Siddipet
-
ఇటీవల చోటుచేసుకున్న ఘటనలు..
● కానిస్టేబుల్ ప్రవీణ్, భార్య రజిత ఇద్దరు కలిసి స్థల విక్రయం గురించి మాట్లాడుదామని ఈ నెల 2న కారులో వ్యాపారి విశ్వనాథంను తీసుకెళ్లారు. అతన్ని హత్య చేసి ఒంటిమీద ఉన్న 10తులాల బంగారు నగలను తీసుకుని మృతదేహాన్ని ఇమాంబాద్ కాలువ వద్ద పడేశారు. అంతకంటే ముందు వీరు గత నెల 25న బొడ్డు నర్సవ్వను ఆస్పత్రికి తీసుకెళ్తామంటూ కారులో ఎక్కించుకుని ఏమార్చి సుమారు మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడు దొంగిలించారు. ● ఏప్రిల్ 30న బస్సులో రద్దీని ఆసరాగా చేసుకుని నాగమణి అనే మహిళ అస్వస్థకు గురైనట్లు నటించి పక్కనే ఉన్న మహిళ బ్యాగులోంచి ఏడున్నర తులాల బంగారు నగలను అపహరించింది. వెంటనే సదరు మహిళ చేర్యాల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ● ఈ నెల 11న చేర్యాల పట్టణం గట్టుతోటలో పిట్టల శ్రీనివాస్ ఇంటి తాళం పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. బీరువాలో ఉన్న 5 తులాల బంగారం నగలతో పాటు నగదును ఎత్తుకెళ్లారు. ● మెదక్ జిల్లా ఏడుపాయల టీ జంక్షన్ సమీపంలో చేపల దుకాణాన్ని బోల ఎగొండ–లావణ్యలు నడుపుతున్నారు. ఈ నెల 11న మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అలసిపోవడంతో నిద్రలోకి జారుకున్నారు. స్కూటీ పై ఇద్దరు వ్యక్తులు వచ్చి లావణ్య మెడలో ఉన్న పుస్తెలతాడు తెంపుకొని పరారయ్యారు. -
దున్నపోతుతో రైతుల నిరసన
తొగుట(దుబ్బాక): ఆరుగాలం కష్టపడి పండించిన పొద్దు తిరుగుడు ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ తొగుట మండల కేంద్రంలో మంగళవారం రైతులు రోడ్డెక్కారు. మార్కెట్ యార్డు నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు దున్నపోతుతో ర్యాలీ నిర్వహించి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. దున్నపోతును కార్యాలయంలోకి తీసుకెళ్లి అధికారుల ఎదుట తమ గోడును వెళ్లబోసుకున్నారు. మార్కెట్ యార్డులో ధాన్యం పోసి 40 రోజులు దాటినా కొనుగోళ్లు ప్రారంభించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనకు సొసైటీ చైర్మన్ హరికృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి, వైస్ చైర్మన్ యాదగిరి తదితరులు సంఘీభావం తెలిపారు. వెంటనే ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించాలంటూ తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. -
ప్రైవేటు వాటర్ ప్లాంట్లను ఆశ్రయిస్తూ..
సిద్దిపేటజోన్: జిల్లా కేంద్రంలోని నూతన కాలనీల్లో తాగునీటి సమస్య నెలకొంది. ఇంటింటికీ తాగునీరు సరఫరా చేస్తున్నప్పటికీ కొన్ని కాలనీల్లో ‘భగీరథ’ నీటి కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. కొన్ని కాలనీల్లో భగీరథ పైపులైన్ పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా మిలాన్ గార్డెన్స్, మహిళా డిగ్రీ కళాశాల, ఎల్లంకి కళాశాల పరిసర ప్రాంతాల్లో భగీరథ నీరు లేకపోవడంతో ప్రజలు ప్రయివేటు వాటర్ ప్లాంట్లను ఆశ్రయిస్తున్నారు. రూ.80కోట్లతో అమృత్ పథకం కింద కొత్తగా మిషన్ భగీరథ పనులు చేపట్టారు. పైపులైన్ పనులు పూర్తి అయినప్పటికీ ఇళ్లకు కనెక్షన్ ఇవ్వడంపై జాప్యం జరుగుతోంది. -
జై హనుమాన్
● ఘనంగా జయంతి ఉత్సవాలు ● శ్రీరామ నామస్మరణతో మార్మోగిన ఆలయాలు ప్రశాంత్నగర్(సిద్దిపేట): హనుమాన్ జయంతి ఉత్సవాలను జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అన్ని హనుమాన్ ఆలయాలలో మంగళవారం భక్తులు ఉదయం నుంచే స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాలధారులు దీక్ష విరమించారు. జై హనుమాన్, జై శ్రీరామ్ నామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. పంచవటిలో హరీశ్రావు పూజలు జిల్లా కేంద్రం రంగధాంపల్లిలోని పంచవటి హనుమాన్ ఆలయంలో మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయ నిర్వాహకులు, అర్చకులు హరీశ్రావుకు ఘనస్వాగతం పలికారు. పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు ఆశీర్వచనాలు అందించారు. -
కొత్త కాలనీలకు నల్లా నీరేదీ?
గజ్వేల్: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని కొత్త కాలనీలకు ఇంకా ‘మిషన్ భగీరథ’ నల్లా నీరు అందడం లేదు. ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ఇక్కడే ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగా ప్రారంభించిన సంగతి తెల్సిందే. మున్సిపాలిటీలో ‘మిషన్ భగరీథ’ ద్వారా నిత్యం 39లక్ష లీటర్ల మంచినీటి సరఫరా చేసే వ్యవస్థ అందుబాటులో ఉంది. ఉదయం, సాయంత్రం కలిపి రెండుసార్లు 78లక్షల లీటర్ల నీటిని సరఫరా చేయడం లక్ష్యం కాగా ప్రస్తుత వేసవిలో సరిపడా మంచినీటి సరఫరా జరగడం లేదు. ఫలితంగా పట్టణ ప్రజలకు దాహార్తి తీరడం లేదు. మరోవైపు కొత్త కాలనీల్లో నల్లా నీరు సరఫరా వ్యవస్థ లేదు. దీంతో ఏడాదిగా ఇక్కడ రూ.28కోట్ల వ్యయంతో చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆయా కాలనీల్లో పైపులైన్ పనులు చేపట్టి నల్లా కనెక్షన్లు ఇవ్వకుండానే వదిలేశారు. ఫలితంగా మంచినీటికి ఇక్కట్లు తప్పడం లేదు. -
ధాన్యం దిగుమతిలో జాప్యం చేయొద్దు
● మిల్లర్లకు కలెక్టర్ హైమావతి ఆదేశం ● క్షేత్రస్థాయిలో పరిశీలన చిన్నకోడూరు(సిద్దిపేట): రైస్ మిల్లర్లు వరి ధాన్యం దిగుమతిలో జాప్యం చేయవద్దని, మిల్లులకు వచ్చిన వాహనాలు 12 గంటల లోపే దిగుమతి చేయాలని కలెక్టర్ హైమావతి మిల్లర్లను ఆదేశించారు. మంగళవారం మండల పరిధిలోని రామునిపట్ల, మల్లారం గ్రామాల్లోని రైస్ మిల్లులలో ధాన్యం దిగుమతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు సజావుగా జరగాలంటే మిల్లులకు పంపించిన ధాన్యాన్ని దిగుమతిలో జాప్యం చేయవద్దన్నారు. ఇందుకు ఎక్కువ మంది హమాలీలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. రోజూ 30 మంది ఉండేలా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలన్నారు. ధాన్యం దిగుమతి కాగానే ట్రక్ షీట్ జనరేట్, ఓపీఎంఎస్ అప్లోడ్ పెండిగ్ ఉంచకుండా వెంటనే పూర్తి చేయాలన్నారు. దిగుమతిలో జాప్యం రాకుండా రెవెన్యూ అధికారులను నియమించినట్లు అన్నారు. ఆమె వెంట జిల్లా సవిల్ సప్లై అధికారి తనూజ, జిల్లా తూనికల కొలతల అధికారి శివరంజని, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మున్సిపాలిటీల్లో మంచినీటి తిప్పలు
దూప తీర్చనిభగీరథజిల్లాలోని మున్సిపాలిటీల్లో మంచి నీటి సమస్య రోజురోజుకూ అధికమవుతోంది. ఎండలు మండుతుండటంతో ప్రజలు నీటి కోసం తల్లడిల్లుతున్నారు. రూ.కోట్లు వెచ్చించి మిషన్ భగీరథ తెచ్చినా ప్రజల గొంతు తడవడంలేదు. పట్టణ శివార్లకు రెండు, మూడు రోజులకోమారు నీటి సరఫరా చేస్తున్నారు. అదికూడా అరకొరగా జరగుతోంది. కొన్ని ప్రాంతాలకు ట్యాంకర్ల నీరే దిక్కవుతోంది. ప్రజలు ఇన్ని బాధలు పడుతున్నా అధికారుల్లో చలనం రావడం లేదు. నీటి సరఫరాను పెంచడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపాలిటీల్లో ప్రధానంగా నీటి సమస్య చర్చనీయాంశంగా మారింది. శివార్లలో రెండు, మూడురోజులకోసారి సరఫరా దృష్టిసారించని అధికారులు -
రెండు రోజులకోసారి 10 బిందల నీళ్లే..
హుస్నాబాద్: మండుతున్న ఎండలకు మున్సిపాలిటీలో తాగునీటి అవసరాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. పట్టణంలో 20 వార్డులు ఉన్నాయి. 7,228 మిషన్ భగీరథ కనెక్షన్లు ఉన్నాయి. పట్టణానికి 7 కి.మీ. దూరంలో ఉన్న మహ్మదాపూర్ సంపు నుంచి రోజూ 2.4 ఎంఎల్డీ నీటిని సరఫరా చేస్తున్నారు. రెండు రోజులకోసారి మున్సిపల్ అధికారులు నల్లాల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నారు. ఉదయం 10 తర్వాత సరఫరా చేస్తుండటంతో చాలా మంది పనులకు వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అవికూడా 10 నుంచి 15 బిందెల వరకే నీళ్లు వస్తున్నాయి. ఈ నీళ్లు తాగడానికి, ఇంటి అవసరాలకు సరిపోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ప్రజల నీటి అవసరాల మేరకు ప్రత్యామ్నాయంగా వాటర్ ట్యాంక్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. పట్టణం విస్తరిస్తుండటం.. పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగా మంచి నీటి సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు తప్పడంలేదు. చాలా మంది మినరల్ వాటర్ ప్లాంట్ల వద్దకు వెళ్లి నీటిని కొని తెచ్చుకుంటున్నారు. వేసవి కాలంలో రోజూ నీటి సరఫరా చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
డబుల్బెడ్రూం కాలనీల్లో తప్పని గోస
దుబ్బాక: మున్సిపాలిటీలో ప్రధానంగా డబుల్బెడ్రూం కాలనీల్లో నీటిఎద్దడి నెలకొంది. కాలనీల్లో సుమారు 900 కుటుంబాలు నివసిస్తున్నారు. మిషన్ భగీరథ పైపులైన్ ద్వారా మంచినీటి సరఫరా జరుగుతున్నప్పటికీ చాలా కాలనీలకు సరిపడా నీళ్లు రావడం లేదు. జీప్లస్ టూ పద్ధతిలో డబుల్ బెడ్రూంల నిర్మాణం ఉండటంతో పైన ఉన్నవారికి తిప్పలు అన్నీ ఇన్నీకావు. నీటిగోస తీర్చేందుకు ఇటీవలనే మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బోర్లు వేసినప్పటికీ పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. 3 వేలకు పైగా జనాభా ఉన్న డబుల్ బెడ్రూం కాలనీల్లో మంచినీటి ఎద్దడి తీర్చాలని ఎన్నిసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదంటూ స్థానికులు వాపోతున్నారు. -
ఊరూరా ఇక గ్రంథాలయం
సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ గ్రంథాలయం ఏర్పాటుకు కృషి చేస్తానని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం అన్నారు. మంగళవారం జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీపరీక్షలకు అవసరమైన అన్ని రకాల పుస్తకాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. జిల్లా గ్రంథాలయంలో అన్ని రకాల మౌలిక సౌకర్యాలు కల్పిస్తామన్నారు. గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని, ఉన్నత ఉద్యోగాలను సాధించాలన్నారు. ఉద్యోగ కల్పన కేంద్రాలుగా గ్రంథాలయాలు ఉపయోగపడుతాయన్నారు. అంతకు ముందు దరిపల్లి చంద్రంను గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. సర్వం సిద్ధం చేసిన అధికారులు సిద్దిపేటఎడ్యుకేషన్: జిల్లాలో బుధవారం నుంచి జరగనున్న ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ నెల 21వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని శాఖల అధికారుల సహాయ సహకారాలు తీసుకుంటున్నారు. పరీపక్షల నిర్వహణ కోసం సీఎస్, డీఓలు, కస్టోడియన్లు, స్క్వాడ్ బృందాలను నియామకం చేసి ఇప్పటికే వారికి అవగాహన సమావేశం నిర్వహించి తగు సూచనలు, సలహాలు అందించారు. జిల్లా వ్యాప్తంగా 27 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్రెడ్డి చెప్పారు. పరీక్షల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనల్లో చేర్చిన ఇంటర్బోర్డునారాయణఖేడ్: ఈసారి ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో ప్రవేశాలు పొందే విద్యార్థులు తప్పనిసరిగా యాంటీ డ్రగ్ అఫిడవిట్ను సమర్పించాల్సి ఉంటుందని ఇంటర్మీడియెట్ బోర్డు స్పష్టం చేసింది. మాదక ద్రవ్యాల వాడకం వల్ల కళాశాల విద్యార్థుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వీటి నివారణకు కట్టుదిట్టమైన ప్రభుత్వం చర్యలు చేపట్టింది. యువత, కళాశాల విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు పోలీసు, ఎకై ్సజ్, విద్యాసంస్థలు కలిసి పని చేస్తున్నాయి. డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు ఈగల్ టీంను సైతం ఏర్పాటు చేశాయి. కళాశాలలు, హోటళ్ల ప్రాంతాల్లోనూ తనిఖీలు జరుపుతున్నారు. పాఠశాలలు, కళాశాలల్లో డ్రగ్స్ ప్రమాదాలపై సెమినా ర్లు, యువతలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
పొద్దుతిరుగుడు, మక్కలు కొనేలా చర్యలు
మిరుదొడ్డి(దుబ్బాక): నిలిచిపోయిన పొద్దు తిరుగుడు, మొక్కజొన్న ధాన్యం కొనుగోళ్లను త్వరలో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి రైతులకు భరోసా కల్పించారు. మంగళవారం మిరుదొడ్డిలోని పొద్దు తిరుగుడు, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ధాన్యాన్ని పరిశీలించారు. రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. నెల రోజులుగా కొనుగోళ్లు లేక నానా అవస్థలు పడుతున్నామని రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వం కొనుగోళ్లు చేపట్టకపోవడంతో దళారులను ఆశ్రయించి క్వింటాలుకు సుమారు రూ.3 వేల వరకు నష్టపోవాల్సి వస్తుందని రైతులు వాపోయారు. రైతుల సమస్యలను తెలుసుకున్న కోదండరెడ్డి స్పందిస్తూ పొద్దు తిరుగుడు, మొక్కజొన్న కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి -
జిల్లాలో పెరుగుతున్న దొంగతనాలు
● పసిడే లక్ష్యంగా ఇళ్లలో చోరీలు ● పేట్రేగిపోతున్న చైన్స్నాచర్స్ ● హత్య చేసేందుకు సైతం వెనుకాడని నేరగాళ్లు బంగారం విలువ పెరుగుతుండటంతో దొంగతనాలు విపరీతంగా పెరుగుతున్నాయి. బంగారం ఇప్పుడు నేరగాళ్లకు ప్రధాన టార్గెట్గా మారింది. ఇంట్లో బంగారం ఉన్నా.. బయటకు నగలు ధరించి వెళ్లినా.. సామాన్యుల్లో ఆందోళన ఎక్కువైంది. సాధారణంగా ప్రతీ మహిళ మెడలో మంగళసూత్రంతో పాటు బంగారు గొలుసు ఉంటాయి. ఇలాంటి తరుణంలో మహిళలే టార్గెట్ చేసుకొని దొంగలు చోరీలకు పాల్పడుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. – సాక్షి, సిద్దిపేట బులియన్ మార్కెట్లో బంగారం ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. గత సంవత్సరం కాలంగా ధరలు పెరుగుతున్నాయి. ఇదే నేరగాళ్లకు పెద్ద టార్గెట్గా మారింది. త్వరగా డబ్బులు సంపాదించాలనే ఆశ, ఈజీ మనీ మోజుతో నేరాలకు పాల్పడుతున్నారు. బంగారం దొపిడీకి పాల్పడిన తర్వాత సదరు వ్యక్తులను హత్య చేసేందుకు సైతం వెనుకాడటం లేదు. ఇలాంటి సంఘటనలు జరుగుతుండటంతో ప్రజలను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. నిఘా అవసరం చోరీ సొమ్మును వెంటనే నగదుగా మార్చుకునేందుకు కొందరు అక్రమ కొనుగోలుదారులను ఆశ్రయిస్తున్నారు. బిల్లులు లేకుండానే బంగారం కొనుగోలు చేసే షాప్లు నేరాలకు పాల్పడే వారికి పరోక్షంగా సహకరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవస్థపై కఠి న నిఘా అవసరమని ప్రజలు కోరుతున్నారు.జాగ్రత్తలు తప్పనిసరి ప్రస్తుతం బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో దొంగతనాలు పెరిగే అవకాశం ఉంది. మహిళలు, వృద్ధులు ఒంటరిగా ప్రయాణించే సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అనుమానిత వ్యక్తులతో మాట్లాడకూడదు. మాటలతో నమ్మించే అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలా ఎవరైనా కనిపిస్తే వెంటనే 100కి కాల్ చేసి సమాచారం అందించాలి. –రష్మీ పెరుమాళ్, సీపీ -
పనిచేసే వారికే పదవులు
కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ రాజ భద్రయ్య ప్రశాంత్నగర్(సిద్దిపేట): కాంగ్రెస్ పార్టీలో కష్టపడే ప్రతీ కార్యకర్తకు తప్పకుండా పదవులు వస్తాయని, ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఉమ్మడి మెదక్ జిల్లా అబ్జర్వర్ బందెల రాజ భద్రయ్య అన్నారు. సోమవారం సిద్దిపేటలోని డీసీసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ పోస్టుకు దరఖాస్తులను స్వీకరించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజభద్రయ్య మాట్లాడుతూ ఇప్పటివరకు పార్టీ జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్గా కొనసాగిన కొమ్ము విజయ్కుమార్తో పాటు 26 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. దరఖాస్తులను పార్టీ స్టేట్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణకు అందజేస్తామని, పరిశీలించి నిష్పక్షపాతంగా ఎంపిక చేస్తారన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గాడిపల్లి రఘువర్ధన్ రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ పత్తి కుమార్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
కొనుగోళ్లపై పర్యవేక్షణ తప్పనిసరి
● మంత్రి పొన్నం ప్రభాకర్ ● అధికారులతో టెలీకాన్ఫరెన్స్ హుస్నాబాద్: రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కంట్రోల్ రూమ్ ద్వారా ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పర్యవేక్షించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం హుస్నాబాద్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లపై హైదరాబాద్ నుంచి మంత్రి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్రాలకు భారీగా ధాన్యం వస్తుండటంతో అధికారులు సమన్వయంతో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని చెప్పారు. మిల్లుల వద్ద, ధాన్యం తరలింపులో వాహనాల సమస్య, హమాలీల కొరత లేకుండా చూసుకోవాలన్నారు. ధాన్యం అధికంగా వచ్చే కేంద్రాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇక నుంచి రోజు విడిచి రోజు టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. టెలికాన్ఫరెన్స్లో సిద్దిపేట, హన్మకొండ, కరీంనగర్ అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, డీఎస్ఓలు, డీఎం, సివిల్ సప్లయ్ అధికారులు, తహసీల్దార్లు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ
● జిల్లాలో 27 పరీక్షా కేంద్రాలు ● హాజరు కానున్న 9,142 మంది విద్యార్థులు సిద్దిపేటఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 13 నుంచి 21వరకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇంటర్ విద్యాధికారులు పూర్తి చేశారు. పరీక్షల నిర్వహణలో కీలక పాత్ర పోశించనున్న సీఎస్, డీఓలకు సోమవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్ విద్యాధికారి (డీఐఈఓ) రవీందర్రెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 27పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కాగా ఫస్టియర్లో 654, సెకండియర్లో 3,488 మంది మొత్తం 9,142 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు చెప్పారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్న 12గంటల వరకు ఫస్టియర్ విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్ విద్యార్థులకు పరీక్షలను నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షలను పారదర్శకంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు వివరించారు. విద్యార్థులు నిర్ణీత సమయం కంటే అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా గదుల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పరీక్షల కమిటీ సభ్యులు జ్యోతి, గంగాధర్, దేవయ్య, స్థానిక కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.కేంద్రాల వద్ద పటిష్ట ఏర్పాట్లుసిద్దిపేటకమాన్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్న కేంద్రాల వద్ద 163బీ ఎన్ఎస్ఎస్ నిబంధనలు అమల్లో ఉంటాయని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం 7నుంచి సాయంత్రం 7గంటల వరకు నిబంధనలు అమల్లో ఉంటాయన్నారు. కేంద్రాల సమీపంలో ప్రమాదకరమైన వస్తువులు కలిగి ఉండకూడదన్నారు. సమీపంలోని అన్ని జిరాక్స్ సెంటర్లు మూసి వేసి ఉంచాలని సీపీ ఆదేశించారు. పరీక్షలకు కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. -
జై శ్రీరాం.. జై హనుమాన్
అనంతసాగర్లోఆలయంలో తహసీల్దార్ నిర్మల, దళితులుగజ్వేల్: జగదేవ్పూర్ మండలం అనంతసాగర్లో దళితులను దుర్గమ్మ ఆలయ బోనాల కార్యక్రమంలో పాల్గొనకుండా అడ్డుకున్న ఘటనపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. సోమవారం తహసీల్దార్ నిర్మల ఆధ్వర్యంలో దళితులచే ఆలయ ప్రవేశం చేయించారు. కులవివక్షత చట్టరీత్య నేరమని, అంతా కలిసిమెలిసి ఉండాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్లు, తదితరులు పాల్గొన్నారు. చిన్నకోడూరు(సిద్దిపేట): చిన్నకోడూరులో సోమవారం హనుమాన్ మాలధారులు, భక్తులు భారీ హనుమాన్ విగ్రహంతో గ్రామంలో శోభాయాత్ర నిర్వహించారు. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ.. జై శ్రీరాం, జై హనుమాన్ నినాదాలతో శోభాయాత్ర సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దళితుల ఆలయ ప్రవేశం -
వచ్చే పది రోజులు అత్యంత కీలకం
కలెక్టర్ హైమావతి సిద్దిపేటజోన్: వచ్చేపది రోజులు అత్యంత కీలకమని, ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హైమావతి సూచించారు. సోమవారం ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనంలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సివిల్ సప్లై, డీఆర్డీఏ, పీఏసీఎస్, రెవెన్యూ, మార్కెటింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రణాళిక ప్రకారం ధాన్యాన్ని లిఫ్టింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం లోడింగ్లో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలన్నారు. లారీల కొరత లేకుండా చూడాలని రవాణా శాఖ అధికారులకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేసి కొనుగోలు ప్రక్రియ జరపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లై అధికారి తనూజ, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, డీఎం మార్కెటింగ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈవీఎం గోదాం పరిశీలన.. కలెక్టరేట్ పక్కన ఉన్న ఈవీఎం గోదాంను కలెక్టర్ హైమావతి పరిశీలించారు. ఈ సందర్భంగా లాగ్ బుక్ పరిశీలించి, విజిటర్ రిజిస్టర్లో సంతకం చేశారు. సీసీ కెమెరాల పనితీరు, పోలీసు అధికారుల బందోబస్తు గురించి ఆరా తీశారు. ఈవీఎం గోదాం పరిసర ప్రాంతాన్ని పర్యవేక్షించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. -
పైసలేవీ?
ఎన్నికల● ఇప్పటికీ ఐదు నెలలు గడుస్తున్నా రాని డబ్బులు ● నాడు అప్పులు తెచ్చి పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పన అయోమయంలో పంచాయతీ కార్యదర్శులుగ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసి ఐదు నెలలు గడుస్తున్నా ఎన్నికల నిర్వహణకు వెచ్చించిన డబ్బులు పూర్తి స్థాయిలో రాకపోవడంతో కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ఖర్చు దాదాపు రూ.5.07 కోట్లు కాగా ఇప్పటి వరకు రూ.4 కోట్లే చెల్లించారు. ఇంకో రూ.కోటి వరకు చెల్లింపులు పెండింగ్లో ఉండగా, అందులో ఎక్కువ భాగం గ్రామ పంచాయతీ కార్యదర్శులకే ఉండటం గమనార్హం. మరో పది రోజుల్లో కార్యదర్శులకు బదిలీలు ఉండటంతో పెట్టిన డబ్బులు వస్తాయా? లేదా? అని ఆందోళన చెందుతున్నారు. – సాక్షి, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మూడు దశలలో డిసెంబర్11, 14, 17వ తేదీలలో 508 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాయి. ఓ గ్రామ పంచాయతీలో 12 వార్డులున్న వాటికి దాదాపు 50 మంది పోలింగ్ సిబ్బంది విధులకు హాజరయ్యారు. వారికి ముందు రోజు బస, భోజనం, పోలింగ్ నాడు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, టీలను పంచాయతీ కార్యదర్శులే ఏర్పాటు చేశారు. కేంద్రాల్లో టెంట్లు కుర్చీలు, టేబుల్స్ సమకూర్చారు. ఇందుకు దాదాపు రూ.25వేలు వెచ్చించారు. కానీ ఆ కార్యదర్శికి ఇప్పటి వరకు మండల అభివృద్ధి అధికారి(ఎంపీడీఓ) రూ. 10వేలు అందించారు. అదే చిన్న గ్రామ పంచాయతీలకు రూ.18వేలు ఖర్చు అయితే రూ.8వేలు చెల్లించారు. అదేమంటే, ఇంకా నిధులు రావాల్సి ఉందని సమాధానం చెబుతున్నారు. అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పలు మండలాల పరిఽధిలో పలువురు వీడియో గ్రాఫర్లకు సైతం డబ్బులు చెల్లించలేదని తెలుస్తోంది. మరో పది రోజుల్లో బదిలీలు జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల బదిలీలు మరో పది రోజుల్లో జరగనున్నాయి. ఎన్నికల కోసం పెట్టిన ఖర్చులు వస్తాయా? లేదా? అని వారు అందోళన చెందుతున్నారు. కొందరు జీతం డబ్బుల, మరికొందరు అప్పు తెచ్చి ఎన్నికల నిర్వహణ కోసం వెచ్చించారు. డబ్బుల కోసం నాలుగు నెలలుగా ఎదురుచూస్తున్నారు. బదిలీలు అయితే డబ్బులు ఎలా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నత అధికారులు స్పందించి పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని పంచాయతీ కార్యదర్శులు, ఎన్నికల నిర్వహణలో పని చేసివారు కోరుతున్నారు.ఎంపీడీఓల ఆధ్వర్యంలోనే పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. కనుక వారికి డబ్బులు ఎప్పుడు ఇచ్చినా ఏమీ కాదు అనే ధోరణిలో పెండింగ్లో పెట్టినట్లు తెలుస్తోంది. పెద్ద మండలాలకు ఎక్కువ, చిన్నవైతే తక్కువ మొత్తాన్ని ఉన్నతాధికారులు ఎంపీడీఓల ఖాతాలలో జమ చేశారు. పంచాయతీ వారీగా విభజిస్తే అర కొర నిధులే వచ్చాయి. పోలింగ్ ఖర్చుల వివరాలను బిల్లులతో సహా పంచాయతీ కార్యదర్వులు ఐదు నెలల కిందటే ఎంపీడీఓ కార్యాలయాల్లో సమర్పించారు. ఎన్నికల నిర్వహణ కోసం రూ.5.07 కోట్లు ఖర్చు అయ్యాయి. ప్రభుత్వం నుంచి రూ.4కోట్లు వచ్చాయి. ఇంకా రూ.1.07కోట్లు పెండింగ్లో ఉన్నాయి. అవి విడుదల కాగానే పూర్తి స్థాయిలో చెల్లింపులు జరగనున్నాయి. – రవీందర్, ఇన్చార్జి డీపీఓ -
జన గణన ప్రక్రియ షురూ..
