోయిన ఎలక్ట్రానిక్ స్క్రాప్ను గుర్తించి వాటిని వెంటనే తొలగించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్, మున్సిపల్ కౌన్సిలర్లు రొట్టెల శ్రీనివాస్, కాముని మురళి, బొగ్గుల స్వప్న తదితరులు పాల్గొన్నారు. అన్ని ప్రక్రియలలో పద్యం గొప్పదిఅలరించిన వద్దిపర్తి పద్మాకర్ శతావధానం ప్రశాంత్నగర్(సిద్దిపేట): అన్ని ప్రక్రియలలో పద్యం స్థానం గొప్పదని అవధాని వద్దిపర్తి పద్మాకర్ అన్నారు. సిద్దిపేటలోని లలిత చంద్రమౌళీశ్వర దేవాలయంలో శనివారం జరిగిన శతావధానంలో అవధాని డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ పద్యాలతో అలరించారు. సమస్య, వర్ణన, ఆశువు, నిషిద్ధాక్షరి తదితర అంశాలపై వంద పద్యాలు అలవోకగా చెప్పి ఆకట్టుకున్నారు. పండరి రాధాకృష్ణ, ఉండ్రాళ్ళ రాజేశం, నరసింహరావు, మరుమాముల దత్తాత్రేయ శర్మ, బ్రోచ్ కార్ ఓంప్రకాష్, చేపూరి శ్రీనివాస్, మిట్టపల్లి సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్, దొర్భల ప్రభాకరశర్మ, మంచినీళ్ల సరస్వతి, అశోక్, లక్ష్మయ్య, వెంకటేశ్వర్లు, వీరారెడ్డి, విజయ్ కుమార్, శైలజ, లలిత, శివకుమార్, లక్ష్మణచారి తదితరులు అడిగిన పశ్నలకు పద్యరూపంలో పద్మాకర్ సమాధానమిచ్చారు. మోయతుమ్మెద వాగులోకి నీరు విడుదల బెజ్జంకి(సిద్దిపేట): తీవ్రమైన ఎండలతో పంటలకు నీటి కొరత లేకుండా ఉండేందుకు శనివారం కోహెడ మండలం శనిగరం ప్రాజెక్టు నుంచి మోయతుమ్మెద వాగులోకి నీటిని విడుదల చేశారు. ఇరిగేషన్ అధికారులు గాగిళ్లాపూర్ వచ్చే కాలువ తూము తెరిచి నీటిని సరఫరా చేశారని సర్పంచ్ ఎర్రల జానకి తెలిపారు. సకాలంలో స్పందించి రైతులకు లబ్ధి చేకూరేలా చేసిందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. -
పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం మన దేశ ఎగుమతులు..దిగుమతులపై పడుతోంది. పలు దేశాలకు భారత్ నుంచికోడిగుడ్లు ఎగుమతి అవుతుండగా ప్రస్తుత పరిస్థితులతో సరఫరా నిలిచిపోయింది. దీంతో స్థానికంగా ధర అమాంతంపడిపోయింది. నెల రోజుల క్రితం గుడ్డుకు రూ.7 పలకగా ప్రస్తుతం రూ.3.75కి
పౌల్ట్రీలో పేరుకున్న గుడ్ల నిల్వలుఉమ్మడి మెదక్ జిల్లాలో 80కి పైగా పౌల్ట్రీఫాంలు ఉన్నాయి. అందులో 75లక్షల కోళ్లు ఉన్నాయి. జిల్లా నుంచి యూఏఈ, ఓమన్, ఖతార్ వంటి దేశాలకు దాదాపు 20లక్షలకు పైగా గుడ్లు ఎగుమతి అవుతుంటాయి. యుద్ధం ప్రారంభమైన మరుసటి రోజు నుంచే ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. మన ప్రాంతాల్లో సాధారణంగా చలికాలంలో అధికంగా వినియోగం ఉంటుంది. వేసవి కాలంలో కాస్త తగ్గుతుంది. ఈ సీజన్లో ధర పడిపోవడం, గుడ్ల ఉత్పత్తి తగ్గడం సాధారణమే అయినా ఎగుమతులు నిలిచిపోవడంతో ధర మరింత క్షీణించడానికి కారణమైంది. పౌల్ట్రీ రైతు యుద్ధం ఎఫెక్ట్తో తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక్కో కోడిగుడ్డుపై దాదాపు రూ.1.75 నష్టం వాటిల్లుతోంది. దీంతో రోజుకు రూ.1.13కోట్ల నష్టం చవిస్తున్నారు. పెట్టిన పెట్టుబడి రాక.. కోడి గుడ్లు సకాలంలో అమ్ముడు పోకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కుళ్లిపోతున్నాయి.. కోడిగుడ్లు సాధారణంగా చలి, వర్షాకాలంలో 25 రోజుల పాటు నిల్వ ఉంచవచ్చు. అదే ఎండాకాలంలో దాదాపు 18 రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి. ఎగుమతులు నిలిచిపోవడంతో కొన్ని పౌల్ట్రీలలో గుడ్ల స్టాక్ పెరిగిపోతోంది. ఎండాకాలం కావడంతో కుళ్లిపోతున్నాయి. దీంతో పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరి కొన్ని రోజులు పరిస్థితి ఇలాగే ఉంటే మరింత నష్టం తప్పదని పౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరుతున్నారు. కోళ్లకు అందించే ఫీడింగ్ పై జీఎస్టీని ఎత్తివేయాలని, అలాగే విద్యుత్కు సబ్సిడీ ఇవ్వాలంటున్నారు.ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇలా.. గుడ్డు పెట్టే కోళ్లు: 75లక్షలు రోజూ ఉత్పత్తి అయ్యే గుడ్లు: 65లక్షలు గుడ్డుకు సగటున ఖర్చు: రూ. 5.50 ప్రస్తుతం ధర రూ.3.75 నుంచి రూ. 4.10 ఒక్కో గుడ్డుపై రూ. 1.75 నష్టం -
సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలి
పండుగ వచ్చినా పబ్బం వచ్చినా ఎఫెక్ట్ పౌల్ట్రీ రైతుపై పడుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినా కోళ్లకు ఫీడింగ్ ధర పెరుగుతుంది. యుద్ధం ఎఫెక్ట్తో అన్ని ధరలు పెరుగుతుంటే కోడి గుడ్ల ధరలు పడిపోతున్నాయి. గతంలో తెలుగు రాష్ట్రాల్లోనే పౌల్ట్రీ ఫాంలు ఎక్కువగా ఉండేవి. ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు వివిధ రకాల సబ్సిడీలను అందజేస్తుంది. ఇక్కడ ఎలాంటి రాయితీలు ఇవ్వడం లేదు. పౌల్ట్రీ రైతులకు సబ్సిడీలు అందించి ఆదుకోవాలి. – కృష్ణారెడ్డి, అధ్యక్షుడు, పౌల్ట్రీ అసోసియేషన్ -
సీఎం పర్యటనకు ఏర్పాట్ల పరిశీలన
నంగునూరు(సిద్దిపేట): నర్మేటలోని ఆయిల్పామ్ ఫ్యాక్టరీని శనివారం సిద్దిపేట అదనపు డీసీపీ కుశాల్కర్, ఏసీపీ రవీందర్రెడ్డి సందర్శించారు. ఈనెల 22న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫ్యాక్టరీని ప్రారంభించనున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. హెలీప్యాడ్, సభా ప్రాంగణం, పార్కింగ్, రైతువేళా నిర్వహించే స్థలాన్ని పరిశీలించి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఈసందర్భంగా ఫ్యాక్టరీ నిర్మాణం, సభాస్థలికి సంబంధించిన వివరాలను మేనేజర్ ప్రణయ్గౌడ్ పోలీస్ అధికారులకు వివరించారు. రైల్వే పనులు అడ్డుకున్న రైతులుచిన్నకోడూరు(సిద్దిపేట): రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్ల వేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహించిన అన్నదాతలు శుక్రవారం రైల్వే పనులను అడ్డుకుని ధర్నా నిర్వహించారు. మండల పరిధిలోని గంగాపూర్కు రంగనాయకసాగర్ ఎడమ కాలువ ద్వారా సాగు నీరు అందేది. రైల్వేట్రాక్ నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో సాగు నీరు అందించే కాలువ ధ్వంసమైంది. ఫలితంగా సాగు నీరు అందక సుమారు 400 ఎకరాల్లో పంట పొలాలు ఎండిపోతున్నాయని, తమకు న్యాయం చేయాలని రైల్వే అధికారులను కోరినా ఫలితం లేదని రైతులు తెలిపారు. చేసేదిలేదక ఆందోళనకు దిగామని చెప్పారు. గంట పాటు ధర్నా నిర్వహించడంతో సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, ఎస్ఐ చంద్రమోహన్ చేరుకుని పంట పొలాలు పరిశీలించారు. సంబధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రాచీన వరి విత్తన సాగే మేలు -
ప్రశాంతంగా రాయండి
పదోతరగతి పరీక్షలను విద్యార్థులు ప్రశాంతంగా రాసేలా ఏర్పాట్లు చేశాం. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పకడ్బందీ చర్యలు చేపట్టాం. పరీక్షల నిర్వహణకు 4 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, ఏడుగురు రూట్ ఆఫీసర్లు, 82 చీఫ్ సూపరింటెండెంట్లు, 82 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, 24 స్టోరేజ్ పాయింట్ కస్టోడియల్ విధులు నిర్వహిస్తున్నారు. – శ్రీనివాస్రెడ్డి, డీఈఓఆల్ ది బెస్ట్ పరీక్షలు రాస్తున్న టెన్త్ విద్యార్థులకు శుభాశీస్సులు. 100% ఉత్తీర్ణత సాధించాలని ఆశిస్తున్నా. కష్టపడి చదివారు. మీ కష్టం వృథా కాదు. మీ భవిష్యత్తు పునాది పదో తరగతే. ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయండి. ఉత్తమ ఫలితాలు సాధించండి. సిద్దిపేట ముందు వరుసలో నిలవాలి. మీ అమ్మా నాన్నల ఆశయాలను, ఉపాధ్యాయుల సంకల్పాన్ని నెరవేరుస్తారని ఆశిస్తున్నా. – హరీశ్రావు, ఎమ్మెల్యే -
విజయీభవ..
ప్రశాంత్నగర్(సిద్దిపేట): పదోతరగతి వార్షిక పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 16 వరకు కొనసాగనున్నాయి. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. రోజు ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. భౌతిక రసాయనశాస్త్రం, జీవశాస్త్రం మాత్రం రెండు రోజులు నిర్వహిస్తుండగా, మిగతా పరీక్షలు అన్ని ఒక్కోరోజు మాత్రమే జరుగనున్నాయి. జిల్లాలో 15,358 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. అందుకు గాను 82 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రాంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసేలా చర్యలు చేపట్టారు. పరీక్ష కేంద్రాల్లోకి గంట ముందు నుంచే విద్యార్థులను పంపించనున్నారు. 5 నిమిషాల వరకు ఆలస్యమైనా అనుమతి ఉంటుంది. పోలీస్శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. నేటి నుంచే టెన్త్ పరీక్షలు హాజరుకానున్న 15,358 మంది విద్యార్థులు 82 పరీక్షా కేంద్రాల ఏర్పాటు సర్వం సిద్ధం చేసిన విద్యాశాఖ -
ఆర్థిక సంక్షోభంలోనూ సంక్షేమ ఫలాలు
సిద్దిపేటజోన్: ప్రజా సంక్షేమం లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ పథకాలు ఆపడం లేదని కార్మిక శాఖ మంత్రి వివేక్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీజేఆర్ భవన్లో 342మంది లబ్ధిదారులకు రూ.3.కోట్ల 42లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా పాలన వేదికగా మారుతుందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. ఇందిరమ్మ పథకం సిద్దిపేట నియోజకవర్గంలో చాలా బాగా ఉందని కితాబిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య, సిద్దిపేట ఆర్డీఓ సదానందం, తహశీల్దార్ హరికిరణ్, మున్సిపల్ వైస్ చైర్మన్ కనకరాజు, నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.ముస్లింల సంక్షేమానికి ప్రాధాన్యం ముస్లింల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఇక్బాల్ మినార్ మైదానంలో ప్రభుత్వం పక్షాన ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రంజాన్ పండుగ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింల కోసం షాదీఖాన, కబ్రస్థాన్ కోసం రూ.50లక్షల చొప్పున మంజూరు చేస్తోందన్నారు. అనంతరం పలువురికి రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు కార్మిక శాఖ మంత్రి వివేక్ -
ఒకేసారి 3 నెలల రేషన్
వేసవి కాలం దృష్ట్యా ప్రజలు ఇబ్బందులు పడవద్దన్న ఉద్దేశంతో మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం ఒకేసారి పంపిణీ చేయనుంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో రాష్ట్రం ఈ మేరకు జిల్లా సివిల్ సప్లై అధికారులనుసమాయత్తం చేసింది. ఏప్రిల్, మే, జూన్ నెలల రేషన్ బియ్యాన్ని ఏప్రిల్లో పంపిణీ చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఈ నెల 30లోగా రేషన్ దుకాణాలకు బియ్యంచేరుకునేలా ఏర్పాట్లు చేశారు. – సాక్షి, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 3,33,332 రేషన్ కార్డులు కార్డులుండగా అందులో అంత్యోదయ కార్డులు 18,311, ఆహార భద్రత 3,14,940, అన్నపూర్ణ 81 కార్డులున్నాయి. వీటికి ప్రతి నెలా 6,583 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అందిస్తున్నారు. మూడు నెలలకు ఒకే సారి బియ్యంను పంపిణీ చేయాలంటే 19,749 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం. ఇతర ప్రాంతాల నుంచి.. రేషన్ షాప్ల ద్వారా సన్న బియ్యం పంపిణీతో కార్డుదారుల నుంచి స్పందన బాగా ఉంది. దొడ్డు బియ్యం పంపిణీ చేసినప్పటి కంటే సన్న బియ్యం చాలా మంది లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాలకు సన్న ధాన్యం తక్కువగా రావడంతో ఇతర ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నారు. కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డిల నుంచి తెప్పించి గోదాంలలో స్టోర్ చేస్తున్నారు. భద్రపరచడమే సమస్య గడిచిన వానాకాలంలో మూడు నెలల బియ్యం ఒకే సారి పంపిణీ చేసినప్పుడు రేషన్ డీలర్లు, లబ్ధిదారులు కొంత ఇబ్బంది ఎదుర్కొన్నారు. స్టాక్ భద్రపరచడానికి సరపడా స్థలం లేకపోవడం డీలర్లకు పెద్ద సమస్యగా మారింది. ఒకే సారి మూడు నెలల కోటా తీసుకోవాలంటే లబ్ధిదారుల నుంచి ఈ పాస్ యంత్రం పై మూడు మార్లు బయోమెట్రక్ / ఐరీస్ / ఓటీపీ ద్వారా బియ్యం ఇవ్వనున్నారు. సర్వర్ సమస్యలు తలెత్తితే ఒక్కో కార్డు పూర్తి కావడానికి 10 నుంచి 15 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో లబ్ధిదారులు రెండు వారాల పాటు రేషన్ షాపుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. సాంకేతిక అడ్డంకులను అధిగమించేందుకు అధికారులు ప్రత్యేక సాఫ్ట్వేర్, ఇతర నిబంధనలు అప్డేట్, ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని కార్డుదారులు కోరుతున్నారు.కసరత్తు చేస్తున్న సివిల్ సప్లయ్ అధికారులు గోదాంలకు చేరుతున్న సన్నబియ్యం జిల్లాలో 3,33,332 రేషన్ కార్డులు 19,749 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరంకసరత్తు చేస్తున్నాం రేషన్ కార్డుదారులకు ఏప్రిల్, మే, జూన్నెలలకు సంబంధించి రేషన్ బియ్యం ఒకే సారి ఏప్రిల్ నెలలో సరఫరా చేయాలని ప్రభుత్వం అదేశించింది. ఇందుకోసం సన్న బియ్యాన్ని ఇతర జిల్లాల నుంచి తెప్పిస్తున్నాం. కార్డుదారులకు ఎలాంటి సమస్య తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. – గోపికృష్ణ, డీఎం, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ -
ఇంటర్ పరీక్షలు ముగిసె.. ఉత్సాహం వెల్లివిరిసె..
