breaking news
Siddipet
-
అర్జీలను సత్వరం పరిష్కరించాలి
సిద్దిపేటరూరల్: ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా అదనపు కలెక్టర్లు గరీమా అగర్వాల్, అబ్దుల్ హమీద్లతో కలిసి కలెక్టర్ కె.హైమావతి అర్జీలను స్వీకరించారు. అంతకుముందు ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రజలు నమ్మకంతో ప్రజావాణికి వస్తున్న క్రమంలో వారికి న్యాయం కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈనెల 11న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలను వేయించాలని ఆదేశించారు.వివిధ పరిశ్రమల స్థాపనకు టీజీఐపాస్లో దరఖాస్తు చేసుకున్న వారందరికీ విభాగాల వారీగా పరిశీలన చేసి అనుమతులి వ్వాలని అధికారులకు సూచించారు. కాగా, ప్రజావాణిలో 157 దరఖాస్తులు వచ్చాయి. కుక్ సతీశ్ను బదిలీ చేయవద్దు మేము చిన్నకోడూరులోని బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులం. హాస్టల్లో కుక్గా పనిచేస్తున్న సతీశ్ను బదిలీ చేశారు. తమకు చాలా రోజులుగా వంటలు వండుతూ సాయంత్రం సమయంలో ట్యూషన్ నిర్వహిస్తూ ఎంతో సహాయకారిగా ఉండేవాడు. ఎలాగైనా కలెక్టర్ స్పందించి సతీశ్ను బదిలీ చేయకుండా మళ్లీ తమ హాస్టల్కు వచ్చేలా చూడాలన్నారు. అంతకుముందు విద్యార్థులు కొద్దిసేపు కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు.157 అర్జీలు స్వీకరించిన కలెక్టర్ హైమావతి -
తెలవారే.. తొలి దర్శనం
దుబ్బాక: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన దుబ్బాక బాలాజీ ఆలయం చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితులు పుణ్యాహవచనంతో బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో సన్నిధిగొల్ల(యాదవులు) ఆల యం తెరిచే ఆచారాన్ని బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలిసారి దుబ్బాక బాలాజీ ఆలయంలో చేపట్టారు. సోమవారం తెల్లవారుఝామునే యాదవులు కుటుంబసమేతంగా పట్టణంలో పట్టువస్త్రాలతో ఊరేగింపుగా ఆలయానికి వచ్చి స్వామివారి తొలిదర్శనాన్ని చేసుకున్నారు. అనంతరం సంతానం కోసం నిర్వహించిన ప్రత్యేక హోమం కార్యక్రమానికి 2వేలకు పైగా దంపతులు హాజరై గరుడ ప్రసాదాలను స్వీకరించారు. కాగా, స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. -
ఉమ్మడి జిల్లా బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక
మిరుదొడ్డి(దుబ్బాక): ఉమ్మడి మెదక్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సీనియర్, సబ్ జూనియర్ అండర్–15 బాల్ బ్యాడ్మింటన్ ఉమ్మడి జిల్లా జట్లను ఎంపిక చేసినట్లు అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ భైరయ్య తెలిపారు. మిరుదొడ్డిలో సోమవారం ఆయన మాట్లా డుతూ..సీనియర్ జట్టుకు శశికుమార్, శ్రీనివాస్, చైతన్య, భరత్, కృష్ణసాయి, రవి, కిరణ్, రవితేజ, నవీన్, స్టాండ్ బాయ్స్గా మునీరొద్దీన్, రామ కోటి ఎంపికయ్యారన్నారు. బాలికల సబ్ జూనియర్ జట్టుకు శ్రావణి, నిహారిక, నందిత, లలిత, శరణ్య, సఫియా, సోహ, జెస్సీ, మనోవర్ధిని, శ్రీతేజ, తన్విలు ఎంపిక కాగా, సబ్ జూనియర్ బాయ్స్ జట్టులో చైతన్య, కృష్ణసాయి, సిద్విక్, మనికంఠ, సాకేత్, మోయిన్, భవన్, అక్షిత్, లలిత్, కౌశిక్, ఆర్యలు ఎంపికయ్యారు. ఈ నెల 23, 24 తేదీల్లో రాష్ట్రస్థాయి సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీలో సీనియర్ జట్లు పాల్గొంటాయని తెలిపారు. -
సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి
సిద్దిపేట సీపీ అనురాధ సిద్దిపేటకమాన్: సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సీపీ అనురాధ సూచించారు. పోలీసు కమిషనర్ కార్యాలయంలో సైబర్ వారియర్స్కు సైబర్ సెక్యూరిటీ బ్యూరో నుంచి వచ్చిన టీషర్ట్స్ను సీపీ సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..సైబర్ వారియర్స్కు వచ్చే ఫోన్ కాల్స్కు వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. సైబర్ కేసుల్లో పూర్తి ఆధారాలు సేకరించి నేరస్తులను గుర్తించడం, నేరగాళ్లకు శిక్షలు పడేలా చేయడమనేది సైబర్ వారియర్స్ చాలెంజ్గా స్వీకరించాలని చెప్పారు. కార్యక్రమంలో సిద్దిపేట సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ ఏసీపీ శ్రీనివాస్, జిల్లాలోని సైబర్ వారియర్స్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యూడీఐడీ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి జయదేవ్ఆర్యా సిద్దిపేటరూరల్: జిల్లాలోని అర్హులైన దివ్యాంగులు యూడీఐడీ దివ్యాంగుల శిబిరానికి హాజరై గుర్తింపు కార్డును పొందాలని జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి జయదేవ్ ఆర్యా సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. నడవలేని వారికి ఆగస్టు 14, 28వ తేదీల్లో, మానసిక, కంటిచూపు, వినికిడి సమస్యలున్న వారికి 07,21,28వ తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దరఖాస్తు అనంతరం వారికి కేటాయించిన సమయానికి సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు దగ్గరలో గల ప్రభుత్వాస్పత్రికి ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు. నకిలీ ఎరువుల దందాను అరికట్టాలిరైతు సంఘం జిల్లా కార్యదర్శి సత్తిరెడ్డి కొమురవెల్లి(సిద్దిపేట): జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగుతోన్న నకిలీ ఎరువుల దందాను వ్యవసాయ అధికారులు అరికట్టాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో రైతు సంఘం కార్యాలయంలో సంఘం నాయకులతో కలసి సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పేరున్న కంపెనీల ఎరువుల బస్తాలకు కృతిమ కొరత సృష్టించి ,అధిక లాభాల కోసం నాసిరకం ఎరువులు విక్రయించి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారన్నారు. కొంతకాలంగా నాసిరకం విక్రయాలు జరుగుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో కృష్ణారెడ్డి, వుల్లంపల్లి సాయిలు, తాడూరి మల్లేశం, నూకల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జ్వర పరీక్షలు నిర్వహించాలిడీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ సిద్దిపేటకమాన్: ఆరోగ్య కేంద్రానికి జ్వర లక్షణాలతో వచ్చే వారి నుంచి రక్త నమూనాలను సేకరించి టీహబ్కు పంపించి పరీక్షలు నిర్వహించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ సిబ్బందిని ఆదేశించారు. సిద్దిపేట కలెక్టరేట్లోని వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో సబ్ యూనిట్ అధికారులు, ఎల్టీలు, సూపర్వైజర్లతో సోమవారం డీఎంహెచ్ఓ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..డెంగ్యూ, మలేరియా నిర్థారణ పరీక్ష కిట్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి మంగళ, శుక్రవారాల్లో డ్రై డే నిర్వహించాలన్నారు. సిబ్బంది సమయ పాలన పాటించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్ యాదవ్, సోఫాన్ రాథోడ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
యూరియా కోసం బారులు
● పోలీసు బందోబస్తు మధ్య పంపిణీ ● క్యూలో ఉన్నా చాలామందిరైతులకు అందని వైనం దుబ్బాక: ప్రభుత్వం, అధికారులు యూరియాకు కొరత లేదని రైతులకు సరిపడా నిల్వలున్నాయని గప్పాలు చెప్పుకోవడం తప్పా ఆచరణలో మాత్రం కానరావడంలేదు. దుబ్బాక పట్టణంలో సోమవారం యూరియా బస్తాల లారీ రావడంతో తెల్లవారక ముందే దుకాణం వద్దకు వందలాది మంది రైతులు తరలివచ్చి లైన్ కట్టారు. వందల సంఖ్యలో రైతులు ఉండడంతో ఒక్కో రైతుకు ఆధార్కార్డు, పాస్బుక్ తీసుకుని 2 బస్తాల చొప్పున పోలీసు బందోబస్తు మధ్య పంపిణీ చేశారు. దొరకని రైతుల ఆందోళన క్యూలో వేచి ఉన్నా చాలామంది రైతులకు యూరియా దొరకకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా లేక తమ పంటలు పాడైతున్నాయని ఇంకా ఎన్ని రోజులు ఈ తిప్పలు పడాలంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సరిపడా యూరియాను తెప్పించి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. -
సాగునీటి ప్రాజెక్టులపై సర్కారు నిర్లక్ష్యం
● రెండేళ్లుగడుస్తున్నా ముందుకు సాగని పనులు ● ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి తొగుట(దుబ్బాక): సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దుర్మార్గమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి మండిపడ్డారు. మల్లన్న సాగర్ అనుబంధంగా మండలంలోని ఎల్లారెడ్డిపేట వద్ద నిర్మిస్తున్న మినీ పంప్హౌజ్, పైప్లైన్ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుసేన్ మనవలు ఎండీ కరీమోద్దిన్,యాసీనుద్దిన్, మనవరాలు అయేషా సుల్తానాల పుట్టినరోజు సందర్భంగా మండలంలోని ఘనపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సోమవారం బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ ఉప కాలువలు నిర్మించాలని పలుమార్లు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి విన్నవించినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇర్కోడ్ పైపు లైన్ పనులు 90% బీఆర్ఎస్ ప్రభుత్వమే పూర్తిచేసిందన్నారు. మిగిలిపోయిన పనులు రెండేళ్లు గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిచేయలేదని ఆరోపించారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా మల్లన్న సాగర్ నుంచి సాగునీరు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉప కాలువ పనులు వేంటనే పూర్తిచేయాలని లేకుంటే సెక్రటేరియట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు.విద్య, వైద్యం ఉచితం చేయాలి పేదలకు విద్య, వైద్యం అందనిద్రాక్షలా మారిందని, ఆ రెండింటినీ ఉచితంగా అందించాలని ప్రభాకర్రెడ్డి డిమాండ్ చేశారు. నేడు ప్రతీ ఒక్కరి సంపాదనలో సింహభాగం విద్య ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా వ్యవస్థల్లో మార్పు రావడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అంతకుముందు తొగుటలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ కుర్మ యాదగిరిని పరామర్శించారు. కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మండలంలోని ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు. -
ప్రయాణం సులువే!
మంగళవారం శ్రీ 5 శ్రీ ఆగస్టు శ్రీ 2025ఎక్స్ప్రెస్వే..తెరపైకి కొత్త ప్రతిపాదనసిద్దిపేట జిల్లాలో రాజీవ్రహదారిగజ్వేల్: మేడ్చల్ జిల్లా శామీర్పేట నుంచి సిద్దిపేట, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల మీదుగా మంచిర్యాల, రామగుండం ప్రాంతం వరకు 207కిలోమీటర్ల మేర రాజీవ్ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించారు. 15ఏళ్ల క్రితం ఈ రోడ్డు విస్తరణకు రూ.1,450కోట్లకుపైగా వెచ్చించారు. బీఓటీ(బిల్ట్ ఆపరేటర్ ట్రాన్స్ఫర్) విధానంలో ఈ పనులు పూర్తి చేశారు. ఉత్తర తెలంగాణలోని మేడ్చల్, సిద్దిపేట, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో గల పలు జాతీయ రహదారులను కలిపే ఈ దారి అత్యంత కీలకమైనది. ప్రత్యేకించి హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు, వరంగల్ హైవే, నేషనల్ హైవే–44 తదితర హైవేలతోపాటు కొత్తగా నిర్మించనున్న ట్రిపుల్ఆర్తోనూ ఈ రహదారి అనుసంధానం కానుంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ రహదారి మలుపులు సరిచేయకుండానే విస్తరణ పనులు చేపట్టిన కారణంగా తరుచూ ఎన్నో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఎలివేటెడ్ కారిడార్తో అనుసంధానం.. రాజీవ్ రహదారిపై మలుపులు సరిచేయడం, ఆరు లేన్లుగా విస్తరించే అంశాన్ని ప్రభుత్వం పక్కన పెట్టింది. ఈ క్రమంలో రాజీవ్రహదారికి ప్రత్యామ్నాయంగా ఎక్స్ప్రెస్వేను నిర్మించాలని భావిస్తోంది. ఇది పూర్తిగా గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేగా ఉంటుందని చెబుతున్నారు. సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి శామీర్పేట వరకు 18కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ కారిడార్తో ఎక్స్ప్రెస్వేను అనుసంధానం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం రూ.4వేలకోట్లకుపైగా వ్యయం అవుతుందని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కు ప్రతిపాదనలు పంపింది.న్యూస్రీల్సిద్దిపేట జిల్లాలో 90 కి.మీటర్లపైనే! ఆర్ఆర్కు ప్రత్యామ్నాయంగాకొత్త రహదారి శామీర్పేట నుంచి రామగుండం వరకు 207కిలోమీటర్లు సిద్దిపేటతోపాటు ఉత్తర తెలంగాణకు ప్రయోజనం!రాజీవ్ రహదారిపై భారీగా ట్రాఫిక్ పెరిగి ప్రమాద ఘంటికలు మోగుతున్న వేళ... ఈ రహదారికి ప్రత్యామ్నాయంగా ఎక్స్ప్రెస్వే తీసుకురావాలనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. సిద్దిపేటతోపాటు ఇతర ఉత్తర తెలంగాణ జిల్లాల రాకపోకలకు రాజీవ్రహదారి కీలకం. ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదిస్తున్న ఎక్స్ప్రెస్వే కార్యరూపంలోకి వస్తే ఉత్తర తెలంగాణ జిల్లాలకు భారీ ప్రయోజనం చేకూరనుంది.రాజీవ్ రహదారి సిద్దిపేట జిల్లాలో ములుగు మండలం వంటిమామిడి నుంచి బెజ్జంకి మండలం దేవక్కపల్లి వరకు సుమారుగా 90కిలోమీటర్లకుపైగా విస్తరించి ఉంది. రాజీవ్రహదారికి ప్రత్యామ్నాయంగా ఎక్స్ప్రెస్వే ప్రతిపాదన కార్యరూపంలోకి వస్తే ఈ జిల్లాలోనే సింహభాగం విస్తరించే అవకాశముంది. దీంతో ప్రత్యేకించి సిద్దిపేట జిల్లాలోని ప్రాంతాలకు ఎక్స్ప్రెస్వే ద్వారా ప్రయాణం ట్రాఫిక్ చిక్కుల్లేకుండా మరింత సులువుగా మారనుంది. ప్రత్యేకించి గజ్వేల్ ప్రాంతానికి హైదరాబాద్ మరింతగా చేరువగా మారనుంది. ఇప్పటికే ఈ నియోజకవర్గంలోని ములుగు, మర్కూక్, వర్గల్, గజ్వేల్ మండలాలు మెగా హెచ్ఎండీఏ పరిధిలోకి వెళ్తున్నాయి. ఈ ఎక్స్ప్రెస్వే ప్రతిపాదన ఈ ప్రాంతానికి కలిసిరానున్నది. అదేవిధంగా ఉత్తర తెలంగాణలోని ఇతర జిల్లాలకు సైతం ప్రయోజనం చేకూరనుంది. -
సీపీఎస్ రద్దు చేయాలి
పీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి మహేందర్రెడ్డి చిన్నకోడూరు(సిద్దిపేట): సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పింఛను విధానాన్ని అమలు చేయాలని పీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి వంగ మహేందర్రెడ్డి డిమాండ్ చేశారు. చిన్నకోడూరు ఉన్నత పాఠశాలలో సోమవారం సభ్యత్వ నమోదులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దును డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1న పీఆర్టీయూ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నానో యూరియా డాప్తో అధిక దిగుబడులుజిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి కొండపాక(గజ్వేల్): నానో యూరియా డాప్ వినియోగంతో అధిక దిగుబడులు పొంద వచ్చని జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి పేర్కొన్నారు. మండల పరిధిలోని బందారం గ్రామంలో ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కో ఆపరేటివ్ లిమిటెడ్ సంస్థ, వ్యవసా య శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నానో యూరియా డాప్ల వినియోగంపై సోమ వారం రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్వరూపరాణి మాట్లాడుతూ...నానో యూరియాను పిచికారీ చేయడం వల్ల కాలుష్యం తగ్గించడంతో పాటు సమర్థవంతంగా పంటలకు ఉపయోగపడుతుందన్నా రు. 500 మిల్లీ లీటర్ల నానో యూరియా తక్కువ ధరకే లభిస్తుందని తెలిపారు. -
కాళేశ్వరం నివేదికపై స్పందించిన కేసీఆర్
సాక్షి, సిద్దిపేట: కాళేశ్వరం కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పందించారు. సోమవారం ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ కీలక నేతలతో భేటీ అయిన ఆయన.. కమిషన్ నివేదికను, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ‘‘అది కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్. ఆ కమిషన్ నివేదిక ఊహించిందే. ఎందరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఈ వ్యవహారంలో కొంతమంది BRS నేతలను అరెస్ట్ చేయవచ్చు.. అంతమాత్రాన భయపడవద్దు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు అన్నవాడు అజ్ఞాని.. .. కాళేశ్వరంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలు ఏంటో తెలంగాణ ప్రజలకు వివరించాలి. కాళేశ్వరంపై క్యాబినెట్ లో ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం’’ అని ఆయన అన్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో హరీష్ రావు, కేటిఆర్, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.ఇదిలా ఉంటే.. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ కాళేశ్వరం అవకతవకలపై విచారణ జరిపిన ప్రభుత్వానికి నివేదిక అందించింది. అయితే ప్రభుత్వం ఆ నివేదికను బయటపెట్టడం కంటే ముందే మీడియాకు లీకు కావడం చర్చనీయాంశమైంది.ఇదీ చదవండి: ‘కాళేశ్వరం అవకతవకలు.. ఆయనదే పూర్తి బాధ్యత’ -
రేషన్ కార్డుల పంపిణీ రసాభాస
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించి చేపడుతున్న రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఆదివారం గజ్వేల్లో రసాభాసగా మారింది. నేతలు రెండు వర్గాలుగా విడిపోయి బాహాబాహికి దిగారు. ఈ సందర్భంగా పలువురు నాయకుల చొక్కాలు చిరిగిపోయాయి. ఫలితంగా ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో మరోసారి కాంగ్రెస్ విభేదాలు బయటపడ్డాయి. మంత్రి వివేక్ సమక్షంలో మరోసారి బయటపడ్డ విభేదాలు గజ్వేల్/వర్గల్(గజ్వేల్)/ములుగు (గజ్వేల్)/జగదేవ్పూర్ (గజ్వేల్): ఇచ్చిన హామీలు నెరవేరుస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తుందని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. ప్రజాపాలన ప్రగతిబాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం వర్గల్ మండలం శాకారం టీజీఆర్ గార్డెన్స్ వేదికగా జిల్లా కలెక్టర్ హైమావతి, ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డిలతో కలిసి ఆయన నూతన రేషన్కార్డుల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ...ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల్ల మంజూరు ద్వారా పేదల సొంతింటి కలసాకారం చేస్తున్నామన్నారు. కాళేశ్వరం తప్పిదాలకు బాధ్యులైనవారిపై చర్యలు తప్పవన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్పై ఇప్పటికే జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. మెగా కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారని ఆరోపించారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు తమపై నర్సారెడ్డి వర్గీయులు దాడి చేశారని అసమ్మతి నేతలు విజయ్కుమార్, మల్లారెడ్డి, నాయిని యాదగిరిలు వేర్వేరుగా గజ్వేల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మొత్తానికి మంత్రి పర్యటనలో కాంగ్రెస్ విభేధాలు మరోసారి రచ్చకెక్కడం చర్చనీయాంశమైంది. నర్సారెడ్డివి ఒంటెద్దు పోకడలు డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి ఒంటెద్దు పోకడలకు పాల్పడుతున్నారని అసమ్మతి నేతలు ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, సీనియర్ నాయకులు నాయిని యాదగిరి, కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు విజయ్కుమార్ ఆరోపించారు. గజ్వేల్లో ఉద్రిక్తత, మంత్రి అసహనం ప్రజాసంక్షేమమే పరమావధి: మంత్రి వివేక్ -
గజ్వేల్లో గందరగోళం
గజ్వేల్ పట్టణంలోని ముట్రాజ్పల్లిలోని ఎస్ఎమ్ గార్డెన్స్లో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే డీసీసీ అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని వ్యతిరేకిస్తూ గజ్వేల్ ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి వేదికపైకి వెళ్లగా..అక్కడే ఉన్న డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి వర్గీయులు మల్లారెడ్డిని దిగిపోవాలని నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా పోలీసులకు, నర్సారెడ్డి వర్గీయులకు మధ్య తోపులాట జరిగింది. ఇదే క్రమంలో అక్కడే ఉన్న మల్లారెడ్డి కిందకు వచ్చి వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి వర్గీయులకు, మల్లారెడ్డితోపాటు అక్కడే ఉన్న నర్సారెడ్డిని వ్యతిరేకిస్తున్న మరో ఇద్దరు అసమ్మతి నేతలు సీనియర్ నాయకుడు నాయిని యాదగిరి, కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు విజయ్కుమార్ ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో పలువురు నాయకుల చొక్కాలు కూడా చిరిగిపోయాయి. ఇంతలోనే కలెక్టర్ హైమావతి లేచి సభ నిర్వహణకు సహకరించాలని కోరినా ఎవ్వరూ తగ్గలేదు. దీంతో అసహనానికి గురైన మంత్రి వివేక్ జోక్యం చేసుకుని నాయకులకు నచ్చజెప్పడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. ఆ తర్వాత మంత్రి తన ప్రసంగాన్ని పూర్తి చేశారు. -
క్రీడా సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి
రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ ఫాల్గుణసిద్దిపేటజోన్: రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత సిద్దిపేటలో అద్భుతమైన ఫుట్బాల్ మైదానం ఉందని రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఫాల్గుణ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఫుట్బాల్ మైదానంలో అష్మిత లీగ్ నాకౌట్ 2025 ఫుట్బాల్ టోర్నీ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇక్కడ ఆటకు తగ్గట్టుగా వసతులున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాలకూ చెందిన క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకుముందు మున్సిపల్ చైర్మన్ మంజుల, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిరాంలు మాట్లాడుతూ..క్రీడాహబ్గా సిద్దిపేటను తీర్చిదిద్దడానికి ఎమ్మెల్యే హరీశ్రావు చేసిన కృషి విస్మరించలేనిదన్నారు. సిద్దిపేట నుంచి జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడాకారులు వచ్చారని పేర్కొన్నారు. యువత క్రీడల పట్ల ఆసక్తి చూపాలని సూచించారు. రసవత్తరంగా పోటీలు అష్మిత ఫుట్బాల్ లీగ్ టోర్నీ పోటీలు రసవత్తరంగా సాగాయి. ఖేల్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో నిజామాబాద్ విజేతగా నిలిచింది. పోటీల్లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొనగా, ఫైనల్ మ్యాచ్ నిజామాబాద్, ఆదిలాబాద్ జట్ల మధ్య జరిగింది. 2–0గోల్స్తో నిజామాబాద్ విజయం సాధించింది. రన్నర్గా ఆదిలాబాద్, విజేతగా నిజామాబాద్ బహుమతులు అందుకున్నారు. కార్యక్రమంలో పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు సంపత్రెడ్డి, ఫుట్ బాల్ కోచ్ అక్బర్, అసోసియేషన్ అధ్యక్షుడు గణేష్, జాయింట్ సెక్రెటరీ సాజిద్, క్రీడాకారులు పాల్గొన్నారు. -
ఆదాయ మార్గాల వైపు నజర్
అనుమతులు గృహాలకు... నడుస్తున్నది కమర్షియల్ ● గ్రౌండ్ ఫ్లోర్కే పన్ను చెల్లింపులు.. పైఅంతస్తులకు ఎగవేత ● అక్రమ నిర్మాణాలకే పెనాల్టీ అంటున్న అధికారులు హుస్నాబాద్: మున్సిపల్ అధికారులు ఆదాయ మార్గాలపై దృష్టి సారించారు. అక్రమ ఇళ్ల నిర్మాణాలను గుర్తించే పనిలో పడ్డారు. హుస్నాబాద్ పట్టణంలో ఇళ్లు 6,039, కమర్షియల్ 579, మిక్స్డ్ 684 మొత్తం కలిపి 7,302 ఉన్నాయి. గత కొంత కాలంగా పట్టణంలో అక్రమ నిర్మాణాలు, గృహ నిర్మాణం పేరిట వాణిజ్య సముదాయాలు నడుపుతూ మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్నారనే ఉద్దేశంతో అధికారులు అక్రమ నిర్మాణాలపై కొరడా ఝళిపిస్తున్నారు. గతంలోనే పట్టణాన్ని నాలుగు డివిజన్లుగా విభజించి ఇంటి పన్నులు విధించారు. ప్రస్తుతం పట్టణంలో ప్రతి ఇంటిని భువన్ సర్వే చేసి ఇంటి విస్తీర్ణాన్ని కొలతలు వేసి ప్రత్యేక యాప్లో నిక్షిప్తం చేస్తున్నారు. పాత ఇంటి పన్నుల ఆధారంగానే విస్తీర్ణాన్ని బట్టి ఇంటి పన్నులు విధిస్తున్నారు. ప్రస్తుత మున్సిపల్ ఆదాయం ఏరియల్స్తో కలుపుకొని రూ.1.70 కోట్లు కాగా, దాన్ని మరింత పెంచుకునే మార్గాలను మున్సిపల్ అధికారులు అన్వేషిస్తున్నారు. ప్రతీఏటా రివిజన్ నిర్వహించాల్సి ఉంటుంది. పదేళ్లుగా ఆ పని చేయలేదు. ప్రస్తుతం ఇంటి రివిజన్ చేస్తుండటంతో ఇంటి పన్నులు పదింతలు పెరుగుతుండటంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. గృహ నిర్మాణం పేరిట వాణిజ్యం పట్టణంలోని మెయిన్రోడ్డు, అక్కన్నపేట రోడ్, నాగారం రోడ్లో కమర్షియల్ దుకాణాలు అధికంగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో చాలావరకు అక్రమ నిర్మాణాలు చేశారని అధికారుల నిర్ధారించుకున్నారు. ఇంటి (గృహ) నిర్మాణం కోసం అనుమతి తీసుకుని అందులో వాణిజ్య వ్యాపారాలు చేస్తున్నారు. దీంతో మున్సిపల్కు గృహ నిర్మాణ పన్ను మాత్రమే చెల్లిస్తున్నారు. అలాగే గ్రౌండ్ ఫ్లోర్కు గృహ నిర్మాణం అనుమతి తీసుకుని గ్రౌండ్ ఫ్లోర్తోపాటు పైన మరో రెండు అంతస్తులు వేసి వాణిజ్య పరమైన వ్యాపారాలు చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్కు మాత్రమే ఇంటి పన్ను చెల్లిస్తూ, పైన అక్రమంగా నిర్మించిన ఫ్లోర్లకు పన్నులు చెల్లించకుండా ఎగ్గోడుతున్నారని అధికారులు చెబుతున్నారు. దీంతో రూ.లక్షల పన్నులు మున్సిపల్కు చెల్లించకుండా భారీగా గండికొడుతున్నారని అధికారులు నిర్ధారణకు వచ్చారు. కొన్నేళ్లుగా అనుమతులు సరిగా తీసుకోకుండా పన్నులు చెల్లించని వ్యాపారులపై జరిమానాలు వేస్తూ ఆదాయాన్ని పెంచుకునే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకు 827 ఇండ్లకు రివిజన్ చేయగా, పన్నుల రూపంలో దాదాపు రూ.35 లక్షల వరకు ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. ఇంటి పన్నులు పెంచలేదు సీడీఎంఏ ఆదేశాల మేరకే రివిజన్ నిర్వహిస్తున్నాం. పాత ఇంటి పన్నులే తప్ప కొత్తగా పన్నులు పెంచలేదు. అక్రమ నిర్మాణాలు, ఇంటి పర్పస్ అనుమతి తీసుకొని వాణిజ్య వ్యాపారం చేసుకుంటున్న వారికి పెనాల్టీ వేస్తున్నాం. పన్నులు అధికంగా వేశారని అనుకుంటే దరఖాస్తు చేసుకుంటే మళ్లీ రివ్యూ చేస్తాం. –మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్, హుస్నాబాద్ -
నీట్ పీజీ పరీక్షకు 48 మంది హాజరు
సిద్దిపేటఅర్బన్: పొన్నాలలోని ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన నీట్ పీజీ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. సీబీటీ విధానంలో ఉదయం 9 గంటల నుంచి 12.30 గంటల వరకు నిర్వహించిన పరీక్షకు 48 మంది హాజరయ్యారు. ఇద్దరు విద్యార్థులు గైర్హాజరయ్యారు. డాక్టర్ నౌషీన్, డాక్టర్ స్రవంతి, టీసీఎస్ ఆఫీసర్ అఫ్సర్, పీఆర్వో బొడ్డు రఘు, సిస్టం అడ్మిన్ షాదుల్లా, కరీముద్దీన్ పరీక్ష కేంద్రాన్ని పర్యవేక్షించారు. పొన్నాల బాలయ్యకు సినారె పురస్కారంప్రశాంత్నగర్(సిద్దిపేట): సిద్దిపేట చెందిన ప్రముఖ కవి రచయిత పొన్నాల బాలయ్య ఆదివారం హైదరాబాద్ లో జరిగిన ఉత్సవంలో మహాకవి సినారె సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు. ఈ మేరకు మంజీర రచయితల సంస్థ సభ్యులు ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. హైదరాబాదులో సినారె కళాపీఠం, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జరిగిన ఉత్సవంలో ఈ పురస్కారాన్ని బాలయ్యకు ప్రదానం చేశారు. మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలి: సీఐటీయూనంగునూరు(సిద్దిపేట): పంచాయతీ కార్మికులకు అమలు చేస్తున్న మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సొప్పరి రవికుమార్ డిమాండ్ చేశారు. నంగునూరులో ఆదివారం పంచా యతీ కార్మికుల ప్రత్యేక సమావేశం నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దేవులపల్లి రాజమౌళి, ప్రధాన కార్యదర్శిగా కనకయ్య, కోశాధికారిగా రవీందర్, ఉపాధ్యక్షులుగా కనకవ్వ, రేణుక, కనకయ్య, సహాయ కార్యదర్శులుగా బాలయ్య, నర్సవ్వ, యాదవ్వ ఎన్నికయ్యారు. అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానంచేర్యాల(సిద్దిపేట): చేర్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీరాంకుమార్ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. కంప్యూటర్ సైన్స్–2, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్–3, సివిల్ ఇంజినీరింగ్–4, ఫిజిక్స్–1, మ్యాథ్స్–1, కెమిస్ట్రీ–1 పోస్టుల కోసం అర్హతగల అభ్యర్థులు ఈ నెల 2 నుంచి 5 వరకు స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. టెక్నికల్ విభాగాల కోసం బీఈ, బీటెక్లో ఫస్టు క్లాసులో ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. ఎంటెక్ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. సీఎం రేవంత్ మోసకారిఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణమాదిగ గజ్వేల్: అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా... దివ్యాంగులు, వృద్ధుల పింఛన్లు పెంచకుండా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దేశంలోనే మోసకారి ముఖ్యమంత్రిగా ఖ్యాతిని గడించారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ ఆరోపించారు. హైదరాబాద్లో దివ్యాంగులు, వృద్ధులు ఫించన్ల పెంపును డిమాండ్ చేస్తూ ఈనెల 13న నిర్వహించనున్న సభను విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం గజ్వేల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లను పెంచుతానని చెప్పిన సీఎం..20నెలలుగా రూ. 20వేల కోట్లు ఎగ్గొట్టారని ఆరోపించారు. ఈ నిధులను రుణమాఫీకి మళ్లించారని చెప్పారు. ఈ విషయాన్ని ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న కేసీఆర్ ప్రశ్నించకపోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో దివ్యాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు భూమయ్యయాదవ్, ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. -
స్నేహితుల దినోత్సవ వేడుకల్లో మహిళల సందడి
పచ్చని చెట్లు... చుట్టూ గుట్టలు, మధ్య నీటి సెలయేరు.. స్వచ్ఛమైన, ప్రకృతి రమణీయమైన వాతావరణంలో మహిళలు స్నేహితుల దినోత్సవ వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. మండలంలోని ఉమ్మాపూర్ మహాసముద్రం గండి వద్ద ఆదివారం హుస్నాబాద్ పట్టణానికి చెందిన పద్మావతి గ్రూప్ మహిళా సభ్యులు కలిసి స్నేహితుల దినోత్సవ వేడుకలను నిర్వహించారు. చేతులకు ఫ్రెండ్షిప్ బ్యాండ్లను కట్టుకుని కేక్ కట్ చేసి కుటుంబ సభ్యులతో కలిసి ఆటలు ఆడుతూ. పాటలు పాడుతూ ఆనందంగా గడిపారు. –హుస్నాబాద్ప్రకృతి ఒడిలో పచ్చని స్నేహం -
నీళ్లివ్వండి సారూ!
మర్కూక్(గజ్వేల్): మాజీ సీఎం కేసీఆర్ దత్తత గ్రామం నర్సన్నపేటలో నీటి ఎద్దడి నెలకొంది. గత 20 రోజులుగా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు, ప్రజా ప్రతినధులు పట్టించుకోకపోవడంతో ఆదివారం నర్సన్నపేట రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టింకుని మిషన్ భగీరథ నీరు వచ్చేలా చేయాలని కోరారు. కేసీఆర్ దత్తత గ్రామంలో 20 రోజులుగా రాని తాగు నీరు రోడ్డుపై మహిళల నిరసన -
ఎర్రవల్లి ఫాంహౌస్లో కేసీఆర్ కీలక సమావేశం.. వాటిపైనే చర్చ
సాక్షి, సిద్ధిపేట: ఎర్రవల్లి ఫాంహౌస్లో బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్తో కేసీఆర్ సమావేశమయ్యారు. కాళేశ్వరం నివేదిక, స్థానిక ఎన్నికలపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.గత గురువారం కూడా బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. కేసీఆర్.. ఎర్రవల్లి నివాసంలో ఆ పార్టీ నేతలతో సుదీర్ఘంగా భేటీ అవుతున్నారు. ఈ సమావేశాల్లో కీలక అంశాలపై చర్చించడంతో పాటు పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తున్నారు.మరో వైపు, ఉద్యమ పార్టీగా ప్రస్థానం ప్రారంభించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం పదేళ్లపాటు అధికారంలో కొనసాగి ప్రస్తుతం ప్రతిపక్ష పాత్రకు పరిమితమైన బీఆర్ఎస్ కొత్త తరానికి చేరువ అయ్యేందుకు అనుసరించాల్సిన వ్యూహానికి పదును పెడుతోంది. తెలంగాణ అస్తిత్వ పోరాటాలు, రాష్ట్ర సాధన ఉద్యమంలో బీఆర్ఎస్ పాత్ర, నదీ జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన ఆవశ్యకత తదితరాలను విద్యార్థులు, యువతకు నూరిపోయాలని భావిస్తోంది.టీఆర్ఎస్గా అవిర్భవించి గత 25 ఏళ్లుగా బీఆర్ఎస్ సాగిస్తున్న ప్రస్థానం, ఉద్యమ నాయకుడిగా, ప్రభుత్వాధినేతగా కేసీఆర్ చేసిన కృషిని వివరించాలని భావిస్తోంది. ఈ నెల 26న హైదరాబాద్లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే విస్తృత స్థాయి సమావేశం తరహాలో అన్ని జిల్లా కేంద్రాల్లోనూ సదస్సులు నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. -
‘బంధీ’తో స్నేహ బంధం
ప్రాణస్నేహితులను చేసిన కిడ్నాప్ ఘటన.. దుబ్బాక: ఓ కిడ్నాప్ ఘటన ముగ్గురిని ప్రాణస్నేహితులను చేసింది. 34 ఏళ్ల క్రితం కిడ్నాప్ ఘటన జరిగినా ఆ ముగ్గురి మధ్య ప్రేమ నేటికీ చెక్కుచెదరలేదు. ఆ నాటి సంఘటన ఒక్కసారి గుర్తు చేసుకుందాం.. 1991 ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా సీఎంగా నెదురుమల్లి జనార్దన్రెడ్డి ఉన్నారు. పీపుల్స్వార్ ప్రాబల్యం అధికంగా ఉన్న ఆ రోజుల్లో ప్రస్తుత మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఓ రోజు ఫారూఖ్ తన చిన్ననాటి స్నేహితుడు సికిందర్ తో కలిసి స్కూటర్పై దుబ్బాకకు వస్తున్న క్రమంలో అప్పటి దుబ్బాక పీపుల్స్ వార్ దళం కమాండర్గా ఉన్న రామన్న ఫారూఖ్, సికిందర్లను కిడ్నాప్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వరంగల్ జిల్లాకు చెందిన రామన్న ఉద్యమ రీత్యా దుబ్బాక ప్రాంతంలో పనిచేస్తుండగా అప్పటి వరకు వీరికి ఎలాంటి పరిచయంలేదు. కిడ్నాప్ అయినప్పుడే వీరికి రామన్న పరిచయం అయ్యాడు. ఆతర్వాత రామన్న పీపుల్స్వార్ పార్టీని వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చాక మాజీ ఎమ్మెల్సీ ఫారూక్, సికిందర్, రామన్నలు ప్రాణస్నేహితులయ్యారు. రామన్న ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో అ కుటుంబానికి ఫారూఖ్ హుస్సేన్ చాలా సార్లు అండగా నిలిచారు. వీరు ముగ్గురు తరుచూ కలుస్తూ తమ కష్ట సుఖాలు పంచుకుంటూ ఆదర్శ స్నేహితులుగా నిలిచారు. ఏదేమైనా బంధీ లో పరిచయంలో ఈ ముగ్గురిని ప్రాణస్నేహితులను చేయడం విశేషం. -
మన కోసం నిలబడే వాళ్లే..