సాక్షి, సిద్దిపేట: జనాభా గణన–2027 ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. 2021లో జరగాల్సిన జనాభా గణన కరోనా కారణంగా వాయిదా పడింది. సామాజిక ఆర్థిక సర్వే –2024 ప్రకారం జిల్లాలో 3.31లక్షల కుటుంబాలు ఉండగా 2041 బ్లాక్లుగా విభజించారు. జన గణన కోసం ఎన్యూమరేటర్లు 1,970 మంది, సూపర్వైజర్ల 345 మందిని, ఛార్జ్ సెన్సెస్ అధికారులను 31 మందిని నియమించారు. వీరికి ఇప్పటికే శిక్షణను ఇచ్చారు. ఈ గృహాల గుర్తింపు జూన్ 9వ తేదీ వరకు కానుంది. తొలి రోజు మ్యాపింగ్తో పాటు గృహాల గుర్తించారు. ఆ గృహాలకు నంబర్లును ఎన్యూమరేటర్లు రాశారు. స్వీయ గణనను జిల్లాలో దాదాపు 22వేల కుటుంబాలు వినియోగించుకున్నారు. ఫిబ్రవరి 2027లో జనాభా గణనను చే పట్టనున్నారు. ఒక్కో ఎన్యూమరేటర్కు దాదాపు 150 ఇండ్లకు పైగా కేటాయించనున్నారు. ఎన్యూమరేటర్ మొబైల్ యాప్ ద్వారా డేటాను నమోదు చేయనున్నారు. కేవలం నివాసాలే కాకుండా ... కమర్షియల్ భవనాలు, ఆసుపత్రులు, హోటళ్లు, కాలేజీ ఇలా అన్నింటిని సర్వేలో కవర్ చేయనున్నారు. తొలి రోజు గృహాల మ్యాపింగ్, గుర్తింపు జూన్ 9వ తేదీ వరకు కొనసాగనున్న కార్యక్రమం స్వీయ గణన చేసుకున్న 22వేల కుటుంబాలు సిద్దిపేటఅర్బన్: మండలంలోని ఆయా గ్రామాలలో ఇంటింటి సర్వే ప్రక్రియను సర్పంచ్లు ప్రారంభించారు. సూపర్వైజర్ల ఆధ్వర్యంలో ఎన్యూమరేటర్లు ఆయా గ్రామాలలో తొలి రోజు సర్వే నిర్వహించారు. జనగణనలో భాగంగా అధికారులు ఇంటింటికి తిరుగుతూ వివరాలను డిజిటల్ విధానంలో సేకరించనున్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
పాలిసెట్కు సర్వం సిద్ధం
నంగునూరు(సిద్దిపేట): పాలిసెట్కు సర్వం సిద్ధం చేశామని డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, రాజగోపాలపేట పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ గోవర్ధన్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా, వ్యవసాయ వెటర్నరీ కోర్సులో ప్రవేశాల కోసం బుధవారం ఉదయం 11 నుంచి సాయంత్రం 1.30 వరకు పరీక్ష జరుగుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 4,037 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్లో కలిపి మొత్తం 11 సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. నిమిషం నిబంధన అమలులో ఉందని, ఓఎంఆర్ షీట్కు రెండు వైపులా విద్యార్థుల వివరాలు నమోదు చేయాల్సి ఉన్నందున గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. హాల్ టికెట్తో పాటు ఏదైనా ఫొటో గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలన్నారు. సిద్దిపేటఅర్బన్: ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న ఎప్సెట్ పరీక్షలు సోమవారంతో ప్రశాంతంగా ముగిశాయి. మొదటగా అగ్రికల్చర్, ఫార్మసీలో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించారు. అనంతరం మూడు రోజుల పాటు ఇంజినీరింగ్ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించారు. సీబీటీ విధానంలో జరిగిన పరీక్షకు సోమవారం ఉదయం సెషన్కు 50 మంది విద్యార్థులకు గాను 49 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్కు 48 మంది హాజరయ్యారు. పరీక్షలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీపీ రాజు, అబ్జర్వర్ భాస్కర్, టీసీఎస్ ఆఫీసర్ సింగిత్సింగ్, పీఆర్వో రఘు, సిస్టమ్ అడ్మిన్ షాదుల్లా పర్యవేక్షించారు. గజ్వేల్: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో యూఐడీఎఫ్(అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్) పనులపై కదలిక వచ్చింది. యూఐడీఎఫ్ ప్రారంభానికి పట్టిన రాజకీయ గ్రహణంపై ‘సాక్షి’లో ఈనెల 11న ‘నేతల పంతం...అంతా సతమతం’ శీర్షికన ప్రచురితమైన కథనం నేపథ్యంలో కదలిక మొదలైంది. సోమవారం మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్ హైదరాబాద్లోని యూఐడీఎఫ్ ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్)ని కలిశారు. టెండర్లను వెంటనే ఓపెన్ చేసి, వర్క్ ఆర్డర్లు ఇవ్వాలని కోరారు. స్పందించిన ఈఎన్సీ తగు చర్యలకు హామీ ఇచ్చారు. యూఐడీఎఫ్ పనులకు ఇక ఆటంకాలు తొలిగిపోయినట్లయ్యింది. కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ మహేశ్ తదితరులు పాల్గొన్నారు. ప్రశాంత్నగర్(సిద్దిపేట): హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఒకటో తరగతిలో ఆరు ఖాళీలకు గాను అర్హులైన ఎస్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి వెంకటేష్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలను ఈనెల 18 న సాయంత్రం ఐదు గంటల లోపు కార్యాలయంలో అందించాలన్నారు. ఈ నెల 22న ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టరేట్లో లాటరీ పద్ధతిలో అర్హులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. కొండపాక(గజ్వేల్): కుకునూరుపల్లిలో పాండురంగ ఆశ్రమ గురువులు విఠల్శర్మ ఆధ్వర్యంలో బొడ్రాయి, పోతలింగేశ్వరస్వామి విగ్రహాల ప్రతిష్ఠాపన సోమవారం ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ కనకవ్వ, నేతలు నవీన్కుమార్, నరేందర్, అమరేందర్, పాండురంగం, భూములుగౌడ్, రాములు, శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. -
అర్జీలు సత్వరం పరిష్కరించండి
● కలెక్టర్ హైమావతి ● అధికారులకు దిశానిర్దేశం సిద్దిపేటకమాన్: ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫిర్యాదుదారుల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రజావాణిలో జిల్లాలో మొత్తం 94 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్ఓ నాగరాజమ్మ, జిల్లా అధికారులు, తదితరులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా మహిళా మత్య్స పారిశ్రామిక సహకార సంఘం సభ్యులకు మహిళా కేటగిరిలో ఇచ్చే వాహనాలను ఇవ్వడం లేదు. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకువచ్చిన కూడా వాహనాలు ఇవ్వకపోవడం విడ్డూరం. సంబంధిత అధికారులు వాహనాలు ఇప్పించాలి. – బర్ల సత్యనారాయణ, పొన్నాల -
నల్ల బ్యాడ్జీలతో బీసీ నేతల నిరసన
హుస్నాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో బీసీ రిజర్వేషన్లపై ప్రకటన చేయకపోవడంపై బీసీ నేతలు మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు, తెలంగాణలో 42 శాతం రిజర్వేషన్ల బిల్లును 9వ షేడ్యూల్లో చేర్చి అమలు చేయాలని డిమాండ్ చేశారు. జనగణనలో కులగణను చేర్చి లెక్కించాలన్నారు. బీసీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలన్నారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో పాటు బీసీ రక్షణ చట్టం చేయాలన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పునః సమీక్షించి, మండల్ కమిషన్ సిఫార్సులను అమలతో పాటు పలు డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ కన్వీనర్ మేకల వీరన్న యాదవ్, నియోజకవర్గ ఇన్చార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, కాంగ్రెస్ నాయకులు వడ్డెపల్లి రమణ, హస్సెన్, శ్రీనివాస్గౌడ్, కౌన్సిలర్లు వరప్రసాద్, రమేష్, రాజు, శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
పాత పెన్షన్ విధానమే వర్తింపజేయాలి
ప్రశాంత్నగర్(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం హేయమైన చర్య అని ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో తిరుపతిరెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ(2003) ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టమైన తీర్పు ఇచ్చిందన్నారు. 2004 సెప్టెంబర్కు ముందు నోటిఫికేషన్ ద్వారా నియామకాలు పొందిన ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తోందన్నారు. రాష్ట్రం ప్రభుత్వం మాత్రం అమలు చేయడంలో విఫలమవుతోందన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి -
జనగణనలో భాగస్వాములు కండి
● సిబ్బందికి సహకరించాలి ● నేటినుంచి ఇంటింటికీ ఎన్యూమరేటర్లు ● కలెక్టర్ హైమావతి సిద్దిపేటజోన్: జనగణన ప్రక్రియ చాలా కీలకమని, ఇందులో భాగస్వామ్యం అయ్యే బాధ్యత ప్రతి ఒక్కరిదని కలెక్టర్ హైమావతి అన్నారు. ఆదివారం డిగ్రీ కళాశాల మైదానంలో మొదటి దశ జనగణనపై అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమగ్ర కచ్చితమైన గణాంకాల రూపకల్పనకు జనగణన కీలకమన్నారు. ఇందులో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చాలా ఏళ్ల తర్వాత మన దేశంలో జనగణన జరుగుతోందన్నారు. కోవిడ్ కారణంగా 2021లో జరగలేదని, స్వాతంత్య్ర సిద్ధించిన తరువాత ఇది 16వ జనగణన అని అన్నారు. మన రాష్ట్రంలో ఇది మొదటి జనగణన అని, మొదటి సారిగా డిజిటల్ విధానంలో చేపడుతున్నట్లు తెలిపారు. ఈనెల 10తో స్వీయగణన పూర్తి అయ్యిందని, సోమవారం నుంచి జిల్లాలో ఇంటింటికీ ఎన్యూమరేటర్లు వెళ్లి వివరాలు సేకరిస్తారన్నారు. వారికి శిక్షణ అందించినట్లు, ప్రత్యేకంగా గుర్తింపు కార్డులను జారీ చేసినట్లు తెలిపారు. ఇంటికి వచ్చిన సిబ్బందికి ప్రజలు సహకరించాలని సూచించారు. జనగణన పేరిట ఎవరైనా అనుమానిత వ్యక్తులు వచ్చి వివరాలు అడిగే అవకాశం ఉంటుందన్నారు. అలాంటి వ్యక్తుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. జనగణనలో పాల్గొనే సిబ్బందికి జారీ చేసిన గుర్తింపు కార్డు మీద క్యూఆర్ కోడ్ ఉంటుందని, దాన్ని స్కాన్ చేస్తే అధికారిక వెబ్ సైట్లో పొందిపర్చిన వారి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చని సూచించారు. ఈ ర్యాలీ ముస్తాబాద్ చౌరస్తా, మెదక్ రోడ్ మీదుగా పాత బస్టాండ్ వరకు సాగింది. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి శ్రీనివాస్రెడ్డి, అధికారులు హమీద్, రామస్వామి, పలు సంఘాల ప్రతినిధులు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట
ప్రధాని మోదీ ● వర్చువల్గా స్మార్ట్ సిటీ పనులకు శంకుస్థాపన ● సభకు తరలివెళ్లిన పార్టీ శ్రేణులు జహీరాబాద్/ఝరాసంగం(జహీరాబాద్): జహీరాబాద్ ప్రాంతం భవిష్యత్తులో పారిశ్రామిక పట్టణంగా అవతరించనుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఆదివారం హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా నిర్వహించిన సభలో జహీరాబాద్ స్మార్ట్ సిటీ పనులకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జహీరాబాద్లోని నిమ్జ్ ప్రాజెక్టులో ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్ ప్రాంతం నిర్మాణం వెనుక ఇదే లక్ష్యం ఉందన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ వికసితానికి కేంద్ర, రాష్ట్రం ప్రభుత్వాల వాటా ఉందన్నారు. జహీరాబాద్ ప్రాంతంలో ప్రపంచస్థాయి మౌలిక వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. నాణ్యవంతమైన విద్యుత్ సరఫరా, అత్యాధునిక హైసిటీ నెట్వర్క్ కూడా ఉండనుందన్నారు. దేశవ్యాప్తంగా ఉండే పరిశ్రమల అవసరాల కోసం కావాల్సిన అన్ని సదుపాయాలు ఇక్కడ తయారుకానున్నాయని తెలిపారు. ఇలాంటి సదుపాయాల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.వేలకోట్లు అవసరమవుతాయని చెప్పారు. తెలంగాణతోపాటు హైదరాబాద్ ప్రాంతంలోని వేలాది యువకులకు జహీరాబాద్ ప్రాంతం జాబ్ హబ్గా తయారుకానుందని వివరించారు. నిమ్జ్లో తయారయ్యే వాహనాలు, యంత్రాలతోపాటు ఇక్కడ ఉండే ఆహారశుద్ధి ఉద్యోగులకు, తెలంగాణలోని కార్మికులు, రైతులకు ఈ ప్రాజెక్టు వల్ల లబ్ధి చేకూరనుందన్నారు. ఝరాసంగం–న్యాల్కల్ పరిధిలో స్మార్ట్సిటీ ఝరాసంగం, న్యాల్కల్ మండలాల పరిధిలో స్మార్ట్ సిటీ ఏర్పాటు కానుంది. ప్రాజెక్టు ఏర్పాటు నిమిత్తం మొదటి విడత కింద 3,245 ఎకరాల మేర భూసేకరణ జరిగింది. ఝరాసంగం మండలంలోని మూడు గ్రామాలు,న్యాల్కల్ మండలంలోని 17 గ్రామాల పరిధిలో జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి(నిమ్జ్) ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం సుమారు రూ.2,369 కోట్ల నిధులతో రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయల సంస్థ, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి అమలు ట్రస్ట్ కలిసి పారిశ్రామిక అభివృద్ధి పనులు చేపట్టనున్నాయి. కేవలం మౌలిక సదుపాయాల కల్పన కోసమే జహీరాబాద్లో రూ.1,695 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇక వేగంగా స్మార్ట్సిటీ పనులునిమ్జ్ ప్రాంతంలో ఏర్పాటు కానున్న స్మార్ట్ సిటీ పనులకు ప్రధాని మోదీ వర్చువల్గా శంకుస్థాపన చేసిన నేపథ్యంలో ఇక పనుల్లో జోరు పెరగనుంది. 3,245 ఎకరాల విస్తీర్ణంలో రూ. 2,369 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు పనులు చేపట్ట నున్నారు. హైదరాబాద్–నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్ వర్క్లో భాగంగా పరిశ్రమలకు అవసరమయ్యే మౌలిక వసతులు ఏర్పాటు చేస్తారు. కాగా, కేంద్ర ప్రభుత్వం 2024 ఆగస్టులో ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రకటించింది. బర్దిపూర్లో ఏర్పాటుచేసిన శంకుస్థాపన కార్యక్రమంలో నిమ్జ్ ప్రత్యేకాధికారి విశాలాక్షి, ఆర్డీఓ దేవుజా, జోనల్ మేనేజర్ విఠల్, రూరల్ సీఐ హనుమంతు, ప్రాజెక్టు కాంట్రాక్ట్ మేనేజర్ విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
అలరించిన అష్టావధానం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని లలిత చంద్రమౌళీశ్వర ఆలయంలో ఆదివారం నిర్వహించిన అష్టావధానం అలరించింది. అవధాని శరత్కుమార్ శర్మ పద్యాలతో ఆకట్టుకున్నారు. పృచ్చకులుగా నిషిద్ధాక్షరి పెందోట వెంకటేశ్వర్లు, వర్ణన ఉండ్రాళ్ల రాజేశం, సమస్య కాల్వ రాజయ్య, దత్తపది దుడుగు నాగలత, ఆశువు మచ్చ అనురాధ, వ్యస్తాక్షరి నల్ల అశోక్ తదితరులు అడిగిన అంశాలపై వజ్జల శరత్ కుమార్ శర్మ పద్యాలు అప్పటికప్పుడే చెప్పారు. తెలుగు భాషలో అవధానం గొప్పదని ఆలయ నిర్వాహకులు పండరి రాధాకృష్ణ అన్నారు. సిద్దిపేటఅర్బన్: ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న టీఎస్ఎప్సెట్ ఇంజినీరింగ్ పరీక్ష రెండో రోజు ప్రశాంతంగా ముగిసింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించారు. ఉదయం సెషన్కు 50 మంది విద్యార్థులకు 49 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్కు 52 మందికి 52 మంది హాజరయ్యారు. పరీక్షలను ప్రిన్సిపాల్ డాక్టర్ వీపీ రాజు, అబ్జర్వర్ భాస్కర్, టీసీఎస్ సింగిత్ సింగ్, పీఆర్వో రఘు, సిస్టమ్ అడ్మిన్ షాదుల్లా పర్యవేక్షించారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు గజ్వేల్రూరల్: కార్పొరేట్ యాజమాన్యాలకు మేలు చేసేలా లేబర్ కోడ్లు ఉన్నాయని, వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్కోడ్లు వ్యతిరేకిస్తూ, నూతనంగా నోటిఫై చేసిన రూల్స్ ప్రతులను ఆదివారం గజ్వేల్లో దహనం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం తీసుకువచ్చిన కోడ్ల వల్ల కనీస వేతనాలు, సౌకర్యాలు లేకుండా పోతాయని, పనిగంటల పెంపుతో పాటు ఉద్యోగ భద్రత కరువవుతుందని అన్నారు. కేంద్రం తమ వైఖరిని మార్చుకొని కార్మికులకు మేలు చేసేలా చట్టాలను రూపొందించాలని, లేనిపక్షంలో కార్మికవర్గం నుంచి పెద్ద ఎత్తున తిరుగుబాటు తప్పదని తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సందబోయిన ఎల్లయ్య, నాయకులు బండ్ల స్వామి, వేణుగోపాల్, సుధాకర్, చంద్రశేఖర్రెడ్డి, వెంకట్రావు, భూపతి, పర్శరాములు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. తాగు నీరు వృథా చిన్నకోడూరు (సిద్దిపేట): మండలంలోని మెట్టుబండల నుంచి చంద్లాపూర్ వెళ్లే రహదారి పక్కన పైపులైన్ లీకేజీ అయి తాగు నీరు వృథాగా పోతోంది. అరికట్టాల్సిన యంత్రాంగం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. లీకేజీలతో నీరు కలుషితమై అదే నీరు ప్రజలు తాగుతున్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. విద్యార్థినికి రూ.లక్ష బహుమతి సిద్దిపేటఎడ్యుకేషన్: సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థిని మోకు హారిక ఇంటర్మీడియెట్ బోర్డు ప్రకటించిన లక్ష రూపాయల నగదు బహుమతికి ఎంపికై నట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్రెడ్డి ఆది వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలకు చెందిన విద్యార్థిని ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో 994 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సోమవారం ఆ విద్యార్థినికి పారితోషికాన్ని అందించి సన్మానిస్తారని తెలిపారు. హారికను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి రాణించాలని పిలుపునిచ్చారు. -
మార్మోగిన మల్లన్న ఆలయం
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం భక్తుల రాకతో సందడిగా మారింది. దీంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మారుమోగాయి. శనివారం సాయంత్రమే క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆలయ, ప్రయివేటు వసతి గదులలో బసచేశారు. వేకువజామునే పుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. కొంత మంది గంగిరేణి చెట్టు వద్ద పట్నాలు వేసి, ముడు పులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. కొందరు స్తంభం వద్ద కోడెలను కట్టారు. భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను ఆలయ అధికారులు పర్యవేక్షించారు.కొమురవెల్లిలో భక్తుల సందడి -
ఆరోగ్య సమాజాన్ని నిర్మిద్దాం
● అట్టహాసంగా ప్రోమో రన్ ● హాజరైన న్యాయమూర్తి సంతోష్ కుమార్, అదనపు డీసీపీ సుభాష్సిద్దిపేటజోన్: ఆరోగ్య సమాజాన్ని నిర్మిద్దామని వక్తలు పిలుపునిచ్చారు. శనివారం కోమటిచెరువు పైన తెలంగాణ రన్నర్స్, సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేట ప్రోమో రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్ జెండా ఊపి రన్ ప్రారంభించారు. అనంతరం విజేతలకు ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జ్ సంతోష్ కుమార్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి సంతోష్ కుమార్ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు తప్పనిసరి వాకింగ్, రన్నింగ్, వ్యాయాయం, వంటి శారీరక కార్యకలాపాలు అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెంపొందించడం, యువతను ఫిట్నెస్ వైపు ప్రోత్సాహించడం లక్ష్యంగా ప్రోమో రన్ ఏర్పాటు చేసినట్టు నిర్వహకులు తెలిపారు. జూన్7న హైదరాబాద్ లో నిర్వహించనున్న అవంతిక తెలంగాణ రన్ కార్యక్రమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రోమో రన్ చేపట్టినట్టు తెలిపారు. ఈ ప్రోమో రన్ లో పెద్ద ఎత్తున రన్నర్స్, యువత, విద్యార్థులు, క్రీడాభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు జగన్ మోహన్రెడ్డి, రాజు,బాపురెడ్డి, రవి, సుజాత, హరి, తదితరులు పాల్గొన్నారు. -
రైతుల సమస్యలు పట్టని సర్కార్
● పొద్దుతిరుగుడు, మక్కలు కొనరేం ● మాజీ మంత్రి హరీశ్రావు చిన్నకోడూరు(సిద్దిపేట): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీకి మూటలు మోయడానికి టైమ్ ఉంది.. కానీ రైతులకు గన్నీ సంచులు సరఫరా చేసేందుకు టైమ్ దొరకడం లేదని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. శనివారం చిన్నకోడూరులోని పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. 40 రోజులుగా పొద్దు తిరుగుడు కొనలేదని రైతులు చెప్పడంతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు ఫోన్ చేసి, పొద్దు తిరుగుడు రైతు సమస్యలు వివరించారు. కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వివరించారు. కొనుగోలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. హరీశ్రావు మాట్లాడుతూ కనీసం ఒక్కసారి ఏ పల్లెలోనైనా వడ్ల కుప్పల దగ్గరకు పోయి రైతుల బాధలు వినలేదన్నారు. మూసీ, ఫ్యూచర్ సిటీ మీద ఉన్న ప్రేమ రేవంత్ రెడ్డికి రైతుల మీద లేదన్నారు. రైతులు పండించిన పంటలు కొనుగోలు చేయడంలేదని, ఢిల్లీకి ఉత్తరాలు రాశామని కాలయాపన చేస్తున్నారే తప్ప రైతుల గురించి ఆలోచించడం లేదన్నారు. నెలల తరబడి వడ్లు కొనక రైతులు ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రికి పట్టడంలేదన్నారు. మూడు పంటలకు రైతు భరోసా ఎగ్గొట్టారని, యూరియా అడిగితే యాప్ అంటున్నారని, రైతులు పండించిన పంటలు కొనడంలేదని హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజూ మూసీ, ఫ్యూచర్ సిటీ కోసం మీటింగ్లు పెడుతున్నారే తప్ప ఆరుగాలం కష్టపడి పండించిన పంటల కొనుగోళ్ల మీద ఒక్క మీటింగ్ కూడా పెట్టలేదన్నారు. ప్రభుత్వం తక్షణమే పొద్దు తిరుగుడు, మొక్కజొన్న, శనిగలు యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వడ్ల కొనుగోళ్లు వేగవంతం చేయాలన్నారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు. -
వేణుగోపాలునికి ఘటాభిషేకం
వర్గల్ కోవెలలో బ్రహ్మోత్సవాలు సంపూర్ణం వర్గల్(గజ్వేల్): భక్తజనావళికి ఆధ్యాత్మిక పంచిన వర్గల్ వేణుగోపాలుని వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ఘటాభిషేకం, చక్రతీర్థంతో ముగిశాయి. అర్చకులు ఆలయ ముఖమండపంలో వేదికపై రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఉత్సవమూర్తులను ఆసీనులను చేశారు. కలశాలు స్థాపన, కలశ పూజ నిర్వహించారు. గర్భగుడిలో మూలవిరాట్టులకు మంత్రోక్తంగా ఘట కలశాభిషేకం నిర్వహించారు. దేవతామూర్తులను సర్వాలంకారశోభితులుగా అలంకరించారు. వసంతోత్సవం, కోనేరులో చక్రతీర్థం (చక్రస్నానం) నిర్వహించారు. వేడుకలలో భక్తజనులు పాల్గొని తరించారు. -
హైందవ ధర్మాన్ని మరవద్దు
● ఎంపీ మాధవనేని రఘునందన్రావు ● దుబ్బాకలో హిందూ మహాసమ్మేళనం దుబ్బాక: పాశ్చత్యసంస్కృతి మోజులో పడి మన హిందూ ధర్మాన్ని మరచిపోవద్దని ఎంపీ మాధవనేని రఘునందన్రావు అన్నారు. శనివారం రాత్రి దుబ్బాక పట్టణంలోని బాలాజీ ఆలయంలో హిందూ మహాసమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచమంతా హిందూ ధర్మాన్ని అనుసరిస్తుంటే మనం దూరం అవుతుండడం బాధాకరమన్నారు. హిందూ ధర్మం ప్రపంచానికే నడవడిక నేర్పిందన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచంలోనే గొప్పగా నిలిచిందన్నారు. హిందువుగా పుట్టడడం మన అదృష్టమన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ధర్మ రక్షణకు ప్రతి భారతీయుడు పాటు పడాలన్నారు. దుబ్బాకలో హిందు మహా సమ్మేళనం ఘనంగా నిర్వహించడం చాలా సంతోషకరమన్నారు. కార్యక్రమంలో అప్పాల ప్రసాద్ జీ, హిందూ ఽమహాసమ్మేళనం అధ్యక్షులు చింత రాజు, వడ్లకొండ శ్రీధర్, రొట్టె రాజమౌళి తదితరులు ఉన్నారు. -
స్వీయగణన అంతంతే!
● జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 11 వేల మందే నమోదు ● నేటితో ముగియనున్న గడువు ● రేపటి నుంచి గృహాల గుర్తింపు ప్రక్రియ షురూ.. సాక్షి, సిద్దిపేట: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జన గణన చేపడుతోంది. ఇందుకోసం అన్ని సిద్ధం చేస్తోంది. ఎన్యూమరేటర్లు ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించకముందే ప్రజలు ఆన్లైన్లో వివరాలు సొంతంగా నమోదు చేసుకునే అవకాశాన్ని ఏప్రిల్ 26వ తేదీ నుంచి ఈ నెల 10వ తేదీ వరకు కల్పించారు. కానీ స్వీయ గణనకు స్పందన అంతంత మాత్రంగానే వస్తోంది. ఇప్పటి వరకు 11,115 కుటుంబాలు మాత్రమే ఆన్లైన్లో వివరాలు నమోదు చేశారు. ప్రజలకు స్వీయ గణనపై సరైనా అవగాహన కల్పించకపోవడంతోనే ప్రజలు దీనిని వినియోగించుకోలేదని తెలుస్తోంది. 3.31 లక్షల కుటుంబాలు సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ–రాజకీయ, కుల సర్వే(ఎస్ఈఈఈపీసీ–2024) వివరాల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 3,31,438 కుటుంబాలున్నాయి. 10,30,453 జనాభా ఉన్నారు. జనాభా గణన–2027 కోసం జిల్లా యంత్రాంగం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఎన్యూమరేటర్లు 1,970, సూపర్వైజర్లు 345 మందికి శిక్షణ పూర్తి అయింది. వీరు రేపటి (ఈ నెల11 తేదీ) నుంచి జూన్ 9వ తేదీ వరకు వారికి కేటాయించిన ప్రదేశాల్లో స్వీయ గణనను చేసుకోని గృహాల గుర్తింపును చేయనున్నారు. 3.5 శాతం మాత్రమే.. స్వీయగణనపై జిల్లా యంత్రాంగం విస్తృతంగా ప్రచారం చేయకపోవడంతో ప్రజల నుంచి స్పందన అంతంతమాత్రంగా ఉంది. జిల్లాలో 3.31లక్షల కుటుంబాలుంటే కేవలం 3.5 శాతం మంది మాత్రమే స్వీయ గణన చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యోగుల కుటుంబాలే దాదాపు 6వేలకుపైగా ఉంటారు. విద్యావంతులు, రాజకీయ నాయకులు చాలా వరకు ఉంటారు. కానీ పలువురి నిర్లక్ష్యమా.. లేదంటే తెలియక ముందుకు రాలేదా అని తెలుస్తోంది.నేడు ఆఖరు స్వీయ గణన ఆదివారంతో ముగియనుంది. స్వీయ గణన నమోదులో సందేహాలుంటే టోల్ ఫ్రీ నంబరు 1855లో సంప్రదించాలి. ఎవరికి వారు మాతృబాషలోనూ వివరాలు పొందుపర్చొచ్చు. యజమాని పేరు తప్పుగా రాయొద్దు.డిజిటల్ పద్ధతిలో.. దేశ వ్యాప్తంగా డిజిటల్ పద్ధతిలో జన గణన జరగనుంది. మొదట ఇళ్ల గుర్తించి జాబితాను సిద్ధం చేస్తారు. తర్వాత జనాభా లెక్కింపు చేపట్టనున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. దీనిని పర్యవేక్షించేందకు జిల్లా, మండల, మున్సిపల్ స్థాయిలో బాధ్యులను నియమించారు. స్మార్ట్ ఫోన్లలో జనగణన యాప్ డౌన్లోడ్ చేసుకొని వివరాలను నమోదు చేస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో.. ఇంటింటికీ వెళ్లి వివరాలను నమోదు చేయనున్నారు. వివరాలన్నింటిని యాప్లోనే నిక్షిప్తం చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం ఉండటం చాలా తక్కువ కనుక ఆఫ్లైన్ నమోదుకు సైతం అవకాశం కల్పించింది.పకడ్బందీగా ప్రక్రియ ఇప్పటికే ఎన్యూమరేటర్ల శిక్షణ పూర్తి అయింది. స్వీయగణన ఈ నెల 10న ముగియనుంది. ఈ నెల 11 నుంచి ఎన్యూమరేటర్లు ఇంటింటికీ తిరిగి గృహాల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. పకడ్బందీగా చేపడతాం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించి యాప్లో నమోదు చేయనున్నారు. – రాజ్కుమార్, ఏఓ, కలెక్టరేట్ -
విహాన్రామ్కు డీజీపీ అభినందనలు
మద్దూరు(హుస్నాబాద్): అంతర్జాతీయ బాల పర్వతారోహకుడు మాస్టర్ జాటోత్ విహాన్రామ్ను రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ అభినందించారు. ఇటీవల అస్ట్రేలియా ఖండంలోని అత్యంత ఎత్తయిన పర్వత శిఖరం మౌంట్ కోషియాస్కోని విజయవంతంగా అధిరోహించడంతో హైదరాబాద్లోని తన కార్యాలయంలో విహాన్రామ్కు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడుతూ ఇంత చిన్న వయస్సులో ఆఫ్రికాలోని కిలిమెంజోరో, హిమాచల్ ప్రదేశ్లోని పాతాల్సు, ఆస్ట్రేలియాలోని కోషియాస్కో పర్వతాలను అధిరోహించడం మన రాష్ట్రనికి దేశానికి గర్వకారణమని అన్నారు. మాదకద్రవ్యాలు వద్దు అనే నినాదంతో ఎంచుకోని పద్వతాలను అధిరోహించడం అభినందనీయమని అన్నారు. భవిష్యత్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించినట్లు విహాన్రామ్ తండ్రి తిరుపతి తెలిపారు. ప్రశాంతంగా ఎప్సెట్సిద్దిపేటఅర్బన్: టీఎస్ఎప్సెట్లో భాగంగా ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న పరీక్ష శనివారం ప్రశాంతంగా ప్రారంభమైంది. పొన్నాలలోని ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలలో సీబీటీ విధానంలో నిర్వహించిన పరీక్షకు ఉదయం సెషన్కు 50 మంది విద్యార్థులకు గాను 50 మంది హాజరు కాగా మధ్యాహ్నం సెషన్కు 48 మంది హాజరయ్యారు. ఆదివారం, సోమవారం సైతం పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీపీ రాజు, అబ్జర్వర్ భాస్కర్, టీసీఎస్ ఆఫీసర్ సింగిత్ సింగ్, పీఆర్వో రఘు, సిస్టం అడ్మిన్ షాదుల్లా పర్యవేక్షించారు. ఉద్యోగాల కల్పనలో మోదీ విఫలం హుస్నాబాద్: ప్రతి సంవత్సరం 2కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని యువతకు ఇచ్చిన హామీ అమలు చేయడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు జనగామ రాజ్కుమార్ ఆరోపించారు. శనివారం అనబేరి సింగిరెడ్డి అమరుల భవన్లో జరిగిన సమావేశంలో బహిరంగ లేఖ విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజ్కుమార్ మాట్లాడుతూ విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన ప్రధాన హామీలు ఇప్పటికి అమలు చేయలేదన్నారు. ప్రజల భావోద్వేగాలను ఉపయోగించుకొని రాజకీయ లాభాలు పొందడమే తప్ప కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి చేసింది ఏమీలేదన్నారు. సమావేశంలో సంఘ జిల్లా సహాయ కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు చంద్రశేఖర్, రేవతి, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. ట్రిపుల్ఐటీ దరఖాస్తుకు నేడే తుది గడువుసంగారెడ్డి క్రైమ్: రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని బాసర (ట్రిపుల్ ఐటీ)లో 2026–2027 విద్యా ఏడాది లో ప్రవేశాలకు ఈనెల 10వ తేదీతో గడువు ముగియనుంది. ఈ ఏడాది 180 సీట్లు కేటాయించారు. ఆరేళ్ల బీటెక్ సమీకృత కోర్సుల్లో చేరేందుకు అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇటీవల పదో తరగతి ఫలితాల్లో రెగ్యులర్ విద్యార్థులు సాధించిన ప్రతిభ మార్కుల ఆధారంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలను సీట్లను భర్తీ చేస్తారు. దరఖాస్తులను మీసేవ, ఈ సేవ, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఓసీ,బీసీ అభ్యర్థులు దరఖాస్తు రూ.500, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు రూ.450 చెల్లించాలి. విద్యార్థులు 2026 ఎస్ఎస్ఎస్సీ పరీక్షలు రెగ్యులర్లో ఉత్తీర్ణులై ఉండాలి. 10–05–2026 నాటికి 18 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 21 ఏళ్లు నిండకూడదు. -
హైదరాబాద్ తరహాలో ఇక్కడా..
సిద్దిపేటజోన్: హైదరాబాద్ తరహాలో త్వరలో సిద్దిపేట శ్రీరామకుంట శ్మశానవాటికలో గ్యాస్ ఆధారిత మిషన్ ద్వారా దహన సంస్కారాలు నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. శనివారం శ్రీరాంకుంట వైకుంఠధామాన్ని ఆయన పరిశీలించారు. పరిశుభ్రత, మౌలిక వసతుల కల్పన అంశాలపై అరా తీశారు. చలికాలంలో వేడి నీరు రావడం లేదని వెంటనే పనులు చేపట్టాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్, మాజీ చైర్మన్ రాజనర్స్, పట్టణ పార్టీ అధ్యక్షుడు సంపత్ రెడ్డి యువజన విభాగం అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరింత ఉన్నతంగా ఎదగాలి.. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో ఎదగాలని హరీశ్రావు సూచించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లింగారెడ్డిపల్లికి చెందిన ప్రియాంక ఇంటర్ ఫలితాల్లో 991మార్కులు సాధించిన సందర్భంగా ఆమెను ఎమ్మెల్యే అభినందించారు. అంతకుముందు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ పొందిన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పరిశోధన విద్యార్థి బలరాంను అభినందించారు. డాక్టరేట్ పొందడం సిద్దిపేట ప్రజలందరికి గర్వకారణమన్నారు. -
అమ్మ ప్రోత్సాహం.. సివిల్స్ సాకారం
పోలీస్ కమిషనర్ ఎస్ఎం రష్మీ పెరుమాళ్ ‘సాక్షి’తో అమ్మ అనుబంధాన్ని పంచుకున్న సీపీ సృష్టిలో తియ్యనైన పదం ‘అమ్మ’.. కరుణ, త్యాగానికి ప్రతిరూపమైన అమ్మ గొప్పతనం.. ఆ పిలుపులోని మాధుర్యం వెలకట్టలేనిది. ఆమె జీవితంలో ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా.. తన బిడ్డలను ఉన్నత స్థితిలోనిలిపేందుకు అమ్మ పడే వేదన మాటలకందనిది. అందుకే అమ్మా.. అందుకో మా వందనం. సాక్షి, సిద్దిపేట: ‘సివిల్ సర్వీస్లోకి రావడం అమ్మ ప్రోత్సాహమే.. నాన్న ఆర్మీలో పని చేస్తున్న క్రమంలో టెర్రరిస్ట్ దాడిలో మృతి చెందారు. అప్పటి నుంచే అమ్మే ఇంటి బాధ్యతలు చేపట్టి ఇంతటి వారిని చేశారు.’ అని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్ఎం రష్మీ పెరుమాళ్ అన్నారు. మదర్స్ డే సందర్భంగా అమ్మతో అనుబంధాన్ని సాక్షితో పంచుకున్నారు. సీపీ మాటల్లోనే.. మా ఫ్యామిలీలో అందరూ డాక్టర్లే. నేను సివిల్స్లో మంచి ర్యాంక్ సాధించి ఐఏఎస్, ఐపీఎస్ కావాలన్నది అమ్మ కోరిక. అమ్మ డ్రీమ్ను 2019లో నెరవేర్చా. సివిల్స్ సర్వీస్ కోసం ఐదు మార్లు రాశా. నాలుగు మార్లు మంచి ర్యాంక్ రాకున్నా అమ్మ నన్ను ప్రోత్సహించారు. ఐదో సారి 216 ర్యాంక్ రావడంతో అమ్మ సంతోషానికి హద్దులు లేవు. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అంతా అమ్మ చలువే. మాది హైదరాబాద్.. అమ్మానాన్నలు గీతా, కల్నల్ మాధవ్ పెరుమాళ్. అన్నయ్య జయంత్. నాన్న ఇండియన్ ఆర్మీలో పని చేసేవారు. ఆర్మీలో డాక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో అస్సాంలో జరిగిన టెర్రరిస్ట్ దాడిలో 2009లో చనిపోయారు. అప్పటి నుంచి అమ్మనే ఇంటి బాధ్యతలు చూశారు. అన్నయ్య, వదిన సైతం ఆర్మీలో డాక్టర్లుగా పని చేస్తున్నారు. ఎక్కువ కాలం హాస్టల్లో ఉండి చదువుకున్నా. సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు అమ్మ చేసిన పప్పన్నం చాలా ఇష్టంగా తినేది. ఇప్పటికీ అమ్మ వండిన వంటలే ఇష్టంగా తింటున్నా. కరీంనగర్లో ప్రొబిషనరీ ఏసీపీగా, మంచిర్యాల, వైరా, కుషాయిగూడలలో ఏసీపీగా, అదనపు డీసీపీగా రాజేంద్రనగర్, నార్త్జోన్ డీసీపీగా అక్కడి నుంచి సిద్దిపేటకు వచ్చాను. -
సీజన్ ముగిశాక చేప పిల్లల పంపిణీయా?
ప్రభుత్వ తీరుపై మత్స్యకారుల ఆగ్రహం సిద్దిపేటఅర్బన్: ఉచిత చేప పిల్లల పంపిణీని సకాలంలో చేపట్టాలని, వానాకాలం సీజన్ ముగిసే దశలో చేప పిల్లలను వదలడం ద్వారా తమకు ఏ ఉపయోగం ఉండదని మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా శుక్రవారం సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాలలోని ముదిరాజ్ ఫంక్షన్ హాలులో జిల్లా స్థాయి మత్స్యకారుల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏయే పథకాలు అమలు చేస్తుందో అధికారులు తెలియజేయకుండా చెప్పకుండా చెరువులు, కుంటలు, సొసైటీల, సభ్యుల లెక్కలు చెప్తే ఏం లాభమని వాపోయారు. గత సీజన్లో సరైన సమయంలో చెరువులు, కుంటలలో చేప పిల్లలను ఎందుకు వదలలేదని ప్రశ్నించారు. ఈ సారైనా ప్రభుత్వం సకాలంలో ఉచిత చేప పిల్లలను పంపిణీ చేయాలని, అన్ని చెరువులు, కుంటల్లో వదిలే విధంగా ప్రతిపాదనలు పంపాలని కోరారు. కార్యక్రమంలో నోడల్ అధికారి డీఏఓ స్వరూపరాణి మాట్లాడుతూ.. మత్స్యకారుల సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారి శ్రీనివాస్, ఫీల్డ్ ఆఫీసర్ గౌతమి, మత్స్య సొసైటీ సభ్యులు, నాయకులు జంగిటి శ్రీనివాస్, పాపయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఉచిత సివిల్ శిక్షణకు ఆహ్వానం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న మైనార్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు, జిల్లా మైనా ర్టీశాఖ అధికారి నాగరాజమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు ఉచిత కోచింగ్ అందించనున్నట్లు తెలిపారు. 21 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాలు ఉన్న మైనార్టీ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ నెల 31 వరకు దరఖాస్తుల స్వీకరణ, జూన్ 14న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించి, అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఎంపికై నా వారికి హైదరాబాద్లో ఉచిత వసతి, భోజన సౌకర్యంతో శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. బెజ్జంకి(సిద్దిపేట): తెలుగు ప్రపంచ సాహిత్య మహాసభల సమన్వయకర్తగా ప్రముఖ కవి ఆచార్యురాలు వెంకటరమణను నియమించినట్లు కళావేదిక జాతీయ అధ్యక్షుడు ప్రతాప్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన వెంకటరమణ సిద్దిపేట డిగ్రీ కళాశాలలో తెలుగు సహాయాచార్యులుగా పని చేస్తున్నారు. జూన్ 6, 7వ తేదీల్లో ఏడవ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించనున్నారు. వెంకటరమణకు అరుదైన గౌరవం ఇవ్వడంపై కళాశాల ప్రిన్సిపాల్ సునీత, వైస్ ప్రిన్సిపాల్ అయోధ్యరెడ్డి, తెలుగు శాఖ అధ్యక్షుడు సంపత్కుమార్తో పాటు మండల సాహిత్య అభిమానులు అభినందించారు. విత్తనాల ఎంపికలో అప్రమత్తం వ్యవసాయ శాస్త్రవేత్త శ్వేత మిరుదొడ్డి(దుబ్బాక)/చిన్నకోడూరు(సిద్దిపేట): సాగులో విత్తనాల ఎంపిక చాలా కీలకమని, ప్రతి రైతుకు అవగాహన ఉండాలని వ్యవసాయ శాస్త్రవేత్త డా.శ్వేత అన్నారు. మిరుదొడ్డిలో శుక్రవారం నిర్వహించిన రైతుల ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. వానాకాలం సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కలిగించారు. అధిక మోతాదులో యూరియా వినియోగిస్తే భూ సారం దెబ్బతింటుందని, చీడపీడల బెడద ఎక్కువై దిగుబడులు తగ్గిపోతాయని చెప్పారు. ఉద్యానశాఖ అధికారి రమేశ్, సర్పంచ్ మహేశ్వరి, ఏఈఓలు ప్రశాంత్, అఖిల్, రేఖ, సమజాత తదితరులు పాల్గొన్నారు. అలాగే చిన్నకోడూరు మండల పరిధిలోని రామునిపట్లలో సమతుల్య ఎరువుల వినియోగంపై శాస్త్రవేత్తలు ఉష, శంకరి మీనా, సెంథిల్వేల్ సేతుపతి అవగాహన కల్పించారు. పంట మార్పిడి చేస్తూ సేంద్రియ ఎరువులు వాడాలని సూచించారు. నూనె గింజల పరిశోధనాసంస్థ అధికారి నిహారిక, ఏఈఓ స్వర్ణ పాల్గొన్నారు. మంత్రి ఉత్తమ్తో కలిసి ఇరిగేషన్ అధికారులతో జగ్గారెడ్డి సమావేశం సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: నిజాంకాలం నాటి సాగునీటి కాలువ గంగకత్వ ఆధునీకరణ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దశాబ్దాల కాలంగా నిర్లక్ష్యానికి గురైన ఈ కాలువ మరమ్మతులకు రూ.42 కోట్లు మంజూరుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ కాలువ ఆధునీకరణ చేపట్టాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి దృష్టికి గతంలో తీసుకెళ్లడంతో ఈ పనులకు మోక్షం లభించింది. నీటి పారుదలశాఖ ఈ కాలువ ఆధునీకరణ పనుల కోసం అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన నీటి పారుదలశాఖ ఈ నిధుల మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ పనులపై శుక్రవారం సచివాలయంలో మంత్రి ఉత్తమ్తో కలిసి జగ్గారెడ్డి నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమై చర్చించారు. సదాశివపేట మండలం సూరారం గ్రామం నుంచి ప్రారంభమయ్యే ఈ గంగకత్వ కాలువ 11 గ్రామాల శివారుల మీదుగా మాచిరెడ్డిపల్లి వరకు పారుతుంది. దీనికి 33 ఫీడర్ చానల్లు ఉన్నాయి. ఈ కాలువను ఆధునీకరిస్తే అదనంగా మూడు వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ పనుల్లో భాగంగా కాలువకు లైనింగ్ పనులు చేపడతారు. కాలువపై అవసరం ఉన్న చోట్ల కొత్త బ్రిడ్జిల నిర్మాణం చేపడతారు. ఇప్పటికే ఉన్న బ్రిడ్జిలకు, తూములను మరమ్మతులు చేస్తారు. ఈ పనులకు త్వరలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శంకుస్థాపన చేస్తారని జగ్గారెడ్డి తెలిపారు. -
నీటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ
నీటిపారుదల శాఖ ఎస్ఈ లక్ష్మణ్ మర్కూక్(గజ్వేల్): రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి అభివృద్ధి కార్యక్రమాలు రైతాంగానికి ఎంతో మేలు చేస్తున్నాయని జిల్లా నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) లక్ష్మణ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రగతి ప్రణాళిక’కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మర్కూక్ మండల కేంద్రంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ పంప్హౌస్ వద్ద నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు వారోత్సవాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వాయర్లు, కాల్వలు, పంపు హౌజ్ల అభివృద్ధితో గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ జలాలు గణనీయంగా వృద్ధి చెందాయన్నారు. దీంతో వ్యవసాయానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. రైతులు నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు నీటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించేందుకు ఆధునిక సాగు విధానాలను అవలంభించాలన్నారు. రైతుల సంక్షేమం, ప్రతి ఎకరాకు సాగునీరు అందించడం ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. కార్యనిర్వహణాధికారి వీటీటీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. సాగునీరు సమర్థవంతంగా అందించడంలో రైతుల భాగస్వామ్యం ఎంతో కీలకమన్నారు. నీటి వినియోగంలో రైతులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే నీటి వనరులను దీర్ఘకాలం సంరక్షించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాణి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, డిప్యూటీ ఇంజనీర్లు శ్రీధర్, చండీరాం, భాస్కర్, జీవన్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డివిజన్ స్థాయి అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు, రైతులు హాజరయ్యారు. -
చెక్పోస్టులు కట్టుదిట్టం
బక్రీద్ నేపథ్యంలో పకడ్బందీ చర్యలు: సీపీ సిద్దిపేటకమాన్: బక్రీద్ పండగ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా కమిషనరేట్ పరిధిలో చెక్పోస్టులు కట్టుదిట్టం చేసినట్లు సీపీ రష్మీపెరుమాళ్ తెలిపారు. తన కార్యాలయంలో శుక్రవారం వెటర్నరీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పండగ సమయంలో చట్ట విరుద్ధ రవాణా, అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు చెక్పోస్టులను కట్టుదిట్టం చేశామన్నారు. జిల్లాలోని ప్రధాన రహదారులు, సరిహద్దు ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. పశువుల రవాణాలో సంబంధిత పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో అదనపు డీసీపీ కుశాల్కర్, ఏసీపీలు రవీందర్రెడ్డి, సుమన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అంజయ్యకు వరిష్ట పురస్కారం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాకు చెందిన ప్రముఖ కవి, రచయిత కొమురవెల్లి అంజయ్య వరిష్ట పురస్కారానికి ఎంపికయినట్లు తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి చెన్నయ్య శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగు సాహిత్యరంగంలో అంజయ్య చేస్తున్న కృషికి గాను ఈ పురస్కారం అందిస్తున్నట్లు తెలిపారు. 14న హైదరాబాద్లో రూ.20 వేల నగదు, జ్ఞాపికతో సన్మానించనున్నట్లు తెలిపారు. 11న పీఎం నేషనల్ అప్రెంటీస్ మేళామెదక్ కలెక్టరేట్: ఈనెల 11న ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటిస్షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఈ మేళాలో జిల్లాతోపాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. 18యేళ్లు నిండి ఏదైనా ఐటీఐ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. -
ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే మన కర్తవ్యం
● 26 నుంచి రాష్ట్ర కమిటీ సమావేశాలు ● సీపీఎం రాష్ట్ర నేత చుక్కా రాములు సిద్దిపేటఅర్బన్: దేశంలో ఫాసిస్టు శక్తులు విస్తరిస్తున్న తరుణంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే అతిముఖ్యమైన రాజకీయ కర్తవ్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు అన్నారు. స్థానిక కార్మిక, కర్షక భవన్లో శుక్రవారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్రంలో 26 నుంచి 28 వరకు జరగనున్న సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. శ్రామిక శక్తులను సమీకరించి విశాల ఉద్యమాలను నిర్మించడమే లక్ష్యంగా ఈ సమావేశాల ఉద్దేశ్యమన్నారు. వామపక్ష, ప్రజాతంత్ర, సెక్యులర్ శక్తుల బలోపేతం కోసం ఐక్యపోరాటాలు నిర్మించేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, విజయ రాఘవన్, కేంద్ర కమిటీ సభ్యులు హాజరవుతారని తెలిపారు. సమావేశాల ఆహ్వాన సంఘం చైర్మన్గా చుక్క రాములు, ప్రధాన కార్యదర్శిగా ఆముదాల మల్లారెడ్డి, కోశాధికారిగా గోపాలస్వామి, ఉపాధ్యక్షులు, కార్యదర్శులుగా మరో 17 మందిని ఎన్నుకున్నారు. -
కొత్త కనెక్షన్
● ఇబ్బందులు పడుతున్న ప్రజలు టెన్షన్..సాక్షి, సిద్దిపేట: పశ్చిమాసియా యుద్ధం ప్రభావం ఇక్కడి ప్రజలపై పడుతోంది. గ్యాస్ దిగుమతి అంతంత మాత్రంగా అవుతుండటంతో గ్యాస్ సంక్షభం ఏర్పడింది. కొత్త గ్యాస్ కనెక్షన్ల మంజూరు నిలిచిపోయింది. ఫలితంగా వినియోగదారులు సతమతమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 3,33,850 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. సిలిండర్ల కోసం వినియోగదారులు ఏజెన్సీల ఎదుట బారులు తీరుతున్నారు. ఒక సిలిండర్ ఉన్నవారు డబుల్ సిలిండర్ కోసం యత్నిస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీల వెబ్సైట్లో కొత్త కనెక్షన్లు, డబుల్ గ్యాస్ సిలిండర్ దరఖాస్తు ఆప్షన్ను మార్చి 11న క్లోజ్ చేశారు. కొత్త గ్యాస్ కనెక్షన్లు దాదాపు 50 రోజుల నుంచి నిలిచిపోయాయి. గతంలో ఏ కంపెనీ ఏజెన్సీని సంప్రదించినా కనెక్షన్ వెంటనే మంజూరు చేసేవారు. నూతన కనెక్షన్ల మంజూరు కోసం ప్రత్యేక డ్రైవ్ను సైతం ఏర్నాటు చేసేవారు. ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా ఉంది. కొత్త గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం లేదు సిద్దిపేట శివారులో ఇటీవల టిఫిన్ సెంటర్ను ప్రారంభించా. గ్యాస్ కొరత ఏర్పడటంతో హోటల్ నిర్వహణ కష్టంగా మారింది. కమర్షియల్ గ్యాస్ నూతన కనెక్షన్ కోసం గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరిగినా ఇవ్వడం లేదు. ఇంట్లో వినియోగించే సిలిండర్ వినియోగిస్తే అధికారులు తనిఖీ చేసి స్వాధీనం చేసుకుంటున్నారు. దీంతో తప్పని పరిస్థితుల్లో కట్టెల పొయ్యిపై వంటలు చేస్తూ హోటల్ను నిర్వహిస్తున్నాను. ఇప్పటికై నా అధికారులు స్పందించి నూతన గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాలని కోరుతున్నా. –బైరి శ్రీనివాస్, పొన్నాలఆలస్యంగా డెలివరీ గ్యాస్ సిలిండర్ కోసం ఆన్లైన్లో బుక్ చేసినా డెలివరీ ఆలస్యమవుతోంది. గతంలో జిల్లాకు ప్రతి రోజు 15వేల గ్యాస్ సిలిండర్లో వచ్చేవి ఇప్పుడు దాదాపు 5వేల లోపే సిలిండర్లు దిగుమతి అవుతున్నాయి. బుక్ చేసిన వారం నుంచి 10 రోజులకు డెలివరీ అవుతోంది. దీంతో సింగిల్ సిలిండర్ ఉన్న వారు గ్యాస్ అయిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. కొందరికి కట్టెల పొయ్యే దిక్కవుతోంది. -
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
ములుగు(గజ్వేల్): మండల కేంద్రమైన ములుగులో బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు చైల్డ్ హెల్ప్ లైన్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గణేశ్, ఐసీడీఎస్ సూపర్వైజర్ రంజిత, రెవెన్యూ ఇన్స్పెక్టర్ హరీశ్, పోలీస్ శాఖల సిబ్బందితో కూడుకున్న బృందం గురువారం గ్రామానికి చేరుకున్నది. బాల్య వివాహం చేయడం ద్వారా జరిగే అనర్థాలు, చట్టాలపై ఇరు కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. బాలిక వయస్సు 16 ఏళ్ల కారణంగా యుక్త వయస్సు వచ్చేవరకు పెళ్లి చేయరాదని కుటుంబ సభ్యుల వద్ద నుంచి లిఖితపూర్వకంగా రాసుకున్నారు. బాలల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ బాల్యవివాహాల ను అరికట్టేందుకు సహకరించాలని కోరారు. -
పదవుల జాతరే..
సాక్షి, సిద్దిపేట: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తొలిసారిగా రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులలో జిల్లా వారికి అవకాశం దక్కింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి పదవుల కోసం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. రెండున్నరేళ్ల తర్వాత పద్మశాలి సహకార కార్పొరేషన్ చైర్మన్గా సిద్దిపేటకు చెందిన గుడూరు శ్రీనివాస్, మున్నూరుకాపు సహకార కార్పొరేషన్ చైర్మన్గా హుస్నాబాద్కు చెందిన బొమ్మ శ్రీరాం నియమితులయ్యారు.ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు నియామక ఉత్తర్వులను బుధవారం జారీ చేశారు. సుడా చైర్మన్ భర్తీ ఎప్పడో? జిల్లాకు చెందిన పలు చైర్మన్, డైరెక్టర్ నామినేటెడ్ పోస్టులు ఇంకా భర్తీ చేయలేదు. సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(సుడా), సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్లతో పాటు డైరెక్టర్ పోస్టులను రెండున్నరేళ్లుగా ఖాళీగానే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేస్తే ఒక మారు పదవీకాలం ముగిసేది. మరికొందరికీ అవకాశం వచ్చేది. ఈ నామినేటెడ్ పోస్టులకు ఎంతో మంది ఆశలు పెట్టుకున్నారు. అలాగే త్వరలో ఖాళీ అయ్యే రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులలో జిల్లాకు అవకాశం కల్పించాలని, ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్కు విన్నవించుకున్నారు. పద్మశాలీల సంక్షేమానికి కృషి పద్మశాలి సహకార కార్పొరేషన్ చైర్మన్గా సిద్దిపేటకు చెందిన గుడూరు శ్రీనివాస్ నియమితులయ్యారు. గతంలో సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్గా పని చేశారు. ప్రస్తుతం టీపీసీసీ చేనేత సెల్ రాష్ట్ర అధ్యక్షునిగా శ్రీనివాస్ కొనసాగుతున్నారు. అసెంబ్లీ ,పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలి కులస్తులను కలిసి అభ్యర్థుల విజయం కోసం కృషి చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్కు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. పద్మశాలీల అభివృద్థికి, కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేస్తానన్నారు. సామాజిక సేవే లక్ష్యంగా.. మున్నూకాపు సహకార కార్పొరేషన్ చైర్మన్గా హుస్నాబాద్కు చెందిన బొమ్మ శ్రీరాం చక్రవర్తి నియమితులయ్యారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో హౌసింగ్ సొసైటీ చైర్మన్గా పని చేశారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. మున్నూరుకాపు విద్యార్థుల కోసం హాస్టల్ను నిర్వహిస్తూ, సామాజిక సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. నియామకంపై సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్లకు బొమ్మ శ్రీరాం చక్రవర్తి కృతజ్ఞతలు తెలిపారు. కార్మిక సంఘం నాయకుడిగా.. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా దరిపల్లి చంద్రం నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ దేవసేనా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బీఎన్ఆర్కేఎస్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా, టీపీసీసీ కార్యవర్గ సభ్యుడిగా దరిపల్లి చంద్రం కొనసాగుతున్నారు. కార్మిక సంఘం నాయకుడిగా, సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా అందరికీ సుపరిచితులు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా విధులు నిర్వహించిన కేడం లింగమూర్తి , హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడంతో రాజీనామా చేశారు. దీంతో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖాళీగా ఏర్పాడింది. దీంతో దరిపల్లి చంద్రంను గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నియామకమయ్యారు. జిల్లాకు రెండు రాష్ట్ర స్థాయి చైర్మన్ నామినేటెడ్ పోస్టులు పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్గా గుడూరు శ్రీనివాస్ ‘మున్నూరుకాపు’ చైర్మన్గా బొమ్మ శ్రీరాం చక్రవర్తి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా దరిపల్లి చంద్రం -
మధ్యవర్తిత్వంతోనే సత్వర న్యాయం
జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి సిద్దిపేటకమాన్: మధ్యవర్తిత్వంతోనే ప్రజలకు సత్వర న్యాయం చేకూరుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి తెలిపారు. సిద్దిపేట కోర్టులో 30మంది న్యాయవాదులకు నిర్వహించిన 40గంటల మీడియేషన్ శిక్షణ కార్యక్రమం బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ మీడియేషన్ ద్వారా ఆస్తి తగాదాలతో పాటు తదితర కేసుల్లో న్యాయం చేయడం జరుగుతుందని తెలిపారు. శిక్షణలో పాల్గొన్న న్యాయవాదులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు జయప్రసాద్, కుమారస్వామి, సాధన, తరణి, సౌజన్య, న్యాయవాదులు రవీందర్, రాజలింగం, తదితరులు పాల్గొన్నారు. ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ఇందిరానగర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన విద్యార్థినులు జాతీయ స్థాయి గోల్ షాట్బాల్ పోటీలకు ఎంపికై నట్లు గోల్ షాట్బాల్ సెక్రటరీ మహేష్ బుధవారం తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 9 నుంచి 11వరకు జరుగనున్న జాతీయ స్థాయి పోటీల్లో క్రీడాకారులు అక్షయ, అర్చన, కృపారాణి పాల్గొంటారన్నారు. ఈ నేపథ్యంలో క్రీడాకారులను పీడీ సుజాత తదితరులు అభినందనలు తెలిపారు. ‘నాచగిరి’ నుంచి మృత్తిక సేకరణ వర్గల్(గజ్వేల్): భద్రాచలంలోని గోవింద కల్పవృక్ష నరసింహ శాలగ్రామ ఆశ్రమంలో భూవరాహ యజ్ఞం కోసం గురువారం నాచగిరి లక్ష్మీనృసింహక్షేత్రం నుంచి మృత్తిక(మట్టి) సేకరించారు. ఆలయ ఈఓ రంగాచారి, అర్చక పరివారం సమక్షంలో ఆశ్రమ వ్యవస్థాపకుడు డాక్టర్ కృష్ణచైతన్యస్వామి ప్రాంగణంలోని చెట్టు వద్ద మృత్తికను సేకరించారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని, రైతు క్షేమం కాంక్షిస్తూ ఏరువాక పౌర్ణమి రోజున భూవరాహ యజ్ఞం నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణచైతన్యస్వామి అన్నారు. గడప గడపకు నరసింహం అనే మహోన్నత ఆశయంతో నిర్వహిస్తున్న యజ్ఞం కోసం ప్రముఖ పురాతన నరసింహస్వామి క్షేత్రాలను సందర్శించి మృత్తిక సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఇరవై రోజులవుతున్నా కొనరేం?
హుస్నాబాద్: పట్టణంలోని ఆరపల్లె కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చి 20 రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు చేయడంలేదంటూ రైతులు మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం బుడిగ జంగాల కాలనీ రహదారిపై ధర్నా నిర్వహించారు. వీరికి మద్దతుగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు, పార్టీ నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకర్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోళ్ల ప్రక్రియను జాప్యం చేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. మరో వైపు లారీల కొరత వల్ల కేంద్రాల వద్ద ధాన్యం నిలువలు పెరిగిపోతున్నాయన్నారు. స్థానిక ఎస్ఐ లక్ష్మారెడ్డి, సింగిల్ విండో సీఈఓ ప్రవీణ్ అక్కడికి చేరుకుని కొనుగోలు ప్రక్రియను వేగిరం చేయిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మిల్లర్లపై చర్యలు తీసుకోవాలి నంగునూరు(సిద్దిపేట): ధాన్యం కొనుగోలులో జాప్యం జరగకుండా చూడాలని, తాలు పేరిట దోపిడీకి పాల్పడుతున్న మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం ముండ్రాయి వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. రైతులు మాట్లాడుతూ ఇప్పటి వరకు గ్రామం నుంచి రెండు లారీల వడ్లు ముండ్రాయి మిల్లుకు తరలిస్తే తాలు పేరిట క్వింటాలుకు 5 కిలోల చొప్పున కోత విధించారన్నారు. మిల్లర్లను అడిగితే దురుసుగా మాట్లాడుతున్నారని, డీఎస్ఓకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు.రహదారిపై రైతుల ధర్నా బస్వాపూర్లో ఆకస్మిక తనిఖీ కోహెడరూరల్(హుస్నాబాద్): ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగవద్దని, క్షేత్ర స్థాయిలో సమస్యలను వెంటనే ఎందుకు పరిష్కరించడంలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మండలంలోని బస్వాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి కొనుగోలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. స్పందించిన మంత్రి అక్కడికక్కడే కలెక్టర్ హైమవతికి ఫోన్ చేసి మాట్లాడారు. -
కలెక్టర్ హైమావతి
చేర్యాల(సిద్దిపేట): రైతులు పండించిన పంటను పూర్తిగా కొనుగోలు చేస్తామని, ఆందోళన చెందవద్దని కలెక్టర్ హైమావతి తెలిపారు. మరోవైపు కొనుగోళ్లు వేగిరం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డుతో పాటు, వేచరేణి గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేర్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్నలు, వరి ధాన్యం ఒకేసారి వచ్చాయన్నారు. మూడు రోజుల్లో అన్ని ఇబ్బందులు తొలగిపోతాయని, అప్పటి వరకు రైతులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. -
సహకారం యథాతథం
దుబ్బాక: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో మళ్లీ పాత పాలకవర్గాలే కొనసాగనున్నాయి. యథావిధిగా పాత పాలకవర్గాలే కొనసాగించాలంటూ హైకోర్టు తీర్పు నిచ్చింది. ఈ నేపథ్యంలో పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టాలని రాష్ట్ర స్పెషల్ కమిషనర్ అండ్ రిజిస్ట్రార్ కో ఆపరేటీవ్ సొసైటీస్ ప్రసన్న పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో మంగళవారం చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లుగా తమ తమ సహకార సంఘాల్లో బాధ్యతలు స్వీకరించారు. సహకార సంఘాలకు నామినేటేడ్ లేదా ఎన్నికల ద్వారా కొత్త కమిటీలను ఎన్నుకునే వరకు పాత కమిటీలనే కొనసాగించాలని కోర్టు తీర్పు నిచ్చింది. గత నవంబర్ నుంచి.. పీఏసీఎస్ల పాలక వర్గాల పదవీకాలం ముగియడంతో మరో ఆరు నెలల పాటు ప్రభుత్వం పొడిగించింది. కొత్త కమిటీలకు ఎన్నికలు నిర్వహించక పోవడంతో ఇంకో 3 నెలలకు పైగా వారే కొనసాగారు. ఆరు సంవత్సరాల పాటు ఉన్న పాత పాలకవర్గాలను ప్రభుత్వం రద్దు చేస్తూ 2025 నవంబర్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాత పాలకవర్గాలు హైకోర్టును ఆశ్రయించాయి. తాజాగా హైకోర్టు పాత పాలకవర్గాలను కొత్త కమిటీలు నియామకం అయ్యేంత వరకు కొనసాగించాలని తీర్పు నిచ్చింది. 6 నెలల పాటు మాజీలుగా ఉన్న వారు కోర్టు తీర్పుతో తాజాగా పాత పదవుల్లోనే బాధ్యతలు స్వీకరించారు.. 21 ప్రాథమిక సహకార సంఘాలు జిల్లాలో 21 ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి. కొత్తగా జిల్లా ఏర్పాటు అయినప్పటికీ ఉమ్మడి మెదక్జిల్లా డీసీసీబీ పరిధిలోనే సహకార సంఘాలు పనిచేస్తున్నాయి. జిల్లాల వారీగా డీసీసీబీలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పీఏసీఎస్లకు నామినేటెడ్ పద్ధతిలో కమిటీలను ఎన్నుకునే విధంగా యోచిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఆరు నెలల తర్వాత ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు మళ్లీ పాత పాలకవర్గాలనే పునరుద్ధరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం.. పాత పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించడం చర్చనీయంశంగా మారింది. కొత్త కమిటీలను ఎన్నుకునే వరకు వీరే.. సహకార శాఖ ఉత్తర్వులు జారీ బాధ్యతలు స్వీకరించిన సభ్యులు పాలక వర్గాల హర్షం హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా రావడం.. వెంటనే అమల్లోకి తేవడంతో పీఏసీఎస్ పాలకవర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. మళ్లీ పదవుల్లో బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉందని దుబ్బాక పీఏసీఎస్ చైర్మన్ శేర్ల కై లాసం, వైస్ చైర్మన్ కాల్వ నరేష్ తెలిపారు. -
టీజీ20 లీగ్ నిలిపివేయండి
టీసీఏ అధ్యక్షుడు నరేందర్రెడ్డి సిద్దిపేటజోన్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన టీజీ20 ప్రీమియర్ లీగ్ను తక్షణమే నిలిపివేయాలి రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ జిల్లా కన్వీనర్ నరేందర్రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐ నిబంధనలు అతిక్రమించిందని ఆరోపించారు. ముందస్తు అనుమతి లేకుండా టీ20 నిర్వహించడం చట్టవిరుద్ధమన్నారు. యువ క్రీడాకారుల భవిష్యత్తుపై ప్రభావం పడుతుందన్నారు. సమావేశంలో ప్రతినిధులు బాలరాజు, ఉమాపతి, శ్రీనివాస్ హరి తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేటఅర్బన్: టీఎస్ఎప్సెట్ పరీక్షలో భాగంగా అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షలు మంగళవారం ముగిశాయి. ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలలో సీబీటీ విధానంలో జరిగిన ప్రవేశ పరీక్షకు 50 మందికి గాను 49 మంది హాజరయ్యారు. అలాగే ఈ నెల 9 నుండి 11 వరకు ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశాల కోసం పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా పరీక్షలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీపీ రాజు, అబ్జర్వర్ భాస్కర్, టీసీఎస్ ఆఫీసర్ అప్సర్, పీఆర్వో రఘు, సిస్టం అడ్మిన్ షాదుల్లా పర్యవేక్షించారు. ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాకు చెందిన కవియిత్రి ఎడ్ల లక్ష్మికి బాలసాహితి మూర్తి పురస్కారం వరించింది. తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలసాహిత్య సమ్మేళన కార్యక్రమంలో పురస్కారం స్వీకరించినట్లు బాలసాహితీవేత్త ఉండ్రాళ్ల రాజేశం తెలిపారు. ఎడ్ల లక్ష్మి రచించిన ‘వెన్నెల వెలుగులు’ పుస్తకావిష్కరణ జరిగినట్లు తెలిపారు. కార్యక్రమంలో పరిషత్ అధ్యక్షుడు ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి చెన్నయ్య, రిటైర్డ్ ఐఏఎస్ రమణాచారి, వరప్రసాదరెడ్డి, పత్తిపాక మోహన్, గరిపల్లి మోహన్ తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు. ప్రశాంత్నగర్(సిద్దిపేట): రైతులు వరి, మొక్కజొన్న, పత్తి లాంటి సాంప్రదాయ పంటలే కాకుండా రైతులు హార్టికల్చర్, సెరికల్చర్ వైపు దృష్టి సారించాలని, ఉద్యాన శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖల ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఉద్యాన పంటల సబ్సిడీ వివరాలు, అధునాతన పద్ధతిలో సాగు, మల్బరీ, పట్టు పురుగుల పెంపకం ఆయిల్పామ్ పంటల గురించి వివరించారు. మల్బరీ సాగుతో నెల నెలా ఆదాయం వస్తుందని రైతులు ఆ దిశగా ముందుకు సాగాలన్నారు. పంటల మార్పిడితోనే అధిక లాభాలు వస్తాయన్నారు. కార్యక్రమంలో నంగునూరు ఏఎంసీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి, చిన్నకోడూరు ఏఎంసీ చైర్మన్ మహేందర్, ఉద్యాన శాఖ ఉమ్మడి జిల్లా సహాయ సంచాలకులు ఇంద్రసేనారెడ్డి, ఆయా శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యాన్ని ఆరబెట్టి తీసుకురండి
● తేమ శాతం తప్పనిసరి ● రైతులతో కలెక్టర్ హైమావతి హుస్నాబాద్: ధాన్యాన్ని తేమ శాతం వచ్చే వరకు ఆరబెట్టుకొని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కలెక్టర్ హైమావతి రైతులకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డును కలెక్టర్ సందర్శించి మక్కలు, ధాన్యం కొనుగోలు ప్రక్రియను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం ఆరబెట్టడం వల్ల అకాల వర్షాలతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. వ్యవసాయ మార్కెట్లో మక్కలు, ధాన్యానికి సరిపడా స్ధలం లేదన్నారు. వరి ధాన్యాన్ని మీకు దగ్గరలోని గ్రామాల కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలని సూచించారు. ఏఎంసీలో పల్లపు ప్రాంతంలో ధాన్యం ఆరబెట్టకుండా ఫ్లక్సీలు ఏర్పాటు చేయాలని ఆధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రామ్మూర్తి, ఏఎంసీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, ఇతర శాఖల అధికారులు ఉన్నారు. ఆగిన కొనుగోళ్లు.. రోడ్డెక్కిన రైతులు మిరుదొడ్డి(దుబ్బాక): చెప్యాల అల్వాల క్రాస్ రోడ్డు వద్ద నిర్వహిస్తున్న వడ్ల కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు రోడ్డెక్కారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన దిగారు. పది రోజులుగా కొనుగోళ్లు పూర్తిగా నెమ్మదించడంతో రోజుల తరబడి ఎండలో నానా అవస్థలు పడుతున్నామని రైతులు మండిపడ్డారు. అకాల వర్షాల వచ్చి ధాన్యం తడిస్తే ఎవరి బాధ్యత అంటూ రైతులు అసహనం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న దుబ్బాక సీఐ ఆందోళన వద్దకు చేరుకుని రైతులకు నచ్చజెప్పే క్రమంలో పోలీసులకు, రైతులకు వాగ్వాదం చోటు చేసుకుంది. కాగా ఇదే సమయంలో అటుగా వెళుతున్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి రైతుల ఆందోళనకు సంఘీభావం తెలుపుతూ రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. కలెక్టర్తో సహా అధికారుల నిర్లక్ష్యం వల్లే కొనుగోళ్లు నిలిచిపోతున్నాయని ఆరోపించారు. కొనుగోళ్లు వేగవంతం చేయకుంటే రైతులతో కలిసి కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. సుమారు గంట పాటు జరిగిన రైతుల ఆందోళనతో గజ్వేల్, మిరుదొడ్డి రహదారులకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే -
త్వరలో గ్రామ కమిటీలు
టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత సిద్దిపేటకమాన్: త్వరలోనే సిద్దిపేటకు వచ్చి గ్రామ గ్రామాన పార్టీ కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. మంగళవారం సిద్దిపేటలోని అంబేడ్కర్ విగ్రహానికి కవిత పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. త్వరలోనే జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తామని.. సిద్దిపేట ప్రజలు తెలంగాణ రక్షణ సేన పార్టీని ఆదరించాలని కోరారు. సామాజిక న్యాయం కోసమే .. మిరుదొడ్డి(దుబ్బాక): బడుగు బలహీన వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం అందించడం కోసమే టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) రాజకీయ పార్టీ ఆవిర్భవించిందని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని మోతెలోని లక్ష్మీ సమేత వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీని రానున్న కాలంలో మరింత బలోపేతం చేసి ప్రజల సేవలో భాగస్వాములమవుతామన్నారు. -
డబ్బు, ప్రలోభాలు శాశ్వతం కాదు
● ధర్మాన్ని, శ్రమను నమ్ముకున్నవారే గెలుస్తారు ● మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గజ్వేల్రూరల్: రాజకీయాల్లో డబ్బు, ప్రలోభాలు శాశ్వతం కాదని, ప్రళయాన్ని సృష్టించే శక్తి ప్రజలకే ఉందని మేడ్చల్–మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఈనెల 10న సికింద్రాబాద్లోని పరేడ్గ్రౌండ్లో జరగనున్న ప్రధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు మంగళవారం గజ్వేల్లోని ప్రజ్ఞా గార్డెన్స్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈటల మాట్లాడుతూ డబ్బులు ఇస్తేగాని గెలవలేమనే ఈ రోజుల్లో తమిళనాడులో విజయ్ డ్రైవర్ కొడుకు గెలుపొందారని అన్నారు. రాజకీయాల్లో ధర్మాన్ని, శ్రమను నమ్ముకున్నవారే గెలుస్తారనడానికి తమిళనాడు ఎన్నికలే నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ... నియంతృత్వంగా వ్యవహరించే వారికి బెంగాల్ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. తెలంగాణలో కేసీఆర్ పాలనపై విసుగు చెందిన ప్రజలు ఆ పార్టీని ఓడించగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లకే రేవంత్రెడ్డిపై వ్యతిరేకత వచ్చిందని, ప్రజాపాలన అంటే 32ఏళ్లుగా ఒకే పార్టీని ఆదరిస్తున్న గుజరాత్ రాష్ట్రమే ఉదాహరణ అని అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దేశభద్రత కోసం ప్రజలు ఓటు వేశారని చెప్పారు. ఈనెల 10న పరేడ్గ్రౌండ్లో జరిగే ప్రధాని బహిరంగ సభకు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, పార్టీ నాయకులు, ఆయా మండల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
పోలీసులంటే భయం వద్దు
● మీ కోసమే మేమున్నాం ● సీపీ రష్మీ పెరుమాళ్ ● కోహెడలో ‘మన పోలీస్–మన ఊరు’ కోహెడరూరల్(హుస్నాబాద్): పోలీసులు అంటే భయం వద్దని, మన కోసం పని చేస్తున్నారనే భావన ప్రజల్లో కలగాలని సీపీ రష్మీ పెరుమాళ్ అన్నారు. మన పోలీస్–మన ఊరు కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆమె కోహెడలో ఎస్ఐ అభిలాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీకి గ్రామ మహిళలు ఘన స్వాగతం పలికారు. అనంతరం సీపీ మట్లాడుతూ ఏప్రిల్ 1న ప్రారంభమైన మన పోలీస్–మన ఊరు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోవడం, డ్రగ్స్, మద్యం వంటి సామాజిక సమస్యలపై పోలీసులకు వినతులు అందుతున్నాయని వీటిని గ్రామస్తుల సమక్షంలోనే పరిష్కరిస్తామని చెప్పారు. భద్రతకు ప్రాధాన్యం.. కోహెడ పోలీస్స్టేషన పరిధిలో ఏర్పాటు చేసిన 30 సీసీ కెమెరాలను సీపీ ప్రారంభించారు. అనంతరం స్టేషన్ ఆవరణంలో మొక్కలు నాటిన సీపీ ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. అలాగే మండలంలోని 27 గ్రామాలకు వాలీబాల్ కిట్లను పంపిణీ చేసి వాలీబాల్ మ్యాచ్ను ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ సుభాస్ చంద్రబోస్, ఏసీపీ సదానందం, సీఐ శ్రీనివాస్, సర్పంచ్ సుజాత తదితరులు ఉన్నారు. -
పల్లె మురవలె
ప్రగతి మెరవలె..మన గ్రామాలు వెనుకబాటు● తాజాగా కేంద్ర ప్రభుత్వం నివేదిక ● జిల్లా ఫ్రంట్ రన్నరప్గా ముద్దాపూర్ ● తొమ్మిది అంశాలలో జిల్లా టాప్ గ్రామాల వెల్లడి సాక్షి, సిద్దిపేట: మన పల్లెలు అభివృద్ధికి దూరంగా ఉంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది పంచాయతీ అభివృద్ధి సూచికను(పీఏఐ) విడుదల చేస్తోంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఏఐ 2.0ను ఇటీవల కేంద్ర గ్రామీణాబివృద్ధి శాఖ విడుదల చేసింది. జిల్లాలోని 508 గ్రామ పంచాయతీలలో ఏ ఒక్క పంచాయతీ జాతీయ, రాష్ట్ర స్థాయిలో రాణించలేదు. వచ్చే నివేదికలోనైనా జాతీయ, రాష్ట్ర స్థాయిలలో నిలిచేందుకు సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఫ్రంట్ రన్నర్గా.. పంచాయతీ అభివృద్ధి సూచిక 2.0లోని 9 అంశాలలో కుకునూరుపల్లి మండలం ముద్దాపూర్ పంచాయతీ 76.21 మార్కులు సాధించి జిల్లా ఫ్రంట్ రన్నర్గా నిలిచింది. అలాగే చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీగా ముద్దాపూర్ 88.68 మార్కులు సాధించింది. గ్రామంలో 700 జనాభా ఉంటుంది. వ్యవసాయమే జీవనాధారంగా కొనసాగుతుంది. గ్రామంలో కూరగాయలు సైతం పండిస్తున్నారు. గతేడాది కేంద్ర బృందాలు పర్యటించి గ్రామాలను పరిశీలించాయి. 9అంశాలలో పరిశీలన తొమ్మిది అంశాలలో గ్రామాలను పరిశీలించారు. వర్షం నీటిని ఇంకించడం. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం. పచ్చదనం ఏర్పాటు చేయడం. స్వయం సమృద్ధి సదుపాయాలను సమకూర్చుకోవడం. సామాజిక న్యాయం అమలు చేయడం, మహిళలకు ఇబ్బందులు లేకుండా చూడటంతో పాటు మొత్తంగా పంచాయతీ పాలన మెరుగ్గా ఉండేలా సర్పంచ్లు మరింత చొరవ తీసుకోవాలి. -
అర్జీలు సత్వరమే పరిష్కారం
● కలెక్టర్ హైమావతి ● ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు 69సిద్దిపేటరూరల్: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను అర్హతల మేరకు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతులను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హతల మేరకు వెంటనే పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలన్నారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం అర్జీలు 69 వచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో కూడా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపారు. అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలివచ్చే వారం రోజుల్లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ హైమావతి సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడవకుండా టార్పాలిన్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. పీఏసీఎస్ కేంద్రాల్లో మొక్కజొన్న కొనుగోలు చేపట్టాల్సి ఉందని, ఇందుకు సంబంధించి ఇప్పటికే 10 వేల గన్ని బ్యాగులు సరఫరా చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని సమీపంలోని రైస్ మిల్లులకు వెంటనే తరలించాలని, దూర ప్రాంతాలకు కూడా అవసరం మేరకు రవాణా సదుపాయాలు కల్పిస్తున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు.సిద్దిపేటరూరల్: ఉమ్మడి మెదక్ జిల్లాలోని నిరుద్యోగ యువకుల కోసం ఈ నెల 8న సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న జాబ్ మేళాకు జిల్లాలోని యువకులు అధిక సంఖ్యలో పాల్గొని, ఉద్యోగాలకు సాధించాలని కలెక్టర్ హైమావతి కోరారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక జాబ్ మేళా పోస్టర్లను సంబంధిత శాఖల అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం.. ఈనెల 8న ఉదయం 8 గంటల నుంచి సంగారెడ్డి పట్టణంలోని తార డిగ్రీ కాలేజీలో జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదన్నారు. 250 పైగా వివిధ రంగాలకు చెందిన ప్రైవేట్ కంపెనీలు పాల్గొని తమ కంపెనీలకు, సంస్థలకు అవసరమైన వారిని ఎంపిక చేసుకుంటారన్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియెట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ వీటితో పాటు ఇతర అన్ని రకాల అర్హతలు కలిగిన వారు ఈ జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాన్ని పొందాలని కలెక్టర్ యువతకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ, యువజన సర్వీసుల శాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి, జెడ్పీ సీఈఓ రమేష్, డీపీఆర్ఓ రవికుమార్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
టీఎస్ఎప్సెట్ తొలిరోజు ప్రశాంతం
సిద్దిపేటఅర్బన్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న టీఎస్ఎప్సెట్ పరీక్ష ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం ప్రశాంతంగా జరిగింది. తొలి రోజు అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాల కోసం పరీక్ష నిర్వహించారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లుగా సీబీటీ విధానంలో నిర్వహించారు. ఉదయం సెషన్కు 50 మంది విద్యార్థులకు 49 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్కు సైతం 49 మంది హాజరై పరీక్ష రాశారు. పరీక్షల నిర్వహణను ప్రిన్సిపాల్ డాక్టర్ వీపీ రాజు, అబ్జర్వర్ భాస్కర్, టీసీఎస్ ఆఫీసర్ అప్సర్, పీఆర్వో రఘు పర్యవేక్షించారు. నిబంధనలు తప్పనిసరి సిద్దిపేటకమాన్: పురపాలక నిబంధనలను కచ్చితంగా పాటించాలని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీపీ సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వధశాలలకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలను పాటిస్తూ, అక్రమ వధను నివారించాలన్నారు. నిబంధనలకు అనుగుణంగా జంతువుల రవాణా వంటి అంశాలపై చర్చించినట్లు తెలిపారు. జంతువులు అక్రమ రవాణా నివారించడానికి కమిషనరేట్ పరిధిలో చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అయేషా ఫాతిమా, అడిషనల్ డీసీపీ కుశాల్కర్, ఏసీపీ రవీందర్రెడ్డి పాల్గొన్నారు. జీవన ఎరువులతో సేద్యానికి జీవం ములుగు(గజ్వేల్): రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి జీవన ఎరువులను ఉపయోగించడంతో భూసారాన్ని పెంచవచ్చని హార్టికల్చర్ జాయింట్ డైరెక్టర్ కె.రామలక్ష్మి సూచించారు. వ్యవసాయ శాఖ రైతు వారోత్సవం సందర్భంగా నేల ఆరోగ్య పరిరక్షణ, సమతుల్య ఎరువుల యాజమాన్యం, ప్రకృతి వ్యవసాయం అనే అంశాలపై సోమవారం ములుగు రైతువేదికలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రసాయన ఎరువుల వాడకం వల్ల నేలలోని సూక్ష్మజీవరాశి నశించి భూమి నిస్సారమవుతోందన్నారు. కూరగాయ పంటలు, వాటి యాజమాన్యం గురించి రైతులకు వివరించారు. ప్రతి గ్రామం నుంచి ఐదుగురు రైతుల చొప్పున మట్టి నమూనాలను సేకరించి పరీక్షలు చేయించి వారికి సాయిల్ హెల్త్కార్డులు అందజేశారు. కార్యక్రమంలో వంటిమామిడి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ప్రభాకర్గుప్త, రైతులు పాల్గొన్నారు. ‘ఉపాధి’ కూలీల సమస్యలు పరిష్కరించండి గజ్వేల్రూరల్: ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీల సమస్యలను పరిష్కరించాలని డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండస్వామి అన్నారు. ఉపాధి హామీ కూలీల పరిరక్షణ యాత్రలో భాగంగా సోమవారం మండల పరిధిలోని శ్రీగిరిపల్లిలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల వద్ద కూలీల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఎంఎంఎస్ ద్వారా కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించాలన్నారు. అదే విధంగా కనీస సౌకర్యాలైన నీరు, నీడ, ప్రథమ చికిత్స కిట్లను అందుబాటులో ఉంచాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడుస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం కూలీల పక్షాన ఉంటూ వీబీరామ్జీ బిల్లును రద్దు చేసేలా కృషి చేయాలన్నారు. -
రైతుల సమస్యలు పట్టని సర్కార్
● 22 రోజులుగా వడ్లు, మక్కలు కొనుగోలు కేంద్రాల్లోనే ● మాజీమంత్రి హరీశ్రావుసిద్దిపేటరూరల్: కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల సమస్యలు పట్టడంలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. రూరల్ మండల పరిధిలోని బుస్సాపూర్లో జరుగుతున్న బీరప్ప ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులను తిప్పలు పెడుతోందని మండిపడ్డారు. కేసీఆర్ బయటకు వస్తేనే రైతు భరోసా వేస్తున్నారన్నారు. వడ్లు, మక్కలు 22 రోజులగా కొనుగోలు కేంద్రాల్లో ఉంచి రైతులు పడిగాపులు కాస్తున్నారన్నారు. కేసీఆర్ ముఖ్య మంత్రిగా ఉన్నపుడు లేని తిప్పలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయన్నారు. బుస్సాపూర్కు లిఫ్ట్ మంజూరు చేసి 90శాతం పనులు తాను పూర్తి చేశామన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక తట్టెడు మట్టి ఎత్తలేదన్నారు. త్వరలోనే మిగిలిన పనులు పూర్తి చేసి లిఫ్ట్తో పంట పొలాల్లోకి నీళ్లు వచ్చేలా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సుడా మాజీ చైర్మన్ రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీదేవి, గ్రామ సర్పంచ్, నాయకులు పాల్గొన్నారు. -
డిగ్రీ కళాశాలలో నూతన కోర్సులు
● సీట్లు సైతం పెంపు ● ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత ● కొనసాగుతున్న ‘దోస్త్’ ప్రక్రియసిద్దిపేటఎడ్యుకేషన్: సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో నూతన కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత చెప్పారు. దోస్త్ ప్రక్రియ కొనసాగుతోందని విద్యార్థులు షెడ్యూల్ ప్రకారం తమ అడ్మిషన్లకై వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. సోమవారం కళాశాలలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు రెండు నూతన అప్రెంటిస్షిప్ ఎంబీడెడ్ డిగ్రీ ప్రొగ్రాం(ఏఈడీపీ) కోర్సులను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. కొత్తగా బీఎస్సీ ఫార్మాస్యూటికల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ అండ్ క్వాలిటీ, బీఎస్సీ ఫిషరీస్ అండ్ అక్వాకల్చర్(ఏఈడీపీ) కోర్సులను ఆసక్తిగల విద్యార్థులు ఎంపిక చేసుకోవాలని సూచించారు. బీఎస్సీ లైఫ్సైన్సెస్లో మెడికల్ ఫిజియాలజీ అనే నూతన సబ్జెక్టులను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ఈ విద్యాసంవత్సరానికి వివిధ కోర్సుల్లో సీట్లను సైతం పెంచినట్లు చెప్పారు. బీఏ(సీబీసీఎస్) ఇంగ్లిష్మీడియంలో ప్రస్తుతం ఉన్న 180 సీట్లతో పాటు మరో 60 సీట్లు, బీస్సీ ఫిజికల్ సైన్స్ (సీబీసీఎస్)లో 300ల సీట్లతో పాటు మరో 60 సీట్లు పెంచినట్లు చెప్పారు. ప్రస్తుతం కళాశాలలో మొత్తం 1920 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుందని, ఈ నెల 7వరకు మొదటి విడత అడ్మిషన్ల ప్రక్రియ ఉంటుందని దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్ భాస్కర్ చెప్పారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర అయోధ్యరెడ్డి, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ మధుసూదన్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
తాటి ముంజలు ఆరోగ్యానికి మేలు
హుస్నాబాద్: వేసవి కాలంలో ప్రకృతి ప్రసాదమైన తాటి ముంజలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం నగరంలోని మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రికి హుస్నాబాద్ గీత కార్మికులు తాటి ముంజలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గీత కార్మికులకు గ్రామీణ ప్రాంతాల్లో తాటి ముంజలు ఆర్థిక వెసులుబాటును కల్పిస్తాయన్నారు. ప్రభుత్వం తరుపున తాటి ముంజల మార్కెటింగ్కు సదుపాయాలు కల్పిస్తామన్నారు. ప్రతి ఒక్కరు తాటి ముంజలు తిని ఆస్వాదించాలని కోరారు.మంత్రి పొన్నం ప్రభాకర్ -
16 అంశాలపై ఏకగ్రీవ తీర్మానాలు
చేర్యాల(సిద్దిపేట): మున్సిపల్ సాధారణ సమావేశం స్థానిక కార్యాలయంలో చైర్పర్సన్ ముస్త్యాల అరుణ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో 20 ఎజెండా అంశాలపై చర్చించిన సభ్యులు 16 అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించినట్లు కమిషనర్ నాగేందర్ తెలిపారు. ఆమోదం తెలిపిన వాటిలో పారిశుద్ధ్య వాహనాల సర్వీసింగ్, రిపేరింగ్, డీజిల్ బిల్స్, అవుట్ సోర్సింగ్ స్టాఫ్ జీతభత్యాలు, మున్సిపల్ బిల్డింగ్ పునరుద్ధరించుట తదితర అంశాలు తీర్మానించినట్లు తెలిపారు. సమావేశంలో పాల్గొన్న స్థానిక సీఐ రమేష్ పట్టణంలో ట్రాఫిక్, త్రిబుల్ రైడింగ్ వంటి అంశాల నియంత్రణకు పోలీస్ శాఖకు పాలకవర్గం సహకరించాలని కోరారు. సమావేశంలో వైస్ చైర్పర్సన్ ఉమ, కౌన్సిలర్లు, కో–ఆప్షన్ సభ్యులు, వివిధ శాఖల అదికారులు పాల్గొన్నారు. -
లాస్లో ‘ఆర్టీసీ’
ఉమ్మడి జిల్లాలో రూ.32 కోట్ల మేర నష్టాలు ● రెండు డిపోల పరిధిలో అత్యధికం ● అధికారుల దిద్దు‘బాట’మెదక్ కలెక్టరేట్: ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆర్టీసీ సంస్థ లాస్లో నడుస్తోంది. గత ఫిబ్రవరి వరకు రూ.32 కోట్ల మేర నష్టాల్లో ఉంది. సంగారెడ్డి, నారాయణ్ఖేడ్ డిపోల పరిధిలో నష్టం అత్యధికంగా ఉంది. మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఏడాదికి రూ. 300 కోట్లు కేంద్ర ఆర్టీసీ సంస్థకు చెల్లిస్తున్నప్పటికీ గట్టెక్కడం లేదు. ప్రతి కిలోమీటర్కు రూ.62 రావాల్సి ఉండగా, ప్రస్తుతం రూ. 57.52 మాత్రమే వస్తున్నాయి. అలాగే డ్రైవర్లు, కండక్టర్లు సరిపోను లేకపోవడంతో ఉన్నవారిపై పనిభారం పడుతోంది. ఫలితంగా వారు సెలవులు పెడుతున్నారు. దీంతో కొన్ని రూట్లలో బస్సులను నడపడం లేదు. ఆదాయం వచ్చే మార్గాలపైన అధికారులు దృష్టి పెట్టడం లేదు. దీంతో సంస్థకు నష్టాలు వస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆర్టీసీ సంస్థ లాస్లో నడుస్తుంది. ఉమ్మడి జిల్లాలో మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, సంగారెడ్డి, దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట కలిపి మొత్తం 9 డిపోలు ఉన్నాయి. సమ్మర్ టూర్లు.. తీర్థయాత్రలు ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు అధికారులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. వేసవిలో ప్రయాణికులకు ఆహ్లాదం, ఆధ్యాత్మికత కోసం టూర్లకు వెళ్తుంటారు. దీనిని క్యాష్ చేసుకునేందుకు అధికారులు ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీని ద్వారా విద్యార్థులు, వారి తల్లిదండ్రులను సైతం సమ్మర్ టూర్లో మెదక్ జిల్లాలోని ఏడుపాయల, ఖిల్లా, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సీఎస్ఐ చర్చి, పోచారం అభయారణ్యం లాంటి ప్రదేశాలు చూపించాలని భావిస్తున్నారు. అలాగే భక్తుల కోసం ప్రత్యేకంగా పుణ్యక్షేత్రాలకు బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. గతేడాది సైతం ఈ ప్రణాళిక కొనసాగింది. ఈ ఏడాది సైతం అరుణాచలం, శ్రీశైలం, యాదగిరిగుట్ట, వేములవాడ, రామప్ప ఆలయం తదితర ఆలయాలకు సమ్మర్లో ప్రత్యేక ప్యాకేజీలతో సిద్ధం చేస్తున్నారు.ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇలా.. డిపోలు 9 బస్సులు 627డ్రైవర్లు 764కండక్టర్లు 1,014 -
ధాన్యం వర్షార్పణం
హుస్నాబాద్: వడగండ్ల వాన రైతులను అతలాకుతలం చేసింది. చేతికందిన పంట వర్షం పాలు కావడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. హుస్నాబాద్ పట్టణంలో ఆదివారం కొద్ది సేపు కురిసిన రాళ్ల వర్షంతో అన్నదాతల ఆశలు ఆవిరయ్యాయి. వ్యవసాయ మార్కెట్ యార్డులో ఽరైతులు ఆరబెట్టిన ధాన్యం కళ్లెదుటే వర్షానికి కొట్టుకుపోవడంతో రైతులు దిగాలు చెందారు. మార్కెట్ యార్డులో గ్యాప్ లేకుండా ధాన్యం రాశులు నిండిపోయాయి. మండుతున్న ఎండలకు ధాన్యం మ్యాచర్ వచ్చినా నాలుగు రోజుల నుంచి ధాన్యం కొనుగోళ్లు చేయలేదని రైతులు వాపోయారు. వర్షానికి ధాన్యమంతా తడిసిపోయింది. వారం రోజుల నుంచి గన్నీ బ్యాగులు ఇవ్వాలని కోరినా, ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాతే ఇస్తామని ఇబ్బందులు పెడుతున్నారని అన్నదాతలు ఆవేదన చెందారు. మరికొంత మందికి గన్నీ బ్యాగులు ఇచ్చినా కాంటాలు పెట్టకుండా వదిలేశారని తెలిపారు. టార్పాలిన్లు ఇవ్వాలని కోరినా ఎండలే ఉన్నాయని ఇప్పుడెందుకు అంటూ నిరాకరించారని చెప్పారు. రోజుల తరబడి మార్కెట్లోనే ధాన్యం కుప్పలకు కాపలా కాస్తున్నా... చెడగొట్టు వానతో నిండా ముంచిందని వాపోయారు. రవాణా సౌకర్యం లేకపోవడం, ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కాంటా పెట్టి మిల్లులకు తరలించకపోవడంతో అకాల వర్షానికి ధాన్యమంతా నీళ్ల పాలైంది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. తడిసిన ధాన్యాన్ని మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ చందు, కౌన్సిలర్ రవీందర్ పరిశీలించారు.తడిసిన ధాన్యాన్ని ఎత్తిపోస్తున్న రైతులువడగండ్లతో రైతులకు కడగండ్లు అకాల వర్షంతో ఆవిరైన అన్నదాతల ఆశలు మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యం -
వడ్లకు చోటేదీ...?
గజ్వేల్: వడ్ల కొనుగోళ్లకు మరో కష్టం వచ్చిపడింది. పొద్దుతిరుగుడు ధాన్యంతో మార్కెట్ యార్డు లు నిండిపోయాయి. దీంతో వడ్లకు చోటు లేకుండా పోయింది. జిల్లాలో వడ్ల కొనుగోళ్లకు ఎన్నో రకాల ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. వరిధాన్యం ఉత్పత్తులు పోటెత్తుతుండగా, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. యాసంగికి సంబంధించి జిల్లాలో 3.7లక్షల ఎకరాల్లో వరి సాగులోకి వచ్చింది. అధికారుల అంచనా ప్రకారం 5లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ఉత్పత్తులు కొనుగోళ్లకు రానున్నాయి. 422 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఐకేపీ అధ్వర్యంలో 214, సహకార సంఘాల ఆధ్వర్యంలో 202, మెప్మా ఆధ్వర్యంలో మరో 6 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మార్కెట్ యార్డుల ఫుల్ జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, తొగుట, బెజ్జంకి, హుస్నాబాద్, మిర్దొడ్డి, చిన్నకోడూరు మార్కెట్ యార్డులు పొద్దుతిరుగుడు రాశులతో నిండిపోయాయి. ఎన్నో అశలతో పొద్దు తిరుగుడు సాగు చేసిన రైతులు.. తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ఆయా కేంద్రాల్లో కొద్ది రోజులు మాత్రమే కొనుగోళ్లు సాగాయి. కేంద్ర ప్రభుత్వం టార్గెట్ ముగిసిందనే పేరుతో జిల్లావ్యాప్తంగా కేవలం 1,800 టన్నులు మాత్రమే కొనుగోలు చేసి గత నెల 18వ తేదీ నుంచే కేంద్రాలను మూసేశారు. ఫలితంగా ఆయా యార్డుల్లో ఇంకా 3,500 టన్నులకుపైగా పొద్దుతిరుగుడు నిల్వలు పేరుకుపోయి ఉన్నాయి. ఈ నిల్వల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొడిగింపు వస్తుందని అధికారులు చెబుతూ వస్తున్నారు. కానీ రోజులు గడుస్తున్నా..ఫలితం లేకుండా పోతుంది. దీంతో రైతులు ఆయా మార్కెట్ యార్డుల్లో నెలకుపైగా నిరీక్షణలో ఉన్నారు. ఇప్పటికై నా వీటి కొనుగోలు జరుగుతుందా...? లేదా అనేది అనుమానంగా ఉన్నది. పొద్దుతిరుగుడు ఖాళీ అయితేనే.. పొద్దు తిరుగుడు కొనుగోళ్లు జరిగి...అవి ఖాళీ అయితేనే అయా మార్కెట్ యార్డుల్లో వడ్ల కొనుగోళ్లకు అవకాశం కలగనుంది. ఇప్పటికే వరిధాన్యం మార్కెట్ యార్డులకు పోటెత్తుతున్నది. షెడ్లలో ఖాళీ లేక... రైతులు తమ ఉత్పత్తులను యార్డుల్లో ఆరుబయటే పోస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తాజాగా అదివారం హుస్నాబాద్ మార్కెట్ యార్డులో వడగండ్ల వానకు వరి ధాన్యం తడిసి ముద్దయిన ఘటన ఆందోళన కలిగిస్తున్నది.పొద్దు తిరుగుడు రాశులు ఖాళీ చేయిస్తాం పొద్దుతిరుగుడు కొనుగోళ్లకు తేదీని పొడగించే అవకాశమున్నది. రాగానే వారంలో కొనుగోళ్లను పూర్తి చేసి మార్కెట్ యార్డులను ఖాళీ చేయిస్తాం. దీనిద్వారా వడ్ల కొనుగోళ్లకు ఇబ్బందులు రాకుండా చూస్తాం. – మార్క్ఫెడ్ డీఎం సునీత పొద్దుతిరుగుడు ధాన్యంతో మార్కెట్ యార్డులు ఫుల్ కొనుగోలు తేదీ పొడిగింపు రాక ఈ దుస్థితి అవి ఖాళీ అయితేనే... వడ్ల కొనుగోళ్లకు అవకాశం నిరీక్షణలో పొద్దుతిరుగుడు రైతులు -
హైందవ ధర్మం కోసం పాటుపడాలి
మాట్లాడుతున్న సునీతారెడ్డి. చిత్రంలో శివాచార్య స్వామిజీజహీరాబాద్ టౌన్: సనాతన ధర్మ పరిరక్షణ, హిందూ ఐక్యత కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని వీహెచ్పీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సునీతారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణంలో ఆదివారం నిర్వహించి హిందూ సమ్మేళనానికి ఆమె హాజరై మాట్లాడారు. గడప దాటితే అందరం హిందువులని, కుల,మత భేదాలను వీడి అందరూ ఒక్కటికావాలని కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు హిందూ ధర్మం గురించి చెబుతుండాలని చెప్పారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.వీహెచ్పీ ఉపాధ్యక్షురాలు సునీతారెడ్డి -
మల్లన్న ఆలయంలో భక్తుల రద్ధీ
టేక్మాల్(మెదక్): భద్రకాళీ సమేత వీరభద్రుడి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం మండలంలోని బొడ్మట్పల్లి గుట్టపై వెలసిన వీరభద్రుడి కల్యాణోత్సవంలో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ బస్వరాజ్, సర్పంచ్ అవినాష్, వైస్ చైర్మన్ ఈశ్వరప్పతో పాటు పలువురు సన్మానించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని హమీ ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ వీరభద్రుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారి ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపు నిర్వహించారు. కాగా బోడ్మట్పల్లి ఉన్నత పాఠశాలలో పదో తరగతి టాపర్గా నిలిచిన విద్యార్థిని వైష్ణవిని మంత్రి దామోదర సన్మానించి అభినందించారు. -
‘నీట్’గా రాశారు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు పరీక్ష కొనసాగింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన పరీక్షకు 937 మంది అభ్యర్థులకు గాను 916 మంది హాజరయ్యారు. 21 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను కలెక్టర్, నీట్ పరీక్షల నోడల్ అధికారి పరిశీలించారు. ముందస్తు ప్రణాళికతో నీట్ పరీక్షను జిల్లాలో విజయవంతంగా నిర్వహించినట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. అధికారుల ముందస్తు సూచనలతో అమ్మాయిలు తమ బంగారు ఆభరణాలను తల్లిదండ్రులకు ఇచ్చారు. గాజులు లేకుండానే పరీక్షకు హాజరయ్యారు. సాధారణ దుస్తులకు అనుమతి లేకపోవడంతో టీషర్ట్, ప్యాంట్లు ధరించాల్సి వచ్చిందని వాపోయారు. కాగా ఉదయం 11 గంటల నుంచి అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిచ్చారు. జిల్లా కేంద్రం పరిధిలోని రామచంద్రాపురానికి చెందిన అమ్మాయి 5 నిమిషాలు ఆలస్యంగా పరీక్షకు రావడంతో అప్పటికే గేటు మూసివేశారు. సిబ్బంది పరీక్షకు అనుమతించకపోవడంతో నిరాశగా వెను తిరిగింది.చెవి కమ్మలు, ముక్కు పొడకలను తొలగిస్తున్న తల్లి 21 మంది గైర్హాజరు క్షుణ్ణంగా తనిఖీ చేసిన సిబ్బంది పరీక్ష కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ హైమావతి -
ఇక వినతులకు సులువే..
సిద్దిపేటజోన్: ప్రజావాణిలో సమస్యలపై ఫిర్యాదు ప్రక్రియ ఇక సులభతరంగా మారనుంది. ప్రజలకు మరింత చేరువగా చేసే పనిలో భాగంగా జిల్లాలో ఆర్డీఓ కేంద్రాలుగా ప్రజావాణిలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు కలెక్టరేట్లో మాత్రమే అర్జీలు స్వీకరించేవారు. కొత్త నిబంధనల మేరకు ప్రతి సోమవారం కలెక్టరేట్తో పాటు రెవెన్యూ డివిజన్ల వారీగా ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కలెక్టర్ హైమావతి జారీ చేశారు. జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఐదు మున్సిపాలిటీలు, 26 మండలాల్లో 499 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా ప్రాంతానికి చెందిన ప్రజల ఫిర్యాదులు, సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కలెక్టరేట్లో ప్రతి సోమవారం ప్రజావాణి ఏర్పాటు చేసింది. ప్రతి వారం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన బాధితులు కలెక్టరేట్కు వచ్చి అధికారులకు అర్జీలు సమర్పించేవారు. ఈ లెక్కన 90నుంచి 150వరకు వివిధ అంశాలపై దరఖాస్తులు వచ్చేవి. కలెక్టరేట్లో మాత్రమే ఉన్న ప్రజావాణి ప్రక్రియను మరింత విస్తృత పరిచేందుకు ఆర్డీఓ కార్యాలయాల్లో కూడా అమలు చేస్తున్నారు. భూముల సమస్యలు, పింఛన్లు, ఇంటి మంజూరు, ఉద్యోగం తదితర అంశాలపై అర్జీలు అధికంగా వస్తున్నాయి. కొన్ని మండలం, రెవెన్యూ స్థాయిలో ఉండే సమస్యలపై కలెక్టరేట్లో ప్రజావాణిలో దరఖాస్తులు అందిస్తున్నారు. ప్రజలకు ఫిర్యాదు ప్రక్రియ సులభంగా మార్చేందుకు జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా ప్రజావాణిని అందుబాటులోకి తెచ్చారు. ప్రతి సోమవారం ఉదయం10గంటల నుంచి ఆయా డివిజన్ స్థాయి అధికారులు అందుబాటులో ఉండి ప్రజావాణిలో అర్జీలు స్వీకరించనున్నారు. దీని వల్ల సుదూరంగా ఉండే జిల్లా కేంద్రానికి ప్రజలు అర్జీలు ఇవ్వడానికి వెళ్లే ప్రయాస తగ్గుతుంది. ఎక్కడికక్కడ అర్జీలు అధికారులకు ఇచ్చే వెసులుబాటు కల్గనుంది. సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ జిల్లాలో ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్తో పాటు సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్లలో ప్రజావాణి కార్యక్రమాలు ఉంటాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హైమావతి సూచించారు. డివిజనల్ స్థాయి అధికారులు అందుబాటులో ఉండి అర్జీలు తీసుకుంటారని పేర్కొన్నారు. ఆయా డివిజన్ ప్రజలు ఆర్డీఓ ఆఫీస్లోని ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం మరింత చేరువగా ప్రజావాణి జిల్లాలో ఆర్డీఓ కేంద్రాలుగా ఏర్పాటు ఎక్కడికక్కడ దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి జిల్లాలో అమలు -
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దు
మద్దూరు(హుస్నాబాద్): ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయొద్దని, రైతులను ఇబ్బంది పెట్టకుండా పనిచేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. ఆదివారం మండలంలోని సలాఖపూర్ గ్రామంలోని పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో తేమశాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కేటాయించిన మిల్లుకు తరలించాలని సిబ్బందికి సూచించారు. సెంటర్లో ప్యాడీ క్లీనర్లు చెడిపోతే వెంటనే రిపేర్ చేయించాలన్నారు. మిల్లుల్లో జాప్యం కాకుండా ఒక సెంటర్కు రెండు లేదా మూడు మిల్లులను కేటాయించాలని సివిల్ సప్లయి అధికారులను ఆమె ఫోన్లో ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సెంటర్ నిర్వాహకులు పాల్గొన్నారు.కలెక్టర్ హైమావతి -
అంజన్న దయతో కాళేశ్వరం జలాలు
సిద్దిపేటజోన్: విజయవాడ కృష్ణానదిలో జరిగే తెప్పోత్సవం తరహాలో సిద్దిపేట గోదారి నీటిలో ఘనంగా హనుమాన్ తెప్పోత్సవం జరగడం ఆనందంగా ఉందని, సిద్దిపేట తెప్పోత్సవానికి నెలవుగా మారిందని ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి స్థానిక కోమటిచెరువులో వైభవంగా హనుమాన్ తెప్పోత్సవం నిర్వహించారు. అంతకుముందు దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో హనుమాన్ విగ్రహప్రతిమతో చెరువులో కలియ తిరిగారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. హనుమాన్ మాల ధారణ విశ్వాసానికి ప్రతీకగా అభివర్ణించారు. ఈ తెప్పోత్సవం భవిష్యత్లో కూడా ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. అంజన్న దయతో సిద్దిపేటకు కాళేశ్వరం ద్వారా గోదారి నీరు వచ్చిందన్నారు. సమష్టి కృషితోనే 22 అవార్డులు ప్రశాంత్నగర్(సిద్దిపేట): అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, పారిశుద్ధ్య కార్మికుల సమష్టి కృషితోనే, సిద్దిపేట మున్సిపాలిటీకి 22 అవార్డులు వచ్చా యని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సరిత, రాములు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం, దుస్తుల పంపిణీ, పదిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట పట్టణం పచ్చదనం, పరిశుభ్రంగా ఉండటానికి పారిశుద్ధ్య కార్మికుల కృషి వెలకట్టలేనిదన్నారు. బెల్లె సరిత ఉద్యోగం సాధించిన తర్వాత తన మొదటి జీతంతో మంచి పని చేయాలనే సంకల్పం గొప్పదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, కౌన్సిలర్ చంద్రం, రాములు, ఎల్లయ్య, నర్సింహులు, సతీశ్, శ్రీహరి పాల్గొన్నారు. ఎమ్మెల్యే హరీశ్రావు కోమటిచెరువులో ఘనంగా తెప్పోత్సవం -
రాష్ట్రంలో బీజేపీకి అధికారం ఖాయం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. మే 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే ప్రధాని సభ నేపథ్యంలో శనివారం జిల్లా బీజేపీ కార్యాలయంలో విస్తృత స్థాయి సన్నాహక కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రధాని సభకు ప్రతి మండలం నుంచి భారీగా కార్యకర్తలు, నాయకులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. త్వరలో సిద్దిపేటలో మున్సిపల్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి , సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కష్టపడే వారికి పార్టీలో గుర్తింపు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఎంపీ రఘునందన్ రావు -
కొంటరా.. కొనరా..?
తాలు తీసి తీసుకురండి.. దుబ్బాకరూరల్: ధాన్యాన్ని తాలు తీసి తీసుకురావాలని చీకోడ్ మిల్లు యజమాని సతీశ్ తెలిపారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని రాజక్కపేట ఎల్లాపూర్ కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం లారీ లోడ్ వచ్చిందన్నారు. ధాన్యం బస్తాలను చెక్ చేయగా అంతా తాలు, దుమ్ముధూళి ఉందన్నారు. క్వింటాల్కు 5 కిలోలు కట్ చేస్తున్నారని, కొంత మంది పని గట్టుకుని రైతులను రెచ్చగొట్టి దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు.దుబ్బాకరూరల్: వరి పంట కోసి పదిహేను రోజులు గడుస్తున్నప్పటికీ కొనడం లేదంటూ రైతులు ఆగ్రహించారు. శనివారం మండలంలోని హబ్సిపూర్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఏ ఒక్క అధికారి కొనుగోలు కేంద్రాలకు వచ్చిన పాపాన పోవడంలేదన్నారు. ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. సీఐ రాజేశ్, ఎస్ఐ కీర్తిరాజ్ రైతుల వద్దకు చేరుకుని నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. -
రాఘవాపూర్లో రోడ్డెక్కిన రైతులు
సిద్దిపేటరూరల్: ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ రైతులు రోడ్డెక్కారు. శనివారం మండల పరిధిలోని రాఘవాపూర్ వద్ద సిద్దిపేట– కామారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వారం రోజులవుతున్నా నేటికీ ధాన్యం కొంటలేరని మండిపడ్డారు. పంటలు కోసి నెల రోజులు దాటుతున్నా కొనుగోళ్లు సాగడం లేదన్నారు. తాలు పట్టే ప్రక్రియలో జల్లి యంత్రాలు సరిగ్గా లేవని దీంతో సమయం వృథా అవుతోందన్నారు. తాలు పట్టే విధానం కాకుండా పాతపద్ధతిలో కొనుగోళ్లు చేపట్టాలన్నారు. సమాచారం తెలుసుకున్న సీఐ శ్రీను, ఎస్ఐ రాజేష్లు అక్కడికి చేరుకుని ఆందోళనను విరమింపజేసేందుకు ప్రయత్నించారు. కలెక్టర్ రావాలంటూ రైతులు నినాదాలు చేశారు. దీంతో పోలీసులు తహసీల్దార్ రెహమాన్ కు సమాచారం అందించగా అక్కడికి చేరుకున్నారు. రెండురోజుల్లో కొనుగోళ్ల ప్రక్రియ చేపట్టేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కార్యక్రమంలో సర్పంచులు పద్మ శ్రీనివాస్, భాస్కర్రెడ్డి, రైతు సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు. -
దుబ్బాకలో ఉద్రిక్తత
దుబ్బాక: పట్టణంలో శనివారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పట్టణంలో ఏర్పాటు చేసిన ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ధాన్యం కొనుగోలు చేయకపోవడంపై కింద కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సమావేశంలోకి దూసుకొచ్చారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసు బలగాలు వారిని అడ్డుకున్నాయి. ఎమ్మెల్యే నిరసన తెలుపుతూ మాట్లాడుతుండగా మైక్లు కట్ అయ్యాయి. రైతుల గురించి మాట్లాడుతుంటే కట్ చేస్తారా అంటూ ఆగ్రహంతో మైక్ను నేలకేసికొట్టారు. అనంతరం సభను బహిష్కరించి ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి బయటకొచ్చి గేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైతులు కష్టాలు పడుతుంటే సంబరాలా? ధాన్యం కొనుగోళ్ల కోసం రైతులు రోడ్లపై ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రజాపాలన సంబరాలు జరుపుకోవడం సిగ్గుచేటని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏసీ గదుల్లో కూర్చుని సమీక్షలు చేయడం కాదని, రైతుల మధ్యకొస్తే పరిస్థితి తెలుస్తుందన్నారు. బీ గ్రేడ్ ధాన్యం కొంటామంటూ అధికారులు షరతులు పెట్టడం సరికాదన్నారు. వెంటనే కొనుగోళ్లు వేగవంతం చేయాలన్నారు. చివరి గింజకొనే వరకు రైతులకు అండగా ఉండి పోరాడుతామన్నారు. -
ఆదేశాలు రాలేదని చెబుతుండ్రు
కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసి 18 రోజులవుతోంది. తొమ్మిది రోజుల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. అయినా కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో నాతోపాటు చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో మాదిరిగా కొనుగోళ్లు చేపట్టాలి. అకాల వర్షాలతో ధాన్యం తడిసి పోయే అవకాశం ఉంది. – రేణికుంట వెంకటేశ్, రైతు, రాఘవాపూర్కొనుగోళ్లు సాగుతున్నాయికొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ఎలాంటి సమస్యలు లేవు. ధాన్యంలో తాలు లేకుండా చూడాలని రైతులను కోరుతున్నాం. ధాన్యం డబ్బులు సైతం రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. – గోపికృష్ణ, డీఎం, సివిల్ సప్లయ్ కార్పొరేషన్కొనుగోలు కేంద్రంలో వడ్లు పోసి 15 రోజులు అవుతుంది. కేంద్రం ప్రారంభించి పది రోజులైనా ఇప్పటికీ గింజ ధాన్యం కూడా కొనలేదు. అధికారులను అడిగితే ఇంకా ఆదేశాలు రాలేదని సమాధానం చెబుతున్నారు. కొనుగోలు కేంద్రంలో తాలు తీసే మిషిన్లు లేవు. హమాలీ కార్మికులు కూడా అందుబాటులో లేరు. గన్ని సంచులకూ దిక్కులేదు. – చెరుకూరి మల్లేశం, రైతు, మల్లాయిపల్లి, దుబ్బాక -
ఇక ‘మధురమ్మ’ జ్ఞాపకమే..
తిమ్మాయిపల్లిలో శతాధిక వృద్ధురాలి మృతి నంగునూరు(సిద్దిపేట): చిన్నారుల నుంచి వృద్ధుల వరకు గ్రామస్తులతో ఉన్న వందేళ్ల అనుబంధం నేడు దూరమైంది. శతాధిక వృద్ధురాలు మధురమ్మ(103) శనివారం తిమ్మాయిపల్లిలో మృతి చెందారు. గ్రామానికి చెందిన చల్లారం మధురమ్మ భర్త మరణించడంతో ఎన్నో కష్టాలకు ఓర్చి ఇద్దరు కుమారులు, కూతురిని ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. కాలక్రమంలో ఇద్దరు కుమారులు మృతి చెందడంతో కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచారు. మనువళ్లు, మనువరాళ్లు, మునిమనవళ్ల మధ్య వందవ పుట్టిన రోజు జరుపుకొన్న మధురమ్మ మృతి చెందడంపై గ్రామస్తులు సంతాపం వ్యక్తం చేశారు. గ్రామస్తులు ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియలో పాల్గొన్నారు. -
ఆందోళన వద్దు.. అండగా ఉంటా
● ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేవరకు పోరాటం ● నిరుద్యోగ యువతతో మాజీ మంత్రి హరీశ్సిద్దిపేటజోన్: ‘ఆందోళన వద్దు.. మీకు అండగా ఉంటా.. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేవరకు ఊరుకునేది లేదు’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు భరోసా ఇచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని లైబ్రరీని సందర్శించారు. ఈ సందర్భంగా నిరుద్యోగ యువతతో ముఖాముఖిగా మాట్లాడారు. వారి ప్రిపరేషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ హయాంలో నోటిఫికేషన్ విడుదల ప్రక్రియ గురించి వివరించారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అన్ని శాఖల్లో ఖాళీలు ఉన్నా ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేయడం లేదన్నారు. అనంతరం నిరుద్యోగ యువతతో కలిసి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, మెగా డీఎస్సీ వేయాలని, ఉద్యోగాల భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగ సంఘాల ప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో చేపడుతున్న యాత్రపై అడిగి తెలుసుకున్నారు. వారికి సంఘీభావం ప్రకటించారు. జిల్లాకు వచ్చిన ప్రతినిధులను అభినందించారు. విలీనం అయ్యాకే రంగధాంపల్లి అభివృద్ధి ప్రశాంత్నగర్(సిద్దిపేట): పట్టణంలోని రంగధాంపల్లి మున్సిపాలిటీలో కలిశాకే అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. రంగధాంపల్లిలో శ్రీ పంచవటి హనుమాన్ దేవాలయం ప్రాంగణం లో నిర్మించిన అన్న ప్రసాద భవనాన్ని శనివారం ప్రారంభించారు. అనంతరం హనుమాన్ మాలధారులతో కలిసి భోజనం(భిక్ష) చేశారు. అనంతరం హరీశ్రావు మాట్లాడుతూ సిద్దిపేట అన్నదానాలకు, ఆధ్యాత్మికతకు నెలవుగా మారిందన్నారు. హనుమాన్ దీక్షకు, భిక్ష కు బీజం వేసింది మన సిద్దిపేటనేన్నారు. -
మధ్యవర్తిత్వంతో సత్వర న్యాయం
సిద్దిపేటకమాన్: మధ్యవర్తిత్వంతో ప్రజలకు సత్వర న్యాయం చేకూరుతుందని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి సురేపల్లి నందా తెలిపారు. జిల్లా కోర్టు కాంప్లెక్స్లో 30మంది న్యాయవాదులకు 40గంటల మీడియేషన్ శిక్షణ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు న్యాయమూర్తి నందా కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. 684 మంది అడ్వకేట్లకు ఇప్పటి వరకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. మీడియేషన్ ద్వారా ఆస్తి వివాదాలు తదితర కేసుల్లో సత్వరం న్యాయం అందుతుందన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని కేసులను పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ మెంబర్ పంచాక్షరి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి, న్యాయమూర్తులు జయప్రసాద్, సంతోష్కుమార్, సాధన, తరణి, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. మల్లన్న సన్నిధిలో చేర్యాల జడ్జికొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామిని చేర్యాల జూనియర్ సివిల్ జడ్జి శ్రీరామ్ కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామి వారి శేష వస్త్రాలు, ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్, పర్యవేక్షకులు నీల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎల్లమ్మ తల్లికి సీపీ పూజలుహుస్నాబాద్: పట్టణంలోని రేణుకా ఎల్లమ్మ జాతర కొనసాగుతోంది. శనివారం సీపీ రష్మీ పెరుమాళ్ ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు తాటికొండ పరమేశ్వర్ శర్మ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కుంకుమార్చనలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ చరిత్ర, అమ్మవారి విశిష్టత, జాతర కార్యక్రమ వివరాలను నిర్వాహకులు తెలియజేశారు. కార్యక్రమంలో ఏసీపీ సదానందం, సీఐ శ్రీనివాస్, ఎస్ఐ లక్ష్మారెడ్డిలు ఉన్నారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు జెడ్పీ సీఈఓ రమేశ్ దుబ్బాక: అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజాపాలన లక్ష్యమని జెడ్పీ సీఈఓ,స్పెషల్ ఆఫీసర్ రమేశ్ అన్నారు. శనివారం దుబ్బాక పట్టణంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని మండల మహిళా సమాఖ్యలకు బ్యాంక్ లింకేజీ కింద రూ.194.89 కోట్ల చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు పారదర్శకమైన సుపరిపాలన అందించేందుకే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీపీఓ రవీందర్, ఏఎంసీ చైర్మన్లు కొంగరి రవి, సంయుక్త, ఎంపీడీవోలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
సాగని కొనుగోళ్లు..ఆగని కన్నీళ్లు
సాక్షి, సిద్దిపేట: ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 20 రోజుల నుంచే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పోసి పడిగాపులు కాస్తున్నారు. కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండటంతో రైతులు దిగాలు చెందుతున్నారు. ఽవాతావరణ మార్పులతో వర్షాలు కురవచ్చన్న బెంగ రైతుల్లో నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 3.73లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా 421 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. 20 రోజుల క్రితం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఇప్పటి వరకు 5,100 మంది రైతుల నుంచి 25,500 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండటంతో కేంద్రాల్లో ధాన్యం రాశులు పేరుకపోయాయి. ఇప్పటి వరకు రూ.30 కోట్ల విలువ చేసే ధాన్యం కొనుగోలు చేయగా.. రూ.6.44కోట్లను మాత్రమే రైతులకు చెల్లించారు. ఇంకా దాదాపు రూ.13.56కోట్లు పెండింగ్లో ఉన్నాయి. కొంత మేరకు తాలుతోనే ధాన్యంను కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కుతున్నారు. ప్యాడి క్లీనర్ల ద్వారా ఎంత జల్లి పట్టినా అలాగే ఉంటుందని, పాత పద్ధతిలోనే కొనుగోలు చేయాలని రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఽకూలీల కొరతతో జల్లి పట్టేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు హమాలీలు, లారీల కొరత తో సైతం కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయి. 18 రోజులుగా పడిగాపులు ధాన్యం అమ్మేందుకు కర్షకుడి కష్టాలు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు పలుచోట్ల రోడ్డెక్కుతున్న రైతులు చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు ఇప్పటి వరకు కొనుగోలు చేసింది 25వేల మెట్రిక్ టన్నులే..ధాన్యం రాశులు ఉన్న ఈ దృశ్యం.. సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్లోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం. ఏప్రిల్ 24న కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఇప్పటికీ తొమ్మిది రోజులవుతున్నా ఒక్క గింజనూ కొనుగోలు చేయలేదు. 60 మందికి పైగా రైతులుకొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని ఉంచారు. దాదాపు 300 టన్నుల ధాన్యం రాశులు పేరుకపోయాయి. అకాల వర్షాలు కురిస్తే అంతా ఆగమేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. తాలు పేరుతో కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20 రోజులవుతున్నా కొంటలేరు దుబ్బాక మార్కెట్ యార్డులో వడ్లు పోసి 20 రోజులవుతోంది. వడ్లు ఎండి 12 శాతం తేమ వస్తోంది. అయినా కాంటా పెట్టడం లేదు. బి గ్రేడ్ అయితేనే కొంటామంటూ అధికారులు చెబుతున్నారు. ఎండల్లో నానాపాట్లు పడుతున్నాం. అధికారులు వెంటనే కొనుగోలు చేయాలి. – వంగ శ్రీనివాస్రెడ్డి, చెల్లాపూర్ -
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
గజ్వేల్: ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలు, నాయకులపై ఉందని మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. శనివారం గజ్వేల్ మండలం రిమ్మనగూడలో మంత్రి హరీశ్రావు సమక్షంలో గజ్వేల్ మండలం అక్కారం కాంగ్రెస్ నాయకులు సింగర్ ఎల్లంతోపాటు పలువురు బీఆర్ఎస్లో చేరారు. హరీశ్రావు వారికి బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డిలతో కలిసి కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రేవంత్రెడ్డి పాలనలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేరని చెప్పారు. గత ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలను తుంగలోకి తొక్కి.. కాంగ్రెస్ ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తున్నదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న అసంబద్ధ విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు బెండె మధు, పట్టణ శాఖ అధ్యక్షుడు నవాజ్మీరా, బాల్చంద్రం, నాయకులు పాల్గొన్నారు. -
గౌరవెల్లి ప్రాజెక్టు బాధ్యత నాదే
● త్వరలోనే నిర్మాణం పూర్తి చేస్తాం ● కబడ్డీ అకాడమీ ఏర్పాటుకు కృషి ● మంత్రి పొన్నం ప్రభాకర్హుస్నాబాద్: గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి నిర్మాణం తనదే బాధ్యత అని, భూ నిర్వాసితులకు త్వరలో పేమెంట్ చేసి కాలువల నిర్మిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం పట్టణంలో నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు. ఆర్డీఓ రామ్మూర్తి ముఖ్యమంత్రి సందేశం చదివి వినిపించారు. నియోజకవర్గ స్థాయిలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని వినిపించారు. అంతకముందు మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్ హైమావతితో కలిసి పరిశీలించారు. స్వయం సహాయక సంఘాలకు రూ.128 కోట్ల విలువైన బ్యాంక్ లింకేజీ చెక్కులు, కల్యాణలక్ష్మి, నేతన్న బీమా చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ జూన్ 2 తర్వాత పింఛన్ల పెంపుతో పాటు కొత్త పింఛన్లు ఇస్తామన్నారు. కొత్తపల్లి నుంచి హుస్నాబాద్కు నాలుగు వరుసల రహదారి పనులు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే హుస్నాబాద్ నుంచి అక్కన్నపేట వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి టెండర్లు పిలిచామని తెలిపారు. హుస్నాబాద్లో హోల్సెల్ కూరగాయల ఏర్పాటు చేస్తామని, త్వరలో కబడ్డి అకాడమీ సైతం ఏర్పాటు కాబోతుందని తెలిపారు. కార్యక్రమంలో సీపీ సాధన రష్మీ పెరుమాళ్, మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్ పర్సన్ చిత్తారి పద్మ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘జాబ్ క్యాలెండర్ ప్రకారం ఒక్క ఉద్యోగమైన భర్తీ చేశారా?’
సిద్దిపేట: కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందంటూ ధ్వజమెత్తారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్రావు. నిరుద్యోగులు నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తుంటే.. సీఎం రేవంత్ మాత్రం ఆ నోటిఫికేషన్ వద్దంటున్నారని మండిపడ్డారు. ఈరోజు(శనివారం, మే 5వ తేదీ) సిద్ధిపేట జిల్లా జిల్లా గ్రంధాలయంలో ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులతో ఇంటరాక్ట్ అయ్యారు హరీష్రావు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘ నిరుద్యోగులు నోటిఫికేషన్ వద్దంటున్నారని సీఎం రేవంత్ చెబుతున్నారు. కానీ నిరుద్యోగులు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. రాహుల్ గాంధీని అశోక్ నగర్ తీసుకువచ్చి మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలని నమ్మించారు. ఆనాడు నమ్మించి..నేడు వంచించడం కాంగ్రెస్ నైజం. సెంట్రల్ లైబ్రరీలో పోలీసులతో నిరుద్యోగులపై రేవంత్ దాడి చేయిస్తున్నారు. BRS హయాంలో 1.60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం. కాంగ్రెస్ వచ్చాక భర్తీ చేసింది కేవలం 16 వేల ఉద్యోగాలని సీఎం రేవంత్ అసెంబ్లీలో చెప్పారు. మిగిలిన 1.84 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారో సీఎం సమాధానం చెప్పాలి. పోలీస్ శాఖలో 19 వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని డీజీపీ చెప్పారు. మరి 5 వేల ఉద్యోగాలకే ప్రభుత్వం అనుమతి ఇచ్చి..మిగతా 14 వేల పోస్టులను ఎందుకు ఆపుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో 40 వేల పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేశాం. విద్యా కమిషన్ రిపోర్ట్ని సీఎం రేవంత్ ఎందుకు బయటపెట్టడం లేదు. రాష్ట్రంలో 30 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నాయి. మెగా డీఎస్సీసీ కాస్త దగా డీఎస్సీ అయిపోయింది. రేవంత్ నీ డ్రామాలు బంద్ చేయి. చిల్లర మాటలు కాదు కావాల్సింది...జాబ్ నోటిఫికేషన్ కావాలి. జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ అయి చిత్తు కాగితం అయింది. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఒక్క ఉద్యోగమైన భర్తీ చేశారా?, నీ కోసం పని చేసిన నిరుద్యోగులే రేపు రేవంత్ని బొందపెడతారు. తక్షణమే జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. లేదంటే నిరుద్యోగులతో సెక్రటేరియట్ ని ముట్టడిస్తాం’ అని హెచ్చరించారు. -
వైభవంగా ఎల్లమ్మ కల్యాణం
హుస్నాబాద్: పట్టణంలోని రేణుకా ఎల్లమ్మ దేవాలయ జాతర ఉత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి పొన్నం దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పంబాల పూజారులు అమ్మవారి కథను వినిపించారు. పంబాల కళాకారుల డప్పుకు మంత్రి స్టెప్పులేసి ఉత్సాహాన్ని నింపారు. అనంతరం రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మహాముని దివ్య కల్యాణం కనులపండువగా సాగింది. కల్యాణ వేడుకలను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. సాయంత్రం రైతులు ఎడ్లబండ్లను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కొత్తగా నియమించిన జాతర ఉత్సవ కమిటీ సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, ఆలయ కార్యనిర్వాహణాధికారి కిషన్ రావు, కౌన్సిలర్లు, గౌడ కులస్తులు, భక్తులు పాల్గొన్నారు.పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం -
ఆర్టీసీ కార్మికులకు వారధిగా ఉంటా
● బాధ్యతగా విధులు నిర్వహించండి ● మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్: ఆర్టీసీ కార్మికులు బాధ్యతను హక్కుగా భావించి విధులు నిర్వహించినప్పుడే సంస్థ ముందుకు సాగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం ఆర్టీసీ డిపోలో మే డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలకు ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. డిపో ఎదుట కార్మికులు ఎర్ర జెండాను ఆవిష్కరించారు. అనంతరం డిపోలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రజాపాలనలో ఆర్టీసీ సంస్థను లాభాల్లోకి తెచ్చామన్నారు. కార్మికుల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో మంత్రులు, కార్మిక సంఘాల నాయకులతో చర్చించి చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కార్మికులకు 11 శాతం పీఆర్సీ ప్రకటించిందన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రవాణా శాఖ మంత్రిగా వారధిగా ఉంటానని పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు. ఆయన మృతికి సంతాప సూచికగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీ సోలమన్, ఆర్టీఏ మెంబర్ సూర్యవర్మ, ఏసీపీ సదానందం, డిపో మేనేజర్ వెంకన్న, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. -
గుర్రాలగొందిని సందర్శించిన ట్రెయినీ డీపీఓలు
సిద్దిపేటరూరల్: నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది గ్రామాన్ని ట్రెయినీ డీపీఓలు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు గ్రామంలో అమలవుతున్న గ్రామస్థాయి మంత్రివర్గ పనితీరు, రుతుప్రేమ, స్టీల్బ్యాంకు నిర్వహణను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ స్వప్న గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు, వంటి వాటిని అధికారులకు తెలిపారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ గ్రామ వార్డు సభ్యులు మంత్రివర్గం మాదిరిగా శాఖలను కేటాయించుకుని సమస్యలు పరిష్కరించుకోవడం బాగుందన్నారు. కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ట్రెయినీ డీపీఓ అనూష, సిద్దిపేట డీపీఓ వినోద్, జగిత్యాల ట్రెయినీ డీపీఓ రేవంత్, వనపర్తి ట్రైనీ డీపీఓ తరుణ్చక్రవర్తి, డీఎల్పీఓ చందన, ఎంపీఓ విష్ణు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు అధైర్యపడొద్దు ● ప్రాణం కంటే మార్కులు ముఖ్యం కాదు ● సీపీ రష్మీ పెరుమాళ్ సిద్దిపేటకమాన్: పదో తరగతి ఫలితాల విడుదల నేపథ్యంలో విద్యార్థులు ఎవరూ అధైర్యపడొద్దని, ప్రాణం కంటే మార్కులు ముఖ్యం కాదని సీపీ రష్మీ పెరుమాళ్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫలితాలు ఆశించిన స్థాయిలో రాకపోయినా ఆత్మహత్య వంటి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. పిల్లలను ఇతరులతో పోల్చి చిన్నబుచ్చవద్దని వారిపై అనవసర ఒత్తిడి తీసుకురావద్దని సూచించారు. ఫలితాల తర్వాత పిల్లలు మౌనంగా ఉన్నా, ఒంటరిగా ఉండటానికి ప్రయత్నిస్తున్నా వారితో ప్రేమగా మాట్లాడి ధైర్యం కల్పించాలని సూచించారు. ఓటమి అనేది తాత్కాలికమని, విద్యార్థులకు జిల్లా పోలీసులు ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. సమస్య ఏదైనా పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని సహాయం కోసం ఏ సమయంలోనైనా సిద్దిపేట పోలీసు కంట్రోల్ రూమ్ 8712667100 లేదా డయల్ 100కు ఫోన్ చేయాలని సూచించారు. కార్మిక చట్టాలపై అవగాహన అవసరం సిద్దిపేటరూరల్: కార్మిక చట్టాలపై అవగాహనతో పాటు హక్కులను కాపాడుకోవాలని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో మేడే అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఆర్ఓ నాగరాజమ్మ , అదనపు డీసీపీ సుభాష్చంద్రబోస్లు అసిస్టెంట్ లేబర్ కమిషనర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల హక్కులు, ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. ప్రతీ కార్మికుడికి కనీస వేతనం అందేలా చూడడం, అదనపు వేతనం పొందే హక్కు, భద్రతా ప్రమాణాలు, భీమా సౌకర్యం తదితర పొందేలా అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్మిక కార్డు, ఈశ్రమ్ కార్డులను దరఖాస్తు చేసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రయోజనాలను పొందాలన్నారు. కార్మిక ప్రయోజనాలు పొందేందుకు కార్మిక కార్యాలయాన్ని, మీసేవ కేంద్రాన్ని సంప్రదించాలని తెలిపారు. అనంతరం కార్మిక చట్టాలు, ప్రయోజనాల వివరాలతో కూడిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ అధికారులు, కార్మికులు పాల్గొన్నారు. మొక్కజొన్న పంట దగ్ధంబెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని కల్లెపెల్లిలో ప్రమాదవశాత్తు నిప్పంటుకొని శుక్రవారం మొక్కజొన్న పంట దగ్ధమైంది. హార్వెస్టర్ నడిపిస్తుండగా బెల్ట్ నుంచి నిప్పు రవ్వలు రావడంతో మొక్కజొన్న పంటకు నిప్పంటుకుంది. ఈ సంఘటనలో కొండల్రెడ్డి, హనుమంతరెడ్డి, రాజయ్యలకు చెందిన మొక్కజొన్న పంటలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేలోగా పంటలు అధిక శాతం కాలిపోయాయని బాధితులు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు ఈ సందర్భంగా వేడుకున్నారు. -
నాచ‘గిరి’ ప్రదక్షిణం
ఆధ్యాత్మిక తరంగంగిరి ప్రదక్షిణలో భక్తజన సందోహంస్వాతి నక్షత్ర మహోత్సవంతో నాచగిరి అలరారింది. నృసింహ నామంతో మార్మోగింది. భక్తజన సామూహిక ‘గిరి’ ప్రదక్షిణ సంరంభంతో హరిద్రాతీరం పరవశించింది. శుక్రవారం ఉదయం పీఠాధిపతి మాధవానంద సరస్వతి ఆలయ ఉత్తర ద్వారం వద్ద ‘గిరి’ ప్రదక్షిణ ప్రారంభించారు. నాచగిరి కొండలు చుడుతూ, హరిద్రానది తీరం దాటుతూ, గోశాల మీదుగా ఉత్తరద్వారం వరకు కొనసాగిన గిరి ప్రదక్షిణలో వేలాది మంది భక్తులు పాల్గొని భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. స్వామివారిని దర్శించుకుని తరించారు. – వర్గల్(గజ్వేల్) -
తాలు తీసిన ధాన్యాన్నే కొంటాం
● కలెక్టర్ హైమావతి ● కొనుగోలు కేంద్రాల సందర్శనసిద్దిపేటఅర్బన్: తాలు తీసిన ధాన్యాన్నే కొనుగోలు కేంద్రాలలో కొంటామని కలెక్టర్ హైమావతి స్పష్టం చేశారు. శుక్రవారం సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి, తడ్కపల్లిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. పాడీ క్లీనర్ పనిచేయడం లేదని, తాలు తీయడం ఇబ్బంది అవుతోందని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వెంటనే రిపేర్ చేయించాలని మార్కెటింగ్ డీఎం నాగరాజును ఫోన్లో ఆదేశించారు. పాడీ క్లీనర్, కాంటాలు, తేమ యంత్రాలు అన్ని సరిగా ఉన్నాయో లేదో పరీక్షించాలన్నారు. సమస్యలు ఉంటే వెంటనే సరిచేయించుకోవాలని సెంటర్ నిర్వాహకులకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం తేమశాతం రాగానే తాలు పట్టించాలని, తాలు తీసిన ధాన్యాన్ని మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు. ఇతర ప్రాంతాల్లో తాలు తీయకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నారంటూ జరిగే ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అన్ని కేంద్రాలలో టెంట్, తాగునీరు, తాలు తీసే యంత్రాలు, కాంటాలు, టార్పాలిన్ కవర్లు, సుతిల్ దారాలు, గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. రెండు పంటలు వరి సాగు చేసే రైతులు పంట మార్పిడి చేయాలని సూచించారు. ఆయిల్పామ్ సాగు కోసం ప్రభుత్వం అనేక సబ్సిడీలు ఇస్తోందని, అధునాతన కార్మాగారం అందుబాటులో ఉన్న దృష్ట్యా ఆయిల్పామ్ సాగుకు మొగ్గు చూపాలని రైతులకు సూచించారు. -
మెరుగైన ఫలితాలు సాధించాం
● టాపర్స్కు త్వరలో ఐ ప్యాడ్స్ ● మాజీ మంత్రి హరీశ్రావు ● విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో టెలీకాన్ఫరెన్స్సిద్దిపేటజోన్: ‘పదో తరగతి ఫలితాల్లో గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలు సాధించాం. అందరికీ అభినందనలు. వంద శాతం ఉత్తీర్ణత సాధించిన చిన్నకోడూరు మండల ఉపాధ్యాయులు, విద్యార్థులకు శుభాకాంక్షలు. పదిలో ఉత్తీర్ణత సాధించిన మీ పిల్లల భవిష్యత్తు మరింత ఉన్నతంగా ఉండాలి’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఆకాంక్షించారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఆయన గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. మీ పిల్లలు బాగా చదివి, ఉన్నతంగా ఎదగాలి అనేది నా తాపత్రయం, నా ప్రయత్నం అని అన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో 2,874మంది విద్యార్థులు పది పరీక్ష రాయగా 2,791మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. ఇదే పట్టుదలతో చదివి భవిష్యత్తుకు మంచి లక్ష్యం ఎంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. అందుకు తన సంపూర్ణ సహకారం ఉంటుందని, మీకు ఎలాంటి సహకారం కావాలన్నా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటానని అన్నారు. అదేవిధంగా నంగనూరు, సిద్దిపేట రూరల్, అర్బన్, నారాయణరావు పేటలకు త్వరలో బెస్ట్ 30 మంది విద్యార్థులకు ఐ ప్యాడ్స్ గిఫ్ట్గా ఇస్తానని, అదేవిధంగా సన్మాన కార్యక్రమం నిర్వహిస్తానన్నారు. -
గణితంలో గ్రహపాటు
● పదో తరగతిలో 401 మంది ఫెయిల్ ● అధికంగా గణితం, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లోనే..సాక్షి, సిద్దిపేట: పదో తరగతిలో ఉత్తీర్ణత సాధిస్తేనే ఉన్నత విద్యలోకి ప్రవేశం ఉంటుంది. అయితే పదో తరగతిలో పలువురు విద్యార్థులు తడబడుతున్నారు. తాజాగా వెలువడిన పదో తరగతి ఫలితాల్లో జిల్లా 97.85శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో 13వ స్థానంలో నిలిచింది. 2025–26 విద్యా సంవత్సరంలో 401మంది ఫెయిల్ అయ్యారు. పాఠ్యాంశాల వారీగా పరిశీలిస్తే గణితం, ఇంగ్లిష్లలో అధికంగా ఫెయిల్ అయ్యారు. గణితం పాఠ్యాంశాల్లో సమస్యలను అన్వయించి పరిష్కరించడంలో విద్యార్థులు రాణించలేకపోతున్నారు. ఆంగ్లం స్పష్టంగా చదవడం రాయడం రాకపోవడంతోనే ఫెయిల్ అయ్యారు. మూడు మండలాల్లో.. దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట అర్బన్ మండలాల్లోనే అత్యధికంగా విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. అక్బర్పేట భూంపల్లి, బెజ్జంకి, చిన్నకోడూరు. ధూల్మిట్ట, కోహెడ, కుకునూరుపల్లి మండలాల్లో 100శాతం ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం పెరుగుతూ.. తగ్గుతూ పదేళ్లుగా పదో తరగతి ఫలితాలను పరిశీలిస్తే ఉత్తీర్ణత శాతం పెరుగుతూ... తగ్గుతూ వస్తోంది. 2021–22లో 14,869 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 14,550 (97.85 శాతం)మంది ఉత్తీర్ణులయ్యారు. ఆ ఏడాది రాష్ట్రంలో మొదటి స్థానం జిల్లా సాధించింది. 2018–19, 2022–23. 2023–24లలో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచింది. -
ధాన్యం దిగుమతిలో జాప్యం చేయొద్దు
● కలెక్టర్ హైమావతి ● సివిల్ సప్లై, రైస్ మిల్లర్లతో సమావేశం సిద్దిపేటరూరల్: వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో భాగంగా ధాన్యం దిగుమతి చేసుకోవడంలో ఎలాంటి జాప్యం చేయవద్దని కలెక్టర్ హైమావతి మిల్లర్ యజమానులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో జిల్లాలోని బాయిల్డ్ రైస్ మిల్లు ప్రతినిధులతో, సివిల్ సప్లై అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు జిల్లాలో 12,936 మెట్రిక్ టన్నులు వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు సివిల్ సప్లై అధికారి తనూజ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యంతో వచ్చిన లారీలను దిగుమతిలో జాప్యం కాకుండా ఎక్కువ మంది హమాలీలను ఏర్పటు చేసుకోవాలని మిల్లుల యజమానులను ఆదేశించారు. తాలు తీసిన ధాన్యాన్ని మాత్రమే మిల్లులకు వచ్చేలా అధికారులు పనిచేస్తున్నారన్నారు. అధికారులు, మిల్లర్ల సమన్వయంతో కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా పని చేయాలన్నారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో లారీలను అందుబాటులో ఉంచాలని కాంట్రాక్టర్ లను ఆదేశించారు. -
సింహవాహనంపై నాచగిరీశుడి విహారం
వర్గల్(గజ్వేల్): స్వాతి నక్షత్రం వేళ నృసింహావిర్భావం.. సింహవాహనంపై స్తంభోద్భోవుని దివ్యదర్శనం ఆవిష్కృతమైంది. నృసింహస్వామి జయంతి సందర్భంగా గురువారం నాచగిరి భక్తిపారవశ్యమైంది. జయంతి ఉత్సవాలలో భాగంగా విశేష అభిషేకం, సుదర్శన నారసింహ మూలమంత్ర హవనం, పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం ఆలయ మండపంలో అష్టోత్తర శతకలశ పూజ జరిపారు. భక్తజన హర్షధ్వానాల మధ్య సింహవాహనంపై శ్రీవారు ఊరేగారు. అనంతరం స్తంభోద్భవుడు నృసింహుని ఆవిర్భావ ఘట్టంతో క్షేత్రంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించండి మిరుదొడ్డి(దుబ్బాక): ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించడం కోసం దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. మండల పరిదిలోని లింగుపల్లిలో గురువారం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ చైర్పర్సన్ బొమ్మెర సంయుక్తతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి కనీస మద్దతు ధరను పొందాలని సూచించారు. గ్రామ గ్రామాన ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కావాల్సిన తాగు నీరు, నీడ, వంటి వసతులు కల్పించాలని నిర్వాహకులను ఆదేశించారు. కోదండరాంను కలిసిన టీజేఎస్ నాయకులుగజ్వేల్రూరల్: ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి వచ్చిన సందర్భంగా టీజేఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో టీజేఎస్(తెలంగాణ జన సమితి) జిల్లా ఇన్ఛార్జి రమేశ్, జిల్లా అధ్యక్షుడు నీరుడి స్వామి, యువజన విభాగం అధ్యక్షుడు కీసర స్వామి గురువారం కోదండరాంకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మల్లన్నసాగర్ భూనిర్వాసితుల నష్టపరిహారం తదితర అంశాలను కోదండరాం దృష్టికి తీసుకెళ్లి ముంపు గ్రామాల ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. మంత్రి ఇలాకాలో ఏఈ ఏరీ?హుస్నాబాద్: రూ.కోట్లాది అభివృద్ధి పనులు జరుగుతున్న మున్సిపాలిటీలో పూర్తి స్థాయి ఏఈ (అసిస్టెంట్ ఇంజినీర్)ని నియమించాలని పలు పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట గురువారం బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి రవీందర్గౌడ్, భారతీయ కిసాన్ సంఘ్ డివిజన్ కన్వీనర్ కవ్వ వేణుగోపాల్రెడ్డి బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి ఇలాకాలో పూర్తి స్థాయి ఏఈ లేకపోవడం దారుణమన్నారు. సీసీ రోడ్లలో నాణ్యత లేకపోవడం, క్వాలిటీ కంట్రోల్ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో మూడేళ్లకే గుంతలు పడి కంకర తేలి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పాత రోడ్లపైనే మళ్లీ రోడ్లు వేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. -
ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగిరం చేయండి
● అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ● మంత్రి పొన్నం ప్రభాకర్ కోహెడరూరల్(హుస్నాబాద్): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసి గృహ ప్రవేశాలు జరిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. గురువారం కోహెడ మండల కార్యాలయంలో సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మండలానికి మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. అలాగే ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సమస్యలను పరిష్కరించాలన్నారు. ధాన్యం కొనుగోళ్లు, తాగు నీటి సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇంజనీరింగ్ కళాశాలలో అన్ని వసతులు కల్పిస్తాం హుస్నాబాద్: ఇంజనీరింగ్ కళాశాలలో అన్ని వసతులు కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గురువారం మండలంలోని ఉమ్మాపూర్లో శాతవాహన ఇంజనీరింగ్ కళాశాల, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ భవన నిర్మాణాలు జరిగే స్ధలాన్ని పరిశీలించి స్థల పత్రాలను అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కళాశాల భవన నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, టెండర్ ప్రక్రియ పూర్తయిందన్నారు. విద్యార్థి, విద్యార్థినులకు ప్రత్యేక హాస్టల్ భవనాలు నిర్మిస్తున్నామన్నారు. అలాగే ప్రస్తుతం గాంధీనగర్లో ఉన్న పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఒకటిన్నర ఎకరాల్లో ఏటీసీ(అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్) ఏర్పాటు కోసం సంబందిత అధికారులకు స్థలం అప్పగించామన్నారు. ఇంజనీరింగ్ కళాశాల, ఏటీసీ కేంద్రం నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. అలాగే కూచనపల్లి, మాలపల్లె మధ్య న్యాక్ సెంటర్ మంజూరు కాగా స్థలాన్ని పరిశీలించారు. విద్య, వైద్యం, ఉపాధి, టూరిజం మెరుగుపడాలని మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఉమేష్కుమార్ తదితరులు ఉన్నారు. -
చట్టబద్ధ దత్తతే చక్కని మార్గం
జిల్లా సంక్షేమశాఖ అధికారి శారదసిద్దిపేటరూరల్: అందమైన కుటుంబం ఏర్పాటు కోసం చట్టబద్ధంగా చిన్నారుల దత్తత చక్కని మార్గమని జిల్లా సంక్షేమ శాఖ అధికారి శారద అన్నారు. గురువారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో మిషన్ వాత్సల్య పథకం– డీసీపీయూ విభాగం ఆధ్వర్యంలో దత్తత కోసం దరఖాస్తు చేసుకున్న వారికి చట్టబద్ధ దత్తతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకోవడానికి గల అర్హతలు, సంబంధిత వివరాలను తెలియజేస్తూ దరఖాస్తుచేసుకోవాలన్నారు. చట్టబద్ధంగా కాకుండా అక్రమ పద్ధతిలో దత్తత తీసుకోరాదన్నారు. అనంతరం దత్తత తీసుకున్న తల్లితండ్రులకు అనుమానాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో డీఈఓ శ్రీనివాస్రెడ్డి, బాలరక్షాభవన్ కోఆర్డినేటర్ మమత, డీసీపీఓ రాము, బాలల రక్షణ అధికారులు పాల్గొన్నారు. -
జీవించు.. జయించు
ధైర్యం వీడొద్దు.. ఆత్మస్థైర్యం మరవొద్దు సిద్దిపేటకమాన్: విద్యార్థుల అనాలోచిత నిర్ణయాల వల్ల విలువైన ప్రాణాలను తీసుకుంటున్నారు. ర్యాంకులు, మార్కుల విషయంలో తోటివారితో పోలికలు ఒత్తిడిలోకి నెడుతున్నాయి. విజ్ఞానం కోసం నేర్చుకోవాల్సిన చదువులు యువతను మానసిక ఒత్తిడికి గురి చేసి ఆత్మహత్యల వైపు నడిపిస్తున్నాయి. ర్యాంకుల కోసం నిత్యం పుస్తకాలతో కుస్తీ పడుతూ విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. విద్యార్థుల బలవన్మరణాల ఫలితంగా రేపటి భావితరాల భవిష్యత్ ప్రశ్నార్థకమవుతోంది. ఇంటర్మీడియెట్, పదవ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలవగానే తాము అనుకున్న స్థాయిలో మార్కులు రాలేదని, ఫెయిల్ అవుతామని ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య ఎక్కువవుతోంది. పరీక్షలు మళ్లీ రాసి గెలవాలే గానీ క్షణికావేశంలో జీవితాలను అర్థాంతరంగా ముగించుకోవడం ఏమాత్రం సమంజసం కాదని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత సమాజంలో విద్యార్థుల్లో సున్నితత్వం పెరిగింది. వారిని మానసికంగా దృఢంగా మార్చడానికి తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలి. పిల్లలు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని వారి పట్ల దురుసుగా ప్రవర్తించకూడదు. మార్కుల పట్ల ఇతరులతో పోల్చి తక్కువ చేసి మాట్లాడితే క్షణికావేశంలో విద్యార్థులు ఆత్మహత్యను ఓ మార్గంగా ఎంచుకుంటున్నారు. మీ పిల్లల మార్కులు, ర్యాంకుల కంటే వారి జీవితం అత్యంత ప్రాధాన్యమైనదని గుర్తించాలి. ‘చిన్న’కోడూరుకు ‘పది’ంతల కీర్తి ఆత్మహత్య పరిష్కారం కాదు విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో, మార్కులు తక్కువ వచ్చాయనో క్షణికావేశంలో విలువైన ప్రాణాలు తీసుకోకూడదు. ఆత్మహత్య పరిష్కారం కాదు. మళ్లీ మళ్లీ ప్రయత్నించి విజయం సాధించాలి. అంతేకాని అనాలోచిత నిర్ణయాల వల్ల జీవితాన్ని కోల్పోవద్దు. విద్యార్థులు ఏవరైనా ఒత్తిడికి లోనైతే తమను సంప్రదిస్తే కౌన్సెలింగ్ ద్వారా వారిలో మార్పు తీసుకవస్తా. – డాక్టర్ శాంతి, మానసిక వైద్య నిపుణురాలు, సిద్దిపేట ప్రభుత్వాస్పత్రి -
ఈత ఇంపు.. కొలను కంపు
అధ్వానంగా సర్కార్స్విమ్మింగ్ పూల్ ● జిల్లా కేంద్రంలో రూ. కోట్లు వెచ్చించి నిర్మాణం ● అధికారుల మధ్య సమన్వయ లోపమే కారణం ● వినియోగంలోకి తీసుకురావాలంటున్న ప్రజలు సాక్షి, సిద్దిపేట: జిల్లా కేంద్రంలో 2016లో రూ.5కోట్ల వ్యయంతో 50 మీటర్ల పొడవు, 25 మీటర్ల వెడల్పుతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఈత కొలను నిర్మించారు. అలాగే బేబీ స్విమ్మింగ్ పూల్ను సైతం ఏర్పాటు చేశారు. ప్రారంభంలో జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీలు సైతం నిర్వహించారు. కరోనా కాలంలో కొన్ని రోజులు మూత పడింది. కొన్ని రోజులు మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహణ కొనసాగింది. తర్వాత జిల్లా యుజవన క్రీడల శాఖ ఆధ్వర్యంలో గత నాలుగేళ్లు ప్రైవేట్ కాంట్రాక్టర్కు అప్పగించారు. సదరు కాంట్రాక్టర్లు నిర్వహణ గాలికి వదిలేశారు. వేసవి కాలంలో, డబ్బులు వచ్చే సమయంలోనే ఓపెన్ చేసే వారు. తర్వాత మూసివేస్తున్నారు. నాలుగేళ్లుగా కాంట్రాక్ట్ పొందిన వారు డబ్బులు చెల్లించకపోయినా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. సమన్వయ లోపం మున్సిపల్ పరిధిలో ఉండటంతో తమకు అప్పగిస్తే వినియోగంలోకి తీసుకువస్తామని కలెక్టర్, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారులకు మున్సిపల్ కమిషనర్ లేఖ రాశారు. దీంతో మున్సిపాలిటీకి అప్పగించాలని కలెక్టర్ ఆదేశించినట్లు తెలిసింది. అధికారుల మధ్య సమన్వయ లోపంతో మరమ్మతులకు నోచుకోడం లేదు. పైగా రెండు శాఖల నిర్లక్ష్యం కారణంగా రూ.కోట్లు పెట్టి నిర్మించిన స్విమ్మింగ్ పూల్ నిరాదరణకు గురవుతోంది. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి త్వరగా మరమ్మతులు చేసి ఈ వేసవి కాలంలో అందుబాటులోకి తీసుకరావాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. భానుడి భగభగలకు ఉపశమనం పొందాలని ఆశించే పట్టణ వాసులకు, శిక్షణ పొందే క్రీడాకారులకు సిద్దిపేట లోని ఈత కొలను నిరాశే మిగులుస్తున్నది. మున్సిపల్, యువజన క్రీడల శాఖాధికారుల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన స్విమ్మింగ్ పూల్ నిరాదరణకు గురవుతోంది. 8 నెలలుగాతెరుచుకోకపోవడంతోకంపుకొడుతోంది. మున్సిపాలిటీకి అప్పగించాం కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపాలిటీ వారికి స్విమ్మింగ్ పూల్ బాధ్యతలను అప్పగించాం. ఈ మేరకు ఇదివరకే సంతకం చేశాను. విద్యుత్ బిల్లులు సైతం బకాయిలు ఉన్నాయి. – శ్రీనివాస్ రెడ్డి, ఇన్చార్జి డీవైఎస్ఓ అప్పగించలేదు జిల్లా యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట ఈత కొలను ఉంది. కొలను నిర్వహణ బాధ్యతలు తమకు అప్పగించాలని లేఖ రాశాం. ఇంకా అప్పగించలేదు. మా ఆధీనంలోకి రాగానే మరమ్మతులు చేసి వినియోగంలోకి తీస్తాం. – ఆశ్రిత్ కుమార్, కమిషనర్, సిద్దిపేట పురపాలక సంఘంఅంతా చెత్తాచెదారం ఎనిమిది నెలలుగా స్విమ్మింగ్ పూల్ను తెరవకపోవడంతో దుర్వాసన వస్తోంది. వర్షపు నీళ్లు, చెత్తా చెదారంతో నిండిపోయింది. ఎయిర్ బాల్స్ గొలుసు తెగిపోయింది. మోటార్లు పాడయ్యాయి. కొలను ఆవరణలో గడ్డి ఏపుగా పెరిగింది. కొన్ని నెలలుగా విద్యుత్ బిల్లు బకాయి ఉంది. ప్రైవేట్ పూల్స్ కోసమే ప్రభుత్వ స్విమ్మింగ్ పూల్ నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
మెదక్జోన్: జిల్లా కోర్టులో ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూనియర్ అసిస్టెంట్ 1, స్టేనో టైపిస్ట్ 1 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. మే 1 నుంచి 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాగా జూనియర్ అసిస్టెంట్కు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ, స్టేనో టైపిస్ట్కు డిగ్రీతో పాటు ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్, టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఉండాలన్నారు. ఇతర వివరాలకు జిల్లా కోర్టు వెబ్సైట్, నోటీస్ బోర్డులో చూసుకోవచ్చన్నారు. -
చెడు స్నేహం వలలో పడొద్దు
సిద్దిపేటరూరల్: సైబర్ క్రైమ్, సమాచార మాధ్యమాలతో ఏర్పడిన చెడు స్నేహాల వలలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని కలెక్టర్ హైమావతి సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా నర్సింగ్ కళాశాల విద్యార్థులకు సైబర్ క్రైమ్పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వమాట్లాడుతూ అన్ని తెలుసనే భ్రమలో విద్యార్థులు ఉంటారని, ఏది నిజం, ఏది అబద్దం అనేది గ్రహించకుండా త్వరగా అట్రాక్టివ్ అవుతారన్నారు. ఇంటర్నెట్, టెక్నాలజీ అవసరం మేరకు వాడుకోవాలని సూచించారు. వాట్సప్, పలు సోషల్ మీడియాలో రకరకాల కొత్త వారితో ఎక్కువ మంది స్నేహాలు చేస్తుంటారని, దాని వల్ల జీవితం నాశనమయ్యే పరిస్థితి ఉంటుందన్నారు. చాలా మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు సైతం చూస్తున్నామన్నారు. కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తల్లిదండ్రులు పెంచి చదివిస్తున్న క్రమంలో వారి కలలను నిజం చేయాలన్నారు. ఆధ్యాత్మిక భావన, యోగ, ధ్యానం చేసుకుని పాజిటివ్ దృక్పథంతో ఉండాలన్నారు. విద్య పరంగా సమస్యలు ఎదురైతే ఉపాధ్యాయులకు తెలపాలని, ఒక లక్ష్యాన్ని ఎంచుకుని నిరంతరం శ్రమించి, జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. సైబర్ క్రైమ్, డ్రగ్స్ బారిన పడకుండా జిల్లా సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా టోల్ఫ్రీ నంబర్ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి శారద, సీడీపీఓ రాము, ఇన్చార్జి డీఎంహెచ్ఓ తదితరులు పాల్గొన్నారు. జీవితాలను నాశనం చేసుకోవద్దు కలెక్టర్ హైమావతి నర్సింగ్ విద్యార్థులకు సైబర్క్రైమ్పై అవగాహన -
ఎల్లమ్మ ఉత్సవ కమిటీ నియామకం
హుస్నాబాద్: పట్టణంలోని రేణుకా ఎల్లమ్మ జాతర ఉత్సవ కమిటీని నియమించారు. ఈ మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ సభ్యులుగా పూదరి శ్రీనివాస్గౌడ్, పచ్చిమట్ల రాధాగౌడ్, టాకూర్ భగవాన్ సింగ్, దొబ్బల అనిల్, లావుడ్యా కిషన్నాయక్, కోడం ప్రభాకర్, పున్న సమ్మయ్య, అలవోజు రవీందర్, ముప్పిడి రాజిరెడ్డి, గొర్ల కొమురయ్య, సావుల వెంకటస్వామి, గట్టు సాయికృష్ణ, బొల్లి శ్రీనివాస్లను నియమించారు. మే 1వ తేదీ నుంచి 31 వరకు ఉత్సవ కమిటీ పని చేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పంట వివరాల నమోదు తప్పనిసరి: స్వరూపరాణిదుబ్బాకటౌన్: రైతులు సాగు చేస్తున్న పంట వివరాలను తప్పనిసరిగా వ్యవసాయ అధికారుల వద్ద నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి తెలిపారు. బుధవారం రాయపోల్ మండలం అంకిరెడ్డిపల్లిలో పంట నమోదు వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు పంట నమోదు చేసుకుంటేనే ఉత్పత్తులు అమ్ముకోవడానికి వీలుంటుందన్నారు. ప్రతి సీజన్లో పంట నమోదు చేసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం ఫర్టిలైజర్ యాప్ అప్డేట్స్ కోసం తాత్కాలికంగా నిలిపి వేశారన్నారు. రైతులకు యూరియా అవసరం ఉంటే నానో యూరియా వాడాలని, అలాగే ఆయిల్పామ్ పంట కోసం అమ్మోనియా సల్ఫేట్ వాడాలని సూచించారు. ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నరేష్, వ్యవసాయ విస్తరణ అధికారి స్వర్ణలత, రైతులు తదితరులున్నారు. బకాయిలు విడుదల చేయండి సిద్దిపేటజోన్: పెండింగ్లో ఉన్న విద్యార్థుల స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రాజు డిమాండ్ చేశారు. బుధవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల నాలుగేళ్లుగా దాదాపు రూ.10 వేల కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని ఆరోపించారు. 14లక్షల మంది పేద విద్యార్థులు పథకంపై ఆధారపడి చదువుతున్నారని, వారికి విద్యను దూరం చేసే కుట్ర జరుగుతోందని అన్నారు. ఫీజులు చెల్లించలేని విద్యార్థులకు కాలేజీలు హాల్టిక్కెట్లు, సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. బకాయిలు చెల్లించకుండా మరోపక్క ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజులను 35 శాతం పెంచి పేద విద్యార్థుల తల్లిదండ్రులకు భారం చేసిందన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో పోరాటం ఉధృతం చేస్తామని ఆయన ప్రకటించారు. -
చదువుల్లో రాణించినప్పుడే గుర్తింపు
గజ్వేల్రూరల్: విద్యార్థులు చదువుల్లో రాణించినపుడే గుర్తింపు లభిస్తుందని సీపీడీసీ సభ్యులు అన్నారు. గజ్వేల్ పట్టణంలోని బాలుర ఎడ్యుకేషన్ హబ్లోగల ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాశాల సీపీడీసీ సభ్యులు లక్ష్మణ్, నరేష్, గోపాల్రెడ్డి, సుభాష్చంద్రబోస్ తదితరులు మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆశలను అడియాసలు చేయకుండా విద్యార్థులు చదువుల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. -
ఒకే రోజు రెండు ప్రవేశ పరీక్షలు
గజ్వేల్: పదో తరగతి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన ఓ పేద విద్యార్థినికి ఒకే రోజు ఒకే సమయానికి ఇంటర్మీడియెట్ కేజీబీవీ, గురుకుల జూనియర్ కళాశాల ప్రవేశ పరీక్ష ఉండటంతో అయోమయానికి గురవుతోంది. గజ్వేల్ మండలం పిడిచెడ్ గ్రామానికి చెందిన హారిక ములుగులోని సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశారు. బుధవారం వెలువడిన పదో తరగతి ఫలితాల్లో 508 మార్కులను సాధించారు. రిజల్ట్కు ముందే ఇంటర్మీడియెట్ ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్నారు. సదరు విద్యార్థినికి హాల్టికెట్లు కూడా వచ్చాయి. కేజీబీవీ ప్రవేశ పరీక్ష మే 3న ఉదయం 10గంటల నుంచి 12:30గంటల వరకు సిద్దిపేట మండలం తడ్కపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాయాల్సి ఉంది. టీజీఆర్జేసీ ప్రవేశ పరీక్ష సైతం అదే రోజు, అదే సమయానికి సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడు మోడల్ పాఠశాలలో ఉన్నట్లు హాల్ టికెట్లు వచ్చాయి. ఈ రెండింటిలో ఏ పరీక్షకు హాజరు కావాలో తెలియక సదరు విద్యార్థిని తికమకపడుతున్నారు. ఒకే రోజు.. ప్రవేశ పరీక్షలను నిర్వహించడంలో సంబంధిత అధికారుల ఆంతర్యమేమిటో అర్థం కాని ప్రశ్నగా మారింది. వారి నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది పేద విద్యార్థులు హారికలాగే ఆందోళన చెందుతున్నారు. ఒకే సమయానికి టీజీఆర్జేసీ, కేజీబీవీ ఎంట్రెన్స్ టెస్ట్లు ఆందోళనలో టెన్త్ విద్యార్థులు -
సమస్యల పరిష్కారానికి కమిటీలు
అక్కన్నపేట(హుస్నాబాద్): గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ వేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. అక్కన్నపేట మండల కేంద్రంలో బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. అలాగే మండలస్థాయి అధికారుల సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తేమ శాతం సరైన విధంగా ఉండి కూడా కొనుగోలు చేయలేకపోతే సమస్యలు వస్తాయన్నారు. అదేవిధంగా గ్రామాల్లో తాగునీటి సరఫరాలో సమస్యలు రావద్దన్నారు. ఆయా గ్రామాల్లో శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. బావుల పూడికతీత, పైపులైన్ వేయడం, తదితర అంశాలపై పరిష్కారం చూపడానికి ఐదుగురుతో కమిటీ వేయాలని చెప్పారు. గ్రామాల్లో హెల్త్ క్యాంప్లు ఏర్పాటు చేయాలన్నారు. అందరూ ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు. కమిటీలు బాధ్యతగా వ్యవహరించినప్పుడే గ్రామాల్లో సమస్యలు తొలుగుతాయన్నారు. మండలంలో రూ.14కోట్లతో రోడ్లు వేశామన్నారు. అలాగే పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. మండలంలోని పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్లు వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పీసీసీ జనరల్ సెక్రటరీ సౌజన్య, కలెక్టర్ హైమావతి, ఆర్డీఓ రామ్మూర్తి, ఆత్మ కమిటీ చైర్మన్ ఐల్లయ్య, ఎంపీడీఓ బానోతు జయరాం, ఎమ్మారో సింహాచలం మధుసూదన్, ఎంఈఓ గుగులోతు రంగా నాయక్, వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగాలి ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి మంత్రి పొన్నం ప్రభాకర్ -
పదింతల సంబురం
ఫలితాల్లో జిల్లా ౖపైపెకి..● 25 నుంచి 13వ స్థానానికి ● ఈసారి బాలురదే హవా ● 243 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత ● చిన్నకోడూరు మండలంలో అందరూ పాస్ ● రాణించిన గురుకులాల విద్యార్థులుగురుకుల విద్యార్థినికి 585 మార్కులువర్గల్(గజ్వేల్): జిల్లా స్థాయిలో వర్గల్ మండలం చౌదరిపల్లి(గజ్వేల్) సోషల్వెల్ఫేర్ బాలికల గురుకులం మెరిసింది. టెన్త్ పరీక్షలో సత్తాచాటిన అనుముల అక్షిత 585 మార్కులు సాధించారు. ఏ.జ్యోతిర్మయి (565), డి. మేనక(554) మార్కులు సాధించారు. మొత్తం 78 మంది పరీక్ష రాయగా 77 మంది ఉత్తీర్ణులయ్యారని ప్రిన్సిపాల్ తెలిపారు. పూలే భళా.. వర్గల్(గజ్వేల్): టెన్త్ ఫలితాల్లో వర్గల్ జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ బాలికల గురుకులం శతశాతం ఉత్తీర్ణత సాధించింది. 77 మంది బాలికలు పరీక్ష రాయగా అందరూ ఉత్తీర్ణులైనట్లు ప్రిన్సిపాల్ లక్ష్మీ దేవి తెలిపారు. టీ. శ్రీహర్ష (566), ఎం. శిరీష(558) మార్కులతో టాపర్లుగా నిలిచారు. గురుకులంలో శతశాతం ఉత్తీర్ణత నమో దు కావడంపై ప్రిన్సిపాల్ సంతోషం వ్యక్తం చేశారు.ప్రశాంత్నగర్(సిద్దిపేట): పదోతరగతి ఫలితాల్లో జిల్లా మెరిసింది. జిల్లా 13వ స్థానంలో నిలిచింది. గత 2024– 25 విద్యాసంవత్సరంలో 25వ స్థానంలో ఉన్న జిల్లా.. 2025– 26 ఫలితాల్లో 13వ స్థానానికి ఎకబాకింది. 15,325 మంది విద్యార్థులకు గాను 14,995 మంది ఉత్తీర్ణత సాధించారు. దీంతో జిల్లా 97.85శాతం ఉత్తీర్ణత సాధించింది. ప్రస్తుతం వెలువడిన ఫలితాల్లో 7,752 మంది బాలురకు 7,540 మంది, 7,573 మంది బాలికలకు 7,455 మంది ఉత్తీర్ణులయ్యారు. 100 శాతం ఉత్తీర్ణత సాధించిన మండలంగా చిన్నకోడూరు నిలిచింది. స్పింగ్డల్స్ పాఠశాలకు చెందిన విద్యార్థిని ఎర్రవళ్లి సాత్విక 595 మార్కులు సాధించి టాపర్గా నిలిచారు. గురుకులాల విద్యార్థులు సత్తా చాటారు. ఎన్సాన్పల్లి గురు కులం విద్యార్థిని శ్రీగారి వర్ష 588 మార్కులు సాధించారు. 136 ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలు, 21గురుకులాలు, 13 కేజీబీవీలు, 11 ఆదర్శ స్కూల్స్ వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. పరీక్షకు హాజరైన విద్యార్థులు: 15,325ఉత్తీర్ణత సాధించిన వారు : 14,995ఫెయిల్ అయిన వారి సంఖ్య: 330జిల్లాలో ఉత్తీర్ణత శాతం: 97.85అత్యధిక మార్కులు సాధించిన వారుశ్రీగారి వర్ష (రెసిడెన్షియల్ స్కూల్ ఎన్సాన్పల్లి): 588బొమ్మిడి అమూల్య (జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నర్మేట): 587దనాల అశ్వప్రియ (రెసిడెన్షియల్ స్కూల్ ఎన్సాన్పల్లి): 586 -
బంకుల్లో డీజిల్ కొరత
హుస్నాబాద్: బంకుల్లో డీజిల్ కొరతతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డీజిల్ నో స్టాక్ బోర్డులు దర్శనం ఇవ్వడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. హుస్నాబాద్ పట్టణంలో 5 పెట్రోల్ బంకులు ఉన్నాయి. రెండు రోజుల నుంచి డీజిల్ కొరత నెలకొంది. బంకు యాజమానులు డీజిల్ కోసం అడ్వాన్స్ పేమెంట్ చేసినా చమురు కేంద్రాల నుంచి దిగుమతి కావడం లేదు. వరి కోతల సమయంలో హార్వెస్టర్లకు డీజిల్ అత్యవసరం. రోజూ ప్రతి హార్వెస్టర్కు దాదాపు 100 నుంచి 150 లీటర్ల డీజిల్ అవసరం ఉంటుంది. దీంతో వరి కోత మిషన్లు వ్యవసాయ క్షేత్రంలోనే ఉండాల్సి పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా.. గతంలో కొంత మంది అవసరానికి మించి డీజిల్ను నిలువ చేసుకొని, ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరో వైపు పెట్రోల్ కొరత ఉంటుందనే వదంతులతో పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు క్యూ కడుతున్నాయి. ముందస్తుగా వాహన ట్యాంక్లను నింపుకొంటున్నారు. -
అంతా.. ఆన్లైన్
ధాన్యం లారీలకు జీపీఎస్జీపీఎస్ ట్రాకింగ్ అమర్చిన వాహనంలో ధాన్యం బస్తాల లోడింగ్మిల్లులకు సమానంగా ధాన్యం కేటాయింపులు.. పంపిన ధాన్యాన్ని అన్లోడ్ చేయడంలో జాప్యాన్ని నియంత్రించేందుకు జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేశారు. ఈ సీజన్లో ధాన్యం కొనుగోలులో ట్రక్ షీట్ జనరేట్, ఆన్లైన్లోనే మిల్లులకు కేటాయింపులను ప్రారంభించారు. తరుగు పేరుతో దోపిడీ అరికట్టనున్నారు. డబ్బుల చెల్లింపులు వేగిరం చేయనున్నారు. – సాక్షి, సిద్దిపేట జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు ఈ సీజన్ నుంచే నూతన పద్ధతులను పౌరసరఫరాల శాఖ అమలు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా యాసంగిలో 3.7లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని జిల్లా వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందు కోసం 419 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఇప్పటికే పలు చోట్ల ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు 6వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. అక్రమాలను అరికట్టేందుకే.. ధాన్యం రవాణాలో అక్రమాలను అరికట్టేందుకు జీపీఎస్ విధానాన్ని అమలు చేస్తున్నారు. తరుగు ఎక్కువగా తీయాలని మిల్లర్లు రోజుల తరబడి వాహనాల నుంచి ధాన్యం అన్లోడ్ చేయకుండా ఉంచేవారు. ధాన్యం తరుగును తీసేందుకు అంగీకరిస్తేనే దించుకునేవారు. జీపీఎస్ ఏర్పాటు చేయడంతో ఎంత సమయం వేచి ఉంది.. ఎందుకు వేయిటింగ్ చేయించారనే వివరాలు తీసుకోనున్నారు. కావాలని ఆలస్యం చేస్తే మిల్లర్ల పై చర్యలు తీసుకుంటారు. అక్రమాలకు చెక్ పెట్టేందుకు లారీలు, డీసీఎం వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ పరికరాలు అమర్చడం తప్పనిసరి చేశారు. జీపీఎస్ సరిగా పని చేస్తున్న వాహనాలకు మాత్రమే లోడింగ్ చేయనన్నారు. వాహనాల కదలికలను నిత్యం పర్యవేక్షించనున్నారు. ఇలా ఆన్లైన్లో ట్రక్షీట్లు జనరేట్, వాహనాలకు జీపీఎస్ ఏర్పాటుతో రైతులకు ఎంతో మేలు జరగనుంది. తరుగు పేరుతో దోపిడికి పాల్పడే అవకాశాలు తగ్గిపోనున్నాయి. రైతులకు దాదాపు 48 గంటల్లో ధాన్యం డబ్బులు అకౌంట్లలో జమ కానున్నాయి. ‘పలుకుబడి’కి ఇక చెల్లు ఇదివరకు సివిల్ సప్లయ్ అధికారులు, స్థానిక అధికారులకు నచ్చిన మిల్లులకు, పలుకుబడి ఉన్న నేతల మిల్లులకు అధికంగా ధాన్యం కేటాయించే వారు. దీంతో మిల్లుల యజమానుల నుంచి ఫిర్యాదులు, అధిక తరుగు, మిల్లుల వద్ద లారీలు పడిగాపులకు, అక్రమాలకు చెక్ పడనుంది. నాణ్యతలేదనే పేరుతో కోతలు, ట్రక్ షీట్లలో అవకతవకలకు పాల్పడే అవకాశాలు ఉండవు. కొనుగోలు కేంద్రాల్లో లారీ లోడ్ చేసిన వెంటనే ఆన్లైన్లో ట్రక్షీట్ జనరేట్ చేసి, సంబంధిత మిల్లును ఆటోమేటిక్గా కేటాయించే విధానాన్ని అమలు చేస్తోంది. మాన్యువల్గా మిల్లుల కేటాయింపు విధానాన్ని నిలిపివేసింది. కొత్త విధానంలో లారీ లోడ్ చేసే సమయానికి మిల్లు వివరాలు తెలియవు. ట్రక్ షీట్ ఆన్లైన్లో జనరేట్ చేసిన తర్వాతే అదే ఆటోమేటిక్గా ఏ మిల్లుకు తరలించాలో సూచిస్తుంది. ట్రక్షీట్లో పేర్కొన్న మిల్లుకే ధాన్యాన్ని తరలించాలి. నూతన పద్ధతిలోనే మిల్లులకు కేటాయింపులు అన్లోడింగ్ జాప్యానికి చెక్ రైతులకు త్వరగా డబ్బు చెల్లింపులు జిల్లా వ్యాప్తంగా 5లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ..పారదర్శకత కోసమే.. మిల్లర్లకు ధాన్యం కేటాయింపుల్లో పారదర్శకత, త్వరితగతిన రైతులకు డబ్బులు చెల్లింపులు జరగనున్నాయి. తరుగు పేరుతో ఇక మిల్లర్ల ఇబ్బందులు ఉండవు. వాహనాలకు సైతం జీపీఎస్ ఏర్పాటు చేశాం. దీంతో మిల్లర్లు అన్లోడింగ్ జాప్యం సైతం తగ్గనుంది. – గోపికృష్ణ, డీఎం, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ -
వైభవంగా నాచగిరిశుడి జయంత్యుత్సవాలు
వర్గల్(గజ్వేల్): నాచగిరి లక్ష్మీ నృసింహ క్షేత్రంలో స్వామివారి జయంత్యుత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రెండోరోజు ఉదయం 7.30 గంటలకు యాగశాల ప్రవేశం జరిగింది. అర్చకస్వాములు మంత్రోచ్ఛరణలతో మూర్తికుంభ స్థాపన, అగ్నిప్రతిష్ఠ, ప్రధాన కుండానికి అదనంగా మరో మూడు కుండాలు ఏర్పాటుచేసి సుదర్శన నారసింహ మూలమంత్ర హవనములు నిర్వహించారు. పూర్ణాహుతి జరిపారు. సాయంత్రం హవనాది కార్యక్రమాలు కొనసాగాయి. ఉత్సవాలలో ఆలయ చైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా, ధర్మకర్తలు శ్రీనివాస్, భక్తులు హోమంలో పాల్గొని తరించారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. మల్లన్న ఆలయంలో వేలం పాటలుకొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న ఆలయంలో మంగళవారం పలు దుకాణాల నిర్వహణకు ఈఓ కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో వేలం పాటలు నిర్వహించారు. ఆలయ పరిసరాలలో పూజా సామగ్రి విక్రయించే లైసెన్సు హక్కును కొమురవెల్లికి చెందిన చిక్కుడు స్వామి దక్కించుకున్నారు. అలాగే టీటీడీ కాంప్లెక్స్లోని షాప్ నెం.15ను రూ.88వేలకు ఎల్. నరేందర్, అన్నదాన సత్రం ఎదుట ఉన్న షాప్ నెం. నాలుగును రూ.65,500 కె.మహేశ్ దక్కించు కున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓలు సుదర్శన్, శ్రీను పాల్గొన్నారు.ప్రైవేటీకరణపై నిర్ణయం తీసుకోలేదుగజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ చందన గజ్వేల్: మున్సిపాలిటీలో చెత్త సేకరణ వ్యవస్థను ప్రైవేటీకరించే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుతం పట్టణంలోని ప్రధాన రోడ్డుపై ఉన్న కమర్షియల్ దుకాణాల వద్ద మాత్రమే ట్రయల్ రన్ చేస్తున్నామని చైర్పర్సన్ గంగిశెట్టి చందన తెలిపారు. కొన్ని రోజులుగా చెత్త సేకరణపై వస్తున్న విమర్శలపై మంగళవారం స్పందించారు. మున్సిపాలిటీలో ఆర్అండ్ఆర్ కాలనీ విలీనం కావడం వల్ల గతంలో అక్కడి పంచాయతీల్లో పనిచేసిన 32మంది పారిశుద్ధ్య సిబ్బంది.. ఇక్కడికి బదిలీ అయ్యారన్నారు. దీంతో చెత్త వాహనాల డీజిల్ ఖర్చులు, సిబ్బంది వేతనాలు భారంగా మారాయన్నారు. పరిస్థితులను సమతుల్యం చేసుకోవడానికి మాత్రమే ట్రయల్ రన్ చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజల అనుమతితోనే తదుపరి చర్యలు చేపడతామని, ఈవిషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. సజ్జనార్ను కలిసిన లింగాయత్ నేతలు గజ్వేల్: పోలీస్శాఖ డీజీగా పదోన్నతి పొందిన వీసీ సజ్జనార్కు గజ్వేల్, చేర్యాల ప్రాంతాలకు చెందిన వీరశైవ లింగాయత్ సమాజం నాయకులు అభినందనలు తెలిపారు. హైదరాబాద్లో మంగళవారం ఆయనను కలుసుకొని పుష్పగుచ్ఛం అందించి సన్మానించారు. కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ నాయకులు అకుల ప్రశాంత్, కాసని వీరేశం, కొత్తపల్లి శ్యామ్కుమార్, మధుసూదన్, రమేశ్, రాకేశ్, యాదగిరి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులను ఆదుకోండిసిద్దిపేటజోన్: కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులను ఆదుకోవాలని స్వేచ్ఛ సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రెండున్నర ఏళ్లుగా ప్రభుత్వం దివ్యాంగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. దివ్యాంగుల పెన్షన్ పెంచాలని కోరారు. గతంలో అనేక సార్లు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పరిష్కారం కాలేదన్నారు. దివ్యాంగులను గుర్తించి న్యాయం చేయాలని కోరారు. -
వైద్యసేవల్లో అగ్రగామిగా నిలుపుదాం
దుబ్బాక: వైద్యసేవల్లో రాష్ట్రంలోనే గొప్ప ఆస్పత్రిగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మంగళవారం దుబ్బాక వంద పడకల ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం సూపరింటెండెంట్ హేమరాజ్సింగ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆస్పత్రిలో కంటి ఆపరేషన్లు నిర్వహించేందుకు ఎల్వీ ప్రసాద్ యాజమాన్యంతో ఎమ్మెల్యే మాట్లాడారు. అలాగే మోకాలు చిప్పల మార్పిడిపై వాటికి సంబంధించిన ఆపరేషన్ పరికరాల ఏర్పాటుపై అధికారులతో చర్చించారు. ఆసుపత్రి చుట్టూ ప్రహరీ, పోస్టు మార్టమ్ రూమ్ వరకు సీసీ రోడ్డు, డ్రైనేజీ కొత్తగా నిర్మించడం, రోగులకు అవసరమయ్యే పరికరాల కొనుగోలు తదితర విషయాలపై ప్రత్యేకంగా చర్చించారు. ఆస్పత్రిలో అన్ని రకాల ఆపరేషన్లు నిర్వహించేందుకు ప్రత్యేకంగా కృషి చేయాలన్నారు. నార్మల్ డెలవరీలను ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో చైర్పర్సన్ సంగీత, వైస్ చైర్పర్సన్ ఆస సులోచన, కౌన్సిలర్ దేవుని రాజు, డీసీహెచ్ఎస్ డాక్టర్ అన్నపూర్ణ, ఆస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ అరుణ, సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాక ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం -
సెలవుల్లో ఊరెళ్తున్నారా.. అయితే జాగ్రత్త
సీపీ రష్మీ పెరుమాళ్ సిద్దిపేటకమాన్: వేసవి సెలవుల్లో ఇంటికి తాళం వేసి ఊరెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాఠశాలలకు సెలవుల నేపథ్యంలో ఇళ్లకు తాళాలు వేసి స్వగ్రామాలకు, విహారయాత్రలకు వెళ్లేవారు ఇంటి పరిసర ప్రాంతాల్లో సీసీ కెమరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పక్కన ఉన్న వారికి సమాచారం ఇవ్వాలని సూచించారు. విలువైన బంగారు వస్తువులు, నగదు బ్యాంకు లాకర్లులో భద్రపర్చుకోవాలని తెలిపారు. ప్రయాణ వివరాలు సోషల్ మీడియాలో షేర్ చేయకూడదన్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై డయల్ 100 లేదా సంబంధిత పోలీస్స్టేషన్లో సమాచారం అందించాలని సూచించారు. పిల్లలను ఒంటరిగా ఈత కోసం చెరువులు, కుంటల, లోతైన నీరు ఉన్న ప్రాంతాలకు పంపకూడదన్నారు. చిన్నపిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. -
ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే ముఖ్యం
గజ్వేల్: ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి అన్నారు. మంగళవారం గజ్వేల్–ప్రజాపూర్ ఆర్టీసీ డిపో వద్ద కార్మికులతో కలిసి సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు, ఇతర సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని కొనియాడారు. కార్మికుల సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో గజ్వేల్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఆశోక్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి రేవంత్, పొన్నం చిత్రపటాలకు క్షీరాభిషేకం -
కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక
● నలుగురు బీఆర్ఎస్ నాయకులు ఏకగ్రీవం ● ఎమ్మెల్యే అభినందనలుదుబ్బాక: మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ల ఎన్నిక మంగళవారం ఏకగ్రీవంగా జరిగింది. చైర్పర్సన్ శ్రీరాం సంగీత ఆధ్యక్షతన జరిగిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్కు చెందిన నలుగురు కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకున్నారు. మైనార్టీ కోటాలో ఎండీ.ఖలీల్, నసీమా, పాలన అనుభవం కోటాలో ఆస యాదగిరి, గోనె దేవలక్ష్మి ఎన్నికయ్యారు. కో ఆప్షన్ సభ్యుల కోసం మొత్తం 10 నామినేషన్లు దాఖలయ్యాయి. కో ఆప్షన్ మెంబర్ల ఎన్నిక కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌన్సిల్ సమావేశానికి కాంగ్రెస్, బీజేపీకి చెందిన కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. మొత్తం కౌన్సిల్లో 20 మంది సభ్యులకు గాను బీఆర్ఎస్ చెందిన వారు 14 మంది ఉండటంతో కో ఆప్షన్ మెంబర్లను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి సూచన మేరకు ఎన్నుకున్నారు. ఎన్నికై న నలుగురు కో ఆప్షన్ మెంబర్ల చేత ఎలక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేపించారు. కో ఆప్షన్ ఎన్నిక సమావేశానికి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి హాజరై ప్రత్యేకంగా అభినందించారు. మున్సిపల్ అభివృద్ధికి భాద్యతయుతంగా పనిచేయాలని కో ఆప్షన్ మెంబర్లకు సూచించారు. -
రోడ్డెక్కిన రైతులు
గతంలో మాదిరిగానే ధాన్యం కొనాలంటూ ధర్నా సిద్దిపేటఅర్బన్: గతంలో మాదిరిగా ధాన్యాన్ని జల్లి పట్టకుండానే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. మంగళవారం సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లిలో రహదారిపై ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రం వద్ద సరైన సౌకర్యాలు లేవని మండిపడ్డారు. ధాన్యం జల్లి పట్టడానికి యంత్రాలు లేవని, గతంలో మాదిరిగానే తాలుకు తరుగు తీసి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై అధికారులను వివరణ కోరగా ధాన్యాన్ని జల్లి పట్టిన తరువాతే కొనుగోలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని అన్నారు. తాలు తీయకుండా కొనుగోలు చేసే పరిస్థితి లేదని తెలిపారు. -
చదువుతోనే ఉన్నత స్థానం
మిరుదొడ్డి(దుబ్బాక): ప్రతి విద్యార్థి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలంటే చదువొక్కటే మార్గమని కలెక్టర్ హైమావతి అన్నారు. మంగళవారం మిరుదొడ్డిలోని మోడల్ స్కూల్లో ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల వినియోగం, వాటి నివారణ చర్యలు, సైబర్ నేరాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేరీర్ గైడెన్స్ అనేది ప్రతి ఒక్కరికీ అవసరమన్నారు. విద్యారంగంతో పాటు అన్ని రంగాల్లో రాణించినప్పుడే జీవితంలో స్థిరపడటానికి అవకాశాలు వస్తాయన్నారు. జీవితంలో ఓటమి అనేది విజయానికి దారి చూపుతుందన్నారు. నిరాశపడకుండా నిబద్ధతతో పని చేస్తేనే విజయం వరించడమే కాకుండా పది మందికి ఆదర్శంగా నిలుస్తామన్నారు. కష్టాల సుడిగుండంలో పెరిగి ఉన్నత చదువులు చదివి శాస్త్రవేత్తగా ఎదిగి, అత్యున్నత రాష్ట్రపతి పదవిని చేపట్టిన డాక్టర్ అబ్దుల్ కలాంను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సెల్ఫోన్లకు దూరంగా ఉండి ఆరోగ్యం, చదువు, భద్రతపై విద్యార్థులు దృష్టి సారించాలన్నారు. విద్యార్థులకు పాజిటివ్ ఎనర్జీ రావాలంటే యోగా, ధ్యానం లాంటివి అలవాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అఽధికారి శారద, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, సీడీపీఓ రాము, తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, ఎంఈఓ ప్రవీణ్ బాబు, ఎంపీడీఓ గణేష్రెడ్డి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ అర్చన ప్రియదర్శిని, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రం సందర్శన మిరుదొడ్డి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం సందర్శించారు. పొద్దు తిరుగుడు గింజలను కొనుగోలు చేయాలని రైతులు కలెక్టర్కు మొర పెట్టుకున్నారు. కొనుగోలు కోసం రాష్ట్ర స్థాయి అధికారులతో సంప్రదించామని, వారి నుంచి అనుమతులు రాగానే కొనుగోళ్లు చేపడతామని హామీ ఇచ్చారు. కొనుగోలు కేంద్రాలలో అన్ని మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు.నీట్ పరీక్షకు ఏర్పాట్లు చేయండి సాక్షి, సిద్దిపేట: నీట్– 2026 ఆఫ్లైన్లో జరిగే పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ హైమావతి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మే 3న నీట్–2026 పరీక్ష జరుగుతుందన్నారు. జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 937 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మార్గదర్శకాల ప్రకారం సెంటర్లో సీసీ కెమెరాలు, పవర్ సప్లయ్, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని డీఎంహెచ్ఓను, సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకునేలా అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీ డీఎంను ఆదేశించారు. అలాగే రెండు సెంటర్ల చుట్టూ 144 సెక్షన్ అమలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి కలెక్టర్ హైమావతి -
ఊడేనా?
రెచ్చిపోతున్న గ్రామసింహాలు జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీలో వీధి కుక్కలుస్వైరవిహారం చేస్తున్నాయి. వివరాలు 8లో uఉండేనా..గజ్వేల్లోని ఈఎన్సీ కార్యాలయాల సముదాయం ఏడాదిగా ఈఎన్సీ పోస్టు ఖాళీ పదేళ్లపాటు అధికారంలో ఉన్న అప్పటి సీఎం కేసీఆర్ తన సొంత నియోజకవర్గం గజ్వేల్పై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో రాష్ట్రానికే నమూనాగా తీర్చిదిద్దడానికి కృషి చేశారు. ప్రత్యేకించి సాగునీటి పారుదలశాఖ(ఇరిగేషన్)కు సంబంధించి మరో అడుగు ముందుకేసి.. ఈ ప్రాంతాన్ని ఈఎన్సీ కార్యాలయంగా అప్గ్రేడ్ చేశారు. దీనివల్ల ఈ కార్యాలయం జిల్లాతోపాటు తెలంగాణలోని జనగామ, యాదాద్రి, మెదక్, మేడ్చల్ తదితర జిల్లాలకు ప్రధాన ఆధారంగా మారింది. అప్పట్లో కాళేశ్వరం ప్రాజెక్ట్లకు ఇక్కడ ఈన్ఎసీగా పనిచేసిన హరేరామ్ కీలకంగా వ్యవహరించారు. అంతేకాదు.. ఈ ప్రాంతంలో నిర్మించిన మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లను పూర్తి చేయడం, కాల్వల నిర్మాణం చేపట్టడంలో ఇక్కడి ఇరిగేషన్ శాఖ అధికారులు బిజీబిజీగా గడిపారు. ఏడాదికాలంగా మారిన సీన్.. ఏడాది కిందట ఇక్కడి ఈఎన్సీ హరేరామ్ ఏసీబీకి చిక్కారు. ఈ కేసులో అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఆయన విచారణను ఎదుర్కోవడం వల్ల.. ఇక్కడికి కొత్త ఈఎన్సీ రాలేదు. దీనివల్ల ఇక్కడ ఈఎన్సీ పోస్టు కొనసాగుతుందా? లేదా..? అనే విషయంలో స్పష్టత లేదు. ప్రస్తుతం ఇక్కడ సీఈ, ఎస్ఈతోపాటు ముగ్గురు ఈఈలు ఉండగా, డీఈ, ఏఈల పోస్టులు చాలావరకు ఖాళీలు ఉన్నాయి.ఎక్కడి పనులు అక్కడే.. గతంలో ఈఎన్సీ కార్యాలయంగా ఉన్న గజ్వేల్లో పనులకు సంబంధించిన పరిపాలన అనుమతులు, బిల్లుల చెల్లింపులు, ఇతర అంశాలు చాలా వేగంగా జరిగేవి. ప్రస్తుతం భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లకు సంబంధించిన ప్రధాన కాల్వలు, పంపిణీ కాల్వలు, ఉప కాల్వలకు సంబంధించి ఎన్నో పనులు పెండింగ్లో ఉన్నాయి. ఏళ్లతరబడి ఈ పనులన్నీ సాగకపోవడం వల్ల సాగునీటి పంపిణీ సమస్యగా మారుతోంది. జిల్లాలోనే కాదు.. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ప్రధాన కాల్వల పనులు ఏళ్లతరబడి పెండింగ్లో ఉండటం వల్ల కొన్ని జిల్లాలకు ఇంకా గోదావరి జలాలు అందలేదు. ఇకపోతే పంపిణీ కాల్వల సమస్య తీవ్రంగా ఉంది. ఉప కాల్వలకు సంబంధించిన కార్యాచరణ ముందుకుసాగకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి ఇక్కడికి ఈఎన్సీ పంపడం ద్వారా పనులు గాడిన పడేలా చేస్తుందా..? అనేది వేచి చూడాల్సిందే. -
బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత
సిద్దిపేటకమాన్: జిల్లా వ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయి. జిల్లా కేంద్రంలోని రెండు, మూడు బంకుల్లో మాత్రమే ఇంధనం ఉండడంతో వాహనదారులు గంటల తరబడి క్యూలో ఉన్నారు. దీంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా వరకు బంకులు మూతపడటంతో రైతులు, వినియోగదారులు, ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సమస్య తీవ్రంగా ఉంది. పది రోజుల క్రితమే నిర్వాహకులు డబ్బులు చెల్లించినప్పటికీ కంపెనీల నుంచి ఇంధనం సరఫరా కావడం లేదని బంకుల నిర్వాహకులు చెబుతున్నారు. -
జయంత్యుత్సవాలకు అంకురార్పణ
వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధమైన నాచగిరి లక్ష్మీ నృసింహ క్షేత్రంలో శ్రీవారి జయంత్యుత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం రాత్రి అర్చకులు పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారం గర్భగుడిలో స్వయంభూ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి విశేషాలంకృతులను చేశారు. ఆలయ ముఖమండపంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం నిర్వహించారు. రక్షాబంధనం చేసి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. స్వామివారికి నివేదన అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. వేడుకల్లో ఆలయ ఈఓ బెల్లంకొండ రంగాచారి, ధర్మకర్తలు నాయకం శ్రీనివాస్, కొత్తపల్లి శ్రీనివాస్, గాలి కిష్టయ్య, కేంద్ర జౌలి పరిశ్రమ శాఖ కమిషనర్ అరుణ్కుమార్, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.నాచగిరిలో భక్తిపారవశ్యం -
రేవంత్ పాలనలో రాష్ట్రం విధ్వంసం
గజ్వేల్: ఎన్నో బలిదానాలు, త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ నేడు సీఎం రేవంత్రెడ్డి కబంధహస్తాల్లో విధ్వంసమవుతోందని, ఈ పరిస్థితికి చరమగీతం పాడాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం గజ్వేల్లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అబద్దపు పాలనలో ప్రజలు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో అన్ని రంగాల్లో పురోగతిని సాధించిన తెలంగాణ ప్రస్తుతం అధ్వానస్థితికి చేరిపోయిందన్నారు. కేసీఆరే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని ప్రజలు మరోసారి బలంగా నమ్ముతున్నారని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గంగిశెట్టి చందన, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.జిల్లా పార్టీ కార్యాలయంలో.. సిద్దిపేటజోన్: జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శర్మ, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్లు పార్టీ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మంజుల, జెడ్పీ మాజీ చైర్పర్సన్ రోజాశర్మ, పట్టణ పార్టీ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వేణుగోపాల్రెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు ప్రభాకర్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. -
కొత్త కార్యవర్గాలను ఎన్నుకోండి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : కాంగ్రెస్ పార్టీని బూత్స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ కార్యవర్గాలు ఏర్పాటు చేయాలన్నారు. గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల క్రియాశీలక నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలువురు నాయకులతో మీనాక్షి నటరాజన్ వన్ టూ వన్గా సమావేశమయ్యారు. పార్టీలో అంతర్గతంగా కొనసాగుతున్న విషయాలను అడిగినట్లు తెలిసింది. అనంతరం మీనాక్షి మాట్లాడుతూ...బూత్, గ్రామ, మండల, బ్లాక్ జిల్లా కాంగ్రెస్ కమిటీల్లో మూడేళ్లు పూర్తయిన ప్రతీ ఒక్కరిని మార్చాలన్నారు. ప్రస్తుతం ఎన్నుకునే ఈ కమిటీ రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వరకు కొనసాగుతారని, అందుకే ఈ కార్యవర్గం ఎన్నికల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలు, నాయకులకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఆయా కార్యవర్గాలను ఎన్నుకుని వివరాలను పీసీసీకి పంపాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చేలా కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ సురేశ్ షెట్కార్, పార్టీ పార్లమెంట్ ఇన్చార్జి ప్రీతం, అహ్మదుల్లా, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి (సంగారెడ్డి), ఆంక్షారెడ్డి (సిద్దిపేట), ఆంజనేయులుగౌడ్ (మెదక్) తదితరులు పాల్గొన్నారు. -
అర్జీలు పునరావృతం కావొద్దు
● పరిష్కరించేందుకు అధికారులుచొరవచూపాలి ● కలెక్టర్ హైమావతిసిద్దిపేటరూరల్: ప్రజలు అందించే అర్జీలు పునరావృతం కాకుండా పరిష్కరించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్తో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకంతో ప్రజలు ప్రజావాణికి వస్తారన్నారు. స్వీకరించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి అర్హతల మేరకు పరిష్కరించాలన్నారు. వచ్చే ప్రజావాణి నుంచి విభాగాల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ హైమావతి తెలిపారు. పలు రకాల సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తంగా 98 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో ఆర్డీఓ నాగరాజమ్మ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. తాలు తీసాకే ధాన్యం కొనుగోలుతప్పనిసరిగా తాలు తీసిన తర్వాతే కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తారని కలెక్టర్ హైమావతి రైతులకు సూచించారు. సోమవారం రూరల్ మండలం పుల్లూరు, రాఘవపూర్, నారాయణరావుపేట మండలం బంజేరుపల్లిలో వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తేమ శాతం వచ్చే వరకు వ్యవసాయ క్షేత్రాల వద్దనే ఆరబెట్టుకోవాలన్నారు. తాలు తీసాకే ధాన్యానికి గ్రేడ్ ఇవ్వాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ధాన్యం దిగుమతిలో జాప్యం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లోనూ మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. -
కులవృత్తులను కూల్చకండి
కలెక్టరేట్ ఎదుట వడ్డెర సంఘం నాయకుల నిరసనసిద్దిపేటరూరల్: వడ్డెర కులవృత్తిని అడ్డుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని వడ్డెర జాతీయ అధ్యక్షుడు పిట్ల శ్రీధర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు వడ్డెర సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్గల్ మండలం జబ్బాపూర్ గ్రామంలో సుమారు 60 వడ్డెర కుటుంబాలు 70 ఏళ్లుగా కులవృత్తిని నమ్ముకుని బండరాయి పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు. కొంతమంది రియల్ఎస్టేట్, రాజకీయ నాయకులు తమ పలుకుబడితో బండరాయి పనులు చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దీంతో పేద కుటుంబాలైన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ రోడ్డున పడే పరిస్థితి నెలకొందన్నారు. వెంటనే అధికారులు చొరవ తీసుకుని వడ్డెకుటుంబాలకు వెంటనే న్యాయం చేసి, బండప్రాంతాలపై హక్కులు కల్పించాలన్నారు. వారికి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. కార్యక్రమంలో వడ్డెర సంఘం రాష్ట్ర నాయకుడు తిరుపతి, జిల్లా ఇన్చార్జి అధ్యక్షుడు స్వామి, రమేశ్, కనకయ్య, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
నంగునూరు(సిద్దిపేట): జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ చొరవతో కాలువ పూర్తి కావడంతో వాగవతలి గ్రామాలకు సాగునీరు అందుతోందని ఏఎంసీ చైర్మన్ యాదగిరి అన్నారు. సోమవారం ఘణపూర్ పంప్హౌస్ వద్ద ప్రత్యేక పూజలు చేసి మంత్రి వివేక్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. అనంతరం యాదగిరి మాట్లాడుతూ తొమ్మిది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో పంప్హౌస్ పూర్తి చేయకపోవడంతో రైతులు ఇబ్బంది పడ్డారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచిపోయిన పనులు పూర్తి చేసిందన్నారు. కార్యక్రమంలో సత్తయ్య, వెంకట్రెడ్డి, శ్రీకాంత్, రాములు, రవి, రమేశ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా ఎల్లమ్మ ఉత్సవాలు
చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని అల్లీపూర్ రేణుకా ఎల్లమ్మ దేవాలయ వార్షికోత్సవాలు సోమవారం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమం నిర్వహించారు. పుట్టకు పూజలు చేయడంతో పాటు మహిళలు బోనాలు తీశారు. అలాగే ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ‘గేట్’కు ఉచిత కోచింగ్ హుస్నాబాద్: శాతవాహన యూనివర్సిటీ హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్)పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎక్స్–ఐఈఎస్ (ఆల్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్) అభ్యర్థి చింతల రమేశ్ ఉపన్యసించారు. వచ్చే నెల ఒకటి నుంచి గేట్కు ఉచిత కోచింగ్ తరగతులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. గేట్ సిద్ధత, సబ్జెక్ట్ ప్రణాళిక, సమయ నిర్వాహణతో పాటు ఉన్నత విద్య, ఉద్యోగ పరిశోధన అవకాశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ తిరుపతిరెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర వర్గల్(గజ్వేల్): రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని వంటిమామిడి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాగనోల్ల విజయ అన్నారు. సోమవారం పీఏసీఎస్ పర్సన్ ఇంచార్జి శ్రీనివాస్రెడ్డి, సెక్రటరీ జితేందర్రెడ్డితో కలిసి ఆమె వర్గల్ మండలం తున్కిఖాల్సా, వేలూరు, నాచారం, మజీద్పల్లి, మైలారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు దళారుల బారిన పడొద్దన్నారు. సన్నధాన్యానికి ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తుందని గుర్తుచేశారు. కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. పెండింగ్ బకాయిలివ్వండి ఏబీవీపీ నాయకుల నిరాహార దీక్ష సిద్దిపేటకమాన్: విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో సిద్దిపేట బస్టాండ్లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, బస్టాండ్ వద్ద సోమవారం నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందన్నారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా ఏడాదికి సుమారు 14లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద మధ్యతరగతి విద్యార్థులు పలు కోర్సుల్లో చదువుకుంటున్నారని తెలిపారు. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలన్నారు. విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడుతామన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు విజయ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. కోర్టు కార్యాలయం తరలింపు గజ్వేల్రూరల్: పట్టణంలో ప్రస్తుతం ఉన్న జూనియర్ సివిల్ జడ్జీ కోర్టు కార్యాలయాన్ని తరలించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణంలో శాశ్వత కోర్టు భవన నిర్మాణం పూర్తయ్యే వరకు ఐవోసీ (ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్)లోగల బ్లాక్ – ఏలో తాత్కాలికంగా కోర్టు కార్యాలయం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ హైమావతి గజ్వేల్ ఆర్డీఓను ఆదేశించారు. -
చెత్త సేకరణను ప్రైవేటీకరిస్తే సహించం
గజ్వేల్: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో చెత్త సేకరణను ప్రైవేటీకరిస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని కాంగ్రెస్ కౌన్సిలర్లు నాయిని సత్యలక్ష్మి, గుంటుకు లక్ష్మీ, సంతోషి, రమేష్, ఉపేందర్రెడ్డి, నర్సింహారెడ్డి హెచ్చరించారు. సోమవారం గజ్వేల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ చెత్త సేకరణ పేరుతో ప్రజలపై అదనపు భారం మోపాలని చూడడం ఎంతవరకు సమంజసమన్నారు. మెరుగైన పాలన అందించాల్సింది పోయి ఈ విధానం సరికాదని హెచ్చరించారు. ఇప్పటికై నా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిలర్ల హెచ్చరిక -
మనవళ్లతో ఆడుకోవాల్సిన వయసులో.. గర్భం దాల్చింది
సిద్దిపేట జిల్లా: శిశువు మరణానికి కారణమైన దంపతులతో పాటు వారికి సహకరించిన ఆర్ఎంపీని రిమాండ్కు పంపించారు. శనివారం హుస్నాబాద్ ఏసీపీ సదానందం, సీఐ శ్రీను కేసు వివరాలు వెల్లడించారు. 2025, జులై 29న మండల పరిధిలోని కేశనాయక్ తండా శివారులోని వాగులో గుర్తు తెలియని పసికందు శవం నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చిందని పంచాయతీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అక్కన్నపేట ఎస్ఐ సీహెచ్ ప్రశాంత్, హుస్నాబాద్ సీఐ శ్రీను విచారణ చేపట్టారు. తండాకు చెందిన బానోతు లక్ష్మికి లేటు వయస్సులో ప్రెగ్నెన్సీ రాగా అప్పటికే ఆమె కూతుర్లకు పెళ్లి కావడంతో విషయం బయటకు తెలిస్తే పరువుపోతుందనే భయంతో దంపతులు ఎవరికి తెలియకుండా అబార్షన్ చేసుకోవాలనుకున్నారు. అయితే కుందానవానిపల్లికి చెందిన ఆర్ఎంపీ వంశీ సహకారంతో అబార్షన్ టాబ్లెట్స్ వేసుకోగా బతికి ఉన్న శిశువు జన్మించింది. కాగా గ్రామంలో తెలిస్తే పరువుపోతుందనే భయంతో శిశువును ఎవరికి తెలియకుండా రహస్యంగా చంపాలని నిర్ణయించుకున్నారు. దీంతో వారి ఇంటి సమీపంలోని కాలువలో పడేయగా శిశువు నీటి ప్రవాహంలో మునిగి చనిపోయినట్టు విచారణలో నిర్దారణ అయిందని తెలిపారు. ఈ కేసులో చనిపోయిన శిశువు మరణానికి కారణమైన తల్లిదండ్రులు బానోతు లక్ష్మి, రాజు, ఆర్ఎంపీ వంశీలను అరెస్ట్ చేశారు. -
‘కో–ఆప్షన్’పై ఉత్కంఠ
గజ్వేల్: ‘కో–ఆప్షన్’ సభ్యుల ఎన్నికపై గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఉత్కంఠ నెలకొంది. నాలుగు కో–ఆప్షన్ స్థానాలు ఉండగా, ఇందులో మైనార్టీలకు రెండు(మహిళ, జనరల్), మాజీ ప్రజాప్రతినిధులు, ఇతర కోటా నుంచి రెండు స్థానాలు(మహిళా, జనరల్) కేటాయించిన సంగతి తెల్సిందే. ఈ పదవులకు 40మంది దరఖాస్తు చేస్తున్నారు. నిజానికి ఈ ఎన్నిక ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది. కానీ కమిషనర్ సెలవులో ఉన్న కారణంగా.. దరఖాస్తుల స్క్రూటీని చేయలేదు. ఎన్నికకు సంబంధించి తేదీ నిర్ణయం జరగలేదు. ఒకటిరెండ్రోజుల్లో కమిషనర్ విధుల్లో చేరే అవకాశం ఉండగా, స్క్రూటీని ప్రక్రియ పూర్తి చేసి ఎన్నికకు రంగం సిద్ధం చేయనున్నారు. బీఆర్ఎస్లో కసరత్తు మున్సిపాలిటీని కై వసం చేసుకున్న బీఆర్ఎస్.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే మాజీ మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డిలు అభ్యర్థుల ఎంపికపై సమాలోచనలు జరుపుతున్నారు. మున్సిపల్ చైర్పర్సన్, వైస్చైర్పర్సన్తోపాటు పార్టీ ముఖ్యనేతల అభిప్రాయాలను తీసుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేక సమావేశాలు సైతం నిర్వహిస్తున్నారు. గత పాలకవర్గంలో ‘సీల్డ్ కవర్’ పంపిన తర్వాత కూడా.. చివరి క్షణంలో కొత్త వ్యక్తులను తెరపైకి తీసుకొచ్చి ఎన్నిక చేశారు. ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా బీఆర్ఎస్ జాగ్రత్త పడుతోంది. కాకపోతే ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల ఎంపిక పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. అభ్యర్థుల ప్రాధాన్యతల మేరకు ఎంపిక ప్రక్రియ జరగనుందని తెలుస్తోంది. పోటీలో కాంగ్రెస్ నేతలు... కో–ఆప్షన్ పదవుల కోసం కాంగ్రెస్కు చెందిన నేతలు సైతం పోటీలో ఉండటం చర్చనీయాంశంగా మారింది. మున్సిపాలిటీలోని 20కౌన్సిలర్ స్థానాల్లో 11మంది బీఆర్ఎస్, ఒకరు ఇండిపెండెంట్, ఏడుగురు కాంగ్రెస్, మరొకరు బీజేపీ కౌన్సిలర్ ఉన్న తెల్సిందే. ఇండిపెండెంట్ కౌన్సిలర్ సైతం బీఆర్ఎస్కు మద్దతు పలకడంతో వారి సంఖ్య 12కు చేరింది. ఈ క్రమంలో ‘కో–ఆప్షన్’ సభ్యుల ఎన్నికకు చేతులెత్తే విధానంలో అభ్యర్థులకు మద్దతు పలకాల్సి ఉంటుంది.ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరం మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు, సీనియర్ నాయకులు ఎలాగైనా ‘కో–అప్షన్’ పదవులు సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. కొందరు పట్టణంలో తమ రాజకీయ ఉనికికి పరీక్షలా భావించి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తాము అభ్యర్థుల గెలుపునకు పనిచేశామని.. బీఆర్ఎస్ అధిష్టానం తమను గుర్తించాలని నేతల చుట్టూ ఆశావహులు ప్రదక్షిణలు చేస్తున్నారు. కొందరు నేతలు ఖర్చుకు సైతం సిద్ధమవుతుండటం గమనార్హం.పోటీలో 40మంది ఆశావహులు నేటికీ పూర్తికాని దరఖాస్తుల స్క్రూటీని ఎన్నికకు తేదీ నిర్ణయంలో జాప్యం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో పరిస్థితి -
కంట తడి
చివరికి..సాగునీరు అందక ఎండుతున్న పంటలుమొరాయిస్తున్న మోటార్లు నెల రోజుల వరకు నిండుగా పోసిన బోరుబావులు ఇప్పుడు మొరాయిస్తున్నాయి. నీటి ఊటలేక ఉపయోగం లేకుండా పోయాయి. కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా సైతం సమస్యగా మారింది. అర ఎకరా, ఎకరా సాగుచేయడమే గగనంగా మారింది. చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. పడిపోతున్న భూగర్భ జలాలు గింజలు గట్టిపడుతున్న వేళఅందని నీరు ఆరు మండలాల్లో 15 మీటర్ల లోతులో జలం నీటి కోసం రైతుల భగీరథ ప్రయత్నం -
స్వీయగణనలో భాగస్వాములు కండి..
దుబ్బాక: స్వీయగణనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ కమిషనర్ రమేశ్కుమార్అన్నారు. జనగణనలో భాగంగా ఆదివారం చైర్పర్సన్ శ్రీరాం సంగీత స్వీయగణనలో తమ వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభా లెక్కల్లో భాగంగా స్వీయగణనలో తొలిరోజునే కౌన్సిలర్లు ఆన్లైన్లో నమోదు చేసుకున్నారన్నారు. ఫుట్బాల్ పోటీల్లో రాణించాలిగజ్వేల్రూరల్: రాష్ట్రస్థాయిలో జరుగుతున్న ఫుట్బాల్ పోటీల్లో రాణించి మంచి పేరు తీసుకురావాలని జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గణేశ్ అన్నారు. రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టుకు ఆదివారం గజ్వేల్లో జెర్సీలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 27 నుంచి 29 వరకు మంచిర్యాల జిల్లా రామకిష్టాపూర్ టాగోర్ ఫుట్బాల్ స్టేడియంలో రాష్ట్రస్థాయి జూనియర్స్ బాలికల ఫుట్బాల్ పోటీలు జరుగనున్నాయని తెలిపారు. రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారులు అద్భుతంగా రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎన్ఐఎస్ కోచ్ నరసింహ, జీఎఫ్సీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యంపై దృష్టిసారించాలి మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి హుస్నాబాద్: పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే పట్టణ ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చైర్పర్సన్, కౌన్సిలర్లు యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు. తినే ఆహారంలో పప్పు దినుసులు, ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, కార్మికులు పాల్గొన్నారు. మహనీయులను మరవొద్దు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య మిరుదొడ్డి(దుబ్బాక): ఆర్థిక, స్వేచ్ఛా సమానత్వం కోసం పోరాడిన మహనీయులను మరవొద్దని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. ఈ నెల 30న దుబ్బాక మండలం చీకోడ్ గ్రామంలో నిర్వహించే మహనీయుల ఉత్సవ సభ కరపత్రాలను ఆదివారం అక్బర్పేట–భూంపల్లి మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన మహనీయులను గుర్తు చేసుకోవడం శుభపరిణామమన్నారు. మహనీయులు కలలుగన్న ఆశయాలను నిజం చేయడానికి ప్రతి ఒక్కరూ పాటు పడాలని కోరారు. మహనీయుల జీవిత చరిత్రను తెలుసుకోవడానికి చీకోడ్లో చేపట్టిన బృహత్ కార్యక్రమానికి కవులు, కళాకారులు, మేధావులు, కార్మిక కర్షకులు అభిమానులు అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తిమ్మాపూర్ సర్పంచ్ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ ఆస యాదగిరి, మాజీ సర్పంచ్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఎర్లీబర్డ్.. ఎగిరిపోతది!
సిద్దిపేటజోన్: జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లో అమలవుతున్న ఎర్లీబర్డ్ పథకం ఆఫర్ గడువు ముంచుకొస్తోంది. 2026–27 ఆర్థిక సంవత్సర ఆస్తిపన్ను ఒకేసారి చెల్లిస్తే ప్రభుత్వం ఐదు శాతం రాయితీ ఇస్తోంది. ఇది వరకు బకాయిలు లేని వారు ఈ పథకానికి అర్హులు. ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లించి రాయితీ పొందాలనే వారికి మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉంది. ఐదు మున్సిపాలిటీల్లోని 69,709 నివాస గృహాలకు గాను కేవలం 8,705మంది మాత్రమే వినియోగించుకున్నారు. 26 రోజుల్లో.. జిల్లా వ్యాప్తంగా రూ.35.12కోట్ల లక్ష్యానికి ఎర్లీబర్డ్ పథకం కింద 26 రోజుల్లో రూ.4.96 కోట్ల వసూలుతో 14.29శాతం నమోదు అయింది. జిల్లాలో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీలు ఉన్నాయి. గత ఏడాది నిర్దేశించిన ఆస్తిపన్ను వసూలు లక్ష్యం అనంతరం ఈ ఆర్థిక సంవత్సర ఆస్తిపన్నుపై ప్రభుత్వం దృష్టి సారించింది. అందుకు అనుగుణంగానే ఒకేసారి ముందస్తు ఆస్తిపన్ను చెల్లించే వారికి 2026–27 ఆర్థిక సంవత్సర పన్నులో ఐదు శాతం రాయితీ ప్రకటించింది. ఈ మేరకు ఆయా మున్సిపాలిటీల్లో హోర్డింగ్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. ప్రజల్లోనూ చైతన్యం తెచ్చారు. గత ఏడాది ఎలాంటి ఆస్తిపన్ను బకాయిలు లేని వారికి ఈ పథకం కల్పించారు. మరోవైపు ఆర్థిక ఆస్తిపన్ను లక్ష్యం అధిగమించేందుకు ఎర్లీబర్డ్ పథకం బల్దియాలకు ఎంతో ఉపయోగం కానుందని ప్రభుత్వం సంకల్పించింది. సిద్దిపేట మున్సిపాలిటీలో అత్యధికంగా రూ.3.82కోట్లు ఎర్లీబర్డ్ పథకం కింద ఆస్తిపన్ను చెల్లించగా, అత్యల్పంగా చేర్యాలలో కేవలం రూ.12లక్షలే వసూలయ్యాయి. ఆఫర్ మరో నాలుగు రోజులే ఇప్పటివరకు రూ.4.96 కోట్లు వసూలు సద్వినియోగం చేసుకున్నది8,705 మందే అత్యధికంగా సిద్దిపేట.. అత్యల్పం చేర్యాల -
సోమవారం శ్రీ 27 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
రైతుల కష్టం ఎండలకు ఆవిరైపోతోంది.. సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. పలు చోట్ల కుంటలు, చెరువులలో నీళ్లు లేక నోళ్లు తెరుచుకున్నాయి. బోరు బావులన్నీ భోరుమంటున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. యాసంగి పంటలకు తడి అందక రైతులకు గుండె తడే మిలిగిస్తున్నది. మూడు తడులు పారిస్తే చేతికొస్తదనుకున్న పంటల కోసం తిప్పలపడుతున్నారు. ఎలాగైనా పంటను కాపాడుకోవాలని రైతులు నీటి కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. ట్యాంకర్లు, చెరువులు, ఇతర బావుల నుంచి నీటిని తరలించి పంటలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. – సాక్షి , సిద్దిపేట -
భక్తుల సందడి
మల్లన్న ఆలయంలో భక్తుల సందడిమల్లన్న ఆలయంలోస్వామివారి రాజగోపురం ఎదుట భక్తులసందడి కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆలయ పరిసరాలన్నీ మల్లన్న నామస్మరణతో మారుమోగాయి. ఆదివారం వేకువజామునే పుష్కరిణిలో స్నానమాచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. కొంత మంది భక్తులు గంగిరేణి చెట్టు వద్ద పట్నాలు వేసి, ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఏర్పాట్లను ఆలయ అధికారులు పర్యవేక్షించారు. -
‘బంధం’ మరమ్మతులకు మోక్షం
వర్గల్(గజ్వేల్): ‘సాక్షి’ కథనానికి స్పందన లభించింది. అయిదేళ్ల నిరీక్షణకు తెరపడింది. భారీ జలాశయం ‘బంధం’ చెరువు మరమ్మతులకు మోక్షం లభించింది. రైతుల్లో ఆనందం వెల్లువెత్తుతోంది. కొండపోచమ్మ సాగర్ జలాలను హల్దీవాగులోకి తరలించే కీలక ఫీడర్ చానల్గా ప్రాధాన్యత కలిగిన చౌదరిపల్లి ‘బంధం’ చెరువు దుస్థితి వెల్లడిస్తూ ఈ నెల 21న ‘బంధం..బలహీనం’ శీర్షికతో ‘సాక్షి’లో ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం విదితమే. ఈ మేరకు స్పందించిన అధికారులు ఆదివారం చెరువు మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. చెరువులో నీళ్లు అడుగంటిపోగా, కట్టవైపు మరమ్మతు పనులకు అవరోధం కలగకుండా మిగతా నీరు వెళ్లిపోయేలా ‘ట్రెంచ్’ (కాలువ) తవ్వారు. కట్టమీద చెట్ల తొలగింపు పనులు వేగవంతం చేశారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ విభాగం కార్యనిర్వాహక ఇంజనీర్ మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరగా ‘బంధం’ చెరువు మరమ్మతులు పూర్తి చేస్తామన్నారు. -
జిల్లాలో ఇంధన కొరత తీవ్రరూపం దాల్చింది. నాలుగైదు రోజులుగా పెట్రోల్, డీజిల్ దొరకడం లేదు. దీంతో చాలా వరకు బంకులు మూతపడగా.. రైతులు, వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. – దుబ్బాక
జిల్లాలో గత మూడు రోజులుగా ఇంధన కొరత వేధిస్తోంది. మొత్తం 180కి పైగా పెట్రోల్ బంకులు ఉండగా, సగానికి పైగా బంకుల్లో కొరత ఏర్పడింది. వారం క్రితమే డబ్బులు కట్టినప్పటికీ, కంపెనీల నుంచి బంకులకు ఇంధనం సరఫరా కావడం లేదంటూ బంకుల యజమానులు చెబుతున్నారు. దుబ్బాక పట్టణంతో పాటు శివారులో 7 పెట్రోల్ బంకులుండగా, ఐదు పెట్రోల్ బంకుల్లో మూడు రోజులుగా, మిగితా రెండు బంకుల్లో శనివారం మధ్యాహ్నం వరకే పెట్రోల్, డీజిల్ అయిపోయింది. దీంతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల, మిరుదొడ్డి, చిన్నకోడూర్, నంగునూర్, భూంపల్లి, దౌల్తాబాద్, రాయపోల్, వర్గల్, జగదేవ్పూర్ మండలాల్లో సైతం కొరత తీవ్రంగా ఉంది. సరిగ్గా వరి కోతల సమయంలోనే సమస్య ఉత్పన్నం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం, సంబంధిత కంపెనీలు స్పందించి ఇంధన కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.వరి కోతల వేళఇంధన కొరత నాలుగైదు రోజులుగా బంకుల మూత ఇబ్బంది పడుతున్న వినియోగదారులు -
కిచెన్ గార్డెన్లు తప్పనిసరి
రామాయంపేట(మెదక్): అంగన్వాడీల్లో కిచెన్ గార్డెన్లు తప్పనిసరని, ఏర్పాటు చేయని టీచర్లపై చర్యలు తీసుకుంటామని మెదక్ ఎంపీ రఘునందన్రావు హెచ్చరించారు. శనివారం పట్టణంలోని ఐసీడీఎస్ సెక్టార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషణ్ పక్వాడ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అంగన్వాడీల్లో సాధ్యమైనంత మేర ప్లాస్టిక్ను నిషేధించాలని సూచించారు. చిన్నారులను సెల్ఫోన్లకు దూరంగా ఉంచాలన్నారు. ఈసందర్భంగా ఎంపీ అంగన్వాడీ టీచర్లకు సెల్ఫోన్లు అందజేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసాపత్రాలు అందజేఽశారు. ఎంపీ వెళ్లిపోయిన అనంతరం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఐసీడీఎస్ ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. చిన్నారులకు గ్యాడ్యుయేషన్ సర్టిఫికెట్లు అందజేసి మోడల్స్ బహుకరించారు. కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు నరేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్, సంఘం మండలశాఖ అధ్యక్షుడు ప్రభాకర్, సీడీపీఓ స్వరూప, ఆయా గ్రామాల సర్పంచ్లు, అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.ఎంపీ రఘునందన్రావు -
నియోజకవర్గానికో ‘ఏటీసీ’
నర్సాపూర్ రూరల్: ప్రతి నియోజకవర్గ కేంద్రంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభిస్తామని మంత్రి వివేక్ తెలిపారు. శనివారం మండలంలోని నారాయణపూర్లో ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విద్యార్థులు ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే స్కిల్స్ అవసరం అన్నారు. అందుకే ఏటీసీ సెంటర్లు ఏర్పాటుచేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్రతి ఒక్కరిని బడిలో చేర్పించి చదివించాలని గ్రామస్తులకు సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమాసింగ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నియోజకవర్గ ఇన్చార్జి రాజిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్గుప్తా, సర్పంచ్ దేవిసింగ్, ఎంఈఓ తారాసింగ్, హెచ్ఎం రవి తదితరులు పాల్గొన్నారు. ఆరు గ్యారంటీలు అమలు నర్సాపూర్: తమ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేస్తుందని మంత్రి వివేక్ చెప్పారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలో నగరాభివృద్ధి పథకం కింద రూ. 15 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. గత ప్రభుత్వం పదేళ్లలో రూ. 8 లక్షల కోట్ల అప్పు చేసిందని, వాటికి వడ్డీలు చెల్లించడం తమకు భారంగా తయారైందన్నారు. అనంతరం ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ.. ఆడపిల్లల తల్లిదండ్రులకు భారం కావొద్దని మాజీ సీఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి పథకం అమలు చేసి అండగా నిలిచారని అన్నారు. పట్టణంలో పెండింగ్లో ఉన్న పలు పనులను నిధులు విడుదల చేయాలని మంత్రిని కోరారు. -
ఉపాధి పనులకు రండి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఉపాధిహామీ కూలీల హాజరు శాతం గణనీయంగా పెంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం ఆశాఖ అధికారులకు లక్ష్యాలను నిర్దేశించింది. ఉపాధిహామీ పథకంలో చేపట్టిన ఈ పనులకు ఎక్కువమందిని తీసుకురావాలని క్షేత్రస్థాయిలో పనిచేసే మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ దిశగా ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీడీఓలు, మండలస్థాయిలో పనిచేసే ఉపాధిహామీ ఏపీఎంలను ఆదేశించింది. దీంతో సంబంధిత అధికారులు గ్రామాల వారీగా సమీక్షలు చేస్తున్నారు. మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు వంటి క్షేత్రస్థాయి సిబ్బందితో టెలీకాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారు. చిన్న గ్రామమైతే కనీసం 100 మంది కూలీలు, పెద్ద గ్రామ పంచాయతీల్లో 200లకు మించి కూలీల హాజరు సంఖ్య ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. కీలక మార్పుల నేపథ్యంలో.. నిరుపేద వ్యవసాయ కూలీల వలసలను నివారించేందుకు స్థానికంగా పని కల్పించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఈ పథకం పేరును వీబీజీరాంజీగా మార్చుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఇందులోభాగంగా కీలక మార్పులు చేసింది. మరో రెండు, మూడు నెలల్లో కీలక మార్పులు అమల్లోకి రానున్న నేపథ్యంలో కూలీల సంఖ్యను వీలైనంత ఎక్కువగా పెంచి పనులు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎండల తీవ్రత, వ్యవసాయ పనులు.. కూలీల హాజరు తక్కువగా ఉండటానికి ప్రధానంగా ఎండల తీవ్రతే కారణం. గత పక్షం రోజులు ఎండలు మండిపోతున్నాయి. కొన్నిచోట్ల 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఈ పనులు చేస్తున్న కూలీలు అల్లాడిపోతున్నారు. దీంతో కూలీల సంఖ్య తక్కువ నమోదవుతోంది. మరోవైపు వ్యవసాయ పనుల్లో కూలీలు నిమగ్నమయ్యారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్, మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట వంటి ప్రాంతాల్లో జొన్న పంట కోతలు కొనసాగుతున్నాయి. మెదక్, సిద్దిపేట జిల్లాల్లో వరి కోత దశకు చేరుకుంటోంది. దీంతో కూలీలు వ్యవసాయ పనులకు వెళ్తుండటంతో హాజరు అనుకున్నంత మేరకు నమోదు కావడం లేదు.జిల్లాల వారీగా టార్గెట్లు ఇలా.. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 3.75 లక్షలమంది ఉపాధిహామీ కూలీలున్నారు. వీరికి 2.09 లక్షల జాబ్కార్డులున్నాయి. ఇందులో 1.85 లక్షలమంది కూలీలు మాత్రమే పనులు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతీరోజు సుమారు 27,450 మంది కూలీలు ఈ పనులకు హాజరవుతున్నారు. ఈ సంఖ్యను ప్రతీరోజు 40 వేలకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు. సిద్దిపేట జిల్లాలో 3.84 లక్షలమంది కూలీలుండగా, 1.95 లక్షల జాబ్కార్డులున్నాయి. వీరిలో 1.86 లక్షలమంది కూలీలు ఉపాధిహామీ పనులు చేస్తారు. ఇందులో ప్రస్తుతం రోజుకు 32,790 మంది కూలీలు ఉపాధి పనులకు వస్తున్నారు. ఈ సంఖ్యను 47,500లకు పెంచాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మెదక్ జిల్లాకు సంబంధించి 3.24 లక్షల మంది కూలీలుండగా, 1.63 లక్షల జాబ్కార్డులున్నాయి. ఇందులో 1.89 లక్షలమంది ఉపాధిహామీ పనులు చేస్తారు. ప్రస్తుతం రోజుకు 33,110 మంది కూలీలు పనులకు వస్తే..ఈ సంఖ్యను 42,800లకు పెంచాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి.ఈజీఎస్ కూలీల హాజరు పెంచేందుకు టార్గెట్లు గ్రామాల వారీగా మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లతో సమీక్షలు వీబీజీరాంజీగా పేరు మార్పు నేపథ్యంలో కీలక నిర్ణయాలు -
చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
దుబ్బాక: గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. శనివారం దుబ్బాక ఐసీడీఎస్ కార్యాలయంలో ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ టీచర్లకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలపై ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలకు భవనాలు లేవని వెంటనే స్థలాలు కేటాయించి నిర్మాణాలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చూడాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరాం సంగీల, వైస్ చైర్పర్సన్ సులోచన, కౌన్సిలర్లు, సీడీపీఓ ఎల్లయ్య, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి -
వరికోతలు నిలిచిపోయాయి
గత నాలుగు రోజులుగా డీజిల్ దొరకక హార్వెసర్లు, ట్రాక్టర్లు నడవడం లేవు. వరికోతలు ఆగిపోయాయి. నా ట్రాక్టర్లో రెండు రోజుల క్రితమే డీజిల్ అయిపోవడంతో పొలం వద్దే ఆగిపోయింది. క్యాన్లు పట్టుకొని రోజు బంకుల చుట్టూ తిరుగుతున్నా. ఇంధనం ఎప్పుడు వస్తదో వరి కోతలు ఎప్పుడు కోయాలో అర్థం కావడం లేదు. – భూపతిరెడ్డి, రైతు, దుబ్బాక ఇబ్బందిగా మారింది పెట్రోల్, డీజిల్ కొరతతో తమకు చాలా ఇబ్బంది తయారైంది. డబ్బులు కట్టి వారం రోజులు అవుతున్నా ఇంధనం సరఫరా కావడం లేదు. చాలా బంకులు ఖాళీగానే ఉన్నాయి. వినియోగదారులకు సమాధానం చెప్పలేకపోతున్నాం. వరికోతల సమయంలో కొరత ఏర్పడడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. – సురేశ్, జిల్లా పెట్రోల్ బంకుల ఓనర్ల సంఘం ప్రెసిడెంట్ -
కోర్టుల ద్వారానే కేసుల పరిష్కారం
సంగారెడ్డి టౌన్: కోర్టుల ద్వారానే కేసులు చట్టపరంగా పరిష్కారమవుతాయని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నంద, జస్టిస్ అనిల్కుమార్ పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కోర్టులో ఫస్ట్ క్లాస్ కోర్టును శనివారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...వివాదాలు ఉన్న వారు కోర్టులను సద్వినియోగం చేసుకుని సమస్యల్ని పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర, ఎస్పీ పరితోశ్ పంకజ్, కోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నంద, జస్టిస్ అనిల్కుమార్ -
జాబ్ మేళాకు అనూహ్య స్పందన
సిద్దిపేటకమాన్: సిద్దిపేట పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో శనివారం నిర్వహించిన పోలీస్ ఉద్యోగ మిత్ర మెగా జాబ్ మేళాకు అనూహ్య స్పందన లభించినట్లు సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. జాబ్ మేళాలో 65 ప్రముఖ కంపెనీలు పాల్గొని వివిధ రంగాల్లో అభ్యర్థులకు ఎంపిక చేశారన్నారు. మొత్తం 2 వేల మంది అభ్యర్థులు హాజరు కాగా, ఇంటర్వ్యూ అనంతరం 624 మందిని ఎంపిక అయినట్లు చెప్పారు. కాగా జాబ్మేళాలో మహిళా అభ్యర్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని విశాఖపట్టణం నుంచి ఆరుగురు అభ్యర్థులు వచ్చారు. వారిని గుర్తించిన గౌరారం ఎస్ఐ కరు ణాకర్రెడ్డి ప్రత్యేక చొరవతో ఫార్మా కంపెనీ విభాగంలో ఇంటర్వ్యూకు పంపించగా, వారు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అనంతరం అభ్యర్థులకు సీపీ నియామక పత్రాలు అందజేశారు. పోలీస్శాఖ శాంతి భద్రతల పరిరక్షణతో పాటు సమాజ శ్రేయస్సులో భాగస్వామ్యం వహించడం తమ కర్తవ్యమన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, ట్రైనీ ఐపీఎస్ ఆయేషా ఫాతిమా, ఏసీపీలు రవీందర్రెడ్డి, సుమన్కుమార్, సీఐలు లక్ష్మీబాబు, వాసుదేవరావు, ఉపేందర్, లతీఫ్, ప్రవీణ్కుమార్, ఎస్ఐలు, పలు కంపెనీల హెచ్ఆర్లు తదితరులు పాల్గొన్నారు.వివిధ ఉద్యోగాలకు 624 మంది ఎంపిక -
స్వీయ గణనలో పాల్గొనండి
సిద్దిపేటరూరల్: జనగణన కార్యక్రమంలో భాగంగా ఈనెల 26 నుంచి నిర్వహించనున్న స్వీయ గణనలో ప్రజలు పాల్గొనాలని కలెక్టర్ హైమావతి పిలుపునిచ్చారు. వెబ్ పోర్టల్ https://se.censesgov.in/ సంప్రదించి ఇళ్లు, కుటుంబ సభ్యుల వివరాలు స్వయంగా నమోదు చేసుకోవచ్చని సూచించారు. మే 11 తర్వాత ఇంటికి వచ్చే జనగణన అధికారులకు చూపిస్తే ధృవీకరిస్తారని తెలిపారు. ఇదే విషయమై తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ జూమ్ మీటింగ్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీ, జడ్జి, ఎమ్మెల్సీలకు ముందస్తు సమాచారం అందించి, వారి స్వగృహంలో స్వీయ గణన, జియో ట్యాగింగ్ ప్రక్రియను ఎన్యూమరేటర్లు చేయించాలన్నారు. ఇప్పటికే రెండు గ్రూపులకు శిక్షణ అందించామన్నారు. రోజువారీగా ఇచ్చిన టార్గెట్ ఆధారంగా ఈనెల 30 వరకు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్ఓ నాగరాజమ్మ, జెడ్పీ సీఈఓ రమేశ్, డీపీఓ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ హైమావతి -
కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా మహిపాల్రెడ్డి
బెజ్జంకి(సిద్దిపేట): కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా మండలంలోని దేవక్కపల్లెకు చెందిన కరివేద మహి పాల్రెడ్డిని నియామకం అయ్యారు. ఈమేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈసందర్భంగా మహిపాల్రెడ్డి మాట్లాడుతూ.. రెండోసారి రాష్ట్ర కార్యదర్శిగా అవకాశం కల్పించడంపై సంతోషం వ్యక్తం చేశారు. తన నియామకానికి సహకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్, స్టేట్ చీఫ్ రామచంద్రారావుకు కృతజ్ఞతలు తెలిపారు. అవగాహనతోనే మలేరియా అంతం సిద్దిపేటకమాన్: అవగాహనతోనే మలేరియా ను అంతం చేయవచ్చని డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ అన్నారు. ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవం సందర్భంగా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో పట్టణంలో శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సరైన సమయంలో పరీక్షలు చేయించుకొని వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోవాలన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో మలేరియాకు ఉచిత చికిత్స అందుబాటులో ఉందని తెలిపారు. వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగహన కల్పించాలన్నారు. ప్రతి మంగళ, శుక్రవారం డ్రై డే పాటించాలన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ శ్రీకాంత్ యాదవ్, డాక్టర్ వినోద్బాబ్జి, డాక్టర్ దీప్తి ప్రియాంక, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సమ్మర్ క్యాంపులతో మానసిక వికాసం కొండపాక(గజ్వేల్): వేసవి శిబిరాలు విద్యార్థుల మానసిక వికాశానికి దోహదపడతాయని జిల్లా విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి ముండ్రాతి రమేశ్ అన్నారు. కుకునూరుపల్లి ప్రాథమిక పాఠశాలలో శనివారం ఆయన సమ్మర్ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు ఈ సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతంగా ఉండాలన్నారు. ఆంగ్లంపై పట్టుసాధించడం, చేతిరాత తదితర అంశాల్లో శిక్షణనిస్తారన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ బచ్చలి సత్తయ్య, హెచ్ఎం శ్రీనివాస్రెడ్డి, పీఎన్ఆర్ ట్రస్టు నిర్వాహకుడు పొల్కంపల్లి నరేందర్, సీఆర్పీ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మల్లికార్జునుడికి హైకోర్జు జడ్జి పూజలు కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామిని రాష్ట్ర హైకోర్టు జడ్జి నంద శనివారం దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు తీర్థ ప్రసా దం, శేషవస్త్రాలు, స్వామివారి చిత్రపటాన్ని అందించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్, చేర్యాల న్యాయమూర్తి తరుణి, సీఐ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. త్వరలోనే ఆర్వోబీ పనులు చేగుంట(తూప్రాన్): మండల కేంద్రంలోని రైల్వేగేట్ను శనివారం రైల్వే డిప్యూటీ ఇంజనీర్ నూరొద్దీన్ హబీబ్ సందర్శించారు. ఈసందర్భంగా రైల్వే గేటు వద్ద నిర్మించే ఆర్వోబీ గురించి కాంట్రాక్టర్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే రైల్వే గేటును మూసివేసి ఆర్వోబీ పనులు నిర్వహిస్తామన్నారు. వాహనదారుల కోసం ప్రత్యామ్నాయ దారులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆయన వెంట ఇంజనీర్లు సమీర్, జగదీశ్తో పాటు రైల్వే సిబ్బంది, బీజేపీ నాయకులు ఉన్నారు. -
మూడో రోజూ బస్సులు బంద్
సిద్దిపేటకమాన్: ఆర్టీసీ కార్మికుల సమ్మె శుక్రవారం మూడో రోజు కూడా కొనసాగింది. జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్–ప్రజ్ఞాపూర్, దుబ్బాక, హుస్నాబాద్ డిపోల పరిధిలో సిబ్బంది విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. బస్సులన్నీ ఆయా డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వృద్ధులు గంటల తరబడి బస్టాండ్లో బస్సుల కోసం ఎదురుచూశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సిద్దిపేట బస్టాండ్ వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సిద్దిపేట డిపో పరిధిలో శుక్రవారం 5 ఆర్టీసీ, 49 అద్దె బస్సులు వివిధ ప్రాంతాలకు నడిపారు. ప్రైవేటు వాహనాల దోపిడీ ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేస్తుండటంతో చేసేదిలేక ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. దీంతో వారు రెండింతల చార్జీ వసూలు చేశారు. సమ్మెతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. నోటికి నల్ల రిబ్బన్లతో నిరసన వరంగల్ నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్గౌడ్ మృతికి సంతాపంగా సిద్దిపేట ఆర్టీసీ కార్మికులు నోటికి నల్ల రిబ్బన్లు ధరించి శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. డిపో నుంచి మోడ్రన్ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలవేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా జేఏసీ ప్రతినిధులు నక్క మల్లేశం, బీసీ వెల్ఫేర్ రాష్ట్ర కార్యదర్శి రవీందర్గౌడ్ మాట్లాడుతూ తమ డిమాండ్లు పరిష్కరించకపోతే సమ్మె మరింత తీవ్రతరం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు బీఎస్ గౌడ్, రాజయ్య, కేఎస్ నారాయణ, ప్రభాకర్రెడ్డి , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొనసాగిన ఆర్టీసీ సమ్మె నోటికి నల్లరిబ్బన్లతో కార్మికుల నిరసన పలు పార్టీలు, కుల సంఘాల సంఘీభావం -
● 11 రోజుల్లో ముగియనున్నపాలకవర్గం పదవీకాలం ● ఈనెల 30న చివరి కౌన్సిల్ సమావేశం ● వార్డుల పెంపు, ఎన్నికలపై సర్వత్రా చర్చ
సిద్దిపేట మున్సిపాలిటీ పాలకవర్గం పదవీకాలం మరో 11 రోజుల్లో ముగియనుంది. ‘పుర’ పాలనకు కౌంట్డౌన్ మొదలైంది. మే 7వ తేదీతో మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు మాజీలు కానున్నారు. సమయం తక్కువగా ఉండటంతో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్నికలు వెంటనే నిర్వహిస్తారా? కొంత సమయం తీసుకుంటారా? అన్న విషయమై ఆయా రాజకీయ పార్టీ నేతలు, పట్టణ ప్రజలు జోరుగా చర్చించుకుంటున్నారు. – సాక్షి, సిద్దిపేట సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికలు ఏప్రిల్ 30, 2021న ఎన్నికలు జరగగా, మే 3న ఫలితాలు ప్రకటించారు. అందులో బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) 36 వార్డులో విజయం సాధించగా, ఐదు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు(రెబల్), బీజేపీ, ఎంఐఎం అభ్యర్థులు ఒక్కో వార్డులో గెలుపొందారు. మున్సిపల్ చైర్పర్సన్ పీఠం బీఆర్ఎస్ కై వసం చేసుకుంది. మే 7, 2021న కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ చైర్పర్సన్గా కడవేర్గు మంజుల బాధ్యతలు చేపట్టారు. మే 6, 2026కు పదవీ బాధ్యతలు స్వీకరించి ఐదేళ్లు పూర్తి అవుతుంది. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత అవిశ్వాసం పెట్టేందుకు అధికార పార్టీ నేతలు పలు మార్లు ప్రయత్నాలు చేశారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు పట్టువీడకుండా హరీశ్ రావు వైపే ఉన్నారు. దీంతో నలుగురు మాత్రమే అఽధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. 30న పాలకవర్గానికి సన్మానం ఈ నెల 30వ తేదీన సిద్దిపేట మున్సిపాలిటీ పాలకవర్గం చివరి కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ పాలక వర్గం ఏర్పాటైన తర్వాత చాలా అవార్డులు అందుకున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ప్రత్యేక చొరవతో మున్సిపాలిటీ స్వచ్ఛ సర్వేక్షణ్లో అనేక అవార్డులు సాధించింది. మే మొదటి వారంలో పాలకవర్గానికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. సిద్దిపేట మున్సిపాలిటీతో పాటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు డివిజన్ల సంఖ్య పెంచాలని మున్సిపల్ శాఖ ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. సిద్దిపేట మున్సిపాలిటీలో సైతం వార్డుల పెంపు? వార్డుల పునర్విభజన ఉంటుందా? అని అధికారులను పలువురు రాజకీయ పార్టీనేతలు, ఆశావహులు అడిగి తెలుసుకుంటున్నారు. వార్డుల పెంపు ఉంటే ఎంత మంది ఓటర్లకు ఒక వార్డును విభజిస్తారని రాజకీయ పార్టీల నేతలు, ప్రస్తుత కౌన్సిలర్లు ఆరా తీస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సిద్దిపేట బల్దియాలోని రాజకీయ నేతల్లో కొత్తగా ఆశలు చిగురుస్తున్నాయి. పాలకవర్గానికి మరో 11రోజులు మాత్రమే ఉండటంతో ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటి వరకు ఎలాంటి కసరత్తు రాష్ట్ర ఎన్నికల సంఘం చేపట్టలేదు. దీంతో మున్సిపాలిటీ ప్రత్యేక అఽధికారుల పాలన కొనసాగే అవకాశాలున్నాయి. సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికలు త్వరలో నిర్వహిస్తారా? కొంత సమయం తీసుకుంటారా? అన్న విషయమై జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 2010 నుంచి 2016 వరకు ప్రత్యేక పాలనలో బల్దియా కొనసాగింది. పలు గ్రామాలు మున్సిపాలిటీలో విలీనం చేశారు. అప్పుడు ఆయా గ్రామాల ప్రజలు కోర్టులో కేసు వేయడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆరేళ్లు ఎన్నికలు నిర్వహించలేదు. తెలంగాణ ఏర్పడిన అనంతరం 2016లో ఎన్నికలు నిర్వహించారు. -
జూనియర్ సివిల్ జడ్జీల బదిలీ
సిద్దిపేటకమాన్: సిద్దిపేట రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కమ్ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్గా కె.సౌజన్య నియామకం అయ్యారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ ఎల్బీనగర్ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న సౌజన్య సిద్దిపేటకు రానున్నారు. అదేవిదంగా వికారాబాద్ జిల్లా కొడంగల్లో జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న బానోతు శ్రీరామ్ చేర్యాల కోర్టుతోపాటు సిద్దిపేట జువైనల్ కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర హైకోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. డిమాండ్ ఉన్న పంటలే సాగు చేయండి వ్యవసాయ శాస్త్రవేత్త పల్లవి దుబ్బాక: రైతులు కేవలం వరిపంటపైనే ఆధారపడకుండా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగుచేస్తూ లాభాలు ఆర్జించాలని వ్యవసాయ శాస్రవేత్త పల్లవి అన్నారు. శుక్రవారం హసన్మీరాపూర్లో మండల వ్యవసాయ అధికారి ప్రయదర్శిని ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంట మార్పిడి విధానాలపై రైతులకు వివరించారు. ప్రకృతి వ్యవసాయంతో కలిగే లాభాలను తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ నగేష్, కార్యదర్శి తేజస్విని, రైతులు తదితరులు ఉన్నారు. పంప్ హౌస్ ట్రయల్ రన్ సక్సెస్ నంగునూరు(సిద్దిపేట): మండలంలోని వాగవతలి గ్రామాలకు సాగు నీరందించేందుకు ఘణపూర్ వద్ద నిర్మించిన పంప్ హౌస్ పూర్తి కావడంతో శుక్రవారం ఇరిగేషన్ అధికారులు ట్రయల్ రన్ చేపట్టారు. రంగనాయకసాగర్ కుడి కాలువ ద్వారా ఖాతా, ఘణపూర్, అక్కేనపల్లి, గట్లమల్యాల గ్రామాల్లోని 13 చెరువులను నింపేందుకు ఘణపూర్ వద్ద పంప్ హౌస్ నిర్మాణం కోసం అప్పటి మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు నిధులు మంజూరు చేశారు. అసంపూర్తిగా మిగిలిన పనులు పూర్తి కావడంతో ఇరిగేషన్ అధికారులు ట్రయల్రన్ నిర్వహించారు. ట్రయల్రన్ విజయవంతం కావడంతో ఎమ్మెల్యే హరీశ్రావు హర్షం వ్యక్తం చేశారు. పంప్ హౌస్తో నాలుగు గ్రామాలకు మేలు జరుగుతుందని తెలిపారు. ఘణపూర్లో 4 చెరువులు, అక్కేనపల్లి 4, గట్లమల్యాలలో 5 చెరువులు నింపడం ద్వారా 4,142 ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందన్నారు. బాలల హక్కులు ఉల్లంఘిస్తే చర్యలుదుబ్బాకటౌన్: ప్రభుత్వం బాలల పరిరక్షణ కోసం పలు చట్టాలను ఏర్పాటు చేసిందని, హక్కులు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని జిల్లా బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యుడు నరసింహులు అన్నారు. మండల పరిధిలోని తిర్మలాపూర్ జెడ్పీ పాఠశాలలో బాలల సంక్షేమంపై మండల విద్యాధికారి కనకరాజుతో కలిసి అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ పిల్లలకు సంబంధించిన సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి, వాటి పరిష్కారంపై ప్రభుత్వానికి సూచనలు చేయడం కమిటీ ప్రధాన బాధ్యత అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, వసుంధర, నరేందర్, రజని, శ్రీనివాస్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాస్పత్రి సందర్శన చేర్యాల (సిద్దిపేట): స్థానిక ప్రభుత్వాస్పత్రిని ఆరోగ్యశ్రీ జిల్లా మేనేజర్ విజయ్భాస్కర్ శుక్రవారం సందర్శించారు. ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దేవేందర్తో సమావేశమయ్యారు. త్వరలో డయాలసిస్ సేవలను ప్రారంభించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలపై ఆస్పత్రి సూపరింటెండెంట్తో చర్చించినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా టీం లీడర్ నవీన్కుమార్ తదితరులు ఉన్నారు. -
శంకర్గౌడ్ది ముమ్మాటికీ
● మంత్రి పొన్నం రాజీనామా చేయాలి ● ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి ప్రభుత్వ హత్యేగజ్వేల్: ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ మృతికి నైతిక బాధ్యత వహిస్తూ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాజీనామా చేయాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే శంకర్గౌడ్ మృతిచెందారన్నారు. శుక్రవారం గజ్వేల్లో ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఇదే క్రమంలో డ్రైవర్ శంకర్గౌడ్ ప్రాణత్యాగానికి ఒడిగట్టారని చెప్పారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చందన, గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, నాయకులు నర్సింగరావు, నవాజ్మీరా, బెండ మధు, మల్లేశం, బొల్లారం ఎల్లయ్య, అర్జున్గౌడ్, కృష్ణారెడ్డి, ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. కొనుగోళ్లల్లో నిర్లక్ష్యాన్ని సహించం టార్గెట్ పూర్తయ్యిందనే సాకుతో పొద్దు తిరుగుడు కొనుగోళ్లను నిలిపివేసి, రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వంటేరు ప్రతాప్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పార్టీ శ్రేణులతో కలిసి గజ్వేల్ మార్కెట్ యార్డును సందర్శించి రైతుల ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ పొద్దు తిరుగుడు ధాన్యం కొనుగోళ్లను పునఃప్రారంభించకపోతే రైతుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. -
అనుమతి లేని కళాశాలల్లో చేరొద్దు
జిల్లా కేంద్రంంలో ఇప్పటి వరకు ఎలాంటి నూతన కళాశాలలకు అనుమతులు లేవు. కనీసం దరఖాస్తు కూడా చేసుకున్న దాఖలాలు లేవు. ఒక కళాశాల మాత్రం పేరు మార్పు కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాని ఇంకా అనుమతి రాలేదు. అకాడమీలు, ఐఐటీలు, జేఈఈ, నీట్ లాంటి కోచింగ్ సెంటర్ల అనుమతికి సంబంధించిన అంశం మా పరిధిలో లేదు. అనుమతులు లేని కళాశాలల్లో విద్యార్థులను చేర్పించకూడదు. – రవీందర్రెడ్డి, జిల్లా ఇంటర్ విద్యాధికారి, సిద్దిపేట నిర్మాణం పూర్తి కాకుండానే ఐఐటీ, జేఈఈ, నీట్ కోచింగ్ పేరుతో వెలసిన విద్యాసంస్థ -
బీడీ కార్మికులకు ‘సంజీవని శక్తి’ కిట్లు
దుబ్బాకరూరల్: మండలంలోని శిలాజీనగర్లో బీడీ కార్మికులకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీక ‘సంజీవని శక్తి’ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాత్రనక పగలనక కష్టపడి పని చేసే బీడీ కార్మికుల ఆరోగ్యం బాగు కోసమే కిట్లు అందించినట్లు తెలిపారు. సంజీవని శక్తి కిట్లో క్యాల్షియం టాబ్లెట్లు, మిల్టీవిటమిన్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, పేయిన్ రిలీఫ్ జెల్, హెయిర్ ఆయిల్, దువ్వెన, స్టిక్కర్స్, కాజల్(కాటుక), కుంకుమ పసు పు, యాంటిసెప్టిక్ సబ్బు, నెయిల్ కట్టర్, హాట్ వాటర్ బ్యాగ్, గాజులు, ఛత్రం, కాటన్ బ్యాగ్ తదితర వస్తువులు ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ సునీత తదితరులు పాల్గొన్నారు. -
400 ఎకరాల్లో పంట నష్టం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలో గురువారం కురిసిన వడగళ్ల వానతో 400 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. శుక్రవారం జిల్లాలోని వడగళ్ల వాన కురిసిన ప్రాంతాలను జిల్లా, మండల, వ్యవసాయశాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వరి 398 ఎకరాల్లో, మొక్కజొన్న 2 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు అంచనా వేశారు.నష్టపోయిన రైతులను ఆదుకోండిసిద్దిపేటజోన్: అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి హరీశ్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఐదు సార్లు వడగళ్ల వాన, ఒకసారి తుపాన్ వల్ల నష్టపోయిన రైతులకు నేటికీ ఒక్క రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు. పంట నివేదిక ఆధారంగా పరిహారం చెల్లించాలన్నారు. గురువారం కురిసిన అకాల వర్షాలకు వివిధ పంటలు దెబ్బతిన్నాయని, అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం కలెక్టర్, నియోజకవర్గ వ్యవసాయ శాఖ అధికారులతో హరీశ్రావు ఫోన్లో మాట్లాడారు. సిద్దిపేట అర్బన్ మండల పరిధిలో అధికంగా పంట నష్టం వాటిల్లిందన్నారు. చేతికి వచ్చిన పంట అకాల వర్షాలతో దెబ్బతినడంతో రైతులు దిక్కుతోచనిస్థితిలో ఉన్నారని, వారిని ఆదుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేసి, రైతులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ను హరీశ్రావు కోరారు. వడగళ్ల వాన నష్టంపైప్రాథమిక అంచనా క్షేత్రస్థాయిలో పరిశీలించినవ్యవసాయాధికారులు అకాల వర్షాల బాధితులకుపరిహారం ఇవ్వాలి మాజీ మంత్రి హరీశ్రావు -
విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలి
సిద్దిపేటరూరల్: ప్రతీ విద్యార్థి తనలోని నైపుణ్యాలను గ్రహించి విద్య, ఎంచుకున్న రంగంలో ఉన్నతంగా ఎదగాలని కలెక్టర్ హైమావతి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల విద్యార్థులకు జిల్లా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి పథకాలపైన కలెక్టర్ అధ్యక్షతన ఒక రోజు శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా సంక్షేమ వారోత్సవాలలో యువత కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి, వారిలో ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు ప్రభుత్వం అనేక పథకాలు తీసుకువచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేటి యువత కోసం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ప్రారంభించి కొత్త కోర్సులను తీసుకువచ్చిందన్నారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో చేరడం ద్వారా తక్కువ సమయంలో మంచి ఉపాధి పొందవచ్చని, ఇంజనీరింగ్ వాళ్లకు లేనన్ని ఉపాధి అవకాశాలు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలోను విద్యార్థులకు లభిస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కలెక్టర్ హైమావతి ఉపాధి, విద్య అవకాశాలపై శిక్షణ -
చెత్త సేకరణ ఇక భారమే!
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో చెత్త సేకరణ ఇక భారం కానుంది. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణను ప్రైవేటీకరించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే పలు కాలనీలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. సిబ్బంది, వాహనాల కొరత కారణంగా వేగవంతమైన సేవల కోసం మున్సిపల్ యంత్రాంగం ఈ నిర్ణయానికి మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. – గజ్వేల్ గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా ఏర్పడిన ఆర్అండ్ఆర్ కాలనీలతో కలుపుకొని 15వేలకుపైగా ఇళ్లు ఉండగా.. జనాభా 80వేల పైచిలుకు చేరుకున్నది. ఈ నేపథ్యంలో ఇక్కడ నిత్యం ఉత్పత్తి అవుతున్న చెత్త 18 మెట్రిక్ టన్నుల పైనే. కానీ మున్సిపాలిటీలో సిబ్బంది, వాహనాల కొరత శాపంగా పరిణమించింది. ఇక్కడ 160మందికిపైగా పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారు. నిజానికి మరో 80 మందికిపైగా సిబ్బంది అవసరం. 30 వరకు చెత్త సేకరణ వాహనాలు ఉండగా, మరో పదికిపైగా వాహనాలు అవసరమున్నాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే పారిశద్ధ్య సమస్యను పర్యవేక్షించాల్సిన శానిటరీ ఇన్స్పెక్టర్ పోస్టు ఖాళీగా ఉండటంతో. .ఇన్ఛార్జితో నెట్టుకొస్తున్నారు. ఫలితంగా తడి, పొడి చెత్త సేకరణ సక్రమంగా సాగటం లేదు. చెత్త బండ్లు సకాలంలో రాకపోవడంతో పలు కాలనీల్లో ఇంటి యజమానులు కవర్లలో చెత్తను తీసుకొచ్చి రోడ్లపై పారబోస్తున్నారు. దీంతో ఆయా రోడ్లు కంపుకొడుతున్నాయి. మరోవైపు డంపింగ్ యార్డు నిర్వహణ సైతం అధ్వానంగా మారింది. యార్డులో తరుచూ మంటలు చెలరేగి.. పట్టణంలో దట్టమైన పొగలు కమ్ముకొని ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారింది. అంతేకాకుండా వర్మీకంపోస్ట్ తయారీ, బయోమైనింగ్ ప్రక్రియ కూడా నామమాత్రంగా సాగుతోంది. ప్రైవేటీకరణ దిశగా చర్యలు ప్రైవేటీకరణకే మొగ్గు.. సిబ్బంది, వావాహనాల కొరత కారణంగా పారిశుద్ధ్య నిర్వహణ భారంగా మారటంతో మున్సిపల్ యంత్రాంగం, పాలకవర్గం ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది. మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం కారణంగా ఈ పట్టణం ఆదర్శ మున్సిపాలిటీగా కీర్తిని తెచ్చుకుంది. పేరుకు తగ్గట్టుగా నిధుల వరద పారింది. కానీ నేడు భిన్నమైన పరిస్థితి నెలకొన్నది. ఫలితంగా పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ సజావుగా సాగాలంటే.. ప్రైవేటీకరణే తరుణోపాయంగా భావించి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పట్టణంలోని పలు కాలనీలకు సమాచారమిచ్చినట్లు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి చెత్త సేకరణకు నెలకు కొంత మొత్తాన్ని చెల్లించాలని సూచించినట్లు వినికిడి. ఈ విధానాన్ని ముందుగా కొన్ని కాలనీల్లో అమలు చేసి...భవిష్యత్తులో అన్ని కాలనీల్లో అమలు చేయాలని భావిస్తున్నారు. మున్సిపల్ నిర్ణయం ఎలా వున్నా.. చెత్త సేకరణ ప్రైవేటీకరణపై పట్టణ ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ప్యాడీ క్లీనర్లకు తుప్పు.. ఎవరిదీ తప్పు
తుప్పు పట్టిన ప్యాడీ క్లీనర్లు ప్యాడీ క్లీనర్ల యంత్రాలపై నిర్లక్ష్యపు గ్రహణం ఆవహించింది. కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకువచ్చిన ధాన్యంలో చెత్తా చెదారాన్ని వేరు చేసి శుభ్రం చేయడానికి వినియోగించే ప్యాడీ క్లీనర్లపై అధికారుల పర్యవేక్షణ కరువైంది. దీంతో నెలల తరబడి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ తుప్పు పట్టి పనికి రాకుండా పోయాయి. మండల కేంద్రమైన మిరుదొడ్డిలోని ఏఎంసీ గోదాం వద్ద సుమారు 15 ప్యాడీ క్లీనర్లు తుప్పుపట్టి ఉన్నాయి. వాటిపై పర్యవేక్షణ లోపించడంతో ప్రజాధనం వృథాగా మారుతోందని రైతులు మండిపడుతున్నారు. – మిరుదొడ్డి(దుబ్బాక) -
ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోండి
● తూకం వేసిన వెంటనే మిల్లులకు తరలించండి ● కలెక్టర్ హైమావతి నంగునూరు(సిద్దిపేట): అకాల వర్షాలు కురుస్తున్నందున కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ హైమావతి నిర్వాహకులకు సూచించారు. గురువారం పాలమాకులలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ధాన్యాన్ని తూకం వేసిన వెంటనే మిల్లుకు తరలించాలని నిర్వాహకులను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా తాగునీటి వసతి, బార్దాన్, టార్పాలిన్ కవర్లు, ప్యాడి క్లీనర్ను అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం మాట్లాడుతూ వరి పంట కోయగానే తేమ లేకుండా ఎండబెట్టి కొనుగోలు కేంద్రానికి తేవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని అధికారులను ఆదేశించారు. దిగుమతిలో జాప్యం తగదు చిన్నకోడూరు(సిద్దిపేట): ధాన్యం దిగుమతిలో జాప్యం రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హైమావతి నిర్వాహకులను ఆదేశించారు. గురువారం మండల పరిధిలోని పెద్దకోడూరు, గోనెపల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. రైతులు, నిర్వహకులతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రాల్లో గన్నీ బ్యాగ్లు, తేమ శాతం కొలిచే యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, తాగు నీరు, అకాల వర్షాల వల్ల ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. తేమ శాతం రాగానే వెంటనే లోడ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. -
మామిడి పండ్ల ఎగుమతులపై అవగాహన
ములుగు(గజ్వేల్): కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో మామిడి పండ్ల ఎగుమతి, ఉత్పత్తులపై గురువారం రైతులకు, విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా హాజరైన ఏపీఈడీఏ సంస్థకు చెందిన ఏజీఎం ఆర్పీ నాయుడు, బీడీఎం బాష మాట్లాడుతూ మామిడి పండ్లను అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి చేయడంపై అవగాహన కల్పించారు. గ్లోబల్ గ్యాప్ ప్రమాణాలు, పంటలో అవశేషాల నియంత్రణ, నాణ్యత ప్రమాణాలు, గ్రేడింగ్, ప్యాకింగ్, కోల్డ్ చైన్ నిర్వహణ, ఎగుమతి విధానాలపై విపులంగా వివరించా రు. కార్యక్రమంలో వర్సిటీ అధికారులు రైతులకు పలు సూచనలిచ్చారు. అనంతరం అతిథులను వర్సిటీ అధికారులు సత్కరించారు. పథకాలు సద్వినియోగం చేసుకోండి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య మిరుదొడ్డి(దుబ్బాక): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కోరారు. గురువారం మండల పరిధిలోని అందె గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను దళారులకు అమ్మకుండా ప్రభుత్వం అందిస్తున్న కనీస మద్ధతు ధరను పొందాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం లక్ష్మీనర్సమ్మ, సర్పంచ్ యాదగిరి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట అంజిరెడ్డి, జిల్లా నాయకుడు సూకూరి లింగం తదితరులు పాల్గొన్నారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలిగజ్వేల్: స్వయం సహాయక మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ చందన ఆకాంక్షించారు. గురువారం గజ్వేల్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెప్మా(పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) అధర్యంలో ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’లపై అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలపై అవగాహన ఉన్నప్పుడే వాటిని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కళ్యన్కర్ పద్మాబాయి, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ హన్మంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