రేపటి నుంచే మూల్యాంకనం ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఆదివారం నుంచి ప్రారంభం అవుతుందని డీఐఈఓ రవీందర్రెడ్డి చెప్పారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల(కోడ్యుకేషన్)లో మూల్యాంకన కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గణితం, ఇంగ్లిష్, హిందీ, తెలుగు, పొలిటికల్సైన్స్ సబ్జెక్టులకు సంబంధించిన అధ్యాపకులు మూల్యాంకన కేంద్రంలో ఉదయం 10గంటలలోగా రిపోర్టు చేయాలన్నారు. మూల్యాంకన విధులకు హాజరు కాని అధ్యాపకులపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.సిద్దిపేటఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. శుక్రవారం చివరి రోజు విద్యార్థులు ఉత్సాహంగా బయటకు వచ్చారు. పరీక్షలకు ఫస్టియర్ విద్యార్థులు 98శాతం, సెకండియర్ విద్యార్థులు 96 శాతం మంది హాజరైనట్లు డీఐఈఓ రవీందర్రెడ్డి తెలిపారు. జనరల్, ఒకేషనల్ బ్రిడ్జ్కోర్సు, మైనర్ మీడియా పరీక్షలు మినహా ప్రధాన పరీక్షలు ముగిశాయన్నారు. మొత్తంలో ఒక విద్యార్థిపై మాల్ప్రాక్టీస్ కేసు మినహా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పరీక్షలు విజయవంతంగా ముగిసినట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణకు సహకరించిన అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. -
గ్యాస్ కొరత లేదు.. ఆందోళన వద్దు
సిద్దిపేటరూరల్: ప్రభుత్వం జిల్లాకు అవసరమైన వంట గ్యాస్ సరఫరా చేస్తున్నక్రమంలో ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని కలెక్టర్ హైమావతి తెలిపారు. ప్రజలు అనవసర భయాందోళనలకు గురై ఎక్కువ సిలిండర్ లను బుక్ చేసుకోరాదన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ఎల్పీజి గ్యాస్ డీలర్లు, సంబంధించిన శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గృహ అవసరాలకు, కేజీబీవీ, గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆస్పత్రులు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలకు కొరత రాకుండా వంట గ్యాస్ సరఫరా చేయాలని డీలర్లను ఆదేశించారు. ఎల్పీజి గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది తలెత్తవద్దన్నారు. ఏదైనా సమస్య ఉంటే జిల్లా పౌరసరఫరాల అధికారి దృష్టికి తీసుకురావాలని సూచించారు. గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఒక గ్యాస్ సిలిండర్ తేడా వచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి తనుజ, డీఈఓ శ్రీనివాసరెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్, డీడబ్ల్యూఓ శారద, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, రవాణా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. ఎల్పీజీ గ్యాస్ సరాఫరాపై వినియోగదారుల్లో గందరగోళం నెలకొన్న దృష్ట్యా రాష్ట్ర పౌరసరాఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ హైమావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్యాస్ సరాఫరాపై మంత్రి పలు సూచనలు చేశారు. కలెక్టర్ హైమావతి గ్యాస్ సరఫరాపై అధికారులతో సమీక్ష -
● శేషతల్పంపై వైకుంఠనాథుడు
వర్గల్(గజ్వేల్): నాచగిరి క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వం చేస్తున్నాయి. వాహన సేవలు, హోమాది పూజలతో ఆధ్యాత్మికత వెల్లివిరిస్తోంది. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి శేషవాహనోత్సవ సేవ అంగరంగ వైభవంగా జరిగింది. శేషతల్పంపై సర్వాలంకార శోభితులై కొలువుదీరిన లక్ష్మీ సమేత నృసింహస్వామివారు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. భజనలు, కోలాటాలతో శ్రీవారి ఊరేగింపు కొనసాగింది. భక్తులు నాచగిరీశుని, అమ్మవారిని దర్శించుకుని తరించారు. నేడు గరుడసేవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి పెద్ద గరుడ సేవ జరుగుతుంది. రాత్రి 9 గంటలకు వేడుక ప్రారంభమై ఒంటి గంట వరకు కొనసాగుతుంది. -
మైనార్టీల సంక్షేమం పట్టని సర్కార్
గజ్వేల్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మైనార్టీల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. శుక్రవారం రాత్రి గజ్వేల్లోని మదీన మసీద్లో బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలోనే మైనార్టీలకు సముచిత స్థానం కల్పించామని గుర్తు చేశారు. కేసీఆర్ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో పెద్దపీట వేశారని తెలిపారు. విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో ఎన్నో అవకాశాలను కల్పించామన్నారు. ప్రత్యేకించి గజ్వేల్ నియోజకవర్గంలో వేలాది కోట్లతో అభివృద్ది కార్యక్రమాలను చేపట్టినట్లు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్.. అబద్దపు మాటలతో కాలంవెళ్లదీస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ వైఫల్యాలను నిలదీయాల్సిన అవసరముందన్నారు. వంటేరు ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ రంజాన్ సందర్భంగా ముస్లింలకు మంచి జరగాలని ఆకాంక్షించారు. మైనార్టీలకు బీఆర్ఎస్ ఎప్పుడూ తోడుగా ఉంటుందన్నారు. కేసీఆర్ కృషి వల్ల గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. ఈ ప్రాంతానికి ఒరగబెట్టిందేమీలేదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గజ్వేల్ పట్టణ శాఖ అధ్యక్షుడు నవాజ్మీరా, మజీద్ కమీటీ మాజీ అధ్యక్షుడు యూసుఫొద్దీన్, మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకుడు విరాసత్అలీ, గజ్వేల్ మార్కెట్ కమీటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం మాజీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవీ రవీందర్, మాజీ జెడ్పీటీసీ మల్లేశం, బీఆర్ఎస్ నాయకులు గంగిశెట్టి రవీందర్, కళ్యన్కర్ నర్సింగరావు, గజ్వేల్ మండల శాఖ అధ్యక్షుడు బెండె మధు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి హరీశ్రావు గజ్వేల్లో బీఆర్ఎస్ నేత వంటేరు ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు -
పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు
సీపీ రష్మీ పెరుమాళ్ సిద్దిపేటకమాన్: జిల్లాలో పదో తరగతి పరీక్షలు జరగనున్న కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్ నిబంధనలు అమల్లో ఉంటాయని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో టెన్త్ వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు బందోబస్తు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల సమీపంలో 500మీటర్ల వరకు ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడ దన్నారు. సమీపంలోని అన్ని జీరాక్స్ సెంటర్లు మూసివేసి ఉంచాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చిన్నకోడూరు(సిద్దిపేట): అసంపూర్తిగా ఉన్న కాలువులు పూర్తి చేయడంతో గురువారం రైతులు మండల పరిధిలోని గంగాపూర్ శివారులో మాజీ సీఎం కేసీఆర్, హరీశ్రావు ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. రంగనాయకసాగర్ రిజర్వాయర్ నుంచి నీటిని తరలించే కాలువలు కొన్నెళ్లుగా పెండింగ్లో ఉండటంతో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు హరీశ్రావు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన హరీశ్రావు.. సొంత డబ్బుతో కాలువలు తవ్వించి నీటిని తరలించారు. దీంతో గంగాపూర్, గుర్రాలగొంది గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్లు, రైతులు పాల్గొన్నారు. మద్దూరు(హుస్నాబాద్): భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్గా మండలానికి చెందిన బొంగోని సురేశ్గౌడ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సురేశ్గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర నాయకత్వం మీడియా ప్యానలిస్ట్గా నియమించడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. పార్టీ బలోపేతం కోసం, ప్రజల సమస్యలను సమాజం ముందుకు తీసుకురావడంలో, పార్టీ విధానాలను ప్రజలకు వివరించడంలో బాధ్యతగా నిర్వర్తిస్తానని తెలిపారు. ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం 10గంటలకు ఉగాది కవిసమ్మేళనం నిర్వహించనున్నట్లు వెన్నెల సాహితీ సంగమం అధ్యక్షుడు వంగర నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి పర్కపెల్లి యాదగిరిలు గురువారం తెలిపారు. కార్యక్రమానికి ప్రముఖకవి, రచయిత కోడం పవన్కుమార్, విశిష్ట అతిథులుగా ప్రముఖకవి, రచయిత, తెరవే రాష్ట్ర అధ్యక్షుడు కొండిమల్లారెడ్డి, ఆత్మీయ అతిథిగా సొప్పదండి విద్యాసాగర్లు హాజరవుతారన్నారు. కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులకు అందెశ్రీ ఉగాది పురస్కారం, జ్ఞాపికలు అందించనున్నట్లు తెలిపారు. మిరుదొడ్డి(దుబ్బాక): నానో యూరియాపై ప్రతి రైతు అవగాహన పెంచుకోవాలని ఏఆర్ఎస్ తోర్నాల శాస్త్రవేత్త రమాదేవి అన్నారు. గురువారం మండల పరిధిలోని చెప్యాల రైతు వేదికలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) ఆధ్వర్యంలో సమగ్ర సస్యరక్షణ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. అలాగే క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించారు. రైతులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అణుగుణంగా రైతులు ఆధునిక సాగు పద్ధతులపై దృష్టి సారించాలని సూచించారు. రసాయన ఎరువుల మోతాదును తగ్గించి సేంద్రియ ఎరువులతో దిగుబడులు సాధించేలా రైతులు ముందడుగు వేయాలని కోరారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులపై ప్రతి రైతుకు అవగాహన కలిగేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
సేవాభావం అలవర్చుకోవాలి
ములుగు(గజ్వేల్): విద్యార్థులు చదువుతోపాటు సేవాభావం అలవర్చుకోవాలని కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ విద్యార్థి వ్యవహారాల డీన్ జె.చీనా అన్నారు. ములుగులోని అటవీ కళాశాల, పరిశోధన సంస్థ(ఎప్సీఆర్ఐ)లో గురువారం కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ కోఆర్డినేటర్ డాక్టర్.ఎంఎస్ శ్రీనిధి ఆధ్వర్యంలో వలంటీర్లకు నిర్వహించిన ఓరియెంటేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు విద్యాభ్యాసంతో పాటు సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాలని సూచించారు. ఎన్సీసీ హెడ్ మలేషా మాట్లాడుతూ విద్యార్థి వ్యక్తిగత అభివృద్ధిలో ఎన్ఎస్ఎస్ పాత్ర కీలకమైందన్నారు. ప్రస్తుత సమాజంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఎదుర్కుంటున్న సమస్యలను అర్థం చేసుకుని సుస్థిరమైన పరిష్కారాలను కనిపెట్టాలని సూచించారు. -
ప్రజాసేవే లక్ష్యంగా పని చేయండి
సాక్షి, సిద్దిపేట: ప్రజాప్రతినిధులు ప్రజాసేవే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. గురువారం సిద్దిపేటలో రెడ్డి సంక్షేమ సంఘ భవనంలో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై మున్సిపల్ చైర్మన్లు, వార్డు కౌన్సిలర్లు, సర్పంచ్లకు అవగాహన కార్యక్రమం కలెక్టర్ హైమావతి అధ్యక్షత జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా బక్కి వెంకటయ్య హాజరై మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో కూడా విద్య, వైద్యం, పారిశుద్ధ్యం తదితర రంగాల్లో అవగాహన కార్యక్రమాలను అమలు చేసిందని గుర్తు చేశారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ పల్లెల్లో, పట్టణాల్లో అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించగకుండానే బిల్లులకు ఆమోదం తెలుపుతున్నారన్నారు. ఏదైనా భవనం నిర్మిస్తే డోర్లు, కిటికీలు సరిగ్గా ఉన్నాయా? లేదా? అని కూడా ఇంజనీరింగ్ శాఖ అధికారులు పరిశీలించడం లేదని ఆరోపించారు. గ్రామాల్లో చిన్న చిన్న విద్యుత్ స్తంభాలు ఉండటంతో వైర్లు కిందికి వేలాడుతున్నాయన్నారు. ఏదైనా గ్రామంలో విద్యుత్ మర్మతులు చేపట్టినప్పుడు ఆ ఒక్క గ్రామానికి ప్రత్యేకంగా బ్రేకర్ లేకపోవడంతో నాలుగు గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందన్నారు. గ్రామాల్లో స్ట్రీట్ లైట్లు ఆన్ ఆఫ్ స్వీచ్లు లేకపోవడంతో నిరంతరంగా వెలుగుతున్నాయన్నారు. ప్లాస్టిక్ నిర్మూలనకు కృషి చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమాన్ని ఐదు అంచెల్లో అమలు చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని సూచించారు. ఆర్ఓ ప్లాంట్ల నీటి కంటే మిషన్ భగీరథ నీటిని తాగడం చాలా మంచిదన్నారు. తాను మిషన్ భగీరథ నీటినే వేడి చేసి చల్లార్చి తాగుతున్నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యా, వైద్యం, వ్యవసాయం, పట్టణాభివృద్ధి, పౌరసరఫరాలు, రోడ్డు భద్రత, డ్రగ్స్ నిర్మూలన, శాంతి భద్రతలు, విద్యుత్, పర్యావరణం, ఇందిరమ్మ గృహాల పై తమ శాఖలకు సంబంధించిన అంశాలపై అధికారులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్తో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. సమస్యలపై ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టిసారించాలి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య ‘ప్రగతి ప్రణాళిక’పై అవగాహన కార్యక్రమం క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించకుండానే బిల్లులా?: ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి -
మంచినీటి పన్ను ఇక ఆన్లైన్
గజ్వేల్: మంచినీటి పన్నుల వసూళ్లపై మున్సిపల్ అధికారులు దృష్టి పెట్టారు. ఈ పన్నులను ఆన్లైన్ విధానంలోకి తీసుకొచ్చారు. గతంలో ఆఫ్లైన్ విధానం అమల్లో ఉన్న సమయంలో రూ.కోట్లల్లో బకాయిలు పేరుకుపోయాయి. కొత్త విధానంలో బాకాయిలన్నీ వసూలు చేయాలని మున్సిపల్ యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పరిణామం ఆయా పట్టణాల ప్రజలకు భారంగా మారనుంది. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ కొత్త విధానం అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో సిద్దిపేట మున్సిపాలిటీ మినహా మిగతావి 2012 తర్వాత పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ అయినవే. మున్సిపాలిటీ నిర్వహణకు ప్రధాన ఆధారమైన పన్నుల విధానం ఒక్కోచోట ఒక్కో రకంగా అమల్లో ఉంది. సిద్దిపేట మినహా అన్ని చోట్లా మంచినీటి పన్నులను ఆన్లైన్ చేస్తున్నారు. నిజానికి మంచినీటికి కూడా పన్ను కట్టాలని ఆయా పట్టణాల ప్రజలకు తెలియదు. పంచాయతీల నేపథ్యం నుంచి వచ్చిన గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీల్లో మంచినీటి పన్ను వసూలు చేయొద్దని వినతులు చేస్తూ వస్తున్నారు. కొద్దిశాతం మంది మాత్రమే ఆఫ్లైన్లో చెల్లింపులు జరుపుతున్నారు. దీనివల్ల ఆయా మున్సిపాలిటీల్లో మంచినీటి పన్నుల బకాయిలు కోట్లల్లోకి చేరుకున్నాయి. గజ్వేల్లో రూ.4.32కోట్ల బకాయిలు గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోనాలుగేళ్లుగా రూ.4.32కోట్ల మంచినీటి పన్నుల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో ఈసారి అధికారులు రూ. 3.80లక్షలు వసూలు చేశారు. కాగా ఇంకా రూ.3.94కోట్లకుపైగా బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఇకపోతే ఈ మున్సిపాలిటీకి 12891 ఇండ్ల ద్వారా ఏటా రూ.5.79కోట్ల ఆస్తి పన్ను ఆదాయం సమకూరుతున్నది. ఆస్తి పన్నుతోపాటు మంచినీటి పన్ను కూడా ప్రధాన వనరుగానే మారింది. కాగా ‘మిషన్ భగీరథ’ పథకానికి గజ్వేల్ నియోజకవర్గమే పుట్టినిల్లు. గజ్వేల్ మండలం కోమటిబండ వద్ద 2016 ఆగస్టు 7న ప్రధాని నరేంద్రమోదీ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ‘మిషన్ భగీరథ’ తొలి ఫలాలను అందుకున్నది కూడా ఈ ప్రాంతమే. తమకు నిరంతరం ఉచితంగా మంచినీటి పంపిణీ జరగనుందని ప్రజలు భావించారు. కానీ మున్సిపాలిటీల్లో మిషన్ భగీరథ పథకం నిర్వహణ బాధ్యతను మున్సిపల్ అధికారులకే అప్పగించడంతో...పన్నుల భారం తప్పడం లేదు. ఈ పన్నులను ఎలాగైన వసూలు చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. రూ.కోట్లల్లో పేరుకుపోయిన బకాయిలు వసూళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టి అన్ని మున్సిపాలిటీల్లోనూ అమలయ్యేలా చర్యలు ఆస్తి పన్నుతోపాటు.. ప్రస్తుతం ఆస్తి పన్నులతోపాటు మంచినీటి పన్నును సైతం వసూలు చేయడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నారు. జిల్లాలోని దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. ఏళ్లతరబడి పెండింగ్లో ఉన్న మంచినీటి పన్నును ప్రస్తుతం చెల్లించాల్సిందేనని ఒత్తిడి మొదలుకావడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ అంశంపై గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్ను వివరణ కోరగా...మంచినీటి పన్ను ఇటీవలే ఆన్లైన్ చేశామని, ప్రజలు సకాలంలో ఈ పన్ను చెల్లించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. -
ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిత
అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ స్వప్న ప్రశాంత్నగర్(సిద్దిపేట): విద్యార్థుల భవిత ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని, మాతృ హృదయంతో బోధించాలని, దేశం గర్వపడే వ్యక్తులుగా తీర్చిదిద్దాలని సెన్సార్ బోర్డు మెంబర్, కేఎంఐటీ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ స్వప్న అన్నారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించారు. ముందుగా మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్వప్న మాట్లాడుతూ విద్యార్థులకు తల్లి మొదటి గురువు అని, గురువు మొదటి తల్లి అన్నారు. విద్యార్థులు తమ ఉపాధ్యాయులు చెప్పిందే నిజమనే ప్రగాఢ విశ్వాసాన్ని కలిగి ఉంటారన్నారు. కార్యక్రమంలో సుజాత, కొత్త వనజ, గంగాధర మనోజ, వివిధ మండలాల నుండి విచ్చేసిన మహిళ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
‘యాంత్రీకరణ’ ముసుగులో మాయాజాలం
సబ్సిడీ ద్వారా అందజేసిన రొటోవేటర్లువ్యవసాయ యాంత్రీకరణ ముసుగులో రైతులు నిలువుదోపిడీకి గురవుతున్నారు. సబ్సిడీ పరికరాలను బహిరంగ మార్కెట్ ధర కంటే అధిక ధరలకు అందజేస్తున్నారు. ఏజెన్సీ నిర్వాహకులు.. అధికారులు కుమ్మకై ్క అక్రమాలకు తెరలేపారు. ఒక్కో రొటోవేటర్కు రైతులు రూ.19వేలు అధికంగా చెల్లిస్తున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద జిల్లాకు రూ.4.34కోట్లు మంజూరయ్యాయి. – సాక్షి, సిద్దిపేట వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా 42 బ్లేడ్లు, ఆరు ఫీట్ల రొటోవేటర్ను రూ.1.34,060 అందజేస్తున్నారు. ఇందులో రైతు రూ.84,060 చెల్లిస్తుండగా ప్రభుత్వం సబ్సిడీ రూ.50వేలు అందిస్తోంది. ప్రభుత్వం సబ్సిడీతో అందజేస్తున్న రొటోవేటర్ అదే బహిరంగ మార్కెట్లో ఎంత ధర ఉందని ‘సాక్షి’ పరిశీలించింది. దానికి సంబంధించి సబ్సిడీ పరికరాలు అందించే ఏజెన్సీ నుంచే కొటేషన్ను సాక్షి సేకరించింది. ఒక్కో రొటోవేటర్ను రూ.1,20,000 అని, దాదాపు రూ.5వేల వరకు తగ్గించే అవకాశం ఉంటుందని చెప్పారు. అంటే బహిరంగ మార్కెట్లో రూ.1.15లక్షలకు మాత్రమే లభిస్తుంది. బహిరంగ మార్కెట్లో పరికరాలు తీసుకున్న రైతులను అడగ్గా రూ.1.05లక్షలకే అందజేస్తున్నారని చెబుతున్నారు. దీని ప్రకారం సాక్షి సేకరించిన కొటేషన్ ప్రకారం చూస్తే ఒక్కో రొటోవేటర్కు దాదాపు రూ.19వేలు అధికంగా చెల్లిస్తున్నారు. దీంతో ప్రభుత్వం అందించే సబ్సిడీలో కేవలం రూ.34వేలు మాత్రమే అందుతోంది. ప్రభుత్వ సొమ్మేకదా అని అప్పనంగా దోచేస్తున్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా రైతులకు సబ్సిడీతో వ్యవసాయ పరికరాలను అందజేస్తున్నారు. వీటి కోసం జిల్లాకు రూ.4.34 కోట్లు మంజూరయ్యాయి. బహిరంగ మార్కెట్ కంటే సబ్సిడీ ద్వారా అందించే వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు అధిక ధరలకు ఇవ్వడం గమనార్హం. బహిరంగ మార్కెట్లో లభించే ధరలకే సబ్సిడీ ద్వారా అందించే పరికరాలు అందజేయాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటి వరకు రూ.1.52కోట్ల సబ్సిడీతో పరికరాలు వ్యవసాయ యాంత్రీకరణలో అందజేసే పరికరాల కోసం జిల్లాకు రూ. 4.34కోట్లు మంజూరు కాగా జిల్లా వ్యాప్తంగా అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఇప్పటి వరకు రూ. 1.52కోట్ల సబ్సిడీతో 152 రొటోవేటర్లు, గడ్డి కట్టే యంత్రాలు 6, పవర్ స్ప్రేలు 56, బ్రష్ కట్టర్లు 5, పవర్ వీడర్స్ 6 అందజేశారు. ఏజెన్సీ నిర్వాహకులు.. అధికారులు కుమ్మక్కు ఒక్కో రొటోవేటర్కు రూ.19వేలు అధికంగా వసూలు ‘సాక్షి ’ పరిశీలనలో తేలిన వైనం కలెక్టర్ దృష్టి సారించాలని కోరుతున్న రైతులు జిల్లాకు ‘వ్యవసాయ యాంత్రీకరణ’ కింద రూ.4.34కోట్లు మంజూరు ధరలతో సంబంధంలేదు వ్యవసాయ యంత్రీకరణ పరికరాలకు సంబంధించి ధరలు ఇక్కడ నిర్ణయించినవి కావు. కమిషనర్ స్థాయిలో నిర్ణయించిన వాటి ప్రకారమే సబ్సిడీ పోను మిగతా వాటిని డీడీ రూపంలో స్వీకరిస్తున్నాం. ధరల నిర్ణయంలో మాకు ఎలాంటి సంబంధం లేదు. – స్వరూప రాణి, జేడీఏ ఎక్కువ మొత్తంలో పరికరాలు తీసుకున్నప్పుడు తక్కువ ధరకు ఇవ్వాల్సింది పోయి మార్కెట్ ధర కంటే ఎక్కువ డబ్బుకు అందజేస్తున్నారు. పరికరాలు అందజేసే ఏజెన్సీ నిర్వాహకులు, అధికారులు కుమ్మకై ్క ధరను పెంచారని పలువురు ఆరోపిస్తున్నారు. ఒక్కో రొటావేటర్పై రూ.19వేలు అధికంగా చెల్లిస్తున్నారు. ఇప్పటి వరకు రోటవేటర్లు 156 మందికి అందజేయగా దాదాపు రూ.29.73లక్షలు చేతులు మారినట్లు తెలుస్తోంది. అంటే ఒక్క రొటావేటర్కే ఇంత పెద్ద మొత్తంలో చేతుల మారగా ఇంకా మిగతా వాటిపై ఎంత అధికంగా చెల్లించారో తెలియాల్సి ఉంది. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి మేలు జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు. -
పకడ్బందీగా ఈ–నామ్
కలెక్టర్ హైమావతి సిద్దిపేటజోన్: జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్ మార్కెట్లలో ఈ –నామ్ 2.0 వెర్షన్ పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో సిద్దిపేట, గజ్వేల్ మార్కెట్ కమిటీ కార్యదర్శులు, మార్కెటింగ్ శాఖ అధికారులు, ట్రేడర్లు, కమిషన్ ఏజెంట్లతో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎక్కువ సంఖ్యలో కంప్యూటర్ సిబ్బందిని ఏర్పాటు చేసుకొని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ–నామ్ భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇస్తుందన్నారు. సమావేశంలో జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
బల్దియా కొరడా...