సంగారెడ్డి టౌన్: స్నేహితుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. మనకోసం నిలబడే వాళ్లే నిజమైన స్నేహితులు. కష్టాలు, బాధలు, సంతోషాలను పంచుకుంటూ అందరితో కలిసిపోతూ ఉండాలి. నా చిన్న నాటి నుంచి ముగ్గురు స్నేహితులం. వారు వృత్తిరీత్యా ఇతర దేశాలో స్థిర పడినప్పటికీ సమయం దొరికినప్పుడు కలుస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరూ అందరితో కలిసి ఉండాలి. ‘నేను ఉన్నాను’ అనే ధైర్యం ఇవ్వాలి. సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ విజ్ఞాన పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి. – సౌజన్య, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆనాటి స్మృతులు మధురం ప్రశాంత్నగర్(సిద్దిపేట): స్నేహితులతో కలిసి మట్టిలో ఆడిన ఆటలు.. చెట్టు కొమ్మల్లో దాగిన రోజులు నేటికీ గుర్తుకువస్తే ఎంతో సంతోషంగా ఉంటోంది. మళ్లీ ఆరోజులు వస్తే బాగుండు అనిపిస్తుంది. నాడు ఎక్కడికి వెళ్లినా ఒక జట్టుగా వెళ్లేవాళ్లం. ఒకరింటికి మరొకరం వెళ్తూ సందడి చేసే వాళ్లం. వినాయక చవితి, దసరా, దీపావళి, బోనాలు, బతుకమ్మ, హోలీ పండుగలను మిత్రులతో సంతోషంగా జరుపుకొనేది. చాలా మంది మిత్రులు నేడు ఉపాధ్యాయ వృత్తితో పాటు ఇతర వృత్తుల్లో ఉన్నారు. ఏ హోదాలో ఉన్నా కలుసుకున్నపుడు అనుభూతి ఏర్పడుతోంది. – శ్రీనివాస్రెడ్డి, సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారి బాల్య స్నేహితుడికి బాసట శివ్వంపేట(నర్సాపూర్): బాల్య స్నేహితుడు అనార్యోగంతో మృతిచెందగా తోటి స్నేహితులు మేమున్నామంటూ బాధిత కుటుంబానికి బాసటగా నిలిచారు. శివ్వంపేటకు చెందిన శేరిపల్లి గోపాల్ అనారోగ్యంతో ఆరేళ్ల క్రితం మృతిచెందాడు. ఇతనికి భార్య ఇద్దరు కుతూళ్లు ఉన్నారు. పేద కుటుంబానికి చెందిన గోపాల్.. వర్గల్లోని నవోదయ విద్యాలయంలో 1992–93లో పదో తరగతి పూర్తి చేశాడు. అప్పటి నవోదయ స్నేహితులు గోపాల్ కుటుంబాన్ని ఆదుకున్నారు. స్నేహితులందరూ రూ.3 లక్షలు పోగుచేసి గోపాల్ కుమార్తెలు చందన, అక్షయ పేరిట బ్యాంకులో డిపాజిట్ చేశారు. -
ఖాళీ బిందెలతో.. మహిళల నిరసన
మిరుదొడ్డిలో నిలిచిన భగీరథ తాగునీటి సరఫరామిరుదొడ్డి(దుబ్బాక): మూడు రోజులుగా మండల కేంద్రమైన మిరుదొడ్డిలోని పలు వార్డుల్లో మిషన్ భగీరథ నీరు సరఫరా కావడం లేదని స్థానిక మహిళలు శనివారం ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. తాగునీటిని సరఫరా చేయడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. చాలా రోజులుగా అరకొరగా నీరు సరఫరా అవుతుండటంతో ఇబ్బందులు పడుతున్నామని అసహనం వ్యక్తం చేశారు. మూడు రోజులుగా తాగునీటి సరఫరా లేకపోవడంతో నీటి కోసం నానా తంటాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి తాగునీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. -
ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచండి
● సాగు విస్తీర్ణం మేరకే ఎరువులు ● కలెక్టర్ హైమావతివిద్యార్థులకు నాణ్యమైన ఆహారం ఇవ్వాలి అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్కొమురవెల్లి(సిద్దిపేట): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నిర్ణీత ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ హైమావతి లబ్ధిదారులకు సూచించారు. శనివారం మండల కేంద్రంలో ఎంపీడీవో శ్రీనివాసవర్మతో కలిసి నూతనంగా నిర్మాణం చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల పనులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశు వైద్యశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం , ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గొర్రెలకు ఇచ్చే బ్లూటాంగ్ వ్యాక్సిన్ ప్రకియను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ సమయంలో మెడికల్ ఆఫీసర్ సెలవులో ఉన్నాడని డ్యూటీ నర్సు తెలుపడంతో జిల్లా వైద్యాధికారికి ఫోన్చేసి సెలవు మంజూరుపై ఆరా తీశారు. జెడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పప్పు ఉడకకపోవడంతో వంట మనుషులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలోని సేల్స్ రిజిస్టర్ను పరిశీలించి రైతులకు విస్తీర్ణం ప్రకార మే ఎరువులు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో రమేశ్, పంచాయతీ కార్యదర్శి హరీశ్, అధికారులు పాల్గొన్నారు. జిల్లాను ఆదర్శంగా నిలపాలి సిద్దిపేటరూరల్: జిల్లాలోని రైతులను ఆర్థికంగా బలోపేతం చేసి ఆదర్శంగా తీర్చిదిద్దే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ఉద్యాన, వ్యవసాయ, ఆయిల్ ఫెడ్ శాఖల అధికారులతో ఆయిల్ పామ్ సాగు, ఫార్మర్ రిజిస్ట్రీ అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ సాగుపై ఉత్సాహం చూపుతున్న రైతులను ప్రోత్సహించడంతోపాటు మండల వ్యవసాయ అధికారులకు నిర్దేశించిన మేర సాగు జరిగేలా ప్రయత్నం చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, ఉద్యానవనశాఖ అధికారి సువర్ణ, వ్యవసాయ శాఖ అధికారి స్వరూపరాణి, టీజీ ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.ప్రశాంత్నగర్(సిద్దిపేట): గురుకుల విద్యార్థులకు నాణ్యమైన, బలవర్థకమైన అహారం అందించాలని, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని మహాత్మాజ్యోతిపూలే బీసీ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం, స్టోర్ రూమ్ గల సరుకులను, కూరగాయలను పరిశీలించారు. విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ను తనిఖీ చేశారు. విద్యార్థులకు కచ్చితంగా మెనూ ప్రకారం ఆహారాన్ని అందించాలని, వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రిన్సిపాల్ను ఆదేశించారు. అనంతరం కేసీఆర్ నగర్ డబుల్ బెడ్ రూం కాలనీలోని గ్రంఽథాలయంను పరిశీలించారు. పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రగతిని పరిశీలించారు. ఇండ్ల నిర్మాణ వేగంగా జరిగేలా పర్యవేక్షించాలని మున్సిపల్, హౌసింగ్ అధికారులను ఆదేశించారు. -
సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు
హుస్నాబాద్: విద్యార్థుల్లో చదవాలనే సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల కోసం శంషాబాద్ డిప్యూటీ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ అయిలేని శ్రీనివాస్ రెడ్డి శనివారం గ్రంథాలయానికి పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పోటీ పరీక్షల్లో నెగ్గి ఉద్యోగాలు సాధించిన వారు తమ వద్ద ఉన్న పుస్తకాలను గ్రంథాలయానికి ఇస్తే పేద విద్యార్థులకు ఉపయోగపడతాయని తెలిపారు. చదువు ఉంటే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మాజీ ఎంపీపీ వెంకట్, సత్యనారాయణ, అశోక్, రిటైర్డు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రంగనాయక సాగర్పై హెచ్చరిక బోర్డు చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని చంద్లాపూర్ శివారులోని రంగనాయక సాగర్ రిజర్వాయర్పై నిఘా లేకపోవడంతో పర్యాటకులు ప్రమాదాలకు గురవుతున్నారని రంగనాయకా.. రక్షణ ఏది? అనే శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. స్పందించిన పోలీ సులు శనివారం రిజర్వాయర్పై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. పర్యాటకులు ఈ ప్రాంతాల్లోకి వెళ్లొద్దని సూచనలు చేశారు. ఎస్ఐ సైఫ్ అలీ మాట్లాడుతూ.. ప్రతిరోజు సాయంత్రం సాగర్ కట్టపై పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు. ఆకతాయిలపై నిఘా ఏర్పాటు చేసి వారిపై చర్యలు తీసుకుంటామని, కట్టపై బైక్ రైడింగ్ నిషేధించామని పేర్కొన్నారు. ‘భగీరథ’మరమ్మతులు ప్రారంభం వర్గల్(గజ్వేల్): ‘భగీరథ లీకై ంది..తోట చెరువైంది’ శీర్షికతో శనివారం సాక్షిలో కథనం ప్రచురితమైంది. స్పందించిన మిషన్ భగీరథ అధికారులు మండలంలోని గౌరారం వద్ద లీకేజీకి గురైన పైపులైన్ వద్ద మరమ్మతు పనులు ప్రారంభించారు. జేసీబీ యంత్రంతో తవ్వకాలు జరిపి లీకేజీని గుర్తించారు. చీకటిపడే వరకు పనులు కొనసాగించారు. ఆదివారం మరమ్మతులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. కాగా కూరగాయల తోట, పొలాల్లో నీరు బయటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో అలాగే నిలిచిపోయింది. గడువు ముగిసిన మందులు ఉండొద్దు డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ సిద్దిపేటకమాన్: గడువు ముగిసిన మందులు నిల్వ ఉండకుండా చూసుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ తెలిపారు. సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలోని టీ హబ్ను, సెంట్రల్ డ్రగ్ స్టోర్ను డీఎంహెచ్ఓ శనివారం తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆరోగ్య కేంద్రాల నుంచి వచ్చిన బ్లడ్ శాంపిల్స్ను పరీక్షలు నిర్వహించి ఫలితాలను అదే రోజు పంపించాలని సూచించారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ రేవతి, టీహబ్ మేనేజర్ అనిల్కుమార్ పాల్గొన్నారు. -
నిజమైన మిత్రులు.. ఇద్దరి కంటే ఎక్కువ ఉన్న వారే అధికం
స్నేహానికి కన్న మిన్న.. లోకాన లేదురా.. అనేది ఒకప్పటి సినిమా పాట. ఇది నిజమేనంటున్నారు ఇప్పటి యువత, విద్యార్థులు, ఉద్యోగులు. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ బృందం ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రత్యేక సర్వే నిర్వహించింది. మొత్తం వంద మందితో ఈ సర్వే చేసింది. యువత, విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న వారు, వృత్తి నిపుణులు.. వివిధ వర్గాలకు చెందిన వారి ఒపీనియన్లను సేకరించింది. తమ అభిప్రాయలు వెలుబుచ్చిన వారిలో సగం మంది మహిళలు ఉన్నారు. ఈ సర్వే ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. కల్మషం లేనిదే నిజమైన స్నేహమని ఎక్కువ మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, నిజమైన స్నేహంలో స్వార్థానికి తావులేద ని చెప్పారు. అవసరాలు తీర్చేదే స్నేహమని తక్కువ మంది తన అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. స్నేహం కలుషితమవుతోంది.. ప్రస్తుత రోజుల్లో ఫ్రెండ్ షిప్ కలుషితమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వంద మందిలో 57 మంది ఇదే అబిప్రాయాన్ని చెప్పారు. ఎలాంటి కలుషిత కాలేదని 47 శాతం మంది చెప్పారు. ప్రస్తుత రోజుల్లో స్నేహితులు ఎంతో మంది ఉంటారు. కానీ నిజమైన స్నేహితులు పరిమితంగానే ఉంటారు. మీకు నిజమైన స్నేహితులు ఎంత మంది ఉన్నారనే ప్రశ్నకు ఇద్దరి కంటే ఎక్కువ మంది నిజమైన స్నేహితులు ఉన్నారని చెప్పిన వారే అధికంగా ఉన్నారు. ఇద్దరు కంటే ఎక్కువ మంది స్నేహితులున్నారని 61 మంది చెప్పగా, ఒక్కరే నిజమైన స్నేహితుడు ఉన్నాడని 39 మంది అన్నారు. మొదటగా కన్నవారే.. కన్న వారి తర్వాతే మిత్రుడికి స్థానమని ఎక్కువ మంది చెప్పారు. 67 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని తెలిపారు. 27 శాతం మంది ఫ్రెండ్ తర్వాతే అమ్మానాన్న అని చెప్పిన వారు కూడా ఉన్నారు. నాన్న, అమ్మ, ఫ్రెండ్ అని చెప్పిన వారు 16 మంది ఉన్నారు. – సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి, సంగారెడ్డి జోన్/మెదక్ జోన్/సిద్దిపేట3) మీకు ఎంతమంది నిజమైన ఫ్రెండ్స్ ఉన్నారు?4) మీ ఫ్రెండ్కు మీరు ఇచ్చే స్థానం?2) ఫ్రెండ్షిప్ కూడా కలుషితం అయ్యిందా?నాన్న, అమ్మ, ఫ్రెండ్అమ్మ, నాన్న, ఫ్రెండ్ అని చెప్పిన వారుఒకరులేదు394357అవును61ఫ్రెండ్, అమ్మ, నాన్నఇద్దరికి మించిఉమ్మడి జిల్లాలో సర్వే వివరాలు..1) ఫ్రెండ్ షిప్ అంటే మీ దృష్టిలో..7426 కన్నవారి తర్వాతే మిత్రుడు.. ప్రస్తుత స్నేహ బంధాలు కలుషితం అవుతున్నాయి ఫ్రెండ్షిప్ డే సందర్భంగా సాక్షి సర్వే ఆసక్తి కరమైన అంశాలు వెలుగులోకి..అవసరాలు తీర్చేది అని..కల్మషం లేనిది అని చెప్పిన వారు -
నకిలీ ఎరువుల కలకలం
● ఇష్టారాజ్యంగా విక్రయాలు ● పట్టించుకోని అధికారులు ● ఆందోళన చెందుతున్న రైతులుఈ ఎరువును ఎప్పుడు చూడలేదు వరినాటులో ఎరువు చల్లేందుకు డీఏపీ బస్తా కోసం ఎరువుల దుకాణానికి వెళితే అది అందుబాటులో లేదని భూమిలాబ్ 19.19.19 అనే ఎరువును అంటగట్టాడు. దానిని పొలంలో చల్లితే పని చేయలేదు. దీనిపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియడం లేదు. అధికారులు స్పందించి నకిలీ ఎరువుల బెడదను అరికట్టాలి. –కిష్టారెడ్డి, రైతు, మర్రిముచ్చాల కొమురవెల్లి(సిద్దిపేట): మండలంలోని ఎరువుల దుకాణాల్లో నకిలీ ఎరువులు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. బోరుబావుల కింద కొద్దో గొప్పో సాగు చేస్తున్న రైతులకు ఎరువుల దుకాణదారులు నకిలీ ఎరువులను అంటగడుతున్నారు. మనుగడలో లేని కంపెనీ పేర్లతో ఉన్న ఎరువుల బస్తాలు, దంటు గుళికలు , పురుగుమందులు విక్రయిస్తూ రైతులకు ఆర్థికంగా నష్టం చేకూరుస్తున్నారు. ఇంత జరిగినా వ్యవసాయ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం శాపంగా మారింది. గ్రోమోర్ 20.20.0.13, గోదావరి డీఏపీ , 14.35.14, 19.19.19, 17.17.17 ఇట్లాంటి పేరున్న కంపెనీ ఎరువులు అమ్మితే దుకాణదారులకు తక్కువ లాభాలొస్తాయి. కానీ, పంటలకు, రైతులకు మేలు జరుగుతుంది. ఇందుకు భిన్నంగా మండలంలో ఎక్కడ కనబడని కంపెనీ పేర్లతో ఉన్న ఎరువులు అంటగడుతున్నారు. కారణం వీటిపై ఎక్కువ లాభాలు వస్తుండటంతో వాటినే విక్రయిస్తున్నారు. ఈ నాసిరకం ఎరువులు వాడిన అన్నదాతలు చేను ఎదకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి నకిలీ ఎరువులు, పురుగుమందులు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నకిలీ ఎరువులు విక్రయిస్తే చర్యలు మండలంలో నకిలీ ఎరువులు విక్రయిస్తున్నట్లు మా దృష్టికి ఇంత వరకు రాలేదు. మా పరిశీలనలో తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. –వెంకట్రావమ్మ, మండల వ్యవసాయ అధికారి -
అసభ్యంగా మాట్లాడటంతోనే హత్య
● ఐకేపీ ఉద్యోగి కేసులో నలుగురు నిందితులు అరెస్టు ● వివరాలు వెల్లడించిన పోలీసులుములుగు(గజ్వేల్): అదృశ్యమై హత్యకు గురైన ఐకేపీ ఉద్యోగి కేసులో పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. శనివారం ములుగు పోలీస్స్టేషన్లో గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్రెడ్డి, ఎస్ఐ విజయ్కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. ములుగుకు చెందిన ఐకేపీ ఉద్యోగి తిగుళ్ల నెహ్రూ(35) గతనెల 28న అదృశ్యమైనట్టు బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. నెహ్రూ, మజీద్పల్లి గ్రామానికి చెందిన గామిలిపురం మహేశ్ కలిసి చిట్ఫండ్ లావాదేవీలు నిర్వహించేవారు. మహేశ్కు కొండపాక సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న నిషారాణితో వివాహేతర సంబంధం ఉంది. ఆమెకు చెందిన బంగారాన్ని వర్గల్లోని ఓ మైక్రో ఫైనాన్స్లో పెట్టి ఆ డబ్బును చిట్ఫండ్కు వినియోగించనున్నట్లు మహేశ్ జూలై 28న ఆమెతో చెప్పాడు. నిషారాణి హామీదారుగా నెహ్రూను తీసుకురావాలని చెప్పింది. దీంతో మహేశ్ ములుగు నుంచి నెహ్రూను కారులో తీసుకుని నిషారాణి ఇంటికి వెళ్లాడు. ఇదే సమయంలో నిషారాణిపై నెహ్రూ అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో మహేశ్ అతడిపై దాడిచేశాడు. అపస్మారక స్థితిలోకెళ్లిన నెహ్రూను ఒక వైర్తో గొంతునులిమి హత్య చేశాడు. ఆ మృతదేహాన్ని నిషారాణితోపాటు ఆమె తండ్రి నారదాసు కొమురయ్య సాయంతో కారులో తీసుకువెళ్లి గాగిళ్లాపూర్ సమీపంలోని ఓ చెరువులో పడేశారు. అనంతరం మహేశ్ రూ.15 వేల చిట్ఫండ్ డబ్బును నెహ్రూ భార్యకు అందించి అతను బాగానే ఉన్నాడని నమ్మించే ప్రయత్నం చేశాడు. నెహ్రూ ఫోన్ను ములుగు కొండపోచమ్మ కాలువలో పడేశాడు. విచారణలో భాగంగా ప్రధాన నిందితుడు గామిలిపురం మహేశ్, అతడికి సహకరించిన నిషారాణి, ఉబ్బని వినయ్, నారదాసు కొమురయ్యను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి రెండు కార్లు, నాలుగు సెల్ఫోన్లు, టీవీఎస్ ఎక్సెల్ వాహనం, మైక్రో ఫైనాన్స్లోని బంగారం రుణానికి సంబంధించిన రశీదును స్వాధీనం చేసుకున్నారు. -
గ్రూపులుంటేనే మజా
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి /వట్పల్లి : రాజకీయ పార్టీల్లో ఆధిపత్య పోరు, గ్రూపులు లేకుంటే ఆ పార్టీ అభివృద్ధి చెందదని, గ్రూపులు ఉంటేనే ఉత్సాహం ఉంటుందని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ పేర్కొన్నారు. గ్రూపు తగాదాలు లక్ష్మణ రేఖ దాటవద్దని సూచించారు. అన్ని నియోజకవర్గాల్లో గ్రూపులు ఉంటాయని, ఎన్నికలు వస్తే అన్ని గ్రూపులు ఒక్కటై పోరాడి విజయం సాధించాలని హితవు పలికారు. తాము మాత్రం అన్ని గ్రూపులకు సమాన ప్రాధాన్యమిస్తామని స్పష్టం చేశారు. జనహిత పాదయాత్రలో భాగంగా కాంగ్రెస్ నాయకులు శనివారం జోగిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో నిర్వహించిన శ్రమదాన కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం సంగుపేటలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమని, చాలా ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్న వారికే ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. పార్టీకి కొత్త నీరు కూడా అవసరమని అందుకే 15% కొత్తవారిని కూడా తీసుకుంటున్నామని, పాత, కొత్తలతో ముందుకు సాగుతున్నామన్నారు. సర్వేల ఆధారంగానే స్థానిక టికెట్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇస్తామని, సర్వేల ఆధారంగానే కేటాయింపు ఉంటుందని మహేశ్కుమార్గౌడ్ పేర్కొన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ సురేశ్షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్రెడ్డి, పార్టీ నాయకులు చంద్రశేఖర్, రాజిరెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలోపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ -
మల్లన్నసాగర్ పైపులైన్ పూర్తవడంతో సంబరాలు
కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీగా జలాభిషేకాలు గజ్వేల్: స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ...గజ్వేల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీ కార్యక్రమాలతో ముందుకుసాగుతున్నాయి. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి గజ్వేల్కు రూ.210కోట్లతో చేపట్టిన ప్రత్యేక మిషన్ భగీరథ పైపులైన్ పనులు పూర్తయి మంచినీటి సరఫరా ప్రారంభమైంది. శనివారం రెండు పార్టీలు జలాభిషేకాలు నిర్వహించాయి. డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు గజ్వేల్ మండలం కోమటిబండ గుట్టపై ఉన్న మిషన్ భగీరథ హెడ్వర్క్స్ వద్ద సీఎం రేవంత్రెడ్డి చిత్రపటానికి జలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ సీఎం చొరవ తీసుకొని రూ.210కోట్లు మంజూరు చేయడం వల్లే గజ్వేల్కు మల్లన్నసాగర్ నుంచి మిషన్ భగీరథ ప్రత్యేక పైపులైన్ వచ్చిందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కృషివల్లే గజ్వేల్కు మిషన్ భగీరథ నీరు వచ్చిందని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ గజ్వేల్లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకులతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి జలాభిషేకం చేశారు. -
100 అడుగుల దూరం
గజ్వేల్: మున్సిపాలిటీలను సమగ్ర పట్టణాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ‘వంద రోజుల ప్రణాళిక’ కార్యక్రమం కొనసాగుతున్నది. తాజాగా శనివారం నాటికి ఈ కార్యక్రమం 62వ రోజుకు చేరుకుంది. పారిశుద్ధ్యం మొదలుకొని ఆస్తి పన్నుల అసెస్మెంట్, భువన్సర్వే, ట్రేడ్ లైసెన్స్లు తదితర అంశాలపై కార్యాచరణ కొనసాగుతున్నది. మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న ఈ కార్యక్రమాలను మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు మదింపు చేస్తున్నారు. కానీ సిబ్బంది కొరత, ఇతర సమస్యలు కార్యక్రమం లక్ష్యానికి అవరోధంగా మారుతున్నాయి. జిల్లాలో సిద్దిపేట మినహా గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక పట్టణాలు 2012లో మేజర్ పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా చేశారు. చేర్యాలను ఆరేళ్లక్రితం మున్సిపాలిటీగా మార్చారు. అప్గ్రేడ్ అయిన తర్వాత ఆయా పట్టణాల్లో మెరుగైన పాలన అందుతుందని ప్రజలు భావించారు. కానీ పరిస్థితిలో ఏ మార్పు లేదు. పారిశుద్ధ్యం మొదలుకొని అన్ని అంశాల్లోనూ సమస్యలున్నా యి. సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమా లు సక్రమంగా సాగటం లేదు. అంతేకాదు.. ఇంటి పన్నుల అసెస్మెంట్, ఇళ్ల అనుమతులు, ఇంటి నంబర్ల కేటాయింపు, నల్లాల ఆన్లైన్, ట్రేడ్ లైసెన్స్లు, భువన్ సర్వే తదితర అంశాల్లో మెరుగైన సేవలు అందటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ‘100 రోజుల ప్రణాళిక’ కార్యక్రమం కొనసాగుతున్నది. సెప్టెంబర్ 10 వరకు.. తాజాగా శనివారం నాటికి వంద రోజుల ప్రణాళిక కార్యాచరణ 62వ రోజుకు చేరుకున్నది. సెప్టెంబర్ 10వరకు కొనసాగనున్నది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రస్థాయిలో మున్సిపల్ ఉన్నతాధికారులు రోజువారీగా విశ్లేషిస్తున్నారు. రోజువారీగా చేపట్టే అంశాలకు సంబంధించి ఆయా మున్సిపాలిటీల పనితీరును మదింపు చేస్తున్నారు. వెనుకబడుతున్న వాటికి తగు లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో అనుకున్న స్థాయిలో ఈ కార్యక్రమం ఫలితాలు కనిపించడం లేదు. సాధారణ స్థాయిలోనే కార్యాచరణ కొనసాగుతున్నది. సిబ్బంది కొరత, ఇతర సమస్యల వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని తెలుస్తోంది. ప్రహసనంగా వంద రోజుల ప్రణాళిక సిబ్బంది కొరతతో ఇబ్బందులు జిల్లాలోని మున్సిపాలిటీల పరిస్థితిపై పరిశీలన -
ఆప్తులున్నవారే అసలైన అదృష్టవంతులు
మెదక్ మున్సిపాలిటీ: వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా.. ఎన్ని ఆస్తులున్నా.. ఆప్తులను సంపాదించుకున్న వారే అదృష్టవంతులు. ఎవరి సమక్షంలో మన బాధలు సగం అవుతాయో.. ఎవరి కారణంగా మన ఆనందం రెట్టింపు అవుతుందో వారే అసలైన ఆప్త మిత్రులు. మానవ బంధాలన్నీ ఆర్థిక సంబంధాలతో ముడిపడుతున్న ఈ ఆధునిక యుగంలో స్వచ్ఛమైన స్నేహం కోసం తాపత్రయపడే వాళ్లెందరో ఉన్నారు. నేను డ్యూటీలో ఎంత బిజీగా ఉన్నా.. రోజూ స్నేహితులతో పది నిమిషాలు మాట్లాడతా. చిన్నప్పుడు కలిసి చదువుకున్న స్నేహితులతో ఇప్పటికీ కలుస్తాను. వారితో మాట్లాడి, ఊరు విషయాలు, కుటుంబ విషయాలు, ఇతర విషయాల గురించి చర్చించుకుంటాం. స్నేహితులతో కలిసి మాట్లాడటం వల్ల ఎంతో రిలీఫ్ ఉంటుంది. – డీవీ శ్రీనివాసరావు, ఎస్పీ, మెదక్ జిల్లా -
యోగాతో మానసిక ఒత్తిడి దూరం
ఎమ్మెల్యే హరీశ్ రావుసిద్దిపేటజోన్: యోగాతో మానసిక ఒత్తిడిని దూరం అవుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. శనివారం స్థానిక విపంచి ఆడిటోరియంలో అస్మితా యోగాసనా సిటీ లీగ్ – 2025 మహిళల యోగా పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కరోనా ప్రజల జీవితాల్లో అనేక మార్పులు తెచ్చిందని, కరోనా తర్వాత యోగా ప్రాముఖ్యత పెరిగిపోయిందన్నారు. లక్షలు ఖర్చు పెట్టి ఆస్పత్రుల్లో నయం చేసుకునే కంటే ముందుగానే స్వీయ రక్షణ ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ యోగా, వాకింగ్ లాంటి తప్పనిసరి చేయాలన్నారు. యువతులు, బాలికలు వేసిన యోగాసనాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మంజుల, వైస్ చైర్మన్ కనకరాజు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు వేణుగోపాల్రెడ్డి, సాయిరాం, డాక్టర్ అరవింద్, నిర్వాహకులు సతీశ్, సంధ్య, అంజయ్య, అశోక్ శ్రీనివాస్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, విజయ పాల్గొన్నారు. -
విధులు నిర్వర్తించని డాక్టర్లపై చర్యలు
● సమయపాలన తప్పనిసరి ● కలెక్టర్ హైమావతిసిద్దిపేటరూరల్: విధులు నిర్వర్తించని వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామ కలెక్టర్ హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో జిల్లా, మండల, వైద్యారోగ్య శాఖ అధికారులతో అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్యులు సమయానికి ఆస్పత్రికి రావాలని, అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవన్నారు. గ్రామాల్లో డ్రై డే కార్యక్రమాలు మరింతగా మెరుగు పరచాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. డెంగీ, మలేరియా కేసులు వస్తే ఆ ప్రాంతం చుట్టూ ఫాగింగ్ చేయాలన్నారు. ఇంటింటికి తిరుగుతూ ఫీవర్ సర్వే వివరాలను సేకరించాలన్నారు. ఆస్పత్రుల్లో సీసీకెమెరా, బయోమెట్రిక్ అమలు చేసేలా చూడాలని డీఎంహెచ్ఓకు తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ ధనరాజ్, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. భూ భారతి పక్కాగా చేపట్టాలి కొండపాక(గజ్వేల్): భూ హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతిని పక్కాగా చేపట్టాలని, పారదర్శకత లోపించవద్దని కలెక్టర్ హైమావతి సూచించారు. కొండపాకలోని సమీకృత మండల సముదాయ కార్యాలయ సముదాయాన్ని శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. రెవెన్యూ, ఎంపీడీఓ కార్యాలయాల పనితీరును పరిశీలించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ భారతి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. భూభారతి చట్టం అమలుపై ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పనుల్లో ప్రత్యేక దృష్టి సారించి వేగిరం చేయాలన్నారు. బెజ్జంకిలో ఆకస్మిక తనిఖీలు బెజ్జంకి(సిద్దిపేట): బెజ్జంకి, గుండారం గ్రామాలలో కలెక్టర్ హైమావతి శుక్రవారం ఆకస్మిక పర్యటించారు. బెజ్జంకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా స్టాఫ్ నర్స్తో పాటు అటెండర్ మాత్రమే ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో రాని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ డీఎంహెచ్ఓను ఆదేశించారు. రోగుల పట్ల నిర్లక్ష్యం చేసినా, పరిశుభ్రంగా లేకపోయినా సహించేది లేదని హెచ్చరించారు. ఆగ్రోస్ కేంద్రంలో తనిఖీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూభారతి దరఖాస్తుల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం గుండారంలోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. మధ్యాహ్న భోజన నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. -
పట్టు పెంచుదాం..
పట్టు ఉత్పత్తిలో జిల్లాకు మరోసారి గుర్తింపు వచ్చింది. 2030 నాటికి ప్రపంచంలోనే మన దేశం నంబర్ వన్ స్థానానికి చేరేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ‘నా పట్టు... నా గర్వం’ (మేరా రేషమ్.. మేరా అభిమాన్) అనే వంద రోజుల ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందుకు దేశ వ్యాప్తంగా 128 జిల్లాలను ఎంపిక చేయగా అందులో సిద్దిపేట జిల్లా ఉండటం విశేషం. – సాక్షి, సిద్దిపేట పట్టు ఉత్పత్తిలో దేశం రెండో స్థానంలో ఉన్నా.. వినియోగంలో మొదటి స్థానంలో నిలిచింది. సిద్దిపేట జిల్లాలో పట్టు అధికంగా ఉత్పత్తి అవుతుండటంతో కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. దేశంలో బనారస్, కశ్మీరీ వస్త్రాలు, బలుచారి కంజీవరం, మైసూర్, గద్వాల, పోచంపల్లి, వెంకటగిరి లాంటి చీరలకు వాడేది మన జిల్లాలో ఉత్పత్తి అయిన పట్టుదారమే. మన పట్టు.. నాణ్యమైంది రాష్ట్రం భౌగోళికంగా సమశీతోష్ణ స్థితి ప్రాంతంలో దక్కన్ పీఠభూమిలో ఉంది. ఈ విధమైన వాతావరణ పరిస్థితులు పట్టు ఉత్పత్తికి అనుకూలం. 2019–20కి గాను దేశంలోనే అత్యంత నాణ్యమైన బైవోల్టన్ పట్టు ఉత్పత్తి రాష్ట్రంగా తెలంగాణకు కేంద్రం అవార్డు కూడా ఇచ్చింది. మొదట పట్టు పురుగుల పెంపకం ఐదు దశలుగా ఉండేవి. వీటిని మొత్తం రైతులే నిర్వహించేవారు. ఇప్పుడు మొదటి రెండు దశలను చాకీ కేంద్రం పెంచుతోంది. మరో మూడు దశలు రైతులే పెంచుతున్నారు. దీని వలన పంట నాణ్యత పెరగడమే కాకుండా పంటకాలం కూడా తగ్గింది. గతంలో క్రాస్ బ్రీడ్ రకం పెంచేవారు. కానీ ఇప్పుడు జన్యు మార్పిడి చెందిన బైవోల్టన్ రకం వచ్చింది. దీనివల్ల పంట దిగుబడి గణనీయంగా పెరిగింది. ఇవే కాకుండా మల్బరీ సాగు రకాలు కూడా జన్యు మార్పిడి ఆధునికతతో అత్యధిక ఆకుల దిగుబడి వస్తుంది. దీంతో గతంతో పోలిస్తే పట్టుసాగులో చాలా మార్పులు వచ్చి లాభదాయకంగా మారింది. ప్రత్యేక యాప్లో వివరాల సేకరణ జూలైలో వివిధ కార్యక్రమాలు చేపట్టగా, ఆగస్టు, సెప్టెంబర్లలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో బేస్లైన్ సర్వేలో రైతులను కలిసి వివరాలను సేకరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పట్టు పరిశ్రమ శాఖకు చెందిన ప్రత్యేక యాప్లో నమోదు చేస్తున్నారు. రైతులు ఎలాంటి సాయం కోరుతున్నారు? మార్కెట్ ధరలు, సాగులో ఇంకా టెక్నాలజీ కావాలంటున్నారా? అనేది తెలుసుకుంటున్నారు. ఈ వివరాలతో దేశ వ్యాప్తంగా యాక్షన్ ప్లాన్ రూపొందించనున్నారు. కొత్త రైతులు పట్టు ఉత్పత్తి వైపు మళ్లించేందుకు అవగాహన కల్పించనున్నారు. ఇలా కార్యక్రమాలు నిర్వహిస్తూ మల్బరీ సాగు పెంచేందుకు కృషి చేయనున్నారు. త్వరలో అవగాహన సదస్సులు కేంద్ర ప్రభుత్వం ‘నా పట్టు.... నా గర్వం’ అనే నినాదంతో పట్టు ఉత్పత్తి పెంచేందుకు కృషి చేస్తోంది. ఈ కార్యక్రమం సెప్టెంబర్ వరకు కొనసాగనుంది. త్వరలో జిల్లాలో అవగాహన సదస్సులను ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. పట్టు ఉత్పత్తితో రైతులకు అధిక ఆదాయం వస్తుంది. – వినోద్ కుమార్, సీనియర్ శాస్త్రవేత్త,ప్రాంతీయ పట్టు పరిశోధన కేంద్రందేశంలోనే కీర్తి సాధిద్దాం ‘నా పట్టు.. నా గర్వం’ కార్యక్రమానికి కేంద్రం శ్రీకారం దేశ వ్యాప్తంగా సిద్దిపేటకు ప్రత్యేక స్థానం సెప్టెంబర్ వరకు కొనసాగనున్నకార్యక్రమాలు జిల్లాలో 1,500 ఎకరాల్లోమల్బరీ సాగు లక్ష్యంజిల్లాలో వంద టన్నుల ఉత్పత్తి రాష్ట్రంలో 17వేల ఎకరాల్లో సాగు అవుతుండగా అధికంగా మన జిల్లాలోనే సాగవుతోంది. జిల్లాలో 1,216 ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తుండగా 100 టన్నుల పట్టుల ఉత్పత్తి అవుతోంది. చిన్నకోడూరు, బెజ్జంకి, కొండపాక, తొగుట, సిద్దిపేట అర్బన్, రూరల్, కొమురవెల్లి హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట, మద్దూరు, చేర్యాల, జగదేవ్పూర్, గజ్వేల్, మర్కూక్, మిరుదొడ్డి, దౌల్తాబాద్, దుబ్బాక, నారాయణరావుపేట్ మండలాల్లో రైతులు పట్టు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది 1,216 ఎకరాల నుంచి 1,500లకు పెంచేందుకు లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా 100 రోజుల ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. సిద్దిపేటకు ప్రాంతీయ పట్టు పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త వినోద్ కుమార్ను ఇన్చార్జీలుగా నియమించారు. -
ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెంచాలి
సిద్దిపేటకమాన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుతున్న వైద్య సేవలపై ప్రజలకు నమ్మకం కలిగించేలా విధులు నిర్వహించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని మలేరియా యూనిట్, బస్తీ దవాఖానను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. గర్భిణులకు, చిన్నపిల్లలకు వేసే వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సిబ్బంది సమయ పాలన పాటించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ సరిత, డాక్టర్ దివ్యశ్రీ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రసవాల సంఖ్య పెంచండినంగునూరు(సిద్దిపేట): ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని జిల్లా వైద్యాధికారి ధన్రాజ్ అన్నారు. రాజగోపాల్పేట ప్రభుత్వ ఆస్పత్రిని శుక్రవారం తనిఖీ చేసి ల్యాబ్, మెడికల్ స్టోర్, ఓపీ, సిబ్బంది వివరాలు సేకరించి రికార్డులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అంకితభావంతో విధులు నిర్వహించాలి డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ -
‘భగీరథ’ లీకై ంది.. తోట చెరువైంది
● రైతులకు తీరని నష్టం ● గౌరారం వద్ద ఘటన..వర్గల్(గజ్వేల్): భగీరథ పైపులైన్ లీకై ంది. నీరు వరదలా ప్రవహించింది. పంట చేన్లు చెరువులా మారింది. వర్గల్ మండలం గౌరారం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఊహించని ఈ ఘటనతో పొలంలో మోకాలు లోతు నీరు నిలిచి కాత దశలో పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం రాత్రి నుంచి గౌరారం రాజీవ్ రహదారి వ్యవసాయ క్షేత్రాల సమీపంలో మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీ అయింది. నీరంతా పక్కనే ఉన్న కూరగాయ పందిరి తోటల్లోకి, పంట పొలాల్లోకి చేరింది. రైతులు వెళ్లి చూడగా పంట చేన్లలో మోకాలు లోతు నీరు ఉన్నట్లు గురించారు. పొలం లీజుకు తీసుకుని రూ.లక్షకు పైగా పెట్టుబడితో రెండెకరాల పొట్లకాయ తోటను, 10 గుంటల్లో మొక్కజొన్న స్వీట్కార్న్ సాగుచేసినట్లు బాధిత రైతు చిందం స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. కాయ దిగుబడి మొదలైన తరుణంలో ఊహించని వరద నిండా ముంచిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వమే నష్ట పరిహారం ఇప్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పలు పంటపొలాలు సైతం నీట మునగడంతో పలువురికి నష్టం జరిగింది. కాగా మల్లన్న సాగర్ నీటి మళ్లింపు నేపథ్యంలో పైపులైన్ లీకేజీ ఏర్పడిందని, యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపడతామని గజ్వేల్ మిషన్ భగీరథ డీఈ రాజు పేర్కొన్నారు. -
బాలకార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం: సీపీ అనురాధ
సిద్దిపేటకమాన్: జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పాటు పడాలని సీపీ అనురాధ తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా గత నెలలో 94 మంది చిన్నారులను రెస్క్యూ చేసి వారి తల్లిదండ్రులు, బంధువులకు అప్పగించినట్లు తెలిపారు. బడీడు పిల్లలు పాఠశాలల్లో ఉండేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆపరేషన్ ముస్కాన్ను పోలీసు అధికారులు, సిబ్బంది, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్మెంట్, వైద్యారోగ్యశాఖతో పాటు వివిధ శాఖల అధికారుల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించామన్నారు. బాల కార్మికులతో పని చేయించుకుంటున్న 27 మంది యజమానులపై కేసులు నమోదు చేశామన్నారు. చదువుతోనే గుర్తింపు ఇంటర్ విద్యాధికారి రవీందర్రెడ్డి చిన్నకోడూరు(సిద్దిపేట): మనిషి జీవితాన్ని మార్చేది చదువు ఒక్కటేనని, చదువుకుంటేనే సమాజంలో గుర్తింపు వస్తుందని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం చిన్నకోడూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించారు. రికార్డులు, కళాశాల పరిసరాలు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. నిర్వహిస్తున్న తరగతులపై, కళాశాలలో వసతుల గురించి, ఎంసెట్, నీట్ ఆన్లైన్ క్లాసులు జరుగుతన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య పెంచడానికి అధ్యాపకులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, అధ్యాపకులు ఉన్నారు. పంచాయతీ కార్యదర్శికి షోకాజ్ మద్దూరు(హుస్నాబాద్): ధూళ్మిట్ట మండలం కూటిగల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి అనితకు జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి షోకాజ్ నోటీసు అందించారు. శుక్రవారం మద్దూరు మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో దేవకీదేవి ఇందిరమ్మ ఇళ్ల ప్రగతిపై మాట్లాడారు. ప్రతి గ్రామంలో ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని కార్యదర్శులకు సూచించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కార్యదర్శి అనితకు షోకాజ్ జారీ చేశారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి మిరుదొడ్డి(దుబ్బాక): ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) అసోసియేట్ అధ్యక్షుడు గాడిపల్లి తిరుపతిరెడ్డి డిమాండ్ చేశారు. టీపీటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని మోతె, భూంపల్లి, రుద్రారం, ఖాజీపూర్, జంగపల్లి ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందన్నారు. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 5న జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్, రాష్ట్ర కౌన్సిలర్ జానకి రాములు, జిల్లా ఉపాధ్యక్షుడు ర్యాకం మల్లేశం, జిల్లా కార్యదర్శి శివాజీ పాల్గొన్నారు. రన్నింగ్ పోటీలకు గజ్వేల్ విద్యార్థి ఎంపిక గజ్వేల్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన బీకాం మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి జ్ఞానేశ్వర్ రాష్ట్ర స్థాయి రన్నింగ్ పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 3న ఈ పోటీలు హనుమకొండలో జరగనున్నాయి. ఇటీవల ఉమ్మడి జిల్లా పోటీల్లో ప్రతిభ కనబరిచడంతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. శుక్రవారం స్థానిక కళాశాలలో ప్రిన్సిపాల్ నిఖత్, స్పోర్ట్స్ ఇన్చార్జి డాక్టర్ మహేందర్రెడ్డిలు జ్ఞానేశ్వర్కు అభినందనలు తెలిపారు. -
ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలి
పట్టు పరిశ్రమ శాఖ జేడీ లత చిన్నకోడూరు(సిద్దిపేట): పట్టును విదేశాలకు ఎగుమతి చేయాలంటే స్థానికంగా పట్టు ఉత్పత్తి పెరగాలని పట్టు పరిశ్రమ శాఖ జాయింట్ డైరెక్టర్ లత అన్నారు. మా పట్టు మా అభిమాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం చంద్లాపూర్లో పట్టు రైతుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎక్కువ స్థాయిలో రైతులు పట్టు సాగు చేయడానికి ముందుకు రావాలన్నారు. పట్టు సాగుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను వివరించారు. సేంద్రియ ఎరువులతో మల్బరీ తోట సాగు చేస్తే మంచి ఫలితం ఉంటుందన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు వినోద్ కుమార్, రాఘవేందర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఇంద్రసేనారెడ్డి, పట్టు పరిశ్రమ జిల్లా అధికారి రేణు శర్మ, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించండి
డీఎంహెచ్ఓ ధనరాజ్సిద్దిపేటరూరల్: ప్రస్తుతం వానాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ ధనరాజ్ వైద్య సిబ్బందికి సూచించారు. గురువారం మండల పరిధిలోని పుల్లూరు, నారాయణరావుపేట, చింతమడక గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను డీఎంహెచ్ఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమం తప్పకుండా వైద్య శిబిరాలను నిర్వహించాలన్నారు. ఆస్పత్రుల్లో అత్యవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. వైద్యులు, సిబ్బంది తప్పకుండా సమయ పాలన పాటించి అంకిత భావంతో సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్లు బాపురెడ్డి, వినోద్, భాస్కర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
విధులకు ఎగనామం
పంచాయతీ కార్యదర్శుల నకిలీ హాజరు ●● ముఖ హాజరుతో మాయాజాలం ● విధులకు రాకుండానే హాజరైనట్లు నమోదు ● అడ్డంగా దొరికిన 70 మంది ● నోటీసులు జారీచేయాలంటూ కలెక్టర్ ఆదేశాలు సాక్షి, సిద్దిపేట: కొందరు పంచాయతీ కార్యదర్శులు ముఖహాజరుతో మాయాజాలం చేస్తూ విధులకు ఎగనామం పెడుతున్నారు. లొకేషన్లో ఫొటో తీసినట్లు అటెండెన్స్ వేసుకుంటూ గ్రామ పంచాయతీకి వెళ్లకుండానే ఊర్లు.. ఫంక్షన్లకు వెళ్తున్నారు. ఇలా ఫేక్ అటెండెన్స్ వేస్తూ కొందరు అడ్డంగా దొరికిపోయారు. పంచాయతీ కార్యదర్శులు సమయపాలనకు, గ్రామాల్లో సేవలు అందించేందుకు, డుమ్మాలకు చెక్ పెట్టేందుకు పంచాయతీ శాఖ ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ యాప్ను అమల్లోకి తీసుకువచ్చింది. ప్రభుత్వాన్నే తప్పుదారి పట్టించి 70 మంది గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఫేక్ అటెండెన్స్ వేశారు. గురువారం వారిని గుర్తించారు. దీంతో వారికి నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలులో గ్రామ పంచాయతీ కార్యదర్శులది కీలక పాత్ర పోషిస్తారు. ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు సక్రమంగా లబ్ధిదారులకు అందాలంటే కార్యదర్శులు విధులకు డుమ్మాలు కొట్టవద్దు. ఉద్యోగులు నిత్యం వివిధ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. వారి నివాసాలు పట్టణాల్లో ఉండటంతో సమయపాలన పాటించడం లేదు. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. విధులకు హాజరుకావడం లేదని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఫేస్ రికగ్నిషన్ యాప్ను పంచాయతీ శాఖ తీసుకవచ్చింది. 8 నెలలుగా అమలు చేస్తున్నారు. కార్యదర్శులు విధులు నిర్వర్తించే గ్రామంలో లొకేషన్కు వెళ్లి ఫోటో తీసి పంచాయతీ యాప్లో నమోదు చేసి అటెండెన్స్ వేసుకోవాలి. ఫేక్ అటెండెన్స్ జిల్లా వ్యాప్తంగా 508 గ్రామ పంచాయతీలుండగా 470 మంది పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వర్తిస్తున్నారు. పలువురు పంచాయతీ కార్యదర్శులకు మరో గ్రామ పంచాయతీ సైతం ఇన్చార్జి కేటాయించారు. వీరు ప్రతి రోజు ఉదయం 10 గంటల వరకు గ్రామ పంచాయతీకి చేరుకుని ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా అటెండెన్స్ను ఫొన్లో వేసుకోవాలి. పలువురు పంచాయతీ కార్యదర్శులు విధులకు డుమ్మాలు కొట్టి.. గ్రామ పంచాయతీ సిబ్బందికి యాప్ లాగిన్ను ఇచ్చి ఫొటోతో.. ఫోటో తీసి యాప్లో అప్లోడ్ చేశారు. 8 నెలలుగా పలువురు ఇదే విధంగా హజరు వేసుకుంటూ డుమ్మా కొడుతున్నారు. బుధవారం నుంచి డీపీఓలకు ప్రత్యేక లాగిన్ను ఇచ్చారు. దీంతో యాప్లో అప్లోడ్ చేస్తున్న ఫొటో వ్యక్తిదేనా.. నేరుగా దిగి అప్లోడ్ చేశారా.. ఫొటోను ఫొటో తీసి అప్లోడ్ చేశారా? అని పరిశీలించాలని డీపీఓలకు ఆదేశించారు. దీంతో రెండు రోజులుగా డీపీఓ నేతృత్వంలో పరిశీలించగా ఫేక్ అటెండెన్స్ వేస్తురని తేటతెల్లమైంది. 70 మంది పంచాయతీ కార్యదర్శులను గుర్తించారు. ఆ పంచాయతీ కార్యదర్శులకు కలెక్టర్ ఆమోదంతో నోటీసులను గురువారం రాత్రి డీపీఓ జారీ చేశారు. నోటీసులు జారీ చేస్తున్నాం విధులకు హాజరు కాకుండా నకిలీ అటెండెన్స్ యాప్లో అప్లోడ్ చేసి 70 మంది గ్రామ పంచాయతీ కార్యదర్శులను గుర్తించాం. వారికి కలెక్టర్ అనుమతితో నోటీసులు జారీ చేస్తున్నాం. ఉన్నత అధికారుల మేరకు కఠిన చర్యలు తీసుకుంటాం. –దేవకి దేవి, డీపీఓ -
డైట్ మెనూ తప్పనిసరి
