breaking news
Siddipet
-
తగ్గని నేరాలు
గతేడాది కంటే పెరిగిన 291 కేసులుసిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో గతేడాదితో పోలిస్తే 4శాతం నేరాల సంఖ్య పెరిగింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 7,144 కేసులు నమోదు కాగా 2024లో 6,853 కేసులు నమోదయ్యాయి. దీంతో గతేడాదికంటే 291 కేసులు పెరిగాయి. ఆస్తి కోసం హత్యలు, చైన్ స్నాచింగ్లు, దోపిడీ కేసులు పెరిగాయి. అత్యాచార, పోక్సో చట్టం, మహిళలపై నేరాలు తగ్గాయి. జిల్లాలో స్వల్పంగా రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. నేరాల శిక్షలను పరిశీలిస్తే గతేడాది వివిధ కేసుల్లో నేరస్తులకు 48శాతం పడగా ఈ ఏడాది పలు కేసుల్లో 42శాతం శిక్షలు విధించారు. – సాక్షి, సిద్దిపేట/సిద్దిపేట కమాన్ రోడ్డు ప్రమాదాలు తగ్గడంతో పాటు మరణాలు సైతం తగ్గాయి. ఈ ఏడాది 716 రోడ్డు ప్రమాద కేసులు నమోదుకాగా అందులో 274 మరణాలు, 599 మంది గాయపడ్డారు. 2024లో 718 కేసులు, 315 మరణాలు కాగా 645 మందికి గాయాలయ్యాయి. ట్రాఫిక్ నిబంధనలపై పోలీసులు కొరఢా ఝుళిపించారు. ఈ ఏడాది 4,52,776 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదు కాగా వారికి రూ. 16,73,29,000 జరిమానా విధించారు. గతంతో పోలిస్తే 14శాతం పెరిగింది. రాజీవ్ రహదారిపై స్పీడ్ లేజర్ గన్ ద్వారా 61,147 ఓవర్ స్పీడ్ కేసులు నమోదు చేయగా రూ. 6,32,67,845 జరిమానా విధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారికి ఒక్కొక్కరికి రూ.10వేల జరిమానా వేస్తున్నారు. దీంతో మద్యం సేవించి వాహనాలు నడిపేందుకు వాహనదారులు జంకుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో, గ్రామాలలో అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించి, ప్రజలకు ట్రాఫిక్, రహదారి భద్రతా సమస్యలు, డ్రైవింగ్ నిబంధనలు, అవగాహన కల్పించారు. సిద్దిపేట మండలం రాంపల్లి గ్రామానికి చెందిన సీనియర్ సిటిజన్ సిహెచ్ బాలమల్లయ్య రహదారి భద్రతా సమస్యలపై వివిధ రహదారి భద్రతా కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు. తగ్గిన దొంగతనాలు కమిషనరేట్ పరిధిలో దొంగతనాలు తగ్గినప్పటికీ చైన్ స్నాచింగ్లు పెరిగాయి. గతేడాది 759 దొంగతనాలు జరగగా ఈ ఏడాది 731 నమోదయ్యాయి. ఈ దొంగతనాల్లో 5,07,67,840 విలువైన ఆస్తి, నగదు పోగా అందులో రూ. 1,42,69,301 విలువైన ఆస్తిని రికవరీ చేశారు. దోపిడీ కేసులు 2024లో 7 నమోదు కాగా ఈ ఏడాది 12కి పెరిగాయి. పలు ముఖ్యప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని పోలీసులు చెబుతున్నా చైన్ స్నాచింగ్లు ఆగడం లేదు. చైన్ స్నాచింగ్లు 2014లో 9 కాగా ఈ ఏడాది 13 జరిగాయి. గేమింగ్ యాక్ట్ కింద 77 కేసులు ఈ ఏడాది గేమింగ్ చట్టం కింద 77 కేసులు నమోదు చేసి రూ. 11,25,700 సీజ్ చేశారు. ఎప్పుడు లేని విధంగా సిటిజన్ క్లబ్ పై మెరుపు దాడి నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా పేకాట ఆడుతున్న 50 మంది పై కేసులు నమోదు చేశారు. గ్రామాల్లో బెల్ట్ షాప్లను కట్టడిలో భాగంగా ఎకై ్సజ్ చట్టం 440 కేసులు, అక్రమ ఇసుక రవాణా 203 కేసులు నమోదు అయ్యాయి. కోడ్ ఉల్లంఘన.. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి, మోడల్ కోడ్ కండక్ట్ను పకడ్బందీగా చేపట్టారు. కోడ్ ఉల్లంఘనలో 507 కేసులు నమోదయ్యాయి. అందులో 271 మద్యం కేసులు నమోదు చేసి 5,181 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. సరియైన పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ 30,36,620 నగదును సీజ్ చేశారు. అక్రమార్కులపై ఉక్కుపాదం వీధి రౌడీలు, మోసగాళ్లు, చట్టాన్ని ఉల్లంఘించేవారితో పాటు, అక్రమార్కుల పై కఠినంగా వ్యవహరించి ఉక్కు పాదం మోపుతాం. పారదర్శకంగా, అవినీతి రహితంగా, బాధ్యతాయుతమైన పోలీసింగ్ వ్యవస్థను నిర్వహిస్తాం. సాధారణ పౌరులకు భద్రతా కల్పిస్తూ, కఠినమైన పద్ధతిలో చట్టాన్ని అమలు చేస్తాం. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా వాహనదారులకు అవగాహనపెంచుతాం. – విజయ్ కుమార్, సీపీనిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న బ్యాటరీలు, వాహనాలుమహిళలపై తగ్గిన వేధింపులు జిల్లాలో మహిళలపై వేధింపులు తగ్గాయి. షీ టీంలు నిఘా ఏర్పాటు చేసి ఈవ్ టీజింగ్కు పాల్పడే పోకిరీల ఆటకట్టించారు. 2024లో అత్యాచార కేసులు 80 నమోదు కాగా ఈ ఏడాది 53 అయ్యాయి. దీంతో గతేడాదిలో పోలిస్తే 27 తగ్గాయి. పోక్సో చట్టం కేసులు గతేడాది 97 కాగా ఈ ఏడాది 79 అయ్యాయి. గతేడాది కంటే ఇప్పుడు 18 తగ్గాయి. మహిళలపై నేరాల కేసులు 2024లో 589 నమోదు కాగా నుంచి 572 కేసులు నమోదయ్యాయి. పెరిగిన హత్యలు, చైన్ స్నాచింగ్లు, దోపిడీలు రోడ్డు ప్రమదాలు, మరణాలు తగ్గుముఖం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు 507 -
నాచగిరి క్షేత్రంలో సర్వం సిద్ధం
వర్గల్(గజ్వేల్): నాచగిరి లక్ష్మీనృసింహ క్షేత్రం, వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రంలోని వేంకటేశ్వరాలయాలు ‘ముక్కోటి’ ఏకాదశి పర్వదిన వేడుకలకు ముస్తాబయ్యాయి. మంగళవారం తెల్లవారు జామున 5.30 గంటలకు వైకుంఠ ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తారు. ముక్కోటి మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశామని నాచగిరి చైర్మన్ పల్లెర్ల రవీందర్గుప్తా, ఈఓ విజయరామారావు పేర్కొన్నారు. వర్గల్ కోవెలలో.. వర్గల్ వేంకటేశ్వరాలయంలో తెల్లవారుజాము 3.00 గంటలకు అభిషేకం, 5.30 గంటల వరకు అలంకార సేవ, 5.45 గంటల వరకు ఉత్తర ద్వార పూజ, 6.00 గంటల నుంచి ఉత్తర ద్వారం గుండా భక్తులకు స్వామివారి దర్శనం ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి తులసి అర్చన, పంచసూక్త పారాయణాలు జరుగుతాయని ఆలయ మేనేజర్ రఘుపవన్రావు తెలిపారు.ఆలయంలో కొలువైన శ్రీవారువర్గల్లోని వేంకటేశ్వరాలయం -
గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తులు
● కలెక్టర్ హైమావతి ● ప్రవేశ పరీక్ష పోస్టర్ ఆవిష్కరణ సిద్దిపేటరూరల్: ప్రభుత్వ గురుకులాల్లో ప్రవేశాల పరీక్షకు సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. ఈ మేరకు సోమవారం ప్రవేశపరీక్షకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల విద్యాసంస్థల్లో 5వ తరగతి ప్రవేశాలు, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో 6నుంచి 9వ తరగతుల ఖాళీలకు దరఖాస్తులు తీసుకోనున్నట్లు తెలిపారు.http://tgcet.cgg.gov.in ద్వారా వచ్చే నెల జనవరి 21లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు కులం, ఆదాయం, ఆధార్కార్డు, బర్త్ సర్టిఫికెట్, ఫొటోలు అవసరమని తెలిపారు. సర్టిఫికెట్ల సత్వర జారీకి కలెక్టరేట్లో ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయండి
చేర్యాల(సిద్దిపేట): సుమారు తొమ్మిదేళ్లుగా కొనసాగుతున్న చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంశం మరోసారి అసెంబ్లీలో చర్చకు వచ్చింది. సోమవారం అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా జీరో అవర్లో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంశాన్ని సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేరేరాల ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాప్రభుత్వం ప్రజాభీష్టం నెరవేర్చాలన్నారు. ఈ వీడియో స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది.అసెంబ్లీలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి -
యాసంగి పంటలకు నీరందించండి
దుబ్బాక: మల్లన్నసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాల్వలు పూర్తయినప్పటికీ మిగిలిన పంట కాల్వలు త్వరగా పూర్తిచేసి యాసంగికి నీరందించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అసెంబ్లీలో విన్నవించారు. సోమవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం అనుసంధానంగా నిర్మించిన మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మించి చెరువులు, కుంటలు నింపే ప్రధాన కాల్వలు పూర్తయినా పంట కాల్వలు పూర్తికాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిపై ఇరిగేషన్ మంత్రి, అధికారులకు పలుసార్లు విన్నవించినా ఫలితం లేదన్నారు. యాప్లు పెట్టి ఇబ్బందులు పెట్టకుండా రైతులకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచాలన్నారు. గత వానాకాలంలో యూరియా కొరతతో పంటల దిగుబడి చాలా తగ్గిందని, ఈసారి అలా జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కరెంట్ కష్టాలు సైతం రైతులకు ఎక్కువయ్యాయని అన్నారు. ప్రభుత్వం రైతుల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. ఇదిలా ఉంటే.. అసెంబ్లీ సమావేశాలకు సోమవారం హాజరైన మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఎమ్మెల్యే పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. వేగిరంగా కాల్వలు పూర్తిచేయండి అసెంబ్లీలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి -
మల్లన్న ఆలయంలో భక్తుల సందడి
రాజగోపురం ఎదుట భక్తుల సందడికొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయంలోఆదివారం భక్తుల సందడి నెలకొంది. భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయ పరిసరాలన్నీ మల్లన్న నామస్మరణతో మారుమోగాయి. స్వామివారిని దర్శించుకున్న అనంతరం గంగరేణి చెట్టు వద్ద పట్నాలు వేసి, ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. మరికొంతమంది ఆలయ ముఖ మండపంలో నిత్యకల్యాణం, అభిషేకం, ఒడిబియ్యాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొండపైన ఉన్న ఎల్లమ్మ తల్లికి బోనంతో నైవేద్యం సమర్పించారు. స్వామి వారి దర్శనానికి సుమారు 3 గంటల సమయం పట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు.నాచగిరి.. భక్తజన ఝరివర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధ నాచగిరి లక్ష్మీనృసింహక్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వారాంతపు సెలవు కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. హరిద్రలో పుణ్యస్నానాలాచరించారు. విశేషమైన ధనుర్మాసంలో గర్భగుడిలో కొలువైన లక్ష్మీనృసింహులను దర్శించుకున్నారు. మొక్కులు తీర్చుకున్నారు. -
గాంధీ పేరును రూపుమాపే కుట్ర
హుస్నాబాద్రూరల్: కేంద్ర ప్రభుత్వం గాంధీ పేరును రూపుమాపేందుకు కుట్ర పన్నుతోందని, అందులో భాగంగానే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పేరును మార్చిందని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. ఆదివారం పట్టణంలో గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా లింగమూర్తి మాట్లాడుతూ గ్రామీణ రైతు, కూలీలకు వంద రోజుల పని కల్పించాలనే లక్ష్యంతో సోనియా గాంధీ ఆధ్వర్యంలో ఉపాధి పథకం తెచ్చారన్నారు. ఉపాధిహామీ పథకం వచ్చిన తర్వాత గ్రామాల్లో కూలీలకు పని దొరకడంతో పాటు కూలీ రేట్లు పెరిగాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే మంచి పథకాలు తెస్తే స్వాగతిస్తామని, కానీ పథకాలకు పేర్లు మార్చడం సరికాదన్నారు. అనంతరం అంబేడ్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ అవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, బంక చందు, చిత్తారి రవీందర్, పద్మ, హసన్, రజిత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి హుస్నాబాద్లో కాంగ్రెస్ పార్టీ నిరసన -
రైతుల గోస పట్టని సర్కార్
దుబ్బాక: రైతుల కష్టాలు పట్టడంలేదని, కనీసం యూరియా కూడా అందించని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆదివారం రఘోత్తంపల్లి శివారులో వరినాట్లు వేస్తున్న రైతుల దగ్గరికి వెళ్లి వారిని ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా యూరియా దొరకడం లేదని, సాగు చేయాలంటే ఇబ్బందులు తప్పడంలేదని రైతులు ఎమ్మెల్యేతో తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ హయాంలోనే రైతులు ఏ ఇబ్బందులు లేకుండా వ్యవసాయం చేసుకున్నారన్నారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని రైతులకు అప్పుడే మంచిరోజులు వస్తాయన్నారు. రైతులకు అండగా బీఆర్ఎస్ ఉంటుందన్నారు. అధైర్యపడొద్దని తప్పకుండా మంచి రోజులు వస్తాయన్నారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి నాట్లేస్తున్న రైతులతో మాటామంతి -
వార్డుల పెంపు లేనట్లే?
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో వార్డుల పెంపు లేనట్లే కనిపిస్తోంది. ప్రత్యేకించి ఈ మున్సిపాలిటీలోని మల్లన్నసాగర్ నిర్వాసితుల కాలనీ (ఆర్అండ్ఆర్ కాలనీ) కొత్తగా విలీనం కావడంతో వార్డుల సంఖ్య 30కి పెరగొచ్చనే వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతమున్న 20వార్డుల్లోనే ఈ కాలనీ విలీనం కానుందని తెలుస్తోంది. ఈ నిర్ణయంతో రాజకీయ నేతల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. – గజ్వేల్ మల్లన్నసాగర్ నిర్వాసిత గ్రామాలైన తొగుట మండలం పల్లెపహాడ్, వేములఘాట్, ఏటిగడ్డకిష్టాపూర్, బ్రహ్మణ బంజేరుపల్లి, లక్ష్మాపూర్లతోపాటు కొండపాక మండలంలోని ఎర్రవల్లి గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో మరిన్ని మధిర గ్రామాలు ఉన్న సంగతి తెల్సిందే. ఈ పంచాయతీలను గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముట్రాజ్పల్లి, సంగాపూర్లకు తరలించి ఆర్అండ్ఆర్ కాలనీని నిర్మించారు. 2020 నుంచి ఇటీవలీ కాలం వరకు ఇవీ పంచాయతీలగానే కొనసాగాయి. ఈ పంచాయతీలను కొన్ని రోజుల కిందట రద్దు చేసిన విషయం విదితమే. ప్రస్తుతం ఆయా గ్రామాల పరిధిలో సుమారు 20వేల జనాభా, మరో 14వేల మంది ఓటర్లు ఉన్నారు. మున్సిపాలిటీలో ఇదివరకే 32వేల ఓటర్లు ఉన్నారు. ఈ రెండు కలిపితే.. ఓటర్ల సంఖ్య 46వేలకు చేరుకుంది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీలో ప్రస్తుతం 1500 ఓటర్ల చొప్పున మరో 10వార్డులు పెరుగొచ్చని వార్తలొచ్చాయి. కానీ అందుకు భిన్నంగా 2,300ఓటర్లకు ఒక వార్డు చొప్పున గతంలో 20వార్డులనే కొనసాగించాలని మున్సిపల్ ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఈమేరకు నిర్వాసిత కాలనీ ఓటర్లను ప్రస్తుతమున్న వార్డుల్లోనే చేర్చాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సిద్దిపేట లాంటి మున్సిపాలిటీలోనూ ఒక్కో వార్డులో 2,200–2,500మంది ఓటర్లు ఉండగా, అదే తరహాలో ఇక్కడ కూడా 20వార్డులు సరిపోతాయని భావిస్తున్నారు. దీంతో వార్డుల పెంపు ఇప్పట్లో లేనట్టేనని సమాచారం. రాజకీయ నేతల ఆశలపై నీళ్లు.. మున్సిపాలిటీ పరిధిలో వార్డుల సంఖ్య పెరిగితే పరిస్థితులు తమకు అనుకూలంగా ఉంటాయని భావించి ఎంతోమంది కౌన్సిలర్లుగా పోటీచేయడానికి ఆశావహులు ఎదురుచూస్తున్నారు. కానీ పరిస్థితి భిన్నంగా మారే అవకాశముండటం వల్ల వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. ప్రస్తుతమున్న వార్డుల్లోనే నిర్వాసిత గ్రామాలు విలీనమయ్యే అవకాశముంటడం వల్ల రాజకీయ సమీకరణలు మారనున్నాయి. పార్టీల బలాబలాలపై ఈ పరిణామం ప్రభావం చూపనుంది. త్వరలోనే ఈ అంశాలపై అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశముంది. పాత వార్డుల్లోనే నిర్వాసిత గ్రామాల విలీనం మున్సిపల్ ఎన్నికల వేళ.. ఆశావహుల్లో నిరాశ గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిస్థితిసీఎం వద్దకు వెళ్తేనే.. మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య పెరగాలంటే ఈ అంశాన్ని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుందని అధికారుల వర్గాల తెలుస్తోంది. సీఎంను ఒప్పించి తీర్మానం ఆమోదించగలిగితేనే ఇది సాధ్యమవుతుందని చెబుతున్నారు. కానీ ఇక్కడ ఆ స్థాయి ప్రయత్నానికి అవకాశం లేకపోవడం వల్ల వార్డుల పెంపు అంశం మరుగున పడనుంది. -
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): రాష్ట్రాభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కాంగ్రెస్, నియోజకవర్గ పార్టీ క్యాంప్ కార్యాలయాల్లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జిల్లా కార్యాలయంలో డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, నియోజకవర్గ కార్యాలయంలో హరికృష్ణలు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అన్ని రంగాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రానున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే విధంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కార్యక్రమాలలో టీపీసీసీ సభ్యులు దరిపల్లి చంద్రం, బొమ్మల యాదగిరి, దాస అంజన్న, డీసీసీ మహిళా అధ్యక్షులు ముద్దం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.జిల్లా కేంద్రంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు -
జాతీయస్థాయి పోటీలకు ముగ్గురు ఎంపిక
ప్రశాంత్నగర్(సిద్దిపేట): మహారాష్ట్రలో ఈ నెల 30 నుంచి జనవరి 2వరకు నిర్వహించనున్న జాతీయ యోగాసన పోటీలకు ముగ్గురు ఎంపికై నట్లు, జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి ఆదివారం తెలిపారు. వినయ్కుమార్, తోట సుధాంశ్, తోట సంధ్య ఎంపికయ్యారన్నారు. ఈ సందర్భంగా ఎంపికై న క్రీడాకారులను ఉపాధ్యక్షుడు విక్రమ్రెడ్డి, హరిప్రసాద్, చీఫ్ ప్యాట్రన్ ప్రభాకర్, గౌరవాధ్యక్షులు అంజయ్యతో పాటు యోగాసనా సంఘం సభ్యులు అభినందనలు తెలిపారు. చెకుముకి పోటీల్లో జిల్లా ప్రథమ స్థానం ప్రశాంత్నగర్(సిద్దిపేట): కరీంనగర్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ పరీక్షలో జిల్లా ప్రఽథమ స్థానంలో నిలిచినట్లు సిద్దిపేట అర్బన్ మండల విద్యాధికారి ప్రభాకర్రెడ్డి ఆదివారం తెలిపారు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సానియా, రక్షిత, రామ్చరణ్లు రాణించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి పొందారన్నారు. అద్భుత ప్రతిభను కనబరిచిన విద్యార్థులను, గైడ్ టీచర్ను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం అభినందించింది. ఏఐటీయూసీ జెండా ఆవిష్కరణ దుబ్బాకరూరల్: మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ వద్ద హమాలి సంఘం, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ పాల్గొన్నారు. అలాగే నూతనంగా మండల కార్యవర్గం ఏర్పాటు చేశారు. మండల అధ్యక్షుడిగా బెల్లె రమేశ్, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు సిద్దిపేటకమాన్: చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐలు వాసుదేవరావు, ఉపేందర్ హెచ్చరించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లోని గాలిపటాలు, మాంజా విక్రయ దుకాణాల్లో ఆదివారం వారు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాంజా వల్ల ప్రజలకు, వాహనదారులు, పశువులు, పక్షులకు ప్రమాదకరంగా మారిందన్నారు. వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని, వ్యాపారులు విక్రయించకూడదని సూచించారు. -
బతుకులు గొయ్యి పాలాయె.. వంతెన కోసం తవ్విన గొయ్యిలోకి ద్విచక్రవాహనం దూసుకెళ్లి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వివరాలు 8లో u
సోమవారం శ్రీ 29 శ్రీ డిసెంబర్ శ్రీ 2025నేడు సాక్షి ఫోన్ ఇన్..సిద్దిపేటకమాన్: జిల్లాలో చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రజలు దగ్గు, జలుబు, జ్వర పీడిత బారిన పడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుతున్న వైద్య సేవలు, మందులు తదితర అంశాలపై జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ ధనరాజ్తో ఈనెల 29న (సోమవారం) సాక్షి ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రజలు తమ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం డీఎంహెచ్ఓతో మాట్లాడవచ్చు. 29వ తేదీ (సోమవారం) సమయం మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 గంటల వరకు ఫోన్ చేయాల్సిన నంబర్లు 98668 98692, 98669 84788 రైతులను ముంచిన భారీ వర్షాలు ● జిల్లాలో అధిక వర్షపాతం నమోదు ● యూరియా కోసం తప్పని అవస్థలు ● దిగుబడిపై తీవ్ర ప్రభావం ● ప్రారంభానికి సిద్ధమైన పామాయిల్ ఫ్యాక్టరీజిల్లాలో పంటల సాగుకు రైతులు అష్టకష్టాలు పడ్డారు. కాలం కలిసిరాక ఒక వైపు.. పాలకులు సరియైన సమయంలో యూరియా అందించక మరోవైపు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. భారీ వర్షాలు ఆగమాగం చేశాయి. చెరువులు, వాగులు తెగి పంటలు నీటిపాలయ్యాయి. వరి దిగుబడి తగ్గింది. పత్తి పంట చేతికి వచ్చే సమయంలోనూ వానలు పడటంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. సన్న ధాన్యానికి ప్రభుత్వం బోనస్ అందజేస్తుండటంతో రైతులకు కొంత ఊరట కలిగింది. మొత్తానికి జిల్లాలో ఈ ఏడాది సాగు ఇలా సాగింది. – సాక్షి, సిద్దిపేట జిల్లాలో సాధారణ వర్షపాతం సగటున 716 మిల్లీమీటర్లు.. కాగా 1,252 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వానాకాలం మొదట్లో తక్కువగా కురవగా.. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో కురిసిన అతి భారీ వర్షాలకు చెరువులు, కుంటలు తెగిపోయాయి. దీంతో అన్నదాత ఆశలన్నీ నీటి పాలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా పది వేలకు పైగా ఎకరాల్లో పంట దెబ్బతిన్నది. ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలున్నాయి. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకవచ్చిన తర్వాత కూడా వర్షాలు వెంటాడాయి. హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల్లో అత్యధికంగా వడ్లు తడిశాయి. హుస్నాబాద్ మార్కెట్ యార్డులో ధాన్యాన్ని విక్రయించేందుకు తీసుకువచ్చిన ఇద్దరి రైతుల ధాన్యం పూర్తిగా కొట్టుకపోయాయి. దిగుబడిపై ప్రభావం.. వర్షాలతో పంటల దిగుబడిపై ప్రభావం పడింది. వానాకాలంలో మొత్తం 5,42,382 ఎకరాల్లో పంటలు సాగు అయ్యాయి. వరి 3,86,083 ఎకరాలకు దాదాపు 7లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రావాలి. ఒక్కో ఎకరానికి 18 నుంచి 21 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి రావాల్సి ఉండగా సుమారు 15క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. పత్తి 1,18,785 ఎకరాల్లో సాగుకాగా మిగతా పంటలు 37,514 ఎకరాల్లో సాగు చేశారు. 5.5లక్షల క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు చేసింది. 94వేల మంది రైతుల దగ్గర నుంచి ప్రభుత్వ కేంద్రాల ద్వారా 3,63,487 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందులో 3,44,633 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 18,853 టన్నుల సన్నాలు కొనుగోలు చేశారు. సన్నాలకు ప్రభుత్వం బోనస్గా ఇవ్వడంతో కొంత మంది రైతులు ఊపిరిపిల్చుకున్నారు. వర్షాల నేపథ్యంలో పొలాల దగ్గరనే పలువురు కాంటాలు పెట్టారు. ఇదే అదనుగా ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరకే కొనుగోలు చేశారు.పామాయిల్ ఫ్యాక్టరీ నంగునూరు మండలం నర్మెటలో రూ.300 కోట్ల వ్యయంతో పామాయిల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారు. పామాయిల్ గెలల నుంచి ఆయిల్ బయటకు వచ్చే విధంగా ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. ట్రయల్ రన్ సైతం పూర్తి అయింది. త్వరలో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించే అవకాశాలున్నాయి. జిల్లాలో 12,600 ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు రైతులకు దిగుబడి ప్రారంభమైంది. జిల్లాలో పామాయిల్ పరిశ్రమ అందుబాటులోకి వస్తే మరింత సాగు పెరిగే అవకాశాలున్నాయి. -
హుస్నాబాద్ మినహా.. మిగతా చోట్ల ప్ర‘గతి’తప్పింది
ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్ శ్రీ 2025రేపు సాక్షి ఫోన్ ఇన్.. జిల్లాలో యాసంగి వరినాట్లు జోరుగా సాగుతున్నాయి. కోటి ఆశలతో రైతులు పొలం బాట పట్టారు. వరినాట్లు వేసే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. దీంతో పొలాల వద్ద సందడి కనిపిస్తోంది. నారాయణరావుపేట మండల పరిధిలోని గుర్రాలగొంది గ్రామ సమీపంలో వరినాట్లు వేస్తున్న దృశ్యం సాక్షి కెమెరాతో కిక్ల్మనిపించింది. –సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట సిద్దిపేటకమాన్: జిల్లాలో చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రజలు దగ్గు, జలుబు, జ్వర పీడిత బారిన పడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలు, మందులు తదితర అంశాలపై జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ ధనరాజ్తో ఈనెల 29న (సోమవారం) సాక్షి ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రజలు తమ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం డీఎంహెచ్ఓతో మాట్లాడవచ్చు. తేదీ 29.12.2025, సోమవారం సమయం మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 గంటల వరకు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 98668 98692, 98669 84788 వరి నాట్లు వేస్తున్న మహిళలుఎరువులు చల్లుతూ.. కొండపోచమ్మ ఆలయం వద్ధ భక్తుల సందడిఆశల సాగు.. -
గాంధీ పేర్లు లేకుండా బీజేపీ కుట్ర
మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్: నెహ్రూ, ఇందిరాగాంధీ, మహాత్మాగాంధీ పేర్లు లేకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. శనివారం పట్టణంలోని గాంధీ చౌరస్తాలో ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. మహాత్మాగాంధీ పేరును అవమానపర్చే విధంగా ఉపాధి హామీ పథకంలో ఆయన పేరును తొలగించి విబి రామ్ జీ పేరును పెట్టారని మండిపడ్డారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ కేడం లింగమూర్తి, కాంగ్రెస్ నాయకులు శివయ్య, రవీందర్ తదితరులు ఉన్నారు. అభ్యర్థుల ఖర్చుల వివరాలు సమర్పించాలిఅక్కన్నపేట(హుస్నాబాద్): అక్కన్నపేట మండలం అంతకపేటలో డీఎల్పీఓ వెంకటేశ్వర్లు శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. అక్కన్నపేట, హుస్నాబాద్, కోహెడ, బెజ్జంకి, మద్దూరు, దూల్మిట్ట మండలాల పంచాయతీ కార్యదర్శులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. నూతనంగా ఏర్పాటైన గ్రామాలలో బ్యాంక్ అకౌంట్లను తెరవాలన్నారు. సర్పంచ్ అభ్యర్ధుల ఖర్చుల వివరాలను సమర్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పారిశుద్ధ్యం, డ్రైనేజీల శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆయన వెంట కార్యదర్శి సంజీవ్ ఉన్నారు. దరఖాస్తుల ఆహ్వానంప్రశాంత్నగర్(సిద్దిపేట): సంక్రాంతిని పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాలలోని వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచినవారికి సంక్రాంతి విశిష్ట ప్రతిభా పురస్కారాలు అందించనున్నట్లు ‘సర్వేజనా: సుఖినో భవంతు’ అధ్యక్షులు నారాయణ తెలిపారు. సమాజ సేవకులు, ఉపాధ్యాయులు, వైద్యులు, ఇంజనీర్లు, యోగ, మెడిటేషన్, సంగీత, నృత్య గురువులు, సినీ, టీవీ, రంగస్థల కళాకారులు, కవులు, రచయితలు, క్రీడాకారులు, కార్మికులు, రైతులు, విద్యార్థులు, మేధావులు, జర్నలిస్టులకు పురస్కారాలు అందజేయనున్నట్లు తెలిపారు. పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం జనవరి 18న హైదరాబాద్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి కల్గిన వారు సర్వేజనాః సుఖినో భవంతు, డోర్ నెం. 1–20–164, పోస్టు: తిరుమలగిరి, గోకుల్నగర్, వెంకటాపురం, సికింద్రాబాద్ – 500015కు జనవరి 5లోగా దరఖాస్తులు పంపాలన్నారు. పూర్తి వివరాలకు 9652347207 నంబర్లో సంప్రదించాలన్నారు. -
జాతీయ ఆర్థిక సదస్సుకు డాక్టర్ రమేష్
కోహెడరూరల్(హుస్నాబాద్): చైన్నెలోని వేల్స్ యూనివర్సిటీలో ఆదివారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న 108వ ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ వార్షిక సదస్సుకు ఎకనామిక్స్ అధ్యాపకుడు డాక్టర్ జాలిగం రమేష్ హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్ధిక రంగ నిపుణులు, మేధావులు పాల్గొనే ఈ ప్రతిష్టాత్మక సదస్సు ఈనెల 27, 28, 29 తేదీల్లో జరగనుంది. కాగా, సదస్సులో భాగంగా డాక్టర్ రమేష్ భారతదేశంలో పంటల ఉత్పాదకత, స్థిరమైన వ్యవసాయంపై నీటిపారుదల వ్యవస్థల ప్రభావం అనే పత్రాన్ని సమర్పించనున్నారు. దేశంలోని సాగునీటి వసతులు, పంటల దిగుబడిని పెంచడంలో నీటి పారుదల పాత్ర, పర్యావరణహిత వ్యవసాయ పద్ధతులపై ఆయన చేసిన లోతయిన విశ్లేషణను వివరించనున్నారు. జాతీయ స్థాయి వేదికపై పరిశోధన పత్రాన్ని సమర్పించే అవకాశం రావడం పట్ల పలువురు విద్యావేత్తలు డాక్టర్ రమేష్ను అభినందించారు. -
హాజరు శాతం పెంచాలి
● తరగతి గదుల్లోనే విద్యార్థుల భవిష్యత్ ● కలెక్టర్ హైమావతి చిన్నకోడూరు(సిద్దిపేట): తరగతి గదుల్లోనే విద్యార్థుల భవిష్యత్ ఉందని, విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు రావాలని కలెక్టర్ హైమావతి పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని ఇబ్రహీంనగర్ మోడల్ స్కూల్ను, ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించారు. బియ్యం, కూరగాయల నాణ్యత ఎలా ఉంటుందని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల హాజరు శాంత పెంచాలని సూచించారు. చదువు విషయంలో రాజీ పడవద్దని, ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి నిరంతరం శ్రమించాలన్నారు. కాగా, ఇబ్రహీంనగర్లోని పీహెచ్సీని కలెక్టర్ తనిఖీ చేశారు. వీది కుక్కలను నియంత్రించండి సిద్దిపేటరూరల్: జిల్లాలో వీధి కుక్కల నియంత్రణతో పాటుగా వాటికి షెల్టర్ నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ హైమావతి అన్నారు. శనివారం కలెక్టరేట్లోని మీటింగ్ హల్లో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పోలీస్, గ్రామపంచాయతీ, మున్సిపల్, వైద్య ఆరోగ్య, విద్య, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ అధికారులతో కుక్కల నియంత్రణపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ..కుక్కల నియంత్రణకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీల్లో, ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున గ్రామీణ ప్రాంతాల్లో కుక్కల షెల్టర్ హోమ్ను నిర్మించి అక్కడికి తరలించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి కొండల్రెడ్డి, అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, డీపీఓ రవీందర్, జిల్లా వైద్యాధికారి ధనరాజ్, డీటీఓ లక్ష్మణ్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి వెంకట నర్సయ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాక: కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. శనివారం రాయపోల్ మండలం గొల్లపల్లి–ఉదయపూర్ ఉపసర్పంచ్ భూపాల్, బీజేపీ గ్రామశాఖ అధ్యక్షుడు కనకయ్య, వార్డు మెంబర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజావ్యతిరేక విధానాలతో బీజేపీ గ్రామస్థాయిలో విశ్వసనీయత కోల్పోయిందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకున్నది బీఆర్ఎస్ మా త్రమే అన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. కార్యక్రమంలో రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పులి సంచారం
అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులుమిరుదొడ్డి(దుబ్బాక): పులి సంచరిస్తోందని, ఆయా గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. మిరుదొడ్డి, తొగుట మండలాల శివారులోని పంట పొలాల్లో శుక్రవారం పులి సంచరిస్తున్నట్లు రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ రేంజ్ అధికారి సందీప్ కుమార్ నేతృత్వంలో సంఘటనా స్థలానికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు. పులి పాద ముద్రలను గుర్తించారు. పాద ముద్రల ఆధారంగా పులి సంచరిస్తున్నట్లు నిర్ధారించారు. మిరుదొడ్డి మండలంలోని కొండాపూర్, అందె, తొగుట మండలంలోని గోవర్ధన గిరి, ముత్యం పేట గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఆయా గ్రామాల రైతులు తమ వ్యవసాయ పొలాలకు ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్లాలని సూచించారు. సాయంత్రం కాగానే తమ ఇళ్లలోకి చేరుకోవాలని కోరారు. పాడి పశువులను వ్యవసాయ పొలాల వద్ద కాకుండా ఇండ్ల వద్ద కట్టేసుకోవాలని అవగాహన కలిగించారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పులి కదలికలను పసిగట్టి పట్టుకుంటామని అధికారులు వెల్లడించారు.అధికారులు గుర్తించిన పులి పాద ముద్ర -
బీఆర్ఎస్ కంచుకోట బద్దలు కొట్టాం
● హరీశ్ను ఓడించేందుకు తానే బరిలోకి దిగుతా ● మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నిజాంపేట(మెదక్): పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంచుకోటను బద్దలు కొట్టామని, త్వరలో హరీశ్రావును ఓడించేందుకు తానే స్వయంగా బరిలోకి దిగుతానని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా పలువురు సర్పంచ్లు కాంగ్రెస్లో చేరగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేటలో కాంగ్రెస్ను పటిష్టం చేస్తున్నట్లు చెప్పారు. హరీశ్రావు సీఎం కావాలని ఆశలు పెట్టుకున్నాడన్నారు. గత ప్రభుత్వంలో 90 శాతం సర్పంచ్లను ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. కులాలతో రాజకీయం చేయొద్దన్నారు. నిజాంపేట మండలంలో మంచి మెజార్టీ సాధించినట్లు పేర్కొన్నారు. నూతన ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. వివిధ గ్రామాల సర్పంచ్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
రెండో రోజు జన జాతరే..
