Siddipet
-
‘జిజ్ఞాస’లో భేష్
సిద్దిపేటఎడ్యుకేషన్: ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాల జిజ్ఞాస రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ స్థానాల్లో నిలిచి భేష్ అనిపించుకుంది. మైక్రోబయాలజీ విభాగం డా.మధన్మోహన్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘టూత్బ్రష్ల పరిశుభ్రత’ ప్రాజెక్టుకు ప్రథమ, తెలుగు విభాగం డా.మట్ట సంపత్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ‘వరకవిసిద్ధప్ప’ ప్రాజెక్టుకు, ఆంగ్ల విభాగం బాలకిషన్ ఆధ్వర్యంలో చేసిన పరిశోధన ‘కృత్రి మ మేధస్సు పాత్ర’కు ద్వితీయ బహుమతులు లభించాయి. వాటితో పాటు చరిత్ర విభాగంలో డాక్టర్ కొండల్రెడ్డి పర్యవేక్షణలో హస్తకళలు–గొల్లభామచీరలు అనే పరిశోధనకు తృతీయ బహుమతి లభించింది. ఈ సందర్భంగా బుధవారం ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అయోధ్యరెడ్డి, సీఈఓ డా.గోపాలసుదర్శనం, డా.మధుసూదన్, డా.ఉమామహేశ్వరి, పిట్లదాసు, డా.శ్రద్ధానందం తదితరులు విద్యార్థులను అభినందించారు. -
‘పదోతరగతి’ ఎంతో కీలకం
చేర్యాల(సిద్దిపేట): విద్యార్థి జీవితంలో పదోతరగతి ఎంతో కీలకమైందని, కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ విద్యార్థినులకు పిలుపునిచ్చారు. బుధవారం ఆమె కేజీబీవీని సందర్శించి 10వ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చదువుకున్న పాఠశాలకు కలెక్టర్ హోదాలో రావాలన్నారు. అలాగే హాస్టల్లో తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం, పరిసరాలను పరిశీలించి హాస్టల్ నిర్వహణ, బోధన తీరుపై అధ్యాపకులకు పలు సూచనలు చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల పంపిణీపై ఆరా తీశారు. అలాగే కుర్మవాడ అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి కేంద్రంలో చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు అందజేస్తున్న భోజనం, పిల్లలతో టీచర్లు ఉంటున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట స్థానిక తహసీల్దార్ సమీర్ అహ్మద్ఖాన్, ఎంపీడీఓ మహబూబ్ అలీ, మున్సిపల్ కమిషనర్ నాగేందర్, ఆర్ఐ రాజేదర్రెడ్డి ఉన్నారు.అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ -
అన్ని వర్గాలకూ అన్యాయం
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాక: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు అన్యాయం చేసేవిధంగా ఉంది. వ్యవసాయం, విద్య, సంక్షేమ పథకాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మరోమారు మోసం చేసేవిధంగానే బడ్జెట్ను రూపొందించారు. పేదల సంక్షేమానికి పెద్దపీట డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి గజ్వేల్: తమ ప్రభుత్వం పేదల సంక్షేమానికి బడ్జెట్లో పెద్దపీట వేసింది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి రూ.56,084 కోట్లను కేటాయించారు. రైతు సంక్షేమం, నీటిపారుదల తదితర అంశాలకు ప్రాధాన్యమిచ్చారు. విద్య, వైద్యానికి ప్రాధాన్యంలేదు మంద పవన్, సీపీఐ జిల్లా కార్యదర్శి బడ్జెట్లో విద్యకు 7.57 శాతం, వైద్యానికి 6 శాతం నిధులు కేటాయించారు. దీని వల్ల ఆ రెండు రంగాలు అభివృద్ధి చెందే అవకాశం లేదు. నీటి పారుదులకు రూ.23,373 కోట్లు, రోడ్లు భవనాల శాఖకు రూ.5,907 కోట్లు కేటాయించి ప్రభుత్వం చేతులు దులుపుకొంది. హామీలకు, బడ్జెట్కు పొంతన లేదు మల్లారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి సిద్దిపేటఅర్బన్: కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు, ప్రవేశపెట్టిన బడ్జెట్కు పొంతన లేదు. ఈ యేడాది కూడా హామీలను అమలుచేసే పరి స్థితి కనిపించడంలేదు. వెనక్కి తీసుకొని ప్రజా సంక్షేమ బడ్జెట్ను రూపొందించాలి. -
బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్
గజ్వేల్: మాజీ సీఎం కేసీఆర్ అందుబాటులో ఉండటం లేదని, సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలకు అందుబాటులో ఉండని ఎమ్మెల్యే కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్తో బీజేపీ గజ్వేల్ నాయకులు బుధవారం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గేటుకు ‘వాంటెడ్ గజ్వేల్ ఎమ్మెల్యే, టు–లెట్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్’ పోస్టర్లను అతికించారు. అనంతరం అక్కడే బైఠాయించి ‘గుర్తున్నారా సారూ–గజ్వేల్ ప్రజలు’, ‘కేసీఆర్ రాజీనామా చేయాలి’ అనే నినాదాలతో ఫ్లకార్డులు పట్టుకొని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న సీఐ సైదా అక్కడికి చేరుకొని ఆందోళన విరమింపజేశారు. బీజేపీ నేతలు జశ్వంత్రెడ్డి, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదు గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రతాప్రెడ్డి నేతృత్వంలో బీజేపీ నేతలపై బీఆర్ఎస్ నాయకులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాడిచేసిన వారిని చట్టప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ కృషి వల్లే గజ్వేల్ అభివృద్ధిలో యాభై యేళ్లు ముందుకు వెళ్లిందన్నారు. మెదక్ ఎంపీ రఘనందన్రావు గెలిచిన తర్వాత ఈ ప్రాంతానికి ఒక్క అభివృద్ధి పనైనాని చేయగలిగారా?, సోయి లేకుండా క్యాంపు కార్యాలయంపై దాడి చేస్తారా? అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సైతం గజ్వేల్ అభివృద్ధికి ఏమీ చేయలేదని వాపోయారు. పాదయాత్ర చేస్తాం: డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డికాంగ్రెస్ నాయకులు గురువారం కలెక్టరేట్లో ఫిర్యాదు చేస్తామని, అనంతరం హైదరాబాద్లో పాదయాత్ర నిర్వహించి +రాజ్భవన్లో కూడా వినతి పత్రం అందజేస్తామని డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి తెలిపారు. కేసీఆర్ క్యాంపు కార్యాలయం ముట్టడి పోలీస్స్టేషన్లో బీఆర్ఎస్ ఫిర్యాదు వేడెక్కిన గజ్వేల్ రాజకీయం -
3
యంగ్ ఇండియా స్కూళ్లుసాక్షి, సిద్దిపేట: జిల్లాకు మూడు యంగ్ ఇండియా స్కూళ్లు రాబోతున్నాయి. 2025–2026 సంవత్సరానికిగాను రూ.3.04,965 కోట్లతో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ను బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అందులో జిల్లాకు ప్రత్యేకంగా కేటాయింపులు ఏమీ లేనప్పటికీ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలలో లబ్ధిదారులకు ఫలాలు అందనున్నాయి. అందులో భాగంగా మహిళలకు చేయూత; పల్లె, పట్టణాల అభివృద్ధికి నిధులు రానున్నాయి. జిల్లాకు ప్రత్యేకంగా నిధులు కేటాయించక పోవడంతో ప్రజలు నిరాశ చెందారు. కార్పొరేట్ స్థాయి వసతులతోపేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లో చదువుకోలేని వారి కోసం కార్పొరేట్ స్థాయి వసతులతో ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తోంది. తొలివిడతలో హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలం తంగళ్లపల్లిలో నిర్మాణ పనులకు ఇప్పటికే శంకుస్థాపన చేశారు. ఈ సారి బడ్జెట్లో ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీంతో జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో సైతం త్వరలో ఏర్పాటు చేయనున్నారు. దీంతో పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందనుంది. మహిళలకు చేయూత మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇప్పటికే బ్యాంక్ లింకేజీ రుణాలను అందజేస్తున్నారు. అలాగే క్యాంటీన్లను ఏర్పాటు చేయిస్తున్నారు. తాజాగా ప్రతి మండలంలో మహిళలతో రైస్ మిల్లులు, మినీ గోదాములు నిర్వహిస్తారని ప్రకటిం చారు. ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆ రైస్ మిల్లుల్లోనే మిల్లింగ్ చేసి ఎఫ్సీఐకి సరఫరాచేసే బాధ్యతలను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించనున్నారు. అలాగే మహిళా సమాఖ్యల ద్వారా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి 150 అద్దె బస్సులు కేటాయించారు. త్వరలో మరో 600 బస్సులను కేటాయిస్తామని ప్రకటించడంతో మహిళా సంఘాల సభ్యులకు లబ్ధి చేకూరనుంది. మొదటి ఫేస్లో జిల్లాకు బస్సులేమీ దక్కకపోయినా త్వరలో కేటాయించే అవకాశాలున్నాయి. జిల్లాలో 18,274 మహిళా స్వయం సహాయక సంఘాలు ఉండగా అందులో 1,94,714 మంది సభ్యులున్నారు.ఆరు గ్యారెంటీలకు పెద్దపీట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారెంటీల అమలు కోసం రూ.56,084 కోట్లు కేటాయించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల కోసం జిల్లా వ్యాప్తంగా 2,30,483 మంది దర ఖాస్తు చేసుకొన్నారు. అందులో ఇంటి స్థలం ఉండి ఇళ్లులేని వారు 86,968 మంది, స్థలం, ఇళ్లు లేనివారు 34,404 మందిగా గుర్తించారు. అందులో పైలెట్ ప్రాజెక్ట్లో భాగంగా జనవరి 26వ తేదీన 26 మండలాల్లో ఒక్కో గ్రామంలో 2,585 ఇళ్లను మంజూరు చేశారు. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించగా వాటిలో పూర్తి స్థాయిలో ఎంపికలు జరగలేదు. ఈ సారి బడ్జెట్లో కేటాయింపు వల్ల అర్హులందరికీ సొంతింటి కల నెరవేరనుంది. ఇప్పటికే గృహజ్యోతి, ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్, సన్న ధాన్యానికి క్వింటాల్కు రూ.500 బోనస్, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాలు కొనసాగుతున్నాయి. కోమటిచెరువు పర్యాటకం పూర్తయ్యేనా?జిల్లాలో కోమటిచెరువు పర్యాటక అభివృద్ధి మధ్యలోనే నిలిచిపోయింది. శిల్పారామం, నెక్లెస్ రోడ్, బీచ్ పనులు యేడాదిన్నరగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. అలాగే రంగనాయకసాగర్ దగ్గర పర్యాటక అభివృద్ధి అర్ధాంతరంగా నిలిచి పోయాయి. ఈ సారి బడ్జెట్లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటకం కోసం రూ.775 కోట్లు కేటాయించారు. ఆ నిధుల నుంచి కోమటి చెరువు, రంగనాయకసాగర్ దగ్గర పర్యాటక అభివృద్ధికి నిధులు కేటాయించాలని జిల్లా వాసులు కోరుతున్నారు. పల్లె, పట్టణాల అభివృద్ధికి ప్రాధాన్యం మహిళలకు చేయూత పర్యాటకానికి నిధులొచ్చేనా? బడ్జెట్లో జిల్లాకు అంతంత మాత్రమేపల్లె, పట్టణాల అభివృద్ధి రాష్ట్ర బడ్జెట్లో పురపాలకశాఖకు రూ.17,677 కోట్లు కేటాయించారు. దీంతో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలోని 115 వార్డులకు నిధులు రానున్నాయి. దీంతో పట్టణాలు అభివృద్ధి చెందనున్నాయి. అలాగే పెండింగ్లో ఉన్న పనులకు కూడా మోక్షం కలిగే అవకాశం ఉంది. పంచాయతీ రాజ్కు రూ.31,605 కోట్లు కేటాయించారు. దీంతో జిల్లాలోని 508 గ్రామ పంచాయతీలు, 4,508 వార్డులు అభివృద్ధి చెందనున్నాయి. అలాగే పెండింగ్లో ఉన్న బిల్లులు సైతం విడుద లయ్యే అవకాశం ఉంది. -
రాజగోపాల్పేటకు రాష్ట్రస్థాయి బహుమతి
నంగునూరు(సిద్దిపేట): పాలిటెక్నిక్ కళాశాలల రాష్ట్రస్థాయి సృజన టెక్ఫెస్ట్ 2025 పోటీలో రాజగోపాల్పేట కళాశాల విద్యార్థులు ప్రథమ బహుమతి సాధించారు. హైదరాబాద్లో మంగళవారం నిర్వహించిన పోటీలలో కళాశాల నుంచి విద్యార్థి చంద్రశేఖర్ బృందం ‘అత్యవస ర వాహనాల కోసం ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థ’ ఐఓటీ ఆధారిత మొబైల్ యాఫ్ను ఆవిష్కరించారు. అధ్యాపకుడు రాజమౌళి పర్యవేక్షణలో చేపట్టిన ఈ ప్రయోగానికి రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి లభించింది. ఈ సందర్భంగా ఆ విద్యార్థులు చంద్రశేఖర్, కావ్య, జ్యోత్స్న, ప్రకర్ణ, రితేశ్, ముదాసీర్ను ప్రిన్సిపాల్ గోవర్ధన్, అధ్యాపకులు రాజు, అభినవ్, రాజేశ్ తదితరులు అభినందించారు. నూతన డీఎంగా వెంకన్న హుస్నాబాద్: హుస్నాబాద్ ఆర్టీసీ డిపో డీఎంగా ఎన్.వెంకన్న బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ డీఎంగా పనిచేసిన వెంకటేశ్వర్లు కాచిగూడ డిపోకు బదిలీపై వెళ్లారు. అనంతరం డిపోలో ఎన్.వెంకన్న ఆధ్వర్యంలో జనవరి, ఫిబ్రవరి 2025కు గాను ఉద్యోగులకు ప్రగతిచక్ర అవార్డులను ప్రదానం చేశారు. అలాగే బెస్ట్ ఈపీకే, బెస్ట్ కేఎంపీఎల్ క్యాష్ అవార్డులను అందజేశారు. గేట్ ఫలితాల్లో సత్తా చాటిన రైతుబిడ్డ చిన్నకోడూరు(సిద్దిపేట): గేట్ ఫలితాల్లో సింగిరెడ్డి శ్రావణ్రెడ్డి ఆల్ ఇండియా 807వ ర్యాంకు సాధించాడు. మండల పరిధిలోని మాచాపూర్కు చెందిన సింగిరెడ్డి నిర్మల, ఆదిరెడ్డి దంపతుల రెండో కుమారుడు శ్రావణ్రెడ్డి. వారిది సాధారణ రైతు కుటుంబం కావడంతో మొదటి నుంచి ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లోనే విద్యనభ్యసించాడు. బుధవారం వెలువడిన గేట్ ఫలితాల్లో ఈసీ బ్రాంచ్లో 807వ ర్యాంకు సాధించాడు. దీంతో మిత్రులు, గ్రామస్తులు శ్రావణ్ను అభినందించారు. రాజరాజేశ్వర.. అందుకో పుష్పార్చనదుబ్బాక: అక్బర్పేట–భూంపల్లి మండలంలోని చౌదర్పల్లిలోని పార్వతీ సహిత దుబ్బరాజేశ్వరస్వామి ఆలయంలో బుధవారం మూడు లక్షల పుష్పాలతో స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా హరహర మహాదేవ నామస్మరణతో ఆలయం మారుమోగింది. నేడు జిల్లా స్థాయి యూత్ పార్లమెంట్ సిద్దిపేట ఎడ్యుకేషన్: జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ను సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో నిర్వహించనున్నట్లు కార్యక్రమ నోడల్ ఆఫీసర్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, కోఆర్డినేటర్ డా.శ్రద్ధానందం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మేడ్చల్, జనగామ, సిద్ది పేట జిల్లాలకు సంబంధించిన ఫెస్టివల్ ఇక్కడ జరగనున్నట్లు తెలిపారు. 150 మందిని ఎంపిక చేశామని, అలాగే 20, 21న జిల్లాస్థాయి ఎంపిక కార్యక్రమం ఉంటుందని తెలిపారు. -
ఆధ్యాత్మిక సంరంభం
వర్గల్(గజ్వేల్): వేద మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాలు, భక్తుల జయజయ ధ్వానాల మధ్య నాచగిరి శ్రీలక్ష్మీ నృసింహ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నాచగిరి శ్రీక్షేత్రం శ్రీమధుసూదనానంద సరస్వతి బుధవారం సాయంత్రం జ్యోతి ప్రజ్వలనచేసి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. వేదపండితులు పాంచరాత్ర ఆగమ పద్ధతిలో ఉత్సవ పూజలకు శ్రీకారం చుట్టారు. కోనేరు ప్రాంతం నుంచి పుట్టమన్ను తెచ్చి ముఖమండపంలో విశ్వక్సేనారాధన, స్వస్తి పుణ్యహవాచనం, అంకురార్పణం, నీరాజనం, మంత్రపుష్పాది పూజలు నిర్వహించారు. నేడు ధ్వజారోహణం బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం ధ్వజారోహణ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గరుడాళ్వారుకు మహా నివేదన చేసి బ్రహ్మోత్సవ బాధ్యతలను అప్పగిస్తారు. రాత్రి భేరీ పూజ నిర్వహించి సకల దేవతలకు ఆహ్వానం పలుకుతారు.బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ -
ఇండస్ట్రియల్ వద్దే వద్దు..
అక్కన్నపేట(హుస్నాబాద్): ‘ప్రాణాలైనా ఇస్తాం.. కానీ ఇండస్ట్రియల్ పార్కుకు భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టం చేశారు. మండల పరిధిలోని చౌటపల్లిలో బుధవారం ఆర్టీఓ రామ్మూర్తి ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికి భూ సేకరణ కోసం గ్రామసభ నిర్వహించారు. సభకు చౌటపల్లి, జనగామ, తోటపల్లి గ్రామాల పరిధిలో భూములు కోల్పుతున్న రైతులు హాజరయ్యారు. చౌటపల్లిలో 83.36 ఎకరాలకు గాను 162 మంది, జనగామలో 15.20 ఎకరాలకు గాను 12 మంది, తోటపల్లిలో 25.20 ఎకరాలకు గాను 21 మంది రైతుల భూములను కోల్పోతున్నారు. మొత్తం 124.36 ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికి భూ సేకరణ చేయనున్నట్లు గ్రామసభలో తహసీల్దార్లు అనంతరెడ్డి, రవీందర్ చదవి వినిపించారు. ఈ సందర్భంగా రైతులు అభ్యంతరాలు, వినతి పత్రాలను సమర్పించారు. పచ్చని భూముల్లో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయడమేమిటని రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతంగా భూములు లాక్కొని తమ కడుపు కొట్టొద్దని వేడుకొన్నారు. గ్రామసభ ముగిసిన తర్వాత చౌటపల్లి గ్రామ మహిళ రైతులు తమ భూములు ఇవ్వబోమంటూ నిరసన తెలిపారు. కాలుష్య రహిత ‘ఇండస్ట్రియల్’ కాలుష్యం వెదజల్లే కంపెనీలను ఎట్టిపరిస్థితుల్లో ఏర్పాటు చేయబోమని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారని ఆర్డీఓ రామ్మూర్తి చెప్పారు. ప్రజాప్రయోజనాల కోసం రైతులందరూ తప్పకుండా సహకరించాలని, భూములు కోల్పోతున్న వారికి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఏసీపీ సతీశ్, తహసీల్దార్లు అనంతరెడ్డి, రవీందర్, ఎంపీడీఓ జయరాం, ఎంపీఓ మోహన్నాయక్, ఆర్ఐ యాదగిరి, జాహిద్, రాజయ్య, సీనియర్ అసిస్టెంట్ రాజు, పంచాయతీ కార్యదర్శులు సతీశ్ తదితరులు పాల్గొన్నారు. భూములు లాక్కొని పొట్టకొట్టొద్దు గ్రామసభలో రైతుల ఆందోళన -
ఆర్థిక అక్షరాస్యతతోనే అభివృద్ధి
కలెక్టర్ మనుచౌదరిసిద్దిపేటఎడ్యుకేషన్: ప్రజలకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన ఉంటే అది వారి స్వయం అభివృద్ధితోపాటు దేశాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి అన్నారు. ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాల కామర్స్ విభాగాధిపతి డాక్టర్ గోపాల సుదర్శనం రచించిన ‘ఆర్థిక అక్షరాస్యత’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. కళాశాలలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ. ప్రస్తుత పరిస్థితుల్లో ఆదాయ వనరులు పెరిగినా, సరైన ఆర్థిక పరిజ్ఞానం లేక వెనుకబడుతున్నారన్నారు. ఆర్థిక సంస్థల విధి విధానాలు, పన్నులు, వాటి మదింపు పద్ధతులు, పొదుపు, పెట్టుబడి తదితర అంశాల గురించి రచయిత ఈ పుస్తకంలో వివరించారని ప్రశంసించారు. అధ్యాపకులు విద్యార్థులకు ఆర్థిక క్రమశిక్షణను, పొదుపు ప్రాధాన్యాన్ని బోధించాలని సూచించారు. అనంతరం పుస్తక రచయిత డాక్టర్ గోపాల సుదర్శనం మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యతలో వెనుకబడిన వారు వ్యాపారాల్లో దివాలాతీసి, అప్పులుచేసి కృంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. అందుకే సమర్థవంతమైన ఆర్థిక ప్రణాళిక, భద్రత గురించి ఈ పుస్తకంలో వివరించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డా.సునీత, రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ అయోధ్యరెడ్డి, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ మధుసూదన్, ఇంగ్లిష్ విభాగాధిపతి మామిడాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలు
ముస్తాబైన నాచగిరి క్షేత్రం ● నేటి నుంచి అంగరంగౖ వెభవంగా శ్రీలక్ష్మీనృసింహస్వామివారి వేడుకలు ● ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు వర్గల్(గజ్వేల్): హరిద్రనది పరవళ్లు, ప్రకృతి రమణీయతలతో అలరారే సహజసిద్ధ కొండగుహల్లో స్వయంభుగా శ్రీలక్ష్మీనారసింహుడు కొలువుదీరిన భవ్యక్షేత్రం నాచారం గుట్ట నాచగిరి శ్రీలక్ష్మీనృ సింహ క్షేత్రం. మండలంలోని నాచగిరి క్షేత్రం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. శ్రీ క్రోధి నామ సంవత్సర పాల్గుణ బహుళ పంచమి బుధవారం 11వ తేదీ నుంచి శ్రీవిశ్వావసు నామ చైత్ర శుద్ధ పాడ్యమి ఆదివారం 30 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. అందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాదుకు చేరువలో.. హైదరాబాదుకు 55 కిలోమీటర్లు, 44వ నెంబర్ జాతీయ రహదారి తూప్రాన్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో నాచగిరి ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి ప్రజ్ఞాపూర్ మీదుగా కూడా నాచగిరికి చేరుకోవచ్చు. నాచగిరి క్షేత్రానికి ఆర్టీసీ సౌకర్యం ఉంది. ఆకర్షణీయంగా.. ఉత్సవాలను పురస్కరించుకొని ప్రధాన ఆలయం, రాజగోపురం, తూర్పుద్వారం, ఉత్తరద్వారం, సభా మండపాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుద్దీపాలతో ఆలయాన్ని అలంకరించారు. భక్తు లు బసచేసేందుకు సత్రాలు సిద్ధం చేశారు. క్షేత్ర పరిసరాలలో పిచ్చిమొక్కలు, ముళ్లపొదల తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. నాచగిరి వద్ద హరిద్రనది వాగుక్షేత్ర ప్రాశస్త్యం నాచగిరిపై శేషశాయి మాదిరి గుహలో స్వామి స్వయంభుగా కొలువుదీరారు. క్షేత్రం ఎదుట పరవళ్లు తొక్కుతూ సాగిపోయే హరిద్రనది హల్దీవాగు రమణీయ దృశ్యకావ్యంలా గోచరిస్తుంది. కొండ గుహలో కొలువైన శ్రీవారిని దర్శించుకుంటే శత్రుబాధ, భూత, ప్రేత, పిశాచ బాధలు తొలగిపోతాయని, దీర్ఘరోగములు నయమవుతాయని, కుటుంబ శాంతి, వివాహం, సంతానం సమకూరుతుందని భక్తులు విశ్వసిస్తారు. -
గరిమా టీచర్ !
టెన్త్ విద్యార్థులకు 45 నిమిషాల పాటు బోధన దుబ్బాక: నిత్యం ఎన్నో పనుల ఒత్తిడితో ఉంటే అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ లెక్కల టీచర్గా మారారు. పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 45 నిమిషాల పాటు పదోతరగతి విద్యార్థులకు గణితం, ఫిజిక్స్కు సంబంధించిన అంశాల గురించి బోధించారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. అనంతరం పరిసరాలు, భోజనశాలను పరిశీలించారు. అన్నం మెత్తగా ఉండడంతో వెంటనే సివిల్ సప్లయ్ డీఎంకు ఫోన్చేసి నాణ్యమైన బియ్యం ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సంజీవ్కుమార్, ఎంపీడీఓ భాస్కరశర్మ, ఎంఈఓ ప్రభుదాసు తదితరులు ఉన్నారు. శతశాతం సాధించాలి సిద్దిపేటరూరల్: బ్యాంకర్లకు వివిధ సెక్టార్లో ఇచ్చిన లక్ష్యాలను శతశాతం సాధించేలా బ్యాంకర్లు, అధికారులు సమష్టి కృషితో ముందుకు సాగాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో బ్యాంకర్లు, పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివిధ పథకాలు, కార్యక్రమాల అమలులో నిర్ధేశించిన లక్ష్యాలను అమలు చేయాలన్నారు. జిల్లాలో మంజూరైన రుణాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం ఆలస్యం కాకుండా చూడాలని ఆదేశించారు. లక్ష్య సాధనలో ఎలాంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని చెప్పారు. అనంతరం నాబార్డు జారీ చేసిన పొటెన్షియల్ లింకేజీ ప్లాన్ 2025–26 ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎల్డీఎం హరిబాబు, డీఆర్డీఓ జయదేవ్ఆర్యా, నాబార్డ్ డీడీఎం నిఖిల్, యుడీఐ ఆర్ఎం వికాస్ తదితరులు పాల్గొన్నారు. ఓటుహక్కు నమోదు చేసుకోండి 18యేళ్లు నిండిన వారంతా ఓటుహక్కును నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. దుబ్బాక ఐఓసీ కార్యాలయంలో వివిధ రాజకీయపార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటుహక్కు నమోదుకు నాయకులు సహకరించాలన్నారు. తహసీల్దార్ సంజీవ్కుమార్, ఆర్ఐ నరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఒత్తిడికి దూరంగా ఉండాలి
జిల్లా విద్యాధికారి శ్రీనివాస్రెడ్డి గజ్వేల్: పదోతరగతి విద్యార్థులు ఒత్తిడికి దూరంగా ఉండి పరీక్షలకు సిద్ధమైతేనే ఉత్తమ ఫలితాలు సాధించగలరని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్రెడ్డి సూచించారు. మండలంలోని బూర్గుపల్లి ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ, టీవైఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంగ్లిష్ ల్యాబ్, లైబ్రరీని మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో హెచ్ఎం కృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు సత్యనారాయణ, శ్రీనివాస్, శ్రీనివాస్రెడ్డి, రఫీక్, అర్జు న్, కవిత, ప్రసన్నలక్ష్మి, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం గజ్వేల్రూరల్/కొండపాక(గజ్వేల్): జిల్లాలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల బాలుర, బాలికల పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతుల్లో ఖాళీల భర్తీకి విద్యార్థులు దరఖా స్తు చేసుకోవాలని జిల్లా డీసీఓ శివప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 6వ తరగతిలో ప్రవేశానికి 2025 ఆగస్టు 31 నాటికి 12యేళ్లలోపు ఉండాలని, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మరో రెండేళ్ల మినహాయింపు ఉంటుందని తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు రూ.లక్షా 50 వేలు, పట్టణ ప్రాంత విద్యార్థులు రూ.2 లక్షల ఆదాయ పరిమితి మించ కూడదని, ఆసక్తిగల విద్యార్థులు 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 15 నుంచి హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని, ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు https://mjptbewreir.teanfana.gov.inను సంప్రదించాలని సూచించారు. -
మాజీ సీఎం కేసీఆర్కు ఆహ్వాన పత్రిక
వర్గల్(గజ్వేల్): నాచగిరి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మాజీ సీఎం కేసీఆర్కు మంగళవారం నాచగిరి ఆలయ ఈఓ విశ్వనాథ శర్మ ఆహ్వాన పత్రిక అందజేశారు. వేదపండితుల మహదాశీర్వచనం అనంతరం ప్రసాదం, శేషవస్త్రం అందజేశారు. ఉత్సవాలకు హాజరుకావాలని కోరారు. ఆయన వెంట మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి ఉన్నారు. మంత్రి కొండా సురేఖకు.. రాష్ట్ర దేవాదాయ శాఖమంత్రి కొండా సురేఖను నాచగిరి స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వా నిస్తూ డీసీసీ అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డితో కలిసి ఆలయ ఈఓ ఉత్సవ ఆహ్వాన పత్రిక అందజేశారు. దపండితులు మంత్రికి మహదాశీర్వచనం చేసి, ప్రసాదం అందజేశారు. పరీక్షలంటే భయం వద్దు దుబ్బాకటౌన్: పదోతరగతి విద్యార్థులు ఎటువంటి భయం లేకుండా, ఆత్మ విశ్వాసంతో పరీక్షలకు సన్నద్ధం కావాలని తెలంగాణ మోడల్ స్కూల్ డిప్యూటీ డైరెక్టర్ దుర్గా ప్రసాద్ సూచించారు. మండంలోని లచ్చపేట మోడల్ స్కూల్ను మంగళవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో పలు రికార్డులను తనిఖీ చేసి, విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పరీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమయాన్ని వృథా చేయకుండా పరీక్షలపై దృష్టి సారించాలన్నారు. ఇటీవల సైన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొన్న విద్యార్థి హర్షవర్ధన్ను అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బుచ్చిబాబు, ఉపాధ్యాయులు ఉన్నారు. హాస్టల్ వెల్ఫేర్ అధికారిగా బెజ్జంకి యువకుడు బెజ్జంకి(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం వెలువరిచిన హాస్టల్ వెల్ఫేర్ అధికారుల నియామకాలకు బెజ్జంకి యువకుడు జడల చంద్రశేఖర్ ఎంపికయ్యారు. టీపీఎస్పీ నిర్వహించిన పరీక్షలలో రాష్ట్రస్థాయిలో 184వ ర్యాంకు, జోనల్ స్థాయిలో 24వ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయనను గ్రామస్తులు, యువకులు అభినందించారు. అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు జిల్లా వ్యవసాయశాఖ అధికారి రాధిక చిన్నకోడూరు(సిద్దిపేట): ఎరువులను అధిక ధరలకు విక్రయించే డీలర్లపై చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి రాధిక హెచ్చరించారు. స్థానిక ఎరువుల దుకాణాలను మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిత్యం ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచాలని, కృత్రిమ కొరత సృష్టిస్తే లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. అనంతరం పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఆమె వెంట మండల వ్యవసాయశాఖ అధికారి జయంత్ కుమార్, ఏఈఓలు ఉన్నారు. 12 మంది డిబార్ కోహెడ(హుస్నాబాద్): ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభమైన పదిరోజులలో జిల్లా వ్యాప్తంగా 12 మంది విద్యార్థులు డిబార్ అయ్యారని డీఐఈఓ రవీందర్రెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక పరీక్ష కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఇంటర్మీడియెట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలో భాగంగా ఐదుగురు విద్యార్థులు కాఫీ కొడుతూ పట్టుబడినట్లు చెప్పారు. -
లక్ష్యంతో చదివితేనే ఉన్నత స్థాయికి..
మిరుదొడ్డి(దుబ్బాక): ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో చదివితేనే ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి చేరుకుంటారని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్రావు అన్నారు. సంకల్ప్ సేవా ఫౌండేషన్, ఎస్ఆర్కే ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం మిరుదొడ్డి మండల పరిధిలో టెన్త్ విద్యార్థులకు ఎగ్జామినేషన్ కిట్స్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అత్యున్నతమైన గౌరవం, విలువ లభించాలంటే చదువొక్కటే మార్గమన్నారు. అనుకున్నది సాధించాలంటే పట్టుదలతో చదివి మంచి ఫలితాలను సాధించాలన్నారు. ఉపాధ్యాయులపై అసహనం .. ఎగ్జామినేషన్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో దేశ రాష్ట్రపతి ఎవరు అన్న ప్రశ్నకు విద్యార్థులు సరైన సమాధానం చెప్పకపోవడంతో మెదక్ ఎంపీ విస్మయం వ్యక్తం చేశారు. దేశ ప్రథమ పౌరురాలు ఎవరో తెలియని విద్యార్థులకు ఏం విద్యాబోధన చేస్తున్నారని ఆయా పాఠశాలల ఉపాధ్యాయులపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రతి పాఠశాలలో ప్రధాని, రాష్ట్రపతి, రాష్ట్ర సీఎం ఫొటోలను ఏర్పాటు చేయాలని ఎంఈఓ ప్రవీణ్ బాబును ఆదేశించారు. ఇదిలా ఉండగా ఎంపీగా గెలుపొందింన తర్వాత తొలి సారిగా మిరుదొడ్డి మండల కేంద్రానికి వచ్చిన మెదక్ ఎంపీ మాధ వనేని రఘునందన్ రావుకు పలువురు రైతులు, అంగన్వాడీ టీచర్లు వినతులు అందజేశారు. వినతులను పరిష్కరించంచేందుకు కృషి చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్ఆర్కే వ్యవస్థాపకుడు శివరామ కృష్ణ, దక్షిణ మధ్య ధర్మ జాగరణ ప్రముఖ్ అమర లింగం, ఎంఈఓ ప్రవీణ్ బాబు పాల్గొన్నారు.ఎంపీ రఘునందన్ రావు -
రిజర్వాయర్ పంప్హౌస్ వద్ద ధర్నా
మద్దూరు(హుస్నాబాద్): లద్నూరు రిజర్వాయర్లోకి సాగునీరు విడుదల చేయాలని రైతులు బొమ్మకూరు రిజర్వాయర్ పంప్హౌస్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ మేరకు గ్రామ మాజీ ఎంపీటీసీ గుజ్జుక సమ్మయ్య మాజీ సర్పంచ్ జీడికంటి సుదర్శన్లు రైతులతో కలిసి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న రిజర్వాయర్లోకి సాగునీరు విడుదల చేయకపోవడంతో పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బావులు, బోర్లు వట్టిపోవడంతో పంటలకు నీరు అందడంలేదన్నారు. దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని అన్నారు. ఇప్పటికై నా రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేయాలన్నారు. -
సంక్షేమ హాస్టళ్లను పట్టించుకోండి
దుబ్బాక: ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు అధ్వానంగా మారాయని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి సోమ వారం అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే దృష్టిసారించాలన్నారు. హాస్టళ్ల నిర్వహ ణ కొరవడటం.. నాణ్యమైన భోజనం అందడటంలేదన్నారు. కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా అర్థం చేసుకోవాలన్నారు. హబ్షీపూర్ గురుకులంలో 7 వ తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారన్నారు. విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినా విషయం బయటకు రానివ్వడంలేదన్నారు. ఏ హాస్టల్కు వెళ్లినా ఫుడ్పాయిజన్, సిబ్బంది సక్రమంగా ఉండక సౌకర్యాలు సరిగ్గా లేక అవస్థలు పడుతున్నారన్నారు. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా పట్టించుకోవడంలేదు.. అసెంబ్లీలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి -
రోడ్డెక్కిన రైతులు
దుబ్బాకటౌన్: తలాపునే గోదావరి నీళ్లు ప్రవహిస్తున్నప్పటికీ నీరు అందక పంటలు ఎండుతున్నాయని రైతులు మండిపడ్డారు. చేగుంట, దౌల్తాబాద్ మండలాల రైతులు దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ చౌరస్తాలో సోమవారం రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. దీంతో రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించాయి. దౌల్తాబాద్ మండలం మాచిన్ పల్లి, నర్సంపల్లి, చేగుంట మండలం పోతన్పల్లి, పోతంశెట్టిపల్లి, మక్కరాజుపేట, చందాయిపేట, కాసాన్పల్లి, తదితర గ్రామాలకు చెందిన సుమారు 500 మంది రైతులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. సాగునీరు అందించి పంటలను కాపాడాలని రైతులు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్రెడ్డి అక్కడికివచ్చి వారితో మాట్లాడారు. సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రైతుల ధర్నాను విరమింప జేశారు. కార్యక్రమంలో దౌల్తాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాములు, ఉపాధ్యక్షుడు స్వామి, ఇరిగేషన్ అధికారులు తదితరులున్నారు. -
పంటలు కాపాడాలంటూ ఆందోళన
దుబ్బాక: మల్లన్నసాగర్ కాలువ ద్వారా నీటిని అందించి ఎండుతున్న పంటలు కాపాడాలని సోమవారం దుబ్బాకలో రైతులు ఆందోళన చేపట్టారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ దుబ్బాకకు కన్నతల్లి లాంటి పెద్దచెరువులోకి మల్లన్నసాగర్ నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు కాల్వ పూర్తి చేయకపోవడం దారుణమన్నారు. పెద్దచెరువును నింపితే 1500 ఎకరాలకు పైగా పంటలు సాగులోకి వస్తాయన్నారు. వెంటనే ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, ఎంపీ రఘునందన్రావు స్పందించి చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో రైతులు రాజమల్లు, రాంచంద్రం, జోగయ్య, యాదగిరి, రాజయ్య, బాబు, ప్రవీణ్ తదితరులు ఉన్నారు. -
నేడు డయల్ యువర్ డీఎం
గజ్వేల్రూరల్: గజ్వేల్–ప్రజ్ఞాపూర్(జీపీపీ) ఆర్టీసీ డిపో పరిఽధిలో మంగళవారం ‘డయల్ యువర్ డీఎం’ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బస్సులలో రాకపోకలు సాగించే ప్రయాణికులకు సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని జీపీపీ ఆర్టీసీ డిపో మేనేజర్ పవన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల సమస్యలు తెలుసుకోవడంతో పాటు వాటిని పరిష్కరించేందుకు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఉదయం 11గంటల నుంచి 12గంటల వరకు 99592 26270 నంబర్కు ఫోన్ చేసి సమస్యలు, సూచనలు తెలపాలన్నారు. నాచగిరి హుండీ ఆదాయం రూ.15.42 లక్షలు వర్గల్(గజ్వేల్): నాచగిరి లక్ష్మీనృసింహ క్షేత్రంలో సోమవారం హుండీ కానుకలు లెక్కించారు. గడచిన 88 రోజులలో భక్తులు వేసిన కానుకల ద్వారా ఆలయానికి రూ.15,42,922 ఆదాయం సమకూరినట్లు కార్యనిర్వహణాధికారి విశ్వనాథశర్మ తెలిపారు. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి పర్యవేక్షణలో హుండీలను తెరిచారు. హైదరాబాద్ భ్రమరాంబిక సేవాసమితి సభ్యులు, శివకేశవ స్వచ్ఛంద సంస్థ సభ్యులు, ఆలయసిబ్బంది హుండీ కానుకల లెక్కింపులో పాల్గొన్నారు. వర్గీకరణ తర్వాతే నియామకాలు చేపట్టాలి ఎమ్మార్పీఎస్ నిరసన దీక్షలు ప్రారంభం గజ్వేల్: ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాతే గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3 ఉద్యోగాల నియామకాలు చేపట్టాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం గజ్వేల్లో నిరసన దీక్షలను ప్రారంభించారు. ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జి ఉబ్బని ఆంజనేయులు మాదిగ అధ్వర్యంలో ఈ దీక్షలు చేపట్టారు. ఎంఈఎఫ్(మాదిగ ఉద్యోగుల సమాఖ్య) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేబర్తి యాదగిరిమాదిగ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యేవరకు ఉద్యోగాల నియామకాలను ఆపేయాల్సిందేనని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మహజన సోషలిస్టు పార్టీ(ఎంఎస్పీ) రాష్ట్ర నాయకులు మైస రాములు మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బుడిగే మహేశ్ తదితరులు పాల్గొన్నారు. కుష్ఠు రహిత సమాజాన్ని నిర్మిద్దాం డీఎంహెచ్ఓ డాక్టర్ పల్వన్కుమార్ సిద్దిపేటకమాన్: కుష్ఠు రహిత సమాజాన్ని నిర్మించేందుకు జిల్లాలో సోమవారం నుంచి ఈ నెల 30వరకు క్షేత్రస్థాయిలో ఆశాకార్యకర్తల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్ఓ పల్వన్కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి వ్యాధి లక్షణాలు ఉన్న వారిని ముందస్తుగా గుర్తించి చికిత్స అందిస్తామన్నారు. కుష్ఠు వ్యాధిపై ప్రజలలో ఉన్న అపోహలను తొలగించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. జిల్లాలో 882 టీంల ద్వారా సర్వే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. వైద్య సిబ్బంది గృహ సందర్శనకు వచ్చినపుడు ప్రజలు సహకరించాలన్నారు.బీజేపీతోనే బీసీల అభివృద్ధిజగదేవ్పూర్(గజ్వేల్): బీజేపీతోనే దేశంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ అన్నారు. సోమవారం గొల్ల, కురుమ సంఘం ఆధ్వర్యంలో కొండపోచమ్మ ఆలయ అవరణలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సన్మానం కార్యక్రమం నిర్వహించారు. నూతనంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై న ఆయనను సంఘం నేతలు సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు ఐలయ్యయాదవ్, నాయకులు భాస్కర్, రాజు, నర్సింహులు, రమేశ్ పాల్గొన్నారు. -
తాగునీటికీ తండ్లాటే
కొండపాక(గజ్వేల్): గ్రామాల్లో తాగునీటికీ తండ్లాట తప్పడంలేదు. మిషన్ భగీరథ పథకం మంచి నీటి సరఫరాను పట్టించుకునేవారేలేరు. దీంతో ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుకునూరుపల్లి మండలం లకుడారంలో సుమారు 1800 జనాభా ఉంటుంది. కోమటి బండ నుంచి గ్రామానికి భగీరథ పథకం నుంచి నీరు సరఫరా చేసేవారు. ఈక్రమంలో గ్రామానికి నీటి సరఫరా అయ్యే పైపులైన్ దెబ్బతిన్నది. పది రోజలవుతున్నా మరమ్మతుకు నోచుకోవడంలేదు. దీంతో గ్రామ పంచాయతీ ట్యాంకర్ ద్వారా ఒక్కసారే సరఫరా చేస్తుండటంతో స్థానికులు పిల్లపాపలతో క్యూ కట్టాల్సి వస్తోంది. వ్యవసాయ బోరుబావుల నుంచి తెచ్చుకుందామన్నా ఎండాకాలం కావడంతో రైతులు అడ్డుచెబుతున్నారు. అధికారులు స్పందించి భగీరథా పథకం ద్వారా తాగు నీరు సరఫరా అయ్యేలా చూడాలని కోరుతున్నారు. ఈవిషయమై గ్రిడ్ ఏఈ వెంకటేశ్ను వివరణ కోరగా కోమటిబండ వద్ద నీటి కొరత ఏర్పడటంతో నీటి సమస్య ఏర్పడిందన్నారు. రెండు మూడు రోజుల్లో నీరు సరఫరా అయ్యేలా చూస్తామన్నారు. లకుడారంలో నీటి గోస ట్యాంకర్ ద్వారా సరఫరా బిందెడు నీటి కోసం పిల్లాపాపలతో క్యూ -
అదనపు పీపీగా ఆత్మారాములు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఆత్మారాములును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్ల పాటు ఆత్మారాములు విధులు నిర్వహించనున్నారు. ఆయన మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన విధులను సక్రమంగా నిర్వహిస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఆత్మారాములును కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఎండీ రఫీయోద్దీన్, డీసీసీ లీగల్ సెల్ అధ్యక్షుడు జీవన్రెడ్డి, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. -
పొట్ట దశలో పుట్టెడు కష్టాలు
పక్క చిత్రంలో రైతు పేరు శతవేణి కొమురయ్య.. కోహెడ మండలం రామచంద్రాపూర్కు చెందిన ఈ రైతు.. మోయతుమ్మెద వాగు శివారులో మూడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నారు. వరి సాగు చేశాడు. పంట పొట్ట దశలో ఉండగా.. నీరందక పొలం ఎండిపోయింది. ఇప్పటికే పంట కోసం రూ.80వేల వరకు పెట్టుబడి పెట్టారు. పంట ఎండిపోవడంతో తీవ్రంగా నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఒక్క రైతు పరిస్థితే కాదు జిల్లాలో పంటలు సాగు చేస్తున్న దాదాపు అందరిదీ ఇదే దుస్థితి.సాక్షి, సిద్దిపేట: జిల్లాలో గత అక్టోబర్ వరకు వర్షాలు కురిశాయి. దీంతో యాసంగిలో వరి సాగుకు ఏమాత్రం ఢోకా లేదని భావించారు. చెరువులు, వాగులు, బోరుబావులపై ఆధారపడి.. ఎక్కువ మంది రైతులు వరి సాగుకే మొగ్గు చూపారు. వారందరూ ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నారు. పెరుగుతున్న ఎండలకు బోరుబావుల్లో భూగర్భజలాలు అడుగంటాయి. కొత్త బోర్లు వేసినా.. ఫలితం కానరావడంలేదు. పొట్టదశలో ఉన్న వరి పైరును కాపాడుకోలేని నిస్సహాయస్థితిలో జీవాలకు మేతగా వదిలేస్తున్నారు. వరి, మొక్కజొన్న పంటల పరిస్థితి చూసి, జిల్లా రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మరో నెల రోజుల్లో చేతికి.. మరో నెల నుంచి నెలన్నర రోజుల్లో చేతికి వచ్చే పంటలు ఎండిపోతున్నాయి. కొన్ని చోట్ల వరి పొలాలను రైతులు అర్ధంతరంగా వదిలేస్తున్నారు. మరికొందరు కొత్త బోర్లను తవ్వుతున్నా.. నీటి జాడ అందడంలేదు. కొందరు ట్యాంకర్లతో నీటి తడులందిస్తూ పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎండిపోయిన పంటలను వ్యవసాయ అధికారులు పరిశీలించి రైతులకు సూచనలిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 3.50లక్షల ఎకరాల్లో సాగవుతుండగా వ్యవసాయ అధికారుల లెక్కల ప్రకారం 2,094 ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. జిల్లాలో సగటున భూగర్భ జలాలు 12.13మీటర్ల లోతుకు పడిపోయాయి. మండలం ఎండిపోయిన ఎకరాలు చేర్యాల 300 కొమురవెల్లి 350 దూల్మిట్ట 15 మద్దూరు 15 దుబ్బాక 168 కొండపాక 190 అక్కన్నపేట 305 కోహెడ 152 జగదేవ్పూర్ 58 హుస్నాబాద్ 91 సిద్దిపేట అర్బన్ 45 తొగుట 48 సిద్దిపేట రూరల్ 50 మిరుదొడ్డి 77 దౌల్తాబాద్ 25 బెజ్జంకి 45 రాయపోల్ 40 చిన్నకోడూరు 20 అక్బర్పేట భూంపల్లి 90నీరందక పంట పొలాలన్నీ నెర్రలు ఇప్పటికే 2వేల ఎకరాలకుపైగా ఎండిన పంటలు మండుతున్న ఎండలతో అడుగంటుతున్న భూగర్భ జలాలు చేసేదిలేక జీవాలకు మేతగా పంట చేన్లు ఆదుకోవాలని కోరుతున్న రైతులు -
పోటెత్తిన భక్తజనం
కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. తొమ్మిదవ ఆదివారం ఆలయానికి భక్తులు పోటెత్తారు. వచ్చేవారం బ్రహ్మోత్సవాలు ముగియనుండటంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు పుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు చేశారు. గంగిరేణు చెట్టు వద్ద పట్నాలు వేసి, ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకున్నారు. కొండపైన ఉన్న రేణుక ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఏర్పాట్లను ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు. – కొమురవెల్లి(సిద్దిపేట) -
పర్యాటక కేంద్రంగా మహాసముద్రం
● రూ.10 కోట్లతో ప్రతిపాదనలు ● మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి హుస్నాబాద్రూరల్: డివిజన్ కేంద్రానికి సమీపంలోని మహాసముద్రంను పర్యాటక కేంద్రంగా సుందరీకరణ చేస్తున్నామని, ఇందుకు రూ.10 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఆదివారం ఉమ్మాపూర్లోని మహాసముద్రాన్ని పరిశీలించి, అభివృద్ధి పనులపై స్థానిక నాయకులతో చర్చించారు. నిధులు మంజూరు కాగానే పనులను ప్రారంభిస్తామన్నారు. పోతారం(ఎస్) జాతీయ రహదారి నుంచి బైరోని చెరువు, మహాసముద్రం వరకు రోడ్డు నిర్మాణం చేసి పర్యటక కేంద్రానికి కావల్సిన పనులను పూర్తి చేయడానికి పర్యటక శాఖ అధికారులు ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. హుస్నాబాద్ ప్రాంతానికి పొరుగు జిల్లాల నుంచి ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు వచ్చే అవకాశం ఉందన్నారు. మంత్రి వెంట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, మార్కెట్ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్ చందు తదితరులు ఉన్నారు. -
సమస్యల మోత..
సోమవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2025గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీఅభివృద్ధి ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’లా మారింది. కేసీఆర్ ప్రాతినిథ్య నియోజకవర్గంలోని ఈ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే మోడల్గా కీర్తించారు. అంతేకాదు.. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు నమూనాగా మార్చాలని గత ప్రభుత్వం భావించింది. ఈ మేరకు భారీ ప్రాజెక్టులు సైతం వచ్చాయి. కానీ ప్రధాన పనులన్నీ పెండింగ్లో ఉండటం ఆదర్శ పట్టణం స్ఫూర్తికి గండిపడుతోంది. ఫలితంగాసమస్యలు తీరక మున్సిపాలిటీ ప్రజలు అష్టకష్టాలుపడుతున్నారు. – గజ్వేల్ నాచగిరి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం వర్గల్(గజ్వేల్): నాచగిరి లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 19 నుంచి జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈఓ విశ్వనాథశర్మ పలువురు.. ప్రముఖులకు బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఎంపీ మాధవనేని రఘునందన్రావు, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు, డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డిలను వేర్వేరుగా కలిసి ఉత్సవాలకు హాజరుకావాలని కోరారు. యువత ఉపాధికి కృషి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాకలో మహిళా జాబ్మేళా దుబ్బాక: యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కృషిచేస్తానని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో మహిళా జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయన్నారు. ఎన్నో కంపెనీలు హైదరాబాద్కు తీసుకురావడం జరిగిందన్నారు. ఫాక్స్కాన్ మల్టినేషనల్ కంపెనీ ఆధ్వర్యంలో జాబ్మేళా నిర్వహించినట్లు తెలిపారు. ఈ కంపెనీలో సెల్ఫోన్ విడిభాగాలు తయారు అవతాయన్నారు. కంపెనీకి సెలక్ట్ అయినవారికి మంచి భవిష్యత్త్ ఉంటుందన్నారు. అభివృద్ధిపై దృష్టి సారించండి దుబ్బాక మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఆదివారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, అధికారులతో సమీక్షించారు. సందర్భంగా కలెక్టర్కు ఫోన్ చేసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. అనంతరం పంచాయతీ రాజ్ అధికారులతో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిపై చర్చించారు. నియోజకవర్గంలోని పలు బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించారు. చెక్కుల అందజేత అక్కన్నపేట(హుస్నాబాద్): మండలంలోని పెద్దతండా, జనగామ గ్రామాల్లో లబ్ధిదారులకు ఆదివారం ఆయా గ్రామాల నాయకులు సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. పెద్దతండా గ్రామ పరిధిలోని పంజాగుట్టతండాకు చెందిన గుగులోతు లకపతికి మంజూరైన రూ.60వేల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో నాయకులు రాంబాబునాయక్, భాస్కర్నాయక్, జమిలాల్నాయక్, నరసింహనాయక్, తిరుపతినాయక్ తదితరులు పాల్గొన్నారు.హైదరాబాద్ నగరానికి అతి సమీపంలో ఉన్న గజ్వేల్ మున్సిపాలిటీ స్థిరనివాసమేర్పరుచుకోవడానికి అనువైన పట్టణం. ఇప్పటికే గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్మెంట్ కల్చర్ పెరుగుతోంది. కానీ పాలకుల నిర్లక్ష్యం పట్టణానికి శాపంగా మారుతోంది. పెండింగ్లో ఉన్న ప్రధాన పనులను పూర్తి చేయగలిగితే పట్టణ ప్రతిష్ట మరింతగా పెరగనుంది. పట్టణంలో రూ.156కోట్ల వ్యయంతో చేపట్టిన యూజీడీ(అండర్ గ్రౌండ్ డ్రైనేజీ) పనులు లోపభూయిష్టంగా చేపట్టడం సమస్యగా పరిణమించింది. పనుల్లో నాణ్యతాలోపం బయటపడుతోంది. రూ.45కోట్లకుపైగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయనే కారణంతో సదరు కాంట్రాక్టర్ పనులను వందశాతం పూర్తిచేయకుండానే చేతులేత్తేశారు. ఫలితంగా వర్షం కురిసిన సందర్భంలో, పైప్లైన్లు లీకేజీతో మురుగునీరు చాంబర్ల నుంచి బయటకు ఉబికి వస్తోంది. దీంతో దుర్గంధం వ్యాపిస్తోంది. పెండింగ్లో బస్టాండ్ల నిర్మాణం పట్టణంలో తూప్రాన్ రోడ్డువైపు రూ.10కోట్ల వ్యయంతో అధునాతన హంగులతో బస్టాండ్ నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు. కానీ రింగు రోడ్డు అనుసంధానం పూర్తికాకపోవడంతో ఈ బస్టాండ్కు బస్సులు రాక నిరుపయోగంగా మారింది. మరో రూ.7కోట్లకుపైగా వ్యయంతో పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పక్కన నిర్మిస్తున్న మూవింగ్ బస్టాండ్, ప్రజ్ఞాపూర్లో రాజీవ్రహదారిపై నిర్మిస్తున్న మరో బస్టాండ్ పెండింగ్లో ఉండటం ప్రయాణికులకు ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. నత్తనడకన రోడ్డు విస్తరణ మున్సిపాలిటీలోని కోటమైసమ్మ గుడి వైపు వెళ్లే రోడ్డును 1.3 కిలోమీటర్ల మేర 70ఫీట్లుగా విస్తరించాలని నిర్ణయించారు. ఈ పనులకు రూ.12కోట్లు వెచ్చిస్తున్నారు. కొన్నేళ్లుగా పనులు సాగు...తూనే ఉన్నాయి. ప్రత్యేకించి ఎంపీడీఓ కార్యాలయం నుంచి కోటమైసమ్మ గుడి వరకు పూర్తిస్థాయిలో పనులు చేపట్టలేదు. బీటీ కొంత వేసి, కొంత పెండింగ్లో ఉంచారు. రోడ్డుకు ఇరు పక్కలా డ్రైనేజీ పనులు సైతం పెండింగ్లోనే ఉన్నాయి. రోడ్డు విస్తరణ సందర్భంలో ఎంతోమంది ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. వీరిలో కొందరికీ మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారు. ఇంకా చాలా మందికి ఇళ్లు అందాల్సి ఉంది. డబుల్ ఇళ్లపై తరుచూ ఆందోళనలు మున్సిపాలిటీకి మొత్తం 1,250 ఇళ్ల మోడల్ కాలనీని మంజూరు చేశారు. ఈ కాలనీ 156 బ్లాకులుగా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఒక్కో బ్లాకులో కింద నాలుగు, పైన నాలుగు(మొత్తం 8 ఇళ్లు) రెండు ఫ్లోర్లుగా నిర్మాణం జరిగింది. ఒక్కో ఇల్లు 570 చదరపు గజాల విస్తీర్ణంలో కాలనీలో అన్ని రకాల వసతులను కల్పించారు. కానీ పంపిణీ వ్యవహారం ఏళ్ల తరబడి నానుతూ వస్తోంది. వివిధ రకాల ఆందోళనల తర్వాత 2023 మార్చి 21న తుది డ్రా నిర్వహించి 1100మందిని ఎంపిక చేశారు. వివిధ కారణాల వల్ల గృహప్రవేశాలు నిలిచిపోగా ఈ అంశంపై తరుచూ రచ్చ కొనసాగుతోంది. డంపింగ్ యార్డు భద్రత గాలికి మున్సిపాలీటీలోని డంపింగ్ యార్డులో ఏటా అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం మున్సిపాలీటీ పరిధిలో కొత్తగా ఏర్పడిన ఆర్అండ్ఆర్ కాలనీలతో కలుపుకొని 15వేలకుపైగా ఇళ్లు ఉన్నాయి. జనాభా 80వేల పైచిలుకు చేరుకున్నది. ఈ నేపథ్యంలో ఇక్కడ నిత్యం ఉత్పత్తి అవుతున్న చెత్త 20మెట్రిక్ టన్నుల పైనే. చెత్తలోని వివిధ రకాల పదార్థాల వల్ల మంటలు వ్యాపించి డంపింగ్ యార్డులో తరుచూ వందలాది టన్నుల చెత్త దగ్ధమవుతోంది. ఈ పొగ పట్టణంలో వ్యాపిస్తూ ప్రజారోగ్యానికి శాపంగా మారుతోంది. కాలనీల్లో రోడ్లు అధ్వానం మున్సిపాలిటీ పరిధిలో 80కిలోమీటర్ల పొడవునా అధ్వానంగా ఉన్న అంతర్గత రోడ్లను సీసీ రోడ్లుగా మార్చడానికి సుమారుగా రూ.120 కోట్ల నిధులు అవసరమని గత బీఆర్ఎస్ హయాంలో ప్రతిపాదించారు. కానీ రెండేళ్ల క్రితం ఇందులో కేవలం రూ. 22.87కోట్లు మాత్రమే నిధులు విడుదలయ్యాయి. దీంతో అరకొరగా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి వదిలేశారు. అంతర్గత రోడ్లు సక్రమంగా లేని లక్ష్మీప్రసన్ననగర్ కాలనీ, భారత్ నగర్, ప్రజ్ఞాపూర్లోని పలు వార్డులు, అదేవిధంగా విలీన గ్రామాలైన క్యాసారం, ముట్రాజ్పల్లి గ్రామాల్లోని ప్రజలు నరకం చవిచూస్తున్నారు. ప్రత్యేక కార్యాచరణ గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకుసాగుతున్నాం. ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ప్రాధాన్యత క్రమంలో, దశల వారీగా పరిష్కరించడానికి కృషి చేస్తాం. – గొల్కొండ నర్సయ్య, మున్సిపల్ కమిషనర్ప్రమాదాలకు చెక్ పెట్టాలి గజ్వేల్ పట్టణంలో రింగు రోడ్డు పనులు పూర్తికాకపోవడంతో భారీ వాహనాలు పట్టణంలోకి వస్తున్నాయి. ఫలితంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తి ప్రమాదాలు జరుగుతున్నాయి. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారిపై ప్రయాణమంటేనే జంకే పరిస్థితి ఏర్పడింది. రింగు రోడ్డు అనుసంధానం పూర్తి చేసి ప్రమాదాలకు చెక్ పెట్టాలి. – బారు అరవింద్, మున్సిపాలిటీమున్సిపాలిటీలో అంతర్భాగం కాదా? మున్సిపాలిటీలో విలీన గ్రామాలైన క్యాసారం, ముట్రాజ్పల్లి, రాజిరెడ్డిపల్లి, సంగుపల్లి, సంగాపూర్లలో యూజీడీ నిర్మించాలని ఏళ్లతరబడి కోరుతున్నాం. అయినా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. మేము మున్సిపాలిటీలో అంతర్భాగం కాదా? మాపై ఎందుకు ఈ నిర్లక్ష్యం. – ప్రవీణ్, క్యాసారం గ్రామస్తుడు తగ్గిన భగీరఽథ నీటి సరఫరా.. మున్సిపాలిటీకి నిత్యం 7.5 ఎంఎల్డీ(మిలియన్ లీటర్స్ ఫర్ డే) నీరు అవసరం. ప్రస్తుతం 5ఎంఎల్డీ నీటి సరఫరా మాత్రమే జరుగుతోంది. దీనివల్ల భవిష్యత్తులో నీటి గండం తలెత్తే ప్రమాదం ఉంది. పట్టణంలో కొత్త కాలనీలకు ఇంకా మిషన్ భగీరథ కనెక్షన్లు వందల సంఖ్యలో ఇవ్వాల్సి ఉంది. దీనిపై అధికారుల కార్యాచరణ ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే.న్యూస్రీల్ యూజీడీ నిర్మాణం లోపభూయిష్టం కాలనీల్లో తరుచూ మురుగు ప్రవాహం పారిశుద్ధ్య లోపంతో సతమతం రింగు రోడ్డు పూర్తి కాక.. ట్రాఫిక్ ఇక్కట్లు ఇళ్లు పంపిణీకి నోచుకోక తరుచూ ‘డబుల్’ రచ్చ కాలనీల్లో అంతర్గత రోడ్లు కచ్చ వానొస్తే లోతట్టు కాలనీల్లో వణుకే గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీవాసుల కష్టాలు వర్ణనాతీతం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ స్వరూపం సుందరీకరణ పనులకు బ్రేక్ మూడేళ్ల క్రితం మున్సిపల్ పాలకవర్గం పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దడానికి సంకల్పించింది. ఈ క్రమంలోనే పట్టణంలోని మహనీయుల విగ్రహాల జంక్షన్లను అందంగా తీర్చిదిద్ది, వాటర్ ఫౌంటెన్లను ఏర్పాటు చేయాలని, ‘లవ్ జీపీపీ’ పేరిట స్వాగత ద్వారాలను ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. ఇందుకోసం రూ.2కోట్లు నిధులు కూడా విడుదల చేసిన సంగతి తెల్సిందే. ఈపనులు అరకొరగా సాగి బ్రేక్ పడ్డాయి. పూర్తికానీ రింగు రోడ్డు అనుసంధానం రూ.230కోట్లతో చేపట్టిన రింగు రోడ్డు అనుసంధానం పూర్తికాకపోవడంతో ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. ధర్మారెడ్డిపల్లి–జాలిగామ గ్రామాల మధ్య 1.5కిలోమీటర్ల పొడువున పెండింగ్లో ఉన్న పనులను ప్రస్తుతం చేపడుతున్నారు. సిటిజన్స్ క్లబ్ భవనం వద్ద సుమారు 250మీటర్ల మేర పనులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. మొత్తం 24కిలోమీటర్లకు ఇప్పటివరకు 22కిలోమీటర్ల మేర పూర్తయినా ఉపయోగం లేకుండాపోయింది. ఒకవేళ రింగు రోడ్డు నిర్మాణం పూర్తయి ఉంటే ట్రక్కులు ఇతర భారీ వాహనాలు పట్టణంలోకి రాకుండా రింగు రోడ్డు గుండా వెళ్లిపోయే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం భారీ వాహనాలన్నీ పట్టణంలోని ప్రధాన రహదారి గుండా వెళ్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి. ఫలితంగా ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. విలీన గ్రామాల యూజీడీ ప్రతిపాదనకు మంగళం మున్సిపాలీటీలో విలీనమైన ముట్రాజ్పల్లి, క్యాసారంతోపాటు మధిర గ్రామాలైన సంగాపూర్, రాజిరెడ్డిపల్లి, సంగుపల్లిల్లో రెండో విడతలో యూజీడీ పనులు చేపట్టడానికి నిర్ణయించారు. సుమారు 40కిలోమీటర్లకుపైగా ఆయా గ్రామాల్లో భూగర్భ మురుగునీటి వ్యవస్థ అవసరమని గుర్తించారు. ఇందుకోసం రూ.49కోట్లు అవసరమని ఇప్పటికే ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. కానీ ఈ ప్రతిపాదనలకు దాదాపుగా మంగళం పాడారు. -
కాళేశ్వరంతో గోదావరి పరవళ్లు
చిన్నకోడూరు(సిద్దిపేట): కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో పల్లెల్లో గోదావరి నీళ్లు పరవళ్లు తొక్కుతున్నాయని ఎమ్మెల్యే హరీష్రావు అన్నారు. ఆదివారం రంగనాయక సాగర్ ప్రధాన కాల్వ నుంచి చిన్నకోడూరు బెల్లంకుంటకు సాగు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదన్న కాంగ్రెస్ నేతలు చిన్నకోడూరుకు వచ్చి చూడాలని సవాల్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి వల్లే రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సిద్దిపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం అసెంబ్లీలో కూడా గట్టిగా కొట్లాడుతాని.. ప్రజల కష్ట సుఖాల్లో అందుబాటులో ఉంటానని అన్నారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.అక్రమ కేసులకు భయపడను సిద్దిపేటజోన్: నియోజకవర్గ అభివృద్ధి కోసం అసెంబ్లీలో గళం ఎత్తి ప్రభుత్వాన్ని నిలదీస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో పలువురి లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బెదిరేదిలేదన్నారు. సాగునీరు లేక దుబ్బాక, చేర్యాల ప్రాంతంలో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆదాయం పడిపోయిందని, కేసీఆర్ హయంలో రాష్ట్రం పురగమనంలో ఉంటే కాంగ్రెస్ పాలనలో తిరోగమనంలోఉందన్నారు. పెట్టుబడులు తగ్గి రాష్ట్ర పరిస్థితి అధ్వనంగా మారిందని విమర్శించారు.అంతకు ముందు బీఆర్ఎస్ సభ్యత్వం ఉండి ప్రమాదవశాత్తు చనిపోయిన వారి కుటుంబాలకు బీమా చెక్కులు అందజేశారు.ఎమ్మెల్యే హరీష్రావు -
దళితులంటే బీఆర్ఎస్ నేతలకు చిన్నచూపు
● డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి ఫైర్ ● గజ్వేల్లో కేటీఆర్, జగదీశ్వర్రెడ్డిలదిష్టిబొమ్మలు దహనం గజ్వేల్: దళితులంటే బీఆర్ఎస్ నేతలకు చిన్నచూపు అని, ప్రజలు బుద్ధి చెప్పినా, అధికారం కోల్పోయినా వారిలో మార్పు రావడం లేదని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి మండిపడ్డారు. స్పీకర్పై జగదీశ్వర్రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివారం గజ్వేల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీశ్వర్రెడ్డిల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులంటే బీఆర్ఎస్కు మొదటి నుంచి చిన్నచూపు ఉందని ఆరోపించారు. స్పీకర్ ప్రసాద్కుమార్ను అసెంబ్లీలో ఆ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్వర్రెడ్డి అగౌరవపరిచే విధంగా మాట్లాడడం తగదన్నారు. జగదీశ్వర్రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ గజ్వేల్ ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్రెడ్డి, మాజీ కార్పోరేషన్ చైర్మన్ భూంరెడ్డి, యూత్కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ సర్ధార్ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, టీపీసీసీ నాయకులు సాజిద్బేగ్ తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటక కేంద్రంగా మహాసముద్రం
● రూ.10 కోట్లతో ప్రతిపాదనలు ● మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి హుస్నాబాద్రూరల్: డివిజన్ కేంద్రానికి సమీపంలోని మహాసముద్రంను పర్యాటక కేంద్రంగా సుందరీకరణ చేస్తున్నామని, ఇందుకు రూ.10 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఆదివారం ఉమ్మాపూర్లోని మహాసముద్రాన్ని పరిశీలించి, అభివృద్ధి పనులపై స్థానిక నాయకులతో చర్చించారు. నిధులు మంజూరు కాగానే పనులను ప్రారంభిస్తామన్నారు. పోతారం(ఎస్) జాతీయ రహదారి నుంచి బైరోని చెరువు, మహాసముద్రం వరకు రోడ్డు నిర్మాణం చేసి పర్యటక కేంద్రానికి కావల్సిన పనులను పూర్తి చేయడానికి పర్యటక శాఖ అధికారులు ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. హుస్నాబాద్ ప్రాంతానికి పొరుగు జిల్లాల నుంచి ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు వచ్చే అవకాశం ఉందన్నారు. మంత్రి వెంట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, మార్కెట్ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్ చందు తదితరులు ఉన్నారు. -
ఏం కష్టమొచ్చిందో.. దంపతుల ఆత్మహత్య.. అనాథలైన పిల్లలు
సిద్దిపేట: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఏం కష్టమొచ్చిందో దంపతులు ఆత్మ హత్య చేసుకున్నారు. ముందుగా భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా, ఆపై భార్త కూడా పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు.వివరాల్లోకి వెళితే.. తొగుట మండలం ఎల్లారెడ్డిలో ఈ దారుణం జరిగింది. కెమ్మసారం భాగ్య పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీన్ని చూసిన భర్త నాగరాజ్.. భార్య లేని జీవితం వద్దకుని అతను కూడా పురుగుల మందు సేవించాడు. దాంతో నాగరాజ్ కూడా తనువు చాలించాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఆ దంపతులకున్న నలుగురు పిల్లలు అనాథులుగా మారిపోయారు. అమ్మా, నాన్న ఇక తమతో ఉండరని తెలిసి రోదిస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేసిన హరీష్ రావు
సిద్దిపేట జిల్లా : సిద్ధిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 184 లబ్ధిదారులకు సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ‘ పేదల కోసం సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఎలా ఉన్నదో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఊళ్లలో కరెంట్ కష్టాలు మళ్లీ వచ్చాయి.ప్రజలకు ఆశ చూపి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. పేద ప్రజల కోసం కేసీఆర్ ఎప్పుడూ ఆలోచించేవాడు. రేవంత్ మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. సిద్ధిపేటకు రేవంత్ అన్యాయం చేస్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు సిద్ధిపేట బాగా అభివృద్ధి చెందింది. మళ్లీ కేసీఆర్ రావాలి అని అందరూ అనుకుంటున్నారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ బాగా పడిపోయింది. అన్ని రంగాల్లో విఫలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. సిద్ధిపేట అభివృద్ధి కోసం అసెంబ్లీలో కూడా కొట్లాడతా. కేసీఆర్ అన్ని ప్రాజెక్టులు నిర్మించాడు. బుద్ధి లేని ప్రభుత్వం రాష్ట్రాన్ని పరిపాలిస్తోంది’ అని హరీష్ విమర్శించారు. -
ఇక ఈజీ..!
ఆదివారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2025ఈవీ చార్జింగ్..టైం వేస్ట్ కావడం లేదు కారు చార్జింగ్ కోసం ఇది వరకు ప్రత్యేకంగా టైం కేటాయించే వాళ్లం. ఇప్పుడు హోటళ్లలో ఈ– ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తుండటంతో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ టైం ఏది అయితే ఆ సమయంలో ఒక గంట సమయం ఛార్జింగ్ పెడుతున్నాం. ఇలా అన్ని హోటళ్లలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. – ముక్తా శ్రీనివాస్, మంచిర్యాల రోజుకు 10 కార్లు చార్జింగ్ రెండు నెలల క్రితం మా హోటల్లో రెండు కంపెనీలకు చెందిన వారు ఈవీ– ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. కారు ఛార్జింగ్ అయ్యే సమయంలో కస్టమర్లు భోజనం, టిఫిన్, స్నాక్స్, టీ తాగుతున్నారు. ఇలా రోజుకు 10 కంటే ఎక్కువగానే వాహనాలు ఛార్జింగ్ చేసుకుంటున్నారు. కస్టమర్ల నుంచి మంచి స్పందన ఉంది. గతంలో ఈ– ఛార్జింగ్ స్టేషన్ ఎక్కడ ఉందని కస్టమర్లు అడిగే వారు. ఇప్పుడు వారి ఇబ్బందులు తప్పాయి. – కేఆర్శర్మ, జీఎం, హరిత మినర్వా, సిద్దిపేట సాక్షి, సిద్దిపేట: హోటళ్లు, షాపింగ్ మాల్స్లో ఈ–చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడంతో వాహనదారులకు ఇబ్బంది తప్పినట్లు అయింది. దీంతో సాఫీగా ప్రయాణం సాగిస్తున్నారు. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ అయితే సామర్థ్యాన్ని బట్టి నిమిషాల్లో ట్యాంక్ ఫుల్ అవుతుంది. అదే ఎలక్ట్రిక్ కారు అయితే 45 నిమిషాల నుంచి ఆరు గంటల వరకు ఛార్జింగ్ అవసరమవుతోంది. ఎక్కువగా ఎంజీ, టాటా, హ్యుందాయ్, కియా, బీవైడీ కార్లను వినియోగిస్తున్నారు. మార్కెట్లో రూ.8 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు (బెంజ్ లాంటి కంపెనీలు కాకుండా) కార్ల ధరలు ఉన్నాయి. కార్లను బట్టి 45 నిమిషాల నుంచి 8 గంటల పాటు చార్జింగ్ చేసే 50 కిలో మీటర్ల నుంచి సుమారుగా 350 కిలో మీటర్లు ప్రయాణించవచ్చు. ప్రస్తుతం అంతా ఈవీలపైనే ప్రజలు మక్కువ చూపుతున్నారు. గతంలో ఎలక్ట్రిక్ కారు యజమానులు ముందుగానే బ్యాటరీ చార్జింగ్ చేయించుకునేవారు. కొంత లిమిట్ వరకే వెళ్లేవారు.. మళ్లీ ఛార్జింగ్ స్టేషన్ ఎక్కడ ఉందని వెతుక్కొని చార్జింగ్ పెట్టుకునేవారు. దూర ప్రయాణం చేయాల్సి వస్తే కొంత ఇబ్బంది పడాల్సి వచ్చేది. దీంతో పలు కంపెనీలు ఈ–చార్జింగ్ స్టేషన్లను హోటల్, షాపింగ్ మాల్స్లలో ఏర్పాటు చేస్తున్నారు. దీంతో వాహనదారులకు టెన్షన్ పోయింది. ప్రత్యేక యాప్లో వివరాలు.. పలు కంపెనీలను ఈ–చార్జింగ్ స్టేషన్లకు సంబంధించి ప్రత్యేక యాప్లను అందుబాటులోకి తెచ్చారు. యాప్ ద్వారా సమీప హోటల్, షాపింగ్ మాల్స్లలో ఎక్కడ ఈ–చార్జింగ్ స్టేషన్ అందుబాటులో ఉందో తెలుసుకోవచ్చు. యాప్ ద్వారానే స్లాట్ బుక్ చేసుకోవచ్చు. దీని ద్వారానే డబ్బులు సైతం చెల్లించవచ్చు. దీంతో ప్రయాణం చేసే సమయంలో వాహనాల యజమానులు హోటళ్లలో ఈ –కారు చార్జింగ్ చేసుకునేందుకు మక్కువ చూపుతున్నారు. ఒక వైపు కారులో ప్రయాణించే వారు భోజనం, స్నాక్స్ తీనే సమయంలోనే కారు చార్జింగ్ అవుతుంది. యూనిట్లను బట్టి ఆయా కంపెనీలు ఛార్జింగ్కు డబ్బులు వసూలు చేస్తున్నాయి.న్యూస్రీల్హోటళ్లు, రెస్టారెంట్లలో స్టేషన్ల ఏర్పాటు టిఫిన్, భోజనం చేసి వచ్చేసరికి పూర్తి వాహనదారుల సమయంవృథా కాకుండా ఏర్పాటు సంవత్సరం రిజిస్ట్రేషన్ అయిన అన్ని రకాల వాహనాలు 2020–2021 8,79,826 2021–2022 9,51,780 2023–2024 9,76,073 -
మాటలే తప్ప చేతలేవీ..?
● మైనార్టీలకు అన్యాయం చేసిన సర్కార్ ● కేబినెట్లో వారికి చోటేది..? ● హామీల అమలులో విఫలం ● సీఎం రేవంత్పై హరీశ్రావు ధ్వజంరామచంద్రాపురం(పటాన్చెరు): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివి మాటలు తప్ప చేతలు శూన్యమని మండిపడ్డారు. శనివారం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని విద్యుత్నగర్లో మాజీ సర్పంచ్ మల్లెపల్లి సోమిరెడ్డి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హరీశ్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మైనార్టీల సంక్షేమానికి రూ.4వేల కోట్లు ఇస్తానని హామీనిచ్చిందన్నారు. అయితే గత బడ్జెట్లో రూ.3వేల కోట్లు మాత్రమే కేటాయించి ఇప్పటివరకు కేవలం రూ.వెయ్యికోట్లే ఖర్చు చేసిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మైనార్టీ యువతకు, మహిళలకు కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు. గత కేసీఆర్ ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని, దానితోపాటు సకాలంలో షాదీ ముబారక్ పథకం కింద ఆర్థిక సాయం అందించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మత ఘర్షణలు పెచ్చుమీరాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్రెడ్డి కేబినెట్లో ఒక మైనార్టీ మంత్రి కూడా లేరని కనీసం వారికి ఎమ్మెల్సీ సీటు కూడా ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ లౌకికవాద పార్టీ అని చెప్పుకుంటూ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్రెడ్డి ప్రధాని మోదీతో ఉన్న అనుబంధాన్ని వ్యక్త పరిచారని గుర్తు చేశారు. దీన్ని బట్టి చూస్తే మైనార్టీల కాంగ్రెస్కు ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే కారణంతెల్లాపూర్ మున్సిపాలిటీలో అభివృద్ధి కుంటుపడటానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని హరీశ్రావు ఆరోపించారు. గత ప్రభుత్వ హాయాంలో తెల్లాపూర్ ప్రజల అవసరాల కోసం రూ.500 కోట్ల విలువైన ఐదు ఎకరాల భూమిని కేటాయించి అందులో కోట్లాది రూపాయలతో ఫంక్షన్ హాల్ను నిర్మించామని అయితే ఇప్పటికీ అది ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదని మండిపడ్డారు. అదేవిధంగా వెజ్ నాన్వెజ్ మార్కెట్ కోసం నిధులు మంజూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిధులను వెనక్కి తీసుకుందని విమర్శించారు. పెండింగ్ నిధులను ఇచ్చి అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతకుముందు తెల్లాపూర్ మున్సిపల్ కార్యాలయాన్ని ఆనుకొని నిర్మించిన ఫంక్షన్ హాల్, అసంపూర్తిగా ఉన్న వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ను ఆయన సందర్శించారు. కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే క్రాంతి, రసమయి బాలకిషన్, గువ్వల బాల్రాజ్, మాజీ వైస్ చైర్మన్ రాములుగౌడ్, సీనియర్ నాయకులు ఎల్లయ్య, బాల్రెడ్డి, ఆదర్శ్రెడ్డి, గోవర్దన్రెడ్డి పాల్గొన్నారు. -
గజ్వేల్ కాంగ్రెస్లో గ్రూపుల గోల
● తారస్థాయికి తూంకుంట,బండారు మధ్య విభేదాలు ● ఇరువర్గాల మధ్య సయోధ్యకుమైనంపల్లి యత్నాలు ● కలసిపని చేయాలని నిర్ణయంగజ్వేల్: గజ్వేల్ కాంగ్రెస్ గ్రూపులపై అధిష్టానం సీరియస్గా ఉంది. వాటిని చెక్ పెట్టేందుకు చర్యలు చేపట్టింది. గ్రూపుల గోలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కొంత కాలంగా డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్రావు వర్గాల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలను వేర్వేరుగా నిర్వహిస్తున్న విషయం విదితమే. గతేడాది డిసెంబర్ 3న ములుగు మండలం బండతిమ్మాపూర్లో సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సాక్షిగా రెండు వర్గాల విభేదాలు రచ్చకెక్కిన విషయం కూడా తెలిసిందే. ఆ తర్వాత కూడా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర పార్టీకి కొత్త ఇన్చార్జీగా మీనాక్షి నటరాజన్ వచ్చిన సందర్భంలో గజ్వేల్పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాకా కావడం, బీఆర్ఎస్ ఇక్కడ పటిష్టంగా ఉన్న తరుణంలో కాంగ్రెస్లో విభేదాలు ఇదే తరహాలో కొనసాగితే... నష్టం తప్పదని గ్రహించి రెండు వర్గాల మధ్య చర్చలు జరపాలని సూచించినట్లు తెలిసింది. ఈ బాధ్యతలను మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే హన్మంతరావుకు అప్పగించారు. ఈ క్రమంలో మైనంపల్లి రెండు వర్గాలతో సయోధ్య చర్చలు జరిపే పనిలో ఉన్నారు. ఈ మేరకు కొన్ని రోజుల కింద సిద్దిపేటలో ఇరు వర్గాల మధ్య జరిపారు. తాజాగా శనివారం మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని తన నివాసం పక్కన ఉన్న ఓ ఆలయంలో మరోసారి చర్చలు జరిపారు. కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలు గజ్వేల్కు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో వైరల్గా మారాయి. మైనంపల్లి ఆధ్వర్యంలో జరుగుతున్న చర్చలు ఫలిస్తే రెండు వర్గాలు ఏకతాటిపైకి వచ్చే అవకాశం ఉంది. -
జాతీయస్థాయి పోటీలో రాణించిన హంసిని
ప్రశాంత్నగర్(సిద్దిపేట): విద్యాభారతి సంస్కృతి శిక్షా సంస్థాన్ న్యూఢిల్లీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి వ్యాసరచన పోటీలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ విద్యార్థిని లక్ష్మీహంసిని ప్రథమ స్థానంలో నిలిచిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరేష్కుమార్ అన్నారు. శనివారం హంసినిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణతో అన్ని పోటీలలో రాణించవచ్చని, ఐదో తరగతి విద్యార్థిని లక్ష్మీహంసిని నిరుపించారని పేర్కొన్నారు. వెనుకబడిన పిల్లలకుఏఐ ద్వారా బోధన – డీఈఓ శ్రీనివాస్రెడ్డి జగదేవ్పూర్(గజ్వేల్): విద్యాపరంగా వెనుకబడిన పిల్లలకు కృత్రిమ మేధ సహాయంతో బోధన అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్రెడ్డి చెప్పారు. మండలంలోని వట్టిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కొన్ని పాఠశాలల్లో మాత్రమే ఉపయోగిస్తున్న ఈ ఏఐ విధానం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలలో ప్రవేశపెట్టేలా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో ఎంఈఓ మాధవరెడ్డి, ప్రధానోపాధ్యాయులు కనకయ్య, సరోజ, ఉపాధ్యాయులు శ్రీనివాస్, పరశురాములు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షల్లో ఇద్దరు డిబార్సిద్దిపేట ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల్లో ఇద్దరు విద్యార్థులు డిబార్ అయ్యారు. శనివారం ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు నిర్వహించిన పరీక్షల్లో విద్యార్థులు కాపీ చేస్తుండగా అధికారులు పట్టుకున్నారు. దౌల్తాబాద్లో ఒకరు, బెజ్జంకిలో మరొకరు పట్టుబడ్డారు. జిల్లాలోని 43 పరీక్ష కేంద్రాల్లో జనరల్, ఒకేషనల్ మొత్తం 8,050 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, 296 మంది వివిధ కారణాల చేత పరీక్షకు గైర్హాజరు అయ్యారు. 7,754 మంది విద్యార్థులతో 96శాతం విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఎంఆర్పీ ధర కంటే ఎక్కువ ఇవ్వొద్దు జిల్లా లీగల్ సర్వీసెస్ అఽథారిటీ కార్యదర్శి స్వాతిరెడ్డి సిద్దిపేటరూరల్: వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అఽథారిటీ కార్యదర్శి ఎస్.స్వాతిరెడ్డి అన్నారు. శనివారం నారాయణరావుపేటలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్వాతిరెడ్డి మాట్లాడారు. దుకాణాల నుంచి ఎలాంటి వస్తువులు కొన్నా వాటిని పరిశీలించిన తర్వా తనే ఎంఆర్పీ డబ్బులు చెల్లించాలని చెప్పారు. ఏదైనా వస్తువు కొనుగోలు చేసినప్పుడు దానిపై ఉన్న ప్రతీ అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. కాలపరిమితి, ఇతర సమస్యలు ఉంటే వెంటనే కంపెనీ వారికి సమాచారం అందించవచ్చన్నారు. ఎటువంటి వివరాలు లేని వస్తువులను కొనకూడదని తెలిపారు. ఎవరైనా ఎక్కువ ధరకు విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవచ్చని, వస్తువు సంబంధిత బిల్లును కూడా తీసుకోవాలని సూచించారు. వినియోగదారుడికి ఎలాంటి సమస్య ఉన్న వినియోగదారుల కోర్టులో ఉచితంగా కేసు వేయవచ్చన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ అపూర్వరెడ్డి, ఎంపీడీఓ సూపరింటెండెంట్ శ్రీనివాస్, కాంగ్రేస్ నాయకులు కరుణాకర్ పాల్గొన్నారు. -
లక్ష్యంపైనే గురి పెట్టండి
కొమురవెల్లి(సిద్దిపేట): విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులను పక్కన పెట్టి అనుకున్న లక్ష్యంపైనే గురిపెట్టాలని జిల్లా కలెక్టర్ మిక్కిలేని మనుచౌదరి సూచించారు. మండలంలోని గురువన్నపేట పాఠశాలలో ఎఫ్.ఎల్.ఎన్ (ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ) ప్రోగ్రాం ద్వారా విద్యార్థుల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు డీఈవో శ్రీనివాస్రెడ్డితో కలసి ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...జిల్లాలో ఏఐ ద్వారా విద్యాబోధన చేసేందుకు 31 పాఠశాలలు ఎంపిక చేసి ప్రస్తుతం 29 పాఠశాలలో ప్రారభించామన్నారు. జిల్లాలో రూ.30 కోట్లతో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా టాయిలెట్స్, అదనపు తరగతి గదులు, ప్రహరీగోడలు తదితర నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థులు భాషపై పట్టు ఉంటే విజయం సాధిస్తారని తెలిపారు. విద్యార్థులు ప్రతీరోజు వార్త పత్రికలు చదవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఇష్టమైన రంగాలలో కష్టపడితే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. బడిలో నేర్పిన విలువలే పాటిస్తారు విద్యార్థులకు స్టేజ్ ఫియర్ లేకుండా ప్రతీ రోజు ఒక్కో విద్యార్థితో వర్తమానం అంశాలపై మాట్లాడించాలని, పాఠశాలలో నేర్పిన విలువలు జీవితాంతం పాటిస్తారని ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచించారు. పాఠశాలకు కావాల్సిన మౌలిక వసతులు, పాఠశాల ప్రహరీగోడ, 5 కంప్యూటర్లను వెంటనే మంజూరు చేస్తానని హామీనిచ్చారు. వచ్చే విద్యాసంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పెరిగితే పాఠశాలకు బస్సు, అదనపు తరగతి గదులు, సైన్స్ల్యాబ్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి రామస్వామి, ఏఎస్వో భాస్కర్, తహసీల్దార్ దివ్య, ఎంపీడీవో శ్రీనివాస వర్మ, ఎంఈవో రమేశ్, ఎస్ఐ రాజు, పాఠశాల ప్రాధానోపాధ్యాయుడు బి.రాజు, ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్లు పాల్గొన్నారు. ఇష్టమైన రంగాల్లో కృషి చేస్తే సత్ఫలితాలు కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి -
పంటలను కాపాడండి
● దేవాదుల మూడవ ఫేజ్ మోటార్లుఆన్ చేయండి ● సర్కార్ నిర్లక్ష్యంతోనేఎండిపోతున్న పంటలు ● అసెంబ్లీలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిచేర్యాల(సిద్దిపేట): దేవాదుల ప్రాజెక్టు నుంచి మూడవ ఫేజ్ మోటార్లు ఆన్చేసి సాగునీరు అందించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన అసెంబ్లీలో దేవాదుల నీటి విడుదలపై మాట్లాడారు. జనగామ నియోజకవర్గం పరిధిలోని చేర్యాల ప్రాంతం దేవాదుల ఆయకట్టు పరిధిలో ఉందని, ప్రస్తుతం వరి, ఇతర పంటలు నీరులేక ఎండిపోతున్నాయని తెలిపారు. కాబట్టి దేవాదుల మూడవ ఫేజ్ కింద సాగునీరు అందించాలని కోరారు. దేవాదుల మొదటి, రెండవ ఫేజ్ పూర్తి కాగా, మూడవ ఫేజ్ నిర్మాణ పనులు దగ్గర పడ్డాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి నీరు వస్తున్న క్రమంలో అత్యవసరంగా నీటిని విడుదల చేసి, ఎండుతున్న పంటలను కాపాడాలని కోరారు. జనగామ నియోజకవర్గ పరిధిలో సుమారు 1.50లక్షల ఎకరాలు దేవాదుల ఆయకట్టు కిందికి వస్తుందని చెప్పారు. జిల్లాలో 5.14లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, కేవలం 3లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పి, 34 రోజులుగా పంపు మోటార్లు ఆగిపోయేటట్టు చేశారని ఆరోపించారు. దీంతో రూ.600 కోట్ల మేర రైతులు నష్టపోయేలా చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయకట్టు, కాల్వ పరిధి కాకున్నా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తపాస్పల్లి రిజర్వాయర్ వద్దకు వచ్చి నీళ్లు కావాలని జులుం చేయడం ఏమిటని పల్లా ప్రశ్నించారు. ఆయకట్టు ప్రతిపాదనలతో సంబంధం లేకుండా స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గండిరామారం నుంచి నీటిని తరలించడం రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేయడమే అన్నారు. దేవాదుల పంప్హౌజ్ వద్ద పంపు ఆపరేటర్లు నిరసన తెలిపే సమయంలో తాను ప్రత్యేక శ్రద్ధ వహించడంతోనే ప్రస్తుతం కొద్ది పాటి నీటి విడుదలకు కారణమైందన్నారు. తాను చెప్పేది అబద్ధమైతే ముక్కు నేలకు రాస్తానంటూ సవాల్ విసిరారు. -
శిక్షణతో పాటు ఉపాధి కల్పించాలి
సిద్దిపేటరూరల్: జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులు, ఉన్నత చదువులు చదువుకునే వారికి అన్ని రంగాల్లో నైపుణ్యాలు పొందేలా శిక్షణ కల్పించి, ఉపాధి పొందేలా అధికారులు చొరవ చూపాలనని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో కాన్ఫరెన్స్ హాల్లో డిస్ట్రిక్ట్ స్కిల్ కమిటీ సమావేశాన్ని అదనపు కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డీఆర్డీఓ, పరిశ్రమల కేంద్రం, సెట్విన్, కార్మికశాఖ, ఉపాధి, పలు శిక్షణ శాఖల ఉమ్మడి భాగస్వామ్యంతో నిర్మాణ రంగం, టైలరింగ్, ఇందిరమ్మ ఇళ్ల కోసం మెసీ్త్రల ట్రైనింగ్, కూలీ ట్రైనింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో శిక్షణ ఇవ్వడం కోసం కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. వాటితో పాటుగా బ్యాంకింగ్, ఇతర రంగాల్లో ప్రతిభ చూపేలా పర్సనాలిటీ డెవలప్మెంట్ తరగతులు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ జయదేవ్ఆర్యా, డీఆర్ఓ, మైనార్టీ సంక్షేమశాఖ అధికారి నాగరాజమ్మ, డీఏఓ రాధిక, సెట్విన్ కోఆర్డినేటర్ అమీనాభాను, లేబర్ కమిషనర్ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ -
హాజరు నుంచి హోంవర్క్ దాకా..