● పాటించకుంటే కఠిన చర్యలు ● కలెక్టర్ హైమావతి ● పుల్లూరు జెడ్పీ స్కూల్ సందర్శన సిద్దిపేటరూరల్: ప్రభుత్వ బడుల్లో డైట్ మెనూ ప్రకారం భోజనం అందించాలని, పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హైమావతి నిర్వాహకులను హెచ్చరించారు. గురువారం మండల పరిధిలోని పుల్లూరు జిల్లా పరిషత్ హైస్కూల్ను ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. డైట్ ప్రకారం గురువారం బగారా అన్నం, మిక్స్డ్ వెజిటేబుల్ కూరను వండాల్సి ఉండగా సాధారణ అన్నం మిల్మేకర్ కూర, చింతపులుపు చారు వండడాన్ని గమనించారు. 95 మంది విద్యార్థులకు ఏడు కిలోల కూరగాయలు బదులు, తక్కువ శాతం కూరగాయలతో వండటంతో కలెక్టర్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ తప్పకుండా డైట్ మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. వంట గదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ రికార్డుల్లో వివరాలు నమోదు చేయాలని ఇన్చార్జి హెచ్ఎంను ఆదేశించారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం తగదు చిన్నకోడూరు(సిద్దిపేట): వైద్య సేవల్లో నిర్లక్ష్యం తగదని, వైద్య సిబ్బంది అంకిత భావంతో సేవలందించాలని కలెక్టర్ హైమావతి అన్నారు. గురువారం చిన్నకోడూరు పీహెచ్సీని, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలను తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ల్యాబ్లో ఎక్కువగా ఎలాంటి పరీక్షలు చేస్తున్నారని తెలుసుకున్నారు. కాలం చెల్లిన మందులు వాడకూడదని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వైద్యం చేయించుకోవాలని రోగులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణాల ప్రగతిపై ఎంపీడీఓతో సమీక్ష నిర్వహించారు. ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి ఎరువుల సరఫరా రికార్డులు పరిశీలించారు. సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఆమె వెంట ఆర్డీఓ సదానందం, ఎంపీడీఓ జనార్దన్, తహసీల్దార్ సలీమ్, ఎంపీఓ సోమిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. వాహనదారుల భద్రత ముఖ్యం సిద్దిపేటరూరల్: వాహనదారుల భద్రత ఎంతో ముఖ్యమని, ఎవరికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హైమావతి అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో రోడ్డు భద్రత కమిటీతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాజీవ్ రహదారిలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్స్పాట్లను గుర్తించి, నివా రణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు కావాల్సిన వాటికి ఎస్టిమేట్ వేసి డాక్యుమెంట్లను తన వద్దకు తీసుకురావాలని ఆర్అండ్బి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనవసర మలుపులను మూసివేయాలని, సురక్షిత రవాణాకు కావాల్సిన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఏసీపీలు, అర్అండ్బి అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
పథకాల అమల్లో ఉద్యోగులే కీలకం
● డిమాండ్లు పరిష్కరించాలి ● టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మార్గం జగదీశ్వర్హుస్నాబాద్రూరల్: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చేది ఉద్యోగులేనని టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మార్గం జగదీశ్వర్ అన్నారు. గురువారం హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ అధ్యాపకుడు మధుసూదన్రెడ్డి పదవీ వీరమణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలు పరిష్క రించాలని 56 డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తే 16 డిమాండ్లను పరిష్కరించడానికి ఆగస్టు 15 వరకు గడువు పెట్టారని చెప్పారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కారించకపోతే ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మరో కార్యాచరణను రూపొందిస్తామన్నారు. లెక్చరర్ల సర్వీసును 65 ఏళ్లకు పెంచడానికి సీఎం సానుకూలంగా స్పందించారని త్వరలోనే ఆచరణలోకి వస్తుందని చెప్పారు. ఉద్యోగులు సైతం చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలన్నారు. కార్యక్రమంలో పుల్లయ్య, ప్రిన్సిపాల్ శ్రీదేవి, అభినవ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
కొనలేం.. కొట్టలేం
బెంబేలెత్తిస్తున్న టెంకాయ ధరలు● రూ.45 పలుకుతున్న కొబ్బరికాయ ● పండుగల నేపథ్యంలో రోజురోజుకు పెరుగుతున్న ధరలు ● ఏపీలో ఉత్పత్తి తగ్గడమే కారణమంటున్న వ్యాపారులు ● నారికేళం బాటలోనే కొబ్బరి బోండాలు ప్రశాంత్నగర్(సిద్దిపేట): పవిత్ర కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, పూజ కార్యక్రమాలలో కొబ్బరి కాయలను విరివిగా వినియోగిస్తారు. ఎన్నో పవిత్రమైన విశిష్టతలు కల్గిన టెంకాయ ధర రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం శ్రావణమాసం కావడం.. ప్రతి ఇంటిలో, ఆలయాలలోని పూజ కార్యక్రమాలలో కొబ్బరికాయల వినియోగం మరింత పెరిగింది. గతేడాది ఇదే సమయంలో టెంకాయ ధర రూ. 30 వరకు ఉండగా, నేడు రూ.45 వరకు ధర పలుకుతోంది. ముఖ్యంగా జిల్లాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కొబ్బరికాయలు వస్తుంటాయి. జిల్లాలో యాభై వరకు కొబ్బరికాయల హోల్సెల్ విక్రయాల దుకాణాలు ఉన్నాయి. రోజూ లారీలతో పాటు ఇతర చిన్న వాహనాలలో కొబ్బరి కాయలు వస్తుంటాయి. ఈ హోల్సెల్ దుకాణాలను అధికంగా ఏపీ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారే నిర్వహిస్తున్నారు. ఉత్పత్తి తగ్గడమే కారణం వాతావరణం, అక్కడి పంటల సాగులో వచ్చిన మార్పుల నేపథ్యంలో ఏపీలో కొబ్బరికాయల ఉత్పతి తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో వ్యాపారులు తమిళనాడు, కేరళ నుంచి కొబ్బరికాయలను దిగమతి చేసుకుంటున్నారు. సరుకు వాహనాల కిరాయి, హమాలీల కూలీలు కలుపుకుని కొబ్బరికాయల విక్రయాల ధరలను నిర్ణయిస్తున్నారు. దీంతో ధరలు మరింత ప్రియం అవుతున్నాయి. కొబ్బరి బోండాలు సైతం.. కొబ్బరి కాయల బాటలోనే కొబ్బరి బోండాల ధరలు పరుగులు తీస్తున్నాయి. కొబ్బరిబోండాలు ధరలు రూ.40 నుంచి రూ.60 వరకు ధర పలుకుతున్నాయి. అదేవిధంగా కొబ్బరి నీరు లీటరుకు రూ.150 నుంచి ఆ పైన ధర పలుకుతుంది. కొబ్బరి నీరు రోగులతో పాటుగా, వృద్ధులు, చిన్నారులు అధికంగా వినియోగిస్తున్నారు. దీంతో కొబ్బరి బోండాలకు గిరాకీ పెరిగింది. ధరలు బాగా పెరిగాయి కొబ్బరి కాయల ధరలు బాగా పెరిగాయి. ఒక్కొక్కటి రూ.40 వరకు విక్రయిస్తున్నారు. శ్రావణమాసం పూర్తయ్యే వరకు రోజు పూజలలో కొబ్బరికాయాల వినియోగం అధికంగా ఉంటాయి. రానున్న రోజుల్లో పెద్ద పండుగలు ఉన్నాయి. ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. – మహిళ, సిద్దిపేట ఉత్పత్తి తగ్గిపోవడం వల్లే.. కొబ్బరి కాయల ఉత్పత్తి గతంలో కంటే బాగా తగ్గింది. ముఖ్యంగా ఏపీ నుంచి దిగుమతి అవుతాయి. కానీ అక్కడ వివిధ కారణాలతో ఉత్పత్తి తగ్గడంతో తమిళనాడు, కేరళ నుంచి కొబ్బరికాయలను దిగుమతి చేసుకుంటున్నాం. అందువలన రవాణా, కూలీల చార్జీలు పెరగడంతో ధరలు పెరిగాయి. –శ్రీనివాస్, కొబ్బరికాయల హోల్సేల్ వ్యాపారి, సిద్దిపేట -
పూర్తయిన భగీరథ పైప్లైన్ పనులు
గజ్వేల్: మల్లన్నసాగర్ నుంచి గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలకు ప్రత్యేక మిషన్ భగీరథ పైప్లైన్ పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. ‘సాక్షి’ వరుస కథనాల నేపథ్యంలో స్పందించిన సంబంధిత అధికార యంత్రాంగం పనులను పూర్తి చేయించింది. గురువారం ట్రయల్ రన్ నిర్వహించి నీటి సరఫరా ను ప్రారంభించారు. పైప్లైన్లు కొత్తవి కావడం వల్ల మంచినీటిని కొద్దిరోజుల వరకు కాచి వడపోసి వాడుకోవాలని మిషన్ భగీరథ ఎస్ఈ వెంకట్రెడ్డి తెలిపారు. పూర్త యిన పనులను పర్యవేక్షించిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విష యాన్ని తెలిపారు. పనులు పూర్తి కావడంతో ప్రజ్ఞాపూర్ వద్ద హెచ్ఎండబ్ల్యూఎస్(హైద్రాబాద్ మెట్రో వాటర్ వర్క్స్) మిషన్ భగీరథ ట్యాపింగ్ పాయింట్ను మూసేశారు. మంచినీటి సరఫరాకు సంబంధించి గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలకు స్వయం ప్రతిపత్తి లభించినట్లయింది. సరిపడా నీటి సరఫరా జరగనుంది. -
విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదు
● అధికారులకు కలెక్టర్ హైమావతి హెచ్చరిక ● లక్ష్మీనగర్, మిరుదొడ్డిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన లిక్కర్ మీదున్న శ్రద్ధ పాఠశాలలపై ఏదీ? మిరుదొడ్డి(దుబ్బాక): విధి నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖా పరమైన చర్యలు చేపడతామని కలెక్టర్ హైమావతి అధికారులను హెచ్చరించారు. పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన లక్ష్మీనగర్లో, మిరుదొడ్డిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ శరవేగంగా నిర్మాణాలను చేపట్టాని లబ్ధిదారులకు సూచించారు. త్వరగా పూర్తి చేసిన ఇంటి నిర్మాణాలకు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో విడతల వారీగా నిధులు జమ అవుతాయని తెలిపారు. అనంతరం మిరుదొడ్డిలోని పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వైద్య పరీక్షలను, రికార్డులను పరిశీలించారు. పీహెచ్సీలో ధ్వంసమైన గ్రౌండ్ ఫ్లోర్ను బాగు చేయించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచి పీఏసీఎస్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాగు విస్తీర్ణం మేరకు రైతులకు యూరియా పంపిణీ చేయాలన్నారు. ఎరువు లను అక్రమంగా విక్రయించినా, యూరియా కొరత సృష్టించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కాగా గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ళను సందర్శించారు. ఆమె వెంట ఎంపీడీఓ గంగుల గణేశ్రెడ్డి, మండల వ్యవసాయ అధికారి మల్లేశం, పీఏసీఎస్ చైర్మన్ లింగాల వెంకట్రెడ్డి తదితరులు ఉన్నారు. మెరుగైన వైద్యం అందించాలి దుబ్బాకరూరల్: మండలంలోని తిమ్మాపూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను, సిబ్బందిని ఆదేశించారు. ఆస్పత్రికి వచ్చిన రోగులతో మాట్లాడారు. సీజనల్ వ్యాధులు రాకుండా చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. వేడి చేసిన నీటినే తాగాలన్నారు. అనంతరం అదే గ్రామంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. కుకునూరుపల్లిలో ఆకస్మిక తనిఖీ కొండపాక(గజ్వేల్): కుకునూరుపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. 24 గంటల వైద్య సేవలందించే ఆస్పత్రిలో రాత్రి వేళ వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారా? లేదా? అనే విషయాన్ని పరిశీలించారు. వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రహదారికి ఆనుకొని ఆస్పత్రి ఉందని 24 గంటల పాటు వైద్యం అందేలా చూసుకోవాలన్నారు. సీజన్ వ్యాదులు ప్రభలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.దుబ్బాక: లిక్కర్ మీదున్న శ్రద్ధ పాఠశాలలపై లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. బుధవారం దుబ్బాక మున్సిపల్ పరధిలోని దుంపలపల్లిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. గ్రామాల్లో మద్యం ఏరులై పారించడమేనా ప్రజాపాలన అంటూ ప్రశ్నించారు. లిక్కర్ ద్వారా ఆదాయం పెంచుకోవాలని చూస్తున్నారే తప్ప పాఠశాలలను పట్టించుకోవడంలేదని అన్నారు. పాఠశాలల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయన్నారు. గతంలో దుబ్బాక మున్సిపాలిటీకి టీయూఎఫ్ఐడీసీ కింద 20 కోట్లు మంజూరైతే కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. ‘కూడవెల్లి’ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాదుబ్బాకరూరల్: అక్బర్పేటభూంపల్లి మండలంలోని కూడవెల్లి రామలింగేశ్వరస్వామి దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి తెలిపారు. ఆలయ అభివృద్ధిపై బుధవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులతో సమీక్షించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారుఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి -
జానపద కళలను పరిరక్షిద్దాం
కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాంరెడ్డి మిరుదొడ్డి(దుబ్బాక): నానాటికి కనుమరుగవుతున్న జానపద కళారంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని జానపద వృత్తి కాళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాంరెడ్డి అన్నారు. వండర్ బుక్ఆఫ్ రిక్డార్డులో స్థానం దక్కించుకున్న మండల కేంద్రమైన మిరుదొడ్డిలోని సీతారామచంద్ర స్వామి అలయ భజన మండలి సభ్యులను ఆలయ కమిటీ చైర్మన్ తోట కమలాకర్రెడ్డి నేతృత్వంలో ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కరీంనగర్ జిల్లాలో ఆధ్యాత్మిక భజన మహోత్సవం నిర్వహించిన కార్యక్రమానికి వండర్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కిందన్నారు. అందులో మిరుదొడ్డికి చెందిన సీతారామాంజనేయ భజన మండలి కళాకారులు 30 మంది పాల్గొనడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో టెలికం బోర్డు మెంబర్ మొగుళ్ళ మల్లేశం, బీజేపీ జిల్లా నాయకుడు కాన్గంటి శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట అంజిరెడ్డి, నాయకులు సూకూరి లింగం, మొగుళ్ల ఐలయ్య, కాస కిష్టయ్య, భజన మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ఛీ.. ఇదేం తీరు
రోడ్లపైనే మాంసం విక్రయాలుఅధికారుల చర్యలేవి మాంసాన్ని రోడ్లపై విక్రయిస్తున్నా.. అధికారులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రూ.50 లక్షల నిధులతో నిర్మించిన షట్టర్లను ఖాళీగా ఉంచి.. రోడ్లపై మాంసం విక్రయించడం దారుణమని ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా అధికారులు చర్యలు తీసుకుని షట్టర్లలోనే మాంసం విక్రయాలు జరిగేలా చూడాలని కోరుతున్నారు.దుబ్బాకటౌన్: పట్టణంలో రోడ్లపైనే మాంసం విక్రయాలు జరుగుతున్నాయి. వర్షాలు కురిసి రోడ్లంతా చిత్తడిగా మారినా.. పైగా కుక్కలు మలమూత్రాలు విసర్జించిన ప్రాంతాల్లోనే విక్రయాలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నాన్ వెజ్ మార్కెట్ నిర్మించి, వివిధ హంగులతో తీర్చి దిద్దినా మాంసం విక్రయదారుల తీరు మారడం లేదు. అసలే వానాకాలం.. ఆపై సీజనల్ వ్యాధులతో భయాందోళనకు గురవుతున్న ప్రజలు రోడ్లపైనే మాంసం విక్రయిస్తుండటంతో జంకుతున్నారు. పట్టణంలో నాన్వెజ్ మార్కెట్ నిర్మాణం కోసం రూ.50 లక్షల నిధులతో 10 షట్టర్లను నిర్మించి విక్రయదారులకు కేటాయించారు. కానీ విక్రయదారులు రోడ్డుపైనే విక్రయిస్తున్నారు. అన్ని వసతులతో షట్టర్లు ఉన్నా రోడ్లపైనే విక్రయించడం చర్చనీయంశంగా మారింది. కుక్కల వీరవిహారం రోడ్లపై మాంసం విక్రయిస్తుండటంతో కుక్కలు వీరవిహారం చేస్తున్నాయి. వ్యర్థాలు తినడానికి పోటీ పడుతున్నాయి. అక్కడే మలమూత్రాలు విసర్జి స్తున్నాయి. అదే ప్రాంతంలో మాంసం అమ్మడంతో మాంసాహార ప్రియులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వర్షం నీరు రోడ్లపై ప్రవహిస్తున్నా.. మాంసం విక్రయించడం చూస్తుంటే వారు వ్యవహరించే తీరు నిర్లక్ష్యానికి నిలువుటద్ధంలా కనిపిస్తోంది. కుక్కలు మలమూత్రాలు విసర్జించిన ప్రాంతాల్లో అమ్మకాలు మార్కెట్ ఉన్నా బయటే విక్రయాలు మారని విక్రయదారుల తీరు సీజనల్ వ్యాధులతో పొంచి ఉన్న ముప్పు ప్రజల ప్రాణాలతో చెలగాటం రోడ్లపై, అపరిశుభ్రమైన పరిసరాలలో మాంసం విక్రయిస్తున్నారు. దీంతో ప్రజలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. షట్టర్లలో దుకాణాలను నడపడానికి ఏమైనా ఇబ్బందులుంటే అధికారులతో చర్చించి పరిష్కరించుకోవాలి. కానీ ఎక్కడపడితే అక్కడ మాంసం విక్రయించడం తగదు. – మాడబోయిన శ్రీకాంత్, దుబ్బాక విక్రయాలు చేస్తే చర్యలు బహిరంగ ప్రదేశాలలో, రోడ్లపై మాంసం విక్రయాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటాం. మొదటి హెచ్చరికగా నోటీసులు పంపిస్తాం. తీరు మారకుంటే చర్యలు తప్పవు. – రమేశ్కుమార్ మున్సిపల్ కమిషనర్ -
స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలి
మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ హుస్నాబాద్: బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ అన్నారు. బుధవారం వంద రోజుల ప్రణాళికలో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులు, వృత్తులు, అమ్మకాల ప్రదర్శనను కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మల్లికార్జున్ మాట్లాడుతూ మహిళా సంఘాలు ఇందిరా మహిళా శక్తి, బ్యాంక్ లింకేజీ, సీ్త్రనిధి తదితర లోన్ల ద్వారా స్వయం ఉపాధి కోసం రుణాలు పొందారన్నారు. ఈ ఏడాది పట్టణంలో 503 సంఘాలకు గాను 23 సంఘాలకు రూ.2 కోట్లు రుణాలు ఇచ్చామన్నారు. ఈ ప్రదర్శనలో తినుబండారాలు, స్వీట్లు, కప్స్, ప్లేట్స్, కూరగాయ లు, గాజులు, డ్రెస్ మెటీరియల్ ఐటమ్స్, తదితర ఉత్పత్తులను ప్రదర్శించారన్నారు. రుణాలను వ్యక్తిగత అవసరాలకు కాకుండా వ్యాపారాలకు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఎంసీ సంతోషిమాత, మున్సిపల్ మేనేజర్ సంపత్, ఆర్పీలు పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
మిరుదొడ్డి(దుబ్బాక): స్థానిక కేజీబీవీలో ఇంటర్మీడియెట్ ఎంపీహెచ్డబ్ల్యూ (ఫీమేల్) గ్రూపు విద్యార్థినులకు నర్సింగ్ సబ్జెక్టులు బోధించుటకు దరఖాస్తులు కోరుతున్నారు. అర్హులైన గెస్టు ఫ్యాకల్టీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు స్పెషల్ ఆఫీసర్ స్వర్ణలత తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన మహిళలు ఈ నెల 31 నుంచి, ఆగస్టు 2 వరకు మిరుదొడ్డిలోని కేజీబీవీలో దరఖాస్తులను అందించాలని కోరారు. హిందీ అతిథి అధ్యాపక పోస్టుకు.. దుబ్బాకటౌన్: పట్టణంలోని కస్తూర్బాలో హిందీ బోధించడానికి అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రత్యేక అధికారి స్వాతి బుధవారం తెలిపారు. హెచ్పీటీ అర్హత ఉన్న మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వేతనం రూ.18వేలు ఉంటుందన్నారు. ఆసక్తిగల వారు ఆగస్టు 2లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. డెమో తరగతుల ఆధారంగా అభ్యర్థి ఎంపిక ఉంటుందన్నారు. నేడు డయల్ యువర్ డీఎం గజ్వేల్రూరల్: జీపీపీ(గజ్వేల్–ప్రజ్ఞాపూర్) డిపో పరిధి లోని ప్రయాణికులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను డయల్ యువర్ డీఎం దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ డిపో మేనేజర్ పవన్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం ఉంటుందన్నారు. ఆర్టీసీ బస్సులలో రాకపోకలు సాగించే ప్రయాణికులు తమ సమస్యలను 99592 26270 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ‘గ్రంథాలయ’ బడ్జెట్ ఆమోదం ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా గ్రంఽఽథాలయ సంస్థ సర్వసభ్య సమావేశం బుధవారం చైర్మన్ లింగమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశంలో 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను ఆమోదించారు. గ్రామ పంచాయతీలకు గ్రామ గ్రంథాలయాలు చెల్లించాల్సిన సెస్ విషయంలో పూర్తి సహకారం అందిస్తామని జిల్లా పంచాయతీ అధికారి దేవికాదేవి తెలిపారు. కార్యక్రమంలో డీపీఆర్ఓ రవికుమార్, లైబ్రరీ కార్యదర్శి వసుంధర తదితరులు పాల్గొన్నారు. బెజ్జంకి మండలాన్ని కరీంనగర్లో కలపండిబెజ్జంకి(సిద్దిపేట): మండలాన్ని తిరిగి కరీంనగర్ జిల్లాలో చేర్చాలని స్థానిక నాయకులు కోరారు. ఈమేరకు మంత్రి వివేక్ను బుధవారం నగరంలోని తన నివాసంలో కరీంనగర్ జిల్లా పోరాట సమితి బెజ్జంకి నాయకులు మానాల రవి, మైల ప్రభాకర్లు కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రజల అభిప్రాయం మేరకు గతంలో సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారని వారు వివరించారు. జిల్లాకు మంచిపేరు తేవాలి సిద్దిపేటజోన్: ఇదే స్ఫూర్తితో రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చూపి జిల్లాకు మంచి పేరు తేవాలని జిల్లా క్రీడల శాఖ అధికారి వెంకట్ నర్సయ్య సూచించారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం సెలెక్షన్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అథ్లెటిక్స్ ద్వారా మంచి భవిష్యత్తు ఉందన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు పంపిణీ చేశారు. వివిధ అంశాల్లో 60 మంది బాలబాలికలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి వెంకట్ స్వామి, ప్రతినిధులు రామేశ్వర్రెడ్డి, భిక్షపతి, అశోక్, ఉప్పలయ్య, ప్రభాకర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎకరాకు ఒకటే బస్తా
● కొరత నేపథ్యంలో యూరియా పంపిణీ తీరు ● ఎరువుల దుకాణాల వద్ద రైతులు బారులు ● జిల్లాలో చాలా చోట్ల ఇదే పరిస్థితి గజ్వేల్: కొరత నేపథ్యంలో యూరియా పంపిణీ తీరు మారింది. పట్టాదారు పాస్పుస్తకం, ఆధార్ కార్డు ఆధారంగా ఎకరాకు ఒకటే బస్తా ఇవ్వాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఇది కూడా స్టాకు తక్కువగా ఉంటే నాలుగైదు ఎకరాల భూమి రైతుకు కూడా ఒకటి, రెండు బస్తాలను ఇచ్చి పంపుతున్నారు. జిల్లాలోని అన్నిచోట్ల ఇదే పరిస్థితి నెలకొనగా..యూరియా బస్తాల కోసం రైతులు బారులు తీరుతున్నారు. జిల్లాలో వరి సాగు క్రమంగా ఊపందుకుంటోంది. వానాకాలం సీజన్కు సంబంధించి 5.60లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగులోకి వస్తాయని వ్యవసాయశాఖ అంచనా వేస్తే.. ఇప్పటివరకు 3లక్షల ఎకరాలకుపైగా వివిధ రకాల పంటలు సాగులోకి వచ్చాయి. మరోవైపు పంటలు సాగు పెరిగే కొద్దీ యూరియా వాడకం పెరుగుతోంది. ప్రస్తుత వానాకాలం సీజన్ మొత్తానికి 35,144 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. 10వేల మెట్రిక్ టన్నులకుపైగా యూరియా వచ్చిందని వ్యవసాయశాఖ చెబుతోంది. నిజానికి గతంలో వానాకాలం సీజన్ అవసరాలకు యూరియా 80శాతంవరకు ముందుగానే స్టాకు వచ్చేది. జూలై చివరివారం, ఆగస్టు నెల వరకు పూర్తిస్థాయి నిల్వలు అందుబాటులో ఉండేవి. వాడకాన్ని తగ్గించడంపై దృష్టి రైతులు ఎకరా వరికి 3 నుంచి 4 బస్తాల యూరియా వాడుతారు. ఇలా పంట పూర్తయ్యేంతవరకు 6నుంచి 8బస్తాలను వాడతారు. కానీ ఎకరాకు ఒక దఫాలో ఒకే బస్తా సరిపోతుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. పంట పూర్తయ్యేంతవరకు 2 బస్తాలు వేస్తే సరిపోతుందని చెబుతున్నారు. అన్ని చోట్ల క్యూలైన్లు యూరియా పంపిణీ సందర్భంగా మంగళవారం జిల్లాలోని అన్నిచోట్ల క్యూలైన్లు కనిపించాయి. ఎకరాకు ఒకటే బస్తా పంపిణీ జరిగింది. చాలా చోట్ల నాలుగైదు ఎకరాలున్న రైతులకూ రెండు, మూడు కంటే ఎక్కువ బస్తాలు దొరకలేదు. గజ్వేల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. స్థానిక ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద బారులు తీరిన రైతులతో కలిసి బీఆర్ఎస్ నియోజకవర్గఇన్చార్జి నిరసన తెలిపారు. అధికంగా వాడితే అనర్థమే యూరియా కొరత లేదని వ్యవసాయ అధికారి స్వరూపరాణి తెలిపారు. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ మోతాదుకు మించి వాడటం వల్లే ఇబ్బందులు వస్తున్నాయన్నారు. ఈ దుస్థితిని నివారించేందుకు రైతులకు అవగాహన కల్పిస్తున్నామని ఎకరాకు ఒకటే బస్తా ఇవ్వాలని ఆదేశాలిచ్చామన్నారు. -
యూరియా నిల్వ చేస్తే చర్యలు
జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి దుబ్బాకటౌన్: యూరియాను అక్రమంగా నిల్వ చేసినా, అధిక ధరలకు అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి స్పష్టం చేశారు. మంగళవారం రాయపోల్ మండల పరిధిలోని అంకిరెడ్డిపల్లి, అనాజీపూర్లలో సలు ఫర్టిలైజర్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా విక్రయాలను, బిల్లు బుక్, స్టాక్ రిజిస్టర్ లను, ధరల పట్టికలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలించినా.. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డీలర్లను హెచ్చరించారు. -
వైభవం
బుధవారం శ్రీ 30 శ్రీ జూలై శ్రీ 2025నాగ పంచమి ఆలయాల వద్ద భక్తుల సందడి జిల్లా వ్యాప్తంగా నాగుల పంచమిని భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామునుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఆలయాల ఆవరణలోని పుట్టల్లో పాలు పోశారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. తమ కుటుంబాలు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నాగదేవతలకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లా కేంద్రంలోని కోటిపడగల సంతాన నాగదేవత, ఉమాపార్థీఽశ్వర కోటిలింగాల, తదితర ఆలయాలు అమ్మవారి నామస్మరణతో మార్మోగాయి. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. – ప్రశాంత్నగర్(సిద్దిపేట) న్యూస్రీల్ -
పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టాలి
● కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ● జిల్లా కాంగ్రెస్ సమీక్ష సమావేశం గజ్వేల్: జిల్లాలో కాంగ్రెస్ పటిష్టతపై నాయకులు దృష్టి పెట్టాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ విషయాన్ని డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె సూచించారు. త్వరలోనే జిల్లాలో పర్యటించి సమస్యలను తెలుసుకుంటానని వెల్లడించారు. కలిసికట్టుగా పనిచేసి పార్టీకి పూర్వవైభవం తేవడానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో నర్సారెడ్డితోపాటు టీపీసీసీ నేతలు పాల్గొన్నారు. -
బడి నిధుల గోల్మాల్పై విచారణ
ప్రశాంత్నగర్(సిద్దిపేట): పీఎం శ్రీ పాఠశాలల్లో నిధుల దుర్వినియోగంపై జిల్లా విద్యాశాఖ విచారణ చేపట్టింది. మంగళవారం సాక్షిలో ప్రచురితమైన బడి నిధులు గోల్మాల్ కథనానికి జిల్లా విద్యాశాఖ స్పందించింది. ఈ మేరకు పీఎం శ్రీ పాఠశాలల్లో నిధుల వ్యయం పై పూర్తి వివరాలు సమర్పించాలని, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్లను డీఈఓ ఆదేశించారు. అయితే పీఎం శ్రీ నిధుల వినియోగం వివరాలు ఆన్లైన్లో పంపించాలని కోరడంతో మళ్లీ, పాత లెక్కలే పంపించే అవకాశం ఉందని, ఉపాధ్యాయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అందువల్ల అధికారులే నేరుగా క్షేత్ర స్థాయిలో విచారణ చేపడితే అక్రమాలు బయటపడే అవకాశాలు ఉన్నాయని ఉపాధ్యాయులు చర్చించుకుంటున్నారు. -
సబ్ కోర్టు ఏర్పాటుకు ముందడుగు
హుస్నాబాద్: పట్టణంలో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకు ముందడుగు పడింది. గత నెలలో న్యాయ కార్యదర్శి ప్రభుత్వ తరపున హైకోర్టుకు లేఖ రాసినట్లు రాష్ట్ర కాంగ్రెస్ లీగల్ చైర్మన్ పొన్నం అశోక్ మంగళవారం హుస్నాబాద్ బార్ అసోసియేషన్కు సమాచారం అందించారు. చిరకాల కల అయిన సబ్ కోర్టు ఏర్పాటుకు బార్ అసోసియేషన్ సభ్యులు సమష్టి కృషి చేశారు. ఈ విషయంలో మంత్రి పొన్నం చొరవ చూపడంపై బార్ అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ కోర్టు మంజూరు గజ్వేల్: పట్టణానికి స్పెషల్ జ్యుడీషియల్ ఆఫ్ సెకండ్ క్లాస్ కోర్టు మంజూరయ్యింది. కోర్టును మంజూరు చేయాలంటూ స్థానిక బార్ అసోసియేషన్ కొంత కాలంగా విజ్ఞప్తులు చేస్తూ వస్తోంది. ఈమేరకు తాజాగా ప్రభుత్వ న్యాయశాఖ కార్యదర్శి నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ క్రమంలో మంగళవారం నగరంలో న్యాయశాఖ కార్యదర్శి తిరుపతిని స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పండరి, ఏజీపీ కిరణ్సాగర్రావు, న్యాయవాదులు పార్థసారధిరాజు తదితరులు కలిసి పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు. చట్టాలు అమలు చేసినప్పుడే పేదలకు లబ్ధి రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు ఆనంద్ బెజ్జంకి(సిద్దిపేట): చట్టాలు ఎంత పటిష్టంగా ఉన్నా వాటిని అమలు చేసినప్పుడే పేదలకు లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్ అన్నారు. బెజ్జంకిలోని రైతు వేదికలో జాతీయ ఆహార భద్రత చట్టంపైన మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలలోని పేదలకు లబ్ధి చేకూరేలా చట్టాలు, బాధ్యతలు వివరించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు, గర్భిణులకు పౌష్టికాహరం అందించాలన్నారు. రేషన్ అర్హులందరికీ ఇబ్బందులు లేకుండా బియ్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో ఫ్యాన్లు సమకూర్చుకునేందుకు తన వంతు సహాయంగా రూ.10 వేలు ఇస్తున్నట్లు అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ ప్రకటించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ ధనరాజ్, డీఈఓ శ్రీనివాస్రెడ్డి, డీడబ్ల్యూఓ లక్ష్మీకాంతరెడ్డి, ఫుడ్ సెక్యురిటీ అధికారి జయరాం పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి పీఆర్టీయూ రాష్ట్ర ప్రతినిధి మహేందర్రెడ్డి హుస్నాబాద్: అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు ఆగస్టు 15లోగా పరిష్కరించాలని పీఆర్టీయూ రాష్ట్ర ప్రతినిధి మహేందర్రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పీఆర్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సీపీఎస్ రద్దు చేయకుంటే సెప్టెంబర్ 1న వేలాది మందితో ఇందిరా పార్క్ వద్ద ఉద్యమిస్తామన్నారు. ఉపాధ్యాయులు దాచుకున్న జెడ్పీ జీపీఎఫ్ సరెండర్ బిల్లులు రెండు సంవత్సరాలు గడుస్తున్నా పెండింగ్లో ఉంచడం శోచనీయమన్నారు. అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో వర్తించే విధంగా హెల్త్ కార్డులు మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మల్లుగారి ఇంద్రసేనారెడ్డి, ప్రధాన కార్యదర్శి శశిధర్ శర్మ, హుస్నాబాద్ మండల శాఖ అద్యక్షుడు తిరుపతి రెడ్డి నాయకులు పాల్గొన్నారు. -
సాహితీ సౌరభం సినారె
ప్రశాంత్నగర్(సిద్దిపేట): తెలుగు సాహిత్యం అభివృద్ధిలో సింగిరెడ్డి నారాయణరెడ్డి చేసిన కృషి ఎనలేనిదని ప్రముఖ పద్య కవి కనకయ్య, గ్రంథ పాలకులు దాసరి రాజు అన్నారు. డాక్టర్ నారాయణరెడ్డి జయంతి సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో సినారె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ నారాయణరెడ్డి రచనలు నేటి యువ కవులకు ఆదర్శమన్నారు. బాలసాహితీవేత్త ఉండ్రాళ్ల రాజేశం మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పేద కుటుంబంలో జన్మించి, ఎంతో కష్టపడి, పలు ప్రక్రియలలో రచనలు చేశారన్నారు. జ్ఞానపీఠ్, కేంద్ర సాహిత్య పురస్కారం లాంటి ఎన్నో అవార్డులతో పాటు రాజ్యసభ సభ్యులుగా పనిచేసిన డాక్టర్ నారాయణరెడ్డి తెలుగు సాహితీ జగత్తులో ఒక వెలుగు వెలిగారన్నారు. కార్యక్రమంలో లక్ష్మయ్య, రాజ్కుమార్, పర్శరాములు పాల్గొన్నారు. -
ఫేస్తోనే ఇక పెన్షన్
మరింత పారదర్శకంగా డబ్బు పంపిణీ పెన్షనర్లకు ఇక నుంచి ఫేస్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు) విధానం ద్వారా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. చేయూత పథకం కింద అందిస్తున్న పింఛన్ల పంపిణీలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు ఫేస్ రికగ్నిషన్ అనే ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బయోమెట్రిక్ విధానం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను తొలగించడంతో పాటు సులభంగా, వేగంగా పెన్షన్ అందించేందుకు ఈ విధానం చేయనుంది. ఇప్పటికే సంబంధించిన అధికారులు, సిబ్బందికి శిక్షణ అందించారు. సిద్దిపేటరూరల్: మున్సిపాలిటీల్లో పింఛన్ ను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. అయితే ఎవరైనా లబ్ధిదారు మరణిస్తే కుటుంబ సభ్యులు సంబంధిత అధికారులకు సమాచారం అందించాల్సి ఉంటుంది. డెత్ సర్టిఫికెట్ ఇచ్చినట్లెతే సదరు లబ్ధిదారునికి అందించే పింఛన్ నిలిచిపోతుంది. కానీ అలా జరగడం లేదు. పింఛన్ దారులు మరణించినా డబ్బులు మాత్రం వారి ఖాతాల్లో జమ అవుతున్నాయి. వాటిని కొంతమంది ఏటీఎం ద్వారా డ్రా చేసుకుంటున్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు పలు చోట్ల చోటు చేసుకున్నాయి. అలాగే పలుచోట్ల పంచాయతీ కార్యదర్శులు పింఛన్ కాజేసిన ఘటనలు సైతం చోటు చేసుకున్నాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టే దిశగా ప్రభు త్వం ఫేస్ రికగ్నిషన్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పకడ్బందీగా అమలు పెన్షన్ పొందుతున్న వారిలో కొందరు వారి ఆధార్ కార్డుల్లో వయస్సును తప్పుగా నమోదు చేయించుకుంటూ ఎక్కువ వయస్సు ఉందంటూ అధికారులను నమ్మించి మోసం చేస్తూ పెన్షన్లు పొందుతున్నారు. దీంతో ఈ యాప్ను పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇబ్బందులు దూరం.. ప్రస్తుతం బయోమెట్రిక్ ద్వారా పింఛన్ల పంపిణీ జరుగుతోంది. పెన్షన్ పొందాలంటే పోస్టాఫిస్కు వెళ్లి అక్కడ బయోమెట్రిక్ వేయాల్సి ఉంది. ఈ క్రమంలో లబ్ధిదారుల్లో అత్యధికులు వృద్ధులు కావడంతో వేలి ముద్రలు స్కాన్ కాకపోవడంతో వారు పెన్షన్ తీసుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఐరిష్లోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో వార్డు అధికారులు, కార్యదర్శుల బయోమెట్రిక్ ద్వారా పెన్షన్లు పొందుతున్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన యాప్ ద్వారా బయోమెట్రిక్ ఇబ్బందులు దూరం కానున్నాయి. ఆధార్ ఫొటోతో అనుసంధానమైన లబ్ధిదారుల వివరాలు స్మార్ట్ ఫోన్లో ఫొటో తీయగానే చెల్లింపు వివరాలు వస్తాయి. దీంతో వెంటనే పెన్షన్ డబ్బులు పొందేందుకు ఆస్కారం ఉంది. జిల్లాలో పెన్షన్దారుల వివరాలు లబ్ధిదారుల సంఖ్య: 1,85,296 నెలవారీగా చెల్లిస్తున్న డబ్బులు: రూ.40,08,70,736 వృద్ధులు: 58,666 వితంతువులు: 54,734 దివ్యాంగులు: 13,657 ఒంటరి మహిళలు: 3,406 టేకీదార్లు (మునీంలు): 274 చేనేత: 2,194 బీడీ కార్మికులు: 45,393 గీత కార్మికులు: 2,921 ఫైలేరియా: 2,429 డయాలసిస్ రోగులు: 232 ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు: 1,390 బయోమెట్రిక్ ఇబ్బందులకు స్వస్తి ఇప్పటికే పూర్తయిన బీపీఎంల శిక్షణ ఆగస్టు నెల నుంచే అమల్లోకి.. అక్రమాలకు చెక్ పెట్టేందుకే..పెన్షన్ల పంపిణీలో అక్రమాలకు చెక్పెట్టి మరింత పారదర్శకతను తీసుకురావాలనే ఉద్దేశ్యంత ఫేస్ రికగ్నిషన్ యాప్ను తీసుకువచ్చారు. అధికారులకు, బీపీఎంలకు, పంచాయతీ కార్యదర్శులు శిక్షణ పూర్తి అయింది. పూర్తి స్థాయిలో స్మార్ట్ ఫోన్లను అందించడం జరుగుతుంది. –జయదేవ్ఆర్యా, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి -
అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ● గత బీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్కార్డూ ఇవ్వలేదు ● పదేళ్లుగా నిరీక్షించిన వారికి రేషన్కార్డులిచ్చాం ● సొంతింటి కలనూ నెరవేరుస్తున్నాం ● ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ అర్హులందరికీ సంక్షేమ ఫలాలు సిద్దిపేటజోన్: ‘మాది ప్రజా ప్రభుత్వం.. అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం.. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టినా సంక్షేమ పథకాలు ఆపడంలేదు’ అని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నియోజకవర్గ పరిధిలోని సిద్దిపేట అర్బన్, రూరల్ మండల లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డుల ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. పదేళ్లుగా నిరీక్షించిన వారికి రేషన్ కార్డులు ఇచ్చి వారి కలను నిజం చేశామన్నారు. అలాగే పేదల సొంతింటి కలను సైతం నెరవేరుస్తున్నామని వివేక్ అన్నారు. సిద్దిపేట అర్బన్, రూరల్ పరిధిలో కొత్తగా 10వేల రేషన్ కార్డులు మంజూరు చేసినట్టు తెలిపారు. సిద్దిపేట అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్కు అధికంగా నిధుల కేటాయించేందుకు ప్రయత్నిస్తానన్నారు. పరస్పర నినాదాలు.. రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు. ముందు జాగ్రత్తగా పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తలు తమ పార్టీలకు అనుగుణంగా నినాదాలు చేశారు. పెద్ద రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, ఆర్డీఓ సదానందం, కాంగ్రెస్ నాయకుడు హరికృష్ణ అధికారులు పాల్గొన్నారు. విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి నంగునూరు(సిద్దిపేట): రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి నిధులు పెంచిన ఘనత రేవంత్ సర్కారుదేనని, విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు మంత్రి వివేక్ తెలిపారు. మంగళవారం నంగునూరులో 3,302 మంది లబ్ధిదారులకు రేషన్కార్డుల ప్రొసీడింగ్స్, కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ డిసెంబర్లోపు లక్ష మందికి ఉద్యోగాలు కల్పించి, మూడేళ్లలో మరో లక్ష ఉద్యోగాలిస్తామన్నారు. బీఆర్ఎస్ హయాంలో సంక్షేమం నిర్వీర్యం చిన్నకోడూరు(సిద్దిపేట): గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో సంక్షేమాన్ని నిర్వీర్యం చేసి.. రాష్ట్రా న్ని అప్పుల పాలు చేసిందని మంత్రి వివేక్ అన్నారు. చిన్నకోడూరులో నూతన రేషన్ కార్డు ల ప్రొసీడింగ్స్, కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో పేదలకు న్యాయం జరుగుతోందన్నారు. సిద్దిపేటరూరల్: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ అన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. మంగళవారం నారాయణరావుపేట మండల కేంద్రంలో రేషన్కార్డుల ప్రొసీడింగ్, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మా నాన్న గడ్డం వెంకటస్వామి మూడు సార్లు ఎంపీగా పనిచేసి, 1973లో కేంద్ర మంత్రిగా ఉంటూ రేషన్కార్డు పద్ధతిని తీసుకువచ్చారని’ గుర్తు చేశారు. ఆయన వారసుడిగా తానూ రేషన్కార్డులను పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. రేషన్కార్డుల ద్వారా సరాఫరా చేసే సన్నబియ్యాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలన్నారు. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతో రూ.5లక్షలతో ఇందిరమ్మ ఇళ్లను అందిస్తున్నామన్నారు. -
ఆలయ భూములు అన్యాక్రాంతం
హిందు ధార్మిక సంఘం నాయకుడు మల్లేశం యాదవ్ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని మోహినిపుర వెంకటేశ్వరస్వామి ఆలయ భూములు అన్యాక్రాంతమయ్యాయని సిద్దిపేట హిందు ధార్మిక సంఘాల నాయకుడు ఉడుత మల్లేశం యాదవ్ ఆరోపించారు. పట్టణంలోని వెంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలో సోమవారం ఆయన మాట్లాడారు. ఆలయంలో గతంలో ఆర్డీఓగా విధులు నిర్వహించిన వెంకట నరసయ్య ఐదెకరాలు అసైన్డ్ భూమిని తన వంశస్థులే శాశ్వత చైర్మన్గా ఉండేలా ఒత్తిడి తెచ్చా రని ఆరోపించారు. కానీ ఆలయం మాత్రం సిద్ది పేట ప్రజల సహకారంతోనే నిర్మాణం జరిగింద న్నారు. ఐదెకరాల స్థలం ఒక సంవత్సరం మాత్రమే ఆలయం పేరు మీద ఉండి తదనంతరం ఆ భూమి లో నాలుగెకరాలు తన కుమారుల పేరు మీద మార్చారని ఆరోపించారు. చివరకు ఆలయం పేరు మీద ఒక్క ఎకరం మాత్రమే మిగిల్చారని వాపోయారు. నాటి నుంచి నేటి వరకు ఒక్క వంశంవారే గుడి చైర్మన్గా ఉంటున్నారన్నారు. ఆలయ భూము లు అన్యాక్రాంతం విషయంపై అధికారులు, గవర్నర్కు, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. -
భవిష్యత్ ముద్దు సోషల్ మీడియా వద్దు
జగదేవ్పూర్(గజ్వేల్): విద్యార్థులు భవిష్యత్ను లక్ష్యంగా పెట్టుకుని విద్యను అభ్యసించాలని, సోషల్ మీడియాకు వీలైనంత దూరంగా ఉండాలని ఎస్ఐ కృష్ణారెడ్డి సూచించారు. సోమవారం జగదేవ్పూర్లో కేజీబీవీ పాఠశాలలో షీటీమ్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు వివిధ చట్టాలు, అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే చట్టాలు, సైబర్నేరాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఉన్నతస్థాయికి ఎదగాలంటే విద్య ఒకటే మార్గమని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ స్రవంతి, ఏఎస్ఐ రమణారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
చేర్యాల(సిద్దిపేట): పట్టణకేంద్రంలోని పదో వార్డుకు చెందిన పలు పార్టీల నాయకులు సోమ వారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్, వార్డు ఇన్చార్జి చింతల మల్లేశం ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చేర్యాలలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని, పార్టీలో చేరిన యువత అందుకు కృషి చేయాలన్నారు. పార్టీలో చేరిన పలువురు మాట్లాడుతూ ప్రతాప్రెడ్డి నాయకత్వంలో పనిచేస్తూ స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషిచేస్తామన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లేశం, నాయకులు చంద్రయ్య, లక్ష్మీనారాయణ, నరేంద ర్, సతీశ్, రాకేష్కృష్ణన్, నాని, సన్ని, సదానందం ఖలీం పాష, అరవింద్, హరీశ్, భాను, ప్రసాద్, రాజేశ్, అరవింద్, సోను, హర్షవర్ధన్, బాలరాజ్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు. -
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
సీఐటీయూ జిల్లా కోశాధికారి భాస్కర్ తొగుట(దుబ్బాక): గత ఎన్నికల సమయంలో పంచాయతీ కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హమీలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి గొడ్డుబర్ల భాస్కర్ డిమాండ్ చేశారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం మండల స్థాయి పంచాయతీ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలన్నారు. 60 యేళ్లు నిండిన కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్గా రూ.5 లక్షలు అందజేయాలని కోరారు. మల్టీపర్పస్ విధా నాన్ని రద్దు చేస్తామని, కార్మికులకు కనీస వేతనాలు పెంచుతామని ప్రభుత్వం హమీ ఇచ్చిందని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల వేతనాలు మంజూరు చేస్తే పంచాయతీ కార్యదర్శులు కార్మి కుల వేతనాల్లో కోతలు విధిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కార్మికులకు ఏడాదికి రెండు జతల యూనిఫామ్స్ అందించాలని నిబంధ న ఉన్నా సకాలంలో అందించడంలేదని వాపోయా రు. చెప్పులు, నూనె, గ్లౌజులు, సబ్బులు, కనీస వసతులు అందించకుండా కార్మికులకు ఇబ్బందు లకు గురిచేయడం తగదన్నారు. అనంతరం మండ ల నూతన కమిటీని ఎంపిక చేశారు. అధ్యక్షుడిగా నర్సింహులు, ఉపాధ్యక్షుడిగా భిక్షపతి, కార్యదర్శిగా మాణిక్యం, సహాయ కార్యదర్శులుగా పోశ య్య, అక్కవ్వ, స్వామి, సాయిలు, కనకరాజు, కోశాధికారిగా ప్రభాకర్ తదితరులను నియమించారు. -
నానో యూరియాతో రైతులకు మేలు
బెజ్జంకి(సిద్దిపేట): నానో యూరియా, డీఏపీ వినియోగించడం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఏఓ సంతోష్ అన్నారు. మండలంలోని కల్లెపెల్లిలో సోమవారం పత్తి పంటను పరిశీలించా రు. అనంతరం మాట్లాడుతూ యూరియాను మో తాదుకు మించి వాడితే చీడపీడల ఉధృతి కూడా పెరుగుతుందన్నారు. నానో యూరియా ద్రవ రూపంలో తక్కువ ధరకే లభిస్తుందని తెలిపారు. వర్షాల కారణంగా పత్తి చేనులో నీరు నిలిస్తే కాపర్ ఆక్సీ క్లోరైడ్ మూడు గ్రాములు లీటర్ నీటిలో కలిపి చెట్టు మొదళ్లలో పోయాలని చెప్పారు.అనంతరం బెజ్జంకి, కల్లెపెల్లి గ్రామా లలోని ఫ్యాక్స్, ఎరువుల దుకాణాలను తనిఖీచేసి యూరియా నిల్వలు, రికార్డులను పరిశీలించారు. వినియోగం పెంచాలి తొగుట(దుబ్బాక): నానో యూరియా వినియో గాన్ని పెంచేలా డీలర్లు కృషి చేయాలని దుబ్బాక ఎడీఎ మల్లయ్య కోరారు. స్థానిక రైతు వేదికలో ఎరువుల డీలర్లకు నానో యూరియాపై సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీలర్లు నానో యూరియాను రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రైతులు కొనుగోలు చేసిన వెంటనే బిల్లులు ఇవ్వాలని, స్టాక్ బోర్డు ఏర్పాటు చేసుకోవాల సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఏఓ మోహన్ పాల్గొన్నారు. పత్తిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి జగదేవ్పూర్(గజ్వేల్): పత్తి పంటలో రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఏఓ వసంతరావు సూచించారు. మండలంలోని అలిరాజ్పేటలోని పలువురి పత్తి పంటలను సోమవారం పరిశీలించారు. ఇటీవల కురిసిన అధిక వర్షాల వల్ల తీసుకో వాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించా రు. అనంతరం మాట్లాడుతూ ప్రస్తుతం పంట శాఖీయదశ నుంచి గూడదశలో ఉందన్నారు. అక్కడక్కడ పారవిల్ట్ కనిపిస్తుందని, దీని వల్ల మొక్కల ఆకులు ఎండిపోయినట్లు కనిపిస్తాయని వివరించారు. నివారణకు పొలంలో ఉన్న నీటిని బయటకు పంపించాలని సూచించారు. వ్యవసాయ అధికారుల సూచనల మేరకు మందులు పిచికారీ చేయాలని చెప్పారు. -
దోమల నివారణకు చర్యలేవీ?
● మూలనపడ్డ ఫాగింగ్ యంత్రాలు ● గ్రామాల్లో విజృంభిస్తున్న దోమలు ● పట్టించుకోని అధికారులు అక్కన్నపేట(హుస్నాబాద్): అసలే గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ అంతంత మాత్రమే ఉంది. వర్షాకాలం వచ్చిందంటే ఎక్కడ పడితే అక్కడ నీరు నిల్వ ఉండి, మురుగు కాలువలు నిండి కాలనీల్లో అధ్వానంగా మారుతాయి. దీంతో దోమలు విజృంభిస్తున్నాయి. మలేరియా, డెంగీ, డయేరియా, చికున్గున్యా వంటి రోగాల బారిన పడుతుంటారు. ప్రజలను సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడేందుకు వర్షాకాలంలో ప్రత్యేక చర్యలు తీసు కోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశిస్తున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. వానకాలంలో ప్రత్యేకించి దోమల నివారణకు చర్యలు చేపట్టాల్సి ఉంది. వానాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిరుపయోగంగా ఫాగింగ్ యంత్రాలు వానాకాలంలో దోమల నివారణకు గతంలో పంచాయతీలు ఫాగింగ్ యంత్రాలు కొనుగోలు చేశాయి. నిధులు తక్కువగా ఉండే జీపీలు వేరే జీపీల నుంచి తీసుకుని వాడుకునేలా అధికారులు చర్యలు తీసుకునేవారు. గతేడాది వరకు ఆడపదడపా వాటి వినియోగం కనిపించినా ఈ యేడాది మాత్రం నామమాత్రంగా కూడా కనిపించడం లేదు. మండలంలో మొత్తం 38 గ్రామాలు ఉండగా దాదాపుగా 15 గ్రామాల్లో ఫాగింగ్ యంత్రాలు కొనుగోలు చేశారు. ఒక్కొక్క దానికి రూ.40 వేల నుంచి రూ.60 వేలు నిధులు వెచ్చించారు. వాటి వినియోగంపై అవగాహన లేక పెట్రోల్, డీజిల్, లిక్విడ్ సమపాళ్లలో కలపకపోవడంతో తరుచూ పాడవుతున్నాయని తెలుస్తోంది. మళ్లీ మరమ్మత్తు చేయించాలంటే ఖర్చు భారీగా అవుతున్నట్లు సమాచారం. దీంతో గతేడాది పాడైపోయిన యంత్రాలు ఇప్పటివరకు మరమ్మత్తులకు నోచుకోలేదు. నిధులు లేమితో యంత్రాలు గ్రామ పంచాయతీ కేంద్రాల్లో మూలన పడ్డాయి. నిధుల లేమి చాలా పంచాయతీలలో ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పలు దర్శన మిస్తున్నాయి. డ్రైనేజీలు చెత్తాచెదారంతో నిండిపోయాయి. దీంతో రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తోంది. దీంతో గ్రామాలలో దోమలు విపరీతంగా పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం నిల్వ నీటి మడుగుల్లో ఆయిల్ బాల్స్ వేయడం వంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు. ఉన్నతాధికారులు ఇప్పటికై నా ఫాగింగ్ యంత్రాలను వినియోగంలోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.చర్యలు తీసుకుంటున్నాం.. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై పంచాయతీ కార్యదర్శులతో ప్రతి బుధవారం ప్రత్యేక సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నాం. డ్రైడే నిర్వహణ, నిల్వ నీటిలో ఆయిల్ బాల్స్ వేయడం వంటి చర్యలు తీసుకుంటున్నాం. ఫాగింగ్ యంత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. గ్రామాల్లో దోమల నివారణకు చర్యలు తీసుకుంటాం. పాడైన ఫాగింగ్ యంత్రాలకు మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకొస్తాం. – భానోతు జయరాం, ఎంపీడీఓ -
ఏసీ రెడ్డి ఆశయాలను కొనసాగిద్దాం
కొమురవెల్లి(సిద్దిపేట): తెలంగాణ రైతాంగ సాయు ధ పోరాటయోధుడు జనగామ మాజీ ఎమ్మెల్యే ఏసీరెడ్డి నర్సింహారెడ్డి ఆశయాలను కొనసాగిద్దామని సీపీఎం మండల కార్యదర్శి తాడూరి రవీందర్ పిలుపునిచ్చారు. సోమవారం నర్సింహారెడ్డి 34వ వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఏసీ రెడ్డి నాడు భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన సాయుధ పోరాటంలో కీలకపాత్ర పోషించారన్నారు. దొరలు, భూస్వాములకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించి వేలాది ఎకరాల భూములను పేదలకు పంచారని కొనియాడారు. మల్లేశం, ఎల్లయ్య, రవీందర్, భరత్కుమార్, రాకేశ్ పాల్గొన్నారు. -
మొక్కలు సంరక్షించడం అందరి బాధ్యత
ఎస్ఐ కీర్తిరాజుదుబ్బాకరూరల్: వనమహోత్సవంలో భాగంగా మండలంలోని పెద్దగుండవెళ్లిలో ఎస్ఐ కీర్తిరాజు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాదు వాటిని రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మొక్కలను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని చెప్పారు.ప్రతి ఒక్కరు విధిగా ఐదు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అదే విధంగా గ్రామంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఛైర్మన్ మహేశ్ ఆయనకు శాలువ కప్పి సన్మానించారు. కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ మల్లుగారి ప్రేమ్, కార్యదర్శి యాదగిరి, పరశురాములు, శ్రీకాంత్రెడ్డి, ప్రదీప్రెడ్డి, అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఐదు మొక్కలు నాటాలి హుస్నాబాద్రూరల్: స్వశక్తి మహిళలు వనమహోత్సవంలో పాల్గొని ఇంటింటికీ ఐదు మొక్కలు నాటాలని ఏపీఎం భిక్షపతి సూచించారు. పోతారం(ఎస్) గ్రామంలో స్వశక్తి మహిళలతో కలిసి వనమహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు ఆహ్లాదకరంగా ఉండాలంటే ఇంటి ఎదుట మొక్కలు నాటుకోవాలన్నారు. మునగ, జామ, నిమ్మ, కరివేప, తులసి మొక్కలు నాటితే అవి మన ఆర్యోగానికి ఉపయోగపడుతాయని చెప్పారు. కార్యక్రమంలో సీసీలు రవీందర్, సీఏ కనకతార తదితరులు పాల్గొన్నారు. మొక్కలతోనే మనుగడ చిన్నకోడూరు(సిద్దిపేట): చెట్లను పెంచడం ద్వారా నే మానవ మనుగడ సాధ్యమవుతుందని జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఏపీఎం ఆంజనేయులు అన్నారు. సోమవారం చిన్నకోడూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణ, ఖాళీ స్థలా ల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. ఏపీఓ స్రవంతి, సీసీ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. -
కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
వ్యవసాయ అధికారి మల్లేశం మిరుదొడ్డి(దుబ్బాక): మండల పరిధిలో యూరి యా కృత్రిమ కొరత సృష్టించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయ అధికారి మల్లేశం హెచ్చరించారు. మిరుదొడ్డిలోని పీఏసీఎస్, చెప్యాలలోని డీసీఎంఎస్ కేంద్రాలను సోమవారం ఆయన సందర్శించారు. రెండు కేంద్రాలకు సరఫ రా అయిన 40 మెట్రిక్ టన్నుల యూరియా రైతు లకు అందిస్తున్న విధానాన్ని పరిశీలించారు. అనంతరం పలు ఎరువులు, విత్తనాల దుకాణాలను తనిఖీ చేశారు. రికార్డులు, రసాయన ఎరువులు, విత్తనాల నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని రైతులకు కావాల్సిన యూరియా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో మిరుదొడ్డి పీఏసీఎస్ సీఈఓ రాజు, ఏఈఓ లు అఖిల్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
బీటీ రోడ్డు నిర్మించాలని వినతి
చేర్యాల(సిద్దిపేట): మండల పరిధిలోని ముస్త్యాల గ్రామ వేముల పోచమ్మ దేవాలయం వరకు బీటీ రోడ్డు నిర్మించాలని కోరుతూ సీపీఐ మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహసీల్దార్ దిలీప్నాయక్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లానేత అందె అశోక్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఈరి భూమయ్య మాట్లాడుతూ పోచమ్మ దేవాలయానికి నిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తారన్నారు. అలాంటి ఆలయం వరకు మట్టి రోడ్డు ఉండడంతో వర్షం పడితే రోడ్డు బురదగా మారి భక్తులు ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. ఆలయం వరకు బీటీరోడ్డు మంజూరు చేయించాలని కోరుతూ తహసీల్దార్కు వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తానని తహసీల్దార్ హామీ ఇచ్చారని చెప్పారు. నాయకులు భద్రయ్య, ప్రభాకర్, రాజు, కుమార్, నర్సిరెడ్డి, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రకృతిని రక్షించుకుందాం
దుబ్బాకటౌన్: ప్రకృతిని రక్షించుకుందాం.. భవిష్యత్ను కాపాడుకుందామని గజ్వేల్ లయ న్స్ క్లబ్ స్నేహ ఉపాధ్యక్షుడు డాక్టర్ కుమారస్వామి అన్నారు. సోమవారం రాయపోల్ మండలం ఆరేపల్లి ప్రాథమిక పాఠశాలలో అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ స్నేహ ఆధ్వర్యంలో మొక్కలు నాటి విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు. భవిష్యత్ తరాలకు ఆహ్లాదకరమైన పర్యావరణం అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్ర మంలో క్లబ్ స్నేహ నాయకులు సత్యనారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్, ఉపాధ్యాయులు స్వాతి, విద్యార్థులు తదితరులున్నారు. భాస్వరం కరిగించే బ్యాక్టిరియా నంగునూరు(సిద్దిపేట): పొలంలో పేరుకుపోయిన భాస్వరాన్ని కరిగించే బ్యాక్టిరియాను అభివృద్ధి చేయడంతో పంటకు ఎంతో మేలు జరుగుతుందని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పల్లవి అన్నారు. తోర్నాల ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం ముండ్రాయిలో క్షేత్రస్థాయి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్జీవన్రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల విద్యార్థులకు పంటల సాగు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. పల్లవి మాట్లాడుతూ విత్తన శుద్ధి చేసిన నారు కట్టలను ముంచే పద్ధతిలో పీఎస్బీ ద్రావకంలో నానబెట్టి నాటు వేసుకోవాలన్నారు. రెండు కిలోల పీఎస్బీ ద్రావకాన్ని పశువుల ఎరుతో కలిపి చల్లడం ద్వారా భాస్వరాన్ని కరిగించే లక్షణం వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో విద్యార్థులు దాక్షాయని, అర్చన, గాయత్రి, సుమయ, అలేఖ్యరెడ్డి, రైతు కరుణాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నోట్ పుస్తకాల పంపిణీ మద్దూరు(హుస్నాబాద్): మండల పరిధిలోని లద్నూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు గ్రా మానికి చెందిన దాసరి మురళీధర్రెడ్డి సోమ వారం నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇదే పాఠ శాలలో తన తండ్రి లక్ష్మారెడ్డి ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహించారన్నారు. తన తండ్రి లక్ష్మారెడ్డి, తల్లి కృష్ణమ్మల జ్ఞాపకార్థం పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. పాఠశాల అభివృద్ధికి అందరూ సహాయ సహకారా లు అందించాలన్నారు. ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనర్సయ్య, కృష్ణా రెడ్డి, పద్మారెడ్డి, భూపాల్రెడ్డి, వేణుగోపాల్రెడ్డి, అరవింద్రెడ్డి, అనూ ప్రెడ్డి, నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ బాల రాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గ్రంథాలయ నిర్వహణపై అవగాహన కొండపాక(గజ్వేల్): పుస్తక పఠనంతో విజ్ఞానం పెంపొందుతుందని మండల విద్యాధికారి(ఎంఈఓ) బచ్చలి సత్తయ్య అన్నారు. కుకునూరుపల్లి పాఠశాలల్లో గ్రంథాలయ నిర్వహణ తీరుపై ఉపాధ్యాయులకు సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన గ్రంథాలయాలకు విద్యార్థులు అలవాటు పడేలా చూసుకోవాలన్నారు. పుస్తక పఠనం విలువ గురించి విద్యార్థులకు అర్థం చేయించాలని సూచించారు. శిక్షణలో బెస్టు పార్టిసిపెంట్గా నిలిచిన బొబ్బాయిపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం అశ్విని ఘనంగా సత్కరించారు. రిసోర్సు పర్సన్ సత్యకృష్ణ, సీఆర్పీ సంతోష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అంబులెన్స్ల్లో తనిఖీలు హుస్నాబాద్: జిల్లాలో మొత్తం ఇరువై ఆరు అంబులెన్స్లను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈఎంఆర్ఐ, గ్రీన్ హెల్త్ సర్వీసెస్తో అనుసందానంతో సేవలందిస్తున్నట్లు ఆ సంస్థ అధికారి కిషోర్ తెలిపారు. పట్టణంలో సోమవారం రెండు 108 అంబులెన్స్లు, 102 అమ్మఒడి వాహనాన్ని తనిఖీ చేశారు. అంబులెన్స్లోని పరికరాలు, రికార్డులు, పనితీరును పరిశీలించారు. అనంతరం కిషోర్ మాట్లాడుతూ అత్యవసర సమయంలో నిర్లక్ష్యం చేయకూడదన్నారు. నాణ్యత విభాగంశాఖ తనిఖీ అధికారి, జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ షేక్ జాన్ సాహిద్, జిల్లా మేనేజర్ హరి రామకృష్ణ, పైలెట్ సతీశ్, ఈఎంటీ విష్ణు వర్ధన్ పాల్గొన్నారు. -
కొత్త రేషన్కార్డులతో నెరవేరిన కల
బెజ్జంకి(సిద్దిపేట): రేషన్కార్డుల కోసం పదేళ్లుగా కంటున్న పేదల కల ఇప్పటికి నెరవేరిందని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. స్థానిక సీఎన్హెచ్ గార్డెన్స్లో సోమవారం పలువురు లబ్ధిదారులకు మంజూరైన కొత్త రేషన్కార్డులు, సీఎం సహాయనిధి, కల్యాణలక్ష్మి, షాది ము బారక్ చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో రేషన్కార్డులు ఇచ్చారని, మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే కొత్త కార్డులు మంజూరయ్యాయన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజలను పట్టించుకోలేదని ఆరోపించారు. మండలంలో రెండు విడతల్లో 901 రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీఓ ప్రవీణ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దామోదర్, పార్టీ అధ్యక్షుడు రత్నాకర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, ఆలయ కమిటీ చైర్మన్ ప్రభాకర్, పోచయ్య, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయన బాలికల పాఠశాలలో రూ.7.15 లక్షలతో నిర్మించనున్న నూతన భవిత కేంద్రానికి, అలాగే రామసాగరంలో నూతన పంచాయతీ భవనానికి భూమిపూజ చేశారు. అదేవిధంగా వాటర్ట్యాంక్, దాచారంలో నూతన పంచాయతీ భవనం, అంగన్వాడీ కేంద్రం పాఠశాలలో వంటశాలతోపాటు సీసీ రోడ్లు ప్రారంభించారు. మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి -
వరినాట్ల జోరు
వర్షాలతో ఊపందుకున్న సాగు ● ఇప్పటికే 1.30 లక్షల ఎకరాలకుపైగా విస్తీర్ణం ● ఇప్పటి వరకు అధిక వర్షపాతం నమోదు ● సాగు మరింత పెరిగే అవకాశం నాలుగు రోజులుగా తెరిపి లేకుండా కురిసిన వర్షాలతో జిల్లాలో సాగు స్వరూపం మారిపోతోంది. వరినాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వర్షపాతం ఇదేవిధంగా కొనసాగితే సాగు మరింత ఊపందుకునే అవకాశం ఉంది. పత్తి, మొక్కజొన్న పంటలకు జీవం పోసినట్లయ్యింది. ఇప్పటికీ 1.30లక్షల ఎకరాలకుపైగా వరి సాగు అవుతున్నట్లు అంచనా. గజ్వేల్: జిల్లాలో వానాకాలం సీజన్లో రైతుల ఆది నుంచి కష్టాలు పడుతున్నారు. సీజన్ అరంభం నుంచి 45రోజులకుపైగా వర్షాలు సక్రమంగా లేక పత్తి, మొక్కజొన్న పంటలు వాడిపోయే దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు కొంత ఊరటనిస్తున్నాయి. నల్లరేగడి భూముల్లో సాగు చేసిన పత్తి పంటలు జీవం పోసుకున్నాయి. మిగతా భూముల్లో వేసిన పత్తి ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయి మొక్కల ఎదుగుదల లోపించింది. మొక్కజొన్న పరిస్థితి ఇదే విధంగా ఉంది. జిల్లాలో పత్తి ఇప్పటివరకు 1.11లక్షల ఎకరాల సాగుకు అంచనాకు ఇప్పటివరకు 1.04లక్షల ఎకరాల్లో సాగయ్యింది. మొక్కజొన్న 40వేల ఎకరాల సాగు అంచనాకు 25,371 ఎకరాల్లో సాగులోకి వచ్చింది. అదేవిధంగా కందులు 5,297 ఎకరాలు, పెసర్లు 202, మినుములు 13.5, స్వీట్కార్న్ మరో 1,352 ఎకరాల్లో సాగులోకి వచ్చింది. వర్షపాతం అధికం పది రోజుల క్రితం వరకు అరకొరగా ఉన్న వర్షపాతం నాలుగురోజులుగా కురుస్తున్న వర్షాలతో ఒక్కసారిగా మారిపోయింది. జూన్ 1నుంచి ఇప్పటివరకు జిల్లాలో 271.9మి.మీ.ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు 347.1మి.మీలు నమోదయ్యింది. ముందు కూడా వర్షాలు సమృద్ధిగా ఉంటాయనే ఆశతో రైతులు వరి నాట్లు ముమ్మరం చేశారు. జిల్లాలో 5.60లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగులోకి వస్తాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా వరి 3.76లక్షల ఎకరాలకుపైగా సాగవుతుందని అంచనా వేస్తే.. కురుస్తున్న వర్షాలకు 1.30లక్షల ఎకరాల్లో సాగులోకి వచ్చిందని వ్యవసాయశాఖ చెబుతున్నది. భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందువల్ల సాగు మరింతగా పెరగొచ్చని, అంచనాలను చేరుకోవచ్చని కూడా వ్యవసాయశాఖ భావిస్తోంది. యూరియా అధికంగా వాడటం వల్లే.. మరోవైపు రైతులు ఎకరాకు ఒక్క బస్తా యూరియా మాత్రమే వాడాల్సి ఉండగా.. 3– 4బస్తాలు వాడుతుండటం కూడా కొరతకు కారణమవుతున్నదని వ్యవసాయశాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో రైతుకు ఎకరాకు ఒక్క యూరియా బస్తా మాత్రమే ఇవ్వాలని గట్టిగా ఆదేశాలిచ్చారు. యూరియా కొనుగోలు సందర్భంగా రైతుల వివరాలను నమోదు చేసుకోవాలని చెబుతున్నారు. వ్యవసాయశాఖ ఎన్ని ప్రయత్నాలు చేసినా నిల్వలు సమృద్ధిగా లేకపోతే ఎరువుల దుకాణాల వద్ద క్యూలైన్లు తప్పేలా లేవు.సాగు పెరిగే అవకాశం జిల్లాలో వర్షపాతం బాగుంది. వరి నాట్లు ఊపందుకున్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే జిల్లాలో వరి సాగయ్యే అవకాశం ఉంది. పత్తి, మొక్కజొన్న పంటలు జీవం పోసుకున్నాయి. జిల్లాలో యూరియా కొరత తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తాం. – స్వరూపరాణి, జిల్లా వ్యవసాయాధికారియూరియా కొరతపై ఆందోళన యూరియా కొరతపై జిల్లాలో ఆందోళన నెలకొంది. వానాకాలం సీజన్ అవసరాలకు 35,144 మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు కేవలం 10వేల మెట్రిక్ టన్నులకుపైగా మాత్రమే వచ్చింది. నిజానికి ఈ సమయానికి జిల్లాకు అవసరమైన యూరియా నిల్వల్లో ఇప్పటికే 75శాతం అందుబాటులో ఉండేది. కానీ ప్రస్తుతం భిన్నంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సాధారణ యూరియా కొరత నేపథ్యంలో వ్యవసాయశాఖ నానో యూరియా వాడాలని ప్రచారం చేస్తున్నా.. రైతులు ఇప్పుడే ఆ దిశగా వెళ్లే అవకాశం కనిపించడం లేదు.బుడ్డోడి వ్యవ‘సాయం’ బడులకు ఆదివారం సెలవు కావడంతో లింగుపల్లిలో ఓ చిన్నారి తన తల్లిదండ్రులతో పొలం వద్దకు వెళ్లి వ్యవసాయంలో సాయ పడుతూ ఉత్సాహంగా కనిపించాడు. చిట్టి చిట్టి చేతులతో వరి నారు మోస్తూ అబ్బుర పరిచాడు. నారును విసురుతూ చూపరులను ఆకట్టుకున్నాడు. – మిరుదొడ్డి(దుబ్బాక) -
మల్లన్న ఆలయంలో భక్తుల సందడి
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. శ్రావణ మాసం ప్రారంభం కావడంతో భక్తుల రాక పెరిగింది. భక్తులు పుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. మల్లన్నకు పూజలు చేసి, పట్నాలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. కోరికలు తీర్చాలంటూ గంగిరేణి చెట్టుకు ముడుపులు కట్టారు. అనంతరం కొండపైన ఉన్న రేణుక ఎల్లమ్మ తల్లికి బోనంతో నైవేద్యం సమర్పించారు. ఆలయ ఈఓ అన్నపూర్ణ, ఏఈఓ బుద్ధి శ్రీనివాస్, ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్లు పర్యవేక్షించారు. ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలి ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలని, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి గంపశ్రీనివాస్ అన్నారు. వివిధ రంగాల్లో రాణించిన ఆర్యవైశ్యులకు ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ విద్య, వైద్య, వ్యాపారం, రాజకీయంతో పాటుగా అన్ని రంగాల్లో ఆర్యవైశ్యులు ముందంజలో ఉండాలన్నారు. ఆర్యవైశ్యులు సేవా కార్యక్రమాల్లో ముందుండటం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు ఆంజనేయులు, హరినాథ్, డాక్టర్ మాంకాల నవీన్ కుమార్, కాసం నవీన్, గంప కృష్ణమూర్తి, యాసాల వెంకట లింగం, హేమలత, రాజమౌళి, లింగమూర్తి, రవికుమార్ పాల్గొన్నారు. న్యూట్రిషన్ ఫుడ్తో ఆరోగ్యంగా ఉండాలిబాలల హక్కుల కమిషన్ సభ్యురాలు వందన చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని అల్లీపూర్ కేజీబీవీ పాఠశాలను ఆదివారం బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు కంచర్ల వందన సందర్శించారు. విద్యార్థులకు ఉన్న సదుపాయాలు, ఉపాధ్యాయుల ప్రవర్తన, విద్యా విధానం, సమస్యలు విద్యార్థులను వ్యక్తిగతంగా అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అందజేస్తున్న న్యూట్రిషన్ ఫుడ్ ద్వారా విద్యార్థులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించవచ్చన్నారు. బాల్య వివాహలపై జరిగే అనర్థాలను వివరించారు. కార్యక్రమంలో డీసీపీఓ రాము, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
ఉరకలెత్తిన ఉత్సాహం
ఉల్లాసంగా హాఫ్ మారథాన్ ● రంగనాయక సాగర్ జనసంద్రంచిన్నకోడూరు(సిద్దిపేట): హాఫ్ మారథాన్ ఉత్సాహంగా సాగింది. రంగనాయక సాగర్ రిజర్వాయర్ కట్ట జనసంద్రంగా మారింది. సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హాఫ్ మారథాన్ నిర్వహించారు. ఇందుకు సపోర్టింగ్ స్పాన్సర్గా సాక్షి మీడియా వ్యవహరించింది. 5, 10, 21 కి.మీ. విభాగాల్లో నిర్వహించిన పరుగు పోటీల్లో వివిధ జిల్లాలకు చెందిన వారు ఆసక్తిగా పాల్గొన్నారు. రన్నర్స్, యువత, ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉత్సాహంగా పరిగెత్తారు. మెదక్ ఎంపీ రఘునందన్రావు జెండా ఊపి పరుగును ప్రారంభించారు. ఈ పరుగులో గెలుపొందిన విజేతలకు నగదు పురస్కారాలను అందజేశారు. సాక్షి డాట్ గేమ్స్ అదుర్స్.. రంగనాయక సాగర్పై జరిగిన హాఫ్ మారథాన్లో సాక్షి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాక్షి డాట్ గేమ్స్ ఆకట్టుకున్నాయి. రన్నర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. అక్కడే ఏర్పాటు చేసిన సాక్షి విత్ సెల్ఫీ పాయింట్లో ఫొటోలు దిగారు. సాక్షి డాట్ గేమ్లో మొదటి ముగ్గురి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఎంపీ రఘునందన్రావుతో పాటు సినీ నటుడు సంపూర్ణేష్ బాబు, పలువురు ప్రముఖులు, సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజు తదితరులు సాక్షి సెల్ఫీ పాయింట్లో ఫొటోలు దిగారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్, నాయకులు పాల్గొన్నారు. వ్యాయామం తప్పనిసరి.. డయాబెటిక్ ఇండియాను హెల్త్ ఇండియాగా మార్చాలంటే ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలని ఎంపీ రఘునందన్రావు అన్నారు. ప్రస్తుతం మనల్ని మనం రక్షించుకోవడానికి మన ముందున్న మార్గం వాకింగ్ అన్నారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటేనే దేశం బాగుంటుందన్నారు. ఆరోగ్యవంతంగా ఉంటేనే ఏ రంగంలోనైనా రాణించగలమన్నారు. 50 మారథాన్లలో పాల్గొన్నా ఇప్పటి వరకు 50 మారథాన్లలో పాలొని సత్తాచాటాను. ఢిల్లీ, ముంబై, చైన్నె, గుజరాత్, వైజాగ్, హైదరాబాద్లలో జరిగిన మారథాన్లలో పాల్గొన్నా. గత ఏడాది సిద్దిపేటో మొదటి స్థానంలో నిలిచాను. ఈ సారి 21కే లో రెండో స్థానం సాధించాను. – రమేశ్చంద్ర, నాగర్కర్నూల్ -
పేదల సంక్షేమానికే ప్రాధాన్యం
కోహెడ(హుస్నాబాద్): పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం స్థానిక రైతువేదికలో కల్యాణలక్ష్మి, రేషన్ కార్డులు, కాటమయ కిట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 26 వేల మందికి నూతల రేషన్కార్డులు అందించామన్నారు. కోహెడ. హుస్నాబాద్, అక్కెన్నపేటలో 3,799 రేషన్కార్డులను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. కోహెడ మండలంలో 506 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని.. ఇందులో 72 మినహాయించి 432 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. 72 ఇళ్ల లబ్ధిదారులు సైతం నిర్మాణ పనులు చేసుకోవాలని కోరారు. మండలంలో మహిళా సంఘాలకు నాలుగు నెలల్లో రూ.కోటీ 15లక్షలకు పైగా వడ్డీలేని రుణాలు అందించినట్లు చెప్పారు. పేదలు, మహిళలు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 41 మందికి కల్యాణలక్ష్మి చెక్లు, పలువురి గీతకార్మికులకు కాటమయ కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, గంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, హుస్నాబాద్ ఆర్డీఓ రామ్మూర్తి, కోహెడ ఏఎంస్సీ చైర్మన్ నిర్మల, తహసీల్దార్ ఎండీ సమీర్అహ్మద్ ఖాన్, ఎంపీడీఓ కృష్ణయ్య పాల్గొన్నారు.ఆడ బిడ్డల ఆనందమే ముఖ్యం హుస్నాబాద్రూరల్: ఆడ బిడ్డలను ఆస్తిపరులను చేయడమే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆదివారం పోతారం(ఎస్)లో ఏర్పాటు చేసిన రేషన్కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డూ కూడా ఇవ్వలేదన్నారు. మహిళ సంక్షేమ కోసం ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, ప్లాస్టిక్ను నిషేధించడానికి ఉచితంగా స్టీల్ బ్యాంక్ను మహిళా సంఘాలకు అందిస్తున్నామన్నారు. వన మహోత్సవంలో ప్రతి మహిళ ఇంట్లో తులసి, జామ, నిమ్మ, మునుగ, కరివేపాకు మొక్కలను నాటాలని చెప్పారు. మడదలో మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న రూ.8 కోట్ల సోలార్ ప్లాంట్ ప్రోసిడింగ్స్ను అందించారు. పథకాలు సద్వినియోగం చేసుకోండి జిల్లాలో 26 వేల రేషన్కార్డులు అందజేత మంత్రి పొన్నం ప్రభాకర్ -
అభివృద్ధిపైనే దృష్టి
● ఎన్నికలప్పుడే రాజకీయాలు ● ఎంపీ రఘునందన్రావు, ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి దుబ్బాక: రాజకీయ జన్మనిచ్చిన దుబ్బాక ప్రాంతాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందామని ఎంపీ మాధవనేని రఘునందన్రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆదివారం దుబ్బాక పట్టణంలో పోచమ్మ ఆలయ పునర్నిర్మాణానికి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని కులాల ఆరాధ్యదైవం పోచమ్మ తల్లి ఆలయాన్ని అన్ని సౌకర్యాలతో నిర్మించుకుందామన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలన్నారు. రెవెన్యూ డివిజన్ కోసం ఉద్యమిస్తాం దుబ్బాక రెవెన్యూ డివిజన్ సాధన కోసం రాజకీయాలకు అతీతంగా పోరాడుదామని ఎంపీ, ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. రెవెన్యూ డివిజన్తో పాటు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, దుబ్బాక–హబ్షీపూర్ ల మధ్య నాలుగులేన్ల రోడ్డును సాధించుకునేందుకు కార్యచరణ రూపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయం పనర్నిర్మాణ కమిటీ బాధ్యులు, పట్టణంలోని అన్ని కుల సంఘాల నాయకులు తదితరులు ఉన్నారు.నయాపైసా నిధులివ్వట్లేదు: కొత్తదుబ్బాక: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా నియోజకవర్గానికి నయాపైసా నిధులివ్వలేదని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆదివారం దుబ్బాక పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని పలు బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు నిధులు మంజూరు చేయకుండా కక్ష సాధింపు ధోరణిని అవలంబిస్తోందన్నారు. నిధులు లేక అభివృద్ధి కుంటుపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికై నా న్యాయబద్దంగా నిధులు మంజూరు చేయాలన్నారు. -
జిల్లా కవులకు ఘన సన్మానం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాకు చెందిన ప్రముఖ కవులు పెందోట వెంకటేశ్వర్లు, వర్కోలు లక్ష్మయ్యలను ఘనంగా సన్మానించినట్లు బాల సాహితీవేత్త ఉండ్రాళ్ల రాజేశం ఆదివారం తెలిపారు. జాతీయ తెలుగు సారస్వత పరిషత్, తెలంగాణ పోలీస్శాఖ, జ్యోతి జాతీయ తెలుగు దినపత్రిక ఆధ్వర్యంలో పోలీస్ సామాజిక బాధ్యత అనే అంశంపై హైదరాబాద్లోని పోలీస్ ఆఫీసర్స్ మెస్లో ఆదివారం కవి సమ్మేళనం నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లాకు చెందిన కవులు పెందోట వెంకటేశ్వర్లు, వర్కోలు లక్ష్మయ్య పాల్గొని పోలీసులపై కవితాగానం వినిపించారని తెలిపారు. కవులు ఎన్నవెళ్లి రాజమౌళి, మిట్టపల్లి పరశురాములు, ఎడ్ల లక్ష్మి, బైతి దుర్గయ్య వారికి అభినందనలు తెలిపారు. -
రంగనాయక సాగర్పై ఉత్సాహంగా హాఫ్ మారథాన్.. భారీగా పాల్గొన్న అథ్లెట్లు
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట రంగనాయక సాగర్ రిజర్వాయర్ కట్టపై సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆఫ్ మారథాన్ను ఆదివారం నిర్వహించారు. సపోర్టింగ్ స్పాన్సర్గా సాక్షి మీడియా గ్రూప్ వ్యవహరించింది. రన్నర్స్, యువత ప్రజలు ఉత్సాహంగా రన్లో పాల్గొన్నారు. 5k,10 k, 21 కిలోమీటర్ల పరుగుపందెం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు హాజరయ్యారు. గెలుపొందిన విజేతలకు నగదు పురస్కారాలను అందజేశారు. రన్ చేసిన వారికి మెడల్స్ను అందజేశారు.200 మందికి పైగా..2023 మార్చి 8న సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఏర్పాటైంది. ప్రస్తుతం 200 మందికి పైగా సభ్యులు ఉన్నారు. పరుగెత్తుతూ.. ఆరోగ్యంగా జీవిద్దాం అనే లక్ష్యంతో ఆవిర్భవించిన ఈ సంఘంలో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వివిధ వృత్తులు, వయసుల వారున్నారు. వివిధ ప్రాంతాల్లో జరిగే పోటీల్లో అసోసియేషన్ సభ్యులు పాల్గొని పతకాలు సాధిస్తున్నారు. 100 మంది మారథాన్ స్థాయికి ఎదిగారు.3100 మంది నమోదు..సిద్దిపేట వేదికగా హాఫ్ మారథాన్ నిర్వహణకు రెండు నెలలుగా కసరత్తు చేశారు. 40 మందితో కార్వనిర్వాహక కమిటీ ఏర్పాటైంది. సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేశారు. పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. రెండు నెలల కిందట ఆన్లైన్లో నమోదు ప్రారంభించారు. 5K, 10K, 21K విభాగాల్లో పోటీలు జరుగుతాయి. హాఫ్ మారథాన్లో 300 మంది, 10 కి.మీ. విభాగంలో 250 మంది, 5 కి.మీ. విభాగంలో 2550 మంది నమోదు చేసుకున్నారు.ఓసారి తెలుసుకుందాం..మారథాన్ అంటే 42.195 కి.మీ. మేర, హాఫ్ మారథాన్ అంటే 21.975 కి.మీ. మేర పరుగెత్తాలి. నడకతో మొదలెట్టి పరుగు వరకు.. ఏ దశలోనైనా చేరవచ్చు. విజయానికి సమయం నిర్దేశిస్తారు. పరుగెత్తే వారిని మారథాన్ రన్నర్స్గా పిలుస్తారు. ప్రపంచ జనాభాలో 0.01 శాతం మాత్రమే మారథాన్ రన్నర్స్ ఉన్నారు. -
మార్గం.. సుగమం
జిల్లాలో పలు రోడ్లకు మహర్దశ పట్టనుంది. రాష్ట్రంలో హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్(హ్యామ్) విధానంలో ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ పరిధిలో కొత్త రోడ్లను నిర్మించాలని, ఉన్న రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఆ దిశగా తొలి అడుగు పడింది. జిల్లా వ్యాప్తంగా 166 రోడ్లు.. 721 కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మించనున్నారు. దీంతో వాహనదారులకు, ప్రజలకు ఇబ్బందులు తప్పనున్నాయి. –సాక్షి, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 166 రోడ్లు 721 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో రోడ్డు భవనాల శాఖ (ఆర్ అండ్బీ) 16 రోడ్లు 181.6 కిలోమీటర్లు, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్(పీఆర్) 150 రోడ్లు 540 కిలో మీటర్లు నిర్మాణం చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతమున్న రోడ్ల వెడల్పు, మరమ్మతులు పూర్తి చేయనున్నారు. ఇప్పటికే పలు కన్సల్టెన్సీ సంస్థలు క్షేత్రస్థాయిలో పరిశీలించాయి. ఈ రోడ్ల నిర్మాణానికి సుమారు రూ.700కోట్లను అంచనా వేసింది. మూడేళ్లలో రోడ్ల నిర్మాణం పూర్తి కానుంది. ప్రజలపై భారం పడకుండా.. ప్రజలపై భారం పడకుండా, ప్రభుత్వానికి సులభంగా ఉండేలా హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్(హ్యామ్) విధానాన్ని రూపొందించారు. ఈ విధానంలో టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్, కాంట్రాక్ట్ సంస్థలకు ప్రభుత్వం తొలుత 40శాతం నిధులను అందిస్తుంది. మిగిలిన 60శాతం నిధులను కాంట్రాక్టు సంస్థలే భరించి పనులు పూర్తి చేస్తాయి. ఆ సంస్థలు భరించిన 60శాతం నిధులను ప్రభుత్వం 15 ఏళ్ల పాటు ఏటా కొంత చొప్పున వడ్డీతో సహా చెల్లిస్తుంది. అయితే ఈ రోడ్ల పై టోల్గేట్లు పెట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. హ్యామ్ విధానంలో గ్రామీణ రోడ్లను నిర్మించడం, విస్తరించడం ఇదే తొలిసారి. నాణ్యత, నిర్వహణ పర్యవేక్షిస్తూనే చెల్లింపులు ఉంటాయి. జాతీయ రహదారుల్లో ఈ పద్ధతి ప్రవేశపెట్టగా, ప్రస్తుతం గ్రామీణ రోడ్లకు ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారు.పల్లె రోడ్లకు మహర్దశ హ్యామ్ పద్ధతిలో నిర్మాణం జిల్లా వ్యాప్తంగా 166 దారులు..721 కిలోమీటర్లు రూ.700 కోట్ల వ్యయం అంచనాతీరనున్న ఇబ్బందులు మండల కేంద్రాల నుంచి గ్రామాలకు, గ్రామాలను కలిపే రోడ్లు చాలా చోట్ల గుంతలుగా, సింగిల్ రోడ్లు ఉన్నాయి. ప్రతీ సంవత్సరం వర్షాకాలంలో కల్వర్టులు, వంతెనలు మరమ్మతులకు నోచుకున్నా పూర్తి స్థాయిలో చేయడం లేదు. తాత్కాలిక పనులు చేస్తూ వస్తున్నారు. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా హ్యామ్ పద్ధతిలో రోడ్ల నిర్మాణం చేపట్టనుండటంతో వాహనదారులు, ప్రజల కష్టాలు తీరనున్నాయి.వారం రోజుల్లో టెండర్లు హ్యామ్ పద్ధతిలో రోడ్ల నిర్మాణం కోసం వారం రోజుల్లో టెండర్లను ఈఎన్సీ ఆదేశాల మేరకు పిలవడం జరుగుతుంది. స్పాట్ వర్క్ల కింద పరిగణలోకి తీసుకుని తక్కువ సమయంలోనే టెండర్లను ఫైనల్ చేయనున్నాం. రోడ్ల వెడల్పు, కొత్త రోడ్ల నిర్మాణం జరగనుంది. – నరేందర్రెడ్డి, ఎస్ఈ, ఆర్అండ్బీ -
ప్రజారోగ్యంలో పారిశుద్ధ్య కార్మికులు కీలకం
చేర్యాల(సిద్దిపేట): ప్రజల ఆరోగ్య రక్షణలో పారిశుద్ధ్య కార్మికులది కీలక పాత్ర అని అదనపు కలెక్టర్ గరీమాఅగర్వాల్ అన్నారు. శుక్రవారం పట్టణ కేంద్రంలో పర్యటించిన ఆమె స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో పారిశుద్ధ్య కార్మికులకు సెల్ప్ హెల్త్ మెటీరియల్ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణ ప్రజల అరోగ్య రక్షణలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ప్రధానమైందన్నారు. కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారన్నారు. వానాకాలం సీజన్లో వారానికి రెండు రోజులు డ్రై డే పాటించాలని పట్టణ ప్రజలకు సూచించారు. అనంతరం పట్టణంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజచేశారు. మూడో వార్డు పరిధిలో చేపడుతున్న వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు పరిశీలించిన ఆమె త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సూచించారు. అలాగే ప్రభుత్వం చేపడుతున్న వన మహోత్సవంలో భాగంగా పెద్ద చెరువు కట్టపై మొక్కలు నాటి నీరు పోశారు. పట్టణ నర్సరీని పరిశీలించిన నర్సరీలో పెంచుతున్న మొక్కల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఆమె వెంట మున్సిపల్ కమిషనర్ నాగేందర్, తహసీల్దార్ దిలీప్నాయక్, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. అప్రమత్తంగా ఉండాలిసిద్దిపేటరూరల్: వర్షాల ప్రభావంతో చెరువులు, కెనాల్ల వద్ద నీరు ఉప్పొంగి ప్రవహించే క్రమంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి మంత్రి సీతక్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ పాల్గొన్నారు. కాన్ఫరెన్స్ అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది ప్రతీరోజూ పరిస్థితులను గమనిస్తూ అవసరమైన చోట ఫీవర్ సర్వేలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్, ఇరిగేషన్, వైద్యారోగ్యశాఖ అధికారులు, డీపీఓ తదితరులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ ● ఆరోగ్య కిట్లు పంపిణీ -
స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం కావాలి
వర్గల్(గజ్వేల్): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం వర్గల్ మండల కేంద్రంలో బొల్లిపల్లి తిరుపతిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాలలో ఆయన ప్రసంగించారు. ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగరాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు కై వసం చేసుకోవాలన్నారు. గజ్వేల్ ఎన్నికల ఇన్చార్జి ఎల్లు రాంరెడ్డి మాట్లాడుతూ విభేదాలు లేకుండా పార్టీశ్రేణులు కలిసికట్టుగా పనిచేసి స్థానిక ఎన్నికల్లో సత్తాచాటాలన్నారు. రాష్ట్ర నాయకుడు నందన్గౌడ్ మాట్లాడుతూ ఎంపీ ఎన్నికలలో ఉత్సాహంగా పనిచేసి విజయాలు నమోదుచేసిన రీతిలో స్థానికంలో కూడా శ్రమించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు కనకయ్య, బుచ్చిరెడ్డి, శ్రీనివాస్ గుప్తా, యాదగిరి, రవి, శంకర్ గౌడ్, ప్రదీప్గౌడ్, రవీందర్, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ -
అధికారుల తీరు మారాలి
సీనియర్ యోగాసన పోటీలుదౌల్తాబాద్ (దుబ్బాక): అధికారుల పనితీరు మెరుగుపడాలని కలెక్టర్ హైమావతి హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసే సమయంలో సిబ్బంది లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సరిగా సమాధానం చెప్పకపోవడంతో వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ప్రాథమిక వ్యవసాయ సహకార కార్యాలయ్యాన్ని ఆకస్మికంగా తనీఖీ చేశారు. ఇక్కడికి వచ్చిన యూరియా ఎంత? ఎంత మంది రైతులకు పంపీణీ చేశారని అధికారులను అడిగారు. సరైన సమాధానం చెప్పకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పని తీరు మారకపోతే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. అనంతరం మండల కేంద్రంలోని తండాలో 19 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించారు. తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతి రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. జిల్లా పరిషత్ బాలికల పాఠశాలను తనీఖీ చేశారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి హుస్నాబాద్రూరల్: నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అధికారులను కలెక్టర్ కె.హైమావతి ఆదేశించారు. శుక్రవారం ఐఓసీ భవనంలో ఆర్డీవో రాంమూర్తితో కలిసి వివిధ శాఖల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... హుస్నాబాద్ నుంచి సుందరగిరి వరకు ఫోర్లైన్ రోడ్డు పనులకు రోడ్డు పక్కన విద్యుత్ స్తంభాలు, చెట్లను తొలగించే చర్యలు చేపట్టాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాల పనులు పూర్తి చేయాలన్నారు. మున్సిపాల్టీలో వివిధ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని సూచించారు. సమావేశంలో వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.ప్రశాంత్నగర్(సిద్దిపేట): యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 27న జిల్లా కేంద్రంలో ిసీనియర్ యోగాసన పోటీలు నిర్వహించనున్నట్లు తోట అశోక్, శ్రీనివాస్రెడ్డి శుక్రవారం తెలిపారు. యోగాసన పోటీలలో పాల్గొనే సభ్యులు ఆదివారం ఉదయం 7లోపు వ్యాస మహర్షి యోగా సెంటర్లో రిపోర్ట్ చేయాలన్నారు. సీనియర్ విభాగంలో 18 – 28 ఏళ్లు, 28–35 ఏళ్లు, 35–45 ఏళ్లు, 45– 55 ఏళ్ల వారీగా జరుగుతాయన్నారు. ఈ విభాగాల్లో ఎంపికైన వారు ఆగస్టు7,8లలో ఆదిలాబాద్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి ఛాంపియన్షిప్కు ఎంపికవుతారన్నారు. పూర్తి వివరాలకు 9948110433 ను సంప్రదించాలన్నారు. పనితీరు మెరుగుపడాలి కలెక్టర్ హైమావతి పలు ప్రభుత్వ కార్యాలయాల తనిఖీ -