మెదక్ చర్చికి పోటెత్తిన భక్తులుప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిలో శుక్రవారం క్రిస్మస్ వేడుకలు రెండోరోజు ఘనంగా జరిగాయి. దేశ నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది మందితో చర్చి ప్రాంగణం కిటకిటలాడింది. మత గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేసి భక్తులను ఆశీర్వదించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. చర్చి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దుకాణాలు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. యువతీ, యువకులు సెల్ఫీలతో సందడి చేశారు. మెదక్ కలెక్టరేట్: -
కాంగ్రెస్ది ప్రజా వ్యతిరేక పాలన
హత్నూర(సంగారెడ్డి): కాంగ్రెస్ది ప్రజాపాలన కాదని, ప్రజావ్యతిరేక పాలనని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో ఎస్సీ సబ్ప్లాన్ నిధులతో మంజూరైన సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వానికి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదన్నారు. సీఎం రేవంత్రెడ్డి స్థాయి మరిచి ప్రతిపక్ష నాయకుడిపై విమర్శలు చేయడం తప్ప, సంక్షేమ పథకాలపై ధ్యాస లేదన్నారు. పంచాయతీ కార్యదర్శులు అప్పుల పాలై ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కనీసం నిధులు మంజూరు చేయడం లేదన్నారు. నాలుగు నెలలుగా జీపీ కార్మికులకు వేతనాలు ఇవ్వలేదన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు 90 శాతం పూర్తి చేసి 37 వేల ఎకరాలకు కేసీఆర్ నీరందిస్తే, ఈ ప్రభుత్వం రెండేళ్లలో కనీసం 10 శాతం పనులు కూడా పూర్తి చేయలేదన్నారు.ఎమ్మెల్యే సునీతారెడ్డి -
కూర్పు.. కావాలి మార్పు
శనిగరం సింగారం మండలంలోని శనిగరం జలాశయాన్ని ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్సందర్శించారు. వివరాలు 8లో uకాంగ్రెస్ కమిటీలపై కసరత్తుసాక్షి, సిద్దిపేట: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గతంతో పోల్చితే ఎక్కువ సర్పంచ్లు, వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలుపొందడంతో ఆ పార్టీ కార్యకర్తలు జోష్లో ఉన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల్లోగా జిల్లా కాంగ్రెస్ కమిటీలను నియమించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఇప్పటికే డీసీసీ అధ్యక్షురాలుగా టి.ఆంక్షారెడ్డిని నియమించగా.. తనకు తోడుగా గట్టి టీంను నియమించాలని కసరత్తు ముమ్మరం చేశారు. ఈ కమిటీల నియామకం కోసం పీసీసీ నుంచి పరిశీలకులు మల్లాది వపన్, రోహిత్ రావులను నియమించారు. జిల్లా కమిటీ, పట్టణ కమిటీలు ఉంటే త్వరలో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పురపాలక సంఘాల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి ఎక్కువ మంది పనిచేయడానికి వీలు కలుగుతుందని, అందుకే నోటిఫికేషన్కు ముందుగానే పదవులను భర్తీ చేయాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. సర్పంచ్ ఎన్నికలు రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగాయి. అదే పరిషత్, పురపాలిక సంఘాల ఎన్నికలు పార్టీ గుర్తులతో జరగనుండటంతో ఫలితాలపై ప్రభుత్వం, పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతాయి. దీంతో జిల్లా, పట్టణ కాంగ్రెస్ కమిటీలు త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించింది. పోటీ ఎక్కువే.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తూనే మహిళలు, యువతకు పదవుల్లో పెద్దపీట వేయాలని అధిష్టానం నిర్ణయించింది. ఇకపై పార్టీ కమిటీలే అన్ని నిర్ణయాల్లో కీలక పాత్ర వహిస్తాయనే సంకేతాలతో వీటిని దక్కించుకునేందుకు నాయకులు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు. డీసీసీ కమిటీ, మండల, బ్లాక్ కమిటీలే ఇక పార్టీలో క్రియాశీలక పాత్ర వహిస్తాయని సంకేతాలివ్వడంతో పదవులను దక్కించుకునేందుకు నేతల్లో పోటీ మొదలైంది. ఒక్కో బ్లాక్కు ఇద్దరు ఉపాధ్యక్షులు, ఇద్దరు ప్రధాన కార్యదర్శులను నియమించాల ని పార్టీ నాయకత్వం సూచించినట్లు సమాచారం. ప్రతి మండలం నుంచి ఒక కార్యదర్శి, ప్ర తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒక అధికార ప్రతినిధి ఉండేలా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా కార్యవర్గ సభ్యులను దాదాపు 15 మంది వరకు నియమించనున్నారు. ఇప్పటికే మంత్రు లు, నియోజకవర్గ ఇన్చార్జిలతో పలువురు నేతలు డీసీసీలో చోటు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పలువురు రాష్ట్ర నాయకులు నేతల పేర్లను సైతం సిఫార్సు చేసినట్లు సమాచారం.నేడు సమావేశం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, పీసీసీ పరిశీలకులు పవన్, రోహిత్ రావు శనివారం సమావేశం నిర్వహించనున్నారు. జనవరి మొదటి వారంలోగా పరిశీలకులు జాబితాను సిద్ధం చేసి పీసీసీకి పంపిస్తే వాటిని పరిశీలించి సంక్రాంతిలోగా ఆమోదముద్ర వేయనున్నారు. -
పేదల పక్షాన పోరాటం
● సీపీఐ జిల్లా కార్యదర్శి పవన్ ● గజ్వేల్లో పార్టీ జెండావిష్కరణగజ్వేల్రూరల్: అంతరాలు లేని సమాజ స్థాపనే లక్ష్యంగా, పేదల పక్షాన నిరంతరం సీపీఐ పోరాటాలను కొనసాగిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మంద పవన్ పేర్కొన్నారు. సీపీఐ 101వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టణంలోని ఇందిరాపార్కు చౌరస్తా వద్ద ఆ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాన్పూర్లో 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించిన సీపీఐ నాటి నుంచి నేటి వరకు అనేక ఉద్యమాలు, పోరాటాలను నిర్వహించిందని గుర్తు చేశారు. చట్టసభల్లో కార్మికులు, కర్షకులు, విద్యార్థుల కోసం అనేక చట్టాలను చేయించిన ఘనత సీపీఐకే ఉందన్నారు. దేశ స్వాతంత్య్రంలో, తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర ఉందన్నారు. సీపీఐ పార్టీకి వందేళ్లు పూర్తయిన సందర్భంగా జనవరి 18న ఖమ్మంలో జరిగే శతజయంతి ముగింపు ఉత్సవాల భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దయానందరెడ్డి, జనార్ధన్, నియోజకవర్గ ఇన్చార్జి శివలింగు కృష్ణ, సభ్యులు రాజేశం, పోచయ్య, సాయిలు, చింత శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
రైతులు ఇబ్బంది పడొద్దు
సిద్దిపేటజోన్/చిన్నకోడూరు: వచ్చే యాసంగి నాటికి శాశ్వత పంట కాల్వల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి హరీశ్రావు ఇరిగేషన్ అధికారులకు సూచించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో వారితో సమీక్ష నిర్వహించారు. గత యాసంగిలో ప్రభుత్వం సరైన ప్రణాళికలను చేపట్టకపోవడంతో రైతుల పంట పొలాలకు సాగు నీరు అందించడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. తన సొంత డబ్బులతో తాత్కాలిక కాల్వలు తీసి సాగు నీరు అందించే పరిస్థితి వచ్చిందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని వచ్చే యాసంగిలో రైతులకు ఇబ్బందులు కలగకుండా పంట పొలాలకు సాగునీరు అందించాలని ఆదేశించారు. కలెక్టర్ హైమావతికి ఫోన్ చేసి అవసరమైన భూసేకరణ చేపట్టాలని కోరారు. భూసేకరణ, కాల్వల నిర్మాణానికి కావాల్సిన నిధులు ఇవ్వాలన్నారు. ఇర్కోడ్, చందలాపూర్లో నిర్మించే లిఫ్ట్ పనులు వేగవంతం కావాలన్నారు. నియోజకవర్గ పరిధిలోని పెండింగ్ చెక్ డ్యాం పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఇరిగేషన్ ఈఈలు గోపాల్కృష్ణ, శంకర్, డీఈ చంద్రశేఖర్, అధికారులు శిరీష, వినయ్, ఆంజనేయులు, విద్యాసాగర్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం చిన్నకోడూరు రైల్వేస్టేషన్ నిర్మాణంతో పాటు విఠలాపూర్ వరకు రైల్వేలైన్ పనులు పరిశీలించారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. -
బలహీనవర్గాల సత్తా చాటాలి: నవీన్
బెజ్జంకి(సిద్దిపేట): వచ్చే ఎన్నికలలో బలహీనవర్గాల సత్తా చాటాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొంకటి నవీన్ పిలుపునిచ్చారు. బెజ్జంకిలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమష్టిగా కృషి చేసి అన్ని రంగాలలో రాణించాలన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో గెలిచిన విధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో విజయం సాధించాలని కోరారు. గెలుపొందిన ప్రజా ప్రతినిధులకు జనవరి 23న బెజ్జంకిలో సన్మానం చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి బొనగం రాజేశం, బెజ్జంకి సర్పంచ్ బొల్లం శ్రీదర్, ఉపసర్పంచ్ దూమాల మహేష్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జెండాను ఎగురవేయాలిఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ గజ్వేల్రూరల్: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్లో బీజేపీ జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా కార్యకర్తలు ముందుకు సాగాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బి.శంకర్ పిలుపునిచ్చారు. పట్టణంలోని ప్రజ్ఞా గార్డెన్స్లో శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పార్టీ పట్టణశాఖ అధ్యక్షుడు మనోహర్యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శంకర్ మాట్లాడుతూ అభివృద్ధి పనులను పూర్తి చేయడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. పెండింగ్ పనులు, సమస్యల పరిష్కారానికై బీజేపీ రాజీలేని పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్, బీజేపీ నాయకులు రాంరెడ్డి, శ్రీనివాస్, రాములు, మధు, శివకుమార్, బోసు తదితరులు పాల్గొన్నారు. కొండాపూర్(సంగారెడ్డి): శ్రమ చేసి సంపదను సృష్టిస్తున్న కార్మికులపై కేంద్ర ప్రభుత్వం పగబట్టి, కార్పొరేట్లకు వ్యాపారాలు అప్పజెప్పుతున్నారని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు ఆరోపించారు. శుక్రవారం కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంగారెడ్డిలోని సుందరయ్య భవన్ నుంచి ఐబీ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆనాడు యూపీఏ ప్రభుత్వం గ్రామీణ పేదలను ఆదుకోవాలని ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. నేడు బీజేపీ ప్రభుత్వం మతంపైన శ్రద్ధ పెడుతూ ప్రజలు, కార్మికులకు అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. మహాత్మాగాంధీ పేరుతో ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, వీబీ రాంజీ పేరు చేర్చి చట్టాన్ని బలహీనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మల్లేశం, సాయిలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జయరాజ్, అధ్యక్షుడు రాజయ్య, సీఐటీయూ నాయకులు రాజయ్య, మాణిక్ పాండురంగారెడ్డి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. చేగుంట(తూప్రాన్): కేవల్ కిషన్ ఆశయ సాధనకు ఉద్యమిద్దామని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అడివయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని పొలంపల్లిలో కేవల్ కిషన్ సమాధి వద్ద నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవల్ కిషన్ పేద ప్రజల కోసం తన సొంత భూములను సైతం విరాళంగా అందించి చెరువులను తవ్వించాడని పేర్కొన్నారు. భూస్వాముల కుట్రలకు బలైన డిసెంబర్ 26న ఏటా ప్రజలు జాతర నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం సీపీఎం ఆధ్వర్యంలో చేగుంట వరకు పాదయాత్ర నిర్వహించారు. -
‘సంక్షేమం’తో గొప్ప పరివర్తన
గజ్వేల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలో చేపడుతున్న సంక్షేమ పథకాలతో గ్రామీణ సమాజంలో గొప్ప పరివర్తన వస్తుందని మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం గజ్వేల్లోని ఎస్ఎమ్ గార్డెన్స్లో డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిల ఆధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ సర్పంచ్లను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం, రూ.2లక్షల రుణమాఫీతోపాటు ఇతర పథకాలతో చక్కటి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. సర్పంచ్ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తమ సత్తాను చాటుకున్నారని కొనియాడారు. రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తితో పనిచేయాలని కోరారు. గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మన సొంతం కావాలంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగా శ్రమించాలన్నారు. నియోజకవర్గానికి కావాల్సిన అభివృద్ధి నిధుల అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. అదనంగా ఇందిరమ్మ ఇళ్లు కూడా కావాలని కోరుతామన్నారు. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ త్వరలోనే గెలిచిన సర్పంచ్లతో సీఎంను కలిసేలా అవకాశం కల్పించాలని కోరారు. కాంగ్రెస్ గజ్వేల్ నియోజకవర్గ ప్రచార కమిటీ కన్వీనర్ రంగారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్లు భూంరెడ్డి, ఎలక్షన్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు నరేందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, విజయమోహన్, సర్ధార్ఖాన్, ప్రభాకర్గుప్త తదితరులు పాల్గొన్నారు. మెస్ బిల్లులు విడుదల చేయండి కాగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీతోపాటు కస్తుర్బా హాస్టళ్లల్లో ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న మెస్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు తాటికొండ రవి మంత్రికి వినతి పత్రం అందజేశారు.బీఆర్ఎస్ భూస్థాపితం ఖాయం: మంత్రి వివేక్ తన సొంత నియోజకవర్గం గజ్వేల్లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిక స్థానాలు గెలుచుకోవడంతో భయానికి గురైన కేసీఆర్ తోలు తీస్తా అంటూ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మంత్రి వివేక్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అధినేత ‘ఇలాకా’గజ్వేల్లో కాంగ్రెస్ రోజురోజుకూ పుంజుకుంటున్నదని చెప్పారు. తమ పార్టీ కార్యకర్తలు, నాయకుల కృషి వల్ల అత్యధిక సర్పంచ్ స్థానాలను ఇక్కడ గెలుచుకోగలిగామని చెప్పారు. రాబోవు మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఫలితాలే పునరావృతమవుతాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ భూస్థాపితం ఖాయమని జోస్యం చెప్పారు. -
మౌలిక వసతులు కల్పిస్తా
ఎంపీ రఘునందన్ రావు జిన్నారం (పటాన్చెరు): గడ్డపోతారం పట్టణ పరిధిలోని కాజీపల్లి, జీఎంఆర్ కాలనీలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు శుక్రవారం పర్యటించారు. కాలుష్య ప్రాంతమైన కాజీపల్లి జీఎంఆర్ కాలనీలలో మంచినీటి సరఫరా జరిగేలా చూడాలని ఎంపీని స్థానికులు విజ్ఞప్తి చేశారు. కాలుష్యానికి గురైన కాల్వలు చెరువులను పరిశీలించిన ఎంపీ.. సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలోనే తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల అవ సరాలకు అనుగుణంగా మౌలిక వసతులను కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్కే ఫౌండేషన్ చైర్మన్ రమాకాంత్, మండల బీజేపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి పాల్గొన్నారు. కూల్చడం తప్ప.. కట్టడం తెలియదు: ఎమ్మెల్యే జహీరాబాద్: కోహీర్ మండలంలోని సజ్జాపూర్కు చెందిన బేగరి రాములుకు ఎమ్మెల్యే కె.మాణిక్రావు రూ.లక్ష ఆర్థిక సహాయం అందించారు. శుక్రవారం ఆయన గ్రామాన్ని సందర్శించారు. రాములుకు సంబంధించిన రేకుల ఇంటిని కూల్చి వేయించడంతో వివాదానికి దారితీసింది. ఎమ్మెల్యే మాణిక్రావు బాధితుడి ఇంటికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణ సహాయం కింద బాధితుడికి ఆర్థిక సహాయం అందించామన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదనే కక్షతోనే ఇంటిని కూల్చివేయించారని, కాంగ్రెస్ నాయకులకు కూల్చడం తప్ప కట్టడం తెలియదని విమర్శించారు. బాధిత కుటుంబానికి నూతన గృహం నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకులు బండి మోహన్, నామ రవికిరణ్, భూమయ్య, మచ్చేందర్, రవికిరణ్, రాజశేఖర్, సంపత్, నర్సింహులు పాల్గొన్నారు. -
మళ్లీ గెలుస్తానని శపథాలా?
సిద్దిపేట జోన్: ‘వయసులో నీకు తండ్రి లాంటి వారైన కేసీఆర్పై మాట్లాడిన మాటలు ఏమిటి? టైమ్ వస్తది బిడ్డా! నీవేదో వీర్ర వీగుతు న్నావు, అహంకారంతో మాట్లాడుతున్నావు. ఇప్పటి కైనా చిల్లర మాటలు మానుకో’ అంటూ మాజీ మంత్రి హరీశ్రావు సీఎం రేవంత్రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్రె డ్డి అనాథ పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టక, కా స్మెటిక్ చార్జీలు ఇవ్వడం చేతకాక దుర్భాషలాడటం తగునా అని ప్రశ్నించారు. అలాంటి రేవంత్రెడ్డిని కొరడా దెబ్బలు కొట్టినా తక్కువేనంటూ మండిపడ్డారు.గురువారం క్రిస్మస్ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అర్బన్ రెసిడెన్షియల్ బ్రిడ్జి స్కూల్ను హరీశ్రావు సందర్శించారు. వారి యో గక్షేమాలు అరా తీసి పిల్లలతో సహపంక్తి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘మాట లు సీఎంకే కాదు.. మాకూ వస్తాయి. తెలంగాణకు జరుగుతున్న నీటి అన్యాయం, కాంగ్రెస్ ఎన్నికల హామీల గురించి కేసీఆర్ మాట్లాడితే సీఎం స్థాయి మరచి రేవంత్రెడ్డి బూతులు మాట్లాడటం ఏమిటి? మళ్లీ గెలుస్తా, టూ థర్డ్స్ మెజారిటీతో గెలుస్తా అని శపథాలు చేస్తున్న రేవంత్రెడ్డి.. కొడంగల్ ఎన్నికల్లో ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చేసిన శపథం ఏమైంది? రేవంత్రెడ్డికి మాటతప్పడం, పార్టీలు మారడం, పదవులు కొనుక్కోవడం, చిల్లర మాటలు మాట్లాడటం బాగా అలవాటే’ అంటూ హరీశ్రావు మండిపడ్డారు.ఫార్మాసిటీ భూముల్ని రైతులకు తిరిగివ్వాలి..ఫార్మాసిటీని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని కేసీఆర్ అడగడం తప్పా అని హరీశ్రావు ప్రశ్నించారు. గతంలో ఫార్మాసిటీ భూములు రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేసిన రేవంత్.. ప్రస్తుతం చేస్తున్న పని ఏమిటని నిలదీశారు. కేసీఆర్ ఆలోచన మేరకు ఫార్మాసిటీని ఏర్పాటు చేయకుంటే రైతులకు భూములు తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. ఐదు నెలలుగా కాస్మెటిక్ చార్జీలు, మెస్ చార్జీలు అందక అనాథ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని, సీఎం ఇప్పటికైనా బిల్లులు విడుదల చేయాలన్నారు. -
ల్యాబ్ టెక్నీషియన్లు వచ్చేస్తుండ్రు
జిల్లాకు రానున్న 60 మంది ● ఇటీవల మెరిట్ జాబితా విడుదల ● డీఎంఈ, వైద్యవిధాన పరిషత్, డీహెచ్కు కేటాయింపులుసిద్దిపేటకమాన్: జిల్లాకు 60 మంది నూతన ల్యాబ్ టెక్నీషియన్లు రానున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో ల్యాబ్ టెక్నీషియన్లను రాష్ట్ర ప్రభుత్వం రిక్రూట్ చేసింది. మెడికల్ హెల్త్ రిక్రూట్మెంట్ సర్వీసెస్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) 2024 నవంబర్ 10న రాష్ట్రంలో ల్యాబ్ టెక్నీషియన్లకు రాత పరీక్ష నిర్వహించింది. ఉత్తీర్ణత సాధించి ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారి సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ఈ ఏడాది నవంబర్ 17న తుది జాబితాను వెలువరించింది. ఎంపికైన అభ్యర్థులకు మూడు రోజుల క్రితం పోస్టింగ్లను కేటాయించారు. వైద్య సేవల నిమిత్తం ఆస్పత్రులకు వచ్చే వారిలో అవసరమైన వారికి రక్త పరీక్షలు నిర్వహించి, వెంటనే ఫలితాలు అందించే అవకాశం ఉంది. జిల్లాలో పోస్టుల భర్తీ జిల్లాలో ఖాళీగా ఉన్న 60 గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేశారు. మెడికల్ హెల్త్ రిక్రూట్మెంట్ సర్వీసెస్ బోర్డు డైరెక్టర్ ఆఫ్ హెల్త్, వైద్య విధాన పరిషత్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) కింద ల్యాబ్ టెక్నీషిన్లను నియమించింది. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలకు 15మంది, అనుబంధ జనరల్ ఆస్పత్రికి ఆరుగురు, డీహెచ్ పరిధిలోని పలు పీహెచ్సీల్లో 25మంది, వైద్య విధాన పరిషత్ పరిధిలో 14మందిని నియమించారు. వీరు రెండు, మూడు రోజుల్లో విధుల్లో చేరనున్నారు. ఈ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షల్లో ప్రస్తుతం అవుట్ సోర్సింగ్ ఒప్పంద పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లను రెగ్యులర్ చేయనున్నారు. ఈ క్రమంలో నియామక ప్రక్రియలో 20మార్కుల వెయిటేజీ కల్పించారు. నూతనంగా జిల్లాకు 60 మంది ల్యాబ్ టెక్నీషియన్లు రానుండడంతో వైద్య సేవలు మరింత పెరగనున్నాయి. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల నుంచి ప్రభుత్వాస్పత్రులకు వచ్చే వారు రక్త పరీక్షలు, రిపోర్టుల కోసం ఎదురుచూపులు తప్పనున్నాయి. ప్రైవేటుకు వెళ్లకుండా ఖర్చులు తగ్గడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది. అదేవిదంగా నూతనంగా ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన ల్యాబ్ టెక్నీషియన్లు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.సంతోషంగా ఉంది సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రి, బ్లడ్ బ్యాంకులో అవుట్సోర్సింగ్ పద్ధతిలో 18ఏళ్లుగా ల్యాబ్ టెక్నీషియన్గా విధులు నిర్వహిస్తున్నాను. గత ఏడాది నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి తుది జాబితాలో ఉద్యోగానికి ఎంపిక కావడం సంతోషంగా ఉంది. – కనకచంద్రం, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్–2 -
త్వరలోనే కొత్త పెన్షన్లు ఇస్తాం
దుబ్బాక: ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, త్వరలోనే అర్హులైన వారందరికీ కొత్తగా పెన్షన్లు అందిస్తామని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ అన్నారు. బుధవారం దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన క్రీస్మస్ సంబరాల్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందన్నారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు రూ.27 వేల కోట్లు అందించామన్నారు. పేదలకు అండగా నిలవాలన్న సంకల్పంతోనే ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు అందించినట్లు తెలిపారు. రాష్ట్రంలో క్రీస్మస్ పండగను అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం క్రైస్తవుల సంక్షేమం కోసం కృషి చేస్తోందన్నారు. -
ఎల్లమ్మ హుండీ ఆదాయం రూ. 3.37 లక్షలు
హుస్నాబాద్రూరల్: పట్టణంలోని ఎల్లమ్మ దేవాలయ హుండీ కానుకలను బుధవారం లెక్కించినట్లు ఈఓ కిషన్రావు తెలిపారు. హుండీ ఆదాయం రూ.3,37,476 వచ్చిందన్నారు. సంగారెడ్డి దేవదాయ శాఖ సహాయ కమిషనర్ కార్యాలయం పరిశీలకుడు వెంకటరమణారెడ్డి సమక్షంలో హుండీ కానుకలను లెక్కించామన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ మాజీ చైర్మన్ లక్ష్మీనారాయణ, సభ్యులు పాల్గొన్నారు. 108 అంబులెన్స్ తనిఖీ చిన్నకోడూరు(సిద్దిపేట): ఉమ్మడి మెదక్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ సంపత్ 108 అంబులెన్స్ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 108 వాహనంలో ఉన్న అత్యవసర మందులు, పరికరాలను, రిజిస్టర్లను పరిశీలించారు. సిబ్బంది పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే చిన్నకోడూరు పీహెచ్సీని సందర్శించారు. 102 వాహనం వినియోగంపై వైద్యురాలు ఐశ్వర్యను అడిగి తెలుసుకున్నారు. 102 సేవలు వినియోగించుకోవాలని సూచించారు. ఆయన వెంట జిల్లా కోఆర్డినేటర్ హరిరామ కృష్ణ, సిబ్బంది ఉన్నారు. అంతర్జాతీయ సదస్సుకు ఉపాధ్యాయుడు నరేశ్ ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయు డు వెంగళ నరేశ్ ఒడిశాలోని భువనేశ్వర్లో జరిగే అంతర్జాతీయ సదస్సుకు ఎంపికయ్యారు. ఈ మేరకు అక్షర సేద్యం ఫౌండేషన్ అధ్యక్షుడు బైతి దుర్గయ్య బుధవారం తెలిపారు. నరేశ్.. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఆచార్య వీరన్న పర్యవేక్షణలో ‘రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం అమలు.. సిద్దిపేట జిల్లాపై కేస్ స్టడీ’ అనే అంశంపై పరిశోధన (పీహెచ్డీ) చేస్తున్నారన్నారు. కళింగ విశ్వవిద్యాలయంలో ఆల్ ఇండియా పొలిటికల్ సైన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 27, 28 తేదీలలో అంతర్జాతీయ సదస్సు జరగనుందని, ఈ సదస్సులో నరేశ్ పాల్గొననున్నట్లు తెలిపారు. ట్రాఫిక్పై అవగాహన గజ్వేల్రూరల్: విద్యార్థులు రోడ్డు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని గజ్వేల్ ట్రాఫిక్ సీఐ మురళి పేర్కొన్నారు. పట్టణంలోని మైనార్టీ బాలుర పాఠశాలలో బుధవారం విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. విద్యార్థి దశనుంచే ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ట్రాఫిక్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
విజ్ఞానం పంచి.. చైతన్యం పెంచి
గురువారం శ్రీ 25 శ్రీ డిసెంబర్ శ్రీ 2025దుబ్బాక: అక్షరజ్ఞానం లేని ఎందరో పేదప్రజలకు విజ్ఞానం అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహాదేవాలయం.. 125 ఏళ్ల చరిత్ర గల పెద్దగుండవెల్లి సీఎస్ఐ చర్చి ఎంతో ప్రఖ్యాతిగాంచింది. స్వాతంత్య్రానికి పూర్వమే పెద్దగుండవెల్లిలో ఇంగ్లండ్ దేశానికి చెందిన వారు 1901లో చర్చిని నిర్మించారు. ఆ చర్చిస్థానంలోనే 2001 లో అన్ని హంగులతో పునఃనిర్మించారు. ఈ చర్చిలో ప్రతి ఆదివారం పెద్ద ఎత్తున క్రైస్తవులు ప్రార్థనలు చేస్తుంటారు. ప్రతి ఏటా ఘనంగా సంబరాలు పెద్దగుండవెల్లి సీఎస్ఐ చర్చిలో ప్రతి ఏటా క్రిస్మస్ సంబురాలు ఘనంగా జరుపుతారు. ఈ సందర్భంగా క్రిస్మస్ తాతయ్య (శాంతాక్లాజ్) వేషధారణతో గ్రామంలో తిరుగుతూ పిల్లలకు చాక్లెట్లు పంచుతారు. ఏసుక్రీస్తు నామస్మరణ చేస్తూ గ్రామంలో భారీ ఊరేగింపు నిర్వహిస్తారు. కేక్ కట్చేసి ప్రజలకు పంపిణీ చేస్తారు. చర్చిలో 100 కుటుంబాలకు పైగా ఒక్కచోట చేరి సంబురాలు ఆనందంగా జరుపుకొంటారు. క్రిస్మస్ శుభాకాంక్షలు: హరీశ్రావుప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలోని క్రైస్తవులకు మాజీ మంత్రి హరీశ్రావు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, సేవాతత్పరతను, క్షమా గుణాన్ని బోధించిన క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత సంతోషకరమైన రోజు అని పేర్కొన్నారు. కుటుంబ సమేతంగా సుఖసంతోషాలతో క్రిస్మస్ వేడుక జరుపుకోవాలని ఆకాంక్షించారు. -
విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదు
● కలెక్టర్ హైమావతి ● ప్రజ్ఞాపూర్లో గురుకుల పాఠశాల తనిఖీగజ్వేల్: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేదీలేదని కలెక్టర్ హైమావతి హెచ్చరించారు. బుధవారం ప్రజ్ఞాపూర్లోని సాంఘిక గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంటల తీరు, పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించి కామన్ డైట్ను ఎందుకు పాటించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తరగతి గదుల్లో, వరండాలో విద్యార్థుల సామగ్రి, ఎక్కడపడితే అక్కడే చెత్త ఉండటం చూసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యానికి కారకులైన ప్రిన్సిపాల్, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధి త అధికారులకు అక్కడి నుంచే ఫోన్లో ఆదేశించా రు. అనంతరం మైనార్టీ బాలికల గురుకులం, జూనియర్ కళాశాలను సైతం కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు క్రమశిక్షణతో తాము అనుకున్న లక్ష్యాలను సాధించాలని సూచించారు. తీగుల్ పీహెచ్సీ సందర్శన.. జగదేవ్పూర్ మండలం తీగుల్ పీహెచ్సీని బుధవారం కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. పీహెచ్సీ పరిసరాల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. -
కాంగ్రెస్లోకి విఠలాపూర్ సర్పంచ్
చిన్నకోడూరు(సిద్దిపేట): విఠలాపూర్ బీఆర్ఎస్ సర్పంచ్ దాసరి నాగరాణి బుధవారం మంత్రి వివేక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ సమక్షంలో సర్పంచ్ నాగరాణి, ఉప సర్పంచ్ యాదవరెడ్డి, వార్డు సభ్యులకు మంత్రి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు సర్పంచ్, వార్డు సభ్యులు పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయండి ప్రశాంత్నగర్(సిద్దిపేట): కాంగ్రెస్ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సంయుక్తంగా కృషి చేయాలని మంత్రి వివేక్ సూచించారు. బుధవారం హైదరాబాద్కు వెళ్తూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాసేపు ఆగారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. -
విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
జూనియర్ కళాశాలలో వీర్బాల దివస్ సిద్దిపేటఎడ్యుకేషన్: సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల(కో–ఎడ్)లో బుధవారం వీర్బాలదివస్ను పురస్కరించుకుని కేంద్ర సీ్త్ర శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణరెడ్డి, పీఎఫ్ కార్యాలయ అధికారి వేణుగోపాల్లు మాట్లాడారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. భారత ప్రధాని నరేంద్రమోదీ వీర్ బాలదివస్ను 2022లో ప్రారంభించారన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 26న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని చెప్పారు. గురుగోవింద్ సింగ్ కుమారులు బాబాజోరావర్ సింగ్, ఫతే సింగ్ల ధైర్యం, త్యాగాలకు గుర్తుగా జాతీయస్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్నారు. దేశ రక్షణ కోసం వారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు అర్షియా తబుస్సుమ్, జ్యోతి, అభిలాష్రెడ్డిలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో క్రమశిక్షణా కమిటీ చైర్మన్ నంట శ్రీనివాస్రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రొగ్రాం అధికారి ధరిపల్లి నగేష్, స్టూడెంట్ కౌన్సిలర్ తహసీన్ఫాతిమా, పీఎఫ్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ లక్కిరెడ్డి సునీల్రెడ్డితో పాటు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. -
టెన్త్లో టాప్గా నిలవాలి
● మాజీ మంత్రి హరీశ్రావు ● విద్యార్థుల తల్లిదండ్రులకు ఉత్తరాలుప్రశాంత్నగర్(సిద్దిపేట): త్వరలో జరగనున్న టెన్త్ పరీక్ష ఫలితాల్లో సిద్దిపేట టాప్లో నిలవాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఈ మేరకు నియోజకవర్గంలోని పదోతరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు ఉత్తరాలు రాశారు. పలు సూచనలు చేశారు. చదువును నమ్ముకున్న వారంతా తమ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకున్నారన్నారు. నిరుపేద కుటుంబాల్లో జన్మించి మంచి చదువులు చదివి దేశాలను పాలించే స్థాయికి ఎదిగారన్నారు. ప్రణాళిక బద్దంగా చదివితే ఉత్తమ మార్కులు సాధించే అవకాశం ఉందన్నారు. ‘కొద్ది రోజుల్లోనే మీ పిల్లలు పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారు. మంచి మార్కులతో గట్టెక్కితేనే ఉన్నత చదువుల దిశగా ముందడుగు వేసే అవకాశం ఉంటుంది’ అని అన్నారు. లేదంటే మీరు ఇన్నాళ్లు పడిన కష్టానికి, మీ పిల్లల చదువుకు ఎలాంటి అర్థం ఉండదని తెలిపారు. విద్యార్థులను సెల్ ఫోన్లకు, విందులు, వినోదాలు, ఫంక్షన్లు, సినిమాలు, టీవీల జోలికి వెళ్లకుండా చూడాలన్నారు. నా వంతుగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులతో పాటు అల్పాహారం ఏర్పాటు చేస్తున్నానని తెలిపారు. మార్కులు సాధించేందుకు కంటెంట్ పుస్తకాలు పంపిస్తున్నానని చెప్పారు. -
పాల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలుద్దాం
● మరిన్ని సహకార సంఘాల ఏర్పాటు ● పాఠశాల ఆవరణలో మద్యం సేవిస్తే రౌడీ షీట్ ఓపెన్ చేయండి ● మంత్రి పొన్నం ప్రభాకర్హుస్నాబాద్రూరల్: నియోజకవర్గాన్ని పాల ఉత్పత్తిలో, పశుసంపదలో అగ్రగామిగా నిలబెట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో ఏడు మండలాల అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. హుస్నాబాద్ నియోజకవర్గం గ్రామీణ ప్రాంతం కావడంతో రైతులు పాల ఉత్పత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తారన్నారు. అలాగే ప్రభుత్వ సంక్షేమాలు రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. పాఠశాలల ఆవరణలో మద్యం సేవించే వారిపై రౌడీ షీటు ఓపెన్ చేయాలని సిద్దిపేట, హన్మకొండ, కరీంనగర్ జిల్లా సీపీలను ఆదేశించారు. గ్రామాల్లో ఏడు మెడికల్ కాలేజీల ద్వారా సంక్రాంతి లోపు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. యాసంగి పంటల సీజన్ ప్రారంభం కావడంతో గ్రామాల్లో రైతులకు పంటల సాగుపై అవగహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో మరిన్ని సహకార సంఘాలను ఏర్పాటు చేసి అదనపు గోదాములను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. సమవేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి, మార్కెట్ చైర్మన్ తిరుపతిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.గొర్రెలకు నట్టల మందు వేయండిహుస్నాబాద్రూరల్: గొర్రెల మంద పెరిగితే ఆదాయం వృద్ధి చెందుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం తోటపల్లిలో గొర్రెలకు నట్టల మందు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గొర్రెల మంద ఎదగాలంటే జీవాల ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు. ఆరోగ్య సమస్యలను గుర్తించి సమీపంలోని పశువైద్యులను సంప్రదించి వైద్యం అందించాలన్నారు. జీవాలు ఆరోగ్యంగా ఉంటే మంద పెరుగుతుందన్నారు. అప్పుడు ఆదాయం కూడా పెరుగుతుందని చెప్పారు. జీవాల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయవద్దన్నారు. ఊరూర గొర్రెల మందలను గుర్తించి గొర్రెల పెంపకముదారులకు అవగహన కల్పించాలని అధికారులకు సూచించారు. -
చరిత్ర ఘనం.. చర్చిలు అబ్బురం
నేడే క్రిస్మస్ పండుగ.. వేడుకలకు సర్వం సిద్ధంప్రశాంత్నగర్(సిద్దిపేట): ఇంగ్లండ్ మిషనరీలు జిల్లా కేంద్రంలో నిర్మించిన తొలి సీఎస్ఐ చర్చి ఇది. చర్చికి 137 ఏళ్ల చరిత్ర ఉంది. స్వాతంత్య్రం రాకముందే నిర్మించిన ఈ చర్చి జిల్లాలోనే అతి పెద్దది, విశాలమైనది. ఒకేసారి వెయ్యి మందికి పైగా భక్తులు ప్రార్థనలు చేసుకునే అవకాశం ఉంది. క్రిస్మస్ రోజున జిల్లాతో పాటుగా, రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన భక్తులు ఈ చర్చికి అధిక సంఖ్యలో తరలివస్తారు. ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. సిద్దిపేట ప్రాంతంలో ఎలాంటి చర్చి లేనందున ప్రత్యేక శ్రద్ధతో సీఎస్ఐ చర్చి నిర్మాణం చేశారని నిర్వాహకులు చెబుతున్నారు. పట్టణం మధ్యలో మొదట చిన్న పాకగా.. ఆ తరువాత రేకుల షెడ్డుగా.. అనంతరం భారీ చర్చిని నిర్మించారని వారు తెలిపారు. వేడుకలు వైభవంగా నిర్వహిస్తాం జిల్లాలోనే పురాతనమైనది సీఎస్ఐ చర్చి. ఇంగ్లండ్ మిషనరీలు ఈ చర్చిని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. సిద్దిపేట పరిసరాల ప్రజలకు చర్చి అందుబాటులో లేనపుడు ఇక్కడ నిర్మించారు. ఈ చర్చికి వేలాది భక్తులు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. క్రిస్మస్ పండుగ రోజు ఈ చర్చిలో వైభవంగా వేడుకలు నిర్వహిస్తాం. – రెవరెండ్ ఆంథోని, సీఎస్ఐ చర్చి జిల్లాలోనే ప్రథమం.. 137 ఏళ్ల ప్రస్థానం -
కామన్ డైట్ మెనూ పాటించాలి
చిన్నకోడూరు(సిద్దిపేట): కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని, విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని కలెక్టర్ హైమావతి సూచించారు. మంగళవారం కస్తూరిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. పిల్లల ఆట వసువులను పరిశీలించారు. విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించారు. చదువు విషయంలో రాజీ పడవద్దని, ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి నిరంతరం శ్రమించాలని విద్యార్థులకు సూచించారు. అదనపు తరగతి గదులు కావాలని టీచర్లు కొరగా మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. -
యేసు బోధనలు ఆచరణీయం
హుస్నాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు బాగుండాలని ఏసుప్రభు చేసిన బోధనలు ఆచరణీయమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం పట్టణంలోని లక్ష్మి గార్డెన్లో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భగవంతుడే స్వయంగా ఏసుక్రీస్తు అవతారం ఎత్తి.. ప్రజలు సన్మార్గంలో ఉండాలని బోధనలు చేశారన్నారు. ద్వేషభావాలు లేకుండా మానవ జాతి ప్రశాంతంగా ఉండాలని మంచిని ప్రభువు నేర్పారని తెలిపారు. స్థానికంగా క్రైస్తవ కమ్యూనిటీ హాల్కు స్థలం చూపించి భవన నిర్మాణానికి రూ.25 లక్షలు కేటాయిస్తామని మంత్రి వెల్లడించారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి అయి, కాలువలతో ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలని, మెడికల్ పరంగా పీజీ కళాశాలతో పాటుగా విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలతో ఈ ప్రాంతం బాగుండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఆర్డీఓ రామ్మూర్తి, తహసీల్దార్ లక్ష్మారెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, సర్పంచ్లు, పాస్టర్లు పాల్గొన్నారు. హుస్నాబాద్లో కబడ్డీ అకాడమీ హుస్నాబాద్లో కబడ్డీ అకాడమీతోపాటు స్టేడియంలో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంగళవారం రాత్రి మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గంలోని ఏడు మండలాల అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా అధికారులు పరిష్కరించాలన్నారు. పంచాయతీ రాజ్ శాఖలో పెండింగ్ బిల్లులు వారం రోజుల్లో విడుదల అవుతాయన్నారు. జనవరి మొదటి వారంలో సర్పంచ్లు, అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహిస్తామన్నారు. -
డబ్బులిచ్చుకో.. దందా చేస్కో!
