Siddipet
-
విద్యాధరి సేవలో కలెక్టర్
వర్గల్(గజ్వేల్): అక్షయ తృతీయ పర్వదినం వేళ ఆదివారం రాత్రి సుప్రసిద్ధమైన వర్గల్ శ్రీవిద్యాఽ దరి క్షేత్రాన్ని కలెక్టర్ హైమావతి సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. శ్రీచక్రపూజలో పాల్గొ న్నారు. ఈ సందర్భంగా వేదపండితులు మహ దాశీర్వచనం చేసి, తీర్థప్రసాదం, అమ్మవారి శేషవస్త్రం అందజేశారు. ప్రశాంత్నగర్(సిద్దిపేట): ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించనున్న వెల్ఫేర్ వీక్ను విజయవంతం చేయాలని వసతి గృహాల వార్డెన్లను కలెక్టర్ హైమావతి ఆదేశించారు.ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలోని వసతి గృహాలను ఆకస్మికంగా సందర్శించారు. వంటశాలలు, కిచెన్ రూమ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ సమయాన్ని వృధా చేయకుండా బాగా చదువుకోవాలన్నారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తామని అన్నారు. బాలికల భద్రత అతి ముఖ్యమని కామన్ డైట్ మెనూ పాటించాలని రుచికరమైన భోజనం అందించాలని వార్డెన్లను ఆదేశించారు. ప్రశాంత్నగర్(సిద్దిపేట): రాష్ట్ర సారస్వత పరిషత్ బాలల కథల పోటీల్లో ‘అందరూ చేసిందే చేద్దాం’ కథ ఉత్తమంగా ఎంపికై నట్లు బాలసాహితీవేత్త ఉండ్రాళ్ల రాజేశం ఆదివారం తెలిపారు. మొత్తం 180 కథలలో పది కథలు ఎంపిక కాగా, అందులో సిద్దిపేటకు చెందిన అనిశెట్టి సతీశ్కుమార్ రాసిన కథ ఉత్తమ బహుమతికి ఎంపికైందన్నారు. ఈ మేరకు కవులు బస్వరాజ్కుమార్, కోణం పరశురాములు, వర్కోలు లక్ష్మయ్య, బి. సుధాకర్, చిరంజీవి, తిరుపతి, కాల్వ రాజయ్య తదితరులు అభినందనలు తెలిపారన్నారు. హుస్నాబాద్రూరల్: హుస్నాబాద్ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాల విద్యార్థులు జిల్లా స్థాయి ర్యాంకులు సాధించినట్లు ప్రిన్సిపాల్ శ్యామలత ఆదివారం తెలిపారు. గురుకుల కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరంలో టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనే జ్మెంట్ కోర్సును ప్రవేశ పెట్టారు. గ్రామీణ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కోర్స్ను ప్రారంభించారు. ఇందులో ప్రవేశాలు పొందిన విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో రజాకర్ 453(500), మణికంఠ 452 (500) మార్కులతో జిల్లా టాపర్స్గా నిలిచారు. ఆసక్తి గల విద్యార్థులు టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ గ్రూపులో ప్రవేశం పొందాలని ప్రిన్సిపాల్ కోరారు. ఈ నెల 25 తేదీలోగా గురుకుల వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
అభివృద్ధి బాధ్యత నాదే..
● సిద్దిపేటను ప్రగతి బాటపట్టిస్తా ● అర్హులందరికీ సంక్షేమ పథకాలు ● త్వరలో రెండు లక్షల కొత్త పింఛన్లు ● కార్మిక శాఖ మంత్రి వివేక్ సిద్దిపేటజోన్: సిద్దిపేటను అభివృద్ధి బాటలో తీసుకెళ్లే బాధ్యత నాపై ఉందని, అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ అన్నారు. సిద్దిపేట ప్రాంతంతో మా కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎనిమిదవ వార్డులో పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలన అంటే ప్రజాపాలనగా అభివర్ణించారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తామని తెలిపారు. త్వరలోనే రెండు లక్షల కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. అదేవిధంగా సిద్దిపేట నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, మరో రెండు వేల ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఆయా వార్డుల్లో డ్రైనేజీ నిర్మాణానికి త్వరలో ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. అందరూ కష్టపడి పని చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. వార్డుల్లో కాంగ్రెస్ కమిటీలను బలోపేతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి హరికృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్లు యాదగిరి, మహేందర్లు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. ప్రశాంత్నగర్(సిద్దిపేట): నైపుణ్యం కల్గిన కార్మికులకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మంత్రి వివేక్ అన్నారు. రాష్ట్రంలోని హమాలీల కోసం నూతన చట్టాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన 14 కార్మిక సంఘాల సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. కార్మికులకు విదేశాల్లో ఉద్యోగ కల్పనకు రూ.90 కోట్లు మంజూరు చేసామన్నారు. టామ్కామ్ కంపెనీ ద్వారా విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు, కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలన్నారు. భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్లు ఇచ్చేందుకు త్వరలోనే చర్యలు చేపడతామన్నారు. ప్రతి జిల్లాకు భవన నిర్మాణ కార్మికుల కోసం కార్మికసంఘ భవనాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలో లేబర్ బోర్డు ఏర్పాటు చేసి అర్హులెన ప్రతి ఒక్క కార్మికునికి లేబర్ కార్డు, ఇందిరమ్మ ఇళ్లు, సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. సిద్దిపేటలో కార్మిక సంఘం భవనానికి స్థల కేటాయింపుతోపాటు, నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. -
వణికించిన వడగళ్లు
చిన్నశంకరంపేట(మెదక్)/చేగుంట(తూప్రాన్)/ శివ్వంపేట(నర్సాపూర్): అకాల వర్షం జిల్లాను వణికించింది. ఆదివారం ఉదయం ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి కాగా, సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చిన్నశంకరంపేట, నార్సింగి, చేగుంట, శివ్వంపేట మండలాల్లోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కురిసిన వడగళ్ల వాన అతలాకుతలం చేసింది. దీంతో పంటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. వర్షం నీటిలో వడ్లు కొట్టుకుపోయాయి. ఆరుగాలం శ్రమించి పడించిన పంట వర్షార్పణం అయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడగా, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. -
కాంటా వేసేదెన్నడో?
మిరుదొడ్డి(దుబ్బాక): విత్తనం వేసింది మొదలు చేతికొచ్చిన ధాన్యాన్ని అమ్ముకోవడంలో కూడా రైతులకు నానా తిప్పలు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంలో ఉన్న ఉత్సాహం.. వాటి నిర్వహణపై లేకపోవడంతో ధాన్యపు రాశులు ఎక్కడిక్కడా నిలిచిపోయాయి. మిరుదొడ్డి మండల కేంద్రంలో మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద మొక్కజొన్న, పొద్దు తిరుగుడు కేంద్రాలను నెల క్రితం ప్రజాప్రతినిధులు, అధికారులు ఆర్భాటంగా ఏర్పాటు చేశారు. మొదట్లో నామమాత్రంగా కొనుగోళ్లను ప్రారంభించిన అధికారులు రాను రాను కొనుగోళ్ల ప్రక్రియ నిలిచిపోవండంతో రోజుల తరబడి ఎండలో నానా అవస్థలు పడాల్సి వస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిరుదొడ్డి మండల కేంద్రంగా దౌల్తాబాద్, అక్బర్పేట–భూంపల్లి, రాయపోల్, దుబ్బాక మొదలైన మండలాల్లోని వివిధ గ్రామాల నుంచి రైతులు మొక్కజొన్న, పొద్దు తిరుగుడు ధాన్యాన్ని విక్రయించడానికి తీసుకువస్తున్నారు. ధాన్యాన్ని తీసుకువచ్చి పక్షం రోజులు గడుస్తున్నా అధికారులు కాంటా పెట్టకపోవడంతో ధాన్యం రాశులు పెరిగిపోతున్నాయనీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి ధాన్యం కుప్పల వద్ద మండుటెండలో పడరాని అవస్థలు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. ధాన్యం కేంద్రం వద్ద ఎలాంటి మౌలిక వసతులు లేక, మండుతున్న ఎండలకు నిలువు నీడ లేక అరిగోస పడుతున్నామని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు కొనుగోళ్లను వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్లోనే మొక్కజొన్న, పొద్దుతిరుగుడు రాశులు మండుతున్న ఎండల్లోనే రైతుల పడిగాపులు దృష్టిసారించని అధికారులు -
పట్టణాలు మురిసేనా?
కూడళ్లు మెరిసేనా?‘సుందరీకరణ’కు గ్రహణం వీడేనా? జిల్లాలోని మున్సిపాలిటీల్లో సుందరీకరణ పనులు ఈసారైనా ముందుకు సాగేనా..? అనే చర్చ సాగుతోంది. గతంలో నిధులు మంజూరైనా పనులు చేపట్టకపోవడంతో ల్యాప్స్ అయ్యాయి. తాజాగా మున్సిపాలిటీలకు మంజూరైన టీయూఎఫ్ఐడీసీ(తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్) నిధులతో ఈ పనులు చేపట్టే అవకాశం ఉండగా.. పాలకవర్గాల చొరవపైనే ఆశలు నెలకొన్నాయి. – గజ్వేల్ మున్సిపాలిటీల్లో చేపట్టాల్సిన సుందరీకరణ పనులకు ఏళ్ల తరబడి ఏదో అంశం అడ్డంకిగా మారుతోంది. ఫలితంగా గతంలో మంజూరైన నిధులు ల్యాప్స్ కావడంపై చర్చనీయాంశంగా మారింది. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో సుందరీకరణలో భాగంగా నాలుగేళ్ల క్రితం మహనీయుల విగ్రహాల జంక్షన్లను అందంగా తీర్చిదిద్ది, వాటర్ ఫౌంటేన్లను ఏర్పాటు చేయాలని, ‘లవ్ జీపీపీ’ పేరిట స్వాగత ద్వారాలను ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. ఇందుకోసం అప్పట్లో ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ద్వారా రూ.2కోట్లు నిధులు కూడా విడుదల చేసిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలోనే పట్టణంలోని ప్రజ్ఞాపూర్ చౌరస్తా, పిడిచెడ్ రోడ్డు చౌరస్తా, అంబేడ్కర్ సర్కిల్, ఇందిరాపార్కు చౌరస్తా, జాలిగామ బైపాస్ రోడ్డు చౌరస్తా, తూప్రాన్ రోడ్డులోని బాబుజగ్జీవన్రామ్ వై జంక్షన్, ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ వద్ద గల సర్కిల్, ముట్రాజ్పల్లి సర్కిళ్లను అందంగా తీర్చిద్దిడానికి సంకల్పించారు. కానీ ఇందులో అంబేడ్కర్ చౌరస్తా, బాబూజగ్జీవన్రాం చౌరస్తా, ముట్రాజ్పల్లి చౌరస్తాలో మాత్రమే పనులను పూర్తి చేసి, మిగతా పనులను చేపట్టకుండా చేతులు దులుపుకొన్నారు. వచ్చిన నిధుల్లో పావువంతుకుపైగా మాత్రమే ఖర్చు చేశారు. మిగిలిన ల్యాప్స్ అయ్యాయి. నిధులు మంజూరుతో.. గతంలో పనులు చేపట్టకపోవడంతో నిధులు ల్యాప్స్ ఇటీవల టీయూఎఫ్ఐడీసీ నిధులు మంజూరు పాలకవర్గాల చొరవపైనే ఆశలు జిల్లాలోని మున్సిపాలిటీల తీరు జిల్లాలోని మున్సిపాలిటీల సుందరీకరణ, మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా టీయూఎఫ్ఐడీసీ ద్వారా నిధులు వచ్చాయి. ఇందులో గజ్వేల్, సిద్దిపేటలకు రూ.18.7కోట్ల చొప్పున, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీలకు రూ.15కోట్లకుపైగా విడుదలయ్యాయి. ప్రధానంగా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో సుందరీకరణలో భాగంగా.. సెంట్రల్ లైటింగ్, హౌసింగ్ బోర్డు మైదానంలోని చిల్డ్రన్స్ పార్కు ఆధునీకరణ, ఇందిరాపార్క్ కూడలి, ఇతర కూడళ్ల సుందరీకరణకు రూ.కోటి, చిల్డ్రన్స్ పార్కు సుందరీకరణకు రూ.కోటి, పట్టణంలోని ప్రధాన రహదారులపై పెండింగ్లో ఉన్న సెంట్రల్ లైటింగ్ కోసం రూ.1.5కోట్లు, మరో రూ.15కోట్లకుపైగా సీసీ రోడ్లు, ఇతర పనులను చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి పనులను ప్రారంభించాల్సి ఉంది. మిగతా మున్సిపాలిటీల్లోనూ ఈ నిధుల్లో సింహభాగం సుందరీకరణకే వెచ్చించాలనుకుంటున్నారు. పాలకవర్గాల చొరవపైనే పనుల ప్రగతి ఆధారపడి ఉంది. -
మన మట్టిబిడ్డ జాతీయ జట్టులో ఆడాలి
● మాజీమంత్రి హరీశ్రావు ● కేసీఆర్ ట్రోఫీలో విజేతలకు బహుమతుల ప్రదానం సిద్దిపేటజోన్: ‘సిద్దిపేట మట్టి బిడ్డ భారత క్రికెట్ జట్టులో ఆడాలన్నదే నా స్వప్నం.. అప్పుడే సిద్దిపేట స్టేడియానికి సార్థకత లభిస్తుంది’ అని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని క్రికెట్ స్టేడియంలో కేసీఆర్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రికెట్ అంటే ఒక ఆట కాదని, ఒక కమ్యూనిటీ అని, అందరూ కలిసి కట్టుగా ఉంటేనే గెలుపు సాధ్యమవుతుందన్నారు. నేటి యువత కూడా కలిసి మెలసి ఉండాలని సూచించారు. స్నేహం అంటే జీవితాంతం తోడునీడగా ఉండాలన్నారు. క్రికెట్ ఆటలో ఆల్రౌండర్ మాదిరి నిజజీవితంలో కూడా చదువు, ఉద్యోగం, సమాజానికి సేవ, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని పిలుపునిచ్చారు. క్రికెట్ను కాలక్షేపం కోసం కాకుండా సీరియస్గా ఆడితే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. భవిష్యత్తులో మహిళా టోర్నీ.. మగవాళ్లతో సమానంగా మహిళలు కూడా అంతర్జాతీయ స్థాయిలో అద్భుతంగా క్రికెట్ ఆడుతున్నారని, భవిష్యత్తులో సిద్దిపేట ప్రాంత అమ్మాయిలను ప్రోత్సహించేందుకు కేసీఆర్ ఉమెన్స్ క్రికెట్ టోర్నీ ఏర్పాటు చేస్తామన్నారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచించారు. అనంతరం ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించిన గణేశ్నగర్ 11 జట్టుకు మొదటి బహుమతి కింద రూ.లక్ష, రెండో స్థానంలో నిలిచిన కింగ్స్ ఖాదర్ పూర జట్టుకు రూ.50వేల ప్రైజ్ మని అందించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వంతో పోరాడుతా
చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రభుత్వంతో పోరాడి పొద్దు తిరుగుడు, మొక్కజొన్న రైతులకు న్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తానని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. శనివారం రాత్రి మండల పరిధిలోని పెద్దకోడూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పండించిన పొద్దు తిరుగుడు, మొక్కజొన్నలు కొనడం లేదని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు పూర్తిగా విస్మరించిందన్నారు. ప్రభుత్వం కొత్త రోడ్లు ఇవ్వకపోయినా, కనీసం బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్లనైనా పూర్తి చేయాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశానన్నారు. గ్రామాభివృద్ధికి అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తానన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సామల సునీత, నాయకులు మాణిక్యరెడ్డి, శ్రీనివాస్, పాపయ్య, కనకరాజు, ఆయా గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు.మాజీ మంత్రి హరీశ్రావు -
‘కుస్తీ’మే సవాల్
నారాయణఖేడ్: ఖేడ్ మండలంలోని ర్యాకల్ గ్రామంలోని ఎల్లమ్మ జాతర ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం కుస్తీపోటీలు నిర్వహించారు. ఈ పోటీలు హోరాహోరీగా సాగాయి. ప్రాంతం నుంచే కాకుండా కర్ణాటక, మహరాష్ట్ర ప్రాంతాల నుంచి సైతం మల్లయోధులు తరలివచ్చారు. 500మంది వరకు మల్లయోధులు స్థాయిని బట్టి పోటీలు నిర్వహించి చివరి కుస్తీ విజేతకు రూ.5,100లు బహుమతిగా అందజేశారు. క్రమశిక్షణ తప్పనిసరి మెదక్జోన్: పోలీసులు క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరిగా పాటించాలని ఏఆర్ డీఎస్పీ రంగనాథ్ అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పరేడ్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పోలీసులు శరీర దారుఢ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రతిరోజూ వ్యాయామం చేయాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని ఆదేశించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనే వారికి ఎలాంటి మినహాయింపులు ఉండవని హెచ్చరించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు. -
కాంగ్రెస్ నాయకుల మాటలన్నీ అబద్ధాలే
హుస్నాబాద్: గతంలో పనికి రాదని కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు చేసి, ఇప్పుడు మరమ్మతులు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం ద్వారా కాంగ్రెస్ నాయకుల మాటలన్నీ అబద్ధాలని తెలిపోయిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. హుస్నాబాద్ శివారులోని పోతారం(ఎస్) శుభం గార్డెన్లో శనివారం బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కొద్ది కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. ప్రజలు తిరిగి కేసీఆర్ నాయకత్వం వైపు ఆశగా చూస్తున్నారని తెలిపారు. తెలంగాణ, ఆంధ్ర విభజన అంశంపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించే భారీ బహిరంగ సభలో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొంటారని చెప్పారు. ఈ సభను విజయవంతం చేయడానికి నియోజకవర్గంలోని కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. హుస్నాబాద్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికారాన్ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ గెలిచిందని మాజీ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, మహిళలు పాల్గొన్నారు.మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ -
పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
సిద్దిపేటఅర్బన్: చిన్నారులు, గర్భిణులు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీడబ్ల్యూఓ శారద సూచించారు. శనివారం సిద్దిపేట అర్బన్ మండలంలోని పొన్నాలలో పోషణ్ పక్వాడ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరేళ్ల లోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపిస్తే పౌష్టికాహారం అందుతుందన్నారు. చిన్నారులను ఫోన్కు అలవాటు చేయడంతో వారిలో మానసిక ఎదుగుదల లోపించి మాటలు సరిగా రాకపోవడం, ఇతర పిల్లలతో కలిసి మెలిసి ఉండకపోవడం, ఒంటరితనంకు అలవాటు పడుతారన్నారు. అలాగే గర్భిణులు, బాలింతలు మంచి పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. అనంతరం పౌష్టికాహారానికి సంబంధించి పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు, మిల్లెట్స్ వంటి వాటిని ప్రదర్శిస్తూ గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పొన్నాల సర్పంచ్ అమ్ముల వెంకటయ్య, పోషణ్ అభియాన్ డీసీ వెంకటప్రసాద్, బీసీ శ్రీనివాస్, పంచాయతీ సెక్రటరీ నరేష్, ఐసీడీఎస్ సూపర్వైజర్ సునీత, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.డీడబ్ల్యూఓ శారద -
విద్య, వైద్యానికే తొలి ప్రాధాన్యం
జోగిపేట(అందోల్): రాష్ట్ర ప్రభుత్వం వైద్య, విద్యారంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుందని మంత్రి సి.దామోదర రాజనర్సింహ తెలిపారు. శనివారం చౌటకూర్, అందోలు మండలాల్లో పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని, బాలికలు ఉన్నత విద్యనభ్యసించాలని ఆయన సూచించారు. గ్రంథాలయాన్ని డిజిటల్ లైబ్రరీగా మారుస్తామన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండేందుకు నూతనంగా సబ్స్టేషన్ను ఏర్పాటు చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండేలా సమీకృత భవానాన్ని నిర్మిస్తామన్నారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, అదనపు కలెక్టర్ పాండు, మున్సిపల్ చైర్మన్ ఎస్.కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ ఆకుల చిట్టిబాబు, సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.మంత్రి దామోదర రాజనర్సింహ -
పసిడి పండుగకు స్వాగతం
సాక్షి, సిద్దిపేట: పసిడి పండుగ రానే వచ్చింది. ఏటా వైశాఖ మాసంలో వచ్చే అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని విశ్వాసం. అందుకే ఈ రోజున ఎంతో కొంత బంగారం కొనుగోలు చేసేందుకు ప్రజలు ఉవ్విళ్లూరుతుంటారు. దీంతో జిల్లాలోని ప్రముఖ బంగారం షాప్లన్నీ కొత్త మోడళ్ల ఆభరణాలను అందుబాటులోకి తెచ్చారు. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో తక్కువ బరువు ఉండే నగలను రూపొందించారు. వివాహ ముహూర్తాలు అధికంగా ఉండటంతో పనిలో పనిగా ఈ రోజు నగలు కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఆదివారం ఒక్క రోజే జిల్లా వ్యాప్తంగా రూ. 50 కోట్ల బంగారు నగల వ్యాపారం జరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మేరకు బంగారం షాపులు ప్రత్యేకంగా ముస్తాబయ్యాయి ధర ఎక్కువ ఉన్నా.. బంగారం ధరలు పెరిగినా కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అక్షయ తృతీయను దృష్టిలో ఉంచుకుని గ్రాము నుంచి 5 గ్రాముల కాయిన్లను అందుబాటులో ఉంచారు. ఆదివారం షాపులన్నీ రద్దీగా ఉంటాయని భావించి కొంత మంది ఇప్పటికే నగలను ఎంపిక చేసుకుని అడ్వాన్స్లు సైతం ఇచ్చారు. అక్షయ తృతీయ రోజు అభరణాలు తీసుకెళ్లేలా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. కాగా పలు బంగారం షాపులు ఆఫర్లు ప్రకటించాయి. కొన్ని షాపుల నిర్వాహకులు తరుగులో తగ్గింపు, గోల్డ్, వెండి కాయిన్స్ అందజేయనున్నారు. వివిధ బ్యాంక్ల క్రెడిట్ కార్డులకు క్యాష్ బ్యాక్ను రూ. 1,000 నుంచి రూ.5 వేలు ప్రకటించారు. నేడే అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్లతో హడావుడి జిల్లాలో రూ.50 కోట్ల వ్యాపారం జరిగే అవకాశం అందుబాటులోకి మోడల్స్ అక్షయ తృతీయను దృష్టిలో ఉంచుకొని అనేక మోడల్స్ ఆభరణాలను అందుబాటులో ఉంచాం. ఎంతో కొంత బంగారమైన కొనుగోలు చేయాలని ప్రజల భావిస్తారు. బంగారు ఆభరణాలపై ఆఫర్లు సైతం అందుబాటులో ఉన్నాయి. – రాజేశ్, సేల్స్ మేనేజర్, మలబార్ జ్యువెల్లర్స్, సిద్దిపేట -
ఉపాధి కూలీల సంఖ్య పెంచండి
దుబ్బాకటౌన్: ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పనులలో కూలీల సంఖ్యను కనీసం 100 మందికి పెంచే దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి జయదేవ్ ఆర్య అధికారులను ఆదేశించారు. శనివారం రాయపోల్ మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువుల పునరుద్ధరణ, మురుగు కాలువల శుభ్రత, చెత్త నిర్వహణ, రహదారి పక్కన మట్టి పనులు చేపట్టడం ద్వారా కూలీలకు నిరంతర ఉపాధి కల్పించవచ్చని చెప్పారు. పనుల ఎంపికలో పారదర్శకత పాటించాలని, సమయానికి వేతనాలు చెల్లించేలా దృష్టి పెట్టాలని ఆదేశించారు. అనంతరం జిల్లా పంచాయతీ అధికారి రవీందర్ పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండొద్దని హెచ్చరించారు. ట్రాక్టర్ల ద్వారా చెత్తను క్రమం తప్పకుండా సేకరించి, డంపింగ్ షెడ్డులకు తరలించాలని సూచించారు. వేసవికాలం దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, బోర్లు, ట్యాంకులు, పైపులైన్లకు సకాలంలో మరమ్మతులు చేయించాలని సూచించారు.డీఆర్డీఓ జయదేవ్ ఆర్య -
కవిగా నిలబెట్టిన కళాశాల ఇదే
సిద్దిపేట ఎడ్యుకేషన్: తనను కవిగా నిలబెట్టిన కళాశాల సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలేనని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ నందిని సిధారెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థి, తెలుగు శాఖ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ నందిని ిసిధారెడ్డిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు స్వీకరించిన సందర్భంగా శనివారం కళాశాలలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సిధారెడ్డి మాట్లాడుతూ..సిద్దిపేట కళాశాల విద్యార్థిగా తాను కవిత్వంలోకి అడుగు పెట్టానని కళాశాల వాతావరణం తనను కవిగా తీర్చిదిద్దిందన్నారు. బాల్యంలోని బంగారం జ్ఞాపకాలను యువకుడిగా డిగ్రీ కాలేజీ జ్ఞాపకాలను గుర్తుచేసుకుని వాటి ప్రేరణలను విద్యార్థులకు వివరించారు. ‘కట్టువోతల బందారం– బాల్య జ్ఞాపకాలు’‘సిద్దిపేట కాలేజీలో తన విద్యార్థి జీవితం’ఇవి రెండు తనను కవిగా పరిశోధకుడిగా నిలబెట్టాయన్నారు. సిద్దిపేట గడ్డ బందారం గడ్డ ఆనాటి రైతాంగ ఉద్యమాలు తనకు ఉద్యమస్ఫూర్తిని ఉగ్గుపాలతోనే నేర్పించాయని గుర్తు చేసుకున్నారు. కళాశాల తనను ఆత్మీయంగా సత్కరించటం గొప్ప గౌరవమని కళాశాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కళాశాల పూర్వ విద్యార్థి పూర్వాధ్యాపకులు సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం గర్వకారణమని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ సునీత అభినందించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ జి.పాపయ్య, సిధారెడ్డి బాల్య స్నేహితులు, అధ్యాపక మిత్రులు బాల నరసయ్య, నాళేశ్వరం శంకరం, కందుకూరి శ్రీరాములు, రవికుమార్, శ్రీహరి యాదవ్, బాలమణి, తెలుగు శాఖ అధ్యక్షుడు ప్రొఫెసర్ మట్ట సంపత్ కుమార్రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.అయోధ్యరెడ్డి, డాక్టర్ మధుసూదన్, డాక్టర్ గోపాల సుదర్శనం, తెలుగు విభాగం అధ్యాపకులు పిట్ల దాసు, నారోజు వెంకటరమణ, విద్యార్థులు, పాల్గొన్నారు.డాక్టర్ నందిని సిధారెడ్డి -
అటవీశాస్త్రంలో పీహెచ్డీ
ములుగు(గజ్వేల్): ములుగు కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న అటవీ కళాశాల పరిశోధన కేంద్రంలో చదువుకుంటున్న విద్యార్థి బోచు జీవన్ అటవీ శాస్త్రంలో పీహెచ్డీ సాధించారు. ఏటూరు నాగారం వన్యప్రాణి అభయారణ్యంలో ఫైటోసోసియాలజీ, కార్బన్ నిల్వలు మరియు ప్రధాన మట్టి పోషకాలపై అధ్యయనం పూర్తి చేశారు. జీవన్ పీహెచ్డీ సాధించడంపై కళాశాల డీన్ ప్రవీణ, జాయింట్ డైరెక్టర్ శ్రీధర్రావు, డిప్యూటీ డైరెక్టర్ కవిత, అధ్యాపకులు అభినందించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు పోలీసు కమిషనర్ రష్మీ పెరుమాళ్సిద్దిపేటకమాన్: జిల్లాలో జరగనున్న పదో తరగతి, ఇంటర్మీడియెట్ (తె లంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ) పరీక్షా కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్ నిబంధనలు అమల్లో ఉంటాయని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. జిల్లాలోని 9 పరీక్షా కేంద్రాల్లో ఈ నెల 20నుంచి 27వరకు పరీక్షలు జరగనున్నందున ఉదయం 7నుంచి సాయంత్రం 7గంటల వరకు నిబంధనలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. సమీపంలోని అన్ని జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని ఆదేశించారు. పరీక్షలకు బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. సర్కారు బడిలో సకల వసతులు హవేళిఘణాపూర్(మెదక్): బడీడు పిల్లలు బడిలోనే ఉండేలా తల్లిదండ్రులు చూడాలని డీఈఓ విజయ అన్నారు. శనివారం మండల పరిధిలోని కూచన్పల్లిలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పాఠశాల విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించి, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యాబోధన అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లారెడ్డి, శివరాజ్, శశికుమార్, కృష్ణవేణి, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు చిన్నశంకరంపేట(మెదక్): వైద్యారోగ్యంపై ప్రజలకు అవసరమైన అవగాహన కల్పించేందుకు గ్రామసభలు నిర్వహించాలని డీఎంహెచ్ఓ శ్రీరామ్ సిబ్బందికి సూచించారు. శనివారం చిన్నశంకరంపేట ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్టులు, ల్యాబ్, ఫార్మసీని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. మే 15 వరకు ఈ ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. కార్యక్రమంలో సీహెచ్ఓ యాదగిరిరావు, ఎంఎల్హెచ్పీ కుమారి, సూపర్వైజర్ బుజ్జి, అనిత, నర్సింహులు పాల్గొన్నారు. పకడ్బందీగా జనగణన కౌడిపల్లి(నర్సాపూర్): జనగణన పకడ్బందీగా చేయాలని అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. శనివారం మండల కేంద్రంలో ఎన్యూమరేటర్ల శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించి మాట్లాడారు. జనగణనపై ఆర్థిక, సామాజిక, విద్య తదితర అంశాలు ఆధారపడి ఉంటాయన్నారు. కరోనాతో 2021లో జనగణన జరగలేదని, ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ప్రతి కుటుంబాన్ని లెక్కించాలని చెప్పారు. కొన్ని గ్రామాల్లో ఎక్కువ ఇళ్లు ఉండి, తక్కువ జనాభా ఉంటారని, మరికొన్ని చోట్ల తక్కువ జనాభా ఉండి ఎక్కువ ఇళ్లు ఉంటాయని తెలిపారు. దీంతో జాగ్రత్తగా గణన చేయాలన్నారు. -
రక్తం నిండుకుంటోంది
‘గత నెల 31న సిద్దిపేట జీజీహెచ్లో రోగికి అత్యవసర చికిత్స నిమిత్తం ఓ పాజిటివ్ రక్తం అవసరమైంది. దీంతో బ్లడ్ కోసం ఇబ్బంది పడుతుంటే సిద్దిపేట వన్టౌన్ పోలీస్స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ చంద్రశేఖర్ స్పందించి రక్తదానం చేశారు. దీంతో ఆ వ్యక్తికి అత్యవసర చికిత్స పూర్తి చేశారు’.సాక్షి, సిద్దిపేట: జిల్లాలో నిత్యం పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు, 20 నుంచి 30 మంది మహిళలు పురుడు పోసుకుంటున్నారు. ఇందులో చాలా మందికి రక్తం అవసరం అవుతోంది. తలసేమియా బాధితులకు పదిహేను రోజులకోసారి రక్తం ఎక్కించాలి, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. ప్రస్తుతం జిల్లాలో బ్లడ్ బ్యాంక్లో నిల్వలు రోజు రోజుకు తగ్గుతున్నాయి. జీజీహెచ్ (ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి)లో బ్లడ్ బ్యాంక్ ఉంది. వేసవిలో ఏర్పడే కొరతను అధిగమించేందుకు దాతల సహకారం అవసరం. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ఉచితంగా రక్తం కావాలంటే ఇతరుల నుంచి సేకరించి ఇవ్వాల్సి వస్తోంది. వేసవిలో ప్రమాద ఘంటికలు మోగే పరిస్థితులున్నాయి. నెగెటివ్ స్టాక్ తక్కువ జీజీహెచ్లో నెగెటివ్ బ్లడ్ స్టాక్ చాలా తక్కువగా ఉంది. బ్లడ్ బ్యాంక్ మొత్తంగా అన్ని రకాల గ్రూప్లు కలిపి 112 యూనిట్ల రక్తం మాత్రమే నిల్వ ఉంది. అందులో ఏబీ పాజిటివ్ 08, ఏబీ నెగిటివ్ 01, ఓ పాజిటివ్ 39, బీ పాజిటివ్ 35, ఏ పాజిటివ్ 18, ఏ నెగిటివ్ 02, ఓ నెగిటివ్ 06, బీ నెగిటివ్ 03 యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. రక్తం కొరత ఉండటంతో బ్లడ్ అవసరం ఉన్న వారి తరఫున ఒకరు డొనేట్ చేస్తే సర్దుబాటు చేస్తున్నారు. దీంతో డొనర్ కోసం రోగి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీవ్రంగా కొరత ఉండే నెగిటివ్ గ్రూప్లకు సంబంధించిన ఫోన్ నంబర్లకు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది ఫోన్లు చేసి పిలిపిస్తున్నారు. ఎవరు ఇవ్వొచ్చు.. 18– 55 వయసు ఉండి.. 50 కిలోల కంటే ఎక్కువ బరువు ఉన్న వారే రక్తదానం చేయాలి. మనిషి శరీరంలో సుమారుగా 5 లీటర్ల వరకు రక్తం ఉంటుంది. 350 మిల్లీ లీటర్ల మేర రక్తం సేకరిస్తారు. రక్తదానం చేయడంతో శరీరంలో ఐరన్, మినరల్ లెవెల్స్ సమస్థాయిలో ఉండి, శరీరానికి మేలు చేస్తాయి.దాతలు స్పందించాలి రక్త నిల్వలు సమకూరేందుకు యువత, రాజకీయ పార్టీ నేతలు, సినీ హీరో అభిమానులు, స్వచ్ఛంద సంస్థలు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో విద్యార్థులకు సెలవులు ఉండనున్నాయి. రక్తం కొరత నుంచి గట్టెక్కించ్చేందుకు ప్రభుత్వ ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంక్లో రక్తదాన శిబిరాలను నిర్వహించాలి. రాజకీయ నేతలు, సినీ హీరో పుట్టిన రోజుల, పెళ్లి రోజుల సందర్భంగా దాతలు ముందుకు వచ్చి యువత, స్వచ్చంద సంస్థలు, రాజకీయ పార్టీల నేతలు రక్తదాన శిభిరాలు ఏర్పాటు చేయాలని వైద్యులు కోరుతున్నారు. అలాగే ఆస్పతి సిబ్బంది ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలను సంప్రదించి విద్యార్థులచే క్యాంప్లను ఏర్పాటు చేసేందుకు అవగాహన కల్పించాలి. బ్లడ్ బ్యాంక్లో తగ్గుతున్న నిల్వలు నెగెటివ్ గ్రూపుల స్టాక్ చాలా తక్కువ అన్నీ కలిపి 112 యూనిట్లే నిల్వ వేసవిలో మరింత తగ్గే అవకాశంఇబ్బంది లేకుండా చూస్తున్నాం వేసవిలో సాధారణంగా రక్తం కొరత ఉంటుంది. కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. ప్రస్తుతం జీజీహెచ్ బ్లడ్ బ్యాంక్లో అన్ని గ్రూప్ల రక్తపు నిల్వలున్నాయి. బ్లడ్ అవసరం ఉన్నవారికి వారి కుటుంబ సభ్యులు రక్తం డొనెట్ చేసేలా అవగాహన కల్పిస్తున్నాం. దాతలు ముందుకు వచ్చి క్యాంప్లు ఏర్పాటు చేస్తే వేసవిలో రక్తం కొరత లేకుండా ఉంటుంది. – డాక్టర్ జ్యోతి, ఆర్ఎంఓ, జీజీహెచ్ -
బకాయిలన్నీ చెల్లించాల్సిందే
కలెక్టరేట్ ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగుల నిరసన ● ఎంప్లాయీస్ జేఏసీ డిమాండ్ ● కలెక్టరేట్ ఎదుట నిరసన సిద్దిపేటరూరల్: విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల బకాయిలన్నీ చెల్లించాల్సిందేనని టీజీఈజేఏసీ జిల్లా నాయకులు గ్యాదరి పరమేశ్వర్, విక్రంరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ విరమణ పొందిన వారికి బకాయిలను చెల్లించాలన్నారు. హెల్త్కార్డులుపై నగదు రహిత వైద్యం, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి గజ్వేల్: ఉద్యోగుల ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం గజ్వేల్లోని ఐఓసీ ఎదుట పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఐక్యకార్యాచరణ కమిటీ నాయకులు మాట్లాడుతూ ఉద్యోగులకు రావాల్సిన రెండు పీఆర్సీలను, పెండింగ్లో ఉన్న డీఏలను వెంటనే అందించాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు అందాల్సిన అన్ని రకాల బెనిఫిట్లను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఎన్జీఓల సంఘం గజ్వేల్ తాలూకా కార్యదర్శి రాజశేఖర్రెడ్డి, కోశాధికారి ప్రవీణ్, జిల్లా ఉపాధ్యక్షులు నాగభూషణం, వెంకట్, మహిళా విభాగం నాయకురాలు జబినా సుల్తానా, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సత్యనారాయణరెడ్డి, లింగం, వలీ అహ్మద్, సత్యనారాయణ, శ్రీనివాస్, సీపీఎస్ ఉద్యోగుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగేగజ్వేల్లోని జిల్లా ఆస్పత్రి ప్రాంగణంలో మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ గజ్వేల్ శాఖ అధ్యక్షుడు శ్రీనివాసచారి ఆధ్వర్యంలో వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేశారు. నల్లబ్యాడ్జీలతో నిరసన సిద్దిపేటఎడ్యుకేషన్: సమస్యలు పరిష్కరించాలంటూ శుక్రవారం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాల ఆవరణలో భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలతో ఉద్యోగ సంఘాల నాయకలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీజీసీటీఏ, టీఎన్జీఓ, టీజీఓల ప్రతినిధులు మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చూపక పోవడం విచారకరమన్నారు. -
డ్రైవర్ల అప్రమత్తతతోనే ప్రమాదాల నివారణ
గజ్వేల్: డ్రైవర్ల అప్రమత్తతతోనే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని డీజీపీ శివధర్రెడ్డి అన్నారు. శుక్రవారం గజ్వేల్లోని మహతి ఆడిటోరియంలో నిర్వహించిన ‘అరైవ్–అలైవ్’ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు నిబంధనలు పాటించకపోవడమే ప్రమాదాలకు కారణమని అన్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడూ మనసు ఆధీనంలో ఉంచుకోవాలన్నారు. డ్రైవింగ్లో ఫోన్ వాడటం ఎంతమాత్రం సరికాదన్నారు. మరోవైపు సీటు బెల్టులు వాడటం నమోషీగా భావిస్తున్నారని చెప్పారు. కారు ప్రయాణంలో డ్రైవింగ్ చేసే వ్యక్తితోపాటు అందులో ప్రయాణించే ప్రతిఒక్కరూ సీటు బెల్టులు పెట్టుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. డ్రైవర్లలో చైతన్యం తీసుకురావడమే ఈ కార్యక్రమాల లక్ష్యమన్నారు. ఆటోడ్రైవర్లకు యూనిఫామ్ల పంపిణీ సదస్సులో భాగంగా 150మందికిపైగా ఆటోడ్రైవర్లకు యూనిఫారమ్లను పంపిణీ చేశారు. వైద్యశిబిరం నిర్వహించారు. కంటి పరీక్షలు చేయించుకున్న మరికొంతమందికి కళ్లద్దాలను అందజేశారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు, రోడ్డు ప్రమాదాలపై నిర్వహించిన వీడియో ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇంకా ఈ సదస్సులో జిల్లా కలెక్టర్ హైమావతి, సీపీ రష్మీపెరుమాళ్, గజ్వేల్ ఆర్డీఓ వీవీల్ చంద్రకళ, గజ్వేల్ ఏసీపీ నర్సింహులు, జిల్లాలోని ఏసీపీలు, స్థానిక ఇన్స్పెక్టర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా డీజీపీని పోలీసులు సన్మానించారు. రోడ్డు నిబంధనలు పాటిస్తూఆదర్శంగా నిలవాలి చైతన్యం పెంపొందించేందుకే‘అరైవ్–అలైవ్’ : డీజీపీ శివధర్రెడ్డి -
పైసలు రాక.. పస్తులు
ఉపాధి కూలీల వెతలుమహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కూలీలు డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. కూలీలకు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో పథకం లక్ష్యం నీరుగారుతోంది. చెమటోడ్చి పనిచేసిన కూలీలకు సకాలంలో కూలి డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదలు, చెమట చిందించి చేసిన పనికి పైసా రాకపోవడంతో పస్తులతో అల్లాడిపోతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రూ.2.95కోట్లు పెండింగ్లో ఉన్నాయి. డబ్బుల చెల్లింపు ఆలస్యమవుతుండటంతో ఉపాధి పనులకు కూలీలు వచ్చేందుకు మొగ్గు చూపడం లేదు. – సాక్షి, సిద్దిపేట దాదాపు రూ.6వేలు రావాలి ఉపాధి పనులు చేస్తున్నా డబ్బులు రావడంలేదు. దాదాపు రూ. 6వేలు రావాలి. కూలి డబ్బుల కోసం రోజూ బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా. అధికారులను అడిగితే ఇంకా పడలేదు అని చెబుతున్నారు. ఇప్పటికై నా ఉన్నత అధికారులు స్పందించి కూలి డబ్బులు త్వరగా చెల్లించాలి. – ముత్యాలు, ఉపాధి హామీ కూలీ,లింగుపల్లి, మిరుదొడ్డి త్వరలో జమ అవుతాయి పెండింగ్లో ఉన్న కూలీల డబ్బులు వారం రోజుల్లో బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి. రోజు పనులకు వచ్చిన వారి వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నాం. కూలి పనికి వచ్చిన వారందరికీ తప్పకుండా డబ్బులు చెల్లించడం జరుగుతుంది. – జయదేవ్ ఆర్యా, డీఆర్డీఓ, సిద్దిపేట గ్రామాల్లో రైతులకు, కూలీలకు ఉపాధి పనుల ద్వారా ఆర్థికంగా చేయూతను అందించేందుకు ఎన్ఆర్ఈజీఎస్ ను కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చింది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 5,69,156 జాబ్ కార్డులుండగా 10,84,409 మంది ఉపాధి కార్మికులున్నారు. అందులో 5,59,118 మంది యాక్టివ్ కూలీలున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు అంతగా లేకపోవడంతో జాబ్ కార్డు ఉన్న ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక్కరైనా ఉపాధి పనులకు వెళ్తున్నారు. పనిలోకి వచ్చిన కూలీ పేరు, చేసిన పరిమాణాన్ని రోజూ ఫీల్డు అసిస్టెంట్లు ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఉదయం 8గంటలకు ఒక సారి ఫొటో దిగితే , మళ్లీ మధ్యాహ్నం 12గంటలకు (కనీసం 4గంటలు గ్యాప్) ఫొటో దిగాలి. అప్పుడే ఉపాధి కూలీకి డబ్బులు అకౌంట్లో జమ అవుతాయి. కేవైసీ కొర్రీలతో.. ప్రతి 15 రోజులకు ఒక సారి కూలి డబ్బులు కార్మికుల బ్యాంక్ ఖాతాలో జమకావాలి. కానీ ఫిబ్రవరి 6వ తేదీ నుంచి డబ్బులు జమ కావడం లేదు. గత రెండు నెలలుగా కూలి డబ్బులు అందక, ఈ కేవైసీ కొర్రీలతో కూలీలు పనులకు వెళ్లడమే మానేస్తున్న దుస్థితి దాపురించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ. 2,95,49,000లు పెండింగ్లో ఉన్నాయి. చట్టం ప్రకారం 15 రోజుల్లోగా కూలి డబ్బులు జమవ్వకపోతే రోజువారీగా పరిహారాన్ని అందించాలి. ఉపాధి కూలీలకు డబ్బులు వెంటవెంటనే అందిస్తే ఉపాధి పనులకు ఎక్కువ మంది కూలీలు పనులకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికై నా ఉన్నత అధికారులు స్పందించి త్వరగా కూలి డబ్బులు చెల్లించాలని ఉపాధి కూలీలు కోరుతున్నారు.జిల్లా జాబ్ కార్డులు కూలీలు బకాయిలు ిసద్దిపేట 1,96,086 3,84,444 రూ.1,26,83,000 సంగారెడ్డి 2,09,508 3,37,490 రూ.56,23,000మెదక్ 1,63,562 3,24,475 రూ.1,12,43,000 రెండు నెలలుగా నిలిచినడబ్బుల చెల్లింపులు పెండింగ్లో రూ.2.95కోట్లు ఎదురుచూస్తున్న కూలీలు ఉమ్మడి మెదక్ జిల్లాలోజాబ్ కార్డులు: 5.69లక్షలు -