సిద్దిపేటజోన్: నిబంధనలు అతిక్రమించిన వారికి మున్సిపల్ అధికారులు జరిమానా విధించారు. గురువారం కమిషనర్ ఆశ్రిత్ కుమార్ పట్టణంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల బిర్యానీలో బొద్దింక వచ్చిందనే ఫిర్యాదు మేరకు హయత్ రెస్టారెంట్ నిర్వహకులకు రూ.15 వేలు జరిమానా విధించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ప్రాంతంలో బహిరంగ మల విసర్జన చేసిన ఇరువురికి జరిమానా విధించారు. బృందావన్ గ్రాండ్ హోటల్ ఆకస్మికంగా తనిఖీ చేసి కాల పరిమితి దాటినా సరుకులు ఉండటాన్ని గమనించి రూ.15 వేలు జరిమానా విధించారు. ఆయన వెంట మున్సిపల్ అధికారులున్నారు. -
పకడ్బందీగా పది పరీక్షలు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): పదోతరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి శ్రీనివాస్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తరగతి పరీక్షల నిర్వహణ అధికారి లక్ష్మయ్యతో కలిసి డీఈఓ మాట్లాడారు. ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్ష సమయానికి కంటే గంట ముందు విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. 5 నిమిషాలు ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోని అనుమతించనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 82 పరీక్ష కేంద్రాలను కేటాయించినట్లు తెలిపారు. మొత్తం 15,358 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారన్నారు. 4 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, ఏడుగురు రూట్ ఆఫీసర్లు, 82 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 82 మంది డిపార్ట్ మెంటల్ ఆఫీసర్లు, 24 స్టోరేజ్ పాయింట్ కస్టోడియల్ అధికా రులు విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంతగా వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. హాజరుకానున్న 15,358 మంది విద్యార్థులు ఐదు నిమిషాలు వెసులుబాటు జిల్లా విద్యాధికారి శ్రీనివాస్రెడ్డి -
హుస్నాబాద్ బడ్జెట్.. రూ.21.88కోట్లు
కోతుల నివారణకు రూ.5 కోట్లు కేటాయించండిహుస్నాబాద్: పట్టణ అభివృద్ధి కోసం ప్రజలపై భారం పడకుండా అవసరమైన ఆదాయ వనరులు పెంచుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం మున్సిపల్ సమావేశ మందిరంలో చైర్పర్సన్ దండి లక్ష్మి అధ్యక్షతన వార్షిక బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సమక్షంలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 21.88 కోట్ల అంచనా రాబడి, అంతే మొత్తంలో వ్యయంతో కూడిన వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టగా, పాలకవర్గ సభ్యులు చేతులు పైకి ఎత్తి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. బడ్జెట్ వివరాలను అకౌంటెంట్ హారతి చదివి వినిపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. వివిధ రకాలుగా మున్సిపాలిటీకి వచ్చే ఆదాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పట్టణ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులను స్థానిక పార్లమెంట్ సభ్యుడితో కలిసి తీసుకువస్తామని తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా, భవిష్యత్ తరాలు స్వచ్ఛమైన వాతావరణంలో జీవించేలా పచ్చదనం, పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పట్టణంలో ఒక ఇంటికి రెండు, మూడు నల్లా కనెక్షన్లు ఉన్నాయని ఫిర్యాదులు అందుతున్నాయని, వాటిని సరిచేయాలని సూచించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పై సమావేశం నిర్వహించి నూతనంగా ఎన్నికై న కౌన్సిలర్లను సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు పాల్గొన్నారు. బంజారాల అభివృద్ధికి కృషి కోతులు, కుక్కలు, పందుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని వివిధ పార్టీల నాయకులు బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సమస్య నియోజవర్గ వ్యాప్తంగా ఉందని, వాటి నివారణ కోసం రూ.5 కోట్ల బడ్జెట్ కేటాయించాలని కోరారు. కోతుల వల్ల వరి పంట తప్ప వేరే పంటలు వేసే పరిస్థితి లేదన్నారు. కోతులు, కుక్కల దాడుల వల్ల వివిధ ఆస్పత్రులకు నెలకు 200 మంది చికిత్స కోసం వస్తున్నారని తెలిపారు. సమస్యలపై యుద్ధ ప్రాతిపదికను చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్, బీఎస్పీ, బీజేపీ, నాయకులు అయిలేని మల్లికార్జున్ రెడ్డి, పచ్చిమట్ల రవీందర్ గౌడ్, బత్తుల శంకర్ బాబు, వేణు గోపాల్రెడ్డి, అనంత స్వామి తదితరులు ఉన్నారు. మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం ఆదాయ వనరులుపెంచుకోవాలి: మంత్రి పొన్నంవివిధ పార్టీల నాయకుల విన్నపం -
ప్రణాళికతో పదిలం
విద్యార్థులకు నిపుణుల సలహాలు, సూచనలు ● 14 నుంచి టెన్త్ క్లాస్ పరీక్షలులెక్కలు.. చిక్కులు కావు సోపానాల క్రమంలో సమస్య సాధించాలి. గ్రాఫ్ నిర్మాణాలు ప్రాక్టీస్ చేయాలి. సాంఖ్యక శాస్త్రం, శ్రేఢులు, క్షేత్రమితి సూత్రాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మంచి మార్కులు సాధించవచ్చు. సాంఖ్యక శాస్త్రం, సమితులు, సంభావ్యత, నిరూపక రేఖ గణితం పాఠ్యాంశాలు సులభంగా ఉంటాయి, కాబట్టి వాటిపై దృష్టి పెట్టాలి. – కొండల్రెడ్డి, మాథ్స్ టీచర్, కూచన్పల్లి ఫిజిక్స్ ఆలోచించి రాయాలి ఫిజిక్స్ నిత్య జీవితంలో ఉపయోగాలు, పట నైపుణ్యం, విద్యా ప్రమాణాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. సమాచార నైపుణ్యంలో.. ప్రశ్నలోనే నైపుణ్యం ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచించి రాయాలి. విషయావగాహన ప్రమాణం నుంచి కాన్సెప్ట్ ఎంపిక చేసుకొని చదివితే మంచి ఫలితాలు ఉంటాయి. – అశోక్, ఫిజిక్స్ టీచర్, నాగ్సాన్పల్లి ఒత్తిడికి లోను కావొద్దు పదో తరగతి విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు రాయాలి. ఇంటి నుంచి పరీక్ష హాల్కు వెళ్లే వరకు చదువుతు ఉండటం సరికాదు. అరగంట ముందు పరీక్ష కేంద్రానికి వెళ్లి ప్రశాంతంగా ఉండాలి. కనీసం 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. రాత్రి పూట తేలికగా జీర్ణమయ్యే ఆహారం, ఉదయం కొద్ది పాటి టిఫిన్ తిని పరీక్షకు వెళ్లాలి. వేసవి ఎండలు ముదిరినందున తగినంత నీరు తాగాలి. కొబ్బరి నీరైతే మంచిది. – డాక్టర్ భానుచందర్, పల్స్ ఆస్పత్రి, మెదక్ -
హంసవాహనంపై నాచగిరీశుడు
వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధమైన నాచగిరి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం రాత్రి హంసవాహనోత్సవసేవ నేత్రపర్వం చేసింది. రంగురంగుల పూలకూర్పుతో కూడిన గజమాలికల మధ్య వటపత్రంపై విశేషాలంకృతులైన లక్ష్మీసమేత నృసింహస్వామివారు ‘వటపత్రశాయి’గా హంసవాహనం అధిష్టించారు. భక్తుల హర్షధ్వానాలు, భాజభజంత్రీలు, మేళతాళాలు, కోలాటాల మధ్య పురవీథులలో ఊరేగుతూ సభామండపం చేరుకున్నారు. అక్కడ వేదపఠనం, సంగీతం, భజనాది కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈఓ బెల్లంకొండ రంగాచారి, ధర్మకర్తలు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కమనీయంగా సాగిన శ్రీవారి హంసవాహోత్సవ వైభవం తిలకించి భక్తజనులు తరించారు. -
ఆందోళన వద్దు
గృహ వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గ్యాస్ బుక్ చేసిన వారికి ఇంటికి డెలివరీ చేస్తున్నాం. బుధవారం ఒక్క రోజే దాదాపు 6వేల గ్యాస్ సిలిండర్లను సరఫరా చేశాం. కమర్షియల్ సిలిండర్లు మాత్రం ప్రభుత్వ రంగ సంస్థలకే సరఫరా చేస్తున్నాం. అది కూడా ఓటీపీ ద్వారా మాత్రమే అందిస్తున్నాం. – తనూజ, డీఎస్ఓ పొదుపు చేయండి గృహ వినియోగదారులు గ్యాస్ బుక్ చేసుకుంటే సరఫరా చేస్తున్నాం. గ్యాస్ కోసం ఎలాంటి ఇబ్బంది లేదు.. యుద్ధం ఎఫెక్ట్తో ఏర్పడిన పరిస్థితులతో గ్యాస్ వినియోగాన్ని పొదుపు చేయాలి. గృహ వినియోగదారులెవరూ బయట హోటళ్లకు విక్రయించవద్దు. –మహేశ్కుమార్, ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీల సంఘం అధ్యక్షుడు -
గ్యాస్ గోస
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధంతో ఎల్పీజీ సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పటికే పెంచిన గ్యాస్ సిలిండర్ల ధరలతో సామాన్యులు సతమతమవుతుండగా, తాజాగా గ్యాస్ కొరత మరింత వేధిస్తోంది. పట్టణాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రమైంది. జిల్లాలో హోటళ్లు, రెస్టారెంట్లు, వాహనాలకు గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లు మూతపడే స్థితికి వచ్చాయి. ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడటంతో యజమానులు, కార్మికులు ఆందోళన చెందుతున్నారు. – సాక్షి, సిద్దిపేట హోటళ్లు, రెస్టారెంట్లకు ప్రైవేట్, ప్రభుత్వం సరఫరా చేసే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది. దీంతో పలువురు ప్రైవేట్ గ్యాస్ వ్యాపారులు బ్లాక్లో విక్రయాలకు తెరలేపారు. ప్రైవేట్ కంపెనీకి చెందిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ 19 కేజీలది గతంలో రూ.1,850లకు డెలవరీ చేసేవారు. ప్రస్తుతం రూ.3వేలకు విక్రయిస్తున్నారు. గ్యాస్ లేకపోతే హోటల్ నడవదన్న ఉద్దేశంతో చేసేదిలేక అధిక ధర అయినా బ్లాక్లో కొందరు కొనుగోలు చేస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు గ్యాస్ కొరతతో హోటళ్లు, రెస్టారెంట్లు బంద్ చేస్తే ఉపాధి కోల్పోతామన్న ఉద్దేశంతో యజమానులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బుధవారం సిద్దిపేట పట్టణంలో హోటల్ యజమానులు సమావేశమయ్యారు. గ్యాస్ ఇబ్బందుల నుంచి బయట పడేందుకు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. హైదరాబాద్లో స్మోక్లెస్ ఉడ్ స్టవ్లను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.నో బుకింగ్ వివిధ గ్యాస్ కంపెనీల వారు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల బుకింగ్ తీసుకోవడం లేదు. కేవలం ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే సరఫరా చేస్తున్నారు. అలాగే గ్యాస్ కొరత ఏర్పడుతుందని ముందస్తుగా ఒకే సారి గృహవినియోగదారుల బుకింగ్లు పెరిగాయి. దీంతో గతంలో 24 గంటల్లో గ్యాస్ సిలిండర్ సరఫరా చేసే వారు ఇప్పుడు నాలుగు నుంచి ఐదు రోజుల సమయం పడుతోంది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.. గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద గ్యాస్ కొరత ఉందని వినియోగదారులు సహకరించాలని ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.జిల్లాలో ఎల్పీజీ కొరత అక్కడ యుద్ధం.. ఇక్కడ సంకటం మూత దిశగా పలు హోటళ్లు, రెస్టారెంట్లు ఇదే అదనుగా బ్లాక్లో విక్రయాలు -
సహజ వ్యవసాయంతో అధిక లాభాలు
జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి అక్కన్నపేట(హుస్నాబాద్): సహజ పద్ధతిలో పంటలను సాగుచేసి అధిక దిగుబడులు పొందాలని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి అన్నారు. అక్కన్నపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం వ్యవసాయంపై రైతులు, శాస్త్రవేత్తల చర్చా గోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా సహజ వ్యవసాయం పద్ధతులు, రసాయనాల వినియోగం తగ్గించడం, పంట మార్పిడి, నూనె గింజల సాగుపై అవగాహన కల్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతులందరూ భూసార పరీక్షలు చేయించుకోవాలన్నారు. మట్టిలో ఉండే పోషకాలను తెలుసుకొని పంటల వేయాలన్నారు. పచ్చిరొట్ట ఎరువులు వాడకంపై కూడా రైతులకు అవగాహన కల్పించారు. సేంద్రియంవైపు మొగ్గు చూపాలి పథకాలను సద్వినియోగం చేసుకోండి: సీపీ రష్మీసిద్దిపేటజోన్: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ పిలుపునిచ్చారు. మూడు రోజులుగా విపంచి ఆడిటోరియంలో కొనసాగిన పీఎం విశ్వకర్మ లబ్ధిదారుల ఉత్పత్తుల ప్రదర్శన, ట్రేడ్ ఫెయిర్ ముగింపు కార్యక్రమంలో బుధవారం ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సృజనాత్మక ఆలోచనలకు పదును పెట్టాలని సూచించారు. వృత్తి నైపుణ్యాలను సాధించాలన్నారు. చిత్రలేఖనం, టైలరింగ్, కంప్యూటర్, పెయింటింగ్ లాంటివి నేర్చుకోవాలన్నారు. అనంతరం ఎగ్జిబిషన్, ట్రేడ్ ఫెయిర్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురికి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమ సంస్థ డైరెక్టర్ రావు, పీఎం విశ్వకర్మ పథకం రాష్ట్ర కో ఆర్డినేటర్ అమినా భాను, ప్రతినిధులు పాల్గొన్నారు. హక్కుల సాధనకు పోరాటం చిన్నకోడూరు(సిద్దిపేట): హక్కుల సాధనకు కార్మికులు సంఘటితంగా పోరాడాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కనకయ్య పిలుపునిచ్చారు. బుధవారం చిన్నకోడూరులో హమాళీ కార్మికులతో కలిసి మాట్లాడారు. అన్ని రంగాల్లో పని చేస్తున్న అసంఘటిత కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల పక్షాన సీఐటీయూ నిరంతరం పోరాడుతోందన్నారు. సమావేశంలో నాయకులు కాటం మధు, శ్రీనివాస్రెడ్డి, భాస్కర్, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.15న కవి సమ్మేళనం గజ్వేల్రూరల్: కవి సమ్మేళనం ఈనెల 15న నిర్వహిస్తున్నట్లు గజ్వేల్ డివిజన్ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు దేశపతి శంకరశర్మ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణంలోని శ్రీసత్యసాయి బాబా మందిరంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనంతో పాటు పంచాంగ ఆవిష్కరణ జరుగుతుందన్నారు. కార్యక్రమానికి హాస్య బ్రహ్మ డాక్టర్ శంకరనారాయణ వస్తున్నారని తెలిపారు. కవి సమ్మేళనంలో పాల్గొనే కవులు తమ పేర్లను 9849302525 నంబర్కు ఫోన్ చేసి నమోదు చేసుకోవాలని సూచించారు. మల్లన్న ఆలయంలో వేలం పాట కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జునస్వామి ఆలయంలో పలు అంశాలకు బహిరంగా వేలం పాటలను ఈఓ కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో ఏఈఓలు సుదర్శనం, బుద్ది శ్రీనివాస్, పర్యవేక్షకులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ముగిసిన సిద్ధి హోమం మిరుదొడ్డి(దుబ్బాక): మండల కేంద్రమైన మిరుదొడ్డిలో మూడ్రోజులుగా నిర్వహిస్తున్న రేణుకా– జమదగ్ని ఏకాదశ సిద్ధిహోమం బుధవారం ముగిసింది. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండుగ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు. -
సమన్వయంతో జనగణన చేపట్టాలి
సిద్దిపేటరూరల్: అధికారులు సమన్వయంతో జనగణన చేపట్టాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో సెన్సెస్ – 2027 ప్రక్రియపై తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సంబంధిత జిల్లా అధికారులకు నిర్వహించిన శిక్షణ తరగతులలో కలెక్టర్ పాల్గొని దిశానిర్దేశం చేశారు. భారతదేశంలో సాధారణంగా ప్రతి పదేళ్లకు చేసినప్పటికి 2021లో కరోనా వైరస్ వల్ల జనగణన చేపట్టలేదన్నారు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి జనాభా గణన చేయడం ఎనిమిదవదన్నారు. సెన్సెస్–2027 గణన ఫేస్–1 లో గృహాల జాబితా, ఫేస్–2 లో జనాభా జాబితాను సేకరిస్తారన్నారు. మొదటగా గృహ గణనపై తహసీల్దార్, ఎంపీడీఓ అధికారులకు శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. మే నెలలో గృహాల జాబితా చేపట్టనున్నట్లు తెలిపారు. అధికారులు గణనలో పాల్గొ ని విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ సదానందం, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, సీపీఓ దశరథ్, డీఈఓ శ్రీనివాస్రెడ్డి, అసిస్టెంట్ సెన్సెస్ అధికారి రమాదేవి పాల్గొన్నారు. కలెక్టర్ హైమావతి అధికారులకు దిశానిర్దేశం -
గ్యాస్ ధరలు తగ్గించాల్సిందే..
చేర్యాల(సిద్దిపేట): పెంచిన వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశోక్ కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ పట్టణ కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ఖాళీ గ్యాస్ సిలిండర్తో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 12 ఏళ్లలో అనేక సార్లు వంట గ్యాస్ ధరలు పెంచిందన్నారు. ప్రస్తుతం యుద్ధం పేరుతో గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ రూ.60వేల కోట్ల భారాన్ని దేశ ప్రజలపై వేయడాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలన్నారు. ధరలను ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు భూమయ్య, భాస్కర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, రజిత, సుదర్శన్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. -
పంటలు ఎండుతున్నా పట్టించుకోరేం
● కరెంట్ కోతలను సహించం ● ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి ● గజ్వేల్ సబ్స్టేషన్ వద్ద బీఆర్ఎస్ నిరసనగజ్వేల్: కరెంట్ సరఫరాలో కోత విధించడంతో పంటలు ఎండిపోతున్నాయని, ఈ పరిస్థితి మారకపోతే సహించేదీలేదని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి హెచ్చరించారు. సోమవారం గజ్వేల్లోని సబ్స్టేషన్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం విద్యుత్శాఖ డీఈ భానుప్రకాశ్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో కేసీఆర్ రైతులకు 24గంటలూ విద్యుత్ సరఫరా అందజేసి అండగా నిలిస్తే.. నేడు పరిస్థితి భిన్నంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో 9గంటలకుమించి సరఫరా కావడం లేదన్నారు. దీంతో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చందన, దేవీ రవీందర్, మాజీ జెడ్పీటీసీ మల్లేశం, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
పరిసరాల పరిశుభ్రత తప్పనిసరి
హుస్నాబాద్: స్వచ్ఛతలో అందరూ భాగస్వాములు కావాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి పొన్నం అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం హుస్నాబాద్లో 5 కె రన్ నిర్వహించారు. విద్యార్థులు, మహిళలు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్కు పంపించాలన్నారు. దోమల బెడద నివారణకు ఖాళీ స్థలాల్లో నీరు నిలవకుండా చూడాలన్నారు. వేసవి కాలంలో తాగునీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. -
ధ్వజారోహణం.. దేవతాహ్వానం
వర్గల్(గజ్వేల్): ధ్వజారోహణ మహోత్సవంతో నాచగిరి పరవశించింది. నాచగిరీశుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం గరుడ ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా జరిగింది. గరుడాళ్వారు చిత్రంతో కూడిన పతాకానికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. స్వామివారి కల్యాణానికి సన్నాహ సూచికగా సాయంత్రం సకల దేవతాహ్వానం పలుకుతూ భేరీపూజ నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి 10 గంటలకు శ్రీవారి తిరుకల్యాణోత్సవం జరుగుతుంది.వైభవంగా నాచగిరీశుని బ్రహ్మోత్సవాలు -
బోనమెత్తిన భక్త జనం