ఓపెన్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల
ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఉమ్మడి మెదక్ జిల్లా ఓపెన్ స్కూల్ విధానంలో నిర్వహించనున్న సప్లిమెంటరీ పరీక్షలకు పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల అయ్యిందని డీఈఓ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారు పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఆగస్టు 5వరకు, రూ.50 అపరాధ రుసుముతో ఆగస్టు 15 వరకు చెల్లించే అవకాశం ఉందన్నారు. పూర్తి వివరాలకు జిల్లా ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ వెంకటస్వామి (8008403635)ని సంప్రదించాలన్నారు. 27న హాఫ్ మారథాన్ సిద్దిపేటకమాన్: జిల్లా కేంద్రంలో ఈ నెల 27న నిర్వహించనున్న హాఫ్ మారథాన్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఏసీపీ రవీందర్రెడ్డి పిలుపునిచ్చారు. సిద్దిపేట ప్రెస్క్లబ్లో ఆదివారం మారథాన్ టీషర్టులను శుక్రవారం ఏసీపీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజు రన్నింగ్, వాకింగ్ చేయడం చాలా అవసరమన్నారు. శారీరకంగా, మానసికంగా బలంగా లేకపోవడం వల్ల ఆత్మహత్యలు పెరుగుతున్నాయన్నారు. ఇలాంటి రన్నింగ్ రేస్లు సమాజానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ రన్కు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని అందరూ పాల్గొనాలని అన్నారు. కార్యక్రమంలో రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజు, జర్నలిస్టు సంఘం జిల్లా అధ్యక్షుడు కె.రంగాచారి, కౌన్సిలర్ బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ ప్రవేశాలకు లాస్ట్చాన్స్ దోస్త్ స్పెషల్ ఫేస్ ఈనెల 31వరకు సిద్దిపేటఎడ్యుకేషన్: డిగ్రీ కోర్సులలో ప్రవేశాలు పొందేందుకు ఉన్నత విద్యామండలి దోస్త్ స్పెషల్ ఫేస్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 31వరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ సందర్భంగా శుక్రవారం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత మాట్లాడారు. డిగ్రీలో ప్రవేశాలకు గతంలో దరఖాస్తు చేసుకోని విద్యార్థులకు ఇది మంచి అవకాశమన్నారు. ఈ విద్యాసంవత్సరానికి డిగ్రీలో అడ్మిషన్ పొందేందుకు ఇది చివరి అవకాశమని చెప్పారు. కళాశాలలు, కోర్సులను ఎంపిక చేసుకునేందుకు ఈనెల 31వరకు వెబ్ ఆప్షన్లను ఇచ్చుకోవచ్చన్నారు. ఆగస్ట్ 3న సీట్లను అలాట్మెంట్ ఉంటుందన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్ట్ 6వరకు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి, సీసీఓటీపీతో వ్యక్తిగతంగా కళాశాలను సందర్శించి ధ్రువపత్రాలను సంబంధిత ప్రిన్సిపాల్కు సమర్పించి ఫీజు చెల్లించి తమ సీటును దృవీకరించుకోవాలని చెప్పారు. దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్ భాస్కర్ మాట్లాడుతూ మూడు విడతలలో సీట్లు పొందని విద్యార్థులు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా స్పెషల్ ఫేస్ను ఉపయోగించు కోవచ్చన్నారు. ఇప్పటి వరకు దోస్త్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోని వారి ప్రస్తుతం రూ. 400లు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. -
కొమురవెల్లిలో భక్తుల గిరి ప్రదక్షిణ
అమ్మవార్లకు శ్రావణ పూజలుశ్రావణ మాసం పురస్కరించుకుని కొమురవెల్లి మల్లికార్జున స్వామి గిరి ప్రదక్షిణను భక్తులు ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండీ గ్రామానికి చెందిన సుమారు 150 మంది భక్తులు శుక్రవారం ప్రదక్షిణ చేశారు. తెల్లవారు జామునుంచే గిరి ప్రదక్షిణ చేసి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. – కొమురవెల్లి(సిద్దిపేట) జిల్లాలో శ్రావణమాస సందడి ప్రారంభమైంది. తొలి శుక్రవారం అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. జిల్లా కేంద్రంలోని సంతోషిమాత, పార్వతీమాత, లలితా పరమేశ్వరి, రేణుకా ఎల్లమ్మ, వాసవికన్యకాపరమేశ్వరి ఆలయాలతో పాటు పలు ఆలయాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్లకు కుంకుమార్చన, ఒడిబియ్యం, పుష్పార్చన తదితర కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ఆలయ ప్రాంగణాలు అమ్మవారి నామస్మరణతో మార్మోగాయి. – ప్రశాంత్నగర్(సిద్దిపేట) -
స్థానిక పోరుకు సన్నద్ధం
‘పరిషత్’ ఎన్నికలపై పార్టీల నజర్● గెలుపే లక్ష్యంగా వ్యూహాలు ● ముఖ్యకార్యకర్తలతో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ సమావేశాలు సాక్షి, సిద్దిపేట: త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల కైవసమే లక్ష్యంగా నేతలు పావులు కదుపుతున్నారు. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశించింది. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు కేడర్ను సమాయత్తం చేస్తున్నారు. రిజర్వేషన్లు తేలితే ఎవరెవరు పోటీ చేస్తారో తేలనుంది. సంక్షేమ పథకాలే అస్త్రంగా కాంగ్రెస్.. రానున్న స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కై వసం చేసుకోవడానికి అధికార పార్టీ సమాయత్తమవుతోంది. ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా మంత్రి పొన్నం ప్రభాకర్ను పార్టీ నియమించింది. ఇటీవల గాంధీభవన్లో నియోజకవర్గ ఇన్చార్జిలతో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిలు నర్సారెడ్డి, చెరుకు శ్రీనివాస్రెడ్డి, పూజల హరికృష్ణ, కొమ్మూరి ప్రతాప్రెడ్డిలు కార్యకర్తలతో సమావేశామవుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పై ప్రజలకు వివరించాలని, అర్హులకు పథకాలను అందేలా చూడాలని చెబుతూ కార్యకర్తలకు సూచిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆరు గ్యారంటీలపై బీఆర్ఎస్ పోరు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు ఉన్నారు. ఇప్పటికే పలు గ్రామాలకు పార్టీ ఇన్చార్జిలను నియమించారు. పలు నియోజకవర్గాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీగా ఎవరు గెలుపొందే అవకాశం ఉంటుందని ఇప్పటికే ఒక దఫా బీఆర్ఎస్ సర్వే చేయించింది. ఇటీవల నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ముఖ్యకార్యకర్తలతో సమావేశాలను నిర్వహించారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను సక్రమంగా అమలు చేయడం లేదంటూ ప్రజలల్లోకి తీసుకెళ్లాలని మార్గదర్శనం చేస్తున్నారు. పట్టున్న గ్రామాలపై బీజేపీ దృష్టి గ్రామీణ ప్రాంతాల్లో పట్టున్న గ్రామాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇటీవల నియమితులైన జిల్లా అధ్యక్షుడు బైరీ శంకర్ ఆధ్వర్యంలో మండలాల వారీగా ముఖ్యకార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలల్లోకి తీసుకెళ్లాలని, రాష్ట్ర ప్రభుత్వం ‘గ్యారంటీ’లు అమలు చేయడం లేదని ప్రజలకు వివరించాలని సూచిస్తున్నారు.గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయా పార్టీలు గెలుపొందిన వివరాలు జెడ్పీటీసీలు బీఆర్ఎస్: 22, కాంగ్రెస్: 1 ఎంపీటీసీలు మొత్తం ఎంపీటీసీ స్థానాలు: 229 బీఆర్ఎస్ : 153, కాంగ్రెస్: 29, బీజేపీ: 04, సీపీఎం:1, ఇతరులు: 42 పోటీకి సై అంటున్న వామపక్షాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో వామపక్షాలు సైతం పోటీకిసై అంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తుపై అధిష్టానం నుంచి స్పష్టత వస్తే దానికనుగుణంగా పోటీ చేసే అంశంపై సీపీఐ, సీపీఎంలు కార్యాచరణ రూపొందించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
● కలెక్టర్ హైమావతి ● నంగునూరు మండలంలో విస్తృత పర్యటననంగునూరు(సిద్దిపేట): విధుల పట్ల నిర్లక్ష్యం మహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హైమావతి అధికారులను హెచ్చరించారు. గురువారం నంగునూరులో విస్తృతంగా పర్యటించారు. ప్రభుత్వ ఆస్పత్రి, పీహెచ్సీ సెంటర్, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, పశువైద్యశాల, తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం అక్కేనపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను, మొయతుమ్మెద వాగును పరిశీలించి ఇంటికి అవసరమయ్యే ఇసుకను వాగు నుంచి లబ్ధిదారులకు అందజేయాలని తహసీల్దార్ సరితను ఆదేశించారు. నంగునూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుడు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయుష్ గదికి తాళం వేయడంతో డైరెక్టర్కు ఫోన్ చేసి వైద్యుడు రెగ్యులర్గా వచ్చేలా చూడాలన్నారు. తహసీల్దార్, ఎంపీడీఓలు నిత్యం ఆస్పత్రిని తనఖి చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను త్వరగా ప్రారంభించి బిల్లులు వెంటనే చెల్లించాలని కలెక్టర్ సూచించారు. పశువుల ఆస్పత్రి పరిశీలన నంగునూరులో శిథిలావస్థకు చేరిన పశువుల ఆస్పత్రిని కలెక్టర్ పరిశీలించారు. మండలంలో పశువుల సంఖ్య, క్రమం తప్పకుండా టీకాలు వేస్తున్నారా? అని ఆరా తీసి వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. -
ఔటర్ రింగ్ రైలు కూత
ఉమ్మడి మెదక్ జిల్లాలో 120 కిలోమీటర్లు విస్తరణ● కీలకంగా మారనున్న గజ్వేల్ రైల్వేస్టేషన్ ● హైదరాబాద్ స్టేషన్లకు ప్రత్యామ్నాయంగా విస్తరించే అవకాశం ● ‘మల్టీమోడల్ లాజిస్టిక్ హబ్’ అభివృద్ధికి మార్గం లాజిస్టిక్ పార్కు అభివృద్ధికి దోహదం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పరికిబండ శివారులో రూ.996 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కు (బహుళవిధ సరుకు రవాణ సేవల సముదాయం) అభివృద్ధికి ఈ రింగు రైలు ప్రాజెక్ట్తో బాటల పడనున్నాయి. ఈ లైన్తో లాజిస్టిక్ అనుసంధానమయ్యే అవకాశాలుండటం వల్ల ఇక్కడి నుంచి సరుకు రవాణా సేవలు దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు విస్తరించరించుకునే అవకాశం కలగనుంది. ఇదే కాదు.. ఉమ్మడి మెదక్ జిల్లాలోని తూప్రాన్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్చెరు ప్రాంతాల్లో రైలు రవాణా ఆధారిత అభివృద్ధి వేగవంతం కానుంది. మహా నగరానికి పొరుగు జిల్లాలతో మెరుగైన రైలు రవాణా వ్యవస్థ ఏర్పడనుంది. దీంతో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకునే అవకాశాలున్నాయి.గజ్వేల్: హైదరాబాద్ ఔటర్ రింగు రైలుకు అలైన్మెంట్ ఖరారు కావడం.. ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధికి మరో కీలక అడుగుగా మారింది. ట్రిపుల్ఆర్ (రీజినల్ రింగు రోడ్డు)కు సమాంతరంగా 392కిలోమీటర్ల మేర ఈ అలైన్మెంట్ ఉండగా.. ఇందులో ఉమ్మడి జిల్లాలోనే 120కిలోమీటర్ల మేర విస్తరించే అవకాశాలున్నాయి. హైదరాబాద్కు ఈ ప్రాంతం సమీపంలో ఉండటం వల్ల భారీ ప్రయోజనాలు చేకూరి అభివృద్ధికి బాటలు పడనున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా (సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి)తోపాటు వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ, యాదాద్రి జిల్లాల మీదుగా రింగు రైలు అలైన్మెంట్ ఖరారైంది. ట్రిపుల్ఆర్ (రీజినల్ రింగు రోడ్డు)కు సమాంతరంగా 3.5కిలోమీటర్ల దూరంలో, ఒకటి రెండు చోట్ల మాత్రం 11కిలోమీటర్ల దూరంలో అలైన్మెంట్ను సిద్ధం చేశారు. ఈ భారీ ప్రాజెక్ట్ వల్ల ఉమ్మడి మెదక్ జిల్లాకు జరిగే ప్రయోజనంపై జిల్లావాసుల దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఔటర్ రింగు రైలు ప్రాజెక్టులో భాగంగా ఆరు చోట్ల ఆర్ఓఆర్(రైల్ ఓవర్ రైల్) వంతెనలు రానున్నాయి. ఈ ఆర్ఓఆర్ గజ్వేల్లో రానుందని ప్రకటనలు వెలువడ్డాయి. జగదేవ్పూర్, గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్, సంగారెడ్డి ప్రాంతాల మీదుగా రింగు రైలు విస్తరించే అవకాశాలున్నాయి. గజ్వేల్ స్టేషన్ కీలకం! రింగు రైలు ప్రాజెక్ట్లో మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలైన్పై ఉన్న గజ్వేల్ రైల్వే స్టేషన్ కీలకంగా మారనుంది. ప్రస్తుతం మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు 151.36కిలోమీటర్ల పొడవున ఈ న్యూబ్రాడ్గేజ్ లైనన్ నిర్మాణం జరుగుతుండగా.. రూ.1160.47కోట్లు వెచ్చిస్తున్నారు. ఉత్తర తెలంగాణ అభివృద్ధిలో ఈ రైల్వేలైన్ కీలక మలుపుగా మారనుంది. కరీంనగర్ నుంచి హైదరాబాద్కు వెళ్లడానికి ఇప్పటి వరకు రోడ్డు మార్గమే ఆధారం. ఈ లైన్ వల్ల సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మనోహరాబాద్ మీదుగా కొత్తపల్లి వరకు, అక్కడి నుంచి పెద్దపల్లి గ్రాండ్ ట్రంక్ లైన్తో అనుసంధానం కానుంది. ప్రస్తుతం సిద్దిపేట వరకు ప్రస్తుతం రైలు కూడా నడుస్తున్న సంగతి తెల్సిందే. తాజాగా రింగు రైలు ప్రాజెక్ట్ నేపథ్యంలో గజ్వేల్ స్టేషన్ ఈ లైన్తో అనుసంధానం కానుంది. దీని ద్వారా నగరంలోని ప్రధాన రైల్వేస్టేషన్లకు గజ్వేల్ స్టేషన్ ప్రత్యామ్నాయంగా మారడానికి అడుగులు పడనున్నాయి. ఈనేపథ్యంలో కొన్ని ప్రధానమైన రైళ్లు ఇక్కడి నుంచే నడిచే అవకాశాలున్నాయి. గజ్వేల్ నుంచి వెళ్తున్న ట్రిపుల్ఆర్ పక్కనే నిర్మించిన ఈ రైల్వేస్టేషన్.. యథాతథంగా రింగు రైలుకు కూడా అనుసంధానం కానుంది. -
ప్రతీ విద్యార్థి ఉన్నతంగా ఎదగాలి
బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ప్రశాంత్నగర్(సిద్దిపేట): ప్రతీ విద్యార్థి చిన్ననాటి నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో నిర్వహించిన వందన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నిరంతరం దేశం కోసం పనిచేస్తున్న ప్రధానమంత్రి మోదీని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. దేశం అభివృద్ధిలో అందరం భాగస్వాములు కావాలన్నారు. ఈ సందర్భంగా పాఠశాల కమిటీ అధ్యక్షుడు పెద్ది వైకుంఠం, ప్రధానోపాధ్యాయులు నరేష్ కుమార్లు బైరి శంకర్ను ఘనంగా సన్మానించారు. స్థానిక ఎన్నికల్లో సత్తాచాటుదాం సిద్దిపేటరూరల్: త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని పుల్లూరులో నిర్వహించిన మండల ఎన్నికల కార్యశాలకు శంకర్ హాజరై మాట్లాడారు. గెలుపునకు బీజేపీ కార్యకర్తలు కలిసి కట్టుగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎన్నికల ప్రభారి కనకయ్య, మండల ఎన్నికల ప్రభారి రమేశ్గౌడ్, మండల అధ్యక్షుడు సురేశ్గౌడ్, నాయకులు నరేశ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
30న మెగా జాబ్ డ్రైవ్
సిద్దిపేట ఎడ్యుకేషన్: మెగా జాబ్ డ్రైవ్ ఈ నెల 30న నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్విద్యాశాఖ అధికారి రవీందర్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హెచ్సీఎల్ టెక్నాలజీ, కలెక్టర్ ఆధ్వర్యంలో టెక్ బీ పోగ్రాం పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉదయం 10గంటలకు స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ఇంటర్లో 75శాతం మార్కులు సాధించిన విద్యార్థులు అర్హులన్నారు. పూర్తి వివరాలకు హెచ్సీఎల్ ప్రతినిధులను 7569177071, 7981834205లలో సంప్రదించాలన్నారు. 26న విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ హుస్నాబాద్: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ నెల 26న కేంద్ర మంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయనున్నట్లు కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ కన్వీనర్ ప్రవీణ్రావు తెలిపారు. గురువారం వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు బండి సంజయ్ జన్మదినం పురస్కరించుకుని మోదీ గిఫ్ట్ పేరిట 20 వేల సైకిళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి 400 సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని బండి సంజయ్ లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి, ఫిలిం సెంట్రల్ సెన్సార్ బోర్డు మెంబర్ లక్కిరెడ్డి తిరుమల తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల అక్రమ అరెస్టులు తగవు ప్రశాంత్నగర్(సిద్దిపేట): విద్యార్థి సంఘాల నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేయడం సరికాదని యూఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గుడికందుల రవి అన్నారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఛలో సెక్రటేరియట్ కార్యక్రమానికి యూఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పిలుపునిస్తే, కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకోవడంతో గురువారం జిల్లా కేంద్రంలో కళ్లకు నల్లగుడ్డలు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యిందన్నారు. ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయకుండా జాప్యం చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో యూఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు హేమంత్, రవి, విగ్నేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించండి సిద్దిపేటరూరల్: విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ పీఆర్సీని ప్రకటించి, ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీల షెడ్యూల్ ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు అజీజ్, మల్లయ్య, శ్రీనివాస్గౌడ్, విష్టువర్థన్, శ్రీనివాస్, రాజు, శ్రీనివాస్, నర్సింహారెడ్డి పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగిరం చేయండి కొండపాక(గజ్వేల్): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగిరం చేయాలని, పనులు పారదర్శకంగా చేపట్టాలని చీఫ్ ఇంజనీర్ చైతన్య కుమార్ సూచించారు. మండల పరిధిలోని సిర్సనగండ్లలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా చైతన్య కుమార్ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతా లోపించకుండా చూసుకోవాలన్నారు. గ్రామానికి 65 ఇళ్ల మంజూరు కావడం అందులో 54 మంది నిర్మాణ పనులు మొదలు పెట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పీడీ దామోదర్రావు, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, కార్యదర్శి స్వాతి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
బగారా రైస్. చికెన్ కర్రీతో టీచర్ల విందు..కట్ చేస్తే కలెక్టర్..!
చేర్యాల(సిద్దిపేట): పాఠశాలలో ఉపాధ్యాయులు దావత్ చేసుకున్నారు. బుధవారం విద్యార్థి సంఘాలు బంద్కు పిలుపు నివ్వడంతో విద్యార్థులంతా ఇంటికెళ్లారు. అయినా ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనం సిద్ధం చేయడం.. అందులో బగారా రైస్, చికెన్ కర్రీ వండారు. కలెక్టర్ హైమావతి చేర్యాల పట్టణ కేంద్రంలోని పెద్దమ్మగడ్డ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. వంటగదిని పరిశీలించిన ఆమెకు మెనూలో లేని చికెన్, బగారా అన్నం కనిపించడంతో మండిపడ్డారు. పిల్లలు లేకుండానే వంట ఎందుకు చేశారని ఉపాధ్యాలను వివరణ కోరగా, విద్యార్థి సంఘాల బంద్ పిలుపు మేరకు విద్యార్థులను ఇంటికి పంపించామని చెప్పారు. వండిన వంటను వెంటనే హాస్టల్ విద్యార్థులకు పంపించాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచించారు. ఈ ఘటనతో ఉపాధ్యాయులపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. -
చెప్పింది చేయాలె
రూల్స్ చెప్పొద్దు..అధికారులపై అధికార పార్టీ నేతల ఒత్తిడిజిల్లా వ్యాప్తంగా గత ఏడాది నుంచి పలు సంక్షేమ కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమాలకు అధికార పార్టీ నేతలకు సైతం సమాచారం అందించాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి 26న ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాల ప్రారంభోత్సవం సందర్భంగా అధికార పార్టీ, ప్రతిపక్ష నేతల మధ్య గోడవలు సైతం జరిగిన సంఘటనలున్నాయి. ఈ నెల 25 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు ఆయా గ్రామాల్లో రేషన్ కార్డుల మంజూరు ప్రొసీడింగ్ పత్రాలను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పంపిణీ చేసే కార్యక్రమాల్లో మళ్లీ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఎక్కడ గోడవలకు దిగుతారోనని అధికారుల్లో ఆందోళన నెలకొంది. అధికారిక కార్యక్రమాలు నిర్వహించడం తలనొప్పిగా మారిందని అధికారులు చర్చించుకుంటున్నట్లు వినికిడి. ఇతర జిల్లాలతో పోలిస్తే ఇక్కడ కష్టంగానే ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేతలు ఫిర్యాదులు చేసినంత మాత్రానా మంత్రులు క్షేత్రస్థాయిలో విషయాన్ని తెలుసుకోవాలని పలువురు అధికారులు కోరుతున్నారు. ఫిర్యాదులు ఇలా.. ● జిల్లాలోని ఓ పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల విషయంలో తాను సూచంచిన వారికే ఇవ్వాలని అధికార పార్టీనేత చెప్పినట్లు తెలిసింది. అధికార పార్టీ నేతలు ఇచ్చిన జాబితాలోని వారికే ఆ మున్సిపాలిటీలో ఇళ్లు కేటాయించారు. దీంతో తాము చెప్పిన పనులు చేయడం లేదని సదరు అధికారిపై ఆగ్రహంతో ఇటీవల ఇన్చార్జి మంత్రి వివేక్కు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మంత్రికి సదరు అధికారి వివరణ ఇచ్చేందుకు ఇటీవల హైదరాబాద్కు వెళ్లినట్లు సమాచారం. ● ములుగు, నంగనూరు, చిన్నకోడూరు మండలాల్లో ఉన్న గ్రామ పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేయాలని అధికార పార్టీ నేతలు పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది. ములుగు మండల కేంద్రంలో ఓ గ్రామ పంచాయతీ కార్యదర్శిని బదిలీ చేయాలని ఏకంగా కాంగ్రెస్ పార్టీనేత లేఖ సైతం అధికారికి ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ అధికారి కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంతో ఇన్ వార్డులో ఇవ్వండి అని చెప్పినట్లు తెలిసింది. బదిలీ చేయపోతే ఇన్చార్జి మంత్రి నుంచి ఫోన్ వస్తుందని సదరు అధికారికి హుకుం జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. పనులు చేయని వారిపైమంత్రులకు ఫిర్యాదులు అడకత్తెరలో పోకచెక్కలా యంత్రాంగంఇక్కడ పని చేయడం ఇబ్బందే ఇక్కడ ప్రతిపక్ష పార్టీ బలంగా ఉంది. అధికార పార్టీ నేతలు వివిధ పనులు మంజూరు కోసం పట్టుబడుతున్నారు. కొన్ని పథకాలను ఎమ్మెల్యేల అనుమతితో చేయాల్సి ఉంటుంది. మరికొన్ని నేరుగా చేయవచ్చు. అధికార పార్టీ నేతలు ఇచ్చినవే చేయాలని పలువురు కోరుతున్నారు. దీంతో ఇక్కడ పని చేయడం చాలా ఇబ్బందే. ఇతర జిల్లాలతో పోలిస్తే ఇక్కడి అధికారులకు తలనొప్పే.. – ఓ జిల్లా అధికారి -
వర్షం.. పంటలకు జీవం
● రైతుల్లో హర్షం ● జిల్లా వ్యాప్తంగా 577.2 మి.మీ.వర్షపాతం ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళ, బుధవారాలలో కురిసిన వర్షాలతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. నీటి తడులు అవసరం ఉన్న పత్తి, మొక్కజొన్న, కందులు, తదితర ఆరుతడి పంటలు జీవం పోసుకున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 1,20,026 ఎకరాల్లో వరి, 1,04,011 ఎకరాల్లో పత్తి, 25,361 ఎకరాల్లో మొక్కజొన్న, 5,289 ఎకరాల్లో కందులు, 202 ఎకరాల్లో పెసర్లు, ఇతర ఉద్యానపంటలు సాగు చేస్తున్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో మరో మూడు, నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. బుధవారం జిల్లాలో సగటున 22.2మిల్లీమీటర్లు, మొత్తంగా 577.2మి.మీ. వర్షపాతం నమోదు అయ్యింది. అత్యధికంగా అక్బర్పేట భూంపల్లి మండలంలో 47మి.మీ, నారాయణరావుపేటలో 46మి.మీ, దుబ్బాకలో 45.7మి.మీ, చిన్నకోడూరులో 36.2మి.మీ, బెజ్జంకిలో 35.9మి.మీ, సిద్దిపేట రూరల్లో 31.4మి.మీ, హుస్నాబాద్లో 30.7మి.మీ, దౌల్తాబాద్లో 30.6మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. వానలు ఆదుకున్నాయి వానాకాలం సాగుకు ముందే వర్షాలు కురవడంతో సంతోషంగా వ్యవసాయ పనులు ప్రారంభించాం. కానీ తీరా విత్తనాలు విత్తాక వర్షాలు వెనకడుగు వేశాయి. దీంతో సాగుపై నీలినీడలు నెలకొన్నాయి. మళ్లీ రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో పంటలను ఆదుకుంటున్నాయి. వరుణుడు సరైన సమయంలో అన్నదాతలకు అండగా నిలిచాడు. – నవీన్, తొగుట -
పక్కదారి!
సబ్సిడీ యూరియాకొన్ని పరిశ్రమల్లో గుట్టుగా సాగుతున్న అక్రమ వినియోగంసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: వ్యవసాయ అవసరాలకు వినియోగించే సబ్సిడీ యూరియా పక్కదారి పడుతోందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నిబంధనల ప్రకారం పారిశ్రామిక అవసరాలకు టెక్నికల్ గ్రేడ్ (కమర్షల్) యూరియా వాడాలి. కానీ దాని స్థానంలో తక్కువ ధరకు సబ్సిడీపై లభిస్తున్న వ్యవసాయ యూరియాను అక్రమంగా ముడిసరుకుగా వాడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా బొల్లారం, పాశమైలారం, ఖాజీపల్లి వంటి పారిశ్రామిక వాడల్లో కొన్ని పరిశ్రమల్లో ఇలా వ్యవసాయ యూరియాను ముడిసరుకుగా వాడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా రోజులుగా ఈ అక్రమ వాడకం కొనసాగుతుండగా.. ప్రస్తుతం యూరియా కొరత నేపథ్యంలో ఈ వ్యవహరం తెరపైకి వస్తోంది. రైతుల ఇబ్బందులు యూరియా కొరతతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రెండు బస్తాల కోసం రోజంతా క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. చెప్పులు, పాస్పుస్తకాలను లైన్లో పెట్టి పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ అవసరాలకు వినియోగించాల్సిన యూరి యా పక్కదారి పట్టకుండా పకడ్బందీగా వ్యవహరించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. వ్యవసాయేతర అవసరాలకు ఇలా.. యూరియాను ఒక్క వ్యవసాయ అవసరాలతో పాటు, పారిశ్రామిక అవసరాలకు కూడా వినియోగిస్తారు. ఇందులో 46 శాతం నైట్రోజన్ ఉంటుంది. చిన్న చిన్న మిశ్రమాలు కలిపితే వివిధ ఉత్పత్తుల తయారీకి అవసరమైన ముడిసరుకుగా మారుతుంది. ప్రధానంగా రసాయన పరిశ్రమలు, లూబ్రికేంట్స్, ప్లాస్టిక్, రెసిన్స్, అతుక్కునే పదార్థాలు, క్రీములు, లోషన్లు, రబ్బరు వంటి పరిశ్రమలకు యూరియను ఓ ముడిసరుకుగా వాడుతుంటారు. పెయింట్, రబ్బరు, టాయిలెట్ క్లీనర్లు, శుభ్రపరిచే యంత్రాలు వంటి వాటి తయారీకి కూడా ఈ యురియా వినియోగం ఉంటుంది. టెక్నికల్ గ్రేడ్ యూరియాకు ఎక్కువ రేటు.. రైతులకు సరఫరా చేస్తున్న యూరియా ఎరువులపై ప్రభుత్వం పెద్ద మొత్తంలో సబ్సిడీలు భరిస్తుంది. 50 కిలోల బస్తాకు రైతుకు రూ. 266 చొప్పున విక్రయిస్తుంది. పారిశ్రామిక అవసరాలకు వినియోగించే యూరియాను టెక్నికల్ గ్రేడ్ యూరియా అని పిలుస్తారు. దీని ధర బస్తాకు రూ. 1,500 నుంచి రూ. రెండు వేల వరకు ఉంటుంది. వ్యవసాయానికి వాడాల్సిన యూరియా తక్కువ ధరకు లభిస్తుండటంతో కొన్ని పరిశ్రమలు గుట్టుగా వ్యవహారాన్ని కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. టెక్నికల్ గ్రేడ్ స్థానంలో వ్యవసాయ యూరియా వాడకం? కొరత నేపథ్యంలో తెరపైకి వస్తున్న దందా.. దొరికితేనే దొంగలు.. జిల్లాలో పలు పరిశ్రమలు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి. ఆ పరిశ్రమలో తయారయ్యే ఉత్పత్తులకు సంబంధించి వివిధ ప్రభుత్వ శాఖల నుంచి తీసుకున్న అనుమతులు ఒకటి ఉంటే.. అందులో తయారయ్యే ఉత్పత్తులు మరొకటి ఉంటున్నాయి. ఇలా పాశమైలారం పారిశ్రామిక వాడలోని ఓ పరిశ్రమలో నకిలీ పాలను తయారు చేస్తున్న వ్యవహరం గతంలో పోలీసుల దాడుల్లో తేటతెల్లమైంది. ఈ పాల తయారీకి కూడా యూరియాను వాడుతున్నట్లు గుర్తించారు. అనుమతి ఒక ఉత్పత్తికి తీసుకొని.. మరో ఉత్పత్తులను తయారు చేస్తున్న కొన్ని పరిశ్రమలు.. ఇలా ముడి పదార్థాల తయారీకి సబ్సిడీ ముడి సరుకులను వాడటానికి ఏమాత్రం వెనుకాడరనే ఆరోపణలు ఉన్నాయి. అధికారుల కనుసన్నల్లోనే..? అధికారులు, డీలర్ల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం నడుస్తున్నట్లు ఆరోపణలున్నాయి. జిల్లాకు ఎరువులు సరఫరా చేసే రైల్వే రేక్పాయింట్ల నుంచే నేరుగా ఈ పరిశ్రమలకు లారీల్లో యూరియాను డంప్ చేస్తున్నట్లు సమాచారం. రాజకీయ పలుకుడి ఉన్న ఓ స్థానిక నాయకుడు ఈ దందాను వెనుకుండి నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో కొందరు డీలర్ల గోదాములకు డెలివరీ చేస్తున్నట్లు, వే బిల్లులతో వారానికి రెండు, మూడు లారీలు ఈ పరిశ్రమల్లో యూరియా అక్రమంగా డంప్ అవుతున్నట్లు తెలుస్తోంది. -
అందుబాటులో సరిపడా ఎరువులు
జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి కొండపాక(గజ్వేల్): వానాకాలం సీజన్కు అవసరమయ్యే ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి అన్నారు. కుకునూరుపల్లి మండలంలోని ఎరువుల దుకాణాలను బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల క్రయ విక్రయాల రిజస్టర్లను పరిశీలించారు. ఈసందర్భంగా స్వరూపరాణి మాట్లాడుతూ ఎరువుల కొరత ఉన్నట్లు వస్తున్న పుకార్లను నమ్మవద్దన్నారు. జిల్లా వ్యాప్తంగా వర్షాకాలంలో వివిఽ ద పంటలకు ఏ సమయంలో ఎంత అవసరపడతాయో గుర్తించి ఎరువులు ఆగ్రోస్, పీఏసీఎస్ సహకార సంఘాలకు సరఫరా చేస్తున్నామన్నారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు అమ్మిన దుకాణాదారుల లైసెన్సులను రద్దు చేస్తా మంటూ హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి గోవింద రాజు, ఎస్సై శ్రీనివాస్, పోలీసులు, దుకాణాదారులు, వ్యవ సాయ విస్తరణాధికారులు పాల్గొన్నారు. నాణ్యమైన విద్యనందించాలి మోడల్ స్కూల్స్ అదనపు డైరెక్టర్ శ్రీనివాసాచారి సిద్దిపేటరూరల్: విద్యార్థులకు మంచి విలువలతో కూడిన విద్యను అందించాలని మోడల్ స్కూల్స్ అదనపు డైరెక్టర్ శ్రీనివాసాచారి అన్నారు. బుధవారం మండల పరిధిలోని మోడల్ స్కూల్ను శ్రీనివాసాచారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యా బోధనను, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ దుర్గాప్రసాద్, ఏఎంఓ రవికుమార్, ప్రిన్సిపాల్ రవీందర్ గౌడ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. బీఎంఎస్ రాజీలేని పోరాటం గజ్వేల్: కార్మికుల సమస్యల పరిష్కారమే లక్షంగా బీఎంఎస్ రాజీలేని పోరాటాన్ని కొనసాగిస్తోందని ఆ యూనియన్ ప్రజ్ఞాపూర్ రాణే పరిశ్రమ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి సల్ల శ్రీనివాస్లు అన్నారు. బుధవారం బీఎంఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కంపెనీ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎంఎస్ ద్వారానే కార్మికులకు మేలు జరుగుతుందని అన్నారు. స్థానిక రాణే పరిశ్రమలో సీఐటీయూ నాయకులు సమస్యలను గాలికొదిలేసి కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో బీఎంఎస్ నాయకులు పులుగం శ్రీనివాస్, పరశురాం, నజీర్ తదితరులు పాల్గొన్నారు. నెంటూరు బస్సు పునరుద్ధరణ వర్గల్(గజ్వేల్): ఆర్టీసీ బస్సు కోసం పల్లె ప్రజల సుదీర్ఘ నిరక్షణకు తెరపడింది. ‘నెంటూరు–జేబీఎస్’ ఆర్టీసీ బస్సును పునరుద్ధరించారు. ఏళ్ల తరబడి ఆర్టీసీ సేవలు దూరమైన వర్గల్ మండలంలోని అనేక గ్రామాల ప్రజలకు మేలు చేకూరింది. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ డిపో ద్వారా పునరుద్ధరించిన ‘నెంటూరు–జేబీఎస్’ ఆర్టీసీ బస్సును బుధవారం డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, నియోజకవర్గ ప్రచార చైర్మన్ రంగారెడ్డితో కలిసి ప్రారంభించారు. బస్సు రాకతో ఆయా గ్రామాల ప్రజలు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్కు, నర్సారెడ్డికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వంటిమామిడి ఏఎంసీ చైర్మన్ విజయమోహన్, నాయకులు రంగారెడ్డి, విద్యాకుమార్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ గెలుపే లక్ష్యం కావాలి
● స్థానిక ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేద్దాం ● గత ప్రభుత్వ అవినీతిని ఎండగడదాం ● డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డిగజ్వేల్: వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ప్రతీకార్యకర్త పనిచేయాలని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం గజ్వేల్లో మున్సిపాలిటీస్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నర్సారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అభివృద్ధి పేరిట గత ప్రభుత్వంలో కేసీఆర్ కుటుంబం వందల కోట్లు దోచుకున్నదని మండిపడ్డారు. పట్టణంలో యూజీడీ, రింగు రోడ్డు, సీసీ రోడ్లు, బస్టాండ్ల నిర్మాణాలు అసంపూర్తిగా నిర్మించారన్నారు. ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ వేతనాలు, అలవెన్సులు పొందుతున్నా.. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా, ఫామ్హౌస్కే పరిమితమవుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హాయాంలో జరిగిన అవినీతిని ప్రజలకు వివరించాలన్నారు. బీఆర్ఎస్ నిర్వాకం వల్లే మల్లన్నసాగర్ నిర్వాసితుల సమస్యలు ఇంకా పెండింగ్లో ఉన్నాయని ఆరోపించారు. వారి ఇబ్బందులను తీర్చడానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేదల సంక్షేమమే లక్ష్యంగా సాహాసోపేత నిర్ణయాలతో ముందుకుసాగుతున్నారని కొనియాడారు. మరోవైపు గ్రూపు విభేదాలను పక్కన పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, వైస్ చైర్మన్ సర్ధార్ఖాన్, కాంగ్రెస్ పట్టణ శాఖ అధ్యక్షులు మొనగారి రాజు, కార్యదర్శి నక్క రాములు తదితరులు పాల్గొన్నారు. -
వైద్యసేవలపై నిర్లక్ష్యం తగదు
● కలెక్టర్ హైమావతి ● చేర్యాలలో ఆకస్మిక పర్యటన ● ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంపాఠశాలలో ఉపాధ్యాయుల దావత్ ● విద్యార్థులు లేకున్నా.. మధ్యాహ్నంభోజనంలో బగారా రైస్.. చికెన్కర్రీ ● కలెక్టర్ ఆకస్మిక తనిఖీతో వెలుగులోకి.. ● ఉపాధ్యాయుల తీరుపై సీరియస్చేర్యాల(సిద్దిపేట): ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని, సేవల్లో నిర్లక్ష్యం తగదని కలెక్టర్ హైమావతి అన్నారు. బుధవారం కలెక్టర్ చేర్యాల పట్టణంలో ఆకస్మికంగా పర్యటించారు. మొదటగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది రిజిస్టర్లను పరిశీలించారు. మందులు స్టాక్ రిజిస్టర్, ఔట్, ఇన్ పేషెంట్ రిజిస్టర్ పరిశీలించిన ఆమె నిర్వహణ సరిగాలేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలని అన్నారు. అలాగే రోగులతో మాట్లాడిన ఆమె డాక్టర్, సిబ్బంది సరిగ్గా చూస్తున్నారా? లేదా అని ఆరా తీశారు. అనంతరం నూతనంగా నిర్మించిన ప్రభుత్వ సామాజిక ఆస్పత్రి భవనాన్ని పరిశీలించారు. ఆస్పత్రి భవనం పూర్తయినందున ఇప్పటివరకు నిర్వహిస్తున్న ఆస్పత్రిలోని పరికరాలను ఇక్కడకు తరలించి వైద్య సేవలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి డాక్టర్, మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. పట్టణంలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గుపోస్తున్న కార్యక్రమానికి కలెక్టర్ హాజరై నిర్మాణ పనులను ప్రారంభించారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుక సరఫరా విషయంలో ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. స్థానిక ఆగ్రోస్ రైతు సేవ కేంద్రాన్ని సందర్శించిన ఆమె ఎరువుల స్టాక్ రిజిస్టర్ను పరిశీలించి గోదాంలో ఉన్న స్టాకును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్టాకు వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాధిక, ఏఓ భోగేశ్వర్ను ఆదేశించారు. వానకాలం పంటకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని రైతులు ఉపయోగించుకోవాలని అన్నారు.చేర్యాల(సిద్దిపేట): పాఠశాలలో ఉపాధ్యాయులు దావత్ చేసుకున్నారు. బుధవారం విద్యార్థి సంఘాలు బంద్కు పిలుపు నివ్వడంతో విద్యార్థులంతా ఇంటికెళ్లారు. అయినా ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనం సిద్ధం చేయడం.. అందులో బగారా రైస్, చికెన్ కర్రీ వండారు. కలెక్టర్ హైమావతి చేర్యాల పట్టణ కేంద్రంలోని పెద్దమ్మగడ్డ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. వంటగదిని పరిశీలించిన ఆమెకు మెనూలో లేని చికెన్, బగారా అన్నం కనిపించడంతో మండిపడ్డారు. పిల్లలు లేకుండానే వంట ఎందుకు చేశారని ఉపాధ్యాలను వివరణ కోరగా, విద్యార్థి సంఘాల బంద్ పిలుపు మేరకు విద్యార్థులను ఇంటికి పంపించామని చెప్పారు. వండిన వంటను వెంటనే హాస్టల్ విద్యార్థులకు పంపించాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచించారు. ఈ ఘటనతో ఉపాధ్యాయులపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.ఎంపీడీఓపై చర్యకు ఆదేశాలు.. స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్.. భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి వీటిని త్వరితగతిన పరిష్కరించాలని తహసీల్దార్ దిలీప్నాయక్ను ఆదేశించారు. స్థానిక ఎంపీడీఓ మహబూబ్ అలీ విధులకు హాజరు, నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు గుర్తించిన ఆమె అతడిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత జిల్లా అధికారికి సూచించారు. ఆమె వెంట ఆస్పత్రి వైద్యులు, స్థానిక మున్సిపల్ కమిషనర్ తదితరులున్నారు. -
గురువారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2025
‘రూల్స్ చెప్పొద్దు.. చెప్పింది చేయాలి’ అంటూ అధికారులపై అధికార పార్టీ నేతలు పెత్తనం చెలాయిస్తున్నారు. మాటవినని వారిపై మంత్రులకు ఫిర్యాదులు చేస్తున్నారు. కొంత కాలంగా ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక దగ్గరి నుంచి బదిలీల వరకు తాము చెప్పింది చేయాలని అధికార పార్టీ నేతలు అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కింది స్థాయి, జిల్లా స్థాయి అధికారుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. – సాక్షి, సిద్దిపేట న్యూస్రీల్ -
4 గంటలు.. 22 శాఖలు
అభివృద్ధి పనులపై నిర్విరామంగా మంత్రి వివేక్ సమీక్ష ● సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందాలి ● సమన్వయంతో పకడ్బందీగా చేపట్టాలి ● ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ ● సమస్యల వర్షం కురిపించినప్రతిపక్ష ఎమ్మెల్యేలు నాలుగు గంటలు నిర్విరామంగా.. 22 ప్రభుత్వ శాఖల సమీక్ష సాగింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జిల్లా వ్యాప్తంగా నెలకొన్న సమస్యలపై ప్రశ్నించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశాన్ని ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి, కార్మిక శాఖ మంత్రి వివేక్ నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్యే హరీశ్రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హాజరయ్యారు. – సాక్షి, సిద్దిపేట మధ్యాహ్నం 2:50గంటలకు ప్రారంభమైన సమీక్ష సమావేశం సాయంత్రం 6:50గంటల వరకు కొనసాగింది. వ్యవసాయం, హౌసింగ్, వైద్య ఆరోగ్య , రెవెన్యూ, విద్యా, బీసీ, ఎస్సీ, మైనార్టీ, ట్రైబల్ వెల్ఫేర్, ఎస్సీ కార్పొరేషన్, జిల్లా సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి, జిల్లా పంచాయతీ, విద్యుత్తు, ఇరిగేషన్, మిషన్ భగీరథ, కార్మిక, ఉపాధి, పరిశ్రమలు, మైనింగ్, ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖలపై సమీక్షను నిర్వహించారు. సమీక్ష సమావేశాన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించాలని, 20నెలల్లో ఒక్కసారి మాత్రమే జిల్లా ఇన్చార్జి మంత్రి సమీక్ష నిర్వహించారని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. వెంటనే మంత్రి వివేక్ స్పందించి రాత్రి అయినా పర్వాలేదు అన్ని శాఖల పై సమీక్ష చేద్దామన్నారు. ఇప్పటి నుంచి మూడు నెలలకు ఒక సారి నాల్గవ సోమవారం జిల్లా అభివృద్ధిపై సమీక్షను ఏర్పాటు చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు జిల్లా అధికారులు సమాధానాలు చెప్పారు. వివిధ శాఖల్లో గత ప్రభుత్వంలో డబ్బులు పెండింగ్లో ఉన్నాయా? ప్రస్తుతం 20 నెలలుగా పెండింగ్లో ఉన్నాయా అని మంత్రి వివేక్, ఎమ్మెల్యే హరీశ్లు అధికారులను అడుగుతూ నవ్వులు పూయించారు. కార్మిక శాఖకు సంబంధించిన నివేదిక హార్డ్ కాపీని తీసుకురాకుండా ఫోన్లో చూసుకుంటూ లేబర్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ రావు చదివారు. ఫోన్లు ఎవరు మాట్లాడవద్దని, ఫోన్లు హాలులోకి తీసురావద్దని జిల్లా అఽధికారులను మంత్రి ఆదేశించారు. సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, సన్న బియ్యం పంపిణీ, రైతు భరోసా, రైతు బీమా, రూ.500లకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నామని మంత్రి వివేక్ అన్నారు. మెరుగైన విద్యను అందించే లక్ష్యంతో ప్రభుత్వం 10 వేల టీచర్ల నియామకం చేపట్టిందని తెలిపారు. రాష్ట్రంలో యూరియా కొరత లేదని, ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించి, రైతులను ప్రలోభాలకు గురిచేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. యూరియా కోసం బారులు జిల్లాకు యూరియాను పూర్తి స్థాయిలో సరఫరా చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఉదయం లేసిందంటే యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. జిల్లాలో విద్యుత్ కండక్టర్ల కొరత ఉందని దీంతో నూతన విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. పూర్తి స్థాయిలో రుణ మాఫీ కాలేదని, సన్న వడ్ల బోనస్ రైతులకు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ వైర్లు కిందకు వేలాడుతూ, ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ లేకపోవడంతో పశువులు, రైతులు మృత్యువాత పడుతున్నారని, ఎన్నో మార్లు విద్యుత్ అధికారులకు విన్నవించినా ఫార్వర్డ్ చేసి టైంపాస్ చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. సిద్దిపేటకు వెయ్యి పడకల ఆస్పత్రి అవసరమా?: మంత్రి వివేక్ ఐదు జిల్లాలకు కేంద్రమైన సిద్దిపేట జిల్లాలో మెడికల్ కళాశాలకు అనుబంధంగా వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మాణం చివరి దశలో ఉంది. ఆస్పత్రికి కొంత మైనర్ వర్క్లకు దాదాపు రూ.25కోట్లు కేటాయిస్తే వినియోగంలోకి వస్తుందని దానికి నిధులు కేటాయించే విధంగా కృషి చేయాలని మంత్రి వివేక్ను ఎమ్మెల్యే హరీశ్ రావు కోరారు. ఈ సందర్బంగా ఇన్చార్జ్ మంత్రి వివేక్ మాట్లాడుతూ చిన్న ఊరికి ఇంత పెద్ద ఆస్పత్రి అవసరమా? చెన్నూరులో 100 పడకల ఆస్పత్రి మాత్రమే ఉందని అని అన్నారు. వెంటనే హరీశ్ మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న ఉద్దేశ్యంతో రూ.300 కోట్లతో నిర్మాణం చేశామని గుర్తు చేశారు. -
ప్రజా సంక్షేమమే ముఖ్యం
● ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం ● మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు కృషి ● జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ ● కలెక్టరేట్లో రేషన్కార్డు ప్రొసీడింగ్ల పంపిణీ ప్రొటోకాల్ రగడ సిద్దిపేటరూరల్: ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో కొండపాక, సిద్దిపేట అర్బన్ మండలాల రేషన్కార్డు లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంిపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్ ముఖ్య అతిథిగా హాజరై రేషన్ కార్డు లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 20లక్షల కొత్త రేషన్కార్డులు అందించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రేషన్ కార్డుతో ప్రజలు సన్నబియ్యంతో పాటు అన్ని ప్రభుత్వ పథకాలకు అర్హత పొందేందుకు వీలుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోందన్నారు. నేడు ప్రజలు సంతోషంగా తింటున్నారన్నారు. ప్రజలకు నాణ్యమైన బియ్యం సరాఫరా అయ్యేలా కలెక్టర్, యంత్రాంగం పర్యవేక్షించాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఉచిత విద్యుత్, ఉచిత బస్సు సౌకర్యం, సబ్సిడీ గ్యాస్, సన్నబియ్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, సన్నధాన్యానికి బోనస్ వంటి ఎన్నో పథకాలు అమలు చేస్తోందన్నారు. ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను అందిస్తున్నామని, ఇక ముందు మరింత ఎక్కువగా ఇళ్లను ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు 400 నుంచి 600 చదరపు అడుగుల్లోనే ఇళ్లు నిర్మించుకుంటేనే డబ్బులు వస్తాయన్నారు. నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలి అంతకుముందు ఎమ్మెల్యే హరీశ్రావు మాట్లాడుతూ రేషన్కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియ అని, ప్రజల అవసరాల మేరకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కొత్త రేషన్కార్డులు మంజూరైన వారికి కూడా సన్నబియ్యం అందించాలన్నారు. సన్నబియ్యంలో నూకలు ఎక్కువగా ఉండి అన్నం ముద్దగా అవుతుందన్న ఆరోపణలు వస్తున్నాయన్నారు. నాణ్యమైన బియ్యం సరాఫరా చేసేలా ప్రభు త్వం పర్యవేక్షించాలన్నారు. తమతో పాటుగా జిల్లా అభివృద్ధికి ఇన్చార్జి మంత్రి సహకరించాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కివెంకటయ్య, అదనపు కలెక్టర్లు గరీమా అగర్వాల్, అబ్దుల్ హమీద్, డీసీఎస్ఓ తనూజ, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న రేషన్కార్డుల ప్రొసీడింగ్ ప్రక్రియలో ప్రొటోకాల్ రగడ ఉద్రిక్తతకు దారితీసింది. పంపిణీ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఫొటో ఎందుకు లేదంటూ బీఆర్ఎస్ నాయకులు నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కాంగ్రెస్ నాయకులు సైతం హరీశ్రావు, కొత్తప్రభాకర్రెడ్డిలు డౌన్డౌన్ అంటూ నినాదాలు చేయడంతో గందరగోళం కాస్త ఉద్రిక్తంగా మారింది. రంగప్రవేశం చేసిన పోలీసులు ఇరు పార్టీల నాయకులకు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఇందిరమ్మ ఇళ్లు అందరికీ రావడంలేదని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించగా.. స్పందించిన మంత్రి వివేక్ గత పదేళ్లలో మీరు ఎన్ని ఇళ్లు ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాజకీయం చేయద్దంటూ బీఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు. బక్కి వెంకటయ్య అసహనంరేషన్కార్డు ప్రొసీడింగ్ పత్రాల పంపిణీలో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫొటో ఎందుకు వేయలేదని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కివెంకటయ్య కలెక్టర్ను అడిగారు. అలాగే తన పేరుతో కుర్చీ కూడా ఏర్పాటు చేయకపోవడంపై అసహనాన్ని వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన మంత్రి వివేక్ తప్పకుండా ప్రొటోకాల్ పాటించాలని మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చూసుకోవాలన్నారు. -
హోరాహోరీగా ఫుట్బాల్ పోటీలు
వర్గల్(గజ్వేల్): ఉమ్మడి మెదక్ జిల్లా వర్గల్ నవోదయ వేదికగా కొనసాగుతున్న ప్రీ సుబ్రతో జాతీయ ఫుట్బాల్ పోటీలు క్రీడాభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. టోర్నీలో రెండోరోజు మంగళవారం షిల్లాంగ్, పాట్నా రీజియన్లు ఆధిపత్యం ప్రదర్శించాయి. అండర్–17, అండర్–15 రెండు విభాగాల్లోనూ ఫైనల్కు దూసుకెళ్లారు. తుదిపోరులో సత్తాచాటేందుకు సన్నద్ధమవుతున్నారు. రెండోరోజు విజేత జట్లు అండర్–15 విభాగం నుంచి పట్నా, షిల్లాంగ్ జట్లు అత్యుత్తమ ప్రదర్శనతో ఫైనల్కు చేరాయి. లీగ్ మ్యాచ్లలో షిల్లాంగ్ జట్టు పూణె జట్టును 9–0, చండీఘర్ జట్టును 5–0 గోల్స్తో చిత్తుచేసింది. చండీఘర్ జట్టు 3–0తో జైపూర్ను, లక్నో జట్టు 2–0 గోల్స్తో పాట్నాను, భోపాల్ జట్టు 2–1తో హైదరాబాద్ను ఓడించాయి. భోపాల్, లక్నో జట్ల మధ్య 2–2 గోల్స్తో మ్యాచ్ టై అయింది. అదే ఒరవడిలో జైపూర్, పూణె జట్ల మధ్య మ్యాచ్ కూడా 0–0 గోల్స్తో టై అయింది. సెమీఫైనల్లో పాట్నా 4–0 గోల్స్తో లక్నోను ఓడించి ఫైనల్కు చేరుకోగా, మరో సెమీఫైనల్లో షిల్లాంగ్ 4–1 గోల్స్తో లక్నోను ఓడించి ఫైనల్కు చేరింది. అండర్–17 విభాగంలో.. అండర్–17 విభాగంలోనూ షిల్లాంగ్, పాట్నా జట్లే ఫైనల్కు చేరాయి. రెండోరోజు లీగ్ మ్యాచ్లలో పాట్నా 9–0 గోల్స్తో జైపూర్ను, 2–0 గోల్స్తో చండీఘర్ను ఓడించింది. షిల్లాంగ్ 6–0 గోల్స్తో హైదరాబాద్ను, చండీఘర్ 7–1 గోల్స్తో భోపాల్ను ఓటమిపాల్జేశాయి. లక్నో 3–1 గోల్స్తో పూణెను, భోపాల్ 1–0 తో జైపూర్ను ఓడించాయి. సెమీఫైనల్స్లో షిల్లాంగ్ 3–1 గోల్స్తో చండీఘర్ను, రెండో సెమీఫైనల్లో పాట్నా, లక్నో మ్యాచ్ టై కాగా పెనాల్టీ షూటవుట్ ద్వారా 4–2 గోల్స్తో పాట్నా ఫైనల్కు చేరింది. ఫైనల్స్లో షిల్లాంగ్, పాట్నా తలపడనున్నాయి. -
దాశరథి జీవితం యువతకు స్ఫూర్తి
ప్రముఖ కవి నందిని సిధారెడ్డిసిద్దిపేటఎడ్యుకేషన్: సమాజంలోని అసమానతలను తొలగించేందుకు కవిత్వం ఉపయోగపడుతుందని ప్రముఖ కవి డాక్టర్ నందిని సిధారెడ్డి అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో మంగళవారం దాశరథి కృష్ణమాచార్య శతజయంతి సాహిత్య సమాలోచన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దాశరథి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ‘దాశరథి జీవితం, సాహిత్యం–ప్రేరణలు’ అనే అంశంపై సిధారెడ్డి మాట్లాడారు. సంస్కత భాషాధిపత్యాన్ని ఎదిరించడంతో ప్రారంభించింది మొదలు.. తన 15 ఏళ్ల వయస్సులో నిజాం పాలనపై సాహిత్యాన్ని ఆయుధంగా మలచి పద్యాలు రాసి ఊరూరా ప్రచారం చేసి నాటి పాలకులకు నిద్రలేకుండా చేశారన్నారు. దాశరథి జీవితం నేటి యువతకు స్పూర్తిదాయకమని కొనియాడారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సునీత మాట్లాడుతూ దాశరథి పద్యాలు తెలంగాణ ప్రజలకు కంచు కాగడాలై కొత్త వెలుగులను అందిస్తాయని చెప్పారు. తెలుగు విభాగాధిపతి డాక్టర్ మట్ట సంపత్కుమార్రెడ్డి మాట్లాడుతూ దాశరథి కవిత్వపు మానవీయత, సమాజదృక్పఽథం, సాహితీ వైవిధ్యం ఉద్యమాల ప్రేరణ, ధిక్కార స్వరం, సాహసాన్ని పునికిపుచ్చుకుని విద్యార్థులు ఉత్తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల సీఓఈ డాక్టర్ గోపాలసుదర్శనం, అధ్యాపకులు పాల్గొన్నారు. జా.సా.ప ఆధ్వర్యంలో.. ప్రశాంత్నగర్(సిద్దిపేట): పట్టణంలో జాతీయ సాహిత్య పరిషత్(జాసాపా) ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక కార్యాలయంలో దాశరథి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు కవులు దాశరథి సాహిత్యం, ఆయన తెలంగాణ ప్రజలను చైతన్యం చేసిన తీరును గుర్తు చేసుకున్నారు. నా తెలంగాణ.. కోటి రతనాల వీణ అని నినదించిన ఆయన సాహిత్యం అజరామరమన్నారు. కార్యక్రమంలో కవులు రాజమౌళి, ఉండ్రాళ్ల రాజేశం తదితరులు పాల్గొన్నారు. -
పట్టు సాగులో ఆధునికత అవసరం
సెంట్రల్ సిల్క్ బోర్డు శాస్త్రవేత్తలు చిన్నకోడూరు(సిద్దిపేట): పట్టు సాగులో ఆధునికతను అందిపుచ్చుకుని, నూతన టెక్నాలజీని వినియోగించాలని సెంట్రల్ స్కిల్ బోర్డు శాస్త్రవేత్తలు వినోద్ కుమార్, రాఘవేంద్రలు తెలిపారు. పట్టు రైతుల అభివృద్ధి కోసం సెంట్రల్ సిల్క్ బోర్డు ఆదేశాలతో మంగళవారం మండల పరిధిలోని చంద్లాపూర్, జక్కాపూర్ గ్రామాల్లో బేస్లైన్ సర్వే చేశారు. వారు మాట్లాడుతూ బేస్లైన్ సర్వేకు సిద్దిపేట, సిరిసిల్ల, రంగారెడ్డి జిల్లాలు ఎంపికయ్యాయన్నారు. పట్టు సాగులో మెలకువలపై రైతులతో చర్చించారు. అధిక ఆదాయం ఉన్న ఈ సాగులోకి రైతులను ఎలా ప్రోత్సహించాలన్న విషయాలపై చర్చించారు. -
నీళ్ల చారు
ఉడకని అన్నం ● పప్పుంతా కారమే ● కానరాని కూరగాయాలు, ఆకు కూరలు ● జనగామ పాఠశాలలో మధ్యాహ్న భోజనం దుస్థితిఅక్కన్నపేట(హుస్నాబాద్): ఉడకని అన్నం.. నీళ్లచారు.. కారం పప్పు.. ఇదీ ప్రభుత్వ పాఠశాలలో నిత్యం కనిపించే మధ్యాహ్న భోజనం దుస్థితి. అక్కన్నపేట మండలం జనగామ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సుమారు 77మంది విద్యార్థులు ఉన్నారు. అయితే, మంగళవారం మెనూ ప్రకారం అన్నం, కూరగాయలు, సాంబారుతో భోజనం పెట్టాలి. కానీ నీళ్లచారు, కారం పప్పుతో ఉడకని అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ‘సాక్షి’ పలకరించగా.. రోజూ నీళ్లచారు, కారం పప్పుతోనే భోజనం పెడుతున్నారని వాపోయారు. మెనూ ప్రకారం భోజనం అందడంలేదని, పప్పులో కుళ్లిన టమాటా, మిర్చి తదితర వస్తున్నాయని చెబుతున్నారు. పోషకాహారం దేవుడెరుగు, కనీసం చిక్కటి పప్పు అన్నం అందడం లేదని తెలిపారు. ఇదేమిటని ఉపాధ్యాయులు, విద్యార్థులు కార్మికులను అడిగితే పొంతన లేని సమాధానం చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం భోజనం వడ్డించాలని చెప్పినా వినడం లేదని ఉపాధ్యాయులు తెలిపారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం పెట్టేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. -
మారనున్న గజ్వేల్ స్వరూపం
పెరగనున్న వార్డుల సంఖ్య ● మున్సిపాలిటీలో 30కి చేరే అవకాశం ● ఆర్అండ్ఆర్ కాలనీ విలీనంతో పెరిగిన పట్టణ పరిధి ● ఎన్నికల నోటిఫికేషన్ నాటికి పూర్తి కానున్న వార్డుల డీలిమిటేషన్ ● మార్పులు, చేర్పులపై సర్వత్రా ఆసక్తి గజ్వేల్– ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ స్వరూపం మారనుంది. ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులు ఉండగా.. మరో 10 వార్డులు పెరిగే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ నాటికి వార్డుల డీలిమిటేషన్ పూర్తి చేయనున్నారు. మున్సిపాలిటీలో ఆర్ అండ్ ఆర్ కాలనీ విలీనం కావడంతో మార్పులు జరగనున్నాయి. ఈ అంశాలపై పట్టణ ప్రజల్లో ఆసక్తి నెలకొంది. – గజ్వేల్ గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధి ప్రస్తుతం 49 చదరపు కిలోమీటర్లు పరిధి కలిగి ఉంది. మున్సిపాలిటీలో గజ్వేల్తో పాటు ప్రజ్ఞాపూర్, రాజిరెడ్డిపల్లి, సంగాపూర్, క్యాసారం, ముట్రాజ్పల్లి గ్రామాలు ఉన్నాయి. దీంతో పట్టణ జనాభా 55వేలకు చేరుకుంది. మల్లన్నసాగర్ నిర్వాసిత గ్రామాలైన పల్లెపహాడ్, వేములగాట్, ఏటిగడ్డకిష్టాపూర్, ఎర్రవల్లి, సింగారంతోపాటు ఈ పంచాయతీల పరిఽధిలోని లక్ష్మాపూర్, రాంపూర్, బ్రహ్మణ బంజేరుపల్లి తదితర గ్రామాల ప్రజలకు ఆర్అండ్ఆర్ కాలనీని నిర్మించి ఇచ్చిన సంగతి తెల్సిందే. కాలనీలో నివాసముంటున్నా.. 2020 నుంచి కొంతకాలం వరకు ఆయా గ్రామాలు పంచాయతీలుగానే కొనసాగాయి. ప్రస్తుతం ఆయా గ్రామాల పరిధిలో 15వేల జనాభా, మరో 13వేల మంది ఓటర్లు ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల ఈ పంచాయతీలను రద్దు చేశారు. ఆర్ అండ్ ఆర్ కాలనీ విలీనంతో.. మల్లన్నసాగర్ నిర్వాసిత గ్రామ పంచాయతీలను ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత యథాతథంగా ఈ గ్రామాలన్నీ మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. ఈ క్రమంలోనే నిర్వాసిత గ్రామాల్లో పారిశుద్ధ్యం, మంచినీరు, ఇతర సామాజిక అవసరాల బాధ్యతను మున్సిపల్ యంత్రాంగమే చేపడుతోంది. ఆర్అండ్ఆర్ కాలనీ భౌగోళికంగా మున్సిపాలిటీ పరిఽధిలోనే ఉంది. గతంలో మున్సిపాలిటీలో చేరాలా?.. వద్దా? అనే అంశంలో కొంతకాలం నిర్వాసితులు సందిగ్ధంలో ఉన్నారు. తమను ప్రత్యేక పంచాయతీలుగానే ఉంచాలని కోరారు. కానీ భౌగోళికంగా మున్సిపాలిటీ పరిధిలో ఉండటం వల్ల ప్రత్యేక పంచాయతీలుగా కొనసాగించడం కుదరదని ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే కలెక్టర్ నుంచి స్థానిక మున్సిపల్ అధికారులకు నిర్వాసిత గ్రామాల పారిశుద్ధ్య నిర్వహణ, ఇతర అంశాల బాధ్యత మున్సిపల్ యంత్రాంగానిదేనని మార్గదర్శకాలు రావడంతో విలీనం జరిగినట్లేనని స్పష్టమైంది. మారనున్న సమీకరణలు మున్సిపాలిటీ పరిధిలో వార్డుల సంఖ్య పెరగనున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణల్లోనూ మార్పులు చోటు చేసుకోనున్నాయి. వార్డుల విభజన గతంతో పోలిస్తే కొంత మార్పులు, చేర్పులు ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే కౌన్సిలర్లుగా పోటీ చేయనున్నారు. ఔత్సాహికులు వార్డుల ఎంపికలో తమకు అనుకూలగా ఉండే వార్డుల ఎంపికపై దృష్టి సారించనున్నారు. మరోవైపు మున్సిపాలిటీలో ఎలాగైనా పట్టు సాధించాలని బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. నోటిఫికేషన్ కంటే ముందే పట్టణంలో అన్ని పార్టీల్లోనూ చేరికలు జోరుగా సాగుతున్నాయి. మొత్తానికి వార్డుల సంఖ్య పెంపు మున్సిపల్ రాజకీయాల్లో కీలకమార్పులను తేబోతోంది. 75 వేలకుపైగా జనాభా.. ఆర్ అండ్ ఆర్ కాలనీ విలీనం తర్వాత పట్టణ జనాభా సుమారు 75వేల పైచిలుకు చేరుకుంది. ఓటర్ల సంఖ్య కూడా భారీగానే పెరగనుంది. సుమారు 45వేల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో వార్డుల సంఖ్య పెంచడం అనివార్యమవుతోంది. ప్రస్తుతం 20 వార్డులుండగా మరో 10 వార్డులు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక్కో వార్డులో 1500మంది ఓటర్లకు తగ్గకుండా విభజన జరుగనుంది. మున్సిపల్ ఎన్నికలలోపే వార్డుల డీలిమిటేషన్లో ప్రక్రియ పూర్తి చేయనున్నారు. -
‘ఫుట్బాల్’ సంగ్రామం
ముస్తాబైన నవోదయం ● నేటి నుంచి మూడు రోజులపాటు పోటీలు ● జాతీయస్థాయి మెగాటోర్నీకి వర్గల్ సర్వసన్నద్ధం ● సత్తాచాటనున్న వివిధ రాష్ట్రాల నవోదయ క్రీడాకారులు వర్గల్(గజ్వేల్): పరుగులో చిరుత వేగం.. ప్రత్యర్థి ప్రయత్నాన్ని అడ్డుకుంటూ బంతిని కాళ్ల మధ్య గింగిర్లు తీయిస్తూ.. గోల్ పోస్టు వైపు దూసుకెళ్తూ.. పెనాల్టీ కార్నర్లు.. పెనాల్టీ షూటవుట్లు.. అరుప లు, కేరింతలతో క్రీడాకారులు మూడురోజులపాటు క్రీడాభిమానులకు కనువిందు చేయనున్నారు. ఇందుకు వర్గల్ నవోదయ వేదికకానుంది. జాతీయ ఫుట్బాల్ సంగ్రామానికి వర్గల్ నవోదయ సర్వసన్నద్ధమైంది. అత్యుత్తమ విద్యతోపాటు క్రీడలకు సముచిత ప్రాధాన్యతనిస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేస్తున్న స్థానిక నవోదయ వేదికగా సోమవారం నుంచి 3 రోజుల పాటు జరిగే టోర్నమెంట్కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో.. దేశంలోని అన్ని నవోదయ విద్యాలయాల ఫుట్బాల్ జట్ల క్రీడాకారులు ఆయా ప్రాంత రీజియన్కు ప్రాతినిధ్యం వహిస్తారు. 8 రీజియన్ల నుంచి అండర్–15 విభాగంలో ఒక జట్టు, అండర్–17 విభాగంలో మరో జట్టుగా మొత్తం 16 జట్లు టోర్నీలో తలపడనున్నాయి. గ్రూప్–ఏ, గ్రూప్–బీ గా జట్లను విభజించి లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలు నిర్వహిస్తారు. టోర్నీలో విజేత జట్లు నవోదయ విద్యాలయాలన్నిటికి (నవోదయ ఒక రాష్ట్రంగా) ప్రాతినిధ్యంగా ‘ప్రీ–సుబ్రతో’ జాతీయ టోర్నీకి ఎంపికవుతారు. వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 253 మంది క్రీడాకారులు, 32 మంది ఎస్కార్ట్ టీచర్లు వర్గల్కు చేరుకున్నారు. సందడిగా రిహార్సల్స్ వివిధ రీజియన్ల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు, ఎస్కార్ట్ టీచర్లతో వర్గల్ నవోదయ సందడిగా మారింది. స్టేడియంలో మార్చ్ఫాస్ట్, ఓత్ టేకింగ్, తదితర రిహార్సల్స్ కొనసాగాయి. ప్రిన్సిపాల్ రాజేందర్ పర్యవేక్షణలో నవోదయ యంత్రాంగం తగు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రతిష్టాత్మకంగా టోర్నమెంట్ క్లస్టర్, రీజినల్, జాతీయ టోర్నీలు సమర్థంగా నిర్వహించిన అనుభవం వర్గల్ నవోదయకు ఉంది. ప్రీ–సుబ్రతో జాతీయ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహణ అవకాశం మాకు దక్కడం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాం. ఫిజికల్ టీచర్లు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరి సహకారంతో టోర్నీ జయప్రదం చేస్తాం. నిష్ణాతులైన రెఫరీలతో పోటీలు నిర్వహిస్తున్నాం. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని చాటుతూ పోటీలలో పాల్గొనాలి. – దాసి రాజేందర్, ప్రిన్సిపాల్ నేడు టోర్నీ ప్రారంభోత్సవం వర్గల్ నవోదయ వేదికగా ప్రీ–సుబ్రతో ఫుట్బాల్ జాతీయ పోటీలు సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి. ముఖ్యఅతిథిగా ఫుట్బాల్ అంతర్జాతీయ క్రీడాకారుడు, తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జీపీ ఫల్గుణ, ప్రత్యేక ఆహ్వానితులుగా నవోదయ విద్యాలయ సమితి డిప్యూటీ కమీషనర్ అభిజిత్ బేరా హాజరవుతున్నారు. -
మల్లన్న ఆలయంలో భక్తుల సందడి
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం భక్తుల రాకతో కిట కిటలాడింది. మల్లన్న నామస్మరణతో ఆలయ పరిసరాలన్నీ మారుమోగాయి. క్షేత్రానికి చేరుకున్న భక్తులు స్వామి వారిని దర్శించుకుని అభిషేకాలు, పట్నాలు, అర్చన, ఒడి బియ్యం, గంగిరేణి చెట్టుకు ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు కావాల్సిన సౌకర్యాలను ఆలయ ఈఓ అన్నపూర్ణ, ఏఈఓ బుద్ధి శ్రీనివాస్, ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్, ఆలయ ధర్మకర్తలు పర్యవేక్షించారు. స్కాన్ చెయ్.. కానుక వెయ్ కొమురవెల్లి(సిద్దిపేట): గుడికొచ్చాం.. దేవుడిని దర్శించుకున్నాం.. అయ్యో హుండీలో వేసేందుకు చిల్లర లేదే.. అని జేబులు తడుముకోవాల్సిన అవసరం లేదంటున్నారు కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ అధికారులు. ప్రతి చిన్న అవసరానికి ఫోన్పే, గూగుల్పే, క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా డిజిటల్ చెల్లిస్తున్న కాలమిది. అందుకు అనుగుణంగా భక్తుల కోసం ‘ఈ హుండీ’ని ఆదివారం ఈఓ అన్నపూర్ణ ప్రారంభించారు. బుకింగ్ కార్యాలయం, ప్రసాద విక్రయాల వద్ద, ఆన్నదాన సత్రంలలో క్యూఆర్ కోడ్ స్కానర్లను అమర్చారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త జయప్రకాశ్రెడ్డి రూ.10,116 స్కాన్ చేశారు.ఎల్లమ్మ సన్నిధిలో జడ్జి సాయికుమార్ దుబ్బాక: మండలంలోని పెద్దగుండవెల్లి ఎల్లమ్మతల్లిని ఆదివారం సిద్దిపేట సివిల్కోర్టు జడ్జి సాయికుమార్ కుటుంబంతో సహా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జడ్జికి అమ్మవారి జ్ఞాపికను అందించారు. కార్యక్రమంలో ఆలయం చైర్మన్ ఏల్పుల మహేష్, మల్లుగారి ప్రభాకర్, న్యాయవాది ప్రకాశ్ తదితరులు ఉన్నారు. -
కేంద్ర పథకాల అమలుపై ఆరా
కొమురవెల్లి(సిద్దిపేట): మండలంలోని గురువన్నపేటలో కేంద్ర బృందం సభ్యులు పర్యటించారు. గ్రామంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు తీరుపై కేంద్ర బృందం సభ్యులు జోస్లీజోసఫ్, వినోద్, అదనపు డీఆర్డీఓ శ్రీనివాస్గౌడ్, డీఎల్పీఓ మల్లికార్జునరెడ్డితో కలసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు, పేదరిక నిర్మూలన చర్యలు, స్వయం ఉపాధి రుణాల వితరణ వంటి అంశాలపై ప్రజలు, మహిళాసంఘాల సభ్యులతో చర్చించారు. అదే విధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణపనులు ఎలా చేపడుతున్నారు? ఎంత ఖర్చు వస్తుంది? ప్రభుత్వం ఎంత చెల్లిస్తోందని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఏపీడీ సతీష్, ఎంపీడీఓ శ్రీనివాస వర్మ, పీఆర్ ఏఈ శివకుమార్, ఏపీఓ బాలలింగం, ఏఈ హౌసింగ్ మేఘన, ఏకేపీ ఏపీఎం శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి వివేక్ను కలిసిన కాంగ్రెస్ నేతలు
చిన్నకోడూరు(సిద్దిపేట): రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తుండగా ఆదివారం చర్లఅంకిరెడ్డిపల్లి వద్ద కాంగ్రెస్ నాయకులు కలిశారు. మంత్రిని సన్మానించారు. యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి అజ్జు యాదవ్ మండలంలో జరుగుతున్న అభివృద్ధి, తదితర అంశాలను మంత్రికి వివరించారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయించాలని కోరారు. ఆయనతో పాటు నాయకులు అనిల్కుమార్, శ్రీనివాస్గౌడ్, రమేష్, వెంకటేశం, ప్రభాకర్రెడ్డి ఉన్నారు. కేజీబీవీలో స్పాట్ అడ్మిషన్లు చేర్యాల(సిద్దిపేట): పట్టణ కేంద్రంలోని కేజీబీవీ జూనియర్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు జరగనున్నాయి. సీఈసీ ఇంగ్లిష్ మీడియంలో మొదటి సంవత్సరంలో ఖాళీగా ఉన్న 20 సీట్లకు సోమవారం స్పాట్ అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు ఎస్ఓ కృష్ణవేణి తెలిపారు. ఈ అవకాశాన్ని 10వ తరగతి పాసైన విద్యార్థినులు ఉపయోగించుకోవాలని సూచించారు. ‘కొండపోచమ్మ’ అభివృద్ధికి కృషి జగదేవ్పూర్(గజ్వేల్): కొండపోచమ్మ ఆలయ అభివృద్ధికి తమవంతు కృషి చేస్తానని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. ఆదివారం మండలంలోని కొండపోచమ్మ ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. భక్తుల కోసం మంచి నీటి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో చైర్పర్సన్ అనుగీత, ఈఓ రవికుమార్, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల పెన్షన్ పెంచాలి సిద్దిపేటకమాన్: దివ్యాంగులకు ఇచ్చిన హామీల్లో భాగంగా పెన్షన్లను ప్రభుత్వం పెంచాలని ఎమ్మార్పీఎస్, వీహెచ్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సిద్దిపేట ప్రెస్క్లబ్లో నిర్వహించిన ఎమ్మార్పీఎస్, వీహెచ్పీఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడారు. వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఆగస్టు 13న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే వికలాంగుల పెన్షన్దారుల మహాగర్జన సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో శంకర్, కుమార్, యాదగిరి, పరశురాములు, ప్రసాద్, నర్సయ్య, రవి, తదితరులు పాల్గొన్నారు. ప్రమాదకరంగా బావిఅక్కన్నపేట(హుస్నాబాద్): మండల కేంద్రంలో ఇళ్లమధ్య ప్రమాదకరంగా బావి ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కనీసం రక్షణ గోడ లేకపోవడం.. సీసీ రోడ్డు పక్కనే ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. ఏదైనా కొంచెం ఏమరుపాటు జరిగినా ప్రాణాలు గాలిలో కలిసిపోయే పరిస్థితి ఉంది. ఎలాంటి ప్రమాదం జరగకముందే బావిని పూడ్చివేయాలని స్థానికులు కోరుతున్నారు. దరఖాస్తుల ఆహ్వానం దుబ్బాక: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ భవాని కోరారు. కామర్స్ 2, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ 1, తెలుగు అధ్యాపకుడి పోస్టు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి గల అభ్యర్థులు 23లోగా దరఖాస్తులు అందజేయాలని సూచించారు. అభ్యర్థులు పీజీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. -
సోమవారం శ్రీ 21 శ్రీ జూలై శ్రీ 2025
ఆషాఢ మాసం ఆఖరి ఆదివారం జిల్లా వ్యాప్తంగా బోనాల సంబురాలు అంబరాన్నంటాయి. ఉదయం నుంచే అమ్మవార్ల ఆలయాల వద్ద భక్తుల సందడి నెలకొంది. బోనాలతో తరలివచ్చి నైవేద్యాలు తల్లికి సమర్పించారు. జిల్లా కేంద్రంలో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పోతరాజులు, శివసత్తులు, జోగినిలు, కళాకారుల విన్యాసాలు భక్తులను విశేషంగా అలరించాయి. రోడ్డు పొడవునా కళాకారులు నెత్తిన బోనాలతో, కోలాటం ఆడారు. దీంతో జిల్లా కేంద్రం భక్తిపారవశ్యంతో, అమ్మవార్ల నామస్మరణతో మార్మోగింది. – ప్రశాంత్నగర్(సిద్దిపేట) బోనంతో బైలెల్లి.. తల్లికి ప్రణమిల్లి న్యూస్రీల్ -
ప్లాస్టిక్ వినియోగాన్ని అరికడదాం
జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి దుబ్బాకటౌన్: గ్రామాలలో ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టాలని జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి అన్నారు. శనివారం రాయపోల్ మండలం అనాజీపూర్, రాయపోల్ గ్రామ పంచాయతీలు, నర్సరీ, సెగ్రిగేషన్ షెడ్, వైకుంఠధామం, ప్రధాన రహదారి వెంట ఉన్న మురుగు కాలువలు, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం తగదని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న దృష్ట్యా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు పంచాయతీ కార్యదర్శిలను ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శుల విధులు నిర్వ హణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చ రించారు. కార్యక్రమంలో ఎంపీడీవో బాల య్య, ఎంపీఓ శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ ముత్తాలీఫ్, పంచాయతీ కార్యదర్శులు తదితరులున్నారు. -
పెండింగ్ కేసులు పరిష్కరించండి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి సిద్దిపేటకమాన్: చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న సివిల్, క్రిమినల్ కేసులు పరిష్కరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి తెలిపారు. జిల్లా కోర్టు కాంప్లెక్స్లో శనివారం కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ కేసుల పరిష్కారంలో ముందు వరుసలో ఉండే విధంగా న్యాయ, పోలీసు అధికారులు పనిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, జిల్లా అదనపు న్యాయమూర్తి జయప్రసాద్, జూనియర్ సివిల్ జడ్జి రేవతి, సీపీ అనురాధ, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు తదితరులు పాల్గొన్నారు. -
నానో ఎరువులపై ఫోకస్
● యూరియా కొరత నేపథ్యంలోవ్యవసాయ శాఖ నిర్ణయం ● జిల్లా అంతటా అవగాహన సదస్సులు ● సాధారణ ఎరువులతో పోలిస్తేమేలంటున్న అధికారులుగజ్వేల్: జిల్లాలో నానాకాలం సీజన్కు సంబంధించి సుమారు 5.50లక్షల పైచిలుకు ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగులోకి వస్తాయి. యాసంగిలో 3లక్షల ఎకరాల వరకు సాగవుతాయి. రైతులు రసాయనిక ఎరువులపైనే ఆధారపడటం వల్ల ఏటా జిల్లాలో ఆయా నియోజకవర్గాలకు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు యూరియా 35,144 మెట్రిక్ టన్నులు, డీఏపీ 25,524 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 20,419 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 49,474 మెట్రిక్ టన్నులు మొత్తం కలుపుకొని 15,9227 మెట్రిక్ టన్నుల రసాయనిక ఎరువులు అవసరం ఉంటుందని అంచనా. రబీలో మరో 90వేల మెట్రిక్ టన్నులు అవసరమని తెలుస్తోంది. యూరియా కొరతతో కష్టాలు ఇతర ఎరువులతో పోలిస్తే ఏటా యూరియా కొరత రైతులకు కష్టాలను తెచ్చిపెడుతోంది. జిల్లాలో వానాకాలం సీజన్ మొత్తానికి 35,144మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంది. కానీ ఇప్పటివరకు కేవలం 9,700 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే వచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని చోట్ల కొరత తలెత్తింది. పలు మండల కేంద్రాల్లో రైతులు బారులు తీరుతున్న సంఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే వ్యవసాయశాఖ నానో ఎరువులపై దృష్టి పెట్టింది. పర్యావరణహితం.. కేంద్ర ప్రభుత్వం సంస్థ ఇఫ్కో ఉత్పత్తి చేస్తున్న ద్రవ రూప నానో యూరియా, డీఏపీలు సాధారణ ఎరువులతో పోలిస్తే పర్యావరణహితంగా పనిచేస్తాయని వ్యవసాయశాఖ చెబుతోంది. రసాయనిక యూరియా బస్తా ఎమ్మార్పీ రూ.266ఉండగా, నానో యూరియా లిక్విడ్ అర లీటర్ బాటిల్ రూ.225లకే లభిస్తోంది. అర లీటర్ లిక్విడ్ బాటిల్ ఎకరా మొత్తానికి పిచికారీ చేయడానికి సరిపోతుంది. కానీ బస్తాల రూపంలో రైతులు ఎకరాకు 3నుంచి 4బస్తాలను వాడతారు. ఇలా ఒక పంటకు రెండుసార్లు వేస్తారు. అంటే 6నుంచి 8బస్తాలను ఉపయోగిస్తారు. నానో యూరియా మాత్రం రెండుసార్లు పిచికారీ చేయాలనుకుంటే రెండు అర లీటర్ల బాటిళ్లు సరిపోతాయి. అదేవిధంగా డీఏపీ సాధారణ బస్తా ఎమ్మార్పీ రూ.1130ఉండగా నానో డీఏపీ లిక్విడ్ ఎమ్మార్పీ రూ.550మాత్రమే. ఎకరాకు సాధారణంగా బస్తాల్లోని డీఏపీ మూడుసార్లు మూడుకుపైగా బస్తాలు వాడతారు. కానీ నానో లిక్విడ్ డీఏపీ రెండు బాటిళ్లు కొనుగోలు చేస్తే ఎకరాకు సరిపోతుంది. రైతులకు ఖర్చు తగ్గడమేకాకుండా, మంచి ఫలితాలను ఇవ్వనుంది. రసాయనిక ఎరువులతో అనర్థమే రసాయనిక ఎరువులు మోతాదుకు మించి వాడటం వల్ల నేల సారం తగ్గి పంటల సాగులో దిగుబడులు పడిపోతుంటాయిం. పైగా రైతులు నష్టాల బారిన పడటం సహజపరిణామంగా మారుతోంది. పంటల ఉత్పత్తుల్లో పోషకాలు లోపించి, కలుషితమవుతున్నాయి. ఈ పరిణామం ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారుతోంది. నానో ఎరువుల వాడకం వల్ల నేల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ఉత్పాదకతను పెంచనుంది. అంతేకాకుండా తెగుళ్లను తట్టుకునే శక్తిని పెంపొందిస్తోంది. ఈ అంశాలను రైతులకు వివరించి వారిని చైతన్యపరడానికి వ్యవసాయశాఖ కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే జిల్లావ్యాప్తంగా ఫర్టిలైజర్స్ డీలర్లు, రైతులతో అవగాహన సదస్సులను నిర్వహిస్తోంది. మంచి ఫలితాలు వస్తాయి నానో ఎరువుల వాడకంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈ విషయాన్ని రైతులకు వివరిస్తూ పంటల సాగులో వాడేలా ప్రోత్సహిస్తున్నాం. ఇందుకోసం అన్ని మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. వీటి వాడకం మేలు అని కూడా చెబుతున్నాం. జిల్లాలో రసాయనిక ఎరువుల కొరత లేదు. – స్వరూపరాణి, జిల్లా వ్యవసాయాధికారినానో ఎరువులపై వ్యవసాయశాఖ ఫోకస్ పెట్టింది. యూరియా కొరత రోజురోజుకూ తీవ్రమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సాధారణ ఎరువులతో పోలిస్తే.. నానో ఎరువులతో మంచి ఫలితాలుంటాయని రైతులకు వివరిస్తూ చైతన్య పరిచే కార్యాచరణతో ముందుకుసాగుతోంది. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా అవగాహన సదస్సులకు శ్రీకారం చుట్టారు. -
– గన్నె తిరుపతి రెడ్డి, దుబ్బాక / రాంచర్ల వేణుగోపాల్ రెడ్డి, దుబ్బాకటౌన్
గోరింట సంబురం హుస్నాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం మహిళలు గోరింటాకు సంబురాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ సతీమణి మంజుల, తల్లి మల్లవ్వతో పాటు కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం సంప్రదాయంగా వస్తోంది. గోరింటాకు పెట్టుకుంటే వేడి తగ్గించడమే కాకుండా, చర్మ వాధులు దూరమవుతాయని నమ్మకం. కార్యక్రమంలో మెప్మా ఏడీఎంసీ సంతోషి, మాజీ కౌన్సిలర్లు చిత్తారి పద్మ, సరోజని, దండి లక్ష్మి, మెప్మా ఆర్పీలు, వార్డు ఆఫీసర్లు పాల్గొన్నారు. అలాగే గజ్వేల్ పట్టణంలోని మహిళా డిగ్రీ కళాశాలలోనూ గోరింటాకు సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ప్రిన్సిపాల్ కమలా క్రిస్టియాన, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. – హుస్నాబాద్8లో -
జోరుగా ఫైనాన్స్ల దందా?