సాక్షి, సిద్దిపేట: విద్యార్థి బడికి గైర్హాజరైతే వెంటనే తల్లిదండ్రులకు మెసేజ్ వెళుతుంది.. విద్యార్థికి ఆ రోజు ఇచ్చే అసైన్మెంట్లు/హోంవర్క్ వివరాలు కూడా యాప్లో వచ్చేస్తాయి.. అంతేకాదు పరీక్షల్లో వచ్చిన మార్కులు, ప్రోగ్రెస్ రిపోర్ట్, సెలవులు, సిలబస్ వంటి వివరాలూ తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు చేరుతాయి. ఇదేదో ప్రైవేట్ స్కూల్లో అమలవుతున్న ఆధునిక విధానం కాదు.. సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రత్యేకత. మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ మనుచౌదరి ప్రత్యేక చొరవ తీసుకుని ఓ ప్రైవేట్ కంపెనీ రూపొందించిన యాప్లో ఈ పాఠశాలకు ప్రత్యేక లాగిన్ అందించారు. విద్యార్థులపై మంచి పర్యవేక్షణతో.. ఈ పాఠశాలలో 364 మంది విద్యార్థులున్నారు. రోజూ ఉదయం 9 గంటలకే యాప్లో, రిజిస్టర్లో విద్యార్థుల అటెండెన్స్ తీసుకుంటారు. పాఠశాలకు గైర్హాజరైన విద్యార్థి తల్లిదండ్రుల ఫోన్కు వెంటనే ఎస్సెమ్మెస్ వెళుతుంది. అలాగే విద్యార్థులకు రోజువారీగా ఇచ్చే అసైన్మెంట్లను క్లాస్ టీచర్లు యాప్లో అప్లోడ్ చేస్తారు. ఈ వివరాలు తల్లిదండ్రులకు చేరుతాయి. దీనితో పిల్లలు స్కూల్కు వెళ్తున్నామని డుమ్మాకొట్టే చాన్స్ ఉండదు. హోంవర్క్/రీడింగ్ లేదంటూ ఇళ్లలో చెప్పి తప్పించుకోవడానికీ వీలుండదని టీచర్లు చెబుతున్నారు. ఈ యాప్తో విద్యార్థులపై పర్యవేక్షణ సులువైందని అంటున్నారు. త్వరలో విద్యార్థి ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా.. విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్ట్, లీవ్ అనుమతులు, నెలవారీ సిలబస్, పేరెంట్స్ ఫీడ్ బ్యాక్, పరీక్షల టైం టేబుల్, హాలిడేస్ లిస్ట్ వంటివి సైతం యాప్ ద్వారానే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ప్రతి విద్యార్థికి సంబంధించి కనీస సామర్థ్యాలు సాధించే దిశగా విద్యార్థి సూచిక (స్టూడెంట్ ప్రొఫైల్) ఉంటుంది. సబ్జెక్టుల వారీగా వెనుకబడిన తీరు, పురోగతి సాధిస్తున్న అంశాలను ఇందులో పొందుపర్చనున్నారు.హాజరుశాతం పెరిగింది యాప్ ద్వారానే విద్యార్థుల అటెండెన్స్ తీసుకుంటున్నాం. విద్యార్థి స్కూల్కు గైర్హాజరైతే వెంటనే పేరెంట్స్కు సమాచారం వెళ్తుంది. పర్యవేక్షణ పెరగడంతో విద్యార్థుల హాజరుశాతం పెరిగింది. ప్రోగ్రెస్ రిపోర్ట్, ఫీడ్ బ్యాక్ వంటివి కూడా త్వరలో అందుబాటులోకి తీసుకువస్తాం. – వాసుదేవరెడ్డి ప్రధాన ఉపాధ్యాయుడు, జెడ్పీ ఉన్నత పాఠశాల, హుస్నాబాద్ పిల్లలు గైర్హాజరైతే వెంటనే మెసేజ్ వస్తుందిమా పిల్లలు ప్రభుత్వ స్కూల్లోనే చదువుతున్నారు. వాళ్లు స్కూల్కు వెళ్లకుంటే నా ఫోన్కు మెసేజ్ వస్తుంది. ఇలా తల్లిదండ్రులకు విద్యార్థుల సమాచారం తెలపడం బాగుంది. టీచర్లు అసైన్మెంట్లను యాప్లో పెడుతుండటంతో.. పిల్లలు ఇంటికి వచ్చాక వారిని దగ్గరుండి చదివిస్తున్నాం. – ముక్కెర రమేశ్, విద్యార్థి తండ్రి -
పెళ్లి కుదరడంలేదని యువకుడి బలవన్మరణం
చిన్నశంకరంపేట(మెదక్): ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిన్నశంకరంపేట మండలం మడూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ నారాయణ గౌడ్ కథనం మేరకు.. మండలంలోని మడూర్ గ్రామానికి చెందిన శివరాజ్(24)కు కొద్ది రోజులుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ ఎక్కడా సంబంధం కుదరడంలేదు. దీంతో మానోవేదనకు గురయ్యాడు. గురువారం రాత్రి పొలం వద్దకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. అర్థరాత్రి అవుతున్నా ఇంటికి రాకపోవడంతో తండ్రి యాదగిరి, మరో రైతు సత్యనారాయణతో కలిసి పొలం వద్దకు వెళ్లి చూశారు. అప్పటికే పొలం వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో తండ్రి యాదగిరి శుక్రవారం పోలీస్లకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. భార్యతో గొడవపడి భర్త.. పటాన్చెరు టౌన్: భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సుభాష్ సాకేత్(27) బతుకుదెరువు కోసం పటాన్చెరుకు వచ్చాడు. మండల పరిధిలోని పెద్ద కంజర్ల గ్రామంలో గల అరబిందో వెంచర్లో మేస్త్రీ వద్ద కూలీగా పని చేస్తూ అక్కడే షెడ్లో ఉంటున్నాడు. గురువారం రాత్రి ఫోన్లో భార్యతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం లేచి చూసేసరికి వెంచర్లోనే ఓ చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించి మృతుడి సోదరుడు విశాల్ ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
మా ఊరి నుంచి నీరివ్వం..
కాలువలో బండరాళ్లు,మట్టివేసి పూడ్చివేత ● బీఆర్ఎస్ నాయకుల నిర్వాకం ● ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులుకోహెడరూరల్(హుస్నాబాద్): మా ఊరి ప్రాజెక్టు నుంచి ఇతర గ్రామాలకు నీటిని తరలించేది లేదంటూ స్థానిక బీఆర్ఎస్ నాయకులు కొందరు కాలువలో బండరాళ్లు, మట్టిని వేసి పూడ్చివేశారు. ఈ ఘటన కోహెడ మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఫలితంగా మూడు గ్రామాల్లోని సుమారు 500 ఎకరాల్లో వరి పంటలకు నీరందని పరిస్థితి నెలకొంది. వివరాలిలా ఉన్నాయి. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ మనుచౌదరి మండలంలో పర్యటించినప్పుడు పలు గ్రామాల రైతులు పంటలు ఎండుతున్నాయని శనిగరం ప్రాజెక్టు నుంచి మోయతుమ్మెదవాగు ద్వారా నీటిని విడుదల చేయాలని వినతి పత్రం అందించారు. వారు వెంటనే స్పందించి నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ ఈఈ, డీఈకి ఆదేశాలిచ్చారు. సాక్షాత్తు మంత్రి, కలెక్టర్ ఆదేశించినా శనిగరం గ్రామానికి చెందిన కొందరు బీఆర్ఎస్ నాయకులు అడ్డుచెబుతుండటం గమనార్హం. నీరు వచ్చే కాలువలో బండరాళ్లు, మట్టిని వేసి పూడ్చి వేశారు. ఈ ఘటనతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై వెంటనే అధికారులకు ఫిర్యాదు చేశారు. నీటి కాలువలు ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పంటలు ఎండుతున్నా బీఆర్ఎస్ నాయకుల ప్రవర్తన విచిత్రంగా ఉందంటూ వాపోయారు. వెంటనే నీరు విడుదల చేసి పంటలను కాపాడాలని వారు వేడుకుంటున్నారు. -
గరిమా కుమారుడికి అన్నప్రాసన
వర్గల్ క్షేత్రంలో అదనపు కలెక్టర్ దంపతుల పూజలు వర్గల్(గజ్వేల్): అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, పల్లవ్ దంపతులు శుక్రవారం సాయంత్రం వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రం సందర్శించారు. అమ్మవారి సన్నిధిలో తమ కుమారుడు రిశాన్కు శాస్త్రోక్తంగా అన్నప్రాసన జరిపించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, వేదపండితుల ఆశీర్వచనం పొందారు. అనంతరం వేదపండితులు దంపతులకు తీర్థప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. ముంబై సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న నీలం పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేక పూజలుపటాన్చెరుటౌన్: తన జన్మదినాన్ని పురస్కరించుకుని ముంబైలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సిద్ధి వినాయకుడిని శుక్రవారం కాంగ్రెస్ నేత నీలం మధుముదిరాజ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నీలం మధు మాట్లాడుతూ... తమ కోరికలు తీర్చుకునేందుకు దేశవ్యాప్తంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని స్వామి కృపకు పాత్రులవుతారన్నారు. ప్రతీ గణేశ్ దేవాలయాల్లో వినాయకుడికి తొండం ఎడమవైపు ఉంటుందని కానీ ఈ దేవాలయంలో మాత్రం తొండం కుడి వైపు ఉండటంతోపాటు తొండంలో మూడో కన్ను ఉంటుందన్నారు. ఇంతటి ప్రత్యేకతలు ఉన్న సిద్ధి వినాయకుడిని దర్శించుకుంటే శుభాలు కలుగుతాయన్నారు. సిద్ధి వినాయకుడిని దర్శించుకోవడం చాలా ఏళ్లుగా తనకు అలవాటని అందులో భాగంగా తన పుట్టినరోజు సందర్భంగా వినాయకుడిని దర్శించుకున్నానన్నారు. ఆ సిద్ధి వినాయకుడు ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. -
సచిన్ డబుల్ ధమాఖా..
● గ్రూప్– 2లో రెండు.. ● గ్రూప్–3లో 23వ ర్యాంక్ సిద్దిపేటజోన్: సిద్దిపేట పట్టణానికి చెందిన వడ్లకొండ సచిన్రెడ్డి డబుల్ ధమాఖా సాధించారు. శుక్రవారం విడుదల చేసిన గ్రూప్–3 ఫలితాల్లో 450మార్కులకు 317.15తో రాష్ట్ర స్థాయిలో 23వ ర్యాంక్ సాధించాడు. ఇటీవల విడుదలైన గ్రూప్–2లో రెండో ర్యాంక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సాక్షితో సచిన్ తన సంతోషం వ్యక్తం చేస్తూ గ్రూప్–1 ర్యాంకింగ్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఏదిఏమైనా సివిల్స్ సాధించాలని ఉందని తన లక్ష్యం మరోసారి గుర్తు చేశారు. సత్తాచాటిన తొగుట యువకుడు తొగుట(దుబ్బాక): గ్రూప్–3 ఫలితాల్లో మండల కేంద్రానికి చెందిన ముచ్చర్ల శ్రీకాంత్ యాదవ్ సత్తాచాటారు. టీఎస్పీఎస్సీ శనివారం ఫలితాలు విడుదల చేసింది. రాష్ట్ర స్థాయిలో 232 ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం శ్రీకాంత్ హెచ్ఎండీఏలో ఉద్యోగిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. వచ్చే నెల 20 నుంచిఓపెన్ పరీక్షలు ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు వచ్చే నెల 20 నుంచి నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి, జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ వెంకటస్వామి శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఏప్రిల్ 20 నుంచి 26 వరకు టెన్త్, ఇంటర్మీడియెట్ థియరీ పరీక్షలు, ఏప్రిల్ 26 నుంచి మే 3 వరకు ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు పరీక్షలు జరుగనున్నట్లు తెలిపారు. పరీక్ష రుసుం చెల్లించిన అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు అర్హులన్నారు. పూర్తి వివరాలకు జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ ఫోన్ నంబర్ (80084 03635)ను సంప్రదించాలన్నారు. -
ఆక్రమణలపై చర్యలు తీసుకోండి
శనివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2025మంత్రి కొండా సురేఖకు ఫిర్యాదు హుస్నాబాద్: ఎల్లమ్మ గుడి వద్ద ప్రైవేట్ భూమిని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చిత్ర దర్శకుడు, తెలంగాణ ఉద్యమకారుడు సయ్యద్ రఫీ శుక్రవారం నగరంలో మంత్రి కొండా సురేఖకు ఫిర్యాదు చేశారు. హుస్నాబాద్లోని తన 4.4 ఎకరాల భూమిని ఎల్లమ్మ గుడికి దానం చేశారు. ప్రస్తుతం దాని విలువ సుమారు రూ.32.80 కోట్లు ఉందన్నారు. దాని పక్కనే ఉత్తరం వైపు ఉన్న 32 గుంటలన్నర మా సొంత భూమిని ఎల్లమ్మ గుడి ఈఓ మరికొందరు కలిసి కబ్జా చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మంత్రికి ఫిర్యాదు చేశారు.సిద్దిపేటలో డ్రమ్ వాయిస్తున్న మున్సిపల్ చైర్పర్సన్ మంజుల -
తూకాల్లో మోసం.. కొలతల్లో వ్యత్యాసం
సిద్దిపేటకమాన్/సిద్దిపేటజోన్/ప్రశాంత్నగర్: వినియోగదారులు నిత్యం నిలువు దోపిడీకి గురవుతున్నారు. కొన్ని వాణిజ్య, వ్యాపార సంస్థలు తూకాల్లోనే కాదు.. వివిధ రకాల మోసాలకూ పాల్పడుతున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి రకరకాల తిరకాసులతో వినియోగదారులను నిండా ముంచుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. నిత్యం తనిఖీలు చేస్తూ కేసులు నమోదు చేసి, లైసెన్స్లు రద్దు చేయాల్సిన అధికారులు మొక్కుబడి చర్యలతో వదిలివేయడం వెనక పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బేకరీలు, సూపర్మార్కెట్లలో సైతం ప్యాకింగ్ ఆహార పదార్థాలు గడువు దాటినివి సైతం విక్రయిస్తున్నారు. పట్టణంలోని సుభాష్ రోడ్డు, ఓ గోదాంలో ప్యాకింగ్ లేకుండా విడిగా వంట నూనె, దీపం నూనెలు విక్రయిస్తూ నిర్వాహకులు డబ్బులు దండుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. పట్టణంలో పండ్ల విక్రయదారుల మాత్రం ఇంకా పాత తరం త్రాసులే వాడుతుండటం గమనార్హం. వీటితోనే విక్రయదారులకు పండ్లు, పలు రాకాల పదార్థాలను తూకాలు వేస్తున్నారు. రెండేళ్లలో 291 కేసులు రెండేళ్లలో పలు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి 291 కేసులు నమోదు చేశారు. 2023–24లో 275 కేసులు నమోదు చేసి రూ.14,55,000 జరిమానా విధించారు. 2024–25లో 168 కేసులు నమోదు చేసి రూ.8,33,000 జరిమానా విధించి వసూలు చేశారు.దర్జాగా దగా వినియోగదారుల నిలువు దోపిడీ బస్టాండ్, థియేటర్ల దుకాణాల్లోఅధిక ధరలకు విక్రయాలు ఇప్పటికీ పాత తరం త్రాసులే వినియోగం పెట్రోల్ బంకుల్లోనూకనీస సౌకర్యాలు కరువు చోద్యం చూస్తున్న సంబంధిత అధికారులు నేడు ప్రపంచ వినియోగదారులహక్కుల దినోత్సవంఫిర్యాదు చేస్తే తనిఖీలు నిర్వహిస్తాం.. ఆహార పదార్థాలను నాణ్యతతోపాటు క్వాంటిటీలో తేడా రాకుండా విక్రయించాలి. గడువు ముగిసిన ఆహార పదార్థాలను, ఎంఆర్పీ కంటే ఎక్కువకు విక్రయించినా ఫిర్యాదు చేయండి. తనిఖీలు నిర్వహించి వారిపై చర్యలు తీసుకుంటాం. గత రెండేళ్లలో 291కేసులు నమోదు చేశాం. అలాగే పెట్రోల్ బంక్లలో పెట్రోల్, డీజిల్ కల్తీ చేపడితే చర్యలు చేపడతాం. – సుజత్ అలీ, తూనికల కొలతల జిల్లా ఇన్చార్జి అధికారి -
ప్రగతి బాట.. రియల్ మాట
ట్రిపుల్ ఆర్ వరకు హెచ్ఎండీఏ విస్తరణ ● పుంజుకోనున్నరియల్ ఎస్టేట్ రంగం ● హెచ్ఎంఆర్ పరిధిలోకి75 రెవెన్యూ గ్రామాలు ● తగ్గనున్న సుడా విస్తీర్ణంహెచ్ఎంఆర్ పరిధిలోకి వచ్చేరెవెన్యూ గ్రామాలు ఇవే.. ● గజ్వేల్ : ఆక్కారం, బంగ్లా వెంకటాపూర్, థర్మారెడ్డిపల్లి గజ్వేల్, కొమటిబండ, క్యాసారం, మాసాన్పల్లి, ముట్రాజ్పల్లి, ప్రజ్ఞాపూర్, సంగాపూర్, శ్రీగిరిపల్లి. ● జగదేవ్పూర్: అల్లిరాజ్పేట్, ధర్మారం, ఇటిక్యాల, జగదేవ్పూర్, పీర్లపల్లి ● మర్కూక్: మండలంలో అంగడికిష్టాపూర్, చేబర్తి, దామరకుంట, ఎర్రవల్లి, కర్కపట్ల, మర్కూక్, పాములపర్తి, శివార్ వెంకటాపూర్. వర్ధరాజ్పూర్ ● ములుగు: అచ్చాయపల్లి,అడివిమాజిద్, బలైంపూర్, బండ మైలారం, బండా తిమ్మాపూర్, బస్వాపూర్, క్షీరసాగర్, చిన్నా తిమ్మాపూర్, దాసర్లపల్లి, గంగాదారపల్లి, కొక్కొండ, కొత్తూరు, కోట్యాల, లక్ష్మక్కపల్లి, మామిడ్యాల, ములుగు, ముస్తఫగూడా, నర్సంపల్లి, నర్సాపూర్, జప్తి సింగాయపల్లి, సింగన్నగూడా, శ్రీరాంపూర్, తానెదార్పల్లి, తునికి బొల్లారం, ● రాయపోల్: అప్పాయిపల్లి, బేగంపేట్, ఎల్కల్ ● వర్గల్: అంబర్పేట్, అనంతగిరిపల్లి, చందాపూరం, గౌరారం, జబ్బాపూర్, కొండాయిపల్లి, మాధారం, మైలారం, మజిద్పల్లి, మీనాజీపేట్, నాచారం, నెంటుర్, రామచంద్రపురం, శాఖారం, తునికి కల్స, తునికిమక్త, వర్గల్. సాక్షి, సిద్దిపేట: ట్రిపుల్ ఆర్ (హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు) వరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్(హెచ్ఎంఆర్) ఏర్పాటుతో ప్రగతి పరుగులు పెట్టడంతోపాటు రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోనుంది. మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)ను విస్తరిస్తూ హెచ్ఎంఆర్గా ఏర్పాటు చేయడంతో దీని పరిధిలోకి 75 రెవెన్యూ గ్రామాలు రానున్నాయి. ఈ మేరకు పురపాలక ముఖ్యకార్యదర్శి ఎం. దానకిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే మూడు మండలాలు హెచ్ఎండీఏ పరిధిలో ఉండగా మరో మూడు మండలాల్లోని గ్రామాలు హెచ్ఎంఆర్తో కలవనున్నాయి. హెచ్ఎండీఏ విస్తరణతో హెచ్ఎంఆర్ పరిధిలో 11 జిల్లాలు, 104 మండలాలు ,1,355 రెవెన్యూ గ్రామాలు ఉండనున్నాయి. ట్రిపుల్ ఆర్ తరువాత 2 కిలో మీటర్ల వరకు ఉన్న ప్రాంతాన్ని బఫర్జోన్గా మార్చారు. హెచ్ఎండీఏ పరిధిలో ఇప్పటికే ములుగు మండలంలో 24 గ్రామాలు, మర్కూక్లోని 9గ్రామాలు, వర్గల్ 22 గ్రామాలు ఉన్నాయి. ప్రభుత్వ విడుదల చేసిన తాజా ఉత్తర్వులతో గజ్వేల్లోని 12, జగదేవ్పూర్లోని 5, రాయపోల్లోని మూడు గ్రామాలు చేరాయి. ఇలా మొత్తంగా జిల్లాలోని 75గ్రామాలు హెచ్ఎంఆర్ పరిధిలోకి వస్తున్నాయి. అభివృద్ధి సైతం వేగిరం కానుంది. పెరగనున్న భూముల ధరలు హెచ్ఎంఆర్ పరిధిలోని గ్రామాల్లో భూముల ధరలు అమాంతం పెరగనున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ పుంజుకోనుంది. ట్రిపుల్ ఆర్ కు సమీపంలో ఉండనుండటంతో భూములకు మంచి డిమాండ్ రానుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములకొనుగోళ్లపై దృష్టి పెట్టారు. అలాగే హైదరాబాద్లో ఉండే వారు సైతం హెచ్ఎంఆర్ పరిధిలో భూము లు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. తగ్గనున్న సుడా పరిధి గతేడాది అక్టోబర్లో సుడా (సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) ను జిల్లా వ్యాప్తంగా విస్తరించారు. అందులో భాగంగా జగదేవ్పూర్, గజ్వేల్, రాయపోల్ మండలాల్లోని పలు రెవెన్యూ గ్రామాలు సైతం హెచ్ఎంఆర్లో కలువనున్నాయి. దీంతో సుడా విస్తీర్ణం తగ్గనుంది. సుడాకు సంబంధించి మళ్లీ కొత్త ఉత్తర్వులు ఏమైన విడుదల చేస్తారా లేదా చూడాలి. -
ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణానికి స్థల పరిశీలన
హుస్నాబాద్రూరల్: పట్టణంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణానికి గురువారం కలెక్టర్ మనుచౌదరి స్థలాన్ని పరిశీలించారు. శాతవాహన యూనివర్సిటీకి కొత్త ఇంజనీరింగ్ కళాశాల మంజూరు అయ్యింది. ఈ నేపథ్యంలో హుస్నాబాద్లో నిర్మించేందుకు వైస్ చాన్స్లర్ ఉమేష్కుమార్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఉమ్మాపూర్ శివారులో మహాసముద్రం గండి వద్ద, జిల్లెలగడ్డలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పక్కన ఉన్న ప్రభుత్వ భూములను పరిశీలించారు. కళాశాలకు త్వరగా ప్రభుత్వ భూమి గుర్తించి యూనివర్సిటీకి అప్పగించాలని కలెక్టర్ అధికారులను అదేశించారు. వీరి వెంట ఆర్డీఓ రామ్మూర్తి, తహసీల్దార్ రవీందర్రెడ్డి తదితరులు ఉన్నారు. -
బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగంపై ఉచిత శిక్షణ
● 15 నుంచి దరఖాస్తుల స్వీకరణ ● టీజీబీసీ స్టడీ సర్కిల్ జిల్లా డైరెక్టర్ దయాసాగర్ ప్రశాంత్నగర్(సిద్దిపేట): బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగంపై నెల రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు టీజీబీసీ స్టడీ సర్కిల్ సిద్దిపేట డైరెక్టర్ కృష్ణ దయాసాగర్ బుధవారం తెలిపారు. ఈ శిక్షణ హైద్రాబాద్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ట్రైనింగ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. డిగ్రీ పూర్తయి, 26 ఏళ్లు లోపు ఉన్న అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి కల్గిన అభ్యర్థులు 15 నుంచి ఏప్రిల్ 8 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. అర్హత సాధించిన అభ్యర్థులకు ఏప్రిల్ 12 నుంచి ఉమ్మడి జిల్లా కేంద్రంలో శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు టీజీబీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యం గజ్వేల్రూరల్: పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యకర్తలు ముందుకు సాగాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పుస్తకాల పంపిణీ కొండపాక(గజ్వేల్): కుకునూరుపల్లి హైస్కూల్కు లయన్స్, స్నేహ క్లబ్లు సంయుక్తంగా విద్యార్థులకు బుధవారం కెరియర్ గైడెన్స్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధి విజయభాస్కర్ మాట్లాడుతూ పదోతరగతి పరీక్షల అనంతరం ఉన్నత చదువుల్లో చేరేందుకు ఈ పుస్తకాలు ఉపయోగపడుతాయన్నారు. పదోతరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ఐదుగురు విద్యార్థులకు ఒక్కొక్కరికీ రూ.5వేలు పారితోషికం అందజేస్తామని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈఓ బచ్చలి సత్తయ్య, క్లబ్ ప్రతినిధులు పరమేశ్వర్ చారి, కుమారస్వామి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మినీ వాటర్ప్లాంట్ వితరణ వర్గల్(గజ్వేల్): మండల పరిధిలోని నాచారం జెడ్పీ ఉన్నత పాఠశాలకు బుధవారం జూబ్లిహిల్స్ రోటరీక్లబ్ రూ.85 వేలు విలువైన మినీ వాటర్ప్లాంట్, విద్యార్థులకు క్రీడా దుస్తులను అందజేసింది. కార్యక్రమంలో రోటరీ ప్రతినిధులు బాలకోటారెడ్డి, లక్ష్మి, విజయలక్ష్మి, రాజా కిషన్, హెచ్ఎం ఉమారాణి, మాజీ ఎంపీటీసీ వెంకటేశ్గౌడ్ పాల్గొన్నారు. ప్రభుత్వ కళాశాలలో చేరండి సిద్దిపేటఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పూర్తికాగానే డిగ్రీ కోర్సుల కోసం తమ కళాశాలలో చేరాలంటూ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రినిపాల్, అధ్యాపకులు విద్యార్థినులను కోరారు. ప్రిన్సిపాల్ జీవన్కుమార్, అధ్యాపకులు ఇంటర్మీడియెట్ పరీక్షా కేంద్రాల వద్ద బుధవారం విద్యార్థినులను కలిసి కరపత్రాలను పంచారు. కళాశాలలో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఈ లైబ్రరీ, ఐసీటీ క్లాస్రూంలు ఉన్నాయని వారికి వివరించారు. మెరుగైన వైద్యమే లక్ష్యం గజ్వేల్రూరల్: ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందిన పలువురికి మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు చర్యలు చేపడుతున్నారన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ సర్దార్ఖాన్, నాయకులు సుఖేందర్రెడ్డి, కరుణాకర్రెడ్డి, యాదగిరి, రాములుగౌడ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. విస్తరాకుల్లో మధ్యాహ్న భోజనం అక్కన్నపేట(హుస్నాబాద్): మండల పరిధిలోని అంతక్కపేట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు బుధవారం విస్తరాకుల్లో భోజనాలు చేశారు. ఈ సందర్భంగా హెచ్ఎం మోహన్నాయక్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి విద్యార్థుల్లో అవగాహన పెంచుతున్నామన్నారు. అందులో భాగంగా విస్తరాకుల్లో భోజనం వడ్డించేలా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. దీంతో పర్యావరణాన్ని కాపాడుకోవడంతో పాటు ఆరోగ్యానికి ఎటువంటి హానీ జరగదని వివరించారు. కార్యక్రమంలో మహిళా సంఘం సీఏలు రంగమ్మ, అంజలి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఓ వ్యక్తికి రిమాండ్ నంగునూరు(సిద్దిపేట): కోర్టు పేషీలకు హాజరుకాని ఒకరిని రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ ఆసీఫ్ తెలిపారు. దర్గపల్లికి చెందిన ఆసర్ల యాదయ్యపై 2021లో రాజగోపాల్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ క్రమంలో కోర్టు పేషీలకు హాజరుకావడం లేదు. దీంతో బుధవారం అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి అరెస్టు వారెంట్ జారీ చే యడంతో రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. -
గురువారం శ్రీ 13 శ్రీ మార్చి శ్రీ 2025
ఒకప్పుడు అన్నింటా ఆదర్శంగా నిలిచిన సిద్దిపేట మున్సిపాలిటీని.. ఇప్పుడు అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. జిల్లా కేంద్రం కావడంతో కొత్త కాలనీలు ఏర్పాటవుతున్నాయి. ముఖ్యంగా విలీన వార్డుల్లో వీధి దీపాలు, అంతర్గత రహదారులు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ సౌకర్యాలు లేకపోవడంతో స్థానికులకు ఇబ్బందులు తప్పడంలేదు. అలాగే పలు కాలనీలో ఏర్పాటు చేసిన పార్కులు, ఓపెన్ జిమ్లను పట్టించుకోకపోవడంతో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. కాలనీలో కొత్తగా ఇంటి నిర్మాణం ఎక్కడ జరిగితే అక్కడ పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు వాలిపోయి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. సిద్దిపేట మున్సిపాలిటీలో సమస్యలు కోకొల్లలు● పేరుకే ఆదర్శం.. అంతా అధ్వానమే.. ● అస్తవ్యస్తంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ● పలు కాలనీలలో రోడ్లు, వీధి దీపాలు కరువు ● పార్కులు, ఓపెన్ జిమ్లపై కానరాని పర్యవేక్షణ ● ఫుట్పాత్లను ఆక్రమించినా పట్టించుకోని అధికారులు సాక్షి విజిట్లో వెగులుచూసిన వాస్తవాలు న్యూస్రీల్ -
అగ్నికి ఆహుతి.. నష్టాన్ని మిగిల్చి
మక్క చేను దగ్ధం మిరుదొడ్డి(దుబ్బాక): ప్రమాదవశాత్తు మక్క చేను దగ్ధమైన ఘటన మండల పరిధిలోని మల్లుపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. బాధిత రైతు మంతూరి కిష్టయ్య తెలిపిన వివరాల ప్రకారం.. రెండు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాను. ప్రమాదవశాత్తు ట్రాన్స్ఫార్మర్ కరెంటు తీగలు ఒకదానికొకటి రాపిడై నిప్పు రవ్వలు ఎగసి పడటంతో మక్క చేను కాలి బూడిదైపోయింది. ఇందులో మక్క పంటతోపాటు, ఎకరంలో వేసిన డ్రిప్ పైపులు, గేట్ వాళ్లు కాలిపోయాయి. సుమారు రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు తనకు నష్ట పరిహారం అందజేసి ఆదుకోవాలని కోరాడు. చిన్నకోడూరులో మామిడి తోట చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రమాదవశాత్తు నిప్పంటుకొని మామిడి తోట దగ్ధమైన ఘటన మండల పరిధిలోని రామంచ శివారులో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ఎడ్ల బాల్రెడ్డికి 10 ఎకరాల మామిడి తోట ఉంది. ఆ తోటను సిద్దిపేటకు చెందిన రామోజీ లీజ్కు తీసుకున్నాడు. బుధవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు మామిడి తోటలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు మంటలార్పినప్పటికీ తోట పూర్తిగా దగ్ధమైంది. తోటలో ఉన్న డ్రిప్ పైపులు కాలిపోయాయి. సుమారు రూ. 8 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు. -
భార్యా బిడ్డలకు దూరమై.. జీవితమే భారమై
బంగారం శుద్ధి చేసే విషం తాగి స్వర్ణకారుడు ఆత్మహత్య పాపన్నపేట(మెదక్): మిల మిల మెరిసే బంగారు ఆభరణాలు తయారు చేసే అతడి కుటుంబ జీవితంలో చీకటి కోణాలు దాగి ఉన్నాయి. తాత్కాలిక ఆవేశాలతో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ కొంప ముంచింది. రోజు వారి వేధింపులు భరించలేక ఇద్దరు బిడ్డలను తీసుకొని ఆ ఇల్లాలు పుట్టింటికి వెళ్లిపోయింది. మీరు లేని జీవితం నాకొద్దంటూ ఆ స్వర్ణకారుడు బలన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు.. పాపన్నపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన అవుసుల రాములు మేడ్చల్లో కుల వృత్తి చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇతడికి భార్య సరళ, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కుటుంబ విషయంలో భార్యా భర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. సరళ కొద్ధి రోజుల కిందట పిల్లలను తీసుకొని పుట్టినిల్లు ఎల్లారెడ్డికి వెళ్లి పోయింది. దీంతో తీవ్ర మనో వేదనకు గురైన రాములు స్వగ్రామమైన కొత్తపల్లికి వచ్చి బంగారం శుద్ధి చేసే విషం తాగాడు. బుధవారం గ్రామ శివారులోని మెయిన్ రోడ్డు పక్కన శవమై కనిపించాడు. మృతుడి తమ్ముడు లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. పేకాటరాయుళ్ల అరెస్టు జోగిపేట(అందోల్): జోగిపేట పట్టణంలోని బజాజ్ షోరూం ఎదురుగా పేకాట ఆడుతున్న ఐదుగురిని బుధవారం అరెస్టు చేసినట్లు ఎస్ఐ పాండు తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు దాడి నిర్వహించగా గోపాల్, శ్రీశైలం, నాగరాజు, మల్లేశం, వెంకటేశం పేకాట ఆడుతుండగా అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.47 వేల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
15 శాతం నిధులు కేటాయించాలి
ప్రశాంత్నగర్(సిద్దిపేట): రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయించాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్య అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగిన ఏబీవీపీ సమావేశంలో జిల్లా కన్వీనర్ ఆదిత్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సకలజనులు పోరాడి తెచ్చు కున్న తెలంగాణలో మొదటి పదేళ్లలో కేసీఆర్ ప్రభు త్వం విద్యా వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేశారన్నారు. నిధులు కేటాయించకుండా విద్యావ్యవస్థను గత ప్రభుత్వం అధోపాతాలానికి తొక్కితే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే దారిలో వెళ్తుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఫణిందర్, అంబేడ్కర్ జోనల్ ఇన్చార్జి అనీష్, నగర ఉపాధ్యక్షుడు భాను, నగర సంయుక్త కార్యదర్శి రాకేశ్, హరికృష్ణ, శ్రావణ్, మైపాల్ పాల్గొన్నారు. కలెక్టరేట్ వరకు పాదయాత్ర సిద్దిపేటరూరల్: రాష్ట్ర బడ్జెట్లో విద్యకు 15 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని పాత బస్టాండ్ అంబేడ్కర్ విగ్రహం నుండి జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చి విస్మరించిందన్నారు. 2024– 25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో కేవలం 6.3 శాతం నిధులు కేటాయించి హామీని తుంగలో తొక్కిందన్నారు. ఈ బడ్జెట్ లోనైనా ఎన్నికల హామీ ప్రకారం 15 శాతం నిధులు కేటాయించి మాట నిలబెట్టుకోవాలని సీఎంకి విజ్ఞప్తి చేశారు. అనంతరం కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఏగొండ, జిల్లా ఉపాధ్యక్షుడు భీమ్ శేఖర్, పోతరాజు శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి భ్యాగరి వేణు, బెజ్జెంకి తిరుపతి, దశరథం, ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యా రంగానికి పెద్దపీట వేయాలి ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఆదిత్య -
విదేశాలకు ఎగుమతితో మంచి లాభాలు
కౌడిపల్లి(నర్సాపూర్): మామిడి పండ్లను విదేశాలకు ఎగుమతి చేయడం వల్ల అధిక లాభాలు పొందవచ్చని ఏపీఈడీఏ (అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ) అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆర్పీ నాయుడు సూచించారు. బుధవారం మండలంలోని తునికి వద్ద గల డాక్టర్ డి.రామానాయుడు ఏకలవ్య గ్రామీణ వికాస ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)లో ఏపీఈడీఏ ఆధ్వర్యంలో మామిడి సాగు రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు నాణ్యమైన మామిడి పంటను ఉత్పత్తి చేస్తే విదేశాలకు ఎగుమతి చేయొచ్చన్నారు. దీంతో అధిక లాభాలు వస్తాయన్నారు. విదేశాలకు ఎగుమతి చేసేందుకు ప్రభుత్వ లైసెన్స్ అవసరం ఉంటుందన్నారు. అనంతరం కేవీకే హెడ్ అండ్ సైంటిస్ట్ శంభాజీ దత్తాత్రేయ నల్కర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం మామిడి పంట పిందె దశలో ఉన్నాయని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పూత పిందె రాలితే శాస్త్రవేత్తల సూచనలు పాటించాలన్నారు. మామిడి తోటను ప్రతి రోజూ గమనించి తెగులు, చీడపీడలు సోకకుండా చర్యలు తీసుకుని సస్యరక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా హార్టికల్చర్ అధికారి ప్రతాప్సింగ్, కేవీకే శాస్త్రవేత్త శ్రీనివాస్, నర్సాపూర్ డివిజన్ హర్టికల్చర్ అధికారి సంతోష్, ఆయిల్ఫామ్ మేనేజర్ క్రిష్ణ, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. ఏపీఈడీఏ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆర్పీ నాయుడు కేవీకేలో మామిడి రైతులకు అవగాహన సదస్సు -
భూసేకరణ ప్రక్రియ వేగిరం చేయండి
● కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి ● టీజీఐఐసీ, రెవెన్యూ, సర్వేఅధికారులతో సమావేశం సిద్దిపేటరూరల్: ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ వారికి కేటాయించిన భూముల సేకరణను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్తో కలిసి టీజీఐఐసీ, రెవెన్యూ, సర్వే అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలాల వారీగా కేటాయించిన ప్రభుత్వ, పట్టా, అసైన్డ్ భూములు వెరిఫై చేయాలన్నారు. భూసేకరణకు సంబంధించి ఎస్టిమేట్ చేసి టీజీఐఐసీ అధికారులకు పత్రాలు అందించాలన్నారు. డ్రోన్ద్వారా భూసేకరణ కొలతలు తీసుకుంటే సులభంగా వేగంగా జరుగుతుందని, ఈ పనిని ఎప్పటికప్పుడు ఆర్డీఓలు పర్యవేక్షణ చేయాలన్నారు. సమావేశంలో ఆర్డీఓలు సదానందం, చంద్రకళ, రామ్మూర్తి, టీజీఐఐసీ జోనల్మేనేజర్ అనురాధ, డీజీఎం ఉమామహేశ్వర్, డీఈ జ్యోతి, సర్వేల్యాండ్ ఏడీ వినయ్కుమార్, ఏఓ రెహమన్ తదితరులు పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్ రాయితీ సద్వినియోగం చేసుకోండి సిద్దిపేటరూరల్: ఎల్అర్ఎస్ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 25 శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్ లో అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు, తహసీల్దార్, ఎంపీఓ, ఎంపీడీఓ, లేఅవుట్ యజమానులతో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ తో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2020లో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్లాటు యజమానులు ఈనెలాఖరులోపు 25 శాతం రాయితీ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సాంకేతిక సమస్యలు ఎదురైతే పరిష్కరించుకోవాలని తెలిపారు. ఈనెలాఖరులో పనులు పూర్తి చేయాలి సిద్దిపేటరూరల్: ఉపాధి హమీలో భాగంగా చేపట్టిన సీసీరోడ్లు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాల్లో మరుగుదొడ్లు, డ్రైనేజీలు, గ్రామపంచాయతీ భవనాలు తదితర నిర్మాణ పనులను ఈనెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. పూర్తయిన నిర్మాణాలకు సంబంధించి ఎంబీ రికార్డ్ చేయాలన్నారు. -
మున్సిపాలిటీ స్వరూపం..
