breaking news
Siddipet
-
వయో వృద్ధులకు డే కేర్
జిల్లాలో సుమారు నాలుగు వేలకుపైగా వృద్ధులు ఉన్నారు. కుటుంబ సభ్యులు ఉద్యోగాలు, చదువులు, వ్యాపారాల నిమిత్తం వెళ్లినప్పడు ఒంటరితనంతో మానసిక ఆందోళనకు గురవుతున్నారు. తమను పలకరించేవారు లేక మనోవేధనకు గురవుతున్నారు. ఇలాంటి వారికి డే కేర్ సెంటర్ బాసటగా నిలవనుంది. ఇందులో ఇతర వృద్ధులతో కలిసి ఆడుతూ, పాడుతూ సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంది. త్వరలో జిల్లా కేంద్రంలో ప్రారంభమయ్యే కేంద్రంలో 60 ఏళ్లు పైబడిన వృద్ధులు 50 మంది ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వృద్ధులు ఈ కేంద్రంలో ఉండడానికి వీలుగా ఇండోర్ గేమ్స్, గ్రంథాలయం, ఇతరత్ర సదుపాయాలు కల్పించనున్నారు. జిల్లాలో ఈ కేంద్రం ఏర్పాటు కోసం సేవా సంఘం అనే ఎన్జీఓకు అధికారులు బాధ్యతలు అప్పగించారు. మెదక్ పట్టణంలో ఒక భవనాన్ని సైతం ఎంపిక చేసినట్లు సమాచారం. -
మేధావులూ ఆలోచించండి
● నాడు సిద్దిపేట దేశంలోనే ఆదర్శం.. ● నేడు ఆగిన ప్రగతితో వెలవెల ● మాజీ మంత్రి హరీశ్రావుసిద్దిపేటజోన్: పదేళ్లుగా ప్రగతి పథంలో పయనించిన సిద్దిపేట.. రెండేళ్లుగా వెనుకబడిన ప్రక్రియపై మేధావులు, జర్నలిస్టులు ఆలోచించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో సిద్దిపేట దేశానికి ఆదర్శంగా ఉందన్నారు. వివిధ రాష్ట్రాల ప్రతినిధులు. అధికారులు సిద్దిపేటకు వచ్చి అధ్యయనం చేసేలా గొప్పగా తీర్చిదిద్దుకున్నామన్నారు. ఇబ్రహీంపూర్ను ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల ప్రతినిధులు తిలకించిన విషయాన్ని గుర్తు చేశారు. బ్రిటిష్ అంబాసిడర్ సైతం సిద్దిపేట స్వచ్ఛతను చూసి కితాబిచ్చారన్నారు. నాటి అభివృద్ధిని జర్నలిస్టులు విజయగాథలుగా అద్భుతంగా రాశారన్నారు. అదే సిద్దిపేట.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఆగిన అభివృద్ధితో వెలవెల పోయిందన్నారు. ఒక బాధ్యతాయుతమైన జర్నలిస్టులు, మేధావులు ఆలోచించాలని పిలుపునిచ్చారు. రెండేళ్లలో ఒక్క రూపాయి సిద్దిపేటకు రాలేదన్నారు. ఒక్క పని కూడా జరగలేదని వివరించారు. జర్నలిస్టు జీవితం అంతా ఇబ్బందులతో ముడి పడి ఉంటుందన్నారు. వారి కష్టాలు వర్ణనాతీతమన్నా రు. కరోనా సమయంలో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, జిల్లా జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు రంగాచారి, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. -
వంటేరు వజ్రమ్మకు నివాళి
జగదేవ్పూర్(గజ్వేల్): అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి తల్లి వజ్రమ్మకు ఘన నివాళులర్పించారు. ఆదివారం జగదేవ్పూర్లో పదకొండు రోజుల కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రులు హరీశ్రావు, సబితారెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, కొత్త ప్రభాకర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు దేశపతి శ్రీనివాస్, యాదవరెడ్డి, మాణిక్రావు, జనార్దన్రెడ్డి, పద్మాదేవేంద్రెడ్డి తదితరులు వజ్రమ్మ చిత్ర పటానికి పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే నియోజకవర్గంలోని అన్ని మండలాల మాజీ ప్రతినిధులు, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు, పార్టీ జిల్లా నేతలు పెద్ద సంఖ్యలో హాజరై నివాళులర్పించారు. అలాగే శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, భక్తిరత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు వజ్రమ్మ చిత్రాన్ని సబ్బు బిళ్లపై అద్భుతంగా చిత్రించి ప్రతాప్రెడ్డికి అందించారు.శ్రద్ధాంజలి ఘటించిన మాజీ మంత్రులు, పలువురు నేతలు -
కలవని చేతులు
జిల్లాలో కాంగి‘రేసు’లో ఎవరికి వారే అనే విధంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. పార్టీలో ఇంకా విభేదాలు సమసిపోవడం లేదు. ఓ వైపు పార్టీ అధిష్టానం కలిసికట్టుగా ముందుకు సాగాలనేసంకేతాలిస్తుంటే జిల్లాలో మాత్రం ఇందుకు భిన్నంగా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. పార్టీకి నష్టం చేస్తున్నారని ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డికి పార్టీ క్రమశిక్షణ కమిటీ షోకాజు నోటీసులు జారీచేసినట్లు, సిద్దిపేట నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి పూజల హరికృష్ణ నుంచివివరణ అడిగినట్లు పీసీసీ వర్గాల ద్వారా తెలిసింది. – సాక్షి, సిద్దిపేట నర్సారెడ్డిపై విజయ్ ఫిర్యాదు గజ్వేల్ పట్టణంలో ఆగస్టు 3న రేషన్ కార్డుల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమానికి ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరు కాగా డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా ఒకరి పై ఒకరు ధూషించుకున్నారు. దీనితో నర్సారెడ్డిపై పోలీస్ స్టేషన్లో విజయ్కుమార్ ఫిర్యాదు చేయడంతో ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. అలాగే వీరిద్దరు పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి లకు సైతం ఫిర్యాదు చేశారు. దీంతో నర్సారెడ్డిని ఆదివారం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి పిలిచారు. ‘షోకాజు నోటీసులు జారీచేస్తున్నాం.. రాత పూర్వకంగా వారం రోజుల్లో వివరణ ఇవ్వాలి’ అని చెప్పినట్లు తెలిసింది. దీనిపై నర్సారెడ్డిని వివరణ కోరగా నిజమని తెలిపారు.హరికృష్ణను వివరణ కోరిన మల్లు సిద్దిపేట నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి పూజల హరికృష్ణపై పీసీసీ అధ్యక్షుడు మహేష్గౌడ్, క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిలకు ఆరుగురు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఎంపీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో పార్టీ కోసం పని చేయకుండా క్యాంప్ కార్యాలయానికే పరిమితం అయ్యారని, ఇటీవల ఇన్చార్జి మంత్రి మంజూరు చేసిన రూ.2 కోట్ల నిధులలో కమిషన్లు తీసుకున్నారని పలువురు ఆరోపిస్తూ ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీనితో మల్లు రవి స్పందించి వివరణ ఇవ్వాలని హరి కృష్ణను ఆదేశించారు. ఈ విషయం పై హరికృష్ణను వివరణ కోరగా ‘నాకు ఎలాంటి నోటీసులు రాలేదు.. వస్తే ఎందుకు వచ్చాయో అందరికీ తెలియజేస్తాను’ అని తెలిపారు. -
కేంద్రంలో ఉండే సదుపాయాలు
● వృద్ధులు ఆడుకోవడానికి వీలుగా క్యారం, చెస్తో పాటు ఇతర సదుపాయాలు ● సేదతీరడానికి ఆహ్లాదరక వాతావారణం, గార్డెనింగ్, మొక్కల పెంపకం ● వంట గది, గ్రంథాలయంతో పాటు ఇతర మౌలిక వసతులు ● తరచూ కేంద్రంలో ఆరోగ్య శిబిరాల నిర్వహణ ● వీల్ చైర్స్తో పాటు ర్యాంప్ల నిర్మాణం ● అత్యవసర పరిస్థితుల్లో అలారం సిస్టమ్ ఏర్పాటు ● మానసిక వేధన, భావోద్వేగానికి గురయ్యే వారికి కౌన్సెలింగ్ -
నాణ్యమైన భోజనం అందించండి
● కలెక్టర్ హైమావతి ● రాఘవాపూర్ కేజీబీవీ ఆకస్మిక తనిఖీసిద్దిపేటరూరల్: ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ హైమావతి కేజీబీవీ సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం మండల పరిధిలోని రాఘవాపూర్ కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ భోజనం, తరగతులను గూర్చి అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఉపాధ్యాయుల దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. కలెక్టర్ వెంట సీసీ నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిరుద్యోగులకు వరం ఉచిత కంప్యూటర్ శిక్షణ
ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఉచిత కంప్యూటర్ శిక్షణ నిరుద్యోగులకు వరమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని వేదాస్ సంస్థలో ఉచిత కంప్యూటర్ శిక్షణ పొందిన 35 మంది అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరడానికి ఆదివారం హైదరాబాద్కు బయలుదేరారు. బస్సును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ ఉచిత కంప్యూటర్ శిక్షణతో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు రాణించాలన్నారు. ఉచిత కంప్యూటర్ శిక్షణలో ఉచిత వసతి, భోజనంతో పాటుగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. సేవాభావాన్ని అలవర్చుకోవాలి చిన్నకోడూరు(సిద్దిపేట): విద్యార్థులు సమాజాన్ని చైతన్య పరిచే కార్యక్రమాలు చేపట్టాలని ఉస్మానియా ప్రొఫెసర్ డాక్టర్ విద్యాసాగర్ అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆదివారం పెద్దకోడూరులో స్పెషల్ క్యాంపు నిర్వహించారు. క్యాంపును ఆకస్మికంగా సందర్శించి మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే సామాజిక సేవా కార్యక్రమాలు అలవర్చుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ గ్రీనరీ పెంచడం వల్ల భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుందన్నారు. సమాజం కోసం ఏవిదంగా పని చేయాలో వివరించారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో ముచ్చటించారు. ఆత్మరక్షణకు కరాటే దోహదం జనగామ డీసీసీ అధ్యక్షుడు ప్రతాప్రెడ్డి చేర్యాల(సిద్దిపేట): ఆత్మ రక్షణకు కరాటే తోడ్పడుతుందని జనగామ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక రేణుక గార్డెన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన విద్యార్థులకు కరాటే బెల్టుల ప్రదానం చేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు కరాటేలో పోటీల్లోనూ రాణించి రాష్ట్ర, జాతీయ స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కరాటే రాష్ట్ర అధ్యక్షుడు పాషా మాట్లాడుతూ కరాటేతో మానసిక, శారీరక, ఉన్నతితో పాటు ఉద్యోగాల్లో సైతం అవకాశాలుంటాయని అన్నారు. కరాటే మహిళలకు ఆత్మ రక్షణతో పాటు మనోధైర్యం ఇస్తుందన్నారు. కార్యక్రమంలో కరాటే జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లేశం, ప్రభాకర్, ఎల్లాగౌడ్, ఎల్లదాస్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నాయకుడికి షోకాజ్ నోటీసు గజ్వేల్: పట్టణానికి చెందిన బీజేపీ క్రీయాశీలక నాయకుడు కాశమైన నవీన్కు షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి నరసింహ ముదిరాజ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 12న పట్టణంలోని అయ్యప్ప ఫంక్షన్ హాలు వద్ద పార్టీ నేతలు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను చించివేసి, అసభ్యపదజాలంతో దుర్భాషలాడినందువల్ల ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు. -
ఎవరు లీక్ చేస్తున్నారు?
సాక్షి, సిద్దిపేట: ఆఫీస్లో జరిగే విషయాలు బయటకు ఎలా వెళ్తున్నాయి? ఎవరు లీక్ చేస్తున్నారు? అనే అంశాలపై కలెక్టర్లోని ఉన్నతాధికారి ఆరాతీస్తున్నారు. ఈ నెల 7న ‘సాక్షి’ దినపత్రికలో దఫ్తర్లోనే బిస్తర్! అనే శీర్షికతో వార్త ప్రచురితమైన విషయం విదితమే. ఇలా పలు విషయాలు లీక్ చేస్తున్నారన్న కక్షతో కింది స్థాయి సిబ్బందికి మోమోలు ఇచ్చినట్లు వినికిడి. గొర్రెల పెంపకం అభివృద్ధి పథకం(ఎస్ఆర్డీఎస్)పై ఒక పక్క ఈడీ విచారణ జరుగుతుండగానే అందులో నుంచి రూ.2లక్షలను సదరు అధికారి నేరుగా డ్రా చేశారు. గజ్వేల్ నియోజకర్గం పరిధిలోని ఓ మండల వైద్యశాలకు తనిఖీకి వెళ్లిన సమయంలో డాక్టర్తో సిగరేట్ డబ్బా తీసుకురావాలని హుకుం జారీ చేశారని తెలిసింది. ఎస్ఆర్డీఎస్ పథకం అమలు కావడంతో గొర్ల కాపర్ల అభివృద్ధిపై ఈ నెల 10న క్షేత్రస్థాయిలో పరిశీలన, సదస్సుకు జగదేవ్పూర్ మండలం పీర్లపల్లికి రాష్ట్ర గొర్రెల డెవలప్మెంట్ ఎండీ సుబ్బారాయుడు వచ్చారు. ఓ ఉన్నత స్థాయి అధికారి వచ్చినప్పుడు వెళ్లాల్సి ఉండగా.. వెళ్లకుండా.. సుబ్బారాయుడు పరిశీలన ముగిసిన తర్వాత తాపీగా గజ్వేల్కు చేరుకున్నారు. ఇలా అనేక తప్పులను కప్పి పుచ్చుకునేందుకు కార్యాలయంలో పని చేసే సిబ్బందికి పలువురికి మెమోలు జారీ చేసినట్లు తెలిసింది. తనిఖీల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని టీఎన్జీవోస్, వైద్యులు, గొర్రెల కాపర్ల సంఘం నేతలు కలిసి కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
భూ పంపిణీ అమలులో వైఫల్యం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాములు సిద్దిపేట అర్బన్: రైతాంగ సాయుధ పోరాటం నాటి భూ ఎజెండాను పాలకులు నేటికీ పరిష్కరించకుండా నివాస, సాగు యోగ్యమైన భూమి లేని పేదలకు భూమిని పంచడంలో పూర్తిగా వైఫల్యం చెందారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ అమరవీరుల సంస్మరణ సభ శుక్రవారం సిద్దిపేటలోని కార్మిక, కర్షక భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ..సాయుధ పోరాటం ఫలితంగానే భూ సంస్కరణ చట్టం అమల్లోకి వచ్చిందని, దాని వల్ల పేదల చేతుల్లో భూములున్నాయన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఐక్యం చేసిన పోరాటం రైతాంగ సాయుధ పోరాటమన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి, కార్యదర్శి వర్గ సభ్యులు గోపాలస్వామి, శశిధర్, సత్తిరెడ్డి, భాస్కర్, జిల్లా కమిటీ సభ్యుడు శ్రీనివాస్, ప్రశాంత్, నాయకులు కనకయ్య, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. హుస్నాబాద్లో 8 రెవెన్యూ క్లస్టర్లు హుస్నాబాద్రూరల్: హుస్నాబాద్ మండలంలో 17 గ్రామ పంచాయతీలను 8 రెవెన్యూ క్లస్టర్లుగా ఏర్పాటు చేసి జీపీఓలను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు తహసీల్దారు లక్ష్మారెడ్డి శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. పాలనా సౌలభ్యం కోసం సమీపంలోని గ్రామాలను కలుపుతూ రెవెన్యూ క్లస్టర్లు ఏర్పాటు చేశారు. హుస్నాబాద్–1, హుస్నాబాద్–2, తోటపల్లి, పోతారం(ఎస్)–3, మీర్జాపూర్, వంగరామయ్యపల్లి, భల్లునాయక్తండా–4, పందిల్ల, కూచనపెల్లి, మాలపల్లి–5, పొట్లపల్లి–6, మహ్మదాపూర్, మడద, రాములపల్లి, నాగారం–7, ఉమ్మాపూర్, జిల్లెలగడ్డ–8 గ్రామాలను రెవెన్యూ క్లస్టర్లోకి తీసుకున్నట్లు తహసీల్దార్ పేర్కొన్నారు. వైద్య వృత్తి పవిత్రమైనది ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి గజ్వేల్రూరల్: వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని, ఆపత్కాలంలో మనిషి ప్రాణాలను కాపాడలిగేది వైద్యం మాత్రమేనని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని శనివారం కోలా అభిరాం గార్డెన్స్లో జరిగిన ప్రగతి జూనియర్ కళాశాల ఎంపీహెచ్డబ్ల్యూ ప్రథమ సంవత్సర విద్యార్థినుల క్యాపింగ్ కార్యక్రమంలో యాదవరెడ్డి పాల్గొని మాట్లాడారు. రోగులు తొందరగా కోలుకునేలా వైద్యసేవలు అందించాలని, విద్యార్థినులు నర్సింగ్ వృత్తిలో రాణించి అందరి మన్ననలు పొందాలని సూచించారు. కార్యక్రమంలో మంజీ రా, ప్రగతి విద్యాసంస్థల కరస్పాండెంట్ అంబ దాస్, ప్రగతి కళాశాల ప్రిన్సిపాల్ మట్టయ్య చౌదరిలతోపాటు సంధ్య పాల్గొన్నారు. సీఎం హామీని అమలు చేయాలి వీహెచ్పీఎస్ ఉమ్మడి జిల్లా కో–ఆర్డినేటర్ దండు శంకర్ సిద్దిపేటరూరల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్నికల సమయంలో పెన్షన్లు పెంచుతామని ఇచ్చిన హామీని అమలు చేయాలని వీహెచ్పీఎస్ ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ దండు శంకర్ డిమాండ్ చేశారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో శనివారం నారాయణరావుపేట మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ...వృద్ధులు, వితంతువులు, ఒంటరిమహిళలు, గీత, చేనేత, బీడీ కార్మికులు, దివ్యాంగులకు పెన్షన్లను పెంచుతామని హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన హమీలు అమలు చేయని నేపథ్యంలో ఈనెల 15న పెన్షన్ దారులతో ఎమ్మార్వో కార్యాలయాల ముట్టడి చేపట్టనున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కస్తూరి రాజిరెడ్డి, సత్తయ్య, వేణు, జక్కయ్య, తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగ నోటిఫికేషన్లు ఏవీ?
సిద్దిపేటజోన్/ప్రశాంత్నగర్(సిద్దిపేట): ప్రస్తుత ప్రభుత్వంలో మెగా డీఎస్సీ, ఏడాదికి 2లక్షల ఉద్యోగాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగభృతి ఎక్కడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ప్రశ్నించారు. రాజకీయాలకతీతంగా ఏర్పాటు చేస్తున్న జాబ్మేళాలను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విపంచి ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన జాబ్మేళాకు హారీశ్రావు హాజరై మాట్లాడారు. అంతకుముందు ట్రస్మా ఆధ్వర్యంలో సిద్దిపేటలో నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ..యువత భవిష్యత్తు బాగుండాలనే జాబ్మేళాలు ఏర్పాటు చేస్తున్నానన్నారు. ఉద్యోగం కోసం ఊరు దాటితేనే ప్రపంచం గురించి అర్థం అవుతుందని చెప్పారు. విద్యార్థులకు విద్యతోపాటుగా సామాజిక నైతిక బాధ్యతను చిన్ననాటి నుంచే నేర్పించాలని సూచించారు. ప్రైవేట్ ఉపాధ్యాయులకు జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులు అందించాలన్నారు. క్రీడలతో విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే గెలుపోటములను సమానంగా స్వీకరించే మానసిక స్థితి మెరుగుపడుతుందన్నారు. సిద్దిపేటలో అన్ని రకాల విద్య సంస్థలున్నాయని, వెటర్న రీ కళాశాలను సీఎం రేవంత్రెడ్డి కొడంగల్కు తరలించుకుపోయారని, మళ్లీ అధికారంలోకి రాగానే తిరిగి కళాశాలను ప్రారంభిస్తామన్నారు. పనులు వేగవంతం చేయాలి నియోజకవర్గ పరిధిలోని నీటిపారుదల శాఖ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని హరీశ్రావు సూచించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. యాసంగిలో ఎదురైన సమస్యలు వానాకాలం పంటకు ఎదురుకాకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మాజీ ఎమ్మెల్సీ పారూఖ్ హుస్సేన్ పాల్గొన్నారు. ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాలి: హరీశ్రావు సిద్దిపేటరూరల్: ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని హరీశ్రావు పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని చింతమడక గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్తో కలిసి హరీశ్రావు ఆవిష్కరించారు. అనూహ్య స్పందన ఈ సందర్భంగా నిర్వహించిన జాబ్ మేళాకు సుమారు 2వేలకుపై చిలుకు నిరుద్యోగ యువతి యువకులు హాజరయ్యారు. మహేంద్ర టెక్, రిలయన్స్, జీఎంఆర్, అమెజాన్, ఎయిర్ టెల్, ఎంఆర్ఎఫ్, పేటీఎం, డెలివరీ, ఐకియా, ఫ్లిప్కార్డ్, జుమోటో, జెప్టో, మిషో, బిగ్బాస్కెట్, డిమార్ట్, గ్లోబల్ సొల్యూషన్ వంటి సంస్థల ప్రతినిధులు పాల్గొని అభ్యర్థులను ఇంటర్వ్యూలు చేశారు. -
పత్తి కొనుగోళ్లకు కార్యాచరణ
పత్తి కొనుగోళ్లకు కార్యాచరణ సిద్ధమవుతోంది. కలెక్టర్ రెండ్రోజుల కిందట దీనిపై సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో 1.07లక్షల ఎకరాలకుపైగా పత్తి సాగులోకి రాగా, ఈసారి 10లక్షల క్వింటాళ్లకుపైగా దిగుబడులు రావొచ్చని అంచనా వేస్తున్నారు. గజ్వేల్: మరో నెల రోజుల తర్వాత పత్తి మార్కెట్లోకి వచ్చే అవకాశముండగా...అధికార యంత్రాంగం కొనుగోళ్ల ఏర్పాట్లపై ముందస్తు కార్యాచరణను సిద్ధం చేసింది. జిల్లాలో ఈసారి 1,07,243 ఎకరాల్లో పత్తి సాగులోకి వచ్చింది. ఈసారి పత్తి రైతులకు ఆది నుంచే కష్టాలు చుట్టుముట్టాయి. సీజన్ ఆరంభంలో అనావృష్టి దెబ్బతీస్తే....ఆగస్టు నెల నుంచి అతివృష్టి అపార నష్టాన్ని కలిగించింది. ఈ క్రమంలోనే రోజుల తరబడి చేలల్లో వరద నిలిచి పంట ఎదుగుదల లోపించింది. తెగుళ్లు చుట్టుముట్టి పంట రంగు మారిపోయింది. కొనిచోట్ల కాత, పూత లేకుండా తయారయి..దిగుబడులపై ప్రభావం పడింది. మార్కెటింగ్ శాఖ మాత్రం ఈసారి ఎకరాకు 10క్వింటాళ్ల చొప్పున 10లక్షల క్వింటాళ్లకుపైగా ఉత్పత్తులు రావొచ్చని అంచనా వేస్తోంది. జిల్లాలో 1.07 లక్షల ఎకరాలకుపైగా సాగు గోదాములు సిద్ధం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 63 గోదాములు పత్తి నిల్వ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో 1,59,150మెట్రిక్ టన్నుల పత్తిని నిల్వ చేసుకునే అవకాశముంది. ఈసారి ప్రభుత్వం పత్తి క్వింటాలుకు రూ.8,110 మద్దతు ధర ప్రకటించినందు వల్ల...సీసీఐ కేంద్రాల్లో ఈ ధరను పొందడానికి రైతులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో ఏఈఓలతో ఈ పంటను నమోదు చేయించుకుని, పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్కార్డు ఆధారంగా అమ్ముకోవాల్సి ఉంటుంది. పత్తి కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షించేందుకు మండల స్థాయిలో తహసీల్దార్, ఏఓ, ఎస్హెచ్ఓ(స్టేషన్ హౌజ్ ఆఫీసర్), మార్కెట్ కమిటీ కార్యదర్శి, సీసీఐ అధికారి, రైతు ప్రతినిధులతో కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నారు. గతేడాది మాదిరిగానే జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, చిన్నకోడూర్, తొగుట, దౌల్తాబాద్, కొండపాక, బెజ్జంకి, హుస్నాబాద్, చేర్యాల మార్కెట్ కమిటీల పరిధిలో 23 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి తగు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఆయా మిల్లుల్లో రైతులకు కావాల్సిన వసతులు, ఇతర ఏర్పాట్లపై అధికారులు తనిఖీ చేయనున్నారు. రైతులకు ఇబ్బందుల్లేకుండా చూస్తాం పత్తి కొనుగోళ్లపై ముంద స్తు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైతులకు మద్దతు ధర అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకుసాగుతుంది. మరో నెల రోజుల తర్వాత పత్తి మార్కెట్లోకి వచ్చే అవకాశమున్నందున ఆలోగా కొనుగోళ్లకు సర్వం సిద్ధంగా ఉంటాం. – నాగరాజు, సిద్దిపేట జిల్లా మార్కెటింగ్ అధికారి -
వేగంగా డబుల్ రోడ్డు పనులు
● రూ. 20 కోట్ల నిధులతో పనులు అక్కన్నపేట మండలం అంతక్కపేట క్రాసింగ్ నుంచి తుది దశకు చేరుకున్న డబుల్ రోడ్డు నిర్మాణ పనులు అక్కన్నపేట(హుస్నాబాద్): అక్కన్నపేట మండల ప్రజలు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న డబుల్ రోడ్డు కల తీరనుంది. అక్కన్నపేట మండల అంతక్కపేట గ్రామ క్రాసింగ్ నుంచి కట్కూర్ గ్రామం మీదుగా రూ.20కోట్ల వ్యయంతో చేపట్టిన డబుల్ రోడ్డు విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అంతక్కపేట క్రాసింగ్ నుంచి భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ వరకు దాదాపు 11.5కిలోమీటర్ల మేర ఈ డబుల్ రోడ్డును నిర్మించనున్నారు. ప్రస్తుతం పనులు సగానికి పైగా పూర్తిగా కాగా డాంబర్ పోయడమే మిగిలి ఉంది. తీరనున్న కల... సంక్రాంతి పండుగ వచ్చిదంటే చాలు కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయానికి ఈ మార్గం ద్వారానే ప్రయాణిస్తారు. ఇక్కడ ప్రతీ ఏటా మకర సంక్రాంతి సందర్భంగా జాతర జరుగుతుంది. దీంతో అక్కన్నపేట మండలంలోని అనేక గ్రామాల ప్రజలు ఈ రోడ్డు ద్వారానే ఎండ్ల బండ్లు, ట్రాక్టర్లపై వెళ్తుంటారు. డబుల్ రోడ్డు నిర్మించాలని గతంలో అనేకసార్లు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రజాపాలనలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో తీసుకుని డబుల్ రోడ్డు విస్తరణ పనుల్ని చేపట్టారు. -
రాష్ట్రంలో దగాకోరు పాలన
● ఇబ్బందులు పడుతున్న ప్రజలు, రైతులు ● ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాక: కాంగ్రెస్ ప్రభుత్వం దగాకోరు పాలనలో ప్రజలు, రైతులు నరకయాతన పడుతున్నారని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దుబ్బాక పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. కేవలం 22 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల్లో విసుగువచ్చిందన్నారు. యూరియా దొరకక రైతులు తమ పంటలను పశువులను మేపుతూ, దున్నేస్తున్నారని ఇంతటి దయనీయమైన పరిస్థితి ఎప్పుడు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా ఎప్పుడు వస్తుందో లేదో కూడా తెలియని అయోమయ పరిస్థితులున్నాయంటే పాలన ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. ఎమ్మెల్యేలు అభివృద్ధి పనులు సమస్యల కోసం ఫోన్లు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. రోడ్లు ధ్వంసమై బస్లు కూడా గ్రామా లకు రాని పరిస్థితి దాపురించినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. సంక్షేమ హాస్టళ్లను పట్టించుకోండి.. సంక్షేమ హాస్టళ్లపై రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్షేమ హాస్టళ్లలో దయనీయమైన పరిస్థితులు నెలకొనడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు మంజూరు చేసి హాస్టళ్లల్లో సమస్యలు పరిష్కరించాలన్నారు. అంతకుముందు నియోజకవర్గంలోని పలు బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. -
చేపలు చేరేదెప్పుడు?
అదను దాటిపోయిందని ఆందోళన పడుతున్న మత్స్యకారులు సాక్షి,సిద్దిపేట: చేప పిల్లల పంపిణీకి సంబంధించి అదను దాటిపోతున్నా ఇంకా టెండర్లు కూడా ఖరారు కాకపోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా జూలై–ఆగస్టు మధ్య కాలంలోనే చేప పిల్లలను వదలాల్సి ఉండగా, ఇప్పటివరకు పంపిణీకి సంబంధించిన ప్రక్రియే పూర్తి కాలేదు. దీంతో పలువురు మత్స్యకారులు సొంతంగానే చేపపిల్లలను కొనుగోలు చేసి చెరువుల్లోకి వదులుతున్నారు. మరోవైపు చేపపిల్లల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం టెండర్లను ఆహ్వానింగా కేవలం ఇద్దరు కాంట్రాక్టర్లు మాత్రమే బిడ్లు వేయడంతో చేపపిల్లలను ఎప్పుడు పంపిణీ చేసేది? ఎప్పుడు వదిలేది? ఎప్పుడు ఎదిగేది అని మత్స్యకారులు వాపోతున్నారు. చేపపిల్లల పంపిణీ కాంట్రాక్ట్లు ఇంకా టెండర్ ఖరారు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. జిల్లాలో 379 మత్స్యకార సొసైటీలు జిల్లాలో 379 మత్స్యకార సొసైటీలు ఉండగా 24,517 మంది సభ్యులున్నారు. అందులో 40 మహిళా సొసైటీలు 1,975 సభ్యులు, పురుషుల సొసైటీలు 339 ఉండగా అందులో 22,442 మంది సభ్యులున్నారు. 2025–26 ఏడాదికి 1,715 చెరువుల్లో 4.42కోట్ల చేప పిల్లలను వదిలేందుకు మత్స్యశాఖ ప్రణాళికలు రూపొందించింది. గత నెల 20 నుంచి ఈ నెల 1 వరకు టెండర్లను ఆహ్వానించగా ఎవరూ ముందుకురాకపోవడంతో రెండోసారి ఈనెల 8 వరకు ఆ తర్వాత మళ్లీ 12 వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు పొడిగించారు. అయితే ఈ టెండర్ల ప్రక్రియలో ఇద్దరు కాంట్రాక్టర్లు మాత్రమే బిడ్లు దాఖలు చేశారు. దరఖాస్తుల పరిశీలన ఈ నెల 16వ తేదీ వరకు దరఖాస్తులో పేర్కొన్నవాటిని, ఫాంలో చేప పిల్లలు అందుబాటులో ఉన్నాయా?... సరఫరా చేసే సామర్థ్యం ఉందా అని అధికారులు పరిశీలించనున్నారు. ఇంకా 20 రోజుల ప్రక్రియ మిగిలి ఉంది. అంటే చేప పిల్లలు అక్టోబర్ నుంచి ప్రారంభమ య్యే అవకాశం ఉంటుంది. ప్రారంభమైన రోజు నుంచి అన్ని చెరువులకు చేప పిల్లలను పంపిణీ చేయాలంటే 45 రోజులు సమయం పట్టనుంది. టెండర్ దాఖలు చేసిన కాంట్రాక్టర్లు సక్రమంగా పంపిణీ చేస్తారా? లేదా ? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎదుగుదల ఇలా... ఫిబ్రవరి, మార్చి నాటికి చెరువులు ఎండుముఖం పడుతాయి. ఏప్రిల్ మే నెలలలో పూర్తిగా వట్టిబోయే అవకాశం ఉంటుంది. జాప్యం జరిగిన కొద్దీ చేపలు ఎదగక నష్టపోయే ప్రమాదం ఉందని మత్స్యకారులు పేర్కొంటున్నారు. బంగారు తీగరకం 8 నెలలకు, బొచ్చ 9 నుంచి 10 నెలల కాలం, రాహు సంవత్సరానికి 500 నుంచి 750గ్రామలు బరువు వస్తుందని పేర్కొంటున్నారు. ఈ లెక్కన ఏప్రిల్, మే నాటివరకు చేపలు చేతికి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.టెండర్లు ఖరారు కాగానే పంపిణీ టెండర్లు ఖరారు కాగానే చేప పిల్లల పంపిణీ ప్రారంభిస్తాం. ఇద్దరు కాంట్రాక్టర్లు టెండర్లు వేశారు. కాంట్రాక్టర్ దాఖలు చేసిన ప్రకారం పరిశీలించి టెండర్లు ఖరారు చేస్తాం. –మల్లేశం, ఎఫ్డీఓఎదురు చూసి.. కొనుక్కునిసిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ చెరువులో సొసైటీ సభ్యులు ప్రభుత్వం చేప పిల్లలు పంపిణీ చేస్తారని నెల రోజులుగా ఎదురు చూశారు. ఇంకా టెండర్ల ప్రక్రియనే కొనసాగుతుండటంతో చేప పిల్లలు వదిలే సమయం దాటిపోతుందని రూ.13 వేలతో చేప పిల్లలను తెచ్చి పోసుకున్నారు. ఇక చేప పిల్లల పంపిణీకి బదులుగా సొసైటీలకు నగదు బదిలీ చేస్తే నాణ్యమైన చేపపిల్లల్ని తామే కొనుగోలు చేసి సరైన సమయంలో చెరువులు, కుంటల్లో వదులుకుంటామని పలువురు మత్స్యకారులు అభిప్రాయపడుతున్నారు. -
కమలంలో కుంపట్లు
జిల్లా భారతీయ జనతాపార్టీ(బీజేపీ)లో నేతల మధ్య వర్గపోరు తారస్థాయికి చేరుకుంటోంది. సమన్వయం కొరవడి పార్టీలో ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో కార్యకర్తలు అయోమయానికి గురువుతున్నారు. ఆరు నెలల క్రితం బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా బైరీ శంకర్ను రాష్ట్ర పార్టీ ప్రకటించింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి జిల్లా అధ్యక్ష పదవిని కట్టాబెట్టారని అప్పటి నుంచి పలువురు అసంతృప్తిని వ్యక్తం చేస్తూవస్తున్నారు. అధిష్టానానికి ఫిర్యాదులు, సోషల్ మీడియాలో బహిరంగంగా విమర్శలు చేసే వరకు వెళ్లింది. – సాక్షి, సిద్దిపేట జిల్లా బీజేపీ మూడు వర్గాలుగా విడిపోయింది. ప్రస్తుత అధ్యక్షుడు బైరీ శంకర్, మాజీ అధ్యక్షుడు గంగాడి మోహన్రెడ్డి, దూది శ్రీకాంత్రెడ్డి ఒకరికొకరు అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు మోహన్రెడ్డి వర్గం దూరంగా ఉంటోంది. పార్టీ కార్యక్రమాల్లో ఎంపీ రఘునందన్ రావు పాల్గొనే వాటికి మాత్రమే శ్రీకాంత్రెడ్డి వర్గం పాల్గొంటోంది. మిగతావాటికి దూరంగానే ఉంటున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, రాష్ట్ర ఇన్చార్జి చంద్రశేఖర్ జీకి పలువురు ఫిర్యాదు చేశారు. ఎంపీ ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి రఘునందన్ రావుకు అధికంగా ఓట్లు వచ్చాయి. జిల్లాలో పార్టీ బలోపేతం అవుతున్న సమయంలో నేతల వర్గపోరుతో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. పెండింగ్లోనే జిల్లా కార్యవర్గం జిల్లా కార్యవర్గాన్ని ఇంకా పెండింగ్లోనే పెట్టారు. జిల్లా అధ్యక్షుడిని నియమించి ఆరు నెలలు కావస్తున్నా జిల్లా కమిటీ ఏర్పాటు కాలేదు. దీంతో అధ్యక్షుడి మార్పు ఉంటుందని కార్యకర్తలు జోరుగా చర్చించుకుంటున్నారు. అధిష్టానం దృష్టి సారించేనా? జిల్లాపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టి వర్గపోరును కట్టడి కోసం చర్యలు తీసుకుంటుందా? లేదా అన్న చర్చ కార్యకర్తల్లో జోరుగా సాగుతోంది. ఇదే విధంగా వర్గపోరు ఉంటే త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని పలువురు కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. బీజేపీ అధిష్టానంతో పాటు, ఎంపీ రఘునందన్ రావు ప్రత్యేక దృష్టి కేంద్రికరించి వర్గపోరు నియంత్రించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలు కోరుతున్నారు.ఫోన్ కాల్ సంభాషణ.. ‘ఏ పార్టీ నుంచైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓ సామాజిక వర్గం వారు పోటీ చేస్తే వారికి ఆర్థిక సాయం అందించాలి. మధన్న(కాంగ్రెస్) వెనకాల టీం ఉంటే ఉపయోగంగా ఉంటుంది’ అని ఓ వ్యక్తితో జిల్లా అధ్యక్షుడు ఫోన్లో మాట్లాడిన సంభాషణ కలకలం రేపుతోంది. ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కులం పేరుతో పార్టీకి వెన్నుపోటు పోడిచే విధంగా ఉందని పలువురు కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ఆరోపిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును జిల్లా అధ్యక్షుడు బైరీ శంకర్తో పాటు పలువురు కలిసి ఈ ఫోన్ కాల్ సంభాషణపై వివరణ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. మూడు వర్గాలుగా విడిపోయిన నేతలు జిల్లా అధ్యక్షుడిపై అధిష్టానానికి ఫిర్యాదు ఇంకా ఖరారుకాని జిల్లా కార్యవర్గం ఫోన్ కాల్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయోమయంలో క్యాడర్ -
మీడియా గొంతు నొక్కడమా?
సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి, జర్నలిస్టులపై అక్రమంగా కేసులు బనాయించడమేకాకుండా, కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్న ఏపీ ప్రభుత్వంపై వివిధ సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు అని, అక్రమాలను, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం మీడియా కర్తవ్యమని అన్నారు. ఏకపక్షంగా వ్యవహరించడాన్ని ఏపీ ప్రభుత్వం తక్షణం మానుకోవాలని వారు హెచ్చరించారు. ఏపీ ప్రభుత్వ నిర్బంధ చర్యలపై పలువురి నేతల అభిప్రాయాలు.. వారి మాటల్లోనే.. చంద్రబాబు పెద్ద నియంత దుబ్బాక: దేశంలోనే పెద్ద నియంత చంద్రబాబు. ప్రశ్నించే గొంతుకలను అణగదొక్కాలని చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు అక్రమాలను నిర్భయంగా రాస్తున్న సాక్షిపై కక్షసాధించడం తగదు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి, జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను దళిత, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. – భీమసేన, భీమ్ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబు వైఖరి దుర్మార్గం దుబ్బాక: ఏపీలో కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతున్న సాక్షిపై తప్పుడు కేసులు బనాయించడం దారుణం. ప్రజా ఉద్యమాలకు మొదటి నుంచి ఊపిరిపోస్తున్న సాక్షిపై చంద్రబాబు సర్కార్ చేస్తున్న దుర్మార్గమైన వైఖరిని మాలమహానాడు తీవ్రంగా ఖండిస్తోంది. – ర్యాకం శ్రీరాములు, జాతీయమాలమహానాడు రాష్ట్ర పొలిట్బ్యూరో చైర్మన్ పత్రికాస్వేచ్ఛను హరించడమే దుబ్బాక: నిజాలను నిర్భయంగా రాస్తున్న సాక్షిపై ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం దారుణం. చంద్రబాబు సర్కార్ భావప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు వేయడం హేయమైన చర్య. – అమ్మన రాంచంద్రారెడ్డి, సీనియర్ న్యాయవాది మంచి పరిణామం కాదు.. సిద్దిపేటజోన్: పత్రికా స్వేచ్ఛను హరించవద్దు. పత్రికలపై నిర్బంధాలు మంచి పరిణామం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి ఎడిటర్, జర్నలిస్టుల మీద పెట్టిన అక్రమ కేసుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. పత్రికలకు పాలకులు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి, అప్పుడే నిజానిజాలు బహిర్గతం అవుతాయి. –పరమేశ్వర్. జిల్లా టీన్జీఓ అధ్యక్షుడు నిర్బంధ చర్యలు తగవు సిద్దిపేటజోన్: ప్రజలకు, ప్రభుత్వానికి వారధి పత్రికలు. పత్రికలు, జర్నలిస్టులపై ఉద్దేశపూర్వకంగా అక్రమ కేసులు బనాయించడం తగదు. నిర్బంధ చర్యలు మంచి సంస్కృతి కాదు. ప్రభుత్వాలు వస్తుంటాయి. పోతుంటాయి. కక్ష ధోరణిలో వ్యవహరించడం దారుణం. ఏపీ ప్రభుత్వ తప్పిదాలను వెలుగులోకి తెస్తే వాటిని ప్రభుత్వం సరిదిద్దుకోవాలి. – విక్రమ్ రెడ్డి, ఉద్యోగ సంఘాల ప్రతినిధి. దాడులు సరికాదు సిద్దిపేటజోన్: నిజాన్ని నిర్భయంగా వెలికితీయడమే మూల సూత్రంగా పనిచేసే మీడియాను ఇబ్బంది పెట్టడం, దాడులు చేయడం సరికాదు. జర్నలిస్టులపై కేసులు నమోదు చేస్తే మీడియా స్వేచ్ఛకు భంగమే. ఇకనైనా జర్నలిస్టులపై దాడులు ఆపాలి. – వరుకోలు రాజలింగం, అడ్వకేట్, సిద్దిపేట -
మత్తళ్లు.. పరవళ్లు
రెండు రోజులుగా కురిసిన వర్షాలకు జలాశయాలన్నీ జలకళను సంతరించుకున్నాయి. నంగునూరు, పాలమాకుల, బద్దిపడగ, రాంపూర్, మగ్ధుంపూర్, సిద్దన్నపేట, అంక్షాపూర్, నాగరాజుపల్లి, నర్మేట లోని చెరువులు, కుంటలు మత్తడి దూకుతున్నాయి. నంగునూరు మండలం గుండా ప్రవహించే మోయతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో చెక్డ్యామ్లు పరవళ్లు తొక్కుతున్నాయి. కాగా భారీ వర్షాలతో అక్కేనపల్లి లోని బుడగ జంగాల కాలనీ నీట మునిగింది. నిత్యావసర సరుకులు కొట్టుకుపోయాయి. హుస్నాబాద్ మండలంలోని వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మత్స్యకారులు చేపలు పడుతుండటంతో చెరవుల వద్ద సందడి నెలకొంది. అక్కన్నపేట మండలం గండిపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద చేరడంతో నిండుకుండను తలపిస్తోంది. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 0.5టీఎంసీలు. కొన్ని రోజులుగా నీళ్లు లేక ఎండిన ప్రాజెక్టులో నీళ్లు చేరడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. – నంగునూరు(సిద్దిపేట)/హుస్నాబాద్రూరల్/అక్కన్నపేట(హుస్నాబాద్) -
రోడ్లు కోత.. పయనం వెత
అక్కన్నపేట మండలం ధర్మారం, పోతారం(జే), మైసమ్మవాగుతండా గ్రామాల్లో రోడ్లన్నీ ఛిద్రమయ్యాయి. రాత్రి కురిసిన భారీ వర్షానికి కోతకు గురయ్యాయి. తాటివనం బ్రిడ్జి వద్ద రోడ్డు ధ్వంసం కావడంతో ప్రయాణం ప్రమాదంగా మారింది. అలాగే పలు చోట్ల సైడ్ బర్ములు కొట్టుకుపోయ్యాయి. ధర్మారం వెళ్లే మార్గంలో బ్రిడ్జి వద్ద రోడ్డు కోతకు గురై వరి పొలంలో ఇసుక మేటలు వేశాయి. ఎలాంటి ప్రమాదాలు, ప్రాణనష్టం జరగక ముందే సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. – అక్కన్నపేట(హుస్నాబాద్) -
ఇందిరమ్మ ఇళ్ల వేగం పెంచాలి
హుస్నాబాద్రూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం తోటపల్లిలో ఇందిరమ్మ లబ్ధిదారుడు గూళ్ల లింగం,లావణ్య దంపతుల గృహ ప్రవేశానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో మొదటి విడతగా 3,500 ఇళ్లు మంజూరు చేశామని చాలా మంది గృహ ప్రవేశాలు చేస్తున్నారని తెలిపారు. ప్రజాపాలన ప్రభుత్వం పేదల సొంతింటి కల నేరవేర్చుతోందని అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తోటపల్లిలో గృహప్రవేశం -
ప్రవక్త జీవితం ఆదర్శనీయం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): ప్రవక్త ప్రవచనాలు విశ్వశాంతికి మార్గదర్శకాలని ముస్లిం మత పెద్దలు ముఫ్తి ఆసిఫ్, కరీం పటేల్లు అన్నారు. మిలాద్ ఉన్ నబి పురస్కరించుకుని శుక్రవారం సిద్దిపేటలో ముస్లింలు శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త కారణ జన్ముడని ఆయన చూపిన బాటలో పయణిస్తే జీవితం సుఖ శాంతులతో ఉంటుందన్నారు. ప్రవక్త జీవితం మొత్తం మానవాళికి ఆదర్శప్రాయమని కొనియాడారు. మహిళలకు ఉన్నతమైన స్థానాన్ని కల్పించిన ఘనత మహమ్మద్ ప్రవక్త దేనన్నారు. తల్లి దండ్రులను మనం ప్రేమిస్తే జీవితం సఫలమైనట్టేనని ప్రవక్త తెలిపారన్నారు. ప్రవక్త జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని గంగా జమున తహజీబ్గా ప్రజలందరం కలిసి ఉండాలని సూచించారు. అనంతరం సిద్దిపేట ఏసీపీ రవీందర్ మాట్లాడుతూ ర్యాలీని నిర్వహకులు శాంతియుతంగా నిర్వహించారని కొనియాడారు. సిద్దిపేటలో మిలాద్ ఉన్ నబి శాంతి ర్యాలీ -
జీఎస్టీ తగ్గింపుతో పెరిగిన కొనుగోలు శక్తి
మెదక్ ఎంపీ రఘునందన్రావు గజ్వేల్: ప్రధాని మోదీ కృషి వల్ల భారత్ బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నదని ఎంపీ రఘునందన్రావు అన్నారు. శుక్రవారం రాత్రి గజ్వేల్లో జీఎస్టీ తగ్గింపుపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ గడిచిన 11 ఏళ్లలో మోదీ తీసుకొచ్చిన సంస్కరణల వల్ల దేశంలో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచడానికి కేంద్రం జీఎస్టీని తగ్గించడం ద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి బాటలు వేసిందన్నారు. మరోవైపు 12లక్షల లావాదేవీలకు వరకు ఇన్కమ్ ట్యాక్స్ను రద్దు చేయడం ద్వారా మధ్య తరగతి ప్రజలకు భారీ మేలు జరిగిందన్నారు. నేడు అమెరికా ఎన్ని రకాల బెదిరింపులకు పాల్పడు తున్నా నరేంద్రమోదీ తనదైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారని కొనియాడారు. సదస్సులో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పోరాట స్మృతి చిహ్నాలను కాపాడాలి మద్దూరు(హుస్నాబాద్): పోరాట స్మృతి చిహ్నా లను కాపాడాలని, పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ కోరారు. శుక్రవారం దూల్మిట్ట మండలం బైరాన్పల్లిలో రజాకార్ల దాడిలో అమరులైన 118కి బురుజు, స్తూపం వద్ద నివాళుర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట చరిత్రని బీజేపీ వక్రీకరిస్తోందని మండిపడ్డారు. గుండ్రంపల్లి, బైరాన్పల్లి, కూటిగల్ లాంటి ఖిల్లాలను గుర్తిస్తూ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. గొల్ల కురుమలపై సర్కార్ వివక్షసిద్దిపేటజోన్: కాంగ్రెస్ ప్రభుత్వం గొల్ల కురుమల పట్ల వివక్ష చూపుతోందని రాష్ట్ర గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీహరి ఆరోపించారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లా డారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో కురుమల సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వలేదన్నారు. పశు సంవర్ధక శాఖ ద్వారా నట్టల మందులు సరఫరా చేయాలని, పశు వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయల నగదు బదిలీ చేయలన్నారు. నూతన సొసైటీలు ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఐలయ్య, పట్టణ శాఖ అధ్యక్షుడు ఎల్లయ్య, నాయకులు పాల్గొన్నారు. -
అదే వరుస.. తప్పని గోస
యూరియా కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే గంటల తరబడి క్యూలో నిల్చుంటున్నా బస్తా యూరియా దొరకడం గగనంగా మారుతోంది. శుక్రవారం మిరుదొడ్డిలో రెండు యూరియా లారీల లోడ్ రావడంతో రైతులు ఒక్కసారిగా కిక్కిరిసి పోయారు. కొందరికి టోకెన్లు లభించక పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. మిరుదొడ్డి గోదాం వద్ద పోలీసుల పహారాలో యూరియా పంపిణీ చేశారు. చిన్నకోడూరులో తెల్లవారుజామునే ఫర్టిలైజర్ షాపునకు పరుగులు పెట్టారు. వరుసలో చెప్పులను పెట్టారు. దుబ్బాక పట్టణంలో 5 సెంటర్లలో యూరియా రావడంతో రైతులు ఐదు చోట్ల బారులు తీరారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఒక్క సంచి యూరియా కోసం నానా అవస్థలు పడ్డారు. దూల్మిట్ట మండల కేంద్రంలోని పీఏసీఎస్ గోదాం వద్దకు యూరియా రావడంతో వందలాది మంది రైతులు తరలివచ్చారు. గంటలకొద్దీ నిరీక్షించినా కొంత మందికి యూరియా దొరకకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. – మిరుదొడ్డి(దుబ్బాక)/చిన్నకోడూరు(సిద్దిపేట)/దుబ్బాకటౌన్/మద్దూరు(హుస్నాబాద్)అక్రమంగా నిల్వ చేసిన యూరియా సీజ్ ఒకరిపై కేసు నమోదుఅక్కన్నపేట(హుస్నాబాద్): ఒకవైపు యూరియా కొరతతో రైతులు అల్లాడుతుంటే మరొపక్క బ్లాక్లో యూరియా బస్తాలను అమ్మేస్తున్నారు. మండల పరిధిలోని నందారం గ్రామానికి చెందిన కరివేద సంజీవ్రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా యూరియా బస్తాలు నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించి తొమ్మిది బస్తాలను సీజ్ చేసినట్లు మండల వ్యవసాయ అధికారి తస్లీమా సుల్తానా చెప్పారు. విషయం తెలుసుకున్న జిల్లా వ్యవసాయ అధికారి స్వరూప రాణి హుటాహుటిన సందర్శించారు. అలాగే మండలంలోని పలు ఫర్టిలేజర్ దుకాణాలను తనిఖీ చేశారు. అనంతరం ఏఓ తస్లీమా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.రోజురోజుకు పెరుగుతున్న యూరియా అవస్థలు -
‘కోడ్’ల రద్దుకు సంఘటిత పోరు
గజ్వేల్: కార్మికుల పాలిట ఆశనిపాతంగా మారిన లేబర్కోడ్ల రద్దుకు సంఘటితంగా ఉద్యమిస్తామని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ తెలిపారు. గురువారం గజ్వేల్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్హాల్లో రాణే బ్రేక్లైనింగ్ ఫ్యాక్టరీ కార్మిక యూనియన్ కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశానికి హాజరైన మల్లికార్జున్ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నీరుగారుస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టాల స్థానంలో లేబర్కోడ్లను అమలు చేయడం వల్ల కార్మికుల హక్కులకు భంగం వాటిల్లే ప్రమాదమున్నదని వాపోయారు. దీనివల్ల కనీస వేతన హక్కుచట్టం, గ్రాట్యూటీ, పెన్షన్, పనిభద్రత, సెలవులు, ఇతర సౌకర్యాలు లేకుండా హరించివేస్తున్నారని తెలిపారు. కార్మికులతో పాటు ఉద్యోగులకు ఈ లేబర్కోడ్లు తీవ్రమైన నష్టాన్ని కల్పించనున్నాయని పేర్కొన్నారు. వీటిని రద్దు చేసేంతవరకు పోరాటాలను ముమ్మరం చేయాల్సిన అవసరమున్నదని పిలుపునిచ్చారు. -
పత్రికా స్వేచ్ఛపై దాడే..
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడమే కాకుండా కలంపై కత్తి కట్టడాన్ని పలు రాజకీయ పార్టీల నేతలు, జర్నలిస్టు సంఘాల నేతలు ముక్తకంఠంతో ఖండించారు. పత్రికాస్వేచ్ఛకు విఘాతం కలిగేలా, ప్రజాస్వామ్య విలువలకు భంగం వాటిల్లేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డితో పాటు విలేకరులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశానికి సంబంధించి పలువురి నేతల అభిప్రాయాలు వారి మాటల్లోనే.. కక్ష సాధింపు సిగ్గుచేటు దుబ్బాక: ఆంధ్ర ప్రదేశ్లో నిజాలను నిర్భయంగా రాస్తున్న సాక్షిపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుండటం దుర్మార్గం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రజలకు మద్దతుగా కథనాలు రాస్తున్న సాక్షిపై అక్రమ కేసులు బనాయిస్తూ, కార్యాలయాలపై దాడులకు పాల్పడటం పత్రిక స్వేచ్ఛను హరించడమే. ప్రజల కష్టాలను, కన్నీళ్లను, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను నిర్భయంగా వెలికితీసే కథనాలు రాయడమే సాక్షి తప్పా. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తమ వైఫల్యాలను ఎండగడుతున్న సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి, జర్నలిస్టులపై అక్రమంగా కేసులు పెడుతూ ఇబ్బందులకు గురిచేయడం సిగ్గుచేటు. దాడులు, అక్రమ కేసులను ప్రజాస్వామ్యవాదులు అందరూ ఖండించడంతో పాటుగా సాక్షికి అండగా నిలుద్దాం. – కొత్త ప్రభాకర్రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే దమననీతి చర్యలు తగవు ఏపీ ప్రభుత్వం చేస్తున్న దమననీతి చర్యలు ఖండిస్తున్నాం. వాస్తవాలు బాహ్య ప్రపంచానికి చెప్పే బాధ్యతగా సాక్షి మీడియా ప్రయత్నాలు చేస్తుంటే, అణచివేత ధోరణితో నిర్బంధ చర్యలకు పాల్పడడం సిగ్గుచేటు. ఇది పూర్తిగా పత్రికా స్వేచ్ఛను హరించడమేకాక, ప్రజల భావ స్వేచ్ఛను కాలరాయడమే. తక్షణమే ప్రభుత్వం ఈ చర్యలను విరమించాలి. –రంగాచారి. జిల్లా జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు ఏపీలో పోలీస్ రాజ్యం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. పోలీసులను, అధికారులను ఉపయోగించి పత్రికా స్వేచ్ఛను హరించేలా వ్యవహరిస్తున్నారు.ఏపీలో పోలీస్ రాజ్యం నడుస్తోంది. సాక్షి ఎడిటర్, సాక్షి మీడియా మీద నిర్బంధ చర్యలు సరికావు. ఇది మంచి సంస్కృతి కాదు. నియంతృత్వ పోకడలకు నిదర్శనంగా పాలన సాగుతోంది. తీవ్రంగా ఖండిస్తున్నాం. –రాజిరెడ్డి. టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కేసులు పెట్టడం మూర్ఖత్వమే.. సిద్దిపేటఅర్బన్: ఏపీ లోని కూటమి ప్రభుత్వం సాక్షి ఎడిటర్పై, జర్నలిస్టులపై కేసులు పెట్టడం మూర్ఖత్వమే.. కేసులు పెట్టి భయపెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని, భావప్రకటన స్వేచ్ఛను కాలరాయాలని చూడడం సరైంది కాదు. – ఆముదాల మల్లారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి ముమ్మాటికీ కక్షపూరితమే.. సిద్దిపేటఅర్బన్: నిజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేది మీడియానే. ధర్మాన్ని పాటిస్తూ ప్రజలకు సమాచారాన్ని చేరవేసే జర్నలిస్టులపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయడం హేయమైన చర్య. కలంపై కత్తి కట్టడం ముమ్మాటికీ కక్షపూరితమైన చర్యే. – కిష్టాపురం లక్ష్మణ్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శిజర్నలిస్టుల గొంతు నొక్కడమే.. ఏపీలో జర్నలిస్టులపై, ముఖ్యంగా సాక్షి మీడియాపై జరుగుతున్న నిర్బంధ చర్యలు భావ స్వేచ్ఛను హరించేలా ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. పోలీస్ యంత్రాంగం ద్వారా పత్రికా స్వేచ్ఛను పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ముమ్మాటికీ జర్నలిస్టుల గొంతు నొక్కడమే. ప్రభుత్వానికి అభ్యంతరాలు ఉంటే పత్రికా ముఖంగా ఖండించాలి. కానీ ఇలాంటి చర్యలు చేపట్టడం తగవు. –గందే నాగరాజు, జిల్లా జర్నలిస్ట్ యూనియన్ నాయకుడు -
యూరియా.. అవే అవస్థలయా
దుబ్బాకలో యూరియా కోసం బారులుదీరిన రైతులుపలు ప్రాంతాల్లో బారులు తీరిన రైతులు ఒక్క బస్తా కోసం గంటల తరబడి నిరీక్షణ జిల్లాలో యూరియా కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయే తప్ప తీరడంలేదు. వ్యవసాయ పనులన్నీ వదిలేసి యూరియా కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. వేసిన పంటలను రక్షించుకునేందుకు ప్రాణాలను సైతం పణంగా పెట్టాల్సిన దుస్థితి నెలకొంది. ఒక రోజు ముందే యూరియా పంపిణీ కేంద్రాలకు సద్దులు, దుప్పట్లు పట్టుకుని వస్తుండటం గమనార్హం. గురువారం దుబ్బాకలో ఇదే సీన్ కనిపించింది. వేల మంది రైతులు గంటల కొద్దీ లైన్లో నిరీక్షించారు. ఈ క్రమంలో గంభీర్పూర్కు చెందిన వృద్ధురాలు రెడ్డి చిత్తవ్వ స్పృహతప్పి పడిపోయారు. దీంతో తోటి రైతులు సపర్యలు చేయడంతో కోలుకున్నారు. పాఠశాలలు, కళాశాలలకు డుమ్మాకొట్టి విద్యార్థులు సైతం తల్లిదండ్రుల కోసం క్యూలో నిల్చుంటున్నారు. తీరా 520 యూరియా బస్తాలు వస్తే కొద్ది మందికే దొరకడంతో మిగతా రైతులు నిరాశతో వెనుదిరుగాల్సి వచ్చింది. – సిద్దిపేటరూరల్/దుబ్బాక/హుస్నాబాద్/రూరల్/చేర్యాల(సిద్దిపేట)/దౌల్తాబాద్ (దుబ్బాక) -
యూరియా కొరతకు కేంద్రమే కారణం
● కామారెడ్డి సభతో సత్తా చాటుదాం ● డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి ప్రశాంత్నగర్(సిద్దిపేట): రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణమని డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి అన్నారు. గురువారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నర్సారెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో చట్టం తెస్తే అది జరగకుండా కేంద్రంలో బీజేపీ కుట్ర పన్నుతోందన్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు భారీ సంఖ్యలో హాజరై సత్తా చాటుదామన్నారు. -
మళ్లీ వణికిన మెదక్
మెదక్జోన్: భారీ వర్షంతో మెదక్ మరోసారి అతలాకుతలం అయింది. జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ముఖ్యంగా రాందాస్ చౌరస్తాలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక వర్షం నీరు భారీగా నిలిచింది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పలు దుకాణాల్లోకి నీరు చేరింది. స్పందించిన మున్సిపల్ అధికారులు అడ్డుగా ఉన్న డివైడర్ను జేసీబీతో తొలగించి నీరు దిగువకు వెళ్లేలా చేశారు. అలాగే పట్టణంలోని గాంధీనగర్లో పలువురి ఇళ్లలోకి నీరు చేరటంతో ప్రజలు అవస్థలు పడ్డారు. బృంధావన్నగర్, ఫతేనగర్, సాయినగర్, నర్సిఖేడ్ కాలనీలు జలమయం అయ్యాయి. అలాగే మెదక్ మండలంలోని పలు గ్రామాల్లో 17 సెంటీ మీటర్లు, కొల్చారం మండలంలో 8 సెంటీ మీటర్లు, హవేళిఘణాపూర్లో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏకధాటిగా 3 గంటల పాటు కురిసిన కుండపోత వర్షానికి మెదక్ అంతా జలమయం అయింది. పట్టణాన్ని ఆనుకొని ఉన్న పుష్పలవాగు ఉధృతి మళ్లీ ప్రారంభం కావటంతో సమీపంలోని విద్యుత్ సబ్స్టేషన్ మళ్లీ నీట మునుగుతుందా.. అంటూ జనం భయాందోళన వ్యక్తం చేశారు. వర్షం తగ్గటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలోనూ వర్షాలు ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలో గురువా రం సాయంత్రం నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రానున్న రెండు రోజుల పాటుగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గురువారం మిరుదొడ్డి మండలంలో 39.6 మిల్లీమీటర్లు, అక్కన్నపేటలో 21.5 మి.మీ, దుబ్బాకలో 17.8 మి.మీ, నంగునూరు మండలంలో 16.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. కుమ్మేసిన వాన.. మెదక్లో అత్యధికంగా 17 సెం.మీ వర్షపాతం -
ఆస్పత్రి వెనుక డోర్ సైతం సీజ్
ఆర్ఎంపీ వైద్యుడిపై పీఎస్లో మరోమారు ఫిర్యాదు కొండపాక(గజ్వేల్): కలెక్టర్ ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఆస్పత్రి వెనుక డోర్ నుంచి వైద్య చికిత్సలు చేస్తున్న ఆర్ఎంపీ వైద్యుడిపై అధికారులు చర్యలు చేపట్టారు. ‘కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్’ అనే శీర్షికన గురువారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఆర్ఎంపీ వైద్యుడి తీరుపై కలెక్టర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహించారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదిక సమర్పించాలని జిల్లా వైద్యాధికారికి సూచించారు. దీంతో డిప్యూటీ డీఎంహెచ్ఓ శ్రీనివాస్ మండల రెవెన్యూ అధికారి సత్యనారాయణతో వెళ్లి ఆస్పత్రి వెనక ఉన్న డోర్ను సీజ్ చేశారు. ఆర్ఎంపీ వైద్యుడు సుదర్శన్పై మరోమారు కుకునూరుపల్లి పీఎస్లో ఫిర్యాదు చేసినట్లు డిప్యూటీ డీఎంహెచ్ఓ తెలిపారు. -
రక్తదానం సామాజిక బాధ్యత
కలెక్టర్ హైమావతిసిద్దిపేటఎడ్యుకేషన్: ఆపదలో ఉన్న వారికి రక్త దానం చేయడం ద్వారా సంతృప్తి లభిస్తుందని కలెక్టర్ హైమావతి అన్నారు. ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, రెడ్ రిబ్బన్ క్లబ్ల ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధు లు ప్రభలుతున్న ప్రస్తుత తరుణంలో రక్తదానం చేస్తూ విద్యార్థులు మానవీయతను, సామాజిక స్ఫూర్తిని చాటుతున్నారన్నారు. అభినందించారు. రక్తదానం ప్రతి ఒక్కరికి సామాజిక బాధ్యత కావాలన్నారు. ఆదిశగా విద్యార్థులు, అధ్యాపకులు ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ శిబిరంలో 30 మందికి పైగా రక్తదానం చేశారు. కార్యక్రమ నిర్వాహకులను, రక్త దానం చేసిన వారిని కలెక్టర్ అభినందించి పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపా ల్ డాక్టర్ సునీత, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అయోధ్యరెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రొగ్రాం అధికారులు, అయా విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
హుస్నాబాద్ను కరీంనగర్లో కలపాలి
అక్కన్నపేట(హుస్నాబాద్): హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాలను కరీంనగర్లో కలపాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం అక్కన్నపేట మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్లో కలుపుతామని మాట ఇచ్చి తప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్ను గ్రామాల్లో అడ్డుకుంటామని అన్నారు. ఎన్నికల్లో గెలిచిన వంద రోజుల్లో హుస్నాబాద్ను కరీంనగర్ జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారన్నారు. నేడు మాట ఎత్తడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. -
బుగ్గరాజేశ్వరుడి హుండీ ఆదాయం రూ.1.70లక్షలు
సిద్దిపేటరూరల్: స్వయంభూ బుగ్గరాజేశ్వర స్వామి ఆలయానికి హుండీ ఆదాయం రూ.1.70లక్షలు వచ్చినట్లు ఆలయ చైర్మన్ కరుణాకర్, ఈఓ శ్రీధర్రెడ్డి తెలిపారు. బుధవారం నారాయణరావుపేట శివారులోని స్వయంభూ బుగ్గరాజేశ్వర స్వామి ఆలయ హుండీ కానుకలను దేవాదాయ, పోలీసుల సమక్షంలో లెక్కించారు. భక్తులు కానుకల రూపంలో రూ.1,70,293 సమర్పించుకున్నారన్నారు. ఈ డబ్బును దేవాదాయ శాఖ ఖాతాలో జమ చేయనున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, చైర్మన్ కరుణాకర్, డైరెక్టర్లు శ్రీనివాస్, ఆలయ పూజారి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ‘భూ భారతి’ సమస్యలు పరిష్కరించండి ● అలసత్వం చూపితే చర్యలు ● కలెక్టర్ హైమావతి కొండపాక(గజ్వేల్): భూ భారతి దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం చూపితే చర్యలు తప్పవని కలెక్టర్ హైమావతి హెచ్చరించారు. కొండపాకలోని సమీకృత కార్యాలయం భవనాన్ని బుధవారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించారు. భూ భారతిలో వచ్చిన దరఖాస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా హైమావతి మాట్లాడుతూ భూ హక్కుల పరిరక్షణ కోసం భూ భారతిలో వచ్చిన దరఖాస్తులను నిబంధనల మేరకు పరిష్కరించాలన్నారు. ఇందిరమ్మ పథకంలో ఇళ్లు మంజూరైన వారు నిర్మాణాల విషయాల్లో జాప్యం చేస్తే నోటీస్ అందించి మరొకరి పేరిట మంజూరు కోసం ప్రతిపాదనలు పంపాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పనుల్లో వేగం పెంచుతూ పారదర్శకత లోపించకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్యామ్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, సీనియర్ అసిస్టెంట్ సురేశ్, కార్యాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాగి జావ ఆరోగ్యానికి మేలుడీఈఓ శ్రీనివాస్రెడ్డి ప్రశాంత్నగర్(సిద్దిపేట): రాగి జావ ఆరోగ్యానికి మేలు చేస్తుందని డీఈఓ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. బుధవారం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో రాగిజావ పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం పాఠశాల ప్రారంభం కాగానే రాగిజావ పంపిణీ చేస్తామన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ప్రతినిఽధి మహదేవ్ నరేష్, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మహిళల భాగస్వామ్యం భేష్ ఇర్కోడ్ను సందర్శించిన ఉత్తరప్రదేశ్ ప్రతినిధులు -
పరిషత్ ఓటర్లు 6,55,958
జిల్లాలో పరిషత్ ఓటర్లు 6,55,958 మంది ఉన్నారు. పరిషత్ ఓటర్ల తుది జాబితాను బుధవారం జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో సీఈఓ రమేశ్ విడుదల చేశారు. మండల పరిషత్ కార్యాలయాల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీల వారీగా జాబితాను ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ రాగానే నిర్వహించేందుకు ఓటరు జాబితాను సిద్ధం చేశారు. – సాక్షి, సిద్దిపేటమహిళా ఓటర్లే..పరిషత్ ఓటర్లలో మహిళా ఓటర్ల అధికంగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా పరిషత్ ఓటర్లు 6,55,958 మంది ఉండగా అందులో మహిళలు 3,34,186, పురుషులు 3,21,766, ఇతరులు ఆరుగురు ఉన్నారు. కోహెడ మండలంలో అధికంగా ఓటర్లు, దూళ్మిట్టలో తక్కువ ఓటర్లు ఉన్నారు.జిల్లా వ్యాప్తంగా మూడు అభ్యంతరాలుజిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీల వారీగా 1,291 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి గ్రామ పంచాయతీ, ఎంపీడీఓ కార్యాలయాల్లో ఈ నెల 6న ఓటరు ముసాయిదాను ప్రదర్శించారు. ఈ నెల 8న జిల్లా, మండల స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించారు. ఓటరు జాబితాపై అభ్యంతరాలుంటే లిఖిత పూర్వకంగా దరఖాస్తులను ఈ నెల 8 వరకు స్వీకరించగా మూడు అభ్యంతరాలు వచ్చాయి. వాటిని 9వ తేదీ వరకు పరిష్కరించి బుధవారం జాబితాను ప్రచురించారు. జిల్లాలో జిల్లా పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గం (జెడ్పీటీసీ) 26, మండల ప్రాదేశిక నియోజకవర్గం(ఎంపీటీసీ)లు 230 ఉన్నాయి. -
కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్
కొండపాక(గజ్వేల్): సాక్షాత్తు కలెక్టర్ ఆదేశాలను ఆర్ఎంపీ వైద్యుడు ఉల్లంఘించారు. ఆస్పత్రిని సీజ్ చేసినా వెనకాల నుంచి యథాతథంగా వైద్య చికిత్సలు చేస్తున్నారు. ఈ ఘటన కుకునూరుపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామంలో ఆర్ఎంపీ వైద్యుడు సుదర్శన్.. ఆస్పత్రి అని పేరుపెట్టుకొని వైద్యం అందిస్తూ వస్తున్నారు. ఈక్రమంలో జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్కు చెందిన విద్యార్థి యశ్వంత్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రికి రాగా ఎలాంటి పరీక్షలు చేయకుండానే అత్యవసర వైద్యం అందించడంతో ఆగస్టు 29న మృతి చెందిన విషయం తెలిసిందే. ఈక్రమంలో కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యాధికారి ధనరాజు ఆస్పత్రిని సీజ్ చేశారు. అంతేకాక పోలీస్స్టేషన్లో వైద్యుడిపై ఫిర్యాదు చేయగా కేసు నమోదయ్యింది. అయినా యథావిధిగా ఆస్పత్రి వెనుక నుంచి డోర్ ఓపెన్చేసి వైద్య చికిత్సలు చేస్తున్నారు. వెనకాల డోర్ తెరిచి ఉన్న దృశ్యాన్ని బుధవారం సాక్షి కెమెరా క్లిక్ మనిపించింది. దీంతో పాటు లోపలికి వెళ్లి ఆస్పత్రి సీజ్ అయిన విషయాన్ని వైద్యుడు సుదర్శన్తో ప్రస్తావించగా.. సీజ్ అయిన విషయం వాస్తవమే. కానీ వెనకాల ఉన్న డోర్ను వైద్యాధికారి ధనరాజ్ ఓపెన్ చేసుకోమన్నారంటూ చెప్పడం గమనార్హం. ఈ విషయమై వైద్యాధికారిని వివరణ కోరగా అలాంటిది ఏమీ లేదని, నిబంధలు ఉల్లంఘిస్తే మరో కేసు నమోదు చేసి కఠిన చర్యలు చేపడతామన్నారు. ఉల్లంఘించిన ఆర్ఎంపీ వైద్యుడు ఆస్పత్రిని సీజ్ చేసినా యథాతథంగా వైద్య చికిత్సలు -
యూరియా పంపిణీలో సర్కార్ విఫలం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): రైతులకు యూరియా అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యూరియా సరఫరాపై ప్రభుత్వం ముందస్తు కార్యాచరణ చేపట్టలేదన్నారు. జిల్లాల్లో ఎంత మంది రైతులు ఉన్నారు? ఎంత సాగవుతోంది? ఎంత యూరియా అవసరం? అనే వివరాలు తీసుకుని ప్రభుత్వానికి కలెక్టర్లు తెలపాలన్నారు. వివరాలు పూర్తిగా తెలిస్తే కేంద్ర మంత్రులతో మాట్లాడి రాష్ట్రానికి యూరియా తీసుకువచ్చే బాధ్యత ఎంపీలదన్నారు. ప్రధాని మోదీ జన్మదినం పురస్కరించుకుని ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద తమ తల్లి పేరున మొక్కను నాటి సంరక్షించాలన్నారు. స్వచ్ఛ భారత్, ప్లాస్టిక్ నివారణ, స్వదేశీ వస్తువుల వినియోగం, రక్తదానాలు, పేదలకు ఆహార పదార్థాలు అందించడం లాంటి కార్యక్రమాలు నాయకులు, కార్యకర్తలు చేపట్టాలన్నారు. జీఎ స్టీపై ఈ నెల 12 న గజ్వేల్, 13న సిద్దిపేటలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శంకర్, మార్కండేయులు, తదితరులు పాల్గొన్నారు.అలసి.. కునుకు తీసిజగదేవ్పూర్(గజ్వేల్): జగదేవ్పూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద బుధవారం యూరియా కోసం రైతులకు బారులు తీరారు. ఉదయమే వివిధ గ్రామాల రైతులు రైతు వేదికకు వచ్చి వేచి చూశారు. రాళ్లు, చెప్పులు, పాస్ పుస్తకాలు క్యూలో పెట్టారు. ఓ గ్రామానికి చెందిన వృద్ధ రైతు అలసి పోయి అక్కడే కొంతసేపు కునుకు తీశారు. ఏఓ వసంతరావు మాట్లాడుతూ మండలానికి 15 వందల బస్తాలు వచ్చాయని వరుస క్రమంలో యూరియాను అందించినట్లు తెలిపారు.సహకార సంఘం ఎదుట బారులు మద్దూరు(హుస్నాబాద్): యూరియా కోసం రైతులు బారులు తీరారు. బుధవారం ధూళ్మిట్ట మండల కేంద్రంలో ఉదయం నుంచి సహకార సంఘం వద్ద రైతులు క్యూలైన్లో వేచి ఉన్నారు. వారం రోజులుగా ఒక్క సంచి దొరకలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. టోకెన్లు ఒక చోట యూరియా మరో చోట ఇవ్వడంతో రైతులు ఇబ్బందులకు గురయ్యారు. రైతులు అధైర్యపడొద్దు.. అందరికీ అందిస్తాం మెదక్ ఎంపీ రఘునందన్రావు -
పల్లెలకు వెలుగులు: మంత్రి పొన్నం
హుస్నాబాద్రూరల్: పల్లెల్లో సెంటర్ లైటింగ్స్ ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బుధవారం రాత్రి పందిల్ల, పోతారం (ఎస్) గ్రామాల్లో జాతీయ రహదారి పై ఏర్పాటు చేసిన సెంటర్ లైటింగ్స్ను కలెక్టర్ హైమావతితో కలిసి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ హుస్నాబాద్ను విద్య, పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేస్తానన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరిరీమా ఆగర్వాల్, జిల్లా గ్రంథాల చైర్మన్ లింగమూర్తి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, చెరుకు శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నో యాక్షన్..!
మున్సిపాలిటీల్లో వంద రోజుల యాక్షన్ ప్లాన్ మొక్కుబడిగా సాగింది. ప్రభుత్వం నుంచి కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేకంగా ఎలాంటి నిధులు మంజూరు కాకపోవడంతో అధికారులు సైతం ప్రణాళిక అమలును మమ అనిపించారు. దీంతో ప్రగతి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పారిశుద్ధ్యం ఏమాత్రం మెరుగుపడలేదు. ఇళ్ల మధ్య, రోడ్లపైనే చెత్త దర్శనమిస్తోంది. అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయి. రెగ్యులర్గా చేపట్టే పనులను మాత్రం నిర్వహించడం గమనార్హం. జిల్లాలోని మున్సిపాలిటీల్లో వంద రోజుల ప్రణాళిక అమలుపై ‘సాక్షి’ బృందం పరిశీలించగా అనేక విషయాలు వెలుగుచూశాయి.అంతర్గత రోడ్లు, పారిశుద్ధ్యం అధ్వానం గజ్వేల్: మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం మొదలుకొని భువన్ సర్వే, ట్రేడ్ లైసెన్స్లు, ఇళ్ల అసిస్మెంట్ల టార్గెట్లు, ఇంటి పన్నుల వసూళ్లు, ఇళ్ల అనుమతులు, నల్లా కనెక్షన్ల ఆన్లైన్ తదితర అంశాలవారీగా వంద రోజుల ప్రణాళిక కార్యక్రమం కొనసాగింది. ఇందులో భాగంగానే 2,685 నల్లా కనెక్షన్లను ఆన్లైన్ చేశారు. 34 గృహలను వాణిజ్య గృహాలుగా మార్చారు. 486 ట్రేడ్ లైసెన్స్లు అందించారు. 37శిథిల ఇళ్లను గుర్తించి నోటీసులు ఇచ్చి, వీటిలో 19 ఇళ్లను కూల్చేశారు. కానీ పారిశుద్ధ్యం, అంతర్గత రోడ్ల విషయంలో పరిస్థితి మారలేదు. ఇళ్ల మధ్యే చెత్తను పారబోస్తున్నారు. దీంతో దుర్గంధం వ్యాపిస్తోంది. అంతర్గత రోడ్లకు మరమ్మతులు కరువై నడవడానికి కూడా వీలు లేకుండా తయారయ్యాయి. ఈ అంశంపై స్థానిక మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ మాట్లాడుతూ వంద రోజుల ప్రణాళికలో తమ కృషిని కొనసాగించామని తెలిపారు.తీరని మురుగు వ్యథసిద్దిపేటజోన్: స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలో వందరోజుల యాక్షన్ ప్రణాళిక మొక్కుబడిగా ముగిసింది. ప్రభుత్వం ప్రత్యేకంగా ఎలాంటి నిధులను కేటాయించలేదు. అయినప్పటికీ మున్సిపల్ నిధులతో కొన్ని పనులను చేపట్టారు. ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలను వందరోజుల ప్రణాళికలలో బల్దియా ఆశించిన స్థాయిలో చేపట్టలేదు. భారీ వర్షాలు కురిస్తే పట్టణంలోని లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తుతోంది. అస్తవ్యస్తంగా ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ వల్ల మురుగు నీటి ఇబ్బందులు తప్పడంలేదు. ఇదే అంశంపై మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ మాట్లాడుతూ.. యాక్షన్ ప్లాన్లో భాగంగా పట్టణంలో అనేక అంశాలపై దృష్టి సారించామని తెలిపారు.నిధులు రాక.. పనులు చేపట్టకదుబ్బాక: నిధులు లేక మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. వంద రోజుల ప్రణాళికలో నిధుల జాడ లేకపోవడంతో కొత్తగా పలాన పని అయిందన్న దాఖలాలు కనిపించలేదు. మున్సిపాలిటీలో సరిపడే సిబ్బంది లేక పారిశుద్ధ్య నిర్వాహణ అంతంత మాత్రంగానే తయారైంది. నిధులు లేకపోవడంతో కేవలం రెగ్యులర్గా నిర్వహించే శానిటేషన్, ట్రేడ్ లెసెన్స్లు, నల్లా కనెక్షన్ల ఆన్లైన్ తదితర పనులు మాత్రమే పూర్తిస్థాయిలో చేపట్టారు. అంతర్గత రోడ్లు, డ్రేనేజీలు అధ్వానంగా ఉండటంతో ప్రజలు నరకయాతన పడుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. -
వనం..
ఒకే రోజు 15,292 మొక్కలు నాటిన అధికారులు వనమహోత్సవంలో నంబర్ వన్గా నిలిచిన జిల్లా సాక్షి, సిద్దిపేట: జిల్లా వ్యాప్తంగా ఒకే రోజు ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి ఒక్కో మొక్కను నాటి ఆదర్శంగా నిలిచారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా మంగళవారం ‘ఏక్ పేడ్ మా కే నామ్ (తల్లి పేరు మీద) స్ఫూర్తితో కలెక్టర్ హైమావతి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు జిల్లా వ్యాప్తంగా 15,292 మొక్కలు నాటారు. ఇందులో అటెండర్ స్థాయి నుంచి కలెక్టర్ వరకు ఉద్యోగులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలోకి ఉద్యోగులు ర్యాలీగా వచ్చి మొక్కలు నాటే వినూత్న కార్యక్రమం చేపట్టారు. మొక్కను నాటి సెల్ఫీ దిగి సోషల్ మీడియాలలో షేర్ చేశారు. అలాగే నాటిన మొక్కలకు జీయో ట్యాగ్ చేసి ఏక్ పేడ్ మా కే నామ్ యాప్లో అప్లోడ్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తల్లికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని, అందుకే తల్లి పేరుపై మొక్కను నాటి వాటి సంరక్షణ బాధ్యత చూసుకోవాలన్నారు. రాష్ట్రంలోనే నంబర్ వన్ వన మహోత్సవం కార్యక్రమంలో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రాష్ట్రంలోనే నంబర్ వన్గా జిల్లా నిలిచింది. 2025–26కుగాను 18.02కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు 13.14కోట్ల(72.89శాతం) మొక్కలను నాటారు. అందులో జిల్లా లక్ష్యం 22.47లక్షలు కాగా 23.32 లక్షల (103.79 శాతం) మొక్కలు నాటి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. -
మార్గదర్శకాల ప్రకారమే కోర్టు కాంప్లెక్స్
దుబ్బాక: సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని కలెక్టర్ హైమావతి, జిల్లా జడ్జి సాయి రమాదేవి తెలిపారు. మంగళవారం సాయంత్రం దుబ్బాకలో కోర్టుకాంప్లెక్స్ నిర్మాణానికి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత కోర్టు ప్రాంతంలోనే జడ్జి క్వార్టర్స్ ఉండేలా చూడాలన్నారు. పాత తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ, సర్వే అధికారులు సర్వేచేసి ప్రభుత్వ భూమి సేకరించాలని ఆదేశించారు. ఆర్అండ్బీ శాఖ అధికారులు అన్ని సౌకర్యాలతో కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి డిజైన్ రూపొందించాలన్నారు. అతి త్వరలోనే భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తి జయప్రసాద్, ఆర్డీవో సదానందం, రెవెన్యూ, కోర్టు, సర్వే, మున్సిపల్ అధికారులు తదితరులు ఉన్నారు. త్వరలోనే నిర్మాణానికి శంకుస్థాపన కలెక్టర్ హైమావతి, జిల్లా జడ్జి సాయిరమాదేవి దుబ్బాకలో స్థల పరిశీలన -
రోడ్డుపై బైఠాయించి నిరసన
చేర్యాల(సిద్దిపేట): యూరియా బస్తాల పంపిణీలో అవకతవకలకు పాల్పడుతున్న స్థానిక ఏఓపై చర్యలు తీసుకోవాలంటూ రైతులు రోడ్డెక్కారు. మంగళవారం పట్టణంలోని బాలాజీ కళామందిర్ రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఓ టోకెన్ జారీ చేసినా షాపుల నిర్వాహకులు యూరియా ఇవ్వడం లేదన్నారు. వచ్చిన బస్తాలకన్నా ఎక్కువ టోకెన్లు జారీ చేస్తూ రైతులను ఇబ్బందుల పాలుజేస్తున్నారన్నారు. రోజంతా లైన్లో నిలబడినా యూరియా అయిపోందంటూ పంపిస్తున్నారని వాపోయారు. మరోవైపు రాజకీయ నాయకులకు చాటుగా యూరియా బస్తాలు అందిస్తున్న ఏఓపై చర్యలు తీసుకువాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. ఏడీఏ రాధిక రైతులతో మాట్లాడారు. సమస్యపరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని చెప్పడంతో రైతులు శాంతించారు. -
బాధితులకు న్యాయం జరగాలి
పటాన్చెరు టౌన్: సిగాచి పరిశ్రమ బాధితులకు న్యాయం జరగాలని, ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేస్తూ ముత్తంగిలోని పీఎస్ఆర్ గార్డెన్లో టీపీజేఏసీ కన్వీనర్ అశోక్ కుమార్, సైంటిస్ట్ ఫర్ పీపుల్స్ వ్యవస్థాపకులు బాబూరావు ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రొఫెసర్ కోదండరామ్తో పాటు పలువురు మేధావులు, వక్తలు, బాధిత కుటుంబ సభ్యులు, కార్మిక సంఘం నాయకులు హాజరై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు తమ బాధలను పంచుకున్నారు. అనంతరం ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ...సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదం చాలా దురదృష్టకరమన్నారు. యాజమా న్య తప్పిదం తోనే ప్రమాదం జరిగినట్లు నిపుణులు చెప్తున్నారని తెలిపారు. పోలీసులు యాజమాన్యంపై కేసు నమోదు చేసినా ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం సరి కాదని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులపై కేసులు పెట్టి దొరికిన వారిని అరెస్టు చేసిన ప్రభుత్వాలు ప్రమాదానికి కారణమైన పరిశ్రమ యాజమాన్యాలపై మరొకలా వ్యవహరించడం ఏం నీతని నిలదీశారు. కార్మికుల సజీవ దహనానికి కారణమైన యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలతోపాటు పౌర సమాజం ఈ ప్రమాదం నుంచి గుణ పాఠాలు నేర్చుకుని భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా నిర్మాణాత్మక శైలిలో నిబంధనలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కార్మిక సంఘాలతోపాటు నిపుణులు, మేధావులు ఒకతాటిపై వచ్చి ప్రణాళిక సిద్ధం చేసి సీఎంను కలిసి వివరిద్దామని తెలిపారు. సంఘటన సమయంలో సీఎం రేవంత్రెడ్డి మృతిచెందిన కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారంతోపాటు గాయపడిన క్షతగాత్రులకు రూ.పది లక్షల పరిహారం ప్రకటించారని వెంటనే ఆ పరిహారాన్ని చెల్లించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.సిగాచి పరిశ్రమ నిర్లక్ష్యం, కాలం చెల్లిన మెషీనరీతో అవగాహన లేని కాంట్రాక్ట్ కార్మికులతో పనిచేయించడం, పరిశ్రమలో తయారుచేసే మిశ్రమం నుంచి వచ్చిన ధూళితోనే ఇంత పెద్ద ప్రమాదం సంభవించిందని సైంటిస్ట్ ఫర్ పీపుల్స్ వ్యవస్థాపకులు బాబూరావు తేల్చిచెప్పారు. ప్రమాదంలో మృతిచెందిన కార్మికులకు రూ.కోటితో పాటు గాయపడ్డ క్షతగాత్రులకు రూ.పదిలక్షల నష్టపరిహారం ప్రకటించినా ఇప్పటివరకు కార్మికులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందలేదన్నారు. పక్క రాష్ట్రంలో ప్రమాదం జరిగిన వారం రోజుల్లోనే ప్రత్యేక కమిటీ వేసి ప్రమాదంలో మరణించిన కార్మికులకు రూ.కోటి, గాయపడ్డ వారికి రూ.50 లక్షల చొప్పున నష్టపరిహారం అందిస్తే తెలంగాణలో మాత్రం కార్మికులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. అడ్వొకేట్ వసుదా నాగరాజు సహకారంతోనే హైకోర్టులో పిల్ దాఖలు చేసినట్లు చెప్పారు. ఈ కేసులో బాధితులందరికీ న్యాయం జరిగే వరకూ విశ్రమించేది లేదని తేల్చి చెప్పారు. పరిశ్రమల్లో కార్మిక భద్రత గురించి ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.ధూళితోనే ఇంత పెద్ద ప్రమాదం: బాబూరావు సిగాచిపై రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు ప్రొఫెసర్ కోదండరామ్ బాధిత కుటుంబ సభ్యుల సమస్యలు చెబితే సీఎం దృష్టికి తీసుకెళ్తా ప్రకటించిన పరిహారం త్వరగా చెల్లించండి -
క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలి
ప్రశాంత్నగర్(సిద్దిపేట): విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని డీఈఓ శ్రీనివాస్రెడ్డి అన్నారు. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో క్రీడాపోటీలు ప్రారంభమయ్యాయి. డీఈఓ శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డిలు క్రీడా జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలను సమానంగా చూడాలన్నారు. ప్రతిరోజు కొంత సమయాన్ని క్రీడలకు కేటాయిస్తే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుందన్నారు. సెల్ఫోన్కు బానిసలవ్వరాదని, సెల్ఫోన్కు కేటాయించే సమయాన్ని క్రీడలకు కేటాయించాలన్నారు. జిల్లా స్థాయిలో రాణించి, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యి, జిల్లాకు పతకాలు తీసుకురావాలన్నారు. డీఈఓ శ్రీనివాస్రెడ్డి అట్టహాసంగా జిల్లా క్రీడాపోటీలు షురూ.. -
పర్యావరణ హితమే లక్ష్యం
డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి గజ్వేల్: పర్యావరణ హితమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గజ్వేల్లోని పత్తి మార్కెట్ యార్డులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిని గౌరవించుకోవడంతోపాటు భావితరాల బాగు కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నదన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవాలనే సంకల్పంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, మార్కెట్ కమిటీ కార్యదర్శి జాన్వెస్లీ, వైస్ చైర్మన్ సర్ధార్ఖాన్, సూపర్వైజర్ మహిపాల్, నాయకులు పాల్గొన్నారు. చేప పిల్లల పంపిణీలో సర్కార్ విఫలం సిద్దిపేటజోన్: ఉచిత చేప పిల్లల పంపిణీలో సర్కార్ విఫలమైందని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ మండిపడ్డారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం సకాలంలో పంపిణీ చేసిందని, ముదిరాజ్లకు అండగా నిలిచిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మత్స్యకారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. గత ఏడాది టెండర్ల పేరిట కాలయాపన చేసిన ప్రభుత్వం ఈసారి అలసత్వం ప్రదర్శిస్తోందన్నారు. చేప పిల్లలను వదిలే సీజన్ దాటినా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం వచ్చాక మత్స్యకారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చేప పిల్లలను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు వెంకటేశం, యాదగిరి, ఎల్లం, శ్రీనివాస్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఏబీవీపీ నాయకుల వినూత్న నిరసన సిద్దిపేటజోన్: విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను నిరసిస్తూ మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో భిక్షాటన చేశారు. స్థానిక సుభాష్ రోడ్ మార్గంలో దుకాణాలలో నాయకులు భిక్షాటన చేసి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్స్, స్కాలర్ షిప్లను సకాలంలో విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పరశురాం, అరవింద్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డుకు పడిన గండి పూడ్చివేత మిరుదొడ్డి(దుబ్బాక): అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని రుద్రారం ఖాజీపూర్ రోడ్డు ఇటీవల కురిసి వర్షాలకు గండి పడింది. 15 రోజులుగా రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఈ నేపథ్యంలో రుద్రారం గ్రామానికి చెందిన సామాజిక సంఘ సేవకుడు మల్లన్నగారి భిక్షపతి ప్రత్యేక చొరవతో మంగళవారం జేసీబీ, ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలించి గండిని పూడ్చివేశారు. దీంతో రెండు గ్రామాలకు రాకపోకలు ప్రారంభం కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. -
యూరియా పక్కదారి పట్టిస్తే చర్యలు
జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి కొమురవెల్లి(సిద్దిపేట): యూరియాను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి హెచ్చరించారు. మంగళవారం మర్రిముచ్చాల రైతు వేదికలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో యూరియా పంపిణీకి ఏర్పాటు చేసిన అదనపు కౌంటర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు కావాల్సినంత యూరియా అందిస్తామన్నారు. కొందరు ప్రయివేటు డీలర్లు యూరియా పక్కదారి పట్టిస్తున్నట్లు సమాచారం ఉందని, వారిపై వారిపై కఠినచర్యలు తీసుకోవడమే కాకుండా వారి లైసెన్సు రద్దు చేస్తామన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వెంకట్రావమ్మ, ఆత్మ కమిటీ డైరెక్టర్ జంగని రవి తదితరులు పాల్గొన్నారు. -
యూరియా కోసం చెప్పులతో కొట్లాట
గజ్వేల్రూరల్/గరిడేపల్లి/దుబ్బాక/బీబీపేట: ఎప్పుడు వస్తుందో... ఎప్పుడు ఇస్తారో తెలియక యూరియా కోసం రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని చోట్ల రాస్తారోకోలు, ఆందోళనలు చేస్తుండగా, మరికొన్ని చోట్ల ఘర్షణలకు దిగుతున్నారు. » సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ఆవరణలో మంగళవారం యూరియా టోకెన్ల కోసం బారులు తీరిన మహిళా రైతులు ఒకరినొకరు చెప్పులతో కొట్టుకున్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురయ్యారు. » వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటుకాలపల్లిలోని జాతీయ రహదారిపై యూరియా కోసం రైతులు ధర్నా చేశారు. రాయపర్తి మండలం పెర్కవేడులో యూరియా కోసం టోకెన్లు ఇస్తున్నారని తెల్లవారుజాము నుంచే రైతువేదిక వద్ద మహిళా రైతులు బారులుతీరారు. » మహబూబాబాద్ జిల్లాలోని కురవి, మహబూబాబాద్ మండలాల్లో పీఏసీఎస్ కేంద్రాల వద్ద కూడా బారులుతీరారు. నర్సింహులపేట మండలంలోని పెద్దనాగారం స్టేజీ వద్ద వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. » కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రానికి మంగళవారం యూరియా వస్తుందని తెలుసుకున్న రైతులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. అలసిపోయి, నీరసించిన తర్వాత రైతులు క్యూ లైన్లో రాళ్లు, చెప్పులు, చెట్ల కొమ్మలు పెట్టారు. » సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలోని మన గ్రోమోర్ సెంటర్కు రైతులు పెద్ద సంఖ్యలో వచ్చి క్యూలైన్లలో నిలబడ్డారు. కేవలం 15 నుంచి 20 మందికి మాత్రమే రెండు బస్తాలు ఇచ్చి స్టాక్ అయిపోయిందని చెప్పడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. -
బినామీల దందా!
ఎస్సీ కార్పొరేషన్కు చెందిన దుకాణాల అద్దె వ్యవహారంలో బినామీల దందా కొనసాగుతోంది. కొందరు రాజకీయ పలుకుబడిని ఉపయోగించి 15 ఏళ్లుగా అద్దెను పెంచనివ్వకుండా ఎస్సీ కార్పొరేషన్ ఖజానాకు గండి కొడుతున్నారు. తక్కువ అద్దెకు షెట్టర్లను తీసుకొని అధిక అద్దెలకు వ్యాపారులకు ఇచ్చి ఏటా రూ. లక్షకు పైగా ఆదాయం పొందుతున్నారు. ఇతరులకు అక్రమంగా అద్దెలకు ఇచ్చి ఆదాయం పొందుతున్నా.. కొన్నేళ్లుగా అద్దెలు చెల్లించకపోయినా అడిగే నాథుడే కరువయ్యారు. – సాక్షి, సిద్దిపేటఎస్సీల అభివృద్ధి కోసం స్వయం కృషి పథకంలో భాగంగా 1989–90లో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా తొమ్మిది చోట్ల 50షెట్టర్లను నిర్మించారు. సిద్దిపేటలో ఐదు, దుబ్బాకలో 10, గజ్వేల్లో ఐదు, తిమ్మాపూర్లో 5, జగదేవ్పూర్లో 5, కొండపాకలో 5, లింగారెడ్డిపల్లిలో 5, మద్దూరులో 5, లచ్చపేటలో ఐదు షెట్టర్లు ఉన్నాయి. వీటిని 19 నుంచి 45 సంవత్సరాల లోపు ఎస్సీలకు అద్దెలకు ఇచ్చి స్వయం ఉపాధి కల్పించారు. 2008లో పట్టణాల్లో అయితే రూ.600 నుంచి రూ.800, గ్రామ పంచాయతీల్లో రూ.400 అద్దెగా నిర్ణయించారు. మార్కెట్ ధర ప్రకారం 5శాతమే అద్దె 2008 నుంచి కొందరు అద్దెను చెల్లించడమే బంద్ చేశారు. దాదాపు 15 ఏళ్లుగా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. మరి కొందరు ఇతరులకు అక్రమంగా అద్దెకు ఇచ్చి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. కానీ ఎస్సీ కార్పొరేషన్కు అద్దె మాత్రం చెల్లించడంలేదు. ఇటీవల అధికారులు నోటీసులు ఇవ్వడంతో కొంత చెల్లించారు. మార్కెట్ ధర ప్రకారం అద్దెను చూస్తే కనీసం 5శాతం సైతం లేని అద్దెను సకాలంలో చెల్లించడం లేదు. 2008లో నిర్ణయించిన ప్రకారం చూస్తే సిద్దిపేటకు చెందిన షెట్టర్లు రూ.7.20లక్షలు చెల్లించాలి. కానీ ఇప్పటి వరకు రూ2.77లక్షలు మాత్రమే చెల్లించారు. గజ్వేల్లో రూ.3.60లక్షలు చెల్లించాల్సి ఉన్నా చెల్లించింది రూ.1.95లక్షలే. దుబ్బాకలో రూ.10లక్షలకు గాను రూ.6.7లక్షలు మాత్రమే చెల్లించారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి అద్దెను సవరించి, పాత బకాయిలను వసూలు చేయాలని, బినామీలకు షెట్టర్లను రద్దు చేసి నిరుద్యోగ ఎస్సీ యువతకు అందించాలని కోరుతున్నారు. సిద్దిపేట పట్టణంలో మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ఐదు షెట్టర్లను ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించారు. వాటిని ఎస్సీలకు కేటాయించారు. 2008లో రూ.800 అద్దెగా నిర్ణయించారు. అప్పటి నుంచి అంతే అద్దెకు కొనసాగుతోంది. వీటిలో రెండు షెట్టర్లను కేటాయించిన వారు కాకుండా ఇతరులకు అద్దెకు ఇచ్చి ఎక్కువగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటికి సమీపంలోనే మున్సిపాలిటీకి సంబంధించిన షెట్టర్లు ఉండగా వాటికి ఒక్కోదానికి రూ.12వేల నుంచి రూ.14వేలు వసూలు చేస్తున్నారు. దుబ్బాక పట్టణంలో ఎంపీడీఓ కార్యాలయం వద్ద పది షెట్టర్లను ఎస్సీ కార్పొరేషన్ నిర్మించి అద్దెకు ఇచ్చింది. 2008లో ఒక్కో షెట్టర్కు రూ. 600గా నిర్ణయించారు. అప్పటి నుంచి అద్దెను పెంచలేదు. ఇందులో దాదాపు నలుగురు ఇతరులకు అక్రమంగా అద్దెకు ఇచ్చి అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు. అక్కడ సాధారణంగా ఒక్కో షెట్టర్కు రూ.8వేల నుంచి రూ.10వేలు అద్దె ఉంది. ఇతరులకు ఇచ్చిన వారిపై చర్యలు త్వరలో అద్దెలను పెంచుతాం. షెట్టర్లలో అద్దెకు ఉంటున్న వారికి నోటీసులు ఇచ్చాం. దీంతో దాదాపు రూ.11లక్షల వరకు అద్దె వసూలు చేశాం. కొన్ని శిథిలావస్థకు చేరాయి. వాటిని మరమ్మతులు చేయిస్తాం. కేటాయించిన వారు కాకుండా ఇతరులకు అద్దెలకు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకుంటాం. – భార్గవ్, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ దుకాణాల అద్దెలో గోల్మాల్ 15 ఏళ్లుగా కిరాయి చెల్లించని లబ్ధిదారులు అక్రమంగా ఇతరులకు కేటాయింపు అధిక కిరాయి వసూలు కార్పొరేషన్ ఖజానాకు గండి -
అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం
సిద్దిపేటరూరల్: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందిస్తున్న అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్జీలను పూర్తి స్థాయిలో పరిశీలించి తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భూ సమస్యలు, పలు సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తంగా 168 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు గరీమా అగర్వాల్, అబ్దుల్ హమీద్, డీఆర్ఓ నాగరాజమ్మ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. రశీదు కౌంటర్ వద్ద గందరగోళం ప్రజావాణిలో భాగంగా దరఖాస్తు అందించిన అనంతరం రశీదు అందించే కౌంటర్ వద్ద గందరగోళం నెలకొంది. రశీదు కోసం గంటల తరబడి వేడిచూడాల్సి వచ్చింది. అధికారులు మరో కౌంటర్ ఏర్పాటు చేసి రశీదు అందిస్తే బాగుంటుందని పలువురు కోరారు. కలెక్టర్ హైమావతి ప్రజావాణికి దరఖాస్తుల వెల్లువ -
జీఓ 99 సవరించాల్సిందే
హుస్నాబాద్: ఎస్సీ వర్గీకరణ కంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ నంబర్ 99 అత్యంత ప్రమాదకరమని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ అన్నారు. సోమవారం మాల మహానాడు పిలుపు మేరకు మాలలు చేపట్టిన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ముట్టడిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వ్యవసాయ మార్కెట్ యార్డు గేట్ వద్ద జీఓ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ ఈ జీవో వల్ల మాలల విద్యార్థులకు విద్య, ఉద్యోగ సీట్లల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. రోస్టర్ విధానంలో 22 నుంచి 16కు తగ్గించాలని డిమాండ్ చేశారు. జీఓ నంబర్ 99ని సవరించే వరకు పోరాటం ఆగదన్నారు. అనంతరం మంత్రి పీఏకి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం నియోజకవర్గ ఇన్చార్జి ఆరె కిషోర్, నాయకులు వెన్న రాజు, దండి లక్ష్మి తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడి దుబ్బాక: ఏబీసీడీ వర్గీకరణతో మాలలకు తీరని అన్యాయం జరుగుతుందని మాలమహానాడు నేతలు మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని నాయకులు ముట్టడించారు. క్యాంపు ఆఫీసు గేట్ ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి లేక పోవడంతో పీఏకు వినతి పత్రం అందించారు. జీఓ 99 ను రద్దుచేయాలని, ఏబీసీడీ వర్గీకరణతో మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీలో మాట్లాడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. క్యాంపు కార్యాలయం ముట్టడించిన మాలమహానాడు నాయకులను పోలీసులు అక్కడినుంచి బలవంతంగా పోలీస్స్టేషన్కు తరలించారు. కార్యక్రమంలో మాలమహానాడు దుబ్బాక నియోజకవర్గం ఇన్చార్జి కాల్వ నరేష్, అంబేడ్కర్ సంఘం అధ్యక్షుడు కాల్వ లింగం, ఆస రాజశేఖర్, శ్రీనివాస్, రాజేష్, ప్రభాకర్, శేఖర్రావు, నారాయణ తదితరులు ఉన్నారు.మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ -
వణికిస్తున్న జబ్బు.. ఆస్పత్రులు గబ్బు..
చీటిలకూ పడిగాపులే..ఓ వైపు వణికిస్తున్న జబ్బు.. మరోవైపు ఆస్పత్రుల్లోని కంపుతో రోగులు బెంబేలుచెందుతున్నారు. అసలే జ్వరాల సీజన్ కావడంతో ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. వైద్యం కోసం ఓపీ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఓపీ కేంద్రం నుంచి వైద్యం చేయించుకునే వరకు రోగులు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీకావు.. సాక్షాత్తు జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో రోగుల ముక్కులు పగిలిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు జబ్బు తగ్గించుకుందామని ఆస్పత్రికి వస్తే.. ముక్కు పుఠాలు ముక్కలయ్యేలా కంపు కొడుతోంది. దీంతో ఆస్పత్రులకు వచ్చిన రోగులు, వారికి తోడుగా వచ్చిన సహాయకులు.. కొత్త రోగాల బారిన పడుతుండటం గమనార్హం. ఇక పట్టణ ఆస్పత్రుల్లో అరకొర మందులు.. వైద్య సిబ్బంది కొరతతో అవస్థలు తప్పడంలేదు. సోమవారం పట్టణ ఆస్పత్రులను సాక్షి విజిట్ చేయగా పలు విషయాలు వెలుగుచూశాయి. గజ్వేల్రూరల్: రోగమొస్తే ప్రభుత్వాస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుందామనుకునే ప్రజలు.. వైద్యుల వద్దకు వెళ్లేముందు తీసుకునే టోకెన్ల(చీటి) కోసమే పడిగాపులు కాయాల్సి వస్తోంది. అంతేగాకుండా వైద్యులు సైతం సమయపాలన పాటించడం లేదనే ఆరోపణలు సైతం ఉన్నాయి. గజ్వేల్ పట్టణంలో జిల్లా ప్రభుత్వాస్పత్రితో పాటు మాతాశిశు సంరక్షణ ఆస్పత్రులను ప్రభుత్వం వేర్వేరుగా ఏర్పాటు చేసింది. జిల్లా ప్రభుత్వాసుపత్రిలో జనరల్ వ్యాధులతో పాటు పీడియాట్రిక్, ఆప్తమాలజీ, ఆర్థోపెడిక్ తదితర చికిత్సలను అందిస్తుండగా, మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో గర్భిణులకు వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు ఆస్పత్రులలో నిత్యం సుమారు 700 నుంచి 900 మంది వైద్యం కోసం వస్తుంటారు. అయితే జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వైద్యుని వద్దకు వెళ్లేకంటే ముందు టోకెన్(చీటి) తీసుకోవడానికి సుమారు అరగంటకుపైగా క్యూలైన్లో పడిగాపులు కాయాల్సి వస్తుందని వాపోతున్నారు. అంతేగాకుండా వైద్యులు సైతం సమయపాలన పాటించడం లేదని ఆసుపత్రికి వచ్చే వారు ఆరోపిస్తున్నారు. వైద్యం సకాలంలో అందడంలేదని చెబుతున్నారు. కంపుకొడుతున్న పెద్దాస్పత్రిసిద్దిపేటకమాన్: సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చెత్త, వ్యర్థాలు పేరుకుపోవడంతో దుర్గంధం వ్యాపిస్తోంది. దీంతో ఆస్పత్రికి వస్తే వ్యాధి నయమవడం ఏమో కానీ వ్యాధుల బారీన పడే అవకాశం ఉందని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రతి నిత్యం పలు విభాగాల్లో 1600మంది ఓపీ సేవలు పొందుతున్నారు. ఇందులో వైరల్ ఫీవర్ వారు ఎక్కువగా ఉన్నారు. నెల రోజుల్లో 37మంది డెంగీ బారీన పడ్డారు. జనరల్ మెడిసిన్, పిడియాట్రిక్, గైనకాలజీ విభాగాల ఓపీ వద్ద రోగులు క్యూ కట్టారు. ప్రస్తుతం ఇన్ పేషెంట్ విభాగంలో 256 మంది చికిత్స పొందుతున్నారు. రోగులను తీసుకెళ్లాల్సిన స్ట్రెచర్ పైన సిబ్బంది మందులు తీసుకెళ్తుండటం గమనార్హం. ఆస్పత్రిలో శానిటేషన్, వైద్య సేవలపై ఆర్ఎంఓను సంప్రదించగా చెత్త తీసుకెళ్లే వాహనం రిపేర్ వల్ల రాలేదని, మున్సిపల్ సిబ్బందితో మాట్లాడి చెత్తను తొలగిస్తామని, ఆస్పత్రిలో అన్ని విభాగాల్లో వైద్య సేవలందుతున్నాయని, మందులు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డాక్టర్లు అరకొర.. రోగులు కిటకిటహుస్నాబాద్: వైరల్ ఫీవర్తో రోగులు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులతో జ్వరాలు విజృంభిస్తున్నాయి. హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి సోమవారం రోగులతో కిటకిటలాడాయి. 419 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో 83 మందికి వైరల్ ఫీవర్గా గుర్తించారు. 24 మంది జ్వర పీడితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రోజు రోజుకు జ్వరాలు పెరగడంతో రోగులతో ఆస్పత్రి కిటకిటలాడుతోంది. ఉదయాన్నే రోగులు క్యూలైన్లు కట్టారు. ఆస్పత్రిలో 16 డాక్టర్ల పోస్టులకు గాను ఏడుగురు డాక్టర్లు మాత్రమే ఉన్నారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ జ్వరాలతో బాధపడుతున్నారు. వైద్యం దైవాదీనంఓపీ కేంద్రాల వద్ద రోగులు బారులు గంటల తరబడి నిరీక్షణ అరకొర మందులు.. వేధిస్తున్న సిబ్బంది కొరత ఎవరికీ పట్టని పేదల గోస సాక్షి విజిట్లో వెలుగుచూసిన వాస్తవాలు -
ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకం
గజ్వేల్రూరల్: తెలంగాణ ఉద్యమంలో ప్రజలను, అన్ని రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి కీలకపాత్ర పోషించే విధంగా కృషి చేయడంలో గజ్వేల్ జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని, మద్యం మహమ్మారి, రైతు ఆత్మహత్యలపై పోరాటాలు అభినందనీయమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. గజ్వేల్ ప్రెస్క్లబ్ రజతోత్సవం సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్లోని ఎస్ఎల్ఎన్ కన్వెన్షన్లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గజ్వేల్ ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో రూపొందించిన సావనీర్ ‘కలం పోరు’పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం హరీశ్రావు మాట్లాడుతూ..కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల కోసం డబుల్ బెడ్రూం ఇండ్లతోపాటు గ్రామీణ ప్రాంత విలేకరులకు బస్పాసులు అందించామన్నారు. రిటైర్డ్ జర్నలిస్టుల కోసం ఈహెచ్ఎస్ ఏర్పాటుకు అసెంబ్లీలో చర్చిస్తామని హామీనిచ్చారు. గజ్వేల్ ప్రెస్క్లబ్కు ప్రత్యేక స్థానం: శ్రీనివాస్రెడ్డి తెలంగాణ ప్రాంతంలో గజ్వేల్ ప్రెస్క్లబ్కు ప్రత్యేక స్థానముందని శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేయగా సంబంధిత శాఖ అధికారులను పిలిచి వారంలోగా సమావేశం ఏర్పాటు చేసి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారని తెలిపారు. మంచి చేయాలన్నవారే జర్నలిస్టులుగా రావాలి: కొత్త ప్రభాకర్రెడ్డి గ్రామాల్లో ప్రజలకు ఏ సమస్య వచ్చినా జర్నలిస్టుల దృష్టికి తీసుకువెళితే ఆ సమస్య వేగంగా పరిష్కారమయ్యేదనే నమ్మకముండేదని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. యూట్యూబ్ చానల్, సోషల్ మీడియా రావడంతో నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులకు గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజానికి మంచి చేయాలన్నవారే జర్నలిస్టులుగా రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు డాక్టర్ యాదవరెడ్డి, దేశపతి శ్రీనివాస్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మాజీ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్రెడ్డి, బేవరేజస్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవీ ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ నరేందర్రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్రావు, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్అలీ, జిల్లా అధ్యక్షుడు రంగాచారి, ప్రధాన కార్యదర్శి అరుణ్కుమార్, లోక్సత్తా తెలుగు ఉభయ రాష్ట్రాల సమన్వయకర్త బండారు రామ్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా నిమజ్జనం
సోమవారం శ్రీ 8 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025డీజే సౌండ్లు, భక్తుల కోలాహలం, పోలీసు బందోబస్తు మధ్య వినాయక నిమజ్జనోత్సవ శోభాయాత్ర దుబ్బాకలో శనివారం రాత్రి ప్రారంభమై ఆదివారం సాయంత్రానికి ప్రశాంతంగా ముగిసింది. డీజే పాటలకు మహిళలు, యువతీయవకుల నృత్యాలు, మహారాష్ట్ర మహిళల బ్యాండ్ ట్రూప్లతో శోభాయాత్ర కనుల విందుగా సాగింది. నిమజ్జనానికి వివిధమండపాలనుంచి వివిధ ఆకృతుల్లో తీసుకువచ్చిన వినాయక విగ్రహాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. – దుబ్బాకటౌన్ -
కరెంట్.. కట్కట
● వ్యవసాయానికి వేళాపాళా లేని విద్యుత్తు కోతలు ● రోజుకు 10 గంటలు కూడా సరఫరా కాని దుస్థితి కొండపాక(గజ్వేల్): కొండపాక, కుకునూరుపల్లి మండలాల్లో వ్యవసాయ రంగానికి వేళాపాళా లేని విద్యుత్తు కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతు రాజ్యమంటూ గొప్పలు చెపుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ రైతుల సమస్యలను పరిష్కరించడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. ఓ పక్క యూరియా కొరత వేధిస్తుండగా మరో పక్క వ్యవసాయ బావులకు త్రీ ఫేజ్ విద్యుత్తు కోతలు రైతులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. త్రీ ఫేజ్ కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియకపోతుండటంతో రాత్రింబవళ్లూ వ్యవసాయ బావుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ప్రారంభంలో 12 నుంచి 15గంటలు సరఫరా వర్షాకాలం వ్యవసాయ సాగు పనులు ప్రారంభంలో ప్రతీ రోజు 12 నుంచి 15 గంటల వరకు త్రీ ఫేజ్ విద్యుత్తు సరఫరా జరిగేది. అయితే ఆలస్యంగా వర్షాలు కురవడంతో రెండు మండలాల్లో 3నుంచి 4 గ్రామాల్లో మినహా మిగతా గ్రామాల్లోని చెరువులు నిండటంతో భూగర్భజలాలు పెరిగాయి. దీంతో ఆలస్యంగా వరి నాట్లు వేశారు. కొండపాక మండలంలో సుమారు 20 వేల ఎకరాల్లో, కుకునూరుపల్లి మండలంలో 8 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. కొండపాక మండలంలో 7,452 అధికారిక వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లుండగా, కుకునూరుపల్లి మండలంలో 3,510 వ్యవసాయ అధికారిక విద్యుత్తు కనెక్షన్లుండగా మరికొన్ని అనధికారిక విద్యుత్తు కనెక్షన్ల ద్వారా త్రీ ఫేజ్ విద్యుత్తు సరఫరా జరుగుతోంది. ఇందుకుగాను దుద్దెడ, కొండపాక, మర్పడ్గ, బందారం, వెలికట్ట, తిమ్మారెడ్డిపల్లి, మేదినీపూర్, తిప్పారం గ్రామాల్లోని 32/11 కేవీ విద్యుత్తు సబ్స్టేషన్ల నుంచి వ్యవసాయ బావులకు విద్యుత్తు సరఫరా జరుగుతోంది. ప్రచారార్భాటం పటాటోపమే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో నిమిషమైనా కరెంటు కోతలుండవంటూ ప్రచారం చేసి తీరా అధికారంలోకి రాగానే కరెంటు సరఫరా తీరులను పట్టించుకోవడం లేదంటూ అన్నదాతలు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో వ్యవయసాయ రంగానికి రోజుకు 18 నుంచి 20 గంటల వరకు సరఫ రా జరగ్గా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 8 నుంచి 10 గంటల విద్యుత్తు సరఫరా కూడా కావడం లేదంటూ రైతులు వాపోతున్నారు. విద్యుత్తు శాఖ గజ్వేల్ డీఈ భానుప్రకాశ్ను వివరణ కోరగా త్రీ ఫేజ్ విద్యుత్తు సరపరాలో కోతల విషయమై నిర్ధారించడం లేదు.పొట్ట దశకు చేరుకున్న వరిపంటలు వర్షాకాలం ప్రారంభ దశలో సాగు చేసిన పంటలు చిరు పొట్ట దశకు చేరుకున్నాయి. ఈ దశలో నీటి వినియోగం ఎక్కువగా అవసరపడుతుందని సమయంలో వేళాపాళాలేని విద్యుత్తు కోతలతో పంటలు ఎండిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. సాయంత్రం 4 గంటలకు నిలిచిపోయిన త్రీ ఫేజ్ కరెంటు మధ్యరాత్రి సుమారు 2 నుంచి 3 గంటలకు సరఫరా అవుతుందన్నారు. కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియక రాత్రి పూట వ్యవసాయ బావుల వద్ద పడిగాపులు కాస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
అదను దాటితే అంతే సంగతులు!
యూరియా లేక.. పంటలు డీలా గజ్వేల్: యూరియా కొరత తీవ్ర పంట నష్టాన్ని కలిగిస్తున్నది. ఎదుగుదల లోపించడం, తెగుళ్లు వ్యాపించడంతో ఇప్పటికే వేలాది ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. మరోవైపు అతివృష్టి వల్ల నీట మునిగిన పంటలను రికవరీ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. కొన్ని చోట్ల రైతులు ఇప్పటికే వానాకాలం పంటలపై ఆశలు వదులున్నారు. సిద్దిపేట జిల్లాలో పంటల పరిస్థితిపై ‘సాక్షి’ పరిశీలన జరిపింది. జిల్లాలో 4.87లక్షల ఎకరాలకుపైగా పంటలు సాగులోకి వచ్చాయి. ఇందులో వరి 3.40లక్షల ఎకరాలు, మొక్కజొన్న 27,820, ఎకరాలు, కంది 6594 ఎకరాల్లో సాగులోకి రాగా పత్తి 1.06లక్షల ఎకరాలపైగా సాగులోకి వచ్చింది. మిగిలిన విస్తీర్ణంలో ఇతర పంటలు సాగులోకి వచ్చాయి. కానీ ఈసారి యూరియా కొరత రైతులను కుంగదీస్తున్నది. వానాకాలం సీజన్ మొత్తానికి 40వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా.. ఇప్పటివరకు కేవలం 28,882 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. పంటలు ఎదిగే కీలకమైన సమయంలో యూరియా ఒక్క బస్తా దొరకడం గగనమవుతుండగా..రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.వేలాది ఎకరాల్లో పంట నష్టం పంటలు ఎదిగే సమయంలో యూరియా దొరక్క వేలాది ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. మరోవైపు భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను రికవరీ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ప్రత్యేకించి వరికి తీవ్ర నష్టం కలిగింది. జిల్లాలోని చాలా చోట్ల వరద ఉధృతికి వరి ఇసుక మేట వేసి వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. లోతట్టు చేలల్లో పత్తి నీటి మునిగి రంగుమారుతోంది. మరోవైపు వేరుకుళ్లు ఇతర తెగుళ్లు విజృంభించాయి. దీనివల్ల దిగుబడి భారీగా పడిపోయే దుస్థితి నెలకొన్నది. కొన్ని చోట్ల రైతులకు పెట్టుబడి కూడా దక్కని స్థితిలో పంటలు ఉన్నాయి. మొక్కజొన్న పంటకు సైతం భారీ నష్టం జరిగింది. అతివృష్టి వల్ల జిల్లాలో 7759 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. పూర్తిస్థాయి అంచనా కోసం క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతున్నారు. ఇకపోతే అదనుకు యూరియా వేయపోవడం వల్ల జిల్లావ్యాప్తంగా వరి సుమారుగా 20వేల ఎకరాలకుపైగా పత్తి 10వేల ఎకరాలు, మొక్కజొన్న 4వేల ఎకరాలకుపైగా దెబ్బతిన్నట్లు అంచనా. యూరియా దొరక్క వరి దెబ్బతింది నాలుగు ఎకరాల్లో వరి సాగు చేసిన. ఎన్ని రోజుల నుంచి తిరుగుతుండగా, మూడు బస్తాల యూరియా దొరికింది. ఇది ఏ మూలకు సరిపోలేదు. దీనివల్ల పంట ఎదుగుతలేదు. ఇప్పటికై నా యూరియా అందకపోతే పంట మీద ఆశలు చాలించుకోవాల్సిందే. రైతు లచ్చిరెడ్డి, తీగుల్, జగదేవ్పూర్ మండలం -
అంగన్వాడీలా!
● అద్దె భవనాల్లో కొనసాగుతున్న వైనం ● ఆట వస్తువుల పరిస్థితి అంతంతే ● కొరవడిన అధికారుల పర్యవేక్షణచిన్నకోడూరు(సిద్దిపేట): చిన్నారులు, గర్బిణీలు, బాలింతలకు పౌష్టికాహారంతో పాటు బాల్యం నుంచే చదువుపై ఆసక్తి కల్పించే లా ఆట, పాటలతో బోధించేందుకు ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. సరైన వసతులు లేకపోవడం వల్ల పిల్లలను అంగన్వాడీలకు పంపేందుకు తల్లిదండ్రులు ఆసక్తిచూపడం లేదు. అద్దె భవనాలు, ఇరుకు గదుల్లో అరకొర వసతులు వేధిస్తుండటంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. పర్యవేక్షించాల్సిన సంబంధిత అధికారులు అంగన్వాడీ కేంద్రాల్లో నెలకొన్న సమస్యలపై పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఏడు అద్దె భవనాల్లో మండలంలో మొత్తం 54 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 28 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలుండగా, 19 కేంద్రాలు అద్దె లేని భవనాల్లో కొనసాగుతుండగా, ఏడు కేంద్రాల్లో అద్దె భవనాల్లో సాగుతున్నాయి. ప్రభుత్వం నెలకు రూ. వెయ్యి అద్దె చెల్లిస్తోంది. అద్దె మొత్తం కంటే ఎక్కువగా ఉంటే టీచర్లు మిగిలిన డబ్బు భరించాలి.నిలిచిపోయిన నిర్మాణాలు అద్దె భవనాల్లో ఉన్న కొన్ని కేంద్రాలకు గతంలో భవనాలు మంజూరైనా పనులు అసంపూ ర్తిగా నిలిచిపోయాయి. మరికొన్నింటికి పనులు ప్రారంభం కాలేదు. చిన్నకోడూరులో రెండు భవనాలు, ఎల్లాయపల్లిలో ఒక భవ నం నిర్మాణ పనులు ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాలేదు. అధికారులు స్పందించి భవనాలను పూర్తి చేయాలని కోరుతున్నారు.నాణ్యమైన భోజనం అందించాలికొండపాక(గజ్వేల్): విద్యార్థులకు నాణ్యమైన బోధన, భోజనం అందేలా చూసుకోవాలని కలెక్టర్ హైమావతి సూచించారు. కొండపాకలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలను ఆదివారం రాత్రి ఆకస్మికంగా సందర్శించారు. రాత్రి పూట అందించిన భోజనాన్ని పరిశీలిస్తూ ఎలా ఉందంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలు ఎలా ఉన్నాయన్న విషయమై కలియ తిరుగుతూ పరిశీలించారు. మురికి కాలువలు చెడిపోవడంతో దుర్వాసన వస్తున్న విషయాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు కలెక్టర్ దృష్టికి తేవడంతో స్పందించి వెంటనే పనులు చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశించారు. అక్కడక్కడ తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా హైమావతి మాట్లాడుతూ..కామన్ డైట్ మెనూను పాటించాలన్నారు. విద్యాపరమైన అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. తల్లిపేరు మీద మొక్క నాటాలి సిద్దిపేటరూరల్: జిల్లాలో కలెక్టర్ ఆదేశాల మేర కు ‘ఏక్ పేడ్ మా కే నామ్పే’ అనే నినాదంతో ప్రతీ అధికారి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు కలెక్టర్ కె.హైమావతి ఆదివారం పిలుపునిచ్చారు. 9న తల్లి పేరున ఒక మొక్క స్ఫూర్తితో జిల్లాలోని అధికారులంతా మొక్కలు నాటాలని కోరారు. ఇప్పటి వరకు జిల్లాలో గుర్తించిన 13,900ల మంది ఉద్యోగులు కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. కార్యక్రమం సజావుగా జరిగేలా సంబంధిత శాఖల అధికారులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. -
న్యూస్రీల్
జిల్లాస్థాయి క్రీడా పోటీలుప్రశాంత్నగర్(సిద్దిపేట): స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 10 నుంచి 12 వరకు 69వ జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి, ఎస్జీఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి సౌందర్య ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అండర్–14, 17 బాలురు, బాలికల కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, క్రికెట్ విభాగాల్లో పోటీలు నిర్వహించి, ఇందులోనుంచి జిల్లా స్థాయి జట్టును ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ క్రీడలు ప్రభుత్వం బాలుర ఉన్నత పాఠశాలలో, క్రికెట్ స్థానిక మినీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. లడ్డూను దక్కించుకున్న ముస్లింమద్దూరు(హుస్నాబాద్): ధూళ్మిట్ట మండలంలోని బైరాన్ పల్లి గ్రామంలో శివ భజరంగి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో పూజలందుకున్న గణపతి లడ్డూను వేలంపాటలో అదేగ్రామానికి చెందిన ముస్లిం యువకుడు మొహమ్మద్ జహంగీర్ దక్కించుకున్నారు. శనివారం రాత్రి నిర్వహించిన లడ్డూ వేలంలో రూ.14,916కు జహంగీర్ దక్కించుకున్నారు. కాగా, హిందూ పండుగలో ముస్లిం యువకుడు భాగస్వామి కావడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. నాచగిరి ఆలయ ద్వారబంధనంవర్గల్(గజ్వేల్): సంపూర్ణ చంద్రగ్రహణం పురస్కరించుకుని ఆదివారం ఉదయం 10 గంటల నుంచి నాచగిరి ఆలయాన్ని మూసివేశారు. సోమవారం తెల్లవారుజామున సంప్రోక్షణ అనంతరం యథావిధిగా పూజాకార్యక్రమాలు కొనసాగుతాయని, భక్తులకు దర్శనం ఉంటుందని ఆలయ కార్యనిర్వాహణాధికారి విజయ రామారావు తెలిపారు. వంటేరుకు ప్రముఖుల పరామర్శజగదేవ్పూర్(గజ్వేల్): మాతృవియోగంతో బాధపడుతున్న గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డిని ఎమ్మెల్యే రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, బేవరేజెస్ కార్పోరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ పరామర్శించారు. సమస్యల పరిష్కారానికి కృషిటీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు పరమేశ్వర్ సిద్దిపేటజోన్: జిల్లాలోని పంచాయతీ కార్యదర్శుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా మని జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు పరమేశ్వర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఫోరమ్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పెండింగ్ సమస్యలను ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటా మని తెలిపారు. బతుక మ్మ, దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వం నిధులను విడుదల చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధా న కార్యదర్శి విక్రమ్రెడ్డి, పంచాయతీ కార్యదర్శుల ఫోరమ్ ప్రతినిధులు బలరాం, వికాస్, ప్రవీణ్ పాల్గొన్నారు. -
వంటేరును పరామర్శించిన హరీశ్
జగదేవ్పూర్(గజ్వేల్): అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డిని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పరామర్శించారు. వంటేరు మాతృమూర్తి వజ్రమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే. శనివారం యూకే నుంచి హైదరాబాద్ చేరుకున్న హరీశ్రావు విషయం తెలుసుకుని దౌలాపూర్ చేరుకుని ప్రతాప్రెడ్డి స్వగృహంలో వజ్రమ్మ చిత్ర పటానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ శ్రీనివాస్తో కలిసి హరీశ్రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే తిగుల్కు చెందిన మాజీ సర్పంచ్ ఎల్లయ్యను, కాలు విరిగి ఇంట్లో ఉన్న బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్కు కూడా హరీశ్రావు పరామర్శించారు. ఆయన వెంట ఏఎంసీసీ మాజీ చైర్మన్ శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, కొండపోచమ్మ మాజీ చైర్మన్ ఉపేందర్రెడ్డి, ఆంజిరెడ్డి, రంగారెడ్డి, కరుణకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు క్రీడల్లో రాణించాలిఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య మిరుదొడ్డి(దుబ్బాక): విద్యార్థులు చదువుతో పాటు, క్రీడారంగంలో రాణించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. అక్బర్పేట–భూంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం ఎస్జీఎఫ్ మండలస్థాయి కబడ్డీ, వాలీబాల్, ఖోఖో క్రీడాలను ప్రారంభించారు. మండల పరిధిలోని 10 పాఠశాలలకు చెందిన 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గెలుపోటములు సహజమన్నారు. అనంతరం టీచర్స్ డే సందర్భంగా 15 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంఈఓ అంజాగౌడ్, స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ రాజేందర్, ఆయా పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చక్కని బోధనతోనే సత్ఫలితాలు: శ్రీనివాస్రెడ్డినంగునూరు(సిద్దిపేట): మారుతున్న కాలానికి అనుగుణంగా బోధనా పద్ధతులను అవలంబించి మంచి ఫలితాలు సాధించాలని డీఈఓ శ్రీనివాస్రెడ్డి సూచించారు. నంగునూరులో మండలస్థాయి టీఎల్ఎమ్ (టీచర్స్ లర్నింగ్ మెటీరియల్) బోధన అభ్యాసన ఉపకరణ మేళా శనివారం నిర్వహించారు. ఉపాధ్యాయులు తయారు చేసిన పరికరాలను ప్రదర్శించి సులభ బోధనకు ఎలా దోహదపడతాయో వివరించారు. స్టాళ్లను పరిశీలించిన ఆయన ప్రతిభ చూపిన ఉపాధ్యాయులను అభినందించారు. అనంతరం మాట్లాడుతూ ఉపాధ్యాయులు చేస్తున్న కృషి ఫిలితంగా సిద్దిపేట జిల్లా మూడు సంవత్సరాలుగా ముందంజలో ఉందన్నారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ డీఈఓగా ఎంపికై న శ్రీనివాస్రెడ్డిని ఎంఈఓ దేశిరెడ్డి, గెజిటెడ్ హెచ్ఎంలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఘనంగా సత్కరించారు. అరుణాచలానికి ప్రత్యేక బస్సు సిద్దిపేటకమాన్: సిద్దిపేట డిపో నుంచి అరుణాచల గిరిప్రదక్షణకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీస్ను నడపనున్నట్లు డిపో మేనేజర్ రఘు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12న సిద్దిపేట నుంచి బస్సు బయలుదేరి కాణిపాకం, వేలూరు, అరుణాచలం, తిరుపతి, జోగులాంబ అమ్మవారి దర్శనానంతరం తిరిగి 16న బస్సు సిద్దిపేటకు చేరుకుంటుందని తెలిపారు. పెద్దలకు రూ.5,200, పిల్లలకు రూ.4 వేలు చార్జి ఉంటుందని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
సారొస్తారంటేనే హడల్
సదరు అధికారి క్షేత్రస్థాయి పర్యటనలకు వస్తున్నారంటేనే ఆ శాఖ సిబ్బంది హడలెత్తిపోతున్నారు. తన శాఖకు చెందిన ఆస్పత్రుల్లో తనిఖీలకు వెళితే.. బిర్యానీ, సిగరేట్ డబ్బా, చేతిలో ఒక కవర్, మద్యం బాటిల్ ఇవ్వాలని హుకుం జారీ చేస్తారు. ఏర్పాట్లు చేయకపోతే సార్ కోపానికి వస్తాడేమోనని.. చేసేదేమిలేక సర్దుబాటు చేస్తున్నారు. గొర్రెల పెంపకం అబివృద్ధి పథకం (ఎస్ఆర్డీఎస్) కింద రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిధులు మంజూరు చేసింది. ఈ పథకంపై ఇప్పటికే సీబీఐ విచారణ జరిగింది, ఈడీకి ఈ కేసును అప్పగించిన విషయం తెలిసిందే. ఈ పథకానికి సంబంధించిన డబ్బులు డ్రా చేయవద్దని ఇదివరకే ఉన్నతాధికారులు అదేశించారు. అయితే.. కార్యాలయంలో ఫర్నిచర్ కోసం ఎస్ఆర్డీఎస్ డబ్బులు రూ.2లక్షలు సెల్ఫ్ డ్రా చేసినట్లు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా చెక్ రాయలేమని ఆ సెక్షన్ అధికారి తనకు ఈ బాధ్యతలు వద్దని రాసిచ్చి వెళ్లినట్లు తెలిసింది. దీంతో మరో సీనియర్ అసిస్టెంట్ ద్వారా చెక్ రాయించుకొని డ్రా చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇలా కింది స్థాయి ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తుండటంతో త్వరలో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిసింది. కాగా, సదరు అధికారిని వివరణ కోరగా.. మధ్యాహ్నం సమయంలో విశ్రాంతి తీసుకునేందుకు చాపను ఏర్పాటు చేసుకున్నాని, కార్యాలయంలో ఉండటం లేదని సమాధానం ఇచ్చారు. -
దఫ్తర్లోనే బిస్తర్!
ఆయన జిల్లా స్థాయి అధికారి. అధికారం, దర్పం, ఆర్థిక వెసులుబాటులన్నీ ఉన్నాయి. దర్జాగా ఉండాల్సిన ఆ అధికారి ఎందుకో దైన్యంగా ఉంటున్నాడు. సమీకృత కలెక్టరేట్ రెండవ అంతస్తులోని తన కార్యాలయంలో మకాం పెట్టాడు. వికారాబాద్ నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చిన సదరు అధికారి.. ఆగస్టు ఒకటిన బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి దఫ్తర్లోనే అన్నీ కానిచ్చేస్తున్నాడు. ఉతికిన బట్టలను ఆరబెడుతున్నాడు. కార్యాలయానికి వచ్చిన ప్రజలు చూసి ఔరా.. ఇదేమిటని ముక్కున వేలేసుకుంటున్నారు.కలెక్టరేట్లోని తన కార్యాలయంలో మకాం ● ఫైళ్లు ఉండాల్సిన బీరువాలో అధికారి బట్టలు ● ఉతికిన బట్టలను కుర్చీలపై ఆరబెట్టిన వైనం ● అధికారి వ్యవహారశైలిపై సర్వత్రా విమర్శలుసాక్షి, సిద్దిపేట: జిల్లా కలెక్టరేట్లోని బీరువాలలో ఆఫీసు ఫైళ్లు ఉండాల్సింది పోయి బట్టలు, చాప, దుప్పట్లు దర్శనమిస్తున్నాయి. కార్యాలయంలోనే సదరు అధికారి సిగరెట్లు తాగుతుండటంతో దుర్వాసనకు ముక్కు మూసుకోవాల్సి వస్తుందని సిబ్బంది, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి అధికారికి హోదాకు తగ్గట్టు ఇంటి అద్దెను వేతనంలో కలిపి ప్రభుత్వం చెల్లిస్తుంది. కానీ అలవెన్స్ ఖర్చులు మిగిలించుకోవడం కోసం ఇలా కక్కుర్తిపడటం ఎంత వరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
రోడ్లు ధ్వంసం
19.64దెబ్బతిన్న కల్వర్టులు, వంతెనలు ● రూ.33 కోట్ల నిధులు అవసరం ● ప్రతిపాదనలు పంపిన అధికారులుసిద్దిపేట అర్బన్: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల తాత్కాలికంగా రాకపోకలు సాగించేలా మరమ్మతులు చేశారు. జిల్లాలోని సిద్దిపేట ఆర్అండ్బీ ఈఈ పరిధిలో 25 ప్రాంతాలలో 18.80 కి.మీ మేర రోడ్లు ధ్వంసమయ్యాయి. దీనిలో ఇప్పటి వరకు 10 కి.మీ రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేశారు. తొమ్మిది ప్రాంతాలలో రోడ్డుపై నుంచి వరద నీరు వచ్చే ప్రాంతాలను గుర్తించారు. దెబ్బతిన్న రోడ్లు, ఓవర్ ఫ్లో అయ్యే రోడ్ల మరమ్మతులకు రూ.1.55 కోట్లు అవసరం అవుతాయని అంచనాలతో ప్రతిపాదనలు పంపారు. అలాగే గజ్వేల్ ఆర్అండ్బీ ఈఈ పరిధిలో 29 ప్రాంతాలలో 0.84 కి.మీ మేర రోడ్లు దెబ్బతినగా.. 26 ప్రాంతాలలో ఓవర్ఫ్లో అవుతున్నట్టు గుర్తించారు. వీటి మరమ్మతుల కోసం రూ. 1.71 కోట్లు అవసరం అవుతాయని నిర్ధారణకు వచ్చారు. మొత్తంగా 54 ప్రాంతాలలో 19.64 కి.మీ మేర రోడ్లు దెబ్బతినగా.. తాత్కాలిక మరమ్మతుల కోసం 3.26 కోట్లు అవసరం అవుతాయని, శాశ్వత మరమ్మతుల కోసం రూ.29.82 కోట్లు అవసరం అవుతాయని అధికారులు ప్రతిపాదనలు పంపారు. పంచాయతీ రాజ్, ఇంజినీరింగ్ శాఖ పరిధిలో సిద్దిపేట ఈఈ పరిధిలో 5 చోట్ల, గజ్వేల్ ఈఈ పరిధిలో 2 చోట్ల వంతెనలు దెబ్బతినగా మరమ్మతులకు అవసరమైన నిధులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కొత్తగా వంతెనలు నిర్మించడానికి దాదాపు రూ. 3 కోట్ల నిధులు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు.ప్రతిపాదనలు పంపాం ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో పలు ప్రాంతాలలో రోడ్లు కొంత వరకు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల తాత్కాలికంగా రాకపోకలు సాగించేలా మరమ్మతులు చేయించాం. మళ్లీ దెబ్బతినకుండా శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేసేందుకు అవసరమైన నిధుల కోసం అంచనాలు రూపొందించి పై అధికారులకు ప్రతిపాదనలు పంపాం. –సారంగపాణి, ఎస్ఈ -
పారిశుద్ధ్యం లోపిస్తే కఠిన చర్యలు
అక్కన్నపేట(హుస్నాబాద్): గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయితీ అధికారి(డీపీఓ) దేవకీ దేవి హెచ్చరించారు. ‘మంచం పట్టిన తండా.. ఇంటింటా జ్వరపీడితులే..’ అనే శీర్షికన సాక్షిలో శనివారం ప్రచురితమైన కథనానికి ఆమెతోపాటు జిల్లా వైద్యాధికారి ధన్రాజ్ స్పందించారు. ఈ సందర్భంగా మండలంలోని మైసమ్మవాగుతండాలో వైద్యాధికారి వినోద్రెడ్డి ఆధ్వర్యంలో స్థానికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇంటింటా జ్వర సర్వే చేసి దాదాపు 100 మందికి జ్వరం టాబ్లెట్లు అందజేశారు. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న ఆరుగురికి రక్తపరీక్షలు చేశారు. అనంతరం డీఎంహెచ్ఓ ధన్రాజ్ పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. డీపీఓ దేవకీ దేవి మాట్లాడారు. మారుమూల పల్లెలు, తండాల్లో పారిశుద్ధ్యం లోపించకుండా ప్రత్యేక దృష్టిసారించాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఆమె స్వయంగా తండాలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ఎక్కి తాగునీటిని పరిశీలించారు. వీధుల్లో చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో డీఎల్పీఓ వెంకటేశ్వర్లు, మిషన్ భగీరథ డీఈ రుహిన తస్కిన్, ఆరోగ్య డిప్యూటీ డిఎంహెచ్ఓ ఆనంద్, ఎంపీడీఓ జయరాం, ఎంపీఓ మోహన్నాయక్, హెల్త్ అసిస్టెంట్ కొమురయ్య, ఏఎన్ఎం సునీత, పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్, గ్రామస్తులు పాల్గొన్నారు.డీపీఓ దేవకీదేవి -
టీచర్ కావాలనుకొని లీడరయ్యా
● ఉపాధ్యాయ వృత్తి మహోన్నతమైనది ● బడిబాటతో సత్ఫలితాలు ● ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య ● విద్యతోనే వికాసం: కలెక్టర్సిద్దిపేటజోన్: ఉపాధ్యాయ వృత్తి మహోన్నతమైనదని, తనకు చిన్నతనంలోనే టీచర్ కావాలనే బలమైన కోరిక ఉండేదని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. శనివారం స్థానిక టీటీసీ భవన్లో జరిగిన గురుపూజోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. సర్పంచ్ అయి రాజకీయాల్లోకి వచ్చాక తనకు టీచర్ అయ్యే అవకాశం వచ్చిందని, అనివార్య కారణాల వల్ల కాలేకపోయానని చెప్పారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు రూ 23కోట్ల సంబంధించి నిధులు విడుదల కాలేదన్నారు. రూ.100 కోట్లు మన ఊరు, మన బడి బకాయిలు ఉన్నట్టు పేర్కొన్నారు. కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధికి మూలాలు విద్యా వ్యవస్థలో ఉన్నాయని పేర్కొన్నారు. నూతన విద్యా సూచనలు పాటిస్తూ కొత్త కొత్త విషయాలు బోధించి పిల్లలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, కోమరయ్యలు, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
రైల్వేలైన్ పనులు అడ్డగింత
చిన్నకోడూరు(సిద్దిపేట): తమకు నష్ట పరిహారం చెల్లించాకే రైల్వేలైన్ నిర్మాణ పనులు చేపట్టాలని మండల పరిధిలోని గంగాపూర్ రైతులు ఆందోళనకు దిగారు. పనులను అడ్డుకుని శనివారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైల్వేలైన్ నిర్మాణ పనుల్లో భాగంగా తమ పట్టాభూములు కోల్పోయామన్నారు. ఇప్పటి వరకు తమకు ఎలాంటి నష్ట పరిహారం చెల్లించలేదని వాపోయారు. పరిహారం కోసం అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని, తమ భూములకు నష్టపరిహారం చెల్లించాకే పనులు చేపట్టాలని పనులను అడ్డుకొని రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ సలీమ్, ఎస్ఐ సైఫ్అలీ అక్కడకు చేరుకుని రైతులతో మాట్లాడారు. సమస్యను కలెక్టర్కు వివరించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. రోడ్డుపై బైఠాయించిన రైతులు -
నేడు ఉత్తమ గురువులకు సన్మానం
విజయరేఖవెంకట్రామిరెడ్డిఉమారాణి జయప్రకాశ్రెడ్డిశ్రీనివాస్రెడ్డివరలక్ష్మికృష్ణారెడ్డివర్గల్(గజ్వేల్)/కొండపాక(గజ్వేల్)/జగదేవ్పూర్(గజ్వేల్)/గజ్వేల్రూరల్: ఉత్తమ ఉపాధ్యాయులు శనివారం సన్మానం పొందనున్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా కొందరు ఎంపి కైన విషయం తలిసిందే. అందులో భాగంగా వర్గల్ కస్తూర్బా బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ)లో ఇంగ్లిష్ టీచర్ ఎల్.వరలక్ష్మి, చౌదరిపల్లి జెడ్పీహైస్కూల్లో ఫిజికల్ సైన్స్ టీచర్ పి.కృష్ణారెడ్డి ఎంపికయ్యారు. వారికి సిద్దిపేటలో అవార్డులు అందజేయనున్నారు. అలాగే కొండపాక మండలంలోని ఖమ్మంపల్లి హైస్కూల్లో గెజిటెడ్ హెచ్ఎంగా పనిచేస్తున్న శ్రీనివాస్రెడ్డి, సిర్సనగండ్ల ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్న జయప్రకాశ్రెడ్డి, మర్పడ్గ హైస్కూల్లో తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఉమారాణి ఎంపికయ్యారు. జగదేవ్పూర్ మండలం గొల్లపల్లి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు వెంకట్రామిరెడ్డి ఎంపికైనట్లు ఎంఈఓ మాధవరెడ్డి తెలిపారు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఎన్.విజయరేఖ ఎంపి కై నట్లు ఎంఈఓ కృష్ణ తెలిపారు. ఆమెను ఉపాధ్యాయులు అభినందించారు. -
పేదల సంక్షేమమే లక్ష్యంగా సాగుదాం
రాష్ట్ర ఆర్యవైశ్య నేత శంకర్ప్రశాంత్నగర్(సిద్దిపేట): పేదల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మలిపెద్ది శంకర్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్యవైశ్యుల్లో ఉన్న పేదవారికి చేయూతనిచ్చి వారిని ఉన్నత స్థాయికి చేర్చాలని సూచించారు. మనకున్న సంపద, తెలివితేటలను పేదల శ్రేయస్సు కోసం వినియోగించాలన్నారు. ఆర్యవైశ్య మహాసభ సిద్దిపేట అధ్యక్షుడు గంప శ్రీనివాస్, నేతలు అయిత కిషోర్, యాసాల వెంకట లింగం, గరిపెల్లి సిద్దేశ్వర్, మాంకాల లింగమూర్తి ఆధ్వర్యంలో ఆ అసోషియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా గెజిటెడ్ హెచ్ఎం వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శిగా విఠల్, కోశాధికారిగా అడ్వకేట్ చంద్రశేఖర్, ఉపాధ్యక్షులుగా జగదీశ్వర్, శివ, అడ్వకేట్ కొ మరవెల్లి మహేశ్, శ్రీనివాస్, కార్యదర్శులుగా శ్రీ కాంత్, సతీశ్కుమార్ తదితరులను ఎన్నుకున్నారు. వైకుంఠం, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు వీరే..
చిన్న బ్రమ్మయ్యరామకృష్ణ బద్దిపడగ రమేశ్ నంగునూరు(సిద్దిపేట)/వర్గల్/మర్కూక్(గజ్వేల్): ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో ముగ్గురు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. నంగునూరు మండలం రాజగోపాల్పేట పాలిటెక్నిక్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అధ్యాపకునిగా పని చేస్తున్న రామకృష్ణ సేవలను గుర్తించిన ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక చేసింది. అలాగే మర్కూక్ మండలం దామరకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు చిన్న బ్రహ్మయ్యకు రాష్ట్ర స్థాయి అవార్డు దక్కింది. బోధనలో నిబద్దత, విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందిస్తుండటంతో ఈ ఆవార్డు లభించింది. వర్గల్ మండలం మజీద్పల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బద్దిపడగ రమేశ్ రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. ఈయన ‘ఇళ్లు.. గుడి.. బడి ప్రపంచం’ యూట్యూబ్ చానల్ ద్వారా ప్రభుత్వ విద్యారంగ కార్యక్రమాలకు ఇతోధిక ప్రచారం కల్పించారు. జిల్లా స్థాయిలో 55 మంది ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలో 55 మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై నట్లు డీఈఓ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న వారిని శనివారం మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని టీటీసీ భవన్లో ప్రశంస పత్రాలతో పాటు సన్మానించనున్నట్లు తెలిపారు. -
రవిరాజ్ బోధనకు ప్రపంచస్థాయి ప్రశంసలు
నర్సాపూర్ రూరల్: ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు రవిరాజ్ వినూత్న రీతిలో యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యాబోధన చేస్తూ ప్రపంచ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నారు. నర్సాపూర్ మండలం అద్మాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు రవిరాజ్ బోధనలో కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. 2008 డీఎస్సీలో ఉపాధ్యాయునిగా ఎంపికై ఉమ్మడి మెదక్ జిల్లా కంగిటి మండలం చౌకన్ పల్లి ప్రాథమిక పాఠశాలలో బాధ్యతలు చేపట్టారు. 43 మంది విద్యార్థులతో కొనసాగుతున్న పాఠశాలలో 104 మంది విద్యార్థుల సంఖ్యను పెంచి మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు పొందారు. 2004లో అద్మాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలకు బదిలీపై వచ్చినప్పుడు 53 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం 70కి పైగా విద్యార్థుల సంఖ్యను పెంచి తన ప్రత్యేకతను చాటారు. నెల రోజుల క్రితం సొంతంగా లక్ష రూపాయలతో విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సులు, టై బెల్టులు, ఆట వస్తువులు డీఈఓ రాధాకిషన్ చేతుల మీదుగా అందజేశారు. -
సృజనాత్మకంగా బోధిస్తూ.. ఉన్నతంగా తీర్చిదిద్దుతూ..
అందరి నేస్తం.. ఆపన్నహస్తం ఇటీవల వజ్ర అవార్డుతో ప్రశాంత్కు సన్మానం.. వర్గల్ (గజ్వేల్): ఆధునిక హంగులతో చదువులకు వన్నెలద్దడమేకాకుండా.. రక్తదానాలతో స్పందించే హృదయంగా పేరొందారు వర్గల్ మండలం చాంద్ఖాన్మక్త ప్రైమరీస్కూల్ ప్రధానోపాధ్యాయుడు వరాల ప్రశాంత్. 2002లో నాచారం స్కూల్ టీచర్గా, శాకారం హెచ్ఎంగా, ప్రస్తుతం చాంద్ఖాన్మక్త హెచ్ఎంగా కొనసాగుతున్న ప్రశాంత్ ఆయా పాఠశాలలపై తనదైన ముద్ర వేశారు. సొంతంగా డబ్బు వెచ్చిస్తూనే, మిత్రులు, దాతల సహకారంతో డిజిటల్ క్లాస్రూమ్స్, తరగతి గోడలకు బోధన సంబంధ అంశాలతో ఎనామిల్ పెయింటింగ్స్, ఆకట్టుకునే బొమ్మలతో బడి వాతావరణాన్ని చదువుల నెలవుగా తీర్చిదిద్దారు. విద్యార్థులలో సామాజిక స్పృహ పెంపొందింపజేస్తూ.. శాకారం స్కూల్ను నందనవనంగా తీర్చిదిద్దారు. ఆయన కృషిని అభినందిస్తూ 2020–21 ‘రైస్ అండ్ షైన్’ ఎన్సీఈఆర్టీ జాతీయస్థాయి మ్యాగజైన్లో శాకారం పాఠశాల సక్సెస్స్టోరీ ప్రచురితం చేశారు. రేడియో పాఠాల రూపకల్పన, ఉపాధ్యాయ శిక్షణ మాడ్యూల్స్ తయారీ, పాఠ్యపుస్తకాల రచనలోనూ ప్రశాంత్ భాగస్వామిగా నిలిచారు. పిల్లల మానసిక అభివృద్ధికి.. గత వేసవి సెలవులలో మొబైల్ ఫోన్లకు పిల్లలు అతుక్కుపోకుండా ఉండడానికి పిల్లల శారీరక మానసిక అభివృద్ధికి డిజిటల్ డీటాక్స్ పేరుతో 21రోజులు, 21 రకాల కార్యక్రమాలతో సమాజానికి సరికొత్త విధానం పరిచయం చేశారు. అతని సేవలకు గుర్తింపుగా 2021లో మండల స్థాయి, 2022లో జిల్లా స్థాయి, అదేసంవత్సరం రాష్ట్రస్థాయి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అవార్డు, 2023లో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు వరించాయి. తాజాగా 2025 జూన్లో సేవారంగంలో వజ్ర పురస్కారం సొంతమైంది. కేవలం బోధనకే పరిమితం కాకుండా 74 సార్లు రక్తదానం, 3 సార్లు ప్లేట్లెట్లు దానం చేసి ఆపదలో స్పందించే హృదయంగా పేరొందారు. అటు చదువులకు, సమాజానికి ఉపయుక్తంగా నిలుస్తూ అందరి నేస్తంగా అభినందనలు చూరగొంటున్నారు. డిజిటల్ హంగులు కల్పించి.. 74సార్లు రక్తదానం చేసి పాఠశాలలపై ‘ప్రశాంత్’ ముద్ర సదాశివపేట రూరల్(సంగారెడ్డి): విద్యార్థులతో కలిసి ఆడుతారు పాడుతారు.. వారి పక్కనే నేలపై కూర్చుంటారు.. వారిని అక్కున చేర్చుకొని పాఠాలు చెబుతారు.. అందుకే ఆయనంటే విద్యార్థులకు చాలా ఇష్టం. విద్యార్థులంటే ఆయనకు ప్రాణం. ఆయనే సదాశివపేట మండలం మెలగిరిపేట్, అంకేనపల్లి, చందాపూర్ ప్రభుత్వ పాఠశాలల్లో 28 ఏళ్లుగా విధులు నిర్వహించిన హెచ్ఎం బి.అశోక్ కుమార్. మరోవైపు రోటరీ క్లబ్ కార్యదర్శిగా, వాసవీ క్లబ్ అధ్యక్షుడిగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. తాను పని చేసే పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటు, విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సులు, టై, బెల్ట్, గ్లాసులు, ప్లేట్స్తో పాటుగా నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. అదేవిధంగా తరగతి గదులను సొంత డబ్బుతో వాల్ పెయింటింగ్ తో అందంగా తీర్చిదిద్దారు. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ను వినియోగిస్తూ విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి కలిగేలా సృజనాత్మకంగా బోధిస్తున్నారు. హెచ్ఎం అశోక్ కుమార్ సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయనకు జిల్లా, మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను సైతం అందజేసింది. వచ్చే ఏడాది ఆగస్టులో అయన పదవీ విరమణ పొందనుండగా, ఇటీవల మునిపల్లికి బదిలీపై వెళ్లారు. -
రైతు బాంధవుడు కేసీఆర్
● ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి ● కొండపోచమ్మ సాగర్పై బీఆర్ఎస్ నేతల ర్యాలీ మర్కూక్(గజ్వేల్): రైతును రాజుగా చూడాలనుకున్న ఏకైక నాయకుడు మాజీ సీఎం కేసీఆర్ అని ఎఫ్డీసీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. మండలంలోని కొండపోచమ్మ సాగర్ వద్ద గురువారం బీఆర్ఎస్ నేతలు, నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వంటేరు మాట్లాడుతూ గోదావరి జలాలను బీడు భూములకు పారించి రైతుల కష్టాలను తీర్చిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. కాళేశ్వరం, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ వంటి ప్రాజెక్టుల ద్వారా గోదావరి జలాలను రైతుల పొలాలకు పారించారన్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి కేసీఆర్పై కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కరుణాకర్రెడ్డి, మాజీ ఎంపీపీ పాండుగౌడ్, మాజీ జెడ్పీటీసీ రాంచంద్రం యాదవ్, వైస్ ఎంపీపీ బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కళాకారుడిగా రంగులద్ది.. గురువుగా మెరుగులు దిద్ది
పాపన్నపేట(మెదక్): ఆటపాటలతో విద్యార్థులను అక్కున చేర్చుకుంటూ.. వినూత్న బోధనలతో ఆకట్టుకుంటూ.. చిన్నారుల భవితకు బంగారు బాటలు వేస్తున్నారు ఉపాధ్యాయుడు ఆశన్నగారి మల్లేశం. ఇతను మెదక్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం బస్వాపూర్ పాఠశాలలో 2012లో టీచర్ వృత్తిలోకి ప్రవేశించారు. విద్యార్థుల సంఖ్యను పెంచే ఉద్దేఽశ్యంతో గ్రామ సర్పంచ్తో మాట్లాడి మీ పిల్లల బాధ్యత మాది అంటూ భరోసా ఇచ్చి వారి పిల్లలను సర్కార్ బడిలో చేర్పించారు. దీంతో వెలవెలబోయిన పాఠశాల కొద్ది రోజుల్లోనే కళకళ లాడింది. కుర్తివాడ బడి రూపురేఖలు మార్చి.. బదిలీపై కుర్తివాడ వచ్చిన ఆయన కొద్ది రోజుల్లోనే బడి రూపం మార్చారు. పాఠశాలకు పెయింటింగ్లతో కొత్త కళను తెచ్చారు. చాలా మంది తమ పిల్లలను సర్కార్ బడిలో చేర్పించారు. ఆటల్లో.. చదువుల్లో.. సాంస్కృతిక కార్యక్రమాల్లో.. మాకెవరు లేరు పోటీ అనేలా విద్యార్థులను తీర్చి దిద్దుతున్నారు మల్లేశం. -
సార్ సేవలకు ఇరవై ఏళ్లు
శుక్రవారం శ్రీ 5 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025పిల్లల మధ్యే విశ్రాంత జీవితం జగదేవ్పూర్(గజ్వేల్): పదవీ విరమణ పొందిన చాలా మంది శేష జీవితం పొందుతారు. కానీ రిటైర్డు ఉపాధ్యాయుడు బాల్రెడ్డి మాత్రం పిల్లల మధ్యే జీవితం సాగిస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. జగదేవ్పూర్ మండలం తిగుల్ గ్రామానికి చెందిన తొందూరు బాల్రెడ్డి ఉపాధ్యాయుడిగా 34 ఏళ్లు పనిచేశారు. 2004లో రిటైర్డు అయ్యారు. అయినా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ఉచితంగా విద్యాబోధన చేస్తున్నారు. ఏడేళ్ల పాటు ప్రయివేట్ పాఠశాలలో పనిచేశారు. అనంతరం గజ్వేల్ మండలం దాచారం ప్రభుత్వ ప్రాఽథమిక పాఠశాలలో మూడేళ్లు, క్యాసారం పాఠశాలలో రెండేళ్లు, ప్రజ్ఞాపూర్ పాఠశాలలో ఏడాది, తిగుల్ ప్రాఽథమిక పాఠశాలలో ఏడేళ్లుగా పనిచేస్తున్నారు. తెలుగు, గణితం పిల్లలకు బోధిస్తున్నారు. బాల్రెడ్డి సేవలకు జిల్లా విద్యాశాఖ అధికారులు, మాజీ మంత్రి హరీశ్రావు శాలువాతో సత్కరించి అభినందించారు. ఆరోగ్యం సహకరించినన్ని రోజులు పిల్లలకు పాఠాలు చెబుతానని తెలిపారు. -
వారిపై రాజద్రోహం కేసు నమోదు చేయండి
కేంద్ర మంత్రి బండి సంజయ్కి గిరిజనుల వినతి హుస్నాబాద్: లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన తెల్లం వెంకట్రావ్, సోయం బాపురావులపై రాజద్రోహం కేసు నమోదు చేయాలని గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బీజేపీ నాయకుడు గుగులోతు తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో గురువారం కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ని కలిసి వినతి పత్రం సమర్పించారు. భారత రాజ్యాంగం రిజర్వేషన్ 342 ప్రకారమే లంబాడి జాతిని ఎస్టీ జాబితాలో కలిపారన్నారు. అన్నదమ్ముల్లా కలిసిమెలసి ఉన్న లంబాడి, కోయ జాతుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు తదితరులు ఉన్నారు. గజ్వేల్: రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జి వంటేరు ప్రతాప్రెడ్డి మాతృమూర్తి వజ్రమ్మ మృతి చెందారు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వజ్రమ్మ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. వంటేరు ప్రతాప్రెడ్డి స్వగ్రామం జగదేవ్పూర్ మండలం దౌలాపూర్లో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వజ్రమ్మ మృతి చెందిన విషయం తెలుసుకున్న పలువురు నేతలు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు సంతాపం తెలిపారు. జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్రెడ్డి సిద్దిపేటఎడ్యుకేషన్: విద్యార్థులు తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి (డీఐఈఓ) రవీందర్రెడ్డి సూచించారు. సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల (కోఎడ్యుకేషన్)లో గురువారం విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ఇంటర్ విద్య బలోపేతానికి ప్రత్యేక కృషి చేస్తోందన్నారు. ఇంటర్ బోర్డు డైరెక్టర్ కృష్ణ అదిత్య ప్రత్యేక చొరవతో జూనియర్ కళాశాలలకు నిధులు కేటాయించినట్లు చెప్పారు. కార్పొరేట్కు దీటుగా ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్నట్లు వివరించారు. విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకుని తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలని ఆకాంక్షించారు. కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ అధ్యాపకుల సేవలను వినియోగించుకుని జీవితంలో ఉన్నత స్థానాల్లో నిలవాలన్నారు. ఈ సందర్భంగా గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని అధ్యాపకులను సన్మానించారు. -
ఆటో ఏర్పాటు చేసి.. హంగులు కల్పించి..
కొండపాక(గజ్వేల్): సిర్సనగండ్లలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రధానోపాధ్యాయుడు జయప్రకాశ్రెడ్డి విశేష కృషి చేస్తున్నారు. మరోవైపు తన సొంత ఖర్చులతో పాఠశాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అంతేకాకుండా విద్యార్థుల రవాణా సౌలభ్యం కోసం ఆటో ఏర్పాటు చేశారు. క్రీడా దుస్తులు, స్వచ్ఛమైన తాగు నీటి ఆర్వో ప్లాంట్, చదువు అర్థం అయ్యేలా ఐఎఫ్బి స్క్రీన్ ఎల్ఈడీ ప్యానల్, కంప్యూటర్, తరగతి గదుల్లో కార్పెట్లు, పాఠశాలకు అందమైన రంగులు వేయడం వంటి వాటి కోసం సుమారు రూ. 9లక్షలు వెచ్చించారు. బడి బాట కార్యక్రమంలో భాగంగా సుమారు70 మంది విద్యార్థులను పాఠశాలలో చేర్పించారు. ప్రస్తుతం 210 మంది విద్యార్థులకు విద్యాభ్యాసం జరుగుతోంది. -
కాంగ్రెస్ కుట్రలు తిప్పికొడతాం
● అపర భగీరథుడు కేసీఆర్ ● దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి ● మల్లన్న సాగర్ వద్ద మహాధర్నా ● కేసీఆర్, హరీశ్రావుల ఫ్లెక్సీకి జలాభిషేకంతొగుట(దుబ్బాక): గోదావరి జలాలతో తెలంగాణను సస్యశ్యామలం చేసిన కేసీఆర్పై కాంగ్రెస్ సర్కార్ ఎన్నికుట్రలు చేసినా ప్రజలు తిప్పికొడతారని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. కేసీఆర్కు మద్దతుగా మల్లన్న సాగర్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కట్టపై బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్, హరీశ్రావులపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగానే సీబీఐ కేసు పెట్టారని ఆరోపించారు. మేడిగడ్డ ప్రాజెక్టులో కేవలం రెండు పిల్లర్లు కూలితే రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. మల్లన్న సాగర్ నుంచి మెదక్, సిరిసిల్లా, నల్గొండ జిల్లాల్లో పంటలకు సాగునీరు అందుతున్నది వాస్తవం కాదా అన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డికి ప్రాజెక్టులపై అవగాహన లేదన్నారు. రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లకు గోదావరి జలాలు పొంగిపొర్లుతుంటే కాంగ్రెస్ నాయకులకు కళ్లకు కనిపించడంలేదా అని నిలదీశారు. కుంగిన మేడిగడ్డ పిల్లర్లకు మరమ్మతు చేయాలని ఎన్డీఏఎస్ రిపోర్టు ఇస్తే రేవంత్ సర్కార్ రిపోర్టును బుట్టదాఖలు చేసిందని ఆరోపించారు. ప్రాజెక్టులు నిర్మించి సాగునీరు అందించిన కేసీఆర్కు ప్రజల్లో ఉన్న ఆదరణచూసి ఓర్వలేకనే రేవంత్ సర్కార్ సీబీఐ కేసు పేరుతో వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు తగిన బుద్ధిచెబుతారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావుల ఫ్లెక్సీకి జలాభిషేకం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మనోహర్రావు, సతీష్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి, నియోజకవర్గంలోని మాజీ ప్రజా ప్రతినిధులు, ఎఎంసీ చైర్మన్లు పాల్గొన్నారు.రాజకీయ కుట్రలో భాగమే.. ఎమ్మెల్సీ దేశపతి ఆరోపణ సిద్దిపేటజోన్: రాజకీయ కుట్రలో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని సీబీఐకి అప్పగించాలని చూస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఆరోపించారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక మెడిగడ్డ కాదని, 20 రిజర్వాయర్ల సమూహమేనన్నారు. కేసీఆర్, హరీశ్రావు, ఇంజినీరింగ్ అధికారులు కష్టపడి రైతన్నల ముంగిట్లో సాగునీరు తెచ్చారని అన్నారు. -
మల్లన్న ఆలయ ఈఓగా వెంకటేశ్
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయ ఈఓగా వెంకటేశ్ బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈఓ ఆలయానికి ఉద యం రావడంతో అర్చకులు స్వాగతం పలికి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈఓ తన చాంబర్లో ఏఈఓ బుద్ది శ్రీనివాస్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ఉద్యోగులు నూతన ఈఓను మర్యాదపూర్వకంగా కలిశారు. మద్యం దుకాణాలు బంద్ సిద్దిపేటకమాన్: వినాయక నిమజ్జనం సందర్భంగా జిల్లాలోని మద్యం, కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారి శ్రీనివాసమూర్తి బుధవారం తెలిపా రు. ఈ నెల 5వ తేదీ సాయంత్రం నుంచి ఈ నెల 7వ తేదీ ఉదయం వరకు మూసివేసి ఉంటాయన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు బస్సు సౌకర్యం హుస్నాబాద్: స్థానిక ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల సౌకర్యార్థం బుధవారం బస్సు సౌకర్యం కల్పించారు. విద్యార్థులకు హాస్టల్ వసతి, బస్సు సౌకర్యం లేకపోవడంతో సీట్లు నిండటం లేదని అధికారులు గుర్తించారు. దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో అమ్మాయిలకు, టీచర్స్ ట్రైనింగ్ సెంటర్లో అబ్బాయిలకు హాస్టల్ వసతి కల్పించారు. హుస్నాబాద్ బస్టాండ్ నుంచి కిషన్నగర్లో ఉన్న ఇంజనీరింగ్ కళాశాల వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సు సౌకర్యం కల్పించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ తిరుపతిరెడ్డి తెలిపారు. ఈ నెల ఒకటి నుంచి తరగతులు ప్రారంభమయ్యాయని తెలిపారు. అభ్యసన సామగ్రితో ఉత్తమ ఫలితాలు: డీఈఓ కొమురవెల్లి(సిద్దిపేట): అభ్యసన సామగ్రి ఉపయోగించి బోధిస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని డీఈఓ శ్రీనివాస్రెడ్డి సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన టీఎల్ఎం మేళాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు అభ్యసన సామగ్రిని ఉపయోగించాలన్నారు. దీంతో విద్యార్థులకు అర్థవంతమైన బోధన అందుతుందన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ రమేశ్, రాజమల్లయ్య, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం గజ్వేల్రూరల్: విద్యారంగ సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న రూ. 8200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే దిశగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా స్పందించి విద్యారంగ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఆదిత్య, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
నిమజ్జనానికి ఏర్పాట్లు చేయండి
● కలెక్టర్ హైమావతి ● పలు శాఖల అధికారులతో సమావేశంసిద్దిపేటరూరల్: జిల్లా వ్యాప్తంగా వినాయక విగ్రహాల నిమజ్జనాలు 4, 5, 6వ తేదీల్లో జరుగుతున్నందున మున్సిపాలిటీల్లో, గ్రామాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో పోలీస్, మున్సిపల్, ఎలక్ట్రిసిటీ, ఎక్సైజ్ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిమజ్జనాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. కోమటిచెరువు, చింతలచెరువు, నర్సాపూర్ చెరువు వద్ద నిమజ్జనాలకు క్రేన్లను ఏర్పాటు చేసి, అనంతరం క్లీన్ చేయాలన్నారు. గ్రామాల్లో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మండల ప్రత్యేకాధికారులు చెరువులు, కుంటలు నిండిన క్రమంలో రాత్రి వేళల్లో కాకుండా పగటి వేళల్లో నిమజ్జనాలు చేసేలా చూడాలన్నారు. సమావేశంలో అదనపు డీసీసీ అడ్మిన్ కుశాల్కర్, ఏసీపీ సదానందం, రవీందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, విద్యుత్శాఖ అధికారులు, సీఐలు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించాలి జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బుధవారం రోడ్డు భద్రతా కమిటీ, మత్తుపదార్థాల వినియోగ నివారణపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలన్నారు. ప్రతీ గ్రామంలో రోడ్డు దాటేందుకు ఒకే డివైడర్ ఉండాలని, అనధికారికంగా రోడ్డు తొలగిస్తే కఠినంగా వ్యవహరించాలన్నారు. ఎక్కడైనా మత్తుపదార్థాలు విక్రయిస్తే వెంటనే 1908 నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. జీపీఓలను నియమిస్తాం సిద్దిపేటరూరల్: జిల్లా వ్యాప్తంగా ఎంపికై నా 150 మంది జీపీఓ (గ్రామ పరిపాలన అధికారి)లకు కౌన్సెలింగ్ నిర్వహించి గ్రామాలకు నియమిస్తామని కలెక్టర్ హైమావతి తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) లోకేష్ కుమార్ జీపీఓల నియామకాలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీపీఓలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం వారికి పోస్టింగ్ ఇస్తామన్నారు. -
నిర్మాణాలు వేగిరం చేయాలి
కలెక్టర్ హైమావతితొగుట(దుబ్బాక): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ హైమావతి లబ్ధిదారులకు సూచించారు. మండలంలోని తుక్కాపూర్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు ఇళ్లు నిర్మించుకోవాలన్నారు. మరుగుదొడ్లు ఇంటిలో కాకుండా బయట నిర్మించుకోవాలన్నారు. అంతకు ముందు స్థానిక పీహెచ్సీని తనిఖీ చేశారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీఓ శ్యామల పాల్గొన్నారు. -
సహకారం.. పొడిగింపు
పీఏసీఎస్ల పనితీరు ఆధారంగా నిర్ణయంప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పాలకవర్గాల పనితీరు ఆధారంగా పదవీకాలాన్ని పొడిగించారు. ఆగస్టు 14వ తేదీతో పీఏసీఎస్ల పదవీకాలం ముగిసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 111పీఏసీఎస్లు ఉండగా.. పాలకవర్గాల పనితీరు మేరకు 89 వాటికే పదవీకాలం పొడిగిస్తూ బుధవారం ఆయా జిల్లాల డీసీఓలు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే మెదక్ జిల్లాలోని రాంపూర్ పీఏసీఎస్కు పర్సన్ ఇన్చార్జి కొనసాగుతుండగా మరో 21 సంఘాల పదవీకాలం పొడిగింపు సహకార శాఖ పెండింగ్లో పెట్టింది. సాక్షి, సిద్దిపేట: మండల స్థాయిలో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, పంట రుణాలు అందజేస్తూ పీఏసీఎస్లు అండగా నిలుస్తున్నాయి. ఇలాంటి వాటికి ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుంది. సంఘం పరిధిలోని రైతులు, డైరెక్టర్లు, చైర్మన్లతో కూడిన పాలకవర్గాన్ని ఎన్నుకుంటారు. 2020లో ఎన్నికై న పాలకవర్గం గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 14తో ముగియగా మరో ఆరు నెలలు(ఆగస్టు 14వ తేదీ) వరకు ఇదివరకే పొడిగించారు. గత నెలలో మరో ఆరు నెలలు పదవీకాలం పొడిగించేందుకు సహకార శాఖ పలు నిబంధనలు పెట్టింది. పనితీరుపై ఆరా.. తాజా నిబంధనల ప్రకారం పనితీరు మెరుగ్గా ఉంటేనే వాటి పాలకవర్గాల గడువు పొడిగింపు ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు సంఘాల వారీగా పది అంశాలతో కూడిన సమాచారం అందించాల్సిందిగా జిల్లా సహకార శాఖను ఆదేశించింది. సొసైటీ పరిధిలో పాత బకాయిల పరిస్థితి రుణాల తిరిగి చెల్లింపులు సక్రమంగా ఉన్నాయా? నిధుల దుర్వినియోగం ఏమైనా జరిగిందా? జరిగితే వాటిపై ఎలాంటి విచారణ చేపట్టారు? దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకున్నారా? సొసైటీ కార్యకలాపాలపై ఆడిట్ చేశారా? తదితర ఆంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఉత్తర్వులు జారీ చేశాం జిల్లాలో 18 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పదవీకాలం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశాం. మరో మూడు సంఘాలు హుస్నాబాద్, అల్లిపూర్, దుబ్బాక పదవీకాలం పొడిగింపు పెండింగ్లో ఉంది. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే వాటి ప్రకారం చర్యలు తీసుకుంటాం. –నాగేశ్వర్రావు, డీసీఓ, సిద్దిపేట -
గులాబీ బాస్.. రిలాక్స్!
సాక్షి, హైదరాబాద్: తన తండ్రిపై ఎంతో ఒత్తిడి నెలకొని ఉండొచ్చని, అందుకే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఉంటారని కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే.. ఒకవైపు కవిత ప్రెస్మీట్ పెట్టి సంచలన ఆరోపణలు, కీలక చేసిన వేళ.. ఆమె తండ్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మాత్రం రిలాక్స్గా గడిపారు. సెప్టెంబర్ 1వ తేదీన కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కాళేశ్వరంలో కేసీఆర్కు అవినీతి మరక అంటడానికి హరీష్రావు, సంతోష్రావులే కారణమని ఆరోపించడం కలకలం రేపింది. దీనికి తోడు ఈ మధ్యకాలంలో ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ సీనియర్లకు, పార్టీ కేడర్కు కోపం తెప్పించింది. దీంతో ఎర్రవల్లిలోని ఫామ్హౌజ్లో ఎడతెరిపి లేకుండా బీఆర్ఎస్ కీలక నేతలతో కేసీఆర్ మంతనాలు జరుపుతున్నారు. బుధవారం ఉదయం నుంచి కూడా భేటీ జరుగుతుండగా.. కవిత ప్రెస్మీట్ సమయంలో మధ్యలోనే ఆయన బయటకు వెళ్లారు. కారులోనే వ్యవసాయ క్షేత్రం చుట్టూ తిరిగి పొలాలను చూసొచ్చారు. తిరిగి ఫామ్హౌజ్కు వచ్చి నేతలతో భేటీ కొనసాగించారు. -
కవిత సస్పెన్షన్ సబబే..
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాక: ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ విషయంలో తమ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిన్నామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన సాక్షితో మాట్లాడారు. కొద్దిరోజులుగా కవిత చేసే పనుల వలన పార్టీకి నష్టం జరుగుతుందన్నారు. తప్పు చేస్తే కుటుంబసభ్యులైనా సహించబోనని గతంలోనే కేసీఆర్ చెప్పారన్నారు. ప్రాణాలు పణంగా పెట్టి ప్రత్యేక రాష్ట్రం సాధించిన కేసీఆర్ అడుగు జాడల్లోనే నడుచుకుంటామన్నారు. కార్యకర్తలు, నాయకులు ఆందోళన చెందవద్దని, అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. -
పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం
అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్కొండపాక(గజ్వేల్): పరిసరాల పరిశుభ్రతలతోనే వ్యాధులను దూరం చేసుకోవచ్చని అదనపు కలెక్టర్ గరీమా ఆగర్వాల్ అన్నారు. మండలంలోని దుద్దెడలో పంచాయతీ సిబ్బంది, అధికారులతో కలిసి మంగళవారం పర్యటించారు. పారిశుద్ధ్య నిర్వహణ, ఇంట్లో వాడుకునే నీటిని పరిశీలించారు. కొందరి ఇళ్లల్లో నీరు ఎక్కువ రోజులుగా నిల్వ ఉండటాన్ని గుర్తించి బయట పడేయిస్తూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గరీమా అగర్వాల్ మాట్లాడుతూ నివాస ప్రాంతాల్లో పారిశుద్ధ్యం లోపించవద్దన్నారు. సంపులు, నీటి తొట్టిల్లో మూడు నాలుగు రోజుల కంటే ఎక్కువ రోజుల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. వారం రోజులకోమారు మురికి కాలువలను శుభ్రం చేయాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ అధికారి దేవకీదేవి, మండల ప్రత్యేకాధికారి నాగరాజు, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఎంపీఓ మల్లికార్జున్, ఏఎంపీ డైరెక్టరు కొమ్ము మల్లికార్జున్ పంచాయతీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఆరోపణలు తగవు
హుస్నాబాద్: మాజీ మంత్రి హరీశ్రావు, సంతోశ్రావులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తాలో కవిత ఫ్లెక్సీని దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కవిత బీజేపీకి అమ్ముడుబోయిందని విమర్శించారు. ఆమైపె ఉన్న కేసులను మాఫీ చేసుకునేందుకు, తన రాజకీయ భవిష్యత్ కోసం హరీశ్రావును కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారన్నారు. అంతక ముందు అంబేడ్కర్ చౌరస్తాలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావులపై సీబీఐ విచారణ నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. -
బీఆర్ఎస్ నిరసనలు.. దిష్టిబొమ్మ దహనాలు
ఎమ్మెల్సీ కవిత తీరుపై ఆగ్రహాలుఅక్కన్నపేట(హుస్నాబాద్): జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు చేపట్టారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణను వ్యతిరేకిస్తూ, ఎమ్మెల్సీ కవిత తీరును నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. మంగళవారం బీఆర్ఎస్ నాయకుల ఆందోళనలతో అక్కన్నపేట మండలం కేంద్రం దద్దరిల్లింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీబీఐ విచారణ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వరప్రదాయిని అయిన కాశేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసివేసే కుట్ర చేస్తున్నారన్నారు. కవిత దిష్టిబొమ్మ దహనం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులు మండల కేంద్రంలో దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి హరీశ్రావుపై కవిత అనుచిత వ్యాఖ్యాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు పెసరు సాంబరాజు. నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ముందస్తుగా ఉపాధ్యాయ దినోత్సవం
టీచర్ల తీరుపై సర్వత్రా చర్చ చేర్యాల(సిద్దిపేట): తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అన్నట్లుగా ఉపాధ్యాయులు వ్యవహరించారు. మూడు రోజుల ముందే ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. మంగళవారం ముస్త్యాల మోడల్స్కూల్లో ఎంఈఓ కిష్టయ్య ఆధ్వర్యంలో టీఎల్ఎం మేళా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి హాజరయ్యారు. ఇదే కార్యక్రమంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. విచిత్రమేమిటంటే ఈ సందర్భంగా పలువురి ఉపాధ్యాయులకు ఉత్తమ అవార్డులు ప్రదానం చేయడం గమనార్హం. ఈ విషయమై ఎంఈఓ కిష్టయ్యను వివరణ అడగగా 5వ తేదీన సెలవు ఉందని, కనుక ముందస్తుగా జరుపుకొన్నట్లు చెప్పారు. -
పంట నష్టం లెక్కపక్కాగా..
భారీ వర్షాల వల్ల చోటుచేసుకున్న పంట నష్టాన్ని మరోసారి పక్కాగా అంచనా వేయాలని ప్రభుత్వం నుంచి వ్యవసాయశాఖకు ఆదేశాలు వచ్చాయి. ఈమేరకు సంబంధిత అధికారులు బుధవారం నుంచి క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలన జరిపి నష్టం అంచనా వేయడానికి సిద్ధమవుతున్నారు. జిల్లాలో 7,759ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రాథమిక అంచనాలో తేలింది. రెండోసారి జరపనున్న పరిశీలనలో పంట నష్టంపై పూర్తిస్థాయి స్పష్టత రానుంది. గజ్వేల్: జిల్లాలో ఇప్పటి వరకు 4.87లక్షల ఎకరాలకుపైగా పంటలు సాగులోకి వచ్చాయి. ఇందులో వరి 3.40లక్షల ఎకరాలు, మొక్కజొన్న 27,820, కంది 6594 ఎకరాల్లో సాగులోకి రాగా పత్తి 1.06లక్షల ఎకరాలపైగా సాగవుతోంది. మిగిలిన విస్తీర్ణంలో ఇతర పంటలు సాగు చేస్తున్నారు. జిల్లాలో ఈసారి భారీ వర్షాలు రైతాంగాన్ని కుదేలు చేశాయి. సీజన్ ఆరంభంలో అనావృష్టి నష్టాలు పాలుచేస్తే.. తాజాగా పంటలు ఏపుగా పెరుగు తున్న సమయంలో అతివృష్టి రైతులను కష్టాల్లోకి నెట్టేసింది. ఆశలపై నీళ్లు.. భారీ వర్షాలు రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. తెరిపి లేకుండా కురవడం వల్ల పంటలకు అపార నష్టం సంభవించింది. ప్రత్యేకించి వరికి తీవ్ర నష్టం కలిగింది. వేలాది ఎకరాల్లో ఇసుక మేటలు ఏర్పడ్డాయి. లోతట్టు చేలల్లో పత్తి నీటి మునిగి రంగుమారుతోంది. మరోవైపు తెగుళ్లు విజృంభించాయి. మొక్కజొన్న పంటకు సైతం భారీ నష్టం జరిగింది. క్షేత్రస్థాయి పరిశీలనకు.. జిల్లాలో పంట నష్టాన్ని పక్కాగా తేల్చాలని, ఇందుకోసం రెండోసారి పరిశీలన చేపట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో వ్యవసాయశాఖ అధికారులు బుధవారం నుంచి క్షేత్రస్థాయి పరిశీలనకు సిద్ధమయ్యారు. పంట నష్టం జరిగిన గ్రామాల్లో రైతు వారీగా గణన చేయడానికి కార్యాచరణతో ముందుకుసాగనున్నారు. ఈ విషయాన్ని జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి ధ్రువీకరించారు. నేటి నుంచి క్షేత్రస్థాయిలోకి అధికారులు -
దివ్యాంగులకు ఉపకరణాలు అందిస్తాం
గజ్వేల్రూరల్: దివ్యాంగులకు వారి వైకల్యాన్ని మేరకు ఉపకరణాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సమగ్ర శిక్షా విభాగం జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి రంగనాథ్ తెలిపారు. మంగళవారం ప్రజ్ఞాపూర్లోగల బాలుర ఉన్నత పాఠశాలలో భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ, సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవసరమయ్యే ఉపకరణాలను అందించేందుకు నిర్దారణ శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ శిబిరంలో గజ్వేల్, జగదేవ్పూర్, వర్గల్, కొండపాక, ములుగు, తొగుట, దౌల్తాబాద్, రాయపోల్, కుకునూర్పల్లి, మర్కుక్ మండలాల నుంచి 60మందికి పరీక్షలను నిర్వహించినట్లు తెలిపారు. త్వరలోనే వీరందరికీ ఉపకరణాలను అందిస్తామన్నారు. కార్యక్రమంలో వైద్యురాలు కోమల, భవిత సెంటర్ నిర్వాహకురాలు హరిత తదితరులు పాల్గొన్నారు. -
7న మల్లన్న ఆలయం మూసివేత
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయాన్ని ఈనెల 7న మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని మూసివేయనున్నట్లు తెలిపారు. ఆరోజు మధ్యాహ్నం 1గంట నుంచి మరుసటి రోజు ఉదయం సంప్రోక్షణ, ప్రాతఃకాలపూజల అనంతరం స్వామి వారి దర్శనం కల్పించనున్నుట్లు తెలిపారు. క్రీడల్లోనూ రాణించాలి జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాస్రెడ్డి ప్రశాంత్నగర్(సిద్దిపేట): విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో రాణించాలని డీఈఓ శ్రీనివాస్రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సిద్దిపేట అర్బన్ మండల స్థాయి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ రోజూ చిన్నారులు ఆటలు ఆడాలన్నారు. క్రీడల్లో రాణించడం ద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటనర్సయ్య, మండల విద్యాశాఖ అఽధికారి రాజ ప్రభాకర్రెడ్డి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కమిషనర్ రాజేంద్రకుమారేనా? పదవీ విరమణ పొందినా ఆయన పేరే చేర్యాల(సిద్దిపేట): పట్టణ ప్రజలను కమిషనర్ ఎవరనే అయోమయంలో పడేస్తోంది సిటిజన్ బడ్డీ యాప్. ఇక్కడ కమిషనర్గా పనిచేసి బదిలీపై వెళ్లి, పదవీ విరమణ పొందిన రాజేంద్రకుమార్ పేరే యాప్లో కనబడటంతో పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పట్టణ సమస్యలపై ఆన్లైన్లో ఫిర్యాదు చేయాల్సిన యాప్లో సరైన సమాచారం పొందుపర్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్థానిక అధికారుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు కమిషనర్లు మారినా యాప్లో పేరు మారకపోవడం గమనార్హం. అలాగే పదవీకాలం ముగిసి నా పాలక వర్గం పేర్లు అవే కొనసాగడం విచిత్రం. ప్రస్తుత కమిషనర్ ఎస్. నాగేందర్ చొరవ చూపి బడ్డీ యాప్లో పేర్లు మార్చేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు. తుది ఓటరు జాబితా విడుదలసిద్దిపేటరూరల్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లా యంత్రాంగం అన్ని గ్రామ పంచాయతీల్లో మంగళవారం తుది ఓటరు జాబితాను ప్రదర్శించింది. గత నెల 28న జాబితా ముసాయిదాపై స్వీకరించిన అభ్యంతరాలను పరిష్కరించి తుది జాబితా ను విడుదల చేశారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 508 పంచాయతీలు ఉండగా 4,508 వార్డులు ఉన్నాయి. గ్రామీణ ఓటర్లు 6,55,958 మంది ఉన్నారు. ఇందులో 3,21,766మంది పురుషులు, 3,34,184 మంది మహిళా ఓటర్లు, ఇతరులు ఆరుగురు ఉన్నారు. నిమజ్జన ఏర్పాట్లు వేగవంతం చేయాలి మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ సిద్దిపేటజోన్: వినాయక నిమజ్జనం ఏర్పాట్లు వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ సూచించారు. మంగళవారం స్థానిక కోమటి చెరువు వద్ద విగ్రహాల నిమజ్జనం ఘాట్ పరిసరాలను ఆయన పరిశీలించారు. బ్యారికేడ్లు, లైటింగ్ ఏర్పాట్లు పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. భారీ విగ్రహాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. చెరువు వద్ద గజ ఈతగాళ్ళు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతకుముందు పట్టణంలో పలు మరమ్మతుల పనులను పరిశీలించారు. -
నిబంధనలు పాటిస్తేనే ఇళ్లకు బిల్లు
● కలెక్టర్ హైమావతి ● వర్గల్ మండలంలో పర్యటన వర్గల్(గజ్వేల్): ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోవాలని కలెక్టర్ హైమావతి అన్నారు. ఇంటి నిర్మాణం 600 చదరపు అడుగులు దాటితే బిల్లు రాదన్నారు. మంగళవారం ఆమె వర్గల్, నెంటూరు, మీనాజీపేట గ్రామాలలో పర్యటించారు. ఆయా గ్రామాలలో శానిటేషన్ డ్రైవ్, ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, పాఠశాలల్లో భోజనాలు, పారిశుద్ధ్యం తీరు సమీక్షించారు. ఎక్కడికక్కడా అధికారులను హెచ్చరిస్తూ అప్రమత్తం చేశారు. సీజనల్ వ్యాధులబారిన పడకుండా ప్రజల్లో అవగాహన పెంపొందించాలన్నారు. డ్రైనేజీలు శుభ్రం చేయించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక, మొరం చేరేలా పోలీస్, రెవెన్యూ అధికారులు పర్యవేక్షించాలన్నారు. మండలంలో 367 ఇండ్లు మంజూరయ్యాయని, 244 ఇండ్లకు మార్కింగ్ ఇచ్చామని, 38 మంది సుముఖంగా లేరని ఎంపీడీఓ మచ్చేందర్ కలెక్టర్కు నివేదించారు. భూ భారతి రెవెన్యూ సదస్సుల దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని తహశీల్దార్ రఘువీర్రెడ్డిని ఆదేశించారు. నెంటూరు స్కూల్ లో మెనూకు భిన్నంగా టమాటా పప్పు పెడుతున్నట్లు గమనించి హెచ్ఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యాహ్నభోజనంలో మెనూ పాటించాలని, స్కూల్ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మీనాజీపేట హైస్కూల్ లో కిచెన్ గార్డెన్ను పరిశీలించి అభినందించారు. పరిశ్రమల్లో భద్రతా చర్యలు చేపట్టాలి సిద్దిపేటరూరల్: జిల్లాలోని ఫార్మా, కెమికల్ కంపెనీల్లో భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పరిశ్రమల పర్యవేక్షణ శాఖ కమిటీతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని కంపెనీల్లో భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. ప్రమాదాలపై కార్మికులకు మాక్డ్రిల్ నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ గణేశ్రామ్, డిప్యూటీ చీఫ్ ధర్మారెడ్డి, లేబర్ అధికారి, పొల్యూషన్ కంట్రోల్ బోర్టు అధికారులు, ఫైర్ సేఫ్టీ సిబ్బంది పాల్గొన్నారు.బస్తీ దవాఖానలో కలెక్టర్ బీపీ చెకప్ గజ్వేల్: ఆకస్మిక తనిఖీలతో నిత్యం బిజీగా ఉంటున్న కలెక్టర్ హైమావతి మంగళవారం గజ్వేల్లోని కోటమైసమ్మ సమీపంలోగల బస్తీ దవాఖానాలో బీపీ చెకప్ చేయించుకున్నారు. ఆస్పత్రిని ఆకస్మికంగా సందర్శించిన సందర్భంగా వైద్యాధికారి గౌతమితో మాట్లాడి తనకు బీపీ చెకప్ చేయాలని అడిగారు. వెంటనే సదురు వైద్యురాలు బీపీ చెకప్ చేసి నార్మల్గానే ఉందని తెలిపారు. అనంతరం మల్టీ విటమిన్ మందులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ఉధృతంగా ప్రబలుతున్నందువల్ల అప్రమత్తంగా పనిచేయాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు పరీక్షలు జరిపి తగిన మందులు ఇవ్వాలని సూచించారు. అంతకుముందు అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించారు. ఆ తర్వాత సీజనల్ వ్యాధులకు సంబంధించి ఎంత మంది రోగులకు దవాఖానకు వస్తున్నారని, డెంగీ పరీక్షల తీరును అడిగి తెలుసుకున్నారు. -
కవిత వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ కుట్ర: పల్లా
సాక్షి, హైదరాబాద్: పార్టీకి నష్టం కలిగిస్తే ఎవరిపై అయినా చర్యలు తప్పవంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. కార్యకర్తల నిర్ణయం మేరకే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పల్లా చెప్పుకొచ్చారు. కవిత వ్యాఖ్యలు వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందన్న పల్లా.. కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తోందంటూ వ్యాఖ్యానించారు. ‘‘ఎంతోమంది వస్తుంటారు.. పోతుంటారు.. కేసీఆర్ ఆదేశాలే మాకు శిరోధార్యం’’ అంటూ పల్లా రాజేశ్వర్రెడ్డి తేల్చి చెప్పారు.కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: కేపీ వివేకానందకేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. ‘‘గత కొద్దిరోజులుగా బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను కవిత అయోమయానికి గురిచేస్తున్నారు. బీఆర్ఎస్ అంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ, 60 లక్షల మంది సైనికులు, నాయకులు, కార్యకర్తలు ఉన్న సైన్యం. తప్పు చేస్తే కుటుంబ సభ్యులనైనా సహించమని గతంలోనే కేసీఆర్ చెప్పారు...కన్నకూతురు కంటే కూడా కష్టంలో పార్టీకి అండగా ఉన్న కార్యకర్తల భవిష్యత్త్ ముఖ్యమని తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయం. పార్టీ కంటే ఎవరు పెద్ద వారు కాదనే విషయం ఈ నిర్ణయంతో స్పష్టమైంది. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డారు. ఈ రోజు పార్టీ కోసం కన్న బిడ్డను కూడా వదులుకున్న గొప్ప నాయకుడు కేసీఆర్’’ అని వివేకానంద పేర్కొన్నారు.కాగా, హరీష్రావు, సంతోష్రావులు అవినీతి అనకొండలన్న కవితపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో పలు చోట్ల కవిత దిష్టిబొమ్మలను దహనం చేశారు. బీఆర్ఎస్ ఆఫీస్ల్లొ కవిత ఫ్లెక్సీలను తొలగించారు. -
బ్యాంకు సేవలుసద్వినియోగం చేసుకోండి
అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ కొండపాక(గజ్వేల్): ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా కలిగి ఉండి, బ్యాంకులు అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ అన్నారు. సోమవారం కొండపాకలో ఆర్థిక పరమైన అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎలాంటి రుణాలు కావాలన్నా ప్రభుత్వ బ్యాంకుల నుంచే పొందాలని, ప్రైవేట్ బ్యాంకులను ఆశ్రయించి ఇబ్బందులకు గురికావద్దన్నారు. ఆన్లైన్ మోసాలకు గురైతే వెంటనే 1930 కాల్ చేసి సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఏజీఎం రితీష్ పటేల్, డీసీసీబీ సీఈఓ శ్రీనివాస్, బ్యాంకు అధికారులు తదితరులు పాల్గొన్నారు -
ప్రభుత్వ బడుల్లోనే చదువుదాం
అక్కన్నపేట(హుస్నాబాద్): ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్నదే బీజేపీ లక్ష్యమని, అందులోభాగంగానే కేంద్ర మంత్రి బండి సంజయ్ .. విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేస్తున్నారని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని కన్నారం గ్రామంలో మోదీ కానుకగా పదో తరగతి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు సైకిల్ పంపిణీ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. రానున్న రోజుల్లో 8, 9వ తరగతి విద్యార్థులకు సైతం సైకిళ్లు అందజేస్తారన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ గుగులోతు రంగానాయక్, అసెంబ్లీ కో–కన్వీనర్ వేణుగోపాల్రావు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ వైఫల్యాలపై బీజేపీ రాస్తారోకో
ములుగు(గజ్వేల్): హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మండల కేంద్రంలోని రాజీవ్రహదారిపై సోమవారం బీజేపీ శ్రేణులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకుల మాట్లాడుతూ ఆరు గ్యారంటీల అమలు, రైతులకు సరిపోను యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతులు వ్యవసాయ పనులు మానేసి రోజూ యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారన్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన కారులకు నచ్చచెప్పడంతో ఆందోళన విరమింప జేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు లక్ష్మణ్గౌడ్ జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి బాగ్యలక్ష్మి, నాయకులు రమేష్యాదవ్, కృష్ణయాదవ్, హరికృష్ణ, శ్రీకాంత్, అరుణ్, రమేష్, ఎలేందర్రెడ్డి, కనుకయ్య, ప్రవీణ్గౌడ్, కర్ణాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం
● కలెక్టర్ హైమావతి ● ప్రజావాణిలో దరఖాస్తుల స్వీకరణ సిద్దిపేటరూరల్: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందిస్తున్న అర్జీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ హైమావతి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణికి ఇచ్చిన ఫిర్యాదులపై స్పందన వస్తుండటంతో ప్రజలకు ప్రజావాణిపై విశ్వాసం పెరుగుతోందన్నారు. అర్జీలను పూర్తి స్థాయిలో పరిశీలించి తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మొత్తంగా 174 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, కలెక్టరేట్ ఏఓ రెహమన్ తదితరులు పాల్గొన్నారు. ఖబ్రస్థాన్కు భూమిని కేటాయించండి ఏడెకరాల ఖబ్రస్థాన్ భూమి కేటాయించాలంటూ మల్లన్నసాగర్ ముంపునకు గురైన ముస్లింలు కోరారు. ఈమేరకు కలెక్టర్కు వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ ముంపునకు గురైన ఎర్రవల్లి, వేములఘాట్, లక్ష్మాపూర్, సంగారం గ్రామాలకు సంబంధించి ఏడు ఎకరాల ఖబ్రస్థాన్ భూమి పోయిందన్నారు. పునరావాసం, నష్టపరిహారం చెల్లించినా ఖబ్రస్థాన్కు భూమిని కేటాయించలేదన్నారు. భూమి లేకపోవడంతో 2019 నుంచి ఇబ్బందులు తప్పడంలేదన్నారు. తమకు అధికారులు స్థలాన్ని కేటాయించాలన్నారు. -
కాళేశ్వరంపై కుట్రలు సహించం
● బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ ● అమరవీరుల స్తూపానికి జలాభిషేకం ప్రశాంత్నగర్(సిద్దిపేట): కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను సహించబోమని, కాంగ్రెస్ తీరుతో అమరవీరుల ఆత్మ గోషిస్తోందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణను నిరసిస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సోమవారం ‘ఇది కదా కాళేశ్వరం’ అనే నినాదంతో రంగనాయకసాగర్ నుంచి బిందెలతో నీరు తెచ్చి, జిల్లా కేంద్రంలోని రంగధాంపల్లి అమరవీరుల స్తూపానికి జలాభిషేకం చేశారు. అనంతరం రాజీవ్రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ముఖ్యమంత్రి ఫ్లెక్సీని దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణకు జీవధార కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారు. ఉద్యమ సమయంలో జరిగిన కుట్రలే నేడు కాళేశ్వరంపై జరుగుతున్నాయన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినందుకు కేసీఆర్, హరీశ్రావులపై, కాళేశ్వరం పేరుతో సీబీఐ విచారణ చేయిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల ముందు కావాలని బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నిందలు మోపుతోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 228 పిల్లర్లకు గాను మూడు పిల్లర్లు కుంగితే రాద్దాంతం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేరుగా బీఆర్ఎస్ ను ఎదుర్కొనలేక ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శించారు. రాస్తారోకో చేస్తున్న బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు పక్కకు తప్పించే క్రమంలో వాగ్వాదం జరిగింది. సీఎం రేవంత్రెడ్డి ఫ్లెక్సీ దహనం చేసే క్రమంలో బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ నాయకులకు ప్రమాదం తప్పింది. రాస్తారోకో సందర్భంగా రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఫ్లెక్సీ దహనంలో తప్పిన ప్రమాదం ఫ్లెక్సీ దహనంలో త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణను నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రంగధంపల్లి చౌరస్తాలో రాస్తారోకో, సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ క్రమంలో ఫ్లెక్సీపై పెట్రోల్ పోసి నిప్పు అంటించే క్రమంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో పలువురు నాయకులకు గాయాలయ్యాయి. వెంటనే మంటలను ఆర్పివేశారు. -
పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం
వైద్యశాఖ అదనపు డైరెక్టర్ అమర్సింగ్నాయక్జగదేవ్పూర్(గజ్వేల్): వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులు ప్రబలవని మలేరియా విభాగ అదనపు డైరెక్టర్ అమర్సింగ్ నాయక్ అన్నారు. సోమవారం తిమ్మాపూర్ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో ఇంటింటికీ తిరిగి నీటి తొట్టెలను, నీటి కుళాయిలను, పరిసరాలను పరిశీలించారు. నీటినిల్వలను తొలగించారు. ఆయన మాట్లాడుతూ గ్రామంలో ప్రజలు జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నందున ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పరిశుభ్రత లోపిస్తే దోమలు వృద్ధి చెంది సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందన్నారు. జ్వరం వస్తే వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలన్నారు. రక్తపరీక్షల ఫలితాలను త్వరగా అందజేయాలి సిద్దిపేటకమాన్: పీహెచ్సీలలో రోగుల నుంచి సేకరిస్తున్న బ్లడ్ శాంపిల్స్ను టీహబ్లో పరీక్షలు నిర్వహించి త్వరగా ఫలితాలను అందజేయాలని మలేరియా విభాగ అదనపు డైరెక్టర్ అమర్సింగ్ నాయక్ తెలిపారు. సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోని టీహబ్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..టీహాబ్లో అన్ని రకాల పరీక్షలు నిర్వహించాలని అన్నారు. -
స్థానిక కసరత్తుముమ్మరం
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నెల 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా తుది ఓటరు జాబితాను సిద్ధం చేసి మంగళవారం ప్రకటించేందుకు సన్నద్ధమవుతున్నారు. అలాగే ఇటీవల ఎంపీటీసీ, జెడ్పీటీసీల వారీగా ఓటరు జాబితాను రూపొందించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. –సాక్షి, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీల వారీగా 1,291 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పంచాయతీ, ఎంపీడీఓ కార్యాలయాల్లో ఈ నెల 6న ఓటరు ముసాయిదాను ప్రదర్శించనున్నారు. ఈ నెల 8న జిల్లా, మండల స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఓటరు జాబితాపై అభ్యంతరాలుంటే లిఖిత పూర్వకంగా దరఖాస్తులను ఈ నెల 8వ తేదీ వరకు స్వీకరించనున్నారు. వాటిని 9వ తేదీ వరకు పరిష్కరించి 10న తుది జాబితాను వెల్లడించనున్నారు. జిల్లాలో జెడ్పీటీసీలు 26, ఎంపీటీసీలు 230 ఉన్నాయి. వార్డుల వారీగా తుదిజాబితా గ్రామ పంచాయతీలకు సంబంధించి వార్డుల వారీగా ఓటరు తుది జాబితాను ప్రకటించనున్నారు. అగస్టు 28న ఓటరు ముసాయిదాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఓటరు ముసాయిదా జాబితా పై 1,182 అభ్యంతరాలు రాగా వాటిని పరిష్కరించారు. మంగళవారం తుది జాబితాను విడుదల చే యనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాలు తగ్గే అవకాశం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాలు తగ్గే అవకాశం ఉంది. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 700 నుంచి 750 మంది ఓటర్లు ఉండే విధంగా చూడాలని ఇప్పటికే ఉన్నతాధికారుల నుంచి ఎంపీడీఓలకు ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. పలు చోట్ల 400 ఓటర్లకు సైతం ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లను ఇతర కేంద్రాలకు తరలించే అవకాశం ఉందని సమాచారం. ఏర్పాట్లు చేస్తున్నాం ఎంపీటీసీ, జెడ్పీటీసీల వారీగా ఓటరు ముసాయిదా జాబితాలను సిద్ధం చేసి ఆయా గ్రామ పంచాయతీలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రదర్శించనున్నాం. 8వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి వాటిని పరిష్కరించి తుది జాబితాను ఈ నెల 10న విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. – రమేశ్, సీఈఓ, జిల్లా ప్రజాపరిషత్తుగ్రామీణ మొత్తం ఓటర్లు: 6,55,958 మహిళలు: 3,34,186 పురుషులు: 3,21,766 ఇతరులు: 06 పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం -
మళ్లీ వానలు..
తప్పని ఇబ్బందులు ● పంటలకు తీరని నష్టం ● ఎర్రబడుతున్న పత్తిపంట దుబ్బాక: వారం రోజులుగా భారీ వర్షాలతో ఇబ్బందులు పడిన జనం.. ఇంకా కోలుకోకముందే మళ్లీ వానలు కురుస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. కేవలం రెండు రోజుల విరామంతో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రి నుంచి వర్షం ప్రారంభమై సోమవారం రోజంతా ముసురుపెట్టింది. పంటలకు తీరని నష్టం కలుగుతోంది. పత్తి, మొక్కజొన్న పంటలు సైతం.. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో నీరు నిలిచి పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతింటున్నాయి. పత్తి చేనులో నీరు నిల్వ ఉండటంతో ఎర్రబడి ఎదుగుదల లోపించడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. పుట్టెడు పెట్టుబడులు పెట్టామని తీరా పూత, కాయలు వస్తున్న సమయంతో అధిక వర్షాలతో పంటలకు నష్టం ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఎడతెరిపిలేని వానలు రైతన్నలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. పత్తి ఎర్రబడుతోంది నాలుగు ఎకరాల్లో పత్తి పంట వేశాను. కలుపు తీసి మందులు కొట్టిన. తీరా వానలు కురుస్తుండటంతో నీరు నిలిచి పత్తి పంట ఎర్రగా మారుతోంది. పూత, కాయలు కాసే దశలో నష్టం ఏర్పడుతుంది. ఇప్పటికే పుట్టెడు పెట్టుబడులు పెట్టాం. –భూపతిరెడ్డి, రైతు -
అందని యూరియా..ఆగని పోరు
జిల్లాలో రైతులకు యూరియా తిప్పలు తప్పడంలేదు. సాగు చేసిన పంటలకు సమయానికి యూరియా అందకపోవడంతో రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. వ్యవసాయ పనులు వదిలేసి రోజంతా యూరియా కోసం బారులు తీరుతున్నారు. సోమవారం హుస్నాబాద్లో ఎరువుల దుకాణాల వద్ద యూరియా లేదంటూ బోర్డులు వెలియడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు. రెండు చోట్ల రహదారులపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో వాహనాల రాకపోకలు కిలోమీటర్ల మేర స్తంభించాయి. వ్యవసాయ అధికారి వచ్చి యూరియా అందేలా చేస్తామని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. అలాగే యూరియా వస్తుందని తెలిసి మద్దూరు మండల కేంద్రంలోని రేబర్తి సొసైటీ వద్ద రైతులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. తీరా క్లస్టర్ పరిధిలో ఉన్న గ్రామాల రైతులకే టోకెన్లు ఇస్తామని అధికారులు తెలిపారు. దీంతో రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వచ్చి సర్దిచెప్పి మద్దూరు క్లస్టర్ పరిధిలోని రైతులకే టోకెన్లు ఇప్పించి యూరియా సరఫరా చేయించారు. కొండపాక, జగదేవ్పూర్లోనూ యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. రహదారులపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనలను విరమింపజేశారు. –హుస్నాబాద్/మద్దూరు(హుస్నాబాద్)/కొండపాక(గజ్వేల్)/జగదేవ్పూర్ జిల్లాకు 2 వేల టన్నుల యూరియా కేటాయింపు గజ్వేల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ఎంపీల కృషి ఫలితంగా జిల్లాకు 2వేల టన్నుల యూరియా వచ్చిందని డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి తెలిపారు. ఆదివారం గజ్వేల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే వెయ్యి టన్నుల యూరియా గజ్వేల్ రేక్ పాయింట్కు చేరిందన్నారు. యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కొరత తలెత్తకుండా వ్యవసాయశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. అవసరం మేరకే రైతులు యూరియా కొనుగోలు చేయాని సూచించారు. మద్దూరు: రేబర్తి సొసైటీ ఎదుట రైతులు బారులు -
షోకాజ్ నోటీసు ఇస్తారా? వేటు వేస్తారా?
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మంగళవారం ఎర్రవెల్లిలోని తన ఫామ్హౌజ్లో కీలక భేటీ నిర్వహించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంశంపై ఆయన చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సుదీర్ఘంగా కొనసాగుతున్న చర్చల దృష్ట్యా కవితపై చర్చలు తప్పవనే సంకేతాలు అందుతున్నాయి.కాళేశ్వరంలో కేసీఆర్కు అవినీతి మరక అంటడానికి హరీష్రావు, సంతోష్రావులే కారణమంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల తర్వాత నిన్న సాయంత్రం నుంచి కీలక నేతలతో సమావేశం జరుపుతున్నారు. మాజీ మంత్రి హరీష్రావు యూకే పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో తాజా పరిణామాలపై అందుబాటులో ఉన్న కీలక నేతలతో కేసీఆర్ చర్చిస్తున్నారు.నిన్న అర్ధరాత్రి ఫామ్హౌజ్ నుంచి వెళ్లిపోయిన కేటీఆర్ ఈ ఉదయం మళ్లీ అక్కడకు చేరుకున్నారు. కేటీఆర్తో పాటు జగదీష్ రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారని సమాచారం. కవిత వ్యాఖ్యలపై పలువురు సీనియర్లతో పాటు కేడర్ కూడా గుర్రుగా ఉంది. మొన్నీమధ్యే బహిరంగ లేఖ పేరిట కేటీఆర్ పైనా ఆమె తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఈ క్రమంలో కవితపై కేసీఆర్ చర్యలకు సిద్ధమవుతున్నారని పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. అయితే వ్యాఖ్యలకుగానూ షోకాజ్ నోటీసులు ఇస్తారా? లేదంటే పార్టీ నుంచే సస్పెండ్ చేస్తారా?.. చర్యలు ఎలా ఉండబోతున్నాయనే అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ.. వేటు వేస్తే తలెత్తే పరిణామాలపైనా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణ జాగృతి బీఆర్ఎస్కు అనుబంధ సంస్థగా కొనసాగుతోంది. ఒకవేళ కవితపై వేటు పడితే.. జాగృతిలో ఉన్న బీఆర్ఎస్ నేతలు ఎటు వైపు ఉంటారు? అనే కోణంలోనూ చర్చిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కాళేశ్వరం నివేదిక.. సీబీఐ విచారణకు ఆదేశం దరిమిలా బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నాయి. హుస్నాబాద్ నియోజకవర్గంలో హరీష్రావుపై వ్యాఖ్యలకు నిరసనగా కవిత దిష్టిబొమ్మను దగ్దం చేయడం గమనార్హం. -
వండర్ బుక్లో విశ్వేశ్వర్రావు
గజ్వేల్రూరల్: గజ్వేల్ ప్రాంతానికి చెందిన పాటల రచయిత, స్వరకర్త, గాయకుడు రాయారావు విశ్వేశ్వర్రావుకు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్లో స్థానం దక్కింది. 2019 నుంచి 2025 వరకు ప్రతియేటా అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా పాటలు రాయడంతో పాటు వాటిని కంపోజ్ చేయడం ద్వారా అద్భుతమైన ఘనతను సాధించడంతో లండన్ సంస్థ గుర్తించింది. ఈ సందర్భంగా శనివారం నగరంలోని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ కార్యాలయంలో సంస్థ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ నరేందర్గౌడ్ విశ్వేశ్వర్రావుకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఆదివారం గజ్వేల్లో లయన్స్ క్లబ్ ప్రతినిధులు, నాయకులు, పట్టణ వాసులు సన్మానించారు. -
శాశ్వత పరిష్కారం దిశగా..
భవిష్యత్లో ఇంతకంటే రెట్టింపు స్థాయిలో వరద ప్రవాహం వచ్చినప్పటికీ సమస్య రాకుండా రెవెన్యూ, మున్సిపల్ ఇరిగేషన్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే బఫర్ జోన్ నియమావళి మేరకు ఫీడర్ ఛానల్కు ఇరువైపులా నిర్మాణాలు.. కట్టడాలు లేకుండా చూడటంతో పాటు ఫీడర్ ఛానల్ ఇరువైపులా రేలింగ్ ఎత్తు పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు సమాచారం. అందుకు అనుగుణంగా ఇటీవల బల్దియా అధికారులు కోమటి చెరువు ఫీడర్ ఛానల్ ఆద్యంతం సర్వే చేసి సుమారు 15 కట్టడాలు ఇరిగేషన్ నిబంధనలు అతిక్రమించి నిర్మాణం చేపట్టినట్లు గుర్తించారు. వాటికి సంబంధించి నోటీసుల జారీ ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. శాశ్వత పరిష్కారం దిశగా ఫీడర్ ఛానల్ ఇరువైపులా రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల శాఖ సంయుక్తంగా హద్దులు నిర్ణయించే ప్రక్రియకు ప్రణాళికలు తయారు చేశారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముందుకు సాగేందుకు అధికార యంత్రాంగం వేచిచూస్తోంది. -
హామీలు విస్మరించిన సర్కార్
తపస్ జిల్లా అధ్యక్షుడు రఘువర్ధన్ రెడ్డిప్రశాంత్నగర్(సిద్దిపేట): కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నేటికీ అమలు చేయడంలేదని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) జిల్లా అధ్యక్షుడు ఊడెం రఘువర్ధన్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రఘువర్ధన్రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన హామీలను గుర్తు చేయడం కోసం సోమవారం ఉద్యోగుల విద్రోహ దినంగా పాటిస్తున్నామన్నారు. మన పాఠశాల – మన ఆత్మగౌరవం, ఆత్మగౌరవ సభ లను చేపడుతున్నామని చెప్పారు. అదే రోజు మధ్యాహ్నం హైదరాబాద్ లో జరిగే సీపీఎస్ ఉద్యోగుల ఆత్మగౌరవ సభను జయప్రదం చేయాలన్నారు. అంతకు ముందు వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. -
అధికారుల్లో కదలిక
ముంచెత్తిన ముంపుతో అధికారుల్లో కదలిక వచ్చింది. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ ముంపునకు గురైన నేపథ్యంలో బల్దియా దిద్దుబాటుకు శ్రీకారం చుట్టింది. కోమటి చెరువు ఫీడర్ ఛానల్ ఇరువైపులా నాలాలు కబ్జాకు గురికావడం.. నిర్మించిన అక్రమ కట్టడాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ఫీడర్ ఛానల్ ప్రక్షాళన దిశగా మూడు శాఖలు (మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్) అడుగులు వేస్తున్నాయి. ఇరిగేషన్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన వాటిని గుర్తించారు. ఇప్పటికే 15 నిర్మాణాలకు బల్దియా అధికారులు నోటీసులు జారీ చేశారు. – సిద్దిపేటజోన్ ముంపు నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై మూడు శాఖల అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మరోవైపు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముందుకు సాగేలా యంత్రాంగం సమాలోచన చేస్తోంది. జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు మత్తడికి పురాతన చరిత్ర ఉంది. ఎగువ భాగాన ఉన్న ఆయా చెరువుల నీటి ప్రవాహం కోమటి చెరువు ద్వారా కెనాల్ గుండా దిగువ భాగంలోని నర్సాపూర్ చెరువులోకి వెళ్తుంది. ఈ క్రమంలో గత ప్రభుత్వ హయాంలో సుమారు మూడు కిలోమీటర్ల పొడవునా కోమటి చెరువు ఫీడర్ ఛానల్ ఆధునీకరణ జరిగింది. కోమటి చెరువు గరిష్ట నీటి మట్టం దాటిన క్రమంలో నీటి ప్రవాహం మత్తడి దూకి నర్సాపూర్ చెరువుకు ఫీడర్ ఛానల్ ద్వారా వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల మునుపెన్నడూ లేనంత భారీ వర్షాలు కురవడంతో పెద్ద ఎత్తున వరదతో కోమటి చెరువు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఫీడర్ ఛానల్ లక్ష్యంగా ప్రణాళికలు భవిష్యత్తు తరాల కోసం అడుగులు అక్రమ కట్టడాలపై నజర్ ఇప్పటికే 15 నిర్మాణాలకు నోటీసులు -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
● రోగులకు మెరుగైన సేవలందించాలి ● కలెక్టర్ హైమావతి ● వేళలు పాటించని డాక్టర్లపై ఆగ్రహం మద్దూరు(హుస్నాబాద్): విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ హైమావతి వైద్యాధికారులకు సూచించారు. ఆదివారం లద్నూరు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. కలెక్టర్ సందర్శించినపుడు ఆస్పత్రిలో స్టాఫ్ నర్సు, అటెండర్ మాత్రమే విధుల్లో ఉన్నారు. వైద్యాధికారులు అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్లు క్రమం తప్పకుండా విధులకు వస్తున్నారా? లేదా అని అక్కడున్న సిబ్బందిని ప్రశ్నించారు. మెడికల్ ఆఫీసర్ రాసే ఓపీ రిజిస్టర్ ఎవ్వరికీ అర్థం కాకుండా రాస్తే ఏం ఉద్యోగం చేస్తున్నట్లు అని అసహనం వ్యక్తం చేశారు. డీఎంహెచ్ఓకు రిజిస్టర్ లు చూపించి కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. రోగులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం చేయించుకోవాలని సూచించారు. పీహెచ్సీ మరమ్మతు పనులను పరిశీలించారు. స్లాబ్ పైన నీరు నిలవకుండా చూడాలన్నారు. ప్లంబింగ్ ఇతరత్ర పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. మద్దూరు ఏంపీడీఓ, మండల కేంద్రంలో, గ్రామాల్లో ఓటరు జాబితా పై అభ్యంతరాలు స్వీకరణను క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించారు. ‘తపాస్పల్లి’ భూములు ఆక్రమిస్తే చర్యలు కొమురవెల్లి(సిద్దిపేట): మండలంలోని తపాస్పల్లి రిజర్వాయర్ భూములు ఆక్రమిస్తే చర్కలు తీసుకుంటామని కలెక్టర్ హైమావతి హెచ్చరించారు. ఆదివారం తపాస్పల్లి రిజర్వాయర్ను సందర్శించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ సామర్థ్యం, నీటి పంపింగ్, లభ్యతపై ఆరా తీశారు. అనంతరం ఆమె మట్లాడుతూ రిజర్వాయర్ భూములు కబ్జాకు గురికాకుండా రెవిన్యూ అధికారులు చూడాలన్నారు. కట్టపై ఉన్న పిచ్చిమొక్కలను వెంటనే తొలగించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. అలాగే రిజర్వాయర్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భూములపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలనిన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ రాజు, ఆర్ఐ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఫాగింగ్కూ డబ్బులు లేవట
● ఇట్లయితే మున్సిపాలిటీ నడిచేదెట్లా.. ● అసెంబ్లీలో ఎమ్మెల్యే హరీశ్రావు సిద్దిపేటజోన్: ‘సిద్దిపేట లాంటి పెద్ద మున్సిపాలిటీలో ప్రస్తుతం ఫాగింగ్కూ డబ్బులు లేని పరిస్థితి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టణ ప్రగతి నిధులు ఇచ్చేది. ఇప్పుడున్న ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఇట్లయితే మున్సిపాలిటీ ఎలా కొనసాగాలి’ అని అసెంబ్లీలో మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ప్రస్తావించారు. ఆదివారం శాసనసభ సమావేశాల్లో భాగంగా మున్సిపల్శాఖ బిల్లు అంశంపై చర్చ సాగుతోంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే.. సిద్దిపేట బల్దియా అంశంపై మాట్లాడుతూ పట్టణ ప్రగతి నిధులు లేవని, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంఘం నిధులు రావడం లేదన్నారు. రూపాయి లేకుండా మున్సిపాలిటీ ఎలా కొనసాగాలన్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో పరిస్థితి అయోమయంగా ఉందని, సిద్దిపేట మున్సిపాలిటీలో ముగ్గురు శానిటరీ ఇన్స్పెక్టర్లకుగాను ఒక్కరూ లేరన్నారు. అన్ని ఖాళీగా ఉంటే ఎట్లా అని ప్రశ్నించారు. -
పత్తికి అతివృష్టి దెబ్బ
గజ్వేల్: పత్తికి అతివృష్టి దెబ్బ తగిలింది. తెల్ల‘బంగారం’గా చెప్పుకునే ఈ పంటను ఎన్నో ఆశలతో సాగు చేస్తే రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. కొన్ని రోజులుగా తెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లోతట్టుగా ఉన్న పత్తి చేలల్లో నీరు నిలిచి ఇప్పటికే తీవ్ర నష్టం జరిగింది. జిల్లావ్యాప్తంగా ఈసారి 1.06లక్షల ఎకరాలకుపైగా పత్తి సాగులోకిరాగా ఇప్పటికే 60శాతానికి పంట దెబ్బతిన్నది. జిల్లాలో ఈసారి 5.60లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగులోకి వస్తాయని వ్యవసాయశాఖ అంచనా వేస్తే..ఇప్పటి వరకు 4.87లక్షల ఎకరాలకుపైగా పంటలు సాగులోకి వచ్చాయి. ఇందులో వరి 3.40లక్షలు, మొక్కజొన్న 27,820, కంది 6,594 ఎకరాల్లో సాగులోకి రాగా పత్తి 1.06లక్షల ఎకరాలపైగా సాగులోకి వచ్చింది. మిగిలిన విస్తీర్ణంలో ఇతర పంటలు సాగులోకి వచ్చాయి. తెల్ల‘బంగారం’గా చెప్పుకునే పత్తితో జిల్లాకు విడదీయరాని అనుబంధం ఉంది. వరి తర్వాత పత్తి పంటే ఇక్కడి రైతులకు ప్రధాన ఆధారం. నిజానికి ఈసారి 1.11లక్షల ఎకరాల్లో ఈ పంట సాగులోకి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేస్తే.. 5వేల ఎకరాలు తగ్గింది. సీజన్ ఆరంభంలో అనావృష్టితో నష్టపోయిన రైతులు.. తాజాగా అతివృష్టితో పంట దెబ్బతిని పీకల్లోతూ కష్టాలు కూరుకుపోయారు.పత్తి రికవరీకి అవకాశంరైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పత్తి పంట రివకరీ అయ్యే అవకాశం ఉన్నది. రైతులు ముఖ్యంగా తమ పత్తి చేలల్లో నీరు నిలిచి ఉండకుండా బయటకు పంపించే ఏర్పాట్లు చేసుకోవాలి. తెగుళ్ల సోకితే క్షేత్రస్థాయిలో వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించాలి. : స్వరూపరాణి, జిల్లా వ్యవసాయాధికారి వేలాది ఎకరాల్లో అపార నష్టం తెగుళ్ల దాడి, పంట ఎదుగుదలపైతీవ్ర ప్రభావం జిల్లాలో 1.06లక్షలఎకరాలకుపైగా సాగు పంట రికవరీకి యూరియా ప్రభావం ఆందోళనలో రైతాంగం అతివృష్టితో పత్తికి భారీ నష్టం కొన్ని రోజులుగా తెరిపిలేకుండా కురిసిన వర్షాలు మిగతా పంటలతో పోలీస్తే పత్తికి తీవ్ర నష్టాన్ని కలిగించాయి. కాలం కలిసొస్తే మంచి దిగుబడులు రావడంతోపాటు ధర కూడా ఆశించిన విధంగా పలకవచ్చనే ఆశతో రైతులు పత్తిని సాగు చేస్తుండగా..అతివృష్టి వారి ఆశలపై నీళ్లు చల్లింది. ఇదేవిధంగా వర్షాలు కొనసాగితే చెలక, నల్ల రేగడి భూముల్లో పత్తికి నష్టం తీవ్రత పెరగనున్నది. గడ్డి విపరీతంగా పెరిగిపోవడం, మొక్కలకు వేరుకుళ్లు, ఇతర తెగుళ్లు వ్యాపించే అవకాశమున్నది.పంటను రికవరీ చేసుకునే అవకాశం ఏదీ..? ఇప్పటికే భారీ వర్షాల కారణంగా తీవ్ర పంట నష్టానికి గురై రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉండగా.. యూరియా కొరత శాపంగా మారింది. అతివృష్టి వల్ల దెబ్బతిన్న పత్తిని కొంత మేరకై నా రికవరీ చేసుకోవడానికి యూరియాను వేస్తుంటారు. ప్రస్తుతం యూరియా దొరక్క రైతులు పంటపై ఆశలు చాలించుకున్నారు. కొందరు ఈ పంటను తొలగించడానికి సిద్ధమైన దయనీయ పరిస్థితి నెలకొన్నది. జిల్లావ్యాప్తంగా సాగులోకి వచ్చిన 1.06లక్షల ఎకరాల్లో భారీ వర్షాల వల్ల 60శాతానికిపైగా పంట ఇప్పటికే దెబ్బతిన్నది. వరద నీరు తొలగించిన చోట కొంత రికవరీ అవుతున్నది. ఈ సమయంలో యూరియా వేసి పంటను కాపాడుకోవాల్సి ఉండగా...యూరియా దొరికే పరిస్థితి లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. -
రోడ్డెక్కిన రైతులు
అక్కన్నపేటలో అధికారుల నిర్బంధందుబ్బాక మండలం చీకోడులో ధర్నా చేస్తున్న రైతులుసిద్దిపేటజోన్/అక్కన్నపేట(హుస్నాబాద్)/హుస్నాబాద్రూరల్/హుస్నాబాద్/తొగుట(దుబ్బాక)/ దుబ్బాకరూరల్: జిల్లాలో యూరియా కోసం రైతులు శనివారం రోడ్డెక్కారు. సిద్దిపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు, అలాగే.. అక్కన్నపేట మండల కేంద్రంలో నిరసన తెలిపారు. రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒకదశలో అధికారులను కలిసేందుకు విఫలయత్నం కావడంతో ఆందోళనకు దిగారు. దీంతో సిద్దిపేట, కరీంనగర్ మార్గంలో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. అక్కన్నపేట ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వందలాది రైతులు యూరియా కోసం రోడ్డెక్కి నిరసన తెలిపారు. స్థానిక రైతు వేదికలో వ్యవసాయ అధికారులను నిర్భందించారు. అక్కడే చుట్టుముట్టి అలసిపోయి కొందరు నిద్రించారు. వెంటనే యూరియా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే.. రెండు లారీల యూరియా వస్తుందన్న సమాచారంతో వివిధ గ్రామాల రైతులు, మహిళలు ఉదయం 4 గంటలకు తొగుటకు చేరుకున్నారు. ఆగ్రోస్ సేవా కేంద్రం, పీఏసీఎస్ కార్యాలయం ఎదుట లైన్లో నిలబడ్డారు. ఉదయం నుంచి నిలబడిన రైతులు ఓపిక నశించడంతో చెప్పులు, బీరు బాటిళ్లను వరుసలో ఉంచారు. లింగంపేటకు చెందిన నాల్గవ తరగతి విద్యార్ది రేవంత్ స్కూల్కు వెళ్లకుండా యూరియా కోసం తండ్రితో పాటు లైన్లో నిలుచున్నాడు. 9 గంటల వరకు వేచిచూసిన రైతులకు యూరియా సాయంత్రం వస్తుందనితేవో మోహన్ చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్–సిద్దిపేట రోడ్డుపై భైఠాయించారు. దుబ్బాక మండలం చీకోడ్ గ్రామంలో రైతులు యూరియా కోసం రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. హుస్నాబాద్: పంట కాలం ముగిసిన తర్వాత ఎరువులు ఇస్తారా అంటూ రైతులు మండిపడ్డారు. శనివారం హుస్నాబాద్ పట్టణంలోని రైతు మిత్ర, గ్రోమోరు ఎరువుల దుకాణాల వద్ద ధర్నా నిర్వహించారు. వరి నాట్లు వేసి దాదాపు నెల రోజుల నుంచి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నామని వాపోయారు. -
మల్లన్న సాగర్ను సందర్శించిన ఐఏఎస్లు
తొగుట(దుబ్బాక): కొమురవెల్లి మల్లన్న సాగర్ రిజర్వాయర్ను ఐఏఎస్ అధికారులు శనివారం సందర్శించారు. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సివరేజ్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ నర్సింహారెడ్డి సందర్శించిన వారిలో ఉన్నారు. వారితో పాటు మల్లన్న సాగర్ అధికారులు పాల్గొన్నారు. కొండపోచమ్మ సందర్శన మర్కూక్(గజ్వేల్): కొండపోచమ్మ సాగర్ను మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఆర్డిసిఎల్) మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి, ఎంఆర్డిసిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఇవి నర్సింహారెడ్డి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా మూసీ రివర్ ఫ్రంట్ అభివృధ్ది ప్రాజెక్ట్లో చేపట్టబోతున్న రేవెట్మెంట్లు, గేబియన్ వాల్ నిర్మాణ పనుల విధానాలను సమిక్షించారు. సంబందిత పనులలో అనుసరించబోయే సాంకేతికత, నాణ్యత ప్రమాణాలు మరియు నిర్మాణ విధానాలపై ఆరా తీశారు. అనంతరం కొండపోచ మ్మ సాగర్ నుంచి సంగారెడ్డికి వెళ్లే కాల్వను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. సృజనాత్మకతతో బోధించాలిజిల్లా కోఆర్డినేటర్ రమేష్ దుబ్బాకటౌన్: విద్యార్థులకు బోధన అభ్యాస సామగ్రి పద్ధతిని ఉపయోగించి సృజనాత్మకతతో విద్యాబోధన చేస్తే సులభంగా పాఠ్యాంశాలు అర్థమవుతాయని జిల్లా కోఆర్టినేటర్ రమేష్, మండల విద్యాధికారి జోగు ప్రభుదాస్ అన్నారు. శనివారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట మోడల్ స్కూల్లో మండల స్థాయి బోధన అభ్యాస సామగ్రి మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠశాలలో బోధన పద్ధతులు సృజనాత్మకతతో మెరుగుపరుచుకోవాలని సూచించారు. పాఠశాల ప్రిన్సిపల్ బుచ్చిబాబు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులున్నారు. -
సృజనాత్మక బోధనతోనే గుణాత్మక విద్య
జగదేవ్పూర్(గజ్వేల్): ప్రాథమిక పాఠశాల స్థాయిలో సృజనాత్మకతో బోధించడం వల్ల విద్యార్థులకు నేర్చుకోవాలన్న ఆసక్తిని రేకెత్తించేలా ఉండాలని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రమైన జగదేవ్పూర్లో శనివారం ప్రాథమిక స్థాయి టీఎల్ఎం (బోధనాభ్యసన సా ఛగ్రి) మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యారంగంలో ఉత్తమ ఫలితాల సాధనలో ప్రాథమిక ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా నేర్చుకునేలా బోధనా విధానం, తరగతి గది ఉండాలనే లక్ష్యంతో ఎఫ్ఎల్ఎన్ పద్ధతిని అమలు చేస్తున్నట్లు తెలిపారు. తరగతి గదిలోకి రాగానే చదవడం, రాయడం కాకుండా విద్యార్థులకు బోధనాభ్యాసన వైపు ఆసక్తిని రేకెత్తించేలా బోధన విధానాన్ని ఎంచుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. కాగా ఆయా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు రూపొందించిన పలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వీటిలో ఉత్తమ ప్రదర్శనలను ఎంపిక చేసి ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో మాధవరెడ్డి, తహశీల్దార్ నిర్మల, ఎంపీడీవో రాంరెడ్డి, కాంప్లెక్స్ హెచ్ఎం సైదులు, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా విద్యాధికారి శ్రీనివాస్రెడ్డి జగదేవ్పూర్లో టీఎల్ఎం మేళా -
అన్నదాత అగచాట్లు
ఆదివారం శ్రీ 31 శ్రీ ఆగస్టు శ్రీ 2025యూరియా కోసం నిత్యం ఎదురు చూపులుసాక్షి, సిద్దిపేట: జిల్లాలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. సాగు పనులు చేయాల్సిన రైతులు. యూరియా బస్తాల కోసం అనేక అవస్థలు పడుతున్నారు. 25 రోజులుగా పీఏసీఎస్, ఆగ్రోస్ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఎరువుల బస్తాల కోసం ఇళ్లు వదిలి అర్థరాత్రి నుంచే పీఏసీఎస్ కేంద్రాల ముందు నిరీక్షిస్తున్నారు. సమయానికి యూరియా వేయకపోతే పంట దిగుబడి తగ్గి.. పెట్టిన పెట్టుబడులు నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వరి 3,31,020 ఎకరాలు, పత్తి 1,06,921, మొక్క జొన్న 27,826, కంది 6,594లతో పాటు ఇతర పంటలు సాగు చేస్తున్నారు. పంటలు వేసిన 20 రోజుల్లోపే యూరియా చల్లాలని ఆ తర్వాత వేసినప్పటికీ దిగుబడి తగ్గుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదను దాటితే ఇబ్బంది పడాల్సి వస్తుందని రైతులు యూరియా బస్తాల కోసం రోజుల తరబడి సొసైటీ కేంద్రాల ముందు నిరీక్షిస్తున్నారు. చెప్పులు, ఆధార్ కార్డులు, పట్టా పాస్ బుక్లు, రాళ్లు క్యూ లైన్లుగా పెడుతున్నారు. వర్షాలను సైతం లెక్కచేయకుండా క్యూ లైన్లలో ఉంటూ రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రైవేట్ వ్యాపారులు బ్లాక్లో విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినవస్తున్నాయి. జిల్లాకు వచ్చింది 59శాతమే జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్లో 4,65,318 ఎకరాల్లో సాగు అవుతందని ఈ సీజన్కు 43,130.8 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు 25,780 (59.77శాతం) మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సరఫరా అయింది. అందులో సొసైటీలకు 15,468 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్కు 10,312 మెట్రిక్ టన్నులు కేటాయించారు. ఇంకా ఇరవై రోజుల సమయం మాత్రమే ఉంది. సెప్టెంబర్ 20వ తేదీ వరకు పూర్తిగా యూరియా జిల్లాకు చేరాలంటే రోజుకు వెయ్యి మెట్రిక్ టన్నులు వస్తేనే సరిపోతుంది. వ్యవసాయ అధికారులు 4.65లక్షలు సాగు అవుతుందని, దానికి సరఫరా యూరియాను అంచనా వేశారు కానీ ఇప్పటికే 4.90లక్షలకు పైగా వివిధ పంటలు సాగు చేస్తున్నారు. దీని ప్రకారం చూస్తే అధికారులు అంచనా వేసిన దానికంటే ఎక్కువ యూరియా అవసరం పడనుంది.గరికపోసలతో గణనాథుడి అలంకరణ దుబ్బాకలో వినాయక చవితి నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం పట్టణంలో కేదారేశ్వర ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో గణనాథున్ని 4 లక్షల గరిక పోసలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. – దుబ్బాకటౌన్ : మిరుదొడ్డికి చెందిన రాములు ఒక ఎకరంలో మొక్కజొన్నను సాగు చేస్తున్నాడు. దుక్కి దున్ని విత్తనం పెట్టి 44 రోజులు కావస్తుంది. ఇప్పటి వరకు యూరియా లభించకపోవడంతో చల్లలేదు. పదిరోజులుగా యూరియా బస్తాల కోసం తిరుగుతున్నా ఒక్కటి లభించలేదు. యూరియా బస్తా కోసం పడిగాపులు కాస్తున్నా దొరకడం లేదు. పెట్టిన పెట్టుబడి సైతం వస్తుందో రాదో అని రైతు రాములు ఆందోళన చెందుతున్నాడు. 43వేల మెట్రిక్ టన్నులకు.. వచ్చింది 25వేల మెట్రిక్ టన్నులే 4.90లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు అదను దాటిపోతుందని ఆందోళన -
కక్షిదారులకు సత్వర న్యాయం అందాలి
సిద్దిపేటకమాన్: కోర్టు ద్వారా కక్షిదారులకు సత్వరంగా న్యాయాన్ని అందించాలని హైకోర్టు న్యాయమూర్తులు పుల్లా కార్తీక్, బి.విజయ్సేన్రెడ్డి, ఎన్.వి, శ్రావణ్కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా కోర్టులో నూతనంగా నిర్మించిన రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్డు కమ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ భవనాన్ని, మూడు, నాల్గవ అంతస్తులో నూతనంగా నిర్మించిన కోర్టు భవనాలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవితో కలసి న్యాయమూర్తులు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి పుల్లా కార్తీక్ మాట్లాడుతూ.. బార్ అసోసియేషన్, కోర్టు బెంచ్ ఆరోగ్యవంతమైన సంబంధాలతో ముందుకు సాగాలని, అప్పుడే న్యాయం అందుతుందని చెప్పారు. జస్టిస్ విజయ్సేన్రెడ్డి మాట్లాడుతూ.. న్యాయం కోసం కోర్టులకు వచ్చే ప్రజలకు అసంతృప్తిని కల్పించకూడదన్నారు. ఇరువర్గాల కక్షిదారులకు న్యాయం చేకూరేలా చూడాలని తెలిపారు. జస్టిస్ శ్రావణ్కుమార్ మాట్లాడుతూ..జిల్లాలో 450మంది న్యాయవాదులు ఉంటే 20మంది మహిళ న్యాయవాదులు ఉన్నారన్నారు. తాను బెజ్జంకి మండలం గుగ్గిళ్ల ప్రాంతానికి చెందిన ఈ ప్రాంతం వాడినన్నారు. రాజ్యాంగం చదివితే తమ హక్కులు, విధులు తెలుసుకోవడంతో పాటు, ప్రజాస్వామ్యంలో చురుకై న పాత్ర పోషించగలరని అన్నారు. అనంతరం ఉత్తమ సేవలందించిన పలువురు కోర్టు సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. రెండు బ్యాంకుల సహకారంతో బాలసదనంకు రూ.50వేల చెక్తో పాటు వాటర్ ప్యూరిపైర్ను అందజేశారు. హైకోర్టు న్యాయమూర్తులను జిల్లా న్యాయమూర్తి సాయిరమాదేవి, కలెక్టర్ కె.హైమావతి, సీపీ అనురాధ శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు జయప్రసాద్, మిలింద్కాంబ్లి, సంతోష్, సాధన, రేవతి, స్వాతి, జితేందర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సిహెచ్ జనార్థన్రెడ్డి, జనరల్ సెక్రటరీ రమేష్, తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు న్యాయమూర్తులుకార్తీక్, విజయ్సేన్రెడ్డి శ్రావణ్కుమార్ సిద్దిపేటలో నూతన కోర్టు భవనాలనుప్రారంభించిన న్యాయమూర్తులు -
వినాయకుడి పూజ కోసం పూజారి కిడ్నాప్ ..!
సిద్దిపేట జిల్లా (హుస్నాబాద్): గణపతి నవరాత్రులు వచ్చాయంటే పూజారులకు క్షణం తీరిక ఉండదు. పూజల కోసం ప్రజలు ముందుగానే పూజారులతో మాట్లాడుకుంటారు. ఒక్కో పూజారి నాలుగైదు మంటపాల వద్ద గణపతి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే, తమ మంటపంలో పూజలు చేయటానికి పూజారి దొరక్కపోవటంతో కొందరు యువకులు ఓ పూజారిని ఎత్తుకెళ్లిన ఘటన సిద్దిపేట జిల్లా కోహెడలో చోటుచేసుకుంది. హుస్నాబాద్ మండల కేంద్రంలో పద్మశాలి సంఘం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మంటపం వద్ద బుధవారం పూజ పూర్తయిన వెంటనే విశ్వబ్రాహ్మణ కాలనీ, పోచమ్మ కాలనీ, గ్రామ పంచాయతీ కాలనీ, ధర్మసాగర్పల్లి తదితర ప్రాంతాల యువకులు ఒకేసారి వచ్చి తమ పంటపం వద్ద పూజ చేయాలని పూజారి కనకయ్యను చుట్టుముట్టారు. పోటీ పెరగటంతో యువకుల మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో విశ్వబ్రాహ్మణ కాలనీకి చెందిన యువకులు పూజారిని బలవంతంగా బైక్పై ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ..… pic.twitter.com/uV4lsMUj3u— Telugu Reporter (@TeluguReporter_) August 29, 2025 -
శనిగరం.. పరవళ్లు
శనిగరం మధ్యతరహ ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. ఎగువ నుంచి వస్తున్న వరదలతో నిండుకుండలా దర్శనమిస్తోంది. భారీ వర్షాలతో మోయతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ వరదంతా ప్రాజెక్టులోకి వస్తోంది. ప్రాజెక్ట్ సామర్థ్యం టీఎంసీ కాగా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. మత్తడి పరవళ్లు తొక్కుతోంది. శుక్రవారం కలెక్టర్ ప్రాజెక్టును సందర్శించారు. మత్తడి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పర్యాటకులు, స్థానికులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జల దృశ్యాలను తన ఫోన్లో చిత్రీకరించారు. – కోహెడరూరల్(హుస్నాబాద్) -
వానొస్తే వణుకే..
