Siddipet
-
కాంగ్రెసోళ్లకేనా ఇందిరమ్మ ఇళ్లు?
దుబ్బాక: ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో పూర్తిగా అవకతవకలు జరుగుతున్నాయని బ్రోకర్ల జేబులు తడిపితేనే ఇళ్లు మంజూరు చేసే పరిస్థితులు నెలకొన్నాయని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం దుబ్బాకలోని క్యాంపుకార్యాలయంలో నియోజకవర్గంలోని బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక కమిటీలో కాంగ్రెస్ వారే ఉన్నారని, వారి పార్టీకి చెందిన వారినే ఎంపిక చేస్తున్నారని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామంటూ దళారులు విచ్చలవిడిగా పేదలనుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారని తెలిపారు. పోలీస్వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అవుతోందని.. దుబ్బాక, మిరుదొడ్డిలలో ఎస్ఐలు లంచాలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి -
దరువు అంజన్నకు, బుర్ర సతీష్కు అవార్డులు
దుబ్బాకటౌన్/బెజ్జంకి(సిద్దిపేట): ఉద్యమ కారులు, గాయకులకు గద్దర్ అవార్డులు వరించాయి. సాయి అలేఖ్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని భాస్కర ఆడిటోరియంలో గద్దర్ ఐకాన్– 2024 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాయపోల్ మండలం కేంద్రానికి చెందిన కళాకారుడు దరువు అంజన్న, బెజ్జంకి మండలం గుండారం గ్రామానికి చెందిన బుర్ర సతీష్కు చేసిన సేవలకు గుర్తుగా అవార్డులు దక్కాయి. అవార్డులను శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్, తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్ వెన్నెల, టూరిజం శాఖ చైర్మన్ రమేష్రెడ్డి, ప్రజా గాయని విమలక్క చేతుల మీదుగా అందించారు. పండుగలు సంస్కృతికి ప్రతీకలుమిరుదొడ్డి(దుబ్బాక): లోక కల్యాణార్థం పల్లెల్లో నిర్వహించే పండుగలు సంస్క ృతీ సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలుస్తాయని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని కొండాపూర్లో నిర్వహించిన నల్ల పోచమ్మ తల్లి, బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు వారికి కలశంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమంలో వారు పాల్గొ ని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు భక్తి భావాన్ని కలిగి ఉండాలని కోరారు. ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. భగీరథ మహర్షికి నివాళిసంగారెడ్డి జోన్: భగీరథ మహర్షి దీక్షకు, సహనానికి ప్రతిరూపమని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం భగీరథ మహర్షి జయంతి సందర్భంగా సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి అదనపు కలెక్టర్తో పాటు పలువురు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అనుకున్నది సాధించేంతవరకు ఎంతటి కష్టన్నైనా ఎదుర్కోవడంతో ఆయనను భగీరథుడిగా పిలుస్తారని తెలిపారు. -
కాంగ్రెస్ సమావేశం రచ్చ రచ్చ
ఇందిరమ్మ కమిటీల్లో బీఆర్ఎస్ నేతల ఆధిపత్యమేంటని నిలదీత ● పార్టీ పరిశీలకుడిని అడ్డుకున్నపటాన్చెరు కాంగ్రెస్ నాయకులు ● మంత్రి దామోదర ఎదుటేనిలదీసిన శ్రేణులు ● కాంగ్రెస్ జిల్లా ముఖ్య నేతలసమావేశం రసాభాససాక్షిప్రతినిధి, సంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు.. అంతర్గత పోరు మరోమారు రచ్చకెక్కింది. మంత్రి దామోదర రాజనర్సింహ, పార్టీ పరిశీలకులుగా జిల్లాకు వచ్చిన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి సమక్షంలోనే ఆ పార్టీ పటాన్చెరు నియోజకవర్గం నేతలు రచ్చ రచ్చ చేశారు. సమావేశం వేదిక వద్దకు దూసుకొచ్చి.. రామ్మోహన్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ముఖ్యనాయకులు సముదాయించినా నాయకులు పట్టించుకోలేదు. దీంతో సమావేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం ఆదివారం సంగారెడ్డిలోని ఓ హోటల్లో ఆ పార్టీ జిల్లా ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా వ్యా ప్తంగా ఐదు నియోజకవర్గాల నుంచి ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్మోహన్రెడ్డి మాట్లాడుతుండగా నాయకులు అడ్డుకున్నారు. ఇందిరమ్మ కమిటీల్లో గూడెం పెత్తనంపై ఆగ్రహం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రామ్మోహన్రెడ్డి వివరిస్తున్న క్రమంలో పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ కమిటీల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పెత్తనం ఏంటని రామ్మోహన్ను ప్రశ్నించారు. ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికలో కీలకమైన ఈ కమిటీలోఅసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరిగిందని వాగ్వాదానికి దిగారు. నియోజకవర్గంలో ఇప్పటికీ బీఆర్ఎస్ నాయకుల మాటే చెల్లుబాటు అవుతోందని, ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని నేతలను నిలదీశారు. రామ్మోహన్రెడ్డి ఎంత వారించినా వినలేదు. పోలీసులు సైతం నిలువరించే ప్రయత్నం చేశారు. వేదికపై ఉన్న ఎంపీ సురేష్షెట్కార్, మాజీ మంత్రి చంద్రశేఖర్ కలుగచేసుకుని సముదాయించడంతో కొంత మేర శాంతించారు. స్వేచ్ఛే కాంగ్రెస్కు బలం.. బలహీనత : మంత్రి దామోదర కాంగ్రెస్ పార్టీకి స్వేచ్ఛే బలం, బలహీనత అని మంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యానించారు. కార్యకర్తలు లేనిది పార్టీ లేదు.. నాయకుడు లేడు అన్నారు. పార్టీలో వర్గ విభేదాలు ఉండటం సహజమేనన్నారు. కానీ సమన్వయం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో, తాలుకా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో.. సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యకర్తలే నాయకులకు బలమని, వారి కృషితోనే నాయకుల గెలుపోటములు ఆధారపడి ఉంటాయన్నారు. కార్యకర్తలకు కచ్చితంగా అండగా ఉంటామన్నారు. గూడెం ఫొటోపై మరో నేత ఫొటో అతికించి.. సమావేశంలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యేలు, జిల్లా ముఖ్యనేతల ఫొటోలను ఏర్పాటు చేశారు. ఇందులో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఫొటో కూడా ఉంది. ఈ ఫొటో ఏర్పాటు చేయడంపై కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ ఫ్లెక్సీపై మాజీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఫొటోను అతికించారు. హోటల్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలోనూ గూడెం మహిపాల్రెడ్డి ఫొటోపై మరోనాయకుడి ఫొటోను అతికించడం చర్చనీయాంశంగా మారింది. -
ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధం
హుస్నాబాద్: ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆదివారం హుస్నాబాద్ బస్టాండ్ను సందర్శించి ప్రయాణికులు, డ్రైవర్లు, కండక్టర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ ఈ నెల 5, 6వ తేదీల్లో తాను హైదరాబాద్లోనే ఉంటానని, ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైనా వచ్చి సమస్యలపై చర్చించవచ్చన్నారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో రవాణా వ్యవస్థ బాగుండాలని కొత్త బస్సులు, నియామకాలు, కారుణ్య నియామకాలు చేపట్టామని తెలిపారు. గత పదేళ్లుగా సమ్మెతో అనేక మంది చనిపోయినా పట్టించుకోలేదన్నారు. ఒక్క బస్సు కొనుగొలు చేయకుండా, ఒక్క నియామకం చేపట్టకుండా ఆర్టీసీ వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే ముందుకు వెళ్తుండటంతో సమ్మె చేస్తే మూలిగే నక్కపై తాటి పండు పడిన విధంగా చేయవద్దన్నారు. ఆర్టీసీ లాభాల బాటలో నడుస్తున్న సందర్భంలో పాత అప్పులు, పాత పీఎఫ్, సీసీఎస్ బకాయిలు తగ్గిస్తూ రిటైర్మెంట్ రోజున వారి నిధులు ఇచ్చే ప్రయత్నం జరుగుతోందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, డిపో మేనేజర్ వెంకన్న, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, కాంగ్రెస్ నాయకులు చిత్తారి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో సంస్థ నిర్వీర్యం మంత్రి పొన్నం ప్రభాకర్ -
పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయండి
గజ్వేల్రూరల్: ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ సూచించారు. ఆదివారం గజ్వేల్ పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలోని బీజేపీ పోలింగ్ బూత్ అధ్యక్షులు, క్రియాశీలక నాయకుల సమావేశాన్ని పట్టణశాఖ అధ్యక్షుడు మనోహర్యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ బూటకపు హామీలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీలకు బుద్ధిచెప్పడం ఖాయమన్నారు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రతి కార్యకర్త ప్రధాని నరేంద్రమోదీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించాలని సూచించారు. మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగురడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎల్లు రాంరెడ్డి, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ -
కూలిన టోల్గేట్ పైకప్పు
కొండపాక(గజ్వేల్): మండల కేంద్రమైన కొండపాకతో పాటు మర్పడగ, సిర్సనగండ్ల, దమ్మకపల్లి, దుద్దెడ, బందారం గ్రామాల్లో వడగళ్ల వర్షం కురిసింది. దుద్దెడ శివారులో రాజీవ్ రహదారిపై ఉన్న టోల్ గేట్ పైకప్పు రేకులు ఎగిరిపడ్డాయి. టోల్ ప్లాజా పైకప్పు షీట్లు కూలిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బందారంలో బాలవికాస నీటి శుద్ధీకరణ గది పూర్తిగా ధ్వంసం కాగా, పైకప్పు రేకులు ఎగిరిపడ్డాయి. ఇదే క్రమంలో రాజీవ్ రహదారి వెంబడి ఉన్న చెట్లు కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. ఇదిలా ఉంటే వర్షానికి రోడ్లపై ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోగా, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం కుప్పలు తడిసిముద్దయ్యాయి. -
శిక్షణ శిబిరాలు
పిల్లలను ప్రోత్సహించేందుకే● సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ మంజుల ● సాక్షి, అంబిటస్ పాఠశాల ఆధ్వర్యంలో.. ● ఉచిత వేసవి శిక్షణ శిబిరం ప్రారంభంసిద్దిపేటకమాన్: వేసవి సెలవుల్లో శిక్షణ శిబిరాలు చిన్నారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ కడవెర్గు మంజుల రాజనర్సు అన్నారు. శనివారం సాక్షి, అంబిటస్ పాఠశాల సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలోని అంబిటస్ పాఠశాలలో ఉచిత వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆమె హాజరై, అంబిటస్ పాఠశాల కరస్పాండెంట్ ఎడ్ల శ్రీనివాస్రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో ముచ్చటించి, భవిష్యత్లో వారు ఏమి కావాలనుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. శిక్షణ శిబిరంలో కరాటే, యోగా, మ్యూజిక్, హ్యాండ్ రైటింగ్, డ్యాన్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లను ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లో పిల్లలు బయట తిరగడం వల్ల వడదెబ్బ భారిన పడి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందన్నారు. పలు అంశాలపై శిక్షణ ఇవ్వడం వల్ల విద్యార్థుల్లో నైపుణ్యం పెరుగుతుందని తెలిపారు. వేసవి సెలవుల్లో సమయం వృథా చేయకుండా ఏదో ఒక అంశంపై పట్టు సాధించాలన్నారు. 15రోజుల పాటు ఉదయం 8.30 నుంచి 10.30 గంటల వరకు విద్యార్థులకు శిక్షణ ఇస్తారని తెలిపారు. ఉచిత వేసవి శిబిరాన్ని నిర్వహిస్తున్న సాక్షి మీడియా, అంబిటస్ పాఠశాల యాజమాన్యాన్ని ఆమె అభినందించారు. సుమారు వంద మంది పైగా విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పవన్రెడ్డి, డ్యాన్స్ మాస్టర్ వాసుదేవ్, కరాటే మాస్టర్ భాగ్యరాజ్, చిన్నా, టీచర్లు అపర్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం తరలింపులో ఇబ్బందులుండొద్దు
కోహెడరూరల్(హుస్నాబాద్)/హుస్నాబాద్: ధాన్యం తరలింపులో వాహనాల ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. శనివారం కోహెడ మండలంలోని శనిగరం గ్రామంలో అధునాతన పాడి క్లీనర్ అండ్ డ్రయ్యర్ యంత్రాన్ని మంత్రి ప్రారంభించారు. అలాగే శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం, పోచమ్మ దేవాలయాల జాతర ఉత్సవాలపై అధికారుల సమీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. రూ.180కోట్లతో మండలంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులు ప్రారంభం కానున్నాయన్నారు. శనిగరం గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కావాలని అడిగారని, త్వరలో కల్పిస్తామన్నారు. రేణుకా ఎల్లమ్మ, పోచమ్మ దేవాలయాలను స్థపతి ప్రకారమే అభివృద్ధి చేస్తామని మంత్రి అన్నారు. ఈ నెల 12 నుంచి జూన్ 11 వరకు జరిగే జాతరకు ఏర్పా ట్లు చేయాలన్నారు. ఆలయ అభివృద్ధికి రూ.9 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. మల్లెచెట్టు చౌరస్తా నుంచి ఎల్లమ్మ చెరువు మత్తడి వరకు రోడ్డు నిర్మాణానికి రూ.5కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మను చౌదరి, ఆర్డీఓ రామ్మూర్తి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, తహసీల్దార్ రవీందర్ రెడ్డి ఉన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ రూ.9 కోట్లతో ఎల్లమ్మ ఆలయం అభివృద్ధికి ప్రతిపాదనలు -
భూ భారతిపైనే రైతుల ఆశలు
అక్కన్నపేట(హుస్నాబాద్): రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భూ భారతి రెవెన్యూ చట్టాన్ని పైలట్ ప్రాజెక్టుగా ‘అక్కన్నపేట మండలాన్ని’ ఎంపిక చేస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మండలంలో ఎలాంటి భూ సమస్యలు ఉన్నాయి? ఎన్ని ఫిర్యాదులు వస్తున్నాయి? వాటి పరిష్కారం ఏ విధంగా సాధ్యమవుతుందని లెక్కలు వేసుకొని చట్టం ద్వారా వాటిని పరిష్కరిస్తారు. ఆ తర్వాత భూ భారతి పోర్టల్లో కూడా వాటికి సంబంధించిన మాడ్యూల్స్ను సిద్ధం చేస్తారు. భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోర్టల్ను రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తారు. అయితే భూ భారతి పైలట్ ప్రాజెక్టు కింద అక్కన్నపేట మండలాన్ని ఎంపిక చేయడానికి తన వంతు కృషి చేసిన రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు ఈ ప్రాంత రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని భూ సమస్యలకు భూ భారతి ద్వారా పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సాదాబైనామా, అసైన్డ్ భూముల సమస్యలే అధికంగా ఉన్నాయి. సాదాబైనామాలు, అసైన్డ్ భూముల కేసులే అధికం పైలట్ ప్రాజెక్టుగా ‘అక్కన్నపేట’ ఎంపిక హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలుషెడ్యూల్ వివరాలు భూ భారతి చట్టం అమలుకు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక కావడంతో తహసీల్దార్ అనంతరెడ్డి శనివారం విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అక్కన్నపేట, హుస్నాబాద్, కోహెడ మండలాల తహసీల్దార్లు బృందాలుగా ఏర్పడినట్లు తెలిపారు. ఈ బృందాల్లో మొదటి టీంలో అక్కన్నపేట తహసీల్దార్ అనంతరెడ్డి, రెండో టీంలో హుస్నాబాద్ తహసీల్దార్ జీ.రవీందర్రెడ్డి, మూడో టీంలో కోహెడ తహసీల్దార్ కె.సురేఖ ఉన్నారు. -
7 నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె
హుస్నాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సమ్మె సైరన్ మోగించేందుకు కార్మికులు సిద్ధమవుతున్నారని కరీంనగర్ రీజినల్ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఎంపీ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఆర్టీసీ కార్మికుల ప్రధాన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 7వ తేదీ నుంచి కార్మికులు సమ్మె బాట పట్టనున్నట్లు వెల్లడించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, యూనియన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశాడు. కారుణ్య నియామకాలు చేపట్టిన వారిని రెగ్యులర్ పద్ధతిలో తీసుకోవాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించి, ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీ సంస్ధకు అప్పజెప్పాలన్నారు. న్యాయవాదుల సహకార సంఘం డైరెక్టర్గా సంజీవరెడ్డి దుబ్బాక: న్యాయవాదుల పరస్పర సహకార సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా డైరెక్టర్గా దుబ్బాక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మరిపెద్ది సంజీవరెడ్డి ఎన్నికయ్యారు. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగుతారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో డైరెక్టర్గా ఎన్నుకోవడంపై సహచర న్యాయవాదులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. న్యాయవాదుల సంక్షేమం కోసం అహర్నిషలు కృషి చేస్తానని తెలిపారు. ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు డీఐఈఓ రవీందర్రెడ్డి బెజ్జంకి(సిద్దిపేట): బెజ్జంకి ప్రభుత్వ జూనియర్ కళాశాలను సిద్దిపేట డీఐఈఓ రవీందర్రెడ్డి శనివారం సందర్శించారు. అధ్యాపకులతో సమావేశం నిర్వహించి ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించేలా చూడాలన్నారు. విద్యార్థుల సంఖ్య పెంచేందుకు గ్రామాలకు వెళ్లి 10 పాసైన విద్యార్థులను, తల్లిదండ్రులను కలువాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు చంద్రశేఖర్, సరిత, ప్రవీణ్రెడ్డి, సంజీవ్, శేషశయన తదితరులు పాల్గొన్నారు. క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి చిన్నకోడూరు(సిద్దిపేట): క్రమ శిక్షణకు మారుపేరు పోలీస్ శాఖ అని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతోపాటు విధులు నిర్వర్తించాలని ఏఆర్ అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్ అన్నారు. శనివారం మండల పరిధిలోని పెద్దకోడూరు శివారులోని సీఏఆర్ హెడ్ క్వార్టర్స్లో జిల్లాలోని సివిల్, రిజర్వ్ పోలీస్, హోంగార్డు సిబ్బందికి పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది క్రమం తప్పకుండా వాకింగ్, రన్నింగ్, యోగా వంటివి చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించే వారవుతారన్నారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఆర్ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. మతం ముసుగులో దాడులు చేయొద్దు ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య చేర్యాల(సిద్దిపేట): దళితులపై మతం ముసుగులో దాడులకు దిగడం సరైనదికాదని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. మండల పరిధిలోని వేచరేణిలో దళిత యువకుడిపై దాడిజరిగిన విషయంమై శనివారం గ్రామానికి వచ్చిన ఆయన ఘటనపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లా డుతూ మతం ముసుగులో దాడులకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని పోలీసులకు సూచించారు. ఆయన వెంట దళిత సంఘాల నాయకులు తదితరులున్నారు. -
మంత్రిపై విమర్శలు సరికాదు
హుస్నాబాద్: వెనుకబడిన హుస్నాబాద్ను అభివృద్ధి చేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ను విమర్శిస్తే సహించేది లేదని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. హుస్నాబాద్కు ఇంజినీరింగ్ కళాశాల మంజూరైతే కరీంనగర్ కాంగ్రెస్ నాయకులకు కడుపు నొప్పి ఎందుకని ఆయన ప్రశ్నించారు. శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పురమల్ల శ్రీనివాస్ మంత్రి పొన్నం ప్రభాకర్ను విమర్శించారన్నారు. గతంలో కరీంనగర్కు వచ్చిన కళాశాలలను అప్పటి మంత్రులు జీవన్ రెడ్డి, శ్రీధర్బాబు కొండగట్టు, మంథని ప్రాంతాలకు తీసుకెళితే పొన్నం వ్యతిరేకించలేదన్నారు. త్వరలో శ్రీనివాస్పై టీ పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు రవీందర్, ఎండీ హుస్సేన్, శ్రీనివాస్, భిక్యా నాయక్, కిష్టస్వామి, వీరన్న పాల్గొన్నారు.గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి -
పోలీసులకు అండగా భద్రత స్కీమ్
సిద్దిపేటకమాన్: విధి నిర్వహణలో మృతి చెందిన పోలీసులకు డిపార్ట్మెంట్ ఎప్పుడూ అండగా ఉంటుందని సీపీ అనురాధ అన్నారు. అనారోగ్యంతో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ డీవీఆర్ రాజుకు డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన రూ.8లక్షల చెక్కును ఆయన కుటుంబ సభ్యులకు సీపీ శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీ సు కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అండగా భద్రత స్కీమ్ ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో టాస్క్ఫోర్స్ ఏసీపీ రవీందర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీధర్గౌడ్, పోలీసు సంఘం ఉపాధ్యక్షు డు రవీందర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
సకాలంలో పరీక్షా కేంద్రాలకు రావాలి
ప్రశాంత్నగర్(సిద్దిపేట): నీట్ పరీక్ష రాసే విద్యార్థులు నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్),బాలికల ఉన్నత పాఠశాలలోని నీట్ పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు పరీక్ష హాలుకు తీసుకురావొద్దన్నారు. విద్యార్థులు హాల్ టికెట్తో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫొటో, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ తదితర ఏదేని ఒక గుర్తింపు కార్డును తీసుకొని రావాలని తె లిపారు. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. విద్యార్థులను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్, నీట్ పరీక్ష సిటీ కోఆర్డినేటర్ సూర్య ప్రకాశ్, పరీక్ష నిర్వహణ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలులో జాప్యం వద్దు సిద్దిపేటఅర్బన్: అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని వెంటనే తేమ శాతాన్ని కొలిచి తూకం వేసి మిల్లులకు పంపించాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. శనివారం సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాలలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. అదనపు కలెక్టర్ వెంట అర్బన్ తహసీల్దార్ సలీం, మండల వ్యవసాయాధికారి శ్రీనాథ్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, ఉన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ నీట్ పరీక్ష కేంద్రాల పరిశీలన -
వడగళ్ల బీభత్సం
● దుబ్బాక మండలంలో దంచికొట్టిన వాన ● కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యందుబ్బాక: మండలంలో శుక్రవారం సాయంత్రం వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. వడగళ్లతో కురిసిన వానతో పలు పంటలకు నష్టం వాటిల్లింది. అలాగే కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిముద్దయింది. కమ్మరపల్లి, చీకోడ్ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం వర్షం ధాటికి కొట్టుకుపోయింది. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడ్డారు. సకాలంలో తరలించకపోవడంతో కాంటాలు పెట్టిన బస్తాలు కూడా తడిసిపోయాయి. కొనుగోళ్లను వేగిరం చేయాలని రైతులు కోరారు. కొమురవెల్లిలో వాన కొమురవెల్లి(సిద్దిపేట)/జగదేవ్పూర్(గజ్వేల్): కొమురవెల్లి, జగదేవ్పూర్ మండలాల్లోనూ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాలలో ఆర బోసిన ధాన్యం తడిసిపోయింది. తపాస్పల్లిలో వడగళ్ల వర్షం కురిసింది. దీంతో రైతులు కల్లాలో ఆరబెట్టిన ధాన్యం ప్లాస్టిక్ కవర్లను కప్పారు. జగదేవ్పూర్ మండలంలో పలుచోట్ల పంటలకు నష్టంజరిగింది. అలాగే తోటల్లో మామిడికాయలు రాలిపోయాయి. -
గోపవ్వ గోస
● సొంత ఇల్లు ఉందంటూ ‘ఇందిరమ్మ’లో పేరు తొలగింపు ● కూలిపోయిన గుడిసెలోనే వృద్ధురాలి నివాసంమేము అర్హులం కాదా.. ఇందిరమ్మ ఇంటి కోసం దివ్యాంగ దంపతుల వేడుకోలు మద్దూరు(హుస్నాబాద్): ఇందిరమ్మ ఇల్లుకు మేము అర్హులం కాదా అని దివ్యాంగ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. వంగపల్లికి చెందిన బొడికే మల్లేశం, రేణుక దంపతులకు పుట్టుక నుంచే కాళ్లు లేవు. ఇద్దరూ దివ్యాంగులే. ప్రభుత్వం ఇచ్చే ఆసరా పింఛన్తోనే ఇంటి అద్దె చెల్లిస్తూ కుటుంబాన్ని పోషించుకొని జీవనం కొనసాగిస్తున్నారు. ఈక్రమంలో ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇళ్లు మంజూరైన లిస్టులో వీరి పేరు రాకపొవడంతో ఆందోళన చెందారు. కొన్నేళ్లుగా కిరాయి ఇంట్లోనే జీవనం సాగిస్తున్నామని వారు పోయారు. నంగునూరు(సిద్దిపేట): భర్త మరణించడంతో కూలినాలి చేసుకుంటూ జీవనం సాగిస్తోంది వృద్ధ మహిళ. వర్షాలకు గుడిసె కూలిపోవడంతో మిగిలిన భాగంలో కవర్లు కప్పి అందులోనే నివాసం ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు దరఖాస్తు చేసుకుంది. ఆమెకు సొంత బిల్డింగ్ ఉందని అధికారులు ఆన్లైన్లో నమోదు చేయడంతో ఆర్హుల జాబితా నుంచి తొలగించారు. ఈవిషయమై కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారే కరువయ్యారని వృద్ధురాలు వాపోతోంది. నంగునూరు మండలం పాలమాకుల గ్రామానికి చెందిన కందారం గోపవ్వ భర్త సిద్ధయ్య వడ్రంగి పని చేస్తూ కుటుంబాన్ని పోషించే వారు. సంవత్సరం కిందట అనారోగ్యంతో మరణించడంతో అతని కుమారుడు శేషాద్రి జీవనోపాధి కోసం కరీంనగర్ వెళ్లి అక్కడే నివాసం ఉంటున్నారు. దీంతో గోపవ్వ కూలిపోయిన గుడిసెలోనే నివాసం ఉంటూ ప్రభుత్వం అందించే పింఛన్తో బతుకీడుస్తోంది. కలెక్టర్కు ఫిర్యాదు ఇల్లు మంజూరు కాకపోవడంతో నిరుత్సాహానికి గురైన గోపవ్వ ఐదు రోజుల కిందట కలెక్టరేట్లో ఫిర్యాదు చేసింది. తాను నివాసం ఉంటున్న ఇల్లు, ఇతర ఆధారాలను జత చేసింది. అధికారులు స్పందించి నిరుపేదనైన తనకు ఇల్లు మంజూరు చేయాలని వేడుకుంటోంది. -
వక్ఫ్ సవరణ చట్టం రద్దు చేయాల్సిందే
సిద్దిపేటజోన్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ సవరణ చట్టం రద్దు చేయాల్సిందేనని సిద్దిపేట ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. రద్దు చేసేవరకు శాంతియుతంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అల్ ఇండియా పర్సనల్ లా బోర్డ్ పిలుపు మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం నమాజ్ అనంతరం జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు అబ్దుల్ సమి, ఉబెదుర్ రహమాన్ మాట్లాడుతూ.. వక్ఫ్ చట్టం విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం తగదన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కొత్త చట్టం కాలరాస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. కఠినంగా శిక్షించాలి.. కశ్మీర్ లోయల్లో పర్యాటకుల మీద ఉగ్రవాదులు జరిపిన దాడిని జేఏసీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.జిల్లా కేంద్రంలో ముస్లిం జేఏసీ నిరసన -
వడదెబ్బ బారిన పడొద్దు
● వేసవి కాలంలో అప్రమత్తంగా ఉండాలి ● వైద్యాధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలి ● కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరిసిద్దిపేటరూరల్: వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండుటెండలతో ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా వైద్యారోగ్య శాఖతో పాటు, ఇతర శాఖల జిల్లా అధికారులు ప్రజలకు అవగాహన కలిగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మధ్యాహ్నం సమయంలో ఇంట్లోనే ఉండాలని, బయటకు వెళ్లాల్సి వచ్చినా తలకు టోపీ ధరించడం, తువ్వాల చుట్టుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎండ వేడిమి సమయంలో ప్రయాణాలు పెట్టుకోవద్దని, చల్లని ప్రదేశాలలో ఉండాలని అన్నారు. ఎక్కువ మోతాదులో ద్రవ పదార్థాలు తీసుకుంటూ, కాటన్ వస్త్రాలను ధరించాలన్నారు. చిన్నారుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆయా కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, సముదాయాలలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు వేసవి తీవ్రత వల్ల వడదెబ్బకు లోను కాకుండా తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ మేరకు ఉపాధి హామీ కార్మికులు ఉదయం వేళలోనే పనులు చేసేలా, తాగునీటి వసతి అందుబాటులో ఉండేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుందన్నారు. అన్ని ఆసుపత్రులు, పీహెచ్సీ, సీహెచ్సీలలో వైద్యాధికారులు, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉంటూ, వడదెబ్బ నివారణ ఔషధాలు సరిపడా అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. ప్రజలు ఎవరైనా వడదెబ్బకు గురైతే, వెంటనే వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే తక్షణ చికిత్స చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. -
దొడ్డు బియ్యం దుమారం
● రేషన్ డీలర్లతో లబ్ధిదారుల వాగ్వాదం ● పరిశీలించిన డీఎం, ఉన్నతాధికారులు ● ఆ బ్యాగులు గోదాంలకు తరలింపు ● తిరిగి సన్నబియ్యం పంపిణీ ● చర్యలు తీసుకుంటాం: డీఎస్వోదుబ్బాక: పేదలకు సన్నబువ్వ అందించాలన్న ప్రభుత్వ ఆశయానికి అధికారుల నిర్లక్ష్యంతో ఆదిలోనే ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఏప్రిల్ నెలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. పలు రేషన్షాపుల్లో సన్నబియ్యంతో పాటు దొడ్డుబియ్యం సంచులు రావడం గమనార్హం. గురువారం దుబ్బాక పట్టణంలోని 46వ రేషన్ దుకాణంషాపులో బియ్యం తీసుకోవడానికి లబ్ధిదారులు వచ్చారు. పంపిణీ చేసేందుకు తీరా సంచులు విప్పి చూడగా దొడ్డుబియ్యం ఉన్నాయి. దీంతో లబ్ధిదారులు సన్నబియ్యం ఇవ్వకుండా ఇవి ఎందుకు ఇస్తున్నారంటూ రేషన్డీలర్తో గొడవకు దిగారు. అనంతరం ఆ బ్యాగును పక్కన పెట్టి వేరే బ్యాగు విప్పి చూడగా అందులో కూడా దొడ్డుబియ్యమే ప్రత్యక్షమయ్యాయి. అలాగే 45వ నంబర్ షాపులో సైతం ఇదే పరిస్థితి తలెత్తింది. దీంతో లబ్ధిదారుల ఆందోళనతో రేషన్డీలర్ వెంటనే పంపిణీని నిలిపివేసి సంబంధిత అధికారులకు విషయం తెలిపారు. వారి సూచన మేరకు దొడ్డు బియ్యం సంచులను పక్కన బెట్టి సన్నబియ్యం పంపిణీ చేశారు. డీఎం, అధికారుల పరిశీలన విషయం తెలుసుకున్న వెంటనే సివిల్ సప్లయ్ డీఎం ప్రవీణ్కుమార్, టెక్నికల్ ఆఫీసర్ శ్రీనివాస్రావు, డీటీ రవికుమార్, ఆర్ఐ నరేందర్ రేషన్ షాపునకు చేరుకొని 46, 45వ నంబర్ షాపులను పరిశీలించారు. కొన్ని బ్యాగుల్లో దొడ్డు బియ్యం ఉండటం గుర్తించారు. వెంటనే ఆ బ్యాగులను కుమ్మరించి, బియ్యం పంపిణీ చేయవద్దని డీలర్లకు సూచించారు. దొడ్డు బియ్యం సంచులను గోదాంకు తరలించి సన్నబియ్యంను రిప్లేస్ చేసే చర్యలు చేపట్టారు. ఈ విషయంపై డీఏస్ఓ తనూజ సంబంధిత రేషన్ డీలర్లతో మాట్లాడి పరిస్థితి తెలుసుకోవడంతో పాటు అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై ఉన్నతాధికారులు బాధ్యులపై చర్యలు తీసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని లబ్ధిదారులు కోరుతున్నారు. మళ్లీ పునరావృతం కాకుండా చూస్తాం దుబ్బాక పట్టణంలోని రేషన్షాపుల్లో దొడ్డుబియ్యం రావడంపై తగు చర్యలు తీసుకుంటాం. మళ్లీ పునరావృతం కాకుండా చూస్తాం. రేషన్ షాపులకు వచ్చిన దొడ్డుబియ్యంను గోదాంకు తరలించి సన్న బియ్యాన్ని రిప్లేస్ చేస్తాం.పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తాం. అన్ని కోణాల్లో ఆరా తీసి చర్యలు తీసుకుంటా. –డీఎస్ఓ తనూజ -
విశ్వకర్మలకు రూ.4కే యూనిట్ విద్యుత్
ప్రశాంత్నగర్(సిద్దిపేట): అర్హత కలిగిన విశ్వకర్మ వృత్తుల వారికి రూ.4కే యూనిట్ విద్యుత్ను అందించనున్నట్లు, జిల్లా విద్యుత్శాఖ ఎస్ఈ చంద్రమోహన్, అఖిలభారత విశ్వకర్మ పరిషత్ జిల్లా అధ్యక్షుడు నరసింహచారి తెలిపారు. నాలుగవ కేటగిరి విద్యుత్ను రూ.4కే యూనిట్ను అందించనున్నట్లు ఎలక్ట్రిసిటీ రెగ్యులరైజేషన్ కమిషన్ గురువారం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో జిల్లా విద్యుత్శాఖ కార్యాలయంలో ఎస్ఈ చంద్రమోహన్కు పథకాన్ని వెంటనే అమలు చేయాలని విశ్వకర్మలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఈ చంద్రమోహన్ మాట్లాడుతూ తమ పరిధిలోని అన్ని మండలాల్లో అర్హత కలిగిన విశ్వకర్మలకు వివరాలు సేకరించి నాలుగో కేటగిరి మీటర్ ద్వారా 25 హెచ్పీ కెపాసిటీతో విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం నాయకులు బాలయ్య, యాదగిరి, రామచంద్రం, నాగరాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
త్వరలో మార్కెట్ కమిటీ పాలకవర్గాల ప్రమాణ స్వీకారం
గజ్వేల్: నియోజకవర్గంలో కొత్తగా నియమించిన వంటిమామిడి, కొండపాక మార్కెట్ కమిటీల నూతన పాలకవర్గాలు ప్రమాణ స్వీకారం చేసేందుకు ఈనెల 10లోపు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి కలిసి ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కొత్త పాలకవర్గాలకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మెహన్, శ్రీనివాస్రెడ్డి, సాజిద్బేగ్ తదితరులు పాల్గొన్నారు. ప్రసవాల సంఖ్య పెంచాలి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ రవీంద్రనాయక్ నంగునూరు(సిద్దిపేట): ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ రవీంద్రనాయక్ అన్నారు. అలాగే హైరిస్క్ గర్భిణుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యులకు సూచించారు. గురువారం రాజగోపాల్పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి పల్వన్ కుమార్తో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆశా వర్కర్లు చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు వేయించడంతో పాటు క్షయ, లెప్రసీ, హైపర్ టెన్షన్, షుగర్ వంటి అసంక్రమిత వ్యాధులపై అవగాహన పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ రేవతి, శ్రీనివాస్, పీఆర్ఓ ఆనంద్, నారాయణ్రావు, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బాధ్యతల స్వీకరణ గజ్వేల్రూరల్: గజ్వేల్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా ఎం.స్వాతి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పాండరి, సభ్యులు కలిసి మంథని కోర్టు నుంచి గజ్వేల్కు బదిలీపై వచ్చిన జడ్జి స్వాతికి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు నరేశ్చారి, కరుణాకర్, భాస్కర్, ప్రశాంత్, భాస్కర్, అంజలి తదితరులు పాల్గొన్నారు. క్రీడల్లో రాణించాలి హుస్నాబాద్: క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. వేసవి క్రీడా శిక్షణలో భాగంగా మినిస్టేడియంలో గురువారం కబడ్డీ, వాలీబాల్ శిక్షణ శిబిరాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడాకారులు వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, మాజీ ఎంపీపీ వెంకట్, ఎస్జీఎఫ్ సెక్రటరీ శ్రీనివాస్, కోచ్లు కృష్ణ, రాకేష్, సీనియర్ క్రీడాకారులు హుస్సేన్, రాజు తదితరులు పాల్గొన్నారు. నేడు బెజ్జంకిలో ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమం హాజరుకానున్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే బెజ్జంకి(సిద్దిపేట): ప్రజలకు మరింత చేరువై సమస్యలను పరిష్కరించేందుకు మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వినూత్నంగా చేపట్టిన ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమం శుక్రవారం బెజ్జంకి మండల కేంద్రానికి వస్తున్నట్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మనుచౌదరి, ఎమ్మెల్యే పాల్గొంటారని పేర్కొన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఎమ్మెల్యే చేపట్టిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు. -
నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి
అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ బెజ్జంకి(సిద్దిపేట): ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ లబ్ధిదారులకు సూచించారు. మండలంలో దత్తత గ్రామమైన వీరాపూర్లో ఇండ్ల లబ్ధిదారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల మేరకు 400 నుంచి 600 చదరపు అడుగుల వరకు నిర్మించుకుంటే సర్కారు ఇచ్చే డబ్బులతో ఇల్లు పూర్తి చేయవచ్చని తెలిపారు. ఎక్కువ ఎస్ఎఫ్టీతో నిర్మించిన లబ్ధిదారుల సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బిల్లులు మంజూరు కాని వారికి త్వరలోనే వస్తాయన్నారు. అనంతరం ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ దామోదర్రెడ్డి, ఎంపీడీఓ ప్రవీణ్, ఎంపీఓ మంజుల, పీఆర్ ఏఈ సమ్మయ్య, ఏపీఎం నర్సయ్య, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి
ఘనంగా మేడే వేడుకలు ప్రపంచ కార్మికుల దినోత్సవం ‘మే’డే ను గురువారం జిల్లాలో వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పార్టీలు, పలు కార్మిక సంఘాల నాయకులు కార్యాలయాల ఎదుట జెండాలను ఆవిష్కరించారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేశారు. ర్యాలీలు తీశారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. మేడే కార్యక్రమాల్లో పార్టీల, పలు సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. – చేర్యాల(సిద్దిపేట) -
యోగాతో మహిళల ఆరోగ్యం పదిలం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): ప్రతి రోజు యోగా చేయడం ద్వారా మహిళలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తోట అశోక్ అన్నారు. భారత్ స్వాభిమాన్ ట్రస్ట్, వ్యాస మహర్షి యోగా సొసైటీ ఆధ్వర్యంలో గురువారం సిద్దిపేట వ్యాస మహర్షి యోగా సెంటర్లో ఉచిత మహిళ యోగా శిక్షణ తరగతులు ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. మహిళల మానసిక, శారీరక దృఢత్వానికి యోగా చక్కటి సాధనమన్నారు. కార్యక్రమంలో వ్యాస మహర్షి యోగా సొసైటీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ తోట సంధ్య, తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ సతీష్, కౌన్సిలర్ నాగరాజురెడ్డి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రాజేశం, ప్రధానోపాధ్యాయులు మంజు భార్గవి, సభ్యులు విదిష, నందిని, విజయ, వాణి పాల్గొన్నారు. -
సుడాపై రియల్ పిడుగు
తగ్గిన ఆదాయం ● ఏడాదిన్నరగా నిలిచిన అభివృద్ధి పనులు ● ప్రభుత్వం నిధులు కేటాయించాలి సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(సుడా)పై రియల్ ఎస్టేట్ ప్రభావం పడింది. దీంతో రోజు రోజుకు ఆదాయం పడిపోతోంది. 2017లో సుడాను ఏర్పాటు చేశారు. కాగా గత ఏడాదిన్నరగా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టడం లేదు. పలు పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. సుడా ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులు చేపట్టినా.. నిధులు లేకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు సైతం బిల్లులు చెల్లించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుడా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతున్నారు. సుడాకు తగ్గిన ఆదాయం గతంలో సుడాకు సంవత్సరానికి రూ.6 నుంచి రూ.8కోట్ల ఆదాయం వచ్చేది. 2024–25లో రూ.5.4 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. దీనిలో రూ.2.5 కోట్లు ఖర్చయ్యాయి. మిగతా డబ్బులను ఉద్యోగుల జీతాలు, విద్యుత్ బిల్లుల కోసం నిల్వ ఉంచారు. సుడా వెంచర్లో అభివృద్ధి అంతంత మాత్రమే మిట్టపల్లి శివారులో సుడా ఆధ్వర్యంలో ల్యాండ్ పూలింగ్ స్కీంలో భాగంగా ప్రభుత్వ స్థలాన్ని సేకరించారు. 2023లో సుడా ఆధ్వర్యంలో 14 ఎకరాల్లో వెంచర్ ఏర్పాటు చేశారు. రైతులకు ఇవ్వగా మిగిలిన 101 ప్లాంట్లను మూడు మార్లు ఓపెన్ యాక్షన్ పెట్టగా 27 ప్లాట్లు మాత్రమే సేల్ అయ్యాయి. వెంచర్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయకపోవడంతో కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ప్లాట్స్ సేల్ అయితే వచ్చే ఆదాయంతో సుడా పరిధిలో పలు అభివృద్ధి పనులు చేయాలనుకున్నారు. కానీ అవి సేల్ కాకపోవడంతో పనులు నిలిచిపోయాయి. దీనికి తోడు రియల్ రంగం కుదేలు కావడంతో ప్రైవేట్ వ్యాపారులు కొత్త వెంచర్లు ఏర్పాటు చేయలేదు. కొత్త భవనాల నిర్మాణానికి అనుమతుల కోసం సుడాకు ఎవరు రాకపోవడంతో ఆదాయం తగ్గింది. ప్రభుత్వం ప్రత్యేకంగా సుడా అభివృద్ధికి నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.ఆదాయం పెంచేందుకు కృషి కొత్త వెంచర్లు ఏర్పాటు కాకపోవడం, నూతన ఇంటి నిర్మాణ పనులు యజమానులు చేపట్టడం లేదు. రియల్ ఎస్టేట్ అంతగా లేకపోవడంతో ఆదాయం ఎక్కువగా రావడం లేదు. సుడా ఆదాయం పెంచేందుకు నా వంతు ప్రయత్నం చేస్తున్నా. – అశ్రీత్ కుమార్, వైస్ చైర్మన్, సుడామూడేళ్లుగా సాగుతున్న రిసార్ట్ పనులు రంగనాయకసాగర్ రిజర్వాయర్ను చూసేందుకు పర్యాటకులు వస్తున్నారు. కానీ సమీపంలో ఎలాంటి వసతి లేకపోవడంతో భోజనం, నైట్ హాల్ట్కు సిద్దిపేటకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో సుడా ఆధ్వర్యంలో రిసార్ట్ నిర్మించాలని నిర్ణయించారు. ప్రభుత్వం దాదాపు 1.5 ఎకరాల స్థలాన్ని కేటాయించడంతో 2022లో సుడా రిసార్ట్ పనులను ప్రారంభించింది. ఇప్పటి వరకు సుమారుగా రూ.1.5 కోట్లతో కాటేజీలు, రెస్టారెంట్ హాల్స్ను నిర్మించారు. నిధులు లేకపోవడంతో స్విమ్మింగ్ పూల్, వాటర్ ఫౌంటేన్ నిర్మాణం చేపట్టలేదు. దీంతో వినియోగంలోకి రాలేదు. -
బీఆర్ఎస్కు వత్తాసు పలుకుతారా?
మున్సిపల్ కమిషనర్పై కలెక్టరేట్ ఏవోకు ఫిర్యాదుసిద్దిపేటరూరల్: సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ బీఆర్ఎస్ నాయకులకు వత్తాసు పలుకుతూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, కార్యాలయాన్ని బీఆర్ఎస్ కార్యాలయంగా మారుస్తున్నారని పలువురు కౌన్సిలర్లు ఆరోపించారు. ఈ విషయంపై గురువారం కలెక్టరేట్ ఏఓకు ఫిర్యాదు చేసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ బుధవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సాధారణ సర్వసభ్య సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే హాజరవుతున్న విషయం మున్సిపల్ కమిషనర్ తమకు తెలియజేయలేదన్నారు. సమావేశానికి విలేకరులను అనుమతించాలని కోరితే గత ప్రభుత్వ జీఓ ప్రకారం అనుమతి లేదని చెప్పిన కమిషనర్ ఎమ్మెల్యే వచ్చాక అనుమతించడం ఎంతవరకు సమంజసమన్నారు. కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు సమస్యల పరిష్కారంపై ఇచ్చిన వినతులపై స్పందించడం లేదన్నారు. ప్రతిపక్ష మహిళా కౌన్సిలర్లు సమావేశంలో మాట్లాడుతుంటే దుర్భాషలాడుతూ మాట్లాడకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మున్సిపల్ కార్యాలయంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ మెప్మా సాయికృష్ణ, రమ్య, ఇద్దరు సిబ్బందిని తిరిగి మళ్లీ విధుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. వారిపై తక్షణమే విచారణ చేపట్టి శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే పలు పనుల టౌన్ప్లానింగ్, శానిటేషన్, మిషన్ భగీరథ, గ్రీన్ సిద్దిపేట, యూజీడీ, ఇంజినీరింగ్, కోమటిచెరువు వంటి పనుల్లో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం జరిగాయన్నారు. ఇప్పటికై నా అధికారులు చర్యలు తీసుకోకపోతే జిల్లా మంత్రి, ఇన్చార్జి మంత్రుల దృష్టికి తీసుకెళ్లి సీబీఐ విచారణ చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మిఆనంద్, బుచ్చిరెడ్డి, మహమ్మద్ రియాజ్, కవిత, రవితేజ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
మహిళల రక్షణకు పెద్దపీట
సీపీ అనురాధసిద్దిపేటకమాన్: మహిళలు, పిల్లల రక్షణకు పెద్దపీట వేస్తున్నామని సీపీ అనురాధ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని షీటీమ్స్, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ యూనిట్స్ అధికారులు, సిబ్బంది గత నెలలో 47 ప్రదేశాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. 45మంది ఈవ్టీజర్లను పట్టుకొని కౌన్సిలింగ్ నిర్వహించి, పెట్టి కేసులు నమోదు చేశామన్నారు. మహిళలు ఎవరైనా వేధింపులకు గురైతే 100 లేదా షీటీమ్ వాట్సప్ నంబర్ 87126 67434కు ఫోన్ చేయాలని సూచించారు. కేతకీలో భక్తుల సందడిఝరాసంగం(జహీరాబాద్): కేతకీ సంగమేశ్వర ఆలయం గురువారం భక్తులతో సందడిగా మారింది. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. అనంతరం గర్భగుడిలోని పార్వతిపరమేశ్వరులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారులు భక్తులకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. డీలక్స్ బస్సుల్లో రాయితీనారాయణఖేడ్: ఆర్టీసీ డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే వారికి చార్జీల్లో 10శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ఖేడ్ డిపో మేనేజర్ మల్లేశయ్య ఓ ప్రకటనలో వెల్లడించారు. నెలవారీ సీజన్ టికెట్పై 20 రోజుల చార్జీతో 30 రోజులు ప్రయాణం చేసే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈ సదుపాయం ఈ నెల 1వ నుంచి అమలులోకి వచ్చిందన్నారు. ఖేడ్ నుంచి జేబీఎస్కు రూ.230 చార్జీకి రాయితీతో రూ. 210 చెల్లిస్తే సరిపోతుందన్నారు. ఖేడ్ నుంచి లింగంపల్లికి రూ.210 గాను రూ. 190, ఖేడ్ నుంచి సంగారెడ్డికి రూ. 160కి గాను రూ.140 చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. అలాగే ఖేడ్ నుంచి సంగారెడ్డి వరకు గల వివిధ స్టేజీలకు మంత్లీ సీజన్ టికెట్స్ ఇవ్వనున్నట్లు చెప్పారు. -
లక్ష్మీనారాయణకు శ్రమశక్తి అవార్డు
దుబ్బాక పట్టణానికి చెందిన ఐఎన్టీయూిసీ నేత, తెలంగాణ ఆల్ బీడీ కార్మిక సంఘం నాయకుడు తుమ్మ లక్ష్మీనారాయణకు శ్రమశక్తి అవార్డు లభించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండున్నర దశాబ్దాలుగా, విద్యార్థులు, బీడీ కార్మికుల సంక్షేమం, వారి హక్కుల సాధన కోసం ఆయన అలుపెరగని కృషి చేస్తున్నారు. పేద విద్యార్థుల కోసం పనిచేస్తున్న లక్ష్మీనారాయణపై పోలీసులు గతంలో కక్షగట్టి విచక్షణ రహితంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయస్థితిలో నుంచి బయటపడ్డారు. ఇప్పటికీ అతడిపై దాడిచేసిన పోలీసు అధికారులపై హైకోర్టులో కేసు నడుస్తోంది. ఈ క్రమంలో ప్రాణాలకు తెగించి కార్మికుల పక్షపాతిగా పోరాడుతున్న ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి శ్రమశక్తి అవార్డుకు ఎంపిక చేసింది. గురువారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారుల సమక్షంలో అవార్డును ప్రదానం చేశారు. – దుబ్బాక -
భూభారతితో సత్వర న్యాయం
దౌల్తాబాద్(దుబ్బాక): భూ భారతి చట్టంతో రైతాంగానికి సత్వర న్యాయం అందుతుందని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో భూ భారతి చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మొదట అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ చట్టంలోని ప్రతి అంశాన్ని వివరించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యలన్నీ జిల్లా స్థాయిలోనే పరిష్కరించుకోవచ్చని అన్నారు. పెండింగ్లో ఉన్న సాదాబైనామాలకు సైతం పరిష్కారం లభిస్తుందన్నారు. వారసత్వ భూముల సమస్యలను మ్యుటేషన్ పద్ధతిలో పరిష్కరిస్తామన్నారు. రెవెన్యూ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి మండల, గ్రామ స్థాయిలో పోస్టులను భర్తీ చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ రైతే దేశానికి రాజు అని అన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ సదానందం, పీఎసీఎస్ చైర్మన్ వెంకట్రెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్ లింగ మూర్తి, తహసీల్దార్ చంద్ర శేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు. రైతులకు మేలు జగదేవ్పూర్(గజ్వేల్): రైతుల సమస్యలు పారదర్శకంగా పరిష్కరించడానికే భూ భారతి చట్టాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్ మనుచౌదరి అన్నారు. బుధవారం మండలంలోని గొల్లపల్లి గ్రామంలో భూ భారతిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. మేధావులు, లాయర్లు, రైతు సంఘాలు, ప్రజలతో సంప్రదింపులు జరిపి భూ భారతి చట్టాన్ని తీసుకరావడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షలకుపైగా సాదా బైనామాలు పెండింగ్లో ఉన్నాయని, జిల్లాలో 44 వేలు ఉన్నాయని వివరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రకళ, తహశీల్దార్ నిర్మల, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ మనుచౌదరి దౌల్తాబాద్లో అవగాహన సదస్సు -
అలైన్మెంట్ మార్పునకు కేంద్రం అంగీకారం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్సిద్దిపేటకమాన్: జాతీయ రహదారి (365బీ) అలైన్మెంట్ మార్పునకు కేంద్రం అంగీకరించిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ అన్నారు. సిద్దిపేట ప్రెస్క్లబ్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అలైన్మెంట్ మార్పు ఎంపీ రఘునందన్రావు విశేష కృషి ఫలితమేనని అన్నారు. పాత అలైన్మెంట్ ద్వారా దుద్దెడ, ఎన్సాన్పల్లి, తడకపల్లి, చిన్నగుండవెళ్లి, పుల్లూరు, మల్యాల గ్రామాల్లో రైతులు భూములు కోల్పోతున్నారని అన్నారు. దీంతో ఎంపీ ప్రత్యేక చొరవ తీసుకుని జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి ఉమాశంకర్ దృష్టికి తీసుకెళ్లారన్నారు. స్పందించిన ఉమాశంకర్ ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. రైతుల భూములకు ఎలాంటి నష్టం లేకుండా రాజీవ్రహదారి, సిద్దిపేట ఔటర్రింగ్రోడ్డుతో అనుసంధానం చేసే మార్గాన్ని ప్రతిపాదించారని తెలిపారు. కార్యక్రమంలో బాసంగారి వెంకట్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
సిద్దిపేట మున్సిపాలిటీ రికార్డు
ఒక్క రోజే రూ.కోటి వసూలు సిద్దిపేట జోన్: సిద్దిపేట మున్సిపాలిటీ చరిత్రలోనే అరుదైన రికార్డు సాధించింది. ప్రభుత్వం ఇచ్చిన 5 శాతం ఇంటి పన్ను రాయితీలో ఒక్క రోజే రూ.కోటి వసూలు అయ్యింది. పన్ను రాయితీలో భాగంగా బుధవారం ఒక్క రోజే రూ.కోటి 5లక్షలు చెల్లించి ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఇంటి పన్ను రూ.17కోట్లకు గాను ఇప్పటి వరకు రూ. 6కోట్ల 27లక్షలు వసూలయ్యాయి. మానవ మనుగడకు వేదాలు దోహదం పీఠాధిపతి మాధవానంద సరస్వతి వర్గల్(గజ్వేల్): మానవ మనుగడకు వేదాలు దోహదపడతాయని, వేదవిద్య సమాజాన్ని జాగృతం చేస్తుందని పీఠాధిపతి మాధవానంద సరస్వతి అన్నారు. బుధవారం అక్షయ తృతీయ విశేష పర్వదినం రోజు వర్గల్ శ్రీవిద్యాసరస్వతి క్షేత్రం సందర్శించిన పీఠాధిపతికి ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖర సిద్ధాంతి పరివారం పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం వేదపాఠశాలలో స్మార్తం పూర్తిచేసుకున్న తొమ్మిది మంది విద్యార్థులకు జయపట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అనుగ్రహ భాషణం చేస్తూ వేదం అనేది విద్య మాత్రమే కాకుండా జీవన విధానమని అభివర్ణించారు. వేద విద్యార్థులు సామాజిక శ్రేయస్సుకు కృషి చేయాలన్నారు. ఉన్నతస్థాయికి ఎదుగుతూ వేదపాఠశాల లక్ష్యాలు సిద్ధింపజేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆశీస్సులు అందజేశారు. నేలవాలిన మునగ తోట తొగుట(దుబ్బాక): మండలంలోని వెంకట్రావుపేటలో ఈదురుగాలులకు మునగ తోట నేలవాలింది. గ్రామానికి చెందిన రైతు సుతారి ఆంజనేయులు వ్యవసాయంతో పాటు ఎకరం మునగ తోట సాగుచేశారు. బుధవారం సాయంత్రం వీచిన ఈదురు గాలులకు కాపు దశకు వచ్చిన చెట్లు విరిగి పడిపోయాయి. దీంతో తీవ్ర నష్టం వాటిల్లిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తంచేశారు. బసవేశ్వరుని బోధనలు అనుసరణీయం డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి గజ్వేల్: బసవేశ్వరుని బోధనలు అనుసరణీయమని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. బుధవారం బసవేశ్వరుని జయంతి సందర్భంగా పట్టణంలోని బసవేశ్వరుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నర్సారెడ్డి మాట్లాడుతూ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి గొప్ప పరివర్తనకు బసవేశ్వరుడు నాంది పలికారని కొనియాడారు. కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, వైస్ చైర్మన్ సర్ధార్ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, లింగాయత్ సంఘం నాయకులు పాల్గొన్నారు. సీఐటీయూ పోరాట ఫలితమే సంగారెడ్డి : సీఐటీయూ పోరాట ఫలితమే అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు వచ్చాయని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు మే నెలంతా సెలవులు ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటించడం సంతోషకరమన్నారు. ఇతర సేవలు అందించటం కోసం అంగన్వాడీ ఉద్యోగులందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంగన్వాడీలకు వేసవి సెలవుల నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వానికి సీఐటీయూ సంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సమరశీల పోరాటాలకు అంగన్వాడీ సిబ్బంది సిద్ధం కావాలని కోరారు. -
సత్తాచాటిన పేదింటి కుసుమాలు
మోడల్లో మెరిసిన విద్యార్థులుఆటో డ్రైవర్ కుమారుడు టాపర్ దుబ్బాకటౌన్: ఆటో డ్రైవర్ కుమారుడు మండల టాపర్గా నిలిచారు. బుధవారం ప్రకటించిన టెన్త్ ఫలితాల్లో హరీశ్ సత్తా చాటాడు. అక్బర్పేట భూంపల్లి మండలం పోతారెడ్డిపేటకు చెందిన ఆటో డ్రైవర్ పుస్కూరి లక్ష్మణ్, లావణ్య దంపతుల కుమారుడు హరీశ్ దుబ్బాక ప్రభుత్వ మైనార్టీ పాఠశాలలో 10వ తరగతి చదివాడు. ఫలితాల్లో 573 మార్కులు సాధించి మండల టాపర్గా నిలిచాడు. తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయుల ప్రోత్సాహమే తనని మండల టాపర్గా నిలిపిందని హరీష్ చెప్పారు. పేదింటి చేనేత విద్యార్థి ప్రతిభ దుబ్బాకటౌన్: మున్సిపల్ పరిధిలోని లచ్చపేట 11 వార్డు చేనేత కుటుంబానికి చెందిన సబ్బాని దీపక్ టెన్త్ ఫలితాల్లో సత్తాచాటాడు. తండ్రి సబ్బాని శ్రీరాం ప్రసాద్ దర్జీగా, తల్లి మాధవి బీడీలు చుడుతూ.. ఇద్దరు కుమారులతో జీవనం సాగిస్తున్నారు. దీపక్ లచ్చపేట మోడల్ స్కూల్లో 10వ తరగతి చదివాడు. 562 మార్కులు సాధించి మండల ద్వితీయ టాపర్గా నిలిచాడు. దీంతో పలువురు దీపక్ను అభినందించారు.చేర్యాల(సిద్దిపేట): మండల పరిధిలోని పలు ప్రభుత్వ బడులతో పాటు మోడల్ స్కూల్, కేజీబీవీ పాఠశాలలు టెన్త్లో వంద శాతం ఫలితాలు సాధించాయి. మండల వ్యాప్తంగా అర్జునపట్ల, కడవేర్గు, తాడూరు, వీరన్నపేట, గుర్జకుంట, పెద్దరాజుపేట పోతిరెడ్డిపల్లి పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. మోడల్ స్కూల్కు చెందిన కొల్పుల భానుతేజ అనే విద్యార్థిని 564 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచారు. అలాగే అదే పాఠశాలకు చెందిన రంగు రాహుల్ 555, పుట్ట అమూల్య 555 మార్కులు సాధించారు. -
దార్శనికుడు బసవేశ్వరుడు
సిద్దిపేటఅర్బన్: సమసమాజ స్థాపనకు కృషి చేసిన మహనీయుడు బసవేశ్వరుడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. బుధవారం పొన్నాల వై జంక్షన్ వద్ద బీసీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బసవేశ్వరుడి జయంతి వేడుకలలో హరీశ్రావు పాల్గొన్నారు. బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హరీశ్రావు మాట్లాడుతూ కుల, మత, వర్గ, వర్ణ వివక్షత లేకుండా సమసమాజం, సమన్యాయం కోసం పోరాడిన మహానీయుడని అన్నారు. బసవేశ్వరుడి మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడలలో నడవాలని అన్నారు. కార్యక్రమంలో బీసీ అభివృద్ధి అధికారి నాగరాజమ్మ, లింగాయత్ సంఘాల జిల్లా అధ్యక్షుడు, పట్టణ గౌరవ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు. సమసమాజ స్థాపనకు కృషి చేసిన మహనీయుడు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు -
అధికారుల తీరు మారాలి
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ● రోజూ క్షేత్రస్థాయిలో పర్యటించాలి ● తాగునీటి సమస్య రానివ్వొద్దు ● స్వచ్ఛ సిద్దిపేటే లక్ష్యం కావాలి ● మున్సిపల్ సమీక్షలో ఎమ్మెల్యే హరీశ్రావు సిద్దిపేటజోన్: ‘మున్సిపాలిటీకి మీరే కీలకం.. వార్డు ఆఫీసర్ పనితీరు బాగుంటే వార్డు బాగుంటుంది. వార్డు బాగుంటే పట్టణం బాగుంటుంది’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సూచించారు. బుధవారం సాయంత్రం మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రగతి పనులపై అధికారులతో ఆరా తీశారు. ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలను కౌన్సిల్ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. రోజూ క్షేత్ర స్థాయిలో మున్సిపల్ చైర్మన్, కమిషనర్, కౌన్సిలర్లు పర్యటించాలని, చెత్త బండ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులు సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పన్నుల వసూలులో మున్సిపాలిటీ ఎప్పుడూ ముందు ఉండాలని సూచించారు. వార్డు అధికారులు ప్రతి పనిలో భాగస్వామ్యం కావాలన్నారు. వేసవికాలంలో ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద మంచి నీటి వాటర్ ట్యాంక్ ను ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా ఔటర్ రింగ్ రోడ్డు గుండా ఏర్పాటు చేసిన రింగ్ మెయిన్ పనులను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో ఉదయం, సాయంత్రం రెండు సమయాల్లో ప్రజలకు తాగునీరు సరఫరా చేయాలని ఆదేశించారు. పాత బస్టాండ్ నుంచి మెదక్ రోడ్డు, కరీంనగర్ రోడ్డుకు ఇరువైపులా ఫుట్ పాత్ లైటింగ్ ప్రణాళికలు సిద్ధం చేయాలని హరీశ్రావు చెప్పారు. ఇందిరమ్మ కాలనీ, బీటీ రోడ్డు పనులు, లింగారెడ్డిపల్లి బ్రిడ్జి పనుల జాప్యంపై అరా తీశారు. మూడు రోజుల్లో పనులు పూర్తి చేయాలని ఆర్అండ్బీ అధికారులకు సూచించారు. పట్టణంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలన్నారు. పట్టణంలో విద్యుత్, మున్సిపల్ సిబ్బంది ఇష్టానుసారంగా చెట్లను నరకడం సరికాదని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పట్టణంలో చెత్త పేరుకుపోయిందని, బ్లాక్ స్పాట్స్ తొలగించాలని సూచించారు. దేశ స్థాయిలో సిద్దిపేట కు మంచి పేరు ఉందని, దాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అనంతరం 32 వార్డుల అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రతి రోజు ఉదయం 5గంటల నుంచి ప్రతి వార్డు అధికారి చెత్త బండితో తిరగాలని సూచించారు. అంతకుముందు చైర్పర్సన్ మంజుల అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. పలు సమస్యలను కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్, వైస్ చైర్మన్ కనకరాజు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్
హుస్నాబాద్: పోటీ ప్రపంచంలో విద్యార్థులు కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎన్సాన్పల్లిలోని రెసిడెన్సియల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీఎస్ గ్రూప్లో 468/470 మార్కులతో హుస్నాబాద్ విద్యార్థిని రాధారపు వైష్ణవి రాష్ట్ర ప్రథమ ర్యాంక్ సాధించారు. ఈ నేపథ్యంలో మంగళవారం మంత్రి వైష్ణవి నివాసానికి వెళ్లి అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైష్ణవి ఈ ప్రాంత విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు. గురుకులాల్లో చదువుకున్న దాదాపు 150 మంది ప్రతిభ కనబరిచిన ఇంటర్ విద్యార్థులకు సన్మానించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మాజీ కౌన్సిలర్లు మ్యాదరబోయిన శ్రీనివాస్. చిత్తారి పద్మ తదితరులు ఉన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటర్ రాష్ట్ర టాపర్కు సన్మానం -
కన్నీటిపాలు
అకాల వర్షాలతో ఆగమాగం రైతు కష్టం..నోటికాడికూడు వర్షార్పణందుబ్బాక: ధాన్యాన్ని కాపాడుకునేందుకు పాట్లు జిల్లాలో భారీగా నష్టం ● 6,557 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు ● ఫసల్ బీమా లేక అవస్థలు ● ప్రభుత్వం వైపు దీనంగా రైతన్న చూపు అకాల వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు చేతికందే సమయంలో నేలపాలవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈ యాసంగిలో 3.47లక్షల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, కూరగాయలు, తదితర పంటలు సాగు చేశారు. అయితే మార్చి 22 నుంచి ఈ నెల 26 వరకు కురిసిన అకాల వర్షాలు రైతులను కన్నీటిపాలు చేశాయి. ఇప్పటి వరకు జిల్లాలో 6,557 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. ఇందులో అత్యధికంగా వరి 4,498 ఎకరాలు, మొక్కజొన్న 496, మామిడి 1,505ఎకరాలు, ఇతర పంటలు 58 ఎకరాల్లో నష్టపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రశాంత్నగర్(సిద్దిపేట): అకాల వర్షాలు రైతన్నను నట్టేట ముంచుతున్నాయి. చిన్నకోడూరు, నంగునూరు, జగదేవ్పూర్, ధూళ్మిట్ట, చేర్యాల, బెజ్జంకి, అక్కన్నపేట, గజ్వేల్, దౌల్తాబాద్ మండలాల్లో ఎక్కువగా పంటలు దెబ్బతిన్నాయి. సాగు పెట్టుబడి కోసం చేసిన అప్పులు.. ఈ అకాల వర్షాలతో వచ్చిన నష్టంతో రైతులు దిక్కుతోచని స్థితికి గురవుతున్నారు. ఫసల్ బీమా లేక.. కొన్నేళ్లుగా ఫసల్బీమా పథకాన్ని పాలకులు అమలు చేయకపోవడంతో రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు. ఎకరా వరికి రూ.450 ప్రీమియం చెల్లిస్తే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పంట నష్టపోయిన రైతులకు చెదోడు వాదోడుగా ఫసల్బీమా నిలిచేది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి దెబ్బతిన్న పంట వివరాలను వ్యవసాయశాఖ అధికారులు అందించారు. ప్రభుత్వం ప్రతి ఎకరాకు రూ.10వేలు చొప్పున నష్టపరిహారం అందించనుంది. కానీ నష్టపరిహారం ఎపుడు వస్తుందోనని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. నేలరాలిన మామిడి... జిల్లాలో 16 వేల ఎకరాల్లో మామిడి తోటలు సాగు చేస్తున్నారు. కొద్ది రోజులుగా అకాల వర్షాలు, ఈదురుగాలులు, వడగళ్లతో మామిడి రైతులు బెంబేలెత్తుతున్నారు. మామిడి కోతకు వచ్చిన సమయంలో వరుణుడు భయపెడుతుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,505 ఎకరాల్లో మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. దుబ్బాక: అకాల వర్షంతో దుబ్బాక మార్కెట్ యార్డులో ఆరబోసిన ధాన్యం తడిసిముద్దయింది. చాలా వరకు కొట్టుకుపోయింది. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా వర్షం రావడంతో ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నోటికాడికూడు వర్షార్పణం కావడంతో కన్నీటిపర్యంతమయ్యారు. వాన ఎప్పుడు వస్తదో తెలియని పరిస్థితి నెలకొందని, మళ్లీ వాన పడితే ధాన్యం చేతికిరాని పరిస్థితి నెలకొందన్నారు. త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేసి తమ ఇబ్బందులు తీర్చాలని రైతులు డిమాండ్ చేశారు. ఈదురుగాలులతో బీభత్సం తొగుట(దుబ్బాక): మండలంలో ఈదురుగాలతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. కురిసిన అకాల వర్షానికి తొగుట, చందాపూర్, తుక్కాపూర్, జప్తిలింగారెడ్డిపల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది. గజ్వేల్–సిద్దిపేట రహదారిపై చెట్లు విరిగి పడ్డాయి. కోళ్లఫారం ధ్వంసం గజ్వేల్రూరల్/మర్కూక్: మున్సిపాలిటీతో పాటు పలు గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ప్రజ్ఞాపూర్ శివారులో నిర్మాణంలో ఉన్న కోళ్లఫారం ఈదురు గాలులకు ధ్వంసమైంది. రూ.70వేల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు. అలాగే మర్కూక్ మండలంలో వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది.పరిహారం అందిస్తాం ఈ యాసంగిలో అకాల వర్షాలు, వడగళ్ల వానతో వరి, మొక్కజొన్న, మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా 6,557 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పంట నష్టం వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాం. పంట నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరాకు రూ.10వేలు రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. –రాధిక, జిల్లా వ్యవసాయశాఖ ఆధికారి -
మా భూములు మాకివ్వండి
మంత్రి పొన్నంకు రైతుల విన్నపంతోటపల్లి రిజర్వాయర్ కోసం సేకరించిన భూములు తిరిగి ఇవ్వాలని రైతులు కోరారు. ఈ మేరకు మంగళవారం రాంచంద్రాపూర్కు చెందిన పలువురు రైతులు మంత్రి పొన్నం ప్రభాకర్కు విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయమే జీవనాధారమన్నారు. సుమారు 600ఎకరాల సాగు భూమి ప్రభుత్వం ఆధీనంలో ఉన్నా చేసేదిలేక సాగు చేసుకుంటున్నామని చెప్పారు. ఆ భూములన్నీ తిరిగి మాకే అప్పజెప్పాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. ఈ విషయమై మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. కార్యక్రమంలో రైతులు వెంకట్రెడ్డి, మహేందర్రెడ్డి, బత్తుల రాజు, బినవేణి రామస్వామి, లక్ష్మణు, మైలు మల్లేశం, బోలుమల్ల దేవమ్మ, భారతవ్వ తదితరులు ఉన్నారు. –కోహెడరూరల్(హుస్నాబాద్) -
సుబ్రహ్మణ్యేశ్వరుడికి లక్ష పుష్పార్చన
వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధమైన విద్యాసరస్వతి క్షేత్రంలోని సుబ్రహ్మణ్యేశ్వరాలయంలో కృత్తిక నక్షత్ర మహోత్సవం వైభవంగా జరిగింది. మంగళవారం తెల్లవారుజామున వేదపండితులు స్వామివారి మూలవిరాట్టుకు పంచామృతాభిషేకం జరిపారు. పట్టువస్త్రాలు, ఆభరణాలు, పూలమాలికలతో అలంకరించారు. స్వామివారి నామాలు పఠిస్తూ సామూహిక లక్షపుష్పార్చన చేశారు. కన్నుల పండువగా సాగిన ఈ మహోత్సవంలో భక్తులు పాల్గొని తరించారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. భూసార పరీక్షలు తప్పనిసరి గజ్వేల్: మండల పరిధి జాలిగామ గ్రామంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం భూసారపరీక్షలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ఏరియా మేనేజర్ సాయికుమార్ మాట్లాడుతూ రైతులు విచక్షణారహితంగా ఎరువులు వాడటం వల్ల నేలసారం దెబ్బతింటుందని చెప్పారు. నేలల్లో నత్రజని, భాస్వరం, పొటాషియం ఇతర పోషకాల శాతాన్ని తెలుసుకోవడానికి ఏటా భూసార పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పరీక్షల ఫలితాల తర్వాత పోషకాలను సరిచేసుకొని, అందుకనుగుణంగా పంటలు వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్కు సంబంధించిన సిబ్బంది, గ్రామ రైతులు పాల్గొన్నారు. మా భూముల్లో కాల్వలు తవ్వొద్దు హుస్నాబాద్రూరల్: మా భూముల్లో కెనాల్ కాల్వలు తవ్వొద్దని కూచనపెల్లి రైతులు కోరారు. ఈ మేరకు మంగళవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఇప్పటికే చెరువు, కుంటల నుంచి నీటి కాల్వలు పంట పొలాలకు ఉన్నాయని, మళ్లీ కొత్తగా కెనాల్ కాల్వల కోసం భూములు తీసుకోవడం తగదని అన్నారు. ఎల్లమ్మ చెరువు నుంచి నీటి కాల్వలు కూచనపెల్లి వరకు ఉన్నాయన్నారు. శనకుంటకు నీరు వెళ్లేందుకు పాత కాల్వలు ఉన్నాయని వాటికి మరమ్మతులు చేస్తే సరిపోతుందన్నారు. భూ సేకరణతో చిన్న, సన్నకారు రైతులు నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత మల్లికార్జున్రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
భూభారతితో భూసమస్యలకు చెక్
ములుగు(గజ్వేల్): జిల్లాస్థాయిలోనే భూసమస్యలు పరిష్కారమయ్యేలా భూభారతి చట్టం దోహదపడుతుందని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. మంగళవారం ములుగు మండల కేంద్రంలో భూ భారతి చట్టం అవగాహన కార్యక్రమానికి అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్తో కలిసి కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాదా బైనామాలకు పరిష్కారం లభిస్తుందన్నారు. మనిషికి ఆధార్ కార్డు మాదిరిగా, భూమికి భూధార్ కార్డులు జారీ చేస్తామన్నారు. దీని ద్వారా భూ ఆక్రమణలకు చెక్ పెట్టవచ్చని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రకళ, వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ మోహన్, వైస్చైర్మన్ ప్రభాకర్, తహసీల్దార్ ఆరిఫా, ఏడీఏ అనీల్కుమార్, డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. పటిష్టంగా అమలు మర్కూక్(గజ్వేల్): భూభారతిని పటిష్టంగా అమలు చేస్తామని కలెక్టర్ మనుచౌదరి తెలిపారు. మంగళవారం మండల కేంద్రమైన మర్కూక్లో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మనిషికి ఆధార్ కార్డు మాదిరి భూమికి భూధార్ కార్డు అని, భూమి హద్దులు జీపీఆర్ఎస్లో పొందుపరిచి పటిష్టంగా ఉంచడంలో భూదార్ కార్డు ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు. మార్కెట్ నిర్మాణం చేపడతాంవంటిమామిడి మార్కెట్ యార్డు వద్ద రాజీవ్రహదారిపై క్రయవిక్రయాల రద్దీని అధిగమించేందుకు యార్డు ఎదుట ఉన్న ఖాళీ ప్రదేశంలో మార్కెట్ నిర్మాణం చేపడతామని కలెక్టర్ మనుచౌదరి తెలిపారు. మంగళవారం వంటిమామిడి ఏఎంసీని ఆయన సందర్శించి అక్కడి స్థితిగతులను పరిశీలించారు. మార్కెట్ యార్డు ఎదుట ఉన్న రాజీవ్రహదారిపై వ్యాపారస్తులు, రైతులు, క్రయవిక్రయాలు కొనసాగిస్తుండటంతో ఆ మార్గంలో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడి భారీగా ట్రాఫిక్ స్తంభిస్తుందని ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి తెచ్చారు. స్పందించిన కలెక్టర్ మాట్లాడుతూ మార్కెట్యార్డు ముందర మార్కెట్యార్డు నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపి అతి త్వరలో మార్కెట్ నిర్మాణాన్ని సైతం పూర్తి చేస్తామని కలెక్టర్ చెప్పారు. రైతులకు భూధార్ కార్డులు కలెక్టర్ మనుచౌదరి ములుగులో చట్టంపై అవగాహన -
ప్రజాసౌకర్యాలకు ప్రాధాన్యం
‘సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఆయా వార్డుల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పిస్తాం. అవసరమైతే సమస్యలపై క్షేత్ర స్థాయిలో పర్యటించి సత్వరం పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. ప్రాధాన్యత క్రమంలో రహదారులనూ నిర్మిస్తాం’ అని కమిషనర్ ఆశ్రిత్ కుమార్ తెలిపారు. మంగళవారం మున్సిపల్ కమిషనర్తో ఉదయం 11:30 నుంచి 12:30 వరకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ ఇన్కు అనూహ్య స్పందన లభించింది. ఈ సందర్భంగా పట్టణ వాసులు కమిషనర్ దృష్టికి పలు సమస్యలు తీసుకువచ్చారు. వాటిని పరిష్కరించాలని కోరారు. ఫోన్ ఇన్ ద్వారా వచ్చిన సమస్యలు, ఫిర్యాదులపై కమిషనర్ స్పందిస్తూ.. ఆయా విభాగాల అధికారులు తక్షణం క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. ప్రధానంగా నూతన కాలనీల్లో మిషన్ భగీరథ నీళ్లు, యూజీడి వ్యవస్థ అమలు, రహదారుల నిర్మాణానికి అత్యధికంగా వినతులు వచ్చాయి. – సాక్షి సిద్దిపేట/సిద్దిపేటజోన్ కొత్త కాలనీలకు నీళ్లివ్వండి మా కాలనీలో 20 ఇళ్లు ఉన్నాయి. ఇప్పటివరకు మిషన్ భగీరథ నీరు రావడం లేదు. తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నాం. భగీరథ పైప్ లైన్ ఏర్పాటు చేసి మంచి నీళ్లు ఇవ్వాలి. – భూషణం, సాజిద్ అలీ(సద్గురు నగర్, సిద్దిపేట) మున్సిపల్ కమిషనర్: మున్సిపాలిటీ పరిధిలో కొత్త కాలనీలు వెలిశాయి. అప్పటి నివాసాలకు అనుగుణంగా మిషన్ భగీరథ పైప్లైన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పెరిగిన నివాసాలకు అనుగుణంగా పైప్ లైన్ పనులు చేపట్టాలని నిర్ణయించాం. త్వరితగతిన భగీరథ నీళ్లు అందిస్తాం తాగునీటికి ఇబ్బందులు పలు కాలనీల్లో నీరు సరఫరా సక్రమంగా జరగడం లేదు. తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. తక్షణం పరిష్కరించండి –కోటమ్మ(శివాజీ నగర్), వెంకట్ రమణారెడ్డి (మైత్రి వనం), వెంకయ్య (మోహిన్ పూర)మున్సిపల్ కమిషనర్: మిషన్ భగీరథ, మానేరు పథకం ద్వారా పట్టణంలో నీటి సరఫరా చేస్తున్నాం. నీటి సరఫరాలో సమస్యలు ఉంటే మా దృష్టికి తెస్తే సత్వరం పరిష్కరిస్తాం. వేసవిలో నీటి సమస్య రాకుండా చర్యలు చేపడుతున్నాం. సంబంధిత అధికారి, సిబ్బంది క్షేత్ర స్థాయిలో పర్యటించి సమస్య పరిష్కరిస్తారు. రోడ్డు మధ్యలో ఆర్చ్ కట్టారు.. రోడ్డు మధ్యలో ప్రయివేటు వ్యక్తులు కమాన్ (ఆర్చ్) నిర్మించారు. ప్రజలకు ఇబ్బందిగా ఉంది, చర్యలు తీసుకోండి. –శ్రీనివాస్ రెడ్డి(మైత్రి వనం) మున్సిపల్ కమిషనర్: ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మాణం చేస్తే ఉపేక్షించేది లేదు. టౌన్ ప్లానింగ్ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే చర్యలు తీసుకుంటారు. వసతులు కల్పించండి మౌలిక వసతులు కల్పించాలి. వి మార్ట్ వెనుక భాగంలో రహదారులు లేవు, యూజీడి వ్యవస్థ అసలే లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. –సంజీవ రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, లత శేఖర్గౌడ్ (మారుతి నగర్) మున్సిపల్ కమిషనర్: రహదారి. యూజీడి వ్యవస్థ నిర్మాణం కోసం ప్రతిపాదనలు పూర్తి చేసి టెండర్లను పిలిచాం. కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. త్వరితగతిన ప్రక్రియ పూర్తి చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. యూజీడికి అక్కడ ఔట్ లెట్ లేదు. అయినప్పటికీ సమస్య లేకుండా చూస్తాం. కాలువలు శుభ్రం చేయాలి పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేదు. మురికి కాలువలను సరిగ్గా శుభ్రం చేయడం లేదు. రోజు క్లీనింగ్ ఉండేలా చూడాలి. చెత్త బండి సరిగ్గా రావడం లేదు –వంశీకష్ణ (అంబేడ్కర్ నగర్), శేఖర్(మారుతీ నగర్), లక్ష్మీనారాయణ(చార్వాదాన్ వీధి) మున్సిపల్ కమిషనర్: పారిశుద్ధ్య నిర్వహణ పనులు సరిగ్గా జరిగేలా చూస్తాం. సిబ్బంది కొరత వల్ల కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు వస్తున్నాయి. రోజూ చెత్త బండి వచ్చేలా చూస్తాం. సంబంధించిన విభాగం అధికారులు, సిబ్బంది క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేసి సమస్యలు లేకుండా చూస్తారు. మ్యుటేషన్ చేస్తలేరు నోటరీ ద్వారా మ్యుటేషన్ చేస్తాలేరు. ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. –శ్రీకాంత్(గాంధీనగర్) మున్సిపల్ కమిషనర్: నోటరీ ఆధారంగా మున్సిపల్ కార్యాలయంలో మ్యుటేషన్ జరగదు. నిబంధనల ప్రకారమే మ్యుటేషన్ చేస్తాం. సంబంధించిన పత్రాలు తీసుకుని నేరుగా కలవండి. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. పన్ను విధింపులో తేడాలు ఆస్తి పన్ను విధింపు విషయంలో తేడాలు తలెత్తుతున్నాయి. ఒకే వార్డులో ఒకే ప్రాంతంలో వేరువేరుగా ట్యాక్స్ విధిస్తున్నారు. (ప్రవీణ్ రెడ్డి, సిద్దిపేట) మున్సిపల్ కమిషనర్: భవనం పరిస్థితులు, నిర్మాణం మేరకు మున్సిపల్ ఆస్తి పన్ను విధింపు ఉంటుంది. ట్యాక్స్ విషయంలో ఎలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తగా కొలతల ప్రకారమే పన్నులు అమలు చేస్తున్నాం. అధ్వానంగా మ్యాన్హోల్స్ మ్యాన్ హోల్స్పై కవర్లు లేవు. మైత్రి వనంలో యూజీడీ మ్యాన్ హోల్పై కవర్లు లేనందున ఇబ్బందులు పడుతున్నాం. అందులో చెత్త చెదారం పడుతోంది. దుర్వాసన వస్తోంది. రాత్రి వేళల్లో అందులో పడే ప్రమాదం ఉంది. –నాగరాజు(మైత్రి వనం) మున్సిపల్ కమిషనర్: సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. త్వరితగతిన మ్యాన్ హోల్స్ మీద కవర్లు ఏర్పాటు చేస్తాం. ఇబ్బంది లేకుండా చూస్తాం. యూజీడి అధికారులు క్షేత్ర స్థాయిలో వచ్చేలా ఆదేశాలు జారీ చేస్తా. దుర్వాసన వస్తోంది నర్సాపూర్ చెరువు వద్ద మాంసం వ్యర్థాలు బహిరంగంగా పారబోస్తున్నారు. దీంతో దుర్వాసన వస్తోంది. వాకర్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. –బాబు(సిద్దిపేట) మున్సిపల్ కమిషనర్: సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. వ్యర్థాలు బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా చూస్తాం. గట్టి నిఘా ఏర్పాటు చేస్తాం. ఫోన్లో ఫిర్యాదులు స్వీకరిస్తున్న కమిషనర్ ఆశ్రిత్కుమార్పారిశుద్ధ్యం నిర్వహణపై ప్రత్యేక దృష్టి రోడ్ల మరమ్మతులను వేగవంతం చేస్తాం యూజీడి, భగీరథ సమస్యలపై ఫోకస్ మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ ‘సాక్షి’ ఫోన్ ఇన్కు అనూహ్య స్పందన -
సోలార్ ప్లాంట్ల ఏర్పాటుపై అనాసక్తి
● ముందుకు రాని రైతులు ● ఉమ్మడి మెదక్ జిల్లాలో 363 మంది దరఖాస్తు ● ఇప్పటి వరకు ఈఎండీ చెల్లించింది 94 మందే ● సబ్సిడీ అందించాలంటున్న అన్నదాతలు ● ‘పీఎం కుసుమ్’లో 0.5 నుంచి 2 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశంజిల్లా పేరు దరఖాస్తులు ఈఎండీ చెల్లించిన వారు సిద్దిపేట 179 37 మెదక్ 74 24 సంగారెడ్డి 110 33 దరఖాస్తు చేసిన రైతు భూమిని పరిశీలిస్తున్న రెడ్కో అధికారులు‘సౌర’ పంటకు రైతులు వెనుకడుగు వేస్తున్నారు. పీఎం– కుసుమ్ పథకం కింద పంట పొలాల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీజీ రెడ్కో) ఆధ్వర్యంలో దరఖాస్తులను గత ఫిబ్రవరి 28వ తేదీ వరకు స్వీకరించారు. రైతు కనీసం 0.5 నుంచి 2 మెగావాట్ల ప్లాంటు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో ఉత్సాహంగా దరఖాస్తు చేసుకున్న రైతులు ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు రాకపోవడం గమనార్హం. సాక్షి, సిద్దిపేట: సాగు, బీడు భూముల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుతో రైతులు ఆదాయం పొందాలన్న ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. పీఎం – కుసుమ్లో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో 430 విద్యుత్ సబ్ స్టేషన్ ప్రాంతాలను ఎంపిక చేశారు. వీటి పరిధిలో 363 మంది రైతులు దరఖాస్తు చేయగా అందులో ఈఎండీ (ఎర్నెస్ట్ మనీ డిపాజిట్)ను 94 మంది రైతులు మాత్రమే చెల్లించారు. ఈ ఈఎండీలు ఈ నెల 30వ తేదీతో గడువు ముగియనుంది. మెగావాట్కు రూ.3 కోట్లు ఒక్క మెగావాట్ విద్యుత్తు ఉత్పత్తి కోసం సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే కనీసం రూ.3 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో ఏదైన బ్యాంక్ రుణం పొందితే మెగావాట్కు 30శాతం లెక్కన రైతులు దాదాపు రూ.85లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇది కాకుండా ప్లాంటు నుంచి విద్యుత్తు సబ్స్టేషన్ వరకు వేసే విద్యుత్తు లైన్ కోసం కిలో మీటరుకు రూ. 5లక్షలు ఖర్చు అవుతుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని ముందుకు రావడం లేదని దరఖాస్తు చేసిన రైతులు అంటున్నారు. కొంత ప్రభుత్వం నుంచి సబ్సిడీ అందజేయాలని రైతులు కోరుతున్నారు. భూముల్లో కరెంట్ ఉత్పత్తి ఉమ్మడి మెదక్ జిల్లాలో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లకు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న భూముల్లో 0.5 మెగావాట్ల నుంచి 2 మెగా వాట్ల సామర్థ్యం వరకు కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు. తెలంగాణ విద్యుత్తు రెగ్యులేటరీ కమిషనర్ (టీజీఈఆర్సీ) ఒక్కో యూనిట్కు రూ.3.13లను నిర్ణయించిన టారిఫ్ ప్రకారం కొనుగోలు చేయనున్నారు. దీంతో రైతులకు ఆదాయం రానుంది. ఒక్క మెగావాట్ ప్లాంట్లో రోజుకు 4600 నుంచి 5వేల యూనిట్ల వరకు సౌరశక్తిని ఉత్పత్తి చేయవచ్చు. ఈలెక్కన యేడాదికి సుమారు రూ.60 లక్షల వరకు పొందవచ్చు. జనవరి నుంచి విద్యుత్ ఉత్పత్తి దరఖాస్తు చేసి ఈఎండీ చెల్లించిన వారిచే డిసెంబర్ వరకు సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తాం. అలాగే ఈ ప్లాంట్ జనవరి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాం. ఈ నెలాఖరు వరకు ఈఎండీ చెల్లించే గడువు ఉండటంతో మరి కొందరు చెల్లించే అవకాశం ఉంది. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. –రవీందర్ చౌహాన్, డీఎం, రెడ్కో -
సాదాబైనామాలకూ పరిష్కారం
● కలెక్టర్ మనుచౌదరి ● గజ్వేల్లో భూభారతిపై అవగాహన సదస్సు గజ్వేల్: పెండింగ్లో ఉన్న సాదాబైనామా సమస్యలను పరిష్కరించడానికి ‘భూభారతి’లో అవకాశం కల్పించినట్లు కలెక్టర్ మనుచౌదరి తెలిపారు. సోమవారం గజ్వేల్లోని ఐఓసీ(ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్)లో నిర్వహించిన ‘భూభారతి’ అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల్లో అవగాహనను పెంపొందించడమే లక్ష్యంగా సదస్సుల నిర్వహణతోపాటు కరపత్రాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. భూసమస్యలపై అందించే దరఖాస్తులను భూభారతి చట్టం ద్వారా పరిష్కరిస్తామన్నారు. ఆర్డీఓ నిర్ణయంపై కలెక్టర్ వద్దకు, కలెక్టర్ నిర్ణయంపై భూ ట్రిబ్యునల్ వద్ద అప్పీల్ చేసుకోవచ్చునని తెలిపారు. అప్పీల్ వ్యవస్థ అందించిన తీర్పుపై సంతృప్తి చెందకపోతే సివిల్ కోర్టుకు వెళ్లవచ్చునని తెలిపారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డులను తయారు చేసి, ప్రతి ఏటా ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు. గ్రామాల్లో రెనెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడానికి గ్రామ పరిపాలన అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రకళ, మండల ప్రత్యేకాధికారి సువర్ణ, తహశీల్ధార్ శ్రావన్కుమార్, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భూభారతి దేశానికే ఆదర్శం
● రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ● వర్గల్ మండలం శాకారంలో చట్టంపై అవగాహన సదస్సు ● పాల్గొన్న మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ వర్గల్(గజ్వేల్): దేశంలోనే చరిత్రాత్మకంగా, రోల్మోడల్గా భూభారతి చట్టం నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టర్ మనుచౌదరి అధ్యక్షతన వర్గల్ మండలం శాకారంలో నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన సదస్సుకు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డిలతో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రైతులు ఆత్మగౌరవంతో జీవించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూభారతి చట్టం ఒక వరమని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా నిలిచిన భూ సమస్యలు పరిష్కారం కానున్నాయని వివరించారు. మనిషికి ఆధార్ మాదిరిగా, భూమి ఉన్న ప్రతి రైతుకు హక్కులు కల్పిస్తూ భూధార్ సంఖ్య కేటాయించనున్నట్లు మంత్రి తెలిపారు. ధరణి పోర్టల్తో అనేక ప్రభుత్వ, అసైన్డ్ భూములు, వక్ఫ్, దేవాదాయ తదితర భూములు పక్కదారి పట్టాయన్నారు. వేలాది ఎకరాలు పార్ట్బీలో చేరాయని, సాదాబైనామాలు పెద్ద ఎత్తున ఆన్లైన్ దరఖాస్తులకే పరమితమయ్యాయన్నారు. రికార్డులో తప్పుల నమోదుతో అత్యవసర పరిస్థితులలో అర ఎకరం భూమి అమ్ముకుందామంటే అమ్మలేని దయనీయ స్థితిని ధరణి కారణంగా రైతులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ఇలాంటి సమస్యలన్నిటికీ పరిష్కారంగా భూభారతి చట్టం తీసుకువచ్చామన్నారు. దీనిని చట్టబద్ధం చేసేందుకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడితే తమ ఉనికికే ప్రమాదమని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నానా ప్రయత్నాలు చేసిందన్నారు. ప్రస్తుత సీఎం రేవంత్ నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం పేదోడికి అండగా నిలుస్తూ సీఎం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల దాకా ప్రజల్లోనే ఉంటున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకోగా, గజ్వేల్ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కేటాయిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రికార్డుల పరంగా పలువురు రైతులు తాము ఎదుర్కొంటున్న భూసంబంధ సమస్యలను వేదికపై మంత్రికి నివేదించారు. వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కాగా ఇదే వేదికపై పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. -
మున్సిపల్ కమిషనర్తో నేడు ‘సాక్షి’ ఫోన్ ఇన్
సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో కమిషనర్తో ఫోన్ ఇన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పట్టణంలో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, పౌర సేవలు, నూతన ఇంటి అనుమతులు, వివిధ రకాల పన్నుల చెల్లింపు, మ్యుటేషన్ తదితర అంశాలపై అనుమానాలు, సందేహాలు, ఫిర్యా దులను నేరుగా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఫోన్ చేయాల్సిన నంబర్లు : 98668 98692, 98665 53321 -
కేసీఆర్ ఆరోపణలు అర్థరహితం
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బుచ్చిరెడ్డి సిద్దిపేటరూరల్: బీఆర్ఎస్ రజతోత్సవ సభ కేవలం సీఎం రేవంత్రెడ్డిపై నిందలు వేసేందుకు మాత్రమే నిర్వహించినట్లు ఉందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బుచ్చిరెడ్డి ఆరోపించారు. సోమవారం మండల పరిధిలోని ఇర్కోడ్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 16 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై మాజీ సీఎం కేసీఆర్ తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సొంత గ్రామంలోనే ఇచ్చిన హామీ నెరవేర్చలేని కేసీఆర్.. ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. పెండింగ్ బిల్లులన్నీ బీఆర్ఎస్ హయాంలో జరిగినవేనని అన్నారు. కార్యక్రమంలో పార్టీ గ్రామ అధ్యక్షుడు మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ సదాశివారెడ్డి, కిష్టారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ మల్లయ్య, శ్రీనివాస్, బాలకిషన్, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఐడియా అదిరింది.. ఆటో భలేగుంది
ఇంటి పెరట్లో.. మేడపైన మొక్కలు పెంచడం సహజం. కానీ వీటన్నింటికీ భిన్నంగా ఆటోపై మట్టికుండీలు అమర్చి వాటిలో మొక్కలు పెంచుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు ఓ ఆటోవాలా. అంతే కాదండోయ్ పర్యావరణం పట్ల తన ఆటోలో ప్రయాణించేవారికి అవగాహన కల్పిస్తున్నారు. మండుతున్న వేసవిలోనూ ఈ ఆటోలో ప్రయాణిస్తే చాలా కూల్కూల్గా ఉంటోంది. వినూత్న పద్ధతిలో ఆటోను డిజైన్ చేసి నడుపుతున్న డ్రైవర్ అంజిని ‘సాక్షి’ సోమవారం పలకరించింది. మహబుబాబాద్ జిల్లా పూసపల్లికి చెందిన అంజి తన ఆటోకు పచ్చిగడ్డి, పూలమొక్కలను ఏర్పాటు చేసి ప్రకృతిని కాపాడాలంటూ వందల కిలోమీటర్లు తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వేసవిలో ప్రయాణికులు ఉపశమనం పొందేలా కూలర్ లాంటి ఫ్యాన్ను, చల్లని మంచినీటిని ఏర్పాటు చేశారు. వికలాంగులు, కంటి చూపు లేని వారిని ఉచితంగా తన ఆటోలో తమ తమ గమ్య స్థానాలకు చేరవేస్తున్నట్లు అంజి తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి, వాటిని కాపాడాలని, ప్రకృతిని ప్రేమించాలని కోరుతున్నారు అంజి. – సిద్దిపేటకమాన్ -
వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయండి
సిద్దిపేటరూరల్: హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి గోపాల స్వామి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాలస్వామి మాట్లాడుతూ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. అలాగే 50 ఏళ్లు నిండిన ప్రతి హమాలీకి నెలకు రూ.10వేల పెన్షన్ ఇవ్వాలన్నారు. ఐకేపి, పీఏసీఎస్ ల ఆధ్వర్యంలో చేపడుతున్న కొనుగోలు కేంద్రాలు హమాలీ కార్మికులతో నడుస్తున్నాయన్నారు. కొన్ని సార్లు ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్న క్రమంలో ప్రభుత్వం వారికి రక్షణగా నిలవాలన్నారు. కార్మికులకు కొనుగోలు కేంద్రం ద్వారానే కూలిని చెల్లించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. ప్రమాదవశాత్తు చనిపోయిన హమాలీకి రూ.10 లక్షల నష్టపరిహారం అందించాలన్నారు. సాధారణ మరణం పొందితే రూ.5లక్షలు అందించాలన్నారు. లేని పక్షంలో సీఐటీయూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి రవికుమార్ , కమిటి సభ్యులు అమ్ముల బాలనర్సయ్య, హమాలి యూనియన్ జిల్లా అధ్యక్షుడు మామిడాల కనకయ్య, నాయకులు ఎల్లయ్య, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు. హమాలీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి సీఐటీయూ జిల్లా కార్యదర్శి గోపాల స్వామి డిమాండ్ -
అర్జీలను సత్వరం పరిష్కరించాలి
అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సిద్దిపేటరూరల్: ప్రజలు అందజేసిన అర్జీలను సత్వర పరిష్కరించాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి గరిమా అగర్వాల్ దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అర్జీలు అందిస్తున్న బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. అర్జీలు పునరావృతం కాకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. భూ సంబంధిత, హౌసింగ్, ఆసరా పింఛన్ల, వివిధ సమస్యలపై మొత్తంగా 59 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో డీఆర్ఓ నాగరాజమ్మ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో అలసత్వం తగదు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి దుబ్బాక: ధాన్యం కొనుగోళ్లలో అలసత్వం తగదని, రైతులకు ఇబ్బందులు లేకుండా కొనసాగించాలని మున్సిపల్ కమిషనర్ పాతూరి శ్రీనివాస్రెడ్డి నిర్వాహకులకు సూచించారు. సోమవారం మున్సిపల్ పరధిలోని చెల్లాపూర్ 2, 3 వార్డులలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేమ, తూకం విషయంలో ఏ మాత్రం పొరపాట్లు లేకుండా చూసుకోవాలన్నారు. మండుతున్న ఎండలతో పాటు అకాల వర్షాలు కురుస్తున్నందునా కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు. కేంద్రాల్లో ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను ఇంటి పన్ను చెల్లించే వారికి అందించే ఎర్లీబర్డ్ పథకం మరో రెండు రోజుల్లో ముగుస్తుందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మెప్మా సీఈఓ సరిత, ఆర్పీలు, రైతులు తదితరులు ఉన్నారు. చేర్యాల మహిళకు సీ్త్ర శక్తి అవార్డు చేర్యాల(సిద్దిపేట): పట్టణ కేంద్రానికి చెందిన పి.మంగ రాష్ట్ర స్థాయి సీ్త్ర శక్తి అవార్డు అందుకున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ప్రోత్సహించడంలో భాగంగా డీఆర్డీఓ సిద్దిపేటతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల ఆధ్వర్యంలో అవార్డులు వరించాయి. జిల్లా తరఫున చేర్యాలకు చెందిన నకాషి కళాకారిని పి.మంగ రూపొందించిన చేర్యాల మాస్క్ అవార్డుకు ఎంపికయ్యారు. అవార్డును మంత్రి సీతక్క, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో డీపీఎం కరుణాకర్రావు తదితరులు పాల్గొన్నారు. -
అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి
వేసవికాలం దృష్ట్యా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి. చిన్నారులు, వృద్ధులు, మహిళలు ఎండల వేళ బయటకు వెళ్లకపోవడమే మంచిది. ఒక వేళ వెళ్లాల్సివస్తే గొడుగు, నెత్తిన టోపీలు, చలువ అద్దాలు ధరించాలి. అధిక ఎండల వల్ల శరీరంలోని లవణాలు త్వరగా చెమట రూపంలో కోల్పోతాం. లవణాలను తిరిగి పొందేందుకు నీరు, చెరకు, నిమ్మ రసం, మజ్జిగ సేవించాలి. –డాక్టర్ రాజేశ్వర్, ఎండీ జనరల్ ఫిజీషియన్, సిద్దిపేట -
కేసీఆర్ ఇలాకాలో ఘనంగా రజతోత్సవం
గజ్వేల్: మాజీ సీఎం కేసీఆర్ ఇలాకా గజ్వేల్లో బీఆర్ఎస్ రజతోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డితో కలిసి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జై తెలంగాణ అంటూ నినాదాలను హోరెత్తించారు. ఆ తర్వాత వరంగల్ సభకు బయలుదేరే బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ రజతోత్సవ సభతో కాంగ్రెస్లో భయం మొదలైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, బీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు నవాజ్మీరా తదితరులు పాల్గొన్నారు. -
వాహనాలన్నీ ఓరుగల్లు వైపే
ప్రధాన చౌరస్తాగా మారిన రంగధాంపల్లి.. సిద్దిపేటజోన్/ప్రశాంత్నగర్(సిద్దిపేట): బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణలు భారీగా తరలివెళ్లారు. నిజామాబాద్, రాజన్న సిరిసిల్లా, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, సిద్దిపేట, మెడ్చల్ రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి వచ్చే వాహనాలన్నీ రంగధాంపల్లి చౌరస్తా నుంచి ఓరుగుల్లు వైపు పయణమయ్యాయి. వేలల్లో వాహనాల రాకతో సిద్దిపేట పట్టణంలోని బీజేఆర్ చౌరస్తా, రంగధాంపల్లి చౌరస్తాల వద్ద ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు, అంబులెన్స్లు, ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పార్టీ జెండాల ఆవిష్కరణ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే హరీశ్రావుతో పాటు దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డిలు పాల్గొని పార్టీ జెండా ఆవిష్కరించారు. పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న సర్కిళ్లను గులాబి తోరణాలతో అలంకరించారు. రంగధాంపల్లి అమరవీరుల స్తూపం వద్ద ఎమ్మెల్యే హరీఽశ్రావు నివాళులు అర్పించి ఎల్కతుర్తికి భారీ వాహనాలతో తరళివెళ్లారు. క్యాంపు కార్యాలయంలో సందడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సందడి నెలకొంది. సభ స్థలికి వెళ్లే మార్గం సిద్దిపేట గుండా కావడంతో సమీపంలోని వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు. మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు మార్గమధ్యంలో హరీశ్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక్కడే అల్పాహారం చేశారు. -
జడ్జి ప్రత్యేక పూజలు
హుస్నాబాద్: రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ఆదివారం హుస్నాబాద్ కోర్టు జడ్జి కృష్ణతేజ్ ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి మొక్కు లు చెల్లించుకున్నారు. అనంతరం జడ్జిని అర్చకుడు పరమేశ్వర్ సన్మానించారు. నీతికథలతో మంచి ఆలోచనలు ప్రశాంత్నగర్(సిద్దిపేట): నీతి కథలు చెప్పడం వల్ల చిన్నారుల్లో మంచి ఆలోచనలకు స్థానం లభిస్తుందని కథాశిల్పి ఐత చంద్రయ్య అన్నారు. జాతీయ కథల దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలో కథల తాతయ్య ఎన్నవెళ్లి రాజమౌళిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఐత చంద్రయ్య మాట్లాడుతూ నీతి కథలు చెప్పి, విద్యార్థులను మంచివైపు నడిచేలా బాటలు వేస్తున్న కథల తాతయ్య రాజమౌళి అభినందనీయుడన్నారు. కథలు చెప్పడం ఒక కళ అని, అందులో చిన్నారులకు కథలు చెప్పడం అంటే గర్వించే విషయమన్నారు. బాలసాహితీవేత్త ఉండ్రాళ్ల రాజేశం మాట్లాడుతూ వేసవి సెలవుల్లో బాలలకు కథలు వినిపించాలన్నారు. సన్మాన గ్రహిత రాజమౌళి మాట్లాడుతూ పిల్లల ప్రపంచంలో కథలు చెప్పడం సంతోషమనిపిస్తుందన్నారు. బాలల వికాసానికి కథలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. కార్యక్రమంలో కవులు సింగీతం నరసింహరావు, బస్వ రాజ్ కుమార్, కోణం పరశురాములు, ఉండ్రాళ్ల తిరుపతి, తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక గజ్వేల్రూరల్: జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ప్రజ్ఞాపూర్లోగల టీజీడబ్ల్యూఆర్ఎస్(వర్గల్) విద్యార్థి బి.ఆకాష్ ఎంపికై నట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఫిజికల్ డైరెక్టర్ మురళి తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. టీజీడబ్ల్యూఆర్ఎస్లో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆకాష్ ఈనెల 30 నుంచి మే 5వరకు ఢిల్లీలో జరిగే అండర్ –19 జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యారన్నారు. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభను చాటి మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థి ఆకాష్ను అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల పీఈటీ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉగ్రవాదుల పిరికిపంద చర్య
కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్ చెరువంతా గుర్రపు డెక్కమిషన్ భగీరథ పైపులైన్ లీకేజీసంగారెడ్డి రూరల్: ఉగ్రదాడి పిరికిపంద చర్య అని కుల వివక్ష పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్ పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్లో పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఆదివారం డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో కేకే భవన్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాణిక్ మాట్లాడుతూ... ఉగ్రవాదులు జరిపిన కాల్పులను ప్రజాతంత్రవాదులు, మేధావులు, కుల, రాజకీయ పార్టీలు, యువత ముక్తకంఠంతో ఖండించాలన్నారు. దేశంలో సైనిక వ్యవస్థను ప్రైవేటుపరం చేయడం కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. ఆర్మీని నిఘా వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ...కేంద్ర ప్రభుత్వం కశ్మీర్ ప్రజలతోపాటు దేశ ప్రజలకు రక్షణ కల్పించడంలో విఫలమైందన్నారు. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన వారి కుటుంబాలను 50 లక్షల ఎక్స్్గ్రేషియాతోపాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి నాయకులు సాయి, శివ, ప్రశాంత్ శ్రీకాంత్, సురేష్, ప్రవీణ్, దేవదాస్, అమీర్ పాల్గొన్నారు.దుబ్బాక పట్టణంలోని రామ సముద్రం చెరువు గుర్రపు డెక్కతో నిండిపోయింది. దీంతో చెరువులోని నీరంతా కలుషితమవుతోంది. ఈ విషయమై అధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోవడంలేదని స్థానికులు మండిపడుతున్నారు. గుర్రపు డెక్కను తొలగించి చెరువును సుందరీకరించాలని వారు కోరుతున్నారు. – దుబ్బాకటౌన్ పాపన్నపేట(మెదక్): మిషన్ భగీరథ పైపులైన్ జాయింట్ విడిపోవడంతో ఆదివారం నీరు వృథాగా పోయింది. సుమారు 20 ఎకరాల పొలాల్లోకి నీరు చేరింది. మండల పరిధిలోని నార్సింగి గ్రామానికి చెందిన 70 కుటుంబాలతో పాటు పలు గ్రామాలకు తాగునీరు రావడంలేదు. ఎల్లమ్మ గుడి వద్ద మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్కు కొత్తగా లింక్ లైన్ ఏర్పాటు చేసి, అర్కెల, దాని పరిధిలోని ఏడు గిరిజన తండాలు, నార్సింగిలోని ఒక ట్యాంకుకు కనెక్షన్ ఇచ్చి తాగునీరందిస్తున్నారు. మూడు రోజులుగా తాగునీరు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఫోన్లు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. నార్సింగి గ్రామ శివారులో పైపులు పగిలి నీరు వృథాగా పోతోందని తెలిపారు. వృథాగా పోతున్న తాగునీరు మూడు రోజులుగా పలు గ్రామాలకు నీటి కష్టాలు పట్టించుకోని అధికారులు -
పక్షులను కాపాడుకుందాం
మానవులతో సమానంగా ప్రకృతిలో జంతువులు, పక్షులకు జీవించే హక్కు ఉంది. వాటిని రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. పచ్చని చెట్లు ఉంటే మనం రక్షించుకోవడంతో పాటు, జంతువులు, పక్షులు సేదతీరుతాయి. ఇంట్లో పెంచుకునే కుక్కలు, పిల్లులు, పక్షుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పలువురు తమ ఇళ్లు, విద్యాసంస్థల వద్ద పక్షుల కోసం తాగునీటి తొట్టెలు, ధాన్యం ఏర్పాటు చేయడం సంతోషకరం. –డాక్టర్ నరసింహస్వామి, పర్యావరణ ప్రేమికుడు, సిద్దిపేట -
రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
హుస్నాబాద్: హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే సతీశ్కుమార్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యకర్తలను సమాయత్తం చేస్తూ శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ నినాదంతో దిగ్విజయంగా 25 సంవత్సరాలుగా తన ప్రస్థానాన్ని కొనసాగడం ఒక్క గులాబి జెండాకే దక్కిందన్నారు. సమావేశంలో నాయకులు రాయిరెడ్డి రాజిరెడ్డి, తిరుపతిరెడ్డి, అన్వర్ పాష, వెంకట్, నవీన్, రజిత, అనిత, వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉద్యమ స్ఫూర్తితో.. తొగుట(దుబ్బాక): ఉద్యమ స్ఫూర్తితో అధిక సంఖ్య లో కార్యకర్తలు తరలివచ్చి రజతోత్సవ సభను జయప్రదం చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి కోరారు. కార్యక్రమంలో నాయకులు యాదగిరి, అరుణ్కుమార్, రమేశ్, నరేందర్, ఆబిద్ హుస్సేన్ పాల్గొన్నారు. హుస్నాబాద్కు చేరుకున్న పాదయాత్ర హుస్నాబాద్: హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించునున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సిద్దిపేట నుంచి బీఆర్ఎస్ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర శనివారం రాత్రి హుస్నాబాద్కు చేరుకుంది. స్థానిక నాయకులు స్వాగతం పలికారు. అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. డీజే సౌండ్, డప్పుల చప్ప్ళుళ్లతో నృత్యం చేస్తూ సందడి చేశారు. మండలంలోని పోతారం(ఎస్) శుభం గార్డెన్లో రాత్రి బసచేసి ఆదివారం ఉదయం పాదయాత్రగా ఎల్కతుర్తికి బయలుదేరనున్నట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో రాయిరెడ్డి రాజిరెడ్డి, రజిత, అనిత, వెంకట్, తిరుపతిరెడ్డి, మంగ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్యే సతీశ్కుమార్ -
సమర్థ పాలనకు కార్యదర్శులే కీలకం
సిద్దిపేటఎడ్యుకేషన్: పాలన సమర్థవంతంగా ఉండేందుకు పంచాయతీ కార్యదర్శులు ముఖ్య పాత్ర పోషించాలని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) దేవకీదేవి అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థ ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో శనివారం పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ.. కార్యదర్శులు శిక్షణలో నేర్చుకున్న అంశాలపై పట్టు సాధించి పంచాయతీ పాలనను సమర్థవంతంగా నిర్వహించడంలో ప్రజాప్రతినిధులకు సహకరించాలని సూచించారు. రిసోర్స్ పర్సన్లు రిటైర్డ్ ఎంపీడీఓ సమ్మిరెడ్డి, ఎంపీఓ శ్రీనివాసరావు, విద్యావికాస్రెడ్డి తదితరులు పారదర్శకత, ప్రజల భాగస్వామ్యం, స్వయం సహాయక బృందాలు, స్వచ్ఛంద సంస్థలు, గ్రామ సభ నిర్వహణలో కార్యదర్శి పాత్ర తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లాలోని 33 మంది పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి -
గల్ఫ్ బాధితుడికి విముక్తి
మంత్రి పొన్నం చొరవతో క్షేమంగా ఇంటికి.. హుస్నాబాద్: గల్ఫ్లో చిక్కుకున్న చొప్పరి లింగయ్య ఎట్టకేలకు సొంతూరుకు చేరుకున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తనకు స్వదేశానికి రప్పించాలని కోరుతూ హుస్నాబాద్ పట్టణానికి చెందిన చొప్పరి లింగయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నంకు సెల్ఫీ వీడియో ద్వారా విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియో వైరల్ అయింది. వెంటనే స్పందించిన మంత్రి.. ఎన్నారై అడ్వైజరీ కమిటీ చైర్మన్ వినోద్కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డిలను సమన్వయం చేశారు. ఎన్నారై ప్రతినిధులు లింగయ్యను పరామర్శించి ధైర్యం చెప్పారు. విమాన టికెట్ డబ్బులను మంత్రి పొన్నం భరించారు. దీంతో లింగయ్య హైదరాబాద్కు చేరుకున్నాడు. చొరవ చూపిన మంత్రి పొన్నంకు లింగయ్య, అతని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. గంజాయి, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం: సీపీసిద్దిపేటకమాన్: గంజాయి, మత్తు పదార్థాలను ఉక్కుపాదంతో అణచివేయాలని సిద్దిపేట పోలీసు కమిషనర్ అనురాధ అన్నారు. సిద్దిపే ట డివిజన్ పోలీసు అధికారులతో ఆమె సమీక్షించారు. పోక్సో, ఎస్సీ ఎస్టీ కేసులలో 60రోజులలో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. నూతన టెక్నాలజీపై పోలీసు అధికారులు, సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. రాబోవు రోజుల్లో సీసీటీఎన్ఎస్ డాటా ప్రకారమే దేశ, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పోలీసు స్టేషన్లు ఎంపిక చేస్తారన్నారు. సైబర్ నేరాలు, గంజాయి తదితర అంశాలపై యవతకు అవగహన కల్పించాలన్నారు. సమావేశంలో ఏసీపీ మధు, టాస్క్ఫోర్స్ ఏసీసీ రవీందర్, సీఐలు వాసుదేవరావు, ఉపేందర్, విద్యాసాగర్, శ్రీను, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీధర్గౌడ్, ఎస్ఐలు అపూర్వరెడ్డి, బాలకృష్ణ, అసిఫ్, గంగరాజు, హరీశ్, రాజేష్, పరుశరామ్ తదితరులు పాల్గొన్నారు. చదువుతోనే ఉజ్వల భవిష్యత్ జగదేవ్పూర్(గజ్వేల్): చదువుతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రాజన్న అన్నారు. ఇటీవల వెలువడిన ఇంటర్ ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ప్రతిభ చాటిన విద్యార్థులను కళాశాలలో శనివారం శాలువాలు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు పది, ఇంటర్మీడియెట్ విద్యే భవితకు పునాదన్నారు. చదువతోనే సమాజంలో గుర్తింపు, గౌరవం వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. చైర్మన్, వైస్ చైర్మన్లకు ఘన సన్మానం కొండపాక(గజ్వేల్): వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ పరశురాములును కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. మండలంలోని వెలికట్ట గ్రామంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ బూర్గుల సురేందర్రావు మాట్లాడుతూ 15యేళ్లుగా మార్కెట్ కమిటీ పాలకవర్గ లేకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు పడ్డార న్నారు. ధాన్యం కొనుగోళ్లలో అవకతవకతలు, ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు. లింగారావు, గంగాధర్, సిద్దులు, ప్రభాస్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఇక భూధార్ కార్డులు
● భూ సమస్యలకు భూభారతితో చెక్ ● కలెక్టర్ మనుచౌదరీ కొండపాక(గజ్వేల్): భూముల గుర్తింపునకు భూదార్ కార్డులు ముఖ్యమని జిల్లా కలెక్టర్ మనుచౌదరి పేర్కొన్నారు. శనివారం కొండపాక, కుకునూరుపల్లి మండలాల్లోని రైతు వేదికల్లో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భా సమస్యలకు భూభారతి చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందన్నారు. రైతుల తమ భూములపై పక్కాగా హక్కులు కలిగి ఉండేలా భూ భారతి చట్టం పని చేస్తుందన్నారు. గతంలో అన్యాక్రాంతమైన ప్రభుత్వం భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసకునేలా ఈ చట్టంలో అవకాశాలు ఉన్నాయన్నారు. ఇదివరకు భూ సమస్యల పరిష్కారం కోసం కోర్టుల చుట్టూ తిరుగాల్సి వచ్చేదని, భూ భారతితో పారదర్శకంగా విచారణ జరిపి జిల్లా, రెవెన్యూ అధికారులు పరిష్కరించే అధికారులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంతకు ముందు అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రకళ, డీసీఓ నాగమణి, మార్కెట్ కమిటీ చైర్మన్ వి.శ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్లు దిలీప్ నాయక్, సుజాత, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, ఏఓలు శివరామకృష్ణ, గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు. పకడ్బందీగా యూజీసీ నీట్ పరీక్ష నిర్వహించాలి సిద్దిపేటరూరల్: మే 4వ తేదీన జరిగే యూజీసీ నీట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. శనివారం కేంద్ర విద్యాశాఖ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు న్యూఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన రెండు పరీక్ష కేంద్రాలలో పకడ్బందీ ఏర్పాట్లను చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఈఓ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలి
సిద్దిపేటరూరల్: నీటి ఎద్దడి ఏర్పడకుండా జిల్లా స్థాయిలో వాచ్డాగ్ కమిటీలు పనిచేయాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నీటి వనరులు తరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలకు నీటి ఎద్దడి సమస్యలు తలెత్తకుండా కమిటీ పనిచేయాలని సూచించారు. వర్షపు నీటి హార్వెస్టింగ్పై సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయడానికి ముందుగానే 300 చదరపు మీటర్ల కంటే ఎక్కువ ప్లాట్ ఏరియా ఉన్న అన్ని భవనాలు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ కలిగి ఉండాలన్నారు. 10 వేల చదరపు మీటర్లు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న భారీ భవనాలలో అలాగే వంద అంతకంటే ఎక్కువ యూనిట్లు ఉన్న గ్రూప్ హౌస్లకు వ్యర్థ జలాల రీసైక్లింగ్ ప్లాంట్లను కలిగి ఉండేలా చూడాలన్నారు. విద్యా సంస్థలు, హాస్టళ్లలో, ప్రభుత్వ కార్యాలయాల్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లను ఏర్పాటు చేయాలన్నారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. కార్యక్రమంలో డీపీఓ దేవకీదేవి, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, మిషన్ భగీరథ అధికారులు మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ -
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
● జిల్లా విద్యాధికారి శ్రీనివాస్రెడ్డి ● కడవేర్గులో బడిబాట ప్రారంభంచేర్యాల(సిద్దిపేట): ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని జిల్లా విద్యా శాఖాధికారి శ్రీనివాస్రెడ్డి అన్నారు. జిల్లాలో ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని శనివారం మండల పరిధిలోని కడవేర్గు కాంప్లెక్స్ పరిధిలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉన్నత విద్యార్హతలు, అనుభవం కలిగిన ఉపాధ్యాయుల చేత బోధన ఉంటుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ బడులకు పంపకుండా ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని కోరారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఇళ్లకు వెళ్లి కష్టపడి సంపాదించిన డబ్బు దుబారా చేయొద్దని కోరాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని ఉచిత సౌకర్యాలతో పాటు టెక్నాలజీతో కూడిన బోధన లభిస్తుందని చెప్పారు. ఆయన వెంట ఎంఈఓ కిష్టయ్య, కాంప్లెక్స్ హెచ్ఎం చంద్రశేఖర్రావు, పాఠశాలల హెచ్ఎంలు ఐలయ్య, సంతోష్, మల్లికార్జున్రెడ్డి, కిషన్, రాజు, ఉపాధ్యాయులు కాంతికృష్ణ, బాలభాస్కర్, రామచంద్రమూర్తి, విజయ్ తదితరులు ఉన్నారు. -
కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్కు పాతికేళ్లు
● కొనాయిపల్లిలో పూజలు చేసి ర్యాలీగా జలదృశ్యంకు ● నాడు నాటిన బీజం.. నేడు గులాబీవనంలా మారి.. ● ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏ కార్యక్రమం చేపట్టినా సక్సెస్ఏ ఎన్నికై నా అండగా నిలిచిన ప్రజలు తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా తమ పదవులకు రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసిన బీఆర్ఎస్ (టీఆర్ఎస్) అభ్యర్థులకు ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు అండగా నిలిచారు. 2001, 2004, 2008, 2010.. ఇలా జరిగిన సిద్దిపేట ఉప ఎన్నికల్లో ఓటర్లు విజయాన్ని అందించారు. 2023లో సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, సంగారెడ్డి, నర్సాపూర్, జహీరాబాద్, పటాన్చెరు, 2018లో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, పటాన్చెరు, జహీరాబాద్, నర్సాపూర్, ఆందోల్, మెదక్, నారాయణఖేడ్, 2014లో సిద్దిపేట, మెదక్, పటాన్చెరు, సంగారెడ్డి, నర్సాపూర్, గజ్వేల్, ఆందోల్, దుబ్బాక నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. 2004లో సిద్దిపేట, సంగారెడ్డి, రామాయంపేట, దుబ్బాక, 2009లో సిద్దిపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపొందింది. ఇవే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సాక్షి, సిద్దిపేట: గులాబీ పార్టీ 25 ఏళ్ల పండుగ వేళ పురిటిగడ్డ మెతుకుసీమ మురిసిపోతుంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి, బీఆర్ఎస్కు మొదటి నుంచి ఉమ్మడి మెదక్ జిల్లా అండగా నిలిచింది. 2000 సంవత్సరం ఆరంభంలో విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా.. ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. ఏప్రిల్ 27, 2001న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించి గులాబీ జెండాను ఎత్తుకున్నారు. అప్పటి నుంచి 14 ఏళ్లు అన్నివర్గాలను ఏకం చేసి రాష్ట్రాన్ని సాధించారు. తర్వాత పదేళ్లు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. ఉప ఎన్నికల్లో బస్సు గుర్తు కేటాయింపు 2001 ఆగస్టు 18న టీఆర్ఎస్ను రాజకీయ పార్టీగా రిజిస్టర్ అయింది. 2001 సెప్టెంబర్లో జరిగిన సిద్దిపేట ఉప ఎన్నికల్లో కేసీఆర్ ఇండిపెండెంట్గా పోటీ చేయడంతో ఎన్నికల కమిషన్ బస్సు గుర్తును కేటాయించింది. ఆ ఉపఎన్నికలో సమీప ప్రత్యర్థి శ్రీనివాస్రెడ్డి (టీడీపీ)పై 58,712 ఓట్ల మెజార్టీతో కేసీఆర్ ఘనం విజయం సాధించారు. అధికార టీడీపీ ప్రభుత్వం కేసీఆర్ను ఓడించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా సిద్దిపేట ప్రజలు కేసీఆర్కు బ్రహ్మరథం పట్టారు. మేమున్నాం తెలంగాణను సాధించి తీసుకురండి అని ఆశీర్వదించారు. ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం 2005లో వరంగల్లో నిర్వహించిన జైత్రయాత్ర సభకు కేసీఆర్ సైకిల్పై బయలు దేరారు. సిద్దిపేట నుంచి వరంగల్కు ఆయన వెంట వేలాది మంది కార్యకర్తలు, నాయకులు తరలివెళ్లారు. 2006లో తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట తప్పడంతో ఆ పార్టీపై కేసీఆర్ యుద్ధం ప్రకటించారు. సిద్దిపేటలో శంఖారావం పేరిట బహిరంగ సభను నిర్వహించడంతో సక్సెస్ అయింది. అదే ఏడాదిలో రాజీవ్ రహదారిపై వంటా వార్పు, రోడ్డు దిగ్బంధం కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది. 2008లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించిన తర్వాత కాంగ్రెస్ నాయకులను సవాల్ చేస్తూ సిద్దిపేటలో హరీశ్రావు నాయకత్వంలో నిర్వహించిన ఉద్యోగ గర్జన విజయవంతం అయింది. 2009 నవంబర్లో సిద్దిపేట అంబేడ్కర్ భవన్లో జరిగిన సమావేశంలో ‘‘తెలంగాణ వాలె జాగో.. ఆంధ్రా వాలె బాగో’’అని కేసీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ను ఫ్రీ జోన్గా ప్రకటించడంతో తెలంగాణ ఉద్యమం మరింత ఊపందుకుంది. ఫ్రీ జోన్ రద్దు, ప్రత్యేక తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ఆమరణ దీక్ష చేయాలని నిర్ణయించారు. సిద్దిపేట పట్టణంలోని రంగధాంపల్లి సెంటర్ను వేదికగా ఎంచుకున్నారు. కరీంనగర్ నుంచి నవంబర్ 29న సిద్దిపేటలోని ఆమరణ దీక్ష శిబిరానికి బయలు దేరుతుండగా పోలీసులు అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించారు. దీంతో హరీశ్రావు, దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి, పద్మారెడ్డితో పలువురు నాయకులు దీక్షకు సిద్ధమవుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఉమ్మడి మెదక్ నుంచి 2 లక్షల మంది వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు హాజరయ్యేందుకు ఇప్పటికే సిద్దిపేట నుంచి పాదయాత్రగా యువత, అలాగే పటాన్చెరు నుంచి కార్లతో ర్యాలీగా బయలుదేరారు. ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 2 లక్షల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లా నాయకులతో మాజీ మంత్రి హరీశ్రావు ఎప్పటికప్పుడు సమీక్షలు, టెలికాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్నారు.పోరాటం తప్పదని ప్రకటన 2001 ఏప్రిల్ 14న సిద్దిపేటలో జరిగిన అంబేడ్కర్ జయంతి సభలో పాల్గొన్న కేసీఆర్ తెలంగాణ కోసం పోరాటం తప్పదని ప్రకటించారు. అంతకు ముందే పలువురు మేధావులతో రాష్ట్ర సాధన కోసం చర్చించారు. తర్వాత సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డులో ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. తెలంగాణ సాధన కోసం ఉద్యమం చేద్దాం అని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 27న సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కొనాయిపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి ర్యాలీగా హైదరాబాద్ జలదృశ్యం బయలుదేరారు. అక్కడ టీఆర్ఎస్ పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు.సిద్దిపేట నుంచి వరంగల్ సభకు సైకిల్పై వెళ్తున్న కేసీఆర్ (ఫైల్) -
వర్గల్ క్షేత్రం.. భక్తిపారవశ్యం
వర్గల్(గజ్వేల్): శనిత్రయోదశి మహోత్సవ వైభవంతో వర్గల్ శ్రీవిద్యాసరస్వతి శనేశ్వర క్షేత్రం అలరారింది. తైలాభిషేకాలకు తరలివచ్చిన భక్తులతో కిటకిటలాడింది. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖర సిద్ధాంతి పర్యవేక్షణలో శనివారం తెల్లవారుజామున శనిత్రయోదశి వేడుకలకు అంకరార్పణ జరగగా, ఆలయ మహామండపంలో భక్తుల సామూహిక శనేశ్వర పూజలు కొనసాగాయి. అనంతరం భక్తులు ఒక్కొక్కరుగా మూలవిరాట్టుకు తిల తైలం సమర్పించి, శుభాలు చేకూర్చా లని ప్రార్థించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అలాగే క్షేత్రంలోని చంద్రమౌళీశ్వర స్వామికి మాస శివరాత్రి సందర్భంగా విశేషా భిషేకం అనంతరం అన్నపూజ నిర్వహించారు. శనిత్రయోదశి వైభవం శనేశ్వరునికి తిల, తైలాభిషేకం -
ఉద్యమానికి సిద్దిపేటకు పేగుబంధం
●నిబంధనల మేరకే భూసేకరణ ట్రిపుల్ఆర్ ఉత్తర భాగానికి సంబంధించిన భూసేకరణ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే కొనసాగుతోంది. ఎన్హెచ్ 1956 చట్టం ప్రకారం ఈ భూసేకరణ జరుగుతుంది. పరిహారం పంపిణీ కూడా మే లేదా జూన్ నెలలో పూర్తి కానుంది. దీని తర్వాత భూముల స్వాధీనానికి చర్యలుంటాయి. – తోసిఫ్, డిప్యూటీ మేనేజర్, ఎన్హెచ్ఏఐ ● పాదయాత్ర విజయయాత్ర కావడం ఖాయం ● గెలిచినా ఓడినా ప్రజల పక్షమే ● మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ప్రశాంత్నగర్(సిద్దిపేట): తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేటకు పేగు బంధం ఉందని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో నిర్వహించనున్న పార్టీ రజతోత్సవ సభకు సిద్దిపేట నుంచి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం, యువజన విభాగాల ఆధ్వర్యంలో పాదయాత్రగా బయలుదేరారు. జిల్లా కేంద్రంలోని రంగధాంపల్లి అమరవీరుల స్తూంపం వద్ద అమరవీరులకు, పహల్గామ్లో ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులర్పించారు. అనంతరం వరంగల్కు పాదయాత్రను శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే హరీశ్రావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మిట్టపల్లి వరకు పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతరం హరీశ్రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ విద్యార్థి, యువజన విభాగాలు నిర్వహిస్తున్న ఈ పాదయాత్ర.. పార్టీ అధికారంలోకి రావడానికి విజయ యాత్ర కాబోతుందన్నారు. చాలా పార్టీలు పుడుతుంటాయి, పోతుంటాయి కానీ బీఆర్ఎస్ పార్టీ లక్ష్యాన్ని సాధించిందన్నారు. కేసీఆర్ అనే ఒక గొంతు కోట్ల గొంతుకలను ఏకం చేసిందన్నారు. 14 ఏళ్ల ఉద్యమం, 10 ఏళ్ల ప్రభుత్వం ఇప్పుడు ఏడాదిన్నర ప్రతిపక్షం. ఏ పాత్ర అయినా బీఆర్ఎస్ తెలంగాణ పక్షం వైపే ఉండి పోరాడుతుందన్నారు. 44 డిగ్రీల ఎండను సైతం లెక్క చేయకుండా 1500 మంది యువత పాదయాత్రగా రజతోత్సవ సభకు బయలుదేరడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్.. గాంధీ చూపిన బాటలో ఉద్యమాన్ని ముందుకు నడిపారన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో, అభివృద్ధి సంక్షేమాల్లో, అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చింది, కాంగ్రెస్ చెప్పిన మోసపూరిత మాటలు, అబద్దపు హామీలు ప్రజలకు అర్థమయ్యాయన్నారు. పాదయాత్ర పొడుగునా కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజలకు వివరించాలని, రోజూ మధ్యాహ్నం, రాత్రి భోజన సమయంలో మిమ్మల్ని కలుసుకుంటానన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.యువకులకు దిశా నిర్దేశం చేస్తున్న హరీష్రావునంగునూరు(సిద్దిపేట): బీఆర్ఎస్ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర మధ్యాహ్నం పాలమాకులకు చేరుకుంది. భోజనాల అనంతరం ఎమ్మెల్యే హరీష్రావు యవకులకు దిశానిర్దేశం చేశారు. ‘నేను మీతో కలసి పాదయాత్ర చేస్తా.. మిమ్ములను గుండెలో పెట్టుకొంటా’ అని అన్నారు. యువకులు క్రమశిక్షణతో వరంగల్ వరకు పాదయాత్ర చేయాలన్నారు. ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. సాయంత్రం తిరిగి పాదయాత్ర ప్రారంభించిన యువకులు రాత్రి బద్దిపడగలో బస చేశారు. ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం నంగునూరు(సిద్దిపేట): వడ్ల కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుండటంతో ధాన్యం దళారుల పాలు అవుతోందని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. పాలమాకులలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వడ్లు అమ్మి వారం రోజులు గడుస్తున్నా డబ్బులు రాలేదని రైతులు తెలిపారు. అనంతరం హరీశ్రావు మాట్లాడుతూ ధాన్యం అమ్మిన రైతులకు సకాలంలో డబ్బులు వచ్చేలా చూడాలని అన్నారు. గత యేడాది లక్షా 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తామని చెప్పి కేవలం 52 వేల మెట్రిక్ టన్నులే సేకరించిందన్నారు. -
బీఎస్ఎన్ఎల్ సేవలు సద్వినియోగం చేసుకోండి
ఏజీఎం లక్ష్మణ్ బానోత్ సిద్దిపేటకమాన్: బీఎస్ఎన్ఎల్ సేవలను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఏజీఎం) లక్ష్మణ్ బానోత్ తెలిపారు. సిద్దిపేటలో శుక్రవారం వినియోగదారుల మేళా కార్యక్రమం నిర్వహించారు. మేళాలో పలువురు బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు పలు సమస్యలపై సంప్రదించగా సిబ్బంది పరిష్కరించి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏజీఎం లక్ష్మణ్ మాట్లాడుతూ.. వినియోగదారుల సౌకర్యార్థం అత్యాధునిక టెక్నాలజీతో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏస్డీఈలు మోహన్రెడ్డి, రవీందర్, రాజేంద్రప్రసాద్, రాజ్కుమార్, శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించండి సివిల్ సప్లై సీఆర్ఓ ఫణిందర్ కొండపాక(గజ్వేల్): ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలోనే అమ్ముకోవాలని సివిల్ సప్లై సీఆర్ఓ (ఐఏఎస్) ఫణిందర్ అన్నారు. దుద్దెడలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ధ్యాన్యం కొనుగోళ్లను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నీరు, నీడ నిచ్చే సౌకర్యాలను ఏర్పాటు చేయలేదని రైతులు తెలిపారు. ఈ సందర్భంగా ఫణిందర్ మాట్లాడుతూ కొనుగోళ్ల కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందన్నారు. ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. అకాల వర్షాలు కురుస్తున్న వేళ కేంద్రాలకు ధాన్యాన్ని తెచ్చేటప్పుడు టార్పాలిన్ కవర్లను తెచ్చుకోవాలన్నారు. కార్యక్రమంలో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, పంచాయతీ కార్యదర్శి, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఉరుములు.. పిడుగులు ● పలు ప్రాంతాల్లో గాలివాన ● భయాందోళనకు గురైన ప్రజలు దుబ్బాక/దుబ్బాకరూరల్: మండల పరిధిలోని బల్వంతాపూర్, తొగుట మండలం గుడికందుల గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో పిడుగులు పడడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బల్వంతాపూర్లో ఇంటి ఆవరణలోని కొబ్బరిచెట్టు, గుడికందులలో ఇళ్లసమీపంలోని తాటిచెట్టుపై పిడుగులు పడి మంటలు ఎగసిపడ్డాయి. వరదరాజుపల్లిలో పాడిగేదెలు మృతి తొగుట(దుబ్బాక): పిడుగుపాటుకు పాడిగేదెలు మృతిచెందాయి. ఈ ఘటన వరదరాజుపల్లిలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రేపాక పరశురాములు తన వ్యవసాయ పొలం వద్ద పాడిగేదెలను కట్టేసిన చెట్టుపై పిడుగుపడింది. దీంతో గేదెలు మృతిచెందాయి. నిలిచిన రాకపోకలు.. మిరుదొడ్డి(దుబ్బాక): మండల పరిధిలో ఈదురుగాలులతో వర్షం కురిసింది. దీంతో రోడ్లపై చెట్లు విరిగి పడటంతో వాహనదారుల రాకపోకలు నిలిచి పోయాయి. గంట పాటు కరెంటు సరఫరా నిలిచిపోయింది. -
బీఆర్ఎస్ రక్షణ కవచం
తెలంగాణకు శ్రీరామరక్షరజతోత్సవ సభకు అద్భుతమైన స్పందన●● పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం ● ‘సాక్షి’తో ఎమ్మెల్సీ, రచయిత, గాయకుడు దేశపతి శ్రీనివాస్ బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) పార్టీ తెలంగాణ ప్రజల రక్షణ కవచమని ఎమ్మెల్సీ, రచయిత దేశపతి శ్రీనివాస్ అన్నారు. పార్టీ తెలంగాణను పునఃనిర్మాణం చేసిందని, కాంగ్రెస్కు అధికారం తప్ప.. ప్రజల గురించి ఆలోచించడంలేదని తెలిపారు. రజతోత్సవ సభకు అద్భుతమైన స్పందన వస్తోందని, మూడేళ్ల తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. దేశపతి శ్రీనివాస్ను రజతోత్సవం సందర్భంగా ‘సాక్షి’ పలకరించింది. వెల్లడించిన అంశాలు ఆయన మాటల్లోనే.. సాక్షి, సిద్దిపేట: సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఒక అనాథ.. తెలంగాణకు అన్యాయం జరిగితే అడిగే దిక్కులేదు. వివక్షకు గురవుతుంటే అడిగే వారేలేరు. కాంగ్రెస్లో ఉన్న నాయకులు తెలంగాణను ఒక అంగడి సరుకు చేసి తమకు పదవి రానప్పుడల్లా ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ను ఎత్తు కోవడం పదవి రాగానే దించడం చేశారు. దీంతో ప్రజల్లో ఉద్యమంపై, ప్రత్యేక రాష్ట్రం వస్తుందని ఆశ లేకుండా పోయింది. 1969లో 369 బలిదానాలు జరిగినా కేంద్రంలో ఉన్న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాసింది. సరిగ్గా ఈ సమయంలోనే ప్రత్యేక రాష్ట్రంపై ప్రజల్లో కేసీఆర్ ఆశలు చిగురింపజేశారు. గులాబీ జెండాను ఎత్తి 2001లో జలదృశ్యంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్)ను ఏర్పాటు చేశారు. అప్పటి వరకు మూగబోయిన తెలంగాణ ఉద్యమం సింహగర్జన చేసింది. నిర్జీవమైన ఉద్యమం మళ్లీ ప్రాణం పోసుకుంది. అనేక ఉద్యమాలతో అప్పటి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం. బీఆర్ఎస్ పార్టీ జెండా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుట. తెలంగాణను పునఃనిర్మాణం చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. పదేళ్ల పరిపాలనలో చల్లగా బతికింది. కేసీఆర్ పరిపాలనలో భూమి మీద నీళ్లు పారాయి. కేసీఆర్ వచ్చిన తర్వాతనే పెండింగ్ ప్రాజెక్ట్లు పూర్తి, కొత్తగా కాళేశ్వరం నిర్మించి, పాలమూరు ఎత్తిపోతల పథకంను 80శాతం, సీతారామను 90శాతం, అనేక చెక్ డ్యాంలు నిర్మాణాలయ్యాయి. దీంతో చెరువులు బాగుపడ్డాయి. జలాలు.. ధాన్యం రాశులు ఆనాడు నీటి కోసం అలమటించిన తెలంగాణ.. కేసీఆర్ సీఎం అయ్యాక ఏటు చూసినా జల రాశులు, పంట రాశులు దర్శినమిచ్చాయి. కరోనా వచ్చినా రాష్ట్ర ఆర్థిక ప్రగతి ఆగలేదు. పదేళ్లలో ఆర్థిక వృద్ధి పెరగడంతోపాటు 1.60లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. ఆ ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా రాష్ట్రపతి ఉత్తర్వులను తీసుకవచ్చింది బీఆర్ఎస్ పార్టీ. పల్లెలు పట్టణాలు అభివృద్ధి చెందాయి. అభివృద్ధిని జీర్ణించుకోలేని విపక్షాలు దుష్ప్రచారాలు చేశాయి. గోరంతను కొండంతగా చూపించాయి. ప్రజలను తప్పుదోవ పట్టించాయి. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ లేని రాజకీయాలను ఊహించలేం. కొంత ఆత్మపరిశీలన చేసుకున్నాం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పరిపాలన, సంక్షేమ పథకాలు అమలు ఎలా ఉండేవి అన్న ఆలోచన ప్రజలు చేస్తున్నారు. కాంగ్రెస్ తీరు అర్థమైంది.. కాంగ్రెస్ నేతలకు అధికారం అనుభవించాలనే కోరిక తప్ప.. ప్రజలకు మేలు చేద్దామనే ఆలోచన లేదు. కాంగ్రెస్ పార్టీతో అన్ని కోల్పోతున్నామని ప్రజలకు అర్థమవుతోంది. కాళేశ్వరం నీటితో చెరువులు నింపుతున్న పరిస్థితి లేదు. చెరువులు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. మళ్లీ కరువు వచ్చేస్తోంది. కరెంట్ సమస్యలు వస్తున్నాయి. పదేళ్లలో ఆర్థిక వృద్ధి రేటు పెరిగితే సంవత్సరం నుంచి క్షీణత మొదలైంది. రియల్ రంగం కుదేలైంది. దీంతో తెలంగాణ తిరోగమన దిశ ప్రారంభమైంది. కేసీఆర్ మాటలు వినాలని.. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అద్భుతమైన స్పందన వస్తోంది. కేసీఆర్ను చూడాలని.. ఆయన మాటలు వినాలని గులాబీ దండు కదిలివస్తోంది. బండ్లు కట్టుకుని.. నడచుకుంటూ వరంగల్కు చేరుకుంటున్నారు. రజతోత్సవం బీఆర్ఎస్ పండుగే కాదు.. ప్రజల ఆత్మగౌరవం. కచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి జరగాలన్నా.. రైతు బంధు రావాలన్నా.. బడుగులకు భరోసా దొరకాలన్నా.. బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. మూడేళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం. -
ట్రిపుల్ఆర్ భూబాధితుల ఆక్రోశం
రూ.కోట్లు పలికే భూములకు అత్తెసరు పరిహారం ఇవ్వడానికి అధికారులు సిద్ధమవుతున్నారంటూ ట్రిపుల్ఆర్ భూ బాధితుల్లో ఆక్రోశం వ్యక్తమవుతోంది. భూముల ప్రభుత్వ విలువపై పట్టణ ప్రాంతాల్లో రెండింతలు, గ్రామీణ ప్రాంతాల్లో మూడింతలు ఇవ్వనున్నట్లు సంకేతాలు వస్తుండటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 4,832ఎకరాల భూసేకరణ పూర్తి చేశారు. మే లేదా జూన్ నెలలో భూముల స్వాధీనానికి రంగం కూడా సిద్ధమైంది. పరిహారం తేల్చకుండానే అధికారుల కార్యాచరణ వేగవంతం చేయడంతో బాధితుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. గజ్వేల్: ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం భూబాధితుల పరిహారం లెక్కల వ్యవహారం చర్చనీయాంశంగా మారుతోంది. రూ.కోట్ల విలువైన భూములకు పొంతన లేని పరిహారం ఇవ్వడానికి రంగం సిద్ధమవుతుండటమే కారణం. ట్రిపుల్ఆర్ భూసేకరణ కోసం రెవెన్యూ డివిజన్ల వారీగా కాలా (కాంపీటెంట్ అథారిటీ ఫర్ ల్యాండ్ అక్వాజైషన్)లు పనిచేస్తున్న సంగతి తెలిసిందే. చౌటుప్పల్, యాదాద్రి–భువనగిరి పరిధిలో మూడు కాలాలతోపాటు గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్, ఆందోల్–జోగిపేట, సంగారెడ్డి కాలాల పరిధిలోని 84గ్రామాల్లో 4832.5ఎకరాల వరకు భూసేకరణ లక్ష్యంగా ఉండగా, ఇందులో దాదాపుగా సేకరించారు. ఇందులో 180 ఎకరాల అటవీ భూమి, మరో 650 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. పొంతనలేని లెక్కలు సేకరిస్తున్న భూమికి ప్రభుత్వ విలువపై రెండు లేదా మూడింతలు మాత్రమే పరిహారం ఇవ్వడానికి అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఉత్తర భాగంలో ప్రభుత్వ విలువ ప్రకారం చూస్తే సంగారెడ్డి ప్రాంతంలోని కొన్ని సర్వే నంబర్లల్లోని భూమి అత్యధికంగా రూ.75లక్షలు పలుకుతోంది. ఇది మున్సిపాలిటీ పరిధిలోకి వస్తే రూ.1.5కోట్ల పరిహారం అందే అవకాశం ఉంది. నిజానికి ఈ భూమికి బహిరంగ మార్కెట్లో ధరను పరిశీలిస్తే.. రూ.10కోట్లకుపైనే ఉంటుంది. ప్రభుత్వ విలువ ప్రకారం చూస్తే చౌటుప్పల్, గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్ లాంటి పట్టణ ప్రాంతాల్లో ఎకరాకు అత్యధికంగా రూ.20లక్షల నుంచి రూ.50లక్షల విలువ కలిగిన భూములు ఉన్నాయి. నిజానికి బహిరంగ మార్కెట్లో వాటి ధర రూ.5నుంచి 7కోట్ల వరకు పలికే అవకాశముంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ కొన్ని చోట్ల గరిష్టంగా రూ.10లక్షలకుపైగా ప్రభుత్వ విలువ కలిగిన భూములు ఉన్నాయి. కానీ భూములకు మార్కెట్ ధరతో పోలిస్తే పొంతన లేని పరిహారం పొందే అవకాశముంది. ముఖ్యమైన విషయమేటంటే భూముల ప్రభుత్వ విలువల పెంపు శాసీ్త్రయంగా జరగకపోవడం కూడా బాధితుల తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. సామలపల్లిలో ట్రిపుల్ఆర్ నిర్మాణం వల్ల సర్వం కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు ప్రభుత్వ విలువపై రెండు లేదా మూడింతలే.. ఎన్హెచ్ యాక్ట్ ప్రకారం ముందుకు ఉత్తర భాగంలో 4,832 ఎకరాల భూసేకరణ పూర్తి భూముల స్వాధీనానికి రంగం సిద్ధం అదనపు భూసేకరణ ట్రిపుల్ఆర్ ఉత్తర భాగంలో 11చోట్ల ఇంటర్ఛేంజ్ల నిర్మాణం చేపట్టాలని నేషనల్ హైవే ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది. వీటి నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రస్తుత హైదరాబాద్ అవుటర్ రింగు రోడ్డు కంటే మరింత మెరుగ్గా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో పలు ఇంటర్ఛేంజ్ల వద్ద అదనపు భూసేకరణ అవసరమవుతోంది. దీంతో ఇంటర్చేంజ్ ప్రదేశాల్లోనూ బాధిత రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. -
భూ భారతితో సమస్యల పరిష్కారం
మద్దూరు(హుస్నాబాద్): ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భూభారతి చట్టం అత్యంత పారదర్శకంగా అమలు చేస్తామని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాలులో భూభారతిపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎదైన భూ సమస్య ఉంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫీల్డ్ ఎంక్వయిరీ, ఇరువర్గాలను పిలిచి వారి వద్ద ఉన్న డాక్యుమెంట్ పరిశీలనచేసి నిర్ణీత కాలంలో సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. భూమికి సంబంధించిన ఏ సమస్య అయినా ఆర్డీఓ, అదనపు కలెక్టర్, కలెక్టర్ స్థాయిలో జరగుతాయని వివరించారు. అలాగే అన్ని వివరాలతో కూడిని భూఆధార్ కార్డును రైతులకు అందించన్నుట్లు తెలిపారు. దీంతో భూఅక్రమాలకు చెక్ పెట్టవచ్చని తెలిపారు అనంతరం దూల్మిట్ట మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని అధికారులతో కలసి సందర్శించారు. కొంత కాలంగా మూసి ఉన్న వసతి గృహాన్ని వెంటనే ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వసతి గృహానికి కావల్సిన మౌలిక వసతులు వెంటనే కల్పించి వచ్చే విద్యాసంవత్సరం అరంభం నాటికి వసతి గృహాన్ని పునఃప్రారంభించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మూర్తి ,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జీవన్రెడ్డి, ఆయా మండలాల ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు. అత్యంత పారదర్శకంగా అమలు కలెక్టర్ మనుచౌదరి -
సీటు బెల్ట్ ధరించడం తప్పనిసరి
ట్రాఫిక్ సీఐ ప్రవీణ్కుమార్ సిద్దిపేటఅర్బన్: వాహనాలు నడిపే వారు తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలని ట్రాఫిక్ సీఐ ప్రవీణ్కుమార్ సూచించారు. గురువారం సాయంత్రం రాజీవ్ రహదారి పొన్నాల దాబాల వద్ద పెండింగ్ చలాన్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీటు బెల్ట్ ధరించడం వల్ల అనుకోకుండా ప్రమాదం జరిగితే కారులో ఉండే ఎయిర్ బెలూన్స్ తెరుచుకొని ప్రాణాపాయం నుంచి బయటపడేస్తాయన్నారు. అలాగే ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు. పెండింగ్ చలాన్లకు సంబంధించి రూ. 42వేల జరిమానా వసూలు చేసినట్లు చెప్పారు. -
ఇంటర్లో తెలుగు తప్పనిసరిగా ఉండాలి
ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఇంటర్లో తెలుగు భాష స్థానంలో సంస్కృతం ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయం మానుకోవాలని జాతీయ సాహిత్య పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఐతా చంద్రయ్య అన్నారు. గురువారం సాయంత్రం సిద్దిపేట శాఖా గ్రంథాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అధికార భాష హోదా దక్కినా తెలుగును కళాశాల విద్యలో తొలగించడం ఎంతవరకు సమంజమన్నారు. జాతీయ సాహిత్య పరిషత్ జిల్లా అధ్యక్షుడు ఎన్నవెళ్లి రాజమౌళి మాట్లాడుతూ తెలుగుభాష ఉన్నంతవరకు మనకు గౌరవం దక్కుతుందని, ఇతర భాషల వల్ల వెనుకబడి పోతున్నామన్నారు. జాతీయ సాహిత్య పరిషత్ ప్రధాన కార్యదర్శి ఉండ్రాళ్ళ రాజేశం మాట్లాడుతూ భాషకు గౌరవం దక్కాలంటే ప్రతి ఒక్కరూ తెలుగు చదవాలన్నారు. కార్యక్రమంలో ఆర్థిక కార్యదర్శి బస్వరాజు కుమార్, చీకోటి రాములు, వంగరి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. ఆలయ భూములు కబ్జా చేస్తే చర్యలు దుబ్బాకరూరల్: ఆలయాల భూములు కబ్జాకు పాల్పడితే చర్యలు తప్పవని దేవాదాయ ధర్మాదాయ శాఖ జిల్లా డివిజన్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి హెచ్చరించారు. గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం మండలంలోని హబ్సిపూర్లో భూములను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ దేవాదాయ పరిధిలో 1417, 1418 సర్వే నంబర్లో 11ఎకరాల భూమి ఉందన్నారు. భూమిని కొంత మంది కబ్జా చేయాలని చూస్తున్నారని తెలిపారు. కొందరు ఏకంగా భవనాలు నిర్మించేందుకు పనులు చేపడుతున్నారని, వారికి నోటీసులు జారీ చేశామన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నేడు బీఎస్ఎన్ఎల్ సేవామేళా సిద్దిపేటకమాన్: సిద్దిపేట బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో శుక్రవారం వినియోగదారుల సేవామేళా నిర్వహించనున్నట్లు ఏజీఎం లక్ష్మణ్ తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు ఈ మేళా కొనసాగుతుందన్నారు. వినియోగదారులు మొబైల్ తదితర సేవలు, సమస్యల పరిష్కారం కోసం మేళాను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తాం సిద్దిపేటకమాన్: ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తామని సిద్దిపేట ఆర్టీసీ డిపో మేనేజర్ రఘు తెలిపారు. సిద్దిపేట డిపోలో నిర్వహించిన ప్రగతి చక్ర అవార్డు కార్యక్రమంలో గత రెండు నెలల్లో విధి నిర్వహణలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన 92మంది సిబ్బందిని గురువారం అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా డీఎం మాట్లాడుతూ ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ విధులు నిర్వహించి సిద్దిపేట, దుబ్బాక డిపోలను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ మహేశ్వరి, అసిస్టెంట్ ఇంజనీరు రంజిత్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. డిగ్రీ అడ్మిషన్లకు ఆహ్వానం పటాన్చెరు టౌన్: డిగ్రీలో అడ్మిషన్లకు దరఖాస్తులు కోరుతున్నారు. మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాల్లో ఇంటర్ పూర్తి చేసిన గిరిజన విద్యార్థులు పెద్దకంజర్లలో అడ్మిషన్ తీసుకోవచ్చని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సోమనాథ శర్మ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన, ఎస్సీ, బీసీ విద్యార్థులకు అడ్మిషన్లు గురుకుల నియమ నిబంధనలకు లోబడి అడ్మిషన్ కల్పించనున్నట్లు చెప్పారు. అడ్మిషన్ కోసం నేరుగా కళాశాలను సంప్రదించాలని కోరారు. అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఉచిత భోజన వసతి, విద్య, యూనిఫాం, ఉచిత ఎగ్జామినేషన్ ఫీజు అందించనున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం 94948 24692, 80080 70959 ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు. -
భక్తిశ్రద్ధలతో అగ్నిగుండాలు
గాలివాన బీభత్సంగజ్వేల్రూరల్: గజ్వేల్ పట్టణంలోని అతి పురాతనమైన సీతారామ ఉమామహేశ్వరాలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం అగ్ని గుండాలు, గరుడ వాహనసేవ నిర్వహించారు. అలాగే గరుడ వాహనంపై స్వామివార్ల విగ్రహాలను ఉంచి పట్టణంలోని ప్రధాన వీధులగుండా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ● బెజ్జంకిలో పిడుగుపడి వృద్ధురాలు మృతి ● కూలిన విద్యుత్ స్తంభాలు ● నేలరాలిన మామిడికాయలు బెజ్జంకి(సిద్దిపేట): మండలంలో గురువారం ఈదురు గాలులతో కురిసిన వాన బీభత్సం సృష్టించింది. లక్ష్మీపూర్లో విద్యుత్ స్తంభాలు కూలాయి. మామిడితోటల్లో మామిడికాయలు నేలరాలాయి. బెజ్జంకిలోని ఎడ్ల బొమ్మ సమీపంలో పిడుగు పడి టేకు రంగవ్వ (63) అనే వృద్ధురాలు మృతిచెందగా టేకు ప్రవీణ్ అనే 13 ఏళ్ల బాలుడు స్పృహతప్పిపడిపోయాడు. వీరిని మొదట బెజ్జంకి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం రంగవ్వను సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారని కుటుంబసభ్యులు తెలిపారు. ప్రవీణ్ను అంబులెన్సులో కరీంనగర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఉగ్రవాదంపై ఉక్కుపాదమే
సాక్షి, సిద్దిపేట: ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు పీఎం మోదీ సారథ్యంలో కేంద్రప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి పాశవికచర్య అని, సెక్యులర్ మేధావులు సైతం తీవ్రంగా ఖండించాలన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడారు. ఈ ఘటనపై స్టాలిన్, కమలహాసన్, ప్రకాశ్రాజ్, సెక్యులర్ మేధావులు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లినప్పుడల్లా దేశంలో అలజడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఓ రకమైన అల్లర్లు సృష్టించేందుకు దేశంలోని ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందన్నారు. టెర్రరిస్ట్ సంస్థలపై మోదీ ప్రభుత్వం కచ్చితంగా చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ నిర్ణయాల వల్ల పాతబస్తీలో అభివృద్ధి జరగలేదని, మెట్రో రాలేదని విమర్శించారు. ఒవైసీ పేద ముస్లింల కోసం ఆలోచించడం లేదని చెప్పారు. డెవలప్మెంట్కి ముస్లింలను దూరంగా ఉంచేది ఏంఐఎం పార్టీ అని విమర్శించారు. మదర్సాలపై శ్వేత పత్రం విడుదల చేయాలి తెలంగాణలో ఉన్న మదర్సాల్లో ఎవరు ఉంటున్నారు? ఏ రాష్ట్రం వారు ఉంటున్నారు? వారి కుటుంబ నేపథ్యం ఎంటీ? విషయాలపై సీఎం రేవంత్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణను ఇస్లామిక్ అడ్డాగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. హిందూ దేవాలయాల మీద దాడులు చేస్తే ప్రజలు ఊరుకునే పరిస్థితిలో లేరని అన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ తదితరులు పాల్గొన్నారు. సెక్యులర్ మేధావులు సైతం ఉగ్రదాడిని ఖండించాలి దేశంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రతిపక్షాల కుట్ర మెదక్ ఎంపీ రఘునందన్ రావు -
మే నెలంతా సెలవులివ్వండి
సిద్దిపేటరూరల్: అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అందరికీ మే నెల మొత్తం సెలవులు ఇవ్వాలంటూ కలెక్టరేట్ ఎదుట గురువారం నిరసన చేపట్టారు. అనంతరం యూనియర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఏఓ రెహమన్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి పద్మ మాట్లాడుతూ వేసవి కాలం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో సమానంగా అంగన్వాడీలకు సైతం ఒక్కపూట బడిని నిర్ణయిస్తూ సర్క్యలర్ జారీ చేయడం మంచి విషయమన్నారు. ఇటీవల ములుగు జిల్లాలో జరిగిన పోషన్ పక్వాడా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క మేనెల మొత్తం సెలవులు ప్రకటించే యోచనలో ఉన్నట్లు తెలిపారన్నారు. 40 డగ్రీలకు పైగా ఎండ తీవ్రత నమోదవుతోందన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి సెలవులపై ప్రకటన చేయాలన్నారు. తమకు స్పష్టమైన హమీ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సింగిరెడ్డి చంద్రారెడ్డి, యూనియన్జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి వీరమని, శారద, కళావతి, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల నిరసన -
భూ కబ్జాలపై ఫిర్యాదు చేయండి
అక్కన్నపేట(హుస్నాబాద్): గ్రామాల్లో భూములు కబ్జాలకు గురైతే కలెక్టర్కు ఫిర్యాదు చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. అక్కన్నపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదట భూ భారతి చట్టంలోని వివిధ అంశాలను అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ రైతులకు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పార్టీలకతీతంగా ప్రభుత్వ భూములను కాపాడుకోవాలన్నారు. ప్రభుత్వ భూములను కబ్జాలు చేసిన వారు ఎంతటి వారైన సహించబోమన్నారు. రైతులకు వరం భూమి అంటేనే ఆత్మగౌరవం అని, అలాంటి భూమి వివాదాల్లో ఉండటం.. తదితర అంశాల పరిష్కారానికి ‘భూ భారతి’ రైతులకు వరంలా ఉపయోగపడుతుందన్నారు. ధరణి వల్ల జరిగిన అవకతవకల వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35లక్షల మంది ఫిర్యాదు చేశారన్నారు. 30 ఏళ్ల క్రితం అమ్మిన భూమి ధరణిలో మళ్లీ పాత యజమాని పేరు వచ్చిందని... తద్వారా గొడవలు నెలకొన్నాయన్నారు. భూముల మీద పంచాయితీలు జరగకుండా ఉండాలన్నదే మా లక్ష్యమన్నారు. త్వరలోనే గౌరవెల్లి కాలువల నిర్మాణం పూర్తవతుందని, ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందిస్తామన్నారు. అలాగే నష్టపోయిన రైతులను అందుకుంటామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ మనుచౌదరి, ఆర్డీఓ రామ్మూర్తి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య తదితరులు పాల్గొన్నారు. మంత్రి దృష్టికి భూ సమస్యలు భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు ముగిసిన తరువాత పలువురు రైతులు భూ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అక్కన్నపేట మండలంలోని నందారం గ్రామ రెవెన్యూ పరిధిలో సుమారు 935ఎకరాల వరకు వ్యవసాయ భూములు ఓ ముస్లిం పేరుపై ఉండటంతో ధరణీ పోర్టల్లో నిషేధిత జాబితాలోకి వెళ్లాయని భానోతు భాస్కర్నాయక్ చెప్పారు. మోత్కులపల్లి పరిధిలో సుమారు 120ఎకరాల భూమి ఎస్సీ, ఎస్టీ, బీసీ కులస్తులకు పశువులు, మేకలు మేపుటకు అప్పటి దొరలు ఇస్తే ఇతరులు పట్టాలు చేసుకున్నారని గుగులోతు రాంబాబు నాయక్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే రేగొండలో ఏళ్లతరబడి కాస్తులో ఉంటే ధరణిలో మరొకరి పేరు ఉందని ఎడల వనేష్ చెప్పారు. ఇలా పలువురు భూ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ధరణి పోర్టల్ను ప్రస్తుతం బంగాళాఖాతంలో కలిపేశామన్నారు. భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని భరోసా ఇచ్చారు. జూన్ 2 నుంచి క్షేత్ర స్థాయిలో అమలుహుస్నాబాద్: వచ్చే జూన్ 2 నుంచి భూ భారతి చట్టం క్షేత్ర స్థాయిలో అమలు అవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మండలంలోని పొతారం (ఎస్)లో గురువారం భూ భారతి చట్టం అవగాహన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ ధరణి వచ్చిన తర్వాతే భూముల పంచాయితీ పెరిగిందన్నారు. భూమి ఎవరిదో తెలిపేలా సమగ్ర వివరాలతో భూ భారతి చట్టం తెచ్చామన్నారు. కోర్టుల వరకు పోవాల్సిన అవసరం లేదని, తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. భూ భారతితో కష్టాలు తొలగిస్తాం భూముల పేరిట పంచాయితీలు వద్దు అవగాహన సదస్సులో మంత్రి పొన్నం -
దుకాణాల వేలానికి స్పందన కరువు
దుబ్బాకటౌన్: దుబ్బాక పట్టణంలోని మున్సిపల్ దుకాణ సముదాయాల వేలానికి స్పందన కరువైంది. మున్సిపల్ పరిధిలోని మూడు ప్రదేశాల్లోని దుకాణ సముదాయాల్లో 26 షెట్టర్లు ఉన్నాయి. ఇందులో పోచమ్మ దేవాలయ వద్ద ఉన్న 16 షెట్టర్లలో గతంలో దక్కించుకున్న 11 మంది వ్యాపారస్తులు రెన్యూవల్ చేయించుకున్నారు. కాగా 5 షెట్టర్లకు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం బహిరంగ వేలం పాట నిర్వహించగా అందులో కేవలం మూడు షెట్టర్లకు మాత్రమే వేలం పూర్తయింది. షెట్టర్ నం.3కి దరఖాస్తులే రాకపోవడంతో రెండు షెట్టర్లకు వేలం వాయిదా వేశారు. షెట్టర్ నం.7ను మహ్మద్ నజీర్ రూ.12500, షెట్టర్ నం.14ను గంట రాజు రూ.7500, షెట్టర్ నం.17ను సోమ వినయ్ రూ. 9300 నెలసరి అద్దె ప్రాతిపదికన దక్కించుకున్నారు. ఆసక్తి చూపని వ్యాపారస్తులు లాల్ బహదూర్ శాస్త్రి సమీపంలోని 6 షెట్టర్లకు కేవలం ఒకే దరఖాస్తు రావడంతో అధికారులు వేలం వాయిదా వేశారు. అలాగే డబుల్ బెడ్రూం సమీపంలోని 4 షెట్టర్లకు కనీసం ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ఆ ప్రదేశాల్లో వ్యాపార నిర్వహణకు వ్యాపారస్తులు ఆసక్తి చూపడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. 15 షెట్టర్లకు కేవలం మూడింటికి మాత్రమే వేలం ఆసక్తి చూపని వ్యాపారస్తులు -
విద్యుదాఘాతంతో వివాహిత మృతి
నారాయణఖేడ్: ఉతికిన బట్టలు ఆరవేస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై మహిళ మృతి చెందింది. ఈ ఘటన నారాయణఖేడ్ మండలం హుక్రాన (జి) గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ విద్యాచరణ్రెడ్డి థనం ప్రకారం.. ఖేడ్ మండలం హుక్రానా(జి) గ్రామానికి చెందిన రావుల స్వప్న (30) బుధవారం సాయంత్రం ఇంట్లో దుస్తులు ఉతికి ఆవరణలో ఆరబెట్టడానికి కట్టిన పాత టీవీ కేబుల్ తీగపై దుస్తులను ఆరవేస్తూ విద్యుదాఘాతానికి గురై అరుస్తూ కిందపడిపోయింది. కుటుంబీకులు ఆమెను ఖేడ్ ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలికి భర్త రావుల హన్మారెడ్డి, ఈమధ్యే ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తిచేసుకున్న కుమారుడు సాయిచరణ్ రెడ్డి, 8వ తరగతి పూర్తిచేసుకున్న కూతురు భార్గవి ఉన్నారు. దుస్తులు ఆరవేయడానికి కట్టిన కేబుల్ తీగకు వైర్లు తేలిన విద్యుత్తు తీగ తగిలి విద్యుదాఘాతతానికి గురైనట్లు భావిస్తున్నారు. స్వప్న మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
చీటింగ్ కేసులో అఘోరీ రిమాండ్
● లింగ నిర్ధారణ పరీక్షలకు నిరాకరణ ● తిరిగి కోర్టుకు పంపిన అధికారులు సంగారెడ్డి టౌన్: ఓ చీటింగ్ కేసులో అఘోరీని బుధవారం చేవెళ్ల కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరు పర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో సంగారెడ్డి జిల్లాలోని కంది సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే ఇక్కడ జైలు అధికారులకు అఘోరీని ఏ బారక్లో ఉంచాలో అనే టెన్షన్ మొదలైంది. అయితే లింగ నిర్ధారణ పరీక్షలకు నిరాకరించడంతో తిరిగి చేవెళ్ల కోర్టుకు పంపించినట్టు జైలు పర్యవేక్షకులు సంతోష్ రాయ్ తెలిపారు. పుస్తక పఠనంతో మేధో సంపత్తిగజ్వేల్రూరల్: పుస్తక పఠనంతోనే మేధో సంపత్తి పెరుగుతుందని గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నిఖత్ అంజుమ్ పేర్కొన్నారు. పట్టణంలోని బాలుర ఎడ్యుకేషన్ హబ్లోగల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ప్రపంచ పుస్తక కాపీరైట్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ డాక్టర్ వి.వెంకటేశ్వర్లు, వర్తమాన రచయిత డాక్టర్ మహేందర్రెడ్డి, వెస్ ప్రిన్సిపాల్ గణపతిరావు, అధ్యాపకులు పాల్గొన్నారు. బొంతపల్లిలో ఇరు వర్గాల ఘర్షణజిన్నారం (పటాన్చెరు): జిన్నారం మండల కేంద్రంలో విగ్రహ ధ్వంసం చేసిన ఘటన నేపథ్యంలో పలు ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి ప్రధాన రహదారిపై కారులో వెళ్తున్న ఓ వర్గానికి చెందినవారు రెచ్చగొట్టేలా నినాదాలు చేయడంతో మరో వర్గానికి చెందిన వ్యక్తి దాడికి పాల్పడ్డారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాల వారికి నచ్చజెప్పి వారిని శాంతింపచేశారు. మరో వర్గం విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రోడ్డుపై ధర్నా చేయడంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ట్రాన్స్ఫార్మర్ను పగులగొట్టి ఆయిల్ చోరీ దుబ్బాకటౌన్: రాయపోల్ మండలం బేగంపేట గ్రామంలో మల్కాపూర్ రోడ్డులోని రైల్వే బ్రిడ్జి వద్ద గల వ్యవసాయ పొలంలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు ట్రాన్స్ఫార్మర్ను పగులగొట్టారు. దానిలోని కాయిల్స్, ఆయిల్ను దుండగులు ఎత్తుకెళ్లారు. ఇది గమనించిన రైతులు పోలీసులకు విద్యుత్, అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. సుమారు వాటి విలు రూ. 50 వేల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు. రైతు మల్లమ్మ ఫిర్యాదు మేరకు బేగంపేట ఎస్సై మహిపాల్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా భర్త ఆచూకీ తెలుపండిహవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని గంగాపూర్ గ్రామానికి చెందిన శశికళ తన భర్త కనిపించడం లేదని బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొన్ని రోజులుగా ఆమె భర్త మహేశ్తో గొడవపడి పుట్టింటికి వెళ్లింది. అయితే ఈ క్రమంలో చాకలి గోపాల్, బండి శోభలు కలిసి శశికళ అత్తమ్మ(64)ను మార్చి 25న బంగారు ఆభరణాల కోసం ఆంధ్రప్రదేశ్కు వెళ్లి హత్య చేసినట్లు పోలీసులు స్వగ్రామానికి వచ్చారు. దీంతో తన భర్త ఆచూకీ కనిపెట్టాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. మందుబాబులకు జరిమానాసంగారెడ్డి క్రైమ్: డ్రంకన్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ వాహనదారులకు సంగారెడ్డి జిల్లా న్యాయస్థానం జరిమానా విధించింది. సంగారెడ్డి పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి పాత బస్టాండ్వద్ద, జాతీయ రహదారి, బైపాస్లోని గుర్రపు బొమ్మ వద్ద నిర్వహించిన డ్రంకన్ అండ్ డ్రైవ్లో తనిఖీల్లో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం వీరిని సంగారెడ్డి జిల్లా న్యాయస్థానంలో హాజరుపరచగా జిల్లా అదనపు న్యాయమూర్తి షకీల్ అహ్మద్ సిద్దిఖీ ఒకరికి రూ.2వేలు, మిగతా నలుగురికి రూ.1,500 చొప్పున జరిమానా విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. -
మంత్రి ఆదేశాలతో పనుల్లో వేగం
పిచెర్యాగడికి వాటర్షెడ్ ప్రాజెక్టు పథకం మంజూరైనా ఇప్పటి వరకు నిధుల కేటాయింపులు లేకపోవడంతో మూడు శాతం మాత్రమే పనులు జరిగాయి. చేసిన పనులకు ఇంకా చెల్లింపులు జరగలేదు. శనివారం పిచెర్యాగడి గ్రామంలో ఏర్పాటు చేసిన వాటర్షెడ్ కార్యక్రమానికి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ సురేశ్ శెట్కార్, సెట్విన్ చైర్మన్ ఎన్.గిరిధర్రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాలకు రూ.1.56కోట్ల చెక్కును ఉపాధి కోసం అందజేశారు. మంత్రి కార్యక్రమంతో నిధులు విడుదలై వాటర్షెడ్ పనుల్లో వేగం పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం రైతులు, లబ్ధిదారులు వ్యక్తం చేస్తున్నారు. -
ఉసురు తీసిన కుటుంబ కలహాలు
పాపన్నపేట(మెదక్): కుటుంబ సమస్యలు భరించలేక పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న యువకుడు చికి త్స పొందుతూ బుధవారం మరణించాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం... కొడుపాక గ్రామానికి చెందిన అవుసుల శ్రీకాంత్ (26) నార్సింగి గ్రామంలో బంగారం దుకాణం నిర్వహిస్తున్నాడు. అతడికి ఆరేళ్ల క్రితం బాచుపల్లికి చెందిన లావణ్యతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే తరచుగా ఇంట్లో గొడవలు జరుగుతుండేవి. ఈ నెల 21న భార్య, అతని తల్లికి మధ్య గొడవ జరిగింది. దీంతో ఎవరిని ఏమనలేక , బయటకు వెళ్లిన శ్రీకాంత్ పెట్రోల్ తీసుకొని వచ్చి ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. వెంటనే అతన్ని మెదక్కు, అక్కడి నుంచి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించాడు. భార్య లావణ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మద్యానికి బానిసై .. సంగారెడ్డి క్రైమ్: మద్యానికి బానిసై వ్యక్తి మృతి చెందిన ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.పట్టణ సీఐ రమేశ్ కథనం ప్రకారం... పట్టణంలోని శివాజీనగర్కు చెందిన మార్కంటి దేవదాసు (50), బతుకుదెరువు కోసం కుటుంబంతో కలిసి మూడేళ్ల క్రితం మహరాష్ట్ర నుంచి పట్టణానికి వచ్చి, కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్య లక్మీభాయి, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు. బుధవారం ఉదయం భార్య లక్మీభాయి బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లింది. మధ్నాహ్యం మూడు గంటల సమయంలో ఇంటికి వచ్చి చూడగా దేవదాసు తన గదిలో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని విగతజీవిగా కనిపించాడు. కొన్ని నెలలుగా మద్యానికి బానిసై సరిగా పని చేయడం లేదని కుటుంబీకులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో గడి ్డ మందు తాగి.. సిద్దిపేటకమాన్: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్యకు యత్నించి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. వన్ టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని గ్రీన్ కాలనీకి చెందిన నర్సింహారెడ్డి టింబర్ డిపో నిర్వహిస్తున్నాడు. అతడు వ్యాపార నిర్వహణ కోసం అవసరాల నిమిత్తం చిట్ ఫండ్లలో, తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. అప్పు ఇచ్చిన వారి వేధింపులు భరించలేక, మానసికంగా ఇబ్బంది పడుతూ టింబర్ డిపోలో మంగళవారం గడ్డి మందు తాగాడు. గమనించిన అతడి కుమారుడు వెంటనే సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. కుమారుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.పెట్రోలు పోసుకొని ఆత్మహత్య -
రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు లారీని ఢీకొట్టిన మహిళా ఆర్ఎంపీ.. చేగుంట(తూప్రాన్): ఆగి ఉన్న లారీని స్కూటీ ఢీకొట్టిన ప్రమాదంలో మహిళా ఆర్ఎంపీ మృతి చెందింది. ఈ ఘటన చేగుంట మండలం రెడ్డిపల్లి కాలనీ సబ్ స్టేషన్ వద్ద 44వ జాతీయ రహదారిపై బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారానికి చెందిన కమ్మరి మంజుల(45) ఆర్ఎంపీగా పని చేస్తున్నారు. ఆమె కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో ఉంటున్న తన కూతురు శృతిలయను చూసేందుకు స్కూటీపై వెళ్లింది. బుధవారం తిరుగు ప్రయాణంలో స్కూటీపై వస్తుండగా రెడ్డిపల్లికాలనీ వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఆమె తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి తెలిపారు. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆటో.. హవేళిఘణాపూర్(మెదక్): ఆగి వున్న లారీని వెనుక నుంచి ఆటో ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని శాలిపేట గేటు సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... హవేళిఘణాపూర్ మండల పరిధిలోని బూర్గుపల్లికి చెందిన ఆటోలో మెదక్ నుంచి 12 మంది ప్రయాణికులు బూర్గుపల్లి వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో మండల పరిఽధిలోని శాలిపేట గేటు శివారులోకి రాగానే నిలిచి ఉన్న ఇనుప రాడ్ల లోడ్తో ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శాలిపేట గ్రామానికి చెందిన లక్ష్మి(54) అక్కడికక్కడే మృతి చెందింది. డ్రైవర్ రాములుకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. కామారెడ్డి జిల్లా గుండారానికి చెందిన పెంటి, శ్రీకాంత్లకు మెదక్ ఆస్పత్రిలో చికిత్స నిర్వహిస్తున్నారు. వీరితో పాటు ఉన్న మరో 9 మందికి స్వల్ప గాయాలయ్యాయి. మృతుడికి భర్త యాదగిరి, ఒక కుమారుడు ఉన్నాడు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ సత్యనారాయణ సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డివైడర్ను ఢీకొట్టిన యువకుడు.. చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండలంలోని జప్తిశివనూర్ జాతీయ రహదారిపై బైక్ అదుపుతప్పి యువకుడు డివైడర్ను ఢీకొట్టి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. నార్సింగి ఎస్ఐ అహ్మద్ మోహినోద్దీన్ కథనం ప్రకారం... సిద్దిపేట జిల్లా అక్బర్పేట –భూపంల్లి మండలం చౌదర్పల్లి గ్రామానికి చెందిన వల్లెపు సంతోష్(28) తన పెద్దమ్మ కుమారుడు రాజుతో కలిసి మంగళవారం రాత్రి బైక్పై గండిమైసమ్మ నుంచి కామారెడ్డికి బయలుదేరారు. మార్గమధ్యలో జప్తిశివనూర్ వద్దకు చేరుకోగానే బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి ప్రమాదానికి గురయ్యారు. వెంటనే రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కామారెడ్డికి తరలిస్తుండగా సంతోష్ మృతి చెందాడు. రాజు కాలు విరగడంతో అస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
వాన నీటిని ఒడిసిపట్టేందుకు..
జహీరాబాద్: సంగారెడ్డి జిల్లాకు ప్రధానమంత్రి కృషి సించాయి యోజన 2.0 కింద వాటర్షెడ్ పథకం మంజూరైంది. ఈ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను కేటాయిస్తారు. జిల్లాకు మంజూరైన పిచెర్యాగడి వాటర్షెడ్ ప్రాజెక్టు కింద 8 గ్రామాలను ఎంపిక చేశారు. అత్యంత తక్కువగా భూగర్భ జలాలు ఉన్నట్లు జలవనరుల శాఖ గుర్తించిన ప్రాంతాలను వాటర్షెడ్ పథకం కోసం ఎంపిక చేశారు. ఇక్కడ వాననీటిని ఒడిసిపట్టి భూగర్భ జలవనరులను పెంచి కరువును పారద్రోలనున్నారు. ఈ ప్రాజెక్టు కింద జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహిర్ మండల పరిధిలోని పిచెర్యాగడి, బడంపేట, పర్శపల్లి, సజ్జాపూర్, కొత్తూర్(కె), ఖానాపూర్, మాచిరెడ్డిపల్లి, రాజనెల్లి గ్రామాల్లో భూగర్భ జలాలు నామమాత్రంగానే ఉన్నాయి. ఆ గ్రామాల్లో భూగర్భ జలాలను పెంచేందుకు వీలుగా వాటర్షెడ్ పనులను చేపట్టేందుకు ప్రతిపాదించారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మంజూరు కావాల్సిన ప్రాజెక్టుకు ఆలస్యంగా 2024లో మంజూరైంది. ఆరు నెలల పాటు డిటేల్డ్ ప్రాజెక్టు రిపోర్టును తయారు చేసి ప్రభుత్వానికి అందజేశారు. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ.10.58 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ పథకం కింద 4,733 హెక్టార్ల భూమిలో వాటర్షెడ్ పనులను చేపట్టేందుకు గుర్తించారు. ప్రాజెక్టు మంజూరైనందున ఇప్పటి వరకు ప్రజల భాగస్వామ్యంతో మూడు శాతం మేర పనులు చేశారు. పర్శపల్లిలో 6, సజ్జాపూర్లో 3 శాతం మట్టి పర్క్యులేషన్ ట్యాంకుల పనులు కొనసాగుతున్నాయి. వాటర్షెడ్ పనుల కోసం 49 శాతం నిధులు కేటాయిస్తారు. ఈ నిధులతో గుట్టలపై మట్టి కట్టలు వేసి వర్షపునీరు ఎక్కడికక్కడే ఇంకిపోయేలా చర్యలు చేపడతారు. మిగిలిన నీరు కూడా ఇంకిపోయేందుకు కందకాలను, మట్టి సర్కులేషన్ ట్యాంకులను నిర్మిస్తారు. వర్షం నీరు ఎక్కడికక్కడే ఇంకిపోయి భూగర్భ జలాలు పెంచేందుకు వీలుగా వాటర్షెడ్ పథకం ఉపయోగపడుతుంది. రైతులకు అవసరమైన పరికరాలకు నిధులు.. సమగ్ర గ్రామీణాభివృద్ధిని సాధించి, ఉత్పాదకత పెంచేందుకు వీలుగా రైతులకు అవసరమైన పరికరాలను అందించేందుకు వీలుగా 15 శాతం నిధులను కేటాయిస్తారు. మరో 15 శాతం నిధులతో పేద, నిరుపేద కుటుంబాల జీవన ప్రమాణ స్థాయిని పెంచేందుకు గ్రామాల్లో ఉన్న సంఘాల ద్వారా అమలు చేస్తారు. ముఖ్యంగా స్వయం ఉపాధి, వ్యవసాయ ఆధారిత జీవనోపాధి వ్యవసాయేతర ఉపాధిని ఈ పథకం కింద కల్పిస్తారు.జిల్లాకు కొత్త వాటర్షెడ్ పథకం పిచెర్యాగడి ప్రాజెక్టు కింద 8 గ్రామాల ఎంపిక భూగర్భ జలాలు తక్కువగా ఉన్న గ్రామాలకు చోటు రూ.10.58 కోట్ల నిధులు మంజూరు 4,733 హెక్టార్లలో పనులు మూడు శాతం మాత్రమే జరిగిన పనులు -
ఉగ్రదాడి పాశవిక చర్య
దిష్టి బొమ్మ దహనం చేసిన న్యాయవాదులు హుస్నాబాద్: కశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిని బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు న్యాయవాదులు బుధవారం విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఉగ్రవాదుల దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ ఉగ్రవాదులు పర్యాటకులపై చేసిన దాడి అత్యంత హేయమైన చర్య అన్నారు. ఉగ్రవాదులు భారత్కు రాకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి దేశానికి రక్షణ కల్పించాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సదానందం, న్యాయవాదులు చిత్తారి రవీందర్, మురళీమోహన్, కన్నోజు రామకృష్ణ, రాజశేఖర్, సంపత్ పాల్గొన్నారు. పేద రోగులకు సేవలందిస్తా ఎంపీహెచ్డబ్ల్యూ ఒకేషనల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ సాయి దీప్తి చేర్యాల(సిద్దిపేట):పేద రోగులకు సేవ చేయాలన్నదే నా లక్ష్యమని ఇంటర్మీడియెట్లో ఎంపీహెచ్డబ్ల్యూ ఒకేషనల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన సాయి దీప్తి అన్నారు. మంగళవారం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన సాయి దీప్తిని ‘సాక్షి’ పలకరించగా పై విధంగా అన్నారు. ‘ఆ లక్ష్యంతోనే చేర్యాల కేజీబీవీలో ఎంపీహెచ్డబ్ల్యూ నర్సింగ్ కోర్సులో జాయిన్ అయ్యాను. కష్టపడి చదివి, ఉపాధ్యాయుల సహకారంతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాను. బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి పేద రోగులకు సేవలందిస్తా’నని అన్నారు. పదో తరగతి పూర్తయిన తర్వాత ఆర్థిక పరిస్థితి కారణంగా రెండేళ్లు చదువు ఆపేసినట్లు తెలిపారు. కేజీబీవీలో ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సులో చేరి స్టేట్ ఫస్ట్ర్యాంక్ సాధించడంపై బాలికను అధ్యాపకులతో పాటు పలువురు అభినందించారు. అదనపు సెషన్స్ జడ్జిగా ప్రసాద్ సిద్దిపేటకమాన్: ఫస్ట్ క్లాస్ అదనపు డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జిగా వైజే ప్రసాద్ బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. ఈ మేరకు బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఆయనకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. 42 ఏళ్లకు కలుసుకున్న అపూర్వ మిత్రులు ఒకరు ఏసీపీ.. మరొకరు హెడ్మాస్టర్ హోదాలో.. మిరుదొడ్డి(దుబ్బాక): వారిద్దరు ఒకేచోట చదువుకున్న మిత్రులు. ఉన్నత చదువుల రీత్యా ఎవరికి వారు విడిపోయారు. ఒకరేమో ఏసీపీగా, మరొకరేమో హెడ్మాస్టర్గా స్థిరపడ్డారు. సరిగ్గా 42 ఏళ్ల తర్వాత ఇద్దరు విధి నిర్వహణలో అనుకోని రీతితో తారాసపడ్డారు. దీంతో ఇద్దరి మధ్య చోటు చేసుకున్న ఆనంద భావోధ్వేగం చూపరుల మనసును కట్టిపడేసింది. శాంతి భద్రతల సమీక్షలో భాగంగా అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని ఖాజీపూర్ గ్రామాన్ని ఏసీపీ మధు బుధవారం సందర్శించారు. ఇదే గ్రామంలో జెడ్పీహెచ్ఎస్లో హెడ్మాస్టర్గా విధులను నిర్వహిస్తున్న చిన్ననాటి మిత్రుడు కూరపాటి జగన్మోహన్ రాజు ఏసీపీకి అకస్మాత్తుగా ఎదురుపడ్డారు. దీంతో సంభ్రమాశ్చర్యానికి గురై ఒక్కసారిగా ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరు కలిసి విద్యనభ్యసించిన జ్ఞాపకాలను, సంఘటనలను ఒకరికొకరు గుర్తు చేసుకున్నారు. విద్యతోనే సమాజంలో గుర్తింపు దుబ్బాకటౌన్: విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలని, విద్యతోనే సమాజంలో గుర్తింపు లభిస్తాయని డీఈఓ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాయపోల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బడిబాట వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా క్రమశిక్షణ, నైతిక విలువలతో కూడిన విద్యనభ్యసించాలన్నారు. -
ఉగ్రదాడికి నిరసనగా శాంతి ర్యాలీ
కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. బుధవారం రాత్రి గజ్వేల్ పట్టణంలో పార్టీల కతీతంగా కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన వీధులగుండా జాతీయ జెండాలను పట్టుకొని ర్యాలీ చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఉగ్రవాదుల దుశ్చర్యను తీవ్ర స్థాయిలో ఖండించారు. కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, యువజన, ప్రజా సంఘాల నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. – గజ్వేల్రూరల్ -
తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం
2024–25లో రూ.26 లక్షలు పడిపోయిన రాబడి ● డాక్యుమెంట్ల సంఖ్య కూడా స్వల్పంగా తగ్గుముఖం ● రియల్ఎస్టేట్ రంగం సంక్షోభమే కారణమంటున్న అధికారులు ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 16 ఎస్ఆర్ఓ కార్యాలయాలురియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పుల ప్రభావం ఈ రంగంపై తీవ్రంగా పడిన సంగతి తెలిసిందే. దీంతో రిజిస్ట్రేషన్ల ఆదాయం ఏడాదికేడాది పెరగాల్సింది పోయి తగ్గుముఖం పట్టింది. ఇందుకు ఈ రంగం సంక్షోభమే ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సంగారెడ్డితో పాటు, మెదక్, సిద్దిపేట జిల్లాలో హైదరాబాద్ నగరానికి ఆనుకుని ఉన్నాయి. ఇక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్లు పెద్ద ఎత్తున వెలిశాయి. వెంచర్లలో నివాస స్థలాల క్రయవిక్రయాలు చాలా మట్టుకు నిలిచిపోయాయి. కొత్తగా ఏర్పాట్లు చేస్తున్న వెంచర్ల సంఖ్య నామమాత్రంగానే ఉంటోంది. ఉన్న వెంచర్లలోనే నివాస స్థలాలను కొనుగోలు చేసే నాథుడే లేకుండా పోయారు. దీంతో చాలా వెంచర్లలో పిచ్చిమొక్కలు మొలుస్తున్నాయి. అలాగే ఈ వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు తమ అవసరాల కోసం విక్రయిద్దామంటే కూడా కొనుగోలుదారులు లేకుండా పోయారు. సెకండ్ సేల్ కూడా లేకపోవడంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య పడిపోయింది. దీనికితోడు రియల్ వ్యాపారులు నివాస స్థలాల రేట్లను విపరీతంగా పెంచడంతో సామాన్యులు ప్లాట్లను కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. అలాగే అపార్టుమెంట్లు, ఇతర ఆస్తుల క్రయవిక్రయాలు కూడా పడిపోయాయి. ఇలా రియల్ రంగం సంక్షోభం ప్రభావం రిజిస్ట్రేషన్ల ఆదాయంపై స్పష్టంగా కనిపిస్తోంది. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం స్వల్పంగా తగ్గింది. అలాగే రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా కొంతమేరకు పడిపోయింది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తే 2023–24 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2024–25 ఆర్థిక ఏడాదిలో రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయంలో రూ.25.74 లక్షలు తగ్గింది. 2023–24లో మొత్తం 1.29 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా ప్రభుత్వ ఖజానాకు రూ. 1,135.19 కోట్ల ఆదాయం వచ్చింది. 2024–24లో 1.13 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా, 1,109.45 కోట్లు మాత్రమే ప్రభుత్వ ఖజానాకు జమ అయింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 16 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. సర్కారుకు ప్రధాన ఆదాయ వనరుల్లో ఈ రిజిస్ట్రేషన్ల ఆదాయం ఎంతో కీలకమైంది. రిజిస్ట్రేషన్ చార్జీలతోపాటు, స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ కింద ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం లభిస్తుంది. రిజిస్ట్రేషన్ ఆస్తి విలువలో సుమారు 7.5% మొత్తాన్ని ఈ రిజిస్ట్రేషన్ చార్జీల కింద ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏటా రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరుగుతూ వస్తుండగా... ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఆదాయం పడిపోవడం గమనార్హం. అనధికారిక లే అవుట్ రిజిస్ట్రేషన్లపై నిషేధంతో.. అనధికారిక లేఅవుట్లలోని స్థలాలను రిజిస్ట్రేషన్లను చేయకూడదని ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖ ను ఆదేశించిన విషయం విదితమే. ఇది కూడా రిజిస్ట్రేషన్ల సంఖ్య పడిపోవడానికి ప్రధాన కారణమని ఆశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇలా రిజిస్ట్రేషన్ల ఆదాయం స్వల్పంగా తగ్గడానికి పలు కారణాలున్నాయని చెబుతున్నారు.రియల్ రంగం కుదేలే కారణం! -
భూ భారతి రైతులకు వరం
కోహెడ(హుస్నాబాద్): భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భూ భారతి చట్టాన్ని ప్రభుత్వం రూపొందించిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం రెవెన్యూ అధికారులు మండల కేంద్రంలోని హైస్కూల్ ఆవరణలో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన భూ భారతి చట్టం రైతులకు వరం కానుందన్నారు. దీంతో కోర్టుకు వెళ్లకుండానే సమస్యలు పరిష్కారం కానున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణితోనే కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యాయన్నారు. సాదాబైనామాలు సైతం భూ భారతి ద్వారా పరిష్కారం కానున్నట్లు తెలిపారు. నాలుగు దిక్కులా హద్దులతో వ్యవసాయ మ్యాప్తో రిజిస్టేషన్లు అయ్యేలా భూ భారతి చట్టంలో ఉందన్నారు. రైతులు తమ సమస్యల పరిష్కరం కోసం తహసీల్దార్ కార్యాలయంలో అర్జీలు పెట్టుకోవాలని కోరారు. కాగా సదస్సుకు వచ్చిన పలువురి రైతుల సమస్యలకు కలెక్టర్ మనుచౌదరి సలహాలు, సూచనలు చేశారు. అలాగే తొమ్మిది మందికి కల్యాణలక్ష్మి చెక్కులు అందించారు. అంతకు ముందు సన్నబియ్యం లబ్ధిదారులు తలారి మల్లవ్వ, చంద్రయ్య ఇంట్లో మంత్రి భోజనం చేశారు. అనంతరం వింజపల్లి చౌరస్తా కురుమ వాడలో సాయుధ పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని మంత్రి అవిష్కరించారు. అనంతరం కురుమ ఆత్మీయ సమ్మేళనానికి హాజరై ప్రసంగించారు. కార్యక్రమంలో కలెక్టర్ మనుచౌదరి, అదనపు కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డిలో బుధవారం జరిగిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కుమార్తె జయారెడ్డి–గుణచైతన్యరెడ్డి నిశ్చితార్థ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి హాజరయ్యారు. జపాన్ పర్యటన ముగించుకుని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా సంగారెడ్డికి చేరుకున్న రేవంత్రెడ్డి ముందుగా రాంనగర్లో ఉన్న రామాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం నిశ్చితార్థ కార్యక్రమానికి చేరుకుని కాబోయే వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డికి జగ్గారెడ్డితోపాటు, జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహలు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డివెంకట్రెడ్డి, కొండా సురేఖ, ఎంపీ సురేశ్ షెట్కార్, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కీలక భూ సమస్యలన్నీ ఇక పరిష్కారం మంత్రి పొన్నం ప్రభాకర్ కోహెడలో అవగాహన సదస్సు -
రజతోత్సవం.. సమాయత్తం
బీఆర్ఎస్ సభకు భారీ సన్నాహాలు ● గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం ● ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 2లక్షల మందిని తరలించేందుకు కసరత్తు ● సమీక్షలు, టెలికాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్న హరీశ్రావు ● సిద్దిపేట నుంచి పాదయాత్రగా యువత సాక్షి, సిద్దిపేట: బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు మెతుకుసీమ గులాబీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ (టీఆర్ఎస్) 24 ఏళ్లు పూర్తి చేసుకుని ఈ నెల 27న 25వ ఏటా అడుగుపెడుతున్న సందర్భంగా హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో రజతోత్సవ భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఉమ్మడి మెదక్ జిల్లా భారీ సంఖ్యలో నాయకులను, కార్యకర్తలను తరలించేందుకు సమాయత్తం మవుతున్నారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలను నిర్వహించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు సమీక్షలను, టెలికాన్ఫరెన్స్లను నిర్వహిస్తూ కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి భారీగా తరలివెళ్లి ఉద్యమాల గడ్డగా మరోమారు సత్తా చాటేందుకు స్థానిక గులాబీ నేతలు ప్రత్యేక దృష్టి పెట్టారు. ముమ్మరంగా ఏర్పాట్లు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి దాదాపు 2లక్షల మందికి పైగా సభకు వెళ్లేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సన్నాహక సమావేశం నిర్వహించారు. నాయకులకు పలు బాధ్యతలను అప్పగించారు. గజ్వేల్ నుంచి గులాబీ దండును తరలించే పనిలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ప్రతాప్రెడ్డి, మాదాసు శ్రీనివాస్లు దృష్టి సారించారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఇప్పటికే సన్నాహక సమావేశం నిర్వహించారు. సభకు తరలేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలోనే సభ జరుగుతుండటంతో ఎక్కువ మందిని తరలించేందుకు ప్రత్యేక దృష్టిపెట్టారు. అలాగే మెదక్, సంగారెడ్డి, నర్సాపూర్, పటాన్చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోల్ నుంచి సైతం జన సమీకరణ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. నాయకుల కూలి పనులు సభకు వెళ్లేందుకు తోవ ఖర్చుల (భోజనం, వాటర్ ప్యాకెట్ల) కోసం గులాబీ నాయకులు కూలీ పనులు చేస్తున్నారు. బీఆర్ఎస్, బీఆర్ఎస్ యువజన, బీఆర్ఎస్వీ నాయకులు పలు చోట్ల కూలీ పనులు చేసి డబ్బులను సమకూరుస్తున్నారు. అలాగే పలువురు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సభకు వెళ్లేందుకు ఖర్చుల కోసం డబ్బులను విరాళంగా ఇస్తున్నారు. రేపు పాదయాత్ర ప్రారంభంఎల్కతుర్తిలో జరగనున్న సభకు శుక్రవారం పాదయాత్రగా బయలు దేరి వెళ్లనున్నారు. సిద్దిపేటలోని రంగధాంపల్లి చౌరస్తా అమరవీరుల స్తూపం నుంచి దాదాపు వెయ్యి మంది యువత, విద్యార్థులు పాదయాత్రగా బయలుదేరనున్నారు. 27న సాయంత్రం ఎల్కతుర్తిలో జరిగే సభకు చేరుకోనున్నారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీని హరీశ్రావు నియమించారు. ఈ కమిటీ ఇప్పటికే హాల్టింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామం నుంచి 10 నుంచి 15 మంది పాదయాత్రగా వెళ్లేందుకు యువత ముందుకు వచ్చారు. ఇప్పటికే జాబితాను రూపొందించారు. తరలివెళ్దాం రండీ..ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాక: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా తరలిరావాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం స్థానికంగా సభ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం కోసం జరిగిన ఉద్యమంలో దుబ్బాక నియోజకవర్గం క్రీయాశీలక పాత్ర పోషించిందన్నారు. కనీవిని ఎరుగని స్థాయిలో జరుగనున్న రజతోత్సవ సభకు నియోజకవర్గం నుంచి 15 వేలకు పైగా క్రీయాశీలక కార్యకర్తలు హాజరవుతారన్నారు. సభకు సంబంధించి ఇప్పటికే నియోజకవర్గంలోని కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి తగిన ఏర్పాట్లపై చర్చించామన్నారు కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జోరుగా వాల్ రైటింగ్ ఎల్కతుర్తి సభను విజయవంతం చేయాలని కోరుతూ పలువురు బీఆర్ఎస్ నేతలు ప్రధాన రహదారుల వెంట వాల్రైటింగ్ రాయించారు. అలాగే పలువురు బీఆర్ఎస్ నేతలు వాల్ పోస్టర్లను రూపొందించి అతికించారు. స్థానిక సంస్థల్లో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కౌన్సిలర్లుగా పోటీ చేయాలనుకునే నాయకుల సభను విజయవంతం చేయాలని వాల్రైటింగ్లు, వాల్ పోస్టర్లు అంటించి తమ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. -
రైతులకు భూ భారతి వరం
దుబ్బాక: ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టం రైతులకు వరమని ఆర్డీఓ సదానందం అన్నారు. మంగళవారం దుబ్బాక ఐఓసీలో భూ భారతిపై రైతులకు అవగాహన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఈ చట్టంతో రైతులకు కలిగే లాభాలను వివరించారు. రైతులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ సంజీవ్కుమార్, ఎంపీడీఓ భాస్కరశర్మ, ఆర్ఐ నరేందర్, మండలంలోని రైతులు, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు. సమస్యలు ఇక సత్వర పరిష్కారం మిరుదొడ్డి(దుబ్బాక): భూ భారతితో రైతుల భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. మంగళవారం అక్బర్పేట–భూంపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతి చట్టం గురించి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన ఆర్ఓఆర్ 2025 చట్టంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. భూ భారతి ద్వారా చేకూరే ప్రయోజనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి సమస్యల పరిష్కారం కోసం భూ భారతి పోర్టల్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ సదానందం, తహసీల్దార్ మల్లికార్జున్ రెడ్డి, ఎంపీడీఓ జైపాల్రెడ్డి, మండల వ్యవసాయ అధికారి సత్యాణ్వేష్, జిల్లా కో ఆపరేటివ్ అధికారి నాగేశ్వర్రావు, ఆర్ఐ వెంకట్ నర్సయ్య, రెవెన్యూ సిబ్బంది, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు. -
పోషకాహారలోపాన్ని నివారించాలి
డీప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్ గజ్వేల్: మహిళలు, చిన్నారుల్లో పోషకాహారలోపాన్ని సరిచేయడానికి కృషి చేయాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని ఐఓసీ (ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్)లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గజ్వేల్ ప్రాజెక్ట్ స్థాయి పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. హాజరైన డిప్యూటీ డీఎంహెచ్ఓ మాట్లాడుతూ గ్రామాల్లో ఆశావర్కర్లు, అంగన్వాడీలు సమన్వయంతో పనిచేసి పోషకాహారలోపం తలెత్తకుండా చూడాలన్నారు. పోషణ పక్వాడలో భాగంగా మొదటి వెయ్యి రోజులు గర్భిణులు, పిల్లలకు క్రమపద్ధతిలో పోషకాహారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో సీడీపీఓ సరిత, తహసీల్దార్ శ్రావన్కుమార్, వైద్యాధికారులు బల్బీర్సింగ్, ప్రణయ్, సత్యప్రకాశ్, పోషణ అభియాన్ బ్లాక్ కో–ఆర్డినేటర్ కిరణ్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు భవానీ, శ్రీలక్ష్మీ, రజిత, అనురాధ, దెబోర రాణి, రాణి, సునీత తదితరులు పాల్గొన్నారు. కల్యాణం.. కమనీయం గజ్వేల్రూరల్: పట్టణంలోని అతి పురాతనమైన సీతారామ ఉమామహేశ్వరాలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కల్యాణం కనులపండువగా నిర్వహించారు. మంగళవారం రాత్రి స్వామివార్ల ఎదుర్కోలు కార్యక్రమాన్ని మంగళవాయిద్యాల నడుమ నిర్వహించి, పట్టణ పుర వీధుల గుండా మంటపం వరకు విగ్రహాలను తీసుకువచ్చారు. అనంతరం వేదబ్రాహ్మణుల మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణం వైభవంగా జరిగింది. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి కల్యాణాన్ని తిలకించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఆలయ కమిటీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యం ములుగు(గజ్వేల్): కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలకు కష్టాలే తప్ప అభివృద్ధి లేదని ఎమ్మెల్సీ యాదవరెడ్డి, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి విమర్శించారు. మంగళవారం ములుగులోని కేఎంఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ తెలంగాణను సాధించి దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చి దిద్దారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే హామీలను తుంగలో తొక్కి, ఆరు గ్యారంటీలను విస్మరించిందన్నారు. అనంతరం వారు నాయకులు, కార్యకర్తలతో కలసి సభకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. యువత భాగస్వాములు కావాలి గజ్వేల్రూరల్: దేశ రక్షణలో యువత భాగస్వాములు కావాలని గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి అన్నారు. గజ్వేల్లోని ఆజాద్ డిఫెన్స్ అకాడమీ నుంచి ఆర్మీ జవాన్గా ఎంపికై న వరుణ్ను మంగళవారం ఏసీపీ పురుషోత్తంరెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్మీలో చేరి దేశ ప్రజలకు సేవలందించే సైనికుల సేవలు వెలకట్టలేనివని, యువత దేశ రక్షణలో భాగస్వాములయ్యేలా ప్రోత్సహిస్తున్న ఆజాద్ డిఫెన్స్ అకాడమీ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో తొగుట సీఐ లతీఫ్ తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణాన్ని కాపాడుకుందాం
డీపీఓ దేవకిదేవి కొమురవెల్లి(సిద్దిపేట): పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని డీపీఓ దేవకిదేవి అన్నారు. సోమవారం ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో ఎంపీడీఓ శ్రీనివాస వర్మతో కలిసి ప్లాస్టిక్ చెత్తను సేకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాలుష్యం నుంచి భూమిని కాపాడుకోవాలని అన్నారు. మనిషి జీవితం పూర్తిగా భూమిపై ఆధారపడి ఉందని, మనం తీసుకునే ఆహారం, తాగునీరు వంటి ప్రధాన అవసరాలన్ని భూమియే సమకూరుస్తోందని అన్నారు. భూమిని కాపాడుకోవాలంటే ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించడమే మార్గమన్నారు. పునర్వినియోగానికి ఉపయోగపడే వాటర్ బాటిళ్లు, బ్యాగులు మాత్రమే వాడాలన్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి ఎల్ఆర్ఎస్పై సమీక్షించారు. కార్యక్రమంలో డీఎల్పీఓ, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
యూజీడీ కోసం వినతి
సిద్దిపేటజోన్: పట్టణంలోని సంతోష్నగర్ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని మంగళవారం కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలో యూజీడీ పనులు ఇంకా ప్రారంభం కాలేదని వివరించారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేనందున వర్ష కాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, సెక్రటరీ కనకరాజు, ప్రతినిధులు కనకయ్య, కొండల్రెడ్డి, శ్రీనివాస్, నంద కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మెరిసిన కవలలు
తల్లి స్వీపర్.. కూతురు టాపర్సత్తాచాటిన గురుకుల విద్యార్థినులు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్యడీఈఓ శ్రీనివాస్రెడ్డి హుస్నాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాల్లో కవల పిల్లలు అత్యుత్తమ మార్కులతో మెరిశారు. హుస్నాబాద్ పట్టణానికి చెందిన అశాడపు శ్రీనిజ, ఆశాడపు శ్రీనిత్యలు అక్కా చెల్లెల్లు. స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం (ఎంపీసీ) పూర్తి చేశారు. వెలువడిన ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో శ్రీనిత్య 981/1000, శ్రీనిజ 968/1000 మార్కులు సాధించారు. ప్రథమ సంవత్సరంలోనూ శ్రీనిత్య 461/470, శ్రీనిజ 438/470 మార్కులు వచ్చాయి. ఇంజనీరింగ్ కావాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు వారు తెలిపారు. తొగుట(దుబ్బాక): తండ్రి లేకపోయినా.. తల్లి సహకారంతో పేదింట విద్యాకుసుమం మెరిసింది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని భార్గవి 971 మార్కులు సాధించి కళాశాల టాపర్గా నిలిచింది. పడిగె మల్లేశం, మాధవి దంపతులకు కూతురు భార్గవి, కుమారుడు స్వామి (9వ తరగతి) ఉన్నారు. వారు తమ రెక్కల కష్టంతో పిల్లలను చదివిస్తున్నారు. ఈ క్రమంలో 8నెలల క్రితం మల్లేశం గుండెపోటుతో మృత్యువాతపడ్డారు. భర్త మరణించినా గుండైధెర్యంతో ఇద్దరు పిల్లలను రెక్కల కష్టంతో చదివిస్తోంది. మాధవి గజ్వేల్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో స్వీపర్గా పనిచేస్తున్నారు. తొగుటలోని బాలికల గురుకుల పాఠశాలలో చదివిన భార్గవి టెన్త్లోనూ 9.8జీపీఏ సాధించింది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 971 మార్కులు సాధించి పలువురి ప్రశంసలు అందుకుంది. కష్టపడి చదివి తల్లి కష్టానికి ప్రతిఫలం అందించి పేదింట సంతోషాలను పూయించింది.సిద్దిపేటఅర్బన్: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో ఎన్సాన్పల్లిలోని గురుకుల కళాశాల విద్యార్థినులు ప్రతిభ కనబరిచారు. మొదటి సంవత్సరం ఎంపీసీలో 39 మందికి 39 మంది ఉత్తీర్ణత సాధించారు. అమూల్య, వైష్ణవిలు 468 మార్కులు సాధించి సత్తాచాటారు. బైపీసీ ఫస్టియర్లోనూ 37 మందికి 37 మంది ఉత్తీర్ణత కాగా, భూమిక 436 మార్కులు సాధించారు. అలాగే ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో 40 మందికి 39 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంద్రజ, అశ్విని 990 మార్కులు వచ్చాయి. బైపీసీ సెకండియర్లో 38 మందికి 35 మంది ఉత్తీర్ణత సాధించగా దీపిక 993 మార్కులు సాధించింది. విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడంపై కళాశాల ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. జగదేవ్పూర్(గజ్వేల్): ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని డీఈఓ శ్రీనివాస్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని ఇటిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం నిర్వహించారు. డీఈఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వచ్చే ఏడాది నుంచి ఏఐ ద్వారా పాఠాలు ఉంటాయని వివరించారు. విద్యార్థులకు విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా అందే విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకే పంపించాలని కోరారు. అంతకు ముందు కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంఈఓ మాధవరెడ్డి, తహసీల్దార్ రఘువీరారెడ్డి, ఎంపీడీఓ రాంరెడ్డి, మాజీ సర్పంచ్ చంద్రశేఖర్, ఎంపీటీసీ అయూబ్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. పేదింట విద్యాకుసుమం ఇంటర్లో 971 మార్కులు సాధించిన భార్గవి -
బ్యాంకు గ్యారంటీలకు ససేమిరా
● బీజీలు ఇవ్వని మూడింట రెండోవంతు రైసు మిల్లర్లు ● 94 మిల్లులకుగాను ఇచ్చింది కేవలం 33 మిల్లులే ● వారికే సీఎంఆర్ ధాన్యం కేటాయిస్తామంటున్న అధికారులు సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: కస్టం మిల్లింగ్ పేరుతో సర్కారు ధాన్యాన్ని తీసుకుని బహిరంగ మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్న రైసుమిల్లర్లకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కొత్తగా తెరపైకి తెచ్చిన నిబంధనలు మెదక్ జిల్లాలో అమలు కావడం లేదు. బ్యాంకు గ్యారెంటీ (బీజీ)లు ఇస్తేనే కస్టం మిల్లింగ్ కోసం ధాన్యం కేటాయించాలనే నిబంధనను మిల్లర్లు పట్టించుకోవడం లేదు. ఈ యాసంగి కొనుగోలు సీజనులో మిల్లర్లు తీసుకునే ధాన్యానికి బీజీలు ఇచ్చేందుకు ససేమిరా అంటు న్నారు. మూడింట రెండోవంతు మిల్లర్లు ఈ బీజీలు ఇవ్వలేదు. జిల్లాలో మొత్తం 94 రైసుమిల్లులు ఉండగా, ఇప్పటివరకు కేవలం 33 రైసుమిల్లుల యాజమాన్యాలు మాత్రమే బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చాయి. మిగిలిన 61 మిల్లర్లు బీజీలు ఇవ్వాలనే నిబంధనను పెడచెవిన పెడుతున్నారు. దీంతో వీరికి ఈ సీజనులో ధాన్యం కేటాయింపులు ఉంటా యా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధనల ప్రకారం మిల్ల ర్లు తాము తీసుకునే ధాన్యానికి సంబంధించి బ్యాంకుల నుంచి గ్యారెంటీ ఇవ్వాలి. ఒకవేళ తీసుకున్న ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటే ఆ మొత్తాన్ని బ్యాంకు ద్వారా ప్రభుత్వం రాబట్టుకుంటుంది. ఈ నిబంధన జిల్లా లో పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. ఊపందుకుంటున్న సేకరణ సీజను... మెదక్ జిల్లాలో ధాన్యం సేకరణ సీజను ప్రారంభమైంది. ఈ యాసంగి సీజనులో 2.46 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఇందులో 2.01 లక్షల ఎకరాల్లో దొడ్డురకం, సుమారు 43 వేల ఎకరాల్లో సన్నరకం ధాన్యం సాగైనట్లు వ్యవసాయశాఖ అధికారులు లెక్కించారు. రైతులు తమ సొంత అవసరాలు పోగా, ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసే ధాన్యం మినహాయిస్తే...సుమారు 3.89 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం (సన్న, దొడ్డురకాలు కలిపి) ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 480 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే ఇప్పటికే ఈ కేంద్రాల్లో సేకరణ షురువైంది. ఈ నెల 19 నాటికి 312 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఇలా ఈ సేకరణ ప్రక్రియ ఊపందుకుంటోంది. కానీ, మిల్లర్లు మాత్రం బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు.. బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చిన మిల్లర్లకు మాత్రమే ఈ సీజనులో సీఎంఆర్ ధాన్యం కేటాయింపులు ఇస్తామని అధికారులు పేర్కొంటున్నారు. బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వని మిల్లర్లకు ధాన్యం కేటాయించేది లేదని చెబుతున్నారు. కానీ, రాజకీయ ఒత్తిళ్లు వస్తే...సర్కారు ధాన్యాన్ని మిల్లర్లకు కట్టబెట్టడం అధికారులకు పరిపాటిగా మారింది. గత ప్రభుత్వ హయాంలోనూ ప్రజాప్రతినిధులు, నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు అక్రమార్కులకు అక్షరాల రూ.214 కోట్లు విలువ చేసే ధాన్యాన్ని కట్టబెట్టారు. ఈ మిల్లర్లు సర్కారు ధాన్యాన్ని బహిరంగమార్కెట్లో విక్రయించి ఆ సొమ్ముతో రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టుకుని రూ.కోట్లకు పడగలెత్తారు. జిల్లా ఉన్నతాధికారులు కూడా తమకు అందే మామూళ్లను తీసుకుని సర్కారు ధాన్యాన్ని అప్పనంగా అక్రమ మిల్లర్లకు అప్పగించారనేది బహిరంగ రహస్యమే. ఈ యాసంగి సీజనులోనైనా ప్రభుత్వం పెట్టిన బ్యాంకు గ్యారెంటీల నిబంధనను అధికారులు నిక్కచ్చిగా అమలు చేస్తారా...లేదంటే అక్రమ మిల్లర్లు ఇచ్చే ముడుపులు తీసుకుని బ్యాంకు గ్యారెంటీలు లేకుండా సర్కారు ధాన్యాన్ని కేటాయిస్తారా..? అనేది వేచి చూడాల్సిందే. సాధారణంగా రైతుల సమస్యను సాకుగా చూపి ఏటా బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వని మిల్లర్లకు రూ.కోట్లు విలువ చేసే ధాన్యాన్ని కట్టబెట్టడం పరిపాటైపోయింది. బీజీలు ఇచ్చిన వారికే కేటాయింపులు ఈ బ్యాంకు గ్యారెంటీల విషయమై ‘సాక్షి’ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సురేశ్రెడ్డిని ఫోన్లో సంప్రదించగా ఆయన స్పందించలేదు. అదనపు కలెక్టర్ మెంచు నగేశ్ను సంప్రదించగా.. బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చిన వారికే ధాన్యం కేటాయింపులు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ గ్యారెంటీలు ఇవ్వని వారి వద్ద కూడా తీసుకుంటామని పేర్కొన్నారు. –మెంచు నగేశ్, అదనపు కలెక్టర్, మెదక్ -
ఇంజన్లో షార్ట్ సర్క్యూట్తో కారు దగ్ధం
కేతేపల్లి: ఇంజన్లో షార్ట్ సర్క్యూట్తో కారు దగ్ధమైంది. ఈ ఘటన విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ వద్ద సోమవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. పటాన్చెరువు మండలం ఇస్నాపూర్లో నివాసముంటున్న వీ. వెంకట్రావు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా పని చేస్తున్నాడు. వెంకట్రావు సోమవారం భార్యతో కలిసి కారులో హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరాడు. మార్గమధ్యలో కేతేపల్లి మండలం కొర్లపహాడ్ వద్దకు రాగానే కారు ఏసీలో నుంచి పొగలు వచ్చాయి. గమనించిన వెంకట్రావు దంపతులు కారును రోడ్డు పక్కకు నిలిపి కిందకు దిగారు. వెంటనే ఇంజన్లో మంటలు చెలరేగి నిమిషాల వ్యవధిలోనే కారుకు మొత్తం అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. నకిరేకల్ ఫైర్ స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పివేశారు. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. బాధితుడు వెంకట్రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొనిల దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివతేజ తెలిపారు. -
మొక్కజొన్న సాగుపై ఆరా
కొండాపూర్(సంగారెడ్డి): మండల పరిధిలోని హరిదాసుపూర్లో సోమవారం సౌదీ అరేబియా రైతులు పర్యటించారు. గ్రామంలోని రైతులను కలిసి జొన్న పంట సాగు పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒక ఎకరాల్లో జొన్న సాగుచేయడానికి ఎంత పెట్టుబడి అవుతుంది? దిగుబడి ఎంత వస్తుంది? మార్కెట్ జొన్న పంటకు డిమాండ్ ఎలా ఉందనే విషయాలపై ఆరా తీశారు. జొన్న సాగు చేయడానికి ఒక ఎకరాకు రూ. 20 వేల పెట్టుబడి వస్తుందని, ఒక ఎకరాలో 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని రైతులు వివరించారు. అనంతరం జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్ మాట్లాడుతూ.. నీటి సాంద్రత తక్కువ ఉన్న ప్రాంతంలో ఎలాంటి పంటలను సాగు చేయాలనే పరిశోధనతో క్షేత్ర స్థాయిలో సాగు వివరాలను తెలుసుకునేందుకు సౌదీ అరేబియా రైతులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు, ఏడీఏ వెంకట లక్ష్మీ, మండల వ్యవసాయాధికారి గణేశ్, ప్రతిభ, ఏఈఓ రవి రైతులు తదితరులు పాల్గొన్నారు.హరిదాసుపూర్లో సౌదీ అరేబియ్యా రైతులు -
లింగయ్యను స్వదేశానికి రప్పించేందుకు కృషి
హుస్నాబాద్: దుబాయిలో చిక్కుకుపోయిన చొప్పరి లింగయ్యను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు కృషి చేస్తామని గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి గాజుల సంపత్ కుమార్ తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలో సోమవారం లింగయ్య ఇంటికి వెళ్లి అతడి భార్య రజితను కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ.. గల్ఫ్ దేశాల్లో ఉపాధి కల్పిస్తామని ఏజెంట్లు మోసం చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం లింగయ్య వద్ద వైద్య చేయించుకోవడానికి చిల్లి గవ్వ లేదన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి ఎన్నారై అడ్వైజరీ కమిటీ చైర్మన్ వినోద్కుమార్ దృష్టికి తీసుకెళ్లారన్నారు. సామాజిక సేవకులు సత్యం పటేల్, బాలరాజ్ గౌడ్, తిరుపతి రెడ్డి ఆదివారం లింగయ్యతోపాటు కంపెనీ యాజమాన్యాన్ని కలిసినట్లు తెలిపారు. తప్పకుండా లింగయ్యను తిరిగి స్వదేశానికి రప్పించి ఆయనకు ఉపాధి కల్పించేలా మంత్రి దృష్టికి తీసుకెళ్తామని సంపత్ కుమార్ తెలిపారు. -
మెరుగైన వైద్య సేవలు అందించాలి
కొల్చారం(నర్సాపూర్):ప్రభుత్వాస్పత్రులకు వైద్యం కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవ లు అందించాలని రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీందర్ నాయక్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆస్పత్రిలోని ఇన్ పేషెంట్ వార్డులో రోగులకు అందుతున్న సేవలపై సిబ్బందితో ఆరా తీశారు. వై ద్యం కోసం వచ్చిన రోగులను పలకరించి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రికార్డును పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైద్య సేవలపై నిర్లక్ష్యం వహిస్తే సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని, ఎట్టి పరిస్థితుల్లో రోగులకు అసౌకర్యం కలిగించొద్దని సిబ్బందిని ఆదేశించారు. అక్కడి నుంచి అంశాన్ పల్లిలో కొనసాగుతున్న ఆయుష్మాన్ భారత్ సెంటర్ను సందర్శించారు. ఆయన వెంట జిల్లా వైద్యాధికారి శ్రీరామ్, నర్సాపూర్ డివిజన్ వైద్యాధికారి సజన, ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రమేశ్, ఎంపీహెచ్ఓ మదన్ మోహన్, సిబ్బంది ఉన్నారు. రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీందర్ నాయక్ కొల్చారం పీహెచ్సీ తనిఖీ -
గుప్త నిధుల కోసం తవ్వకాలు!
విశ్వనాథస్వామి ఆలయఆవరణలో భారీ గొయ్యి ● చైర్మన్పై భక్తుల ఆగ్రహం ● ఎమ్మెల్యే, పోలీసుల పరిశీలన ● పోలీసుల అదుపులో చైర్మన్గొయ్యిని పరిశీలించిన ఎమ్మెల్యే విషయం తెలుసుకొని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్, వైస్ చైర్మన్ దారం శంకర్, మాజీ ఎంపీటీసీ పండరిరెడ్డి, నాయకులు అశోక్రెడ్డి గొయ్యిని పరిశీలించారు. ఆలయం ఆవరణలో అపారమైన నిధి ఉందని చైర్మన్ హన్మాండ్లు చెప్పేవారని కొందరు ఎమ్మెల్యేకు వివరించారు. కొత్త ఆలయ కమిటీ ఏర్పాటుకు నోటిఫికేషన్ రానున్న తరుణంలో ఘటన జరగడం, పరిస్థితులను బట్టి గుప్తనిధుల కోసమే తవ్వినట్లు ఎమ్మెల్యే అనుమానం వ్యక్తం చేశారు. త్వరగా కొత్త కమిటీ కోసం నోటిఫికేషన్ ఇవ్వాలని దేవాదాయ, ధర్మాదాయశాఖ ఉన్నతాధికారులను ఫోన్ ద్వారా కోరారు. తవ్వకాల విషయంలో కేసు నమోదు చేసి సమగ్రవిచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఎమ్మెల్యే సూచించారు.నారాయణఖేడ్: ఖేడ్ పట్టణంలోని విశిష్ట చరిత్రగల ప్రాచీన కాశీ విశ్వనాథస్వామి ఆలయం ఆవరణలో గొయ్యి తవ్వకం కలకలం సృష్టించింది. గుప్త నిధుల కోసమేనని భక్తులు అనుమానం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కాశీ విశ్వనాథస్వామి ఆలయ ముఖద్వారం ఎదుట ఉన్న మండపానికి ఆనుకొని దాదాపు ఐదు అడుగుల లోతు, 10 అడుగుల వెడల్పుతో గొయ్యిని తవ్వారు. దానిపై పాత గేటు గ్రిల్ వేసి, గొయ్యి కనిపించకుండా ఉండేందుకు గడ్డి, చెట్ల పొదలతో కప్పి ఉన్న విషయాన్ని సోమవారం ఆలయానికి వచ్చిన భక్తులు గుర్తించారు. ఆలయ కమిటీ చైర్మన్ హన్మాండ్లును పిలిపించగా పూజకు వాడిన పూలను వేసేందుకు ఆదివారం తానే అడ్డా కూలీలతో తవ్వించినట్లు తెలపారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయంలో అధికారుల అనుమతి లేకుండా, కమిటీలోని ఇతర బాధ్యులకు తెలపకుండా ఎలా తవ్వించారని భక్తులు ప్రశ్నించారు. పూలను వేసేందుకై తే అంత పెద్ద గొయ్యి, అదీ మండపానికి ఆనుకొని దాని పునాదులు కూలే అవకాశం ఉండేలా తవ్వించడం.. పైగా కనపడకుండా పైన గ్రిల్పెట్టి పొదలతో కప్పిఉంచడంలో ఆంతర్యం ఏంటని భక్తులు నిలదీశారు. ఇద్దరు కూలీలతో తవ్వించినట్లు చెబుతుండగా నలుగురితోపాటు ఓ బాబా సైతం ఉన్నట్లు అక్కడున్న వారు చెప్పడంతో గుప్త నిధుల కోసమే తవ్వించారని భక్తులు ఆరోపించారు. విషయం తెలుసుకొని ఎస్సై–2 మెగులయ్య సిబ్బందితో వచ్చి వివరాలు సేకరించారు. విచారణ నిమిత్తం చైర్మన్ హన్మాండ్లును స్టేషన్కు తరలించారు. -
విద్యుదాఘాతంతో పంట దగ్ధం
కంగ్టి(నారాయణఖేడ్): విద్యుదాఘాతంతో మొక్కజొన్న కంకులు బుగ్గిపాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. కంగ్టి మండలం తడ్కల్ గ్రామానికి చెందిన మహ్మద్ సయ్యద్ అనే రైతు పట్టా భూమిలో ఒక ఎకరం మొక్కజొన్న పంట కాలిపోయింది. విద్యుత్ తీగలతో మంటలు చెలరేగి ఉంటాయని రైతు అనుమానం వ్యక్తం చేశారు. మంటలార్పే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు రూ.80 వేల విలువ చేసే పంట కాలిపోయినట్లు పేర్కొన్నారు. అధికారులు స్పందించి తమకు ఆర్థికంగా ఆదుకోవాలని రైతు కుటుంబీకులు కోరారు. పిడుగుపాటుకుఇల్లు ధ్వంసం ములుగు(గజ్వేల్): పిడుగుపాటుకు ఇల్లు ధ్వంసమై మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన ములుగు మండలం బస్వాపూర్లో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. బాధితులు, గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామంలో సాయంత్రం 4 గంటల సమయంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. కురుమ వసంత రామాంజనేయులు దంపతులు నివాసముంటున్న ఇంటిపై ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగు పడటంతో రేకులు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో వసంతకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. -
కాలుష్యం
కమ్మేస్తున్న కాలుష్యం నుంచి కాపాడండి పరిశ్రమల నుంచి నిరంతరం వెలువడుతున్న వాయు కాలుష్యంతో జీవన పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటున్నాయి. శ్వాస తీసుకోవడంలో ఆందోళన పడుతున్నాం. పిల్లలు మహిళలు ఘాటైన వాసనలతో అనారోగ్యం పాలవుతున్నారు. ఫిర్యాదులు చేసిన పట్టించుకునే నాధుడే లేడు. మా ప్రాణాలను రక్షించండి. – ఇమ్రాన్, బొల్లారం కాంగ్రెస్ నాయకులు పీసీబీ అధికారుల చర్యలు శూన్యం సా్థనికంగా వెలువడుతున్న విష వాయువులు సామాన్యులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని పలుమార్లు పీసీబీ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేరు. సమస్య తీవ్రతరంగా మారుతున్న నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాం. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి. – మద్దూరి పెంటేశ్, బీఆర్ఎస్ నాయకులుజిన్నారం (పటాన్చెరు): వాయు కాలుష్యం దినదినం ప్రాణాంతకరంగా మారుతోంది. బొల్లారం పారిశ్రామిక వాడలోని పలు రసాయన పరిశ్రమలు విచ్చలవిడిగా విష వాయువులను వాతావరణంలోకి విడుదల చేస్తూ సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇప్పటికే జల కాలుష్యం పెద్ద ఎత్తున ఉండగా దానికి తోడు వాయు కాలుష్యాన్ని విడుదల చేస్తున్నారు. స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుకునే అవకాశాలను సైతం విష వాయువులను విడుదల చేస్తూ హరించేస్తున్నారు. సామాన్య ప్రజల జీవన విధానం పైనే కాకుండా పర్యావరణ పరిరక్షణకు సైతం రసాయన పరిశ్రమలు విగాధం కలిగిస్తున్నాయి. రసాయన విష వాయువులు గాలిలోకి.. పారిశ్రామిక వాడకు చెందిన పలు పరిశ్రమలు గుట్టుచప్పుడు కాకుండా ఉదయం సాయంత్రం వేళల్లో పరిశ్రమల పొగ గొట్టాల ద్వారా పెద్ద ఎత్తున రసాయన విష వాయువులను వాతావరణంలోకి విడుదల చేస్తున్నారు. ఈ వాయువులు స్వచ్ఛమైన ఆక్సిజన్ ను కలుషితం చేస్తూ సామాన్య ప్రజలను ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందికి గురి చేస్తున్నాయి. వీటిపై ఫిర్యాదులు చేసిన పీసీబీ యంత్రాంగం క్షేత్ర స్థాయిలో పర్యటించి చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. ఫిర్యాదులను పెడచెవిన పెట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. పిల్లలు, వృద్ధుల్లో అనారోగ్య సమస్యలు విషవాయువులు సామాన్య ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలు వృద్దుల్లో శ్వాసకోశ సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక విషవాయువులు కళ్లలో మంటలు పుట్టిస్తూ, ముక్కుపుట్టలు అదిరేలా చేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. పరిశ్రమలను గుర్తించి విషవాయువులను నియంత్రించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని పారిశ్రామిక వాడ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకరంగా బొల్లారంపారిశ్రామిక వాడ విచ్చలవిడిగా వాతావరణంలోకివిష వాయువులు ఘాటైన వాసనలతో జనాల్లోఅనారోగ్య సమస్యలు పట్టించుకోని పీసీబీ యంత్రాంగం -
సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలి
కొల్చారం(నర్సాపూర్): మండల కేంద్రం కొల్చారంలో డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు, అనంతరం గ్రామంలో నెలకొన్న సమస్యను ప్రజలు, యువత సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఎస్సీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. సోమవారం గ్రామంలో వివాదాస్పదంగా మారిన అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు, శివాజీ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి స్థలంను వెంకటయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. అంబేడ్కర్ను, శివాజీ మహారాజ్ను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మొదట పెట్టిన అంబేడ్కర్ విగ్రహాన్ని తీసివేయాలనడం సబబు కాదన్నారు. ముందస్తుగానే గ్రామస్తులు ఈ విషయమై చర్చించుకోవాల్సి ఉండేదన్నారు. విగ్రహం ఎదుట మరో విగ్రహం ఏర్పాటు చేయడం ఇబ్బంది కలిగించడమేనని పేర్కొన్నారు. ఎస్పీ, కలెక్టర్ ఈ విషయంలో గ్రామస్తులతో చర్చించి సమస్యను పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ మహమ్మద్ గౌస్,దళిత సంఘాల నాయకులు ఉన్నారు. ఎస్సీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ బక్కి వెంకటయ్య కొల్చారంలో విగ్రహ ఏర్పాట్ల స్థల పరిశీలన -
ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్రికార్డులో సిద్దిపేట చిన్నోడు
మద్దూరు(హుస్నాబాద్): ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో సిద్దిపేట జిల్లా దూల్మి ట్ట మండలం హనుమ తండాకు చెందిన అంతర్జాతీయ పర్వతారోహకుడు జాటోత్ విహాన్రామ్కు చోటు దక్కింది. ఈ విషయం తండ్రి తిరుపతినాయక్ తెలిపారు. ఆదివారం పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో ఈ మేరకు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డును జాటోత్ విహాన్రామ్ అందుకున్నట్లు తిరుపతి తెలిపారు. ఆఫ్రికా ఖండంలోని అత్యంత ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని, హిమాచల్ ప్రదేశ్లోని పాతాల్ పర్వతాన్ని అధిరోహించినందుకు గాను అందించినట్లు తెలిపారు. తన కుమారుడిని ఈ స్థాయికి తీసుకొచ్చిన కోచ్ లెంకల మహిపాల్కు అంకితం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. విహాన్ మంచిర్యాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. వారెవ్వా .. వైష్ణవి ● అంతర్జాతీయ బుక్ ఆఫ్ అవార్డ్స్లో దామరకుంట విద్యార్థిని మర్కూక్(గజ్వేల్): అంతర్జాతీయ బుక్ ఆఫ్ అవార్డ్స్ వారు నిర్వహించిన పోటీల్లో మర్కూక్ మండలం దామరకుంట విద్యార్థిని లింగ వైష్ణవి ఉత్తమ ప్రతిభ కనబర్చింది. దామరకుంట జిల్లా పరిషత్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న వైష్ణవి ఆదివారం పంజాబ్లో నిర్వహించిన పోటీల్లో వైష్ణవి పాల్గొని భౌతిక రసాయన శాస్త్రంలో అత్యంత వేగంగా నిమిషం 59 సెంకడ్లలో ఆవర్తన పట్టిక క్రమ రూపం ఏర్పాటు చేసి బుక్ ఆఫ్ అవార్డ్స్లో స్థానం దక్కించుకుంది. సోమవారం ఇంటర్ నేషనల్ బుక్ ఆఫ్ అవార్డ్స్ సీఈఓ పంకజ్ వేగ్ చేతుల మీదుగా ట్రోఫీ, బహుమతిని అందుకుందని మండల విధ్యాధికారి వెంకట్ రాములు తెలిపారు. వెంకట్రాములు, పాఠశాల ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. సనాతన ధర్మాన్ని కాపాడాలి పెద్దశంకరంపేట(మెదక్): సనాతన ధర్మాన్ని కాపాడడం అందరి బాధ్యత అని హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతిస్వామి, చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు డాక్టర్ సీఎస్. రంగరాజన్ అన్నారు. సోమవారం పెద్దశంకరంపేటలో నూతనంగా నిర్మించిన రామాలయ ఉత్సవాల్లో వారు పాల్గొని భక్తులకు ప్రవచనాలందించారు. ఆలయ నిర్మాణంలో ప్రతీ ఇంటి నుంచి కులమతాలకు అతీతంగా భాగస్వాములు కావడం అభినందనీయమని కొనియాడారు. ఇలాగే అందరూ కలిసిమెలిసి ఉండి ధర్మ పరిరక్షణ చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. రైలు కింద పడి గుర్తు తెలియని మహిళ మృతి జహీరాబాద్: రైలు కింద పడి గుర్తు తెలియని మహిళ మృతి చెందిన ఘటన జహీరాబాద్ పట్టణ శివారులో చోటు చేసుకుంది. వికారాబాద్ పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో ఆదివారం రాత్రి రైలు కింద పడి గుర్తు తెలియని మహిళ (45) మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని వికారాబాద్లోని ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు వివరించారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే సెల్ 84669 38351ను సంప్రదించాలని సూచించారు. కులం పేరుతో దూషణ ● ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు మద్దూరు(హుస్నాబాద్) : కులం పేరుతో దూషించి వ్యక్తిపై దాడి చేసిన వారిపై సోమవారం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ షేక్ మహబూబ్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. మండలంలోని ఖాతా గ్రామానికి చెందిన సోలిపురం బాబు శనివారం మిత్రులు సురేశ్, రాజుతో కలిసి ధూల్మిట్టలో వ్యవసాయ పనులకు కూలీ పనికి వెళ్లారు. తిరిగి వస్తూ బాబు, సురేశ్ వైన్స్ వద్ద గల పర్మిట్ రూంలో మద్యం తాగుతుండగా మహిపాల్రెడ్డి కులం పేరుతో బాబును దూషించాడు. కర్రతో దాడి చేయగా తలకు గాయమైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రంకై న్ డ్రైవ్లో జైలు గజ్వేల్రూరల్: డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన ఓ వ్యక్తికి 3 రోజుల జైలు శిక్ష పడినట్లు గజ్వేల్ ట్రాఫిక్ సీఐ మురళీ పేర్కొన్నారు. ఆయన కథనం మేరకు.. గజ్వేల్–ప్రజ్ఞాఫూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన చౌరస్తాల వద్ద ఇటీవల నిర్వహించిన వాహన తనిఖీల్లో 21 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిని సోమవారం గజ్వేల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ప్రియాంక ఎదుట హాజరు పర్చగా విచారణ అనంతరం 21మందికి రూ. 15 వేల జరిమానా విధించగా, ఇందులో ఓ వ్యక్తికి 3 రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. -
కరెంట్ ఫెన్సింగ్ తీగే మృత్యుపాశమై..
వర్గల్(గజ్వేల్): పందుల బెడద నుంచి పైరును కాపాడేందుకు ఏర్పాటు చేసిన కరెంట్ ఫెన్సింగ్ తీగే ఆ రైతు పాలిట మృత్యుపాశమైంది. విద్యుదాఘాతంతో పైరుకు నీరు పారిస్తున్న కౌలు రైతు మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన సోమవారం సాయంత్రం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మజీద్పల్లిలో చోటు చేసుకుంది. బేగంపేట ఎస్ఐ మహిపాల్రెడ్డి, గ్రామస్తుల కథనం ప్రకారం.. వర్గల్ మండలం దండుపల్లికి చెందిన నీల స్వామి(40) మజీద్పల్లిలో కొంత పొలం కౌలుకు తీసుకొని మొక్కజొన్న సాగు చేశాడు. పందుల బెడద నుంచి పంట కాపాడుకునేందుకు చుట్టూరా కరెంట్ ఫెన్సింగ్ తీగ ఏర్పాటు చేశాడు. సోమవారం ఉదయం పొలంలో నీరు పారించేందుకు వెళ్తున్నట్లు భార్య శ్యామలకు చెప్పి వెళ్లాడు. మధ్యాహ్నం భోజనానికి రాలేదు. కుమారుడు రాజు పలుమార్లు తండ్రికి ఫోన్ చేసినప్పటికీ స్పందించలేదు. దీంతో పొలం వద్దకు వెళ్లి వెతికాడు. అక్కడ ప్రమాదవశాత్తు కరెంట్ ఫెన్సింగ్ తీగను తగిలి విద్యుత్ షాక్కు గురై పొలంలోనే చనిపోయి కనిపించాడు. మృతుడి కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించామని ఎస్ఐ పేర్కొన్నారు. విద్యుదాఘాతంతో కౌలు రైతు దుర్మరణం వర్గల్ మండలం మజీద్పల్లిలో ఘటన -
వక్ఫ్ సవరణ చట్టంపై అపోహలు నమ్మొద్దు
ఎంపీ రఘునందన్ రావు సంగారెడ్డి ఎడ్యుకేషన్: వక్ఫ్ సవరణ చట్టంపై పేద ముస్లింలలో అపోహలు సృష్టిస్తూ అల్లర్లు రేపే ప్రయత్నాలు జరుగుతున్నాయని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రతిపక్షాలపై మండిపడ్డారు. సోమవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో పార్టీ మాజీ ఎంపీ బీబీ పాటిల్, జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. జహీరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 12,892 ఎకరాలు వక్ఫ్ భూములుగా నమోదు చేయడం వల్ల వేల మంది రైతులు హక్కులు కోల్పోయారని వాపోయారు. కొండాపూర్ మండలం సైదాపూర్లో 197 ఎకరాలు వక్ఫ్ జాబితాలో చేరడం వల్ల సుమారు 200 మంది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే కాకుండా మొగుడంపల్లి, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్, రాయికోడ్ మండలాల్లో పెద్ద ఎత్తున భూములు వక్ఫ్ జాబితాలో చేరాయని ఆరోపించారు. రాష్ట్రంలో పాతబస్తీ వక్ఫ్ ఆస్తులపై సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా వివరాలు ఇవ్వాలనీ, ముతావలీలు ఎవరి పేర్లపై లీజులకు ఇచ్చారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ‘పట్టణాల్లో వక్ఫ్ భూములు ఆక్రమణకు గురవుతున్నా, అసలు లబ్ధిదారులైన పేద ముస్లింలకు ఉపయోగం లేకుండా పోతోందని, తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని తెలిపారు. రైతులు, ప్రజలు చట్టంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రాజేశ్వర్ రావు దేశ్ పాండేతో పాటు నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
కార్డుల్లో పేర్లు గజిబిజి
సాక్షి, సిద్దిపేట: కొత్త రేషన్ కార్డులు మంజూరు కాలేదు.. దరఖాస్తు చేసిన వారి పేర్లు అమ్మమ్మ, నానమ్మ రేషన్ కార్డుల్లో పేర్లు నమోదు అయ్యాయి. దీంతో దరఖాస్తు దారులు ఆందోళన చెందుతున్నారు. తొమ్మిదేళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీ, పేర్ల నమోదుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో ప్రజలు సంతోషించారు. కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన, సమగ్ర కుటుంబ సర్వేలలో జిల్లా వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం, చేర్పులు కోసం 74,272 మంది దరఖాస్తు చేశారు. 52వేల మంది దరఖాస్తు ప్రజాపాలన, సమగ్ర కుటుంబ సర్వేలో కొత్త రేషన్ కార్డుల కోసం 52,742, పేర్లు చేర్చుటకు 21,530 మంది దరఖాస్తు చేశారు. వీటి ఆధారంగా ప్రాథమిక స్థాయిలో అర్హులను గుర్తించి వారి జాబితాలను గ్రామ పంచాయతీ, పట్టణాల్లో వార్డు సభలలో ప్రకటించారు. ఈ జాబితాలో పేర్లు ఉన్న వారు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవద్దని అధికారులు చెప్పడంతో నూతన కార్డులు వచ్చినట్లే అని సంతోషపడ్డారు. వీరికి ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించారు. దీంతో ఆనందంతో రేషన్ షాప్లకు వెళ్తే కొత్త కార్డు రాలేదు.. పిల్లల పేర్లు అమ్మమ్మ, నానమ్మ కార్డులలో నమోదు కావడంతో అయోమయానికి గురవుతున్నారు. గందరగోళంగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అమ్మమ్మ, నానమ్మ కార్డుల్లోనే మనవళ్లు, మనవరాళ్ల పేర్లు కొత్త కార్డుల కోసం 43 వేల మంది దరఖాస్తు పేర్లు సరి చేయాలని కోరుతున్న దరఖాస్తు దారులుఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి నంగనూరు మండలం పాలమాకుల గ్రామానికి చెందిన గాండ్ల రాజు. ప్రజాపాలన, సమగ్ర కుటుంబ సర్వేలో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేశారు. తీరా.. రాజు సతీమణి హేమ పేరుతోపాటు కుమారులు గాండ్ల విశాల్, విహాన్ పేర్లు సైతం అత్తంటి వారి కార్డులోనే ఉన్నాయి. అధికారులను అడిగితే మాకు తెలియదని సమాధానం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులుస్పందించి మా కుటుంబానికి కొత్త రేషన్ కార్డు మంజూరు చేయాలని కోరుతున్నారు. ఇలా వీరి ఒక్కరిదే కాదు.. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసిన వారిలో పలువురి పరిస్థితి ఇలాగే ఉంది.విచిత్ర పరిస్థితి పెళ్లయిన మహిళలు భర్తతో నూతన రేషన్ కార్డు కావాలని తమ చిన్నారులతో సహా దరఖాస్తు చేశారు. అలాగే కొత్త కార్డుల కోసం పెళ్లయిన యువకులు సైతం తమ పేర్లను తల్లిదండ్రుల కార్డుల నుంచి తొలగించుకుని దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరి పేర్లు అత్తగారి రేషన్ కార్డులో తమ చిన్నారులతో సహా నమోదయ్యాయి. ఇలా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఆన్లైన్లో సిబ్బంది చేసిన తప్పా? లేక టెక్నికల్ సమస్యతో ఇలా నమోదు అయ్యాయా? అని ఆందోళన చెందుతున్నారు. మళ్లీ దరఖాస్తు చేసేందుకు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తప్పులను సరి చేసి కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని కోరుతున్నారు. -
అర్హులైన వారికే ఇందిరమ్మ ఇళ్లు
● పైరవీలకు తావులేదు ● రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండీ గౌతమ్ ఇళ్ల నిర్మాణాలు వేగిరం చేయాలి కొండపాక(గజ్వేల్): ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ఎలాంటి పైరవీలకు తావులేదని, అర్హులకే మంజూరు చేస్తామని రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఎండీ వీపీ గౌతమ్ అన్నారు. కుకునూరుపల్లి మండలం మేదినీపూర్లో పైలెట్ ప్రాజెక్టులో భాగంగా కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను సోమవారం పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాల్లో ప్రభుత్వం చూపిన కొలతల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించుకునే ఇళ్లకు సైతం పథకం వర్తించేలా చూడాలని గ్రామస్తులు ప్రత్యేకాధికారి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారుల ఖాతాల్లో మొదటి విడత డబ్బులు వేసే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. గ్రామంలో 75 ఇళ్లు మంజూరు కాగా 11 మాత్రమే ప్రారంభమయ్యాయన్నారు. ఇళ్ల మంజూరు కోసం దళారులను ఆశ్రయించి మోసపోవద్దన్నారు. పేదలు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, ఎంపీడీఓలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేటరూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగిరం చేయాలని రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఎండీ వీపీ గౌతమ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల ప్రగతిపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలన్నారు. స్థలం ఉండి పూర్తిగా ఇల్లు కట్టుకునే స్తోమత లేని నిరుపేదలను మాత్రమే గుర్తించాలని అన్నారు. ఆర్థిక సహకారం కోరుకునే వారికి మహిళా సమాఖ్యల ద్వారా రుణం ఇప్పించేలా అధికారులు చొరవ చూపించాలన్నారు. ప్రాధాన్యత క్రమంలో పూర్తయ్యే ఇంటి నిర్మాణ పనులను పంచాయతీ సెక్రటరీ పోర్టల్లో నమోదు చేయాల్సిన అవసరం లేదన్నారు. లబ్ధిదారుడే తన స్మార్ట్ ఫోన్లో ఇంటి నిర్మాణ ఫొటోలను ఎప్పటికప్పడు అప్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించినట్లు తెలిపారు. వాటి ఆధారంగా బిల్లుల్లో ఆలస్యం జరగదన్నారు. అసంపూర్తిగా, చివరిస్థాయిలో ఉన్న డబుల్ బెడ్రూం నిర్మాణ పనులపై మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన మేరకే నిర్మాణ పనులు పూర్తి చేసేలా చూడాలన్నారు. అనంతరం కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి మాట్లాడుతూ లబ్ధిదారుల ఎంపికలో ఒక్క అనర్హుడు ఉండకుండా జాగ్రత్త వహించాలన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, హౌసింగ్ పీడీ దామోదర్ రావు, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, గజ్వేల్, హుస్నాబాద్ ఆర్డిఓలు చంద్రకళ, రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఈఈ శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారులతో సమావేశం మండల పరిధిలోని వెంకటాపూర్ను గౌతమ్ సందర్శించారు. లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో 183 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి మంజూరు పత్రాలు అందించామన్నారు. వారిలో 21 మంది మార్కింగ్ చేసుకోవడంతో పాటు 11 మంది బేస్మెంట్ పూర్తి చేసుకున్నారన్నారు. నిర్మాణానికి సంబంధించి సామగ్రి ధరలు పెరిగాయని లబ్ధిదారులు చెప్పడంతో ఇసుకను ఉచితంగా అందించడంతో పాటుగా ధరల నియంత్రణపై చర్చలు జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. -
ముంచెత్తిన వాన..
మంగళవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025జిల్లాలో అకాల వర్షం తీరని నష్టాన్ని కలిగించింది. సోమవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పలు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం బస్తాలు తడిసిముద్దయ్యాయి. హుస్నాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసి పోయింది. కాంటా కోసం ధాన్యం ఆరబెట్టి, తాలు లేకుండా శుభ్రం చేసుకున్నారు. ఒక్కసారిగా కురిసిన వర్షంతో ధాన్యమంతా నీటిపాలైంది. మార్కెట్లోకి వరద వస్తే బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వరద ఎక్కడికక్కడా నిలిచిపోవడంతో ధాన్యమంతా నీటిలో మునిగిపోయింది. మునిగిన ధాన్యాన్ని గంపల్లో ఎత్తుకుంటూ రైతులు అవస్థలు పడ్డారు. కాంటా పెట్టిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించకపోవడంతో ధాన్యం బస్తాలు సైతం తడిసిపోయాయి. పది రోజుల నుంచి పడిగాపులు కాసి ధాన్యానికి కాపలాగా ఉంటే ఒక్కసారిగా కురిసిన వర్షంతో ధాన్యమంతా నీటి పాలైందని రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. అలాగే జగదేవ్పూర్ మండలంలో ఈదురు గాలులు, వడగళ్లతో వర్షం కురిసింది. చెట్లు నేలకొరిగాయి. హోల్సెల్ చెప్పుల దుకాణం పైకప్పు రేకులు ఎగిరిపడ్డాయి. అలాగే నిరుపేదకు చెందిన పూరి గుడిసె ధ్వంసమైంది. పలు గ్రామాల్లో వరి పంటకు నష్టం జరిగింది. మామిడి తోటల్లో మామిడి కాయలు నేలరాలాయి. మద్దూరు మండల కేంద్రంతో పాటు జాలపల్లి, తోర్నాల, లింగాపూర్ గ్రామాల్లో ఉరుములు, మెరుపులులతో వర్షం కురిసింది. గాలి దుమారానికి పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలగా, పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. –హుస్నాబాద్/మద్దూరు/జగదేవ్పూర్(గజ్వేల్) వరదనీటిలో ధాన్యం.. రైతన్న శోకం అకాల వర్షంతో తీరని నష్టం నోటికాడికూడు వర్షార్పణం -
అభివృద్ధి, సంక్షేమానికే ప్రాధాన్యం
గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి గజ్వేల్: అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డులో రూ.10లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కోరగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రూ.5కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈ నిధులను ప్రాధాన్యత క్రమంలో కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఇంకా ఈ ఈ కార్యక్రమంలో మార్కెట్ కమీటీ వైస్ చైర్మన్ సర్ధార్ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, నాయకులు మొనగారి రాజులు, నక్క రాములుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడతాం సీఐటీయూ జిల్లా కార్యదర్శి గోపాలస్వామి మిరుదొడ్డి(దుబ్బాక): కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడతామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కాముని గోపాల స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్బర్పేట–భూంపల్లి మండల కేంద్రంలో సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 28న హమాలీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని తెలిపారు. ధర్నా కార్యక్రమానికి హమాలీ కార్మికులు తరలిరావాలని కోరారు. అలాగే మే 20న దేశ వ్యాప్తంగా జరిగే సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సమ్మె కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు శ్రీనివాస్, ఎల్లం, స్వామి, నాగేందర్, బాల పోచయ్య తదితరులు పాల్గొన్నారు. కొత్త ఆవిష్కరణలు అవసరం కృషికల్ప సీఈఓ సీఎం పాటిల్ సిద్దిపేట ఎడ్యుకేషన్: ఆవిష్కరణలు కొత్తవి సృష్టించడమే కాకుండా మనం ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారాలు ఆలోచించాలని కృషికల్ప సీఈఓ సీఎం పాటిల్ అన్నారు. ప్రపంచ ఇన్నోవేషన దినోత్సవం సందర్భంగా సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి)లో సోమవారం ఇన్నోవేషన్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీజీఐసీ ఆతిథ్య సంస్థగా పని చేస్తున్న స్వయంప్రతిపత్తి కళాశాలలో ఇన్నోవేటర్లను గుర్తించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సునిత, వైస్ ప్రిన్సిపల్, ఇన్నోవేషన్ కోఆర్డినేటర్ అయోద్యరెడ్డి, గురుచరణ్దాస్, ఎంఎస్సీ, ఫిషరీస్, బోటనీ, జువాలజీ, బీబీఏ విబాగాల విద్యార్థులు పాల్గొన్నారు. -
అర్జీలు సత్వరం పరిష్కారం
సిద్దిపేటరూరల్: ప్రజాసమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి దోహదపడుతుందని కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలు అందిస్తున్న బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. అర్జీలు పునరావతం కాకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. మొత్తం 44 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో డీఆర్ఓ నాగరాజమ్మ, డీఆర్డిఓ జయదేవ్ ఆర్య, ఏఓ అబ్దుల్ రహమాన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
‘వక్ఫ్’పై బీఆర్ఎస్ వైఖరి ప్రకటించాలి
కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ ప్రశాంత్నగర్(సిద్దిపేట): వక్ఫ్ సవరణ చట్టంపై బీఆర్ఎస్ వైఖరి ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించిన వక్ఫ్ సవరణ చట్టంపై బీఆర్ఎస్ ఎందుకు మౌనంగా ఉంటుందో తెలపాలన్నారు. దేశంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనారిటీలకు అందించిన 4 శాతం రిజర్వేషన్ ఇప్పటికీ అమలు అవుతోందని చెప్పారు. కేవలం ఎన్నికలప్పుడు ముస్లింల ఓట్లు దండుకునేందుకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన బీఆర్ఎస్ పదేళ్లపాటు కాలయాపన చేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్హుస్సేన్ ముస్లింలపై ప్రేమ కురిపించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. బీజేపీ తీసుకున్న ప్రతి నిర్ణయంలో బీఆర్ఎస్ సహకరిస్తోందని, ఆ రెండు పార్టీలు తోడుదొంగలేనని ప్రజలకు అర్థమైందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని, మైనార్టీలు కాంగ్రెస్ వైపే ఉన్నారన్నారు. కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి గ్యాదరి మధు, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గయాజొద్దీన్, పట్టణ మైనార్టీ అధ్యక్షుడు సలీం, ఫయాజ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
నూతనోత్సాహం నింపిన వేడుకలు
● డీఈఓ శ్రీనివాస్రెడ్డి ● ఘనంగా జెడ్పీ హైస్కూల్ వార్షికోత్సవంవర్గల్(గజ్వేల్): ఉన్నత పాఠశాల వార్షిక వేడుకలు అందరిలో నూతనోత్సాహం నింపాయని డీఈఓ శ్రీనివాస్రెడ్డి అన్నారు. పాఠశాల ప్రాంగణంలో హెచ్ఎం వెంకటేశ్వర్గౌడ్ అధ్యక్షతన శనివారం రాత్రి నిర్వహించిన స్థానిక జెడ్పీ హైస్కూల్ వార్షి కోత్సవం ఉత్సాహంగా సాగింది. విద్యార్థుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. బాంగ్రా, లంబాడి, హర్యాన, కేరళ నృత్యాలు జాతీయ సమైక్యతను చాటాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన డీఈఓ మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను ఉపాధ్యాయులు సమర్ధవంతంగా వినియోగించుకున్నపుడే అద్భుత ఫలితా లొస్తాయన్నారు. పీఎం శ్రీ పథకం ద్వారా వర్గల్ స్కూల్కు అటల్ టింకరింగ్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, వొకేషనల్ కోర్సులు, ఆధునిక వసతులు సమకూరాయని చెప్పారు. పాఠశాల రూపొందించిన ఈ–మేగజైన్, త్రైమాసిక ఆన్లైన్ ప్రగతి పుస్తకం ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ సునీత, లయన్స్ క్లబ్ ప్రతినిధులు సూర్యరాజు, అమర్నాథ్, ఏఏపీసీ చైర్మన్ భవాని తదితరులు పాల్గొన్నారు. -
అందుబాటులోకి వచ్చేలా కృషి
ఐటీఐ భవన నిర్మాణం చివరి దశకు చేరుకుంది. కాంట్రాక్టర్ పనులలో జాప్యం వహించడం వల్ల ఆలస్యమైంది. ఈ ఆగస్టు నాటికి ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీ కేంద్రాలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తాం. – వెంకటేశం, ఆర్అండ్బీ డీఈ, దుబ్బాక పెరగనున్న విద్యార్థుల సంఖ్య ఐటీఐ, ఏటీసీ భవనాలు అందుబాటులోకి వస్తే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులకు మంచి ఉపాధి కల్పించే కోర్సులు నేర్చుకొనే వీలుంటుంది. దీంతో వారు జీవితంలో స్థిరపడేందుకు అవసరమైన ఉద్యోగాలు, ఉపాధి పొందేందుకు ఆస్కారం ఉంటుంది. – కనకయ్య, ఐటీఐ ప్రిన్సిపాల్, దుబ్బాక -
ఐటీఐ.. అందుబాటులోకి
ఫలించనున్న ఏడేళ్ల కల ● నత్తనడకన సాగిన పనులు ● ఆగస్టు నుంచి ప్రారంభం ● నూతనంగా ఏటీసీ సెంటర్ ● ఉద్యోగ అవకాశాలు కల్పించే ఆరు కోర్సులు దుబ్బాకటౌన్: పదో తరగతి పూర్తయిన విద్యార్థులను పారిశ్రామిక రంగంలో వృత్తి శిక్షణ కలిగిన నిపుణులుగా తయారుచేసి, వారికి ఉపాధి చూపించేలా ఐటీఐ (ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్ట్సిట్యూట్)ను ప్రభుత్వం ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా 2012లో దుబ్బాకలోని ఒక అద్దె భవనంలో ఐటీఐని ప్రారంభించారు. రూ.5 కోట్లతో.. ఐటీఐ భవన నిర్మాణానికి దుబ్బాక 16వ వార్డు పరిధిలో నాలుగెకరాల స్థలాన్ని కేటాయించారు. రూ.5 కోట్లతో 2018లో మాజీ మంత్రి హరిశ్రావు పనులకు శంకుస్థాపన చేశారు. ఉపాఽధి, కార్మికశాఖకు చెందిన నిధులతో జీ ప్లస్ఒన్ తరహాలో ఆర్అండ్బీ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు చేపట్టారు. నత్తనడకన సాగుతూ.. ఆ భవన నిర్మాణ పనులు ప్రారంభించి ఏడేళ్లు కావస్తోంది. ప్రస్తుతం పనులు ముగింపు దశకు చేరాయి. దీని పక్కనే టాటాగ్రూపు సహకారంతో ఐటీఐ విద్యార్థులకు ఏటీసీ(అడ్వాన్డ్ టెక్నికల్ సెంట ర్– అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రం)ని నిర్మిస్తున్నారు. ఇది కూడా పూర్తయితే ఐటీఐ మరింత అప్గ్రేడ్ కానుంది. కాంట్రాక్టర్ జాప్యంతో పనులు నత్తనడకన సాగాయని, ఇప్పటికి చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్తున్నారు. ఈ విద్యా సంవత్సరం అంటే ఆగస్టు నాటికి ఐటీఐని అందుబాటులోకి తీసుకురావడానికి కాంట్రాక్టర్, ఆర్అండ్బీ అధికారులు కృషిచేస్తున్నారు.ఆరు రకాల కోర్సులు ఐటీఐ భవనం, ఏటీసీ కేంద్రం అందుబాటులోకి వస్తే.. యేడాది వ్యవధిగల వివిధ కోర్సుల్లో చేరే అవకాశం ఉంటుంది. మ్యానుప్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్లో 20 సీట్లు, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్లో 20 సీట్లు, ఆర్టీయస్యన్ యూజింగ్ అడ్వాన్స్డ్లో 10 సీట్లు కొత్తగా రానున్నాయి. అలాగే రెండేళ్ల వ్యవధి గల బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫయర్(మెకానికల్)లో 24 సీట్లు, అడ్వాన్స్డ్ సీఎన్సీ మెషినింగ్ టెక్నీషియన్లో 24 సీట్లు, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికిల్స్లోను సీట్లు అందుబాటులోకి రానున్నాయి. విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఐటీఐ ప్రిన్సిపాల్ కనకయ్య తెలిపారు. -
రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
బీఎస్సీ నియోజకవర్గ ఇన్చార్జి రవీందర్అక్కన్నపేట(హుస్నాబాద్): అకాల వర్షం వల్ల నేలరాలిన మామిడి, పంటలు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని బీఎస్సీ నియోజకవర్గ ఇన్చార్జి రవీందర్ డిమాండ్ చేశారు. మండలంలోని మల్చెర్వుతుండా, రేగొండ గ్రామా ల్లో ఇటీవల అకాల వర్షంతో దెబ్బతిన్న మామిడితోటలను ఆదివారం ఆయన పరిశీలించారు. అనంత రం మాట్లాడుతూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్న మామిడి చెట్లు నేలకొరగడం తీరని నష్టమన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతీసుకొని నష్టపరిహారం త్వరగా వచ్చేలా కృషి చేయాలని కోరారు. -
బారులుతీరిన వాహనాలు
హుస్నాబాద్రూరల్: యాసంగి కోతలు మొదలు కావడం.. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని విక్రయించడంతో మిల్లులకు ధాన్యం వాహనాలు బారులు తీరుతున్నాయి. పందిల్ల మిల్లు వద్ద ఆదివారం ఆధిక సంఖ్యలో ధాన్యం ట్రాక్టర్లు దర్శనమిచ్చాయి. దిగుమతి చేయడానికి వివిధ గ్రామాల నుంచి వచ్చి చేరిన ట్రాక్టర్ల యజమానులు క్యూలో నిరీక్షించారు. ఒక ట్రాక్టర్ ధాన్యం దిగుమతి చేయడానికి సుమారు మూడు గంటల సమయం పట్టడంతో ట్రాక్టర్ యాజమానులు మిల్లుల వద్దనే పడిగాపులు కాచారు. హమాలీల సంఖ్యను పెంచి దిగుమతి వేగంగా చేయాలని వారు కోరుతున్నారు. ట్రాక్టర్ యజమానుల పడిగాపులు -
బీఆర్ఎస్ కార్యకర్తల కూలి పనులు
నంగునూరు(సిద్దిపేట): బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు తరలి వెళ్లేందుకు ఆ పార్టీ కార్యకర్తలు ఆదివారం గట్లమల్యాలలో కూలి పనులు చేశారు. గ్రామానికి చెందిన బుద్ది తిరుపతి చేనులో బస్తాలు మోయగా రూ.5వేలు, అలాగే పుట్ట మధు రూ.5వేలు అందజేశారు. కార్యక్రమంలో వేణుగోపాలచారి, ప్రకాశ్రెడ్డి, బాబు, వెంకటయ్య, శ్రీనివాస్, వెంకటేశ్, భిక్షపతి, పరశురాములు, రాజు తదితరులు పాల్గొన్నారు. మల్లన్న ఆలయంలో పూజలు కొమురవెల్లి(సిద్దిపేట): బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ సీనియర్ నాయకుడు పిడిశెట్టి రాజు కొమురవెల్లి మల్లన్న ఆయలంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం ఉద్యమించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన గొప్పనాయకుడు కేసీఆర్ అన్నారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందని చెప్పారు. సభకు ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. -
సీఎంకు పీపీ జీవన్రెడ్డి కృతజ్ఞతలు
సిద్దిపేటకమాన్: తనకు రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అవకాశం కల్పించినందుకు సీఎం రేవంత్రెడ్డి, మంత్రులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు అడ్వకేట్ జీవన్రెడ్డి తెలిపారు. సిద్దిపేట ప్రెస్క్లబ్లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా కోర్టుకు మొట్టమొదటి రెగ్యులర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా రాష్ట్ర ప్రభుత్వం తనకు అవకాశం కల్పించిందన్నారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాడడంతో పాటు నిందితులకు శిక్షలు పడే విధంగా తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో అడ్వకేట్ పత్రి ప్రకాశ్, ఖలిమొద్దీన్ పాల్గొన్నారు. -
ఫౌండేషన్ సేవలు అభినందనీయం
ఎమ్మెల్యే పల్లారాజేశ్వర్రెడ్డికొమురవెల్లి(సిద్దిపేట): మండలంలో బీఆర్ఆర్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఆ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఆది వారం ఉచిత నేత్ర వైద్యశిబిరం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మండలంలోని పేద ప్రజలు, విద్యార్థులకు ఆర్థిక సాయం అందిండటం, అలాగే క్రీడాకారులకు ప్రో త్సాహకాలు అందించడం సంతోషంగా ఉంద న్నారు. అదే విధంగా మండలంలో ఎవరైనా నిరుపేదలు మరణిస్తే వారి ఇంటికి వెళ్లి ఆర్థిక సాయం అందించడం గొప్పవిషయమని కొనియాడారు. భవిష్యత్లో ఫౌండేషన్ సేవలు మరింత ఎక్కువ మంది కి అందేలా చూడలని సూచించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ రాజేందర్రెడ్డి, కిషన్, మాజీ జెడ్పీటీసీ సిద్దప్ప, శ్రీధర్, నర్సింహులు, స్వామి, వంశీధర్రెడ్డి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ
బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని కల్లెపెల్లి లోని వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. యంత్ర ప్రతిష్ఠ, పల్లకిసేవ నిర్వహించారు. అనంతరం స్వామి కల్యాణాన్ని అర్చకులు కనుల పండువగా నిర్వహించారు. సమీప గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కేసీఆర్, హరీశ్రావు ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని కమ్మర్లపల్లి గ్రామ మధిర కొండెంగలకుంట గ్రామ శివారులోని కుమ్మరికుంట గోదావరి జలాలతో నిండి మత్తడి దూకడంతో ఆదివారం గ్రామస్తులు కేసీఆర్, ఎమ్మెల్యే హరీశ్రావుల ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. హరీశ్రావు ప్రత్యేక చొరవతోనే రంగనాయకసాగర్ నుంచి కాలువల ద్వారా కుమ్మరికుంట నిండిందని సంతో షం వ్యక్తం చేశారు. కొన్నేళ్లుగా బీడుగా ఉన్న కుంట ప్రస్తుతం మండుటెండలో కూడా నిండు కుండలా మారడంతో హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి, ఉపాధ్యక్షుడు పాపయ్య, బీఆర్ ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కాల్వ ఎల్లయ్య, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఘనంగా ఆలయ వార్షికోత్సవం మిరుదొడ్డి(దుబ్బాక): అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పోచమ్మతల్లి ఆలయ రెండో వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు బోనాల జాతర, మంగళహారతులతో సామూహిక పూజలు చేశారు. ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకొన్నారు. అనంతరం భక్తులు అన్నదానం చేశారు. చలివేంద్రం ప్రారంభం బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని దేవక్కపల్లెలో బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ సుజాత మాట్లా డుతూ తీవ్రమైన ఎండలతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులకు గురికాకూడదనే ఉద్దే శ్యంతో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వాటి ఏర్పాటుకు ఆర్థికంగా సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బాలవికాస ప్రతినిధులు, సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. భక్తులకు ముత్యాల తలంబ్రాలు గజ్వేల్రూరల్: భద్రాచల సీతారాముల కల్యా ణోత్సవంలో వినియోగించిన ముత్యాల తలంబ్రాలను గజ్వేల్ ప్రాంత భక్తులకు పంపిణీ చేసేందుకు ఆ ఆలయ అధికారులు రామకోటి భక్తసమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు రామ కోటి రామరాజుకు ఆదివారం అందించారు. ఈ సందర్భంగా ఆ ఆలయ ఏఈఓ శ్రావణ్ మాట్లాడుతూ గజ్వేల్ ప్రాంతంలో రామకోటి సంస్థ ద్వారా చేపట్టిన కార్యక్రమాలు అభినందనీయమని, మూడేళ్లుగా తలంబ్రాలను గోటితో వలిచి అందించడం ఆనందంగా ఉందన్నారు. గజ్వేల్ ప్రాంత భక్తులకు అందించేందుకు 100 కిలోల తలంబ్రాలను అందజేశారని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
దూరంగా ఉండటంతో నిరుపయోగం
● రోడ్డుపక్కన కూరగాయల విక్రయాలు ● పట్టించుకోని పాలకులు, అధికారులు ● చిన్నతిమ్మాపూర్లో వ్యాపారుల అగచాట్లు కూరగాయలు అమ్ముకునే వారి జీవనానికి ఉపయోగపడాల్సిన ‘విలేజ్ మార్కెట్’లు అలంకార ప్రాయాలుగా మారుతున్నాయి. సరైన స్థలంలో నిర్మిస్తే అమ్మకందారులకు, కొనుగోలుదారులకు ఉపయుక్తంగా ఉంటుంది. కాని ములుగు మండలం చిన్నతిమ్మాపూర్(వంటిమామిడి)లో మార్కెట్ను ఓ మూలన నిర్మించారు. దీంతో ఆ విలేజ్ మార్కెట్ నిరుపయోగంగా మారింది. ములుగు(గజ్వేల్): ములుగు మండలం వంటి మామిడి నుంచి తున్కిబొల్లారం మార్గంలో చిన్నతిమ్మాపూర్ వద్ద రోడ్డుపక్కనే కూరగాయల విక్రయాలు నిర్వహిస్తారు. నిత్యం వాహనాల రద్దీ ఉండటంతో వారంతా ప్రమాదాల నీడలోనే కూర గాయలు అమ్ముకొనేవారు. అయితే వారి కోసం రూ.15లక్షల ఈజీఎస్, పంచాయతీ నిధులు వెచ్చించి యేడాదిన్నర క్రితం ‘విలేజ్ మార్కెట్’ నిర్మించారు. దాదాపు అరెకరం విస్తీర్ణంలో అంతర్గత రోడ్డులో 28 దుకాణాలు ఏర్పాటు చేసుకునేలా మార్కెట్ షెడ్డు నిర్మించారు. గ్రామపంచాయతీకి ఆదాయం, కూరగాయల విక్రేతలకు ప్రయోజనం కలిగించే ఈ మార్కెట్ సముదాయంలో దుకాణాలను మాత్రం ఎవరికీ కేటాయించలేదు. దీంతో అది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది.ఆవరణంతా పిచ్చిమొక్కలు, చెత్తాచెదారంతో నిండిపోయింది. శిథిలావస్థకు చేరుకుంటోందని స్థానికులు వాపోతున్నారు. చిన్నతిమ్మాపూర్లో వృథాగా ఉన్న విలేజ్ మార్కెట్ ప్రాంగణం బస్షెల్టర్లో కూరగాయల సామగ్రి గ్రామానికి చెందిన కూరగాయల అమ్మకందారులకు ప్రత్యేకమైన స్థలం లేకపోవడంతో రోడ్డుపక్కనే వారు విక్రయాలు సాగిస్తున్నారు. అయితే వారు ప్రయాణికుల కోసం నిర్మించిన బస్షెల్టర్ను కూరగాయల అడ్డాగా మార్చేశారు. అద్దె ప్రాతిపదికన తీర్మానం రోడ్డుపక్క కూరగాయలు విక్రయించుకునే వారికోసం ఈజీఎస్, జీపీ నిధులతో విలేజ్ మార్కెట్ నిర్మింపజేశాం. అందులో 28 దుకాణాలు ఏర్పాటు చేసుకోవచ్చు. అందుకుగాను నెల వారీ అద్దె ప్రాతిపదికన దుకాణాలు కేటాయించాలని తీర్మానం కూడా చేశాం. – హంస మహేశ్, మాజీ సర్పంచ్ వినియోగంలోకి తెస్తాం.. చిన్నతిమ్మాపూర్లో విలేజ్ మార్కెట్ వృథాగా ఉన్న విషయం వాస్తవమే. 28 దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు సౌల భ్యం ఉంది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లి మార్కెట్ను త్వరలోనే వినియోగంలోకి తెచ్చేలా చూస్తాం. – మేరీ స్వర్ణకుమారి, ఎంపీడీఓ, ములుగు -
కొనుగోలు కేంద్రాలలో మహిళలకు ప్రాధాన్యం
మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపెల్లిబెజ్జంకి(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో మహిళలకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. మండలంలోని గుగ్గిల్ల, దాచారం, కల్లెపెల్లిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను శనివారం ఆయన ప్రారంభించారు. అంతరం మాట్లాడుతూ రైతుల ప్రయోజనాల కోసం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అనంతరం బెజ్జంకి మండల పరిషత్ కార్యాలయంలో సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.5.56 లక్షల చెక్కులను 18 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఆయా కార్యక్రమాలలో తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, ఎంపీ డీఓ ప్రవీణ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దామోదర్, ఏఎంసీ చైర్మన్ కృష్ణ, మండల అధ్యక్షుడు రత్నాకర్రెడ్డి, చేప్యాల శ్రీనివాస్, సంతోష్, శ్రీకాంత్, కుమార్, నర్సయ్య, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
వైభవం.. బొడ్రాయి వార్షికోత్సవం
మద్దూరు(హుస్నాబాద్): మండలంలోని లద్నూరులో బొడ్రాయి ప్రథమ వార్షికోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా దూసకంటి రాజేశ్శర్మ, నవీన్శర్మ, వంశీకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు తమ ఇండ్ల వద్ద నుంచి బిందెలతో నీళ్లు తీసుకువచ్చి బొడ్రాయికి జలాభిషేకం చేశారు. అనంతరం డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాల మధ్య మహిళలు బోనాలతో తరలివెళ్లి బొడ్రాయి, పోచమ్మలకు నైవేద్యంగా సమర్పించారు. బొడ్రాయి ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. -
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
సీడీపీఓ శారదచిన్నకోడూరు(సిద్దిపేట): గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకుంటేనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని సీడీపీఓ శారద అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శనివారం పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అప్పుడే పుట్టిన శిశువుకు ముర్రుపాలు పట్టడంతోపాటు ఆరు నెలల వరకు తల్లిపాలు తాగించాలన్నారు. గర్భిణులు తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రంలోనే ఒక పూట భోజనం తినాలని, పిల్లలకు బాలామృతం తినిపించాలని సూచించారు. పోషకాహారం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించి, సామూహిక సీమంతాలు చేశారు. ఎంపీడీఓ జనార్దన్, సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.. హుస్నాబాద్రూరల్: గర్భిణులు పోషకాహారం తీసు కుంటేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని ఐసీడీఎస్ అధికారి తిరుమల అన్నారు. పందిల్లలో నిర్వహించిన పోషక పక్షోత్సవాల కార్యక్రమంలో ఆమె పాల్గొని పోషకాలు కలిగిన ఆహారం గురించి అవగాహన కల్పించారు. పౌష్టికాహారం తీసుకొంటే పిల్లల ఎదుగలలో లోపాలు ఉండవని, అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ చేసే ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు. అనంతరం సామూహిక సీమంతాలు చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యా యుడు అశోక్, అంగన్వాడీ టీచర్లు శారద తదితరులు పాల్గొన్నారు. పౌష్టికాహారంతోనే ఎదుగుదల బెజ్జంకి(సిద్దిపేట): పౌష్టికాహారాన్ని అందించినపుడే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని హుస్నాబాద్ సీడీపీఓ జయమ్మ అన్నారు. మండలంలోని బేగంపేటలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. సూపర్వైజర్ నాగరాజు, తోటపెల్లి వైద్యాధికారి కృష్ణతేజ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ముండ్రాయి సెక్టార్లో.. నంగునూరు(సిద్దిపేట): గర్భిణులు వైద్యులు సూచించిన వాక్సిన్లు తీసుకుంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని సీడీపీఓ శారద సూచించారు. ముండ్రాయి సెక్టార్లో సామూహిక సీమంతాలు, చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. చిరుధాన్యాలు, ఆకుకూరలతో వండిన పదార్థాలను ప్రదర్శించి వాటి లాభాలను వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సరిత, సూపర్ వైజర్ స్వరూప, హెచ్ఓ స్వామి, అనురాధ, సౌమ్య, రజిత, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. -
యేసుక్రీస్తు బోధనలు స్ఫూర్తిదాయకం
డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డిగజ్వేల్: యేసుక్రీస్తు బోధనలు స్ఫూర్తిదాయకమని డీసీసీ అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. గజ్వేల్లో శనివారం నిర్వహించిన ‘రన్ ఫర్ జీసస్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యేసు బోధనల ప్రాధాన్యాన్ని చాటిచెప్పడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్ధార్ఖాన్, కార్యక్రమ నిర్వాహకులు రూబెన్, బాపురెడ్డి, ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు సమీర్, మొనగారి రాజు, రాములుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. హుస్నాబాద్లో ర్యాలీ హుస్నాబాద్: గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగను పురస్కరించుకొని నియోజకవర్గ పాస్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన వీధుల్లో క్రైస్తవులు, పాస్టర్లు, ఫ్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పాస్టర్ల కమిటీ అధ్యక్షుడు సాల్మన్ రాజ్, మలాకీ, రత్నకుమార్, ఇస్సాక్, తిమోతి, ఇజ్రాయిల్ తదితరులు పాల్గొన్నారు. -
నిర్వహణ లేక కరువైన ఆహ్లాదం
● విరిగిన పరికరాలు, పాడైన సామగ్రి ● పట్టించుకోని అధికారులు పిల్లల కోసం ఏర్పాటు చేసిన పార్కులు, ఉద్యానవనాల నిర్వహణ కరువైంది. దుబ్బాకలో పార్కులను అభివృద్ధి చేసినప్పటికీ సంబంధిత అధికారులు వాటిపై కన్నెత్తి చూడకపోవడంతో అధ్వానంగా మారాయి. లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఆట పరికరాలు, ఇతర సామగ్రి పాడవుతోంది. దుబ్బాకటౌన్: పట్టణ కేంద్రంలో ప్రజలు సేద తీరేందుకు రామసముద్రం చెరువుకట్ట మీద చిల్డ్రన్ పార్క్ను, 18వ వార్డులో ఉద్యానవనం, దుంపలపల్లి 4వ వార్డులో ఫ్రీడమ్ పార్కును ఏర్పాటు చేశారు. నిర్వహణ శూన్యం లక్షల రూపాయల నిధులతో పలుచోట్ల ఏర్పాటు చేసిన పార్కుల్లో ఆహ్లాదం లేకుండా పోయింది. పార్కు చుట్టూ ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలు పెరిగి పిల్లలు ఆడుకునేందుకు ఇబ్బందిగా మారాయి. నిర్వహణ లేకపోవడంతో కట్టపై ఓపెన్ జిమ్ వద్ద ప్లాట్ఫామ్ ధ్వంసమైంది. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా నిమ్మకు నీరెత్తిన్నట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలుమండిపడుతున్నారు. విరిగిన ఆట వస్తువులు పట్టణ సుందరీకరణలో భాగంగా రామసముద్రం చెరువు కట్టపై 2019లో రూ.50 లక్షల ఎస్ఓఎఫ్ నిధులతో నిర్మించిన పిల్లల పార్కు విరిగిన ఆట వస్తువులతో దర్శనమిస్తోంది. గుర్రపు బొమ్మలు, జారుడు బల్లలు, ఉయ్యాలలు విరిగిపోయాయి. కొన్నింటిని మందుబాబులు చెరువులో పడేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మందుబాబులకు అడ్డాగా మున్సిపల్ పరిధిలోని దుంపలపల్లి నాలుగో వార్డులో 2022లో రూ.4 లక్షలు వెచ్చించి ఫ్రీడమ్ పార్కు నిర్మించారు. అందులో వివిధ రకాల మొక్కలు నాటి, జాతీయజెండా రంగులో టైర్లతో కుర్చీలు, ఉయ్యాలలు ఏర్పాటు చేశారు. కాని నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో మొక్కలకు నీరందడం లేదు. దీంతో అవి ఎండిపోవడంతో పశువులకు మేతగా మారాయి. పార్కు చుట్టూ ఉన్న ఫెన్సింగ్ విరిగిపోయి, సిమెంటు దిమ్మెలు ధ్వంసమయ్యాయి. పార్కులో ఖాళీ మద్యం సీసాలు, ప్లాస్టిక్ గ్లాసులు దర్శనమిస్తున్నాయి. రామసముద్రం కట్టపై పిల్లల పార్కు -
‘విశ్వావసు’ క్యాలెండర్ ఆవిష్కరణ
ప్రశాంత్నగర్(సిద్దిపేట): విశ్వవాసు తెలుగు నూతన సంవత్సర క్యాలెండర్ను మోహినిపుర వెంకటేశ్వర ఆలయంలో దేవాదాయశాఖ వరంగల్ డిప్యూటీ కమిషనర్ సంధ్యారాణి శనివారం ఆవిష్కరించారు. దేవాదాయ ధర్మాదాయశాఖ ఉద్యోగులు, అర్చక సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈఓ విశ్వనాఽథ్శర్మ, బుగ్గ రాజేశ్వరిస్వామి ఆలయ ఈఓ శ్రీధర్రెడ్డి, చైర్మన్ అమరేశ్ విష్ణు, ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కృష్ణమాచార్యులు, చంద్రకుమార్, రాంరెడ్డి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ రక్షణ అందరి బాధ్యత గజ్వేల్రూరల్: పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అధ్యాపకులు డాక్టర్ సుజాత, దేవదాసు అన్నారు. కళాశాలకు చెందిన విద్యార్థినులు శంషాబాద్ పరిధిలోని కర్తల్లో శనివారం జరిగిన ‘యూత్ లీడర్స్ కాన్ల్కెవ్ ఫర్ బెటర్ ఎర్త్’ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో విద్యార్థినులు పోస్టర్ ప్రెజంటేషన్ నిర్వహించి పర్యావరణ పరిరక్షణపై వివరించారు. ప్రొఫెసర్లు పురుషోత్తంరెడ్డి, బాలకృష్ణారెడ్డి మాట్లాడారు. జంతు జాలాన్ని రక్షించుకోవాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే భారీనష్టం దుబ్బాకటౌన్: అగ్ని ప్రమాదాల నివారణ పద్ధతులపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, ప్రమాదాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే భారీగా ఆస్తి, ప్రాణనష్టం తప్పదని అగ్నిమాపకశాఖ అధికారి కమలాకర్ హెచ్చరించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా శనివారం సినిమా థియేటర్లో ప్రమాదాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. అనంతరం వాల్పోస్టర్లను ఆవిష్కంచారు. లీడింగ్ ఫైర్ అధికారి లక్ష్మణ్, సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్కు దారేది? హుస్నాబాద్: మున్సిపల్ కార్యాలయానికి వెళ్లేదారి లేకుండా అడ్డంగా ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించాలని బీఆర్ఎస్ నాయకులు శనివారం డిమాండ్ చేశారు. కార్యాలయం వద్ద వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్తగా నిర్మించిన మున్సిపల్ భవనం వద్ద అధికారులు బ్యారి కేడ్లు ఏర్పాటు చేయడం సరికాదన్నారు. దీని వల్ల కార్యాలయానికి వచ్చే ప్రజలు తమ వాహనాలను ఎండలోనే పార్కింగ్ చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కార్యక్రమంలో నాయకులు మల్లికార్జున్రెడ్డి, నవీన్, జగ్జీవన్, వికాస్, అరవింద్ పాల్గొన్నారు. హరీశ్రావు పరామర్శ సిద్దిపేటరూరల్: మండలంలోని చింతమడక గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్త వాతపు సత్యనారాయణ భార్య రామలక్ష్మి ఇటీవల క్యాన్సర్తో బాధపడుతూ మృతి చెందింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు శనివారం పరామర్శించారు. వారితో మాట్లాడి మనోధైర్యం కల్పించారు. ఆయన వెంట ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ వర్మ తదితరులు ఉన్నారు. -
పల్లెల్లోకి కరువును తీసుకొచ్చిన కాంగ్రెస్
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డిదుబ్బాకటౌన్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తెలంగాణ పల్లెల్లోకి కరువును తీసుకొచ్చిందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి విమర్శించారు. రాయపోల్ మండల కేంద్రంలో శనివారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసుగు చెందారని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. 27న జరిగే సభకు ప్రజలు చీమల దండులా తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ప్రజాపాలన కాదు.. కక్షసాధింపు పాలన కొండపాక(గజ్వేల్): రాష్ట్రంలో ప్రజాపాలన కాదు.. కక్షసాధింపు పాలన కొనసాగుతుందంటూ ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి ఎద్దేవా చేశారు. కుకునూరుపల్లి, దుద్దెడలోని ప్రైవేటు పంక్షన్ హాళ్లలో బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగసభ నిర్వహణ కోసం శనివారం ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలన స్వర్ణయుగంలా ప్రజలు కొలుస్తున్నారన్నారు. ఇటీవల కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో నిర్వహించినది రాజ్యాంగ పరిరక్షణ పోరుయాత్ర కాదని ముఖ్య నేతల పదవులను కాపాడుకునేందుకు నిర్వహించిన పోరుబాట అన్నారు. ఆచరణకు సాధ్యం కాని హామీలనిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభు త్వం ప్రాజెక్టుల నుంచి చెరువులకు నీరు విడుదల చేయకుండా లక్షల ఎకరాల్లో పంటలు ఎండగొట్టి రైతులను ఆగం చేసిందని వాపోయారు. ఎల్కతుర్తిలో నిర్వహించే భారీ బహిరంగసభకు అధిక సంఖ్యలో ప్రజలను తరలించాలని కోరారు. అనంతరం బహిరంగసభ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్రెడ్డి, రవీందదర్, అమరేందర్, దుర్గయ్య, కుమార్, శ్రీనివాస్, కనకయ్య, భగవాన్, శ్రీనివాస్, కిరణ్కుమార్చారి, శ్రీనివాస్, ఐలయ్య, ఎల్లం, లక్ష్మణ్రాజ్, హైమద్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. -
సిబ్బందిని నియమిస్తాం..
పిల్లల పార్కులు, ఉద్యాన వనాలను మెరుగుపరిచేందుకు త్వరలో తగిన చర్యలు తీసుకుంటాం. నిధుల లభ్యతను బట్టి సౌకర్యాలు కల్పిస్తాం. వాటి నిర్వహణకు త్వరలోనే సిబ్బందిని నియమిస్తాం. – శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, దుబ్బాక మరమ్మతులు చేపట్టాలి పట్టణంలో రామసముద్రం చెరువు కట్టపై పార్కులో ఆట వస్తువులు విరిగి పోవడంతో చిన్నారులు నిరాశ చెందు తున్నారు. విరిగిన ఆట వస్తువులకు మరమ్మతులు చేయించాలి. అలాగే ఉయ్యాలలను తిరిగి ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – శ్రీకాంత్, దుబ్బాక -
చిన్నారి కథ విని హరీష్రావు కంటతడి..
సాక్షి, సిద్ధిపేట: ఓ చిన్నారి కథ విని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు భావోద్వేగానికి గురయ్యారు. సిద్ధిపేటలో విద్యార్థుల కోసం లీడ్ ఇండియా ఆధ్వర్యంలో 'భద్రంగా ఉండాలి.. భవిష్యత్లో ఎదగాలి' అనే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హరీష్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ చిన్నారి మాటలకు ఆయన చలించిపోయారు.. కంటతడి పెట్టారు.ఆ విద్యార్థిని మాట్లాడుతూ తన తండ్రి చిన్నప్పుడే చనిపోయాడని.. తల్లే తనను కష్టపడి చదివిస్తోందని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ చిన్నారి మాటలు విన్న హరీష్రావుతో పాటు ఆ వేదికపై ఉన్న వారంతా ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. ఆ బాలికను ఆత్మీయంగా దగ్గరికి తీసుకునన్న హరీష్రావు.. వేదికపై తన పక్కన కూర్చోబెట్టుకుని ఓదార్చారు. -
రాజకీయంగా ఎదుర్కోలేకే కక్ష సాధింపు
మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయంగా ఎదుర్కోలేకే గాంధీ కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం పట్టణంలోని ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ, ఆరపల్లె జంక్షన్ల అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీబీఐ, ఈడీలపై ఆధారపడి బీజేపీ సర్కార్ను నడుపుతోందన్నారు. బీజేపీ బలహీనపడే సందర్భంలో పార్లమెంట్లో, బయట నరేంద్రమోడీ జవాబు చెప్పలేక కాంగ్రెస్ నాయకత్వాన్ని వేధింపులకు గురి చేస్తున్నార న్నారు. మిత్రపక్షాలు ఎంత అవినీతి చేసినా మాట్లాడకుండా ఉండి, ప్రత్యర్థులపై కక్ష సాధింపు ధోరణి మంచి పద్ధతి కాదన్నారు. ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చందు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారులకు అభినందన.. హుస్నాబాద్రూరల్: గ్రామీణ క్రీడల్లో రాణించి హుస్నాబాద్కు పేరు, ప్రతిష్టలు తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.జిల్లా స్థాయి కబడ్డీ ట్రోఫీని గెలుపొందిన పోతారం(ఎస్) కృష్ణ కబడ్డీ క్లబ్ జట్టును గురువారం మంత్రి అభినందించారు. ఈ నెల 11, 12, 13న గజ్వేల్లో నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో ట్రోఫీని పోతారం జట్టు గెలువడం హర్షణీయమన్నారు. గ్రామాల్లో క్రీడాకారులను తయారు చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించాలని కోచ్ కృష్ణకు సూచించారు. -
ఎండు గంజాయి స్వాధీనం
● నలుగురు రిమాండ్ మునిపల్లి(అందోల్): అక్రమంగా తరలిస్తున్న ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు బుదేరా ఎస్ఐ రాజేశ్ నాయక్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. మండలంలోని కంకోల్ టోల్ ప్లాజా సమీపంలో గురువారం వాహనాలను తనిఖీ చేస్తున్నాం. బీదర్ నుంచి హైద్రాబాద్కు వెళ్తున్న కారులో 130 గ్రాముల ఎండు గంజాయి లభించింది. కారులో ఉన్న వత్సల్ రామ్శెట్టి, ఆకాశ్, అజయ్ దేశ్ముఖ, సోహెల్ను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. గంజాయి చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ రాజేశ్నాయక్, పోలీస్ సిబ్బందిని కొండాపూర్ సీఐ వెంకటేశం అభినందించారు. అలాగే కంకోల్ టోల్ ప్లాజా సమీపంలో వాహనాల తనిఖీ చేస్తుండగా రెండు బైక్లపై రియాజ్ పాషా, రేహాన్, సోఫి యాన్, ఆసిఫ్ 110 గ్రాముల ఎండు గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించాం. రియాజ్ పాషా, రేహాన్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా మరో ఇద్దరు పరారైనట్లు తెలిపారు. కంది శివారులో ఐదు కిలోలు కంది(సంగారెడ్డి): అక్రమంగా తరలిస్తున్న ఎండు గంజాయిని రూరల్ పోలీసులు పట్టుకున్నారు. రూరల్ ఎస్ఐ రవీందర్ కథనం మేరకు.. మండల కేంద్రమైన కంది శివారులో సాయంత్రం వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో ఓ కారులో 5 కిలోల ఎండు గంజాయి దొరికింది. కాశీపురం ఆంజనేయులుగా గుర్తించి కారుతోపాటు గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐపేర్కొన్నారు. విషపు ఆహారం తిని.. ● మూడు ఆవులు మృతి హత్నూర (సంగారెడ్డి): విష ఆహారం తిని మూడు పాడి ఆవులు మృతి చెందిన ఘటన హత్నూర మండలం గుండ్ల మాచునూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన మన్నె సత్తయ్య పాడి గేదెలు, ఆవులను మేపుతూ జీవిస్తున్నాడు. గ్రామ శివారులో గల చెరువు సమీపంలో ఇటీవల సినీ ఇండస్ట్రీ వాళ్లు సినిమా షూటింగ్లో భాగంగా అమ్మవారికి అన్నం రతి పోసి నైవేద్యం సమర్పించే సన్నివేశాన్ని చిత్రీకరించారు. సుమారు 3 క్వింటాళ్ల బియ్యంతో వండిన అన్నం వదిలేసి వెళ్లిపోయారు. వారం రోజుల కిందట వండిన అన్నం కావడంతో పూర్తిగా కుళ్లిపోయింది. ఆ ఆహారాన్ని బుధవారం సాయంత్రం మూడు ఆవులు తిని మృతి చెందాయి. సుమారు రూ.3 లక్షల వరకు నష్టపోయినట్లు బాధితుడు సత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మాకు మున్సిపాలిటీ వద్దు జిన్నారం(పటాన్చెరు): జిన్నారంను మున్సిపాలిటీ చేయొద్దని డిమాండ్ చేస్తూ జిన్నారం బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు జగన్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం మందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...జిన్నారంను మున్సిపల్ చేయడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని తెలిపారు. రైతులు నష్టపోతారని వివరించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు నర్సింగరావు, ప్రతాపరెడ్డి, రాజిరెడ్డి, రమేశ్,అశోక్ తదితరులు పాల్గొన్నారు. శబ్ద గ్రంథాలయాలు దివ్యాంగులకు ఉపయోగం కలెక్టర్ వల్లూరు క్రాంతి సంగారెడ్డి జోన్: శబ్ద గ్రంథాలయాల్లో ఆడియో పుస్తకాలు దివ్యాంగులకు ఎంతో ఉపయోగమని కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. గురువారం జిల్లా గ్రంథాలయ సంస్థ ఆవరణలో కంటిచూపు లేని దివ్యాంగుల కోసం మహిళా శిశు వికలాంగులు, వయోవృద్ధులు,ట్రాన్స్జెండర్స్ శాఖ ఆధ్వర్యంలో సౌండ్ లైబ్రరీ ఏర్పాటు పనులకు కలెక్టర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...దివ్యాంగులు కూడా మిగతా వారితో సమానంగా విద్యను సమాచారాన్ని పొందడానికి హక్కు కలిగి ఉన్నారన్నారు. ఈ లైబ్రరీ ద్వారా చదువును వినిపించి, దివ్యాంగులకు విజ్ఞానాన్ని చేరవేసే అవకాశం లభించనుందన్నారు. ఈ ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, డిప్యూటీ ఇంజనీర్ దీపక్, డీసీపీఓ రత్నం, వికలాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సీనియర్ అసిస్టెంట్ వెంకటేశం, ఫీల్డ్ రెస్పాన్స్ అధికారి సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
మాకేది పరిహారం?
హుస్నాబాద్ డివిజన్ పరిధిలో3 వేల ఎకరాల్లో ఎండిన చేన్లు ● వట్టిపోయిన బోర్లు,చుక్క నీరు లేని బావులు ● వడగళ్లకు నష్టపోయినపంటలకే ఇస్తే ఎలా? ● ఎండిన పంటలకు సైతంఇవ్వాలని డిమాండ్ ● గౌరవెల్లి ప్రాజెక్ట్ కిందమెట్ట రైతులను వీడని కరువు ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు భైరి భిక్షపతి. గౌరవెల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితుడు. ప్రాజెక్టులో ఊరు గుడాటిపల్లె ముగిని పోతే ముల్లె మూట సర్దుకొని హుస్నాబాద్కు వచ్చి కిరాయి ఇంట్లో ఉంటున్నాడు. గాంధీనగర్లో మూడు ఎకరాలు సెలక కొని రూ.4 లక్షలు పెట్టి రెండు బోర్లు వేయించాడు. వానాకాలం బాగానే పంట వచ్చింది. ఈ యాసంగి వరి పెడితే ఒక బోరులో నీళ్లు లేక రెండు ఎకరాల వరి ఎండిపోయింది. బోరుకు తెచ్చిన బాకీలు రూ.2లక్షలు తీరకముందే రూ.60 వేల నష్టం వాటిల్లింది. గౌరవెల్లి ప్రాజెక్టుకు భూములు ఇచ్చి ఊరు విడిసిన గోదారి నీళ్లు రాకపాయే కరువు తప్పకపాదాయే అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.హుస్నాబాద్రూరల్: హుస్నాబాద్ మెట్ట ప్రాంతం ఊట బావులు, బోర్ల నీటి లభ్యత మేరకు రైతులు పంటలు సాగు చేస్తారు. డివిజన్ పరిధిలోని హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట, బెజ్జంకి, హుస్నాబాద్ మండలాల్లో యాసంగి 68,272 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తే 53,280 ఎకరాల్లో వరి పంటలను సాగు చేశారు. వానా కాలం వర్షాలు సమృద్ధి కురిసినా భూగర్భజలాలు ఫిబ్రవరిలోనే అడుగంటిపోవడంతో రైతుల పంట చేన్లకు నీరు అందక ఎండిపోయాయి. వ్యవసాయ అధికారులు మార్చి 11 వరకు 593 ఎకరాల పంటలు ఎండిపోయినట్లు అంచనా వేశారు. మీర్జాపూర్ క్లస్టర్ పరిధిలోనే 600 ఎకరాల వరకు పంటలు ఎండిపోయినట్లు రైతులు చెబుతున్నారు. హుస్నాబాద్ డివిజన్లో సుమారు 6 వేల ఎకరాల్లో వరి పంటలు ఎండిపోయాయి. వ్యవసాయ అధికారులు గ్రామాల్లో పర్యటించి రైతులు నష్టపోయిన పంటల వివరాలను నమోదు చేసుకొని నష్ట పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. పంట నష్ట పరిహారం ఏది? వడగళ్లకు నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.10 వేలు పరిహారం ఇస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. రూ.వేల కొద్ది పెట్టుబడులు పెట్టి నష్టపోయిన మాకు నష్టపరిహారం ఎందుకు ఇయ్యరని రైతులు ప్రశ్నిస్తున్నారు. సరైన సమయంలో రైతు బంధు ఇవ్వకపోతే అప్పులు చేసి పెట్టుబడులు పెట్టారు. పంటల బీమా లేకపోవడంతో నష్టపోయిన పరిహారం అందడం లేదు. బ్యాంకులు పంట రుణాలు ఇచ్చే సమయంలో పంట బీమా చేసినా ఏ రైతుకు ఇప్పటి వరకు పరిహారం ఇవ్వడం లేదని వాపోతున్నారు. 18 ఏళ్లుగా గోదావరి నీళ్ల ముచ్చటే! మెట్ట ప్రాంత రైతులకు కరువు దూరం చేయాలని 2007లో వైఎస్ రాజశేఖర్రెడ్డి గౌరవెల్లి ప్రాజెక్టుకు పునాదులు వేశాడు. అప్పటికే 90 శాతం పనులు పూర్తి చేసినా మహానేత మరణంతో ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో ప్రాజెక్టుకు రీడిజైన్ చేసి 8 టీఎంసీల వరకు 2020లో పనులు పూర్తి చేశారు. అధికారులు ముంపునకు గురైన గుడాటిపల్లె, తెనుగుపల్లె, కొత్తపల్లితో పాటు నాలుగు గిరిజన తండాలను ఖాళీ చేయించి 2023 జూన్ 30న గౌరవెల్లి ప్రాజెక్టులోకి ట్రైయల్ రన్ చేసి గోదావరి నీళ్లు వస్తున్నాయని ఆశలు కల్పించారు. ఎన్జీటీలో కేసు ఉండటంతో పనులు నిలిపేయాలని స్టే ఇవ్వగా అధికారులు నిలిపేశారు. 2024 ఆగస్టులో ప్రాజెక్టు కుడి, ఎడుమ కాల్వల తవ్వకాల కోసం ప్రభుత్వం రూ.431 కోట్లు నిధులు మంజూరు చేయడంతో ప్రాజెక్టులోకి గోదావరి నీళ్లు వస్తాయని నాయకుల ప్రసంగాలతో రైతులకు భరోసా కల్పించారు. కాల్వల ద్వారా నీళ్లు రాకపోయినా ప్రాజెక్టులోకి గోదావరి నీళ్లు వస్తే బావుల్లో నీటి ఊటలు పెరిగుతాయని ఆశ పడ్డారు. 18 ఏళ్ల నుంచి గోదావరి నీళ్లు వస్తున్నాయనే నాయకుల మాటలే తప్ప ఇప్పటికీ నీళ్లు తీసుకరాలేదని రైతులు వాపోతున్నారు.2 ఎకరాలు ఎండింది వానాకాలం వరి కోతల వరకు వర్షాలు పడ్డాయని బావుల్లో నీళ్లు ఉంటే మూడు ఎకరాలు వరి వేసిన. ఉగాదికి ముందే ఊటలు వెనక్కి వెళ్లిపోవడంతో బాయి నీళ్లు అడుగంటిపోయి మొదటి మడి పారలేదు. వరుస తాళ్లు పెడితే ఒక ఎకరం పంట చేతుకి వచ్చింది. రెండు ఎకరాలు కళ్ల ముందే ఎండిపోతే పశువులకు మేతకు వదిలేసిన. రూ.45 వేలు పెట్టుబడి నష్టపోయిన ప్రభుత్వం మాకు పరిహారం ఇయ్యాలే. – దేవేందర్ నాయక్, భల్లునాయక్ తండా రూ.5 లక్షల వరకు నష్టం గాంధీనగర్లో సొంత పొలంలో పశువులను పెంచి సేంద్రియ ఎరువు తయారుతోనే పంటలు సాగు చేస్తున్నా. ఎరువును ఇరుగు పొరుగు వారికి సరఫరా చేస్తా. 10 ఏళ్ల నుంచి ఎప్పుడూ చూడని కరువును ఇప్పుడు చూశా. రెండు బావులు, ఒక బోరు ఎండిపోతే రూ.1.50 లక్షలతో మరో 600 ఫీట్ల బోరు వేయించిన రూ.1.50 లక్షలతో మోటారు బిగిస్తే ఒక్క రోజులోనే ఎండిపోయింది. 3.20 ఎకరాల సేంద్రియ సన్నరకం వరి పంట ఎండిపోయింది. రూ.5 లక్షల వరకు నష్టం వచ్చింది. పశువుల మేతకు మరో దగ్గర నుంచి పశుగ్రాసం కొనుగోలు చేయాల్సి దుస్థితి వచ్చింది. – మాదాడి రాజేశ్వర్రావు, గాంధీనగర్ హుస్నాబాద్ -
స్వాతంత్య్రోద్యమం కోసమే ఆ పత్రిక
సంగారెడ్డి: స్వాతంత్య్ర సమరాన్ని ఉధృతం చేసేందుకు, ప్రజలను ఉద్యమానికి సమాయత్తం చేసేందుకు పుట్టిన పత్రికే నేషనల్ హెరాల్డ్ అని అటువంటి పత్రికపై విషం గక్కుతున్న బీజేపీని ముక్తకంఠంతో వ్యతిరేకించాలని టీపీసీసీ జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ చార్జిషీట్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం సంగారెడ్డి పోస్టాఫీస్ వద్ద కాంగ్రెస్ శ్రేణులతో కలసి ఆయన ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...నేషనల్ హెరాల్డ్ పుట్టినప్పుడు నరేంద్రమోదీ, అమిత్షా పుట్టనేలేదన్నారు. సోనియా, రాహుల్ గాంధీలది క్షమించే గుణమని, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి అమిత్ షాలది కుట్రల గుణమని చెప్పారు. రాహుల్ గాంధీకి, అమిత్షాకు నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పారు. బీజేపీని అధికారంలోకి తెచ్చిన అద్వానీని ఎందుకు ప్రధానమంత్రిగా చేయలేదో ఆర్ఎస్ఎస్ నాయకులు సమాధానం చెప్పాలన్నారు. సంగారెడ్డి పోస్టాఫీస్ వద్ద ధర్నాలో టీపీసీసీ జగ్గారెడ్డి సోనియా, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ చార్జిషీట్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ... -
బాలసదనంలో లీగల్ అవేర్నెస్
సిద్దిపేటజోన్: జిల్లా కేంద్రంలోని బాలసదనంలో గురువారం లీగల్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు.జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి ఆదేశాల మేరకు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ, న్యాయమూర్తి స్వాతి రెడ్డి హాజరై పిల్లలకు చట్టాలు, చదువు విలువ గూర్చి వివరించారు. సమస్యలు ఉంటే 15100 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. బాలసదనంలో ఉన్న పిల్లల యోగ క్షేమాల గూర్చి ఆరా తీశారు. అలాగే సిబ్బంది హాజరు రిజిస్టర్ను తనిఖీ చేశారు. భోజనం నాణ్యత, వంటగది, నిల్వ ఉన్న ఆహార పదార్థాలను పరిశీలించారు. అనంతరం ఆమె శిశు కేంద్రాన్ని సందర్శించారు. -
అప్పుల బాధ తాళలేకవ్యక్తి ఆత్మహత్య
జహీరాబాద్ టౌన్: అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పపడిన ఘటన అల్గోల్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. జహీరాబాద్ మండలంలోని అల్గోల్కు చెందిన ఉప్పరి వెంకట్(50)కు నాలుగు ఎకరాల పొలం ఉంది. వ్యవసాయం పనులు చేస్తూ ఫైనాన్స్ బిజినెస్ చేశాడు. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో అప్పు బారిన పడ్డాడు. భూమి తాకట్టుపెట్టి కొంత అప్పులు తీర్చాడు. అయినా అప్పులు తీరకపోవడంతో బాధ భరించలేక గురువారం పొలంలో చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాలతో వలస కూలీ రామచంద్రాపురం(పటాన్చెరు): ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరులో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. అసోం రాష్ట్రానికి చెందిన బిషాల్(30) జీవనోపాధికి తెల్లాపూర్ మున్సిపల్కు వలసొచ్చాడు. ఆరు నెలలుగా కొల్లూరులోని కారు వాషింగ్ సెంటర్లో పని చేస్తున్నాడు. గురువారం తెల్లావారుజామున కారు వాషింగ్ షెడ్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల వల్లే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కారు షెడ్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
గొర్రెలు, మేకల దొంగలు అరెస్ట్
వర్గల్(గజ్వేల్): గొర్రెలు, మేకలను అపహరిస్తున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం గౌరారం ఎస్ఐ కరుణాకర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన నీరజ్కుమార్ ఇంచురే(21), మాఖన్ విశాల్సింగ్(22), రాహుల్, బాబు నలుగురూ గొర్రెలు, మేకలను అపహరించడమే లక్ష్యంగా ముఠాగా ఏర్పడ్డారు. గత నెల 24న దిల్సుఖ్నగర్లో సెల్ఫ్ డ్రైవింగ్ కారును అద్దెకు తీసుకున్నారు. అదే రోజు రాత్రి సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మల్లారెడ్డిపల్లిలో చీర్ల మల్లేశంకు చెందిన మేకల దొడ్డిలో 4 మేకలను అపహరించారు. కారులో వేసుకొని హైదరాబాద్లోని జియాగూడలో విక్రయించారు. రెండ్రోలకు 26న తొగుట సమీప రాంపూర్లో 4 గొర్రెలు అపహరించి విక్రయించారు. బాధితుడు చీర్ల మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గురువారం ఉదయం గౌరారం హోటల్ వద్ద అనుమానాస్పదంగా కన్పించిన ముఠాలోని ఇద్దరు సభ్యులు నీరజ్కుమార్ ఇంచురే, మాఖన్ విశాల్సింగ్లను అదుపులోకి తీసుకొని విచారించగా రెండు చోరీ ఘటనలు ఒప్పుకున్నారు. వెంటనే వారిని అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ చేసినట్లు తెలిపారు. మిగితా నిందితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి కౌడిపల్లి(నర్సాపూర్): ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కౌడిపల్లి ఎస్ఐ రంజిత్రెడ్డి తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు.. ఇటీవల మండలంలోని రాజిపేట శ్రీ రేణుక ఎల్లమ్మదేవి ఆలయంలో చోరీ జరుగగా కేసు నమోదు చేశాం. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టాం. గురువారం కౌడిపల్లి శివారులో వాహనాల తనిఖీ చేస్తుండగా మండలంలోని దేవులతండాకు చెందిన విస్లావత్ ప్రేమ్ అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో పట్టుకుని విచారించగా నిజం ఒప్పుకున్నట్లు తెలిపారు. ఆలయంలో రూ.2 వేలు నగదు, రోల్డ్గోల్డ్, వెండి అభరణాలు చోరీ చేయగా దీంతోపాటు శివ్వంపేట మండల కొత్తపేట్ ఎల్లమ్మగుడి, చండీలోని ఆలయం, నర్సాపూర్ మండలం గొల్లపల్లిలోని మల్లన్నగుడిలో సైతం చోరీకి పాల్పడినట్లు తెలిపారు. పలు కేసుల్లో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆర్ఈఏసీ సభ్యురాలిగాకౌడిపల్లి మహిళా రైతు
● కంచన్పల్లి గ్రామానికి చెందిన లక్ష్మీకి అరుదైన గౌరవం ● వ్యవసాయ పొలంలో సేంద్రియ పద్ధతిలో వరి, కూరగాయలు సాగు కౌడిపల్లి(నర్సాపూర్): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఏయూ) ఆర్ఈఏసీ (రిసెర్చ్ అండ్ ఎక్స్టెన్షన్ అడ్వైజరీ కౌన్సిల్) సభ్యురాలిగా కౌడిపల్లి మండలం కంచన్పల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు నాయిని లక్ష్మీ ఎంపిక అయ్యారు. గురువారం విశ్వవిద్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. నత్నయపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త శోభ తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్లోని పీజేటీఏయూలో గురువారం ఆర్ఈఏసీ సమావేశం వైస్ చాన్స్లర్ అల్దాస్ జానయ్య అధ్యక్షతన నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు రైతులు ఎంపిక కాగా ఇందులో లక్ష్మీని ప్రభుత్వం ఎంపిక చేసిందని రెండేళ్లపాటు సభ్యురాలిగా కొనసాగుతుందన్నారు. లక్ష్మీ కంచన్పల్లిలోని తన వ్యవసాయ పొలంలో సేంద్రియ పద్ధతిలో వరి, కూరగాయలతోపాటు అదనపు ఆదాయం కోసం ఒరంగట్టుపై టేకు మొక్కలు పెంపకం, కోళ్లఫారమ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యూనివర్సిటీ ఇచ్చిన మినికిట్స్తో విత్తన వరిని సైతం సాగు చేస్తుందన్నారు. ఆర్ఈఏసీ సమావేశంలో రైతులకు అందుబాటులో ఉండేలా నర్సాపూర్లో విత్తన గోదాం, టింబర్ గోదాం నిర్మించాలని సూచించినట్లు తెలిపారు. -
కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకెళ్తుండగా..
● ట్రాక్టర్ బోల్తా పడి రైతు మృతి ● మరో నలుగురికి గాయాలు ● నిజాంపేట్ మండలంలో ఘటననారాయణఖేడ్: ఆరుగాలం కష్టపడి పండిన వరి ధాన్యాన్ని తానే ట్రాక్టర్ నడుపుతూ రైతు కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్తున్నాడు. కొద్దిదూరంలో కొనుగోలు కేంద్రం ఉందనగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో రైతు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మరో నలుగురికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల కేంద్రంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నిజాంపేట్ మండలం శాఖాపూర్కు చెందిన గడ్డమీది అశోక్ (38) తన పొలంలో పండిన ధాన్యంను నిజాంపేటలోని కొనుగోలు కేంద్రంలో విక్రయించేందుకు ట్రాక్టర్లో లోడ్ చేశాడు. ట్రాక్టర్ను తోలుకుంటూ అశోక్ వస్తున్న క్రమంలో కొనుగోలు కేంద్రానికి కొద్ది దూరంలో అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవింగ్ చేస్తున్న రైతు అశోక్ ట్రాక్టర్ స్టీరింగ్ కింద ఇరుక్కుపోయి మృతి చెందాడు. ట్రాక్టర్పై ఉన్న బీర్ల లక్ష్మయ్య, బీరయ్యకు తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. అశోక్ భార్య సవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి.. సదాశివపేట రూరల్(సంగారెడ్డి): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని ఆరూర్ శివారులో గురువారం చోటు చేసుకుంది. సదాశివపేట సీఐ మహేశ్ గౌడ్ కథనం మేరకు.. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన మొరంగపల్లి రాజయ్య(79) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. వ్యక్తిగత పనుల నిమిత్తం సదాశివపేట పట్టణానికి టీవీఎస్ ఎక్సెల్ పై వచ్చి తిరిగి గ్రామానికి వెళ్తున్నాడు. ఆరూర్ శివారులోని ఎవరెస్ట్ పరిశ్రమ వద్దకు రాగానే వెనుక వేగంగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన రాజయ్యను సదాశివపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. విద్యుదాఘాతంతో గొర్రెల కాపరి చిన్నశంకరంపేట(మెదక్): విద్యుదాఘాతంతో గొర్రెల కాపరి మృతి చెందిన ఘటన మండలంలోని చందంపేట గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన క్యాసారం ఎల్లయ్య కుమారుడు దాసు(32) గొర్రెల కాపరిగా పని చేస్తున్నాడు. గొర్రెలను మేపడానికి గురువారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన దాసు చందంపేట గ్రామ శివారులోని వ్యవసాయ పొలం వద్ద దాహం తీర్చుకునేందుకు వెళ్లాడు. బోరు బావి స్టార్టర్ బాక్స్ వద్ద కరెంట్ వైరు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సాయంత్రం పొలం వద్దకు వెళ్లిన రైతు విషయం గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి గజ్వేల్రూరల్: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని అక్కారం గ్రామ శివారులో గురువారం రాత్రి చోటు చేసుకుంది. గజ్వేల్ పోలీసుల కథనం మేరకు.. జగదేవ్పూర్ మండలం తీగుల్ గ్రామానికి చెందిన గొర్లకాడి దుర్గాప్రసాద్(26) బైక్పై ప్రజ్ఞాపూర్ నుంచి తీగుల్ వైపు వస్తున్నాడు. గజ్వేల్ మండలం అక్కారం గ్రామ శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో దుర్గాప్రసాద్ అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతుడికి ఏడాది కిందట చేర్యాల ప్రాంతానికి చెందిన పుష్పతో వివాహం జరుగగా ప్రస్తుతం ఆమె 4 నెలల గర్భిణీ అని గ్రామస్తులు పేర్కొన్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే దుర్గాప్రసాద్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
5.33 గంటలు.. 40 కిలో మీటర్లు
మొక్కు చెల్లించడానికి పరుగెత్తారు దుబ్బాకటౌన్: అనుకున్న లక్ష్యానికి, దైవ భక్తికి ఏ ఆటంకం ఎదురు రాదని దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చెల్లాపూర్ వార్డుకు చెందిన కమ్మరి సాయి వర్ధన్, దుంపలపల్లికి చెందిన దొందడి రాకేశ్ నిరూపించారు. ఇటీవల భారత ఆర్మీ (అగ్నివీర్)కి సాయి వర్ధన్, రాకేశ్ ఎంపికయ్యారు. గురువారం ఇద్దరు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్నకు మొక్కు చెల్లించడానికి స్వగ్రామం నుంచి 40 కిలో మీటర్ల దూరాన్ని కేవలం 5 గంటల 33 నిమిషాల్లో పరుగెత్తి ఆలయాన్ని చేరుకున్నా రు. కాగా సాయివర్ధన్ గతంలో ఆర్మీ సెలక్షన్లో రెండు సార్లు విఫలమయ్యాడు. దీంతో ఈసారి ఎంపిక కావాలని పట్టువదలని విక్రమార్కుడిలా రోజు ఉదయం గ్రౌండ్లో చెమటోడ్చి అనుకున్న లక్ష్యం సాధించాడు. -
వేర్వేరు చోట్ల ముగ్గురు అదృశ్యం
జహీరాబాద్: వ్యక్తి అదృశ్యమైన ఘటన మొగుడంపల్లి మండలంలోని జాడీమల్కాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. రూరల్ ఎస్ఐ ప్రసాద్రావు కథనం మేరకు.. గ్రామానికి చెందిన బల్లెపు సంగయ్య (34) గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 1న జహీరాబాద్ నుంచి రైలులో వికారాబాద్ వెళ్లి అక్కడి నుంచి తిరుపతి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయలుదేరాడు. ఇప్పటి నుంచి తిరిగి రాకపోవడంతో బంధువులు, స్నేహితుల వద్ద వెతికారు. ఎక్కడా ఆచూకీ లభ్యం కాకపోవడంతో గురువారం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భార్య స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఇంటి నుంచి వెళ్లి వృద్ధుడు మిరుదొడ్డి (దుబ్బాక ): వృద్ధుడు అదృశ్యమైన ఘటన మండల కేంద్రమైన మిరుదొడ్డిలో చోటు చేసుకుంది. గురువారం ఎస్సై బోయిని పరశురామ్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన వనం యాదయ్య(55) కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేక గ్రామంలో తిరుగుతుండేవాడు. 14న ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు బంధుమిత్రుల వద్ద వెతికినా ఫలితం లేకుండా పోయింది. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గుండ్లపల్లిలో వ్యక్తి శివ్వంపేట(నర్సాపూర్) : వ్యక్తి అదృశ్యమైన ఘటన మండల పరిధి గుండ్లపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కుల్ల మల్లేశం 16న ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. గురువారం మల్లేశం భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మధుకర్రెడ్డి తెలిపారు. తిరుపతికని వెళ్లి వ్యక్తి -
విద్యార్థులకు ఏఐ బోధన
మిరుదొడ్డి (దుబ్బాక): విద్యలో వెనుకబడిన విద్యార్థుల స్థాయి పెంపునకు ఏఐ ఆధారిత ఎఫ్ఎల్ఎన్ బోధన దోహద పడుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని కొండాపూర్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా కంప్యూటర్ ల్యాబ్ను పరిశీలించి, విద్యార్థులతో తెలుగు, ఇంగ్లిష్, గణితంపై అసెస్మెంటన్లు ప్రాక్టీస్ చేయించారు. అనంతరం పాఠశాల రికార్డులు, మధ్యాహ్న భోజనంతోపాటు ఆవరణలో నాటిన మొక్కలను పరిశీలించారు. అలాగే లింగుపల్లి ప్రాథమిక పాఠశాల, చెప్యాల ఉన్నత పాఠశాలను సందర్శించి డైట్ విద్యార్థుల ద్వారా థర్డ్ పార్టీ ఫిజికల్ వెరిఫికేషన్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ప్రవీణ్ బాబు, ప్రధానోపాధ్యాయుడు బుచ్చిరెడ్డి, ఉపాధ్యాయులు బాలకిషన్ , శ్రీనివాస్ పాల్గొన్నారు. దళారులను ఆశ్రయించొద్దు బెజ్జంకి(సిద్దిపేట): వరి ధాన్యం విక్రయాల కోసం దళారులను ఆశ్రయించవద్దని డీఆర్డీఓ జయదేవ్ ఆర్య రైతులకు సూచించారు. బెజ్జంకి ఏఎంసీ మార్కెట్లోని కొనుగోలు కేంద్రాలను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తేమ, తాలు లేకుండా ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని అధికారులకు సూచించారు. వడ్లను తూర్పార బట్టే మిషన్ను పరిశీలించారు. అనంతరం విద్యార్థుల కోసం కుడుతున్న యూనిఫామ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రవీణ్, ఏపీఎం నర్సయ్య, సీసీలు సారయ్య, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీనర్సింహ స్వామి ఆదాయం 4.80 లక్షలు బెజ్జంకి(సిద్దిపేట): బెజ్జంకి శ్రీలక్ష్మీనర్సింహ స్వామి బ్రహ్మోత్సవాల హుండీ ఆదాయం రూ.4 లక్షల 80 వేల 276 వచ్చినట్లు ఆలయ కమిటీ చైర్మన్ జెల్ల ప్రభాకర్ తెలిపారు. ఎండోమెంట్ పరిశీలకురాలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో గురువారం హుండీ తెరిచారు. మార్చి 23 తేదీ నుంచి నేటి వరకు హుండీలో వచ్చిన ఆదాయాన్ని లెక్కించారు. హుండీ ఆదాయంతో కలుపుకొని మొత్తం జాతర ఆదాయం రూ.14 లక్షల 9వేల 990 వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓ శర్మ, పూజారి మధుసూదనాచారి, ఏఎస్ఐ శంకర్రావు, డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ డయాలసిస్ సెంటర్కు బెస్ట్ పర్ఫామెన్స్ అవార్డు దుబ్బాక: ఉత్తమ సేవలు అందించినందుకు గాను దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రి డయాలసిస్ సెంటర్కు బెస్ట్ పర్ఫామెన్స్ అవార్డు లభించింది. అపెక్స్ కిడ్నీ వేర్ ప్రైవేట్ లిమిటెడ్ ముంబై దుబ్బాక కిడ్నీ సెంటర్కు అవార్డును అందించింది. 2023 మార్చ్ 5న దుబ్బాక ప్రభుత్వాస్పత్రిలో ఐదు బెడ్స్తో డయాలసిస్ సెంటర్ ప్రారంభమైంది. దీంతో ఇప్పటివరకు ఈ సెంటర్లో 8200 డయాలసిస్ కేసులతో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోనే ఉత్తమ అవార్డు రావడం పట్ల ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్, డయాలసిస్ ఇన్చార్జ్ శేఖర్, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. -
విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం
అక్కన్నపేట(హుస్నాబాద్): విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధమై ఘటన అక్కన్నపేట మండలం పంతుల్తండా గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన భానోతు పకాలియా–సారవ్వ కుటుంబ సభ్యులు గురువారం వ్యవసాయ పొలం పనులు వెళ్లారు. మధ్యాహ్నం ఇంట్లో మీటర్ వద్ద షార్ట్ సర్క్యూట్ అయ్యి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లోని వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. ఇరుగుపొరుగు వారు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి మంటాలార్పే ప్రయత్నం చేశారు. అప్పటికే సగానికి పైగా వస్తువులు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఇటీవల మహిళా సంఘం ద్వారా వచ్చిన డబ్బులు రూ.లక్ష ఇంట్లో దాచిపెట్టగా బుగ్గిపాలయ్యాయి. అదే విధంగా ఫ్యాన్లు, గిన్నెలు, ఫ్రీజ్, కూలర్తోపాటు బియ్యం బస్తాలు దగ్ధమయ్యాయి. వాటి విలువ రూ.4 లక్షలు ఉంటుందని బాధితులు వాపోయారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని బీజేపీ మండలాధ్యక్షుడు రామంచ మహేందర్ రెడ్డి, గిరిజన మోర్చా మండలాధ్యక్షుడు రైనా నాయక్ తదితరులు ప్రభుత్వాన్ని కోరారు.రూ.లక్ష నగదు, విలువైన వస్తువులు కాలి బూడిద -
పామాయిల్ సాగు అంతంతే!
ఉమ్మడి మెదక్ జిల్లాలో తొలుత సిద్దిపేటలో సాగు ● ఇప్పటి వరకు 4,515 మంది రైతులు.. 15వేల ఎకరాల్లో సాగు ● గతేడాది 10వేల ఎకరాల లక్ష్యానికి సాగైంది 3వేలు మాత్రమే ● ఈ ఏడాదైనా సాగు పెంచేందుకు అధికారులు కృషి చేయాలి సాక్షి, సిద్దిపేట: పామాయిల్ను అంతంత మాత్రంగానే సాగు చేస్తున్నారు. గతంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేకంగా సాగు చేస్తే వచ్చే లాభాలపై అవగాహన సదస్సులు విస్తృతంగా నిర్వహించి.. రైతులను అటు వైపు మళ్లించారు. ఏడాదిన్నర నుంచి అఽధికారులు , ప్రజాప్రతినిఽధులు అవగాహన కల్పించకపోవడంతో పాటు నీటి ఇబ్బందులతో పామాయిల్ సాగు చేసేందుకు రైతులు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. 15వేల ఎకరాల్లో సాగు.. తొలుత సిద్దిపేట జిల్లాలో రెండేళ్ల తర్వాత మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో పామాయిల్ సాగును ప్రారంభించారు. ఉమ్మడి మెదక్లో 4,515 మంది రైతులు, 15,134 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో మొక్కలను తెలంగాణ ఆయిల్ ఫెడ్, మెదక్, సంగారెడ్డిలలో ప్రైవేట్ కంపెనీలు అందజేస్తున్నాయి. గతేడాది ఉమ్మడి మెదక్ జిల్లాకు ఉద్యాన శాఖ 10వేల ఎకరాలు లక్ష్యంగా నిర్ణయించగా 3,110 ఎకరాల్లోనే సాగు చేస్తున్నారు. ఇటీవల పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సందర్శించిన అనంతరం అధికారులతో సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సాగు తక్కువగా ఉండటంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్ అధికారులు సమన్వయంతో సాగుతూ సాగు విస్తీర్ణం పెంచే విధంగా కృషి చేయాలని ఆదేశించారు. గతంలో పామాయిల్ సాగుకు అధిక ప్రాధాన్యమిచ్చి పెద్ద రైతులను గుర్తించి వారితో ప్రత్యేకంగా మాట్లాడి వారిని పామాయిల్ సాగు చేసే విధంగా ప్రోత్సహించారు. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇక్కడే విక్రయించుకొనే అవకాశం ఇప్పటికే సిద్దిపేటలో పామాయిల్ సాగవుతున్న పలు చోట్ల దిగుబడి ప్రారంభమైంది. గెలలు కోసి సిద్దిపేటలోనే విక్రయించి రైతులు ఆదాయం పొందారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మెటలో పామాయిల్ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. త్వరలో అందుబాటులోకి రానుంది. దీంతో మార్కెటింగ్కు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రైతులను పామాయిల్ సాగు చేసే విధంగా ప్రోత్సహిస్తే ఎంతో మేలు జరగనుంది. ఎకరానికి రూ.50 వేల రాయితీ రైతులను ప్రోత్సహించేందుకు పలు రకాల సబ్సిడీని అందిస్తోంది. ఎకరం ఆయిల్ పామ్ సాగు కోసం ప్రభుత్వం రూ. 50,600 రాయితీ ఇస్తున్నది. మొక్కలకు 80 శాతం సబ్సిడీ, అలాగే డ్రిప్ సిస్టమ్ కోసం బీసీలకు 90 శాతం సబ్సిడీ, ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం సబ్సిడీతో అందిస్తున్నారు. ఇలా 12.5ఎకరాల వరకు రైతులకు ప్రభుత్వం నుంచి రాయితీలు పొందే అవకాశం ఉంది. అలాగే మొక్కలు నాటిన నాలుగేండ్ల వరకు కాత రాదు. ఈ సమయంలో మొక్కల సంరక్షణతో పాటు ఆయిల్ పామ్ అంతర పంట సాగు కోసం ప్రభుత్వం రూ.4,200 చొప్పున నాలుగేండ్లకు రూ.16,800 చెల్లిస్తుంది. ఈ సాగుతో నాలుగేండ్ల తర్వాత నుంచి 30 ఏండ్ల వరకు నిరంతర ఆదాయాన్ని పొందవచ్చు. -
అవసరమైన వారికి కంటి శస్త్ర చికిత్సలు
డీఎంహెచ్ఓ పల్వన్కుమార్ సిద్దిపేటకమాన్: కంటి పరీక్షలు నిర్వహించిన వారిలో అవసరమైన వారికి రోజూ 20మందికి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తామని మెడికల్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ విమలాథామస్, డీఎంహెచ్ఓ డాక్టర్ పల్వన్కుమార్ తెలిపారు. సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కాంట్రాక్ట్ సర్జరీలపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని సూచించారు. ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. గర్భిణులకు ఆరోగ్య వైద్య సేవల నిమిత్తం 102 వాహనం ద్వారా ఇంటి నుంచి ఆస్పత్రికి, తిరిగి ఇంటికి తీసుకెళ్లాలన్నారు. తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్, సైకియాట్రిక్ విభాగ హెచ్ఓడీ డాక్టర్ శాంతి, ఆర్ఏంఓలు, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
గజ్వేల్.. మరో టెర్మినల్!
రైల్వేస్టేషనే ప్రత్యామ్నాయం ● హైదరాబాద్లోని స్టేషన్లలో పెరిగిన రద్దీ ● ఈ ప్రాంతంపై దక్షిణ మధ్య రైల్వేశాఖ ప్రత్యేక దృష్టి ● మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలైన్ పూర్తయి.. ‘రింగ్ రైల్’ కార్యరూపం దాలిస్తే మహర్దశే గజ్వేల్ రైలు మార్గంరాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని ప్రధాన రైల్వేస్టేషన్లకు గజ్వేల్ ప్రత్యామ్నాయం కాబోతున్నది. నగరంలోని స్టేషన్లలో రద్దీ పెరగడం, అభివృద్ధి పనుల పేరిట తరుచూ రైళ్లను మళ్లించాల్సి వస్తుండటంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు గజ్వేల్ రైల్వేస్టేషన్పై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలైన్ పనులు పూర్తయి, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ట్రిపుల్ఆర్ (రీజినల్ రింగు రోడ్డు)కు సమాంతరంగా చేపట్టాలనుకుంటున్న ‘రింగ్ రైల్’ కార్యరూపం దాలిస్తే గజ్వేల్కు మహర్దశ పట్టనుంది. గజ్వేల్: మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు 151.36కిలోమీటర్ల పొడవునా ఈ న్యూ బ్రాడ్గేజ్ లైన్ నిర్మాణం జరుగుతోంది. ఇందుకు రూ.1160.47కోట్లు వెచ్చిస్తున్నారు. ఉత్తర తెలంగాణ అభివృద్ధిలో ఈ రైల్వేలైన్ కీలక మలుపుగా మారుతోంది. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్లడానికి ఇప్పటి వరకు రోడ్డు మార్గమే ఆధారం. ఈ రైల్వేలైన్ పూర్తయితే ప్రయాణం ఇక సులువు కానుంది. మొత్తం ఈ లైన్కోసం మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల పరిధిలో 2020 ఎకరాల భూసేకరణ జరిగింది. ప్రస్తుతం మనోహరాబాద్ నుంచి సిద్దిపేట వరకు 75కిలోమీటర్లకుపైగా పనులు పూర్తికాగా ప్యాసింజర్ రైలు కూడా నడుస్తోంది. గజ్వేల్ వరకు గూడ్స్ రైలు విజయవంతంగా నడుపుతున్నారు. మరోవైపు సిద్దిపేట నుంచి సిరిసిల్ల వరకు పనులు జోరుగా సాగుతున్నాయి. ‘గ్రాండ్ టంక్ లైన్’తో అనుసంధానం ఈ లైన్ వల్ల సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మనోహరాబాద్ మీదుగా కొత్తపల్లి వరకు, అక్కడి నుంచి పెద్దపల్లి గ్రాండ్ ట్రంక్ లైన్తో అనుసంధానం కానుంది. ఫలితంగా ఈ లైన్ హైదరాబాద్, న్యూఢిల్లీ, కోల్కతా లాంటి మహానగరాలను కలుపుతూ జాతీయ లైన్గా ఆవిర్భవించనుంది. పెద్దపల్లి గ్రాండ్ ట్రంక్లైన్కు ఇప్పటి వరకు సికింద్రాబాద్, ఖాజీపేట మార్గం అనుసంధానంగా ఉండేది. మనోహరాబాద్– కొత్తపల్లి రైల్వేలైన్ పూర్తయితే.. ప్రయాణికులకు దూరభారం తగ్గనుంది. రైల్వేశాఖ ప్రత్యేక దృష్టి ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో పలు ప్లాట్ఫామ్లను మూసేశారు. అంతేకాకుండా పలు రైళ్లను చర్లపల్లి, మల్కాజిగిరి, కాచిగూడ, నాంపల్లి స్టేషన్ల నుంచి నడుపుతున్నారు. కొన్ని నెలలపాటు ప్రయాణికులకు ఈ అసౌకర్యం తప్పేలా లేదు. భవిష్యత్తులోనూ ఇలాంటి సమస్యలు వస్తే ఏం చేద్దామనే ఆలోచన దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారుల్లో మొదలైంది. ఇలాంటి తరుణంలో నగరంలోని ప్రధాన రైల్వేస్టేషన్లకు గజ్వేల్ ప్రాంతమే ప్రత్యామ్నాయంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది. ఆయా స్టేషన్లలో రద్దీ పెరగటం వల్ల, మరిన్ని కొత్త రైళ్లను నడపడానికి అవకాశంలేని సందర్భాల్లో నగరానికి సుమారుగా 50కిలోమీటర్ల దూరంలోపే ఉన్న గజ్వేల్ నుంచి ప్రధాన రైళ్లు నడిపితే బాగుంటుందన్న చర్చ జరుగుతోంది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే.. ఇక్కడి నుంచే కొన్ని ప్రధాన రైళ్లు అంటే తిరుపతి, బెంగళూరు, ముంబై, షిర్డీకి రైళ్లను నడపవచ్చని సమాచారం. నగరంలో రద్దీ పెరగడం.. రైల్వే స్టేషన్ల విస్తరణకు అవకాశం లేకపోవడంతో ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి కొత్త రైళ్ల పయనం విజయవంతంగా సాగితే హైదరాబాద్ నగరవాసులేకాకుండా, ఇతర ప్రధాన ప్రాంతాలకు చెందిన వారు గజ్వేల్కు వచ్చి బయలుదేరాల్సి ఉంటుంది. ఈ లెక్కన సహజంగానే గజ్వేల్ ప్రాంత ప్రాధాన్యం ఒక్కసారిగా పెరగనుంది. మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి రైల్వేలైన్ పూర్తయి, ట్రిపుల్ఆర్ (రీజినల్ రింగు రోడ్డు)కు సమాంతరంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టాలనుకుంటున్న ‘రింగ్ రైల్’ పనులు మొదలైతే గజ్వేల్కు మహర్దశ పట్టనుంది. అంతేకాకుడా ఈ ప్రాంతంలో వ్యాపార, వాణిజ్య రంగాల అభివృద్ధికి బాటలు పడే అవకాశముంది. భారీ, చిన్న తరహ పరిశ్రమలకు సంబంధించిన వస్తు ఎగుమతులు, దిగుమతులకు అవకాశం కలిగిన వ్యాపార రంగం గణనీయంగా వృద్ధి చెందనుంది. వీటన్నంటితోపాటు ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా పెరిగి పర్యాటకం రంగం కూడా అభివృద్ధి చెందనుంది. గజ్వేల్ స్టేషన్ అభివృద్ధి అంశాలను దక్షిణ మధ్య రైల్వే శాఖ సీనియర్ అధికారి ఒకరు ‘సాక్షి’కి ధ్రువీకరించారు. -
ధర లేదని పొగాకు పారబోత
దుబ్బాకరూరల్: పొగాకుకు మద్దతు ధర లేకపోవడంతో ఆవేదన చెందిన రైతు రోడ్డుపై పారబోశారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లిలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. అప్పనపల్లి చుట్టు పక్కల గ్రామాలకు చెందిన రైతులు పొగాకును తీసుకు వచ్చి ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తారు. గత ఏడాది పొగాకు ధర క్వింటాలుకు రూ.15వేలు ఉండేది. ప్రస్తుతం రూ.6వేలుకు పడిపోయింది. తేమ, రకం బట్టి పొగాకుకు మద్దతు ధర కేటాయిస్తున్నారు. గత ఏడాది కంటే ప్రస్తుతం భారీగా ధర పడిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. పొగాకును విక్రయించడానికి వచ్చిన ఓ రైతు కనీస మద్దతు ధర లేక పోవడంతో ఆవేదన చెందాడు. కనీసం మద్దతు ధర లేక పోవడంతో ఆగ్రహంతో తాను తెచ్చిన పొగాకును రోడ్డుపై పారబోశాడు. పంటకు పెట్టిన పెట్టుబడి రావడం లేదని కన్నీంటి పర్యంతమయ్యాడు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి దళారుల బారిన పడకుండా పొగాకుకు మద్దతు ధర కేటాయించాలని రైతులు కోరారు. -
20 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు
మెదక్ కలెక్టరేట్: ఈనెల 20 నుంచి మే 26వ తేదీ వరకు జిల్లాలో ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్ పరీక్షలు జరగనున్నట్లు మెదక్ జిల్లా డీఈఓ రాధాకిషన్ తెలిపారు. బుధవారం పరీక్షల కోసం సంబంధిత అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. పది పరీక్షలకు 459 మంది, ఇంటర్లో 876 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు చెప్పారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని సూచించారు. ప్రతిరోజు ఉదయం 9 నుండి 12 గంటల వరకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆలస్యమైతే నో ఎంట్రీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఐదు నిమిషాలకు మించి ఆలస్యమైతే పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉండదని డీఈఓ రాధాకిషన్ తెలిపారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి 30 నిమిషాల ముందు కేంద్రంలోని చేరుకోవాలన్నారు. పదికి 3.. ఇంటర్కు 5 కేంద్రాలు: జిల్లాలో జరిగే పదో తరగతి పరీక్షలకు మెదక్, నర్సాపూర్, తూప్రాన్లలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 3 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇంటర్ పరీక్షల కోసం మెదక్(2), నర్సాపూర్(2), తూప్రాన్(1) చొప్పున మొత్తం ఐదు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా కనీస వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎండలను దృష్టిలో పెట్టుకొని పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. క్రిమినల్ కేసులు పరీక్షల్లో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా వారి పై చట్టం 25/1997 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని డీఈఓ హెచ్చరించారు. పరీక్ష కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ఒక సిట్టింగ్ స్క్వా డ్, ఇద్దరు ప్లయింగ్ స్క్వాడ్స్, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు ఉంటారన్నారు. 5 నిమిషాలు ఆలస్యమైతే నో ఎంట్రీ అభ్యర్థులకు గుర్తింపు కార్డు తప్పనిసరి -
ఆయిల్పామ్ సాగుకు ముందుకు రావాలి
గజ్వేల్రూరల్: మండల పరిధిలోని పలు ఆయిల్పామ్ తోటలను కేంద్ర బృందం బుధవారం సందర్శించింది. ఈ సందర్భంగా మండలంలోని బూర్గుపల్లి, అక్కారం గ్రామాల్లోని ఆయిల్పామ్ తోటలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో 66,546 మొక్కలు నాటేందుకు చర్యలు చేపడతున్నామన్నారు. అయితే ఇప్పటి వరకు 12,339 ఎకరాల్లో ఆయిల్ఫామ్ సాగవుతున్నట్లు తెలిపారు. 329 మంది రైతులు 322.83టన్నుల ఆయిల్పామ్ దిగుబడి సాధించారన్నారు. జిల్లాలోని మిరుదొడ్డి మండలం చెప్యాలలో, మర్కూక్ మండలాల్లో ఆయిల్పామ్ గెలల కొనుగోలు కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు. జూన్ మొదటి వారంలో నంగునూరు, నర్మెట్టలో ఏర్పాటు చేస్తున్న ఆయిల్పామ్ ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రస్తుతం టన్ను ఆయిల్పామ్ గెలల ధర రూ.21000 వరకు ఉందని, రైతులు పంట సాగుచేసేందుకు ముందుకు రావాలని సూచించారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ పొన్నుస్వామి, అదనపు డైరెక్టర్(హార్టికల్చర్) సరోజినిదేవి, జిల్లా ఉద్యాన శాఖాధికారి సువర్ణ, అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. వేసవిలో ఎక్కువ నీరు అందించాలి కొమురవెల్లి(సిద్దిపేట): వేసవిలో ఆయిల్పామ్ మొక్కలకు ఎక్కువ నీరు అందించాలని డైరెక్టర్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ డాక్టర్ పొన్నుస్వామి సూచించారు. బుధవారం మండలంలోని గురువన్నపేటలో పలు అయిల్పామ్ తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్పామ్లో అంతరపంటగా అరటి, మునగ వేసుకోవడం వల్ల మొదటి మూడేళ్లు మంచి లాభాలు వస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ఉద్యన శాఖ అదనపు డైరెక్టర్ సరోజిని దేవి, జిల్లా అధికారి సువర్ణ, అయిల్ఫెడ్ జిల్లా ఇన్చార్జి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. పలు గ్రామాల్లో తోటలను సందర్శించిన కేంద్ర బృందం -
రైతులను ఆదుకుంటాం
● అకాల వర్షంతో తీరని నష్టం ● ఎకరాకు రూ.10వేల పరిహారం ● మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీ కుటుంబాన్ని కేంద్రం వేధిస్తోంది● విచారణ పేరిట రాక్షసత్వం తగదు ● మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కన్నపేట(హుస్నాబాద్): అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అక్కన్నపేట మండలం పంతుల్తండాలో ఇటీవల కురిసిన వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను మంత్రి బుధవారం పరిశీలించారు. అలాగే అక్కన్నపేట, గొల్లకుంట, అంతక్కపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందజేస్తామన్నారు. ఎకరాకు రూ.10వేల పరిహారం అందించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర తెలంగాణలో వడగళ్ల వాన వల్ల కూరగాయాల పంటలు, వరి, మామిడి పంటలు దెబ్బతిన్నాయన్నారు. దెబ్బతిన్న పంటల వివరాలను వ్యవసాయ శాఖ సేకరిస్తోందన్నారు. గౌరవెల్లి నీళ్లు వచ్చినట్లయితే ఈప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. రైతులందరూ ఆయిల్పామ్ తోటలు పెట్టాలని, పంట సాగుపై అవగాహన కల్పిస్తామన్నారు. అలాగే కూరగాయాల పెంపకానికి ప్రోత్సాహం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, పార్టీ మండలాధ్యక్షుడు అయిలయ్య, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ కరంటోతు రవీ, నాయకులు పాల్గొన్నారు.హుస్నాబాద్: సోనియా గాంధీని విచారణ పేరుతో కేంద్ర ప్రభుత్వం రాక్షసత్వంగా వ్యవహరిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. సోనియా గాంధీ, రాహుల్ గాంఽధీలపై ఈడీ చార్జిషీట్లను నిరసిస్తూ బుధవారం హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంత్రి ధర్నా చేపట్టారు. మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర విధానాలపై పోరాడుతుంటే కాంగ్రెస్ అగ్రనేతలను ఈడీ కేసుల పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక దేశ స్వతంత్య్రం కోసం పని చేసిందన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబాన్ని బద్నాం చేస్తున్నారని అన్నారు. దేశంలో అనేక మంది నిరవ్ మోదీలు దేశాన్ని దోచుకుంటే చర్యలు లేవన్నారు. ప్రభుత్వ రంగ సంస్ధలు ఎల్ఐసీ, ఎయిర్పోర్ట్, రైల్వేలు, అన్ని ఆర్థిక సంస్థలను అదాని, అంబానీలకు అప్పగిస్తున్నారన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వెంట ప్రజలు ఉన్నారని, దేశమంతా ముక్తకంఠంతో మద్దతు ఇస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, నియోజకవర్గంలోని ఏడు మండలాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
జీవనోపాధికి చేయూత
డీఆర్డీఏ పీడీ జయదేవ్ ఆర్య చిన్నకోడూరు(సిద్దిపేట): చేతి వృత్తుల వారిని ప్రోత్సహించడంతో పాటు పేదలకు జీవనోపాధి కల్పించడమే వాటర్ షెడ్ పథకం లక్ష్య మని డీఆర్డీఏ పీడీ జయదేవ్ ఆర్య అన్నారు. బుధవారం చౌడారంలో వాటర్ షెడ్ యాత్ర నిర్వహించారు. అలాగే జీవనోపాధి కింద నెలకొల్పిన పలు యూనిట్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండ్ల తోటల పెంపకానికి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందన్నారు. వర్షపు నీరు వృథాకాకుండా ఈ పథకం ద్వారా కందకాలు, రాతికట్టడాలు, చెక్డ్యామ్లు నిర్మించుకోవచ్చన్నారు. తద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. వృథా నీటిని భూమిలో ఇంకేందుకు ఇంకుడు గుంతలు నిర్మించాలన్నారు. నాలుగు రెవెన్యూ గ్రామాల్లో 311 మందికి రూ.1.54 కోట్ల రుణాలు వీఓల ద్వారా మహిళల జీవనోపాధికి అందజేశామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ అధికారి రాధిక, అదనపు పీడీ బాలకిషన్, డీపీఎం కరుణాకర్, ఏడీపీ శ్రీనివాస్ గౌడ్, ఎంపీడీఓ జనార్దన్, వాటర్ షెడ్ ప్రాజెక్టు ఆఫీసర్ నూరొద్దిన్, ఎంపీఓ సోమిరెడ్డి, ఏపీఓ స్రవంతి, ఏపీఎం ఆంజనేయులు పాల్గొన్నారు. సామర్థ్యాలను పెంచేందుకే ఏఐ బోధన: డీఈఓచిన్నకోడూరు(సిద్దిపేట): విద్యలో వెనుకబడిన విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకు ఏఐ బోధన ఎంతగానో దోహదపడుతుందని డీఈఓ శ్రీనివాస్రెడ్డి అన్నారు. బుధవారం రామంచ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సందర్శించారు. కంప్యూటర్ ల్యాబ్లో విద్యార్థులు చేస్తున్న ఏఐ టూల్స్ ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఈ విధానంతో విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే కంప్యూటర్ పరిజ్ఞానం పెరుగుతుందన్నారు. అన్ని పాఠశాలల్లో నెట్ సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. అనంతరం పాఠశాలల రికార్డులు, మధ్యాహ్న భోజనంతో పాటు ఆవరణలో నాటిన పండ్ల మొక్కలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈఓ యాదవరెడ్డి, హెచ్ఎంలు సత్తవ్వ, అబ్దుల్ షరీఫ్, ఉపాధ్యక్షు లు భాస్కర్, సురేష్కుమార్ పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణాలు వేగిరం చేయండిఅదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ గజ్వేల్రూరల్: లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. మండల పరిధిలోని గిరిపల్లి గ్రామంలో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటిని 400 నుంచి 600 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించుకోవాలని సూచించారు. ఎలాంటి ఆటంకంలేకుండా ఇళ్లకు ఇసుక సరఫరాపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ చంద్రకళను ఆదేశించారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ దామోదర్రెడ్డి, ఎంపీడీఓ ప్రవీణ్, పంచాయతీరాజ్శాఖ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 23న మున్సిపల్ షెటర్లకు వేలందుబ్బాకటౌన్: పట్టణంలో మూడు చోట్ల ఉన్న 26 మున్సిపల్ షెటర్లకు ఈనెల 23న అద్దె ప్రాతిపాదికన బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో పోచమ్మ దేవాలయ సమీపంలో ఉన్న 16 షెటర్లకు, శాస్త్రి విగ్రహ సమీపంలో ఉన్న ఆరు షెటర్లకు, డబుల్ బెడ్రూం సమీపంలో ఉన్న 4 షెటర్లకు వేలం నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి గల వారు పోచమ్మ సమీపంలో ఉన్న షెటర్లకు రూ. 50 వేలు, మిగతా రెండు చోట్ల ఉన్న షెటర్లకు రూ.25వేల డీడీ తీసి దరఖాస్తు ఫారంతో ఈ నెల 22న కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. -
‘ఆ టెస్టులు మీరే చేయించుకుంటే మీ అసలు రంగు బయటకొస్తది’
దుబ్బాక: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ప్రజలు తన వద్ద అన్నమాటలే తాను చెప్పానని అన్నారు. తాను చేసిన దాంట్లో తప్పేముంది.. కావాలంటే తనపై కేసులు పెట్టుకోవాలని సవాల్ చేశారు కొత్త ప్రభాకర్ రెడ్డి. ప్రజలు చందాలు వేసుకుని బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని చూస్తున్నారని మరోసారి ఉద్ఘాటించారు.అవి నా వ్యాఖ్యలు కావు.. ప్రజలు మాటలుతాను ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలు తన సొంత మాటలు కావని, రాష్ట్రంలో ఉన్న చాలామంది ప్రజలు తమ వద్దకు వచ్చి అంటున్న మాటలు అని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం మారాలి అని రైతులు.. రియల్టర్లు, పారిశ్రామిక వేత్తలు కోరుకుంటున్నారన్నారు.కేసీఆర్ లేకుంటే పొంగులేటి ఉన్నాడా?మంత్రి పొంగులేటి తనను కేసీఆర్ ఆత్మ అని అంటున్నారని, కేసీఆర్ లేకుంటే పొంగులేటి ఎక్కడ ఉండేవాడు అని కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. నేడు పొంగులేటి మంత్రి పదవిలో ఉన్నాడు అంటే.. అది కేసీఆర్ వల్లే అనే విషయం గుర్తించుకోవాలన్నారు. నార్కోటిక్ టెస్ట్ లు చేయడం తనకు కాదు అని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలకు నార్కోటిక్ టెస్ట్ లు చేయాలని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కు కౌంటర్ ఇచ్చారు.అలా చేస్తే ఈ ప్రభుత్వం పై వాళ్ల మనసులో ఏముందో తెలుస్తోందన్నారు..ఇక కాంగ్రెస్ వాళ్లకు వాళ్ళ ప్రభుత్వం పై నమ్మకం లేకనే తమ పార్టీ నుండి ఎమ్మెల్యే లను తీసుకేళ్లరని, ఇప్పుడు కాకపోయిన ఇంకొద్ది రోజులు కైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం పక్క అని కొత్త ప్రభాకర్ రెడ్డి మరోసారి వ్యాఖ్యానించారు. -
అరటి పండ్ల కోల్డ్ స్టోరేజీలో మంటలు
గోదాం దగ్ధం ● భయంతో పరుగులు తీసిన కూలీలు, రైతులు ● రూ. 1.50 కోట్ల నష్టం కొండపాక(గజ్వేల్): ప్రమాదవశాత్తు అరటి పండ్ల కోల్డ్ స్టోరేజీ గోదాంకు నిప్పంటుకొని పూర్తిగా దగ్ధమైంది. పెద్దఎత్తున దట్టమైన పొగలు, మంటలు ఎగసి పడటంతో గోదాంలో పని చేసే కూలీలు, సమీప వ్యవసాయ బావుల వద్ద ఉన్న రైతులు భయంతో పరుగులు తీశారు. ఈ సంఘటన మండల పరిధిలోని మర్పడ్గ శివారులో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. మర్పడ్గ నుంచి ఖమ్మపల్లికి వెళ్లే దారిలో అర ఎకరం భూమిలో సుమారు రూ.2 కోట్లతో సిద్దిపేటకు చెందిన వ్యాపారులు కోల్డ్ స్టోరేజీ అరటి పండ్ల గోదాం నిర్వహిస్తున్నారు. అరటి తోటల నుంచి కాయలను తీసుకువచ్చి కోల్డ్ స్టోరేజీలో పండ్లుగా మార్చుతారు. వీటిని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, చేర్యాల పట్టణాలకు సరఫరా చేస్తుంటారు. సాయంత్రం వేళ గోదాంలోంచి ఒక్కసారిగా దట్టమైన మంటలు వచ్చాయి. బావుల నుంచి నీళ్లు తెచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాకపోవడంతో గోదాం పూర్తిగా దగ్ధమైంది. దీంతో సుమారు రూ.1.50 కోట్ల వరకు నష్టం జరిగిందంటూ గోదాం నిర్వాహకులు పేర్కొన్నారు. -
ఏఐ సరే.. ఇంటర్నెట్ మరి!
ఫోన్ నెట్ సాయంతో.. పక్క చిత్రంలో కనిపిస్తున్నది తొగుట మండల పరిధి.. కాన్గల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్. ఫోన్ నెట్తో ఏఐ క్లాస్లను విద్యార్థులు వింటున్నారు. ఒక్కో సారి ఫోన్ సిగ్నల్ రాకపోవడం.. ఇంటర్నెట్ లేకపోవడంతో క్లాస్లకు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇందులో సీ గ్రేడ్లో 3వ తరగతిలో ఆరుగురు, నాల్గవ తరగతిలో ఇద్దరు, ఐదవ తరగతిలో నలుగురు ఉన్నారు. విద్యార్థులకు అందని క్లాసులు ● చదువులో వెనుకబడిన వారి కోసం ఏర్పాటు ● పైలెట్ ప్రాజెక్ట్లో భాగంగా 47 పాఠశాలలో అమలు ● నెట్ సౌకర్యం లేకపోవడంతో తప్పని ఇబ్బందులు సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వ పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)కు ఇంటర్నెట్ అడ్డంకిగా మారింది. ప్రతీ రంగాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావితం చేస్తోంది. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిని ఏఐ సాయంతో మెరుగైన సాధన కోసం చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా జిల్లా పైలెట్ ప్రాజెక్ట్ కింద 47 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేశారు. వాటిలో పలు చాలా వరకు ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో క్లాస్ అంతంత మాత్రంగా సాగుతున్నాయి. వారానికి నాలుగు రోజులు.. 3 నుంచి 5వ తరగతిలో వెనకబడిన విద్యార్థులపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. మ్యాథ్స్, జనరల్ సైన్స్ సబ్జెక్ట్కు సంబంధించిన క్లాస్లు వారానికి నాలుగు రోజులు ఏఐ ద్వారా చెప్పిస్తున్నారు. ఒక్కో క్లాస్ 20 నిమిషాల పాటు కంప్యూటర్లో ఆన్లైన్లో ఏఐ క్లాస్లు చెబుతున్నారు. ముఖ్యంగా వెనకబడిన విద్యార్థులు ఈ టూల్స్ను ఉపయోగించుకొని స్వయంగా వారే తెలుగు, ఇంగ్లిష్ భాషలో అక్షరాల గుర్తించే విధంగా కృషి చేస్తుంది. సరళ పదాలు, వారి స్థాయి మేరకు పదాలను చదవడం, రాయడం, గణితంలో సంఖ్యలు రాయడం, కూడిక నుంచి మొదలుకొని భాగాహారం వరకు విద్యార్థులు స్వయంగా నేర్చుకోవడానికి ఏఐ దోహపడుతుంది. ఏఐ ద్వారా విద్యార్థులో ఆసక్తి పెరిగి ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా చక్కగా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతంత మాత్రంగానే.. పలు పాఠశాలల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేని కారణంగా మొబైల్ నెట్ కనెక్షన్తో క్లాస్లు నిర్వహిస్తున్నారు. దీనికి తోడు సెల్ ఫోన్ల సిగ్నల్ లేక కొన్ని పాఠశాలలో అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. మొదటి విడతలో ఏఐ క్లాస్ల నిర్వహణలో ఏర్పడిన సమస్యలను అధిగమిస్తేనే సత్ఫాలితాలు వస్తాయి. అన్ని పాఠశాలలో ఏఐ ల్యాబ్లను ఏర్పాటు చేసి చదువులో వెనకబడిన విద్యార్థులను ప్రోత్సహించి వారు మరింతగా చదివే విధంగా కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.స్కూల్ గ్రాంట్స్తో తీసుకోవాలి ఏఐ ద్వారా బోధనకు ఎంపికై న పాఠశాలల్లో ఇంటర్నెట్ కనెక్షన్ను స్కూల్ గ్రాంట్ నిధులతో తీసుకోవాలని ఆదేశించాం. పాఠశాలలను పరిశీలించి అన్నింటికీ ఇంటర్నెట్ ఉండేలా కృషి చేస్తాం. –శ్రీనివాస్ రెడ్డి, డీఈఓఫోన్ డేటా సాయంతోనే.. మా పాఠశాలకు ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో మా ఫోన్లతోనే ఇంటర్నెట్ను కనెక్ట్ చేసి విద్యార్థులకు ఏఐ ద్వారా బోధనను అందిస్తున్నాం. ఒక డెస్క్ టాప్, ల్యాప్టాప్, ట్యాబ్లను వినియోగిస్తున్నాం. మరో మూడు డెస్క్ టాప్లను వినియోగించడం లేదు. పలు ప్రైవేట్ కంపెనీల ఇంటర్నెట్ వారిని నెట్ కోసం సంప్రదించాం. చాలా దూరం ఉండటంతో ఇవ్వలే మని చెబుతున్నారు. అయినా ప్రయత్నిస్తున్నాం. – మధు, హెచ్ఎం, కాన్గల్, ప్రాథమిక పాఠశాల