నర్సాపూర్ చెరువులో గుర్రపు డెక్కచెరువుల్లో గుర్రపు డెక్క మున్సిపాలిటీ పరిధిలోని చెరువులు, కుంటలలో చెత్తాచెదారం పేరుకుపోయింది. ఎర్రచెరువు, నర్సాపూర్ చెరువులు గుర్రపు డెక్కతో నిండిపోయాయి. కోమటిచెరువు కెనాల్లో పిచ్చి మొక్కలు, చెత్త పేరుకుపోయి ప్రజలకు తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తున్నాయి. ప్రధాన కాలువ చుట్టూ బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మున్సిపాలిటీ ఏర్పడిన సంవత్సరం: 1952 విస్తీర్ణం: 54,55చదరపు కిలోమీటర్లు. జనాభా: 1,77,879 వార్డులు: 43 రెవెన్యూ జోన్లు:17 పట్టణంలో ఇళ్లు: 42,325 మంచినీటి పథకాలు: యశ్వడ.. మిషన్భగీరథ పట్టణానికి అవసరమైనతాగునీరు: 21,20 ఎంఎల్డి.. చెత్త సేకరణ వాహనాలు: 51 పబ్లిక్ టాయిలెట్స్: 48 వీధి దీపాలు: 15,000 బస్తీ దవాఖానాలు: 3 స్వయం సహాయక సంఘాలు: 2,147 వీధి వ్యాపారులు: 7,768సిద్దిపేటజోన్: స్మార్ట్ సిటీ లక్ష్యంగా పట్టణంలో రూ.300 కోట్లతో 274కిలోమీటర్ల పొడవునా మూడు దశల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టారు. ఇప్పటివరకు రెండు దశల్లో పనులు పూర్తి అయ్యాయి. పలు చోట్ల చిన్న వర్షాలకే డ్రైనేజీ మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతున్నాయి. దీంతో మురుగు రోడ్లపై ఎరులై పారుతోంది. ఫలితంగా ఆ మార్గం గుండా వెళ్లాలంటేనే జనం ఇబ్బంది పడుతున్నారు. అలాగే హౌసింగ్ బోర్డు కాలనీ, ఆర్టీసీ పెట్రోల్ పంప్ దగ్గర మ్యాన్హోల్స్ నుంచి మురుగు నీరు రోడ్లపైకి వస్తున్నాయి. పట్టణ పరిధిలోని మారుతినగర్, ప్రియదర్శినగర్, మైత్రివనం ఫేస్–2, హరిప్రియానగర్, గాడిచర్లపల్లి, సుడా కార్యాలయం బ్యాక్సైడ్, టీహెచ్ఆర్ కాలనీ, వడ్డెరకాలనీ యూజీడీ లేకపోవడంతో పలు చోట్ల రోడ్లపైకే నీటి వృథాగా వదిలేస్తున్నారు. కొత్త కాలనీలైన మైత్రీవనం ఫేజ్–2, మారుతినగర్, టెలికాంనగర్, ఆదర్శనగర్, కేసీఆర్ కాలనీ, ఇందిరమ్మ కాలనీలలో అవసరాలకు అనుగుణంగా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయలేదు. కొన్ని చోట్ల ఏర్పాటు చేసినా వాటికి లైట్లు ఏర్పాటు చేయకపోవడంతో రాత్రి అయ్యిందంటే చాలు అంధకారంలో మగ్గుతున్నాయి. రాత్రి వేళ స్థానిక ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఇక వర్షాకాలంలో రోడ్లన్నీ బురదమయంగా మారుతున్నాయి. దీంతో వాహనదారులు, స్థానికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. పలు కాలనీలలోని ఖాళీ స్థలాల్లో చెత్తదారం, వర్షపు నీళ్లు నిలుస్తున్నాయి. మురికి కాలువలు శుభ్రం చేకపోవడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. పట్టణంలో 43 వార్డులుండగా ఒకే ఫాగింగ్ మిషన్ ఉంది. దీంతో దోమల నియంత్రణ కరువైంది. దోమలతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దోమలు కుట్టడంతో పలువురు అనారోగ్యం బారీన పడుతున్నారు. దోమల నియంత్రణకు ఫాగింగ్ చేయాలని ప్రజలు కోరుతున్నారు. సిద్దిపేట మున్సిపాలిటీలో ప్రజల అవసరాలను గుర్తించి ప్రధాన రహదారులకు ఇరువైపులా ఫుట్పాత్లను ఏర్పాటు చేశారు. మెదక్, హైదరాబాద్, కరీంనగర్ మార్గంలో ఉన్న ఫుట్పాత్ లను ఆక్రమించి కొందరు వ్యాపారం చేస్తున్నారు. నడవడానికి అవకాశం లేక పాదచారులు రోడ్డుపైనే నడవాల్సి వస్తోంది. దీంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. కొందరైతే ఫుట్పాత్లపైనే పర్మినెంట్ నిర్మాణాలు చేపట్టి వ్యాపారాలు కొనసాగిస్తుండటం గమనార్హం. అధికారులు కాసులకు ఆశపడి పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ అలంకరణ ప్రాయంగా మారుతున్నాయి. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయక పోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తరుచూ మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి కొన్ని కూడళ్లలో ఉంది. ముఖ్యంగా సుభాష్ రోడ్, కమాన్రోడ్, మార్కెట్ రోడ్ నిత్యం రద్దీగా ఉంటోంది. ఇరుకై న రహదారుల వల్ల ప్రజలు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.పేరుకే రైతు బజార్లు పట్టణ ప్రజల అవసరాలను గుర్తించి బల్దియాలో రైతు బజార్లు ఏర్పాటు చేశారు. ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్ మార్కెట్లతో పాటు మరో నాలుగు రైతు బజార్లు ఉన్నాయి. కానీ వీటిలో కొన్ని వినియోగంలో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా పట్టణంలో ఇష్టానుసారంగా వివిధ ప్రాంతాల్లో మాంస విక్రయాలు జరగడంతో నాన్వెజ్ మార్కెట్ ఏర్పాటు లక్ష్యం నీరు గారుతోంది. ఇప్పటికై న అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. -
సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం
మెదక్ కలెక్టరేట్: సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. బుధవారం మెదక్ సమీకృత కలెక్టరేట్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాను బాల్య వివాహా రహిత జిల్లాగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఐడీఓసీని నిత్యం పరిశుభ్రంగా ఉంచుతున్న మహిళా శానిటేషన్ సిబ్బందిని, మహిళా పారిశుద్ధ్య కార్మికులను శాలువాలతో సత్కరించి, బహుమతులు అందజేశారు. అదే విధంగా వివిధ శాఖలకు చెందిన మహిళా అధికారులను, ఉత్తమ మహిళా ఉద్యోగులను ప్రశంసాపత్రాలతోపాటు బహుమతులను ప్రదానం చేశారు. గెలుపొందిన వారికి కలెక్టర్ బహుమతులు అందించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, డీడబ్ల్యూ హైమావతి, అదనపు డీఆర్డీఓ సరస్వతీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విజయలక్ష్మీ, ఎస్సీ సంక్షేమ అధికారిని శశికళ, గిరిజన సంక్షేమ అధికారిని నీలిమ , మెప్మా పీడీ ఇందిరా, సీడబ్ల్యూసీ చైర్మన్ ఉప్పలయ్య, సీడీపీఓలు స్వరూప, హేమ భార్గవి, వెంకటరమణ, పద్మలత, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేటకమాన్: మహిళల సమానత్వం ఇంటి నుంచే ప్రారంభం కావాలని సిద్దిపేట సీపీ అనురాధ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిద్దిపేట పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో సీపీ బుధవారం కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు చదువు చాలా ముఖ్యమన్నారు. విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాలన్నారు. మహిళలు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని, ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వెంటనే ఆస్పత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించాలన్నారు. తల్లిదండ్రులు ఇంట్లో మగ పిల్లలను, ఆడపిల్లలను సమానంగా చూడాలన్నారు. జిల్లాలో మహిళలు, పిల్లల సంరక్షణ కోసం ప్రత్యేకంగా షీ టీమ్స్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. పోలీస్ సిబ్బందికి నిర్వహించిన పలు పోటీల్లో గెలుపొందిన వారిని సీపీ అభినందించారు. అనంతరం మెమోంటోతో సన్మానించారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఏసీపీ మధు, సీఐలు విద్యాసాగర్, విష్ణు ప్రసాద్, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ దుర్గ, పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ కలెక్టరేట్లో ఘనంగా మహిళా దినోత్సవం సిద్దిపేట సీపీ అనురాధ పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో మహిళా దినోత్సవం -
ఇప్పటికీ గ్రౌండింగ్ నో
సాక్షి, సిద్దిపేట: ఎస్సీ కార్పొరేషన్ ఎకనామిక్ సపోర్ట్ స్కీం కింద పలువురికి సబ్సిడీ విడుదలై ఆరు నెలల నుంచి ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు గ్రౌండింగ్ కాలేదు. ఎస్సీలకు చేయూతను అందించేందుకు 60శాతం సబ్సిడీని ప్రభుత్వం అందిస్తోంది. బ్యాంక్కు సంబంధం లేకుండానే థర్డ్ పార్టీ పేరుతో సబ్సిడీలు 34 మంది పేర్ల మీద రూ.1.20కోట్లు విడుదల అయ్యాయి. అందులో 75శాతం పైగా యూనిట్లు గ్రౌండింగ్ కాలేదు. ఇది అధికారులకు తెలిసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇద్దరు కలిసి కాజేశారా? అసలు సబ్సిడీ డబ్బులు లబ్ధిదారులకు అందయా?.. లేక గతంలో ఎస్సీ కార్పొరేషన్ అధికారి, కింగ్ బుక్స్టాల్ యజమాని ఇద్దరు కలిసి కాజేశారా అని అనుమానాలు రేకెత్తుతున్నాయి. రూ.1.20కోట్లు ఎటు వెళ్లాయని జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అధికారిక వెబ్సైట్లో గ్రౌండింగ్ కాలేదని తేటతెల్లం అవుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. లబ్ధిదారుల పేరుతో వీరిద్దరే సబ్సిడీ డబ్బులను మాయం చేశారని తెలుస్తోంది. దీని పై ఉన్నత స్థాయి అధికారి నియమించి క్షేత్రస్థాయిలో విచారణ చేపడితే ఆక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గోల్మాల్ పై జోరుగా చర్చ ఎస్సీ కార్పొరేషన్లో సబ్సిడీ గోల్మాల్ అయ్యాయని వార్త ప్రచురితం కావడంతో జిల్లా వ్యాప్తంగా జోరుగా చర్చ సాగింది. పలు దళిత సంఘాలు ఎస్సీ కార్పొరేషన్ ఎండీకి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. -
మజీద్పల్లిలో వెటర్నరీ బృందం
● కోళ్లఫారాలు పరిశీలన ● కోళ్ల మృతిపై ఆందోళన వద్దు ● జిల్లా పశుసంవర్ధకశాఖ జేడీ వెల్లడివర్గల్(గజ్వేల్): మజీద్పల్లిలోని కోళ్ల ఫారాలను వెటర్నరీ బృందం సందర్శించింది. ‘కోళ్లకు ఏమైంది’ శీర్షికతో బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ అశోక్కుమార్ స్పందించారు. క్షేత్రస్థాయి పరిశీలన, వివరాలు శాంపిల్స్ సేకరణ నిమిత్తం సిద్దిపేట ఏడీ కొండల్రెడ్డి, సంగారెడ్డి పశువ్యాధి నిర్ధారణ కేంద్రం ఏడీ పవన్కుమార్, వేలూరు పశువైద్యాధికారి డాక్టర్ సర్వోత్తమ్తో కూడిన బృందాన్ని వర్గల్ మండలం మజీద్పల్లి గ్రామానికి పంపించారు. క్షేత్రస్థాయిలో వీరు కోళ్ల ఫారాలను పరిశీలించారు. కోళ్లు చనిపోయిన తీరు, తదితర వివరాలను సేకరించారు. కోడిపిల్లలను అందజేసే కంపెనీ సంబంధీకులు ముందురోజే మిగతా కోళ్లను ‘కల్లింగ్’ చేసి తరలించినట్లు, కోళ్ల ఫారాలను శానిటైజ్ చేయించినట్లు గుర్తించారు. ఫారాలలో కోళ్లు లేకపోవడంతో శాంపిల్స్ సేకరించలేదు. పౌల్ట్రీ నిర్వాహకులకు, కోడిపిల్లలు ఇచ్చే కంపెనీల ప్రతినిధులకు పలు ముందస్తు జాగ్రత్తలు సూచించారు. పౌల్ట్రీ రైతులు తమ ఫారాలలో పెద్దసంఖ్యలో కోళ్లు మృతిచెందినట్లు గమనిస్తే వెంటనే పశుసంవర్ధక శాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. కోళ్ల మృతిపై జేడీ ద్వారా ఉన్నతాధికారులకునివేదిస్తామన్నారు. చికెన్ నిరభ్యంతరంగా తినొచ్చు కోళ్ల మృతిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, నిరభ్యంతరంగా చికెన్ తినొచ్చని జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ అశోక్కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉడకబెట్టిన వంటకాలలో వైరస్ ప్రభావం ఉండదన్నారు. చికెన్ తదితర వంటకాలను 100 డిగ్రీల ఉష్ణోగ్రత దాకా ఉడికించి తయారుచేయడం సాధారణమేనన్నారు. అందువల్ల వైరస్ ప్రభావం ఎంత మాత్రం ఉండదని, చికెన్పై, కోళ్ల మృతిపై ఆందోళన అవసరం జేడీ స్పష్టం చేశారు. -
16న మహిళా జాబ్మేళా
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాక: పట్టణంలో ఈనెల 16న మహిళల కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి తెలిపారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఉదయం 10 నుంచి 2 గంటల వరకు జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నగరంలోని కొంగర్ కలాన్లోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ(ఎంఎన్సీ)లో మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకే జాబ్ మేళా ఏర్పాటు చేశామన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాస్, ఫెయిల్ తో పాటు పాలిటెక్నిక్, ఐటీఐ అర్హతలు ఉన్న మహిళలకు ఈ కంపెనీలో అవకాశాలున్నాయన్నారు. దుబ్బాక నియోజకవర్గంలోని ఆసక్తి గల మహిళలు తమ సర్టిఫికెట్లతో జాబ్ మేళాకు హాజరు కావాలన్నారు. డీసీసీబీ చైర్మన్కుపితృ వియోగం కొండపాక(గజ్వేల్): ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి తండ్రి చిట్టి రాంరెడ్డి(80) హైదరాబాద్లో మృతి చెందారు. స్వగ్రామమైన కొండపాకలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, తహసీల్దార్ దిలీప్ నాయక్, సీఐ లతీఫ్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు డీసీసీబీ చైర్మన్ను పరామర్శించి ఓదార్చారు. పుస్తక ప్రదర్శన వర్గల్(గజ్వేల్): దశాబ్ది కార్యక్రమాల సందర్భంగా వర్గల్ జ్యోతిబాపూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో బుధవారం లైబ్రరీ డే నిర్వహించారు. ఆకట్టుకున్న ఈ మహా పుస్తక ప్రదర్శనలో గ్రంథాలయంలోని 22,241 గ్రంథాలను ప్రదర్శించారు. ఇందులో 9,062 రెఫరెన్స్ బుక్స్, 2,233 డొనేషన్ ద్వారా సమకూరిన బుక్స్, 676 పోటీ పరీక్షల పుస్తకాలు, 9,376 పాఠ్యాంశ సంబంధ బుక్స్, 894 జనరల్ బుక్స్, 11 పీరియాడికల్స్, 6 దినపత్రికలున్నాయి. ప్రిన్సిపాల్ భాస్కర్రావు, లైబ్రేరియన్ బాలలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా పుస్తక ప్రదర్శన తిలకించారు. -
చక్రం తిప్పిన కింగ్
కింగ్ బుక్స్టాల్కు చెందిన యజమానిని ఏజెంట్గా సదరు మాజీ అధికారి నియమించుకున్నారు. ఆ బుక్ స్టాల్కు చెందిన కుటుంబ సభ్యుల ద్వారా వివిధ ఎంటర్ప్రైజెస్ల పేర్ల మీద బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేశారు. మే, 2023 నుంచి సెప్టెంబర్ 2024 వరకు థర్డ్ పార్టీ పేరుతో రూ.1.2కోట్లన సబ్సిడీని విడుదల చేశారు. ఎంటర్ప్రైజెస్ పేరు మీద ఆరుగురి సబ్సిడీలను రూ.26.80లక్షలు, కింగ్ బుక్ స్టాల్ పేరు మీద ముగ్గురికి రూ.14.40లక్షలు, కింగ్ భవాని ఎంటర్ప్రైజెస్ పేరు మీద మరో ముగ్గురికి రూ.10.80లక్షలు, అలాగే కింగ్కు సంబంధించిన కుటుంబ సభ్యుల పేర్ల మీద, వాహనాలు కొనుగోలు చేసేందుకు నేరుగా లబ్ధిదారులకే చెక్లను విడుదల చేశారు. ఇలా మొత్తంగా థర్డ్ పార్టీ పేరుతో 34 మందికి సంబంధించి సబ్సిడీ రూ.1.20కోట్లను విడుదల చేశారు. ఒక్కో లబ్ధిదారుని దగ్గర రూ.80వేల నుంచి రూ.2లక్షల వరకు డబ్బులను కింగ్, మాజీ అధికారి తీసుకుని అందజేసినట్లు తెలుస్తోంది. పాడి పశువుల పంపిణీలో ఆక్రమాలను గతంలో ‘సాక్షి’ వెలికితీయగా, అలాగే ఇతర అక్రమాలు పాల్పడినట్లు కలెక్టర్ దృష్టికి రావడంతో విచారణ చేసి ఎస్సీ కార్పొరేషన్కు సరెండర్ చేశారు. గతంలో పనిచేసిన అధికారి పాల్పడిన ఆక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. యూనిట్లను ఏర్పాటు చేయకుండానే సబ్సిడీలను విడుదల చేసిన అధికారి, సహకరించిన ఏజెంట్ కింగ్కు సంబంధించిన ఎంటర్ప్రైజెస్లపై పూర్తి స్థాయిలో విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు కోరుతున్నాయి. -
ఉత్తమ ప్రాజెక్టులు రూపొందించండి
● ఓయూ కామర్స్ డీన్ కృష్ణచైతన్య ● కామర్స్ విద్యార్థులకు ఒకరోజు వర్క్షాప్సిద్దిపేటఎడ్యుకేషన్: నిపుణులైన అధ్యాకుల పర్యవేక్షణలో ఉత్తమ ప్రాజెక్టులను రూపొందిస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందుతాయని ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్ విభాగం డీన్ ప్రొఫెసర్ కృష్ణచైతన్య అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో ప్రాజెక్టుల తయారీ, పరిశోధనా మెలకువలపై మంగళవారం కామర్స్ విభాగం ఆధ్వర్యంలో పీజీ ఫైనలియర్ విద్యార్థులకు ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యవక్తగా హాజరై మాట్లాడారు. ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థుల్లో సామాజిక సమస్యలపై అవగాహన, సూక్ష్మపరిశీలన, పరిశోధనపై జిజ్ఞాస పెంపొందుతుందన్నారు. ప్రాజెక్టుల రూపకల్పనలో పాటించాల్సిన మెలకువలు, నివేదికలు తయారుచేసి సమర్పించాల్సిన విధానాలను వివరించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సునీత మాట్లాడుతూ విద్యార్థులు సానుకూల దృక్పధాన్ని అలవర్చుకుని పరిశోధన మెలకువలతో ఉత్తమ ప్రాజెక్టులు రూపొందించాలని సూచించారు. వర్క్షాప్ కన్వీనర్ డాక్టర్ గోపాల సుదర్శనం మాట్లాడుతూ పరిశోధనా సమస్యల గుర్తింపు, పరిష్కార మార్గాలు, ఫలితాల విశ్లేషణ సాధనాలను అర్థం చేసుకోవాలన్నారు. -
మల్లన్న ఎనిమిదో వారం ఆదాయం రూ.58.39 లక్షలు
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో ఆదివారం రూ.58,39,513 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు మంగళవారం తెలిపారు. మొత్తం మూడు రోజులలో ఈ ఆదాయం సమకూరిందన్నారు. భక్తుల వివిధ రకాల మొక్కులు, దర్శనాలు, లడ్డూ ప్రసాదం, పట్నాలు, బోనాలు, టికెట్ల అమ్మకాల ద్వారా ఈ ఆదాయం వచ్చిందని తెలిపారు. గత ఏడా ది కంటే ఈసారి రూ.11,52,263 అధికంగా వచ్చిందని ఈఓ రామాంజనేయులు తెలిపారు. దుబ్బాక మున్సిపల్ బడ్జెట్ రూ.22.22 కోట్లు అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సమక్షంలో ఆమోదం దుబ్బాక: మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.22.22 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టి ఆమోదించినట్లు కమిషనర్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్, మున్సిపల్ ప్రత్యేక అధికారి గరిమా అగర్వాల్ సమక్షంలో బడ్జెట్ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. సాధారణ నిధులు, వివిధ గ్రాంట్లు కలుపుకొని ఆదాయం రూ.22.22 కోట్లుగా అంచనా కాగా, వ్యయం రూ.22.19 కోట్లుగా కేటాయించామన్నారు. ఆదాయం, వ్యయానికి సంబంధించి మొత్తంగా మిగులు బడ్జెట్ రూ.2.82 లక్షలు ఉందన్నారు. మున్సిపల్ సాధారణ ఆదాయం రూ.5.85 కోట్లు, వ్యయం రూ.5.82 కోట్లు ఉందన్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు రూ.80 లక్షలు, సిబ్బంది వేతనాలకు రూ.1.6 కోట్లు, విద్యుత్ చార్జీలకు రూ.62.5 లక్షలు అలాగే రుణాల చెల్లింపులకు రూ.40 లక్షలు కేటాయించామన్నారు. వర్గల్ ఎంపీడీఓ బదిలీవర్గల్(గజ్వేల్): మండల పరిషత్ అధికారి విజయలక్ష్మి బదిలీ అయ్యారు. మంగళవారం ఎంపీఓ ఖలీమ్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. యేడాదిపాటు సేవలందించి అందరి మన్ననలు పొందిన విజయలక్ష్మి, మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ద్వారా సొంత జిల్లా మహబూబ్నగర్కు వెళ్లారు. విధి నిర్వహణలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆమె ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఆదర్శలో ప్రవేశానికి గడువు పెంపు చిన్నకోడూరు(సిద్దిపేట): ఆదర్శ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తు గడువు ఈ నెల 20వరకు పొడిగించినట్లు ఇబ్రహీంనగర్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సతీష్ తెలిపారు. 6వ తరగతిలో ప్రవేశం పొందే విద్యార్థులతో పాటు 7, 8, 9, 10 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు ఆదర్శ పాఠశాలలో సంప్రదించాలన్నారు. గ్రూప్ 2లో 103వ ర్యాంక్ హుస్నాబాద్: పట్టణానికి చెందిన అయిలేని మణికంఠేశ్వర్రెడ్డి గ్రూప్ –2లో 103 ర్యాంక్ సాధించారు. గ్రూప్ 2 పరీక్షలో 392.5 మార్కులు వచ్చాయి. గతంలో గ్రూప్ –4లో 600 ర్యాంక్ సాధించిన మణికంఠేశ్వర్రెడ్డి ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ఎండోమెంట్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. -
సబ్సిడీ గోల్మాల్
ఎస్సీ కార్పొరేషన్లో అక్రమాలు ● నేరుగా థర్డ్ పార్టీ పేరుతో చెల్లింపులుఎస్సీ కార్పొరేషన్లో అక్రమాలు వెలుగుచూశాయి. సబ్సిడీ పేరుతో రూ.కోట్లు స్వాహా చేశారు. అధికారి, కింగ్ బుక్స్టాల్ యజమాని, లబ్ధిదారుడు కుమ్మకై ్క బ్యాంకర్కు సంబంధం లేకుండానే సబ్సిడీ గోల్మాల్ చేశారు. థర్డ్ పార్టీ పేరుతో 34 మంది లబ్ధిదారులకు దాదాపు రూ.1.20కోట్ల సబ్సిడీని విడుదల చేశారు. యూనిట్లను ఏర్పాటు చేయకుండానే సబ్సిడీ డబ్బులను ఆ ముగ్గురు పంచుకున్నారు. కాసులకు ఆశపడి సదరు ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధికారి మే, 2023 నుంచి సెప్టెంబర్ 2024 వరకు పనిచేసిన సమయంలో ఇష్టారాజ్యంగా సబ్సిడీలను విడుదల చేయడం గమనార్హం. థర్డ్ పార్టీ పేరుతో విడుదల చేసిన సబ్సిడీలపై ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పరిశోధన చేసింది. అనేక విషయాలు వెలుగు చూశాయి. సాక్షి, సిద్దిపేట: జిల్లాలో 2020–21లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో 60శాతం సబ్సిడీతో ఎకానామిక్ సపోర్ట్ స్కీం కింద దరఖాస్తులను ఆహ్వానించారు. దీంతో 1,576 మంది దరఖాస్తు చేశారు. ఏప్రిల్ 2023లో 1,408 మందికి రూ 33.29కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. వీటిలో రూ.21.18కోట్లతో 781 గ్రౌండింగ్ అయ్యాయని, మరో 627 మంది లబ్ధిదారులకు సంబంధించి సబ్సిడీ రూ.12.11కోట్లు బ్యాంక్లో ఉన్నాయని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. నేరుగా సబ్సిడీ విడుదల గతంలో పని చేసిన ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధికారి.. కింగ్ బుక్స్టాల్ యజమాని, లబ్ధిదారులు కలిసి సబ్సిడీ డబ్బులు పంచుకున్నారు. ఎస్సీ కార్పొరేషన్లో రుణం కోసం దరఖాస్తు దారుడు ఏర్పాటు చేసే యూనిట్కు సంబంధించి వివరాలతో బ్యాంక్ను సంప్రదించాలి. అప్పుడు బ్యాంక్ అధికారులు దరఖాస్తు దారుని వివరాలు పరిశీలించి రుణం మంజూరు చేయాలనుకుంటే బ్యాంక్ కాన్సెంట్ ఇస్తారు. ఆ పత్రాన్ని ఎస్సీ కార్పొరేషన్లో అందజేయాలి. అప్పుడు యూనిట్కు సంబంధించి సబ్సిడీని బ్యాంక్కు విడుదల చేస్తారు. అలా నిబంధనలు ఏమీ పాటించకుండానే ఇష్టారాజ్యంగా సబ్సిడీని నేరుగా అందించారు. 34 మందికి రూ.1.2కోట్లు విడుదల గతంలో పనిచేసిన అధికారి చేతివాటం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటున్న దళిత సంఘాలు ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశోధనలో వెలుగు చూసిన నిజాలు ఉన్నతాధికారులకు నివేదికయూనిట్ ఏర్పాటు చేస్తున్న వారికే సబ్సిడీని విడుదల చేయాలి. కానీ థర్డ్ పార్టీ పేరుతో సబ్సిడీని విడుదల చేయవద్దు. వివిధ యూనిట్లకు సంబంధించి నేరుగా గతంలో పని చేసిన అధికారి సబ్సిడీ విడుదల చేశారని తెలియడంతో ఉన్నత అధికారులు రిపోర్ట్ తెప్పించుకున్నారు. – రామాచార్య, ఇన్చార్జ్ ఈడీ, ఎస్సీ కార్పొరేషన్ -
కోళ్లకు ఏమైంది..?
● అంతుచిక్కని వ్యాధితో వేలాదిగా మృత్యువాత ● తాజాగా మజీద్పల్లిలో 15 వేల కోళ్లు మృతి ● ఫారాలన్నీ ఖాళీ.. పౌల్ట్రీ రైతుల గగ్గోలు ● వివరాలు సేకరించిన పశువైద్యాధికారి వర్గల్(గజ్వేల్): అంతుచిక్కని వ్యాధితో జిల్లా వ్యాప్తంగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. కోళ్లతో కళకళలాడే పౌల్ట్రీ ఫారాలన్నీ వెలవెలపోతున్నాయి. తీవ్ర నష్టాలతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. తాజాగా వర్గల్ మండలం మజీద్పల్లిలోని రెండు పౌల్ట్రీఫారాలలో 15వేలపై చిలుకు కోళ్లు మృత్యువాత పడ్డాయి. మజీద్పల్లి గ్రామానికి చెందిన ఎస్కే అలీ కోళ్లఫారం లీజుకు తీసుకుని అందులో 10వేల కోడి పిల్లలు పెంచుతున్నాడు. అదే విధంగా సయ్యద్ బాసిత్ తన సొంత ఫారంలో 7,500 కోళ్లు వేశాడు. ఈ ఫారాలలో కోళ్లను అంతుచిక్కని వ్యాధి చుట్టుముట్టింది. వ్యాధి బారినపడి ఈ రెండు ఫారాలలో వారం రోజులుగా కుప్పలకొద్ది కోళ్లు చనిపోయాయి. కోళ్లు చనిపోయి ఫారాలు ఖాళీ అవుతుండడంతో నష్టాలు చవిచూస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉన్నతాధికారులకు నివేదిస్తా వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడిన సమాచారం తెలిసి మంగళవారం వర్గల్ మండలం వేలూరు పశువైద్యాధికారి డాక్టర్ ఎన్ సర్వోత్తమ్ మజీద్పల్లి సందర్శించారు. బాధిత పౌల్ట్రీరైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఎస్కే అలీ ఫారంలో 8,000 కోళ్లు, సయ్యద్ బాసిత్ ఫారంలో 7,000 కోళ్లు మృతిచెందినట్లు పేర్కొన్నారు. కోళ్లు మృతిచెందిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఆయన పేర్కొన్నారు. నష్టాలే మిగిలాయి కోళ్లఫారం లీజుకు తీసుకుని 10 వేల కోడి పిల్లలు వేశాను. చక్కగా ఎదిగి రూ.లక్షకు పైగా ఆదాయం వస్తదనుకున్నా. అనూహ్యంగా వారం రోజుల నుంచి వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. ఇప్పటికే 8,500 కోళ్లు చనిపోయాయి. మిగతావి బతికే అవకాశం లేదు. రూ.1.20 లక్షల దాకా నష్టం. ప్రభుత్వం ఆదుకోవాలి. – ఎస్కే అలీ, పౌల్ట్రీ నిర్వాహకుడు -
అలసత్వం.. సమన్వయ లోపం..
నరేందర్రెడ్డి ఓటమికి కారణాలివే.. ● ఉమ్మడి మెదక్లోనే అతి తక్కువ ఓట్లు ● ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపై సుదీర్ఘ చర్చ ● ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలతో సమావేశమైన జిల్లా మంత్రులుసాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి నరేందర్రెడ్డి ఓటమికి గల కారణాలపై ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు సుదీర్ఘంగా చర్చించారు. గెలిచే అవకాశాలున్న ఎమ్మెల్సీ సీటు చేజారి పోవడానికి దారితీసిన పరిస్థితులను సమీక్షించారు. ఈ ఓటమికి అభ్యర్థి నరేందర్రెడ్డి అలసత్వమే కారణమని పలువురు జిల్లా కాంగ్రెస్ ముఖ్యనేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల ఇన్చార్జిలు, కీలక నాయకులతో జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ, జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహలు మంగళవారం సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అభ్యర్థి నరేందర్రెడ్డి అలసత్వం కారణంగానే జిల్లాలో ఆశించిన ఓట్లు పడలేదని పలు నియోజకవర్గాల నేతలు ఈ సమావేశంలో అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. అలాగే అభ్యర్థి ఎంపిక కూడా మరోకారణమని, హరికృష్ణకు టికెట్ ఇస్తే ప్రయోజనం ఉండేదని, మరోవైపు టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని నిలపకపోవడం కూడా కారణమని పలువురు నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ సమావేశానికి చివరలో హాజరైన పీసీసీ చీఫ్ బి.మహేష్కుమార్గౌడ్తో కూడా ఈ అంశంపై జిల్లా నేతలు ప్రస్తావించినట్లు తెలిసింది. పాత బిల్లులు క్లియర్ చేయండి త్వరలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేక అభివృద్ధి నిధులు (ఎస్డీఎఫ్)లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిన అంశంపైనా సమావేశంలో చర్చ జరిగింది. అయితే గతంలో మంజూరైన అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు రాక పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయని, ఒకరిద్దరు నాయకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. అలాగే ఆందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాలకు మంజూరైన ఇంటిగ్రేటెడ్ పాఠశాలల అంశాన్ని కూడా సమావేశంలో చర్చించారు. ప్రజల్లో ప్రభుత్వంపై ఎందుకంత వ్యతిరేకత వస్తోందనే అంశం కూడా ఈ సమావేశంలో చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. -
సత్వర న్యాయం అందాలి
● శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యం ● మంత్రి పొన్నం ప్రభాకర్ ● హుస్నాబాద్లో ఏసీపీ కార్యాలయ భవనం ప్రారంభం హుస్నాబాద్: పోలీస్స్టేషన్ను ఆశ్రయించిన బాధితులకు సత్వర న్యాయం అందించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలో రూ.2.84 కోట్ల వ్యయంతో ఆధునిక టెక్నాలజీతో నిర్మించిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయ భవనాన్ని మంగళవారం మంత్రి ప్రారంభించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. మంత్రి మాట్లాడుతూ బాధితులకు సత్వర న్యాయం అందించడానికి పోలీసులు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఆలోచనలో ఫ్రెండ్లీ పోలీస్ ఒకటని, నేరస్తుల విషయంలో కఠినంగా వ్యవహరించి బాఽధితులకు న్యాయం చేయాలన్నారు. సమస్యలు పరిష్కరించి ప్రజల ఆదరాభిమానాలు పొందాలని సూచించారు. పోలీసులు నూతన టెక్నాలజీని ఉపయోగించి విధులు నిర్వహిస్తూ ప్రజలకు మరింత సేవలు అందించాలన్నారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ అధికారులు, సిబ్బంది అద్భుతంగా పని చేస్తున్నారని మంత్రి కొనియాడారు. కార్యక్రమంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.రమేశ్, కలెక్టర్ మనుచౌదరి, సీపీ అనురాధ, ఏఆర్ అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు సతీష్, మధు, పురుషోత్తం రెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్లు, సీఐలు పాల్గొన్నారు. -
అర్జీలు సత్వరం పరిష్కారం
● కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి ● అధికారులకు దిశానిర్దేశం ● ప్రజావాణికి వచ్చిన అర్జీలు 54సిద్దిపేటరూరల్: ప్రజవాణి కార్యక్రమంలో అందించిన అర్జీలను సత్వరం పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్తో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీల పరిష్కారంపై కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు అర్జీలు పరిష్కరించడం ద్వారా ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుందన్నారు. పలు సమస్యలపై 54 దరఖాస్తులు వచ్చాయి. గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించండికొమురవెల్లి(సిద్దిపేట): మండలంలోని తపాస్పల్లి గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించాలని గ్రామస్తులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్కు విన్నవించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న గ్రామపంచాయతీ భవనం, ఎస్సీ కమ్యూనిటీ హల్, బస్ షెల్టర్ ,పాఠశాల ప్రహరీ నిర్మాణానికి నిధుల కేటాయించాలని కలెక్టర్ను కోరినట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ స్పందించి అసంపూర్తిగా ఉన్న పనులకు నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో పుట్ట నర్సింహులు, ఈగ కనకయ్య, రమేష్ తదితరులు ఉన్నారు.చెరువులను నింపండి కొండపాక(గజ్వేల్): చెరువులు నింపి సాగునీటిని అందించాలని రైతులు కోరారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. మల్లన్నసాగర్ నుంచి తపాస్పల్లి రిజర్వాయర్కు నీరు వెళ్లేందుకు ఆగిపోయిన కాలువ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ను కోరారు. మేదినీపూర్, లకుడారం గ్రామాల రైతులు కాలువ తవ్వకాల్లో భూములు కోల్పోతున్నారని అన్నారు. వారికి పరిహారం అందకపోవడంతో కాలువ తవ్వకం పనులను నిలిపివేస్తున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. మర్పడ్గ, రాంపల్లి శివారుల్లో ఆగిపోయిన కాలువ పనుల విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, రైతులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్లో కోవర్టులను ఏరేస్తాం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇతర పార్టీలకు కోవర్టులుగా వ్యవహరిస్తున్న వారిని గుర్తించి, ఏరివేస్తామని పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మైనంపల్లి మాట్లాడుతూ పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పార్టీకంటే వ్యక్తులు గొప్పకాదన్నారు. పదేళ్లుగా అధికారంలో ఉండి ఇచ్చిన హామీలను అమలుచేయలేని పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. కొండగట్టు బస్సు ప్రమాదం, మాసాయిపేట స్కూల్ బస్సు ప్రమాదాలు జరిగినపుడు నాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఏనాడూ బాధితులను పరామర్శించలేదని మండిపడ్డారు. టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా మారినపుడే ప్రజలు వీఆర్ఎస్ ఇచ్చారన్నారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం కార్యకర్తలు సమష్టిగా కష్టపడి పని చేయడం హర్షించదగిన విషయమన్నారు. పార్టీ కోసం కష్టపడుతున్న వారికి తప్పకుండా గుర్తింపు వస్తుందన్నారు. కాంగ్రెస్ నాయకులు పార్టీ పటిష్టతకు కృషి చేయాలన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయానికి అందరం కృషి చేద్దామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. అధిక శాతం రైతులకు రుణమాఫీ అయ్యిందన్నారు. ఈవిషయంలో కావాలనే బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని బద్నాం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదని, జరిగినట్లు నిరూపిస్తే నేను రాజకీయాలకు దూరంగా ఉంటానని హనుమంతరావు సవాల్ చేశారు. ఎట్ల దోచుకోవాలో, ఎలా దాచుకోవాలో, ఎట్ల పబ్లిసీటీ చేసుకోవాలో బీఆర్ఎస్ నాయకులకు తెలిసినంతగా ఎవరికీ తెలియదని ఆరోపించారు. కార్యక్రమంలో సిద్దిపేట, మెదక్ జిల్లాల పార్టీ అధ్యక్షులు నర్సారెడ్డి, ఆంజనేయులు గౌడ్, నాయకులు హరికృష్ణ, అత్తు ఇమామ్, యాదగిరి, లక్ష్మి, శ్రీనివాస్, మహేందర్, సతీష్, ఎల్లం యాదవ్, శివప్ప, బుచ్చిరెడ్డి, ఆనంద్, దాస అంజయ్య, రియాజ్, గోపికృష్ణ, తదితరులు పాల్గొన్నారు. పార్టీ సీనియర్ నేత హనుమంతరావు స్పష్టీకరణ జిల్లా కేంద్రంలో నాయకులు,కార్యకర్తలతో సమావేశం -
ఎవరికీ పట్టని ప్రజావాణి!
డిజిటల్ జమానా.. జేబులో ఫోన్ ఉంటే చాలు వివిధ రకాల చెల్లింపులకు నగదు బదిలీ సాధారణమైంది. తాజాగా ఈ ట్రెండ్ వివాహ వేడుకలకూ పాకింది. వివాహ వేడుకకు హాజరైన వారు డిజిటల్ పద్ధతిలో కూడా కట్నాలు చదివించుకోవచ్చు అన్నట్లు సంబంధీకులు ‘క్యూఆర్’ కోడ్ స్కానర్ను అందుబాటులో పెట్టారు. పెళ్లికి వచ్చిన వారు దీనిని చూసి నయా ట్రెండ్ భళే ఐడియా అంటూ ఆశ్చర్యపోయారు. డిజిటల్ కట్నాలు చదివించడం వర్గల్ మండలం గౌరారంలో చోటుచేసుకుంది. – వర్గల్(గజ్వేల్)మండుతున్న ఎండలకు మనుషులే తట్టుకోలేక పోతున్నారు. ఇక మూగ జీవాల సంగతి సరేసరి. కోతులు ఎండ వేడిమిని భరించలేక చెట్ల నీడను ఆశ్రయిస్తున్నాయి. మిరుదొడ్డిలో మిట్ట మధ్యాహ్నం వేళ వానరాలు స్థానిక పెద్దచెరువు కట్టపై ఉన్న చెట్ల నీడన చేరి ఉపశమనం పొందుతున్న ఈ దృశ్యాన్ని ‘సాక్షి’ కెమెరా క్లిక్మనిపించింది. – మిరుదొడ్డి(దుబ్బాక)న్యూస్రీల్ -
సమీకృత గురుకులానికి రూ.200 కోట్లు
● నిర్మాణానికి నిధులు మంజూరు ● ఇప్పటికే తంగళపల్లిలో భూమిపూజ చేసిన మంత్రి పొన్నం ● సుమారు 25 ఎకరాల్లో నిర్మాణానికి చర్యలు ● అంతర్జాతీయ స్థాయిలో అందనున్న విద్య కోహెడరూరల్(హుస్నాబాద్): అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో, అత్యంత ప్రతిష్టాత్మకంగా విద్యను అందించే లక్ష్యంతో కోహెడ మండలంలోని తంగళపల్లిలో సమీకృత గురుకుల పాఠశాలను నిర్మించనున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేసింది. మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ ఇటీవలే గ్రామ శివారులో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇంటర్నేషనల్ స్థాయిలో ఇంగ్లిష్ మీడియంలో 5 నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులకు బోధన అందనుంది. అంతర్జాతీయ స్థాయి బోధన సమారు 25 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి పిల్లలకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో అంతర్జాతీయ స్థాయిలో విద్య అందించనున్నారు. ఈ సమీకృత గురుకులంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ గురుకుల పాఠశాలలన్నీ ఒకే ప్రాంగణంలోకి వస్తాయి. 5 నుంచి 12వ తరగతి వరకు నిర్వహిస్తారు. విద్యార్థులకు లైబ్రరీలతో పాటు కంప్యూటర్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. అన్ని తరగతులు డిజిటల్ బోర్డుల ద్వారా బోధించనున్నారు. కార్పొరేట్కు దీటుగా విద్య పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం. విద్యార్థులకు అన్ని తరగతుల్లో కంప్యూటర్, డిజిటల్ బోర్డుల ద్వారా బోధన జరగనుంది. చదవుల పేరిట ఒత్తిడి స్పష్టించే వాతావరణం కాకుండా క్రీడలు, వినోదం వంటిని విద్యార్థులకు అందుతాయి. ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరుకు కృషి చేసిన సీఎం రేవంత్రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కుకు ప్రత్యేక కృతజ్ఞలు. – పొన్నం ప్రభాకర్, బీసీ, రవాణా శాఖ మంత్రి -
నా భూమిని నాకు ఇప్పించండి సారూ..