బోగస్కు చెక్ బోగస్ ధ్రువీకరణ పత్రాలకు చెక్ పెడుతూ ప్రభుత్వం డిజిటల్ యాప్ను తీసుకొచ్చింది. వివరాలు 8లో uమిరుదొడ్డిలో రేణుకాదేవి జమదగ్ని ఏకాదశ సిద్ధి హోమం అంగరంగ వైభవంగా సాగుతోంది. సోమవారం డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల శిగాల మధ్య భక్తులు అమ్మవారికి బోనాల జాతర నిర్వహించారు. యువకులు ఆట పాటలతో హోరెత్తించారు. అనంతరం వైదిక నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ మంగళవారం అమ్మవారి కల్యాణ మహోత్సవంతో పాటు అన్నదానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. – మిరుదొడ్డి(దుబ్బాక) -
పదిలో మెరవాలి
ఉత్తమ ఫలితాలే లక్ష్యం కావాలి ‘టెన్త్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి. జిల్లా అగ్రస్థానంలో నిలవాలి. పరీక్షల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. పరీక్ష కేంద్రానికి అర గంట ముందే చేరుకోవాలి. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికావొద్దు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాం’ అని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు టెన్త్ పరీక్షల నేపథ్యంలో ‘సాక్షి ’కి సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో డీఈఓ వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే.. – సాక్షి, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 15,337 మంది విద్యార్థులు పదో పరీక్షలు రాయనున్నారు. బాలురు 7,700, బాలికలు 7,637 మంది ఉన్నారు. వీరి కోసం 82 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశాం. జిల్లాకు ఇప్పటికే ప్రశ్నపత్రాలు రావడంతో వాటిని ఆయా పరీక్ష కేంద్రాల పరిధిలోని పోలీస్స్టేషన్లలో భద్రపరిచాం. సీసీ కెమెరా నిఘాలో సీల్ తీసి, పరీక్ష ముగిసిన తర్వాత అదేచోట జవాబు పత్రాలను సీల్ వేసి తపాలా కార్యాలయం ద్వారా కేటాయించిన చిరునామాకు రిజిస్టర్ పోస్ట్ చేయనున్నాం. జిరాక్స్ కేంద్రాలు మూసివేస్తాం పరీక్ష కేంద్రాల వద్ద పరీక్ష సమయాల్లో జిరాక్స్ కేంద్రాలను మూసివేస్తాం. 82 మంది సీఎస్లు, 20 మంది విద్యార్థులకు చొప్పున ఒక్కో ఇన్విజిలేటర్లను ఇలా 848 మందిని నియమించాం. ఇప్పటికే సీఎస్లకు శిక్షణ ఇచ్చాం. పరీక్షల జిల్లా కమిటీ, సిట్టింగ్ స్క్వాడ్, ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్లు నిరంతరం పర్యవేక్షిస్తుంటుంది. ఎవరైనా నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటాం. ఆరు సబ్జెక్టులు.. ఏడు పరీక్షలు ఆరు సబ్జెక్ట్లు ఏడు పేపర్లలో పరీక్షలు జరగనున్నాయి. దీనిపై ముందుగానే విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కల్పించి ప్రీ ఫైనల్ పరీక్షలు సైతం నిర్వహించాం. ఉదయం 9:30గంటల నుంచి మధ్యాహ్నం 12:30గంటల వరకు పరీక్షలు ఉండనున్నాయి. భౌతిక, జీవశాస్త్రం రెండు పేపర్లు ఉదయం 9:30గంటల నుంచి 11:30గంటల వరకు జరగనున్నాయి. నిమిషం నిబంధనను సడలించిన నేపథ్యంలో పరీక్ష ప్రారంభమైన తర్వాత 5 నిమిషాల వరకు మాత్రమే పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తాం. ఒత్తిడికి గురికావద్దు విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలి. విద్యార్థులు మొదట ప్రశ్నపత్రంను పూర్తిగా చదవాలి. ఆ తర్వాత వచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయాలి. తర్వాత రానీ వాటి గురించి ఆలోచించాలి. తల్లిదండ్రులు వారికి పోషక విలువలు కలిగిన ఆహారం అందించాలి. ఇప్పటికే ప్రత్యేక తరగతులు నిర్వహించాం. గత సంవత్సరం పదో తరగతి పరీక్షలకు సంబంధించిన సెట్–2తో ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించాం. అలాగే చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ఫోకస్ పెట్టి, ప్రత్యేక తరగతులు నిర్వహించాం. ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా.. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఉత్తీర్ణతలో 2022–23, 2023–24లలో రాష్ట్ర స్థాయిలో 2వ స్థానం, గత సంవత్సరం 25వ స్థానం సాధించాం. ఈ సారి టాప్ త్రీ స్థానాల్లో ఉండే విధంగా విద్యాభోధన అందించాం. ప్రతి పరీక్షకు 3, 4 రోజుల విరామం ఉంటుంది. పరీక్షల సమయంలోనూ ప్రత్యేక తరగతులు కొనసాగుతాయి. ‘సాక్షి’తో డీఈఓ శ్రీనివాస్రెడ్డిపరీక్ష సమయాల్లో ఆర్టీసీ బస్సులు పదో తరగతి పరీక్షల నిమిత్తం జిల్లా కో ఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని ఇప్పటికే కలెక్టర్ హైమావతి ఏర్పాటు చేశారు. పరీక్షల సందర్భంగా విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకునేందుకు.. మళ్లీ ఇంటికి చేరేందుకు ఆ సమయాల్లో బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులకు, పరీక్ష కేంద్రాల వద్ద వైద్య సిబ్బంది, తాగునీటి ఏర్పాట్లు చేయాలని ఆయా అధికారులను కలెక్టర్ అదేశించారు. -
మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
‘ప్రగతి ప్రణాళిక’ను పక్కాగా చేపట్టాలి సిద్దిపేటరూరల్: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలోని కార్యక్రమాలు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జిల్లా వ్యాప్తంగా పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో అధికారులతో ప్రజా పాలన ప్రగతి ప్రాణాళిక కార్యక్రమం అమలుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ శాఖల వారీగా నిర్దేశించిన కార్యక్రమాలను పర్యవేక్షించాలన్నారు. అన్ని సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూల్స్, ఇతర విద్యాసంస్థలలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి శుభ్రం చేయాలన్నారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో వాహనాల డ్రైవర్లకు వైద్యారోగ్యశాఖ సహాకారంతో కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీరు సమస్య తలెత్తకుండా గ్రామాల్లో, మున్సిపాలిటీలలో ఏర్పాట్లు చేయాలని, గృహ అవసరాలకు , వ్యవసాయ అవసరాలకు సరఫరా చేస్తున్న విద్యుత్ స్తంభాలు , విద్యుత్ వైర్లను సరిచేయాలన్నారు. ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు తీసుకోవాలన్నారు. 14 నుంచి 15 సంవత్సరాలలోపు పిల్లలకు జిల్లా వ్యాప్తంగా హెచ్పీవి వ్యాక్సినేషన్ చేయించాలన్నారు. 12న ప్రగతి ప్రణాళికా కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించాలన్నారు.సిద్దిపేటఅర్బన్: ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అందించే వివిధ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలని కలెక్టర్ హైమావతి అన్నారు. సోమవారం అర్బన్ మండలం ఎల్లుపల్లి శివారులోని జిల్లా మహిళా సమాఖ్య భవనంలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మహిళలో ఉన్న శక్తి సామర్థ్యాలను తెలుసుకొని రాణించాలన్నారు. మీ పిల్లలను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దాలని సూచించారు. క్రమశిక్షణ, పట్టుదలతో పనిచేసి ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. అనంతరం ఖరీఫ్, రబీ సీజన్ ధా న్యం మార్కెంటింగ్ కమిషన్ డబ్బులకు సంబంధించిన రూ. 12.36 కోట్ల చెక్కును మహిళా సమాఖ్య సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో డీఆర్డీఓ జయదేవ్ఆర్య, డీఆర్ఓ నాగరాజమ్మ, డీఏఓ స్వరూపరాణి, డీహెచ్ఎస్ఓ సువర్ణ, కోఆపరేటివ్ అధికారి వరలక్ష్మి, తూనికలు, కొలతల శాఖ అధికారి, మహి ళా సమాఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
కంప్యూటర్ విద్యతో ఉపాధి అవకాశాలు
హుస్నాబాద్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ స్కిల్స్పై సర్టిఫికెట్ కోర్సు రెండో బ్యాచ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ భిక్షపతి మాట్లాడుతూ ఆధునిక జీవన విధానంలో కంప్యూటర్ విద్య అనేది తప్పనిసరి అని తెలిపారు. ఏ కోర్సు అయినా రెండు నెలల పాటు శిక్షణ ఉంటుందని తెలిపారు. శిక్షణ అనంతరం విద్యార్థుల ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. ఈ సదవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కోర్సు కో ఆర్డినేటర్ డాక్టర్ చంద్రమౌళి, అధ్యాపకులు తదితరులు ఉన్నారు. మెగా మేళాలో పట్టు రైతులు చిన్నకోడూరు(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం నగరంలోని రాజేంద్రనగర్లో ఏర్పాటు చేసిన మెగా రైతు మేళాకు సోమవారం మండల పరిధిలోని చంద్లాపూర్ పట్టు రైతులు తరలివెళ్లారు. రైతు మేళాలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. పట్టు పరిశ్రమ శాఖ ఉమ్మడి మెదక్ జిల్లా డైరెక్టర్ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ పట్టు రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీలు, ప్రోత్సాహకాలు వివరించారు. పట్టు సాగులో తీసుకోవాల్సిన మెలకువలు వివరించారు. కార్యక్రమంలో అధికారులు ఐలయ్య, పట్టు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింహులు, రైతులు ఉన్నారు. నేడు మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ గజ్వేల్రూరల్: విద్యార్థులకు ఉద్యోగావకాశాలను కల్పించేందుకు మంగళవారం మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ను నిర్వహిస్తున్నట్లు గజ్వేల్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అనిత అబ్రహం పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని బాలికల ఎడ్యుకేషన్ హబ్లోగల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ శోభారాణితో కలిసి ఆమె మాట్లాడారు. ప్రముఖ కంపెనీలు ఈ డ్రైవ్లో పాల్గొనున్నట్లు తెలిపారు. ఇంటర్, డిగ్రీ, పీజీతో పాటు ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న వారు అర్హులన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఉదయం 10గంటలకు కళాశాలలో జరిగే ప్లేస్మెంట్ డ్రైవ్కు హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు 8985710323 నంబర్లో సంప్రదించాలన్నారు. స్వచ్ఛ పట్టణంగా మార్చుదాం మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ సిద్దిపేటజోన్: సమష్టిగా పనిచేసి సిద్దిపేటను స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దుదామని మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం ప్రజా పాలన–ప్రగతి పాలన ప్రణాళికలో భాగంగా సోమవారం ఆయన పలు పార్కులు ప్రకృతి వనాలు సందర్శించారు. మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్, అధికారులు, సిబ్బంది చీపురు పట్టి శుభ్రం చేశారు. ఎండిపోయిన పిచ్చి మొక్కలు, గడ్డి తొలగించారు. కాలనీ వాసులకు పలు సూచనలు చేశారు. -
వినతుల వెల్లువ
● సమస్యల పరిష్కారానికి ప్రజావాణి బాట ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ ● వివిధ సమస్యలపై 169 దరఖాస్తులుసాక్షి, సిద్దిపేట: జిల్లాలో ప్రజల పలు సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి బాట పడుతున్నారు. తమ గోడును విన్నవించుకునేందుకు ఉదయం 9గంటలకే జిల్లా కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలపై 169 మంది వినతులను అందజేశారు. సోమవారం ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ లతో కలిసి కలెక్టర్ హైమావతి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన అర్జీలను సత్వరంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రజలు తమ సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మకంతో ప్రజావాణి కార్యక్రమానికి వచ్చేసి అందజేసిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హతల మేరకు వెంటనే పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్ఓ నాగ రాజమ్మ, ఏఓ రాజ్ కుమార్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు ట్రై సైకిల్ ఇప్పించండి సారూ.. మేసీ్త్ర పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న నాకు.. ఒక రోజు ఎడుమ కాలుకు ఇన్ఫెక్షన్ వచ్చింది. దీంతో ఆస్పత్రికి వెళ్తే.. షుగర్ ఎక్కువ ఉండటం.. ఇన్ఫెక్షన్ ఎక్కువ కావడంతో కాలును తొలగించారు. ఇటీవల నారాయణ సేవా సంస్థ వారు కృత్రిమ కాలు పెట్టించారు. కానీ నడవాలంటే ఇబ్బంది అవుతోంది. బ్యాటరీ ట్రై సైకిల్ ఇప్పించండి సారూ.. అని ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నా. – వద్దిరాల ఐలయ్య, పందిళ్ల, హుస్నాబాద్ -
సమైక్యతకు ప్రతీక రంజాన్
● ఇఫ్తార్ విందుకు నాంది ఇక్కడే.. ● మాజీ మంత్రి హరీశ్రావు సిద్దిపేటజోన్: ‘మతసామరస్యానికి ప్రతీకగా రంజాన్ నిలుస్తోంది. ఇఫ్తార్ విందు సిద్దిపేట ప్రాంతంలోనే మొదలైంది. సరిగ్గా 35 ఏళ్ల క్రితమే కేసీఆర్ స్వగ్రామమైన చింత మడకలో ప్రారంభించి, నేడు దేశ వ్యాప్తంగా నడుస్తోంది’ అని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ఎక్బాల్ మినార్ దర్గాలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేసి చదార్ సమర్పించారు. అనంతరం మైదానంలో తన ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట హిందూ ముస్లిం ఐక్యతకు నిదర్శనమన్నారు. అన్ని వర్గాల సంక్షేమం లక్ష్యంగా కేసీఆర్ పాలన సాగిందన్నారు. రంజాన్ పండుగకు అధికార గుర్తింపు ఇచ్చి తోపాలు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ముస్లిం దోస్త్ బీఆర్ఎస్.. అంతకుముందు మాజీ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ ముస్లిం దోస్త్ బీఆర్ఎస్ అని, కేసీఆర్, హరీశ్రావులు ముస్లిం సంక్షేమం కోసం పాటుపడినట్లు తెలిపారు. పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి. మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్, మైనార్టీ నాయకులు మోహిజ్, నయ్యర్, హమీద్, వజీర్ తదితరులు పాల్గొన్నారు. -
‘భోజనం’పై రాజీపడొద్దు
హుస్నాబాద్: ప్రభుత్వం రూపొందించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, ఆహారం విషయంలో రాజీ పడొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్లోని సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల(బెజ్జంకి)ను సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. మధ్యాహ్నం భోజనంలో వడ్డిస్తున్న మెనూ పరిశీలించారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయని, బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్ధులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆస్పత్రి నిర్మాణ పనుల పరిశీలన హుస్నాబాద్లో కొత్తగా నిర్మిస్తున్న 250 పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణ పనులను కలెక్టర్ హైమావతితో కలిసి మంత్రి పరిశీలించారు. జీ ప్లస్ 5 లో ఒక్కోఫ్లోర్ 30 వేల చదరపు అడుగులతో అధునాతన సాంకేతిక టెక్నాలజీతో ఆస్పత్రిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పిల్లర్ల దశకు చేరుకున్న ఆస్పత్రి పనులు వచ్చే ఏడాది లోపు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచండిహుస్నాబాద్రూరల్: బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచితే గ్రామాభివృద్ధికి కావాల్సిన నిధులు తెచ్చే బాధ్యత నాదేనని మంత్రి పొన్నం అన్నారు. సోమవారం మండల పరిషత్లో కలెక్టర్ హైమా వతి అధ్యక్షతన ప్రగతి ప్రణాళిక అంశాలపై సర్పంచ్లు, అధికారులతో చర్చించారు. మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, గ్రామాలు అభివృద్ధి చేందాలంటే ముందుగా సర్పంచ్లు బడిలో పిల్లలను చేర్పించాలని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రజలకు వైద్య సేవలు అందించడానికి గ్రామాల్లో వైద్య శిబిరాలను నిర్వహిస్తామన్నారు. నాణ్యమైన ఆహారంఅందించాలి -
కంది రైతుల రంది!
సిద్దిపేట యార్డులో పడిగాపులు సిద్దిపేట యార్డులో కందులు కంది రైతుకు తిప్పలు తప్పడం లేదు. మార్కెట్ యార్డులో మద్దతు ధర కోసం వస్తే పట్టించుకునే నాథుడు కరువయ్యారు. కంది గింజలతో రోజుల కొద్దీ అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. ఓపిక నశించి ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో ప్రభుత్వ కొనుగోళ్లకు దీటుగా దళారులు కంది పంటనుచేజిక్కించుకున్నారు. సిద్దిపేటజోన్: జిల్లాలో వ్యవసాయ శాఖ రికార్డుల ప్రకారం.. 6,606 ఎకరాల్లో కంది పంట సాగు అయింది. దీనితో ప్రభుత్వం కందుల కొనుగోలు ప్రక్రియలో భాగంగా సిద్దిపేట గజ్వేల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. క్వింటాలు కందుల ధర రూ 8వేలు మద్దతు ధర ప్రకటించారు. అత్యధికంగా సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని 15మండలాల్లో కందుల సాగు ఉంటుంది. రోజుల కొద్దీ కందికి మద్దతు ధర అందించే సదుద్దేశంతో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు రైతులకు నిరాశకు గురి చేస్తున్నాయి. సిద్దిపేట యార్డులో కంది పంట కొనుగోలు కోసం రోజుల కొద్దీ పడిగాపులు కాసే పరిస్థితి నెలకొంది. నాణ్యత నిబంధనలు పేరిట అధికారులు కంది గింజలను తిరస్కరించడంతో చేసేదిలేక నాలుగు సార్లు యార్డులో అర పెట్టాల్సి వస్తుంది. గింజలను పరిశీలిస్తున్న సిబ్బంది ఇష్టానుసారంగా సమయపాలన పాటించడంతో రైతులు వారి కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. జనవరి 29న సిద్దిపేట యార్డులో కేంద్రం ఏర్పాటు చేయగా ఇప్పటివరకు 45 మంది రైతుల వద్ద కేవలం 1350 క్వింటాళ్ల కందులు కొనుగోలు చేశారు. సిద్దిపేట యార్డులో ప్రభుత్వం కందుల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినప్పటికీ ఇక్కడ దళారులదే పై చేయి అని చెప్పాలి. ఇప్పటివరకు 1,111 రైతుల వద్ద 3,379 క్వింటాళ్ల కందులు ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేశారు. మొదట్లో నాలుగు వేలకు కొనుగోలు చేసిన వ్యాపారులు ప్రభుత్వ కేంద్రం ఏర్పాటు తర్వాత కనిష్టంగా 6,800 గరిష్టంగా 7,300 ధరకు కొనుగోలు చేస్తున్నారు. అయినా క్వింటాలు కందికి రూ 700 లాభం అర్జిస్తున్నారు. తప్పని కొనుగోలు తిప్పలు నిబంధనల పేరిట కొర్రీలు దిక్కులేని పరిస్థితుల్లో ప్రైవేట్ వైపు.. -
సమన్వయంతో పనిచేయండి
మెదక్జోన్/మెదక్ కలెక్టరేట్: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సమన్వయంతో నిర్వహించి ఉమ్మడి మెదక్ జిల్లాను టాప్లో నిలపాలని జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మెదక్ కలెక్టరేట్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మూడు జిల్లాల కలెక్టర్లు, జిల్లాల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల అమలుతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, ఇతర సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఉమ్మడి జిల్లాకు తాగు, సాగు నీటిని అందించే సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల కారణంగా, ఈ వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా ముందుస్తు చర్యలు చేపట్టాలన్నారు. పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అంతకుముందు ప్రజాప్రతినిధులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.ఉమ్మడి మెదక్ జిల్లాను టాప్లో నిలపండి ఇన్చార్జి మంత్రి వివేక్ కలెక్టరేట్లో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశం -
సమస్యల కూత!