ఎకై ్సజ్ అధికారుల అక్రమ వసూళ్లు ‘ఊరూరా బెల్టుషాపులు నడుపుకోండి.. ఎమ్మార్పీపై ఎంతైనా అదనంగా వసూలు చేసుకోండి.. అక్రమాలు ఎన్ని ఉన్నా మీపై ఈగ వాలనివ్వం.. మేం అడిగిన డబ్బులు ఇచ్చుకోండి.. ’ జిల్లాలో ఇదీ ఎకై ్సజ్ అధికారుల తీరు. కప్పం కడితే అన్నీ మేం చూసుకుంటాం అంటూ కొత్త ఎకై ్సజ్ పాలసీలో (2025–27) మద్యం వ్యాపారులకు చెప్పి భారీగా డబ్బు వసూళ్లు చేస్తున్నట్లు ప్రచారం. ఒక్కో దుకాణం నుంచి ఏకంగా రూ.2.5లక్షలు వసూలు చేస్తుండటంతో వ్యాపారులు దిక్కుతోచని స్థితికి గురవుతున్నారు. కొత్తగా దుకాణాలు ఏర్పాటు చేసి నెల రోజులు కూడా కాలేదు.. అప్పుడే వసూళ్లు ఏమిటంటూ వ్యాపారులు వాపోతున్నారు. – సాక్షి, సిద్దిపేట జిల్లాలో 93 మద్యం దుకాణాలున్నాయి. డిసెంబర్ 1వ తేదీ నుంచి నూతన మద్యం పాలసీ ప్రారంభమైంది. మద్యం తెప్పించుకున్నారు.. సర్పంచ్ ఎన్నికలు రావడంతో అమ్మకాలు పెరిగాయి. ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న సమయంలోనే రెండేళ్లకు కొంత డబ్బు.. మళ్లీ నెల నెల రూ.15వేలు ఇవ్వాలని ఎకై ్సజ్ అధికారులు అక్రమ వసూళ్లకు తెరలేపుతున్నారు.. దీంతో కొత్తగా మద్యం వ్యాపారంలోకి వచ్చిన వారు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా రూ.2.32 కోట్లు!కింది స్థాయి నుంచి పైవరకు.. వసూలు చేసిన డబ్బును కింది స్థాయి నుంచి పై అధికారి వరకు పంపకాలు జరుగుతాయని తెలిసింది. గతంలో రూ.1.5 లక్షలు వసూలు చేశారని పాత మద్యం వ్యాపారులు చెబితే.. ఈసారి జిల్లాలో ఇద్దరు అధికారులు పెరిగారని, అందుకే ఎక్కువ వసూలు చేస్తున్నామని చెబుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. షాప్ ప్రారంభంలోనే ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని, దీనికి తోడు అధికారులకు అక్రమ వసూళ్లతో దిక్కుతోచనిస్థితికి గురవుతున్నామని చెబుతున్నారు. కాస్త సమయం ఇవ్వండి అని అడిగినా పట్టించుకోవడం లేదని కొందరు మద్యం వ్యాపారులు వాపోతున్నారు.కొత్తగా వైన్ షాప్ దక్కించుకున్న సంతోషం.. మద్యం వ్యాపారుల్లో ఉండటం లేదు. ఇప్పటికే షాప్ కోసం అద్దెకు తీసుకోవడం.. ఫస్ట్ క్వార్టర్ డబ్బులు చెల్లించడం, ఫర్నిచర్ తయారు చేయించడం ఇలా ఇప్పుడే సర్దుకుంటున్న సమయంలోనే ఎక్సైజ్ పోలీస్స్టేషన్కు కప్పం కట్టాలని అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఒక్కో వైన్ షాప్ నుంచి రూ.2.5లక్షలు ఇవ్వాలని మద్యం వ్యాపారులకు హుకుం జారీ చేసినట్లు తెలిసింది. ఇలా జిల్లా వ్యాప్తంగా 93 వైన్ షాప్ల వద్ద వసూలు చేయాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా రూ.2.32కోట్లు వసూలు చేయనున్నారు. అధికారులతో ఇబ్బంది ఎందుకని.. ఇబ్బంది పడుతూనే డబ్బులను ఎకై ్సజ్ అధికారులకు ముట్టచెప్పుతున్నట్లు తెలుస్తోంది. ఈ డబ్బులే కాకుండానే ప్రతి నెలా ఒక్కో వైన్ షాప్ రూ.15వేలు ఇవ్వాలని ఎకై ్సజ్ అధికారులు చెప్పతున్నట్లు మద్యం వ్యాపారుల్లో జోరుగా చర్చసాగుతోంది. నా దృష్టికి రాలేదు మద్యం దుకాణాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు నా దృష్టికి రాలేదు. అలాంటి తప్పుడు పని చేయవద్దు. స్టేషన్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సీరియస్గా వార్నింగ్ ఇస్తాను. అలాంటి వారి పై చర్యలు తీసుకుంటాం. –శ్రీనివాసమూర్తి, ఈఎస్, సిద్దిపేట -
నేడు మంత్రి వివేక్ రాక
దుబ్బాక: ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ బుధవారం దుబ్బాక నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇందు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గతంలో నియోజకవర్గంలో మంత్రి పర్యటనల్లో చోటుచేసుకున్న సంఘటనలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు బందోబస్తు చేశారు. దౌల్తాబాద్, చేగుంట మండల కేంద్రాల్లో మంత్రి పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు చేగుంటలోని రైతు వేదికలో, దౌల్తాబాద్లోని వీఆర్ఆర్ గార్డెన్లో 11 గంటలకు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేస్తారు. అలాగే నూతనంగా గెలుపొందిన కాంగ్రెస్ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులను సన్మానించనున్నారు. -
పాఠశాలల బలోపేతం అవశ్యం
● జనగామలో 28, 29న రాష్ట్ర విద్యా సదస్సు ● యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి ప్రశాంత్నగర్(సిద్దిపేట): విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన జరగాలంటే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాల్సిన అవసరం ఉందని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి అన్నారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 28, 29న జనగామలో నిర్వహిస్తున్న రాష్ట్ర విద్యా సదస్సు, విస్తృత్త స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో రాష్ట్ర సమావేశాలకు సంబంధించిన ల్పోస్టర్లను జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి, యూటిఎఫ్ నాయకులు ఆవిష్కరించారు. అనంతరం యాదగిరి మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చూడాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా సదస్సు సందర్భంగా ఒక నివేదికను సమర్పిస్తామన్నారు. రాష్ట్ర విద్యా సదస్సుకు వక్తలుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్, నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ హాజరవుతున్నారన్నారు. ముఖ్య అతిథులుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పంచాయితీరాజ్ మహి ళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ లు హాజరవుతారన్నారు. ఈ సదస్సును సిద్దిపేట జిల్లాలోని ఉపా ధ్యాయులు భారీ సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట రూరల్ మండల విద్యాధికారి రాజిరెడ్డి, కొమరవెల్లి మండల విద్యాధికారి రవీందర్, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి తుడుం శివలింగం తదితరులు పాల్గొన్నారు. -
యేసయ్య కోవెల ముస్తాబు
క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లుమెదక్జోన్: పరలోక ప్రభువు ఏసయ్య జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం నిర్వహించే క్రిస్మస్ వేడుకలకు మెదక్ చర్చి ముస్తాబవుతోంది. ఇప్పటికే పర్యాటకులు, భక్తుల తాకిడి మొదలైంది. దీంతో మెదక్లో సందడి నెలకొంది. అపురూపం.. కట్టడం మెదక్ సీఎస్ఐ చర్చి నిర్మించి 101 సంవత్సరాలు అవుతోంది. గతేడాది జరిగిన శత జయంతి వేడుకలకు గవర్నర్, సీఎంతో పాటు పలువురు మంత్రులు సైతం హాజరయ్యారు. చర్చి అభివృద్ధికి రూ. 29.50 కోట్లు మంజూరు చేయటంతో, ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. క్రిస్మస్ సందర్భంగా గురువారం ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభించనుండడంతో అందుకు తగిన సన్నాహాలు చేస్తున్నారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్లుగా చర్చి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక దుకాణాలు, రంగుల రాట్నాలతో చర్చి ఆవరణ జాతరను తలపిస్తోంది. సుందర కట్టడంగా పేరొందిన మెదక్ కెథడ్రల్ చర్చి ఎందరో మహానుభావుల అర్కెటిక్ పనితనంతో ఇంకా సుభాగా విరాజిల్లుతోంది. ప్రత్యేకంగా క్రిస్మస్ సందర్భంలో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. 590 మందితో బందోబస్తు క్రిస్మస్ నేపథ్యంలో 590 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పట్టణ సీఐ మహేశ్ తెలిపారు. ఇందులో మెదక్తో పాటు సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన పోలీస్ సిబ్బంది పాల్గొంటారు. 4 గురు డీఎస్పీలు, 11 మంది సీఐలు, 45 మంది ఎస్సైలతో పాటు 5 సెక్టార్లకు సంబంధించిన పోలీస్ సిబ్బంది విధుల్లో ఉంటారు. ఐడీపార్టీలు, క్యూఆర్టీంలు, షీటీంలతో పాటు 100 సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. చర్చి ఎదుట పోలీస్ కంట్రోల్ రూం సైతం ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్ దీపాల కాంతుల్లో చర్చి -
సీఎం రేవంత్రెడ్డిపై విమర్శలు విడ్డూరం
● మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ● గజ్వేల్లో సైదయ్య విగ్రహానికి నివాళిగజ్వేల్: బీఆర్ఎస్ హయాంలో పేదల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన కేసీఆర్, నేడు సీఎం రేవంత్రెడ్డిపై తప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి మండిపడ్డారు. సోమవారం గజ్వేల్లో దివంగత ఎమ్మెల్యే సైదయ్య, దివంగత ఎమ్మెల్సీ మాదాడి రంగారెడ్డి విగ్రహాలకు డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, వైస్ చైర్మన్ సర్ధార్ఖాన్లతో కలిసి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్ట్లు, పథకాల పేరుతో లక్షల కోట్లు దోచుకున్న కేసీఆర్ కుటుంబం వివిధ సంస్థల్లో పెట్టుబడులను పెట్టిందని ఆరోపించారు. వాటిని కాపాడుకునేందుకు ప్రజలను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ చేసిన అప్పులకు.. కాంగ్రెస్ ప్రభుత్వం మిత్తీలు కట్టే పరిస్థితి వచ్చిందన్నారు. ఓట్లేసి గెలిపించిన గజ్వేల్ నియోజకవర్గ ప్రజలను సైతం కేసీఆర్ మోసం చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి వల్ల మల్లన్నసాగర్ నిర్వాసితులకు తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు. నిర్వాసితులను బీఆర్ఎస్ నేతలకు దోచుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇక కేసీఆర్ శకం ముగిసిందని వ్యాఖ్యానించారు. వారు చేసిన అవినీతి, అక్రమాల చిట్టా ప్రభుత్వం వద్ద ఉన్నదని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ గజ్వేల్ మండల, పట్టణ శాఖ నాయకులు పాల్గొన్నారు. -
అధికారుల అలసత్వం.. నిలిచిన ధాన్యం
● పది రోజులు గడుస్తున్నా పట్టని దైన్యం ● కొనుగోలు కేంద్రంలో 1,500 ధాన్యం బస్తాలు నంగునూరు(సిద్దిపేట): అధికారుల నిర్లక్ష్యం, రైస్ మిల్లర్ల సహాయ నిరాకరణ రైతులకు శాపంగా మారింది. వడ్లను తూకం వేసి పది రోజులు గడిచినా మిల్లుకు తరలించపోవడంతో ధాన్యం బస్తాల వద్ద రైతులు వడిగాపులు కాస్తున్నారు. ఈవిషయమై అధికారులు, రైస్మిల్లు యజమానులకు మొర పెట్టుకున్నా కనికరించడం లేదని రైతులు వాపోతున్నారు. నంగునూరు మండలం గట్లమల్యాల రెండు నెలల కిందట ఐకేపీ ద్వార వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 237 మంది రైతుల ద్వారా 6,700 క్వింటాళ్ల వడ్లను కొనుగోలు చేసి మిల్లుకు తరలించారు. కొనుగోళ్లను నిలిపివేస్తామని అధికారులు ప్రకటించడంతో చివరి రోజు వరకు పది మంది రైతుల నుంచి 1,500 బస్తాల ధాన్యాన్ని తూకం వేశారు. -
సాగు నీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం
దుబ్బాక: సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. ఒక్కరోజైన ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ప్రాజెక్టులపై సమీక్ష చేయకపోవడమే ఇందుకు నిదర్శనమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. సోమవారం నియోజకవర్గంలోని దుబ్బాక, మిరుదొడ్డి, తొగట మండలాల్లోని పలు గ్రామాల్లో నూతనంగా ఎన్నికై న గ్రామపంచాయతీల పాలకవర్గాల ప్రమాణ స్వీకారకార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం భారీ ప్రాజెక్టులను నిర్మిస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాలో మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయక సాగర్ వంటి మూడు భారీ ప్రాజెక్టులు ఉన్నప్పటికీ కనీసం పంటలకు నీరందించే కాల్వల నిర్మాణాలు కూడా పూర్తి చేయకపోవడం దారుణమన్నారు. ప్రజల సమస్యలపై కలెక్టర్, ఉన్నత అధికారులకు ఫోన్ చేసినా స్పందించడంలేదన్నారు. గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి ప్రస్తుతం ఎన్నికై న సర్పంచ్లు రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నూతనంగా పదవీ బాధ్యతలు చేపడుతున్న సర్పంచ్లు, పాలక వర్గాలకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. -
విపత్తు నిర్వహణ సమన్వయంతో చేపట్టాలి
● కలెక్టర్ హైమావతి ● అధికారులకు దిశానిర్దేశం సిద్దిపేటరూరల్: వరదలు, పరిశ్రమలలో ప్రమాదాలు వంటి విపత్తుల సమయంలో సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆదేశాల మేరకు విపత్తులు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై అధికారులతో మాక్డ్రిల్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా వరదలు రావడం, వాగులు ఉప్పొంగడం, ప్రజలు, పశువులు నీటిలో చిక్కుకుపోవడం వంటి విపత్తు పరిస్థితుల్లో కాపాడేందుకు ముందస్తుగా నిర్వహిస్తున్న మాక్ డ్రిల్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఓటరు జాబితా సవరణ చేపట్టాలి ప్రభుత్వం సూచించిన గడువు లోగా సమగ్ర ఓటరు జాబితా సవరణ చేపట్టాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక ఓటరు జాబితా సవరణపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటరు జాబితాలో డూప్లికేట్ ఎంట్రీలు, సమానమైన వివరాలు, బ్లర్ ఫొటోలు వంటి లోపాలను సరిదిద్దడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. క్షేత్రస్థాయిలో వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. -
ఆకట్టుకున్న గణిత నమూనాలు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): జాతీయ గణిత దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలోని అన్ని పాఠశాలల్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ గణితవేత్త రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు కూడికలు, తీసివేత, గుణకారాలు, భాగహారాలు, త్రిభుజాలు, రేఖాగణిత, అల్జీబ్రాతో పాటుగా వివిధ రకాల గణిత శాస్త్ర నమూనాలను ప్రదర్శించారు. సాంఘికశాస్త్ర ల్యాబ్ ఏర్పాటు అభినందనీయం సిద్దిపేటఅర్బన్: సాంఘిక శాస్త్రం ల్యాబ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని, జిల్లా విద్యాధికారి ఎల్లంకి శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట అర్బన్ మండలం బక్రిచెప్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు మామిడి పూర్ణచందర్రావు చొరవతో సాంఘికశాస్త్ర ల్యాబ్ ఏర్పాటు చేశారు. డీఈవో శ్రీనివాస్రెడ్డి ల్యాబ్ను ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో సాంఘికశాస్త్ర ల్యాబ్ చూడటం ఇదే ప్రథమమని దీని స్ఫూర్తి తో జిల్లాలో సాంఘికశాస్త్ర ల్యాబ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులకు ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. మల్లన్న సన్నిధిలో ఎమ్మెల్సీ కొమురయ్య కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్నస్వామిని ఎమ్మెల్సీ మల్క కొమురయ్య కుటుంబసమేతంగా సోమవారం దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిత్యాన్నదానానికి రూ.1,00,116 విరాళంగా ఈఓ వెంకటేశ్కు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్, ముఖ్య అర్చకులు ఆంజనేయులు, పర్యవేక్షకులు నీల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ హుస్నాబాద్: రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో మోడల్ స్కూల్ విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. ఈ నెల 21న హన్మకొండలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో అండర్–10 బాలికలు కటాస్ విభాగంలో హర్షిత గోల్డ్ మెడల్, కృతిక, అనుదీపిక, ప్రసన్నలు సిల్వర్ మెడల్ సాధించారు. అండర్–12 కటాస్ విభాగంలో అక్షయ, బాలుర విభాగంలో శశివర్ధన్ గోల్డ్ మెడల్తో మెరిపించారు. విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ విశ్వనాథ్, కరాటే మాస్టర్ కంటే రాజు అభినందించారు. టెట్ వాయిదా వేయాలి బెజ్జంకి(సిద్దిపేట): ప్రభుత్వం వచ్చే నెల 3వ తేదీ నుంచి నిర్వహించతలపెట్టిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్)ను తాత్కాలికంగా వాయిదా వేయాలని ఎస్టీయూ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బెజ్జంకి బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం లంచ్ అవర్లో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల విధుల వల్ల చాలా మంది ఉపాధ్యాయులు ప్రిపేర్ కాలేకపోయారన్నారు. కనీసం నెల రోజుల పాటు వాయిదా వేయాలన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం శ్రీరాములు, ఎస్టీయూ ఆర్థిక కార్యదర్శి రామంచ రవీందర్, మండల అధ్యక్షుడు శంకరాచారి, రాజేందర్, రజనీష్రెడ్డి, చందన, రఘునాథ్ పాల్గొన్నారు. -
కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల వాగ్వాదం
వర్గల్(గజ్వేల్): ప్రమాణస్వీకారాల వేళ వర్గల్లో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదాలతో వేడెక్కింది. వర్గల్ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణస్వీకారం జరిగింది. అందరం కలిసి అభివృద్ధిలో భాగస్వాములవుదామని పంచాయతీ వేదికగా సర్పంచ్ దేవగణిక జయభారతి, ఉపసర్పంచ్ టేకులపల్లి గోవర్ధన్రెడ్డి ప్రకటించారు. అంతా సవ్యంగా సాగిందనుకున్న తరుణంలో అభివృద్ధి పనుల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరిగి ఇరుపార్టీల శ్రేణుల మధ్య తోపులాటకు దారితీసింది. వెంటనే గౌరారం ఎస్ఐ కరుణాకర్రెడ్డి, సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాలను సముదాయించారు. ఆ తరువాత సన్మానాల కార్యక్రమాలు యథావిధిగా కొనసాగాయి. -
నిరాకరిస్తున్న రైస్ మిల్లర్లు
గట్లమల్యాల కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన వడ్లను ఆరు రైస్ మిల్లులకు కేటాయించడంతో దిగుమతి చేసుకున్నారు. నిల్వ ఉన్న 1,500 బస్తాలు పది రోజులు గడిచినా తరలించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పక్కనే బస్తాలు వేయడంతో రాత్రి పూట కాపు కాయాల్సివస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేరుగా రైస్ మిల్లుకు వెళితే తమ వద్దకు రావొద్దని, ఐకేపీ నిర్వాహకులను అడగాలని సమాధానం ఇస్తున్నారు. ఈవిషయమై కొనుగోలు కేంద్రం నిర్వహకులను వివరణ కోరగా పది రోజుల నుంచి లారీలు రావడంలేదన్నారు. మిల్లర్లకు ఫోన్ చేస్తే నూకలు ఎక్కువగా వస్తున్నాయని, తమ టార్గెట్ పూర్తయి. గోదాములు ఖాళీగా లేకపోవడంతో దిగుమతి చేసుకోవడం లేదన్నారు. ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్కు ఫోన్ చేయగా స్పందించలేదు. -
మంగళవారం శ్రీ 23 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
చేర్యాల పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద బోల్తాపడిన సిమెంట్ బస్తాల ట్రాక్టర్పల్లె సారథులు వచ్చేశారు..సాక్షి, సిద్దిపేట: గ్రామ పంచాయతీల్లో సోమ వారం నూతన పాలక వర్గాలు కొలువుదీరాయి. నూతనంగా ఎన్నికై న సర్పంచులు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఫిబ్రవరి 2, 2024న గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించారు. దాదాపు 22 నెలల తర్వాత పంచాయతీలకు సర్పంచ్లు వచ్చారు. ప్రత్యేక అధికారుల నుంచి బాధ్యతలను సర్పంచులు స్వీకరించారు. ఈ ప్రమాణ స్వీకరణ కార్యక్రమంతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. జిల్లాలో 508 సర్పంచ్లకు గాను 507 మంది సర్పంచ్లు బాధ్యతలు స్వీకరించారు. కోహెడ మండలం తంగళ్లపల్లి సర్పంచ్ సంపత్ తండ్రి మృతి చెందడంతో ప్రమాణస్వీకారం చేయలేదు. బడిలో ప్రమాణం వర్గల్(గజ్వేల్): చాంద్ఖాన్మక్త పంచాయతీ కార్యాలయానికి సొంత భవనం లేకపోవడంతో మదిర గ్రామమైన లింగారెడ్డిపల్లి స్కూల్ బిల్డింగ్లో కొనసాగుతోంది. విద్యార్థులు లేకపోవడం.. స్కూల్ పొరుగు పాఠశాలలో విలీనమవడంతో ఆ భవనాన్ని పంచాయతీకి వినియోగిస్తున్నారు. దీంతో సోమవారం సర్పంచ్ మేదిని సజనిత, ఉపసర్పంచ్ కనకయ్య, వార్డుసభ్యులు లింగారెడ్డిపల్లి పాఠశాల భవనంలో ప్రమాణస్వీకారం చేశారు. అదేవిధంగా సామలపల్లి పంచాయతీకి సొంత భవనం లేకపోవడంతో ఇరుకై న అద్దెగదిలోనే సర్పంచ్ భాస్కర్రెడ్డి, ఉపసర్పంచ్, వార్డుసభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.జగదేవ్పూర్లో పంచాయతీ పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదంగజ్వేల్: కుర్చీల లొల్లితో జగదేవ్పూర్ పంచాయతీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీలకు చెందిన వార్డు సభ్యులు నినాదాలతో వాగ్వాదానికి దిగారు. ఒకనొకరు తోసుకునే పరిస్థితి ఏర్పడింది. పంచాయతీలో సర్పంచ్గా బీఆర్ఎస్ అభ్యర్థి పనగట్ల శ్రీనివాస్గౌడ్ ఎన్నికయ్యారు. మొత్తం 14 వార్డుల్లో 8 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకోగా, 5స్థానాల్లో కాంగ్రెస్, మరొక స్థానంలో బీజేపీ అభ్యర్థి గెలిచారు. సోమవారం ప్రమాణ స్వీకారం సందర్భంగా పంచాయతీ భవనం వెలుపలా కుర్చీలు ఏర్పాటుచేశారు. పరిమితంగా ఏర్పాటు చేయడం వల్ల అప్పటికే బీఆర్ఎస్ వార్డు సభ్యులు, నాయకులు వచ్చి కూర్చున్నారు. కాంగ్రెస్, బీజేపీకి చెందిన వార్డు సభ్యులకు కుర్చీలు లేవు. దీంతో ఈ రెండు పార్టీలకు చెందిన సభ్యులు, నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతల తీరుపై మండిపడుతూ.. జై కాంగ్రెస్, జై బీజేపీ అంటూ నినాదాలు మొదలెట్టారు. ఈ సందర్భంగా పార్టీల నేతల మధ్య కొద్దిసేపు మాటల యుద్ధం నడిచింది. బీఆర్ఎస్ నేతలు సైతం పోటీగా జై తెలంగాణ.. అంటూ నినాదాలు చేశారు. ఫలితంగా ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. పార్టీల నేతల మధ్య వాగ్వాదాలు తోపులాటకు దారి తీసి.. తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ కృష్ణారెడ్డి తన సిబ్బంది అక్కడికి చేరుకొని నేతలను సముదాయించి ఉద్రికత్తకు తెరదించారు. ఆ తర్వాత వార్డు సభ్యుల వారీగా కుర్చీలను ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారాన్ని పూర్తి చేశారు.చాలా చోట్ల మాజీ సర్పంచ్లు ఓటమిపాలకవర్గాలు కొలువుదీరాయ్.. -
కేంద్రానివి కుట్ర పూరిత చర్యలు
సిద్దిపేటజోన్: మహాత్మాగాంధీ పేరును కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ఉపాధి హామీ పథకం నుంచి తొలగించాలని చూస్తుందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకాంక్షరెడ్డి, ఓబీసీ సెల్ కన్వీనర్ సూర్యవర్మలు ఆరోపించారు. పార్టీ పిలుపు మేరకు ఆదివారం గాంధీ చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గాంధీజీ ఆశయాలు, ఆయన పేరుతో ఉన్న పథకాలను కాపాడే బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందన్నారు. ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేయడాన్ని కాంగ్రెస్ ఉరుకోదని అన్నారు. అంతకుముందు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు నర్సారెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, నాయకులు చంద్రం, బుచ్చిరెడ్డి, రియాజ్, రవితేజ, సర్పంచ్లు కార్యకర్తలు పాల్గొన్నారు. -
మల్లన్నసాగర్ పథకం తీరు ఇదీ..
మల్లన్నసాగర్ నీటి నిల్వ సామర్థ్యం 50 టీఎంసీల్లో హైదరాబాద్ మహానగర అవసరాలకు ఏటా 20 టీఎంసీలను వాడుకోవాలని పథకం రూపొందించారు. రూ.4,500 కోట్ల వ్యయంతో 198 కిలోమీటర్ల మేర పైపులైన్ల పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్కు వెళ్తున్న ఎల్లంపల్లి లైన్కు సమాంతరంగా మరో కొత్త పైప్లైన్ నిర్మించాలని నిర్ణయించారు. ముందుగా మల్లన్నసాగర్ నుంచి మేడ్చల్ జిల్లా ఘనపూర్ వరకు సమారుగా 100 కిలోమీటర్ల మేర 4 డయామీటర్ల పైప్లైన్ నుంచి నిర్మించి అక్కడ ప్రత్యేక డబ్ల్యూటీపీ (వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్) నిర్మించాలని నిర్ణయించారు. అక్కడి నుంచి నగరంలోని ఉస్మాన్నగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లను నింపాలనుకుంటున్నారు. ఇందుకోసం అవుటర్ రింగు రోడ్డు గుండా పైప్లైన్ నిర్మాణం జరగనుంది. దీంతోపాటు మూసీ నది సుందరీకరణకు సైతం ఈ జలాలను తరలించే ప్రత్యేక కార్యాచరణ ఈ పథకంలో ఉంది. మొత్తంగా 198కిలోమీటర్ల మేర పైప్లైన్ల నిర్మాణం చేపట్టాల్సి ఉందని ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు. -
కామన్ డైట్ మెనూ అమలు చేయాలి
కోహెడరూరల్(హుస్నాబాద్): విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని, రోజూ కామన్ డైట్ పాటించాలని కలెక్టర్ హైమావతి సూచించారు. ఆదివారం సాయంత్రం కోహెడ మండలంలోని తంగళ్ళపల్లిలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ క్షేత్రస్థాయిలో సందర్శించారు. రాత్రి భోజనం, వసతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆహార పదార్థాలను తనీఖీ చేశారు. విద్యార్ధుల హాజరు ప్రకారం వంట సరుకులు అందించరా?, సన్నబియ్యం నాణ్యతపై ఆరా తీశారు. విద్యాలయ ప్రాంగణంలో వెలుతురు సరిగ్గా లేదని, ఎక్కువ వెలుతురు వచ్చే లైట్లు అవర్చేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ను కోరారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామన్నారు. -
మల్లన్నకు పట్నాలు.. భక్తుల మొక్కులు
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆలయ పరిసరాలన్నీ కిటకిటలాడాయి. జిల్లా నుంచే కాకుండా వివిధ ప్రాతాల నుంచి భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. గంగరేణి చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. మరికొంతమంది పట్నాలు వేశారు. ఆలయ ముఖ మండపంలో నిత్యకల్యాణం, అభిషేకం, ఒడిబియ్యాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎల్లమ్మ తల్లికి బోనం పెట్టి వేడుకున్నారు. స్వామి వారి దర్శనానికి సుమారు 3 గంటల సమయం పట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
మల్లన్న జలాలు ఇక బిరబిర
మంచినీటి పథకానికి శ్రీకారం● నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ● హైదరాబాద్ మహానగరానికి తరలింపు పనులు ప్రారంభం ● ఏటా 20 టీఎంసీల నీటి తరలింపే లక్ష్యం మల్లన్న జలాలు ఇక పరుగులు పెట్టనున్నాయి. నీటి పథకానికి జిల్లాలో శ్రీకారం చుట్టారు. మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కానుంది. హైదరాబాద్ మహా నగరం మంచినీటి అవసరాలను తీర్చేందుకు, అలాగే మూసీ సుందరీకరణకు ఆధారమైన మల్లన్నసాగర్ జలాల తరలింపు పనులు ప్రారంభమయ్యాయి. గజ్వేల్ ప్రాంతంలోని పాతూరు కూరగాయల మార్కెట్ సమీపంలో ఇందుకు సంబంధించిన పైప్లైన్ పనులు కొన్ని రోజుల కిందట మొదలుపెట్టారు. రూ.4500కోట్ల వ్యయంతో 198 కిలోమీటర్ల మేర జరగనున్నాయి. – గజ్వేల్ జిల్లాలో నిర్మించిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ నేడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ భవిష్యత్ అవసరాలకు కల్పతరువుగా మారింది. ఉత్తర తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా 50టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఈ రిజర్వాయర్... తాజాగా రాజధానికి గొంతు తడపటానికి ఉపయోగపడబోతోంది. ప్రస్తుతం కృష్ణ, మంజీర నదులు, ఎల్లంపల్లిబ్యారేజీతోపాటు గండిపేట రిజర్వాయర్ల నుంచి మంచినీటి సరఫరా జరుగుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న నగర నీటి అవసరాలను అంచనా వేస్తూ.. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్(హెచ్ఎండబ్ల్యూఎస్) ఆయా వనరుల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నది. ఇందులోభాగంగానే జంటనగరాల్లోని వివిధ ప్రాంత్లాల్లో తాగనీటి పరిష్కారం కోసం గోదావరి సుజల స్రవంతి పథకాన్ని పన్నెండేళ్ల క్రితమే రూ.3,375కోట్ల అంచనాల వ్యయంతో పనులు చేపట్టి పూర్తి చేశారు. కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి ఏటా 10టీఎంసీల నీటిని హైద్రాబాద్కు తరలిస్తున్నారు. అయినా మహానగర దాహార్తికి తిప్పలు తప్పడం లేదు. క్రమంలోనే మల్లన్నసాగర్ మంచినీటి పథకానికి ఇటీవల రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. మల్లన్నసాగర్ మంచినీటి పథకానికి సంబంధించిన పనులు గజ్వేల్ ప్రాంతంలో పాతూరు కూరగాయల మార్కెట్ పక్కన కొన్ని రోజుల కిందట ప్రారంభమయ్యాయి. గతంలో ఉన్న ఎల్లంపల్లి పైప్లైన్కు సమాంతరంగా ఈ పనులు చేపడుతున్నారు. -
సోమవారం శ్రీ 22 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
కోహీర్లో చలిమంట కాచుకుంటున్న ప్రజలుపల్లెకు పట్టాభిషేకంనేడు కొలువుదీరనున్న కొత్త పాలకవర్గాలు దుబ్బాకటౌన్/చిన్నకోడూరు(సిద్దిపేట): కొత్త పాలకవర్గాలు కొలువు దీరేందుకు పంచాయతీలు ముస్తాబయ్యాయి. సోమవారం జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ భవనాలను అందంగా తీర్చిదిద్దారు. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని గజ్వేల్, సిద్ధిపేట, హుస్నాబాద్ డివిజన్లలో 508 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో సర్పంచ్, వార్డు సభ్యులకు ఎన్నికలు జరిగాయి. ప్రత్యేకాధికారుల పాలనకు తెర ప్రత్యేక అధికారుల పాలన ముగియనుంది. అలాగే 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల అయ్యేందుకు మార్గం సుగమం కానుంది. రెండేళ్లుగా గ్రామాలు ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగాయి. వారు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండకపోవడంతో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. పాలనా వ్యవహారాలు పంచాయతీ కార్యదర్శులకు భారంగా మారిందని ప్రచారం. గ్రామ పాలకులు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు ఆగిపోయాయి. వీధి దీపాలు, పారిశుద్ధ్య పనులు, చెత్త సేకరణ, తాగునీరు, ఇతర అవసరాలకు డబ్బు లేకపోవడంతో కార్యదర్శులు ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. వడ్డీలకు డబ్బు తెచ్చి జీపీలను నడిపించారని జోరుగా ప్రచారం సాగింది. వీటిలో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. కొత్త సర్పంచ్లు వస్తే అభివృద్ధి జరుగుతుందని ఆయా గ్రామాల ప్రజలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. అద్దె భవనాల్లో ఏర్పాట్లు.. చిన్నకోడూరు మండలంలోని కొన్ని గ్రామాల్లో పంచాయతీ భవన నిర్మాణాలు అసంపూర్తిగా ఉండటంతో అద్దె భవనాల్లో ఏర్పాట్లు చేశారు. కొన్ని గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న భవనాల్లో నూ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరిగాయి. ఈ క్రమంలో గ్రామాల్లో సందడి నెలకొంది. -
కాంగ్రెస్కు గాంధీపై ప్రేమ లేదు..
సిద్దిపేటజోన్: ‘రామరాజ్యం అనేది మహాత్మాగాంధీ కల, అది పీఎం నరేంద్రమోదీ ద్వారానే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ గాంధీ కలలను పట్టించుకోవడం లేదు, వారికి గాంధీ మీద ప్రేమ లేద’ని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఇటీవల గెలుపొందిన బీజేపీ సర్పంచ్. ఉప సర్పంచ్ల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..దేశంలో బీజేపీ మార్పు కోరుతోందన్నారు. కాంగ్రెస్ అనేక మాట లు చెప్పి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. భవిష్యత్తులో సిద్దిపేట జెడ్పీ పీఠం, మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగరాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
చేయిచేయి కలిపారు.. ‘మురుగు’ తరలించారు
● దశాబ్దాల పారిశుద్ధ్య సమస్యకు పరిష్కారం ● ఆదర్శంగా చౌదరిపల్లి వాసులు వర్గల్(గజ్వేల్): మురుగుకాలువ సదుపాయం లేక సతమతమయ్యారు. మురుగు దుర్గంధంతో తల్లడిల్లిపోయారు. పట్టించుకునేవారు లేరని ఆవేదన చెందారు. తలో పైసా పోగేసుకున్నారు. అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించుకున్నారు. దశాబ్దాలుగా వేధిస్తున్న పారిశుధ్య సమస్య పరిష్కరించుకున్నారు. గజ్వేల్–వర్గల్ రోడ్డు మార్గంలో వర్గల్ మండలం చౌదరిపల్లి చౌరస్తా ఉంది. మెయిన్రోడ్డు ఆనుకుని చాలా ఇళ్లు ఉంటాయి. ఆ ఇళ్ల నుంచి వృథానీరు వెళ్లేందుకు సైడ్ డ్రైయిన్లు (మురుగు కాలువలు) లేవు. ఇంట్లో నీరు ఇంటి ప్రాంగణంలోనే నిలిచిపోయి, వర్షకాలంలో వరదనీరు తోడై దుర్భర పరిస్థితి ఎదుర్కోవాల్సివచ్చేది. పలుమార్లు అధికారుల దృష్టికి తెచ్చినా, దశాబ్దాలు గడుస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఆ ఇళ్ల యజమానులు రూ. 40,000 దాకా పోగేశారు. పైపులు, ఛాంబర్లు తెప్పించారు. ఇళ్ల ముందు నుంచి చౌరస్తా వద్ద మెయిన్లైన్లోకి మురుగునీరు వెళ్లిపోయేలా అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించుకున్నారు. తమ సమస్య తామే పరిష్కరించుకుని ఆదర్శంగా నిలిచారు. అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాం చౌదరిపల్లి చౌరస్తాలో చాలా ఇళ్లకు మురుగు నీరు వెళ్లే మార్గం లేదు. వానపడితే ఇళ్లల్లోకి నీరు వస్తుండే. వాసన, దోమలతోని బాధలు పడ్డాం. ఎవరికీ చెప్పినా ప్రయోజనం లేకపోవడంతో డబ్బులు జమ చేసి రోడ్డు పక్కన అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాం. మురుగు బాధ నుంచి బయటపడ్డాం. – తుమ్మ వెంకటేశ్, చౌదరిపల్లి చౌరస్తా -
రాజీమార్గమే ఎంతో మేలు
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి ● జాతీయ లోక్ అదాలత్లో 2,420 కేసులు పరిష్కారంసిద్దిపేటకమాన్: రాజీయే రాజ మార్గమని లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి తెలిపారు. సిద్దిపేట కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో రాజీ మార్గం ద్వారా న్యాయమూర్తులు పలు కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకోవడం ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందని తెలిపారు. జాతీయ లోక్ అదాలత్లో 2,420కేసులు పరిష్కారమైనట్లు వీటిలో 45 సివిల్, 16 మోటారు ప్రమాద కేసుల్లో రూ.1,34,75,000 పరిష్కరించినట్లు తెలిపారు. 67బ్యాంకు పీఎల్సీ కేసుల్లో రూ.26,97,267 పరిష్కరించారన్నారు. లోక్ అదాలత్ సందర్భంగా పీవీ నరసింహారావు చారిటబుల్ ట్రస్ట్ డాక్టర్ సుధాకిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లడ్ డోనేషన్ క్యాంపులో 62యూనిట్ల రక్తాన్ని సేకరించారు. కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి సంతోష్కుమార్, న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు. -
దేవుడి కృపతో అందరూ బాగుండాలి
డీఈఓ శ్రీనివాస్రెడ్డి దుబ్బాక: కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి కృపతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని డీఈఓ శ్రీనివాస్రెడ్డి అన్నారు. తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన దుబ్బాక బాలాజీ ఆలయంలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ఆలయాన్ని సుందరంగా నిర్మించడం, స్వామి వారు భక్తుల కొంగుబంగారంగా విరజిల్లుతుండడం అద్భు తమని అన్నారు. ఆలయ చైర్మన్ వడ్లకొండ శ్రీధర్, బాధ్యులు చింత నాగేందర్ ఆధ్వర్యంలో డీఈఓతో పాటు ఎంఈఓ ప్రభుదాసును వేదపండితులు సన్మానించారు. తపస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక ప్రశాంత్నగర్(సిద్దిపేట): తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) జిల్లా నూతన అధ్యక్ష కార్యదర్శులను ఆదివారం జిల్లా కేంద్రంలో ఎన్నుకున్నారు. జిల్లా నూతన అధ్యక్షులుగా చిలుముల మురళీధర్, ప్రధాన కార్యదర్శిగా వంగ నర్సిరెడ్డి లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా దేశ్ భాస్కర్, హరిపురం రఘులు వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు చిలుముల మురళీధర్ మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధి, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తపస్ నిస్వార్థ సేవలు అందిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో మండలాల తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర మంత్రిని కలిసిన నాయకులు కోహెడరూరల్(హుస్నాబాద్): ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో గెలుపొందిన తీగలకుంటపల్లి సర్పంచ్ మ్యాక స్వర్ణలత, నాయకులు కేంద్ర మంత్రి బండి సంజ య్ కుమార్ను కలిశారు. కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఎంపీ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి పూర్తి సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. బీజేపీని బలోపేతం చేద్దాం ఎంపీ రఘునందన్రావు తొగుట(దుబ్బాక): గ్రామీణ ప్రాంతంలో బీజే పీని బలోపేతం చేద్దామని మెదక్ ఎంపీ రఘునందన్రావు కార్యకర్తలకు సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ బలపరిచిన సర్పంచ్, ఉప సర్పంచ్లను సిద్దిపేటలో ఆదివారం నిర్వహించిన కా ర్యక్రమంలో సన్మానించారు. ఎంపీ మాట్లా డు తూ వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీజే పీ సత్తాచాలన్నారు. కార్యక్రమంలో చందాపూ ర్ మాజీ సర్పంచ్ నర్సింహులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ అడ్వకేట్ జాయింట్ సెక్రటరీగా శివకుమార్ ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా ఎస్సీ, ఎస్టీ అడ్వకేట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా చారకొండ శివకుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తనకు అవకాశం ఇచ్చిన న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. -
అప్పులిచ్చినవారి వేధింపులు భరించలేక..
బెజ్జంకి (సిద్దిపేట): అప్పులిచ్చిన వారి వేధింపులు భరించలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని దాచారం గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీనివాస్, రేణుకలకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శ్రీహర్ష (33)కు మూడేళ్ల క్రితం రుక్మిణి (28)తో వివాహం జరిగింది. బెజ్జంకిలో వస్త్ర దుకాణం పెట్టుకుని అక్కడే జీవిస్తున్నారు. వీరికి కూతురు హరిప్రియ ఉంది. కాగా శ్రీహర్ష తన మిత్రుడి వద్ద డబ్బులు తీసుకుని, మరో మిత్రునికి ఇచ్చాడు. డబ్బులివ్వాలని అప్పుచి్చన వ్యక్తి మరో ముగ్గురితో కలిసి వేధిస్తుండగా, తీసుకున్న వ్యక్తి ఇవ్వడం లేదు. ఈ క్రమంలో వారి వేధింపులతో అవమానంగా భావించిన శ్రీహర్ష, భార్య, కూతురుతో కలిసి క్రిమిసంహారక మందు తాగారు. చిన్నారి రోదన విని సమీప వ్యక్తులు శ్రీహర్ష తండ్రికి సమాచారమందించారు. అతను వచ్చి ఇంటి తలుపులు తెరిచి వెళ్లేసరికి అప్పటికే రుక్మిణి మృతి చెందింది. శ్రీహర్ష, చిన్నారిని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం శ్రీహర్షను కరీంనగర్ ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కాగా చిన్నారి సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తమ చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. సంఘటనా స్థలాన్ని ఏసీపీ రవీందర్రెడ్డి, రూరల్ సీఐ శ్రీను, ఎస్ఐ సౌజన్య పరిశీలించారు. -
ధైర్యంగా పని చేయండి
● వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే ● అన్ని పనులు చేసుకుందాం ● మా సర్పంచులను తన ఖాతాలో వేసుకుంటున్న సీఎం ● ఎమ్మెల్యే హరీశ్రావు ఎద్దేవాసాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: బీఆర్ఎస్ సర్పంచులు ధైర్యంగా పనిచేయాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాలని చెప్పారు. బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులను సంగారెడ్డిలో శనివారం ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కేసులు పెట్టినా.. డబ్బులు పంచి గూండాయిజం చేసినా బీఆర్ఎస్ నాయకులు ధైర్యంగా ఎదుర్కొని సర్పంచులుగా విజయం సాధించారని చెప్పారు. మరో రెండేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమేనని, బీఆర్ఎస్ సర్పంచులు అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. సర్పంచులు ఐదేళ్లు పదవిలో ఉంటారని, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అన్ని గ్రామాల అభివృద్ధికి సంబంధించిన అన్ని పనులను తాను దగ్గరుండి చేయిస్తానని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేలకు లేని చెక్ పవర్ సర్పంచులకే ఉంటుందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పడైనా అధికార పార్టీ 90 శాతం స్థానాలను గెలుచుకుటుందని, కానీ ఈ సర్పంచ్ ఎన్నికల్లో 40 శాతానికి మించి సుమారు నాలుగు వేల సర్పంచ్ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుందని హరీశ్ చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి బీఆర్ఎస్ సర్పంచులను కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ సీఎం కావాలని ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. సర్పంచులు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని, కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా సర్పంచుల ఖాతాల్లో జమ అవుతాయని పేర్కొన్నారు. కొత్త సర్పంచులకు అవగాహన కార్యక్రమాలు కొత్తగా సర్పంచులుగా ఎన్నికై న వారికి అవగాహన కల్పించేందుకు పార్టీ ఆధ్వర్యంలో త్వరలో సర్పంచులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామని ప్రకటించారు. సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన వారికి భవిష్యత్ ఉంటుందని, గెలిచిన వారికి బాధ్యత ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఆ పార్టీ నాయకులు కాసాల బుచ్చిరెడ్డి, విజయేందర్రెడ్డి, డాక్టర్ శ్రీహరి, పట్నం మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. -
432 కేసుల ఉల్లంఘన
సిద్దిపేటకమాన్: జిల్లాలో మూడు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి పోలింగ్, కౌంటింగ్ ముగిసే వరకు పటిష్ట పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా ఇటీవల నూతన పోలీసు కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన విజయ్కుమార్ తన మార్క్ చాటుకున్నారు. సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీ చేసిన అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన, మద్యం పంపిణీని అడ్డుకుని పోలీసులు కేసులు నమోదు చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టేలా ఎవరు చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చర్యలు తీసుకున్నారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ నెల 17న మూడవ విడత పోలింగ్, కౌంటింగ్ ముగిసే వరకు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జిల్లాలో మొత్తం 432 కేసులు నమోదు చేశారు. వీటిలో 271 మద్యం కేసులు నమోదయ్యాయి. రూ.37,89,530 విలువగల 5,181 లీటర్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉచితంగా వివిధ రకాల వస్తువులను పంపిణీ చేసేందుకు పలువురు ప్రయత్నించగా తనిఖీ బృందాలు పట్టుకుని 35 కేసులు నమోదు చేసి రూ.2,29,560 విలువగల వస్తువులను సీజ్ చేశారు. సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.30,36,620 నగదును పోలీసులు సీజ్ చేశారని తెలిపారు. అనుమతి లేని ర్యాలీలు నిర్వహించిన వారిపై 27కేసులు, బాణసంచా కాల్చడంపై 15కేసులు నమోదు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు జాగ్రత్తగా 2,729 మందిని అధికారుల ముందుగానే బైండోవర్ చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక పోలీసు నిఘా ఏర్పాటు చేశారు. -
‘ఉపాధి’ చట్టాన్ని కొనసాగించాలి
చేర్యాల(సిద్దిపేట): మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు వెంకట్మావో అన్నారు. ఈ సందర్భంగా శనివారం స్థానిక పాత బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారిపై నిరసన చేపట్టి వీబీ జీ రాం జీ పేరుతో ఉన్న ఉపాధి హామీ పథకం పత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీబీ జీ రాంజీ పేరుతో ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందన్నారు. రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా పని హక్కుగా ఉన్న పాత చట్టాన్ని మార్చి సాధారణ పథకంగా అమలు చేయాలని చూస్తుందన్నారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పేరుతో ఉన్న పథకం పేరు మార్చడం మహాత్ముడిని అవమానపర్చడమే అన్నారు. ఈ పథకం అమలు చేసేందుకు కేంద్రం ఇస్తున్న 90 శాతం నిధులను 60 శాతానికి తగ్గించి రాష్ట్రాలపై భారం మోపుతుందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు అరుణ్, నర్సిరెడ్డి, శ్రీహరి, శోభ, రాజు, మైసయ్య, రవీందర్, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు వెంకట్మావో -
మురుగుతో సతమతం
గుంతలమయంగా రోడ్డు గజ్వేల్ రూరల్: గజ్వేల్ మండలం బయ్యారం గ్రామ ప్రధాన రహదారి గుంతలమయం కావడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల రాత్రి సమయంలో పలువురు ద్విచక్ర వాహనదారులు అదుపు తప్పి కిందపడటంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. ఈ మార్గం గుండా వెళ్లాలంటే జంకుతున్నారు. రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. నిలిచిన జీపీ భవన నిర్మాణం అక్కన్నపేట: అక్కన్నపేట మండలం కన్నారం గ్రామ పంచాయతీ భవన నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. మూడేళ్ల క్రితం నిర్మాణ పనులు ప్రారంభించారు. అది ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో శిథిలావస్థలో ఉన్న భవనంలోనే పాలన కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భవనం ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. తొగుట: తొగుట మండల కేంద్రంలో పలు కాలనీల్లో మురుగు కాలువలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొన్నేళ్లుగా మురుగు కాలువల నిర్మాణం చేపట్టకపోవడంతో ఇళ్ల ముందే గుంతలు తవ్వి మురుగు నీటిని పంపిస్తున్నారు. దీంతో దోమలతో సతమతం అవుతున్నారు. ఎన్నికల సమయంలో డ్రైనేజీ కాలువల నిర్మాణం చేస్తామని ఇప్పటివరకు పూర్తి చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
పీఏసీఎస్లకు పర్సన్ ఇన్చార్జిలు
సాక్షి, సిద్దిపేట: ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ (పీఏసీఎస్) ప్రస్తుత పాలకవర్గాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంత వరకు పర్సన్ ఇన్చార్జీలుగా కొనసాగనున్నారు. పీఏసీఎస్ పాలకవర్గాల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరి 14న ముగిసింది. వాటినే పర్సన్ ఇన్చార్జి మేనేజింగ్ కమిటీలుగా ఆరు నెలలు పాటు కొనసాగించేందుకు ఉత్తర్వులు ఇచ్చింది. ఆ గడువు ముగిసిన తర్వాత ఆగస్టు 14న నిరవధికంగా పొడిగింపు ఇచ్చింది. తాజాగా శుక్రవారం వాటిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాలో ఉన్న 21 పీఏసీఎస్లకు పర్సన్ ఇన్చార్జిలను జిల్లా సహకార అధికారి వరలక్ష్మి నియమించారు. కొండపాక పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జిగా డీసీఏవో నాగేశ్వర్ రావు, చేర్యాల, రేబర్తికి అసిస్టెంట్ రిజిస్ట్రార్ సతీశ్ రెడ్డి, ములుగు, వర్గల్లకు శ్రీనివాస్ రెడ్డి, హుస్నాబాద్, కట్కూర్లకు గౌతమ్, సిద్దిపేట, గంగాపూర్కు అమృతసేనారెడ్డి, దుబ్బాక, మిరుదొడ్డిలకు రాజశేఖర వర్మ, గజ్వేల్, జగదేవ్పూర్లకు రఘోత్తమ్రెడ్డి, కోహెడ, బెజ్జంకిలకు రాజమౌళి, పాలమాకుల, నంగునూరులకు సీనియర్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ రెడ్డి, దౌల్తాబాద్, కానుగల్కు రవి, మిట్టపల్లి, అల్లీపూర్లకు యాదగిరి నియమితులయ్యారు. శనివారం వీరంతా బాధ్యతలు స్వీకరించారు.బాధ్యతల స్వీకరణ -
మెలకువలతో మెరవాలి
సిద్దిపేటరూరల్: నాసిక్ క్షేత్ర పర్యటనలో భాగంగా మహిళలు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ మెలకువలను నేర్చుకొని ఆర్థిక పురోగతి సాధించాలని కలెక్టర్ కె.హైమావతి కోరారు. శనివారం కలెక్టరేట్ నుంచి మహారాష్ట్రలోని నాసిక్లో గల సయ్యాద్రి ఫామ్స్లను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు మూడు రోజుల పాటు పర్యటించనున్న మహిళా సంఘాల సభ్యుల బృందం వాహనాన్ని కలెక్టర్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయ మార్కెటింగ్ రంగంలో స్వయం సహాయక మహిళా సంఘాలను ప్రోత్సహించడం, టెక్నాలజీ పరిశీలన కోసం జిల్లా సమాఖ్య, మండల మహిళా సమాఖ్య అధ్యక్షులు మొత్తం 25 మంది పంపుతున్నట్లు పేర్కొన్నారు. ఆర్థికంగా ఎదగడం కోసం ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, ఎల్డీఎం హరిబాబు, అదనపు డీఆర్డీఓ సుధీర్ బాబు, డీపీఎం వాసుదేవ్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రేణుక తదితరులు పాల్గొన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా అధికారులు రోడ్డు భద్రత నిబంధనలపై విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ కె.హైమావతి అన్నారు. శనివారం పోలీస్, రవాణా, ఆర్టీసీ, రోడ్లు భవనాలు, నేషనల్ హైవే, విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. జనవరి 1 నుండి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా వాహనదారులకు, డ్రైవర్లకు, విద్యార్థులకు సాధారణ ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సమవేశంలో అదనపు డీసీపీ కుశాల్కర్, ఏసీపీలు, జిల్లా వైద్యాధికారి డాక్టర్. ధనరాజ్, సిద్దిపేట ఆర్టీసీ డిపో మేనేజర్ భవభూతి, రవాణా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. వచ్చే సోమవారం నుంచి యథావిధిగా కార్యక్రమం ఉంటుందన్నారు. -
పల్లె ప్రగతి మారేనా..!
సాక్షి, సిద్దిపేట: నూతనంగా ఎన్నికై న సర్పంచ్లకు పల్లెల్లో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. దాదాపు రెండేళ్లుగా పాలకవర్గాలు లేకపోవడంతో ప్రతి పంచాయతీలో సమస్యలు తిష్టవేశాయి. రోడ్లు, డ్రైనేజీలు, పారిశుద్ధ్య లోపం, నీటి సరఫరాలో అంతరాయం, పాఠశాలలు, అంగన్వాడీలకు ప్రహరీ లేకపోవడం, వీధిలైట్లు... ఇలా అనేక సమస్యలు సవాల్గా మారాయి. పన్నుల ద్వారా సమకూరే ఆదాయం కేవలం సిబ్బంది జీత భత్యాలు, ట్రాక్టర్ ఈఎంఐలు, ఇతర పారిశుద్ధ్య నిర్వహణకే సరిపోవడం లేదు. పలుచోట్ల పంచాయతీ కార్యదర్శులు సొంత డబ్బులు ఖర్చు చేశారు. జిల్లాలోని 508 సర్పంచ్లు, 4,508 వార్డులకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. కొత్తగా ఎన్నికై న సర్పంచ్లు సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. నూతన సర్పంచ్లకు సమస్యల స్వాగతం రెండేళ్ల తర్వాత పంచాయతీ పాలకవర్గాలు జిల్లాలో 508 జీపీలు, 4,508 వార్డులు రేపు బాధ్యతలు స్వీకరించనున్న సర్పంచ్లు -
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
గజ్వేల్రూరల్: జాతీయ స్థాయి నెట్బాల్ పోటీల్లో రాణించి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని గజ్వేల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతిర్మయి అన్నారు. పట్టణంలోని బాలికల ఎడ్యుకేషన్ హబ్లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఎంఎల్టీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వాసాల వైష్ణవి ఎంపికయింది. ఈ నెల 25 నుంచి 30 వరకు కర్ణాటకలోని మంగుళూరులో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్–19 బాలికల విభాగంలో జాతీయస్థాయి నెట్బాల్ పోటీల్లో ఆడానుంది. ఈ సందర్భంగా వైష్ణవితో పాటు కళాశాల పీడీ సమ్మయ్యలను డీఐఈఓ రవీందర్రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ జ్యోతిర్మయిలు అభినందించారు. -
విద్యాధరికి లక్ష పుష్పార్చన
వైభవంగా మూల మహోత్సవం వర్గల్(గజ్వేల్): చదువుల తల్లి నెలవు వర్గల్ శ్రీవిద్యా సరస్వతి క్షేత్రం శనివారం మూల మహోత్సవ వేడుకలతో అలరారింది. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖరసిద్ధాంతి పర్యవేక్షణలో అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం చేశారు. పట్టువస్త్రాలు, పూలమాలికలు, సకలాభరణాలతో కమనీయంగా అలంకరించారు. లక్ష పుష్పార్చన, లలితాపారాయణం, సప్తశతీ పారాయణం, చండీహోమం నిర్వహించారు. పూజలు, కుంకుమార్చన జరిపారు. వేడుకలో భక్తులు పాల్గొని తరించారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఖైదీలు సత్ప్రవర్తనతో ఉండాలి న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సంతోష్కుమార్ సిద్దిపేటకమాన్: ఖైదీలు సత్ప్రవర్తనతో ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సంతోష్కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా జైలును శనివారం ఆయన సందర్శించారు. ఖైదీల వంట గది, స్టోర్ రూమ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖైదీలందరికీ న్యాయవాదులు ఉండాలని తెలిపారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ వారానికి మూడు సార్లు జైలును సందర్శిస్తారని, అడ్వకేట్స్ లేనివారికి న్యాయ సహాయం అందజేస్తారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలోనే గ్రామాల అభివృద్ధి నిజాంపేట(మెదక్): బీఆర్ఎస్ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని దుబ్బాక ఎ మ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఈమేరకు శనివారం మండల పరిధిలోని కల్వకుంట పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యేను ఆయన స్వగృహంలో కలిశారు. ఈసందర్భంగా వారిని సన్మానించారు. అనంతరం ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి కేసీఆర్ చాలా కృషి చేశారని తెలిపారు. ప్రస్తుత పాలక గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ అందె కొండల్రెడ్డి, వార్డు సభ్యులు మహిపాల్, తిరుపతి, భవాని, పద్మ, రేణుక, శ్యామల, శ్రీనివాస్గౌడ్, రాజు, నాగరాజుగౌడ్, భారతమ్మ, కనకరాజు, సుల్తానా తదితరులు పాల్గొన్నారు. పోటీ పరీక్షలతో విద్యార్థులకు మేలు టీఎంఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రావు -
పరీక్షలకు ఏర్పాట్లు చేయండి
సిద్దిపేటరూరల్: వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరిగే పోటీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. యూజీసీ నెట్, జేఈఈ తదితర ఆన్లైన్ పరీక్షల నేపథ్యంలో శుక్రవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మార్గదర్శకాల ప్రకారం సెంటర్లను ఎంపిక చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరా, పవర్ సప్లై, నీటి వసతి, ఫర్నిచర్, టాయిలెట్స్, కంప్యూటర్లు, నెట్ సౌకర్యం ఇతరత్రా అన్ని సౌకర్యాలు చెక్ చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశం లో డీఈఓ శ్రీనివాస్రెడ్డి, ఏఓ రాజ్ కుమార్, కేవీ ప్రిన్సిపాల్ సూర్య ప్రకాష్, నవోదయ స్కూల్ ప్రిన్సిపాల్ రాజేందర్, పోలీస్, ఎన్ఐిసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రణాళిక ఏర్పాటు చేయండి జిల్లాలో ఎలాంటి విపత్తులు జరిగినా వెంటనే స్పందించడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం విపత్తుల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో విపత్తు నిర్వహణ శాఖ ఎప్పటికప్పుడు వివరాలను అప్డేట్ చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు వారి వద్ద ఉన్న వివరాలను విపత్తు శాఖకు అందించాలన్నారు. ఎక్కడ ఎలాంటి విపత్తు జరిగినా వెంటనే స్పందించాలన్నారు. ఈ కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, అదనపు డీసీసీ సుభాష్చంద్రబోస్, డీఆర్ఓ నాగరాజమ్మ, ఆర్డీఓలు సదానందం, చంద్రకళ, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ హైమావతి అధికారులతో కలెక్టర్ సమావేశం -
హరీశ్రావు సమక్షంలో చేరికలు
గజ్వేల్: మండల పరిధి కొడకండ్ల గ్రామంలో కాంగ్రెస్కు చెందిన యువకులు శుక్రవారం మాజీ మంత్రి హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. హరీశ్రావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు పండరి రవీందర్రావు, గజ్వేల్ మండల శాఖ అధ్యక్షులు బెండె మధు తదితరులు పాల్గొన్నారు. కాగా ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందిన బీఆర్ఎస్ నాయకుడు శేక్భాస్కర్ కుటుంబీకులను హరీశ్రావు కోమటిబండ గ్రామంలో పరామర్శించారు. -
దరఖాస్తుల ఆహ్వానం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకానికి (సీఎంఓఎస్ఎస్) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి నాగరాజమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విదేశీ విశ్వవిద్యాలయాల్లో పీజీ, డాక్టోరల్ కోర్సు విద్యను అభ్యసిస్తున్న మైనార్టీ విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఆసక్తి కల్గిన అభ్యర్థులు జనవరి 19 సాయంత్రం 5గంటల లోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జాన్ విల్సన్ ఆదర్శనీయుడుఏసీపీ సదానందం హుస్నాబాద్: పోలీస్ విధి నిర్వహణలో నక్సలైట్లు పేల్చిన మందుపాతరకు ప్రాణాలు కోల్పోయిన ఎస్సై జాన్ విల్సన్ను పోలీసులు ఆదర్శంగా తీసుకోవాలని ఏసీపీ సదానందం అన్నారు. శుక్రవారం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై జాన్ విల్సన్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ సదానందం మాట్లాడుతూ 34 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో నక్సల్స్ ప్రభావం అధికంగా ఉండేదన్నారు. అలాంటి పరిస్థితిలో జాన్ విల్సన్ మందుపాతరకు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఈ ప్రాంత ప్రజల మనస్సులో జాన్ విల్సన్ చిరస్థాయిగా నిలువడం పోలీస్ శాఖకే గర్వకారణమన్నారు. కార్యక్రమంలో ఎస్సై లక్ష్మారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, జాన్ విల్సన్ ట్రస్ట్ చైర్మన్ బోయిని ఎల్లయ్య, పోలీస్ సిబ్బంది, ప్రముఖులు పాల్గొన్నారు. స్వచ్ఛ పథకానికి జెడ్పీ బాలుర పాఠశాల దుబ్బాకటౌన్: దౌల్తాబాద్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల స్వచ్ఛ విద్యాలయ పథకానికి ఎంపిక కావడం అభినందనీయమని మండల విద్యాధికారి కనకరాజు అన్నారు. స్వచ్ఛ విద్యాలయ పరిశీలనలో భాగంగా రాష్ట్ర బృందం పాఠశాలను పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల మౌలిక వసతులు, పరిశుభ్రతను స్వచ్ఛ విద్యాలయ పథకంలోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారని చెప్పారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు. ప్రజల ఆదరణ మరువలేనిదిఉమ్మడి జిల్లా డీసీసీబీ డైరెక్టర్ అంజిరెడ్డి ములుగు(గజ్వేల్): బీఆర్ఎస్ పార్టీపై ప్రజల ఆదరణ మరువలేనిదని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్, ములుగు పీఏసీఎస్ చైర్మన్ బట్టు అంజిరెడ్డి అన్నారు. నూతన సర్పంచ్ తిగుళ్ల కనుకయ్య, ఉపసర్పంచ్ కర్ణాకర్రెడ్డి, వార్డు సభ్యులను శుక్రవారం ఆయన అభినందించి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ములుగు ప్రజలు మూడవసారి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి పట్టం కట్టడం అభినందనీయమన్నారు. ప్రజల నమ్మకాన్ని కాదనకుండా నూతన సర్పంచ్లు అభివృద్ది, సంక్షేమ పథకాలను చేపట్టి ఆదర్శంగా నిలవాలని సూచించారు. 23న క్రాస్ కంట్రీ ఎంపిక పోటీలుసిద్దిపేటజోన్: స్థానిక స్టేడియంలో ఈనెల 23న జిల్లా క్రాస్ కంట్రీ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పరమేశ్వర్, కార్యదర్శి వెంకట్ స్వామి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈనెల 22 సాయంత్రంలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. పురుషులకు 10కిలోమీటర్లు, మహిళలకు 8 కిలోమీటర్లు, అండర్ 20 బాలురకు 8కిలోమీటర్లు, అండర్ 18 బాలురకు 6 కిలోమీటరు పరుగు పోటీలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. -
డాక్టర్లు ఉండరు.. మందులు ఉండవు
సిద్దిపేటకమాన్: పట్టణంలో ఉన్న నాలుగు బస్తీ దవాఖానాల్లో మూడింటిలో డాక్టర్లు లేరని.. డాక్టర్ కుర్చీకి దుమ్ము పట్టిందని.. బస్తీ దవాఖానాలకే సుస్తి తెచ్చిన ప్రభుత్వమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఫైర్ అయ్యారు. పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ వద్ద గల బస్తీ దవాఖానను హరీశ్రావు శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. విధుల్లో ఉన్న స్టాఫ్ నర్సుతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో కేసీఆర్నగర్, కాళ్లకుంట కాలనీ, లింగారెడ్డిపల్లి, ఆర్అండ్బీ కార్యాలయం వద్ద నాల్గు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామన్నారు. మూడు బస్తీ దవాఖానాల్లో ఆరు నెలలుగా డాక్టర్లు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ ఆఫీసర్ రూమ్ పెచ్చులు ఊడిపోయి, డాక్టర్ కుర్చీ దుమ్ము పట్టి ఉండటంపై ఇదేనా బస్తీ దవాఖాన తీరని, డాక్టర్ లేకుండా వైద్యం ఎలా అందిస్తారని ప్రశ్నించారు. జలుబు, షుగర్, విరేచనాలకు సంబంధించిన మాత్రలు సైతం లేవన్నారు. ప్రజా వైద్యంపై నిర్లక్ష్యం వీడాలని, వెంటనే బస్తీ దవాఖానలో వైద్యులను ఏర్పా టు చేసి సకాలంలో మందులు అందుబాటులో ఉంచాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. బస్తీ దవాఖానాలకే సుస్తి తెచ్చిన సర్కార్ మాజీ మంత్రి హరీశ్రావు ఫైర్ -
వెల్నెస్ సేవలు విస్తృతం
సిద్దిపేటకమాన్: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులకు వైద్య సేవలందించే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్ సేవలు మరింత విస్తృతం అయ్యాయి. సిద్దిపేట పట్టణంలోని పాత ఎంసీహెచ్ భవనంలో వెల్నెస్ సెంటర్ కొనసాగుతోంది. జర్నలిస్టులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ సెంటర్ ద్వారా వైద్య సేవలు అందుతున్నాయి. ప్రస్తుతం అందుతున్న జనరల్ మెడిసిన్, డెంటల్, ఫిజియోథెరపీతో పాటు గైనకాలజీ, ఆర్థోపెడిక్, డెర్మటాలజీ, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, సైకియాట్రీ విభాగాల్లో వైద్య సేవలు అందనున్నాయి. ఇక నుంచి వెల్నెస్ సెంటర్కు సిద్దిపేట ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ నోడల్ ఆఫీసర్గా వ్యవహరించడంతో ప్రభుత్వాస్పత్రి పర్యవేక్షణలో కొనసాగనుంది. అదేవిధంగా వెల్నెస్లో గైనకాలజీ, డెర్మటాలజీ, ఆప్తమాలజీ, ఈఎన్టీ, ఆర్థోపెడిక్, సైకియాట్రి విభాగాల్లో రోజు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయి. అన్ని రకాల మందులు ఉచితంగా అందుబాటులో ఉండేలా చూడాలని, మెరుగైన వైద్య సేవలందించాలని, సిబ్బంది సమయ పాలన పాటించాలని వెల్నెస్ సెంటర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో నోడల్ ఆఫీసర్ డాక్టర్ సంగీత తెలిపారు. కార్యక్రమంలో సీఎస్ ఆర్ఎంఓ డాక్టర్ జ్యోతి, డాక్టర్ సురేష్బాబు, డాక్టర్ చందర్, డాక్టర్ సదానందం, వెల్నెస్ సెంటర్ ఇన్చార్జి ప్రసాద్గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు. ఎనిమిది విభాగాల్లో ఓపీ వైద్య సేవలు నోడల్ ఆఫీసర్గా ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంగీత -
అగ్ని ప్రమాదాల నియంత్రణ అందరి బాధ్యత
ములుగు(గజ్వేల్): అగ్ని ప్రమాదాల నియంత్రణ అందరి బాధ్యత అని ములుగు అటవీ కళాశాల, పరిశోధన సంస్థ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్.ఎన్ఎస్ శ్రీనిధి అన్నారు. కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో శుక్రవారం గజ్వేల్ అగ్నిమాపక కేంద్ర సిబ్బందిచే అగ్ని ప్రమాద నియంత్రణ పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ఆందోళనకు గురికాకుండా ఎలా ఎదుర్కోవాలనేది అవగాహన ఉన్నట్లయితే వాటి నుంచి తప్పించుకోవచ్చని వివరించారు. అవగాహన కార్యక్రమాలతో అగ్ని ప్రమాదాలు కొంత మేరకై నా నియంత్రించవచ్చని తెలిపారు. అగ్ని ప్రమాదాల నివారణ,అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగత్త్రలు, అగ్నిమాపక పరికరాల సురక్షిత వినియోగం, చిన్నపాటి అగ్ని ప్రమాదాలను ప్రారంభ దశలో ఎలా నియంత్రించాలి? అనే అంశాలపై గజ్వేల్ అగ్నిమాపక సిబ్బంది ప్రత్యక్షంగా ఇచ్చిన ప్రదర్శనలు ఎన్ఎస్ఎస్ వలంటీర్లకు, విద్యార్థులకు అవగాహన పెంపొందింపజేశాయి. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.ములుగు అటవీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనిధి -
ఒలింపియాడ్కు అర్హత సాధించిన విద్యార్థులు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఇండియన్ నేషనల్ మ్యాఽథమెటిక్స్ ఒలింపియాడ్ పరీక్షకు జిల్లాకు చెందిన అంకం రిషిక్తేజ్, బత్తుల శ్రీనయనలు అర్హత సాధించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్రెడ్డిలు ఒలింపియాడ్కు ఎంపికై న విద్యార్థులను అభినందించారు. ఒలింపియాడ్ పరీక్షకు అర్హత సాధించిన విద్యార్థులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో టెన్త్ చదువుతున్నారు. -
సిద్దిపేట.. ఇక కాంగ్రెస్ కోట
సిద్దిపేటఅర్బన్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా ఎగురవేసి సిద్దిపేటను కాంగ్రెస్ కంచుకోటగా మారుస్తామని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ అన్నారు. శుక్రవారం సిద్దిపేటలో ఎన్సాన్పల్లి సర్పంచ్గా పోటీ చేసిన బాలరాజ్ కృష్ణమూర్తితో పాటు ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిద్దిపేటలో బీఆర్ఎస్ను కనుమరుగు చేస్తామన్నారు. ప్రజలు బీఆర్ఎస్పై, హరీశ్రావుపై విశ్వాసం కోల్పోయారన్నారు. ఇక నుంచి సిద్దిపేటపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని, వాటి ఫలాలను ప్రజలకు అందేలా చూడాలని నియోజకవర్గ ఇన్ఛార్జి పూజల హరికృష్ణకు మంత్రి సూచించారు. కార్యక్రమంలో డీసీసీ మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, అర్బన్ మండల అధ్యక్షుడు భిక్షపతి, గ్రామ శాఖ అధ్యక్షుడు కట్కూరి సత్యనారాయణ, ఉప సర్పంచ్ సంతోష్రెడ్డి, వార్డు సభ్యులు కనకరాజు, కరుణాకర్, గిరి, సతీష్, కంది ప్రభాకర్రెడ్డి తదితరులు ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జెండా ఎగురవేస్తాం ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ ఎన్సాన్పల్లిలో పార్టీలోకి భారీగా చేరికలు -
‘జీ రామ్ జీ’ బిల్లును రద్దు చేయాల్సిందే
గజ్వేల్రూరల్: గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధిని కల్పించేందుకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరిట తీసుకువచ్చిన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడం సరికాదని సీపీఎం నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా శుక్రవారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద వీబీ జీ రామ్ జీ బిల్లు ప్రతులను దహనం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎల్లయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రజల ఉపాధిని దెబ్బతీసే విధంగా వీబీ జీ రామ్ జీ (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజివిక మిషన్) ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు సరైంది కాదని మండిపడ్డారు. కార్యక్రమంలో నాయకులు బండ్ల స్వామి, ప్రవీణ్, రాజగోపాల్, నర్సింలు, రమేష్, శ్రీను, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. -
అందుబాటులో ఉండి సేవలందించండి
చేర్యాల(సిద్దిపేట): గెలుపొందిన సర్పంచులు, వార్డు సభ్యులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన నాలుగు మండలాల బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్, వార్డు సభ్యుల అభినందన సభలో ఆయన మాట్లాడుతూ ఓడి పోయిన వారు నిరుత్సాహపడొద్దన్నారు. ప్రజా సేవలో ఉన్నవారికి ఎప్పుడైనా అవకాశాలు వస్తాయని అన్నారు. ఎన్నికల్లో అధికార పార్టీ ఎన్ని అడ్డంకులు కలిగించినా ఎదుర్కొని నిలిచి గెలిచిన పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలను అభినందించారు. గెలిచిన సర్పంచ్, వార్డు సభ్యులకు శాలువాలు కప్పి సన్మానించారు. ప్రజలు కేసీఆర్ పాలన కావాలని కోరుతున్నారనడానికి ఈ ఫలితాలే నిదర్శనమన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి గెలుపొందిన సర్పంచ్లు, వార్డు సభ్యులకు సన్మానం -
చెక్ ‘పవర్’తోనే క్రేజ్..! పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవితో పాటు ఉపసర్పంచ్ పదవికి కూడా ఫుల్ డిమాండ్ ఏర్పడింది. వివరాలు 10లో u
శనివారం శ్రీ 20 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ఇంకా షాక్లోనే ఓడిన అభ్యర్థులుఒక్కొక్కరు రూ.20 లక్షల నుంచి రూ.60 లక్షలకుపైగా ఖర్చుపంచాయతీ ఎన్నికల పుణ్యామా.. వందలాది కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పోటీకోసం చేసిన ఖర్చు తడిసి మోపెడయ్యాయి. ఇప్పుడు అప్పులు తీర్చేదెలా? అని ఓటమి అభ్యర్థుల కుటుంబాల్లో తీవ్ర ఆంతర్మథనం నెలకొంది. ‘రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చాయని పోటీ చేస్తే.. తీరా ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేసినా.. గెలవకపోతిమి. ఉన్న ఆస్తులు, బంగారం పాయే.. అప్పుల కుప్పాయె’.. అంటూ చాలా కుటుంబాలు కుమిలిపోతున్నాయి. – దుబ్బాక పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తాకత్కు మించి ఖర్చు పెట్టినా ఫలితం లేకపోవడంతో దిక్కుతోచనిస్థితికి గురవుతున్నారు. ఉన్న ఆస్తులు పోయి అప్పుల పాలయ్యారు. చాలా మంది ఎన్నికల ఖర్చు కోసం తమ పొలాలు, ప్లాట్లు, ఇళ్లు, బంగారం కుదవపెట్టి(తాకట్టు) అప్పులు తీసుకున్నారు. మరికొందరైతే ఏకంగా ఆస్తులకు రిజిస్ట్రేషన్లే చేసి డబ్బులు తీసుకున్నారు. రూ.50 లక్షలకు పైగా విలువ ఉన్న ప్లాటును, పొలాన్ని కేవలం రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలోపే తీసుకొని సేల్డీడ్లు చేయించిన సంఘటనలు ఉన్నాయి. మరికొందరు తమకు నమ్మకం ఉన్న వారి దగ్గర, తమ బంధువుల వద్ద రూ.లక్షల్లో అప్పులు తెచ్చి ఖర్చు పెట్టారు. తీరా ఫలితాలు విరుద్ధంగా రావడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. పార్టీల నుంచి భరోసా అందక.. ఓడిపోయి నైరాశ్యంలో ఉన్న అభ్యర్థులకు వారివారి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, పెద్దల నుంచి పెద్దగా ధైర్యం, భరోసా కూడా లేకపోవడంతో ఇంకా ఆందోళనకు గురవుతున్నారు. పోటాపోటీగా ఖర్చు.. పట్టణాలకు దగ్గరగా ఉన్న గ్రామాలు, మండల కేంద్రాలు, రాజకీయంగా పలుకుబడి ఉన్న గ్రామాల్లో ఎలాగైన గెలవాలన్న పట్టుదలతో చాలా మంది అభ్యర్థులు పోటీపడి ఖర్చు చేశారు. చాలా మంది అభ్యర్థులు రూ.20లక్షల నుంచి రూ.50 లక్షలు, రూ.60 లక్షలు, రూ.70 లక్షలు ఇలా ఇంత కంటే ఎక్కువే ఖర్చుపెట్టి ఓడిపోవడం శోచనీయం. గెలిచిన వారి పరిస్థితీ అంతే! ఓడిపొయిన సర్పంచ్ల పరిస్థితియే కాదు రూ.లక్షలు పెట్టి గెలిచిన సర్పంచ్ల పరిస్థితి కూడాదయనీయంగానే తయారైంది. లక్షలు పెట్టి గెలిచాం.. ఈ అప్పులు ఎలా తీర్చాలో ఏం చేద్దామన్న ఆలోచనలతో చాల మంది గెలిచిన సర్పంచ్లు తలలు పట్టుకుంటున్నారు. ఏదైమెనా ఈ పంచాయతి ఎన్నికలు చాల కుటుంబాలను ఆర్ధికంగా, మానసికంగా కోలుకోలేకుండా చేశాయనే చెప్పవచ్చు.కుటుంబాల్లో కంటతడిగెలుస్తామన్న నమ్మకంతో ఉన్న ఆస్తులు తాకట్టు పెట్టి రూ.లక్షల్లో ఖర్చు పెట్టినా గెలవకపోవడంతో చాలా మంది ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థులు, వారి కుటుంబాలు ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నాయి. ‘పైసలు తీసుకుండ్రు.. తాగిండ్రు.. తిన్నరు.. మమ్మల్ని మోసం చేసిండ్రు.. ఈ అప్పులు ఎట్లా తీర్చాలో..’ అంటూ చాలా కుటుంబాలు కంటతడి పెడుతున్నాయి. బంధువులు వచ్చి ధైర్యం చెబుతూ ఓదారుస్తున్న పరిస్థితి చాలా గ్రామాల్లో కనబడుతోంది. గెలుపు కోసం భూములు, ప్లాట్లు, బంగారం తాకట్టు దిక్కుతోచని స్థితిలో ఓడిన అభ్యర్థుల కుటుంబాలు -
ఆయిల్పామ్ సాగు లక్ష్యం చేరాలి
● రైతులకు అవగాహన కల్పించాలి ● అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి ● కలెక్టర్ హైమావతి సిద్దిపేటరూరల్: జిల్లాలో ఆయిల్పామ్ సాగు లక్ష్యాన్ని సమన్వయంతో పూర్తి చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఉద్యాన శాఖ, ఆయిల్ ఫెడ్, మైక్రో ఇరిగేషన్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు 13,576 ఆయిల్ పామ్ మొక్కలు ప్లాంటేషన్ జరిగినట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాలో 6,500 ఎకరాల లక్ష్యానికి 1,536 ఎకరాల్లో మాత్రమే ప్లాంటేషన్ పూర్తి చేశారన్నారు. ఆశించిన స్థాయిలో సాగు లేదని అసహనం వ్యక్తం చేశారు. రబీ సీజన్కు సన్నద్ధమయ్యే లోపు ప్రతి రైతుని కలిసి ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పించాలన్నారు. ఈ వారం మొత్తం స్పెషల్ డ్రైవ్ గా తీసుకుని ప్రణాళిక ప్రకారం ప్రతి గ్రామంలో రైతులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. మీకు ఇచ్చిన టార్గెట్ తప్పనిసరిగా చేరుకోవాలన్నారు. విధుల్లో నిర్లక్ష్య వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. మెరుగైన వైద్యసేవలు అందించండి పీహెచ్సీకి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ హైమావతి వైద్య సిబ్బందికి సూచించారు. గురువారం నారాయణరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి, వైద్య సేవలను పరిశీలించారు. రికార్డులు చక్కగా నిర్వహించాలని, మొక్కుబడిగా రాస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. -
సర్పంచ్.. జాతీయ అథ్లెటిక్స్ క్రీడాకారుడు
హుస్నాబాద్రూరల్: గురుకుల పాఠశాలలో చదివిన వేల్పుల సంపత్ క్రీడల్లోనూ రాణించారు. అదే పట్టుదలతో గ్రామ సర్పంచ్గా పోటీచేసి గెలుపొందారు. హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ సర్పంచ్ వేల్పుల సంపత్ డిగ్రీ పూర్తి చేసి ఎస్బీఐ ఇన్సూరెన్స్లో పని చేస్తున్నారు. పాఠశాల దశ నుంచి అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్ జాతీయ క్రీడల్లో పాల్గొన్నారు. పలు రాష్ట్రాల్లో జరిగిన క్రీడల్లో పాల్గొని బహుమతులు పొందారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్గా పోటీ చేసి విజయం సాధించారు. క్రీడల్లో రాణించినట్లే పట్టుదలతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని సంపత్ తెలిపారు. విద్యావంతులు.. గ్రామ పాలకులు అక్కన్నపేట(హుస్నాబాద్): మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో విద్యావంతులు సర్పంచ్లుగా గెలిచారు. మండలంలోని మైసమ్మవాగుతండా సర్పంచ్గా గెలిచిన కృష్ణనాయక్ బీఈడీ, పీజీ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు. పెద్దతండా సర్పంచ్గా గెలిచిన గుగులోతు తిరుపతినాయక్ ఎంఏ, ఎంఈడీ, పీహెచ్డీ ఓయూలో చేశారు. సేవా లాల్ మహరాజ్తండా సర్పంచ్గా గెలిచిన జరుపుల సునీత డిగ్రీ చదివారు. ఈమె వయస్సు 22 ఏళ్లు. చిన్న వయస్సులో సర్పంచ్ కావడంతో తండావాసులు సంతోషం వ్యక్తం చేశారు. విద్యావంతులై ప్రథమ పౌరులుగా, ప్రజా సేవకు సిద్ధమవుతుండటంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నాడు భర్త.. నేడు భార్య కొమురవెల్లి(సిద్దిపేట): మొన్నటి వరకు భర్త సర్పంచ్గా ఉన్నారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో భార్య సర్పంచ్గా గెలిచారు. మండలంలోని రసులాబాద్ సర్పంచ్గా బీఆర్ఎస్ మద్దతుదారు పచ్చిమడ్ల స్వామి అనూష సర్పంచ్గా గెలుపొందారు. ఇప్పటి వరకు ఆమె భర్త పచ్చిమడ్ల స్వామి సర్పంచ్గా ఉండగా ఈసారి భార్యను పోటీలో ఉంచారు. స్వతంత్ర అభ్యర్థిపై 50 ఓట్లతో గెలుపొందారు. ఆకునూరు.. రవి జోరుచేర్యాల(సిద్దిపేట): మండల పరిధిలోని మేజర్ గ్రామ పంచాయతీ ఆకునూరులో అర్ధరాత్రి వరకు ఓట్ల లెక్కింపు కొనసాగింది. సర్పంచ్, 11 వార్డు స్థానాలకు జరిగిన ఎన్నికల పోలింగ్లో 3,592 ఓట్లు పోలయ్యాయి. భోజన విరామ అనంతరం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు అర్ధరాత్రి వరకు కొనసాగడంతో గెలుపుపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఓట్లు ఎక్కవ కావడం, బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటంతో లెక్కింపునకు సమయం పట్టినట్లు అధికారులు తెలిపారు. ఉత్కంఠ భరిత ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొమ్ము రవి 856 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సర్పంచ్ అభ్యర్థికి ఒక్కటే ఓటు చేర్యాల మండల పరిధిలోని శభాష్గూడెం సర్పంచ్గా బరిలో నిలిచిన దాసరి శ్రీశైలం అనే అభ్యర్థికి కేవలం ఒక్క ఓటు మాత్రమే వచ్చినట్లు అధికారులు ధ్రువీకరించారు. సర్పంచ్గా పోటీ చేయాలంటే అదే గ్రామానికి చెందిన ఒక ఓటరు బలపర్చాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ అభ్యర్థికి కేవలం ఒక్క ఓటే వచ్చింది. అంటే బలపర్చిన వ్యక్తి కూడా ఓటు వేయలేదా? అన్న చర్చ జరుగుతోంది. -
వికసించని కమలం
● జిల్లాలో 30 మంది సర్పంచ్లే గెలుపు ● ఇండిపెండెంట్లకు దక్కిన స్థానాల కంటే తక్కువే.. ● తీవ్ర నిరాశలో కార్యకర్తలు పల్లెల్లో కమలం వాడిపోయింది. ఇండిపెండెంట్లకు దక్కిన స్థానాలు సైతం గెలవలేక చతికిలపడింది. పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఇద్దరు బీజేపీ ఎంపీల పరిధిలో చాలా మండలాలు ఉన్నప్పటికీ ఉనికి చాటలేదు. ఎన్నికల ఫలితాలను చూస్తే పార్టీ పట్టుకోల్పోయిందన్న చర్చ జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా 5.90శాతం సీట్లు మాత్రమే బీజేపీ మద్దతుదారులు సర్పంచ్లుగా గెలుపొందారు. సంస్థాగతంగా గ్రామ స్థాయిలో బలోపేతం కావాలని ఉవ్విళ్లూరిన బీజేపీ సత్తా చాటడంలో విఫలమైంది. – సాక్షి, సిద్దిపేట‘స్థానిక’ ఎన్నికల్లో బీజేపీ డీలాజిల్లా వ్యాప్తంగా మూడు విడతల్లో 26 మండలాల్లోని 508 గ్రామ సర్పంచ్లకు ఎన్నికలు జరగాయి. కేవలం 30 సర్పంచ్ స్థానాలు మాత్రమే బీజేపీకి దక్కాయి. మొదటి విడతలో 10, రెండో విడతలో 13, మూడో విడతలో 7 సర్పంచ్ స్థానాలలో బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. ఈ మూడు విడతల్లో ఇండిపెండెంట్లు 52 మంది విజయం సాధించారు. ఇండిపెండెంట్లు గెలుపొందిన సంఖ్య సైతం బీజేపీకి దక్కలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. గ్రామ పంచాయతీ ఎన్నికలను జిల్లా నాయకత్వం, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదా? అన్న చర్చ జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉపాధి హామీ పథకంతో పాటు పలు పథకాలు కొనసాగుతున్నా.. వాటిని ప్రచారం చేయడంలో పార్టీ నేతలు విఫలమయ్యారని తెలుస్తోంది. పలు గ్రామ పంచాయతీల పరిధిలో బీజేపీ నేతలు ప్రచారం నిర్వహించినప్పటికీ ఓటమి చెందారు. సిద్దిపేట నియోజకవర్గంలో మూడు చోట్ల మాత్రమే బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. గెలుపొందిన సర్పంచ్ల సన్మాన కార్యక్రమాన్ని త్వరలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ‘ఎన్నికల సమయంలో పట్టించుకోలేదని.. ఇప్పుడు గెలుపొందిన తర్వాత మేము కావాల్సి వచ్చామా? అని పలువురు డుమ్మా కొట్టే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. వర్గపోరును కట్టడి చేస్తేనే.. పార్టీలో వర్గపోరును కట్టడి చేసి నేతలను ఏకం చేస్తే తప్ప క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కావడం కష్టమని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఒక వర్గం నేతలు జిల్లాలో జరిగే పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు. ఇప్పటికై నా అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించి అందరిని ఒక్కతాటి పైకి తీసుకవచ్చి పార్టీని ముందుకు తీసుకవెళ్లాలని కార్యకర్తలు కోరుతున్నారు. మెదక్, కరీంనగర్ ఎంపీలుగా రఘునందన్ రావు, బండి సంజయ్లు గెలుపొందడంతో పార్టీలో జోష్ కనిపించినా.. ప్రస్తుత సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో గెలుపొందకపొవడంతో కార్యకర్తల్లో నైరాశ్యం అలుముకుంది. రాబోయే కాలమంతా ఎన్నికల కాలం.. ఇలాంటి సమయంలో కేడర్ అంతా నిరుత్సాహంలో ఉంటే ఎలా అని కార్యకర్తలు అయోమయానికి గురవు తున్నారు. త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు జిల్లాలో జరగనున్నాయి. పరిస్థితి ఇలానే కొన సాగితే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రభావం పడే అవకాశాలున్నాయి. తొగుటలో ఖాతా తెరిచి..తొగుట(దుబ్బాక): మండలంలో ఎట్టకేలకు బీజేపీ ఖాతా తెరించింది. పంచాయతీ ఎన్నికల్లో మొదటి సారిగా ఆ పార్టీ నాయకులు సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి దిగారు. వరదరాజుపల్లిలో పార్టీ నాయకుడు ఎర్వ గోపాల్రెడ్డి సర్పంచ్గా విజయం సాధించారు. తొగుట, తుక్కాపూర్, లింగాపూర్, కాన్గల్, గుడికందుల, గోవర్ధనగిరి, వర్దరాజుపల్లి గ్రామాల్లో బీజేపీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థులు బరిలోకి దిగారు. గుడికందుల, లింగాపూర్, గోవర్ధనగిరిలో ప్రత్యర్థులకు గట్టి పోటీనిచ్చారు. రెండు చోట్ల ద్వితీయ స్థానంలో నిలవగా మిగతా చోట్ల గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపినట్లు మండలంలో చర్చజరుగుతోంది. తుక్కాపూర్లో బీజేపీ మండల అధ్యక్షుడు చిక్కుడు చంద్రం తన భార్యను రంగంలోకి దింపారు. కారణమేంటో తెలియదుగాని బరిలో నుంచి అర్ధంతరంగా తప్పుకున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ఖాతా తెరిచిన బీజేపీ త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఏమేరకు సత్తా చూపుతారో వేచిచూడాలి. -
పల్లె దశ మారేనా?
జిల్లాలోని 26 మండలాల్లో 508 పంచాయతీలు ఉన్నాయి. మొదటి విడతలో 163, రెండో విడతలో 182, మూడో విడతలో 163 పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. ఈనెల 22న కొత్త సర్పంచ్లు కొలువు దీరనున్నారు. ఈనేపథ్యంలో గ్రామాల్లో నెలకొన్న సమస్యలపైనే అందరి దృష్టి నెలకొంది. గత 2024 ఫిబ్రవరి నెలలో సర్పంచ్ల పదవీకాలం ముగిసింది. దీంతో 20 నెలలకుపైగా పంచాయతీలకు నిధులు నిలిచిపోయాయి. 15వ ఆర్థిక సంఘం, ఎఫ్ఎఫ్ఎసీ, ఉపాధిహామీ తదితర పథకాల అమలు ఆగిపోయింది. ఫలితంగా ఎన్నో సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోయాయి. ప్రత్యేకించి గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసింది. చాలా గ్రామాల్లో పంచాయతీలకు కేటాయించిన చెత్త సేకరణ ట్రాక్టర్లకు డీజీల్ పోయించుకోలేని దయనీయ పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి వల్ల పారిశుద్ధ్య నిర్వహణ గాలికొదిసినట్లయ్యింది. దాదాపు అన్ని చోట్ల పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేసి పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టారు. ఈ బిల్లులు అందక ఇప్పటికీ నానా తంటాలు పడుతున్నారు. వ్యాధుల విజృంభణ పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో గ్రామాల్లో వ్యాధుల వ్యాప్తి పెరిగిపోయింది. ఊర్లకు ఊళ్లు.. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ లాంటి భయంకరమైన జ్వరాలు బారిన పడ్డాయి. వందల సంఖ్యలో రోగులు మంచాన పడ్డారు. గత ఆగస్టు నెలలో జిల్లాలోని జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్లో ఇద్దరు, అనంతసాగర్లో ఒకరు డెంగీ బారిన పడి మృతి చెందడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ రెండు గ్రామాల్లోనే కాదు.. జిల్లాలోని అన్ని గ్రామాల్లో విష జ్వరాలు విజృంభించాయి. ఈ పరిస్థితి మార్చాల్సిన అధికారులు పంచాయతీ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు వేసి చేతులు దులుపుకొన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులపైనే.. పంచాయతీలకు మార్చిలోగా రెండేళ్ల 15వ ఆర్థిక సంఘం నిధులు రావాల్సి ఉన్నది. 20నెలలుగా సర్పంచ్ల ఎన్నికలు జరగకపోవడం ఈ నిధులు రాలేదు. 2026మార్చిలోగా ఈ నిధులను రాబట్టుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామాల జనాభా దామాషా ప్రకారం ఒక్కొక్కరికి రూ.900–1400చొప్పున నిధులు రానున్నాయి. కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తాయో.. అన్ని నిధులు రాష్ట్రం నుంచి కూడా రావాల్సి ఉంది. ఉదాహరణకు 3వేల జనాభా ఉన్న గ్రామాలకు కేంద్రం నుంచి రూ.27లక్షల వరకు నిధులు వచ్చే అవకాశం ఉంది. రెండేళ్ల నిధులు ఇస్తే.. ఇది రెట్టింపు అవుతుంది. ఈ లెక్కన గ్రామాలకు దండిగా నిధులు రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటాగా నిధులు విడుదల చేయడంతోపాటు ఎస్ఎఫ్సీ నిధులు కూడా ఇస్తే గ్రామాలకు మహర్దశ పట్టనుంది. ప్రభుత్వ సహకారం కీలకం గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాల సహకారమే కీలకం. గ్రామాల్లో ఎన్నో సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. సమస్యలు కొత్త సర్పంచ్లకు సవాలుగా మారాయి. ప్రభుత్వాలు నిధులు విడుదల చేసి ప్రజల ఇబ్బందులను తీర్చడానికి కృషి చేయాలని కోరుకుంటున్నాం. – ప్రభాకర్, ఆహ్మదీపూర్ సర్పంచ్, గజ్వేల్ మండలంపడకేసిన పారిశుద్ధ్యం పంచాయతీ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో.. ఇక అందరి దృష్టి గ్రామాల్లో నెలకొన్న సమస్యలపైనే కేంద్రీకృతమై ఉంది. ప్రత్యేకించి కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం ఎదురుచూపుల్లో ఉన్నారు. కొత్త సర్పంచ్లు కొలువుతీరిన వెంటనే వస్తే.. మేలు జరిగే అవకాశం ఉంది. –గజ్వేల్ -
‘ప్రజా పాలన’ను ఆశీర్వదించారు
సంక్షేమ పథకాలే కాంగ్రెస్ను గెలిపించాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్: ప్రజా పాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఆశీర్వదించారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం క్యాంప్ కార్యాలయంలో నూతన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులకు అభినందనలు తెలుపుతూ ఘనంగా సన్మానించారు. అంతకు ముందు ఉదయం కార్యకర్తలతో కలిసి బైక్ నడుపుతూ గల్లి గల్లి తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. అనంతరం క్యాంప్ కార్యాలయంలో సర్పంచ్లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో 171 సర్పంచ్ స్ధానాలకు ఎన్నికలు జరిగితే 108 మంది కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారన్నారు. మరో 11 మంది ఇండిపెండెంట్లు కాంగ్రెస్లోకి వస్తున్నారన్నారు. పార్టీ కార్యకర్తల కృషి వల్లే అత్యధిక స్ధానాల్లో గెలిచామన్నారు. నియోజకవర్గంలో 80 శాతం పైగా పోలింగ్ జరిగిన గ్రామాలకు అభినందనలు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రజాస్వామ్యం మీద విశ్వాసంతో పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలివచ్చారని తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి కల్పన, వ్యవసాయం, టూరిజం అన్ని రంగాల్లో అబివృద్ధి చేస్తామన్నారు. అనంతరం క్యాంప్ కార్యాలయంలో నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, అధికారులు పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధే లక్ష్యం కావాలి
● పూర్తి సహాయ సహకారాలు అందిస్తా ● నూతన సర్పంచ్లతో మంత్రి వివేక్ ప్రశాంత్నగర్(సిద్దిపేట): స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన దుబ్బాక, సిద్దిపేట అసెంబ్లీ పరిధిలోని సర్పంచ్, వార్డు మెంబర్లు మంత్రి వివేక్ను కలిశారు. గురువారం గాడిపల్లి రఘువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రిని హైదరాబాద్లో కలిసినట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మంద పాండు తెలిపారు. నూతన సర్పంచ్లు, వార్డు సభ్యులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని, అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారన్నారు. మంత్రిని కలిసిన వారిలో కాంగ్రెస్ నాయకులు సదాశివరెడ్డి, మంద వనజ, తదితరులు ఉన్నారన్నారు. -
పేదల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం
గజ్వేల్: పేదల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యమని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు. బుధవారం జగదేవ్పూర్ మండలం తీగుల్ గ్రామంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నర్సారెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నర్సారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంక్షేమ పథకాల అమలుపైనే ప్రత్యేక దృష్టి పెట్టారని కొనియాడారు. రుణమాఫీ, సన్నబియ్యం, ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ రాయితీ, 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ తదితర పథకాలతో గ్రామీణ సమాజంలో గొప్ప పరివర్తన వస్తోందని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్లో చేరుతు న్నారని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్రెడ్డి, కాంగ్రెస్ జగదేవ్పూర్ మండల శాఖ అధ్యక్షుడు రవీందర్రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ‘ఉపాధి’ని ఎత్తివేసేందుకు కుట్ర: సీఐటీయూగజ్వేల్: పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బండ్ల స్వామి మండిపడ్డారు. బుధవారం గజ్వేల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్రం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజివిక మిషన్ పేరుతో బిల్లును తీసుకువస్తున్నారని చెప్పారు. పథకాన్ని నీరుగార్చే ఉద్దేశంలో భాగంగానే ఈ బిల్లును తీసుకొస్తున్నారని ఆరోపించారు. వామపక్షాల పోరాటాల ఫలితంగా 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని తీసుకొచ్చిందని గుర్తుచేశారు. ఈ పథకం వల్ల నిరుపేద కూలీలకు భారీ ప్రయోజనం కలిగిందన్నారు. 2014నుంచి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ క్రమంగా ఈ పథకాన్ని నీరుగారుస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ఉపాధిహామీ బిల్లును మార్చే నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే పోరాటాలు తప్పవని హెచ్చరించారు. సీఎం దృష్టికి బీడీ కార్మికుల సమస్యలు దుబ్బాక: బీడీ కార్మికుల సమస్యలను సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తెలిపారు. బుధవారం తెలంగాణ ఆల్ బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు(ఐఎన్టీయూసీ) తుమ్మ శంకర్ ఆధ్వర్యంలో మైనంపల్లిని కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా బీడీ కార్మికుల సమస్యలను తెలుసుకున్న యన తప్పకుండా న్యాయం చేస్తామని హామీనిచ్చినట్లు శంకర్ తెలిపారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు. -
పోటెత్తి.. ఓటెత్తి
● 150 సర్పంచ్, 1,182 వార్డుల్లో ఎన్నికలు ● భారీగా తరలివచ్చి ఓటేసిన పల్లె వాసులు తుది విడత పోలింగ్ 88.45 శాతం నమోదుసాక్షి, సిద్దిపేట: జిల్లాలో పల్లె ఓటరు ఓటెత్తారు. తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బుధ వారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. జిల్లాలోని తొమ్మిది మండలాల్లో పోలింగ్ జరిగింది. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కొండపాక, కుకునూరుపల్లి, జనగామ నియోజకవర్గం పరిధిలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, దూల్మిట్ట, హుస్నాబాద్ పరిధిలో హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలల్లో ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవం అయిన సర్పంచ్ స్థానాలు13 మినహాయిస్తే 150 సర్పంచ్ పదవులకు, 574 అలాగే ఏకగ్రీంగా ఎన్నికై న 249 వార్డు సభ్యుల స్థానాలను మినహాయించి 1,182వార్డు స్థానాలకు 3,059 పోటీ చేశారు. తుది విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కుకునూరుపల్లిలో అత్యధికం మూడో(చివరి) విడతలో 88.45శాతం పోలింగ్ నమోదైంది. కుకునూరుపల్లి మండలంలో అత్యధికంగా 91.08 శాతం పోలింగ్ నమోదు కావడం గమనార్హం. అత్యల్పంగా చేర్యాలలో 86.87 శాతం ఓట్లు పోలయ్యాయి. పురుషులే అత్యధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. మూడు విడతల్లో ఓటు హక్కు వినియోగించుకోని ఓటర్లు మండలాల వారీగా.. అక్కన్నపేట 29,441(88.06 శాతం) చేర్యాల 28,911(86.87 శాతం) దూల్మిట్ట 11,975(89.70 శాతం) హుస్నాబాద్ 14,976(89.46 శాతం) కోహెడ 33,002(88.38 శాతం) కొమురవెల్లి 13,842(87.49 శాతం) కొండపాక 23,488(89.05 శాతం) కుకునూరుపల్లి 12,976(91.08 శాతం) మద్దూరు 15,642(88.24 శాతం)తొమ్మిది మండలాల్లో.. మొత్తం ఓటర్లు: 2,08,314 పురుషులు: 1,02,716 మహిళలు: 1,05,595 ఇతరులు: 03 ఓటు హక్కు వినియోగించుకున్న వారు పురుషులు 91,492 (89.07%) మహిళలు 92,759 (87.84%) ఇతరులు 02 మొత్తం 1,84,253 (88.45%) ఉదయం 9 గంటల వరకు పోలైన ఓట్లు: 50,727 (24.35%) ఉదయం 11 గంటల వరకు.. : 1,25,311 (60.15%) మధ్యాహ్నం 1 గంట వరకు.. : 1,80,692 (86.74%) పోలింగ్ ముగిసే సమయం వరకు: 1,84,253 (88.45%) -
ఫుల్లుగా తాగించారు
● ‘స్థానిక ’ ఎన్నికల్లో ఏరులై పారిన మద్యం ● జిల్లాలో రూ.69.95కోట్ల మద్యం అమ్మకాలు ● గత నెలతో పోలిస్తే ఈ నెలలో భారీగా విక్రయాలు సిద్దిపేటకమాన్: జిల్లాలో మూడు విడతల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మద్యం ఏరులై పారింది. సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీ చేసిన అభ్యర్థులు మద్యానికే భారీగా డబ్బు వెచ్చించినట్లు సమాచారం. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశారు. కుల, యువజన సంఘాలను ఏకం చేస్తూ వారికి పలు విధాలుగా హామీలు ఇచ్చారు. అభ్యర్థులు, వారి మద్దతుదారులు ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఓటర్లకు రోజూ బిర్యానీ, మద్యంతో దావత్లు ఏర్పాటు చేశారు. కొన్ని గ్రామాల్లో పోలింగ్కు రెండు రోజుల ముందు నుంచే ఓటర్లకు నగదు, మద్యం పంపిణీ చేశారు. కొన్నిచోట్ల అక్రమంగా నిల్వ ఉంచిన, రవాణా చేస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. పెరిగిన అమ్మకాలు జిల్లాలోని ఐదు ఎకై ్సజ్ పోలీసు స్టేషన్ల పరిధిలో 93 వైన్ షాపులు, 16 బార్ అండ్ రెస్టారెంట్ల ద్వారా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. నూతన మద్యం పాలసీ (2025–27) ప్రకారం ఇటీవల మద్యం దుకాణాలు దక్కించుకున్న వారు ఈ నెల 1వ తేదీ నుంచి అమ్మకాలు జరుపుతున్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైన్ షాపుల నుంచి 15రోజులుగా భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. ఇటీవల నూతన పోలీసు కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన విజయ్కుమార్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు. పోలీసు శాఖ కట్టడి చేసినప్పటికీ రకరకాల పద్ధతుల ద్వారా మద్యం సరఫరా చేశారు. జిల్లాలో గత నెల నవంబర్లో రూ.53.44కోట్ల విలువగల 68,682 కేసుల లిక్కర్, 84,037 కేసుల బీర్ల విక్రయాలు జరిగాయి. ఈ నెల డిసెంబర్లో ఇప్పటి వరకు రూ.69.95కోట్ల విలువగల 74,678 కేసుల లిక్కర్, 79,828 కేసుల బీర్లను విక్రయించారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు మద్యంపై భారీగా ఖర్చు చేసినట్లు పలువురు చర్చించుకుంటున్నారు. భారీగా మద్యం విక్రయాలు మద్యం దుకాణాల ద్వారా ఈ నెలలో భారీగా మద్యం విక్రయాలు జరిగాయి. నూతన షాప్లు కావడంతో ఈ నెలలో ఇప్పటి వరకు 74,678 కేసుల లిక్కర్, 79,828 కేసుల బీర్లు విక్రయించారు. మొత్తం రూ.69.95 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో చివరి వారంలో విక్రయాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. లైసెన్స్దారులు నిబంధనలకు అనుగుణంగా విక్రయాలు జరపాలి. – శ్రీనివాసమూర్తి, జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ -
ఓటర్లను తరలించిన అభ్యర్థులు
ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. చలిని సైతం లెక్క చేయకుండా ఓటు హక్కును వినియోగించుకున్నారు. వలసవెల్లిన పల్లె వాసులు తమ సొంత గ్రామానికి చేరుకుని ఓటు వేశారు. చాలా మంది ఓటర్లను సర్పంచ్, వార్డు అభ్యర్థులు తమ సొంత వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలించి ఓట్లు వేయించారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. ఒంటి గంటకు పోలింగ్ కేంద్రం గేటు తాళం వేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హైమావతి పర్యవేక్షించారు. -
ఓటుకు 74 వేల మంది దూరం
సాక్షి, సిద్దిపేట: ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ కీలకమే. ఆ ఒక్క ఓటే అభ్యర్థుల గెలుపోటములను శాసిస్తోంది. ఎంతో మంది అభ్యర్థుల తలరాతను మార్చి పదవులు వచ్చేలా చేయడంతో పాటు పరాజితులను సైతం చేసి ఇంటికి పరిమితం చేసేది ఓటే.. అలాంటిది జిల్లాలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలలో పల్లె ఓటర్లు 74,527 మంది ఓటుకు దూరంగా ఉన్నారు. ఈ నెల 11, 14, 17వ తేదీలలో సర్పంచ్, వార్డు సభ్యులకు ఎన్నికలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 88.30శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కును వినియోగించుకోవాలని చైతన్య కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ చాలా మందిలో మార్పు రాకపోవడం గమనార్హం. చాలా చోట్ల అభ్యర్థులే నేరుగా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించారు. 5,62,518 మంది ఓటేశారు.. జిల్లా వ్యాప్తంగా 508 సర్పంచ్లు, 4,508 వార్డు సభ్యులకు ఎన్నికల నామినేషన్లు స్వీకరించగా 39 సర్పంచ్ స్థానాలకు, 729 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 469 సర్పంచ్ స్థానాలకు 1,653 మంది, 3,779 వార్డులకు 9,835 మంది పోటీ చేశారు. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించిన సర్పంచ్, వార్డు లలో మొత్తం 6,37,045 ఓటర్లు ఉండగా అందులో 5,62,518 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషులే అధికం పల్లెల్లో జరిగిన ఎన్నికల్లో మహిళల కంటే పురుషులే అధికంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషులు 3,12,530 మంది ఓటర్లుండగా 2,78,265 (89.03 శాతం), మహిళలు 3,24,509 మంది ఓటర్లుండగా 2,84,250 (87.59 శాతం) మంది ఓటు వేశారు. జిల్లాలో అత్యధికంగా మూడో విడతలో జరిగిన కుకునూరుపల్లి మండలంలో 91.08శాతం మంది, అత్యల్పంగా మొదటి విడతలో జరిగిన జగదేవ్పూర్లో 84.27శాతం మంది ఓటు వేశారు. విడతల వారీగా ఇలా.. విడత పురుషులు మహిళలు ఇతరులు మొత్తం మొదటి 80,413 81,557 01 1,61,253 రెండో 1,06,360 1,09,934 0 2,16,294 మూడో 91,492 92,759 02 1,84,253ఓటరు జాబితా తప్పుల తడక మృతి చెందిన, డబుల్ ఓటర్ల పేర్లను గ్రామీణ ఓటరు జాబితాలో నుంచి తొలగించలేదు. క్షేత్రస్థాయిలో పరిశీలించి మృతిచెందిన ఓటర్లను ఓటరు జాబితా సవరణల సమయంలో బీఎల్ఓలు, పంచాయతీ కార్యదర్శులు తొలగించాలి. కానీ చేయలేదు. ఉదాహరణకు కొమురవెల్లి మండలం గౌరాయపల్లిలో 1,325 ఓటర్లు ఉండగా అందులో దాదాపు 110 వరకు ఓటర్లు మృతి చెందినవారి, డబుల్, ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ అయిన వారి పేర్లను తొలగించలేదు. దీంతో ఆ గ్రామంలో 74శాతం మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలింది. ఇప్పటికై నా చనిపోయిన ఓటర్లు, డబుల్ ఉన్న వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి ఓట్లును తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. -
అభివృద్ధికి ఐక్యంగా కృషి చేయండి
హుస్నాబాద్: నూతనంగా గెలిచిన సర్పంచ్లు గ్రామాల అభివృద్ధికి ఐక్యంగా కృషి చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం క్యాంప్ కార్యాలయంలో హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, సైదాపూర్ మండలాల్లో కాంగ్రెస్ మద్దతు దారులు సర్పంచ్లుగా గెలిచిన వారిని సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారన్నారు. నిరంతరం ప్రజా సమస్యలపై ప్రజలకు అండగా ఉన్న నాయకులకు పట్టం కట్టారన్నారు. -
అధికారుల బృందం సీఓఈ సందర్శన
ములుగు(గజ్వేల్): మండల కేంద్రంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీఓఈ), అచ్చాయిపల్లి ఏటీజీసీని ఉద్యానశాఖ జాయింట్ డైరెక్టర్ రామలక్ష్మి, ఆయా రాష్ట్రాలకు చెందిన ఉద్యాన అధికారుల బృందం మంగళవారం సందర్శించింది. ఈ సందర్భంగా వారు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో జరుగుతున్న వివిధ రకాల కూరగాయలు, నర్సరీల పెంపకం తీరును పరిశీలించారు. మొక్కల ఉత్పత్తి విధానంలో సాగుచేస్తున్న మామిడి, జామ, సీతాఫలం, నిమ్మలో పాటించాల్సిన మెలకువల గురించి జాయింట్ డైరెక్టర్ రామలక్ష్మి బృందానికి వివరించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి శ్రీధర్ పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధే లక్ష్యం కావాలి
ములుగు(గజ్వేల్): గ్రామాల అభివృద్ధికి నూతన సర్పంచ్లు కృషి చేయాలని డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సా రెడ్డి సూచించారు. ములుగు మండలం బండనర్సంపల్లిలో మొదటి విడత గ్రామపంచాయ తీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. సర్పంచ్ ఆర్ఆర్. లహరీశ్రీధర్రెడ్డి, ఉపసర్పంచ్ జహంగీర్, వార్డు సభ్యులను మంగళవారం వారు అభినందించి, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ సహకారంతో సర్పంచ్లు గ్రామాలలో పలు అభివృద్ధి పనులు చేపట్టి ఆదర్శంగా నిలవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీధర్రెడ్డి, భిక్షపతిరెడ్డి, ప్రవీణ్రెడ్డి, మురళి, రమణారెడ్డి, స్వామిగౌడ్, చంద్రయ్య, యాదగిరి, హన్మంతరెడ్డి, నర్సింలు, నర్సింహ్మారెడ్డి, సునీల్రెడ్డి పాల్గొన్నారు. -
అధిక కేసులు రాజీ కుదర్చండి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవిసిద్దిపేటకమాన్: జాతీయ లోక్ అదాలత్ ఈ నెల 21న జరగనున్న దృష్ట్యా అధిక కేసులు రాజీకుదిర్చేలా చూడాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి తెలిపారు. సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక కోర్టు న్యాయమూర్తులతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో క్రిమినల్, సివిల్, ఎకై ్సజ్, మోటారు వాహనాల కేసులు అధిక మొత్తంలో పెండింగ్లో ఉన్నాయన్నారు. జాతీయ లోక్ అదాలత్లో అధిక మొత్తంలో కేసులు రాజీపడేలా చర్యలు చేపట్టాలని న్యాయమూర్తులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు సీనియర్ సివిల్ జడ్జి సంతోష్కుమార్, న్యాయమూర్తులు తరణి, రేవతి, ప్రమీద, స్వాతిగౌడ్, జితేందర్, న్యాయసేవ సిబ్బంది పాల్గొన్నారు. -
కావేరి యూనివర్సిటీకి బెస్ట్ అవార్డు
వర్గల్(గజ్వేల్): మండల పరిధి గౌరారం కావేరీ యూనివర్సిటీకి ‘తెలంగాణ బెస్ట్ యూనివర్సిటీ’ అవార్డు లభించినట్లు వర్సిటీ ఛాన్స్లర్ జీవీ భాస్కర్రావు పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని వెటరన్స్ ఇండియా, ఏఐసీటీఈ, ఎన్బీఏ, ఏఐయూ, ఈపీఎస్ఐ సంయుక్తంగా దేశభక్తి తదితర అంశాలు ప్రాతిపదికన నిర్వహించిన ప్రైడ్ ఆఫ్ నేషన్ అవార్డ్స్– 2025లో కావేరీ యూనివర్సిటీ ‘తెలంగాణ బెస్ట్ యూనివర్సిటీ’గా ఎంపికైందన్నారు. విజయ దివస్ సందర్భంగా న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో వర్సిటీ వైస్ఛాన్స్లర్ డాక్టర్ ప్రవీణ్రావు ఈ అవార్డును అందుకున్నట్లు పేర్కొన్నా రు. అవార్డు రావడంపై రిజిస్ట్రార్ డాక్టర్ బి. శ్రీనివాసులు, డైరెక్టర్ హర్ష పొలసాని, డీన్లు డాక్టర్ కొండా శ్రీనివాస్, డాక్టర్ ప్రతాప్ కుమార్రెడ్డి, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. అజ్ఞానం వీడితేనే ప్రశాంతత మిరుదొడ్డి(దుబ్బాక): మన చుట్టూ ఆవరించిన అజ్ఞాన పొరలను తొలగించినప్పుడే మనసుకు ప్రశాంత లభిస్తుందని రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి తెలిపారు. మండల కేంద్రమైన మిరుదొడ్డిలో నిర్వహిస్తున్న గీతా పారాయణం 16వ అధ్యాయం ముగింపు సందర్భంగా మంగళవారం భక్తులకు ఆయన అనుగ్రహభాషణం చేశారు. పారాయణంలో పాల్గొన్న మహిళా భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తి భావం కలిగిన పల్లెలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా వర్ధిల్లుతాయన్నారు. దైవ చింతన కలిగి ఉండటంతో పాటు, సామాజిక స్పృహ కలిగి ఉండాలన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు: సీపీ విజయ్కుమార్ సిద్దిపేటకమాన్: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ విజయ్కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచా కాల్చడం వంటివి చేయకూడదన్నారు. మొదటి దశ ఎన్నికల రోజు ఉల్లంఘన కేసులు 20, రెండో దశలో 13 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. జిల్లాలో మూడో దశ ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో ఎన్నికల నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపారు. వ్యాధిగ్రస్తుల గుర్తింపు పకడ్బందీగా చేపట్టాలి డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ సిద్దిపేటకమాన్: జిల్లాలో ఈ నెల 18 నుంచి 31వరకు నిర్వహించనున్న కుష్ఠు వ్యాధిగ్రస్థుల గుర్తింపు కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో 14రోజుల పాటు 273మంది ఆరోగ్య పర్యవేక్షకుల ఆధ్వర్యంలో, 822మంది ఆశా కార్యకర్తలు ఇంటింటి సర్వే నిర్వహిస్తారని తెలిపారు. శరీరంపై స్పర్శ లేని మచ్చలు, తిమ్మిర్లు, వంటి సమస్యలు గుర్తించి నమోదు చేసుకుంటారని తెలిపారు. వ్యాధి నిర్ధారణ మేరకు మందులు పంపిణీ చేస్తామన్నారు. చికిత్స ద్వారా ఈ వ్యాధి ఆరు నెలల నుంచి 12 నెలల్లో నయమవుతుందన్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లాస్థాయి అబాకస్ పోటీలు ప్రశాంత్నగర్(సిద్దిపేట): విశ్వం ఎడ్యుకేషనల్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలో అబాకస్ వేదిక్ మ్యాథ్స్ జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో జిల్లాలోని 30 పాఠశాలలకు చెందిన 650 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతిభ చూపిన 26 మంది విద్యా ర్థులకు బహుమతులు అందించారు. వారంతా జనవరిలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీ లలో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. -
తుది విడత సంగ్రామం నేడే
బుధవారం శ్రీ 17 శ్రీ డిసెంబర్ శ్రీ 2025మూడో విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల సామగ్రిని ఆయా మండల కేంద్రాల్లో మంగళవారం పంపిణీ చేశారు. హుస్నాబాద్కు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో, అక్కన్నపేటకు జెడ్పీహెచ్ ఎస్లో, కోహెడకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, చేర్యాలకు మండల పరిషత్ కార్యాలయంలో, మద్దూరుకు తాజ్ ఫంక్షన్ హాలులో, దూల్మిట్టకు రైతు వేదికలో, కొమురవెల్లికి జెడ్పీహెచ్ఎస్లో, కొండపాకకు ఐఎంఓసీ, కుకునూరుపల్లికి కోల అంజయ్య ఫంక్షన్ హాలులో ఎన్నికల సామగ్రిని అందజేశారు. సిబ్బందికి బ్యాలెట్ బాక్స్లు, బ్యాలెట్ పత్రాలు, ఇతర సామగ్రిని అందించి దిశానిర్దేశం చేశారు. పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది ప్రత్యేక బస్సుల తరలివెళ్లారు. ఆ వెంటనే కౌంటింగ్.. గ్రామ పంచాయతీ ఎన్నికలు బుధవారం ఉదయం 7 గంటల నుంచి ఒంటి గంట వరకు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు కానుంది. లెక్కింపు సజావుగా, పారదర్శకంగా జరిగేలా ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాలు అమర్చారు. పోలింగ్ పూర్తి కాగానే బ్యాలెట్ బాక్స్లు, ఇతర సామగ్రిని స్ట్రాంగ్ రూమ్లో భద్రపర్చి రెండు గంటల నుంచి ఓట్లు లెక్కిస్తూ, ఫలితాలను ప్రకటిస్తారు. బ్యాలెట్ బాక్స్ల్లో సర్పంచ్ ఓట్లను వేరు చేస్తూనే , తొలుత వార్డుల వారీగా ఓట్లను లెక్కిస్తారు. పంచాయతీ చివరి వార్డు ఫలితం వెల్లడించిన తర్వాత సర్పంచ్ ఓట్లను గుర్తుల వారీగా వేరు చేసి లెక్కిస్తారు. జిల్లాలో తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. బుధవారం తొమ్మిది మండలాల్లో పోలింగ్ జరగనుంది. హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, మద్దూరు, చేర్యాల, దుల్మిట్ట, కొమురవెల్లి, కొండపాక, కుకునూర్పల్లి మండలాల్లో పోలింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. మొత్తం 163 పంచాయతీలకు గాను 13 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా, 150 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 1,432 వార్డు స్థానాల్లో 249 ఏకగ్రీవం కాగా, 1,182 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. 3,895 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. – హుస్నాబాద్ పోలింగ్ అధికారులు ఇలా.. మూడో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆయా పోలింగ్ కేంద్రాలకు అధికారులను నియమించారు. పోలింగ్ కేంద్రాలు 1,432, సమస్యాత్మక కేంద్రాలు 46, రిటర్నింగ్ అధికారులు 195 మంది, పీఓలు 1,718 మంది, అసిస్టెంట్ పీఓలు 2,123 మంది, మైక్రో అబ్జర్వర్స్ 37 మంది, వెబ్ కాస్టింగ్ 9, జోనల్ ఆఫీసర్స్ 24 మంది, రూట్ ఆఫీసర్స్ 56 మందిని కేటాయించారు. -
గెలుపెవరిదో?
హుస్నాబాద్: మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గెలుపు ఎవరిని వరిస్తుందోనన్న చర్చ గ్రామాల్లో జోరుగా జరుగుతోంది. మొదటి, రెండో విడత ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బలపర్చిన అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో విజయం సాధించారు. దీంతో మూడో విడత ఎన్నికల్లోనూ ఆ పార్టీలు బలపర్చిన అభ్యర్థులే గెలుస్తారన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. మూడో విడత గ్రామాల్లో రాజకీయాలు వేడిని పుట్టిస్తున్నాయి. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ఇప్పటికే మందు, నగదు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. పల్లె ఎవరికి పట్టం కడుతుందోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఓ వైపు గజగజ వణికే చలి, మరో వైపు నరాలు తేగే ఉత్కంఠ నెలకొంది. గ్రామాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నా మద్యం, డబ్బు పంపిణీకి అడ్డుకట్ట పడకపోవడం గమనార్హం. హుస్నాబాద్ మండలం కూచనపల్లిలోని ఓ తోటలో పంపిణీకి సిద్ధం చేసిన డబ్బులు, మద్యం బాటిళ్లను సిద్దిపేట టాస్క్ఫోర్స్ పోలీసులు భారీగా పట్టుకున్నారు. పోలీసులు డేగ కన్ను వేసినా.. ఆయా గ్రామాల అభ్యర్థులు గుట్టు చప్పుడు కాకుండా ఓటర్లకు డబ్బులు అందజేస్తున్నట్లు వినికిడి. ఏది ఏమైనా మరి కొన్ని గంటల్లో అభ్యర్థుల భవిత్యం తేలనుంది. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం తగదు కొండపాక(గజ్వేల్): ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం తగదని, అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హైమావతి సూచించారు. కొండపాక, కుకునూరుపల్లి మండలంలో జరిగే మూడో విడత సర్పంచ్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగా మంగళవారం ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల డ్యూటీ నిర్వహణలో ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవాలన్నారు. పోలింగ్కేంద్రాల్లో పోలింగ్ మెటీరియల్ చెక్చేసుకోవాలన్నారు. ఓటింగ్ ప్రక్రియ ఉదయం ఏడు గంటలకే ప్రారంభం కావాలన్నారు. ప్రతీ రెండు గంటలకోమారు పోలింగ్ శాతాన్ని అందించాలన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కౌటింగ్ ప్రక్రియకు మొదలు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రకళ, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా ప్రక్రియ నిర్వహించాలి మద్దూరు(హుస్నాబాద్): మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హైమావతి సూచించారు. మంగళవారం మద్దూరు మండల కేంద్రంలోని తాజ్ ఫంక్షన్హాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు సూచనలు చేస్తూ ఎన్నికల నిబంధనలు తప్పక పాటించాలన్నారు. పోలింగ్ ముగిశాక మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ మొదలు పెట్టాలన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించాలని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కాగానే అబ్జర్వర్ అనుమతితో మాత్రమే ఫలితాలు విడుదల చేయ్యాలని తెలిపారు. -
ఫార్మర్ ఐడీ తప్పనిసరి
● రైతులు నమోదు చేసుకోవాలి ● జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి ప్రశాంత్నగర్(సిద్దిపేట): వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పథకాల ద్వారా లభించే రాయితీలు, సబ్సిడీలు పొందాలంటే ఫార్మర్ ఐడీ తప్పనిసరి అని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి మంగళవారం తెలిపారు. జిల్లాలోని రైతులు తమ పరిధిలో ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారిని, సమీపంలోని మీ సేవ కేంద్రాలను సంప్రదించి ఫార్మర్ ఐడీ నమోదు చేసుకోవాలన్నారు. అగ్రిస్టాక్ తెలంగాణ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవసాయ పథకాల లబ్ధిని సులభంగా పొందవచ్చన్నారు. ముఖ్యంగా పీఎం కిసాన్ పథకం సహాయం పొందేందుకు ఫార్మర్ ఐడీ తప్పనిసరి అని తెలిపారు. రైతుల వివరాలు కచ్చితంగా నమోదు కావడం వల్ల పారదర్శకత పెరుగుతుందని చెప్పారు. బీమా, సబ్సిడీలు, రుణాలు తదితర ప్రభుత్వ పథకాలు త్వరితగతిన అందుతాయని తెలిపారు. ఒకే ఫార్మర్ ఐడి ద్వారా లబ్ధి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలోకి జమ అవుతుందని, భవిష్యత్తు పథకాల ప్రయోజనాలు సులభంగా పొందే అవకాశం ఉంటుందన్నారు. సరైనా గుర్తింపు ఉండటం వల్ల మోసాలు తగ్గుతాయని పేర్కొన్నారు. ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్కు ఆధార్ కార్డు నంబర్, పట్టాదార్ పాస్బుక్ వివరాలు, ఆధార్తో లింక్ అయిన మొబైల్ నంబర్ అవసరమని తెలిపారు. సమీపంలోని మీ సేవ కేంద్రాలలో కేవలం రూ.15 చెల్లించి నమోదు చేసుకునే అవకాశం కల్పించామని, అలాగే రైతు వేదికలలో వ్యవసాయ విస్తరణ అధికారి ద్వారా ఉచితంగా ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు. -
‘గిరి’ ప్రదక్షిణం
● ధనుర్మాసోత్సవ సంరంభం ● వైభవంగా స్వాతి నక్షత్ర మహోత్సవం ● నాచగిరిలో ఆధ్యాత్మిక వైభవం వర్గల్(గజ్వేల్): ‘స్వాతి’ నక్షత్రం.. నృసింహుడి జన్మనక్షత్రం.. ధనుర్మాసోత్సవ ప్రారంభ వేళ.. హరిహరుల నెలవు సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం నాచగిరి భక్తజన సందోహమైంది. భక్తజన సామూహిక విజయాచల గిరి ప్రదక్షిణతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. రంగం పేట పీఠాధిపతి మాధవానంద సరస్వతి దిశానిర్దేశం చేశారు. మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, ఆలయ చైర్మన్ రవీందర్ గుప్తా పర్యవేక్షణ, ధర్మకర్తలు, అర్చక వేదపండితులు, సిబ్బంది, భక్తజన పరివారం తోడుగా మంగళవారం స్వాతి నక్షత్ర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 7.30 గంటలకు పీఠాధిపతి కార్యక్రమం ప్రారంభించగా, భక్తజన హర్షధ్వానాలు, భజనలు, నారసింహ స్మరణల మధ్య గిరి ప్రదక్షిణ సంరంభం ఆద్యంతం నేత్రపర్వం చేసింది. ధనుర్మాసోత్సవంలో గిరి ప్రదక్షిణ అత్యంత శుభకరమని పీఠాధిపతి శ్రీమాధవానంద సరస్వతి అన్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం అనుగ్రహ భాషణం చేశారు. భక్తులు నృసింహుని దర్శించుకుని తరించారు. మహాప్రసాదం స్వీకరించారు. -
సమష్టిగా గ్రామాభివృద్ధికి కృషి చేయండి
● మీకు సంపూర్ణ సహకారం అందిస్తా ● మాజీ మంత్రి హరీశ్రావు సిద్దిపేటజోన్: నియోజకవర్గ పరిధిలోని 91 గ్రామాలకు 77 గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుందని, గొప్ప విజయమని, మీకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు భరోసా ఇచ్చారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ బలపర్చిన వారు తమ పాలకవర్గ సభ్యులతో కలిసి ఆదివారం క్యాంపు కార్యాలయంలో హరీశ్రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని అభినందించి సన్మానించారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి చెందగా, కాంగ్రెస్ హయాంలో నిర్వీర్యం అయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. రెండేళ్లుగా మన తెలంగాణ రాష్టానికి ఒక్క అవార్డు రాలేదన్నారు. మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమని దైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే క్రమంలో ఐక్యతతో పనిచేయాలని సూచించారు. కోలాహలంగా క్యాంపు కార్యాలయం రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు పెద్ద ఎత్తున విజయం సాధించి క్లీన్ స్వీప్ చేశారు. ఈ నేపథ్యంలో గెలిచిన వారంతా పెద్ద ఎత్తున అనుచరులతో క్యాంపు కార్యాలయానికి రావడంతో పెద్ద ఎత్తున కోలాహలంగా మారింది. తెల్లవారుజామున నుంచి మధ్యాహ్నం వరకు వచ్చిన వారికి ఆప్యాయంగా పలకరించి, అభినందించారు. పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు స్వీట్స్ పంపిణీ చేసుకొని సంబరాలు చేసుకున్నారు. -
ఆఖరి పోరు.. పంపకాల జోరు
ముగిసిన మూడో విడత ప్రచారంఎన్నికల ప్రచారం ముగిసింది. మైక్లు మూగబోయాయి. ఇక మిగిలింది బేరసారాలు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు మందు, విందులకు గ్రామాలు వేదికగా మారుతున్నాయి. ప్రతి గడప తడుతూ ‘మీ ఓటు మాకే వేయాలంటూ..’ డబ్బు, మద్యం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు వినికిడి. కుల సంఘాలను గంపగుత్తగా తమ వైపు తిప్పుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ప్రతి ఇంటికి కిలో మాంసం, క్వార్టర్ మందు సీసా చేతిలో పెట్టి వేడుకుంటున్నారు. సమయానికి అభ్యర్థుల వద్ద పెద్ద మొత్తంలో డబ్బు లేక పోవడంతో వ్యవసాయ భూములు, ప్లాట్లు అమ్ముతున్నట్లు సమాచారం. తమకు ఉన్న పరపతితో వడ్డీలకు డబ్బులు తెచ్చి ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. ఒక్కో ఓటరుకు రూ.500 నుంచి రూ.2వేలు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఓటర్లకు ప్రయాణ ఖర్చులు ఇచ్చి కుటుంబ సభ్యులతో రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఓటర్లు ఏది అడిగితే అది కాదనకుండా ఇంటి ముంగిటకే తెచ్చి పెడుతున్నారు. మరో వైపు పోలీసులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తుండటంతో మద్యం, డబ్బులు పంపిణీ గుట్టుగా చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. అభ్యర్థుల బల ప్రదర్శన ప్రచారం చివరి రోజు సోమవారం అభ్యర్థులు బల ప్రదర్శన చేశారు. గ్రామాల్లో సమావేశాలు పెట్టి తాము గెలిస్తే ఏమేమి అభివృద్ధి పనులు చేస్తామో ఎల్ఈడీల ద్వారా హామీలు గుప్పిస్తూ ప్రచారాన్ని హోరెత్తించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రచారానికి ఊపు తెచ్చారు. ‘ఒక్కసారి అవకాశం ఇవ్వండి సమస్యలు తీరుస్తా’మని హామీల వర్షం కురిపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ పార్టీలు బలపరిచిన అభ్యర్థులతో పాటుగా మిగతా అభ్యర్థులు కూడా తమ గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో పార్టీలకతీతంగా అభ్యర్థుల మధ్య పోటీ ఉంటే, మరికొన్ని గ్రామాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ సాగుతోంది. మూడో విడత ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ఏర్పాట్లల్లో అధికారులు నిమగ్నమయ్యారు. ఆయా మండల కేంద్రాల్లో బ్యాలెట్ బాక్స్లు, బ్యాలెట్ పేపర్లు, ఇతర సామగ్రిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు వేగవంతం చేశారు. జోరందుకున్న ప్రలోభాల పర్వం ప్రధాన పార్టీల ర్యాలీలుచేర్యాల(సిద్దిపేట): ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తించాయి. సోమవారం ప్రచారానికి చివరి రోజు కావడంతో గ్రామాల్లో ఎవరికి వారు వారివారి మద్దతు దారులతో ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో సర్పంచ్, వార్డుల స్థానాల్లో అభ్యర్థులు తమ గుర్తులతో కూడిన నమూనా బ్యాలెట్ పత్రాలతో ఓటర్ల వద్దకు వెళ్లి తమకు ఓటువేసి గెలిపించాలని అభ్యర్థించారు. ప్రధానంగా అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బలపర్చిన అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది, బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులకు మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. మూడో విడత ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు మంగళవారం ఒక్క రోజే కీలకం. దీంతో అభ్యర్థులు ప్రలోభాలకు తెరలేపారు. ఓటర్లకు డబ్బు, మద్యం జోరుగా పంపిణీ చేస్తున్నట్లు ప్రచారం. బుధవారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. మూడో విడతలో 9 మండలాల్లో 163 గ్రామ పంచాయతీలు, 1,432 వార్డు స్థానాలున్నాయి. వీటిలో 13 మంది సర్పంచ్లు, 249 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 150 సర్పంచ్లకు 587 మంది, 1,182 వార్డు స్థానాలకు 3,308 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. –హుస్నాబాద్ -
నేడు నాచ‘గిరి’ ప్రదక్షిణ
వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధ నాచగిరి లక్ష్మీనృసింహ క్షేత్రంలో మంగళవారం స్వాతి నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ రవీందర్ గుప్త, ఈఓ విజయరామారావు తెలిపారు. లక్ష్మీనృసింహుని జన్మ నక్షత్ర వేళ ఉదయం 7.30 గంటలకు నాచగిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని తరించాలని వారు కోరారు. గురు మదనానంద క్షేత్రం పీఠాధిపతి మాధవానంద సరస్వతి పర్యవేక్షణలో గిరి ప్రదక్షిణ కొనసాగనుంది. ప్రతిభ చాటినప్పుడే గుర్తింపు గజ్వేల్రూరల్: విద్యార్థులు తమలోని ప్రతిభను చాటినప్పుడే గుర్తింపు లభిస్తుందని మాజీ ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ రామచంద్రమూర్తి అన్నారు. వరంగల్ జిల్లా ప్లాటినం జూబ్లీ హైస్కూల్లో నిర్వహించిన ఫెస్ట్ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి 260 మంది విద్యార్థులు, గైడ్ టీచర్లు 120 ప్రాజెక్టులతో హాజరు కాగా ప్రజ్ఞాపూర్లోగల సేయింట్ మేరీస్ విద్యానికేతన్ పాఠశాలకు చెందిన అటల్ టింకరింగ్ ల్యాబ్ ఇన్స్పెక్టర్ వైష్ణవి, గైడ్ టీచర్ నాగలక్ష్మి పర్యవేక్షణలో విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సైన్స్ కేవలం తరగతి గదిలో నేర్చుకునేది కాదని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతుందన్నారు. సేయింట్ మేరీస్ విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టుల పట్ల అభినందిస్తూ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఇన్నారెడ్డి ఏటీఎల్ ఇన్స్పెక్టర్ వైష్ణవి, గైడ్ టీచర్ నాగలక్ష్మితో పాటు విద్యార్థులను అభినందించారు. కార్మికుల సమస్యలపై నిరంతర పోరాటాలు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బండ్ల స్వామి గజ్వేల్: కార్మికుల సమస్యల పరిష్కారానికి సీఐటీయూ నిరంతర పోరాటాలను కొనసాగిస్తుందని ఆ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు బండ్ల స్వామి అన్నారు. ప్రతి కార్మికుని ఇంటిపై సీఐటీయూ జెండా ఎగురవేయాలని రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు గజ్వేల్లోని తన ఇంటిపై సోమవారం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బండ్ల స్వామి మాట్లాడుతూ సీఐటీయూ అఖిలభారత మహాసభలు విశాఖపట్టణంలో ఈ నెల 31 నుంచి జనవరి 4వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాట కార్యాచరణ రూపొందించడానికి మహాసభల్లో తీర్మానాలుంటాయన్నారు. కేంద్రం తెచ్చిన లేబర్ కోడ్లను వెంట నే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అసంఘటిత రంగ కార్మికులకు, స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం నెలకు రూ. 26 వేలు అందేలా జీఓలు సవరణ చేయాలన్నారు. పాఠశాలలో మాక్ పోలింగ్ కొండపాక(గజ్వేల్): కుకునూరుపల్లి మండలం లకుడారం గ్రామంలోని హైస్కూల్లో సోమ వారం మాక్ పోలింగ్ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణతోపాటు ఓటు హక్కు వినియోగంపై ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. విద్యార్థులచే ఓటు వేయించారు. నమూనా ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా వంకని శివమణి, ఉపసర్పంచ్గా వంకని లోకేష్లు విజయం సాధించారు. ఎన్నికల నిర్వహణ అధికారిగా హెచ్ఎం జానకీరెడ్డి, ఇతర అధికారులుగా సత్యంతో పాటు తదితరులు పాల్గొన్నారు. -
మూడో విడతకు పకడ్బందీ ఏర్పాట్లు
● కలెక్టర్ హైమావతి ● జూమ్ ద్వారా అధికారులకు దిశానిర్దేశం సిద్దిపేటరూరల్: జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్కు పకడ్బందీ ఏర్పా ట్లు చేస్తున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. ఈ మేరకు సోమవారం అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈనెల 17న అక్కన్నపేట, హుస్నాబాద్, కోహెడ, చేర్యాల, మద్దూరు, కొండపాక, కుకునూరుపల్లి, మండలాల్లోని 163 సర్పంచ్, 1,432 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. మొత్తంగా 3,841 మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. 1,432 పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు, ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు హరిత, డీపీఓ రవీందర్, డీఈఓ శ్రీనివాస్రెడ్డి, ఈడీఎం ఆనంద్, జెడ్సీ సీఈఓ రమేశ్, ట్రైనీ డీపీఓ వినోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. వసతులు కల్పించండి చేర్యాల(సిద్దిపేట): మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలన్నారు. సోమవారం చేర్యాల మండలం గుర్జకుంట, వేచరేణి, కడవేర్గు, నాగపురి, ముస్త్యాల, ఆకునూరు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిపేందుకు అధికారులు పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్కు పెట్టేందుకు సౌకర్యంగా ఉండాలన్నారు. లైవ్ వెబ్ కాస్టింగ్ కోసం నెట్ కనెక్షన్ ఉండేలా చూసుకోవాలన్నారు. అలాగే కౌంటింగ్ కోసం సౌకర్యంగా ఉండేలా పెద్ద గదిని ఎంచుకోవాలని ఆయా ఎంపీడీఓలను ఆదేశించారు. ఓటర్ స్లిప్ల పంపిణీ 100 శాతం చేయాలని బీఎల్ఓలను ఆదేశించారు. పోలింగ్ స్టేషన్లలో ఎవరికి ఫోన్ అనుమతి లేదని, చుట్టూ గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. ఆమె వెంట ఎంపీడీఓ, ఎంపీఓ, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు. -
ఊళ్లు.. ఓటెత్తాయ్..
సిద్దిపేటజోన్: గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. చలిని సైతం లెక్కచేయకుండా ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 2,44,776 ఓట్లకు గాను 2,16,294 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో 88.36 పోలింగ్ శాతం నమోదైంది. ఏకగ్రీవమైన స్థానాలను మినహాయించి 172 సర్పంచ్ స్థానాలకు, 1,371 వార్డులకు పోలింగ్ జరిగింది. రెండో విడతలో సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, నారాయణరావుపేట, నంగనూరు, చిన్నకోడూరు మండలాలతో పాటు దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, భూపల్లి, మానకోడూరు నియోజకవర్గ పరిధిలోని బెజ్జంకి మండలాల్లో పోలింగ్ నిర్వహించారు. ఆదివారం జరిగిన రెండో విడత పోలింగ్ ప్రక్రియ మెల్లమెల్లగా పుంజుకుంది. నిర్ణీత సమయం 7గంటలకు పోలింగ్ ప్రక్రియ మొదలైంది. మొదటి గంట పోలింగ్ శాతం కొద్దిగా నెమ్మదించిన తర్వాత పుంజుకుంది. 9గంటల వరకు సగటున 23శాతం చేరుకుంది. వీకెండ్ కావడంతో పాటు రెండో శనివారం రావడం ఓటర్లకు కలిసి వచ్చింది. సుదూర ప్రాంతాల్లో ఉన్నవారు సైతం ఓటు వేసేందుకు స్వగ్రామాలకు చేరుకుని ఓటు వేశారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయం గడువు దాటినా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు క్యూ కట్టారు. వారందరికీ అధికారులు అవకాశం కల్పించారు. షెడ్యూల్ మేరకు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. పోలింగ్ సరళిని కలెక్టర్ హైమావతి, పోలీసు కమిషనర్ విజయ్ కుమార్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టడంతో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రశాంతంగా రెండో విడత పోలింగ్పది మండలాల్లో ఓటర్ల సంఖ్య: 2,44,776 పురుషులు: 1,19,471 మహిళలు: 1,25,304 ఇతరులు: 01 పోలింగ్ శాతం సరళి.. ఉదయం 9 వరకు పోలైన ఓట్లు: 56,905 (23.25) 11 గంటల వరకు.. 1,43,027 (58.43) ఒంటి గంట వరకు పోలైన మొత్తం ఓట్లు: 2,16,294 (88.36)జిల్లాలో 88.36 శాతం నమోదు మండలాల వారీగా పోలింగ్ శాతం.. అక్బర్ పేట–భూపల్లి: 87.63 బెజ్జంకి: 85.89చిన్నకోడూరు: 87.99 దుబ్బాక: 86.91మిరుదొడ్డి: 87.70 నంగునూరు: 90.16 నారాయణరావు పేట: 89.78 సిద్దిపేట రూరల్: 89.52 సిద్దిపేట అర్బన్: 89.30తొగుట: 89.74 -
ఖాజీపూర్లో ఉద్రిక్తత
పోలీసులకు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం మిరుదొడ్డి(దుబ్బాక): అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని ఖాజీపూర్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సర్పంచ్ అభ్యర్థులు పోలింగ్ కేంద్రానికి సమీపంలో ప్రచారం నిర్వహిస్తున్నారన్న ఆరోపణలతో ఇద్దరు అభ్యర్థులను పోలీసులు వారించే ప్రయత్నం చేశారు. దీంతో అభ్యర్థులు, పోలీసులకు మధ్య మాటా మాటా పెరిగి చివరికి వాగ్వాదానికి దారి తీసింది. ఘటనా స్థలంలో జనాలు గుమిగూడటంతో ఉద్రిక్తతంగా మారింది. పరిస్థితి చేయి దాటక ముందే పోలీసులు.. అభ్యర్థులను, గ్రామస్తులను చెదర గొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మిరుదొడ్డిలో పోలీసుల అత్యుత్సాహం మండల కేంద్రమైన మిరుదొడ్డిలో వార్తా సేకరణకు వెళ్లిన విలేకరులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలింగ్ కేంద్రానికి సుమారు వెయ్యి మీటర్ల దూరంలో ఫొటోలు తీస్తున్న విలేకరులను వారిస్తూ వారి నుంచి అక్రిడిటేషన్ కార్డులు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని ఫొటోలను డిలేట్ చేశారు. ఇదేమిటని ప్రశ్నించిన విలేకరులపై విరుచుపడ్డారు. చివరికి ఎస్ఐ సమత జోక్యంతో సమస్య సద్దుమణిగింది. సమస్య ఉత్పన్నం కాకుండా చూడాల్సిన పోలీసులే సమస్యలకు కారణమవడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
లోకల్ ఫైట్..గులాబీ హిట్
రెండో విడతలో బీఆర్ఎస్ 119.. కాంగ్రెస్ 33 స్థానాల్లో గెలుపుసిద్దిపేటజోన్: గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులదే హవా కొనసాగింది. ఆదివారం పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపులో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు అత్యధికంగా విజయం సాధించారు. బీఆర్ఎస్ 119 స్థానాల్లో.. కాంగ్రెస్ 33 స్థానాల్లో, బీజేపీ 13 స్థానాల్లో, ఇండిపెండెంట్లు 17 స్థానాల్లో విజయం సాధించారు. గులాబీకి పట్టు న్న సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో వారికి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. బెజ్జంకి మండలంలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు ఎక్కువగా విజయం సాధించారు. మరోవైపు బీజేపీ నామమాత్రంగా ప్రభావం చూపగా, స్వతంత్ర అభ్యర్ధులు డబుల్ డిజిట్లో గెలుపొందారు. సిద్దిపేట పట్టణ సరిహద్దులోని కొన్ని మేజర్ గ్రామాల్లో స్వతంత్ర అభ్యర్థులదే పైచేయిగా నిలిచింది. సిద్దిపేటలో కొనసాగిన హవా.. సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో బీఆర్ఎస్ ప్రభావం కొట్టొచ్చినట్లు కన్పించింది. కొన్ని రోజులుగా గ్రామాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. పోటీల్లో బీఆర్ఎస్ పార్టీ అనుచరులు అధిక సంఖ్యలో ఉండడంతో పోటీ రసవత్తరంగా మారింది. చివరకు బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. చిన్నకోడూరు, నంగునూరు, సిద్దిపేట రూరల్, అర్బన్, నారాయణరావుపేట మండలాల్లో మంచి ఫలితాలు వచ్చాయి. బీఆర్ఎస్కు 76 స్థానాలు రాగా కాంగ్రెస్, బీజేపీలకు డబుల్ డిజిట్ కూడా దక్కలేదు. బెజ్జంకిలో కాంగ్రెస్ ప్రభావం.. మానకోడూరు నియోజకవర్గం బెజ్జంకి మండలంలో కాంగ్రెస్ ఆధిపత్యం కనిపించింది. పార్టీ బలపర్చిన అభ్యర్థులు అత్యధికంగా విజయం సాధించారు. 13స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించగా, 8స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. ఇక్కడ మూడు చోట్లా స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. వికసించని కమలం ప్రజాప్రతినిధుల పట్టు రెండో విడత ఓట్ల లెక్కింపులో ప్రజాప్రతినిధులు సొంత గ్రామాల్లో పట్టు సాధించారు. మాజీ సీఎం కేసీఆర్ స్వగ్రామమైన చింత మడకలో బీఆర్ఎస్, ఎమ్మెల్యే హరీశ్రావు స్వగ్రామం తోటపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. ఎంపీ రఘునందన్ రావు స్వగ్రామంలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. -
కొమురవెల్లి ఆలయ అభివృద్ధికి కృషి
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంతి కొండా సురేఖ తెలిపారు. బ్రహ్మోత్సవాల నాటికి మేడాలమ్మ, కేతమ్మలకు సుమారు 2 కిలోల బంగారు కిరీటాలు, స్వామి వారి పల్లకీకి వెండి తాపడం చేయిస్తామన్నారు. ఆదివారం స్వామి వారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ మల్లన ఆలయ అభివృద్ధికి త్వరలోనే మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేసేలా చర్యలు చేపడతామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆలయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారన్నారు. గిరిజనుల ఆరాధ్య దైవం సమ్మక్క –సారక్క జాతర ఏర్పాట్లకు ప్రభుత్వం కనివిని ఎరుగని రీతిలో నిధులు మాంజూరు చేసినట్లు తెలిపారు. -
సర్పంచ్లు ప్రజల మన్ననలు పొందాలి
మాజీ మంత్రి హరీశ్రావుగజ్వేల్: సర్పంచ్లుగా ఎన్నికైనవారు ప్రజల మన్ననలు పొందాలని మాజీ మంత్రి హరీశ్రావు సూచించారు. ఆదివారం గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో తొలివిడత ఎన్నికల్లో గజ్వేల్ మండలం ఆహ్మదీపూర్ సర్పంచ్గా ఎన్నికై న ప్రభాకర్, ఉప సర్పంచ్ గోపాల్రెడ్డి, వార్డుసభ్యులు హరీశ్రావును కలిశారు. ఈ సందర్భంగా హరీశ్రావు వారిని శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ ఓట్లేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో గ్రామ బీఆర్ఎస్ నాయకులు మద్ది రాజిరెడ్డి, చాడ శ్రీనివాస్రెడ్డి, పాల రమేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కమనీయం.. మల్లన్న కల్యాణం
కొమురవెల్లి(సిద్దిపేట): మేళతాళాలు.. మంగళవాయిద్యాలు.. భక్తుల జయజయధ్వానాల మధ్య కొమురవెల్లి కోరమీసాల మల్లన్న కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆదివారం క్షేత్రంలోని తోట బావి వద్ద సర్వాంగసుందరంగా ముస్తాబు చేసిన ప్రత్యేక మండపంలో మల్లన్న స్వామి.. మేడలాదేవి, కేతమ్మలను సరిగ్గా మధ్యాహ్నం 12.01గంటలకు వివాహమాడారు. ఆలయ అధికారుల పర్యవేక్షణలో వీరశైవ ఆగమ పండితులు కల్యాణ క్రతువును కనుల పండువగా నిర్వహించారు. కల్యాణ వేడుకను వీక్షించేందుకు రాష్ట్రం నుంచే కాక వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ గర్భగుడిలో ఉదయం 9 గంటలకు మూల విరాట్కు కల్యాణం నిర్వహించారు. అనంతరం స్వామి. అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక పల్లకీలో ఊరేగింపుగా మేళాతాళలతో తోటబావి వద్ద గల మల్లన్న కళ్యాణవేదికకు చేర్చి కల్యాణ క్రతువు చేపట్టారు. ప్రభుత్వం తరపున మల్లికార్జున స్వామికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమర్పించారు. మాజీ ఎమ్మెల్సీ రాజలింగం, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డి, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి తదితరులు స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. పీఠాధిపతుల పర్యవేక్షణలో .. మల్లికార్జున స్వామి కల్యాణాన్ని పీఠాధిపతి మహమండలేశ్వర్ మహంత్ సిద్ధేశ్వరానందగిరి మహరాజ్ పర్యవేక్షణలో కొనసాగగా.. కల్యాణ వ్యాఖ్యతలుగా డాక్టర్ మహంతయ్య, సాంబశివశర్మ, శశిభూషణ సిద్దాంతిలు వ్యవహరించారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన స్వామి వారి కల్యాణ వేడుకను భక్తులు భక్తి శ్రద్ధలతో తిలకించారు.భారీగా హాజరైన భక్తజనం -
విచ్చలవిడిగా డబ్బు, మద్యం
దుబ్బాక: పంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డారు. ఈ క్రమంలో విచ్చలవిడిగా డబ్బులు, మద్యం పంపిణీ చేసినట్లు విశ్వసనీయంగా సమాచారం. మండల కేంద్రాలతో పాటు, ప్రధాన గ్రామాల్లో పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అభ్యర్థులు దేనికి వెనుకాడకుండా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు వినికిడి. ఓటుకు రూ.2 నుంచి 4 వేలు కొన్ని ప్రధాన గ్రామాల్లో పోటీ తీవ్రంగా ఉండటంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటుకు రూ.2 వేల నుంచి 4 వేల వరకు ఇంటింటికీ పంపిణీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కొన్ని గ్రామాల్లో అయితే పలనా వారు రూ.2 వేలు ఇచ్చినట్లు తెలిస్తే.. కొందరు ఓటుకు రూ.3 వేలు సైతం ఇచ్చిటన్లు సమాచారం. ఓ వైపు పోలీసులు గ్రామాల్లో నిఘా పెట్టినప్పటికీ అభ్యర్థులు మాత్రం యథేచ్ఛగా డబ్బులు, మద్యం పంపిణీ చేయడం గమనార్హం. -
కేసీఆర్ను మళ్లీ సీఎంను చేయడమే లక్ష్యం
● ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ● నూతన సర్పంచ్లు, ఉప సర్పంచ్లకు సన్మానం దుబ్బాక: కేసీఆర్ను మళ్లీ సీఎంను చేయడమే లక్ష్యంగా కృషి చేద్దామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం దుబ్బాక పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మొదటి విడత ఎన్నికల్లో గెలుపొందిన నియోజకవర్గంలోని దౌల్తాబాద్, రాయపోల్ మండలాలకు చెందిన బీఆర్ఎస్ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలో లేకున్నా మెజార్టీ సర్పంచ్లను బీఆర్ఎస్ గెలుచుకోవడం చాలా సంతోషకరమన్నారు. ఇదే స్ఫూర్తితో రెండో విడత ఎన్నికల్లో సైతం పెద్ద ఎత్తున సర్పంచ్లను గెలిపించుకుందామన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం అభివృద్ధికి నిధుల కోసం పోరాడుతానన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. -
రెండో విడత.. పోరు
జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఆదివారం 172 సర్పంచ్, 1,371 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ నిర్వహణతోపాటు కౌంటింగ్ కోసం 4,763 మంది సిబ్బందిని నియమించారు. రెండో విడతలో 38 గ్రామాలు సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు. రెండో విడతలో 4,328 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్ హైమావతి పర్యవేక్షించారు. – సాక్షి, సిద్దిపేట జిల్లాలో మూడు విడతలలో 508 సర్పంచ్లు, 4,508 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు మొదటి విడత ఈ నెల 11న ముగియగా, ఆదివారం రెండో విడతలో 10 మండలాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో 182 సర్పంచ్లు, 1,644 వార్డులకు గాను 10 సర్పంచ్లు, 273 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 172 సర్పంచ్ స్థానాలకు 684 మంది, 1,371 వార్డు స్థానాలకు 3,644 మంది పోటీ చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో పలు చోట్ల ఓటర్లకు డబ్బులు, మద్యం, వివిధ రకాల గిఫ్ట్లను అందజేసినట్లు తెలిసింది. పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది పది మండలాల్లో పది చోట్ల ఎన్నికల సిబ్బందికి బ్యాలెట్ బాక్స్లు, పేపర్లు, ఇతర మెటీరియల్ను పంపిణీ చేశారు. అక్బర్పేట – భూంపల్లిలో శ్రీనివాస ఐటీఐ, చిన్నకోడూరులో ఎంపీడీఓ కార్యాలయం, దుబ్బాకలో ఎంపీడీఓ కార్యాలయం, మిరుదొడ్డిలో మోడల్ స్కూల్, నంగునూరులో ఎంపీడీఓ కార్యాలయం, నారాయణరావు పేటలో జెడ్పీహెచ్ఎస్, సిద్దిపేట రూరల్లో మైనార్టీ కాలేజీ, సిద్దిపేట అర్బన్లో మెరీడియన్ స్కూల్, తొగుటలో ఎంపీడీఓ కార్యాలయం, బెజ్జంకిలో శ్రీసత్యసాయి గురుకుల విద్యానికేతన్లో పోలింగ్ సామగ్రిని అందజేశారు. ఆయా కేంద్రాల నుంచి ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ తర్వాత మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. మొదట వార్డు ఓట్ల లెక్కింపు బ్యాలెట్ బాక్స్లో సర్పంచ్ ఓట్లను వేరు చేస్తూనే.. తొలుత వార్డుల వారీగా ఓట్లను లెక్కిస్తారు. పంచాయతీ చివరి వార్డు ఫలితం వెల్లడించాక.. సర్పంచ్ ఓట్లను గుర్తుల వారీగా వేరు చేసి లెక్కిస్తారు. చిన్న గ్రామ పంచాయతీలు సాయంత్రం 5గంటలలోగా ఫలితాలు వెల్లడికానున్నాయి. పెద్ద గ్రామ పంచాయతీల ఫలితాలు రాత్రి 7గంటల తర్వాతే వచ్చే అవకాశం ఉంది.విధుల్లో 4 వేల మంది.. ఎన్నికల నిర్వహణకు 4,763 మంది సిబ్బందిని నియమించారు. పోలింగ్ అధికారులు1,973, పోలింగ్ సిబ్బంది 2,436 మందిని నియమించగా ప్రత్యేక వాహనాల ద్వారా పోలింగ్ కేంద్రాలకు తరలించారు. -
ఎన్నికల కూలీలు
● ప్రచారానికి పైసలిచ్చి తీసుకెళ్తున్న నేతలు ● నేడు ఒక అభ్యర్థికి.. రేపు మరొకరికి జైవెల్దుర్తి(తూప్రాన్): ఒకప్పుడు పల్లెకో, పట్టణానికో నాయకుడు వస్తే జనం స్వచ్ఛందంగా కదలివచ్చేవారు. ర్యాలీల్లో నేతలతో కలిసి పాదం పాదం కలిపేందుకు, సభల్లో వారి ప్రసంగాలు వినేందుకు పోటీ పడేవారు. కానీ ప్రస్తుత రాజకీయాలు మారిపోయాయి. ముఖ్య కార్యకర్తలు తప్ప పని వదిలి ప్రచారానికి తరలివచ్చేవారు.. నేతల మాటలు వినడానికి కదిలే వారు కరువయ్యారు. దీంతో అభ్యర్థులు, ఆశావహులు సభలు, ప్రచారాల కోసం కూలీలను ఆశ్రయిస్తున్నారు. ఇవాళ ఇక్కడ.. రేపు అక్కడ.. కూలీలు సైతం ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే ఆ రోజు వారికే ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు ఒక పార్టీకి జై కొడితే.. రేపు మరో పార్టీకి అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో తమ పార్టీలోకి ఎక్కువ చేరికలు జరిగాయని చెప్పుకునేందుకు కూలీలకు సైతం కండువాలు కప్పుతున్న నేతలకు లెక్కేలేదు. ఈ వ్యవహారాన్ని చూసి పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా గ్రామాలు, పట్టణాల్లో కూలీలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ప్రచారానికి వస్తే రోజుకు రూ. 300 కూలీ ఇస్తూ టిఫిన్, భోజనం ఉచితంగా అందిస్తున్నారు. ఒకే రోజు రెండు పార్టీల మీటింగ్లు, ప్రచారాలు ఉంటే మాత్రం కూలీల రేటు రెండింతలు అవుతుంది. పైపెచ్చు ప్రచారం పూర్తికాగానే మగవారికి మద్యం బాటిల్ చేతిలో పెట్టి రేపటి ప్రచారానికి మళ్లీ రావాలని మురిపిస్తున్నారు. -
మల్లన్న కల్యాణానికి రారండీ
కొమురవెల్లిలో నేటి ఉదయం 10:45 గంటలకు.. కొమురవెల్లి(సిద్దిపేట): భక్తుల కొంగుబంగారమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు. మల్లన్న క్షేత్రంలోని జరిగే కల్యాణోత్సవానికి రాష్ట్ర నలుమూలలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా తరలిరానున్నారు. ఈ మహోత్సవాన్ని వైభవంగా జరిపేందుకు ఆలయవర్గాలు విస్తృత ఏర్పాట్లు చేశాయి. తోటబావి ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కల్యాణ మండలపంలో మల్లికార్జున స్వామి, కేతలమ్మ, మేడలదేవిని ఉదయం 10.45నిమిషాలకు వివాహమాడనున్నారు. మార్గశిర మాసం చివరి ఆదివారాన్ని పురస్కరించుకుని వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించే కల్యాణోత్సవంతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మల్లన్న కల్యాణానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు పలువురు ప్రముఖులు, అధికారులు హాజరుకానున్నారు. శనివారం పీఠాధిపతులు మహమండలేశ్వర్, డాక్టర్ మహంత్ సిద్ధేశ్వరానందగిరి మహంత్ మహస్వామి కొమురవెల్లికి చేరుకున్నారు. స్వామి తరపున పడిగన్నగారి వంశస్తులు.. ఆలయ గర్భగుడిలో మల్లన్న మూల విరాట్ వద్ద మొదట కల్యాణ తంతును ప్రారంభించి అదే సమయంలో తోట బావి వద్ద ఉత్సవ విగ్రహాలకు కల్యాణం జరిపిస్తారు. వధువులు బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మ తరపున మహదేవుని వంశస్తులు, వరుడు మల్లికార్జున స్వామి తరపున పడిగన్నగారి వంశస్తులు పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తారు. సర్వాంగసుందరంగా కల్యాణ వేదిక స్వామివారి కల్యాణ వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. చలువపందిళ్లు వేశారు. స్వామి వారి రథం పనులు, గుట్టపైన ఎల్లమ్మ ఆలయ అలంకరణ పనులు పూర్తీ చేశారు. పటిష్ట బందోబస్తు మల్లన్న కల్యాణానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అదనపు డీసీపీ చంద్రబోస్ తెలిపారు. బందోబస్తుకు వచ్చిన పోలీసులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ విధులను పకడ్బందీగా నిర్వహించాలని, భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. బందోబస్తులో అదనపు డీసీపీ, ఏసీపీలు ఇద్దరు, సీఐలు 10మంది , ఎస్ఐలు12, కానిస్టేబుల్లు మొత్తం 361 సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు పోలీసులకు సహకరించాలని, పార్కింగ్ ప్రదేశాలలోనే వాహనాలను పార్కు చేయాలని సూచించారు. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ స్వామి వారి కల్యాణం ఏర్పాట్లను కలెక్టర్ హైమావతి పరిశీలించారు. ఆలయ పరిసరాలలో పారిశుద్ధ్యంపై అప్రమత్తంగా ఉండాలని ఆలయ అధికారులను ఆదేశించారు. అనంతరం బండ గుట్టపై చేపడుతున్న 50 గదుల నిర్మాణపనులను పరిశీలించారు. -
ఇవేం ఏర్పాట్లు
అధికారులపై కలెక్టర్ ఆగ్రహంబెజ్జంకి(సిద్దిపేట): ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రంలో ఏర్పాట్లపై కలెక్టర్ హైమావతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బెజ్జంకిలోని సత్యసాయి గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని శనివారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హైమావతి పరిశీలించారు. భోజన, తదితర వసతులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సెంటర్లోని మైక్ పని చేయకపోవడంతో ఎంపీడీఓ ప్రవీణ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేస్తే విధులు నిర్వహించడం కష్టమని, బెజ్జంకి కేంద్రంపై దృష్టి సారించాలని ఆర్డీఓకు సూచించారు. ఎన్నికల విధులకు అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కావాలన్నారు. పోలింగ్ సిబ్బందికి రాత్రి వేళ సంబంధిత పోలింగ్ కేంద్రాలలో భోజనవసతి కల్పించాలని కార్యదర్శులకు సూచించారు. కార్యక్రమంలో హుస్నాబాద్ ఆర్డీఓ రామ్మూర్తి, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీఓ ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు. ఓటు హక్కు మరవొద్దు సిద్దిపేటరూరల్: ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ప్రశాంత వాతావరణంలో ఓటు వేయాలని, ఓటు హక్కు మరవద్దని కలెక్టర్ హైమావతి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు, ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈ అవకాశాన్ని ఆయా మండలాల్లోని గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతకు ముందు ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మూర్తి, జెడ్పీ సీఈఓ రమేశ్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ భవ్య, ఎంపీడీఓలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. -
కార్యకర్తల్లో నయా జోష్
ఎక్కువ చోట్ల బీఆర్ఎస్ గెలుపు ● గతం కంటే ఎక్కువ స్థానాలు సాధించిన కాంగ్రెస్సాక్షి, సిద్దిపేట: ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే అధిక సర్పంచ్ స్థానాలు గెలుపొందామని బీఆర్ఎస్ శ్రేణులు.. గతం కంటే ఎక్కువ సర్పంచ్లు గెలిచామని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు జోష్లో ఉన్నారు. గురువారం జరిగిన మొదటి విడత ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల బలపర్చిన అభ్యర్థులు నువ్వా నేనా? అన్నట్లుగా పోటీ రసవత్తరంగా సాగింది. గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని గజ్వేల్, జగదేవ్పూర్, వర్గల్, ములుగు, మర్కూక్ మండలాలు, దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని రాయపోలు, దౌల్తాబాద్ మండలాల్లోని 163 సర్పంచ్లు, 1,432 వార్డులకు ఎన్నికలు మొదటి విడతలో నిర్వహించారు. అందులో 16 సర్పంచ్లు, 224 వార్డులు ఏకగ్రీవం కాగా గురువారం147 సర్పంచ్, 1,208 వార్డులకు ఎన్నికలు జరిగాయి. అందులో బీఆర్ఎస్ బలపర్చినవారు సర్పంచ్లుగా 68 మంది, కాంగ్రెస్కు చెందిన వారు 59 మంది, బీజేపీ వారు 8, ఇతరులు 12 మంది గెలుపొందారు. నేతల విస్తృత ప్రచారం బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థుల మద్దతుగా ముఖ్యనాయకులు అంతగా ఎవరూ ప్రచారం చేయనప్పటికీ ఆ పార్టీ నాయకులే ఎక్కువగా సర్పంచ్లుగా గెలుపొందారు. మండల నాయకుల సహకారంతో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్క ఓటరును కలిసి గ్రామ అభివృద్ధి ఎజెండాను వివరించి తమకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఇద్దరు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ఉన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఐదు మండలాల్లో 46 మంది , దుబ్బాక నియోజకవర్గంలో రెండు మండలాల్లో 22 మంది బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు సర్పంచ్లుగా విజయం సాదించారు. రెండు, మూడో విడతలపై ప్రభావం మొదటి విడతలో వచ్చిన ఫలితాలు రెండవ, మూడవ విడతలలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల పై ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో ఆయా పార్టీల నేతలు ప్రచార వేగం పెంచారు. జిల్లాలో అత్యధికంగా సర్పంచ్లు గెలుపొందాలని లక్ష్యంగా రెండు పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఈ నెల 14న, 17న ఆయా గ్రామ పంచాయతీల్లో జరిగే ఎన్నికల్లో ప్రజలు ఏ గ్రామ పంచాయతీలో ఎవరికి పట్టం కడతారో వేచిచూడాల్సిందే.గజ్వేల్లో 46 చోట్ల కాంగ్రెస్ గెలుపు జిల్లా కాంగ్రెస్ పార్టీ(డీసీసీ) అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిలు ఇద్దరు గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన వారే కావడంతో పలు గ్రామాల్లో ప్రచారంలో పాల్గొన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఐదు మండలాల్లో 46 సర్పంచ్లు గెలుపొందారు. దుబ్బాక నియోజకవర్గంలో రెండు మండలాల్లో 13 కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులకు సర్పంచ్ పదవులు దక్కాయి. ఈ ఇద్దరు నేతలు వర్గల్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీపై ప్రత్యేక దృష్టి పెట్టినప్పటికీ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి ఓటమి చెందడం గమనార్హం. -
రేపే మల్లన్న కల్యాణం
పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి కొండా సురేఖ స్వామివారి కల్యాణం సందర్భంగా స్వామివారికి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమర్పించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు మంత్రి తీసుకువచ్చేందుకు దేవాదాయ శాఖ.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి తీసుకున్నది. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ● నేడు దిష్టి కుంభానికి బియ్యం సేకరణకొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి వార్షిక కల్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఆదివారం ఆలయ తోట బావి వద్ద కల్యాణమండపంలో ఉదయం 10.45 గంటలకు స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు. వీర శైవ ఆగమశాస్త్ర సంప్రదాయం ప్రకారం ఉజ్జయిని పీఠాధిపతులు సిద్ధిలింగరాజశికేంద్రశివాచార్య మహాస్వామి పర్యవేక్షణలో కల్యాణం నిర్వహిస్తారు. మొదట ఆలయ గర్భగుడిలో మూల విరాట్కు కల్యాణం నిర్వహించేందుకు వధువు (బలిజమేడలమ్మ, గొల్ల కేతమ్మ) తరఫున మహాదేవుని వంశస్తులు, వరుడు మల్లికార్జున స్వామి తరఫున పడిగన్నగారి వంశస్తులు పెండ్లి పెద్దలుగా వ్యవహరిస్తారు. అదే సమయంలో తోట బావి వద్ద కల్యాణోత్సవంలోనూ వీరే పెళ్లి పెద్దలుగా వ్యవహరించనున్నారు. ఆదివారం తెల్లవారుజామున 6 గంటలకు స్వామి వారి ఆలయంలో దిష్టి కుంభం నిర్వహిస్తారు. శనివారం గ్రామంలో అందరి ఇళ్లలోంచి రతి బియ్యాన్ని తీసుకువస్తారు. దీంతో మల్లన్న కల్యాణ వేడుకల తంతు ప్రారంభమవుతుంది. మల్లన్న కల్యాణంతో జాతర షురూ.. మల్లన్న బ్రహ్మోత్సవాలు మార్గశిర మాసం చివరి ఆదివారంతో మొదలై ఫాల్గున మాసం చివరి ఆదివారం అగ్ని గుండాలతో జాతర ముగుస్తుంది. పూజా సామగ్రి సిద్ధం కల్యాణోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా సామాగ్రిని ఆలయ అర్చకులు శుక్రవారం సిద్ధం చేశారు. స్వర్ణకిరీటం, కోరమీసాలు, ఖడ్గం, రుద్రాక్షమాల, స్వామి వారి నామాలు, పంచహారతి, రుద్రపాదం, తదితర సామగ్రిని సిద్ధం చేశారు. వైభవంగా నిర్వహిస్తాం కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కల్యాణోత్సవానికి సుమారు 50 వేల మందికి పైగా భక్తులు హాజరు కానున్నారు. భక్తులకు ఇబ్బందులకు కలగకుండా ఏర్పాటు పూర్తి చేశాం. – వెంకటేశ్, ఆలయ ఈఓ -
సంకుల సమరమే
● పార్టీల ప్రభావం అంతంతే.. ● అభ్యర్థి కేంద్రంగానే ఎన్నికలు వెల్దుర్తి(తూప్రాన్): గత అనుభవాలు, క్షేత్రస్థాయిలో ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే పంచాయతీ ఎన్నికల పోరు, సం‘కుల’ సమరంగా మా రింది. పల్లెల్లో కులాలు, వర్గాల ప్రాతిపదికనే సమీకరణలు సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. మెజారిటీ పంచాయతీల్లో ఇదే పరిస్థితి ఉండగా, కులాలవారీగా సమావేశాలు, విందులు జోరందుకున్నాయి. పార్టీల ప్రభావం అంతంత మాత్రంగానే ఉండగా, అభ్యర్థి కేంద్రంగా ఎన్నికలు జరుగుతున్నాయి. గెలిచాక ఏదో ఒక పార్టీ వంచన చేరే అవకాశాలు లేకపోలేదు. ఎన్నికల గుర్తులతో అభ్యర్తులు ప్రజలను కలుస్తూ తనకు ఓటువేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. పార్టీల ప్రభావం అంతంతే.. అసెంబ్లీ ఎన్నికలు పార్టీ కేంద్రంగా జరిగితే పంచాయతీ ఎన్నికలు ప్రధానంగా అభ్యర్థి కేంద్రంగా జరగుతున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తి కూడా ఇదే. పచ్చని పల్లెల్లో రాజకీయాలకు అతీతంగా ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతో పార్టీలకు సంబంధం లేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పార్టీలకు సంబంధం లేని గుర్తులనే కేటాయిస్తున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి చూస్తే గ్రామాల్లో పార్టీలతో సంబంధం లేకుండానే ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లోనైతే పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. కులాల వారీగా అభ్యర్థులు సర్పంచ్ పదవుల రిజర్వేషన్లు ఖరారైన వెంటనే ఆయా గ్రామాల్లో కులాలవారీగా పెద్దలు రంగంలోకి దిగారు. ఎక్కువ మంది సంఘ సభ్యులున్నచోట తమ అభ్యర్థిని బరిలో నిలిపారు. పోటీ అధికంగా ఉన్న చోట ఆశావహుల నడుమ రాజీ కుదుర్చి ఒక్కరే బరిలో ఉండేలా చూసుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో అవకాశం రానివారికి రాబోయే మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో అవకా శం వచ్చేలా చూస్తామని హామీ ఇవ్వగా కొందరూ పోటీకి దూరంగా ఉన్నారు. మరికొందరు మాత్రం బరిలో నిలిచారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలే కాకుండా జనరల్ స్థానాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. -
అభివృద్ధే లక్ష్యంగా ముందుకు..
హుస్నాబాద్: ‘నా రాజకీయ పరపతిని హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి వినియోగిస్తా.. ప్రగతే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నా’ నని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో నూతనంగా గెలుపొందిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులను సన్మానించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని 173 మంది సర్పంచ్లకు త్వరలో పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామాల అభివృద్ధిపై శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మొదటి విడతలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గణనీయమైన స్థానాలు గెలుచుకున్నారన్నారు. రెండో విడత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులనే గెలిపించాలని కోరారు. గాంధీజీ కలలు కన్న విధంగా గ్రామాభివృద్ధికి కృషి చేయాలన్నారు. ప్రజల సమస్యలను ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలన్నారు. ఇంజనీరింగ్ కళాశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, బాసర ట్రిపుల్ ఐటీ బ్రాంచ్, కరీంనగర్, జనగామ, అక్కన్నపేట నాలుగు లేన్ల రోడ్, 250 పడకల ఆస్పత్రి, ఎల్లమ్మ చెరువును అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.నాగారం గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దుతా.. హుస్నాబాద్రూరల్: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. శుక్రవారం నాగారంలో కుమారస్వామికి మద్ధతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాగారం గ్రామానికి కావల్సిన అభివృద్ధికి నిధులను ఇస్తామన్నారు. గ్రామానికి మౌలిక వసతులు కల్పనకు నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. మహ్మదాపూర్లో కాంగ్రెస్ నాయకుడు తౌటు రాజయ్య ఇటీవల మరణించి వారి కుటుంబాన్ని పరామర్శించి భరోసా ఇచ్చారు. వీరి వెంట మార్కెట్ వైస్ చైర్మన్ బంక చందు, బొలిశెట్టి శివయ్య, చిత్తారి రవీందర్ తదితరులు ఉన్నారు. రాజకీయ పరపతిని వినియోగిస్తా త్వరలో నూతన సర్పంచ్లకు శిక్షణ మంత్రి పొన్నం ప్రభాకర్ -
ఉద్యాన డిగ్రీ ప్రవేశాలకు ఆహ్వానం
ములుగు(గజ్వేల్): ఉద్యాన విశ్వవిద్యాలయంలోని డిగ్రీలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ భగవాన్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 17న ఉదయం 10:30 నుంచి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కంబైన్డ్ కౌన్సెలింగ్కు దరఖాస్తు సమర్పించాలన్నారు. ఎప్సెట్ –2025లో ర్యాంకు పొందిన విద్యార్థులు ఈ కౌన్సెలింగ్ కు హాజరు కావచ్చన్నారు. విశ్వవిద్యాలయం పరీక్షా కేంద్రంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారన్నారు. మరిన్ని వివరాలకు 96524 56779 నంబర్ను సంప్రదించాలని ఆయన సూచించారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించండి: జడ్జి రేవతి హుస్నాబాద్: ప్రభుత్వం అమలు చేస్తున్న హెల్త్ స్కీంలు ప్రజలకు తెలిసే విధంగా అవగాహన కల్పించాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రేవతి కోరారు. శుక్రవారం ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలను తెలుసుకున్నారు. వైద్య పరికరాలు, మందులు పరిశీలించారు. అనంతరం జడ్జి రేవతి మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. గ్రామాల్లో, పాఠశాలల్లో హెల్త్ క్యాంప్లు నిర్వహించి వైద్యం అందించాలని కోరారు. అనంతరం కోర్టు హాల్లో ఈ నెల 21న నిర్వహించే లోక్ అదాలత్ కార్యక్రమం సందర్భంగా పోలీస్, ఎకై ్సజ్ అధికారులతో కో ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ప్రమిద, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ రెడ్డి, న్యాయవాదులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. చదువుతోనే ఉజ్వల భవిష్యత్ ప్రశాంత్నగర్(సిద్దిపేట): చదువుతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్చంద్రబోస్ విద్యార్థులకు సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత వసతి గృహం ఆవరణలో విద్యార్థులను కలిసి మాట్లాడారు. వసతి గృహంలో అన్ని రకాల మౌలిక సౌకర్యాలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. విద్యార్థి దశ నుంచే మంచి అలవాట్లను, క్రమశిక్షణ, సమయపాలనను అలవర్చుకోవాలన్నారు. పీఓ, ఏపీఓలకు శిక్షణ హుస్నాబాద్రూరల్: డివిజన్లో 3వ విడత పంచాయతీ ఎన్నికలు జరగనుండగా పీఓ, ఏపీఓ అధికారులకు శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రమేశ్ మాట్లాడుతూ గ్రామాల్లో వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. బ్యాలెట్ పేపర్లు, పోలింగ్ బాక్స్లు సీల్ వేయడం, ఓట్ల లెక్కింపునకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు త్వరగా బ్యాలెట్ పేపర్ ఇచ్చి ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలన్నారు. మద్దూరులో.. మద్దూరు(హుస్నాబాద్): ఉమ్మడి మద్దూరు మండల పరిధిలో శుక్రవారం ప్రొసీడింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. పోలింగ్ రోజున నిర్వహించాల్సిన విధులపై శిక్షణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మద్దూరు, ధూళ్మిట్ట మండలాల ఎంపీడీఓలు, ఎంఈవోలు పాల్గొన్నారు. ఫోన్ ఇన్ కార్యక్రమం రద్దుసిద్దిపేటకమాన్: సామాన్య ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకునేందుకు ప్రతి శనివారం సీపీతో నిర్వహించే ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించడం లేదని సీపీ విజయ్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఫోన్ ఇన్ కార్యక్రమం రద్దు చేసినట్లు తెలిపారు. ఈ నెల 20న యథావిధిగా తిరిగి నిర్వహించనున్నట్లు సీపీ పేర్కొన్నారు. -
భారీ రోడ్షోలు.. ర్యాలీలు
మిరుదొడ్డి(దుబ్బాక): ప్రచారానికి శుక్రవారం ఆఖరి రోజు కావడంతో అయా గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు భారీ రోడ్డు షోలు నిర్వహించారు. తమకు కేటాయించిన గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఓటర్లను అభ్యర్థించారు. అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని రుద్రారంలో సర్పంచ్ అభ్యర్థిగా బరీలో నిలిచిన కాముని మంజుల ఎన్నికల ప్రచారంలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాళ్లబండి శశిధర్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి గోపాల స్వామి, జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్, శిరీష తదితరులు పాల్గొన్నారు. కాముని మంజులను గెలిపించాలని కోరుతూ ఓటర్లను అభ్యర్థించారు. -
పటిష్ట బందోబస్తు
సీపీ విజయ్కుమార్ సిద్దిపేటకమాన్: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు సీపీ విజయ్కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట అర్బన్, రూరల్, అక్బర్పేట భూంపల్లి, బెజ్జంకి, చిన్నకోడూరు, దుబ్బాక, మిరుదొడ్డి, నంగునూరు, నారాయణరావుపేట, తొగుట మండలాల్లో ఈ నెల 14న పోలింగ్ జరగనున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రానికి 100మీటర్ల లోపల, ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వెళ్లే మార్గంలో ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పోలీసులకు ప్రజలు సహకరించాలని తెలిపారు. -
ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్
మిరుదొడ్డి(దుబ్బాక): రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. ఈ మేరకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం మిరుదొడ్డి మండలంతో పాటు, అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమావళి నిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్రాల్లో కరెంటు, విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు, ర్యాంపులు, మరుగుదొడ్లు, తాగు నీటి వసతి కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నెట్ కనెక్షన్ ఉండే విధంగా చూసుకోవాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ గంగుల గణేశ్రెడ్డి, ఇన్చార్జి ఎంపీఓ ఫహీం, ఆయా గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాలలో సౌకర్యాలు కల్పించాలి పోలింగ్ కేంద్రాల పరిశీలన తొగుట(దుబ్బాక): ఓటర్లకు ఇబ్బందులు కలుగకుండా పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి హైమావతి అధికారులను ఆదేశించారు. మండలంలోని గుడికందుల, పెద్ద మాసాన్పల్లి గ్రామాల్లో శుక్రవారం పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. -
కొమురవెల్లిలో భక్తులకు ఇబ్బందులు తలెత్తొద్దు
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లిలో ఈనెల 14న జరిగే మల్లన్న కల్యాణ ఏర్పాట్లను దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు గురువారం ఆలయ అధికారులతో కలిసి పరిశీలించారు. స్వామి వారి కల్యాణం జరిగే తోటబావి ప్రాంగణం, క్యూకాంప్లెక్స్, ఆలయ పరిసరాలను సందర్శించారు. అనంతరం ఆలయ కార్యాలయంలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి తగు సూచనలు చేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ పరిసరాలలో శానిటేషన్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆయన వెంట ఏసీ సుధాకర్ రెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఓం ప్రకాశ్, ఆలయ ఈఓ వెంకటేశ్, ఏఈఓ బుద్ది శ్రీనివాస్, పర్యవేక్షకులు చంద్రశేఖర్లు ఉన్నారు. వెండి వస్తువుల బహూకరణ మల్లన్న స్వామికి అమీన్పూర్కు చెందిన భక్తులు తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి 500 గ్రాములు వెండి వస్తువులను విరాళంగా గురువారం ఆలయ ఈఓ టంకసాల వెంకటేశ్కు అందిచారు. స్వామివారికి నైవేద్యం సమర్పించేందుకు ఉపయోగించే వెండి బాక్స్లను బహూకరించారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్, ముఖ్య అర్చకులు చిన్న మల్లికార్జున్, మనోహర్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
‘బొమ్మ’ ఆశయాలను కొనసాగిస్తాం
● మంత్రి పొన్నం ప్రభాకర్ ● ఏకగ్రీవంగా ఎన్నికై న సర్పంచ్ భూక్య రాజేశ్వరికి సన్మానం హుస్నాబాద్: ఇందుర్తి మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు ఆశయాలను కొనసాగిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బొమ్మ వెంకటేశ్వర్లు జయంతిని పురస్కరించుకుని గురువారం ఆయన విగ్రహానికి మంత్రి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడే బలహీన వర్గాల ఉద్యమం, సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తి వెంకటేశ్వర్లు అని కొనియాడారు. ఈ ప్రాంతంలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర సందర్బంగా ప్రజల ఆకాంక్ష గౌరవెల్లి ప్రాజెక్టు సాధన కోసం పని చేశారన్నారు. మార్గదర్శిగా ఉన్న బొమ్మ వెంకటేశ్వర్లు ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, నాయకులు చిత్తారి రవీందర్, ఎండీ హస్సెన్ తదితరులు ఉన్నారు. సర్పంచ్, ఉప సర్పంచ్లకు సన్మానం హుస్నాబాద్ మండలం వంగ రామయ్య పల్లి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికై న భూక్య రాజేశ్వరి తిరుపతిని మంత్రి పొన్నం ప్రభాకర్ సత్కరించి అభినందించారు. అలాగే ఏకగ్రీవంగా ఎన్నికై న ఉప సర్పంచ్ దండుగుల రాజుతో పాటుగా వార్డు సభ్యులను సన్మానించారు. -
బీఆర్ఎస్ 73కాంగ్రెస్ 64
మొదటి విడత పల్లె పోరులో పోటాపోటీగా ఫలితాలు సాక్షి, సిద్దిపేట: పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ఉత్కంఠ భరితంగా సాగింది. పోలీసుల భారీ బందోబస్తు మధ్య కౌంటింగ్ జరిగింది. హోరాహోరీగా సాగిన తొలివిడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు అధికార, ప్రతిపక్షాలు పోటా పోటీగా సర్పంచ్లను దక్కించుకున్నారు. మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే ఎక్కువగా విజయం సాధించారు. అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. గ్రామ పంచాయతీ ఎన్నికలను రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ఈ రెండు పార్టీల మద్దతుదారులు పోటాపోటీగా ప్రచారం చేశారు. వారం రోజుల పాటు ప్రచారాన్ని హోరెత్తించారు. పెద్ద మొత్తంలో ఎన్నికల్లో ఖర్చు చేశారు. మద్యం, మాంసం, విందులు ఇచ్చారు. కీలకమైన కులసంఘాలు, యువతను ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. బీఆర్ఎస్ బలంగా ఉన్న చోట.. తొలి విడతలో గజ్వేల్, జగదేవ్పూర్, మర్కూక్, వర్గల్, ములుగు, దౌల్తాబాద్, రాయపోలు మండలాల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 163 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా బీఆర్ఎస్ పార్టీ 73 సర్పంచ్ స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 64 సర్పంచ్లు, బీజేపీ 10 సర్పంచ్ స్థానాలు, ఇండిపెండెంట్లు 16 సర్పంచ్లు దక్కించుకున్నాయి. బీఆర్ఎస్ పార్టీల బలంగా ఉన్న చోట కాంగ్రెస్ సర్పంచ్లు గెలుపొందడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. వికసించని కమలం కమలం పార్టీ మద్దతు దారులు ఈ ఎన్నికల్లో తమ ఉనికి చాటలేదు. గత పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన కమలం పార్టీ పంచాయతీ ఎన్నికలకు వచ్చే సరికి ఆ స్థాయిలో సత్తా చాటలేకపోయింది. మరోవైపు స్వతంత్రుల కంటే బీజేపీ సర్పంచ్లు తక్కువ మంది గెలుపొందారు.. ఆయా గ్రామాల్లో అభ్యర్థికి ఉన్న మంచి పేరుతో విజయం సాధించినట్లయింది. ఈ గ్రామాల ప్రజలు పార్టీలకు అతీతంగా స్వతంత్య్ర అభ్యర్థిని గెలిపించడం గమనార్హం. తూంకుంట ఇలాకాలో బీఆర్ఎస్.. మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డిది వర్గల్ మండల కేంద్రం.. అక్కడ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జయభారతి గెలుపొందారు. డీసీసీ అధ్యక్షురాలిగా ఆంక్షారెడ్డి నియమితులైన తర్వాత తొలి ఎన్నికల్లోనే పార్టీ బలపర్చిన అభ్యర్థి ఓటమి చెందారు. డ్రాతో సర్పంచ్గా గెలిచి.. మర్కూక్ మండలం గంగాపూర్–యూసుఫ్ఖాన్పల్లి సర్పంచ్గా పోటీ చేసిన ఇద్దరు బీఆర్ఎస్కు చెందిన వారే.. ఐతం శ్యామల, జంపల్లి లక్ష్మికి 194 ఓట్ల చొప్పున వచ్చాయి. డ్రా తీయగా శ్యామల గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. డ్రా తీసినప్పుడు ఎవరి పేరు వచ్చిందో పూర్తిగా చూపించ కుండానే శ్యామల గెలుపొందారని ప్రకటించారని లక్ష్మి తన అనుచరులతో కలిసి ఆందోళన చేశారు. దీంతో పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జీ చేశారు. ఈ ప్రకటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని లక్ష్మి తెలిపారు. -
ఓటెత్తిన పల్లె
88.05 శాతం పోలింగ్ నమోదు.. తొలి విడత 147 సర్పంచ్, 1,208 వార్డుల్లో ఎన్నికలు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటేసిన పల్లె వాసులు సాక్షి, సిద్దిపేట: జిల్లాలో పల్లె ఓటరు ఓటెత్తారు. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. జిల్లాలోని ఏడు మండలాల్లో పోలింగ్ జరిగింది. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని గజ్వేల్, మర్కూక్, జగదేవ్పూర్, ములుగు, వర్గల్, దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్, రాయపోలు మండలాలల్లో ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవమైన స్థానాలు మినహాయించి 147 సర్పంచ్, 1,208వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చలి తీవ్రత కారణంగా... ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో తొలి గంట సేపు పోలింగ్ నెమ్మదిగా సాగింది. 8 గంటల నుంచి ఊపందుకుంది. పోలింగ్కు ఆరు గంటల సమయం ఉండటంతో పోలింగ్ కేంద్రాలకు త్వరగా వచ్చారు. హైదరాబాద్కు ఉపాధికి, ఉద్యోగ కోసం వెళ్లిన పల్లె ఓటర్లు తమ సొంత గ్రామానికి చేరకుని ఓటు వేశారు. చాలా మంది ఓటర్లను అభ్యర్థులు తమ సొంత వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలించారు. చివరి అరగంట పోలింగ్ కేంద్రాల వద్ద హడావుడి కనిపించింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హైమావతి, సీపీ విజయ్ కుమార్ పర్యవేక్షించారు. భారీగా పోలింగ్.. తొలివిడత పోలింగ్ భారీగానే నమోదైంది. ఏకంగా 88.05 శాతం నమోదైంది. రాయపోలు మండలంలో అత్యధికంగా 89.59 శాతం పోలింగ్ నమో దైంది. అత్యల్పంగా జగదేవ్పూర్లో 84.27 శాతం ఓట్లు పోలయ్యాయి. మహిళలు అత్యధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఓటింగ్ సరళి ఇలా.. ఉదయం 9 గంటల వరకు పోలైన ఓట్లు: 44,995 (24.46 శాతం) 11 గంటల వరకు ఇలా: 1,10,488 (60.06 శాతం) మధ్యాహ్నం 1 గంట వరకు : 1,47,348 (80.10 శాతం) పోలింగ్ ముగిసే సమయం వరకు : 1,61,971 (88.05 శాతం) -
జాలిగామలో ఉద్రిక్తత
గజ్వేల్రూరల్: గజ్వేల్ మండలం జాలిగామలో గురువారం జరిగిన ఎన్నికల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఓటర్లను ప్రలోభ పెడుతూ ప్రచా రం నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారంతో పోలీసులు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి తాళ్ల లావణ్య భర్త నవీన్గౌడ్ను, 4వ వార్డు స్వతంత్ర అభ్యర్థి కరుణాకర్ భార్య అనసూయలను అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా పోలింగ్ కేంద్రం సమీపంలో గుంపులుగుంపులుగా వస్తుండటంతో పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బహిలంపూర్లో.. ములుగు(గజ్వేల్): మండల పరిధి బహిలంపూర్లో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం సమీపంలో అధికారులు నిర్దేశించిన ప్రదేశంలో వేచిఉన్న వారిని పోలీసులు అక్కడినుంచి పంపించే క్రమంలో గ్రామస్తులకు, పోలీసులకు వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని గ్రామస్తులకు నచ్చజెప్పడంతో సమస్య సద్దుమణిగింది. -
పల్లెకు పైసలెట్ల వస్తాయంటే..!
● సొంత వనరులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు ● ఆయా నిధులతోనే మౌలిక, సామాజిక వసతుల కల్పన ● మూడు రకాలుగా సమకూరనున్న ఆదాయం జహీరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలో కొత్త పాలక మండలి ఏర్పడనుంది. ఈ క్రమంలో గ్రామాభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు నిధుల అవసరం ఎంతో ఉంటుంది. ఇందు కోసం గ్రామ పంచాయతీలు ముఖ్యంగా సొంత వనరులను సమకూర్చుకోవడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రాంట్ల రూపంలో నిధులు పొందుతాయి. కర్మాగారాల నుంచి సీఎస్ఆర్ నిధులు కూడా కేటాయింపులు జరుగుతాయి. పంచాయతీలు విధించే పన్నులు, రుసుముల ద్వారా ఆదాయం పొందుతాయి. ఇంటి, నల్లా, వృత్తి, వ్యాపార పన్నులు, వారపు సంతలు, మార్కెట్ల నిర్వహణ, పంచాయతీకి చెందిన భవనాలు, ఖాళీ స్థలాల వంటి ఆస్తులు అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటాయి. కేంద్ర ప్రభుత్వ నిధులు ఐదు సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లోకి కేంద్ర ఆర్థిక సంఘం గ్రాంట్లు బదిలీ అవుతాయి. ఇవి పారిశుద్ధ్యం మౌలిక వసతుల కల్పనకు ఉపయోగపడతాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులకు, కూలీల వేతనాలకు నిధులు అందుతాయి. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా గ్రామ పారిశుద్ధ్య, ఘన వ్యర్థాల నిర్వహణకు నిధులు కేటాయిస్తారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వంటి పథకాలతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరవుతాయి. కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ ద్వారా శుద్ధమైన తాగునీటి సరఫరాకు నిధులు విడుదల చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి.. రాష్ట్ర ప్రభుత్వం స్టాంపు డ్యూటీ వాటా చెల్లిస్తుంది. భూముల కొనుగోలు, రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే స్టాంపు డ్యూటీలో కొంత వాటాను పంచాయతీలకు అందిస్తుంది. రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు అభివృద్ధి, నిర్వహణ ఖర్చుల కోసం ప్రభుత్వం సాధారణ గ్రాంట్లు విడుదల అవుతాయి. ప్రత్యేక అవసరాల కోసం ముఖ్యమంత్రి హామీల అమలుకు, ఇతర కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. గ్రామ పంచాయతీ ఖర్చులను మూడు రకాలుగా పరిశీలించవచ్చు. కార్యాలయ నిర్వహణ, పాలనా వ్యయాలు, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, పచ్చదనం నిర్వహణ, సామాజిక కార్యక్రమాలకు నిధులు వ్యయం చేస్తారు. ప్రజలు కేంద్ర ప్రభుత్వ ఈ గ్రామ స్వరాజ్ పోర్టల్ ద్వారా పంచాయతీకి కేటాయించిన బడ్జెట్, ఖర్చుల వివరాలు, ఆడిట్ నివేదికను సులభంగా పరిశీలించవచ్చు. ఇది గ్రామాభివృద్ధిలో జవాబుదారీ తనాన్ని పెంచుతుంది. -
గౌరవెల్లి ప్రాజెక్టుకు ‘బొమ్మ’ పేరు పెట్టాలి
హుస్నాబాద్: గౌరవెల్లి ప్రాజెక్టుకు మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు పేరు పెట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్కు విజ్ఞప్తి చేస్తామని కాంగ్రెస్ నాయకులు అన్నారు. గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బొమ్మ వెంకటేశ్వర్లు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్టు బీజం పడింది వెంకటేశ్వర్లు కృషి వల్లేనని కొనియాడారు. ఈ ప్రాంతంలో బస్ డిపో, కోర్టు, డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు విశేషంగా కృషి చేశారన్నారు. పేద ప్రజల అభ్యున్నతికి తోడ్పాటును అందించారన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేశారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర హౌస్ ఫెడ్ మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరాంచక్రవర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు. -
ఆల్జీబ్రా.. గుండె గాబరా ఇక ఉండదు
సాక్షి, సిద్దిపేట: ఆల్జీబ్రా.. గుండె గాబరా అనే చందంగా లెక్కలంటే కొందరు విద్యార్థులకు చెప్పలేనంత భయం. పరీక్షల్లో మిగతా సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు సాధిస్తున్నా మ్యాథ్స్లో మాత్రం జస్ట్ పాస్ మార్కులతో గట్టెక్కడం లేదా ఫెయిల్ అవుతూ ఉంటారు. అదే సమయంలో ఆటపాటలను మాత్రం ఎంతో ఇష్టపడుతుంటారు. విద్యార్థుల్లో గణితంపట్ల ఉన్న ఈ భయాన్ని పోగొట్టి లెక్కలంటే ఇష్టం పెంచేందుకు సిద్దిపేట జిల్లా వర్గల్లోని జవహర్ నవోదయ విద్యాలయం సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. విద్యాలయం ప్రాంగణంలో దాదాపు 500 గజాల విస్తీర్ణంలో మ్యాథ్స్ థీమ్ పార్కును ఏర్పాటు చేసింది. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ఉపయోగపడేలా థీమ్ పార్కును తీర్చిదిద్దింది. తరగతి గదిలో బోధనతోపాటు ఓపెన్ స్పెస్ లర్నింగ్ ద్వారా విద్యార్థులు సులువుగా, త్వరగా అర్థం చేసుకునేలా గణితం ఉపాధ్యాయులు అమ్మని, శేషు, అనిల్ కుమార్ పాఠాలు బోధిస్తున్నారు. వారంలో రెండు క్లాస్లను మ్యాథ్స్ పార్క్లో ప్రత్యక్షంగా వివిధ ఆకారాలను చూపిస్తూ బోధిస్తున్నారు. సర్కిల్ తీరంస్, టైప్ ఆఫ్ యాంగిల్స్, ట్రైయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్, ఎక్స్టర్నల్, పైథాగరస్ పెంటగాన్, కోన్, ట్రైయాంగిల్ ప్రిజం, స్క్వేర్ ప్రిజం, త్రీ డైమన్షనల్ ప్లేన్, సిలిండర్, క్యూబ్, క్యూబాయిడ్, పిరమిడ్ వంటి ఆకారాలతో పార్క్ను నిర్మించారు. అందులో ల్యాడర్ గేమ్, ప్రైమ్ ఫాక్టర్స్ ఆటలను ఆడిస్తూ తరగతులు చెబుతున్నారు. జామెట్రికల్, టూడీ, త్రీడీ, సాలిడ్ ఫిగర్స్, క్షేత్ర సమితి, వైశాల్యాలు, ఘన పరిమాణాలు, సమాంతర రేఖలు, గ్రాఫ్లపై విద్యార్థులకు మెరుగైన అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు పార్క్ మధ్యలో ప్రఖ్యాత గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.సులభంగా అర్థమవుతోంది మ్యాథ్స్ థీమ్ పార్క్లో వివిధ తీరంస్ను చూపిస్తూ ప్రత్యక్షంగా బో«ధించడంతో సులభంగా అర్థమవుతోంది. వివిధ యాంగిల్స్ గురించి ఇలా నేర్పించడంతో ఎప్పటికీ గుర్తుండి పోతాయి. ఓపెన్ స్పేస్ లర్నింగ్ ఎంతో ఉపయోగపడుతోంది. – అఖిలేష్, 7వ తరగతి ఓపెన్ లర్నింగ్లో భాగమే.. విద్యార్థులు చూస్తూ నేర్చుకోవడంతో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. విద్యార్థులకు తరగతి గదిలోనే బోధన కాకుండా ఓపెన్ లర్నింగ్ ద్వారా విద్యను అందిస్తున్నాం. హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీలో భాగంగా మ్యాథ్స్ పార్క్ను నిర్మించాం. పీఎంశ్రీ పథకం, పాఠశాల నిధులతో ఈ పార్క్ను ఏర్పాటు చేశాం. – రాజేందర్, ప్రధానోపాధ్యాయుడు, నవోదయ విద్యాలయ, వర్గల్ -
ఏమవుతుందో ఏమో..?
దుబ్బాక/వర్గల్: పంచాయతీ ఎన్నికల పర్వం తుదిఅంకానికి చేరుకోవడంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. గెలుపే లక్ష్యంగా ముమ్మర ప్రచారం కొనసాగించిన అభ్యర్థులు బుధవారం ఓటరు దేవుని ప్రసన్నం కోసం చిట్టచివరి ప్రయత్నం వదలలేదు. గుట్టు చప్పుడు కాకుండా కొన్ని గ్రామాల్లో ఓటర్లకు తాయిళాలు, నగదు, మద్యం పంపిణీ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. తొలి విడత ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లోని సర్పంచ్, వార్డు సభ్యుల కుటుంబాల్లో తీవ్ర అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతుండటం.. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు కానుండటంతో పోటీలో ఉన్న అభ్యర్థుల గుండెల్లో గుబులు నెలకొంది. ఇన్ని రోజులు సర్వశక్తులు ఒడ్డి ప్రచారాలు.. ప్రలోభాలు చేపట్టాం.. ఇప్పుడు ఏం జరుగుతుందో? తీర్పు ఎలా ఉంటుందో? నన్న తీవ్ర ఉత్కంఠ వారిలో నెలకొంది. గెలవకుంటే ఎట్లా..? ‘ఉన్న ఆస్తులు తాకట్టు పెట్టాం.. అమ్ముకున్నాం.. అప్పులు తెచ్చి ఎన్నికల్లో నిలబడ్డాం ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో..’ అంటూ పోటీలో ఉన్న అభ్యర్థులు తీవ్ర కలవరం చెందుతున్నారు. గెలవకుంటే ఎట్లా అన్న సందిగ్ధం వారిలో నెలకొంది. ఏదేమైనా ఈ పంచాయతీ ఎన్నికలు పోటీలో ఉన్న అభ్యర్థులకు కంటిమీద కునుకులేకుండా చేశాయి. ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడుతారో కొన్ని గంటల్లో తేలనుంది. అభ్యర్థుల్లో టెన్షన్ నేడు తేలనున్న భవితవ్యం -
మానవ హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత
ప్రశాంత్నగర్(సిద్దిపేట): మానవ హక్కుల పరిరక్షణ బాధ్యత అందరిపై ఉందని అదనపు సీనియర్ జడ్జి సంతోష్కుమార్ విద్యార్థులకు సూచించారు. జాతీయ మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకుని బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అదనపు సీనియర్ జడ్జి సంతోష్కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సమాజంలో స్వేచ్ఛగా జీవించే హక్కు ఉందన్నారు. మానవ హక్కులకు భంగం వాటిల్లకుండా చేసుకునే హక్కు అందరికీ ఉందన్నారు. భంగం వాటిల్లితే మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ డిప్యూటీ చీఫ్ శరత్బాబు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. 010 ఖాతా ద్వారా జీతాలు చెల్లించాలి గజ్వేల్రూరల్: ఉద్యోగుల వేతనాలను 010 ఖాతా ద్వారా చెల్లించాలని గజ్వేల్ ప్రభుత్వాసుపత్రి సిబ్బంది డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బుధవారం గజ్వేల్ పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ అన్నపూర్ణకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వైద్య విధాన పరిషత్ను రద్దు చేసి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ ప్రధాన ఖాతా (010) ద్వారా వేతనాలు చెల్లించడం ద్వారా పారదర్శకత, ఉద్యోగ భద్రత అంశాల్లో స్పష్టత లభిస్తుందని తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆర్ఎంఓలు, వైద్యు లు, నర్సింగ్ అధికారులు, పారా వైద్య సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు. ఆన్డ్యూటీగా పరిగణించండి ప్రశాంత్నగర్(సిద్దిపేట): గ్రామ పంచాయతీ ఎన్నిలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు పోలింగ్ మరుసటి రోజు ఓడీ (ఆన్ డ్యూటీ)గా పరిగణించాలని యూటీఎఫ్ నాయకులు కోరారు. బుధవారం యూటీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ జిల్లాలో మూడు విడతల్లో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు పోలింగ్ డే మరుసటి రోజున విధులకు రావడం సాధ్యం కాదన్నారు. అందువలన పోలింగ్ మరుసటి రోజున ఓడీ ఇవ్వాలన్నారు. ఈ అంశాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని డీఈఓ తెలిపారన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తప్పెట్ల యాదగిరి, జిల్లా కార్యదర్శి గ్యార ప్రవీణ్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు తలారి కనకయ్య, కిషన్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. నేడు పత్తి కొనుగోళ్లు బంద్ గజ్వేల్రూరల్: స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు అధికారులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గురువారం గజ్వేల్ మండలం పిడిచెడ్ సమీపంలోని ఈశ్వరసాయి కాటన్ ఇండస్ట్రీస్, సాయి బాలాజీ కాటన్ ఇండస్ట్రీస్, శివగంగా కాటన్ ఇండస్ట్రీస్(బయ్యారం)తో పాటు పట్టణ శివారులోని శ్రీ వాసవి కాటన్ ఇండస్ట్రీస్(జిన్నింగ్ మిల్)లలో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు జరగవని తెలిపారు. ఎన్నికలు జరిగే రోజున కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుకింగ్ ఉండదని, గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మూసి ఉంటుందని తెలిపారు. రైతులు విషయాన్ని గుర్తించి సహకరించాలని కోరారు. -
కౌంటింగ్ పకడ్బందీగా చేపట్టాలి
● అధికారుల అనుమతి తర్వాతే ఫలితాలు వెల్లడించాలి ● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హైమావతిములుగు(గజ్వేల్): గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని, పై అధికారుల అనుమతితో ఫలితాలను విడుదల చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.హైమావతి సూచించారు. ములుగు మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లను ఆమె బుధవారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ పీఓ, ఓపీఓలకు బ్యాలెట్ బ్యాక్స్ ఉపయోగించే ప్రక్రియ గురించి ఎలాంటి సందేహాలున్నా మాస్టర్ ట్రైనర్లను అడిగి పరిష్కరించుకోవాలని తెలిపారు. పోలింగ్ మెటీరియల్తో పోలింగ్ స్టేషన్లకు వెళ్లిన సిబ్బంది ఫర్నిఛర్, బ్యాలెట్ బాక్స్లు, ఆయా మెటీరియల్ను సరిచేసుకోవాలని సూచించారు. ఓటింగ్ ప్రక్రియ తప్పనిసరిగా ఉదయం 7 గంటలకు మొదలు పెట్టాలన్నారు. ప్రతి 2 గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని తెలపాలని అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓటర్లకు ఓటు వేసుకునే అవకాశం కల్పించాలని, ఆతరువాతే బ్యాలెట్ బాక్స్లకు సీల్ వేయాలన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిచాలని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాలలోకి ఏజెంట్లు, పోలింగ్ సిబ్బందికి ఫోన్ల అనుమతి లేదన్నారు. ఎన్నికల సిబ్బందికి కావాల్సిన సౌకర్యాలు పంచాయతీ కార్యదర్శులు సమకూరుస్తారని తెలిపారు. ఎన్నికల విధులకు గైర్హాజరు అయిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అందరూ సహకరించాలి గజ్వేల్: ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అంతా సహకరించాలని కలెక్టర్ హైమావతి సూచించారు. బుధవారం గజ్వేల్ ఐఓసీ (ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్)లోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. గజ్వేల్, దుబ్బాక నియోజకర్గాల్లోని 147 సర్పంచ్ స్థానాలు, మరో 1208 వార్డు సభ్యుల స్థానాలకు మొదటి విడత పోలింగ్ జరుగుతోందని చెప్పారు. 33 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించామని, ఇందులో 5 కేంద్రాల్లో వెబ్కాస్టింగ్, మిగిలిన చోట మైక్రోఅబ్జర్వర్ల నిఘా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలన్నారు. ఓటర్లు ఓటు వేయడానికి వచ్చే సందర్భాల్లో తమ వెంట తప్పనిసరిగా గుర్తింపుకార్డును తెచ్చుకోవాలన్నారు. నిబంధనలు పాటించకతప్పకపోతే చర్యలు తప్పవన్నారు. -
పల్లె తీర్పు నేడే
మొదటి విడత పోలింగ్కు సర్వం సిద్ధంపోలింగ్ సామగ్రితో సిబ్బందిగజ్వేల్: జిల్లాలో గురువారం జరగనున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 7 నుంచి ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్, ములుగు, వర్గల్, జగదేవ్పూర్, మర్కూక్తోపాటు దుబ్బాక నియోజకవర్గంలోని రాయపోల్, దౌల్తాబాద్ మండలాల్లో 163 పంచాయతీలున్నాయి. ఇందులో 16 సర్పంచ్, 224 వార్డులు ఏకగ్రీవం కాగా మిగిలిన 147 సర్పంచ్, 1208వార్డుల్లో పోలింగ్ జరగనున్నది. ఎన్నికల సామగ్రి పంపిణీ.. ఎన్నికల సిబ్బందికి అధికారులు సామగ్రి అందజేశారు. గజ్వేల్ మండలానికి సంబంధించి పట్టణంలోని ఐఓసీ(ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్)లో, మర్కూక్ మండలానికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, ములుగు మండలానికి రైతు వేదిక, వర్గల్ మండలానికి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, జగదేవ్పూర్ మండలానికి ఎస్వీ ఫంక్షన్ హాల్లో, దౌల్తాబాద్ మండలానికి తెలంగాణ మోడల్ స్కూల్లో, రాయపోల్ మండలానికి జీఎల్ఆర్ ఫంక్షన్హాలులో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గజ్వేల్, ములుగు, రాయపోల్, దౌల్తాబాద్ సామాగ్రి పంపిణీ కేంద్రాలను కలెక్టర్ హైమావతి, అధికారులు పోలింగ్ నిర్వహణపై సూచనలు చేశారు. సాయంత్రం పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకుసామగ్రితో తరలివెళ్లారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా పోలీసు శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టింది. ఇందులోభాగంగా ఇద్దరు అదనపు ఎస్పీలు, ముగ్గురు ఏసీపీలు, 15మంది సీఐలు, 35మంది ఎస్ఐలు, రెండు ఫ్లటూన్లు, 900మంది ఏఎస్ఐలు, హెడ్కానిస్టేబుళ్లు కలుపుకొని 1010 మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు గజ్వేల్ ఏసీపీ నర్సింహులు తెలిపారు. మండలాల వారీగా ఓటర్ల వివరాలు.. గజ్వేల్ మండలంలో 34,006మంది ఓటర్లు ఉండగా, ఇందులో 16,544 మంది పురుషులు, 17,460మంది మహిళలు, మరో ఇద్దరు ఇతరులు ఉన్నారు. ములుగు మండలంలో 31,055మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 15,450మంది పురుషులు, 15,605మంది మహిళలు ఉన్నారు. మర్కూక్ మండలంలో 19,493 మంది ఓటర్లుకుగానూ 9,575మంది పురుషులు, 9,918మంది మహిళలు ఉన్నారు. వర్గల్ మండలంలో 29,241ఓటర్లు ఉన్నారు. ఇందులో 14,458మంది పురుషులు, 14,783 మంది మహిళలు ఉన్నారు. జగదేవ్పూర్ మండలంలో 31,298మంది ఓటర్లకుగానూ 15,305మంది పురుషులు, 15,993మంది మహిళలు ఉన్నారు. దౌల్తాబాద్ మండలంలో 24,484మంది ఓటర్లకుగానూ 11,974మంది పురుషులు, 12,510మంది మహిళలు ఉన్నారు. రాయపోల్ మండలంలో 21,529మంది ఓటర్లకుగానూ 10,524మంది పురుషులు, 11,005మంది మహిళలు ఉన్నారు. పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులు, వెబ్కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లు, జోనల్ అధికారులు, రూట్ అధికారులు కలుపుకొని మొత్తంగా 3,600మందికిపైగా నియమించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భద్రత కట్టుదిట్టం 147 సర్పంచ్, 1208 వార్డుల స్థానాల్లో ఎన్నికలు ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ఏకగ్రీవమైన సర్పంచ్ స్థానాలు ఇవే.. రంగంపేట(గజ్వేల్), ఎర్రవల్లి, నర్సన్నపేట(మర్కూక్), జప్తి సింగాయపల్లి(ములుగు), పలుగుగడ్డ, బీజీ వెంకటాపూర్, నిర్మల్నగర్, అనంతసాగర్, కొండాపూర్(జగదేవ్పూర్), గుంటిపల్లి, చాంద్ఖాన్మక్త, తునికి మక్త(వర్గల్) ఆరేపల్లి, కొత్తపల్లి(రాయపోల్), నర్సంపల్లి, లింగాయపల్లి తండా(దౌల్తాబాద్)లు ఉన్నాయి. -
అభ్యర్థులు ఖర్చుల వివరాలివ్వాలి
ఎన్నికల పరిశీలకురాలు నిశాంతి చేర్యాల(సిద్దిపేట): సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల వివరాలు తప్పనిసరిగా సమర్పించాలని వ్యయ పరిశీలకురాలు నిశాంతి అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బుధవారం మండల పరిధిలోని ముస్త్యాల రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఖర్చుల నిర్వహణపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో వ్యయ పరిశీలకురాలు నిశాంతి మాట్లాడుతూ అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చులకు సంబంధించిన లెక్కలు రాసి సమర్పించాలన్నారు. ఎంపీడీఓ ప్రణయ్ మాట్లాడుతూ అభ్యర్థులు ఎన్నికల నియమావలి పాటించాలన్నారు. సమావేశంలో తహసీల్దార్ దిలీప్ నాయక్, సహాయ పరిశీలకులు శ్రీనివాస్రెడ్డి, పోలీసు అదికారులు, బరిలో నిలిచిన అభ్యర్థులు, ఆఫీసు సిబ్బంది పాల్గొన్నారు. -
బీజేపీతోనే పల్లెల అభివృద్ధి
మిరుదొడ్డి(దుబ్బాక): బీజేపీతోనే పల్లెల అభివృద్ధి సాధ్యమని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్రావు అన్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మిరుదొడ్డి సర్పంచ్గా బీజేపీ బలపర్చిన కానుగంటి స్వప్న శ్రీనివాస్ గెలుపు కోపం మిరుదొడ్డిలో బుధవారం నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం లేని అభ్యర్థులకు ఓటేస్తే అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుందన్నారు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు నిధులు లేవన్న సాకుతో పాలన చేతకాక చేతులెత్తేశారని మండిపడ్డారు. కేంద్రంలో ఉన్న బీజేపీతోనే పల్లెల అభివృద్ధి సాధ్యమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో టెలికం బోర్డు మెంబర్ మొగుళ్ల మల్లేశం, నాయకులు ఎల్లం, రాములు, రాజు తదితరులు పాల్గొన్నారు.ఎంపీ రఘునందన్రావు -
ఎన్నికల నియమావళి తప్పనిసరి
దుబ్బాకటౌన్: ఎన్నికలో పోటీచేసే అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పక పాటించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ అన్నారు. బుధవారం దౌల్తాబాద్, రాయపోల్ మండల కేంద్రాల్లో గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా బందోబస్తును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమల్లో ఉంటుందని, 100 నుంచి 200 మీటర్ల పరిధిలో ప్రత్యేక నిబంధనలు ఉండటంతో ప్రజలు అనవసరంగా గుమిగూడకూడదని తెలిపారు. ఓటర్లు క్యూ లైన్ పద్ధతిని పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టేవారి పై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని తెలిపారు. గొడవలు, అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని సూచించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, గజ్వేల్ ఏసీపీ నరసింహులు, టాస్క్ ఫోర్స్ ఏసీపీ రవీందర్, తొగుట సీఐ లతీఫ్, సీసీఆర్బి ఇన్స్పెపక్టర్ రామకృష్ణ, పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.పోలీస్ కమిషనర్ విజయ్కుమార్ -
సమీపిస్తున్న పరీక్షలు.. ఎన్నికల విధుల్లో టీచర్లు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): విద్యార్థుల్లో ఎన్నికల గుబులు పట్టుకుంది. ఒకవైపు పరీక్షలు సమీపిస్తుండగా.. మరోవైపు ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయులు ఉండటంతో గడువులోగా సిలబస్ పూర్తికావడంపై సందిగ్ధం నెలకొంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలంటే నాణ్యమైన విద్యను అందించాలి. అలాగే వారిలో పరీక్షలపై ఉన్న భయాన్ని పోగొట్టాలి. దీంతో వారు పరీక్షలకు సన్నద్ధమై పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. అందుకు ముందుగానే పాఠ్యాంశాలు పూర్తి చేసి, విద్యార్థులకు పునశ్చరణ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల విధులకు ఉపాధ్యాయులను వినియోగిస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో ఉపాధ్యాయులే కీలకం. వీరికి ముందుగానే ఎన్నికల కోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అలాగే ఓటింగ్, కౌంటింగ్ విధులు నిర్వహించనున్నారు. దీంతో పాఠశాలల్లో ఉండాల్సిన ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో ఉంటున్నారు. గడువులోగా సిలబస్ పూర్తయ్యేనా -
ఓట్ల బేరం!
బుధవారం శ్రీ 10 శ్రీ డిసెంబర్ శ్రీ 2025జోరుగా ప్రలోభాల పర్వం ● ముగిసిన మొదటి విడత ప్రచారం ● 147 సర్పంచ్ పదవులకు 481 మంది పోటీ ● 1,208 వార్డులకు 2,972 మంది బరిలో.. ● రేపు తొలి విడత పంచాయతీ ఎన్నికలు నేరుగా ఓటరును కలిసి.. గ్రామ పంచాయతీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. మొదటి విడతలో జరిగే పంచాయతీల్లో ప్రచారం మంగళవారం సాయంత్రం 5గంటలతో ముగిసింది. ఇక పోటీ చేసే అభ్యర్థులు.. ప్రలోభాలకు తెరలేపారు. మద్యం, డబ్బుల పంపిణీకి ముమ్మరంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. గురువారం ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్లను లెక్కించనున్నారు. – సాక్షి, సిద్దిపేట మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు 163 సర్పంచ్, 1,432 వార్డు స్థానాలకు నవంబర్ 27 నుంచి 29వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించారు. ఈ నెల 3న నామినేషన్ల విత్డ్రా, మధ్యాహ్నం 3గంటలకు అభ్యర్థులకు గుర్తులను కేటాయించారు. మొదటి విడతలో జరిగే వాటిలో 16 సర్పంచ్లు, 224 వార్డు సభ్యులు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 147 సర్పంచ్లకు గాను 481 అభ్యర్థులు, 1,208 వార్డు సభ్యులకు 2,972 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. హోరాహోరీగా ప్రచారం మొదటి విడత గ్రామ పంచాయతీల్లో ప్రచారం మంగళవారం చివరి రోజు హోరెత్తించారు. అసెంబ్లీ ఎన్నికలు తలెదన్నేలా గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా నిర్వహించారు. సర్పంచ్లు, వార్డు సభ్యులు గెలుపు కోసం ఇంటింటికీ ఓట్లను అభ్యర్థించారు. ఉన్న సమయంలో ఓటర్ల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేశారు. సర్పంచ్, వార్డు సభ్యునిగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఒక అవకాశాన్ని ఇవ్వాలని కోరారు. తమను గెలిపిస్తే సమస్యలను పరిష్కరిస్తామని హామీలు గుప్పిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులే కాకుండా మిగతా పోటీలో ఉన్న అభ్యర్థులు కూడా గెలుపు కోసం ఒప్పందాలు చేసుకున్నట్లు సమాచారం.పోలింగ్ ఏర్పాట్లు మొదటి విడత గ్రామాల్లో పోలింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా మండల కేంద్రాల్లో బ్యాలెట్ బాక్స్లు, బ్యాలెట్ పేపర్లు, సామగ్రిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పోలింగ్ అధికారులకు, సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.ఓటరును నేరుగా కలిసి డబ్బు, మద్యం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. పెద్ద గ్రామ పంచాయతీలలో ఓటుకు రూ.500 నుంచి రూ.2,000 వరకు అందజేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థల పై నిఘా ఉండటంతో తమకు దగ్గరగా ఉన్న బంధువులు, స్నేహితుల ద్వారా డబ్బులను సర్దుబాటు చేసుకుంటున్నారు. పోలీసులు నిత్యం తనిఖీలు చేస్తుండటంతో మద్యం, డబ్బులు ఎలా పంపిణీ చేయాలని తర్జనభర్జన చెందుతున్నారు. -
మల్లన్న కల్యాణానికి ఏర్పాట్లు
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లన్న కల్యాణం ఈనెల 14న జరగనుండటంతో ఆల య అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. మంగళవారం రాతిగీరలు, కోనేరు లోని విగ్రహాలు, రాజగోపురం, కొడెల స్తంభం, స్వామివారి రథానికి రంగులు వేశారు.సోనియా చొరవతోనే ప్రత్యేక రాష్ట్రం హుస్నాబాద్: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చొరవతోనే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా లింగమూర్తి మాట్లాడుతూ 16 ఏళ్ల క్రితం తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన సందర్భంగా ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం రాష్ట్ర ఏర్పాటును ప్రకటించారన్నారు. బీఆర్ఎస్ హయాంలో అప్పులు తప్ప ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, తదితరులు ఉన్నారు. తెలంగాణ తల్లికి క్షీరాభిషేకం సిద్దిపేటజోన్: బీఆర్ఎస్ రాష్ట్ర అధిష్టానం పిలుపు మేరకు మంగళవారం డిసెంబర్ 9 పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో వేడుకలు నిర్వహించారు. స్థానిక కోటిలింగాల దేవాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్, రాష్ట్ర కార్యదర్శి శర్మ, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు వేణుగోపాల్ రెడ్డి, సాయిరాం, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయొద్దు మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ సిద్దిపేటజోన్: సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో మంగళవారం మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. 2, 8, 13, 16, 32, వార్డుల్లో సమస్యలపై ఆరా తీశారు. బహిరంగ ప్రాంతాల్లో చెత్త వేయరాదని వార్డులో ప్రజలకు సూచించారు. యూజీడీ సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ అభివృద్ధి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇటీవల వేసిన సీసీ రోడ్లను పరిశీలించారు. మురికి కాల్వలో సిల్ట్ తొలగించాలని, చెత్త చెదారం లేకుండా చూడాలని ఆదేశించారు. రోడ్డు పక్కన మాంస విక్రయాలు జరుగుతున్న నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తంచేశారు. మాంస విక్రయాలు కేవలం మార్కెట్లలో మాత్రమే చేయాలని సూచించారు. అదేవిధంగా ఇరుకోడ్ శివారులో ఉన్న స్లాటర్ హౌస్ను సద్వినియోగం చేసుకోవాలని, అక్కడే మేకలను వధించాలని సూచించారు. ఆయన వెంట మున్సిపల్ కౌన్సిలర్లు సురేష్, రాజేశం, చంద్రం, మల్లికార్జున్, పృథ్వి తదితరులు పాల్గొన్నారు. -
సొంతూరు.. పోరు జోరు
వర్గల్(గజ్వేల్): హేమాహేమీల నెలవైన వర్గల్ మండల కేంద్రంలో పంచాయతీ ఎన్నికల పోరు ప్రతిష్టాత్మకంగా మారింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి సొంత గ్రామం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మద్దతుతో ముగ్గురు అభ్యర్థులు పోటీకి దిగడంతో త్రిముఖ పోటీ నెలకొన్నది. వర్గల్ పంచాయతీ బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో దీటైన అభ్యర్థి కోసం ఆయా పార్టీలు తీవ్ర కసరత్తు చేశాయి. కాంగ్రెస్ మద్దతుతో వర్గల్ మాజీ జెడ్పీటీసీ తాళ్ల సుధారాణి, బీఆర్ఎస్ మద్దతుతో ఆ పార్టీ జిల్లా యూత్ అధ్యక్షుడు నాగరాజు తల్లి దేవగణిక జయభారతి, బీజేపీ మద్దతుతో వర్గల్ మాజీ ఉపసర్పంచ్ రమేశ్ సతీమణి పసుల రజిత పోటీలో నిలిచారు. ప్రతిష్టాత్మకమైన ఈ స్థానం కైవసం చేసుకునేందుకు ముగ్గురూ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఆంక్షారెడ్డి, నర్సారెడ్డి పర్యటిస్తూ ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. నర్సారెడ్డి సమక్షంలో ఇటీవల తాజా మాజీ జెడ్పీటీసీ బాలమల్లు యాదవ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. ప్రతిష్టాత్మకమైన వర్గల్ తుది ఫలితం ఎలా ఉంటుందన్న ఆసక్తి జిల్లా వ్యాప్తంగా నెలకొంది. -
ఎన్నికల ‘సిత్రం’
గుర్తు చేతపట్టి.. మిరుదొడ్డి(దుబ్బాక): గ్రామ పంచాయతీ అభ్యర్థులకు గుర్తులు కేటాయించడంతో ఆయా గుర్తులతో అభ్యర్థులు ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. గుర్తుల కరపత్రాలు, వాల్ పోస్టర్లతోనే కాకుండా తమకు కేటాయించిన గుర్తులను చేతబూని ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. తమకు కేటాయించిన గుర్తులకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ‘గుర్తు’ను గీసి.. ప్రచారం చేసిపంచాయతీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారింది. మిరుదొడ్డిలోని 6వ వార్డులో ఓ చిన్నారి వినూత్న రీతిలో ప్రచారం చేయడం ఆలోచింపజేసింది. వార్డు మెంబర్గా బరిలో ఉన్న అంజయ్య కూతురు రియా ఇంటింటా తిరుగుతూ ప్రచారం చేసింది. తన తండ్రికి కేటాయించిన గౌను గుర్తును తానే స్వయంగా గీసి ప్రచారం చేయడం ఆకట్టుకుంది. మా నాన్నకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తూ ఇలా కనిపించింది. -
ఆఖరి మోఖా..
సెంటిమెంట్ రగిలిస్తూ.. కాళ్లపై మోకరిల్లుతూ.. గజ్వేల్: జిల్లాలో మొదటి విడత ఎన్నికలకు సంబంధించి నిన్నమొన్నటి వరకు నిత్యం ప్రచారంలో మునిగి తేలిన అభ్యర్థులు.. పోలింగ్కు ఇక ఒకే ఒక్క రోజు మిగిలి ఉండటంతో అఖరి ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఎలాగైనా గెలిచి తీరాలని, అందుకు తగ్గ వ్యూహాలు రచిస్తున్నారు. కుల సంఘాల ఓట్లను ఇప్పటికే గంపగుత్తగా కొనుగోలు చేసిన అభ్యర్థులు ఈనెల 10 రాత్రి ఓటరు వారీగా పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ చేపట్టడానికి వ్యుహాల్లో ఉన్నారు. కొన్ని ప్రధాన గ్రామాల్లో ఒక్కో ఓటుకు రూ.1000–3000 ఇవ్వడానికి సిద్ధమవుతున్న ట్లు ప్రచారం. ఇకపోతే మద్యం కూడా నాణ్య మైన బ్రాండ్లను అందజేస్తున్నట్లు తెలుస్తోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు.. ఓటర్లను వివిధ రూపాల్లో ఆకట్టుకోవడానికి అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. చివరగా సెంటిమెంట్ అస్త్రాన్ని ఓటర్లపై ప్రయోగిస్తున్నారు. ‘అన్ని శక్తులొడ్డి ఎన్నికల్లో దిగినం.. ఇక మీ దయ’ అని కొందరు, ‘మాపై కుట్రలు జరుగుతున్నయ్.. సాదుకున్న మీరే సంపుకున్న మీరే’ అంటూ మరికొందరు, ‘గెలిపిస్తే మిమల్ని కళ్లల్లో పెట్టి చూసుకుంటా’ మని ఇంకొందరు సెంటిమెంట్ రగిలిస్తున్నారు. ఇవన్నీ పక్కనబెడితే కొందరు అభ్యర్థుల తమకు ఈ ఎన్నికలు చావో.. రేవో అంటూ ప్రతి ఓటరు కాళ్లపై మోకరిల్లుతున్నారు. ఈ సమయంలో కన్నీరు పెడుతూ ఓటు వేయాలని అడుగుతున్నారు. వినూత్న హామీలపై ఆశలు... మొదటి విడత ఎన్నికల్లో అభ్యర్థుల వినూత్న హామీలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఆడపిల్ల పుడితే.. రూ.5000 డిపాజిట్ చేస్తామని, పెళ్లిల్లో ఆడపిల్లకు రూ.5వేల నజరానా ఇస్తామని తదితర వినూత్న హామీలు పనిచేస్తాయని అభ్యర్థులు భావిస్తున్నారు. మరికొందరు ఇంకొ అడుగు ముందుకేసి సమస్యల పరిష్కారానికి బాండ్ పేపర్లు రాసిస్తున్నారు. చివరి రోజు బలప్రదర్శన.. మంగళవారం చివరి రోజు ప్రచారంలో అభ్యర్థులు బలాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నించారు. భారీ ర్యాలీలు, మైక్ ప్రచారాలు, సభలు, సమావేశాలు నిర్వహించారు. పార్టీలకు సంబంధించిన రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గస్థాయి నాయకులను ఈ ప్రచారాల్లో భాగస్వాములను చేశారు. మొత్తానికి గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో మొదటి విడత ఎన్నికల పర్వం సర్వత్రా ఆసక్తిని రేకిత్తించింది.ఎల్లయ్య.. ఎవ్వలకు ఓటేద్దాం.. దుబ్బాకరూరల్: గ్రామాల్లో రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. ఎక్కడ చూసినా పంచాయతీ ఎన్పికలపైనే చర్చ జరుగుతోంది. సర్పంచ్ల ఎన్నికల వాతావరణం వేడెక్కడంతో ఎక్కడ చూసినా గ్రామ ప్రజలంతా గ్రామ చావిడి, హోటళ్ల వద్ద గుమిగూడి ముచ్చట్లు పెడుతున్నారు. ‘అవురా.. ఎల్లయ్య మన ఊళ్లో ఎవ్వలకు ఓటు వేద్దాం? ముగ్గురు నిలబడిరి. ఎవ్వలైతే మంచిగుంటదరా’ అంటూ వృద్ధులు ముచ్చటిస్తున్నారు. ‘అరేయ్ మల్లయ్య.. గ్రామాన్ని ఎవ్వలైతే అభివృద్ధి చేస్తారో వారికే ఓటు వేద్దాం రా..’ అంటూ ముచ్చట పెడుతున్నారు. వృద్ధులు ముచ్చట పెడుతున్న ఈ దృశ్యం మండలంలోని అచ్చుమాయిపల్లి గ్రామంలోనిది.ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు రేపు సెలవు సిద్దిపేటరూరల్: మొదటి విడతలో భాగంగా ఈనెల 11న జరిగే ఎన్నికల ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హైమావతి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గజ్వేల్, మర్కూక్, వర్గల్, జగదేవపూర్, ములుగు, దౌల్తాబాద్, రాయపోల్ మండలాల పరిధిలోని గ్రామాల్లో జరగనున్న పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. అంతకుముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్, ఎన్నికల సాధారణ పరిశీలకులు హరిత, వ్యయ పరిశీలకులు నిశాంతి, అదనపు డీసీపీ కుశాల్కర్, డీపీఓ రవీందర్, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, డీఈఓ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల విధులు వద్దు
టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల విధుల నుంచి దివ్యాంగ ఉపాధ్యాయులకు మినహాయించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి సోమవారం సిద్దిపేటలో అన్నారు. రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులకు ఎన్నికల విధులు వేయడం తగదన్నారు. కొంతమంది ఉపాధ్యాయులను అసలే తీసుకోలేదని, వచ్చినవారికి మూడు డ్యూటీలు వేశారని ఆరోపించారు. ముందస్తు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నేరుగా శిక్షణలకు పంపించడం, సుదూర ప్రాంతాల్లో ఎన్నికల విధులు కేటాయించడం వలన ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మానవతా దృక్పథంతో ఎన్నికల విధులనుంచి మినహాయించాలని ఆయన కోరారు. నాడు పతులు.. నేడు సతులుచేర్యాల(సిద్దిపేట): మండల పరిధిలోని వీరన్నపేట సర్పంచ్గా గత ఎన్నికల్లో భర్తలు ప్రత్యర్థులుగా పోటీ పడ్డారు. నేటి ఎన్నికల్లో వారి భార్యలు ప్రధాన పార్టీల మద్దతుతో పోటీలో నిలిచారు. నాడు కొండపాక భిక్షపతి, ఎలికట్టె శివశంకర్ పోటీ పడగా భిక్షపతి సర్పంచ్గా గెలిచారు. తర్వాత జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో ఎలికట్టె శివశంకర్ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీటీసీగా గెలుపొందారు. ప్రస్తుతం గ్రామ సర్పంచ్ పదవి జనరల్ మహిళకు రిజర్వు కావడంతో అధికార పార్టీ మద్దతుతో భిక్షపతి భార్య కనకలక్ష్మి, బీఆర్ఎస్ మద్దతుతో ఎలికట్టె శివశంకర్ భార్య శైలజ బరిలో నిలిచారు. దరఖాస్తుల ఆహ్వానం హుస్నాబాద్: రేణుకా ఎల్లమ్మ దేవాలయ కమిటీ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్లమ్మ జాతర సందర్భంగా నెల రోజుల పాటు ఉత్సవ కమిటీ వేశారు. ఆ గడవు ముగిసింది. ప్రస్తుతం కొత్తగా ఆసక్తి గల అభ్యర్థులు సంగారెడ్డి సహాయ కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని ఆలయ కమిటీ కార్యనిర్వాహణ అధికారి కిషన్రావు పేర్కొన్నారు. నేడు విజయోత్సవ వేడుకలు సిద్దిపేటజోన్: బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో డిసెంబర్ 9 పురస్కరించుకుని మంగళవారం తెలంగాణ విజయోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు పట్టణ పార్టీ అధ్యక్షుడు సంపత్రెడ్డి పేర్కొన్నారు. ఉదయం 10గంటలకు కోటిలింగాల దేవాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం, అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో పండ్లు పంపిణీ, మోడల్ బస్టాండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నట్లు పేర్కొన్నారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు. మద్యం కొనొద్దని వినూత్న నిరసన సిద్దిపేటజోన్: మద్యం కొనొద్దని బీజేపీ నేతలు వినూత్న నిరసనకు దిగారు. పట్టణ శివారులో దేవాలయం సమీపంలో వైన్స్ ఏర్పాటు చేశారని, వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. సోమవారం పట్టణ అధ్యక్షుడు వెంకట్ ఆధ్వర్యంలో మద్యం దుకాణం ఎదుట మద్యం కొనొద్దని ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని శాంతిపజేశారు. పనిచేసిన చోటే ప్రజాప్రతినిధిని కావాలని.. సిద్దిపేటఅర్బన్: మండలంలోని మిట్టపల్లి గ్రామంలో ఏడే ఎల్లవ్వ 7వ వార్డ్ సభ్యురాలిగా పోటీ చేస్తున్నారు. భర్త మరణించడంతో ఎల్లవ్వ గతంలో గ్రామ సేవకురాలిగా పనిచేశారు. ఇప్పుడు తమ వార్డు రిజర్వేషన్ ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో వార్డు మెంబర్గా పోటీలో నిలిచారు. తాను గెలిచి చిరుద్యోగిగా పనిచేసిన చోటే ప్రజా ప్రతినిధిగా సేవలందిస్తానని చెప్తున్నారు. సర్పంచ్ బరిలో ముగ్గురు రేషన్ డీలర్లు బెజ్జంకి(సిద్దిపేట): ముగ్గురు రేషన్ డీలర్లు సర్పంచ్లుగా పోటీ చేస్తున్నారు. బెజ్జంకి సర్పంచ్గా బొల్లం శ్రీధర్(పెద్దన్న), రేగులపల్లెలో దుంబాల పద్మ, దేవక్కపల్లెలో పడాల సత్యనారాయణ బరిలో ఉన్నారు. ప్రజలతో ఉన్న సత్సంబంధాలే తమకు విజయం చేకూరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రచార హోరు.. ఆఫర్ల జోరు
మంగళవారం శ్రీ 9 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ఏకగ్రీవాల కోసం ప్రలోభాలుగ్రామాల్లో సర్పంచ్ పదవుల ఏకగ్రీవానికి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో పంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా ఈ నెల 11, 14, 17వ తేదీల్లో జరగనున్నాయి. ఇప్పటికే సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ పూర్తి అయ్యింది. రెండు విడతల్లో ఉప సంహరణలు ముగిశాయి. మూడో విడత మంగళవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. ఏకగ్రీవాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామంటూ ప్రజా ప్రతినిధులు.. గ్రామాభివృద్ధికి సొంత నిధులను వెచ్చిస్తామంటూ అభ్యర్థులు ముందుగానే ప్రకటిస్తున్నారు. ఇప్పటివరకు 26 గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఏకగ్రీవం కాగా, పలు చోట్ల ఆఫర్లు బహిరంగంగా జరగడంతో పోలీసులు కేసులు నమోదుచేశారు. వీటిపై క్షేత్రస్థాయి అధికారులు విచారణ చేపడుతున్నారు. – సాక్షి, సిద్దిపేట