నాపేరు కౌసల్య. గౌరాయపల్లి. కొమురవెల్లి మండలం. నాభర్త రాంరెడ్డి 2019లో మరణించాడు. గ్రామశివారులో సర్వే నంబర్ 107/ఎ/4 లో 33 గుంటల భూమి నాభర్త పేరుపై ఉంది. ఆ భూమిని 2024లో నాపేరుపై మార్చుకున్నాను. మా గ్రామానికి చెందిన వ్యక్తి వేలిముద్రలు సరిగ్గా పడలేదని నమ్మించి. మళ్లీ వేలి ముద్రలు పెట్టించి తనపేరుపై మార్చుకోవడమేకాక, వేరే గ్రామానికి చెందిన వ్యక్తికి విక్రయించాడు. నాకు అన్యాయం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకుని నాభూమి నాకు ఇప్పించాలి. బాధిత వృద్ధురాలు కౌసల్య -
కాంగ్రెస్తోనే సామాజిక న్యాయం
గజ్వేల్: కాంగ్రెస్తోనే సామాజిక న్యాయం సాధ్యమని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. సోమవారం గజ్వేల్ మండలం పిడిచెడ్ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేద, బడుగువర్గాల సంక్షేమానికి పెద్దపీట వేశారని కొనియాడారు. ఈ క్రమంలోనే దేశంలో ఎక్కడాలేనివిధంగా కులగణన చేపట్టి బీసీలకు న్యాయం చేయడానికి కృషి చేస్తున్నారన్నారు. వర్గీకరణ ద్వారా ఎస్సీల్లో అట్టడుగున నిలిచిన వారికి అండగా నిలుస్తున్నామని తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సముచిత న్యాయం చేశారని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలుచేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, వైస్ చైర్మన్ సర్ధార్ఖాన్, కాంగ్రెస్ నియోజకవర్గ ప్రచార కమిటీ చైర్మన్ నిమ్మ రంగారెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి, గజ్వేల్ నియెజకవర్గ శాఖ అధ్యక్షుడు అజహర్ తదితరులు పాల్గొన్నారు.డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి -
సమయపాలన పాటించని అధికారులు
● ఉదయం 11 గంటలవుతున్నా అరకొరగా హాజరు ● నిరీక్షణలో అర్జీదారులు ● పెండింగ్లో వందలాది వినతులుప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపడుతున్న ప్రజావాణి కార్యక్రమం అపహాస్యమవుతోంది. సమస్యలపై వినతులను స్వీకరించేందుకు అధికారులు సరైన సమయానికి రాకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వినతుల స్వీకరణను కలెక్టర్ మనుచౌదరి, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్ఓ నాగరాజమ్మ, డీఆర్డీఓ జయదేవ్లు సోమవారం ఉదయం 10:30గంటలకు ప్రారంభించారు. జిల్లాలోని వివిధ విభాగాల అధికారులు సైతం ఆ సమయంలోగా హాజరుకావాలి. సుమారు 11 గంటలవుతున్నా 49 మంది అధికారులకు 12 మందే హాజరవడం తీవ్ర చర్చనీయాంశమైంది. వారి కోసం అర్జీదారులు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. –సాక్షి, సిద్దిపేట జిల్లా ఉన్నతాధికారులే సమయ పాలన పాటించడంలేదు. ప్రజావాణి 10:30 గంటలకు ప్రారంభమైంది. ఉదయం 10:45గంటల వరకు డీఎస్ఓ తనూజ, డీపీఓ దేవకీ దేవి, జిల్లా మత్స్య శాఖ అధికారి మధుసూదన్, డీఐసీ జనరల్ మేనేజర్ గణేశ్ రామ్, ఎల్డీఎం హరిబాబు, జీజీహెచ్ఆర్ఎంఓ డాక్టర్ శ్రావణి, ఏడీ మైన్స్ లింగస్వామి, ఎస్సీ వేల్ఫేర్ అధికారి హైమద్, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ అశోక్ కుమార్, డీడబ్ల్యూఓ లక్ష్మీకాంత్, డీఈఓ శ్రీనివాస్రెడ్డి, ఏడీ ల్యాండ్స్ సర్వే వినయ్ కుమార్లు ప్రజావాణికి హాజరయ్యారు.ఆ తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కరుగా 11:20గంటల వరకు చేరుకున్నారు. సమయపాలన పాటించాలని రిజిస్ట్రర్ సైతం కలెక్టరేట్లో ఏర్పాటు చేశారు. అయినప్పటికీ పలువురు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో పలువురు చర్చించుకోవడం కనిపించింది. ఉన్నతాధికారులు డుమ్మా.. కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి ఆయా శాఖల ఉన్నతాధికారులు విధిగా హాజరుకావాలి. కొందరు జిల్లా అధికారులు డుమ్మా కొట్టి.. కింది స్థాయి సిబ్బందిని ప్రజావాణికి పంపిస్తుండటం గమనార్హం. కలెక్టర్, అదనపు కలెక్టర్లకు ఉన్న శ్రద్ధ జిల్లా అధికారులకు ఉండటం లేదని పలువురు దరఖాస్తు దారులు ఆరోపిస్తున్నారు. పలువురు ఫోన్లలో బిజీ ప్రజావాణికి వచ్చిన అధికారులు పలువురు ఫోన్లలో మాట్లాడటమే సరిపోతోంది. కలెక్టర్కు వినతి ఇవ్వగానే వెంటనే ఆయా శాఖ జిల్లా అధికారిని పిలిచి అప్పగించి పరిష్కారించాలని ఆదేశిస్తున్నారు. దీంతో ఆ శాఖ అధికారికి సమస్య వివరించేందుకు దరఖాస్తు దారులు వెళ్తున్నారు. సదరు అధికారులు గంటల తరబడి ఫోన్లలో బిజీగా ఉండటంతో దరఖాస్తుదారులు ఎవరికీ చెప్పుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొందరు ఉన్నతాధికారులే ఇలా వ్యవహరించడం చర్చకు దారితీస్తోంది.కలెక్టరేట్ గోడలపై పెట్టుకుని రాస్తున్న వినతులుపెండింగ్లో 411 వినతులు ప్రజావాణికి వివిధ సమస్యలపై ప్రతి సోమవారం సుమారు 50 వరకు దరఖాస్తులు వస్తున్నాయి. గతేడాది మార్చి 1 నుంచి ఈ ఏడాది మార్చి 10వ తేదీ వరకు 1,262 వినతులు రాగా వీటిలో 851 పరిష్కారమైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 411 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ప్రధానంగా భూ సమస్యలకు సంబంధించినవి ఎక్కువగా వస్తున్నాయి. తమ భూములు ఆక్రమించారని, సర్వే చేయించాలని, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఇలా పలు సమస్యలపై వినతులు వస్తున్నాయి. సమస్యలను త్వరగా పరిష్కరించాలని దరఖాస్తు దారులు కోరుతున్నారు. దరఖాస్తులు రాసేందుకు కనీసం టేబుళ్లు లేకపోవడంతో గోడలపై పెట్టుకుని వినతులను రాస్తున్నారు. వినతులు రాసుకునేలా టేబుళ్లను ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. -
పంటలు ఎండిపోతున్నా పట్టించుకోని సర్కార్
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాకరూరల్: పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడలేదని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో సోమవారం సాగునీటి కాలువ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఎండిపోతున్న వరి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంవత్సరం గడస్తున్నా కాలువలు పూర్తి కాలేదన్నారు. కాలువ నిర్మాణం పూర్తయితే మల్లన్న సాగర్ ద్వారా వచ్చే నీరు 30 గ్రామాలకు అందుతాయన్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెడితే పంటలు ఎండి పోవడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వర్గీకరణతోనే అందరికీ న్యాయం ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు పరశురాములు చిన్నకోడూరు(సిద్దిపేట): వర్గీకరణతోనే మాదిగ ఉప కులాలకు న్యాయం జరుగుతుందని మహాజన్ సోషలిస్ట్ పార్టీ(ఎంఎస్పీ) జిల్లా అధ్యక్షుడు పరశురాములు అన్నారు. సోమ వారం ఎమ్మార్పీఎస్ లక్ష డప్పులు కార్యక్రమం చిన్నకోడూరులో నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంద కృష్ణ నాయకత్వంలో 30 ఏళ్ల పోరాట ఫలితం తుది దశకు చేరిందన్నారు. వర్గీకరణ అమలయ్యేంత వరకు గ్రూప్ ఫలితాలు, ఉద్యోగాల నోటిఫికేషన్లు నిలిపివేయాలన్నారు. తెలంగాణలో అత్యధికంగా ఉన్న మాదిగలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలన్నారు. సమావేశంలో ఎంఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మణ్, నాయకులు రంజిత్, రాజు, రమేష్, మురళీ, రవి, బాబు, కళాకారులు పాల్గొన్నారు. సమాజంలో మహిళల పాత్ర కీలకం ప్రశాంత్నగర్(సిద్దిపేట): సమాజంలో మహిళల పాత్ర కీలకమని జిల్లా లీగల్ సెల్ అఽథారిటీ సెక్రటరీ స్వాతిరెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా సావిత్రిబాయిపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వాతిరెడ్డి మాట్లాడుతూ మహిళల హక్కులపై వివరించారు. అనంతరం స్వాతిరెడ్డిని, మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు పన్యాల భూపాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి మామిడి పూర్ణచందర్రావు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా స్థాయి కమిటీ నియామకం ప్రశాంత్నగర్(సిద్దిపేట): బీజేపీ జిల్లా స్థాయి కమిటీని సోమవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరిశంకర్ ముదిరాజ్ నియమించారు. రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కన్వీనర్గా నలగామ శ్రీనివాస్, కో కన్వీనర్లుగా తొడుపునూరి వెంకటేశం, భూరెడ్డి విభిషన్ రెడ్డిలను నియమిస్తున్నట్లు తెలిపారు. -
ఎవరికీ పట్టని ప్రజావాణి!
డిజిటల్ జమానా.. జేబులో ఫోన్ ఉంటే చాలు వివిధ రకాల చెల్లింపులకు నగదు బదిలీ సాధారణమైంది. తాజాగా ఈ ట్రెండ్ వివాహ వేడుకలకూ పాకింది. వివాహ వేడుకకు హాజరైన వారు డిజిటల్ పద్ధతిలో కూడా కట్నాలు చదివించుకోవచ్చు అన్నట్లు సంబంధీకులు ‘క్యూఆర్’ కోడ్ స్కానర్ను అందుబాటులో పెట్టారు. పెళ్లికి వచ్చిన వారు దీనిని చూసి నయా ట్రెండ్ భళే ఐడియా అంటూ ఆశ్చర్యపోయారు. డిజిటల్ కట్నాలు చదివించడం వర్గల్ మండలం గౌరారంలో చోటుచేసుకుంది. – వర్గల్(గజ్వేల్)మండుతున్న ఎండలకు మనుషులే తట్టుకోలేక పోతున్నారు. ఇక మూగ జీవాల సంగతి సరేసరి. కోతులు ఎండ వేడిమిని భరించలేక చెట్ల నీడను ఆశ్రయిస్తున్నాయి. మిరుదొడ్డిలో మిట్ట మధ్యాహ్నం వేళ వానరాలు స్థానిక పెద్దచెరువు కట్టపై ఉన్న చెట్ల నీడన చేరి ఉపశమనం పొందుతున్న ఈ దృశ్యాన్ని ‘సాక్షి’ కెమెరా క్లిక్మనిపించింది. – మిరుదొడ్డి(దుబ్బాక)న్యూస్రీల్ -
పెద్ద మాసాన్పల్లి అడవికి నిప్పు
తొగుట(దుబ్బాక): మండలంలోని పెద్ద మాసాన్పల్లి అడవికి ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. అడవి సమీపంలోని వ్యవసాయ బావుల వైపునకు మంటలు వ్యాపించాయి. దీంతో పరిస్థితిని గమనించిన గ్రామస్తులు జిల్లా ఫారెస్ట్ ఇన్చార్జి అధికారికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. మంటలు ఆర్పేందుకు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా వేడుకున్నారు. తమ వ్యవసాయ బావుల వద్ద పశువుల పాకలు, పాడిగేదెలు, గడ్డి వాములు ఉన్నాయని సదరు అధికారికి సమస్య విన్న వించారు. ఆలస్యంచేస్తే తమకు భారీగా నష్టం వాటిల్లుతుందని విన్నవించారు. అయినా సదరు అధికారి స్పందించకుండా ఫోన్ చేసిన గ్రామస్తులపై రుసరుసలాడారు. తనకు ఎందుకు పోన్చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారంటూ గ్రామస్తులు తెలిపారు. రేపు ఉదయం చూద్దాంలే అంటూ ఫోన్కట్చేశాడని వారు తెలిపారు. ఇక ఆలస్యంచేస్తే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే ప్రమాదముందంటూ యువకులు మంటలు ఆర్పేందుకు తరలివెళ్లారు. ఈదురు గాలులు వ్యాపించడంతో మంటలు అదుపులోకి రాలేదు. ఈ క్రమంలో గ్రామస్తులకు సమాచారం అందించడంతో పెద్ద ఎత్తున అడవికి తరలివచ్చారు. వ్యవసాయ బావుల నుంచి పైపుల ద్వారా ఎంతో శ్రమించి మంటలు ఆర్పివేశారు. అడవికి నిప్పంటుకుందని సమాచారం ఇచ్చినా స్పందించని జిల్లా ఫారెస్ట్ ఉన్నతాధికారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. స్పందించని ఫారెస్ట్ ఉన్నతాధికారి గ్రామస్తులే మంటలు ఆర్పిన వైనం -
సుందరంగా తీర్చిదిద్దుతాం
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్నస్వామి క్షేత్రాన్ని అన్ని విధాల సుందరంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. ఆదివారం కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. మల్లికార్జున స్వామి మా కుటుంబానికి ఇలవేల్పు అని, ప్రతి సంవత్సరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ కట్టుబడి ఉందని, భక్తులకు కావల్సిన సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహాదేవుని శ్రీనివాస్, ధర్మకర్తలు లింగంపల్లి శ్రీనివాస్, జయప్రకాశ్ రెడ్డి, తురాయి నవీన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్షాలు కావాలనే బద్నాం చేస్తున్నాయి..కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు కావాలనే బద్నాం చేస్తున్నాయని మంత్రి పొన్నం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి ఆరోగ్యశ్రీని రూ.5 లక్షలనుంచి రూ.10 లక్షలకు పెంచామన్నారు. మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా నిధుల విడుదల చేశామని అన్నారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లను సైతం ఇస్తామని, మహిళను కోటీశ్వరులను చేసేందుకు ప్రభత్వం అనేక పథకాలను తీసుకురానుందని తెలిపారు. వేసవిలో గ్రామాలలో తాగునీటి సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కొమురవెల్లిలో వసతులు కల్పిస్తాం మల్లన్న స్వామి మా ఇంటి ఇలవేల్పు మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ స్వామి సన్నిధిలో కుటుంబసమేతంగా పూజలు -
సుడా.. ఇంకెప్పుడు బడా?
సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(సుడా)ని విస్తరించేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. కానీ నేటికీ అమలు కావడంలేదు. సిద్దిపేట మున్సిపాలిటీ , 26 గ్రామాలే కాకుండా జిల్లా అంతటా విస్తరించాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు విస్తరణకు అడుగు ముందుకు పడటంలేదు. దీంతో విస్తరణ ఉంటుందా? ఉండదా? అని పలువురు చర్చించుకుంటున్నారు. ట్రిపుల్ ఆర్ రోడ్డు వెళ్లే మార్గం నుంచి రెండు కిలోమీటర్ల వరకు (మహానగరాభివృద్ధి సంస్థ) హెచ్ఎండీఏను విస్తరించాలని, మిగతా ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగా పరిగణించాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.ఉత్తర్వులిచ్చారు.. విస్తరణ మరిచారు ● ఆదేశాలిచ్చి నేటికి నాలుగు నెలలు ● ఇష్టారాజ్యంగా వెలుస్తున్న వెంచర్లు ● పట్టించుకోని అధికారులు ● డీటీసీపీ విలీనం జరిగేనా? సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(సుడా) అక్టోబర్ 30, 2017న ఏర్పాటుచేశారు. సిద్దిపేట మున్సిపాలిటీతో పాటు 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 26 గ్రామాలతో సుడా పురుడు పోసుకుంది. సుడా విస్తరణ కోసం హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న వర్గల్, ములుగు, మర్కూక్ మండలాలు కాకుండా మిగతా మండలాలను కలిపేందుకు కలెక్టర్ నుంచి ప్రతిపాదనలు స్వీకరించారు. వాటిని పరిశీలించి గతేడాది అక్టోబర్ 15న పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి దానకిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. నేటికీ నాలుగు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అమలు కావడం లేదు. నాలుగు మున్సిపాలిటీలు.. 286 గ్రామాలు డిస్ట్రిక్ట్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్(డీటీసీపీ) పరిధిలో గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీలతో పాటు 22 మండలాల పరిధిలోని 286 గ్రామాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు డీటీసీపీని సుడాలో కలపలేదు. కొత్తగా ఉత్తర్వులు జారీ చేసిన దానిలో సిద్దిపేట అర్బన్, రూరల్, నారాయణరావుపేట, చిన్నకోడూరు, నంగనూరు, దుబ్బాక, తొగుట, మిరుదొడ్డి, దౌల్తాబాద్, అక్బర్పేట–భూంపల్లి, రాయపోలు, గజ్వేల్, కొండపాక, కుకునూరుపల్లి, హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, మద్దూరు, చేర్యాల, కొమురవెల్లి, బెజ్జంకి, దూల్మిట్ట మండలాలు రానున్నాయి. సుడా పరిధిలోకి వెళ్లాయని గ్రామ పంచాయతీ అధికారులు, మున్సిపల్ అధికారులు ఆక్రమ లేఔట్ల పై దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇష్టారాజ్యంగా అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయి. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాకుండా పోతోంది. సుడా విస్తరణ జరిగితే ఆక్రమ లేఔట్లకు చెక్ పడనుంది. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి విస్తరణ చేయాలని పలువురు కోరుతున్నారు.ఇంకా క్లారిటీ రాలేదు.. సుడా విస్తరణపై ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. సుడాతో పాటు మిగతా పట్టణాభివృద్ధి సంస్థలకు సైతం వచ్చాయి. వాటిని ఇంకా ఏర్పాటు చేయలేదు. సుడా విస్తరణపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే డీటీసీపీ విలీనం అవుతుంది. – అశ్రిత్ కుమార్, వీసీ, సుడా -
రాజుల కోటలో రత్నాల వేట
కొల్చారం(నర్సాపూర్): రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి.. కానీ ఆనాటి చరిత్రను తెలిపే కోటలు మాత్రం ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా కనిపిస్తూనే ఉన్నాయి. అందులో వందల ఏళ్ల నాటి చారిత్రక నేపథ్యం కలిగిన రంగంపేట కోట ఒకటి. హైదరాబాద్ రాజ్యంలో ఉన్న 14 సంస్థానాల్లో ఒకటైన పాపన్నపేట సంస్థానం కింద నిజాం నవాబులచే రాయ్భాగన్గా బిరుదు పొందిన రాణి శంకరమ్మ దత్తపుత్రుడైన రాజా సదాశివరెడ్డి 1,700 సంవత్సర మధ్యకాలంలో ఈ కోటను నిర్మించారు. నిజాం పరిపాలనలో ఈ కోట ఆర్థిక భాండాగారంగా కొనసాగిందని చరిత్ర చెబుతుంది. అయితే ప్రస్తుతం ఆ కోట గుప్తనిధుల వేటగాళ్ల ధ్వంస రచనతో బీటలు వారింది. శిథిలావస్థకు చేరి అధ్వానంగా మారింది. ఎంతో చరిత్ర కలిగిన రంగంపేట కోట గురించి భావితరాలు తెలుసుకునేలా పురావస్తు శాఖ రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అప్పుడే నిర్మాణానికి నాంది పాపన్నపేట, ఆందోల్ సంస్థానాల మధ్య రాణి శంకరమ్మ పరిపాలన సాగిస్తూ తిరుగులేని రాణిగా కొనసాగింది. వృద్ధాప్యం వచ్చే క్రమంలో రాజ్యాన్ని కాపాడాలన్న లక్ష్యంతో బాలుడైన రాజా సదాశివరెడ్డిని దత్తత తీసుకొని రాజుగా ప్రకటించింది. ఆయన ఆందోల్ నుంచి రంగంపేట మీదుగా ఎడ్ల బండిలో పాపన్నపేటకు మంది మార్బలంతో ప్రయాణం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రస్తుతం కోట నిర్మించిన రంగంపేట శివారులోకి రాగానే వేట కుక్కలను తరుముతున్న కుందేలు కనిపించింది. ఈ విషయమై రాజ పురోహితులతో చర్చించారని, ఇక్కడి స్థల ప్రాముఖ్యతను గుర్తించి కోట నిర్మాణానికి నాంది పలికారన్నది చరిత్ర చెబుతోంది. దాదాపు పదెకరాల విస్తీర్ణంలో శత్రు దుర్భేద్యమైన కోటను నిర్మించారు. అయితే కోటను కొంతమేరకైనా రక్షించాలన్న లక్ష్యంతో అధికారులు కోట చుట్టూ ఫెన్సింగ్, పల్లె ప్రకృతి వనం నిర్మించారు. గుప్త నిధుల తవ్వకాలతో.. ఆనవాళ్లు కోల్పోతున్న రంగంపేట కోట పట్టించుకోని ప్రభుత్వాలు పరిరక్షించాలంటున్న ప్రజలు -
3,500 నాటు కోళ్లు మృతి
నర్సాపూర్ రూరల్: అంతుచిక్కని వ్యాధితో నాటు కోళ్లు మృతి చెందిన సంఘటన నర్సాపూర్ మండలం లింగాపూర్లో చోటు చేసుకుంది. లింగాపూర్ తండాకు చెందిన పాతులోత్ ప్రసాద్కు చెందిన 3,500 నాటు కోళ్లు అంతు చిక్కని వ్యాధితో మృత్యువాత పడ్డాయి. కొన్ని రోజులుగా నాటు కోళ్ల పెంపకంతో ఉపాధి పొందుతున్న ప్రసాద్ తీవ్ర ఆవేదనకు గురవుతున్నాడు. అప్పులు చేసి రూ. 8 లక్షల వరకు పెట్టుబడి పెట్టి నాటు కోళ్లను పెంచుతున్నట్లు బాధితుడు తెలిపాడు. ఇటీవల నా షెడ్డు దగ్గరలో ఉన్న బాయిలర్ పౌల్ట్రీ షెడ్డులో కోళ్లు చనిపోయాయని, అదే వ్యాధి నాటు కోళ్లకు వ్యాపించి చనిపోయని ఆరోపించాడు. ప్రైవేట్ బాయిలర్ కోళ్ల కంపెనీ, లేదా ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరుతున్నాడు. ఈ విషయమై పశుసంవర్ధక శాఖ వైద్యాధికారి సౌమిత్ను వివరణ కోరగా.. అతి ఉష్ణోగ్రత కారణంగా కోళ్లు చనిపోయి ఉంటాయని, లేదా ఇంకా ఏదైనా వ్యాధితో మృతి చెంది ఉంటాయన్నారు. బర్డ్ప్లూ అని మాత్రం నిర్ధారించలేమన్నారు. మృతి చెందిన కోళ్లను ల్యాబ్కు పంపుదామంటే బాధితుడు కోళ్లను గోతిలో పాతి పెట్టడంతో ల్యాబ్కు పంపలేకపోయినట్లు చెప్పారు. పౌల్ట్రీ షెడ్డులు నిర్వహించే రైతులు కోళ్లకు ఏదైనా సమస్య వచి్చనట్లయితే వెంటనే పశుసంవర్ధక శాఖ వైద్య అధికారులను సంప్రదించాలని సూచించారు. -
సీసీఐ అక్రమాల్లో మరొకరు సస్పెన్షన్
హుస్నాబాద్రూరల్: పత్తి కొనుగోలు కేంద్రాల్లో జరిగిన అక్రమాల్లో హుస్నాబాద్ మార్కెట్ కార్యదర్శి ప్రభాకర్ సస్పెండ్ అయినట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు శనివారం తెలిపారు. గతంలో మండల వ్యవసాయ అధికారితో పాటు జిల్లా మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేయగా ఇప్పుడు హుస్నాబాద్ మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేశారు. జిల్లాలోని 23 సీసీఐ కేంద్రాల్లో బోగస్ టీఆర్లపై పత్తి విక్రయించిన వ్యాపారులు, పత్తి మిల్లులపై చర్యలు తీసుకొనేందుకు ప్రక్రియ కొనసాగుతున్నట్లు జిల్లా అధికారి ఒకరు తెలిపారు. హుస్నాబాద్ సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయించిన వ్యాపారులపైనా చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మహిళా శక్తి చాటాలివర్గల్(గజ్వేల్): వర్గల్ పూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో శనివారం మహిళాదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళా అధ్యాపకులను ప్రిన్సిపాల్ డాక్టర్ భాస్కర్రావు ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నిరంగాలలో మహిళలు పురోగమిస్తూ మహిళాశక్తి చాటాలన్నారు. మహిళలు సాధించిన విజయగాథలు స్ఫూర్తిగా విద్యార్థినులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వైస్ప్రిన్సిపాల్ గోవిందరావు అన్నారు. ఏటీపీ ఉమామహేశ్వరి మాట్లాడుతూ మహిళలు ప్రతి రంగంలోనూ ముందువరుసలో ఉంటారని, అదేవిధంగా విద్యార్థినులు పురోగమించాలన్నారు. అధ్యాపక బృందం, విద్యార్థినులు పాల్గొన్నారు. ముగిసిన సదస్సు గురుకులంలో రసాయనశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల సదస్సు శనివారం ముగిసింది. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా రసాయన శాస్త్ర సంబంధ మార్పులపై వక్తలు ప్రసంగించారు. గురుకుల ప్రిన్సిపాల్ డాక్టర్ గడ్డం భాస్కర్రావు అధ్యక్షతన జరిగిన సదస్సులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సీ. రాజారెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్. గిరిబాబు, రిటైర్డ్ ప్రొఫెసర్ విటల్, డాక్టర్ రాధ, జానకి, విద్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
అన్ని రంగాల్లోనూ మహిళల రాణింపు
సిద్దిపేటకమాన్: మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి అన్నారు. న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు భవనంలో న్యాయమూర్తులు శనివారం కేక్ కట్ చేసి మహిళ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. మగ, ఆడ అనే తేడా లేకుండా అందరినీ సమానంగా చదివించాలని తెలిపారు. మహిళ సిబ్బందికి నిర్వహించిన వ్యాసరచన, కుకింగ్ పోటీల్లో విజేతలకు న్యాయమూర్తులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, మిలింద్కాంబ్లి, శ్రావణి, తరణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ నిర్లక్ష్యమే కారణం
● వంటేరువి తప్పుడు ఆరోపణలు ● గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి గజ్వేల్: మల్లన్నసాగర్ నిర్వాసితులు ఇప్పటికీ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణమని గజ్వేల్ మార్కెట్ చైర్మన్ నరేందర్రెడ్డి ఆరోపించారు. శనివారం వైస్ చైర్మన్ సర్ధార్ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఆ పార్టీ నేత వంటేరు ప్రతాప్రెడ్డి కాంగ్రెస్పై తప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో సర్వం కోల్పోయిన త్యాగ ధనులను బీఆర్ఎస్ ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్న తీరును అంతా గమనిస్తున్నారని చెప్పారు. సమావేశంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నర్సింహారెడ్డి, సుఖేందర్రెడ్డి, కర్ణాకర్రెడ్డి, యాదయ్య, మాజీ కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు. -
అధికారులపై చర్యలు తీసుకోండి
సిద్దిపేటకమాన్: హైకోర్టు ఆర్డర్ను ధిక్కరించిన పురపాలిక టౌన్ ప్లానింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ ఫర్ సిటీజన్ రైట్స్ సంస్థ రాష్ట్ర కార్యదర్శి శివచంద్రం అన్నారు. సిద్దిపేట ప్రెస్క్లబ్లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేటలో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణంపై హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ను మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి పట్టించుకోవడంలేదన్నారు. మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో సభ్యులు రాజు, రవితేజ, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యం వీడాలి
నిర్వాసితుల సమస్యల పట్ల అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ప్రభుత్వం దృష్టికి ఇబ్బందులను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలి. – కొమ్ము నరేష్, మల్లన్నసాగర్ నిర్వాసిత గ్రామం పల్లెపహాడ్ చివరి మజిలీకి కష్టాలు మల్లన్నసాగర్ రిజర్వాయర్ కోసం సర్వం త్యాగం చేసిన మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. శ్మశానవాటికలకు స్థలాల కేటాయింపు జరగకపోవడం ఎంతవరకు సమంజసం. ఇప్పటికై నా సమస్య తీర్చాలి. – హైదర్పటేల్, మల్లన్నసాగర్ నిర్వాసిత గ్రామం సింగారం -
సాగేనా?
ఎల్ఆర్ఎస్ ముందుకుసాక్షి, సిద్దిపేట: ప్రభుత్వం రాయితీ ప్రకటించడంతో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ఇప్పటికై నా ముందుకు సాగుతుందా? అనే చర్చ జరుగుతోంది. ఎల్ఆర్ఎస్ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం) కింద ప్లాట్ క్రమబద్ధీకరణ చేసుకునే వారికి ప్రభుత్వం రాయితీని కల్పించింది. 2020లో చేసిన దరఖాస్తు దారులు పలువురు ఇంటి నిర్మాణం, మరికొందరు ప్లాట్లను విక్రయించారు. దీంతో ప్రభుత్వం ప్రకటించిన రాయితీకి ముందుకు రావడం కొంత అనుమానంగానే ఉంది. అలాగే సర్వర్ చాలా నెమ్మదిగా ఉండటంతో దరఖాస్తు దారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,00,632 మంది దరఖాస్తు చేయగా 79,220 ప్లాట్లకు ఆటోమెటిక్ ఫీజు చెల్లింపు సమాచారాన్ని ఆయా ఫోన్ నెంబర్లకు పంపించారు. ఇంకా 21,412 ప్లాట్ల యజమానులకు ఫీజు చెల్లింపు సమాచారం వెళ్లలేదు. ఇప్పటి వరకు 27 మందే ఎల్ఆర్ఎస్ ఫీజు ఒకేసారి చెల్లిస్తే ప్రభుత్వం 25శాతం రాయితీని ప్రకటించింది. ఈ ఆఫర్ను ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ప్రారంభించింది. ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఇప్పటి వరకు ప్రభుత్వం కల్పించిన రాయితీకి స్పందించి 27 ప్లాట్లకు ఫీజును చెల్లించారు. ఈ నెలాఖరులోగా చెల్లించిన వారికి ఈ ఆఫర్ను వర్తింపజేయనుంది. అలాగే 2020 ఆగస్టు 26 నాటికి లే అవుట్లలోని 10శాతం ప్లాట్లు రిజిస్ట్రేషన్ జరిగితే మిగతా ప్లాట్లను రిజిస్ట్రేషన్ సమయంలో విక్రయ దస్తావేజుతో క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించింది. మరో మారు పరిశీలన నిషేధిత జాబితాల్లో లేని భూములు, చెరువులు, కుంటలకు 200మీటర్ల పరిధిలో లేని ప్లాట్ల దరఖాస్తులకు ఆటోమెటిక్గా ఫీజు సమాచారం పంపిస్తున్నారు. ఫీజు చెల్లించిన తర్వాత వాటిని టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు మరోసారి ఆ ప్లాట్ను పరిశీలించి అన్ని సరిగా ఉంటేనే అమోదం తెలపనున్నారు. వివిధ కారణాలతో దరఖాస్తు తిరస్కరణకు గురైతే ప్రాసెసింగ్ చార్జీల కింద 10శాతం మినహాయించుకుని మిగిలిన 90శాతం డబ్బులను వెనక్కి ఇస్తామని పురపాలక శాఖ ప్రకటించింది. అమోదం తెలిపిన వాటికి ల్ఆర్ఎస్ పే చేసినట్లు ధ్రువపత్రం జారీ చేయనున్నారు.ఈ నెలాఖరు వరకు 25శాతం రాయితీ జిల్లా వ్యాప్తంగా 1,00,632 దరఖాస్తులు ఫీజు చెల్లింపు సమాచారం 79,220 మందికే.. ఇప్పటికే చాలా వరకు చేతులు మారిన ప్లాట్లు మున్సిపాలిటీ దరఖాస్తులు ఫీజు చెల్లింపు చేర్యాల 6,069 2,575 దుబ్బాక 1,884 1,594 గజ్వేల్ 11,548 10,138 హుస్నాబాద్ 6,054 3,982 సిద్దిపేట 32,354 24,258 సుడా 21,380 20,688 గ్రామాలు 21,343 15,985 చేతులు మారాయి.. 2020లో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తు చేసి ఇప్పటికీ ఐదేళ్లు కావస్తుండటంతో ప్లాట్లు చేతులు మారాయి. ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసినప్పటికీ పలువురు ప్లాట్లను అర్థిక అవసరాల నిమిత్తం విక్రయించుకున్నారు. ఇలా కొన్ని ప్లాట్లు ఐదుగురు నుంచి ఆరుగురికి చేతులు మారాయి. దీంతో దరఖాస్తు చేసిన వ్యక్తి ప్రస్తుతం ప్లాట్ కొనుగోలు చేసిన వ్యక్తి తెలియదు. దీంతో ఎల్ఆర్ఎస్ సమాచారం అందరికీ చేరడం లేదు. దరఖాస్తు చేసే సమయంలో సెల్ నెంబర్లను సైతం అప్లోడ్ చేశారు. అలాగే కొందరి ఫోన్ నంబర్లు పని చేయకపోవడంతో ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపు సమాచారం చేరడం లేదు. సమాచారంసద్వినియోగం చేసుకోవాలి ఎల్ఆర్ఎస్ దరఖాస్తు దారులు ప్రభుత్వం కల్పించిన 25శాతం రాయితీని సద్వినియోగించుకోవాలి. ఈ నెలాఖరులోగా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన వారికి ఈ ఆఫర్ వర్తించనుంది. స్థలాలు కొనుగోలు చేసిన వారు, ఫోన్ నంబర్ మారిన వారు వారి వివరాలను అప్డేట్ చేయించుకోవాలి. స్థలం అమ్మిన వారు దరఖాస్తు చేస్తే వివరాలు అప్డేట్ చేసుకుంటే కొనుగోలు చేసిన వారి పేరు మీదనే ఎల్ఆర్ఎస్ ధ్రువపత్రం జారీ చేయనున్నాం. – వందనం, సీపీఓ, సుడా -
రాజీమార్గం.. సత్వర న్యాయం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి ● లోక్ అదాలత్లో 3,622 కేసుల పరిష్కారం సిద్దిపేటకమాన్: క్షణికావేశంలో చేసిన తప్పులను, పెండింగ్ కేసులను పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ సరైన వేదిక అని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి అన్నారు. జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో న్యాయమూర్తులు రాజీ మార్గం ద్వారా పలు కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. లోక్ అదాలత్లో 3,557 క్రిమినల్, 50 సివిల్, 15 మోటారు ప్రమాద కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాద కేసుల్లో రూ.1,01,65,000 బాధితులకు ఇప్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు స్వాతిరెడ్డి, మిలింద్కాంబ్లి, శ్రావణి, తరణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమయం వృథా చేసుకోవద్దుహుస్నాబాద్: లోక్ అదాలత్లో రాజీ మార్గంతో వివిధ కేసులు పరిష్కరించుకుంటే ఇరువురికి న్యాయం జరుగుతుందని ప్రిన్సిపాల్ సివిల్ కోర్టు అదనపు జడ్జి కృష్ణతేజ్ అన్నారు. శనివారం కోర్టు హాలులో జాతీయ లోక్అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణతేజ్ మాట్లాడుతూ క్షణికావేశంలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లకు కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని వృథా చేసుకోవద్దన్నారు. సామరస్య పూర్వకంగా పరిష్కరించుకునే గొడవలను కోర్టుల దాకా తెస్తున్నారన్నారు. రాజీ మార్గంతో కేసులను పరిష్కరించుకోవాలని జడ్జి సూచించారు. -
‘సాక్షి’ గెస్ట్ ఎడిటర్గా వల్లూరు క్రాంతి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా వ్యాప్తంగా వచ్చిన వార్తలను పరిశీలించి.. వాటిని క్షుణ్ణంగా చదివి.. ఆ వార్తల ప్రాధాన్యత క్రమాన్ని ఎంపిక చేశారు సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి. పాలన పరమైన విధుల్లో నిత్యం బిజీగా ఉండే కలెక్టర్ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హైదరాబాద్లోని సాక్షి ప్రధాన కార్యాలయంలోని సంగారెడ్డి జిల్లా ఎడిషన్కు గెస్ట్ ఎడిటర్గా వ్యవహరించారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న, ప్రతిభ చూపుతున్న మహిళలకు సంబంధించి విలేకరులు రాసిన ప్రత్యేక కథనాలు ఆమె చదివారు. వాటి ప్రాధాన్యతను కూడా గుర్తించి సబ్ ఎడిటర్లతో చర్చించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. జిల్లా పేజీల డిజైన్లను పరిశీలించారు. అలాగే వివిధ మండలాలు, పట్టణాల నుంచి వచి్చన వార్తలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ ఈ కథనాలు మహిళలకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని కితాబిచ్చారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్లేలా వారిని ప్రోత్సహిస్తూ.. స్ఫూర్తిదాయక కథనాలు మరిన్ని రావాలని ఆకాక్షించారు. దినపత్రికకు గెస్ట్ ఎడిటర్గా వ్యవహరించడం తనకు ఎంతో మంచి అనుభూతిని ఇచి్చందన్నారు. పత్రిక నిత్యం ప్రజాసమ స్యలను వెలికి తీస్తుండటంతో.. ఆ సమస్యలు అధికార యంత్రాంగం దృష్టికి వస్తాయని.. తద్వారా అధికార యంత్రాంగం వాటి పరిష్కారం కోసం కృషి చేస్తారన్నారు. అధికారుల దినచర్య న్యూస్పేపర్లతోనే ప్రారంభమవుతందని చెప్పారు. పత్రిక పాఠకునికి చేరడం వెనుక ఆయా విభాగాలు ఎలా పనిచేస్తాయో తెలిసిందని అన్నారు. -
మల్లన్న హుండీ ఆదాయం రూ.69.11లక్షలు
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామికి రూ.69.11లక్షల ఆదాయం లభించినట్లు ఆలయ సిబ్బంది వెల్లడించారు. స్వామి వారి ఆలయంలో 15రోజుల హుండీ ఆదాయాన్ని మెదక్ దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ రంగారావు, ఆలయ కార్యనిర్వహణ అధికారి రామాంజనేయులు ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది, శివరామకృష్ణ భజనమండలి సభ్యులు శుక్రవారం లెక్కించారు. నగదు రూ 69,11,633, విదేశి కరెన్సీ నోట్లు 14, మిశ్రమ బంగారం 46 గ్రాములు, మిశ్రమ వెండి 5కిలోల 200 గ్రాములు, పసుపు బియ్యం15 క్వింటాళ్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అనంతరం నగదును స్థానిక తెలంగాణ గ్రామీణావికాస్ బ్యాంక్లో జమ చేశారు. రాజీపడేట్లు చూడాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి సిద్దిపేటకమాన్: జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ మొత్తంలో కేసులు రాజీ అయ్యేట్లు చూడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి తెలిపారు. లోక్ అదాలత్ను పురస్కరించుకుని జిల్లా బార్ అసోసియేషన్ న్యాయవాదులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లోక్ అదాలత్లో సివిల్, క్రిమినల్, మోటారు రోడ్డు ప్రమాద కేసుల్లో రాజీ కుదిర్చి అధిక మొత్తంలో కేసులు రాజీ అయ్యేట్లు చూడాలన్నారు. మహిళ దినోత్సవం సందర్భంగా మహిళా న్యాయవాదులకు సన్మానం చేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు స్వాతిరెడ్డి, మిలింద్కాంబ్లి, శ్రావణి, తరణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్థన్రెడ్డి, సెక్రటరీ మంతూరి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
పేదల పాలిట పెళ్లి పెద్ద
నర్సాపూర్: పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు తన వంతుగా సహాయం చేస్తూ వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రఘువీరారెడ్డి. తన మిత్రుడు హకీం ఇచ్చిన సూచన మేరకు నియోజకవర్గంలో జరిగే ఆడపిల్లల పెళ్లిళ్లకు పుస్తె మెట్టెలు అందజేయాలని నిర్ణయించారు. సుమారు 12 ఏళ్ల క్రితం అమలులో పెట్టారు. అయితే వాటిని అందజేసే సమయంలో ప్రచారం కోసం ఆరాటపడటం లేదు. ఇప్పటివరకు సుమారు 2,500 మంది ఆడపిల్లలకు రఘువీరారెడ్డి పుస్తె మెట్టెలు అందజేశారు. శక్తి ఉన్నంత వరకు పేద కుటుంబాలకు అండగా నిలుస్తానని అన్నారు. గతంలో ఒక ఆడ కూతురుకు పుస్తె మెట్టెలు ఇవ్వడానికి రూ. 8 వేల వరకు ఖర్చు కాగా, ప్రస్తుతం రూ. పది వేలు అవుతున్నాయని చెప్పారు. కులమతాలకు అతీతంగా పేద వారికి సహాయం చేయడమే తన లక్ష్యమని రఘువీరారెడ్డి పేర్కొన్నారు. -
వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి
ములుగు(గజ్వేల్): ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ములుగు అటవీ కళాశాల, పరిశోధన కేంద్రం ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్, కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎన్.ఎస్ శ్రీనిధి సూచించారు. ములుగు మండలం అచ్చాయిపల్లిలో వారంరోజుల పాటు కొనసాగనున్న ఎన్ఎస్ఎస్ శిబిరంలో భాగంగా శుక్రవారం విద్యార్థులచే గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్లాస్టిక్ నియంత్రణ, స్వచ్ఛభారత్, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అనంతరం లయన్స్క్లబ్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటుచేసి గ్రామస్తులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని రక్షించడంలో ప్రతి ఒక్కరూ పాత్రధారులు కావాలన్నారు. ప్లాస్టిక్ రహిత వస్తువులను వినియోగించాలన్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో యువకులు స్వచ్ఛందంగా పాల్గొని పరిసరాలు శుభ్రం చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.ములుగు అటవీకళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనిధి -
ముందు మీ తప్పులను సరిదిద్దుకోండి
గజ్వేల్రూరల్: బీఆర్ఎస్కు ప్రజలు వీఆర్ఎస్ ఇచ్చారని, ఇప్పటికై నా ఆ పార్టీ నాయకులు బీజేపీని విమర్శించే ముందు తమ తప్పులను సరిచేసుకోవాలని మెదక్ ఎంపీ రఘునందన్రావు పేర్కొన్నారు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్లో గల త్రిశక్తి దేవాలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జన ఔషది దివాస్ సందర్భంగా గజ్వేల్లోని జనరిక్ మెడికల్ దుకాణంను సందర్శించారు. ఈ సందర్భంగా రఘునందన్రావు మాట్లాడుతూ.. బీసీలకు బీజేపీ అన్యాయం చేసిందని ఎమ్మెల్సీ కవిత మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని, కేసీఆర్కు చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బీసీకి కేటాయించేలా చూడాలని కవితకు సూచించారు. గతంలో ఈటెల రాజేందర్ను మంత్రి పదవి నుంచి తొలగించింది బీఆర్ఎస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన టీచర్స్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఒకటి ఓసీలకు, మరొకటి బీసీలకు కేటాయించిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, నాయకులు ఎల్లు రాంరెడ్డి, నలగామ శ్రీనివాస్, జశ్వంత్రెడ్డి, వెంకటరమణ, రాంరెడ్డి, కుడిక్యాల రాములు, శివకుమార్, శశిధర్రెడ్డి, సురేష్, మహేష్, మనోహర్యాదవ్, అశోక్గౌడ్, జన ఔషధి దుకాణం నిర్వాహకులు రమణాచారి, వినోద్తోపాటు ఆయా మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.మెదక్ ఎంపీ రఘునందన్రావు -
రాష్ట్రంలోనే తొలి స్క్రాపింగ్ కేంద్రం
జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి కొండల్రావువర్గల్(గజ్వేల్): కాలుష్య నియంత్రణలో భాగంగా కాలం చెల్లిన వాహనాలను స్క్రాపింగ్ చేసేందుకు రాష్ట్రంలోనే తొలి కేంద్రం ఏర్పాటైంది. వర్గల్ మండలం చందాపూర్లో పాతవాహనాలను రీసైక్లింగ్ చేసేందుకు అంబర్ ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాహన స్క్రాపింగ్కేంద్రాన్ని జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి కొండల్రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తెలంగాణలోనే ఇది తొలి స్క్రాపింగ్ కేంద్రమన్నారు. సామాజిక బాధ్యతగా ప్రతీ ఒక్కరు పదిహేనేళ్లు ముగిసిన కాలం చెల్లిన వాహనాలను స్క్రాపింగ్ కేంద్రాలలో అప్పగించి సహకరించాలని సూచించారు. కాలుష్యకారక, కాలం చెల్లిన వాహనాల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పాలసీతో స్క్రాపింగ్ విధానాన్ని అమలుచేస్తున్నాయని తెలిపారు. కాలం చెల్లిన వాహనాల వాహనాల స్క్రాపింగ్ కోసం వాటి యజమానులకు ప్రభుత్వం వివిధ రకాల రాయితీలతో ప్రోత్సహిస్తుందని వివరించారు. -
చిన్న వయసులో.. ‘నిర్మల’మైన మనసు
● కష్టాలు ఓరుస్తూ.. కుటుంబ భారం మోస్తూ ● కూరగాయలు అమ్ముతున్న విద్యార్థిని నారాయణఖేడ్: ఆ కుటుంబానికి కష్టాలు చుట్టముట్టాయి.. రెక్కాడితే కాని డొక్కాడని బతుకులు.. ఇంటినిండా ఆడపిల్లలు.. పెద్దల నుంచి వచ్చిన అర ఎకరం పొలం.. తండాలో చిన్నపాటి ఇల్లు.. ఆ దంపతులు పడరాన్ని పాట్లు పడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తూ పిల్లలను పెంచి పెద్ద చేశారు. ముగ్గురు ఆడపిల్లలను పెళ్లిళ్లు చేసి పంపేసరికి రూ.12 లక్షల అప్పు. ఆ కుటుంబం మరింత కష్టాల్లోకి నెట్టి వేయబడింది. ఈ కష్టాలను చూసిన నాలుగో కూతురు ఓ రాణి రుద్రమలాధైర్యాన్నిస్తూ తల్ల్లిదండ్రుల వెన్ను తట్టింది.. నారాయణఖేడ్ మండలం చందర్నాయక్ తండాకు చెందిన చందర్, చాందీబాయికి ఆరుగురు సంతానంలో ఐదుగురు కూతుళ్లే. లత, బూలి, బుజ్జి, నిర్మల, వైశాలి తర్వాత పవన్ పుట్టాడు. లత, బూలి, బుజ్జిబాయిల వివాహమైంది. రూ.12 లక్షల వరకు అప్పులు అయ్యాయి. అర ఎకరం పొలంలో కూరగాయలు పండిస్తూ ఖేడ్ పట్టణంలో విక్రయిస్తున్నారు. నాలుగో కూతురు నిర్మల సిద్దిపేటలో హాస్టల్లో ఉంటూ 10వ తరగతిలో 9.8 జీపీఓ ఉత్తీర్ణత సాధించింది. ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చినా తండ్రి అనారోగ్యానికి గురవ్వడం కుటుంబ భారం వల్ల వెళ్లలేదు. ఖేడ్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్లో అడ్మిషన్ అయ్యింది. డాక్టర్ కావాలన్న లక్ష్యంతో ఓ కానిస్టేబుల్ కొనిచ్చిన నీట్ ప్రిపరేషన్కు సంబంధించిన పుస్తకాలను పఠనం చేస్తుంది. తమ అర ఎకరం పొలంలో నిత్యం పండిన కూరగాయలను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. తెల్లవారు 3 గంటలకు వచ్చిన నిర్మల బీట్లో కూరగాయలు కొని దుకాణంలో సర్ది 8 గంటల వరకు వ్యాపారం.. అనంతరం తండాకు వెళ్లి 9 గంటలకు కళాశాలకు వెళ్తుంది. ఇలా కష్టపడుతున్న నిర్మల ఆ కుటుంబానికి ధైర్యం ఇస్తూ తన లక్ష్యం డాక్టర్ కావాలని.. మరో సోదరి, సోదరుణ్ణి జీవితంలో వారి కాళ్లపై వారు నిలబడేలా చేయాలని చెబుతుంది. చదువులో నిర్మల మంచి ప్రతిభ కనబరుస్తుందని ఉపాధ్యాయులూ చెబుతున్నారు. -
ఆకాశవాణి.. మహిళా కేంద్రం
డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డీడీఎస్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంఘం రేడియో స్టేషన్లో కార్యక్రమాలన్నింటినీ మహిళలే నిర్వహిస్తున్నారు. అల్గోల్ నర్సమ్మ, జనరల్ నర్సమ్మ ప్రతి నిత్యం కార్యక్రమాలను రూపొందించుకొని ప్రసారంచేస్తున్నారు. జహీరాబాద్: గ్రామాలకు వెళ్లి సమాచారం సేకరణ ఝరాసంగం మండలంలోని మాచ్నూర్ గ్రామంలో 1998 సంవత్సరంలో సంఘం రేడియో స్టేషన్ను ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్ నుంచి సుమారు 20 కిలోమీటర్ల మేర ప్రసారాలు అందుతున్నాయి. 90.4 ఫ్రీక్వెన్సీలో రాత్రి 7 నుంచి 9 గంటల వరకు కార్యక్రమాలను అందిస్తున్నారు. మండలంలోని అల్గోల్ గ్రామానికి చెందిన అల్గోల్ నర్సమ్మ, పస్తాపూర్ గ్రామానికి చెందిన జనరల్ నర్సమ్మ 1999 నుంచి రేడియో స్టేషన్ నిర్వహిస్తున్నారు. గ్రామాలకు వెళ్లి ప్రసారాలకు కావాల్సిన సమాచారాన్ని ఆడియో రికార్డింగ్ చేసుకుంటారు. డీడీఎస్కు సంబంధించి పలు కార్యక్రమాలను చూస్తున్న ఏడుగురు మహిళలు రేడియో ప్రసారాలకు సంబంధించిన కార్యక్రమాలను గ్రామాలకు వెళ్లినప్పుడు ఆడియో రికార్డింగ్ చేసుకొని స్టేషన్ నిర్వాహకులకు అందిస్తున్నారు. వాటిని ఎడిట్ చేసుకొని ప్రసారం చేస్తారు. ముఖ్యమైన ప్రసారాలు మన ఊరి పంటలు, ఆరోగ్యం, సంఘాలు, చావిడికట్ట, భాష, మన రుచులు, పండుగలు, పాటలు, పర్యావరణం, బాలానందం, యారండ్ల ముచ్చట్లు తదితర కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేస్తున్నారు. భాషకు సంబంధించి తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ భాషల్లో పెద్ద మనుషులతో వినిపిస్తారు. పొలంలో పనిచేసే సమయంలో, పెళ్లి సందర్భంలో, పుట్టినరోజు వేడుకలు, యువతులు పుష్పవతి అయిన సమయంలో పాడే పాటలను పరిచయం చేస్తారు. చిన్న పిల్లలకు సంబంధించి బాలానందం కార్యక్రమం నిర్వహించి పాటలు, కథలు వినిపిస్తారు. సీజన్ వ్యాధులు, చిన్న పిల్లల సంరక్షణ తదితర అంశాలపై ముచ్చటిస్తారు. వ్యవసాయ విషయానికి వస్తే పంట వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రతలు, ఏయే పంటలు వేయాలి, ఎరువులు, పశువుల పెంపకం, కోళ్ల పెంపకం గురించి సూచనలు చేస్తారు.వారే మిక్సింగ్, కంపోజింగ్.. అల్గోల్ నర్సమ్మ, జనరల్ నర్సమ్మ రేడియో స్టేషన్లో మిక్సింగ్, కంపోజింగ్, ట్రాన్స్మిషన్ నిర్వహణ, రికార్డు చేసిన కార్యక్రమాల ఎడిటింగ్ పనులను చూస్తారు. ప్రతీ నిత్యం కార్యక్రమాలను రూపొందించుకొని ప్రసారం చేసేంత వరకు వారే చూసుకుంటారు. ఇద్దరూ డీడీఎస్ డైరెక్టర్ దివంగత పీవీ సతీష్ వద్ద శిక్షణ పొందారు. అప్పటి నుంచి వారు ఈ కమ్యూనిటీ రేడియో స్టేషన్ను నిర్వహిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. మహిళల సంఘం రేడియో స్టేషన్ ప్రతీ నిత్యం రెండు గంటలపాటుకార్యక్రమాలు స్థానిక అంశాలే ప్రసారం -
విద్యార్థులు వినూత్నంగా ఆలోచించాలి
ములుగు(గజ్వేల్): విద్యార్థులు వినూత్న ఆలోచనలను అన్వేషించాలని ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చ ర్ రీసెర్చ్(ఐసీఎఆర్)డిప్యూటీ డైరెక్టర్ జనరల్(విద్య) డాక్టర్.ఆర్.సి అగర్వాల్ సూచించారు. ములుగులోని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో శుక్రవారం సెంట్రల్ ల్యాబ్, స్మార్ట్ క్లాస్ గదిని వైస్ చాన్స్లర్ డాక్టర్.డి.రాజిరెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ణానాన్ని ఉపయోగించుకోవడంతో పాటు వ్యవసాయ పురోగతికి చురుకుగా దోహదపడాలన్నారు. విశ్వవిద్యాలయంలోని సెంట్రల్ ల్యాబ్, స్మార్ట్ క్లాస్ గదులు అభ్యాస అనుభవాన్ని మెరుగుపరుస్తాయని, పరిశోధన, విద్యానైపుణ్యం కోసం విద్యార్థులకు అత్యాధునిక వనరులను అందిస్తాయని తెలిపారు. విశ్వవిద్యాలయ అధికారులు భగవాన్, లక్ష్మీనారాయణ, రాజశేఖర్, విజయ, శ్రీనివాసన్, నాగేశ్వర్రావు పాల్గొన్నారు. -
భూసేకరణ పూర్తి చేయాలి
కలెక్టర్ మనుచౌదరి హుస్నాబాద్రూరల్: హుస్నాబాద్ ప్రాంతంలోని గౌరవెల్లి ప్రాజెక్టు కెనాల్ కాల్వలు, రంగనాయకసాగర్ నుంచి కోహెడ మండలంలోకి వచ్చే కెనాల్ కాల్వల భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. శుక్రవారం ఆర్డీఓ కార్యాలయలంలో భూసేకరణపై తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. హుస్నాబాద్ నియోజకవర్గం గుండా జాతీయ రహదారి వెళ్తోందని, రోడ్డు పనులు ఆగిన చోట భూసేకరణ సమస్య పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం భూములను గుర్తించాలనని అదేశించారు. సమావేశంలో ఆర్డీఓ రాంమూర్తి, తహసీల్దార్ రవీందర్రెడ్డి ఉన్నారు. ఎఫ్బీఓ రోల్ మోడల్గా నిలవాలి అక్కన్నపేట(హుస్నాబాద్): ప్రసిద్ధ ఎఫ్బీఓ అందరికీ ఒక రోల్ మోడల్గా నిలవాలని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. శుక్రవారం అక్కన్నపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రసిద్ధ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ సీఈవో, డైరెక్టర్లు,అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానికంగా ఏం పంటలు పండిస్తున్నారనే విషయాలను తెలుసుకొని రాష్ట్రంలో వివిధ మార్కెట్లో ధరలను గురించి అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులకు గుర్తించి మనం ఎలాంటి పంటలను ఎగుమతి చేయాలనే విషయ పరిజ్ఞానాన్ని సంపాదించుకోవాలన్నారు. అలాగే మండలంలోని అంతకపేట జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. పాఠశాలల్లో నిర్మాణ్ సంస్థ సౌజన్యంతో కొత్తగా ఏర్పాటు చేయబోతున్న కంప్యూటర్ ల్యాబ్ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం పదోవ తరగతి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. కార్యక్రమంలో ఆర్డీవో రామ్మూర్తి, తహసీల్దార్ అనంతరెడ్డి, ఎంపీడీవో బానోతు జయరామ్, వ్యవసాయ అధికారి సుల్తానా, ఎంఈవో గుగులోతు రంగనాయక్ పాల్గొన్నారు. పరీక్షలంటే భయం వద్దు డీఐఈఓ రవీందర్రెడ్డి దుబ్బాకటౌన్: ఇంటర్మీడియెట్ విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా, మానసిక ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని డీఐఈఓ రవీందర్రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలో కొనసాగుతున్న ఇంటర్ పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి వసతులను పరిశీలించారు. అనంతరం దుబ్బాక మైనారిటీ గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షల వేళ తమ విలువైన సమయాన్ని వృథా చేయవద్ధని సూచించారు. జేఈఈ మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన మైనార్టీ కళాశాలకు చెందిన భానుప్రసాద్, సుభాష్ను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా పరీక్షల కమిటీ సభ్యుడు దేవయ్య, కస్టోడియన్ శివకుమార్, మైనారిటీ కళాశాల ఉపాధ్యాయులు, వార్డెన్ హమీద్, తదితరులు పాల్గొన్నారు. మహిళల సాధికారతలేనిదే అభివృద్ధి లేదు: రంగనాథ్కొమురవెల్లి(సిద్దిపేట): మహిళల స్థితి గతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదని జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి రంగనాథ్ అభిప్రాయపడ్డారు. మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం మహిళాదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏంఈవో రమేశ్తో కలసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...సమాజ నిర్మాణంలో సగభాగమైన మహిళ సమానత్వమే మన ప్రగతికి మూలాధారమన్నారు. అనంతరం పాఠశాలోని మహిళ ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్, మధ్యాహ్న భోజన కార్మికులను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ లావణ్య, ప్రధానోపాధ్యాయురాలు మంజుల, ఉపాధ్యాయులు కరుణశ్రీ,, సత్యానారాయణ తదితరులు పాల్గొన్నారు. -
యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడి
దుబ్బాకటౌన్: మేలైన యాజమాన్య పద్ధతులతో పొద్దు తిరుగుడు సాగులో అధిక దిగుబడులు పొందవచ్చని తోర్నాల వ్యవసాయ పరిశోధన క్షేత్రం ప్రధాన శాస్త్రవేత్త శ్రీదేవి అన్నారు. శుక్రవారం రాయపోల్ మండలం మంతూర్లో పొద్దుతిరుగుడు సాగులో మేలైన యాజమాన్య పద్ధతులపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం క్షేత్రస్థాయిలో పొద్దుతిరుగుడు పంటను పరిశీలించారు. కార్యక్రమానికి భారతీయ నూనె గింజల పరిశోధన ప్రధాన శాస్త్రవేత శ్రీనివాస్, రాజేంద్రనగర్, కోయంబత్తూర్ శాస్త్రవేత్తలు శశికళ, సెంథిల్, రాయపోల్ మండల వ్యవసాయ అధికారి నరేష్, వ్యవసాయ విస్తరణ అధికారి కవిత, మంతూర్ రైతులు తదితరులు పాల్గొన్నారు. -
మహిళలు మానవాళికి దిక్సూచి
సిద్దిపేట ఎడ్యుకేషన్: మహిళలు మానవాళికి దిక్సూచి అని, జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) ఎన్సీసీ యూనిట్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మహిళలు అన్ని రకాలుగా స్వేచ్ఛగా ఉండాలన్నారు. ఎన్సీసీ ద్వారా ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపారు. అనంతరం గరిమా అగర్వాల్ను సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, ఎన్సీసీ కేర్ టేకర్ కృష్ణయ్య, పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ గోపాల సుదర్శనం, డాక్టర్ మామిద్యాల శ్రీనివాస్, అధ్యాపకులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులు పూర్తి చేయాలి హుస్నాబాద్రూరల్: పట్టణ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. పట్టణంలో సుందరీకరణ పనులకు సంబంధించి శుక్రవారం అధికారుల చేత కొలతలు చేయించారు. అభివృద్ధి పనులు ఎక్కడా అసంపూర్తిగా లేకుండా కమిషనర్ చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణంలోని మైనార్టీ బాలికల గురుకుల విద్యాలయం పాఠశాలను తనిఖీ చేశారు. హాస్టల్లోని సరుకులను పరిశీలించారు. నాణ్యత లేని వంట సరుకులను ఎట్టి పరిస్థితిలో కొనుగోలు చేయరాదన్నారు. ఇంటర్ విద్యార్థులు పరీక్షలు బాగా రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని సూచించారు. పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అలయ అభివృద్ధి పై ఈఓ కిషన్రావును అడిగి తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్ వెంట మండల ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి, కమిషనర్ మల్లికార్జున్, ఎంపీడీఓ వేణుగోపాల్రెడ్డి, డీఎల్పీఓ వెంకటేశ్వర్లు, ఎంఈఓ మనీల ఉన్నారు.జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ -
బీఆర్ఎస్ నేతలతో భేటీ.. కేసీఆర్ కీలక నిర్ణయం
సాక్షి, సిద్ధిపేట: ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. పలు అంశాలపై ఆయన చర్చించారు. ఎమ్మెల్సీగా ఎవర్ని నిలపాలన్న విషయంపై అభిప్రాయాలను కేసీఆర్ తీసుకున్నారు. యాసంగి పంటకు సాగునీరు అందించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి నిర్ణయించారు. హామీల అమలుకై పోరాటాలకు కార్యాచరణ రూపొందించాలని కేసీఆర్ సూచించారు.బహిరంగ సభపై పార్టీ నేతలతో చర్చించిన కేసీఆర్.. ఏప్రిల్ 27న వరంగల్ వేదికగా బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. కేసీఆర్తో బీఆర్ఎస్ నేతల సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. పార్టీ ప్లీనరీ, బహిరంగ సభ, ఎమ్మెల్సీ అభ్యర్థి, అసెంబ్లీ సమావేశాలపై చర్చ జరిగింది. హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్న కేసీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. నిత్యం ప్రజల్లో ఉండాలని బీఆర్ఎస్ నేతలను కేసీఆర్ ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై రేవంత్ సర్కార్ను నిలదీయాలని కేసీఆర్ సూచించారు. -
సాగునీటిని అందించండి
మంత్రి ఉత్తమ్ను కలిసిన కాంగ్రెస్ నాయకులు చేర్యాల(సిద్దిపేట): తపాసుపల్లి రిజర్వాయర్ను గోదావరి జలాలతో నింపి చేర్యాల ప్రాంత రైతులకు సాగునీరు అందించాలని పలువురు కాంగ్రెస్ నాయకులు కోరారు. ఈమేరకు గురువారం భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డితో కలిసి పలువురు కాంగ్రెస్ నాయకులు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేర్యాల ప్రాంత రైతన్నలు సాగు నీటి కోసం పడుతున్న కష్టాలను మంత్రికి వివరించామన్నారు. స్పందించిన మంత్రి రంగనాయకసాగర్ డీ10 కెనాల్ద్వారా కమలాయపల్లి, అర్జునపట్ల, అకునూరు, జాలపల్లి, లింగాపూర్, దూల్మిట్టకు సాగునీరు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అలాగే దేవాదుల ఎత్తిపోతల పథకం ఫేజ్–3 మోటార్లు ప్రారంభించి గండిరామారం, బొమ్మకూరు, వెల్దండ, తపాసుపల్లి రిజర్వాయర్లను నింపి రైతులకు సాగు నీరు ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారని వారు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో మద్దూరు, చేర్యాల మాజీ జెడ్పీటీసీలు గిరి కొండల్రెడ్డి, కొమ్ము నర్సింగరావు, నాయకులు, ఆయా గ్రామాల రైతులు ఉన్నారు. -
పీఎఫ్ కార్యాలయ తరలింపు నిలిపివేత
మెదక్ ఎంపీ రఽఘునందన్రావు ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని పీఎఫ్ కార్యాలయాన్ని తరలించవద్దని కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయను కోరగా, వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారని ఎంపీ రఘునందన్రావు తెలిపారు. గురువారం నగరంలో జరిగిన తెలంగాణ జోనల్, రీజినల్ పీఎఫ్ కార్యాలయ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, మన్సుఖ్ మాండవీయాలు హాజరయ్యారన్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఉన్న పీఎఫ్ కార్యాలయాన్ని ఇక్కడి నుంచి తరలించకుండా చొరవ చూపాలని ఎంపీ కేంద్రమంత్రిని కోరినట్లు తెలిపారు. అందుకు గాను కార్యక్రమంలోనే పీఎఫ్ కమిషనర్ రమేష్కృష్ణమూర్తికి ఆదేశాలు జారీ చేశారన్నారు. సిద్దిపేట పీఎఫ్ కార్యాలయ తరలింపును నిలిపివేయడంతో ఎంపీ మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. -
రెండో రోజూ ఇంటర్ పరీక్షలు ప్రశాంతం
సిద్దిపేట ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. గురువారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పేపర్లు తెలుగు, హిందీ, సంస్కృతం తదితర పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జనరల్, ఒకేషనల్ మొత్తం కలిపి 9,452 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 335 మంది గైర్హాజరు అయ్యారు. 9117 మందితో 97శాతం హాజరు నమోదైంది. జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. ఇంటర్ విద్యాధికారి రవీందర్రెడ్డి పట్టణంలోని ప్రభుత్వ కోఎడ్యుకేషన్ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంతో పాటు పలు ప్రైవేట్ కళాశాలల పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. డీఈసీ సభ్యులు గంగాధర్, జ్యోతి ఉదయం పట్టణంలోని వన్టౌన్ పోలీస్ స్టేషన్లోని కస్టోడియన్ సెంటర్ను సందర్శించి ప్రశ్నపత్రాల బెండల్స్ను సీఎస్, డీఓలకు పంపిణీ చేసే విధానాన్ని పర్యవేక్షించారు. హైపవర్ కమిటీ సభ్యులు హిమబింధు చేర్యాల, ముస్త్యాల కేంద్రాలను, ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు తొగుట, మిరుదొడ్డి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించి సీఎస్, డీఓలను వివరాలు అడిగి తెలుసుకుని, రికార్డులను పరిశీలించి పలు సూచనలు, సలహాలను అందించారు. 97 శాతం హాజరు పరీక్ష కేంద్రాల ఆకస్మిక తనిఖీలు -
అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి
ఈ చెట్ల నుంచి వెలువడే పుప్పొడి వల్ల ఆస్తమా వ్యాధి గ్రస్తులు నరక యాతన అనుభవించాల్సి వస్తుంది. గాలి ద్వారా వ్యాప్తి చెందే పుప్పొడి రేణువులను పీల్చడం వల్ల ఊపిరి తిత్తుల్లో సమస్యలు ఏర్పడే అవకాశాలు మెండుగా ఉంటాయి. చర్మ ఎలర్జీలు సంభవిస్తాయి. శ్వాస కోశ సంబంధ వ్యాధి గ్రస్తులు ఈ చెట్టు పరిసరాల్లో ఉండక పోవడం మంచిది. చెట్లు పుష్పించక ముందే శాఖలను ఎప్పటికప్పుడు తొలగించాలి. – లింగమూర్తి, సీహెచ్ఓ, పీహెచ్సీ, మిరుదొడ్డి -
చెంతనే ప్రాణాంతక చెట్లు
‘కోనోకార్పస్’తో ముప్పు! ● జిల్లా వ్యాప్తంగా విస్తరింపు ● పేరు వింటేనే హడలిపోతున్న జనం ● వెంటాడుతున్న శ్వాసకోశ వ్యాధులు ● గాలి పీల్చినా ప్రమాదమే ● జీవ వైవిధ్యానికి.. పర్యావరణానికి హాని ● తొలగించాలని సర్వత్రా డిమాండ్ ● అయినా స్పందించని అధికారగణంమిరుదొడ్డి(దుబ్బాక): పచ్చదనం, అందం, ఆకర్శణీయంగా కనిపించే కోనోకార్పస్ చెట్టు పేరు వింటేనే గ్రామీణ, పట్టణ ప్రజలు హడలి పోతున్నారు. ఈ చెట్టు ఉన్న ప్రాంతాల్లో అన్నీ సమస్యలే అంటూ జనం బెంబేలెత్తుతున్నారు. నీటి తడి లేకున్నా సరే మండుటెండలో సైతం పచ్చగా చిగురిస్తూ సకల సమస్యలను తెచ్చిపెడుతోంది. పచ్చదనం పరిశుభ్రత పేరుతో గత హరితహారం కార్యక్రమాల్లో నాటిన ఈ కోనోకార్పస్ చెట్లు జనాలకు రోగాలను తెచ్చిపెడుతున్నాయి. ఈ చెట్లు పుష్పించి వెదజల్లే పుప్పొడి వల్ల దీర్ఘకాలిక వ్యాధులకు ఆజ్యం పోస్తాయని డాక్టర్లు సైతం హెచ్చరిస్తున్నారు. వెంటనే ఈ చెట్లను తొలగించాలని సర్వత్రా డిమాండ్ వినిపిస్తున్నా అధికార యంత్రాంగం ముందుకు రావడంలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాంటి ఉపయోగం చేని చెట్టు హరితగ్రామాలుగా తీర్చి దిద్దాలన్న లక్ష్యంతో గ్రామీణ పట్టణ ప్రాంతాలు అన్న తేడా లేకుండా అధికారులు లక్షల్లో కోనోకార్పస్ చెట్లను నాటారు. నీటి ఎద్దడిని తట్టుకునే ఈ చెట్లు తక్కువ కాలంలోనే పచ్చగా ఎదుగుతూ ఆకర్శిణీయంగా మారాయి. ముఖ్యంగా ఈ చెట్ల ఆకులును పశువులుగానీ తినలేవు. కనీసం పక్షులు కూడా వాలలేవు. గూళ్ళు సైతం కట్టలేవు. ఇక రాత్రయిందంటే చాలు దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. దుష్ప్రరిణామాలను చూపించే ఈ చెట్లు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో హాట్ టాపిక్గా మారింది. అనారోగ్య సమస్యలు ఉత్పన్నం మండుతున్న ఎండల్లో సైతం ఈ చెట్లు పచ్చగా కళకళలాడే ఈ కోనోకార్పస్ చెట్లు సకల రోగాలను అంటగడుతున్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఈ చెట్లు పుష్పించి గాలిద్వారా వెదజల్లే పుప్పొడి వల్ల శరీరంపై అలర్జీ, ఆస్తమా, శ్వాసకోశ సంబంధ వ్యాధులకు ఆజ్యం పోస్తుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడే వారు ఈ చెట్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. చెట్ల వేళ్లతో సతమతం అనారోగ్య సమస్యలను తెచ్చిపెట్టే ఈ కోనోకార్పస్ చెట్ల వేళ్లు సైతం సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యంగా తాగు నీటి సమస్యను అస్తవ్యస్తం చేస్తూ వేళ్లు పాతుకు పోతున్నాయి. మిషన్ భగీరథ పైపుల్లోకి వెళ్ళు చొచ్చుకెళుతుండటంతో నీటి పరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయి గ్రామాల్లో నీటి ఎద్దడి ఏర్పడుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి పరఫరాను పున:రుద్ధరించడం కోసం మిషన్ భగీరథ సిబ్బంది నానా అవస్థలు పడాల్సి వస్తుంది.నిషేధం ఉన్నా.. దేశంలోని తెలంగాణ రాష్ట్రంతో పాటు, ఆంధ్ర, గుజరాత్, అసోం, కర్ణాటక వంటి రాష్ట్రాలు నిషేధించినప్పటికీ క్షేత్ర స్థాయిలో అధికారులు మాత్రం హరితహారంలో విరివిగా కోనోకార్పస్ చెట్లను నాటుతున్నారు. చెట్ల చరిత్ర ఇదీ.. కోనోకార్పస్ చెట్లు నాటిన నాటి నుంచి తక్కువ కాలంలోనే వేరు వ్యవస్థ వేగంగా పాతుకుపోవడం వల్ల చెట్లు నిండుగా పచ్చదనంతో ఆకర్శణీయకంగా పెరుగుతాయి. పాశ్చాత్య దేశాల్లో రోడ్లు, పార్కులు, ఉద్యానవనాల్లో సుందరీకరణ కోసం పెంచితే, ఊష్ణ దేశాల్లో సంభవించే ఇసుక తుపాన్లను అడ్డుకోవడానికి తీర ప్రాంతాలల్లో కోనోకార్పస్ చెట్లను విరివిగా పెంచుకుంటారు. అయినప్పటికీ ఎక్కువగా దుష్ఫ్రరిణామాలు కలిగించే ఈ చెట్లను చాలా దేశాలు నిషేధించాయి కూడా. -
ఎమ్మెల్సీ రేసులో సీపీఐ
చాడాకు చాన్స్ దక్కేనా? ● అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ● హుస్నాబాద్లో కాంగ్రెస్ గెలుపునకు కృషి ● ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీకి షెడ్యూల్ విడుదలసాక్షి, సిద్దిపేట: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఎమ్మెల్సీ స్థానాల్లో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డికి అవకాశం దక్కుతుందా లేదా అన్న చర్చ జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ పొత్తు పెట్టుకున్నాయి. అందులో రెండు ఎమ్మెల్సీలకు అవకాశం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఎమ్మెల్సీలు హసన్ మీర్జా, ఎగ్గె మల్లేఽశం, శేరి సుభాష్రెడ్డి, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ పదవీకాలం ఈ నెల 29వ తేదీతో ముగయనుంది. దీంతో రాష్ట్రంలో ఐదు ఎమ్మెల్సీ లు ఖాళీ అవుతున్నాయి. వాటిని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ గత నెల 28న షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 10న నామినేషన్ల స్వీకరణ, 11న పరిశీలన, 13న నామినేషన్ల పరిశీలన, 20న పోలింగ్ ఉండనుంది. మొదట హుస్నాబాద్ సీటుపై.. అసెంబ్లీ ఎన్నికల్లో.. కాంగ్రెస్, సీపీఐ పార్టీల పొత్తులో భాగంగా హుస్నాబాద్ ఎమ్మెల్యే సీటును సీపీఐకి కేటాయించాలని పట్టు పట్టారు. హుస్నాబాద్, కొత్తగూడెంలలో సీపీఐకి పట్టు ఉండటంతో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆ పార్టీ రెండు స్థానాలను అడిగారు. చివరకు హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్కు కేటాయించారు. పొత్తులలో కొత్తగూడెం సీటును కూనంనేని సాంబశివరావు కు కేటాయించారు. సీపీఐ అధిష్టానం సూచించిన ఇద్దరికీ ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తామని గతంలోనే హామీ ఇచ్చినట్లు ప్రచారం. పొన్నం గెలుపు కోసం.. హుస్నాబాద్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి పొన్నం ప్రభాకర్ గెలుపొందేందుకు సీపీఐ నేతలు కీలక పాత్ర పోషించారు. ఎన్నికల ప్రచారంలో నిత్యం పాల్గొని విజయానికి కృషి చేశారు. చాడాకు అవకాశం వచ్చేనా? 2004లో ఇందుర్తి నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా చాడ వెంకట్ రెడ్డి గెలుపొందారు. రేకొండ సర్పంచ్గా, చిగురుమామిడి ఎంపీపీ, జెడ్పీటీసీగా చాడ వెంకట్రెడ్డి పని చేశారు. దీనితో తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చించినట్లు తెలిసింది. చాడ కే అవకాశం దక్కుతుందని అంతా ఎదురు చూస్తున్నారు.కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్లను కలిసిన సీపీఐ నేతలు ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్కు 4, బీఆర్ఎస్కు ఒక ఎమ్మెల్సీ దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్కు దక్కే వాటిలో సీపీఐకి ఒకటి అవకాశం ఇవ్వాలని ఇప్పటికే సీపీఐ నేతలు సీఎం రేవంత్రెడ్డిని, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ను కలిశారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ నాయకులు చాడా వెంకట్ రెడ్డి, తక్కల్లపల్లి శ్రీనివాస్ రావులు కలిసిన వారిలో ఉన్నారు. -
ఇక్కడి పాలు ఇక్కడే విక్రయం
సేకరించిన రోజే సరఫరా ● స్వచ్ఛమైన, నాణ్యమైన పాలే లక్ష్యం ● రైతు, వినియోగదారుడు రెండు కళ్లు ● విజయ డెయిరీ ప్రభుత్వ రంగ సంస్థకు చెందినది ● ‘సాక్షి’తో విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్సాక్షి, సిద్దిపేట: జిల్లాలోని పాడి రైతుల నుంచి సేకరించిన పాలను ఇక్కడే విక్రయిస్తున్నామని విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్(డీడీ) శ్రీనివాస్ తెలిపారు. వినియోగదారులకు కల్తీ లేకుండా, స్వచ్ఛమైన, నాణ్యమైన పాలను అందించడమే లక్ష్యమన్నారు. జిల్లా వ్యాప్తంగా 295 పాల సేకరణ కేంద్రాలున్నాయన్నారు. రోజుకు దాదాపు 30వేల లీటర్ల పాలను 7,400 మంది రైతుల నుంచి సేకరిస్తున్నామని చెప్పారు. ‘సాక్షి’తో డీడీ శ్రీనివాస్ మాట్లాడుతూ అదే రోజూ పాలను ప్యాకింగ్ చేసి ఫ్రెష్గా అందిస్తున్నామన్నారు. ఇతర ప్రైవేట్ డెయిరీలైతే.. సేకరించిన తర్వాత రెండు రోజుల తరువాత మార్కెట్లో పాలను విక్రస్తుంటాయన్నారు. విజయ పాల పేరుతో పలువురు ఇతర ప్రైవేట్ డెయిరీలలో ప్యాకింగ్ చేసి విక్రస్తున్నారని మా దృష్టికి వచ్చిందని, ఆ పాలతో ప్రభుత్వ రంగ సంస్థ అయిన తెలంగాణ విజయ పాలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. వినియోగదారులు అందరూ విజయ తెలంగాణ లోగో ఉందో లేదో చూసి కొనుగోలు చేయాలని కోరారు. సన్న, చిన్నకారు రైతుల నుంచే.. విజయ డెయిరీకి రైతు, వినియోగదారుడు రెండు కళ్లు లాంటి వారన్నారు. దేశంలో ఎక్కడా కొనుగోలు చేయని ధరకు రైతుల దగ్గరి నుంచి పాలను విజయ డెయిరీ కొనుగోలు చేస్తోందన్నారు. సన్న, చిన్నకారు రైతుల నుంచే మా సంస్థ పాలను ఎక్కువగా కొనుగోలు చేస్తోందని శ్రీనివాస్ వివరించారు. విజయ తెలంగాణ పాలలో కృత్రిమ పదార్థాలు కలపబోమని, రైతు నుంచి సేకరించిన పాలనే అందిస్తున్నామన్నారు. వినియోగదారులకు ఎలాంటి కల్తీ లేకుండా, స్వచ్ఛమైన నాణ్యమైన పాలను అందించడంలో రాజీపడబోమన్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో విజయ తెలంగాణ పాలనే అందజేస్తున్నామని, అలాగే కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయానికి సైతం విజయ నెయ్యినే సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు. -
చేనేతలకు మరింత భరోసా
శుక్రవారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2025సిద్దిపేటజోన్: చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని, వారికి మరింత భరోసా ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించనున్నట్లు సీఎం రేవంత్రెడ్డి చెప్పారని పీసీసీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్ తెలిపారు. సీఎంను నగరంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ చేనేత కార్మికుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. చేనేత పరిశ్రమకు కొత్త సంక్షేమ పథకాలను అమలు చేసి కార్మికులను ఆదుకుంటామని, అన్ని సమస్యలపై అధ్యయనం చేస్తున్నామని సీఎం చెప్పారన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలు అర్హులైన చేనేత కార్మికులకు అందేలా పనిచేయాలని సూచించినట్లు తెలిపారు.న్యూస్రీల్ -
మహిళలకు ఉచిత న్యాయ సలహాలు
న్యాయమూర్తి స్వాతిరెడ్డి హుస్నాబాద్: మహిళలకు ఏ సమస్య తలెత్తినా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఉచిత న్యాయ సలహాలు పొందవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, న్యాయమూర్తి స్వాతిరెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని గురువారం మహిళ సంఘా ల సభ్యులకు లీగల్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశా రు. అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు ఉన్నాయన్నారు. గెలిచేది ఆడ, మగ అని కాదని, నైపు ణ్యం, సమర్థత ఎవరికి ఉంటుందో వారే ఉన్నతమైన హోదాలో ఉంటారన్నారు. ఆలోచనలో మార్పు రావాలని, ఆ మార్పుకు మహిళలే తొలి అడుగు వేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, సీడీపీఓ జయమ్మ, బార్ అసొసియేషన్ అధ్యక్షుడు మురళీమోహన్, న్యాయవాదులు పాల్గొన్నారు. దరఖాస్తులు తక్షణం పరిష్కరించండి సీపీ అనురాధసిద్దిపేటకమాన్: ఫిర్యాదు బాక్సులలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సీపీ అనురాధ సిబ్బందికి సూచించారు. పోలీసు కమిషనర్ కార్యాలయంలో షీటీమ్, భరోసా, స్నేహిత మహిళా సెంటర్ సిబ్బందితో సీపీ గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి పిల్లలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. పిల్లలు, మహిళల రక్షణకు మేమున్నామని పూర్తి నమ్మకం, భరోసా కల్పించాలన్నారు. హాట్ స్పాట్లపై మరింత నిఘా ఏర్పాటు చేయాలన్నారు. పిల్లలు సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. హాట్స్పాట్ పరిసర ప్రాంతాల్లో ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేయాలని సీఐ దుర్గకు సూచించారు. బాలికలు, అబ్బాయిలు కనబడితే వారికి కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. ఏవరైనా వేధిస్తే డయల్ 100 లేదా షీటీమ్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో మహిళా పోలీసు స్టేషన్ సీఐ దుర్గ, ఎస్బీ ఇన్స్పెక్టర్లు కిరణ్, శ్రీధర్గౌడ్, షీటీమ్, భరోసా సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తైబజార్ డబ్బుల రికవరీలో అవినీతి రామాయంపేట(మెదక్): మున్సిపాలిటీలో తైబజార్ వేలం పాటకు సంబంధించి డబ్బుల రికవరీలో అవినీతి చోటు చేసుకుందని సీఐటీయూ, కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమణి, కాంగ్రెస్ జిల్లా నాయకులు శ్రీధర్రెడ్డి, రమేశ్ గురువారం మన్సిపల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 2018 నుంచి తాము తైబజార్ వేలానికి సంబంధించి వివరాల కోసం ఆర్టీఐ ద్వారా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా, తప్పుడు సమాచారం ఇచ్చారని మండిపడ్డారు. తైబజార్ వేలం పాటలో తీర్మాణించిన మేరకే సంబంధిత కాంట్రాక్టర్ వద్ద డబ్బులు వసూలు చేయాల్సి ఉండగా, రికార్డుల్లో మాత్రం తప్పుడు వివరాలు నమోదు చేశారని తెలిపారు. ఈవిషయమై మున్సిపల్ అధికారులపై కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్యారానగర్లో సర్వేయర్ల బృందం పర్యటన జిన్నారం(పటాన్చెరు): గుమ్మడిదల మండలం నల్లవల్లి సమీపంలోని ప్యారానగర్ గ్రామంలో సంగారెడ్డి ఏడీ ఆధ్వర్యంలో సర్వేయర్ల బృందం గురువారం పర్యటించింది. డంప్యార్డ్ ఏర్పాటుకు సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు వారు పర్యటించారు. అటవీ రెవెన్యూశాఖ అధికారుల సమక్షంలో సర్వే చేసి హద్దులు గుర్తించారు. సర్వే రిపోర్టును ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు అధికారుల బృందం వెల్లడించింది. కాగా ప్యారానగర్లో డంప్యార్డ్ ఏర్పాటును నిరసిస్తూ చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు గురువారం 30వ రోజుకు చేరుకున్నాయి. -
అడవిలోనే ప్రతిఫలం దక్కేలా!
