Visakhapatnam
-
అరుదైన ప్రాణులకు ఊపిరి
ఆరిలోవ: వాతావరణ కాలుష్యం, వేటగాళ్ల ఉచ్చులు, క్రూర మృగాల దాడి, మారుతున్న పర్యావరణ పరిస్థితుల కారణంగా ఎన్నో వన్యప్రాణి జాతులు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. ఒకప్పుడు సజీవంగా ఉన్న జాతులు నేటి తరానికి టీవీల్లో, పుస్తకాల్లో మాత్రమే కనిపించే పరిస్థితి నెలకొంది.వాటి ఉనికే ప్రశ్నార్థకమవుతున్న ఈ తరుణంలో విశాఖ నగరంలోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్కు ఒక ఆశాకిరణంగా నిలుస్తోంది. అంతరించిపోతున్న అరుదైన వన్యప్రాణులకు పునరుత్పత్తి కేంద్రంగా మారి, వాటి వంశాన్ని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడి సంరక్షకుల కృషితో గత ఎనిమిది నెలల్లోనే 12 అంతరించిపోతున్న జాతులకు చెందిన 46 పిల్లలు ఊపిరిపోసుకున్నాయి. వన్యప్రాణి సంరక్షణలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాయి. అరుదైన జీవులకు అభయం విశాఖ జూ పార్కు ఇప్పుడు కేవలం జంతు ప్రదర్శనశాల మాత్రమే కాదు.. అంతరించిపోతున్న జీవజాతులకు ఒక సురక్షితమైన ఆవాసం, పునరుత్పత్తి కేంద్రం. వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972 ప్రకారం షెడ్యూల్–1 జాబితాలోని అనేక జీవులు ఇక్కడ విజయవంతంగా తమ సంతతిని పెంచుకుంటున్నాయి. జింక పిల్లలు, అడవి దున్నలు, అడవి కుక్కల పిల్లలు, నీల్గై, రెడ్నెక్డ్ వాలబీ, బెంగాల్ ఫాక్స్, ఇండియన్ గ్రే వోల్ఫ్, రింగ్టైల్డ్ లెమూర్స్ వంటి జాతులకు చెందిన చిట్టి ప్రాణులు తమ ఎన్క్లోజర్లలో తల్లుల వెంట ఉత్సాహంగా తిరుగుతూ సందర్శకులను అలరిస్తున్నాయి. ఈ అద్భుతమైన దృశ్యాలు జూకి వచ్చే వారికి కనువిందు చేయడమే కాకుండా, అంతరించిపోతున్న జాతులను పరిరక్షించడం ఎంత అవసరమో తెలియజేస్తున్నాయి. వెటర్నరీ వైద్యులు, యానిమల్ కీపర్ల నిరంతర పర్యవేక్షణలో ఈ ఘనత సాధ్యమైంది.8 నెలలు.. 46 బుల్లి ప్రాణులు గడిచిన ఎనిమిది నెలలకాలంలో ఇందిరా గాంధీ జూ పార్కులో 12 రకాల వన్యప్రాణులకు 46 పిల్లలు పుట్టాయి. ఇందులో అడవి కుక్కలు–14, కృష్ణ జింక (రాష్ట్ర జంతువు) –9, చుక్కల జింక–7, కనుజు–5, నీల్ గై–3, బార్కింగ్ డీర్–2, మౌస్ డీర్–1, బెంగాల్ ఫాక్స్–1, ఇండియన్ గ్రే వోల్ఫ్–1, అడవి దున్న (బైసన్)–1, రెడ్–నెక్డ్ వాలబీ–1, రింగ్టైల్డ్ లెమూర్–1 ఉన్నాయి. అంతరించిపోతున్న జాతుల విశేషాలివి.. ఈ జూలో పునరుత్పత్తి అవుతున్న కొన్ని ముఖ్యమైన అంతరించిపోతున్న జాతులు, వాటి ప్రత్యేకతలు ఇప్పుడు తెలుసుకుందాం.. ⇒ అడవి కుక్కలు(ఆసియాటిక్ వైల్డ్ డాగ్స్): ఇవి వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లోని షెడ్యూల్–1 కిందకు వస్తాయి. ఇందిరా గాంధీ జూ పార్కులో వీటి పునరుత్పత్తి కేంద్రం ఉంది. వీటి ఎత్తు సుమారు 50 సెం.మీ., శరీరం పొడవు 90 సెం.మీ., తోక పొడవు 40–45 సెం.మీ. ఉంటుంది. ⇒ కృష్ణ జింక(బ్లాక్బక్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువుగా గుర్తింపు పొందిన ఈ జింకలు, తమ మెలితిరిగిన కొమ్ములతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కృష్ణ జింక షెడ్యూల్–1 జాబితాలో ఉంది ⇒ మూషిక జింక(మౌస్ డీర్): షెడ్యూల్–1 జాబితాలోని ఈ జింక శరీరం పొడవు 50–60 సెం.మీ., బరువు 3–4 కిలోలు ఉంటుంది. ప్రపంచంలోని అతి చిన్న జింక జాతులలో ఇది ఒకటి. చూడటానికి చిన్నగా, సున్నితంగా ఉండే ఈ జీవి కూడా షెడ్యూల్–1 జాబితాలో ఉంది. ⇒ కనుజు : ఇది కూడా షెడ్యూల్–1 జాబితాలో ఉంది. మగ కనుజులకు చెట్ల కొమ్మల మాదిరిగా ఉండే కొమ్ములు 3.5 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. ⇒ నీలి ఎద్దు( నీల్గై): ఆసియా జింక జాతులలో అతి పెద్దదైన నీల్గై షెడ్యూల్–2 జాబితాలో ఉంది. దీని గొంతు భాగం తెల్లగా ఉంటుంది. మగ నీల్గైకి 13 సెం.మీ. జుట్టు ఉంటుంది. ఆడవి 200 కిలోలు, మగవి 250 కిలోల వరకు బరువు వరకు పెరుగుతాయి. ⇒ రెడ్ నెక్డ్ వాలబీ: ఈ జాతి జీవుల పునరుత్పత్తి ఎంతో ఆసక్తికరం. రెడ్నెక్డ్ వాలబీ గర్భం దాల్చిన 30 రోజుల్లో పిల్లకు జని్మస్తుంది. తర్వాత ఆ పిల్ల తల్లి పొట్ట కింద సంచిలో సుమారు 7 నెలల పాటు పెరిగి, తల్లి పాలు తాగుతుంది. 12 నెలల తర్వాత స్వతంత్రంగా జీవించడం మొదలుపెడుతుంది.వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు జూ పార్కులో వన్య ప్రాణుల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాం. ఇటీవల పునరుత్పత్తి అయిన పలు రకాల జాతుల పిల్లలను ఇక్కడ సంరక్షకులు, జూ వెటర్నరీ వైద్యులు, సిబ్బంది, యానిమల్ కీపర్లు ప్రత్యేక శ్రద్ధతో సంరక్షిస్తున్నారు. అంతరించిపోతున్న జాతుల సంతతి జూలో గణనీయంగా పెరుగుతోంది. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం వీటికి ఎలాంటి హాని కలిగించినా చట్టరీత్యా నేరమవుతుంది. – జి.మంగమ్మ, జూ క్యూరేటర్ -
తల్లిదండ్రుల ఆందోళన
50 ఏళ్ల చరిత్ర గల పాఠశాల మూసివేతకు యత్నం ● ఉపాధ్యాయులు లేరని గేటుకు తాళం ● విద్యాశాఖ అధికారులతో చర్చలు ● సమస్య పరిష్కారం కాకుండానే వెనుదిరిగిన అధికారులు అధికారుల నిర్లక్ష్యం ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన పాఠశాలను మూసివేయడం తగదు. పాలకులు, విద్యాశాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కూట మి ప్రభుత్వం తీరు ఏమాత్రం బాగోలేదు. –అప్పలరాజు, పేరెంటు, గొల్లకంచరపాలెం.పాఠశాలనుకొనసాగించాలి జీవనోపాధికోసం పల్లె నుంచి పట్టణానికి వచ్చాం. కంచరపాలెం పరిధి పరిసర ప్రాంతాల్లో ఏళ్ల చరిత్ర కల్గిన పాఠశాల అని విని మా పిల్లలను ఇదే పాఠశాలలో చేర్పించాం. ఇప్పుడు మూసివేస్తామని చెప్పడం దారుణం. పాఠశాల మూసివేస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. –టి.సావిత్రి దుర్గానగర్, కంచరపాలెంకంచరపాలెం: జీవీఎంసీ పరిధిలోని కంచరపాలెం రామ్మూర్తిపంతులుపేట ఉన్నత పాఠశాల క్యాంపస్లో ఉన్న జీవీఎంసీ కంచరపాలెం ప్రాథమిక పాఠశాలను టీచర్లు లేరనే సాకుతో మూసివేయడానికి ప్రయత్నించారు. దీంతో సోమవారం పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 50 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పాఠశాలను మూసివేయడాన్ని నిరసిస్తూ, తల్లిదండ్రులు కంచరపాలెం నేతాజీ కూడలి ఫ్లైఓవర్ వంతెన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. గతంలో కంచరపాలెం పరిధిలో ఆర్పీపేట ప్రాథమిక, కంచరపాలెం ప్రాథమిక, రామ్మూర్తిపంతులుపేట, కే.కాలనీ ఉన్నత పాఠశాలలు ఉండేవి. పదేళ్ల క్రితం కే.కాలనీ ఉన్నత పాఠశాలను ఉపాధ్యాయుల లబ్ధి కోసం బర్మాక్యాంప్ కొండవాలు ప్రాంతానికి తరలించారు. అప్పటి నుంచి కే.కాలనీ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు రామ్మూర్తిపంతులుపేట ఉన్నత పాఠశాలలోనే చేరుతున్నారు. ఉపాధ్యాయుల కొరతపై ఆందోళన కంచరపాలెం ప్రాథమిక పాఠశాలలో గత ఏడాది వరకు 11 మంది ఉపాధ్యాయులు ఉండగా, ప్రస్తుతం కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. మిగిలిన 9 మంది ఉపాధ్యాయులు కౌన్సెలింగ్లో బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 3, 4, 5 తరగతులకు చెందిన 225 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సోమవారం ఉదయం పాఠశాలను తెరవకుండా తాళాలు వేశారు. తమ పిల్లలను పాఠశాలకు తీసుకొచ్చిన తల్లిదండ్రులు తాళాలు వేసి ఉండటంతో ఆందోళన చెందారు. పోలీసుల జోక్యం పాఠశాల ఆవరణలో రికార్డు షీట్లు తీసుకుని సమీప పాఠశాలల్లో చేరాలంటూ ఏర్పాటు చేసిన బోర్డును చూసిన తల్లిదండ్రులు స్థానిక కార్పొరేటర్ రాజశేఖర్కు, విద్యాశాఖాధికారులకు ఫోన్లు చేశారు. వార్డు మాజీ కార్పొరేటర్ బొట్టా ఈశ్వరమ్మకు, ఎస్ఎఫ్ఎస్ నాయకులకు సమాచారం అందించడంతో, ఈశ్వరమ్మ విద్యాశాఖాధికారులతో ఫోన్లో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి విద్యాశాఖాధికారులు రావాలంటూ నినాదాలు చేశారు. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో కంచరపాలెం నేతాజీ ఫ్లైఓవర్ కూడలిలో రాస్తారోకో చేపట్టారు. ట్రాఫిక్కు అంతరాయం కలగడంతో సీఐ చంద్రశేఖర్ జోక్యం చేసుకుని, తల్లిదండ్రులకు నచ్చచెప్పి, విద్యాశాఖాధికారులతో మాట్లాడి పాఠశాల తెరిచేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన విరమించారు. మొక్కుబడిగా సమావేశం పాఠశాల మూసివేతపై ఆందోళన చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి సోమవారం సాయంత్రం ఎంఈవో–2 దివాకర్, సీఐచంద్రశేఖర్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) ప్రేమ్కుమార్ , డిప్యూటీ డీఈవో సోమశేఖర్ కూడా పాల్గొన్నారు. సమస్య పరిష్కారంపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగిసింది.విద్యార్థుల జీవితాలతో ఆటలు విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోవద్దు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విద్యకు, పాఠశాలలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. నేడు ఆ పరిస్థితి కనిపించడంలేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాఠశాలను మూసివేయకుండా చర్యలు తీసుకోవాలి –ఎస్.పుష్పలత, తోటవీధి, కంచరపాలెం. -
మేయర్ను పట్టించుకోని ఎమ్మెల్యే
● వంశీకృష్ణ ఏకపక్ష వైఖరి ● మేయర్, స్థానిక కార్పొరేటర్కు తెలియకుండానే భూమిపూజడాబాగార్డెన్స్: దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ ఏకపక్ష నిర్ణయాలు విమర్శలకు దారితీశాయి. నగర ప్రథమ పౌరుడైన మేయర్ పీలా శ్రీనివాసరావు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, స్థానిక కార్పొరేటర్కు సమాచారం ఇవ్వకుండానే వార్డు అభివృద్ధి పనులకు భూమిపూజ నిర్వహించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటన మూడు రోజుల ముందుగానే ఖరారైనప్పటికీ, ఎమ్మెల్యే హడావుడిగా భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించడం వెనుక ఆంతర్యం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. యోగాంధ్ర కార్యక్రమం ప్రపంచ స్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో, ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి స్వయంగా విశాఖ వస్తున్న తరుణంలో భూమిపూజ కార్యక్రమాన్ని వేరొక రోజుకు మార్చుకుందామని మేయర్ పీలా శ్రీనివాసరావు సూచించారు. అయితే ఎమ్మెల్యే వంశీకృష్ణ మాత్రం మేయర్ సూచనలను బేఖాతర్ చేయడంపై ‘నగర ప్రథమ పౌరుడికిచ్చే గౌరవం ఇదేనా?’ అంటూ కూటమి నేతల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కార్పొరేటర్కు సమాచారం లేదు వార్డు అభివృద్ధి పనులకు సంబంధించి సోమవారం జరిగిన భూమిపూజ సందర్భంగా కనీసం స్థానిక కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్కు కూడా సమాచారం ఇవ్వకుండా, తన పార్టీకి చెందిన కొందరు చోటా నాయకులతోనే ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తన వార్డులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన భూమిపూజ విషయంలో తనకెందుకు సమాచారం ఇవ్వలేదో చెప్పాలని కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ సదరు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. కౌన్సిల్లో పోరాడి నిధులు సాధించిన కార్పొరేటర్ జీవీఎంసీ 41వ వార్డు అభివృద్ధి పనులకు సంబంధించి స్థానిక కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ కౌన్సిల్లో పోరాడారు. సుమారు రూ.10 కోట్లకు పైగా నిధులు సాధించి, వార్డు సమస్యల పరిష్కార దిశగా కృషి చేస్తున్నారు. ఇదిలా ఉండగా సొంత నిధులతో వార్డుకు సేవలందిస్తున్న కార్పొరేటర్ లేకుండా, హోల్సేల్ మార్కెట్, క్రిస్టియన్ శ్మశాన వాటిక మౌలిక వసతులకు కనీసం ప్రజాప్రతినిధులతో సంబంధం లేకుండా భూమిపూజ చేయడపై స్థానికులు విస్మయం వ్యక్తం చెందారు. -
ఏ తల్లి కన్నబిడ్డో..!
తగరపువలస: సింహాచలం–విజయనగరం రోడ్డులోని అనంతవరం కూడలి బస్టాప్లో ఓ గుర్తు తెలియని మహిళ అప్పుడే పుట్టిన మగబిడ్డను వదిలేసి వెళ్లిపోయింది. ఆనందపురం మండలం శిర్లపాలెం గ్రామ పంచాయతీకి చెందిన బెవర సత్యవమ్మ ఈ బిడ్డను గ్రామంలోకి తీసుకువెళ్లి కోరాడ వరలక్ష్మి అనే మహిళకు ఇచ్చింది. దీంతో పంచాయతీలో కలకలం మొదలైంది. బిడ్డను పెంచుకోవడానికి పలువురు పోటీపడటంతో స్థానికులు ఆనందపురం పోలీసులకు, పద్మనాభం 108 వాహన సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఎం.తిరుపతి, ఎస్.బంగార్రాజు శిశువుకు అత్యవసర చికిత్స అందించి, హుటాహుటిన కేజీహెచ్కి తరలించారు. ఆనందపురం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీ జిల్లా అనుబంధ కమిటీల నియామకం
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ విశాఖ జిల్లా 19 అనుబంధ విభాగాల కమిటీలను నియమించారు. ఈ మేరకు సోమవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ● జిల్లా బూత్ విభాగం కమిటీ ప్రధాన కార్యదర్శిగా అబ్దుల్ సఖి, కార్యదర్శులుగా చట్టి నూకరాజు, ఈది మధుబాబు, ఇద్దరు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ను నియమించారు. ● జిల్లా అంగన్వాడీ విభాగం కమిటీ ప్రధాన కార్యదర్శులుగా కొల్లి రమణమ్మ, పిలకా వరలక్ష్మి, కార్యదర్శులుగా సికల అనిత, పాల కుసుమకుమారితో పాటు నలుగురు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ను నియమించారు. ● జిల్లా బీసీ సెల్ కమిటీ ప్రధాన కార్యదర్శులుగా పాతపట్నం రామ్మోహన్, ఎన్నెటి రమణ, గంగల్ల లక్ష్మణరావు, కార్యదర్శులుగా వారధి పార్థి నరసింహమూర్తి, శిస్తు చంద్రశేఖర్తో పాటు తొమ్మిది మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కు చోటుకల్పించారు. ● జిల్లా క్రిస్టియన్ మైనారిటీ విభాగం కమిటీ వైస్ ప్రెసిడెంట్గా మోకాన సుధాకర్, ప్రధాన కార్యదర్శులుగా గొట్టివాడ దానయ్య, బండుకొండ నాగమణి, కార్యదర్శులుగా దమ్మ గోవింద్, కొండపల్లి చిట్టితల్లి, గంట్యాడ రూపావతితో పాటు ముగ్గురు ఎగ్జిక్యూటివ్ మెంబర్లగా అవకాశం కల్పించారు. ● జిల్లా సాంస్కృతిక విభాగం కమిటీ వైస్ ప్రెసిడెంట్గా విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పడాల స్వప్న, ప్రధాన కార్యదర్శిగా శరగడం పద్మ, కార్యదర్శిగా కోన లక్ష్మితో పాటు నలుగురికి ఎగ్జిక్యూటివ్ మెంబర్లగా స్థానం కల్పించారు. ● జిల్లా వైఎస్సార్టీయూసీ విభాగం కమిటీ వైస్ ప్రెసిడెంట్గా గాలి ప్రసాద్, ప్రధాన కార్యదర్శులుగా పిలకా వెంకట రమణ, కై లాస్ మాలిక్, కార్యదర్శులుగా వరపాల మహేష్, నడుపూరి అనిల్కుమార్, కంచు మూర్తి వెంకట రమణతో పాటు నలుగురిని ఎగ్జిక్యూటివ్ మెంబర్లగా నియమించారు. ● జిల్లా చేనేత విభాగం కమిటీ వైస్ ప్రెసిడెంట్గా మీసాల రత్నం, ప్రధాన కార్యదర్శిగా నీలి శ్రీనివాసరావు, కార్యదర్శిగా కాపు విజయ, ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కాలిపాక సంధ్యను నియమించారు. ● జిల్లా వలంటీర్ విభాగం కమిటీ వైస్ ప్రెసిడెంట్గా దూడ అప్పారావు, ప్రధాన కార్యదర్శిగా అన్నెపు సూర్యనారాయణ, కార్యదర్శులుగా డి.స్వరూపరాణి, గొండేసి గోవింద్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా బి.మోహన్రావు, జి.సూర్య ప్రకాష్, యాసలపు శ్రీనివాసరావు, బొజ్జ సంతోష్ సాగర్, శ్రీమంతపురం బానూజీరావు, బొడ్డు దుర్గారావు, బేతా శ్రీనివాసరావును నియమించారు. ● జిల్లా వాణిజ్య విభాగం కమిటీ ప్రధాన కార్యదర్శిగా దొడ్డి రమేష్కుమార్, కార్యదర్శులుగా వెలుగల జగదీష్, చెరుకూరి కుమార్, మీసాల సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ మెంబర్లగా బి.దంతేశ్వరరావు, పులేకుర్తి శ్రీనివాసరావు, పశుపురెడ్డి అప్పారావు, చేకూరి ముకుందరావు, కోరాడ శ్రీనివాసరావును నియమించారు. ● జిల్లా సోషల్ మీడియా విభాగం కమిటీ ప్రధాన కార్యదర్శులుగా తండ్రంగి మహేష్బాబు, నల్ల రామకృష్ణ, వాసు పొట్నూరు, కార్యదర్శిగా కాండ్రేగుల త్రినాథ్తో పాటు ఏడుగురు ఎగ్జిక్యూటివ్ మెంబర్లను నియమించారు ● జిల్లా ఎస్సీ విభాగం కమిటీ వైస్ ప్రెసిడెంట్లుగా కోనా శంకర్, ఎడ్ల సిద్ధార్థరాజు, ముంజేటి హనుమంతురావు, ప్రధాన కార్యదర్శిగా ఆరుగుల అప్పన్న, కార్యదర్శులుగా ధనల ఆంజనేయులబాబు, గారా కృపారావు, నేతల కుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా 12 మందిని నియమించారు. ● జిల్లా ఆర్టీఐ విభాగం వైస్ ప్రెసిడెంట్గా కోడూరి సుశీల, ప్రధాన కార్యదర్శులుగా మహ దశ్యం గోపి, గంట్యాడ కృష్ణమూర్తి, కార్యదర్శులు కె.సీతయ్యరెడ్డి, నక్క త్రినాఽథ్తో పాటు ఐదుగురు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ను నియమించారు. ● జిల్లా ప్రచార విభాగం కమిటీ ప్రెసిడెంట్గా జిలకర్ర నాగేంద్ర, ప్రధాన కార్యదర్శులుగా కసరి ఫణిదీప్తి, యలమంచిలి అప్పారావు యాదవ్, గవర నాయుడు, కార్యదర్శులుగా కోరబిల్లి మహేష్, బోరా అప్పలరెడ్డి, కొండపు సత్తిబాబుతో పాటు ఆరుగురు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ను నియమించారు. ● జిల్లా మైనారిటీ విభాగం కమిటీలో ప్రధాన కార్యదర్శులుగా నజమే అబ్బాస్, షేక్ రహమన్, కార్యదర్శులు మహ్మద్ హర్షద్, మహమద్ కరీన్ మిరిష్, షేక్ రజియ్య, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ను నియమించారు. ● జిల్లా మహిళా విభాగం కమిటీ ప్రధాన కార్యదర్శులుగా శరగడం వెంకట లక్ష్మి, పిలిరిచెట్టి సుజాత, కార్యదర్శులుగా మెట్ట దమయంతి, బాసంగి రాజేశ్వరి, కార్యదర్శులుగా కాండ్రుగుల కనకలక్ష్మి, కరణం లక్ష్మి, ఆరుగురు ఎగ్జిక్యూటివ్ మెంబర్లను నియమించారు ● జిల్లా న్యాయ విభాగం కమిటీ ప్రధాన కార్యదర్శులుగా ఎండిబోయిన లక్ష్మి, రాయుడు సుబ్రహ్మణ్యం రవి, కార్యదర్శిగా వాగుపల్లి చిన్నారావును నియమించారు ● జిల్లా ఐటీ వింగ్ కార్యదర్శిగా గర్భాపు శ్యామ్కుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కోటాన శ్రీనివాసరావు, జిల్లా ఇంటలెక్చవల్స్ ఫోరం ప్రధాన కార్యదర్శిగా పేరం రామకృష్ణను నియమించారు. ● జిల్లా గ్రీవెన్స్ సెల్ కమిటీ ప్రధాన కార్యదర్శులుగా అల్లు రామగోవిందేశ్వరరావు, పెదిరెడ్డి చంద్రశేఖర్, కార్యదర్శులుగా జిరు శ్రీనివాస్, చరకాపు రామారావుతోపాటు ఏడుగురు ఎగ్జిక్యూటివ్ మెంబర్లను నియమించారు. -
పోర్ట్కు రెండు ప్రతిష్టాత్మక సీఎస్ఆర్ అవార్డులు
విశాఖ సిటీ: విశాఖ పోర్ట్ అథారిటీ(వీపీఏ)కు రెండు ప్రతిష్టాత్మక సీఎస్ఆర్ అవార్డులు లభించాయి. ఢిల్లీలో జరిగిన 11వ వార్షిక గ్రీన్టెక్ సీఎస్ఆర్ అవార్డ్స్–2025లో ఈ అవార్డులను అందజేశారు. హెల్త్ కేర్ ప్రమోషన్, నైపుణ్యాభివృద్ధి విభాగాల్లో వీపీఏ చేసిన కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ అవార్డులు దక్కాయి. ఈ అవార్డులు లభించడం పట్ల పోర్టు చైర్పర్సన్ డాక్టర్ ఎం.అంగముత్తు సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయానికి కారకులైన ఉద్యోగులను ప్రత్యేకంగా అభినందించారు. సామాజిక పరంగా సమగ్రాభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని పిలుపునిచ్చారు. -
యోగా దినోత్సవాన్ని విజయవంతం చేద్దాం
మహారాణిపేట/ఏయూక్యాంపస్: విశాఖలో ఈనెల 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే ఈ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు సోమవారం విశాఖ వచ్చిన సీఎం చంద్రబాబు ఆర్కే బీచ్ నుంచి రుషికొండ సమీపంలోని గీతం యూనివర్సిటీ వరకూ క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. యోగా డేలో పాల్గొనే వారితో మాక్ యోగా నిర్వహించాలని సూచించారు. యోగా డే ఏర్పాట్లను యోగాంధ్ర 2025 నోడల్ అధికారి ఎం.టి కృష్ణబాబు వివరించారు. ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం ఏయూ మైదానంలో జరుగుతున్న పనులను సీఎం పరిశీలించారు. ఏయూ మైదానంలో విద్యార్థులతో యోగా చేయించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ హరేందిర ప్రసాద్ తెలిపారు. అనంతరం ప్రజా ప్రతినిధులు, అధికారులతో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విశాఖలో చారిత్రక వేడుకకు నాంది పలుకుతున్నామన్నారు. యోగా డేలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నాచారు. యోగా డే నిర్వహణకు సంబంధించి భారతీయ నౌకాదళం కూడా 11 నౌకల్ని ఆర్కే బీచ్ సమీపంలో ప్రదర్శించనుందని వెల్లడించారు. కార్యక్రమంలో మంత్రులు పి.నారాయణ, వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ ఎం.శ్రీభరత్, సిఎస్ కె.విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇతర అధికారులు పాల్గొన్నారు. విశాఖలో ఏర్పాట్లనుపరిశీలించిన సీఎం చంద్రబాబు -
ఐదు నెలల నిరీక్షణకు తెర
డాబాగార్డెన్స్: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కు దాదాపు ఐదు నెలల నిరీక్షణ తర్వాత ప్రభుత్వం సోమవారం నూతన కమిషనర్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఐదు నెలలుగా కమిషనర్ లేకపోవడంతో పాలనలో తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పనిచేసిన కేతన్ గార్గ్ (రాజస్థాన్కు చెందిన 2018 బ్యాచ్ ఐఏఎస్ అధికారి) జీవీఎంసీ కమిషనర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్గా, విజయనగరం, రాజాంపేటలో వివిధ హోదాల్లో గార్గ్ పనిచేశారు. అస్తవ్యస్త పాలన గాడిన పడేనా? దాదాపు 20 లక్షలకు పైబడిన జనాభా, 98 మంది కార్పొరేటర్లు, ఎనిమిది జోన్లతో కూడిన జీవీఎంసీకి ఐదు నెలలుగా కమిషనర్ లేకపోవడంతో పాలన అస్తవ్యస్తంగా మారింది. కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ కలెక్టరేట్ విధులు, జీవీఎంసీ ఇన్చార్జ్ కమిషనర్ బాధ్యతలను ఏకకాలంలో నిర్వహించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ కారణంగా ఫైల్స్ నిలిచిపోవడంతో పాటు, నగర పౌరులకు సేవలు సక్రమంగా అందలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. కింది స్థాయి అధికారులు తూతూ మంత్రంగా విధులు నిర్వహించడంతో పనులు అరకొరగా సాగాయి. అధికారులను నిలదీసే పాలకవర్గం కూడా మొక్కుబడిగా పాలన సాగిస్తోందని కౌన్సిల్ సభ్యులే గతంలో వాపోయారు. ప్రభుత్వంపై ఒత్తిడి, కలెక్టర్కు ఉపశమనం ఇటీవల నిర్వహించిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ను నియమించాలని వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. కీలకమైన కమిషనర్ పోస్టును నెలల తరబడి భర్తీ చేయకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు కూడా జీవీఎంసీకి ఐదు నెలలుగా కమిషనర్ లేకపోవడం దౌర్భాగ్యమని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వెంటనే కమిషనర్ను నియమించేలా చూడాలని అన్నారు. ఈ నేపథ్యంలో నూతన కమిషనర్ నియామకంతో కలెక్టర్ హరేందిర ప్రసాద్ కొంత ఉపశమనం పొందారని పలువురు అధికారులు చెబుతున్నారు. జీవీఎంసీ కమిషనర్గా కేతన్గార్గ్ -
అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలుచేయాలి
బీచ్రోడ్డు: అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, సాధికార సర్వేలో ‘ప్రభుత్వ ఉద్యోగి’ అనే పదాన్ని తొలగించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్లు సోమవారం జీవీఎంసీ వద్ద గల గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నాయకురాలు కె.వెంకటలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులు కాదని, వారికి ఇస్తున్నది కేవలం గౌరవ వేతనం మాత్రమేనని ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ఆరేళ్లుగా వేతనాలు పెంచలేదని, ధరలు ఆకాశాన్నంటుతున్నా ప్రభుత్వం ఈ విషయాన్ని విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘తల్లికి వందనం’, పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్లు, ఇంటి స్థలాలు వంటి సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి అంగన్వాడీ వర్కర్కు, హెల్పర్కు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు మణి, గౌరవ సలహాదారు బృందావతి, జిల్లా ప్రధాన కార్యదర్శి దేవి, కోశాధికారి కె. పద్మావతి, జిల్లా నాయకులు శ్రీదేవి, సత్యవతి, బేగం, శివలక్ష్మి, వెంకటలక్ష్మి, దుర్గ, మాధురి, సుగుణ, సులోచన తదితరులు పాల్గొన్నారు. -
మెట్రో మొదటి దశ పనుల పరిశీలన
మహారాణిపేట: విశాఖపట్నంలో మెట్రో రైలు విస్తరణ, అభివృద్ధిలో భాగంగా మొదటి దశ పనులను అధికారులు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా కారిడార్ 1, 2, 4 నిర్మాణ ప్రాజెక్టు 46.23 కిలోమీటర్ల మేర సాగనుంది. ఈ ప్రాజెక్టు పనుల పురోగతిని రెవెన్యూ భూసేకరణ అధికారులు సోమవారం పరిశీలించారు. మెట్రో ప్రాజెక్టు కోసం అవసరమైన భూసేకరణ నిమిత్తం సమగ్ర నివేదికను రూపొందించడానికి కలెక్టర్ సోషల్ ఇంపాక్టు అసెస్సెమెంటు(ఎస్ఐఏ) కమిటీని నియమించారు. ఈ కమిటీ సోమవారం వివిధ ప్రాంతాల్లో పర్యటించి, క్షేత్రస్థాయి వివరాలను సేకరించి నివేదిక తయారీలో నిమగ్నమైంది. మెట్రో పథకం కోసం గాజువాక, గోపాలపట్నం మండలాల్లోని పలు గ్రామాలతో పాటు విశాఖ నగరం, విశాఖ గ్రామీణ మండలం, విశాఖ జోన్–3, జోన్–4, జోన్–5లలోని నిర్దిష్ట వార్డుల నుంచి భూములను ఎంపిక చేశారు. మొత్తం 9.22 ఎకరాల పట్టా భూమితో పాటు, అదనంగా 87 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించాల్సి ఉంది. నూతన భూసేకరణ చట్టం 2013 ప్రకారం, భూసేకరణకు ముందుగా సామాజిక ప్రభావ అంచనా నివేదికను తప్పనిసరిగా తయారు చేయాలి. ఈ నివేదిక రూపకల్పనకు నియమించిన బృందంలో మెట్రో ప్రాజెక్టు డిప్యూటీ తహసీల్దార్ పద్మావతి, సర్వేయర్ శ్రీనుబాబు, ఎస్ఐఏ సామాజిక నిపుణులు పి.దేవరాజ్, సభ్యులు శ్రీనివాస్, మెట్రో రైలు ప్రాజెక్టు ఇంజనీర్ లక్ష్మణ్, రెవెన్యూ సిబ్బంది, భూ నిర్వాసితులు తదితరులు పాల్గొన్నారు. భూసేకరణకు అవసరమైన భూములను, అలాగే నష్టపోయే గృహ, వ్యాపార నివాసాలను బృందం పర్యవేక్షించింది. నిర్వాసితులను నేరుగా కలిసి వారి సామాజిక, ఆర్థిక, సాంఘిక స్థితిగతులను తెలుసుకుని, వారి వివరాలను నమోదు చేసుకునేందుకు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు. -
సర్వం సన్నద్ధం
21న విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ● పాల్గొననున్న ప్రధాని మోదీ ● నగరంలో 5 లక్షల మందితో యోగాసనాలు ● ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 326 కంపార్ట్మెంట్ల ఏర్పాటు ● 3.5 లక్షల యోగా మ్యాట్లు సిద్ధం ● గిన్నిస్ రికార్డు కోసం ప్రణాళికలు ● 21న విద్యా సంస్థలకు సెలవు విశాఖ సిటీ: యోగాంధ్రకు నగరం ముస్తాబవుతోంది. ఐదు లక్షల మంది యోగాసనాలకు విశాఖ వేదిక అవుతోంది. గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కేందుకు సమాయత్తమవుతోంది. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ఈ నెల 21వ తేదీన విశాఖ అతిథ్యమిస్తోంది. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, అనేక మంది ప్రముఖులు ఈ వేడుకకు తరలిరానున్నారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, సిబ్బందితో పాటు ప్రజలను సైతం పెద్ద సంఖ్యలో భాగస్వాములను చేసేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. ఈ కార్యక్రమం దృష్ట్యా విద్యా సంస్థలకు 21 తేదీన సెలవుగా ప్రకటించారు. 2 కి.మీ మేర ప్రధాన వేదిక ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు కాళీమాత ఆలయం నుంచి పార్కు హోటల్ వరకు ప్రధాన వేదిక కానుంది. ఇక్కడే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రముఖులు, నేవీ అధికారులు, అధికారులు యోగాసనాలు చేయనున్నారు. ఈ రెండు కిలోమీటర్లు మేర ప్రధాన వేదికలో 12 కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి కంపార్ట్మెంట్లో వెయ్యి మంది ఉంటారు. ప్రధాన వేదిక తర్వాత సీ1 కంపార్ట్మెంట్ ఉంటుంది. పార్కు హోటల్ వరకు మొత్తం 12 కంపార్ట్మెంట్లు ఉంటాయి. సీ6 వరకు 9 వేల మంది ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డు సిబ్బందితో పాటు, ఇంటర్నేషనల్ యోగా స్టూడెంట్స్, యోగా అసోసియేషన్ సభ్యులు, వివిధ స్థాయిల్లో యోగా పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు పాల్గొంటారు. అలాగే సీ7 నుంచి సీ12 వరకు గల కంపార్ట్మెంట్లలో సమీపంలోని నివాసితులు భాగస్వామ్యమవుతారు. ఈ ప్రధాన వేదిక వద్ద పాల్గొనే వారి అవసరాలకు అనుగుణంగా 1400 టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రధాన వేదిక ప్రాంతంలో అదనపు కంపార్ట్మెంట్లతో కలిపి మొత్తం 15 వేల మంది పాల్గొననున్నారు. ఒక వేళ వర్షం పడితే ఈ ప్రధాన వేదికను ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలోకి మార్చనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. విదేశీ విద్యార్థుల రాక ఈ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు విదేశీ విద్యార్థులు రానున్నారు. 13 దేశాలకు చెందిన 76 మంది విద్యార్థులు ఈ నెల 20న విశాఖకు చేరుకోనున్నారు. ముందు వీరికి కోవిడ్ పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం మూడు ప్రత్యేక బస్సుల్లో కంపార్ట్మెంట్లకు తీసుకురానున్నారు. భారీ భద్రతా ఏర్పాట్లు భారీ స్థాయిలో చేపడుతున్న యోగాంధ్ర వేడుకలకు పోలీసులు కూడా భారీ భద్రతా చర్యలు చేపడుతున్నారు. ప్రధాన వేదిక వద్దే కాకుండా ప్రతి కంపార్ట్మెంట్ వద్ద పోలీసు బందోబస్తు కల్పిస్తున్నారు. ఇప్పటికే నగరంలో బాంబ్ తనిఖీ బృందాలతో నిశితంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు భద్రతా చర్యలతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికలు రూపొందించారు. యోగాంధ్రకు వచ్చే వాహనాలతో జాతీయ రహదారిలో ట్రాఫిక్ పెరిగే అవకాశముంది. దీంతో ఆ రోజున కొన్ని గంటల పాటు సాధారణ వాహనాల మళ్లింపుపై దృష్టి పెట్టారు. ఆ రోజు పోర్టు నుంచి లారీ రాకపోకలు నియంత్రించనున్నారు. 326 కంపార్ట్మెంట్లు ఆర్కే బీచ్ రోడ్లోని కాళీమాత ఆలయం నుంచి భీమిలి వరకు ఏకకాలంలో 5 లక్షల మంది యోగాసనాలు చేసే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా 326 కంపార్టుమెంట్లు సిద్ధం చేస్తున్నారు. ప్రధాన వేదిక మినహా మిగిలిన కాంపార్ట్మెంట్లలో 3.5 లక్షల మందికి చోటు కల్పిస్తున్నారు. ప్రజలు కంపార్ట్మెంట్లలోకి చేరుకున్న తర్వాత టీషర్టు, క్యూఆర్ కోడ్ అందజేస్తారు. ప్రతి దాంట్లో గెజిటెడ్ ర్యాంకు అధికారి ఇన్చార్జ్గా వ్యవహరిస్తారు. తాగునీరు, పారిశుధ్యం, ఆహారం, వైద్య సిబ్బందితో పాటు పోలీసులతో పాటు 10 మంది వలంటీర్లు ఒక్కో కంపార్ట్మెంట్లో అందుబాటులో ఉంటారు. ప్రతి రెండు లేదా మూడు కంపార్ట్మెంట్లకు అనుబంధంగా 20 బెడ్లతో కూడిన వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. విశాఖ నుంచే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో జనసమీకరణకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రజలను తరలించేందుకు మొత్తంగా 10,235 ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలను వినియోగించనున్నారు. ఆయా ప్రాంతాల నుంచి ప్రజలను కంపార్ట్మెంట్లకు తరలించేందుకు వీలుగా ముందుగా రూట్మ్యాప్ సిద్ధం చేశారు. దాని ప్రకారం ఎవరు ఏ కంపార్టమెంట్లోకి వెళ్లాలన్న విషయాన్ని మ్యాపింగ్ చేస్తున్నారు. దానికి అనుగుణంగానే ప్రజలు వారికి కేటాయించిన కంపార్ట్మెంట్లోకి వెళ్లి నెంబర్ ప్రకారం స్థానంలో కూర్చోవాల్సి ఉంటుంది. 22 రికార్డులు దక్కేలా.. అంతర్జాతీయ యోగా డే వేడుకల ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కేందుకు యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఏకంగా 12 రికార్డులు దక్కించుకునేందుకు కసరత్తు చేస్తోంది. విశాఖ సముద్ర తీరంలో 11 నావికాదళ నౌకలపై నేవీ అధికారులు, సిబ్బంది యోగాసనాలు వేయనున్నారు. ఇది కూడా రికార్డు క్రియేట్ చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అల్లూరి జిల్లాకు చెందిన 25 వేల మంది గిరిజన విద్యార్థులు ఆంధ్రా యూనివర్సిటీ మైదానంలో యోగా చేయనున్నారు. ఇది కూడా రికార్డు నెలకొల్పే అవకాశముంది. ఇలా మొత్తంగా 22 రికార్డులు సొంతం చేసుకునేందుకు చర్యలు చేపడుతున్నారు. దీనిపై ఇప్పటికే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధులకు సమాచారం అందించారు. సాంకేతిక సాయంతో గిన్నిస్ బుక్ వాళ్లు లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. -
నెల క్రితమే పెళ్లి.. కొత్త జంటను ఇలా వెంటాడిన మృత్యువు
సాక్షి, గాజువాక: వివాహమైన నెల రోజులకే ఒక జంట మృత్యు ఒడికి చేరింది. కాళ్ల పారాణి ఆరకముందే విధి ప్రమాద రూపంలో కబళించింది. నగరంలో సరదాగా షికారు చేసి వద్దామనుకొని బయల్దేరిన కొత్త జంట రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. దీంతో, కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఈ విషాద ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది.గాజువాక ట్రాఫిక్ పోలీసులు అందించిన వివరాలివి.. కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన జొన్నాడ సాయి(27), పెదగంట్యాడ మండలం గంగవరం గ్రామానికి చెందిన శాలిని (25) గాజువాకలోని యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్లో ల్యాబ్ టెక్నీషియన్లుగా పని చేస్తున్నారు. వీరిద్దరూ ప్రేమించుకొని నెల రోజుల కిందట పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం శ్రీహరిపురంలో ఒక అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం ల్యాబ్కు సెలవు కావడంతో షికారు కోసం నగరంలోకి వెళ్లేందుకు ద్విచక్రవాహనంపై బయల్దేరారు.ములగాడ మీదుగా పోర్టు రోడ్లోని మారుతీ సర్కిల్ వద్ద వెనుకనే వస్తున్న ఒక ట్రాలర్ వారిని ఢీకొని ఈడ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో సాయి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. తీవ్ర గాయాలపాలైన శాలినిని షీలానగర్లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స ప్రారంభించే సమయానికి మృతి చెందిందని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టు నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు సీఐ కోటేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఇదే రోడ్డులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయిల్ ట్యాంకర్ కింద పడి ఇద్దరు నేవీ వైద్యులు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.. 24 గంటల వ్యవధిలో నలుగురు మృత్యువాత పడటం.. వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. -
‘ప్రధాని’ కార్యక్రమానికి పైసల్లేవ్.!
● ఆర్భాటమే గానీ..నిధులివ్వని కూటమి సర్కార్ ● 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం ● ప్రధాని మోదీ, ఇతర ప్రముఖుల రాక ● ఈ వేడుకల నిర్వహణకు రూ.75 కోట్ల్ల అంచనా ● యోగా భారమంతా స్థానిక సంస్థలకే! మహారాణిపేట: జిల్లాలో ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని(యోగాంధ్ర) అంగరంగ వైభవంగా, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లక్ష్యంగా నిర్వహించాలని నిర్ణయించినా.. అందుకు అవసరమైన నిధుల కోసం అధికార యంత్రాంగం తీవ్రంగా కుస్తీ పడుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి మరో ఐదు రోజులే సమయం ఉన్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని తెలుస్తోంది. రూ. 75 కోట్ల అంచనా.. సాయం సున్నా! ఆర్.కె.బీచ్ నుంచి భీమిలి వరకు ఏకంగా ఐదు లక్షల మందితో యోగాసనాలు చేయించి గిన్నిస్ రికార్డు నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కార్యక్రమ నిర్వహణ మీద సమీక్షలు, ప్రాంతాల పర్యటనలు జరిగాయి. ఈ కార్యక్రమానికి సుమారు రూ.75 కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే ఇంతటి భారీ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక చేయూత అందలేన్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఒక లేఖ పంపినప్పటికీ, ఆ నిధులు మాత్రం ఇప్పటికీ విడుదల కాలేదని సమాచారం. దీంతో మొత్తం ఆర్థిక భారం జీవీఎంసీ, వీఎంఆర్డీలపై పడుతోంది. బీచ్రోడ్డులో 500 కంపార్ట్మెంట్ల నిర్మాణం వంటి పనులను ఈ సంస్థలు తమ నిధుల నుంచే చేపడుతున్నాయి. మొత్తానికి యోగా భారమంతా స్థానిక సంస్థలపైనే పడుతోంది.. కేంద్రం ఇచ్చినా.. రాష్ట్రం చేయూతనివ్వదే.. యోగాలో పాల్గొనే వారికి కేంద్ర ప్రభుత్వం మ్యాట్లు, టీ షర్ట్స్ ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. ముందు అనుకున్న ప్రకారం రెండు లక్షల మ్యాట్లు, టీ–షర్టులు పంపింది. ప్రస్తుతం వాటి డీకోడింగ్ జరుగుతోంది. అయితే పాల్గొనే వారి సంఖ్యను ఐదు లక్షలకు పెంచడంతో మరో మూడు లక్షల మ్యాట్లు, టీ–షర్టులు అదనంగా అవసరమయ్యాయి. ఒక్కో మ్యాట్ ఖరీదు రూ.340 చొప్పున ఈ మూడు లక్షల మ్యాట్ల కొనుగోలుకే సుమారు రూ.10 కోట్లు ఖర్చవుతుంది. దీనికి తోడు కార్యక్రమంలో పాల్గొనే ఐదు లక్షల మందికి అందించే స్నాక్స్ ప్యాకెట్(కేక్, బిస్కెట్, అరటిపండు, వాటర్ బాటిల్, గ్లూకోజ్ ప్యాకెట్) కోసం మరో రూ.5 కోట్లు అవసరం. ఈ అదనపు భారాన్ని ఎవరు మోయాలన్న దానిపై స్పష్టత కొరవడింది. వీటికి అదనంగా ప్రధాని, వీఐపీలు, వీవీఐపీల బస, ప్రయాణ ఏర్పాట్లు, వేదికల నిర్మాణం వంటి ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ప్రతిష్టాత్మక కార్యక్రమానికి సమయం దగ్గర పడుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో, ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఎలా విజయవంతం చేయాలా అని జిల్లా యంత్రాంగం తలలు పట్టుకుంటోంది. -
యువతనూ వెంటాడుతున్న మోకాళ్ల అరుగుదల
మహారాణిపేట: జీవనశైలి లోపాలు, ఊబకాయం, అధిక శరీర బరువు, రోడ్డు ప్రమాదాలు, క్రీడల్లో జరిగే ప్రమాదాల కారణంగా చిన్న వయసు వారిలోనూ మోకాళ్ల అరుగుదల ఎక్కువగా కనిపిస్తోందని వైజాగ్ ఆర్థ్రోస్కోపిక్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శులు డాక్టర్ గొల్లంగి శ్రీనివాస్, డాక్టర్ రాజేష్ కుమార్ రెడ్డి తెలిపారు. సాధారణంగా 60–70 ఏళ్లు దాటిన తర్వాత కనిపించే ఈ సమస్య, పలు కారణాల వల్ల ప్రస్తుతం 20–40 మధ్య వయసు వారిలో కూడా అధికంగా కనిపిస్తోందన్నారు. నగరంలోని ఓ హోటల్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ మోకాలిలో ఉండే లిగమెంట్లు, మినిస్కస్ గాయాలైనప్పుడు వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందాలని సూచించారు. లేని పక్షంలో దీర్ఘకాలంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు. డాక్టర్ రాజేష్ కుమార్ మాట్లాడుతూ ఈ తరహా గాయాలను ఆర్థ్రోస్కోపీ ద్వారా నయం చేయవచ్చని, అందులోనూ అత్యాధునిక సాంకేతికతలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. విశాఖపట్నంలోని కిమ్స్ ఆస్పత్రి (సీతమ్మధార) ఆధ్వర్యంలో నార్త్ ఆంధ్ర ఆర్థోపెడిక్ అసోసియేషన్, వైజాగ్ ఆర్థ్రోస్కోపిక్ అసోసియేషన్ సహకారంతో ఆర్థ్రోస్కోపీ శస్త్రచికిత్సల్లో వస్తున్న అత్యాధునిక విధానాలపై సదస్సు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ సదస్సుకి ఉత్తరాంధ్ర వ్యాప్తంగా 150 మందికిపైగా ఆర్థోపెడిక్ వైద్యులు హాజరయ్యారు. అహ్మదాబాద్లోని అడ్వాన్స్ ఆస్పత్రి డైరెక్టర్ ప్రతీమేష్ జైన్, అహ్మదాబాద్కు చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ రోహన్ వక్త, కోయంబత్తూరులోని ఆర్థోవన్ ఆస్పత్రికి చెందిన వైద్యనిపుణుడు డాక్టర్ సంతోష్ సహానంద్ తదితరులు మోకాలికి సంబంధించిన వివిధ రకాల సమస్యలు, వాటిని నివారించే మార్గాలు, పరిష్కార సాంకేతికతల గురించి వివరించారు. ప్రతి ఒక్కరికీ తగిన శారీరక వ్యాయామం అవసరమని, రోజుకు కనీసం 3 నుంచి 5 కిలోమీటర్లు నడవడం ద్వారా చాలా వరకు సమస్యలను నివారించవచ్చని వైద్యులు సూచించారు. ఈ సమావేశంలో డాక్టర్ సంతోష్ ఆర్. గడ్డం తదితరులు పాల్గొన్నారు. -
ఇదేనా మనమిచ్చే గౌరవం?
క్రీడలు, సాహిత్యం, రాజకీయాలు, కళలు వంటి రంగాల్లో దేశానికి గర్వకారణంగా నిలిచిన ఎందరో మహానుభావుల విగ్రహాలను విశాఖ సాగరతీరంలో ఏర్పాటు చేశారు. ఇవి నగరానికి ప్రత్యేక ఆకర్షణగా మారాయి. యువతకు నిత్యం ప్రేరణగా నిలుస్తున్నాయి. ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం బీచ్ రోడ్డును ముస్తాబు చేసే క్రమంలో భాగంగా అధికారులు ఈ విగ్రహాలకు రంగులు వేయిస్తున్నారు. నిచ్చెనలు వేసుకుని విగ్రహాలకు రంగులు వేయాల్సిన కార్మికులు.. వారి విలువ, ప్రాధాన్యం తెలియక ఆ విగ్రహాలపై నిల్చొని పైకప్పును శుభ్రం చేయడం, రంగులు వేయడం నగరవాసుల మనసులను కలచి వేస్తోంది. సంబంధిత అధికారులు స్పందించి, మహనీయులకు సముచిత గౌరవం దక్కేలా చూడాలని.. రంగులు వేసే ప్రక్రియను గౌరవప్రదంగా పూర్తి చేయించాలని కోరుతున్నారు. – ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
ఊపిరి
అరుదైన ప్రాణులకుచుక్కల జింక పిల్ల అడవి కుక్క పిల్లలు అంతరించిపోతున్న జాతుల విశేషాలివి.. ఈ జూలో పునరుత్పత్తి అవుతున్న కొన్ని ముఖ్యమైన అంతరించిపోతున్న జాతులు, వాటి ప్రత్యేకతలు ఇప్పుడు తెలుసుకుందాం.. ● అడవి కుక్కలు(ఆసియాటిక్ వైల్డ్ డాగ్స్): ఇవి వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లోని షెడ్యూల్–1 కిందకు వస్తాయి. ఇందిరా గాంధీ జూ పార్కులో వీటి పునరుత్పత్తి కేంద్రం ఉంది. వీటి ఎత్తు సుమారు 50 సెం.మీ., శరీరం పొడవు 90 సెం.మీ., తోక పొడవు 40–45 సెం.మీ. ఉంటుంది. ● కృష్ణ జింక(బ్లాక్బక్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువుగా గుర్తింపు పొందిన ఈ జింకలు, తమ మెలితిరిగిన కొమ్ములతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కృష్ణ జింక షెడ్యూల్–1 జాబితాలో ఉంది ● మూషిక జింక(మౌస్ డీర్): షెడ్యూల్–1 జాబితాలోని ఈ జింక శరీరం పొడవు 50–60 సెం.మీ., బరువు 3–4 కిలోలు ఉంటుంది. ప్రపంచంలోని అతి చిన్న జింక జాతులలో ఇది ఒకటి. చూడటానికి చిన్నగా, సున్నితంగా ఉండే ఈ జీవి కూడా షెడ్యూల్–1 జాబితాలో ఉంది. ● కనుజు : ఇది కూడా షెడ్యూల్–1 జాబితాలో ఉంది. మగ కనుజులకు చెట్ల కొమ్మల మాదిరిగా ఉండే కొమ్ములు 3.5 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. ● నీలి ఎద్దు( నీల్గై): ఆసియా జింక జాతులలో అతి పెద్దదైన నీల్గై షెడ్యూల్–2 జాబితాలో ఉంది. దీని గొంతు భాగం తెల్లగా ఉంటుంది. మగ నీల్గైకి 13 సెం.మీ. జుట్టు ఉంటుంది. ఆడవి 200 కిలోలు, మగవి 250 కిలోల వరకు బరువు వరకు పెరుగుతాయి. ● రెడ్ నెక్డ్ వాలబీ: ఈ జాతి జీవుల పునరుత్పత్తి ఎంతో ఆసక్తికరం. రెడ్నెక్డ్ వాలబీ గర్భం దాల్చిన 30 రోజుల్లో పిల్లకు జన్మిస్తుంది. తర్వాత ఆ పిల్ల తల్లి పొట్ట కింద సంచిలో సుమారు 7 నెలల పాటు పెరిగి, తల్లి పాలు తాగుతుంది. 12 నెలల తర్వాత స్వతంత్రంగా జీవించడం మొదలుపెడుతుంది. ఆరిలోవ: వాతావరణ కాలుష్యం, వేటగాళ్ల ఉచ్చులు, క్రూర మృగాల దాడి, మారుతున్న పర్యావరణ పరిస్థితుల కారణంగా ఎన్నో వన్యప్రాణి జాతులు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. ఒకప్పుడు సజీవంగా ఉన్న జాతులు నేటి తరానికి టీవీల్లో, పుస్తకాల్లో మాత్రమే కనిపించే పరిస్థితి నెలకొంది. వాటి ఉనికే ప్రశ్నార్థకమవుతున్న ఈ తరుణంలో నగరంలోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్కు ఒక ఆశాకిరణంగా నిలుస్తోంది. అంతరించిపోతున్న అరుదైన వన్యప్రాణులకు పునరుత్పత్తి కేంద్రంగా మారి, వాటి వంశాన్ని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడి సంరక్షకుల కృషితో గత ఎనిమిది నెలల్లోనే 12 అంతరించిపోతున్న జాతులకు చెందిన 46 పిల్లలు ఊపిరిపోసుకున్నాయి. వన్యప్రాణి సంరక్షణలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాయి. రింగ్టైల్డ్ లెమూర్స్ 8 నెలలు.. 46 బుల్లి ప్రాణులు గడిచిన ఎనిమిది నెలలకాలంలో ఇందిరా గాంధీ జూ పార్కులో 12 రకాల వన్యప్రాణులకు 46 పిల్లలు పుట్టాయి. ఇందులో అడవి కుక్కలు–14, కృష్ణ జింక (రాష్ట్ర జంతువు) –9, చుక్కల జింక–7, కనుజు–5, నీల్ గై–3, బార్కింగ్ డీర్–2, మౌస్ డీర్–1, బెంగాల్ ఫాక్స్–1, ఇండియన్ గ్రే వోల్ఫ్–1, అడవి దున్న (బైసన్)–1, రెడ్–నెక్డ్ వాలబీ–1, రింగ్టైల్డ్ లెమూర్–1 ఉన్నాయి. అరుదైన జీవులకు అభయం విశాఖ జూ పార్కు ఇప్పుడు కేవలం జంతు ప్రదర్శనశాల మాత్రమే కాదు.. అంతరించిపోతున్న జీవజాతులకు ఒక సురక్షితమైన ఆవాసం, పునరుత్పత్తి కేంద్రం. వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972 ప్రకారం షెడ్యూల్–1 జాబితాలోని అనేక జీవులు ఇక్కడ విజయవంతంగా తమ సంతతిని పెంచుకుంటున్నాయి. జింక పిల్లలు, అడవి దున్నలు, అడవి కుక్కల పిల్లలు, నీల్గై, రెడ్నెక్డ్ వాలబీ, బెంగాల్ ఫాక్స్, ఇండియన్ గ్రే వోల్ఫ్, రింగ్టైల్డ్ లెమూర్స్ వంటి జాతులకు చెందిన చిట్టి ప్రాణులు తమ ఎన్క్లోజర్లలో తల్లుల వెంట ఉత్సాహంగా తిరుగుతూ సందర్శకులను అలరిస్తున్నాయి. ఈ అద్భుతమైన దృశ్యాలు జూకి వచ్చే వారికి కనువిందు చేయడమే కాకుండా, అంతరించిపోతున్న జాతులను పరిరక్షించడం ఎంత అవసరమో తెలియజేస్తున్నాయి. వెటర్నరీ వైద్యులు, యానిమల్ కీపర్ల నిరంతర పర్యవేక్షణలో ఈ ఘనత సాధ్యమైంది. తల్లి పాలు తాగుతున్న బార్కింగ్ డీర్ పిల్ల వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు జూ పార్కులో వన్య ప్రాణుల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాం. ఇటీవల పునరుత్పత్తి అయిన పలు రకాల జాతుల పిల్లలను ఇక్కడ సంరక్షకులు, జూ వెటర్నరీ వైద్యులు, సిబ్బంది, యానిమల్ కీపర్లు ప్రత్యేక శ్రద్ధతో సంరక్షిస్తున్నారు. అంతరించిపోతున్న జాతుల సంతతి జూలో గణనీయంగా పెరుగుతోంది. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం వీటికి ఎలాంటి హాని కలిగించినా చట్టరీత్యా నేరమవుతుంది. – జి.మంగమ్మ, జూ క్యూరేటర్ ●తల్లితో కనుజు పిల్ల -
ఆటో బోల్తా.. ఒకరి దుర్మరణం
మద్యం మత్తులో ఆటో నడపడంతో ప్రమాదం గాజువాక: మద్యం మత్తులో ఆటో నడపడంతో ఒక వ్యక్తి ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. అతడితో పాటు ప్రయాణిస్తున్న మరో నలుగురు వ్యక్తులు అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాజువాక ట్రాఫిక్ పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక ప్రశాంతినగర్కు చెందిన బలగం సురేష్ (26) పీవీసీ వర్క్షాప్ నిర్వహిస్తున్నాడు. స్నేహితులు లోకేష్, దుర్గాప్రసాద్తోపాటు మరో ఇద్దరితో కలిసి చినగంట్యాడలో మందు పార్టీ చేసుకున్నారు. అప్పటికే బాగా తాగి ఉన్న ఆ ఐదుగురు వ్యక్తులు ఎన్ఏడీ జంక్షన్లో వేరే పార్టీ కోసం ఆటోలో బయలుదేరి వెళ్తున్నారు. ఆ ఆటోను ఐదుగురిలో ఒకడైన లోకేష్ నడుపుతున్నాడు. పంతులుగారి మేడ జంక్షన్కు వెళ్లేసరికి ఆటో అకస్మాత్తుగా తిరగబడిపోయింది. ఈ సంఘటనలో నలుగురు వ్యక్తులు బయటకు తుళ్లిపోగా, సురేష్పై ఆటో పడిపోయింది. దీంతో అతడు సంఘటనా స్థలంలోనే దుర్మరణం పాలయ్యాడు. మిగిలిన నలుగురు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విత్తన బంతులతో పచ్చదనం
తీరంలో సందడి తాటిచెట్లపాలెం: పచ్చని వనాలను పెంచడానికి విత్తన బంతులు ఒక అద్భుతమైన మార్గమని పర్యావరణ సంరక్షణ గతివిధి సంస్థ విశాఖ పర్యావరణ సంయోజక్ డా.ఎస్పీబీ రంగాచార్యులు అన్నారు. సీతమ్మధార కొండపైన ఆదివారం పర్యావరణ సంరక్షణ గతివిధి, వనమాలి, సీటీజీ, ప్లాంట్ ఎ హోప్, జేడీ ఫౌండేషన్, రోటరీ, ఐఐఏఎం, వుమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ సొసైటీ, గ్రీన్ కై ్లమేట్ టీం వంటి స్వచ్ఛంద సంస్థలు కలిసి విత్తన బంతులు విసిరే కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ సందర్భంగా డా.రంగాచార్యులు మాట్లాడుతూ వాతావరణ మార్పులను నిరోధించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మనం తిన్న పండ్ల విత్తనాలను సేకరించి, ఆరబెట్టి, ఆ తర్వాత పేడ, మట్టి, బూడిదతో కలిపి విత్తన బంతులుగా తయారుచేయాలని సూచించారు. వర్షాకాలంలో ఈ విత్తన బంతులను కొండలు, నదీతీరాలు, సముద్రతీర ప్రాంతాలు, చెరువు గట్లపై చల్లడం ద్వారా పచ్చదనాన్ని పెంచవచ్చని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేయకపోతే భవిష్యత్ తరాలు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, మహిళలు, ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సమాజ సేవకులు పాల్గొన్నారు. -
యోగా దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు
● భారీగా జనం తరలింపునకు ఏర్పాట్లు ● ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లోనే బీచ్రోడ్డుకు రావాలి ● కలెక్టర్ హరేందిర ప్రసాద్ మహారాణిపేట: బీచ్రోడ్డులో ఈ నెల 21న జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాని మోదీ హాజరవుతున్నారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ సూచించారు. బీచ్రోడ్డులో యోగా దినోత్సవం ఏర్పాట్లపై నగర ప్రజాప్రతినిధులతో ఆదివా రం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో కలెక్టర్ ఈ వివరాలు వెల్లడించారు. ప్రజలు ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాటు చేసిన బస్సులు, ఆటోలు, టాటా మ్యాజిక్ వంటి వాహనాల్లో మాత్రమే బీచ్రోడ్డులోని తమకు కేటాయించిన ప్రాంతానికి చేరుకోవాలని, ప్రైవేట్ వాహనాలకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ప్రజల తరలింపునకు ప్రత్యేక ఏర్పాట్లు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన, గుర్తించిన ప్రాంతాలకు ప్రజలను సకాలంలో తరలించడం ముఖ్యమని కలెక్టర్ తెలిపారు. ఆయా నియోజకవర్గాల నుంచి ఉదయాన్నే బస్సులు బయలుదేరేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. ప్రతి వార్డు సచివాలయానికి కేటాయించిన ప్రాంతం గురించి ఇప్పటికే సమాచారం అందించామని, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకుని ప్రజలు తెల్లవారుజామున ఆ ప్రాంతానికి చేరుకునేలా చూడాలని కోరారు. బస్సులకు వార్డు సచివాలయం కార్యదర్శులను ఇన్చార్జిలుగా నియమిస్తున్నామని, పికప్, డ్రాపింగ్ పాయింట్ల వివరాలతో కూడిన బ్యానర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 2,185 బస్సులు సిద్ధం: ప్రజలను తరలించేందుకు జిల్లాలో మొత్తం 2,185 బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. వీటికి అదనంగా ఆటోలు, టాటా ఏస్, మ్యాజిక్ వంటి వాహనాల్లో కూడా తరలింపు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ బస్సులన్నీ 20వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకే ఆయా ప్రాంతాలకు చేరుకుంటాయన్నారు. ఉచితంగా టీ షర్ట్లు, మ్యాట్లు, స్నాక్స్ యోగా కార్యక్రమంలో పాల్గొనే వారందరికీ ఉచితంగా టీ షర్ట్లు, మ్యాట్లు అందజేస్తామని కలెక్టర్ చెప్పారు. అలాగే స్నాక్స్ ప్యాకెట్లు అందిస్తామన్నారు. పార్కింగ్ కేటాయింపులు విశాలాక్షినగర్ వరకు ఉన్న బీచ్రోడ్డును నగరంలోని వివిధ ప్రాంతాల ప్రజలకు కేటాయించారు. పెందుర్తి, అనకాపల్లి ప్రాంతాల వారికి లా కాలేజ్ రోడ్డు, విజయనగరం జిల్లా వారికి మధురవాడ ఐటీ సెజ్ ప్రాంతం, శ్రీకాకుళం వారికి తిమ్మాపురం నుంచి భీమిలి వరకు మార్కింగ్ చేశారు. ఒక్కో కంపార్ట్మెంట్లో 600 మంది పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముందురోజు నగరానికి చేరుకుంటారని పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పి.విష్ణుకుమార్ రాజు, పి.గణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, మేయర్ పీలా శ్రీనివాసరావు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ప్రధాని కార్యక్రమానికి పైసల్లేవ్.!8లో -
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
మహారాణిపేట: ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం విశాఖపట్నం పర్యటనకు రానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం భద్రతా వాహన శ్రేణి ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ ట్రయల్ రన్ విశాఖ విమానాశ్రయం నుంచి ప్రారంభమై నోవాటెల్ హోటల్, ఆర్.కె.బీచ్, ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్, పీఎంపాలెం ప్రదేశాల మీదుగా సాగింది. ముఖ్యమంత్రి పర్యటించే మార్గంలో భద్రతా లోపాలు లేకుండా చూసేందుకు ఈ ట్రయల్ రన్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డీసీపీలు అజిత, మేరీ ప్రశాంతి, ఆర్డీవో శ్రీలేఖ విమానాశ్రయంలో వివిధ శాఖల అధికారులతో భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. -
వసూళ్లు
అన్ని శాఖల్లోనూ నకిలీ ఏసీబీ సీఐ లీలలెన్నో.. ● నేరుగా, ఫోన్ పే ద్వారా కలెక్షన్లు ● మధురవాడ జెడ్సీ కార్యాలయంలోనూ తిష్ట ● ఏసీబీ కార్యాలయంలో ఓ సీఐ వద్ద బాతాఖానీ ● నగరంలోని మరో విభాగంలో కొలువైన సదరు సీఐ ● వసూళ్లపై ఫిర్యాదుకు అధికారుల వెనుకంజ ● లోతుగా విచారిస్తే మరిన్ని పెద్ద తలకాయలు బయటకు.. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం నకిలీ ఏసీబీ సీఐ సుధాకర్ లీలలు ఒక్కొక్క టిగా బయటకు వస్తున్నాయి. నగరంలోని కీలక విభాగాలన్నింటిలోనూ అతడు వసూళ్లకు తెగబడినట్టు తెలుస్తోంది. అధికారుల నుంచి నేరుగాను.. ఫోన్ పే ద్వారా కూడా భారీగా వసూళ్లు చేసినట్లు సమాచారం. ఏసీబీ అధికారినంటూ మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి డబ్బులు డిమాండ్ చేయగా.. సదరు సబ్ రిజిస్ట్రార్ నేరుగా ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో సుధాకర్ గుట్టు కాస్తా రట్టయింది. ఆయనతో పాటు ఏసీబీ జాయింట్ డైరెక్టర్నని ఫోన్లో మాట్లాడిన వేరే ప్రాంతంలో పనిచేస్తున్న ఓ మహిళా ఏఆర్ సీఐ పాత్ర కూడా బట్టబయలైంది. అయితే అంతకు ముందుగా మధురవాడలోని జీవీఎంసీ జోనల్ కార్యాలయం (జెడ్సీ)లో రూ. 25 వేల వరకూ వసూలు చేసి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు రెవెన్యూ, మైనింగ్, జీవీఎంసీలోని వివిధ విభాగ అధికారుల వద్ద నుంచి కూడా భారీగా వసూలు చేసినట్టు సమాచారం. అంతేకాకుండా గతంలో ఏసీబీలో పనిచేసి... ప్రస్తుతం బదిలీపై నగరంలోనే వేరే కార్యాలయంలో పనిచేసే సీఐకు కూడా సదరు నకిలీ సీఐతో లింకులు ఉన్నట్టు విచారణలో తేలినట్టు సమాచారం. అంతేకాకుండా ఒక కార్పొరేషన్ చైర్మన్తో కూడా విమానాల్లో విదేశాలకు సంచరించినట్టు ఇప్పటికే ఫొటోలతో కూడిన ఆధారాలతో తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు లోతుగా విచారిస్తే మరిన్ని పెద్ద తలకాయల పేర్లు బయటకు వస్తాయనే అభిప్రాయం మాత్రం సర్వత్రా వ్యక్తమవుతోంది. సీఐతో మాటా మంతీ...! గతంలో ఏసీబీలో పనిచేసే సమయంలో ఓ సీఐ కూర్చునే రూమ్కు రెగ్యులర్గా సదరు నకిలీ ఏసీబీ సీఐ వచ్చేవాడని ఏసీబీ కార్యాలయంలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు విశాఖపట్నంలోనే వేరే విభాగంలో పనిచేసే సదరు సీఐ రూమ్లో గంటల తరబడి ఇద్దరూ మాటామంతీ జరిపేవారని సమాచారం. ఆ సమయంలో కూడా ఏసీబీకి వచ్చే ఫిర్యాదులు కాస్తా లీకయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సుధాకర్తో పాటు పట్టుబడి సస్పెండైన మహిళా సీఐకు... ఏసీబీలో గతంలో పనిచేసిన సీఐకు కూడా మంచి సంబంధాలే ఉండేవని సమాచారం. ఈ కోణంలో కూడా సుధాకర్కు గతంలో ఏసీబీలో పనిచేసే సీఐ సహకరించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా విద్యుత్ శాఖలో పనిచేసే మరో ఉద్యోగికి కూడా ఈ నకిలీ ఏసీబీ సీఐ బాగా పరిచయస్తుడని తెలుస్తోంది. మొత్తంగా నగరంలోని అనేక విభాగాల అధికారులతో ఎంతో చనువుగా ఉంటూ... అవినీతిపరుల జాబితాను సేకరించి వసూళ్లకు తెగబడ్డారని అర్థమవుతోంది. అయితే, అంతులేని ఈ నకిలీ ఏసీబీ సీఐ వ్యవహారంలో పోలీసుల విచారణ లోతుగా సాగడం లేదనే విమర్శలు మాత్రం వినిపిస్తున్నాయి. లోతైన విచారణ ఏదీ...! వాస్తవానికి నకిలీ ఏసీబీ సీఐ వ్యవహారంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే, లోతుగా విచారణ జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నకిలీ ఏసీబీ సీఐకు ఫోన్ పే చేసిన వారిని విచారించినప్పటికీ.. తమకేమీ సంబంధం లేదన్నట్టుగా పోలీసుల ముందు బుకాయిస్తున్నట్టు తెలుస్తోంది. తమను బెదిరించి వసూళ్లు చేశారనే కోణంలో కూడా ఎవరూ ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదని పోలీసువర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, అధికార పార్టీకి చెందిన ఓ కార్పొరేషన్ చైర్మన్తో పాటు పలువురు పోలీసులకు, వివిధ విభాగాల అధికారులకు కూడా మంచి సంబంధాలు ఉండటమే కారణమని తెలుస్తోంది. ఆయా ఫొటోలు కూడా ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. అయినప్పటికీ పోలీసులు మాత్రం మిన్నకుండిపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతులేకుండా సాగిన నకిలీ ఏసీబీ సీఐ వసూళ్ల కథలో అనేక మంది ఆయనను నేరుగా కలిసి మామూళ్లు ఇవ్వడమో.. ఫోన్ పే ద్వారా చెల్లింపులు చేసిన వారే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో లోతుగా విచారణ జరిపితే అందరి బాగోతాలు బయటపడతాయనే ఆందోళనే కారణమనే విమర్శలున్నాయి. -
పెళ్లయిన నెల రోజులకే మృత్యు ఒడికి..
రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల దుర్మరణం గాజువాక: వివాహమైన నెల రోజులకే ఒక జంట మృత్యు ఒడికి చేరింది. కాళ్ల పారాణి ఆరకముందే విధి ప్రమాదరూపంలో కబళించింది. నగరంలో సరదాగా షికారు చేసి వద్దామనుకొని బయల్దేరిన కొత్త జంట రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. గాజువాక ట్రాఫిక్ పోలీసులు అందించిన వివరాలివి.. కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన జొన్నాడ సాయి(27), పెదగంట్యాడ మండలం గంగవరం గ్రామానికి చెందిన శాలిని (25) గాజువాకలోని యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్లో ల్యాబ్ టెక్నీషియన్లుగా పని చేస్తున్నారు. వీరిద్దరూ ప్రేమించుకొని నెల రోజుల కిందట పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం శ్రీహరిపురంలో ఒక అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం ల్యాబ్కు సెలవు కావడంతో షికారు కోసం నగరంలోకి వెళ్లేందుకు ద్విచక్రవాహనంపై బయల్దేరారు. ములగాడ మీదుగా పోర్టు రోడ్లోని మారుతీ సర్కిల్ వద్ద వెనుకనే వస్తున్న ఒక ట్రాలర్ వారిని ఢీకొని ఈడ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో సాయి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. తీవ్ర గాయాలపాలైన శాలినిని షీలానగర్లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స ప్రారంభించే సమయానికి మృతి చెందిందని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టు నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు సీఐ కోటేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఇదే రోడ్డులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయిల్ ట్యాంకర్ కింద పడి ఇద్దరు నేవీ వైద్యులు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.. 24 గంటల వ్యవధిలో నలుగురు మృత్యువాత పడటం.. వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. -
చెస్ పోటీల్లో విజేతలు కృష్ణ, సాత్విక
విశాఖ స్పోర్ట్స్: విశాఖ జిల్లా అండర్–15 చదరంగం పోటీల్లో కృష్ణ, సాత్విక విజేతలుగా నిలిచారు. ఆల్ విశాఖ చెస్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జట్టు ఎంపిక పోటీలు నిర్వహించగా ఓపెన్లో 146 మంది, బాలికలు 59 మంది పాల్గొన్నారు. ఓపెన్లో ఏడు రౌండ్లు నిర్వహించగా బాలికలకు ఆరు రౌండ్లు నిర్వహించారు. ఓపెన్లో పి.కృష్ణ ఆరున్నర పాయింట్లతో విజేతగా నిలవగా ఆరేసి పాయింట్లతో ఉద్ధవ్ లక్ష్మణ్, పి.అనిరుథ్ తర్వాత స్థానాల్లో నిలిచారు. బాలికల్లో పి.సాత్విక ఆరు పాయింట్లతో విజేతగా నిలవగా ఎం.దివ్యవర్షిణి, అఫ్ణీన్ ఐదేసి పాయింట్లతో తర్వాత స్థానాల్లో నిలిచారు. తొలి రెండు స్థానాల్లో నిలిచిన కృష్ణ, ఉద్ధవ్, సాత్విక, దివ్య జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. అంతర్ జిల్లాల అండర్–15 చదరంగం పోటీలు జూలై 12,13వ తేదీల్లో విశాఖలోనే జరగనున్నాయి. -
ఏడాది పాలనతో అంతా మోసమే..!
● రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ సీపీ పీఏసీ మెంబర్ గొల్ల బాబూరావు ● కూటమి ప్రభుత్వ ఏడాది వైఫల్యాలపై కేకే రాజు ఆధ్వర్యంలో వెన్నుపోటు పుస్తకావిష్కరణ సాక్షి, విశాఖపట్నం : వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటే ఓ నమ్మకం.. చంద్రబాబు అంటే మోసానికి మారుపేరు అని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గొల్ల బాబూరావు అన్నారు. ఆదివారం మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో వైఫల్యాలపై వెన్నుపోటు పుస్తకాన్ని వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, వాసుపల్లి గణేష్కుమార్, సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, దేవన్రెడ్డితో కలిపి ఆయన ఆవిష్కరించారు. ముందుగా బి.ఆర్.అంబేడ్కర్, వైఎస్సార్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గొల్ల బాబూరావు మాట్లాడుతూ పేద ప్రజలను మోసం చేయడం, అక్రమాలు చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. అబద్దపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా కాలయాపన చేయడమే కాకుండా.. ఇచ్చిన ఒకటి రెండు పథకాల్లో కూడా కోతలు విధిస్తున్నారని మండిపడ్డారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పేదల ఇంటికి సంక్షేమ పథకాలు అందించామని, అవన్ని ప్రజలు గుర్తుచేసుకుంటున్నారన్నారు. పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు వైఫల్యం చెందారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏడాదిలోనే అన్ని పథకాలను అమలు చేస్తే.. నేటి కూటమి ప్రభుత్వంలో ఏడాది పూర్తయినా ఒక పథకం కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. టీవీ ఛానళ్లు, పత్రికలను చుట్టూ పెట్టుకుని ప్రతీ రోజూ అబద్దపు కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ పథకాలు, హామీల గురించి ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతామని బెదిరిస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని హరిస్తోందని మండిపడ్డారు. అసెంబ్లీని రబ్బర్ స్టాంప్లా చేస్తుందని, ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వంపై ఏడాదిలో పూర్తి వ్యతిరేకత పెరిగిందని, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీసీ విజయం ఖాయమన్నారు. కార్యకర్తలెవరూ నిర్లక్ష్యంగా ఉండకూడదు.. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, డిప్యూటీ మేయర్ కె.సతీష్, పార్టీ కార్యాలయం పర్యవేక్షకులు రవిరెడ్డి, ముఖ్య నాయకులు పేర్ల విజయచందర్, ఉడా రవి, రొంగలి జగన్నాథం, గొలగాని శ్రీనివాస్, జహీర్ ఆహ్మద్, నడింపల్లి కృష్ణంరాజు, రవిరాజు, ఉపాధ్యక్షులు బాణాల శ్రీనివాసరావు, చెన్నా జానకిరామ్, జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లు శంకరరావు, ద్రోణంరాజు శ్రీవాత్సవ, కార్పొరేటర్లు కె.అనిల్కుమార్ రాజు, శశికళ, బిపిన్ కుమార్, జిల్లా అనుబంధ అధ్యక్షులు పేడాడ రమణి కుమారి, భర్కత్ అలీ, పులగం కొండారెడ్డి, పీలా జగదీష్, ఎస్.ప్రసాదరావు, రామిరెడ్డి, బోండా ఉమా మహేశ్వరరావు, దేవరకొండ మార్కండేయులు, రాష్ట్ర, జిల్లా పార్టీ అనుబంధ కమిటీ సభ్యులు దొడ్డి కిరణ్, కాళిదాస్రెడ్డి, అల్లంపల్లి రాజబాబు, కిరణ్రాజు, పల్లా దుర్గారావు, మంచా నాగమల్లీశ్వరి, కొణతాల రేవతిరావు, జె.నాగేంద్ర, పద్మ, నీలి రవి, బి.పద్మావతి, శ్రీదేవి వర్మ, శ్రీనివాస్ గౌడ్, కొట్యాడ సూర్య తదితరులు పాల్గొన్నారు. -
క్యాన్సర్కు కళ్లెం
విశాఖ సిటీ: క్యాన్సర్ కర్కశమైనది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ కబళిస్తోంది. అటువంటి మహమ్మారి పీచమనచడానికి విశాఖ లో అడ్వాన్స్డ్ క్యాన్సర్ కేర్ బ్లాక్ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర, ఒడిశా రాష్ట్రాల క్యాన్సర్ బాధితులకు వైద్య సేవలు అందిస్తున్న అగనంపూడి ప్రాంతంలో ఉన్న హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్(హెచ్బీసీహెచ్ఆర్సీ)లో నూతన భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దేశంలోనే అత్యుత్తమ స్పెషలైజ్డ్ క్యాన్సర్ చికిత్సా కేంద్రాల్లో ఒకటిగా నిలిచేలా దీన్ని తీర్చిదిద్దనున్నారు. ప్రధానంగా పీడియాట్రిక్, హెమటోలింఫాయిడ్(శిశు, రక్త) క్యాన్సర్ల చికిత్స, పరిశోధనలకు సంబంధించి అతి పెద్ద కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. క్యాన్సర్ రోగులకు అనేక సేవలు ఈ కొత్త బ్లాక్ ద్వారా క్యాన్సర్ రోగులకు అనేక వైద్య సేవలు అందనున్నాయి. ఇందులో ఇంటెన్సివ్ కీమోథెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, అధునాతన రేడియేషన్ థెరపీ, కార్ టీ–సెల్ థెరపీ లాంటి అధునాతన ఇమ్యునోథెరపీలు, మూడు లీనియర్ యాక్సిలరేటర్లు, ఎంఆర్ఐ, సీవీటీ అండ్ పెట్ స్కాన్లతో పాటు అత్యంత ఆధునిక మెడికల్ ఇమేజింగ్, డయాగ్నోస్టిక్స్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే ఇందులో 14 బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ గదులు, 14 ఐసీయూలు, 5 ఆపరేటింగ్ థియేటర్లు, పరిశోధనల కోసం ప్రయోగశాలలు, చికిత్స ప్లానింగ్, శిక్షణ కోసం జాయింట్ డిస్కషన్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. పీడియాట్రిక్, హెమటోలింఫాయిడ్ క్యాన్సర్లకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్స, బ్లడ్ సెంటర్, పౌష్టికాహారం, పునరావాసం లాంటి సేవలు అందనున్నాయి. టీఎంసీకి ఐసీఐసీఐ రూ.550 కోట్లు విరాళం ఈ భారీ క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి ఐసీఐసీఐ బ్యాంక్ భారీ విరాళాన్ని టాటా మెమోరియల్ సెంటర్(టీఎంసీ)కు ప్రకటించింది. బ్యాంకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్ఆర్) నిధులు రూ.550 కోట్లతో ఈ అడ్వాన్స్డ్ క్యాన్సర్ కేర్ని నిర్మిస్తోంది. దేశంలో క్యాన్సర్ కేర్కు సంబంధించి విశాఖ, నవీ ముంబై, న్యూ చండీగఢ్లో కొత్తగా మూడు టీఎంసీ కేంద్రాల ఏర్పాటుకు ఐసీఐసీఐ బ్యాంక్ రూ.1,800 కోట్లు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో రూ.550 కోట్లతో విశాఖలో శిశు, రక్త క్యాన్సర్ చికిత్సకు తూర్పు దేశంలోనే అతిపెద్ద అత్యుత్తమ మెడికల్ టెక్నాలజీతో అధునాతన ఆస్పత్రి నిర్మాణానికి పూనుకున్నారు. ఏటా 3 వేల మందికి చికిత్స అందించేలా..ఐసీఐసీఐ ఫౌండేషన్ బ్లాక్ ఫర్ చైల్డ్ అండ్ బ్లడ్ క్యాన్సర్ భవనాన్ని 8 అంతస్తుల్లో సుమారు 3.9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఈ కొత్త భవనంలో 555 పకడలు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం అగనంపూడిలో ఉన్న హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో గత మూడేళ్లుగా రోజూ కొత్తగా సుమారు 200 మంది పీడియాట్రిక్ క్యాన్సర్ రోగులు, 350–400 మంది హెమటోలింఫాయిడ్ క్యాన్సర్ పేషంట్లు వైద్య సేవలు పొందుతున్నారు. కొత్త బ్లాక్ అందుబాటులోకి వచ్చిన తర్వాత బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్తో పాటు ప్రస్తుత వైద్య సేవలను గణనీయంగా విస్తరించేందుకు, అలాగే ఇమ్యునోథెరపీకి వెసులుబాటు కలగనుంది. మరో 3 వేల మంది క్యాన్సర్ రోగులకు చికిత్స అందించే అవకాశం ఉంటుంది. ఈ కొత్త బ్లాక్ల్లో అధునాతన వైద్య సదుపాయాలు, పరిశోధన విభాగాలు ఉండనున్నాయి. పెరుగుతున్న క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 2027 నాటికి ఈ కొత్త బ్లాక్ను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఉన్నారు. -
60 ఏళ్లు దాటితేనే మోకాలి శస్త్రచికిత్స!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స 60 ఏళ్లు దాటిన వారికి మాత్రమే మంచిదని... యువతకు ఇది మంచిదికాదని అహ్మదాబాద్లోని అడ్వాన్స్డ్ నీ అండ్ షోల్డర్ హాస్పిటల్ డైరెక్టర్, చీఫ్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ప్రత్మేష్ జైన్ తెలిపారు. 60 ఏళ్ల వయసులోపు ఉన్న వారికి ప్రధానంగా మోకాళ్లకు, తుంటి కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స (జాయింట్ రీ–ప్లెస్మెంట్ సర్జరీ) చేయడం కంటే... మోకా లిని సంరక్షించుకునే పద్ధతి మెరుగైనదని పేర్కొ న్నారు. ఈ కారణంగానే కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ యోజన పథకం కింద 60 ఏళ్ల లోపు వారికి జాయింట్ రీ–ప్లేస్మెంట్ సర్జరీలను చేయవద్దని స్పష్టంగా ఆదేశాలిచ్చిందని తెలిపారు. 60 ఏళ్ల లోపు వయసు ఉన్న వారికి మోకాలి, తుంటి సంరక్షణపైనే ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. వైర్లెస్ ఆర్థోస్కోపీ ద్వారా చేసే శస్త్రచికిత్సల వల్ల తక్కువ గాయం, రక్తస్రావంతో సర్జరీ చేసే వీలుందని, అయితే, భారతదేశంలో ఇప్పటివరకు కేవలం కొచ్చిలో మాత్రమే ఈ పద్థతి ద్వారా చికిత్స చేసినట్లు తెలిపారు. దీనిపై మరింతగా అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. విశాఖపట్నంలో జరుగుతున్న ‘అడ్వాన్స్డ్ నీ ఆర్థోస్కోపీ కోర్స్’సదస్సుకు హాజరైన సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...!యువత విషయంలో ఇది బెటర్..యువతకు గాయమైన సందర్భాల్లో మొత్తం మోకాలి మార్పిడికి పోకుండా పనితీరును పునరుద్ధరించడానికి ఉద్దే శించిన ఇతర పద్ధతులను ఆశ్రయించాల్సిన అవసరం ఉంది. ఫిజియోథెరపీ, పెయిన్ రిలీఫ్, యాంటీ–ఇన్ఫ్లమేటరీ మందులు, ఇంజెక్షన్లు వంటి వాటిని వినియోగించడం వంటి పద్ధతులపైనే ఆధారపడితే మంచిది. యూరప్కు ఎగుమతులుగతంలో మనం ప్రధానంగా ఎముకలకు సంబంధించిన సర్జరీలకు, చికిత్సలకు అవసరమైన పరికరాలను దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. అయితే, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మన అవసరాలకు మనం ఉత్పత్తి చేసుకోవడంతో పాటు యూరప్ వంటి దేశాలకు కూడా మనం పరికరాలను ఎగుమతి చేస్తున్నాం. ఇప్పటికే మనం నూరుకుపైగా దేశాలకు ఆర్థోపెడిక్ ఉపకరణాలను మనం దేశం నుంచి ఎగుమతి చేస్తున్నాం. ప్రపంచ మార్కెట్లో చైనాది కూడా మన తర్వాతి స్థానమే. ప్రధానంగా మేకిన్ ఇండియాలో భాగంగా స్థానికంగా ఉత్పత్తి చేయడం పెరుగుతోంది. పెరుగుతున్న క్రీడాగాయాలుమన దేశంలో క్రీడల ద్వారా జరుగుతున్న ప్రమాదాల వల్ల ఎముకల శస్త్రచికిత్సలు పెరుగు తున్నాయి. క్రీడాకారుల సంఖ్య పెరగడంతో పాటు సరైన శిక్షణ లేకుండా ఆటలు ఆడటం కూడా ఇందుకు కారణం. ఆంధ్రప్రదేశ్ విష యానికి వస్తే, మిగిలిన ప్రాంతాల కంటే విశాఖ లో క్రీడాగాయాల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. అందుకే ఇక్కడ సర్జరీలు కూడా ఎక్కువ. 2036 సంవత్సరంలో అహ్మదాబాద్లో జరగనున్న ఒలంపిక్స్ నేపథ్యంలో ప్రధానంగా ఈ క్రీడా గాయాలపై ఎక్కువ దృష్టి సారించి... మెరుగైన వైద్యసేవలను అందించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సదస్సులు యువ డాక్టర్లకు మరింతగా అత్యాధునిక వైద్యపద్ధతులకు తెలియజేసేందుకు ఉపయోగపడతాయి. -
‘జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం’
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని అనకాపల్లి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. కూటమి ప్రభుత్వ ఏడాది వైఫల్యాలు, మోసాలపై ‘వెన్నుపోటు’ పుస్తకాన్ని వైఎస్సార్సీపీ నేతలు ఆదివారం ఆవిష్కరించారు. కన్న బాబురాజు, కంబాల జోగులు, అదీప్ రాజు, పెట్ల ఉమాశంకర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ నేతలపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు. ఏడాది కాలంలో లక్ష యాభై వేల కోట్ల అప్పు తప్ప చేసిందేమీ లేదు.. త్వరలో అక్రమ మైనింగ్పై కూడా పోరాటం చేస్తాం. వైఎస్ జగన్ చెప్పిన హామీలతో పాటు చెప్పని హామీలను కూడా అమలు చేశారని గుడివాడ అమర్నాథ్ గుర్తు చేశారు.కూటమి మోసాలపై వెన్నుపోటు పుస్తక ఆవిష్కరణ.. విశాఖపట్నం వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం జరిగింది. ఈ పుస్తకాన్ని ఎంపీ బాబురావు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, కేకే రాజు, వాసుపల్లి గణేష్ కుమార్ తదితరులు ఆవిష్కరించారు.అక్రమాల్లో చంద్రబాబు పీహెచ్డీ: గొల్ల బాబురావుపేద ప్రజలను మోసం చేయడం.. అక్రమాలు చేయడంలో చంద్రబాబు వేయి పీహెచ్డీలు చేశాడు. వైఎస్ జగన్ సంక్షేమ పాలనను ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. మోసం పోయాం అని గ్రహించి ప్రజలు మళ్లీ జగన్ను గెలిపించాలని అనుకుంటున్నారు. జగన్ అంటే నమ్మకం.. బాబు అంటే మోసం అని ప్రజలకు వివరించాలి.హమీలు అమలు చేయడంలో చంద్రబాబు విఫలం: కేకే రాజుఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు వైఫల్యం చెందారు. వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పాలన అందించారు. నాడు ఏడాదిలో జగన్ అన్ని పథకాలను అమలు చేశారు. జగన్ ఇచ్చిన మాట మీద నిలబడితే.. బాబు మోసం చేశాడు. ఎల్లో మీడియాలో ప్రతీ రోజూ అబద్దపు కథనాలు రాస్తున్నారు. హామీల గురించి ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతామని లోకేష్ బెదిరిస్తున్నాడు.అప్పులు చేయడం సంపద సృష్టించడమా?: వరుదు కల్యాణిగతంలో మూడు సార్లు సీఎంగా చేసిన బాబు ఎప్పుడూ ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ప్రజలను బాబు మరోసారి మోసం చేశాడు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం సరే.. మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆడ పిల్లలగా పుట్టడమే పాపమా అన్నట్టు ఉంది. ప్రభుత్వ దృష్టి అంతా అమరావతి అవినీతిపైనే ఉంది. ఏడాదిలో జగన్ 90 శాతం హామీలు అమలు చేశారు. బాబు చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది: వాసుపల్లి గణేష్ కుమార్చంద్రబాబు ఒక్కడే ఎప్పుడూ జగన్ను ఢీ కొట్టలేడు. పవన్, బీజేపీని కలుపుకొని బాబు గెలిచాడు. జగన్కు 40 శాతం ఓట్లు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం ఖాయం. లోకేష్ నాయకుడిగా ఎదగలేడు.. ఆయన నాయకత్వం ముందుకు సాగదు. సంపద సృష్టిస్తా అని అధికారంలోకి వచ్చి.. అప్పు చేసి తల్లికి వందనం ఇచ్చారు. అసెంబ్లీని రబ్బర్ స్టాంప్లా చేస్తున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు అనంతరం జగన్ 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారు. జగన్ మచ్చ లేని నాయకుడు.. ఆయన ఏ తప్పు చేయలేదు. నాయకులు, అధికారుల తప్పిదం వలన ఓడిపోయాం. కూటమి పాలనలో తప్పులు చేసిన వారు ఎక్కడున్నా తీసుకొస్తాం. -
దక్షిణ కోస్తా రైల్వే జోన్ జీఎంగా సందీప్ మాథుర్ బాధ్యతలు
తాటిచెట్లపాలెం (విశాఖ): దక్షిణ కోస్తా రైల్వే జోన్ జనరల్ మేనేజర్గా సందీప్ మాథుర్ శనివారం విశాఖలోని దొండపర్తిలో ఉన్న డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.అనంతరం డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్బోరాతో కలిసి పలు అభివృద్ధి పనులపై సమీక్షించారు. జోనల్ కార్యకలాపాలపై భవిష్యత్తులో చేపట్టాలి్సన ప్రణాళికలను గురించి వివరించారు. ఈ సమావేశంలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఓఎస్డీ చంద్రశేఖర్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (కన్స్ట్రక్షన్ ) అంకుష్ గుప్తా ఇతర ఉన్నతాధికారులతో ఆయన పాల్గొన్నారు. -
ఆన్!
ఆఫ్..ఇంజిన్ మీటర్● బండి షెడ్డులో ఉన్నా బిల్లు తీసేసుకుంటున్నారు ● మెకానికల్ విభాగంలో ఆయిల్ మాయ ● ప్రతీ నెలా రూ.లక్షన్నర మేర పక్కదారి ● అర్హత లేకపోయినా ఏఈ స్థాయిలో జీపు వినియోగం ● ఏడాది కాలంగా అడ్డగోలు వ్యవహారంసూత్రధారులు ఓ ఏఈ... మలేరియా అధికారి....! జీవీఎంసీలో జరుగుతున్న భారీ ఆయిల్ కుంభకోణంలో మరిన్ని షాకింగ్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆయిల్ మాయాజాలంలో ప్రధానంగా ఒక అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) తో పాటు ప్రజారోగ్య విభాగంలోని ఒక అధికారి, మలేరియా విభాగంలోని ఒక అధికారికి కీలక పాత్ర ఉందని విమర్శలున్నాయి. తిరగని వాహనాలకు సైతం ఆయిల్ బిల్లులు దోచేస్తున్న జీవీఎంసీ మెకానికల్ విభాగం అధికారులు, కార్డుల ద్వారా మాత్రమే ఆయిల్ జారీ చేయాలనే నిబంధనను ఉల్లంఘిస్తున్నారని తెలుస్తోంది. అయితే హైడ్రాలిక్ ఆయిల్ కోసం మాత్రం 20 లీటర్ల కూపన్లను అదనంగా ఇస్తున్నట్లు సమాచారం. ఇది కేవలం కాగితాలపై మాత్రమే జరుగుతున్న వ్యవహారం అని, నిజానికి ఆయిల్ దారి మళ్లుతోందని ఆరోపణలున్నాయి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మెకానికల్ విభాగంలో భారీ ఎత్తున ఆర్థిక అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కనీసం రోడ్లపై తిరగని వాహనం పేరుతో కూడా ప్రతీ నెలా ఆయిల్ బిల్లు డ్రా అవుతోంది. ఏఈ స్థాయి అధికారి ఏకంగా రెండు జీపుల్లో తిరుగుతున్నట్టు లెక్కలు చూపి ప్రతీ నెలా రూ. లక్ష మేర ఆయిల్ బిల్లును నొక్కేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన గత ఏడాది కాలంగా ఈ వ్యవహారం సాగుతోంది. ఇక జీవీఎంసీ నుంచి ఎస్ఈ స్థాయి అధికారి బదిలీపై వెళ్లి.. తిరిగి ఇక్కడకు వచ్చే వరకూ ఆయనే వాహనాన్ని నడుపుతున్నట్టు మరీ దోపిడికి తెగబడుతున్నారు. ఇక ఫాగింగ్ మిషన్ల ఆయిల్ బిల్లు ఏకంగా ప్రతీ నెలా రూ. 30 లక్షల మేర అదనంగా పెంచేశారు. మొత్తంగా జీవీఎంసీ మెకానికల్ విభాగంలో మాత్రం వాహనంలో ముల్లు కదలకపోయినా ఆయిల్ బిల్లు మాత్రం లక్షలకు చేరుతోంది. ఏడాది కాలంగా...! జీవీఎంసీ మెకానికల్ విభాగంలో జరుగుతున్న ఈ అక్రమాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. తిరుగుతున్న వాహనాలకు మాత్రమే కాకుండా, షెడ్డులో మూలకు చేరిన వాహనాలు నడు స్తున్నట్లు లెక్కలు చూపిస్తూ ఆయిల్ బిల్లులు కాజేస్తున్నారు. ఉదాహరణకు, పెద్దగా వాడకంలో లేని రెండు జీపులతో పాటు, అసలు పనిచేయకుండా నిలిచిపోయిన ఒక టాటా సఫారీ వాహనం పేరుతో ప్రతినెలా రూ. 1.5 లక్షల ఆయిల్ బిల్లులు డ్రా అవుతున్నాయి. ఈ విధంగా గత ఏడాది కాలంగా ఆయిల్ దోపిడీ జరుగుతోందని సమాచారం. అంటే, వాహనం ఆన్లో లేకపోయినా, జీవీఎంసీ మెకానికల్ విభాగంలోని కొందరు అధికారులు డీజిల్ బిల్లు మీటర్ను మాత్రం ఆన్లోనే ఉంచుతున్నారన్నమాట. నిబంధనలకు విరుద్ధంగా.. నిబంధనల ప్రకారం జీవీఎంసీలో అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) స్థాయి అధికారికి ఎటువంటి వాహనం కేటాయించరు. కేవలం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (డీఈ) స్థాయి అధికారి నుంచే వాహనాలను కేటాయిస్తారు. అయినప్పటికీ ఏడాది కాలంగా మెకానికల్ విభాగంలోని ఒక ఏఈ ఏకంగా రెండు వాహనాలను ఉపయోగిస్తూ, ప్రతినెలా ఆయిల్ బిల్లుల రూపంలో లక్ష రూపాయల వరకూ కాజేస్తున్నారని విమర్శలున్నాయి. హైడ్రాలిక్ ఆయిల్, ఫాగింగ్ మిషన్ల పేరుతోనూ అక్రమాలు హైడ్రాలిక్ ఆయిల్ కూపన్ల విధానాన్ని రద్దు చేసినప్పటికీ, ఒక్కో వాహనానికి 20 లీటర్ల చొప్పున కూపన్లను రోజువారీగా అదనంగా జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. హైడ్రాలిక్ ఆయిల్ లీటరు ధర రూ. 350 పైచిలుకు పలుకుతుంది. ఇక, ఫాగింగ్ మిషన్లు, స్ప్రింక్లర్లకు ఆయిల్ బిల్లులను అమాంతంగా రెట్టింపు చేయడంతో నెలకు రూ. 30 లక్షల మేర ప్రజాధనం పక్కదారి పడుతోంది. మొత్తంగా చూస్తే, జీవీఎంసీ మెకానికల్ విభాగంలో అవకాశం దొరికిన ప్రతిచోటా ఆయిల్ దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శలున్నాయి. ఈ అక్రమాలపై ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఫాగింగ్ మిషన్ల పేరుతో నెలకు రూ. 30 లక్షల అదనపు దోపిడీ ఇక ఫాగింగ్ మిషన్ల పేరుతో నెలకు అదనంగా రూ. 30 లక్షల మేర ప్రజాధనం కాజేస్తున్నట్లు విమర్శలున్నాయి. జీవీఎంసీలో 8 పెద్ద ఫాగింగ్ మిషన్లు, 80 మీడియం సైజు ఫాగింగ్ మిషన్లు, 25 స్ప్రింక్లర్లు ఉన్నాయి. వీటికి గతంలో ప్రతినెలా రూ.38 లక్షల మేర ఆయిల్ బిల్లులు చెల్లించేవారు. అయితే, డిప్యూటేషన్పై వచ్చిన ఇద్దరు అధికారులు మెకానికల్ విభాగంతో కుదుర్చుకున్న ‘మామూళ్ల ఒప్పందంలో’ భాగంగా ఈ బిల్లును ఏకంగా రూ. 68 లక్షలకు పెంచేశారు. ఈ అక్రమ ఒప్పందానికి ప్రతిఫలంగా, ప్రజారోగ్య విభాగంలోని ఒక అధికారికి, మలేరియా విభాగానికి చెందిన మరో అధికారికి చెరో రూ. 2 లక్షల చొప్పున ప్రతి నెలా ముట్టచెప్పే విధంగా ఒప్పందం కుదిరిందని ఆరోపణలున్నాయి. ప్రతినెలా ఈ ‘మామూళ్ల పంపకంలో’ మలేరియా విభాగంలోని ఒక అధికారిదే కీలక పాత్ర అని తెలుస్తోంది. పూర్తిస్థాయి విచారణ ఈ ఆరోపణలపై మెకానికల్ విభాగం ఈఈ రత్నాకర్ రెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా గత 10 రోజులుగా జీపులకు ఆయిల్ బిల్లులను నిలిపివేశామని తెలిపారు. అయితే ఈ ఆయిల్ కుంభకోణంపై పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వ్యవహారం జీవీఎంసీ పరిపాలనలో పారదర్శకత లేకపోవడాన్ని, అవినీతి ఏ స్థాయిలో పాతుకుపోయిందో స్పష్టం చేస్తోంది. బదిలీ అయిన తరువాత కూడా.. ఇంకో విచిత్రమైన సంఘటన ఏమిటంటే, ఒక ఎస్ఈ స్థాయి అధికారి జీవీఎంసీలో పనిచేసి కాకినాడకు బదిలీపై వెళ్లిన తర్వాత ఆరు నెలల పాటు తిరిగి జీవీఎంసీకి వచ్చే వరకు ఆయన పేరు మీద ఉన్న వాహనాన్ని మాత్రం వెనక్కి తీసుకోలేదు. అంటే, ఆరు నెలల పాటు అక్కడ విధులు నిర్వర్తించని అధికారి పేరుతో వాహనాన్ని నడుపుతున్నారన్నమాట. మరో టాటా సఫారీ వాహనాన్ని కూడా ఇంకో అధికారి వినియోగిస్తున్నారని, గత రెండు నెలలుగా ఆయిల్ బిల్లులను భారీగా డ్రా చేస్తున్నారని ఆరోపణలున్నాయి. -
‘మురికివాడల’ కేసు కొట్టివేత
డాబాగార్డెన్స్: దశాబ్దానికి పైగా సాగిన న్యాయపోరాటం ఫలించింది. 2012లో జీవీఎంసీ, పోలీస్ అధికారులు విశాఖలోని మురికివాడల ప్రజలపై నమోదు చేసిన కేసులను శుక్రవారం సెషన్స్ కోర్టు కొట్టివేసింది. అప్పట్లో 1200 మందిపై కేసులు నమోదు చేసి 94 మందిని అరెస్టు చేసి జైలుకి పంపారు. ఈ సుదీర్ఘ పోరాటంలో 8 మంది నిందితులు మరణించగా, పలువురు అనారోగ్యానికి గురయ్యారు. విశాఖ రైల్వే న్యూకాలనీలోని ఇందిరాగాంధీ కాలనీ, జ్ఞానాపురం బాబూ కాలనీ, దయానందనగర్ చాకలిగెడ్డ, రాజీవ్ కాలనీ, సెబాస్టియన్ కాలనీ, కంచరపాలెం మెట్టు పైడిమాంబ కాలనీ, మాధవధార ఏకలవ్య కాలనీ, సెంట్రల్ జైలు రామకృష్ణాపురం కాలనీ, పెందుర్తి చినముషిడివాడ అంబేడ్కర్ నగర్ కాలనీ, ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ఫేకర్ లేఅవుట్, వినాయకనగర్ కాలనీ ప్రజలపై అక్రమంగా కేసులు బనాయించారు.2వ జిల్లా, సెషన్స్ కోర్టు , 1వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు ఈ కేసులను కొట్టివేశాయి. ఈ కేసులో బాధిత ప్రజల తరఫున న్యాయవాదులు పల్లేటి అప్పారావు, కేఎస్ చలం, ఢిల్లీరావు, కె.పద్మ, ఎన్బీఎస్ చలపతి, ఎంఎన్ రాజు, యు.కనకరాజు వాదించారు. కోర్టు తీర్పు మురికివాడ ప్రజల పోరాటం న్యాయమైనదని నిరూపించిందని బాధితులు పేర్కొన్నారు. ఇప్పటికై నా జీవీఎంసీ అధికారులు, రాజకీయ నాయకులు మురికివాడ ప్రజల హక్కులను గుర్తించి, ఇందిరాగాంధీ కాలనీకి సంపూర్ణ హక్కులు కల్పించి గౌరవప్రదమైన జీవనం సాగించే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
జీవీఎంసీ ప్రధాన ఇంజనీర్గా పల్లంరాజు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన ఇంజనీర్గా జీవీ పల్లంరాజు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని శుక్రవారం తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. గత నెల 31న జీవీఎంసీ ప్రధాన ఇంజనీర్గా విధులు నిర్వహించిన పి. శివప్రసాదరాజు పదవీ విరమణ పొందిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో, జీవీఎంసీ పర్యవేక్షక ఇంజనీర్గా ఉన్న పల్లంరాజుకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్బాబు పూర్తి అదనపు బాధ్యతలతో జీవీఎంసీ ప్రధాన ఇంజనీర్గా ఉత్తర్వులు జారీ చేశారు. కొనసాగుతున్న ఎస్జీటీల బదిలీ కౌన్సెలింగ్ ఆరిలోవ: ఉమ్మడి విశాఖ జిల్లాల్లో ఎస్జీటీ బదిలీల కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా, శుక్రవారం 801 నుంచి 1,600 వరకు సీరియల్ నంబర్లు ఉన్న అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. దాదాపు 800 మందికి ఈ ప్రక్రియ అర్ధరాత్రి దాటినా కొనసాగింది. రాత్రి 8:45 గంటల సమయానికి సీరియల్ నంబర్ 1358 వరకు కౌన్సెలింగ్ పూర్తయింది. మిగిలిన 242 మంది అభ్యర్థులకు అర్ధరాత్రి తర్వాత కూడా కౌన్సెలింగ్ కొనసాగింది. జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) ప్రేమ్కుమార్ మాట్లాడుతూ శనివారం ఉదయం 1,601వ సీరియల్ నంబర్ నుంచి చివరి నంబర్ వరకు ఉన్న అభ్యర్థులందరికీ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ జాబితాలో ఉన్న ఉపాధ్యాయులు ఉదయం 8:30 గంటలకే కౌన్సెలింగ్ హాల్కు చేరుకోవాలని ఆయన సూచించారు. డీఎస్సీ పరీక్షకు 172 మంది గైర్హాజరు ఆరిలోవ: జిల్లాలో డీఎస్సీ–2025 ద్వారా విద్యాశాఖ నిర్వహిస్తున్న ఉపాధ్యాయ నియామక పరీక్షలు ఈ నెల 6వ తేదీ నుంచి కొనసాగుతున్నా యి. ఇందులో భాగంగా శుక్రవారం నిర్వహించిన పరీక్షలకు మొత్తం 172 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. శుక్రవారం ఉదయం జరిగిన పరీక్షకు ఐదు కేంద్రాలలో మొత్తం 1,642 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అదేవిధంగా, మధ్యా హ్నం నిర్వహించిన పరీక్షకు ఎనిమిది కేంద్రాలలో 2,337 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. పరీక్షా కేంద్రాలను డీఈవో ఎన్. ప్రేమ్కుమార్ స్వయంగా సందర్శించారు. ఆయన ఒక కేంద్రాన్ని పరిశీలించగా, ఫ్లైయింగ్ స్క్వాడ్ నాలుగు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసింది. ఉదయం జరిగిన పరీక్షకు 109 మంది, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 63 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. -
విమాన ప్రమాద మృతులకు వైఎస్సార్ సీపీ ఘన నివాళి
డాబాగార్డెన్స్: అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రగాఢ సంతాపం తెలిపింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి శుక్రవారం సాయంత్రం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు నేతృత్వంలో నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తులు వెలిగించి, రెండు నిమిషాల పాటు మౌనం పాటించి మృతులకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని, ఇంతవరకు ప్రమాదానికి గల కారణాలు తెలియకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, గుజరాత్ ప్రభుత్వాలు ప్రకటించిన రూ.కోటి పరిహారం సరిపోదని, దీనిని మరింత పెంచి బాధితుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, గుజరాత్ ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. దాదాపు 241 మంది అకాల మరణం చెందారని, మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. విమాన ప్రమాదంలో ప్రయాణికులు మృతి చెందడంతో పాటు, ఆ విమానం మెడికల్ కాలేజీపై కూలి మెడికో విద్యార్థులు కూడా మృత్యువాత పడటం అత్యంత విచారకరమన్నారు. పార్టీ మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి మాట్లాడుతూ ఇంత పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరగడం ఇదే మొదటిసారని, ఒకే కుటుంబానికి చెందిన 10 మంది చనిపోవడం అత్యంత బాధాకరమన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లపల్లి సుభద్ర, సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, తిప్పల శ్రీనివాస్, దేవన్రెడ్డి, మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, మాజీ శాసనసభ్యులు తైనాల విజయ్కుమార్, చింతలపూడి వెంకట్రామయ్య, డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్, పార్టీ కార్యాలయ పర్యవేక్షకుడు రవిరెడ్డి, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, నియోజకవర్గ విభాగాల అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
తల్లికి వందనం..వంచన
విశాఖ సిటీ: ‘తల్లికి వందనం’ అంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు తల్లుల కు పంగనామాలు పెడుతోందనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బడికి వెళ్లే ప్రతి విద్యా ర్థికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చి, తాజాగా నిబంధనల పేరుతో లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోత విధించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నెల 12వ తేదీ నుంచే డబ్బులు జమ అవుతాయని పత్రికా ప్రకటనలు రావడంతో బ్యాంకుల వద్ద పడిగాపులు కాసిన తల్లులు, డబ్బులు జమ కాకపోవడంతో చాలా మంది నిరాశగా వెనుదిరిగారు. హామీల ఉల్లంఘన, నిబంధనల వల ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం, ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఈ పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. అయితే, ‘ఫస్ట్ క్లాస్లో చేరిన వారికి వచ్చే ఏడాది నుంచి మాత్రమే ఇస్తాం’ అంటూ ప్రభుత్వం మాట మార్చిందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేల కంటే ఎక్కువ జీతం వచ్చిన వారిని అనర్హులుగా గుర్తించి జాబితా నుంచి తొలగించారు. ఎటువంటి ఆస్తులు లేకపోయినా, ఉన్నట్లుగా చూపిస్తూ మరికొంతమందిని పథకం నుంచి తప్పించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అనుమానాస్పద జాబితా ఎంపిక ఏ పథకానికై నా దరఖాస్తులు స్వీకరించి, పరిశీలించి లబ్ధిదారులను గుర్తించడం తప్పనిసరి. కానీ ఈ ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించకుండానే లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శించారు. గత విద్యా సంవత్సరం డేటా ఆధారంగా జాబితాను సిద్ధం చేయడం వల్ల, ఈ విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో చేరిన విద్యార్థులకు పథకం వర్తించదని తల్లిదండ్రులకు సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. ఆస్తుల లింకుతో ఇక్కట్లు గతంలో ‘అమ్మ ఒడి’ తీసుకున్న లబ్ధిదారులు సైతం ఈ జాబితాలో అనర్హులుగా తేలడం గమనార్హం. దీనిపై సచివాలయంలో ఆరా తీయగా, వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ ఆస్తి ఉన్నట్లు లేదా రూ.12 వేలు కంటే ఎక్కువ ఆదాయం ఉన్నట్లు చూపుతూ అనర్హులుగా తేల్చినట్లు చెబుతున్నారు. వాస్తవానికి, అనర్హుల్లో అత్యధిక శాతం మందికి ఆస్తులు లేనప్పటికీ, ఉన్నట్లు చూపుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఆస్తులు లేవని, అద్దె ఇంట్లో ఉన్నామని చెబుతున్నప్పటికీ, సచివాలయం సిబ్బంది తమకు సంబంధం లేదని జీవీఎంసీ కార్యాలయానికి వెళ్లాలంటూ తిప్పుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సచివాలయ సిబ్బంది ఇంటింటి సర్వే, మ్యాపింగ్ చేపట్టినప్పుడు, అద్దెకున్న వారి ఆధార్ కార్డును ఇంటి ఆస్తి పన్నుతో లింక్ చేయడం వల్లే ఈ సమస్య తలెత్తిందని తెలుస్తోంది. దీంతో లబ్ధిదారుల ఆధార్ నెంబర్ పరిశీలిస్తే, ఆస్తి ఉన్నట్లు చూపిస్తోంది. ఈ లింకును తొలగించడానికి సచివాలయం సిబ్బంది నిరాకరించడం, ఉన్నతాధికారులు సైతం దీనిపై దృష్టి పెట్టకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిబంధనల పేరుతో తల్లికి వందనం లబ్ధిదారుల సంఖ్య కుదింపు 2022–23లో ఇంటికొకరు చొప్పున 1,70,467 విద్యార్థులకు పంపిణీ ఇపుడు ఎంత మంది పిల్లలున్నా అందరికీ ఇస్తామని కూటమి హామీ కానీ జిల్లాలో 1,90,433 మందే అర్హులుగా తేల్చిన ప్రభుత్వం జిల్లాలో ఫస్ట్ నుంచి ఇంటర్ వరకు 4 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తులు స్వీకరించకుండానే లబ్ధిదారుల ఎంపికపై అనుమానాలు రూ.12 వేలు కంటే ఎక్కువ జీతం వస్తే తల్లికి వందనం కట్ ఎటువంటి ఆస్తులు లేకున్నా ఉన్నట్లు చూపిస్తూ అనర్హులుగా ప్రకటన లబ్ధిదారుల సంఖ్యలో భారీ కోత ఎన్నికలకు ముందు ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ ‘తల్లికి వందనం’ కింద రూ.15 వేలు ఇస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది తర్వాత పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు హడావుడి చేశారు. దీని ప్రకారం జిల్లాలో 3 నుంచి 3.5 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని అందరూ భావించారు. కానీ జిల్లాలో మొత్తం 4 లక్షల మంది విద్యార్థులు ఉండగా, కేవలం 1,30,706 మంది తల్లులకు గాను 1,90,433 మంది పిల్లలకు మాత్రమే ఇస్తున్నట్లు ప్రకటించారు. 2022–23లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ‘అమ్మ ఒడి’ పథకాన్ని 1,70,467 మందికి అమలు చేసింది. ఎన్నికల కారణంగా 2024లో నిధులు పడలేదు. రెండేళ్ల తర్వాత అమలు చేస్తున్న పథకంలో లబ్ధిదారుల సంఖ్య 3 లక్షలకు పెరుగుతుందనుకుంటే, కేవలం 19,966 మందికి మాత్రమే అదనంగా ఇస్తున్నట్లు తెలుస్తోంది. -
నేడు, రేపు హై లైఫ్ బ్రైడ్స్ ఎగ్జిబిషన్
ఏయూ క్యాంపస్: వివాహాలకు అవసరమైన విభిన్న మోడళ్ల ఆభరణాలతో కూడిన రెండు రోజుల హై లైఫ్ బ్రైడ్స్ ఎగ్జిబిషన్ శని, ఆదివారాలు నోవాటెల్ హోటల్లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఎగ్జిబిషన్లో భాగంగా వివాహ సందర్భాల్లో వధువును మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే ఆభరణాలు అందుబాటులో ఉంటాయన్నారు. డిజైనర్ల చేతిలో రూపుదిద్దుకున్న ఫ్యాషన్ ఆభరణాలు మహిళల అందాన్ని మరింత ద్విగుణీకృతం చేస్తాయన్నారు. భారత దేశవ్యాప్తంగా పేరుగాంచిన డిజైనర్లు తాము తయారు చేసిన ఆభరణాలను ఇక్కడ ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. వివాహ ఫ్యాషన్కు తగినట్టుగా ప్రతి ఆభరణం ఎంతో నైపుణ్యంతో డిజైన్ చేసి, తయారు చేసి విశాఖ వాసుల కోసం ఇక్కడి ప్రదర్శనలో ఉంచుతున్నట్లు వెల్లడించారు. -
‘హెచ్పీవీ వ్యాక్సిన్పై అపోహలు వద్దు’
ఏయూక్యాంపస్: హెచ్పీవీ వ్యాక్సిన్పై ప్రజలు అపోహలు వీడాలని వైద్యులు సూచించారు. బీచ్ రోడ్డులోని ఓ హోటల్లో సీరం ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో కాంకర్ హెచ్పీవీ–క్యాన్సర్ కాన్క్లేవ్ను కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి శుక్రవారం ప్రారంభించి, మాట్లాడారు. మహిళల్లో రొమ్ముక్యాన్సర్ తర్వాత అత్యధికంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కనిపిస్తోందన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా దీనిని నివారించడం సాధ్యపడుతుందన్నారు. ఆపోహలు వీడి అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఆంధ్ర మెడికల్ కళాశాల ఆచార్యులు డాక్టర్ విద్య రమ మాట్లాడుతూ సీ్త్ర, పురుషులకు వచ్చే అనేక క్యాన్సర్లను హెచ్పీవీ వ్యాక్సిన్ నిరోధిస్తుందన్నారు. 9 నుంచి 15 ఏళ్ల వయసు వారికి రెండు డోసులు, ఆపైబడిన వయసు వారు మూడు డోసులు వేసుకోవాలన్నారు. ఒక్కో డోసుకు మధ్య ఐదు నెలల వ్యత్యాసం ఉండాలన్నారు. 26 ఏళ్లలోపు వయసున్నవారు దీనిని తీసుకోవాలన్నారు. హెచ్పీవీ వ్యాక్సిన్కు ఇతర క్యాన్సర్లను నిరోధించే శక్తి కూడా ఉందన్నారు. కార్యక్రమంలో సీ్త్రల వైద్య నిపుణురాలు డాక్టర్ సునందరాణి, చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ మురళీసంతోష్, డాక్టర్ సాయి సునీల్ కిషోర్ తదితరులు మాట్లాడారు. -
జీవీఎంసీ డీడీవోగా ఫణిరామ్ బాధ్యతల స్వీకరణ
డాబాగార్డెన్స్: జీవీఎంసీ డీడీవోగా ఎం.వి.డి.ఫణి రామ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జీవీఎంసీ అదనపు కమిషనర్ ఎస్.ఎస్. వర్మ వ్యక్తిగత కారణాలతో ఈ నెల 24 వరకు సెలవులో ఉండటంతో, ఆయన నిర్వహిస్తున్న డీడీవో బాధ్యతలను జీవీఎంసీ డీపీఓగా విధులు నిర్వహిస్తున్న ఎం.వి.డి.ఫణిరామ్కు పూర్తి అదనపు బాధ్యతలతో అప్పగిస్తూ జీవీఎంసీ ఇన్చార్జ్ కమిషనర్ హరేందిర ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే జీవీఎంసీ అదనపు కమిషనర్ (ఫైనాన్స్) బాధ్యతలను జీవీఎంసీ అదనపు కమిషనర్ (జనరల్) డి.వి. రమణమూర్తికి అప్పగించినట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. -
యోగాంధ్రలో పాల్గొనేందుకు క్యూఆర్ కోడ్ సౌకర్యం
డాబాగార్డెన్స్: ఈ నెల 21న రామకృష్ణా బీచ్ నుంచి భీమిలి వరకు నిర్వహించనున్న ‘యోగాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొనే వారికి ఏపీఎస్ఆర్టీసీ ద్వారా రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించారు. ద్వారకాబస్టేషన్లోని ఏపీఎస్ఆర్టీసీ కార్యాలయంలో క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు క్యూఆర్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ద్వారకాబస్టేషన్ యూనిట్ ఇన్చార్జ్ పీబీఎంకే రాజు, వర్మ, హరిశంకర్తో పాటు పలువురు సూపర్వైజర్లు , ప్రయాణికులు పాల్గొన్నారు. -
● దారి దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు నకిలీ పోలీసుల అరెస్ట్ ● అడవివరం–శొంఠ్యాం రోడ్డులో కాపుకాసి బలవంతంగా వసూళ్లు ● బాధితుడి ఫిర్యాదుతో చాకచక్యంగా పట్టుకున్న పెందుర్తి పోలీసులు ● నిందితుల్లో ఒకరు తొలగించబడ్డ పోలీస్ కానిస్టేబుల్
నిందితుడు పాత నేరస్తుడే.. ఈ క్రమంలో సీపీ శంఖబ్రతబాగ్చీ ఆదేశాల మేరకు వెస్ట్ జోన్ ఏసీపీ ఏబీ పృధ్వితేజ ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన పెందుర్తి సీఐ కె.వి.సతీష్కుమార్ బృందం నిందితుల కోసం అన్ని కోణాల్లో గాలించారు. బాధితుడి ఫోన్పే ట్రాన్సాక్షన్ ఆధారంగా నిందితుల ఫోన్పే ఖతాపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఇదే తరహాలో దోపిడీకి పాల్పడేందుకు పోలీస్ యూనిఫాంలో పెందుర్తి మండలం సరిపల్లి చెక్పోస్టు వద్ద మాటు వేసిన శివప్రసాద్, గోపిలను పట్టుకుట్లున్నట్లు సీఐ వెల్లడించారు. పెందుర్తి: అడవివరం–శొంఠ్యాం రోడ్డులో ప్రేమ జంటలే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు నకిలీ పోలీసులను పెందుర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను పెందుర్తి పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ కె.వి.సతీష్కుమార్ వెల్లడించారు. విజయనగరం జిల్లా ధర్మవరం మండలం మామిడిపాలేనికి చెందిన ఏతలపాక శివప్రసాద్, నగరంలోని రైల్వే న్యూకాలనీలో నివాసం ఉంటున్న కదరాపు గోపీతో కలిసి దారి దోపిడిలు చేయడం వృత్తిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో పోలీస్ కానిస్టేబుల్ యూనిఫాంలు ధరించి అడవివరం–శొంఠ్యాం రోడ్డులో ఈ నెల 3 నుంచి 6 వరకు మాటు వేశారు. రోజూ పొద్దుపోయాక అటుగా వెళ్తున్న ప్రేమ జంటలను గమనించేవారు. వారు ఎక్కడైనా బైక్లు నిలిపి మాట్లాడుకోవడం, లేదా అనుమానం కలిగేలా ప్రవర్తించడం చూసి వారి వద్దకు వెళ్లి, బెదిరింపులకు దిగేవారు. ఈ నేపథ్యంలో ఈ నెల 6న కోరాడ జయరాం అనే వ్యక్తి గాజువాక నుంచి బైక్పై తనకు కాబోయే భార్యతో కలిసి విజయనగరం వెళ్తున్నాడు. సరిగ్గా అడవివరం భైరవకోన దాటాక వారిని అడ్డగించిన శివప్రసాద్, గోపి తాము పోలీసులమని చెప్పి బెదిరింపులకు దిగారు. నగదు ఇస్తే వదిలేస్తామని, లేదంటే కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తామని భయపెట్టారు. అయితే నగదు లేదని, ఫోన్పే ద్వారా ఇస్తానని చెప్పడంతో నిందితుడు శివప్రసాద్ తన వద్ద ఉన్న ఫోన్పే క్యూఆర్ కోడ్ ద్వారా రూ.5 వేలు నగదు బదిలీ చేయించుకున్నాడు. వీరి తీరుపై అనుమానం వచ్చిన జయరాం అదే రోజు రాత్రి విశాఖ సీపీకి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశాడు. పది జంటల నుంచి వసూళ్లు ఈ నెల 3 నుంచి 6 వరకు దాదాపు పది జంటల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి రూ.2 వేలు నగదు, స్కూటీ, రెండు సెల్ఫోన్లతో పాటు రెండు పోలీస్ యూనిఫాంలను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు శివప్రసాద్ గతంలో ఏపీఎస్పీ 5వ బెటాలియన్లో కానిస్టేబుల్గా పనిచేసేవాడని, అతడి అనుచిత ప్రవర్తన కారణంగా 2019లో ఉద్యోగం నుంచి తొలగించినట్లు సీఐ తెలిపారు. శివప్రసాద్పై దోపిడి, దొంగతనం కేసులు 15 ఉండగా, అందులో 9 దోపిడీ కేసులు పెందుర్తి పోలీస్ స్టేషన్లోనే ఉన్నాయన్నారు. నిందితులిద్దరిని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. కేసులో ప్రతిభ కనబరిచిన సీఐ సతీష్కుమార్, ఎస్ఐ సీహెచ్ స్వామినాయుడు, హెచ్సీ గెదెల అప్పారావు, పీసీలు రొంగలి సంతోష్కుమార్, ప్రగడ గణేశ్వరరావు, గాదె శంకర్రావులను ఉన్నతాధికారులు అభినందించారు. -
కూటమి ఏడాది పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు
ఘనంగా పునీత ఆంథోనీ చర్చి పండగడాబాగార్డెన్స్: రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏడాది పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు ఆక్షేపించారు. జగదాంబ సమీపానున్న పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు డాక్టర్ బి.గంగారావు, ఆర్కేఎస్వీ కుమార్, వి.కృష్ణారావులతో కలిసి శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ముందు విశాఖ ప్రజలకు ఇచ్చిన హామీలకు భిన్నమైన పాలన సాగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో ప్రజలపై భారాలు పెరిగాయి తప్ప, ప్రధాన సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని ధ్వజమెత్తారు. తొలుత అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాద మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారు మాట్లాడుతూ విశాఖ ఉక్కును, కార్మికులను కాపాడతామని ఎన్నికల ముందు మభ్యపెట్టి, ఇప్పుడు కేంద్రం చెప్పుచేతల్లో నడుస్తూ ప్లాంట్ ప్రైవేటీకరణకు అండగా నిలుస్తున్నారని ఎద్దేవా చేశారు. రూ.11,440 కోట్లు ప్యాకేజీలో ఒక్క రూపాయి కూడా ప్లాంట్కు ఖర్చు చేయనివ్వలేదని ఆరోపించారు. విశాఖ రైల్వే జోన్ ప్రతిపాదించి 11 నెలలైనా ఇంత వరకు కేంద్రం నుంచి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయించలేకపోయారని ఆక్షేపించారు. జమ్మూ రైల్వే డివిజన్ ఏర్పాటును 2025 జనవరిలో ప్రకటిస్తే 6 మాసాల్లోపే డీపీఆర్ ఆమోదంతో పాటు గెజిట్ నోటిఫికేషన్కూడా వచ్చిందన్నారు. అధికారంలోకి వస్తే విలువ ఆధారిత ఆస్తిపన్ను రద్దు చేస్తామని చెప్పి, ఇప్పుడు 15 శాతం పన్ను పెంచేయడం దారుణమన్నారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లపై టీడీపీ ద్వంద్వ వైఖరిని విమర్శించారు. ఇళ్లులేని పేదలకు టిడ్కో ఇల్లు, 2 సెంట్ల భూమి హామీ అతీగతిలేదన్నారు. సూపర్ సిక్స్ పేరిట ప్రజలను మభ్యపెట్టడం సరికాదన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, నెలకు రూ.1500 ఆర్థిక సాయం, నిరుద్యోగ భృతి ఇతర హామీలు వాయిదాలు వేస్తున్నారని, గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలు నిలిపివేయడం దారుణమన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్లో విశాఖ ప్రజలపై భారాలు మీడియాతో సీపీఎం విశాఖ జిల్లా కమిటీ -
రక్తదానంతో ఆరోగ్యం
ఆరిలోవ: రక్తదానం చేసినవారికి ఆరోగ్యంతో పాటు, మానసిక ఆనందం కలుగుతుందని విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్) డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబు అన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని శుక్రవారం విమ్స్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విమ్స్ సిబ్బంది చేపట్టిన రక్తదాన అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. సిబ్బంది ప్లకార్డులతో నినాదాలు చేస్తూ విమ్స్ పరిపాలనా విభాగం నుంచి జాతీయరహదారి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రాంబాబు మాట్లాడుతూ ప్రతి ఆరు నెలలకు రక్తదానం చేయడం ఆరోగ్యానికి మంచిదన్నారు. రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నవారవుతారని పేర్కొన్నారు. విమ్స్లో ఆరు నెలల నుంచి రక్తనిధి అందుబాటులో ఉందన్నారు. ఇంతవరకు 8 రక్తదాన శిబిరాలు నిర్వహించి వాటి ద్వారా 542 యూనిట్ల రక్తం సేకరించినట్లు వెల్లడించారు. రక్త హీనత, తలసేమియా రోగులకు త్వరలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయనున్నామన్నారు. కార్యక్రమంలో విమ్స్ వైద్యులు, సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఉపరితల ఆవర్తనంతో భారీ వర్షాలు
సాక్షి, అమరావతి/మహారాణిపేట(విశాఖ): ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగలలో 4.8, అన్నమయ్య జిల్లా గుండ్లపల్లిలో 4.4, విజయనగరం జిల్లా గుల్లసీతారామపురంలో 4.0, నంద్యాల జిల్లా చౌతకూరులో 3.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకూ 24 గంటల వ్యవధిలో తిరుపతి జిల్లా తడలో అత్యధికంగా 8.3 సెంటీమీటర్ల వర్షం పడింది. నాగలాపురంలో 7.9 సెంటీమీటర్లు, పల్నాడు జిల్లా మాచర్లలో 7.1, తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకచర్లలో 6.7, చిత్తూరు జిల్లా యాదమర్రిలో 6.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉపరితల ఆవర్తనం శుక్రవారానికి ఉత్తర కర్ణాటక దానికి ఆనుకుని ఉన్న తెలంగాణ, రాయలసీమ మీదుగా సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. మరో ద్రోణి పశ్చిమ–మధ్య అరేబియా సముద్రం నుంచి దక్షిణ ఒడిశా తీరం వరకు కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో శనివారం రాష్ట్రవ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణంతో పాటు కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. -
ప్లాస్టిక్ కవర్లో పసికందు.. ప్రసవం తరువాత చెట్టుకు వేలాడదీసి
సాక్షి,అల్లూరి : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో హృదయవిదారకర ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన బిడ్డను వర రామచంద్రపురం మండలం కొక్కెరగూడెం అడవిలో వదిలేసిన వైనం వెలుగులోకి వచ్చింది. ఏ కన్నతల్లిబిడ్డో ఏమో ప్రసవం తరువాత పసికందును ప్లాస్టిక్ కవర్లో పెట్టి చెట్టుకు వేలాడ దీశారు. ప్లాస్టిక్ కవర్ చుట్టడంతో ఊపిరాడక గుండలవిసేలా ఏడుస్తున్న పసికందును స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్లాస్టిక్ కవర్లో ఉన్న పసికందును అత్యవసర చికిత్స నిమిత్తం చింతూరు ఆసుపత్రికి తరలించారు. చింతూరు పసికందుల వార్డులో మగ బిడ్డకు డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. -
విశాఖలో దారుణం.. భార్యను చంపి భర్త ఆత్మహత్య
సాక్షి, విశాఖపట్నం: నగరంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్యను హతమార్చి.. భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యను డంబుల్తో కొట్టి చంపేశాడు.. భార్యను హతమార్చిన అనంతరం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కంచర పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివాహేతర సంబంధమే కారణమమని పోలీసులు అంటున్నారు.తమ్ముడి చేతిలో అన్న హతంమరో ఘటనలో తమ్ముడి చేతిలో అన్న హతమయ్యాడు. ఈ ఘటన తెలంగాణలోని జగిత్యాలా జిల్లా పెగడపల్లి మండలం ఐతుపల్లిలో జరిగింది. కుటుంబ కలహాలతో తాగిన మైకంలో అన్న కూన నర్సయ్యను కట్టెతో తలపై తమ్ముడు కూన రాములు విచక్షణారహితంగా కొట్టి చంపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
వేతనాల కోసం విమ్స్ వైద్యుల ధర్నా
ఆరిలోవ: విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వైద్యులు గురువారం ధర్నా చేపట్టారు. తమ వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు కాంట్రాక్ట్ వైద్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి విమ్స్ ఆవరణలోని అవుట్ పేషెంట్ విభాగం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ అప్పలనాయుడు, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ హారిక తదితర వైద్యులు మాట్లాడారు. తాము రూ. 92,000 జీతంతో కాంట్రాక్ట్ పద్ధతిలో విమ్స్లో చేరి మూడేళ్లు పూర్తయిందని, కానీ ఇప్పటివరకు తమ వేతనాలు పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని విభాగాల్లో రోగులకు వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం గతంలో వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటివరకు స్పందించలేదని వైద్యులు ఆరోపించారు. తమ వేతనాలను రూ.1.60 లక్షలకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. వైద్యులు ధర్నా చేసిన రెండు గంటల పాటు రోగులకు వైద్య సేవలు అందక ఇబ్బందులు పడ్డారు. -
ఇది హృదయ విదారక ఘటన
విమాన ప్రమాద మృతులకు మాజీ మంత్రి అమర్నాథ్ సంతాపంసాక్షి, విశాఖపట్నం : అహ్మదాబాద్లో ఎయిరిండియా విమాన ప్రమాద ఘటన చాలా దురదృష్టకరమని.. ఇది తమను ఎంతో బాధించిందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ నేతలు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబీకుల దుఃఖాన్ని ఊహించడం కష్టమని.. అందరికీ తట్టుకునే బలాన్ని, ధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్సార్సీపీ నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. విశాఖ తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు, ముఖ్య నేతలు పేర్ల విజయచందర్, రవిరెడ్డి, బోని శివరామకృష్ణ, అల్లంపల్లి రాజబాబు, పీతల గోవింద్ తదితరులు సంతాపం తెలిపారు. -
మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారమివ్వాలి
మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ అనకాపల్లి అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మహారాణిపేట: పరవాడలోని జేఎన్ ఫార్మాసిటీలో ఉన్న ఎస్ఎస్ ఫార్మా గ్యాస్ లీక్ ఘటనలో మృతి చెందిన పరిమి చంద్రశేఖర్(తెలంగాణా), శరగడం కుమార్(మునగపాక) కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందించాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. కేజీహెచ్ మార్చురీ వద్ద మృతుల కుటుంబాలను గురువారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ విశాఖ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఎసెన్షియా ఫార్మా తదితర కంపెనీల్లో జరిగిన ప్రమాదాల్లో చాలా మంది మరణించారని పేర్కొన్నారు. కంపెనీల్లో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎప్పటికప్పుడు సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఏడాది కాలంలో ఇన్ని ప్రమాదాలు ఎప్పుడూ జరగలేదన్నారు. గతంలో జరిగిన ప్రమాదంలో ఎలా నష్ట పరిహారం ఇచ్చారో అలాగే ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
కూలిన ఉక్కు దీక్ష శిబిరం షెడ్
కూర్మన్నపాలెం: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల దీక్ష శిబిరం షెడ్ కూలిపోయింది. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి తాటాకులతో నిర్మించిన షెడ్డు నేలమట్టమైంది. దీంతో కార్మికులు తమ నిరసనను శిబిరం వెలుపల కొనసాగించాల్సి వచ్చింది. విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం 2021 ఫిబ్రవరి 12న అఖిలపక్ష కార్మిక సంఘాలు రిలే నిరాహార దీక్షలను ప్రారంభించాయి. ఈ దీక్షల కోసం తాటాకులతో ఈ షెడ్డును నిర్మించారు. సుమారు ఐదేళ్లు కావస్తున్నందున ఎండకు ఎండి, వానకు తడిసి షెడ్డు ఎప్పుడైనా కూలిపోయే పరిస్థితికి చేరుకుంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి షెడ్డు కూలిపోయింది. అయితే ఆందోళనకారులు, కార్మిక సంఘాలు మళ్లీ షెడ్డు నిర్మిస్తాయా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఇటీవల పోలీసులు శిబిరాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని అక్కడే కూర్చున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు తిరిగి షెడ్డు నిర్మాణానికి అనుమతిస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. -
కొత్తగా కళ్లు తెరిచెనే.!
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులో రెండు జంతువుల పిల్లలు సందడి చేస్తున్నాయి. ఇటీవల గర్భం దాల్చిన రెడ్–నెక్డ్ వాలబీ, మౌస్ డీర్ ఒక్కో పిల్లకు జన్మనిచ్చాయి. ప్రస్తుతం తల్లీపిల్లలు రెండూ ఆరోగ్యంగా ఉన్నాయి. మౌస్ డీర్ పిల్ల తన తల్లితో కలిసి ఎన్క్లోజర్లో చురుకుగా తిరుగుతూ సందర్శకులకు కనువిందు చేస్తోంది. మరోవైపు రెడ్–నెక్డ్ వాలబీ పిల్ల ఇంకా తన తల్లి పొట్టభాగంలోని సంచిలోనే సురక్షితంగా ఉంది. సాధారణంగా రెడ్–నెక్డ్ వాలబీ గర్భం దాల్చిన 30 రోజుల్లోనే పిల్లకు జన్మనిస్తుంది. పుట్టినప్పటి నుంచి ఆ పిల్ల సుమారు ఏడు నెలల పాటు తల్లి సంచిలోనే ఉండి పాలు తాగుతూ పెరుగుతుంది. దాదాపు 12 నెలల వయసు వచ్చాక పూర్తిగా బయటకు వచ్చి స్వతంత్రంగా జీవించడం ప్రారంభిస్తుంది. ఈ రెండు పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయని జూ క్యూరేటర్ మంగమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. జూలో జంతువుల పునరుత్పత్తి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని, కొన్ని నెలల కిందట కూడా పలు జంతువులు పిల్లలకు జన్మనిచ్చాయని ఆమె పేర్కొన్నారు. -
సీఎన్సీ ప్లాస్మా కటింగ్ మెషీన్ ప్రారంభం
సింధియా: విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కోసం నిర్మిస్తున్న 60టీ బోలార్డ్ పుల్ టగ్ స్టీల్ కటింగ్ వేడుక గురువారం ఘనంగా జరిగింది. హిందూస్థాన్ షిప్యార్డ్ హల్ షాప్ వద్ద ఏర్పాటు చేసిన సీఎన్సీ ప్లాస్మా కటింగ్ మెషీన్ను పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ అంగముత్తు ప్రారంభించారు. ముందుగా చైర్మన్ అంగముత్తును హిందూస్థాన్ షిప్యార్డ్ సీఎండీ హేమంత్ ఖత్రి ఘన స్వాగతం పలికారు. రెండు సంస్థల మధ్య బలమైన, దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ప్రతిబింబించేలా జరిగిన ఈ వేడుకలో విశాఖపట్నం పోర్ట్, షిప్యార్డ్ కార్మికులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షిప్యార్డ్ సీఎండీ మాట్లాడుతూ సముద్ర రంగం అభివృద్ధిలో విశాఖ పోర్ట్, షిప్యార్డ్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయన్నారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో భవిష్యత్తులో ఎలక్ట్రిక్, హైడ్రోజన్ శక్తితో నడిచే గ్రీన్ టగ్స్ అభివృద్ధికి హెచ్ఎస్ఎల్ కృషి చేస్తోందని తెలిపారు. పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ మాట్లాడుతూ హిందూస్థాన్ షిప్యార్డ్ సంస్థ నౌకా నిర్మాణ రంగంలో సృష్టిస్తున్న అద్భుతాలు, నూతన పని విధానాలను అభినందించారు. పోర్ట్ ట్రస్ట్ కోసం నిర్మిస్తున్న టగ్ నిర్మాణ పద్ధతులను వివరించారు. -
వలస నేతకు అందలమా?
● టీడీపీలో అసమ్మతి జ్వాలలు ● 8వ వార్డులో బయటపడ్డ విభేదాలు ● మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమన్న కార్యకర్తలు కొమ్మాది: వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలో చేరిన కార్పొరేటర్ లొడగల అప్పారావుకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై 8వ వార్డు టీడీపీలో తీవ్ర దుమారం రేగింది. పార్టీ అధికారంలో లేనప్పుడు ఐదేళ్లుగా కష్టపడి పని చేసిన తమను కాదని.. కొత్తగా వచ్చిన వారికి పెద్దపీట వేయడంపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గురువారం ఎండాడలో జరిగిన కూటమి ఏడాది పాలన సంబరాల్లో పార్టీలో ఈ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. వివరాల్లోకి వెళితే.. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా 8వ వార్డు ఎండాడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ పార్టీ ఎస్సీ విభాగం యువ నాయకుడు బెల్లాన శ్రీనివాస్ తన ఆవేదనను బహిరంగంగా వెళ్లగక్కారు. ‘ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం ధర్నాలు, ఆందోళనలు చేసి జైలుకు కూడా వెళ్లాం. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చాక కార్పొరేటర్ లొడగల అప్పారావుకు ప్రాధాన్యమిస్తూ.. మమ్మల్ని పట్టించుకోవడం లేదు. దీనిని బట్టి చూస్తే పార్టీలో కష్టపడే వారికి విలువ లేదని స్పష్టమవుతోంది.’అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఐదేళ్లుగా వార్డు అధ్యక్షుడిగా పార్టీకి అనేక సేవలు అందించిన చెట్టిపిల్లి గోపిని ఆ పదవి నుంచి తొలగిస్తున్నారని, ఇది ఎంతమాత్రం సమంజసం కాదని శ్రీనివాస్ అన్నారు. సమస్యలు చెప్పుకోవడానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును కలిసేందుకు వెళ్తే ఆయన ముఖం చాటేస్తున్నారని ఆరోపించారు. ఒక వేళ వార్డు అధ్యక్షుడిని మారిస్తే మాత్రం మూకుమ్మడి రాజీనామాలు చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. కాగా.. ఏడాది పాలన సంబరాలను సైతం ఎండాడలో ఒక వర్గం, సాగర్నగర్లో మరో వర్గం వేర్వేరుగా నిర్వహించడం గమనార్హం. ఈ కార్యక్రమాలకు బీజేపీ, జనసేన స్థానిక నాయకులు హాజరుకాలేదు. -
ఉలికిపాటు
● ఎస్ఎస్ ఫార్మా గ్యాస్ లీక్ ఘటనతో కలకలం ● గత ప్రమాదాల నుంచి నేర్చుకోని యాజమాన్యం ● ప్రభుత్వ ఉదాసీనతే కారణమన్న ఆరోపణలుపరవాడ: అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో జరుగుతున్న వరుస ప్రమాదాలతో ఫార్మా ఉద్యోగులు, కార్మికులు ఉలికి పడుతున్నారు. తరచూ ఫార్మా పరిశ్రమల్లో చోటుచేసుకుంటున్న అగ్ని ప్రమాదాలు, గ్యాస్ లీక్ ఘటనలతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎస్ఎస్ ఫార్మా పరిశ్రమలో సాల్వెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లో గురువారం తెల్లవారు జామున జరిగిన గ్యాస్ లీకేజీ ఘటనలో పరిశ్రమలో సేఫ్టీ మేనేజర్గా పనిచేస్తున్న హదారాబాద్కు చెందిన పరిమి చంద్రశేఖర్(32), షిప్ట్ సేఫ్టీ అఫీసర్గా పనిచేస్తున్న అనకాపల్లి జిల్లా మునగపాకకు చెందిన శరగడం కుమార్(25) మృత్యువాత పడ్డారు. హెల్పర్గా పనిచేస్తున్న ఒడిశాకు చెందిన బైడు బైసాల్(37) ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వరుస ప్రమాదాలతో భయాందోళన ● గతంలో సినర్జీన్ యాక్టివ్ పరిశ్రమలో జరిగిన బాయిలర్ పేలుడు ఘటనలో జార్ఖండ్కు చెందిన ముగ్గురు, ఒడిశాకు చెందిన ఒకరు, విజయనగరానికి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ● రక్షిత్ డ్రగ్స్ ఫార్మాలో గత డిసెంబర్లో ప్రొడక్షన్ బ్లాక్లో హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ లీకై న ఘటనలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికులు దేవిబాగ్, ఉగ్రేసర్గౌడ్లు అస్వస్దతకు గురయ్యారు. ● గత ఏప్రిల్లో అపిటోరియా పరిశ్రమ యూనిట్–6లో నైట్రోజన్ గ్యాస్ పీల్చడంతో విజయనగరం జిల్లా గంట్యాడ మండలం సిరిపురం గ్రామానికి చెందిన ఆళ్ల గోవింద్ మృతి చెందాడు. ● ఆల్కలీ మెటల్ ఫార్మా పరిశ్రమలో ఏప్రిల్లో జరిగిన మరో ఘటనలో మిథైల్ నైట్రేట్ గ్యాస్ లీకై విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం గొల్లపేటకు చెందిన సీహెచ్.రమణ(32) మృతి చెందాడు. మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ● అదే నెలలో ఠాగూర్ లేబొరేటరీస్ పరిశ్రమలో రియాక్టర్ను శుభ్రం చేస్తున్న క్రమంలో రియాక్టర్ వాల్వ్ నుంచి విడుదలైన విషవాయువును పీల్చడం వల్ల కె.సింహచలం అనే కాంట్రాక్టు కార్మికుడు అస్వస్దతకు గురయ్యాడు. అనంతరం ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ● మెట్రెకమ్ పరిశ్రమలో ఖాళీ రసాయన డబ్బాలు, వ్యర్ధాల వల్ల ప్రమాదం నెలకొంది. యాజమాన్యం వెంటనే స్పందించడంతో కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు. -
టాలెంటెడ్ గేమ్ పేరుతో దోపిడీ
కూర్మన్నపాలెం : టాలెంట్డ్ గేమ్ పేరుతో కూర్మన్నపాలెంలో భారీ ఎత్తున గలాట జరుగుతోంది. స్థానిక జనసేన నాయకుడు ఇంట్లో రోజూ సాయంత్రం వేళ వందలాది మంది ఆడుతున్నారు. కొందరు వేలాది రూపాయలు నష్టపోతుండగా.. నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న భవనాన్ని అద్దెకు తీసుకుని యథేచ్ఛగా సాగుతున్న ఈ గులాటకు అన్ని అనుమతులు ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. న్యాయస్థానం కూడా అనుమతిచ్చిదంటూ నిర్వాహకులు ప్రచారం చేసుకుంటున్నారు. అందువల్లే పోలీసులు కూడా అటు వైపు వెళ్లడం లేదని తెలుస్తోంది. దీని వలన ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టాలెంటెడ్ పేరుతో ఆడిస్తున్న ఈఽ దందాకు కొందరు పోలీసులు తమ వంతు సహకారం అందిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అలాగే పెదగంట్యాడ పరిధి దయాల్ నగర్ భక్తాంజనేయ స్వామి ఆలయ సమీపంలో కూడా కొంతమంది ఇదే టాలెంటెడ్ గేమ్ ఆడిస్తూ రోజూ లక్షల్లో దోచుకుంటున్నారు. ఇక్కడ కూడా పోలీసులు సహకారం ఉందనే స్థానికులు చెబుతున్నారు. -
ఏసీబీ ప్రక్షాళన
విశాఖ సిటీ: అవినీతి నిరోధక శాఖలో ప్రక్షాళన షురూ అయింది. అవినీతి ఆరోపణలు ఉన్న సిబ్బందిపై ఎట్టకేలకు బదిలీ వేటు పడింది. దీర్ఘకాలంగా ఏసీబీలో తిష్టవేసుకుని కూర్చున్న వారికి స్థానచలనం కలిగింది. ఏసీబీలో అవినీతి సిబ్బందిపై ‘సాక్షి’ వరుస కథనాలతో ఉన్నతాధికారులు దృష్టి సారించారు. వీరితో పాటు ఐదేళ్లు నిబంధన ప్రకారం పలువురికి బదిలీ చేస్తూ ఏసీబీ డీజీ అతుల్ సింగ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ ఏసీబీలో పలువురి వ్యవహార శైలిపై మొదట్నుంచి ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. ఉన్నతాధికారుల పేరు చెప్పి పలు ప్రభుత్వ శాఖల్లో భారీగా వసూళ్లకు తెరలేపారన్న వార్తలు వినిపించాయి. ప్రధానంగా రిజిస్ట్రేషన్, రెవెన్యూ, రవాణా శాఖల నుంచి నెలసరి మామూళ్లకు అలవాటు పడ్డారన్న గుసగుసలు ఉన్నాయి. ఏసీబీలోనే దండిగా ఆదాయం వస్తుండడం కొంత మంది సిబ్బంది రాజకీయ నేతల ఆశీస్సులతో ఇక్కడి నుంచి వెళ్లకుండా తిష్టవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా ఒక ఎస్ఐ, ఒక హెచ్సీ ఏసీబీలో చక్రం తిప్పినట్లు ఆఫీస్లోనే చర్చ జరుగుతోంది. ఉన్నతాధికారుల పేరుతో వీరు చేస్తున్న దందాపై ‘సాక్షి’ వరుస కథనాలతో అధికారులు ఉలిక్కిపడ్డారు. దీనిపై అంతర్గత విచారణ చేపట్టి అవినీతి ఆరోపణలు ఉన్న వారితో పటు ఐదేళ్ల నిబంధన ప్రకారం బదిలీలు చేపట్టారు. వీరిలో ఎస్ఐలు బి.సురేష్, కె.శ్రీనివాసరావులను విశాఖ రేంజ్ డీఐజీకి రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే హెచ్సీలు టి.కొండలరావు, ఎం.సత్యనారాయణ, ఆర్.చంద్రశేఖర్నాయుడు, కానిస్టేబుల్ ఎస్.రమేష్లను విశాఖ సీపీకి కేటాయించారు. అదే విధంగా హెచ్సీ జి.రాంబాబు, కానిస్టేబుళ్లు కె.రామకిరణ్, టి.శ్రీనివాసరావులను అనకాపల్లి ఎస్పీకి రిపోర్టు చేయాలని ఆదేశించారు. -
ఏపీ ప్రాక్టీసింగ్ న్యాయవాదుల సంఘం కార్యనిర్వహక కార్యదర్శిగా చక్రవర్తి
విశాఖ–లీగల్: ఆంధ్రప్రదేశ్ ప్రాక్టీసింగ్ న్యాయవాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శిగా నగరానికి చెందిన పిల్లా నీలకంఠ చక్రవర్తి నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.రంగారావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన నియామకం పట్ల నగర న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎం.కె.శ్రీనివాస్, రాష్ట్ర బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు ఎస్.కృష్ణమోహన్, సభ్యులు పి.నరసింగరావు, కె.రామజోగేశ్వరరావు, బైపా అరుణ్ కుమార్, ఆలిండియా లాయర్స్ యూనియన్ ఉపాధ్యక్షుడు బీ.వీ.రామాంజనేయరావు, ఇండియన్ లాయర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.ఎస్.సురేష్కుమార్, ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు పప్పు అనురాధ, సీనియర్ న్యాయవాది శకుంతల హర్షం ప్రకటించారు. -
అనుమతుల్లేకుండా గోడ కూల్చివేత
ఏఎంటీజెడ్పై స్టీల్ప్లాంట్ ఆగ్రహం పెదగంట్యాడ: జీవీఎంసీ 77వ వార్డు పరిధి మదీనాబాగ్ సమీపంలోని ప్రగతి మైదానం వద్ద ఏఎంటీజెడ్ అధికారులు అనుమతులు లేకుండా స్టీల్ప్లాంట్ గోడను కూల్చివేశారు. తమ వ్యాపార ప్రయోజనాల కోసం ఇటీవల ఏఎంటీజెడ్ ప్రాంగణంలో పిలానీ పబ్లిక్ స్కూల్ నిర్మించారు. అయితే విద్యార్థులు, బస్సులు నేరుగా వెళ్లేందుకు వీలుగా సుమారు 30 మీటర్ల మేర గోడను గత నెలలో కూల్చివేసి, అక్కడ గేటును ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్టీల్ప్లాంట్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఏఎంటీజెడ్ అధికారులను ప్రశ్నించారు. అయితే ఏఎంటీజెడ్ అధికారులు స్టీల్ప్లాంట్ అధికారుల మాటలను లెక్కచేయకుండా, వారిని అడ్డుకున్నప్పటికీ వెనక్కి తగ్గకుండా తమ పనిని కొనసాగించారు. గురువారం స్టీల్ప్లాంట్ అధికారులు మళ్లీ అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ఏఎంటీజెడ్ అధికారులు వారితో వాగ్వాదానికి దిగారు. స్టీల్ప్లాంట్ అధికారులపై దుర్భాషలాడారు. ‘మా వెనకాల ప్రభుత్వం ఉంది. మీరు ఏం చేయలేరు.’ అని బెదిరించారని స్టీల్ప్లాంట్ అధికారులు వాపోయారు. దీనిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని, ఎస్టేట్ కోర్టులో ఫిర్యాదు చేస్తామని స్టీల్ప్లాంట్ అధికారులు తెలిపారు. 2013లో స్టీల్ప్లాంట్ నిర్మించిన ఈ గోడను అడ్డగోలుగా కూల్చి గేటు ఏర్పాటు చేయడం సరికాదని, దీని వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. స్టీల్ప్లాంట్ ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండా ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదని పేర్కొన్నారు. -
విధులకు వెళ్తుండగా విధి చిన్నచూపు
● స్కూటీని ఢీకొన్న కంటైనర్ ● చెల్లెలు మృతి, అన్నయ్యకు తీవ్రగాయాలుకూర్మన్నపాలెం : ఆ కుటుంబంపై విధి కన్నెర్రజేసింది. గురువారం ఉదయం అన్నాచెల్లెళ్లు విధులకు స్కూటీపై వెళ్తుండగా తుంగ్లాం రైల్వే గేటుకు సమీపంలో కంటైనర్ ఢీకొంది. ప్రమాదంలో చెల్లెలు ఘటన స్థలంలో మృతి చెందగా అన్నయ్య తీవ్రగాయాలపాలయ్యాడు. దువ్వాడ పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. యాదవ జగ్గరాజుపేటలో నివాసం ఉంటున్న గొంప శ్రీను, మణి దంపతులకు సతీష్(29), గీత(24) అనే పిల్లలు ఉన్నారు. తండ్రి శ్రీనివాస్ ఒక ప్రైవేటు కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. అన్నాచెల్లెళ్లు కూడా ఆటోనగర్లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. గురువారం ఉదయం అన్నాచెల్లెళ్లు విధులకు స్కూటీపై వెళ్తుండగా తుంగ్గాం రైల్వేగేటు సమీపంలో కంటైనర్ లారీ వెనుక నుంచి ఢీకొంది. గీత లారీ వెనుక చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. పక్కకు పడిపోయిన సతీష్కు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. సతీష్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. అందివచ్చిన కుమార్తె మృతి చెందడం, కుమారుడు తీవ్రగాయాలపాలవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
వేటకు వేళాయె
● రేపు అర్ధరాత్రి నుంచిసముద్రంలో చేపలవేట ప్రారంభం ● బోట్లను సిద్ధం చేస్తున్న మత్స్యకారులు మహారాణిపేట: మత్స్యకారులు వేటకు సిద్ధమవుతున్నారు. హార్బర్ మళ్లీ కళకళలాడనుంది. రాష్ట్ర ప్రభుత్వం విధించిన వేట నిషేధం గడువు శనివారంతో ముగియనుంది. శనివారం అర్ధరాత్రి నుంచి సముద్రంలోకి వేటకు వెళ్లేందుకు మత్స్యకారులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇన్నాళ్లూ బోసిపోయిన విశాఖ ఫిషింగ్ హార్బర్ మళ్లీ సందడిగా మారనుంది. ఏప్రిల్ 15న వేట నిషేధం అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విరామ సమయంలో మత్స్యకారులు తమ పడవలకు, వలలకు మరమ్మతులు పూర్తి చేశారు. ఇంజిన్లు, గేర్ బాక్సులు, పంఖాలు వంటి కీలక భాగాలను బాగు చేయించుకుని బోట్లను వేటకు సిద్ధం చేశారు. గంగమ్మ తల్లికి పూజలు ప్రతి ఏటా వేట ప్రారంభానికి ముందు గంగమ్మ తల్లిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా వేటలో ఎలాంటి ఆటంకాలు ఎదురవకుండా, గంగమ్మ తల్లి చల్లగా చూడాలని కోరుకుంటూ ఈ నెల 10న హార్బర్లో అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించారు. అమ్మవారికి పసుపు, కుంకుమలతో మొక్కులు చెల్లించుకున్నట్లు రాష్ట్ర మరపడవల సంఘం మాజీ అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ నాయకుడు వాసుపల్లి జానకీరామ్ తెలిపారు. కాగా.. ఈ నెల 15 నుంచి మత్స్యకారులు తిరిగి వేట ప్రారంభించవచ్చని మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు పి.లక్ష్మణరావు తెలిపారు. అయితే వేటకు వెళ్లేటప్పుడు భద్రతా ప్రమాణాలను విధిగా పాటించాలని సూచించారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని, తగిన జాగ్రత్తలతో వేట సాగించాలని కోరారు. వేటపైనే జీవనాధారం జిల్లాలో 65 కిలోమీటర్ల తీరప్రాంతంలో ఉన్న 32 మత్స్యకార గ్రామాల్లో సుమారు 1.15 లక్షల కుటుంబాలు మత్స్యకార వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2,547 మర, మోటారు, సంప్రదాయ పడవలు ఉన్నాయి. ఒక్క విశాఖ ఫిషింగ్ హార్బర్పైనే ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మంది ఉపాధి పొందుతున్నారు. ఈ 61 రోజుల విరామం వారి జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పుడు వేట తిరిగి ప్రారంభం కానుండటంతో వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. -
‘సాక్షి’ విలేకరి హఠాన్మరణం
గాజువాక: ‘సాక్షి’ అక్కిరెడ్డిపాలెం విలేకరి బి.రామకృష్ణ హఠాన్మరణం చెందారు. దీంతో ‘సాక్షి’ సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు. గురువారం విధులను ముగించుకుని కంచరపాలెంలోని తన సోదరి ఇంటికి వెళ్లిన రామకృష్ణ గుండెపోటుకు గురయ్యారని సమీప బంధువులు తెలిపారు. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ‘సాక్షి’ దినపత్రికలో అక్కిరెడ్డిపాలెం విలేకరిగా రామకృష్ణ పదేళ్లుగా పని చేస్తున్నారు. నిరంతరం ఆయన ప్రజా సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చే కథనాలను అందించారు. ఆయన మృతికి ‘సాక్షి’సిబ్బంది, సహచర విలేకరులు సంతాపం ప్రకటించారు. జాతీయ జర్నలిస్ట్ల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు రిపోర్టర్ రామకృష్ణ భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. -
బాల కార్మికులు లేని సమాజమే లక్ష్యం
విశాఖ లీగల్ : బాల కార్మికులు లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విశ్రాంత ప్రిన్సిపల్ జడ్జి, లోక్ అదాలత్ న్యాయమూర్తి జి.వల్లభ నాయుడు అన్నారు. ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా కార్మిక శాఖ, జిల్లా విద్యాశాఖ, యాక్సిస్టివ్ జస్టిస్ ఫర్ చిల్డ్రన్ అప్ హోల్డ్ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలలు బాల కార్మికులుగా మారడానికి తల్లిదండ్రులు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారన్నారు. నిరక్షరాస్యత, వలస వెళ్లడం, ఇంటి పనులకు పెట్టడం, ఆర్థిక పరిస్థితుల వల్ల బాలలు బాల కార్మికులుగా మారుతున్నారని తెలిపారు. డిప్యూటీ కమిషనర్ లేబర్ సునీత మాట్లాడుతూ బాల కార్మికులను రెస్క్యూ చేయడంలో తమ సమస్త డిస్టిక్ టాస్క్ ఫోర్స్ సభ్యులు విశేషంగా కృషి చేస్తున్నామన్నారు. తిరిగి రిహాబ్లేట్ చేయడం కోసం బాలల సంక్షేమ సమితి, ఇతర డిపార్టుమెంటు, స్వచ్ఛంద సేవా సంస్థలు విశేషంగా కృషి చేస్తున్నాయన్నారు. మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ పి.పుష్యరాగం మాట్లాడుతూ చదువుకోవలసిన బాలలు పనిలోకి వెళ్లడం విచారకరమన్నారు. యాక్సిస్ టు జస్టిస్ అప్ హోల్డ్ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ జి.డేవిడ్ రాజు మాట్లాడుతూ తమ సంస్థ గత సంవత్సరం లేబర్ డిపార్టుమెంటు, మిగిలిన సంస్థలతో కలిసి 2012 మందిని రిస్క్ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రభుత్వ అధికారిణి మమత పాల్గొన్నారు -
బడిలో
సమస్యల గంట ● తొలి రోజు హాజరు అంతంతమాత్రమే ● అరకొరగా పుస్తకాల పంపిణీ ● కానరాని బ్యాగులు, బూట్ల పంపిణీ ● జమకాని తల్లికి వందనం నగదు ● తల్లిదండ్రుల్లో తీవ్ర నిరాశ సగం మందికే తల్లికి వందనం ఎన్నికల ముందు కూటమి నేతలు ప్రతి కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి రూ.15 వేలు చొప్పున ‘తల్లికి వందనం’కింద జమ చేస్తామని హామీలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిపోయింది. మొదటి సంవత్సరం ఈ పథకాన్ని అమలు చేయకుండా ఎగ్గొట్టేసింది. రెండో ఏడాది పాఠశాలలు తెరిచే నాటికి తల్లికి వందనం నిధులు జమ అవుతాయని ఆశించిన తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. కాగా.. జిల్లాలో సగం మంది విద్యార్థులకే తల్లికి వందనం అందనుంది. ఇందుకు సంబంధించి జీవో నంబర్లు 26, 27 ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేసిన జాబితాను విద్యా శాఖాధికారులు ప్రకటించారు. ఈ జాబితాలో ఉన్న విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జూలై 5న ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో 1,90,433 మంది విద్యార్థులు, 1,30, 706 మంది తల్లుల జాబితా సిద్ధమైంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న అర్హులైనవారందరికీ తల్లికి వందనం ఇస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం జిల్లాలో 1,388 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 3,22,737 మంది విద్యార్థులున్నారు. వీరితో పాటు సుమారు 70 వేల మంది ఇంటర్ విద్యార్థులు కలిపి దాదాపు 4 లక్షల మంది ఉన్నారు. వీరందరికీ తల్లికి వందనం నిధులు వేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం 1,90,433 మంది విద్యార్థులకు మాత్రమే ఆర్థిక సాయం చేయడానికి జాబితా సిద్ధం చేశారు. వారికి కూడా పలు నిబంధనలు వర్తించాలి. పిల్లలు, తల్లిదండ్రుల ఆధార్ నంబర్లు వ్యాలిడేట్ అయి ఉండాలి. నెలవారీ ఆదాయం గ్రామాల్లో రూ.10,000, పట్టణాల్లో రూ.12,000 మించికూడదు. మాగాణి భూమి 3 ఎకరాలు, మెట్ట భూమి 10 ఎకరాలు మించి ఉండకూడదు. నెలసరి 300 యూనిట్లు మించి కరెంట్ వినియోగం ఉండకూడదు. ఆ నిబంధనలకు లోబడి ఉన్న ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థుల తుది జాబితాను ఈ నెల 12 నుంచి 28 వరకు, ఇంటర్ విద్యార్థుల జాబితా ఈ నెల 30న సిద్ధం చేసి గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రకటించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆరిలోవ: వేసవి సెలవుల సందడి ముగిసింది. బడి గంట మోగింది. గురువారం నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. సెలవుల్లో ఆటపాటలతో హాయిగా గడిపిన విద్యార్థులు.. మొదటి రోజు బడికి వెళ్లడానికి అయిష్టత చూపారు. చాలామంది చిన్నారులు ‘బడికి వెళ్లం’ అంటూ మారాం చేయడంతో, వారి తల్లిదండ్రులు నచ్చజెప్పి పాఠశాలలకు తీసుకురావాల్సి వచ్చింది. తమ పిల్లలను పాఠశాలల వద్ద దగ్గరుండి దింపి, జాగ్రత్తలు చెప్పి పంపించారు. పుస్తకాల బ్యాగులను వీపుపైకి ఎత్తుకుని చిన్నారులు బడి బాట పట్టారు. స్వాగతం పలికిన అసౌకర్యాలు బడికి వచ్చిన విద్యార్థులకు కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని అసౌకర్యాలు స్వాగతం పలికాయి. కొన్ని చోట్ల మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరగా, మరికొన్ని తరగతి గదుల్లో ఫ్యాన్లు విరిగిపోయి ఉన్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాఠశాల మైదానాలు బురదమయంగా మారాయి. విద్యార్థులు ఆ బురద నీటిని దాటుకుంటూ తరగతి గదులకు వెళ్లాల్సి వచ్చింది. విద్యార్థి కిట్ల పంపిణీ ఎక్కడ? పాఠశాలలు తెరిచిన రోజే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మొదటి రోజు నుంచే విద్యార్థుల వద్ద పాఠ్య పుస్తకాలు అందుబాటులో ఉంటాయని చెప్పింది. అయితే ఈ ప్రకటనలు కార్యరూపం దాల్చలేదు. మొదటి రోజు హాజరైన విద్యార్థులకు చాలా పాఠశాలల్లో కిట్లు పంపిణీ చేయలేదు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన సందర్భంగా కూటమి పార్టీల నేతలు సంబరాలు చేసుకున్నారు. వారు లేకుండా కిట్లు పంపిణీ చేస్తే ఎక్కడ రాద్ధాంతం చేస్తారో అని ప్రధానోపాధ్యాయులు భయపడి పంపిణీ చేపట్టలేదు. తొలిరోజు బడులు వెలవెల జిల్లాలో మొత్తం 1,388 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలున్నాయి. వీటిలో ఒకటి నుంచి 10వ తరగతి వరకు సుమారు 3,22,737 మంది విద్యార్థులు చదువుతున్నారు. దీంతో పాటు కొత్తగా ప్రవేశాలు కూడా జరుగుతున్నాయి. దీంతో వీటి సంఖ్య కొంత వరకు పెరగనుంది. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 72,627 మంది, ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో 2,50,110 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే తొలి రోజు ఎక్కువ మంది విద్యార్థులు పాఠశాలలకు హాజరుకాలేదు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం అంతంతమాత్రంగానే కనిపించింది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం 30 శాతం మంది విద్యార్థులు హాజరుకాగా, ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఈ సంఖ్య 40 నుంచి 45 శాతంగా నమోదైంది. దీంతో తరగతి గదులు, పాఠశాల ప్రాంగణాలు విద్యార్థుల సందడి లేక వెలవెలబోయాయి. -
ఏపీలో ఐదు రోజులు వానలే.. ఈ జిల్లాలకు అతి భారీ వర్షసూచన
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలో అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది.ఈశాన్య రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో ఐదు రోజుల పాటు పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక, గడచిన 24 గంటల్లో అత్యధికంగా ఏలూరు జిల్లాల్లో 15 సెంమీ వర్షపాతం నమోదు అయ్యింది.నేడు, రేపు.. ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు అతిభారీ వర్షాలు.. బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరుగా, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.మరోవైపు.. బుధవారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 10, గుడివాడలో 9.4, చల్లపల్లి మండలం పురిటిగడ్డలో 9.3, బాపట్ల జిల్లా కూచినపూడిలో 7.9 సెం.మీ. వర్షం కురిసింది. పార్వతీపురం మన్యం జిల్లా రస్తాకుంటు బాయిలో 7.2 సెం.మీ. వర్షం పడింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 6.5, అంబేడ్కర్ కోనసీమ జిల్లా తాతపూడిలో 4.7, ప్రకాశం జిల్లా కొలుకులలో 4.4, ఆత్రేయపురంలో 4.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
అనకాపల్లి: ఫార్మా కంపెనీలో విష వాయువు లీక్.. కార్మికులు మృతి
సాక్షి, విశాఖపట్నం: ఏపీలోని అనకాపల్లి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఫార్మా కంపెనీలో విష వాయువులు లీక్ అయ్యాయి. ఈ విష వాయువులు పీల్చి ఇద్దరు కార్మికులు మృతి చెందగా.. పలువురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో, వెంటనే వారికి స్థానిక ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. అనకాపల్లిలోని ఎస్ ఎస్ ఫార్మా కంపెనీలో బుధవారం అర్ధరాత్రి విషవాయువులు లీక్ అయ్యాయి. విష వాయువు పీల్చి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మృతులను చంద్రశేఖర్, కుమార్గా గుర్తించారు. విష వాయువు కారణంగా పలువురు కార్మికుల ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దీంతో, కంపెనీ యాజమాన్యం వారిని స్థానిక ఆసుపత్రికి తరలించింది. అయితే, ఫార్మా కంపెనీలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. పరవాడ సీఐ మల్లికార్జునరావు సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మరోవైపు.. పరవాడ ఫార్మా ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను కేజీహెచ్లో పరామర్శించారు వైఎస్సార్సీపీ నాయకులు బొడ్డేడ ప్రసాద్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..‘పరవాడ ఫార్మా కంపెనీల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫార్మా కంపెనీలపై అధికారుల నియంత్రణ కొరవడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. చనిపోయిన ఒక్కొక్కరికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి. కార్మికులంటే ప్రభుత్వానికి లెక్కలేదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
దంచికొట్టిన వర్షాలు
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ): ఈశాన్య రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం నుంచి బుధవారం వరకూ 24 గంటల వ్యవధిలో ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రులో 15.5 సెం.మీ. వర్షం కురిసింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 10, గుడివాడలో 9.4, చల్లపల్లి మండలం పురిటిగడ్డలో 9.3, బాపట్ల జిల్లా కూచినపూడిలో 7.9 సెం.మీ. వర్షం కురిసింది. బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా రస్తాకుంటు బాయిలో 7.2 సెం.మీ. వర్షం పడింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 6.5, అంబేడ్కర్ కోనసీమ జిల్లా తాతపూడిలో 4.7, ప్రకాశం జిల్లా కొలుకులలో 4.4, ఆత్రేయపురంలో 4.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ద్రోణి ప్రభావంతో మరో రెండు, మూడు రోజులపాటు రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరుగా, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. -
దైవ దర్శనానికి వెళ్లొస్తూ..
జగదాంబ/బుచ్చెయ్యపేట: భార్య వైద్య పరీక్షల కోసం కేజీహెచ్కు బయలుదేరిన ఆ కుటుంబం.. గమ్యం చేరకముందే ప్రమాదం బారిన పడింది. ఇసుకకొండ సత్యనారాయణ స్వామి దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడటంతో.. భార్య అక్కడికక్కడే కన్నుమూయగా, భర్త పరిస్థితి విషమంగా ఉంది. కన్నవారి కోసం ఆ పసిపిల్లల ఎదురుచూపులు, వా రి ఆలనా పాలనా చూడాల్సిన నాన్నమ్మ గుండెలవిసేలా రోదించడం గ్రామస్తులను కంటతడి పెట్టించింది. ఈ ఘట నతో బుచ్చెయ్యపేట మండలం ఆర్.శివరాంపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దేవర చిలుకనాయుడు దివ్యాంగుడు. కాళ్లు చచ్చుబడ్డా.. ఆత్మవిశ్వాసాన్ని చంపుకోలేదు. ఎనిమిదేళ్ల కిందట దిబ్బిపాలేనికి చెందిన కృష్ణకుమారి (33)ని వివాహం చేసుకున్నాడు. గ్రామంలో చిన్న పాన్షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్న చిలుకనాయుడికి భార్యే చేదోడు వాదోడుగా ఉండేది. వారికి ఇద్దరు కుమార్తెలు యువశ్రీ(4), హాత్విక(8 నెలలు) ఉన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణకుమారిని ప్రతి నెలా కేజీహెచ్కు తీసుకొస్తున్నాడు చిలుకనాయుడు. బుధవారం ఉదయం కూడా తన మూడు చక్రాల స్కూటీపై భార్య, చిన్న కూతురు హాత్వికతో కలిసి శివరాంపురం నుంచి బయలుదేరాడు. ఈ క్రమంలో వీరు సత్యనారాయణ స్వామి దర్శనానికి ఘాట్ రోడ్డులో వెళ్లి తిరిగి వస్తున్నారు. పూర్ణామార్కెట్ సమీపంలో మొదటి మలుపు వద్ద స్కూటీ బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. అదుపుతప్పిన వాహనం వేగంగా గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కృష్ణకుమారి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. చిలుకనాయుడు తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్కూటీలో ముందు కూర్చున్న 8 నెలల హాత్విక పక్కనే ఉన్న ఇసుక దిబ్బపై పడటంతో ప్రాణాలతో బయటపడింది.ఆ పసిపాప ఏడుపు విని చలించిపోయిన ఓ మహిళా వ్యాపారి, చిన్నారిని దగ్గరకు తీసుకుని సపర్యలు చేసింది. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించింది. ప్రస్తుతం కేజీహెచ్లో చికిత్స పొందుతున్న చిలుకనాయుడు పరిస్థితి విషమంగా ఉందని, 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. గుండెలు పగిలేలా రోదన చిలుకునాయుడు తండ్రి చిన్నోడు గతంలోనే మరణించారు. కొడుకు చిలుకనాయుడే తల్లి రాజులమ్మకు ఆధారం. ఇప్పుడు కోడలు మరణించి, కొడుకు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండటంతో ఆ తల్లి గుండె పగిలింది. ‘నా కొడుకు బతకాలి.. ఈ పసిపిల్లల్ని ఎలా సాకాలి? రేపటి నుంచి మా బతుకులేంటి?’ అంటూ ఆమె నేలపై పడి రోదించిన తీరు అక్కడి వారందరినీ కదిలించింది. తల్లి చనిపోయిందని, తండ్రి ఆసుపత్రిలో ఉన్నాడని తెలియని ఆ ఇద్దరు పసిపిల్లలు బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తుండటం చూపరులను కలిచివేసింది. చితికిపోయిన ఈ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. స్కూటీ బ్రేకులు ఫెయిల్.. తల్లి మృతి.. తండ్రికి సీరియస్ అనాథలైన పసిపాపలు పూర్ణామార్కెట్ సమీపంలోని ఘాట్ రోడ్డులో ఘటన -
జర్నలిస్టులకు ఉచిత వైద్య పరీక్షలు
మహారాణిపేట: జిల్లాకు చెందిన వర్కింగ్ జర్నలిస్టులకు త్వరలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తామని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ హామీ ఇచ్చినట్టు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా బుధవారం కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ను కలిసి, పెండింగ్లో ఉన్న 12 అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ఏటా మాదిరిగానే వర్కింగ్ జర్నలిస్టులకు వైద్య పరీక్షలు చేయించాలని కోరారు. దీనికి కలెక్టర్ స్పందించి, ఈ నెల 21న జరగనున్న ‘యోగాంధ్ర’పూర్తయిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల ఇంటి స్థలాల సమస్యను పరిష్కరించాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, పెన్షన్ సదుపాయం కల్పించాలని కలెక్టర్ను కోరారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు పోతుమహంతి నారాయణ్ మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు వీలుగా రాష్ట్రంలో హై పవర్ కమిటీ, జిల్లాలో పోలీసు ఉన్నతాధికారులతో కమిటీలను ఏర్పాటు చేసి భద్రత కల్పించాలన్నారు. ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి జి.శ్రీనివాస్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఇరోతి ఈశ్వరరావు, చింతాడ మదన్, ఆంధ్రప్రదేశ్ స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వి.ఎస్.జగన్ మోహన్రావుతో పాటు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి సీజీఆర్ఎఫ్ సదస్సులు
విశాఖ సిటీ: ఏపీఈపీడీసీఎల్ పరిధిలో విశాఖ జోన్–2, బొబ్బిలి, జగ్గంపేట డివిజన్ల విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సదస్సులు నిర్వహించనున్నట్లు విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్ఎఫ్) చైర్పర్సన్, విశ్రాంతి జడ్జి బి.సత్యనారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 13న విశాఖ సర్కిల్ జోన్–2 డివిజన్ (పెదగంట్యాడ సెక్షన్), 17న విజయనగరం సర్కిల్ బొబ్బిలి డివిజన్(మెంటాడ సెక్షన్), 19న కాకినాడ సర్కిల్ జగ్గంపేట డివిజన్(హంసవరం సెక్షన్) కార్యాలయాల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు ఈ సదస్సులు జరుగుతాయని తెలిపారు. వినియోగదారులు నేరుగా పాల్గొని విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, హెచ్చు తగ్గులు, బిల్లుల సమస్యలు, కొత్త సర్వీసుల జారీలో జాప్యం, పేరుమార్పిడి, విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో జాప్యం, ట్రాన్స్ ఫార్మర్ల మార్పిడి, తదితర విద్యుత్ సంబంధిత సమస్యలపై ఫిర్యాదులను తెలపాలని సూచించారు. అలాగే సీతమ్మధారలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఉన్న సీజీఆర్ఎఫ్ కార్యాలయానికి కూడా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. వినియోగదారుల సమస్యల వివరాలను పరిశీలించి, విచారణ జరిపి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వినియోగదారులు విద్యుత్ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1912కు సంప్రదించాలని సూచించారు. ఈ సదస్సుల్లో తనతో పాటు సీజీఆర్ఎఫ్ కమిటీ సభ్యులు బి.సులేఖరాణి, ఎస్.సుబ్బారావు, ఎన్.మురళీకృష్ణ పాల్గొంటారన్నారు. -
ఏయూలో కొలువుదీరిన కొత్త నాయకత్వం
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం విభాగాలకు నూతన నాయకత్వం పదవీ బాధ్యతలు చేపట్టింది. ఏయూ అకడమిక్ సెనేట్ మందిరంలో ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్, రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్.ధనంజయరావు చేతుల మీదుగా డీన్, డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్లకు బుధవారం నియామక ఉత్తర్వులను అందించారు. మొత్తం 43 మందికి వివిధ పదవీ బాధ్యతలను కేటాయించారు. అనంతరం వీసీ రాజశేఖర్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించామని, త్వరలో నూతన కార్యక్రమాలను చేపట్టేలా ప్రతి విభాగం పనిచేయాలన్నారు. విద్యార్థులతో, సిబ్బందితో గౌరవప్రదంగా నడుచుకోవాలన్నారు. యువతకు ప్రాధాన్యత నూతనంగా నియామకం చేసిన డీన్, డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్లలో అత్యధికంగా యువతకు అవకాశం కల్పించారు. ప్రతి విభాగంలో ఉన్న యువ ఆచార్యులను ఎంపిక చేసి ఈ బాధ్యతలు కేటాయించారు. భవిష్యత్ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ వర్సిటీని ముందుకు నడిపించే దిశగా యువ ఆచార్యులను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. -
అంతర్ రాష్ట్ర మహిళల బ్లైండ్ క్రికెట్ విజేత ఒడిశా
రన్నరప్గా ఆంధ్రప్రదేశ్ జట్టు ఉక్కునగరం: ఉక్కు స్టేడియంలో జరిగిన అంతర్ రాష్ట్ర మహిళల బ్లైండ్ క్రికెట్ చాంపియన్షిప్ను ఒడిశా జట్టు కై వసం చేసుకుంది. ఎన్టీపీసీ సింహాద్రి సహకారంతో క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ (సీఏబీఏపీ), క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ కేరళ (సీఏబీకే) సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన టోర్నమెంట్లో ఢిల్లీ, ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్ జట్లు పాల్గొన్నాయి. బుధవారం జరిగిన ఫైనల్స్లో ఒడిశా జట్టు మొదట బ్యాటింగ్కు దిగింది. 15 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆంధ్రప్రదేశ్ జట్టు 15 ఓవర్లలో 80 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఒడిశా జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్కు డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి హాజరై క్రీడాకారులను అభినందించారు. ముగింపు కార్యక్రమంలో ఎన్టీపీసీ ఈడీ సమీశ్ శర్మ, హెచ్ఆర్ బి.బి.శర్మ ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు ట్రోఫీలు, బహుమతులు అందజేశారు. ఇండియన్ బ్లైండ్ క్రికెట్ మాజీ కెప్టెన్ అజయ్కుమార్ రెడ్డి, కో–ఆర్డినేటర్లు అమ్మి నాయుడు, నరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
కనకమహాలక్ష్మి హుండీ ఆదాయం రూ.53.29 లక్షలు
డాబాగార్డెన్స్: కనకమహాలక్ష్మి హుండీల ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. మార్చి 27 నుంచి ఈ నెల 11వ తేదీ వరకు రూ.53,29,489 నగదు, 59 గ్రాముల బంగారం, 990 గ్రాముల వెండి లభించింది. అలాగే యూఎస్ఏకి చెందిన 32 డాలర్లు, కువైట్కు చెందిన 1/4 దినర్, 5 రూపీస్ నేపాల్ కరెన్సీ, శ్రీలంకకు చెందిన 100 రుపీస్, ఇంగ్లండ్కు చెందిన 5 యూరోస్, హాంగ్కాంగ్ కరెన్సీ 20 డాలర్లు, సింగపూర్ కరెన్సీ 10 డాలర్లు, అరబ్ ఎమిరేట్స్ 5 దిరమ్స్ వచ్చాయి. హుండీ లెక్కింపులో ఆలయ ఈవో కె.శోభారాణి, వెలంపేట దుర్గాలమ్మ ఆలయ ఈవో పి.శేఖర్బాబు, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి కె.తిరుమలేశ్వరరావు, గోపాలపట్నం శ్రీ హరి సేవ సభ్యులు పాల్గొన్నారు. -
కలెక్టర్కు ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నోటీస్
మద్దిలపాలెం: విజయనగరం జోన్ వ్యాప్తంగా ఉన్న సమస్యల పరిష్కారంలో యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా.. కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్కు బుధవారం సమ్మెకు సంబంధించిన నోటీసు అందజేసినట్లు నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి పి.వి.మోహన్ తెలిపారు. ఈ నెల 8న జరిగిన జోనల్ కౌన్సిల్ సమావేశంలో యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల వల్ల కార్మికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని.. జోన్లోని అన్ని జిల్లాల కలెక్టర్లకు సమ్మె నోటీసులు ఇవ్వాలని తీర్మానం చేశారన్నారు. ఈ నెల 26వ తేదీ తర్వాత ఎప్పుడైనా సమ్మెలోకి వెళ్లే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు కలెక్టర్కు సమ్మె నోటీస్ మెమోరాండంను సమర్పించామన్నారు. రాష్ట్ర కార్యదర్శి జి.ఆర్.రావు, జిల్లా కార్యదర్శి పిళ్లా శంకర్రావు, జిల్లా అధ్యక్షుడు పి.ఎన్.మూర్తి, విజయనగరం మాజీ జోనల్ కార్యదర్శి ఎం.వి.ఆర్.మూర్తితో పాటు జోనల్లోని ముఖ్య నాయకులు పాల్గొన్నారు. -
పునరుత్పాదక శక్తిపై వర్క్షాప్ రేపు
విశాఖ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ(ఎంఎన్ఆర్ఈ) ఆధ్వర్యంలో ఈ నెల 13న నోవాటెల్ హోటల్లో సౌత్ జోన్ రీజనల్ వర్క్షాప్ను నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ వెంకటేష్ జోషి హాజరుకానున్నారు. రాష్ట్రం తరఫున విద్యుత్శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, నెడ్క్యాప్ వీసీ–ఎండీ కమలాకర్బాబు, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృఽథ్వీతేజ్ ఇమ్మడి, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావు, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి, పలు రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రులు పాల్గొననున్నారు. ఈ వర్క్షాప్లో ప్రధానంగా పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ తదితర ప్రభుత్వ పథకాల అమలు తీరు, విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, హైడ్రో పవర్ వంటి పునరుత్పాదక ఇంధన వనరుల ఆవశ్యకతపై చర్చించనున్నారు. కేకే లైన్లో రైళ్ల గమ్యం కుదింపు తాటిచెట్లపాలెం: కె.కె.లైన్లోని సుకు–కోరాపుట్ మధ్య జరుగుతున్న రెండవ లైన్ పనుల కారణంగా ఆ మార్గంలో నడిచ పలు రైళ్ల గమ్యం కుదించినట్లు వాల్తేర్ డివిజన్ అధికారులు తెలిపారు. ఈ నెల 13, 16వ తేదీల్లో విశాఖపట్నం–కోరాపుట్(18512) బై వీక్లీ ఎక్స్ప్రెస్ డుమురిపుట్ వరకు మాత్రమే నడుస్తుంది. ఈ నెల 14, 17వ తేదీల్లో కోరాపుట్–విశాఖపట్నం(18511) బై వీక్లీ ఎక్స్ప్రెస్ డుమురిపుట్ నుంచి బయలుదేరుతుంది. ఈ తేదీల్లో డుమురిపుట్–కోరాపుట్ మధ్య ఈ రైలు రాకపోకలు సాగించదు. ● ఈ నెల 12 నుంచి 19వ తేదీ వరకు విశాఖపట్నం–కోరాపుట్(58538) పాసింజర్ దమన్జోడి వరకు మాత్రమే నడుస్తుంది. ఈ నెల 13 నుంచి 20వ తేదీ వరకు కోరాపుట్–విశాఖపట్నం(58537) పాసింజర్ దమన్జోడి నుంచి బయలు దేరుతుంది. ఈ తేదీల్లో ఈ రైలు కోరాపుట్–దమనజోడి మధ్య రాకపోకలు సాగించదని రైల్వే అధికారులు తెలిపారు. తహసీల్దార్లు విధుల్లో చేరికపై సందిగ్ధం మహారాణిపేట: అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి విశాఖపట్నం జిల్లాకు బదిలీ అయిన ఇద్దరు తహసీల్దార్లు విధుల్లో చేరికపై సందిగ్ధం నెలకొంది. ఇటీవల బదిలీ అయిన రామకృష్ణ (పెందుర్తి తహసీల్దార్గా), ఎంవీవీ ప్రసాద్ (కలెక్టరేట్లో సి.సెక్షన్ పర్యవేక్షకుడిగా) ఇంకా విధుల్లో చేరలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం రామకృష్ణను అల్లూరి జిల్లా కలెక్టర్ రిలీవ్ చేయడానికి నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రసాద్ తనకు తహసీల్దార్ పోస్ట్ కేటాయిస్తేనే వస్తానని చెబుతున్నట్లు సమాచారం. ఈ కారణాలతో ఇద్దరు అధికారులు ఇంకా రిలీవ్ కాలేదని తెలుస్తోంది. సమాచార శాఖ డీడీగా సదారావు మహారాణిపేట: సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్(డీడీ)గా సదారావు నియమితులయ్యారు. నెల్లూరు జిల్లాలో డిప్యూటీ డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న ఆయన బదిలీపై ఇక్కడకు వస్తున్నారు. ఇక్కడ చాలా రోజుల నుంచి డీడీ పోస్టు ఖాళీగా ఉంది. అలాగే విజయనగరం జిల్లాలో అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ)గా పనిచేస్తున్న డి.రమేష్ను విశాఖ జిల్లా ఏడీగా నియమించారు. ఈ పోస్టు కూడా చాలా రోజుల నుంచి ఖాళీగా ఉంది. విశాఖ జిల్లా డీపీఆర్వో సీహెచ్ రమణను అనకాపల్లి జిల్లా డీపీఆర్వోగా ప్రభుత్వం బదిలీ చేసింది. పాఠశాలలు, హాస్టళ్లకు సన్న బియ్యం మహారాణిపేట: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా సన్న బియ్యంతో పౌష్టికాహారం అందిస్తామని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి సన్న బియ్యాన్ని సిద్ధం చేశామని, గురువారం నుంచి జిల్లాలోని మొత్తం 582 ప్రభుత్వ పాఠశాలలు, 70 సంక్షేమ హాస్టళ్లలో వినియోగిస్తామని పేర్కొన్నారు. ఈ బియ్యాన్ని 25 కిలోల ప్యాకెట్ల రూపంలో ప్యాక్ చేసి, క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా మండల స్థాయి గోదాములకు చేరవేశారు. అక్కడి నుంచి నేరుగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లకు అవసరమైన ప్యాకెట్లను సరఫరా చేసినట్లు చెప్పారు. పిల్లలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని జేసీ వెల్లడించారు. ఐసీడీఎస్ అర్బన్ సీడీపీవోగా నీలిమ మర్రిపాలెం: ఐసీడీఎస్ విశాఖ అర్బన్ సీడీపీవోగా కె.నీలిమ నియమితులయ్యారు. ఈ మేరకు ఆర్అండ్బీ జంక్షన్ సమీపంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో బుధవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక్కడ సీడీపీవోగా విధులు నిర్వర్తిస్తున్న రమణకుమారి యలమంచిలికి బదిలీ అయిన సంగతి తెలిసిందే.. -
తడబడిన అడుగులు
● నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం ● పూర్తికాని ఉపాధ్యాయుల బదిలీలు ● అసంపూర్తిగా తరగతి గదులు, టాయిలెట్స్ నిర్మాణాలు ● పూర్తిస్థాయిలో రాని స్టూడెంట్స్ కిట్లు ● యూనిఫాం, బూట్లు, సాక్సులు పెండింగ్ ● చాలా పాఠశాలల్లో పనిచేయని ఆర్వో ప్లాంట్లు ఆరిలోవ: వేసవి సెలవులు పూర్తయ్యాయి. గురువారం నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ప్రైవేట్ పాఠశాలలు సకల సౌకర్యాలతో విద్యార్థుల తల్లిదండ్రులను రా రమ్మని స్వాగతం పలుకుతుండగా.. సర్కారు బడులు సౌకర్యాల లేమితోనే విద్యార్థులను ఆహ్వానిస్తున్నాయి. జిల్లాలో కొన్ని పాఠశాలల్లో మురుగుదొడ్లు, అదనపు తరగతి గదుల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. పలు పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు పనిచేయడం లేదు. ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. వీటితో పాటు విద్యార్థులకు పాఠశాలలు తెరిచేనాటికే పంపిణి చేయాల్సిన సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లలో(స్టూడెంట్స్ కిట్స్) కొన్ని వస్తువులు కొరత ఉన్నాయి. సాధారణంగా పాఠశాలలు పునఃప్రారంభం నాటికే విద్యాశాఖ అధికారులు అన్ని సిద్ధం చేయాలి. కానీ ఈ విద్యా సంవత్సరం అసౌకర్యాలతో ఆరంభంకానుంది. స్టూడెంట్స్ కిట్ల కొరత సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లలో పాఠ్యప్తుకాలు, నోట్ బుక్స్తో పాటు బ్యాగ్, బూట్లు, సాక్సులు, యూనిఫాం, బెల్ట్ ఉండాలి. వాటిలో బ్యాగులు, పాఠ్యపుస్తకాలు కొరతగా ఉన్నాయి. జిల్లాలో 2025–26 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు 72,627 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారిలో 33,830 మంది బాలురు కాగా, 38,697 మంది బాలికలున్నారు. వారందరికి స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ చేయాల్సి ఉంది. ఆ కిట్లలో 8,789 స్కూల్ బ్యాగులు కొరతగా పంపించారు. 1,436 పాఠ్య పుస్తకాల కొరత ఉంది. వీటితో పాటు 71,635 మందికి అందించాల్సిన బూట్లు(ఒక జత చొప్పున), సాక్సులు(రెండు జతలు చొప్పున) పూర్తిగా పంపిణీ కాలేదు. బూట్లు, సాక్సులు ఎప్పుడు వస్తాయో విద్యాశాఖాధికారులు వద్ద కూడా స్పష్టత లేకపోవడం విశేషం. ఇంతవరకు ఉన్న కిట్లను మండలాల్లో అన్ని పాఠశాలలకు అధికారులు పంపిణీ చేశారు. పూర్తికాని ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ పాఠశాలలు పునఃప్రారంభానికే ఉపాధ్యాయుల బదిలీలు ప్రక్రియ పూర్తిచేస్తామని విద్యాశాఖాధికారులు ముందుగానే ప్రకటించారు. కానీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. గురువారం పాఠశాలలు తెరుచుకోనున్నాయి. అయినా ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ సగభాగం కూడా పూర్తికాలేదు. తక్కువ సంఖ్యలో ఉన్న స్కూల్ అసిస్టెంట్లు బదిలీ ప్రక్రియ పూర్తయినప్పటికీ అత్యధిక సంఖ్యలో ఉన్న ఎస్జీటీల బదిలీ ప్రక్రియ మాత్రం ఇంతవరకు ఓ కొలిక్కి రాలేదు. బుధవారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు 300 మందికి మాత్రమే మాన్యువల్ కౌన్సెలింగ్ జరిగింది. జిల్లాలో 2,782 మంది ఎస్జీటీలు కౌన్సెలింగ్కు దరఖాస్తు చేసుకొన్నారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఉంటే వారందరికీ కౌన్సిలింగ్ పూర్తయ్యేసరికి మరో వారం పడుతుందని అధికారులు అంటున్నారు. అసంపూర్తిగా మరుగుదొడ్లు, అదనపు తరగతి గదులు గతంలో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు నిర్మాణ పనులు పాఠశాలల్లో చేపట్టారు. వాటిలో కొన్ని పాఠశాలల్లో పనులు ఇప్పటికీ అసంపూర్తిగా మిగిలిపోయాయి. దీంతో ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. తోటగరువు హైస్కూల్ అరకొర ప్రవేశాలు హైస్కూళ్లలో ఇంతవరకు ప్రవేశాలు జరగలేదు. వేసవి సెలవులు ఇచ్చేనాటికే ప్రవేశాలు జరిపించాలని రాష్ట్ర విద్యాశాఖ హైస్కూళ్ల ప్రధానోపాధ్యాయులను ఆదేశించింది. ఇందులో భాగంగా ఉన్నత పాఠశాలల పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలలకు వెళ్లి 2024–25 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులను హైస్కూళ్లలో చేర్పించాలని సూచించింది. అయినా ఇంతవరకు ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు ఆరో తరగతిలో చేరలేదు. పునఃప్రారంభం అనంతరం ఆ విద్యార్థులు ఆరో తరగతిలో చేరుతారో లేదో వేచిచూడాల్సిందే. ఇదిలా ఉండగా తరగతి గదిలో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి 49ః1గా నిర్ణయించారు. దీంతో హైస్కూల్లో అవసరమైన వారి కంటే ఎక్కువమంది ఉపాధ్యాయులు సంఖ్య ఉన్నట్లు లెక్క తేలింది. అదనంగా ఉన్న ఉపాధ్యాయులను ఇప్పుడు వేరేచోటకు బదిలీ చేసేశారు. 2024–25 విద్యా సంవత్సరం వరకు వీరి నిష్పత్తి 40ః1గా ఉండేది. తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 40ః1గా ఉన్నప్పుడు 57 మంది ఉపాధ్యాయులు ఉండేవారు. ప్రస్తుతం 49ః1 నిష్పత్తి ఉండటంతో 16 మంది ఉపాధ్యాయులు తగ్గిపోయారు. -
హామీలన్ని గాలికి..
సూపర్ సిక్స్ పేరుతో బూటకపు హామీలు గుప్పించి ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చడానికి ఖజానా ఖాళీ అయిపోయిందని కుంటి సాకులు చెబుతున్నారు. ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తానని, ఉచిత బస్సు ప్రయాణమని మాయమాటలు చెప్పారు. ప్రతి రైతుకు ఏడాదికి పెట్టుబడి సాయం కింద రూ.20 వేలు ఇస్తామని చెప్పి అన్నదాతకు వెన్నుపోటు పొడిచారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ, పెండింగ్ డీఏలు అన్నీ ఇస్తామని చెప్పి బుట్టలో వేసుకుని ఇప్పుడు నిలువునా ముంచారు. ఇలా విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు అందరికీ పంగనామాలు పెట్టారు. -
పంగనామాలు
అందరికీకూటమి ఏడాది పాలన అంతా మోసం, దగా సూపర్ సిక్స్ హామీలకు మంగళం స్టీల్ప్లాంట్ కార్మికుల గోడుపట్టదా? ఉక్కు పరిశ్రమను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం నెమ్మదిగా ఉద్యోగులను వీఆర్ఎస్ పేరుతో ఇంటికి పంపిస్తోంది. కాంట్రాక్టు కార్మికులపై వేటు వేసింది. దీంతో వేలాది మంది కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గత ఏడాది కాలంగా కార్మికులు రోడ్డెక్కి ఆందోళనలు, ర్యాలీలు, నిరాహార దీక్షలు చేస్తున్నా.. ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్గానీ వారి గోడును పట్టించుకున్న దాఖలాలు లేవు. తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు నిరసనలు చేపడుతుంటే.. వారి ఆందోళనలను అణిచివేయడానికి పోలీసులను ప్రయోగిస్తుండడం గమనార్హం. -
రోడ్డున పడ్డ ఉద్యోగులు
కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో వలంటీర్లు, 108 ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ టీచర్లు, ఆశా కార్యకర్తల ధర్నాలు, నిరసనలతో విశాఖ హోరెత్తిపోతోంది. ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని 108 ఉద్యోగులు.. విధుల్లోకి తీసుకొని రూ.10 వేలు వేతనం ఇవ్వాలని వలంటీర్లు.. సమస్యలు పరిష్కరించాలంటూ ఆశ వర్కర్ల నిరసనలు.. ఆకలి కేకలతో అలమటిస్తూ పెండింగ్ జీతాల కోసం ఆయాల పొలికేకలు.. ఎండీయూ వాహనాలు రద్దు చేయడంతో రోడ్డున పడ్డ 702 మంది ఆపరేటర్లు, హెల్పర్ల ఆర్తనాదాలు.. ఇలా చంద్రబాబు ఏడాది పాలనలోనే అన్ని వర్గాల నుంచి అసహనం కట్టలు తెంచుకుంటోంది. -
జగన్ కాన్వాయ్పై దాడి దుర్మార్గం
సాక్షి, విశాఖపట్నం: పొగాకు రైతుల సమస్యలు తెలుసుకోవడానికి పొదిలి పర్యటనకు వెళ్లిన మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కాన్వాయ్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ, రైతులకు అండగా నిలుస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఏదో విధంగా అడ్డుతొలగించుకోవాలని దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో మహిళలకు రక్షణ లేదు.. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ విస్మరించి అన్ని వర్గాల వారినీ మోసం చేస్తున్న చంద్రబాబు సర్కార్ వైఫల్యాలను ఎత్తి చూపితే తప్పా? అంటూ ప్రశ్నించారు. ప్రజా సమస్యలను, వారికిచ్చిన హామీలను గాలికొదిలేసి చంద్రబాబు, పవన్ కల్యాణ్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఏదో విధంగా అలజడులు సృష్టించి, తద్వారా శాంతిభద్రతలకు ఆటంకం కలిగించడం, ఆ నెపాన్ని జగన్మోహన్రెడ్డిపై, వైఎస్సార్సీపీపై వేయాలనే కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయన్నారు. అందుకు నిదర్శనమే పొదిలి పర్యటనలో వైఎస్ జగన్మోహన్రెడ్డి కాన్వాయ్పై జరిగిన దాడి అని కె.కె.రాజు అన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు -
ఉపాధ్యాయుల సహనానికి పరీక్ష
రెండో రోజూ బదిలీల కౌన్సెలింగ్లో గందరగోళం ఆరిలోవ: ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్జీటీ బదిలీల కౌన్సెలింగ్లో రెండో రోజూ గందరగోళం నెలకొంది. సాంకేతిక లోపాలు, అధికారుల జాప్యంతో బుధవారం కూడా ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎస్జీటీ బదిలీ కోసం మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మాన్యువల్ కౌన్సెలింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదటి రోజు సాంకేతిక సమస్యలతో అంతా గందరగోళంగా మారింది. దీంతో మొదటి రోజు కౌన్సెలింగ్ పూర్తిగా రద్దు కాగా, రెండో రోజు ఉదయం నుంచి రాత్రి వరకు పడిగాపులు కాయడంతో వారి సహనం నశించి అధికారులను నిలదీశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం 1 నుంచి 300 వరకు కౌన్సెలింగ్ జరగాల్సి ఉండగా ఉపాధ్యాయులు ఉదయం 10 గంటలకే చేరుకున్నారు. కానీ కౌన్సెలింగ్ ఆలస్యంగా మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమైంది. ప్రక్రియ నత్తనడకన సాగడంతో మధ్యాహ్నం 2.40 గంటలకు కేవలం 20 మందికి, మధ్యాహ్నం 3.30 గంటలకు 50 మందికి, సాయంత్రం 7.45 గంటలకు 210 మందికి మాత్రమే పూర్తయింది. మిగిలిన 90 మంది కౌన్సెలింగ్ ఆలస్యం కావడంతో.. అప్పటి వరకు నిరీక్షించిన ఉపాధ్యాయుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వారు ఉమ్మడి జిల్లాల డీఈవోల వద్దకు వెళ్లి, అధికారులు కావాలనే తమను ఇబ్బంది పెడుతున్నారంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు మరోసారి సాంకేతిక సమస్యనే కారణంగా చెప్పినా వారు శాంతించలేదు. చివరకు మిగిలిన వారికి కౌన్సెలింగ్ పూర్తయ్యే సరికి రాత్రి 11 గంటలు దాటింది. పాఠశాలల తొలిరోజే టీచర్ల గైర్హాజరు! మరోవైపు గురువారం పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. నేడు మరో 500 మందికి కౌన్సెలింగ్ నిర్వహిస్తుండటంతో, వారంతా తొలిరోజు పాఠశాలలకు గైర్హాజరు కావడం ఖాయంగా కనిపిస్తోంది. మొదటి రోజు సాంకేతిక లోపంతో కౌన్సెలింగ్ రద్దు కావడం, రెండో రోజు ఈ జాప్యం జరగడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. గురువారం 301 నుంచి 800 వరకు ఎస్జీటీ ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని విశాఖ డీఈవో ఎన్. ప్రేమ్కుమార్ తెలిపారు. ఉపాధ్యాయులు ఉదయం 9 గంటలకు కౌన్సెలింగ్కు హాజరుకావాలని ఆయన సూచించారు. -
ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలకు బిగ్ అలర్ట్
సాక్షి, విశాఖపట్నం: రానున్న 24 గంటల్లో ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బాపట్ల, కృష్ణ, గుంటూరు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. వచ్చే ఐదు రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి ఉత్తరాంధ్ర తీరానికి అనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వాతావరణం.. రుతుపవనాల పురోగమనానికి అనుకూలంగా మారింది. నిన్న గుడివాడలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదైంది. కైకలూరు, మచిలీపట్టణం 7, ఏలూరు 6, నూజివీడు, భీమడోలు, రేపల్లె 5 సెంటీమీటర్ల, లేపాక్షి 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
భారత నావికాదళానికి మరింత బలం
త్వరలో 9–10 కొత్త యుద్ధనౌకలు ఏయూక్యాంపస్: భారత నావికాదళం తన సంపత్తిని మరింత పెంచుకోనుంది. ఈ ఏడాది జూన్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో 9 నుంచి 10 కొత్త యుద్ధనౌకలు భారత నావికాదళంలో చేరనున్నాయి. దీంతో నౌకాదళం తన శక్తిని గణనీయంగా విస్తరించనుంది. ఈ నూతన చేర్పులలో భాగంగా, యాంటీ–సబ్మైరెన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ యుద్ధనౌక ‘అర్ణాలా’ ను జూన్ 18న విశాఖలోని నేవల్ డాక్యార్డ్లో కమిషన్ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇది నావికాదళం బలాన్ని మరింతగా వృద్ధి చేస్తుంది. త్వరలో కమిషన్ చేయనున్న ఈ యుద్ధనౌకలలో ఎక్కువ భాగం దేశీయంగా తయారు చేసినవేనని అధికారులు తెలిపారు. కమీషనింగ్ కార్యక్రమంలో ఏఎస్డబ్ల్యూ– ఎస్డబ్ల్యూసీ విభాగానికి చెందిన మరిన్ని నౌకలు కూడా ఉంటాయని, విశాఖపట్నం నుంచే ‘అర్ణాలా’ తో పాటు మరికొన్ని ఏఎస్డబ్ల్యూ– ఎస్డబ్ల్యూసీ రకం యుద్ధనౌకలు కమిషన్ చేయబడతాయని పేర్కొన్నారు. -
విద్వేషం.. విధ్వంసం
కూటమి ఏడాది పాలనలో వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు, దౌర్జన్యాలు ఉమ్మడి విశాఖ జిల్లాలో 100 మందిపై కేసులు, ఇద్దరిపై హత్యాయత్నం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన మరుక్షణం నుంచే కూటమి నేతలు, కార్యకర్తలు దాడులు, హత్యలు, దౌర్జన్యాలతో చెలరేగిపోతున్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులు, సానుభూతిపరులే లక్ష్యంగా తీవ్ర స్థాయిలో వేధింపులకు పాల్పడుతున్నారు. రెడ్బుక్ పేరుతో టీడీపీ నేతలు, కార్యకర్తల దౌర్జన్యకాండకు హద్దుల్లేకుండా పోయింది. భౌతికదాడులు, ఆస్తుల విధ్వంసం విచ్చలవిడిగా కొనసాగుతోంది. ప్రశాంతతకు మారుపేరైన ఉమ్మడి విశాఖ జిల్లాలోని పల్లెల్లో వ్యక్తిగత విద్వేషాలు, దాడులు, అడ్డగోలు కేసులు, అరెస్టులు పెచ్చుమీరిపోయాయి. 8లో -
నేడు అప్పన్నకు మూడో విడత చందనం సమర్పణ
సింహాచలం: జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారికి బుధవారం మూడో విడత చందన సమర్పణ కార్యక్రమం జరగనుంది. తెల్లవారుజామున అర్చకులు ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఇప్పటికే సిద్ధం చేసిన మూడు మణుగుల (సుమారు 125 కిలోలు) పచ్చి చందనంలో మంగళవారం వైదికులు పలు రకాల సుగంధ ద్రవ్యాలను కలిపి సమర్పణకు సిద్ధం చేశారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు కరి సీతారామాచార్యులు, ఉప ప్రధానార్చకుడు సాతులూరి నరసింహాచార్యులు, అర్చకుడు అప్పాజీ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మూడో విడత చందన సమర్పణ కారణంగా బుధవారం అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహించనున్నారు. -
వాన..ఈదురుగాలులు
మహారాణిపేట: మూడు రోజులుగా ఎండ వేడిమి, ఉక్కబోతతో అల్లాడుతున్న నగర వాసులకు మంగళవారం కురిసిన వర్షం ఎంతో ఉపశమనాన్నిచ్చింది. రుతుపవనాల రాక, వాతావరణంలో మార్పుల కారణంగా గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి. ఒకవైపు ఉక్కబోత, మరోవైపు వేడి గాలులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం నుంచి నగరంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం దంచికొట్టింది. దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. జోరున కురిసిన వర్షంతో పాటు వీచిన ఈదురుగాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. పందిమెట్ల, బుల్లయ్య కాలేజీ సమీపంలో భారీ వృక్షాలు కూలిపోయాయి. ఆశీలమెట్ట వద్ద ఈదురుగాలులకు హోర్డింగ్లు, ఫ్లెక్సీలు తెగిపడిపోయాయి. వర్షం తాకిడికి బీచ్రోడ్డులో అలల తాకిడి ఉధృతంగా మారింది. బీచ్ రోడ్డులో కురిసిన భారీ వర్షం కారణంగా రోడ్డుపైకి నీరు చేరింది. -
ఉపాధ్యాయ కౌన్సెలింగ్ గందరగోళం
● ఇబ్బంది పడ్డ ఉపాధ్యాయులు ● కనీస ఏర్పాట్ల కరవు ● అధికారులను నిలదీసిన టీచర్లు ● సాంకేతిక లోపం అంటూ నేటికి కౌన్సెలింగ్ వాయిదా ఆరిలోవ: ఉమ్మడి విశాఖ జిల్లాల సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ) బదిలీలకు సంబంధించి మంగళవారం నిర్వహించాల్సిన మాన్యువల్ కౌన్సెలింగ్ గందరగోళంగా మారింది. కొన్ని రోజులుగా ధర్నాలు, నిరసనలతో తమ సమస్యలను వినిపించిన ఎస్జీటీలకు కౌన్సెలింగ్ ప్రక్రియ తీవ్ర అసౌకర్యాన్ని కలిగించింది. విద్యాశాఖ అధికారులు సరైన సౌకర్యాలు కల్పించకపోవడం, కౌన్సెలింగ్లో తీవ్ర జాప్యం జరగడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం జరిగిన ఈ కౌన్సెలింగ్కు అర్హులైన 1 నుంచి 500 మంది ఉపాధ్యాయులను పిలవగా, వారంతా మధ్యాహ్నం 2 గంటలకే హాజరయ్యారు. అయితే కౌన్సెలింగ్ ప్రక్రయ గంటల తరబడి ఆలస్యమవుతూ వచ్చింది. దీంతో సహనం కోల్పోయిన ఉపాధ్యాయుల్లో గందరగోళం నెలకొంది. అధికారులను నిలదీశారు. కౌన్సెలింగ్ జరుపుతారా లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు సాంకేతిక లోపం తలెత్తిందని పేర్కొంటూ కౌన్సెలింగ్ను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు రాత్రి 9 గంటలకు ప్రకటించారు. అప్పటివరకు నిరీక్షించిన ఉపాధ్యాయులు ఈ ప్రకటనతో తీవ్ర నిరాశకు గురయ్యారు. కనీసం హాజరైన ఉపాధ్యాయులకు కూర్చోవడానికి కుర్చీలు కూడా ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. దూర ప్రాంతాల నుంచి చంటి పిల్లలతో సహా హాజరైన కొందరు ఉపాధ్యాయులు రాత్రివేళ తీవ్ర అవస్థలు పడ్డారు. నగరానికి దగ్గరగా ఉన్నవారు ఇళ్లకు చేరుకోగా, దూర ప్రాంతాల నుంచి వచ్చినవారు వసతి కోసం లాడ్జీలను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బుధవారం ఉదయం 9 గంటలకు 1 నుంచి 300 మందికి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. అయితే విద్యా శాఖ అధికారులు కావాలనే ఇబ్బంది పెడుతున్నారంటూ ఉపాధ్యాయుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. బుధవారం జరగాల్సిన కౌన్సెలింగ్ అయినా సక్రమంగా జరుపుతారో లేదో అని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉపాధ్యాయులు నిరాశతో వెనుదిరిగారు. -
ప్రపంచ రికార్డు లక్ష్యంగా యోగా దినోత్సవం
● రాజకీయాలకు అతీతంగా ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి ● అధికారులతో రాష్ట్ర మంత్రి లోకేష్ సమీక్ష మహారాణిపేట: ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం ప్రపంచ రికార్డు సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఒకే ప్రాంతంలో ఐదు లక్షల మందితో యోగా నిర్వహించడమే లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఆంధ్రా యూనివర్సిటీలోని సాగరిక కన్వెన్షన్ హాలులో యోగా డే నిర్వహణ ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారన్నారు. ప్రధాని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని అధికారులు పట్టుదల, క్రమశిక్షణతో విజయవంతం చేయాలని కోరారు. ఇది రాష్ట్ర ప్రజలందరి కార్యక్రమమని, రాజకీయాలకు అతీతంగా అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జూన్ 21న ఆర్.కె. బీచ్ నుంచి భీమిలి వరకు 26 కిలోమీటర్ల పొడవునా 247 కంపార్ట్మెంట్లలో యోగా కార్యక్రమం జరగనుంది. ఉదయం 6:30 గంటలకు ప్రధాని మోడీ ప్రధాన ప్రాంగణానికి చేరుకుంటారని, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా రవాణా సౌకర్యాలు కల్పించాలని మంత్రి ఆదేశించారు. హాజరయ్యే ప్రతి ఒక్కరికీ యోగా మ్యాట్, కిట్, వాటర్ బాటిల్ అందజేయాలన్నారు. మొత్తం 108 పర్యాటక ప్రాంతాల్లో యోగా నిర్వహించనున్నట్లు హోం మంత్రి అనిత తెలిపారు. రాష్ట్ర స్థాయి నోడల్ ఆఫీసర్ ఎం.టి. కృష్ణబాబు మాట్లాడుతూ ప్రతి కంపార్ట్మెంట్కు ఒక గెజిటెడ్ అధికారిని నియమించామని, క్యూఆర్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిని మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. రవాణా నియంత్రణకు కమాండ్ కంట్రోల్ రూమ్, 1200 కెమెరాలు ఏర్పాటు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం 3,500 ఆర్టీసీ బస్సులు, 8 వేల ప్రైవేటు బస్సులు సిద్ధం చేశామని తెలిపారు. భద్రత కోసం 116 అంబులెన్స్లు, 1400 బయో టాయ్లెట్లు అందుబాటులో ఉంచుతున్నారు. సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయుస్వామి, రాష్ట్రమంత్రులు అనగాని సత్యప్రసాద్, గుమ్మడి సంధ్యారాణి, కలెక్టర్ హరేందిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చి, డీఐజీ గోపినాథ్ జెట్టి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎల్ఎల్సిలు, కార్పొరేషన్ చైర్మన్లు, రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
‘నారా’ పాలనలో నేరాలెన్నో..
● కూటమి ప్రభుత్వం వచ్చాకమహిళలపై పెచ్చుమీరిన దాడులు ● ఇంత జరుగుతున్న బాబు, పవన్ స్పందించరా? ● హోం మంత్రి ఉన్నట్టా? లేనట్టా?? ● కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తిన వైఎస్సార్ సీపీ మహిళా విభాగం ● బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేత డాబాగార్డెన్స్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో మహిళలు, బాలికలపై దాడులు, లైంగిక దాడులు పెరిగాయని, శాంతిభద్రతలు క్షీణించాయని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం ఆరోపించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించకపోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు సూచనలతో ఈ నిరసనను చేపట్టారు. బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపి, విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ‘నారా పాలనలో మహిళల ఆక్రందనలు.. ఆడబిడ్డలపై అఘాయత్యాలు.. బాబు పాలనలో రక్షణ లేదు.. భక్షణే’, ‘నేరగాళ్ల చేతిలో ఆడబిడ్డల భవిత’, ‘కక్షల్లో ప్రభుత్వం–పోలీసులు’, ‘మంటల్లో శాంతి భద్రతలు’, ‘రోజుకో అఘాయత్యం, గంటకో నేరం’, ‘ఆడబిడ్డలకు లేదు రక్షణ’, ‘బాబు వచ్చాడు, దిశ తీసేశాడు’ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళల భద్రతను గాలికి వదిలేసిందని విమర్శించారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, హోంమంత్రి అనిత మహిళ అయి ఉండి కూడా మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్నారని ఆమె దుయ్యబట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహిళలకు అన్యాయం జరుగుతుందని విమర్శించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్కు ఇప్పుడు జరుగుతున్న దాడులు కనిపించడం లేదా అని ఆమె ప్రశ్నించారు. హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల రక్షణకు పెద్ద పీట వేశారని, దిశ చట్టాన్ని అమలు చేసి భద్రత కల్పించారని గుర్తు చేశారు. మాజీ మేయర్ గొలగాని హరి వెంకటకుమారి మాట్లాడుతూ గత ఏడాదిగా మహిళలు, బాలికలపై దాడులు, లైంగికదాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్ జగన్ మోహన్రెడ్డి పాలనలో మహిళలకు పూర్తి రక్షణ ఉండేదని గుర్తు చేస్తూ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, అందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పార్టీ నాయకురాలు ఈర్లె అనురాధ మాట్లాడుతూ, రాష్ట్రంలో అనేక లైంగికదాడులు జరుగుతున్నాయని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలు ఏమయ్యాయని చంద్రబాబు, పవన్ కల్యాణ్ను ప్రశ్నించారు. కార్యక్రమంలో పల్లా చిన్నతల్లి, నాగ శశికళ, చుక్క వరలక్ష్మి, రీసు అనురాధ, బి.విజయలక్ష్మీ, రామలక్ష్మి, పప్పల సునీత, శ్రీదేవివర్మ, బి.పద్మావతి, బయ్యవరపు రాధ, సత్యాల సాగరిక, రాజేశ్వరి, మాసిన లక్ష్మి, నాగమణి, ఈశ్వరి, శిరీష, విశాలక్షి, సలాది భాను, మళ్ల ధనలత, పత్తివాడ కనక, మజ్జి జ్యోతి, రమణమ్మ, సత్యవతి, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మహిళల నిరసనకు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్, పార్టీ నాయకులు గొలగాని శ్రీనివాస్, దొడ్డి బాపూ ఆనంద్, పీతల వాసు, ముత్తాబత్తుల రమేష్, పచ్చిరపల్లి రాము పలువురు నాయకులు, కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. -
మీడియాపై దాడి.. ప్రజాస్వామ్యంపై దాడే: బొత్స
సాక్షి, విశాఖపట్నం: అక్రమ కేసులో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేయడం, సాక్షి మీడియా సంస్థ కార్యాలయాలపై జరుగుతున్న దాడులను శాసన మండలిలో విపక్ష నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఖండించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.‘‘రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతింది. మూడు రోజులుగా ఓ పథకం ప్రకారమే సాక్షి కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. ఏలూరు సాక్షి కార్యాలయానికి నిప్పుపెట్టడం దుర్మార్గం. మీడియాపై దాడి చేశారంటే.. ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్లే. ఈ హింసాత్మక చర్యలు భవిష్యత్లో తీవ్ర పర్యవసానాలకు దారితీస్తాయి అని బొత్స ఓ ప్రకటనలో అన్నారు. దాడులతో ప్రశ్నించే వారిని భయపెట్టలేరని, ఈ అరాచకాలపై ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని, జరిగిన దారుణాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అని కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి బొత్స వ్యాఖ్యానించారు. -
ఏపీకి ఐఎండీ బిగ్ అలర్ట్
సాక్షి, విశాఖపట్నం: ఏపీకి భారత వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే వారం రోజులు వాతావరణం అల్లకల్లోలంగా ఉంటుందని చెబుతూ.. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన చేసింది. అదే సమయంలో దక్షిణ కోస్తాలోనూ విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపింది. ఉత్తర ఒడిశాను అనుకుని ఉన్న బంగాళాతంలో ఉపరితల ఆవర్తనం బలంగా కొనసాగుతోంది. రుతుపవనాల పురోగతికి మారిన వాతావరణం అనుకూలంగా మారింది. ఈ నేపథ్యంలోనే భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఒడిశాలోని గోపాల్ పూర్ వరకు నైరుతి విస్తరించి ఉంది. తీరం వెంబడి ఇప్పటికే గరిష్టంగా 40కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. ఆవర్తన ప్రభావంతో పాతపట్నంలో 5, పార్వతీపురంలో 5 ,టెక్కలి.. సాలూరు.. శ్రీకాకుళం.. ఆనందపురంలో 4, విజయనగరం, కళింగపట్నం. అనకాపల్లిలో 3 సెంమీ చొప్పున వర్షపాతం నమోదు అయ్యింది. -
రాజకీయ సిఫార్సులకే పెద్దపీట?
● ఉమ్మడి విశాఖలో బదిలీల దుమారం ● ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి నో బదిలీ ● పెందుర్తిలో బాబ్జీకి భంగపాటు? మహారాణిపేట: ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో జరిగిన రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల ఉద్యోగుల బదిలీలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఏళ్ల తరబడి ఒకే చోట పాతుకుపోయిన, ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు తహసీల్దార్లకు స్థానచలనం కల్పించకపోవడం, అదే సమయంలో కీలకమైన పోస్టులను భర్తీ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ బదిలీల ప్రక్రియలో కూటమి ఎమ్మెల్యేల సిఫార్సులకే పెద్దపీట వేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా రెవెన్యూ శాఖలో జరిగిన తహసీల్దార్ల బదిలీలలో రాజకీయ జోక్యం స్పష్టంగా కనిపిస్తోంది. పెందుర్తి తహసీల్దార్ బదిలీ విషయంలో అక్కడి ఎమ్మెల్యే పంతం నెగ్గించుకున్నారు. ఈ విషయంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ సిఫార్సులను పరిగణలోకి తీసుకోలేదని సమాచారం. భీమిలి ఎమ్మెల్యే సిఫార్సు మేరకే ఆనందపురం తహసీల్దార్ను బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఎక్కువ సంవత్సరాలు పనిచేసిన కారణంగా గాజువాక తహసీల్దార్ బదిలీ జరిగింది. అయితే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు అధికారులను కదపకపోవడం గమనార్హం. వీరితో పాటు డిప్యూటీ తహసీల్దార్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బందితో కలిపి రెవెన్యూ శాఖలో మొత్తం 62 మందిని బదిలీ చేశారు. పంచాయతీరాజ్లో 75 మందికి స్థానచలనం జిల్లా పరిషత్లో కూడా భారీగా బదిలీలు జరిగాయి. జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి మొత్తం 75 మంది ఉద్యోగులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఐదుగురు ఎంపీడీవోలు, ఐదుగురు పరిపాలనాధికారులు, 4 సీనియర్ అసిస్టెంట్లు, 11 మంది జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు టైపిస్టులు, 12 మంది రికార్డు అసిస్టెంట్లు, 30 మంది ఆఫీస్ సబార్డినేట్లు, ఆరుగురు నైట్ వాచ్మెన్లు ఉన్నారు. జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర పాల్గొన్నారు.బదిలీ అయిన రెవెన్యూ అధికారులు వీరే.. మండలం/స్థానం తహసీల్దార్/ కేటాయించిన స్థానం సూపరింటెండెంట్ పేరు పెందుర్తి ఎం.ఆనందకుమార్ అనకాపల్లి జిల్లా ములగాడ ఎం.భుజంగరావు అనకాపల్లి జిల్లా కలెక్టరేట్(అల్లూరి) బి.నాగరాజు అనకాపల్లి జిల్లా కలెక్టరేట్(అల్లూరి) ిసీహెచ్ తిరుమలరావు అనకాపల్లి జిల్లా కలెక్టరేట్(అల్లూరి) ఎం.భాస్కరఅప్పారావు అనకాపల్లి జిల్లా అల్లూరి జిల్లా టి.రామకృష్ణ పెందుర్తి మండలం అల్లూరి జిల్లా ఎంవీవీపసాద్ ల్యాండ్ ప్రొటెక్షన్(విశాఖ) కలెక్టరేట్(అనకాపల్లి) బీవీ రాణి మెజిస్టీరియల్ సెక్షన్(విశాఖ) అచ్యుతాపురం జి.జనార్ధన్ అల్లూరి జిల్లా ఆనందపురం పి.శ్యాంప్రసాద్ కోఆర్డినేషన్ సెక్షన్(విశాఖ) (ఆనందపురం హెచ్డీటీ ఎల్.చేతన్ కుమార్ ఇన్చార్జి తహసీల్దార్గా నియామకం) గాజువాక టి.శ్రీ వల్లి వీఎంఆర్డీఏ (గాజువాక హెచ్డీటీ బి.శ్రీనివాసరావు ఇన్చార్జి తహసీల్దార్గా నియామకం) సీతమ్మధార ఎం.రమేష్ను ములగాడ (సీతమ్మధార హెచ్డీటీ ఎస్.ఎ.త్రినాథరావు ఇన్చార్జి తహసీల్దార్గా నియామకం) -
రేషన్ కార్డు మంజూరుకు నిబంధనాలు
మహారాణిపేట: కొత్త రేషన్ కార్డులు, మార్పులు–చేర్పులు, ఇతర సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్త కార్డుల కోసం అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఆన్లైన్ సమస్యలు వెంటాడుతుండటంతో దరఖాస్తుదారులు సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సోమ, మంగళవారాల్లో సర్వర్ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్ట అధికారులు వెల్లడించారు. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుదారులకు సాఫ్ట్వేర్ సమస్యలు తీవ్ర తలనొప్పిగా మారాయి. అవసరమైన పత్రాలున్నా, నిబంధనల కారణంగా దరఖాస్తు చేయలేకపోతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొత్త పేర్ల నమోదు, తొలగింపు ప్రక్రియ నిలిచిపోయిందని, దీనివల్ల ప్రతిరోజూ సచివాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని అంటున్నారు. పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. తక్షణమే సాఫ్ట్వేర్ను మార్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలు ఇవే..విద్యుత్ బిల్లులు అధికంగా వస్తే కొత్త కార్డుకు అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. బిల్లులో తప్పులున్నా, విద్యుత్ అధికారుల సహాయంతో సరిచేసినా కూడా దరఖాస్తు చేయడానికి అవకాశం ఉండటం లేదని లబి్ధదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విద్యుత్ బిల్లులు ఉన్న వారి పేరున కొత్త రేషన్ కార్డులు జారీ కావని అధికారులు స్పష్టం చేస్తున్నారు. హా భార్యాభర్తలు కొత్త రేషన్ కార్డు కావాలనుకుంటే, వారి ఆధార్ కార్డులో స్థానిక చిరునామా కాకుండా వేరే అడ్రస్ ఉంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇంటి మ్యాపింగ్ కూడా సక్రమంగా జరగడం లేదని లబి్ధదారులు వాపోతున్నారు. ఆధార్ కార్డులో చిరునామాలు సక్రమంగా ఉంటేనే ఇంటి మ్యాపింగ్ అవుతుందని అధికారులు చెబుతున్నారు. రేషన్ కార్డులో కుటుంబ సభ్యులుగా తల్లి, తండ్రి, కుమారుడు ఉన్నప్పుడు, కుమారుడికి వివాహం జరిగితే కొత్త కార్డు ఇవ్వడం లేదా ఈ కార్డు నుంచి తొలగించడానికి నిబంధనలు అడ్డు వస్తున్నాయి. కుమారుడు కుటుంబం వేరుగా ఉన్నా కొత్త కార్డు నమోదు చేయడానికి నిబంధనలు అడ్డు వస్తున్నాయని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు చక్రాల వాహనం(వ్యక్తిగత వినియోగానికి) ఉన్నవారు. ఆదాయపు పన్ను చెల్లించేవారు. గ్రామీణ ప్రాంతాల్లో మూడు ఎకరాల మాగాణి(వరి పండే భూమి) ఉన్నవారు, పదెకరాల మెట్ట భూమి ఉన్నవారు. ప్రతి నెలా 300 యూనిట్లకు మించి విద్యుత్ (గృహావసరాలకు) వినియోగించేవారు. నగరంలో 1000 చదరపు గజాల స్థలంలో ఇల్లు ఉన్నవారు. పైన పేర్కొన్న అంశాలకు చెందినవారిని తెలుపు రేషన్ కార్డులకు అనర్హులుగా పరిగణిస్తారు.కూటమి మోసంపై ఆగ్రహం ఎన్నికల ముందు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి రోజులు గడుస్తున్నా ప్రజలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు కార్డుల కోసం ఇంకా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అర్బన్ డీఎస్వో పరిధిలో మధురవాడ, ఆనందపురం, భీమిలి, పద్మనాభం, పెందుర్తి తదితర ప్రాంతాలు ఉన్నాయి. జిల్లాలో 5 లక్షల 12 వేల 619 తెలుపు కార్డులతోపాటు 625 చౌకధరల డిపోలు ఉన్నాయి. సర్కార్ మొండి చెయ్యి కూటమి నేతలు ఎన్నికల ముందు అర్హులకు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించి, ఇప్పుడు మొండిచేయి చూపుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారం చేపట్టి ఏడాది దాటిన నేపథ్యంలో, కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. దీంతో అర్హులైన ప్రజలు దరఖాస్తు పత్రాలతో గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లగా, అక్కడ వారికి నిరాశే మిగులుతోంది. కార్డులో పేర్ల నమోదు, తొలగింపునకు సంబంధించిన సాఫ్ట్వేర్లో ఎటువంటి ఆప్షన్ లేదని సచివాలయ సిబ్బంది చెప్పడంతో దరఖాస్తుదారులు షాక్కు గురై వెనుదిరుగుతున్నారు. -
కొమ్మినేని అరెస్ట్.. కూటమి డైవర్షన్ రాజకీయం
మహారాణిపేట: కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల వ్యతిరేకతను మళ్ళించేందుకే సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారని వైస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి డా. మంచా నాగమల్లేశ్వరి ఆరోపించారు. మహిళలపై దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్నా హోంమంత్రి వంగలపూడి అనిత పట్టించుకోవడం లేదని ఆమె మండిపడ్డారు. సోమవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. సొంత జిల్లాలో మహిళ హత్య జరిగినా హోంమంత్రి పరామర్శించకపోవడం దౌర్భాగ్యమని నాగమల్లేశ్వరి విమర్శించారు. ముఖ్యమంత్రి స్వయంగా హోంమంత్రిత్వ శాఖ చివరి స్థానంలో ఉందని ప్రకటించడం చూస్తే, మహిళల రక్షణ గాలికి వదిలేసినట్టేనని అన్నారు. పచ్చ మీడియా ఓనర్లను, జర్నలిస్టులను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. శ్రీసత్యసాయి జిల్లాలో బాలికపై అత్యాచారం జరిగినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని నిలదీశారు. డైవర్షన్ రాజకీయాలు మాని మహిళల ప్రాణాలు రక్షించాలని హోంమంత్రి అనితకు సూచించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధికారప్రతినిధి డా. మంచా నాగమల్లేశ్వరి -
భీమిలి వరకు యోగా వేడుకలు
మహారాణిపేట: ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లాలో విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఆరోగ్య, వైద్య కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి. కృష్ణబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ జీ. వీరపాండియన్, కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్తో కలిసి ఆయన యోగాంధ్ర కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ భారీ యోగా కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకునే అవకాశం ఉందని, అందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని కృష్ణబాబు సూచించారు. ప్రధాన వేదిక నుంచి భీమిలి వరకు జరిగే ఈ కార్యక్రమానికి విద్యుద్దీకరణ, ఇంటర్నెట్, ఎల్ఈడి స్క్రీన్లు, సీసీ కెమెరాలు, డ్రోన్లు, రవాణా, పార్కింగ్, తాగునీరు వంటి అన్ని ఏర్పాట్లను సమర్థవంతంగా చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో వీఎంఆర్డీఏ కమిషనర్ కే. విశ్వనాథన్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, పలువురు రాష్ట్ర, జిల్లా అధికారులు, ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘కూటమి’కి ప్రజాగ్రహం తప్పదు
● వైఎస్సార్సీపీ ఆత్మీయ సమావేశంలో గొల్ల బాబూరావు సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వంలో 108 అంబులెన్స్ సేవలు అంధకారంలో ఉన్నాయని వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 8వ తేదీన విశాఖ బీచ్రోడ్డులో సముద్ర కెరటాల్లో చిక్కుకున్న ఒక బాలుడు సకాలంలో అంబులెన్స్ రాకపోవడంతో ప్రాణాలు కోల్పోయాడని ఆయన ఆరోపించారు. వెంటనే అంబులెన్స్ వచ్చి ఉంటే ఆ బాలుడు బతికేవాడని, ఈ సంఘటన తన హృదయాన్ని కలచివేసిందని బాబురావు అన్నారు. ‘పేదల ప్రాణాలు కాపాడలేని ఈ కూటమి ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం తప్పద’ని హెచ్చరించారు. ఈ దుస్థితిని చక్కదిద్దేందుకు తన ఎంపీ నిధుల నుంచి మూడు అంబులెన్స్లు కొనుగోలు చేసి, వాటి ద్వారా వైద్య సేవలు అందిస్తానని ప్రకటించారు. ఈ అంబులెన్స్లకు డ్రైవర్లను తానే నియమించి, వారి జీతాలను కూడా స్వయంగా భరిస్తానని తెలిపారు. సోమవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ కేడర్తో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో గొల్ల బాబూరావు మాట్లాడుతూ పార్లమెంటు నిధులను విశాఖ అభివృద్ధి కోసం వినియోగిస్తానని హామీ ఇచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ.. గొల్ల బాబూరావు మంచి రాజకీయ నాయకుడిగానే కాకుండా సమర్థవంతమైన ప్రభుత్వ అధికారిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కుంభా రవిబాబు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె. సుభద్ర, సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్ కుమా ర్, మొల్లి అప్పారావు, తిప్పల దేవన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి , తైనాల విజయ కుమార్, తిప్పల గురుమూర్తి రెడ్డి, మాజీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, డిప్యూటీ మేయర్ కటమూరి సతీష్, పార్టీ కార్యాలయ పర్యవేక్షకులు రవిరెడ్డి, ముఖ్యనేతలు పేర్ల విజయచందర్, రొంగలి జగన్నాఽథం, వుడా రవి, రవి రాజు, నడింపల్లి కృష్ణంరాజు, సతీష్ వర్మ, మంత్రి రాజశేఖర్, ద్రోణంరాజు శ్రీవత్సవ్, పల్లా చినతల్లి, పేడాడ రమణి కుమారి, సనపల రవీంద్ర భరత్, శివ రామకృష్ణ, భర్కత్ అలీ, ఎస్. ప్రసాదరావు, రామి రెడ్డి, బోండా ఉమా మహేశ్వరరావు, దేవరకొండ మార్కండేయులు, పీలా ప్రేమ కిరణ్ , రాయపు రెడ్డి అనిల్ కుమార్, దిలీప్ మారుతి ప్రసాద్ , కార్పొరేట్లు అల్లు శంకర్ రావు, కొండబాబు, కటారి అనిల్ కుమార్ రాజు, మువ్వల లక్ష్మీ, వావిలపల్లి ప్రసాద్, రెయ్యి వెంకటరమణ, శశికళ, పీవీ సురేష్ , భూపతి రాజు సుజాత, కాళిదాస్ రెడ్డి, అల్లంపల్లి రాజబాబు, వేంపాడ శ్రీనివాస్ రెడ్డి, కిరణ్ రాజు , పి.దుర్గారావు, నాగ మల్లీశ్వరి, ఆల్ఫా కృష్ణ, సత్యాల సాగరిక, నీలి రవి, అప్పన్న , జి.నాగేంద్ర, బి.పద్మావతి, శ్రీదేవి వర్మ,జ్యోతి, గంగా మహేష్, సూర్య, మహేష్ బాబు పాల్గొన్నారు. -
ఉక్కు ఉద్యమంపై కుట్ర
● పోలీసుల ద్వారా కూటమి ప్రభుత్వం వేధింపులు ● దీక్షా శిబిరాన్ని ఆక్రమించిన పోలీసులు ● నేలపై కూర్చుని నిరసన వ్యక్తం చేసిన ఆందోళనకారులు ● పోలీసుల తీరుపై ఉక్కు కార్మికుల ఆగ్రహం కూర్మన్నపాలెం: విశాఖ ఉక్కు కర్మాగారంలో కాంట్రాక్టు కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కూర్మన్నపాలెం వద్ద కొనసాగుతున్న దీక్షా శిబిరం వద్ద సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. శాంతియుతంగా జరుగుతున్న ఉద్యమాలను పోలీసుల ద్వారా అణచివేయాలని ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని కార్మిక సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. 1,579 రోజులుగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో దీక్ష కొనసాగుతుండగా సోమవారం నిర్వహించిన నిరసన కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాకుండా దీక్షా శిబిరంలోకి పోలీసులు చొరబడి కుర్చీలలో ఆశీనులవడంతో ఆగ్రహించిన కార్మికులు నేలపై కూర్చుని నిరసన కొనసాగించారు. ఈ సందర్భంగా పోలీసులు దౌర్జన్యం ఆపాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశత్వం విడనాడాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్మిక సంఘాల నేతల ధ్వజం అఖిల పక్ష కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ ప్రభుత్వాలు అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తు న్నాయని దుయ్యబట్టారు. శాంతియుతంగా జరుగుతున్న దీక్షలను పోలీసుల ద్వారా అణచివేయాల ని చూడటం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉందని కారణం చూపి వారిని తొలగించడం సరికాదని పేర్కొన్నారు. కర్మాగారం స్థాపించినప్పటి నుంచి అనేక పోరాటాలు చేశామని, ఇంత దారుణంగా ఎవరూ ఎప్పుడూ వ్యవహరించలేదని పోరాట కమిటీ చైర్మన్ డి. ఆదినారాయణ ఆరోపించారు. మునుపెన్నడూ లేని విధంగా దీక్షా శిబిరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడం ఇదే ప్రథమమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి విధానాలు విడనాడకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. సిటు గౌరవ అధ్యక్షులు జె. అయోధ్యరామ్ మాట్లాడుతూ, కార్మికులను అణచివేసి కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయాలని ప్రభుత్వాలు చూస్తున్నాయని మండిపడ్డారు. ఇది పాలకులకు క్షేమకరం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. 78వ వార్డు కార్పొరేటర్ బి. గంగారావు మాట్లాడుతూ, కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయాలన్న కుట్ర ప్రభుత్వ విధానాల్లో భాగమేనని, కొత్తగా తీసుకొచ్చిన లేబర్ కోడ్ లో భాగంగానే కార్మికుల ఉద్యమాలను అణచివేస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి నిర్ణయాలు ఉపసంహరించుకొని తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని గంగారావు హెచ్చరించారు. భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు నమ్మి రమణ, కేఎం.శ్రీనివాస్, రామచంద్రరావు, కనకరాజు తదితరులు పాల్గొన్నారు. నేలపై కూర్చుని నిరసన వ్యక్తం చేస్తున్న ఉక్కు కార్మికులు -
ఘనంగా పాణిహాటి మహోత్సవం
భీమునిపట్నం: భీమిలి సాగరసంగమం సమీపంలో హరేకృష్ణ మూమెంట్(గంభీరం) ఆధ్వర్యంలో సోమవారం పాణిహాటి మహోత్సవ కార్యక్రమాన్ని భక్తులు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవం ముందుగా సామూహిక సంకీర్తనలతో ప్రారంభమైంది. అనంతరం బలరామకృష్ణుని విగ్రహాలకు పాలు, వివిధ నదుల నుంచి సేకరించిన జలాలు, పంచామృతాలు, పూలతో విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరేకృష్ణ మూమెంట్ అధ్యక్షుడు డాక్టర్ నిష్కించిన భక్త దాస మాట్లాడుతూ ఈ ఉత్సవానికి ఒక ప్రత్యేక చరిత్ర, గుర్తింపు ఉన్నాయని వివరించారు. హరేకృష్ణ మూమెంట్ వ్యవస్థాపకులు శ్రీచైతన్య మహాప్రభువు, నిత్యానంద ప్రభువులు కోల్కతా సమీపంలోని పాణిహాటి గ్రామం వద్ద కృష్ణతత్వాన్ని అన్ని ప్రాంతాలకు విస్తరింపజేశారన్నారు. అందులో భాగంగా గంగానది తీరంలో ఈ ఉత్సవాన్ని నిర్వహించగా.. అప్పటి నుంచి దీనిని నదీ తీరాల వద్ద నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు గోస్తని నది తీరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. అందరూ చక్కని జీవన ప్రయాణాన్ని సాగించాలంటే కృష్ణతత్వాన్ని అనుసరించాలని భక్త దాస సందేశమిచ్చారు. అంబరీష్ దాసతో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు. -
బయోడైవర్సిటీ పార్కులో శ్రీగంధం చెట్ల నరికివేత
బీచ్రోడ్డు: పెదవాల్తేరులోని బయో డైవర్సిటీ పార్కులో 23 ఏళ్ల వయసున్న మూడు శ్రీగంధం చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు నరికేశారు. ఈ దొంగలు పార్కు కంచెను తొలగించి, ఆరు నుంచి ఏడు అడుగుల పొడవైన కలప దుంగలను దొంగిలించారు. పార్కు నిర్వాహకుడు రామమూర్తి సోమవారం ఉదయం చెట్లు నరికివేయడాన్ని గుర్తించారు. వెంటనే మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది కేవలం గంధపు చెట్ల దొంగతనం కాదని, పార్కును నాశనం చేయడానికి చేసిన ప్రయత్నంగా కనిపిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. చెట్లను నరికిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. కేసు దర్యాప్తులో ఉంది.పార్కులో వదిలేసిన చెట్ల కొమ్మలు -
రోగులకు మెరుగైన వైద్యం నా లక్ష్యం: డాక్టర్ వాణి
మహారాణిపేట: కేజీహెచ్ సూపరింటెండెంట్గా ప్రసూతి, సీ్త్ర వ్యాధుల విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఐ.వాణి సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. సూపరింటెండెంట్ పోస్టు అదనపు డీఎంఈ కేడర్లో ఉండటంతో.. అదే కేడర్కు చెందిన డాక్టర్ వాణిని నియమిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న డాక్టర్ పి.శివానంద్ నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు. సీఎస్ఆర్ఎంవో డాక్టర్ యు.శ్రీహరి, అడ్మినిస్ట్రేటర్ బి.వి.రమణ, డిప్యూటీ సీఎస్ఆర్ఎంవో డాక్టర్ జి.మెహర్ కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్లు, ఇతర వైద్యులు, పరిపాలన సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డాక్టర్ వాణి మాట్లాడుతూ రోగులకు మెరుగైన సంరక్షణ, ఉన్నతమైన చికిత్స ప్రమాణాలు అందించడమే తన ప్రథమ లక్ష్యమని తెలిపారు. -
సాక్షి కార్యాలయాలపై దాడులు సరికాదు
జిల్లా వ్యాప్తంగా పోలీసులకు జర్నలిస్టుల ఫిర్యాదు ఆరిలోవ/తగరపువలస/గాజువాక/అల్లిపురం/పెందుర్తి: రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాలపై టీడీపీ దాడులకు పాల్పడడం సరికాదని జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. సాక్షి కార్యాలయాలపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జిల్లా వ్యాప్తంగా పాత్రికేయులు ఆయా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఆరిలోవలో సీఐకి ఫిర్యాదు అందజేయగా.. గాజువాక సీఐ పార్థసారధిని స్థానిక సాక్షి విలేకరులు కలిసి ఫిర్యాదు చేశారు. దాడులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే టూటౌన్ ఎస్.ఐ సతీష్కు సాక్షి విలేకరులు ఫిర్యాదు చేశారు. సాక్షి కార్యాలయాలపై జరిగిన దాడులను భీమిలి నియోజకవర్గంలో జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు తప్పుపట్టాయి. మధురవాడ ప్రాంత పాత్రికేయులు ఏసీపీ అప్పలరాజు, సీఐ బాలకృష్ణకు ఫిర్యాదు అందజేశారు. భీమిలి ప్రెస్క్లబ్ ప్రతినిధులు హెడ్ కానిస్టేబుల్ సన్యాసిరావుకు ఫిర్యాదు చేశారు. పెందుర్తి పోలీస్స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ రమణకు సాక్షి విలేకరులు ఫిర్యాదు చేశారు. కొందరు వ్యక్తులు చేపట్టిన రాజకీయ ప్రేరేపిత దాడులు, ఇతర నేర చర్యలపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి, కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సాక్షి మీడియా విశాఖ యూనిట్ బ్రాంచ్ మేనేజర్ వర్రి చంద్రారావు ఫిర్యాదు చేశారు. తమ కార్యాలయం ఎదుట అనుమతి లేకుండా గుంపులుగా చేరి దాడులకు పాల్పడ్డారని, వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
వీసీబీ సభ్యులకు 12 శాతం డివిడెండ్
● మహాజన సభలో చైర్మన్ రాఘవేంద్రరావు ప్రకటన మద్దిలపాలెం: ది విశాఖపట్నం కో–ఆపరేటివ్ బ్యాంకు(వీసీబీ) 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.71.77 కోట్ల నికర లాభం సాధించిందని, వాటాదారులకు 12 శాతం డివిడెండ్ (రూ. 43.06 కోట్లు) అందిస్తున్నట్లు బ్యాంకు చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు ప్రకటించారు. మద్దిలపాలెంలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం జరిగిన బ్యాంకు మహాజన సభలో ఆయన మాట్లాడారు. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు డిపాజిట్లు 4.98 శాతం వృద్ధితో రూ. 4354.73 కోట్లకు, రుణాలు 7.42 శాతం వృద్ధితో రూ. 3436.47 కోట్లకు చేరాయన్నారు. బ్యాంకు మొత్తం వ్యాపారం 6.04 శాతం వృద్ధితో రూ.7791.20 కోట్లకు చేరుకుందని, నికర నిరర్థక ఆస్తులు సున్నా శాతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యాంకుకు 55 శాఖల్లో 1,11,593 మంది సభ్యులు ఉన్నారని, షేరు ధనం రూ. 389.55 కోట్లకు చేరిందని రాఘవేంద్రరావు తెలిపారు. పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా ఈ ఏడాది మరో 5 కొత్త శాఖలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. బ్యాంకు సీఈవోగా వి.వి.బి.వరలక్ష్మి నియామకానికి మహాజన సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. సహకార రంగానికి, బ్యాంకుకు సుదీర్ఘకాలం సేవలందించిన పూర్వ అధ్యక్షుడు మానం ఆంజనేయులును అభినందన సంచిక ఆవిష్కరణతో ఘనంగా గౌరవించారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ సభ్యులకు సహకార రంగంపై అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. బ్యాంకు పూర్వ జనరల్ మేనేజర్ ఎ.వి.రామకృష్ణారావును కూడా పాలకవర్గం సత్కరించింది. బ్యాంకు ఉపాధ్యక్షుడు ఎం.రాఘవరావు, డైరెక్టర్లు వి.చంద్రశేఖర్, పి.వి.నరసింహమూర్తి, జేవీ సత్యనారాయణమూర్తి, సూరపనేని నాగభూషణ చౌదరి, ఏజే స్టాలిన్, ఉన్నతాధికారులు, వివిధ శాఖల మేనేజర్లు, సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు. -
గంభీరం చేపలకు భలే డిమాండ్
తగరపువలస: ప్రస్తుతం సముద్రంలో చేపల వేట నిషేధం అమలవుతుండటంతో తాజా చేపల లభ్యత తగ్గింది. ఇదే సమయంలో కొన్ని చెరువుల్లో కోళ్ల వ్యర్థాలు వేసి చేపలను పెంచుతున్నారనే ప్రచారం, పట్టణ ప్రాంతాల్లోని కలుషిత నీటిలో పెరిగే చేపల వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయనే భయాలు వినియోగదారులను చెరువు చేపలకు దూరం చేస్తున్నాయి. ఈ తరుణంలో గంభీరం రిజర్వాయర్లోని స్వచ్ఛమైన నీటిలో పెరిగిన చేపలు సురక్షితమైనవి, రుచికరమైనవి కావడంతో వాటికి అమాంతం గిరాకీ పెరిగింది. విశాఖ, మధురవాడ, తగరపువలస తదితర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున గంభీరం రిజర్వాయర్కు తరలివస్తున్నారు. గంభీరం రిజర్వాయర్లో నీటిమట్టం తగ్గడంతో, పద్మనాభం మండలం పాండ్రంగి మత్స్యకార సొసైటీ సభ్యులు చేపల వేట ముమ్మరం చేశారు. ఇక్కడ 8 కిలోల వరకు బరువున్న భారీ చేపలు కిలో కేవలం రూ.120కే లభిస్తుండటం విశేషం. అంతేకాదు కొనుగోలు చేసిన చేపలను అక్కడికక్కడే కిలోకు రూ.20 చెల్లిస్తే శుభ్రం చేసి ఇస్తుండటంతో వినియోగదారులకు శ్రమ తప్పుతోంది. పెద్ద చేపలను కొన్నవారు తమలో తాము వంతులు వేసుకొని పంచుకుంటున్నారు. ఈ రిజర్వాయర్ చేపల రుచి అమోఘం. ఇది మటన్ను కూడా మరిపిస్తుందని కొనుగోలుదారులు లొట్టలేసుకుంటూ చెబుతున్నారు. చేపలతో పాటు, వాటి గుడ్లతో కూడిన ‘సొన’కు కూడా ప్రత్యేకంగా డిమాండ్ ఉంది. కొందరు చేపలను మాత్రమే తీసుకుని సొనను అక్కడే వదిలేస్తుండగా, దానిని ఇష్టపడేవారు రూ. 50 నుంచి రూ. 100 వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఈ రిజర్వాయర్లో చేపలు 16 కిలోల వరకు పెరుగుతాయని, అయితే వాటిలో చాలా వరకు వయసు మీద పడటంతో సహ జంగానే మరణిస్తాయని మత్స్యకారులు తెలిపారు. =========== (08టివిఎల్01) రిజర్వాయర్ వద్దే తూకం వేసి విక్రయిస్తున్న చేపలు(08టివిఎల్01ఎ) నాలుగు కిలోల చేపను కొనుగోలు చేసిన వినియోగదారుడు(08టివిఎల్01బి) (08టివిఎల్01సి, 01డి,01ఇ) శుభ్రం చేసిన చేపలను వంతులు వేస్తున్న మత్స్యకార మహిళలు(08టివిఎల్01ఎఫ్) రుచికి ఫిదా అవుతున్న విశాఖ వాసులు -
ఆసనాలతో ఆరోగ్యయోగం
సీతంపేట: అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్కయ్యపాలెం పోర్టు స్టేడియంలో ఆదివారం ‘యోగాంధ్ర’ ఉత్సాహంగా సాగింది. వయో వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, యూసీడీ మహిళలు, విద్యార్థులు, యోగా అసోసియేషన్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. యోగా శిక్షకుల సూచనలకు అనుగుణంగా వివిధ ఆసనాలు వేశారు. యోగాసనాలతో పాటు ఓం శాంతి ఆధ్వర్యంలో ధ్యానం చేశారు. 78 ఏళ్ల సీనియర్ సిటిజన్ ఉమామహేశ్వరరావు క్లిష్టమైన యోగసనాలు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. జూన్ 21న విశాఖ వేదికగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో నగర ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వామ్యమై విజయవంతం చేయాలని అధికారులు పిలుపునిచ్చారు. పలుశాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారుపోర్టు స్టేడియంలో ఆసనాలు వేస్తున్న ప్రజలు -
కార్పొరేట్లకు కేంద్రం వత్తాసు
సిటు అఖిల భారత కోశాధికారి సాయిబాబు డాబాగార్డెన్స్: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ విధానాలు దేశ ఆర్థిక స్వావలంబనను దెబ్బతీశాయని సిటు అఖిల భారత కోశాధికారి సాయిబాబు ఆరోపించారు. డాబాగార్డెన్స్లోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఆదివారం సిటు 18వ జాతీయ మహాసభల ఆహ్వాన కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ కేంద్రం బహుళజాతి కంపెనీలు, కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. కార్మిక శక్తి ఏకమై వీటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. 1970లో ఐక్యతా నినాదంతో ప్రారంభమైన సిటు.. విద్యుత్ ప్రైవేటీకరణ వంటి అంశాలపై దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తోందన్నారు. కార్మిక సంఘాలకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకువచ్చిన నల్ల చట్టాలను సిటు విజయవంతంగా అడ్డుకుందన్నారు. 1991 నుంచి ఇప్పటివరకు 21 సార్వత్రిక సమ్మెలు నిర్వహించామని, వచ్చే నెల 9న జరగనున్న సమ్మెను కూడా కార్మిక సంఘాలు ఐక్యంగా నిర్వహించాలని కోరారు. ఎన్డీఏ హయాంలో దేశ జీడీపీని ప్రభావితం చేసే రంగాలు కుదేలయ్యాయని, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం వద్ద ప్రణాళికలు లేవని విమర్శించారు. రైల్వే, డిఫెన్స్ రంగాల్లో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. పెహల్గాం ఉగ్రదాడి అనంతరం మత విభజన జరిగేలా బీజేపీ చేసిన ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారన్నారు. ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల సభ్యులు ఈ సభల విజయానికి కృషి చేయాలని కోరారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణపై పోరాటం సిటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు మాట్లాడుతూ తమ సంఘం పోరాటం వల్లే ఇప్పటివరకు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్పరం కాలేదన్నారు. ఆర్ఎస్ఎస్ వారిని స్టీల్ ప్లాంట్ సీఎండీలుగా నియమించి.. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో కార్మిక వర్గాన్ని అణచివేసే చర్యలు చేపడుతున్నారని, ఇది కేంద్ర ప్రభుత్వ ప్రోద్బలంతోనే జరుగుతోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం విశాఖను ఒక ప్రయోగశాలగా చూస్తోందన్నారు. పవన్ కల్యాణ్పై సిటు విమర్శలు సిటు పోరాటంలో భాగంగా స్టీల్ ప్లాంట్ కోసం ఆత్మహత్య చేసుకున్న బాధితుడి కుటుంబాన్ని పరామర్శించి పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని నరసింగరావు గుర్తు చేశారు. అలాంటి పవన్ కల్యాణ్ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుకూలంగా ఎన్డీఏ పక్షాన నిలబడటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రం తర్వాత ఇంతటి కార్మిక అణచివేత చర్యలు ఎప్పుడూ జరగలేదన్నారు. అనంతరం ఈ ఏడాది డిసెంబర్ 31 నుంచి విశాఖలో నిర్వహించనున్న 18వ జాతీయ మహాసభల ఆహ్వాన కమిటీని సిటు రాష్ట్ర అధ్యక్షుడు కేవీ నాగేశ్వరరావు ప్రకటించారు. కమిటీ చైర్మన్గా సీహెచ్ నరసింగరావు, ప్రధాన కార్యదర్శిగా ఆర్కేఎస్వీ కుమార్, కోశాధికారిగా ఏవీ నాగేశ్వరరావు వ్యవహరిస్తారు. -
యువతకు మార్గదర్శిగా ‘జేఆర్డీ ఫ్యాషన్స్’
తాను ఎదిగిన ఫ్యాషన్ రంగంలో తనలాంటి మరెందరికో దారి చూపించాలనే లక్ష్యంతో శశిధర్ 2022లో జేఆర్డీ ఫ్యాషన్స్ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా ఇప్పటివరకు 27 మందికి ఫ్యాషన్, నటనలో శిక్షణ ఇచ్చి వారిని ప్రోత్సహిస్తున్నాడు. భవిష్యత్తులో మరింత మంది యువతను ఉన్నత శిఖరాలకు చేర్చడమే తన ఆశయమని శశిధర్ తెలిపాడు. మిస్టర్ కొచ్చి 2021 విజేత అవార్డులే అవార్డులు ఇటీవల దుబాయ్లోని పిరమిడ్ స్పిరిట్యువల్ సొసైటీ ఆఫ్ దుబాయ్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ నృత్య పోటీల్లో ఎస్కేఎస్ అకాడమీ నుంచి ఎనిమిది మంది నృత్య కళాకారులు ప్రదర్శనలిచ్చారు. ఇందులో శశిధర్ ప్రదర్శించిన ఒడిస్సీ నృత్యానికి ‘యువ ప్రతిభ పురస్కారం’లభించింది. అలాగే శ్రీ లంబోదర కల్చరల్ అకాడమీ నుంచి ‘జాతీయ మహా స్వర్ణ నంది అవార్డు’ను అందుకున్నాడు. 2024లో ‘యాక్టివ్ ఉగాది పురస్కారం’కూడా శశిధర్కు లభించింది. -
ఈఏపీసెట్ ఫలితాల్లో ఎసెంట్ విజయకేతనం
మద్దిలపాలెం: ఏపీ ఈఏపీసెట్–2025(ఫార్మా) ఫలితాల్లో ఎసెంట్ మెడికల్ అకాడమీ విద్యార్థులు మరోసారి అత్యుత్తమ ఫలితాలు సాధించారని డైరెక్టర్ ఎం.వి.ఆర్.మురళీకృష్ణ తెలిపారు. విద్యార్థి ఎం.తులసీభార్గవ్ రామ్ రాష్ట్ర స్థాయిలో 69వ ర్యాంకు సాధించినట్లు వెల్లడించారు. అలాగే 14 మంది విద్యార్థులు 500 లోపు ర్యాంకులు సాధించి ఎసెంట్ హవాను కొనసాగించారని పేర్కొన్నారు. తమ విద్యార్థులు వరసగా 69, 88, 92, 93, 193, 194, 205, 248, 279, 317, 319, 406, 467, 485 ర్యాంకులతో పాటు 140 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించినట్లు చెప్పారు. ఈ విజయం వెనుక తమ డైరెక్టర్లు, అధ్యాపక బృందం కృషి, పట్టుదల ఉన్నాయని కొనియాడారు. ఈ సందర్భంగా 69వ ర్యాంకు సాధించిన ఎం.తులసి భార్గవ్ రామ్ను పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు. -
దివీస్ ఉద్యోగి అనుమానాస్పద మృతి
తగరపువలస: బాలాజీనగర్లో నివాసం ఉంటున్న దువ్వారపు సత్యప్రకాష్ (31) అనే దివీస్ ఉద్యోగి శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పశ్చిమ గోదావరి జిల్లా, ఉండ్రాజవరం మండలం, రజకులపేటకు చెందిన సత్యప్రకాష్ దివీస్ లేబొరేటరీస్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు మూడేళ్ల క్రితం లక్ష్మీదుర్గతో వివాహం జరిగింది. బాలాజీనగర్లో కుటుంబంతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్న సత్యప్రకాష్ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. శనివారం ఇంట్లో ఉన్న సమయంలోనే స్పృహ కోల్పోయి పడి ఉండటాన్ని అతని భార్య గమనించింది. నోటి వెంట నురగలు కూడా రావడంతో ఆటోలో భర్తను అనిల్ నీరుకొండ జనరల్ ఆసుపత్రికి తరలించింది. అక్కడ పరీక్షించిన వైద్యులు సత్యప్రకాష్ మృతి చెందినట్టు నిర్ధారించారు. భీమిలి పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. -
అంధ మహిళా క్రికెట్ క్రీడాకారులకు ప్రోత్సాహం
ఉక్కునగరం: ఎన్టీపీసీ సింహాద్రి సహకారంతో క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆంధ్రప్రదేశ్, క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ కేరళ సంయుక్త ఆధ్వర్యంలో ఉక్కు స్టేడియంలో అంతర్ రాష్ట్ర అంధ మహిళల క్రికెట్ పోటీలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ అంధ మహిళా క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉద్ఘాటించారు. క్రీడాకారులకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న సుప్రీంకోర్టు అడ్వకేట్ శరత్బాబు తన వంతుగా విజేత జట్టుకు రూ. 75 వేలు, రన్నరప్ జట్టుకు రూ. 25 వేలు బహుమతులుగా అందజేస్తానని ప్రకటించి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. పోటీల్లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లో ఆంధ్రప్రదేశ్ జట్టు, కేరళ జట్టుపై 79 పరుగుల తేడాతో విజయం సాధించింది. అనంతరం జరిగిన రెండో మ్యాచ్లో ఒడిశా జట్టు, ఢిల్లీ జట్టును 49 పరుగుల తేడాతో ఓడించి గెలుపొందింది. కార్యక్రమంలో విజువల్లి ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి. రవీంద్రబాబు, ఎన్టీపీసీ సింహాద్రి యూనిట్ ప్రతినిధి అనిల్, ఇండియన్ బ్లైండ్ క్రికెట్ మాజీ కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి, కో–ఆర్డినేటర్లు అమ్మి నాయుడు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
అధికారిక లాంఛనాలతో ‘పల్లా’ అంత్యక్రియలు
గాజువాక: మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆదివారం జరిగాయి. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం నగరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. విశాఖ నుంచి ఆదివారం పార్థివ దేహాన్ని గాజువాక తీసుకొచ్చి ప్రజల సందర్శనార్థం ఉంచారు. అనంతరం గాజువాక హైస్కూల్ రోడ్లోని కై లాసభూమిలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్, కలెక్టర్ హరేందిర ప్రసాద్, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, మేయర్ పీలా శ్రీనివాస్, ఎమ్మెల్యేలు గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి, తిప్పల నాగిరెడ్డి, పీలా గోవింద సత్యనారాయణ, స్థానిక నాయకులు మంత్రి రాజశేఖర్, తిప్పల దేవన్రెడ్డి, టి.హర్షవర్థన్ ప్రసాద్, పప్పు రాజారావు, కోన తాతారావు, పలువురు కార్పొరేటర్లు, పలువురు వాణిజ్య, అధికార ప్రముఖులు పల్లా సింహాచలం పార్థివ దేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, పల్లా శంకర్రావులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
సంఘాల నిర్మాణంతో పాటు ఉద్యమాన్ని విస్తరించాలి
డాబాగార్డెన్స్: అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యల రెండు సంస్థల విలీన సభ సందర్భంగా ఆదివారం డాబాగార్డెన్స్లోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో సాహిత్య సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ గత 50 ఏళ్లుగా విప్లవ సాంస్కృతికోద్యమ నిర్మాణంలో భాగమైన రెండు సంఘాల విలీనం అవసరమన్నారు. మార్క్సిజం, లెనినిజం, మావోయిజం భావాలున్న వారు ఐక్యమవ్వాల్సిన అవసరం ఉందని, రాజకీయ కార్యాచరణ ద్వారానే ఇది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో కార్పొరేట్ మనువాదం, సామ్రాజ్యవాదం పెరిగిపోతున్నాయని, మోదీ ప్రభుత్వం ప్రశ్నించే వారిని అణచివేస్తోందని ప్రొఫెసర్ కాశీం విమర్శించారు. ఇటువంటి తరుణంలో కళాకారులు ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ఉందని, ఆ దిశగా అరుణోదయ కళాకారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రైటర్స్ అకాడమీ చైర్మన్ వీవీ రమణమూర్తి మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవాలని, మందసలో ఎయిర్పోర్టు రాకుండా రైతుల భూములను రక్షించాలని కోరారు. తెలంగాణ అరుణోదయ రాష్ట్ర అధ్యక్షుడు వేణు మాట్లాడుతూ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కనబెట్టి మోదీ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. సభాధ్యక్షుడు నాగరాజు అమర కళావీరులను స్మరిస్తూ తీర్మానం చేశారు. ముందుగా సరస్వతి పార్క్ నుంచి సభావేదిక వరకు అరుణోదయ కళాకారుల కళా ప్రదర్శన ఆటపాటలతో సాగింది. కార్యక్రమంలో తెలంగాణ అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సున్నశెట్టి రాజశేఖర్, రాష్ట్ర కార్యదర్శి అంజయ్య, కె నిర్మల, ఎస్.జయలక్ష్మి, పీవోడబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు ఎం.లక్ష్మి, ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకుడు వెంకటేశ్వర్లు, న్యాయవాది చలం అధిక సంఖ్యలో కళాకారులు పాల్గొన్నారు. -
తారస్థాయిలో పైరవీలు
● నేటితో ముగియనున్న ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ● కూటమి ఎమ్మెల్యేల నుంచి భారీగా సిఫార్సు లేఖలు ● పోస్టును బట్టి ధర నిర్ణయించినట్టు ప్రచారం మహారాణిపేట: ఉద్యోగుల బదిలీలకు గడువు సోమవారంతో ముగియనుండడంతో పైరవీలు తారస్థాయికి చేరుకున్నాయి. రెండు చేతులా డబ్బులు వచ్చే స్థానాల కోసం ఉద్యోగులు కూటమి ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పోస్టును బట్టి, మండలం/జిల్లాను బట్టి రేట్లు నిర్ణయించి బేరసారాలకు దిగుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సిఫార్సు లేఖల జారీకి ముందు ధరలు నిర్ణయించారని ప్రచారం జరుగుతోంది. కీలక పోస్టులకు డిమాండ్ ప్రధానంగా తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఇరిగేషన్, గ్రామీణ నీటి సరఫరా విభాగాల ఇంజినీర్ల పోస్టులకు సిఫార్సు లేఖల కోసం తీవ్ర పోటీ నెలకొంది. భీమిలి, విశాఖ రూరల్, ఆనందపురం, పెందుర్తి, సీతమ్మధార తహసీల్దార్ పోస్టులకు మంచి గిరాకీ ఉందని, ఈ స్థానాల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విశాఖలో ఏళ్ల తరబడి తిష్టవేసిన వారు ఇక్కడి నుంచి కదలకుండా, గ్రామీణ ప్రాంతాల వారు నగరంలో పోస్టింగ్ కోసం ప్రయత్నిస్తున్నారు. పాలనాపరమైన ప్రయత్నాలు ఇటీవల ఉమ్మడి విశాఖ జిల్లాల కలెక్టర్ల సమావేశంలో తహసీల్దార్ల బదిలీలపై ప్రధానంగా చర్చించారు. విశాఖలో పనిచేస్తున్న వారిని ఏజెన్సీకి, అక్కడ పని చేస్తున్న వారిని విశాఖకు బదిలీ చేసే ప్రతిపాదనలు పరిశీలించారు. అలాగే కొందరు విశాఖ తహసీల్దార్లను ఇతర ప్రాంతాలకు పంపాలని విశాఖ కలెక్టర్ యోచిస్తున్నట్లు సమాచారం. సిఫార్సు లేఖల వెల్లువ రెవెన్యూ శాఖలో అన్ని కేడర్ల బదిలీల కోసం కూటమి ఎమ్మెల్యేల నుంచి 132 సిఫార్సు లేఖలు కలెక్టరేట్కు అందినట్లు తెలుస్తోంది. జిల్లా పరిషత్లో ఎంపీడీవోలు, ఇతర ఉద్యోగుల బదిలీలకు కూడా లేఖలు అందాయి. మొత్తం 68 వ్యక్తిగత దరఖాస్తులు కూడా రాగా, మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి సిఫార్సులు, ఫోన్ కాల్స్ పెద్ద సంఖ్యలో వస్తున్నట్లు సమాచారం. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పని చేస్తున్న తహసీల్దార్లు కూడా విశాఖలో పోస్టింగ్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. -
విశాఖలో ట్రాఫిక్ కష్టాలకు ‘అస్త్రం’
● ప్రజల రవాణా కష్టాలకు చెక్ ● యాప్ ప్రారంభించిన హోం మంత్రి అనిత అల్లిపురం: విశాఖపట్నంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు పోలీసులు రూపొందించిన ‘అస్త్రం’ యాప్ను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఆదివారం ఆవిష్కరించారు. నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, విశాఖ ఆర్థిక రాజధానిగా ఎదుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ కష్టాలు తనకు తెలుసునని చెప్పారు. ‘అస్త్రం’ యాప్ ప్రజలకు ఉపయోగపడేలా, ‘పబ్లిక్ ఫ్రెండ్లీ’గా తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఈ యాప్ ద్వారా ట్రాఫిక్ జామ్స్, క్లియరెన్స్ సమయం, ప్రత్యామ్నాయ మార్గాల వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు. ఇది ట్రాఫిక్ సిబ్బందికి కూడా సమన్వయంతో పనిచేయడానికి ఉపయోగపడుతుందన్నారు. యాప్తో నగరంలో ట్రాఫిక్ కష్టాలకు దాదాపుగా చెక్ పెట్టవచ్చని, నగర ప్రజలు గమ్య స్థానాలకు సురక్షితంగా చేరేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుం దన్నారు. టెలిగ్రామ్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగల ఈ యాప్ మూడు నెలల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని హోం మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె ట్రాఫిక్ సిబ్బందికి ఏసీ హెల్మెట్లు అందజేసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి, డీసీపీలు అజిత వేజెండ్ల, ప్రశాంతి, ట్రాఫిక్ ఏడీసీపీ తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. -
కేజీహెచ్సూపరింటెండెంట్గా వాణి
మహారాణిపేట: కేజీహెచ్ నూతన సూపరింటెండెంట్గా డాక్టర్ ఐ. వాణి నియమితులయ్యారు. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖలో అడిషనల్ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)గా పదోన్నతి పొందిన డాక్టర్ వాణి, ప్రస్తుతం కేజీహెచ్లో సీనియర్ ప్రొఫెసర్గా, గైనిక్ విభాగాధిపతి (హెచ్ఓడీ)గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టీ. కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు కేజీహెచ్ సూపరింటెండెంట్గా పనిచేసిన డాక్టర్ పి. శివానంద్ 16 నెలల పాటు ఈ పదవిలో ఉన్నారు. -
‘గిరి’గీసి మరీ వసూళ్లు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కంచే చేను మేసిన చందంగా మారిపోయిందనే విమర్శలు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వ్యవహారంలో వినిపిస్తున్నాయి. అవినీతి నిరోధానికి కృషి చేయాల్సిన సొంత శాఖకు చెందిన కొందరు అధికారులే నెలవారీ మామూళ్లకు అలవాటుపడి సమాచారాన్ని లీకు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలోనే గతంలో ఓ సీఐ స్థాయి అధికారిని బదిలీ చేసినట్టు తెలుస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లా కేంద్రంగా రిజిస్ట్రేషన్లతో పాటు రవాణాశాఖ నుంచి ప్రతీ నెలా కొద్ది మంది నెలవారీ మామూళ్లు అందుకుంటున్నట్టు ఆరోపణలున్నాయి. సొంత శాఖకు చెందిన ఓ ఎస్ఐ, ఏఎస్ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే, రిజిస్ట్రేషన్లశాఖ నుంచి మామూళ్లు ముట్టచెప్పడంలో ఓ డాక్యుమెంట్ రైటర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతీ నెలా ‘గిరి’గీసి మరీ ఠంచనుగా కొద్ది మంది కీలకమైన అధికారుల నుంచి వసూలు చేసి ముట్టచెబుతున్నట్టు సమాచారం. అయితే ఈ మామూళ్ల వ్యవహారంలో ఎవరెవరికి ఎంత అందుతుందనే విషయంలో మొదలైన చర్చ రచ్చ కావడంతో ఈ వ్యవహారం పైదాకా వెళ్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించినట్టు ఆ శాఖలో గుసగుసలు వినపడుతున్నాయి. మొత్తంగా అవినీతిని కట్టడి చేయాల్సిన అధికారులే అవినీతి రొంపిలో కూరుకుపోతుండటం మాత్రం విస్తుగొలుపుతోంది. ముందుగానే సమాచారం లీకు...! వాస్తవానికి ఏసీబీలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఉన్న కొద్దిమంది సమర్థులైన అధికారులు ఇతర ప్రాంతాలకు బదిలీ చేయించుకుని వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం ఒక ఉన్నతాధికారిపై ఎలాంటి ఆరోప ణలు లేకపోయినప్పటికీ, కిందిస్థాయిలో పేరుకుపోయిన కొందరు అవినీతి సిబ్బందిపై ఆయన సరైన స్థాయిలో చర్యలు తీసుకోలేకపోతున్నారనే విమర్శలున్నాయి. ఏసీబీలో దీర్ఘకాలంగా తిష్టవేసిన ఒక ఎస్ఐతో పాటు ఏఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు సంస్థ పరువును నెలవారీ మామూళ్ల కోసం బజారున పడేస్తున్నారని ఆరోపణలున్నాయి. ముఖ్యంగా అవినీతి ఆరోపణలున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖతో పాటు రవాణా, జీవీఎంసీ, రెవెన్యూ, మైనింగ్ శాఖల నుంచి వీరు నెలవారీ మామూళ్లకు అలవాటు పడినట్లు తెలుస్తోంది. అవినీతి ఆరోపణలున్న సదరు నలుగురు సిబ్బంది డిపార్ట్మెంట్ల వారీగా వసూళ్లకు తెగబడుతున్నట్లు సమాచారం. ఇంకా ఎక్కడి నుంచైనా ఫిర్యాదులు వచ్చిన వెంటనే సంబంధిత శాఖకు ముందుగానే సమాచారాన్ని లీక్ చేస్తున్నారని విమర్శలున్నాయి. ఒకవేళ ఎవరైనా తమ నెలవారీ మామూళ్లకు అంగీకరించకపోతే, వీరే వేరే పేర్లతో ఫిర్యాదు చేసి సదరు అధికారిపై దాడులు చేస్తారనే అపప్రద కూడా ఉంది. ఈ వ్యవహారంలోనే ఒక జీవీఎంసీ అధికారిని కూడా గతంలో ఇదే తరహాలో ఇబ్బంది పెట్టినట్లు ఆ శాఖలో చర్చ జరుగుతోంది. అయితే తాము చెప్పినట్లు వింటే వారిపై ఏ ఫిర్యాదు వచ్చినా కాపాడతారనే ధైర్యాన్ని కూడా ఈ సిబ్బంది కల్పిస్తున్నారని తెలుస్తోంది. కీలకంగా డాక్యుమెంట్ రైటర్...! ఏసీబీలో నెలవారీ మామూళ్ల వ్యవహారం మరింత ముదురుతోంది. రిజిస్ట్రేషన్లు, రవాణా శాఖల నుంచి వసూలు చేసిన మామూళ్లకు సంబంధించి ఒక సీఐను ఇందులో ఇరికించారని తెలుస్తోంది. మొదట్లో తన విధులను మాత్రమే చూసుకునే సదరు సీఐని, నెలవారీ మామూళ్ల రొంపిలోకి లాగి, చివరికి సొంత శాఖ సిబ్బందే ఆయన్ను అడ్డంగా బుక్ చేసినట్టు ఆరోపణలున్నాయి. దీంతో శాఖ పరువు బజారున పడకుండా, ఈ వ్యవహారాన్ని బయటకు పొక్కకుండా గుట్టుగా బదిలీతో సరిపెట్టినట్టు సమాచారం. ఈ మామూళ్ల వ్యవహారంలో ఒక డాక్యుమెంట్ రైటర్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతను రిజిస్ట్రేషన్ల శాఖలోని అధికారులతో సన్నిహి తంగా మెలుగుతూ నెలవారీ మామూళ్లను అందజేస్తున్నట్లు సమాచారం. సదరు డాక్యుమెంట్ రైటర్ ఓ ఉన్నతాధికారికి (గతంలో పనిచేసిన) అత్యంత సన్నిహితుడని ప్రచారం ఉంది. అందుకే ఎన్నో ఆరోపణలున్నప్పటికీ, రిజిస్ట్రేషన్ల శాఖలోని నలుగురైదుగురు అధికారులపై ఎటువంటి చర్యలూ ఉండవనే విమర్శలున్నాయి. తాజాగా, ఇదే శాఖకు చెందిన ఒక అధికారి అవినీతికి సంబంధించి పక్కాగా కొన్ని వీడియోలు, ఫొటోలతో సహా అందిన ఫిర్యాదును కూడా పక్కదారి పట్టించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. భారీ వాణిజ్య భవంతిని నిర్మించి, అద్దెకు పెట్టి అడ్డంగా దొరికినప్పటికీ, ఆ అధికారిని కాపాడారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో భారీగా నగదు చేతులు మారినట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ, ఏసీబీ పరువును బజారున పడకుండా ఉండేందుకు రహస్యంగా ఉన్నతస్థాయిలో విచారణ జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రిజిస్ట్రేషన్లు, రవాణా శాఖ నుంచి భారీగా మామూళ్లు? చక్రం తిప్పుతున్న ఓ డాక్యుమెంట్ రైటర్ -
ఏపీఈఏపీసెట్లో కీర్తనకు 34వ ర్యాంక్
కూర్మన్నపాలెం: వడ్లపూడికి చెందిన గురు కీర్తన ఏపీఈఏపీసెట్ ఫలితాల్లో సత్తా చాటింది. రాష్ట్ర స్థాయిలో 34వ ర్యాంక్ను కై వసం చేసుకుంది. కీర్తన ఉక్కునగరంలోని డీఎస్వోపీ స్కూల్లో ప్రాథమిక విద్యను, శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించింది. కీర్తన తండ్రి శ్రీనివాసరావు ఉక్కు కర్మాగారంలోని వాటర్ సప్లై విభాగంలో పనిచేస్తుండగా, తల్లి నీలవేణి గాజువాకలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కీర్తన మాట్లాడుతూ డాక్టర్ కావాలన్నదే తన లక్ష్యమని చెప్పింది. -
మాట మార్చిన విద్యాశాఖ అధికారులు
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బదిలీల కౌన్సెలింగ్లో మాన్యువల్ విధానం అవలంబిస్తామని విద్యా శాఖాధికారులు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని తుంగలో తొక్కుతున్నారు. ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు మాన్యువల్ కౌన్సెలింగ్ కోరుకుంటున్నారని, ఇంతమంది కోరుతున్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాల్సిన కౌన్సెలింగ్ విధానాన్ని పక్కనబెట్టి, ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్న వెబ్ కౌన్సెలింగ్ను అమలు చేయడం సరికాదు. –డి.గోపీనాథ్, పీఆర్టీయూ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు -
ఆకట్టుకున్న జానపద కళా సంబరాలు
ఆరిలోవ: ఉత్తరాంధ్ర నవ చైతన్య కళా నాట్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం 13వ వార్డు ఆరిలోవ కాలనీ శివాజీనగర్–2లోని ముత్యాలమ్మ గుడి వద్ద జానపద కళా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర కళాకారులు పలు జానపద కళలు ప్రదర్శించి స్థానికులను ఆకట్టుకున్నారు. చిన్నారుల నృత్యాలు, జానపద పాటలు అలరించాయి. కళాకారులకు నృత్యాలు, జానపద పాటలు, నాటికల ప్రదర్శన, కోలాటం తదితర వాటిపై పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ రాష్ట్రమంతటా ఉత్తరాంధ్ర జానపద కళలను ప్రదర్శించి, పరిచయం చేయాలని ఆశిస్తున్నానన్నారు. -
విద్యాశాఖ తీరుపై ఎస్జీటీల కన్నెర్ర
● వెబ్ కౌన్సెలింగ్కు వ్యతిరేకంగా డీఈవో కార్యాలయ ముట్టడి ● విద్యాశాఖ మంత్రి లోకేశ్ మాట మార్చారంటూ ఆక్షేపణ ఆరిలోవ: విద్యాశాఖలో బదిలీల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై గురువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకో నిబంధన, గంటకో సవరణ, తొలుత ఇచ్చిన హామీని విస్మరించడపై నిరసన గళం వినిపించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని సెకండరీ గ్రేడ్ టీచర్లు(ఎస్జీటీ) ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విశాఖ జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని ఆదివారం ముట్టడించారు. నగరంతో పాటు గ్రామీణ, గిరిజన ప్రాంతాల నుంచి వందల మంది టీచర్లు ఉదయం 9 గంటలకే డీఈవో కార్యాలయానికి చేరుకొని కదం తొక్కారు. వెబ్ కౌన్సెలింగ్ వద్దు.. మాన్యువల్ కౌన్సెలింగే ముద్దు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి, ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక స్టీరింగ్ కమిటీ నాయకులు మాట్లాడుతూ ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ చేపడతామని చెప్పి, ఇప్పుడు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామనడం ఆక్షేపణీయమన్నారు. గతంలో విద్యాశాఖా మంత్రి లోకేశ్ మాన్యువల్ కౌన్సెలింగ్ అని మాటిచ్చి, ఇప్పుడు మాట మార్చడం సరికాదన్నారు. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా వందల ఆప్షన్లు ఇవ్వడం కష్టమన్నారు. మాన్యువల్ ద్వారా అయితే అవసరమైన వాటిలో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుందన్నారు. ఉపాధ్యాయులు అభిప్రాయాలు, సూచనలను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్జేడీ కె.విజయభాస్కర్, డీఈవో ఎన్.ప్రేమకుమార్లకు వినతి పత్రాలు అందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ నాయకులు డి.గోపినాఽథ్, ఇమంది పైడిరాజు, టి.చిన్నబ్బాయి, టి.రామకృష్ణారావు, అరుణ్కుమార్, వీరభద్రరావు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
అత్యున్నత స్థాయిలో యోగా డే
● అధికారులు బాధ్యతతో పనిచేయాలి ● సమీక్షా సమావేశంలో కలెక్టర్ హరేందిర ప్రసాద్ మహారాణిపేట: ఈ నెల 21న జరగనున్న యోగా దినోత్సవాన్ని అధికారులు పూర్తి బాధ్యతతో పనిచేసి విజయవంతం చేయాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నందున ఈ యోగా దినోత్సవం దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహించే విధంగా ఉంటుందని, జిల్లాలో దీన్ని అత్యున్నత స్థాయిలో నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి సుమారు 5 లక్షల మంది ప్రజలు పాల్గొననుండగా, ఆర్కే బీచ్ కాళీమాత టెంపుల్ నుంచి భీమిలి బీచ్ వరకు, అలాగే వివిధ స్టేడియంలలో యోగా ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఇందుకు అనుగుణంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, ఏర్పాట్లలో తమ అనుభవాన్ని ప్రతిబింబించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమం జరిగే మొత్తం ప్రాంతాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ అధికారులకు వివరించారు. ప్రజలను బస్సుల ద్వారా కంపార్ట్మెంట్ ప్రాంతాలకు చేర్చిన తర్వాత ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బస్సులను పార్కింగ్ ప్రదేశాలకు తరలించాలని అదేవిధంగా కార్యక్రమం తర్వాత ప్రజలను వారివారి ప్రాంతాలకు సురక్షితంగా చేర్చాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొనే ప్రజలకు, ముఖ్య అతిథులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన వసతులు కల్పించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. విద్యుత్ పార్కింగ్, రవాణా, వైద్యం తదితర అంశాలపై ముందస్తు ఏర్పాట్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ యోగా కార్యక్రమంలో విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల నుంచి ప్రజలు భారీగా హాజరుకానుండటంతో, ఆర్టీసీ అధికారులు మంచి స్థితిలో ఉన్న బస్సులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ అన్ని రకాల ఔషధ సామగ్రిని సిద్ధంగా ఉంచాలని సూచించారు. ప్రధాన కార్యక్రమం అనంతరం, అల్లూరి సీతారామరాజు జిల్లా విద్యార్థులతో సూర్య నమస్కారాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి, ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ రికార్డు సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, వీఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్, ఏపీఈపీడీసీఎల్ పృధ్వీరాజ్, డీఆర్వో భవానీ శంకర్, ఆర్డీవోలు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారానే న్యాయం
ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారానే న్యాయం జరుగుతుంది. వెబ్ కౌన్సెలింగ్లో ఎదురయ్యే ఇబ్బందులను నివారించాలి. వెబ్ కౌన్సెలింగ్లో 1,000 నుంచి 2,000 ఆప్షన్లను ఎంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వెబ్ కౌన్సెలింగ్ సమయంలో వాటిని వెతుక్కోవడం కష్టమవుతుంది. దీనివల్ల ఉపాధ్యాయులకు అనవసరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. ఉపాధ్యాయ సంఘాల సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా విద్యాశాఖ వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించడం బాధాకరం. –ఇమంది పైడిరాజు, ఎస్టీయూ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి, -
నీటిలో మునిగి ఆరుగురి మృతి
డుంబ్రిగుడ/అమరావతి/ఏయూ క్యాంపస్(విశాఖ జిల్లా): అల్లూరి సీతారామరాజు, పల్నాడు, విశాఖ జిల్లాల్లో ఆదివారం జరిగిన వేర్వేరు ఘటనల్లో నీటిలో మునిగి ఆరుగురు మృతి చెందారు. అల్లూరి జిల్లా పోతంగి పంచాయతీ బిల్లాపుట్టు గ్రామానికి చెందిన అన్నదమ్ములు గుంట కమందన్, గుంట రామదాస్ కుమారులు గుంట సాయికిరణ్ (14), గుంట భానుతేజ్ (14)లు 9వ తరగతి చదువుతున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో వీరు డుంబ్రిగుడ మండలం గంగవలస గ్రామంలో ఉన్న తమ మేనత్త ఇంటికి వెళ్లారు. ఆదివారం మామిడి పండ్లు సేకరించేందుకు కొండ వద్దకు వెళ్లి వస్తున్న తరుణంలో..అదే గ్రామానికి చెందిన వీరి స్నేహితుడు కొర్ర సుశాంత్(14)తో కలిసి చెరువులో స్నానాలకు దిగారు. ఇటీవల మన్యంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో చెరువులో 12 అడుగుల మేరకు నీరు చేరింది. ఇది గమనించని విద్యార్థులు ఈతకు దిగి..మునిగిపోయారు. వారిని రక్షించేందుకు సమీపంలోని పొలాల వద్ద ఉన్న వారు వచి్చనా ఫలితం లేకపోయింది. దీంతో ముగ్గురూ మృతి చెందారు. అలాగే, గుంటూరు జిల్లా పెదకాకాని మండలం అగతవరప్పాడు ఏవీఎస్ కాలనీ నుంచి రెండు కుటుంబాలకు చెందిన 10 మంది బక్రీద్ అనంతరం నదిలో స్నానాలు చేసేందుకు ఆదివారం పల్నాడు జిల్లాలోని అమరావతికి వచ్చారు. అమరేశ్వరఘాట్ సమీపంలో కృష్ణానదిలోని ఇసుకలో బాల్తో ఆడుకుంటుండగా.. బాల్ పక్కనే ఉన్న నదిలో పడింది. బాల్ కోసం సయ్యద్ ఖాదర్ వలి (13), సయ్యద్ కాజా(21)లు నీటిలో దిగి...మునిగిపోయారు. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పగా..సీఐ అచ్చియ్య ఘటనా స్థలాన్ని సందర్శించి గజ ఈతగాళ్లను రప్పించారు. వారు గాలింపు చర్యలు చేపట్టి ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. బాలుడిని బలిగొన్న అలలు విశాఖ సాగర తీరంలో విక్టరీ ఎట్ సీ ఎదురుగా బీచ్లో స్నానానికి దిగి ఎం.శ్రీపాద సూర్య(7) కెరటాలకు బలయ్యాడు. ఆదివారం ఉదయం అగనంపూడికి చెందిన ఓ కుటుంబం బీచ్కు వచ్చింది. వీరిలో స్టీల్ప్లాంట్లో పనిచేస్తున్న సతీష్ది శనివారం పెళ్లి రోజు. వేడుకల అనంతరం ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి బీచ్కు వచ్చారు. సముద్రంలో స్నానం చేస్తుండగా బలమైన కెరటాలు బాలుడిని లోపలికి లాక్కెళ్లాయి. సమీపంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు పరదేశి వెంటనే ఘటనాస్థలికి చేరుకుని బాలుడిని రక్షించే ప్రయత్నం చేశారు. బాలుడిని వెంటనే ఒడ్డుకు తీసుకువచ్చి 108 వాహనంలో కేజీహెచ్కు తరలించారు. బాలుడు నీరు ఎక్కువగా తాగడంతో మరణించినట్లు కేజీహెచ్ వైద్యులు వెల్లడించారు. బాలుడి తల్లిదండ్రులను వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు గొల్లబాబురావు పరామర్శించారు. -
కొండపై విష‘నాగులు’
నాగులకొండ.. ప్రకృతి రమణీయతకు నెలవు! అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో ఉన్న ఈ ప్రాంతాన్ని మైనింగ్ మాఫియా కబళిస్తోంది. ఏకంగా 100 అడుగుల లోతులో విచ్చలవిడిగా లేటరైట్ తవ్వకాలు చేపడుతున్నారు. సహజ సిద్ధంగా ఉన్న గెడ్డలను ఆక్రమిస్తూ కొండతో పాటు చెట్టు చేమలను కొట్టేస్తోంది. ఫలితంగా చుట్టుపక్కల ఉన్న 10 గిరిజన గ్రామాలు తాగు నీరు, వంట చెరుకు కోసం అల్లాడే దుస్థితి నెలకొంది.నాగులకొండ.. ప్రకృతి రమణీయతకు నెలవు! అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో ఉన్న ఈ ప్రాంతాన్ని మైనింగ్ మాఫియా కబళిస్తోంది. ఇక్కడ మైనింగ్కి అనుమతించింది కేవంలం 60 అడుగుల లోతు వరకే. కానీ ఏకంగా 100 అడుగుల లోతులో విచ్చలవిడిగా లేటరైట్ తవ్వకాలు చేపడుతున్నారు. సహజ సిద్ధంగా ఉన్న గెడ్డలను ఆక్రమిస్తూ కొండతో పాటు చెట్టు చేమలను కొట్టేస్తోంది. ఫలితంగా చుట్టుపక్కల ఉన్న 10 గిరిజన గ్రామాలు తాగు నీరు, వంట చెరుకు కోసం అల్లాడే దుస్థితి నెలకొంది. ఇక్కడినుంచి రోజుకు దాదాపు 15 వేల టన్నుల నుంచి 20 వేల టన్నుల లేటరైట్ను కూటమి నేతలు వందల టిప్పర్లలో అక్రమంగా తరలిస్తున్నారు. టన్ను లేటరైట్ రూ.3,800 నుంచి రూ.4 వేల దాకా విక్రయిస్తూ రోజూ రూ.6 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు కొల్లగొడుతున్నారు. అంటే, ఏడాదికి రూ.2,044 కోట్ల నుంచి రూ.2,190 కోట్లు వరకు అక్రమంగా ఆర్జిస్తున్నారు. ఇక టీడీపీ ప్రజాప్రతినిధి కుమారుడి ఖాతాలోకి టన్నుకు రూ.250 వెళుతుండగా ఓ ఎంపీకి రూ.200 చొప్పున ముట్టచెబుతున్నట్లు తెలుస్తోంది. – సాక్షి టాస్క్ఫోర్స్గిరిజనుడి ముసుగులో అడ్డగోలు దోపిడీకూటమి పార్టీలోని ఓ ఎంపీకి విధేయుడైన గిరిజనుడు లక్ష్మణరావు పేరుతో నాగులకొండపై అక్రమ మైనింగ్ జరుగుతోంది. ప్రభుత్వానికి నామమాత్రంగా లీజు, రాయల్టీ చెల్లిస్తూ మైనింగ్ మాఫియా రూ.వందల కోట్లను ఆర్జిస్తోంది. అత్యంత విలువైన లేటరైట్ మైన్ ని హెక్టార్కు ఏడాదికి రూ. 26 వేల నామమాత్రపు ధరకు అధికార పార్టీ నేతలకు రాసిచ్చేశారు. అంటే 119 హెక్టార్లకు గాను ప్రభుత్వానికి వచ్చే లీజు ఆదాయం కేవలం రూ.30.94 లక్షలు మాత్రమే. ఇక రాయల్టీ మోసానికి అంతేలేదు. ఇక్కడ నుంచి రోజూ 15 వేల టన్నులకు పైగా లైటరైట్ను తరలిస్తూ 5 వేల టన్నులను మాత్రమే లెక్కల్లో చూపిస్తున్నారు. టన్నుకు రూ.150 చొప్పున (అంటే రోజుకు రూ.7.5 లక్షలు) మాత్రమే రాయల్టీ కింద చెల్లిస్తున్నారు. అంటే రాయల్టీ కింద ఏడాదికి రూ.27.67 కోట్లు మాత్రమే చెల్లించి.. మిగతా రూ.2 వేల కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాకు జమ కావలసిన ప్రజాధనాన్ని యథేచ్ఛగా దోచుకుంటున్నారు.విలువైన హై గ్రేడ్ లేటరైట్..నర్సీపట్నం నియోజకవర్గం నాతవరంలో హై గ్రేడ్ (ఉన్నత శ్రేణి) లేటరైట్ లభిస్తుంది. ఇందులో 43–44 శాతం వరకు అల్యూమినియం ఉంటుంది. కాగా, లేటరైట్ అనేది ఇనుప ఖనిజం (ఐరన్ ఓర్) ఒక రూపం. ఇంత నాణ్యమైనది కావడంతో సిమెంట్ కంపెనీలకు కాకుండా స్టీల్ ప్లాంట్లకు తరలిస్తున్నారు. కాకినాడ పోర్టును దీనికి వినియోగించుకుంటున్నారు. మరోవపు ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. నాణ్యమైన ఖనిజాన్ని.. నాసిరకంగా చూపించి అనుమతులు తీసుకున్నారు. అల్యూమినియం 38–40 శాతంలోపే ఉందని నివేదికలు సమర్పిస్తున్నారు. తద్వారా రాయల్టీ తక్కువగా చెల్లిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. లీజుదారు లక్ష్మణరావు ద్వారా ఆండ్రూ మినరల్స్కు విక్రయిస్తున్నట్లు ఒప్పందం చేసుకున్నారు.వర్షంలో సైతం లేటరైట్ను తరలిస్తున్న టిప్పర్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అక్రమ మైనింగ్పై ఉక్కుపాదంనిర్ణీత మొత్తానికి మించి తవ్వినందుకు విచారణరూ.5 కోట్ల మేర జరిమానా వసూలునాతవరం మండలం సుందరకోట పంచాయతీ భమిడికిలొద్దిలో నిర్ణీత మొత్తానికి మించి మైనింగ్ చేసేందుకు వీల్లేందంటూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. 68,279 టన్నుల లేటరైట్ను ఎక్కువగా తవ్వినట్లు తేలడంతో సుమారు రూ.5 కోట్ల మేర పెనాల్టీ విధించారు. 2023 జూన్లో మైనింగ్ నిలిచిపోగా కూటమి ప్రభుత్వం వచ్చాక లేటరైట్ తవ్వకాలకు టీడీపీ నేతలు పావులు కదిపారు. ఈ క్రమంలో గనుల శాఖ పెనాల్టీని సైతం రద్దు చేసినట్లు తెలుస్తోంది. గత నెలలో మళ్లీ మైనింగ్ ప్రారంభించారు. అయితే, ఫిబ్రవరి నుంచే లేటరైట్ తరలింపు మొదలైనట్లు చెబుతున్నారు. పర్మిట్ల మంజూరు మొత్తం కాకినాడ జిల్లాలోని రౌతులపూడి నుంచి జరుగుతోంది. లేటరైట్ను తవ్వి తరలించే వాహనాలకు జీపీఎస్, మైనింగ్ ప్రాంతంలో వే బ్రిడ్జి లాంటివి ఏమీ లేవు. దీంతో యథేచ్ఛగా భారీ లోడ్ వాహనాల్లో లేటరైట్ తరలిపోతోంది.‘సాక్షి’ బృందాన్ని అడ్డుకున్న మాఫియానాతవరం మండలం సిరిపురం వద్ద మైనింగ్ జరుగుతుండగా.. ఇక్కడినుంచి లేటరైట్ను కాకినాడ జిల్లా రౌతులపూడికి తరలిస్తున్నారు. ఆ తర్వాత అన్నవరం రవికంపాడు వద్ద ఉన్న రైల్వే సైడింగ్ నుంచి ఒడిశాలోని వేదాంత ప్లాంటుకు చేరవేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్రమ మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించి వాస్తవాలను వెలికితీస్తున్న ‘సాక్షి’ ప్రతినిధుల వాహనాన్ని రాఘవపట్నం దాటిన తర్వాత మైనింగ్ మాఫియా ఆయుధాలతో అడ్డుకుని బెదిరించింది. వాహనాన్ని వెంటాడింది. సిరిపురం చేరుకునేలోగా మరికొందరిని పోగేసి గిరిజనులతో మాట్లాడకుండా అడ్డుకున్నారు. -
మంత్రి లోకేష్ మోసం.. తిరగబడ్డ టీచర్లు
సాక్షి, విశాఖపట్నం: కూటమి సర్కార్పై ఉపాధ్యాయులు తిరగబడ్డారు. లోకేష్కు వ్యతిరేకంగా ఉపాధ్యాయలు రోడ్డెక్కారు. ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో 13 ఉమ్మడి జిల్లాల డీఈవో కార్యాలయాల ముట్టడిని టీచర్లు చేపట్టారు. విశాఖ డీఈవో కార్యాలయం ముట్టడికి కదం తొక్కారు. పోలీసులు భారీగా మోహరించారు. ఎస్జీటీలకు మ్యాన్యూవల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. వెబ్ కౌన్సిలింగ్ వద్దు.. మ్యాన్యూవల్ కౌన్సిలింగ్ ముద్దు అంటూ టీచర్లు నినాదాలు చేశారు. డీఈవో కార్యాలయం ముందు మహిళా టీచర్లు బైఠాయించారు. ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగుతోంది.టీచర్ల బదిలీలపై కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని ఉపాధ్యాయ సంఘాలు ఖండించాయి. ఎస్జీటీల బదిలీలను ఆన్లైన్లో కాకుండా మాన్యువల్గా చేపడతామని చెప్పి.. ఆన్లైన్ విధానం అమలు చేయడాన్ని తప్పుబడుతూ ఆ సంఘాలు ఆందోళన చేపట్టాయి. శనివారం కౌన్సెలింగ్ జరిగిన ఎంఈఓ కార్యాలయాల ఎదుట నిరసనలకు దిగారు. ఆదివారం కూడా అన్ని జిల్లాల్లో డీఈవో కార్యాలయాలను ముట్టడించాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చాయి.ఈ అంశంపై విద్యాశాఖ ఉన్నతాధికారులకు, విద్యాశాఖ మంత్రికి లేఖలు రాసినా ఎలాంటి సమాధానం ఇవ్వనందున తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళన చేపడుతున్నట్టు ప్రకటించింది. వాస్తవానికి గతేడాది సెపె్టంబర్ నుంచి వారం వారం పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి బదిలీలు, పాఠశాలల పునర్ వ్యవస్థీకరణపై విజ్ఞప్తులు తీసుకున్నారు.ఈ క్రమంలో ఈసారి ఉపాధ్యాయ బదిలీలకు చట్టం చేస్తున్నామని, ఏటా ఈ చట్ట ప్రకారమే ఆన్లైన్ బదిలీలు చేపడతామని అధికారులు తెలిపారు. అయితే, సంఖ్యాపరంగా అత్యధిక ప్రాథమిక పాఠశాలలు ఉండటంతో వాటిలో పనిచేస్తున్న ఎస్జీటీలకు ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉన్నందున ఇబ్బందులు తలెత్తుతాయని.. ఎస్జీటీలకు మాన్యువల్ విధానంలో కౌన్సెలింగ్ చేపట్టి బదిలీ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. అందుకు అధికారులు అంగీకరించినా మార్చిలో చేసిన ఉపాధ్యాయ బదిలీ చట్టం–2025లో మాత్రం ఉపాధ్యాయులందరికీ ఆన్లైన్ కౌన్సెలింగ్ ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.అయినప్పటికీ బదిలీ ఉత్తర్వుల్లో మార్పులు చేస్తామని అధికారులు సంఘాలకు హామీ ఇచ్చారు. నాడు తాత్కాలికంగా సమస్య పరిష్కారమైందని భావించినా.. మే నెలల విడుదల చేసిన ఉపాధ్యాయుల బదిలీ ఉత్తర్వుల్లో తిరిగి ఆన్లైన్ విధానం ఒక్కటే ఉంటుందని పేర్కొన్నారు. దీంతో గత నెల 16న ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక డీఈవో కార్యాలయాల ముట్టడి తలపెట్టింది. మరుసటి రోజు ఎస్జీటీల మాన్యువల్ కౌన్సెలింగ్కు అధికారులు హామీ ఇవ్వడంతో నిరసనను విరమించింది. తాజాగా ఆన్లైన్ కౌన్సెలింగ్ మాత్రమే ఉంటుందని, అందరూ ఎంఈవో కార్యాలయాలకు వచ్చి ఆప్షన్స్ పెట్టాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ఉపాధ్యాయ సంఘాలు ఆదివారం కూడా ఆందోళనకు దిగాయి. -
అయ్యో పాపం!
● నిద్రపోతున్న కూలీని గమనించని లారీ డ్రైవర్ ● నల్ల పిక్కలో కూరుకుపోయి దుర్మరణం ● మూడు రోజుల తర్వాత వెలుగుచూసిన విషాద ఘటన పెందుర్తి: ఓ నిర్మాణ కూలీ జీవితం నిద్రలోనే కడతేరింది. తాను పనిచేస్తున్న చోటే సేద తీరుతుండగా విధి చిన్నచూపు చూడటంతో ఊపిరాడక అసువులు బాశాడు. పెందుర్తి మండలం ముదపాకలోని జగనన్న కాలనీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పెందుర్తి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి. విజయనగరం జిల్లా తెర్లాం మండలం నందబలగ గ్రామానికి చెందిన పక్కి సూరన్నదొర (57), గంగమ్మ దంపతులు కుటుంబంతో కలిసి ముదపాకకు వలస వచ్చి ఇక్కడి జగనన్న కాలనీలో నిర్మాణ పనులు చేస్తుంటారు. సూరన్నదొర అన్న కుమారుడు పక్కి ప్రసాద్ ఈ నెల 4న ఇదే ప్రాంతంలో బావిలో పడి మృతి చెందాడు. ఈ క్రమంలో ప్రసాద్ మృతదేహం పోస్టుమార్టం కోసం కేజీహెచ్కు వెళ్లిన సూరన్న.. నీరసంగా ఉండటంతో ముదపాకలోని ఇంటికి తిరిగి వచ్చేశాడు. తీవ్ర విషాదంలో ఉన్న సూరన్న ముదపాకలోనే ఉన్న బంధువులతో అదే రోజు సాయంత్రం మద్యం సేవించాడు. ఉదయం మళ్లీ కేజీహెచ్కు వెళ్లి మృతదేహంతో ఊరికి వెళతానని చెప్పాడు. అనంతరం సమీపంలో నిర్మాణం కోసం పోసి ఉన్న నల్ల పిక్క రాశిపై పడుకున్నాడు. అయితే అర్ధరాత్రి అక్కడికి పిక్క వేసేందుకు వచ్చిన లారీ డ్రైవర్ సూరన్న నిద్రిస్తున్న విషయాన్ని గమనించకుండా అతనిపైనే అన్లోడ్ చేసేశాడు. అప్పటికే గాఢ నిద్రలో ఉన్న సూరన్నదొర ఊపిరాడక మరణించినట్లు పోలీసులు భావిస్తున్నారు. మూడు రోజుల తర్వాత వెలుగులోకి... కేజీహెచ్కు వెళతానని చెప్పిన సూరన్న కనిపించకపోవడంతో విజయనగరం వెళ్లిపోయాడని అందరూ భావించారు. కానీ అతను అక్కడికి కూడా రాకపోవడంతో కుటుంబ సభ్యులు ప్రసాద్ అంత్యక్రియలు నిర్వహించకుండా చాలాసేపు ఎదురుచూశారు. చివరకు ఆ కార్యక్రమం పూర్తి చేసుకున్న కుటుంబ సభ్యులు గురువారం తిరిగి ఇక్కడికి వచ్చి సూరన్న ఆచూకీ కోసం ఆరా తీశారు. ఈ క్రమంలో అతను అదృశ్యమైనట్లు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేద్దామని నిర్ణయించుకున్నారు. అయితే శనివారం ఉదయం కాలనీలో నిర్మాణ పనుల కోసం నల్ల పిక్కను తరలించేందుకు పొక్లెయిన్తో లారీలకు లోడ్ చేస్తున్నారు. ఆ సమయంలో నల్ల పిక్క రాశి నుంచి ఓ చేయి బయటకు కనిపించడం, ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా దుర్వాసన రావడంతో ఆందోళనకు గురైన పొక్లెయిన్ ఆపరేటర్ విషయాన్ని కాలనీవాసులకు, గ్రామస్తులకు తెలిపాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయగా, అది సూరన్నదొరదేనని కుటుంబ సభ్యులు గుర్తించారు. ప్రాథమిక విచారణ చేపట్టిన సీఐ కె.వి.సతీష్కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ఈ ఘటనను అనుమానాస్పద కేసుగా న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏడాది కిందట రైలు ప్రమాదంలో సూరన్న కుమారుడు, మూడు రోజుల కిందట ప్రమాదవశాత్తు బావిలో పడి అతని అన్న కుమారుడు మృతి చెందడంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబంలో.. ఈ తాజా విషాదం చోటుచేసుకోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. -
చదివేద్దాం.. ఓ గాంధీ పుస్తకం
● బాపు ఒక చరిత్ర కాదు.. జీవన పాఠం ● ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ‘గాంధియానా’ ఏర్పాటు ● మహాత్ముని జీవిత విశేషాల పుస్తకాల ప్రత్యేక విభాగం సీతంపేట: జాతిపిత మహాత్మా గాంధీ స్వాతంత్య్ర సమరయోధుడు మాత్రమే కాదు.. 20వ శతాబ్దంలో మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన మహోన్నత వ్యక్తి. సత్యం, అహింస అనే సిద్ధాంతాలను ఆయుధాలుగా మలిచి, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం వంటి మార్గాలతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. ఆయన చూపిన మార్గం ప్రపంచానికి ఒక కొత్త పాఠాన్ని నేర్పింది. గాంధీజీ ఆశయాలను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ద్వారకానగర్లోని పౌరగ్రంథాలయంలో ‘గాంధియానా’పేరిట ప్రత్యేక పుస్తక విభాగాన్ని ఏర్పాటు చేశారు. గాంధీజీ చరిత్ర, జీవితం అపురూపం. ఆయన పోరాటం, సిద్ధాంతాలు, ఆశయాలపై వేలాదిగా పుస్తకాలు ప్రచురించగా.. వాటిలో సుమారు వెయ్యి వరకు పుస్తకాలు దాతల నుంచి సేకరించి ఇక్కడ అందుబాటులో ఉంచారు. గాంధీజీ గురించి ఎందుకు చదవాలి? గాంధీజీ జీవిత చరిత్ర, ఆయన పోరాట స్ఫూర్తి గురించి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి. ముఖ్యంగా విద్యార్థి దశలోనే గాంధీజీ గురించి చదివితే నైతిక ప్రవర్తన అలవడుతుంది. తల్లిదండ్రుల పట్ల గౌరవం, పేదవారికి సహాయం చేయాలనే గుణం, దేశభక్తి వంటి సుగుణాలు పెంపొందుతాయి. తద్వారా విద్యార్థులు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగుతారు. వివేకంతో కూడిన విద్యను అభ్యసించి, మెరుగైన సమాజ నిర్మాణానికి దోహదపడతారు. అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, శరీరశ్రమ, నిర్భయత్వం, సర్వమత సమభావం, స్వదేశీ, అస్పృశ్యతా నివారణ అనేవి గాంధీజీ పాటించిన ఏకాదశ వ్రతాలు. మత సామరస్యం, అస్పృశ్యతా నివారణ, మద్యపాన నిషేధం, ఖాదీ, గ్రామ పరిశ్రమలు, మౌలిక విద్య, పారిశుధ్యం ఆరోగ్య నియమాలు, ప్రాంతీయ భాషాభివృద్ధి, వయోజన విద్య, సీ్త్ర సాధికారత, జాతీయ భాష, ఆర్థిక సమానత్వం, రైతు సంక్షేమం, కార్మిక సంక్షేమం, ఆదివాసుల వికాసం, కుష్టు రోగుల సేవ తదితరవి మహాత్ముడు అవలంబించారు. వీటన్నింటి గురించి తెలుసుకునేందుకు గాంధీజీకి సంబంధించిన పుస్తకాలు చదివేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలి. స్వామి వివేకానంద చెప్పినట్లు ‘క్యారెక్టర్, కరికులమ్, కల్చర్’ అనే మూడింటిని ప్రతి ఒక్కరూ అలవరచుకోవాలి. వేల పుస్తకాలు.. కోట్ల ప్రతులు ముంబయిలోని సర్వోదయ మండల్, గాంధీ రీసెర్చ్ ఫౌండేషన్లు గాంధీజీపై వచ్చిన సుమారు 7 వేల పుస్తకాలను సేకరించి భద్రపరిచాయి. గాంధీజీ స్థాపించిన నవజీవన్ ట్రస్ట్ ఆయన ఆత్మకథ ‘సత్యశోధన’ను 17 భారతీయ భాషలతో పాటు ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, ఇటాలియన్, కొరియన్, జపనీస్, చైనీస్ భాషల్లో ప్రచురించింది. కోటికి పైగా గాంధీజీ ఆత్మకథ పుస్తకాలు అమ్ముడయ్యాయంటే అతిశయోక్తి కాదు. నైతిక విలువలు పెరుగుతాయి గాంధీజీ గురించి చదవడం వల్ల నైతిక ప్రవర్తన అలవడుతుంది. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ విద్యార్థి దశలోనే గాంధీజీ గురించి చదవాలి. కనీసం ఆయన ఆత్మకథ ‘ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్’పుస్తకాన్ని అయినా చదవాలి. కళాశాలలో చేరేటప్పుడు ప్రతి విద్యార్థికి యాజమాన్యం గాంధీజీ ఆత్మకథ పుస్తకాన్ని అందజేయాలి. ఏడాది చివరలో నాన్ క్రెడిట్ (మార్కులతో నిమిత్తం లేకుండా) పద్ధతిలో పరీక్ష నిర్వహించి ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా చూడాలి. దీని వల్ల ప్రతి ఒక్కరిలో నైతిక విలువలు పెరుగుతాయి. ఇలా చేస్తే మెరుగైన సమాజం ఏర్పడటానికి దోహదపడిన వారవుతారు. అలాగే సచివాలయ కార్యదర్శులు, ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులకు వారం, పది రోజుల పాటు శిక్షణ ఇవ్వడం ద్వారా గాంధీజీ సిద్ధాంతాలు, ఆశయాలపై అవగాహన కల్పించవచ్చు. దీని వల్ల వారిలో అంకితభావం పెరుగుతుంది. – ఆచార్య వి.బాలమోహన్దాస్, గాంధీ సెంటర్ అధ్యక్షుడు గాంధేయవాదం ఆదర్శం గాంధేయవాదం అన్ని కాలాలకు, అన్ని సమాజాలకు వర్తించే మహత్తర భావన. యువత వ్యక్తిత్వ వికాసానికి గాంధీజీ ఆలోచనలు, ఆశయాలు ఎంతగానో దోహదపడతాయి. ఆయన ఆశయాలు భావితరాలకు ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతోనే పౌరగ్రంథాలయంలో ‘గాంధియానా రిఫరెన్స్’పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. గాంధీ సెంటర్ వ్యవస్థాపకుడు కె.ఎస్.శాస్త్రి బహూకరించిన వందలాది అమూల్యమైన పుస్తకాలు యువతకు దిశానిర్దేశం చేయగలవు. ఇవి కేవలం అలనాటి జాతీయోద్యమ చరిత్రనే కాక, సామాజిక రుగ్మతలపై గాంధీజీ సాగించిన పోరాటాన్ని, ఆయన సంస్కరణ దృక్పథాన్ని ఈ తరం వారికి స్పష్టం చేస్తాయి. గాంధీ గురించి ఏ సమాచారం అయినా ఈ పుస్తకాల్లో లభిస్తుంది. – డి.వి.సూర్యారావు, రచయిత తప్పక చదవాల్సిన కొన్ని పుస్తకాలు ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్(సత్యశోధన), గాంధీ: ది ఇయర్స్ దట్ ఛేంజ్డ్ ది వరల్డ్(రామచంద్ర గుహ), గాంధీ బిఫోర్ ఇండియా(రామచంద్ర గుహ), ఇండియా ఆఫ్టర్ గాంధీ(రామచంద్ర గుహ), మై డియర్ బాపు(సి.రాజగోపాలాచారి గాంధీజీకి రాసిన లేఖలు), ది గుడ్ బోట్మ్యాన్(రాజమోహన్ గాంధీ), గాంధీ: ప్రిజనర్ ఆఫ్ హోప్(జుడిత్ ఎం. బ్రౌన్), ది డెత్ అండ్ ఆఫ్టర్లైఫ్ ఆఫ్ మహాత్మా గాంధీ(మకరంద్ పరాంజపే), హింద్ స్వరాజ్ లేదా ఇండియన్ హోమ్రూల్(గాంధీ–1909), ఐయామ్ గాంధీ(బ్రాడ్ మెల్ట్జర్), మై డేస్ విత్ గాంధీ(నిర్మల్ కుమార్ బోస్), ది లైఫ్ ఆఫ్ మహాత్మాగాంధీ(లూయీ ఫిషర్), ఎ వీక్ విత్ గాంధీ(లూయీ ఫిషర్), మహాత్మా గాంధీ: హిజ్ లైఫ్ అండ్ ఐడియాస్(చార్లెస్ ఎఫ్. ఆండ్రూస్, అరుణ్ గాంధీ), ది మ్యాన్ బిఫోర్ ది మహాత్మా(చార్లెస్ డిసాల్వో), ది లివింగ్ గాంధీ: లెసన్స్ ఫర్ అవర్ టైమ్స్(తారా సేఠియా), గాంధీ అండ్ మావో ఇన్ క్వెస్ట్ ఆఫ్ అనాలజీ(రతన్ దాస్), గాంధీ సీఈవో(అలాన్ ఆక్సెల్రాడ్) -
వీసీబీ నికర లాభం రూ.71.77 కోట్లు
● ఈ ఏడాది మరో 5 కొత్త బ్రాంచీలు ● బ్యాంకు చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు సీతంపేట: ది విశాఖపట్నం కో–ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్(వీసీబీ) ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ.71.77 కోట్ల నికర లాభం ఆర్జించి 110వ వార్షికోత్సవం ఘనంగా జరుపుకుంటోందని బ్యాంకు చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు తెలిపారు. ద్వారకానగర్లోని బ్యాంకు కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుతో మాట్లాడారు. తమ బ్యాంకు 55 బ్రాంచీలతో 1,11,593 మంది సభ్యులను కలిగి ఉందన్నారు. వీసీబీలో షేరు ధనం రూ.389.55 కోట్లు కాగా, డిపాజిట్లు రూ.4354.73 కోట్లు, రుణాలు రూ.3436.47 కోట్లుగా ఉన్నట్టు తెలిపారు. రుణాల్లో 95 శాతం కోటి రూపాయల కంటే తక్కువ మొత్తం అందజేశామన్నారు. సామాన్యులకు ప్రాధాన్యమిస్తూ 1.30 లక్షల మంది రుణగ్రహీతల అవసరాలకు తగినట్టు సేవలందించినట్టు తెలిపారు. 2024–25 ఆర్ధిక సంవత్సరానికి దాదాపు 7,800 కోట్లకు ఆర్థిక లావాదేవీలు చేరుకున్నట్లు వెల్లడించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి 8,600 కోట్లు లక్ష్యంగా, ఈ ఏడాది మరో 5 కొత్త శాఖలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వివరించారు. నాన్ షెడ్యూల్ హోదాలో ఉన్న తమ బ్యాంకుకు షెడ్యూల్ హోదా కల్పించేందుకు వీలుగా ఆర్బీఐకు ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. ఆదివారం మద్దిలపాలెంలోని కాకతీయ ఫంక్షన్ హాలులో జరగనున్న 110వ మహాసభలో డివిడెండ్ ప్రకటించనున్నట్టు తెలిపారు. సమావేశంలో బ్యాంక్ డైరెక్టర్లు సూరపనేని నాగభూషణ చౌదరి, ఏజే స్టాలిన్, నామాన కామరాజు, వి.చంద్రశేఖర్, జె.వి.సత్యనారాయణమూర్తి, గుళ్లపల్లి జనార్ధనరావు, సి.హెచ్.ఆదినారాయణ శాస్త్రి, సీఈవో వి.వి.వి.వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
యోగాంధ్రలో భాగస్వాములు కండి
ఎంవీపీకాలనీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని ఈ నెల 21న నిర్వహించే యోగాంధ్రలో అందరూ భాగస్వాములు కావాలని విశాఖ ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు పిలుపునిచ్చారు. యోగాంధ్ర సన్నద్ధతలో భాగంగా ఓం ప్రీ యోగా ఆధ్వర్యంలో 800 మంది సాధకులతో శనివారం యోగాసనాల ప్రదర్శన నిర్వహించారు. ఎంవీపీ కాలనీలోని గాదిరాజు ప్యాలెస్ వేదికగా సంస్థ నిర్వాహకుడు డాక్టర్ చిలకా వెంకట రమేష్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అతిథులతో పాటు సాధకులతో రమేష్ యోగాసనాలు వేయించారు. సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ, గాదిరాజు వర్మ, ఓం ప్రీ యోగా అధ్యక్షుడు కె.శాంతారాం, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర, ఆయుష్ విభాగ అధికారి ఝాన్సీ, శ్రీ విశ్వం గ్రూప్ ధర్మరాజు, తమేర మల్టీస్పెషల్ స్కిన్ క్లినిక్ నిర్వాహకులు వెంకటరమణ, శాంతి తదితరులు పాల్గొన్నారు. చికెన్ (కిలో) (వెన్కాబ్) ఫారంధర : రూ.95 బ్రాయిలర్ (లైవ్) : రూ.115 స్కిన్ : రూ.200 స్కిన్లెస్ : రూ.210చికెన్ ధరలు -
నగర పరిశుభ్రత అందరి బాధ్యత
కొమ్మాది: నగరాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దడంలో స్వచ్ఛంద సేవకుల(వలంటీర్ల) సేవలు అవసరమని అమెరికన్ కౌన్సిల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ అన్నారు. రుషికొండ బీచ్లో శనివారం ఆంధ్ర విశ్వవిద్యాలయం, అమెరికన్ కార్నర్ సంయుక్తంగా నిర్వహించిన ‘కమ్యూనిటీ డే’లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వలంటీర్లతో కలిసి సాగర తీర ప్రాంతంలో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. బీచ్లో ఉన్న వ్యర్థాలను సేకరించారు. పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని.. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఏయూ ఉపకులపతి ప్రొఫెసర్ జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఈ.ఎన్.ధనుంజయరావు మాట్లాడుతూ బీచ్ పరిసరాలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించడానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం వలంటీర్లకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఏయూ క్రీడా విభాగం సంచాలకుడు ప్రొఫెసర్ ఎన్.విజయ్మోహన్, ఎన్ఎస్ఎస్ కో–ఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎస్.హరినాథ్, అమెరికా కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ పబ్లిక్ డిప్లొమసీ అధికారి ఎమిలియా స్మిత్ తదితరులు పాల్గొన్నారు. అమెరికన్ కౌన్సిల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ -
స్థానిక ఎమ్మెల్యే దృష్టికి సమస్యలు
68 వార్డ్డులో సమస్యలను కార్పొరేటర్ గుడివాడ అనూష లతీష్ కౌన్సిల్కు వివరిస్తూ.. స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దృష్టికి తీసుకొచ్చారు. అక్కిరెడ్డిపాలెం హైస్కూల్ నుంచి పంచవటి వరకు ప్రధాన రహదారి విస్తరణ, విశాఖ డెయిరీ కాలుష్యం, మింది, అక్కిరెడ్డిపాలెం గ్రామాల నుంచి పోర్టు రోడ్డు డ్రెయిన్కు కనెక్టయిన కాలువలు నిర్మించాలని, మింది తాగునీటి ట్యాంక్ నిల్వ సామర్థ్యం పెంచాలని, రామ్నగర్, కాళికానగర్లో కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేయాలని కోరారు. గుడివాడ అప్పన్న కాలనీలో రోడ్డు విస్తరణ పూర్తి చేయాలని కోరారు. -
ఎమ్మెల్యే పల్లాకు పితృ వియోగం
సీతంపేట: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తండ్రి పల్లా సింహాచలం శనివారం మధ్యాహ్నం సీతంపేటలోని తన స్వగృహంలో స్వర్గస్తులయ్యారు. పల్లా సింహాచలం విశాఖ–2 ఎమ్మెల్యేగా, వుడా బోర్డు సభ్యులుగా పనిచేశారు. గాజువాక అంటే పల్లా సింహాచలంగా పేరును సార్ధకం చేసుకున్నారు. ప్రజాసేవకుడిగా, సీనియర్ రాజకీయ నాయకుడిగా విశాఖ జిల్లా వాసులకు సుపరిచితుడు. విశాఖ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా పలువురు గుర్తుచేసుకున్నారు. ఆయన మరణం టీడీపీకి తీరని లోటని పేర్కొన్నారు. ఆదివారం తెల్లవారు 5 గంటల వరకు సీతంపేటలోని ఆయన స్వగృహంలో పార్థివదేహం అందుబాటులో ఉంటుందని, అనంతరం కొత్త గాజువాకలోని పూర్వపు ఇంటి వద్దకు తరలిస్తారు. ఉదయం 9 గంటల తరువాత అంత్యక్రియలు ప్రారంభమవుతాయి. పల్లా సింహాచలం పార్థివ దేహానికి కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, కార్మిక శాఖా మంత్రి సుభాష్, మాజీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి, శ్రీనివాస్ దంపతులు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల రమేష్బాబు, వుడా ఛైర్మన్ ఎం.వి.ప్రణవ్ గోపాల్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ తదితరులు నివాళులర్పించారు. -
గళమెత్తారు
పలు అంశాలపై నిలదీత.. శ్రీహరిపురంలో ఎఫ్ఆర్యూకి సంబంధించి మేయర్ను డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్ నిలదీశారు. అలాగే స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన సీనియర్ అసిస్టెంట్ వెంకట్రావు చేసిన ఫ్రాడ్కి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. వార్డులో రోడ్డు పనులు మంజూరైనప్పటికీ ఇంతవరకు పనులు ప్రారంభించక పోవడంపై ప్రశ్నించారు. డాబాగార్డెన్స్: కొత్త మేయర్ పీలా శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన తొలి నగరపాలక సంస్థ సమావేశంలోనే అధికార కూటమికి వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు చుక్కలు చూపించారు. సెంట్రల్ ఏసీ హాల్లోనూ మేయర్తో పాటు పాలకపక్ష సభ్యులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ప్రజల సమస్యలపై వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు గళమెత్తడంతో, మేయర్ నీళ్లు నమలాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వ తీరును నిలదీస్తుంటే ఏం చేయాలో పాలుపోక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. మేయర్గా తన తొలి సమావేశం ఏకపక్షంగా సాగేలా స్క్రీన్ప్లే రచించినా, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఎదురుదాడికి దిగడంతో మేయర్కు తొలి సమావేశంలో చేదు అనుభవం ఎదురైంది. మేయర్, కూటమి సభ్యుల నాటకానికి తెర జీవీఎంసీ కమిషనరే రాకపోతే కౌన్సిల్కు ఏం మర్యాద ఉంటుందని.. కచ్చితంగా రావాల్సిందేనని డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్, జీవీఎంసీ వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు, మాజీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ నేతృత్వంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. ఇన్చార్జ్ కమినర్ వచ్చేంత వరకు సభ వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. దీంతో మేయర్ పీలా శ్రీనివాసరావు కౌన్సిల్ ప్రారంభమైన 15 నిమిషాల్లోనే టీ బ్రేక్ ప్రకటించారు. ఈ సమయంలోనే జీవీఎంసీ ఇన్చార్జ్ కమిషనర్ను కౌన్సిల్కు పిలిపించినట్టు తెలుస్తోంది. పార్కులు కబ్జా అవునత్నా..కౌన్సిల్లో కూటమి తీరును ఎండగట్టారు ప్రజా సమస్యలపై నినదించిన వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు మేయర్తో పాటు పాలకపక్ష సభ్యులు ఉక్కిరిబిక్కిరి -
ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలి
ఆరిలోవ: ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. జీవీఎంసీ పదో వార్డు పరిధి తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు సమావేశమయ్యారు. ఆదివారం చేపట్టనున్న డీఈవో కార్యాలయం ముట్టడిని ఉమ్మడి విశాఖ జిల్లా ఉపాధ్యాయులంతా విజయవంతం చేయాలని కోరారు. అక్కడ పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధు లంతా చేతులు కలిపి ముట్టడికి సంఘీభావం తెలిపారు. అనంతరం అక్కడ నుంచి నాయకులు డీఈవో కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ డీఈవో చాంబర్లో బైఠాయించి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, సమస్యలు పరిష్కంచాలని, ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ చేపట్టాలని, వెబ్ ఆప్షన్ పెట్టవద్దని నినాదాలు చేశారు. అనంతరం ఆదివారం చేపట్టనున్న డీఈవో కార్యాలయం ముట్టడికి సంబంధించిన నోటీస్ను డీఈవో ఎన్.ప్రేమ్కుమార్కు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు డి.గోపీనాథ్, ఇమంది పైడిరాజు, సీహెచ్.వేణుగోపాల్, టి.రామకృష్ణ, టి.ఆర్ అంబేడ్కర్, అరుణ్కుమార్, ధనుంజయ, చిన్నారావు, సూర్యనారాయణ పాల్గొన్నారు. -
జనసేన నుంచి జనసేనలో చేరిక
● ఎన్నికల ముందు వైఎస్సార్ సీపీ సస్పెన్షన్ చేసిన వారంతా ... ● టీడీపీలో కొందరు గండి బాబ్జీ వ్యతిరేకులను జనసేనలో చేర్చుకున్న ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబుపెందుర్తి: జనసేన పార్టీ నాయకులు జనసేన పార్టీలో చేరారు.. షాకయ్యారా..అవ్వకండి.. పెందుర్తి నియోజకవర్గంలో రానున్న రోజుల్లో ఇలాంటి వింతలు మరిన్ని చూడాలి. ఏడాది క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో వైఎస్సార్ సీపీ వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ సస్పెన్షన్కు గురై.. ఎన్నికల్లో జనసేనకు పనిచేసిన నాయకులతో పాటు ఇటీవల టీడీపీ ఇన్చార్జి గండి బాబ్జీకి వ్యతిరేకంగా రాజీనామాలు చేసిన పలువులు కార్యకర్తలను జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు ఆ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఇప్పటికే టీడీపీ ఇన్చార్జి గండి బాబ్జీ తనకు పక్కలో బల్లెంలా మారడంతో జనసేన నాయకులనే మళ్లీ అదే పార్టీలో చేర్చుకుని ‘నేనే బలవంతుడిని’ అని చెప్పుకోవడం కోసం రమేష్బాబు వెంపర్లాడుతున్నారు. కాగా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిలో ఘోర వైఫల్యాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కోంటున్న వేళ.. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ బలంగా ముందుకు అడుగులు వేస్తున్న సమయంలో.. ‘వాపు’ని బలం అని చెప్పుకోవడానికి కూటమి ముఖ్య నేతలు ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడడం విడ్డూరంగా ఉందని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. వారే వీరు.. పెందుర్తి నియోజకవర్గంలో ఎన్నికల ముందు వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులుగా ఉన్న కొంత మంది సబ్బవరం మండలానికి చెందిన నాయకులు పార్టీ వ్యతిరేక విదానాలకు పాల్పడ్డారు. అందులో అమృతపురం ఎంపీటీసీ సభ్యుడు సింగంపల్లి శ్రీనివాసరావుతో పాటు పలువురిని వైఎస్సార్సీపీ 2024 ఎన్నికల ముందే సస్పెండ్ చేసింది. దీంతో వారంతా జనసేన జెండాలు పట్టుకుని తిరిగారు. వారితో పాటు నారపాడు ఎంపీటీసీ, సబ్బవరం–2 ఎంపీటీసీ బైలపూడి దేముడుబాబు, సబ్బవరం–3 ఎంపీటీసీ సబ్బవరపు శ్రీను తదితర నాయకులు కూటమి అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు పంచన చేరారు. శనివారం సబ్బవరంలో జరిగిన కార్యక్రమంలో వారందరికీ మళ్లీ కండువాలు వేసి జనసేనలో చేర్చుకోవడంతో సభకు హాజరైనవారే అవాక్కయ్యారు. -
82.468 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
తగరపువలస/కూర్మన్నపాలెం: విశాఖ జిల్లాలోని రెండే వేర్వేరు చోట్ల రేషన్ బియ్యం పట్టుకున్నారు. ఆనందపురం మండలం పెద్దిపాలెంలో గురువారం రాత్రి రెండు రైస్ మిల్లులపై రెవెన్యూ, పౌరసరఫరా, విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి 82.468 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. భీమిలి ఆర్డీవో సంగీత్ మాథూర్, ఆనందపురం తహసీల్దార్ శ్యాంప్రసాద్, సీఎస్డీటీ శ్రీనివాసరావు జరిపిన తనిఖీలు రాత్రి 9 గంటల నుంచి ఒంటి గంట వరకు జరిగాయి. శ్రీబాలాజీ మోడరన్ రైస్ మిల్లు నుంచి 50.800 టన్నులు, ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ ముద్రతో రీప్రాసెస్ చేసి బయటకు తరలించిన బియ్యానికి సంబంధించి 388 గోనె పట్టాలు, అశోక్ లే ల్యాండ్ లారీని స్వా«దీనం చేసుకున్నారు. అలాగే శ్రీ సాయి రైస్ అండ్ ఫ్లోర్ మిల్లు నుంచి 31.668 టన్నుల బియ్యంతో పాటు 1,252 ఖాళీ గోనె సంచులు, మహీంద్రా బొలేరో వ్యాన్, ఆటోలను స్వా«దీనం చేసుకున్నారు.రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచి, పాలిష్ చేసి బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నట్టు గుర్తించామన్నారు. వీటిని సీజ్ చేసి జాయింట్ కలెక్టర్కు నివేదిక పంపించినట్టు తహసీల్దార్ తెలిపారు. ఈ రెండు మిల్లుల యజమానులు చెన్నా రాజేష్, రామారావులపై 6ఏ కేసుతో పాటు 7 బీఎన్ఎస్ కేసు నమోదు చేసినట్లు తెలిసింది.1,400కిలోల పీడీఎస్ రైస్ సీజ్ పేదలకు అందించాల్సిన బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఆటోను దువ్వాడ పోలీసులు పట్టుకున్నారు. ఆటో నుంచి 1,400 కిలోల పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. గూడ్స్ ఆటోలో గాజువాక నుంచి సబ్బవరం రైస్ మిల్లుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో దువ్వాడ చెక్ పోస్టు వద్ద పోలీసులు పీడీఎస్ రైస్ను గుర్తించి, స్వా«దీనం చేసుకుని డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్టు సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. -
వార్డుల అభివృద్ధికి నిధులు కేటాయించాలి
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ పరిధిలోని అన్ని వార్డుల అభివృద్ధి పనుల కోసం ఆయా వార్డు కార్పొరేటర్లకు నిధులు కేటాయించాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్ చేశారు. అప్రజాస్వామికంగా మేయర్ పీఠాన్ని కై వసం చేసుకున్న కూటమి ప్రభుత్వం, కనీసం పాలననైనా ప్రజాస్వామికంగా నిర్వహించాలని ఆయన హితవు పలికారు. పార్టీలకతీతంగా ఆలోచించి ప్రజా సమస్యలు, వార్డు అభివృద్ధి కోసం దృష్టి సారించాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యేలకు మాత్రమే కాకుండా, ప్రతి వార్డులో ఆయా వార్డు కార్పొరేటర్లు సూచించిన ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులపై కూటమి పార్టీల మేయర్ ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన డిమాండ్ చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో పార్టీలకతీతంగా ప్రజల కోసం ఏ విధంగా పాలన సాగిందో, దానిని దృష్టిలో పెట్టుకుని ప్రజా శ్రేయస్సు కోసం పాలన చేయాలని కేకే రాజు పిలుపునిచ్చారు. -
ట్రెజరీలో అడ్డగోలు బదిలీలు
విశాఖ సిటీ: జిల్లా ఖజానా శాఖలో చేపట్టిన ఉద్యోగుల బదిలీలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. నిబంధనలను ఉల్లంఘించి, ఇష్టానుసారంగా బదిలీల ప్రక్రియను ముగించారంటూ ఉద్యోగులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కలెక్టరేట్లోని ట్రెజరీ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్, సీనియర్ అకౌంటెంట్లు, సబార్డినేట్లకు సంబంధించిన బదిలీలలో అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు? సాధారణంగా ఒకే చోట ఐదేళ్లకు పైగా విధులు నిర్వర్తించిన ఉద్యోగులకు తప్పనిసరిగా స్థానచలనం కల్పించాలి. అంతేకాకుండా, బదిలీలను కౌన్సెలింగ్ ద్వారా పారదర్శకంగా చేపట్టాలి. అయితే జిల్లా ఖజానా శాఖలో ఈ నిబంధనలను పట్టించుకోకుండా, స్టేట్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ కనుసన్నల్లో 34 మంది ఉద్యోగులను ఇష్టానుసారంగా బదిలీ చేశారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఐదేళ్లు పూర్తయినా అక్కడే కొనసాగింపు ఈ బదిలీల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు 12 మందితో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ, ఆ కమిటీ నిబంధనల ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించలేదని సమాచారం. దీనికి తోడు, ఖజానా శాఖలో ఐదేళ్లుగా జూనియర్ అకౌంటెంట్గా పనిచేస్తున్న ఒక ఉద్యోగికి బదిలీ చేయకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వాస్తవానికి సదరు జూనియర్ అకౌంటెంట్పై అవినీతి ఆరోపణలు చేస్తూ పలువురు సీఎం పేషీకి ఫిర్యాదు చేశారు. దానిపై విచారణ కూడా జరుగుతోంది. అయినప్పటికీ, ఆరోపణలను, ఐదేళ్ల నిబంధనను పట్టించుకోకుండా అతడిని బదిలీ చేయకపోవడం పట్ల ఆ శాఖ సిబ్బంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. డీటీవో సంతకం చేసి సెలవుపై..? ఈ బదిలీల ఫైల్పై జిల్లా ట్రెజరీ ఆఫీసర్ (డీటీవో) నాగభూషణం సంతకం చేసి దీర్ఘకాలిక సెలవుపై వెళ్ళినట్లు సిబ్బందిలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ బదిలీల తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని బాధితులు, ఇతర ఉద్యోగులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై మరింత లోతైన విచారణ జరిపి, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కౌన్సెలింగ్ నిర్వహించకుండా 34 మందికి స్థానచలనం ఐదేళ్ల నిబంధనను పట్టించుకోని అధికారులు -
ఏయూలో సమూల మార్పులు
విభాగాలకు నూతన డీన్, డైరెక్టర్ల నియామకం మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్, శుక్రవారం పరిపాలనకు సంబంధించి పలువురు డీన్లు, డైరెక్టర్లను పూర్తిస్థాయిలో మార్పు చేశారు. పారదర్శకత, జవాబుదారీతనం పెంచడం, సేవలను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ సంస్థాగత మార్పులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. కీలక నియామకాలు డీన్ అండ్ ఫ్యాకల్టీ అఫైర్స్, డీన్ అవుట్రీచ్, డీన్ అలుమ్నీ రిలేషన్స్, డీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్, చీఫ్ కో–ఆర్డినేటర్లు వంటి నూతన పదవులను ఏర్పాటు చేశారు. స్పాట్ వాల్యుయేషన్ విభాగానికి చీఫ్ కో–ఆర్డినేటర్ను నియమించారు. బోధనా సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా డీన్ ఫ్యాకల్టీ అఫైర్స్ను నియమించారు. డీన్ అలుమ్నీ రిలేషన్స్ పదవిని ఏర్పాటు చేశారు. డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ – సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఓపెన్ లెర్నింగ్లను అనుసంధానించి, ఒకే డైరెక్టర్ పరిధిలోకి తీసుకువచ్చారు. విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, కళల విభాగాలను అనుసంధానిం చనున్నారు. నూతన డీన్ల వివరాలు డీన్ ఫ్యాకల్టీ అఫైర్స్: కె. రాంబాబు, డీన్ అకడమిక్స్ అఫైర్ కె. శ్రీనివాసరావు, డీన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రొఫెసర్ వల్లికుమారి (కంప్యూటర్ సైన్స్), డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ – సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఓపెన్ లెర్నింగ్ ప్రొఫెసర్ అప్పలనాయుడు (కెమికల్ ఇంజనీరింగ్), డీన్, పీజీ అండ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్స్ ఆచార్య మునిస్వామి (స్టాటిస్టిక్స్), డీన్ అలుమ్నీ రిలేషన్స్ ప్రొఫెసర్ శ్యామల (కెమిస్ట్రీ), డీన్ అవుట్రీచ్ ప్రొఫెసర్ కె. రమాసుధ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్), డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ డాక్టర్ ఎస్. హరినాథ్ (సోషల్ వర్క్), డీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లానింగ్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ కె.ఎస్. రావు (సివిల్ ఇంజనీరింగ్), చీఫ్ కో–ఆర్డినేటర్ స్పాట్ వాల్యుయేషన్ కేటీ బలరాం పడాల్ను నియమించారు. -
రైతులకువెన్నుపోటు
తగరపువలస: కూటమి నేతలు ఎన్నికల ముందు ఇచ్చిన ‘అన్నదాత సుఖీభవ’ పథకం హామీ అధికారంలోకి వచ్చాక నెరవేర్చలేదు. ఏటా రూ.20,000 రైతులకు అందించకపోవడంపై అన్నదాతలు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఏడాది గడిచినా ఒక్క పైసా కూడా అందలేదని, ఇది మోసపు హామీతో తమకు వెన్నుపోటు పొడవడమేనని రైతులు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు పెట్టుబడి సాయం అందకపోగా, సకాలంలో విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడంలో కూడా విఫలమైందని రైతులు ఆరోపిస్తున్నారు. ఉచిత పంటల బీమాను రద్దు చేసి, ఆ భారాన్ని రైతులపైనే మోపడం, ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను రక్షించడానికి సమీక్షలు లేకపోవడం, రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసి, రైతు సహాయకులను సచివాలయాలకే పరిమితం చేయడం వంటివి రైతుల కష్టాలను మరింత పెంచాయని అంటున్నారు. చాలావరకు రైతు భరోసా కేంద్రాలు తెరచుకోవడం లేదని, కనీస మద్దతు ధర కూడా ఇవ్వలేకపోయారని, ఆక్వా, పాడి రైతులను కూడా నిట్టనిలువుగా ముంచేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో పండగలా సేద్యం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో వ్యవసాయాన్ని పండగలా మార్చిందని రైతులు గుర్తుచేసుకుం టున్నారు. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకుని, అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ అమలు చేశారని, కౌలు రైతులతో సహా ఏటా రూ.13,500 పెట్టుబడి సా యం నేరుగా రైతు ల ఖాతాలకు బది లీ చేశారని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని 24,925 మంది రైతులకు ఐదేళ్లలో రూ.112.62 కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రతి గ్రామ పంచాయితీలో రైతు భరోసా కేంద్రాలను సొంత భవనాలలో ఏర్పాటు చేసి, నకిలీ విత్తనాలు, ఎరువుల నివారణకు సాగు సీజన్కు ముందే కియోస్క్ల ద్వారా విత్తనాలు, డీఏపీ, యూరియా అందుబాటులో ఉంచేవారని గుర్తుచేసుకున్నారు. రైతు సహాయకులను నియమించి, వారి ద్వారా మట్టి నమూనా పరీక్షలు, సాగు చేయవలసిన పంటలు, తెగుళ్ల నివారణ, పండిన పంటకు మద్దతు ధర ప్రకటించడంతో పాటు గోనె పట్టాలు, రవాణా సౌకర్యం కల్పించారని తెలిపారు. భీమిలిలో డాక్టర్ వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేసి విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యత పరీక్షించడంతో పాటు, పశువులలో తలెత్తే రోగాల నిర్ధారణ, చికిత్స కూడా అందించేవారని వివరించారు. అతివృష్టి, అనావృష్టి సమయంలో రైతు నష్టపోకుండా ఉచిత పంటల బీమా పథకం ద్వారా భరోసా కల్పించారని, వైఎస్సార్ జలకళ కింద రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించి మోటార్లు ఏర్పాటు చేశారని అన్నారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రాష్ట్ర రైతులకు అండగా నిలిచారని, ఆ ఐదేళ్లు బ్యాంకులు కూడా రైతులకు విరివిగా రుణాలు ఇవ్వడంతో పాటు వాయిదాలు ఆలస్యం అయినా వేధించేవారు కాదని రైతులు తెలిపారు. ప్రజాప్రతినిధులను గడప గడపకు పంపించి, ఏ కారణం చేత అయినా సాయం అందకపోతే తక్షణం అందేలా చర్యలు తీసుకునేవారని అన్నారు.కూటమి వచ్చాక అప్పులపాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సహాయ కార్యక్రమాలు నిలిచిపోయాయని, దీంతో గత ఏడాది రైతులు అప్పుల పాలయ్యారని, ప్రస్తుతం సీజన్ ప్రారంభం కానున్నందున అధిక వడ్డీల బాధ ఉన్నా అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నదాత వెన్ను విరిచిన కూటమి ప్రభుత్వం అటకెక్కిన ‘అన్నదాత సుఖీభవ’ భరోసా కల్పించని ప్రభుత్వంపై రైతుల ఆగ్రహం జిల్లాలో సాగు భూమి 4,454 హెక్టార్లు, అందులో 78 హెక్టార్లు మెట్ట్ట భూమి, రైతు భరోసా కేంద్రాలు 57(భీమిలి 13, ఆనందపురం 18,పద్మనాభం 16, పెందుర్తి 10) కౌలు రైతులు 504 మొత్తం రైతులు 22,569 -
● వినీలాకాశం.. పర్వత రూపం
వినీలాకాశంలో శుక్రవారం అద్భుత దృశ్యం అబ్బురపరిచింది. నీలిరంగులో ఉండే విశాలమైన కాన్వాస్పై పక్షుల గుంపు రిథమిక్గా సాగిపోతున్న తీరు చూపరులను మంత్రముగ్ధులను చేసింది. సాయంత్రం సమయంలో ఆకాశం నిర్మలంగా, నీలి రంగులో మెరిసిపోతోంది. అక్కడక్కడ చిన్నపాటి మబ్బులు తేలియాడుతున్నాయి. సరిగ్గా అదే సమయంలో వందల సంఖ్యలో పక్షుల గుంపు ఒక పర్వతం ఆకారాన్ని తలపించేలా గాల్లో కదులుతూ ప్రయాణించింది. లయబద్ధంగా సాగిన వాటి ప్రయాణం.. చూసిన ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పంచింది. ఫొటో: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పవన్ కార్తీక్
ఏయూక్యాంపస్: హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (హెచ్ఆర్ఏఏపీ) నూతన కార్యవర్గ ఎన్నిక శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎం.వి. పవన్ కార్తీక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా జైదీప్ బిశ్వాస్, కోశాధికారిగా ఆర్. వెంకటరావులను ఎన్నుకున్నారు. సలహా మండలి సభ్యుడిగా డాక్టర్ ఎస్. ప్రశాంత్ వ్యవహరిస్తారు. నూతన కార్యవర్గం రాష్ట్రంలో పర్యాటకం, ఆతిథ్య రంగాన్ని బలోపేతం చేసే దిశగా పనిచేస్తుందని అధ్యక్షుడు పవన్ కార్తీక్ తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా పనిచేస్తామన్నారు. -
డీఎస్సీ పరీక్షకు 88.39 శాతం హాజరు
ఆరిలోవ: జిల్లాలో డీఎస్సీ–2025 ద్వారా విద్యాశాఖ నిర్వహించిన ఉపాధ్యాయ నియామక పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. డీఎస్సీ అభ్యర్థులకు జిల్లాలో విద్యాశాఖ మొత్తం 12 పరీక్షా కేంద్రాలను కేటాయించింది. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో 11 కేంద్రాలలో పరీక్షలు నిర్వహించారు. మొదటి రోజు పరీక్షల కోసం 2,447 మంది అభ్యర్థులకు హాల్ టికెట్లు పంపించగా, వారిలో 88.39 శాతం (2,163 మంది) హాజరయ్యారు. 284 మంది అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) ఎన్. ప్రేమ్కుమార్ తెలిపారు. ఉదయం సెషన్లో 7 కేంద్రాలలో నిర్వహించిన పరీక్షకు 1,435 మందికి 1,278 మంది (89.06శాతం) హాజరయ్యారు.మధ్యాహ్నం 4 కేంద్రాలలో నిర్వహించిన పరీక్షకు 1,012 మందికి 885 మంది (87.45శాతం) హాజరయ్యారు. డీఈవో ఒక కేంద్రాన్ని, పరీక్షల స్క్వాడ్ మూడు కేంద్రాలను పర్యవేక్షించారు. పరీక్షలు జరిగిన కేంద్రాలలో బుచ్చిరాజుపాలెంలోని ఏడీజెడ్ ఆరోవనా డిజిటల్ జోన్ పరీక్షా కేంద్రంలో అత్యధికంగా 450 మంది అభ్యర్థులను కేటాయించగా, నగరంలోని చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో అత్యల్పంగా 85 మంది అభ్యర్థులను కేటాయించారు. -
ఖైదీలకు యోగా శిక్షణ
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారంలోని ఖైదీలు యోగాసనాలలో శిక్షణ పొందుతున్నారు. ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ‘యోగాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా వారికి ఈ శిక్షణ ఇస్తున్నారు. కారాగారం లోపల ప్రశాంతమైన వాతావరణంలో, పచ్చని చెట్ల మధ్య ఖైదీలకు యోగా నేర్పుతున్నారు. ఖైదీలకు ప్రతిరోజూ గంట పాటు యోగాసనాలు నేర్పుతున్నట్లు జైల్ సూపరింటెండెంట్ ఎం. మహేష్ బాబు శుక్రవారం తెలిపారు. ప్రతిరోజు ఖైదీలు యోగ సాధనలో పాల్గొంటున్నారని, దీని వల్ల వారి శరీర దృఢత్వంతో పాటు మానసిక స్థితి మెరుగుపడుతుందని ఆయన పేర్కొన్నారు. యోగా దినోత్సవం నాటికి జైలులో ఉన్న అందరి ఖైదీలతో యోగాసనాలలో పాల్గొనే విధంగా చర్యలు చేపడుతున్నట్లు మహేష్ బాబు వెల్లడించారు. -
చేతకాక.. కమిషనర్ లేక!
జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం వాడీవేడిగా సాగింది. కూటమి ప్రభుత్వ అసమర్ధతపై వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల మండిపాటు, కూటమి కార్పొరేటర్ల అసంబద్ధ వాదనలతో రసాబాసగా మారింది. ప్రభుత్వం ఏర్పడ్డాక.. అడ్డగోలుగా మేయర్ పీఠాన్ని దక్కించుకోవడంలో చూపిన చొరవ, జీవీఎంసీకి పూర్తిస్థాయి కమిషనర్ను నియమించడంలో చూపకపోవడంపై వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ధ్వజమెత్తారు. ప్లకార్డులతో మేయర్ పోడియంను చుట్టుముట్టి, తక్షణమే జీవీఎంసీకి రెగ్యులర్ కమిషనర్ను నియమించాలని డిమాండ్ చేశారు. దాదాపు 15 నిముషాలు వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల నినాదాలతో కౌన్సిల్ హాల్ మార్మోగింది. డాబాగార్డెన్స్: నూతన మేయర్ పీలా శ్రీనివాస్ అధ్యక్షతన శుక్రవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశం వాద, ప్రతిపాదనలతో హోరెత్తింది. ప్రధాన అజెండాలోని 27 అంశాలతో పాటు, టేబుల్ అజెండాలోని 6 అంశాలు సభ్యుల చర్చకు వచ్చాయి. వీటిలో 3 ప్రధాన అజెండా(1, 10, 14) అంశాలు, 2 టేబుల్(1, 6) అజెండా అంశాలు తప్ప, మిగిలినవన్నీ ఆమోదం పొందాయి. ఉదయం ప్రారంభమైన సమావేశం రాత్రి వరకు కొనసాగింది. రెగ్యులర్ కమిషనర్ నియామకం ఎప్పుడు? జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాగానే వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు సభను అడ్డుకున్నారు. ప్లకార్డులతో మేయర్ పోడియాన్ని చుట్టుముట్టి, జీవీఎంసీకి తక్షణమే రెగ్యులర్ కమిషనర్ను నియమించాలని డిమాండ్ చేశారు. కీలకమైన కమిషనర్ పోస్టును నెలల తరబడి భర్తీ చేయకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని నినాదాలు చేశారు. దాదాపు 15 నిమిషాల పాటు వారి నినాదాలతో సభ దద్దరిల్లింది. మేయర్ పీలా శ్రీనివాసరావు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. మొదట పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాప తీర్మానం చేయాలని సూచించడంతో, వైఎస్సార్సీపీ సభ్యులు తమ సీట్లలో కూర్చున్నారు. అనంతరం, ఉగ్రదాడి బాధితులకు రెండు నిమిషాల మౌనం పాటించి నివాళులర్పించారు. ఇన్చార్జ్ కమిషనర్ రాకపోవడంతో బ్రేక్ ఇన్చార్జ్ కమిషనర్, కలెక్టర్ హరేందిర ప్రసాద్ సీఎం వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నందున సమావేశానికి హాజరుకాలేదు. దీనిపై వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, కమిషనర్ లేకుండా సభను నిర్వహించడాన్ని తప్పుబట్టారు. వారి నిరసనతో మేయర్ పీలా శ్రీనివాసరావు 15 నిమిషాల్లోనే టీ బ్రేక్ ప్రకటించారు. దాదాపు అరగంట తర్వాత కమిషనర్ హాజరు కావడంతో సభ తిరిగి ప్రారంభమైంది. జీరో అవర్ కోసం పట్టు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో మేయర్ పీలా అజెండాలోని అంశాలపై చర్చ ప్రారంభించగా, కార్పొరేటర్లు తమ వార్డు సమస్యల పరిష్కారం కోసం జీరో అవర్ కావాలని పట్టుబట్టారు. మేయర్ దీనికి అంగీకరించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ జీవీఎంసీకి నాలుగు నెలలుగా కమిషనర్ లేకపోవడం దౌర్భాగ్యమన్నారు. కార్పొరేటర్లు, స్థానిక ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రెండు, మూడు రోజుల్లో కమిషనర్ను నియమించేలా చూడాలని సూచించారు. పీలా గోవింద్ హాజరుపై అభ్యంతరం జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ హాజరుపై డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్ అభ్యంతరం తెలిపారు. ఏ హోదాలో ఆయన వచ్చారని ప్రశ్నించగా, పీలా గోవింద్ ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అని, ప్రభుత్వ ప్రత్యేక ఉత్తర్వుల మేరకు ప్రత్యేక ఆహ్వానితుడిగా వచ్చినట్లు అధికారులు వివరించారు. నైట్ ఫుడ్కోర్టుపై మళ్లీ రగడ జైలు రోడ్డులోని నైట్ ఫుడ్కోర్టుపై మరోసారి రగడ చెలరేగింది. అనధికారికంగా అనేక మంది స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నారని, వీటిని తొలగించాలని కౌన్సిల్లో పలుమార్లు చర్చించి తీర్మానం చేసినా చర్యలు తీసుకోకపోవడంపై వైఎస్సార్సీపీ కార్పొరేటర్ బిపిన్కుమార్ జైన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో కార్పొరేటర్ పీవీ సురేష్ మాట్లాడుతూ, వార్డుల్లో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని ఫిర్యాదు చేస్తే, జోనల్ కమిషనర్ తేలికగా ‘అలాగే జరుగుతాయని’మాట్లాడుతున్నారని మండిపడ్డారు.‘ఎఫ్ఆర్యూ’ ఒప్పందం ఎప్పుడైనా రద్దు చేయొచ్చుశ్రీహరిపురంలోని ఫస్ట్ రిఫరల్ యూనిట్ నిర్వహణ కోసం రూ.1.20 కోట్లు కేటాయించడం, విజయ (బెహరా) వెల్ఫేర్ సొసైటీకి చెల్లింపుల ఆమోదంపై జీవీఎంసీ కౌన్సిల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్ పీవీ సురేష్ సహా ఇతర కార్పొరేటర్లు మాట్లాడుతూ సొసైటీ ఉచిత సేవలకు బదులు డబ్బులు వసూలు చేస్తోందని, 30 ఏళ్ల లీజుపై కూడా అభ్యంతరం తెలిపారు. దీనిపై స్పందించిన కలెక్టర్ హరేందిరప్రసాద్, సొసైటీ సరిగా పనిచేయకపోతే విచారణ జరిపి ఒప్పందాన్ని ఎప్పుడైనా రద్దు చేస్తామని మేయర్ పీలా శ్రీనివాసరావు ద్వారా హామీ ఇచ్చారు. రెగ్యులర్ కమిషనర్ను నియమించకపోవడంపై వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల ఆగ్రహం జీవీఎంసీపై కూటమి నిర్లక్ష్యం కమిషనర్ను నియమించాలంటూ వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ప్లకార్డుల ప్రదర్శన 27 అజెండా అంశాలు.. 6 టేబుల్ అజెండా అంశాలు ప్రధాన అజెండాలో 3, టేబుల్ అజెండాలో 2 అంశాలు వాయిదా సుదీర్ఘంగా సాగిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం జీవీఎంసీలో ఘోస్ట్ ఉద్యోగులు జీవీఎంసీలో ‘ఘోస్ట్ ఉద్యోగులు’ఉన్నారని, పని చేయకుండానే జీతాలు తీసుకుంటున్నారని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. అలాంటి వారిని తొలగించాలని డిమాండ్ చేశారు. విశాఖ డెయిరీ వ్యర్థాలు పంట పొలాల్లోకి చేరి రైతులను ఇబ్బంది పెడుతున్నందున, డ్రైన్లు నిర్మించాలని పల్లా సూచించారు. వర్క్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేయరా? జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పలు కీలక ఆరోపణలు చేశారు. జీవీఎంసీ పరిధిలో దీర్ఘకాలంగా ఒకే చోట పని చేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్లపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, వారిని ఎందుకు బదిలీ చేయడం లేదని ప్రశ్నించారు. కీలకమైన జీవీఎంసీకి నెలల తరబడి కమిషనర్ లేకపోవడం దారుణమన్నారు. పనుల టెండర్లలో అంచనాల కంటే 25 శాతం తక్కువకు కాంట్రాక్టర్లు పనులు ఎలా చేస్తున్నారని నిలదీస్తూ, అధికారులు ఎక్కువ ఎస్టిమేషన్లు వేస్తున్నారా? లేదా కాంట్రాక్టర్లకు లీకులు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. ఎవడ్రా నువ్వు..! జీరో అవర్లో వాగ్వాదం చోటుచేసుకుంది. కార్పొరేటర్ కంపా హనోక్ మాట్లాడుతుండగా.. వైఎస్సార్సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు మాట్లాడేందుకు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన హనోక్, ‘ఎవడ్రా నువ్వు’అంటూ నోరు పారేసుకున్నారు. ఈ ఘటనతో సభలో కొంత గందరగోళం నెలకొంది. వెంటనే రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు కల్పించుకుని, వైఎస్సార్సీపీ నుంచి గెలిచి, పార్టీ మారిన విషయాన్ని గుర్తుంచుకోవాలని హనోక్కు చురకంటించారు. హనోక్ వెంటనే క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. వాయిదాపడ్డ అంశాలు.. సీనియర్ అసిస్టెంట్ డి.వెంకట్రావు స్వచ్ఛంద పదవీ విరమణ దరఖాస్తును సభ్యులు వ్యతిరేకించారు. అతనిపై అనేక ఆరోపణలు ఉన్నందున, పూర్తిస్థాయి విచారణ జరిపే వరకు దరఖాస్తును వాయిదా వేశారు. 87వ వార్డులోని కూర్మన్నపాలెం వద్ద ఎంవీవీ అండ్ ఎంకే పార్క్కు 150 కేఎల్డీ శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసేందుకు సంబంధించిన పైప్లైన్ ప్రతిపాదనకు సభ్యులు అభ్యంతరం తెలపడంతో వాయిదా పడింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్లో భాగంగా 15 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల అభివృద్ధి ప్రతిపాదనను సభ్యులు వ్యతిరేకించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల కాలపరిమితి మార్చి 31తో ముగిసిందని, కేవలం ఇద్దరు ముగ్గురు సిబ్బందితో రూ.కోట్ల విలువైన ప్రాజెక్టులు జరుగుతున్నాయని, దీనిపై సుదీర్ఘంగా చర్చించాలని కోరడంతో వాయిదా వేశారు. పరిపాలన సౌలభ్యం కోసం జోనల్ పరిధి మార్పులు చేసే ప్రణాళికను కూటమి సభ్యులతో సహా పలువురు కౌన్సిల్ సభ్యులు వ్యతిరేకించడంతో వాయిదా వేశారు. వీటితోపాటు టీడీఆర్లు, కోడి మాంసం వ్యర్థాలు, అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్, షాప్ రూంలు, పార్క్స్ వంటి అంశాలపై చర్చ అవసరమని సభ్యులు కోరడంతో వాటిని కూడా వాయిదా వేశారు. ఆమోదించిన అంశాల్లో ప్రధానమైనవి రూ.1.96 కోట్లతో 2వ వార్డు కుమ్మరివీధి నుంచి నమ్మివానిపేట కాలనీ బీటీ రోడ్డు విస్తరణ జీవీఎంసీలోని ఈఈ–1 పరిధిలో సివిల్ పనుల పర్యవేక్షణకు అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్లను ఏడాది పాటు కొనసాగింపు రూ.55.40 లక్షల అంచనా వ్యయంతో 19వ వార్డు పెదవాల్తేరులో చేపల మార్కెట్ పునరుద్ధరణ ఇంజినీరింగ్ విభాగం ఈఈ–5 పరిధిలో 18 మంది టెక్నికల్, నాన్ టెక్నికల్ వర్క్ ఇన్స్పెక్టర్లు, సెక్యూరిటీ గార్డుల కొనసాగింపు -
ఏపీ పీజీ ఈసెట్ ప్రారంభం
మద్దిలపాలెం: రాష్ట్రవ్యాప్తంగా ఎంటెక్, ఎం.ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ పీజీ ఈసెట్ 2025 శుక్రవారం ప్రారంభమైంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్ ఈ పరీక్షలను ప్రారంభించారు. పరీక్షల తొలిరోజు ఉదయం సెషన్లో 92 శాతం, మధ్యాహ్నం సెషన్లో 82 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏయూ నిర్వహిస్తున్న ఈ ప్రవేశ పరీక్ష సెట్ కోడ్ను వీసీ విడుదల చేయగా, రెక్టార్ ఆచార్య ఎన్.కిశోర్ బాబు, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జి.శశిభూషణరావు, సెట్ కన్వీనర్ ఆచార్య పి.మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈ పరీక్షలు శని, ఆదివారాల్లో కూడా కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. -
సామాజిక సందేశంతో ఆకట్టుకున్న నాటికలు
మద్దిలపాలెం: విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నెలవారీ నాటక ప్రదర్శనలో భాగంగా శుక్రవారం రెండు సందేశాత్మక నాటికలను ప్రదర్శించారు. వీఎండీఏ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.ఎస్.ఎన్. రాజు, డాక్టర్ గుమ్ములూరి రాంబాబు, పైడా కృష్ణప్రసాద్, నాంచారయ్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి ప్రదర్శనగా స్నిగ్ధ కలం నుంచి జాలువారిన ‘దోషేచ వహ్ని’నాటిక ప్రదర్శించారు. మధ్యతరగతి కుటుంబాల్లో కుమార్తెను అత్తవారింటికి పంపిన తర్వాత, ఆ తల్లిదండ్రులు సర్వం కుమార్తెకు ధారపోస్తూ, కోడలి వేదనను పట్టించుకోని ఇతివృత్తంతో ఈ నాటిక సాగుతుంది. ‘కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయినేషు రంభ, రూపేచ లక్ష్మి, క్షమ యా ధరిత్రి’ అనే ఆరు సూత్రాలను పాటిస్తూ జీవించే సీ్త్ర పాత్రను ఈ నాటిక స్పృశించింది. అయితే భర్త తప్పు చేసినప్పుడు.. సప్తమ సూత్రంగా ‘దోషేచ వహ్ని’ అని సీ్త్ర చైతన్యవంతురాలై తనకు తానుగా లిఖించుకోవాలి అన్న సందేశం ప్రేక్షకులను ఆకట్టుకుంది. కథాంశానికి తగ్గట్టుగా నటీనటుల చక్కని నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి. రెండవ నాటికగా కెరటాలు ప్రదర్శించారు. భాగవతుల రమాదేవి రచించిన ‘కెరటాలు’కథకు మునిపల్లె విద్యాధర్ నాటకీకరణ చేశారు. ఆధునిక భావాలతో నేటి యువత, ముఖ్యంగా మహిళలు తమ తల్లిదండ్రులను, ఆ తర్వాత భర్తను కూడా ఎదిరించడమే అభ్యుదయంగా భావించి తమ జీవితాలను, భవిష్యత్ను భగ్నం చేసుకుంటున్నారు. అలాంటివారు కెరటాల్లో కొట్టుకు పోకుండా.. గతంలో కొందరి జీవితాలను ఉదాహరణగా తీసుకుని ఒడ్డుకు చేరాలనే సందేశమిస్తూ ఈ నాటిక సాగింది. ఈ రెండు నాటికలను రాజాం కళాక్రియేషన్స్ సంస్థ ప్రదర్శించింది. -
జీ హుజూరు!
బెహరాకునేటి కౌన్సిల్లో కీలక అంశాలు మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించనున్న కౌన్సిల్ సమావేశంలో 27 అంశాలు సభ్యుల ఆమోదానికి చర్చకు రానున్నాయి. వీటితో పాటు మరికొన్ని టేబుల్ అజెండా అంశాలు వచ్చే అవకాశం ఉంది. వీటిలో మినిస్టీరియల్ విభాగానికి సంబంధించిన అంశాలు, పలు అభివృద్ధి పనులకు, ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి పొరుగు సేవల విధానంలో వర్క్ ఇన్స్పెక్టర్లు, మాస్ మజ్దూర్ల సేవలు 2026 మార్చి 31వరకు కొనసాగించేందుకు పరిపాలన ఆమోదం, జోన్–4లో యూజీడీలో లోపాల్లేకుండా నిర్వహణకు 6 కేఎల్ జెట్టింగ్ వాహనాలు సఫాయి కర్మచారీస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి అంగీకరించేందుకు పరిపాలన ఆమోదంతో పాటు మరికొన్ని అంశాలపై చర్చించి, నిర్ణయం తీసుకోనున్నారు. డాబాగార్డెన్స్ : శ్రీహరిపురంలో ఉన్న ఫస్ట్ రిఫరల్ యూనిట్(ఎఫ్ఆర్యూ) నెలవారీ ఆపరేషన్స్ అండ్ మెయింట్నెన్స్(నిర్వహణకు) బాధ్యతలను ప్రస్తుతమున్న విజయ(బెహరా) వెల్ఫేర్ సొసైటీకే అప్పగిస్తూ.. రూ.1.20 కోట్ల మేర చెల్లింపులు చేసేందుకు జీవీఎంసీ పాలకవర్గం సిద్ధమైంది. కుటుంబ సభ్యులు జీవీఎంసీలో కార్పొరేటర్లుగా ఉన్నప్పుడు... కాంట్రాక్టు ఎలా కట్టబెడతారంటూ గతంలో ఇదే కూటమి నేతలు తీవ్ర విమర్శలు చేశారు. కాంట్రాక్టును కేటాయించొద్దుంటూ కౌన్సిల్ సమావేశంలో నానా రభస చేశారు. మొన్న జరిగిన మేయర్పై అవిశ్వాస తీర్మానం ఓటింగ్లో బెహరా భాస్కరరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు జనసేనలోకి జంప్ కావడంతో కూటమికి ప్రీతిపాత్రులయ్యారు. దీంతో మొన్నటిదాకా అక్రమమంటూ పెడబొబ్బలు పెట్టిన ఇదే కూటమి నేతలు ఇప్పుడు ఎర్రతివాచీ పరిచి మరీ కాంట్రాక్టును కట్టబెట్టేందుకు సిద్ధమవుతుండటం గమనార్హం. ఈ మేరకు శుక్రవారం జరగనున్న సమావేశంలో 18వ ఎజెండాగా ఈ కేటాయింపుల అంశాన్ని చేర్చారు. అలాగే టెండర్లు పిలవకుండా ఎలా కేటాయిస్తారని స్థానిక ఎమ్మెల్యే మండిపడుతున్నట్టు తెలిసింది. అవినీతిపై విచారణ పూర్తి కాకుండానే.. ఓ సీనియర్ అసిస్టెంట్ వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోగా.. అనుమతి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి ఈయనపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇంకా విచారణ పూర్తి కాలేదు. అయితే తనను కలిసి దరఖాస్తు చేసుకున్నారంటూ మేయర్ ఏకంగా ఎజెండాలో మొదటి అంశంగా చేర్చినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై కూడా ఇదే కూటమి నేతలు గతంలో ఆరోపణలు గుప్పించిన విషయాన్ని పలువురు చర్చించుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గం ఓ జోన్గా.. 27 అజెండా అంశాలతో పాటు మరికొన్ని అంశాలు టేబుల్ అజెండాగా సభ్యుల ముందుకు చర్చకు రానున్నాయి. వీటిలో ప్రధానంగా ఇప్పటి వరకు జీవీఎంసీలో 8 జోన్లు ఉన్నప్పటికీ నియోజకవర్గాలకు సంబంధించి సమస్యలు తలెత్తుతున్నాయి. జోన్–5 కార్యాలయం జ్ఞానాపురంలో ఉంది. ఈ జోన్ పరిధిలోకి దక్షిణ నియోజకవర్గం, పశ్చిమ నియోజకవర్గం, ఉత్తర నియోజకవర్గానికి చెందిన వార్డులు వస్తున్నాయి. దీంతో నియోజకవర్గ సమస్య తలెత్తుతున్న దృష్ట్యా.. జీవీఎంసీ పరిధిలో గల నియోజకవర్గాల కిందకు ఆ నియోజకవర్గానికి చెందిన వార్డులను కేటాయిస్తూ కౌన్సిల్ సమావేశం తీర్మానించనుంది. ఇక నుంచి ఏ నియోజకవర్గానికి సంబంధించి, ఆ నియోజకవర్గ జోనల్ కార్యాలయంలోనే వ్యవహారాలు సాగనున్నాయి. ఈ అంశాన్ని టేబుల్ అజెండాలో పొందుపరిచినట్టు తెలిసింది. ● ఫస్ట్ రిఫరల్ యూనిట్ ఓఅండ్ఎంకు రూ.1.2 కోట్లు చెల్లింపు ● గతంలో తీవ్రంగా విమర్శించిన టీడీపీ ● జీవీఎంసీలో కార్పొరేటర్గా ఉండి పనులు ఎలా చేస్తారని నిలదీత ● ఇప్పుడు అవే పనుల అప్పగింతకు సిద్ధం ● నేటి కౌన్సిల్ సమావేశంలో గ్రీన్సిగ్నల్ ఇచ్చేందుకు నిర్ణయం కౌన్సిల్ సమావేశ మందిరం -
దిక్కులేని జీవీఎంసీ
● కమిషనర్ లేని పాలన.. విశాఖకు తీరని వేదన ● ఫైళ్లు పేరుకుపోతున్నాయి.. పనులు సాగడం లేదు ● జీవీఎంసీకి రెగ్యులర్ కమిషనర్ ఎప్పుడు? ● కూటమి నిర్లక్ష్యంపై నగర ప్రజల ఆగ్రహం డాబాగార్డెన్: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా.. ఐదు నెలలుగా రెగ్యులర్ కమిషనర్ లేకపోవడంతో నగర పాలన పూర్తిగా గాడితప్పింది. రాష్ట్రంలోనే అతి పెద్ద కార్పొరేషన్కు నెలల తరబడి కీలక అధికారిని నియమించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధి పనులు పూర్తిగా ఆగిపోయాయి. అధికారుల్లో జవాబుదారీతనం కొరవడింది. పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారి నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్తంభించిన పాలన రెగ్యులర్ కమిషనర్ లేకపోవడంతో జీవీఎంసీలో పర్యవేక్షణ కొరవడింది. పాలన స్తంభించిపోయింది. సుమారు 20 లక్షల జనాభా, 98 వార్డులున్న జీవీఎంసీ బాధ్యతలను కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్కు అప్పగించి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్న ఆరోపణలున్నాయి. ఓ వైపు కలెక్టరేట్ వ్యవహారాలు.. మరోవైపు జీవీఎంసీ బాధ్యతలతో ఆయన సతమతమవుతున్నారు. దీంతో క్షేత్రస్థాయి పర్యవేక్షణ కొరవడి, ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. కింది స్థాయి అధికారులు సైతం తూతూ మంత్రంగా విధులు నిర్వహిస్తుండడంతో ఫైళ్లు పేరుకుపోతున్నాయి. పనులు ముందుకు సాగడం లేదు. నూతన మేయర్ సైతం సమీక్షలకే పరిమితమయ్యారని, అధికారులను జవాబుదారీ చేసే స్థాయిలో చర్యలు కొరవడ్డాయని విపక్ష కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. అటకెక్కిన అభివృద్ధి, పారిశుధ్యం కమిషనర్ లేని లోటు అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత కమిషనర్ హయాంలో మురికివాడల అభివృద్ధి, రూ.500 కోట్లతో తాగునీటి పైపులైన్ల మంజూరు, గుర్తించిన 1,150 ఖాళీ స్థలాల్లో పార్కుల అభివృద్ధి వంటి కీలక ప్రతిపాదనలు చేశారు. విశాఖ పోర్ట్ ట్రస్ట్ ఆర్థిక సహకారంతో చేపట్టాల్సిన పనులన్నీ ప్రస్తుతం నిలిచిపోయాయి. ఉన్నతాధికారి పర్యవేక్షణ కొరవడటంతో పారిశుధ్య నిర్వహణ దయనీయంగా మారింది. ప్రధాన రహదారులు, జంక్షన్ల వద్ద పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా.. మురికివాడలు, కొండవాలు ప్రాంతాల్లో చెత్త పేరుకుపోతోంది. దోమలు విజృంభించి విషజ్వరాలు ప్రబలుతున్నాయి. దక్షిణ నియోజకవర్గంలో ప్రసాద్ గార్డెన్స్, వెలంపేట, పండావీధి, అల్లిపురం, కొబ్బరితోట, పద్మానగర్, చిలకపేట, జాలారిపేట, రంగిరీజువీధి, చెంగల్రావుపేట, జబ్బరతోట, పెయిందొరపేట, కోటవీధి, ఫెర్రీరోడ్డు, తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఆరిలోవ, డెయిరీఫాం ఏరియా, రామ్నగర్తో పాటు పలు మురికివాడ ప్రాంతాలు, ఉత్తర నియోజకవర్గ పరిధిలో పలు కొండవాలు ప్రాంతాలు, మురికివాడ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. జీవీఎంసీని గాడిలో పెట్టేదెవరు? జీవీఎంసీకి రెగ్యులర్ కమిషనర్ లేకపోవడం నగర పాలనపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. అభివృద్ధి కుంటుపడింది. పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. ఫైళ్లు కదలడం లేదు. రాష్ట్రంలోనే అతి పెద్ద కార్పొరేషన్కు కమిషనర్ను నియమించకుండా కూటమి ప్రభుత్వం ఆడుతున్న నాటకమేంటో? నగర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కమిషనర్ను నియమించడం అత్యవసరం. – బానాల శ్రీనివాసరావు, జీవీఎంసీ వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ ప్లాస్టిక్ నియంత్రణ ఎక్కడ? నగరంలో యథేచ్ఛగా ప్లాస్టిక్ వినియోగం కొనసాగుతోంది. గత మేయర్, కమిషనర్ హయాంలో చేపట్టిన ప్లాస్టిక్ నియంత్రణ కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించడానికి చేపట్టిన అవగాహన కార్యక్రమాలు, డోర్–టు–డోర్ ప్రచారాలు, నియంత్రణ కమిటీలు అన్నీ అటకెక్కాయి. దీంతో నగరంలో మళ్లీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దర్శనమిస్తోంది. ప్రజాగ్రహం, ప్రతిపక్షాల ఆందోళన జీవీఎంసీకి కమిషనర్ను నియమించడంలో ప్రభుత్వ వైఫల్యంపై నగర ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమిషనర్నే నియమించలేని ప్రభుత్వం.. రాష్ట్రాన్ని ఏం పాలిస్తుంది? అంటూ ప్రజలు నిలదీస్తున్నారు. ఐదు నెలలుగా కమిషనర్ లేకపోవడం జీవీఎంసీ చరిత్రలోనే ఇది మొదటిసారని, ఇది కూటమి ప్రభుత్వ ఘనకార్యమని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. తక్షణమే సమర్థవంతమైన ఐఏఎస్ అధికారిని కమిషనర్గా నియమించి, నగర పాలనను గాడిలో పెట్టాలని సీపీఎం, సీపీఐ ఫ్లోర్ లీడర్లు గతంలోనే నిరసన వ్యక్తం చేశారు. సమర్థంగా పనిచేస్తున్న కమిషనర్ను అర్ధాంతరంగా బదిలీ చేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపించారు. స్వప్రయోజనాల కోసం విశాఖను దిక్కులేని నగరంగా మార్చివేశారని, ప్రజల సమస్యలు పరిష్కరించే నాథుడే లేడని మండిపడ్డారు. -
ప్రతి విద్యార్థికి స్కూల్ కిట్లు అందాలి
ఆరిలోవ: వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచిన వెంటనే విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు అందించాలని కేజీబీవీ కార్యదర్శి, జిల్లా నోడల్ ఆఫీసర్ డి.దేవానందరెడ్డి తెలిపారు. విశాఖ జిల్లాలో మండల హెడ్క్వార్టర్లలో విద్యార్థి మిత్ర కిట్లు ఉన్న పలు స్టాక్ పాయింట్లను గురువారం సందర్శించారు. ఇందులో భాగంగా చినగదిలి మండలం తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్టాక్ పాయింట్ను పరిశీలించారు. అక్కడ కిట్లలో పాఠ్య పుస్తకాలు, బెల్టులు, బ్యాగులు పరిశీలించి, డీఈవో కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ డీఈవో ఎన్.ప్రేమ్కుమార్తో కలసి ఎంఈవోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎంఈవోలతో మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి విద్యార్థి మిత్ర కిట్లను అందించాలన్నారు. 121సి అడ్మిషన్ల విషయంలో ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్తో మాట్లాడి విద్యార్థులందరికీ ప్రవేశాలు పొందేవిధంగా జాగ్రతలు తీసుకోవాలన్నారు. ఈ నెల 21న విశాఖలో నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ విజయవంతానికి అందరు ఎంఈవోలు భాగస్వాములు కావాలని సూచించారు. ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేపట్టి పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు ప్రవేశాలు జరిగేటట్లు చూపడాలిన్నారు. కార్యక్రమంలో ఎస్ఎస్ఏ ఏపీసీ జె.చంద్రశేఖర్, సెక్టోరియల్ ఆఫీసర్లు, ఎంఈవోలు పాల్గొన్నారు. -
జూలై 9, 10 తేదీల్లో గిరి ప్రదక్షిణ
విశాఖ సిటీ: శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి గిరి ప్రదక్షిణ జూలై 9, 10 తేదీల్లో నిర్వహించనున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు ఎటువంటి అసౌకర్యం తలెత్తకుండా చూడాలని సూచించారు. భక్తులు జాతీయ రహదారిని దాటే చోట తాత్కాలిక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్, సీపీ శంఖబ్రత బాగ్చి అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి ఎన్హెచ్ఏఐ అధికారులను సమన్వయం చేసుకొని చర్యలు చేపట్టాలని చెప్పారు. తొలి పావంచా వద్ద ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు పోలీస్ బందోబస్తు, పోలీస్ శిబిరాలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలని చెప్పారు. క్యూలైన్లు, రద్దీ ప్రదేశాల వద్ద గట్టి బందోబస్తు కల్పించాలన్నారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున తాగునీరు, మరుగుదొడ్లు, రద్దీ ప్రదేశాల్లో లైటింగ్ ఏర్పాట్లు చేయాలని, ముందుగానే పారిశుధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంబులెన్సులు, వైద్య శిబిరాలు సిద్ధం చేయాలని వైద్యాధికారులకు సూచించారు. అప్పుఘర్ వద్ద భక్తులు సముద్ర స్నానాలు చేసే సమయంలో మైక్ ద్వారా జాగ్రత్తలు చెప్పాలని, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. కొండపై అగ్నిమాపక యంత్రం, ఫైర్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని చెప్పారు. అదనపు టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఉదయం నుంచి దర్శనాలు : ప్రధాన అర్చకుడు వైదిక కార్యక్రమాల షెడ్యూల్ను వివరించారు. జూలై 9వ తేదీ ఉదయం నుంచి దర్శనాలు మొదలవుతాయని, ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రచార రథయాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించారు. తొలి పావంచా వద్ద కొబ్బరి కాయ కొట్టడం ద్వారా 32 కి.మీ మేర గిరి ప్రదక్షిణ మొదలవుతుందని పేర్కొన్నారు. 10వ తేదీ సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగుతాయని, ఆ రోజే స్వామికి నాలుగో విడత చందన సమర్పణ జరుగుతుందని తెలిపారు. యంత్రాంగం సహకారంతో ఏర్పాట్లు ఆలయ ఈవో త్రినాథరావు మాట్లాడుతూ యంత్రాంగం సహకారంతో కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం తరఫున చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. గుర్తించిన 28 ప్రదేశాల్లో 290 తాత్కాలిక టాయిలెట్లు, 129 శాశ్వత టాయిలెట్లు, జీవీఎంసీ ఆధ్వర్యంలో మరో 29 శాశ్వత టాయిలెట్లు, 31 వైద్య శిబిరాలు, 6 ప్రధాన ప్రాంతాల్లో పబ్లిక్ అడ్రస్ సిస్ట్ం ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. కొండపైన 170, దిగువన 58 సీసీ కెమెరాలు ఉన్నాయని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మరిన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. తొలి పావంచా వద్ద అవసరానికి తగిన విధంగా కొబ్బరి కాయలు కొట్టేందుకు కౌంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. సమావేశంలో డీసీపీలు అజిత, మేరీ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, డీఆర్వో బి.హెచ్.భవానీ శంకర్, ఆర్డీవో సంగీత్ మాథుర్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ హరేందిర ప్రసాద్ -
బౌద్ధమతం శాంతిని బోధిస్తుంది
బౌద్ధ సన్యాసి గల్కండెగమ ఉదిత థెరో విశాఖ విద్య: శ్రీలంకలోని థెరవాడ సంప్రదాయానికి చెందిన బౌద్ధ సన్యాసి గల్కండెగమ ఉదిత థెరో ఏయూలోని విద్యా విభాగంలో ‘బౌద్ధమతం–శాంతి విద్య’పై గురువారం ప్రసంగించారు. ఆధునిక కాలపు సంఘర్షణలను పరిష్కరించడం, అంతర్గత సామరస్యాన్ని పెంపొందించడంలో నాలుగు గొప్ప సత్యాలు, అష్టాంగ మార్గం ఔచిత్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమం విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులకు బుద్ధుని బోధనల ద్వారా శాంతి యొక్క ఆధ్యాత్మిక, తాత్విక కోణాలతో నిమగ్నమయ్యే అరుదైన అవకాశాన్ని అందించింది. విభాగాధిపతి ప్రొఫెసర్ టి.షారోన్ రాజు మాట్లాడుతూ ఉపాధ్యాయ శిక్షణ, యువత అభివృద్ధిలో శాంతి విద్య యొక్క పరివర్తనాత్మక పాత్రను వివరించారు. -
పర్యావరణ హితమే ప్రధానం
బీచ్రోడ్డు: పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తూ, భూమి పొరలను నాశనం చేస్తున్న ప్లాస్టిక్ వాడకంపై నిషేధాజ్ఞలను కఠినంగా అమలు చేయాలని పర్యావరణ ప్రేమికులు విజ్ఞప్తి చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఇస్కాఫ్, గ్లోబల్ నెట్వర్క్, సోషల్ మీడియా క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఇస్కాఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు జె.ప్రభాకర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల పేరుతో వినాశకర వస్తువులను ఉపయోగించడం ద్వారా పర్యావరణానికి విఘాతం కలుగుతోందని, దీని వల్ల మానవాళి సంవత్సరాల తరబడి వైకల్యం, ఆరోగ్య సమస్యలతో బాధపడుతోందన్నారు. ఉప్పల అప్పలరాజు మాట్లాడుతూ యుద్ధం వద్దు.. శాంతి ముద్దు అని అన్నారు. మలయాళీ వరల్డ్ కౌన్సిల్ సెక్రటరీ జోషి, గ్లోబల్ నెట్వర్క్ ప్రతినిధి రామ్ ప్రభు, బస్ పోతన, వై.సత్యవతి తదితరులు పాల్గొని పర్యావరణ పరిరక్షణలో ప్రజలు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలు నినాదాలు చేశారు. -
కుమ్మేసిన వర్షం
ఆరిలోవ: నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. వారం రోజులుగా తీవ్రమైన ఎండతో అల్లాడుతున్న నగరవాసులకు ఈ వర్షం ఊరటనిచ్చింది. అయితే కొన్ని చోట్ల గాలివాన బీభత్సంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. జీవీఎంసీ 9వ వార్డు విశాలాక్షినగర్, ఎంవీపీ డబుల్రోడ్డులో చెట్లు నేలకూలాయి. కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రోడ్లపై చెట్లు విరిగిపడటంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదురైంది. శానిటరీ సిబ్బంది రంగంలోకి దిగి చెట్లను తొలగించారు. మద్దిలపాలెం ప్రాంతంలో సుమారు 45 నిమిషాల పాటు కురిసిన వర్షానికి రోడ్లు, కాలనీలు తడిసిముద్దయ్యాయి. మద్దిలపాలెం, కేఆర్ఎంకాలనీ, శివాజీపాలెం రోడ్డు, పిఠాపురంకాలనీలో రోడ్లు వర్షపు నీటితో నిండిపోయి చెరువులను తలపించాయి. మధురవాడ పరిసర ప్రాంతాల్లో గంటన్నర పాటు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు, హైవే సర్వీసు రోడ్లు జలమయమయ్యాయి. నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో కారు మబ్బులు అలుముకున్నప్పటికీ వర్షం కురవలేదు. -
సముద్ర ఆహార రంగాభివృద్ధికి నైపుణ్యం కీలకం
డాబాగార్డెన్స్: సముద్ర ఆహార విలువ జోడింపుపై గురువారం నగరంలో అంతర్ రాష్ట్ర నైపుణ్య ఒలింపియాడ్ జరిగింది. సముద్ర ఆహార ప్రాసెసింగ్ నిపుణుల కోసం మైరెన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ(ఎంపీఈడీఏ) తొలిసారిగా ‘ఇంటర్ స్టేట్ స్కిల్ ఒలింపియాడ్ ఆన్ సీఫుడ్ వాల్యూ అడిషన్ ప్రిలిమినరీ రౌండ్(జోన్ ఐఐ ఈస్ట్ కోస్ట్)’ను నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని ఎంపీఈడీఏ కార్యదర్శి అనిల్కుమార్ ప్రారంభించి మాట్లాడారు. భారతదేశ సముద్ర ఆహార రంగాన్ని అభివృద్ధి చేయడంలో నైపుణ్యాభివృద్ధి, విలువ జోడింపు కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. ఇది భారత ప్రభుత్వ వికసిత్ భారత్ 2047 దార్శనికతకు అనుగుణంగా ఉందని పేర్కొన్నారు. ఎంపీఈడీఏ జాయింట్ డైరెక్టర్ విజయ్కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎండీఎస్ఎస్ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షుడు, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పి.లక్ష్మణరావు, నెక్కంటి సీఫుడ్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్, శాస్త్రవేత్త డాక్టర్ కిజకుడాన్, ఫిష్ ప్యాకర్స్ ప్రతినిధి నాగహనుమాన్, రామకృష్ణ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా తూర్పు తీరానికి చెందిన 20 మంది నైపుణ్యం కలిగిన సముద్ర ఆహార నిపుణులు ఇంటర్–స్టేట్ స్కిల్ ఒలింపియాడ్లో పాల్గొన్నారు. వీరు రొయ్యలు, స్క్విడ్, తిలాపియాతో 10 విలువ ఆధారిత సముద్ర ఆహార ఉత్పత్తులను తయారు చేశారు. సముద్ర ఆహార పరిశ్రమ, మత్స్య సంస్థల నిపుణులతో కూడిన నలుగురు సభ్యుల ప్యానెల్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించింది. కార్యక్రమంలో ప్రాసెసింగ్ టెక్నాలజిస్ట్ డాక్టర్ రమ్యకుమారి, కోటేశ్వర్, అధికారులు పాల్గొన్నారు. ఎంపీఈడీఏ కార్యదర్శి అనిల్కుమార్