ప్రైవేటు వడ్డీ వ్యాపారులు విజృంభిస్తున్నారు. విచ్చలవిడిగా దందాను కొనసాగిస్తూ.. అధిక వడ్డీ వసూలు చేస్తూ పేదల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. వడ్డీలకు చక్రవడ్డీలు విధిస్తూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. దీంతో వారు ఎవరికీ చెప్పుకోలేక లోలోపలే విలవిల్లాడుతున్నారు. పోలీసులు, రెవెన్యూఅధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఫైనాన్స్దందాలను అరికట్టాలని పలువురు కోరుతున్నారు. – సాక్షి, సిద్దిపేట వేధింపులు తట్టుకోలేకపోతున్నాం నా స్థలాన్ని తాకట్టు పెట్టి ఇల్లు కట్టుకునేందుకు రెండేళ్ల క్రితం ఫైనాన్స్ సంస్థలో రూ.6లక్షలు అప్పుతీసుకున్నాను. నెలకు రూ.17వేల చొప్పున కిస్తులు చెల్లిస్తున్నాను. ఆర్థిక ఇబ్బందులతో రెండు వాయిదాలు చెల్లించకపోవడంతో ఫోన్లు చేసి బెదిరింపులకు గురి చేస్తున్నారు. నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా ఫ్యామిలీ వారికి, ఫ్రెండ్స్కు ఫోన్లు చేసి వేధిస్తున్నారు. ఇంటికి వచ్చి బెదిరించడమేకాకుండా దుర్భాషలాడుతున్నారు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. – కొమురవెల్లి యాదగిరి, తిమ్మాయిపల్లి, నంగనూరు తీసుకున్న అప్పునకు రెండింతలు అత్యవసర పరిస్థితుల్లో సిద్దిపేటలోని ఓ ఫైనాన్స్ సంస్థలో తీసుకున్న అప్పుకు రెండింతలు డబ్బు వసూలు చేస్తున్నారు. రెండేళ్ల కిందట రూ.9లక్షలు అప్పుగా తీసుకున్నాను. నెలకు రూ.22వేల చొప్పున చెల్లిస్తున్నాను. ఒక్కరోజు ఆలస్యం అయినా ఫోన్లు చేస్తున్నారు. ఇంటికి వచ్చి బెదిరింపులకుగురిచేస్తున్నారు. – బాధితుడు, తిమ్మాయిపల్లి చర్యలు తీసుకుంటాం అప్పు తీసుకున్న వారిని ప్రైవేట్ ఫైనా న్స్ సంస్థలు వేధింపులకు గురి చేస్తుంటే మా దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటాం. ఆర్బీఐ నిబంధనల ప్రకారం వడ్డీ వసూలు చేయాలి. అధిక వడ్డీ వసూలు చేస్తే చర్యలు తప్పవు. రిజిస్టర్ లేని ఫైనాన్స్ సంస్థలు కొనిసాగిస్తే కేసులు నమోదు చేస్తాం. – డాక్టర్ అనూరాధ, సీపీ జిల్లాలో దాదాపుగా 100కి పైగా ఫైనాన్స్ సంస్థలు నిర్వహిస్తున్నారు. ఇందులో సగం వరకు అనధికారికంగా వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లో బ్రోకర్లను నియమించుకుని అడ్డూఅదుపు లేకుండా వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. పలు ఫైనాన్స్ కంపెనీలు నిబంధనలను అతిక్రమించి అధిక వడ్డీలకు అప్పుగా ఇస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రజల అవసరాన్ని ఆసరా చేసుకొని జలగల్లా పట్టి పీడిస్తున్నారు. వీరి బారిన పడిన వారు ఆర్థికంగా కోలుకోనిస్థితికి వెళ్తున్నారు. అనేక సంతకాలు జిల్లాలో పలు ఫైనాన్స్ సంస్థలు అధికంగా మార్టిగేజ్ చేసుకుని రుణాలు ఇస్తున్నాయని సమాచారం. రుణాలు తీసుకునే సమయంలో తక్కువ వడ్డీ అని చెప్పి తర్వాత అనేక సాకులు చూపుతూ అధిక మొత్తంలో వడ్డీ వసూలు చేస్తున్నారని ఆరోపణలున్నాయి. మార్టిగేజ్ చేసుకోవడమేకాకుండా ఆయా సంస్థలు దాదాపు 50కిపైగా సంతకాలు పెట్టించుకుంటున్నారు. నిరక్షరాస్యులు చదవలేరు. అలాగే పలువురికి ఇంగ్లిష్ చదవడం రాదు దీంతో ఏమి చదవకుండానే వేలిముద్రలు వేస్తున్నారు. దీంతో వినియోదారులకు అర్థం కాని రీతిలో గోప్యంగా కూడా అధిక వడ్డీలు, ఇతర చార్జీలు దండుకుంటున్నారు. రుణం తీసుకున్న వారి దగ్గరికి పలు సంస్థలు చెల్లించే చివరి రోజు వచ్చి డబ్బులు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. రెండు రోజులు ఆలస్యంగా చెల్లిస్తుండటంతో తెలియకుండానే జరిమానాలు సైతం వసూలు చేస్తున్నాయి. వాటికి చక్ర వడ్డీలు విధిస్తున్నారు. పలువురికి నోటీసులు ఆర్థిక ఇబ్బందులతో డబ్బులు చెల్లించలేని వారికి పలు ఫైనాన్స్ సంస్థలు నోటీసులు జారీ చేస్తున్నాయి. ఇంటిని జప్తు చేసుకుంటామని బెదిరింపులకు గురి చేయడంతో రైతులు, సాధారణ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇంటి వద్దకు ఫైనాన్స్ సంస్థల ఉద్యోగులు వచ్చిన గోడవలు చేసిన సంఘటనలున్నాయి. అప్పు ఇచ్చే సమయంలో ఒక బ్యాచ్.. వసూలు చేసేందుకు మరో బ్యాచ్లను ఫైనాన్స్లు ఏర్పాటు చేసుకుంటున్నాయి. దీంతో ఏమి చేయలేక పలువురు భూములు అమ్మి ఫైనాన్స్ సంస్థలకు అప్పులు చెల్లిస్తున్నారు. ఇప్పటికై నా పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వారి ఆగడాలను ఆరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. నిరుపేదలే లక్ష్యంగా వ్యాపారం ఇష్టారాజ్యంగా అధిక వడ్డీ వసూలు బెదిరింపులు.. దౌర్జన్యాలు ఆస్తులు స్వాధీనంచేసుకుంటామంటూ నోటీసులు విలవిల్లాడుతున్న సామాన్య ప్రజలు -
ఉపకరణాల ఎంపికకు హాజరుకండి
సిద్దిపేటరూరల్: ఉపకరణాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులు ఈనెల 22న మధ్యాహ్నం వారి ధ్రువపత్రాల, భౌతిక పరిశీలనకు హాజరు కావాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీకాంత్రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 18న హాజరుకాని వారు కూడా హాజరు కావాలని సూచించారు.సంక్షేమ హాస్టళ్ల దుస్థితి పట్టదా? హుస్నాబాద్: బీసీ సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినా ఎవరికీ పట్టడంలేదని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఆదిత్య డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిత్య మాట్లాడుతూ విద్యార్థులు ఆత్మహత్యా యత్నానికి పాల్పడి 24 గంటలు గడిచినా స్థానిక అధికారులు స్పందించలేదన్నారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల దుస్థితిపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించాలని డిమాండ్ చేశాడు. హాస్టళ్లను అధికారులు పర్యవేక్షించకపోడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. అతిథి అధ్యాపకుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం గజ్వేల్రూరల్: పట్టణంలోని బాలుర ఎడ్యుకేషన్ హబ్లోగల ప్రభుత్వ డిగ్రీ కళాశాల(అటానమస్)లో అతిథి అధ్యాపకులుగా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ నిఖత్ అంజుమ్ తెలిపారు. కళాశాలలో కంప్యూటర్ సైన్స్/అప్లికేషన్స్లో 2, మైక్రో బయాలజీ 1, ఇంగ్లిష్ 2, ఫిజిక్స్లో 1 చొప్పున సబ్జెక్టులను బోఽధించేందుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 22లో గా విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో పాటు ఒక సెట్ జీరాక్స్ కాపీలతో దరఖాస్తును కళాశాల లోని కార్యాలయంలో అందజేయాలన్నారు. ఈనెల 23న ఉదయం 11గంటలకు ఇంటర్వ్యూ, డెమో క్లాసుల ద్వారా ఎంపిక చేస్తారన్నారు. ఫీల్డు అసిస్టెంట్ల నిరసన హుస్నాబాద్రూరల్: మూడు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదంటూ ఉపాధిహామీ పథకం ఫీల్డు అసిస్టెంట్లు శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో కూలీలకు పనులు కల్పించాలని అధికారులు ఆదేశాలు ఇవ్వడం తప్ప వేతనాలు ఇప్పించడంలో పట్టింపు లేదన్నారు. ఉపాధిహామీ పనుల పై వీక్లి సమావేశాలు నిర్వహించి పనులు అప్పగించే అధికారులు వేతనాల విషయంలో ఎందుకు జోక్యం చేసుకోవడంలేదని అన్నారు. కూలీల చేత పనులు చేయిస్తున్నా మా సమస్యలను ఎందుకు పరిష్కారించడం లేదన్నారు. ఈ సందర్భంగా వినతి పత్రాన్ని ఎంపీడీఓకు అందించి వీక్లీ సమావేశాన్ని బహిష్కరించారు. వైద్య సేవల్లో ఆదర్శంగా నిలవాలి సిద్దిపేటకమాన్: వైద్యాధికారులు, సిబ్బంది అందరూ సమష్టిగా కృషి చేసి వైద్య సేవల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని నూతన ఇన్చార్జి డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ తెలిపారు. బాధ్యతలు చేపట్టిన ధనరాజ్ను వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో శనివారం పలువురు వైద్యులు, సిబ్బంది అతడిని అభినందించారు. ఈ సందర్భంగా ధనరాజ్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం వహించకూడదని, సమయ పాలన పాటించాలని సూచించారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
సిద్దిపేటరూరల్: ‘పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత.. ప్రతి ఒక్కరూ బాధ్యతతో మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలి’ అని కలెక్టర్ హైమావతి అన్నారు. శనివారం కలెక్టరేట్ ప్రాంగణంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, జిల్లా అధికారులు, సిబ్బందితో కలిసి వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతతో మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వనమహోత్సవం కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా పాల్గొని మొక్కలు నాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, డీపీఓ దేవకీదేవి, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ హైమావతి కలెక్టర్ ప్రాంగణంలో వన మహోత్సవం -
కురిసిన వాన.. మురిసిన రైతన్న
జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కొద్ది రోజులుగా మొఖం చాటేసిన వానలు రెండు రోజులుగా కురుస్తుండటంతో రైతులు సంబరపడుతున్నారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు 150.8మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ధూళ్మిట్ట మండలంలో 37.5మి.మీ, జగదేవ్పూర్లో 25.3మి.మీ, అక్కన్నపేటలో 24.1మి.మీ, కోహెడలో 15.7మి.మీ, మద్దూరులో 13.4మి.మీ, కొమురవెల్లి మండలంలో 10మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిలిచిన రాకపోకలు అక్కన్నపేట మండలంలో వర్షం కుమ్మేసింది. దాదాపు గంటన్నర పాటు వర్షం కురవడంతో వాగులు ఉప్పొంగాయి. నందారం మీదుగా కపూర్నాయక్తండాకు వెళ్లే దారిలో ఉన్న కల్వర్టుపై వరద ఉధృతితో రాకపోకలు నిలిచాయి. పంటపొలాల్లో వరద నిలిచింది. చేర్యాలలోనూ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. – ప్రశాంత్నగర్(సిద్దిపేట)/చేర్యాల/ అక్కన్నపేట(హుస్నాబాద్) -
కాంగ్రెస్ ప్రభుత్వంలో సాగునీటి ఇబ్బందులు
ఎమ్మెల్యే హరీశ్రావు సిద్దిపేటరూరల్: కాంగ్రెస్ ప్రభుత్వంలో సాగునీటి ఇబ్బందులు తప్పడంలేదని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని పుల్లూరులో దుర్గామాత ప్రథమ వార్షికోత్సవంలో హరీశ్రావు పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా కురవాలన్నారు. సకాలంలో కాళేశ్వరం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయకపోవడంతో రైతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు. రంగనాయక సాగర్ ప్రాజెక్టులో నీళ్లు ఉంటే నేడు పంటలకు బాగుండేదన్నారు. కార్యక్రమంలో సుడా మాజీ చైర్మన్ రవీందర్రెడ్డి, మాజీ జెడ్పీటీసి శ్రీహరిగౌడ్, మాజీ సర్పంచ్ నరేశ్, నాయకులు పాల్గొన్నారు. విద్యావ్యవస్థ నిర్వీర్యం చిన్నకోడూరు(సిద్దిపేట): కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అవుతోందని, ఇప్పటి వరకు విద్యారంగానికి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. శుక్రవారం చిన్నకోడూరు ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్తో కలిసి కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ బడులను బలోపేతం చేశామన్నారు. విద్యార్థులు సోషల్ మీడియాకు, సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలన్నారు. అలాగే చిన్నకోడూరు పెద్ద చెరువు కట్టపై ఏర్పాటు చేసిన కట్ట మైసమ్మ విగ్రహ ప్రతిష్టలో పాల్గొని హరీశ్రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, నాయకులు పాల్గొన్నారు. -
స్వచ్ఛతలో వెనుకడుగు
సాక్షి, సిద్దిపేట: పరిశుభ్రతతోపాటు పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాల్లో వెనుకబడుతున్నాం. గతంలో స్వచ్ఛసర్వేక్షణ్లో దక్షిణ భారత దేశంలోనే సిద్దిపేట మున్సిపాలిటీ మొదటి ర్యాంక్ సాధించింది. అలాగే గజ్వేల్, హుస్నాబాద్ మున్సిపాలిటీలు సైతం ర్యాంక్లు సాధించాయి. ప్రతీ సంవత్సరం పెరుగుతున్న జనాభా, అవసరాలకు అనుగుణంగా స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టాల్సిన అధికారులు మొక్కుబడి చర్యలు చేపడుతుండటంతో ర్యాంక్లు పడిపోతున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్–2024–25లో దేశవ్యాప్తంగా 4,589 మున్సిపాలిటీలు పాల్గొనగా రాష్ట్రానికి చెందిన 143 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ నెల 17న స్వచ్ఛ సర్వేక్షణ్ మార్కులు, జాతీయ, రాష్ట్ర స్థాయి ర్యాంకులను ప్రకటించారు. 12,500 మార్కులకు.. స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలలో 12,500 మార్కులు కేటాయించారు. ఆయా కేటగిరిల వారీగా మార్కులను మున్సిపాలిటీలు సాధించాయి. ఉమ్మడి జిల్లాలో పదిలోపు ర్యాంకును ఒక్క హుస్నాబాద్ మున్సిపాలిటీ మాత్రమే సాధించింది. అట్టడుగు స్థానంలో 142వ ర్యాంక్తో చేర్యాల మున్సిపాలిటీ ఉంది. ఉమ్మడి జిల్లాలో అన్ని మున్సిపాలిటీలు గతంలో పారిశుద్ధ్యంపై పెట్టిన శ్రద్ధ ఇప్పుడు పెట్టడం లేదని.. ఎక్కడ పడితే అక్కడ చెత్త దర్శనమిస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రత్యేక దృష్టి సారించాలి స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులను చూస్తే మన పట్టణాల పరిస్థితి అర్థమవుతుంది. ఇప్పటికై నా పట్టణాల్లో పరిసరాలు పరిశుభ్రతను పాటించి స్వచ్ఛ సర్వేక్షణ్లో మెరుగైన ర్యాంక్లు వచ్చే విధంగా అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఆయా మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులను మంత్రులు తీసుకువచ్చి పట్టణాలను మరింత అభివృద్ధి పరిచి స్వచ్ఛ సర్వేక్షణ్లో మెరుగైన స్థానాలు సాధించే విధంగా కృషి చేయాలని పట్టణ వాసులు కోరుతున్నారు. మరుగుదొడ్ల నిర్వహణ శూన్యం పట్టణాల్లో వాహనదారులు, బాటసారుల కోసం అత్యవసర పరిస్థితిలో వినియోగించుకునేందుకు పలు జంక్షన్లలో మరుగుదొడ్లను నిర్మించారు. వాటిని రోజు శుభ్రం చేయకపోవడంతో ఆధ్వానంగా తయారయ్యాయి. పలు చోట్ల వినియోగించలేని పరిస్థితిలో ఉన్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. హుస్నాబాద్, దుబ్బాక, మెదక్, తుఫ్రాన్, బొల్లారం పట్టణాల్లో కొంత వరకు వినియోగిస్తున్నారు. డంప్యార్డుల్లో బయోమైనింగ్ చేయడం లేదు. మున్సిపాలిటీలలో సాధించిన వివిధ కేటగిరీల ఆధారంగా మార్కుల శాతం కేటాయించారు. ఇంటింటికి చెత్త సేకరణ, వ్యర్థాలను వేరు చేయుట, వ్యర్థాల రీసైక్లింగ్, డంప్యార్డులో బయోమైనింగ్, నివాస స్థలాల్లో శుభ్రత, మార్కెట్ ప్రాంతంలో స్వచ్ఛత , నీటి వనరుల వద్ద శుభ్రత, ప్రజా మరుగుదొడ్ల నిర్వహణపై మార్కులను కేటాయించారు. కేటాయించిన ర్యాంకులు ఇలా.. మున్సిపాలిటీ జాతీయ రాష్ట్రస్థాయి స్కోర్ హుస్నాబాద్ 139 09 8,889 తెల్లాపూర్ 227 18 8,437 అమీన్పూర్ 330 31 8,015 గజ్వేల్ 337 35 7,865 సదాశివపేట 516 52 7,418 జహీరాబాద్ 327 54 7,356 మెదక్ 616 61 7,085 బొల్లారం 628 63 7,053 సిద్దిపేట 448 73 6,692 నారాయణఖేడ్ 990 89 6,224 సంగారెడ్డి 542 94 6,108 దుబ్బాక 946 97 6,087 నర్సాపూర్ 1,161 105 5,816 అందోల్ 1,149 117 5,379 తూప్రాన్ 1,162 119 5,333 రామాయంపేట 1,591 132 4,612 చేర్యాల 1,815 142 3,511స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంక్ల ప్రకటన గతంలో మెరిసిన సిద్దిపేట..ఇప్పుడు వెనక్కి ఉమ్మడి మెదక్ జిల్లాలో హుస్నాబాద్ టాప్ పట్టణాల్లో అధ్వానంగా ప్రజా మరుగుదొడ్లు -
నానో ఎరువులతో లాభాలెన్నో
● రైతులను ప్రోత్సహించాలి ● జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి గజ్వేల్: నానో యూరియా, డీఏపీ వాడేలా రైతులను ప్రోత్సహించాలని జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని రైతువేదికలో ఫర్టిలైజర్స్ డీలర్లకు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన స్వరూపరాణి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ ఇఫ్కో నానో యూరియా, డీఏపీ ఉత్పత్తి చేస్తున్నదని చెప్పారు. ఇవి వాడటం వల్ల వ్యవసాయోత్పత్తుల ఉత్పాదకత, నాణ్యత పెరుగుతుందన్నారు. ఇవీ విత్తన అంకురోత్పత్తిని మెరుగుపరుస్తాయన్నారు. పంటకు పర్యావరణ ఒత్తిడి, తెగుళ్లను తట్టుకునే శక్తిని అందిస్తాయన్నారు. అంతేకాకుండా పర్యావరణహితంగా పనిచేస్తాయని పేర్కొన్నారు. నేలల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమేకాకుండా, గాలి, నీటి కాలుష్యాన్ని తగ్గిస్తాయని వివరించారు. నానో ఎరువులను బయోస్టీమ్యులెంట్స్, పురుగుమందులు, ఇతర వ్యవసాయరసాయనాలతో మిశ్రమంగా వాడుకోచ్చని తెలిపారు. నానో యూరియా మరియు డీఏపీలను పంటలపై పిచికారీ మాత్రమే చేయాలని, డ్రిప్లోగానీ, ఇసుకలో కాలనీ కలిపి వేయవద్దన్నారు. అవగాహన సదస్సులో గజ్వేల్ ఏడీఏ బాబునాయక్, వ్యవసాయాధికారి నాగరాజు, ఇఫ్కో సంస్థ రాష్ట్ర మేనేజర్ కృపాశంకర్, జిల్లా మేనేజర్ చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. -
రిజర్వేషన్లకు పార్టీలన్నీ మద్దతివ్వాలి
దుబ్బాక: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 42 శాతం బీసీ రిజర్వేషన్లకు పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యేలా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి గుండబోయిన వెంకటేశ్వర్ అన్నారు. శుక్రవారం ఆయన దుబ్బాక పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. బీసీ లకు మద్దతు ఇవ్వని పార్టీలను ఎన్నికల్లో ఓటు వేయకుండా తరిమికొడదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్, గంగపుత్ర సంఘం నాయకుడు రాంచంద్రం, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కిషన్, ప్రధాన కార్యదర్శి మంతూరి సందీప్, పోలబోయిన నారాగౌడ్, జిందం గాలయ్య, నీలగిరి శ్రీనివాస్, దేవుని చంద్రయ్య, మాడబోయిన సిద్ధిరాములు పాల్గొన్నారు.బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్ -
భూసార పరీక్షల ఆధారంగానే ఎరువులు వాడాలి
కొమురవెల్లి(సిద్దిపేట): భూసార పరీక్షల ఆధారంగానే పంటలకు ఎరువులు వాడాలని భారతీయ పరిశోధన సంస్థ సీనియర్ సైంటిస్టు డాక్టర్ జయకుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని కిష్టంపేటలో వంద మంది రైతులకు ఉచితంగా సాయిల్ కిట్, బ్యాటరీ స్ప్రేయర్లు, తాడిపత్రిలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అందించే సాయిల్ కిట్తో స్వయంగా పరీక్షలు చేసుకోవచ్చన్నారు. రైతులు ఇష్టానుసారంగా రసాయన ఎరువులను వాడి భూమిని విషతుల్యం చేయవద్దన్నారు. తక్కువ రసాయన ఎరువులు వాడుతూ సేంద్రియ వ్యవసాయం వైపు సాగాలన్నారు. కార్యక్రమంలో బారతీయ వరిపరిశోధన సీనియర్ సైంటిస్టులు డాక్టర్ బ్రిజేంద్ర, జశ్వంత్ కుమార్, బీజేపీ కేంద్ర రాష్ట్ర సమన్వయ కర్త బాల్రాజు, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
పచ్చదనం పక్కాగా చేపడదాం
● హుస్నాబాద్ మున్సిపాలిటీ ముందువరుసలో నిలవాలి ● మంత్రి పొన్నం ప్రభాకర్హుస్నాబాద్: పచ్చదనం, పరిశుభ్రతలో రాష్ట్రంలోనే హుస్నాబాద్ మున్సిపాలిటీ నంబర్ వన్గా నిలవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం పట్టణంలో ప్రజలతో కలిసి మార్నింగ్ వాక్ నిర్వహించారు. ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పట్టణంలోని ఆరపల్లె చౌరస్తాలో త్రిశూలం వాటర్ ఫౌంటేన్ను ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయంలో కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షన్లో హుస్నాబాద్ మున్సిపాలిటీ రాష్ట్ర స్థాయిలో 9వ ర్యాంక్, జిల్లాలో మొదటి ర్యాంక్ సాధించడంపై అధికారులను అభినందించారు. రాబోయే కాలంలో ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. పట్టణంలో పెద్ద ఎత్తున సీసీ రోడ్లు, నాలాల నిర్మాణాలు పూర్తి అవుతున్నాయన్నారు. జాతీయ రహదారి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, నాయకులు ఉన్నారు. -
ప్లాస్టిక్ బాటిళ్ళతో డ్రై హెలి
మున్సిపల్ సిబ్బంది సరికొత్త ఆవిష్కరణ హుస్నాబాద్: మున్సిపల్ సిబ్బంది సరికొత్త ఆవిష్కరణకు పదను పెట్టారు. ఖాళీ బాటిళ్లతో చెత్తను సేకరించే హెలికాప్టర్ ఆకారంలో డ్రై హెలి వాహనాన్ని తయారు చేసి ఔరా అనిపించారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ పై ప్రజలకు అవగాహన కలిగించేందుకు డ్రై హెలి (పొడి చెత్తను సేకరించే వాహనం) వాహనాన్ని రూపకల్పన చేశారు. శుక్రవారం పట్టణంలో ఈ వాహనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. డీఆర్సీసీ కేంద్రం నుంచి గ్రీన్ కలర్ 732 ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించారు. హెలికాప్టర్ ఆకారంలో బాటిళ్లను వరుస క్రమంలో అతికించారు. తొపుడు బండిపై ఈ వాహనాన్ని అమర్చారు. ఇంట్లో వాడకం లేని సీలింగ్ ఫ్యాన్, పనికి రాని కూలర్ ఫ్యాన్ను అమర్చారు. రెండు వైపులా రేకుతో తయారు చేసిన డోర్లు ఏర్పాటు చేశారు. ఈ వాహనంతో ప్రతి వార్డులో ఇంటింటికి తిరిగి సింగిల్ యూస్ ఫ్లాస్టిక్ను తీసుకొని జ్యూట్ బ్యాగులు ఇచ్చి ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను వివరించారు. మున్సిపల్ సిబ్బంది గతంలో ఖాళీ బాటిళ్లతో పడవ ను తయారు చేయగా, ప్రస్తుతం డ్రై హెలి వాహనాన్ని రూపకల్పన చేయడంపై మంత్రి అభినందించారు. -
ఇష్టంగా చదవండి.. ఉన్నతంగా ఎదగండి
పద్యాలు చదవడమే కాదు అర్థం చేసుకోవాలి: కలెక్టర్మర్కూక్(గజ్వేల్): విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని, పద్యాలు చదవడమే కాదు వాటిలోని భావాలు అర్థం చేసుకోవాలని కలెక్టర్ హైమావతి సూచించారు. మండలకేంద్రంలో శుక్రవారం కలెక్టర్ పర్యటించారు. జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను పరిశీలించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందిస్తున్నారా లేదా అని అడిగితెలుసుకున్నారు. టెన్త్ విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పోతన పద్యం అడిగారు. శ్రీజ అనే విద్యార్థిని పద్యం పాడి భావం వివరించడంతో కలెక్టర్ అభినందించారు. తెలుగును ప్రతి ఒక్కరూ తప్పని సరిగా చదవడం, రాయడం నేర్చుకోవాలని కలెక్టర్ సూచించారు. అభివృద్ధి పనుల పరిశీలన మండలకేంద్రంలో కలెక్టర్ సుమారు గంట పాటు పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. మండలకేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లు, ఓపెన్ డ్రైనేజ్, తహసీల్దార్ కార్యాలయం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక వైద్య కేంద్రం అలాగే ఐఓసీ భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందిరమ్మ త్వరితగతిన నిర్మించుకోవాలన్నారు. మురుగు కాల్వలు నిండిపోవడంతో ఎందుకు శుభ్రం చేయించలేదని గ్రామ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో కాల్వలు శుభ్రం చేయాలన్నారు. తహసీల్దార్ ప్రవాణ్కుమార్, ఎంపీడీఓ అశోక్కుమార్, ఎంఈఓ వెంకట్రాములు పాల్గొన్నారు. -
ఆయిల్పామ్ సాగే లక్ష్యం కావాలి
హుస్నాబాద్/కోహెడరూరల్: ఆయిల్పామ్ సాగులో రాష్ట్రంలోనే హుస్నాబాద్ నంబర్ వన్గా నిలవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం మండలంలోని బస్వాపూర్లోని ముత్తన్నపేట శివారులో మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆయిల్పామ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి లతో కలిసి ప్రారంభించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ రైతులు ఆయిల్పామ్ వైపు మొగ్గు చూపాలన్నారు. జిల్లాలో మెగా పామాయిల్ ప్లాంటేషన్లో భాగంగా 143 ప్రాంతాల్లో 23 గ్రామాల్లో 674 ఎకరాల్లో ఆయిల్ ప్లాంటేషన్ చేయనున్నమన్నారు. కోహెడ మండలంలో ఈ ఏడాది 359 ఎకరాల లక్ష్యంగా ఉందన్నారు. ఖమ్మం తరువాత అత్యధికంగా ఆయిల్పామ్ సాగు సిద్దిపేట జిల్లాలోనే జరుతుందన్నారు. ఆగస్టు 15తేది లోపు సీఎం రేవంత్రెడ్డితో నర్మెట్టలో ఫ్యాక్టరీ ప్రారంభిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యయవసాయానికి పాధాన్యత ఇస్తోందన్నారు. ఒక ఎకరం వరి పొలానికి ఇచ్చే నీటితో 5 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయవచ్చన్నారు. ‘గౌరవెల్లి’ని పూర్తిచేసి తీరుతాం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి చేసి పొలాలకు సాగునీరు అందిస్తామని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. రెతుకు 10 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు ఆయిల్పామ్ సాగు చేయలన్నారు. రైతుల ఆకాంక్షల కు అనుగుణంగా మంచి ధర తో ఆయిల్పాం కొనుగోలు చేస్తామన్నారు. హార్టికల్చర్ అధికారుల సహకారంతో సాగులో మంచి దిగుబడి వచ్చేలా చూడలన్నారు. రైతులకు అన్ని రకలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఆనంతరం ఆయిల్ పాం విక్రయించిన రైతులకు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, అద నపు కలెక్టర్ గరీమాఅగర్వల్ మార్కెట్ కమిటీ చైర్మన్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఫ్యాక్టరీ పనులపై ఆరా నంగునూరు(సిద్దిపేట): ఆయిల్పామ్ ఫ్యాక్టరీ నిర్మాణం పనులను గురువారం మంత్రి తుమ్మల ఆకస్మికంగా తనిఖీ చేశారు. నర్మెట్టలోని ఫ్యాక్టరీని పరిశీలించి పనుల పురోగతిపై జీఎం సుధాకర్రెడ్డితో ఆరా తీశారు. త్వరలో ఫ్యాక్టరీ ప్రారంభించేందుకు మిగిలిన పనులన్నీ పూర్తి చేయాలన్నారు. అలాగే ఆయిల్ రిఫైనరీ పనులకు శంకుస్థాపన చేసేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. హుస్నాబాద్ నంబర్వన్గా నిలవాలి త్వరలోనే నర్మెట్టలో ఫ్యాక్టరీ ప్రారంభిస్తాం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బస్వాపూర్లో మెగా పామాయిల్ ప్లాంటేషన్ -
ఆయిల్పామ్ ధర పెంచేందుకు మోదీని కలుస్తాం
హుస్నాబాద్: ఆయిల్పామ్ పంట క్వింటాలుకు రూ.25వేలు ఇవ్వాలని త్వరలోనే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రులతో కలిసి ప్రధాని మోదీని కలవనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. కోహెడ మండలం బస్వాపూర్లో మంగళవారం మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ను మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి తుమ్మల ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ క్వింటాల్కు రూ. 25 వేలు ఇవ్వాలని దేశానికి సరిపడా పామాయిల్ ఇస్తామని మోదీని కోరనున్నట్లు తెలిపారు. ఆయిల్పామ్ పంటలతో తెలంగాణ పచ్చబడాలన్నారు. ప్రజా పాలన ప్రభుత్వంలో 12లక్షల ఎకరాల ఆయిల్ పాం సాగు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలు నిర్మాణ దశలో ఉన్నాయని, మరో 14 ఫ్యాక్టరీలు వస్తాయన్నారు. ఖమ్మం తర్వాత అత్యధిక ఆయిల్ ఫాం సాగు సిద్దిపేట జిల్లాలోనే జరుగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. -
షరా మామూలే..
అవినీతికి నిలయాలుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు●● చక్రం తిప్పుతున్న డాక్యుమెంట్ రైటర్లు ● నిత్యం రూ.లక్షల్లో చేతులు మారుతున్న ముడుపులు ● ఏసీబీ సోదాలు చేస్తున్నా ఆగని దందా సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రిజిస్ట్రేషన్శాఖ కార్యాలయాలు అక్రమాలకు నిలయాలుగా మారాయి. అవినీతి నిరోధకశాఖ అధికారులు అప్పుడప్పుడు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నప్పటికీ ఈ శాఖలో కొందరు అధికారుల వసూళ్ల దందా మాత్రం ఆగడం లేదు. ముడుపులు ముట్టజెప్పనిదే డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కావడం లేదనేది బహిరంగ రహస్యంగా మారింది. 10 నెలల క్రితం సంగారెడ్డిలోని జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో పెద్ద ఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్ల దందా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. నోట్ల కట్టలను కార్యాలయం కిటికీలోంచి బయటకు విసిరేయడం కలకలం రేపింది. తాజాగా గురువారం సదాశివపేట ఎస్ఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో నగదు పట్టుబడగా, కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్లు పట్టుబడ్డారు. రోజుకు రూ.లక్షల్లో చేతులు మారుతున్న ముడుపులు.. ఆయా స్థిరాస్తి విలువను బట్టి ఒక్కో డాక్యుమెంట్కు కనీసం రూ.ఐదు వేల నుంచి రూ.పది వేల చొప్పున ముడుపులు పుచ్చుకోవడం ఈ కార్యాలయాల్లో పరిపాటిగా తయారైంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 16 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు (ఎస్ఆర్ఓ) ఉన్నాయి. అత్యధికంగా పటాన్చెరు జాయింట్ –1, జాయింట్–2, సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, మెదక్, సిద్దిపేట, గజ్వేల్ తదితర ఎస్ఆర్ఓ కార్యాలయాల్లో ఎక్కువ సంఖ్యలో డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అవుతుంటాయి. ఒక్కో కార్యాలయంలో సగటు న 30 నుంచి 90 వరకు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. ఈ లెక్కన ఒక్కో కార్యాలయంలో రోజుకు కనీసం 50 డాక్యుమెంట్లకు రూ. 2.50 లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు ముడుపులు చేతులు మారుతున్నాయి. డాక్యుమెంట్ రైటర్లే కీలకం.. అక్రమాలకు కొందరు డాక్యుమెంట్ రైటర్లే కీలకంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం డాక్యుమెంట్ రైటర్లు, దళారులు రిజిస్ట్రేషన్ కార్యాలయంలోకి వెళ్లకూడదు. కానీ వీరు ఏకంగా ఎస్ఆర్ఓల క్యాబిన్లలోకే దర్జాగా చొచ్చుకుని పోయి..పక్కనుంచి మరీ రిజిస్ట్రేషన్లు చేయిస్తుండటం పరిపాటైపోయింది. -
బాధ్యతాయుతంగా పనిచేయండి
సిద్దిపేటజోన్: బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ సూచించారు. గురువారం మున్సిపల్ సమావేశ మందిరంలో వార్డు అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయా వార్డు అధికారులు తప్పనిసరి క్షేత్ర స్థాయిలో ఉండాలన్నారు. మున్సిపల్ సంబంధించిన సమస్యలు గుర్తించి సత్వరం పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పట్టణంలో ప్రతి వార్డులో ఇంటింటి చెత్త సేకరణ తప్పనిసరి సజావుగా సాగాలని సూచించారు. పట్టణ పరిశుభ్రత మన అందరి బాధ్యతగా భావించాలన్నారు. తడి, పొడి, హానికర చెత్త విభజన తప్పనిసరన్నారు. చెత్తను వేరు చేయకుండా ఇచ్చే వారికి అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో మున్సిపల్ డీఈ ప్రేరణ మేనేజర్ శ్రీనివాస్, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ -
చెరువుకు చేరని చేప
మత్స్యకారులకు ఆర్థిక తోడ్పాటును అందించేందుకు అమలు చేస్తున్న ఉచిత చేప పిల్లలపంపిణీ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రతి ఏటా జూలై నెలలో టెండర్ ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉండగా ఈ ఏడాది ఇప్పటి వరకు జిల్లా యంత్రాంగం పంపిణీ విషయమై ఊసేత్తడం లేదు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ ఉచిత చేప పిల్లల పంపిణీ కొనసాగుతుందా.. లేదా? అనే సందిగ్ధం నెలకొంది. కోహెడరూరల్(హుస్నాబాద్): అసలే అరకొర వర్షాలు. చెరువు, కుంటల్లోనూ అంతంతమాత్రమే నీళ్లు. అయినా చేప పిల్లల పంపిణీపై సందిగ్దం నెలకొంది. గతంలో ఏప్రిల్ చివరి వారంలో ప్రకటన విడుదల చేసి మే నెలలో టెండర్లు ఖరారు చేసేవారు. వర్షాలు కురవగానే జూన్ నుంచి ఆగస్టులోగా చేప పిల్లల పంపిణీ జరిగేది. అలాంటిది ఈ ఏడాది జూన్ నెల గడిచిపోతున్నా టెండర్ల జాడలేదు. మే నెలలో టెండర్లు జరిగితే జూన్ వరకు చేప పిల్లలు అందుబాటులో ఉంచాలి. 8 నుంచి 100 ఎంఎం సైజు ఉన్న చేప పిల్లలను పంపిణీ చేస్తే ఒక్కో చేప పిల్లకు రూ.1.73 చొప్పున చెల్లిస్తారు. 5కోట్ల చేప పిల్లలు.. జిల్లాలో మొత్తం 1500 చెరువులు ఉన్నాయి. ప్రతి సంవత్సరం సుమారు 5 కోట్ల చేప పిల్లలను చెరువులు, కుంటల్లో వదులుతారు. దీంతో పాటు రంగనాయకసాగర్, మల్లన్నసాగర్తో పాటు మరో 6 రిజర్వాయర్లలో చేప, రోయ్య పిల్లలను పంపిణీ చేస్తారు. జిల్లాలో మొత్తం 350కి పైగా మత్య్సకార సొసైటీలు ఉండగా 25 వేల మంది సభ్యులు ఉన్నారు. గతేడాది తీవ్ర నష్టం గతేడాది ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చాలా ఆలస్యంగా సాగింది. పిల్లల్ని పంపిణీ చేయడం సెప్టెంబర్లో మొదలైంది. డిసెంబర్ వరకు చేప పిలల్ని చెరువులు, కుంటల్లో వదిలారు. దాంతో చేపలు కిలో నుంచి 2 కిలోల సైజు పెరగాల్పి ఉన్నా అరకిలో నుంచి కిలో సైజు మాత్రమే పెరిగింది. దీని వల్ల తీవ్రంగా నష్టపోయారు. బొచ్చ, రవ్వ, బంగారు తీగ, మ్రిగాల, రోయ్యల వంటి ఆయా రకల చేపల్ని ఎక్కువగా పెంచుతారు. పెరుగుదలపై ప్రభావం.. చెరువుల్లో రెండు పరిమాణాలు ఉన్న చేప పిల్లలను వదులుతారు. పూర్తిగా నీటితో నిండిన చెరువుల్లో 45 రోజుల వయసున్న 35– 40 మి.మీ. పొడవు చేప పిల్లలు వదలాల్సి ఉంటుంది. ఏడాది మొత్తం నీరుండే పెద్ద చెరువులు, జలాశయాల్లో 75 రోజుల వయసున్న 80–100 మి.మీ. పొడవున్న చేపపిల్లలను వదులుతారు. అవి కిలో సైజులో పెరగాలంటే కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. చేప పిల్లలను ఆలస్యంగా వదిలితే ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. సెప్టెంబర్లో వదిలితే అవి కిలో సైజు రావాలంటే ఫిబ్రవరి అవుతుంది. ఇంకా పెరగలంటే వేసవి వచ్చేస్తుంది. ఉష్ణోగ్రతల కారణంగా నీటిలోనే చనిపోయే ప్రమాదం ఉందని పలువురు మత్స్యకారులు తెలిపారు. టెండర్లు ఇంకెప్పుడు? పంపిణీపై స్పష్టత కరువు ఆలస్యమైతే ఎదుగుదల ఉండదని మత్స్యకారుల్లో ఆందోళన ఏటేటా తగ్గుతున్న చేప పిల్లల సంఖ్య జిల్లాలో 1500 చెరువులు.. 25 వేల మంది సభ్యులు ఆదేశాలు రాలేదు చేపల టెండర్లపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రతి ఏటా మే నెల నుంచే టెండర్లు వేస్తాం. ఈసారి ఇంకా వేయలేదు. ఆదేశాలు అందగానే టెండర్లు వేస్తాం. – మల్లేశం, జిల్లా మత్స్యశాఖ అధికారి -
పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
సాక్షి, సిద్దిపేట/కోహెడ(హుస్నాబాద్): పర్యావరణ పరిరక్షణలో మహిళలు ముందుండాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. కోహెడలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు, స్టీల్ సామగ్రి పంపిణీ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్యఅథితిగా హాజరై మాట్లాడారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి పేరుతో ఏర్పాటు చేసిన పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నియోజక వర్గం వ్యాప్తంగా ఉన్న 276 మహిళా సంఘాలకు స్టీల్ సామగ్రి పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. రాజ్భవన్లో మంత్రి పొన్నం.. స్టీల్ బ్యాంక్ గురించి చెప్పినప్పుడు చాలా నచ్చిందని గుర్తుచేశారు. ప్లాస్టిక్ నివారణ లక్ష్యంగా స్టీల్ సామగ్రి వినియోగించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాలలో బర్తన్ బ్యాంక్ భావితరాలకు దోహదపడుతుందన్నారు. ఐటీ విప్లవం కంటే గొప్పది.. ఈ బర్తన్(స్టీల్) బ్యాంకు చిన్నపనే అయినప్పటికీ అది భవిష్యత్లో బాటలు వేస్తుందని గవర్నర్ అన్నారు. ఇది ఆటోమొబైల్, ఐటీ విప్లవం కంటే గొప్ప కార్యక్రమం అని కోనియాడారు. పర్యావరణం బాగుంటేనే మనం బాగుంటామన్నారు. మానసేవ చేసే అవకాశాలు జీవితంలో అరుదుగా వస్తాయన్నారు. మానవ సేవ చేయాలని సంకల్పించినప్పుడు అదొక ఉద్యమంగా మారుతుందని తెలిపారు. తనది త్రిపుర రాష్ట్రం అని ఇప్పుడిప్పుడే తెలుగు అర్థమవుతుందని స్పష్టం చేశారు. ప్లాస్టిక్ను దూరం పెడితే ఆరోగ్యంగా ఉన్నట్లే.. బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ పాస్టిక్ను దూరం పెడితే మీరు ఆనారోగ్యాలను దూరం పెట్టినట్లే తెలిపారు. స్టీల్ బ్యాంక్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. నియోజక వర్గాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. 276 మహిళా సంఘాలకు సుమారు రూ.2.5కోట్లు నిధులతో స్టీల్ బ్యాంక్ పంపిణీ చేశామన్నారు. మంత్రి కొండా మాట్లాడుతూ.. ప్లాస్టిక్ను దూరంగా పెట్టి ఆరోగ్యంగా జీవించాలన్నారు. మహిళా సంఘాలకు రుణాలు మండల వ్యాప్తంగా ఉన్న 38 వీఓ సంఘాలకు రూ.28.96 కోట్లు వడ్డీలేని రుణాలను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా అందించారు. అలాగే రూ.166.94 కోట్లు బ్యాంక్ లింకేజీ రుణాలు, పలువురికి ప్రమాద బీమా చెక్కులు అందించారు. గవర్నర్ పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీపీ అనురాధ సూచనలతో హుస్నాబాద్ ఏసీఏ సదానందం, సీఐ శ్రీను, ఎస్ఐలు, సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సేర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్, సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. గవర్నర్కు ఘన స్వాగతం స్టీల్ సామగ్రి పంపిణీ కార్యక్రమానికి వచ్చిన రాష్ట్ర గవర్నర్కు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, కలెక్టర్లు హైమావతి, ప్రమేలా సత్పతి, స్నేహశబరిష్లు పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం ఫలికారు. అనంతరం గవర్నర్ మొక్కలు నాటారు. కోహెడ నుంచి వేములవాడకు ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. స్వర్గీయ పొన్నం సత్తయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. మహిళలు కీలక పాత్ర పోషించాలి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 276 మహిళా సంఘాలకు స్టీల్ సామగ్రి పంపిణీ మొక్కలు నాటిన గవర్నర్, వేములవాడకు ఆర్టీసీ బస్సు ప్రారంభం మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్న మంత్రులు -
ఇందిరమ్మ ఇళ్లపై నిబంధనలు సరికావు
గజ్వేల్: ఇందిరమ్మ ఇళ్లపై నిబంధనలు సరికావని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. బుధవారం గజ్వేల్ మండలం కొల్గూరు గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ మల్లం సుమతి, మాజీ ఉపసర్పంచ్ మల్లేష్గౌడ్, మాజీ ఎంపీటీసీ సత్తయ్యగౌడ్ తదితరులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రఘునందన్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇల్లు 60 గజాలు మాత్రమే ఉండాలని, పైన ఇంకో ఇల్లు కట్టుకోకూడదనే విధానాన్ని బీజేపీ వ్యతిరేకిస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్ నేతలు వారి అనుయాయులకే ఇళ్లు మంజూరు చేయించుకుంటున్నారని ఆరోపించారు. బీసీలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుత రాష్ట్ర కేబినెట్లో 50శాతం పదవులు వారికి కేటాయించాలని ఎంపీ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి పంపిన బిల్లులో మతపరమైన రిజర్వేషన్లను తొలగిస్తే 42శాతం బీసీ రిజర్వేషన్లను ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. బీజేపీ ఇప్పటికే అన్ని రకాల పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకే అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నదని స్పష్టం చేశారు. గజ్వేల్ రైల్వే స్టేషన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వమే మొత్తం నిధులను సమకూర్చిందని గుర్తు చేశారు. అదే విధంగా సిద్దిపేట, గజ్వేల్ పట్టణాల్లో యూజీడీల నిర్మాణాలకు సైతం నిధులను మంజూరు చేసిందన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని, కార్యకర్తలు, నాయకులకు ఎంపీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్, పార్టీ సీనియర్ నాయకులు ఎల్లు రాంరెడ్డి, నలగామ శ్రీనివాస్, వెంకటరమణ, సింగం సత్తయ్య, మల్లేశం, గజ్వేల్ పట్టణశాఖ అధ్యక్షుడు మనోహర్యాదవ్, మండలశాఖ అధ్యక్షుడు అశోక్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదాం మెదక్ ఎంపీ రఘునందన్రావు బీజేపీలో పలువురి చేరిక -
జిల్లా ఇన్చార్జి డీఎంహెచ్ఓగా ధనరాజ్
సిద్దిపేటకమాన్: జిల్లా ఇన్చార్జి డీఎంహెచ్ఓగా ఏడీపీహెచ్ఓగా విధులు నిర్వహిస్తున్న సీహెచ్ ధనరాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు మెదక్, సిద్దిపేట జిల్లా ఇన్చార్జి డీఎంహెచ్ఓగా విధులు నిర్వహించిన పల్వన్కుమార్ను రిలీవ్ చేశారు. నూతన డీఎంహెచ్ఓ గురువారం బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. ఇళ్ల నిర్మాణాలను వేగిరం చేయాలి జెడ్పీ సీఈఓ రమేశ్ మద్దూరు(హుస్నాబాద్): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని జిల్లా పరిషత్ సీఈఓ రమేశ్ అన్నారు. బుధవారం నర్సాయిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్లు మంజూరైన వారు వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాంమోహన్, పంచాయతీ కార్యదర్శి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. పోచమ్మ ఆలయ అభివృద్ధికి సహకరిస్తాం దుబ్బాక: పట్టణంలోని పోచమ్మ ఆలయ అభివృద్ధికి సహకరిస్తామని ఎంపీ మాధవనేని రఘునందన్రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి తెలిపారు. బుధవారం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు నగరంలో ఎంపీతో పాటు ఎమ్మెల్యే, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్యను కలిశారు. వందల ఏళ్ల క్రితం నిర్మించిన పోచమ్మ ఆలయ పునర్నిర్మాణం చేసేందుకు సహకరించాలని వారిని కోరారు. దీంతో వారు స్పందిస్తూ.. ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు కమటీ సభ్యులు తెలిపారు. పరశురాములుకు కార్మిక రత్న అవార్డు దుబ్బాకటౌన్: మున్సిపల్ పరిధిలోని చెల్లాపూర్ వార్డుకు చెందిన పరశురాములు కార్మిక రత్న అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అవార్డు కమిటీ ప్రకటించింది. సెప్టెంబర్ 5న తిరుపతిలో జరిగే బహుజన సాహిత్య అకాడమి నేషనల్ కాన్ఫరెన్స్లో ఈ అవార్డు అందజేయనున్నారు. బుధవారం హైదరాబాద్లో అకాడమి జాతీయ కార్యాలయంలో సెలక్షన్ కమిటీ చైర్మన్ నల్ల రాధాకృష్ణ ఆహ్వానపత్రాన్ని పరశురాములకు అందజేశారు. రిజర్వాయర్ నుంచి చెరువులు నింపండి సీపీఎం జిల్లా కార్యదర్శి శశిధర్ కొండపాక(గజ్వేల్): తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి కొండపాక, కుకునూరుపల్లి మండలాల్లోని చెరువులు నింపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాళ్లబండి శశిధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెలికట్టలో బుధవారం పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శశిధర్ మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నప్పటికీ చెరువుల్లోకి చుక్క నీరు చేరలేదన్నారు. మరోవైపు వర్షాలు లేక రైతులు ఆందోళన చెందుతున్నాన్నారు. తలాపునే మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఉన్నప్పటికీ ప్రభుత్వం చెరువులకు నీరు వచ్చే ఏర్పాట్లు చేయకపోవడం దారుణమన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం పార్టీల కతీతంగా అర్హులకు అందేలా చూడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి బాల్నర్సయ్య, నాయకులు మల్లేశం, లింగయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ సీఐగా రవికుమార్ గజ్వేల్రూరల్:నూతన సీఐగా రవికుమార్ బదిలీపై బుధవారం గజ్వేల్కు వచ్చారు. ఇదివరకు ఇక్కడ సీఐగా పనిచేసిన బి.సైదా హైదరాబాద్లోని ఐజీ కార్యాలయానికి బదిలీపై వెళ్లారు. నిజామాబాద్ కమిషనరేట్లోని సీసీఎస్లో పనిచేస్తున్న రవికుమార్ను గజ్వేల్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
నేడు కోహెడకు గవర్నర్ రాక
విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలిడీఈఓ శ్రీనివాస్రెడ్డి ● పర్యటనకు సర్వం సిద్ధం ● హాజరుకానున్న ఐదుగురు మంత్రులు ● సభా స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ ● శాఖల వారీగా బాధ్యతలు అప్పగింత కోహెడ(హుస్నాబాద్): రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గురువారం మధ్యాహ్నం కోహెడకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. మహిళా సంఘాలకు స్టీల్ (డైనింగ్) సామగ్రిని గవర్నర్ పంపిణీ చేయనున్నారు. బుధవారం కలెక్టర్ హైమావతి.. అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్తో కలిసి సభాస్థలంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి సుమారు 3,500 మంది హాజరుకానున్న దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సర్వం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వివిధ ప్రభుత్వ శాఖల వారీగా నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. ఐదుగురు మంత్రుల రాక.. ప్లాస్టిక్ నియంత్రణే లక్ష్యంగా ‘పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్టు’ ఆధ్వర్యంలో నియోజక వర్గంలోని 276 మహిళా సంఘాలకు స్టీల్ సామగ్రి పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వర్రావు, వివేక్ హాజరు కానున్నారు. తొలిసారిగా పెద్ద ఎత్తున నిర్వహించనున్న ఈ కార్యక్రమం జయప్రదంపై అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నిమగ్నమయ్యారు. భారీ బందోబస్తు గవర్నర్ పర్యటన నేపథ్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ అనురాధ తెలిపారు. సభా స్థలాని సందర్శించి మాట్లాడుతూ.. 446 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏసీపీ సదానందం, సీఐ శ్రీను, ఎస్ఐ అభిలాష్లతో పాటు వివిధ శాఖలకు చెందిన జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దుబ్బాక: విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ శ్రీనివాస్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మున్సిపల్ పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం వంటలతో పాటు విద్యార్థుల అభ్యసన ప్రక్రియ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేసి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలన్నారు. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ప్రభుదాసు తదితరులు ఉన్నారు. -
చేర్యాల ప్రజల ఆకాంక్ష నెరవేర్చండి
చేర్యాల(సిద్దిపేట): సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేసి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం నాలుగు మండలాల అఖిల పక్ష నాయకులు జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక అంబేడ్కర్ చౌరస్తా వద్ద మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ నర్సయ్యపంతులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు రెండేళ్లు కావస్తున్నా ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం దారుణమన్నారు. చేర్యాల ప్రాంతం విద్య, వైద్య, వ్యాపారరంగాల్లో వెనుకబడిందని, రెవెన్యూ డివిజన్ చేస్తే అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ఇచ్చిన హామీని సీఎం రేవంత్రెడ్డి తుంగలో తొక్కారని విమర్శించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చేర్యాలను రెవెన్యూ డివిజన్గా చేస్తూ ప్రకటన చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాల్సిందే జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం -
ఎవరి లెక్కలు వారివే!
‘స్థానిక’ రిజర్వేషన్లపై ఉత్కంఠ ● బీసీలకు 42 శాతమంటూ ప్రభుత్వం కసరత్తు ● ఓటరు లిస్టులతో కుస్తీ పడుతున్న ఆశావహులు ● జిల్లాలో జెడ్పీటీసీలు 26, ఎంపీటీసీలు 230, జీపీలు 508 జిల్లాలో స్థానిక ఎన్నికల సందడి మొదలైంది. సెప్టెంబర్ నెలాఖరులోగా ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించడంతోపాటు ఇటీవల మంత్రివర్గ సమావేశంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని తీర్మానం చేసిన విషయం విదితమే. దీంతో పోటీ చేసే ఆశావహులు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు.గతేడాది ఫిబ్రవరి, జూలైలో గ్రామ పంచాయతీల పాలకవర్గాలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీకాలం ముగిసింది. ఈ నేపథ్యంలో ఏ స్థానం ఎవరికి రిజర్వు అవుతుందో అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సాక్షి, సిద్దిపేట: ఇటీవలే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను జిల్లా యంత్రాంగం ఖరారు చేసింది. జిల్లాలో పంచాయతీలు 508, ఎంపీటీసీ స్థానాలు 230, జెడ్పీటీసీలు 26 ఉన్నాయి. గత ప్రభుత్వం 2018లో పంచాయతీ రాజ్ చట్టంలో మార్పులు చేసి నూతన చట్టాన్ని తీసుకవచ్చింది. ఈ చట్టంలో ఆయా పదవుల రిజర్వేషన్లను పదేళ్ల పాటు కొనసాగించాలని పేర్కొంది. గతంలో బీసీలకు 27శాతం, ఎస్సీలకు 13శాతం, ఎస్టీలకు 10శాతం రిజర్వేషన్లు కేటాయించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం సవరణ చేసింది. ఐదు సంవత్సరాలకు ఒకసారి రొటేషన్ ప్రకారం మార్చాలని నిర్ణయించింది. ఆశావహుల్లో ఆందోళన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మంత్రివర్గ తీర్మానంతో గ్రామాల్లో రాజకీయ సందడి మొదలైంది. బీసీలకు దాదాపు 250 వరకు గ్రామ పంచాయతీలు, సుమారు 100 వరకు ఎంపీటీసీలు, 12 జెడ్పీటీసీ స్థానాలు కేటాయించే అవకాశాలున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయాలనుకునే అభ్యర్థులు ఏది రిజర్వేషన్ అవుతుందోనని ఓటరు లిస్టులు పట్టుకుని బీసీలు, ఓసీ, ఎస్సీ, ఎస్టీలు ఎంత మంది ఉన్నారంటూ లెక్కలేస్తున్నారు. ఎంచుకున్న స్థానంలో గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పుడు ఎవరికి రిజర్వ్ అవుతుందో అని ఆందోళన చెందుతున్నారు. గ్రామాల్లో జోరుగా చర్చ గ్రామంలో ఎక్కడ నలుగురు కలిసినా రిజర్వేషన్లపైనే జోరుగా చర్చ సాగుతోంది. ఎవరికి కలిసి వస్తుందో? ఎవరు పోటీ చేస్తారో? నని మాట్లాడుకుంటున్నారు. పోటీకి సిద్ధమైన ఆశావహుల్లో గుబులు పట్టుకుంది. రిజర్వేషన్లు ఎలా ఉన్నా గ్రామాల్లో బీసీ వర్గాలకు చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు రాజకీయ పార్టీల నేతలు క్షేత్రస్థాయిలో ఓటర్లను మచ్చిక చేసుకుంటున్నారు. గతంలో మాదిరిగానే మహిళలకు 50శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో మహిళలకు ఆయా సామాజిక వర్గాల వారీగా 50శాతం రిజర్వేషన్ అమలు చేయనున్నారు. పలు చోట్ల గ్రామ పంచాయతీ, ఎంపీటీసీలకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు. మండలం యూనిట్గా.. ఎంపీటీసీలు, సర్పంచ్ల రిజర్వేషన్లు మండలం యూనిట్గా ఎంపిక చేసి రిజర్వేషన్లు ఖరారు చేసే అవకాశం ఉంది. జిల్లా యూనిట్గా ఎంపీపీ, జెడ్పీటీసీలను ప్రకటించనున్నట్లు సమాచారం. దీంతో ఏ గ్రామంలో బీసీ, ఎస్సీలు ఎక్కువగా ఉన్నారని అంచనాలు వేస్తున్నారు. -
దేవుడా మేమేం పాపం చేశాం.. నా బిడ్డను తీసుకెళ్లావా?
కొల్చారం(నర్సాపూర్): కాంగ్రెస్ ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి అనిల్ హత్య ఉమ్మడి జిల్లాలో కలకలం రేపింది. పేద కుటుంబంలో పుట్టిన అనిల్.. రాజకీయంగా అంచెలంచెలుగా జిల్లాస్థాయి నాయకుడిగా ఎదిగారు. పైగా ఆర్థికంగా బలపడ్డారు. అయితే సోమవారం హైదరాబాద్లో పార్టీ సమావేశానికి వెళ్లి తిరిగి వస్తుండగా అనూహ్య రీతిలో దుండగులు వెంటాడి వేటాడి కాల్పులు జరిపి అనిల్ను మట్టుబెట్టారు. దీంతో అతడి సొంతూరు కొల్చారం మండలం పైతరలో తీవ్ర విషాదం నెలకొంది. బుధవారం అనిల్ పుట్టిన రోజు ఉండటం.. ఒక రోజు ముందే హత్యకు గురికావడంతో అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. అయ్యో.. దేవుడా.. ‘అయ్యో.. బిడ్డా పుట్టిన రోజుకు ఒక ముందే మమ్మల్ని విడిచి పోయావా?.. దేవుడా మేమేం పాపం చేశాం.. నా బిడ్డను తీసుకెళ్లావా?’ అంటూ అనిల్ తల్లి యేసమ్మ రోదించడం అక్కడున్న వారిని కదిలించింది. బర్త్డే వేడుకలు చేసుకుందాం..అందరం కలుసుకుందాం అని చెప్పిన అనిల్ను ఇలా విగతజీవిగా చూస్తామని కలలు కూడా ఊహించలేదని స్నేహితులు కన్నీటిపర్యంతమయ్యారు. పదిమందికి సహాయం చేసే గుణం తప్ప మా అన్న ఎవరికీ చెడు చేయలేదని, శత్రువులు కూడా ఎవరూ లేరని అనిల్ సోదరుడు నవీన్ విలపిస్తున్నాడు. పోలీస్ ఈ విషయంలో పూర్తి దర్యాప్తు చేసి నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గ్రామంలో విషాదఛాయలు అనిల్ మృతితో పైతర గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. తల్లిదండ్రులు మాత్రం తను మా కుమారుడు ఎవరికి హాని తలపెట్టింది లేదని, కావాలనే పిలిచి తమ కుమారుడిని హత్య చేశారంటూ విలపిస్తున్నారు. అనిల్పై కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులతోపాటు వివిధ పారీ్టలకు చెందిన నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఫోన్ మాట్లాడిన 15 నిమిషాలకే.. ఫోన్లో మాట్లాడిన 15 నిమిషాలకే యాక్సిడెంట్ అయ్యిందన్న వార్త అందిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లేశంగౌడ్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు గాం«దీభవన్లో జరిగిన నియోజకవర్గస్థాయి సమావేశానికి నాతో పాటు అనిల్, ఇంకా కొంతమంది నాయకులు పాల్గొన్నారన్నారు. తిరుగు ప్రయాణంలో అదే కారులో నేను మరికొంతమంది కలసి ప్రయాణమయ్యామన్నారు. నేను కూకట్పల్లి మెట్రోస్టేషన్ వద్ద దిగి వెళ్లిపోయానని తెలిపారు. రాత్రి 7:45కు ఫోన్ చేయగా అందర్నీ వారివారి గ్రామాల్లో దించేసి ఇంటికి వెళ్తున్నట్లు చెప్పారని, పావుగంట తర్వాత అనిల్కు యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చిందని వివరించారు. క్లూస్టీం ఆధారాల సేకరణ ఘటనా స్థలిని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి సందర్శించారు. క్లూస్ టీం సహాయంతో ఆధారాలను సేకరించారు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చి..
పుట్టిన రోజుకు ముందేకొల్చారం మండలంపైతరలో తీవ్ర విషాదం ● బర్త్ డే వేడుకలకు ముందు రోజే ఘటన ● శోకసంద్రంలో కుటుంబసభ్యులు ● కలకలం రేపిన కాంగ్రెస్ నేత హత్య కొల్చారం(నర్సాపూర్): కాంగ్రెస్ ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి అనిల్ హత్య ఉమ్మడి జిల్లాలో కలకలం రేపింది. పేద కుటుంబంలో పుట్టిన అనిల్.. రాజకీయంగా అంచెలంచెలుగా జిల్లాస్థాయి నాయకుడిగా ఎదిగారు. పైగా ఆర్థికంగా బలపడ్డారు. అయితే సోమవారం హైదరాబాద్లో పార్టీ సమావేశానికి వెళ్లి తిరిగి వస్తుండగా అనూహ్య రీతిలో దుండగులు వెంటాడి వేటాడి కాల్పులు జరిపి అనిల్ను మట్టుబెట్టారు. దీంతో అతడి సొంతూరు కొల్చారం మండలం పైతరలో తీవ్ర విషాదం నెలకొంది. బుధవారం అనిల్ పుట్టిన రోజు ఉండటం.. ఒక రోజు ముందే హత్యకు గురికావడంతో అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. అయ్యో.. దేవుడా.. ‘అయ్యో.. బిడ్డా పుట్టిన రోజుకు ఒక ముందే మమ్మల్ని విడిచి పోయావా?.. దేవుడా మేమేం పాపం చేశాం.. నా బిడ్డను తీసుకెళ్లావా?’ అంటూ అనిల్ తల్లి యేసమ్మ రోదించడం అక్కడున్న వారిని కదిలించింది. బర్త్డే వేడుకలు చేసుకుందాం..అందరం కలుసుకుందాం అని చెప్పిన అనిల్ను ఇలా విగతజీవిగా చూస్తామని కలలు కూడా ఊహించలేదని స్నేహితులు కన్నీటిపర్యంతమయ్యారు. పదిమందికి సహాయం చేసే గుణం తప్ప మా అన్న ఎవరికీ చెడు చేయలేదని, శత్రువులు కూడా ఎవరూ లేరని అనిల్ సోదరుడు నవీన్ విలపిస్తున్నాడు. పోలీస్ ఈ విషయంలో పూర్తి దర్యాప్తు చేసి నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గ్రామంలో విషాదఛాయలు అనిల్ మృతితో పైతర గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. తల్లిదండ్రులు మాత్రం తను మా కుమారుడు ఎవరికి హాని తలపెట్టింది లేదని, కావాలనే పిలిచి తమ కుమారుడిని హత్య చేశారంటూ విలపిస్తున్నారు. అనిల్పై కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులతోపాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫోన్ మాట్లాడిన 15 నిమిషాలకే.. ఫోన్లో మాట్లాడిన 15 నిమిషాలకే యాక్సిడెంట్ అయ్యిందన్న వార్త అందిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లేశంగౌడ్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు గాంధీభవన్లో జరిగిన నియోజకవర్గస్థాయి సమావేశానికి నాతో పాటు అనిల్, ఇంకా కొంతమంది నాయకులు పాల్గొన్నారన్నారు. తిరుగు ప్రయాణంలో అదే కారులో నేను మరికొంతమంది కలసి ప్రయాణమయ్యామన్నారు. నేను కూకట్పల్లి మెట్రోస్టేషన్ వద్ద దిగి వెళ్లిపోయానని తెలిపారు. రాత్రి 7:45కు ఫోన్ చేయగా అందర్నీ వారివారి గ్రామాల్లో దించేసి ఇంటికి వెళ్తున్నట్లు చెప్పారని, పావుగంట తర్వాత అనిల్కు యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చిందని వివరించారు. క్లూస్టీం ఆధారాల సేకరణ ఘటనా స్థలిని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి సందర్శించారు. క్లూస్ టీం సహాయంతో ఆధారాలను సేకరించారు. -
ఆశలు పదిలం.. ఇళ్లు శిథిలం
నిరుపేదల సొంతంటి కల కలగానే మిగిలిపోతున్నాయనడానికి ఈ చిత్రాలే నిదర్శనం. తొగుట మండలం బండారుపల్లి శివారులో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లు శిథిలావస్థకు చేరాయి. ఇటు లబ్ధిదారులకు కేటాయించక, అటు నిర్వహణ మరిచిపోవడంతో అధ్వానంగా మారాయి. రంగు వెలిసిన గోడలు.. తుప్పుపట్టిన కిటికీలు.. అడుగడుగునా పిచ్చిమొక్కలే దర్శనమిస్తున్నాయి. ఈ ప్రభుత్వంలోనై అధికారులు స్పందించి నిరుపేదలకు ఇళ్లు మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు. –సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట -
స్వచ్ఛతకు నిధులు
కేటాయింపు ఇలా.. మున్సిపాలిటీ నిధులు (రూ.లలో) అమీన్పూర్ 7,17,141 అందోల్–జోగిపేట 4,26,848 బొల్లారం 42,76,373 చేర్యాల 3,65,174 దుబ్బాక 5,49,240 గజ్వేల్–ప్రజ్ఞాపూర్ 66,26,784 హుస్నాబాద్ 4,33,385 మెదక్ 8,12,730 నర్సాపూర్ 3,79,634 రామాయంపేట 3,59,549 సదాశివపేట 6,96,026 సంగారెడ్డి 22,29,523 సిద్దిపేట 1,19,70,573 తెల్లాపూర్ 45,56,296 తూప్రాన్ 24,13,867 జహీరాబాద్ 12,05,599 నారాయణఖేడ్ 3,65,934 ఉమ్మడి మెదక్ జిల్లాకు రూ.3.83 కోట్లు ● 16 మున్సిపాలిటీలకు కేటాయింపు ● అత్యధికంగా సిద్దిపేటకు.. అత్యల్పంగా రామాయంపేటకు ● మెరుగుపడనున్న పట్టణాలు పట్టణాల్లో స్వచ్ఛత వెల్లివిరియనుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) 2.0లో భాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి నిధులను కేటాయించారు. పలు మున్సిపాలిటీలు నిధులు లేక నిర్వహణకు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తీపికబురు అందించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 16 మున్సిపాలిటీలకు రూ.3.83కోట్లు మంజూరు చేసింది. – సాక్షి, సిద్దిపేట పట్టణాలకు ప్రతీ ఏటా స్వచ్ఛ భారత్ మిషన్ ర్యాంకులను కేటాయిస్తుంది. వివిధ కేటగిరిలలో ప్రతిభ కనబర్చిన మున్సిపాలిటీలకు స్వచ్ఛ భారత్ అవార్డులను ప్రకటిస్తుంది. సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్ పట్టణాలకు అత్యధికంగా అవార్డులు దక్కాయి. అక్టోబర్ 2021లో ప్రారంభమైన స్వచ్ఛ భారత్ మిషన్ 2026 అక్టోబర్ వరకు కొనసాగ నుంది. ఇందులో భాగంగా ప్రతీ సంవత్సరం పట్టణాలకు నిధులు కేటాయిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీలకు రూ.3,83,84,676 నిధులు మంజూరు చేశారు. ఆయా పట్టణాల్లో జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది. అత్యధికంగా సిద్దిపేట మున్సిపాలిటీకి, అత్యల్పంగా రామాయంపేట మున్సిపాలిటీకి నిధులు మంజూరయ్యాయి. వీటి నిర్వహణకు.. మున్సిపాలిటీలకు కేటాయించిన నిధులను ఘన వ్యర్థాల నిర్వహణ, సామర్థ్యాలు, నైపుణ్యాల పెంపు, విజ్ఞానం, కమ్యూనికేషన్, ప్రజారోగ్య పరిరక్షణకు ఉపయోగపడేలా వెచ్చించనున్నారు. అలాగే పారిశుద్ధ్య కార్యక్రమాలు, బయో మైనింగ్ కార్యక్రమాల నిర్వహణకు వినియోగించాలని ఆదేశించారు. సౌకర్యాలు ఇక మెరుగు మున్సిపాలిటీలలో వసూలయ్యే పన్నుల ద్వారా దాదాపు అన్ని కార్యక్రమాల నిర్వహణ కొనసాగుతోంది. అయితే ఆదాయం తక్కువగా వస్తుండటంతో కార్యాలయ భవనాల, టాయిలెట్ల నిర్వహణ అంతంతమాత్రంగానే ఉంటోంది. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ నిధులు మంజూరైన తరుణంలో మున్సిపాలిటీలలో సౌకర్యాలు మెరుగుపడే అవకాశం ఉంది. ‘స్వచ్ఛత’లో మెరుగైన ర్యాంక్ సాధిస్తాం స్వచ్ఛభారత్ నిధులను మున్సిపల్ పరిధిలో నిర్వహించే స్వచ్ఛత కార్యక్రమాలకు వినియోగిస్తాం. డీఆర్సీ సెంటర్, డంపింగ్ యార్డు అభివృద్ధి, టాయిలెట్స్ నిర్వహణ, ప్లాస్టిక్ నిషేధంపై, పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తాం. అందరి సమష్టి కృషితో స్వచ్ఛభారత్ మిషన్లో మెరుగైన ర్యాంక్ సాధించేందుకు కృషి చేస్తున్నాం. సీడీఎంఏ అనుమతితో నిధులు వినియోగిస్తాం. –మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్ హుస్నాబాద్ -
నైపుణ్యాలను పెంపొందించుకోవాలి
మిరుదొడ్డి(దుబ్బాక): నైపుణ్యాలు పెంపొందించుకున్నప్పుడే సమాజంలో గుర్తింపు లభిస్తుందని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ అర్చన ప్రియదర్శిణి అన్నారు. మంగళవారం స్థానిక మోడల్ స్కూల్లో ప్రపంచ నైపుణ్యాల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు స్వతహాగా తయారుచేసిన పలు ఎగ్జిబిట్లు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భవిష్యత్ కోసం సృజనాత్మకతను పెంపొందించుకోవాలని సూచించారు. శాసీ్త్రయ అంశాల నుంచి సృజనాత్మకత, పర్యావరణ, డిజిటల్ పరిజ్ఞానం, వినూత్న ఆవిష్కరణల వరకు వివిధ అంశాలలో విద్యార్థులు రాణించాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి
గవర్నర్ పర్యటన ఏర్పాట్ల పరిశీలన సిద్దిపేటరూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ హైమావతి సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో జిల్లాలోని నాలుగు మండలాలకు చెందిన 415 మంది లబ్ధిదారులకు రెండో విడతగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అందరికీ సొంత ఇల్లు అనేది గౌరవ సూచికమని, ఈ సువర్ణ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంటి నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలన్నారు. ఇల్లు మంజూరై ఆర్థిక స్తోమత లేని నిరుపేద లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్థిక సహాయం అందించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, హౌసింగ్ పీడీ దామోదర్ రావు, ఆయా మండలాల అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.కోహెడ(హుస్నాబాద్): రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ నెల 17న కోహెడకు రానున్న నేపథ్యంలో కలెక్టర్ హైమావతి హెలిప్యాడ్, సమావేశ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గవర్నర్ పర్యటనకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ‘పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు స్టీల్ (డైనింగ్) సామగ్రి పంపిణీ కార్యక్రమానికి గవర్నర్ రానున్నట్లు చెప్పారు. సమావేశానికి సుమారు 3,500 మంది మహిళలు హాజరుకానున్నారన్నారు. స్థానిక విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో సమావేశం, గురుకుల పాఠశాల మైదానంలో హెలిప్యాడ్ కోసం ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా 282 మహిళా సంఘాలకు స్టీల్ సామగ్రి అందజేస్తారన్నారు. కార్యక్రమంలో అదనపుకలెక్టర్ గరీమా అగర్వాల్, హుస్నాబాద్ ఆర్డీఓ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లనుపక్కాగా నిర్మించాలి కలెక్టర్ హైమావతి -
పెండింగ్ నిధులు విడుదల చేయండి
డిప్యూటీ సీఎంకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వినతి దుబ్బాక: బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెండింగ్ నిధులు విడుదల చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కోరారు. ఈ మేరకు మంగళవారం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కను సచివాలయంలో కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. నిధుల పెండింగ్ వల్ల రాష్ట్రంలో 25 వేల మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. త్వరగా నిధులు విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్ను కాపాడాలని డిప్యూటీ సీఎంను కోరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారన్నారు. వెంటనే సీఎంతో చర్చించి నిధులు విడుదల చేయించేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో తనతో పాటు కమిషన్ సభ్యులు ఉన్నారని తెలిపారు. ఉపాధి కల్పించండి మంత్రిని కలిసిన మత్స్యకారులు తొగుట(దుబ్బాక): మల్లన్నసాగర్ నిర్వాసిత గ్రామాల మత్స్యకారులకు ఉపాధి కల్పించాలని కోరుతూ మంత్రి వాకిటి శ్రీహరిని కోరారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని మంత్రి నివాసంలో వివిధ గ్రామాల మత్స్యకారులు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాగర్లో చేప పిల్లలను వదలాలని కోరారు. గత ఏడాది ఈ పాటికే చేప పిల్లలను వదిలిన విషయాన్ని మంత్రికి గుర్తుచేశారు. అలాగే సాగర్లో చేపలు పట్టుకునేందుకు లైసెన్స్లు అందించాలన్నారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో మత్స్య సహకారం సంఘం జిల్లా డైరెక్టర్ అక్కారం సత్తయ్య, నాయకులు పాల్గొన్నారు.పేదల వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి గజ్వేల్: వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా మంగళవారం గజ్వేల్ లోని మాతా శిశు సంరక్షణ ఆస్పత్రి(ఎంసీహెచ్)లో మహిళా సంఘాలకు చెందిన వీఓలు, ఇతర సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సారెడ్డి హాజరై మాట్లాడారు. ప్రభుత్వాస్పత్రుల్లోనూ కార్పొరేట్ వైద్య సేవలు అందేలా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. ఆస్పత్రిలో ఎలాంటి సమస్యలు ఉన్నా.. పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీసీహెచ్(డిస్ట్రిక్ కో–ఆర్టినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్), ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్ధార్ఖాన్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎస్జీటీలకు ప్రమోషన్లు కల్పించాలి పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఎస్జీటీ ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులుగా ప్రమోషన్లు కల్పించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇందిరానగర్లో పీఆర్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో పీఆర్టీయూ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఉపాధ్యాయులకు సత్వరమే పీఆర్సీ ప్రకటించి పెండింగ్ డీఏలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి
మిరుదొడ్డి(దుబ్బాక): విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలను అలవర్చుకుంటేనే సమాజంపై మంచి అవగాహన కలుగుతుందని తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ అర్చన ప్రియదర్శిని అన్నారు. మిరుదొడ్డి తెలంగాణ మోడల్ స్కూల్లో ఇటీవల నిర్వహించిన మాక్ పోలింగ్లో గెలుపొందిన విజేతల చేత సోమవారం ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చదువుతో పాటు ఆట పాటలు, నైతిక విలువలు, క్రమ శిక్షణలో విద్యార్థులందరికీ మాక్ పోలింగ్లో గెలుపొందిన విజేతలు ఆదర్శంగా నిలవాలని సూచించారు. తోటి విద్యార్థులందరికీ ప్రాతి నిధ్యం వహించే అవకాశాన్ని జవాబుదారీ తనంతో ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో టీచర్లు అంజుమ్, నాగరత్న, రాజేశ్వరి, అనురాధ, దేవేందర్తో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
కల్లుగీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేసి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కల్లుగీత సంఘం జిల్లా కార్యదర్శి అరుణ్గౌడ్ మాట్లాడుతూ ఎంతో ప్రమాదకరమైన వృత్తి అయినా వృత్తిని నమ్ముకుని కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు. ఈ క్రమంలో చాలా మంది కార్మికులు ప్రమాదాలకు గురైనప్పటికీ ఎక్స్గ్రేషియా అందించడంలో తీవ్ర ఆలస్యం జరుగుతోందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం గీతకార్మికులకు, వారి కుటుంబాలకు రావాల్సిన పరిహారాన్ని అందించాలన్నారు. -
నాగేటి సాలల్లో.. నవతరం
● ఓ వైపు చదువుతూమరో వైపు ఎవుసంపై మక్కువ ● తల్లిదండ్రులకు ఆసరాపత్తి పంటలో గొర్రు కొడుతున్న యువకులు జగదేవ్పూర్(గజ్వేల్): వ్యవసాయం తరతరాలుగా వారసత్వంగా వస్తున్న వృత్తి.. కొందరు ఉన్నత స్థాయిలో ఉన్నా.. మక్కువతో సాగు చేస్తుండగా.. మరి కొందరు చదువుతూనే వ్యవసాయం చేస్తున్నారు. మండలంలో వివిధ గ్రామాలకు చెందిన యువకులు ఓ వైపు చదువుతూ మరో వైపు వ్యవసాయ పనుల్లో రాణిస్తూ మెలకువలు నేర్చుకుంటున్నారు. వ్యవసాయం రంగంలో యువత, విద్యార్థులు రాణిస్తున్నారు. నాగలి పట్టి దుక్కిదున్నడం. దంతె, గొర్రు కొట్టడం, మందు పిచికారీ చేయడం, ట్రాక్టర్ సహాయంతో పొలం దున్నడం, ఒడ్డు చెక్కడం, వ్యవసాయ మిషన్లతో కలుపు తీయడంలాంటి పనులు చేస్తున్నారు. ఎమ్మెస్సీ చేస్తూ... జగదేవ్పూర్ మండలంలోని తిగుల్ గ్రామానికి చెందిన ఉప్పల నరేష్ ప్రస్తుతం సిద్దిపేటలో ప్రతిభ కళాశాలలో ఎమ్మెస్సీ రెండో సంవత్సరం చదువుతున్నారు. ప్రస్తుతం గ్రామంలో తమకున్న భూమితో పాటు మరింత భూమిని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశారు. పంట చేతికందే వరకు ప్రతి పనిని తమ్ముడు రాజు (ఎమ్మెస్సీ ప్రథమ సంవత్సరం)తో కలిసి వ్యవసాయ పనులు చేస్తున్నారు. వ్యవసాయంపై మక్కువతో.. మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన నర్సోల్ల నాగరాజు.. ప్రస్తుతం డిప్లొమా అగ్రికల్చరల్ చేస్తున్నారు. వ్యవసాయం కూడా చదువులో భాగమే అంటూ సాగు చేస్తున్నానని చెబుతున్నారు. సమయం కుదిరినప్పుడల్లా.. వ్యవసాయం పనులు చేయడం.. అమ్మానాన్నలకు ఆసరాగా నిలవడం సంతోషంగా ఉందని నాగరాజుతెలిపారు. డిగ్రీ చేసి.. కూరగాయలు పండిస్తూ.. మండలంలోని తిమ్మాపూర్కు చెందిన నర్సింహులు డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నాడు. ఎవుసం తాత ముత్తాల నుంచి వస్తున్న వృత్తి అని, వ్యవసాయం అంటే చాలా ఇష్టమని తెలిపారు. ఆదునిక పద్ధతులు నేర్చుకుని కూరగాయల పంటలను సాగు చేస్తున్నానని చెబుతున్నారు. -
గ్రూపులొద్దు.. రచ్చకెక్కొద్దు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: విబేధాలుంటే రచ్చకెక్కి మాట్లాడొద్దు.. ఏమైనా సమన్వయ సమస్య ఎదురైతే అంతర్గతంగా చర్చించుకొని పరిష్కరించుకోవాలి.. లేనిపక్షంలో టీపీసీసీ నాయకత్వం దృష్టికి తీసుకురావాలి.. అంతేకానీ ఇష్టానుసారంగా మాట్లాడొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ నేతలకు సూచించారు. సోమవారం గాంధీభవన్లో సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల కీలక నాయకులతో సమావేశం జరిగింది. సంస్థాగత నిర్మాణం గ్రామ, మండల, జిల్లా కార్యవర్గం, అనుబంధ సంఘాల నియామకం తదితర అంశాలపై పొన్నం నేతలతో చర్చించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే నామినెటేడ్, పార్టీ పదవుల ఎంపికలో ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. ఒక్కో నియోజకవర్గానికి రెండు చొప్పున రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ల పోస్టులు భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఈ నెలాఖరులోగా అన్ని నామినేటెడ్ పదవులతో పాటు, పార్టీ సంస్థాగత పదవుల భర్తీ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. నియోజకవర్గ ఇన్చార్జిలు ఆయా పదవుల కోసం ఇచ్చిన జాబితాలపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసి టీపీసీసీ, ఏఐసీసీ నాయకత్వానికి పంపుతామన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కష్టపడి పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ సురేష్షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎంపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్, మెదక్ డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, ఆయా నియోజకవర్గాల ఇన్చార్జిలు రాజిరెడ్డి, టి.నర్సారెడ్డి, నాయకులు ఉప్పల శ్రీనివాస్గుప్త, మెట్టుసాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. ‘స్థానిక’ ఎన్నికల్లో సత్తాచాటుదాం గజ్వేల్: స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. సోమవారం గాంధీభవన్లో డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డితో కలిసి గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు సంబంధించిన వివరాలను నర్సారెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. సమీక్షలో మంత్రి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సాహసోపేత నిర్ణయాలతో ముందుకుసాగుతున్నారని కొనియాడారు. ఏళ్ల తరబడి ప్రజలు ఎదురుచూస్తున్న రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు అందించగలుగుతున్నామని చెప్పారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించడం చరిత్రాత్మక నిర్ణయమన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలన్నారు. కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. -
అదనపు కలెక్టర్ను కలిసిన కొమురవెల్లి అర్చకులు
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయ ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్ ఆధ్వర్యంలో అర్చకులు సోమవారం అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్వామి వారి ప్రసాదాన్ని అందించారు. అదనపు కలెక్టర్ కలిసిన వారిలో జిల్లా దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, స్థానచార్యులు మల్లయ్య, నాచారం లక్ష్మీనర్సింహస్వామి, అర్చకులు తీగుళ్ల గోపికృష్ణ, మనోహర్, బసవేశ్వర్ తదితరులు ఉన్నారు. ‘పాయమాలు’ ఆవిష్కరణ ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాకు చెందిన రచయిత ఐత చంద్రయ్య రచించిన పాయమాలు కథల సంపుటి పుస్తకావిష్కరణ సోమవారం నగరంలో జరిగినట్లు బాలసాహితీవేత్త ఉండ్రాళ్ల రాజేశం తెలిపారు. కథల సంపుటిని ముదిగొండ శివప్రసాద్, ఓలేటి పార్వతీశం, వడ్డి విజయసారథి, ఆంజనేయరాజులు ఆవిష్కరించారన్నారు. జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు ఎన్నవెల్లి రాజమౌళి, లక్ష్మయ్య, బస్వరాజ్ కుమార్, పరశురాములు, సుధాకర్ తదితరులు అభినందనలు తెలిపారు. ఎస్సీలకు న్యాయం చేయండి మంత్రులకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ విజ్ఞప్తి దుబ్బాక: పెరిగిన జనాభా ప్రకారం ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్లు కల్పించి న్యాయం చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కోరారు. ఈ మేరకు సోమవారం నగరంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్లను వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. స్థానిక సంస్థల కులగణన సర్వే ప్రకారం పెరిగిన జనాభాకు అనుగుణంగా ఎస్సీలకు రిజర్వేషన్ను కల్పించాలని మంత్రులను కోరినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు వారు సానుకూలంగా స్పందించారన్నారు. కార్యక్రమంలో తనతో పాటు జహీరాబాద్ ఎంపీ సురేష్షెట్కార్, కమిషన్ సభ్యులు తదితరులు ఉన్నారు. నిరుద్యోగుల నుంచిదరఖాస్తుల ఆహ్వానం సిద్దిపేటరూరల్: నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ తెలంగాణ (డీట్) పోర్టల్ ద్వారా వివిధ పరిశ్రమల్లో ఖాళీగా ఉన్న 160 పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను ఆహానిస్తున్నట్లు కలెక్టర్ హైమావతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రైనీ ఎగ్జిక్యూటివ్విజువల్ ఇన్స్పెక్టర్, ఆర్ఏడీ, క్యూసి, క్యూఏ, ట్రైనీ వంటి పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. దీనికై ఐటీఐ, ఇంటర్, బీటెక్, బిఫార్మసి, ఎంఫార్మసి, బీఎస్సీ, కెమిస్ట్రి, మైక్రోబయోలజీ ప్రత్యేక సబ్జెక్టుగా ఉండి డిగ్రీ, పీజి చదివినవారు అర్హులని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు డీట్ పోర్టల్ www.deet.telangana.gov.inలో ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9281423575 నంబర్ను సంప్రదించాలని కోరారు. దివ్యాంగులకుఇచ్చిన హామీ ఏమాయె ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రాజు దుబ్బాక: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు దివ్యాంగులకు రూ.6,016 పెన్షన్ ఇస్తామని చెప్పి ఇంత వరకు అమలు చేయడంలేదని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రాజుమాదిగ అన్నారు. సోమవారం దుబ్బాకలో దివ్యాంగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్నా దివ్యాంగులకు, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులకు మేనిఫెస్టోలో ప్రకారం పెన్షన్లు పెంచకపోవడం దారుణమన్నారు. దివ్యాంగుల హక్కుల సాధన కోసం ఈ నెల 16న సిద్దిపేటలో జరిగే మహాసభకు మంద కృష్ణమాదిగ హాజరవుతున్నారన్నారు. దివ్యాంగులు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో నాయకులు జోగయ్య, మహేష్, రాజేశ్వరరావు, కనకరాజు తదితరులు ఉన్నారు. -
అర్జీలు సత్వరం పరిష్కరించాలి
● కలెక్టర్ హైమావతి ● అధికారులకు ఆదేశాలు ● ప్రజావాణికి వచ్చిన అర్జీలు 253 సిద్దిపేటరూరల్: జిల్లా వ్యాప్తంగా ప్రజలు అందిస్తున్న అర్జీలను వెంటవెంటనే పరిశీలిస్తూ పరిష్కారం దిశగా పనిచేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు గరీమా అగర్వాల్, అబ్దుల్హమీద్లతో కలిసి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రజావాణిపై నమ్మకం ఏర్పడేలా వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. వాటిని ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. డీఆర్ఓ నాగరాజమ్మ, కలెక్టరేట్ ఏఓ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. డబుల్సెంచరీ దాటిన అర్జీలు.. ప్రజావాణి అర్జీలపై ఎప్పటికప్పుడు కలెక్టర్ సమీక్షిస్తూ అధికారులకు ఆదేశాలు జారీచేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా అధికారులు అర్జీదారులకు ఫోన్ చేసి వివరాలు అడుగుతున్నారు. దీంతో సమస్యలు పరిష్కారం అవుతున్నాయనే సంతోషం అర్జీదారుల్లో వ్యక్తమవుతోంది. ప్రజలు తండోపతండాలుగా కలెక్టరేట్కు వచ్చి అర్జీలను అందిస్తున్నారు. దీంతో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఏకంగా 253 ధరఖాస్తులు వచ్చాయి. గృహలక్ష్మి నిధులు మంజూరు చేయాలి గృహలక్షీనిధులు మంజూరు చేయాలని నంగునూరు మండలం సిద్దన్నపేట వాసులు కోరారు. ఈ మేరకు ప్రజావాణిలో అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో పది మందికి గత ప్రభుత్వం హయాంలో గృహలక్ష్మి పథకం కింద ఇళ్లు మంజూరయ్యాయి. దీంతో ఇళ్లు కట్టుకున్నప్పటికి నేటికి పథకానికి సంబంధించిన నిధులు రాలేవు. దీనికోసం ఎన్నో సార్లు అధికారుల చుట్టూ తిరిగినప్పటికి ఎలాంటి ఫలితం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అప్పులు తెచ్చి ఇళ్లుకట్టుకున్న మాకు నిధులు మంజూరు చేయాలని కోరారు. మా ఇళ్లు కూల్చొద్దు మా ఇళ్లను కూల్చొద్దని దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి వాసులు కోరారు. అర్జీ సమర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ ఉన్న ఇంట్లోనే ఉంటూ బతుకులు వెళ్లదీస్తున్నామన్నారు. ఈ క్రమంలో గ్రామంలోని రోడ్డు వెడల్పులో భాగంగా మాకు ఎలాంటి నోటీసులు, సమాచారం అందించకుండా మార్కింగ్ వేశారన్నారు. ఉన్న ఇళ్లు మొత్తం పోయేలా మార్కింగ్ చేసి కూలిస్తే మా బతుకులు రోడ్డునపడతాయని వారు వాపోయారు. ఎలాగైనా అధికారులు స్పందించి మా ఇళ్లను కూల్చకుండా ప్రత్యామ్నాం చూడాలని కోరారు. కేంద్ర బృందానికి వివరాలు అందించండి సిద్దిపేటరూరల్: జిల్లా పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందానికి అధికారులు అందుబాటులో ఉండి వివిధ పథకాల వివరాలను క్షేత్రస్థాయిలో అందించాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. సోమవారం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో చేపట్టిన పథకాల పరిశీలనకు వచ్చిన కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారులు జోసెఫ్, వినోద్లతో కలెక్టర్ సమావేశమయ్యారు. వారు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించాల్సిన వివిధ పనులపై చర్చించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర బృందం అధికారులు ఈనెల 24వ తేదీ వరకు బెజ్జంకి, అక్కన్నపేట, కొమురవెల్లి మండలాలలో క్షేత్రస్థాయిలలో పర్యటించనున్నారన్నారు. ఉపాధిహమీ పనులు, పెన్షన్లు, వాటర్షెడ్, గ్రామీణ సడక్ యోజన, పీఎం ఆవాస్యోజన, గ్రామ పంచాయతీలు, ఆర్సేటి తదితర 12 రకాల పథకాల అమలును పరిశీలిస్తారన్నారు. ఈ క్రమంలో సంబంధిత అధికారులు అందుబాటులో వివరాలను అందించాలన్నారు. -
బూర్గుపల్లి పాఠశాలలో ‘అల్పాహార సేవ’
గజ్వేల్: సత్యసాయి సేవా సమితి సేవలు అభినందనీయమని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. బూర్గుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ‘అల్పాహార సేవా’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యసాయి సేవాసమితి సేవలు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నాయని చెప్పారు. మరోవైపు గుండె జబ్బుల బారిన పడుతున్న చిన్నారులకు పెద్ద ఎత్తున ఆపరేషన్లు చేయించి వారిని కాపాడుతున్న ఘనత ఈ సంస్థకే దక్కిందన్నారు. బూర్గుపల్లి పాఠశాలలో విద్యార్థులకు నిరంతర ‘అల్పాహార సేవా’ కార్యక్రమాన్ని చేపట్టడం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ కృష్ణ, పాఠశాల హెచ్ఎం పాపిరెడ్డి, దాత బాల్నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు. -
పైసలిస్తే పనులు ఖాయం!
తహసీల్దార్ కార్యాలయాల్లో దళారుల దందా ● నివాసం లేకున్నా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ ● కొండపాక తహసీల్దార్ కార్యాలయం లీలలు సాక్షి, సిద్దిపేట/కొండపాక(గజ్వేల్): కాసులకు ఆశపడి కొందరు రెవెన్యూ అధికారులు ఇష్టారాజ్యంగా సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. రెవెన్యూ శాఖలో కొంతకాలంగా అవినీతి, అక్రమాలు పెరిగిపోతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి వివిధ సర్టిఫికెట్ల జారీకి ఆన్లైన్ పద్ధతిలోకి వచ్చినా కొందరు రెవెన్యూ ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. భూముల మ్యుటేషన్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్, రేషన్ కార్డుల మంజూరు వంటి వాటిని పొందేందుకు దళారులకు డబ్బులిచ్చి సులువుగా పని చేయించుకుంటున్నా రు. దళారులకు డబ్బులిచ్చి తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి కొండపాక తహసీల్దార్ కార్యాలయం నుంచి ఓ మహిళ ఏకంగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ను పొందిన ఘటనే ఇందుకు నిదర్శనం. దళారుల దందా... జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో యథేచ్ఛగా దళారుల దందా కొనసాగుతోంది. సర్టిఫికెట్్కు ఒక రేటు ఫిక్స్ చేసి దళారులు దరఖాస్తుదారుల నుంచి వసూలు చేస్తున్నారు. అన్ని తామే చూసుకుంటామని కొంత సమయం పెట్టి ఎలాంటి సర్టిఫికెట్ అయిన జారీ చేయిస్తున్నారు. దళారులు వసూలు చేసిన డబ్బుల నుంచి కొంత ఆయా అధికారులకు ముట్టచెప్పి పనులు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ సర్టిఫికెట్ల కోసం నేరుగా వెళ్లిన వారికి వివిధ సాకులు చెప్పి తిరిగిపంపించేస్తున్నారని వాపోతున్నారు. దీంతో దళారులను దరఖాస్తుదారులు ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికై నా కలెక్టర్ ప్రత్యేక దృష్టిపెట్టి దళారులు వసూళ్ల దందాను అరికట్టాలని, తప్పుడు పత్రాలు జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇదీ జరిగింది... తొగుట మండలం గుడికందుల గ్రామంలో యాదయ్యకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య 14ఏళ్ల క్రితం మృతిచెందింది. మొదటి భార్యకు ఇద్దరు పిల్లలున్నారు. రెండవ భార్య సరిత హైదరాబాద్లో ఉంటుంది. గతేడాది భర్త అనారోగ్యంతో మృతిచెందాడు. భర్త పేరు మీద గుడికందులలో ఒక ఎకరం 20 గుంటల భూమి ఉంది. ఆ భూమిని తన పేరు మీద రాయించుకునేందుకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ను రెండవ భార్య సరిత కొండపాక తహసీల్దార్ కార్యాలయం నుంచి పొందింది. ఈ సర్టిఫికెట్ను తీసుకుని తొగుట మండలంలో 878/అ/1లో ఉన్న 1.20ఎకరాల భూమిని మ్యుటేషన్ చేయాలని ఆన్లైన్ స్లాట్ బుక్ చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన మొద టి భార్య పిల్లలు తొగుట తహసీల్దార్ను కలిసి ఆ భూమి తమది అని చెప్పి వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిలిపివేయాలని తహసీల్దార్కు సమాచారమిచ్చారు. దీంతో విచారణ చేపట్టిన తహసీల్దారు అధికారులను తప్పు దోవ పట్టించి ఎఫ్ఎంసీని పొందినట్లు గుర్తించారు. దీనిపై కొండపాక మండల తహసీల్దార్ శ్యాంను వివరణ అడగగా ఎఫ్ఎంసీని రద్దు చేశామన్నారు. -
ముమ్మరంగా వనమహోత్సవం
జిల్లాలో 22.47 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం ● ఇప్పటివరకు 7లక్షలకు పైగా మొక్కలు నాటడం పూర్తి ● అన్ని శాఖల సమన్వయంతో ముందుకు 16 శాఖలు.. 22 లక్షల మొక్కలు జిల్లాలో వనమహోత్సవ కార్యక్రమం వివిధ శాఖల సమన్వయంతో కొనసాగుతుంది. అటవీ శాఖ 75,600, పంచాయితీరాజ్, రోడ్లు భవనాల శాఖకు 13.2లక్షలు, మున్సిపాలిటీలకు 4.66లక్షలు, ఎడ్యుకేషన్ 2వేలు, మైన్స్ అండ్ జియాలజీ 2300, హార్టీకల్చర్, సెరీకల్చర్ 1,29,300, పశుసంవర్థక శాఖ 1వేయి, పౌరసరఫరాల విభాగం 2200, ఎకై ్సజ్ 67,700, వైద్యారోగ్యశాఖ 1400, బీసీ సంక్షేమశాఖ 500, నీటిపారుదల శాఖ 45,500, వ్యవసాయశాఖ 1,27,700, ఇండస్ట్రియల్ 20వేలు, పోలీసుశాఖ 4600 మొక్కలు నాటేలా లక్ష్యాలను నిర్దేశించారు. ఇప్పటివరకు ఏడు లక్షలకు పైగా మొక్కలను నాటినట్లు జిల్లా అటవీ అధికారులు చెబుతున్నారు.సిద్దిపేటకమాన్: సిద్దిపేట జిల్లాలో వనమహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 22.47లక్షల మొక్కలు నాటాలని నిర్దేశించారు. ఇప్పటికే లక్ష్యానికి అనుగుణంగా జిల్లా అటవీశాఖ, పంచాయితీరాజ్ శాఖ అధికారులు ఏడు మున్సిపాలిటీలు, డీఆర్డీఓ పరిధిలో 489, ఫారెస్టు 3తోపాటు మొత్తం 499 నర్సరీల్లో 25.05లక్షల మొక్కలను సిద్ధం చేశారు. వనమహోత్సవం ద్వారా మొక్కలు నాటేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అన్ని వర్గాలు, అన్ని శాఖలను భాగస్వామ్యం చేస్తూ మొక్కలను నాటేలా లక్ష్యం నిర్దేశించింది. ఆకుపచ్చ జిల్లాగా మార్చేందుకు అధికార యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా మొక్కలను నాటుతున్నారు. 25 లక్షల మొక్కలు సిద్ధం జిల్లాలో 499 నర్సరీల్లో 25,05,348 మొక్కలను పంపిణీ చేయడానికి అధికారులు సిద్ధంగా ఉంచారు. 2025–26 సంవత్సరానికి గాను జిల్లాలో 22.47లక్షల (22,47,800) మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 7.17లక్షల (31.68%) మొక్కలు నాటారు. వనమహోత్సవ పట్టణాలు, గ్రామ పంచాయితీ పరిధిలో కొనసాగుతుంది. జిల్లా యంత్రాంగం అన్ని గ్రామ పంచాయితీల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేలా, నాటిన ప్రతి మొక్కను కాపాడాలని అన్ని శాఖల సిబ్బందికి జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి చేసేలా అధికారులు పనులు కొనసాగిస్తున్నారు. గతేడాది (2024–25) జిల్లాలో 21.62లక్షల మొక్కలు నాటేలా లక్ష్యం పెట్టుకోగా 19.12లక్షల మొక్కలు నాటి 88.41% పూర్తి చేశారు. వనమహోత్సవం కొనసాగుతుంది జిల్లాలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతుంది. ఈ ఏడాది అన్ని శాఖల అధికారుల సమన్వయంతో జిల్లాలో 22.47లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్ధేశించారు. లక్ష్యాన్ని పూర్తి చేసేలా ప్రభుత్వ ఆదేశానుసారం అన్ని ప్రాంతాల్లో ఇతర అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతుంది. – జోజి, జిల్లా ఇన్చార్జి అటవీ అధికారి సిద్దిపేట -
గెలుపోటములు సహజమే
● క్రీడలతో మానసికోల్లాసం ● మాజీమంత్రి,ఎమ్మెల్యే హరీశ్రావుఏడాది పాటు వందేళ్ల ఉత్సవాలు● చట్ట సభల్లో సీపీఐ ఉంటేనే అర్థవంతమైన చర్చ ● ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి సిద్దిపేటజోన్: క్రీడాకారులు గెలుపు ఓటములను సహజమేనని వాటిని సమానంగా స్వీకరించాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. స్థానిక సిటిజన్ క్లబ్లో రాష్ట్రస్థాయి మహిళా వాలీబాల్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రస్తుతం సమాజంలో తల్లిదండ్రులు తమ పిల్లల ఉన్నత చదువులు, విదేశాల పయనంపైనే ఆలోచిస్తూ పిల్లల ఆరోగ్యం గురించి మర్చిపోతున్నారన్నారు. చదువుతో పాటు ఆటపాటలు కూడా ఎంతో ముఖ్యమని క్రీడామైదానాల వైపు పిల్లలను దృష్టి సారించేలా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. వాలీబాల్ను గ్రామీణ క్రీడగా అభివర్ణించారు. సిద్దిపేటలో జాతీయ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహణకు తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో జాతీయ వాలీబాల్ అకాడమి వైస్ప్రెసిడెంట్ హన్మంతరెడ్డి, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయిరాం, సిటిజన్ క్లబ్ అధ్యక్షుడు రమేశ్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, వైస్చైర్మన్ కనకరాజుతో పాటు పలువురు పాల్గొన్నారు. గురుపూజలో ఉన్న సంతృప్తి ఎక్కడా లభించదు సిద్దిపేటఅర్బన్: పాఠాలు ఎవరైనా చెబుతారని, జీవిత పాఠాలు కొందరే చెబుతారని ఆ కొందరిలో దుర్గాప్రసాద్ స్వామీజీ ఒకరని, అలాంటి వ్యక్తిని గురువుగా భావించి సన్మానించుకోవడం తన అదృష్టంగా హరీశ్రావు పేర్కొన్నారు. గురుపూజోత్సవం పురస్కరించుకుని హనుమాన్ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీకి సిద్దిపేటలో గురుపూజోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు పాల్గొని మాట్లాడారు. మనిషికి దైవ నామస్మరణ, గురుపూజలో ఉన్న సంతృప్తి, ఆనందం ఎందులోనూ ఉండదన్నారు. సిద్దిపేటలో ఏ కార్యక్రమం చేపట్టినా సిద్ధిస్తుందని, కోటి హనుమాన్ చాలీసా పారాయణం సంకల్పం సైతం సిద్ధించాలని కోరుకున్నారు. హుస్నాబాద్: సీపీఐ ఆవిర్భవించి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ చేసిన త్యాగాలు, పోరాటాలు, ప్రజాఉద్యమంలో సాధించిన విజయాలపై ఏడాదిపాటు సీపీఐ వందేళ్ల ఉత్సవాలను నిర్వహించనున్నట్లు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి తెలిపారు. పట్టణంలోని సీపీఐ భవన్లో శనివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ...కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపెడుతూ జిమ్మిక్కుల పాలన కొనసాగిస్తుందన్నారు. దేశంలో కార్పొరేట్ శక్తులు సహజ వనరులను కొల్లగొడుతూ లక్షల కోట్లకు పడగలెత్తుతున్నారని ఆరోపించారు. ఆర్థిక నేరస్తులైన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, లలిత మోదీ వంటి దొంగలకు ప్రధాని మోదీ వత్తాసు పలుకుతున్నారని తెలిపారు. ఆపరేషన్ కగార్ పేరిట ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి మావోయిస్టులను చంపడం ఏ చట్టంలో ఉందని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల పెంపు కోసం ఆర్డినెన్స్ తెస్తామన్న ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు విషయంలో ఇప్పటికే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిశారన్నారు. దీనిపై ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తర్వాత స్పష్టత వస్తుందని తెలిపారు. చట్టసభల్లో సీపీఐ ఉంటేనే అర్థవంతమైన చర్చ జరుగుతుందని చెప్పారు. ఈ నెల 16న సీపీఐ జిల్లా మహాసభలు హుస్నాబాద్లో ఈ నెల 16న సీపీఐ జిల్లా మహాసభలు నిర్వహించనున్నట్లు ఆపార్టీ జిల్లా కార్యదర్శి మంద పవన్ తెలిపారు. ఈ మహాసభలకు జిల్లా నుంచి 300 మంది ప్రతినిధులు పాల్గొంటారన్నారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు గడిపె మల్లేశ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు జాగిరి సత్యనారాయణ, వనేష్, లక్ష్మణ్, నాయకులు కుమార్, జనార్ధన్, భాస్కర్, సుదర్శనచారి, రాజ్కుమార్ తదితరలున్నారు.