breaking news
Siddipet
-
నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి
మిరుదొడ్డి(దుబ్బాక): విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలను అలవర్చుకుంటేనే సమాజంపై మంచి అవగాహన కలుగుతుందని తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ అర్చన ప్రియదర్శిని అన్నారు. మిరుదొడ్డి తెలంగాణ మోడల్ స్కూల్లో ఇటీవల నిర్వహించిన మాక్ పోలింగ్లో గెలుపొందిన విజేతల చేత సోమవారం ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చదువుతో పాటు ఆట పాటలు, నైతిక విలువలు, క్రమ శిక్షణలో విద్యార్థులందరికీ మాక్ పోలింగ్లో గెలుపొందిన విజేతలు ఆదర్శంగా నిలవాలని సూచించారు. తోటి విద్యార్థులందరికీ ప్రాతి నిధ్యం వహించే అవకాశాన్ని జవాబుదారీ తనంతో ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో టీచర్లు అంజుమ్, నాగరత్న, రాజేశ్వరి, అనురాధ, దేవేందర్తో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
కల్లుగీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేసి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కల్లుగీత సంఘం జిల్లా కార్యదర్శి అరుణ్గౌడ్ మాట్లాడుతూ ఎంతో ప్రమాదకరమైన వృత్తి అయినా వృత్తిని నమ్ముకుని కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు. ఈ క్రమంలో చాలా మంది కార్మికులు ప్రమాదాలకు గురైనప్పటికీ ఎక్స్గ్రేషియా అందించడంలో తీవ్ర ఆలస్యం జరుగుతోందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం గీతకార్మికులకు, వారి కుటుంబాలకు రావాల్సిన పరిహారాన్ని అందించాలన్నారు. -
నాగేటి సాలల్లో.. నవతరం
● ఓ వైపు చదువుతూమరో వైపు ఎవుసంపై మక్కువ ● తల్లిదండ్రులకు ఆసరాపత్తి పంటలో గొర్రు కొడుతున్న యువకులు జగదేవ్పూర్(గజ్వేల్): వ్యవసాయం తరతరాలుగా వారసత్వంగా వస్తున్న వృత్తి.. కొందరు ఉన్నత స్థాయిలో ఉన్నా.. మక్కువతో సాగు చేస్తుండగా.. మరి కొందరు చదువుతూనే వ్యవసాయం చేస్తున్నారు. మండలంలో వివిధ గ్రామాలకు చెందిన యువకులు ఓ వైపు చదువుతూ మరో వైపు వ్యవసాయ పనుల్లో రాణిస్తూ మెలకువలు నేర్చుకుంటున్నారు. వ్యవసాయం రంగంలో యువత, విద్యార్థులు రాణిస్తున్నారు. నాగలి పట్టి దుక్కిదున్నడం. దంతె, గొర్రు కొట్టడం, మందు పిచికారీ చేయడం, ట్రాక్టర్ సహాయంతో పొలం దున్నడం, ఒడ్డు చెక్కడం, వ్యవసాయ మిషన్లతో కలుపు తీయడంలాంటి పనులు చేస్తున్నారు. ఎమ్మెస్సీ చేస్తూ... జగదేవ్పూర్ మండలంలోని తిగుల్ గ్రామానికి చెందిన ఉప్పల నరేష్ ప్రస్తుతం సిద్దిపేటలో ప్రతిభ కళాశాలలో ఎమ్మెస్సీ రెండో సంవత్సరం చదువుతున్నారు. ప్రస్తుతం గ్రామంలో తమకున్న భూమితో పాటు మరింత భూమిని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశారు. పంట చేతికందే వరకు ప్రతి పనిని తమ్ముడు రాజు (ఎమ్మెస్సీ ప్రథమ సంవత్సరం)తో కలిసి వ్యవసాయ పనులు చేస్తున్నారు. వ్యవసాయంపై మక్కువతో.. మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన నర్సోల్ల నాగరాజు.. ప్రస్తుతం డిప్లొమా అగ్రికల్చరల్ చేస్తున్నారు. వ్యవసాయం కూడా చదువులో భాగమే అంటూ సాగు చేస్తున్నానని చెబుతున్నారు. సమయం కుదిరినప్పుడల్లా.. వ్యవసాయం పనులు చేయడం.. అమ్మానాన్నలకు ఆసరాగా నిలవడం సంతోషంగా ఉందని నాగరాజుతెలిపారు. డిగ్రీ చేసి.. కూరగాయలు పండిస్తూ.. మండలంలోని తిమ్మాపూర్కు చెందిన నర్సింహులు డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నాడు. ఎవుసం తాత ముత్తాల నుంచి వస్తున్న వృత్తి అని, వ్యవసాయం అంటే చాలా ఇష్టమని తెలిపారు. ఆదునిక పద్ధతులు నేర్చుకుని కూరగాయల పంటలను సాగు చేస్తున్నానని చెబుతున్నారు. -
గ్రూపులొద్దు.. రచ్చకెక్కొద్దు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: విబేధాలుంటే రచ్చకెక్కి మాట్లాడొద్దు.. ఏమైనా సమన్వయ సమస్య ఎదురైతే అంతర్గతంగా చర్చించుకొని పరిష్కరించుకోవాలి.. లేనిపక్షంలో టీపీసీసీ నాయకత్వం దృష్టికి తీసుకురావాలి.. అంతేకానీ ఇష్టానుసారంగా మాట్లాడొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ నేతలకు సూచించారు. సోమవారం గాంధీభవన్లో సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల కీలక నాయకులతో సమావేశం జరిగింది. సంస్థాగత నిర్మాణం గ్రామ, మండల, జిల్లా కార్యవర్గం, అనుబంధ సంఘాల నియామకం తదితర అంశాలపై పొన్నం నేతలతో చర్చించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే నామినెటేడ్, పార్టీ పదవుల ఎంపికలో ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. ఒక్కో నియోజకవర్గానికి రెండు చొప్పున రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ల పోస్టులు భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఈ నెలాఖరులోగా అన్ని నామినేటెడ్ పదవులతో పాటు, పార్టీ సంస్థాగత పదవుల భర్తీ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. నియోజకవర్గ ఇన్చార్జిలు ఆయా పదవుల కోసం ఇచ్చిన జాబితాలపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసి టీపీసీసీ, ఏఐసీసీ నాయకత్వానికి పంపుతామన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కష్టపడి పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ సురేష్షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎంపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్, మెదక్ డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, ఆయా నియోజకవర్గాల ఇన్చార్జిలు రాజిరెడ్డి, టి.నర్సారెడ్డి, నాయకులు ఉప్పల శ్రీనివాస్గుప్త, మెట్టుసాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. ‘స్థానిక’ ఎన్నికల్లో సత్తాచాటుదాం గజ్వేల్: స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. సోమవారం గాంధీభవన్లో డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డితో కలిసి గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు సంబంధించిన వివరాలను నర్సారెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. సమీక్షలో మంత్రి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సాహసోపేత నిర్ణయాలతో ముందుకుసాగుతున్నారని కొనియాడారు. ఏళ్ల తరబడి ప్రజలు ఎదురుచూస్తున్న రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు అందించగలుగుతున్నామని చెప్పారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించడం చరిత్రాత్మక నిర్ణయమన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలన్నారు. కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. -
అదనపు కలెక్టర్ను కలిసిన కొమురవెల్లి అర్చకులు
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయ ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్ ఆధ్వర్యంలో అర్చకులు సోమవారం అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్వామి వారి ప్రసాదాన్ని అందించారు. అదనపు కలెక్టర్ కలిసిన వారిలో జిల్లా దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, స్థానచార్యులు మల్లయ్య, నాచారం లక్ష్మీనర్సింహస్వామి, అర్చకులు తీగుళ్ల గోపికృష్ణ, మనోహర్, బసవేశ్వర్ తదితరులు ఉన్నారు. ‘పాయమాలు’ ఆవిష్కరణ ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాకు చెందిన రచయిత ఐత చంద్రయ్య రచించిన పాయమాలు కథల సంపుటి పుస్తకావిష్కరణ సోమవారం నగరంలో జరిగినట్లు బాలసాహితీవేత్త ఉండ్రాళ్ల రాజేశం తెలిపారు. కథల సంపుటిని ముదిగొండ శివప్రసాద్, ఓలేటి పార్వతీశం, వడ్డి విజయసారథి, ఆంజనేయరాజులు ఆవిష్కరించారన్నారు. జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు ఎన్నవెల్లి రాజమౌళి, లక్ష్మయ్య, బస్వరాజ్ కుమార్, పరశురాములు, సుధాకర్ తదితరులు అభినందనలు తెలిపారు. ఎస్సీలకు న్యాయం చేయండి మంత్రులకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ విజ్ఞప్తి దుబ్బాక: పెరిగిన జనాభా ప్రకారం ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్లు కల్పించి న్యాయం చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కోరారు. ఈ మేరకు సోమవారం నగరంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్లను వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. స్థానిక సంస్థల కులగణన సర్వే ప్రకారం పెరిగిన జనాభాకు అనుగుణంగా ఎస్సీలకు రిజర్వేషన్ను కల్పించాలని మంత్రులను కోరినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు వారు సానుకూలంగా స్పందించారన్నారు. కార్యక్రమంలో తనతో పాటు జహీరాబాద్ ఎంపీ సురేష్షెట్కార్, కమిషన్ సభ్యులు తదితరులు ఉన్నారు. నిరుద్యోగుల నుంచిదరఖాస్తుల ఆహ్వానం సిద్దిపేటరూరల్: నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ తెలంగాణ (డీట్) పోర్టల్ ద్వారా వివిధ పరిశ్రమల్లో ఖాళీగా ఉన్న 160 పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను ఆహానిస్తున్నట్లు కలెక్టర్ హైమావతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రైనీ ఎగ్జిక్యూటివ్విజువల్ ఇన్స్పెక్టర్, ఆర్ఏడీ, క్యూసి, క్యూఏ, ట్రైనీ వంటి పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. దీనికై ఐటీఐ, ఇంటర్, బీటెక్, బిఫార్మసి, ఎంఫార్మసి, బీఎస్సీ, కెమిస్ట్రి, మైక్రోబయోలజీ ప్రత్యేక సబ్జెక్టుగా ఉండి డిగ్రీ, పీజి చదివినవారు అర్హులని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు డీట్ పోర్టల్ www.deet.telangana.gov.inలో ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9281423575 నంబర్ను సంప్రదించాలని కోరారు. దివ్యాంగులకుఇచ్చిన హామీ ఏమాయె ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రాజు దుబ్బాక: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు దివ్యాంగులకు రూ.6,016 పెన్షన్ ఇస్తామని చెప్పి ఇంత వరకు అమలు చేయడంలేదని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రాజుమాదిగ అన్నారు. సోమవారం దుబ్బాకలో దివ్యాంగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్నా దివ్యాంగులకు, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులకు మేనిఫెస్టోలో ప్రకారం పెన్షన్లు పెంచకపోవడం దారుణమన్నారు. దివ్యాంగుల హక్కుల సాధన కోసం ఈ నెల 16న సిద్దిపేటలో జరిగే మహాసభకు మంద కృష్ణమాదిగ హాజరవుతున్నారన్నారు. దివ్యాంగులు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో నాయకులు జోగయ్య, మహేష్, రాజేశ్వరరావు, కనకరాజు తదితరులు ఉన్నారు. -
అర్జీలు సత్వరం పరిష్కరించాలి
● కలెక్టర్ హైమావతి ● అధికారులకు ఆదేశాలు ● ప్రజావాణికి వచ్చిన అర్జీలు 253 సిద్దిపేటరూరల్: జిల్లా వ్యాప్తంగా ప్రజలు అందిస్తున్న అర్జీలను వెంటవెంటనే పరిశీలిస్తూ పరిష్కారం దిశగా పనిచేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు గరీమా అగర్వాల్, అబ్దుల్హమీద్లతో కలిసి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రజావాణిపై నమ్మకం ఏర్పడేలా వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. వాటిని ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. డీఆర్ఓ నాగరాజమ్మ, కలెక్టరేట్ ఏఓ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. డబుల్సెంచరీ దాటిన అర్జీలు.. ప్రజావాణి అర్జీలపై ఎప్పటికప్పుడు కలెక్టర్ సమీక్షిస్తూ అధికారులకు ఆదేశాలు జారీచేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా అధికారులు అర్జీదారులకు ఫోన్ చేసి వివరాలు అడుగుతున్నారు. దీంతో సమస్యలు పరిష్కారం అవుతున్నాయనే సంతోషం అర్జీదారుల్లో వ్యక్తమవుతోంది. ప్రజలు తండోపతండాలుగా కలెక్టరేట్కు వచ్చి అర్జీలను అందిస్తున్నారు. దీంతో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఏకంగా 253 ధరఖాస్తులు వచ్చాయి. గృహలక్ష్మి నిధులు మంజూరు చేయాలి గృహలక్షీనిధులు మంజూరు చేయాలని నంగునూరు మండలం సిద్దన్నపేట వాసులు కోరారు. ఈ మేరకు ప్రజావాణిలో అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో పది మందికి గత ప్రభుత్వం హయాంలో గృహలక్ష్మి పథకం కింద ఇళ్లు మంజూరయ్యాయి. దీంతో ఇళ్లు కట్టుకున్నప్పటికి నేటికి పథకానికి సంబంధించిన నిధులు రాలేవు. దీనికోసం ఎన్నో సార్లు అధికారుల చుట్టూ తిరిగినప్పటికి ఎలాంటి ఫలితం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అప్పులు తెచ్చి ఇళ్లుకట్టుకున్న మాకు నిధులు మంజూరు చేయాలని కోరారు. మా ఇళ్లు కూల్చొద్దు మా ఇళ్లను కూల్చొద్దని దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి వాసులు కోరారు. అర్జీ సమర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ ఉన్న ఇంట్లోనే ఉంటూ బతుకులు వెళ్లదీస్తున్నామన్నారు. ఈ క్రమంలో గ్రామంలోని రోడ్డు వెడల్పులో భాగంగా మాకు ఎలాంటి నోటీసులు, సమాచారం అందించకుండా మార్కింగ్ వేశారన్నారు. ఉన్న ఇళ్లు మొత్తం పోయేలా మార్కింగ్ చేసి కూలిస్తే మా బతుకులు రోడ్డునపడతాయని వారు వాపోయారు. ఎలాగైనా అధికారులు స్పందించి మా ఇళ్లను కూల్చకుండా ప్రత్యామ్నాం చూడాలని కోరారు. కేంద్ర బృందానికి వివరాలు అందించండి సిద్దిపేటరూరల్: జిల్లా పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందానికి అధికారులు అందుబాటులో ఉండి వివిధ పథకాల వివరాలను క్షేత్రస్థాయిలో అందించాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. సోమవారం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో చేపట్టిన పథకాల పరిశీలనకు వచ్చిన కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారులు జోసెఫ్, వినోద్లతో కలెక్టర్ సమావేశమయ్యారు. వారు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించాల్సిన వివిధ పనులపై చర్చించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర బృందం అధికారులు ఈనెల 24వ తేదీ వరకు బెజ్జంకి, అక్కన్నపేట, కొమురవెల్లి మండలాలలో క్షేత్రస్థాయిలలో పర్యటించనున్నారన్నారు. ఉపాధిహమీ పనులు, పెన్షన్లు, వాటర్షెడ్, గ్రామీణ సడక్ యోజన, పీఎం ఆవాస్యోజన, గ్రామ పంచాయతీలు, ఆర్సేటి తదితర 12 రకాల పథకాల అమలును పరిశీలిస్తారన్నారు. ఈ క్రమంలో సంబంధిత అధికారులు అందుబాటులో వివరాలను అందించాలన్నారు. -
బూర్గుపల్లి పాఠశాలలో ‘అల్పాహార సేవ’
గజ్వేల్: సత్యసాయి సేవా సమితి సేవలు అభినందనీయమని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. బూర్గుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ‘అల్పాహార సేవా’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యసాయి సేవాసమితి సేవలు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నాయని చెప్పారు. మరోవైపు గుండె జబ్బుల బారిన పడుతున్న చిన్నారులకు పెద్ద ఎత్తున ఆపరేషన్లు చేయించి వారిని కాపాడుతున్న ఘనత ఈ సంస్థకే దక్కిందన్నారు. బూర్గుపల్లి పాఠశాలలో విద్యార్థులకు నిరంతర ‘అల్పాహార సేవా’ కార్యక్రమాన్ని చేపట్టడం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ కృష్ణ, పాఠశాల హెచ్ఎం పాపిరెడ్డి, దాత బాల్నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు. -
పైసలిస్తే పనులు ఖాయం!
తహసీల్దార్ కార్యాలయాల్లో దళారుల దందా ● నివాసం లేకున్నా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ ● కొండపాక తహసీల్దార్ కార్యాలయం లీలలు సాక్షి, సిద్దిపేట/కొండపాక(గజ్వేల్): కాసులకు ఆశపడి కొందరు రెవెన్యూ అధికారులు ఇష్టారాజ్యంగా సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. రెవెన్యూ శాఖలో కొంతకాలంగా అవినీతి, అక్రమాలు పెరిగిపోతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి వివిధ సర్టిఫికెట్ల జారీకి ఆన్లైన్ పద్ధతిలోకి వచ్చినా కొందరు రెవెన్యూ ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. భూముల మ్యుటేషన్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్, రేషన్ కార్డుల మంజూరు వంటి వాటిని పొందేందుకు దళారులకు డబ్బులిచ్చి సులువుగా పని చేయించుకుంటున్నా రు. దళారులకు డబ్బులిచ్చి తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి కొండపాక తహసీల్దార్ కార్యాలయం నుంచి ఓ మహిళ ఏకంగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ను పొందిన ఘటనే ఇందుకు నిదర్శనం. దళారుల దందా... జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో యథేచ్ఛగా దళారుల దందా కొనసాగుతోంది. సర్టిఫికెట్్కు ఒక రేటు ఫిక్స్ చేసి దళారులు దరఖాస్తుదారుల నుంచి వసూలు చేస్తున్నారు. అన్ని తామే చూసుకుంటామని కొంత సమయం పెట్టి ఎలాంటి సర్టిఫికెట్ అయిన జారీ చేయిస్తున్నారు. దళారులు వసూలు చేసిన డబ్బుల నుంచి కొంత ఆయా అధికారులకు ముట్టచెప్పి పనులు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ సర్టిఫికెట్ల కోసం నేరుగా వెళ్లిన వారికి వివిధ సాకులు చెప్పి తిరిగిపంపించేస్తున్నారని వాపోతున్నారు. దీంతో దళారులను దరఖాస్తుదారులు ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికై నా కలెక్టర్ ప్రత్యేక దృష్టిపెట్టి దళారులు వసూళ్ల దందాను అరికట్టాలని, తప్పుడు పత్రాలు జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇదీ జరిగింది... తొగుట మండలం గుడికందుల గ్రామంలో యాదయ్యకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య 14ఏళ్ల క్రితం మృతిచెందింది. మొదటి భార్యకు ఇద్దరు పిల్లలున్నారు. రెండవ భార్య సరిత హైదరాబాద్లో ఉంటుంది. గతేడాది భర్త అనారోగ్యంతో మృతిచెందాడు. భర్త పేరు మీద గుడికందులలో ఒక ఎకరం 20 గుంటల భూమి ఉంది. ఆ భూమిని తన పేరు మీద రాయించుకునేందుకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ను రెండవ భార్య సరిత కొండపాక తహసీల్దార్ కార్యాలయం నుంచి పొందింది. ఈ సర్టిఫికెట్ను తీసుకుని తొగుట మండలంలో 878/అ/1లో ఉన్న 1.20ఎకరాల భూమిని మ్యుటేషన్ చేయాలని ఆన్లైన్ స్లాట్ బుక్ చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన మొద టి భార్య పిల్లలు తొగుట తహసీల్దార్ను కలిసి ఆ భూమి తమది అని చెప్పి వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిలిపివేయాలని తహసీల్దార్కు సమాచారమిచ్చారు. దీంతో విచారణ చేపట్టిన తహసీల్దారు అధికారులను తప్పు దోవ పట్టించి ఎఫ్ఎంసీని పొందినట్లు గుర్తించారు. దీనిపై కొండపాక మండల తహసీల్దార్ శ్యాంను వివరణ అడగగా ఎఫ్ఎంసీని రద్దు చేశామన్నారు. -
ముమ్మరంగా వనమహోత్సవం
జిల్లాలో 22.47 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం ● ఇప్పటివరకు 7లక్షలకు పైగా మొక్కలు నాటడం పూర్తి ● అన్ని శాఖల సమన్వయంతో ముందుకు 16 శాఖలు.. 22 లక్షల మొక్కలు జిల్లాలో వనమహోత్సవ కార్యక్రమం వివిధ శాఖల సమన్వయంతో కొనసాగుతుంది. అటవీ శాఖ 75,600, పంచాయితీరాజ్, రోడ్లు భవనాల శాఖకు 13.2లక్షలు, మున్సిపాలిటీలకు 4.66లక్షలు, ఎడ్యుకేషన్ 2వేలు, మైన్స్ అండ్ జియాలజీ 2300, హార్టీకల్చర్, సెరీకల్చర్ 1,29,300, పశుసంవర్థక శాఖ 1వేయి, పౌరసరఫరాల విభాగం 2200, ఎకై ్సజ్ 67,700, వైద్యారోగ్యశాఖ 1400, బీసీ సంక్షేమశాఖ 500, నీటిపారుదల శాఖ 45,500, వ్యవసాయశాఖ 1,27,700, ఇండస్ట్రియల్ 20వేలు, పోలీసుశాఖ 4600 మొక్కలు నాటేలా లక్ష్యాలను నిర్దేశించారు. ఇప్పటివరకు ఏడు లక్షలకు పైగా మొక్కలను నాటినట్లు జిల్లా అటవీ అధికారులు చెబుతున్నారు.సిద్దిపేటకమాన్: సిద్దిపేట జిల్లాలో వనమహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 22.47లక్షల మొక్కలు నాటాలని నిర్దేశించారు. ఇప్పటికే లక్ష్యానికి అనుగుణంగా జిల్లా అటవీశాఖ, పంచాయితీరాజ్ శాఖ అధికారులు ఏడు మున్సిపాలిటీలు, డీఆర్డీఓ పరిధిలో 489, ఫారెస్టు 3తోపాటు మొత్తం 499 నర్సరీల్లో 25.05లక్షల మొక్కలను సిద్ధం చేశారు. వనమహోత్సవం ద్వారా మొక్కలు నాటేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అన్ని వర్గాలు, అన్ని శాఖలను భాగస్వామ్యం చేస్తూ మొక్కలను నాటేలా లక్ష్యం నిర్దేశించింది. ఆకుపచ్చ జిల్లాగా మార్చేందుకు అధికార యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా మొక్కలను నాటుతున్నారు. 25 లక్షల మొక్కలు సిద్ధం జిల్లాలో 499 నర్సరీల్లో 25,05,348 మొక్కలను పంపిణీ చేయడానికి అధికారులు సిద్ధంగా ఉంచారు. 2025–26 సంవత్సరానికి గాను జిల్లాలో 22.47లక్షల (22,47,800) మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 7.17లక్షల (31.68%) మొక్కలు నాటారు. వనమహోత్సవ పట్టణాలు, గ్రామ పంచాయితీ పరిధిలో కొనసాగుతుంది. జిల్లా యంత్రాంగం అన్ని గ్రామ పంచాయితీల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేలా, నాటిన ప్రతి మొక్కను కాపాడాలని అన్ని శాఖల సిబ్బందికి జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి చేసేలా అధికారులు పనులు కొనసాగిస్తున్నారు. గతేడాది (2024–25) జిల్లాలో 21.62లక్షల మొక్కలు నాటేలా లక్ష్యం పెట్టుకోగా 19.12లక్షల మొక్కలు నాటి 88.41% పూర్తి చేశారు. వనమహోత్సవం కొనసాగుతుంది జిల్లాలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతుంది. ఈ ఏడాది అన్ని శాఖల అధికారుల సమన్వయంతో జిల్లాలో 22.47లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్ధేశించారు. లక్ష్యాన్ని పూర్తి చేసేలా ప్రభుత్వ ఆదేశానుసారం అన్ని ప్రాంతాల్లో ఇతర అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతుంది. – జోజి, జిల్లా ఇన్చార్జి అటవీ అధికారి సిద్దిపేట -
గెలుపోటములు సహజమే
● క్రీడలతో మానసికోల్లాసం ● మాజీమంత్రి,ఎమ్మెల్యే హరీశ్రావుఏడాది పాటు వందేళ్ల ఉత్సవాలు● చట్ట సభల్లో సీపీఐ ఉంటేనే అర్థవంతమైన చర్చ ● ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి సిద్దిపేటజోన్: క్రీడాకారులు గెలుపు ఓటములను సహజమేనని వాటిని సమానంగా స్వీకరించాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. స్థానిక సిటిజన్ క్లబ్లో రాష్ట్రస్థాయి మహిళా వాలీబాల్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రస్తుతం సమాజంలో తల్లిదండ్రులు తమ పిల్లల ఉన్నత చదువులు, విదేశాల పయనంపైనే ఆలోచిస్తూ పిల్లల ఆరోగ్యం గురించి మర్చిపోతున్నారన్నారు. చదువుతో పాటు ఆటపాటలు కూడా ఎంతో ముఖ్యమని క్రీడామైదానాల వైపు పిల్లలను దృష్టి సారించేలా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. వాలీబాల్ను గ్రామీణ క్రీడగా అభివర్ణించారు. సిద్దిపేటలో జాతీయ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహణకు తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో జాతీయ వాలీబాల్ అకాడమి వైస్ప్రెసిడెంట్ హన్మంతరెడ్డి, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయిరాం, సిటిజన్ క్లబ్ అధ్యక్షుడు రమేశ్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, వైస్చైర్మన్ కనకరాజుతో పాటు పలువురు పాల్గొన్నారు. గురుపూజలో ఉన్న సంతృప్తి ఎక్కడా లభించదు సిద్దిపేటఅర్బన్: పాఠాలు ఎవరైనా చెబుతారని, జీవిత పాఠాలు కొందరే చెబుతారని ఆ కొందరిలో దుర్గాప్రసాద్ స్వామీజీ ఒకరని, అలాంటి వ్యక్తిని గురువుగా భావించి సన్మానించుకోవడం తన అదృష్టంగా హరీశ్రావు పేర్కొన్నారు. గురుపూజోత్సవం పురస్కరించుకుని హనుమాన్ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీకి సిద్దిపేటలో గురుపూజోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు పాల్గొని మాట్లాడారు. మనిషికి దైవ నామస్మరణ, గురుపూజలో ఉన్న సంతృప్తి, ఆనందం ఎందులోనూ ఉండదన్నారు. సిద్దిపేటలో ఏ కార్యక్రమం చేపట్టినా సిద్ధిస్తుందని, కోటి హనుమాన్ చాలీసా పారాయణం సంకల్పం సైతం సిద్ధించాలని కోరుకున్నారు. హుస్నాబాద్: సీపీఐ ఆవిర్భవించి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ చేసిన త్యాగాలు, పోరాటాలు, ప్రజాఉద్యమంలో సాధించిన విజయాలపై ఏడాదిపాటు సీపీఐ వందేళ్ల ఉత్సవాలను నిర్వహించనున్నట్లు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి తెలిపారు. పట్టణంలోని సీపీఐ భవన్లో శనివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ...కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపెడుతూ జిమ్మిక్కుల పాలన కొనసాగిస్తుందన్నారు. దేశంలో కార్పొరేట్ శక్తులు సహజ వనరులను కొల్లగొడుతూ లక్షల కోట్లకు పడగలెత్తుతున్నారని ఆరోపించారు. ఆర్థిక నేరస్తులైన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, లలిత మోదీ వంటి దొంగలకు ప్రధాని మోదీ వత్తాసు పలుకుతున్నారని తెలిపారు. ఆపరేషన్ కగార్ పేరిట ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి మావోయిస్టులను చంపడం ఏ చట్టంలో ఉందని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల పెంపు కోసం ఆర్డినెన్స్ తెస్తామన్న ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు విషయంలో ఇప్పటికే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిశారన్నారు. దీనిపై ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తర్వాత స్పష్టత వస్తుందని తెలిపారు. చట్టసభల్లో సీపీఐ ఉంటేనే అర్థవంతమైన చర్చ జరుగుతుందని చెప్పారు. ఈ నెల 16న సీపీఐ జిల్లా మహాసభలు హుస్నాబాద్లో ఈ నెల 16న సీపీఐ జిల్లా మహాసభలు నిర్వహించనున్నట్లు ఆపార్టీ జిల్లా కార్యదర్శి మంద పవన్ తెలిపారు. ఈ మహాసభలకు జిల్లా నుంచి 300 మంది ప్రతినిధులు పాల్గొంటారన్నారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు గడిపె మల్లేశ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు జాగిరి సత్యనారాయణ, వనేష్, లక్ష్మణ్, నాయకులు కుమార్, జనార్ధన్, భాస్కర్, సుదర్శనచారి, రాజ్కుమార్ తదితరలున్నారు. -
‘ఆపన్నహస్తం’ సేవలు
లోక్సత్తా ఉభయ తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త బండారు రామ్మోహన్రావు గజ్వేల్: ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ‘ఆపన్నహస్త మిత్రబృందం’సేవలు అభినందనీయమని లోక్సత్తా ఉద్యమ సంస్థ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సమన్వయకర్త బండారు రామ్మోహన్రావు పేర్కొన్నారు. గజ్వేల్లో శనివారం నిర్వహించిన ఆపన్నహస్త మిత్రబృందం కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...2017లో ఏర్పడిన ఆపన్నహస్త మిత్రబృందం ఇప్పటివరకు 106 సేవా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా మరెన్నో సంఘాలకు ఆదర్శంగా నిలిచిందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో సరస్వతి శిశుమందిర్ ప్రధానాచార్యులు హరిణాపవన్, జాతీయ యువజన అవార్డుగ్రహీత దేశబోయిన నర్సింహులు, ఆపన్నహస్త మిత్రబృందం అధ్యక్షుడు బాల్చంద్రం, కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి శ్యామ్ప్రసాద్, సహాయ కార్యదర్శి స్వామితో పాటు సంస్థ సభ్యులు పాల్గొన్నారు. -
బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి
ఎంపీ రఘునందన్రావు సమక్షంలో పలువురు బీజేపీలో చేరిక గజ్వేల్: బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని ఎంపీ రఘునందన్రావు సూచించారు. పలువురు బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు శనివారం ఎంపీ రఘునందన్రావు సమక్షంలో బీజేపీలో చేరారు. హైదరాబాద్లోని ఎంపీ రఘునందన్రావు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ...స్థానిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని సూచించారు. బీజేపీలో చేరిన వారిలో సిద్ది నవీన్, శ్రీవర్ధన్, యాదగిరి, గోపి తదితరులున్నారు. -
అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి అక్కన్నపేట(హుస్నాబాద్): ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. అక్కన్నపేట మండలం గొల్లకుంట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు కాశబోయిన రాజవ్వ ఇంటి నిర్మాణానికి శనివారం భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. గ్రామాల్లో పదేళ్ల తర్వాత పేదల కళ్లల్లో వెలుగులు చూస్తున్నామన్నారు. ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడ్డ ప్రజా ప్రభుత్వం..ఇందిరమ్మ రాజ్యం దిశగా అడుగులు వేస్తోందన్నారు. కార్యక్రమంలో హుస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, వైస్చైర్మన్ ఎగ్గిడి ఐల్లయ్య, కట్కూర్ గ్రామ సింగిల్ విండో వైస్చైర్మన్ ముకుందంరెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు జంగపల్లి అయిలయ్య, నాయకులు ముత్యాల సంజీవ్రెడ్డి, చింతల బాల్రెడ్డి, మోతిలాల్నాయక్తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్లు కేటాయించాలిఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మిరుదొడ్డి(దుబ్బాక): రాష్ట్రంలో షెడ్యూల్ కులాల జనాభా గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఎస్సీలకు 18% రిజర్వేషన్లు కేటాయించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఆయన శనివారం మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ...ఎస్సీలకు 18% రిజర్వేషన్లు కేటాయించాలని కోరుతూ ఇద్దరు మంత్రులకు వినతి పత్రాన్ని సమర్పించానన్నారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలిప్రశాంత్నగర్(సిద్దిపేట): సోషల్ మీడియాకు ఎంతదూరం ఉంటే భవిష్యత్ బాగుటుందని సిద్దిపేట షీటీమ్ ఏఎస్ఐ కిషన్ విద్యార్థులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో శనివారం విద్యార్థులకు మహిళా రక్షణకు ఉన్న చట్టాలు, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, పోక్సో, షీటీమ్, మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాలు, నూతన చట్టాల గురించి, అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ..వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు అందరూ కలిసిమెలసి ఉండాలన్నారు. అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్లను ఎత్తవద్దన్నారు. బాలికలు, మహిళల భద్రతకు షీటీమ్, పోలీసులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసలు కాకుండా చదువుపైనే దృష్టి పెట్టాలని చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్ను విడుదల చేయాలిఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజనీకాంత్ ప్రశాంత్నగర్(సిద్దిపేట): రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజనీకాంత్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన ఎస్ఎఫ్ఐ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో రజనీకాంత్ పాల్గొని మాట్లాడారు. వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ను అందించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఫీజుల బకాయిలు చెల్లించలేదని ఆరోపించారు. తక్షణమే ఫీజులు విడుదల చేయకుంటే ఛలో హైదరాబాద్ పేరు తో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బత్తుల అభిషేక్ భాను తదితరులు పాల్గొన్నారు. -
బీమా చేయించి.. ఆపై చంపించి..
సాక్షి, సిద్దిపేట/సిద్దిపేట కమాన్: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అత్తను హత్య చేయించి..దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన ఓ అల్లుడు కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా పెద్దమాసాన్పల్లి శివారులో చోటుచేసుకుంది. శనివారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ డాక్టర్ బి.అనురాధ ఆ వివరాలు మీడియాకు వెల్లడించారు. ఈ నెల 7వ తేదీన తొగుట పీఎస్ పరిధిలో దివ్యాంగురాలైన తాటికొండ రామవ్వ(60)ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందని.. ఆమె అల్లుడు తాళ్ల వెంకటేశ్ డయల్ 100కు కాల్ చేశాడు. దీంతో గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి చెందినట్టు తొగుట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వైట్ కారు ఢీ కొట్టి..ఇప్పుడే వెళ్లిందని ఫిర్యాదులో భాగంగా వెంకటేశ్ పోలీసులకు చెప్పాడు. పోలీసులు వైట్ కారు డ్రైవర్ను విచారించగా, తన కంటే ముందు బ్లాక్ కలర్ తార్జీపు వెళ్లిందని చెప్పాడు. సీసీ ఫుటేజీని పరిశీలించగా ఈ తార్ జీపు తుక్కాపూర్ వరకు నంబర్ ప్లేట్ ఉన్నట్టు, తర్వాత దానిని తొలగించి టీఆర్ స్టిక్కర్ వేసినట్టు గుర్తించారు. ఎందుకు నంబర్ ప్లేట్ తొలగించారని ఆరా తీశారు. ఆ తార్ జీపు నంబరు ఆధారంగా వాహన యజమాని దగ్గరకు వెళ్లి పోలీసులు విచారించారు. పెద్దమాసాన్పల్లికి చెందిన కరుణాకర్ సెల్ఫ్ డ్రైవింగ్ నిమిత్తం సిద్దిపేటలో రూ 2,500 చెల్లించి ఆధార్ కార్డు, వివరాలు ఇచ్చి అద్దెకు తీసుకున్నాడు. దీంతో పోలీసులు కరుణాకర్ను అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. కరుణాకర్ చెప్పిన వివరాల ఆధారంగా మృతురాలి అల్లుడైన వెంకటేశ్ను అదుపులోకి తీసుకొని విచారించారు. తానే ఈ దారుణానికి ఒడికట్టానని పోలీసులకు చెప్పాడు. ముందస్తు ప్లాన్ ప్రకారమే...సిద్దిపేట కేసీఆర్నగర్కు చెందిన తాటికొండ రామవ్వ–రంగయ్య దంపతుల కుమార్తెను తొగుట మండలం పెద్దమాసాన్పల్లికి చెందిన తాళ్ల వెంకటేశ్కు ఇచ్చి వివాహం జరిపించారు. అయితే వెంకటేశ్ తన అత్తను హత్య చేసి దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి... ఆమె పేరుపై ఇన్సూరెన్స్ చేయించి డబ్బు కాజేయాలనుకున్నాడు. అందులో భాగంగానే ఈ ఏడాది మార్చిలో తాటికొండ రామవ్వ పేరుపై పోస్టాఫీసులో ఏడాదికి రూ.755 చెల్లించి రూ.15 లక్షల ఇన్సూరెన్స్, ఎస్బీఐలో రూ.2 వేలు చెల్లించి రూ 40 లక్షల ఇన్సూరెన్స్ చేయించాడు. రైతుబీమా డబ్బు లు వస్తాయని రంగయ్య (మృతురాలి భర్త) పేరు పైన ఉన్న 28 గుంటల వ్యవసాయ భూమిని రామవ్వ పేరు మీద పట్టా మారి్పడి చేయించాడు. ఆపై తన ప్లాన్కు వరుసకు తమ్ముడయ్యే తాళ్ల కరుణాకర్కు చెప్పాడు. వెంకటేశ్ గతంలోనే తాళ్ల కరుణాకర్కు రూ.1.30 లక్షలు అప్పుగా ఇచ్చాడు. అయితే కరుణాకర్ పౌల్ట్రీఫామ్ పెట్టి రూ.22 లక్షల వరకు నష్టపోయాడు. తన అత్త హత్యకు సహకరిస్తే అప్పు ఇవ్వాల్సిన అవసరం లేదని, వచ్చే ఇన్సూరెన్స్లో ఇద్దరం చెరి సగం పంచుకుందామని వెంకటేశ్ కరుణాకర్ను ఒప్పించాడు. ప్లాన్లో భాగంగానే ఈ నెల 7న కారు తీసుకొని రావాలంటూ వెంకటేశ్ కరుణాకర్కు ఫోన్ చేశా డు. ఇదే సమయంలో విద్యుత్ అధికారులు వస్తున్నారని నీ సంతకం కావాలని చెప్పి వెంకటేశ్ తన అత్త రామవ్వను ఎక్స్ఎల్ వాహనంపై పెద్దమాసాన్పల్లి శివారులోని వ్యవసాయ భూమి వద్దకు తీసుకొచ్చాడు. కరుణాకర్ సిద్దిపేటలోని కార్లు సెల్ఫ్ డ్రైవింగ్ ఇచ్చే వారి వద్దకు వెళ్లి ఓ తార్ జీపు (టీఎస్ 18జీ 2277)ను అద్దెకు తీసుకున్నాడు. నంబర్ ప్లేట్ కనిపించకుండా టీఆర్ పేపర్ అతికించి పెద్దమాసాన్పల్లి శివారుకు వచ్చాడు. రోడ్డుపైన రామవ్వను ఉంచి వెంకటేశ్ పొలంలోకి వెళ్లాడు. అనుకున్న ప్లాన్ ప్రకారం...రామవ్వను జీపుతో కరుణాకర్ ఢీకొట్టాడు. ఆపై కొద్ది దూరం వెళ్లాక వెంకటేశ్కు వాట్సాప్ కాల్ చేసి మీ అత్తను చంపిన వెళ్లి చూసుకో అన్నాడు. అనంతరం జీపునకు టీఆర్ పేపర్ తీసేసి దానిని సిద్దిపేటలో ఇచ్చేశాడు. సాంకేతిక సాయంతో పోలీసులు వెంకటేశ్ను అదుపులోకి తీసు కొని విచారించగా ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే తన అత్త ను చంపించినట్టు ఒప్పుకున్నాడు. ఆధారాలు దొరక్కుండా చేసేందుకు వారు దృశ్యం సినిమా చూశారని పోలీసు లు తెలిపారు. నార్మల్ ఫోన్ కాల్ చేస్తే పోలీసులకు దొరికే ప్రమాదముందని నిందితులిద్దరూ వాట్సాప్ కాల్స్ మా ట్లాడుకున్నట్టు విచారణలో తేలింది. వెంకటేశ్, కరుణాకర్లను అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన తార్ జీప్ ఎక్స్ఎల్ వాహనాన్ని స్వా«దీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. గజ్వేల్ ఏసీపీ నరసింహులు ఆధ్వర్యంలో కేసును ఛేదించిన తొగుట సీఐ లతీఫ్, ఎస్ఐ రవికాంతరావు, సిబ్బందిని సీపీ అభినందించి రివార్డు అందజేశారు. -
సిద్ధిపేటలో దారుణం.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అత్తను చంపి..
సాక్షి, సిద్ధిపేట: జిల్లాలో దారుణం జరిగింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ అల్లుడు.. తన అత్తనే చంపించేశాడు.. ఈ నెల జులై 7న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అల్లుడు వెంకటేష్.. రూ. లక్షా 50 వేలు సుపారీ ఇచ్చి.. కారుతో ఢీకొట్టించి అత్తను హత్య చేయించాడు. తోగుట మండలం తుక్కాపూర్ దర్గా వద్ద ఈ ఘటన జరిగింది. పక్కా ప్లాన్ ప్రకారం అత్తను హత్య చేయించిన అల్లుడు గుర్తు తెలియని వాహనం ఢీకొని చనిపోయిందంటూ నమ్మించే ప్రయత్నం చేశాడు.సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేయగా అల్లుడి బాగోతం బయటపడింది. వెంకటేష్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తమదైన శైలిలో విచారించగా.. సంచలన విషయాలు బయటపడ్డాయి. హత్య చేసినట్టు అల్లుడు వెంకటేష్ తన నేరాన్ని అంగీకరించాడు. అత్తను హత్య చేసేందుకు ప్లాన్ చేసిన అల్లుడు వెంకటేష్.. ముందుగానే పోస్టాఫీసు ఇన్సూరెన్స్, ఎస్బీఐ ఇన్సూరెన్స్, రైతు బీమా చేయించినట్లు గుర్తించామని పోలీసులు వెల్లడించారు.పౌల్ట్రీ ఫామ్ పెట్టి రూ.22 లక్షల వరకు నష్టపోయిన వెంకటేష్.. నష్టాల నుంచి బయటపడేందుకు అత్త హత్యకు ప్లాన్ చేశాడు. అత్త పేరుపై రూ.60 లక్షల వరకు ఇన్సూరెన్స్ చేసిన అల్లుడు.. పొలం పని ఉందని చెప్పి..అత్తను తీసుకెళ్లాడు. దృశ్యం-2 సినిమా చూసి అత్తను హత్య చేయించాడు. కారుతో ఢీకొట్టి చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. -
సివిల్ జడ్జి కోర్టును ఏర్పాటు చేయండి
మంత్రి పొన్నంను కలిసిన న్యాయవాదులు హుస్నాబాద్: పట్టణంలో సీనియర్ సివిల్ జడ్జి కోర్టును ఏర్పాటు చేయాలని న్యాయవాదులు కోరారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్లో మంత్రుల నివాస గృహంలో మంత్రి పొన్నం ప్రభాకర్ను హుస్నాబాద్ బార్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి వినతి పత్రం ఇచ్చారు. సీనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరుకు కృషి చేయాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యాళ్ల శ్రీనివాస్రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఒగ్గొజు సదానందం, మాజీ ఏజీపీ కన్నోజు రామకృష్ణ, సీనియర్ న్యాయవాదులు ఉన్నారు. మహిళలు ఆర్థికాభ్యున్నతి సాధించాలి జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ప్రకాశ్ వర్గల్(గజ్వేల్): ఇందిరా మహిళాశక్తి పథకం తోడుగా స్వయంసహాయక సంఘ మహిళలు ఆర్థికాభ్యున్నతి సాధించాలని సెర్ప్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ప్రకాశ్ అన్నారు. గురువారం వర్గల్ మండల కేంద్రంలో ఇందిరా మహిళాశక్తి సంబరాలలో పాల్గొన్నారు. ప్రభుత్వం మహిళాభ్యున్నతికి అమలుచేస్తున్న వివిధ పథకాలపై ఆయన అవగాహన కల్పించారు. వడ్డీలేని రుణాల గురించి వివరించారు. సంఘంలో సభ్యురాలిగా ప్రతి మహిళ చేరేలా, రుణాలు తీసుకుని జీవనోపాధులు కల్పించుకునేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎం ఆనంద్, సమాఖ్య అధ్యక్షురాలు రేణుక, సీసీలు, ఎస్హెచ్జీ మహిళలు పాల్గొన్నారు. మెనూ ప్రకారం భోజనం వడ్డించాలి డీఈఓ శ్రీనివాస్రెడ్డి జగదేవ్పూర్(గజ్వేల్): ప్రభుత్వ పాఠశాలల్లో నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించాలని డీఈఓ శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని తిగుల్నర్సాపూర్, గొల్లపల్లి గ్రామాల్లో పాఠశాలలను సందర్శించారు. అలాగే జగదేవ్పూర్లో ఆదర్శ పాఠశాలను, హాస్టల్ను సందర్శించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆర్థమ య్యే విధంగా బోధన చేయాలని, గ్రూపులుగా విభజించి విద్యను అందించాలన్నారు. రెవెన్యూ డివిజన్ సాధించితీరుతాం 16న జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం చేర్యాల(సిద్దిపేట):రెవెన్యూ డివిజన్ సాధించి తీరుతామని, ఈ నెల 16న స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద మానవహారం నిర్వహిస్తున్నట్లు జేఏసీ చైర్మన్ వకుళాభరణం నర్సయ్యపంతులు తెలిపారు. గురువారం పట్టణ కేంద్రంలో జేఏసీ, అఖిల పక్షం ప్రతినిధులతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు. పలువురు మాట్లాడుతూ మానవహారం కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
ఇళ్లు నిర్మించుకోలేం
‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల వెనుకడుగు ● 40 నుంచి 60 గజాల నిబంధనే కారణం ● డబ్బులు సరిపోవంటూ మరికొందరు దూరం ● ఇప్పటి వరకు ముగ్గు పోసింది 6,069 మందే ● సాయం పెంచాలని, కొలతల నిబంధన సడలించాలని కోరుతున్న లబ్ధిదారులు జిల్లాలోని తొగుట మండలం తుక్కాపూర్లో 131 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. జనవరి 26న పైలెట్ గ్రామంగా తుక్కాపూర్ను ఎంపిక చేశారు. ఇప్పటి వరకు 17 మంది ముగ్గు పోసి పనులు ప్రారంభించారు. ఇంకా 114 మంది ఇంటి నిర్మాణాలను ప్రారంభించలేదు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనప్పటికీ నిర్మించుకోలేమని 82 మంది ఆ గ్రామ కార్యదర్శికి లేఖ రాసి ఇచ్చారు. దీంతో ఈ నెల 9న గ్రామసభలో తీర్మానం చేసి హౌసింగ్ అధికారులకు పంపించారు. ప్రభుత్వ నిబంధనలతో ఇలా ఒక్క గ్రామమే కాదు చాలా చోట్ల పలువురు ఇళ్లు నిర్మించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. – సాక్షి, సిద్దిపేట ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనప్పటికీ నిర్మించుకునేందుకు చాలా మంది లబ్ధిదారులు ముందుకు రావడంలేదు. ఓ వైపు నిర్మాణం కొలతల నిబంధనలు.. మరో వైపు ప్రభుత్వం అందించే డబ్బులు సరిపోవని వెనుకడుగు వేస్తున్నారు. మరి కొందరు పెట్టుబడి లేక నిర్మించుకోవడం లేదు. నిర్మించిన వాటికి సైతం బిల్లుల చెల్లింపు కొంత ఆలస్యం అవుతుండటం మరో కారణం. జిల్లావ్యాప్తంగా 11,605 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 6,069 మందే ముగ్గు పోసి పనులు ప్రారంభించారు. లబ్ధిదారుల చుట్టూ అధికారులు జిల్లా వ్యాప్తంగా 5,536 మంది లబ్ధిదారులు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోయలేదు. ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు ఆసక్తి చూపకపోవడంతో గ్రామ స్థాయి అధికారులు పలుమార్లు లబ్ధిదారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడుతోంది. నిర్మాణం పనులు ప్రారంభించిన వారికి సైతం బిల్లులు వెంటనే చెల్లించడం లేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఇళ్ల పనుల పురోగతి ప్రకారం బిల్లులు చెల్లిస్తున్నామని అధికారులు చెబుతున్నా సకాలంలో అందడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. నిర్మాణం కొలతల నిబంధనలు ఇంటి నిర్మాణం అనేది జీవిత కాలం కల. ఇంటి యాజమానికి నచ్చినట్లు నిర్మించుకుంటారు. నిర్మించుకునేది కొంత పెద్దగా నిర్మించుకోవాలని భావిస్తారు. ప్రభుత్వం 40 గజాలకు తగ్గకుండా 60గజాలకు పెరగకుండా నిర్మించాలని నిబంధన పెట్టింది. 60 గజాలకు అంగుళం పెరిగినా సాయం అందించలేమని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఇంటిని నిర్మించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. తుక్కాపూర్ గ్రామం వ్యూపెరిగిన మెటీరియల్ ధరలు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేసుకున్న వారికి ప్రభుత్వం రూ. 5లక్షలు సాయం అందిస్తోంది. సిమెంట్, ఐరన్, ఇటుకలు, భవన నిర్మాణ మేసీ్త్రలు, కూలీ డబ్బులు విపరీతంగా పెరగడంతో దాదాపు రూ.10లక్షల వరకు ఖర్చు అవుతుంది. దీంతో పేదలు ఇంటి నిర్మించుకునేందుకు ముందుకు రావడం లేదు. ఇప్పుడు వర్షాకాలం కావడంతో ఇంటిని తొలగించి అదే స్థానంలో ఇంటి నిర్మాణం చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ రుణాలు చెల్లించే వెసులుబాటు కల్పించాలని ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న లబ్ధిదారులు కోరుతున్నారు. -
మల్లన్న హుండీ ఆదాయం రూ.కోటి 4 లక్షలు
శుక్రవారం శ్రీ 11 శ్రీ జూలై శ్రీ 2025కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి ఖజానాకు భారీ ఆదాయం సమకూరింది. 55 రోజులలో హుండీ ద్వారా రూ.1,04,35,711ల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ అన్నపూర్ణ తెలిపారు. గురువారం ఆలయంలోని హుండీలనూ దేవాదాయ శాఖ సిద్దిపేట డివిజన్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో కానుకలను లెక్కించారు. నగదు రూ.1,04,35,711, విదేశి కరెన్సీ నోట్లు 42, మిశ్రమ బంగారం 120గ్రాములు, మిశ్రమ వెండి 6కిలోల 100గ్రాములు, పసుపు బియ్యం16క్వింటాళ్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ధర్మకర్తలు, ప్రధానార్చకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆలయంలో పలు కార్యక్రమాలకు వేలం పాట నిర్వహించారు. – కొమురవెల్లి(సిద్దిపేట) -
ట్రేడ్లైసెన్స్ల జారీలో అలసత్వం తగదు
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి ● కలెక్టర్ హైమావతి ● అధికారులతో సమావేశం కొలువుదీరిన కొండపోచమ్మ పాలకవర్గం వేగంగా ఇంజనీరింగ్ కాలేజీ రోడ్డు పనులు మున్సిపల్ కమిషనర్ రమేశ్కుమార్సిద్దిపేటరూరల్: ప్రజలకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండి వైద్య సేవలు అందించాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా, మండల స్థాయి మెడికల్ అధికారులతో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు అరికట్టేందుకు అన్ని ఆస్పత్రులలో మందులు అందుబాటులో ఉంచాలన్నారు. గురుకులాలు, వసతి గృహాలలో విద్యార్థులకు హిమోగ్లోబిన్ శాతం, పలు పరీక్షలు నిర్వహించి జాగ్రత్తగా చూడాలన్నారు. సిద్దిపేట మున్సిపల్ పరిధిలోనీ ఆయా వార్డులలో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ వేగంగా జరిగేలా మున్సిపల్, ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.జగదేవ్పూర్(గజ్వేల్): రాష్ట్రంలోనే ప్రసిద్ధి గాంచిన కొండపోచమ్మ ఆలయంలో గురువారం నూతన పాలకవర్గం కొలువు దీరింది. ఆలయ ప్రాంగణంలో కమిటీ సభ్యుల ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. కమిటీ సభ్యులుగా అనుగీత, రాజు, వెంకట్రాంరెడ్డి, కిషన్, రాజు, దేవేందర్రెడ్డి, అనసూర్య, నర్సింహులు, జనార్దన్రెడ్డి, లక్ష్మణ్, ఆగమల్లు, ఆశయ్య, వజ్రమ్మ, నరేష్లను దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మీ, ఈఓ రవికుమార్లు ప్రమాణం చేయించారు. అనంతరం అనుగీతను చైర్పర్సన్ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన చైర్పర్సన్ను మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి అభినందిస్తూ సన్మానించారు. అలాగే కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీకాంత్రావు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి నూతన చైర్పర్సన్ను, కమిటీ సభ్యులను అభినందించి అమ్మవారిని దర్శించుకున్నారు. హుస్నాబాద్రూరల్: ఇంజనీరింగ్ కాలేజీని ప్రభుత్వ పాలిటెక్నిక్లో ప్రారంభిస్తామని చెప్పిన అధికారులు ఆ దిశగా రోడ్డు పనులు వేగంగా పూర్తి చేస్తున్నారు. గురువారం డీఈ మహేశ్ సీసీ రోడ్డు పనుల నాణ్యతను పరిశీలించారు. పాలిటెక్నిక్ వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి ఈజీఎస్లో రూ.50 లక్షల నిధులు మంజూరయ్యాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ త్వరగా రోడ్డు పనులు పూర్తి చేయాలని ఆదేశించడంతో అధికారులు దగ్గరుండి చేయిస్తున్నారు. మరో రెండు రోజుల్లో రోడ్డు పనులు పూర్తికానున్నట్లు తెలుస్తోంది. దుబ్బాక: మున్సిపాలిటీలో వ్యాపార సముదాయాలకు సంబంధించి ట్రేడ్ లైసెన్స్ల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని, అలసత్వం తగదని కమిషనర్ రమేశ్కుమార్ సిబ్బందికి సూచించారు. గురువారం ట్రేడ్లైసెన్స్ల జారీ, భువన్ యాప్లో వివరాల నమోదును ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ భువన్యాప్లో ఆస్తుల సమాచారాన్ని నమోదు, మ్యాపింగ్ చేయడం, పన్నుల వసూలుకు అవసరమైన వివరాల నమోదు పారదర్శకంగా చేపట్టాలన్నారు. అలాగే మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల సమక్షంలో కొలతలు వేసి ముగ్గులు పోసే కార్యక్రమాన్ని కమిషనర్ పరిశీలించారు. -
మురుగును పారదోల్తాం
హుస్నాబాద్: ‘డ్రైనేజీల ద్వారా వెళ్లే మురుగు నీటిని మళ్లిస్తాం. అవసరం ఉన్న చోట ఎఫ్ఎస్టీపీ కేంద్రాలను నిర్మిస్తాం. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యత ఇస్తాం’ అని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ తెలిపారు. గురువారం పట్టణంలో నెలకొన్న సమస్యల పై ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు అడిగిన ప్రశ్నలకు ఒక్కొక్కటిగా నోట్ చేసుకొని సమాధానాలు ఇచ్చారు. ముఖ్యంగా ఖాళీ ప్లాట్లల్లో నీరు నిలవడం, రహదారులు, మురికి కాలువల నిర్మాణాలు, దోమల నివారణ, పందులు, కోతుల బెడద వంటి పలు సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కాల్ చేసి విన్నవించారు. ఫీల్డ్ విజిట్ చేసి సమస్యలు పరిష్కరిస్తామని కమిషనర్ వివరించారు. ● ఇంటి పన్నులు అధికంగా పెంచారు. రూ.7 వేలు ఉన్న ఇంటి పన్నును రూ.35 వేలు పెంచి నోటీస్ ఇచ్చారు. పెద్ద మొత్తంలో పెంచడం సరికాదు. పూదరి రవీందర్గౌడ్, 3వ వార్డు ● రెసిడెన్సియల్ పర్పస్లో ఇంటి అనుమతి తీసుకొని దుకాణం పెట్టి ట్రేడ్ లైసెన్స్ పొందారు. కమర్షియల్గా చేయడంతో పన్ను పెరిగింది. ● పట్టణంలోని మల్లెచెట్టు నుంచి గాంధీ చౌరస్తా వరకు ఇరుకు రోడ్లు ఉన్నాయి. కూరగాయల దుకాణాలతో ఇబ్బందులు. చర్యలు తీసుకోండి. అయిలేని మల్లికార్జున్ రెడ్డి, చంద్రారెడ్డి, పిడిశెట్టి రాజు, హుస్నాబాద్ ● తాత్కాలికంగా పాత తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోని ఖాళీ స్థలంలోకి కూరగాయల దుకాణాలను తరలిస్తాం. ● మా కాలనీలో పందుల బెడద ఎక్కువైంది. అలాగే దోమల నివారణకు చర్యలు చేపట్టండి. మహ్మద్ మొయినొద్దిన్, 17వ వార్డు ● ఊరు బయటకు పందులు తరలించేలా యజమానులకు సూచిస్తాం. దోమల నివారణకు మెలాథిన్ స్ప్రే చేయిస్తాం. ● ఖాళీ ప్లాట్లన్నీ ముళ్లపొదలను తలపిస్తున్నాయి. పాములు తిరుగుతుండటంతో భయభ్రాంతులకు గురవుతున్నాం. మేకల సంపత్, 17వ వార్డు ● ఖాళీ ప్లాట్ల యజమానులకు ఇప్పటికే నోటీస్లు జారీ చేశాం. వారు స్పందించకుంటే డోజర్తో తామే క్లీన్ చేయిస్తాం. ● బస్టాండ్ వెనుకాల గల కాలనీలో మురుగు నీరు నిలిచి దుర్వాసన వస్తోంది. గంగిశెట్టి సత్యనారాయణ, హుస్నాబాద్ ● నేషనల్ హైవే అధికారుల దృష్టికి తీసుకెళ్లి మురికి కాలువ సమస్యను పరిష్కరిస్తాం. ● పలు వీధుల్లో నిర్మించిన మురికి కాలువలపై అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వరయోగుల అనంత స్వామి, హుస్నాబాద్ ● అక్రమ నిర్మాణాలపై విజిట్ చేసి నోటీస్లు ఇస్తాం. వినకుంటే నిర్మా ణాలను తొలగిస్తాం. ● మా కాలనీలో ఇరువైపులా సీసీ రోడ్లు వేసి మధ్యలో నిలిపివేశారు. పూర్తి చేసేలా చర్యలు తీసుకోండి. తిరుపతిరెడ్డి, 2వ వార్డు ● ఇంజనీరింగ్ అధికారులతో కలిసి వార్డులు తిరుగుతాం. అసంపూర్తిగా ఉన్న రహదారులు, మురికి కాలువల నిర్మాణాలు పూర్తి చేస్తాం. ● ప్రధాన చౌరస్తాల్లో వివిధ ప్రాంతాలు తెలిపేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయండి. పబ్బ సాంబమూర్తి, గాంధీ చౌరస్తా ● తప్పకుండా ప్రధాన చౌరస్తాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తాం. ● మా కాలనీలో గతుకుల రోడ్లతో ఇబ్బందులు పడుతున్నాం. చర్యలు చేపట్టండి సంజీవరెడ్డి, రెడ్డికాలనీ, మైసయ్య 14వ వార్డు ● పెండింగ్ రహదారుల నిర్మాణాల కోసం ఇంజనీరింగ్ అధికారులతో విజిట్ చేస్తాం. కాంట్రాక్టర్లను పిలిపించి పనులు ప్రారంభం అయ్యేలా చూస్తాం. ఎఫ్ఎస్టీపీ కేంద్రాలు నిర్మిస్తాం ఖాళీ ప్లాట్ల యజమానులకు నోటీస్లు జారీ చేస్తాం ఫీల్డ్ విజిట్ చేసి సమస్యలు పరిష్కరిస్తాం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ పట్టణంలోని మెయిన్ రోడ్ నుంచి వచ్చే మురికి నీళ్లు పొలాలకు వెళ్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు ముంచెత్తుతున్నాయి. పచ్చిమట్ల రవీందర్ గౌడ్, హుస్నాబాద్ మురికి నీటిని పట్టణం చివరి వరకు పంపించేందుకు శాశ్వత పరిష్కారం చూపుతాం. మురికి కాలువలు, ఎఫ్ఎస్టీపీ కేంద్రాల నిర్మాణం కోసం రూ.15 కోట్లతో సీడీఎంఏకు ప్రతిపాదనలు పంపాం. పట్టణంలో కోతుల బెడద నుంచి కాపాడండి. అయిలేని శంకర్ రెడ్డి, హుస్నాబాద్ హుస్నాబాద్ పట్టణంలో కోతుల బెడద ఎక్కువగా ఉంది వాస్తవమే. వాటిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. -
బీజేపీలోకి గాడిపల్లి భాస్కర్
● అనుచరులతో కలిసి కాషాయ తీర్థం ● రాష్ట్ర అధ్యక్షుడి సమక్షంలో చేరికలుగజ్వేల్: మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు, మెదక్ ఎంపీ రఘునందన్రావుల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఆయనతోపాటు పట్టణంలోని మాజీ కౌన్సిలర్లు సుభాష్చంద్రబోస్, రామచంద్రాచారి, నర్సింహులు, రొట్టెల దాసు, పద్మశాలి సంఘం అధ్యక్షులు దేవులపల్లి రాజారాంలతోపాటు భాస్కర్ అనుచరులు బీజేపీలో చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు మాట్లాడుతూ గజ్వేల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఎంపీ మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఇదిలావుంటే భాస్కర్ బీజేపీలో చేరడంతో పట్టణంలో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. -
అభివృద్ధి పనులు వేగిరం చేయాలి
● నిర్దిష్ట ప్రమాణాలతో పూర్తి చేయాలి ● కలెక్టర్ హైమావతి సిద్దిపేటరూరల్: జిల్లాలో చేపట్టిన అన్ని రకాల అభివృద్ధి పనులు వేగిరం చేయడమేకాక, నిర్దిష్ట ప్రమాణాలతో పూర్తి చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఈడబ్ల్యూఐడీసీ, ఆర్అండ్బీ శాఖల పనితీరుపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించి ఉన్న ఇబ్బందులు, అనుమతులు, టెండర్, నిధులు అంశాలపై చర్చించారు. భవన నిర్మాణాల పనులపై నివేదిక అందించాలన్నారు. ఇంకా నిర్మించాల్సిన వాటికి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు మొదలు పెట్టాలన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్రెడ్డి, ఎస్ఈ చిరంజీవులు, అర్డబ్ల్యూఎస్ ఎస్ఈ వెంకట్రెడ్డి, ఆర్అండ్బీ ఇన్చార్జి ఈఈ సర్దార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల లబ్ధిదారుల నుంచి స్పందన సిద్దిపేటకమాన్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి మంచి స్పందన వస్తుందని కలెక్టర్ తెలిపారు. సిద్దిపేట పట్టణం 37వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి కలెక్టర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..400 చదరపు అడుగుల మేర ఉన్న ఇళ్లను మాత్రమే గ్రౌండింగ్ చేయడం జరుగుతుందన్నారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు గ్రౌండింగ్ పూర్తి చేస్తామన్నారు. -
కానరాని సీసీ.. అంతా ఛీఛీ
సీసీరోడ్లకు మోక్షమెప్పుడో? ● శంకుస్థాపనలకే పరిమితం ● నిధులు మంజూరైనా ప్రారంభంకాని పనులు ● అధ్వానంగా లోతట్టు ప్రాంతాలు ● కొత్త కాలనీలో రోడ్లపైనే మురుగు ● హుస్నాబాద్ మున్సిపాలిటీ దుస్థితి మట్టిరోడ్ల రహిత పట్టణంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యం.. పాలకుల నిర్లక్ష్యంతో నీరుగారుతోంది. నిధులు మంజూరై నెలలు గడుస్తున్నా నేటికీ పనులు ప్రారంభించలేదు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ పట్టణంలోని ప్రతి వార్డుకూ నిధులు మంజూరు చేసింది. దీంతో సీసీ రోడ్లతో పాటు మురికి కాలువలు నిర్మించాల్సి ఉంది. కానీ చాలా వార్డుల్లో శంకుస్థాపనలకే పరిమితం చేశారు. దీంతో చిరుజల్లులు కురిసినా అంతర్గత దారులు చిత్తడిగా మారుతున్నాయి. రోడ్లపైనే నీరు నిలిచి దుర్గంధం వ్యాపిస్తోంది. – హుస్నాబాద్ హుస్నాబాద్ పట్టణంలో 20 వార్డులు ఉన్నాయి. ఒక్కో వార్డుకు రూ.50లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు. ఇటీవల మున్సిపల్ కార్యాలయంలో అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ హైమావతి సమీక్ష నిర్వహించారు. పెండింగ్లో ఉన్న సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణం, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పలు వార్డుల్లో వివిధ కారణాలతో సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. లోతట్టు ప్రాంతాల్లో వర్షం వస్తే వరద నీటితో ఇళ్లు, కాలనీలు జలమయం కావడం పరిపాటిగా మారింది. దాదాపు 30 ఏళ్ల క్రితం నిర్మించిన మురికి కాలువలు వరద నీటి ప్రవాహాన్ని తట్టుకోలేక రోడ్లను ముంచెత్తి ఇళ్లలోకి వస్తున్నాయి. కొత్త కాలనీల్లో పలుచోట్ల సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టినా.. మురికి కాలువలు నిర్మించకపోవడంతో మురుగునీరంతా ఇళ్ల మధ్యే నిలిచిపోతోంది. అసలే వానాకాలం. వరద నీటితో మట్టి రోడ్లు బురదగా మారి నడిచే వారికి, వాహనదారులకు ప్రాణ సంకటంగా మారుతున్నాయి. సీసీ రోడ్లు నిర్మించండి హుస్నాబాద్లోని 3వ వార్డులో సీసీ రోడ్డు, మురికి కాలువల నిర్మాణాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. 8 నెలలు గడుస్తున్నా నేటికీ పనులు ప్రారంభించలేదు. మా కాలనీ లోట్టు ప్రాంతం. వరద నీటి ప్రవాహంతో రోడ్లు జలమయమై ఇళ్లలోకి నీరు చేరుతుంది. వరద నీటితో రోజుల తరబడి జాగారం చేయాల్సి వస్తోంది. అధికారులు తక్షణం సీసీరోడ్లు, మురికి కాలువలు నిర్మించాలి. – పూదరి రవీందర్గౌడ్, హుస్నాబాద్ రోడ్ల మధ్యే విద్యుత్ స్తంభాలు.. హుస్నాబాద్ పట్టణంలోని నేతాజీ కాలనీలో ఇటీవల సీసీ రోడ్లు నిర్మించారు. ప్రతి రోడ్డును 18 ఫీట్లతో నిర్మించారు. అయితే విద్యుత్ స్తంభాలు తొలగించకుండానే సీసీ రోడ్లు వేయడంతో అవి రోడ్డు మధ్యకు వచ్చాయి. సీసీ రోడ్ల నిర్మాణంలో మున్సిపల్ ఇంజనీరింగ్, విద్యుత్ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడమే ఇందుకు కారణం. రోడ్ల మధ్యనే విద్యుత్ స్తంభాలు ఉన్నప్పటికీ సదరు కాంట్రాక్టర్ సీసీ రోడ్లు నిర్మించి చేతుల దులుపుకొన్నారు. దీంతో వాహనారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయాల్లో వాహనాలు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు.హుస్నాబాద్ మున్సిపాలిటీ వార్డులు: 20 జనాభా: 32,000 పైగానే.. రోడ్లు: 74.825 కి.మీ. సీసీ రోడ్లు: 38.045 కి.మీ. బీటీ రోడ్లు: 18.390 కి.మీ. మట్టి రోడ్లు: 18.390 కి.మీ. -
గురువారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 2025
హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్తో నేడు ఫోన్ ఇన్ హుస్నాబాద్ మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డుల్లో పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత, సీజనల్ వ్యాధులు, ప్రజల ఇబ్బందులు తదితర అంశాలపై మున్సిపల్ కమిషనర్ ఫోన్ ద్వారా సమాధానాలు ఇస్తారు. అంశం: పారిశుద్ధ్యం, పరిశుభ్రత, సీజనల్ వ్యాధులు మున్సిపాలిటీ: హుస్నాబాద్ కమిషనర్: మల్లికార్జున్ బాల్యంపై బ్యాగుబండప్రైవేట్ పాఠశాలల తీరుచిరుజల్లులు..న్యూస్రీల్ -
కొండపోచమ్మ హుండీ ఆదాయం రూ. 9.78 లక్షలు
జగదేవ్పూర్(గజ్వేల్): తిగుల్నర్సాపూర్ సమీపంలో ప్రసిద్ధిగాంచిన కొండపోచమ్మ ఆల యం హుండీ కానుకలను దేవాదాయశాఖ ఆధ్వర్యంలో బుధవారం లెక్కించారు. 89 రోజులకు గాను రూ.9,78,872 నగదుతో పాటు 057.8 గ్రాముల మిశ్రమ బంగారం, 2 కేజీల మిశ్రమ వెండి ఆభరణాలు వచ్చినట్లు సిద్దిపేట డివిజన్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, ఆలయ ఈఓ రవికుమార్ తెలిపారు. వచ్చిన ఆదాయాన్ని అమ్మవారి ఖాతాలో జమ చేయనున్నట్లు చెప్పారు. నేడు నాచగిరిలో వేలం వర్గల్(గజ్వేల్): నాచగిరి క్షేత్రంలో వివిధ వస్తువులకు గురువారం వేలం పాట నిర్వహించనున్నారు. టెంటు సామగ్రి, చీరలు–దోవతులు, ఒడి బియ్యం, తలనీలాలు, పాదరక్షలు, శాలువాలు, శెల్లాలు, కనుములు, రక్షా కంకణాలు, పూలమాలలు, పూల అలంకరణ, వెండి, రాగి డాలర్లకు సంబంధించి ఆలయ ప్రాంగణంలో వేలం పాట నిర్వహిస్తున్నట్లు ఈఓ విజయరామారావు తెలిపారు. భూములు ఇచ్చే ప్రసక్తేలేదు సర్వేను అడ్డుకున్న గిరిజన రైతులు అక్కన్నపేట(హుస్నాబాద్): తాతముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్న భూములను ఇచ్చే ప్రసక్తే లేదని గిరిజన రైతులు సృష్టం చేశారు. సర్వే చేస్తున్న అధికారులను అడ్డుకున్నారు. మండలంలోని రామవరం, గండిపల్లి, కుందనవానిపల్లి గ్రామాల శివారులోని సర్వే నంబర్ 97లో అటవీ, రెవెన్యూ అధికారులతో పాటు సర్వేయర్లు రాగా సర్వే నిర్వహించవద్దంటూ పలువురు రైతులు అడ్డుకొని నిలదీశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. రాళ్లురప్పులను చదను చేసుకొని ఏళ్లుగా సాగు చేస్తూ వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నామన్నారు. ఇప్పడు, ఆ భూములను అటవీ శాఖకు అప్పగిస్తామంటే ఊరుకునే ప్రసక్తేలేదన్నారు. భూములను అటవీశాఖకు ఇచ్చి తమ పొట్టకొట్టవద్దని ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. కార్యక్రమంలో గిరిజన రైతులు నరసింహనాయక్, మాలోతు కుమారస్వామి, ఈర్యనాయక్, ఫుల్సింగ్, నందు, తిరుపతి, ప్రసాద్, రాజు, రమేశ్ పాల్గొన్నారు. యూరియా కోసం తిప్పలు దౌల్తాబాద్ (దుబ్బాక): వానాకాలం పంటలు వేయడానికి సమయం ఆసన్నమైనా రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి బుధవారం 500 బస్తాల యూరియా వచ్చింది. దీంతో రైతులు బారులు తీరారు. ఒక్కో రైతుకు 3 బస్తాల చొప్పున అందించారు. కొందరికి దొరకక వెనుదిరిగారు. అధికారులు కల్పించుకుని రైతులందరికీ యూరియా అందించాలని కోరుతున్నారు. -
● నర్సరీ నుంచే పుస్తకాల మోత ● కమీషన్లకు ఆశపడి ఎక్కువ బుక్స్ అంటగడుతున్న వైనం ● కాగితాలకే పరిమితమైన సర్కార్ ఉత్తర్వులు ● పట్టించుకోని విద్యాశాఖ అధికారులు ● కలెక్టర్ దృష్టి సారించాలని కోరుతున్న తల్లిదండ్రులు
ఈ ఫొటోలో కనిపిస్తున్నది సిద్దిపేట లోని ఓ ప్రైవేట్ స్కూల్ 1వ తరగతి చదువుతున్న చిన్నారి పుస్తకాల బ్యాగు. ఈ బ్యాగులో తెలుగు, హిందీ, ఇంగ్లిష్, తదితర నోట్ బుక్స్.. మొత్తంగా 14 ఉన్నాయి. దీంతో 6కిలోల 62గ్రాముల బరువు ఉంది. ఈ బ్యాగును స్కూల్ వరకు తల్లిదండ్రులు తీసుకువచ్చినా.. స్కూల్ గేట్ నుంచి చిన్నారి మోయలేకపోతోంది. ‘నా బిడ్డ బ్యాగ్ మోయలేకపోతోంది.. కొన్ని బుక్స్ స్కూల్లోనే పెట్టి.. హోం వర్క్, రీడింగ్ ఉన్న బుక్స్ మాత్రమే ఇంటికి పంపించండి’ అని స్కూల్ యాజమాన్యానికి చెప్పినా పట్టించుకోవడం లేదని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పుస్తకాలను రూ.5,600 వెచ్చించి పాఠశాలకు చెందిన స్టాల్లో కొనుగోలు చేశారు. ఇలా ప్రైవేటు పాఠశాలల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
పని గంటల పెంపు తగదు
● కేంద్రం తెచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలి ● సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సందబోయిన ఎల్లయ్యగజ్వేల్: కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సందబోయిన ఎల్లయ్య డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా సీఐటీయూ, ఏఐటీయూసీ అధ్వర్యంలో బుధవారం గజ్వేల్లోని ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సందబోయిన ఎల్లయ్య మాట్లాడారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం ఒక్క కలంపోటుతో హరించి వేస్తున్నదని మండిపడ్డారు. 8గంటల పనివిధానం రద్దు చేసి, 12గంటల పని విధానం తీసుకురావడం, రాత్రి వేళల్లో మహిళలు పరిశ్రమల్లో పనిచేయాలని చెప్పడం దారుణమన్నా రు. హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తున్న కేంద్రం పోరాటం ముమ్మరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ సభ్యులు శివలింగు కృష్ణ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు స్వామి, జిల్లా కమీటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
కేసుల ఛేదనతోనే గుర్తింపు
పోలీస్ కమిషనర్ అనురాధ గజ్వేల్రూరల్: కేసుల ఛేదనతోనే పోలీసులకు గుర్తింపు లభిస్తుందని పోలీస్ కమిషనర్ అనురాధ అన్నారు. గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లిలో ఇటీవల జరిగిన మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులను అభినందించారు. ఈ సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏసీపీ నర్సింహులుతో పాటు సీఐలు సైదా, ముత్యంరాజు, క్రైమ్ వర్టికల్, ఐటీసెల్ సిబ్బంది ఏఎస్ఐ యాదగిరి, కానిస్టేబుళ్లు నరేందర్, వెంకటేష్, రవి, దివ్య, శ్రీకాంత్, రమేష్, సురేందర్, హోంగార్డ్ నగేష్లకు రివార్డును అందజేశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ అంకితభావం, క్రమశిక్షణతో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందిని ప్రోత్సహించేందుకు రివార్డు, అవార్డులు ఇస్తున్నట్లు తెలిపారు. చంద్లాపూర్లో తమిళనాడు బృందం చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని చంద్లాపూర్ను తమిళనాడు రాష్ట్రానికి చెందిన అధికారుల బృందం మంగళవారం సందర్శించింది. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. గ్రామానికి రాష్ట్ర స్థాయి టూరిజం అవార్డు రావడానికి చేపట్టిన కార్యక్రమాలపై ఆరాతీశారు. గ్రామంలోని ఆయిల్పామ్ నర్సరీని సందర్శించారు. గ్రామంలో పండించే పంటల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పర్యటించి ప్రజల స్థితిగ తులు తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీపీఓ దేవకిదేవీ తదితరులు పాల్గొన్నారు. సంక్షోభంలో కార్మిక రంగం ప్రజా సంఘాల రాష్ట్రకన్వీనర్ సంతోష్ దుబ్బాక: కేంద్ర ప్రభుత్వం ఓ వైపు సబ్కా సాత్, సబ్ కా వికాస్ అంటూనే శ్రామికుల నోట్లో మట్టి కొడుతోందని ప్రజాసంఘాల ఉమ్మడి వేదిక రాష్ట్ర కన్వీనర్ వంగల సంతోష్ అన్నారు. మంగళవారం దుబ్బాకలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో కార్మిక రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ఉద్యమంతో సాధించుకున్న 8 గంటల పని దినాన్ని 10 గంటలకు పెంచేలా కేంద్రం అమల్లోకి తీసుకువస్తోందన్నారు.నాలుగులేబర్ కోడ్లతో కార్మికులకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. కలెక్టర్పై చర్య తీసుకోండి చేర్యాల(సిద్దిపేట): కలెక్టర్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి సీఎస్కు పోస్టుద్వారా ఫిర్యాదు చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఇటీవల చేర్యాలలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో అధికార పార్టీకి చెందిన నాయకులను ప్రోత్సహించడమేకాకుండా వారు పాల్గొనేలా వ్యవహరించిన కలెక్టర్ తీరుపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని లేఖలో కోరినట్లు తెలిపారు. బీజేపీలోకి మున్సిపల్ మాజీ చైర్మన్! గజ్వేల్: మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు, మెదక్ ఎంపీ రఘునందన్రావు సమక్షంలో బుధవారం కాషాయకండువా కప్పుకోనున్నారు. కాంగ్రెస్ ను వీడీ బీజేపీలో చేరబోతున్నారనే వార్తలను నిజం చేస్తూ తన అనుచరులతో కలిసి పార్టీ కార్యాలయానికి తరలివెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. గతంలో బీఆర్ఎస్లో ఉన్న ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరారు. ఆ తర్వాత 2024 ఏప్రిల్లో జరిగిన మెదక్ ఎంపీ ఎన్నికల సందర్భంగా బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్లో కొనసాగుతున్న ఆయన తిరిగి బీజేపీ గూటికి చేరడానికి సిద్ధమయ్యారు. భాస్కర్ పార్టీని వీడుతుండటంతో అధికార పార్టీకి షాక్ తగలనుంది. మాలలకు తీరని అన్యాయం దుబ్బాక: ఎస్సీ వర్గీకరణతో మాలలకు తీరని అన్యాయం జరుగుతోందని జాతీయ మాల మహానాడు రాష్ట్ర పొలిట్బ్యూరో చైర్మన్ ర్యాకం శ్రీరాములు అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం రూపొందించిన రోస్టర్ విధానాన్ని సవరించి అందరికీ న్యాయం జరిగేలా చూడాలన్నారు. -
పల్లెల్లోనూ స్టీల్ బ్యాంకులు
ప్లాస్టిక్ నిర్మూలనే లక్ష్యం ● పొన్నం సత్తయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుకు సన్నాహాలు ● గ్రామాల్లో ప్లాస్టిక్ కట్టడికి మంత్రి పొన్నం ప్రత్యేక దృష్టి ● 85 గ్రామాల్లో రూ.1.27కోట్లతో ఏర్పాటుకు చర్యలు ● గవర్నర్ చేతుల మీదుగా సామగ్రి పంపిణీకి సన్నాహాలుప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించేందుకు పల్లెల్లో స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నారు. తొలుత సిద్దిపేట మున్సిపాలిటీలో స్టీల్ బ్యాంకు పురుడు పోసుకుంది. సిద్దిపేటను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాటుకు శ్రీకారం చూడుతున్నారు. అందులో భాగంగానే మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి పేరిట పొన్నం సత్తయ్య ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామాల్లో స్టీల్ బ్యాంక్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ స్టీల్ బ్యాంక్లను కోహెడలో ప్రారంభించేందుకు రాష్ట్ర గవర్నర్ జిష్టుదేవ్ వర్మ రానున్నారు. – సాక్షి, సిద్దిపేట సిద్దిపేట మున్సిపాలిటీలో మాజీ మంత్రి హరీశ్రావు చొరవతో 34 వార్డులలో స్టీల్ బ్యాంక్లను ఏర్పాటు చేశారు. వివాహాలు, పండుగలు, ఇతర శుభకార్యాల్లో ప్లాస్టిక్ వినియోగం తగ్గించేలా దాతల సహకారంతో సిద్దిపేట మున్సిపాలిటీలో 2021లో స్టీల్బ్యాంకు పేరిట కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. అవసరమయ్యే సామగ్రి మార్కెట్లో కన్నా తక్కువ అద్దెకే అందిస్తున్నారు. వీటి నిర్వహణ బాధ్యత స్థానిక మహిళా సంఘాలకు అప్పగించారు. ఇలా ప్రారంభమైన స్టీల్ బ్యాంకు పల్లెల్లో సైతం చేరింది. ఇప్పటికే గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అతిథులు భోజనం చేసేందుకు స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మంత్రి నియోజకవర్గంలోనూ.. మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం తన నియోజకవర్గంలోని గ్రామాల్లో స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ప్లాస్టిక్ను నిర్మూలించి అటు ప్రజల ఆరోగ్యంతో పాటు.. ఇటు పర్యావరణాన్ని పరిరక్షించాలని ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎకనామిక్ సర్వే 2023–24 బుక్లెట్లో సిద్దిపేట స్టీల్ బ్యాంకుకు చోటు దక్కిన విషయం విదితమే. 85 గ్రామాల్లో.. హుస్నాబాద్ నియోజకవర్గంలోని 85 గ్రామాల్లో స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో స్టీల్ బ్యాంకులో 500 భోజనం ప్లేట్లు, 250 టిఫిన్ ప్లేట్లు, 250 గ్లాస్లు, 250 టీ గ్లాస్లు, డిష్లు, బకెట్లు, గంటెలు ఉండనున్నాయి. రూ.1.27కోట్లతో స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేయనున్నారు. గ్రామైక్య మహిళా సంఘాలు వీటి నిర్వహణ బాధ్యతలు చూడనున్నాయి.ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు.. ప్లాస్టిక్ ప్లేట్లలో భోజనం చేయడం, ప్లాస్టిక్ గ్లాస్లలో నీటిని, టీ తాగడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. అలాగే పర్యావరణానికి హానీ కలగనుంది. మంత్రి పొన్నం చొరవతో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు కానుండటంతో పర్యావరణ రక్షణతో పాటు ప్రజల ఆరోగ్యానికి మేలు కలగనుంది. ఈనెల 23న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా గ్రామైక్య సంఘాలకు స్టీల్ సామగ్రి అందించనున్నారు.23న కోహెడకు గవర్నర్ రాక కోహెడ(హుస్నాబాద్): రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ నెల 23న కోహెడకు రానున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ హైమావతి హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గవర్నర్ కార్యక్రమానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానిక లక్ష్మి గార్డెన్ సమీపంలో హెలిప్యాడ్ ఏర్పాటుకు స్థలం అనువుగా ఉందన్నారు. గవర్నర్ కార్యక్రమం రోజున వాహనాల పార్కింగ్కు ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు దిశానిర్దేశం చేశారు. హుస్నాబాద్ నియోజక వర్గం వ్యాప్తంగా 282 మహిళా సంఘాలకు గవర్నర్ చేతుల మీదుగా స్టిల్ సామగ్రి అందజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. -
జనహృదయ నాయకుడు వైఎస్సార్
యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపికృష్ణప్రశాంత్నగర్(సిద్దిపేట): ప్రజల మనిషి డాక్టర్ వైఎస్సార్ అని యూత్కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపికృష్ణ అన్నారు. మంగళవారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి జయంతిని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గోపికృష్ణ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్మెంట్ వంటి పథకాలతో ప్రజల్లో చెరగని ముద్ర వేశారన్నారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు వహబ్, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బొమ్మల ప్రవీణ్, ఎర్రం మహేందర్, చెంది శ్రీనివాస్ ముదిరాజ్, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు అజ్మత్, వర్కింగ్ ప్రెసిడెంట్ రషాద్, నియోజకవర్గ అధ్యక్షులు బడికోల్ రాకేష్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు సాదుల సాయి ప్రతాప్, యూత్ కాంగ్రెస్ రూరల్ మండల అధ్యక్షుడు అనిల్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అజ్మత్ అలీ, కర్ర మధు, తదితరులు పాల్గొన్నారు. -
పట్టణంలో పడకేసిన పారిశుద్ధ్యం
● నివాసాల మధ్యే మురికి కుంటలు ● వారానికోసారి మాత్రమే చెత్త తొలగింపు ● పొంచి ఉన్న వ్యాధుల ముప్పు హుస్నాబాద్ పట్టణంలో జనావాసాల మధ్యే నిలిచిన నీరు హుస్నాబాద్: మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడ చూసినా చెత్తాచెదారం దర్శనమిస్తోంది. మురికి కాలువలు నిండిపోయి దుర్వాసన వస్తోంది. హుస్నాబాద్ పట్టణంలో 20 వార్డులు, 30 వేలకు పైగా జనాభా, 7,533 ఇళ్లు ఉన్నాయి. చెత్తను సేకరించేందుకు మూడు ట్రాక్టర్లు, 10 స్వచ్ఛ ఆటోలు వినియోగిస్తున్నారు. రోజూ ఇళ్ల నుంచి 5.5టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. కానీ మొత్తం 81 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉండగా 45 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. మిగతా వారు ఇతర విభాగాల్లో పని చేయడం వల్ల కార్మికుల కొరత ఏర్పడుతోంది. దీంతో వారానికి ఒకసారి మాత్రమే మురికి కాలువలను శుభ్రం చేస్తున్న పరిస్థితి నెలకొంది. బస్సు డిపో కాలనీ, నేతాజీ కాలనీ, టీచర్స్ కాలనీల్లో చాలా చోట్ల డ్రైనేజీ నిర్మించకపోవడంతో మురికి నీరంతా రోడ్లపై ప్రవహిస్తోంది. బైపాస్ రోడ్డుపైనే.. ప్రభుత్వ ఆస్పత్రి బైపాస్ రోడ్డు పనికి రాని వస్తువులకు నిలయంగా మారింది. భవన నిర్మాణ వ్యర్థాలను ప్రధాన రహదారులకు ఇరువైపులా పడేస్తున్నారు. వీటిని మున్సిపల్ సిబ్బంది తొలగించకపోవడంతో వాహనదారులు, బాటసారులు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు పారిశుధ్య సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. చెత్తదిబ్బలా పట్టణం మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేదు. మురికి కాలువలను శుభ్రం చేయకపోవడంతో చెత్తాచెదారం పేరుకుపోయింది. కార్మికులు ఎప్పటికప్పుడు చెత్తను తొలగించకపోవడంతో దుర్వాసన ఏర్పడుతుంది. వర్షాలు కురుస్తుండటంతో మురికి నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. దీంతో వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల డ్రైనేజీ నిర్మించకపోవడంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. – రాగుల శ్రీనివాస్, హుస్నాబాద్ నీటిని తొలగించండి చాలా కాలనీల్లో నీరు నిలిచి దుర్వాసన వస్తోంది. వర్షాలకు ఖాళీ జాగల్లో నీరు నిలువడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలి. లేదంటే దోమలు వ్యాప్తి చెంది రోగాలబారిన పడటం ఖాయం. – బత్తుల శంకర్ బాబు, హుస్నాబాద్ ఇళ్ల మధ్యే మురుగు పలు కాలనీల్లో జనావాసాల మధ్య మురుగు నీరు దర్శనమిస్తోంది. దీంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. వంద రోజుల ప్రణాళికలో భా గంగా ఇళ్ల మధ్య ఉన్న మురికి గుంతల్లో ఆయిల్ బాల్స్, స్ప్రే చేసి మమా అనిపించారు. వర్షాలు కురుస్తుండటంతో అక్కడ వర్షం నీరు చేరి కుంటలుగా మారాయి. మురికి నీటిని బయటకు పంపించకుండా తూతు మంత్రంగా బ్లీచింగ్ పౌడర్ చల్లి అధికారులు చేతులు దులుపుకున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. -
ఇందిరమ్మ ఇళ్లను వేగిరం చేయండి
● కలెక్టర్ హైమావతి ● అధికారులకు దిశానిర్దేశంచిన్నకోడూరు(సిద్దిపేట): ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసేలా చూడాలని అధికారులను కలెక్టర్ హైమావతి ఆదేశించారు. మంగళవారం గంగాపూర్లో లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలకు ముగ్గు పోసే ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత రాకుండా టోకెన్లు అందించాలని తహశీల్దార్ను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవడానికి డబ్బులు లేని నిరుపేదలకు ఐకేపీ ద్వారా అందించాలని డీఆర్డీఓ పీడీ జయదేవ్ ఆర్యకు సూచించారు. అలాగే రంగనాయక సాగర్ రిజర్వాయర్ను కలెక్టర్ సందర్శించారు. పంప్హౌస్, టన్నెల్ను పరిశీలించారు. డీఈ చంద్రశేఖర్ పంప్ హౌస్ విభాగాలు, మోటార్లు, పంపింగ్ విధానాన్ని కలెక్టర్కు వివరించారు. పర్యావరణాన్ని పరిరక్షించాలి చంద్లాపూర్ శివారులోని వెటర్నరీ కళాశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ మొక్కలు పెంచడం ద్వారా భవిష్యత్ తరాలను కాలుష్యం నుంచి రక్షించడమే కాకుండా ప్రశాంత వాతావరణంలో జీవించగలుగుతామన్నారు. మొక్కలను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయన్నారు. ఇసుక అక్రమ రవాణాపై కలెక్టర్ సీరియస్ కోహెడరూరల్(హుస్నాబాద్): ఇసుక అక్రమ రవాణాపై కలెక్టర్ హైమావతి సీరియస్ అయ్యారు. కోహెడ మండలంలో పర్యటిస్తున్న కలెక్టర్.. ఇసుకతో వెళ్తున్న ట్రాక్టర్ను గమనించి విచారించారు. ఎలాంటి అనుమతి లేకపోవడంతో ఎందుకు నిఘా పెట్టడంలేదని రెవెన్యూ అధికారులపై మండి పడ్డారు. అలాగే పట్టుబడిన ఇసుక ట్రాక్టర్ యజమానికి పనిష్మెంట్ విధించారు. పది ట్రిప్పుల ఇసుకను ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా అందించాలని ఆదేశించారు. ఆనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్, రెవెన్యూ అధికారులు ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిని ఆడ్డుకోవాలని సూచించారు. -
‘మహిళాశక్తి’ సంబరాలు నిర్వహించండి
వర్గల్(గజ్వేల్): ఊరూరా ఇందిరా మహిళాశక్తి సంబరాలు ఘనంగా నిర్వహించాలని సెర్ప్ సంస్థాగత నిర్మాణ విభాగం హైదరాబాద్ ప్రధాన కార్యాలయ ప్రాజెక్ట్ మేనేజర్ భారతి అన్నారు. సంబరాలలో స్వయం సహాయక మహిళల ఆర్థికాభ్యున్నతి, సంఘాల పురోగతి, జీవనోపాదులు, బీమా సౌకర్యం, లబ్ధిపొందిన కుటుంబాలు తదితర అంశాలను చర్చించాలన్నారు. మంగళవారం మండల కేంద్రం వర్గల్ ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం ఆనంద్కుమార్ పర్యవేక్షణలో ఇందిరా మహిళాశక్తి సంబరాలలో భాగంగా మండల సమాఖ్య అధ్యక్షురాలు రేణుక అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బుధవారం నుంచి ప్రతిగ్రామంలో సంబురాలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ సహకారం, బ్యాంకు లింకేజీ రుణాలు, ఆర్థిక పురోగతిని చర్చించుకోవాలన్నారు. సంఘాలలో లేనివారిని చేర్పించాలని, ప్రతి సభ్యురాలికి బ్యాంకు లింకేజీ ద్వారా రుణ మంజూరు చేసి జీవనోపాదులు కల్పించాలన్నారు. మండలంలో జీవనోపాదులు బాగున్నాయని కితాబునిచ్చారు. స్కూల్ డ్రెస్సులను ఎస్హెచ్జీ మహిళలతో కుట్టించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో గ్రామ సంఘాల అధ్యక్షులు, అసిస్టెంట్లు, సీసీలు సత్యం, నర్సింలు, సుభాష్గౌడ్, రమేష్, పద్మలత, భాస్కర్, లత, విష్ణు పాల్గొన్నారు. సెర్ప్ ప్రాజెక్టు మేనేజర్ భారతి -
మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు
డీపీఎం విద్యాసాగర్అక్కన్నపేట(హుస్నాబాద్): మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు స్రభుత్వం వడ్డీ లేని రుణాలను అందజేస్తోందని డీపీఎం విద్యాసాగర్ అన్నారు. మండల కేంద్రంలో స్వయం భూ రాజరాజేశ్వర మండల సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘాల్లో లేని మహిళలను గుర్తించి కొత్త సంఘాలుగా ఏర్పాటు చేయాలన్నారు. లోనూ భీమా, ప్రమాద బీమా, మహిళా శక్తి అంశాలైన తదితర వాటిపై అవగాహన కల్పించారు. సంఘాలకు బ్యాంక్ ద్వారా లింక్ చేయించడం, అందరూ రక్తహీనత లేకుండా మూడు నెలకొసారి ప్రతి మహిళ రక్త పరీక్షలు నిర్వహించడం గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ జ్యోష్ణ, ఏపీఎం శ్రీనివాస్, సీసీలు పాల్గొన్నారు. -
మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే సేవలు
ఉమ్మడి జిల్లా డిప్యూటీ రవాణా శాఖ అధికారి వెంకటరమణ ప్రశాంత్నగర్( సిద్దిపేట): మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే వాహనదారులకు నేరుగా సేవలు అందించాలని ఉమ్మడి మెదక్ జిల్లా డిప్యూటీ రవాణా శాఖ అధికారి వెంకటరమణ అధికారులకు సూచించారు. సోమవారం సిద్దిపేట రవాణా శాఖ కార్యాల యాన్ని వెంకటరమణ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రవాణా శాఖ పరంగా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామ న్నారు. వాహనదారులు, ప్రజలు రవాణా శాఖ కార్యాలయానికి వచ్చి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలను పొందాలన్నారు. జిల్లాలో స్పెషల్ డ్రైవ్ కింద స్కూల్ బస్సులను తనిఖీ చేస్తు న్నామన్నారు. ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులను సీజ్ చేస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాల్లో ఎక్కువ మంది ప్రయాణిస్తే వాహనదారులపై చర్యలు తీసుకుంటామన్నారు. -
ఏమయ్యారో?
ఆ ఎనిమిది మంది● నేటికీ ఆచూకీ లభించని కార్మికుల జాడ ● సిగాచీ పరిశ్రమలో గల్లంతైన వారి కుటుంబీకుల్లో ఆందోళన ● రాత్రింబవళ్లు కొనసాగుతున్న తవ్వకాలు ఒకటి కాదు రెండు కాదు.. ఏడు రోజులు అవుతున్నా వారి ఆప్తుల జాడ లభించడం లేదు. వారేమయ్యారో అంతు చిక్కడం లేదు. తమను ఆదుకోవాల్సిన పెద్ద దిక్కు జాడ తెలియక పోవడంతో మనోవేదనకు లోనవుతున్నారు. పరిశ్రమలో పని చేసేందుకు వచ్చిన వారు ఇలా ఆకస్మికంగా దూరం కావడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆఖరి చూపునకు కూడా నోచుకోకుండా పోతున్నామని కుమిలిపోతున్నారు. వారం రోజులుగా సిగాచీ పరిశ్రమ వద్ద పడిగాపులు కాస్తున్నారు. – పటాన్చెరు పాశమైలారం సిగాచీ పరిశ్రమలో జరిగిన విస్పోటనంలో గల్లంతైన కార్మికుల కోసం వారి కుటుంబాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. గత నెల 30న పరిశ్రమలో పేలుడు జరిగిన సమయంలో 143 మంది పనిచేస్తున్నారు. ఆ సమయంలో పనిచేస్తున్న వారిలో గాయాలపాలైన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను వారి బంధువులకు అప్పజెప్పారు. ఇంకా ఎనిమిది మంది కార్మికుల జాడ మాత్రం నేటికీ దొరకలేదు. వారేమయ్యారో అంతు చిక్కడం లేదు. వారి కుటుంబీకులు మాత్రం పరిశ్రమ వద్ద గత వారం రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. పరిశ్రమలో పని చేసేందుకు వచ్చిన వారు ఇలా ఆకస్మికంగా దూరం కావడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మరోవైపు అధికారులు రాత్రింబవళ్లు సిగాచీ పరిశ్రమలో గల్లంతైన వారి భౌతికకాయాల కోసం వెతుకులాట ముమ్మరం చేశారు. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మట్టి దిబ్బల కింద, బూడిద మట్టిలో అణువణువు వెతుకుతున్నారు. అయితే అక్కడ పని చేస్తున్న వారిపై ఉన్నతాధికారులు, బాధితుల ఒత్తిడి రోజు రోజుకు పెరుగుతుంది. రెండు రోజుల క్రితం వరకు ఆ శిథిలాల్లో అక్కడక్కడ మాడిపోయిన మాంసం ముద్దలు లభించాయి. కానీ ప్రస్తుతం అలాంటి మానవ అవశేషాలు ఏవీ లభించడం లేదు. వెతుకులాట ప్రక్రియ దాదాపు తుదిదశకు చేరిందనే చెప్పాలి. పరిశ్రమలో పేలుడు జరిగిన సమయంలో దాదాపు 700 సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రత ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంత వేడికి శరీరాలు పూర్తిగా మాంసం ముద్దలుగా మారి బూడిదలో కానరాకుండా కలిసిపోయి ఉంటాయని భావిస్తున్నారు. పాలు అమ్ముతానని చెప్పి.. బండ్లగూడలో స్థిరపడిన ఓ కుటుంబానికి చెందిన ఆస్టిన్ పాల ప్యాకెట్లు వేసే పని చేస్తానని ఇంట్లో వారికి చెప్పి ఈ పరిశ్రమలో చేరాడట. ఆ పరిశ్రమలో ప్రమాదం జరగిన రోజు కంటే రెండు రోజుల ముందే అక్కడ డ్యూటీలో చేరాడు. మూడో రోజే ప్రమాదం జరిగింది. నేటికీ ఆ యువకుడి ఆచూకీ లభించడం లేదు. ఆస్టిన్ కుటుంబ సభ్యులు కనపడిన ప్రతి అధికారి కాళ్లపై పడుతున్నారు. కనీసం అతడి మృతదేహం అయినా ఇప్పించాలని రోధిస్తున్నారు. ఆస్టిన్ తోడబుట్టిన చెల్లెళ్లు, ఇతర కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఆస్టిన్తో పాటు రాహుల్ కుమార్ శర్మ, వెంకటేష్, సిల్వరీ రవి, శివ్జీ కుమార్, విజయ్ కుమార్ నిషద్, ఇర్ఫాన్ అన్సారీల ఆచూకీ కోసం వారి కుటుంబీకులు ఎదురుచూస్తున్నారు. -
గాలిలో తుంగ.. నిత్యం బెంగ
మంగళవారం శ్రీ 8 శ్రీ జూలై శ్రీ 2025దుబ్బాక అంతటా వ్యాప్తి ● వాహనదారులకూ తప్పనితిప్పలు ● సమస్య తీర్చాలని ప్రజల వేడుకోలు దుబ్బాకటౌన్: ‘ఇందు గలదు అందులేదని సందేహం వలదు.. ఎందెందువెదికినా అందందే గలదు’.. ఇదేమిటని అనుకుంటున్నారా.. అదే.. తుంగండి. ఇప్పుడు దుబ్బాక అంతటా వ్యాపించింది. ఇళ్లల్లో, హోటళ్లలో, రోడ్లపై, ఎక్కడపడితే అక్కడా గాల్లో తేలియాడుతూ.. ఇటు ప్రజలను అటు వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. దుబ్బాక పెద్ద చెరువు కట్ట సమీపంలో మురికి నీరు ప్రవహించే ప్రాంతంలో పిచ్చిమొక్కలు (తుంగ) ఏపుగా పెరిగి ఎండాకాలంలో ఎండిపోయాయి. ప్రస్తుతం వీస్తున్న ఉధృతమైన గాలికి తెలుపురంగులో తుంగంతా నలుమూలలా వ్యాపిస్తోంది. ఆహారపదార్థాలపై.. తుంగ విపరీతంగా గాల్లో తేలియాడటమేకాకుండా తినుబండారాలపై వాలుతోంది. దీంతో హోటళ్లు, మిర్చి పాయింట్, పానీపూరి, మొక్కజొన్న కంకులు, తదితర తినుబండారాలు విక్రయించే వీధి వ్యాపారులు గిరాకీలు కావడం లేదంటూ వాపోతున్నారు. తుంగ ఆహారపదార్థాలపై పేరుకు పోవడంతో ఎవరూ తినడానికి ఇష్టపడటం లేదంటూ వీధి వ్యాపారులు చెబుతున్నారు. వాహనదారులపై ప్రభావం ద్విచక్ర వాహనదారుల కళ్లలో, ముక్కులోకి అకస్మాతుగా తుంగ వెళ్లడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. ముక్కులోకి వెళ్లడం వల్ల జలుబు, జ్వరం వచ్చి అనారోగ్యానికి గురవుతున్నామని వారు వాపోతున్నారు. న్యూస్రీల్చర్యలు చేపట్టాలి గాల్లో తుంగతో ఇబ్బందులు అన్నీఇన్నీకావు. దుకాణంలో కూర్చొని పాలు కూడా అమ్మలేక పోతున్నా. తుంగ కళ్లలో, ముక్కులోకి వెళ్లి ఇటీవల అనారోగ్యానికి గురయ్యా. తుంగతో ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. – నట్రాజ్, పాలవ్యాపారి, దుబ్బాక సమస్య పరిష్కరిస్తాం తుంగ బహిరంగ ప్రదేశాల్లో పెరిగింది వాస్తవమే. తుంగ పెరిగిన ప్లాటు యజమానులకు నోటీసులు పంపిస్తాం. తుంగ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. –రమేశ్కుమార్, మున్సిపల్ కమిషనర్, దుబ్బాక -
ఓటరు జాబితా పక్కాగా ఉండాలి
అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ వర్గల్(గజ్వేల్): తప్పులకు ఆస్కారం లేకుండా జాగ్రత్తగా ఓటరు జాబితా తయారు చేయాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అన్నారు. సోమవారం వర్గల్ మండలం గౌరారం రైతువేదికలో తహసీల్దార్ బాల్రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి బూత్ లెవెల్ ఆఫీసర్ల(బీఎల్ఓ) శిక్షణ శిబిరాన్ని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఆర్డీఓ చంద్రకళ సందర్శించారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరినీ ఓటరు జాబితాలో నమోదుచేయాలన్నారు. మృతుల తొలగింపు, సవరణ, కొత్త ఓటర్లు ఎలా నమోదు చేయాలి తదితర అంశాలను, వినియోగించాల్సిన ఫారాలను క్షుణ్ణంగా వివరించారు. కార్యక్రమంలో మాస్టర్ ట్రేనర్ రామకృష్ణారెడ్డి, ఆర్ఐ రాజు, సహాయకుడు ఎన్ శంకర్, వెంకటేష్గౌడ్, వివిధ గ్రామాల బీఎల్ఓలు పాల్గొన్నారు. అంజయ్య గౌడ్కు పురస్కారం ప్రశాంత్నగర్(సిద్దిపేట): భారతి సాహితీ సంస్థ కోరుట్ల ఆధ్వర్యంలో అందిస్తున్న అందె వెంకటరాజం స్మారక పురస్కారానికి సిద్దిపేటకు చెందిన అవధాని బండకాడి అంజయ్య గౌడ్ ఎంపికైనట్లు కవి ఉండ్రాళ్ళ రాజేశం తెలిపారు. కోరుట్లలోని సినారె కళాభవనంలో ఈ నెల 12న అంజయ్య గౌడ్ పురస్కారం అందుకుంటారన్నారు. పద్య సాహిత్యంలో విశేష సేవచేస్తున్న అంజయ్యగౌడ్ ఎంపిక కావడంపై పలువురు కవులు అభినందించారు. జీఓ రద్దు చేయాల్సిందే సిద్దిపేటఅర్బన్: పని గంటలను 8 నుంచి 10 గంటలకు పెంచుతూ తెచ్చిన జీఓ 282ను వెంటనే రద్దు చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం సిద్దిపేటలో కార్మిక సంఘాల నాయకులు జీఓ ప్రతులను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 29 రకాల కార్మిక చట్టాలను తిరిగి తీసుకురావడానికి కార్మిక సంఘాలు ఈనెల 9న సార్వత్రిక సమ్మెకు సిద్ధమవుతుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలికే విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కార్యక్రమంలో ఆయా కార్మిక సంఘాల నాయకులు గోపాలస్వామి, లక్ష్మణ్, నర్సింహులు, మల్లేశం, రవికుమార్, సంపత్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. పెద్దగుండవెళ్లిలో శ్రమదానం దుబ్బాక: మండలంలోని పెద్దగుండవెళ్లిలో సోమవారం రేణుకమాత ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రజలు శ్రమదానం చేశారు. ఆలయానికి వచ్చే ప్రధాన రహదారికి రెండువైపులా పెరిగిన చెట్లను తొలగించారు. ఆలయ కమిటీ చైర్మన్ ఏల్పుల మహేశ్, పంచాయతీ కార్యదర్శి మురళి, నాయకులు యాదగిరి, బుచ్చిరెడ్డి, మాల్లారెడ్డి, కిషన్, శ్రీకాంత్ పాల్గొన్నారు. గిరిజన విద్యార్థినికి డాక్టరేట్ హుస్నాబాద్రూరల్: మండల పరిధిలోని భల్లునాయక్ తండాకు చెందిన ఆజ్మీర అరుణ వృక్షశాస్త్రం (బాటనీ)లో పీహెచ్డీ పూర్తి చేసి డాక్ట రేట్ పొందారు. దీంతో గ్రామస్తులు ఆమెను అభినందించారు. ఎమ్మెస్సీ చదివిన అరుణ పీహెచ్డీ పూర్తి చేశారు. సోమవారం హన్మకొండ కాకతీయ యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవంలో గవర్నర్ నుంచి డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. -
హడలెత్తిస్తున్న కలెక్టర్
విస్తృత పర్యటనలు.. ఆకస్మిక తనిఖీలు ● అ‘టెన్షన్’లో అధికారులు, సిబ్బంది ● జిల్లా పాలనలో తనదైన మార్క్ కలెక్టర్ హైమావతి క్షేత్రస్థాయి పర్యటనలు, ఆకస్మిక తనిఖీలతో అధికారులు, సిబ్బంది హడలిపోతున్నారు. డివిజన్, మండల స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు.. గురుకులాలు, కేజీబీవీలు, ప్రభుత్వ పాఠశాలలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలను తనిఖీ చేస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏ కార్యాలయానికి వస్తారోనని అధికారులు, సిబ్బంది అ‘టెన్షన్’లో ఉంటున్నారు. జిల్లా పాలనలో కలెక్టర్ తనదైన మార్క్ చూపిస్తున్నారు. – సాక్షి, సిద్దిపేట జిల్లా కలెక్టర్గా హైమావతి ఈ ఏడాది జూన్ 14న బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ను జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి క్షేత్రస్థాయిలో పర్యటనలు, వివిధ శాఖలపై రివ్యూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు అమలు, జరుగుతున్న అభివృద్ధి పనులపై పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకుంటున్నారు. ఇటీవల జిల్లాలో నలుగురు మంత్రులు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, పలు ప్రారంభోత్సవాల సందర్భంగా కలెక్టర్ మంత్రోచ్ఛరణలు చేశారు. దీంతో మంత్రులందరూ కలెక్టర్ను అభినందించారు. అధికారులకు ఆదేశాలు జిల్లాలో ఉన్న గురుకులాలు, కేజీబీవీలు, హాస్టళ్లను ఈ నెల 4 నుంచి కలెక్టర్ ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. వంట గదులు, సరుకులను పరిశీలిస్తున్నారు. వండిన వంటలను రుచి చూస్తున్నారు. విద్యార్థులతో కలిసి భోజనాలు చేస్తున్నారు. విద్యార్థుల మాటమంతీలో సమస్యలు, డైట్ మెనూ వంటి విషయాలు తెలుసుకుంటున్నారు. అలాగే చదువు, భోజనం ఎలా అందిస్తున్నారని అడుగుతున్నారు. విద్యార్థులు తీసుకవచ్చిన సమస్యలపై వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. స్టోర్ను పరిశీలిస్తూ నాణ్యమైన ఆహారపదర్థాలు మాత్రమే అందించాలని, కాలం చెల్లిన పదార్థాలను వాడకూడదని సిబ్బందిని హెచ్చరిస్తున్నారు. స్టాక్ రిజిస్టర్, అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలిస్తున్నారు. తాను ప్రభుత్వ హాస్టళ్లలోనే ఉండి చదువుకుని ఈ స్థాయికి వచ్చానని వివరిస్తున్నారు. మీరు సైతం పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుతున్నారు. ‘మొదటి సారి తనిఖీ కనుక.. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మరో సారి ఇలానే పునరావృతమైతే చర్యలు తప్పవ’ని అధికారులు, సిబ్బందిని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కొన్ని కార్యాలయాల్లో బయోమెట్రిక్ ఉన్నప్పటికీ అధికారులు ఉదయం ఫింగర్ ప్రింట్ వేసి.. మళ్లీ సాయంత్రం వచ్చి మరో మారు థంబ్ వేసి వెళ్లుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇలానే కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేస్తేనే అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించడంతో పాటు, సక్రమంగా విధులు నిర్వర్తిస్తారని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.నాణ్యమైన భోజనం అందించాలిహుస్నాబాద్: పాఠశాలల్లో, గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ హైమావతి సిబ్బందిని ఆదేశించారు. సోమవారం పట్టణంలోని కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్తో కలిసి కలెక్టర్ తనిఖీచేశారు. స్టాక్ రిజిస్టర్, అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డైట్ మెనూ తప్పని సరిగా అమలు చేయాలన్నారు. నాణ్యమైన ఆహార పదార్థాలు మాత్రమే వినియోగించాలన్నారు. ప్రతి వంటా రుచికరంగా అందించాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థుల చదువు, భోజనం విషయంలో రాజీ పడవద్దని, విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులు బాగా చదవాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఇప్పటి నుంచే కష్టపడాలన్నారు. వారి వెంట ఎంఈఓ బండారి మనీల ఉన్నారు. -
అర్జీలను సత్వరం పరిష్కరించండి
● కలెక్టర్ హైమావతి ● ప్రజావాణికి 152 దరఖాస్తులుసిద్దిపేటరూరల్: ప్రజావాణిలో ప్రజలు అందించిన అర్జీలను సత్వర పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు గరీమా అగర్వాల్, అబ్దుల్ హమీద్ లతో కలిసి కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు అందిస్తున్న అర్జీలను వెంటనే పరిష్కరించేలా అధికారులు పనిచేయాలన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి 152 అర్జీలు వచ్చాయి. అంతకుముందు అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మంగళ, శుక్రవారాల్లో మండల ప్రత్యేక అధికారులు శానిటేషన్, ఇందిరమ్మ ఇళ్ల ప్రగతి, వనమహోత్సవం సహ అన్ని కార్యక్రమాల ప్రగతిని పర్యవేక్షించాలన్నారు. ప్రజావాణి అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించి ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ నాగరాజమ్మ, కలెక్టరేట్ ఏవో, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. డీజిల్తో వచ్చిన బాధితుడు.. అక్కన్నపేట మండలం గోవర్ధనగిరికి చెందిన ఎల్లారెడ్డి భూ బాధితుడు తన సమస్య పరిష్కారం కావడం లేదంటూ ప్రజావాణి కార్యక్రమానికి డీజిల్ కవర్తో వచ్చారు. పోలీసులు అతడిని తనిఖీ చేయడంతో డీజిల్తో ఉన్న కవర్ను గమనించారు. దీంతో ఆయనను లోపలికి అనుమతించలేదు. గ్రామంలోని 266, 267 సర్వే నంబర్లలో తన పేరు మీద ఉన్న 23 ఎకరాల భూమిని ఆన్లైన్ చేయాలని కోరగా అధికారులు తిప్పించుకుంటున్నారే తప్ప పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేసేదిలేక డీజిల్తో కలెక్టరేట్కు వచ్చినట్లు బాధితుడు తెలిపారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు. ఖాళీ బిందెలతో కలెక్టరేట్కు.. చేర్యాల మండల కేంద్రానికి చెందిన మొండి చింత కాలనీలో మహిళలు ఖాళీ బిందెలతో కలెక్టరేట్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ బోరు మోటారు పాడై రోజులు గడుస్తున్నప్పటికీ మున్సిపల్ కమిషనర్ పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. దీంతో నీటి ఎద్దడి తీవ్ర మైందన్నారు. తమ కాలనీలోని పాఠశాల విద్యార్థులు సైతం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కాలనీలో నీటి సమస్యను పరిష్కరించాలన్నారు. -
కూల్చివేతలు ఆపండి
చేర్యాలలో బాధితుల ఆందోళనచేర్యాల(సిద్దిపేట): జాతీయ రహదారి విస్తరణలో భాగంగా పట్టణ కేంద్రంలో చేపట్టిన నిర్మాణాల కూల్చివేత ఆపాలని పలువురు బాధితులు సోమవారం ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ నవీన్ అక్కడకు వచ్చి ఆందోళన విరమింపజేసిన వారిని స్టేషన్కి తరలించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడుతూ గతంలోనే డ్రైనేజీ నిర్మాణం పేరుతో కొంత భాగం కూల్చివేశారని, మళ్లీ ఇప్పుడు రహదారి విస్తరణలో భాగంగా కూల్చి వేయడం సరికాదన్నారు. అనంతరం వారందరూ మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి టౌన్ ప్లానింగ్ అధికారి కల్యాణ్ చక్రవర్తికి వినతి పత్రం అందించారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి వెంటనే కూల్చివేతలను ఆపాలని విన్నవించారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బాధితులు సంపత్, బాలనారాయణ, కృష్ణమూర్తి, రమేష్, శ్రీనివాస్, చంద్రమౌళి, అంజయ్య, ప్రసాద్, మహేందర్, శంకర్, మురళి పాల్గొన్నారు. వీరికి సీపీఐ నాయకులు అశోక్, భాస్కర్రెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి తదితరులు మద్దతు తెలిపారు. -
మోదీ కానుకగా సైకిళ్ల పంపిణీ
టెన్త్ విద్యార్థులకు అందజేయనున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ హుస్నాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పుట్టిన రోజు (ఈ నెల 11) పురస్కరించుకుని మోదీ కానుకగా పదో తరగతి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయనున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్సియల్ స్కూళ్లల్లో చదివే విద్యార్థినీవిద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేస్తారు. జిల్లాలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లో 783, హుస్నాబాద్ మున్సిపల్ పరిధిలో ఒక్కో వార్డుకు 50 చొప్పున 20 వార్డులకు గాను వెయ్యి సైకిళ్లు అందజేయనున్నారు. సైకిల్ రాడ్కు ఒక వైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇంకో వైపు బండి సంజయ్ ఫొటో ముద్రించనున్నారు. ఈ నెల 8 లేదా 9వ తేదీన పంపిణీ చేసేందుకు మంత్రి బండి సంజయ్ సిద్ధమయ్యారు. ప్రభుత్వ స్కూళ్లల్లో చదువుకునే పిల్లలు పేద కుటుంబాల వారే ఎక్కువ. వీరికి రవాణా ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో సైకిళ్లు పంపిణీ చేయనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. -
మహిళల ఆర్థికాభివృద్ధికే శ్రీనిధి రుణాలు
దుబ్బాక: మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్న సదుద్దేశ్యంతోనే ప్రభుత్వం బ్యాంకులు, శ్రీనిధి ద్వారా రుణాలు అందిస్తోందని డీఆర్డీఓ పీడీ జయదేవ్ ఆర్య అన్నారు. శుక్రవారం దుబ్బాక పట్టణంలోని ఐఓసీ భవనంలో నియోజకవర్గంలోని ఐకేపీ సీసీలు, వీఓఏలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా రాణించాలన్నారు. రుణాలను వ్యక్తిగత ఖాతాల్లోనే జమచేయడం జరుగుతుందన్నారు. రుణం పొందిన వెంటనే సభ్యులు భీమా చేసుకోవాలన్నారు. నియోజకవర్గంలో ఇందిరా మహిళాశక్తి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. సెర్ప్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు ప్రతి మహిళకు చేరేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఏపీడీ సుధీర్, డీపీఎం వాసుదేవ్, విద్యాసాగర్, ప్రకాశ్, ఏపీఎంలు కృష్ణారెడ్డి, కిషన్, యాదగిరి, శ్రీనివాస్, ప్రసాద్ తదితరులు ఉన్నారు.డీఆర్డీఓ పీడీ జయదేవ్ ఆర్య -
పంచాయతీలకు..
శనివారం శ్రీ 5 శ్రీ జూలై శ్రీ 2025జిమ్ చేయాలంటే.. వైకుంఠానికి రావాల్సిందే● ఇష్టారాజ్యంగా జిమ్ల ఏర్పాటు ● అధికారుల విచిత్ర వైఖరిమీరు జిమ్ చేయాలనుకుంటున్నారా?.. అయితే ‘వైకుంఠా’నికి రావాల్సిందే. అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా?.. అవును.. ఇది నిజమే. హుస్నాబాద్ మండలం పందిల్ల గ్రామంలోని వైకుంఠధామం(శ్మశానం) లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడమే ఇందుకు కారణం. ఊరూరా ఓపెన్ జిమ్ ఏర్పాటులో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే యువత శ్మశానానికి వెళ్లడానికి భయపడుతున్నారు. పొద్దున్నే లేచి సమాధుల మధ్య వ్యాయామం ఎలా చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఎవరూ లేని ప్రదేశంలో, నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేయడంపై మండిపడుతున్నారు. అలాగే నాగారంలోనూ డంపింగ్ షెడ్డు దగ్గర జిమ్ నిర్మించడంపైనా ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. యువతకు అందుబాటులో ఉండేలా వ్యాయామ పరికరాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఇలా ఎక్కడపడితే అక్కడ ఏర్పాటు చేయడం.. అవి కూడా నాసిరకం కావడంపై సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. – హుస్నాబాద్రూరల్నాగారం గ్రామంలో డంపింగ్ షెడ్డు దగ్గర నిర్మించిన ఓపెన్ జిమ్న్యూస్రీల్కలెక్టర్ హైమావతి -
ఆయిల్పామ్తో బోలెడు లాభాలు
జెడ్పీ మాజీ చైర్పర్సన్ రోజాశర్మ చిన్నకోడూరు(సిద్దిపేట): రైతులు ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని జెడ్పీ మాజీ చైర్పర్సన్ రోజాశర్మ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చంద్లాపూర్లో తన సొంత ఆయిల్ పామ్ తోటలో పామా యిల్ గింజలు కోశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఆయిల్ పామ్ తోటలు వందల ఎకరాల్లో సాగు చేస్తున్నారన్నారు. రైతులు వరికి బదులుగా ఆయిల్పామ్ సాగుపై దృష్టి సారించి ఆర్థికంగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రవి, అంజిరెడ్డి, వెంకట్రెడ్డి, లింగం, భాస్కర్, సాయిరెడ్డి, రైతులు పాల్గొన్నారు. ‘చేవెళ్ల డిక్లరేషన్’పై ఖర్గే చొరవ చూపాలి డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి గజ్వేల్: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేసిన చేవేళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ను వెంటనే అమలు చేయాలని డీబీఎఫ్(దళిత బహుజన ఫ్రంట్) రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండస్వామి డిమాండ్ చేశారు. శుక్రవారం గజ్వేల్లో ఖర్గేకు బహిరంగ లేఖను విడుదల చేసిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి ఎస్సీ కుటుంబాన్ని ఆదుకోవడానికి రూ.12లక్షలను అందజేసేవిధంగా అంబేడ్కర్ అభయహస్తం పథకాన్ని అమలు చేస్తామని, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 18శాతం, ఎస్టీలకు 12శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని డిక్లరేషన్లో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కార్పొరేషన్లను బలోపేతం చేసి ఏడాదికి రూ.750కోట్ల నిధులు అందజేస్తామని కూడా హామీ ఇచ్చారని చెప్పారు. హామీల అమలుకు ఖర్గే చొరవ చూపాలని డిమాండ్ చేశారు. సమావేశంలో డీబీఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుబాషి సంజీవ్, ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు బాగుచేయాలంటూ వినూత్న నిరసన చేర్యాల(సిద్దిపేట): రోడ్డు బాగు చేయాలంటూ స్థానికులు వినూత్న నిరసన తెలిపారు. పట్టణ కేంద్రం నుంచి శివారు గట్టుతోటకు వెళ్లే దారి బురదమయంగా మారినా ఎవరూ పట్టించుకోకపోవడంతో శుక్రవారం రోడ్డుపై నాట్లు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడాది నుంచి రోడ్డు అధ్వానంగా మారినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. చేసేదిలేక వరినాట్లు వేసినట్లు తెలిపారు. ఇప్పటికై నా మున్సిపల్ అధికారులు పట్టించుకుని రోడ్డు బాగు చేయాలని, లేని పక్షంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపడతామన్నారు. కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు భిక్షపతి, స్థానికులు కామల్ల అనిల్, కామల్ల కమలాకర్, కందూరి కర్ణాకర్, కాకర్ల యాదయ్య, కందూరు మహేష్ పాక వెంకటేష్, సూర మహేష్, సూర్ల రాకేష్, కందూరి లింగం, సూర్ల రాజు, పాక కృష్ణ. సూర్ల లింగం. కందూరి శ్రీకాంత్, తుప్పతి రాములు పాల్గొన్నారు. విద్యార్థులకు మెరుగైనవిద్య అందించాలి జిల్లా విద్యాధికారి శ్రీనివాస్రెడ్డి దౌల్తాబాద్ (దుబ్బాక): విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని తిర్మలాపూర్, అహ్మద్నగర్ పలు పాఠశాలలను ఆకస్మికంగా తనీఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. అప్పుడే ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరుగుతుందని అన్నారు. 15 ఏళ్ల యువకులకు, వయోజనులకు తెలంగాణ ఓపెన్ స్కూల్ ద్వారా విద్యను అభ్యసించే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు ,ప్రధానోపాధ్యాయులు లక్ష్మయ్య, ముత్యం రెడ్డి, ప్రశాంత్, స్వాతి, సౌజన్య, సీఆర్పీలు పాల్గొన్నారు. -
బీఎల్ఓల పాత్ర కీలకం
అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ సిద్దిపేటరూరల్: ఓటరు జాబితా పొందుపరచడంలో బీఎల్ఓల పాత్ర ఎంతో కీలకమని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అన్నారు. శుక్రవారం నారాయణరావుపేట మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల బూత్ అధికారుల శిక్షణ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల వివరాలు జాగ్రత్తగా సేకరించి నమోదు చేయాలన్నారు. శిక్షణ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనీ అధికారులు చెప్పే అంశాలను అర్థం చేసుకోవాలని బీఎల్ఓలకు సూచించారు. కార్యక్రమంలో నారాయణరావుపేట తహసీల్దార్ మాధవి, మాస్టర్ ట్రైనీలు, మండలంలోని బీఎల్వోలు తదితరులు పాల్గొన్నారు. -
సాయుధ పోరాటయోధుడు కొమురయ్య
ప్రశాంత్నగర్(సిద్దిపేట): తెలంగాణ సాయుధ పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య అని కలెక్టర్ హైమావతి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో కొమురయ్య వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయిన కలెక్టర్.. కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, బీసీ అభివృద్ధి అధికారి నాగ రాజమ్మ, కురుమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆశయాలను సాధిస్తాంకొమురవెల్లి(సిద్దిపేట): భూమికోసం, భుక్తికోసం, వెట్టిచాకిరి విముక్తికోసం పోరాడి అమరుడైన దొడ్డికొమురయ్య ఆశయాలను సాధిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కొమురయ్య వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ నిజాం సైన్యాలకు కొమురయ్య ఎదురొడ్డి ప్రజలను వెట్టిచాకిరి నుంచి కాపాడారని అన్నారు. కార్యక్రమంలో శెట్టిపల్లి సత్తిరెడ్డి, తాడూరి రవీందర్, కృష్ణారెడ్డి, అత్తిని శారద పాల్గొన్నారు. -
నిధులున్నా.. పనులు సున్నా
అధ్వానంగా అంతర్గత రోడ్లు ● 14వ ఆర్థిక సంఘం ద్వారా రూ.2కోట్ల అంచనా వ్యయం ● వానాకాలం కావడంతోదారులన్నీ చిత్తడి ● గజ్వేల్ మున్సిపాలిటీ దుస్థితిగజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో అంతర్గత రోడ్లు సక్రమంగా లేకపోవడంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. నాలుగేళ్ల క్రితం మున్సిపాలిటీ పరిధిలో 80కిలోమీటర్ల పొడవున అధ్వానంగా ఉన్న అంతర్గత రోడ్లను సీసీ రోడ్లుగా మార్చడానికి సుమారుగా రూ.120 కోట్ల నిధులు అవసరమని ప్రతిపాదించారు. కానీ ఇందులో కేవలం రూ. 22.87కోట్లను మాత్రమే మూడేళ్ల కిందట ప్రభుత్వం విడుదల చేసింది. ఫలితంగా 18కిలోమీటర్ల మేర మాత్రమే పనులు చేపట్టాల్సి ఉండగా.. 70ఽశాతం మేర చేపట్టి మిగితావి వదిలేశారు. గత మున్సిపల్ పాలకవర్గంలోని సభ్యులు తమ వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యతినివ్వడం, తరుచూ గొడవలు పడటం పరిపాటిగా ఉండేది. ఈ పరిస్థితి అభివృద్ధికి అవరోధంగా మారింది. చివరకు పాలకవర్గం తమ పదవీ కాలం ముగిసే సమయంలో అంతర్గత రోడ్లు సక్రమంగా లేని సీసీ రోడ్ల నిర్మాణానికి గతేడాది ఆగస్టు నెలలో రూ.2కోట్ల 14వ ఆర్థిక సంఘం నిధులను ప్రతిపాదించి తీర్మానించింది. మొత్తంగా 20పనులు చేపట్టాలని నిర్ణయించి ఒక్కో పనికి రూ.10లక్షలు మంజూరు చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డుల్లో ఒక్కో వార్డు ఒక్కో పని కేటాయించారు. ఇందులో 11, 12, 14, 15, 19వార్డుల్లో పనులు పూర్తి చేసి, మిగిలిన 15 వార్డుల్లో పనులు పెండింగ్లో పెట్టారు. ఫలితంగా ఆయా వార్డుల్లో ప్రస్తుత వర్షాకాలంలో తేలికపాటి జల్లులు కురిసినా అంతర్గత రోడ్లు చిత్తడిగా మారి ప్రజలకు నరకం చూపుతున్నాయి. ప్రత్యేకించి మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీప్రసన్న నగర్, గజ్వేల్లోని పాత పట్టణం, ప్రజ్ఞాపూర్లోని పలు కాలనీల్లో పరిస్థితి దయనీయంగా ఉన్నది. విలీన గ్రామాల్లోనూ అదే దుస్థితి మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలు, కొత్తగా ఏర్పడిన కాలనీల్లో పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది. వర్షం వస్తే ఆయా కాలనీల్లో కనీసం నడవలేని స్థితిలో అంతర్గతర రోడ్లు ఉన్నాయి. ఈనేపథ్యంలో ఆయా కాలనీవాసులు మున్సిపల్ యంత్రాంగానికి తరుచూ విన్నపాలు చేస్తున్నా..పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఇప్పటికీ ఈ పనులపై స్పందించి ప్రారంభమయ్యేలా చొరవ చూపకపోతే ప్రజల ఇబ్బందులు తీరే అవకాశం లేదు. మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీప్రసన్ననగర్లో అంతర్గత రోడ్డు దుస్థితిపనులు ప్రారంభిస్తాం మున్సిపాలిటీ పరిధిలో చేపట్టాల్సిన సీసీ రోడ్ల పనులు పెండింగ్పై పరిశీలన జరుపుతాం. వాటిని ప్రారంభించేలా చూస్తాం. ప్రజల ఇక్కట్లు తీర్చడమే లక్ష్యంగా ముందుకుసాగుతాం. – బాలకృష్ణ, గజ్వేల్–ప్రజ్ఞాపూర్మున్సిపల్ కమిషనర్ -
కొలువుదీరిన నాచగిరి పాలకవర్గం
● చైర్మన్గా రవీందర్గుప్తా ఏకగ్రీవం ● ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకారం వర్గల్(గజ్వేల్): ఉమ్మడి మెదక్ జిల్లాలో సుప్రసిద్ధమైన నాచారం గుట్ట లక్ష్మీ నృసింహ క్షేత్రంలో శుక్రవారం నూతన ధర్మకర్తల మండలి కొలువుదీరింది. నాచగిరి ఆలయ ముఖమండపంలో ధర్మకర్తల ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. ధర్మకర్తలుగా జగ్గయ్యగారి శేఖర్గుప్తా, దేశపతి ఉషశ్రీ, గాల కిష్టయ్య, కర్రె పద్మ, జగ్గన్నగారి సురేందర్రెడ్డి, జే.ఎస్ తిరుమల్రావు, రుద్ర శ్రీహరి, కొత్తపల్లి శ్రీనివాస్, చందా నాగరాజుగుప్తాతోపాటు, ఎక్స్అఫీషి యో మెంబర్గా జగన్నాథాచార్యులుతో ఆలయ సహాయ కమిషనర్ విజయరామారావు, ఇన్స్పెక్టర్ విజయలక్ష్మిలు ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం చైర్మన్ ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల ఏకగ్రీవ ఆమోదంతో పల్లెర్ల రవీందర్గుప్తా చైర్మన్గా ఎన్నికయ్యారు. నూతన చైర్మన్ను మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి అభినందిస్తూ సన్మానించారు. చైర్మన్, పాలకమండలి ధర్మకర్తలు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్రెడ్డి, విజయమోహన్, శ్రీనివాస్రెడ్డి, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ నిమ్మ రంగారెడ్డి తదితరులు పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా శనివారం నాచగిరి ఆలయ పాలకమండలి సమావేశం, సన్మాన సభ నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ తెలిపారు. -
ఇళ్లను వేగంగా నిర్మించండి
● మొదట పూర్తి చేసిన వారికిసొంత ఖర్చుతో గృహ ప్రవేశం చేయిస్తా ● రెవెన్యూ డివిజన్ అంశాన్నిసీఎం దృష్టికి తీసుకెళ్తా ● భువనగిరి ఎంపీ చామల చేర్యాల(సిద్దిపేట): ‘ఇల్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణాలను మూడు నెలల్లో పూర్తి చేయాలి. మొదట పూర్తి చేసిన వారికి నా సొంత ఖర్చుతో గృహ ప్రవేశం చేయిస్తా’నని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. గురువారం స్థానిక కల్యాణి గార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, దూల్మిట్ట మండల పరిధిలోని పలు గ్రామాలకు మంజూరైన 636 ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన మంజూరు పత్రాలను కలెక్టర్ హైమావతి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డితో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ ఇల్లు మంజూరైన ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు. ఇంటి నిర్మాణ ప్రగతి మేరకు పది రోజులకు ఒకసారి బిల్లు చెల్లింపు ఉంటుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గానికి 3 వేల ఇళ్లు మంజూరు చేశామన్నారు. అలాగే ఈ నెల 14న మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాకుండా మిగిలిపోయిన రైతుల భూ సమస్యలకు భూ భారతి చట్టం ద్వారా శాశ్వత పరిష్కారం చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. భూమి సమస్యలున్న రైతులు వెంటనే రెవెన్యూ అధికారులను సంప్రదించాలన్నారు. అలాగే చేర్యాల ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన రెవెన్యూ డివిజన్ అంశాన్ని సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి డివిజన్ ఏర్పాటు అయ్యేలా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ దామోదర్రావు, ఆర్డీవో సదానందం, జెడ్పీ సీఈఓ రమేష్, ప్రత్యేక అధికారి, ఏడి గ్రౌండ్ వాటర్ నాగరాజు, నాలుగు మండలాల లబ్ధిదారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
నాచగిరికి పాలకమండలి నియామకం
వర్గల్(గజ్వేల్): నాచారం దేవస్థాన పాలక మండలి ఖరారైంది. ఈ మేరకు దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నాచగిరి ఆలయ కమిటీ ధర్మకర్తలుగా పల్లెర్ల రవీందర్, జగ్గయ్యగారి శేఖర్, దేశపతి ఉషశ్రీ, గాల కిష్టయ్య, పద్మ, జగ్గన్నగారి సురేందర్రెడ్డి, జేఎస్ తిరుమల్రావు, రుద్ర శ్రీహరి, కె. శ్రీనివాస్, చంద నాగరాజులతో కూడిన కమిటీని దేవాదాయశాఖ ఏర్పాటు చేసింది. చైర్మన్గా జగ్గయ్యగారి శేఖర్ను ఎన్నుకోనున్నట్లు, పాలకమండలి ప్రమాణస్వీకారం శుక్రవారం జరగనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. తెలుగు వర్సిటీ ప్రతిభాపురస్కారానికి రమేశ్లాల్ ప్రశాంత్నగర్(సిద్దిపేట): సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ ప్రతిభా పురస్కారానికి ప్రముఖ పేరణీ నృత్యకారుడు రమేశ్లాల్ ఎంపిక అయ్యారు. ఈ నేపథ్యంలో గురువారం జిల్లా కేంద్రంలో రమేశ్లాల్ను కవులు సన్మానించారు. ఈ సందర్భంగా ఐత చంద్రయ్య మాట్లాడుతూ పేరణీ విభాగంలో రమేశ్లాల్కు ప్రతిభా పురస్కారం రావడం సంతోషంగా ఉందన్నారు. కవులు అభినందించారు. ఈ కార్యక్రమంలో కవులు ఎన్నవెళ్లి రాజమౌళి, ఉండ్రాళ్ళ రాజేశం, సింగీతం నరసింహారావు, కాల్వ రాజయ్య, నల్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలకుఅండగా ఉంటాం డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి జగదేవ్పూర్(గజ్వేల్): కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి అన్నారు. జగదేవ్పూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు చిరంజీవి సోదరుడు సంతోష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న నర్సారెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, ఏఎంసీ చైర్మన్ నరేందర్రెడ్డిలతో కలిసి మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం రూ.24 వేల ఆర్థిక సహాయం అందించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆపద సమయంలో అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు రవీందర్రెడ్డి, మండల నాయకులు ఉన్నారు. -
రింగ్ రోడ్డు మ్యాప్ సిద్ధం చేయండి
హుస్నాబాద్: రింగ్ రోడ్డు నిర్మాణం కోసం ప్లానింగ్ మ్యాప్ సిద్ధం చేయాలని కలెక్టర్ హైమావతి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయంలో గురువారం నియోజకవర్గంలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హుస్నాబాద్ నుంచి కొత్తపల్లి వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణ పనులకు ఆయా శాఖల అధికారులు అనుమతులు ఇచ్చి టెండర్ విధానం పూర్తి చేయాలన్నారు. రోడ్డుకిరువైపులా చెట్లు తొలగించడం ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆర్అండ్బి అధికారులను ఆదేశించారు. అంతకపేటలో 220 కేవీ విద్యుత్ జంక్షన్ కోసం 10 ఎకరాల స్థలం రెడీగా ఉందని విద్యుత్ అధికారులు వెంటనే ఆయా అనుమతులు తీసుకోవాలన్నారు. ఉమ్మాపూర్ గుట్టల వద్ద నిర్మించే ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి స్థల సేకరణ పూర్తి చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని అనుమతులు రాగానే ఇంజనీరింగ్ అధికారులకు అందిస్తామని తెలిపారు. రంగనాయక సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని అందించేందుకు కాలువల భూ సేకరణ ప్రక్రియ పూర్తవుతోందని తెలిపారు. హుస్నాబాద్ డిగ్రీ కళాశాలలో పీజీ ఎం.కామ్ కోర్సుకు 60 సీట్లు మంజూరు అయ్యాయన్నారు. మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ పూర్తి చేసేలా ఎంపీడీఓ, మున్సిపల్ అధికారులు దృష్టి పెట్టాలన్నారు. 150 పడకల ఆస్పత్రి, కోహెడలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణం, ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులు, కాలువల భూ సేకరణ పనుల పై అధికారులతో చర్చించారు. -
శుక్రవారం
4-7-2025కార్మికుల ఆస్పత్రికి సుస్తీ డిస్పెన్సరీలు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. – 4లోపగలు కూలీ.. రాత్రి చోరీ చోరీ కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు ఏసీపీ సదానందం వెల్లడించారు. – 4లోSimultaneously Printed at Hyderabad | Bangalore | chennai | Delhi | Mumbai | Anantapur | Guntur | Kadapa | Khammam | Karimnagar | Kurnool | Mahaboobnagar | Mangalagiri | Nalgonda | Nellore | Nizamabad | Ongole | rajamahendravaram | Srikakulam | Tadepalli Gudem | Tirupathi | Vijayawada | Visakhapatnam | Warangal -
శంకుస్థాపన చేసి రెండేళ్లు..
● కాచాపూర్లోని మత్తడి వాగుపై వంతెన కలేనా? కోహెడరూరల్(హుస్నాబాద్): మండలంలోని కాచాపూర్లో మత్తడి వాగుపై వంతెన నిర్మాణానికి రెండేళ్ల క్రితం శంకుస్థాపన చేశారు. టెండర్ ప్రకియ సైతం పూర్తయినా నేటికీ పనులు ప్రారంభం కాలేదు. అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. తాత్కాలికంగా ఉన్న మట్టి రోడ్డుపై నుంచి చిన్న వర్షానికే నీరు ప్రవహిస్తుంది. దీంతో ప్రతిఏటా రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్డుతో కలిపి వంతెన నిర్మాణానికి రూ.కోటి వ్యయంతో అప్పటి హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్కుమార్ శంకుస్థాపన చేశారు. సదరు కాంట్రాక్టర్ కనీసం పిల్లర్లకు గుంతలు కూడా తీయలేదు. దీంతో వంతెనా నిర్మాణం కలగానే మిగిలిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల హామీలే తప్ప అమలు చేయడం లేదని వాపోతున్నారు. -
తాత్కాలిక పనులతోనే సరి..
హుస్నాబాద్ రూరల్: భారీ వర్షం పడితే సిద్దిపేట నుంచి హుస్నాబాద్కు రాకపోకలు బంద్ అవుతుంటాయి. 365డీజీ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా హుస్నాబాద్కు సమీపంలో రేణుక ఎల్లమ్మ వాగు బ్రిడ్జి నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. వాగులోనే తాత్కాలికంగా కొంత మట్టి పోసి దాని మీది నుంచే రాకపోకలు సాగుతున్నాయి. భారీ వర్షం పడితే సిద్దిపేట నుంచి హన్మకొండకు సైతం రాకపోకలు నిలిచిపోతుంటాయి. సిద్దిపేటకు రాకపోకలు సాగించాలంటే కొత్తపల్లి నుంచి రాజీవ్ రహదారి మీదుగా వెళ్లాల్సివస్తోంది. భారీ వర్షాలు కురవకముందే పనులు పూర్తి చేయాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.రేణుక ఎల్లమ్మ వాగు -
దాటేదెలా?
వాగులువానొస్తే.. రాస్తా బంద్● లోలెవల్ వంతెనలతో ప్రజల అవస్థలు ● రోడ్లపై నిలుస్తున్న వరద ● రాకపోకలకు తప్పని అంతరాయం ● ఆందోళనలో సమీప గ్రామాల ప్రజలు జిల్లాలోని పలు లోలెవల్ వంతెనలతో వానాకాలంలో రాకపోకలకు తిప్పలు తప్పడంలేదు. భారీ వర్షాలకు ప్రధాన రహదారులపై ఉన్న బ్రిడ్జిలపైకి పెద్దఎత్తున వరద ప్రవహిస్తుండటంతో స్థానికుల బాధలు అన్నీఇన్నీకావు. ప్రతీఏటా వరద ఉధృతికి చెరువులు, వాగులు పొంగిపొర్లి తక్కువ ఎత్తులో ఉన్న వంతెనలపై ప్రవహిస్తున్నాయి. వరద తీవ్రత తెలియక కొందరు అత్యవసర పరిస్థితులో దాటే ప్రయత్నంలో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వీటిపై హైలెవల్ వంతెనలు నిర్మిస్తే ఇబ్బందులు తొలుగుతాయని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. – సాక్షి, సిద్దిపేట మిరుదొడ్డి మండలం అల్వాల శివారు కూడవెల్లి వాగులో పిల్లర్ల దశలోనే నిలిచిన పనులుకానరాని మోక్షం.. ప్రాణాలే పణం మిరుదొడ్డి(దుబ్బాక): మండల పరిధిలోని అల్వాల శివారు కూడవెల్లి వాగుపై ఉన్న హైలెవల్ వంతెన నిర్మాణానికి ఆర్అండ్బీ రూ.4కోట్ల నిధులను మంజూరు చేసింది. ఇందుకోసం జూలై6, 2015న నిర్మాణానికి శంకుస్థాసన చేశారు. స్థల వివాదం కారణంగా పిల్లర్ల దశలోనే ఆగిపోయింది. దీంతో ఏళ్లు గడుస్తున్నా బ్రిడ్జి నిర్మాణానికి మోక్షం లభించడం లేదు. ప్రస్తుతం ఉన్న లోలెవల్ బ్రిడ్జి పైనుంచి వరద పోటెత్తుతుండటంతో రాకపోకలకు ఇబ్బందులు తప్పడంలేదు. భారీ వర్షాలకు పలు మార్లు రాకపోకలు సైతం నిలిచిపోతున్నాయి. మూడేళ్ల క్రితం వాగు దాటుతున్న క్రమంలో ఓ వ్యక్తి వరద నీటిలో గల్లంతై మృతిచెందారు. -
నీటి ఎత్తిపోతలను ప్రారంభించండి
గజ్వేల్: మేడిగడ్డ నుంచి కాళేశ్వరం నీటి ఎత్తిపోతలను ప్రారంభించి రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లను నింపాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం గజ్వేల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు ఆయువుపట్టుగా ఉన్న కాళేశ్వరంను రైతులకు ఉపయోగపడేవిధంగా తీర్చిదిద్దాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాళేశ్వరంపై విషప్రచారం చేస్తున్న ప్రభుత్వ వైఖరిని ఎక్కడికక్కడా ఎండగడతామని హెచ్చరించారు. ఎత్తిపోతలను ప్రారంభించకపోతే రాజీవ్రహదారిని రైతుల ఆధ్వర్యంలో దిగ్భంధిస్తామన్నారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, బీఆర్ఎస్ నాయ కులు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ సమస్యలపైప్రత్యేక దృష్టి గజ్వేల్: విద్యుత్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు గజ్వేల్ విద్యుత్ శాఖ డీఈ భానుప్రకాశ్ అన్నారు. గురు వారం కొడకండ్ల, బూర్గుపల్లి గ్రామాల్లో పర్య టించారు. ఈ సందర్భంగా రైతులతో మా ట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రైతులు తమ ఇబ్బందులను తెలియజేయగా, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రజ్ఞాపూర్ సెక్షన్ ఏఈ సత్యం పాల్గొన్నారు. -
పనులు సాగక.. భగీరథ అందక
మంచినీటికి తప్పని కష్టాలు● మల్లన్నసాగర్ పైప్లైన్ల పనులు పూర్తయితేనే సరఫరా ● 16కిలోమీటర్ల మేర పనులకు 400 మీటర్లు పెండింగ్ ● బిల్లుల చెల్లింపుల్లో జాప్యమే కారణం ● సమస్య పరిష్కారానికి అధికారయంత్రాంగం దృష్టిజిల్లాలోని గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో మిషన్ భగీరథ నీటి కష్టాలు అంతా ఇంతా కాదు. సగానికిపైగా నీటి సరఫరా తగ్గడంతో జనం అల్లాడుతున్నారు. ప్రత్యేకించి గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీతోపాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సమస్య తీవ్ర రూపం దాల్చింది. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం, ఇతర సమస్యల కారణంగా ఈ రెండు నియోజకవర్గాలకు మల్లన్నసాగర్ నుంచి ప్రత్యేకంగా వేస్తున్న పైప్లైన్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. – గజ్వేల్ -
స్థానిక ఎన్నికల్లో సత్తాచాటుదాం
గజ్వేల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటుదామని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానిక ఎన్నికల ఇన్చార్జి నవాబ్ ముజాహిద్ పిలుపునిచ్చారు. బుధవారం గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గస్థాయి విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నవాబ్ ముజాహిద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం పనిచేస్తున్నదని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక ఎన్నికల్లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలు, నాయకులపై ఉందని సూచించారు. టీసీసీ ప్రధాన కార్యదర్శి దయాకర్ మాట్లాడుతూ విభేదాలకు తావు లేకుండా పార్టీ గెలుపునకు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. కాంగ్రెస్ పథకాలకు ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తున్నదని, ఇదే గెలుపునకు సోపానమన్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాల పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్లు మడుపు భూంరెడ్డి, ఎలక్షన్రెడ్డి, మార్కెట్ కమీటీల చైర్మన్లు వంటేరు నరేందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, విజయమెహన్, గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాల్గొన్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు నవాబ్ ముజాహిద్ గజ్వేల్లో పార్టీ నియోజకవర్గస్థాయి సమావేశం -
రజకులను ఎస్సీలో చేర్చాలి
సిద్దిపేటరూరల్: రజకులను ఎస్సీ కమ్యూనిటీలో చేర్చేలా సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్కు పంపాలంటూ రాష్ట్ర చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర కార్యదర్శి మల్లేశం డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రజక కులస్తులు ఎన్నో ఏళ్లుగా అన్యాయానికి గురవుతున్నామన్నారు. తమను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే భావిస్తున్నారు తప్పా.. సంక్షేమాన్ని మరిచారన్నారు. రాష్ట్రంలో 26లక్షలకు పైగా జనాభా ఉన్నప్పటికీ సరైన ప్రాతినిధ్యం లేదన్నారు. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో ఎస్సీ వర్గంగా గుర్తింపు పొందిన క్రమంలో తమ రాష్ట్రంలో కూడా ఎస్సీలుగా గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సంతోష్, కార్యదర్శి కనకరాజు తదితరులు పాల్గొన్నారు. -
‘సాంస్కృతిక’ సలహాదారుగా దరువు అంజన్న
దుబ్బాకటౌన్: రాష్ట్ర సాంస్కృతిక శాఖ సలహాదారు కమిటీ సభ్యుడిగా రాయపోల్ మండల కేంద్రానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, ఓయూ జేఏసీ చైర్మన్ దరువు అంజన్న నియామకమాయ్యరు. 20 మంది సభ్యులతో ఉన్న కమిటీలో అంజన్న ఉండడం విశేషం. కౌన్సెలింగ్కు 470 మంది హాజరునంగునూరు(సిద్దిపేట): రాజగోపాల్పేట పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్న ఈఏపీసెట్ కౌన్సెలింగ్కు బుధవారం 470 మంది విద్యార్థు లు హాజరయ్యారు. ఈసందర్భంగా అధ్యాపకులు ఒరిజినల్ సర్టిఫికెట్లు పరిశీలించి ఐడీ, పాస్వర్డు అందజేశారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ గోవర్ధన్ మాట్లాడుతూ కౌన్సెలింగ్కు హజరవుతున్న విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు అభినవ్, షెహబాజ్, రాజు, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. రోశయ్య విగ్రహ ఏర్పాటు అభినందనీయం జిల్లా ఆర్యవైశ్య మహసభ ప్రశాంత్నగర్(సిద్దిపేట): హైదరాబాద్లో ఈ నెల 4న ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య విగ్రహావిష్కరణను ఆహ్వానిస్తున్నామని జిల్లా ఆర్యవైశ్య మహాసభ నాయకులు తెలిపారు. మరోవైపు ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయమని మహాసభ నాయకులు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్య మహాసభ నాయకులు మాట్లాడారు. రోశయ్య పదహారు సార్లు ఉమ్మడి రాష్ట్ర ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశ పెట్టి దేశంలోనే ఆదర్శంగా నిలిచారన్నారు. రోశయ్య జయంతిని ఆధికారికంగా నిర్వహించడం, విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ నాయకులు గంప శ్రీనివాస్, తణుకు ఆంజనేయులు, కాసం నవీన్ కుమార్, యాసాల వెంకట్ లింగం, మంచాల శ్రీనివాస్, మంకాల నాగారాణి, హేమలత, సముద్రాల హరినాథ్, డాక్టర్ మంకాల నవీన్ కుమార్, గంప కృష్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఎంపీ హామీ ఏమాయె.. చేర్యాల(సిద్దిపేట): పార్లమెంట్ ఎన్నికల సమయంలో చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయిస్తానన్న భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి హామీ ఇప్పటికీ నెరవేరలేదని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కొంగరి వెంకట్మావో అన్నారు. బుధవారం స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ చామల ఎంపీగా బాధ్యతలు చేపట్టి 15నెలలు గడిచినా రెవెన్యూ డివిజన్ అంశం మర్చిపోయారన్నారు. సంక్షేమ, అభివృద్ధి పనుల పేరుతో చేర్యాల ప్రాంతానికి వచ్చి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై ప్రజలు, ప్రజా స్వామ్యవాదులు, మేధావులు ఖండిచాలన్నారు. ఇచ్చిన మాట మరిచిన ఎంపీని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి బండకింది అరుణ్కుమార్, కొమురవెల్లి మండల కార్యదర్శి తాడూరి రవీందర్, పట్టణ కార్యదర్శి రాళ్లబండి నాగరాజు, నాయకులు పోలోజు శ్రీహరి, బోయిన మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. వాహన విడిభాగాల వేలంసిద్దిపేటకమాన్: కమిషనరేట్ పరిధిలోని పోలీసు వాహనాలకు వినియోగించిన టైర్లు, బ్యాటరీలు, విడిభాగాలను వేలం వేయనున్నట్లు సీపీ అనురాధ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 8న సీఏఆర్ హెడ్ క్వార్టర్లో ఉదయం 9.30 గంటలకు వేలం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. వేలంలో పాల్గొ నే వారు 9గంటల వరకు చేరుకోవాలన్నారు. వేలంపాట పూర్తి కాగానే డబ్బు చెల్లించి వస్తువులు తీసుకెళ్లవచ్చన్నారు. మరిన్ని వివరాలకు ఏఆర్ ఎస్ఐ వెంకటేశం, రిజర్వ్ ఇన్స్పెక్టర్ ధరణికుమార్, ఏఆర్ కానిస్టేబుల్ విజయ్ను సంప్రదించాలని సూచించారు. -
అయినవారి కోసం కుటుంబసభ్యుల పడిగాపులు
మూడు రోజులుగా నరకయాతన ● ‘సిగాచీ’ పేలుడు మిగిల్చిన పెనువిషాదంఅయినవారి కోసం ఆర్తనాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సిగాచీ పరిశ్రమ ఎదుట బాధిత కుటుంబసభ్యులు పడిగాపులు కాస్తున్నారు. చివరి చూపు దక్కక.. అంతిమ సంస్కారాలు సాగక దిక్కుతోచని స్థితికి గురవుతున్నారు. కనిపించిన వారినంతా.. ‘అయ్యా.. మా వాళ్లు ఏరీ? అంటూ దీనంగా వేడుకుంటున్నారు. ఈ పేలుడు ఘటన మిగిల్చిన విషాదం మూడు రోజులుగా కొనసాగుతుండటంతో బాధిత కుటుంబసభ్యులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఉపాధి కోసం వందల కిలోమీటర్ల దూరం నుంచి పొట్ట చేతపట్టుకుని వస్తే.. ఉపాధి దేవుడెరుగు.. ఉసురు పోయిందని బాధితులు కన్నీరు మున్నీరవుతుండటం అందరినీ కలిచివేస్తోంది. – సాక్షిప్రతినిధి, సంగారెడ్డికొనసాగుతున్న సహాయక చర్యలు● అందుబాటులో హెల్ప్డెస్క్ ● కలెక్టర్ ప్రావీణ్య పటాన్చెరు టౌన్: పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో రిస్క్యూ ఆపరేషన్, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. సహాయక బృందాలకు మార్గదర్శనం చేస్తున్నామన్నారు. బాధిత కుటుంబాల కోసం ప్రత్యేక సహాయక కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. వారి కుటుంబ సభ్యులకు భోజనం, తాత్కాలిక నివాసం, రవాణా వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. బాధితులు వారివారి స్వగ్రామాలకు వెళ్లేందుకు అవసరమైన రవాణా ఏర్పాట్లు చేశామన్నారు. ఒడిశా, బిహార్ రాష్ట్రాల అధికారులు కూడా సహాయక చర్యలు అందిస్తున్నారన్నారు. 18 మృతదేహాలు అప్పగింత ఇప్పటి వరకు 18 మంది మృతదేహాలను అప్పగించామని కలెక్టర్ తెలిపారు. డీఎన్ఏ ఫలితాల కోసం 18 నమూనాలు పెండింగ్లో ఉండగా, ఇంకా సేకరించాల్సిన రెండు మృతదేహాల నమూనాలు ఉన్నాయని తెలిపారు. డీఎన్ఏ ద్వారా ఐదుగురు నమూనాలు వారి వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలతో పాటు తక్షణ సాయం రూ.లక్ష అందజేశామన్నారు. తాత్కాలిక ఆర్థిక సహాయం 18 మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున, గాయపడిన 34 మందికి రూ.50 వేలు చొప్పున, మిస్సింగ్ అయిన 10 మంది కార్మికుల కుటుంబాలకు రూ.10 వేల చొప్పున తాత్కాలిక సహాయం అందించడం జరుగుతోందన్నారు. బాధిత కుటుంబాలు లేదా వారి బంధువులు సమాచారం కోసం సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ నంబర్ 08455276155ను సంప్రదించవచ్చు. ఈ హెల్ప్ డెస్క్ ద్వారా వారి అవసరాలపై సత్వర స్పందించడానికి సిబ్బంది కార్యాలయ పని వేళల్లో అందుబాటులో ఉంటారని కలెక్టర్ తెలిపారు.క్యాంపులో బిక్కుమంటూ.. బాధిత కుటుంబాల కోసం అధికారులు పాశమైలారం ఐలా కార్యాలయం వద్ద ప్రత్యేక సహాయ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో బాధితులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తమ వారి ఆచూకీ కోసం అక్కడి హెల్ప్డెస్క్లో రక్త నమూనాలను ఇచ్చి తమ వారి మృతదేహాల కోసం వేచి చూస్తున్నారు. అధికారుల నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందోనని ఆవేదనతో వేచి చూస్తున్నారు. ఆచూకీ తెలియగానే సమాచారం ఇస్తామని అధికారులు దాటవేస్తుండటంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు.కుటుంసభ్యులు మరణిస్తే వేదన అంతా ఇంతా కాదు.. మరణించాడని తెలిసి చివరి చూపు కోసం.. అంతిమ సంస్కారాలైనా చేసుకుందామంటే మృతదేహం లభించకపోతే.. ఆ శోకం రెట్టింపవుతుంది. సరిగ్గా ఇలాంటి ఆవేదనే సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలు అనుభవిస్తున్నాయి. తమ వారి జాడ చెప్పాలని, లేదంటే మృతదేహాన్ని అయినా అప్పగించాలని వారి కుటుంబసభ్యులు పడుతున్న యాతన అందరినీ కలిచివేస్తోంది. ఘటన జరిగిన సిగాచీ పరిశ్రమ వద్దకు తరలివస్తున్న బాధిత కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు.. తమ వారి ఆచూకీ కోసం అక్కడ ఉన్న అధికారులను వేడుకుంటున్నారు. హెల్ప్డెస్క్కు వెళ్లి ఆరా తీస్తున్నారు. మృతదేహాలను ఉంచిన పటాన్చెరు ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద అధికారులను సంప్రదిస్తున్నారు. గంటలు కాదు.. రోజులు గడుస్తున్నా తమ వారు కనిపించకపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. -
స్నేహితుడి ఆచూకీ కోసం..
పొట్టచేతపట్టుకుని ఉపాధి కోసం ఒడిశా నుంచి పటాన్చెరుకు వచ్చారు 28 సంవత్సరాల దీపక్. తన స్నేహితులతో కలిసి ఇస్నాపూర్లోని ఓ గదిని అద్దెకుంటున్నాడు. మూగ్గురు మూడు కంపెనీల్లో పనిచేసుకుంటున్నారు. మూడు నెలల క్రితమే దీపక్ ఈ సిగాచీ పరిశ్రమలో చేరారు. సోమవారం ఉదయమే పనికి వెళ్లిన దీపక్ ఆచూకీ లేకుండా పోయింది. దీంతో ఒక్కడే ఇక్కడ ఉండటంతో ఆయనకు సంబంధించిన కుటుంబసభ్యులు ఎవరూ ఇక్కడ లేరు. దీపక్తో పాటు అద్దె గదిలో ఉంటున్న తన స్నేహితులు సునాముద్దీన్, బవుజీలు ఇతర స్నేహితులు ఇప్పుడు దీపక్ ఆచూకీ కోసం పరిశ్రమ వద్దకు వచ్చి అధికారుల వద్ద గోడు వెల్లబోసుకున్నారు. పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లి అడిగితే అధికారుల నుంచి స్పందన లేదని సునాముద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. -
పాఠశాలల్లో ఎన్నో వసతులు
బెజ్జంకి(సిద్దిపేట): ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక వసతులను కల్పిస్తుందని విద్యాశాఖ మానిటరింగ్ అధికారి భాస్కర్ అన్నారు. మండలంలోని గుండారం ప్రాథమిక పాఠశాలలో ప్రి ప్రైమరీ తరగతులు, క్రీడా పరికరాలను ఎంఈఓ మహతిలక్ష్మితో కలిసి మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న రోజులలో పాఠశాలలకు కంప్యూటర్లను కూడా ఇవ్వనున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎం తిరుపతి, కాంప్లెక్స్ హెచ్ఎం శ్రీరాములు, హైస్కూల్ హెచ్ఎం నాగవేణి, రవీందర్, శ్రీనివాస్, శ్రీనివాస్రెడ్డి, దేవయ్య, వేణు తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ సేవతోనే ప్రత్యేక గుర్తింపు కోహెడ(హుస్నాబాద్): ప్రభుత్వ ఉద్యోగి నిజాయితీగా, ఉత్తమ సేవలందిస్తే ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని ఏసీపీ సదానందం అన్నారు. మంగళవారం రాత్రి కోహెడ పీఎస్లో ఏఎస్ఐ ఎడ్ల పవన్కుమార్ ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ఆయన హజరై మాట్లాడారు. పవన్కుమార్ 42 యేళ్లుగా అంకిత భావంతో సేవలందించడం హర్షణీయమన్నారు. ఏఎస్ఐ దంపతులను ఘనంగా సత్కరించి బహుమతిని అందించారు. కార్యక్రమంలో ఎస్ఐ అభిలాష్, సీఐ శ్రీను, కోహెడ, హుస్నాబాద్, అక్కన్నపేట ఎస్ఐలు అభిలాష్, మహేశ్, విజయ్భాస్కర్, ఏఎస్ఐలు కనకయ్య, తిలక్ తదితరులు పాల్గొన్నారు. మేలైన దిగుబడులు దుబ్బాకటౌన్: రైతులు పంట సాగులో మెళకువలు పాటిస్తే మేలైన దిగుబడులు పొందవచ్చని మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్ సూచించారు. మంగళవారం స్థానిక రైతువేదికలో ఆహార భద్రత పథకంలో భాగంగా రైతులకు ఎల్ఆర్జీ 52 కంది విత్తనాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విత్తనాలు ఎండు తెగులును తట్టుకుంటాయని, అధిక దిగుబడులు పొందవచ్చని చెప్పారు. విత్తనాలను ఏక పంటగా లేదా పొలం గట్లపై వేసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఏఈఓలు సంతోష్, హరీశ్, సురేందర్ తదితరులున్నారు. ఆయిల్పామ్తో లాభాలు చిన్నకోడూరు(సిద్దిపేట): రైతులు ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని మండల వ్యవసాయశాఖ అధికారి జయంత్ కుమార్ అన్నారు. మండల పరిధిలోని అల్లీపూర్ తదితర గ్రామాల్లో ఆయిల్పామ్ సాగుపై రైతులకు మంగళవారం అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ సంప్రదాయ నూనెగింజల కంటే 4 నుంచి 5 రెట్ల అధిక దిగుబడి ఉంటుందని, నాలుగు అంతర పంటలు సాగుచేసి మూడింతల ఆదాయం పొందవచ్చని సూచించారు. ఒక్కసారి సాగుచేస్తే 35 యేళ్ల వరకు దిగుబడి ఇస్తుందని, రైతులు వరికి బదులుగా ఆయిల్పామ్ సాగుపై దృష్టి సారించి ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. వైద్య వృత్తి గొప్పది ప్రశాంత్నగర్(సిద్దిపేట): వైద్య వృత్తి చాలా గొప్పదని, వారిని ప్రజలు దేవుళ్లతో సమానంగా భావిస్తారని టీపీసీసీ సభ్యుడు దరిపల్లి చంద్రం అన్నారు. డాక్టర్స్ డేను పురస్కరించుకొని మంగళవారం పట్టణంలోని డాక్టర్లను, సిద్దిపేట కాంగ్రెస్ కౌన్సిలర్ రియాజొద్దిన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడటం కేవలం డాక్టర్లకు మాత్రమే సాధ్యమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు గుండు రవితేజ తదితరులు పాల్గొన్నారు. సీఏం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు కోహెడ(హుస్నాబాద్): ఉద్యమ కవి, గాయకుడు నేర్నాల కిషోర్ను రాష్ట్ర టూరిజం, భాషా సాంస్కృతికశాఖ సలహాదారుడిగా సీఏం రేవంత్రెడ్డి ప్రకటించటం హర్షణీయమ ని మండల కళాకారుల ప్రతినిధి పొన్నాల అశోక్ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిరుద్యోగ కళాకారులకు సాంస్కృతిక సారథిలో ఉద్యోగ అవకశాలు కల్పించాలని కోరా రు. సీఎం, సాంస్కృతికశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కోదండరాంకు కృతజ్ఞతలు తెలిపారు. -
శక్తివంచన లేకుండా కృషి చేస్తా..
ములుగు(గజ్వేల్): ఉపాధ్యాయుల సమస్యలపై శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి చెప్పారు. ములుగు మండలం తున్కిబొల్లారం ఆర్అండ్ఆర్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం నిర్వహించిన హెచ్ఎం బి.రంగారావు ఉద్యోగ విరమణ అభినందన సభకు ఆయన ముఖ్యతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి షరతులు లేకుండా అన్ని కార్పొరేట్ ఆస్పపత్రులలో వర్తింప జేసే విధంగా ఉపాధ్యాయులకు త్వరలోనే హెల్త్ కార్డులు అందజేయనున్నామన్నారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ సాధించి ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇప్పిస్తామని, అందులో ఎస్జీటీ ఉపాధ్యాయులు లాభపడే విధంగా కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో వంగ మహేందర్రెడ్డి, ఎంఈఓలు ఉదయ్బాస్కర్రెడ్డి, మాధవరెడ్డి, పీఆర్టీయూ నేతలు ఇంద్రసేనారెడ్డి, శశిధర్శర్మ, రాధిక, శ్రీనివాస్రెడ్డి, జ్యోతి, వీణమ్మ, రామనర్సయ్య, శ్రీనివాస్, మనోహర్రెడ్డి, రామకృష్ణారెడ్డి, బాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి -
ట్రేడ్ లైసెన్సుల ప్రక్రియ వేగవంతం
దుబ్బాక: మున్సిపాల్టీలో వాణిజ్య, వ్యాపార సముదాయాలకు జారీచేసే ట్రేడ్ లైసెన్సుల ప్రక్రియను వేగవంతం చేయాలని సీడీఎంఏ అసిస్టెంట్ డైరెక్టర్ రుషికేష్ వాత్సవ్ ఆదేశించారు. మంగళవారం ఆయన మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ట్రేడ్ లైసెన్స్ల జారీ ప్రక్రియ, భువన్ యాప్ ద్వారా ఇంటి పన్నులు చెల్లించే వివరాలు, డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద పారిశుద్ధ్య నిర్వహణను కమిషనర్ రమేశ్ కుమార్తో కలిసి పరిశీలించారు. అనంతర ఆయన మాట్లాడుతూ ట్రేడ్ లైసెన్సుల దరఖాస్తులపై అవగాహన కల్పించాలన్నారు. భువన్యాప్లో భవనాలు, వాణిజ్య, వ్యాపారాల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, అనిల్రెడ్డి, నర్సయ్య తదితరులు ఉన్నారు. సీడీఎంఏ అసిస్టెంట్ డైరెక్టర్ రుషికేష్ శ్రీవాత్సవ్ -
భోజనశాలలు పూర్తి చేయరూ!
అసంపూర్తిగా నిర్మాణాలు● ఏళ్లు గడుస్తున్నా సాగని పనులు ● పర్యవేక్షించని అధికారులు ● ఐదింటికి గాను పూర్తయింది ఒక్కటే ● కోతులతో విద్యార్థుల ఇక్కట్లుఆరుబయటే భోజనాలు తింటూ ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల కోసం భోజనశాలల నిర్మాణాలు చేపట్టారు. కాని నిధుల కొరతతో అర్ధంతరంగా నిలిచిపోయాయి. అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల పనులు ముందుకుసాగడం లేదు. విద్యార్థులు ఆరుబయటే తింటూ ఇబ్బందులు పడుతున్నారు. తొగుట(దుబ్బాక): మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా గత ప్రభుత్వం డైనింగ్ హాళ్ల నిర్మాణం చేపట్టింది. ఒక్కొక్క హాల్ నిర్మాణం కోసం రూ.14 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసింది. తొగుట, కాన్గల్, వెంకట్రావుపేట, ఎల్లారెడ్డిపేట, ఘనపురం, గుడికందుల గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 658 మంది చదువుకుంటున్నారు. చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు నిర్మాణ పనులు ప్రారంభించి మధ్యలోనే వదిలేశారు. ఒక్కొక్కరికి మూడు, నాలుగు హాళ్ల నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు పనులు సక్రమంగా పూర్తి చేయలేకపోయారన్న ఆరోపణలున్నాయి. వెంకట్రావుపేట, ఎల్లారెడ్డిపేట పాఠశాలల్లో గోడలు నిర్మించి పైకప్పు రేకులు వేశారు. గుడికందుల పాఠశాలలో పిల్లర్ల స్థాయిలో పనులు నిలిచిపోయాయి. ఒక్క తొగుట పాఠశాలలో పనులు పూర్తిచేసి గత యేడాది జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు మధ్యలోనే వదిలేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లే కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతుల దాడులు మండలంలోని అన్ని గ్రామాల్లో కోతుల బెదడ పెరిగింది. ఆరుబయట భోజనాలు చేసే విద్యార్థులపై కోతులు దాడికి దిగుతున్నాయి. దీంతో విద్యార్థులు భోజనం చేసే వరకు ఉపాధ్యాయులు కాపలాగా ఉండాల్సిన పరిస్థితి. విద్యార్థులను గాయపరిచి ప్లేట్లు ఎత్తుకుపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయని హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భోజనశాలల నిర్మాణాలు పూర్తిచేసి ఇబ్బందులు తొలగించాలని వారు కోరారు. -
వానాకాలం జరభద్రం
హుస్నాబాద్: పట్టణ ప్రజలు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ పిలుపునిచ్చారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా 5వ వార్డులో నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులు మంగళవారం ఆయిల్ బాల్స్, బ్లీచింగ్ పౌడర్ చల్లారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో టైర్లు, పాత కుండల్లో ఉన్న నీటిని పార బోశారు. ఇంటింటికీ తిరుగుతూ సీజనల్ వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. 9వ వార్డులో వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ వానాకాలం దృష్ట్యా ఇంటిలో నిల్వ ఉన్న నీటిని ఎప్పటికప్పుడు తొలగించు కోవాలన్నారు. ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఎల్లం, పర్యావరణ అధికారి రవి కుమార్, వార్డు అధికారులు, మెప్మా రిసోర్స్పర్సన్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ -
రెండు రోజుల్లో కాలేజీకి రోడ్డు
హుస్నాబాద్రూరల్: పాలిటెక్నిక్ కాలేజీ రోడ్డును రెండు రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ‘కాలేజీకి రోడ్డు నిర్మించరూ..?’ అనే శీర్షికన సోమవారం సాక్షిలో వచ్చిన కథనానికి కలెక్టర్ స్పందించి పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులను పనుల వివరాల గురించి ఆరా తీశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీకి రోడ్డు సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. దీంతో డీఈ మహేశ్ ఆధ్వర్యంలో మంగళవారం పనులు ప్రారంభించారు. దరఖాస్తుల ఆహ్వానం గజ్వేల్రూరల్: మోడల్స్కూల్లో విద్యార్థులకు హిందీ బోధించేందుకు గెస్ట్ టీచర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ వన్నెస మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గంటల ప్రాతిపదికన బోధించేందుకు ఆసక్తికల అభ్యర్థులను గురువారం పాఠశాలలో డెమో, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారని తెలిపారు. ఉపాధ్యాయుల కృషి వల్లే.. కొండపాక(గజ్వేల్): ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కృషివల్లే విద్యార్థుల సంఖ్య పెరిగిందని మండల విద్యాధికారి బచ్చలి సత్తయ్య అన్నారు. కుకునూరుపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో 60 మంది విద్యార్థులు చేరడంపై హెచ్ఎం శ్రీనివాస్రెడ్డి, ఉపాధ్యాయులను మంగళవారం ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందన్నారు. అనంతరం విద్యార్థులకు డిక్షనరీలు అందజేశారు. కార్యక్రమంలో సీఆర్పీ సంతోష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పనులు పరిశీలించిన అదనపు కలెక్టర్
సిద్దిపేటజోన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ పరిశీలించారు. స్థానిక 43వ వార్డులో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు లక్ష్మి స్థలాన్ని మంగళవారం ఆమె పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. ఆమె వెంట మున్సిపల్ డీఈ ప్రేరణ, హౌసింగ్ అధికారి దివ్య, మున్సిపల్ అధికారి శ్రీనాథ్, వార్డు కౌన్సిలర్ పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు. ఇళ్లు రానివారు ఆందోళన చెందొద్దు ప్రశాంత్నగర్(సిద్దిపేట): లిస్టులో పేరు రానివారు ఆందోళన చెందవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి హరికృష్ణ, పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్లు అన్నారు. జిల్లా కేంద్రంలోని పలు కాలనీలలో ఇందిరమ్మ ఇళ్లకు మంగళవారం వారు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా డబుల్ బెడ్రూంలు రూం ఇస్తామని చెప్పి కాలయాపన చేశారన్నారు. నాయకుల సంక్షేమం తప్ప ప్రజల సంక్షేమం పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలలో కాంగ్రెస్ పార్టీపై నమ్మకం పెరిగిందని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కష్టపడుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో బొమ్మల యాదగిరి, ముద్దం లక్ష్మి, రియాజొద్దిన్, కలీమొద్దిన్, పయ్యావు ఎల్లం యాదవ్, మధు, నజ్జు, హర్షద్, వహాబ్, రజిని, సంతోష, సాయి, ప్రతాప్, రాకేశ్, రాజు, షాబొద్దిన్, మెరుగు రాజు తదితరులు పాల్గొన్నారు. అర్హులందరికీ ఇళ్లు దుబ్బాకటౌన్: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు బురాణి శ్రీకాంత్ అన్నారు. ధర్మాజీపేట వార్డులో ఇందిరమ్మ ఇంటి నిర్మాణకి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎప్పుడు లేనివిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు సొంతింటి కలను సాకారం చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఏఈ జాహ్నవి, వార్డు అధికారులు రమేశ్, మాజీ కౌన్సిలర్ స్వామి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
వైద్యులు ప్రజల ప్రాణాలు రక్షించే దేవుళ్లు
చేర్యాల(సిద్దిపేట): వైద్యులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజల ప్రాణాలను రక్షించే దేవుళ్లని సీఐ ఎల్.శ్రీను ప్రశంసించారు. వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం చేర్యాల డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. యశోద ఆస్పత్రి సౌజన్యంతో నిర్వహించిన ఉచిత వైద్య ప్రారంభించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా ముందు జాగ్రత్తగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. వైద్యులు తమ వ్యాపారం కోసమే కాకుండా ప్రజల ఆరోగ్యం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐ నీరేష్, పీఎస్ఐ సమత, ఎంఈఓ కిష్టయ్య, వైద్యులు శ్రీకాంత్, పరమేశ్వర్, సంతోష్కుమార్, రఘునందన్, సతీశ్, బాలకిషన్, శ్రీకాంత్, నాయకులు ఆగంరెడ్డి, కళావతి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. సీఐ శ్రీను -
తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు
అక్కన్నపేట(హుస్నాబాద్): మండల పరిధి పంతుల్తండా గ్రామ పరిధిలోని తారాచంద్తండాలో సోమవారం తాగునీటి కోసం గిరిజన మహిళలు రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాగునీరు అందించాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా ఎవరూ పట్టించుకోకపోవడంతో చేసేదిలేక ఆందోళనకు దిగాల్సి వచ్చిందన్నారు. వాగులో నీరులేకపోవడంతో ఉన్న బోరు నుంచి నీరు రావడంలేదన్నారు. మరోవైపు భగీరథ నీరు సరిగ్గా రాకపోవడంతో నిత్యం తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు.ఖాళీ బిందెలతో నిరసన -
పాశమైలారంలో భారీ పేలుడు ● మరుభూమిగా ఘటనా స్థలం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఉపాధి కోసం వస్తే ఏకంగా ఉసురే తీసేసింది సిగాచీ పరిశ్రమ. సోమవారం ఈ కంపెనీలో జరిగిన విస్ఫోటనం బతుకుదెరువుకోసం వలస వచ్చిన వారి జీవితాలను బుగ్గిపాలు చేసింది. పేలుడు ధాటికి దూరంగా ఎగిరిపడ్డ కార్మికుల మృతదేహాలతో..చిధ్రమైన శరీరభాగాలతో, కూలిన శిథిలాలతో సిగాచీ మరుభూమిని తలపించింది. తమ వారి ఆచూకీ కోసం బాధితుల ఆక్రందనలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం భీతిల్లింది. ఈ పారిశ్రామికవాడలో కార్మికుల కుటుంబాలు కోల్పోతున్నా పరిశ్రమ యాజమాన్యానికి మాత్రం సాధారణమేనని తరచూ జరిగే ప్రమాదాలు నిరూపిస్తూనే ఉన్నాయి. అనుభవాలు, ప్రమాద పాఠాల నుంచి యాజమాన్యాలు, ప్రభుత్వాలు గుణపాఠం నేర్వవని మరోసారి ఈ ప్రమాదంతో రుజువైంది. సోమవారం ఉదయం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటన ఆ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. పారిశ్రామిక వాడలో విషాదం ఉదయమే తమ ఇంటి నుంచి ఉద్యోగానికి వెళ్లిన కొద్ది సేపటికే ప్రమాదం జరిగినట్లు సమాచారం తెలుసుకున్న బాధిత కార్మికుల కుటుంబసభ్యుల ఆవేదన అంతా ఇంతా కాదు. కుటుంబసభ్యుల ఆచూకీ లభించకపోవడంతో కార్మికుల కుటుంబసభ్యుల ఆక్రందనలు మిన్నంటాయి. తమ వారు ఏమయ్యారో తెలియకపోవడంతో వారు అధికారుల చుట్టూ తిరిగారు. అక్కడి నుంచి స్పందన లేకపోవడంతో కన్నీరు మున్నీరయ్యారు. దీంతో పాశమైలారం పారిశ్రామికవాడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన బాధిత కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. కాలినగాయాలతో బాధపడుతున్న తమ ఆత్మీయులను చూసి బోరున విలపించారు. కళ్లముందే విగత జీవులుగా మారిన తమ వారిని చూసి కన్నీరు మున్నీరుగా రోదించారు. తమ వారి జాడ ఎక్కడైనా లభిస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు.వారంతా రోజు మాదిరిగానే విధుల్లోకి వచ్చారు. తమ తోటి కార్మికులు, ఉద్యోగులకు శుభోదయం చెప్పుకున్నారు. అప్పుడప్పుడే ఎవరికివారు తాము పని చేసే స్థలాల్లో నిమగ్నమవుతున్నారు. ఒక్కసారిగా మృత్యువు పేలుడు రూపంలో కబళించింది. ఉన్నపళంగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. పొగ పూర్తిగా కమ్ముకోవడంతో చుట్టూ చీకటి. అగ్నికీలలకు దేహాలు ఆహుతైపోయాయి. శరీరభాగాలకు మంటలు అంటుకున్నాయి. మరికొందరి శరీరాలు మాడి మసైపోయాయి. ఎటు చూసినా హాహాకారాలు. ప్రమాదం నుంచి బయటపడేందుకు ఆర్తనాదాలు.. సిగాచీ పరిశ్రమల్లో రియాక్టర్ పేలిన ఘటనకు సంబంధించి భీతావహ వాతావరణం ఇది. ఎక్కడపడితే అక్కడ కార్మికుల శవాలు. కాలి బూడిదై.. మసైపోయిన శరీర భాగాలు. ఇలా పేలుడు జరిగిన ప్రదేశం పూర్తిగా మరుభూమిని తలపించింది.సిగాచీ పరిశ్రమ ఎదుట భీతావహం తమ వారి ఆచూకీ కోసం విలపించిన బాధిత కుటుంబ సభ్యులుఉపాధి కోసం వచ్చి అనంత లోకాలకు.. వారంతా పొట్ట చేతబట్టుకుని వచ్చిన నిరుపేద కుటుంబాలే. ఉపాధి కోసం వందల కిలోమీటర్లు నుంచి వచ్చిన కార్మికులే అధికం. బిహార్, ఛత్తీస్గఢ్, ఒడిశా వంటి రాష్ట్రాల నుంచి భార్యాబిడ్డలతో వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. చాలీ చాలని జీతాలున్నప్పటికీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఈ కార్మికుల కుటుంబాల్లో ఈ పేలుడు ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. పొట్ట చేతబట్టుకుని వచ్చిన తమ వారిని మృత్యువు కబళించడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఉపాధి కోసం వస్తే ఉసురే పోయిందని విలపిస్తున్నారు. ఘటన జరిగి గంటలు గడుస్తున్నా తమ వారి ఆచూకీ లభించకపోవడంతో వారు తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. -
యాజమాన్య నిర్లక్ష్యంతోనే ప్రమాదం
పటాన్చెరు టౌన్: యాజమాన్యం నిర్లక్ష్యం..ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు తూతూ మంత్రంగా చేపట్టే తనిఖీల మూలంగానే సిగాచి ఫార్మా పరిశ్రమలో పేలుడు ఘటన చోటుచేసుకుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన ప్రతీ కార్మికుడి కుటుంబానికి రూ.కోటి, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, క్షతగాత్రలకు మెరుగైన వైద్యంతోపాటు రూ.50లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. పటాన్చెరు నియోజకవర్గ పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో సోమవారం ఉదయం రియాక్టర్ పేలుడు జరిగిన విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఘటనాస్థలికి ఎమ్మెల్యే గూడెం చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా డీఐజి ఇక్బాల్, కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోశ్ పంకజ్తో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... 30 ఏళ్లుగా పరిశ్రమ నడిపిస్తున్న సిగాచి యాజమాన్యం ఎన్నడూ కార్మికుల భద్రత కోసం చర్యలు తీసుకోలేదన్నారు. గతంలో కూడా ఇదే పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి పెద్ద సంఖ్యలో మృతి చెందారని గుర్తు చేశారు. ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సిన పరిశ్రమల తనిఖీల విభాగం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కార్మికుల భద్రతను గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించి పూర్తిస్థాయిలో విచారణ జరిపించి..ఘటనకు కారకులైన యాజమాన్యం, నిర్లక్ష్యం వహించిన పరిశ్రమ విభాగం అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి, క్షతగాత్రులకు రూ.50 లక్షలపరిహారం ఇవ్వాలి ఒకరికి ఉద్యోగం కల్పించాలి అధికారులతో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గూడెం -
పోలీసుల ఓవరాక్షన్
బాధిత కుటుంబాల పట్ల దురుసు ప్రవర్తన పటాన్చెరు: ‘నా భర్త ఎక్కడ’అంటూ కొందరు మహిళలు గుండలవిసేలా విలపించారు. ఓ మహిళ మాట్లాడుతూ తన భర్త పేరు ఆస్పత్రిలో చేరిన వారి జాబితాలో లేదు. చనిపోయిన వారి జాబితాలో కూడా లేదని చెబుతున్నారు. మరి ఎక్కడున్నారు..? చెప్పాలి అంటూ బాధితులు తమ వారి ఆచూకీ కోసం కలియదిరుగుతుంటే లోపలికి రాకూడదంటూ పోలీసులు వారి పట్ల అమానవీయంగా దురుసుగా వ్యవహరించారు. అనిత, సంజీవ్లాల్ అనే మహిళలు పోలీసులతో వాదిస్తూ పోలీసులపై రాయి ఎత్తి పట్టి తిట్టిపోశారు. ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిన మావాళ్లు ఇంటికి తిరిగి రాలేదు. పొద్దున్నుంచి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నా..అని ఓ మహిళ వాపోయింది. పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన విస్ఫోటనంలో చనిపోయిన, గాయపడిన వారి కుటుంబీకుల పరిస్థితి ఇది. -
అప్పుడే మేల్కొనుంటే..
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: గతేడాది మార్చిలో సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్లో ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలి ఆరుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. ఈ పేలుడు ధాటికి చుట్టుపక్కల భవనాలు సైతం శిథిలమయ్యాయి. ఈ ఘటనలో అమాయక కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోగా 30 మంది క్షతగాత్రులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ భారీ ఘటనతోనైనా సంబంధిత అధికారులు మేల్కొని ఉంటే..ఇప్పుడు ఇలా సిగాచీ పరిశ్రమలో భారీ పేలుడు ఘటన పునరావృతం అయ్యేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎస్బీ ఆర్గానిక్స్ ప్రమాదం జరిగినప్పుడు అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. కార్మికుల భద్రత విషయంలో ఎలాంటి ప్రమాణాలు పాటించాలి..ఎలాంటి భద్రతాపరమైన చర్యలు చేపట్టాలనే దానిపై కమిటీ నివేదిక ఇచ్చింది. అయితే ఈ కనీసం నిబంధనలు పాటించకపోవడంతో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. కీలకపని ప్రదేశాల్లో స్కిల్డ్ లేబర్ లేక.. పరిశ్రమల్లో కీలక పని ప్రదేశాల్లో స్కిల్డ్ లేబర్తో పనిచేయించాలి. ముఖ్యంగా రియాక్టర్లు, బాయిలర్లు, బ్లోయర్లు, ఇలా ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సంబంధిత అంశాల్లో అన్ని అర్హతలున్నవారికి విధులను అప్పగించాలి. కానీ, తక్కువ వేతనాలకు పనిచేస్తారనే కారణంగా ఇలాంటి కీలక ప్రదేశాల్లో అన్స్కిల్డ్ కార్మికులతో పనులు చేయించడంతో ఇలాంటి ప్రమాదాలకు దారితీస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాసులకు కక్కుర్తి పడుతున్న పరిశ్రమల యాజమాన్యాలు ఇలా కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాక్టరీల ఇన్స్పెక్టర్ల తనిఖీలు ఏవీ.. పరిశ్రమల్లో కనీస భద్రతా ప్రమాణాలను పాటించేలా ఫ్యాక్టరీల ఇన్స్పెక్టర్లు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి. కానీ, ఈ తనిఖీలు జిల్లాలో మొక్కుబడిగా జరుగుతున్నాయనే విమర్శలున్నాయి. ఆయా పరిశ్రమల నుంచి ప్రతినెలా ఠంఛనుగా మామూళ్లు పొందుతున్న ఈ శాఖ అధికారులు పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను పాటించకపోయినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎస్బీ ఆర్గానిక్ పరిశ్రమ ప్రమాదానికి కొద్దిరోజుల ముందే ఇదే హత్నూర మండలంలో కోవాలెంట్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. ఇలా తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నప్పటికీ.. సంబంధిత అధికారుల్లో కనీసం చలనం లేకుండా పోయింది. ప్రమాదం జరిగాక హడావుడి సంబంధిత అధికారులు ఇలా ప్రమాదం జరిగాక హడావుడి చేస్తున్నారే తప్ప ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు తీసుకుంటున్న చర్యలు శూన్యమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. ఇందుకు ఎస్బీఆర్గానిక్స్ భారీ పేలుడు ఘటన జరిగిన కొన్ని రోజులకే ఇప్పుడు సిగాచీ పరిశ్రమలో అంతకుమించి భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రభుత్వం ఇకనైనా స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని, పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా నిబంధనలను అమలు చేయాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. నాడు ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలి ఆరుగురు మృతి.. ఇదే తరహాలో ఇప్పుడు సిగాచీ పరిశ్రమలో ఘటన.. -
ఉద్యమకారుల శాంతియుత దీక్ష
చేర్యాల(సిద్దిపేట): తెలంగాణ ఉద్యమకారులు శాంతియుత దీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక అంబేడ్కర్ కూడలి వద్ద దీక్షకు దిగారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యమకారులు మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని చెప్పిన సీఎం రేవంత్రెడ్డి.. ఇప్పటి వరకు హామీలు అమలు చేయకపోవడం దారుణమన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ఉద్యమకారుల గుర్తించి, ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.10లక్షలు, ప్రతి నెల రూ.25వేల పెన్షన్, ఉచిత వైద్యం, బస్పాస్, గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. దీక్షలను పరిరక్షణ కమిటీ కన్వీనర్ పందిళ్ళ నర్సయ్య నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. దీక్షలో ఉద్యమకారులు అంబటి నర్సయ్య, ఆడెపు వెంకయ్య, అంబటి అంజయ్య, అందె అశోక్, బండోజు భాస్కర్, ఎండీ.జహురద్దీన్, సంజీవరెడ్డి, మంగోలు చంటి, మంచాల కొండయ్య పాల్గొనగా వివిధ పార్టీలు, సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.హామీలు నెరవేర్చాలని డిమాండ్ -
అంధకారంలో డబుల్బెడ్రూంలు
వీధిలైట్లు వెలగక చిమ్మచీకట్లో డబుల్ బెడ్రూం కాలనీ● కాలనీల్లో చిమ్మచీకట్లు ● వెలుగని వీధిలైట్లు ● ఎవరికీ పట్టడంలేదంటూ ప్రజల ఆవేదన దుబ్బాక: పట్టణంలోని డబుల్ బెడ్రూం కాలనీల్లో వీధిలైట్లు వెలగక చిమ్మచీకట్లు అలుముకున్నాయి. కొన్ని రోజులుగా అంధాకారం నెలకొంటున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. పట్టణంలోని బల్వంతాపూర్ రోడ్డులో నిర్మించిన 850 డబుల్ బెడ్రూంలలో నివసించే ప్రజలు సవాలక్ష సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాలనీలోని 60, 61, 62 బ్లాక్లలో వీధిలైట్లు వెలుగక పోవడంతో చాలరోజులుగా రాత్రి అయ్యిందంటే చాలు ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. కొన్ని బ్లాక్లలో వీధిలైట్లు రాత్రి, పగళ్లు నిరంతరం వెలుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.ఇప్పటికై న సంభందిత అధికారులు దృష్టి సారించి అంధకారంలో ఉన్న కాలనీల్లో వీధిలైట్లకు మరమ్మతులు చేయాలని డబు ల్ బెడ్రూం కాలనీ వాసులు కోరుతున్నారు. -
మెరుగుబడినాయ్..
సిద్దిపేట పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలప్రభుత్వ పాఠశాలల పనితీరు మెరుగు ● కేంద్ర విద్యా శాఖ తాజా నివేదిక విడుదల ● రాష్ట్రంలో సిద్దిపేటకు 4వ, సంగారెడ్డికి 8, మెదక్కు 25వ ర్యాంక్ అభ్యసన ఫలితాలు, చదువుల నాణ్యత, మౌలిక వసతులు, డిజిటల్ లెర్నింగ్, అందుబాటులో బడులు–పిల్లల రక్షణ, విద్యాపరిపాలన విభాగాల్లో 74 సూచికలను పరిగణనలోకి తీసుకుని 600 మార్కులకు గ్రేడింగ్ ఇచ్చారు. వీటిలో వచ్చిన మార్కుల ఆధారంగా 2023–24లో రాష్ట్రంలో సిద్దిపేట 276 మార్కులతో 4వ, సంగారెడ్డి 268 మార్కులతో 8వ, మెదక్ 244 మార్కులతో 25వ ర్యాంక్లు సాధించాయి. 2022–23లో ప్రశిష్ట మూడవ కేటగిరిలో ఉండగా 2023–24లో రెండవ కేటగిరిలోకి అప్గ్రేడ్ అయ్యాయి. డిజిటల్ లెర్నింగ్లో వెనుకబాటు డిజిటల్ లెర్నింగ్లో ప్రభుత్వ బడులు వెనుకబాటులో ఉన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నాయి. పలు పాఠశాలల్లో కంప్యూటర్లు ఉన్నప్పటికీ ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. పలు పాఠశాలలో డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేసి బోధిస్తున్నారు. పాఠ్యంశాలు డిజిటల్ బోధన అందడం లేదు. సిద్దిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ప్రత్యేక చొరవతో ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ బోధన అందిస్తున్నారు. పదో తరగతి విద్యార్థులకు పలు పాఠ్యంశాలు క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయగానే కళ్ల ముందు కదలాడుతూ బోధిస్తుంది. ఇలా విద్యా వ్యవస్థల్లో మార్పులు తీసుకవస్తే మరింత మెరుగుపడే అవకాశాలున్నాయి. అభ్యసన ఫలితాలు గతంతో పోలిస్తే మెరుగుపడి సిద్దిపేట, సంగారెడ్డి వంద మార్కులు దాటాయి. మెదక్ జిల్లా వందలోపే మార్కులు వచ్చాయి. బడులు అందుబాటులో లేక.. అందుబాటులో బడులు– పిల్లల రక్షణ విభాగంలోనూ ఉమ్మడి మెదక్ జిల్లా వెనుకబడ్డాయి. పలు చోట్ల ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేకపోవడంతో దాదాపు రెండు నుంచి ఐదు కిలో మీటర్లు వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఆ కేటగిరిలో 35 మార్కులకు గాను మెదక్ జిల్లాకు 9, సిద్దిపేటకు 15, సంగారెడ్డికి 14 మార్కులు వచ్చాయి. ప్రభుత్వ బడులను బలోపేతం చేయటంలో ఈ రెండు విభాగాలు కీలకమవటంతో వీటిల్లో మెరుగైన ఫలితాలు సాధించే విధంగా జిల్లా యంత్రాంగాలు కృషి చేయాల్సిన అవసరం ఉంది.ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పనితీరు గతంతో పోలిస్తే మెరుగుపడింది. కేంద్ర విద్యాశాఖ 2023–24 పెర్ఫార్మింగ్ గ్రేడ్ ఇండక్స్(పీజీఐ) నివేదికను ఇటీవల విడుదల చేసింది. దీని ప్రకారం 2022–23 కంటే పుంజుకున్నాయి. సర్కారు బడులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. దీంతో మెరుగు పడుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 3,105 ప్రభుత్వ పాఠశాలలో 1.80లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. – సాక్షి, సిద్దిపేట2023–24లో మార్కులు ఇలా.. జిల్లా అభ్యసన చదువుల మౌలిక డిజిటల్ అందుబాటులో విద్యా పరిపాలన ఫలితాలు నాణ్యత వసతులు లెర్నింగ్ బడులు–పిల్లల రక్షణమెదక్ 97 43 29 10 09 56 సిద్దిపేట 110 51 29 16 15 55 సంగారెడ్డి 120 43 28 11 14 53 -
సివిల్స్కు ఉచిత శిక్షణ
సిద్దిపేట ఎడ్యుకేషన్: హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టీఎస్ ఎస్సీ స్టడీ సర్కిల్లో సివిల్స్కు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సిద్దిపేట వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీకాంత్ లు తెలిపారు. ఉచిత సివిల్స్ శిక్షణకు సంబంధించిన కరపత్రాన్ని ఆదివారం సిద్దిపేటలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సీటీ కళాశాల ఆవరణలో ఆవిష్కరించి మాట్లాడారు. సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు జూలై 7 లోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జులై 13 న ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించి అందులో వచ్చిన మెరిట్ ఆధారంగా 100 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారని తెలిపారు. ఎస్సీ లకు 75, ఎస్టీలకు 10 , బీసీలకు 15 శాతం సీట్లు, ఇందులో మహిళలకు 33 శాతం, పీడబ్ల్యూడీ వారికి 5 శాతం సీట్లు కేటాయిస్తారని తెలిపారు. దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలన్నారు. వారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3 లక్షలు మించరాదన్నారు. ఎంపికై న అభ్యర్థులకు 10 నెలల పాటు ఉచిత వసతితో కూడిన శిక్షణ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు నరేష్, మహేష్, రవికిరణ్, రాజేష్, సంజీవ్, వెంకటేశ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరపత్రాల ఆవిష్కరణ -
మల్లన్న ఆలయంలో భక్తుల సందడి
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. క్షేత్రానికి చేరుకున్న భక్తులు పుష్కరిణిలో స్నానమాచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం గంగిరేణి చెట్టుకు ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. కొంతమంది భక్తులు కొండపైన ఉన్న రేణుక ఎల్లమ్మకు బోనాలు సమర్పించారు. ఏర్పాట్లను ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు.హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలో చేరండిమంత్రి పొన్నం ప్రభాకర్హుస్నాబాద్: ఇంజనీరింగ్ కళాశాలలో అడ్మిషన్లకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలలో బీటెక్ ఈసీఈ, సీఎస్ఈ, ఐటీ, ఏఐ కోర్సులు ప్రతీ విభాగంలో 60 సీట్లకు గాను మొత్తం 240 సీట్లు మంజూరు అయ్యాయన్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. మొదటి సంవత్సరం ప్రారంభమవుతున్న కళాశాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. విద్యార్థులు కౌన్సెలింగ్లో ప్రథ మ ప్రాధాన్యతగా హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలకు ఆప్షన్ ఇవ్వాలని మంత్రి కోరారు.ఇందిరమ్మ ఇళ్ల పనులు ప్రారంభంగజ్వేల్: మండలంలో ఇందిరమ్మ ఇళ్ల పనులు ప్రారంభమయ్యాయి. అక్కారం, బెజుగామ, పిడిచెడ్, ఆహ్మదీపూర్, శేర్పల్లి, కొల్గూర్, అనంతరావుపల్లి, దాచారం, బూర్గుపల్లి తదితర గ్రామాల్లో ఆదివారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పనులను త్వరగా పూర్తి చేసి, గృహ ప్రవేశాలకు సిద్ధం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.ముగిసిన పాలిసెట్ కౌన్సెలింగ్నంగునూరు(సిద్దిపేట): పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశం కోసం నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న పాలిసెట్ కౌన్సెలింగ్ ముగిసిందని రాజగోపాల్పేట కళాశాల ప్రిన్సిపాల్ గోవర్ధన్ చెప్పారు. ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఇంజనీరింగ్ డిప్లొమా ప్రవేశం కోసం నిర్వహించిన సర్టిఫికెట్ల పరీశీలనకు ఇప్పటి వరకు 700 మంది హాజరయ్యారన్నారు. విద్యార్థులకు ఐడీ, పాస్వర్డు అందజేశామని తెలిపారు. ఆన్లైన్లో వెబ్ ఆప్షన్లు పెట్టుకునేలా అవగాహన కల్పించామన్నారు. కౌన్సెలింగ్లో అభినవ్, షెహబాజ్, రాజు, రామకృష్ణ, శ్రీనివాస్రెడ్డి, కవిత, శ్రీనివాస్, విజయ్కుమా ర్, రాజమౌళి, మధుబాబు పాల్గొన్నారు. -
3వ రోజుకు చేరిన సైకిల్యాత్ర
గజ్వేల్రూరల్: హుస్నాబాద్ పేరును భార్గవపురంగా మార్చాలని సామాజిక ఉద్యమకారుడు పిడిశెట్టి రాజు కోరారు. ఈ మేరకు చేపట్టిన సైకిల్యాత్ర 3వ రోజు గజ్వేల్కు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకతీయుల కాలంలో తమ గ్రామం పేరు భార్గవపురంగా ఉండేదని, శ్రీరేణుకాదేవి(ఎల్లమ్మతల్లి) కుమారుడైన భార్గవరాముడు(పర్శరాముడు) పేరున భార్గవపురం అని పేరు వచ్చినట్లు తెలిపారు. నిజాంల కాలంలో గ్రామం పేరును హుస్నాబాద్గా మార్చారని, గ్రామ మూలాలు మరచిపోకుండా ఉండాలనేదే తమ ఉద్దేశమన్నారు. పేరు మార్చాలని కోరుతూ సీఎం రేవంత్రెడ్డికి వినతిపత్రం ఇచ్చే వరకు సైకిల్యాత్ర కొనసాగించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
కరవు జిల్లాగా ప్రకటించాలి
సిద్దిపేటఅర్బన్: జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కార్మిక, కర్షక భవన్లో సీపీఎం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా చుక్క రాములు హాజరై మాట్లాడారు. సాగు చేసే సమయంలో వర్షాలు కురవకపోవడంతో విత్తనాలు మొలవక రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉందన్నారు. జిల్లాలోని ప్రాజెక్టులు, కుంటలు, చెరువులు ఎండిపోయి సాగు, తాగు నీరు లేక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే జిల్లాను యూనిట్గా తీసుకొని కరవు జిల్లాగా ప్రకటించాలని కోరారు. కరవు నివారణ చర్యలు చేపట్టి నష్ట పరిహారం అందించాలన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో అవకతవకలు జరుగుతున్నాయని, పథకాలను పారదర్శకంగా అమలు చేసి నిరుపేదలకు సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, కార్యదర్శి వర్గ సభ్యులు గోపాలస్వామి, శశిధర్, ఎల్లయ్య, సత్తిరెడ్డి, భాస్కర్, జిల్లా కమిటీ సభ్యులు వెంకట్, యాదగిరి, రవికుమార్, బాలనర్సయ్య, అరుణ్, శ్రీనివాస్, రవీందర్, శారద, శిరీష, కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చుక్కా రాములు -
దరఖాస్తుల ఆహ్వానం
బీసీ సంక్షేమ శాఖ అధికారి నాగరాజమ్మ ప్రశాంత్నగర్(సిద్దిపేట): వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా సివిల్ సర్వీసెస్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఇవ్వనున్నట్లు, అందుకు దరఖాస్తులను అహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి నాగరాజమ్మ తెలిపారు. హైదరాబాద్లోని బీసీ స్టడీ సర్కిల్లో ఈ శిక్షణ తరగతులు జూలై 27 నుంచి అందించనున్నట్లు చెప్పారు. ఆసక్తి కల్గిన అభ్యర్థులు జూలై 7 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. జూలై 12న నిర్వహించే ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తులు చేసుకోండిప్రశాంత్నగర్(సిద్దిపేట): 2025 సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఆసక్తి కలిగిన ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్, ఆదర్శ, కేజీబీవీలు, గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు జూలై 13లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు చేసిన ఫారంలను జూలై 15లోగా జిల్లా విద్యాశాఖ అధాకారి కార్యాలయంలో అందించాలన్నారు. లక్కీ డ్రా పద్ధతిలో సీట్ల ఎంపిక...సిద్దిపేటరూరల్: 2025–26 విద్యా సంవత్సరానికి గాను బెస్ట్ అవైలబుల్ ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న వారిని విద్యార్థుల ఎంపిక డ్రా నిర్వహించారు. శనివారం కలెక్టరేట్లో జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం ద్వారా షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు ఎంపిక చేసిన ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్యను అందిస్తామన్నారు. విద్యార్థులను డ్రా పద్ధతిలో ఎంపిక చేస్తామని, వారిని సిద్దిపేట, గజ్వేల్, ప్రజ్ఞాపూర్లలోని ఎంపిక చేసిన స్కూల్లలో వసతితో కూడిన ఉచిత విద్యను అందిస్తామని ఆమె వివరించారు. ఒకటో తరగతికి 225 మంది దరఖాస్తు చేసుకోగా.. 87 విద్యార్ధులను ఎంపిక చేశారు. 5 తరగతికి 132 విద్యార్ధులకుగాను 89 మంది విద్యార్థులను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి కవిత, డీఈఓ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయికి 20మంది ఎంపికసిద్దిపేటజోన్: జూలై 1 ,2వ తేదీల్లో హకీంపేట క్రీడాపాఠశాల రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలకు సిద్దిపేట జిల్లా నుంచి 18 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ మేరకు శనివారం జిల్లా క్రీడల శాఖ అధికారి వెంకట్ నర్సయ్య వివరాలు వెల్లడించారు. ఈనెల 24న సిద్దిపేట గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో క్రీడా పాఠశాలల్లో నాల్గవ తరగతిలో ప్రవేశాల కోసం జిల్లా స్థాయిలో ఎంపిక నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఉత్తమ ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర స్థాయి ఎంపిక చేసినట్టు తెలిపారు. బాలుర విభాగంలో ఆత్రేయ, రేవంత్ నాయక్, విశ్వాన్, శ్రేయన్, అక్షిత్, అభినవ్, చరణ్, సుస్వాంత్, రక్షిత్ కుమార్, మనిత్లు బాలికల విభాగంలో ప్రనిషి, వేద సహిత, దేవాన్సీ, హర్షిత, గాయత్రి, రష్మిత, చరిష్మా, కృతికలు ఎంపికయ్యారన్నారు. ఎంపిక అయిన వారు జూలై ఒకటిన ఉదయం10 గంటలకు స్టేడియం ప్రాంగణంలో సంబంధించిన పత్రాలతో హాజరుకావాలని సూచించారు. ఇంజినీరింగ్లో ఉచిత శిక్షణ గజ్వేల్రూరల్: సత్యసాయి స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో డేటా ఇంజినీర్ కోర్సులో యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు భగవాన్ శ్రీసత్యసాయి సేవా సంస్థ ప్రతినిధులు తెలిపారు. గజ్వేల్లో శనివారం వారు మాట్లాడుతూ 2022–2025 మధ్య బీఎస్సీ, ఎమ్మెస్సీ, బీ టెక్, ఎంటెక్ లేదా ఎంసీఏ పూర్తి చేసిన వారు ఈ శిక్షణలో పాల్గొనేందుకు అర్హులన్నారు. ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్లో ని సత్యసాయి స్కిల్ సెంటర్లో బేసిక్, అడ్వా న్స్డ్ పైథాన్, ఎస్క్యూఎల్, బీఐ టూల్స్తో పాటు సాఫ్ట్ స్కిల్స్లో 90 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ పొందిన వారికి ఉద్యోగాలు కల్పించడంలో సహకారం ఉంటుందని చెప్పారు. ఆసక్తి గలవారు 4లోగా www.rethu.aiలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 90523 72023 నంబరులో సంప్రదించాలని సూచించారు. -
ఇన్చార్జీల పాలన ఇంకెన్నాళ్లు..?
మల్లన్న ఆలయంలో రెగ్యులర్ ఈవో ఎక్కడ..? ● వారంలో ఒకటి, రెండూ రోజులు మాత్రమే ఆలయానికి.. ● ఏడాదికి రూ.20 కోట్లకుపైగా ఆదాయం ● అయినా.. భక్తుల ఇబ్బందులు పట్టవా..?కొమురవెల్లి(సిద్దిపేట): తెలంగాణతో ప్రసిద్ధి చెందిన కొమురవెల్లి మల్లికార్జున స్వామి రెగ్యులర్ ఈవో నియామకం కలగానే మిగిలిపోయింది. డిప్యూటీ కమిషనర్ క్యాడర్ కలిగిన ఆలయానికి అసిస్టెంట్ కమిషనర్లకు ఇన్చార్జీలు ఇచ్చి దేవాదా య శాఖ కాలం వెళ్లదీస్తోంది. 2020లో ఈవో వెంకటేశ్ బదిలీపై వెళ్లగా హైదరాబాద్ అసిస్టెంట్ కమిషనర్గా పని చేస్తున్న బాలాజీకి మల్లన్న ఆలయానికి ఇన్చార్జి ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. బాలాజీ 2024 డిసెంబర్లో పదవీ విరమణ పొంవడంతో హైదరాబాద్ దేవాదాయశాఖ కార్యాలయంలో గెజిటెడ్ సూపరింటెండెంట్గా పని చేస్తున్న రామాంజనేయులుకు మల్లన్న ఆలయ ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. 2025 ఏప్రిల్లో రామాంజనేయులు అదనపు బాధ్యతలు తొలగించి హైదరాబాద్లో చిక్కడపల్లి వెంకటేశ్వర్ల స్వామి ఆలయ ఈవో అన్నపూర్ణకు కొమురవెల్లి మల్లన్న ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ఇన్చార్జిగా ఈవోలుగా నియమితులైనవారు బహుముఖ బాధ్యతలు నిర్వహించలేక సతమతం అవుతున్నారు. వారంలో ఒకటి, రెండు రోజులు మత్రమే ఆలయానికి రావడంతో ఆలయంలో అభివృద్ధి పనులు కుంటు పడి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన దేవాలయం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం ప్రతి యేటా స్వామి వారిని సుమారు రూ.కోటికిపై భక్తులు దర్శించుకుంటారు. ఎక్కడా లేని విధంగా స్వామి వారి బ్రహ్మోత్సవాలు నాలుగు నెలల పాటు కొనసాగుతాయి, దీంతో స్వామి వారికి సంవత్సరానికి సుమారు రూ.20 కోట్లకు పైగానే ఆదాయం వస్తుంది. ఇంతటి ప్రాధాన్యత గల ఆలయానికి రెగ్యులర్ ఈవో లేకపోవడం దురదృష్టకరమని భక్తులు వాపోతున్నారు. తమ సమస్యలు పరిష్కరించే నాథుడే లేడని అంటున్నారు. -
ప్రతిభకు పురస్కారం
సిద్దిపేటఅర్బన్: సీబీఎస్ఈ పదవ తరగతి ఫలితాల్లో హైదరాబాద్ రీజియన్ స్థాయిలో సిద్దిపేట కేంద్రీయ విద్యాలయం 5వ స్థానంలో నిలిచింది. 74 పాఠశాలలకు గాను సిద్దిపేట కేంద్రీయ విద్యాలయం ఐదో స్థానం దక్కించుకుంది. ఈ మేరకు శనివారం హైదరాబాద్లో నిర్వహించిన ప్రిన్సిపాళ్ల సమ్మేళనంలో పాఠశాల ప్రిన్సిపాల్ సూర్యప్రకాశ్ కేంద్రీయ విద్యాలయ సమితి కమిషనర్ విధి పాండే చేతులు మీదుగా బహుమతి, ప్రశంసాపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సూర్యప్రకాశ్ మాట్లాడుతూ ఈ అవార్డు వెనుక సిద్దిపేట కేంద్రీయ విద్యాలయం నిలవడంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కృషి ఎంతో ఉందన్నారు. అలాగే ఈ విద్యాసంవత్సరం 9వ తరగతిలో ఒక సీటు, పదవ తరగతిలో ఏడు సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. జూలై 10వ తేదీలోగా అర్హత కలిగిన విద్యార్థులు దరఖా స్తు చేసుకోవాలని, కేంద్రీయ విద్యాలయ మార్గదర్శకాల మేరకు సీట్లు భర్తీ చేస్తామని తెలిపారు.కేంద్రీయ విద్యాలయానికి 5వ స్థానం -
గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసిందే కాంగ్రెస్
● గౌరవెల్లిని 95శాతం పూర్తి చేశాం ● నిర్వాసితులను మోసం చేసిన పొన్నం ● మాజీ ఎమ్మెల్యే సతీష్కుమార్ ధ్వజంహుస్నాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గౌరవెల్లి ప్రాజెక్టు 95 శాతం పూర్తి చేశామని, ప్రాజెక్టును అడ్డుకోవడానికి గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసిందే కాంగ్రెస్ నాయకులని మాజీ ఎమ్మెల్యే సతీష్కుమార అన్నారు. శనివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. నలుగురు మంత్రుల పర్యటనలో అవాకులు, చెవాకులు, ఉపన్యాసాలే తప్పఈ ప్రాంతానికి ఒరగబెట్టిందేమీ లేదన్నారు. తాము మంజూరు చేసిన పనులకు శంకుస్ధాపనలు చేయడం గొప్పనా అని ప్రశ్నించారు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు ఎకరాకు రూ.30 లక్షలు ఇప్పిస్తానని హామీ ఇచ్చిన పొన్నం ప్రభాకర్.. మంత్రి అయిన తర్వాత రూ.17 లక్షలు ఇచ్చి నిర్వాసితులను నిండా మోసం చేశారని మండిపడ్డారు. మెడికల్ కళాశాల ఏర్పాటు చేయకుండా పీజీ మెడికల్ కళాశాల ఏలా సాధ్యమని ప్రశ్నించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, బాలికల జూనియర్ కళాశాల, మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్ర భవనం, సమీకృత కార్యాలయాల భవనం, పాలిటెక్నిక్ కళాశాల, ఏసీపీ కార్యాలయం తమ హయాంలో పూర్తి చేశామన్నారు. ఇంజనీరింగ్ కళాశాల తరగతుల నిర్వాహణకు తాము కట్టించిన పాలిటెక్నిక్ కళాశాల గతైందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఆస్పత్రి అంబులెన్స్ కోసం మంత్రి అనుచరుడు చందాలు వసూలు చేసిన డబ్బులు ఎక్కడున్నాయ ని ప్రశ్నించారు. ఈ సమావేశంలో హన్మకొండ మాజీ జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
లక్ష్యాలను సాధించాలి
సిద్దిపేటరూరల్: నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి అధికారులు జిల్లాను మొదటి స్థానంలో నిలబెట్టాలని కలెక్టర్ కే.హైమవతి అధికారులను ఆదేశించారు. శనివారం వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక, మత్స్య శాఖల అధికారులతో సమీక్షించారు. వారికి కేటాయించిన లక్ష్యాలపై సమాలోచన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని శాఖలు వారికి నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఆయిల్పాం సాగు పెరిగేలా రైతులను ప్రోత్సహించడం, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, క్షేత్రస్థాయిలో సిబ్బంది పనులను అధికారులు పర్యవేక్షించాలని కోరారు. మండల స్థాయిలో పెండింగ్లో ఉన్న పనులను జూలై 15వ తేదీ లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలలో రైతులను ప్రోత్సహించాలని కోరారు. చివరగా ఉద్యాన దర్శిని పుస్తకాన్ని కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, డీఏఓ రాధిక, ఉద్యాన శాఖ అధికారి సువర్ణ, మత్స్య శాఖ అధికారి మల్లేశం, పశుసంవర్ధక శాఖ అధికారి కొండల్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి మొక్క బతకాలి వనమహోత్సవ లక్ష్యాన్ని అధికారులు తప్పనిసరిగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా గ్రామపంచాయతీ, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వనమహోత్సవం కార్యక్రమాన్ని ముందస్తు కార్యాచరణతో లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా గుర్తించిన వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటాలన్నారు. సకాలంలో ఫర్టిలైజర్, నీటిని అందిస్తే మొక్కలు ఏపుగా పెరిగే ఆస్కారం ఉందన్నారు. పెట్టిన ప్రతి మొక్క బతకాలని, అధికారులు తరచూ పర్యవేక్షించాలని కోరారు. ఉద్యానవన శాఖలో 1,335 ఎకరాల లక్ష్యానికి గాను ఇప్పటికి 428 రైతుల నుంచి 748 ఎకరాల్లో పలు రకాల తోటల పెంచేందుకు సిద్ధం చేశారని, ఆగస్టు లోపు పూర్తి చేయాలన్నారు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా చూడవచ్చని, బహిరంగ ప్రదేశాలలో చెత్త, డ్రైనేజీలు పొంగడం లాంటిది ఉన్నట్లయితే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా, స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ–2025 గోడ పత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో సీఈవో రమేష్, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, డీపీఓ దేవకీదేవి, పంచాయతీ రాజ్ ఈఈ లు శ్రీనివాస్ రెడ్డి, చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు. ఆయిల్పామ్ రైతులకు ప్రోత్సాహం జూలై 15లోగా పెండింగ్ పనులు పూర్తి కలెక్టర్ కె.హైమావతి మాట్లాడుతున్న కలెక్టర్ హైమావతి -
కల్యాణలక్ష్మికి ‘గెజిటెడ్’ గ్రహణం
● సంతకాలు చేసేందుకు గెజిటెడ్ అధికారుల నిరాసక్తత ● కార్యాలయాల చుట్టూ లబ్ధిదారుల ప్రదక్షిణలుమిరుదొడ్డి(దుబ్బాక): కల్యాణ లక్ష్మి పథకానికి దరఖాస్తులు చేసుకుంటున్న లబ్ధిదారులకు ఆదిలోనే హంసపాదెదురవుతోంది. అన్ని అర్హతలు కలిగిన పత్రాలను సమకూర్చినప్పటికీ వాటిని ధ్రువపర్చి సంతకాలు చేయాల్సిన గెజిటెడ్ అధికారులు ససేమిరా అంటున్నారు. దీంతో లబ్ధిదారులు నిరాశా నిస్పృహాలకు గురవుతున్నామని కల్యాణ లక్ష్మి బాధితుఉలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన మొగుళ్ళ ఐలవ్వ, మొగుళ్ల లక్ష్మి, భూపల్లి పద్మలు తమ తమ కూతుళ్లకు గత ఐదు నెలల క్రితం వివాహాలు జరిపించారు. కల్యాణ లక్ష్మి పథకం కోసం దరఖాస్తులు చేసుకుందామంటే గెజిటెడ్ అధికారులు సంతకాలు పెట్టకుండా తిప్పుకుంటున్నారని వాపోతున్నారు. క్షేత్ర స్థాయిలో అధికారులు పరిశీలన జరిపాక అర్హులుగా గుర్తించి సంతకాలు చేయాల్సిన గెజిటెడ్ అధికారులు ససేమిరా అంటుండటంతో నిత్యం కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరుగుతున్నామని బాధితులు వాపోతున్నారు. కాగా జిల్లాలో కొన్ని సందర్భాల్లో కల్యాణ లక్ష్మి పథకాన్ని పక్కదారి పట్టించడంతో పలువురిపై కేసులు నయోదైనట్లు గుర్తించిన అధికారులు ధ్రువ పత్రాలపై సంతకాలు చేయడానికి గెజిటెడ్ అధికారులు వెనకంజ వేస్తున్నట్లు సమాచారం. -
పెండింగ్ కేసులపై సత్వర నిర్ణయం
సిద్దిపేటకమాన్: జిల్లాలో పెండింగ్లో ఉన్న కేసులలో పోలీసు శాఖ తగు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి అన్నారు. సిద్దిపేట జిల్లా కోర్టులో కలెక్టర్ హైమావతి, అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఏసీపీలతో శనివారం ఆమె సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోర్టులలో పెండింగ్ కేసులలో పోలీసు శాఖ తరపున తీసుకోవాల్సిన చర్యల గురించి తగు ఆదేశాలు జారీ చేశారు. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక కోర్టు భవనాల స్థల సేకరణపై జిల్లా కలెక్టర్తో చర్చించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో అడిషనల్ జిల్లా సీనియర్ జడ్జి జయప్రసాద్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఏసీపీలు రవీందర్రెడ్డి, సీఐలు వాసుదేవరావు, ఉపేందర్, విద్యాసాగర్, శ్రీను, సైదా, ఎస్ఐ రాజేష్ పాల్గొన్నారు.జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి -
బదిలీలు, పదోన్నతుల కోసం కృషి
వర్గల్(గజ్వేల్): ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించే సత్తా కలిగిన ఏకై క సంఘం పీఆర్టీయూ అని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి అన్నారు. శనివారం మండల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి అధ్యక్షతన వర్గల్ మండలం గౌరారం ఫంక్షన్హాల్లో చౌదరిపల్లి జెడ్పీహైస్కూల్ హెచ్ఎం ఇటిక్యాల వెంకట్రెడ్డి ఉద్యోగ విరమణ సభకు ఆయన హాజరయ్యారు. వెంకట్రెడ్డి దంపతులకు జ్ఞాపికను అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల ప్రయోజనాలే లక్ష్యంగా 50 సంవత్సరాలుగా పీఆర్టీయూ కృషి చేస్తుందని చెప్పారు. ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు ఇప్పిస్తామని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేసే విధంగా కృషి చేస్తామని, షరతులు లేకుండా అన్ని కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యం అందేలా హెల్త్ కార్డులు ఇప్పిస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీఈఓ శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుండు లక్ష్మణ్, దామోదర్రెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లుగారి ఇంద్రసేనారెడ్డి, ఆదరాసుపల్లి శశిధర్శర్మ, ఎంఈఓ సునీత, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి హామీ -
అవార్డుతో మరింత బాధ్యత పెరిగింది
ఉత్తమ డీఐఈఓగా రవీందర్రెడ్డి సిద్దిపేటఎడ్యుకేషన్: ఉత్తమ అవార్డుతో బాధ్యత మరింత పెరిగిందని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్రెడ్డి అన్నారు. ఇటీవల హైదరాబాద్లో ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణ, బోర్డు డైరెక్టర్ కృష్ణఆదిత్య నుంచి రవీందర్రెడ్డి ఉత్తమ డీఐఈఓ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక కార్యాలయంలో గెస్ట్ లెక్చరర్ల సంఘం ఆధ్వర్యంలో ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా రవీందర్రెడ్డి మాట్లాడుతూ ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని, జిల్లాలో ఇంటర్ విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు తన శక్తిమేరకు కృషి చేస్తానన్నారు. గెస్ట్ లెక్చరర్ల సమస్యలు ఈ నెల 30లోగా పరిష్కరిస్తాననన్నారు. అధ్యాపకులు నిబద్ధతతో పనిచేయాలని, విద్యార్థుల భవిష్యత్ను ఉత్తమంగా తీర్చిదిద్దుతూ మంచి ఫలితాలను సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అధ్యాపకులు తమ సమస్యలు తన దృష్టికి తీసుకు వస్తే పరిష్కరించేందకు ప్రయత్నిస్తానని చెప్పారు. ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు పరస్పర సహకారంతో కళాశాలల్లో చక్కని వాతావరణం నెలకొనేలా కృషిచేయాలని కోరారు. సెక్రటరీ సూచన మేరకు గెస్ట్ లెక్చరర్ల సమస్యలను త్వరలోనే పరిఽష్కరిస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్–2152 రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవయ్య, జిల్లా ఇన్చార్జి మల్లికార్జున్శర్మ, జిల్లా సెక్రటరీ చంద్రమోహన్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ఆగస్టులో ప్రారంభిస్తాం
ఆయిల్పామ్ ఫ్యాక్టరీని నంగునూరు(సిద్దిపేట): రాష్ట్రంలోనే అత్యంత కెపాసిటీ కల్గిన ఆయిల్పామ్ ఫ్యాక్టరీని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నామని వ్యవశాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వెల్లడించారు. ఆగస్టు మొదటి వారంలో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. శుక్రవారం మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర, కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలసి తుమ్మల నంగునూరు మండలం నర్మేటలో నిర్మిస్తున్న ఫ్యాక్టరీ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మాణం పనులపై ఆరా తీశారు. జిల్లా వ్యాప్తంగా సాగు విస్తీర్ణం, సాగు చేస్తున్న రైతుల వివరాలు, ఫ్యాక్టరీ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. చుట్టుపక్కల నాలుగు జిల్లాల నుంచి ఆయిల్పామ్ గింజలను సేకరించి ప్యాకింగ్ ఇక్కడే చేస్తారని ముగ్గురు మంత్రులకు వ్యవసాయ మంత్రి వివరించారు. అనంతరం మాట్లాడుతూ నర్మేటలో నిర్మిస్తున ఫ్యాక్టరీ 120 టన్నుల కెపాసిటీ కలిగి ఉందన్నారు. తెలంగాణకు గుండె కాయలా ఉన్న ఈప్రాంతంలో నిర్మిస్తున్న ఫ్యాక్టరీని ప్రతిష్టాత్మకంగా నిలుస్తుందన్నారు. రిఫైనరీ కోసం త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు. నాడు గ్రౌండ్ లేవల్లో ఉన్న పనులను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే పనులు పూర్తి చేశామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, వ్యవసాయ, ఉద్యాన, ఆయిల్ఫెడ్ అధికారులు పాల్గొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాం మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఫ్యాక్టరీని ఆకస్మికంగా పరిశీలించిన మంత్రులు -
పీజీ ఎంట్రెన్స్కు ఉచిత కోచింగ్
సిద్దిపేటఎడ్యుకేషన్: కెమిస్ట్రీ సబ్జెక్ట్తో పీజీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఫార్మా రంగంలో మంచి అవకాశాలున్నాయని వక్తలు అభిప్రాయపడ్డారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో కెమిస్ట్రీ పీజీ ఎంట్రెన్స్ రాయనున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, కెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ శ్రీధర్లు మాట్లాడారు. పీజీలో కెమిస్ట్రీని ఎంచుకుని, శిక్షణా తరగతులను ఉపయోగించుకుని వివిధ యూనివర్సిటీల్లో పీజీ ఎంట్రెన్స్లో మంచి ర్యాంకులు సాధించాలని సూచించారు. పీజీలో ఉత్తమ ప్రతిభ కనబర్చి మంచి ఫలితాలను సాధించాలన్నారు. ఉచిత శిక్షణపై ఆసక్తిగల విద్యార్థులు కన్వీనర్ డాక్టర్ మనోహర్ను కలిసి తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అయోధ్యరెడ్డి, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ మధుసూదన్రెడ్డి, సీఓఈ డాక్టర్ గోపాలసుదర్శనం, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈనెలాఖరు వరకు బియ్యం పంపిణీ సిద్దిపేటరూరల్: రేషన్ బియ్యాన్ని ఈనెల 30వ తేదీవరకు అందించనున్నట్లు అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రేషన్ తీసుకోని లబ్ధిదారులు వెంటనే అందుబాటులో రేషన్ షాప్నకు వెళ్లి తీసుకెళ్లాలన్నారు. పూర్తి స్థాయిలో బియ్యం అందుబాటులో ఉన్నాయన్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 90 శాతం పంపిణీ పూర్తయిందని, మొత్తంగా 2,98,985 రేషన్కార్డులు ఉండగా, నేటికి 2,67,875 కార్డుదారులకు 16,739 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేసినట్లు తెలిపారు. రేషన్ డీలర్లు సమయపాలన పాటిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అక్రమలకు తావివ్వకుండా బియ్యం పంపిణీ చేయాలన్నారు. యాక్టివాపై సుదీర్ఘ ప్రయాణంసిద్దిపేటజోన్: యాక్టివా బైక్తో 6300 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం చేసిన సిద్దిపేట యువకుడిని శుక్రవారం వాసవీ క్లబ్ ప్రతినిధులు సన్మానించారు. స్థానిక శివాజీనగర్కు చెందిన శివకుమార్ 23 రోజుల పాటు ద్విచక్ర వాహనంపై లడక్ వరకు పర్యటించి తిరిగి వచ్చాడు. ఈ సందర్భంగా శివకుమార్ను పట్టణ వాసవీ క్లబ్ ప్రతినిధులు నవీన్ కుమార్, శివకుమార్ హరికిరణ్, మంజుల, ధనలక్ష్మి ఘనంగా సన్మానించారు. బడుల తనిఖీకి ప్రత్యేక యంత్రాంగంనారాయణఖేడ్: పాఠశాలల తనిఖీకోసం ప్రత్యేక యంత్రాగాన్ని ఏర్పాటు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జ్ఞానమంజరి డిమాండ్ చేశారు. ఖేడ్లో శనివారం నిర్వహించిన సంఘం డివిజన్స్థాయి సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయులను పర్యవేక్షణ కోసం వినియోగించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. పర్యవేక్షణ కోసం డీఈఓ, డిప్యుటీ ఈవో, ఎంఈవో, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులను వినియోగించుకోవాలని, అవసరమైనచోట్ల కొన్ని అదనపు పోస్టులను మంజూరు చేసి ప్రత్యేక యంత్రాంగం ద్వారానే పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ఉపాధ్యాయులను తనిఖీ అధికారులుగా నియమిస్తే క్యాడర్, సీనియారిటీ సమస్యలతోపాటు విద్యార్థులకు నష్టం జరుగుతుందని చెప్పారు. సమావేశంలో సంఘ జిల్లా అధ్యక్షుడు అశోక్, కార్యదర్శులు నరేశ్, ఏశప్ప, హరిసింగ్, ఉపాధ్యక్షులు కాశీనాథ్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు. క్షయపై అవగాహన అవసరం హుస్నాబాద్రూరల్: గ్రామీణులకు క్షయవ్యాధిపై అవగాహన కల్పించాలని ఇంఫాక్ట్ ప్రాజెక్టు టీబీ అలర్టు ఇండియా ప్రతినిధి శ్రీనివాస్ సూచించారు. పట్టణంలో ఆశా, ఆరోగ్య కార్యకర్తలకు శుక్రవారం ఆయన అవగాహన కల్పించారు. దగ్గు, తుమ్ములు వచ్చినప్పుడు బ్యాక్టీరియా గాలిలో కలిసి మరొకరికి ఈ వ్యాధి సోకే అవకాశం ఉందన్నారు. ఈ వ్యాధి ఊపిరితిత్తులను ప్రభావితం చేసి, శరీరంలోని ఇతర భాగాలపై కూడా ప్రభావం చూపిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో అక్కన్నపేట, హుస్నాబాద్ మండలాల ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. -
మంత్రులకు ఘన స్వాగతం
హుస్నాబాద్లో మంత్రులకు కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ కార్యకర్తలు బైక్ ర్యాలీగా కిలోమీటర్ల మేర తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. రోడన్నీ పార్టీ కార్యకర్తల జోష్తో నిండిపోయింది. పబ్లిక్ మీటింగ్కు మహిళలు భారీగా తరలివచ్చారు. కాగా సమావేశంలో సాంస్కృతిక కళాకారులు సంక్షేమం, అభివృద్ధిపై ఆటపాటలతో ప్రజలను ఉత్తేజపరిచారు. కానీ సయ్యాటల పాటలు పాడటంతో మహిళలు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ, కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో అధ్యక్షుడు శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అభివృద్ధి చేస్తాం
అండగా ఉంటాం..హుస్నాబాద్లో ప్రగతిని పరుగులు పెట్టిస్తాం‘గౌరవెల్లి’పై గత ప్రభుత్వం నిర్లక్ష్యం: మంత్రి కోమటి రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవెల్లి ప్రాజెక్టను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. రూ.77కోట్లతో హుస్నాబాద్ నుంచి సుందరిగిరి వరకు నాలుగు వరసల రోడ్డు ఫేజ్ టూ కింద రెండు రోజుల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. సుందరగిరి నుంచి కొత్తపల్లి వరకు రూ.80 కోట్లతో నాలుగు వరుసల రహదారి వారం రోజుల్లో మంజూరు అవుతుందని అన్నారు. గత ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి కోసం సీఎంతో మాట్లాడామన్నారు. ఫారెస్ట్ అనుమతులు పూర్తి అయ్యాయని, కాలువల పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.హుస్నాబాద్: నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామని, ఎల్లప్పుడూ అండగా ఉంటామని మంత్రులు దామోదర, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. హుస్నాబాద్ పట్టణంలో శుక్రవారం రూ.11.50కోట్లతో నిర్మించిన మాతా శిశు సంరక్షణ ఆరోగ్యం కేంద్రం ప్రారంభం, రూ.82 కోట్లతో 150 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన, రూ.72.20 కోట్లతో హుస్నాబాద్ నుంచి కొత్త పల్లి వరకు (ఫేజ్–2) నాలుగు లేన్ల రోడ్ల నిర్మాణానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావులు కలిసి శంకుస్థాపన చేశారు. హుస్నాబాద్ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం ఇదే మొదటి సారి. విద్య, ఆరోగ్యంతోనే సమాజంలో మార్పు ఆరోగ్య తెలంగాణ సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో దామోదర మాట్లాడుతూ సమాజంలో మార్పు రావాలంటే విద్య, ఆరోగ్యం, నైపుణ్యం అవసరమన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ వల్లే హుస్నాబాద్కు ఇంజనీరింగ్ కళాశాల వచ్చిందన్నారు. హుస్నాబాద్ 250 పడకల ఆస్పత్రికి 50 సీట్లతో పీజీ మెడికల్ కళాశాలను మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు. ఎంబీబీఎస్ కాదని పీజీ చదువుకునే డాక్టర్లు ఇక్కడికి వస్తారని ఇది చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ప్రతి నియోజకవరానికి ఒక నర్సింగ్ కళాశాల అవసరమన్నారు. త్వరలో నాలుగు లేన్ల రోడ్డు: మంత్రి పొన్నం అక్కన్నపేట నుంచి జనగామ వరకు నాలుగు లేన్ల రోడ్డు త్వరలో వస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల సహకారంలో ఇంజనీరింగ్ కళాశాల ఈ ఏడాది నుంచే ప్రారంభం అవుతుందని తెలిపారు. ఇక్కడికి వచ్చిన మంత్రులు హుస్నాబాద్ అభివృద్దికి అభయం ఇవ్వాలని కోరారు. మూడు జిల్లాల కలెక్టర్లు కలిసి గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల పనుల సర్వే చేస్తున్నారని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని మహిళా సంఘాలకు రూ.71.30 కోట్ల చెక్కులు పంపిణీ చేశారు. హుస్నాబాద్లో గోడౌన్లు నిర్మించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు, సుందరగిరి నుంచి కొత్తపల్లి వరకు ఫేజ్ వన్ నాలుగు వరుసల రహదారిని మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డికి మంత్రి పొన్నం వినతి పత్రాలు ఇచ్చారు. పొన్నంను పొగడ్తలతో ముంచెత్తిన మంత్రులు మంత్రి పొన్నంపై సహచర మంత్రులు ప్రశంసల వర్షం కురిపించారు. మంత్రుల మాటలు ఇలా.. ‘పొన్నం ప్రభాకర్ తెలంగాణ ఉద్యమకారుడు. చాలా యాక్టివ్ మంత్రి. ఎప్పుడూ హుస్నాబాద్ కోసం పరితపిస్తుంటారు. ఉదయం హైదరాబాద్లో ఉంటే సాయంత్రం హుస్నాబాద్లో ఉంటారు. హుస్నాబాద్లో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేవి చాలా ఉన్నాయి. మేమంతా అండగా ఉంటాం. అభివృద్ధి చేస్తాం. రాబోయే మూడున్నరేళ్లలో పొన్నం అడిగిన పనులు పూర్తి అవుతాయి’ అని అన్నారు. ప్రతీ జిల్లాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ: తుమ్మల 50 పడకల పీజీ మెడికల్ కళాశాల: మంత్రి దామోదర త్వరలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తాం: మంత్రి తుమ్మల పది రోజుల్లో నాలుగు లేన్ల రహదారి మంజూరు: మంత్రి వెంకట్రెడ్డి పెద్ద ఎత్తున అభివృద్ధిపనులకు శ్రీకారం శ్రీరాంసాగర్, వరద కాలువలతో అన్నపూర్ణ జిల్లా కరీంనగర్ జిల్లా ప్రసిద్ధి చెందుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. ఎన్నో ప్రాజెక్టులు ఉన్న కరీంనగర్ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా వచ్చానన్నారు. నర్మేటలో నిర్మిస్తున్న ఆయిల్పామ్ ఫ్యాక్టరిని త్వరలో సీఎం ప్రారంభిస్తామన్నారు. నాలుగైదు జిల్లాలకు ఈ ఫ్యాక్టరి ఉపయోగపడుతుందన్నారు. ప్రతి జిల్లాలో ఆ యిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నారు. ఆయిల్పామ్ సాగుకు నష్టం ఉండదని, స్థిరత్వమైన ధర కల్పిస్తామన్నారు. -
పౌష్టికాహారం అందేలా చర్యలు
డీఈఓ శ్రీనివాస్రెడ్డి మిరుదొడ్డి(దుబ్బాక): జిల్లాలోని వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు మెనూ ప్రకారం మంచి పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు డీఈఓ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. మిరుదొడ్డిలోని కేజీబీవీ (కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం), మోడల్ స్కూల్ హాస్టల్ను శుక్రవారం ఆయన సందర్శించారు. హాస్టల్లోని వంట గదులను, స్టోర్ రూంలను పరిశీలించారు. పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్స్ అందించారా లేదా అని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. అలాగే హాస్టల్లో ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య కరమైన వాతావరణంలో విద్యార్థులకు మంచి ఆహారాన్ని అందించాలని టీచర్లకు సూచించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి టీచర్లు మంచి ప్రణాళికాబద్ధంగా బోధన చేయాలని ఆదేశించారు. టెన్త్ చదువుతున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఇప్పటి నుంచే విజ్ఞానవంతమైన బోధన అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రవీణ్బాబు, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ స్వర్ణలత, ఎమ్మార్సీ సిబ్బంది పాల్గొన్నారు. వ్యాయామ విద్యకు ప్రాధాన్యం ప్రశాంత్నగర్(సిద్దిపేట): నేటి ఆధునిక కాలంలో వ్యాయామ విద్యకు ప్రాధాన్యత పెరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో వ్యాయామ విద్య స్టాక్ రిజిస్టర్లను జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుంచే వ్యాయామంపై పట్టు సాధిస్తే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చన్నారు. చిన్నారుల్లో పెరుగుతున్న ఊబకాయం, బద్దకం, తదితర సమస్యలకు వ్యాయామం పరిష్కార మార్గమన్నారు. కార్యక్రమంలో తోట సతీష్, హరికిషన్ తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
గజ్వేల్: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. శుక్రవారం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 2, 13వార్డుల్లో లబ్ధిదారులతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గానికి ప్రభుత్వం 3వేల ఇళ్లు మంజూరుచేసిందని చెప్పారు. ఇప్పటికే 2,938మందికి ప్రొసీడింగ్లను సైతం అందజేశామన్నారు. నియోజకవర్గానికి అదనపు ఇళ్లు కావాలన్నా.. ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సుముఖంగా ఉన్నారన్నారు. ప్రస్తుతం మంజూరైన ఇళ్లను ఆరు నెలల్లో పూర్తి చేసి పండుగ వాతావరణంలో గృహప్రవేశాలు పూర్తి చేయాలని కోరారు. ప్రజాప్రభుత్వంలో సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా పక్కా ప్రణాళికతో ముందుకుసాగుతున్నట్లు వెల్లడించారు. అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లల్లా భావించి సీఎం రేవంత్రెడ్డి ముందుకుసాగుతున్నారని కొనియాడారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని 9రోజుల్లో 9వేల కోట్లు రైతు భరోసా నిధులను జమ చేసినట్లు చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసీ ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ఖాన్, కాంగ్రెస్ నాయకులు సమీర్ పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి గజ్వేల్లో ఇళ్ల పనులు ప్రారంభం -
మత్తు వదిలిద్దాం.. మహమ్మారిని తరిమేద్దాం
విద్యార్థులతో కలిసి ర్యాలీలో నడుస్తున్న కలెక్టర్, సీపీ, ఇతర అధికారులుసిద్దిపేటఎడ్యుకేషన్/హుస్నాబాద్: ‘మత్తు పదార్థాలకు దూరంగా ఉందాం.. మహమ్మారిని తరిమేద్దాం.. మాదక ద్రవ్యాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు’ అని కలెక్టర్ హైమావతి పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని గురువారం జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు జరిగాయి. సిద్దిపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల(కోఎడ్యుకేషన్) నుంచి ఆయా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులచే పాత బస్టాండ్ వరకు నిర్వహించిన ర్యాలీని సీపీ అనురాధతో కలిసి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత్తుకు బానిసలుగా మారిన వారికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు బాధితులకు అవగాహన కల్పించాలన్నారు. స్నేహితులు, బంధువులు సన్మార్గాంలో నడిచేలా యువత బాధ్యతవహించాలన్నారు. అవగాహన కల్పిస్తున్నాం పోలీస్ కమిషనర్ అనురాధ మాట్లాడుతూ పాఠశాలల్లో గంజాయి, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై వివరిస్తున్నట్లు చెప్పారు. ఎవరైనా డ్రగ్స్ కలిగి ఉన్నా, తీసుకున్నా వెంటనే టోల్ఫ్రీ నంబర్ 1908కు లేదా కంట్రోల్ రూమ్ నంబర్ 8712667100 నంబర్కు కాల్ చేయాలని సూచించారు. పాత బస్టాండ్ సర్కిల్ వద్ద డ్రగ్స్కు దూరంగా ఉంటామని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీకాంత్రెడ్డి, జిల్లా విద్యాధికారి శ్రీనివాస్రెడ్డి, పోలీస్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మన్నె రవీందర్రెడ్డి, అదనపు డీసీపీ సుభాష్చంద్రబోస్, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శాంతి తదితరులు పాల్గొన్నారు.మానవహారం.. హుస్నాబాద్ పట్టణంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాదవద్రవ్యాల నిర్మూలన అందరి బాధ్యత అని అన్నారు. అంతకు ముందు విద్యార్థులు ర్యాలీగా వచ్చి అంబేడ్కర్ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. మాదక ద్రవ్యాల నివారణకు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, ఆర్డీఓ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి కలెక్టర్ హైమావతి పిలుపు జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్పై కదంతొక్కిన జనం -
పైరవీలకే పోస్టులు
మెరిట్ లిస్ట్ లేకుండానే.. అర్హత ఆధారంగా దరఖాస్తు చేసిన అభ్యర్థులతో సబ్జెక్ట్ నిష్ణార్థులు, ఎంఈవో, ఎస్వోల సమక్షంలో డెమో చెప్పించారు. క్లాస్ చెబుతుంటే ఎలాంటి వీడియో చిత్రీకరించలేదు. ఎలాంటి మెరిట్ లిస్ట్ను ప్రదర్శించకుండానే నేరుగా అభ్యర్థులకే సమాచారం అందించి సెలెక్ట్ చేశారు. దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంపికలు నిష్పక్షపాతంగా జరగలేదని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. కేజీబీవీ (కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం) లలో గెస్ట్ లెక్చరర్ల నియామకాల్లో పైరవీలకే పెద్దపీట వేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధ్యాపకుల నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. జిల్లాలో 9 కేజీబీవీలను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేయంతో 42 గెస్ట్ లెక్చరర్ల నియామకం చేపట్టారు. అర్హులను కాకుండా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు చెప్పిన వారికే అవకాశాలు కల్పించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోపిస్తున్నారు. ఉన్నత అధికారులు మరోసారి పరిశీలించాలని డెమోకు హజరైన అభ్యర్థులు కోరుతున్నారు. 16 కేజీబీవీలలో.. జిల్లా వ్యాప్తంగా 23 చోట్ల కేజీబీవీలుండగా గతేడాది వరకు ఏడు చోట్ల మాత్రమే ఇంటర్ విద్యను అందించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి మరో 9 కేజీబీవీలలో ఇంటర్మీడియెట్ విద్యను ప్రారంభించారు. దీంతో ఇంటర్ విద్యను అందించే కేజీబీవీలు 16కు చేరాయి. నూతనంగా ఇంటర్ విద్యను అందించేందుకు కొమురవెల్లి, వర్గల్, ములుగు, అక్కన్నపేట, హుస్నాబాద్, తొగుట, అల్లిపూర్(చిన్నకోడూరు) కేజీబీవీలలో బోధించేందుకు గెస్ట్ లెక్చరర్లను నియమించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఆయా కేజీబీవీల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేసి దరఖాస్తులు స్వీకరించారు. 42 గెస్ట్ లెక్చరర్ల పోస్టులకు దాదాపు 150కి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేశారు. పైరవీలకే ప్రాధాన్యత కేజీబీవీలలో గెస్ట్ లెక్చరర్ల ఎంపికల్లో పైరవీలకే ప్రాధాన్యత ఇచ్చారని తెలుస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక మాజీ ప్రతినిధులు చెప్పిన వారికే అవకాశాలు కల్పించారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు దృష్టి సారించి అవసరమైతే మరోమారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్యాపకుల సమక్షంలో డెమో నిర్వహించి ఎంపికలు చేయాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు. దీనిపై త్వరలో కలెక్టర్ను కలిసి న్యాయం చేయాలని కోరనున్నట్లు తెలుస్తోంది. గెస్ట్ లెక్చరర్ల నియామకాల్లో అక్రమాలు ఆయా సబ్జెక్టులకు 42 మంది నియామకం మెరిట్ లిస్ట్ ప్రదర్శించకుండానే ఎంపికలు అవకతవకలపై సర్వత్రా విమర్శలు 9 కేజీబీవీల్లో నూతనంగా ఇంటర్ విద్య ప్రారంభం తొగుట, కొమురవెల్లిలో గెస్ట్ అధ్యాపకురాలి పోస్ట్కు ఓ మహిళా దరఖాస్తు చేశారు. రెండు చోట్లా ఎంతో కష్టపడి వేర్వేరుగా డెమో ఇచ్చారు. అయినా ఫలితం దక్కలేదు. అయితే ఎలాంటి మెరిట్ లిస్ట్ ప్రదర్శించకుండానే గెస్ట్ లెక్చరర్ల నియామకం చేపట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైరవీలు చేసుకున్న అభ్యర్థులనే నేరుగా పిలిచి ఎంపిక చేశారని తెలుస్తోంది. పోస్టుల నియామకాల్లో జరిగిన అవకతవకలపై అధికారులు దృష్టి సారించాలని డెమోకు హాజరైన అభ్యర్థులు కోరుతున్నారు. – సాక్షి, సిద్దిపేట పారదర్శకంగానే ఎంపికలు కేజీబీవీలలో గెస్ట్ లెక్చరర్ల ఎంపికలు పారదర్శకంగా జరిగాయి.అవకతవకలకు అవకాశాలు లేవు. అభ్యర్థులు ఇచ్చిన డెమో ప్రకారం ఎంఈవో, ఎస్వో, ఆ సబ్జెక్ట్ నిష్ణార్థుడు సమక్షంలో ఎంపిక చేశారు –శ్రీనివాస్రెడ్డి, డీఈఓ -
కురిసిన వాన.. మురిసిన రైతన్న
వానాకాలం సీజన్లో సాగు వివరాలు (ఎకరాల్లో) పంట ఇప్పటి వరకు సాగైన పంటలు వరి 614 మొక్కజొన్న 9,145 పత్తి 51,510 కందులు 553 పెసర్లు 36ప్రశాంత్నగర్(సిద్దిపేట): కురిసిన వర్షాలతో సాగు పనులు ముమ్మరమయ్యాయి. కొద్ది రోజులుగా వర్షాలు లేక మొలకెత్తిన మొలకలు సైతం వాడిపోతుండటంతో దిగులుచెందుతున్న రైతుల్లో బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు కురిసిన వర్షాలు సంతోషాలను నింపాయి. జిల్లా వ్యాప్తంగా 1081.6మిల్లిమీటర్లు, సగటున 41.6మిల్లిమీటర్ల వర్ష పాతం నమోదయ్యింది. అత్యధికంగా నారాయణరావు పేట మండలంలో 90.21మి.మీ, సిద్దిపేట రూరల్ మండలంలో 73.2మి.మీ, సిద్దిపేట అర్బన్ మండలంలో 69.6మి.మీ, కోహెడ మండలంలో 56.3మి.మీ, అక్బర్పేట భూంపల్లి మండలంలో 55.8మి.మీ, తొగుట మండలంలో 55.5మి.మీ, దుబ్బాక మండలంలో 53.2మి.మీ, దౌల్తాబాద్ మండలంలో 52.9మి.మీ, అక్కన్నపేట మండలంలో 52.1మి.మీ, చిన్నకోడూరు, బెజ్జంకి మండలాలలో 51.1 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ఎండిపోయే దశలో ఉన్న పంటలకు వానలు ఊపిరిపోశాయి. ముందుగానే పంటలపై ప్రణాళిక సిద్ధం చేసుకున్నౖ రెతులకు ఈ వర్షంతో కోండంత ధైర్యాన్ని ఇచ్చాయి. రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలతో వ్యవసాయాదారులు తమ పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లా వ్యాప్తంగా 1081.6 మిల్లీమీటర్ల వర్షపాతం నారాయణరావుపేటలో అత్యధికం పంటలకు జీవం పోసిన వరుణుడు సాగు పనుల్లో అన్నదాతలు బిజీ పంటకు ప్రాణం నాకున్న భూమిని సాగుకు సిద్ధం చేసి, ప్రారంభంలో వర్షం పడగానే విత్తనాలు వేశాను. ఆ తరువాత వానలు లేకపోవడంతో బాధపడ్డాను. కొద్ది రోజులగా వానలు కురవడంతో పంటలకు ప్రాణం పోసినట్లయింది. – అనిమెల అభి, రైతు, తొగుట -
హుస్నాబాద్లో నేడు మంత్రుల పర్యటన
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ హుస్నాబాద్: పట్టణంలో శుక్రవారం నలుగురు మంత్రులు పర్యటించనున్నారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. ఏర్పాట్లను గురువారం కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్తో కలిసి క్షేత్ర స్ధాయిలో పరిశీలించారు. ఉదయం 11.30 గంటలకు ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో రూ.11.50 కోట్లతో నిర్మించిన 50 పడకల మాతా శిశు సంక్షేమ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఇదే ప్రాంగణంలో ఉన్న 100 పడకల ఆస్పత్రిని 250 పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేసేందుకు రూ.82 కోట్లతో నిర్మించనున్న 150 పడకల భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. హుస్నాబాద్ నుంచి కొత్తపల్లి వరకు రూ.77.20 కోట్లతో నిర్మిస్తున్న నాలుగు లేన్ల రోడ్డుకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగే సమావేశంలో మంత్రులు పాల్గొంటారు. -
వసతి గృహాల్లో వసతులు కల్పించండి
యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రవి ప్రశాంత్నగర్(సిద్దిపేట): రాష్ట్రంలోని ప్రభుత్వ వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యూఎస్ఎఫ్ఐ) రాష్ట్ర అధ్యక్షుడు రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో గురువారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతు నూతన విద్యాసంవత్సరం ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా హాస్టళ్లల్లో కనీస వసతులు కల్పించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ విద్య అభ్యసించడం అంటే సమస్యలతో సతమతమవడమనే విధంగా ఉందని విమర్శించారు. ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ విద్యాసంస్థలు, హాస్టళ్లు మాత్రం మారడం లేదని ఆరోపించారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో హాస్టల్ విద్యార్థులకు రావలసిన బెడ్డింగ్, స్టడీ మెటీరియల్స్ రాకపోవడంతో తల్లిదండ్రుల మీద అదనపు భారం పడుతుందన్నారు. కార్యక్రమంలో యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకుడు నాచారం శేఖర్, జిల్లా అధ్యక్షుడు గుడి కందుల రవి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
పెండింగ్ కేసులు పరిష్కరించండి
సిద్దిపేటకమాన్: పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి తెలిపారు. రాష్ట్ర హైకోర్టు సూచనల మేరకు జిల్లా కోర్టులో న్యాయమూర్తులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న పాత కేసులన్నీ పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు జయప్రసాద్, వినోద్కాంబ్లే, సంతోష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం నంగునూరు(సిద్దిపేట):పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశం కోసం నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ గురువారం ప్రారంభమైంది. రాజగోపాల్పేటలో నిర్వహించిన సర్టిఫికెట్ల పరిశీలనకు మొదటి రోజు 289 మంది విద్యార్థులు హాజరయ్యారు. సర్టిఫికెట్లు పరిశీలించిన అధికారులు ఐడీ పాస్వర్డు అందజేశారు. ప్రిన్సిపాల్ గోవర్ధన్ మాట్లాడుతూ ఐడీ పొందిన విద్యార్థులు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్లు పెట్టు కోవాలన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ఫొటో ముద్రించాలి ప్రధానికి లక్ష పోస్ట్ కార్డుల ఉద్యమం చేర్యాల(సిద్దిపేట): ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని సాధన సమితి జాతీయ అధ్యక్షుడు పరశురాం డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా ప్రధానికి లక్ష పోస్ట్ కార్డ్ల ఉద్యమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 23న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల నుంచి ప్రారంభమైన కార్యక్రమం గురువారం పట్టణ కేంద్రానికి చేరుకుంది. స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద దళిత బహుజన సంఘాల నాయకులు స్వాగతం పలికారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ప్రధాని మోదీకి పోస్ట్ కార్డులు రాశారు. ఈ సందర్భంగా పరశురాం మాట్లాడుతూ అంబేడ్కర్ సూచనలతోనే 1935 ఏప్రిల్ 1 రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా ఏర్పాటైందన్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 500 మందితో పోస్ట్ కార్డ్స్ వేయించామన్నారు. 26 జనవరి 2026 వరకు ప్రధానికి లక్ష మందితో పోస్ట్కార్డ్లు వేయిస్తామన్నారు. కార్యక్రమంలో కరెన్సీపై అంబేడ్కర్ ఫొటో సాధన సమితి జిల్లా కన్వీనర్ మేడిపల్లి చందు, మాజీ కౌన్సిలర్ చంటి, మాజీ సర్పంచ్ వల్లూరి శ్రీనివాస్ నాయకులు పాల్గొన్నారు. ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు చిన్నకోడూరు(సిద్దిపేట): ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయించే డీలర్లపై చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాధిక హెచ్చరించారు. గురువారం మండల పరిధిలోని చిన్నకోడూరు, గంగాపూర్, రామంచ గ్రామాల్లోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నకిలీ విత్తనాలను రైతులకు విక్రయించవద్దన్నారు. ఈ పాస్ యంత్రాల ద్వారానే ఎరువులు అమ్మాలని ఆదేశించారు. రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ఎవ్వరూ ఆందోళన చెందవద్దని సూచించారు. యూరియాను అవసరం మేరకు కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఓ జయంత్ కుమార్, ఏఈఓలు పాల్గొన్నారు. -
వడ్డీ రాకాసులు
చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రైవేటు ఫైనాన్స్లు పేదల నడ్డి విరుస్తున్నాయి. పేద ప్రజల అమాకత్వాన్ని, అవసరాలను ఆసరాగా తీసుకుని అప్పులు ఇచ్చి వడ్డీల పేరుతో నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సిద్దిపేటకు చెందిన ప్రైవేటు ఫైనాన్స్లు గ్రామాల్లో వారం, నెల రోజులు వారీగా మిత్తీలకు ఇస్తూ పేదలను హింసుస్తున్నారు. మహిళల పేరు మీద మహిళా గ్రూపులు ఏర్పాటు చేస్తూ వారం చిట్టీలు నడిపిస్తున్నారు. పది మందిని ఒక గ్రూపుగా చేసుకుంటూ నెలలో ఒక మొదటి వారాన్ని ఎంచుకుని డబ్బులు వసూలు చేస్తున్నారు. పది మందిలో ఆపద ఉండి ఎవరైనా డబ్బులు చెల్లించలేకపోతే వారి ఇళ్లపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. అధిక వడ్డీతో డబ్బులు వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. చిన్నకోడూరు మండలం మాచాపూర్లో కుటుంబ కలహాలతో వారం క్రితం ఒక వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అతను చెల్లించాల్సిన రూ.3 వేల కోసం గురువారం అతని ఇంటిపై సిద్దిపేటకు చెందిన ప్రైవేటు ఫైనాన్స్ సిబ్బంది దౌర్జన్యానికి దిగారు. అధికారులు స్పందించి ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రైవేటు ఫైనాన్స్ల ఆగడాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. పేదల నడ్డి విరుస్తున్న ప్రైవేటు ఫైనాన్స్లు వారి ఆగడాలను అరికట్టాలంటున్న ప్రజలు -
పంచాయతీ పోరు
మూడు నెలల్లో ఎన్నికల నిర్వహణ ● ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ● ఇప్పటికే సిద్ధమైన ఓటర్ల జాబితా, బ్యాలెట్ బాక్సులు ● రిజర్వేషన్లు తేలకపోవడంతో నిలిచిన ఎన్నికల ప్రక్రియ ● కోర్టు తాజా ఆదేశాలతో వేడెక్కనున్న పల్లె రాజకీయంసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పల్లె రాజకీయ మళ్లీ వేడెక్కనుంది. మూడు నెలల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో గ్రామాల్లో ఎన్నికల సందడి షురూ కానుంది. సర్పంచులుగా, వార్డు సభ్యులుగా పోటీ చేయాలని భావిస్తున్న నాయకులు మళ్లీ మద్దతు కోసం మంతనాలు ప్రారంభించనున్నారు. రిజర్వేషన్లపై స్పష్టత వచ్చాకే ఆశావహులు ప్రత్యక్ష కార్యచరణకు దిగాలని యోచిస్తున్నారు. ఈ రిజర్వేషన్ తమ అనుకూలంగా వస్తే..అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటినుంచి మద్దతు కోసం కార్యాచరణ ప్రారంభిస్తే ఖర్చులు తడిసి మోపెడవుతాయని..తీరా రిజర్వేషన్ అనుకూలంగా రాకపోతే ఖర్చులన్నీ వృథా అవుతాయనే ఆలోచనలో చోటా మోటా నాయకులు ఉన్నారు. గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం 2024 జనవరి 31తోనే ముగిసిన విషయం విదితమే. అప్పట్నుంచి గ్రామ పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలోనే కొనసాగుతున్నాయి. పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు కూడా ఆగిపోవడంతో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణకు కార్యదర్శులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే సగం ఏర్పాట్లు పూర్తి ఈ ఎన్నికలను ఆరు నెలల క్రితమే నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం జనవరిలో చకచకా ఎన్నికల ఏర్పాట్లు చేసింది. ఓటరు జాబితాలను కూడా సిద్ధం చేసింది. ఈవీఎంలు కాకుండా, బ్యాలెట్ విధానంలో ఈ పోలింగ్ ప్రక్రియను నిర్వహించాల్సి ఉండటంతో ఇందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వివిధ రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను జిల్లాకు తెప్పించారు. అలాగే బ్యాలెట్ పేపర్లు కూడా ముద్రించారు. పోలింగ్ నిర్వహణకు అవసరమైన సిబ్బందిని కూడా గుర్తించారు. స్టేజ్–1, స్టేజ్–2 ఇలా వివిధ స్థాయిల్లో పోలింగ్ ప్రక్రియను నిర్వహించేందుకు అవసరమైన ఆయా స్థాయిల్లోని అధికారులను, సిబ్బంది జాబితాను రూపొందించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన దాదాపు అన్ని ప్రక్రియలు ఇప్పటికే పూర్తి చేసిన అధికారులు తీరా రిజర్వేషన్లు ఖరారు కాకపోవడంతో పోలింగ్ ప్రక్రియ జరగలేదు. ఇప్పుడు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో అధికార యంత్రాంగం మళ్లీ ఈ ఎన్నికల ఏర్పాట్లపై నిమగ్నం కానుంది.ముఖ్యనేతలకు ప్రతిష్ఠాత్మకమే..గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీలకతీతంగా జరుగుతాయి. అయినప్పటికీ ఆయా నియోజకవర్గాల నేతలకు ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకం కానున్నాయి. తమ అనుచరులనే సర్పంచులుగా గెలిపించుకుంటేనే ఆయా గ్రామాల్లో నియోజకవర్గస్థాయి నాయకులకు పట్టు ఉంటుంది. దీంతో అన్ని పార్టీల నాయకులు తమకు అనుకూలమైన వ్యక్తులను బరిలోకి దింపేందుకు ఇప్పట్నుంచి అన్వేషణ ప్రారంభించనున్నారు. -
ప్రజల రక్షణే ముఖ్యం
సీపీ అనురాధ దుబ్బాకటౌన్: ప్రజల రక్షణే ధ్యేయంగా పోలీసులు విధులు నిర్వహించి, ప్రజల మన్ననలు పొందాలని సీపీ అనురాధ అన్నారు. బుధవారం బేగంపేట పోలీస్స్టేషన్ను సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. ఆమె మాట్లాడుతూ పోలీస్స్టేషన్లో వివిధ కేసులలో ఉన్న వాహనాల అడ్రస్ తెలుసుకుని సంబంధిత యజమానులకు త్వరగా అప్పగించాలని ఎస్ఐకి సూచించారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో గజ్వేల్ ఏసీపీ నర్సింహులు, తొగుట సీఐ లతీఫ్, బేగంపేట ఎస్ఐ మహిపాల్ రెడ్డి, సీసీఆర్బి సీఐ రామకృష్ణ, ఎస్బీ సీఐ శ్రీధర్ గౌడ్ తదితరులు న్నారు. కుకునూర్పల్లి పోలీస్స్టేషన్ తనిఖీ కొండపాక(గజ్వేల్): మండల పరిధిలోని కుకునూర్పల్లి పోలీస్స్టేషన్ను సీపీ అనురాధ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలను, సీజ్ చేసిన వాహనాలను, రిసెప్షన్, రికార్డ్స్, రైటర్రూమ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి సాధ్యమైనంత త్వరగా వారి సమస్య లు పరిష్కరించాలన్నారు. ఆన్లైన్ గేమ్స్, ఆన్ లైన్ బెట్టింగ్పై నిఘా పెంచాలని సూచించారు. పథకాలు సద్వినియోగం చేసుకోండి అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ సిద్దిపేటజోన్: ‘ఏమ్మా.. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నావా? ప్రభుత్వం ఇల్లులేని వారికి ఇందిరమ్మ పథకం అమలు చేస్తోంది. సద్వినియోగం చేసుకోవాలి’ అని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ సూచించారు. బుధవారం అదనపు కలెక్టర్ పట్టణంలో పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక 17 వార్డులో ఒక రేకుల ఇంటి వద్ద ఆగి ఇంటి యజమాని చిలుకల లక్ష్మితో ఆప్యాయంగా మాట్లాడారు. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు గూర్చి అరా తీశారు. దరఖాస్తు చేసినట్టు ఆమె చెప్పడంతో అక్కడే ఉన్న అధికారులను వెంటనే వెరిఫై చేయాలని సూచించారు. అనంతరం ఇంటిగ్రేటెడ్ వెజ్ మార్కెట్ యార్డులో తనిఖీ చేశారు. అక్కడ కొత్తగా నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ నిర్మాణం పనులను పరిశీలించారు. కాళ్లకుంట కాలనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి, అక్కడ ప్రజలతో వైద్య సేవలు గురించి ఆరా తీశారు. అన్ని రకాల మందులు, ల్యాబ్ పరీక్షలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. ఆమె వెంట మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్, జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైద్య పోస్టులు భర్తీ చేయండి హుస్నాబాద్: ప్రభుత్వ ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న వైద్య పోస్టులు భర్తీ చేసేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. ఈమేరకు బుధవారం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేశ్రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి మండలం నుంచి వైద్యం కోసం వందలాది మంది హుస్నాబాద్కు వస్తుంటారని తెలిపారు. పేద ప్రజలకు సరైన వైద్యం అందించేందుకు వైద్య పరికరాలు అందుబాటులో ఉంచాలని కోరారు. అలాగే మందుల కొరత లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధులు సుద్దాల చంద్రయ్య, అయిలేని మల్లికార్జున్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఈసారీ లేనట్టే..!
చడీచప్పుడూలేని ‘ఫసల్ బీమా’ ● పంటల సాగుకు మార్గదర్శకాలేవీ? ● అదిగోఇదిగో అంటూ ఊరిస్తున్న ప్రభుత్వం ● పంట నష్టానికి దేవుడే దిక్కు ‘ఫసల్ బీమా’ ఈసారీ కూడా అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. గతేడాది నుంచి అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న ప్రభుత్వం.. ఈ సీజన్లో పంటల సాగుకు అదను దాటే పరిస్థితి రాబోతున్నా చడీచప్పుడూలేదు. ఈ సీజన్లో రైతుకు పంట నష్టం జరిగితే ‘దేవుడే దిక్కు’ అనే దుస్థితి నెలకొంది. –గజ్వేల్జిల్లాలో ఏటా వానాకాలంలో 5.50లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగులోకి వస్తుంటాయి. గతంలో పంటలకు నష్టం వాటిల్లినప్పుడు ‘ఫసల్ బీమా’ అమలు చేసేవారు. వానాకాలంలో సాగుచేసే ఆహార, నూనె గింజలు, వాణిజ్య, ఉద్యాన పంటలకు పంటల వారీగా, ప్రాంతాల వారీగా ప్రీమియం నిర్దేశించారు. అగ్నిప్రమాదం, పిడుగుపాటు, గాలివాన, వడగళ్లు, తుపాను, అనావృష్టి, వరదలు, నీట మునిగిపోవడం, తెగుళ్లు, ప్రతికూల వాతావరణం వల్ల దిగుబడులకు నష్టం వాటిల్లితే నష్ట పరిహారం చెల్లించేవారు. అంతేగాకుండా ప్రతికూల వాతావరణం కారణంగా రైతులు విత్తనాలు విత్తకపోవడం, నార్లు వేయకపోవడం వల్ల కలిగే ఆర్థిక నష్టాలకు బీమా మొత్తంలో 25శాతం వరకు సత్వర నష్టపరిహారం అందించే అవకాశం ఈ పథకంలో ఉండేది. పంట మధ్యకాలంలో నష్టపోయిన రైతులకు సైతం నష్టాన్ని అంచనా వేసి పరిహారంలో 25శాతం చెల్లించే అవకాశం. పంటల రకాలను బట్టి ప్రీమీయం చెల్లించేవారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ పథకం అమలయ్యేది. కానీ వివిధ కారణాలతో కొన్నేళ్లుగా ఈ పథకం నిలిచిపోయింది. రైతుల ఆశలపై నీళ్లు.. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని పునరుద్ధరించడానికి నిర్ణయించింది. గతేడాది నుంచే అమలు చేస్తామని కూడా ప్రకటించింది. కానీ ఈ సీజన్లోనైనా పథకం అమలవుతుందని అంతా భావించారు. కానీ రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్టే కనపడుతోంది. ఈసారి వానాకాలం ఆరంభం నుంచే రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. సీజన్ ఆరంభం నుంచి ఇప్పటివరకు భారీ వర్షామే లేకుండా పోయింది. జిల్లాలోని 23మండలాల్లో లోటు వర్షపాతం నెలకొంది. సుమారు 80వేల ఎకరాల్లో పత్తిని ఇప్పటికే సాగు చేశారు. మొక్కజొన్న విత్తనం కూడా జోరుగా వేస్తున్నారు. కానీ భూముల్లో పదును లేక విత్తనం మొలకెత్తడం లేదు. పత్తికి ఇప్పటికే భారీ నష్టం జరిగిపోయింది. మొక్కజొన్న పరిస్థితి ఇలాగే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ‘ఫసల్ బీమా’ అమలయి ఉంటే రైతులకు కొంత భరోసా ఉండేది. కానీ పరిస్థితి నేడు భిన్నంగా తయారైంది. నిజానికి జూలై 15లోగా పత్తి, మొక్కజొన్న ఇతర పంటలు సాగుచేసుకునే అవకాశముంది. ఆ తర్వాత వరి సాగుకు మరికొంత సమయం ఉంటుంది. కానీ ఇప్పటివరకు ‘ఫసల్’పై ఎలాంటి మార్గదర్శకాలు విడుదల కాకపోవడం.. ఈ సీజన్లో పథకం అమలయ్యే అవకాశం లేదని స్పష్టమవుతోంది. మార్గదర్శకాలు రాలేదు ‘ఫసల్ బీమా’ అమలుకు సంబంధించి రైతుల నుంచి విజ్ఞప్తులు ఉన్నాయి. కానీ ఈ సీజన్లో అమలుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు అందలేదు. ఒకవేళ వస్తే రైతులకు సమచారమిస్తాం. – రాధిక, జిల్లా వ్యవసాయాధికారి -
పలుచోట్ల మోస్తరు వాన
మొక్క మొక్కకు నీరు పోస్తూ.. హుస్నాబాద్లో 5.8మి.మీ. వర్షపాతం నమోదు జిల్లాలో బుధవారం పలుచోట్ల వర్షం కురిసింది. అత్యధికంగా హుస్నాబాద్ మండలంలో 5.8మీ.మీ, బెజ్జంకిలో 5మి.మీ, అక్కన్నపేటలో 3.6మి.మీ, సిద్దిపేట అర్బన్, కోహెడ మండలాల్లో 1.4మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. – ప్రశాంత్నగర్(సిద్దిపేట) పంటను కాపాడుకునేందుకు రైతు పాట్లు వర్షం కురవకపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు. పంట ఎండిపోకుండా పడరాని పాట్లు పడుతున్నారు. హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్)లో రైతు దొంతరవేని రాజయ్య ఎకరంలో పత్తి పంట వేశారు. వానలు లేకపోవడంతో పత్తి మొక్కలను కాపాడుకోనేందుకు బిందెతో నీరు పోస్తున్నారు. వర్షాలు ఆలస్యమైతే మొక్క మొలిచేందుకు శక్తి ఉండదని నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రూ.పది వేల వరకు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. ఇది రాజయ్య బాధనే కాదు హుస్నాబాద్ డివిజన్లో 10 వేల ఎకరాల్లో పత్తి పంటలు వేసిన రైతుల గోస కూడా ఇలాగే ఉంది. – హుస్నాబాద్రూరల్ -
‘మల్లన్న’ జలాల కోసం ఉద్యమిస్తాం
దుబ్బాక: తలాపునే మల్లన్న సాగర్ జలాలు ఉన్నా సాగు నీటికి తిప్పలుతప్పడంలేదని, నీళ్లకోసం ఉద్యమిస్తామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి తెలిపారు. బుధవారం దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి శివారులో దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లోని 12 గ్రామాలకు ఇర్కోడు లిప్టు ఇరిగేషన్ ద్వారా నీళ్లు అందించాలని జలసాధన సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గానికి నీరు ఇవ్వకుంటే హైదరాబాద్కు మల్లన్నసాగర్ నుంచి వెళ్లే జలాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. అవసరమైతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకై నా సిద్ధమేనని అన్నారు. కేసీఆర్ హయాంలో ప్రాజెక్టులు, ప్రధాన కాలువలు నిర్మిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఉప కాలువలు కూడా నిర్మించడం లేదన్నారు. ఏడాదిన్నర కాలంగా కాలువలు నిర్మించి పొలాలకు నీరందించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మల్లన్నసాగర్ నిర్మాణంతో సర్వం కోల్పోయామని, మా కడుపులు నిండిన తర్వాతనే బయటకు నీళ్లు తీసుకెళ్లాలన్నారు. ఇర్కోడు లిఫ్టు ఇరిగేషన్ ద్వార నీళ్లు ఇవ్వడంతో పాటు వెంటనే కాలువలు పూర్తి చేసి దుబ్బాక నియోజకవర్గానికి నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అవసరమైతే రాజీనామాకై నా సిద్ధమే ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి స్పష్టీకరణ జలసాధన సమితి ఆధ్వర్యంలో సదస్సు -
ఆయిల్పాం రైతులపై వివక్ష
నంగునూరు(సిద్దిపేట): ఆయిల్పాం సాగుచేస్తున్న రైతులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష చూపుతున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్మేటలో నిర్మిస్తున్న ఆయిల్పామ్ ఫ్యాక్టరీ పనులను అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రైతులు లాభదాయక పంటలు సాగు చేయాలనే లక్ష్యంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 300 కోట్లతో ఆసియాలోనే అత్యాధునిక టెక్నాలజీతో అయిల్పామ్ ఫ్యాక్టరీకి అంకురార్పణ చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించకపోవడంతో రైతులు పంట సాగుకు మొగ్గు చూపడంలేదన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం పంటపై తగ్గించిన సుంకాన్ని యథాస్థానానికి తేవాలని డిమాండ్ చేశారు. మనదంతా ఒకే కుటుంబం సిద్దిపేటజోన్: నియోజకవర్గ ప్రజలంతా నా కుటుంబమని, మీ సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 227మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సాయం అందినట్లు పేర్కొన్నారు. అనంతరం నంగనూర్ మండలం మల్యాల గ్రామంలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు కోసం ఎమ్మెల్యే ఆర్థిక సాయం అందించారు. ఎమ్మెల్యే హరీశ్రావు కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలపై మండిపాటు -
క్షయ నిర్మూలనే లక్ష్యం కావాలి
● కలెక్టర్ హైమావతి ● వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్షసిద్దిపేటరూరల్: క్షయవ్యాధి నిర్మూలనే లక్ష్యంగా వైద్యాధికారులు కృషి చేయాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. ఇందుకు టీబీ పరీక్షల కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రజలకు అందిస్తున్న వివిధ ఆరోగ్య సేవలపై బుధవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ అన్ని ప్రాథమిక కేంద్రాల్లో టీబీ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. మాతా, శిశు సంరక్షణ కార్యక్రమంలో భాగంగా, గర్భిణుల నమోదు దగ్గర నుంచి ప్రసవం అయ్యేవరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన ఎప్పటికప్పుడు వైద్యాధికారులు సమీక్షలు నిర్వహించుకోవాలన్నారు. సంవత్సర కాలంలో జరిగిన శిశు మరణాలపై పూర్తి నివేదికను అందించాలని ఆదేశించారు. ఆయుష్మాన్ ఆరోగ్య సెంటర్లో ఓపీ సంఖ్య పెంచాలన్నారు. అలాగే వానాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ పల్వన్ కుమార్, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి డాక్టర్ శాంత, ప్రభు త్వ గజ్వేల్ ఆస్పత్రి డాక్టర్ అన్నపూర్ణ, డిప్యూటీ డీఎంహెచ్ఓలు తదితరులు పాల్గొన్నారు. బాగా చదివి ప్రజలకు సేవ చేయండి సిద్దిపేటకమాన్: బాగా చదివి ప్రజలకు సేవ చేయాలని కలెక్టర్ హైమావతి వైద్య విద్యార్థులకు సూచించారు. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలను కలెక్టర్ బుధవారం సందర్శించారు. వైద్య కళాశాలలో సిబ్బంది, వైద్య కోర్సుల వివరాలు, అవసరమైన పరికరాలు, ప్రాక్టికల్స్ చేయడానికి ల్యాబ్లు, సెక్యూరిటీ తదితర వివరాలను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె వైద్య విద్యార్థులతో మాట్లాడారు. జూనియర్లను ర్యాగింగ్ చేయరాదని సీనియర్ విద్యార్థులకు సూచించారు. యాంటీ ర్యాగింగ్ కమిటీలపై ఆరా తీశారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శాంతి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ చందర్ తదితరులు పాల్గొన్నారు. -
కమీషన్ల కోసం పని చేస్తున్నారా?
చిన్నకోడూరు(సిద్దిపేట): ఇరిగేషన్ అధికారులు కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు తీసుకోవడానికే తప్ప రైతుల కోసం పని చేయడం లేదని, ఇకనైనా అధికారుల్లో మార్పు జరగకపోతే సహించేది లేదని మెదక్ ఎంపీ రఘునందన్రావు అధికారుల తీరుపై మండిపడ్డారు. బుధవారం మండల పరిధిలోని రంగనాయక సాగర్వద్ద ఇరిగేషన్ ఎస్ఈ కార్యాలయంలో మల్లన్నసాగర్ 12వ ప్యాకేజీ పనులపై ఇరిగేషన్ అధికారులు, మెగా కంపెనీ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 నెలలు అయినా అధికారులు, ప్రజా ప్రతినిధులతో ఎందుకు సమీక్ష సమావేశం నిర్వహించలేదని, జీతాలు తీసుకోవడం లేదా అని ప్రశ్నించారు. నెల రోజుల్లో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లో మిగిలిపోయిన పనులు పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందించాలని ఆదేశించారు. 2022లో పనులకు శంకుస్థాపన చేసినా నేటి వరకు ఎందుకు సాగు నీరు ఇవ్వలేదని మండిపడ్డాడు. దుబ్బాక నియోజకవర్గంలో గురువారం నుంచి ఇరిగేషన్ అధికారులు పర్యటించాలని సూచించారు. దుబ్బాక నియోజకవర్గంలో రైతులు ఎక్కువగా ప్రాజెక్టుతో నష్టపోయారని ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మెగా కంపెనీ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ బస్వరాజు, అధికారులు పాల్గొన్నారు. రైతుల ప్రయోజనాలు పట్టవా.. ఇరిగేషన్ అధికారులపై ఎంపీ రఘునందన్రావు ఫైర్ -
ఇన్చార్జి మంత్రిని కలిసిన నాగపురి
చేర్యాల(సిద్దిపేట): ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ను సోమవారం మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగంగౌడ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రనాయకుడు నాగపురి కిరణ్కుమార్గౌడ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు చేర్యాల ప్రాంతంలోని పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. పట్టణంలో అసంపూర్తిగా ఉన్న సమీకృత భవనం నిర్మాణం పూర్తి చేయాలని, అలాగే నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసి అవసరమైన డాక్టర్లను నియమించాలని కోరారు. జిల్లా ఇన్చార్జి మంత్రి హోదాలో చేర్యాల పట్టణ అభివృద్ధిపై రివ్యూ నిర్వహించాలని కోరినట్లు తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి దర్శనానికి రావాలని ఆహ్వానించినట్లు తెలిపారు. వీటన్నింటిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. -
అర్జీలు త్వరగా పరిష్కరించండి
● ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలి ● అధికారులకు కలెక్టర్ ఆదేశం ● ప్రజావాణికి 186 దరఖాస్తులు సిద్దిపేటరూరల్: జిల్లా వ్యాప్తంగా ప్రజావాణిలో ప్రజలు అందించిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు. అలాగే సంబంధిత వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో జిల్లా అదనపు కలెక్టర్లు గరీమా అగర్వాల్, అబ్దుల్ హమీద్తో కలిసి కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. అంతకుముందు ఉదయం జిల్లా అధికారులతో ఇప్పటివరకు ప్రజవాణిలో స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారం, పెండింగ్ వివరాలు శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిపై నమ్మకం కలిగేలా దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆయా వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి 186 దరఖాస్తులు వచ్చాయి. టోకెన్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి.. అర్జీదారులు దరఖాస్తులు అందించేందుకు ఒక్కసారిగా రావడంతో హాలు కిక్కిరిసిపోయింది. దీంతో స్పందించిన కలెక్టర్ టోకెన్ సిస్టమ్ ఏర్పాటు చేసి క్రమానుసారంగా అర్జీలు స్వీరించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారి నాగరాజమ్మ, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. నూతన పెన్షన్ విధానం మాకొద్దు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల పెన్షన్ రూల్స్కు సవరణలు చేస్తున్న క్రమంలో దాన్ని ఉపసంహరించాలని కోరుతూ ఆల్ఇండియా రాష్ట్ర పెన్షనర్ల ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన పెన్షన్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టి పాస్ చేయించుకుని పెన్షన్ దారులకు తీవ్రమైన నష్టం కలిగించిందన్నారు. దేశంలోని పెన్షనర్లు నిరసన తెలుపుతూ కలెక్టర్లకు వినతిపత్రాలను అందించడం జరగుతుందన్నారు. హక్కులను భంగం కలిగించే ఈ నూతన పెన్షన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సింహారెడ్డి, సత్యనారాయణ, రవికుమార్, సిద్దారెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి
సిద్దిపేటజోన్: ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, లబ్ధిదారుల ఎంపికలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని సీఐటీయూ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ కార్యాలయంలో అందచేశారు. అనంతరం సీఐటీయూ జిల్లా నాయకుడు రవికుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇస్తున్న ప్రభుత్వ సాయం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచాలని కోరారు. ప్రభుత్వ హామీ మేరకు ప్రతి మహిళకు రూ.2500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆసరా పథకం పింఛన్లు పెంచి ఇవ్వాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన కమిటీ అక్రమాలకు పాల్పడి అనర్హులను జాబితాలో చేర్చడం వల్ల అర్హులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. జిల్లా అధికారులు సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. రాజీవ్ యువ వికాస పథకం ద్వారా నిరుద్యోగులకు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మీ, కుమార్ బాబు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మీయం ఏదీ?
రైతు కూలీలపైఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందని ద్రాక్షేనా?ఆత్మీయ పథకం వివరాలు.. జిల్లా లబ్ధిదారులు సిద్దిపేట 16,505 మెదక్ 12,521 సంగారెడ్డి 22,792 ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా.. వ్యవసాయ భూమి లేనివారు, ఉపాధి హామీ కూలీగా 20 రోజుల పాటు పని చేసిన వారు అర్హులని నిబంధన పెట్టారు. లబ్ధిదారుల ఎంపిక కోసం ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,531 గ్రామాల్లో 51,818 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వారిలో ఇప్పటి వరకు 2,181 మందికే అందించడంతో 49,637 మంది లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం రైతు కూలీలు ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా రైతు కూలీలకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ కింద ఏడాదికి రూ.12వేల చొప్పున ఇస్తామని ప్రకటించింది. పథకాన్ని ఉమ్మడి మెదక్ జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్లో భాగంగా 70గ్రామాల్లో ప్రారంభించి దాదాపు ఐదు నెలలవుతున్నప్పటికీ ఇంకా అన్ని గ్రామాల్లో అమలు చేయడం లేదు. లబ్ధిదారులు ఎంపికై నప్పటికీ ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి, సిద్దిపేటకాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం లబ్ధిదారులకు అందని ద్రాక్షగానే మారింది. భూమిలేని ఉపాధి హామీ కూలీలకు రైతు భరోసా కింద ఏటా రూ.12వేల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండు విడతల్లో సాయం అందించనుంది. అందులో భాగంగా జనవరి 26న జిల్లా వ్యాప్తంగా ఒక్కో మండలం ఒక్కో గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసి 2,181 మందికి ఆత్మీయ భరోసా అందించారు. 70 గ్రామాలకే పరిమితం ఉమ్మడి మెదక్ జిల్లాలో 70మండలాల్లో ఒక్కో గ్రామ పంచాయతీని పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసి జనవరి 26న 2.181 మందికి మంజూరు పత్రాలను అందజేశారు. తర్వాత రూ.6వేల చొప్పున బ్యాంక్ ఖాతాలలో రూ. 1,30,86,000 జమ చేశారు. పైలెట్ ప్రాజెక్ట్లో అందుకున్న వారికి మరో నెల రోజులైతే రెండో విడత సాయం అందించాల్సిన సమయం వస్తుంది. మిగతా లబ్ధిదారులకు ఆత్మీయ భరోసా వస్తుందా? రాదా ? అని ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఇస్తారనేది అధికారులు ఎవరు చెప్పడం లేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింది ఎంపిక చేసిన లబ్ధిదారులకు సాయం అందజేయాలని కోరుతున్నారు. పైలెట్ గ్రామాలకే పరిమితమా.. ఉమ్మడి మెదక్ జిల్లాలో 51,818 మంది లబ్ధిదారుల ఎంపిక త్వరగా అందజేయాలంటూ వేడుకోలు -
ఉపకరణాల కోసం దరఖాస్తుల ఆహ్వానం
సిద్దిపేటరూరల్: ఉపకరణాలు అవసరం ఉన్న దివ్యాంగుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీకాంత్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని రకాల ధ్రువపత్రాలతో http://tgobmms.cgg.gov.in// వెబ్సైట్లో ఈనెల 27లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు కలెక్టరేట్లో జిల్లా సంక్షేమ శాఖ అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. అర్హులైన దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.27న అథ్లెటిక్స్ ఎంపిక పోటీలుసిద్దిపేటజోన్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 27న ఎంపిక పోటీలు ఉంటాయని అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పరమేశ్వర్, ప్రధాన కార్యదర్శి వెంకట్ స్వామి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 8 గంటలకు స్థానిక స్టేడియంలో అండర్ 10, 12, 14 బాల బాలికలకు ఎంపిక పోటీలు ఉంటాయన్నారు. పోటీల్లో పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలు, మొదటి మూడు స్థానాలు సాధించిన వారికి పతకాలు, మెరిట్ సర్టిఫికెట్స్ అందజేస్తారన్నారు. అత్యంత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు వచ్చే నెల 6న హనుమకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 26న సాయంత్రం ఆరు గంటల లోపు బర్త్ సర్టిఫికెట్ జిరాక్స్తో వచ్చి జిల్లా అథ్లెటిక్స్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 8501977079, 9704061543 నంబర్లు సంప్రదించాలన్నారు.రూ.1000 జరిమానాఅక్కన్నపేట(హుస్నాబాద్): ‘పచ్చని చెట్లపై గొడ్డలివేటు’ అనే శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనాన్ని పంచాయ తీ కార్యదర్శి స్వరూప స్పందించారు. ఈ సందర్భంగా సోమవారం గ్రామస్తులు, మాజీ ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో భాగంగా ఏపుగా పెరిగిన పచ్చని చెట్లను నేటమట్టం చేసిన రైతుకు రూ.1,000జరిమానా విధించినట్లు తెలిపారు. అలాగే రోడ్లకు ఇరువైపులా నాటిన చెట్లను ఎవరైనా నరికివేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.హక్కుల పరిరక్షణ కమిషన్ అధ్యక్షుడిగా రాజుచారిసిద్దిపేటఅర్బన్: జాతీయ మానవ హక్కుల పరిరక్షణ కమిషన్ జిల్లా అధ్యక్షుడిగా మండలంలోని ఎల్లుపల్లికి చెందిన చెన్నోజి రాజుచారి నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షురాడు విజయలక్ష్మి సోమవారం నియామక పత్రం అందజేశారు. తనను నమ్మి జిల్లా అధ్యక్షుడిగా రెండో సారి అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షురాలికి రాజుచారి కృతజ్ఞతలు తెలిపారు.టాస్క్ఫోర్స్ నూతన ఇన్స్పెక్టర్గా శ్రీధర్సిద్దిపేటకమాన్: సిద్దిపేట టాస్క్ఫోర్స్ నూతన ఇన్స్పెక్టర్గా శ్రీధర్ పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు నూతన సీఐ పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీపీ అనురాధను సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. పీడీఎస్ రైస్, ఇసుక అక్రమ రవాణ జరగకుండా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలన్నారు.అందుబాటులో ఇంజనీరింగ్ విద్యహుస్నాబాద్: శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల హుస్నాబాద్లో నూతన విద్యార్థుల అడ్మిషన్లు, తరగతులు ప్రారంభించేందుకు రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం రాత్రి హైదరాబాద్లోని సెక్రటేరియట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. హుస్నాబాద్ శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో నాలుగు కోర్సులు ప్రభుత్వం కేటాయించింది. నాలుగు కోర్సులకు గాను 240 సీట్లతో అడ్మిషన్ల ప్రారంభం అవుతుందని మంత్రి పొన్నం తెలిపారు.మంత్రి టెలికాన్ఫరెన్స్హుస్నాబాద్: నియోజకవర్గంలోని వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్లు ఏడీఏ శ్రీనివాస్ తెలిపారు. వానాకాలం సీజన్లో సాగు చేస్తున్న రైతులందరికీ రైతు భరోసా వేశామన్నారు. మిగిలి ఉన్న వారికి రేపటికల్లా రైతుల అకౌంట్లల్లో జమ అవుతాయని తెలిపారు. -
విద్య ద్వారానే విజ్ఞానం
కొండపాక(గజ్వేల్): విద్య ద్వారానే విజ్ఞానం పెంపొందుతుందని రాష్ట్ర సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి అన్నారు. బందారం గ్రామంలోని హైస్కూల్లో ‘మనం.. మన ఊరు’ పేరిట సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిధారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు బోధించే పాఠ్యాంశాలను ఓపికతో వింటూ ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. చిన్న తనం నుంచే లక్ష్యాన్ని ఏర్పరచుకొని ముందుకు సాగుతూ పుట్టిన ఊరుకు పెంచిన తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువస్తూ సమాజాభివృద్ధికి కృషి చేయాలన్నారు. 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు ఎక్కలదేవి పావని, రాగుల అర్చన, కెమ్మసారం అలేఖ్యలకు సిల్వర్ మెడల్స్తో పాటు నగదుగా అందజేస్తూ మిగతా విద్యార్థులకు విద్యాభ్యాస డైరీలను అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఎం రాంచంద్రం, మనం మన ఊరు ఉద్యోగుల అధ్యక్షుడు భగవాన్రెడ్డి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్యను అందించండి
సిద్దిపేటరూరల్: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో జిల్లా విద్యాశాఖ బడిబాట, వేసవిలో జరిగిన ఉపాధ్యాయుల శిక్షణ, పుస్తకాలు, యూనిఫాం పంపిణీ, టాస్, ఉల్లాస్, తదితర అంశాలపై విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులందరూ సమయపాలన పాటిస్తూ, విద్యార్థులకు కృత్యాధార బోధన నిర్వహిస్తూ క్లిష్టమైన అంశాలు సలువుగా అర్థమయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో డీఐఈఓ రవీందర్రెడ్డి, డీఈఓ శ్రీనివాస్రెడ్డి, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు, 26 మండలాల ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు. జాతీయ అవార్డులకు పంచాయతీలు పోటీ పడాలి జాతీయ అవార్డుల కోసం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు పోటీలో పాల్గొనాలని కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు. జాతీయ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడంపై సోమవారం జిల్లా, మండల స్థాయి అధికారులకు కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్తో కలిసి శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అవార్డులు, ప్రశంసలు సమర్థవంతంగా పని చేయడానికి ఎంతో ప్రోత్సాహం అందిస్తాయన్నారు. అనంతరం వనమహోత్సవం కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఈత, మునగ మొక్కలు ప్రధానంగా నాటాలని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రమేష్, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, డీపీఓ దేవకీదేవి, హౌసింగ్ పీడీ దామోదర్ రావు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, ఎంఈఓలు, ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్సిద్దిపేటకమాన్: న్యాయమూర్తి సాయిరమాదేవిని జిల్లా కోర్టులో కలెక్టర్ హైమావతి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్గా పదవి బాధ్యతలు చేపట్టిన తరుణంలో జిల్లా జడ్జిని ఆమె కలిసి మొక్కను అందించారు. ఈ సందర్భంగా ఇరువురు జిల్లాకు సంబంధించిన పలు విషయాలపై చర్చించారు. కలెక్టర్ హైమావతి అధికారులకు దిశానిర్దేశం అభివృద్ధిలో ఎంపీడీఓలే కీలకం దుబ్బాక: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో ఎంపీడీఓల పాత్ర కీలకమని కలెక్టర్ హైమావతి అన్నారు. సోమవారం సాయంత్రం ఎంపీడీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్శర్మ ఆధ్వర్యంలో జిల్లాలోని ఎంపీడీఓలు కలెక్టర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలు కలెక్టర్కు వివరించామని భాస్కర్శర్మ తెలిపారు. అందరం సమష్టిగా పనిచేసి జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్దామని కలెక్టర్ సూచించారని తెలిపారు. -
ఉత్సాహంగా ఒలింపిక్ రన్
సిద్దిపేటజోన్: ఒలింపిక్ డే పురస్కరించుకుని జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఒలింపిక్ రన్ నిర్వహించారు. స్థానిక ముస్తాబాద్ చౌరస్తాలో జిల్లా క్రీడల శాఖ అధికారి వెంకట్ నర్సయ్య, జిల్లా క్రీడా సమాఖ్య చైర్మన్ సాయిరాంలు రన్ను జెండా ఊపి ప్రారంభించారు. ముస్తాబాద్ చౌరస్తా నుంచి విక్టరీ టాకీస్ చౌరస్తా వరకు అక్కడి నుంచి తిరిగి డిగ్రీ కళాశాల మైదానం వరకు రన్ నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు వెంకట్స్వామి, రవీందర్ రెడ్డి, ఉప్పలయ్య, రామేశ్వర్ రెడ్డి, అశోక్, యువజన సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కిష్టయ్య ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణం పరిష్కరించాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) జిల్లా అధ్యక్షుడు కిష్టయ్య అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో డీటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిష్టయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలుచేయాలన్నారు. మిగిలిన డీఏలను వెంటనే ప్రకటించాలన్నారు. ఉపాధ్యాయుల పక్షాన పోరాటంలో డీటీఎఫ్ ముందుంటుందన్నారు. కార్యక్రమంలో డీటీఎఫ్ జిల్లా నాయకులు తిరుపతిరెడ్డి, మల్లయ్య, మనీష్ కుమార్, ప్రభాకర్రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలి సిద్దిపేటకమాన్: స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారామ్ అన్నారు. సిద్దిపేట ప్రెస్క్లబ్లో జరిగిన సమావేశంలో యాదవుల ఆత్మగౌరవ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో యాదవులకు మంత్రి పదవి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్లుగా అనేక అవకాశాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నెల 30న హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద జరగే యాదవుల ఆత్మగౌరవ సభను జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో కృష్ణ, రాము, నర్సింహులు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు ప్రశాంత్నగర్(సిద్దిపేట): పట్టణంలో జిల్లా స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు ఆదివారం జరిగాయి. పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులకు మెడల్స్, ప్రశంసా పత్రాలు అందించారు. విజేతలు ఈ నెల 28, 29 తేదీల్లో మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో జరిగే రాష్ట్ర ఓపెన్ కిక్ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీలలో పాల్గొననున్నట్లు నిర్వాహకులు తేజస్వీన్, ప్రవీణ్ తెలిపారు. పోటీలకు న్యాయ నిర్ణీతలుగా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆంజనేయులు, జనరల్ సెక్రటరీ భాగ్యరాజ్, ట్రెజరర్ స్వామి, జాయింట్ సెక్రటరీ పవన్ కల్యాణ్, క్రీడాకారులు పాల్గొన్నారు. అసైన్డ్ భూములపై సర్వహక్కులు కల్పించాలిఅంబేడ్కర్, పూలే సేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ రహీం నారాయణఖేడ్: రాష్ట్రంలో అసైన్డ్ భూములు కలిగి ఉన్న రైతులకు 1977 పీవోటీ చట్టాన్ని రద్దుచేసి భూములపై సర్వహక్కులు కల్పించాలని అంబేడ్కర్, పూలే సేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ రహీం ప్రభుత్వాన్ని కోరారు. ఖేడ్లోని సంఘం కార్యాలయంలో శనివారం నిర్వహించిన సంఘం జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ...గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలలో మిగులు, ప్రభుత్వ భూములను భూమిలేని నిరుపేదలకు అసైన్డ్ చేశారన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అసైన్డ్ భూములను రైతుల నుంచి బలవంతంగా లాక్కుని పల్లె ప్రకృతివనాలు, డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాలు, క్రీడా ప్రాంగణాలకు కేటాయించి పేదరైతులకు తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పండరీ, సహాయ కార్యదర్శి గౌచ్చిస్తి, ఖేడ్ డివిజన్ అధ్యక్షుడు నర్సింహులు, ప్రధాన కార్యదర్శి వినోద్కుమార్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు యాదమ్మ పాల్గొన్నారు. -
మల్లన్న క్షేత్రంలో భక్తుల సందడి
భక్తజన నాచగిరి కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లన్న ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం భారీ సంఖ్యలో తరలిరావడంతో అలయ పరిసరాలు రద్దీగా మారాయి. పుష్కరిణిలో స్నానమాచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. సుమారు 20వేల మంది దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. దర్శనానికి వచ్చిన భక్తులందరికీ బండారు బొట్టు పెట్టడం, అభిషేక జలాలు చల్లడం, అఖండ హారతులు ఇవ్వడం వంటి కార్యక్రమాలను అర్చకులు ప్రారంభించారు.నాచగిరి లక్ష్మీ నృసింహ క్షేత్రం భక్తులతో సందడిగా మారింది. ఆదివారం హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్ రంగారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు. హరిద్ర నది వాగులో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం గర్భగుడిలో కొలువైన స్వామివారిని దర్శించుకున్నారు. అభి షేకం, వ్రతం, కల్యాణాది మొక్కులు తీర్చుకున్నారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. క్షేత్రంలో 15 వ్రతాలు, 10 అభిషేకాలు, 8 కల్యాణాలు జరి గాయి. ఆలయ యంత్రాంగం భక్తులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నది. – వర్గల్(గజ్వేల్) -
నూనె గింజల ఉత్పత్తికి ఊతం
కొత్త పథకానికి శ్రీకారం● ఈ ఖరీఫ్ నుంచే ఎన్ఎంఈఓ అమలు ● రైతులకు ఉచితంగా కొత్త విత్తన రకాల సరఫరా ● లబ్ధిదారుల ఎంపికకు వ్యవసాయశాఖ సన్నాహాలు పథకం అమలుకు నిర్దేశించిన లక్ష్యం పంట : విస్తీర్ణం (ఎకరాల్లో..) వేరుశనగ : 36,250 కుసుమ : 3,000 నువ్వులు : 15,000 సోయాబీన్ : 26,000 పొద్దుతిరుగుడు : 12,625 మొత్తం : 92,875 సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: వంట నూనె గింజల పంటల విస్తీర్ణం ఉత్పత్తి పెంచడమే లక్ష్యంగా ప్రభు త్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఎన్ఎంఈఓ (నేషనల్ మిషన్ ఆన్ ఈడబుల్ ఆయిల్) పథకం కింద సోయా, పొద్దుతిరుగుడు, వేరుశనగ, నువ్వులు, కుసుమ పంటలు సాగు చేసే రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రైతులు సాంప్రదాయ పంటలకు స్వస్తి చెప్పేలా..అధిక దిగుబడులు ఇచ్చే కొత్త రకాల విత్తనాలను ఉచితంగా సరఫరా చేయనుంది. అలాగే సంబంధిత వ్యవసాయ శాస్త్రవేత్తలతో సాంకేతిక సహాయాన్ని అందించనుంది. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే ఈ పథకాన్ని అమలు చేయనుంది. 2030 వరకు ఈ పథకాన్ని కొనసాగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఈ మేరకు లబ్ధిదారుల గుర్తింపుకు సన్నాహాలు చేస్తున్నారు. అధిక దిగుబడిని ఇచ్చే విత్తనాల సరఫరా.. ఈ పథకం కింద ఎంపికై న రైతులకు ఉచితంగా నూనె గింజల విత్తనాలను ప్రభుత్వమే సరఫరా చేయనుంది. ఒక్కో రైతుకు రెండున్నర ఎకరాలు (ఒక హెక్టారు)కు పరిమితి విధించారు. ఉదాహరణకు సోయా సాగు చేస్తున్న రైతులు 1994లో విడుదల చేసిన జేఎస్.–335 వైరెటీనే ఎక్కువగా విత్తుకుంటున్నారు. ఈ వైరెటీతో ఆశించిన దిగుబడి రావడం లేదు. వీటి స్థానంలో 2021లో రిలీజైన డీఎస్బీ–34, ఎంఏసీఎస్–1460 వైరెటీ సోయా విత్తనాలను సరఫరా చేస్తారు. అలాగే రైతు ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. పంటలను ఎప్పటికప్పుడు పరిశీలించి, తగిన సూచనలు చేసేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలతో సాంకేతిక సహాయాన్ని అందిస్తారు. పాత వైరెటీలతో 60 శాతం తక్కువ దిగుబడి కొత్తగా వచ్చిన నూనెగింజల విత్తన రకాలకు, ప్రస్తుతం రైతులు వాడుతున్న విత్తనాలకు వచ్చే దిగుబడిలో 60 శాతం తక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. సోయా పంటనే ఉదాహరణగా తీసుకుంటే కొత్త వైరెటీలు (2021లో రిలీజైన డీఎస్బీ–34, ఎంఏసీఎస్–1460 వైరెటీ) తో ఎకరానికి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రైతులు మొగ్గు చూపేలా.. ప్రస్తుతం రాష్ట్రంలో వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలనే ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ రైతులు నూనెగింజల సాగు వైపు మొగ్గు చూపేలా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. మరోవైపు దేశంలో నూనెగింజల ఉత్తత్తి చాలా తక్కువగా ఉంది. వివిధ దేశాల నుంచి నూనెగింజలను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నూనెగింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది.పంటల వారీగా ఎంపిక చేసిన జిల్లాలు సోయాబీన్ : సంగారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్ పొద్దుతిరుగుడు : సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్, భద్రాద్రి, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, కరీంనగర్, నిర్మల్, పెద్దపల్లి వేరుశెనగ : నల్లగొండ, నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ, మహబూబ్నగర్, వికారాబాద్, నారాయణపేట కుసుమ : సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్ నువ్వులు : జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ -
చేనేతల సంక్షేమానికి చర్యలు చేపట్టాలి
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాక: చేనేతల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆదివారం దుబ్బాకలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి నీలకంఠ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులవృత్తికి ఆదరణ లేకపోవడంతో చేనేత కుటుంబాలు దుర్భరంగా కాలం వెళ్లదీస్తున్నాయని అన్నారు. చేనేత వృత్తిలో ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేతకు ప్రసిద్ధి గాంచిన దుబ్బాక ప్రాంతంలో నేడు 50 కుటుంబాలకు కూడా ఉపాధి దొరకని పరిస్థితి నెలకొందన్నారు. చేనేతల సంక్షేమం కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలన్నారు. నీలకంఠ సమాజం అభ్యున్నతికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో నీలకంఠ సంఘం అధ్యక్షుడు బోడ శ్రీహరి, కాల్వ రామస్వామి, వీరబత్తిని లింగం, దుబ్బరాజం, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తదితరులు ఉన్నారు. -
పచ్చని చెట్లపై గొడ్డలివేటు
అక్కన్నపేట(హుస్నాబాద్): నీడనిచ్చే పచ్చని చెట్లను యథేచ్ఛగా నరికివేస్తున్నారు. మండల పరిధిలోని కట్కూర్ గ్రామ సమీపంలో రోడ్డు పక్కన ఏపుగా పెరిగిన చట్లను నరికేశారు. ఐదారేళ్ల కిత్రం పంచాయతీ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటి మొక్కలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో ఆదివారం ఓ రైతు సుమారు సుమారు 10చెట్లను నేలమట్టం చేశారు. ఈ రోడ్డు మార్గంగా వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ చెట్ల నీడన సేదతీరేవారు. చెట్ల నరికివేతతో ఇప్పుడా సౌకర్యం లేక ఆవేదన చెందుతున్నారు. పచ్చని చెట్లను నరికివేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెట్లను నరికివేసిన సదరు వ్యక్తికి జరిమానాతోపాటు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
10 రోజుల్లో ఇళ్ల గ్రౌండింగ్
● ఉచిత ఇసుకకు తహసీల్దార్ల వద్దటోకెన్లు తీసుకోండి ● అధికారులకు కలెక్టర్ హైమావతి ఆదేశం సిద్దిపేటరూరల్: మంజూరు పత్రాలు పొందినవారితో 10 రోజుల్లో ఇందిరమ్మ ఇళ్లకు గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గృహనిర్మాణ శాఖ, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆర్థిక స్థోమత లేక ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఉంటే నోట్ చేసుకోవాలని, ఎంపీడీఓతో సమావేశం నిర్వహించి సుముఖంగా లేని వారికి ఇందిరమ్మ కమిటీ, అధికారుల సమక్షంలో లెటర్ రాసి వారితో ఇల్లు వద్దు అన్నట్లు సంతకం తీసుకోవాలని చెప్పారు. రెండో విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు సోమవారం నుంచి నిర్మాణాలు ప్రారంభించాలన్నారు. ఉచిత ఇసుకకు సంబంధించి ఆయా మండలాల తహసీల్దార్లు టోకెన్లు అందజేస్తారన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, నిర్మాణంలో ఇబ్బందులు ఎదురైనా అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా హౌసింగ్ పీడీ దామోదర్, గృహ నిర్మాణ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఈఈ, డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మాలనపై వారం రోజు ల పాటు ప్రణాళిక ప్రకారంగా యువతకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వీక్ –2025 కార్యాచరణపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఉన్నత పాఠశాల స్థాయి నుంచి ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, నర్సింగ్, మెడికల్ తదితర విద్యాసంస్థలపై ఫోకస్ పెడుతూ ఈనెల 26వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కాగా, మాదక ద్రవ్యాల పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసమూర్తి, ఇంటర్మీడియెట్ అధికారి శ్రీనివాస్రెడ్డి, డీపీఆర్ఓ రవికుమార్ పాల్గొన్నారు. డయేరియా వ్యాధిపై అప్రమత్తం డయేరియా వ్యాధి ప్రబలకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అదేశించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో తాగునీరు, కలుషితం, అపరిశుభ్ర వాతావరణం వల్ల డయేరియా, ఇతర వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నా రు. ప్రభుత్వ ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా డయేరియాపై అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలలు,, హాస్టళ్లు, విద్యార్థులకు వేడి నీ రు అందించాలన్నారు. అన్ని విద్యాలయాల్లో ఓఆర్ఎస్, జింక్ టాబ్లెట్లు , ఓఆర్ఎస్ ద్రావణాన్ని తయా రు చేసే విధానం గూర్చి వివరించాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ పల్వాన్ కుమార్, డిడబ్ల్యూఓ లక్ష్మికాంత్రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. -
నాచగిరి వ్రత శోభితం
వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధమైన నాచగిరి శ్రీలక్ష్మీనృసింహ క్షేత్రం శనివారం సత్యదేవునివ్రత శోభతో అలరారింది. క్షేత్రానికి హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలు, ఉమ్మడి మెదక్ జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు. హల్దీనది వాగులో పుణ్యస్నానాలాచరించి భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ వ్రతాలు, అభిషేకాలు, కల్యాణాలు, సేవలు జరిపించి మొక్కులు తీర్చుకున్నారు. గర్భగుడిలో కొలువైన శ్రీలక్ష్మీనృసింహస్వామివారిని దర్శించుకుని తరించారు. ఈ సందర్భంగా క్షేత్రంలో భక్తులతో కిటకిటలాడింది. భక్తులకు ఇబ్బంది కలగకుండా సీనియర్ అసిస్టెంట్ సుధాకర్గౌడ్ పరివారం తగు జాగ్రత్తలు తీసుకున్నారు. -
30వరకు దరఖాస్తుల స్వీకరణ
ములుగు(గజ్వేల్): సిద్దిపేట జిల్లా ములుగు అటవీ కళాశాల, పరిశోధన సంస్థ (ఎప్సీఆర్ఐ)లో 2025–26 సంవత్సరానికి గానూ బీఎస్సీ (హానర్స్) పారెస్ట్రీ నాలుగేళ్ల డిగ్రీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు చేసుకోవాలని కళాశాల డీన్ ఎస్జె.ఆశ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈఏపీసీఈటీ ర్యాంకుల ఆధారంగా ఎంపిక జరుగుతుందన్నారు. దరఖాస్తులుకు ఈ నెల 30వ వరకు గడువు అన్నారు. ప్రవేశం కొరకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.400, మిగతా వారు రూ.600 చెల్లించి నమోదు చేసుకోవాలని కోరారు. 20 మందికి ఉపాధి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా సిద్దిపేట జోన్: ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో శనివారం కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. మొత్తం 50 మంది విద్యార్థులు హాజరుకాగారవగా వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి 20 మందిని ఎంపిక చేశారు. అనంతంర రీసోర్స్ పర్సన్ దుర్గాప్రసాద్ విద్యార్థులకు ఫార్మా రంగంలో గల అవకాశాలను గురించి వివరించారు. కెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ హైదరాబాద్ జీడిమెట్ల రిడాక్స్ ల్యాబ్స్తో ఎంఓయూ కుదుర్చుకున్నట్లు చెప్పారు. తద్వారా కళాశాల విద్యార్థులకు పరిశ్రమల్లో శిక్షణ, ఉపాధి అవకాశాలు సులువుగా పొందే వీలుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత కెమిస్ట్రీ అధ్యాపకులను అభినందించారు. కార్యక్రమంలో కెమిస్ట్రీ అధ్యాపకులు డాక్టర్ రవి, భాస్కర్, సుమలత, ఆంజనేయులు, శ్రీనివాస్, మనోహర్, బాలకిషన్, తదితరులు పాల్గొన్నారు. ఇర్కోడ్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తిచేయాలిజల సాధన సమితి డిమాండ్ తొగుట(దుబ్బాక): ఇర్కోడ్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తిచేసి మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి చెరువుల్లోకి నీటిని విడుదల చేయాలని జల సాధన సమితి నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని గుడికందులలో ఆయా గ్రామాల రైతులు శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా సాగునీరు సాధించే వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. మండలంలో 50 టీఎంసీల సామర్ధ్యం కలిగిన రిజర్వాయర్ నిర్మించినప్పటికి తమ భూమికి చుక్క నీరు అందని దుస్దితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు. వచ్చే యాసంగి పంటలకు మల్లన్న సాగర్ నుంచి చెరువులు నింపాలని డిమాండ్ చేశారు. లేకుంటే రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయకుండా అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. ‘కూత’ వేటు దూరంలో.. ● తుది దశకు కొమురవెల్లిరైల్వే స్టేషన్ పనులు కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం ఎప్పుడు ఎప్పుడాని ఎదురు చూస్తున్న భక్తులకు త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రతి యేటా మల్లన్న స్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్ఘడ్ నుంచి భక్తులు వస్తుంటారు. కొత్తపల్లి నుంచి మనోహరాబాద్ వరకు నూతనంగా నిర్మాణం చేపడుతున్న రైల్వే లైన్లో కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ వద్ద రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. దీంతో రైల్వేశాఖ స్పందించి స్టేషన్ మంజూరు చేయగా.. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్యాదవ్తో కలసి 2024 ఫిబ్రవరి 15న భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ప్రస్తుతం స్టేషన్, ప్లాట్ఫాం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. దసరాకు కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభిస్తామని ఇటీవల కిషన్రెడ్డి ప్రకటించారు. ఈ రైల్వేస్టేషన్ ప్రారంభమైతే దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ప్రయాణ ఖర్చులతో పాటు సమయం ఆదా అవుతుంది. -
ఖేడ్లో మట్టి పరీక్ష కేంద్రం ఏర్పాటు
● ఉమ్మడి జిల్లాలో రెండో కేంద్రం ● ఉమ్మడి మెదక్ జిల్లా రైతులకు ప్రయోజనంనారాయణఖేడ్: ఎరువులు, రసాయన మందుల విచ్చలవిడి వాడకం ద్వారా నష్టపోతున్న రైతన్నలకు ఉపయోగపడేలా ఉమ్మడి జిల్లాకు మరో మట్టి నమూనా కేంద్రం మజూరైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోనే మట్టి నమూనా పరీక్షా కేంద్రం కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలోని ఏ ప్రాంతం రైతులైనా తమ మట్టి నమూనాలను ఇక్కడే పరీక్షించుకోవాల్సి వస్తుంది. కాగా, ప్రభుత్వం తాజాగా నారాయణఖేడ్కు మట్టి పరీక్షా కేంద్రాన్ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకుగాను రూ.1.95కోట్లను విడుదల చేసింది. రూ.1కోటి ద్వారా భవన నిర్మాణం పనులు చేపట్టగా, రూ.95క్షలతో పరికరాలు, గాజు సామగ్రి, రసాయనాలు, ఫర్నీచర్, మౌలిక సదుపాయాలు, ఇతర వస్తువుల కొనుగోలుకు వినియోగించనున్నారు. ఈ కేంద్రం పరిధిలో జిల్లాతోపాటు మెదక్ జిల్లా పరిధిలోని మండలాల రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఖేడ్, అందోల్, జహీరాబాద్ నియోజకవర్గాలతోపాటు, మెదక్ జిల్లాలోని పెద్దశంకరంపేట, రేగోడ్, టేక్మాల్ తదితర మండలాల రైతులకు అనువుగా ఉండనుంది. ఖేడ్ పట్టణ శివారులోని జూకల్ శివారులో స్థలాన్ని ఇదివరకే ఎంపిక చేసి ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఆ స్థలంలో భవన నిర్మాణం పనులు చేపట్టనున్నారు. ఈ కేంద్రంలో ఒక ఏడీఏ, ఏవో, ఏఈవోలు, ల్యాబ్ టెక్నీషియన్స్ను నియమించనున్నారు. భారీగా ఎరువుల వినియోగం రాష్ట్రంలో భారీ స్థాయిలో ఎరువుల వినియోగం జరుగుతుందని, ప్రధానంగా యూరియా వినియోగాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎరువుల, రసాయనాల మంత్రిత్వ శాఖ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసింది. యూరియా వినియోగం ఎక్కువవుతోందని, దాని ప్రభావం సాగు భూములపై చూపుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. పంజాబ్ తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రసాయన ఎరువులు, క్రిమిసంహారక పురుగు మందుల వినియోగం మోతాదుకు మించి ఉందని వెల్లడించింది. మట్టి పరీక్షల ద్వారా ఈ సమస్యలను అధిగమించే అవకాశం ఉంది. ఇవీ ప్రయోజనాలు.. మట్టి పరీక్ష అనేది మట్టిలోని పోషక పదార్థాల స్థాయిలు, పీహెచ్ విలువ, ఉప్పు సమతుల్యత, సూక్ష్మపదార్థాల ఉనికి తెలుసుకోవడం వ్యవసాయంలో చాలా కీలకమైన అంశం. మట్టి పరీక్ష పంటకు సరిపోయే ఎరువుల ఎంపికకు సహాయ పడుతుంది. మట్టిలో పోషకాలు ఎక్కువగా ఉన్నాయా, ఏవి కొరతగా ఉన్నాయో తెలుసుకుని అందుకు అవసరమైన ఎరువులను సరిగ్గా వినియోగించుకునే వీలుంది. అనవసర ఎరువుల వినియోగం తగ్గించుకోవచ్చు. ఫలితంగా అవసరానికి మించి ఎరువుల వాడకం వల్ల కలిగే హానిని నివారించుకునే వీలుంది. సమతుల్య పోషకాల నిచ్చెన వల్ల పంట ఆరోగ్యంగా పెరిగి దిగుబడి వస్తుంది. అవసరమైన వాటినే వినియోగించడం వల్ల ఖర్చూ తగ్గుతుంది. మట్టిలో మార్పులను గమనించి భవిష్యత్తులో తగిన పంటలు వేసే అవకాశం కలుగుతుంది. అధిక రసాయనాల వాడకాన్ని నియంత్రించి నేల, నీటి, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. కొత్త భూమిలో పంట సాగు ప్రారంభించే ముందు, ప్రతీ రెండు మూడేళ్లకు ఒకసారి, పంట దిగుబడులు తగ్గిన సందర్భాలు, భూమి మార్పు జరిగిన సందర్భాల్లో మట్టి నమూనా పరీక్షలు నిర్వహించుకోవాలి. -
లోటు వర్షపాతమే..!
జిల్లాలోని 23 మండలాల్లో ఇదే పరిసి్థతి మండలాలవారీగా నమోదైన వర్షపాతం మండలం మిల్లి.మీటర్లలో దుబ్బాకలో 36.7 సిద్దిపేట రూరల్ మండలంలో 86.7 చిన్నకోడూరులో 92.0 బెజ్జంకిలో 53.3 కోహెడలో 64.3 హుస్నాబాద్లో 87.3 అక్కన్నపేటలో 68.6 నంగునూర్లో 36.6 సిద్దిపేట అర్భన్లో 66.9 తొగుటలో 78.6 మిరుదొడ్డిలో 93.5 దౌల్తాబాద్లో 46.2 రాయపోల్లో 82.8 వర్గల్లో 55.1 ములుగులో 48.4 మర్కూక్లో 22.9 జగదేవ్పూర్లో 40.8 గజ్వేల్లో 69.1 కొండపాకలో 45.8 చేర్యాలలో 65.9 మద్దూర్లో 32.4 అక్భర్పేట–భూంపల్లిలో 56.6 కుకునూర్పల్లిలో 54.0జగదేవ్పూర్ మండలం తిగుల్లో మొలకెత్తని పత్తిగజ్వేల్: సిద్దిపేట జిల్లాలో వర్షపాతం తీరు రైతులను కలవరానికి గురిచేస్తోంది. ఇప్పటివరకు సమృద్ధిగా వర్షాలు కురవకపోగా, 23 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. గత నెలలో కురిసిన వర్షాలకు రైతులు పత్తిని విత్తుకోగా, వర్షాల జాడ కరువై అది మొలకెత్తక ఇప్పటికే భారీ నష్టం చోటుచేసుకున్నది. మిగితా పంటల సాగుపై ఆందోళన నెలకొన్నది. జిల్లాలో జూన్కు సంబంధించి ఇప్పటివరకు 75.7మి.మీటర్ల సాధారణ వర్షపాతం కావాల్సి ఉన్నది. కానీ అడపాదడపా 37.5మి.మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. కొమురవెళ్లిలో ఇప్పటివరకు 79.9మి.మీలు, నారాయణరావుపేట మండలంలో 89.6మి.మీల సాధారణ వర్షపాతం నమోదైంది. దూల్మిట్ట మండలంలో 120.7మి.మీల వ ర్షపాతం నమోదైంది. దీనిప్రకారం ఆ ఒక్క మండ లంలో 45.4మి.మీల అధిక వర్షపాతం నమోదైంది. మొదలైన కలవరం జిల్లాలో ఈసారి 5.50లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగులోకి వస్తాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ప్రధానంగా వరి అత్యధికంగా 3లక్షల ఎకరాలకుపైగా సాగులోకి రావొచ్చని భావిస్తున్నారు. కానీ జూన్లో సమృద్ధిగా వర్షాల్లేక పోవడం, 23 మండలాల్లో మైనస్ వర్షపాతం ఉండటం వల్ల రైతుల్లో కలవరం మొదలైంది. జిల్లాలో ఇప్పటికే పత్తి 60వేల ఎకరాలకుపైగా సాగులోకి వచ్చింది. గత నెలలో కురిసిన వర్షాలకు రైతులు విత్తనాలు వేశారు. కానీ అప్పటి నుంచి భారీ వర్షాల జాడలేక...పత్తి విత్తు మొలకెత్తని పరిస్థితి నెలకొన్నది. దీనివల్ల ఇప్పటికే పత్తికి భారీ నష్టం జరిగిపోయింది. ఇకపోతే జిల్లాలోని మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయకసాగర్ రిజర్వాయర్లలో నీటిమట్టం గణనీయంగా పడిపోవడం వల్ల కాల్వల ద్వారా సాగునీరు అందే పరిస్థితి లేకపోవడం రైతులు ఆందోళన చెందుతున్నారు. రిజర్వాయర్లలో నీళ్లు సమృద్ధిగా ఉంటే కాల్వల ద్వారానే నీరు అందడమే కాకుండా వేలాది ఎకరాల్లో భూగర్భ జలమట్టం పెరిగి బోరుబావుల్లో నీరు పుష్కలంగా ఉండేవి. కానీ ప్రస్తుతం భిన్నమైన పరిస్థితులు నెలకొనడం వరి సాగుపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నది. ఈ నెలాఖరులో లేదా జూలైనైనా భారీ వర్షాలు కురిస్తే రైతులకు కొంత ఊరట లభించే అవకాశమున్నది. జూన్లో సాధారణ వర్షపాతం 75.7మి.మీ ఇప్పటివరకు కురిసింది...37.5మి.మీటర్లు మాత్రమే పత్తికి ఇప్పటికే భారీ నష్టం..ఆందోళనలో అన్నదాతఆందోళన వద్దు జిల్లాలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పంటల సాగుకు అదును దాటలేదు. భారీ వర్షాలు వస్తాయని ఆశాభావం ఉన్నది. జూలై 15 వరకు పంటల సాగుకు అవకాశమున్నది. : రాధిక, వ్యవసాయాధికారి -
పంచాయతీ భవనమే ఇల్లు
జగదేవ్పూర్(గజ్వేల్): ఆమె గత స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవ సర్పంచ్.. ఉన్న పెంకుటిల్లు కూలిపోవడంతో గ్రామ పంచాయతీ భవనంలోనే కుటుంబంతో తలదాచుకుంటోంది. ఇందిరమ్మ ఇల్లు వస్తదని అనుకుంటే నిరాశే మిగిలింది. వివరాల్లోకి వెళితే... సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని అనంతసాగర్ గ్రామానికి దండు లావణ్యమల్లేశం 2019 స్థానిక ఎన్నికల్లో సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.తనకున్న అర ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటూ పెంకుటిల్లులోనే నివాసముంటున్నారు. ఏడాదిన్నర క్రితం వర్షాలకు పెంకుటిల్లు కూలిపోగా, ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో గ్రామ పంచాయతీ భవనంలోనే నివాసం ఉంటున్నారు. ఆమెకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదు. తాను బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ను కాబట్టే ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన బిల్లులు రూ. 4లక్షల వరకు రావాలని వాపోయారు. -
మెడికల్ కౌన్సిల్ తనిఖీలు
సిద్దిపేటకమాన్: పట్టణంలో నలుగురు నకిలీ వైద్యులను గుర్తించినట్లు మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ జి. శ్రీనివాస్, సిద్దిపేట ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ చందర్ తెలిపారు. సిద్దిపేటలోని పలు ఆస్పత్రులు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ సిద్దిపేటలో 20 ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించామన్నారు. పట్టణంలోని నాలుగు ఫస్ట్ ఎయిడ్ సెంటర్లలో అర్హతకు మించి వైద్యం అందిస్తున్నారన్నారు. అధిక మోతాదులో యాంటీబయాటిక్ మందులు, స్టెరాయిడ్స్ ఇస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. త్వరలో వీరిపై పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయం నుంచి అనుమతులు తీసుకున్న ఆస్పత్రులలో అర్హత కలిగిన వైద్యులు మాత్రమే వైద్య సేవలు అందించాలని తెలిపారు. సమావేశంలో ఐఏంఏ అధ్యక్షుడు డాక్టర్ చందర్, జనరల్ సెక్రటరీ డాక్టర్ గణేష్ వెనిశెట్టి, ట్రెజరర్ డాక్టర్ ప్రణీత్, డాక్టర్ సముద్రాల శ్రీనివాస్, డాక్టర్ సతీష్, డాక్టర్ శ్రవణ్, డాక్టర్ విష్ణు తదితరులు పాల్గొన్నారు.నలుగురు నకిలీ వైద్యుల గుర్తింపు -
అర్హులందరికీ ఇళ్లు ఇస్తాం
సిద్దిపేటజోన్: ‘ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆందోళన చెందవద్దు. ఇది నిరంతరం ప్రక్రియ. అర్హులైన వారందరికీ ఇళ్లు అందిస్తాం. అవసరమైతే ముఖ్యమంత్రితో మాట్లాడి జిల్లాకు ఎక్కువగా వచ్చేలా చూస్తా’నని మంత్రి గడ్డం వివేక్ అన్నారు. శుక్రవారం సిద్దిపేటలో నియోజకవర్గ పరిధిలోని 2,840 మంది ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇంటి మంజూరు పత్రాల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అప్పు 8 లక్షల కోట్లు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను ఆపడం లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటుకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వేదిక మీదకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను ఆహ్వానించక పోవడంతో వారు అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మంత్రి వేదిక మీదకు రావడం, బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులను పైకి పిలవడంతో శాంతించారు. ముందస్తు జాగ్రత్తగా ఏసీపీ రవిందర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అందోళన వద్దు.. ఇది నిరంతరం ప్రక్రియ మరిన్ని ఇళ్ల మంజూరుకు కృషి ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ -
ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఎన్సాన్పల్లిలోని రెసిడెన్షియల్ పాఠశాలలో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు మిగిలిన ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ శ్రీనివాస్రెడ్డి శుక్రవారం పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 25లోగా పాఠశాలలో బోనఫైడ్, 2పాస్పోర్ట్ సైజు ఫొటోలు, ఆధార్కార్డు జిరాక్స్లను జతపరిచి దరఖాస్తు చేయాలన్నారు. ఈ నెల 27న ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ప్రవేశ పరీక్షను గురుకుల పాఠశాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 91217 74930 నంబర్లో సంప్రదించాలన్నారు. దోస్త్ మూడోవిడత పొడిగింపు సిద్దిపేటఎడ్యుకేషన్: దోస్త్ మూడో విడత ప్రవేశాల ప్రక్రియను ఈనెల 25 వరకు పొడిగించినట్లు దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్ భాస్కర్ చెప్పారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో ఆయన మాట్లాడారు. మూడో విడతలో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు 28న సీట్లను కేటాయిస్తారని, 30వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. రెండో విడతలో సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 25లోగా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో టెక్నికల్ సమస్యలు ఉత్పన్నం అయితే సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో ఏర్పాటు చేసిన దోస్త్ హెల్ప్లైన్ సెంటర్లో సంప్రదించాలని సూచించారు. సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం సిద్దిపేటకమాన్: పట్టణంలోని 37వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు సీఎం రేవంత్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదల కల సాకారం అయ్యిందన్నారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్లకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు. 23న మెగా జాబ్మేళా వర్గల్(గజ్వేల్): వర్గల్ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల డిగ్రీ కళాశాలలో మ్యాజిక్బస్ ఎన్జీఓ సంస్థ ఆధ్వర్యంలో 23న విద్యార్థినులకు జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ భాస్కర్రావు తెలిపారు. యాక్సిస్ బ్యాంక్, ముత్తూట్ ఫైనాన్స్, జస్ట్డయల్, కార్పోన్, హెచ్ఆర్హెచ్ నెక్స్ట్ కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయని, డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన ఇతర కళాశాలల విద్యార్థినులు కూడా హాజరుకావొచ్చని తెలిపారు. మరిన్ని వివరాల కోసం ప్రియాంక: 81217 43274, పూర్ణశ్రీ: 80740 17090(మ్యాజిక్ బస్), డాక్టర్ వి.రాధ: 81791 23444, డాక్టర్ ఎస్.రాధారాణి: 99122 35358 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
కుటుంబ సభ్యులకు చిన్నారి అప్పగింత
సిద్దిపేటకమాన్: బస్టాండ్లో తప్పిపోయిన పాపను పోలీసులు వివరాలు సేకరించి రెండు గంటల వ్యవధిలోనే వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. సిద్దిపేట పట్టణం టెలికాంనగర్లో నివాసం ఉంటున్న శివరాత్రి రాజు, స్వప్న దంపతులు తమ కూతురు హారిక (6), తమ అమ్మానాన్నతో కలిసి నివాసం ఉంటున్నారు. పాప నానమ్మ యాదమ్మ పట్టణంలోని హౌసింగ్ బోర్డు వద్ద చెరుకు రసం బండి నిర్వహిస్తోంది. శుక్రవారం సాయంత్రం పాప ఆడుకుంటూ బయటకు వచ్చి ఆర్టీసీ నూతన బస్టాండ్ వద్దకు చేరుకుని బస్సు ఎక్కింది. ఆర్టీసీ సిబ్బంది గమనించి పాప పేరు, వివరాలు, అమ్మానాన్న పేర్లు అడగ్గా ఎలాంటి వివరాలు తెలుపలేదు. విషయం తెలుసుకున్న సిద్దిపేట వన్ టౌన్ పోలీస్స్టేషన్ బ్లూకోట్ సిబ్బంది బస్టాండ్ వద్దకు చేరుకుని విషయాన్ని ఉన్నతాధికారులకు తెలపడంతో పాటు పాప ఫొటోను అన్ని వాట్సప్ గ్రూప్లలో షేర్ చేశారు. పాపను బాలసదనానికి తరలించారు. పాప తప్పిపోయిన విషయం వైరల్ కావడంతో పాప కుటుంబం నివాసం ఉంటున్న కాలనీ వారు పాపను గుర్తించి పాప నానమ్మకు తెలిపారు. దీంతో వారు బాలసదనానికి చేరుకోగా పాప తమ మనవరాలేనని ఆధారాలు చూపించడంతో పోలీసు సిబ్బంది వారికి అప్పగించారు. గంటల వ్యవధిలో చిన్నారిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
పంచాయతా.. పరిషత్తా?
‘స్థానిక’ ఎన్నికలపై జోరుగా చర్చ ● పల్లెల్లో మొదలైన పోరు సందడి ● స్థానిక సంస్థలకు నిలిచిన ఆర్థికసంఘం నిధులు ● పలు చోట్ల అభివృద్ధి పనులకు బ్రేక్ ● ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,531 జీపీలు, ఎంపీటీసీలు 690, జెడ్పీటీసీలు 72ఉమ్మడి మెదక్ జిల్లాలో 19,62,458 మంది పల్లె ఓటర్లుండగా 1,531 గ్రామ పంచాయతీలు, 690 ఎంపీటీసీలు, 72 జెడ్పీటీసీలు ఉన్నాయి. గతేడాది జూలై 4వ తేదీతో మండల పరిషత్ ప్రాదేశిక సభ్యుడు(ఎంపీటీసీ), జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యుడు (జెడ్పీటీసీ) పదవీకాలం, గతేడాది ఫిబ్రవరి 2తో సర్పంచ్ల పదవీకాలం ముగిశాయి. అప్పటి నుంచి గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్లు ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ సింబల్ ఉండదు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలు పార్టీ గుర్తుతో జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఏ ఎన్నికలు ముందు నిర్వహిస్తే అధికార పార్టీకి లాభం అనే చర్చ కాంగ్రెస్ నేతల్లో జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తి కావడంతో ప్రభుత్వ పాలన రెఫరండంగా భావించే అవకాశం ఉంది. ఆశల్లో కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతూ అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లు రాష్ట్రపతి దగ్గరనే ఇంకా పెండింగ్లో ఉంది. బిల్లు ఆమోదం తర్వాతనే నిర్వహిస్తారా? పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తారో.. వేచి చూడాలి. కాంగ్రెస్ పార్టీ పదేళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో గ్రామాల్లోని పార్టీ కార్యకర్తలు స్థానిక పదవుల పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది లేకపోవడంతో కొంత వెనుకబడి ఉంది. దీంతో ముఖ్యంగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ లాంటి పదవులు దక్కితే పార్టీ కొంత బలపడుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.గ్రామ పంచాయతీ ఎన్నికలు ముందు జరుగుతాయా.. లేక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయా? అని పల్లెల్లో జోరుగా చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రుల ప్రకటనతో పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం వేగం పెంచింది. రైతు భరోసా కింద ఎకరానికి రూ. 6వేలు చొప్పున బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడంతో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే నెలలో జరుగుతాయని సర్వత్రా చర్చించుకుంటున్నారు. ఆశావహులు సైతం పోటీకి రెడీ అవుతున్నారు. సాక్షి, సిద్దిపేట: నిలిచిన ఆర్థిక సంఘం నిధులు స్థానిక సంస్థలకు పాలకవర్గాలు లేకపోవడంతో గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి. అదే పాలక వర్గాలుంటే ప్రతీ ఏడాది కేంద్రం నుంచి ప్రత్యేక నిధులను కేటాయించేవారు. ఆర్థిక సంఘం నుంచి నిధులు రాకపోవడంతో పల్లెల్లో అభివృద్ధి పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
హై టెన్షన్!
దుబ్బాకలోతీవ్ర ఉద్రిక్తత మధ్య మంత్రి వివేక్ పర్యటన దుబ్బాకలో జరిగిన మంత్రి సమావేశంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాటదుబ్బాక పట్టణంలో శుక్రవారం హై టెన్షన్ వాతావరణం కనిపించింది. ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ పర్యటనతో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఉద్రిక్తత నెలకొంది. ఇరు పార్టీలకు చెందిన వందలాది మంది నాయకులు పోటాపోటీగా ఆందోళనకు దిగడంతో వారిని అదుపుచేసేందుకు పోలీసులకు తలకుమించిన భారంగా మారింది. మంత్రి వివేక్, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్రెడ్డిలు వారివారి పార్టీల కార్యకర్తలకు ఎంత నచ్చజెప్పినా ఫలితం కానరాలేదు. కలెక్టర్ సైతం పదేపదే విజ్ఞప్తి చేసినా పరిస్థితి అదుపులోకి రాలేదు. అభివృద్ధికి అడ్డుపడొద్దు: మంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని ఇది చూసి ఓర్వలేకనే కొన్ని శక్తులు అడ్డుతగిలే ప్రయత్నాలు చేస్తున్నాయని మంత్రి వివేక్ అన్నారు. ఎన్నికల హామీ మేరకు పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామన్నారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందన్నారు. అప్పులు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. జిల్లాకు 12 వేల ఇళ్లు మంజూరు చేశామన్నారు. అందోళన వద్దు.. ఇది నిరంతరం ప్రక్రియ మరిన్ని ఇళ్ల మంజూరుకు కృషి ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యప్రొటోకాల్, ఫ్లెక్సీల రగడ ఇరు పార్టీ నేతల మధ్య తోపులాట మంత్రి సమావేశం రసాభాస -
పునరావాస ప్యాకేజీ కల్పించాల్సిందే
ములుగు(గజ్వేల్): పునరావాస ప్యాకేజీ కల్పించాలంటూ కొండపోచమ్మ రిజర్వాయర్లో ముంపునకు గురైన మామిడ్యాల గ్రామ నిర్వాసితులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ములుగు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. అధికారులు, సిబ్బంది లోపలికి వెళ్లకుండా ప్రధాన ద్వారం ఎదుట అడ్డుకున్నారు. బీజెపీ మండల అధ్యక్షుడు లక్ష్మణ్గౌడ్, మాజీ అధ్యక్షుడు రమేష్యాదవ్ ఆధ్వర్యంలో బీజెపీ శ్రేణులు ఆందోళనకారులకు మద్దతు తెలిపాయి. ఈ సందర్బంగా నిర్వాసితులు మాట్లాడుతూ ప్రాజెక్ట్ పేరిట తమ భూములు లాక్కొని తమకు పరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ప్యాకేజీలు అందజేయాలని లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అక్కడికి చేరుకున్న తహసీల్దార్ ఆరీఫా నిర్వాసితులతో మాట్లాడారు. విషయం ఆర్డీఓ, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది.‘కొండపోచమ్మ’ నిర్వాసితుల ఆందోళన -
ధాన్యం డబ్బుల కోసం రోడ్డెక్కిన రైతులు
తొగుట(దుబ్బాక): పొద్దు తిరుగుడు ధాన్యం విక్రయించి 75 రోజులు గడుస్తున్నా డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు మండిపడ్డారు. ఈ మేరకు గురువారం స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తొగుట సెంటర్ పరిధిలో 400 మంది రైతులకు గానూ రూ.3 కోట్లకుపైగా బకాయిలున్నాయన్నారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.రోడ్డుపై బైఠాయించిన రైతులు -
సర్కారు బడి.. సమస్యల ఒడి
● పెచ్చులూడుతున్న గదుల పైకప్పులు ● వరండాలలోనే తరగతులు ● మూత్రశాలలు లేక ఇబ్బందులు ● నిలిచిన ‘మన బడి’ పనులు ● క్షేత్రస్థాయిలో ‘సాక్షి’ పరిశీలన పెచ్చులూడుతున్న పైకప్పులు.. వర్షాలకు ఉరుస్తున్న గదులు.. వరండాలు, రేకుల షెడ్డుల్లో తరగతులు.. ఇలా అసౌకర్యాల నడుమ బిక్కు బిక్కుమంటూ చదవులు వెళ్లదీస్తున్నారు. మూత్రశాలలు, మరుగుదొడ్ల కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ‘మన ఊరు– మన బడి’ అభివృద్ధి పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. జిల్లాలో 912 ప్రభుత్వ పాఠశాలలో 65,231 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పలు పాఠశాలలను గురువారం సాక్షి విజిట్ చేయగా పలు సమస్యలు వెలుగుచూశాయి. – సాక్షి, సిద్దిపేట ప్రభుత్వ పాఠశాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశ్యంతో గత ప్రభుత్వం మన ఊరు– మన బడి పథకం తీసుకొచ్చింది. అందులో భాగంగా 342 ప్రభుత్వ పాఠశాల్లో అదనపు గదులు, డైనింగ్ హాళ్లు, మూత్రశాలలు రూ.126..07కోట్లతో పనులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు 77 పాఠశాలలో పనులు పూర్తి కాగా, 96 పాఠశాలలు 75శాతం పనులు, ఇంకా 169 పాఠశాలలు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. డిసెంబర్ 2023 వరకు జరిగిన పనులకు రూ.53.17 కోట్లకు గాను రూ.37.60కోట్లను మాత్రమే చెల్లించారు. ఇంకా రూ.15.56కోట్లు పెండింగ్ ఉండటంతో కాంట్రాక్టర్లు పనులు మధ్యలోనే నిలిపివేశారు. దీంతో గదుల కొరత, సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు, వారి తల్లితండ్రులు కోరుతున్నారు. అసంపూర్తిగా టాయిలెట్స్ చిన్నకోడూరు(సిద్దిపేట): ఎల్లాయపల్లి ప్రాథమిక పాఠశాలలో బాలికల టాయిలెట్స్ గత ఏడాది నిర్మాణం చేపట్టగా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. దీంతో బాలికలు ఇబ్బందులకు గురవుతున్నారు. తాగునీటిని బాలవికాస వాటర్ ప్లాంట్ నుంచి రోజూ తీసుకువస్తున్నారు. పాఠశాలలో మొత్తం 30 మంది విద్యార్థులకు గాను ఇద్దరు ఉపాధ్యాయులే ఉన్నారు. ఆరు బయటే మూత్ర విసర్జన కొమురవెల్లి (సిద్దిపేట): మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలలు ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్నాయి. ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో సుమారు 400 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వారికి సరిపడా టాయిలెట్స్ నిర్మాణం కోసం ప్రభుత్వం ఇటీవల నిధులు విడుదల చేసింది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు పూర్తి కాకపోవడంతో విద్యార్థులు ఆరు బయటే మూత్ర విసర్జనకు వెళ్తున్నారు. గదులు పెచ్చులూడుతున్నాయ్.. నంగనూరు(సిద్దిపేట): మండల పరిధిలోని రాంపూర్ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరింది. వర్షానికి తరగతి గదులు ఉరుస్తున్నాయి. పాఠశాలలో ఏడు గదుల గాను ఐదు గదులు వర్షానికి ఉరుస్తుండటంతో తరగతి గదిల్లోకి నీరు చేరుతుంది. భవనం పెచ్చులూడుతూ కింద పడడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురవుతున్నారు. ఒకే గదిలో ఐదు తరగతులు మిరుదొడ్డి(దుబ్బాక): మండల పరిధిలోని లింగుపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నారు. మొత్తం ఐదు తరగతులకు 13 మంది విద్యార్థులకు గాను, గురువారం నలుగురు విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. ఒకే గదిలో ఐదు తరగతులకు 18 సబ్జెక్టులను ఒకే ఉపాధ్యాయుడు బోధించాల్సిన పరిస్థితి నెలకొంది. పొగతో ఉక్కిరిబిక్కిరి జగదేవ్పూర్(గజ్వేల్): మండలంలోని తిగుల్ నర్సాపూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాల పూర్తిగా శిథిలావస్థలో ఉంది. 30 విద్యార్థులకు ఒకరే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నారు. ఒక గదిలో వరండాలో తరగతులు కొనసాగుతున్నాయి. అలాగే తిగుల్ ప్రాథమిక పాఠశాలలో వంట గది లేక రెండు గదుల మధ్యలో వంటలు చేస్తున్నారు. పొగతో విద్యార్థులు, స్థలం అనువుగా లేకపోవడంతో వంట కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు.వర్గల్ మండలం జబ్బాపూర్ పాఠశాలలో వరండాలోనే నిర్వహిస్తున్న రెండేసి తరగతులుశిథిల భవనంలోనే.. కొండపాక(గజ్వేల్): మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో 110 మంది విద్యార్థులున్నారు. పాఠశాల భవనం శిథిలావస్థ కు చేరినప్పటికీ గత్యంతరం లేక అక్కడే విద్యా బోధన చేస్తున్నారు. దీంతో విద్యార్థులు బిక్కు బిక్కుమంటూ చదువుకుంటున్నారు. విద్యార్థుల తల్లితండ్రులు భయాందోళన చెందుతున్నారు. నిలిచిన నిర్మాణ పనులు ములుగు (గజ్వేల్): తునికి బొల్లారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 109 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. బడిలో సరిపోను గదులు లేవు. కంప్యూటర్ ల్యాబ్ కోసం లైబ్రరీ గదిని వినియోగిస్తున్నారు. పాఠశాలలో ఎనిమిది మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. మన ఊరు– మన బడి పథకం ద్వారా రూ.1.30కోట్ల నిధులతో రెండు హాళ్లు, 8 గదులతో కూడుకున్న నూతన భవన నిర్మాణం చేపట్టినప్పటికీ రెండేళ్లుగా అసంపూర్తి దశలోనే ఉంది.విద్యార్థులతోనే పనులు.. జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో.. విద్యార్థులతోనే ఉపాధ్యాయులు పనులు చేయిస్తున్నారు. స్టాఫ్ రూమ్కు వారితోనే మ్యాట్లను అతికిస్తున్నారు. తరగతి గదిలో పాఠాలు నేర్చుకోవాల్సిన విద్యార్థులతో పనులు చేయిస్తుండటం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. – సాక్షిస్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేటవిద్యార్థులే కొడుతున్న బడిగంట సిద్దిపేట రూరల్: చిన్నగుండపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో అటెండర్ లేకపోవడంతో విద్యార్థులతోనే బడి గంటను మోగిస్తున్నారు. అలాగే గురువారం పేరెంట్స్ కమిటీ సమావేశం జరగడంతో వేసిన జంకానాలు విద్యార్థులే మోసుకెళ్లడం ‘సాక్షి’ కంటపడింది. దీనిపై హెచ్ఎం రాధపద్మజను వివరణ అడగగా ‘స్కావేంజరే గంట కొడుతుంది. స్కావేంజర్ మరో పని చేస్తుండటంతో టైం అయిందని విద్యార్థి బెల్ కొట్టి ఉండవచ్చు. మేము మీటింగ్లో ఉన్నాం. మరోమారు జరగకుండా చుసుకుంటాం’ అని అన్నారు. ముక్కు మూసుకోవాల్సిందే దుబ్బాక టౌన్(దుబ్బాక): పట్టణంలోని డబుల్ బెడ్రూం కాలనీలో కొనసాగుతున్న ప్రాథమిక పాఠశాల దుర్ఘంధంతో కంపుకొడుతోంది. పాఠశాలలో 44 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. డబుల్ బెడ్రూంలలో వినియోగించిన నీరు పాఠశాలలోకి వచ్చి చేరుతుంది. పాఠశాల సమీపంలో డ్రైనేజీ సైతం సరిగా లేదు. వర్షం పడితే పై నుంచి నీరంతా వచ్చి తరగతి గదుల్లోకి వస్తుంది. నీటి పైప్లైన్ సరిగా లేక లీక్ అవుతుంది. పాఠశాలలో ఎలుకల బెడదతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. దశల వారీగా పనులు ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదులు, మూత్రశాలల నిర్మాణాలు దశల వారీగా పనులు జరుగుతున్నాయి. మన ఊరు– మన బడి పనులకు డబ్బుల చెల్లింపు నిలిచిపోగా పనులు మధ్యలో నిలిచిపోయాయి. 8 ప్రభుత్వ పాఠశాలలకు నూతన భవనాలు కలెక్టర్ మంజూరు చేశారు. ఒక్కో భవనానికి రూ.30లక్షల చొప్పున రూ.2.40కోట్లు మంజూరు అయ్యాయి. – శ్రీనివాస్ రెడ్డి, డీఈఓ -
బిక్కుబిక్కు చదువులు
మైత్రితో భరోసాసిద్దిపేట జీజీహెచ్లో మైత్రీ ట్రాన్స్ క్లినిక్ ద్వారా ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక వైద్యసేవలందిస్తున్నారు. వివరాలు 10లో uశుక్రవారం శ్రీ 20 శ్రీ జూన్ శ్రీ 2025పాఠశాల శిథిలం.. విద్యార్థుల్లో భయంభయం వర్గల్(గజ్వేల్): మండల పరిధిలోని జబ్బాపూర్ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థలో ఉంది. పైకప్పు పెచ్చులూడి ఊచలు తేలాయి. పాఠశాలలో 78 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. గదుల కొరత కారణంగా వరండాలో రెండేసి తరగతులు నిర్వహిస్తున్నారు. భవనం ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. భయం భయంగా పాత భవనంలోనే చదువులు నెట్టుకొస్తున్నారు. కొత్త భవనం నిర్మించాలని విద్యార్థుల తల్లితండ్రులు కోరుతున్నారు.న్యూస్రీల్ -
నేను కఠినంగా ఉంటా..
● విధుల్లో నిర్లక్ష్యం సహించను ● అధికారుల తీరుపై కలెక్టర్హైమావతి సీరియస్ హుస్నాబాద్: ‘నేను కఠినంగా ఉంటా.. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవు’ అని కలెక్టర్ హైమావతి సీరియస్ అయ్యారు. హుస్నాబాద్లో గురువారం కలెక్టర్ పర్యటించారు. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేశారు. అనంతరం మున్సిపల్ కార్యాయలంలో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులను పరిశీలించారు. పాఠశాలలో సౌకర్యాలు కల్పించాం, అడ్మిషన్లు పెంచాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలన్నారు. కాలం చెల్లిన మందులు వాడొద్దు ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులతో కలెక్టర్ మాట్లాడారు. ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, ప్రైవేట్కు వెళ్లకుండా ఇక్కడే వైద్యం చేయించుకోవాలని సూచించారు. కాలం చెల్లిన మందులు వాడకూడదని సిబ్బందికి సూచించారు. అభివృద్ధి పనులపై సమీక్ష మున్సిపల్, పీఆర్, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్ శాఖల ఇంజనీరింగ్ అధికారులతో పలు అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్షా నిర్వహించారు. పట్టణంలోని పలు వార్డుల్లో సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణాలు, కమ్యూనిటీ భవన నిర్మాణాల పెండింగ్ పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది కాలంగా పనులు ప్రారంభించకుండా కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తే లీగల్ నోటీస్లు జారీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ కేడం లింగమూర్తి, ఆర్డీఓ రామ్మూర్తి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చట్ట ప్రకారం భూ సమస్యలు పరిష్కారం కోహెడరూరల్(హుస్నాబాద్): భూ భారతి చట్ట ప్రకారం భూ సమస్యలన్నీ పరిష్కరిస్తామని కలెక్టర్ హైమావతి తెలిపారు. సముద్రాల గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను త్వరగా ఫీల్డ్ విచారణ పూర్తి చేసి పరిష్కారించాలని అధికారులకు సూచించారు. గౌరవెల్లి ప్రాజెక్టు సందర్శనఅక్కన్నపేట(హుస్నాబాద్): మండల పరిధిలోని గౌరవెల్లి ప్రాజెక్టును గురువారం కలెక్టర్ హైమావతి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ప్రాజెక్టు స్థితిగతులు, నిర్మాణ పనులపై ఆరా తీశారు. పనులు ఎందుకు నిలిచాయని నీటిపారుదల శాఖ ఈఈ రామునాయక్ను అడిగి తెలుసుకున్నారు. ఎన్జీటీలో కేసులు ఉండడంతో చివర దశ పనులు నిలిచాయని రామునాయక్ వివరించారు. ఈ ప్రాజెక్టుకు అనుసంధానంగా గండిపల్లి ప్రాజెక్టు కూడా ఉందని, ఆ ప్రాజెక్టు పనులు త్వరగా జరగాల్సి ఉందని కలెక్టర్ అన్నారు. -
సంక్షేమ పథకాలనుప్రజల్లోకి తీసుకెళ్లండి
మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేటజోన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి హరికృష్ణ ఇంట్లో అల్పాహారం అనంతరం పార్టీ శ్రేణులతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.అంతకుముందు సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. పశుగణానికి ‘ట్యాగింగ్’ వర్గల్(గజ్వేల్): నాచగిరి పుణ్యక్షేత్రంలోని గోశాలలో పశుగణానికి పశువైద్యాధికారులు ‘ట్యాగింగ్’ వేశారు. ‘డొక్కలు చిక్కి..బొక్కలు తేలి’ శీర్షికతో నాచగిరి గోశాలలో గోవుల దయనీయ స్థితిని వెల్లడిస్తూ ఈ నెల 9న ‘సాక్షి’ ప్రత్యేక కథనం పుచురించిన విషయం పాఠకులకు విదితమే. ఈ మేరకు ఆలయ యంత్రాంగం, పశువైద్యశాఖ స్పందించి ‘గోశాల’లో గోవుల సంరక్షణకు చర్యలు చేపడుతోంది. వాటికి మేత, దాణా, పోషకాలు పెడుతున్నారు. మరోవైపు గురువారం పశువైద్యాధికారి డాక్టర్ సర్వోత్తం యాదవ్ గోశాలను సందర్శించి పరీక్షలు జరిపారు. ప్రతి పశువుకు ఒక గుర్తింపు నెంబర్ ఇస్తూ ‘ట్యాగింగ్’ చేశారు. ఆ నెంబర్ల ప్రకారం ఆయా పశువుకు సంబంధించి ఆరోగ్య స్థితిగతులు (కేస్ షీట్) నమోదుచేశారు. త్వరలోనే పశువులకు ‘లంప్స్కిన్’ వ్యాక్సిన్ వేస్తామని వైద్యాధికారి తెలిపారు. ఈ పాస్ మిషన్ ద్వారే ఎరువులు విక్రయించాలి జిల్లా వ్యవసాయ అధికారి రాధిక జగదేవ్పూర్(గజ్వేల్): ఎరువుల దుకాణాల డీలర్లు ఈ పాస్ మిషన్ ద్వారానే ఎరువులు విక్రయించాలని జిల్లా వ్యవసాయ అధికారి రాధిక సూచించారు. గురువారం మండలంలోని మునిగడప, జగదేవ్పూర్ గ్రామాలలో పలు ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈ పాస్ మిషన్లోని ఎరువుల నిల్వలు సమానంగా ఉన్నాయా లేదా అని పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అధిక ధరలకు విక్రయించినవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా 3300 ఎంటీ యూరియా, 4600 ఎంటీల ఇతర ఎరువులు అందుబాటులో ఉన్నాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జిల్లాలో సరిపడా వరి, పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వసంతరావు, తదితరులు పాల్గొన్నారు. ముగిసిన ఈసెట్ కౌన్సెలింగ్ నంగునూరు(సిద్దిపేట): రాజగోపాల్పేట పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతున్న కౌన్సెలింగ్ గురువారం ముగిసింది. ఈసందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ గోవర్ధన్ మాట్లాడుతూ మూడు రోజుల పాటు నిర్వహించిన కౌన్సెలింగ్కు 450 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ మ్యాథ్స్ చదివిన విద్యార్థులకు ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశం కోసం వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. -
అంతా టెన్షన్.. టెన్షన్
● నేడు దుబ్బాకలో ఇన్చార్జిమంత్రి వివేక్ పర్యటన ● గతంలో మంత్రి కొండా సురేఖపర్యటనలో తీవ్ర ఉద్రిక్తత ● ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు ● ఏర్పాట్లను పరిశీలించిన అదనపు కలెక్టర్ దుబ్బాక: ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మొదటి సారి శుక్రవారం దుబ్బాకలో మంత్రి వివేక్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అంతటా టెన్షన్ నెలకొంది. గతంలో మంత్రి కొండా సురేఖ పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న విషయం విదితమే. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి బీఆర్ఎస్, ఎంపీ రఘునందన్రావు బీజేపీ, అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో ని యోజకవర్గంలో గత ఏడాదిన్నర కాలంగా మూడు పార్టీల మధ్య ఆధిపత్య పోరు చోటుచేసుకుంది. ఏ ప్రభుత్వ కార్యక్రమం చేపట్టాలన్నా మూడు పార్టీలతో అధికారులకు తీవ్ర తలనొప్పిగా తయారైంది. 6 నెలల క్రితం దుబ్బాకలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రోటోకాల్పై బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య జరిగిన రగడ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీయడం.. మధ్యలోనే మంత్రి వెళ్లిపోవడం అంతా రసాభాసగా మారింది. మళ్లీ మంత్రిగా వివేక్ నియోజకవర్గంలో పర్యటన నేపథ్యంలో ఏం జరుగుతుందో అన్న చర్చ జోరుగు సాగుతోంది. పోటాపోటీగా ప్రకటనలు నియోజకవర్గంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రోసిడింగ్ పత్రాలు అందించే కార్యక్రమం మంత్రి చేతుల మీదుగా జరుగనుంది. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో ఏవరికి వారు భారీగా తరలిరావాలంటూ ప్రచారం మొదలుపెట్టారు. మంత్రి వివేక్ లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు అందిస్తారంటూ కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి ఇస్తారంటూ బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటుండగా బీజేపీ నాయకులు సైతం తరలిరావాలంటూ తమ క్యాడర్కు పిలుపు నివ్వడం తీవ్ర చర్చానీయంశంగా మారింది. మంత్రి పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ నియోజకవర్గం ఇంచార్జి చెరుకు శ్రీనివాస్రెడ్డి ప్రత్యేకంగా క్యాడర్తో సమావేశం పై చర్చించారు. నేడు మంత్రి పర్యటన ఇలా.. మంత్రి వివేక్ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు పట్టణంలోని రజనీకాంత్రెడ్డి గార్డెన్కు చేరుకుంటారు. అక్కడే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారు. ఈసందర్భంగా జరిగే సమావేశంలో ప్రసగించనున్నారు. సీపీ అనురాధ ప్రత్యేక దృష్టి మంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ముందు జాగ్రత్తగా సీపీ అనురాధ దృష్టిసారించారు. అలాగే అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు సూచనలు చేశారు. -
కలెక్టర్ను కలిసిన సీపీ అనురాధ
సిద్దిపేటరూరల్: నూతన కలెక్టర్ కె.హైమావతిని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డా.అనురాధ బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్కు మొక్కను బహూకరించారు. శాంతిభద్రతలకు సంబంధించి కొద్దిసేపు చర్చించారు. సీపీ వెంట అదనపు డీసీపీ అడ్మిన్ సుభాష్చంద్రబోస్, ఏసీపీ రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పారదర్శకంగా ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికడీఆర్డీవో జయదేవ్ ఆర్య దుబ్బాక: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా చేపట్టినట్లు డీఆర్డీవో జయదేవ్ ఆర్య పేర్కొన్నారు. త్వరలోనే జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. దుబ్బాక పట్టణంలోని కోమటిరెడ్డి రజనీకాంత్రెడ్డి ఫంక్షన్ హాల్ను బుధవారం సందర్శించి మంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రి వివేక్ పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో సదానందం, తహసీల్దార్ సంజీవ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. పల్లెలకు డ్రగ్స్ను రానివ్వొద్దుహుస్నాబాద్రూరల్: పల్లెలకు డ్రగ్స్కు రాకుండా యువతను కాపాడుకునే బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందని డ్రగ్స్ నిర్మూలన జేఏసీ కన్వీనర్ కవ్వ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన డ్రగ్స్ నిర్మూలన యాత్ర మండలంలో పందిల్ల, పొట్లపల్లి, రాములపల్లి, బంజేరుపల్లి, కూచనపెల్లి గ్రామాల్లో సాగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ..మన యువతను ఆన్లైన్ బె ట్టింగ్, సైబర్ నేరాలకు దూరంగా ఉంచాలన్నా రు. గ్రామాలకు డ్రగ్స్ రాకుండా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు మేకల వీరన్న, సారయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లాస్థాయి పోటీలకు ఇద్దరు విద్యార్థుల ఎంపికమర్కూక్(గజ్వేల్): తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలల ప్రవేశాల కోసం మర్కూక్ మండలం నుంచి జిల్లా స్థాయికి ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు. ఎర్రవల్లి ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన జూపల్లి భానుప్రసాద్, తాండె సాత్విక్ మండలంలోని పాములపర్తి పాఠశాలలో బుధవారం నిర్వహించిన మండల స్థాయి క్రీడా పోటీలలో గెలుపొందారు. ఈ మేరకు మండల విద్యాధికారి వెంకట్ రాములు ఓ ప్రకటనలో వెల్లడించారు. విద్యతో పాటు క్రీడల్లో రాణించాలిహుస్నాబాద్: విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించాలని జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి జంగపల్లి వెంకట నర్సయ్య పేర్కొన్నారు. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక కోసం మండలస్థాయి పోటీలను బుధవారం ఎంఈఓ బండారి మనీల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎంపిక పోటీలను డీవైఎస్ఓ వెంకట నర్సయ్య పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ...విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. క్రీడల వల్ల మంచి ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ అలవడుతుంద ని చెప్పారు. విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థ్ధాయి ల్లో రాణించాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం వాసుదేవ రెడ్డి, ఎస్జీఎఫ్ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో 30 వేలకు పైగా దరఖాస్తులు
జగదేవ్పూర్(గజ్వేల్)/మర్కూక్(గజ్వేల్): భూ భారతి సదస్సుల ద్వారా ఇప్పటి వరకు 30,630 దరఖాస్తులు వచ్చాయని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ వెల్లడించారు. జగదేవ్పూర్లో బుధవారం నిర్వహించిన భూభారతి సదస్సును హాజరై దరఖాస్తులను స్వీకరించారు. అంతకుముందు మర్కూక్ మండలంలోని పాతూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఈ నెల 3 నుంచి ప్రారంభమైన సదస్సులు 20 వరకు కొనసాగుతాయన్నారు. రైతుల నుంచి సాదాబైనామా, పేర్లు తప్పిదాలు, ఆన్లైన్లో సర్వే నంబర్లు తప్పిదం, అసైన్డ్ భూమికి సంబంధించిన దరఖాస్తులు వస్తున్నాయని వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు నిర్మల, ప్రవీణ్రెడ్డి, ఆర్ఐ ఫహీద్, పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇక డుమ్మాలకు చెక్
సాక్షి, సిద్దిపేట: జిల్లా ప్రజా పరిషత్లు, మండల పరిషత్ కార్యాలయాల్లో ఉద్యోగులకు బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్ హాజరును అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడు జిల్లా ప్రజా పరిషత్లు,73 మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్ సంబంధిత మెషీన్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ల పాలక వర్గాల గడువు గతేడాది జూలై 4వ తేదీతో ముగిసింది. అప్పటి నుంచి ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్లు జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారులుగా, మండల పరిషత్ ప్రత్యేక అధికారులుగా పలువురు జిల్లా అధికారులు వ్యవహరిస్తున్నారు. మండల పరిషత్లలో పలువురు అధికారులు సమయ పాలన పాటించడం లేదని గ్రామీణాభివృద్ధి శాఖకు ఫిర్యా దులు అందాయి. దీంతో బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్ మెషీన్లు బిగించి సమయ పాలన పాటించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఆఫ్లైన్ గతంలో పలు కార్యాలయాల్లో బయోమెట్రిక్ హాజరు ఆఫ్లైన్లో ఉండేది. అది సక్రమంగా పనిచేయకపోవడంతో పరికరాలు మూలన పడ్డాయి. దీంతో సిబ్బంది విధుల పట్ల జాప్యం వహించడం, తరచుగా డుమ్మా కొట్టడం, ఇంటికి వెళ్లడం, విధులకు రాకపోయినా వచ్చినట్లు నమోదు చేసుకుంటున్నారు. పలువురు ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో ప్రజలకు మెరుగైన సేవలు అందలేదు. వీటికి చెక్ పెట్టేందుకు బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.సిద్దిపేట జెడ్పీలో బయోమెట్రిక్ మెషీన్లో హాజరు నమోదు చేసుకుంటున్న సిబ్బంది వారం రోజుల్లో అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లో... మండల పరిషత్లు, జిల్లా పరిషత్లలో ఫేస్ రికగ్నిషన్, బయోమెట్రిక్ హాజరు అమలు చేస్తాం. వారం రోజుల్లో అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లో మెషీన్లు బిగించి అమలు చేయనున్నాం. ఉద్యోగుల వివరాలను సేకరిస్తున్నాం. ఈ నెల 18 నుంచి జిల్లా పరిషత్లో అమలు చేయడం ప్రారంభించాం. – రమేశ్, సీఈఓ, జిల్లా ప్రజాపరిషత్, సిద్దిపేట ఉద్యోగుల వివరాల సేకరణ బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్ మెషీన్లో ఉద్యోగులను గుర్తించేందుకు వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఉద్యోగుల హోదా, ఆధార్ నంబర్, ఉద్యోగుల క్రమసంఖ్య తదితర వివరాలను బయోమెట్రిక్లో నమోదు చేస్తున్నారు. బయోమెట్రిక్ హాజరుతో ఉద్యోగులు ఏ సమయానికి వస్తున్నారు? ఎప్పుడు వెళ్తున్నారు? ఎంతమంది సిబ్బంది హాజరయ్యారు? అనే విషయాలను ఎప్పటికప్పుడు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంకు తెలియనుంది. జిల్లా మండల పరిషత్లు సిద్దిపేట 26 సంగారెడ్డి 26 మెదక్ 21 ఉద్యోగుల నుంచి ఆధార్నంబర్, హోదా వివరాల సేకరణ ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడు జిల్లా పరిషత్లు, 73 మండల పరిషత్లు -
లెక్కదాటితే వేటు పక్కా..!
● విచ్చలవిడిగా యూరియా వాడితే చీడపీడలు ● కృత్రిమ కొరత సృష్టించొద్దు ● అధికంగా విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం ● వ్యవసాయ అధికారులు హెచ్చరిక హుస్నాబాద్రూరల్: ఈ సీజన్లో పంటలకు కావాల్సిన ఎరువులను ఇప్పటికే ప్రభుత్వం సరఫరా చేసేసింది. అయితే వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంటలకు తగిన మోతాదులో ఎరువు వేస్తేనే ప్రయోజనం ఉంటుంది. కానీ, భవిష్యత్తులో కొందరు రైతులు యూరియా దొరకదని ముందే కొనుగోలు చేసి నిల్వ ఉంచడం వలన ఏ మాత్రం ప్రయోజనం ఉండదని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. యూరియా నిల్వ ఉంచడం వలన నత్రజని గాలిలో కలిసి ఎరువు నాణ్యత కోల్పోతుంది. నాణ్యతలేని ఎరువును పంటలకు వేసినా పని చేయదని చెబుతున్నారు. యూరియా కావాల్సిన రైతులకు మిగతా ఎరువులు కొనుగోలు చేస్తేనే ఇస్తామని లింకులు పెట్టి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక యూరియాను అవసరానికి మించి రైతులు కొని కృత్రిమ కొరతను సృష్టించే వారిపై చర్యలు తప్పవని కూడా హెచ్చరిస్తున్నారు. కొన్ని చోట్ల ఇలా... సీజన్కు కావాల్సిన 1,13,750 క్వింటాళ్ల యూరియా అవసరం ఉంటుందని అధికారులు ప్రతిపాదనలు పంపించారు. జూలై నెల వరకు కావాల్సిన యూరియా ఇప్పటికే వచ్చినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నా దుకాణాల్లో మాత్రం దొరకడం లేదని రైతులు వాపోతున్నారు. మోతాదు మించితే చీడపీడలు రైతులు ఎక్కువ మోతాదులో యూరియా వేయడం వలన మొక్క కాండము మెత్తబడి చీడపీడలు చేరి పంటకు నష్టం చేస్తాయని, పంటకాలం పెరిగి నీటి తడుల అవసరం ఎక్కువుతుందని, చీడపీడల నివారణకు అదనంగా పురుగు మందులు వాడటం వలన అదనపు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని వ్యవసాయ అధికారులు హెచ్చరిస్తున్నారు. వరి సాగు చేసే రైతులు ఎకరాకు 2 బస్తాలు, మొక్కజొన్న, పత్తి పంటలకు ఎకరాకు 3 బస్తాల చొప్పున యూరియాను నాలుగు దఫాలుగా వేస్తే మొక్కలకు ప్రయోజనం ఉంటుందని వారు పేర్కొంటున్నారు. -
పోక్సో నిందితుడికి ఏడాది జైలు
● రూ.25 వేల జరిమానా ● సిద్దిపేట మొదటి అదనపు సెషన్స్ కోర్టు తీర్పు కొండపాక(గజ్వేల్): పోక్సో కేసులో ఓ నేరస్తుడికి ఏడాది పాటు సాధారణ జైలుశిక్షతోపాటు రూ.25 వేల జరిమానాను విధిస్తూ సిద్దిపేట మొదటి అదనపు సెషన్స్ కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. కొండపాక మండలంలోని దమ్మక్కపల్లి గ్రామంలో 2022 ఆగస్టులో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ మైనర్ అమ్మాయిని నిందితుడు వెలికట్ట అనిల్ ఇంట్లోకి వెళ్లి చేయి పట్టి లాగి బూతు మాటలు తిడుతూ అసభ్యకరంగా వ్యవహరించాడు. దీంతో అప్పట్లో నిందితుడిపై పోలీస్టేషన్న్లో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించగా ఇప్పటివరకు పాటు సిద్దిపేట జిల్లా అదనపు కోర్టులో విచారణ జరిగిందని కుకునూరుపల్లి ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. బాధితుల తరఫున పబ్లిక్ పాసిక్యూటర్ ఆత్మరాములు వాదనలను వినిపించారు. వాదనల అనంతరం కోర్టు పైవిధంగా తీర్పునిచ్చింది. నిందితుడికి శిక్ష పడేలా వ్యవహరించిన కోర్టు కానిస్టేబుల్ లావణ్య, కోర్టు లైజనింగ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్రెడ్డి, భరోసా కేంద్రం సిబ్బంది సౌమ్య, హరితలను కోర్టు అభినందించింది. త్వరలో వీరందరికీ బహుమతులను అందజేస్తామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ పేర్కొన్నారు.