రైల్వేస్టేషన్లలో కనీస వసతులు కరువు గజ్వేల్ రైల్వేస్టేషన్లో పిల్లర్ల స్థాయిలోనే నిలిచిపోయిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు గజ్వేల్: మనోహరాబాద్–గజ్వేల్–సిద్దిపేట మార్గంలోని రైల్వేస్టేషన్లలో కనీస సౌకర్యాలు లేక ప్రయాణికులు నానా ఇక్కట్లు పడుతున్నారు. తాగునీరు మొదలుకొని ఇతర కనీస వసతులు కరువయ్యాయి. ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం జరగకపోవడంతో ట్రాక్లు దాటడం ప్రమాదకరంగా మారింది. 50 శాతం వరకు పనులు పూర్తి మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు 151.36 కిలోమీటర్ల పొడవున న్యూబ్రాడ్గేజ్ లైన్న్ నిర్మాణం జరుగుతుండగా.. రూ. 1160.47 కోట్లను వెచ్చిస్తున్నారు. 2017లో ఈ పనులు ప్రారంభమయ్యాయి. ఈ లైన్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్న్నుంచి మనోహరాబాద్ మీదుగా కొత్తపల్లి వరకు, అక్కడి నుంచి పెద్దపల్లి గ్రాండ్ ట్రంక్ లైన్నతో అనుసంధానం కానుంది. ఫలితంగా ఈ లైన్ హైదరాబాద్, ఢిల్లీ, కలకత్తా లాంటి మహా నగరాలను కలుపుతూ జాతీయ లైన్గా ఆవిర్భవించనుంది. ఉత్తర తెలంగాణలోని సిద్దిపేట జిల్లాతో పాటు మెదక్, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు భారీ ప్రయోజనం చేకూరనుంది. మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మీదుగా సిద్దిపేట వరకు 74 కిలోమీటర్ల మేర.. అంటే మొత్తం లైన్ పొడవులో 50 శాతం వరకు పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రస్తుతం సిరిసిల్ల వైపునకు పనులు సాగుతున్నాయి. కాగా 2023 అక్టోబర్ 3న ప్యాసింజర్ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే.ట్రాక్లు దాటాలంటే నరకమే ఈ లైన్పై మనోహరాబాద్ తర్వాత నాచారం(స్టేషన్), అప్పాయిపల్లి (హాల్ట్), గజ్వేల్ (స్టేషన్), కొడకండ్ల (హాల్ట్), లకుడారం (స్టేషన్), కొమురవెల్లి (హాల్ట్), దుద్దెడ (స్టేషన్), సిద్దిపేట(స్టేషన్) ఉన్నాయి. స్టేషన్లతో పాటు హాల్ట్ స్టేషన్లలోనూ కనీస వసతులు కరువయ్యాయి. గజ్వేల్లో ప్రయాణికులు ట్రాక్పై ఒకవైపు నుంచి మరోవైపునకు వెళ్లేందుకు ప్రారంభించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు పిల్లర్ల దశలో నిలిచిపోయాయి. ఫలితంగా ట్రాక్ను దాటడం ప్రమాదకరంగా పరిణమించింది. నాచారం స్టేషన్ గ్రామానికి సుమారుగా రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడికి వెళ్లేందుకు రోడ్డు సక్రమంగా లేక ఇబ్బందులు తప్పడం లేదు. లకుడారం, దుద్దెడ స్టేషన్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు ఆయా స్టేషన్లలో ప్రయాణికులకు కనీస తాగునీటి వసతి కూడా సక్రమంగా లేదు. పారిశుద్ధ్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో వాష్రూమ్లు వాడకంలో లేవు. మరోవైపు ఏ స్టేషన్లోనూ తగినంత సిబ్బంది లేరు. హాల్ట్ స్టేషన్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. నిర్వహణ లేక ఈ స్టేషన్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. కాగా ఈ మార్గంలో నడుస్తున్న రైలు వేగం పెంచకపోవడంతో ప్రయాణికుల్లో ఆసక్తి తగ్గుతుంది. -
తపస్పల్లికి నీరు మళ్లిస్తే
తడాఖా చూపిస్తాంనంగునూరు(సిద్దిపేట): రంగనాయకసాగర్ నీటిని తపస్పల్లికి మళ్లిస్తే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. నంగునూరు మండలంలోని ఎల్డీ 10 కాలువ వద్ద ఓటీఆర్ పనులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ అధ్యక్షుడు లింగంగౌడ్ ఆధ్వర్యంలో రైతులు శుక్రవారం ఇరిగేషన్ ఎస్ఈ ఎస్ఈకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ శ్రీకాంత్రెడ్డి, సోమిరెడ్డి మాట్లాడుతూ ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి రంగనాయక సాగర్ నీటిని తరలించేందుకు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డిపై ఒత్తిడి తేవడం మానుకోవాలని చెప్పారు. గతంలో తపాస్పల్లి కాలువ నిర్మాణం కోసం తాము భూములు కోల్పోయామని, ఇప్పుడు నీటిని తరలిస్తే నంగునూరు మండలంలోని ఏడు వేల ఎకరాల్లో పంటలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. నాడు కాలువ పూర్తి కాకుండా కమలాయపల్లి రైతులు అడ్డుకోగా.. ఇప్పుడు కాల్వ ఎలా తీస్తారని ప్రశ్నించారు. రెండు సంవత్సరాల కిందట నీటిని తరలించేందుకు ఎంపీ కుట్ర పన్ని రెండు ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చు పెట్టడంతో అల్లర్లు జరిగాయని గుర్తు చేశారు. ఎంపీ చామల తమ ప్రయత్నాలను మానుకోవాలని, లేకుంటే ఉద్యమం తప్పదని హెచ్చ రించారు. ఒక ప్రాంతానికి నీరు తరలించి.. భూములు కోల్పోయిన తమకు నష్టం చేకూ ర్చడం సమంజసమని వారు ప్రశ్నించారు. ఒకవేళ నీటిని మళ్లించేందుకు యత్నిస్తే అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. -
సమస్యల పరిష్కారానికి ‘ప్రగతి ప్రణాళిక’
మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గజ్వేల్: మున్సిపాలిటీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’దోహదపడుతుందని మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. శుక్రవారం 99రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గంగిశెట్టి చందనతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాల్లో పాలన తీరు మెరుగుపరచడంతోపాటు పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. కాగా 16వార్డులో శిథిలావస్థలో ఉన్న మొండి గోడలను తొలగించాలని మున్సిపల్ చైర్పర్సన్, అధికారులు నిర్ణయించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్, వైస్ చైర్పర్సన్ కళ్యన్కర్ పద్మాబాయి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. పాఠశాల తనిఖీప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాలను శుక్రవారం జిల్లా న్యాయసేవాఽధికార సంస్థ కార్యదర్శి సంతోష్కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులను, పాఠశాల ఆవరణను పరిశీలించారు. పాఠశాలలోని మరుగుదొడ్లు, భోజనశాలను, స్టాక్ రూంలో ఉన్న ఆహార పదార్థాలను పరిశీలించారు. అంతకు ముందు పాఠశాల విద్యార్థులకు న్యాయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు న్యాయ సంబంధిత విషయాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్రావు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు. ముందస్తు గుర్తింపుతో వైకల్య నివారణ – డీఎంహెచ్ఓ ధనరాజ్ సిద్దిపేటకమాన్: పిల్లల్లో ముందస్తుగా వైకల్యాలను గుర్తించి వాటిని నివారించవచ్చని డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ తెలిపారు. ఐఏంఏ హాల్లో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఏఎన్ఎంలకు శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లల్లో ఏమైనా వైకల్యాలు ఉంటే స్క్రీనింగ్ ద్వారా గుర్తించి అవసరమైన చికిత్స అందిస్తామన్నారు. జాతీయ మేధో దివ్యాంగుల స్వాధికార సంస్థ ద్వారా అవసరమైన డిజిటల్ పరికరాలు అందింస్తారని చెప్పారు. స్క్రీనింగ్కు సంబంధించిన కిట్లను వైద్య సిబ్బందికి అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ వినోద్బాబ్జి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
హెచ్పీవీ టీకా భవిష్యత్కు భరోసా
కలెక్టర్ కె.హైమావతి సిద్దిపేటరూరల్: హెచ్పీవీ టీకా బిడ్డ భవిష్యత్కు రక్షణ కవచమని కలెక్టర్ కె.హైమావతి పేర్కొన్నారు. శుక్రవారం తన చాంబర్లో హెచ్పీవీ వ్యాక్సినేషన్కు సంబంధించిన పోస్టర్ను డీఎంహెచ్ఓ, ప్రోగ్రాం ఆఫీసర్తో ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గజ్వేల్, జీజీహెచ్ సిద్దిపేట, దుబ్బాక ఏరియా ఆసుపత్రి, సీహెచ్సీ హుస్నాబాద్లో 14 సంవత్సరాల వయసు గల బాలికలకు ఉచితంగా టీకాను వేస్తారన్నారు. తద్వారా బాలికలు గర్భాశయ క్యాన్సర్ నుంచి రక్షణ పొందవచ్చన్నారు. రుతుస్రావం అవుతున్నప్పటికి తీసుకోవచ్చన్నారు. టీకా తీసుకోవడం వల్ల ఎటువంటి దుష్ఫ్రభావాలు ఉండవని, ఇది పూర్తిగా సురక్షితమని పేర్కొన్నారు. మార్చి 31వ తేదీ వరకు టీకా తీసుకునే విధంగా తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ దీప్తి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మెరుగైన వైద్యం అందించాలి దుబ్బాకరూరల్: మండలంలోని తిమ్మాపూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందించే వైద్య సేవలను పరిశీలించారు. 99రోజుల కార్యాచరణ నిర్వహణ గురించి ప్రజలకు తెలిసేలా ఒక బ్యానర్ పెట్టుకోవాలని సూచించారు. అటెండెన్స్, ఓపీపీ రిజిస్టర్ పరిశీలించారు. ఆస్పత్రి సిబ్బంది సమయపాలన పాటిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. రోగులకు మెరుగైన వైద్యం అందించేలా కృషి చేయాలని వైద్యులకు సూచించారు. -
హరీష్ రావుపైనే మా అమ్మ పోటీ.. కవిత కుమారుడు ఆదిత్య
ప్రశాంత్నగర్ (సిద్దిపేట): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అమ్మ (కల్వకుంట్ల కవిత) సిద్దిపేట నుంచే పోటీ చేస్తుందని ఎమ్మెల్సీ కవిత కుమారుడు ఆదిత్య అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతకుముందు జాగృతి నాయకులు ఘనస్వాగతం పలికారు. మే నెలలో కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు ఆదిత్య తెలిపారు. -
‘ద్వార’ బంధనం
నాచగిరి, విద్యాధరి ఆలయాలు మూసివేత వర్గల్(గజ్వేల్): చంద్ర గ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం జిల్లాలోని సుప్రసిద్ధమైన నాచగిరి శ్రీలక్ష్మీ నృసింహస్వామి, వర్గల్ విద్యాధరి ఆలయాలకు ద్వార బంధనం చేశారు. బుధవారం ఉదయం సంప్రోక్షణ, అభిషేకం అనంతరం ఆలయాలలోకి యథావిదిగా భక్తులకు అనుమతి కల్పిస్తారని ఆలయ వేదపండితులు పేర్కొన్నారు. రైల్వే జీఎంకు ఎంపీ రఘునందన్రావు వినతి మెదక్జోన్: మెదక్ లోక్సభ పరిధి పెండింగ్లో ఉన్నా రైల్వే పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. మంగళవారం రైల్వే జీఎం సంజయ్కుమార్ శ్రీవాస్తవను కలిసి పెండింగ్ పనులపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. చేగుంట–మెదక్ ప్రధాన రహదారి వద్ద మంజూరైనా రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్ఓబీ) నిర్మాణంతో పాటు మెదక్ రైల్వేస్టేషన్లో కొనసాగుతున్న అమృత్ పనులపై చర్చించినట్లు చెప్పారు. అలాగే, మెదక్ జిల్లా అక్కన్నపేట్ వద్ద అజంతా, రాయలసీమ ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపాలని జీఎంకు వినతిపత్రం ఇచ్చారు. ఎంఎల్ఆర్ ఆటో పరిశ్రమ వద్ద చెలరేగిన మంటలు మనోహరాబాద్(తూప్రాన్): పరిశ్రమ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు గడ్డి తగలబెట్టడంతో మంటలు అంటుకుంటున్నాయి. మనోహరాబాద్ మండలంలోని ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామిక వాడలో గల ఎంఎల్ఆర్ ఆటో పరిశ్రమల దగ్గరలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు గడ్డిని తగులబెట్టారు. కాగా మంటలు పరిశ్రమ వద్దకు వ్యాపించాయి. గుర్తించిన పరిశ్రమ సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఫైర్ ఇంజన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు మంటలను ఆర్పి భారీ ప్రమాదాన్ని తప్పించారు. కాగా పరిశ్రమలో స్క్రాప్ ధ్వంసమైందని పరిశ్రమ సిబ్బంది తెలిపారు. అటవీ రేంజ్ అధికారి విద్యాసాగర్ రామాయంపేట(మెదక్): పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అటవీ రేంజ్ అధికారి విద్యాసాగర్ పేర్కొన్నారు. వణ్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం స్థానిక సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలలో విద్యార్థుల ర్యాలీ, మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ముందు తరాలకు మంచి వాతావరణం కల్పించే దిశగా మనం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ వేసవిలో అటవీప్రాంతంలో మంటలు వ్యాపించే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు తమకు సహకరించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారిణి గీత పాల్గొన్నారు. -
హుస్నాబాద్లో విస్త‘రణం’
హుస్నాబాద్: చెరువు కోసం రోడ్ల విస్తరణ చేసి పేదల ఇళ్లను కూల్చేస్తే ఊరుకోబోమని స్థానికులు హెచ్చరిస్తున్నారు. హుస్నాబాద్ పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తా నుంచి ఎల్లమ్మ చెరువు వరకు రోడ్ల విస్తరణకు ప్రభుత్వం రూ.2.49 కోట్లు నిధులు మంజూరు చేసింది. కల్వర్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న రోడ్డు 25 ఫీట్ల వెడల్పు ఉంది. విస్తరణలో భాగంగా సెంటర్ పాయింట్ నుంచి ఎటు 40 ఫీట్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు అధికారులు మార్కింగ్ కూడా వేశారు. ఇళ్లకు ఎక్కువ స్థాయిలో నష్టం జరగకుండా తగ్గించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మార్కింగ్తో కొన్ని ఇళ్లు పూర్తిగా కోల్పోతుండగా, మరి కొన్ని సగం వరకు రోడ్డు విస్తరణలో నేలమట్టం కానున్నాయి. రోడ్ల విస్తరణకు మార్కింగ్ ప్రభుత్వం రూ.18కోట్ల వ్యయంతో ఎల్లమ్మ చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. బతుకమ్మ ఘాట్, చెరువు కట్టపై సీసీ రోడ్లు, అందమైన బొమ్మల నిర్మాణాలు, గ్లాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా, మల్లెచెట్టు చౌరస్తా నుంచి ఎల్లమ్మ చెరువు వరకు రోడ్ల విస్తరణ పనులను స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి పెంకుటిల్లు, గుడిసెల్లో నివాసం ఉంటున్నారు. ముందు ఇంటి స్థలంతో పాటు ఇళ్లను కట్టించిన తర్వాతే మా ఇళ్ల జోలికి రావాలని తేగేసి చెబుతున్నారు. కూలీ పనులు చేస్తేనే ఫూట గడిచే పరిస్థితిలో కాలం వెళ్లదీస్తున్నామని, ఇప్పుడు ఇళ్లు తొలగిస్తే ఎటు పోవాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల విస్తరణకు మార్కింగ్ వేసిన అధికారులు ఇల్లు జాగ పోతాంది రోడ్ల విస్తరణ పనులకు అధికారులు మార్కింగ్ చేశా రు. దీంతో మా ఇల్లు, జాగ మొత్తం పోతాంది. మెయిన్ రోడ్లో ఉన్న మమ్ములను ఎక్కడికో తీసుకెళ్తానంటే సాధ్యం కాదు. స్థలం, ఇంటి నిర్మాణ పట్టాలు ఇచ్చిన తర్వాతే మా ఇళ్లను ముట్టుకోవాలి. – రేణుక, హుస్నాబాద్చెరువు కట్టపైనే ఇల్లు నిర్మించాలి అరవై ఏళ్ల నుంచి ఈ ఇంట్లోనే బతుకుతన్న, దిక్కు లేని అనాథను. వెను కా ముందు ఎవరు లేరు. ఇప్పుడు ఇల్లు కూల్చివేస్తే ఎక్కడికి పోవాలే. ఎల్లమ్మ చెరువు కట్టపై ఇళ్లు కట్టించాలి. లేదంటే ఇళ్లను కూల్చనివ్వం. –లచ్చమ్మ, హుస్నాబాద్ -
గర్భస్రావాలు
ఆందోళన కలిగిస్తోన్నగర్భస్రావం (మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ–ఎంటీపీ) కేసుల నమోదు వృద్ధి రేటు తెలంగాణలో గణనీయంగా పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. ఐదేళ్లలో ఏకంగా 900% పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2024–25లో రాష్ట్రవ్యాప్తంగా 16,059 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అథారిటీ (డీసీఏ) రాష్ట్రంలో గర్భ నిరోధక మాత్రల వినియోగంపై దృష్టి సారించింది. అన్వాంటెడ్ కిట్గా పిలుచుకునే ఈ మాత్రలు హిమాచల్ప్రదేశ్, గోవా వంటి రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నట్లు డీసీఏ గుర్తించింది. ఈ మాత్రల వినియోగంపై జిల్లాల్లోని డ్రగ్ ఇన్స్పెక్టర్ల ద్వారా ఆరా తీస్తోంది. ఈ అన్వాంటెడ్ కిట్స్ ఏయే మెడికల్ ఏజెన్సీలకు సరఫరా అయ్యాయి? వాటిని ఏ మెడికల్ షాపులకు విక్రయించారు? లేదా ఆస్పత్రులకు పంపారు? ఈ మాత్రలు ఎవరికి ఇచ్చారు? వంటి వివరాలను డ్రగ్ ఇన్స్పెక్టర్లు సేకరిస్తున్నారు. ప్రతి నెలా కనీసం 15 మెడికల్ షాపులనైనా చెక్ చేస్తున్నామని మెదక్ జిల్లాకు చెందిన ఓ డ్రగ్ ఇన్స్పెక్టర్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. – సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి నిబంధనలకు విరుద్ధంగా వినియోగం గర్భస్రావం మాత్రలు నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఈ మాత్రలను మెడికల్ షాపుల్లో విక్రయించడానికి వీలు లేదు. గైనకాలజీ వైద్యసేవలందించే ఆస్పత్రులు మాత్రమే వీటిని వినియోగించాలి. కానీ, రాష్ట్రంలో వీటి వినియోగం విచ్చలవిడిగా సాగుతోందనే విమర్శలున్నాయి. పీఎంపీలు, ఆర్ఎంపీల సూచనల మేరకు వీటిని వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అలాగే గర్భందాల్చిన నిర్ణీత సమయంలోపే వీటిని వినియోగించాలి. కానీ నెలలు నిండాక కూడా వీటిని వాడటంతో తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. కొందరైతే ఏకంగా ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరైతే శాశ్వతంగా మాతృత్వాన్ని కోల్పోతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. పల్లెల్లోనూ అన్వాంటెడ్ కిట్ల వినియోగం దృష్టి పెట్టిన డ్రగ్ కంట్రోల్ అథారిటీ తనిఖీలు చేస్తున్న డ్రగ్ ఇన్స్పెక్టర్లు నగరాల్లో అత్యధికంగా నమోదుగర్భస్రావాల కేసులు పల్లె పట్టణం అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి వంటి జిల్లాల్లో ఎక్కువగా ఎంటీపీ కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడ ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు ఉండటమే కారణమని భావిస్తున్నారు. ఈ మూడు జిల్లాలో ఏటా సగటున 2,500 నుంచి 5,200 కేసులు నమోదవుతుండటం గమనార్హం. గ్రామీణ, అత్యంత మారుమూల ప్రాంతాలైన ఆసిఫాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో ఏటా 100 నుంచి 300 కేసులు రికార్డవుతున్నాయి. ఇక్కడ సరైన స్పెషలిస్టు వైద్యుల సంఖ్య తక్కువగా ఉండటంతో సమీప పట్టణాలకు వెళ్లి చికిత్స తీసుకుంటున్నారని వైద్యారోగ్యశాఖ భావిస్తోంది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఏటా 1000 కేసులు నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
దుబ్బాకకు నిధుల వరద
సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు రూ.1.7 కోట్లు మంజూరు దుబ్బాక: పల్లెల్లో పూర్తిగా అధ్వానంగా తయారైన రోడ్లు, మురికి కాల్వల నిర్మాణాలకు ఎట్టకేలకు నిధులు మంజూరయ్యాయి. పలు గ్రామాల్లో రహదారులు, మురికి కాల్వల నిర్మాణాలకు ఉపాధిహామీ పథకం (ఎన్ఆర్ఇజీఎస్) కింద పనులు చేపట్టనున్నారు. దుబ్బాక నియోజకవర్గంలోని 17 గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు రూ.1.7 కోట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు పనులు ప్రారంభించేందుకు కలెక్టర్ హైమావతి పరిపాలన ఉత్తర్వులు ఇచ్చారు. దుబ్బాక మండలంలోని రామక్కపేట, పెద్దగుండవెల్లి, శిలాజీనగర్ గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున, మిరుదొడ్డి మండలం మిరుదొడ్డి, కొండాపూర్, అందె, మల్లుపల్లి గ్రామాలకు రూ.10 లక్షలు చొప్పున, భూంపల్లి–అక్బర్పేట మండలం రుద్రారం గ్రామానికి రూ.15 లక్షలు, మోతె, చిన్ననిజాంపేట గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున, దౌల్తాబాద్ మండలం ముత్యంపేట, ముబరాస్పూర్, తొగుట మండలంలోని వర్దరాజుపల్లి, రాయపోల్ మండలంలోని ఆరపల్లి, కొత్తపల్లి, వడ్డెపల్లి గ్రామాలకు 10 లక్షల చొప్పున, టెంకంపేటకు రూ.5 లక్షల నిధులు మంజూరయ్యాయి. కాగా, నిధులు మంజూరు చేయించిన ఎంపీ రఘునందన్రావుకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. -
దూది రైతు దుఃఖం
సాక్షి, సిద్దిపేట: పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఓ వైపు దిగుబడి తగ్గి.. మరోవైపు మద్దతు ధర దక్కక.. సీసీఐ నిబంధనలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అధిక వర్షాలతో కొంత పత్తి నల్లబారినా, తేమ ఎక్కువ ఉంటే సీసీఐ కొనుగోలు చేయకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించారు. జిల్లాలో ఇప్పటివరకు 81,321 మెట్రిక్ టన్నుల పత్తి మాత్రమే విక్రయించారు. ఎకరాకు ఆరేడు క్వింటాళ్లే దిగుబడి 2025–26లో వానకాలంలో 1,18,785 ఎకరాల్లో పత్తి సాగైంది. అధికారుల అంచనా ప్రకారం ఎకరానికి 10 క్వింటాళ్ల చొప్పున లెక్కించినా 1.18 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా పత్తి రావాలి. అలాంటిది ఎకరానికి దాదాపు 6 నుంచి 7 క్వింటాళ్లే దిగుబడి వచ్చినట్లు పత్తి విక్రయాలను బట్టి తెలుస్తోంది. అధిక వర్షాలతో పత్తి రైతు నష్టపోయారు. పత్తి ఏరే సమయంలో ఎండ ఎక్కువ ఉండాలి. మబ్బులు పట్టడంతో పత్తికాయలు పగలలేదు, కొన్ని చోట్ల పత్తికాయలు చెట్ల మీదనే కుళ్లిపోయాయి. పత్తికాయల్లో తేమ శాతం పెరగడంతో నల్లబారి మొలకలు సైతం వచ్చాయి. పత్తి తగ్గడమే కాకుండా నాణ్యత సైతం దెబ్బతింది. రెండేళ్ల కంటే తగ్గిన దిగుబడి ఇటీవల సీసీఐ కొనుగోళ్లు ముగిశాయి. 57,949 మంది రైతుల నుంచి 74,146 మెట్రిక్ టన్నుల పత్తిని సీసీఐ కొనుగోలు చేసింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు రూ.8,110 చాలామంది రైతులకు దక్కలేదు. నాణ్యత లేదని క్వింటాలుకు రూ.100 తగ్గించారు. తేమ ఉందని, నాణ్యత లేదని సీసీఐ కొనుగోలు చేయకపోవడంతో ప్రైవేట్కు 7,175 మెట్రిక్ టన్నులు విక్రయించారు. తేమ పేరుతో, కొంత నల్లబారండంతో సీసీఐ కొనుగోళ్లు చేయలేదు. దీంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించారు. గతేడాది కంటే 40వేల మెట్రిక్ టన్నుల పత్తి కొనుగోళ్లు తగ్గాయి.సంవత్సరం సీసీఐ ప్రైవేట్ మొత్తం (మెట్రిక్ టన్నుల్లో) 2023–24 74,588 26,199 1,00,787 2024–25 1,05,736 15,038 1,20,774 2025–26 74,146 7,175 81,321రూ.75 వేల నష్టం వచ్చింది ఐదు ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశాను. రూ. 90 వేల పెట్టుబడి పెట్టాను. రూ. 25 వేలు కౌలుకు చెల్లించాను. దీంతో మొత్తం రూ1.15 లక్షలు పెట్టుబడి అయింది. పత్తి అమ్మితే రూ.40 వేలు వచ్చింది. దీంతో పెట్టిన పెట్టుబడి రాకపోవడంతోపాటు రూ.75 వేల నష్టం వచ్చింది. పోలు సందీప్, హుస్నాబాద్ సీసీఐ కొనుగోళ్లు పూర్తి నిబంధనల ప్రకారం తేమ ఉంటేనే సీసీఐ పత్తిని కొనుగోలు చేసింది. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు పూర్తయ్యాయి. జిల్లాలో 9 మార్కెట్ల పరిధిలో 23 సీసీఐ నోటిఫైడ్ కేంద్రాలను జిన్నింగ్ మిల్లుల్లో ఏర్పాటు చేసి కొనుగోళ్లు చేశాం. నాగరాజు, జిల్లా మార్కెటింగ్ అధికారినట్టేట ముంచిన పత్తి పంట -
హోలీ..
బుధవారం శ్రీ 4 శ్రీ మార్చి శ్రీ 2026రంగుల కేళిఇఫ్తార్ బుధవారం: 6.29 సహర్ గురువారం: 5.10జిల్లాలో హోలీ పండుగను ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. మంగళవారం ఉదయం నుంచే చిన్న, పెద్ద అనే తేడాలు లేకుండా రంగులు చల్లుకుంటు సంబురాలు చేసుకున్నారు. దీంతో జిల్లాలో ఎక్కడ చూసినా రంగుల సందడే కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో వివిధ యుజవన సంఘాలు, మహిళా సంఘాలు, కాలనీ వాసులు ఒక్క చోట చేరి సంగీతాలకు నృత్యాలు చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు హోలీ వేడుకలో పాల్గొని సందడి చేశారు. దీంతో జిల్లా రంగుల మయంగా మారింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, సిద్దిపేట ద్విచక్ర వాహనాలపై హోలీ సంబురాలు -
దుబ్బాకను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం
● ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ● మున్సిపల్ తొలి కౌన్సిల్ సమావేశం ● పలు సమస్యలపై విస్తృతంగా చర్చ దుబ్బాక: మున్సిపాలిటీని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుదామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. దుబ్బాక మున్సిపల్ తొలి కౌన్సిల్ సమావేశం సోమవారం చైర్పర్సన్ శ్రీరాం సంగీత అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ పరధిలోని పలు సమస్యలపై సమగ్రంగా చర్చించారు. డబుల్ బెడ్రూం గృహాల కాలనీల్లో డ్రైనేజీ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే పరిష్కరించాలని తీర్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలో దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులతో పాటు ఐటీఐ కాలేజీకి వెళ్లే రోడ్డును అత్యవసరంగా అభివృద్ధి చేయాలన్నారు. ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని కౌన్సిలర్లు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు. వీధి కుక్కలపై ప్రత్యేక చర్యలు తీసుకొని, కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణ ఉండాలని, సిబ్బంది విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా నిబంధనల ప్రకారమే నియామకాలు ఉండాలన్నారు. పట్టణంలో తాగునీరు వృథాకాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు నీటి వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మున్సిపల్ టెండర్ల విషయంలో ఎలాంటి రాజీపడొద్దని పక్కా నిబంధనల ప్రకారమే టెండర్లు వేయాలన్నారు. సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రతి వార్డులో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్నారు. పాలకవర్గం, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలన్నారు. ఎఫ్ఎస్టీపీ నిర్వహణలో నిర్లక్ష్యం ఎందుకు జరుగుతోందని దీనిపై తక్షణమే సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. -
అర్జీలను తక్షణం పరిష్కరించాలి
● కలెక్టర్ హైమావతి ● ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు 165సిద్దిపేటరూరల్: ప్రజావాణిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రజలు అందించిన దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించాలని కలెక్టర్ హైమావతి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకంతో ప్రజావాణికి వచ్చి అందిస్తున్న ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. పలు రకాల సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తం 165 దరఖాస్తులు వచ్చాయి. అంతకుముందు జిల్లా అధికారులతో పలు అంశాలపై సమీక్షించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో అన్ని గురుకులాలు, హాస్టల్లో భోజనం, వసతి ఇతరత్రా విషయాలను పర్యవేక్షణ చేయడానికి జిల్లా, మండల స్థాయి అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్ఓ నాగ రాజమ్మ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు ప్యాకేజీ అందించండి కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ముంపు బాధితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందించాలని కోరారు. ఈ మేరకు ముంపు గ్రామమైన మామిడ్యాల వాసులు ప్రజావాణిలో కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మట్లాడుతూ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ సమయంలో మా పుట్టినతేదీ వివరాలను తప్పుగా అధికారులు నమోదు చేశారన్నారు. దీంతో గత ప్రభుత్వం ప్యాకేజిని అందించలేదన్నారు. ఈ విషయమై ఎన్నో సార్లు కలెక్టర్కు, గజ్వేల్ ఆర్డీకు, తహసీల్దార్కు, అప్పటి నాయకులకు విన్నవించినా ఫలితం లేదన్నారు. ఇటీవల ములుగు తహసీల్దార్ విచారణ చేపట్టి కలెక్టర్, ఆర్డీఓకు నివేదికను సమర్పించారన్నారు. ఇప్పటికై నా నష్టపోయిన మాకు కలెక్టర్ న్యాయం చేయాలని కోరారు. -
కన్న కొడుకులే గెంటేయడంతో..
సిద్దిపేటరూరల్: కన్న కొడుకులే ఇంట్లో నుంచి గెంటేయడంతో కలెక్టర్కు చెప్పుకుందామని సోమవారం కలెక్టరేట్లోని ప్రజావానికి చేరుకున్నారు. కోహెడ మండలం పెద్ద సముద్రాల గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు జంగం మల్లయ్య, ఎల్లవ్వలు అనారోగ్యంతో బాధ పడుతున్నారు. వారికి ఉన్న వ్యవసాయ భూమిని పెద్ద కుమారుడు జంగం యాదయ్యకు 30 గుంటలు, రెండో కుమారుడు జంగం కుమార్కు 30 గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేశారు. అనంతరం తమను పట్టించుకోకుండా ఇంటి నుంచి వెళ్లగొట్టారని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరం నుంచి వారు కిరాయి ఇళ్లలో బతుకుదెరువు సాగిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల కుమారులు దాడి చేసి, ధూషించారని తెలిపారు. అధికారులకు, పోలీసులకు ఈ విషయాన్ని చెప్పినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని, చివరికి కలెక్టరేట్ ప్రజావాణికి వచ్చి గోడును వెళ్లబోసుకంటే న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
అయోమయంలో లైసెన్స్డ్ సర్వేయర్లు
ఇప్పటికీ విధులు,బాధ్యతలపై కొరవడిన స్పష్టత జిల్లా వ్యాప్తంగా రెండు విడతల్లో 230 మందికి లైసెన్స్డ్ సర్వేయర్లుగా సర్టిఫికెట్లను జారీ చేయగా మొదటి విడత వారికి మండలాలను కేటాయించారు. తహసీల్దార్ కార్యాలయాల్లో సర్వేయర్లకు చేయడానికి పనిలేక, చేసిన పనికి వేతనం లేక విలవిల్లాడుతున్నారు. తమ విధులు, బాధ్యతలతో పాటు జీతభత్యాలు తెలపాలని సర్వేయర్లు కోరుతున్నారు. భూ కొలతల్లో వీరి పాత్ర కీలకం భూకొలతలు, హద్దులు నిర్ణయించడంలో సర్వేయర్ల పాత్ర కీలకం. భూభారతి చట్టం అమలులో భాగంగా భూ రికార్డుల ప్రక్షాళన కోసం ప్రభుత్వం లైసెన్స్డ్ సర్వేయర్ల వ్యవస్థ తీసుకొచ్చింది. థియరీ, ప్రాక్టికల్, అప్రెంటీస్షిప్ తదితర అంశాల్లో సాంకేతిక సాయంతో భూ సర్వే నిర్వహణపై శిక్షణనిచ్చింది. అన్ని విభాగాల్లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లను జారీ చేశారు. గతేడాది అక్టోబర్ 19న హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డి నుంచి సర్టిఫికెట్లను అందజేశారు. రెండో విడత 110 మందికి ఫిబ్రవరి 28న కలెక్టర్ హైమావతి అందజేశారు. మొదటి విడత వారికి గతేడాది డిసెంబర్ 31న మండలాలు కేటాయించారు. దీంతో వారు తహసీల్దార్లకు రిపోర్ట్ చేశారు. రెండో విడత వారికి ఇంకా మండలాలు కేటాయించలేదు. రెండు నెలలుగా మొదటి విడతలో ఎంపికై నా లైసెన్స్డ్ సర్వేయర్లు పలువురు తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లి ఖాళీగా ఉండటం మినహా విధులు బాధ్యతలపై స్పష్టత లేదు. రవాణా భారం జిల్లాలో కొంత మంది సర్వేయర్లకు ఇతర మండలాల్లో విధులు కేటాయించారు. అసలే జీతం లేకుండా విధులు నిర్వర్తిస్తున్న వారికి కేటాయించిన మండలాలకు వెళ్లి వచ్చేందుకు రవాణా భారమవుతోంది. దీంతో పలువురు కార్యాలయాలకు వెళ్లడమే బంద్ చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి విధివిధానాలు ప్రకటించి ఆర్థిక భరోసాను కల్పించాలని లైసెన్స్డ్ సర్వేయర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనిపై సర్వే ల్యాండ్స్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ను సంప్రదించగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే వాటిని అమలు చేస్తాం.మళ్లీ ఉపాధిని వెతుక్కుంటూ.. డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు భూ సర్వేపై ప్రభుత్వం శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తుందని, చేస్తున్న ప్రైవేట్ ఉద్యోగాలను వదులుకొని శిక్షణలో పాల్గొన్నారు. శిక్షణ పూర్తియినా విధుల పట్ల ఎలాంటి స్పష్టత రాకపోవడంతో మళ్లీ ఉపాధి కోసం వెతుక్కుంటున్నారు. ఉన్న ఉద్యోగం వదిలేసి సర్వేయర్లుగా వచ్చిన వారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితులను చూసి కొందరు సర్వేయర్లుగా విధులు నిర్వర్తించేందుకు సుముఖత చూపడంలేదని తెలుస్తోంది.లైసెన్స్డ్ సర్వేయర్లు.. రెండు నెలలుగా ఖాళీగా ఉంటున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు వారికి విధులు, బాధ్యతలు కేటాయించకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు. వీరికి 50 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ల జారీ చేసిన తర్వాత 75 రోజులకు మండలాలు కేటాయించారు. అయినా బాధ్యతలు అప్పగించకపోవడంతో ఖాళీగా ఉండటం గమనార్హం. – సాక్షి, సిద్దిపేటఉపాధి లభిస్తుందని వస్తే.. ప్రభుత్వం ఉపాధి భరోసా కల్పిస్తుందన్న ఉద్దేశంతో సర్వేయర్లుగా శిక్షణ తీసుకున్నాం. శిక్షణ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు సంవత్సరం వృథా అయింది. డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉపాధి కోసం వివిధ ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే వాళ్లం. సర్వేయర్ ద్వారా ఉపాధి లభిస్తుందని వచ్చాం. ఇప్పటివరకు విధివిధానాలు ప్రకటించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. – ప్రశాంత్కుమార్, అధ్యక్షుడు, జిల్లా లైసెన్స్డ్ సర్వేయర్స్ అసోసియేషన్ -
నేడు చంద్ర గ్రహణం
ఆలయాలకు ద్వారబంధనం నేడు మల్లన్న ఆలయం మూసివేత కొమురవెల్లి(సిద్దిపేట): చంద్రగ్రహణం సందర్భంగా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను మూసివేస్తున్నట్లు ఈఓ కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు దర్శనాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు తదితర సేవలు పూర్తిగా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. ఆలయ శుద్ధి, సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనాలు కల్పిస్తామని తెలిపారు. బ్రహ్మోత్సవాలకు రండి వర్గల్(గజ్వేల్): నాచగిరి లక్ష్మీనృసింహక్షేత్రంలో జరిగే బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ సోమవారం ఎంపీ రఘునందన్రావుకు, రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ హన్మంతరావు, పీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్రావులకు ఈఓ రంగాచారి ఆధ్వర్యంలో ఆలయవర్గాలు ఆహ్వానపత్రికలు అందజేశారు. ఈ నెల 8 నుంచి ఉత్సవాలు జరుగనున్నాయని తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. నకాశీ చిత్రకళపై అవగాహన దరఖాస్తుల ఆహ్వానం ధర్మానాయక్కు బంగారు నంది అవార్డు -
మాజీమంత్రి హరీశ్రావు ఉదారత
సిద్దిపేటజోన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేసి పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రభిత చూపిన యాదవ విద్యార్థుల కోసం మాజీమంత్రి హరీశ్రావు ఉదారత్వం చాటుకున్నారు. యాదవ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తన నెల వేతనం రూ.2లక్షలు అందచేశారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ కార్యక్రమానికి ఎలాంటి అవాంతరాలు లేకుండా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. మంచి కార్యక్రమానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. హరీశ్రావును కలిసిన వారిలో అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీహరి, జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు ఐలయ్య, విద్యా వంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ పాల్గొన్నారు.పురస్కారాలకు నెల వేతనం విరాళం -
నిఘా నేత్రాలు కీలకం
సిద్దిపేటకమాన్: ప్రజారక్షణకు సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి అని సీపీ రష్మీ పెరుమాళ్ అన్నారు. పోలీసు కమిషనరేట్లో సోమవారం సిద్దిపేట సురక్ష నేత్ర లోగోను పోలీసు అధికారులతో కలిసి ఆమె ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఒక్కరోజే పలు గ్రామాల్లో 200కు పైగా సీసీ కెమెరాలను ప్రారంభించామన్నారు. ఏదైనా ఘటన జరిగినపుడు ప్రజలు స్పందించి పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సీసీ కెమెరాలు నేరాల నియంత్రణలో కీలకంగా మారనున్నాయన్నారు. సిద్దిపేట సురక్ష నేత్ర ద్వారా కనెక్టెడ్ విలేజెస్.. ప్రొటెక్టెడ్ కమ్యూనిటీస్ అనే ట్యాగ్ లైన్తో ముందుకు వెళ్లడం జరగుతుందన్నారు. జిల్లాలోని మండల కేంద్రాలు, గ్రామాలు, కామన్ ఏరియాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటికి జియో ట్యాగింగ్ చేయనున్నట్లు తెలిపారు. అనుమానిత వ్యక్తుల కదలికలపై స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. జిల్లాలో ఇప్పటికే 6వేలకు పైగా ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ జియో ట్యాగింగ్ చేయిస్తున్నామని, వాటిని పోలీసు కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో బెల్ట్ షాప్లపై, అక్ర మ ఇసుక రవాణ, గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల వినియోగం, రవాణపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలయాలు, విద్యా సంస్థల సమీపంలో, ఇతర బహిరంగ ప్రదేశంలో మద్యం తాగినా, తాగి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, ఏఆర్ అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఏసీపీ రవీందర్రెడ్డి, హుస్నాబాద్ ఏసీపీ సదానందం, గజ్వేల్ ఏసీపీ నర్సింహులు, ఎస్బి సీఐ శ్రీధర్ గౌడ్, కిరణ్, పీఆర్ఓ ప్రవీణ్ పాల్గొన్నారు. -
విద్యుత్ మీటర్ రీడర్ల సమ్మె
చేర్యాల(సిద్దిపేట): న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ మీటర్ రీడర్లు ఆదివారం నుంచి సమ్మె బాటపట్టారు. స్పాట్ బిల్లింగ్ పనులు నిలిపివేసి చేర్యాల, మద్దూరు, దూళ్మిట్ట, కొమురవెల్లి మండలాల మీటర్ రీడర్స్ అంతా స్థానిక సబ్ డివిజన్ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్నేళ్లుగా తక్కువ వేతనాలతో పనిచేస్తున్న తమపై యాజమాన్యం పనిభారం పెంచి వేధిస్తోందన్నారు. మీటర్ రీడర్స్ కార్మికులకు జీఓ 11ప్రకారం కనీస వేతనం ఇవ్వాలని కోరారు. ఎన్పీడీసీఎల్ తరహలో 30రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మీటర్ రీడర్లు నజిరుద్దీన్, రాజు, శివ, సందీప్, అలీం, సిద్దు, వంశీ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
సోమవారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2026
మల్లన్న ఆలయ అభివృద్ధికి కృషి కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆదివారం కుటుంబసమేతంగా స్వామివారిని దర్శించుకని ప్రత్యే క పూజలు నిర్వహించారు. అంతకుముందు ఈఓ కృష్ణప్రసాద్, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఆలయ ఆవరణలో నిర్మిస్తున్న 50 వసతి గదులు, క్యూకాంప్లెక్స్ పనులు చివరి దశకు చేరుకున్నాయన్నారు. త్వరలోనే వాటిని ప్రారంభించి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. రానున్న రోజుల్లో ప్రణాళిక బద్దంగా ఆలయాన్ని అభివృద్ధి చేయడమేకాకుండా.. అన్ని కుల సంఘాలకు భవనాలు నిర్మించేందుకు కృషి చేస్తానని తెలిపారు. రాజకీయ పార్టీలు దేశ భవిష్యత్తుకు మూలమైన విద్యపై విమర్శలు చేయడం సరికాదన్నారు. విద్యా కమిషన్ ఇచ్చిన నివేదికలో తప్పులు ఉంటే సలహాలు, సూచనలు ఇవ్వకుండా విమర్శించడం సిగ్గుచేటన్నారు. యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని విద్య కమిషన్ ఇచ్చిన నివేదికను తాను స్వాగతిస్తున్నానని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రె స్ మండల అధ్యక్షులు మహదేవుని శ్రీనివాస్, ఆలయ చైర్మన్ నర్సింహారెడ్డి పాల్గొన్నారు. ఇఫ్తార్ సోమవారం: 6.28 సహర్ మంగళవారం: 5.11ఈఓగా కృష్ణ ప్రసాద్ బాధ్యతల స్వీకరణ మల్లన్న ఆల య నూతన ఈఓగా కృష్ణ ప్రసాద్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గత ఈఓ వెంకటేశ్ పదవీ విరమణ పొందడంతో దేవాదాయ శాఖ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్గా పని చేస్తున్న కృష్ణ ప్రసాద్ను ఈఓగా ఇక్కడికి బదిలీ చేసిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడతానన్నారు. -
ఏకగ్రీవమైతే నిధుల వరదే
● కేంద్రమంత్రి బండి సంజయ్ ● గ్రామాభివృద్ధికి రూ.10 లక్షల ఎంపీ నిధులుకోహెడరూరల్(హుస్నాబాద్): గ్రామాల్లో రాజకీయాలకు అతీతంగా ఏకగ్రీవంగా పాలకవర్గాలను ఎన్నుకుంటే నిధుల వరద పారుతుందని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ సృష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం కోహెడ మండలం విజయ్నగర్ కాలనీలో బీజేపీ మద్దతుతో సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికై న కాతం అమ్యూలకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కోసం ప్రకటించిన రూ.10లక్షల ఎంపీ నిధుల పత్రాన్ని గ్రామస్తుల సమక్షంలో పాలకవర్గానికి అందజేశారు. అలాగే అదనంగా సీసీ రోడ్ల నిర్మాణం కోసం మరో రూ.15లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మొత్తం రూ.25లక్షల నిధులతో విజయ్నగర్ కాలనీ అభివృద్ధి పనులు మొదలు పెట్టనున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేంద్రమంత్రి మాట్లాడుతూ కోహెడ మండలంలో రూ.40కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి మోజార్టీ స్థానాలు కట్టబెట్టిన ప్రజల ఆశీర్వాదంతోనే నేడు అభివృద్ధి సాధ్యమవుతోందని ఆయన గుర్తు చేశారు. బీజేపీ సర్పంచ్లు గెలిచిన గ్రామాలకు పెద్ద ఎత్తున నిధులు సమకూర్చి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో కోమటిరెడ్డి రాంగోపాల్రెడ్డి, ఖమ్మం వెంకటేశం, జాలిగం రమేష్, సర్పంచ్ మ్యాకాల స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్కు ఆహ్వానం
మర్కూక్(గజ్వేల్): మండల పరిధి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ సీఎం కేసీఆర్ను నాచారం ఆలయ ట్రస్ట్ మాజీ చైర్మన్ హన్మంతరావు ఆదివారం కలిశారు. ఈ నెల 6న జరిగే తన కుమార్తె వివాహానికి హాజరు కావాలని వివాహ పత్రికను అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పాండుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. యోగాతోనే ఆరోగ్యం హుస్నాబాద్రూరల్: నిత్యం యోగాసనాలు వేస్తే ఆరోగ్యంగా ఉంటారని శిక్షకురాలు అయిలేని అనిత అన్నారు. పట్టణంలోని ధర్మవీర్ యోగ కేంద్రం ద్వితీయ వార్షికోత్సం పురస్కరించుకుని ప్రత్యేక యోగాసనాలు చేయించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ తనువును, మనస్సును, ఆత్మను ఏకం చేసే ఏకై క సాధనం యోగా అన్నారు. యోగాసనాలతో వ్యాయామం జరుగుతుందన్నారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు. ఆర్టీసీ కార్గో ద్వారా భద్రాద్రి తలంబ్రాలు సిద్దిపేటకమాన్: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరగనున్న సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను ఆర్టీసీ కార్గో ద్వారా భక్తులకు అందించనున్నట్లు ఆర్టీసీ డీఎం భవభూతి తెలిపారు. ఇందుకు సంబంధించిన వాల్పోస్టర్ను డీఎం ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్గో ద్వారా రూ.151 చెల్లించి భక్తులు బుక్ చేసుకుంటే తలంబ్రాలను ఇంటి వద్దకే అందిస్తామన్నారు. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అమరుల త్యాగాలు వృథా కావు తూప్రాన్: ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమించి పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన మాదిగ అమరవీరులకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆదివారం నివాళులర్పించారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చెట్లపల్లి యాదగిరి మాదిగ ముఖ్య అతిథిగా హాజరై అమరవీరుల త్యాగాలను కొనియాడారు. -
భవిష్యత్కు ‘పది’ పునాది
● మంచి మార్కులు సాధిస్తే ఐ–ప్యాడ్ గిఫ్ట్ ● మాజీ మంత్రి హరీశ్రావు ● ఇందిరానగర్ పాఠశాలలో ‘విజయీభవ’ కార్యక్రమం ప్రశాంత్నగర్(సిద్దిపేట): విద్యార్థుల భవిష్యత్ను మార్చేది పదో తరగతి అని, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నియోజకవర్గ పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన విజయీభవ ప్రేరణ కార్యక్రమంలో ఆయన అతిథిగా హాజరై మాట్లాడారు. టెన్త్ విద్యార్థులు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. మీ స్థితిని, గతిని మార్చేది పదో తరగతి ఫలితాలన్నారు. ప్రతి విద్యార్థి ఉత్తమ ఫలితాలు సాధించాలంటే అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించాలన్నారు. మంచి చేతిరాత ఉంటే మార్కులు అధికంగా సాధించే అవకాశం ఉంటుందన్నారు. నియోజకవర్గంలో ఉత్తమ మార్కులు సాధించిన 30 మంది విద్యార్థులకు ఐప్యాడ్ను గిఫ్ట్గా అందిస్తామన్నారు. సిద్దిపేట అన్ని రంగాల్లో ఆదర్శంగా ఉంటున్నామని, పది ఫలితాల్లో మనం ఫస్ట్ రావాలన్నదే నా తపన అన్నారు. ఈ ఏడాది పది ఫలితాలలో సిద్దిపేటకి మొదటి స్థానం తెచ్చి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. నా సొంత ఖర్చులతో పదోతరగతి విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్ ఏర్పాటు చేశానన్నారు. పరీక్షల సమయంలో టీవీలు, మొబైల్ ఫోన్లు వాడకుండా, జాగ్రత్తగా చదువుకోవాలన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పదవులు శాశ్వతం కాదు చిన్నకోడూరు(సిద్దిపేట): సంపాదన, పదవులు శాశ్వతం కాదని, చేసిన పనులు సేవా శాశ్వతంగా నిలుస్తుందని మాజీమంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని అల్లీపూర్లో మాజీ సర్పంచ్ అనసూయ ప్రథమ వర్ధంతి సభలో పాల్గొన్నారు. ఆమె జ్ఞాపకార్థం వారి కుమారులు గ్రామానికి వైకుంఠరథం, శవ పేటికను హరీశ్రావు సమక్షంలో అందజేశారు. ఆయన మాట్లాడుతూ అనసూయ గ్రామానికి చేసిన సేవలను కొనియాడారు. అల్లీపూర్ గ్రామం అన్నింటా అభివృద్ధి చెందిదంన్నారు. బీఆర్ఎస్ పాలనలో గ్రామాలు అభివృద్ధి బాటలో పయనించాయన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగ భద్రత కల్పించాలి
సిద్దిపేటజోన్: రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి కోసం పనిచేస్తున్న 6500 మంది లైసెన్స్ సర్వేయర్లకు ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. ఆదివారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లైసెన్స్ సర్వేయర్ల ప్రతినిధులు ఆయనను కలిసి సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయమైన డిమాండ్లను సాధించడానికి వారికి బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. వారి పక్షాన అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ఉన్నత చదువులు చదివి ప్రభుత్వం మీద నమ్మకంతో చేరిన లైసెన్స్ సర్వేయర్లకు ఎకరానికి పది రూపాయల కమీషన్ ఇస్తామని ప్రభుత్వం పేర్కొందని విమర్శించారు. కమీషన్ పేరిట వారి జీవితాలతో ఆడుకోవద్దని, గౌరవ వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. -
ఇంకెప్పుడు అమృత్..!
నత్తనడకన పథకం పనులు రూ. కోట్లల్లో వ్యయం మంచినీటికి తప్పని తిప్పలు జిల్లాలోని మున్సిపాలిటీల్లో దుస్థితి మున్సిపాలిటీల్లో దాహార్తిని శాశ్వతంగా నిర్మూలించేందుకు కేంద్రం తీసుకొచ్చిన అమృత్– 2.0 పథకం పనులు ఏడాది కాలంగా నత్తనడకన సాగుతున్నాయి. ఫలితంగా ప్రజలకు మంచినీటి కష్టాలు తప్పడం లేదు. రూ.కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ పథకం పనులు జిల్లాలోని గజ్వేల్–ప్రజ్ఞాపూర్తోపాటు సిద్దిపేట, చేర్యాల మున్సిపాలిటీల్లోనూ ముందుకు సాగడంలేదు. – గజ్వేల్ జిల్లాలోని అయిదు మున్సిపాలిటీలకు గానూ మూడింటిలో కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన అమృత్–2.0 పథకం పనులు సాగుతున్నాయి. ఇందులోభాగంగానే గజ్వేల్–ప్రజ్ఞాపూర్లో రూ.28కోట్లు, సిద్దిపేటలో రూ.85కోట్లు, చేర్యాలలో సుమారు రూ.9కోట్లు వెచ్చిస్తున్నారు. పట్టణాల్లో మంచినీటి సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టే లక్ష్యంతో ఈ పనులు చేపట్టారు. ఆయా పట్టణాల్లో మంచినీటి సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా ఓవర్హెడ్ ట్యాంకుల నిర్మాణం, కొత్తకాలనీలకు పైప్లైన్ల విస్తరణ, కొత్త నల్లా కనెక్షన్లు, వాటర్ మీటర్ల ఏర్పాటు వంటి పనులు చేపడుతున్నారు. ఏడాది క్రితం చేపట్టిన ఈ పనులు నత్తనడకన సాగటం ఆందోళన కలిగిస్తోంది. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఇలా.. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ప్రస్తుతం ‘మిషన్ భగరీథ’ ద్వారా నిత్యం 39లక్ష లీటర్ల మంచినీటి సరఫరా చేసే వ్యవస్థ అందుబాటులో ఉన్నది. ఉదయం, సాయంత్రం కలిపి రెండుసార్లు 78లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. పెరుగుతున్న పట్టణ అవసరాలకు ఈ నీరు సరిపోకపోవడంతో ప్రస్తుతం అమృత్ 2.0 పథకంలో భాగంగా పట్టణంలోని భారత్నగర్, రాజిరెడ్డిపల్లి, సంగాపూర్ల వద్ద 25లక్షల లీటర్ల సామర్థ్యంతో ఓవర్హెడ్ ట్యాంకుల నిర్మాణం జరుగుతోంది. అంతేకాకుండా కొత్త కాలనీలకు మంచినీటి సరఫరా వ్యవస్థను తీసుకొచ్చేందుకు 15కిలోమీటర్ల మేర పైప్లైన్ల నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే.. నిత్యం ఉదయం, సాయంత్రం వేళ అదనంగా 50లక్షల లీటర్ల నీటిని పట్టణ ప్రజలకు అందించే అవకాశం ఉంటుంది. కానీ పనులు సాగటం లేదు. కొన్ని కాలనీల్లో పైప్లైన్లకు రోడ్లపై గుంతలు తీసి పనులను అర్ధంతరంగా నిలిపివేయడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పనులు పూర్తయి తమకు నీళ్లు ఎప్పుడు వస్తాయోనని ఆయా కాలనీల వాసులు ఎదురుచూస్తున్నారు. సిద్దిపేట, చేర్యాలలోనూ.. సిద్దిపేట, చేర్యాల మున్సిపాలిటీల్లోనూ అమృత్ పనుల ఆలస్యం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఆయా మున్సిపాలిటీల్లో ఓవర్హెడ్ ట్యాంకల నిర్మాణానికి స్థలాల గుర్తింపు జరగకపోవడం, పైప్లైన్ల పనుల్లో జాప్యం నెలకొంది. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న..ఈ పనుల్లో అధికారుల నిర్లక్ష్యం శాపంగా మారుతోంది. మరోవైపు బిల్లుల చెల్లింపుల్లో చోటుచేసుకుంటున్న జాప్యం కూడా పనుల్లో ఆలస్యానికి మరో కారణంగా చెబుతున్నారు. పనుల్లో వేగం పెంచుతాం పట్టణాల్లో మంచినీటి సమస్యను శాశ్వతంగా నిర్మూలించే సంకల్పంతో అమృత్–2.0 పనులు జరుగుతున్నాయి. గజ్వేల్–ప్రజ్ఞాపూర్లో చేపట్టిన పనుల్లో వేగం పెంచుతాం. ప్రజల దాహార్తిని శాశ్వతంగా నిర్మూలిస్తాం. – మహేశ్, ఏఈ గజ్వేల్ మున్సిపల్ -
మెదక్లో మోడల్ ఐక్యరాజ్య సమితి
మెదక్ కలెక్టరేట్: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్లో సోషల్ ఫోరం సహకారంతో మోడల్ ఐక్యరాజ్యసమితి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా అదనపు కలెక్టర్ నగేశ్, డీఈఓ విజయ, జెడ్పి సీఈవో ఎల్లయ్య హాజరయ్యారు. మెదక్ జిల్లాలోని 28 పీఎంశ్రీ పాఠశాలల నుంచి ఇద్దరు విద్యార్థుల చొప్పున 56 దేశాల ప్రతినిధులుగా హాజరై చర్చలో పాల్గొన్నారు. జర్నలిస్టుగా పదిమంది విద్యార్థులు వ్యవహరించారు. సమావేశంలో ప్రసంగించిన విద్యార్థులలో 11 మందిని ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి పంపిస్తామని ఏఎంఓ సుదర్శనమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ సుదర్శనమూర్తి, సీఎమ్ఓ రాజు, ఏఎస్ఓ నవీన్, ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు. అదృశ్యమైన 43 రోజులకు..మృతదేహం లభ్యం కొండపాక(గజ్వేల్): వ్యక్తి అదృశ్యమైన 43 రోజులకు కుళ్లిపోయిన స్థితిలో అతడి మృతదేహం లభించింది. ఈ ఘటన కుకునూరుపల్లి పోలీస్టేషన్ పరిధిలోని లకుడారం గ్రామ శివారులో శనివారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం... సిద్దిపేట రూరల్ మండలంలోని పుల్లూరు గ్రామానికి చెందిన భార్యాభర్తలు దేశెట్టి సరిత, స్వామి 13 ఏళ్ల కింద బతుకుదెరువు కోసం హైదరాబాద్లోని బాలానగర్కు వెళ్లారు. అక్కడ స్వామి ఆటోను నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు అనారోగ్యానికి గురవ్వగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. మనస్తాపానికి గురైన అతడు జనవరి 15న ఆటోను నడిపేందుకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి తిరిగి రాలేదు. దీంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం కుకునూరుపల్లి పోలీస్టేషన్ నుంచి భార్యకు ఫోన్ వచ్చింది. వెళ్లి చూడగా కుడి చేతికి ఉన్న కడెంతో పాటు మెడలో రుద్రాక్షమాల, చెప్పులను చూసి భర్త శవంగా గుర్తించారు.చెరువులో పడి బాలుడి మృతి కొల్చారం(నర్సాపూర్): తప్పిపోయాడనుకున్న బాలుడు చెరువులో పడి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలుడి తల్లిదండ్రులు, ఎస్ఐ మహమ్మద్ మైనొద్దీన్ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన సార వెంకటేశం, శిరీష దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు సతీశ్(4) అలియాస్ బిట్టు శుక్రవారం మధ్యాహ్నం ఆడుకుంటానని ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో తప్పిపోయాడనుకున్నారు. ఉదయం సతీశ్ గ్రామ శివారులోని సండ్రుకుంటలో తేలి ఉన్నాడని సమాచారం అందించారు. అక్కడికి వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించాడు. కుటుంబ పోషణ భారమై.. వ్యక్తి ఆత్మహత్య హుస్నాబాద్: వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం హుస్నాబాద్లో చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం... పట్టణంలోని బాలాజీ నగర్కు చెందిన దుబ్బల సంజు(43)కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో మనస్తాపం చెందిన ఆయన ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కూతుళ్ల పెళ్లిళ్లు చేయాలని, ఇందిరమ్మ ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఉన్నామని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఆర్థిక ఇబ్బందులతో.. బెజ్జంకి(సిద్దిపేట): వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివారం బెజ్జంకి శివారులోని ఎల్లంపల్లెలో చోటుచేసుకుంది. ఎస్ఐ సౌజన్య, స్థానికుల కథనం మేరకు... గుబిరె రాజయ్య(64, నర్సవ్వ దంపతులకు ఐదుగురు కూతుర్లు కాగా అందరికి వివాహాలు చేశారు. ఇద్దరు దంపతులు బెజ్జంకిలో ఉంటూ వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. సిద్దిపేట, హైదరాబాద్లో ఉన్న కూతుర్ల వద్దకు రాజయ్య, నర్సవ్వ వెళ్లారు. శుక్రవారం ఒక్కడే ఇంటికి వచ్చా డు. ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. హక్కులపై అవగాహన అవసరం సిద్దిపేటఅర్బన్: రాజ్యాంగం ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించిందని, వాటిపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని టూ టౌన్ సీఐ ఉపేందర్ సూచించారు. అర్బన్ మండల పరిధిలోని మందపల్లి గ్రామంలో శనివారం పౌరహక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులవివక్షకు తావు లేకుండా అందరూ సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలన్నారు. జీపీఓ కరుణాకర్, పంచాయతీ కార్యదర్శి భవాని పాల్గొన్నారు. -
చెట్టును ఢీకొట్టిన బైక్.. ఒకరి మృతి
సిద్దిపేటఅర్బన్: ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా చెట్టుకు బైక్ ఢీకొని యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల శివారులో శుక్రవారం రాత్రి జరిగింది. సిద్దిపేట త్రీటౌన్ పోలీసుల కథనం మేరకు... కొండపాక మండలం విశ్వనాథంపల్లికి చెందిన గొడుగు ఆంజనేయులు (23), గణేశ్, నవీన్, ప్రశాంత్ సిద్దిపేటలో సెంట్రింగ్ పని చేస్తున్నారు. వీరితో పనికి వచ్చే సిర్సినగండ్లకు చెందిన కొడిశాల నాగరాజు వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో విషయం తెలుసుకున్న ఆంజనేయులు, నవీన్, గణేశ్ ముగ్గురు కలిసి సిర్సినగండ్లకు వెళ్లారు. నాగరాజును నవీన్, ప్రశాంత్ కలిసి బైక్పై సిద్దిపేట ఆస్పత్రికి తీసుకెళ్లారు. మరో బైక్పై ఆంజనేయులు, గణేశ్, సిర్సినగండ్లకు చెందిన పరమేశ్ కలిసి సిద్దిపేటకు వెళ్తున్నారు. మార్గమధ్యలో పొన్నాల శివారులోని ఆయిల్ మిల్లు వద్ద ఆంజనేయులు నడుపుతున్న బైక్ చెట్టును ఢీకొట్టడంతో ముగ్గురికి బలమైన గాయాలయ్యాయి. వీరిని వెంటనే 108లో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆంజనేయులు మృతి చెందాడు. గణేశ్ను హైదరాబాద్కు తరలించగా, పరమేశ్ను సిద్దిపేటలోనే ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. బైక్ అదుపుతప్పి.. సాఫ్ట్వేర్ ఉద్యోగి.. సిద్దిపేటకమాన్: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సిద్దిపేట పట్టణ శివారులో చోటు చేసుకుంది. వన్టౌన్ సీఐ వాసుదేవరావు వివరాల ప్రకారం... రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అల్లె ఉపేంద్ర (25) హైదరాబాద్లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా, నారోజు వెంకటేశ్ ఓ కంపెనీలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ స్నేహితులు. హైదరాబాద్లో విధులు నిర్వహిస్తూ ఒకే గదిలో నివాసం ఉంటున్నారు. ఇద్దరూ స్వగ్రామానికి హైదరాబాద్ నుంచి సిరిసిల్లకు బైక్పై శుక్రవారం రాత్రి బయలుదేరారు. ఈ క్రమంలో పట్టణ శివారు ఇమాంబాద్ శివారులో మలుపు వద్ద కల్వర్టు పక్కన ఉన్న గుంతలో ద్విచక్ర వాహనంతో సహా పడిపోయారు. ప్రమాదంలో ఉపేంద్ర అక్కడికక్కడే మృతి చెందగా, వెనకాల కూర్చున్న వెంకటేశ్ తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయాడు. స్పృహలోకి వచ్చిన వెంకటేశ్ తన మిత్రులకు విషయం ఫోన్ ద్వారా తెలుపగా వారు పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి, వెంకటేశ్ను ఆస్పత్రికి తరలించారు. -
సినీ ఫక్కీలో యువతి కిడ్నాప్
వట్పల్లి(అందోల్): యువతిని సినీ ఫక్కీలో కిడ్నాప్ చేశారు. ఈ ఘటన మండల పరిధిలో శనివారం కలకలం రేపింది. ఎస్ఐ లవకుమార్ వివరాల ప్రకారం... మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి శనివారం వారి వ్యవసాయ బావి వద్ద ఉన్న దర్గాకు వెళ్లి మొక్కులు చెల్లించేందుకు తన తమ్ముడితో కలిసి బైక్పై వెళ్లింది. తిరిగి వస్తున్న క్రమంలో యువతి మేన బావలు ఇటిక్యాల శ్రీకాంత్, ఇటిక్యాల జగదీశ్వర్తో పాటు మరో వ్యక్తి మామిడిపల్లి లక్ష్మణ్తో కలిసి కారులో వచ్చి వారిని అడ్డగించారు. యువతిని బలవంతంగా కారులో ఎక్కించుకొని పరారయ్యారు. ఈ క్రమంలో యువతి సోదరుడు వారిపై ఎదురుదాడికి దిగినా అతడ్ని పక్కకు నెట్టేశారు. అతడు వెంటనే 100కు కాల్ చేసి సమాచారం అందించాడు. అలాగే బైక్పై కారును వెంబడించాడు. అప్రమత్తమైన పోలీసులు ఎస్ఐ లవకుమార్, ఎస్ఐ శ్రీహరి, పుల్కల్ ఎస్ఐ విశ్వజన్లతో పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి పుల్కల్ గ్రామ శివారులో కిడ్నాపర్లను పట్టుకున్నారు. దీంతో అమ్మాయి సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా యువతిని ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పి ఆమె కుటుంబీకులు మరో వ్యక్తితో పెళ్లి సంబంధం కుదుర్చుకోవడంతోనే కిడ్నాప్ చేశామని నిందితులు విచారణలో తెలిపారు. కాగా చిత్ర హింసలు పెట్టినట్లు బాధితురాలు పేర్కొంది. ముగ్గురిపై కిడ్నాప్, హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించారు. నిందితులు స్వయానా మేనబావలు రెండు గంటల్లోనే పట్టుకున్న పోలీసులు -
పుర సేవ.. యువ తోవ
అర్హులకు ప్రభుత్వ ప్రయోజనాలు అందజేస్తా.. తాము సైతం సమాజాభివృద్ధికి పాటు పడుతామంటూ యువతరంరాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఇటీవల నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో యువత కౌన్సిలర్స్గా పోటీ చేసి గెలిచింది. ఉన్నత చదువులు చదివిన యువతి, యువకులు చిన్న వయస్సులోనే ప్రజాసేవ చేయాలన్న సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చారు. దుబ్బాక మున్సిపల్లో మొత్తం 20 వార్డులకు గాను ఐదుగురు 35 సంవత్సరాలలోపు వారే ఉండటం విశేషం. సదాశివపేటలో 26 వార్డుల్లో 6 వార్డుల్లో యువ కౌన్సిలర్లు, నర్సాపూర్లో చైర్పర్సన్ ఎం.లక్ష్మితో పాటు మరో నలుగురు ఉన్నారు. ‘సాక్షి’తో వార్డు కౌన్సిలర్లు వెల్లడించిన అభిప్రాయాలపై ఈ వారం కథనం.మున్సిపాలిటీల అభివృద్ధిలో యువ కౌన్సిలర్లు ప్రజాసేవలో మార్క్ చూపించేందుకు కృషి అత్యధికులు ఉన్నత విద్యావంతులే..చేర్యాల(సిద్దిపేట): డిగ్రీ పూర్తయిన తర్వాత మాస్టర్స్ ఆఫ్ సోషల్ వర్క్ పీజీ చేశాను. అందులో సమాజం, స్థితిగతులు, జీవన విధానం, పేద ప్రజలకు అధికార యంత్రాంగానికి ఉన్న అంతరం తదితర అంశాలను తెలుసుకున్నాను. ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందాల్సిన ప్రయోజనాలు సక్రమంగా అందడం లేదు. ప్రజలకు అవగాహన లేకపోవడం వల్లేనని భావించి, సమాజానికి సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చాను. బీఆర్ఎస్ నుంచి 2వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచాను. వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్యలు పరిష్కరిస్తా. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలను అర్హులకు అందేలా కృషి చేస్తా. – కమలాపురం గీతాంజలి, 2వ వార్డు కౌన్సిలర్, చేర్యాల మున్సిపాలిటీ గజ్వేల్: ప్రజల ఆకాంక్షలకనుగుణంగా పని చేస్తా. 30ఏళ్ల వయసులోనే కౌన్సిలర్గా గెలిచాను. తనపై నమ్మకం ఉంచి చిన్న వయసులోనే వార్డు ప్రజలు కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. వారి నమ్మకం వమ్ము చేయకుండా అభివృద్ధి చేస్తా. మౌళిక వసతులు కల్పించి, వార్దును ఆదర్శంగా తీర్చిదిద్దుతా. వార్డు ప్రగతే ధ్యేయంగా పని చేస్తా. – మన్నె రూప, 5వ వార్డు కౌన్సిలర్, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ సదాశివపేట(సంగారెడ్డి): బీకాం చదివి రాజకీయాల్లోకి వచ్చి ప్రజాప్రతినిధిని అవుతాననుకోలేదు. 19వ వార్డు బీసీ మహిళ రిజర్వు కావడంతో నా భర్త మాజీ కౌన్సిలర్ పట్లూరి నాగరాజ్గౌడ్ ప్రోద్బలంతో కౌన్సిలర్గా ఎన్నికల బరిలో నిలిచాను. ప్రజల ఆశీర్వాదంతో గెలిచాను. నాకు రాజకీయాలు కొత్త అయినా ప్రజలకు అందుబాటులో ఉంటాను. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. – రోజా పట్లూరి, 19వ వార్డు కౌన్సిలర్, సదాశివపేట సదాశివపేట(సంగారెడ్డి): నాకు రాజకీయాలు కొత్తేమే కాదు. కాని కౌన్సిలర్గా ఎన్నిక కావడం కొత్తే. నా తల్లి కొత్తగొల్ల అనురాధ, మున్సిపల్ చైర్ పర్సన్గా, తండ్రి కొత్త గొల్ల కృష్ణ కౌన్సిలర్గా సేవలందించారు. 8 వార్డు కౌన్సిలర్గా పోటీ చేసి గెలుపొంది మొదటి సారి మున్సిపాలిటీలో అడుగుపెట్టాను. వార్డు సమస్యల పరిష్కారం కోసం సమావేశాల్లో ప్రస్తావించి పరిష్కరించేందుకు కృషి చేస్తా. – కొత్తగొల్ల సోమశేఖర్, 8వ వార్డు కౌన్సిలర్, సదాశివపేట గజ్వేల్: వార్డు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ నుంచి పోటీ చేసి 26 ఏళ్ల వయసులో కౌన్సిలర్గా ఎన్నికయ్యాను. వార్డు పరిధిలోని సమస్యలపై అధ్యయనం చేసి దశల వారీగా పరిష్కరిస్తాను. అందరి సహకారంతో ఆదర్శంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం. – కప్ప మమత, ఒకటోవార్డు కౌన్సిలర్, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ హుస్నాబాద్: ప్రజా సేవ చేయాలనే సంకల్పంతో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాను. వార్డులో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తా. తాగునీరు, పారిశుద్ధ్యం, మురికి కాలువల నిర్మాణం, సీసీ రోడ్లపై ప్రత్యేక దృష్టి పెడతాను. ముఖ్యంగా ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తా. చిన్న వయస్సులోనే సేవ చేసే భాగ్యం కల్పించిన ప్రజలకు రుణపడి ఉంటాను. కాగా హుస్నాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను 35 సంవత్సరాల వయస్సు లోపు ముగ్గురు కౌన్సిలర్లు విజయం సాధించారు. – చెన్నబోయిన అనూష, ఒకటో వార్డు కౌన్సిలర్, హుస్నాబాద్ మున్సిపాలిటీ. నర్సాపూర్ : నాకు చిన్నప్పటి నుంచి రాజకీయాలంటే ఇష్టం. పట్టణంలోని 11వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచాను. విద్యార్థి దశలోనే పలు విద్యార్థి సంఘాల్లో పని చేశాను. రిజర్వేషన్ అనుకూలించడంతో బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచాను. అందరి సహకారంతో వార్డును అభివృద్ధి చేస్తాను. – ఎం.నిరంజన్దాస్, 11వ వార్డు కౌన్సిలర్, నర్సాపూర్ దుబ్బాక: నేను బీఎస్సీ చదివిన. నాకు చిన్నప్పటి నుంచి రాజకీయాలంటే చాలా ఇష్టం. నా భర్త సాయితేజగౌడ్, మా మామయ్య ప్రోత్సాహంతో కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచాను. వార్డును అన్ని రంగాలో అభివృద్ధి చేస్తా. – ఐరేని అఖిల, 20వ వార్డు కౌన్సిలర్, దుబ్బాక ఆదర్శంగా తీర్చిదిద్దుతా విద్యార్థి సంఘాల్లో పని చేశారాజకీయాలంటే ఇష్టం -
ప్రజా సేవ చేసేందుకే..
సంగారెడ్డి: ప్రజా సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చాను. ప్రస్తుతం బీటెక్ పూర్తి చేసి మా నాన్న గడ్డం వెంకటరాజు సహకారంతో రాజకీయ రంగ ప్రవేశం చేశాను. ప్రజలు నాపై నమ్మకం ఉంచి వార్డు సభ్యురాలుగా గెలిపించారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతా. మొత్తం సంగారెడ్డిలో 38 వార్డులకు గాను 8 మంది 35 సంవత్సరాల లోపు కౌన్సిలర్లు గెలిచారు. ఇందులో మనీషా 24 ఏళ్లకే కౌన్సిలర్ కావడం విశేషం. – గడ్డం మనీషా, 30వ వార్డు కౌన్సిలర్, సంగారెడ్డి మున్సిపాలిటీ. -
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ
సదాశివపేట(సంగారెడ్డి): రోడ్డు ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా... 50 మంది ప్రయాణికులతో జహీరాబాద్ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును సదాశివపేట పట్టణ పరిధిలోని జాతీయ రహదారిపై వైజంక్షన్ మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో బస్సు ముందుభాగం నుజ్జునుజ్జయింది. తీవ్రంగా గాయపడిన 15 మందితోపాటు, స్వల్పంగా గాయపడిన వారిని 108లో సదాశివపేట, సంగారెడ్డి ఆస్పత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన మేతరి జయమ్మ, మద్దికుంట మహేశ్వరి, గౌసియాబేగం, సోమేశ్వర్, అవుసలి బస్వరాజ్, షేక్ మహబూబ్, గొల్ల కంసమ్మ, హిమబిందు, అంజయ్య, మారుతి, దండు మీనా, కవేలి సరిత, బిడకన్నే రత్నమ్మ, నాగిరెడ్డిపల్లి రాధికలను సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సందర్శించి క్షతగాత్రులకు తక్షణం చికిత్స అందేలా చర్యలు చేపట్టారు. ప్రమాదంలో తీవ్రగాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి గురించి ఫోన్లో అడిగితెలుసుకున్నారు. ఎస్పీ వెంట డీఎస్సీ సత్తయ్యగౌడ్, సీఐ, పోలీసులు పాల్గొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశ్ తెలిపారు. 15 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు సంగారెడ్డి జిల్లాలో ఘటన -
ఉద్యోగం వదిలి..
నర్సాపూర్: స్థానిక ఇంజినీరింగ్ కాలేజీలో నెలకు రూ.35వేల ఉద్యోగం వదిలి ప్రజా సేవ చేయాలన్న లక్ష్యంతో వచ్చాను. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పట్టణంలోని 2వ వార్డు కౌన్సిలర్గా కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందాను. నా తండ్రి వెంకటేశ్గౌడ్ ప్రజా ప్రతినిధిగా గతంలో ఓటమి చెందడంతో తమ ఇంటి నుంచి ప్రజా ప్రతినిధిగా గెలవాలన్న నా తండ్రి కోరికను నెరవేర్చాను. ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజా సేవ చేస్తూ ఉత్తమ వార్డుగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం. – ఏ.సుధీర్గౌడ్, 2వ వార్డు కౌన్సిలర్, నర్సాపూర్ -
సమస్యలపై అవగాహన
దుబ్బాక: మాది దుబ్బాకలో రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. మా మామయ్య స్వర్గీయ శ్రీరాం ప్రభాకర్ దుబ్బాక ఎంపీపీగా ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. నా భర్త నరేందర్ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చా. కౌన్సిలర్గా మొదటి సారి ప్రజలు నాపై నమ్మకంతో అవకాశం కల్పించారు. డిగ్రీ చదివిన నాకు సమాజంపై అవగాహన ఉంది. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు అహర్నిషలు పనిచేస్తా. – శ్రీరాం సరస్వతి, 18వ వార్డు కౌన్సిలర్, దుబ్బాక -
రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి
కొండపాక(గజ్వేల్): రోడ్డు పమ్రాదంలో దంపతులు మృతి చెందారు. ఈ ఘటన కొండపాక శివారులో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలు ఇలా... రాజీవ్ రహదారిపై మరమ్మతులు జరుగుతుండటంతో ఒక్కవైపు రోడ్డు బంద్ చేశారు. దీంతో మరొక లైన్లో సిద్దిపేటకు, హైదరాబాద్ వైపునకు వాహనాలు వెళ్లేలా ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన మహమ్మద్ అబ్దుల్ రఫీ(50) బెల్లంపల్లి ఏరియాలోని ఖైరీగూడ ఓపెన్ కాస్ట్ సింగరేణి కంపెనీలో జనరల్ అసిస్టెంట్గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన భార్య ఫర్జానతో కలిసి కారులో హైదరాబాద్కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కొండపాక శివారులో రాజీవ్ రహదారిపై సిద్దిపేట నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ట్రాలీ ఆటో, కారును ఢీకొట్టింది. దీంతో డ్రైవింగ్ చేస్తున్న రఫీ కారులో ఇరుక్కుపోయి మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాలయ్యియి. ఆమెను అంబులెన్సులో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. కారులో ఇరుక్కుపోయి మృతి చెందిన రఫీని గడ్డపారతో డోర్లను ఓపెన్ చేసి బయటకు తీశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కుకునూరుపల్లి ఎస్సై శ్రీనివాస్ పేర్కొన్నారు.కారును ఢీకొట్టిన ట్రాలీ ఆటో -
యువత రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఉన్నత చదువులు చదివినా ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కౌన్సిలర్లుగా గెలిచి పట్టణాలను ప్రగతి బాట పట్టిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలలో అత్యధికులు 35 ఏళ్లలోపు వారే ఉండటం విశేషం. ‘పురం’లో తమ మ
చేర్యాల నుంచి నంగునూరుకు వెళ్లే ఈ దారి దాదాపు 18 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రోడ్డు రెండు నియోజకవర్గాలను, అలాగే రెండు జాతీయ రహదారులను కలపనుంది. దీంతో చాలా వాహనాలు ఈ మార్గం గుండానే రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ రహదారిలో దాదాపు 8 కిలోమీటర్ల మేర గుంతలమయంగా మారింది. దీంతో వాహనదారులు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ రోడ్డును సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం వాహనదారులకు తిప్పలు తప్పడంలేదు. మెదక్–సిద్దిపేట– ఎల్కతుర్తి జాతీయ రహదారి (765 డీజీ)పై బ్రిడ్జి నిర్మాణం కోసం 2023లో శంకుస్థాపన చేశారు. పర్యవేక్షించే అధికారులు లేకపోవడంతో రెండున్నరేళ్లుగా నత్తనడకన పనులు సాగుతున్నాయి. బ్రిడ్జి నిర్మాణం పూర్తికాకపోవడంతో రైల్వే గేట్ పడితే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.ఇఫ్తార్ ఆదివారం: 6.28 సహర్ సోమవారం: 5.11ఇంజనీర్లు కావలెను నాచగిరి ఉత్సవాలకు రండివర్గల్(గజ్వేల్): నాచగిరి లక్ష్మీనృసింహక్షేత్రంలో మార్చి 8 నుంచి జరగనున్న బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను ఆహ్వానించారు ఈమేరకు శనివారం హైదరాబాద్లో మంత్రిని కలిసి ఆలయ చైర్మన్ పల్లె రవీందర్గుప్త, ఈఓ రంగాచారి ఆహ్వాన పత్రిక అందజేశారు. అనంతరం అర్చకుల మహదాశీర్వచనం, స్వామివారి ప్రసాదం అందజేసినట్లు ఈఓ తెలిపారు. అంతకుముందు బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్లను మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆవిష్కరించారు. ఉత్సవాలకు సంబంధించి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, సీఎంఆర్ మెడికల్ కాలేజీ చైర్మన్ గోపాల్రెడ్డిలకు ఆహ్వాన పత్రికలు అందజేసినట్లు ఈఓ తెలిపారు. నేడు మల్లన్న ఏడోవారం భారీగా తరలిరానున్న భక్తులు కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సత్తేటి వారాలలో భాగంగా ఏడో ఆదివారం వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకోనున్నారు. శనివారం సాయంత్రానికి వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు మల్లన్న క్షేత్రానికి చేరుకున్నారు. వేకువ జామున పుష్కరిణిలో స్నానమాచరించి మల్లన్నకు పట్నం వేసి బోనం సమర్పించి మొక్కులు సమర్పించుకోనున్నారు. మల్లన్న ఆలయ ఈఓగా కృష్ణప్రసాద్ మల్లికార్జున స్వామి ఆలయ నూతన ఈఓగా డి.కృష్ణప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈఓగా పనిచేస్తున్న టంకసాల వెంకటేశ్ శనివారం పదవీ విరమణ పొందడంతో అతని స్థానంలో దేవాదాయ శాఖ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న కృష్ణ ప్రసాద్ ఈఓగా నియమించారు. దరఖాస్తుల ఆహ్వానంప్రశాంత్నగర్(సిద్దిపేట): రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మైనార్టీ నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణకు గాను అర్హులైన అభ్యర్థులనుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి నాగరాజమ్మ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బ్యూటీ అండ్ వెల్నెస్, మెహిందీ ఆర్ట్, ఎలక్ట్రికల్ కోర్సుల్లో మైనార్టీ యువతకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. పది, ఇంటర్ చదివిన అభ్యర్థులు ఈ నెల 7న లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 9866123213లో సంప్రదించాలన్నారు. ఎఫ్పీఓకు ఎక్సలెన్స్ అవార్డు చిన్నకోడూరు(సిద్దిపేట): స్థానిక రైతు ఉత్పత్తి దారుల సహకార సంఘం(ఎఫ్పీఓ)కు ఎన్సీడీసీ ప్రాంతీయ కో ఆపరేటివ్ ఎక్సలెన్స్తో పాటు మెరిట్ అవార్డును హైదరాబాద్లో సంఘం చైర్మన్ వెంకట్రెడ్డికి అందజేశారు. వివిధ రంగాలలో సంఘం సాధించిన ఘనత ఆధారంగా ఈ అవార్డులను ప్రదానం చేసినట్లు భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు జీడీ సతీష్ కుమార్, దినేష్ కుమార్లు తెలిపారు. సంఘం చైర్మన్ ఏలేటి వెంకట్ రెడ్డి, డైరెక్టర్లను పలువురు అభినందించారు. జిల్లాలో సగానికిపైగా ఖాళీలుసాక్షి, సిద్దిపేట జిల్లాలో రహదారులు, భవనాల(ఆర్అండ్బీ) శాఖలో ఇంజనీర్ల పోస్టులు భర్తీ కాకపోవడం పర్యవేక్షణకు అవరోధంగా మారుతోంది. జిల్లా కేంద్రంలో సూపరింటెండెంట్ ఇంజనీర్(ఎస్ఈ) సర్కిల్ కార్యాలయం పరిపాలన సౌలభ్యం కోసం సిద్దిపేట, గజ్వేల్ రెండు డివిజన్ కార్యాలయాలుగా మార్చారు. కానీ క్షేత్రస్థాయిలో ఇంజనీర్లను భర్తీ కాకపోవడంతో రోడ్ల దుస్థితిపై సరైన పర్యవేక్షణ కొరవడుతోంది. పనులు చేసే చోట్ల నాణ్యతా ప్రమాణాలపై ప్రభావం పడుతోంది. రెండు డివిజన్ల పరిధిలో 57 మంది వివిధ హోదాల్లో అధికారులు, సిబ్బంది ఉండాల్సి ఉండగా 22 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్నవారు డిప్యుటేషన్లపై.. జిల్లాలో రెండు డివిజన్లు, ఆరు సబ్ డివిజన్లు ఉన్నాయి. వీటిలో మొత్తంగా 29 మంది వివిధ హోదాల్లో ఇంజనీర్లు ఉండాలి. అందులో 14 మంది మాత్రమే ఉండగా మిగతా 15 ఖాళీలే ఉన్నాయి. ఈ 14 మందిలో సైతం సిద్దిపేట డిప్యూటీఈఈ పని చేస్తున్న వెంకటేశం ఆరు నెలల క్రితం విద్యాశాఖకు డిప్యూటేషన్ పై వెళ్లారు. సిద్దిపేట డివిజన్ ఈఈ పోస్టు ఖాళీగా ఉండటంతో గజ్వేల్ ఈఈకి ఇన్చార్జి బాధ్యతలను అప్పగించారు. సిద్దిపేట సబ్ డివిజన్లో డిప్యూటీ ఈఈ లేకపోవడంతో హుస్నాబాద్ డిప్యూటీఈఈకి ఇన్చార్జీ బాధ్యతలను అప్పగించారు. జగదేవ్పూర్ సబ డివిజన్ పరిధిలో ఒక్క డిప్యూటీఈఈ మాత్రమే ఉండగా ఏఈఈలు లేకపోవడంతో పర్యవేక్షణ కరువుతోంది. అటకెక్కిన నాణ్యత ప్రమాణాలు ఖాళీగా ఉన్న ఏఈఈ పోస్టులన్నీ వివిధ ప్రాంతాల్లోని రోడ్లను పర్యవేక్షణ చేయాల్సినవే. ఆర్అండ్బీ ప్రాథమిక నిబంధన ప్రకారం రోడ్లను పర్యవేక్షించాల్సి ఉంటుంది. గుంతలమయంగా మారితే బాగుచేయించి రాకపోకలకు అవరోధం లేకుండా చూసే కీలక బాధ్యత ఏఈఈలదే. ఖాళీల కారణంగా నాణ్యతా ప్రమాణాల పరిశీలన అటకెక్కింది. ప్రధానంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్నతాధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉంటోంది. ఇది గుత్తేదారులకు అన్ని విధాలుగా కలిసివస్తోంది.పై చిత్రంలోని కార్యాలయం రెండు జిల్లాలకు చెందిన రహదారులు, భవనాల (ఆర్అండ్బీ) శాఖకు చెందినది. శనివారం ఉదయం 10:50గంటలకు ఆర్అండ్బీ ఎస్ఈ కార్యాలయాన్ని ‘సాక్షి’ ప్రతినిధులు వెళ్లగా ఖాళీ కుర్చీలే దర్శన మిచ్చాయి. ఆర్ అండ్ బీ ఎస్ఈ సారంగపాణి, డిప్యూటీ ఎస్ఈ ఆర్కిపస్లు, ఏఈఈ, ఏఈలతో పాటు ఇతర సిబ్బంది రాలేదు. కేవలం కింది స్థాయి సిబ్బంది మాత్రమే వచ్చారు. దీంతో ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. ఒక్కొక్కరు 11:20గంటల నుంచి కార్యాలయంకు రావడం ప్రారంభించారు. ఎప్పుడూ సమయ పాలన పాటించరని పలువురు కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎస్ఈ సారంగపాణిని ఫోన్లో సంప్రదించగా ఈఎన్సీ కార్యాలయంలో తాను, డిప్యూటీ ఎస్ఈ ఇద్దరం సమావేశానికి వెళ్లామని, మిగతా వారు వస్తారని దాటవేశారు. ఇప్పటికై నా ఉన్నత అధికారులు, కలెక్టర్ దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు. అలాగే పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. త్వరలో పదోన్నతులు శాఖలో త్వరలో పదోన్నతులు ఇవ్వనున్నారు. అప్పుడు కొంత మంది ఇంజనీర్లు రానున్నారు. సర్కిల్ పరిధిలో ఖాళీల వివరాలను ఇప్పటికే ఉన్నత అధికారులకు తెలియజేశాం. ఆ పోస్టులు సైతం త్వరలో భర్తీ అయ్యే అవకాశం ఉంది. – సారంగపాణి, ఎస్ఈ, ఆర్ అండ్ బీ హోదా మంజూరు సంఖ్య భర్తీ ఖాళీలు ఈఈ 2 01 01 డిప్యూటీఈఈ 7 05 02 ఏఈఈ 14 07 07 ఏఈ 06 01 05 కేసులు ఎత్తివేయాలి వర్గల్(గజ్వేల్): అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు కోసం గద్దెను నిర్మిస్తున్న నాయకులపై కేసులు ఎత్తివేయాలని డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఏగొండ స్వామి డిమాండ్ చేశారు. శనివారం వర్గల్ మండలం నాచారంలో నిర్మాణ దశలో ఉన్న అంబేడ్కర్ విగ్రహ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విగ్రహ ఏర్పాటు చేస్తున్న గద్దెకు ఇరువైపులా దాదాపు 26 ఫీట్ల దారి ఉన్నప్పటికీ అనవసరంగా అంబేడ్కర్ సంఘ నాయకులను పర్మిషన్ల పేరుతో కేసులు పెట్టారని ఆరోపించారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దళిత బహుజన సంఘాలు సంఘటితంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వెంకటేశ్, కృష్ణ, ప్రభాకర్, నరేష్, బాబు, భగత్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జోన్: రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అందులోభాగంగానే అర్హులైన వారికి స్కూటీలను అందించేందుకు నిర్ణయించింది. ఇప్పటికే ట్రై సైకిల్, ల్యాప్టాప్ తదితర పరికరాలను అందించింది. స్వయం ఉపాధి పొందుతున్న వారితో పాటు ఉన్నత చదువులు అభ్యసిస్తున్న వారికి ప్రాధాన్యం కల్పిస్తోంది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ అర్హులైన దివ్యాంగులు వాహనాలు పొందేందుకు ఇప్పటికే జిల్లా సంక్షేమ శాఖ అధికారులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తు చేసుకున్న వారిలో సదరం సర్టిఫికెట్ ఆధారంగా ఎక్కువశాతం వైకల్యం కలిగి ఉండి, వాహనం నడపగలిగి, డిగ్రీ, పీజీ చదువుకున్న వారితో పాటు స్వయం ఉపాధిలో రాణిస్తున్న వారికి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ మేకు 50 మందిని ఎంపిక చేశారు. సైడ్ వీల్స్ బిగించి.. త్వరలో పంపిణీ జిల్లాలో 14 వేలకు పైగా దివ్యాంగులున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసే స్కూటీలు ఇటీవలే కలెక్టరేట్కు చేరుకున్నాయి. ఎలాంటి ఇబ్బందులు పడకుండా వాహనాలు నడుపుకునేందుకు సంబంధిత శాఖ ఆధ్వర్యంలో వాహనాలకు సైడ్ వీల్స్ బిగించనున్నారు. త్వరలో మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా వీటిని పంపిణీ చేయనున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రభుత్వానిదే ఈ వాహనాల రిజిస్ట్రేషన్ను రాష్ట్ర ప్రభుత్వమే చేయనుంది. సంబంధిత శాఖ ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి అందించనుంది. ఒక్కో వాహనం రూ.1,10,000 వరకు ఉంటుందని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. ఎంపికై న వారికి పూర్తిస్థాయిలో ఉచితంగా పంపిణీ చేస్తారు.ఖాళీ కుర్చీలే దర్శనం -
పెండింగ్ కేసులు పరిష్కరించండి
సిద్దిపేటకమాన్: పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ న్యాయమూర్తి పుల్లా కార్తీక్ అన్నారు. జిల్లా కోర్టును హైకోర్టు న్యాయమూర్తి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి, ఇతర న్యాయమూర్తులు స్వాగతం పలికారు. పోలీసు గౌరవ వందనం స్వీకరించిన అనంతరం కోర్టు హాల్లో న్యాయమూర్తులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు న్యాయశాఖ పనిచేస్తుందని జిల్లాలో వివిధ కేసుల్లో వచ్చే కేసులను త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. అదేవిధంగా పెండింగ్ కేసులు ఎప్పటికపుడు పరిష్కరిచాలన్నారు. అంతకుముందు హరిత మినర్వా హోటల్లో కలెక్టర్ హైమావతి మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తి జయప్రసాద్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్జడ్జి సంతోష్కుమార్, న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.