సాక్షి, సిద్దిపేట: అమ్మలాంటి అడవి మనిషి అత్యాశకు అంతరించిపోయే దుస్థితికి చేరుకుంది. దీంతో అడవినే ఆవాసంగా చేసుకొని బ్రతికే జంతువులు జనావాసాల్లోకి చొచ్చుకొస్తున్నాయి. ముఖ్యంగా వానరాలు అడవుల్లో ఆహారం దొరక్క గ్రామాలపై దండెత్తుతున్నాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల, పరిశోధన సంస్థ వినూత్న ప్రయత్నం చేస్తోంది. అంతరించిపోతున్న అటవీ పండ్ల మొక్కలకు ప్రాణం పోసి కళాశాల ప్రాంగణంలో 2 ఎకరాల విస్తీర్ణంలో వైల్డ్ ఫ్రూట్ గార్డెన్ను పెంచుతున్నారు. 70 రకాల అరుదైన పండ్ల మొక్కలతో ఈ గార్డెన్ అలరారుతోంది. మామిడి, జామ, ద్రాక్ష, సంత్ర, దానిమ్మ లాంటి అందరికీ తెలిసిన చెట్లతోపాటు దట్టమైన అడవుల్లో పెరిగే ఫాల్–సా, లక్ష్మణ ఫలం, నారపండు, బొట్కు, కలిమి పండు, చిన్న కలింగ, నల్ల జీడి, నార మామిడి, బుడ్డ ధరణి, గార్సినియా, తెల్ల నేరడు వంటి చెట్లను కూడా ఈ గార్డెన్లో పెంచుతున్నారు. ఒక్కో పండ్ల రకం 5 మొక్కల చొప్పున మొత్తం 350 మొక్కలు ఈ గార్డెన్లో ఉన్నాయి. ప్రతి మొక్క వద్ద దాని పేరు, శాస్త్రీయ నామం, నాటినవారి పేరుతో నేమ్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఫాల్–సాఈ చెట్లు ఎక్కువగా శ్రీలంకలోనూ, మన అమ్రాబాద్ అడవుల్లోనూ పెరుగుతాయి. ఇవి అచ్చం పరికి పండ్ల మాదిరిగా ఉంటాయి. ఈ చెట్టు సుమారు 6 ఫీట్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ పండ్లను ఆయుర్వేద మందులలో సైతం వినియోగిస్తారు. బొట్కు.. ఈ పండును కోతులు ఇష్టంగా తింటాయి. మధ్యప్రదేశ్ అడవుల్లో ఎక్కువగా ఉంటాయి. ఇది ఇప్పకాయ మాదిరిగా ఉంటుంది. నొప్పులకు, వాపులకు ఈ చెట్టు ఆకుల రసాన్ని వినియోగిస్తారు. కలిమి పండు..ఇది చెర్రీ పండు మాదిరిగా ఉంటుంది. వికారాబాద్ అడవుల్లో అధికంగా పెరుగుతుంది. దీనిని వికారాబాద్ నుంచి తీసుకువచ్చారు. ఈ పండును ఆయుర్వేద మందుల తయారీలో వినియోగిస్తారు. కోతులు, పక్షులు ఇష్టంగా తింటాయి. గార్సినియా కర్ణాటక, మహారాష్ట్ర అడవుల్లో ఎక్కువగా పెరుగుతుంది. ఆ ప్రాంతాల్లో చింతపండుగా వినియోగిస్తారు. ఈ మొక్కలను కర్ణాటక అడవుల్లో నుంచి తీసుకువచ్చారు. వీటిని కోతులు, పక్షులు, మనుషులు ఇష్టంగా తింటారు. వివిధ అడవుల్లో సేకరించాం అడవుల్లో పలు రకాల అటవీ పండ్ల చెట్లు అంతరించి పోవడంతో కోతులకు తిండి లభించడం లేదు. దీంతో అవి జనావాసాల్లోకి వస్తున్నాయి. తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్ అడవుల్లో వివిధ పండ్ల గింజలను సేకరించి వాటి ద్వారా మొక్కలను పెంచుతున్నాం. ఇప్పటివరకు 70 రకాల అడవి పండ్ల మొక్కలను నాటాం. ఇంకా 30 రకాల మొక్కలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇలా ఉత్పత్తి అయిన తర్వాత అడవుల్లో మొక్కలను నాటుతాం. దీంతో కోతులు మళ్లీ అడవుల బాట పట్టే అవకాశం ఉంది. అలాగే కొత్త తరానికి సైతం ఆ పండ్లు తెలుస్తాయి. – డాక్టర్ హరీశ్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అటవీ కళాశాల, పరిశోధన సంస్థ, ములుగు -
పెండింగ్ పనులు పూర్తి చేయించండి
మంత్రి దామోదరకు వినతి ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలో పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయించేలా చొరవ చూపాలంటూ మంత్రి దామోదర రాజనర్సింహను కోరినట్లు పీసీసీ సభ్యుడు దరిపల్లి చంద్రం తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని మంత్రి రాజనర్సింహ నివాసంలో మర్యదపూర్వకంగా కలిసినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో ఉన్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. అలాగే పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు ఉంటుందని మంత్రి తెలిపారన్నారు. జిల్లా అభివృద్ధికి పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసిమెలసి ముందుకు సాగాలని మంత్రి తెలిపారన్నారు. బాధిత కుటుంబాలకు అండగజ్వేల్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు గజ్వేల్ ప్రాంతంలోని ఉపాధ్యాయులు అండగా నిలిచారు. మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజ్పేట స్కూల్ కాంప్లెక్స్లో సీఆర్పీలుగా విధులు నిర్వహిస్తున్న రమేశ్నాయక్, శ్రీనివాస్ల ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన మృతిచెందారు. ఉపాధ్యాయులు రూ.1.90లక్షలు సేకరించి ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో బాధిత కుటుంబాలకు బుధవారం అందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు శశిధర్శర్మ, మల్లికార్జున్, నరేందర్, శ్రీధర్రెడ్డి, శ్రీనివాస్రావు, అమర్నాథరావు, రమణరావు, నరసింహ, సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుండిగల్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. సేంద్రియ ఎరువులను ప్రోత్సహిద్దాంమున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ సిద్దిపేటజోన్: సేంద్రియ ఎరువుల తయారీని ప్రోత్సహించడానికి మున్సిపల్ ప్రత్యేక చర్యలు చేపట్టిందని మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ అన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని పలు వార్డుల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించారు. మంగమ్మతోటలో మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్త చెదారం, సిల్ట్ తొలగించే పనులను పరిశీలించారు. ఆయా వార్డుల్లో వేసవిలో రాలుతున్న ఎండు ఆకులను చూసి వీటిని సేంద్రియ ఎరువుల తయారీకి వాడాలని, కంపోస్టు యార్డుకు తరలించాలని సిబ్బందికి సూచించారు. 27 వార్డులో యూజీడి సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కమిషనర్కు వివరించారు. ఆయన వెంట కౌన్సిలర్లు నాగరాజురెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు. నీట్ పరీక్ష కోసం కసరత్తు పలు పాఠశాలలను పరిశీలించిన కలెక్టర్ ప్రశాంత్నగర్(సిద్దిపేట): నీట్ పరీక్షల నిర్వహణకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. మే 4న పరీక్ష నిర్వహించనున్న దృష్ట్యా కేంద్రాల కోసం పట్టణంలోని పలు పాఠశాలల్లో మౌలిక వసతులను కలెక్టర్ మనుచౌదరి బుధవారం పరిశీలించారు. నేషనల్ టెస్టింగ్ కమిటీ మార్గదర్శకాల ప్రకారం పరీక్ష కేంద్రాలలో గదుల సంఖ్య, పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ సరఫరా, ఫర్నిచర్లు ఉన్నాయా? లేదా? అని ఆరా తీశారు. నీట్ పరీక్ష నిర్వహణకు పట్టణంలో మూడు పరీక్ష కేంద్రాలను ఎంపిక చేయనున్నారు. కలెక్టర్ వెంట డీఈఓ శ్రీనివాస్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
రంగనాయకసాగర్, తపాస్పల్లి కాలువలను కలపండి
మద్దూరు(హుస్నాబాద్): భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి తెలిపారు. బుధవారం చేర్యాల మండల పరిధిలోని కమలాయపల్లి, అర్జున్పట్ల గ్రామాలను సందర్శించారు. రంగనాయకసాగర్ ఎల్డీ–10, తపాస్పల్లి డీ–3 కాలువలను పరిశీలించారు. రంగనాయకసాగర్ కాలువలో సాగునీరు ఉండగా, తపాస్పల్లి కాలువలో మాత్రం సాగునీరు లేకపోవడాన్ని గుర్తించారు. ఇదేవిఽషయాన్ని తపాస్పల్లి కాలువ నీటితో సాగు చేసే రైతులు ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు. అయితే రంగనాయకసాగర్ కాలువ, తపాస్పల్లి కాలువలను కలిపే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఫోన్ ద్వారా నీటిపారుదలశాఖ అధికారులకు సూచించారు. కాలువలకు ఇరువైపుల ఉన్న రైతులు ఇదేవిఽషయాన్ని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి దృష్టికి సైతం తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. ఈ ఐదు గ్రామాల పరిధిలో 12వేల సాగు ఉంటుందని, ఈ కాలువలతో సాగు స్థిరీకరణ అయ్యే విధంగా కృషి చేస్తానన్నారు. -
పకడ్బందీ వ్యూహం
పక్కా ప్రణాళిక..● కలిసొచ్చిన బీజేపీ క్యాడర్ ● ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయానికి కారణాలివే.. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పక్కా ప్రణాళిక.. పకడ్బందీ వ్యూహం. ఇవి శాసన మండలి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలుపు తీరాలకు చేర్చాయి. ఉమ్మడి కరీంనగర్–మెదక్– నిజామాబాద్– ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రామచంద్రాపురానికి చెందిన చిన్నమైల్ అంజిరెడ్డి విజయానికి ఈ రెండు కారణాలని రాజకీయ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ఈ ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరోవైపు బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రసన్న కూడా గట్టి పోటీని ఇచ్చారు. ముగ్గురు అభ్యర్థుల మధ్య హోరాహోరీగా మండలి పోరు సాగింది. మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలుపు తేల్చలేని పరిస్థితి నెలకొంది. దీంతో రెండో ప్రాధాన్యత ఓటును లెక్కించగా.. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. అండగా నిలిచిన కమలం క్యాడర్ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో బీజేపీకి గట్టి క్యాడర్ ఉంది. ఉమ్మడి మెదక్తో పాటు, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో బీజేపీ బలంగా ఉంది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీ స్థానంతో పాటు, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఎంపీలుగా ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించిన విషయం విదితమే. అలాగే ఆయా జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యేలుగా కూడా ఈ నాలుగు జిల్లాలకు చెందిన వారే ఉన్నారు. ఈ ఎన్నికలను ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో బీజేపీ క్యాడర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు రఘునందన్రావు, ధర్మపురి అర్వింద్, బండిసంజయ్, గొడాం నగేష్లకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. అలాగే బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇలా ఆయా ఉమ్మడి జిల్లాల్లో బీజేపీకి గట్టి పట్టు అంజిరెడ్డిని గెలుపు తీరాలకు చేర్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీజేపీ అనుబంధ సంఘాలు కీలకం.. బీజేపీ అనుబంధ సంఘాలు కూడా ఈ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఉమ్మడి కరీంనగర్ – మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా బీజేపీనే కై వసం చేసుకున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితమే టీచర్స్ ఎమ్మెల్సీ ఫలితాలు వెల్లడయ్యాయి. ఇప్పుడు పట్టభద్రుల స్థానాన్ని కూడా కమలం పార్టీ తన ఖాతాలో వేసుకుంది. ఈ రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపులో ఆ పార్టీ క్యాడర్తో పాటు, దాని అనుబంధ సంస్థల కృషి ఎంతగానో ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీరు పకడ్బందీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎలాంటి హంగూ.. ఆర్భాటాలు లేకుండా అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించారని రాజకీయ నిఫుణులు విశ్లేషిస్తున్నారు. కాగా ఎన్నికల నగారా మోగక ముందు నుంచే అంజిరెడ్డి ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై దృష్టి సారించారు. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఉన్న పట్టభద్రులను పెద్ద ఎత్తున ఓటర్లు నమోదు చేయించారు. ఇలా ఓటరు నమోదు చేయించడం ఆయనకు కొంత కలిసొచ్చింది. ఎమ్మెల్యేగా పోటీ చేసి.. పారిశ్రామిక వేత్త అయిన డా.చిన్నమైల్ అంజిరెడ్డి 2009లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పటాన్చెరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎస్ఆర్.ట్రస్టు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అంజిరెడ్డి సతీమణి గోదావరి బీజేపీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న విషయం విదితమే. సామాజిక సేవ.. 2002 ఎస్.ఆర్. చారిటబుల్ ట్రస్ట్ స్థాపన. పెద్ద ఎత్తున తాగునీరు, మినరల్ వాటర్, విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్లతో పాటు మరిన్ని సేవా కార్యక్రమాల నిర్వహణ.అంజిరెడ్డి బయోడేటా.. పేరు: డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి పుట్టిన తేదీ: 18.06.1966 తల్లిదండ్రులు : సి.రాజిరెడ్డి, లక్ష్మీనరసమ్మ భార్యపేరు: సి.గోదావరి (బీజేపీ జిల్లా అధ్యక్షురాలు) సంతానం : అనీష్రెడ్డి, ఆశ్విత రెడ్డి స్వస్థలం : రామచంద్రాపురంరాజకీయ ప్రస్థానం ఇలా.. 2009ÌZ {ç³gêÆ>fÅ…ÌZ ^ólÇMýS. OÐðlG-ÝëÞÆŠḥæïÜ-ï³ÌZ ç³°^ól-Ô>Æý‡$. 2014ÌZ fÇ-W¯]l AòÜ…½Ï G°²-MýSÌZÏ ç³sꯌS^ðlÆý‡$ ¯]l$…_ çÜÓ™èl…{™èl A¿ýæÅ-ǦV> ´ùsîæ ^ólíÜ.. KrÑ$ ´ëÌSĶæ*ÅÆý‡$. ™èlÆ>Ó™èl M>…{VðS-‹ÜÌZ ^ólÇ-MýS.. iòßæ-^ŒlG…ïÜ G°²-MýSÌS çÜ…§ýl-Æý‡Â…V> ½gôæï³ÌZ ^ólÆ>Æý‡$. ´ëÆý‡ÏÐðl$…sŒæ G°²-MýSÌZÏ Ððl$§ýlMŠS G…ï³ sìæMðSPsŒæ¯]l$ BÕ…_ ¿ýæ…VýS-ç³-yézÆý‡$. Ð]l$…yýlÍ G°²-MýSÌZÏ GÐðl$Ã-ÎÞV> ÑfĶæ$…. -
విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి
గజ్వేల్రూరల్: విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడంతో పాటు నాణ్యత పాటించాలని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ అన్నారు. ప్రజ్ఞాపూర్లోగల మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను బుధవారం ఆమె సందర్శించారు. పాఠశాలలోని వంట గదిని, వినియోగించే నిత్యావసర సరుకులను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ మెనూ తప్పక పాటించాలన్నారు. అనంతరం టెన్త్ విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షల పట్ల భయం పెట్టుకోవద్దని, ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రణాళికా బద్దంగా ముందుకు సాగాలన్నారు. ఈ సందర్భంగా పరీక్షలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రావణ్, ఎంఈఓ కృష్ణ, మున్సిపల్ కమిషనర్ నర్సయ్య, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ గరీమాఅగర్వాల్ -
కాళేశ్వరంపై నిర్లక్ష్యం తగదు
చిన్నకోడూరు(సిద్దిపేట): బీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్ మీద కోపంతో కాళేశ్వరంపై నిర్లక్ష్యం తగదని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. బుధవారం మండల పరిధిలోని రంగనాయక సాగర్లోకి నీటి పంపింగ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాళేశ్వరం పిల్లర్ కుంగిపోయి 14 నెలలు అవుతున్నా ఇప్పటికీ బాగు చేయలేదన్నారు. ఎస్సారెస్పీ స్టేజీ 2 ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయన్నారు. గతంలో ఎస్సారెస్పీ నీరు తగ్గినప్పటికీ కాళేశ్వరం ద్వారా రెండు పంటలకు సాగు నీరు అందించామన్నారు. అన్ని వర్గాలకు మంచి చేసే ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయకూడదన్నారు. ఎమ్మెల్యే హరీశ్రావు -
తొలిరోజు 95శాతం హాజరు
హాల్టికెట్లను తనిఖీ చేస్తున్న అధ్యాపకులు● ఇంటర్ పరీక్షలు షురూ.. ● పర్యవేక్షించిన అధికారులు సిద్దిపేటఎడ్యుకేషన్: జిల్లాలో ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. బుధవారం ప్రథమ సంవత్సరం జనరల్ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్, ఒకేషనల్ విద్యార్థులకు జనరల్ ఫౌండేషన్ కోర్సు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 43 పరీక్షా కేంద్రాల్లో జనరల్, ఒకేషనల్ రెండు విభాగాల్లో 10,542 మంది విద్యార్థులకు 9,976 మంది హాజరయ్యారు. 95శాతం హాజరు నమోదు అయింది. కలెక్టర్ మనుచౌదరి పట్టణంలోని ప్రభుత్వ బాలికల కళాశాలతో పాటు పలు ప్రైవేట్ కళాశాలల పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించి అధికారులకు సూచనలు, సలహాలు అందించారు. అదనపు కలెక్టర్లు అబ్దుల్హమీద్ చేర్యాల, ముస్త్యాల పరీక్షా కేంద్రాలను, కొండపాక పరీక్షా కేంద్రాలను గరిమాఅగర్వాల్ తనిఖీ చేశారు. ఇంటర్ బోర్డు డిప్యూటీ సెక్రటరీ యాదగిరి సిద్దిపేట ప్రభుత్వ కోఎడ్యుకేషన్, బాలికల కళాశాలలను సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్రెడ్డి మాట్లాడుతూ పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు డీఈసీ సభ్యులతో పాటు రెండు ఫ్లైయింగ్, మూడు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశాయన్నారు. సిద్దిపేట వన్టౌన్ పోలీస్ స్టేషన్ కస్టోడియన్ పాయింట్ను ఇంటర్ బోర్డు అధికారులు సందర్శించారు. -
కాలువ తీరు.. కన్నీరే పారు
అచ్చుమాయపల్లి సమీపంలో కాలువ దుస్థితితలాపునే రిజర్వాయర్ ఉన్నా.. నీరు అందని చందంగా తయారైంది చాలా గ్రామాల పరిస్థితి. కాళేశ్వరం పథకంలో భాగంగా 50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్న సాగర్ రిజర్వాయర్ను తొగుట మండలంలో నిర్మించారు. ప్రాజెక్టు పూర్తయి నాలుగేళ్లు గడుస్తున్నా ఇంకా కాలువల నిర్మాణాలు పూర్తికాలేదు. దీంతో పంటపొలాలకు నీరందని దుస్థితి నెలకొంది. దుబ్బాక నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో చెరువులు, కుంటలను నింపే పరిస్థితి లేక పోవడంతో రైతులకు, ప్రజలకు నీటి తిప్పలు తప్పడంలేదు.ఎవరికీ పట్టని మల్లన్నసాగర్ కాలువలు●● నాలుగేళ్లుగా అసంపూర్తిగానే నిర్మాణాలు ● చెంతనే ప్రాజెక్టున్నా పారని దుస్థితి ● ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించిన ఎమ్మెల్యేలు కాల్వలపై అశ్రద్ధ తగదు మల్లన్నసాగర్ కాలువల నిర్మాణాలపై అశ్రద్ధ తగదు. త్వరగా పూర్తి చేసి చెరువులు, కుంటలకు నీరందించి పంటలను కాపాడాలి. ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డిని, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని కలిసి కోరాం. అసెంబ్లీ సమావేశాల్లోనూ దృష్టికి తీసుకువచ్చాం. యాసంగిలో నీళ్లు లేక చాలాచోట్ల పంటలు ఎండిపోతున్నాయి. –కొత్త ప్రభాకర్రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే పంటలను కాపాడండి కాలువ పూర్తయి తమ పొలాలకు నీరందుతుందనే ఆశతో వరినాట్లు వేసుకున్నాం. ఇప్పటికీ పూర్తికాకపోవడం.. ఎండాకాలం కావడం.. బోర్ల నుంచికొద్దిపాటి మాత్రమే నీరు వస్తుండటంతో పంటలు ఎండిపోతున్నాయి. పెద్దచెరువులోకి నీళ్లు వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. –గోపాల్రెడ్డి, రైతు దుబ్బాక ఇప్పటికే సగం ఎండిపోయింది వేసిన పంటలు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. 4 ఎకరాలు వరి వేస్తే ఇప్పటికే సగం ఎండిపోయింది. కాలువల నీరు వస్తదనకుంటే ఇంత వరకు కాలువ పూర్తి చేస్తలేరు. అంతా అయోమయంగా ఉంది. కాలువ నిర్మాణం పూర్తి పంటలను కాపాడాలి. –రేపాక రాజిరెడ్డి,రైతుదుబ్బాక: మల్లన్నసాగర్ ప్రాజెక్టు పూర్తయినా చాలా చోట్ల కాలువల నిర్మాణాలు పూర్తి కాలేదు. కాలువల నిర్మాణాలు నాలుగేళ్లుగా సాగుతునే ఉన్నాయి. దుబ్బాక పట్టణంలోని ముస్తాబాద్ రోడ్డులో కాలువ నిర్మాణం అసంపూర్తిగా ఉండడంతో దుబ్బాక పెద్ద చెరువు, పెద్దగుండవెల్లి, దుంపలపల్లి, అచ్చుమాయపల్లి, జోడిచెర్ల, ఆరపల్లి, పోతారం, గంభీర్పూర్, శిలాజీనగర్ గ్రామాల్లోని చెరువులు, కుంటలకు నీరందడంలేదు. ఈ సారైనా కాలువ పూర్తి అవుతుందనే ఆశతో పంటలు వేసుకోగా తీరా కాలువ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండడంతో వేసిన పంటలు చేతికొస్తాయోలేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా కాలువ నిర్మాణం పూర్తి చేసి తమ పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వానికి విన్నపాలు.. మల్లన్నసాగర్ ప్రాజెక్టు అనుసంధానంగా నీరందించే కాలువల నిర్మాణాలు చాలా చోట్ల పెండింగ్లో ఉన్నాయంటూ పలుమార్లు ఎమ్మెల్యేలు హరీశ్రావు, కొత్తప్రభాకర్రెడ్డిలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం రేవంత్రెడ్డికి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి విన్నవించారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనూ చర్చించారు. త్వరగా కాలువలు పూర్తి చేయాలని విన్నవించారు.గ్రామాలకు నీరందని దుస్థితి మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు కేవలం 10–15 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న మిరుదొడ్డి మండలంతో పాటు అక్బర్పేట–భూంపల్లి, దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లోని చాలా గ్రామాలకు కాలువల నీరు అందని పరిస్థితి నెలకొంది. మల్లన్నసాగర్ రిజర్వాయర్ కేవలం ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉన్నా తొగుట మండలంలోని గుడికందుల, గోవర్ధనగిరి, వర్ధరాజుపల్లి గ్రామాల్లో కాలువల నీరు రాక వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. నియోజకవర్గంలోని చేగుంట, నార్సింగ్ మండలాల్లో సైతం కాలువ నిర్మాణానికి అటవీశాఖ అధికారుల అనుమతి నిరాకరించడంతో మధ్యలోనే నిర్మాణం ఆగిపోయింది. -
రైతులు అధైర్యపడొద్దు
కొమురవెల్లి(సిద్దిపేట): ‘తపాస్పల్లి రిజర్వాయర్ కింద వరి పంట వేసిన రైతులు అధైర్యపడొద్దు. పది రోజుల్లో రిజర్వాయర్కు నీటి పంపింగ్ చేస్తా’మని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. బుధవారం స్థానిక రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలసి తపాస్పల్లి రిజర్వాయర్ను సందర్శించారు. ఈసందర్భంగా రిజర్వాయర్ లోకి నీళ్లు వచ్చేలా తక్షణం చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.అనంతరం ఏర్పాటు చేసిన విలేకరులతో ఎంపీ మాట్లాడారు. పంటలు ఎండి పోకుండా పొలాలకు నీరు అందిస్తామని హామీ చెప్పారు. పొలాలకు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే రిజర్వాయర్ను సందర్శించినట్లు తెలిపారు. తపాస్పల్లి రిజర్వాయర్కు నీళ్లు రావాలంటే ముందున్న ధర్మసాగర్, బొమ్మకూరు రిజర్వాయర్లలో నీటి లభ్యత తక్కువగా ఉందన్నారు. ముందు వాటిని నింపిన తర్వాతే తపాస్పల్లికి నీరు వస్తుందని తెలిపారు. వెంటనే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డితో మాట్లాడి త్వరగా నీళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మద్దూరు మాజీ జెడ్పీటీసీ గిరి కొండల్ రెడ్డి, చేర్యాల మాజీ జెడ్పీటీసీ కొమ్ము నర్సింగరావు, నాగపురి కిరణ్కుమార్, కొమురవెల్లి మల్లన్న ఆలయ ధర్మకర్తలు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తపాస్పల్లికి పదిరోజుల్లో నీళ్లు రిజర్వాయర్ నింపాలని అధికారులను ఆదేశించాం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి -
బనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదు: హరీష్
సాక్షి, సిద్ధిపేట: బనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదని మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. ఏపీ, తెలంగాణ రెండు కళ్లు అన్న చంద్రబాబు.. తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ కేంద్రానికి డజన్ల కొద్దీ లేఖలు రాశారని హరీష్ గుర్తు చేశారు.‘‘నాగార్జున సాగర్ ఎడమ కాలువలో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. ఇదేనా మీ రెండు కళ్ల సిద్ధాంతం. చంద్రబాబు, రేవంత్ రెడ్డి కలిసి తెలంగాణ రైతాంగం నోట్లో మట్టి కొడుతున్నారు. తెలంగాణకి సాగునీరు, తాగునీరు అందక రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేఆర్ఎంబీ నీటి వాటాలో.. సమ న్యాయం అనేది మాటల్లో తప్ప చేతల్లో లేదు. చంద్రబాబుది పక్షపాత ధోరణే తప్ప సమన్యాయం కాదు...చంద్రబాబు సీఎం కాగానే ప్రాజెక్ట్ల డీపీఆర్లు రిటర్న్ వస్తున్నాయి. రేవంత్ రెడ్డికి బీజేపీ ప్రశ్నించే తెగువ, తెలివి లేదు. చంద్రబాబు కాళేశ్వరం ప్రాజెక్ట్ను ఆపే ప్రయత్నం చేయలేదా... గతంలో ఆయన దాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాసింది నిజం కాదా’’ అంటూ హరీష్రావు నిలదీశారు. -
కొండపోచమ్మ సన్నిధిలో దత్తాత్రేయ
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మంగళవారం కుటుంబ సమేతంగా కొండపోచమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఆర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బీజేపీ నేతలు జిలేబితో దత్తాత్రేయను తులాభారం వేశారు. – జగదేవ్పూర్(గజ్వేల్)స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న దత్తాత్రేయ కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామిని మంగళవారం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, పూజారులు పూర్ణకుంభంతో ఆలయంలోకి ఆహ్వానించారు. ప్రత్యేక పూజల అనంతరం పెద్ద పట్నం వేసిమొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పూజారులు ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలను అందించారు. కార్యక్రమంలో గవర్నర్తో పాటు ఎంపీ రఘనంధన్రావు తదితరులు ఉన్నారు. అంతకుముందు కలెక్టర్ మనుచౌదరి, పోలీస్కమిషనర్ అనురాధ, ఆర్డీఓ చంద్రకళ పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలుకగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ధర్మం కోసం పనిచేయండి.. జగదేవ్పూర్(గజ్వేల్): హిందూ ధర్మం కోసం పార్టీలకతీతంగా పనిచేయాలని, విద్యార్థులు విద్యనే లక్ష్యంగా ముందుకు సాగాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. మంగళవారం మండలంలోని తిగుల్నర్సాపూర్ సమీపంలోని కొండపోచమ్మ ఆలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ ఆర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భగుడిలో అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గవర్నర్ దంపతులకు ఆలయ సిబ్బంది, అర్చకులు శాలువాలు కప్పి ప్రసాదం అందించి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందు ధర్మం కోసం ప్రతి ఒక్కరూ పాటు పాడాలని సూచించారు. ఆలయాల అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని తెలిపారు. జిలేబితో తులాభారం.. కొండపోచమ్మ ఆలయం వద్ద బండారు దత్తాత్రేయను బీజేపీ నేతలు జిలేబితో తులాభారం వేశారు. జిలేబి ఓ వైపు పెట్టి తూకం వేయగా 65 కేజీల బరువు తూగారు. అలాగే గజ్వేల్కు చెందిన రామకోటి రామరాజును గవర్నర్ శాలువా కప్పి సన్మానించారు. ఫంక్షన్హాల్ ఏర్పాటుకు కృషి.. కొండపోచమ్మ ఆలయం వద్ద ఫంక్షన్హాల్ నిర్మాణానికి తన ఎంపీ నిధులను కేటాయిస్తామని ఎంపీ రఘునందన్రావు తెలిపారు. ఆలయం వద్ద భక్తుల సౌకర్యకార్థం ఫంక్షన్హాల్ నిర్మించాలని మాజీ సర్పంచ్ రజిత వినతిపత్రం అందించగా ఎంపీ స్పందించారు. 04జీజేడబ్ల్యూ73ఏః బండారు దత్తాత్రేయను జిలేబితో తులాభారం వేస్తున్న నాయకులు -
ఇంటర్ పరీక్షలకు వేళాయె..
సిద్దిపేటఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పరీక్షలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. బుధవారం నుంచి ప్రారంభం కానున్న పరీక్షలకు విద్యాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా జనరల్, ఒకేషన్, ప్రథమ, ద్వితీయ సంవత్సరం మొత్తం కలిపి 20,595 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందుకోసం జిల్లా లో 43 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలీ స్, రెవెన్యూ, ఆర్టీసీ తదితర శాఖల అధికారు లతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. సీఎస్, డీఓల నియామకం ప్రతి 24 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్, ప్రతీ పరీక్షా కేంద్రానికి ఒక చీఫ్ సూరింటెండెంట్ (సీఎస్), డిపార్ట్మెంటల్ అధికారుల(డీఓ)ను, 14 మంది అదనపు చీఫ్ సూపరింటెండెంట్(ఏసీఎస్)లను నియమించారు. మాస్కాపీయింగ్ జరగకుండా ఉండేందుకు పరీక్షల కన్వీనర్తో పాటు హైపవర్ కమిటీ, ఇద్దరు జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు, రెండు ఫ్లైయింగ్, మూడు సిట్టింగ్ స్క్వాడ్స్ బృందాలను ఏర్పాటు చేశారు. పరీక్షాకేంద్రాల వద్ద పోలీస్ అధికారులు 144 సెక్షన్ను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు గాని ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకునేందుకు జిల్లా కమాండ్ కంట్రోల్ నంబర్ 9949330191 నంబర్లో సంప్రదించాలని అధికారులు సూచించారు. గంట ముందే చేరుకోవాలిఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. పరీక్షా కేంద్రాల్లో అన్ని వసతులను కల్పించాం. వాచ్లు, ఎలక్ట్రానిక్ పరికాలకు పరీక్షా హాల్లోకి అనుమతి లేదు. ప్రశాంతమైన వాతావరణంలో ఒత్తిడికి గురికాకుండా విద్యార్థులు పరీక్షలు రాయాలి. –రవీందర్రెడ్డి, జిల్లా ఇంటర్ విద్యాధికారిఉచిత ఆటో ఏర్పాటు ఎమ్మెల్యే పల్లా వెల్లడి నేటి నుంచి షురూ.. సర్వం సిద్ధం జిల్లాలో 43 పరీక్షా కేంద్రాలు 20,595 మంది విద్యార్థులుకొమురవెల్లి(సిద్దిపేట): ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఉచిత ఆటో సౌకర్యం కల్పిస్తున్నట్లు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ఇంటర్ పరీక్ష.. దూరమే పెద్ద శిక్ష’ అనే కథనానికి ఎమ్మెల్యే స్పందించారు. చేర్యాల, ముస్త్యాలలో ఉన్న పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు వెళ్లేందుకు బుధవారం నుంచి తన సొంత ఖర్చుతో ఉచితంగా ఆటో ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ‘సాక్షి’కి తెలిపారు. దీంతో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
అభివృద్ధి రయ్రయ్!
● గజ్వేల్కు కొత్త శోభ ● హెచ్ఎండీఏ పరిధిలోకి మరిన్ని కొత్త మండలాలు ● కారిడార్తో ప్రయాణం మరింత సులువు ● ప్రగతిలో మరో ముందడుగు ఇటు ఎలివేటెడ్ కారిడార్.. అటు మెగా హెచ్ఎండీఏశామీర్పేట ఎలివేటెడ్ కారిడార్, మెగా హెచ్ఎండీఏ పరిధి పెంపు అంశాలు గజ్వేల్ ప్రాంతానికి కొత్త కళను తీసుకురాబోతున్నాయి. ఇప్పటికే ఇక్కడ ట్రిపుల్ఆర్ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్న వేళ తాజాగా ఈ రెండు అంశాలతో మరింత కలిసి రానున్నది. ఎలివేటెడ్ కారిడార్తో ఈ ప్రాంతం నుంచి హైదరాబాద్ నగరానికి ప్రయాణం సులువుగా మారుతుండగా, మెగా హెచ్ఎండీఏ పరిధి పెంపుతో గజ్వేల్తోపాటు నియోజకవర్గంలోని కొత్తగా మరిన్ని మండలాలు చేరే అవకాశం కనిపిస్తున్నది. ఈ పరిణామం అభివృద్ధితో మరో ముందడుగుగా మారనున్నది. గజ్వేల్: నగరానికి సమీపంలో ఉన్న గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధిలో శరవేగంగా ముందుకెళ్తోంది. హెచ్ఎండీఏ (హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ) పరిధితో పరిశీలిస్తే ఒక రకంగా గజ్వేల్ నియోజకవర్గంలోని మండలాలు నగరంతో అతి సమీపంగా మారాయి. ఇప్పటికే నియోజకవర్గంలోని ములుగు, వర్గల్, తూప్రాన్, మనోహారాబాద్, మర్కూక్ మండలంలోని కొంత భాగం హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నాయి. దీని పరిధి పెంపు ప్రతిపాదన తెరపైకి వస్తుండగా.. గజ్వేల్, మర్కూక్ మండలం పూర్తిస్థాయిలో, అదేవిధంగా జగదేవ్పూర్తోపాటు సమీప నియోజకవర్గం దుబ్బాకలోని రాయపోల్ మండలాలు కొత్తగా చేరే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. ఎలివేటెడ్ కారిడార్తో.. మేడ్చల్ జిల్లా శామీర్పేట నుంచి రామగుండం వరకు 206 కిలోమీటర్ల మేర రాజీవ్రహదారి విస్తరించి ఉంది. ఈ రహదారి ఉత్తర తెలంగాణ జిల్లాలకు ప్రధాన మార్గం. ప్రత్యేకించి గజ్వేల్ నియోజకవర్గానికి కీలకమైన రోడ్డు. గజ్వేల్ నుంచి హైదరాబాద్కు వెళ్లే వారికి శామీర్పేట వరకు వెళ్లడం ఒక ఎత్తయితే.. అక్కడి నుంచి ట్రాఫిక్లో నగరంలోకి వెళ్లడం గగనంగా మారుతోంది. దీనివల్ల ప్రయాణం నరకప్రాయమవుతోంది. ఇలాంటి తరుణంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతుండటం గజ్వేల్ ప్రాంతానికి కలిసి రానున్నది. ప్రస్తుతం ఇక్కడినుంచి ప్రయాణానికి సుమారు గంటన్నర సమయం తీసుకుంటుండగా ఎలివేటెడ్ కారిడార్ పూర్తయితే కేవలం 45 నిమిషాల్లోనే సికింద్రాబాద్కు చేరుకునే అవకాశముంది. ప్రస్తుత ఎలివేటెడ్ కారిడార్ సికింద్రాబాద్లోని జూబ్లీ బస్స్టేషన్ నుంచి శామీర్పేట వరకు సుమారుగా 18కిలోమీటర్లకుపైగా నిర్మాణం జరగనున్నది. ట్రాఫిక్ చిక్కుల్లేకుండా ఈ కారిడార్ నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. అత్యాధునిక ప్రమాణాలతో ఈ కారిడార్ రూపుదిద్దుకోనున్నది. ఇది అందుబాటులోకి వస్తే ఇప్పటివరకు పడ్డ ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పడనున్నది.ట్రిపుల్ఆర్ పనులు ప్రారంభమవుతున్న వేళ..ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం పనుల ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెల్సిందే. ఉత్తర భాగం నిడివి 161.518 కిలోమీటర్లు. ఈ రోడ్డు చౌటుప్పల్, యాదాద్రి–భువనగిరి, గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్ల మీదుగా సంగారెడ్డి వరకు విస్తరించనున్నది. ఇందులో గజ్వేల్ ప్రాంతంలోనే అత్యధికంగా 31.71కిలోమీర్లు ఉన్నది. ఇలాంటి తరుణంలోనే ఈ ప్రాంతానికి మెగా హెచ్ఎండీఏ పరిధి పెంపు ప్రతిపాదన, ఎలివేటెడ్ కారిడార్ పనులు మరింత కలిసి రానున్నది. అభివృద్దిలో మరో ముందడుగు పడనున్నది. ప్రత్యేకించి చతికిల పడిన రియల్ ఎస్టేట్కు ఈ అంశాలు కలిసి రానున్నాయి. -
వరికి సస్యరక్షణ చర్యలు చేపట్టండి
కొమురవెల్లి(సిద్దిపేట): వరిలో కాండం తొలిచే పురుగు, అగ్గి తెగులు అధికంగా ఉందని, సస్యరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ అధికారి రాధిక తెలిపారు. మంగళవారం మండలంలోని మర్రిముచ్చాల గ్రామంలో వరి పంటలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అగ్గి తెగులు సోకిన వరి ఆకులపై కండె ఆకారంలో ఎర్రటి మచ్చ ఏర్పడి క్రమంగా ముదురు గోధుమరంగులోకి మారుతుందని, ఆకులు ఎండిపోతాయని అన్నారు. నివారణకు రైతులు యూరియా వాడకాన్ని తగ్గించి ట్రైసైక్లోజోన్ అనే మందును 0.6గ్రా. లేదా కసుగామైసిన్ మందును1.5మీ.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. కాండం తొలిచే పురుగు నివారణకు పొట్టదశలో ఎకరానికి కార్టఫ్ హైడ్రోక్లోరైడ్ 50 ఎస్పీమందుని పిచికారీ చేయాలని రైతుకుల సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వెంకట్రావమ్మ, ఏఈఓ రమ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు. కాండంతొలిచే పురుగు, అగ్గి తెగులు అధికం జిల్లా వ్యవసాయ అధికారి రాధిక -
కోడ్ తర్వాత కొత్త రేషన్ కార్డులు
హుస్నాబాద్: ఎన్నికల కోడ్ ముగియగానే అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు అందించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. క్యాంప్ కార్యాలయంలో మంగళవారం జరిగిన ప్రత్యేక గ్రీవెన్స్లో మంత్రి వినతులు స్వీకరించారు. చదువుకున్న యువకులు ఉపాధి అవకాశాలు కల్పించాలని మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి బుధవారం క్యాంప్ కార్యాలయంలో మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వేసవిలో గ్రామాల్లో తాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. యంగ్ ఇండియా రెసిడెన్సియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గౌరవెల్లి, గండిపెల్లి ప్రాజెక్టు కాలువల భూ సేకరణ వేగంగా జరుగుతోందని, త్వరలోనే ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందిస్తామన్నారు. నియోజకవర్గంలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. గ్రామాల్లో నేతలందరూ సమన్వయం చేసుకొని పార్టీ పట్టిష్టతకు కృషి చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక జరుగుతోందని, ఇల్లు లేని వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. మంత్రికి సమస్యల వినతిచిన్నకోడూరు(సిద్దిపేట): మండలంలోని పలు సమస్యలను పరిష్కరించాలని యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి అజ్జు యాదవ్ మంగళవారం మంత్రి పొన్నం ప్రనభాకర్కు వినతి పత్రం అందజేశారు. మంత్రి స్పందించి సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. పార్టీ బలోపేతంపై యువత ముందుకు రావాలని సూచించినట్లు తెలిపారు. నేతలందరూ సమన్వయంతో పని చేయాలి మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు క్యాంప్ కార్యాలయంలో జాబ్ మేళా -
కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు
హుస్నాబాద్రూరల్: కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అడ్డుపడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. సోమవారం హుస్నాబాద్లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడుతూ కిషన్రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి జరగడం ఇష్టంలేదని, అందుకే నిధులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర మంత్రులకు ప్రతిపాదనలు ఇచ్చి నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా కేంద్రం ఎందుకు నిధులు ఇవ్వడంలేదని పొన్నం ప్రశ్నించారు. వరంగల్ ఎయిర్ పోర్టు తన వల్లనే వచ్చిందని పక్క రాష్ట్రం కేంద్ర మంత్రితో చెప్పించుకోనే దుస్థితి కిషన్రెడ్డికే దక్కిందన్నారు. వరంగల్ ఎయిర్ పోర్టు కోసం ఏనాడైనా కిషన్రెడ్డి ప్రయత్నం చేశారా? అని మంత్రి ప్రశ్నించారు. మరో కేంద్రమంత్రి బండి సంజయ్ కేసీఆర్కు బీనామీగా వ్యవహరిస్తున్నారని అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో మీకు బాధ్యత లేదా? నిధులు రాకుండా ఎందుకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. తమిళనాడు వంటి రాష్ట్రాలు అభివృద్ధి కోసం కలిసికట్టుగా పని చేస్తాయని, మన కేంద్ర మంత్రులు అభివృద్ధికి ఎందుకు సహకరించడం లేదన్నారు. రాష్ట్రానికి కేంద్ర నిధులు తేవడం కిషన్రెడ్డికి ఇష్టం లేదన్నారు. అభివృద్ధిని అడ్డుకునే కుట్రలను సహించబోమని, అభివృద్ధి నిరోధకులుగా కేంద్ర మంత్రులు ఎందుకు వ్యవహర్తిస్తున్నారో చెప్పాలన్నారు. మీకు అభివృద్ధి చేయాలనే అలోచనే ఉంటే హైదరాబాద్ నుంచి రామగుండం వరకు రాజీవ్ రహదారిని 8 వరుసలకు విస్తరించాలని డిమాండ్ చేశారు. కుల గణన సర్వే పై బీఆర్ఎస్కు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. సర్వేలో పాల్గొనని వారికి ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు అవకాశం ఇచ్చామని, కేసీఆర్, కేటీఆర్, హరీష్రావులకు స్వయంగా నేను సర్వే పత్రాలను పంపించిన సర్వేలో వారి వివరాలను ఇవ్వలేదన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, సింగిల్విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య తదితరులు పాల్గొన్నారు.మాట్లాడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్ కేసీఆర్ బినామీగా బండి సంజయ్ వ్యవహరిస్తుండు తెలంగాణలో అభివృద్ధి జరగడం వారికి ఇష్టం లేదు మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ -
ఇంటర్ పరీక్ష.. దూరమే పెద్ద శిక్ష
చాలా దూరంలో పలు ఎగ్జామ్ సెంటర్లువెళ్లి రాయాలంటే ప్రైవేటు వాహనాలే దిక్కు ● సమయానికి చేరుకోవాలంటే తప్పని తిప్పలు రేపటి నుంచే పరీక్షలు ప్రారంభం ● జిల్లాలో 43 కేంద్రాలు.. 20,595 మంది విద్యార్థులు సాక్షి, సిద్దిపేట: ఇంటర్ పరీక్షలు ఈ నెల 5 నుంచి 25 వరకు జరగనున్నాయి. జిల్లాలో 20,595 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరి కోసం 43 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో మొదటి సంవత్సరం 9,770 మంది ఉండగా జనరల్ 7,161 మంది, ఒకేషనల్ 2,619 మంది ఉన్నారు. ద్వితీయ సంవత్సరం10,815 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో జనరల్ 8,243, ఒకేషనల్ 2,572 మంది పరీక్ష రాయనున్నారు. మూడు కిలోమీటర్ల దూరం గజ్వేల్రూరల్: పట్టణంలో మొత్తం ఎనిమిది పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టణంలోని బస్టాండ్ నుంచి సంగాపూర్ రోడ్డులోగల బాలుర ఎడ్యుకేషన్ హబ్లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చేరుకునేందుకు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బాలికల, బాలుర ఎడ్యుకేషన్ హబ్లకు ప్రతినిత్యం మూడు ఆర్టీసీ బస్సులు ఉదయం, సాయంత్రం వేళల్లో నడుస్తున్నాయి. అయితే పరీక్షా కేంద్రానికి ఉదయం 8:45గంటలకే చేరుకోవాలనే నిబంధన ఉంది. ఈ మార్గంలో ఎడ్యుకేషన్ హబ్ వరకు ఎలాంటి బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. ఈ పరీక్షా కేంద్రంలో నిత్యం సుమారు 400 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు అధ్యాపకులు పేర్కొన్నారు.ఇంటర్ పరీక్షా కేంద్రాలు దూరంగా ఉండటంతో విద్యార్థులకు అసలు ‘పరీక్ష’ ఎదురుకానుంది. అసలే ఎండలు.. ఆపై బస్సు సౌకర్యం లేకపోవడం.. సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలంటే పెద్ద పరీక్షనే ఎదుర్కోనున్నారు. బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరగనున్నాయి. ఉదయం 8:45 వరకే పరీక్ష కేంద్రం లోపలికి అనుమతిస్తారు. 5 నిమిషాల వరకు గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. వివిధ గ్రామాల నుంచి పలు పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలంటే తిప్పలు తప్పని పరిస్థితి నెలకొంది. పరీక్ష కేంద్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. -
జిల్లాలో సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలు
సిద్దిపేటజోన్: జిల్లా కేంద్రంలో సన్ ఫ్లవర్ కొనుగోలు కేంద్రాన్ని సోమవారం అధికారులు ప్రారంభించారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో పొద్దు తిరుగుడు సాగు చేసిన రైతులకు ఉపయోగపడనుంది. బహిరంగ మార్కెట్లలో ప్రయివేటు వ్యాపారులు మద్దతు ధర కంటే తక్కువగా కొనుగోలు చేస్తున్నారు. పత్తి మార్కెట్ యార్డులో ప్రభుత్వం కేంద్రాన్ని అందుబాటులోకి తేవడంతో రైతులకు క్వింటాల్కు మద్దతు ధర రూ.7,280 లభించనుంది. రైతులు సద్వినియోగం చేసుకోవాలి.. ప్రభుత్వం సన్ ఫ్లవర్ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అన్నారు. పత్తి మార్కెట్ యార్డులో పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా11,193 ఎకరాల్లో పొద్దు తిరుగుడు పంట సాగు అయినట్లు పేర్కొన్నారు. దిగుబడి అంచనా మేరకు జిల్లాలో సిద్దిపేట, హుస్నాబాద్, బెజ్జంకి, గజ్వేల్, తొగుట, చిన్నకోడూరు, అక్కన్నపేట ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు ప్రక్రియ జరగనుందని, రైతులు నిబంధనల మేరకు నాణ్యత ప్రమాణాలు పాటించి మద్దతు ధర పొందాలని సూచించారు. నూనె గింజలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో మాత్రమే విక్రయించాలని, దళారులకు అమ్మొద్దని సూచించారు. కార్యక్రమంలో మార్క్ ఫెడ్ డీఎం క్రాంతి, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు, జిల్లా సహకార శాఖ అధికారి నాగమణి, తదితరులు పాల్గొన్నారు. ఇదిలాఉంటే.. మాజీమంత్రి హరీశ్రావు సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలంటూ సీఎంకు లేఖ రాసిన విషయం విదితమే. సిద్దిపేట మార్కెట్లో ప్రారంభం రైతులు సద్వినియోగం చేసుకోవాలి: అదనపు కలెక్టర్ -