ముగిసిన కో–ఆప్షన్ గడువు
చేర్యాల(సిద్దిపేట): మున్సిపల్ పాలకవర్గానికి అనుబంధంగా ఎన్నిక కావాల్సిన నాలుగు కో– ఆప్షన్ సభ్యులకు దరఖాస్తుల స్వీకరణ గడువు శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. నాలుగు స్థానాలకు ఆరు దరఖాస్తులు వచ్చినట్లు కమిషనర్ ఎస్.నాగేందర్ తెలిపారు. మాజీ ప్రజాప్రతినిధులు, స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్, రిటైర్డ్ గెజిటెడ్ అధికారుల నుంచి ఇద్దరు సభ్యులు, మైనార్టీల నుంచి ఇద్దరిని ఎన్నుకోవాల్సి ఉంది. ఎన్నికకు సంబంధించిన ప్రక్రియలో దరఖాస్తుల స్వీకరణ పూర్తి అయింది. వచ్చిన దరఖాస్తుల్లో ఇద్దరు మైనార్టీలు, నలుగురు మాజీ ప్రజాప్రతినిధులు దరఖాస్తు చేసుకున్నారు. రిటైర్డ్ గెజిటెడ్ అధికారులెవరూ దరఖాస్తు చేసుకోలేదు. స్క్రూటినీ, విత్డ్రాల అనంతరం ప్రత్యేక సమావేశం నిర్వహించి సభ్యులను ఎన్నుకుంటారు. నాలుగు స్థానాలకు ఆరు దరఖాస్తులు రిటైర్డ్ గెజిటెడ్ అధికారులు దూరం -
మంత్రి దామోదరను కలిసిన నిర్వాసిత మహిళలు
గజ్వేల్: మల్లన్నసాగర్ నిర్వాసిత గ్రామాలకు చెందిన ఒంటరి మహిళలు శుక్రవారం మంత్రి దామోదర రాజనర్సింహను కలిశారు. ప్యాకేజీలు, పరిహారాల కోసం హైకోర్టును ఆశ్రయించి విజయం సాధించిన వీరు హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. 2019నుంచి ఎదురైన సమస్యలను పరిష్కరించడానికి అండగా నిలిచిన దామోదర్కు కృతజ్ఞతలు తెలిపారు. వారితోపాటు నిర్వాసిత గ్రామాలకు చెందిన ప్రతినిధులు హయతొద్దీన్ తదితరులున్నారు. సుందరీకరణ పనులు వేగిరం చేయండి హుస్నాబాద్: ఎల్లమ్మ చెరువు సుందరీకరణ, అభివృద్ధి పనులను వేగిరం చేయాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అన్నారు. శుక్రవారం మ్యాప్ను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చెరువులో నిర్మిస్తున్న గ్లాస్ బ్రిడ్జిని పరిశీలించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. సుందరీకరణ పనులు పూర్తయితే ఎల్లమ్మ చెరువు పర్యాటక కేంద్రంగా మారి, ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దండిలక్ష్మి, వైస్ చైర్ పర్సన్ చిత్తారి పద్మ, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, కౌన్సిలర్ భూక్య సంపత్ నాయక్, అధికారులు పాల్గొన్నారు. సామాజిక బాధ్యతకు ఎన్ఎస్ఎస్ దోహదం రాష్ట్ర కోఆర్డినేటర్ వెంకటేశ్వర్రావు వర్గల్(గజ్వేల్): ఎన్ఎస్ఎస్ శిబిరాలు విద్యార్థుల్లో సేవా నిరతి, సామాజిక బాధ్యతను పెంపొందింపజేస్తాయని రాష్ట్ర ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ చలమల్ల వెంకటేశ్వర్రావు అన్నారు. శుక్రవారం వర్గల్ మండలం అవుసులోనిపల్లిలో స్థానిక పూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినుల వారం రోజుల ఎన్ఎస్ఎస్ (జాతీయ సేవాపథకం) శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. విద్యార్థులకు సర్టిఫికేట్లు ప్రధానం చేశారు. ప్రిన్సిపాల్ డాక్టర్ భాస్కర్రావు మాట్లాడుతూ సమాజం, మానవ సంబంధాల పెంపు, నిత్యజీవితంలో సమస్యలపై శిబిరం ద్వారా విద్యార్థులకు అవగాహన ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో వైస్ప్రిన్సిపాల్ గోవిందరావు, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ జీ భాగ్యలక్ష్మి, రాధా రాణి, ఏటీపీ వర్జిని పాల్గొన్నారు. -
శనివారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
గ్రిల్స్ ఏర్పాటు చేయాలి వందల ఏళ్లుగా పూజలు అందుకుంటున్న గంగిరేణి చెట్టును కాపాడుకోవాల్సిన బాధ్యత ఆలయ అధికారులపై ఉంది. చెట్టుపై బంతిపూల దండలు పడకుండా గ్రిల్స్ ఏర్పాటు చేయాలి. భక్తులు వేసిన దండలను రోజూ తీసివేయాలి. దండలు చెట్టుపై కాకుండా మొదట్లో వేసేలా చర్యలు చేపట్టాలి. – కటకం అమరేందర్ స్థానికుడు రక్షణ చర్యలు చేపడతాం ఇటీవల మూడు నెలలపాటు స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరిగాయి. లక్షాలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. గంగిరేణి చెట్టుపై బంతి పూల దండలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో చెట్టు ఎండిపోతోంది. వాటిని తొలగించి రక్షణచర్యలు చేపడతాం. – కృష్ణ ప్రసాద్, ఆలయ ఈఓదేవుని చెట్టుకు ఏమైంది?కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో దేవుని చెట్టుగా పిలువబడే గంగిరేణి వృక్షం మోడుబారుతోంది. భక్తులు వేసిన పూల దండలు తొలగించకపోవడమే కారణమని పలువురు వాపోతున్నారు. నిత్యం స్వామి దర్శనానికి వచ్చే భక్తులు.. ఆలయ ప్రాంగణంలోని గంగిరేణి చెట్టుపై బంతి పూల దండలు వేసి ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించి ముడుపులు కడుతుంటారు. ఇలా నిత్యం వేలాది పూల దండలను చెట్టుపై వేస్తుండటంతో కొమ్మలన్నీ చిగురించకపోగా చెట్టంతా మోడుబారుతుంది. వాతావరణంలో ఎన్ని మార్పులు వచ్చినా కళకళలాడే వృక్షం పూల దండలు వేయడం వల్లే ఇలా మారుతోందని స్థానికులు చెబుతున్నారు. భక్తులు వేసిన పూలదండలను నిత్యం ఆలయ సిబ్బంది తొలగించాలి. కానీ అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో వృక్షం కళావిహీనంగా మారుతోంది. ఇప్పటికై నా అధికారులు పరిరక్షణ చర్యలు చేపట్టాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు. మోడుబారుతున్న గంగిరేణి వృక్షం పూలదండలు తొలగించకపోవడమే కారణమా? రక్షణ చర్యలు తీసుకోవాలనికోరుతున్న భక్తులు -
ప్రజల వద్దకే పాలన
కలెక్టర్ హైమావతి కొమురవెల్లి(సిద్దిపేట): ప్రజల వద్దకు పాలన తీసుకువచ్చేందుకే ప్రభుత్వం ‘ప్రజా పాలన– ప్రణాళికలు’ తీసుకువచ్చిందని కలెక్టర్ హైమావతి తెలిపారు. గురువారం ప్రజాపాలన ప్రణాళికలో భాగంగా మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని రాణించాలన్నారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఒక్కొక్క వారం ఒక్కో అంశంపై ప్రణిళికలు చేస్తూ చర్యలు తీసుకుంటునట్లు తెలిపారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. జూన్ 2 నుంచి కుటుంబ జీవిత బీమాను ప్రభుత్వం అమలు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ దివ్య, ఎంపీడీఓ లక్ష్మప్ప, ఎంపీఓ శ్రీనివాస వర్మ, అధికారులు ,సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
‘రోడ్డు భద్రత’పై నిర్లక్ష్యం తగదు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): రోడ్డు భద్రతలపై నిర్లక్ష్యం వీడాలని, నిబంధనలు పాటిస్తే క్షేమంగా గమ్యం చేరవచ్చని రాష్ట్ర అదనపు డీజీపీ స్వాతి లక్రా అన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో గురువారం పోలీస్శాఖ ఆధ్వర్యంలో వాహనదారులకు ఉచిత నేత్ర వైద్య శిబిరం, సీపీఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన స్వాతి లక్రా మాట్లాడుతూ రహదారి భద్రత కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్కరిదన్నారు. రోజూ జరుగుతున్న ప్రమాదాలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలేనన్నారు. ముఖ్యంగా వాహనదారులు నిద్రలేకుండా సుదూర ప్రయాణాలు చేయడం, మద్యం సేవించడం, అతివేగం, కంటిచూపు సక్రమంగా లేకపోవడమే కారణమన్నారు. సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం, సీట్బెల్ట్ , హెల్మెట్ ధరించకపోవడంతో ప్రమాదాలకు దారితీస్తుందన్నారు. 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరిలో కంటి చూపు సమస్యలు వస్తాయన్నారు. ప్రమాదంలో ఉన్న వ్యక్తులకు తక్షణం సీపీఆర్ చేయడం ద్వారా వారి జీవితాన్ని రక్షించే అవకాశం ఉంటుందన్నారు. అంతకు ముందు సీపీ రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ అరైవ్ అలైవ్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం ప్రతి వాహనదారుడు క్షేమంగా ఇంటికి చేరడమే అన్నారు. అందువలన వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రహదారులపై ప్రయాణాలు చేసేటపుడు జాగ్రత్తలు పాటించాలన్నారు. రహదారులపై ఎవరైనా ప్రమాదాలకు గురైతే వెంటనే డయల్ 100, 108లకు సమాచారం అందించి, ప్రాణాలను కాపాడాలన్నారు. అనంతరం రహదారి భద్రతపై వాహనదారులతో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో పోలీస్శాఖ అధికారులు, వైద్యులు, సిబ్బంది, వాహనదారులు, తదితరులు పాల్గొన్నారు. నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు దూరం రాష్ట్ర అదనపు డీజీపీ స్వాతి లక్రా -
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ఎంపీ రఘునందన్రావుగజ్వేల్రూరల్: బీజేపీతోనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీ రఘునందన్రావు అన్నారు. బుధవారం గజ్వేల్లో భారతీయ జనతా పార్టీ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునందన్రావు మాట్లాడుతూ దేశ భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని ప్రధాని నరేంద్రమోదీ ముందు చూపుతో పాలన సాగిస్తుండగా, మాయమాటలతో ప్రజలను మభ్య పెట్టే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రతి బీజేపీ కార్యకర్త బూత్ స్థాయి నుంచి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు ఓఎస్ రెడ్డి, ప్రకాశ్రెడ్డి, రాష్ట్ర కోశాధికారి వాసుదేవరావు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కో ఆప్షన్ పదవుల పందేరం
నోటిఫికేషన్ జారీ చేసిన మున్సిపల్ కమిషనర్ హుస్నాబాద్: ఎన్నో రోజులుగా ఆశావహులు ఎదురు చూస్తున్న మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎంపిక సందడి మొదలైంది. బుధవారం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ కో ఆప్షన్ సభ్యుల ఎంపికకు నోటిఫికేషన్ జారీ చేశారు. మొదటి సారిగా హుస్నాబాద్ మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ కై వసం చేసుకున్న విషయం విదితమే. 20 వార్డులకు గాను 14 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్ గెలుచుకుంది. నలుగురు కో ఆప్షన్ సభ్యులను కౌన్సిల్ ఎన్నిక చేయనుంది. ఇందులో మాజీ ప్రజాప్రతినిధులు, ఇతర కోటా నుంచి రెండు స్ధానాలు (మహిళా, జనరల్)కు కేటాయించారు. మైనార్టీలకు రెండు స్థానాలు (మహిళ, జనరల్) కేటాయించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టికెట్లు ఆశించి భంగపడిన వారికి, మాజీ కౌన్సిలర్లకు కో ఆప్షన్ పదవులు ఇస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీనే నమ్ముకొని ఉంటున్న కాంగ్రెస్ నాయకులు కో ఆప్షన్ పదవుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మైనార్టీ కోటా నుంచి మాజీ ఎంపీటీసీ ఎండీ హస్సేన్ ముందు వరుసలో ఉన్నారు. అలాగే మాజీ ప్రజా ప్రతినిధుల కోటా నుంచి పున్న లావణ్య, తణుకు ఆంజనేయులు, స్వరూప, వల్లపు రాజు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి ఆశీస్సులు ఉన్న వారికి కో ఆప్షప్ పదవులు దక్కనున్నాయి. అర్హులైన వారు ఈనెల 21వ తేదీలోగా మున్సిపల్ కార్యాలయంలో ధరఖాస్తులు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ కోరారు. -
ధాన్యం కొనుగోళ్లకు సర్వం సిద్ధం
● కలెక్టర్ హైమావతి ● అధికారులకు దిశానిర్దేశం సిద్దిపేటరూరల్: రబీ సీజన్లో వరి ధాన్యం కొనుగోళ్లను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. జిల్లాలో 421 కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని, కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు పూర్తిగా సిద్ధంగా ఉంచాలన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లో బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు నిర్వహణలో ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. గత యాసంగి సీజన్లో 93,142 మంది రైతుల నుంచి 3,84,147 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రూ.884.56 కోట్లు మద్దతు ధర చెల్లించినట్లు తెలిపారు. ప్రస్తుత రబీ సీజన్లో 5,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 421 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించడం జరుగుతుందన్నారు. మండల సభలను సమర్థంగా నిర్వహించాలి ప్రగతి ప్రణాళిక కార్యాచరణ ప్రక్రియలో భాగంగా ఈ నెల 16న జరిగే మండల సభల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హైమావతి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు, రుణమాఫీ సంబంధిత పూర్తి సమాచారాన్ని , ప్రభుత్వం అందజేసిన నిధులను వివరించాలన్నారు. సాధారణ సేంద్రీయ వ్యవసాయంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అబ్దుల్ హమీద్, లక్ష్మీకిరణ్, జెడ్పీ సీఈఓ రమేశ్, డీఆర్డీఓ జయదేవ్ఆర్యా, డీపీఓ రవీందర్, డీడబ్ల్యూఓ శారధ, ఇరిగేషన్ ఈఈలు తదితరులు పాల్గొన్నారు. -
‘మల్లన్న’ నిర్వాసితుల్లో సంబురం
● ఎట్టకేలకు ఫలించిన న్యాయపోరాటం ● రూ.12.54లక్షల చొప్పున ప్యాకేజీ గజ్వేల్: గజ్వేల్– ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లన్నసాగర్ నిర్వాసిత గ్రామాలకు చెందిన ఒంటరి మహిళల న్యాయపోరాటం ఫలించింది. ప్యాకేజీ కోసం 2019 నుంచి పోరాటం సాగించారు. వేములఘాట్ గ్రామానికి చెందిన 24 మంది, ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామానికి చెందిన 21 మంది ఒంటరి మహిళలకు ఒక్కొక్కరికి రూ.12.54లక్షల చొప్పున ప్యాకేజీని వారి ఖాతాల్లో జమచేసినట్లు బుధవారం తెలిపారు. ఏడేళ్ల తర్వాత తమ న్యాయ పోరాటం ఫలించడంతో నిర్వాసితులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కేసును హైకోర్టులో సమర్ధవంతంగా వాదించి గెలిపించిన హైకోర్టు న్యాయవాది సీహెచ్. రవికుమార్కు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. స్థానికంగా సంబురాలు చేసుకున్నారు. -
నిబంధనలు పాటిద్దాం. సురక్షితంగా పయనిద్దాం
● రోడ్డు భద్రత.. అందరి బాధ్యత ● సిద్దిపేట బస్టాండ్ చౌరస్తాలో ‘అరైవ్–అలైవ్’ సిద్దిపేటకమాన్: రోడ్డు భద్రత చట్టం మాత్రమే కాదని.. అది మన జీవితానికి రక్షణ కవచమని అదనపు డీసీపీ ఏఆర్ సుభాష్చంద్రబోస్, ఏసీపీ రవీందర్రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ సుమన్కుమార్ తెలిపారు. అరైవ్– అలైవ్ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట బస్టాండ్ చౌరస్తాలో పోలీసు అధికారులు ట్రాఫిక్, రోడ్డు నిబంధనలు, ప్రమాదాల నివారణపై బుధవారం అవగాహన కల్పించారు. రవాణశాఖ, పోలీసు అధికారులు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతో మానవహారం నిర్వహించి, ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వాహనదారులు వాహనాలు నడిపే సమయంలో బాధ్యతతో వ్యవహరించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లు నడిపేసమయంలో సీట్ బెల్ట్ ధరించాలన్నారు. మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, డ్రంకెన్ డ్రైవ్, ర్యాష్ డ్రైవ్ చేయకూడదని అవగహన కల్పించారు. కార్యక్రమంలో సీఐలు వాసుదేవరావు, ఉపేందర్, లక్ష్మీబాబు, ప్రవీణ్కుమార్, రవాణశాఖ అధికారి శంకర్నారాయణ, ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
సారు.. ఇదేం తీరు
● స్వచ్ఛమైన నీరు అని చెప్పే వారే తాగకపోవడమా? ● ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేట్ మినరల్ వాటర్ ● అధికారులు, సిబ్బంది తీరుపై సర్వత్రా విమర్శలు భగీరథ నీరు.. అధికారులు తాగరు ‘మిషన్ భగీరథ నీళ్లు స్వచ్ఛమైనవి.. పలుమార్లు శుద్ధి చేసి ఇంటింటికీ సరఫరా చేస్తున్నాం.. భగరీథ నీటిని తాగడం వల్ల పూర్తి ఆరోగ్యంగా ఉంటా’రని అధికారులు తరచూ చెప్పే మాటలను వారే ఆచరించకపోవడం విచిత్రం. సాక్షాత్తు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేట్ మినరల్ వాటర్ ప్లాంట్ల నుంచి నీళ్లు తెప్పించుకుని తాగుతుండటం గమనార్హం. చెప్పే వారే పాటించకపోతే ఎలా అని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. – సాక్షి, సిద్దిపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, 508 గ్రామ పంచాయతీలలో 1,515 ఓవర్హెడ్ ట్యాంక్ల నుంచి 2,06,308 గృహాలకు నల్లాల ద్వారా తాగునీటిని అందిస్తున్నారు. పలు ప్రభుత్వ కార్యాలయాలకు సైతం తాగునీటి కనెక్షన్లు ఇచ్చారు. కానీ ఆ నీటిని కార్యాలయ సిబ్బంది తాగకుండా ప్రైవేట్ వాటర్ ప్లాంట్ల నుంచి నీటిని తెప్పిస్తున్నారు. ఇలా ప్రైవేట్ మినరల్ వాటర్ ప్లాంట్లను అధికారులే వినియోగిస్తూ ప్రోత్సహిస్తున్నారు. మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఉన్నా ఆ నీరు తాగడం లేదంటే.. భగీరథ నీటిపై వారికి ఎంత నమ్మకం ఉందో అర్థమవుతోంది. ఇప్పటికై నా ఉన్నత అధికారులు స్పందించి ప్రభుత్వ కార్యాలయాల్లో మినరల్ వాటర్కు స్వస్తి పలికి మిషన్ భగీరథ వాటర్ను తాగి ప్రజల్లో మరింత నమ్మకం పెంచాల్సిన అవసరం ఉంది. సమీకృత కలెక్టరేట్లో సైతం.. జిల్లా సమీకృత కలెక్టరేట్లో దాదాపు 44శాఖలకు సంబంధించిన జిల్లా ప్రధాన కార్యాలయాల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. సమీకృత కలెక్టరేట్కు నిత్యం ప్రైవేట్ వాటర్ ప్లాంట్ నుంచి ఆటో ట్రాలీ వస్తుంది. పెద్ద ట్యాంక్లో నీటిని తీసుకువచ్చి క్యాన్లలో నింపి కార్యాలయాల్లోకి పంపిస్తున్నారు. ప్రైవేట్ మినరల్ వాటర్నే అధికారులు, సిబ్బంది తాగుతున్నారు. అలాగే కలెక్టరేట్లోని అధికారిక నివాసాలకు సైతం భగీరథ వాటర్ కనెక్షన్లు ఇచ్చారు. ఇటీవల మిషన్ భగీరథ వాటర్నే తాగుతున్నానని కలెక్టర్ హైమావతి ప్రకటించారు. సాక్షాత్తు కలెక్టరే భగీరథ నీరు తాగుతున్నా.. జిల్లా అధికారులు మాత్రం ప్రైవేటు మినరల్ వాటర్ వైపు మొగ్గుచూపడం గమనార్హం.సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో కూలింగ్ ఫ్రిడ్జ్ పక్కన మినరల్ వాటర్ క్యాన్లు మిషన్ భగీరథ నీటిని పలు మార్లు ఫిల్టర్ చేసి స్వచ్ఛమైన నీటిని నల్లాల ద్వారా అందజేస్తున్నాం. మా కార్యాలయంలో నల్లా కనెక్షన్ కొంత ఇబ్బంది ఉండటంతో మినరల్ వాటర్ క్యాన్ ద్వారా తెప్పించుకుంటున్నాం. నల్లా కనెక్షన్ ద్వారా వచ్చే నీటినే తాగుతాం. – నర్సింహులు, ఈఈ, మిషన్ భగీరథ ప్రైవేట్ మినరల్ వాటర్ ప్లాంట్లను కట్టడి చేయాల్సిన మున్సిపల్ అధికారులే కట్టుతప్పుతున్నారు. పట్టణ ప్రజలందరూ మిషన్ భగీరథ నీరు తాగడానికి సరఫరా చేస్తున్నారు. కానీ సిద్దిపేట మున్సిపాలిటీ కార్యాలయం అధికారులు, సిబ్బంది మాత్రం ప్రైవేట్ ప్లాంటు నీళ్ల వైపు మొగ్గుచూపుతున్నారు.సిద్దిపేట పట్టణంలోని మిషన్ భగీరథ ఈఈ కార్యాలయంలో భగీరథకు చెందిన మున్సిపల్ నల్లా కనెక్షన్ ఉన్నా బయట నుంచి మినరల్ వాటర్ను క్యాన్లలో తెప్పించుకుని తాగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా మిషన్ భగీరథ వాటర్ను సరఫరా చేస్తున్న కార్యాలయ సిబ్బందే తాగడం లేదు. ప్రతి రోజు ప్రైవేటు ప్లాంటు నుంచి వచ్చే మినరల్ నీటినే ఇక్కడి వారంతా వినియోగిస్తున్నారు. -
లక్ష్య సాధనకు అంకితభావం అవసరం
● సీపీ రష్మీ పెరుమాళ్ ● పుల్లూరులో మన పోలీస్– మన ఊరు కార్యక్రమం సిద్దిపేటరూరల్: విద్యార్ధులు ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు అంకిత భావం అవసరమని సీపీ రష్మీ పెరుమాళ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని పుల్లూరులో నిర్వహించిన మన పోలీస్–మన ఊరు కార్యక్రమాన్ని సీపీ సందర్శించారు. అలాగే పుల్లూరు బండ లక్ష్మీ నరసింహ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను, వైద్య శిబిరాన్ని, పాఠశాల సమీపంలో పునరుద్ధరించిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ యువత చదవడాన్ని అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. విద్య గొప్ప ఆయుధమని, విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలన్నారు. ఫోన్ వాడకం తగ్గించి, కష్టపడి చదవాలన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా వాహనదారుల భద్రత కోసం ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ ఏఆర్ సుభాష్ చంద్రబోస్, స్థానిక ఏసీపీ రవీందర్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
పాఠ్యాంశంగా రోడ్డు భద్రత
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రోడ్డు భద్రతా అంశాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెడుతామని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే రోడ్డుభద్రతపై మరింత అవగాహన పెంచేందుకు ఎంతో దోహదపడుతోందని చెప్పారు. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం హైదరాబాద్ ఐఐటీలో అరైవ్–అలైవ్ కార్యక్రమంలో పొన్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు కుటుంబాలను కోలుకోలేనంతగా దెబ్బతీస్తున్నాయని, కుటుంబాల భవిష్యత్ను చీకటిలోకి నెట్టేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్స్పాట్లను గుర్తించి, వాటిని నివారించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఈ ప్రమాదాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమన్నారు. ప్రమాదాల్లో క్షతగాత్రులను సాయం అందించే వారికి ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని ప్రకటించారు. ఎంపీ రఘునందన్రావు మాట్లాడుతూ ఏటా దేశంలో 1.80 లక్షల మంది రోడ్డు ప్రమాదాలతో మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడమే ప్రమాదాలకు ప్రధాన కారణమన్నారు. చిన్నప్పటి నుంచే వాటిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ 10,081 బస్సులతో దేశంలోనే మూడో అతిపెద్ద రవాణా సంస్థగా నిలుస్తోందన్నారు. విద్యార్థి దశ నుంచే బోధనజరిగేలా చర్యలు మంత్రి పొన్నం ప్రభాకర్ ఐఐటీహెచ్ఓలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం -
భాగ్య కుటుంబానికి అండగా ఉంటాం
మావోయిస్టు భాగ్య కుటుంబసభ్యులను పరామర్శిస్తున్న ఎమ్మెల్యేమిరుదొడ్డి(దుబ్బాక): ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు భాగ్య కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఇటీవల ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లా మాచ్పల్లి అటవీ ప్రాంతంలో ఈ నెల 13న పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో మండల పరిధిలోని ధర్మారం గ్రామానికి చెందిన రంగనబోయిన భాగ్య ఎలియాస్ రూపీ మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మంగళవారం ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి భాగ్య కుటుంబాన్ని పరామర్శించారు. భాగ్య కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రూ.5 వేల ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీడిత వర్గాల అభ్యున్నతి కోసం 24 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉండి పోరాడి అసువులు బాసిన భాగ్య మృతి చెందడం బాధాకరమన్నారు. పరామర్శించిన వారిలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తదితరులు ఉన్నారు. -
అంబేడ్కర్ అందరికీ ఆదర్శం
● అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేసిన నాయకుడు ● కలెక్టర్ హైమావతి, సీపీ రష్మీపెరుమాళ్ సిద్దిపేటకమాన్: భారత రాజ్యాంగంలో పౌరులకు ఉన్నతమైన హక్కులను కల్పించి, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిన మహనీయుడు అంబేడ్కర్ అని కలెక్టర్ హైమావతి తెలిపారు. జిల్లా కేంద్రంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహానికి కలెక్టర్ హైమావతి, సీపీ రష్మీ పెరుమాళ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అంబేడ్కర్ అందరికీ ఆదర్శనీయుడని, సామాజికంగా, ఆర్థికంగా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నప్పటికీ తన సంకల్పంతో ఉన్నత స్థాయికి ఎదిగి కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచారన్నారు. గొప్ప నాయకుడిగా ఎదగడం ఒక్కరోజులో సాధ్యం కాదని, ఎన్నో కష్టాలను అధిగమిస్తూ క్రమశిక్షణతో ముందుకు సాగాల్సి ఉంటుందన్నారు. అంబేడ్కర్ కేవలం ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదని, సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన మహోన్నత నాయకుడన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ మేధావుల్లో గుర్తింపు పొందిన అంబేడ్కర్ మన దేశానికి చెందిన వ్యక్తి కావడం గర్వకారణమన్నారు. సమాజసేవలో ముందుండాలి సీపీ రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ..అంబేడ్కర్ చూపిన మార్గాన్ని అనుసరించి సమసమాజ నిర్మాణానికి కృషి చేయాలన్నారు. అంబేడ్కర్ జీవితంలో ఉన్న మంచి విలువలను స్వీకరించి ప్రతి ఒక్కరూ సమాజ సేవలో ముందుండాలని సూచించారు. ఏసీఎల్బీ అబ్దుల్ రహమాన్ మాట్లాడుతూ అంబేడ్కర్ జీవితంలో నుంచి ఓర్పు, పట్టుదల, బాధ్యత వంటి గుణాలను అలవర్చుకోవాలన్నారు. అంతకుముందు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ అలైవ్లో భాగంగా రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేశారు. ఎస్సీ వెల్ఫేర్ విద్యార్థినిని శాలువాతో సత్కరించారు. కులాంతర వివాహం చేసుకున్న వారికి ప్రోత్సాహకాలు అందజేశారు. కార్యక్రమంలో డీఆర్ఓ నాగరాజమ్మ, ఆర్డీఓ సదానందం, అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, ఏసీపీలు రవీందర్రెడ్డి, సుమన్కుమార్, సీఐలు, ఆర్టీఓ శంకర్నారాయణ, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సంఘ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. -
మెరిట్ విద్యార్థులకు పారితోషికాలు
గజ్వేల్: గతేడాది టెన్త్, ఇంటర్ ఫలితాల్లో మెరిట్ సాధించిన దళిత విద్యార్థులకు అంబేడ్కర్ జయంతి సందర్భంగా మంగళవారం నగదు పారితోషికాలను అందజేశారు. మండలంలోని ఆహ్మదీపూర్ ఉన్నతపాఠశాలకు చెందిన టెన్త్ విద్యార్థి గోవర్ధనగిరి, కొడకండ్ల ఉన్నత పాఠశాలకు చెందిన టెన్త్ విద్యార్థిని అక్షిత, ఇంటర్కు సంబంధించి ములుగు మండలం అడవిమజీద్కు గ్రామానికి చెందిన మనోహర్, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని క్యాసారం గ్రామానికి చెందిన భావన పారితోషికాలను అందుకున్నవారిలో ఉన్నారు. అదేవిధంగా దళిత సర్పంచ్లు, కౌన్సిలర్లను సైతం ఈ సందర్భంగా సన్మానించారు. కార్యక్రమంలో అంబేడ్కర్ కాంప్లెక్స్ కమిటీ అధ్యక్షుడు రాములు, ప్రధాన కార్యదర్శి ఎం. కిష్టయ్య, నాయకులు మన్నె కృష్ణ, ఎం.నాగయ్య తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్రూరల్: విద్యార్థులు తమలోని ప్రతిభను చాటితేనే ఉపాధి అవకాశాలు లభిస్తాయని గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్గౌడ్ అన్నారు. పట్టణంలోని బాలుర ఎడ్యుకేషన్ హబ్లో మంగళవారం ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో జాబ్మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు తమలోని నైపుణ్యాన్ని చాటినపుడే అవకాశాలు లభిస్తాయన్నారు. జాబ్మేళాకు ఎంపికై న విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. జాబ్మేళాకు గజ్వేల్తో పాటు ములుగు, జగదేవ్పూర్, దౌల్తాబాద్ ప్రాంతాల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల నుంచి 81 మంది విద్యార్థులు పాల్గొనగా, వీరిలో 47 మందిని ఎంపిక చేశారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కృష్ణంరాజు, శర్మతో పాటు ఆయా కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. బెజ్జంకి(సిద్దిపేట): 108 వాహనాన్ని ప్రోగ్రాం మేనేజర్ సంపత్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అంబులెన్సులోని మందులు, వైద్య పరికరాలను పరిశీలించారు. రోగులకు మెరుగైన సేవలు అందేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో ఈఎంటీ రాజు, పైలెట్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాకు చెందిన ప్రముఖ కవి మల్లముల కనకయ్య రచించిన కనకధార స్తబకం, భాగ్యశ్రీ శతకం పుస్తకావిష్కరణలు ఈ నెల 19న హైదరాబాదులో జరుగుతాయని కవి ఉండ్రాళ్ళ రాజేశం తెలిపారు. ఈ మేరకు మంగళవారం పుస్తకావిష్కరణలకు సంబంధించిన కరపత్రాలను జిల్లా కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజేశం మాట్లాడుతూ పుస్తకావిష్కరణల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, అవుసుల భాను ప్రకాష్, కంది శంకరయ్య, బండకారి అంజయ్య గౌడ్, వరుకోలు లక్ష్మయ్య, మంచినీళ్ల సరస్వతీ రామశర్మ, బడేసాబ్ హాజరవుతారన్నారు. సిద్దిపేటకమాన్: రెడ్డి కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని రెడ్డి జేఏసీ నేతలు కోరారు. సిద్దిపేట ప్రెస్క్లబ్లో నిర్వహించిన సమావేశంలో మంగళవారం వారు మాట్లాడుతూ రెడ్డి జేఏసీ, ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 21న నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని అన్నారు. -
రాజ్యాంగం వల్లే తెలంగాణ
● ఎమ్మెల్యే హరీశ్రావు ● బంజేరుపల్లిలో అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ సిద్దిపేటరూరల్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంతోనే తెలంగాణ కల సాకారం అయిందని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. మంగళవారం నారాయణరావుపేట మండలం బంజేరుపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ తనకోసం కాకుండా దేశం కోసం, అణగారిన వర్గాల కోసం ఆలోచించారన్నారు. ఆయన రచించిన రాజ్యాంగం వల్ల మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతోందన్నారు. ఎంతో దూరదృష్టితో అలోచింది కొత్త రాష్ట్ర ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం అవసరం లేదని రాశారన్నారు. కేసీఆర్ ప్రపంచంలోనే అతిపెద్ద 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే, ఈ రేవంత్ సర్కార్ తాళం వేసిందన్నారు. నేటి యువత అంబేద్కర్ను స్పూర్తిగా తీసుకుని రాణించాలన్నారు. అంతకుముందు రాఘవాపూర్లో అంబేడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్, మండల నాయకులు తదితరు లు పాల్గొన్నారు. సిద్దిపేటరూరల్: చుక్కనీళ్ళు లేని ప్రాంతంలో మండుటెండల్లో సైతం చెరువుల, కుంటలు జలకళను సంతరించుకున్నాయని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. మంగళవారం నారాయణరావుపేట మండల కేంద్రంలో ఎల్లమ్మతల్లి సిద్దోగం వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ ఎల్లమ్మ దేవాలయానికి దారి లేకపోతే బ్రిడ్జి నిర్మించామని, గౌడఫంక్షన్హాల్ నిర్మాణానికి రూ. 35లక్షలతో అభివృద్ధి చేశామన్నారు. గంగమ్మతల్లి గలగలా పారుతూ ఎల్లమ్మతల్లి పాదాలకు చేరిందన్నారు. కాళేశ్వరం కూలిందని తప్పుడు ప్రచారం చేసిన కుహనా నాయకులు నారాయణరావుపేట పెద్దచెరువు, కుంటలు చూడాలని హితవు పలికారు. ఎల్లమ్మగుడి నుంచి మల్యాలకు బీటిరోడ్డు మంజూరు అయిందని, టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించేలా చూస్తానన్నారు. -
ప్రకృతి సాగు వైపు పయనం
ఇద్దరు చొప్పున ‘కృషి సఖి’లు గజ్వేల్: ఎన్ఎంఎన్ఎఫ్ (నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్) పథకం అమలులో మరో ముందడుగు పడింది. ప్రకృతి సేద్యం వైపు రైతులను మళ్లించేందుకు బయోరిసోర్స్ యూనిట్లను ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ యూనిట్ల ద్వారా రైతులకు పూర్తిగా సేంద్రియ ఎరువులను అందించి ప్రోత్సహించనున్నారు. జిల్లాలో ఎంపిక చేసిన 15క్లస్టర్ల పరిధిలోని 1,825మంది రైతుల వ్యవసాయక్షేత్రాల్లో ఈ కార్యక్రమాలు సాగుతున్నాయి. సదరు రైతులకు ఇందుకోసం భూసార పరీక్షల కార్డులను అందించి.. వారి నేల స్వభావానికనుగుణంగా ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా వానాకాలంలో సుమారు 5.50లక్షలు, యాసంగిలో 3.50లక్షల ఎకరాల వరకు సాగులో వస్తుంటాయి. ఈ రెండు సీజన్లలోనూ రైతులు రసాయనిక ఎరువులపైనే ఆధాపడుతున్నారు. మోతాదుకు మించి ఎరువులను వాడటం వల్ల నేల సారం తగ్గి పంటల సాగులో దిగుబడులు పడిపోయి రైతులు నష్టాల బారిన పడటం సహజపరిణామంగా మారుతున్నది. మరోవైపు పంటల ఉత్పత్తుల్లో పోషకాలు లోపించి, కలుషితమవుతున్నాయి. ఈ దుస్థితిని నివారించేందుకు గతంలో ఉన్న సేంద్రియ పథకాల కంటే కొంత మెరుగ్గా కేంద్ర ప్రభుత్వం ఎన్ఎంఎన్ఎఫ్ పథకం తీసుకొచ్చింది. పథకం అమలు తీరు ఇలా.. గతేడాది యాసంగి సీజన్లో ఎన్ఎంఎన్ఎఫ్ పథకం కింద జిల్లాను 15సెక్టార్లగా విభజించారు. ఒక్కో సెక్టార్కు 125మంది రైతులను మొత్తంగా 1,875మందిని ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లోఎంపిక చేసిన రైతుల వ్యవసాయక్షేత్రాల్లో పూర్తిస్థాయి మట్టి నమునాలు సేకరించారు. మట్టి నమునాలను పరీక్షించి నేలల్లో భాస్వరం, జింక్, మాంనీస్, పొటాషియం, కర్భనము, బోరాన్ తదితర పోషకాల లభ్యతను, ఇతర లోపాలను గుర్తించారు. ఈమేరకు రైతులకు భూసార పరీక్షల కార్డులను అందిస్తున్నారు. కార్డుల్లో వచ్చిన ఫలితాల మేరకు ప్రకృతి సేద్యం చేపట్టడానికి రైతులను ప్రోత్సహించనున్నారు. యూనిట్ల ఏర్పాటుకు రంగం సిద్ధం ప్రకృతి సేద్యానికి సన్నద్ధమవుతున్న రైతులకు సేంద్రియ ఎరువులను అందించేందుకు జిల్లాలో పది వరకు బయోరిసోర్స్ యూనిట్ల ఏర్పాటుచేయడానికి రంగం సిద్ధమైంది. ఈ యూనిట్ల ద్వారా ప్రస్తుతం ఎన్ఎంఎన్ఎఫ్ పథకం అమల్లో ఉన్న 15 క్లస్టర్లకు పూర్తిస్థాయి సేంద్రియ ఎరువులు అందిస్తారు. మొలక దశ నుంచి పంట చేతికొచ్చేవరకు పూర్తిగా సేంద్రియ ఎరువులను వాడేలా చూస్తారు. ఒక్కో క్లస్టర్కు ఇద్దరేసి ‘కృషి సఖి’లను నియమించారు. సేంద్రియ సాగుపై వీరికి శిక్షణ కూడా ఇస్తున్నారు. వీరు ఎంపిక చేసిన రైతుల వ్యవసాయక్షేత్రాల్లో నిరంతరం సలహాలు, సూచనలు అందిస్తారు. ఇందుకోసం ప్రభుత్వం వీరికి పారితోషికం అందించనుంది. ఎన్ఎంఎన్ఎఫ్ పథకంలో మరో ముందడుగు ఇప్పటికే రైతులకు భూసార పరీక్షల కార్డులు సేంద్రియ ఎరువులను అందించేందుకు కార్యాచరణ 15 క్లస్టర్లలోని 1,875 రైతుల వ్యవసాయక్షేత్రాల్లో కార్యక్రమాలు -
మోక్షం
సాదాబైనామాలకు● జిల్లా వ్యాప్తంగా 44వేల దరఖాస్తులు పెండింగ్ ● ఆరేళ్లుగా ఎదురుచూపులు ● నోటీసులు సిద్ధం చేస్తున్న తహసీల్దార్లు రెవెన్యూ పెండింగ్ డివిజన్ దరఖాస్తులు సిద్దిపేట 26,591 గజ్వేల్ 6,200 హుస్నాబాద్ 12,153 సాదా బైనామాలకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. జిల్లా వ్యాప్తంగా 44వేల మంది దరఖాస్తు దారులు ఆరేళ్లుగా ఎదురు చూస్తున్నారు. భూ భారతి చట్టంలో సాదా బైనామాల పరిష్కారానికి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. భూ క్రయవిక్రయదారులు ఇద్దరూ అఫిడవిట్ సమర్పించాలనే నిబంధనను సవరించారు. ఆర్డీఓ విచారణాధికారిగా దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించనున్నారు. – సాక్షి, సిద్దిపేట కాగితాలపై బాండ్ పేపర్ల ఒప్పందాలతో కొనుగోలు చేసిన భూములను చట్టబద్ధత కల్పించేందుకు గతంలో అవకాశం కల్పించింది. దీంతో సాదా బైమానాల కింద 2020లో దరఖాస్తులను స్వీకరించారు. అప్పటి నుంచి పరిష్కారానికి నోచుకోలేదు. దీంతో అవి రికార్డుల్లోకి ఎక్కలేదు. దశాబ్దాలుగా భూములు సాగు చేసుకుంటున్న రైతులకు మాత్రం హక్కులు రాక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 44,944 మంది రైతుల సాదా బైనామాల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. కొనుగోలు, విక్రయదారులు ఇద్దరు అఫిడవిట్ సమర్పించాలని గతంలో ప్రకటించగా పలు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో తాజాగా ప్రభుత్వం భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి మాత్రమే అఫిడవిట్ను సమర్పించాలని సవరణ చేసింది. ఎదురుచూపులు కొన్నేళ్లుగా భూమిని సాగు చేస్తున్నా పట్టా పాస్ బుక్ల కోసం ఎదురుచూస్తున్నారు. ధరణిలో భాగంగా కొందరికీ పట్టా పాస్ బుక్లు చేశారు. తర్వాత స్వీకరించిన దరఖాస్తులకు మోక్షం కలగలేదు. దీంతో ఆరేళ్లుగా దరఖాస్తు దారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆర్డీఓ స్థాయిలో పరిష్కారం గత ప్రభుత్వంలో జరిగిన సాదాబైనామాల క్రమబద్ధీకరణ తహసీల్దార్లు పూర్తి చేశారు. ప్రస్తుతం భూభారతి చట్టం ప్రకారం ఆర్టీఓలకు అధికారాలు కల్పించారు. తహసీల్దారు విచారణ నివేదిక పంపిస్తే వాటిని పరిశీలించి ఆర్డీఓ భూ భారతి పోర్టల్లో భూ భారతి సమాచారం నమోదు చేసి హక్కులు కల్పించనున్నారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో విచారణలో తేలే అంశాలే కీలకంగా మారనున్నాయి. క్రమబద్ధీకరించాల్సిన భూముల సరిహద్దు రైతులకు తహసీల్దార్లు నోటీసులు జారీ చేయనున్నారు. సాదాబైనామా రైతు సమర్పించే అఫిడవిట్ పూర్తి ఆధారాలతో ఉండటంతో పాటు 30 రోజుల పాటు అభ్యంతరాలేవీ రాకుంటే క్రమబద్ధీకరణ సులువుగా పూర్తికానున్నాయి. ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు యాజమాన్య హక్కులు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలకు దూరం అవుతున్నారు. ప్రభుత్వం అందించే రైతు భరోసా, బీమా వీరికి అందడం లేదు. ధాన్యం విక్రయించే సమయంలో పట్టాపాస్ పుస్తకాలు లేకపోవడంతో ఇతర రైతు పేరు మీద నమోదు చేయించుకుంటున్నారు. ప్రభుత్వం భూ భారతిలో సాదాబైనామాలకు సంబంధించి పలు సవరణలు చేయడంతో భూ యాజమాన్య హక్కులు వస్తాయని దరఖాస్తు దారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
మావోయిస్టు భాగ్య మృతదేహం కోసం..
కాంకేర్ జిల్లాకు తరలిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మిరుదొడ్డి(దుబ్బాక): ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లా మాచ్పల్లి అటవీ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు రంగనబోయిన భాగ్య ఎలియాస్ రూపీ మృత దేహాన్ని తీసుకురావడానికి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు తరలి వెళ్లారు. మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన మావోయిస్టు భాగ్య పెద్ద చెల్లెలు కవిత, తమ్ముడు కుమార్, సర్పంచ్ చెప్యాల శ్రీనివాస్ నేతృత్వంలో గ్రామస్తులు కాంకేర్ జిల్లా ఎస్పీ సమక్షంలో భాగ్య మృతదేహాన్ని గుర్తించనున్నారు. అక్కడ పోస్టుమార్టం అనంతరం మంగళవారం సాయంత్రం మృతదేహాన్ని తీసుకువచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కాగా 24 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న భాగ్య.. ఎన్కౌంటర్లో మృతి చెందడంతో ఆమె స్వగ్రామమైన ధర్మారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
రూ.6వేల పెన్షన్ ఇవ్వాల్సిందే
సిద్దిపేటరూరల్: హామీ మేరకు దివ్యాంగులకు రూ.6వేల పెన్షన్ అమలు చేయాలని ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య డిమాండ్ చేశారు. దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అడివయ్య, జిల్లా గౌరవ అధ్యక్షుడు భాస్కర్లు మాట్లాడుతూ జిల్లాలో సుమారు 22 వేల మంది దివ్యాంగులు ఉన్నారని, ప్రభుత్వ పథకాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం లేదని తెలిపారు. పెన్షన్ రూ.6వేలకు పెంచి అమలు చేయాల్సిందేనని అన్నారు. ఎంపికై న 222 మంది లబ్ధిదారులకు సహాయ పరికరాలు పంపిణీ చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలు మంజూరు చేస్తున్న స్వయం ఉపాధి రుణాల్లో 5 శాతం రుణాలు దివ్యాంగులకు ఇవ్వాలన్నారు. జిల్లాలో వైకల్య ధ్రువీకరణ పత్రాల జారీ కోసం నిర్వహిస్తున్న సదరం క్యాంపు నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయని తెలిపారు. వాటిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అనంతరం అదనపు కలెక్టర్, డీడబ్ల్యూఓకు వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో ఓఏఓ జిల్లా కార్యదర్శి అరుణ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు ఎండీ సాజీద్, కార్యదర్శి రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య -
అర్జీల పరిష్కారంలో ఆలస్యం చేయొద్దు
● అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ ● ప్రజావాణిలో వచ్చిన అర్జీలు 235 సిద్దిపేటరూరల్: ప్రజావాణిలో భాగంగా ప్రజలు అందించిన అర్జీలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలను అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకంతో ప్రజలు ప్రజావాణికి వస్తారన్నారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి అర్హతల మేరకు పరిష్కరించాలన్నారు. పలు రకాల సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తంగా 235 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో డీఆర్ఓ నాగరాజమ్మ, హౌసింగ్ పీడీ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
పెండింగ్ పనులు పూర్తి చేయండి
● మాజీ మంత్రి హరీశ్రావు ● ఆర్అండ్బీ అధికారులతో సమీక్ష సిద్దిపేటజోన్: నియోజకవర్గ పరిధిలోని పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. సోమవారం రాత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్అండ్బీ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం హయాంలో మంజూరై అర్ధంతరంగా కొన్ని రోడ్ల పనులు ఆగిపోయినట్టు తెలిపారు. అసంపూర్తిగా ఉన్న రహదారుల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే చొరవ చూపి రోడ్ల పనులను చేపట్టాలని సూచించారు. సిద్దిపేట రింగ్ రోడ్డు 80శాతం పనులు పూర్తి కాగా 20శాతం మిగిలిందన్నారు. సిద్దిపేట, చిన్నకోడూరు, ఇల్లంతకుంట వరకు ఫోర్ లేన్ల రహదారి గత ప్రభుత్వం హయాంలో 70శాతం పూర్తి కాగా ప్రస్తుత పరిస్థితుల్లో పనులు నిలిచిపోయాయన్నారు. రహదారిపై గుంతలు ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, ఇల్లంతకుంట రహదారిపై దృష్టి పెట్టాలని సూచించారు. రామంచ, సిరిసిల్ల రహదారి పెండింగ్ పనులను పూర్తి చేయాలని సూచించారు. ఇర్కోడ్, రాంపూర్ రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. నంగనూరు మండలంలో సీఆర్ఎఫ్ నిధులతో మంజూరైన రహదారి, బ్రిడ్జి పనులను వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో ఆర్అండ్బీ ఎస్ఈ, ఈఈ, ఏఈలు పాల్గొన్నారు. -
ఆ ఇద్దరు ఎక్కడ?
మావోలు అరుణ, స్వరూప జాడేది!● జిల్లా నుంచి అజ్ఞాతంలోకి ముగ్గురు ● భాగ్య అలియాస్ రూపి మృతి ● మిగతా వారు ఎన్కౌంటర్లో మృతిచెందారా? లొంగిపోయారా? లొంగిపోతే ఎక్కడ? ● ఏళ్లుగా ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు సాక్షి, సిద్దిపేట: తెలంగాణ ఉద్యమం.. మావోయిస్టు ఉద్యమాల్లో మెతుకుసీమది కీలకపాత్ర. నక్సల్స్, పీపుల్స్వార్, జనశక్తి, మావోయిస్టు ఉద్యమాలతో సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల ప్రాంతాలకు విడదీయరాని బంధం ఉంది. దుబ్బాక, నర్సాపూర్, గిరాయిపల్లి, ఇందుప్రియాల్, భూపతి, పద్మక్క దళాలుగా ఇక్కడ పీపుల్స్వార్ పనిచేసింది. అదే విధంగా కూడవెల్లి, మంజీర దళాలతో జనశక్తి సైతం కొనసాగింది. డీజీపీ ఇటీవల ప్రకటించిన వారిలో రాష్ట్రానికి చెందిన ఐదుగురు మావోయిస్టులు మాత్రమే ఉన్నారని ప్రకటించారు. అందులో ప్రకటించిన రూపీ ఎన్కౌంటర్లో మృతిచెందారు. డీజీపీ ప్రకటించని మరో ఇద్దరు ఎక్కడ ఉన్నారోనని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కానరాని అరుణ, స్వరూప జిల్లా నుంచి ముగ్గురు మావోయిస్టులు ఉండగా అందులో ఒకరు మిరుదొడ్డి మండలం ధర్మారానికి చెందిన భాగ్య అలియాస్ రూపీ ఛత్తీస్గఢ్ మాచపల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో సోమవారం మృతి చెందినట్లు అక్కడి పోలీసులు ప్రకటించారు. పోలీసుల లెక్కల ప్రకారం ఎవరు అజ్ఞాతంలో లేనట్లే. అరుణ, స్వరూపలు అజ్ఞాతంలోకి వెళ్లి 25 ఏళ్లు దాటిపోయింది. అక్కన్నపేట మండల కేంద్రానికి చెందిన కాశబోయిన స్వరూప 25ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లారు. దండకారణ్యం సభ్యురాలిగా ఉన్న ఆమైపె రూ.3లక్షల వరకు రివార్డు ఉన్నట్లు గతంలో పోలీసులు పేర్కొన్నారు. తన చిన్ననాడే తల్లిదండ్రులు చనిపోతే నానమ్మ, తాత వద్ద పెరిగారు. పదో తరగతి చదువుతున్నప్పుడే ఉద్యమానికి ఆకర్షితురాలై అడవి బాట పట్టారు. ఆమె నానమ్మ, తాత చనిపోగా గ్రామస్తులే చందాలు వేసి అంత్యక్రియలు చేశారు. ప్రస్తుతం తనకు చెల్లె మాత్రమే ఉంది. ఇక నంగునూరు మండల కేంద్రానికి చెందిన రంగు అరుణ అలియాస్ పద్మక్క 20 ఏళ్లుగా మావోయిస్టుల్లో ఉన్నారు. ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీలో యాక్షన్ టీం మెంబర్గా ఉన్న పద్మక్కపై రూ.3లక్షల రివార్డు ఉన్నట్లు అప్పట్లో పోలీసులు పేర్కొన్నారు. ఎక్కడ ఉందో ఎలా ఉందో ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అక్కన్నపేటకు చెందిన కాశబోయిన స్వరూప, నంగునూరుకు చెందిన రంగు అరుణల ఆచూకీ తెలియరావడం లేదు. పోలీసులు సైతం వీరి గురించి స్పష్టంగా చెప్పడం లేదు. వీరు అజ్ఞాతంలోనే ఉన్నారా? ఉంటే ఎక్కడ? లేక లొంగిపోయారా?.. లొంగిపోతే ఎక్కడ జీవనం గడుపుతున్నారు? లేకపోతే ఎప్పుడైనా ఎన్కౌంటర్లో తమ ప్రాణాలు కోల్పోయారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీరి కుటుంబ సభ్యులకు కూడా ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. అయితే తమ బిడ్డలు క్షేమంగా ఉన్నారా?.. లేదా? అనే ఆవేదనతో ఉన్నారు. -
మహిళలు రాజకీయాల్లోకి రావాలి
● మెదక్ ఎంపీ రఘునందన్రావు ● నారీ శక్తి వందన్ ర్యాలీలో పాల్గొన్న ఎంపీ సిద్దిపేటకమాన్: మహిళలు రాజకీయాల్లోకి రావాలని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. మహిళ అంటే ఒక శక్తి అని మీ నుంచే ఎంపీలు, ఎమ్మెల్యేలు రావాలన్నారు. సిద్దిపేట పట్టణంలో సోమవారం నిర్వహించిన నారీ శక్తి వందన్ ర్యాలీలో ఎంపీ పాల్గొన్నారు. పట్టణంలోని హైస్కూల్ నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మోడ్రన్ బస్టాండ్ చౌరస్తాలో ఎంపీ మాట్లాడుతూ.. సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పటికీ మహిళా బిల్లు పాస్ చేయకపోవడం దురదృష్టకరమన్నారు. సీఎం రేవంత్రెడ్డిని సినిమా వాళ్లు కూడా గుర్తుపట్టడం లేదన్నారు. దేశంలో మహిళా ఎంపీల శాతం 15కంటే తక్కువగా ఉండటం బాధాకరమని అన్నారు. జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనపై ఆపరేషన్ సింధూరు విజయవంతంగా నిర్వహించింది కూడా ఒక మహిళేనని అన్నారు. 75సంవత్సరాల నుంచి మహిళలకు సరైన గౌరవం దక్కడం లేదని మహిళలకు ప్రధాని మోదీ పెద్దపీట వేస్తున్నారన్నారు. సునీతావిలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లివచ్చారన్నారు. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ను గెలిచింది కూడా నిజామాబాద్ ఆడబిడ్డనే అన్నారు. దేశ ప్రథమ పౌరురాలు కూడా గిరిజన బిడ్డ అయిన ద్రౌపదిముర్ము అని చెప్పుకొచ్చారు. సుప్రీంకోర్టులో 32మంది న్యాయమూర్తులు ఉంటే ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారన్నారు. హైదరాబాద్ మాజీ మేయర్ కార్తీకరెడ్డి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్, పార్టీ నాయకులు వెంకట్, తిప్పని వనజ, ఉమారెడ్డి, సంతోష్, కార్తీక్, సరోజ, మహిళా న్యాయవాదులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు భద్రత.. అందరి బాధ్యత
● కలెక్టర్ హైమావతి ● ‘అరైవ్–అలైవ్’ పోస్టర్ ఆవిష్కరణ కొండపాక(గజ్వేల్): రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత అని కలెక్టర్ హైమావతి సూచించారు. ‘ప్రగతి ప్రణాళిక’లో భాగంగా సోమవారం కొండపాకలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ ప్రయాణం చేయాలన్నారు. గ్రామ స్థాయిలో రహదారి భద్రతను బలోపేతం చేసేందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. గ్రామాల్లో ప్రమాదకర ప్రదేశాలను గుర్తించడం, హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయడం, చెట్ల పొదలను తొలగించడం వంటి చర్యలు చేపట్టాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అంతకు ముందు అరైవ్–అలైవ్ కార్యక్రమంపై ప్రజా ప్రతినిధులు, ప్రజలచే ప్రతిజ్ఞ చేయించి వాల్ పోస్టరును ఆవిష్కరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మల్లికార్జున్రెడ్డి, ఆర్టీఓ శంకర్ నారాయణ, ఎంపీఓ మల్లికార్జున్, సర్పంచ్ నవీన, నాయకులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజనంలో మెనూ తప్పనిసరి మధ్యాహ్న భోజనంలో మెనూ పాటించకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ హైమావతి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. కొండపాకలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను సోమవారం ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మధ్యాహ్న భోజనంలో మెనూ పాటించారా? రుచికరంగా ఉందా? అంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సరుకుల స్టోర్ రూంలో జాగ్రత్తలు పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంలో నిర్లక్షం చేస్తే ఉపేక్షించేదిలేదన్నారు. కాలం చెల్లిన సరుకులు, ఆహారపదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించరాదన్నారు. -
అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం
డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి గజ్వేల్: అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి అన్నారు. సోమవారం గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ నాయిని సత్యలక్ష్మీతో కలిసి పట్టణంలోని 16వ వార్డులో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకుసాగుతుందన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్ధార్ఖాన్, నాచారం ఆలయ డైరెక్టర్ శేఖర్, కొమురవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, నాయకులు మొనగారి రాజు, నక్క రాములు తదితరులు పాల్గొన్నారు. దుబ్బాకటౌన్: ఉపాధి హామీ పథకంలో ఒకే రోజు అత్యధిక పని దినాలు కల్పించిన గ్రామంగా మండల పరిధిలోని గాజులపల్లి ఎంపికై ంది. ఈ విషయాన్ని ఫీల్డ్ అసిస్టెంట్ నర్సింహులు తెలిపారు. కూలీలకు అత్యధికంగా పని కల్పించినందుకు డీఆర్డీఓ జయదేవ్ ఆర్య ఫీల్డ్ అసిస్టెంట్ నర్సింహులను శాలువాతో సత్కరించి నగదు ప్రోత్సాహకం అందజేశారు. ఎంపీడీఓ అఫ్జల్, ఏపీఓ రాజుకు అభినందనలు తెలిపారు. గ్రామాల్లోని ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా ముందుకు వచ్చి ఉపాధి హామీ కూలీలకు ఎక్కువ పని దినాలు కల్పించేందుకు కృషి చేయాలని కోరారు. ఏబీవీపీ రాష్ట్ర కోకన్వీనర్ పరశురామ్ ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తివేయడం తగదని, ఇలాంటి ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర వనవాసి కో కన్వీనర్ పరుశురామ్ నాయక్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పరశురామ్ నాయక్ పాల్గొని మాట్లాడారు. పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్యను అందించాలనే మంచి ఆలోచనతో తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతోందన్నారు. అందులో భాగంగానే ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయడంలో ఆలసత్వం ప్రదర్శిస్తోందన్నారు. లక్షల మంది పేద విద్యార్థులు ఇంజనీరింగ్, ఫార్మా, మెడిసిన్, లా లాంటి కోర్సులు చదివి దేశ, విదేశాల్లో స్థిరపడి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇస్తున్నారంటే దానికి కారణం ఫీజు రీయింబర్స్మెంట్ పథకమే అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు ఉన్న బకాయిలను చెల్లించి పేద విద్యార్థుల చదువుకు దోహదపడాలన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు. 19న ‘మోడల్’ ప్రవేశ పరీక్ష నర్సాపూర్ రూరల్: ఈనెల 19వ తేదీన మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఉంటుందని ప్రిన్సిపాల్ ఫర్హాన సోమవారం తెలిపారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 6వ తరగతిలో చేరే విద్యార్థులకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7, 8, 9, 10వ తరగతిలో చేరే విద్యార్థులకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ముందుగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అన్లైన్లో హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. హాల్టికెట్తో పాటు బాల్పెన్, పరీక్ష ప్యాడ్తో హాజరుకావాలని సూచించారు. -
అమ్మో.. గుర్రపు డెక్క
● కంపుకొడుతున్న రామసముద్రం చెరువు ● చేపల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం దుబ్బాకటౌన్: చెరువుల్లో పెరుగుతున్న గుర్రపు డెక్కతో నీటిలోని చేపలు, ఇతర జల చరాలకు భారీ నష్టం వాటిల్లుతోంది. దుబ్బాక పట్టణంలోని రామసముద్రం చెరువు ఆరేళ్లుగా గుర్రపు డెక్క, పిచ్చి మొక్కలతో దర్శనమిస్తోంది. దాదాపు సగం చెరువును గుర్రపు డెక్క ఆక్రమించింది. డెక్క చెరువు మొత్తాన్ని ఆక్రమిస్తుండడంతో నీటి సాంద్రత దెబ్బతింటోంది. నీరు కలుషితం అవుతుండడంతో చేపల్లో ఎదుగుదల లోపిస్తోంది. చెరువులోని చేపలు, ఇతర జలచరాల మనుగడకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. పట్టణ మురుగంతా చెరువులోకే.. దుబ్బాక పట్టణంలోని మురికి కాలువల నుంచి వస్తున్న మురుగు అంతా చెరువులోకి చేరుతుండటంతో గుర్రపు డెక్క బాగా వ్యాపిస్తోందని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. నీరు కలుషితమవుతోంది. ఫలితంగా దుర్వాసన వ్యాపిస్తోంది. ఉదయం, సాయంత్రం వ్యాయామానికి చెరువు కట్టపైకి వచ్చే వారు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు గుర్రపు డెక్కను తొలగించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు మత్స్యకారులు, స్థానికులు కోరుతున్నారు. ప్రస్తుతం రామసముద్రం చెరువులో చేపల పెంపకం బాగా తగ్గిపోయింది. ఇటీవల గుర్రపు డెక్కను తొలగించేందుకు ఓ కాంట్రాక్టర్తో కలిసి మున్సిపల్ కమిషనర్ రమేశ్కుమార్, వార్డు కౌన్సిలర్ రాజు పరిశీలించారు. చెరువులో జలచరాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గుర్రపు డెక్కను తొలగించేందుకు రంగం సిద్ధం చేసినా తగినంత బడ్డెట్ లేకపోవడంతో ఆచరణ ముందుకు సాగలేదు. -
సత్తా చాటిన గురుకులం
సాక్షి, సిద్దిపేట: ఇంటర్మీడియెట్ ఫలితాలలో జిల్లా విద్యార్థులు నిరాశ పరిచారు. ఇంటర్ మొదటి సంవత్సరం జనరల్లో రాష్ట్రంలో 29వ స్థానం, ద్వితీయ సంవత్సరం 31 స్థానానికి దిగజారింది. ఇంటర్మీడియెట్ బోర్డు ఆదివారం మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఫస్ట్ ఇయర్లో 54.97శాతం, సెకండియర్లో 64.39 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో ఈ సారి సైతం బాలికలదే పైచేయిగా నిలిచింది. 70శాతం మంది బాలికలు ఉత్తీర్ణత జిల్లా వ్యాప్తంగా 18,822 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 11,183(59.41శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 3,747(45.42శాతం), బాలికలు 7,436 (70.33శాతం) ఉత్తీర్ణత సాధించారు. దీంతో బాలికలే పైచేయిగా నిలిచారు. ప్రైవేట్లో సెకండియర్ జనరల్ విద్యార్థులు 1,023 మంది పరీక్ష రాయగా 302 మంది, ఓకేషనల్లో 196 మంది పరీక్ష రాయగా 111 మంది పాస్ అయ్యారు. గత సంవత్సరం ఫస్ట్ ఇయర్లో 51.5శాతంతో రాష్ట్రంలో 30వ స్థానం, సెకండియర్లో 59.6శాతంతో 31స్థానంలో ఉండగా ఈ సారి మొదటి సంవత్సరంలో 29వ స్థానం వచ్చింది. గతంతో పోలిస్తే ఒక స్థానం ముందుకు వచ్చింది. ద్వితీయ సంవత్సరం గత స్థానానికే పరిమితం కావడం గమనార్హం. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 48శాతమే.. జిల్లా వ్యాప్తంగా 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి, ద్వితీయ సంవత్సరాలు కలిపి 4,857 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,337(48.11శాతం) మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరంలో 2,545 మంది పరీక్ష రాయగా 1,101(43.26శాతం) మంది, ద్వితీయ సంవత్సరం 2,312 మంది పరీక్ష రాయగా 1,236(53.46శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ ఇయర్లో 20శాతం లోపు తొగుట, మిరుదొడ్డి, ములుగు, దౌల్తాబాద్, జగదేవ్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, సెకండియర్లో నంగునూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 51 మంది విద్యార్థులు పరీక్ష రాయగా కేవలం ఐదుగురు మాత్రమే పాస్ అయ్యారు. అత్యధికంగా సెకండియర్లో చిన్నకోడూరు జూనియర్ కళాశాలలో 83.33శాతం, ఫస్ట్ ఇయర్లో కోహెడ జూనియర్ కళాశాలలో 66.92శాతం మంది పాసయ్యారు. ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా ఉత్తీర్ణత 50శాతం సైతం దాటకపోవడం గమనార్హం. సిద్దిపేటఅర్బన్: ఇంటర్ పరీక్ష ఫలితాల్లో గురుకుల పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లిలోని రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల, మిట్టపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారు. ఎన్సాన్ పల్లి రెసిడెన్షియల్ గురుకుల విద్యార్థులు ఎంపీసీ సెకండియర్లో పి.అర్చన 994, అమూల్య 992, డి.అర్చన 991 మార్కులు సాధించారు. బైపీసీ సెకండియర్లో ఎం. పల్లవి 978, నిధి బిహారి 974, వి.అమూల్య 973 మార్కులు సాధించి తమ సత్తా చాటారు. ఇంటర్ ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను ఎన్సాన్ పల్లి కళాశాల ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ రెడ్డి అభినందించారు. -
పనులు వేగిరం చేయండి
● మంత్రి పొన్నం ప్రభాకర్ ● ‘అర్బన్ పార్కు’ పురోగతిపైఅధికారులకు దిశానిర్దేశంహుస్నాబాద్రూరల్: మండల పరిధి జిల్లెలగడ్డ అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న అర్బన్ పార్కు పనులను వేగిరం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అటవీశాఖ అధికారులను ఆదేశించారు. ఆదివారం అటవీ ప్రాంతంలోని పార్కు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పిల్లల పార్కు వేగంగా పూర్తి చేయాలని, ఎత్తయిన గుట్టలపై వాచ్ టవర్స్ నిర్మించాలన్నారు. గాడిదల లొద్ది, పుట్ట లొద్ది మధ్య ట్రాకింగ్ వంతెన నిర్మించాలని చెప్పారు. అంతకు ముందు కూచనపెల్లి మర్రివాగుపై రూ.21.10 లక్షలతో నిర్మించే చెక్ డ్యామ్ పనులకు శంకుస్థాపన చేశారు. చెక్ డ్యామ్ల నిర్మాణంతో భూగర్భ జలాల అభివృద్ధితో పాటు, వ్యవసాయానికి సాగు నీరు అందించవచ్చన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ రాములు, ఆర్డీఓ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. కూరగాయల సాగుతో అధిక లాభాలు అక్కన్నపేట(హుస్నాబాద్): కూరగాయల పండిస్తే అధిక లాభాలను పొందవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ రైతులకు సూచించారు. పోతారం(జే) గ్రామంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రైతులకు కూరగాయల పెట్టెలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులందరూ కూరగాయలు, ఆయిల్పామ్, పట్టు పరిశ్రమ, తేనెటీగలు, వంటి ఆదాయాన్ని ఆర్జించే పంటలను వేయాలన్నారు. మండల కేంద్రంలో ఆయిల్ ఫాం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. అదేవిధంగా హుస్నాబాద్లో వెజిటేబుల్ కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తామని, స్థల పరిశీలన చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు.పర్యాటక కేంద్రాలుగా చెరువులుహుస్నాబాద్: చెరువులను సుందరంగా తీర్చిదిద్ది ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు, కొత్త చెరువు, పల్లె చెరువులతో పాటుగా మినీ స్టేడియం, పలు అభివృద్ది పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మున్సిపాలిటి కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు, దివ్యాంగులకు ఉపకరణాలు అందజేశారు. ట్రాన్స్జెండర్లకు ఈఆర్సీ కింద ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి చెక్కులు పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ వ్యర్థ జలాలు కొత్త చెరువులో కలవకుండా నేరుగా ప్రత్యేక ఫీడర్ కు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.హుస్నాబాద్: మండుటెండల్లో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ తాటి ముంజలు తింటూ కొద్ది సేపు సేద తీరారు. ఆదివారం హుస్నాబాద్ పట్టణ శివారులో తాటి ముంజలు అమ్ముతున్న చిరువ్యాపారులను మంత్రి పలకరించారు. అమ్మకాలు ఎలా జరుగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకునేందుకు తాటి ముంజలు చాలా మేలు చేస్తాయన్నారు. -
సిద్దిపేట అంటే సీఎంకు కళ్లమంట
● కాంగ్రెస్కు, బీజేపీకి బుద్ధిచెప్పాల్సిందే ● మాజీమంత్రి హరీశ్రావు సిద్దిపేటజోన్: ‘మీ కష్టసుఖాల్లో అండగా ఉన్నా.. ఈ ప్రాంత ప్రతిష్ట, గౌరవాన్ని కాపాడాను.. మన సిద్దిపేట అంటే సీఎం రేవంత్కు కళ్లమంట..అందుకే నిధులను ఆపేశారు. పట్టణాన్ని మనమే రక్షించుకోవాలి’ అని మాజీమంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలువురు బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి రెండున్నర ఏళ్లలో ఒక్క పని చేయలేదని విమర్శించారు. సిద్దిపేటకు మంజూరైనా నిధులను ఆపి, వెటర్నరీ కళాశాలను తరలించారన్నారు. కోమటి చెరువు వద్ద శిల్పారామం పనులను సగంలోనే నిలిపివేశారని ఆరోపించారు. వెయ్యి పడకల ఆస్పత్రి పనులు 90శాతం పూర్తయినా మిగతా 10శాతం పూర్తి చేసే కనీస బాధ్యత లేదన్నారు. రేపు బల్దియా ఎన్నికలు వస్తున్నాయని, కాంగ్రెస్, బీజేపీ నాయకులు మీ దగ్గరకు వస్తే వారి మాయమాటలు, డబ్బుల ఆశపడి మోసపోవద్దని సూచించారు. ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో భగీరథ నీటిని ఫిల్టర్ చేసే స్థాయిలో కూడా ప్రభుత్వం లేదని విమర్శించారు. సిద్దిపేటకు రెండు పార్టీలు చేసింది ఏమిటని నిలదీయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్, సీనియర్ నాయకులు వేణుగోపాల్రెడ్డి, సంపత్ రెడ్డి, సాయిరాం, తదితరులు పాల్గొన్నారు. -
ప్రాంతీయ అభివృద్ధికి పరిశ్రమ దోహదం
టీజీఐఐసీ వైస్ చైర్మన్ శశాంక నంగునూరు(సిద్దిపేట): నర్మేటలో ఏర్పాటు చేసిన ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ఈప్రాంతం అభివృద్ధికి దోహదం చేస్తుందని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శశాంక అన్నారు. నర్మేటలో నిర్మించిన ఆయిల్పామ్ ఫ్యాక్టరీని ఆదివారం టీజీఐఐసీ అధికారులు సందర్శించారు. ఈసందర్భంగా ఫ్యాక్టరీలో ఆయిల్ ఉత్పత్తి సామర్థ్యం, విస్తరణ అవకాశాలు, మౌలిక సదుపాయాలు, విద్యుత్, నీటి సరఫరా, రహదారుల ఏర్పాటు, ఉద్యోగ అవకాశాలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం శశాంక మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుతో స్థానికంగా ఎంతో మందికి ఉపాధి లభిస్తుందన్నారు. అలాగే కొత్తగా మరిన్ని పరిశ్రమలు వస్తాయని దీంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. నర్మేటలో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన ఆయిల్ పరిశ్రమ తెలంగాణ ప్రాంతానికి దిక్సూచిగా నిలుస్తుందన్నారు. మంత్రి వివేక్ పటాన్చెరు: రోడ్ల అభివృద్ధికి రూ.300 కోట్ల నిధులు మంజూరు చేశామని మంత్రి వివేక్ తెలిపారు. పటాన్చెరులో ఆదివారం జరిగిన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. అన్ని విధాలుగా సంగారెడ్డి జిల్లా అభివృద్ధికి సహకరిస్తామని హామీఇచ్చారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ఆ ప్రాంత సమస్యలను మంత్రికి వివరించారు. నీలం మధు మాట్లాడుతూ పటాన్చెరులో సీఎస్ఆర్ నిధుల ఖర్చుపై విచారణ చేయాలని మంత్రికి విన్నవించారు. డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ములుగు(గజ్వేల్): కాంగ్రెస్ పాలనలో పేదల సొంతింటి కల సాకారం అవుతోందని డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి అన్నారు. ములుగు, అన్నసాగర్ గ్రామాల్లో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లను ఆదివారం స్థానిక నాయకులతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గూడులేని నిరుపేదలందరికీ గూడు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో రాజీవ్ గాంధీ పంచా యతీ రాజ్ సంఘటన్ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, జిల్లా కోఆఫ్షన్ మాజీ సభ్యుడు సయ్యద్ సలీం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ప్రభాకర్గుప్త, డైరెక్టర్లు, నాయకులు పాల్గొన్నారు. గజ్వేల్రూరల్: ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉన్నప్పుడే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని ఏసీపీ నరసింహులు అన్నారు. ఆదివారం గజ్వేల్ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రోమో రన్ను సీఐలు రవికుమార్, లతీఫ్లతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలని, డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా లక్ష్యం దిశగా ముందుకు సాగాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన 10కే, 5కే రన్లో విజేతలుగా నిలి చిన వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డితో పాటు తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. -
మార్కెట్ యార్డు పనుల అడ్డగింత
● ఇళ్ల స్థలాలు కేటాయించే వరకు ఏర్పాటు చేయొద్దు ● వంటిమామిడి భూబాధితుల ఆందోళనములుగు(గజ్వేల్): భూములు కోల్పోయిన తమకు ఇళ్ల స్థలాలు కేటాయించే వరకు మార్కెట్ను ఏర్పాటు చేయొద్దంటూ ములుగు మండలం వంటిమామిడి బాధిత రైతులు ఆందోళనకు దిగారు. శనివారం మార్కెట్యార్డు కోసం స్థలాన్ని అధికారులు చదును చేస్తుండగా పనులను రైతులు అడ్డుకున్నారు. వంటిమామిడి మార్కెట్యార్డును మరింతగా విస్తరించేందుకు సర్వే నంబర్ 72లో ప్రభుత్వం 49 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. రైతులకు ఎకరా ఒక్కంటికి నష్టపరిహారం కూడా అందజేశారు. అయితే ఆ స్థలాన్ని మార్కెట్ కమిటీ స్వాధీనం చేసుకోలేదు. ప్రతిరోజు ఉదయం మార్కెట్ ముందు రాజీవ్రహదారిపై వ్యాపారులు మార్కెట్ను కొనసాగిస్తుండటంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ఈ సమస్యను పరిష్కరించే దిశగా జిల్లా ఉన్నతాధికారులు మార్కెట్ను సందర్శించి పరిశీలన జరిపారు. మార్కెట్కు కేటాయించిన స్థలంలో కొంతనైనా భూమిని చదును చేసి ఉదయం వేళలో సాగుతున్న మార్కెట్ను ఆ స్థలంలో ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో గజ్వేల్ ఏసీపీ నర్సింలు, గజ్వేల్ రూరల్ సీఐ రవిరాజు, తహసీల్దార్ రవిందర్రెడ్డి, ఎస్ఐ రఘుపతి, మార్కెట్ కార్యదర్శి రేవంత్, ఆయా మండలాల ఎస్ఐలు శనివారం మార్కెట్ వద్దకు చేరుకున్నారు. స్థలాన్ని జెసీబీ యంత్రాలతో చదును చేయిస్తుండగా బాధిత రైతులు అక్కడికి చేరుకుని అభ్యంతరం వ్యక్తంచేస్తూ పనులను అడ్డుకున్నారు. తమకు ఇళ్ల స్థలాలను కేటాయించేంత వరకు పనులు జరగనివ్వబోమని అధికారులతో వాగ్వాదానికి దిగారు. రాజీవ్రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ క్రమంలో మండల బీజెపీ అధ్యక్షుడు లక్ష్మణ్గౌడ్ ఒంటిపై డీజిల్ పోసుకుని భయందోళన సృష్టించాడు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెలుతామని అధికారులు బాధిత రైతులకు నచ్చజెప్పడంతో సద్దుమనిగారు. -
● ఆశావాహుల ప్రయత్నాలు ముమ్మరం● హరీశ్, వంటేరు ఆశీస్సుల కోసం యత్నం ● గజ్వేల్ మున్సిపాలిటీలో ఆసక్తికరం
గజ్వేల్: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ‘కో–ఆప్షన్’సభ్యుల ఎన్నికకు రంగం సిద్ధం కావడంతో ఆశావాహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ మున్సిపాలిటీని బీఆర్ఎస్ కై వసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీకి చెందిన నాయకులు పెద్ద ఎత్తున బరిలో ఉన్నారు. ఇక్కడ నాలుగు కో–ఆప్షన్ స్థానాలు ఉండగా, ఇందులో మైనార్టీలకు రెండు స్థానాలు (మహిళ, జనరల్), మాజీ ప్రజాప్రతినిధులు, ఇతర కోటా నుంచి రెండు స్థానాలు (మహిళా, జనరల్)కు కేటాయించారు. మైనార్టీ కోటా నుంచి పట్టణానికి చెందిన చెందిన బీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు నవాజ్మీరా, మజీద్ కమిటీ మాజీ అధ్యక్షుడు యూసుఫొద్ధీన్, మాజీ కౌన్సిలర్ రహీమ్, అజీజ్, ఉమర్, సింగారం మతీన్ తదితరుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మాజీ ప్రతినిధుల కోటా నుంచి తలకొక్కుల దుర్గాప్రసాద్, అల్వాల బాలేష్, ఆర్కే శ్రీనివాస్, ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన ప్రతాప్రెడ్డి, మాజీ కౌన్సిలర్ రజిత, అత్తెల్లి రవి, దయానందరెడ్డి తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి హరీశ్రావు, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డిల ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోటీ నుంచి తప్పుకున్న కొందరికీ కో–ఆప్షన్లలో అవకాశం కల్పిస్తామని కొందరికి పార్టీ పెద్దలు మా ఇచ్చినట్లు సమాచారం. -
సీసీ కెమెరాలతో మరింత భద్రత
ఏసీపీ రవీందర్రెడ్డిబెజ్జంకి(సిద్దిపేట): గ్రామాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల ప్రజలకు మరింత భద్రత ఉంటుందని ఏసీపీ రవీందర్రెడ్డి అన్నారు. సర్పంచ్లు, యువకులకు స్థానిక పోలీసులు శనివారం నిర్వహించిన సురక్ష నేత్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక సత్యార్జున ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నిఘా నేత్రాలతో ప్రతి కదలికను గుర్తించి అసాంఘిక శక్తుల ఆటకట్టించవచ్చన్నారు. ప్రతి గ్రామంలో కనీసం ఎనిమిది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, ఎస్ఐ సౌజన్య, ఏఎస్ఐ ఓదేలు, హెడ్ కానిస్టేబుల్ సుధాకర్రెడ్డి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అవగాహన అవసరం మిరుదొడ్డి(దుబ్బాక): సీపీ రష్మీ పెరుమాళ్ ఆదేశాల మేరకు ‘సురక్ష నేత్ర’ కార్యక్రమంలో భాగంగా దుబ్బాక సీఐ రాజేశ్ ఆధ్వర్యంలో భూంపల్లి పోలీస్స్టేషన్లో మండల పరిధిలోని సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులకు సీసీ కెమెరాలపై అవగాహన కలిగించారు. సీసీ కెమెరాలపై అవగాహన ఉండాలన్నారు. తమ గ్రామా ల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని పలువురు సర్పంచ్లు ముందుకు వచ్చారు. కార్యక్రమంలో ఎస్ఐ హరీశ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
మత్తు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్సిద్దిపేటకమాన్: మత్తు రహిత జిల్లాగా సిద్దిపేటను తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని సీపీ సాధన రష్మీ పెరుమాళ్ తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పది పడకల మత్తు పదార్థాల విముక్తి చికిత్స, డీఅడిక్షన్ కౌన్సెలింగ్ సెంటర్ను ఆస్పత్రి వైద్యాధికారులతో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత వ్యసనాల నుంచి దూరం చేయడమే లక్ష్యంగా ఈ సెంటర్ను ఏర్పాటు చేసుకున్నామన్నారు. వ్యసనాలకు అలవాటు పడిన వారికి చికిత్స, కౌన్సెలింగ్ ద్వారా మానస్థిక స్థైర్యాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఇటీవల నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వైద్య విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్బాబు, డాక్టర్ చందర్, సైకియాట్రిక్ విభాగ హెచ్ఓడీ డాక్టర్ శాంతి, డాక్టర్ సదానందం, డాక్టర్ వినోద్బాబ్జి, డాక్టర్ శ్రావణి, డాక్టర్ శ్రీకాంత్యాదవ్, సీఐలు లక్ష్మీబాబు, ఉపేందర్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
మార్కెట్కు వస్తే కదా బాధ తెలిసేది
సిద్దిపేటజోన్: అధికారులు కొనుగోలు కేంద్రాలకు రారు.. ప్రభుత్వమూ పట్టించుకోదు.. మరి రైతుల బాధ తీర్చేదెవరు అంటూ ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోళ్లలో జాప్యం.. రైతుల పడిగాపులు, పేరుకుపోయిన పొద్దుతిరుగుడు రాశులపై ఈనెల10న సాక్షిలో ‘కొంటారా... కొనరా’అనే శీర్షికపై ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. శనివారం సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డును పరిశీలించారు. పొద్దుతిరుగుడు, మొక్కజొన్న రైతులతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంచులు, కోటా, లారీలు, హమాలీ సమస్యల పేరిట కొనుగోలు చేయడం లేదని రైతులు హరీశ్రావు దృషికి తీసుకొచ్చారు. స్పందించిన ఆయన వెంటనే జిల్లా మార్క్ఫెడ్ డీఎం సునీత, మార్కెట్ కమిటీ కార్యదర్శి వెంకటయ్యలకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తంచేశారు. యార్డులో రైతులు బాధ పడుతుంటే మీరేమి చేస్తున్నట్టు అని ఆగ్రహం వ్యక్తంచేశారు. మీరు మార్కెట్ యార్డుకు వస్తే కదా రైతుల బాధలు తెలిసేది అంటూ మండిపడ్డారు. కోటా పూర్తి అయిందని, లారీలు, హమాలీ సమస్య ఉందన్నారు. సోమవారం నాటికి మొక్కజొన్న, పొద్దుతిరుగుడు రైతుల సమస్యలను పరిష్కరించాలని, కొనుగోళ్లు వేగవంతం చేయాలని సూచించారు. యార్డులో ఐదు మిషన్లు ఉండగా.. రెండు మాత్రమే పని చేస్తున్నాయని, అవసరమైతే మరో రెండు మిషన్లు కొనుగోలు చేయాలన్నారు. ఆయన వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు వేణుగోపాల్ రెడ్డి, సాయిరాం, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు సంపత్, నాయకులు వరాల సురేష్, రెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
● దుబ్బాక బల్దియాలో ఎన్నికల సందడి ● సభ్యుల ఎంపికకు రంగం సిద్ధం ● ఎమ్మెల్యే మద్దతు కోసం యత్నాలు
దుబ్బాక: దుబ్బాక మున్సిపల్లో కో ఆప్షన్ ఎన్నికల సందడి మొదలైంది. తాజాగా ఈ ఎన్నికకు కమిషనర్ రమేశ్కుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో ఆశావహుల్లో ఆసక్తి మొదలైంది. దుబ్బాకలో 20 వార్డులలో 35 వేలకు పైగా జనాభా ఉంది. దీంతో నలుగురు కో ఆప్షన్ సభ్యులను కౌన్సిల్కు ఎంపిక చేయాలి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 11 మంది బీఆర్ఎస్, 4 కాంగ్రెస్, 2 బీజేపీ, 3 స్వతంత్రులు కౌన్సిలర్లుగా గెలిచారు. ముగ్గురు స్వతంత్రులు బీఆర్ఎస్లో చేరారు. మొత్తం 14 మంది కౌన్సిలర్లతో బీఆర్ఎస్ మున్సిపల్ పీఠాన్ని కై వసం చేసుకుంది. కో ఆప్షన్ పదవుల కోసం బీఆర్ఎస్ పార్టీలోని ఆశావహులు అప్పుడే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే పలువురు టికెట్ రానివారు, మాజీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డిని కలిసి అవకాశం కల్పించాలని కోరారు. 13 నుంచి దరఖాస్తులు కో ఆప్షన్ సభ్యులకు అభ్యర్థులు ఈ నెల 13 నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. 20వ తేదీ తర్వాత 3 రోజుల పాటు దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాను ప్రకటిస్తారు. అనంతరం కౌన్సిల్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సభ్యులను ఎన్నుకుంటారు. -
మిత్రమా.. కుశలమా..!
మిత్రుడి గృహప్రవేశ వేడుకకు హాజరైన డీజీపీ సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ పరిధిలోని గుంటూరుపల్లిలో జరిగిన మిత్రుడి గృహప్రవేశ వేడుకకు డీజీపీ శివధర్రెడ్డి హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్డ్ అయిన గుంటూరుపల్లికి చెందిన భీరెడ్డి థామస్రెడ్డి శనివారం గృహప్రవేశం చేశారు. మిత్రమా.. కుశలమా అంటూ అతడి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. డీజీపీ రావడంతో ఆ ఇళ్లంతా సందడి నెలకొంది. కాగా, థామస్రెడ్డి, శివధర్రెడ్డి కలసి చదువుకున్నారు. – చేర్యాల(సిద్దిపేట) -
● చేర్యాలలో ఊపందుకున్న లాబీయింగ్ ● బీఆర్ఎస్లో తీవ్ర పోటీ ● ఒకటి సీపీఎంకు కేటాయించే అవకాశం
చేర్యాల(సిద్దిపేట): చేర్యాల మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎంపికపై వాడీ వేడి చర్చ మొదలైంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వరుసగా ఐదు, ఏడు స్థానాలు గెలుచుకోగా మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పీఠాలను బీఆర్ఎస్ కై వసం చేసుకున్న విషయం తెలిసిందే. కో–ఆప్షన్ ఎన్నికకు కసరత్తు జరుగుతున్న క్రమంలో పట్టణంలో అభ్యర్థుల పోటీ, ప్రధాన పార్టీల వ్యూహాలు, నేతల లాబీయింగ్ మరింత ఊపందుకున్నాయి. మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు నాలుగు కో–ఆప్షన్ స్థానాలు దక్కనున్నాయి. అర్హులుగా చెప్పుకునే అనుభవం కలిగిన మాజీ ప్రజాప్రతినిధులు, రిటైర్డ్ గెజిటెడ్ అధికారులు, రెండు మైనార్టీ వర్గాల అభ్యర్థుల మధ్య పోటీ ఉన్నప్పటికీ, ఎమ్మెల్యే పల్లా ఆశీస్సులున్న వారికే అవకాశం దక్కుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నాలుగింటిలో ఒకటి సీపీఎంకు ఇవ్వనున్నట్లు సమాచారం. అర్హతలిలా.. అభ్యర్థి వయస్సు 21 ఏళ్లకుపైబడి ఉండి మున్సిపాలిటీలో ఓటరుగా నమోదై ఉండాలి. కనీసం ఐదేళ్లు చైర్పర్సన్, మేయర్, వార్డు సభ్యుడు, కౌన్సిలర్గా పనిచేసి ఉండాలి. మూడేళ్లు మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేసిన న్యాయవాది, ప్రభుత్వ, స్థానిక సంస్థల్లో గెజిటెడ్ ఉద్యోగిగా రిటైర్డ్ అయి.. మున్సిపల్ పరిపాలనలో అనుభవం ఉన్నవారు అర్హులు. వీరి నుంచి ఇద్దరిని ఎంపిక చేస్తారు. ఇందులో ఒక మహిళ తప్పనిసరిగా ఉండేలా ఎంపిక చేయాల్సి ఉంటుంది. మరో ఇద్దరు మైనారిటీ కో–ఆప్షన్్ సభ్యుల ఎంపికకు ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు అర్హులు. -
జ్యోతిబా పూలే జీవితం యువతకు ఆదర్శం
అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ సిద్దిపేటజోన్: మహాత్మా జ్యోతిబాపూలే జీవితం యువతకు ఆదర్శనీయమని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అన్నారు. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శనివారం స్థానిక విపంచి ఆడిటోరియంలో పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పూలే త్యాగాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొని సామాజిక న్యాయం కోసం ముందుకు సాగినట్టు చెప్పారు. అంతకు ముందు మున్సిపల్ చైర్పర్సన్ మంజుల మాట్లాడుతూ.. పూలే గొప్ప వ్యక్తిత్వం ఉన్న మహనీయుడన్నారు. మహిళల విద్య ప్రాముఖ్యత గురించి సమాజానికి మొట్టమొదటి సారిగా చెప్పిన మహామనిషి అని కొనియాడారు. కార్యక్రమంలో డీఆర్ఓ నాగరాజమ్మ, బీసీ సంక్షేమ అధికారి సయ్యద్ రఫీ పాల్గొన్నారు. డ్రగ్స్ విక్రయించొద్దునార్కోటిక్, డ్రగ్ ఇన్స్పెక్టర్లు సిద్దిపేటకమాన్: మెరుగైన సమాజం కోసం జిల్లాలో డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలు రవాణా చేయొద్దు, విక్రయించొద్దని నార్కోటిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ వినయ్ సుష్మీ పిలుపునిచ్చారు. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా డీఐ వినయ్సుష్మీ ఆధ్వర్యంలో సిద్దిపేటలో ఫార్మసీ కళాశాల విద్యార్థులు, ఫార్మసిస్టులతో శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డ్రగ్స్ రహిత సమాజం, మందుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఫార్మసీ విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ వినోద్బాబ్జి, డ్రగ్ అసోసియేషన్ ప్రతినిధులు అయిత సత్యం, వెంకటేశ్వరరావు, శ్రీనివాస్, సిద్దేశ్వర్, శివ తదితరులు పాల్గొన్నారు. ‘సురక్ష నేత్ర’కు సహకరించాలిఅడిషనల్ డీసీపీ సుభాష్చంద్రబోస్ నంగునూరు(సిద్దిపేట): ‘సిద్దిపేట సురక్ష నేత్ర’కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్చంద్రబోస్ కోరారు. శనివారం రాజగోపాల్పేట పోలీస్ స్టేషన్లో సర్పంచ్, ఉపసర్పంచ్లు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. నంగునూరు మండలంలోని అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలన్నారు. నేరాల నియంత్రణ కోసం రహదారులు, ప్రధాన వీధులు, గ్రామ ప్రవేశ, నిష్క్రమణ ప్రదేశాల్లో సీసీ కెమెరాలు బిగించాలన్నారు. కార్యక్రమంలో ఏసీపీ రవీందర్, సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, ఎస్ఐలు వివేక్, తిరుపతి, సర్పంచ్లు పాల్గొన్నారు. ‘ఉపాధి’ పథకాన్ని పునరుద్ధరించాలిడీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి కొండపాక(గజ్వేల్): జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి డిమాండ్ చేశారు. కుకునూరుపల్లి మండల పరిధి కోనాయిపల్లి, మేదినీపూర్, చిన్న కిష్టాపూర్, పీటీ వెంకటాపూర్, రాయవరం గ్రామాల్లో కొనసాగుతున్న చెరువుల పూడికతీత పనులను పరిశీలించారు. కూలీలతో ముఖాముఖీ నిర్వహించారు. సరైన వసతులు లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, పలు గ్రామాల్లో ఇందిరమ్మ పథకంలో నిర్మించిన ఇండ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నూతనంగా తీసుకువచ్చిన వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ తూం శ్రీకాంత్రెడ్డి, నాయకులు రవీందర్, సంతోష్రెడ్డి, మహేందర్ పాల్గొన్నారు. -
పశుగ్రాసం సాగు మెలకువలు పశుగ్రాసం సాగు, ప్రయోజనాలపైపశుసంవర్ధక శాఖ అధికారి సునీల్దత్ సూచనలు. వివరాలు 8లో u
దర్జాగా రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేస్తున్న మిల్లర్లుగతంలో దొడ్డు బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి దందా నడిపిన పలువురు మిల్లర్లు, సన్నబియ్యాన్ని సైతం వదలడం లేదు. అక్రమ వ్యాపారంతో కోట్లు గడించిన అక్రమార్కులు, ఇప్పటికీ తమ పంథా మార్చుకోవడం లేదు. జిల్లాలో కొందరు రైస్ మిల్లర్లు రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేస్తున్నారు. పల్లె, పట్టణాల నుంచి మిల్లు వరకు ఒక చైన్ సిస్టం ఏర్పాటు చేసుకొని పకడ్బందీగా పకడ్బందీగా దందా నడుపుతున్నారు. ఈ బియ్యాన్ని కొత్త సంచుల్లో ప్యాకింగ్ చేసి సీఎంఆర్ కింద ప్రభుత్వానికి తిరిగి ఇచ్చి రూ. కోట్లు ఆర్జిస్తున్నారు. – సాక్షి, సిద్దిపేట జిల్లాలో సన్న బియ్యం దందా యథేచ్ఛగా సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రూ. కోట్లు వెచ్చించి రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి ధాన్యాన్ని సీఎంఆర్ కింద మరాడించేందుకు రైస్ మిల్లులకు అప్పగిస్తుంది. కొందరు రైస్ మిల్లుల యజమానులు మాత్రం సీఎంఆర్ ధాన్యాన్ని విక్రయిస్తూ పెట్టుబడి లేకుండా వ్యాపారం చేస్తున్నారు. ఈ లోటును పూడ్చుకునేందుకు కొంత మంది సన్న బియ్యం దందా ప్రారంభించారు. ధాన్యం స్థానంలో బియ్యం ఇవ్వడానికి, సన్న బియ్యాన్ని టార్గెట్ చేసుకొని కొందరు మిల్లర్లు దందా నడుపుతున్నారు. రేషన్ బియ్యాన్ని ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేసి ప్రభుత్వానికి సీఎంఆర్ కింద అప్పగిస్తున్నారు. పల్లె.. పట్టణం నుంచి మిల్లుకు రేషన్ బియ్యం కొనుగోలు చేసేందుకు రైస్ మిల్లర్లు పలువురు ఏజెంట్లను నియమించుకున్నారు. వారు పల్లె, పట్టణాల్లో తిరుగుతూ కిలో బియ్యం రూ.10 నుంచి రూ.12కు కొనుగోలు చేస్తున్నారు. గ్రామాల వారీగా సేకరించిన బియ్యాన్ని ముందుగా వేర్వేరు ప్రాంతాల్లో నిల్వ చేస్తున్నారు. అనంతరం సదరు ఏజెంట్లు ప్రత్యేక ఆటోలలో రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. మిల్లర్లకు సన్న బియ్యం కిలోకు రూ.18కి విక్రయిస్తున్నారు. ఈదందాకు కార్డుదారులు, రేషన్ డీలర్లు సహకరిస్తున్నారు. ప్రత్యేకంగా నిఘా పెట్టాం రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచిన వారిపై చర్యలు తప్పవు. సీఎంఆర్పై నిఘా కోసం ప్రత్యేకంగా టీంలను ఏర్పాటు చేశాం. నిత్యం రైస్ మిల్లులను తనిఖీ చేస్తున్నాం. మా దృష్టికి వస్తే వెంటనే కేసులు నమోదు చేస్తున్నాం. – గోపికృష్ణ, డీఎం, సివిల్ సప్లై కార్పొరేషన్కరువైన నిఘా ఈనెల 10న రాయపోలు మండలం రామారంలోని శ్రీ సాయి మహాదేవ రైస్ మిల్లులో హైదరాబాద్కు చెందిన టాస్క్పోర్స్ అధికారులు తనిఖీ చేశారు. 1,100 క్వింటాళ్ల పీడీఎస్ సన్న బియ్యం అక్రమంగా నిల్వ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే స్థానిక పౌరసరఫరాల అధికారులకు సమాచారం అందించడంతో ఆ మిల్లుపై కేసు నమోదు చేశారు. సీఎంఆర్పై పకడ్బందీగా నిఘా ఉంచాల్సిన జిల్లా అధికారులు నిద్రమత్తులో ఉన్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. టాస్క్ఫోర్స్ అధికారులు వచ్చి జిల్లాలోని పలు మిల్లుల్లో నడుస్తున్న సన్నబియ్యం దందాను వెలుగులోకి తెస్తుంటే.. స్థానిక అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా పౌరసరఫరాల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి రీసైక్లింగ్ దందాను కట్టడి చేయాలని కోరుతున్నారు. -
ఉప కాలువలపై దృష్టి పెట్టండి
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డిదుబ్బాకటౌన్: ఉప కాలువల నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం అవుతుందని, ప్రభుత్వం తక్షణమే వీటి నిర్మాణంపై దృష్టిపెట్టాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి తెలిపారు. దౌల్తాబాద్ మండలంలోని గువ్వలేగి గ్రామంలో సిద్దిపేట ఆర్డీఓ సదానందంతో కలిసి రైతులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...నీరు వస్తేనే నేల బతుకుతుందని, నేల బతికితేనే రైతు బతుకుతాడని, రైతు బతికితేనే దేశం బలపడుతుందన్నారు. కాలువల నిర్మాణం, భూసేకరణ, పరిహారం వంటి అంశాలపై సమావేశంలో రైతులతో చర్చ జరిపి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. గతంలో రూ.3 లక్షల పరిహారం మాత్రమే ఇవ్వడంతో కొంతమంది రైతులు సమ్మతించగా, మరికొంతమంది ఒప్పుకోకపోవడంతో కోర్టులో డిపాజిట్ చేసినట్లు గుర్తు చేశారు. పరిహారం పెంపు అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లి రైతులకు రూ.10లక్షలు పరిహారం అందేలా చూస్తానని హామీనిచ్చారు. దౌల్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తూ వివిధ సమస్యలను పరిశీలించారు. అనంతరం దౌల్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో మండలస్థాయి అధికారులు, గ్రామ సర్పంచులతో నిర్వహించిన సమీక్షలో గ్రామాభివృద్ధి లక్ష్యంగా సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల అధికారులు, సర్పంచులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
వ్యర్థాలతో ఇం‘ధనం’!
నర్మేటలో రూ.250 కోట్లతో బయోగ్యాస్ ప్లాంట్సాక్షి, సిద్దిపేట: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా వంట గ్యాస్ కోసం వినియోగదారుల బాధలు వర్ణనాతీతం. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడంతోనే ఈ ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇలా దిగుమతులను తగ్గించడానికి భారత ప్రభుత్వం బయోగ్యాస్ ప్లాంట్లను నిర్మించాలని నిర్ణయించింది. వ్యవసాయ, పౌల్ట్రీ వ్యర్థాలు, పశువుల పేడ నుంచి ఇంధనం తయారు చేయనున్నారు. సిద్దిపేట జిల్లా నర్మెటలో టీజీఐఐసీ సేకరించిన 20 ఎకరాల స్థలాన్ని బయోగ్యాస్ ప్లాంట్ కోసం కేటాయించారు.. అభివృద్ధి చెందుతున్న బయో ఎనర్జీ రంగంలో ప్రముఖ సంస్థ అయిన జూనో జౌల్ బయో ప్యూయల్స్ కంపెనీ వారు ఈ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 12న నర్మెటలో మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేయనున్నారు. వ్యవసాయ వ్యర్థాలతో గ్యాస్ రాష్ట్రంలో అత్యధికంగా వరి పంటను సాగు చేస్తున్నారు. వరి కోతలు ముగిసిన తర్వాత గడ్డి, వివిధ పంటల మొదళ్లను తగులబెడుతుంటారు. దీంతో భూమి సారం కోల్పోవడంతో పాటు గ్రీన్హౌస్ వాయువు విడుదలవుతోంది. అదే వ్యవసాయ వ్యర్థాలు, వడ్లపొట్టు, పశువుల పేడ, పౌల్ట్రీ వ్యర్థాలతో స్వచ్ఛమైన ఇంధనంగా తయారు చేయనున్నారు. సేంద్రియ వ్యర్థాలను స్వచ్ఛమైన ఇంధనంగా మార్చడం ద్వారా పర్యావరణ పరిరక్షణ, గ్రామీణ అభివృద్ధికి తోడ్పాటు అందించనుంది.రాష్ట్రంలోనే తొలి ప్లాంట్ సిద్దిపేటలో రూ 250కోట్ల వ్యయంతో 10 సీబీజీ (కంప్రెషడ్ బయో గ్యాస్) ప్లాంట్లతో రాష్ట్రంలో ఇదే తొలి ప్రాజెక్టు. ఒక్కో ప్లాంట్ రోజుకు 10 టన్నుల టీపీడీ (టెన్స్ పర్ డే) సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీని ద్వారా మొత్తం వంద టీపీడీ ఉత్పత్తి సామర్థ్యం లభిస్తుంది. ఇది రాష్ట్రంలో బయో–ఎనర్జీ ఉత్పత్తికి కీలక కేంద్రంగా మారుతుంది. ఈ ప్రాజెక్టును మూడు దశల్లో అమలు చేయనున్నారు. మొదటి, రెండో దశల్లో మూడు ప్లాంట్లు చొప్పున, మూడో దశలో నాలుగు ప్లాంట్లను ప్రారంభిస్తారు. ఈ మొత్తం క్లస్టర్ 2029–2030 నాటికి పూర్తి కానుంది. ఇది భారతదేశం తక్కువ కార్బన్ ఉద్గారాల ఇంధన వ్యవస్థల వైపు సాగించే ప్రయాణానికి తోడ్పడుతుంది. అలాగే దాదాపు 500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 12న మంత్రి శ్రీధర్బాబు శంకుస్థాపన పౌల్ట్రీ వ్యర్థాలు, పశువుల పేడతో ప్లాంట్ నిర్మాణం 10 ప్లాంట్లు.. ఒక్కో ప్లాంట్ 10 టన్నుల టీపీడీ సామర్థ్యం -
మామిడీలా
జిల్లాలో 17 వేల ఎకరాల్లో తోటలు ● ఏటా 68 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ● మార్కెట్ సౌకర్యం లేక సతమతం ● దళారులను విక్రయిస్తూ నష్టపోతున్న రైతులు మామిడిని అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. మార్కెట్ సౌకర్యం లేక కుదేలవుతున్నారు. దళారులు నిర్ణయించిన ధరకే విక్రయిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. పండించిన మామిడి కాయలు విక్రయించేందుకు 100 నుంచి 150 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు స్పందించి స్థానికంగా మామిడి మార్కెట్ను ఏర్పాటు చేసి మద్దతు ధర లభించే విధంగా చూడాలని కోరుతున్నారు. – సాక్షి, సిద్దిపేట జిల్లావ్యాప్తంగా 17 వేల ఎకరాల్లో రైతులు మామిడి తోటలు సాగు చేస్తున్నారు. ఎకరానికి సగటున 4 టన్నుల దిగుబడి వస్తుంది. జిల్లాలో బంగినపల్లి, కేసర్, హిమాయత్, తోటపురి ఇలా వివిధ రకాల మామిడి తోటలున్నాయి. ప్రతి సంవత్సరం దాదాపు 68 వేల మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుందని అంచనా. టన్నుకు ప్రస్తుతం రూ.1.40 లక్షల చొప్పున బయట మార్కెట్లలో విక్రయాలు సాగుతున్నాయి. ఈ ధర ప్రకారం రూ. 952 కోట్ల వ్యాపారం జరగనుంది. అయినా పంట విక్రయానికి రైతులు అపసోపాలు పడుతున్నారు. మకాం వేసిన దళారులు జిల్లాలో మామిడి కాయలకు మార్కెటింగ్ సౌకర్యం లేక రైతులు దళారులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇప్పటికే ఇతర ప్రాంతాల నుంచి దళారులు మామిడి తోటలను సందర్శించి గుత్తాలు మాట్లాడుకుంటున్నారు. ఢిల్లీ, హైదరాబాద్, ముంబై తదితర ప్రాంతాల నుంచి దళారులు, వ్యాపారులు వచ్చి స్థానికంగా తాత్కాలిక స్థావరాలు ఏర్పాటు చేసుకొని కొనుగోలు చేసి తరలిస్తుంటారు. కష్టం రైతులది.. ప్రతిఫలం దళారులది అన్నట్లుగా తయారైంది. పంట దిగుబడి తగ్గడం, మధ్యవర్తుల దోపిడీతో మామిడి రైతులు నష్టపోతున్నారు. స్థానికంగా మామిడి మార్కెట్ను ఏర్పాటు చేస్తే పంటను తరలించేందుకు రైతులకు దూరాభారం, రవాణా ఖర్చులు తగ్గనున్నాయి. రైతులు పడిన కష్టానికి మద్దతు ధర లభిస్తుంది. దీంతో రైతుకు ఆర్థిక భరోసా లభించనుంది. విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి పరిశ్రమలు నెలకొల్పాలి. మామిడి గుజ్జు తీసి నిల్వ చేయడం, గుజ్జును ఎండబెట్టి మామిడి తాండ్ర, పానీయాలు తయారు చేయడం, ఆమ్చూర్, నిల్వ పచ్చళ్ల యూనిట్లు పెట్టిస్తే రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. అలాగే పరిశ్రమలు వస్తే యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.హుస్నాబాద్ రోడ్డులో ప్రైవేట్ వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న షెడ్లునైపుణ్యాలకు పదును పెట్టాలిసిద్దిపేటఎడ్యుకేషన్: పట్టుదలతో కృషి చేస్తే విజయాలు సొంతమవుతాయని జిల్లా ఇంటర్ విద్యాధికారి (డీఐఈఓ) రవీందర్రెడ్డి అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో ఎడ్యుకేషన్)లో శుక్రవారం ఎంఎస్ఎన్ ల్యాబ్స్ అధ్వర్యంలో నిర్వహించిన జాబ్మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ అభ్యర్థులు తమకు ఉద్యోగాలు లేవని బాధపడకుండా తమ నైపుణ్యాలకు పదునుపెట్టి అవకాశాలను సృష్టించుకోవాలని కోరారు. ప్రతిభ, నైపుణ్యాలుంటే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని చెప్పారు. మేళాకు మొత్తం 54 మంది హాజరుకాగా 38 మందికి ఉద్యోగాలు లభించాయి. ఎంపికై న అభ్యర్థులకు కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణరెడ్డి ఆఫర్ లెటర్లను అందించారు. కాగా స్థానిక కళాశాలకు చెందిన 7గురు విద్యార్థులు ఈ మేళాలో ఉద్యోగాలు సాధించడంతో వారిని అభినందించారు. కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు, అధ్యాపకులు దేవయ్య, నగేష్ తదితరులు పాల్గొన్నారు.సమన్వయంతో పని చేయండిసర్పంచ్, కార్యదర్శులకు డీఎల్పీవో విజ్ఞప్తి డీఐఈఓ రవీందర్రెడ్డి 38 మందికి ఆఫర్ లెటర్ల అందజేత -
సాగు కష్టాలు
మిరుదొడ్డి(దుబ్బాక): రోజు రోజుకు పెరిగిపోతున్న మండుటెండలకు భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి. ఫలితంగా యాసంగిలో సాగు నీటిపై ప్రభావం పడుతోంది. ముఖ్యంగా వరి సాగు చేస్తున్న రైతులకు సాగు నీటి అశనిపాతంగా మారుతోంది. ఎండలకు వరి పంటలు ఎండుముఖం పడుతున్నాయి. కళ్ల ముందు ఎండుతున్న పంటలను కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. మండల పరిధిలోని ధర్మారం గ్రామానికి చెందిన రైతులు ఎల్లారెడ్డి, నారాయణరెడ్డి ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తూ వరి పంటను కాపాడుకుంటున్నారు. -
పిల్లలు లేరని కలత
● భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం ● ఆర్వీఎం ఆస్పత్రికి తరలింపు కొండపాక(గజ్వేల్): కుటుంబ తగాదాలతో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన కుకునూరుపల్లి మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని మేదినీపూర్ గ్రామానికి చెందిన తాడెం మల్లేశం, తారలకు పదేళ్ల కింద వివాహమైంది. వీరికి పిల్లలు లేరు. భర్త మల్లేశం తాపీమేసీ్త్ర పనులు చేస్తుండగా భార్య తార వ్యవసాయ కూలీ పనులకు వెళ్తోంది. సంతానం కలుగకపోవడంతో పాటు కుటుంబ సమస్యలతో తరచుగా గొడవపడుతుండేవారు. ఈ క్రమంలో గురువారం ఇంటి వద్ద దంపతుల మధ్య గొడవ జరగగా భర్త భార్యపై చేయి చేసుకున్నాడు. దీంతో మనస్తాపంతో భార్య పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. భయంతో భర్త మల్లేశం వ్యవసాయ బావి వద్దకు వెళ్లి గడ్డి మందును తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన స్థానికులు అంబులెన్సులో ఇద్దరినీ ఆర్వీఎం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న గజ్వేల్ కోర్టు జడ్జి శుక్రవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భార్యాభర్తల నుంచి మరణ వాంగ్మూలం సేకరించారు. – నాగరాజు, డీఎం, మార్కెటింగ్శాఖ -
12న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష
ప్రశాంత్నగర్(సిద్దిపేట): తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఆదివారం రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. 6వ తరగతి ప్రవేశాలకు పరీక్షలు రాయనున్న విద్యార్థులకు ఆదివారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, 7వ తరగతి నుంచి 10వ తరగతిలో ప్రవేశ పరీక్షలు రాయనున్న విద్యార్థులకు మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. చెక్డ్యామ్ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే దుబ్బాకరూరల్: అక్బర్పేటభూంపల్లి మండలం నగరం గ్రామంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి చెక్డ్యామ్ పనులను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెక్డ్యామ్ నిర్మాణం వల్ల నీరువృథాగా పోకుండా అరికట్టవచ్చన్నారు. సర్పంచ్ నిర్మల, ఉప సర్పంచ్ రమేశ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జీడిపల్లి రవి తదితరులు పాల్గొన్నారు. మే 4న బాల సాహిత్య సమ్మేళనంప్రశాంత్నగర్(సిద్దిపేట): తెలంగాణ సారస్వత పరిషత్ బాలసాహిత్య సమ్మేళనం మే 4న హైదరాబాద్లో నిర్వహించనున్నట్లు, పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ చెన్నయ్య, బాల సాహితీవేత్త భైతి దుర్గయ్య ఒక ప్రకటనలో తెలిపారు. రచయితలు, బాల సాహిత్య వికాసం, పాఠశాల స్థాయిలో విద్యార్థులకు మార్గదర్శకులుగా నిలుస్తున్న ఉపాధ్యాయులకు మరింత అవగాహన పెంచే విధంగా పలు అంశాలపై సదస్సులు జరుగుతాయని పేర్కొన్నారు. పద్మభూషణ్ డాక్టర్ కె.ఐ వరప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలోని శాంతా– వసంతా ట్రస్ట్ సౌజన్యం అందిస్తున్న ఈ సమ్మేళనంలో ప్రతినిధులుగా పాల్గొనదలచిన వారు ఈ నెల 20లోగా ‘‘9603727234’’వాట్సాప్ నంబర్లో పేరు నమోదు చేసుకోవాలని కోరారు.కూలీల పెండింగ్ వేతనాలు చెల్లించాలి: డీబీఎఫ్గజ్వేల్/కొండపాక(గజ్వేల్): ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీల పెండింగ్ వేతనాలను పెంచాలని డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండస్వామి డిమాండ్ చేశారు. గజ్వేల్ మండలం కొడకండ్లలో, కుకునూరుపల్లి మండలంలోని రాయవరంలో శుక్రవారం ఉపాధి కూలీల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు పనులు చేసి మూడు నెలలు గడుస్తున్నా డబ్బులు రాకపోవడంతో ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని పేర్కొన్నారు. పనులు చేసే ప్రదేశంలో నీడ సౌకర్యం లేక నీరసిస్తున్నారని, ఓఆర్ఎస్, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు తెలుసుకోడానికే ‘పల్లెపల్లెకు సీపీఐ’సీపీఐ జిల్లా నేత అశోక్ కొమురవెల్లి(సిద్దిపేట): పల్లెపల్లెకు సీపీఐ.. ప్రజల వద్దకు సీపీఐ అంటూ ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశోక్ శుక్రవారం కొమురవెల్లిలో ఇంటింటా తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే పోరాటమే ఎకై క మార్గమన్నారు. కార్మకులు, కర్షకులల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న సీపీఐకి ప్రజల మద్దతు కావాలని కోరారు. ప్రజా ఉద్యమాలే పాలకులను కట్టడి చేయగలవని చెప్పారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి కుడికాల బాలమోహన్, సహాయ కార్యదర్శి బూర్గు సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘ఆయుష్’పై అవగాహన
సిద్దిపేటకమాన్: సిద్దిపేట ప్రభుత్వ సమీకృత ఆయుష్ వైద్యశాలలో ఆయుర్వేదిక్, యునానీ, హోమియోపతి వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కె హైమావతి తెలిపారు. శుక్రవారం ఆయుష్ వైద్యశాలలో నిర్వహించిన వైద్య శిబిరంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఆయుర్వేదిక్, యునానీ, హోమియోపతి ఓపీ వార్డులు, మెడిసిన్ స్టోర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఒక్కో వారం ఒక్కో థీమ్తో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయుర్వేదిక్, యునానీ, హోమియోపతి వైద్య సేవలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. 50పడకల ఆసుపత్రిలో 24గంటలు ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్, డాక్టర్ శ్రీకాంత్యాదవ్, డాక్టర్ వినోద్బాబ్జి, ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ ఉమాదేవి, డాక్టర్ గౌతమిప్రియ, డాక్టర్ కవిత, డాక్టర్ శ్రీప్రియ, డాక్టర్ అనిల్కుమార్, డాక్టర్ సంపత్కుమార్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సేవలను సద్వినియోగం చేసుకోండి కలెక్టర్ కె.హైమావతి -
ఏర్పాటు చేయాలి
జిల్లాలో మామిడి మార్కెట్ లేకపోవడంతో తెంపిన కాయలను వరంగల్కు తరలించాలి. దీంతో రవాణా ఖర్చులతో పాటు అక్కడ నిర్ణయించిన థరకు విక్రయించాల్సి వస్తోంది. ఇవన్నీ ఇబ్బందుల కంటే గుత్తేదారులకే తోటలను అప్పగిస్తున్నాం. ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. – సత్తయ్య, మామిడి రైతు, గట్లమల్యాల నివేదిక పంపిస్తాం మామిడి మార్కెట్ ఏర్పాటు చేస్తే బాగుటుందని మా ఉన్నతాధికారులకు నివేదికను పంపుతాం. మార్కెట్ ఏర్పాటు చేయడం వల్ల రైతులకు మద్దతు ధర లభిస్తుంది. రైతులకు సైతం మేలు జరుగుతుంది. -
ఉద్యానసాగు.. సబ్సిడీ బాగు
జహీరాబాద్: ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహకాలను అందించనుంది. గతేడాది కంటే ఈసారి రెట్టింపు నిధులు ఇచ్చే విధంగా ఉద్యాన శాఖ అధికారులు ప్రణాళికలకు రూపకల్పన చేస్తున్నారు. జిల్లాలో అరటి, బొప్పాయి పండ్ల తోటలతోపాటు అన్ని రకాల కూరగాయల పంటలకు ప్రోత్సాహకాలను అందజేసి సాగు విస్తీర్ణం పెంచేందుకు రూ.5.60 కోట్లతో ఉద్యాన శాఖ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. కూరగాయల పంటల సాగుపై ఎకరానికి రూ.10వేల వరకు సబ్సిడీ ఇవ్వనుంది. జిల్లాలో సుమారు 4వేల ఎకరాల్లో కూరగాయల సాగును చేయించాలనే లక్ష్యంతో ఉంది. గతేడాది కంటే వేయి ఎకరాల సాగును పెంచే ప్రయత్నం చేస్తోంది. పీఏసీఎస్ల సహకారంతో 37 మంది విద్యావంతులైన రైతులను వలంటీర్లను ఎంపిక చేసి శిక్షణ ఇప్పించింది. ఒక వలంటీర్తో 100 ఎకరాల కూరగాయలను సాగు చేయించాలని ప్రతిపాదించారు. ఈ ఏడాది 500 ఎకరాల్లో పండ్ల తోటలను పెంచాలని ఉద్యాన శాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. పండ్ల తోటల సాగును ప్రోత్సహించేందుకుగాను సబ్సిడీని సైతం అందించనున్నారు. రైతులవైపు నుంచి అరటి, బొప్పాయి, మామిడి పంటల సాగుకు సానుకూలత వస్తోంది. డ్రాగన్ ఫ్రూట్, అవకాడో, జామ తోటలకు సైతం సబ్సిడీ అందించనున్నారు. సాగుచేసిన పంటలపై సబ్సిడీ ఇలా... రైతులు సాగు చేసిన ఉద్యానపంటల సాగుపై సబ్సిడీ అందించనున్నారు. అరటి సాగుపై ఎకరానికి రూ.18వేల చొప్పున బొప్పాయికి రూ.7వేలు, అల్లంకు రూ.9వేలు, పసుపునకు రూ.8వేలు, ఉల్లిగడ్డపంటపై రూ.6వేల వంతున రైతులకు సబ్సిడీని అందించనున్నారు. రైతులు పంటను సాగు చేసుకుని, బిల్లులు అందజేసిన తర్వాత అధికారులు పంటల సాగును పరిశీలించిన అనంతరమే సబ్సిడీని మంజూరు చేస్తారు. రూ.5.60కోట్ల సబ్సిడీతో ప్రణాళికలు పెరగనున్న కూరగాయల సాగు విస్తీర్ణం -
బీఆర్ఎస్లో జీవన్రెడ్డి చేరికకు ముహూర్తం ఫిక్స్
సిద్ధిపేట: ఇటీవల కాంగ్రెస్కు రాజీనామా చేసిన జీవన్రెడ్డి బీఆర్ఎస్లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 20వ తేదీన బీఆర్ఎస్లో జీవన్రెడ్డి చేరనున్నారు. దీనిలో భాగంగా జగిత్యాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలోనే జీవన్రెడ్డి.. గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఈరోజు( శుక్రవారం, ఏప్రిల్ 10వ తేదీ) సిద్దిపేట జిల్లాలో కేసీఆర్తో జీవన్రెడ్డి సమావేశమయ్యారు. ఎర్రవెల్లిలో సుమారు ఐదు గంటల పాటు కేసీఆర్తో జీవన్రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం బీఆర్ఎస్లో జీవన్రెడ్డి చేరికపై స్పష్టత నిచ్చారు. దీనిలో భాగంగా జీవన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై పట్టు కోల్పోయింది. ఒకప్పుడు పీసీసీ చెప్పినట్టు సీఎం నడుచుకునే వారు. కానీ ఇప్పుడు సీఎం చెబితే పీసీసీ అమలు చేస్తోంది. త్వరలోనే జగిత్యాలలో భారీ బహిరంగ సభ పెట్టి కేసీఆర్ సమక్షంలో జాయిన్ అవుతా. పీసీసీ తప్పు చేసి ఆ నింద ఏఐసీసీపై వేస్తుంది. నాకు 14 సార్లు B ఫామ్ ఇచ్చారంటే అది నా సమర్థతోనే ఇచ్చారు. నేను కంటెంట్ ఉన్న నాయకున్నీ కాబట్టే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి ఎందుకు వెళ్తున్నానో మీకే తెలియాలి. కాంగ్రెస్ ప్రభుత్వం తిరోగమనంలో పయనిస్తుంది. కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి అని ప్రజల్లో చర్చ మొదలైంది. మిగిలిన రెండున్నరేళ్లు అయిన కాంగ్రెస్ ప్రభుత్వం బాగా పని చేయాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు. -
పాత పట్టణం.. సమస్యలు అధికం
రోడ్లు, డ్రైనేజీలు అధ్వానంగజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని ‘పాతపట్టణం’ అవస్థలమయంగా మారింది. ఏళ్లతరబడి రోడ్డు విస్తరణ, డ్రైనేజీ పనులు పెండింగ్లో ఉండటంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. అభివృద్ధికి నమూనాగా ఊదరగొట్టిన ఈ మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. – గజ్వేల్ గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని ఇందిరాపార్కు చౌరస్తా నుంచి కోటమైసమ్మ గుడి వైపు వెళ్లే రోడ్డును 1.3 కిలోమీటర్ల మేర 70ఫీట్లుగా విస్తరించాలని నిర్ణయించారు. ఈ పనులకు రూ.12 కోట్లు వెచ్చిస్తున్నారు. ఎనిమిదేళ్లుగా పనులు సా గు..తూనే ఉన్నాయి. ప్రత్యేకించి ఎంపీడీఓ కార్యాల యం నుంచి కోటమైసమ్మ గుడి వరకు పూర్తిస్థాయిలో పనులు చేపట్టలేదు. బీటీ కొంత వేసి, కొంత పెండింగ్లో ఉంచారు. రోడ్డుకు ఇరు పక్కలా డ్రైనేజీ పనులు సైతం పెండింగ్లోనే ఉన్నాయి. రోడ్డు పనులు ప్రారంభమైనప్పటి నుంచీ ఇదే నిర్ల క్ష్యం కొనసాగుతూనే ఉంది. పాత పట్టణానికి ప్రధా న ఆధారమైన ఈ రోడ్డుపై కావాలనే వివక్ష చూపుతున్నారని ఇక్కడి కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. రోడ్డు విస్తరణ సందర్భంలో ఎంతోమంది ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. వీరిలో కొందరికీ మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారు. ఇంకా చాలా మందికి ఇండ్లు అందాల్సి ఉంది. రోడ్డు విస్తరణ చేపట్టిన యంత్రాంగం వారిని ఆదుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోల్పోయిన ఇళ్లకు ఖరీదు కట్టి ఇస్తామని అధికారులు చెప్పారు. కానీ అదికూడా జరగలేదు. ఈ అంశంపై బాధితులు నిరసనలకు దిగినా ఫలితం లేకుండా పోయింది. బాధితుల ఇబ్బందులను పట్టించుకోకుండా పోలీసుల పహారాలో పనులు చేపట్టారు. ఇంత చేసినా కనీసం రోడ్డు విస్తరణ, డ్రైనేజీ పనులైనా సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల ప్రజలు ఇక్కట్ల పాలవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డుపైనే మురుగు రోడ్డు విస్తరణ, డ్రైనేజీ పనులు ఏళ్లతరబడి పెండింగ్లో ఉండటం వల్ల మురుగునీరంతా రోడ్డుపైనే ప్రవహిస్తోంది. ఒకవైపు దుర్గంధం.. మరోవైపు దోమల వ్యాప్తి పెరిగి జనం రోగాలబారిన పడుతున్నారు. రోడ్డు విస్తరణ పూర్తికాపోవడంతో సుమారుగా అర కిలోమీటర్ మేర రోడ్డు నరకప్రాయంగా మారింది. వాహదారులు ఈ మార్గం గుండా వెళ్లాలంటనే జంకుతున్నారు. పెండింగ్ పనులపై ప్రత్యేక దృష్టి మున్సిపాలిటీ పరిధిలోని పెండింగ్ పనులన్నీంటిపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. సమీక్ష నిర్వహించి పనులు పూర్తిచేయడానికి అవసరమైన కార్యాచరణ సిద్ధం చేస్తాం. – గంగిశెట్టి చందన, మున్సిపల్ చైర్పర్సన్ -
కొంటారా.. కొనరా?
పొద్దుతిరుగుడు ఉత్పత్తులను పూర్తిగా కొనుగోళ్లు చేయకపోవడంతో రైతులు మార్కెట్ యార్డుల్లో పడిగాపులు కాస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏడు మార్కెట్ యార్డుల్లో కొనుగోలు కేంద్రాలను మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం విధించిన టార్గెట్ మేర పంటను కొనుగోలు చేస్తూ టోకెన్లు జారీ చేశారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. – సాక్షి, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 9,876 ఎకరాల్లో సన్ఫ్లవర్ పంటను సాగు చేయగా 9,619 మెట్రిక్ టన్నుల దిగుబడులు వస్తాయని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. పంటకు కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.7,721గా ప్రభుత్వం నిర్ణయించి మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. గజ్వేల్, సిద్దిపేట, తొగుట, చిన్నకోడూరు, బెజ్జంకి, హుస్నాబాద్, మిరుదొడ్డిలలో పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రారంభించారు. జిల్లాలో 2,200 మెట్రిక్ టన్నుల సేకరణకు కేంద్ర ప్రభుత్వం టార్గెట్ ఇచ్చింది. టోకెన్లు జారీ కొనుగోలు కేంద్రాలలో ఇప్పటి వరకు 1,800 మెట్రిక్ టన్నుల పొద్దుతిరుగుడు గింజలను కొనుగోలు చేశారు. కేంద్రం ఇచ్చిన టార్గెట్కు సరిపడా 400 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేందుకు రైతులకు టోకెన్లను జారీ చేశారు. ఇంకా చాలా మంది రైతులు వారం రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఒక్క తొగుట కొనుగోలు కేంద్రానికే దాదాపు 200 మెట్రిక్ టన్నులు పొద్దుతిరుగుడు గింజలను తీసుకవచ్చారు. ఇతర మార్కెట్లలో సైతం షెడ్ల కింద, బయట పోసి టార్పాలిన్ కవర్లు కప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తేనే.. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తేనే పొద్దుతిరుగుడు కొనుగోళ్లు చేసే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. కొనుగోలు చేసినవి తరలించేందుకు లారీలను అందుబాటులో ఉంచకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల గోనె సంచులు లేకపోవడంతో కొనుగోళ్లు జరగడం లేదు. జిల్లాలో మరో 7వేల మెట్రిక్ టన్నుల పొద్దుతిరుగుడు కొనుగోలు చేయాల్సి ఉంది. కొనుగోలు కేంద్రాల్లో సదుపాయలు లేకపోవడంతో చాలామంది రైతులు ఇంటి వద్దనే దిగుబడులను ఉంచారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పొద్దుతిరుడుగు ఉత్పత్తులను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. వారం రోజులుగా ఎదురుచూపులే తొగుట మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రానికి పొద్దుతిరుగుడు ఉత్పత్తులను 94 సంచుల్లో తీసుకవచ్చా. జల్లి లభించలేదు. అప్పటికే ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ ముగిసిందని అధికారులు చెబుతున్నారు. అధికారులు స్పందించి పొద్దుతిరుగుడు పంటను వెంటనే కొనుగోలు చేయాలి. –తిరుపతి రెడ్డి, ఆనాజీపేటకేంద్రం కోటా పూర్తి కావొచ్చింది జిల్లాలో ఏడు చోట్ల పొద్దుతిరుగుడు పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. కేంద్రం ఇచ్చిన కోటా పూర్తి కావొచ్చింది. మార్కెట్లలో ఎక్కువగా పొద్దుతిరుగుడు పంట ఉందని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకవెళ్లాం. వారు ఆదేశిలిస్తే పూర్తిగా కొనుగోలు చేస్తాం. –సునీత, జిల్లా మేనేజర్, మార్క్ఫెడ్ తొగుట మార్కెట్ యార్డులో పేరుకుపోయిన పొద్దుతిరుగుడు ఉత్పత్తులుమార్కెట్యార్డుల్లో పొద్దుతిరుగుడు రాశులు -
కేసీఆర్ చొరవ.. రైతులకు ఊరట
ఎండుతున్న పంటల సంరక్షణకు ఆదేశం ములుగు(గజ్వేల్): ఎండిపోతున్న పంట పొలాల సంరక్షణకు చర్యలు చేపట్టాలన్న రైతుల విజ్ఞప్తిపై మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. కొండపోచమ్మ కాలువ ద్వారా కర్కపట్ల, కొట్యాల, అల్లీనగర్, అడవి మజీద్, నర్సంపల్లి, క్షీరసాగర్, జప్తిసింగాయిపల్లి గ్రామాలకు నీటిని విడుదల చేసి సంరక్షించాలని ఇరిగేషన్ అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ మాజీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి గురువారం రైతుల వేదనను కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్లిన వెంటనే ఆయన చొరవ తీసుకుని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్, డీఈ అంజలి, ఏఈ లు మాజీ డీసీసీబీ డైరెక్టర్ అంజిరెడ్డితో కలిసి సుమారు 20 కిలోమీటర్ల మేర కాలువను పరిశీలించారు. శుక్రవారం ఆయా గ్రామాల పంట పొలాలకు సాగునీరందేలా నీటిని విడుదల చేస్తామని ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నట్లు అంజిరెడ్డి తెలిపారు. సాగు నీటి విడుదలకు కేసీఆర్ చొరవ తీసుకుని సమస్య పరిష్కరించడంపై ఆయా గ్రామాల రైతులు సంతో షం వ్యక్తం చేస్తున్నారు. -
బయో గ్యాస్ ఫ్యాక్టరీ మంజూరు
నంగునూరు(సిద్దిపేట): మండల పరిధిలోని నర్మేటకు బయో గ్యాస్ ఉత్పదక ఫ్యాక్టరీ మంజూరైంది. వ్యవసాయ వ్యర్థాలతో కంప్రెస్ట్ బయో గ్యాస్ (సీబీజీ) ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రూ.250 కోట్లు మంజూరైనట్లు అధికారులు తెలిపారు. సేంద్రియ, వ్యవసాయ వ్యర్థాలతో రోజుకు 100 టన్నుల గ్యాస్ను ఉత్పత్తి చేసే సామర్థ్యం గల 10 బయో ప్లాంట్లను నిర్మించనున్నారు. ఇందుకు గాను నర్మేట లోని ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ఆవరణలో 20 ఎకరాల భూమిని కేటాయించారు. త్వరలోనే కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రితో కలసి రాష్ట్ర ఇటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇందు కోసం సంబంధిత అధికారులు యుద్ధ ప్రతిపాదికన పనులు ప్రారంభించారు. -
ఎయిడ్స్ రహిత సమాజం నిర్మిద్దాం
సిద్దిపేటకమాన్: ఎయిడ్స్ రహిత సమాజం నిర్మించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలో ఎయిడ్స్ వ్యాధిపై నిర్వహించిన అవగాహన ర్యాలీని డీఎంహెచ్ఓ గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాలీలో పాల్గొన్న వారితో ఎయిడ్స్ నిర్మూలనకై ప్రతిజ్ఞ చేయించినట్లు తెలిపారు. వ్యాధి వ్యాప్తికి సంబంధించిన అంశాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించామన్నారు. ఎయిడ్స్ రహిత సమాజమే లక్ష్యం కావాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ వినోద్బాబ్జి, డాక్టర్ శ్రీకాంత్ యాదవ్, వైద్య సిబ్బంది, నర్సింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. -
రోడ్డు భద్రతపై అవగాహన కల్పించండి
● అధికారులకు కలెక్టర్ హైమావతి ఆదేశం ● వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్, సీపీసిద్దిపేటరూరల్: రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో, పట్టణాల్లోని ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్రెడ్డి, తదితర ఉన్నతాధికారులతో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ హైమావతి, సీపీ రష్మీ పెరుమాళ్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాల్లో, మున్సిపల్ వార్డులో ప్రత్యేక సభలు నిర్వహించి 8 నుంచి 9 మంది సభ్యులతో కూడిన రహదారి భద్రతా కమిటీని ఏర్పాటు చేసి అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేయించాలని సూచించారు. స్కూల్ బస్సుల్లో, ఆటోల్లో పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్లకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సీపీఓ ధశరథ్, డీపీఓ రవీందర్రెడ్డి, డీఎంహెచ్ఓ ధనరాజ్, డీఈఓ శ్రీనివాస్రెడ్డి, ఎంవీఐ శంకర్నారాయణ, ఆర్అండ్బీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లు సమర్థంగా చేపట్టాలి
● ఇబ్బందులు తలెత్తవద్దు ● కలెక్టర్ హైమావతి ● అధికారులతో కలెక్టర్ సమావేశం సిద్దిపేటరూరల్: యాసంగి సీజన్ వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ చేపట్టి వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో జూమ్ మీటింగ్ నిర్వహించిన కలెక్టర్.. వరి ధాన్యం కొనుగోళ్ల ఏర్పాట్లపై ఆర్డీవోలు, సివిల్ సప్లై, మెప్మా, డీఆర్డీఏ, తహసీల్దార్లు, డీసీఓ, డీఏఓ, డీఎం మార్కెటింగ్ తదితర అధికారులకు సమగ్ర దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అంచనాలకు మించి ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలన్నారు. ప్రతి మండలంలో తహసీల్దార్లు, ఎంపిడిఓలు, ఏపిఎం, మహిళ సమాఖ్య ఓపిఓలు, మార్కెటింగ్, అగ్రికల్చర్ అధికారులను సమన్వయం చేసుకొని కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు ముందస్తు సమావేశాలు నిర్వహించాలన్నారు. జిల్లాలోని 421 కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రతి కేంద్రాన్ని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ప్రారంభించాలన్నారు. మార్కెట్ గోదాముల్లో అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాన్ని గుర్తించి నిల్వ సదుపాయాలు కల్పించాలని, అవసరమైతే కాటన్ మిల్లులను వినియోగించుకోవాలని డీఎం మార్కెటింగ్ను ఆదేశించారు. సమావేశంలో సివిల్ సప్లై అధికారి తనూజ, తదితరులు పాల్గొన్నారు. టొరెంట్ గ్యాస్ పైప్లైన్తో గ్యాస్ సరఫరా ప్రశాంత్నగర్(సిద్ధిపేట): టొరెంట్ గ్యాస్ పైప్ లైన్తో ప్రభుత్వ ఆస్పత్రులు, రెసిడెన్షియల్ పాఠశాలలకు గ్యాస్ సరఫరా చేయనున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. బుధవారం టొరెంట్ గ్యాస్ ఏజెన్సీ, జిల్లాస్థాయి కమిటీ సభ్యులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ టొరెంట్ గ్యాస్ ఏజెన్సీ వద్ద గ్యాస్ నిల్వలు అధిక మొత్తంలో ఉన్నాయన్నారు. ముందుగా ప్రభుత్వ ఆస్పత్రులు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు తర్వాత గృహాలకు అందించడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లా కేంద్రంలో గ్యాస్ పైప్ లైన్ 60కి.మీ పైగా విస్తరించినట్లు తెలిపారు. టోరెంట్ గ్యాస్ పైప్ లైన్ ద్వారా ఎలాంటి ప్రమాదాలు జరగవని పూర్తి సెక్యూరిటీగా ఉంటుందని, వినియోగదారులకు ఏజెన్సీ నిర్వాహకులు అందుబాటులో ఉంటారన్నారు. టొరెంట్ గ్యాస్ సేవలకు 8018426836 నంబర్ను సంప్రదించాలని తెలిపారు.ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే మెరుగైన వైద్యం సిద్దిపేటకమాన్: ప్రభుత్వ మాతా శిశు ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని.. గర్భిణులు తప్పనిసరిగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వైద్య సేవలు పొందాలని కలెక్టర్ హైమావతి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సేఫ్ మదర్ డే కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. హెల్త్ వీక్లో భాగంగా రోజువారి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. గర్భిణులు వైద్యుల సూచనలు పాటిస్తూ పౌష్టికాహారం తీసుకోవడం, మానసిక ప్రశాంతత అలవర్చుకోవడం చాలా ముఖ్యమని తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని 7, 8, 9వ నెలల్లో తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం ప్రభుత్వాసుపత్రిలోని సైకియాట్రి విభాగం, డి అడిక్షన్ సెంటర్ను పరిశీలించారు. కుటుంబ సమస్యలతో డిప్రెషన్కు గురై చికిత్స పొందుతున్న పేషెంట్తో మాట్లాడి సూచనలు చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్, ఆసుపత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ చందర్, తదితరులు పాల్గొన్నారు. -
నిధుల బదలాయింపు జరిగేనా!
దేవుడు వరమిచ్చినా గుడిలో పూజారి కరుణించని చందంగా తయారైంది గ్రామాల్లో సీసీ రోడ్ల పరిస్థితి. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను సకాలంలో సంబంధింత అధికారులు వినియోగించుకోలేకపోవడంతో మంజూరైన నిధులను వచ్చే ఆర్థిక ఏడాదికి బదలాయిస్తారా? లేక వెనక్కి వెళ్లిపోతాయా అనే అంశంపై అయోమయం నెలకొంది. –సాక్షిప్రతినిధి, సంగారెడ్డి గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం కోసం జిల్లాకు గత ఆర్థిక ఏడాది 2025–26లో ఉపాధి హామీ పథకం కింద రూ.34.10 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో ఆయా గ్రామాల్లో 509 సీసీ రోడ్లను నిర్మించాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్శాఖ నిర్ణయించింది. కానీ వివిధ కారణాలతో ఇందులో 68 సీసీ రోడ్లు మాత్రమే నిర్ణీత గడువులోగా పూర్తి చేయగలిగారు. పూర్తి చేసిన ఈ సీసీ రోడ్ల అంచనా వ్యయం రూ.2.90 కోట్లు మాత్రమే. మిగిలిన 441 సీసీ రోడ్లకు సంబంధించిన రూ.31.20 కోట్ల నిధులు వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి నెలకొంది. జిల్లా అభివృద్ధి కోసం మంజూరైన నిధులను సకాలంలో సద్వినియోగం చేసుకోకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సీసీ రోడ్ల నిర్మాణం కోసం జిల్లాకు మంజూరైన నిధులతో చేపట్టాల్సిన పనులను జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు ప్రతిపాదించారు. మంత్రి దామోదర రాజనర్సింహ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అందోల్ నియోజకవర్గంలో రూ.8.68 కోట్ల అంచనా వ్యయంతో 115 సీసీ రోడ్లను ప్రతిపాదించారు. ఎంపీ సురేశ్షెట్కార్ నారాయణఖేడ్ నియోజకవర్గంలోని 35 సీసీ రోడ్లకు రూ.1.75 కోట్లు, జహీరాబాద్లో 83 సీసీ రోడ్లకు రూ.6.22 కోట్లు ప్రతిపాదించారు. ఎంపీ రఘునందన్రావు సంగారెడ్డి నియోజకవర్గం పరిధిలో 21 సీసీ రోడ్లకు రూ.2.10 కోట్లు ప్రతిపాదించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ 29 సీసీ రోడ్లకు రూ.2 కోట్లు, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి రూ.32 సీసీ రోడ్లకు రూ.2 కోట్లు, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు రూ.2 కోట్లు, సెట్విన్ కార్పొరేషన్ స్టేట్ చైర్మన్ గిరిధర్రెడ్డి జహీరాబాద్లో రూ.2 కోట్లు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి రూ.71 సీసీ రోడ్లకు రూ.4.కోట్ల మేరకు ప్రతిపాదనలు ఇచ్చారు. నర్సాపూర్ నియోజకవర్గం పరిధిలో ఉన్న హత్నూర మండలంలో స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి రూ.40 లక్షలు, స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆవుల రాజిరెడ్డి, మదన్రెడ్డి 24 సీసీ రోడ్లకు రూ.1.25 కోట్ల పనులను ప్రతిపాదించారు. అయితే మొత్తం రూ.34.10 కోట్ల పనులకు గాను ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి రూ.2.90 కోట్లకు మాత్రమే పనులు పూర్తి చేయగలిగారు. ప్రజాప్రతినిధులు ప్రతిపాదించిన పనుల్లో రూ.31.20 కోట్ల నిధులను సకాలంలో వినియోగించుకోలేకపోవడం గమనార్హం. ఇప్పట్లో అవకాశం లేదు సీసీ రోడ్ల నిర్మాణానికి సంబంధించి గత ఆర్థిక ఏడాదిలో మంజూరై.. పనులు ప్రారంభించని సీసీ రోడ్ల నిధుల విషయమై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. అయితే మార్చ్ 31 లోపు వినియోగించుకోకపోవడంతో ఇప్పట్లో ఈ సీసీ రోడ్ల నిర్మాణం ప్రారంభించే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే ప్రారంభమై పూర్తయిన సీసీ రోడ్లకు మాత్రం బిల్లులు చెల్లింపు ఉంటుంది. –జగదీశ్వర్, పర్యవేక్షక ఇంజనీర్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ. -
ఈతచెట్ల నరికివేతపై నిరసన
● రోడ్డుపై బైఠాయించి ఆందోళన ● మజీద్పల్లిలో ఘటనవర్గల్(గజ్వేల్): ఈతవనంలో చెట్లను అర్ధరాత్రి దుండగులు నరికేశారంటూ వర్గల్ మండలం మజీద్పల్లి గౌడ సంఘ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఘటన స్థలం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మజీద్పల్లి ఎల్లమ్మ గుడి సమీప ఈతవనంలో అర్ధరాత్రి తమకు జీవనోపాధిగా నిలుస్తున్న పలు చెట్లు నరికివేశారని వారు మండిపడ్డారు. ఈ ఘటనకు పాల్పడిన దుండగులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం తెలిసి తొగుట సీఐ లతీఫ్, బేగంపేట ఎస్ఐ మహిపాల్రెడ్డి, ఎకై ్సజ్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఘటన స్థలం పరిశీలించారు. గౌడసంఘ సభ్యులతో మాట్లాడారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. -
ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
గజ్వేల్: విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ రవీందర్ డిమాండ్ చేశారు. బుధవారం గజ్వేల్లోని విద్యుత్శాఖ డీఈ కార్యాలయం ముందు కొనసాగుతున్న ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టిజన్ కార్మికులకు జీవో 11 ప్రకారం పని కల్పించాలని, విద్యార్హతల మేరకు కన్వర్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు పాదయాత్రల్లో విద్యుత్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మాటకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సందబోయిన ఎల్లయ్య, ఆర్టిజన్ కార్మికుల జేఏసీ గజ్వేల్ డివిజన్ చైర్మన్ భూపతిరాజు, కన్వీనర్ శ్రీధర్, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎల్లేష్, గజ్వేల్ డివిజన్ వైస్చైర్మన్ యాదగిరిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
నడిరోడ్డుపై ఫ్లెక్సీలు
చేర్యాల(సిద్దిపేట): పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన భారీ ప్రచార హోర్డింగ్లు, ఫ్లెక్సీల వల్ల ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ప్రచారాల కోసం ఏర్పాటు చేస్తున్న భారీ ఫ్లెక్సీల కారణంగా జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాల రాకపోకలు కనిపించక పోవడంతో ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రమాదాలు జరగకుండా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ప్రచారాలు చేసే అధికారులే ఇలాంటి వాటిపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణ కేంద్రంలో హోర్డింగ్, భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా మున్సిపల్ అధికారుల అనుమతి తీసుకోవాలి. కానీ పట్టణంలోని పోలీస్స్టేషన్ పక్కనే నడిరోడ్డుపై భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసినా ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. -
గవర్నర్ను కలిసిన ఆహార కమిషన్ సభ్యుడు
బెజ్జంకి(సిద్దిపేట): రాజభవన్లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను బుధవారం ఫుడ్ కమిషన్ సభ్యుడు ఓరుగంటి ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేశారు. రాష్ట్రంలో ఆహార భద్రత చట్టం అమలు తీరును వివరించారు. 31 మందికి ఉద్యోగాలు ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలకు చెందిన 31 మంది విద్యార్థులకు కోవలెంట్ లేబరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ (సంగారెడ్డి)లో ఉద్యోగాలు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత తెలిపారు. బుధవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్కిల్ అండ్ నాలెడ్జి సెంటర్, కెరియర్ గైడెన్స్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఉద్యోగాల కోసం క్యాంపస్ ప్లేస్ మెంట్ డ్రైవ్ నిర్వహించారు. 72 మంది విద్యార్థులు పాల్గొనగా, 31 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అయోధ్య రెడ్డి, టీఎస్కేసీ కోఆర్డినేటర్ డాక్టర్ ఉమామహేశ్వరి, రసాయన శాస్త్ర విభాగ అధిపతి డాక్టర్ శ్రీధర్, విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపిక నంగునూరు(సిద్దిపేట): జాతీయ స్థాయి అండర్ 14 సాఫ్ట్బాల్ పోటీలకు గట్లమల్యాల ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థిని బానోత్ అర్చన ఎంపికయ్యారు. మహబూబాబాద్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి మెదక్ జిల్లా జట్టు తరుపున ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈనెల 16 నుంచి ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నట్లు హెచ్ఎం రమేశ్, ఫిజికల్ డైరెక్టర్ రాజ్కుమార్ తెలిపారు. జాతీయ జట్టుకు ఎంపికై న విద్యార్థిని సర్పంచ్ నరేశ్, ఉపసర్పంచ్ శ్రీనివాస్, హస్టల్ వార్డెన్ మాధవి, ఉపాధ్యాయులు అభినందించారు. కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభించండి కొమురవెల్లి(సిద్దిపేట): పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి రైల్వేస్టేషన్ను వెంటనే ప్రారంభించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం పార్టీ నాయకులలో కలిసి రైల్వేస్టేషన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులు పూర్తయినా కొంత మంది నాయకులు, అధికారుల అసమర్థతతో రైల్వేస్టేష్టన్ను ప్రారంభించడం లేదని మండిపడ్డారు. దీంతో మల్లన్న దర్శనం కోసం వచ్చే భక్తులకు తిప్పలు తప్పడంలేదన్నారు. వెంటనే రైల్వేస్టేషన్ ప్రారంభించి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు శెట్టిపల్లి సత్తిరెడ్డి, కొంగరి వెంకట్మావో, అరుణ్కుమార్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. రేపు ఉచిత వైద్య శిబిరం సిద్దిపేటకమాన్: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో పట్టణంలో ఈ నెల 10న ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఉమాదేవి తెలిపారు. ఆయుష్ శాఖ సిబ్బందితో కలిసి పట్టణంలో శుక్రవారం ఉదయం ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ప్రాథమిక విద్య బలోపేతానికి కృషి సిద్దిపేటకమాన్: ప్రాథమిక విద్య బలోపేతమే తమ ప్రధాన లక్ష్యమని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సంఘం ప్రతినిధులు తెలిపారు. సిద్దిపేట ప్రెస్క్లబ్లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని కోరారు. కార్యక్రమంలో పలు మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ప్రజా సంక్షేమానికే ప్రాధాన్యం
డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి గజ్వేల్రూరల్: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి అన్నారు. మండల పరిధిలోని బెజుగామలో ఇందిరమ్మ ఇంటిని, గ్రామానికి వచ్చిన ఆర్టీసీ బస్సు సర్వీస్ను బుధవారం సర్పంచ్ గోపాల్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసేందుకు కృషి చేస్తామన్నారు. గజ్వేల్ అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డికి ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్లు నరేందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, వైస్చైర్మన్ సర్ధార్ఖాన్, పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాదగిరి, అశోక్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
గురువారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
ప్రైవేట్ కళాశాలల అడ్మిషన్ల దందా ఓ వైపు పదో తరగతి పరీక్షలు జరుగుతుండగానే కార్పొరేట్ జూనియర్ కళాశాలల అడ్మిషన్ల దందా ప్రారంభమైంది. హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో చేర్చుకునేందుకు టెన్త్ విద్యార్థులకు గాలం వేస్తున్నారు. ఇందు కోసం పీఆర్ఓలుగా ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రైవేట్ కళాశాల ఆధ్యాపకులను నియమించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు మెస్సేజ్లు, ఫోన్లు చేస్తూ మభ్యపెడుతుండటం గమనార్హం. – సాక్షి, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 15,337 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. ప్రతి ఏడాది ఉత్తీర్ణులైన వారిలో దాదాపు 40శాతం వరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కార్పొరేట్ కళాశాలల్లోనే అడ్మిషన్లు తీసుకుంటున్నారు. మిగతా 60శాతం మంది స్థానిక ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, పాలిటెక్నిక్లు, ఐటీఐలలో ప్రవేశాలు పొందుతున్నారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు కార్పొరేట్ విద్యాసంస్థల వైపు మొగ్గుచూపుతున్నారు. పీఆర్ఓల అవతారం.. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రైవేట్ ఇంటర్ కళాశాలల అధ్యాపకులు పీఆర్ఓల అవతారం ఎత్తుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒంటి పూట పాఠశాలలు ప్రారంభం కావడంతో మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో విద్యార్థుల ఇంటింటికీ వెళ్లి మా కళాశాలల్లోనే చేరాలంటూ తల్లిదండ్రులను మభ్యపెడుతున్నారు. మా కళాశాలలో చదువు బాగా చెబుతారని.. ఎంసెట్, ఐఐటీ, జేఈఈ మెయిన్స్, నీట్లలో మంచి ర్యాంక్లు వస్తున్నాయని ఉచిత సలహాలు ఇస్తున్నారు. కళాశాలలో తనకు తెలిసిన వారు ఉన్నారని, ఫీజులో డిస్కౌంట్ సైతం ఇస్తారని చెబుతుండటం గమనార్హం. -
విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు, మెస్సేజ్లు
ప్రైవేట్ కళాశాలల నుంచి విద్యార్థుల తల్లిదండ్రులకు నిత్యం ఫోన్లు, మెస్సేజ్ల మోతమోగుతున్నాయి. 20 రోజులుగా ఫోన్లు, మెసేజ్లు మరీ ఎక్కువయ్యాయి. ముందుగా అడ్మిషన్ తీసుకుంటే రాయితీ అంటూ ఆఫర్లు ఇస్తున్నారు. పాఠశాలల వారీగా విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకుని ఫీజులో రాయితీ ఇస్తామని అడ్మిషన్లు పొందేలా చేస్తున్నారు. గతేడాది ఇంటర్, జేఈఈ మెయిన్స్, ఎంసెట్, ఐఐటీ, నీట్లలో వచ్చిన ర్యాంక్లను చూపిస్తూ మందస్తుగా అడ్మిషన్ ఫీజు వసూలు చేస్తున్నారు. ఒక్కో విద్యార్థి కళాశాల ఫీజు, హాస్టల్తో కలిపి రూ.2 లక్షల నుంచి రూ.4లక్షలు చెబుతున్నట్లు తెలుస్తోంది. తమ ఫోన్ నంబర్లు ప్రైవేట్ కళాశాలల దగ్గరకు ఎలా వెళ్లాయని.. ఫోన్లు, మెస్సేజ్లతో భరించలేకపోతున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రైవేటు కళాశాలల అడ్మిషన్ల దందా యథేచ్ఛగా సాగుతున్నా ఇంటర్మీడియెట్ విద్యాశాఖ అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో పలు విమర్శలకు తావిస్తోంది. అధికారులు స్పందించి అడ్మిషన్ల దందాను ఆరికట్టాలని విద్యార్థి సంఘాల నేతలు కోరుతున్నారు.షెడ్యూల్ విడుదల కాలేదు 2026–27కు సంబంధించి అడ్మిషన్ల షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. ఆయా ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలకు చెందిన దళారులు చెప్పే మాయ మాటలను నమ్మి మోసపోవద్దు. అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత గుర్తింపు ఉన్న కళాశాలలోనే అడ్మిషన్లు తీసుకోవాలి. – రవీందర్ రెడ్డి, డీఐఈఓ, సిద్దిపేట -
తెలంగాణ చైతన్యానికి స్ఫూర్తి సిద్దిపేట
నందిని సిధారెడ్డిసిద్దిపేటఎడ్యుకేషన్: సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాల ఎంతో మంది గొప్ప వ్యక్తులను, ఉద్యమ నాయకులను, గాయకులను, కళాకారులను అందించిందని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నందిని సిధారెడ్డి అన్నారు. కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆన్లైన్ జాతీయ సదస్సు మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేటకు కాపురాజయ్య, వేముగంటి నరసింహాచార్యులు రెండు కళ్లలాంటి వారిని అందించి తెలంగాణ చైతన్యానికి సిద్దిపేట మూలకందంగా నిలిచి నేటి యువతకు ప్రేరణగా నిలిచిందన్నారు. యవతరం పరిశోధానసక్తిని పెంపొందిందుకుని జిల్లా కళలు, సంస్కృతి, చరిత్రను పరిరక్షించుకోవాలని కోరారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సునీత మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో విశేషమైన కృషి చేస్తూ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొంది సిధారెడ్డి సిద్దిపేటకు వన్నె తెచ్చారని కొనియాడారు. కేవీ రమణాచారి, దేశపతి శ్రీనివాస్ లాంటి ఎంతో మంది సాహితీవేత్తలు కళాశాల పూర్యవిద్యార్థులు అయినందుకు గర్విస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సదస్సు సంచాలకులు ప్రొఫెసర్ మట్టా సంపత్కుమార్రెడ్డి, నర్రా భగవాన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి దుబ్బాకరూరల్: అక్బర్పేటభూంపల్లి మండలం చిట్టాపూర్లో రేణుక ఎల్లమ్మ జమదగ్ని మునిరాజుల సిద్దోగ మహోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని వేడుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వెంకటయ్యను శాలువతో సన్మానించారు. అనంతసాగర్కు సాగు నీరు తీసుకువస్తా: ఎంపీ చిన్నకోడూరు(సిద్దిపేట): అభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం బీజేపీ పని చేస్తుందని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. మంగళవారం రాత్రి మండల పరిధిలోని అనంతసాగర్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా గ్రామాల అభివృద్దికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. రంగనాయక సాగర్ నుంచి చౌడారం వరకు ఉన్న కాలువ పనులు త్వరగా పూర్తి చేసి అనంతసాగర్కు సాగు నీరు వచ్చేలా కృషి చేస్తానన్నారు. సంబంధిత అధికారులతో అక్కడే ఫోన్లో మాట్లాడి కాలువ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా సర్వీస్ రోడ్డు ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. -
డ్యూటీ కోసం ముమ్మర సిఫార్సులు
బుధవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026● ఈఎల్స్తో పాటు గౌరవ వేతనం ఇస్తుండటంతో ఉపాధ్యాయుల మొగ్గు ● జిల్లాలో జనగణనకు 2,005 మంది ఎన్యూమరేటర్లు, 353 మంది సూపర్వైజర్లు సిద్దిపేట పట్టణంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి దుబ్బాక పట్టణంలో ఎన్యూమరేటర్ డ్యూటీ కోసం డీఈఓకు ఓ నియోజకవర్గ ప్రజాప్రతినిధి సిఫార్సు చేసినట్లు సమాచారం. ఇలా ఒక్కరు కాదు.. అర్హత లేని వారు సైతం పైరవీ చేసుకుని ఎన్యూమరేటర్ డ్యూటీని వేయించుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో జిల్లాలో జనగణన వేళ పైరవీల గోల నెలకొనడం గమనార్హం. –సాక్షి, సిద్దిపేట జన గణనలో ఎన్యూమరేటర్లకు గౌరవ వేతనంతో పాటు దాదాపు నెల రోజులు ఈఎల్స్ ఇస్తుండటంతో ఎక్కువ మంది ఉపాధ్యాయులు మొగ్గు చూపుతున్నారు. ఈ డ్యూటీల కోసం ఉపాధ్యాయులు జోరుగా పైరవీలు చేయించుకుంటున్నారు. జన గణన–2027 కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగా మే నెలలో ఇళ్ల గుర్తింపు, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జనాభా లెక్కలు జరగనున్నాయి. అందులో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు కీలక పాత్ర పొషించనున్నారు. 2,005 మంది ఎన్యూమరేటర్లు, 353 మందిని సూపర్వైజర్లుగా ఉపాధ్యాయులను నియమిస్తున్నారు. ఏ మండలంలో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులకు అదే మండలంలో ఎన్యూమరేటర్లుగా నియమించాలి. ఆ బాధ్యతలను స్థానిక ఎంఈఓలకు అప్పగించారు. గతంలో ఎన్నికల విధులు, పదో తరగతి పేపర్ వాల్యూవేషన్, ఇతర కార్యక్రమాల్లోని పాల్గొని, సీనియారిటీ ఆధారంగా నియమించాలని విద్యాశాఖ ఆదేశించింది. పలు చోట్ల ఎంఈఓలు పైరవీలకే ప్రాధాన్యం వేస్తున్నారు. ఎన్యూమరేటర్ల నియామకాల్లో ఎంఈఓలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఎస్జీటీలను ఎన్యూమరేటర్లు, స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎంలను సూపర్వైజర్లును నియమించాలి. కానీ కొన్ని చోట్ల స్కూల్ అసిస్టెంట్లను ఎన్యూమరేటర్లుగా నియమించారని తెలుస్తోంది. త్వరలో శిక్షణ వేసవి సెలవుల్లో విధులు నిర్వహించినందుకు ఉపాధ్యాయులకు గౌరవ వేతనంతో పాటు సంపాదిత సెలవులు(ఈఎల్) వారి వేతనంలో జమ అవుతాయి. దాదాపు నెల రోజుల ఈఎల్లు వేతనానికి జోడించడంతో ప్రయోజనం కలగనుంది. దీంతో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల డ్యూటీ కోసం ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు మక్కువ చూపారు. జాబితాలను తయారు చేసి మండలాల్లో అయితే తహసీల్దార్లకు, పట్టణాలల్లో మున్సిపల్ కమిషనర్లకు ఎంఈఓలు అందించారు. త్వరలో వీరికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సిద్ధం చేసిన జాబితాను మరోసారి పరిశీలించాలని పలువురు ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఎలాంటి పైరవీలకు తావు ఇవ్వకుండా నిష్పక్షపాతంగానే ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల ఎంపిక జరిగిందని మాస్టర్ ట్రైనర్ రామస్వామి తెలిపారు. -
అర్బన్ పార్కుకు నిప్పు
అర్బన్పార్కులో ఎగసిపడుతున్న మంటలు గజ్వేల్రూరల్: అర్బన్పార్కులో అగ్నిప్రమాదం జరిగి సుమారు 10 ఎకరాల్లో మంటలు అంటుకున్నాయి. ఈ ఘటన గజ్వేల్ పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. అటవీశాఖ, అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సంగాపూర్ శివారులో అటవీ ప్రాంతం 292 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ అటవీ ప్రాంతంలో ఉన్న అర్బన్పార్కు(కల్పకవనం) వెనుకభాగంలో ప్రమాదవశాత్తు ఎండుగడ్డి అంటుకొని మంటలు వ్యాపించడాన్ని గుర్తించిన సిబ్బంది స్థానిక అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. స్థానిక అగ్నిమాపక అధికారి శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది చంద్రారెడ్డి, వెంకటేష్, సతీష్, కనకరాజు, నాగరాజు, రవికుమార్ల బృందం ప్రమాదస్థలికి చేరుకొని ఫైర్ ఇంజన్ సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చిన మిరుగుల కారణంగా మంటలు అంటుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. -
ఎంపీకి సమస్యలపై వినతి
మద్దూరు(హుస్నాబాద్): దూల్మిట్ట మండల కేంద్రంలోని సమస్యలపై ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డికి స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు విన్నవించారు. రోడ్డు విస్తరణ, రోడ్డు డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులు నిధులు లేక ఆగిపోవడంతో మాజీ జెడ్పీటీసీ గిరికొండల్ రెడ్డి, సర్పంచ్ లీల తదితరులు నగరంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. గ్రామంలో చాలా పనులు నిధులు లేక ఆగిపోయాయని, నిధులు మంజూరు చేసి గ్రామాభివృద్ధికి సహకరించాలని వారు కోరారు. అభివృద్ధికి సహకరిస్తాని ఎంపీ హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. చక్కటి ఆహారంతోనే ఆరోగ్యం సిద్దిపేటకమాన్: ప్రతి ఒక్కరూ చక్కటి ఆహార నియమాలు పాటిస్తూ వ్యాయామం చేయాలని ప్రభుత్వాస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ చందర్, సీఎస్ఆర్ఎంఓ డాక్టర్ జ్యోతి అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్, ఆర్ఎంఓ డాక్టర్ శ్రావణితో కలిసి వైద్యాధికారులు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యమని.. ఆరోగ్యానికి మించిన సంపద లేదని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటేనే అన్ని పనులు చేయగలుగుతారని తెలిపారు. మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలని సూచించారు. ప్రతి మూడు, నాలుగు నెలలకోసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అదేవిదంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వాసుపత్రిలో లీగల్ అవేర్నెస్ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఆర్ఎంఓ వైద్యులు శ్రావణి ముదిరాజ్, సదానందం, న్యాయసేవా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు ప్రశాంత్నగర్(సిద్దిపేట): నిరుద్యోగ మైనారిటీ యువత విదేశీ ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అఽధికారి నాగరాజమ్మ మంగళవారం పేర్కొన్నారు. రాష్ట్ర మైనారిటీ ఆర్థిక సంస్థ, శిక్షణ, ఉపాధి కార్యక్రమంలో భాగంగా మైనారిటీ నిరుద్యోగ యువతకు విదేశాలలో వివిధ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియా, ఒమన్, జర్మనీ, ఖతర్, గ్రీస్లలో పురుషులకు, మహిళలకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు జిల్లా మైనార్టీ సంక్షేమఽశాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. మందుబాబులకు జరిమానాసిద్దిపేటకమాన్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనదారులకు సిద్దిపేట కోర్టు జరిమానా విధించింది. సిద్దిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో సిబ్బందితో కలిసి నిర్వహించిన వాహన తనిఖీల్లో 17మంది పట్టుబడ్డారు. వారిని కోర్టులో హాజరుపర్చగా విచారణ జరిపిన న్యాయమూర్తి వారికి రూ.1,68,000 జరిమానా విధించినట్లు సీఐ తెలిపారు. ఘనంగా రాజయ్య జయంతి సిద్దిపేటజోన్: అంతర్జాతీయ చిత్రకారుడు కాపు రాజయ్య జయంతి మంగళవారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజయ్య సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కవులు రాజమౌళి, రాజేశం, రాజయ్య, సురేందర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
రెండు పీహెచ్సీలు, ‘ఆరోగ్య కేంద్రా’లకు అవార్డులు
వైద్యాధికారులను, సిబ్బందిని అభినందించిన డీఎంహెచ్ఓసిద్దిపేటకమాన్: వైద్యారోగ్యశాఖ పరిధిలో ఉత్తమ సేవలందించిన జిల్లాలోని రెండు పీహెచ్సీలు, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలకు రాష్ట్ర స్థాయి అవార్డులు వచ్చినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. జిల్లాలోని ఇందుప్రియాల్, రాయపోల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, చేర్యాల మండలంలోని పోతిరెడ్డిపల్లి, రాయపోల్ మండలం లింగారెడ్డిపల్లి, బెజ్జంకి ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు రాష్ట్ర స్థాయి అవార్డులకు ఎంపికై నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర వైద్యరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా ఉత్తమ ప్రతిభ అవార్డులు అందుకున్నట్లు డీఎంహెచ్ఓ తెలిపారు. వైద్యాధికారులు, ఎంఎల్హెచ్పీలు, ఏఎన్ఏంలకు అభినందనలు తెలిపారు. ఇతర ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు కూడా ప్రజలకు మెరుగైన సేవలు అందించి రాష్ట్ర స్థాయిలో ముందుండాలని తెలిపారు. దుబ్బాక ఏరియా ఆస్పత్రికి.. దుబ్బాక: ఉత్తమ వైద్యసేవల్లో దుబ్బాక ఆస్పత్రికి ఒకేసారి రాష్ట్రస్థాయిలో మూడు ఉత్తమ అవార్డులు వరించాయి. దుబ్బాక ఆస్పత్రి ఎన్క్వాస్, కాయకల్ప, ముస్కాన్ అవార్డులు దక్కాయి. మంగళవారం హైదరాబాద్లో మంత్రి దామోదర చేతుల మీదుగా ఆస్పత్రి సూపరింటెండెంట్ హేమరాజ్సింగ్ అవార్డులు అందుకున్నారు. -
దద్దరిల్లిన గజ్వేల్
మంగళవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026● బీఆర్ఎస్ బంద్.. హోరెత్తిన ధర్నాలు, ర్యాలీలు ● ఉద్రిక్తతల నేపథ్యంలో రంగంలోకి పోలీస్ బలగాలు గజ్వేల్:బీఆర్ఎస్ బంద్ నేపథ్యంలో సోమవారం గజ్వేల్ పట్టణం దద్దరిల్లింది. పోలీసు బలగాలు భారీగా రంగంలోకి దిగా యి. మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి చేయడమేకాకుండా అక్రమంగా సీఎం రేవంత్రెడ్డి ఫొటో పెట్టారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. పార్టీ గజ్వేల్ నియోజవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ చందన, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం మాజీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవీ రవీందర్, నాయకులు తదితరులు ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ బస్టాండ్ వద్దకు ఉదయమే చేరుకొన్నారు. బస్సుల రాకపోకలను అడ్డుకునేందుకు గేటు ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు అక్కడికి చేరుకొని చాలాసేపటి తర్వాత వారిని అక్కడినుంచి పంపించారు. ఆ తర్వాత ప్రజ్ఞాపూర్ చౌరస్తా కొద్దిసేపు నిరసన తెలిపి అక్కడి నుంచి గజ్వేల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు ఎదురుపడటంతో.. పట్టణంలో ఇందిరాపార్కు చౌరస్తా నుంచి కేసీఆర్ క్యాంపు కార్యాలయం వరకు బీఆర్ఎస్ నాయకులు ర్యాలీగా బయలుదేరారు. ఇదే క్రమంలో డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి రోడ్డుపైకి నాయకులు, కార్యకర్తలతో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు ఆమెను ఇక్కడికి రావొద్దంటూ వారించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు సైతం అక్కడికి చేరుకొని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బంద్ పిలుపు నేపథ్యంలో కాంగ్రెస్ నేతలను రోడ్లపైకి ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు భారీ సంఖ్యలో ర్యాలీగా పోలీస్స్టేషన్ వైపు దూసుకువచ్చారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డిని, కాంగ్రెస్ నాయకులను పక్కనే ఉన్న వారి ఇంటి వద్దకు పంపించారు. అయినా బీఆర్ఎస్ కార్యకర్తలు తగ్గలేదు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఆంక్షారెడ్డి ఇంటివైపు దూసుకెళ్లకుండా అడ్డంగా భారీకేడ్లను ఏర్పాటు చేశారు. బంద్ సందర్భంగా పట్టణంలో పలు వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఆంక్షారెడ్డిని అడ్డుకుంటున్న పోలీసులుపోలీసులతో బీఆర్ఎస్ నేతల వాగ్వాదం అర్జీలు సత్వరం పరిష్కరించండి సిద్దిపేటరూరల్: ప్రజావాణిలో స్వీకరించిన అర్జీలను సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్తో కలిసి కలెక్టర్ అర్జీలను స్వీరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో ప్రజావాణికి వస్తున్న క్రమంలో అధికారులు వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. పలు రకాల సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తంగా 216 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో డీఆర్ఓ నాగరాజమ్మ, అధికారులు పాల్గొన్నారు.న్యాయవాదుల సంక్షేమానికి కృషి రాష్ట్రబార్ కౌన్సిల్ సభ్యుడు కిరణ్కుమార్ సిద్దిపేటకమాన్/దుబ్బాక: న్యాయవాదుల సంక్షేమానికి కృషిచేస్తానని రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు కిరణ్కుమార్ అన్నారు. సోమవారం సిద్దిపేట కోర్టులో, దుబ్బాక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికైన కిరణ్కుమార్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేటలో నూతన కోర్టు భవన నిర్మాణానికి సంబంధించి అవసరమైన చర్యలను వేగవంతం చేసేలా చర్యలు చేపడతమన్నారు. అలాగే దుబ్బాకలో కోర్టు నూతన భవనం నిర్మాణం కోసం కృషిచేస్తానన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట, దుబ్బాక బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యలపై కేసీఆర్ దృష్టిసారించాలి
గజ్వేల్: మాజీ సీఎం కేసీఆర్ ఇప్పటికైనా గజ్వేల్లోని తన క్యాంపు కార్యాలయానికి వచ్చి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి నాయిని యాదగిరి డిమాండ్ చేశారు. సోమవారం గజ్వేల్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ అందుబాటులో ఉండకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. అందువల్లే తాము ప్రజల పక్షాన పోరాటం చేయాల్సి వస్తుందని చెప్పారు. క్యాంపు కార్యాలయానికి వెళ్ళి తాము సీఎం రేవంత్రెడ్డి ఫొటో పెట్టడంపై బీఆర్ఎస్ నేతలు కావాలనే రాద్దాంతం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికై నా ప్రజలను రెచ్చగొట్టడం మానుకోవాలని హెచ్చరించారు. సమావేశంలో కాంగ్రెస్ నేతలు సమీర్, గుంటుకు శ్రీను పాల్గొన్నారు. -
సామాజిక సంస్కర్త బాబు జగ్జీవన్రామ్
కలెక్టర్ హైమావతిప్రశాంత్నగర్(సిద్దిపేట): సామాజిక న్యాయ సాధనకు కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ అని కలెక్టర్ హైమావతి అన్నారు. జగ్జీవన్రామ్ జయంతి ఉత్సవాలను ఆదివారం జిల్లా కేంద్రంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. జగ్జీవన్రామ్ విగ్రహానికి కలెక్టర్ వివిధ అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ కుల సంఘాల, ఉపాధ్యాయ, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బీజేఆర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. బాబు జగ్జీవన్ రామ్ దేశ రాజకీయాల్లో సుదీర్ఘ కాలం విశిష్ట సేవలు అందించారన్నారు. ఒక నాయకుడు ఉన్నత స్థాయికి ఎదగాలంటే అనేక సవాళ్లను ఎదుర్కొని, సమస్యలను అధిగమించే ధైర్యం అవసరమన్నారు. మహనీయుల ఆశయాలు, కృషిని ఆదర్శంగా తీసుకొని సమాజంలో వివక్ష లేకుండా ప్రతి ఒక్కరూ ఉన్నత వ్యక్తిత్వంతో ఎదగాలని ఆకాంక్షించారన్నారు. మహిళల సాధికారత, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, మెరుగైన వసతులు అందించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. పిల్లల మానసిక, శారీరక అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్ఓ నాగరాజమ్మ, ఆర్డీవో సదానందం, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి హమీ ద్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
అవధాన ప్రక్రియ గొప్పది
ప్రశాంత్నగర్(సిద్దిపేట): తెలుగు సాహిత్యంలో అవధాన ప్రక్రియ గొప్పదని కవి, పండితులు ఆచార్య దోర్బల ప్రభాకరశర్మ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని లలితా చంద్రమౌలీశ్వర క్షేత్రంలో సందీప్ శర్మ చే శతావధానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయిన ఆచార్య దోర్బల ప్రభాకరశర్మ మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో ధారణశక్తితో అవధానం అజరామరమన్నారు. సందీప్ శర్మ పృచ్ఛకులు అడిగిన పశ్నలకు అలవోకగా పద్యాలను అందించి, ధారణ చేశారు. కార్యక్రమంలో క్షేత్ర నిర్వాహకులు పండరి రాధాకృష్ణ, ఉండ్రాళ్ళ రాజేశం, కాల్వ రాజయ్య, బోగయగారి చంద్రశేఖరశర్మ, మురళీధరశర్మ, అశోక్, రాజశేఖరశర్మ, విట్టుబాబు, శ్రీదేవి, శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
చిల్లర చేష్టలు సహించం
● చర్యకు ప్రతి చర్యకు తప్పదు ● మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి గజ్వేల్: స్వరాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ క్యాంపు కార్యాలయంపైనే కాంగ్రెస్ నేతలు దాడులకు తెగబడటం సహించరానిదని, ఇప్పటికై నా చిల్లర చేష్టలను మానుకోకపోతే చర్యకు ప్రతి చర్య తప్పదని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి హెచ్చరించారు. ఆదివారం గజ్వేల్లో ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ వైఫల్యాల వల్ల రాష్ట్ర ప్రజలు కేసీఆర్ను తిరిగి సీఎం కావాలని కోరుకుంటున్నారన్నారు. ఇది మింగుడు పడక కాంగ్రెస్ నేతలు ఇష్టానుసారంగా గూండాయిజం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. వంటేరు ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ ఎంపీగా రాహుల్గాంధీ తన కార్యాలయంలో ప్రధాని నరేంద్రమోదీ ఫొటోను పెట్టుకోగలరా? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా గజ్వేల్లో సోమవారం తలపెట్టిన బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, ఎంపీటీసీల ఫోరం మాజీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవీ రవీందర్, మాజీ జెడ్పీటీసీ మల్లేశం, బీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు నవాజ్మీరా, మండల శాఖ అధ్యక్షుడు బెండె మధు, నాయకులు ఊడెం కృష్ణారెడ్డి, నూనె కుమార్, రాంచంద్రం, పాండుగౌడ్, ఆహ్మద్, స్వామిచారి తదితరులు పాల్గొన్నారు. -
మల్లన్న ఆలయంలో భక్తుల సందడి
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం భక్తులరాకతో సందడి నెలకొంది. ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. శనివారమే క్షేత్రానికి చేరుకున్న భక్తులు వేకువజామున నిద్ర లేచి పుష్కరిణిలో స్నానమాచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. కొంత మంది భక్తులు గంగరేణి చెట్టు వద్ద పట్నాలు వేసి, ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను ఆలయ అధికారులు పర్యవేక్షించారు. స్వామివారిని దర్శించుకున్న సైబరాబాద్ ఏసీపీ కొమురవెల్లి మల్లన్నను సైబరాబాద్ ఏసీపీ శ్రీనివాస్రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాన్ని అందించారు. -
లక్ష్మీనర్సింహుడి సన్నిధిలో న్యాయమూర్తులు
బెజ్జంకి(సిద్దిపేట): లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి, అదనపు జడ్జి జయప్రసాద్ కుటుంబసభ్యులు ఆదివారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ ప్రభాకర్, పూజారి మధుసూదనాచారి వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఉత్తమ అర్చకుడిగా భానుమూర్తి హుస్నాబాద్: జిల్లా ఉత్తమ అర్చకుడిగా హుస్నాబాద్ అయ్యప్ప స్వామి దేవాలయ ప్రధాన అర్చకుడు పోలోజు భానుమూర్తి ఎంపికయ్యారు. రాష్ట్ర అయ్యప్ప సేవార్తి ఐక్య వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్లోని బేగంపేటలో పుష్పగిరి పీఠం ఆశ్రమంలో అయ్యప్ప స్వామి అర్చకుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జగద్గురు విద్యారణ్య భారతీ స్వామి చేతుల మీదుగా హుస్నాబాద్ అర్చకుడు భానుమూర్తి ప్రశంసా పత్రాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో హుస్నాబాద్ అయ్యప్ప స్వామి దేవాలయ అధ్యక్షుడు వెంకట్ పాల్గొన్నారు. సీబీఎస్ఈ సిలబస్లో పాపన్న చరిత్ర చేర్చండి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు వినతి చిన్నకోడూరు(సిద్దిపేట): బహుజన ఆత్మగౌరవ ప్రతీక సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను సీబీఎస్ఈ సిలబస్లో చేర్చాలని జైగౌడ ఉద్యమం జిల్లా అధ్యక్షుడు గంధం హరిగౌడ్ కోరారు. ఈ మేరకు ఆదివారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు వినతి పత్రం అందజేశారు. జై గౌడ ఉద్యమ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ గౌడ్తదితరులతో కలిసి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. పాపన్న గౌడ్ చరిత్ర, ప్రాధాన్యతను వివరించినట్లు తెలిపారు. పాపన్న గౌడ్ నిర్మించిన చారిత్రక కోటలను కేంద్ర పర్యాటక శాఖ ఆధీనంలోకి తీసుకోవాలని కోరారు. పద్మశాలీల అభ్యున్నతికి కృషినంగునూరు(సిద్దిపేట): రాజకీయంగా ఎంతో వెనుకబడిన పద్మశాలీల అభ్యున్నతికి కృషి చేస్తామని నంగునూరు ఏఎంసీ వైస్ చైర్మన్ సాదుల పవన్కుమార్ అన్నారు. ఆదివారం పద్మశాలీ సమాజం ఆధ్వర్యంలో పవన్, పంచాయతీ కార్యదర్శి సూరం నితీష్కుమార్లను సన్మానించి మెమెంటో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మశాలీలు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డారని, నిరుపేదలకు తన వంతుగా సహాయ, సహకారాలు అందజేస్తామన్నారు. -
తీరనున్న సాగునీటి కొరత
చిన్నకోడూరు(సిద్దిపేట): గోదావరి జలాల పరవళ్లతో యాసంగి పంటలకు సాగు నీటి కొరత తీరనుంది. జలసిరితో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. యాసంగి సీజన్ కోసం అనంతగిరి రిజర్వాయర్ నుంచి గోదావరి నీళ్లు రంగనాయక సాగర్లోకి పంపింగ్ను ఆదివారం ఇరిగేషన్ అధికారులు ప్రారంభించారు. దీంతో యాసంగిలో సాగు నీటి ఇబ్బంది తీరనున్నదని అన్నదాతలు సంబురపడుతున్నారు. రంగనాయక సాగర్లో 1 టీఎంసీ నీరు ఉండటంతో యాసంగి పూర్తయ్యే వరకు నీటిని అందజేయాలని మాజీ మంత్రి హరీశ్రావు ఇటీవల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డికి లేఖ రాసిన విషయం విదితమే. స్పందించిన అధికారులు ‘సాగర్’లోకి నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు రంగనాయకసాగర్లో 1 టీఎంసీ మాత్రమే నీరు ఉందని, మరో టీఎంసీ నీటిని నింపడానికి అధికారులు సిద్ధమయ్యారు. పెరగనున్న భూగర్భజలాలు చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ శివారులోని రంగనాయక సాగర్ జలాశయం.. అన్నదాతల వెతలు తీర్చేందుకు ఎంతగానో దోహదపడుతోంది. కుడి, ఎడమ కాలువల ద్వారా చెరువులు, కుంటలకు తద్వారా పంట పొలాలకు నీరందిస్తున్నారు. రంగనాయక సాగర్ కింద 1.10 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. ఎడమ కాలువ 21.5 కిలోమీటర్లు, కుడి కాలువ 23.8 కిలోమీటర్ల వరకు నీటిని సరఫరా చేస్తున్నారు. కుడి కాలువ ద్వారా సిద్దిపేట అర్బన్, నంగునూరు, చేర్యాల, మద్దూరు మండలాలకు, ఎడమ కాలువ ద్వారా చిన్నకోడూరు, సిద్దిపేట రూరల్, నారాయణరావుపేట, సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాలకు నీటిని అందిస్తున్నారు. భూగర్భ జలాలు పెరగడంతో సాగుకు ఊతమిస్తోంది. వరి సాగు చేస్తున్న రైతులకు ప్రాజెక్టు దన్నుగా నిలుస్తోంది.రంగనాయక సాగర్లోకి గోదావరి జలాలు రైతుల్లో హర్షాతిరేకాలు రంగనాయక సాగర్ కింద 1.10 లక్ష ఎకరాల్లో సాగు -
క్యాంపు సొంత ఆస్తా?
● ప్రభుత్వ భవనం కనుకే సీఎం ఫొటో పెట్టాం ● డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి గజ్వేల్: ప్రభుత్వ భవనాల్లో సీఎం రేవంత్రెడ్డి ఫొటో ఉండాలనే లక్ష్యంగా తాము కూడా గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెట్టామని డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం గజ్వేల్లో టీపీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి, మార్కెట్ కమిటీల చైర్మన్లు నరేందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డిలతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ క్యాంపు కార్యాలయాన్ని బీఆర్ఎస్ భవన్గా సొంత ఆస్తిలాగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యపద్ధతిలో, శాంతియుతంగా సీఎం ఫొటోను తాము క్యాంపు కార్యాలయంలో పెట్టామన్నారు. ఈ సందర్భంగా తాము ఎలాంటి దాడులు, విధ్వంసాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. క్యాంపు కార్యాలయం నిర్మించి ఏడేళ్లు దాటుతున్నా.. కేసీఆర్ ఇప్పటివరకు అడుగుపెట్టిన దాఖలాలు లేవన్నారు. ఇప్పటికై నా క్యాంపు కార్యాలయానికి ప్రజా సమస్యల పరిష్కారానికి వినియోగించాలని డిమాండ్ చేశారు. వంటేరుపై పోలీసులకు ఫిర్యాదు కేసీఆర్ క్యాంపు కార్యాలయంలో సీఎం ఫొటోను తొలగించిన వంటేరు ప్రతాప్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు స్థానిక ఇన్స్పెక్టర్ రవికుమార్కు ఫిర్యాదు అందజేశారు. కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్ధార్ఖాన్, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు రవీందర్రెడ్డి, సుఖేందర్రెడ్డి, కనకయ్యగౌడ్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఆశోక్రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
మైనర్ బాలిక ఆత్మహత్య.. రెండవ భర్తపై ఫిర్యాదు చేసిన తల్లి
సాక్షి, సిద్ధిపేట: సిద్ధిపేట జిల్లా దుబ్బాకలోని రెండు పడకల గృహ సముదాయంలో దుర్ఘటన చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో ప్రాంతంలో విషాదం నెలకొంది. జరిగిన ఘటనపై బాలిక తల్లి నిర్మల తన రెండవ భర్త అశోక్పై అనుమానం వ్యక్తం చేసింది. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానికులు ఈ సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే బాలిక ప్రాణాలు తీసుకోవడం సమాజాన్ని కలచివేసింది. పోలీసులు పూర్తి వివరాలు సేకరించి, బాలిక ఆత్మహత్యకు గల కారణాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. -
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
కాంగ్రెస్ గూండాయిజాన్ని సహించందుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి గజ్వేల్: గజ్వేల్లో మాజీ సీఎం కేసీఆర్ కార్యాలయంపై కాంగ్రెస్ నేతలు గూండాయిజం ప్రదర్శించడం సహించరానిదని దుబ్బాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి ఖండించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి మచ్చతెచ్చే విధంగా కాంగ్రెస్ నాయకులు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను సాధించిన కేసీఆర్ కార్యాలయంపైనే దాడి జరగడం ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేయడమేనన్నారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలపై దౌర్జన్యాలకు పాల్పడడం పరిపాటిగా మారిందని మండిపడ్డారు. 24గంటల్లో గజ్వేల్ ఘటనకు బాధ్యులైన నిందితులపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.గజ్వేల్: పట్టణంలోని కేసీఆర్ క్యాంపు కార్యాలయం కేంద్రంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య పోటాపోటీగా సాగుతున్న రాజకీయాలు తరచూ ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. తాజాగా డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి నేతృత్వంలో మార్కెట్ కమిటీల చైర్మన్లు నరేందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్లు సర్ధార్ఖాన్, ప్రభాకర్గుప్తా తదితరులు శనివారం క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. దీంతో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. పట్టణంలోని ప్రధాన రహదారి గుండా ర్యాలీగా వెళ్లిన కాంగ్రెస్ నేతలు.. క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఒక్కసారిగా లోపలికి దూసుకెళ్లారు. వారి వెంట తెచ్చుకున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చిత్రపటాన్ని సమావేశ మందిరంలో మొలలు కొట్టి గోడకు బిగించారు. ఈ సందర్భంగా కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గజ్వేల్ ప్రజలను పట్టించుకోని కేసీఆర్కు పదవిలో కొనసాగే అర్హత లేదంటూ ఆంక్షారెడ్డి మండిపడ్డారు. పోలీసులు చేరుకొని కాంగ్రెస్ కార్యకర్తలను అక్కడి నుంచి పంపించారు. ముట్టడి సందర్భంగా కేసీఆర్ క్యాంపు కార్యాలయం ప్రధాన ద్వారం అద్ధాలు పగిలిపోయాయి. బీఆర్ఎస్ నేతల ఆగ్రహం,.. నిరసన కేసీఆర్ క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నం సీఎం ఫొటో పెట్టిన అధికార పార్టీ నేతలు అనంతరం తొలగించిన బీఆర్ఎస్ నాయకులు పోటాపోటీగా ర్యాలీలు.. ఉద్రిక్తత 6న గజ్వేల్ బంద్కు బీఆర్ఎస్ పిలుపు దాడులు, విధ్వంసం జరగలేదుమాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గజ్వేల్: కేసీఆర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఘటనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని, ప్రభుత్వ ఆస్తిగా ఉన్న ఆ కార్యాలయంలో సీఎం చిత్రపటాన్ని ఏర్పాటు చేయడానికి మాత్రమే కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లారని మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గౌరవంగా వెళ్లి సీఎం చిత్రపటాన్ని పెట్టి వచ్చారే తప్ప అక్కడ ఎలాంటి దాడులు, విధ్వంసం జరగలేదని స్పష్టం చేశారు. ఈ సంఘటనను కొందరు వక్రీకరించి దాడిగా ప్రచారం చేస్తున్నారని వాపోయారు. ఇది పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. -
భూ సమస్యలకు చెక్..!
భూ సమస్యలకు ఇక శాశ్వత పరిష్కారం లభించనుంది. భూ భారతి కింద భూముల సర్వే నిర్వహిస్తోంది. వ్యక్తులకు ఆధార్ కార్డు మాదిరిగానే భూ ఆధార్ నంబర్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లాలో 23 గ్రామాలను పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. ఈ గ్రామాల్లో రీ– సర్వేను ప్రారంభించారు. లైసెన్స్డ్ సర్వేయర్లతో భూముల సర్వే నిర్వహించి ప్రతి భూ కమతానికి హద్దులుగుర్తించనున్నారు. – సాక్షి, సిద్దిపేట జిల్లాలో అనేక గ్రామాల్లో సరిహద్దు వివాదాలు ఉన్నాయి. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి సగానికి పైగా భూ సమస్యల వినతులే వస్తున్నాయి. వీటిని పరిష్కరించేందుకు ఇప్పటి వరకు సర్వేయర్ల కొరత ఉండేది. ఇటీవల జిల్లాల వారీగా సర్వేయర్లను కేటాయించడంతో ప్రయోగాత్మకంగా కొన్ని గ్రామాలను ఎంపిక చేసి భూ ఆధార్ కార్డులు జారీ చేయనున్నారు. జిల్లాలో 23 గ్రామాల్లో 5వేల సర్వే నంబర్లు 61,365 ఎకరాల భూమిని రీ–సర్వేను ఇటీవల ప్రారంభించారు. డీజీపీఎస్ (డిఫరెన్షియల్ గ్లోబల్ పొజీషనింగ్ సిస్టం) ద్వారా సర్వే జరిపి ఆ వివరాలను భూ భారతి పోర్టల్లో అప్లోడ్ చేయనున్నారు. దశాబ్దాలుగా ఉన్న భూ సమస్యలు సైతం పరిష్కారం కానున్నాయి. పకడ్బందీగా రీ సర్వే రీ సర్వే నిర్వహించే గ్రామాల్లో ముందుగా గ్రామ కంఠం, ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, కాలువలు, అటవీ భూములతో పాటు పట్టా భూములకు సంబంధించిన ప్రాథమిక సమాచారం సేకరిస్తారు. అనంతరం సంబంఽధిత భూ యజమానులందరికీ సర్వేకు సంబంఽధించిన నోటీసులు పంపుతారు. నోటీసులు అందిన తర్వాత వివిధ విభాగాల నుంచి వచ్చే అభ్యంతరాలను సేకరించి, వాటిని పరిష్కరించిన తర్వాతే అసలు సర్వేను ప్రారంభించనున్నారు. ఒక సర్వే నంబరు ప్రాతిపదికగా తీసుకొని, అందులో మొత్తం ఎంత భూమి ఉంది. అది ప్రస్తుతం ఎవరెవరి పేర్లపై ఉందనే వివరాలను బై నంబర్లతో సేకరిస్తారు. అత్యాధునిక టెక్నాలజీతో.. భూముల సరిహద్దులను పక్కాగా నిర్ణయించేందుకు డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(డీజీపీఎస్) రోవర్ మిషన్లను ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా ల్యాండ్ పార్సిల్ మ్యాప్లను (ఎల్పీఎం) రూపొందిస్తున్నారు. ఒకే సర్వే నంబర్లో ఉన్న గందరగోళ బై నంబర్లను తొలగించి, ప్రతి భూ యజమానికి ఆధార్కార్డు తరహాలోనే ఒక ప్రత్యేక భూ ఆధార్ నంబరును కేటయించనున్నారు. దీని వల్ల ప్రతి అంగుళం భూమికి స్పష్టమైన గుర్తింపు లభిస్తుంది. క్షేత్రస్థాయిలో భూమికి, రికార్డులోని సమాచారానికి సరిపోలితేనే భూ భారతి పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేస్తారు. భవిష్యత్లో ఆ భూమి సర్వే నంబర్, విస్తీర్ణం మార్చడం లాంటివాటికి ఆస్కారమే ఉండదు. పకడ్బందీగా భూముల వ్యవస్థను తీర్చిదిద్దేందుకు రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఆయా గ్రామాల్లో సర్వేలు కొనసాగుతున్నాయని సర్వే అండ్ ల్యాండ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.రీ సర్వే చేసే గ్రామాలివే.. సిద్దిపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని గంగాపూర్( చిన్నకోడూరు),రంగంపేట్ (దౌల్తాబాద్),దుబ్బాక, రాజక్కపేట, తిమ్మాపూర్(దుబ్బాక), ఇర్కోడ్, రాఘవాపూర్, పుల్లూరు (సిద్దిపేట రూరల్), మురదాబాద్(నంగునూరు) గ్రామాలున్నాయి. గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో గొల్లపల్లి, తీగూల్ నర్సాపూర్(జగదేవ్పూర్), చేబర్తి (మర్కూక్), లక్ష్మక్కపల్లి, శ్రీరాంపూర్, చీలాసాగరం, కోట్యాల్ ( ములుగు), చిన్నమాసాన్పల్లి(రాయపోల్), హుస్నాబాద్ పరిధిలో శ్రీరాములపల్లి, శనిగరం, కోహెడ(కోహెడ), కేశవపూర్, మల్లంపల్లి(అక్కన్నపేట) గ్రామాలను రీ సర్వే చేయనున్నారు. భూ భారతిలో రీ సర్వేకు 23 గ్రామాల ఎంపిక 5వేల సర్వేనంబర్లు, 61వేల ఎకరాల్లో రీ– సర్వే భూములకూ ఆధార్ నంబర్లు -
కేదార్నాథ్ యాత్ర కరపత్రాల ఆవిష్కరణ
సిద్దిపేటజోన్: ఈనెల 22న కేదార్నాథ్ యాత్ర ప్రారంభం నేపథ్యంలో యాత్రకు సంబంధించిన కరపత్రాలను ఎమ్మెల్యే హరీశ్రావు ఆవిష్కరించారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో కేదార్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మానవ సేవ మాధవ సేవగా అభివర్ణించారు. కేదార్నాథ్ యాత్రికులకు అన్న ప్రసాదం అందించడానికి ఈనెల 14న సాయంత్రం 4గంటలకు ఆహార పదార్థాలతో కూడిన వాహనాలను ప్రారంభించాలని సమితి నిర్వాహకులు ఎమ్మెల్యేను కోరారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రతినిధులు, రత్నాకర్, మధుసూదన్, నవీన్, కాశీనాథ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అటవీ సంపదతో ఆర్థిక లబ్ధి ములుగు అటవీ కళాశాల విద్యార్థి విశేష పరిశోధన ములుగు(గజ్వేల్): అటవీ సంపద కేవలం కలపకే పరిమితం కాదని, అది సమాజానికి పరోక్ష ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుందని ములుగు అటవీ కళాశాల పరిశోధక విద్యార్థి రావుల రోహిత్ నిరూపించారు. అటవీశాస్త్రంలో (సిల్వి కల్చర్, అగ్రో ఫారెస్ట్రీ) ఆయన చేసిన విశేష పరిశోధనకు గానూ ప్రతిష్టాత్మకమైన డాక్టరేట్ లభించింది. తెలంగాణలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ నుంచి ‘పర్యావరణ సేవల ఆర్థిక మూల్యాంకనం’ అనే అంశంపై రోహిత్ తన పరిశోధనను కొనసాగించారు. అడవులు అందించే నీటి సరఫరా, కార్బన్ నిల్వ, మట్టి సంరక్షణ వంటి సేవలకు ఆర్థిక విలువ నిర్ధారణ చేసి అటవీ వనరుల అసలు ప్రాముఖ్యతను శాసీ్త్రయంగా నిరూపించారు. ఈ పరిశోధనకు డాక్టర్ మిల్కూరి చిరంజీవరెడ్డి మార్గదర్శకత్వం వహించారు. ప్రభుత్వం అటవీ సంరక్షణకు సరైన నిధులు కేటాయించేందుకు, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు ఈ పరిశోధనలు కీలకంగా మారనున్నాయి. రోహిత్ సాధించిన ఈ విజయానికి ఎఫ్సీఆర్ఐ డీన్, అధ్యాపకులు, తోటి విద్యార్థులు అభినందనలు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అటవీ విద్యకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతతో ములుగు ఎఫ్సీఆర్ఐ నుంచి వస్తున్న ఇలాంటి పరిశోధనలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి. ప్రశ్నించే మహిళే మహనీయురాలు ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే హుస్నాబాద్: అన్యాయాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ, మార్పు కోసం పోరాడే ప్రతీ మహిళ మహనీయురాలేనని ప్రజాస్వామిక రచయిత్రిల వేదిక జాతీయ సమన్వయకర్త, ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే పేర్కొన్నారు. హుస్నాబాద్లో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విజేతలకు శనివారం బహుమతుల ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా కాత్యాయనీ విద్మహే పాల్గొని మాట్లాడారు. మహిళలకు చదువుతోపాటు స్వతంత్రంగా ఆలోచించే శక్తి, ఆత్మవిశ్వాసం ఉండాలన్నారు. ఆత్మస్థైర్యం లేకపోవడమే మహిళల ప్రధాన బలహీనతని చెప్పారు. వరకట్న వేధింపుల నుంచి మొదలుకుని సామాజిక వివక్ష వరకు ప్రతీ దానిని ఎదురించే ఆత్మరక్షణ ప్రేరణ మహిళల్లో కలగాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా సామాజిక వివక్ష, అవినీతి తగ్గకపోవడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా దినోత్సవం అంటే కేవలం వేడుక కాదని, హక్కుల పోరాటమని అభివర్ణించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, హైకోర్టు సీనియర్ న్యాయవాది వసుధ నాగరాజు, జేఏసీ నియోజకవర్గ కన్వీనర్ లక్ష్మారెడ్డి, కో ఆర్డినేటర్లు వీరన్న యాదవ్, డ్యాగల సారయ్య, కౌన్సిలర్లు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి
సాక్షి, సిద్ధిపేట: గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి జరిగింది. క్యాంప్ ఆఫీస్లో కిటికీ అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఘటనకి ముందు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో ర్యాలీగా బయలుదేరిన డీసీసీ ప్రెసిడెంట్ ఆంక్షా రెడ్డి, కాంగ్రెస్ నాయకులు.. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఫోటో పెట్టారు.కాంగ్రెస్ నాయకులే క్యాంప్ ఆఫీస్పై దాడి చేశారంటూ బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. తాము క్యాంప్ ఆఫీస్లో సీఎం ఫోటో పెట్టాము.. కానీ దాడి చేయలేదని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద పోలీసులు మోహరించారు.ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందిస్తూ.. ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముమ్మాటికీ ఇది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జరిగిన దాడి. ప్రజాస్వామ్యంపై సీఎం చేయించిన దాడి. పట్టపగలు అధికార మదంతో విర్రవీగుతూ సోయి మరచి వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నాయకుల తీరు బీహార్ గ్యాంగ్ను తలపిస్తోందంటూ హరీష్రావు మండిపడ్డారు.‘‘ఏకంగా ప్రజా ప్రతినిధుల క్యాంపు కార్యాలయాలపైనే ముప్పేట దాడులు చేస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్లా లేనట్లా?. కాంగ్రెస్ పాలనలో ప్రజా ప్రతినిధులపై దాడులు, ప్రజా సంఘాలపై దాడులు, మీడియాపై దాడులు.. నిత్యకృత్యం కావడం సిగ్గుచేటు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం కాంగ్రెస్ పార్టీకి ప్రైవేట్ సైన్యంలా మారిపోయారా? ఎందుకు అడ్డుకోవడం లేదు?’’ అంటూ హరీష్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కడిగేసిన కాగ్
ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు ప్రభుత్వ శాఖల తప్పిదాలను కేంద్ర ప్రభుత్వానికి చెందిన కాగ్ (కంప్ట్రోలర్ ఆఫ్ ఆడిటర్ జనరల్) తన నివేదికలో కడిగిపారేసింది. ప్రధానంగా నిధుల మళ్లింపు, అధికారుల నిర్లక్ష్యం, రికార్డుల నిర్వహణ లోపాలను గుర్తించింది. ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్–2025 నివేదికలో ఈ లోపాలను స్పష్టంగా పేర్కోవడంతోపాటు సిద్దిపేటలోని రాజీవ్పార్కు, మైత్రివనం, కోమటిచెరువు, పార్కుల నిర్వహణ బాగుందని ప్రశంసించింది. కాగ్ నివేదికలో ఉమ్మడి మెదక్ జిల్లాకుసంబంధించిన అంశాలను పరిశీలిస్తే.. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జహీరాబాద్లోని నిమ్జ్ (నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్) భూసేకరణ కోసం హడ్కో నుంచి తీసుకున్న రూ.725 కోట్ల రుణంలో రూ.317 కోట్లు ఇతర అవసరాలకు మళ్లించినట్లు కాగ్ గుర్తించింది. ఈ భూసేకరణ విషయంలో అధికారుల తీరుపై అక్షింతలు వేసింది. మొత్తం 12,635 ఎకరాలను సేకరించాల్సి ఉండగా, తీవ్ర జాప్యం జరుగుతోందని తన నివేదికలో పేర్కొంది. కల్యాణలక్ష్మి రికార్డుల నిర్వహణలోపాలపై.. కల్యాణలక్ష్మి రికార్డుల నిర్వహణలో సంగారెడ్డి రెవెన్యూ అధికారుల తీరును తప్పుబట్టింది. లబ్ధిదారులకు సంబంధించిన హార్డు కాపీలను అందుబాటులో ఉంచలేదని తన నివేదికలో పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా ఈ రికార్డుల నిర్వహణ ఉందని మొట్టికాయలు వేసింది. నారాయణఖేడ్లోని మినీస్టేడియం నిర్మాణం తీరుపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రూ.2.65 కోట్లతో చేపట్టిన ఈ మినీస్టేడియం డిజైన్ ఖరారులో ఆలస్యం, పనుల్లో జాప్యం, సకాలంలో పనులు పూర్తి చేయకపోవడం వంటి కారణాలతో రూ.కోట్లలో నిధులు వృథా అయ్యాయని తన నివేదికలో పేర్కొంది. సిద్దిపేట పార్కుల నిర్వహణపై ప్రశంసలు సిద్దిపేటలోని రాజీవ్పార్కు, మైత్రివనం, కోమటిచెరువు, పార్కుల నిర్వహణ బాగుందని కాగ్ తన నివేదికలో ప్రశంసలు కురిపించింది. ఇదే సిద్దిపేటలో మురుగునీటి శుద్ధీకరణ ప్రాజెక్టు భాగంగా రూ.158.34 కోట్లతో నిర్మించిన మూడు సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నీటిశుద్ధి చేయడంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన రిపోర్టులకు కాగ్ వంతపాడింది. తాగునీటి పథకానికి సంబంధించి మిషన్ భగీరథ నిధులు వినియోగించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వానికి చెందిన అమృత్ పథకం నిధుల నుంచి రూ.1.50 కోట్లను మళ్లింపుపై కాగ్ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తంచేసింది. ఇలా ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో జరిగిన లోపాలను తన నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్న పలు ఉన్నత విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల లోపాలను కాగ్ తన నివేదికలో ఎత్తిచూపింది. సిద్దిపేటలో మిషన్భగీరథకు అమృత్ నిధులు కల్యాణలక్ష్మి రికార్డుల నిర్వహణపై అక్షింతలు రేవంత్ సర్కారు లోపాలను ఎత్తిచూపిన కాగ్ నివేదిక–2025 రిపోర్ట్లో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పలు అంశాలు -
ఇసుక కోసం దరఖాస్తు తప్పనిసరి
● సరఫరాలో పారదర్శకతకు చర్యలు ● కలెక్టర్ హైమావతిసిద్దిపేటరూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా ఇసుక కోసం లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ హైమావతి సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇసుక సరాఫరాను పారదర్శకంగా, సులభంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ‘మన ఇసుక వాహనం’ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్రమంలో లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ పథకం ద్వారా పౌరులు స్వయంగా ఆన్లైన్ లాగిన్ ద్వారా ఇసుకను కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు. మొదటగా https://tgmiv.cgg. gov.in ను సంప్రదించాలని, బుక్ శాండ్ ఆప్షన్ను క్లిక్ చేసి, ఫోన్నెంబర్, వివరాలతో నమోదు చేసుకోవాలన్నారు. దరఖాస్తును పంచాయతీ కార్యదర్శి, తహసీల్దార్లు పరిశీలించి ఇసుకను మంజూరు చేస్తారని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు దరఖాస్తు చార్జీలు మాత్రమే చెల్లించాలని, ఎలాంటి ఇతర అదనపు రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఇతర అవసరాలకు నిర్ధారిత ఫీజు వ్యక్తిగత, ప్రభుత్వ పనులు, ఇతర అవసరాల కోసం ఇసుక బుక్ చేసుకునే వారు ప్రభుత్వం వెబ్సైట్లో నిర్ణయించిన ధరల ప్రకారం రేట్లు చెల్లించాలని కలెక్టర్ సూచించారు. దరఖాస్తుదారులు సరైన వివరాలు నమోదు చేయాలని, రవాణా కోసం వాహనాన్ని స్వయంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా వెబ్సైట్ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ విధానంతో ఇసుక సరాఫరా ప్రక్రియ వేగంగా, అవినీతి రహితంగా కొనసాగుతుందని, ప్రజలందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. -
రక్తదానం చేసి ప్రాణదాతలు కండి
6న గద్దర్ ఫౌండేషన్ సభ దొడ్డి కొమురయ్య త్యాగం ఎనలేనిది ఘనంగా జయంతి ఉత్సవాలు ఫ్లెక్సీ రగడ.. ఉద్రిక్తత ● బీఆర్ఎస్, కాంగ్రెస్ పరస్పర నినాదాలు ● పోలీసుల జోక్యంతో వివాదం కొలిక్కి సిద్దిపేటజోన్: ఫ్లెక్సీ రగడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తతకు దారితీసింది. ఒకదశలో ఇరుపార్టీల నేతలు పరస్పరం నినాదాలు చేయడంతో గురువారం అర్ధరాత్రి వరకు జిల్లా కేంద్రంలో టెన్షన్ నెలకొంది. ఎట్టకేలకు పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం ఫొటో పెట్టడానికి కాంగ్రెస్ నాయకులు వస్తున్నట్టు సమాచారం అందుకున్న బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఒకదశలో కాంగ్రెస్ నాయకులు అక్కడికి చేరుకుని పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు సంపత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫ్లెక్సీ చింపిన కేసు తీవ్రతరమైన అంశం కాదని నోటీసులు జారీ చేస్తామని పోలీసులు సూచించారు. పోలీసులకు, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాకుండా సహకరించాలని ఇరు పార్టీలకు పోలీసులు సూచించారు. పోలీసు అధికారుల సూచనలతో కాంగ్రెస్ నేతలు వెళ్లిపోవడంతో గొడవ సద్దుమణిగింది. -
పెళ్లికి పెద్దలు నిరాకరించారని..
చేర్యాల(సిద్దిపేట): పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. అది తట్టుకోలేక ప్రియురాలు బలవన్మరణానికి పాల్పడింది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. ముస్త్యాల గ్రామానికి చెందిన తరిగొప్పుల హారిక (24), అదే గ్రామానికి చెందిన అనుముల రాకేశ్ (27) ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో గత నెల 28న రాకేశ్గడ్డి మందు తాగాడు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ప్రేమికుడు మృతి చెందినప్పటి నుంచి మనోవేదనకు గురైన హారికను కుటుంబ సభ్యులు జనగామ జిల్లా నర్మెట మండల కేంద్రంలోని అమ్మమ్మ ఇంట్లో ఉంచారు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుంది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ప్రేమజంట ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. -
దూసుకెళ్తున్న స్టీల్ ధరలు
వ్యసనాలకు బానిస కావొద్దు యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా సన్మార్గంలో నడవాలని సీపీ సాధన రష్మీ పెరుమాళ్ అన్నారు. వివరాలు 8లో uగురువారం శ్రీ 2 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026● యుద్ధం ఎఫెక్ట్.. సామాన్యుడిపై భారం ● నెలరోజుల్లోనే టన్నుకు సుమారు రూ.8వేలు పెరుగుదల ● ఆందోళన చెందుతున్న గృహ నిర్మాణదారులు, బిల్డర్లునెల స్టీల్ సెకండరీ రకం(కేజీ రూ.) స్టీల్ ప్రైమ్ (కేజీ రూ.) మార్చి 1 55 నుంచి 58 60 నుంచి 65 ఏప్రిల్ 1 68 నుంచి 74 70 నుంచి 80కొత్త ఇల్లు నిర్మించుకునే వారికి బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. సొంతింటి కలను నెరవేర్చకుందామనుకున్న వారికి నిరాశే మిగలనుంది. రెండేళ్లుగా నిర్మాణ, రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. ఇప్పుడిప్పుడే నిర్మాణ రంగం పుంజుకుంటున్న సమయంలో ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ఏ భవనం నిర్మించాలన్నా ఐరన్ తప్పనిసరి. స్టీల్, సిరామిక్ బాత్ ఐటమ్స్, విద్యుత్ వైర్లు, తదితర వస్తువుల ధరలు పెరగడంతో నిర్మాణాలు చేసుకునే వారు ఆందోళన చెందుతున్నారు. గతంతో పోల్చుకుంటే స్టీల్ ధరలు భారీగా పెరిగాయి. నిర్మాణాల పనులు నిలిపివేయాలా?.. కొనసాగించాలా? అని తర్జనభర్జన పడుతున్నారు. అదనపు ఖర్చు.. సాధారణంగా సింగిల్ బెడ్రూంను రూ.12లక్షల్లో నిర్మాణం చేయాలనుకునే వారికి పెరిగిన ధరలతో రూ.16లక్షలు ఖర్చు అయ్యే అవకాశం ఉందని బిల్డర్లు అంటున్నారు. దీనికి తోడు సిమెంట్ ధరలు సైతం పెరుగుతాయని ప్రచారం జరుగుతోంది. గృహ నిర్మాణంలో ఉపయోగించే వస్తువుల ధరలు పెరగడంతో బిల్డర్లు ఆందోళన చెందుతున్నారు. నిర్మాణం కోసం అగ్రిమెంట్ చేసుకున్న సమయం కంటే దాదాపు 10 నుంచి 20శాతం పెరగడంతో బిల్డర్ల పై అదనపు భారం పడనుంది. ధరల పెరగడంతో కొందరు బిల్డర్లు ఇంటి యజమానులతో సంప్రదింపులు జరుపుతున్నారు.పశ్చిమాసియాలో యుద్ధంతో సామాన్యుడిపై ధరల పిడుగు పడుతోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ కోసం ప్రజలు సతమత మవుతుండగా వంట నూనెలు, నిత్యావసర ధరలు పెరిగాయి. మరోవైపు యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి స్టీల్ ధరలు సైతం పెరుగుతుండటంతో నిర్మాణారంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మార్చి 1 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు స్టీలుపై టన్నుకు రూ.5వేల నుంచి రూ.8వేలు ధరలు పెరిగాయి. దీంతో గృహనిర్మాణం చేస్తున్నవారు, కాంట్రాక్టర్లు, బిల్డర్లు ఆందోళన చెందుతున్నారు. – సాక్షి, సిద్దిపేట -
గతేడాది రెమ్యూనరేషన్ చెల్లించండి
డీటీఎఫ్ జిల్లా నాయకుల వినతి ప్రశాంత్నగర్(సిద్దిపేట): గతేడాది 10వ తరగతి మూల్యాంకన రెమ్యూనరేషన్ను వెంటనే చెల్లించాలని డీటీఎఫ్ జిల్లా నాయకులు కోరారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న టెన్త్ జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రం వద్ద డీఈఓ శ్రీనివాస్రెడ్డికి డీటీఎఫ్ నాయకులు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా డీటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ గత విద్యాసంవత్సరంలో పదవ తరగతి జవాబు పత్రాలు మూల్యాంకనం చేసి సంవత్సరమైనా నేటి వరకు టీఏ, డీఏలు, రెమ్యూనరేషన్లు ఇవ్వలేదన్నారు. వెంటనే అందించేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి, ఉపాధ్యక్షుడు చంద్ర భాను, కార్యదర్శి మల్లయ్య, ఆడిట్ కమిటీ సభ్యులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. హక్కులను కాలరాస్తున్న కేంద్రంసిద్దిపేటకమాన్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన కార్మిక చట్టాలను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర జేఏసీ కన్వీనర్ ఎండీ మౌలానా డిమాండ్ చేశారు. సిద్దిపేట ఆర్టీసీ డిపో ఎదుట జేఏసీ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మౌలానా మాట్లాడుతూ.. ఎంతో కష్టపడి సాధించుకున్న కార్మిక హక్కులను కేంద్రప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ మల్లేశం, నాయకులు రవీందర్, రాజేందర్, రాజయ్య, పరశురాములు, హేమలత తదితరులు పాల్గొన్నారు. దుబ్బాక డిపో ఎదుట దుబ్బాక: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ బుధవారం దుబ్బాక బస్డిపో ఎదుట కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అసంక్రమిత వ్యాధుల నివారణకు చర్యలుకొండపాక(గజ్వేల్): అసంక్రమిత వ్యాధుల నివారణ కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని డీఎంహెచ్ఓ ధన్రాజ్ తెలిపారు. కొండపాక మండలం దుద్దెడలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. ఆరోగ్య సంబంధిత అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ శివకుమార్, పంచాయతీ కార్యదర్శి చక్రపాణి, డాక్టర్ వినోద్, ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ బాబ్జీ, డిప్యూటీ డీఎంహెచ్ఓ మహేందర్రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీకాంత్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
నిర్మాణ రంగంపై భారం
యుద్ధం ఎఫెక్ట్ నిర్మాణ రంగంపై పడుతోంది. ఐరన్, వివిధ వస్తువుల ధరలు పెరిగినప్పటికీ నాణ్యతలో తగ్గకుండా నిర్మాణం చేపడుతున్నాం. కస్టమర్కు అనుకున్న సమయానికి ఇంటిని నిర్మించి అందించేందుకు కృషి చేస్తున్నాం. – కోల నర్సింహాగౌడ్, బిల్డర్వ్యాపారం చాలా తగ్గింది ఐరన్ వ్యాపారం గతంతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. ఇప్పుడిప్పుడే నిర్మాణ రంగం కొంత పుంజుకుంటున్న సమయంలో ధరలు మండుతున్నాయి. వ్యాపారం జరగక వర్కర్లకు జీతాలు ఇవ్వడం సైతం ఇబ్బంది అవుతోంది. రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు. – జియోద్దీన్, ఐరన్, వ్యాపారి -
చికెన్ విక్రయదారుల నిరసన
గజ్వేల్రూరల్: మార్జిన్ ధరలను పెంచాలని డిమాండ్ చేస్తూ చికెన్ విక్రయ దుకాణ నిర్వాహకులు బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం గజ్వేల్ పట్టణంలోని చికెన్ దుకాణాలను మూసివేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పౌల్ట్రీ కంపెనీలు వ్యాపారులకు ఇచ్చే మార్జిన్లను భారీగా తగ్గించి తమ పొట్టకొడుతున్నాయని ఆరోపించారు. పెరుగుతున్న ధరలతో చికెన్ సెంటర్ల యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మార్జిన్ ధరలను పెంచే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ చికెన్ సెంటర్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, ఉపాధ్యక్షులు ఇమామ్, హుస్సేన్, తిరుపతి, కార్యదర్శులు రాజు, ముస్తఫా, మాజీ అధ్యక్షులు శేఖర్, జహీర్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చికెన్ షాప్ల తాత్కాలిక మూసివేత ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలో చికెన్ షాప్లను నిర్వాహకులు బుధవారం తాత్కాలికంగా మూసివేశారు. హోల్సెల్ నిర్వాహకులు కమీషన్ తక్కువ ఇస్తున్నారంటూ చికెన్ షాపు యజమానులు తెలిపారు. సాయంత్రం నుంచి తిరిగి చికెన్ సెంటర్లు తెరుచుకున్నాయి. జిల్లాలో దాదాపు 1000కి పైగా చికెన్ షాపులు ఉన్నాయి. రోజూ ఈ షాప్ల నుంచే హోటళ్లు, దాబాలు, రెస్టారెంట్లు, బార్లు, వసతి గృహాలకు, గృహ వినియోగానికి సరఫరా అవుతోంది. -
పద్మశాలీల సంక్షేమం మరిచిన సర్కార్
ప్రశాంత్నగర్(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం పద్మశాలీల సంక్షేమాన్ని విస్మరించిందని, వారికి అన్ని రకాల ప్రభుత్వ పథకాలను నిలిపివేసిందని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మార్కండేయ ఆలయంలో 50 మంది పద్మశాలి మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ సంఘంలో సమాజ శ్రేయస్సుకు పాటు పడటంలో పద్మశాలి సమాజం ఆదర్శంగా నిలుస్తోందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వృత్తిపై ఆధారపడే వారిని అన్ని విధాలుగా ఆదుకున్నామని, పద్మ శాలీలకు చేనేత బంధు వంటి ఎన్నో పథకాలతో సహాయం చేశామన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అన్ని కులాలకు అన్ని రకాల బంధులు బంద్ పెట్టిందన్నారు. గతంలో పద్మశాలీలకు 50 కుట్టు మిషన్లు, ఇప్పుడు మరో 50 అందిస్తున్నానన్నారు. రూ.75లక్షలతో పద్మశాలి భవనాన్ని నిర్మించుకున్నామన్నారు. వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కస్తూరి సతీష్, ప్రచార కార్యదర్శి ముదిగొండ శ్రీనివాస్, జోగు భిక్షపతి, మల్లేశం, దయాసాగర్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి హరీశ్రావు మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ -
నిధులివ్వకపోతే మంత్రులను అడ్డుకుంటాం
ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి గజ్వేల్: పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులకు నిధులిచ్చి, పనులు పూర్తిచేయడానికి నెలరోజుల్లో చర్యలు చేపట్టకపోతే మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్ల పర్యటనలను అడ్డుకుంటామని ఎఫ్డీసీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి హెచ్చరించారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్లో అసంపూర్తిగా ఉన్న ఆర్టీసీ బస్టాండ్ను పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. కేసీఆర్ హయాంలో గజ్వేల్కు మంజూరు చేసిన రూ.180కోట్ల నిధులను రేవంత్రెడ్డి ప్రభుత్వం రద్దు చేయడం వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆరోపించారు. ఈ నిధులు వెంటనే ఇచ్చి పెండింగ్ పనులు పూర్తిచేయడానికి సహకరించాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గజ్వేల్ ప్రాంతానికి ఒరిగిందేమీలేదన్నారు. ప్రజ్ఞాపూర్లో బస్టాండ్ పనులు అసంపూర్తిగా ఉండటం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని వాపోయారు. అదేవిధంగా పట్టణంలో 150మీటర్ల మేర రింగు రోడ్డు పనులు పెండింగ్లో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గంగిశెట్టి రవీందర్, కళ్యన్కర్ నర్సింగరావు, బీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు నవాజ్మీరా, నాయకులు ఊడెం కృష్ణారెడ్డి, గోలీ సంతోష్, మర్కంటి కనకయ్య, అహ్మద్, స్వామిచారి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
నేటి నుంచి టెన్త్ మూల్యాంకనం: డీఈఓ
ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏప్రిల్ 1 నుంచి 23వ తేదీ వరకు పదో తరగతి పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం నిర్వహించనున్నట్లు డీఈఓ శ్రీనివాస్రెడ్డి మంగళవారం తెలిపారు. మూల్యాంకనం మూడు దశలలో నిర్వహించనున్నామన్నారు. మొదటి దశలో 1 నుంచి 9వ తేదీ వరకు తెలుగు, హిందీ, ఇంగ్లిష్, గణితం సబ్జెక్టులు, 10వ తేదీ నుంచి 16 వరకు రెండో విడతలో భౌతిక రసాయశాస్త్రం, జీవశాస్త్రం, 17 నుంచి 23వ తేదీ వరకు సాంఘీకశాస్త్రం మూల్యాంకనం చేయనున్నట్లు తెలిపారు. ఈ మూల్యాంకన నిర్వహణలో మొత్తంగా 950 మంది విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. అందుకు గాను అన్ని రకాల మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా మూల్యాంకనం విధులకు హాజరు కానట్లయితే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు డీఈఓ తెలిపారు. యాజమాన్యపద్ధతులు తప్పనిసరి చిన్నకోడూరు(సిద్దిపేట): సాగులో యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూప రాణి రైతులకు సూచించారు. మంగళవారం మండల పరిధిలోని రామంచలో వరి పంటలను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ సాగులో రైతులు రసాయనిక ఎరువులు తగ్గించాలన్నారు. పచ్చిరొట్ట ఎరువుల ద్వారా భూసారం పెరిగి మంచి దిగుబడులు వస్తాయన్నారు. వరికి కాండం తొలుచు పురుగు, మొగి పురుగు ఆశిస్తాయని, వాటి నివారణకు జాగ్రత్తలు వివరించారు. పంటల సాగులో చీడపీడలు, నివారణ, యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. ఆమె వెంట ఏఓ జయంత్ కుమార్, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. గడువు పొడిగింపుప్రశాంత్నగర్(సిద్దిపేట): స్వయం ఉపాధి పథకాల దరఖాస్తు గడువు పొడిగించారు. షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ స్వయం ఉపాధి పథకాల కోసం ఆన్లైన్ దరఖాస్తుల గడువును ఏప్రిల్ 8 వరకు పొడిగించినట్లు సంస్థ ఈడీ విజయ భార్గవ తెలిపారు. అర్హత కల్గిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. హామీలు నెరవేర్చండి మిరుదొడ్డి(దుబ్బాక): తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని దుబ్బాక ఉద్యమకారుల జేఏసీ కన్వీనర్ లింగం డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్ఐ కొండల్రెడ్డికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని మండిపడ్డారు. ఇప్పటికై నా ఉద్యమకారుల సంక్షేమంపై దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో ఉద్యమకారుల జేఏసీ మండల కన్వీనర్ భూపతి గౌడ్, ఉద్యమకారులు బాల్రాజు, నందిని మాస్టర్, స్వామి, విజయ్, రమేష్, సత్యనారాయణ, మల్లయ్య, భూమరాజయ్య, హరికృష్ణ, జ్ఞానేశ్వర్, హుస్సేన్, రాములు తదితరులు పాల్గొన్నారు. ఘనంగా రథోత్సవంబెజ్జంకి(సిద్దిపేట): దాచారంలో శ్రీరామచంద్రస్వామి రథోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. స్వామివారి ఉత్సవ మూర్తులను రథంపై ఉంచి గ్రామంలో ఊరేగించారు. భక్తుల రామనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. -
క్రీడా పాఠశాలలను సద్వినియోగం చేసుకోండి
సిద్దిపేటజోన్: క్రీడా పాఠశాలలను సద్వినియోగం చేసకోవాలని జిల్లా క్రీడాశాఖ అధికారి వెంకటనర్సయ్య తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని గ్రీన్ఫీల్డ్ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి క్రీడా పాఠశాలల ఎంపిక పోటీల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ క్రీడల ద్వారా చక్కటి గుర్తింపు గౌరవం లభిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 ప్రాంతీయ క్రీడా పాఠశాలలున్నట్లు తెలిపారు. ప్రతి పాఠశాలకు బాలబాలికలను ఎంపిక చేసి నైపుణ్యం గల క్రీడాకారులగా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ రాజ ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మహాలక్ష్మితో ఆర్థిక ప్రయోజనం
సిద్దిపేటరూరల్: ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో మహిళలకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనం చేకూరుతున్నదని కలెక్టర్ హైమావతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో అన్నిశాఖల మహిళా ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గతంలో మహిళలకు ప్రత్యేక సంక్షేమ పథకాలు పరిమితంగానే ఉండేవని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మహిళల సాధికారతకు ప్రాధాన్యతనిస్తోందన్నారు. ఆరు గ్యారంటీలలో భాగంగా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, చేయూత వంటి అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఇప్పటివరకు దాదాపు రూ.10 వేల కోట్లను ఆదా చేసుకున్నారన్నారు. సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్–ప్రజ్ఞాపూర్, దుబ్బాక డిపోల ద్వారా 866.66 లక్షల మంది మహిళలు ప్రయాణించి రూ.333కోట్లకుపైగా ఆదా చేసుకున్నారన్నారు. ఆరు గ్యారంటీలలో భాగంగా దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, జనగాం, మానకొండూర్, సిద్దిపేట నియోజకవర్గాల్లో 3,33,332 తెల్ల రేషన్ కార్డులను 10,37,262 మంది లబ్ధిదారులకు అందజేసి, ప్రతినెలా 6,583.867 మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 11,241 ఇళ్లను మంజూరు చేశామన్నారు. వాటిలో 9,854 ఇళ్లకు గ్రౌండింగ్ పూర్తి చేసి రూ.204.44 కోట్ల విలువైన ఇళ్లను లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. రైతు భరోసా పథకం ద్వారా జిల్లాలో 3,20,379 మంది రైతులకు రూ.355.68 కోట్లు ఖాతాలో జమచేశామన్నారు. జిల్లాలో జరుగుతున్న ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మహిళలు తమకు లభించిన ప్రయోజనాలను ప్రజలకు తెలియజేసి, సంక్షేమ పథకాల సద్వినియోగానికి తోడ్పడాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. పథకాలు మరింత మందికి చేరువ చేయడంలో మహిళలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఇకపై కలెక్టరేట్ ఎదరుగా వెళ్లే అన్ని డిపోల ఆర్టీసీ బస్సులు ఆఫీస్ ఎదుట ఆగేలా ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మహిళలను కలెక్టర్ సత్కరించారు. -
మృత్యుఘంటికలు..
కొండపోచమ్మసాగర్ కాల్వలో తరచూ ప్రమాదాలుతెరపైకి భద్రతా చర్యలు... వేగమైన ప్రవాహం కలిగిన కొండపోచమ్మసాగర్ కాల్వలోకి జారిపడితే ప్రాణాలు నీటిపాలవడం సహజపరిణామంగా మారుతోంది. తాజాగా ఆదివారం గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామానికి చెందిన వరుసకు అక్కాతమ్ముళ్లు రిషిక(13), మనీష్(11)లు కాల్వలో నీటమునిగి ప్రాణాలు కోల్పోవడం, అదే రోజు మేడ్చల్ జిల్లాలోని ఆర్మీ క్యాంటీన్లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న విజయ్కుమార్ కుకునూర్పల్లి మండలం ముద్దాపూర్ వద్ద కొండపోచమ్మసాగర్ కాల్వలో మృత్యువాతకు గురికావడం తీవ్ర విషాదాన్ని నింపింది. గతంలోనూ ఈ కాల్వలో ఎన్నో ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం చోటుచేసుకున్నది. కొందరు నీటి ప్రవాహానికి పంపుహౌస్లవరకు కొట్టుకు వెళ్లి ప్రాణాలు విడిచారు. ఈ క్రమంలో భద్రతా చర్యలు తెరపైకి వస్తున్నాయి. ప్రధానంగా ప్రమాదకరంగా ఉన్న ప్రదేశాల్లో ఫెన్సింగ్ ఏర్పాటు, మెట్లు ఉన్న ఉన్న ద్వారాలను మూసేయడం, కాల్వపై తరుచూ పరిశీలనలు జరిపితేనే ఈ ప్రమాదాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. తాజాగా ప్రమాదాల నేపథ్యంలో సంబంధిత అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.గజ్వేల్: మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మసాగర్కు వచ్చే కాల్వ మృత్యుఘంటికలను మోగిస్తోంది. ప్రవాహా వేగానికి క్షణాల్లో ప్రాణాలు నీటిలో కలిసిపోతున్నాయి. తాజాగా గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద ఇద్దరు చిన్నారులు, కుకునూర్పల్లి మండలం ముద్దాపూర్ వద్ద మరో వ్యక్తి మృతి చెందడం కలవరానికి గురిచేస్తున్నది. ఈనేపథ్యంలోనే భద్రతా ఏర్పాట్ల అంశం తెరపైకి వస్తున్నది. చిన్నకోడూరు వద్ద నిర్మించిన రంగనాయక్ సాగర్ నుంచి మల్లన్నసాగర్ ప్రతిపాదిత స్థలానికి 16కిమీల గోదావరి నీళ్లను తరలించే సొరంగ మార్గాన్ని తీసుకొచ్చారు. అక్కడి నుంచి మల్లన్నసాగర్ రిజర్వాయర్తో ప్రమేయం లేకుండా కొండపోచమ్మ సాగర్కు కాల్వకు అనుసంధానం చేశారు. ఈ కాల్వ సామర్థ్యం 11,500క్యుసెక్కులు. ఈ రకంగా మల్లన్నసాగర్ ప్రతిపాదిత స్థలం నుంచి 28కిమీల పొడవున కొండపోచమ్మ సాగర్ వరకు కాలువల ద్వారా గోదావరి నీళ్లు వస్తున్నాయి. చూడటానికి గుంభనంగా కనిపించే ఈ నీళ్లు...వేగమైన ప్రవాహాన్ని కలిగిఉంటాయి. ఈ క్రమంలోనే కొడకండ్ల బ్రిడ్జి వద్ద భారీ ఆనకట్టను నిర్మించి నీటిని వదిలి కాల్వల ద్వారా గజ్వేల్ మండలం అక్కారం పంప్హౌస్ వద్దకు చేరుతాయి. ఇక్కడ 52 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోస్తారు. ఇందుకోసం పంప్హౌస్లో 27మెగావాట్ల విద్యుత్వాడకంతో 6 మోటార్లు పనిచేస్తున్నాయి. అక్కడి నుంచి 2.3 కిలోమీటర్ల వరకు పైప్లైన్ ద్వారా, ఆ తర్వాత కాల్వల మార్గం ద్వారా మర్కూక్ వద్ద నిర్మించనున్న పంప్హౌస్కు తరలిస్తారు. ఇక్కడ మరో 72 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోస్తారు. ఇందుకోసం 34 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 6 మోటార్లను వాడుతున్నారు. ఈ పంప్హౌస్ నుంచి పైపుల ద్వారా 618 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మసాగర్ను నింపుతారు. ఇటీవల ఇద్దరు చిన్నారులు.. మరొకరి మృతితో విషాదఛాయలు ప్రమాదకరంగా ఉన్న ప్రదేశాల్లో ఫెన్సింగ్ అనివార్యం -
యాసంగికి సాగునీరు
‘స్వచ్ఛ సిద్దిపేట’ సాధనే.. స్వచ్ఛ సిద్దిపేట సాధనే లక్ష్యంగా సమష్టిగా కృషిచేయాలని మున్సిపల్ చైర్పర్సన్మంజుల పిలుపునిచ్చారు. వివరాలు 9లో u● హరీశ్రావు వినతికిస్పందించిన మంత్రి ఉత్తమ్ ● ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలుసాక్షి, సిద్దిపేట: యాసంగి పంటలకు సాగు నీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలుచేపట్టింది. యాసంగి పంట కాలం పూర్తయ్యేంత వరకు పంట పొలాలకు సాగు నీటిని అందించేందుకు అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి రంగనాయక సాగర్లోకి నీటి పంపింగ్ చేయాలని ఎమ్మెల్యే హరీశ్రావు కోరారు. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల్లో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డిని కలిసి లేఖ అందజేశారు. దీంతో మంత్రి సానుకూలంగా స్పందించి మంగళవారం ఇరిగేషన్ అధికారులను నీటిని పంపింగ్ చేయాలని ఆదేశించారు. సిద్దిపేట నియోజకవర్గంలో ఐదేళ్లుగా యాసంగి పంటకు రంగనాయక సాగర్ కాల్వల ద్వారా పంట పొలాలకు సాగు నీటిని అందిస్తున్నామని, రంగనాయక సాగర్ కింద ప్రతి ఏడాది గణనీయంగా పంట ఉత్పత్తి పెరుగుతోందని హరీశ్రావు లేఖలో పేర్కొన్నారు. ఈ ఏడాది సుమారు 50 వేల ఎకరాల్లో పంట సాగులో ఉందని రంగనాయక సాగర్లో ఇటీవల 2.4 టీఎంసీల నీటిని పంపింగ్ చేశారన్నారు. ప్రస్తుతం రంగనాయక సాగర్లో 1 టీఎంసీ నీళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని యాసంగి పంటకు పూర్తి స్థాయిలో నీరు అందించాలంటే ఇంకా 1.5 టీఎంసీల నీరు అవసరం ఉందని లేఖలో వివరించారు. అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి రంగనాయక సాగర్లోకి నీటిని పంపింగ్ చేయాలని తెలిపారు. -
సూర్య నమస్కారాలతో మానసిక ప్రశాంతత
గజ్వేల్రూరల్: నడక, ధ్యానం, యోగా, సూర్య నమస్కారాలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరడంతో పాటు రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చని అదనపు సీఐ ముత్యంరాజు అన్నారు. సూర్యనమస్కారాల బృందం 9వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు కొంత సమయం వ్యాయామానికి కేటాయించాలన్నారు. కార్యక్రమంలో సూర్య నమస్కారాల బృందం సభ్యులు సుభాష్రెడ్డి, బాల్చంద్రం, సుదర్శన్చారి, నర్సింహులు, కృష్ణ, భిక్షపతి, రవికుమార్, శ్రీకాంత్, యాదగిరి, ల్యాబ్ రమేశ్, బాల్కుమార్, మధు, విశ్వనాథం, జితేందర్, హరి తదితరులు పాల్గొన్నారు. చెడు వ్యసనాలకు బానిసలు కావద్దు యువత చెడు వ్యసనాలకు బానిసలై విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని సూర్య నమస్కారాల బృందం సభ్యులు సూచించారు. డ్రగ్స్, ఇతర మత్తుపదార్థాలకు అలవాటు పడితే కలిగే అనర్థాలపై అవగాహన కలిగించేందుకు ఇన్స్ఫైర్ గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 19న నిర్వహించతలపెట్టిన 3కే రన్కు సంబంధించిన పోస్టర్ను ఆదివారం ఆవిష్కరించారు. గజ్వేల్లో సూర్య నమస్కారాల బృందం, వాలీబాల్ క్రీడాకారుల ఆధ్వర్యంలో వేర్వేరుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత తాము ఎంచుకున్న లక్ష్యం దిశగా ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో గోపాల్, కేతోజి వినోద్కుమార్, నవీన్, స్వామి, భాస్కర్, సాయి తదితరులు పాల్గొన్నారు. అదనపు సీఐ ముత్యంరాజు -
వైభవంగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
బెజ్జంకి(సిద్దిపేట): బెజ్జంకి లక్ష్మీనర్సింహస్వామి కల్యాణ వేడుకలు ఆదివారం వైభంగా నిర్వహించారు. అర్చకుడు శేషం మధుసూదనాచారి ఆధ్వర్యంలో వందలాది మంది భక్తుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ జెల్ల ప్రభాకర్, సర్పంచ్ శ్రీధర్, దంపతులు, పాలకవర్గ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. హుస్నాబాద్రూరల్: పలువురు లబ్ధిదారులకు మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను ఆదివారం అందజేసినట్లు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బంక చందు తెలిపారు. పోతారం(ఎస్), పందిల్ల, మహ్మదాపూర్ గ్రామాలకు చెందిన 29 మందికి ఆదివారం చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్లు మామిడి చంద్రకళ, రమేశ్, తిరుమల, ఉపసర్పంచ్ బొమ్మగాని రాజ్కుమార్ పాల్గొన్నారు. -
వెంచర్ వేసి..
కాలువను పూడ్చి..● అనుమతి లేకుండా ఏర్పాటు ● ఇబ్బందులు పడుతున్న అన్నదాతలు ● జీపీ తీర్మానాన్ని లెక్కచేయని కార్యదర్శి కొండపాక(గజ్వేల్): అక్రమ వెంచర్ల ఏర్పాటుతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. ఎలాంటి అనుమతి లేకపోయినా చర్యలు ఎవరూ పట్టించుకోకపోవడంతో అనేక అనుమానాలకు తావిస్తోంది. కుకునూరుపల్లి మండలంలోని లకుడారం గ్రామంలో ఆరేళ్ల కిందట ఎలాంటి అనుమతి లేకుండా వెంచర్ ఏర్పాటు చేశారు. సర్వే నంబర్లు 3/ఆ/1, 3/ఆ/2, 343/ఆ, 344/2, 335/ఆ/3 లోని సుమారు 3.32 ఎకరాల వ్యవసాయ భూమిలో వెంచర్ వేసి ప్లాట్ల రూపంలో సుమారు 90 శాతం విక్రయించారు. నిర్లక్ష్యంగా కార్యదర్శి వెంచర్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు, ఇతర అవసరాల కోసం ఏ మాత్రం భూమిని వదిలిపెట్టకుండా ప్లాట్లు వేసి విక్రయించారు. కొందరు అప్పట్లోనే ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్నారు. మరి కొందరు ప్రస్తుతం నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ఈ అక్రమ లేఔట్లో ఎలాంటి నిర్మాణాలు చేయవద్దంటూ సర్పంచ్ శిల్పతో పాటు పంచాయతీ పాలక వర్గం తీర్మానం చేశారు. ఆ పనిని పంచాయతీ కార్యదర్శికి అప్పగించారు. కానీ ఆ తీర్మానాన్ని లెక్క చేయకుండా వ్యవహరించడంతో కార్యదర్శిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని సర్పంచ్ శిల్ప తెలిపారు. అధికారుల పరిశీలన రైతులు, గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో ఇరిగేషన్శాఖ ఏఈ శ్రీనివాస్, ఎంపీఓ విష్ణు వెంచర్ ప్రదేశాన్ని, ఇళ్ల నిర్మాణ తీరును నెల రోజుల క్రితం పరిశీలించారు. వర్షపు నీరు బయటకు పోయేలా ఇది వరకు ఉన్న ఫీడర్ చానల్ కాలువ నిర్మించేలా చూడాలని ఇరిగేషన్శాఖ ఏఈ శ్రీనివాస్కు సూచించారు. ఎల్ఆర్ఎస్ ద్వారా ప్లాటును రెగ్యులరైజేషన్ కోసం ధరఖాస్తు చేసుకున్న వారు ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్మాణాలు చేసుకునేలా చూసుకోవాలని ఎంపీఓ విష్ణు పంచాయతీ కార్యదర్శికి సూచించారు. ఈ విషయపై డీఎల్పీఓ లతను వివరణ కోరగా ఈ వెంచర్ విషయంపై విచారణ చేయిస్తామని చెప్పారు. గోడ నిర్మించి.. కానీ వ్యవసాయ భూమిని నాన్ అగ్రికల్చరల్ భూమిగా మార్చుకొనేందుకు పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతిని పొందలేదు. వెంచర్ వేసిన భూమికి సుమారు 500 గజాల దూరంలో మల్లారెడ్డి చెరువు ఉంది. వర్షాకాలంలో చెరువులో నుంచి వరద నీరు పోయేందుకు ఈ వెంచర్ వేసిన భూమిలోంచి ఫీడర్ చానల్ కాలువ ఉండేది. ఆ కాలువను పూడ్చి వేశారు. అలాగే అడ్డంగా రాతితో గోడ నిర్మించారు. దీంతో వర్షాకాలంలో చెరువు నుంచి వచ్చే నీరు వెంచరుపై భాగంలో ఉన్న వ్యవసాయ భూముల్లో నిలిచిపోతోంది. పంట నీట మునిగిపోతుండంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. -
ఏఎంసీ చైర్మన్గా మీసం మహేందర్
చిన్నకోడూరు(సిద్దిపేట)/నంగునూరు(సిద్దిపేట): చిన్నకోడూరు, నంగునూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల పేర్లను రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదివారం ప్రకటించారు. చిన్నకోడూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా అల్లీపూర్ గ్రామానికి చెందిన మీసం మహేందర్ను నియమించారు. అలాగే నంగునూరు మార్కెట్ కమిటీ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దేవులపల్లి యాదగిరిని నియమించారు. ఈ మేరకు మంత్రి వివేక్, నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ, కాంగ్రెస్ నాయకులు వారికి నియామక పత్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మీసం మహేందర్ మాట్లాడుతూ రైతులకు నిత్యం అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందిస్తానన్నారు. ప్రభుత్వ పథకాలు రైతులకు చేరవేయడంలో తనవంతు కృషి చేస్తానన్నారు. -
ఉత్సవ కమిటీ చైర్మన్గా కమలాకర్
మద్దూరు(హుస్నాబాద్): తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడైన దొడ్డి కొమురయ్య జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్గా రేబర్తి గ్రామానికి చెందిన డాక్టర్ జంగిటి కమలాకర్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా కమలాకర్ ఆదివారం మాట్లాడుతూ కురుమలు దొడ్డి కొమురయ్య ఆశయాలను సాధించుకోవాలన్నారు. 3న రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా నిర్వహిస్తున్న దొడ్డి కొమురయ్య జయంతిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తన నియామకానికి సహకరించిన కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, క్యామ మల్లేశంకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
మైనార్టీ ఉద్యోగుల సంఘం కార్యవర్గం ఎన్నిక
ప్రశాంత్నగర్(సిద్దిపేట): రాష్ట్ర మైనార్టీ ఉద్యోగుల సేవా సంఘం జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం జిల్లా కేంద్రంలో ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు పారుఖ్ అహ్మద్, గౌరవ అధ్యక్షుడు మహమ్మద్ జాకీర్హుస్సేన్, కార్యదర్శి మహమ్మద్ అక్తర్ల ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా సయ్యద్ సందాని, వర్కింగ్ ప్రెసిడెంట్గా షేక్ ఇమ్రాన్, జనరల్ సెక్రెటరీగా అబ్దుల్ మోయిజ్, కోశాధికారిగా సయ్యద్ ఖాజా నవాజ్ అహ్మద్తో పాటు పలువురిని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో విజయ్కుమార్, షబానాజ్, సబిహా తహసీన్ తదితరులు పాల్గొన్నారు. -
స్వశక్తి మహిళలకు పరీక్షలు
హుస్నాబాద్రూరల్: స్వశక్తి సంఘాల్లోని నిరక్షరాస్య మహిళలకు ఆదివారం ఓపెన్ స్కూల్ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించినట్లు ఏపీఎం తిరుపతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ చదవడం, రాయడం రావాలనే లక్ష్యంతో ప్రభుత్వం సెర్ప్ సహకారంతో మహిళ సంఘాల్లో నిరక్షరాస్యులను గుర్తించామన్నారు. వారికి వాలంటీర్లను నియమించి అక్షరాలు నేర్పించి పరీక్షలకు సిద్ధం చేశామని చెప్పారు. 17 గ్రామాల్లో 606 మంది మహిళలు ఆయా గ్రామాల్లో నిర్వహించిన పరీక్షలకు హాజరయ్యారు. మిగతా మహిళలంతా కూడా రాయడం నేర్చుకోవాలని సూచించారు. నంగునూరు(సిద్దిపేట): ఆర్ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ మండల నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ముదిగొండ రమేశ్, ఉపాధ్యక్షుడిగా నకీర్తి రాజమల్లు, ప్రధాన కార్యదర్శిగా మల్లమారి శంకర్తో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ ఆర్ఎంపీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తాన్నారు. మిరుదొడ్డి(దుబ్బాక): నైపుణ్య ఆర్గనైజేషన్, సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం మిరుదొడ్డిలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం వారు మాట్లాడుతూ యువత రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి ప్రాణం పోయాలన్నారు. కార్యక్రమంలో ఐలయ్య, నునిగాని రాజు, బీజేపీ జిల్లా నాయకుడు ఎల్ముల దేవరాజు, టెలికం బోర్డు సభ్యుడు మల్లేశం, వార్డు సభ్యులు రాజు, సదానందరెడ్డి, విజయ్, సుధాకర్, రాజు తదితరులు పాల్గొన్నారు. హుస్నాబాద్రూరల్: ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో పందిల్ల వార్డు సభ్యుడు పోలవేని మహేశ్ చలివేంద్రం ఏర్పాటు చేశారు. పందిల్ల స్టేజీ వద్ద ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని సర్పంచ్ రమేశ్ ఆదివారం ప్రారంభించారు. ప్రయాణికులకు మినరల్ వాటర్ అందిస్తున్న మహేశ్ దంపతులను గ్రామస్తులు అభినందించారు. కొండపాక(గజ్వేల్): కుకునూరుపల్లిలో ఆదివారం మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు మల్లగల్ల యాదగిరి కుటుంబానికి పలువురు నేతలు అండగా నిలిచారు. మృతుడి కుటుంబాన్ని పంచాయతీ పాలకవర్గం పరామర్శించి ఓదార్చారు. సర్పంచ్ మల్లం కనకవ్వ రూ.5 వేలు, ఉపసర్పంచ్ దొంతి సత్తయ్య రూ.5 వేలు, వార్డు సభ్యురాలు ప్రేమలత రూ.2 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించి భరోసా ఇచ్చారు. సందర్భంగా కనకవ్వ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మేఘన ఫౌండేషన్ ట్రస్టు నిర్వాహకుడు మల్లం ఐలయ్య, మాజీ పీఏసీఎస్ వైస్ చైర్మన్ పిస్క అమరేందర్ తదితరులు పాల్గొన్నారు. రాములోరి శోభాయాత్ర మిరుదొడ్డి(దుబ్బాక): శ్రీరామనవమిని పురస్కరించుకుని మండల కేంద్రమైన మిరుదొడ్డిలో శనివారం రాత్రి రాములోరి రథోత్సవ శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి రథోత్సవానికి స్వాగతం పలుకుతూ ప్రత్యేక పూజలు చేశారు. శోభాయాత్రలో చిన్నారుల ఆట పాటలు, మహిళలు కోలాటం అందరినీ ఆకట్టుకున్నాయి. -
మద్యం తాగి వాహనాలు నడపొద్దు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్ హెచ్చరించారు. సిద్దిపేటలో టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై ఆదివారం అవగాహ న కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ వాహనం నడిపేటపుడు కచ్చితంగా సీట్బెల్ట్ ధరించాలన్నారు. అతివేగంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురికావద్దని, గమ్యస్థానం చేరే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాహనానికి సంబంధించిన ధ్రువపత్రాలను తమ వెంట ఉంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ అఖిల్, మహేశ్, టాక్సీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అబ్బు, రమేశ్, డ్రైవర్లు పాల్గొన్నారు.ట్రాఫిక్ ఎస్ఐ విజయ్భాస్కర్ -
నీట మునిగి 8 మంది మృతి
కొండపాక (గజ్వేల్): రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో నీట మునిగి 8 మంది మృతిచెందారు. వీరిలో ఆరుగురు ఈతకు వెళ్లి మరణించగా, మరో ఇద్దరు చెరువులో మునిగి చనిపోయారు. గజ్వేల్ మండలంలోని కొడకండ్ల గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు (వరుసకు అక్కా తమ్ముడు) రిషిక (13), కుక్కల మనీష్ అలియాస్ లక్కీ (11) మామ వరుసైన గణేశ్తో కలిసి వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. గణేశ్ పశువులను మేతకు తీసుకెళ్లగా మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్కు వెళ్లే కాలువలో మనీష్ ఈత కోసం దిగాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోతుండగా రిషిక కాపాడేందుకు కాలువలోకి దిగగా ఇద్దరూ మృతి చెందారు. రుషిక కొడకండ్ల ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతుండగా, మనీష్ 7వ తరగతి చదువుతున్నాడు. కుటుంబీకులు, గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఎస్హెచ్ఓ, ట్రైనీ ఐపీఎస్ అయేషా ఫాతిమా ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను బయటకు తీయించారు. ఇదిలాఉండగా హైదరాబాద్లోని మల్కాజ్గిరి బాలాజినగర్కు చెందిన రాములు కుకునూరుపల్లి మండలంలోని ముద్దాపూర్, రాంచంద్రాపూర్ శివారులో కొంత వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. దీంతో రాములు కొడుకు రాజుతోపాటు 8 మంది స్నేహితులతో కలిసి సరదా కోసం వ్యవసాయ బావి వద్దకు వచ్చారు. విజయ్కుమార్తోపాటు మరో నలుగురు మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్కు వెళ్లే కాలువలో ఈత కోసం దిగారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతోపాటు ఈత రాకపోవడంతో విజయ్కుమార్ నీటిలో మునిగిపోతుండగా స్నేహితులు కాపాడే ప్రయత్నం చేశారు.. అయినా ఫలించలేదు. దీంతో విజయ్కుమార్ మృతి చెందాడు. విజయ్ కుమార్ ఆర్మీ క్యాంటీన్లో కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తున్నాడన్నారు. ఈ మేరకు మృతుల కుటుంబీకుల మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో విషాదంసత్తుపల్లి టౌన్: ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎన్టీఆర్ నగర్లో నివాసం ఉంటున్న వేంసూరు మండలం కుంచపర్తికి చెందిన ఒంగూరి జానకి, వెంకటేశ్వరరావు కుమారుడు నాగబాబు (12) రేజర్ల సమీపాన మామిడి తోటలో గేదెలు మేపేందుకు వెళ్లాడు. నాగబాబుతోపాటు అదే కాలనీకి చెందిన వంటిపులి దేవ (11), షేక్ సైదులు కూడా వెళ్లారు. ఈ క్రమంలో పక్కనే నీళ్లు ఉన్న మట్టి క్వారీ గుంత వద్దకు వెళ్లి ఈత కొట్టేందుకు దూకారు. అయితే క్వారీ గుంతలో నీళ్ల లోతును అంచనా వేయలేక మునిగిపోతూ కేకలు వేశారు. సమీపంలో గేదెలు మేపుతున్న దేశినేని సుధారాణి తన చున్నీ విసిరి భుజాల వరకు నీట మునిగిన షేక్ సైదులును కాపాడింది. మిగతా ఇద్దరు నీళ్లల్లో పూర్తిగా మునిగిపోవడంతో మరణించారు. చెరువులో మునిగి ఇద్దరు మృతికోనరావుపేట (వేములవాడ): చెరువులో మునిగి ఇద్దరు చనిపోయిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారంలో విషాదం నింపింది. ధర్మారం గ్రామానికి చెందిన ముడికె లక్ష్మీరాజం (65), కుమ్మం మొండయ్య (55) అనే గొర్రె కాపరులు తమ జీవాలను తీసుకుని గ్రామ శివారులోని పెద్దచెరువు వైపు వెళ్లారు. గొర్లను చెరువులోకి తీసుకెళ్లి స్నానం చేయించేందుకు దిగగా లక్ష్మీరాజం ప్రమాదవశాత్తు చెరువులో జారిపడ్డాడు. గమనించిన మొండయ్య అతడిని కాపాడేందుకు చెరువులోకి దిగాడు. ఈక్రమంలో లక్ష్మీరాజం.. మొండయ్య మెడను గట్టిగా పట్టుకోవడంతో ఈత వచ్చినా కూడా ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. కోనరావుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కుంటలో మునిగి...అబ్దుల్లాపూర్మెట్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడలో నివసిస్తున్న నాగనా థ్ పంచాల్ కుమారుడు నరేష్ నాగనాథ్ (14) కోహెడ జెడ్పీ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. శనివారం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన నరేష్ ఈత కొట్టేందుకు బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేక పోయింది. ఆదివారం ఉదయం సంఘీనగర్ నుంచి గండిచెరువుకు వెళ్లే దారిలో ఉన్న సమల గడ్డ కుంట వద్ద నరేష్ దుస్తులు, చెప్పులు కనిపించడంతో కుంటలో పరిశీలించగా మృతదేహం నీటిపై తేలుతూ కనిపించింది. అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
డీసీసీ కార్యవర్గం ఎప్పుడో?
పచ్చని అందాలు మహబూబ్ సాగర్ చెరువు కింద వరి పొలాలన్నీ పచ్చని తివాచీలాదర్శనమిస్తున్నాయి. వివరాలు IIలో uజిల్లా కాంగ్రెస్ కమిటీ పూర్తి కార్యవర్గం ఎప్పుడు ప్రకటిస్తారని పార్టీ నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఉగాది సందర్భంగా రాష్ట్రంలోని 14 డీసీసీ పూర్తిస్థాయి కమిటీలను నియమించింది. సిద్దిపేటను మాత్రం పెండింగ్లో పెట్టింది. కార్యవర్గం ఏర్పాటు కోసం నేతల మధ్య సమన్వయం కుదరపోవడమే కారణమని ఆ పార్టీ నేతలు జోరుగా చర్చించుకుంటున్నారు. – సాక్షి, సిద్దిపేట గతేడాది నవంబర్ 22న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా తూంకుంట ఆంక్షారెడ్డిని అధిష్టానం నియమించిన విషయం తెలిందే. గత నాలుగు నెలలుగా అధ్యక్షురాలు ఒక్కరే కొనసాగుతున్నారు. డీసీసీ పూర్తి స్థాయి కమిటీ కోసం టీపీసీసీ నుంచి మల్లాది పవన్, రోహిత్రావులను నియమించారు. కార్యవర్గం నియామకం కోసం నియోజకవర్గ ముఖ్యనేతలతో వారు సమావేశాలు నిర్వహించారు. అయితే నియోజకవర్గ నేతల మధ్య సమన్వయం లేకపోవడంతోనే డీసీసీ కమిటీని ప్రకటించలేదని తెలుస్తోంది. డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి తోడుగా గట్టి టీం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నేతలు తమ అనుచరులకు పార్టీ పదవులు ఇప్పించుకోవాలని పోటీ పడుతున్నారు. పోటీ ఎక్కువే.. కాంగ్రెస్లో సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తూనే మహిళలు, యువతకు పదవుల్లో పెద్దపీట వేయాలని అధిష్టానం నిర్ణయించింది. ఇకపై పార్టీ కమిటీలే అన్ని నిర్ణయాల్లో కీలక పాత్ర వహిస్తాయనే సంకేతాలతో వీటిని దక్కించుకునేందుకు నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. డీసీసీ కమిటీ, మండల, బ్లాక్ కమిటీలే ఇక పార్టీలో క్రియాశీలక పాత్ర వహిస్తాయని సంకేతాలివ్వడంతో పదవులను దక్కించుకునేందుకు నేతల్లో పోటీ మొదలైంది. ఒక్కో బ్లాక్కు ఇద్దరు ఉపాధ్యక్షులు, ఇద్దరు ప్రధాన కార్యదర్శులను నియమించాలని పార్టీ నాయకత్వం సూచించినట్లు సమాచారం. ప్రతి మండలం నుంచి ఒక కార్యదర్శి, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒక అధికార ప్రతినిధి ఉండేలా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా కార్యవర్గ సభ్యులను దాదాపు 15 మంది వరకు నియమించనున్నారు. దీంతో ఇప్పటికే మంత్రులు, నియోజకవర్గ ఇన్చార్జిలతో పలువురు నేతలు డీసీసీలో చోటు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పలువురు రాష్ట్ర నాయకులు నేతల పేర్లను సైతం సిఫార్సు చేసినట్లు సమాచారం.ఆశగా ఎదురుచూపులు కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో జిల్లా పదవుల కోసం పలువురు నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. పార్టీ పదవి ఉంటే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అలాగే త్వరలో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ టికెట్ల ఎంపికలో కీలక పాత్ర పోషించవచ్చని, దీంతో పదవిని దక్కించుకునేందుకు తీవ్ర ప్రయ త్నాలు చేస్తున్నారు. -
పిల్లల బంగారు భవిష్యత్ మీదే
కలెక్టర్ హైమావతి సిద్దిపేటరూరల్: అధికారికంగా దత్తత తీసుకున్న దంపతులు పిల్లల బంగారు భవిష్యత్కు బంగారు బాటలు వేయాలని కలెక్టర్ హైమావతి అన్నారు. శనివారం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 4 సంవత్సరాల బాబును ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన దంపతులకు, 6 నెలల ఆడశిశువును నిజామాబాద్ జిల్లాకు చెందిన దంపతులకు దత్తత ఇచ్చారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలను బాగా చదివించాలని, వారికి ఇష్టమైన రంగంలో ప్రోత్సహించాలన్నారు. పిల్లలను భవిష్యత్ నిర్మాణ పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు. జిల్లాలో పిల్లలు లేని దంపతులు ఎవరైనా దత్తత తీసుకోవాలంటే సిద్దిపేట శిశుగృహ, బాలల పరిరక్షణ విభాగం ద్వారా అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తద్వారా న్యాయపరమైన ఇబ్బందులు ఉండవన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి శారధ, బాలరక్షాభవన్ కోఆర్డినేటర్ మమత, డీసీపీఓ రాము, శిశు గృహ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కవిత, కాంగ్రెస్ ఒకటే: ఎంపీ రఘునందన్ సంగారెడ్డి: కవిత కాంగ్రెస్ ఒకటేనని, ఆమె నూతన పార్టీ ఏర్పాటు చేస్తారని తాను ఏడాది క్రితమే చెప్పానని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. శనివారం ఆయన సంగారెడ్డిలో విలేకరులతో మాట్లాడుతూ అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ నాలుగు ముక్కలు అవుతుందని తాను అప్పుడే జోస్యం చెప్పానన్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ కనుమరుగవుతుందని, కాంగ్రెస్ – బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని విమర్శించారు. -
ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026
ఆధునిక సాగుతో అధిక లాభాలు: వీసీ ములుగు(గజ్వేల్): రైతులు ఆధునిక పరిజ్ఞానాన్ని సాగులో ఉపయోగించడం ద్వారా ఖర్చులు తగ్గి అధిక దిగుబడిని పొందవచ్చని కొండాలక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ రాజిరెడ్డి అన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం పరిధిలోని షెడ్యూల్ కులాల ఉప ప్రణాళిక కింద శనివారం రైతు విజ్ఞాన యాత్రను ప్రారంభించి మాట్లాడారు. భవిష్యత్తులో ఉద్యాన పంటలకు మరింత ఆదరణ ఉంటుందని తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా మేలైన వర్షాలతో రైతులు పత్తి, వరి పంటలను అధికంగా సాగు చేస్తున్నారని, ఎల్నినో నేపథ్యంలో అన్ని పంటలతో పోలిస్తే కూరగాయల సాగే తక్కువ నీటితో సాధ్యమన్నారు. గోదావరి, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పరిధిలోని భూములు సారవంతంగా, నీటి లభ్యత పుష్కలంగా ఉండటంతో ఈ ప్రాంతంలో కూరగాయల సాగు ఇంకా లాభదాయకమని వివరించారు. రైతులు రసాయనాలు తగ్గించి జీవన ఎరువులు తయారు చేసుకోవాలని సూచించారు. బిందు సేధ్యంతో తక్కువ నీటితో వేసవిలో సైతం ఎక్కువ విస్తీర్ణంలో కూరగాయలు సాగు చేసుకోచ్చునని తెలిపారు. కార్యక్రమంలో వర్సిటీ అధికారులు, రైతులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.పొరుగు జిల్లాల్లో ఖరారు నేతల మధ్య సమన్వయం లేకసిద్దిపేట పెండింగ్ నాలుగు నెలలుగా అధ్యక్షురాలు ఒక్కరే.. చోటు కోసం ఆశగాఎదురుచూస్తున్న పార్టీ నేతలు -
ఏప్రిల్ 2 నుంచి గ్రామసభలు
అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ సిద్దిపేటరూరల్: ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఏప్రిల్ 2 నుంచి జిల్లావ్యాప్తంగా గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ అబ్దుల్హమీద్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించి వారి నుంచి అవసరమైన సలహాలు, సూచనలు స్వీకరించాలన్నారు. జిల్లా, డివిజన్, మండలం, గ్రామస్థాయి వరకు కేటాయించిన విధులు సక్రమంగా నిర్వహించాలన్నారు. అదేవిధంగా గ్రామాల్లో చేపట్టిన పనులు ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ నాగరాజమ్మ, డీఆర్డీఓ జయదేవ్ఆర్యా, జెడ్పీ సీఈఓ రమేశ్, డీపీఓ రవీందర్, ఆర్డీఓ లక్ష్మణ్, డీఈఓ శ్రీనివాస్రెడ్డి, డీడబ్ల్యూఓ శారద, హౌసింగ్ పీడీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు ఇబ్బంది కలగకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు, తాగునీటి సరాఫరా సక్రమంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. -
అనుసంధానం ఇంకెన్నేళ్లు?
తరచూ చర్చనీయాంశం..గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి కంఠహారంగా నిర్మించిన ‘రింగు రోడ్డు’ అంశం తరుచూ వార్తల్లోకెక్కుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య చర్చకు దారితీస్తోంది. రూ.233కోట్ల వ్యయంతో ఈ రింగ్ రోడ్డు నిర్మించి పదేళ్లు కావొస్తోంది. అయినా కేవలం 150మీటర్ల పని పెండింగ్ వల్ల పూర్తిస్థాయి అనుసంధానానికి నోచుకోవడంలేదు. అసెంబ్లీలోనే కాదు.. ఈనెల 22న జిల్లాలో జరిగిన ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ దృష్టికి సైతం ఈ అంశం వెళ్లింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ స్పందనపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉన్నది. – గజ్వేల్ మాజీ సీఎం కేసీఆర్ చొరవ ఫలితంగా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ రింగు రోడ్డు మంజూరైంది. 23కిలోమీటర్ల మేర 2015లో పనులు మొదలయ్యాయి. ఆగుతూ... సాగిన ఈ పనుల నిర్మాణ వ్యయం రూ.233కోట్లకు చేరింది. పనులు వందశాతం పూర్తికాకుండానే 2023 అక్టోబర్లో అధికారికంగా ప్రారంభించారు. ఈ రింగు రోడ్డు రాష్ట్రంలోనే మోడల్గా తీర్చిదిద్దారు. ఒక పట్టణ అవసరాలకు రింగు రోడ్డు నిర్మించడం ఇదే తొలిసారి. ఈ క్రమంలోనే ఈ రోడ్డుకు అంతర్జాతీయ ప్రమాణాలద్దారు. రింగు రోడ్డుకు అనుసంధానంగా మరో నాలుగు రేడియల్ రోడ్లు 12.5కిలోమీటర్ల మేర నిర్మాణం జరిగింది. మరెన్నో ప్రత్యేకతలను ఈ రోడ్డు సొంతం చేసుకున్నది. మొత్తం 12 సర్కిళ్లతో ఈ రోడ్డు నిర్మాణం జరిగింది. రింగు రోడ్డు నిర్మాణం వల్ల గజ్వేల్–ప్రజ్ఞాపూర్ చుట్టూ ఉన్న రోడ్డుకు వెలుపలు, బయట భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. మరోవైపు ఈ రోడ్డును ఆనుకొని విల్లాలు, అపార్ట్మెంట్లు వెలుస్తున్నాయి. అంతేకాకుండా వ్యాపార, వాణిజ్య సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లు విరివిగా ఏర్పాటు చేస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ రోడ్డు కేవలం 150మీటర్ల పనుల పెండింగ్ వల్ల పదేళ్లుగా వందశాతం అనుసంధానానికి నోచుకోకపోవడం ఆందోళన కలిగిస్తున్నది.గజ్వేల్ రింగ్ రోడ్డుకు పదేళ్లు.. 23కిలోమీటర్ల మేర అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం రూ.233కోట్లతో సాగిన పనులు సీఎం రేవంత్రెడ్డి దృష్టికి వ్యవహారం ప్రభుత్వ స్పందన కోసం ఎదురుచూపులు -
విద్యుత్ సరఫరాలో సర్కార్ విఫలం
గజ్వేల్: రైతులకు నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ విమర్శించారు. శుక్రవారం గజ్వేల్ మండలం అహ్మదీపూర్ విద్యుత్ సబ్స్టేషన్ను రైతులతో కలిసి ముట్టడించారు. ఈ సందర్భంగా విద్యుత్శాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో రైతులకు 24గంటలపాటు నిరంతర విద్యుత్ సరఫరాను ఇచ్చి అండగా నిలిస్తే నేడు.. రాష్ట్రంలో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి విద్యుత్ కోతలు, సరఫరాలో లోవోల్టేజీ సమస్యలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులను ఇబ్బంది పెడితే సహించేదిలేదని, వారి పక్షాన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రభాకర్, రైతుబంధు సమితి గజ్వేల్ మండలశాఖ మాజీ అధ్యక్షుడు రాజిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రమేష్గౌడ్, అహ్మద్, నిజామొద్దీన్, గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వారసంత వేలం రూ.1.10 కోట్లు
హుస్నాబాద్: మున్సిపల్ కార్యాలయంలో గురువారం రెండోసారి వారసంత వేలం చైర్ పర్సన్ దండి లక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. మొదటిసారి జరిగిన వేలంలో రూ.2 కోట్లకు దక్కించుకున్న కాంట్రాక్టర్ గడువు లోగా మూడో వంతు డిపాజిట్ చెల్లించకపోవడంతో వేలం పాటను రద్దు చేశారు. దీంతో కాంట్రాక్టర్ డిపాజిట్ కింద చెల్లించిన రూ.10 లక్షలు జప్త్ చేసినట్లు కమిషనర్ మల్లికార్జున్ తెలిపారు. వేలంలో ఉప్పుల రాంరెడ్డి అనే కాంట్రాక్టర్ రూ.1.10 కోట్లకు వారసంతను దక్కించుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. -
ఐటీ టవర్లపై పట్టింపేదీ?
● కాంగ్రెస్ పాలనలో నిర్లక్ష్యం ● అసెంబ్లీలో మాజీమంత్రి హరీశ్రావు సిద్దిపేటజోన్: ఐటీ రంగాన్ని క్షేత్ర స్థాయిలో విస్తరించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఐటీ టవర్లను ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వాటిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అందుకు సిద్దిపేట ఐటీ టవరే ఉదాహరణ అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ హరీశ్రావు మండిపడ్డారు. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో సిద్దిపేట ఐటీ టవర్ సమస్యలపై ప్రస్తావించారు. ఇటీవల సిద్దిపేట ఐటీ టవర్ సందర్శించగా అనేక ఇబ్బందులు ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో 18 కంపెనీలు పనిచేస్తే ప్రస్తుతం 7కంపెనీలు వెళ్లిపోయి 11 మాత్రమే ఉన్నాయన్నారు. నెట్బిల్లు లేక ఐటీ టవర్కు ఇంటర్ నెట్ కనెక్షన్ కట్ చేశారని, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడంతో 4నెలలుగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న కంపెనీలకు మూడు నెలల ఫ్రీ రెంటల్ సౌకర్యం కల్పించాలని, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాలు విడుదల చేయాలని, కొత్త కంపెనీలను ఆహ్వానించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. కుంటల, చెరువుల మరమ్మతులకు నిధులు నియోజకవర్గ పరిధిలోని చెరువుల, కుంటల మరమ్మతులకు నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే హరీశ్రావు తెలిపారు. నీటిపారుదల శాఖకు సంబంధించి రూ.కోటి7లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయన్నారు. ఇంద్రగూడెం పల్లె కుంట, మొండి కుంట మరమ్మతులకు రూ.48లక్షల20వేలు, మిట్టపల్లి నుంచి గుండ్ల చెరువు ఫిడర్ ఛానల్ వద్ద బ్రిడ్జి కూలిపోవడంతో నూతన బ్రిడ్జి కోసం ప్రతిపాదనలు పంపించగా రూ.47లక్షల20వేలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. మెరుపు కుంట శాశ్వత మరమ్మతుల కోసం రూ.12లక్షల 45వేలు మంజూరు చేసినట్టు తెలిపారు. పనులను త్వరితగతిన ప్రారంభించాలని సూచించారు. -
శుక్రవారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2026
రుణలక్ష్యం చేరాల్సిందేసిద్దిపేటరూరల్: ఆర్థిక సంవత్సరం రుణ లక్ష్యాన్ని నెలాఖరులోగా సాధించాలని కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ. 10,736 కోట్ల రుణాలు లక్ష్యంగా నిర్ణయించగా 2025 డిసెంబర్ నాటికి రూ. 7,309 కోట్ల రుణాలు అందించినట్లు తెలిపారు. అదేవిధంగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి ఆయా బ్యాంకుల రుణ నిల్వలు, మార్కెట్ షేర్ ఆధారంగా బ్యాంకులవారీగా ఏప్రిల్ నెలలో ప్రయారిటీ, నాన్ ప్రయారిటీ రుణాల లక్ష్యాలను నిర్దేశిస్తామన్నారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాల మంజూరుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల, పరిశ్రమల శాఖ, వ్యవసాయ రుణాలను నిర్దేశిత లక్ష్యం మేరకు అందించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఎల్డీఎం హరిబాబు, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, ఈడీఎస్సీ కార్పొరేషన్ విజయ్ భార్గవ్, జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం సహించేది లేదు దుబ్బాకటౌన్: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ హైమావతి వైద్య సిబ్బందిని హెచ్చరించారు. రాయపోల్లోని పీహెచ్సీని ఆకస్మికంగా సందర్శించారు. హాజరు రిజిస్టర్ తనిఖీ చేశారు. వైద్యాధికారి అరెపల్లిలో ఫీల్డ్ విజిట్ లో ఉన్నట్లు సిబ్బంది తెలపగా వీడియో కాల్ చేసి నిజనిర్ధారణ చేశారు. ఏదో ఒక సాకు చెబుతూ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని మండిపడ్డారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించారు. అనతంరం దౌల్తాబాద్ మండలం శేరిపల్లి బందారంలోని గురుకులకు వెళ్లి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. వంటలు నాసిరకంగా ఉండటంతో వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘డివిజన్’ సాధించితీరుతాం
● అక్రమ అరెస్టులతో అణచివేత తగదు ● జేఏసీ నాయకుల స్పష్టీకరణచేర్యాల(సిద్దిపేట): చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధించితీరుతామని, అక్రమ అరెస్టులతో అణచివేత తగదని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. డివిజన్ ఏర్పాటు చేయాలని కోరుతూ గురువారం జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన అసెంబ్లీ ముట్టడికి చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, దూల్మిట్ట మండలాల పరిధిలోని పలు గ్రామాల నాయకులు తరలివెళ్లారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపేందుకు వెళ్లిన వారందరినీ పోలీసులు అరెస్టు చేసి సమీపంలోని పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమ ప్రాంత చిరకాల కోరిక అయిన చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేందుకు వచ్చిన తమను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్స్టేషన్లకు తరలించడం అన్యాయమన్నారు. అరెస్టయిన వారిలో జేఏసీ నాయకులు నర్సయ్య, మల్లారెడ్డి, బాల్నర్సయ్య, కరుణాకర్, వెంకట్రెడ్డి, యెల్లారెడ్డి, ఉపేంధర్రెడ్డి, సంతోష్, యాదగిరి, చందు, మల్లేశం తదితరులున్నారు. -
యుద్ధమంట
ధరల సెగ.. సామాన్యుడు విలవిలఅంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరుగుదల.. రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. యుద్ధం కారణంగా దిగుమతులు నెమ్మదించడం, షిప్పింగ్ ధరలు పెరగడంతో మార్కెట్లో ప్రతి వస్తువు ధర పెరిగింది. దీనికి తోడు కొందరు వ్యాపారులు యుద్ధాన్ని బూచిగా చూపుతూ ధరలు పెంచి వినియోగదారులపై అదనపు భారం మోపుతున్నారు. పెరిగిన ధరలతో పేద, మధ్య తరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 10.12లక్షల మంది జనాభా ఉండగా 4లక్షలకు పైగా కుటుంబాలున్నాయి. ఒక్కో కుటుంబ సగటున రోజుకు 100 మిల్లీలీటర్ల వంట నూనె వినియోగిస్తున్నట్లు అంచనా. ప్రస్తుతం అన్ని రకాలపైనా లీటరుకు రూ.25 నుంచి రూ.35 పెరిగింది. ఈ లెక్కన రోజుకు జిల్లా ప్రజలపై దాదాపు రూ.5లక్షలకు పైగా భారం పడుతోందని అంచనా. వంట నూనెల వ్యాపారం చేసే వారు జీరో బిల్లులే ఇస్తున్నారు. ఒరిజినల్ బిల్లు అడిగితే మరుసటి రోజే వంట నూనెల సరఫరా ఆలస్యం చేస్తున్నారు. బ్రాండెడ్ నూనెల కోసం తప్పని పరిస్థిలలో జీరో బిల్లులోనే నూనెలను తీసుకోవాల్సి వస్తోందని పలువురు చిరు వ్యాపారులు అంటున్నారు. సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాలలతో పాటు మండల కేంద్రాలలో ఎక్కువగా ఈ నూనెల అమ్మకాలు జరుగుతున్నాయి. జీరో బిల్లులపై జీఎస్టీ అధికారులు ఒక్కసారి సైతం తనిఖీలు చేసిన సందర్భాలు లేవు. కొన్ని సంవత్సరాలుగా ఈ దందానే కొనసాగుతోంది. పూటగడవడం కష్టంగా ఉంది యుద్ధం ఏమో కానీ నిత్యావసర సరుకుల ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నూనె ధరలు అధికంగా పెరిగాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలకు పూట గడవడం కష్టంగా మారింది. ప్రభుత్వం దృష్టి సారించి ధరలను నియంత్రించాలి. –రేపాక పుష్పలత, గృహిణి ఇలా అయితే బతికేదెట్లా..ఏ వస్తువు కొనుగోలు చేయాలన్నా ధరలు మండి పోతున్నాయి. అక్కడెక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ మండిపోతున్నాయి. ధరల పెరుగుదలతో ఏమీ కొనలేకపోతున్నాం. ప్రభుత్వాలు దృష్టి సారించి రేషన్ షాప్ల ద్వారా నిత్యావసర సరుకులను అందించాలి. –మహేశ్వరి, మిట్టపల్లికృత్రిమ కొరత సృష్టించి.. నిత్యావసర వస్తువులు కృత్రిమ కొరతను వ్యాపారులు సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. బ్లాక్ మార్కెట్కు తరలించిన, అధిక ధరలకు అమ్మినా మండల, డివిజన్, జిల్లా స్థాయిలో ఉన్న నియంత్రణ కమిటీలు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. అవన్నీ మొక్కుబడిగా మారాయి. అధికారులు వీటిపై దృష్టి సారించడం లేదు. హోల్సేల్ వ్యాపారాలు, పెద్ద కిరాణం షాపులను తనిఖీ చేస్తే అధిక ధరలకు అమ్మకుండా నియంత్రణలో ఉంటారు. ఇప్పటికై నా అధికారులు దృష్టి సారించాలని వినియోగదారులు కోరుతున్నారు. -
జాతీయ లోక్అదాలత్ను సద్వినియోగం చేసుకోండి
సృజనాత్మకత.. పలు మండలాల్లోని అంగన్వాడీల్లో బాళమేళాలు చేపట్టారు. విద్యార్థులకు ఆటలు, పాటలు చేపట్టారు. వివరాలు 9లో uజిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవిసిద్దిపేటకమాన్: జిల్లా కోర్టు ప్రాంగణంలో ఈ నెల 28న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి తెలిపారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. అవకాశం ఉన్న కేసులు రాజీ కుదుర్చుకోవాలన్నారు. దీంతో సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు. గురువారం నుంచే కక్షిదారులు కోర్టులో కేసులు రాజీ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. జిల్లాలో మొత్తం 2,340 కేసులు రాజీ కుదుర్చుకునేందుకు అవకాశం ఉందన్నారు. అదేవిధంగా జిల్లా కోర్టులో బ్యాంకు అధికారులతో న్యాయమూర్తి సంతోష్కుమార్ సమావేశం నిర్వహించారు. -
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బడ్జెట్ రూ.40.31కోట్లు
● ఏకగ్రీవంగా ఆమోదించిన పాలకవర్గం ● సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ యాదవరెడ్డిగజ్వేల్: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి 2026–27 ఆర్థిక సంవత్సరానికిగానూ రూ.40.31 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బుధవారం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో చైర్పర్సన్ గంగిశెట్టి చందన అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బడ్జెట్ వివరాలను జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ విమల చదివి వినిపించారు. మున్సిపాలిటీకి అంచనా ఆదాయం రూ.40.31 కోట్లుగా, వ్యయం రూ.39.88 కోట్లుగా చూపి.. మిగులు రూ.49.63 కోట్లుగా ఉంటుందని వెల్లడించారు. బడ్జెట్ నిధులను ప్రాధాన్యత రంగాలకు ఖర్చుపెడతామని చైర్పర్సన్ తెలిపారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్, వైస్ చైర్పర్సన్ కళ్యన్కర్ పద్మాబాయి, అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
దరఖాస్తు చేసుకోండి
ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఎస్సీ కార్యాచరణ ప్రణాళికాలో భాగంగా స్వయం ఉపాఽధి పథకాలు, శిక్షణా కార్యక్రమాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విజయభార్గవ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎలక్ట్రికల్ టూ విలర్, త్రీ వీలర్, అగ్రిడోన్ సేవలు, వ్యవసాయ యాంత్రిక ఉమ్మడి కేంద్రం, సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్, వ్యవసాయ అనుబంధ విభాగం, పాడిగేదెల పథకం, సెరికల్చర్, ఉద్యాన సంబంధిత, చిన్ననీటి పారుదల బోర్వెల్ విద్యుదీకరణ పంప్ సెట్లు, సబ్ మెర్సిబుల్ పంప్ సెట్, సర్వీస్ కనెక్షన్ చార్జీలు, బోర్వెల్ వేయడానికి అయ్యే ఖర్చులో సబ్సిడీలో అందించనున్నట్లు తెలిపారు. ఆసక్తి కల్గిన ఎస్సీ అభ్యర్థులు ఏప్రిల్ 2 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే శిక్షార్హులు సిద్దిపేటఅర్బన్: కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో నిర్లక్ష్యం చేయడం నైతికంగా తప్పే కాకుండా చట్టపరంగా శిక్షార్హులవుతారని సిద్దిపేట త్రీటౌన్ సీఐ టాటా లక్ష్మీబాబు హెచ్చరించారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేసిన కుమారులకు బుధవారం పోలీస్ స్టేషన్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. త్రీటౌన్ పరిధిలోని ఖమ్మంపల్లికి చెందిన పాముకుంట నర్సయ్య, ఎల్లవ్వ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. ముగ్గురికి సమానంగా ఆస్తులను పంచి ఇచ్చారు. అయినప్పటికి వారిని పోషించకుండా వదిలేయడంతో ఈ నెల 18న ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన సీఐ బుధవారం ముగ్గురు కుమారులను పిలిపించి తల్లిదండ్రుల సమక్షంలో వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. తల్లిదండ్రుల బాధ్యత ప్రతి కుమారుడి ప్రాథమిక బాధ్యత అని హితబోధ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలుప్రశాంత్నగర్(సిద్దిపేట): రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకో నున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి బుధవారం తెలిపారు. జిల్లాలోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో ఒంటిపూట పాఠశాలలు నిర్వహించకుండా, పూర్తి స్థాయి (ఫుల్డే) నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నా రు. జిల్లాలోని అన్ని పాఠశాలలు ఏప్రిల్ 23 వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలన్నారు. -
ఆర్ఎంపీ క్లినిక్లలో వైద్యాధికారుల తనిఖీలు
చేర్యాల(సిద్దిపేట): మండలంలోని ఆకునూరులో వైద్య విద్యార్హతలు లేకపోయినా కొందరు వ్యక్తులు ప్రజలకు వైద్యం చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై ఉన్నతాధికారులు స్పందించారు. ఈ మేరకు బుధవారం టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు పలు ఆర్ఎంపీ క్లినిక్లలో తనిఖీలు నిర్వహించారు. గ్రామంలో వైద్యం చేస్తున్నట్లు గుర్తించిన శ్రీధర్, యాదగిరి, రాజేష్, విజయ్కుమార్ క్లినిక్లలో తనిఖీలు నిర్వహించిన అనంతరం వారు మాట్లాడారు. కలెక్టర్, జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టామన్నారు. యాదగిరి అనే వ్యక్తి వద్ద నార్కోటిక్ డ్రగ్యాక్ట్ కిందకు వచ్చే పలు యాంటీ బయోటిక్స్, స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ గుర్తించామన్నారు. రాజేష్ అనే వ్యక్తి క్వాలిఫైడ్ నర్సు. తాను ప్రాక్టీస్ చేయడం మానేసినట్లు తెలిపారని, అతడి నర్సింగ్ కోర్స్ సర్టిఫికెట్, నర్సింగ్ కౌన్సిల్ సర్టిఫికెట్స్ పరిశీలించినట్లు తెలిపారు. విజయ్కుమార్ అనే వ్యక్తి క్లినిక్లో యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్, వాడిన ఐవి సెట్స్, సర్జరీకి ఉపయోగించే పరికరాలు గుర్తించామన్నారు. శ్రీధర్ అనే వ్యక్తి అందుబాటులో లేకపోవడంతో అతడి క్లినిక్ పరిశీలించలేదన్నారు. ఇరువురి వద్ద లభించిన వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. తనిఖీల్లో టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు ఇన్చార్జి ఎంపీడీఓ ప్రకాశ్, ఎస్ఐ అపూర్వరెడ్డి, ఆర్ఐ రాజేందర్రెడ్డి, ముస్త్యాల పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ ప్రశాంత్రెడ్డి పాల్గొన్నారు. -
ప్రకృతిని పరిరక్షిస్తూ పరిశోధనలు చేయాలి
ఐఐసీటీ సైంటిస్ట్ వసుంధరసిద్దిపేటఎడ్యుకేషన్: ఆవశ్యకతనే ఆవిష్కరణలకు తల్లి అని, అవసరం ఉన్నప్పుడే మనిషి కొత్త ఆవిష్కరణల వైపు అడుగులు వేస్తారని ఐఐసీటీ సైంటిస్టు వసుంధర అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో ఫిజిక్స్ విభాగం ఆధ్వర్యంలో ‘ఎమర్జింగ్ మెటీరియల్ ఫర్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ అప్లికేషన్స్’ అనే అంశపై రెండ్రోజుల జాతీయ సదస్సు బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శాస్త్రవేత్తలు సమాజ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రకృతిని పరిరక్షిస్తూ పరిశోధనలు చేసి శాసీ్త్రయ అభివృద్ధిని సాధించాలని సూచించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో శాస్త్రవేత్త డాక్టర్ చంద్రబోస్, సదస్సు కన్వీనర్ డాక్టర్ మహేశ్కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మధుసూదన్, వైస్ ప్రిన్సిపాల్ పాల్గొన్నారు. -
జిల్లాలో ఇంధన కొరత లేదు
తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు సీపీ రష్మీ పెరుమాళ్ సిద్దిపేటకమాన్: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెట్రోల్ బంకుల్లో సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందన్నారు. ప్రజలు అనవసర అందోళనకు గురై ఒకేసారి బంకులకు చేరుకోవడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు సాధారణ పంపిణీకి అంతరాయం కలుగుతుందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దన్నారు. అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని సూచించారు. -
బూత్ స్థాయి ఏజెంట్లను నియమించండి
● కలెక్టర్, ఎన్నికల అధికారి హైమావతి ● రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం సాక్షి, సిద్దిపేట: ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించేందుకు త్వరగా బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలని అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హైమావతి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంపై చర్చించి సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు నమోదు ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులు, ఏజెంట్ల పాత్ర చాలా ముఖ్యమన్నారు. 2002లోని ఓటరు జాబితా, 2025 ఓటరు జాబితా సరిపోల్చుకొని జాబితాలో తీసివేతలు, కొత్త ఓటరు నమోదుకు సంబంధించిన ప్రక్రియ జరగనుందన్నారు. అలాగే రాజకీయ పార్టీల ప్రతినిధుల అభ్యర్థన మేరకు బూత్ స్థాయి ఏజెంట్లకు, అధికారులకు శాసనసభ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక ఓటరు నమోదుపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు మోహన్ లాల్, భైరీ శంకర్, అనిల్ కుమార్, మునీర్, కలెక్టరేట్ ఎలక్షన్ సూపరింటెండెంట్ బాలరాజ్లు పాల్గొన్నారు. -
నో
బుధవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2026గంటన్నర పాటు లైన్లో ఉంటే.. పెట్రోల్ కోసం ముస్తాబాద్ చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు వచ్చా. మూడు బంక్లు బంద్ ఉన్నాయి. పాత బస్టాండ్ బంక్ వద్ద గంటన్నర పాటు లైన్లో ఉంటే రూ.200 పెట్రోల్ పోశారు. రోజు ఇంటింటికి వెళ్లి బట్టలు ఉతుకుతాను. రోజుకు రూ.100 పెట్రోల్ ఖర్చు అవుతుంది. ఒక వైపు గ్యాస్.. మరో వైపు పెట్రోల్ కోసం ఇబ్బంది పడుతున్నాం. –బాలకిషన్, సిద్దిపేట ఇబ్బందులే.. ఫ్యామిలీతో బయటకు వచ్చాను. పెట్రోల్ పోయించుకుందామని అన్నీ పెట్రోల్ బంక్లు తిరిగా.. ఎక్కడా దొరకలేదు. ఇక్కడ ఉందని తెలిసి బంకుకు చేరుకున్నా. రోజు రూ.300 పెట్రోల్ ఖర్చు అవుతుంది. పెట్రోల్ కొరత ఏర్పడితే కరెంట్ బిల్లు చెల్లించేందుకు సైతం ఇబ్బందే.. – అరవింద్, గాడిచర్లపల్లిజిల్లాలో మొత్తం 193 పెట్రోల్ బంక్లు ఉన్నాయి. వీటికి ఇండియన్ ఆయిల్, హెచ్పీ, బీపీ ఆయిల్ కంపెనీల నుంచి పెట్రోల్, డీజిల్ సరఫరా అవుతోంది. జిల్లాకు సుమారు రోజూ లక్ష లీటర్ల పెట్రోల్, 3లక్షల లీటర్ల డీజిల్ సరఫరా జరుగుతోంది. కానీ మూడు రోజులుగా సరఫరా భారీగా తగ్గిపోయింది. దీంతో పలుచోట్ల బంకులు తాత్కాలికంగా మూసివేశారు. నోస్టాక్ బోర్డులు పెట్టారు. పెట్రో కొరత ఏర్పడిందనే వార్త దావానలంలా వ్యపించడంతో అందరూ బంకుల వద్ద బారులుతీరారు. పెట్రోల్ కోసం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్టాక్ ఉన్న బంకుల వద్దకు వాహనదారులు పెద్ద ఎత్తున పోటెత్తుతుండటంతో రద్దీ నెలకొంది. అవసరం లేకున్నా రోజువారి కంటే రెండింతలు పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేశారు. బంకులు బంద్ కావడంతో అవసరం ఉన్న చాలా మంది వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. బండ్లు మధ్యలోనే ఆగిపోవడంతో చాలా మంది బాటిళ్లలో తీసుకెళ్లారు. కృత్రిమ కొరతా? బంకుల యజమానులకు కంపెనీలు రూ.20 లక్షల వరకు క్రెడిట్ ఇచ్చేవి. ఇప్పుడు మొత్తం డిపాజిట్ చేస్తేనే పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. అది కూడా సమయం తీసుకుంటున్నట్లు తెలిసింది. దీంతో డీలర్లు ఎప్పటికప్పుడు డిపాజిట్ చేయకపోవడంతో కంపెనీలు సరఫరా నిలిపివేస్తున్నాయి. మరోవైపు పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఇంధనం రావడం లేదనే ప్రచారం కూడా జరుగుతోంది. పెట్రో ఉత్పత్తుల ధరలు పెరుగుతాయనే డీలర్లు పెట్రోల్, డీజిల్లను కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా అధికారులు చూడాలని వాహనదారులు కోరుతున్నారు. జిల్లాలో ఇంధన కొరత తీవ్ర రూపం దాలుస్తోంది. గృహాలు, హోటళ్లలో గ్యాస్ కొరతతో వంటలు.. పెట్రోల్, డీజిల్ కొరతతో రోడ్లపైనే వాహనాలు నిలిచిపోతున్నాయి. మంగళవారం పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయి. స్టాక్ ఉన్న బంకుల వద్ద బారులు తీరుతున్నారు. చాలా మంది తమ వాహనాలకు ఫుల్ ట్యాంకు చేయిస్తుండగా, మరికొందరు బాటిళ్లలో, క్యాన్లలో తీసుకెళ్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి, సిద్దిపేట -
నియోజకవర్గాల పునర్విభజన!
● జిల్లాలో ఐదుకు చేరనున్న అసెంబ్లీ స్థానాలు ● కొత్తగా ఏర్పడనున్న కొమురవెల్లి/చేర్యాల ● మారనున్న రాజకీయ ముఖచిత్రంసాక్షి, సిద్దిపేట: జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో పాటు ఒక అసెంబ్లీ స్థానం పెరిగే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. లోక్సభ, అసెంబ్లీ స్థానాలు 50శాతం మేర పెంచేలా కీలక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ నిర్ణయం అమలైతే జిల్లా రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారనుంది. ప్రస్తుతం ఉన్న నాలుగు నియోజకవర్గాల సంఖ్య ఐదుకు పెరిగే అవకాశం ఉంది. కొత్తగా కొమురవెల్లి/చేర్యాల జిల్లా వ్యాప్తంగా 2011 జనాభా లెక్కల ప్రకారం 10.12లక్షల జనాభా ఉంది. ప్రస్తుతం 26 మండలాలు ఉండగా సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రాలున్నాయి. జనగామలోని నాలుగు మండలాలు, మానకొండూరులోని ఒక మండలం ఉంది. అలాగే గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలోని పలు మండలాలు మెదక్ జిల్లాలో ఉన్నాయి. నాలుగు నియోజకవర్గాలు జనరల్ స్థానాలే ఉన్నాయి. హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో ఐదు నియోజకవర్గాలు అయ్యే అవకాశాలున్నాయి. దీంతో కొమురవెల్లి/ చేర్యాల కేంద్రంగా నూతనంగా నియోజకవర్గం ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. అలాగే పాత నియోజకవర్గాల్లో ఒకటి మహిళకు రిజర్వ్ అవుతుందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. జిల్లాలో మూడు లోకసభ నియోజకవర్గాల పరిధిలో పలు మండలాలున్నాయి. దీంతో జిల్లా మొత్తం కలిపి ఒకటే నియోజకవర్గం ఉండేలా చేస్తే సిద్దిపేట లోకసభ నియోజకవర్గం ఏర్పడే అవకాశాలున్నాయి. మారనున్న రాజకీయ సమీకరణలు జిల్లాలోని రాజకీయ సమీకరణలు సమూలంగా మారుతాయి. నియోజవర్గాల సంఖ్య పెరిగితే జిల్లాలోని పాత సరిహద్దులు మారుతాయి. దీంతో భౌగోళికంగా నియోజకవర్గాల స్వరూపం మారుతుంది. స్థానాల పెంపుతో రిజర్వేషన్ల ప్రక్రియలో భారీ మార్పులు వస్తాయి. నియోజకవర్గాల మార్పుతో ప్రస్తుత ఎమ్మెల్యేల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. మొత్తానికి పునర్విభజన ఎలా ఉంటుందో అని రాజకీయ నేతలు ఆందోళన చెందుతున్నారు. -
మల్లన్నసాగర్ కాల్వలు పూర్తి చేయండి
అసెంబ్లీలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాక: మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్అండ్ఆర్ ప్యాకేజీతో పాటు కాలువల నిర్మాణాలు పూర్తి చేయాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి కోరారు. సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తర సమయంలో ఇరిగేషన్పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్లకు సంబంధించి 90 శాతానికి పైగా కాలువల నిర్మాణాలు పూర్తికాగా ఇంకా 10 శాతం పనులు పెండింగ్లో ఉన్నాయన్నారు. దీంతో పంటలకు నీరందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉప్పరిపల్లి కెనాల్తో పాటు పలు కాలువలు భూసేకరణ, కోర్టు సమస్యతో మధ్యలోనే ఆగిపోయాయన్నారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు దృష్టిసారించి సమస్యను పరిష్కరిస్తే వేల ఎకరాలకు నీరందుతుందన్నారు. గత ప్రభుత్వంలో చేపట్టిన మిషన్ కాకతీయ పథకాన్ని పునరుద్ధరించి చెరువులను అభివృద్ధి చేయాలని కోరారు.