● వరదొస్తే జలదిగ్బంధమే ● రియల్ ‘దందా’తో ఎక్కడికక్కడా నాలాల మూసివేత ● పాలకుల పట్టింపులేనితనమే కారణం ● గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ దుస్థితిగజ్వేల్: భారీవర్షాలొస్తే మున్సిపాలిటీ వరద ముప్పుతో వణికిపోతుంది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు కాలనీలు నీటమునిగాయి. ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. జనం తీవ్ర అవస్థలు పడ్డారు. పట్టణంలో ఉన్న నాలాల వ్యవస్థ ఎక్కడికక్కడా మూసుకుపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. అధికారుల పట్టింపులేనితనంతో ఈ సమస్య జఠిలంగా మారుతోంది. ఈ సమస్య పరిష్కారానికి కొన్నేళ్ల కిందట రూ.14 కోట్లతో ప్రతిపాదనలు పంపినా ఆమోదం కరువైంది. భారీ వరదలతో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆయా వార్డుల్లోని లోతట్టు కాలనీల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా ప్రజ్ఞాపూర్ ఊర చెరువు మత్తడి దుంకితే.. ఆ నీరు వెళ్లడానికి అవసరమైన నాలాల వ్యవస్థ లేదు. వాస్తవానికి నాలాల ద్వారా రాజిరెడ్డిపల్లి కుంటలోకి వరద వెళ్లాల్సి ఉంది. కానీ నీరు వెళ్లే మార్గం లేక ఇళ్ల మధ్య నుంచే వెళ్తోంది. ఈ క్రమంలో పార్ధివేశ్వరస్వామి ఆలయం ఆర్చి వద్ద జలమయంగా మారుతోంది. ఆ రోడ్డు పక్కన డ్రైనేజీ వ్యవస్థను నిర్మించినా పూర్తి స్థాయిలో తరలిపోయే విధంగా నిర్మాణం జరగలేదు. ప్రస్తుతం కురిసిన వర్షాలకు గజ్వేల్–ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారి 2కిలోమీటర్ల మేర జలమయంగా మారింది. వరద ఉధృతికి గంటలతరబడి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రూ.12కోట్లతో ప్రతిపాదనలు పంపినా.. సమస్య పరిష్కారానికి గతంలో ప్రధాన రహదారి కింది భాగంలో ఓ అండర్ బ్రిడ్జిని నిర్మించాలనుకున్నా.. పెండింగ్లో పెట్టారు. మరోవైపు రోడ్డుకు ఇరువైపులా ఉన్న అండర్ డ్రైనేజీ గుండా వరద వేళ్లే విధంగా ప్రత్యేక నిర్మాణాలను చేపట్టాల్సి ఉంది. ఇందుకోసం రూ.12కోట్లతో ప్రతిపాదనలున్నా.. ఆమో దం లభించలేదు. అదేవిధంగా ఎర్రకుంట నుంచి పాండవుల చెరువు ఫీడర్ ఛానెల్ నిర్మాణానికి మరో రూ.2కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ ఈ ప్రతిపాదనలకు మోక్షం కరువైంది. మున్సిపాలిటీ పరిధిలో దశాబ్ధాల కాలంగా ఉన్న వరదనీటి కాలువ వ్యవస్థ రియల్ ‘దందా’ వల్ల పూర్తిగా కనుమరుగైంది. అక్రమ ప్లాట్లలో నిర్మాణాలను మున్సిపల్ అధికారులు అనుమతులు కూడా ఇచ్చేశారు. నీటిపారుదల శాఖ ఏనాడూ కాల్వలు ఆక్రమణకు గురవుతున్నా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఫలితంగా చినుకువస్తే చాలా కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. -
12 గంటలకుపైగా జలదిగ్బంధంలో సిద్దిపేట
భారీ వర్షాలతో పలు కాలనీలు, గ్రామాలు నీట మునగడానికి తప్పు ఎవరిదనే చర్చ జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. సిద్దిపేట, చేర్యాల, దుబ్బాక, హుస్నాబాద్, గజ్వేల్ పట్టణాల్లో నాలాలు ఆక్రమణకు గురయ్యాయి. ప్రధానంగా జిల్లా కేంద్రంలో ఎక్కువగా నాలా ఆక్రమణలు, చెత్తా చెదారం, గుర్రపు డెక్కను తొలగించకపోవడమేనని తెలుస్తోంది. మరోవైపు భూముల ధరలకు రెక్కలు రావడంతో అక్రమార్కుల కన్ను చెరువులు, కుంటలు, నాలాలపై పడింది. పలువురి ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల అండతో భూములన్నీ అన్యాక్రాంతమవుతున్నాయి. హైడ్రా తరహాలో వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఆక్రమణలు కట్టడి అయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. – సాక్షి, సిద్దిపేటజిల్లా కేంద్రంలో వరద ముంపు తగ్గిన తరువాత ప్రస్తుత పరిస్థితి.. ఎందుకీ ముంపు..ఎవరిదీ తప్పు! ● నీట మునిగిన కాలనీల్లో అవస్థలు వర్ణనాతీతం ● నాలాలు, చెరువులు, ● హైడ్రా తరహా వ్యవస్థ ఏర్పాటుకు సర్వత్రా డిమాండ్ సిద్దిపేట పట్టణంలో వర్షం కురవడంతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వచ్చి చేరింది. తొగుట నుంచి వచ్చిన వరద నీరు తడ్కపల్లి, ఎన్సాన్పల్లి చెరువులు నిండి కోమటి చెరువుకు చేరాయి. దాదాపు 1800 క్యూసెక్కుల వరద చేరడంతో కోమటి చెరువు ఉప్పొంగింది. అవుట్ ఫ్లో కేవలం 800 క్యూసెక్కులు ఉండటంతో కాలువ నిండి చూట్టూ పక్కల ఉన్న శ్రీనగర్ కాలనీ, హరిప్రియనగర్, శ్రీనివాస నగర్లోని పలు ఇళ్లల్లోకి వరద చేరింది. దీంతో గురువారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వరద ఇళ్ల మధ్యే వరద ఉంది. దీంతో దాదాపు 12 గంటల పాటు స్థానికులు ఇళ్లకే పరిమితమయ్యారు. తడిసిన నిత్యావసర సరుకులు సిద్దిపేట పట్టణంలో పలువురి ఇళ్లల్లోకి నీరు రావడంతో నిత్యావసర సరుకులు, వివిధ వస్తువులు తడిసి ముద్దయ్యాయి. ఇళ్లల్లో, అపార్టుమెంట్లలోకి వచ్చిన వరద నీటిని స్థానికులు ఎత్తిపోశారు. ఇళ్లన్నీ బురదమయం కావడంతో వాటర్తో కడిగి మట్టిని తొలగించారు. హరిప్రియానగర్ రోడ్ నంబర్ 3కు సమీపంలో ఏర్పాటు చేసిన గణపతి మండపంలోకి వరద చేరడం.. మట్టి వినాయకుడు కావడంతో బాగా తడిసింది. దీంతో రెండో రోజే విగ్రహాన్ని యువకులు నిమజ్జనం చేశారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ సెల్లార్లోకి వరద చేరడంతో రెండు రోజులుగా సేవలు నిలిపివేశారు. వినియోగదారులకు మరో బ్రాంచ్కు పంపించారు. అలాగే బజాజ్ ఎలక్ట్రానిక్స్కు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రత్యేకంగా జనరేటర్ను అద్దెకు తీసుకుని విద్యుత్ సరఫరా కల్పించుకున్నారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సెల్లార్లో వరద నీరు చేరడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సెల్లార్లో ఉన్న బెడ్లు, ఇతర సామగ్రి బురదమయం కావడంతో వాటిని శుభ్రం చేశారు. ఆక్రమణలు ఇలా.. -
ఓటరూ మేల్కోండి.. మార్పులు సరిచేసుకోండి
● సవరణ కోసం దరఖాస్తు చేసుకోవాలి ● కలెక్టర్ హైమావతి ● వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశంసిద్దిపేటరూరల్: గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించిన ఓటరు జాబితాపై ఎలాంటి సందేహాలు, మార్పులు, చేర్పులున్నా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ హైమావతి సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 508 గ్రామపంచాయతీల్లో 6,55,958 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్ల జాబితాను గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించామన్నారు. జాబితాపై ఎలాంటి సందేహాలు ఉన్నా పంచాయతీల్లో, ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఓ దేవకీదేవి, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిర్మాణాల్లో నాణ్యత తప్పనిసరి పనుల జాతర కార్యక్రమంలో భాగంగా చేపట్టిన నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్ హైమావతి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, ఈజీఎస్ ద్వారా చేపడు తున్న పనులపై సంబందిత శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీపి భవనాలు, అంగన్వాడీ సెంటర్ల పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. ‘ఆ గ్రామంలోనే ఉంచండి’ఓటరు లిస్టుపై అభ్యంతరాలు అక్కన్నపేట(హుస్నాబాద్): ‘మేమంతా భూ నిర్వాసితులం.. రామవరం గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని కోరుతూ ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ శంకరయ్యకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. పలువురు మాట్లాడుతూ గత అసెంబ్లీఎన్నికల్లో తమ ఓటు హక్కును రామవరంలోని వినియోగించుకున్నామన్నారు. ఇటీవల ఓటరు లిస్టులో సేవలాల్ మహరాజ్ తండాలో చేర్చారన్నారు. -
ఉధృతంగానే కూడవెల్లి
శనివారం శ్రీ 30 శ్రీ ఆగస్టు శ్రీ 2025నిండుకుండలా రామసముద్రం చెరువుఉధృతంగా ప్రవహిస్తున్న కూడవెల్లి వాగుకూడవెల్లి వాగు ఇంకా ఉధృతంగానే ప్రవహిస్తోంది. భారీ వర్షాలతో కూడవెల్లి వాగుపై ఉన్న 58 చెక్డ్యాంలు నిండి పరవళ్లు తొక్కుతున్నాయి. జగదేవ్పూర్ మండలం అలీరాజ్పేట శివారులో కూడవెల్లి వాగు పుట్టి.. గజ్వేల్, తొగుట, మిరుదొడ్డి, భూంపల్లి–అక్బర్పేట, దుబ్బాక మండలాలగుండా ప్రవహించి రాజన్నసిరిసిల్ల జిల్లా ఎగువమానేరులో కలుస్తుంది. వాగు ఉధృతితతో చాలా గ్రామాలకు రాకపోకలు రెండురోజులుగా బంద్ అయ్యాయి. వరదలకు వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. – దుబ్బాక -
విద్యుత్ మీటర్లు కాలిపోయాయి
అపార్ట్మెంట్లో 21 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నా. గత 12 ఏళ్ల క్రితం ఇలా వరద వచ్చింది. మళ్లీ ఇప్పుడు వచ్చింది. వరద చేరుతుంటే అప్రమత్తమై మా వాహనాలు అన్ని గుడి దగ్గర పార్కింగ్ చేసి వచ్చాం. మా పార్కింగ్లోకి దాదాపు నాలుగు ఫీట్ల ఎత్తు వరకు నీరు వచ్చింది. ఆరు విద్యుత్ మీటర్లు కాలి పోయాయి. పవర్ ఇంకా రాలేదు. మా అపార్ట్మెంట్ సమీపంలోని కెనాల్ కాలువలో కాలువలో సిల్ట్ తీయడమే లేదు. కెనాల్ కాలువ ఎత్తు పెంచి వరద నీరు బయటకు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. – నర్సింహారెడ్డి, సతీష్, మణికంఠ అపార్ట్మెంట్, హరిప్రియనగర్బియ్యం తడిసిపోయాయి ఇంట్లోకి ఒక్కసారిగా వరద రావడంతో భయంతో బయటకు వచ్చాం. గ్యాస్ సిలిండర్ను తీసుకుని బయటకు వచ్చి మెట్ల పైన ఉన్నాం. బియ్యం, కారం, పప్పు, పసుపు తడిసిపోయాయి. ఇళ్లు అంతా బురద మయమైంది. నీళ్లు బయటకు పోవడంతో బురద తొలగించాం. నా కొడుకు సర్టిఫికెట్లు సైతం తడిచాయి. – లక్ష్మీ, హరిప్రియనగర్, సిద్దిపేట పట్టణం -
ఆ ప్రభుత్వాస్పత్రిలో ఏం జరుగుతోంది?
గజ్వేల్: పట్టణంలోని మాతాశిశు సంరక్షణ ఆస్పత్రిలో గతంతో పోలిస్తే డెలివరీలు తగ్గడానికి కారణాలేమిటీ?, అసలు ఏం జరుగుతోంది? అనే అంశాలపై రాష్ట్ర వైద్య విధాన పరిషత్ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజ్ఞాపూర్కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత వెంకట్రామ్రెడ్డి, గజ్వేల్ ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, టీపీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరితోపాటు ఆస్పత్రికి చెందిన పలువురు సిబ్బంది సైతం ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ అన్నపూర్ణపై కొన్ని రోజుల క్రితం ఆరోగ్యశాఖ మంత్రి దామోదరతోపాటు వైద్య విధాన పరిషత్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రికి సంబంధించిన పలు అంశాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలిసింది. 2024లో నెలకు 360కిపైగా డెలివరీలు జరిగితే 2025జనవరి నుంచి ఇప్పటివరకు కేవలం నెలకు కేవలం 304డెలివరీలు మాత్రమే జరుగుతున్నాయని కాంగ్రెస్ నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంతో పోలిస్తే గైనకాలజీ విభాగంలో వసతులు మెరుగుపడి, వైద్యాధికారులు, సిబ్బంది సంఖ్య పెరిగినా డెలివరీలు తగ్గాయని, ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో కుమ్మక్కు కావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆస్పత్రిలో నెలకొన్న వాస్తవ పరిస్థితిపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ అంశంపై సమగ్ర విచారణ జరుగనున్నదని సమాచారం. ఆరా తీస్తున్న వైద్యారోగ్యశాఖఉన్నతాధికారులు సూపరింటెండెంట్పై ఫిర్యాదుతోపలు అంశాలు వెలుగులోకి -
రోజంతా బారులు.. తప్పని నిరసనలు
గజ్వేల్ పట్టణంలో రోడ్డుపై బైఠాయించిన రైతులువర్గల్లో అంబర్పేట వద్ద టోకెన్ల కోసం నిరసనజిల్లాలో యూరియా ఇక్కట్లు తీరడంలేదు. రైతులు రోజంతా పడిగాపులు కాస్తున్నారు. శుక్రవారం సైతం రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. గజ్వేల్ పట్టణంలో, వర్గల్లో రైతులు రహదారులపై బైఠాయించి నిరసన తెలిపారు. సరిపడా యూరియా ఇవ్వకపోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వర్గల్లో స్టాక్ లేకపోవడంతో టోకెన్లు ఇచ్చేందుకు అధికారులు నిరాకరించడంతో అక్కడే రోడ్డుపై బైఠాయించి కొద్దిసేపు నిరసన తెలిపారు. దుబ్బాకలోనూ రైతులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. ఒక్క లారీ లోడ్ రావడంతో చాలా మంది రైతులు నిరాశతో వెనుదిరిగారు. హుస్నాబాద్లోనూ రైతులు గంటలకొద్దీ బారులు తీరి నిరీక్షించారు. – గజ్వేల్రూరల్/వర్గల్(గజ్వేల్)/దుబ్బాకటౌన్/హుస్నాబాద్: -
పండుగరోజూ పడిగాపులే
దుబ్బాకటౌన్/మిరుదొడ్డి(దుబ్బాక)/కొండపాక(గజ్వేల్)/నంగునూరు(సిద్దిపేట):: వినాయక చవితి పండుగ రోజూ, మరోవైపు జోరువానలోనూ రైతులకు యూరియా పాట్లు తప్పలేదు. బస్తా యూరియా కోసం రోజంతా పడిగాపులు పడ్డారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తడిసి ముద్దవుతూనే గొడుగులు పట్టుకుని క్యూ కట్టారు. యూరియా లభించినా వర్షంలో తీసుకెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మిరుదొడ్డికి యూరియా లారీ వస్తుందని తెలియడంతో వేల సంఖ్యలో తరలివచ్చారు. ఒక్కరు ఉంటే ఒక బస్తా, దంపతులు లైన్లో ఉంటే రెండు సంచులకు టోకెన్లు లభించడంతో రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న యూరియా లారీ వద్దకు పరుగులు తీశారు. యూరియా పంపిణీ కోసం ఇటు పోలీసులు, అటు వ్యవసాయ అధికారులు సైతం వర్షంలోనూ విధులు నిర్వహించారు. కొండపాక, మండలాల్లోనూ ఇదే దుస్థితి కనిపించింది. నంగునూరు ఆగ్రోసేవా కేంద్రం ఎదుట రైతులు తెల్లవారు జామునే వచ్చి క్యూలైన్లో నిలబడ్డారు. జోరున వర్షం కురుస్తున్నా లెక్కచేయ కుండా రాత్రి వరకు నిరీక్షించారు. తీరా 500 బస్తాలు రావడంతో చాల మందికి యూరియా దొరకలేదు. ఇదే సమయంలో ఏఓ గీత అక్కడికి చేరుకోవడంతో కారును అడ్డగించి వాగ్వాదానికి దిగారు. రోడ్డెక్కిన రైతన్న గురువారం దుబ్బాక వ్యవసాయ సహకార సంఘానికి యూరియా వస్తుందని తెలిసి ఉదయాన్నే వచ్చి క్యూ కట్టారు. యూరియా లారీ రాకపోవడంతో దుబ్బాక ఛత్రపతి సర్కిల్లో జోరువానను సైతం లెక్క చేయకుండా ధర్నా చేశారు. దీంతో వాహనాలు పెద్ద ఎత్తున రోడ్డు పై నిలిచిపోయాయి. యూరియా కోసం బారులు వర్షంలోనూ రైతుల పాట్లు -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
తొగుట(దుబ్బాక): భారీ వర్షాలతో చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హైమావతి సూచించారు. మండల పరిధిలోని చందాపూర్లోకి వరద నీరు చేరడంతో పోలీస్ కమిషనర్ అనురాధతో కలిసి కలెక్టర్ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా కూడవెల్లి వాగు ప్రవాహాన్ని పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటారని ప్రజలు భయాందోళనకు గురికావద్దన్నారు. అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాల సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. నీటి ప్రవాహం ఉన్నచోట రోడ్లను బ్లాక్ చేయాలని సూచించారు. వరద కారణంగా చందాపూర్ రేషన్ దుకాణంలో తడిసిపోయిన బియ్యాన్ని కలెక్టర్ పరిశీలించారు. తడిసిన బియ్యం తీసుకుని మంచి బియ్యం అందించాలని తహసీల్దార్కు ఆదేశించారు. -
వరద ఉధృతిని తట్టుకునేలా ప్రణాళికలు
సిద్దిపేటజోన్: భవిష్యత్లో వరద ఉధృతిని తట్టుకునేలా సాంకేతిక పర నిపుణులతో మాట్లాడి ప్రణాళికలు రూపొందిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. భారీ వర్షాలతో జలమయంగా మారిన లోతట్టు ప్రాంతాలను గురువారం క్షేత్ర స్థాయిలో సందర్శించారు. కోమటి చెరువు నీటిమట్టం దాటి ఉప్పొంగుతున్న వరద నీటి ప్రవాహన్ని పరిశీలించారు. అనంతరం లోతట్టు ప్రాంతాలు శ్రీనగర్ కాలనీ, హరిప్రియనగర్, శ్రీనివాస్ నగర్ కాలనీల్లో క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అధికారులతో చర్చించారు. భవిష్యత్లో కోమటి చెరువు ఉధృతి పెరిగినప్పటికి లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. 20 ఏళ్లలో ఇంత వరద రాలేదు.. గతంలో ఎన్నడూ లేనట్లు ఈసారి భారీ వరద వల్ల కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురైనట్లు హరీశ్రావు తెలిపారు. సిద్దిపేట పట్టణంలో 10 సెంటీమీటర్లు, ఎగువ భాగంలో 20 సెం.మీ. వర్షపాతం నమోదైందన్నారు. కోమటి చెరువు మత్తడి ద్వారా లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయన్నారు. సమస్య పరిష్కారం కోసం నర్సాపూర్ చెరువు కొంత భాగం తొలగించి నీటిని శనిగరం,మందపల్లి చెరువులకు మళ్ళించి వరద ఉధృతిని తగ్గించినట్టు తెలిపారు. ప్రజలు కూడా సహకరించాలని, నాళాలు కబ్జాలు చేసి, సెట్బ్యాక్ లేకుండా ఇల్లు కట్టడం వల్ల ఇలాంటి సమయంలో సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్, బీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు ఉన్నారు. ఎమ్మెల్యే హరీశ్రావు -
జిల్లాలో కుంభవృష్టి బీభత్సం
వామ్మో.. ఇదేమి వాన.. ఆకాశానికి చిల్లులుపడ్డట్లు.. ఏకధాటిగా కుంభవృష్టి కురవడంతో జిల్లాలో జనజీవనం అతలాకుతలమైంది. రెండు రోజులుగా వర్షాలు కురవడంతో జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. రోడ్లు, పంటలు భారీ స్థాయిలో దెబ్బతిన్నాయి. భారీ వర్షాలతో జనం బిక్కుబిక్కు మంటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాలం గడిపారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల పరిస్థితి దయనీయంగా తయారైంది. సాక్షి, సిద్దిపేట: జిల్లాలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. పలు చోట్ల పంటలు నీట మునిగాయి. పలు గృహాలు కూలిపోయాయి. సిద్దిపేట పట్టణంలో పలు కాలనీలు జలమయంగా మారాయి. పలు చోట్ల రోడ్లపై నుంచి వర్షపు నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాకనియోజకవర్గాలతో పాటు పలు మండలాల్లో అత్యధికంగా వర్షం కురిసింది. కొమురవెల్లి మండలంలో అత్యధికంగా 20.6 సెంటీమీటర్లు, దౌల్తాబాద్లో 20 సెంటీ మీటర్ల వర్ష పాతం నమోదైంది. సిద్దిపేట పట్టణంలో నీట మునిగిన కాలనీలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు, కలెక్టర్ హైమావతిలు పరిశీలించారు.7వేల ఎకరాల్లో పంట నష్టంరెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంటలు నీట మునిగాయి. జిల్లా వ్యాప్తంగా 3,209 రైతులకు చెందిన 7,335 ఎకరాల్లో నష్టం వాటిల్లిందని వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయలు ఎక్కువగా నష్టపోయాయి. జిల్లాలో 74 గృహాలు నేలమట్టం అయ్యాయి. దీంతో వీరిని ఇతర ప్రాంతాలల్లో ఆశ్రయం పొందుతున్నారు.250 విద్యుత్ స్తంభాలు నేలమట్టంజిల్లా వ్యాప్తంగా 250 విద్యుత్ స్తంభాలు నేలమట్టం అయ్యాయి. అలాగే 25 ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ అయ్యాయి. ఐదు కిలో మీటర్ల మేర విద్యుత్ వైర్ ధ్వంసమైంది. దీంతో పలు చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సిబ్బంది పలు చోట్ల వర్షాన్ని సైతం లెక్కచే యకుండా విద్యుత్ లైన్ మరమ్మత్తులు చేసి విద్యుత్ను సరఫరాను అందించారు. మిరుదొడ్డి, అక్బర్పేట–భూంపల్లి, బెజ్జంకి మండలాల్లో పలు గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడటంతో మరో లైన్ ద్వారా విద్యుత్ సరఫరాను కొనసాగించారు. ఈ వర్షాలకు విద్యుత్ శాఖకు దాదాపు రూ35లక్షల వరకు నష్టం వాటిల్లింది.బయట పడిన అధికారుల నిర్లక్ష్యంసిద్దిపేట పట్టణంలో పలు కాలనీలు జలమయం కావడంతో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. పట్టణంలో నాళాలు ఆక్రమించిన సైతం మున్సిపల్ అధికారులు, నీటీ పారుదల శాఖ అధికారులు పట్టించుకోలేదు. అలాగే కాలనీల్లో సెట్బ్యాక్ లేకుండా నిర్మాణాలు చేసిన సైతం కాసులకు ఆశపడి పట్టించుకోలేదు. దీంతో వర్షాలకు నీట మునిగే పరిస్థితి వచ్చిందని పలువురు ఆరోపించారు.ముంచెత్తిన వానలు -
వాగులో చిక్కుకున్న రైతులు..
కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం దుబ్బాక/ దుబ్బాకరూరల్: భూంపల్లి–అక్బర్పేట మండలం చిన్ననిజాంపేటకు చెందిన రైతులు శేర్ల రాజు, సుదర్శన్, గోపాల్ బుధవారం ఉదయం తమ పొలాల వద్దకు వెళ్లారు. తీరా భారీ వర్షం కురవడంతో పోతారెడ్డిపేట పెద్ద చెరువుతో పాటు కూడవెల్లి వాగు ఉధృతం కావడంతో మధ్యలోనే చిక్కుకుపోయారు. మధ్యలో చిక్కుకున్న వారిని భయటకు తెచ్చేందుకు సీపీ అనురాధ, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, సీఐ శ్రీనివాస్తో పాటు గ్రామస్తులు బుధవారం సాయంత్రం నుంచి ప్రయత్నాలు చేశారు. గురువారం ఉదయం ఎన్డీఆర్ఎఫ్ బృందం మధ్యలో చిక్కుకున్న ముగ్గురు రైతులను సురక్షింతగా భయటకు తీసుకరావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. పలు గ్రామాలకు రాకపోకలు బంద్ భారీ వర్షాలతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. తొగుట మండలం చందాపూర్ గ్రామంలోకి కూడవెల్లి వాగు నీరు చేరింది. దీంతో గ్రామస్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. మిరుదొడ్డి మండలం అల్వాల వద్ద చెరువునీరు రోడ్డుపై ప్రవహించడంతో గజ్వేల్–మిరుదొడ్డి మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి. అకారం వద్ద బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తుండడంతో ఆకారం–బీబీపేట మధ్య, అలాగే చిన్ననిజాంపేట గ్రామానికి, భూంపల్లి–ఖాజీపూర్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. -
పల్లెల్లో స్థానిక జోరు
● ఓటరు తుది జాబితాకుషెడ్యూల్ విడుదల ● రేపు 508 జీపీలు, 4,508వార్డుల వారీగా జాబితా ప్రదర్శన సాక్షి, సిద్దిపేట: పల్లెల్లో స్థానిక ఎన్నికల సందడి జోరందుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. అందులో భాగంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితాను విడుదల చేసి ఫైనల్ పబ్లికేషన్ చేసేందుకు మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా 508 గ్రామ పంచాయతీలు, 4,508 వార్డులుండగా 6,55,958 మంది ఓటర్లు ఉన్నారు. హైకోర్టు తీర్పుతో.. పల్లెలో ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. ఏడాదిన్నరగా ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామపంచాయతీలు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 30లోగా గ్రామ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో వచ్చే నెలలో ఎన్నికలు పూర్తయ్యే అవకాశం ఉంది. పంచాయతీలకు పంపిస్తున్నాం వార్డుల వారీగా ఓటరు జాబితాలను సిద్ధం చేసి పంచాయతీలకు పంపిస్తున్నాం. ఈ నెల 28న ఉదయం ఓటరు జాబితాను ప్రదర్శిస్తాం. అభ్యంతరాలు స్వీకరించి సెప్టెంబర్ 2న ఫైనల్ జాబితాను విడుదల చేస్తాం. – దేవకీదేవి, డీపీఓ ఈనెల 28న పంచాయతీ, వార్డుల వారీగా ఓటరు జాబితా ప్రదర్శించనున్నారు. ఈనెల 29న జిల్లా స్థాయి, 30న మండల స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు జాబితాపై అభ్యంతరాలు స్వీకరించనున్నారు. సెప్టెంబర్ 2న ఓటర్ల తుది జాబితాను విడుదల చేయనున్నారు. -
యూరియా పక్కదారి
● పక్క గ్రామాల్లో విక్రయాలు ● ఆందోళనకు దిగిన రైతులు ● జ్యోతి ఫర్టిలైజర్ దుకాణాన్నిసీజ్ చేయాలని డిమాండ్ దౌల్తాబాద్ (దుబ్బాక): యూరియా పక్కదారి పట్టింది. టోకెన్లు ఉన్న రైతులకు సైతం ఇవ్వకుండా అడ్డదారిలో పక్క గ్రామాల్లో గుట్టుగా విక్రయించారు. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. జ్యోతి ఫర్టిలైజర్ దుకాణాన్ని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన జ్యోతి ఫర్టిలైజర్ యజమాని వివిధ గ్రామాలకు చెందిన రైతులకు యూరియా కోసం టోకెన్లు ఇచ్చారు. అయితే టోకెన్లు తీసుకున్న రైతులకు కాకుండా మండల పరిధిలోని నర్సంపేటలో రెండు లారీల యూరియాను అక్రమంగా డంపింగ్ చేసి గుట్టుగా బస్తాకు రూ.350లకు అమ్మేశాడు. మంగళవారం విషయం తెలుసుకున్న రైతులు మండల కేంద్రంలోని శివాజీ చౌరస్తాలో ధర్నాకు దిగి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జ్యోతి ఫర్టిలైజర్ దుకాణాన్ని సీజ్ చేయాలని, దుకాణ యజమాని గోపిశెట్టి శ్రీనివాస్పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుమారు రెండు గంటలకు పైగా ధర్నా చేయడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఏసీపీ నర్సింహులు, తొగుట సీఐ లతీఫ్, దుబ్బాక ఏడీఏ మల్లయ్య అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. జ్యోతి ఫర్టిలైజర్ యజమాని గోపిశెట్టిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. -
మల్లన్న హుండీ ఆదాయం రూ.45.79లక్షలు
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి వారి ఖజానాకు హుండీల ద్వారా రూ. 45,79,870 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ అన్నపూర్ణ తెలిపారు. మంగళవారం డివిజన్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది, శివరామకృష్ణ భజనమండలి సభ్యులు భక్తుల కానుకలను లెక్కించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 46 రోజులలో రూ.45,79,870 నగదుతోపాటు విదేశి కరెన్సీ నోట్లు 83, మిశ్రమ బంగారం 44 గ్రాములు, మిశ్రమ వెండి 4కిలోల 300 గ్రాములు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ధర్మకర్తలు జయప్రకాశ్రెడ్డి, లింగంపల్లి శ్రీనివాస్, కాయిత మోహన్రెడ్డి, వల్లాద్రి అంజిరెడ్డి, ఆలయ ఏఈఓ బుద్ధి శ్రీనివాస్, ఆలయ ప్రధానార్చకులు, శివరామ కృష్ణ భజన మండలి సభ్యులు పాల్గొన్నారు. న్యాయవాదుల రక్షణకు చట్టం తేవాలి హుస్నాబాద్: న్యాయవాదులకు రక్షణ కరువైందని, ప్రత్యేక చట్టాన్ని తేవాలని బార్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. కూకట్పల్లి కోర్టులో న్యాయవాది శ్రీకాంత్పై జరిగిన దాడి ని నిరసిస్తూ మంగళవారం కోర్టు ఆవరణలో విధులు బహిష్కరించారు. నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయవాదులపై రోజురోజుకు దాడులు పెరుగుతున్నాయని తెలిపారు. శ్రీకాంత్పై దాడి చేసిన వారిని శిక్షించాలన్నా రు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లును అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు సాయిని మల్లేశం, కన్నోజు రామకృష్ణ, మురళీమోహన్, ప్రవీణ్, కిరణ్, సంపత్ తదితరులు ఉన్నారు. ముగిసినపదోన్నతుల ప్రక్రియ ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ మంగళవారం పూర్తయినట్లు డీఈఓ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. జిల్లాలోని 154మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు(ఎస్జీటీ) స్కూల్ అసిస్టెంట్లుగా (ఎస్ఏ) పదోన్నతులు పొందారన్నారు. అదేవిధంగా 40 మంది స్కూల్ అసిస్టెంట్లు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు పొందినట్లు తెలిపారు. మహిళలకు రూ. 40 కోట్ల రుణాలు వర్గల్(గజ్వేల్): రాబోయే ఏడాదిలో మహిళా సంఘాలకు రూ.40 కోట్ల రుణాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సెర్ప్ ఏపీఎం కిరణ్కుమార్ అన్నారు. మంగళవారం స్థానిక సెర్ప్ కార్యాలయంలో తాళ్ల రేణుక అధ్యక్షతన మండల మహిళా సమాఖ్య వార్షిక మహాసభ జరిగింది. రాబోయే సంవత్సరంలో 420 మందిని మహిళా వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడం, బ్యాంకు లింకేజీ ద్వారా 669 సంఘాలకు రూ. 40 కోట్ల రుణాలు అందించాలని తీర్మానించారు. అలాగే మట్టి వినాయకులతో పర్యావరణ పరిరక్షణకు మహిళాలోకం బాసటగా నిలవాలని పిలుపునిస్తూ కిరణ్కుమార్ అందరికీ మట్టివినాయక ప్రతిమలు పంపిణీ చేశారు. ప్రజా సంక్షేమమే లక్ష్యం సీఎం రేవంత్రెడ్డి చిత్తశుద్ధితో కృషి ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్యయాదవ్ గజ్వేల్: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సాహసోపేత నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య యాదవ్ అన్నారు. మంగళవారం రిమ్మనగూడలో డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి రేవంత్రెడ్డి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో ప్రజలు ఛీకొడుతున్నారన్నారు. -
నిర్లక్ష్యం వహిస్తే జీతం కట్
● వైద్య సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం ● నారాయణరావుపేట మండల కేంద్రంలో పర్యటన సిద్దిపేటరూరల్: వైద్య సిబ్బందిపై కలెక్టర్ హైమావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే జీతం కట్ చేస్తామని హెచ్చరించారు. మంగళవారం నారాయణరావుపేట మండల కేంద్రంలో కలెక్టర్ హైమావతి పీహెచ్సీని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, డ్రై డేను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పీహెచ్సీ సందర్శించి హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. మెడికల్ ఆఫీసర్ బాపురెడ్డి లీవ్లో ఉన్నట్లు తెలపగా డీఎంహెచ్ఓకు ఫోన్ చేసి తెలుసుకున్నారు. ఇతర హెల్త్ సూపర్వైజర్లు సునీత, పాండురంగాచారి, సుధారాణిలు ఫీల్డ్కు వెళ్లారని చెప్పడంతో కలెక్టర్ వారికి వీడియో కాల్ చేసి తెలుసుకున్నారు. దీంతో 10.30 గంటలైనా విధులకు వెళ్లకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక రోజు వేతనాన్ని నిలిపివేయాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. వైద్య సిబ్బందిపై ఎంపీడీఓ తరచూ పర్యవేక్షణ ఉండాలన్నారు. జ్వరంతో ఆస్పత్రికి వచ్చిన వారితో కలెక్టర్ మాట్లాడారు. కాచి చల్లార్చిన నీటి నే తాగాలని సూచించారు. ఇంటితో పాటు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. శుక్రవారం డ్రై డే నిర్వహించేలా ప్రజల్లో అవగా హన తీసుకురావాలన్నారు. మండల కేంద్రంలో 68 ఇళ్లు మంజూరుకాగా, కేవలం 48 మాత్రమే గ్రౌండింగ్ అయ్యాయని అధికారులు కలెక్టర్కు తెలిపారు. లబ్ధిదారులతో మాట్లాడుతూ త్వరగా ఇంటి నిర్మాణం చేపట్టాలని, నిధులు అకౌంట్లో జమ అవుతాయన్నారు. మట్టి విగ్రహాలను పూజిద్దాంసిద్దిపేటరూరల్: ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్ఠించి, పర్యావరణాన్ని కాపాడాలని కలెక్టర్ హైమావతి సూచించారు. మంగళవారం కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయంలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సహజ రంగులు ఉపయోగించి తయారు చేసిన మట్టి విగ్రహాలను పూజించాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం అవుదామన్నారు. -
దశలవారీగా డబ్బులు జమ
సిద్దిపేటరూరల్: ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు వేగంగా ఇళ్లు నిర్మించుకోవాలని జెడ్పీ సీఈఓ రమేశ్ సూచించారు. మండల పరిధిలోని పుల్లూరు గ్రామంలో మంగళవారం ఆయన పర్యటించారు. విద్యార్థుల మధ్యాహ్నం భోజనం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్మాణాలు చేపట్టిన దశలవారీగా డబ్బులు జమవుతున్నాయన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మరళీధర్శర్మ, పంచాయతీ కార్యదర్శి గౌస్ తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ సీఈఓ రమేశ్ -
యూరియా కోసం అలసి.. సొలసి
యూరియా కొరత రైతులను పట్టి పీడిస్తోంది. బస్తా యూరియా కోసం రైతులు రాత్రనక పగలనకా పడిగాపులు పడుతున్నారు. మిరుదొడ్డికి యూరియా లారీ వస్తుందన్న సమాచారంతో రైతులు సోమవారం తెల్లవారుజాము నుంచే రైతు వేదిక వద్దకు చేరుకున్నారు. అలసి సొలసిన కొందరు అక్కడే కునుకు తీశారు. తీరా యూరియా రావడం లేదని తెలియడంతో ఆగ్రహావేశాలకు లోనయ్యారు. దీంతో రోడ్డుపై బైఠాయించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మంగళవారం రెండు యూరియా లారీలను తెప్పించి పంపిణీ చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనవిరమించారు. దుబ్బాక వ్యవసాయ సహకార సంఘం ఎదుట ఆదివారం అర్ధరాత్రి నుంచే రైతులు క్యూ కట్టారు. మద్దూరు మండలం రేబర్తి సొసైటీ వద్ద జరిగిన యూరియా పంపిణీలో తోపులాట చోటుచేసుకుంది. పోలీసుల పహారాలో అందించారు. చిన్నకోడూరు, బెజ్జంకి, చేర్యాల, కొండపాక తదితర మండలాల్లోనూ ఇదే దుస్థితి. – మిరుదొడ్డి(దుబ్బాక)/ మద్దూరు(హుస్నాబాద్)/ చిన్నకోడూరు/బెజ్జంకి/చేర్యాల(సిద్దిపేట):రెండు రోజులుగా జ్వరం..అయినా.. సంచి యూరియా కోసం నాలుగు రోజుల నుంచి తిప్పలు పడుతున్నా. అయినా దొరకడంలేదు. నాకు బీపీ, షుగర్ ఉంది. పైగా రెండు రోజులుగా జ్వరం. గంటల కొద్దీ నిరీక్షించడంలో పానం ఆగమవుతోంది. జర యూరియా అందించి పుణ్యం కట్టుకోండి. – కనకవ్వ, మహిళా రైతు, అందె, మిరుదొడ్డి -
అర్జీలపై నివేదిక ఇవ్వండి
అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్ హైమావతి సిద్దిపేటరూరల్: ప్రజావాణిలో ప్రజలు అందించిన ప్రతి అర్జీని త్వరగా పరిష్కరించాలని, అలాగే అర్జీలపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించి సమస్య మళ్లీ పునరావృతం కాకుండా చూడాలన్నారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం 281 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్ఓ నాగరాజమ్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇబ్బందులు తొలగించండి మాది బందారం గ్రామం. ఔటర్ రింగురోడ్డు నిర్మాణంలో భాగంగా గ్రామం మధ్యలో ఉన్న సీసీ రోడ్డును తొలగించారు. మళ్లీ రోడ్డు నిర్మాణం చేయకపోవడంతో వర్షాలకు పూర్తిగా గుంతలు ఏర్పడి వాహనదారులకు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ విషయమై ఎన్నో సార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఫలితం లేకుండా పోయింది. ఎలాగైనా అధికారులు స్పందించి తాత్కాలిక రోడ్డు నిర్మించి సమస్యను పరిష్కరించాలని బందారం గ్రామస్తులు కోరారు. డంపింగ్ యార్డును తొలగించాలి మాది తొగుట మండలం, వరదరాజులపల్లి గ్రామం. సిద్దిపేట మున్సిపాలిటీకి చెందిన చెత్తను తీసుకువచ్చి గ్రామ శివారులో వేస్తున్నారు. దీంతో నీటితోపాటు భూమలు కలుషితం అవుతున్నాయి. అలాగే బయోఎరువులు, బయోగ్యాస్ యూనిట్లు ఏర్పాటు చేశారు. వాటి నుంచి వెలువడే వ్యర్థ పదార్థాలను దిగువన ఉన్న కుంటలోకి వదులుతున్నారు. అందులోని చేపలు సైతం చనిపోతున్నాయి. ఇప్పటికై నా డంపింగ్ యార్డును తొలగించాలని వరదరాజుల పల్లి గ్రామస్తులు కోరుతున్నారు. ఉపకరణాలు అందించాలి జిల్లాలో అర్హులైన దివ్యాంగులకు ఉపకరణాలను అందించాలని స్వేచ్ఛ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ దివ్యాంగులు ఉపకరణాలు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కార్మికులకు ఇన్సూరెన్స్ చేయించండి సిద్దిపేటరూరల్: పరిశ్రమల్లోని కార్మికులకు ఇన్సూరెన్స్ చేయించాలని కలెక్టర్ హైమావతి అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని యువతకు ఉపాధి అందించడానికి పరిశ్రమల స్థాపన ఎంతో ముఖ్యమన్నారు. వివిధ పరిశ్రమలు నెలకొల్పడానికి దరఖాస్తు పెట్టుకున్న వాటిని పరిశీలన చేయాలన్నారు. పరిశ్రమల శాఖ అధికారి గణేశ్రామ్, ఎల్డీఎం హరిబాబు, పాల్గొన్నారు. ఇళ్ల గ్రౌండింగ్లో వేగం పెంచాలి ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్లో వేగం పెంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్పై ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ జూమ్ ద్వారా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్కింగ్ చేశాక బేస్మెంట్ వరకు నిర్మాణం కాని వారి వివరాలను తీసుకురావాలన్నారు. బేస్మెంట్ వరకు అయిన వాటిని ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షించాలన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన యాప్లో నమోదు చేసేలా పంచాయతీ కార్యదర్శులకు టార్గెట్ ఇవ్వాలన్నారు. -
మల్లన్న ఆలయ అభివృద్ధికి కృషి
రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అదనపు డీసీపీగా కుశల్కర్ సిద్దిపేటకమాన్: నూతన అదనపు డీసీపీ (అడ్మిన్) గా సీహెచ్ కుశల్కర్ సోమ వారం బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీపీ అనురాధను సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో ఏసీపీ రవీందర్రెడ్డి, ఏసీపీ నరసింహులు, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీధర్గౌడ్, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మట్టి గణపయ్యనే ప్రతిష్ఠిద్దాం ● పర్యావరణాన్ని కాపాడుదాం ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ స్కాలర్షిప్లు విడుదల చేయండి దుబ్బాక: పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్స్, స్కాలర్ షిప్లను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ దుబ్బాక నగర కార్యదర్శి జశ్వంత్ డిమాండ్ చేశారు. సోమవారం దుబ్బాకలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందన్నారు. లక్షలాది పేద విద్యార్థులు పైచదువులకు పోకుండా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్ బకాయిలు అడ్డుపడుతున్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని అన్నారు. కార్యక్రమంలో నాయకులు అఖిల్, శేషాంక్, రాజు, దిలీప్, రాకేశ్ ఉన్నారు. -
అసెంబ్లీని ముట్టడిస్తాం
చేర్యాలను డివిజన్ చేయాల్సిందే● సాధన సమితి జేఏసీ చైర్మన్నరసయ్య పంతులు ● అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకోకొండపాక(గజ్వేల్): చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని సాధన సమితి జేఏసీ చైర్మన్ వకులాభరణం నరసయ్య పంతులు హెచ్చరించారు. మండల పరిధిలోని వెలికట్ట శివారులో అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజానీకం వివిధ సమస్యల పరిష్కారం కోసం హుస్నాబాద్, గజ్వేల్, సిద్దిపేట, జనగామ తదితర పట్టణాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. దీంతో దూరభారంతోపాటు ఆర్థిక భారం తప్పడంలేదన్నారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలంటూ ఎనిమిదేళ్లుగా పోరాటం చేస్తున్నామన్నారు. అయినా పాలకులు స్పందించడంలేదన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చని పక్షంలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతామన్నారు. రహదారిపై సుమారు 25 నిమిషాల పాటు రాస్తారోకో కొనసాగడంతో రోడ్డుకు ఇరువైపులా సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు జోక్యం చేసుకుని రాస్తారోకోను విరమింపజేశారు. కార్యక్రమంలో నాయకులు ఆముదాల మల్లారెడ్డి, బాల్నర్సయ్య, యాదగిరి, శ్రీధర్రెడ్డి, సంతోష్, రవీందర్, పద్మ, శోభ, మానస, మల్లేశం, కర్ణాకర్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
శాఖల మధ్య సమన్వయ లోపం
పారిశుద్ధ్య నిర్వహణను వైద్య, ఆరోగ్య శాఖ, మున్సిపల్, పంచాయతీ శాఖల సమన్వయంతో చేపట్టాల్సి ఉంటుంది. వర్షా కాలానికి వారం రోజుల ముందే సమావేశం ఏర్పాటు చేసుకొని తగిన ప్రణాళికలను రూపొందించుకోవాల్సి ఉంది. డ్రైనేజీల శుభ్రత, పైప్లైన్ల లీకేజీ, వర్షపు నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలి. వ్యాధులు ప్రభలే అవకాశమున్న చోట దోమల నివారణకు చర్యలు చేపట్టాలి. కానీ ఆయా శాఖల సమన్వయ లోపంతో పారిశుద్ధ్య పనులు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ఎవరికి వారు తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. -
వసతి గృహం తనిఖీ
కోహెడరూరల్(హుస్నాబాద్): శనిగరం గ్రామంలోని బాలుర వసతి గృహన్ని కలెక్టర్ హైమవతి శనివారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. వసతి గృహంలో ఉన్న విద్యార్థుల రిజిస్టర్ పరిశీలించారు. రిజిస్టర్లో నమోదైన పిల్లలు వసతి గృహంలో లేకపోవడంతో కలెక్టర్ వార్డెన్ను ప్రశ్నించారు. అదివారం సెలవు కావడంతో ఇంటికి వెళ్లారని వార్డెన్ తెలిపారు. ఆనంతరం విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వసతి గృహంలో మరుగుదొడ్లు సరిగాలేవని విద్యార్థులు తెలిపారు. సమస్య పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చిరు. -
ముదిరాజ్లను బీసీ ఏ లోకి మార్చాలి
సిద్దిపేటకమాన్: ముదిరాజ్లను బీసీ డీ నుంచి ఏ లోకి మార్చాలని తెలంగాణ ముదిరాజు పోరాట సమితి (టీఎంపీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. స్థానిక ప్రెస్క్లబ్లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ముదిరాజ్ పోరాట సమితి ఆధ్వర్యంలో పల్లెబాట నిర్వహించామన్నారు. ముదిరాజ్ల సమస్యలు పరిష్కరించే వరకు పోరాడుతామన్నారు. 57ఏళ్లు నిండిన మత్స్యకారులకు పింఛన్లు కేటాయించాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజ్లకు అవకాశం కల్పించాలన్నారు.కార్యక్రమంలో అశోక్, నీవన్, రమేశ్, రంజిత్, శేఖర్, శ్రీశైలం, నరేశ్, దత్తు తదితరులు పాల్గొన్నారు. టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు పరమేశ్వర్ సిద్దిపేటజోన్: జిల్లాలో ఆయా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న నాల్గో తరగతి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు పరమేశ్వర్, కార్యదర్శి విక్రమ్రెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక పబ్లిక్ సర్వెంట్స్ హోంలో జరిగిన ఉద్యోగుల సమావేశంలో వారు పాల్గొన్నారు. కష్టపడి పనిచేయాలని, అధికారులకు అందుబాటులో ఉండాలని సూచించారు. అనంతరం నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా మహిపాల్రెడ్డి, కార్యదర్శిగా కనకరాజు, అసోసియేట్ అధ్యక్షుడిగా నాగేందర్, కోశాధికారిగా జహంగీర్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో టీఎన్జీఓ నాయకులు అశ్వాక్, శశిధర్, తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్: దివ్యాంగులు, వృద్ధులకు పింఛన్ డబ్బులను పెంచేవరకు పోరాడుతామని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి మంద కుమార్ అన్నారు. వచ్చే నెల 9న సికింద్రాబాద్లోని పరేడ్గ్రౌండ్లో నిర్వహించనున్న పెన్షన్దారుల ‘మహా గర్జన’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం మున్సిపాలిటీ పరిధిలోని క్యాసారంలో పెన్షన్దారుల సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హజరైన మంద కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చిన విధంగా వృద్ధుల పెన్షన్ రూ.4వేలకు, దివ్యాంగుల పెన్షన్ను రూ.6వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ‘మహా గర్జన’కు పెన్షన్దారులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మైస రాములుమాదిగ పాల్గొన్నారు. వికలాంగుల సంక్షేమం పట్టని సర్కార్ మిరుదొడ్డి(దుబ్బాక): వికలాంగుల సంక్షేమాన్ని సీఎం రేవంత్రెడ్డి విస్మరిస్తున్నారని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్ఛార్జి మంద కుమార్ మాదిగ, జిల్లా అధ్యక్షుడు ముక్కపల్లి రాజు విమర్శించారు. ఆదివారం మిరుదొడ్డిలో వీహెచ్పీఎస్ (వికలాంగుల హక్కుల పోరాట సమితి) సీహెచ్పీఎస్ (చేయూత పెన్షన్ దారుల హక్కుల పోరాట సమితి) సంయుక్త ఆధ్వర్యంలో వికలాంగుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం చేయూత పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే కొత్తగా దరఖాస్తులు చేసుకున్న వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. లేదంటే రాష్ట్రంలో ఉన్న 45 లక్షల పెన్షన్దారులు రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు చేయకతప్పదన్నారు. వచ్చే నెల 9న సికింద్రాబాద్లో తలపెట్టిన వికలాంగులు, చేయూత పెన్షన్దారుల మహా గర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వీహెచ్పీఎస్ దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జి రాజేశ్వర్రావు, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు శాంతికుమార్, నాయకులు రాములు, రాజనర్సు, అంజయ్య, వెంకటేశం, ఎల్లయ్య, మల్లయ్య, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
● సకాలంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి ● వైద్యాధికారులకు కలెక్టర్ హైమావతి ఆదేశాలు ● తిమ్మాపూర్లో క్షేత్రస్థాయిలో పర్యటనజగదేవ్పూర్(గజ్వేల్): సీజనల్ వ్యా ధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ.. తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హైమావతి వైద్యాధికారులను ఆదేశించారు. ఆదివారం జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ఇటీవల డెంగీతో మృతి చెందిన శ్రావణ్, మహేశ్ల కుటుంబ సభ్యులను పరామర్శించారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో ఫీవర్ సర్వేతో పాటు డెంగీ పరీక్షలు నిర్వహించాలని, ఎలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే రక్తనమూనాలను టీహబ్కు పంపించి సమగ్ర వివరాలు తెలుసుకోవాలన్నారు. నీరు, చెత్తాచెదారం నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు. వైద్యం విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని, గ్రామాల్లో స్థానికంగా ఉండే ఆర్ఎంపీల వద్దకు వెళ్లకుండా ఎలాంటి లక్షణాలున్నా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. గ్రామంలో అసాధారణ వైద్యం చేస్తున్న ఆర్ఎంపీ రమేశ్ క్లీనిక్ను సీజ్ చేసి అతనిపై కేసు నమోదు చేయాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. కార్యక్రమంలో డీపీఓ దేవకీదేవి, డీఎంహెచ్ఓ ధనరాజ్, ఎంపీడీఓ రాంరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
కిటకిటలాడిన నాచగిరి క్షేత్రం
వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధమైన నాచారం గుట్ట నాచగిరి లక్ష్మీనృసింహక్షేత్రం ఆదివారం భక్తజనులతో రద్దీగా మారింది. సెలవురోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. హల్దీనది వాగులో పుణ్యస్నానాలాచరించారు. గర్భగుడిలో విశేషాలంకృతులై కొలువుదీరిన స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. మొక్కులు తీర్చుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తుల తాకిడితో క్యూలైన్లు రద్దీగా మారాయి. ఇబ్బంది తలెత్తకుండా ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు. నాచగిరీశుని దర్శించుకుంటున్న భక్తులు -
విద్యారంగం బలోపేతం చేద్దాం
● ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపు ● గజ్వేల్లో టీపీటీఎఫ్ విద్యాసదస్సు ● హాజరైన ప్రొఫెసర్ కాశీం, విమలక్క గజ్వేల్: ప్రభుత్వ విద్యారంగం బలోపేతమే లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపునిచ్చారు. ఆదివారం ప్రజ్ఞాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఎల్లయ్య పదవీవిరమణ సందర్భంగా స్థానిక ప్రజ్ఞాగార్డెన్స్లో టీపీటీఎఫ్ విద్యా సదస్సు నిర్వహించారు. సదస్సుకు హాజరైన కోదండరామ్ మాట్లాడుతూ విద్యారంగాభివృద్ధికి టీపీటీఎఫ్ నిబద్దతతో పనిచేయాలన్నారు. ‘ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ–పౌర సమాజం పాత్ర’ అంశంపై ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సీసీఎస్ విధానం వద్దు అంటూ ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్న తరుణంలో...ఈ విద్యారంగాన్ని ఎలా కాపాడుకోగలమని ప్రశ్నించారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో ప్రమాణాలతో కూడిన విద్యాబోధన జరుగుతుండగా, ప్రభుత్వ విద్యా సంస్థల్లో అందుకుభిన్నమైన పరిస్థితి నెలకొన్నదని చెప్పారు. ఈ పరిస్థితి మార్చడానికి ఉపాధ్యాయులు పనిచేయాలన్నారు. ‘తెలంగాణ సాంస్కృతికోద్యమం–మహిళలు’ అంశంపై అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క మాట్లాడారు. ‘తెలంగాణ సాహిత్యోద్యమం–మహిళలు’ అంశంపై నల్గొండ మహత్మాగాంధీ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనిత ప్రసంగించారు. టీపీటీఎఫ్ గజ్వేల్ జోన్ కన్వీనర్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ విద్యా సదస్సులో టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అనిల్కుమార్, ప్రధాన కార్యదర్శి తిరుపతి, అసోసియేట్ అధ్యక్షులు తిరుపతిరెడ్డి, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రం, నాయకులు పాల్గొన్నారు. -
వీడని బారులు.. తీరని తిప్పలు
సిద్దిపేట రూరల్: రాఘవపూర్లో రైతుల నిరసననంగునూరు: పాలమాకుల పీఏసీఎస్ వద్ద బారులు తీరిన రైతులు నంగునూరు(సిద్దిపేట): జిల్లాలో యూరియా కష్టాలు తొలగడంలేదు. పంపిణీ కేంద్రాల వద్ద బారులు తీరిన రైతులే కనిపిస్తున్నారు. రోజంతా నిరీక్షించినా అందని దుస్థితి నెలకొంది. నంగునూరు మండలం పాలమాకుల పీఏసీఎస్కు ఆదివారం యూరియా వస్తోందని తెలియడంతో తెల్లవారు జామునే చుట్టుపక్కల గ్రామాల రైతులు వచ్చి క్యూలైన్లో నిలబడ్డారు. అయితే ఇప్పటి వరకు తీసుకోని వారికి మాత్రమే ఇస్తామని చెప్పడంతో గందళగోళానికి దారి తీసింది. ఆగ్రహించిన కొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న రాజగోపాల్పేట ఎస్ఐ సిబ్బందితో అక్కడికి చేరుకొని రైతులను సముదాయించారు. గొడవ సద్దు మణగడంతో అధికారులు టోకెన్లు పంపిణీ చేశారు. పోలీసుల పహారాలో యూరియా అందజేశారు. ఈసందర్బంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఒక బస్త యూరియాకు మూడు సార్లు క్యూలైన్లో నిలబడాల్సి వచ్చిందన్నారు. పోలీసుల పహారాలో.. కొమురవెల్లి(సిద్దిపేట): మండల కేంద్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసుల పహారాలో ఆదివారం యూరియా పంపిణీ చేశారు. రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి వెంకట్రావమ్మ, ఏఈఓలతో కలసి ఎస్ఐ రాజు, సిబ్బంది పహారాలో రైతులకు టోకన్లు జారీ చేశారు. రైతు సేవా కేంద్రం వద్ద యూరియాను అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కావాల్సినంత యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రాఘవపూర్లో ధర్నా సిద్దిపేటరూరల్: సరిపడా యూరియా సరఫరా చేయాలని కోరుతూ సిద్దిపేట– ముస్తాబాద్ రహదారిపై ఆదివారం రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ యూరియా పూర్తిస్థాయిలో అందడం లేదన్నారు. గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉంటే కొద్ది మందికి మాత్రమే ఇస్తున్నారని వాపోయారు. పాలకులు స్పందించి కావాల్సిన యూరియా సరఫరా చేయాలన్నారు.యూరియా కోసం పడిగాపులు -
పాపన్న ఆశయాలు సాధిద్దాం
మాజీ మంత్రులు హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్ చిన్నకోడూరు(సిద్దిపేట): నాడు కులవృత్తులను ఏకం చేసిన గొప్పవ్యక్తి సర్వాయి పాపన్న గౌడ్ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం గోనెపల్లిలో గౌడ సంఘం, కౌండిన్య సంఘం ఆధ్వర్యంలో పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల, మత, జాతి వర్గ విభేదాలు లేని సమాజం కోసం పోరాటం చేసిన పాపన్న గౌడ్ ఆదర్శనీ యుడన్నారు. ఆయన ఆశయసాధనకు కృషి చేయాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో పాపన్న గౌడ్ చరిత్రను పుస్తకాల్లో పాఠ్యంశంగా చేర్చామన్నారు. జయంతి, వర్ధంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత సిద్దిపేటజోన్: సాక్షాత్తు పార్వతీదేవి మట్టితో వినాయకుడికి జీవం పోసింది. అలాంటి మట్టితో చేసిన వినాయకుడిని పూజిస్తేనే భక్తి, శక్తి లభిస్తుందని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. అమర్నాథ్ సేవా సమితి సేవలు ఆదర్శంగా ఉన్నాయని కితాబిచ్చారు. మట్టి విగ్రహాన్ని పూజించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడదామన్నారు. ఇటీవల పట్టణంలో ఇష్టానుసారంగా చెట్లను నరుకుతున్నారని ఇది మంచి పద్ధతి కాదన్నారు. నాటిన ప్రతి మొక్కను కాపాడే బాధ్యత మనందరి పైన ఉందన్నారు. కార్యక్రమంలో అన్నదాన సేవా సమితి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
ఎరువుల ఇబ్బందులు ఉండొద్దు
అధికారుల సమీక్షలో ఎమ్మెల్యే హరీశ్రావు సిద్దిపేటజోన్: నియోజకవర్గ పరిధిలో రైతులెవరూ ఎరువుల కోసం ఇబ్బంది పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. వ్యవసాయశాఖ అధికారులతో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఆయా మండలాల వారీగా యూరియా సరఫరా, ఇండెంట్ గురించి ఆరా తీశారు. నియోజకవర్గంలో రైతులు ఎరువుల కొరతతో ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు నిర్లక్ష్యం వీడాలని సూచించారు. ఈ వానాకాలం సీజన్లో 11,600 మెట్రిక్ టన్నులకుగాను 4,772 మెట్రిక్ టన్నులే సరఫరా చేశారని మిగతా 6,878 మెట్రిక్ టన్నులను ఎప్పుడు సరఫరా చేస్తారని ప్రశ్నించారు. రైతులు యూరియా కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య తీవ్రతను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. పంట నష్టం, రైతు బీమా అందించడానికి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సూచించారు. -
13న జాతీయ లోక్ అదాలత్
సిద్దిపేటకమాన్: సెప్టెంబర్ 13న జరిగే జాతీయ లోక్ అదాలత్లో క్రిమినల్ కేసులు, సివిల్, చెక్ బౌన్స్, మోటారు వాహన కేసులు రాజీపడేలా చూడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి తెలిపారు. శనివారం జిల్లా కోర్టులో పోలీసు, రెవెన్యూ, ఎకై ్సజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, సీపీ అనురాధ, న్యాయమూర్తులు జయప్రసాద్, మిలింద్ కాంబ్లి, సంతోష్కుమార్, సాధన, రేవతి, స్వాతిగౌడ్, జితేందర్, కాంతారావు, రాజశేఖర్రెడ్డి, పీపీ జీవన్రెడ్డి, అడిషనల్ పీపీ ఆత్మరాములు, ఏసీపీ రవీందర్రెడ్డి, సీఐలు తదితరులు పాల్గొన్నారు. కూడవెల్లి ఆలయం అభివృద్ధికి కృషిమంత్రి కొండా సురేఖ దుబ్బాక: దక్షిణకాశీగా ప్రసిద్ధిగాంచిన కూడవెల్లి రామలింగేశ్వర ఆలయం అభివృద్ధికి కృషి చేస్తానని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. శనివారం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో ఆలయం చైర్మన్ రాజిరెడ్డి మంత్రి సురేఖను కలిసి ఆలయం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. స్పందించిన ఆమె తప్పకుండా నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రి సానుకూలంగా స్పందించడంతో కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అనంతుల శ్రీనివాస్, ఏసురెడ్డి, రవి, శ్రీరాం నరేందర్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. శ్యాంసుందర్కు డాక్టరేట్దుబ్బాక: దుబ్బాక ప్రభుత్వ డిగ్రీ కళాశాల రసాయన శాస్త్రం అధ్యాపకులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్యాంసుందర్కు హైదరాబాద్ గీతం డీమ్డ్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. శ్యాంసుందర్ సింథసిస్ అండ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ బెంజాక్సజోల్స్, థయాజొలిడిన్ డయోన్స్ అండ్ బయోలిజికల్ డాకింగ్ స్టడీస్పై చేసిన పరిశోధనకు డాక్టరేట్ లభించింది. పర్యవేక్షకులు సుధాకర్ ఆధ్వర్యంలో శ్యాంసుందర్ చేసిన పరిశోధన ఫలితాలు రెండు అంతర్జాతీయ పరిశోధనా జర్నల్స్ లెటర్స్ ఆన్ ఆర్గానిక్ కెమిస్ట్రీతో పాటు రష్యన్ జర్నల్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ప్రచురితమయ్యాయి. శ్యాంసుందర్కు డాక్టరేట్ రావడంపై ప్రిన్సిపాల్ భవాని అధ్యాపకులు అభినందించారు. ఉత్తమ ప్రతిభకు పురస్కారం సిద్దిపేట సీపీ అనురాధ సిద్దిపేటకమాన్: ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందికి అవార్డులు, రివార్డులు అందించనున్నట్లు సీపీ అనురాధ తెలిపారు. శనివారం సిద్దిపేట పోలీసు కమిషనరేట్ పరిధిలో జూన్ నెలలో విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి సీపీ ప్రశంసా పత్రాలు అందజేశారు. చేర్యాల పట్టణంలోని చెరువులో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన మహిళను కాపాడిన కానిస్టేబుల్ను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఎక్కువ మంది గంజాయి నేరస్తులను అరెస్టు చేసినందుకు తెలంగాణ నార్కోటిక్ బ్యూరో నుంచి నగదు పురస్కారం అందజేశామన్నారు. 32మందికి కేపీఐ రివార్డులు అందజేసినట్లు చెప్పారు. 11 మంది పోలీస్ అధికారులకు నగదు పురస్కారం అందజేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్చంద్రబోస్, ఏసీపీలు రవీందర్రెడ్డి, నర్సింలు, అధికారులు పాల్గొన్నారు. -
పర్యాటక కేంద్రంగా ఎల్లమ్మ చెరువు
హుస్నాబాద్: ఎల్లమ్మ చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. హుస్నాబాద్ పట్టణంలో మంత్రి శనివారం పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో జరుగుతున్న పెండింగ్ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రూ.15 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఎల్లమ్మ చెరువు ఆధునీకరణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ...ఎల్లమ్మ చెరువులో చేపడుతున్న అక్రమ మట్టి తరలింపునకు అడ్డుకట్ట వేయాలన్నారు. ఎల్లమ్మ సుందరీకరణ పనుల పురోగతి బతుకమ్మ, దసరాలోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయం మాదిరిగా ఎల్లమ్మ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని హామీనిచ్చారు. 250 పడకల ఆస్పత్రి పనులు ప్రారంభమయ్యాయని, అది పూర్తికాగానే పీజీ కళాశాల పనులను ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. గౌరవెల్లి ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని, కాలువల నిర్మాణానికి రైతులు సహకరించాలని కోరారు. మూడు జిల్లాల కలెక్టర్లతో మాట్లాడిన మంత్రి యూరియా సరఫరాపై సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లతో మంత్రి పొన్నం ఫోన్లో మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సరిపడా యూరియాను అందించాలన్నారు. ఎరువుల పంపిణీలో ఎలాంటి లోపాలు చేసుకోకుండా విజిలెన్స్ మానిటరింగ్ చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో అధ్యక్షుడు బొలిశెట్టి శివయ్య, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, ఎల్లమ్మ దేవాలయ కార్యనిర్వహణ అధికారి కిషన్రావు తదితరులున్నారు. -
పేదరికం పరిధులు దాటి..
సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించిన యువకుడుతొగుట(దుబ్బాక): సంకల్ప బలముంటే విధి కూడా తలవంచుతుందని నిరూపించాడో నిరుపేద యువకుడు. మండల పరిధిలోని ఎల్లారెడ్డిపేటకు చెందిన నర్మెట ఎల్లవ్వ, రాములు దంపతులు రెక్కల కష్టంతో కూలి పనులు చేసుకుంటూ జీవనం గడుపుతుండేవారు. వీరికి మనోజ్ కుమార్ కుమా రుడు. ఎలాగోలా కష్టపడి మనోజ్ కుమార్ను డిగ్రీవరకు చదివించారు. ఇదేక్రమంలో తండ్రి రాములు మరణించాడు. దీంతో తన తల్లిని కష్టాల నుంచి గట్టెంక్కించాలన్న సంకల్పంతో కొన్నాళ్లు కేంద్ర ప్రభుత్వ విభాగంలోని సీఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్)లో కానిస్టేబుల్గా ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విధులు నిర్వహించాడు. తను పనిచేస్తున్న విభాగంలో మరింత ఉన్నత ఎత్తుకు ఎదగాలనుకుని కానిస్టేబుల్గానే విధులు నిర్వర్తిస్తూనే సీఐఎస్ఎఫ్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం సాధించాడు. హకీంపేటలో గత ఆరు నెలలుగా కఠినమైన ట్రైనింగ్ను పూర్తి చేసుకుని తన పాసింగ్ అవుట్ పరేడ్ను పూర్తి చేశాడు. ఉద్యోగం వచ్చిన ఆనందంతో తన తల్లి ఎల్లవ్వతో సంతోషాన్ని పంచుకున్నాడు. ఉద్యోగం సాధించుకున్న మనోజ్కుమార్ను అభినందిస్తూ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. -
అదే వరుస.. అదే ప్రయాస
మిరుదొడ్డి(దుబ్బాక)/దుబ్బాకటౌన్/దౌల్తాబాద్(దుబ్బాక)/సిద్దిపేటకమాన్:/సిద్దిపేటఅర్బన్: యూరియా కొరత రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. యూరియా వస్తుందని తెలిస్తే చాలు అన్నదాతలు అర్ధరాత్రే యూరియా కేంద్రాల వద్ద వాలిపోతున్నారు. పట్టా పాస్పుస్తకాలు, చెప్పులు క్యూ లైన్లో ఉంచి పడిగాపులు కాస్తున్నారు. అయినా ఒకటి, రెండు యూరియా బస్తాలు దొరకడమే గగనంగా మారిపోయింది. మిరుదొడ్డి మండల పరిధిలోని అల్వాల గ్రామానికి రెండు లారీల్లో 1,108 యూరియా బస్తాలు వచ్చాయి. విషయం తెలుసుకున్న రైతులు శుక్రవారం అర్ధరాత్రి నుంచే క్యూ లైన్లో పడిగాపులు కాచారు. అధికారులు రెండేసి బస్తాలు పంపిణీ చేశారు. అయితే యూరియా దొరకని రైతులు ఆగ్రహించి రైతు వేదికలో ఉన్న వ్యవసాయ అధికారులను నిర్భంధించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా దౌల్తాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు యూరియా కోసం ఉదయం నుంచే కాచుకొని కుర్చున్నారు. గంటల తరబడి లైన్లో ఉన్నా యూరియా దొరకడం కష్టంగా మారిందని రైతులు వాపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచకపోవడం వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు శ్రీరామ్రెడ్డి వాపోయారు. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం వల్లే రాష్ట్రంలో రైతులు యూరియా కోసం క్యూ లైన్లు కట్టే పరిస్థితి వచ్చిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు ఆరోపించారు. కార్మిక, కర్షక భవన్లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సరిపడా యూరియాను సరఫరాచేసి రైతుల ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేశారు. యూరియా కోసం రైతుల పాట్లు -
శాస్త్రవేత్తలుగా ఎదగాలి
● దేశస్థాయిలో వర్గల్ ఖ్యాతి ఇనుమడింపజేయాలి: ఎంపీ రఘునందన్ ● నవోదయలో ఘనంగా జాతీయ అంతరిక్ష దినోత్సవం విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలి వర్గల్(గజ్వేల్): భూనిర్వాసిత రైతులు సాగుచేసిన పొలాలకు వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. వర్గల్ ఫుడ్ప్రాసెసింగ్ జోన్లో భూములు కోల్పోయిన రైతులు శనివారం వర్గల్ మండలం అవుసులోనిపల్లి కెనాల్ వద్ద ఆయనను కలిసి న్యాయం చేయాలంటూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమలు అక్కడ ఏర్పాటు కాకపోవడంతో భూనిర్వాసిత రైతులు పంటలు సాగు చేసుకున్నారని, పంట సగంలో హఠాత్తుగా అర్ధరాత్రి అధికారులు విద్యుత్ సరఫరా కట్ చేయడం సరికాదన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు ఫోన్ద్వారా పరిస్థితి వివరించారు. ముందే చెబితే రైతులు నాట్లు వేసేవారు కాదన్నారు. విద్యుత్ పునరుద్ధరణ చేయాలని కోరారు. విద్యుత్ పునరుద్ధరణ చేయకపోతే బీజేపీ ఆధ్వర్యంలో రైతుల తరపున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.వర్గల్(గజ్వేల్): శాస్త్ర సాంకేతిక రంగాలు అద్భుతంగా పురోగమిస్తున్న వేళ.. నవోదయ విద్యార్థులు దేశం గర్వించేస్థాయిలో శాస్త్రవేత్తలుగా ఎదగాలని, వర్గల్ ఖ్యాతిని ఇనుమడింపజేయాలని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్రావు పిలుపునిచ్చారు. శనివారం ఉమ్మడి మెదక్జిల్లాలోని వర్గల్ నవోదయ విద్యాలయంలో జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమానికి ఆయన డీఆర్డీఓ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రామచందర్రావుతో కలిసి హాజరయ్యారు. వారికి ప్రిన్సిపాల్ దాసి రాజేందర్ ఆధ్వర్యంలో విద్యాలయ పరివారం, విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. అనంతరం అంతరీక్ష రంగానికి సంబంధించి ఆర్యభట్ట నుంచి చంద్రయాన్, గగనయాన్ దాకా భారత పరిశోధనలు, విజయాలు సూచిస్తూ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమున్నత ఆశయంతో విద్యార్థులు ముందుకుసాగుతూ ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. భావిపౌరులుగా 2047 నాటికి దేశాన్ని అభివృద్ధిచెందిన దేశంగా మార్చాల్సిన భాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రాజేందర్ విద్యాలయలో అభివృద్ధి పనులు వివరించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, నాయకులు కప్పర ప్రసాద్రావు, శ్రీనివాస్, గాడిపల్లి భాస్కర్, నందన్గౌడ్, రాంరెడ్డి, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డిప్యుటేషన్లు రద్దు చేయండి
● డీఎంహెచ్కు కలెక్టర్ ఆదేశం ● చింతమడక పీహెచ్సీ తనిఖీసిద్దిపేటరూరల్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ కె.హైమావతి అన్నారు. శనివారం మండల పరిధిలోని చింతమడక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రోగులకు అందించే వైద్యసేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అటెండెన్స్ రిజిస్టర్, ఓపి రిజిష్టర్ను తనిఖి చేశారు. వైద్యాధికారి భాస్కర్ 13వ తేదీ నుంచి రావడం లేదని అడగగా వర్గల్ మండలంలో డిప్యుటేషన్ ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. వెంటనే డీఎంహెచ్ఓతో మాట్లాడి రోజు 70 నుంచి 80 మంది వరకు ఓపి ఉండే ఆసుపత్రికి డాక్టర్ని డిప్యుటేషన్ ఇవ్వకూడదని, తప్పకుండా రెగ్యులర్ డాక్టర్ను అందుబాటులో ఉంచాలన్నారు. అన్ని డిప్యుటేషన్లను రద్దు చేయాలన్నారు. సీహెచ్ఓ లింగయ్య సెలవు మంజూరు కాకముందే సెలవు తీసుకున్నారని రిజిస్టర్ లో కలెక్టర్ కంప్లైంట్ రాశారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడుతూ డాక్టర్లు వస్తారా అని ఆరా తీయగా డాక్టర్ అప్పుడప్పుడు వస్తారని, నర్సులు సేవలందరిస్తారని రోగులు కలెక్టర్కు తెలిపారు. మట్టి గణపతులను పూజిద్దాం వినాయక చవితి పండగ సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్ఠించి పూజించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడాలని కలెక్టర్ హైమావతి సూచించారు. శనివారం కలెక్టరేట్లో కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర కార్యాలయం ఆధ్వర్యంలో రూపొందించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయం, పర్యావరణ ఇంజనీర్ కుమార్ పాఠక, టి.రవీందర్, పర్యావరణ శాస్త్రవేత్త, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ట్రిపుల్ఆర్.. ఐదు ప్యాకేజీలు
ఆదివారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 202530 కిలోమీటర్లకు ఒకటి.. ● పూర్తి కావొస్తున్న త్రీడీ, త్రీజీ నోటిఫికేషన్లు ● త్వరలో పనుల ప్రారంభానికి సన్నాహాలుట్రిపుల్ఆర్ ఉత్తర భాగం పనుల అంశం కొలిక్కి వచ్చింది. 161.518 కిలోమీటర్ల మేర చేపట్టనున్న ఈ పనులను ఐదు ప్యాకేజీలుగా విభజించినట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం త్రీడీ నోటిఫికేషన్ పూర్తికాగా, త్రీజీ కూడా తుది దశకు చేరుకోబోతుంది. ఈ క్రమంలోనే పరిహారం పంపిణీ చేపట్టడానికి రంగం సిద్ధమైంది. పనిలో పనిగా టెండర్ ప్రక్రియను సైతం వేగిరం చేసి పనులు ప్రారంభించడానికి సంబంధిత యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది. – గజ్వేల్ ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం పనులు ఎలా చేపట్టాలనే అంశంపై సుదీర్ఘ కసరత్తు చేసిన అధికారులు చివరకు ఐదు ప్యాకేజీలుగా చేపట్టడానికి నిర్ణయానికి వచ్చారు. ప్యాకేజీగా 30 కిలోమీటర్కు పైగా విభజించి పనులు చేపట్టే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. 161.518 కిలోమీటర్ల మేర పనులు జరగనుండగా, ఇందులో 100 కిలోమీటర్లపైగా నిడివి ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ఉంది. ఈ క్రమంలోనే మూడు ప్యాకేజీల పనులు ఇక్కడ జరుగను న్నాయి. మరో ముఖ్య విషయమేమిటంటే గజ్వేల్ కేంద్రంగా ఏర్పాటు చేసిన నేషనల్ హైవే ఆథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) కార్యాలయం ఈ పనులను పూర్తిస్థాయిలో పర్యవేక్షించనుంది. పరిహారం పంపిణీకి సన్నాహాలు భూసేకరణ కోసం ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని రెవెన్యూ డివిజన్ల వారీగా కాలా (కాంపీటెంట్ అథారిటీ ఫర్ ల్యాండ్ అక్వాజైషన్)లు పనిచేస్తున్న సంగతి తెల్సిందే. చౌటుప్పల్, యాదాద్రి– భువనగిరి, గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్, ఆందోల్–జోగిపేట, సంగారెడ్డి కాలాల పరిధిలోని 84 గ్రామాల్లో త్రీడీ నోటిఫికేషన్లో భాగంగా 4,832.5 ఎకరాల వరకు భూసేకరణ లక్ష్యంగా ఉండగా, ఇందులో 4,747.5 ఎకరాలను సేకరించారు. ఈ లెక్కన 98 శాతం భూసేకరణ పూర్తయ్యింది. త్రీజీ నోటిఫికేషన్లో పరిహారం పంపిణీకి సంబంధించిన అంశంపై కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటివరకు 86 శాతం ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పరిహారం పంపిణీకి త్వరలోనే చర్యలు చేపట్టబోతున్నారు. పరిహారం పంపిణీ తర్వాత భూములు స్వాధీనం చేసుకోవడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. దీని తర్వాత టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులను సైతం ప్రారంభించే ఆలోచనతో ఉన్నారు.ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం మ్యాపుఅటవీశాఖకు భూముల అప్పగింత పూర్తి ట్రిపుల్ఆర్ కోసం సేకరిస్తున్న భూమిలో 180 ఎకరాల అటవీ భూమి ఉంది. ఇందులో భాగంగానే ప్రత్యేకించి గజ్వేల్లోనే 70 ఎకరాల భూమిని అటవీశాఖ కోల్పోతుంది. ఈ భూమికి బదులుగా మహబూబాబాద్లో 180 ఎకరాల భూములను అటవీశాఖకు కేటాయించారు. ఈ భూముల అప్పగింతను అధికారికంగా పూర్తి చేశారు. ఇకపోతే మరో 650 ఎకరాల ప్రభుత్వ భూమిని సైతం ట్రిపుల్ఆర్ కోసం సేకరిస్తున్నారు.మరికొన్ని నెలల్లో ప్రారంభిస్తాం ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం పనులను మరికొన్ని నెలల్లో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పనులను ఐదు ప్యాకేజీలుగా చేపట్టాలని నిర్ణయించాం. త్రీడీ నోటిఫికేషన్ పూర్తయ్యింది. త్రీజీ కూడా త్వరలోనే పూర్తి కానుంది. కాలాల ఆధ్వర్యంలో పరిహారం పంపిణీ కూడా జరుగనుంది. దీని తర్వాత పనులు ప్రారంభం కానున్నాయి. – మాధవి, ఎన్హెచ్ఏఐ ప్రాజెక్ట్ డైరెక్టర్, గజ్వేల్ -
యూరియా.. తిప్పలు ఇంతింత కాదయా
● అర్ధరాత్రి నుంచే క్యూలైన్లో రైతులు ● రోజంతా ‘చెప్పు’ కోలేని పాట్లు జిల్లాలో యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. మిరుదొడ్డి పీఏసీఎస్ కేంద్రానికి శుక్రవారం యూరియా లారీ వస్తుందని తెలుసుకున్న పలు గ్రామాలకు చెందిన రైతులు అర్ధరాత్రి నుంచే క్యూ కట్టారు. ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్తే లైను పోతుందేమోనన్న బెంగతో చెప్పులను క్యూలో పెట్టి బయటకు వెళ్లారు. మహిళా రైతుల పరిస్థితి అంతాఇంతా కాదు. సుమారు 3 వేల మంది రైతులు బారులు తీరడంతో టోకెన్లు ఇవ్వడానికి అధికారులకు సైతం తిప్పలు తప్పలేదు. టోకెన్ కౌంటర్ ఒకటే ఉండటంతో రైతుల మధ్య కాసేపు తోపులాటకు దారి తీసింది. యూరియా లారీ రావడంతో టోకెన్లు అందుకున్న రైతులకు రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. అందనివారు నిరుత్సాహంగా వెనుదిరగాల్సి వచ్చింది. దుబ్బాకలోనూ ఇదే దుస్థితి నెలకొంది. వచ్చిన 560 సంచుల కోసం 2 వేల మందికి పైగా బారులు తీరడం విశేషం. హుస్నాబాద్లో బీఆర్ఎస్ నాయకులు మంత్రి తుమ్మల దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. దౌల్తాబాద్లోని రైతు వేదిక వద్ద రైతులు యూరియా కోసం గంటలకొద్దీ నిరీక్షించారు. – మిరుదొడ్డి(దుబ్బాక)/దుబ్బాకటౌన్/హుస్నాబాద్ -
ఇక అటవీ శాఖ ముద్ర
● చెట్ల నరికివేతకు అనుమతి తప్పనిసరి ● ప్రభుత్వ శాఖల మధ్య కోల్డ్ వార్కు చెక్ ● ట్రాన్స్కోకు నోటీసుల జారీలో మున్సిపల్ యంత్రాంగం పిట్టపోరు.. పిట్టపోరు.. పిల్లి తీర్చినట్లు జిల్లా కేంద్రంలో విద్యుత్, మున్సిపల్ శాఖల మధ్య కొంతకాలంగా నెలకొన్న చెట్ల నరికివేత అంశం అటవీశాఖ చేతుల్లోకి వెళ్లింది. ఇక నుంచి పట్టణంలో చెట్లు నరికివేసేందుకు అటవీశాఖ అనుమతి తప్పనిసరి. ఈ మేరకు మున్సిపల్ అధికారులు.. అటవీశాఖ అనుమతి పత్రం ఉంటేనే పట్టణంలో హరితహారం చెట్లను తొలగించాలని ట్రాన్స్కోకు అధికారికంగా నోటీసులు జారీ చేసే పనిలో ఉన్నారు. సిద్దిపేటజోన్: జిల్లా కేంద్రంలో కొన్నేళ్లుగా హరితహారం కింద మొక్కలు నాటారు. అదే క్రమంలో ప్రస్తుత ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటుతున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. కొంత కాలంగా విద్యుత్ వైర్లను పొడవాటి చెట్ల కొమ్మలు తాకడం, విద్యుత్ సరఫరాలో సమస్యల దృష్ట్యా విద్యుత్ శాఖ చెట్లను తొలగిస్తోంది. క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ, ఇరు శాఖల సమన్వయ లోపంతో కొన్ని ప్రాంతాల్లో చెట్ల మొదళ్ల వరకు తొలగించారు. ఇదే అంశంపై ఇరు శాఖల్లో కొంత అగాధం ఏర్పడింది. ఈ క్రమంలో ఇరు శాఖలు ఎవ్వరికీ వారు యమునా తీరు అన్నట్లు వ్యవహరించాయి. పెద్ద ఎత్తున జరిమానాలు మరోవైపు పట్టణంలో ఏపుగా పెరిగిన చెట్లను వివిధ కారణాలతో పలువురు తొలగించారు. అలాంటి సంఘటనలపై బల్దియా స్పందించి జరిమానాతోపాటు పోలీస్స్టేషన్లో ఫిర్యాదుల వరకు వెళ్లింది. రూ.500 నుంచి రూ.లక్ష వరకు జరిమానా రూపంలో బల్దియా విధించింది. ఈ లెక్కన ప్రతి ఏడాది సగటున రూ. 50 వేలు జరిమానా పేరిట బల్దియాకు ఆదాయం సమకూరింది. అటవీశాఖ జోక్యం విద్యుత్, మున్సిపల్ శాఖల మధ్య నెలకొన్న సమస్య పరిష్కారానికి అటవీశాఖ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా చెట్లను నరకడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక భవిష్యత్తులో ప్రభుత్వ శాఖలు, ఇతర వ్యక్తులు చెట్లను తొలగించే అంశంపై అటవీశాఖ అనుమతి తప్పనిసరి అని నిబంధన విధించింది. అందుకు అనుగుణంగా ఇరు శాఖలకు సూచనలు చేసింది. ఇప్పటివరకు విద్యుత్, మున్సిపల్ శాఖల పరస్పర అవగాహన మేరకు విద్యుత్ వైర్ల కింద ఉన్న చెట్లు తొలగించారు. ఇక భవిష్యత్తులో ఇరు శాఖలు అటవీశాఖ అనుమతి పొందాల్సి ఉంటుంది. అందులో భాగంగానే పట్టణంలో చెట్లు నరికేందుకు అటవీశాఖ అనుమతి లేఖ బల్దియాకు అందజేయాలని మున్సిపల్ అధికారులు విద్యుత్ శాఖకు అధికారికంగా నోటీస్ జారీ చేసే పనిలో నిమగ్నమైంది.అనుమతి ఉంటేనే.. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో చెట్లను తొలగించడానికి అటవీశాఖ నుంచి అనుమతి తప్పనిసరి. అందుకు సంబంధించిన అంశాలను నోటీసు రూపంలో విద్యుత్ శాఖ అధికారులకు పంపించడానికి చర్యలు తీసుకుంటున్నాం. – ఆశ్రిత్, మున్సిపల్ కమిషనర్