లింగాకర్షణ బుట్టలతో పురుగుల నివారణ
తొగుట(దుబ్బాక): వంగసాగులో కాయ, కాండం తొలుచు పురుగు నియంత్రణకు లింగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని ఏఈఓ నాగార్జున రైతులకు సూచించారు. మండలంలోని పెద్ద మాసాన్పల్లి మదిర ఇందిరానగర్ రైతు అనిల్రెడ్డి సాగుచేసిన వంకాయ తోటలో లింగాకర్షణ బుట్టల ఏర్పాటుపై రైతులకు సోమవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగసాగులో రైతులు అధిక మొత్తంలో పురుగు నివారణకు ఖర్చు చేస్తారని, సమగ్రసస్య రక్షణ చర్యలు చేపడితే ఖర్చు తగ్గే అవకాశముందన్నారు. ఈ పురుగు ఆశించినప్పుడు మొక్క తలవాల్చినట్టుగా కనిపిస్తుందని, అది తీవ్రంగా నష్టాన్ని కలిగిస్తుందని చెప్పారు. ఈ పురుగును నియంత్రించడానికి మొక్క నాటిన 15 రోజుల నుంచిఎకరాకు 18 లిగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. బుట్టలో పడిపోయిన మగ పురుగుల సంఖ్యను బట్టి సస్యరక్షణ చర్యలు చేపట్టాలని, బుట్టల ఏర్పాటుతో సుమారు 30 శాతం వరకు రసాయన మందుల వాడకం తగ్గించవచ్చునని ఏఈఓ నాగార్జున చెప్పారు.ఏఈఓ నాగార్జున -
విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపండి
డీఈఓ శ్రీనివాస్రెడ్డి దుబ్బాకటౌన్: విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందించాలని డీఈఓ శ్రీనివాస్రెడ్డి ఉపాధ్యాయులను ఆదేశించారు. సోమవారం రాయపోల్ మండలం ఆరేపల్లి ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. తరగతి గదిలో పిల్లల సామర్థ్యాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. వినియోగించే కూరగాయలు, వంట పాత్రలు ఎప్పటికప్పుడు పరిశీలించాలని భోజన కార్మికులకు సూచించారు. పాఠ్యాంశాల్లో వెనుకబడిన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. -
నేడు హర్యానా గవర్నర్ రాక
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి దర్శనానికి మంగళవారం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ రానున్నారు. గవర్నర్తోపాటు మెదక్ ఎంపీ రఘునందన్రావు ఉదయం ఆలయానికి చేరుకుంటారని పార్టీ మండల అధ్యక్షుడు బూర్గోజు నాగరాజు సోమవారం తెలిపారు. ఈసందర్బంగా అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపు నిచ్చారు. కేంద్ర మంత్రిని కలిసిన బీజేపీ నాయకులు ప్రశాంత్నగర్(సిద్దిపేట): బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు, కేంద్రమంత్రి కిషన్రెడ్డిని పార్టీ జిల్లా నాయకులు కలిశారు. సోమవారం నగరంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసినట్లు జిల్లా అధ్యక్షుడు శంకర్ తెలిపారు. తనతో పాటు జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి వేణుగోపాల్, మాజీ కౌన్సిలర్ వెంకట్, సీనియర్ నాయకులు ఉన్నారన్నారు. 8న జాతీయ లోక్అదాలత్ జిల్లా న్యాయమూర్తి స్వాతిరెడ్డి సిద్దిపేటకమాన్: జాతీయ లోక్అదాలత్ ఈనెల 8న నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, న్యాయమూర్తి స్వాతిరెడ్డి తెలిపారు. సిద్దిపేట కోర్టు భవనంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. రాజీపడదగిన కేసుల్లో కక్షిదారులు లోక్ అదాలత్లో పరిష్కరించుకోవాలని సూచించారు. గత లోక్అదాలత్లో 5వేల కేసుల వరకు పరిష్కరించినట్లు తెలిపారు. ఈ లోక్అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బుగ్గరాజేశ్వరుడి ఆలయ ఆదాయం రూ.5.21లక్షలు సిద్దిపేటరూరల్: మహాశివరాత్రి సందర్భంగా స్వయంభూ బుగ్గరాజేశ్వరస్వామి ఆలయ ఆదాయం రూ.5.21లక్షలు వచ్చినట్లు చైర్మన్ కరుణాకర్ తెలిపారు. భక్తులు సమర్పించిన కానులకలను సోమవారం లెక్కించారు. హుండీ ద్వారా రూ.2,43,748, టిక్కెట్ల రూపంలో రూ.2,77,732 ఆదాయం సమకూరినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు సీతారామశర్మ తదితరులు పాల్గొన్నారు. ‘ఉపాధి’ కూలీలకు వసతులు కల్పించండి చిన్నకోడూరు(సిద్దిపేట): ఉపాధి హామీ కూలీలకు పని జరిగే చోట వసతులు కల్పించాలని దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని అనంతసాగర్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎండలు మండుతున్న నేపథ్యంలో కూలీలకు పని ప్రదేశంలో నీడ వసతి, తాగు నీటి సౌకర్యం, ప్రాథమిక చికిత్స వంటివి ఏర్పాటు చేయాలన్నారు. ఉపాధి హామీ కూలీలకు పెండింగ్లో ఉన్న కూలి డబ్బులు వెంటనే చెల్లించాలన్నారు. ఆయన వెంట డీబీఎఫ్ నాయకులు ఉన్నారు. కిష్టయ్యకి ఉగాది పురస్కారంసిద్దిపేటఅర్బన్: పిల్లిట్ల కిష్టయ్యకి జాతీయ స్థాయి ఉగాది విశ్వశాంతి పురస్కారం దక్కింది. చిందు యక్షగాన కళా రంగంలో అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తించి అవార్డు ఇచ్చారు. సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లికి చెందిన పిల్లిట్ల కిష్టయ్య నగరంలో జరిగిన కార్యక్రమంలో పురస్కారం దుడపాక శ్రీధర్ చేతుల మీదుగా అందుకున్నారు. అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందని కిష్టయ్య అన్నారు. -
వేసవిలో లోవోల్టేజీ రానివ్వం
దుబ్బాక: వినియోగదారులకు నిరంతరం విద్యుత్ సరఫరా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు టీజీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ కమర్షియల్, జిల్లా నోడల్ ఆఫీసర్ సాయిబాబ అన్నారు. సోమవారం దుబ్బాక మండలం అప్పనపల్లి, సిద్దిపేట మండలంలోని చిన్నగుండవెల్లి విద్యుత్ సబ్స్టేషన్లను సందర్శించారు. ఈ సందర్భంగా లోడ్ మానటరింగ్ తో పాటు రైతులకు నాణ్యమైన కరెంట్ ఇవ్వడంపై విద్యుత్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో ఎక్కడా లోవోల్టేజీ సమస్య రానివ్వబోమన్నారు. కరెంట్ సమస్య లేకుండా ముందస్తుగానే చర్యలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్ఈ చంద్రమోహన్, డీఈఈ టెక్నికల్ శ్రీనాథ్, డివిజనల్ ఇంజనీర్ రామచంద్రయ్య, ఏడీఈ కృష్ణమోహన్, దుబ్బాక సబ్డివిజన్ ఏడీఈ గంగాధర్, దుబ్బాక రూరల్ ఏఈ జయకృష్ణ ఉన్నారు. నిరంతరం విద్యుత్ సరఫరా జిల్లా నోడల్ ఆఫీసర్ సాయిబాబ -
సాగునీరు విడుదల చేయండి
రోడ్డుపై బైఠాయించిన రైతులు సిద్దిపేటరూరల్: అంకంపేట చెరువులోకి నీటిని విడుదల చేసి, పంటలను రక్షించాలని అంకంపేట గ్రామస్తులు సోమవారం లక్ష్మీదేవిపల్లి రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లన్నసాగర్ కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేసి నెల రోజులు గడుస్తున్నా అంకంపేటకు నీళ్ళు వదలడం లేదన్నారు. అంకంపేట చెరువు కింద 350 ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని, పంటలు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. వెంటనే నీటిని వదిలి రైతులకు న్యాయం చేయాలన్నారు. అనంతరం ధర్నా వద్దకు చేరుకున్న రూరల్ సీఐ శ్రీను, ఎస్ఐ అపూర్వరెడ్డి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రైతులు, గ్రామప్రజలు పాల్గొన్నారు. అంకంపేట రైతుల నిరసన -
ప్రయివేటు వాహనాలే దిక్కు
23కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే కొమురవెల్లి: మండలానికి చెందిన ఇంటర్ విద్యార్థులకు ముస్త్యాల మోడల్ స్కూల్లో పరీక్ష కేంద్రం కేటాయించారు. దీంతో విద్యార్థులకు దాదాపు 23 కిలో మీటర్లు దూరం ప్రయాణ భారం కానుంది. రెండు బస్సులు మారితేనే పరీక్ష కేంద్రానికి చేరుకుంటారు. ● కుకునూరుపల్లిలో ఇంటర్ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయలేదు. ఆ కళాశాల విద్యార్థులకు కొండపాక, గజ్వేల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులు సుమారు 15 కిలోమీటర్లు వెళ్లాలి.గురువన్నపేట వరకు నడిచి రావాలి మాది కొమురవెల్లి మండలం గురువన్నపేట. ముస్త్యాల మోడల్ స్కూల్లో పరీక్ష కేంద్రం కేటాయించారు. అయినాపూర్ వరకు నడిచి వచ్చి చేర్యాలకు బస్సు ద్వారా చేరుకుంటాం. కానీ పరీక్ష టైమ్కు బస్సులు లేవు. ప్రైవేటు వాహనాలే దిక్కు. ప్రత్యేక బస్సుల ఏర్పాటకు అధికారులు చొరవ చూపాలి – అనురూప్, గురువన్నపేట బస్సు సౌకర్యం కల్పించాలని కోరాం ఇంటర్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు సమయానికి చేరుకునేలా బస్సుల సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ డీఎంలను కోరాం. విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేశాం. సీసీ కెమెరా నిఘాలో పరీక్షల నిర్వహణ ఉంటుంది. – రవీందర్ రెడ్డి, డీఐఈఓ పకడ్బందీగా నిబంధనలు అమలు: సీపీ సిద్దిపేటకమాన్: జిల్లాలోని ఇంటర్మీడియెట్ పరీక్షా కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్ నిబంధనలు అమలులో ఉంటాయని సీపీ అనురాధ తెలిపారు. ఈ నెల 5 నుంచి 25వ తేదీ వరకు నిబంధనలు అమల్లో ఉంటాయన్నారు. పరీక్షలు జరుగు సమయంలో సమీపంలోని అన్ని జిరాక్స్ సెంటర్లు మూసి వేసివేయాలని, కేంద్రం నుంచి 500మీటర్ల వరకు ప్రజలు గుమికూడి ఉండకూడదన్నారు. పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటుచేశామన్నారు.జగదేవపూర్: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, మోడల్ కళాశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ రెండు సెంటర్లలో సుమారు 838 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. అయితే మండల కేంద్రానికి ప్రభుత్వ కళాశాల సుమారు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. పరీక్ష రాసే విద్యార్థులకు రవాణా కష్టాలు తప్పడం లేదు. రెండు కేంద్రాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రైవేటు వాహనాలు ఆటోల ద్వారా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు తిప్పలు తప్పని పరిస్థితి. జగదేవపూర్ నుంచి భువనగిరి వెళ్లే ప్రతి బస్సు కళాశాల వద్ద ఆపేలా అవకాశం కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. -
అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు
కొండపాక(గజ్వేల్): మండలంలోని ఖమ్మంపల్లి అటవీ ప్రాంతంలో సోమవారం ప్రమాదవశాత్తు పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వ్యవసాయ బావుల వద్ద ఉన్న రైతులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. వ్యవసాయ బావి వద్ద ఉంచిన వల్లంగల్ల రాములుకు చెందిన ట్రాక్టర్, టైర్లు కాలిపోగా ఇతర రైతుల వ్యవసాయ పరికరాలు, పండ్ల తోటలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అటవీ ప్రాంతానికి సమీపంలో ఖమ్మంపల్లి ఉండటంతో స్థానికులు వెంటనే ఫారెస్టు అధికారులకు, పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. రాత్రి వేళ అయితే మంటలు గ్రామంలోకి వ్యాపించి తీవ్ర నష్టం జరిగేదంటూ ఆవేదనకు గురయ్యారు. మంటలను ఆర్పే ప్రయత్నంలో త్రీ టౌన్ సీఐ విద్యాసాగర్ చూపిన చొరవకు గ్రామస్తులు అభినందనలు తెలిపారు. భయాందోళనతో పరుగులు తీసిన రైతులు మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది -
నాణ్యమైన భోజనం అందించాలి
అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ హుస్నాబాద్: ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం పట్టణంలోని తెలంగాణ గిరిజన గురుకుల బాలికల విద్యాలలయాన్ని (అక్కన్నపేట) ఆమె సందర్శించారు. స్టోర్ రూంలోని నిత్యావసర వస్తువులను పరిశీలించారు. విద్యార్థినులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. ఈ సందర్బంగా గరిమా అగర్వాల్ మాట్లాడుతూ విద్యార్థినులు బాగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలన్నారు. విద్యపై ప్రత్యేక దృష్టి సారించి రానున్న పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. -
సీసీ రోడ్లతో గ్రామాలు పరిశుభ్రం
కొండపాక(గజ్వేల్): సీసీ రోడ్లతో గ్రామాలను పరిశుభ్రంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. మండలంలోని మర్పడ్గ, లకుడారం, మా త్పల్లి, మేదినీపూర్ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మా ణాలకు సోమవారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజల కిచ్చిన హామీల మేరకు గ్రామాభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూ రు చేసిందన్నారు. పనులు పారదర్శకంగా జరిగేలా చూసుకోవాలని సూచించారు. మర్పడ్గలోని హై స్కూల్లో మరుగుదొడ్ల నిర్మాణాలకు అదనంగా రూ.2 లక్షలు మంజూరు అయ్యాయని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు లింగారావు, శ్రీనివాస్రెడ్డి, నాయకులు మల్లేశంగౌడ్, తిరుపతిరెడ్డి, రుషి, రాజలింగం, కనకయ్య, కిష్టారెడ్డి, కరుణాకర్, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. సంక్షేమమే ధ్యేయం.. గజ్వేల్రూరల్: ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని నర్సారెడ్డి అన్నారు. మండల పరిధిలోని బెజుగామ గ్రామంలో మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ నాయకులు గంగాధర్ ఆధ్వర్యంలో తయారు చేయించిన 50 డప్పులను సోమవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యకర్తలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్చైర్మన్ సర్దార్ఖాన్, మాజీ సర్పంచ్ పోచయ్య, కాంగ్రెస్ నాయకులు శివారెడ్డి, బాబురావు, సాయిలు, నాగరాజు, నర్సయ్య, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి -
చెరువులు నింపాలని నాయకుల వినతి
కొండపాక(గజ్వేల్): తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి చెరువులకు సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ అధికార పార్టీ నేతలు డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, హౌజింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మడుపు భూంరెడ్డి రైతులతో కలిసి సోమవారం అదనపు కలెక్టరు అబ్దుల్ హమీద్కు వినతిపతరం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పాలకులు తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి కాలువల ద్వారా తిమ్మారెడ్డిపల్లి, కొండపాక, దమ్మక్కపల్లి, సిర్సనగండ్ల, జప్తినాచారం, ఖమ్మంపల్లి, మర్పడ్గ గ్రామాల్లోని చెరువులను నింపుతూ పంట పొలాలు ఎండిపోకుండా కాపాడారన్నారు. అలాగే దుద్దెడ, బందారం, అంకిరెడ్డిపల్లి, దర్గా గ్రామా ల్లోని చెరువులకు సైతం నీరువెళ్లేలా కాలువ తవ్వ కం పనులు చేపట్టాలని కోరారు. ఎండలు ముదరడంతో చెరువుల్లో నీటి నిల్వలు ఘణనీయంగా పడిపోయాయని, ప్రస్తుతం పంటలు పొట్ట దశకు చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కాలువ తవ్వకాల్లో భూములు కోల్పోతున్న రైతులకు నష్ట పరిహారం చెల్లించక పోవడంతో మేదినీపూర్, లకుడారం శివారులో పనులు ఆగిపోయాయని, రైతులకు నష్ట పరిహారం చెల్లించి పనులు ప్రారంభమయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు, రైతులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు అభినందనలు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): అలయన్స్ క్లబ్ ఆన్లైన్లో సోమవారం నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి సైన్స్ క్విజ్ పోటీలలో జిల్లాకు చెందిన విద్యార్థులు రాణించారని ఆ క్లబ్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ ఆత్మరాములు తెలిపారు. ఆయన మాట్లాడుతూ జూనియర్స్ విభాగంలో దీకొండ అభివర్ధన్, శిరిస్తా ప్రథమ స్థానంలోను, సీనియర్ విభాగంలో విశ్వేశ్వర్, సుభిక్ష తృతీయ స్థానంలోను నిలిచారన్నారు. విజేతలకు రూ.25వేల నగదు బహుమతి అందించనున్నట్లు తెలిపారు. సుజాత, బాలచంద్రం, సుజన, వెంకట్లక్ష్మి తదితరులు విద్యార్థులను అభినందించారు. సైన్స్పై అవగాహన అవసరం హుస్నాబాద్: విద్యార్థులు స్కూల్ స్థాయి నుంచే సైన్స్పై అవగాహన పెంచుకోవాలని మండల విద్యాధికారి బండారి మనీల అన్నా రు. స్థానిక సెయింట్ జోసఫ్ హైస్కూల్లో సోమవారం సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. వివిధ అంశాల పై 400లకు పైగా ప్రయోగాల నమోనాలను ప్రదర్శించారు. ఈ సందర్బంగా ఎంఈఓ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆవిష్కరణపై ఆసక్తిని పెంచుతుందన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ శివయ్య, ప్రిన్సిపాల్ విజయ్ కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముగిసిన బ్రహ్మోత్సవాలు మద్దూరు(హుస్నాబాద్): దూల్మిట్ట మండలంలోని కొండాపూర్లోని గట్టు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి. గత 26 నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు వారం రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగాయి. అర్చకులు, కమిటీ సభ్యులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి కల్యాణ మహోత్సవం, పెద్దపట్నం, భద్రకాళి అమ్మవారి పూజ, అగ్నిగుండ ప్రవేశంతో బ్రహ్మోత్సవాలను సోమవారం ముగించారు. సిద్దిపేట, జనగాం, హన్మకొండ, జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్థిక సాయం అందజేత గజ్వేల్రూరల్: చికిత్స పొందుతున్న పలువురికి ఆపన్న హస్త మిత్రబృందం సోమవారం చేయూతనందించింది. పట్టణానికి చెందిన నితిన్, చేర్యాల మండలం కడవెరుగు గ్రామానికి చెందిన శ్రీరాములు ఆర్వీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితిని తెలుసుకున్న ఆపన్నహస్త మిత్రబృందం సభ్యులు ఆర్వీఎం ఆసుపత్రికి చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించారు. నితన్ కుటుంబ సభ్యులకు రూ.20 వేలు, శ్రీరాములు కుటుంబ సభ్యులకు రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం అందించారు. కార్యక్రమంలో బాల్చంద్రం, శ్రీనివాస్, శ్యామ్ప్రసాద్, స్వామి, సాయి, రాజు, రాజేశం, కనకయ్య, బాల్నర్సు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. వైభవంగా పెద్దమ్మ తల్లి బోనాలుసిద్దిపేట రూరల్: మండల పరిధిలోని పెద్ద లింగారెడ్డి పల్లిలో పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం బోనాలు సమర్పించారు. డప్పు చప్పుళ్లు, శివసత్తుల విన్యాసాలు, పోతురాజుల నృత్యాల నడుమ బోనాల ఊరేగింపు కొనసాగింది. పెద్దమ్మ తల్లి నామస్మరణతో పల్లెలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఊరేగింపులో సంఘం సభ్యులు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
బ్యాంకు ఉద్యోగుల వాకథాన్
సిద్దిపేటకమాన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని యూనియన్ బ్యాంకు బ్యాంకు ఉద్యోగులు సోమవారం వాకథాన్ నిర్వహించినట్లు జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ హరిబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాంతీయ కార్యాలయం నుంచి ప్రశాంత్నగర్ బ్రాంచ్ వరకు వాకథాన్ నిర్వహించామన్నారు. బ్యాంకు సేవింగ్ ఖాతా వివరాలు, ప్రయోజనాలు, మైక్రో సేవింగ్స్, ఎస్హెచ్జీ లింకేజీలు, బీమా సౌకర్యాలు, ముద్ర, పీఎంఈజీపీ రుణ పథకాల గురించి అవగాహన కల్పించామని, అలాగే మంగళవారం విపంచి కళానిలయంలో అవుట్రీచ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా 5న ఇర్కోడ్ గ్రామంలో మహిళలు, వృద్ధుల కోసం హెల్త్ క్యాంపు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక బ్యాంకు మేనేజర్లు వికాస్, రాఘవ, సంజయ్, సిబ్బంది పాల్గొన్నారు.జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ హరిబాబు -
వైజ్ఞానిక పరిజ్ఞానం అవసరం
దుబ్బాకటౌన్: విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే వైజ్ఞానిక పరిజ్ఞానం ఎంతో అవసరమని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల బాలుర పాఠ శాల ప్రధానోపాధ్యాయురాలు స్వప్న, రాయపోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగరాజు అన్నారు. దౌల్తాబాద్ మండలం లింగరాజుపల్లి ఎంజేపీ గురుకుల పాఠశాలలో రాయపోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల సైన్సు ప్రదర్శనలను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రదర్శనలు సందర్శించి విద్యార్థులు వివిధ వైజ్ఞానిక అంశాలపై పరిజ్ఞానాన్ని సంపాదించుకున్నారన్నారు. అనంతరం కిచెన్ గార్డెన్ పరిశీలించి వివిధ రకాల మొక్కల జీవన విధానాల గురించి తెలుసుకున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాలకుమార్, చంద్రకాంత్, వెంకటలక్ష్మి, వెంకట్, సంజయ్, నర్సింగరావు, రాము, హరీశ్, స్వాతి, గోవర్ధన్ పాల్గొన్నారు. -
నీటి శుద్ధి యంత్రాలను ఏర్పాటు చేయాలి
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి పుష్కరిణిలో(కోనేరు) నీటిని శుద్ధిచేసే యంత్రాలను అమర్చాలని బీఆర్ఎస్ నాయకుడు ముత్యం నర్సింహులు డిమాండ్ చేశారు. సోమవారం ఇతర నాయకులతో కలిసి స్వామి వారి పుష్కరిణిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పుష్కరిణిలో స్నానమాచరించి స్వామి వారిని దర్శించుకుంటే తమ కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం అని, అలాంటి పుష్కరిణిలో మురుగు చేరినా ఆలయ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్, చెత్తాచెదారం ఉండడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారని, అధికారులు స్పందించి శుద్ధి యంత్రాలతో పాటు మహిళలు దుస్తులు మార్చుకోవడానికి గదులు ఏర్పాటు చేయాలని కో రారు. కార్యక్రమంలో మహేశ్, శ్రీధర్, ఆంజనేయులు, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.బీఆర్ఎస్ నాయకుడు నర్సింహులు -
కౌటింగ్ హాలు పరిశీలన
హుస్నాబాద్రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం పోలింగ్ బాక్స్లను భద్రపరిచే కౌటింగ్ హాల్ను జెడ్పీ సీఈఓ రమేశ్ సోమ వారం పరిశీలించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ లో గతంలో ఎన్నికల కౌటింగ్ నిర్వహించారని, ఇప్పుడు ఆ భవనాలు అనుకూలంగా ఉంటాయని ధ్రువీకరించినట్లు ఎంపీడీఓ వేణుగోపాల్రెడ్డి తెలిపారు. వారి వెంట పీఆర్ డీఈ మహేశ్ ఉన్నారు. సద్వినియోగం చేసుకోండి సిద్దిపేటజోన్/దుబ్బాకటౌన్: స్థల క్రమబద్ధీకరణ రుసుముపై రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం రాయితీ ప్రకటించిందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్లు ఆశ్రిత్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి సోమ వారం వేరువేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. ఈ అవకాశం మార్చి ఆఖరు వరకే ఉందిని తెలిపారు. 2020లో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న స్థలాల యజమానులు ఈ నెల 31లోగా రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సందేహాలు ఉంటే 95055 07248 ఫోన్ నంబర్ను సంప్రదించాలని సూచించారు. మందుబాబులకు జరిమానా సిద్దిపేటకమాన్/సిద్దిపేటఅర్బన్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనదారులకు సిద్దిపేట కోర్టు జరిమానా, జైలుశిక్ష విధించింది టూటౌన్ సీఐ ఉపేందర్, ట్రాఫిక్ సీఐ ప్రవీణ్కుమార్, త్రీటౌన్ సీఐ విద్యాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని పలు ప్రాంతాలలో వారం రోజుల క్రితం నిర్వహించిన వాహన తనిఖీల్లో 24 మంది పట్టుబడ్డారు. వారిని సోమ వారం కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రూ.36 వేల జరిమానా, ఒకరికి 11 రోజులు, మరొక వ్యక్తికి మూడు రోజుల జైలుశిక్ష విధించినట్లు పోలీసులు తెలిపారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేత మద్దూరు(హుస్నాబాద్): మండలంలోని జాలపల్లి వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను రెవెన్యూ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మధుసూదన్ మా ట్లాడుతూ నంగునూరు మండలంలోని ఖాత కు చెందిన చందు ట్రాక్టర్ ద్వారా వాగులో నుంచి ఇసుకను తరలిస్తుండగా పట్టుకొని కార్యాలయానికి తరలించామన్నారు. -
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పూజలు
మద్దూరు(హుస్నాబాద్): రాష్ట్రంలో పంటలు సమృద్ధిగా పండి, రైతులు, ప్రజలు సుఖ, సంతోషాలతో ఉండాలని ఆ పరమశివుడిని ప్రార్థించినట్లు జనగామ ఎమ్మెల్యే పల్లారాజేశ్వర్రెడ్డి చెప్పారు. మద్దూరు మండల పరిధిలోని గాగిల్లాపూర్ గ్రామంలోని శివాలయంలో సోమవారం నిర్వహించిన ఏడో వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఆల య నిర్వాహకులు, అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థప్రసాదాలు అందించారు. కార్య క్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సంతోష్కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లేశం, మాజీ సర్పంచ్ కృష్ణవేణి, చంద్ర మౌళి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ తీరుతో ఎండుతున్న పంటలు
● మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ కాలువలు వెలవెల ● నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డిగజ్వేల్: మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ కాలువల నుంచి సాగునీటిని వదలకపోవడంతో రైతుల పంటలు ఎండిపోయే దుస్థితి ఏర్పడిందని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం మండలంలోని శ్రీగిరిపల్లి వద్ద మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మసాగర్ వెళ్లే కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో ఎండాకాలంలోను కాల్వలు జలకళను సంతరించుకొని ఉండేవన్నారు. సాగునీరు విడుదల కాకపోవడంతో శ్రీగిరిపల్లి, అంగడికిష్టాపూర్, గణేష్పల్లి, చేబర్తి, అక్కారం, పరిసర గ్రామాల్లో పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. సంబంధిత అధికారులకు ఫోన్చేసి విషయం చెప్పినా స్పందించడం లేదని, సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వ వైఖరిలో ఇప్పటికై నా మార్పురాకపోతే రైతుల పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు చంద్రమెహన్రెడ్డి తదితరులు ఉన్నారు. -
కొండంత లక్ష్యంపై కదలిక
సిద్దిపేటజోన్: జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లో పేరుకుపోయిన ఆస్తిపన్ను బకాయిలకు మార్చి 31 నాటికి తుది గడువుపై సాక్షిలో సోమవారం ప్రచురించిన ‘కొండంత లక్ష్యం.. వసూలు అంతంత..’ కథనం జిల్లాలోని బల్దియా అధికారుల్లో కదలిక తెచ్చింది. ఈ ఆర్థిక సంవత్సర లక్ష్యం అధిగమించేందుకు ఈ నెలాఖరులోగా గడువు ఉండడంతో రెవెన్యూ అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్ట డానికి ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగా ఆయా మున్సిపాలిటీ కమిషనర్లు క్షేత్రస్థాయిలో ఆస్తిపన్ను వసూలు ప్రక్రియ చేపడుతున్నారు. ప్రధానంగా మొండి బకాయిలను వసూలు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నారు. మార్చి 31 నాటికి బల్దియా పరిధిలోని అన్ని అస్సె స్మెంట్ పన్నులు సంపూర్ణంగా వసూలు చేసి శతశాతం లక్ష్యం అధిగమించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కమిషనర్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది గ్రూపుల వారీగా వెళ్లి ఇంటి యజమానులకు అవగాహన కల్పించి పన్నులు వసూలు చేస్తున్నారు. ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి పట్టణ ప్రగతికి దోహదపడాలని సూచిస్తున్నారు. -
సన్ ఫ్లవర్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయండి
హుస్నాబాద్: వ్యవసాయ మార్కెట్ యార్డులో సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ డివిజన్ ఇన్చార్జి కవ్వ వేణుగోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. పంట చేతికి వస్తున్నా కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేయలేదన్నారు. సన్ ఫ్లవర్ క్వింటాలుకు రూ.6వేలు మద్దతు ధర నిర్ణయించిందన్నారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటులో జాప్యం జరుగుతుండటంతో దళారులు క్వింటాలుకు రూ.5వేలకే కొనుగోలు చేస్తున్నారని, దీంతో రైతులు నష్టపోతున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం చొరవ తీసుకొని వెంటనే కొనుగొలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. -
నూతన కమిటీ ఎన్నిక
ప్రశాంత్నగర్(సిద్దిపేట): మాల జంగం మహేశ్వర సంక్షేమ సంఘం జిల్లా కమిటీని ఆదివారం సిద్దిపేటలో ఎంపిక చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు రుద్ర రాజలింగం అధ్యక్షతన జరిగిన ఈ ఎన్నికల్లో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎర్పుల నాగరాజు, ఉపాధ్యక్షుడిగా సదానందం, గురుమూర్తి, గౌరవ అధ్యక్షుడిగా ఎన్నం రాజు, ప్రధాన కార్యదర్శిగా అల్లం పరమేశ్, కోశాధికారిగా లింగం, కార్యదర్శి, సహాయ కార్యదర్శులుగా రాజు, రాజేశ్వర్, శివకుమార్, దేవరాజు, పరమేశ్వర్ కార్యవర్గ సభ్యులుగా శంకర్, శివలింగం, సత్యం, ఈశ్వరయ్య, ప్రవీణ్, కాశిలింగం, సోమలింగంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
ఠారెత్తిస్తున్న ఎండలు
వేసవి ప్రారంభంలోనే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం పది దాటిందంటే చాలు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతుండటంతో జనం బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. మిట్టమధ్యాహ్నం అనూహ్యంగా ఎండలు దంచి కొడుతుండటంతో 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఇళ్లలో ఉన్న జనాలు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఇక మూలన పడి ఉన్న కూలర్లకు, ఫ్యాన్లకు పని చెబుతున్నారు. వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు చల్లటి మట్టికుండల కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు.మిరుదొడ్డి(దుబ్బాక): రోజురోజుకు ముదురుతున్న ఎండలతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. మండుతున్న ఎండలతో చెరువులు, కుంటలు, వాగులు వంకల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో బోరుబావులు సైతం వట్టి పోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసవి ప్రారంభంలోనే భూ గర్భ జలాలు అడుగుంటిపోతుండటంతో ఇక మున్ముందు ఎలా ఉంటుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండలతో అనారోగ్య సమస్యలు ఎండలతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎండలో తిరగడం, పనులు చేయడం వల్ల చర్మం పొడిబారిపోయి పూర్తిగా డీ హైడ్రేషన్కు గురై కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందంటున్నారు. సకాలంలో వైద్యం చేయించకపోతే సన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందనీ, తద్వారా చనిపోయే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. మున్ముందు ఎండలు మరింత ముదిరే అవకాశం ఉన్నందున ప్రతీ ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. తేలికపాటి దుస్తులు ధరించాలి ఎండాకాలంలో ఎక్కువ ముదురు రంగులు కాకుండా, తేలికపాటి లైట్ కలర్ దుస్తులను ధరించాలి. ముఖ్యంగా నలుపు రంగు దుస్తులు ఎట్టి పరిస్థితుల్లో వాడరాదు. నలుపు రంగు దుస్తులు ఎక్కువ ఎండవేడిని గ్రహించి అసౌకర్యానికి గురి చేసే అవకాశాలున్నాయి. జాగ్రత్తలు తప్పని సరి వేసవిలో ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నారులు ఎక్కువగా ఎండలో తిరగకుండా, ఆడకుండా తల్లిదండ్రులు దృష్టి సారించాలి. చిన్నపాటి ఎండలకు చిన్నారులు అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇక వృద్ధులు ఇంట్లో నుంచి బయట రాకుండా జాగ్రత్తలు పాటించాలి. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే తలకు రుమాళ్లు, కరీ్చఫ్లు, టోపీలు, గొడుగులు ధరించాలి. ద్రవపదార్థాలు తీసుకోవాలి ఎండాకాలంలో ఘన పదార్థాల కంటే ద్రవ పదార్థాలనే ఎక్కువ తీసుకోవాలి. మంచి నీళ్లు ఎక్కువగా తాగుతుండాలి. ఎండలో తిరిగివచ్చిన వారు షర్భత్, మజ్జిగ, కొబ్బరి నీళ్లను తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. మార్కెట్లో విరివిగా లభించే, పుచ్చ, తర్బూజ, నిమ్మ, ద్రాక్ష ఫలాలతోపాటు, చల్లటి పండ్ల రసాలను తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించక పోవడం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.బోరుబావిలో నీటి మట్టం తగ్గింది ఆరుతడి కింద సాగు చేస్తున్న పంటలకు నీరు అందించే బోరు బావిలో నీటి మట్టం తగ్గుతోంది. ఇదివరకు వచ్చిన నీటి ధారలు రావడం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని భయమేస్తోంది. – ఎల్లయ్య, రైతు, అందెపనులు ఉదయం వేళే చేస్తున్నం మధ్యాహ్నం ఎండలు దంచి కొడుతుండటంతో కూలీ పనులు చేసుకోలేక పోతున్నాం. ఉదయం పది అయ్యిందంటే చాలు మంట పుట్టిస్తున్నాయి. పొద్దున్నే ఉపాధి పనులకు పోయి 10 గంటల వరకు పనులు ముగించుకుంటున్నాం. – లక్ష్మి, ఉపాధి కూలీ, లక్ష్మీనగర్జాగ్రత్తలు పాటించాలి ఎండల పట్ల జాగ్రత్తలు పాటించాలి. రైతులు, వ్యవసాయ, ఉపాధి హామీ కూలీలు ఉదయం, సాయంత్రం వేళ మాత్రమే పనులు చేసుకోవాలి. ఎండలో ఎక్కువగా పని చేయడం వల్ల డీ హైడ్రేషన్కు గురయ్యే ప్రమాదం ఉంది. – డాక్టర్ సమీనా సుల్తానా, పీహెచ్సీ, మిరుదొడ్డిచెట్లు మోడుబారె.. అడవి ఎడారె!|దట్టమైన మల్లన్నసాగర్ అడవి ఎడారిని తలపిస్తోంది. అడవిలో ఉన్న పెద్దపెద్ద చెట్లన్నీ ఆకురాల్చడంతో ఎండిపోయి కనిపిస్తున్నాయి. ఒకవైపు భగ్గుమంటున్న ఎండలు.. మరోవైపు చెట్లు ఆకురాల్చడంతో అడవిలో కొలువైన రేకులకుంట మల్లికార్జునస్వామి దర్శనానికి వచ్చిన భక్తులు నీడ లేక ఆదివారం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దట్టమైన మల్లన్నగుట్టల అడవి బోసిపోయి కనిపిస్తున్న దృశ్యాలను సాక్షి క్లిక్ మనిపించింది. – దుబ్బాక -
శ్రీపాదరావుకు నివాళి
నారాయణఖేడ్: ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తండ్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసనసభాపతి శ్రీపాదరావు జయంతిని ఆదివారం హైదరాబాద్లోని శాసనసభ లాంజ్లో నిర్వహించారు. స్పీకర్ ప్రసాద్కుమార్, శాసనమండలి చైర్మన్ సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యే సంజీవరెడ్డి పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేడు కిసాన్ సంఘ్ ఆవిర్భావ వేడుకలు సంగారెడ్డి టౌన్: భారతీయ కిసాన్ సంఘ్ ఆవిర్భావ వేడుకలను సంగారెడ్డి జిల్లా కార్యా లయంలో నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు నరసింహారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపా రు. అనంతరం రైతులతో సమావేశం ఉంటుందని, కార్యక్రమానికి రైతులు అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. దైవభక్తిని అలవర్చుకోవాలి పటాన్చెరు టౌన్: ప్రతీ ఒక్కరు దైవభక్తిని అలవర్చుకోవాలని న్యాయవాది నాగరాజు యాదవ్ అన్నారు. ఆదివారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి పోచారంలోని హనుమాన్ దేవస్థానం వద్ద భక్తులతో కలిసి హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రులు పిల్లల్లో భక్తిభావంతో పాటు దేశభక్తిని పెంపొందించాలన్నారు. కార్యక్రమంలో వివేకానంద సేవ సమితి అధ్యక్షుడు శేషాద్రి, బజరంగ్ దళ్ సభ్యులు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక కేంద్రంగా బుదేరా
మంత్రి దామోదర రాజనర్సింహ మునిపల్లి(అందోల్): ఆధ్యాత్మిక కేంద్రంగా బుదేరాను తీర్చిదిద్దుతామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం మండలంలోని బుదేరా శివారులో గల హనుమాన్ దేవాలయం వద్ద వైదిక పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బర్ధిపూర్ దత్తాత్రేయ పీఠాధిపతి అవధూత గిరి మహరాజ్ మాట్లాడుతూ.. లోక కల్యాణం కోసం బుదేరా శివారులో వైదిక పాఠశాలను ఏర్పాటు చేసి కులమతాలకతీతంగా పిల్లలకు వేదాలు నేర్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిద్ధేశ్వర్ మహరాజ్, మాజీ ఎంపీపీ రాంరెడ్డి, మాజీ ఎంపీటీసీ మనోహర్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీశ్కుమార్, రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నర్సారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు సహించం గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి గజ్వేల్: రాజకీయ భిక్ష పెట్టిన డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డిపై కాంగ్రెస్ నాయకుడు నాయిని యాదగిరి అనుచితవ్యాఖ్యలు చేయడం సహించేదిలేదని మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్రెడ్డి హెచ్చరించారు. ఆదివారం గజ్వేల్లో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్ధార్ఖాన్, టీపీసీసీ నేత సాజిద్ బేగ్, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, తమ్మిలి శ్రీనివాస్, రవీందర్రెడ్డిలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. నామినేటెడ్ పదవుల కోసం పాకులాడుతూ నర్సారెడ్డిపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం తన సొంత ఆస్తులను అమ్ముకుంటున్న చరిత్ర నర్సారెడ్డిదని చెప్పారు. నాయిని యాదగిరితోపాటు మల్లారెడ్డి, గోపాల్రావు, అనిల్రెడ్డి, మనోహరాబాద్ మల్లారెడ్డిలు పార్టీలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్న వీరి వైఖరిపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. క్రీడల్లో రాణిస్తే బంగారు భవిష్యత్రాష్ట్రస్థాయి ఆర్చరీ విజేత లక్ష్మీఅభయా రెడ్డి రామచంద్రాపురం(పటాన్చెరు):క్రీడల్లో రాణించే వారికి బంగారు భవిష్యత్ ఉంటుందని ఆర్చరీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు టి.రాజు అన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కొల్లూరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో జరిగిన రాష్ట్ర ఆర్చరీ ఇంటర్ డిస్ట్రిక్ట్ చాంపియన్షిప్ పోటీలలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. రాజు మాట్లాడుతూ ఆర్చరీ చిన్నారులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారని చెప్పారు. క్రీడలలో రాణించే వారికి విద్య, ఉపాధి, ఉద్యోగాలలో ప్రత్యేక రిజర్వేషన్లు ఉంటాయని చెప్పారు. అందులో ఎంపికై న వారు ఈనెల 22న విజయవాడలో జరిగే జాతీయస్థాయి ఆర్చరీ క్రీడల్లో పాల్గొంటారని చెప్పారు. అండర్–10 బాలికల విభాగంలో మొదటి బహుమతి సాధించిన ఉప్పల్ మెరీడియన్ పాఠశాల విద్యార్థిని లక్ష్మీఅభయారెడ్డిని ఆయన అభినందించారు. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
● ఐఐటీ హైదరాబాద్లో ఉప రాష్ట్రపతి ధన్ఖఢ్ పర్యటన ● స్వాగతం పలికిన కలెక్టర్ ఎస్పీ, ఎంపీ ● ఐఐటీ ఆవరణలో నాటిన మొక్కలుసంగారెడ్డి జోన్: భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖఢ్ కంది శివారులోని ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్లో పర్యటించారు. ఆదివారం గవర్నర్ జిష్ణుదేవ్ శర్మతో కలిసి క్యాంపస్ను సందర్శిచారు. మధ్యాహ్నం సుమారు 3:15 నిమిషాలకు మూడు ప్రత్యేక హెలిక్యాప్టర్ల ద్వారా క్యాంపస్కు చేరుకున్నారు. క్యాంపస్కు వచ్చిన వారికి గవర్నర్, ఐఐటీ హైదరాబాద్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ డాక్టర్ బీఆర్ మొహన్రెడ్డి, కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ చెన్నూరి రూపేష్, ఎంపీ రఘునందన్రావు, ఐఐటీ హెచ్ డైరెక్టరు బీఎస్ మూర్తి, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి పుష్ఫగుచ్ఛాలు అందించి, మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. ఉపరాష్ట్రపతి పర్యటన ఉత్సాహంగా.. ఉల్లాసంగా సాగింది. క్యాంపస్ ఆవరణలో పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన అభివృద్ధికి ప్రోత్సహించే సంకేతంగా ఉప రాష్ట్రపతి భార్య డా.సుదేశ్ ధన్ఖఢ్తో కలిసి ఏక్ పేడ్ మా కె నామ్ పేరుతో మొక్క నాటి నీరు పోశారు. అనంతరం క్యాంపస్ సభాస్థలి వెళ్లారు. జాతీయ గీతాలాపన చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐఐటీ డైరెక్టరు బీఎస్.మూర్తి ఉప రాష్ట్రపతితో పాటు గవర్నర్కు శాలువాతో సన్మానించి, జ్ఞాపికలను బహూకరించారు. ఐఐటీ డైరెక్టరు ఐఐటీ సాధించిన ముఖ్యమైన విజయాలను వివరించారు. ఐఐటీ విద్యార్థులతో ముచ్చటించి, విద్యార్థులతో కలిసి ఫొటోలు దిగారు. అనంతరం ప్రత్యేక హెలిక్యాప్టర్లలో సుమారు 4:30 నిమిషాలకు హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అయ్యారు. సుమారు గంటన్నర పాటు క్యాంపస్ సందర్శించి, వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉప రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో క్యాంపస్ ఆవరణలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐఐటీ విద్యార్థులు, అధ్యాపకులు నాకు అతిథులు ఐఐటీ విద్యార్థులు, అధ్యాపకులు తనకు అతిథులని, పార్లమెంట్ను సందర్శించాలని ఉపరాష్ట్రపతి కోరారు. భారత దేశం వివిధ భాషల నిలయమని చెప్పారు. పార్లమెంట్లో అన్ని భాషలు ట్రాన్స్లేట్ అవుతున్నాయని చెప్పారు. కాగా, పర్యటన విజయవంతం చేసిన అధికారులకు, పోలీస్ సిబ్బందికి, అన్ని శాఖల అధికారులకు కలెక్టర్ అభినందించారు.రిజర్వేషన్ల ప్రాతిపదికనే నామినేటెడ్ పదవులువర్గల్(గజ్వేల్): వివిధ నామినేటెడ్ పదవులను రిజర్వేషన్ల ప్రాతిపదికన భర్తీ చేస్తామని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. ఆదివారం వర్గల్ మండలం గౌరారం ఎస్సీవాడలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఎమ్మెల్యేగా కేసీఆర్ ఇక్కడి సమస్యలు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని, సీఎం రేవంత్రెడ్డి గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయిస్తున్నారన్నారు. కార్యకర్తలు ప్రతిఒక్కరూ పార్టీకి విధేయులై పనిచేయాలని, క్రమశిక్షణ ఉల్లంఘిస్తే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని, ప్రజాయుత సమస్యలను పార్టీ శ్రేణులు తన దృష్టికి తేవాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మోహన్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి