breaking news
Visakhapatnam
-
‘సుగాలి ప్రీతి కేసు సీబీఐకి అప్పగిస్తామన్నారు.. ఏమైంది?’
విశాఖ: టీడీపీ అంటే తెలుగు దురహంకార పార్టీ అని ధ్వజమెత్తారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. మహిళలను అవమానించడమే టీడీపీ నేతల అలవాటుగా పెట్టుకున్నారని ఆమె విమర్శించారు. జీడీ నెల్లూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త కృపాలక్ష్మీ కోసం ఎమ్మెల్యే థామస్ నీచంగా మాట్లాడరని, మహిళలను అవమానించినా చంద్రబాబు ఏమి అనరు అనే ధైర్యంతో రెచ్చిపోతున్నారని వరుదు కళ్యాణి మండిపడ్డారు. ‘ టిడిపి నేతల వాళ్ళ ఇంట్లో వాళ్ళని అంటే ఎలా ఉంటుంది. దళిత మహిళ అని కూడా చూడకుండా వ్యక్తిత్వ హననం చేశారు. ఈ ఘటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే కృపాలక్ష్మికి ఎమ్మెల్యే థామస్ క్షమాపణ చెప్పాలి. కృపాలక్ష్మి నిజాలు మాట్లాడితే ఆమెపై దాడి చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో టిడిపి నేతలు కాలకేయుల్లా ప్రవర్తిస్తున్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి జనసేన మహిళ నేత వీడియోలు తీయించాడు..డబ్బులు ఎరచూపి వీడియోలు తీయించారని కోట వినూత ఆరోపించారు. తప్పుడు పనులు చేసిన వారిపై పోలీసులను ఉపయోగించడం లేదు. సుగాలి ప్రీతి తల్లిని నిర్బంధించడానికి మాత్రం పోలీసులను వాడుతున్నారు. సుగాలి ప్రీతి తల్లిని అడ్డం పెట్టుకొని పవన్ ఓట్లు దండుకున్నారు.సుగాలి ప్రీతి కేసును సిబిఐకు ఇస్తామని ఎన్నికలకు ముందు పవన్ మాట్లాడారు. సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేయాల్సిన బాధ్యత బాబు పవన్ కళ్యాణకు లేదా?, సుగాలి ప్రీతి కేసులో సాక్ష్యాలు ఎప్పుడూ తారు సుగాలి ప్రీతి కేసులో సాక్ష్యాలు ఎప్పుడూ తారుమారయ్యాయి..?, ఎన్నికల్లో ఓట్ల కోసం సుగాలి ప్రీతి కేసును వాడుకున్నారు. జడ్పీ చైర్పన్ ఉప్పాల హారికపై టిడిపి గుండాలు దాడి చేశారు. కేసు పెడితే కనీసం పోలీసులు పట్టించుకోలేదు. రాష్ట్రంలో మహిళలపై ఎన్ని దాడులు జరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మహిళల పట్ల తప్పులు చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..?’ అని ప్రశ్నించారు వరుదు కళ్యాణి. -
బుల్లెట్ బైకులే టార్గెట్
శ్రీకాకుళం రూరల్: జల్సాలకు అలవాటు పడ్డారు. సులువుగా డబ్బు సంపాదించాలని మార్గాలు వెతికారు. బైక్ హ్యాండిల్ లాక్లను అన్లాక్ చేయడం నేర్చుకున్నారు. బైక్లను దొంగిలించి తక్కువ ధరకు అమ్మడం అలవాటు చేసుకున్నారు. ఆఖరికి పోలీసుల చేతికి చిక్కారు. బుధవారం రూరల్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ (క్రైం) శ్రీనివాసరావు కేసు వివరాలు వెల్లడించారు. శ్రీకాకుళం రూరల్ పరిసర ప్రాంతంలో 5 బుల్లెట్ బైక్లు, ఆమదాలవలస ప్రాంతంలో 2 బుల్లెట్ బైక్లు పోయినట్లు రూరల్ స్టేషన్లో కేసు నమోదైందన్నారు. రెండు రోజుల కిందట రాగోలు దూసి ప్రాంతంలో రూరల్ ఎస్ఐ రాము వాహనాలు తనిఖీలు చేస్తుండుగా రెండు బుల్లెట్లపై వస్తున్న ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా వ్యవహరించడంతో ఆరా తీశామని, అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు. ఖరీదైన వాహనాలే ఆదాయ వనరులు.. బుల్లెట్ దొంగతనాలకు పాల్పడిన ఎ–1 దండు రిషివర్ధన్ స్వస్థలం విశాఖపట్నం. పీఎం పాలెం పోలీస్స్టేషన్లో ఓ వివాహిత హత్య కేసులో ప్రధాన నిందితుడు. పార్వతీపురం రూరల్ పోలీస్టేషన్లో ఒక చీటింగ్ కేసులో ముద్దాయిగా ఉన్నాడు. ఎ–2 రాయిపల్లి వినోద్ స్వస్థలం సాలూరు కాగా.. అక్కడి పోలీస్స్టేషన్లో ఐదు సారా కేసులు, సాలూరు ఎకై ్సజ్ పోలీస్స్టేషన్తో పాటు గంట్యాడ పోలీస్స్టేషన్లో ఒక డెకాయిటీ కేసు, అలాగే పార్వతీపురం రూరల్ పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసులతో పాటు ఏడు కేసులు నమోదై ఉన్నాయి. ఇతనిపై పార్వతీపురం జిల్లా కలెక్టర్ పీడీ యాక్ట్ కూడా ఓపెన్ చేశారు. జైలులో పరిచయం.. : దండు రిషివర్దన్, రాయిపల్లి వినోద్లు ఇద్దరూ జైలులో ఒకరికి ఒకరు పరిచయమయ్యారు. విలువైన బైక్లు దొంగతనం చేసి నంబర్ మారిస్తే ఎవరూ పట్టుకోలేరని ప్లాన్లు గీశారు. గడిచిన మూడు నెలలుగా ఏడు బైక్లు దొంగిలించారు. దొంగిలించిన బైక్లను మూడో నిందితుడు, బైక్ మెకానిక్ కొత్తూరుకు చెందిన చిట్టి సంతోష్ సెకండ్ హ్యాండ్ బైక్ షోరూమ్ నిర్వాహకుడి సాయంతో విక్రయించారు. వీరి వద్ద నుంచి ఏడు బైక్లను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. -
కొత్త పీఆర్సీ ఏర్పాటు చేయాలి
మహారాణిపేట : కొత్త పీఆర్సీని ఏర్పాటు చేయడంతోపాటు తక్షణమే మధ్యంతర భృతి(ఐఆర్) ప్రకటించాలని, పెండింగ్ డీఏ, డీఆర్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ఇంజనీరింగ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యూ.కూర్మారావు డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా పరిషత్ ఆవరణలో జిల్లా కార్యవర్గ సంఘం సమావేశం జిల్లా అధ్యక్షుడు బి.వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూర్మారావు మాట్లాడుతూ పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు గ్రాట్యూటీ, ఇతర బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు. ఈనెల 27న ఏలూరులో జరిగే రాష్ట్ర సభ సమావేశానికి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో సభ్యులు హాజరు కావాలన్నారు. పెన్షనర్లకు బకాయి డీఏలతోపాటు మెడికల్ రీయింబర్స్మెంట్, తదితర అన్ని పెండింగ్ బిల్లులు చెల్లించాలన్నారు. స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ షేక్ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటివరకు 11వ వేతన సవరణ బకాయిలను చెల్లించలేదన్నారు. గడువు ముగిసి ఏళ్లు గడుస్తున్న 12వ వేతన సవరణ సంఘాన్ని ఇప్పటి వరకు నియమించలేదన్నారు. పింఛనుదారుల సమస్యలను కూడా పరిష్కరించాలన్నారు. సమావేశంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఆర్.కృష్ణకుమార్, ఇతర నాయకులు డి.ఎస్.కె.ప్రకాష్, వి.వెంకటేశ్వరరావు, పి.సత్యనారాయణ, బాపిరాజు తదితర సభ్యులు పాల్గొన్నారు. -
‘రుషికొండ భవనాలపై తదుపరి చర్యల్ని ఆపాలి’
సీతంపేట: ఏపీ టూరిజం అథారిటీ పర్యావరణ నియమాలు, కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి రుషికొండ భవనాలను అక్రమంగా ఉపయోగించుకునే ప్రతిపాదనలు పెట్టారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ ఆరోపించారు. ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రుషికొండ భవనాల కోసం హాస్పిటాలిటీ కన్సల్టేషన్ నోటీసుకు సంబంధించి ఈ నెల 11న టూరిజం అథారిటీ పబ్లిక్ నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. జాతీయ, అంతర్జాతీయ హాస్పిటాలిటీ ఆపరేటర్ల కోసం రుషికొండ భవానాల వినియోగంపై ఈ నెల 17న విజయవాడ టూరిజం కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్టు కొన్ని ఎంపిక చేసిన వాట్సాప్ గ్రూపుల్లో, వైబ్సైట్లలో పెట్టినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. హైకోర్టులో డబ్ల్యూపీ(పిల్) నెం.241/2021లో పిటిషనర్గా ఉన్నానని, కేసు ఇంకా పెండింగ్లో ఉందని గుర్తుచేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉందన్నారు. ఈలోగా ఇలాంటి పబ్లిక్ నోటీసులు సరికాదన్నారు. అధికారులు తదుపరి చర్యలను ఆపకపోతే కోర్టు ధిక్కరణ కింద హైకోర్టును ఆశ్రయిస్తానన్నారు. -
రైతులపై టీడీపీ నాయకుల దాడి
తగరపువలస: టీడీపీ నాయకుల ఆగడాలు పెచ్చుమీరిపోతున్నాయి. భూములను కాజేసేందుకు రైతులపై దాడులకు కూడా పాల్పడుతున్నారు. ఆనందపురం మండల పరిధిలో బడుగు రైతులైన తండ్రీ కొడుకులపై జరిగిన దాడే ఇందుకు నిదర్శనం. ఆనందపురం గ్రామపంచాయతీలో రైతులైన తండ్రీ కొడుకులు చందక సన్యాసప్పడు, శివకుమార్లపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు బుధవారం రాడ్లతో దాడికి పాల్పడ్డారు. కల్లంలో పనులు చేసుకుంటున్న తండ్రీ కొడుకుల వద్దకు వచ్చిన షిణగం పెద రామారావు, లెంక సన్యాసప్పడు, లెంక నారాయణమ్మ, లెంక నారాయణరావు, లెంక నరసింగరావు కొన్ని దస్తావేజులు తీసుకువచ్చి, వీరి ఫోన్లు లాక్కున్నారు. సంతకాలు చేయాలని, లేదంటే చంపేస్తామని బెదిరించారు. అయినప్పటికీ వినకపోవడంతో కర్రలు, కత్తులు, ఐరన్ రాడ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో వీరికి ఛాతీ, తల, వెన్నెముక భాగంలో గాయాలయ్యాయి. తొలుత బాధితులు ఆనందపురం పీహెచ్సీకి వెళ్లగా ప్రథమ చికిత్స అనంతరం కేజీహెచ్కు వెళ్లాలని వైద్య సిబ్బంది సూచించారు. కానీ, 108 సిబ్బంది వీరిని భీమిలి సీహెచ్సీకి తరలించి అవసరమైతే ఆటోలో కేజీహెచ్కు వెళ్లాలని చెప్పి ఊరుకున్నారు. దీంతో బాధితులు సంగివలస అనిల్ నీరుకొండ ఆస్పత్రికి వెళ్లారు. గతంలోనూ రెండుసార్లు దాడి బాధితులు సన్యాసప్పడు, శివకుమార్ మాట్లాడుతూ గతంలో వీఆర్వో త్రినాఽథ్, తహసీల్దార్ అంబేడ్కర్ సాయంతో తమకు చెందిన రెండు ఎకరాల భూమి రికార్డులు మార్చి, దొడ్డిదారిన పై టీడీపీ నాయకులు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 2004, 2014లో కూడా ఇదే విధంగా తమపై దాడికి పాల్పడ్డారన్నారు. నకిలీ డాక్యుమెంట్లతో భూమిని కాజేసి తరచూ దాడులకు పాల్పడుతున్న వీరినుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందన్నారు. ఏడాది క్రితం తమ వ్యవసాయభూమికి విద్యుత్ వైర్లు కట్ చేయించి, ట్రాన్స్ఫార్మర్లు కూడా వీరే ఎత్తుకువెళ్లి రెండు నెలల పాటు వ్యవసాయాన్ని దెబ్బతీశారని ఆరోపించారు. వీరిపై ఇప్పటికే కలెక్టర్కు ఫిర్యాదు చేశామన్నారు. -
నేటి నుంచి గ్రేట్ విశాఖ షాపింగ్ ఫెస్టివల్
మహారాణిపేట: జీఎస్టీ 2.0(సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్) కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరిగే ది గ్రేట్ వైజాగ్ షాపింగ్ ఫెస్టివల్ను విజయవంతం చేయాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ కోరారు. ఏయూ గ్రౌండ్స్లో షాపింగ్ ఫెస్టివల్ నిర్వహణ ఏర్పాట్లను కలెక్టర్ బుధవారం పరిశీలించారు. వివిధ రంగాలకు చెందిన వ్యాపార సంస్థల సౌజన్యంతో ఏర్పాటు చేస్తున్న స్టాళ్లను పరిశీలించారు. 60కి పైగా షాపులు ఏర్పాటు చేస్తున్నారని, ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఫెస్టివల్ జరుగుతుందని తెలిపారు. జీఎస్టీ తగ్గిన నేపథ్యంలో మార్కెట్ ధర కంటే తక్కువ రేటుకు వస్తువులు ఫెస్టివల్లో లభిస్తాయని, విశాఖ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఏయూలో పార్టనర్షిప్ సమ్మిట్ ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో నవంబర్ 14, 15 తేదీల్లో నిర్వహించనున్న పార్టనర్షిప్ సమ్మిట్ ఏర్పాట్లను కూడా కలెక్టర్ పరిశీలించారు. సమ్మిట్ నిర్వహణ కోసం తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు సమ్మిట్లో పాల్గొనేందుకు వచ్చే మార్గాలను, డెలిగేట్లు, ఇతర ప్రముఖులు, పాల్గొనేందుకు వచ్చే వారికి చేపట్టాల్సిన ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. అలాగే దీపావళి సందర్భంగా బాణసంచా సామగ్రి విక్రయించే స్టాళ్లను ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానం రోడ్డుకు అవతల వైపు ఉన్న మైదానాన్ని వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్టేట్ జీఎస్టీ అదనపు కమిషనర్ ఎస్.శేఖర్, టూరిజం అధికారి జె. మాధవి, జీవీఎంసీ, రెవెన్యూ, పోలీస్, సీఐఐ అధికారులు పాల్గొన్నారు. -
రుషికొండ భవనాలు నాట్ ఫర్ సేల్ అంటూ బ్యానర్లు
మధురవాడ: రుషికొండ భవనాలు నాట్ ఫర్ సేల్ అంటూ బ్యానర్లు ప్రదర్శిస్తూ జన జాగరణ సమితి వినూత్న రీతిలో నిరసన తెలిపింది. బుధవారం మధురవాడ ఐటీ సెజ్, రుషికొండ భవనాలు తదితర ప్రాంతాల్లో బ్యానర్లు ప్రదర్శించారు. ఈ సందర్భంగా జన జాగరణ సమితి ఉత్తరాంధ్ర కన్వీనర్ తాళ్లవలస దుర్గాప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తి పడి, చేతకానితనంతో రుషికొండ భవనాలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మడానికి చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రుషికొండ సముద్ర తీరంలో ఎంతో విలువైన భవనాలు నిర్మించిందన్నారు. కూటమి ప్రభుత్వానికి వాటిని ఎలా ఉపయోగించుకోవాలో చేతకాకపోతే కేంద్ర ప్రభుత్వానికి వీటిని అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన రుషికొండ భవనాలను రాష్ట్రపతి, గవర్నర్ల బంగ్లాలుగా.. లేకపోతే నేవీ నార్త్ కమాండ్ మ్యూజియంగా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలని కోరారు. వేల కోట్లు విలువ చేసే ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా కూటమి ప్రభుత్వంపై ఉత్తరాంధ్ర ప్రజలు తిరగబడాలని పిలుపునిచ్చారు. -
నకిలీ బాస్?
డ్రెడ్జింగ్కి మళ్లీడ్రెడ్జింగ్ కార్పొరేషన్ కార్యాలయంసాక్షి, విశాఖపట్నం : నష్టాల బాటలో పయనిస్తున్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ను గట్టెక్కించేందుకు చర్యలు తీసుకోవాల్సిన బోర్డు.. చేసిన తప్పునే మళ్లీ చేస్తోంది. సంస్థలో కీలకమైన పోస్టు ఎంపికలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గతంలో నకిలీ సర్టిఫికెట్లతో ఎండీగా, సీఈవోగా బాధ్యతలు చేపట్టిన జీవైవీ విక్టర్.. సంస్థను కోట్ల రూపాయలకు పైగా నష్టాల ఊబిలో కూరుకుపోయేలా చేశారు. నిండా మునిగిన తర్వాత తేరుకున్న ఉన్నతాధికారులు ఆయన్ని విధుల నుంచి తప్పించారు. తర్వాత జరిగిన ప్రధాన నియామకం కూడా అదేరీతిలో మారి వివాదాస్పదమైంది. సదరు వ్యక్తి 1987లో ఎస్సీ కోటా స్పెషల్ డ్రైవ్లో షిప్లో డెక్ కేడెట్గా డ్రెడ్జింగ్ కార్పొరేషన్లో చేరారు. 2009లో డీజీఎంగా పదోన్నతి పొంది.. పట్టుమని పది నెలలైనా పని చెయ్యకుండా డీసీఐకు రాజీనామా చేసేశారు. డీసీఐ ప్రత్యర్థి సంస్థగా చెప్పుకునే మెర్కటర్ సంస్థలో డీజీఎం ఆపరేషన్స్గా జాయిన్ అయ్యారు. రెండున్నరేళ్లు పనిచేసి తిరిగి 2012లో డీసీఐకి వచ్చేశారు. ఈ సమయంలో డీసీఐలో తిరిగి చేరినప్పుడు విద్యార్హతలకు సంబంధించిన నకిలీ ధృవపత్రాలను సమర్పించినా ఆయనకు కీలక బాధ్యతలు కట్టబెట్టేశారు. అర్హతలన్నీ అబద్ధాలే..! గతంలో కీలక బాధ్యతల పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు అందులో హిందూగా పేర్కొన్నారు. ఆ సమయంలోనే సదరు అధికారి నగరంలోని యూనియన్చాపల్ బాప్టిస్ట్ చర్చ్కి వైస్ చైర్మన్గా ఉన్నారు. క్రిస్టియన్గా ఉంటూ ఉద్యోగం కోసం చేసిన దరఖాస్తులో మాత్రం హిందూగా పేర్కొన్నారని ఆరోపణలు మొదలుకొని.. బీకామ్ డిగ్రీతో పాటు డ్రెడ్జ్ గ్రేడ్ మాస్టర్–1 అర్హతలపైనా విమర్శలు వెల్లువెత్తాయి. డిగ్రీ సర్టిఫికెట్ నకిలీదని గుర్తించారు. అంటే కేవలం ఇంటర్ విద్యార్హత ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి సింహాసనంపై కూర్చోబెట్టారన్న ఆరోపణలతో డీసీఐ అట్టుడికిపోయింది. ఈయన వ్యవహారశైలి, తప్పుడు ధృవపత్రాల అంశాలపై గతంలో సీబీఐకి ఫిర్యాదు చేయడంతో విచారణ చేసిన బోర్డు డిమోషన్ చేసి సీజీఎంగా బాధ్యతలు అప్పగించింది. కేంద్ర మంత్రి సిఫార్సుతో మరోసారి..! సీజీఎంగా ఉన్న సదరు అధికారికి సింహాసనంపైనే దృష్టి ఉండేది. ఆ కుర్చీ కోసం ఇన్చార్జ్గా నియమించిన ఉన్నతాధికారిని పక్కనపెట్టేసి.. అన్నీ తానై డ్రెడ్జింగ్లో చక్రం తిప్పేవారు. ఇప్పుడు కూటమి పార్టీకి చెందిన ఓ కేంద్ర మంత్రితో రికమెండేషన్ కోసం డీల్ మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. దీనివెనుక రూ.లక్షలు చేతులు మారాయనే ఆరోపణలు డీసీఐలో వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి సిఫార్సులకు బోర్డు కూడా తలొగ్గినట్లు తెలుస్తోంది. త్వరలోనే సదరు వ్యక్తిని కీలకు కుర్చీలో కూర్చోబెట్టేందుకు ఆర్డర్లు కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. గతంలో తప్పుడు ధృవీకరణ పత్రాలు, సామాజికవర్గం విషయంలోనూ తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తికి మళ్లీ అవే బాధ్యతలు కట్టబెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ పోర్టులో ఇటీవల బదిలీ అయిన వ్యక్తుల ప్రమేయం కూడా ఇందులో ఉన్నట్లు ఆరోపణలున్నాయి. మరోసారి ‘నకిలీ’ అధికారికి డ్రెడ్జింగ్లో కీలకబాధ్యతలు అప్పగిస్తే.. సంస్థ నష్టాలతో మరింత దిగజారిపోతుందన్న ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. సదరు ‘నకిలీ’ ఉన్నతాధికారి.. గతంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్కి రాజీనామా చేసి.. మెర్కటర్లో చేరిన తర్వాత.. డీసీఐకి నష్టం వాటిల్లేలా వ్యవహరించినట్లు కూడా సీబీఐకి కొందరు ఉద్యోగులు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఇలా ప్రతి విషయంలోనూ సదరు అధికారికి సంబంధించిన నియామకం వెనుక ఉన్న అక్రమాల జాబితాని జత చేర్చుతూ.. కేంద్ర పోర్టులు మంత్రిత్వ శాఖతో పాటు సీబీఐకి మరోసారి ఫిర్యాదు చేసేందుకు ఉద్యోగులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ‘నకిలీ’ నియామకానికి సహకరిస్తున్న పోర్టు అధికారులపైనా ఆధారాలతో సహా ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అక్రమాల పుట్టగా మారిన డ్రెడ్జింగ్ కార్పొరేషన్ మరోసారి వివాదాస్పద నియామకానికి సిద్ధమవుతోంది. నకిలీ ధృవపత్రాలతో గతంలో ఉన్నత హోదాలో కూర్చోబెట్టి.. తర్వాత విధుల నుంచి తప్పించిన బోర్డు.. ఇప్పుడు మళ్లీ సంస్థలో అదే వ్యక్తికి కీలక బాధ్యతలు అప్పగించేందుకు చూస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలో కీలకమైన పోస్టు నియామకంలో గుడ్డిగా వ్యవహరించడం వెనక కూటమి ఎంపీ సిఫార్సు ఉన్నట్లు తెలుస్తోంది. భారీగానే డబ్బులు చేతులు మారాయనీ.. అందుకే సదరు అనర్హుడైన ‘నకిలీ’ ఉన్నతాధికారిని మరోసారి సింహాసనంపై కూర్చోబెట్టేందుకు అంతా సిద్ధం చేసినట్లు సమాచారం. -
జీఎస్టీ 2.0తో సామాన్యులకు మేలు
జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఏయూక్యాంపస్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీ 2.0 విధానంతో సామాన్య ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ అన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బుధవారం బీచ్రోడ్డులో నిర్వహించిన ‘సూపర్ జీఎస్టీ– సూపర్ సేవింగ్స్’ కార్యక్రమాన్ని స్టేట్ జీఎస్టీ అడిషనల్ కమిషనర్ సీతాలమ్ శేఖర్తో కలిసి ఆయన ప్రారంభించారు. ముందుగా బీచ్లో ఏర్పాటు చేసిన సైకత శిల్పాన్ని ప్రారంభించి, ర్యాలీకి జెండా ఊపారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. నూతన జీఎస్టీ విధానం పర్యాటక రంగానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. దీని ద్వారా తక్కువ ఖర్చుతో తీర్థయాత్రలు, వినోద ప్రయాణాలు చేయడం సాధ్యపడుతుందన్నారు. పర్యాటకుల సంఖ్య పెరగడం వల్ల స్థానికంగా ఉండే దుకాణాలు, రెస్టారెంట్లు, హస్తకళల వ్యాపారాలు లాభపడతాయని వివరించారు. సీతాలమ్ శేఖర్ మాట్లాడుతూ జీఎస్టీ 2.0 విధానంలో రవాణా, కేటరింగ్ వంటి వాటికి డిమాండ్ పెరుగుతుందన్నారు. జిల్లా పర్యాటక అధికారి జె.మాధవి, డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు, హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు పవన్ కార్తీక్, సీనియర్ అడ్మిన్ ఎం.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఈఎన్సీ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా రియర్ అడ్మిరల్ మనోజ్ ఝా
సాక్షి, విశాఖపట్నం: తూర్పు నౌకాదళం(ఈఎన్సీ) చీఫ్ ఆఫ్ స్టాఫ్(ఆపరేషన్స్)గా రియర్ అడ్మిరల్ మనోజ్ ఝా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మనోజ్ ఝా డీఎస్ఎస్సీ (వెల్లింగ్టన్), యూకేలోని రాయల్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్లో విద్యనభ్యసించారు. 1995 జనవరి 1న నౌకాదళంలో ఫ్లాగ్ ఆఫీసర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. గోవాలోని నావల్ అకాడమీ, ఇండియన్ నావల్ వార్ కాలేజ్ (గోవా)లో విధులు నిర్వర్తించారు. గన్నరీ నిపుణుడైన మనోజ్ ఝా.. ఐఎన్ఎస్ చైన్నె యుద్ధ నౌకకు కమాండ్ ఆఫ్ డిస్ట్రాయర్గా విధులు నిర్వహించారు. ఏఎస్డబ్ల్యూ కర్వెట్ ఐఎన్ఎస్ కమోర్తా యుద్ధ నౌకకు మొట్టమొదటి కమాండింగ్ ఆఫీసర్గా, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విరాట్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా విజయవంతంగా బాధ్యతలు పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన నేవల్ హెడ్క్వార్టర్స్లో అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అక్కడి నుంచి ఈస్ట్రన్ నేవల్ కమాండ్కు రావడం గర్వంగా ఉందని మనోజ్ ఝా ఈ సందర్భంగా తెలిపారు. -
దివ్యాంగులతో ‘సదరం’గం
మహారాణిపేట: ఏళ్ల తరబడి జీవనాధారంగా ఉన్న పింఛను ఉంటుందో ఊడుతుందో తెలియక దివ్యాంగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన పింఛన్ల పునఃపరిశీలన ప్రక్రియ వారిలో గుబులు రేపుతోంది. సదరం సర్టిఫికెట్ల ప్రకారం 40 శాతం కన్నా తక్కువ వైకల్యం ఉందన్న కారణంతో జిల్లా వ్యాప్తంగా 1,150 మంది దివ్యాంగులకు నోటీసులు జారీ చేయడంతో వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. బుధవారం నుంచి నగరంలోని కేజీహెచ్, అగనంపూడి ప్రాంతీయ ఆస్పత్రి, ప్రాంతీయ కంటి ఆస్పత్రి, ఈఎన్టీ ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా వైద్య పరీక్షలు ప్రారంభించారు. కేజీహెచ్లో 25 మందికి, అగనంపూడిలో 25, కంటి ఆస్పత్రిలో 20, ఈఎన్టీలో ఇద్దరికి కలిపి మొత్తం 72 మందికి పరీక్షలు నిర్వహించారు. తమ వైకల్యాన్ని మరోసారి నిరూపించుకోవడానికి, కదల్లేని స్థితిలో ఉన్న వారు కుటుంబ సభ్యుల సహాయంతో ఆస్పత్రులకు రావడం పలువురిని కంటతడి పెట్టించింది. ‘అప్పుడు ధ్రువీకరించింది వైద్యులే కదా? ఇన్నేళ్ల తర్వాత మా వైకల్యం ఎలా తగ్గిపోతుంది?’అంటూ బాధితులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. తమ బతుకులతో ఆటలాడవద్దని, మానవతా దృక్పథంతో పింఛన్లు కొనసాగించాలని వేడుకుంటున్నారు. -
మాస్టర్ప్లాన్ రోడ్ల నిర్మాణంపై దృష్టి
విశాఖ సిటీ: వీఎంఆర్డీఏ పరిధిలోని మాస్టర్ప్లాన్ రహదారుల నిర్మాణాలను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని ఆ సంస్థ చైర్మన్ ప్రణవ్గోపాల్ అధికారులను ఆదేశించారు. బుధవారం వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో బృహత్తర ప్రణాళిక రహదారుల పనుల పురోగతిపై ఆయన అధికారులు, కాంట్రాకర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమయ్యే నాటికి రహదారులను వినియోగంలోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. జీవీఎంసీతో సమన్వయం చేసుకుంటూ.. భూమిని ఇచ్చిన లబ్ధిదారులకు టీడీఆర్లను అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఎలాంటి ఆటంకాలు లేకుండా స్పష్టంగా ఉన్న ప్రాంతాల్లో పెగ్ మార్కింగ్ చేసి పనులను ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. అటవీ శాఖకు చెందిన భూములున్న మార్గాల్లో పనులు చేసేందుకు అనుమతులు వేగంగా వచ్చేలా సంబంధిత అధికారులతో త్వరలో సమావేశం నిర్వహించాలన్నారు. జాయింట్ కమిషనర్ రమేష్, కార్యదర్శి మురళీకృష్ణ, ప్రధాన ఇంజినీర్ వినయ్ కుమార్, ఎస్టేట్ అధికారి దయానిధి, పర్యవేక్షక ఇంజినీర్లు భవానీ శంకర్, మధుసూదనరావు, కార్యనిర్వహక ఇంజినీర్లు రామరాజు, రాంబాబు, సుధీర్, వరుణ్ కార్తీక్ పాల్గొన్నారు. -
‘గూగుల్’కు భూములు ఇవ్వం
తర్లువాడ దళిత రైతుల స్పష్టీకరణ తగరపువలస: ఆనందపురం మండలం తర్లువాడకు చెందిన దళిత రైతులు.. తమ భూములను గూగుల్ టెక్కు ఇవ్వబోమని స్పష్టం చేశారు. బుధవారం రైతులతో భీమిలి ఆర్డీవో సంగీత్ మాథూర్, ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి, తహసీల్దార్ సూరిశెట్టి శ్రీనుబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రైతుల తరఫున సీపీఎం భీమిలి డివిజన్ కార్యదర్శి ఆర్.ఎస్.ఎన్.మూర్తి మాట్లాడారు. ప్రకృతిని ధ్వంసం చేసి, వ్యవసాయ భూముల్లో ఇలాంటి సెంటర్లను ఏర్పాటు చేయవద్దన్నారు. వాటిని ప్రత్యేక పారిశ్రామిక ప్రాంతాల్లోనే నిర్వహించుకోవాలని స్పష్టం చేశారు. గూగుల్ సెంటర్ కోసం భూములు తీసుకుని ఇచ్చే పరిహారం, ఉద్యోగాలు తమకు వద్దంటూ రైతులు నినాదాలు చేశారు. ఆర్డీవో చేసిన ప్రతిపాదనలను తిరస్కరించారు. ‘మా పొట్ట కొట్టి కూటమి ప్రభుత్వం సంబరాలు చేసుకుంటోంది’అని ఆరోపించారు. సీపీఎం ప్రతినిధి ఎస్.అప్పలనాయుడు పాల్గొన్నారు. -
మరణంలోనూ వీడని బంధం
కంచరపాలెం: ఒకరికొకరం జీవితాంతం తోడుగా ఉంటామని బాసలు చేసుకొని మనువాడిన వృద్ధ దంపతులు చివరికి మరణంలోనూ తోడుగా సాగారు. ఒక్క రోజు గడవకముందే ఒకరి తరువాత ఒకరు తనువు చాలించి మరణంలోను దాంపత్య బంధాన్ని చాటుకుని పలువురిని కంటతడి పెట్టించారు. వివరాలు ఇలా ఉన్నాయి. జీవీఎంసీ 48వ వార్డు కంచరపాలెం పరిధి బర్మాక్యాంప్ పల్నాటి కాలనీలో నివాసం ఉంటున్న కల్లింపూడి దేముడమ్మ(62) అనారోగ్యంతో మంగళవారం రాత్రి మరణించింది. బుధవారం కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు సిద్ధమవుతున్న సమయంలో దేముడమ్మ భర్త కల్లింపూడి తాతారావు(66) ఆమె పార్ధివదేహం వద్ద ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తాతారావు మృతి చెందాడని డాక్టర్లు ధ్రువీకరించారు. ఈ మరణవార్త కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను శోకసంద్రంలోకి నెట్టింది. బతికున్నన్నాళ్లు ఎంతో అన్యోన్యంగా ఒకరంటే ఒకరు ప్రేమతో మెలిగిన వృద్ధ దంపతులు ఒక రోజు గడవకముందే ఒకేసారి తనువు చాలించి ఒకరికొకరు తోడుగా సమాధికి సాగారు. ఎప్పుడు కనిపించినా తోడుగా ఇద్దరు కనిపించే దంపతులు చివరి అంకంలోను కలిసి సమాధి కావడం చూపరులను కలిచివేసింది. బుధవారం సాయంత్రం బర్మాక్యాంప్ శ్మశాన వాటికలో కుమారుడు శ్రీనివాస్, బంధువులు, గ్రామ ప్రజలు అంత్యక్రియలు నిర్వహించారు. కాగా వారి కుమారుడు కల్లింపూడి శ్రీనివాసరావు ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తూ కుటుంబానికి ఆధారంగా ఉన్నాడు. తల్లిదండ్రులను ఒకేసారి కోల్పోవడంతో గుండెలవిసేలా రోదిస్తున్నాడు. -
జీఎస్టీ సైకత శిల్పం
భీమునిపట్నం: భీమిలి బీచ్ వద్ద బుధవారం వాణిజ్య పన్నుల శాఖ, పర్యాటక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జీఎస్టీ తగ్గింపు వల్ల కలిగే ప్రయోజనాల గురించి విస్తృత ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా బీచ్లో ఏర్పాటు చేసిన సైకత శిల్పం పర్యాటకులు, స్థానికులను ఆకట్టుకుంది. ఏయూ ఫైన్ ఆర్ట్స్ విభాగం ప్రొఫెసర్ సింహాచలం పర్యవేక్షణలో విద్యార్థులు దీనిని రూపొందించారు. జీఎస్టీ తగ్గింపు, దాని వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలను వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్లు ఉమాశంకర్రావు, రాణి రత్నకుమారి, పర్యాటక శాఖాధికారి అశోక్ వివరించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సురేఖ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి, బీచ్లో విన్యాసాలు చేశారు. -
ఏయూ–జీవీఎంసీ మధ్య దివాళీ ట్రేడ్ ఫైర్
విశాఖ సిటీ: ఆంధ్ర విశ్వవిద్యాలయం మరో వివాదానికి కేంద్రమవుతోంది. ప్రైవేటు వ్యాపారాలకు యూనివర్సిటీ మైదానాన్ని లీజుకు ఇస్తుండడం ఏయూలో అగ్గి రాజేస్తోంది. తాజాగా ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ మైదానంలో ‘దివాళీ ట్రేడ్ ఫేర్’కు అనుమతి ఇచ్చే విషయంపై గందరగోళం నెలకొంది. ఒకవైపు ఎనిమిది రోజుల పాటు మైదానాన్ని లీజుకు ఇవ్వాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఏయూ వీసీకి లేఖ రాయడం ఇపుడు హాట్ టాపిక్గా మారింది. ఏయూ ఆడిటోరియాలు, మైదానాల్లో ప్రైవేటు కార్యక్రమాలను నిషేధిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ట్రేడ్ ఫేర్కు అనుమతులు ఎలా ఇస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రం ఈ దివాళీ ట్రేడ్ ఫేర్కు అనుమతులు ఇవ్వాలని ఏయూ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. మందుగుండు సామగ్రి స్టాళ్ల ఏర్పాటు పేరుతో కూటమి నేతలు భారీగా వసూళ్లకు తెరలేపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 8 రోజుల అనుమతికి లేఖ : ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ క్రీడా మైదానంలో హెలీప్యాడ్ ప్రాంతంలో స్టాళ్ల ఏర్పాటుకు ఈ నెల 14 నుంచి 21వ తేదీ వరకు 8 రోజుల పాటు లీజుకు ఇవ్వాలని జీవీఎంసీ కమిషనర్ ఏయూ వీసీకి లేఖ రాశారు. ముందు నాలుగు రోజులు స్టాళ్ల ఏర్పాటుకు, మూడు రోజుల పాటు అమ్మకాలకు, మరో రోజు వాటి తొలగింపునకు మైదానాన్ని కేటాయించాలని ఆ లేఖలో కోరారు. ఈ అనుమతులపై ఏయూ అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేనట్లు సమాచారం. ఇటీవలే క్రెడాయ్ ఒక కార్యక్రమం నిర్వహణకు ఈ మైదానాన్ని లీజుకు కోరగా.. ఏయూ అధికారులు అందుకు అంగీకరించలేదు. ప్రైవేటు కార్యక్రమాలను ఏయూలో అనుమతి లేదన్న ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయని చెప్పి క్రెడాయ్ కార్యక్రమాన్ని తిరస్కరించారు. ఇపుడు ఈ మందుగుండు సామగ్రి అమ్మకాలకు ఎలా అనుమతులిచ్చారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. స్టాల్కు రూ.1.5 లక్ష నుంచి రూ.2 లక్షలు : ఏయూలో స్టాళ్ల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే కూటమి నేతలు వసూళ్లకు తెరలేపారు. ఒక్కో స్టాల్కు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షలు రేటును నిర్ణయించినట్లు టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి ఒక సొసైటీ పేరుతో అనుమతులకు దరఖాస్తు చేసినప్పటికీ.. తెరవెనుక కూటమి నేతలే చక్రం తిప్పాలని చూస్తున్నట్లు సమాచారం. ఫలితంగా ఏయూలో స్టాళ్ల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చేలా ప్రజాప్రతినిధులు సైతం రంగంలోకి దిగి అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
వైద్య కళాశాలలను ప్రభుత్వమే కొనసాగించాలి
సీతంపేట: గత వందేళ్ల రాష్ట్ర చరిత్రలో కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని, వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రంతో మాట్లాడి ఒకేసారి 17 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అన్ని అనుమతులు తేవడం చారిత్రాత్మకమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె.రాజు అన్నారు. మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణ చెయ్యాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అక్కయ్యపాలెం హైవే వద్ద మంగళవారం చేపట్టిన కోటి సంతకాల సేకరణలో ఆయన పాల్గొన్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్పరం చేస్తే భవిష్యత్లో యువత ఎదుర్కొనే ఇబ్బందుల్ని వివరించి, ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్జగన్ మారుమూల ప్రాంత ప్రజలకు సైతం మెరుగైన వైద్యం అందేలా 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు అనుమతులు సాధించారన్నారు. వీటి వల్ల రాష్ట్రంలో అదనంగా 2,550 ఎంబీబీఎస్ సీట్లు పెరుగుతాయని, ఎంతో మంది పేద, మధ్యతరగతి పిల్లలకు వైద్య విద్య అందుబాటులోకి వస్తుందని ఆశించారన్నారు. ప్రతి మెడికల్ కళాశాలకు అనుబంధంగా 500 పడకల ఆస్పత్రితో ప్రజలకు ఉచితంగా వైద్యం అందేలా కృషి చేశారన్నారు. అమరావతిపై ఖర్చు చేసే రూ.లక్షల కోట్లలో కేవలం రూ.4 వేల కోట్లు వెచ్చిస్తే పెండింగ్లో ఉన్న మెడికల్ కళాశాలలన్నీ ప్రజలకు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, దానికి నిదర్శనం కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందనే అన్నారు. కూటమి ప్రభుత్వ తప్పుడు నిర్ణయంపై ప్రజల అభిప్రాయాన్ని సంతకాల రూపంలో సేకరించి గవర్నర్కు అందజేయనున్నట్లు వెల్లడించారు. మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో కొనసాగే వరకు వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, కార్పొరేటర్లు కె.అనిల్కుమార్రాజు, బర్కత్ ఆలీ, కోఆప్షన్ సభ్యడు సేనాపతి అప్పారావు, వలంటీర్ విభాగం జోనల్ అధ్యక్షుడు ఎం.సునీల్ కుమార్, జిల్లా అనుబంధ విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, రాష్ట్ర విద్యార్ధి విభాగం కార్యదర్శి బాణాల తరుణ్కుమార్, నీలి రవి, శ్రీదేవి వర్మ, వార్డు అధ్యక్షులు గుజ్జు వెంకటరెడ్డి, భీశెట్టి ప్రసాద్, హబీబ్, బలిరెడ్డి గోవింద్, కె.సుకుమార్, ఐ.రవికుమార్, మాజీ కార్పొరేటర్ పామేటి బాబ్జి, నియోజకవర్గ అనుబంధ సంఘాల అధ్యక్షులు షేక్ బాబ్జి, బాధ శ్రీను, జిల్లా కమిటీనాయకులు సాడి కేశవ్, బోగవిల్లి గోవింద్, జక్కంపూడి సత్యనారాయణ, చిరంజీవి, ఎర్రంశెట్టి శ్రీను, పద్మా శేఖర్, గంగా మహేష్, పారుపల్లి రవి, కె.చిన్న, మహేష్బాబు, మహాదాస్య గోపి, మౌనిక, కడితి రమేష్, అనిల్, బషీర్, వెంకటేష్ పాల్గొన్నారు. కోటి సంతకాల సేకరణలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు -
శ్రీశ్రీ స్ఫూర్తితో పోరాడాలి
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శ్రీశ్రీ మాటలను గుర్తుచేసుకుని పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లాలి. విశాఖ కేంద్రంగానే స్టీల్ ప్లాంట్ ఉద్యమం మొదలవ్వాలి. కేసులు పెట్టినా భయపడకుండా పోరాటం చేసినప్పుడే ప్లాంట్ను కాపాడుకోగలం. ఈ ఉద్యమానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. నిరుద్యోగ భరోసా అడిగితే .. బూటు కాలితో.. లాఠీతో ఇబ్బంది పెడుతున్నారు. ఆంధ్రయూనివర్సిటీలో సకాలంలో వైద్య సేవలు అందకపోవడంతో విద్యార్థి మృతి చెందాడు. ఎమెర్జెన్సీ అంబులెన్స్లో ఆక్సిజన్ కూడా ఉండకపోతే ఈ ప్రభుత్వం ఉంటే ఏంటి..లేకపోతే ఎందుకు..? – కొండా రాజీవ్, గ్రంఽథాలయ సంస్థ మాజీ చైర్మన్ -
ఆరేళ్ల తర్వాత చిక్కిన హత్యకేసు నిందితుడు
ఆరిలోవ: కోర్టు కేసు నడుస్తుండగా ఆరేళ్ల క్రితం పరారైన ఓ హత్య కేసులోని ప్రధాన నిందితుడిని ఆరిలోవ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఎన్ని చోట్ల గుట్టుగా గడిపినా చివరికి వెతికి పట్టుకుని, కటకటాల వెనక్కి పంపించారు. ఆరిలోవ పోలీస్ స్టేషన్లో ద్వారకా జోన్ ఏసీపీ అన్నెపు నర్సింహమూర్తి మంగళవారం మీడియాకు తెలిపిన వివరాలు.. ఆరిలోవ ప్రాంతం ప్రియదర్శినికాలనీ, సెయింట్ ఆన్స్ స్కూల్ వెనుక 2011 జూన్ 12న పందిరి రవి అలియాస్ చిత్తిరి రవి హత్యకు గురయ్యాడు. పాత కక్షల కారణంగా రవిని బాలాజీనగర్కు చెందిన తిరుమల రాఘవరాజు(ప్రస్తుత వయసు 40)తో పాటు మరో ఆరుగురు కలసి కత్తులతో దాడిచేసి సినీ ఫక్కీలో హత్య చేశారు. ఈ కేసులో ఏడుగురు ముద్దాయిలను ఆరిలోవ పోలీసులు అప్పట్లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అదే ఏడాది జూలై 1న వారిపై రౌడీ షీట్లు తెరిశారు. కోర్టులో కేసు నడుస్తుండగా ఏ1 ముద్దాయి రాఘవరాజు 2019 జూలై 24 నుంచి కోర్టు వాయిదాలకు హాజరు కాలేదు. రౌడీ షీట్ ఉన్నందున పోలీస్ స్టేషన్కూ వెళ్లకుండా పరారయ్యాడు. అప్పటి నుంచి పోలీసులు అతని కోసం ఎంత గాలించినా పట్టుబడలేదు. దీంతో కోర్టు 2023 మార్చి 10న మిగిలిన ఆరుగురు ముద్దాయిలకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అప్పటికే ఈ కేసులో ఉన్న ముగ్గ్రుు ముద్దాయిలు మరణించారు. మిగిలిన ముగ్గురు ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆరిలోవ సీఐ హెచ్.మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్ఐ పీడీబీ శంకర్, పీఎస్ఐ వరహాలు నాయుడు, కానిస్టేబుల్ జి.అప్పారావు బృందం ఆరు నెలల పాటు ప్రత్యేక నిఘా పెట్టారు. డిజిటల్ వాచ్ చేపట్టారు. చోడవరం ప్రాంతంలో ముద్దాయి ఓ క్వారీలో కూలీగా పనిచేస్తున్నట్లు తెలుసుకుని అక్కడకు చేరుకొన్నారు. పోలీసుల ఆచూకీ గమనించిన ముద్దాయి అక్కడి నుంచి అనకాపల్లి ప్రాంతానికి చేరుకుని కొన్నాళ్లు ట్యాక్సీవాలా అవతారం ఎత్తాడు. అతని ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు అనకాపల్లి మారుమూల గ్రామంలో మంగళవారం తిరుమల రాఘవరాజును పట్టుకుని రిమాండ్కు తరలించారు. ఏసీపీ నర్సింహమూర్తితో పాటు సీపీ శంఖబ్రత బాగ్చి ఫోన్లో సీఐ మల్లేశ్వరరావు బృందాన్ని అభినందించారు. -
సంపూర్ణ బంద్కు పిలుపు
కూటమి ప్రభుత్వం రాజ్యాంగంలోని ‘సోషలిస్ట్’ అంశాన్ని కాలరాస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం ఉధృతం చేయాలి. స్టీల్ ప్లాంట్, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి నగరంలో ఒక రోజు సంపూర్ణ బంద్ పాటించాలి. వేల కోట్లు అప్పు చేసి అమరావతి నిర్మాణం చేస్తున్నప్పుడు, పేదలకు ఉచిత వైద్యం అందించే మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించడం అన్యాయం. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష కమిటీ వేసి పోరాటం చేస్తే తాము తప్పకుండా పాల్గొంటాం. – డాక్టర్ ఎన్ఏడీ పాల్, ఆల్ ఇండియా బహుజన మేధావుల సమైక్య అధ్యక్షుడు. -
నేటి నుంచి మరోసారి దివ్యాంగుల సర్టిఫికెట్ల పరిశీలన
మహారాణిపేట: జిల్లాలో వివిధ కేటగిరీల కింద ఇస్తున్న దివ్యాంగుల పింఛన్ల రీ–వెరిఫికేషన్కు అధికార యంత్రాంగం శ్రీకారం చుట్టింది. గతంలో అనర్హులుగా తేలిన 1150 మంది దివ్యాంగుల పింఛన్లను మరోసారి పరిశీలించడానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఏర్పాట్లు చేశాయి. 40 శాతం లోపు వైకల్యం ఉన్న సదరం సర్టిఫికెట్లను వైద్యుల చేత రీ–వెరిఫికేషన్ చేయనున్నారు. ఇందులో భాగంగా బుధవారం నగరంలోని నాలుగు ఆస్పత్రులలో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.జిల్లాలో మొత్తం 21,306 మంది దివ్యాంగులు ఉండగా, ఇప్పటికే 16,187 మందికి రీ–వెరిఫికేషన్ పూర్తయింది. మిగిలిన 5,119 మందికి ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. గతంలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు గుర్తించిన 1150 మంది పింఛన్లు నిలిపివేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సచివాలయ ఉద్యోగుల ద్వారా నోటీసులు జారీ చేసిన తర్వాత, దివ్యాంగులు అప్పీల్ దరఖాస్తులు చేసుకుని, ఆందోళన చేపట్టడంతో రెండు నెలల పాటు పింఛన్లు ఇచ్చి, ప్రస్తుతం రీ–వెరిఫికేషన్ చేస్తున్నారు. ఎంపిక చేసిన ఈ నాలుగు ఆసుపత్రులలో బుధ, గురు, శుక్రవారాల్లో 40 శాతం లోపు ఉన్న సదరం సర్టిఫికెట్లను వెరిఫై చేస్తారు. ఆస్పత్రులు దివ్యాంగుల సంఖ్య కేజీహెచ్ 25 మంది అగనంపూడి ఆసుపత్రి 25 మంది ప్రాంతీయ కంటి ఆసుపత్రి 20 మంది పెదవాల్తేరు ఈఎన్టీ ఆసుపత్రి ఇద్దరు -
మైత్రి వాక్ 2.0 పోస్టర్ ఆవిష్కరణ
మద్దిలపాలెం: ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా డిసెంబర్ 6న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న ‘మైత్రి వాక్ 2.0’ పోస్టర్ను మంగళవారం ఏయూ ఉపకులపతి ఆచార్య జీపీ రాజశేఖర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని హ్యూమన్ జెనెటిక్స్ విభాగం, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఇంక్లూషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. పోస్టర్ ఆవిష్కరణలో ఏయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎంవీఆర్ రాజు, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఏ. నరసింహారావు, రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు, హ్యూమన్ జెనెటిక్స్ విభాగాధిపతి ఆచార్య వి. లక్ష్మి, సెంటర్ సెంటర్ ఫర్ సోషల్ ఇంక్లూజన్ డైరెక్టర్ డాక్టర్ పి. సుబ్బారావు, ఆచార్య జి. సుధాకర్, ఆచార్య జి. పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘తురకపాలెం మృతుల పట్ల ప్రభుత్వం వివక్ష’
సీతంపేట: ఇటీవల గుంటూరు జిల్లా తురకపాలెంలో కలుషిత నీరు తాగి మృతువాత పడిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లింపులో ప్రభుత్వం వివక్ష చూపిందని విస్తృత దళిత సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ బూసి వెంకటరావు విమర్శించారు. స్థానిక రామాటాకీస్ రోడ్లోని అంబేడ్కర్ భవన్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి తొక్కిసలాట మృతులకు రూ.25 లక్షలు చెల్లించిన ప్రభుత్వం, తురకపాలెం మృతులకు కేవలం రూ.5 లక్షలు చెల్లించడం అన్యాయమని, తక్షణమే నష్టపరిహారం రూ.25 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. తురకపాలెంలో వింత వ్యాధితో 40 మందికి పైగా మరణిస్తే, నెలలు గడిచినా బాధిత కుటుంబాలకు సరైన న్యాయం జరగలేదన్నారు. విషయాన్ని జాతీయ ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లగా, ప్రభుత్వం కంగారు పడి మొక్కుబడిగా రూ.5 లక్షలు పరిహారం చెల్లించి చేతులు దులిపేసుకుందన్నారు. తాగునీటిలో ఈకోలై, మెలియో వంటి ప్రమాదకర బ్యాక్టీరియా కలిసి మరణాలు సంభవించాయని, ఇది పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగ నిర్లక్ష్యమేనన్నారు. సమావేశంలో జాజి ఓంకార్, బూల భాస్కరరావు, గుడివాడ ప్రసాద్, యూఎస్ రాజు, సీహెచ్ దాలయ్య, కస్తూరి వెంకటరావు, సన్యాసిరావు పాల్గొన్నారు. -
ఉద్యమం.. ఉధృతం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోతే, త్వరలో ఈ ప్రాంత కూటమి ఎంపీలు, మంత్రుల ఇళ్లను ముట్టడిస్తాం.ఎన్నికల ముందు ప్రైవేటీకరణకు వ్యతిరేకమని చెప్పిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇప్పుడు దగ్గరుండి ప్రైవేటీకరణకు సహకరిస్తున్నారు. ఉత్తరాంధ్ర ఆత్మగౌరవమైన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతున్నా కూటమి ప్రజాప్రతినిధులు నోరు మెదపడం లేదు. వైఎస్సార్, వైఎస్ జగన్ హయాంలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగింది. చంద్రబాబు మళ్లీ అభివృద్ధిని అమరావతికే కేంద్రీకరించి, లక్షల కోట్లు అప్పు చేసి ఉత్తరాంధ్రకు అన్యాయం చేస్తున్నారు. వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రారంభించిన మెడికల్ కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారు. విశాఖలో విలువైన భూములను లులు, ఉర్సా వంటి సంస్థలకు కారుచౌకగా ఇస్తున్నారు. స్టీల్ ప్లాంట్, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవడానికి మేధావులు, రాజకీయ నేతలు ఐక్యంగా పోరాడాలి., ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడేందుకు ముందుకు వచ్చే అన్ని అఖిల పక్ష రాజకీయ పార్టీలను కలుపుకుని ముందుకువెళతాం. – కేకే రాజు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు -
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరిట దుష్ప్రచారం
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన మంచి పనులను కూడా కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోంది. కేంద్రం తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను సైతం వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై నెట్టి కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చేవరకు ప్రజా ఉద్యమాలు నిర్వహించి, ఈ ప్రాంతంలోని విశాఖ స్టీల్ ప్లాంట్, మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకుంటాం. – నీరుకొండ రామచంద్రరావు, స్టీల్ ప్లాంట్ ఉద్యమ నాయకుడు -
ఉద్యమాన్ని అణిచివేసే కుట్ర
ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మేస్తామంటే చూస్తూ ఊరుకోబోం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని అణచివేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఉద్యమ టెంట్ను తొలగించి ఉద్యమాన్ని లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను తొలగించడం, ఉద్యమాన్ని లేకుండా చేయడమే పనిగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. – ఆదినారాయణ, ఏఐటీయూసీ నాయకుడు -
అనంతుని పవిత్రోత్సవాలకు ఏర్పాట్లు
పద్మనాభం: స్థానిక కుంతీ మాధవస్వామి ఆలయంలో ఈ నెల 16 నుంచి 19 వరకు అనంత పద్మనాభస్వామి పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు ఆలయ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. పవిత్రోత్సవాలకు అవసరమయ్యే పవిత్రాలను తమిళనాడులోని శ్రీరంగం నుంచి తీసుకొచ్చి, ఆలయంలో భద్రపరిచారు. నూతన వస్త్రాలు సమకూర్చారు. 16వ తేదీ సాయంత్రం 6 గంటలకు పవిత్రోత్సవాలు ప్రాంభమవుతాయి. ఉత్సవాల్లో భాగంగా విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ వంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. 17న అగ్ని మథనం, అగ్ని ప్రతిష్టాపన, నిత్యహోమాలు, మూల మంత్రహోమం, పవిత్రాలకు అభిమంత్రణ, మహాఽశాంతి హోమం జరుపుతారు. 18న అష్ట కలశ స్నపన, పంచామృత అభిషేకాలు, నిత్య హోమం అనంతరం శ్రీరంగం నుంచి తెచ్చిన పవిత్రాలను స్వామికి సమర్పిస్తారు. కుంతీ మాధవస్వామి ఆలయంలోని కుంతీ మాధవస్వామి, శ్రీదేవి భూదేవి సమేత అనంత పద్మనాభ స్వామి పెద్ద ఉత్సవ విగ్రహాలకు, చిన్న ఉత్సవ విగ్రహాలకు, రుక్ష్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి, గోదాదేవి, లక్ష్మీదేవి, గిరిపై ఉన్న అనంత పద్మనాభ స్వామికి పవిత్రాలు సమర్పిస్తారు. పవిత్రాల అలకరణలో ఈ మూర్తులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. 19న ఉదయం విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, నిత్య హోమం అనంతరం పవిత్రాలను విసర్జింప చేస్తారు. పూర్ణాహుతి నిర్వహించి, కుంతీ మాధవస్వామి ఆలయంలోని శ్రీదేవి భూదేవి సమేత అనంత పద్మనాభస్వామి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా రూపొందించిన వేదిక వద్దకు తోడ్కొని వస్తారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఉదయం 11 గంటలకు శాంతి కల్యాణంతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. -
కూటమి నిర్లక్ష్యం.. పేదలకు ప్రాణ సంకటం
మహారాణిపేట: జిల్లాలోని పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించే వ్యవస్థను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తోందన్న విమర్శలు తీవ్రమవుతున్నాయి. ఒకవైపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు అందుబాటులో లేక రోగులు అవస్థలు పడుతుంటే, మరోవైపు కార్పొరేట్ ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోవడంతో నెట్వర్క్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోయాయి. ఆరోగ్యశ్రీకి అనారోగ్యం పేదలకు భరోసాగా ఉన్న ఆరోగ్యశ్రీ ప్రస్తుతం అనారోగ్యశ్రీగా మారిందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద అందించిన వైద్యానికి సంబంధించి కూటమి సర్కారు నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో నెట్వర్క్ ఆస్పత్రులు సేవలను నిలిపివేశాయి. దీంతో నాలుగు రోజులుగా కార్పొరేట్, నెట్వర్క్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందక రోగులు అల్లడిపోతున్నారు. జిల్లాలో బకాయిలు చెల్లించకపోవడంతో 62 నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఓపీ, ఐపీ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. అన్ని రకాల వైద్య సేవలు, శస్త్ర చికిత్సలు నిలుపుదల కావడంతో పేద రోగుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. నెట్వర్క్ ఆస్పత్రులకు వచ్చే పేద రోగులకు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలని వైద్యమిత్రులు, ఆరోగ్యమిత్రులు సూచనలు ఇస్తున్నారు. ఈ పరిస్థితి పేద రోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు కూడా వైద్య సేవల్లో ఇబ్బందులు కలిగిస్తోంది. పడకేసిన పల్లె వైద్యం పల్లెల్లో వైద్యం పడకేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ‘ఇన్ సర్వీస్ పీజీ కోటా’ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ పీహెచ్సీల్లో వైద్యులు గత నెల 26 నుంచి ఆందోళన చేస్తున్నారు. గత నెల 29 నుంచి ఓపీలను బహిష్కరించిన వైద్యులు, అక్టోబర్ 1వ తేదీ నుంచి సమ్మె బాట పట్టారు. దీంతో రోగులకు అరకొరగా సేవలు అందుతున్నాయి. సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్న సమయంలో వైద్యులు లేకపోవడంతో జ్వరాల బారిన పడుతున్న పల్లె ప్రజలకు స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులే డాక్టర్ల అవతారం ఎత్తి మందు బిళ్లలు ఇచ్చి పంపుతున్నారు. పేదల వైద్యంపై చిన్నచూపు ఒకవైపు ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం, మరోవైపు పీహెచ్సీల్లో వైద్యుల సమ్మెతో వైద్య సేవలు నిలిచిపోవడంతో పేద రోగులు వైద్యం కోసం అల్లడిపోతున్నారు. దాదాపు ఏడాదిన్నర కాలంగా వైద్య సేవలు అందించిన నెట్వర్క్ ఆస్పత్రులకు కూటమి సర్కారు చిల్లిగవ్వ కూడా విడుదల చేయలేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఆస్పత్రుల నిర్వహణపై తీవ్ర ప్రభావం పడింది. బకాయిలు చెల్లించకుంటే తాము ఆస్పత్రులను నడపలేమని ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ (ఆశా) ప్రకటించింది. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా పేదలకు అందే ఆరోగ్యశ్రీ సేవలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు వైద్య సేవలు అందించే ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్), వర్కింగ్ జర్నలిస్టుల వైద్య సేవలకు కూడా కొంతవరకు బ్రేక్ పడింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స కోసం వెళ్తే అవసరం లేని అనేక పరీక్షలు రాస్తూ, అధిక ఫీజులు వసూలు చేయడంతో పేదలకు వైద్యం అందని ద్రాక్షగా మారిందని, వైద్యం పేరు ఎత్తితేనే భయపడే పరిస్థితి నెలకొందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
2026 నాటికి మాస్టర్ ప్లాన్ రోడ్లు పూర్తి
మహారాణిపేట: విశాఖలో భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా మౌలిక వసతులను భారీగా అభివృద్ధి చేస్తున్నట్లు కలెక్టర్ హరేందిర ప్రసాద్ తెలిపారు. ఇందులో భాగంగా 15 మాస్టర్ ప్లాన్ రోడ్లను నిర్మిస్తున్నామని, వీటిలో ఏడింటి టెండర్లు పూర్తయ్యాయని, త్వరలో పనులు మొదలవుతాయని చెప్పారు. ఈ రోడ్లను 2026 ఏప్రిల్/మే నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీని ద్వారా 50 నిమిషాల్లో నగరం నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు చేరుకోవచ్చని తెలిపారు. తాగునీటి కోసం పోలవరం ఎడమ కాలువ నుంచి నీటిని తెచ్చేందుకు ప్రణాళికలు ఉన్నాయని, అలాగే 24 చెరువులను ఆధునీకరిస్తున్నామని పేర్కొన్నారు. గూగుల్ డేటా సెంటర్ రాకతో విశాఖ రూపురేఖలు మారుతాయని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. 16 నుంచి 19 వరకు షాపింగ్ ఫెస్టివల్ : జీఎస్టీ 2.0 సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమాల్లో భాగంగా నాలుగు రోజుల పాటు ఏయూ ఇంజినీరింగ్ మైదానంలో ఫెస్టివల్ను నిర్వహించనున్నారు. కలెక్టర్ హరేందిర ప్రసాద్ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఇందులో ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఆహార తయారీ వంటి సంస్థల నుంచి సుమారు 60 స్టాళ్లు ఉంటాయని తెలిపారు. జీఎస్టీపై అవగాహన శిబిరం, సాంస్కృతిక కార్యక్రమాలు, లక్కీ డ్రా వంటివి కూడా ఉంటాయని, ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. వినియోగదారులకు చేకూరుతున్న జీఎస్టీ ప్రయోజనాలను వివరించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో స్టేట్ జీఎస్టీ అదనపు కమిషనర్ ఎస్. శేఖర్, అసిస్టెంట్ కమిషనర్ రాంబాబు, టూరిజం అధికారిణి జె. మాధవి, హోటల్స్ అండ్ టూరిజం అసోసియేషన్ ప్రతినిధి పవన్ కార్తీక్ , ఇతర అధికారులు పాల్గొన్నారు. -
అమ్మేయడం..తీసేయడం..
కేంద్ర ప్రభుత్వ ఆశయం, లక్ష్యం దేశంలో ప్రభుత్వ సంస్థలను అమ్మేయడం, మూసేయడం, ఉద్యోగాలను తీసేయడమే. దేశవ్యాప్తంగా విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి 142 కంపెనీలను అమ్ముతున్నారు. చిన్న కంపెనీలను మూసేస్తున్నారు. మైనింగ్ పేరిట కొండలు, సంపదను లాగేసుకుంటున్నారు. అడ్డుపడితే మావోయిస్టుల పేరుతో చంపేస్తున్నారు. ఇటీవల విశాఖలో మోదీ, చంద్రబాబు యోగా కార్యక్రమం నిర్వహించడానికి కారణం – తాము ఏమి చేసినా దేశ ప్రజలు అవయవాలు మూసుకుని, ఊపిరి పీల్చుకోవాలే తప్ప ప్రశ్నించకూడదు అనేదే వారి ఆశయంలా ఉంది. – శ్రీనివాస్, ఎస్ఎఫ్ఐ నాయకుడు -
‘లా నేస్తం’ ఎత్తివేతతో ఇబ్బందులు
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ‘లా నేస్తం’ పథకం ద్వారా ప్రాక్టీస్ చేసే జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ. 5 వేలు అందేవి. కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని ఎత్తేయడంతో జూనియర్ న్యాయవాదులు జీవనం కోసం ప్రైవేట్, మార్కెటింగ్ కంపెనీల్లో చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో లాయర్ల కోసం కేటాయించిన కార్పస్ ఫండ్కు కూడా కూటమి ప్రభుత్వం టోకరా పెట్టింది. లీగల్ సెల్ తరఫున మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. – బాజినాయుడు, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు -
కురుపాం విద్యార్థినులకు మెరుగైన వైద్యం
మహారాణిపేట: కురుపాం గిరిజన బాలికల పాఠశాలలో అస్వస్థతకు గురై కేజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థినులు 65 మందిలో 59 మందిని డిశ్చార్జ్ చేసినట్టు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. మంగళవారం మంత్రి సంధ్యారాణి కేజీహెచ్ను సందర్శించి, చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి అందుతున్న వైద్య సేవలను గురించి కేజీహెచ్ సూపరింటెం డెంట్ డాక్టర్ ఐ. వాణిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి గుమ్మడి సంధ్యారాణి మీడియాతో మాట్లాడుతూ కురుపాం గిరిజన బాలికల పాఠశాలలో మొత్తం 146 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. అస్వస్థతకు గురైన వారిలో 65 మంది బాలికలను జాండీస్, జ్వరంతో బాధపడుతుండటంతో మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్లో చేర్చడం జరిగిందన్నారు. కేజీహెచ్లో మెరుగైన వైద్యం అందించడం ద్వారా 59 విద్యార్థినులు పూర్తిగా కోలుకొని వారి ఇళ్లకు తిరిగి వెళ్లడం జరిగిందన్నారు. మరో 6 గురిలో ముగ్గుర్ని కూడా డిశ్చార్జ్ చేయనున్నామన్నారు. రాష్ట్రంలో ఉన్న హాస్టల్స్, ఏకలవ్య స్కూల్స్, గురుకుల పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్లో మౌలిక సదుపాయాలు, మరమ్మతులకు సీఎం రూ. 90 కోట్లు మంజూరు చేసినట్లుగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ సందర్భంగా వివరించారు. -
డాక్టర్ ఎస్కేఈ అప్పారావుకి ‘లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు’
మహారాణిపేట: విజయవాడలో ఈనెల 10 నుంచి 12 వరకు జరిగిన 20వ సౌత్ జోన్ ఈఎన్టీ కాన్ఫరెన్స్కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి 700 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈఎన్టీ సంఘానికి సేవలందించిన డాక్టర్ ఎస్కేవీ అప్పారావుకు విశాఖలో సీనియర్ ఈఎన్టీ సర్జన్, అంకోశ అధ్యక్షులుగా వ్యవహరించినందుకు గాను, 40 ఏళ్ల నుంచి అందించిన వారి సేవలను గుర్తించి ‘లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అఖిల భారత ఈఎన్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ డి. ముఖర్జీ తదితరులు డాక్టర్ అప్పారావును సన్మానించారు. -
సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న ముగ్గురు అరెస్ట్
విశాఖ సిటీ: సైబర్ మోసాల ద్వారా బాధితుల నుంచి దోచుకున్న డబ్బును ’మ్యూల్ అకౌంట్ల’ ద్వారా ఉపసంహరించి వాటిని సైబర్ నేరగాళ్లకు క్రిప్టోకరెన్సీగా మార్చి అందించిన ముగ్గురు వ్యక్తులను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి సోమవారం రిమాండ్కు పంపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూర్మన్నపాలెం ప్రాంతంలో నివాసముంటున్న స్టీల్ప్లాంట్ ఉద్యోగికి టెలిగ్రామ్ యాప్లో ‘గోద్రేజ్ ప్రాపర్టీస్’ పేరు మీద ఉన్న గ్రూప్లో యాడ్ చేసి, ఇంటి వద్దే పార్ట్టైమ్ జాబ్ చేసుకోవచ్చని సందేశం వచ్చింది. అది నిజమని నమ్మి, వారు పంపించిన లింకులో అతను తన వివరాలు నమోదు చేసుకున్నాడు. అతనికి ‘5 స్టార్ రేటింగ్స్’ ఇచ్చే పనిని అప్పగించారు. మొదట్లో కొన్ని టాస్కులు పూర్తి చేసిన తరువాత లాభాలు కూడా అందడంతో అతనికి నమ్మకం ఏర్పడింది. తర్వాత ఫైజా అనే వ్యక్తి తాను సీబీఏవో అనే కంపెనీకి సలహాదారునిగా పనిచేస్తున్నానని చెబుతూ.. ఇందులో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మబలికాడు. ఇలా ఎన్ఈఎఫ్టీ, ఐఎంపీఎస్, యూపీఐ మార్గాల ద్వారా డబ్బులు పంపించమని కోరారు. ఆ సూచనల ప్రకారం బాధితుడు మొత్తం రూ.15.51 లక్షలు వివిధ బ్యాంకు లావాదేవీల ద్వారా జమ చేశారు. లాభాలు రాకపోగా.. డబ్బు విడుదల చేయాలంటే మరింత మొత్తం చెల్లించాలంటూ మోసగాళ్లు పదేపదే డిమాండ్ చేయడం ప్రారంభించారు. దీంతో మోసపోయినట్లు గ్రహించి వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.2.5 కోట్లు లావాదేవీలు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొదటిగా బ్యాంక్ లావాదేవీలు, యూపీఐ పేమెంట్ లింకులు, టెలిగ్రామ్ గ్రూప్ ఐపీ లాగ్లు, ఫేక్ వెబ్సైట్లను విశ్లేషించారు. ఈ ప్రక్రియలో అనేక లేయర్ల ద్వారా డబ్బు తిరిగి, తిరిగి చివరకు నంద్యాల జిల్లాకు చెందిన షేక్ సఫియుర్ రెహ్మాన్, షేక్ అబ్దుల్ రెహ్మాన్, షేక్ హుస్సేన్ వలీ ఖాతాల్లోకి చేరినట్లు తేలింది. వీరు సుమారు 15 బ్యాంక్ అకౌంట్ల ద్వారా క్యాష్ డిపాజిట్లు, సీఎండీ లావాదేవీలు, యూఎస్డీటీ కొనుగోళ్లు, అమ్మకాలు జరిపారు. టెలిగ్రాంలో పరిచయమైన జేఎండీ అకౌంట్లో సుమారు రూ.2.5 కోట్లు క్రిప్టోకరెన్సీ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఇందులో సఫియూర్ రెహ్మాన్కు సహకరించిన అబ్దుల్ రెహ్మాన్, షేక్ హుస్సేన్ వలీలను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ నేరాలకు వినియోగిస్తున్న బ్యాంక్ అకౌంట్స్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కోర్టులో ప్రవేశ పెట్టగా, వారికి 15 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడి కోసం పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. -
సత్తాచాటిన జూనియర్ అథ్లెట్లు వెంకట్రామ్, శేషు
విశాఖ స్పోర్ట్స్ : 40వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఆంధ్ర అథ్లెట్లు వెంకట్రామ్, శేషు పతకాలు సాధించారు. భువనేశ్వర్లో జరుగుతున్న ఈ మీట్లో ఎం. వెంకట్రామ్ అండర్–20 బాలుర 800, 1500 మీటర్ల పరుగుల్లో విజేతగా నిలిచి స్వర్ణాలు అందుకున్నాడు. విశాఖ అథ్లెట్ డి. శేషు అండర్–18 బాలుర విభాగపు 200 మీటర్ల పరుగును 22.09 సెకన్లలో పూర్తి చేసి తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని అందుకున్నాడు. ఆంధ్ర జట్టుకు కోచ్గా వైకుంఠరావు వ్యవహరించగా, పతకాలు సాధించిన వీరిద్దరినీ జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రతినిధులు అభినందించారు. -
రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావుకు పరామర్శ
ఆరిలోవ: అనారోగ్య కారణంగా హెల్త్ సిటీ మెడ్ సీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావును మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు సోమవారం సాయంత్రం పరామర్శించారు. ఆయనతో మాట్లాడి ధైర్యం చెప్పారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయనను పరామర్శించిన వారిలో పార్టీ భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు, డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్, కార్పొరేటర్ అనిల్కుమార్ రాజు, మాజీ కార్పొరేటర్ రవిరాజు, గంగా మహేష్, శివరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
సాక్షి, విశాఖపట్నం: కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరో రెండు రోజుల పాటు ఏపీలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నెల్లూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతిలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.పిడుగుపాటుకు ఇంజినీరింగ్ విద్యార్థి మృతిచిత్తూరు రూరల్: పిడుగుపాటుకు ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి చిత్తూరు మండలం అనంతాపురం పంచాయతీ ఏ.జంగాలపల్లిలో చోటుచేసుకుంది. ఏ.జంగాలపల్లి గ్రామానికి చెందిన చిట్టిబాబు నాయుడు కుమారుడు లతీష్కుమార్ (20) చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం కురిసింది. ఆ సమయంలో ఇంటి మిద్దెపైకి వెళ్లిన లతీష్కుమార్ పిడుగుపాటుకు గురయ్యాడు.పిడుగు శబ్దానికి జేబులో పేలిన ఫోన్అల్లూరి జిల్లా: పిడుగుపాటు శబ్దానికి జేబులో ఉన్న సెల్ఫోన్ పేలిపోయి గిరిజనుడికి తీవ్ర గాయాలయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలంలోని అత్యంత మారుమూల భూసిపుట్టు పంచాయతీ తోటలామెట్ట గ్రామానికి చెందిన గిరిజనుడు తాలబు మోహన్రావు(58) ఆదివారం సాయంత్రం గ్రామం నుంచి గాల్లెలపుట్టుకు వెళ్తుండగా మార్గం మధ్యలో భారీ వర్షం కురిసింది. అక్కడే పిడుగు కూడా పడింది. ఈ శబ్దానికి ప్యాంట్ జేబులో ఉన్న సెల్ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. మోహన్రావు పొట్ట కుడి భాగం తీవ్రంగా కాలింది. దీనిని గమనించిన స్థానికులు ప్రైవేట్ వాహనంలో ముంచంగిపుట్టు సీహెచ్సీకి తరలించారు. -
సిట్ కాదు.. సీబీఐ దర్యాప్తు కావాలి
భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భీమిలి చిన్నబజార్ జంక్షన్ నుంచి ఎకై ్స జ్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఎకై ్సజ్ సీఐ పిన్నింటి శ్రీనివాస్కు వినతి పత్రాన్ని అందించారు. నకిలీ మద్యం వ్యవహారంపై ప్రభుత్వ పెద్దల చేతుల్లో ఉండే సిట్తో కాకుండా సీబీఐ దర్యాప్తు జరపాలంటూ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ దంతులూరి వాసురాజు, డాక్టర్ మజ్జి శారద ప్రియాంక, కార్పొరేటర్ దౌలుపల్లి కొండబాబు, ఆనందపురం జెడ్పీటీసీ కోరాడ వెంకటరావు, భీమిలి వైస్ ఎంపీపీ బోని బంగారునాయుడు, రాష్ట్ర వైఎస్సార్ సీపీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు దాట్ల పెదబాబు, పోతిన హనుమంతు, ముఖ్య నాయకులు బెందాళం పద్మావతి, చేకూరి రజనీ, పిళ్లా సుజాత పాల్గొన్నారు. -
జీవీఎంసీ పీజీఆర్ఎస్కు వంద ఫిర్యాదులు
డాబాగార్డెన్స్: జీవీఎంసీలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మొత్తం 100 వినతులు అందినట్లు అధికారులు తెలిపారు. అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అందిన ఫిర్యాదుల్లో జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి సంబంధించి 13 వినతులు రాగా, జోన్ల వారీగా చూస్తే అత్యధికంగా జోన్–5 నుంచి 21, జోన్–8 నుంచి 18, జోన్–3 నుంచి 14 వినతులు అందాయి. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు ఆధ్వర్యంలో నాయకులు అదనపు కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. పెదగంట్యాడ వద్ద అదానీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటును రద్దు చేయాలని, తక్షణమే కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి యుద్ధ ప్రాతిపదికన తీర్మానం పంపాలని వారు కోరారు. ప్రధాన వైద్యాధికారి నరేష్కుమార్, ఫైనాన్సర్ అడ్వైజర్ మల్లికాంబ, సీసీపీ ప్రభాకరరావు, డీసీఆర్ శ్రీనివాసరావు, డీడీహెచ్ దామోదరరావు, పర్యవేక్షక ఇంజినీర్లు కె.శ్రీనివాసరావు, సంపత్కుమార్, గోవిందరావు, శాంతిరాజు, ఏడుకొండలు, డీసీపీలు హరిదాసు, కె.వేంకటేశ్వరరావు, రామ్మోహన్, యూసీడీ పీఓ ప్రసన్నవాణి, డీపీవో శాంతికుమారి పాల్గొన్నారు. -
కల్తీ దందా
కూటమి అండకల్తీ మద్యంపై కదం తొక్కిన వైఎస్సార్ సీపీ మహిళా విభాగంకల్తీ మద్యం మరణాల పాపం బాబుదే.. పశ్చిమ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్ ఆధ్వర్యంలో బాజీ జంక్షన్ నుంచి ఎన్ఏడీ తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ సీహెచ్.వి.రమేష్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మళ్ల మాట్లాడుతూ కల్తీ మద్యం మరణాల పాపం ముఖ్యమంత్రి చంద్రబాబుదే అని అన్నారు. ఈ ర్యాలీలో నియోజకవర్గ పరిశీలకుడు చింతలపూడి వెంకటరామయ్య, జిల్లా అంగన్వాడీ అధ్యక్షురాలు శ్రీదేవి వర్మ, పశ్చిమ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు పేడాడ జ్యోత్స్య, కార్పొరేటర్లు పి.వి.సురేష్, బల్లా లక్ష్మణరావు, గుండపు నాగేశ్వరరావు, వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
పుట్టగొడుగుల్లా బెల్ట్ షాపులు
తూర్పు నియోజకవర్గంలో సమన్వయకర్త మొల్లి అప్పారావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కల్యాణి, మహిళా విభాగం నాయకులతో కలిసి ఎకై ్సజ్ అధికారికి వినతి పత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా వెలిశాయని, మద్యం మత్తులో హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర మత్స్యకార విభాగం అధ్యక్షుడు పేర్ల విజయచందర్, సీనియర్ నాయకుడు గొలగాని శ్రీనివాస్, కార్పొరేటర్లు మొల్లి లక్ష్మి, పల్లా అప్పలకొండ, కోరుకొండ వెంకట స్వాతి దాసు, జిల్లా అధికార ప్రతినిధి పల్లా దుర్గారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మువ్వల సురేష్ తదితరులు పాల్గొన్నారు. కల్తీ మద్యంతో రోడ్డున పడ్డ కుటుంబాలు దక్షిణ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ ఆధ్వర్యంలో కల్తీ మద్యంపై వినూత్నంగా నిరసన తెలిపారు. రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి ఇప్పటికే ఎంతో మంది చనిపోయారని, ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాసుపల్లి ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మహిళల పసుపు కుంకుమలకు చెందిన విషయం కాబట్టి వారికి అండగా నిలబడేలా సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం జగదాంబ జంక్షన్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ తహసీల్దార్కు పార్టీ నాయకులు జాన్వెస్లీ, సనపల రవీంద్రభరత్, కార్పొరేటర్లు తోట పద్మావతి, బిపిన్కుమార్ జైన్తో పాటు పార్టీ అనుబంధ సంఘాల నాయకులతో కలిసి వినతి పత్రం అందజేశారు.75 వేల బెల్టు షాపులు తొలగించాలి ఉత్తర నియోజకవర్గంలో పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణకుమారితో పాటు పార్టీ శ్రేణులు, ప్రజలతో కలిసి బిర్లా జంక్షన్ నుంచి మాధవదారలోని ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి అసిస్టెంట్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కల్తీ మద్యంపై సీబీఐ విచారణ చేపట్టాలని, రాష్ట్రంలోని 75 వేల బెల్టు షాపులను తొలగించాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ మేయర్ కె.సతీష్, జీవీఎంసీ ఫ్లోర్లీడర్ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్లీడర్ అల్లు శంకరరావు, స్టాండింగ్ కమిటీ మెంబర్ సాడి పద్మారెడ్డి, కార్పొరేటర్లు, మహిళా నేతలు పాల్గొన్నారు. -
నకిలీ మద్యం విక్రయాలు అరికట్టాలి
గాజువాకలో సమన్వయకర్త తిప్పల శ్రీనివాస దేవన్రెడ్డి ఆధ్వర్యంలో దిబ్బపాలెం పునరావాస కాలనీలోని గాజువాక ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. తొలుత 71వ వార్డులోని సుందరయ్య కాలనీలో ఆంజనేయస్వామి ఆలయం వద్ద పోస్టర్లను ప్రదర్శించారు. నకిలీ మద్యం విక్రయాలను అరికట్టాలని కోరుతూ ఎకై ్సజ్ సీఐకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ విశాఖ పార్లమెంట్ పరిశీలకుడు కదిరి బాబూరావు, నియోజకవర్గ పరిశీలకుడు తైనాల విజయ్కుమార్, కార్పొరేటర్లు మహ్మద్ ఇమ్రాన్, ఉరుకూటి చందు, భూపతిరాజు సుజాత, వార్డు అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
కలెక్టరేట్ పీజీఆర్ఎస్కు 271 వినతులుమహారాణిపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వచ్చిన ఫిర్యాదులను పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి, పునరావృతం కాకుండా సంతృప్తికరమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవా రం కలెక్టరేట్లో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి కలెక్టర్ వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీదారుడు సంతృప్తి చెందేలా సత్వర, శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్, జీవీఎంసీ విభాగాలకు సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రీ–ఓపెన్ అవుతున్న అర్జీలపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై పరిష్కరించిన అర్జీలకు సంబంధించి అర్జీదారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడతానని కలెక్టర్ తెలిపారు. సోమవారం పీజీఆర్ఎస్కు మొత్తం 271 వినతులు అందాయి. వీటిలో రెవెన్యూకు 82, పోలీస్కు 15, జీవీఎంసీకి 86, ఇతర విభాగాలకు 88 ఫిర్యాదులు ఉన్నాయి. జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వర్మ తదితర అధికారులు వినతులు స్వీకరించారు. -
దక్షిణకోస్తాకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన
విశాఖ : ఏపీపై ఉపరితల ఆవర్తనాల ప్రభావ కొనసాగుతోంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం స్పష్టం చేసింది. దీనిలోభాగంగా ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ఇక కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయ్యింది. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది. రాగల 24 గంటలపాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని తుఫాన్ హెచ్చరికల కేంద్ర ముఖ్య అధికారి శ్రీనివాస్ తెలిపారు. -
అదరగొట్టిన ‘గ్లామ్ రన్ వే’
బీచ్రోడ్డు: నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన ‘గ్లామ్ రన్ వే’ ..‘డ్యాన్స్ టోపియా’ మెగా ఫైనల్ కార్యక్రమం ఆహుతులను ఆకట్టుకుంది. మూడేళ్ల నుంచి 14 ఏళ్ల వయసున్న చిన్నారులు ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు.ర్యాంప్ వాక్ విభాగంలో పిల్లలు ఇండియన్ ట్రెడిషన్, బీచ్, అల్ట్రా స్టైలిష్ వంటి రౌండ్లలో నడిచి మెరిశారు. డ్యాన్స్ టోపియాలో సోలో – గ్రూప్ విభాగాలలో తమ నృత్య ప్రదర్శనలతో వేదికను అదరగొట్టారు. ఈ పోటీలకు హేమలత రెడ్డి, సంతోష్, ప్రీతి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించగా, అభయ్ అరోరా ప్రత్యేక ప్రదర్శన అలరించింది. విజేతలకు సిరి మెకోవర్స్ సౌమ్య, నైరా గోల్డ్ మనోజ్ అవార్డులు, కిరీటాలు బహూకరించారు. ఈ చిట్టి మోడల్స్తో ప్రత్యేక క్యాలెండర్ను రూపొందిస్తామని నిర్వాహకులు వీరు మామ తెలిపారు. -
‘మధ్యంతర భృతి వెంటనే ప్రకటించాలి’
ఆరిలోవ: ఉద్యోగ, ఉపాధ్యాయులకు మధ్యంతర భృతి(ఐఆర్) వెంటనే ప్రకటించాలని స్టేట్ టీచర్స్ యూనియన్(ఎస్టీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమంది పైడిరాజు ఆదివారం ఓ ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడిచినా ఇంత వరకు ఐఆర్ ప్రకటించలేదన్నారు. దీంతో పాటు పెండింగ్లో ఉన్న డీఏలు కూడా చెల్లించలేదని ఆక్షేపించారు. సాధారణ ఎన్నికల ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇంతవరకు పీఆర్సీ కమిషన్ నియమించకపోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నట్లు పేర్కొన్నారు. ఈహెచ్ఎస్ కింద ప్రతి ఉద్యోగి నెలానెలా కొంత మొత్తం చెల్లిస్తున్నా.. కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులు వైద్యం అందించేందుకు నిరాకరిస్తున్నాయని వాపోయారు. తక్షణమే ఈ సమస్యలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. -
అడ్డగోలు నిల్వలు.. అనుమతిలేని అమ్మకాలు
సాక్షి, విశాఖపట్నం/మహరాణిపేట : దీపావళి పండగకు మరో వారం రోజులే ఉంది. దీంతో బాణసంచా తయారీ కేంద్రాలు, విక్రయ దుకాణదారులు ప్రభుత్వ నిబంధనలు పాటించకుంటే లైసెన్సులు రద్దు చేస్తామని అధికారులు మొక్కుబడి హెచ్చరికలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో నిబంధనలు పాటించకుండా మందుగుండు సామగ్రిని వ్యాపారులు విక్రయిస్తున్నారు. ఓవైపు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల సీజన్ కావడం.. దీపావళి సమీపిస్తుండటంతో.. విశాఖ జిల్లాపై బాణసంచా పడగ విప్పుతోంది. నిత్యావసరాల మాటున ఇప్పటికే పట్టణానికి పెద్దఎత్తున బాణసంచా నిల్వలు చేరుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. అంతా కూటమి కనుసన్నల్లోనే..! అధికారికంగా దీపావళి సామగ్రి విక్రయించేందుకు ఏయూ మైదానంతోపాటు ఎంవీపీ కాలనీలో ఏఎస్ రాజా కాలేజీ గ్రౌండ్స్, బీచ్ రోడ్డులో ఓ ఫంక్షన్ హాల్, గాజువాక, గోపాలపట్నం, షీలానగర్, స్టీల్ప్లాంట్ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేస్తుంటారు. ఈ స్టాల్స్కు జీవీఎంసీ, రెవెన్యూ, వాణిజ్య పన్నులశాఖ, పోలీసులు, అగ్నిమాపక శాఖ అనుమతులు కావాలి. అయితే.. ఈ ప్రభుత్వ విభాగాల అనుమతులు కావాలంటే.. స్థానిక కూటమి నేతల అనుమతులు తప్పనిసరిగా మారింది. తమ అనుచరులకు, తర్వాత ఎవరు ఎక్కువ మొత్తం ముట్టజెబితే వారికే స్టాల్స్కు పర్మిషన్లు ఇవ్వాలంటూ ఇప్పటికే ఆయా విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికార పార్టీ నేతలతో పాటు తామేం తక్కువ తినలేదంటూ.. తమ చేతులు కూడా తడిపితేనే అనుమతులిచ్చేందుకు అధికారులు సైతం సిద్ధమవుతున్నారు. ఈ లెక్కన ఈసారి ఇష్టారాజ్యంగా విక్రయాలకు పర్మిషన్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. గతేడాది 524 దుకాణాలకు అనుమతులివ్వగా.. ఈసారి 700 దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. శివార్లలో తయారీ కేంద్రాలు ఒడిశా, తమిళనాడు నుంచి ఎక్కువగా ఇక్కడికి బాణాసంచా వస్తుంటుంది. విజయనగరం నుంచి కూడా తీసుకొస్తుంటారు. వీటిలో ఎక్కువగా చైనా టపాసులు దిగుమతువుతున్నాయి. బ్రాండెడ్ టపాసులపై 18 శాతం జీఎస్టీతో పాటు బాణసంచా విక్రయ లైసెన్సులపైన మరో 10 శాతం జీఎస్టీ విధిస్తుంటారు. మొత్తం 28 శాతం పన్ను చెల్లించాలి. దీనికి తోడు.. కూటమి నేతలకు, లైసెన్స్ కోసం ఆయా విభాగాధికారులకు ముడుపులు అదనం. దీంతో అధిక లాభాలకోసం కొందరు సొంత తయారీ కేంద్రాల్ని గుట్టుచప్పుడు కాకుండా నడుపుతున్నట్లు సమాచారం. కొంతమంది అనుమతుల్లేకుండా విచ్చలవిడిగా మందుగుండు సామగ్రి తయారీని కుటీర పరిశ్రమగా మార్చుకుంటున్నారు. పైగా విధివిధానాలను పాటించకపోవడంతో పలు ప్రాంతాల్లో ఈమధ్య కాలంలో భారీ విస్ఫోటనం జరిగి భయానక పరిస్థితులు సంభవిస్తున్న విషయం తెలిసిందే. విచ్చలవిడిగా ముడిసరకు బాణసంచా తయారీకి వినియోగించే ముడిసరకు గన్న్పౌడర్, కోల్ పౌడర్, సల్ఫర్, ఐరన్ కోర్, సురేకారం ఎక్కడికక్కడ బహిరంగ దుకాణాల్లో దొరుకుతోంది. దీంతో పలువురు వాటిని కొనుగోలు చేసి స్వయంగా తయారీకి సిద్ధమవుతున్నారు. ఇటీవల విజయదశమి వేడుకల సందర్భంగా భీమిలి నియోజకవర్గం వలందపేటలో మందుగుండు సామగ్రి తయారీకి ప్రయత్నించగా రాత్రివేళ భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే తేరుకున్నట్లు నటించిన అధికారులు, పోలీసులు.. ఆనందపురం, పద్మనాభం, భీమిలి, భోగాపురం మండలాల్లో బాణసంచా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు చేసి భారీ మొత్తంలో మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఆనందపురం మండలంలో శొంఠ్యాం, పెద్దిపాలెం, వెల్లంకి, నేల్తేరు, దిబ్బడిపాలెం గ్రామాల్లో విశాఖ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. పద్మనాభం మండలంలో అర్చకులవానిపాలెం వద్ద ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. చిన్న చిన్నగా పల్లెల్లో విక్రయించేందుకు తయారు చేస్తున్న వారిపై ప్రభుత్వం ప్రతాపం చూపిస్తుందే తప్ప.. కూటమి నేతల అండతో భారీ మొత్తంలో తయారీ కేంద్రాలు నడుపుతున్న వాటివైపు కన్నెత్తి చూడటం లేదు. భీమిలి, పద్మనాభం, రెడ్డిపల్లి, పాండ్రంగి, కొవ్వాడ, కురపిల్లి, నియోజకవర్గ సరిహద్దు ప్రాంతాలు కవులవాడ, తుడాం, బసవపాలెం గ్రామాల్లోనూ భారీ తయారీ కేంద్రాలు ఉన్నట్లు సమాచారం. వెలుగుల పండగ దీపావళి సమీపిస్తోంది. దీంతో బాణసంచా గుట్టుగా మహా నగరానికి చేరుతోంది. దసరా నుంచే కొందరు వ్యాపారులు ఒడిశా, తమిళనాడుల నుంచి బాణసంచా నిల్వలు తెచ్చినట్టు తెలుస్తోంది. అధికార కూటమి నేతలు చెబితే ఇష్టారాజ్యంగా అనుమతులిచ్చేందుకు పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు జీహుజూర్ అంటున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేలా అక్రమ నిల్వలున్న ప్రాంతాల్లో మాత్రం మొక్కుబడి తనిఖీలతో నిబంధనలు గాలికొదిలేస్తున్నారు. అనుమతులు లేకుండానే నిల్వలు ఇప్పటికే బాణసంచాని తీసుకొచ్చి.. పర్మిషన్లు రాగానే విక్రయించేందుకు వ్యాపారులు అనధికారికంగా ముందస్తు నిల్వలు ఏర్పాటు చేసుకున్నారు. శివారు ప్రాంతాల్లోని గోదాములు, ఇళ్లల్లో గుట్టుచప్పుడు కాకుండా నిల్వ చేశారు. అయితే.. ఇందుకోసం ఫారం–26 ప్రకారం అధికారులు అనుమతులు తీసుకోవాలి. జనావాసాలు, నగర నడిబొడ్డును బాణసంచా నిల్వలు నిషేధం. ఇవేమీ పట్టించుకోకుండా అధికార పార్టీల అండతో.. కొందరు వ్యాపారులు ఇష్టారాజ్యంగా నిల్వలుంచారని తెలుస్తోంది. ఎక్కడెక్కడ నిల్వలున్నాయో అధికారులకు తెలిసినా కూటమి నేతలు అటువైపు వెళ్లొద్దనే ఆదేశాలతో సైలెంట్ మోడ్లో పనిచేసుకుంటున్నారు. దీంతో.. వ్యాపారులు ఇష్టం వచ్చినట్లుగా ప్రమాదకరంగా వ్యాపారాలు చేసుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. -
నలుగురి జీవితాల్లో వెలుగులు
ఆరిలోవ: బ్రెయిన్ డెడ్ మహిళ అవయవాల ద్వారా మరో నలుగురి జీవితాల్లో వెలుగులు నింపారు. నగరంలోని విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్)లో జరిగిన ఈ అవయదానం గురించి డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబు తెలిపిన వివరాలు.. జీవీఎంసీ 9వ వార్డు పరిధి విశాలాక్షినగర్కు చెందిన కె.అన్నపూర్ణ(50) హనుమంతవాక వద్ద శనివారం రోడ్డు దాటుతుండగా ద్విచక్రవాహనం ఢీకొని తలకు తీవ్ర గాయమైంది. అధిక రక్తస్రావంతో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు విమ్స్లో చేర్చారు. చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ఆదివారం నిర్ధారించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించారు. వారు అంగీకరించడంతో జీవన్దాన్ రాష్ట్ర కోఆర్డినేటర్, విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబుకు వైద్యులు విషయం తెలిపారు. ఆయన అనుమతితో బ్రెయిన్ డెడ్ అయిన అన్నపూర్ణ శరీరం నుంచి కాలేయం, ఊపిరితిత్తులు, కార్నియాలను సేకరించారు. వాటిని జీవన్దాన్ ప్రొటోకాల్ ప్రకారం సీరియారిటీ జాబితాను అనుసరించి హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి నగర పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాగ్చి ఆదేశాలతో గ్రీన్ చానల్ ద్వారా తరలించారు. సాయంత్ర 6.45కు అన్నపూర్ణ శరీరం నుంచి తొలగించిన అవయవాలను బీఆర్టీఎస్ మార్గంలో అడవివరం, సింహాచలం, గోపాలపట్నం, ఎన్ఏడీ మీదుగా విశాఖ ఎయిర్పోర్టుకు చేర్చారు. అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా అవయవాలు దానం చేయడానికి ముందుకు వచ్చిన అన్నపూర్ణ కుటుంబ సభ్యులను రాంబాబు అభినందించారు. ఇంతవరకు విమ్స్లో బ్రెయిన్ డెడ్ ఆయిన ఐదుగురు నుంచి అవయవాలు సేకరించి పలువురి జీవితాల్లో వెలుగులు నింపినట్లు తెలిపారు. -
అంబుజా సిమెంట్స్పై పోరాటానికి కార్యాచరణ
పెదగంట్యాడ: అదానీ అంబుజా సిమెంట్స్ గ్రైండింగ్ యూనిట్కు వ్యతిరేకంగా పోరాడేందుకు స్థానికులతో కలసి పోరాట కమిటీని నియమించనున్నట్లు వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్రెడ్డి తెలిపారు. గొందేశి శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో పెదగంట్యాడలో ఆదివారం సాయంత్రం స్థానికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబుజా సిమెంట్స్ను ఏర్పాటు చేస్తే జరిగే నష్టాలను వివరించారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతోపాటు ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకున్నామని గుర్తు చేశారు. ప్రజలు వ్యతిరేకించినా మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణను చేపడతామని అధికారులు ప్రకటించడం సరికాదన్నారు. ఈ ఫ్యాక్టరీ కోసం ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో పోరాట కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో మార్టుపూడి పరదేశి, పల్లా కార్తీక్, గొందేశి మహేశ్వరరెడ్డి, గొందేశి వెంకటరమణారెడ్డి, మంత్రి శంకరనారాయణ, కొయ్య భారతి, గంట్యాడ గురుమూర్తి, సంపంగి ఈశ్వరరావు, తాటికొండ జగదీష్, మధుసూదన్రెడ్డి, సుమన్రెడ్డి, నాగు, పిట్టా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలి అంబుజా సిమెంట్స్ గ్రైండింగ్ యూనిట్ ఏర్పాటు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని రద్దు చేయాలని అదానీ అంబుజా సిమెంట్ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ చైర్మన్ డాక్టర్ ఎం రమేష్కుమార్ డిమాండ్ చేశారు. నడుపూరులోని సీడబ్ల్యూసీలో ఆదివారం వ్యతిరేక పోరాట కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జేవీవీ అధ్యక్షుడు కృష్ణారావు, సీఐటీయూ నాయకుడు లక్ష్మణమూర్తి, రామారావు, కె.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
పీడీఎస్వో జిల్లా మహాసభ విజయవంతానికి పిలుపు
బీచ్రోడ్డు: ఎంతో చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం సరిపడా అధ్యాపకుల్లేక డిపార్ట్మెంట్లకు డిపార్ట్మెంట్లే మూతపడుతున్నాయని పీడీఎస్వో విశాఖ జిల్లా అధ్యక్షుడు పి.విశ్వనాథ్ తెలిపారు. ఈ నెల 15న ద్వారకానగర్లోని విశాఖ పౌర గ్రంథాలయంలో నిర్వహించనున్న పీడీఎస్వో ‘విశాఖ జిల్లా మహాసభ’ను విజయవంతం చేయాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహాసభ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీకి 111 మంది ప్రొఫెసర్లు, 201 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 414 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు కావాలన్నారు. ఏళ్ల తరబడి పోస్టుల్ని భర్తీ చేయకుండా యూనివర్సిటీని నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. జిల్లా కార్యదర్శి వి.లక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ హాస్టళ్ల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. తాగునీటి సమస్య, నాసికమైన ఆహారం, రెగ్యులర్ ఆరోగ్య పరీక్షలు నిర్వహించక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలోని విద్యారంగ సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన కార్యాచరణ రూపకల్పనకు జిల్లా మహాసభను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మహాసభకు ఏయూ మహాసభకు విద్యార్థులు, మేధావులు, ప్రజాతంత్రవాదులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో విశాఖ జిల్లా కమిటీ సభ్యులు సతీష్కుమార్, జానకి, లక్ష్మణ్, ఉదయ్కిరణ్, ఢిల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
భక్తి మార్గంలో తొలి అడుగు.. శ్రీప్రభుపాద ఆశ్రయం
తగరపువలస: ఆనందపురం మండలం గంభీరం ఐఐఎంవీ రోడ్డులోని హరేకృష్ణ వైకుంఠంలో హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో శ్రీరాధా మదన్ మోహన్ మందిరంలో 120 మంది భక్తులు ఆదివారం శ్రీ ప్రభుపాద ఆశ్రయం స్వీకరించారు. ఈ సందర్భంగా మూవ్మెంట్ అధ్యక్షుడు నిష్క్రించిన భక్తదాస మాట్లాడుతూ ప్రభుపాద ఆశ్రయం అంటే హరేకృష్ణ ఆధ్యాత్మిక మార్గంలో ఆధ్యాత్మిక వికాసం కొరకు ప్రభుపాదుని గురువుగా స్వీకరించడమని తెలిపారు. ఆశ్రయం స్వీకరించిన భక్తులు ఇకపై రోజూ హరేకృష్ణ మహామంత్ర జపం చేస్తూ శ్రీభక్తి వేదాంత స్వామి ప్రభుపాద రచించిన భగవద్గీత, భాగవతం వంటి రచనలు చదువుతూ సాధన చేయాలన్నారు. టీ, కాఫీ తీసుకోరాదని, పందెం, జూదం వంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. అనంతరం దామోదర దీపోత్సవంలో భాగంగా దామోదర అష్టకం వివిధ సంగీత వాయిద్యాల నడుమ లయబద్ధంగా ఆలపించారు. శ్రీరాధా మదన్ మోహన్లకు నెయ్యి దీపాలతో హారతులు ఇచ్చారు. కార్యక్రమంలో జితమిత్ర దాస స్వామీజీ, అంబరీస దాస భక్తులకు దామోదర దీపోత్సవం ప్రాముఖ్యతను వివరించారు. -
ప్రభుత్వ స్థల ఆక్రమణను అడ్డుకున్న గ్రామస్తులు
తగరపువలస: ఆనందపురం మండలం పాలవలస పంచాయతీ సర్వే నెం.82లో శనివారం అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని వ్యక్తులు కొండను తొలచి, చెట్లను తొలగించి షెడ్ నిర్మించడాన్ని గ్రామస్తులు పసిగట్టారు. పంచాయతీలో 21 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉండగా సదరు ఆక్రమణదారుడు సుమారు మూడున్నర ఎకరాల్లో చదును చేస్తున్నట్టు గుర్తించారు. ఈ ఆక్రమణకు వ్యతిరేకంగా ఆదివారం ఉదయం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పాక్షికంగా చేపట్టిన షెడ్ను అడ్డుకుని కూలీలను చెదరగొట్టారు. రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తమ పంచాయతీకి ప్రభుత్వ భూమి ఇక్కడ తప్ప మరెక్కడా లేదన్నారు. ప్రస్తుతం ఆక్రమణదారుడు చదును చేస్తున్న మూడున్నర ఎకరాల్లో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్థానికులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రతిపాదించిందన్నారు. ఎన్నికలు రావడంతో ఈ ప్రక్రియకు ఆటంకం కలిగిందన్నారు. గతంలో ఈ సర్వే నంబర్లో ఇద్దరు దళిత వ్యక్తులు, ఒక విశ్రాంత ఆర్మీ ఉద్యోగి తమకు భూములు ఉన్నట్టు ముందుకురాగా తామంతా పార్టీలకు అతీతంగా అడ్డుకున్నామన్నారు. భవిష్యత్తులో కూడా పంచాయతీకి సంబంధం లేని వ్యక్తులు ఇక్కడ ఆక్రమణకు ప్రయత్నిస్తే వారి ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు. జాతీయరహదారిని ఆనుకుని దుక్కవానిపాలెం టోల్గేట్ సమీపంలోఉన్న ఈ భూమి విలువ ఎకరం రూ.5 కోట్లు పైనే ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. ఇదే సర్వే నంబర్లో కొన్ని ప్రభుత్వ భూములకు సంబంధించి వివాదాలు న్యాయస్థానంలో ఉన్నట్లు పేర్కొన్నారు. అనంతరం గ్రామస్తులే స్వయంగా యంత్రాలు తీసుకొచ్చి సర్వే నెం.82లో జంగిల్ క్లియరెన్స్ చేసుకున్నారు. వీఆర్వో దుర్గా రమేష్ అక్కడకు చేరుకుని ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. ఎవరికై నా భూములకు సంబంధించి యాజమాన్య హక్కులు ఉంటే తహసీల్దార్ను సంప్రదించాలని సూచించారు. -
వాటే బ్యాటింగ్...!
విశాఖ స్పోర్ట్స్: టీం ఇండియా భారీ స్కోరు..కంగారూలను కలవరపెట్టడం ఖాయం అనుకున్న అభిమానులకు..ప్రొఫెషనల్ ఆటకు బ్రాండ్ మేమే అన్నట్టు ఆస్ట్రేలియా బ్యాటర్లు పరుగుల వరద సృష్టించారు. భారత బౌలర్లను చీల్చి చెండాడారు. కళ్లు చెదిరే బౌండరీలు..బంతికి చుక్కలు చూపించేలా సిక్సర్లతో మోత మోగించారు. ఆస్ట్రేలియా సారథి అలిస్సా హీలీ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. సొగసైన కవర్ డ్రైవ్స్లో కళాత్మక బ్యాటింగ్తో 142 (107 బంతుల్లో 21 ఫోర్టు, మూడు సిక్సర్లు) చేసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు భారీగా పరుగులు సమర్పించుకుంది. భారత్ జట్టు 330 పరుగులకు అలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా జట్టు ఆది నుంచి బౌలర్లపై విరుచుకుపడింది. మధ్యమధ్యలో వికెట్లు పడినా ఏ మాత్రం లక్ష్యాన్ని వీడలేదు. ఆస్ట్రేలియా బ్యాటర్లంతా రాణించడంతో మరో ఓవర్ ఉండగానే విజయం సాధించింది. చివరి వరకు మ్యాచ్ నువ్వా–నేనా అన్నట్టు సాగింది. అటు ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించినవారికి..టీవీల్లో చూసిన అభిమానులకు మ్యాచ్ మజా పంచింది. విశాఖ వైఎస్సార్ స్టేడియం ఇరు జట్ల పరుగుల దాహాన్ని తీర్చింది. అభిమానులు ఆటను ఆస్వాదించారు. ఫోర్లు, సిక్సర్లు బాదినప్పుడల్లా మువ్వెన్నల జెండా రెపరెపలాడింది. అంతకుముందు స్టేడియంలోని ఏ గ్యాలరీ స్టాండ్కు భారత మాజీ మహిళా జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ పేరుతోనూ, స్టేడియంలోకి మూడో ప్రవేశద్వారానికి స్థానిక క్రీడాకారిణి రావి కల్పన పేరుతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. మ్యాచ్ను రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారాలోకేష్ , ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ అధ్యక్ష, కార్యదర్వులు కేతినేని శివనాథ్, సానా సతీష్ బాబు వీక్షించారు. -
పాలకులు వదిలేశారు.. యువకులు సరిచేశారు
విశాఖ స్పోర్ట్స్: టీం ఇండియా భారీ స్కోరు.. కంగారూలను కలవరపెట్టడం ఖాయం అనుకున్న అభిమానులకు..ప్రొఫెషనల్ ఆటకు బ్రాండ్ మేమే అన్నట్టు ఆస్ట్రేలియా బ్యాటర్లు పరుగుల వరద సృష్టించారు. భారత బౌలర్లను చీల్చి చెండాడారు. కళ్లు చెదిరే బౌండరీలు..బంతికి చుక్కలు చూపించేలా సిక్సర్లతో మోత మోగించారు. ఆస్ట్రేలియా సారథి అలిస్సా హీలీ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. రహదారులపై గుంతలు పూడ్చిన యువత మల్కాపురం: కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్దిరోజుల్లోనే రోడ్లను మెరుగుపరుస్తామని, సంక్రాంతి నాటికి రోడ్లు తళతళా మెరుస్తాయని హామీ ఇచ్చింది. కానీ సంక్రాంతి, దసరా పండుగలు ముగిసి, దీపావళి వచ్చేస్తున్నా రహదారుల పరిస్థితి మాత్రం ఏమాత్రం మెరుగుపడలేదు. గుంతలను పూడ్చే ప్రయత్నం కూడా చేయకపోయింది. ఈ నేపథ్యంలో రోడ్ల దుస్థితిని చూసి విసుగు చెందిన మల్కాపురం ప్రాంత యువకులు నడుం బిగించారు. తలో కొంత డబ్బులు వేసుకుని, సిమెంట్, కాంక్రీట్ కొనుగోలు చేసి ప్రమాదకరమైన గుంతలను పూడ్చి, తమ ప్రాంత ప్రజలకు తామే ఉపశమనం కలిగించారు. మల్కాపురం ప్రధాన సర్వీసు రోడ్డులో.. ముఖ్యంగా కోస్ట్ గార్డ్ కార్యాలయం వైపు వెళ్లే మార్గంలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. రాత్రివేళల్లో వీధి దీపాలు సరిగా వెలగకపోవడంతో వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో యువకులే స్పందించి రహదారిపై ఏర్పడిన గుంతలను పూడ్చారు. -
అనుపమకు ‘వెంపటి చిన్న సత్యం లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు’
మద్దిలపాలెం: పద్మభూషణ్ వెంపటి చిన్న సత్యం 96వ జయంతి ఉత్సవాలు మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో రెండు రోజుల పాటు వైభవంగా జరిగాయి. విశాఖ ఆర్ట్స్ అండ్ డ్యాన్స్ అసోసియేషన్ , కూచిపూడి కళాక్షేత్ర సంయుక్త నిర్వహణలో ముగింపు రోజున వివిధ నృత్య ప్రదర్శనలతో కళాకారులు నృత్య నీరాజనం పలికారు. కార్యక్రమాన్ని నగర పోలీసు కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి, డాక్టర్ శ్రీధర్ మిత్ర, బ్రహ్మకుమారీస్ విశ్వవిద్యాలయం ఇన్చార్జి రమ, గురు హరి రామమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ కూచిపూడి ప్రదర్శకురాలు అనుపమ మోహన్కు ‘వెంపటి చిన్న సత్యం లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ ప్రధానం చేశారు. హైదరాబాద్కు చెందిన శ్రియ శ్రీరామ్ (భరతనాట్యం), విశాఖకు చెందిన కళాకారులు కథక్, ఒడిస్సీ నృత్యాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రతి ఏటా ఇద్దరికి రూ. 5,000 నగదుతో కూడిన మెరిట్ స్కాలర్షిప్ను ప్రవేశపెట్టినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈఏడాది శ్రీ భారతీయ కళాసదన్ విద్యార్థిని కుమారి ఆకెళ్ళ రవళి మనోహరణిని ఎంపిక చేశారు. వీవీడీఏ ప్రధాన కార్యదర్శి కన్నం వెంకటరమణ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈవేడుకలకు ఫెస్టివల్ కోఆర్డినేటర్స్ మంజుష ,సింధుజ, మహాలక్ష్మి ,కల్యాణి, గోపీనాథ్లు వ్యవహరించారు. -
విశాఖ దశ దిశ మారేలా అభివృద్ధి ప్రణాళికలు
అధికారుల సమావేశంలో మంత్రి లోకేష్ మహారాణిపేట: రానున్న 30 ఏళ్ల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని విశాఖ దశ దిశ మారేలా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్ హాలులో ఉత్తరాంధ్ర జిల్లాల (విశాఖ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం) అధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ వివరాలను విలేకరుల సమావేశంలో మంత్రి లోకేశ్ వివరించారు. బెంగళూరు, పుణె వంటి నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు ఇక్కడ ఉత్పన్నం కాకుండా రోడ్లను అభివృద్ధి చేయాలని సూచించారు. విశాఖ వేదికగా అనేక కంపెనీలు వస్తున్నందున, దానికి తగ్గట్టుగా మాస్టర్ ప్లాన్లు సిద్ధం చేయాలన్నారు. ఈ రీజియన్లో యువతకు 5 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అలాగే ఐటీ పార్కుల ఏర్పాటుకు అనువైన ల్యాండ్ బ్యాంక్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. విశాఖ ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక రాజధాని అని పేర్కొన్న లోకేశ్, హైదరాబాద్ 30 ఏళ్లు పడితే.. విశాఖ కేవలం పదేళ్లలో అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. 2047 నాటికి జీవీఎంసీ ఆర్థిక పరపతిని ఒక ట్రిలియన్ డాలర్లకు చేరుస్తామని లక్ష్యాన్ని ప్రకటించారు. ఈ సమావేశంలో ఐటీ సెక్రటరీ, మేయర్, ఎమ్మెల్యేలు, నాలుగు జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
రుషికొండ భవనాలను అమ్మితే ప్రతిఘటిస్తాం
మధురవాడ: రుషికొండపై ఉన్న అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ప్రభుత్వ భవనాలను తమ ‘పర్సంటేజీల’ కోసం కూటమి ప్రభుత్వం అమ్మకానికి పెడితే ఉత్తరాంధ్ర ప్రజలు చూస్తూ ఊరుకోరని జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు హెచ్చరించారు. వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ ఆస్తులను తమ సంపద సృష్టి కోసం తెగనమ్మేందుకు ప్రభుత్వ పెద్దలు సిద్ధమయ్యారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలి గత ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన ఈ సుందరమైన భవనాలను కేవలం ప్రభుత్వ అవసరాల కోసం మాత్రమే ఉపయోగించాలని వాసు డిమాండ్ చేశారు. ఈ భవనాలను రాష్ట్రపతి, ప్రధాన మంత్రి లేక గవర్నర్ల బంగ్లాలుగా ఉపయోగించాలని సూచించారు. ‘పీపీపీ’ అంటే ప్రభుత్వ పెద్దల పర్సంటేజీలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ‘పీపీపీ’ అంటే .. ‘ప్రభుత్వ పెద్దల పర్సంటేజీల కోసం అభివృద్ధి’ అనే ముసుగు తొడిగి వేల కోట్ల ఆస్తులను తెగనమ్ముతోందని వాసు ఆరోపించారు. ఈ భరితెగింపు చర్యలపై రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారని ఆయన అన్నారు. ఉద్యమం తప్పదు అంతర్జాతీయ ప్రమాణాలు గల రుషికొండ భవనాలు ప్రభుత్వ ఆస్తులుగానే కొనసాగేందుకు జన జాగరణ సమితి పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని వాసు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే ఈ దిశగా ఆలోచనలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
కూటమిలో కుప్పిగంతులు
డాబాగార్డెన్స్: కూటమిలో కల్లోలం మొదలైంది. ఇందుకు జనసైనికులు, టీడీపీ కార్యకర్తల వైఖరే కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న కార్యకర్తలు అధికార పక్షంలోకి వెళ్లడం చూస్తుంటాం. కానీ ఇక్కడ విచిత్రంగా, కూటమిలో భాగమైన జనసేన కార్యకర్తలు టీడీపీలోకి, టీడీపీ కార్యకర్తలు జనసేనలోకి మారుతూ ‘దోబూచులాట’ఆడుతున్నారు. ఈ వింత పోకడ కూటమిలో గందరగోళానికి దారితీస్తోంది.జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం కూటమి ధర్మాన్ని పాటించాలని, టీడీపీ వారితో అణిగిమణిగి ఉండాలని జనసైనికులకు పదేపదే సూచిస్తున్నారు. అయితే దిగువశ్రేణి జనసైనికులు మాత్రం అధినేత మాటలను పక్కన పెడుతున్నట్లుగా వారి చేష్టల ద్వారా స్పష్టమవుతోంది. దీంతో కింది స్థాయి కార్యకర్తల్లో ఏ స్థాయిలో సమన్వయ లోపం ఉందో ఇట్టే అర్థమవుతోంది. నిన్నటికి మొన్న.. సేనాని (పవన్ కల్యాణ్) సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు సమక్షంలో 29వ వార్డుకి చెందిన ఈశ్వరరావు అండ్ బృందం జనసేన కండువా కప్పుకుంది. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సమక్షంలోనే జనసేన తీర్థం పుచ్చుకున్నారు. కండువా ఇస్త్రీ మడత చెరిగిపోకముందే..వారంతా టీడీపీ పంచన చేరారు. ఇదీ కూటమి ప్రభుత్వం..నేతల్లో వింత పోకడగా మారింది. దక్షిణ నియోజకవర్గంలోని 29వ వార్డులో ఆదివారం టీడీపీ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జనసేన పార్టీకి చెందిన కొంత మంది యువకులు కార్పొరేటర్ ఉరికూటి నారాయణరావు నేతృత్వంలో టీడీపీ కండువా కప్పుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. జనసేన కార్యకర్తలు టీడీపీలో చేరడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. లోకేశ్ను సీఎం చేసే వరకు నిద్రపోవద్దు ఈ కార్యక్రమంలో పాల్గొన్న దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జ్ సీతంరాజు సుధాకర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో విస్మయం కలిగించాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఉన్నప్పటికీ, టీడీపీ కార్యకర్తలు లోకేశ్ను సీఎం చేసే వరకు నిద్రపోవద్దని ఆయన పిలుపునివ్వడం గమనార్హం. అయితే సుధాకర్ తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ ‘చంద్రబాబునాయుడు వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సాధించి, మరో ఐదేళ్లపాటు ముఖ్యమంత్రి పదవిలో ఉంటారు. ఆ తర్వాత లోకేశ్ సీఎం పదవి చేపట్టేందుకు ఇప్పటి నుంచే కష్టించి పని చేయాలి’ అని వివరణ ఇచ్చారు. పార్టీలో చేరిన ఈశ్వరరావుకు నియోజకవర్గ యువత బాధ్యత అప్పగించినట్లుగా కూడా ఈ సందర్భంగా తెలిపారు. వంశీకృష్ణను కాదని... సీతంరాజును గెలిపించాలి మరోవైపు 29వ వార్డు కార్పొరేటర్ ఉరుకూటి నారాయణరావు చేసిన వ్యాఖ్యలు జనసేన నాయకులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. కూటమి తరఫున గెలిచిన జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ను కాదని, వచ్చే ఎన్నికల్లో సీతంరాజు సుధాకర్ను దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి ఇప్పటి నుంచే అడుగులు ముందుకు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. పలువురు జనసేన కార్యకర్తలు టీడీపీలో చేరడంతో పార్టీ బలోపేతమైందని ఉరుకూటి అనడం, నియోజకవర్గంలో జనసేన బలం తగ్గిందన్నట్లుగా ఉందంటూ జనసేన నాయకులు, కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. 29వ వార్డులో తారాస్థాయికి చేరిన కుంపటి జీవీఎంసీ 29వ వార్డులో కూటమి నేతల మధ్య అంతర్గత లొల్లి తారాస్థాయికి చేరింది. జనసేన నుంచి టీడీపీలోకి, టీడీపీ నుంచి జనసేనలోకి కార్యకర్తలు చేరడం ఈ గందరగోళాన్ని మరింత పెంచుతోంది. వార్డు కార్పొరేటర్ ఉరుకూటి నారాయణరావుకి, ఆ పార్టీ వార్డు అధ్యక్షుడి మధ్య గ్యాప్ పెరుగుతుండగా, జనసేన నాయకుల మధ్య కూడా పొరపొచ్చాలు ఎక్కువై, కూటమి కుంపటి రగులుతోంది. -
కిరికిరి
విద్యుత్ డీఈల మధురవాడ సర్వే నెం.296/14లో 5.33 ఎకరాలకు స్కెచ్ నకిలీ సర్వే నంబర్ సృష్టించి..ఆన్లైన్లో నమోదు సహకరించిన సర్వేశాఖ అధికారులు 296/6లోని భూమిని ఆక్రమించేందుకు యత్నం రిజిస్ట్రేషన్ చేయించేందుకు ప్రయత్నాలుసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ప్రభుత్వ భూమిని ప్రైవేటు ల్యాండ్గా నమ్మించి ఏకంగా రిజిస్ట్రేషన్ చేయించేందుకు యత్నించడంతో పాటు నకిలీ ఈసీలు సృష్టించిన విద్యుత్శాఖ డీఈల ముఠా.. ఇప్పుడు అసలు ఉనికిలోలేని సర్వే నంబరునే సృష్టించారు. ఇందుకోసం ఏకంగా ఆన్లైన్లో కూడా సర్వే నంబరు ఉన్నట్టు మార్పులు చేశారు. అక్కడితో ఆగకుండా.. ఈ సర్వే నంబరులో ఏకంగా 5.33 ఎకరాల భూమి ఉందని ఆన్లైన్లో నమోదు చేశారు. ఈ వ్యవహారంలో సర్వేశాఖ అధికారులు కూడా ఈ ముఠాకు సహకరించినట్టు తెలుస్తోంది. అయితే, లేని సర్వే నంబరును సృష్టించినందున.. మరో సర్వే నంబరులోని భూమిని ఇందులో చూపించేందుకు అనుగుణంగా ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ (ఎఫ్ఎంబీ)లో మార్పులు చేసేందుకు యత్నించారు. తద్వారా మధురవాడలో అత్యంత విలువ చేసే 5.33 ఎకరాల భూమిని తమ చేతుల్లోకి తీసుకుని రిజిస్ట్రేషన్ చేయించేందుకు కొద్ది మంది అధికారులతో లావాదేవీలు కూడా మాట్లాడుకున్నట్టు సమాచారం. వాస్తవానికి తమ శాఖలోనే వివిధ ప్రాంతాల్లో పనిచేసే సిబ్బంది నుంచి మొత్తం రూ.25 లక్షల చొప్పున 200 మంది నుంచి రూ.50 కోట్లు వసూలు చేశారు. వీరందరికీ ఇప్పుడు ఈ సర్వే నంబరులోని భూమిని రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామంటూ చెబుతున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా భూమి లేని లేని సర్వే నంబరును సృష్టించడమే కాకుండా ఆన్లైన్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేయించేందుకు యత్నించిన వ్యవహారంలో సదరు డీఈలు... తమకు మంత్రి అచ్చెన్నాయుడు తెలుసంటూ సహచర ఉద్యోగుల వద్ద చెబుతున్నట్టు తెలుస్తోంది. ఖాళీగా ఉండటంతో.... మధురవాడలోని సర్వే నంబరు 296 సర్వే నంబరు భూమి... స్టేడియంకు ఎదురుగా ఉన్న ఎంవీవీ సిటీకి పక్కనే ఉంది. ఇక్కడ ఎకరా భూమి విలువ రూ. 10 కోట్లు పలుకుతోంది. ఈ భూమిపై కన్నేసిన సదరు ముఠా.... 296/6లో ఖాళీగా ఉన్న ప్రాంతాన్ని రెండు ముక్కలుగా చేసి 296/14 సర్వే నంబరును సృష్టించారు. ఇందులో 5.33 ఎకరాల భూమి ఉన్నట్టు ఏకంగా ఆన్లైన్లోకి ఎక్కించారు. ఈ భూమి ఉన్నట్టు ఆన్లైన్లో ఎక్కించడంలో నేరుగా సర్వేశాఖ అధికారుల పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. సర్వేశాఖ ఏడీ ఒకరు నేరుగా ఇందులో ప్రధాన పాత్ర పోషించినట్టు సమాచారం. ఖాళీగా ఉండటంతో పాటు కుటుంబంలో తగాదాలతో వ్యవహారం కోర్డులో ఉండటం వీరికి కలిసొచ్చింది. అంతేకాకుండా సదరు కుటుంబం అంతా హైదరాబాద్లోనే మరో ప్రాంతంలోనే నివాసం ఉండటంతో ఇటువైపు గమనించే పరిస్థితి లేకపోవడాన్ని ఈ ముఠా అలుసుగా తీసుకున్నట్టు తెలుస్తోంది. అసలు ఉనికిలోలేని ఈ భూమిని చూపించి తాము వసూలు చేసిన రూ. 50 కోట్లలో కొందరికి ఇక్కడ భూమి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని సదరు ముఠా నమ్మిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా శ్రీకాకుళం జిల్లాకు చెందిన డీఈలు... తాము మంత్రి అచ్చెన్నాయుడు బంధువులంటూ చెప్పుకుంటుండటం గమనార్హం. సర్వే నంబరు సృష్టించారు ఇలా...! మధురవాడలోని సర్వే నంబరు 296 సర్వే నంబరులో మొత్తం 50.44 ఎకరాల భూమి ఉంది. అయితే, ఈ సర్వే నంబరులో ఇప్పటివరకు కేవలం 13 సబ్ డివిజన్లు... అంటే 296/1 నుంచి 296/13 వరకూ ఉన్నాయి. ఆయా సబ్ డివిజన్లల్లో ఎవరెవరికి భూమిని కేటాయించారనే వివరాలను కూడా స్పష్టంగా స్థానిక రూరల్ తహసీల్దారు తన నివేదికలో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు అసలు ఉనికిలోనే లేని 296/14 సర్వే నంబరును సదరు ముఠా సృష్టించింది. ఇందుకోసం ఏకంగా ఆన్లైన్లోనే మార్పులు చేశారు. అంతేకాకుండా ఈ సర్వే నంబరులో 5.33 ఎకరాల భూమి ఉందని కూడా పేర్కొన్నారు. అయితే లేని భూమిని ఈ సర్వే నంబరులో చేర్చేందుకుగానూ 296/6లో ఉన్న 7.40 ఎకరాల భూమిపై కన్ను పడింది. వాస్తవానికి ఈ భూమికి పట్టా ఇచ్చారు. అయితే, కుటుంబ తగాదాల వల్ల ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. అందువల్ల ఈ సైట్లో ఎవ్వరూ ఉండటం లేదు. ప్రస్తుతానికి ఈ సర్వే నంబరులోని భూమి ఖాళీగా ఉంది. ఈ ఖాళీ భూమిపై సదరు ముఠా కన్నేసింది. ఈ సర్వే నంబరుకు చెందిన భూమిలోని 5.33 ఎకరాలకు 296/14 సర్వే నంబరులో ఉన్నట్టు చేర్చారు. అంతేకాకుండా ఇందుకు అనుగుణంగా ఎఫ్ఎంబీలోనూ మార్పులు చేసేందుకు యత్నించారు. ఈపీడీసీఎల్లోనూ వసూళ్లు...! జెన్కోకు చెందిన విజయవాడలోని ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్తో పాటు విద్యుత్ సౌధలో అడ్మిన్ విభాగంలో పనిచేస్తున్న ఈ ఇద్దరు డీఈలు... జెన్కోలోని తమ తోటి ఉద్యోగులతో పాటు వైఎస్సార్ కడప జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటు (ఆర్టీపీపీ), కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంటు, ట్రాన్స్కోలో పనిచేసే ఉద్యోగులతో పాటు విశాఖ కేంద్రంగా ఉన్న తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్)లో పని చేసే ఉద్యోగుల నుంచి కూడా చెరో రూ. 25 లక్షల చొప్పున వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఈ విధంగా మొత్తం 200 మంది నుంచి రూ. 50 కోట్లు వసూలు చేశారు. అంతేకాకుండా మధురవాడలోని సర్వే నెంబరు 296/14లోని భూమిని తమ బంధువుల పేరు మీద జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) చేసుకున్నట్టు కూడా చెబుతున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో రిజిస్ట్రేషన్శాఖ అధికారులతో వ్యవహారం మాట్లాడుతున్నట్టు సమాచారం. -
లివర్ మార్పిడి తప్పదా!.. కురుపాం విద్యార్థుల్లో ప్రమాదకర సంకేతాలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: హెపటైటిస్–ఏ బారినపడిన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల్లో కొందరి పరిస్థితి అత్యంత దారుణంగా మారుతోందా?... ఈ వ్యాధి సోకినవారు వెంటనే కోలుకునే స్థితిలో లేరా?.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గిరిజన బిడ్డలు ప్రాణాపాయ స్థితికి చేరుతున్నారా?.. అంటే వైద్య నిపుణుల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది.ఒకవైపు ఇప్పటికే కురుపాం ఆశ్రమ పాఠశాలలో వందల మంది విద్యార్థులను వణికిస్తున్న హెపటైటిస్–ఏ.. పక్కనే ఉన్న ఏకలవ్య పాఠశాలకూ పాకింది. ఇక్కడ కూడా వందల మంది విద్యార్థులు హెపటైటిస్–ఏతో ఇబ్బంది పడుతున్నట్టు పరీక్షల ద్వారా తెలుస్తోంది. అయితే, సాధారణ హెపటైటిస్–ఏ వేరియంట్ కంటే పిల్లలకు సోకిన వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోందని వైద్యులు గుర్తించారు. గోప్యంగా ఉంచిన ప్రభుత్వం!ఈ వ్యాధి బారినపడిన వారు వెంటనే కోలుకుంటున్న పరిస్థితి కూడా లేదని వైద్యులు గుర్తించినట్టు సమాచారం. అందువల్ల మూకుమ్మడిగా వైద్య పరీక్షలు చేయడంతోపాటు హెల్త్ ఎమర్జెన్సీ తరహాలో చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా ఒక విద్యారి్థకి అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ స్టేజీ–1గా కూడా వైద్యులు గుర్తించారు. అయితే, ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం లేదని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లల పరిస్థితి విషమిస్తే కాలేయ మార్పిడి (లివర్ ట్రాన్స్ప్లాంటేషన్)కి కూడా ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉందంటూ ప్రభుత్వం, ఉన్నతాధికారులకు వైద్య నిపుణులు సూచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా ప్రభుత్వ ఆస్పత్రుల్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కు అవసరమైన వైద్య సదుపాయాలు లేవు. వెంటనే కాలేయ మారి్పడికి అవసరమైన ప్రొటోకాల్స్ను సిద్ధం చేసుకుని, తగిన వైద్య సదుపాయాలు ఉన్న ప్రైవేటు ఆస్పత్రులతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంటే మంచిదని ప్రభుత్వానికి వైద్య నిపుణులు సూచించినట్టు తెలుస్తోంది. అయితే, ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడమే కాకుండా వివరాలన్నీ గోప్యంగా ఉంచుతూ గిరిజన విద్యార్థులు, ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెల కిందటే గుర్తించినా...! పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం ఆశ్రమ పాఠశాలలో నెల కిందటే ఒక విద్యార్థికి హెపటైటిస్–ఏ సోకిందని వైద్యులు గుర్తించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా వైద్యాధికారులతోపాటు జిల్లా యంత్రాంగం మొత్తానికి సమాచారం ఇచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని తెలిసినప్పటికీ వైద్య బృందం వెంటనే విద్యార్థులు అందరికీ పరీక్షలు కూడా చేయకపోవడంపైనా విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆదేశాలు జారీ చేయలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు.మరొకరు కూడా మృతి చెందినప్పటికీ... హెపటైటిస్–ఏ కారణం కాదని చెబుతున్నారు. మరోవైపు తాజా పరీక్షల్లో ఈ కొత్త వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని తేలినందున హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి కురుపాం ఆశ్రమ పాఠశాలతోపాటు పక్కనే ఉన్న ఏకలవ్య పాఠశాలలోని విద్యార్థులకు, వారిని కలిసినవారికి, ఆయా గ్రామాల్లో వెంటనే మూకుమ్మడిగా పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది. -
విశాఖలో 70 కోట్ల భూమి.. పిఠాపురం వర్మ కుమారుడి పేరుతో స్వాహా
సాక్షి, తగరపువలస: విశాఖ జిల్లా భీమిలి మండలం తాళ్లవలస పంచాయతీలో సుమారు రూ.70 కోట్ల విలువైన ఆరు ఎకరాల 69 సెంట్ల భూమిని తమకు తెలియకుండా తప్పుడు పత్రాలతో జీపీ రాయించుకున్నారని ఈ భూమి వారసులు ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ కుమారుడు ఎస్వీఎస్ గిరీష్ ఈ జీపీ చేయించుకున్నారని ఈ భూమి వారసులైన దంతులూరి సుజాత, కలిదిండి నరేంద్రవర్మ, బుద్ధరాజు వరలక్ష్మి శనివారం మీడియాకు తెలిపారు.ఈ సందర్బంగా బాధితులు మాట్లాడుతూ.. 13.2, 14.1, 15.1, 15.4, 15.5, 15.6, 15.8, 92.2, 93.1 తమ భూమి సర్వే నెంబర్లని చెప్పారు. అయితే, దంతులూరి రామకృష్ణరాజు కుమారుడు నారాయణరాజు వారసుల్లో ఒకరైన పకీరురాజు, మిగిలిన వారసులకు తెలీకుండా, ఆయనొక్కడే వారసుడినని చెప్పుకుని మోసపూరితంగా పాసు పుస్తకాలు, 1బీ సృష్టించి, 2023 అక్టోబరులో గిరీష్కు జీపీ ఇచ్చారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో తాళ్లవలస టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు డీఏఎన్ రాజు, పూసపాటి గోపాలమూర్తి రాజు సహకరించారని బాధితులు వివరించారు.దొడ్డిదారిన ఎల్పీ, నాలా అనుమతులు.. ఈ మోసాన్ని తాము గుర్తించి భీమిలి తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్, వీఎంఆర్డీఏ అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని వారు వాపోయారు. రెండేళ్లుగా సమాచార హక్కు చట్టం ద్వారా అడిగినా పకీరు ఒక్కడే వారసుడు అనడానికి సంబంధించిన వివరాలను రెవెన్యూ అధికారులు ఇవ్వలేదన్నారు. ఈ భూములపై జిల్లా కోర్టులో ఓఎస్ 115/2025 కేసు రిజిస్టర్ అయి, ఆర్ఓఆర్ పిటిషన్పై విచారణ జరుగుతున్నప్పటికీ, జీపీ పొందిన టీడీపీనేత గిరీష్ దొడ్డిదారిన ఎల్పీ, నాలా అనుమతులు పొందాడని ఆరోపించారు.ఈనెల 5 నుంచి గిరీష్ తన మనుషులతో వచ్చి వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చే ప్రయత్నాలు రాత్రింబవళ్లు చేస్తున్నారని తెలిపారు. గిరీష్ అధికార టీడీపీకి చెందిన వ్యక్తి కావడంతో అధికారులు తమకు న్యాయం చేయడంలేదని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. తమకు ప్రాణహాని ఉందని, ఇటీవల కారుతో తొక్కించి తమను అంతమొందించేందుకు కూడా యత్నించారని బుద్ధరాజు వరలక్ష్మి, ఆమె భర్త రామకృష్ణ రాజు ఆరోపించారు. తప్పుడు పత్రాలతో జీపీ చేసిన వారిపైనా, చేయించుకున్న వారిపైనా చర్యలు తీసుకోవాలని, తమకు రక్షణ కల్పించాలని వారు కోరారు. -
ప్రభుత్వ భూమిపైప్రైవేటు వసూళ్లు!
200 మంది నుంచి ఏకంగా రూ.50 కోట్లు స్వాహా! సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రభుత్వ భూమిని ప్రైవేటుగా చూపించి ఏకంగా రూ.50 కోట్లు వసూలు వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. ఇందుకోసం ఇద్దరు తహసీల్దార్ల పేరుతో నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ ఎండార్స్మెంట్లతో పాటు ఏకంగా నకిలీ ఈసీని కూడా సృష్టించిన వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. విద్యుత్శాఖలో పనిచేసే ఇద్దరు ఇంజనీర్లు (డీఈలు) ఈ తతంగమంతా నడిపించారు. తమతో పాటు పనిచేసే సుమారు 200 మంది నుంచి చెరో రూ.25 లక్షల చొప్పున మొత్తం రూ.50 కోట్ల వరకూ వసూలు చేశారు. మధురవాడ పనోరమ హిల్స్ జంక్షన్కు సమీపంలోని సర్వే నెంబరు 368–3లోని భూమిని చూపించి వసూళ్లకు తెగబడినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఇది ప్రభుత్వ భూమి. మొత్తం విస్తీర్ణం 3.6 ఎకరాలు. ఇక్కడ ఎకరా విలువ రూ.20 కోట్లకుపైగానే పలుకుతోంది. 100 అడుగుల రోడ్డుకు ఆనుకుని ఉన్న ఈ భూమి తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చిందంటూ నమ్మించి భారీగా వసూలు చేశారు. ఇందుకోసం ఇద్దరు తహసీల్దార్ల పేరుతో ఫలానా వారికి పట్టా ఇచ్చారంటూ నకిలీ రికార్డులు సృష్టించారు. చలానాలు కూడా కట్టించి రిజిస్ట్రేషన్ల శాఖ సిబ్బందితో కలిసి రిజిస్ట్రేషన్ను పెండింగ్లో ఉంచేలా కథ నడిపించారు. నకిలీ ఈసీని కూడా సృష్టించి నమ్మించారు. అయితే, అవి నకిలీవని తెలియడంతో వారంతా ఇప్పుడు ఉసూరుమంటున్నారు. వారికి ఇప్పుడు మరో భూమిని చూపించి రిజిస్ట్రేషన్ చేస్తామంటూ కొత్త నాటకానికి తెరలేపినట్టు సమాచారం. రూ.50 కోట్లు వసూళ్లు! ఈ సర్వే నెంబరులోని భూమి తక్కువ ధరకే ఒక్కొక్కరికి రిజిస్ట్రేషన్ చేపిస్తామంటూ నమ్మబలికి మొత్తం 200 మంది నుంచి రూ.25 లక్షల చొప్పున వసూలు చేసినట్టు తెలుస్తోంది. వీరంతా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు కావడం గమనార్హం. ఈ ముఠాకు నేతృత్వం వహిస్తున్న ఇద్దరు వ్యక్తులు కూడా విద్యుత్శాఖలో ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. గతంలో ఈ విధంగానే 50 మంది నుంచి చెరో రూ.25 లక్షలు వసూలు చేసి ఒక ప్రైవేటు భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించడంతో వీరిపై నమ్మకం కుదిరింది. దీన్ని వాడుకుని ఈసారి ఏకంగా 200 మంది నుంచి రూ.25 లక్షల చొప్పున మొత్తం రూ.50 కోట్లు వసూలు చేశారు. విద్యుత్శాఖలో తమకు ఉన్న పరిచయాల ద్వారా తమ సిబ్బంది నుంచే ఈ విధంగా వసూళ్లకు పాల్పడ్డారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు కూట మి నేత, మాజీ హోంమంత్రి అండదండలున్నాయని కూడా బలంగా నమ్మించినట్టు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బందితో కలిసి..! తహసీల్దార్ల పేరుతో నకిలీ డాక్యుమెంట్లు..! మధురవాడలోని సర్వే నెంబరు 368–3లోని భూమి ప్రభుత్వానికి చెందినది. ఈ భూమిని లింగం సోమసుందరరావు పేరుతో పట్టా ఇచ్చారంటూ సెటిల్మెంట్ పట్టాను సృష్టించారు. గతంలో విశాఖ రూరల్ తహసీల్దార్లగా పనిచేసిన నరసింహమూర్తితో పాటు హత్యకు గురైన సనపాల రమణయ్య పేరు మీద నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. నకిలీ అడంగల్, నకిలీ పట్టాలతో పాటు పై ఇద్దరూ తహసీల్దార్లు కూడా ఈ సర్వే నెంబరులో ఫలానా వ్యక్తికి పట్టా ఉందంటూ నివేదిక ఇచ్చినట్టు కూడా నకిలీ పత్రాలు ఏర్పాటు చేశారు. వసూలు చేసిన వారికి వీటిని చూపించడంతో పాటు రిజిస్ట్రేషన్ సిబ్బందితో కలిసి వ్యవహారం నడిపించారు. ఈ వ్యవహారంలో రిజిస్ట్రేషన్ శాఖలోని కొద్దిమంది సిబ్బందికి ఏకంగా రూ.కోటి వరకూ ముట్టచెప్పినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమిగా నకిలీ డాక్యుమెంట్లు ఏకంగా నకిలీ ఈసీసృష్టించిన ముఠా విద్యుత్శాఖలో పనిచేస్తున్న ఇద్దరు డీఈల నిర్వాకం వాస్తవానికి ఈ సర్వే నెంబరులోని భూమి ప్రభుత్వానికి చెందినదని స్పష్టంగా రికార్డుల్లో ఉంది. నిషేధిత జాబితా (22ఏ)లో ఉంది. అందువల్ల రిజిస్ట్రేషన్ చేయడం కుదరదు. అయినప్పటికీ మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చెందిన ఒక అధికారితో మాట్లాడుకుని మొదటి దశలో ఒక 30 మంది రిజిస్ట్రేషన్కు వస్తారని... వారి నుంచి చలానా కట్టించుకుని రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించాలని కోరారు. ఇది ప్రభుత్వ భూమి కావడంతో రిజిస్ట్రేషన్ చేయడం కుదరనందున.. చలానాలు కట్టించుకుని రిజిస్ట్రేషన్ చేసినట్టుగా చేసి సహకరించాలని విన్నవించారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ను పెండింగ్లో ఉంచితే చాలని కోరారు. ఇందుకోసం భారీగానే మాముళ్లు మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. ఈ విధంగానే మొత్తం వ్యవహారం నడిచింది. ఒక్కొక్కరు చెరో రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల మేర చలానా కూడా కట్టారు. తమకు రిజిస్ట్రేషన్ అయ్యిందని మొదటి బ్యాచ్ సంబరపడిపోయింది. మిగిలిన బ్యాచ్కు కూడా త్వరలో పెడతానంటూ సదరు ముఠా నమ్మబలికింది. అంతేకాకుండా మొదటగా రిజిస్ట్రేషన్ చేసిన వారికి దొంగ ఈసీలను కూడా సృష్టించి అందజేయడం గమనార్హం. విజయవాడలోని ఒక నిపుణుడైన డీటీపీ కార్యాలయంలో ఈ ఫేక్ ఈసీని సృష్టించి.. వారి పేరు మీద రిజిస్ట్రేషన్ అయినట్టుగా చూపించారు. అయితే కొందరు అవసరాల నిమిత్తం ఈ భూమిని విక్రయించడానికి ప్రయత్నించగా ఈసీ నకిలీదని తెలియడం అవాక్కయ్యారు. ఇప్పుడు అదే ముఠా కూటమిలోని ఒక నేత పేరుతో కొత్త సర్వే నెంబరుతో రిజిస్ట్రేషన్ కోసం దిగినట్టు తెలుస్తోంది. -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘కోటి సంతకాల ఉద్యమం’
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం చేపట్టింది. ఈ ఉద్యమంలో మేధావి వర్గాలు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజలు పాల్గొనాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు కోరారు. మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం పోస్టర్ను ఆవిష్కరించిన సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ... ప్రజల ఆరోగ్య హక్కులను కాపాడేందుకు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించే కుట్రలను అడ్డుకునేందుకు ఈ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోందన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మెడికల్ కళాశాల నిర్మాణాలను కొనసాగించే వరకు ఉద్యమం ఆగదని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడా వైద్య కళాశాలలను ప్రైవేటుకు అప్పగించలేదని గుర్తు చేస్తూ.. బీజేపీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు తొత్తుగా పనిచేస్తున్నారంటూ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్పై కేకే రాజు విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా ఈ ప్రభుత్వంలో వసతిగృహాల్లోని విద్యార్థులకు కూడా సరైన భోజనం, తాగునీరు అందించలేని పరిస్థితి ఉందని మండిపడ్డారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కె. సతీష్, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు, స్టాండింగ్ కమిటీ మెంబర్ సాడి పద్మారెడ్డి, కార్పొరేటర్లు కె.అనిల్ కుమార్ రాజు, రెయ్యి వెంకటరమణ, బర్కత్ అలీ, శశికళ, కో–ఆప్షన్ సభ్యులు సేనాపతి అప్పారావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిరణ్ రాజు, ఎస్ఈసీ మెంబర్ పీలా వెంకటలక్ష్మి, వలంటరీ విభాగం జోనల్ ప్రెసిడెంట్ ఎం.సునీల్, జిల్లా అనుబంధ విభాగం అధ్యక్షులు నీలి రవి, రామిరెడ్డి, వార్డు అధ్యక్షుడు గుజ్జు వెంకటరెడ్డి, పైడి రమణ, బొడ్డేటి కిరణ్, బలిరెడ్డి గోవింద్, కె.సుకుమార్, మాజీ కార్పొరేటర్ దల్లి రామకృష్ణా రెడ్డి, నియోజకవర్గ అనుబంధ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు -
చేపల వేటకు వెళ్లిన యువకుడి గల్లంతు
పరవాడ: చేపల వేటకు వెళ్లిన ఓ యువకుడు సముద్రపు కెరటాల తాకిడికి పడవ నుంచి జారి గల్లంతైన విషాద ఘటన పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం తీరంలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముత్యాలమ్మపాలెం సమీపంలోని దిబ్బపాలెం గ్రామానికి చెందిన అరిజిల్లి బంగార్రాజు (17) ప్రాణాలు కోల్పోయాడు. చేతికి అందివచ్చిన కొడుకు సముద్రపు రాక్షస అలలకు బలై తమను అనాథలను చేశాడని మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడు బంగార్రాజుతో పాటు తోటి మత్స్యకారులు చింతకాయల కొర్లయ్య, కొండబాబు, మధు, హరి, మేరిగి ముత్యాలు... మొత్తం ఆరుగురు మత్స్యకారులు కలిసి ఒక తెప్పపై శనివారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో చేపల వేటకు బయలుదేరారు. తీరాన్ని దాటి సముద్రంలోపలికి వెళ్తున్న క్రమంలో, సముద్రంపై నుంచి ఉధృతంగా వచ్చిన బలమైన కెరటం వీరు ప్రయాణిస్తున్న తెప్పను బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో తెప్పలో ఉన్న బంగార్రాజు ఒక్కసారిగా సముద్రంలో పడిపోయాడు. వెంటనే స్పందించిన తోటి కార్మికులు సముద్రంలో గాలించినప్పటికీ ఫలితం దక్కలేదు. అనంతరం మరో మూడు తెప్పలపై బంగార్రాజు ఆచూకీ కోసం గాలించినా ప్రయోజనం కనిపించలేదు. ప్రమాద సమాచారాన్ని అందుకున్న పరవాడ సీఐ ఆర్. మల్లికార్జునరావు తన సిబ్బందితో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ బి.నాగరాజు కూడా ఘటనా స్థలాన్ని సందర్శించి, గల్లంతైన మృతదేహం కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. శనివారం ఉదయం నుంచి మృతుడి జాడ కోసం పూడిమడక, పెదగంట్యాడ తీర ప్రాంతాల వరకు పడవలపై విస్తృతంగా గాలించారు. సాయంత్రానికి కూడా మృతుడి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. జనసేన మండల ఇన్చార్జ్ పంచకర్ల ప్రసాద్, సర్పంచ్ చింతకాయల సుజాత మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రమాద కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుడికి తండ్రి అప్పన్న, తల్లి సత్యవతి, అక్క మౌనిక ఉన్నారు. మృతుడి ఆచూకీ కోసం రాత్రి వరకు గాలింపు చర్యలు ముమ్మరం చేసినప్పటికీ ఫలితం కనిపించలేదు. -
రౌడీషీటర్ హత్యకేసులో కొత్తకోణం
ఎంవీపీకాలనీ: విజయవాడకు చెందిన రౌడీషీటర్ శ్రీధర్ హత్య కేసులో మరోకొత్త కోణం వెలుగు చూసింది. ఈ హత్యకేసులో నిందితుడైన యలమంచలికి చెందిన రౌడీషీటర్ గౌరీశంకర్ తొలుత మద్దిలపాలెంలో పవన్ అనే వ్యక్తిపై హత్యాయత్నం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. శ్రీధర్ హత్య, పవన్ అనే వ్యక్తిపై హత్యాయత్నం ఘటనలకు సంబంధించి నలుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి శనివారం రాత్రి ఎంవీపీ కాలనీ పోలీసు స్టేషన్లో ద్వారకా ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి విలేకరులకు వివరాలు వెల్లడించారు. రౌడీషీటర్లు శ్రీధర్, గౌరీశంకర్లు పాతకేసుల్లో భాగంగా ఈ నెల 7వ తేదీన విశాఖ జిల్లా కోర్టుకు వాయిదాకు హాజరయ్యారు. అనంతరం విశాఖలోని పలు ప్రాంతాల్లో కారులో తిరుగుతూ మద్యం సేవించారు. గౌరీశంకర్కు విశాఖలో సాయి అనే స్నేహితుడు ఉన్నాడు. అతనికి పవన్ అనే వ్యక్తికి కొంతకాలంగా గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలో పవన్ని హత్య చేయాలని గౌరీశంకర్, సాయి ఇటీవల నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గౌరీశంకర్, శ్రీధర్, సాయి, అసీఫ్(సాయి స్నేహితుడు) కలిసి పవన్పై హత్యాయత్నానికి ప్రయత్నించారు. 7వ తేదీ రాత్రి మద్దిలపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ దాడి నుంచి పవన్ తప్పించుకొని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎంవీపీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఆరా తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తొలుత సాయిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఈ హత్యాయత్నంలో తనతో పాటు గౌరీశంకర్, అసీఫ్లు కూడా ఉన్నట్లు సాయి వెల్లడించాడు. దీంతో పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకొని విచారించి హత్యాయత్నంలో భాగస్వాములను చేశారు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు ఈ ఘటనలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో రౌడీషీటర్ శ్రీధర్ హత్య వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పవన్పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు తొలుత అదే కోణంలో దర్యాప్తు చేశారు. అయితే సెల్ టవర్ సిగ్నల్ పరిశీలించినప్పుడు గౌరీశంకర్ నెంబర్ సిగ్నల్ ఉన్న ప్రతీచోట మరో వ్యక్తి నెంబర్ వ్యక్తి కూడా కనిపించింది. అయితే ఆ వ్యక్తి ఎవరనే విషయంపై ఎంవీపీ పోలీసులు తొలి నుంచి అనుమానం వ్యక్తం చేశారు. పలు సిగ్నల్ పాయింట్ల్లో పరిశీలించినప్పడు కూడా ఇదే పరిస్థితి ఉండటంతో ఆ నెంబర్ ఎవరిదనే విషయంపై ఆరాతీశారు. ఈ విషయంపై గౌరీశంకర్ను తమదైన శైలిలో మరోసారి విచారించగా అసలు విషయం బయటపడింది. తొలుత 7వ తేదీ ఉదయం కోర్టుకు హాజరైన అనంతరం గౌరీశంకర్, శ్రీధర్ మద్యం సేవిస్తూ నగరంలో పలుచోట్ల తిరిగారు. అనంతరం శ్యామల అనే మహిళ ఇంటికి వెళ్లారు. రాత్రి మద్దిలపాలెంలో పవన్ అనే వ్యక్తిపై హత్యాయత్నం ఘటనలో పాల్గొన్నారు. తరువాత గౌరీశంకర్, శ్రీధర్ శ్యామల కలిసి కారులో అక్కడ నుంచి పరారయ్యారు. తరువాత గౌరీశంకర్, శ్రీధర్ మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ క్రమంలో గౌరీశంకర్, శ్యామల.. శ్రీధర్ను హత్యచేసి యలమంచలిలోని పోలవరం కెనాల్లో పడేశారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన ఎంవీపీ పోలీసులను ఏసీపీ నరసింహమూర్తి ప్రశంసించారు. రెండు కేసుల్లో గౌరీశంకర్తో పాటు శ్యామల, సాయి, అసీఫ్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంవీపీ సీఐ ప్రసాద్, ఎస్ఐ ధనుంజయ్నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
‘గ్లో అప్ గాల’..మిలమిల
బీచ్రోడ్డు: విశాఖలో తొలిసారిగా నిర్వహించిన ‘గ్లో అప్ గాల’ మేకప్ అవార్డ్స్, మెగా మోడలింగ్ ఈవెంట్ శనివారం మిరిమిట్లు గొలిపే విద్యుత్ వెలుగుల్లో ఆకట్టుకుంది. రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసిన సుమారు 30 మంది మోడల్స్.. ఇండియన్ బ్రైడ్స్, లెహెంగాస్, వెస్ట్రన్ గౌన్స్, వన్ మినిట్ శారీస్లో ర్యాంప్పై మెరిశారు. న్యాయ నిర్ణేతలుగా మిస్ ఇండియా యూనివర్స్ హేమల తా రెడ్డి, మిస్ ఒడిశా సుప్రియ, మిస్ ఆంధ్ర సరిత, అంతర్జాతీయ మోడల్ కోచ్ రోహిత్ సువ్వాడ వ్యవహరించారు. -
మెడికల్ కాలేజీలు ధారాదత్తం
సీతంపేట: కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు యాజమాన్యాలకు ధారాదత్తం చేయడం ఖాయమని, ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నర్సీపట్నం పర్యటనలో బట్టబయలు చేయడంతో మింగుడు పడని కూటమి నాయకులు అవాకులు చెవాకులు పేలుతున్నారని వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బొల్లవరపు జాన్వెస్లీ అన్నారు. లలితానగర్లోని తన కార్యాలయంలో శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ జనసేన దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడం లేదని ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ మాట్లాడారన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్కు పీపీపీకి, ప్రైవేట్కు తేడా తెలియదని అజ్ఞానంతో ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. విద్య, వైద్యం అనేవి వైద్య విద్యలోనే కలిసి ఉన్నాయని, అవి ప్రజల ప్రాథమిక హక్కులకు, ప్రజల మనోభావాలకు, జీవితాలకు సంబంధించిన అంశమని, వాటిని తాకట్టుపెట్టే అధికారం నైతికంగా ఏ ప్రభుత్వానికి లేదన్నారు. ఈ విషయాన్ని వంశీకృష్ణ తెలుసుకోవాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అనుమతులిచ్చి నిర్మాణాలు ప్రారంభించడం రాష్ట్రానికి వైద్య రంగంలో ఒక వరంగా భావించాలన్నారు. కూటమి ప్రభుత్వం పేద, మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్యను దూరంగా, భారంగా మార్చిందన్నారు. సామాన్యులు వైద్యాన్ని డబ్బులిచ్చి కొనుక్కునే పరిస్థితి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వస్తుందన్నారు. ఆరోగ్యశ్రీకి తూట్లు పొడవడంతో వైద్యం కోసం వెళ్లే ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కూటమి సర్కారు కళ్లు తెరిచి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీలు, బోధన ఆస్పత్రులు నిర్వహించాలని జాన్వెస్లీ కోరారు. -
బదిలీపై వెళ్తున్న విశ్వనాథన్కు ఘన సత్కారం
తాటిచెట్లపాలెం: రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధ శాఖ డైరెక్టర్గా బదిలీపై వెళ్తున్న వీఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ కేఎస్ విశ్వనాథన్ను కలెక్టర్ హరేందిర ప్రసాద్, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ శనివారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విశ్వనాథన్ విశాఖ నగర అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, ముఖ్యంగా ప్రజాప్రతినిధులతో సమ న్వయం చేసుకుంటూ ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు గొప్పవని కొనియాడారు. కేఎస్ విశ్వనాథన్ మా ట్లాడుతూ.. విశాఖలో పనిచేయడం గొప్ప అనుభూతిని ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో వీఎంఆర్డీఏ జాయింట్ కమిషనర్ రమేష్, కార్యదర్శి మురళీకృష్ణ, ప్రధాన ఇంజినీర్ వినయ్కుమార్, ఎస్టేట్ అధికారి దయానిధి, పర్యవేక్షక ఇంజినీర్లు భవాని శంకర్, మధుసూధనరావు, ముఖ్య ప్రణాళికాధికారిణి శిల్ప, ముఖ్య గణాంకాధికారి హరిప్రసాద్ పాల్గొన్నారు. -
మహోన్నత వ్యక్తిత్వం జస్టిస్ రామస్వామి సొంతం
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ కె. రామస్వామి చిత్రపటాన్ని శనివారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఆవిష్కరించారు. గతంలో జస్టిస్ కె.రామస్వామి ఏయూలో ‘పబ్లిక్ పవర్ అండ్ జ్యుడిషియల్ ఫంక్షన్’ అనే అంశంపై అందించిన ప్రసంగాన్ని, పునర్ ముద్రించిన పుస్తకాన్ని జస్టిస్ బట్టు దేవానంద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జస్టిస్ బట్టు దేవానంద్ మాట్లాడుతూ మహోన్నత వ్యక్తిత్వం జస్టిస్ కె.రామస్వామి సొంతమని కొనియాడారు. విద్యార్థి నాయకుడిగా తాను తొలిసారిగా ఆయనను కలిసిన సందర్భం, ఏయూకు ముఖ్యఅతిథిగా ఆహ్వానించి తీసుకువచ్చిన సందర్భాలను ఆయన గుర్తు చేసుకున్నారు. జస్టిస్ రామస్వామి చారిత్రాత్మకమైన తీర్పులు అందించారని పేర్కొన్నారు. తాను ఉన్నత స్థానంలో నిలవడానికి తన గురువులు అందించిన అత్యుత్తమ బోధన, మార్గదర్శకమే కారణమని, ఈ అవకాశాన్ని దైవం ఇచ్చిన వరంగా భావిస్తున్నానని జస్టిస్ దేవానంద్ అన్నారు. ఏయూ న్యాయ కళాశాల విద్యార్థిగా తన కళాశాల రోజులను, ప్రత్యేక న్యాయ కళాశాల ఏర్పాటుకు చేసిన కృషిని, న్యాయ కళాశాలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరును ప్రతిపాదించిన సందర్భాలను ఆయన గుర్తు చేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన ఆచార్యులకు తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని వేదికపై స్మరించుకున్నారు. అంతకుముందు ఏయూ వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ మాట్లాడుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల ఎందరో న్యాయ కోవిదులను సమాజానికి అందించిందని చెప్పారు. -
రొమ్ము క్యాన్సర్పై అవగాహన అవసరం
మహారాణిపేట: మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్పై గ్రామస్థాయి నుంచి ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్ సతీమణి, ప్రముఖ అడ్వకేట్ దివ్య ప్రసాద్ అన్నారు. ‘పింక్ మంత్’ భాగంగా కేజీహెచ్లో మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ శిల్ప ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రతి మహిళ ఏడాదికి ఒకసారి విధిగా అన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాలని దివ్య ప్రసాద్ కోరారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి మాట్లాడుతూ రొమ్ము క్యాన్సర్పై అవగాహనతో పాటు మెమోగ్రామ్, ఇతర వైద్య పరీక్షలను కేజీహెచ్లో ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. క్యాన్సర్ లక్షణాలను ముందుగా గుర్తించడం ద్వారా సకాలంలో నయం చేయవచ్చని రేడియాలజీ విభాగతకి డాక్టర్ కె. బుజ్జి బాబు పేర్కొన్నారు. -
మూడో వారంలో ఈశాన్య రుతుపవనాలు
సాక్షి, విశాఖపట్నం: దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల నిష్క్రమణ చురుగ్గా సాగుతోంది. ఇప్పటికే ఉత్తర, మధ్య భారతాన్ని వీడిన నైరుతి.. ఈ నెల 14 నాటికి రాష్ట్రం నుంచి, 15 నాటికి దేశవ్యాప్తంగా నిష్క్రమించనుంది. ఇదే సమయంలో ఈ నెల మూడో వారంలో ఈశాన్య రుతుపవనాల ప్రవేశానికి మార్గం సుగమమైంది. 17 నుంచి 20వ తేదీ మధ్యలో ఈశాన్య రుతుపవనాల రాక మొదలయ్యే వాతావరణం కనిపిస్తోంది. ఇవి తమిళనాడు, పాండిచ్చేరి, ఏపీ, కర్ణాటక, కేరళలో ప్రభావం చూపించే అవకాశం ఉందని భారత వాతావరణ నమూనాలు స్పష్టం చేస్తున్నాయి.అయితే ప్రపంచ వాతావరణ విశ్లేషణలు మాత్రం.. పసిఫిక్ మహాసముద్ర పరిస్థితుల కారణంగా ఈశాన్య రుతుపవనాలకు ప్రతికూలతలు కనిపిస్తున్నాయని, దీంతో కాస్త ఆలస్యమయ్యే సూచనలున్నాయని అంచనా వేస్తున్నాయి. 1998, 2005, 2021లో ఈశాన్య రుతుపవనాలు సాధారణం కంటే అధిక వర్షపాతాన్ని అందించాయని, ఈసారి కూడా అదే తరహాలో నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా తమిళనాడు, ఏపీ, కర్ణాటక, కేరళ, తెలంగాణలో అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయి.ఈశాన్య రుతుపవనాల రాకతో అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య వరుస అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలున్నాయి. 2 లేదా 3 తుపాన్లు కూడా రానున్నాయని, ఇవి తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్ వద్ద తీరందాటే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు నైరుతి నిష్క్రమణ కారణంగా రానున్న నాలుగు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లో విస్తారంగా మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. నేడు పలుచోట్ల మోస్తరు వర్షాలు సాక్షి, అమరావతి: ఉత్తర కోస్తా పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ కోస్తా వరకూ విస్తరించి సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. శనివారం చిత్తూరు పట్టణంలోని దొడ్డిపల్లిలో 3.4 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా లక్ష్మీపురంలో 3.1, శ్రీకాకుళం జిల్లా కొర్లాంలో 2.6 సెం.మీ. వర్షం కురిసింది. ఆదివారం అల్లూరి, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. -
లివర్ మార్పిడి తప్పదా!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: హెపటైటిస్–ఏ బారినపడిన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల్లో కొందరి పరిస్థితి అత్యంత దారుణంగా మారుతోందా?... ఈ వ్యాధి సోకినవారు వెంటనే కోలుకునే స్థితిలో లేరా?.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గిరిజన బిడ్డలు ప్రాణాపాయ స్థితికి చేరుతున్నారా?.. అంటే వైద్య నిపుణుల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. ఒకవైపు ఇప్పటికే కురుపాం ఆశ్రమ పాఠశాలలో వందల మంది విద్యార్థులను వణికిస్తున్న హెపటైటిస్–ఏ... పక్కనే ఉన్న ఏకలవ్య పాఠశాలకూ పాకింది. ఇక్కడ కూడా వందల మంది విద్యార్థులు హెపటైటిస్–ఏతో ఇబ్బంది పడుతున్నట్టు పరీక్షల ద్వారా తెలుస్తోంది. అయితే, సాధారణ హెపటైటిస్–ఏ వేరియంట్ కంటే పిల్లలకు సోకిన వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోందని వైద్యులు గుర్తించారు. గోప్యంగా ఉంచిన ప్రభుత్వం!ఈ వ్యాధి బారినపడిన వారు వెంటనే కోలుకుంటున్న పరిస్థితి కూడా లేదని వైద్యులు గుర్తించినట్టు సమాచారం. అందువల్ల మూకుమ్మడిగా వైద్య పరీక్షలు చేయడంతోపాటు హెల్త్ ఎమర్జెన్సీ తరహాలో చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా ఒక విద్యార్థికి అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ స్టేజీ–1గా కూడా వైద్యులు గుర్తించారు. అయితే, ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం లేదని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లల పరిస్థితి విషమిస్తే కాలేయ మార్పిడి (లివర్ ట్రాన్స్ప్లాంటేషన్)కి కూడా ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉందంటూ ప్రభుత్వం, ఉన్నతాధికారులకు వైద్య నిపుణులు సూచిస్తున్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా ప్రభుత్వ ఆస్పత్రుల్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కు అవసరమైన వైద్య సదుపాయాలు లేవు. వెంటనే కాలేయ మార్పిడికి అవసరమైన ప్రొటోకాల్స్ను సిద్ధం చేసుకుని, తగిన వైద్య సదుపాయాలు ఉన్న ప్రైవేటు ఆస్పత్రులతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంటే మంచిదని ప్రభుత్వానికి వైద్య నిపుణులు సూచించినట్టు తెలుస్తోంది. అయితే, ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడమే కాకుండా వివరాలన్నీ గోప్యంగా ఉంచుతూ గిరిజన విద్యార్థులు, ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెల కిందటే గుర్తించినా...! పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం ఆశ్రమ పాఠశాలలో నెల కిందటే ఒక విద్యార్థికి హెపటైటిస్–ఏ సోకిందని వైద్యులు గుర్తించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా వైద్యాధికారులతోపాటు జిల్లా యంత్రాంగం మొత్తానికి సమాచారం ఇచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని తెలిసినప్పటికీ వైద్య బృందం వెంటనే విద్యార్థులు అందరికీ పరీక్షలు కూడా చేయకపోవడంపైనా విమర్శలు వస్తున్నాయి.ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆదేశాలు జారీ చేయలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. మరొకరు కూడా మృతి చెందినప్పటికీ... హెపటైటిస్–ఏ కారణం కాదని చెబుతున్నారు. మరోవైపు తాజా పరీక్షల్లో ఈ కొత్త వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని తేలినందున హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి కురుపాం ఆశ్రమ పాఠశాలతోపాటు పక్కనే ఉన్న ఏకలవ్య పాఠశాలలోని విద్యార్థులకు, వారిని కలిసినవారికి, ఆయా గ్రామాల్లో వెంటనే మూకుమ్మడిగా పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది. -
సివిల్స్ శిక్షణకు బ్రేక్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇంటికో ఉద్యోగం లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తామని నమ్మబలికిన చంద్రబాబు సర్కారు ఉద్యోగాలు కాదు కదా.. కనీసం నిరుద్యోగ యువతకు శిక్షణ కూడా ఇవ్వకుండా అడ్డుపడుతోంది. వైఎస్సార్ సీపీ హయాంలో ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు అందించిన ఏపీ స్టడీ సర్కిల్ మనుగడనే కూటమి సర్కారు ప్రశ్నార్థకంగా మార్చేసింది. యూపీఎస్సీ సివిల్స్, ఏపీపీఎస్సీ గ్రూప్–1, 2 శిక్షణ తరగతులను పూర్తిగా ఎత్తి వేయడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు ఉచిత శిక్షణ అందకుండా పోయింది. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఏపీ స్టడీ సర్కిల్కు పునరుజ్జీవం కల్పించింది. మన రాష్ట్రానికి చెందిన యువత కోసం విశాఖలో ఏపీ స్టడీ సర్కిల్ భవన నిర్మాణాన్ని చేపట్టింది. రుషికొండ ప్రాంతంలో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించి సుమారు రూ.3 కోట్లతో అత్యాధునిక హంగులతో స్టడీ సర్కిల్ భవనాన్ని 2021లో నిరి్మంచింది. పరిపాలన భవనంతో పాటు వసతి గృహానికి సంబంధించి రెండు భవనాలను జీ+2 విధానంలో అందుబాటులోకి తెచి్చంది. గత ప్రభుత్వం వరుసగా మూడేళ్ల పాటు ఈ కేంద్రంలో సివిల్స్ పరీక్షలకు సిద్ధమయ్యే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించగా పలువురు ఉద్యోగాలు కూడా సాధించారు. నిరుద్యోగుల పడిగాపులు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏపీ స్టడీ సర్కిల్ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ గ్రాడ్యుయేట్లకు ఉచిత శిక్షణ తరగతులను నిలిపివేసింది. 2024–25లో సివిల్స్ ఉచిత వసతి శిక్షణ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. స్టడీ సర్కిల్ నోటిఫికేషన్ కోసం వందల మంది నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు పడిగాపులు కాస్తున్నారు. వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని ఏపీ స్టడీ సర్కిల్స్ స్టూడెంట్స్ ఫోరం ప్రతినిధులు ఆందోళనకు దిగుతున్నారు. ఉద్యమించేందుకు సన్నద్ధం.. ఏపీ స్టడీ సర్కిల్ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు మొత్తుకుంటున్నా ఆలకించని కూటమి సర్కారు అంబేడ్కర్ స్టడీ సర్కిళ్ల ద్వారా సాధారణ పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తామని చెబుతోంది. సివిల్స్, గ్రూప్స్ శిక్షణకు అవకాశం కల్పించకుండా కేవలం ఐబీపీఎస్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ, బ్యాంకు ఉద్యోగాల పరీక్షలకు ఇటీవల దరఖాస్తులు ఆహా్వనించింది. అది కూడా ప్రిలిమ్స్ కాకుండా కేవలం మెయిన్స్ మాత్రమే శిక్షణ ఇవ్వాలని నిర్ణయించడం పట్ల నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కూటమి ప్రభుత్వం ఏపీ స్టడీ సర్కిల్ను నిర్వీర్యం చేస్తోందని మండిపడుతున్నారు. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు. వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి..తక్షణమే ఏపీ స్టడీ సర్కిల్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. నోటిఫికేషన్ రాకపోవడంతో నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు సివిల్స్, గ్రూప్స్ పరీక్షల శిక్షణకు దూరమవుతున్నారు. ప్రైవేట్ సంస్థల్లో శిక్షణ పొందే స్థోమత లేక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులు నష్టపోతున్నారు. కూటమి ప్రభుత్వం సివిల్స్ ఉచిత వసతి శిక్షణ నోటిఫికేషన్ వెంటనే ఇవ్వాలి. – కొల్లు ఆనంద్కుమార్, అధ్యక్షుడు, ఏపీ స్టడీ సర్కిల్ స్టూడెంట్స్ ఫోరం -
‘కళింగ’లో క్షిపణి నాణ్యత పరిశీలన
సాక్షి, విశాఖపట్నం : వ్యూహాత్మక నేవల్ బేస్ ఐఎన్ఎస్ కళింగ అత్యాధునిక వ్యవస్థలకు కేంద్ర బిందువుగా మారింది. నావల్ వెపన్ సిస్టమ్స్ను పరీక్షించడానికి అత్యాధునిక స్టాటిక్ ఫైరింగ్ ఫెసిలిటీ ’త్రినేత్ర’ని తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ శుక్రవారం ప్రారంభించారు. నౌకాదళ ఆయుధ సంపత్తి నాణ్యత పరిశీలన, లైఫ్టైమ్ చెకింగ్ మొదలైన అంశాల కోసం... ఇప్పటి వరకూ ఫారిన్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ (ఓఈఎం)పైనే భారత నౌకాదళం ఆధారపడేది. ఇకపై భీమిలి కేంద్రంగా ఐఎన్ఎస్ కళింగలో ఏర్పాటు చేసిన త్రినేత్ర ద్వారా ఈ పరీక్షలు విజయవంతంగా నిర్వహించనున్నారు. క్షిపణులు, రాకెట్లు, ఆయుధాల సామర్థ్యమెలా ఉంది.? ఇంకా వాటి జీవిత కాలం ఎన్ని రోజులు ఉంటుంది.? మొదలైన పరిశీలనలు చేసే అత్యాధునిక సాంకేతికత త్రినేత్రలో ఏర్పాటు చేశారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇక్కడి పరికరాల్ని తయారు చేసినట్లు తూర్పు నౌకాదళ వర్గాలు చెబుతున్నాయి. స్టాటిక్ ఫైరింగ్ ఫెసిలిటీ సెంటర్లో క్షిపణులు, రాకెట్లు, సంబంధిత వ్యవస్థల కీలక పనితీరు వివరాల్ని నమోదు చేయడంతో పాటు.. రికార్డ్ కూడా చేసేలా రూపొందించారు. దీని ద్వారా.. నావల్ ఆర్మమెంట్ సిస్టమ్స్ పనితీరుకు సంబంధించి సమగ్రంగా అంచనా వెయ్యొచ్చు. ఆయుధన పరీక్ష మౌలిక సదుపాయాల కల్పనలో త్రినేత్ర ఒక ప్రధాన మైలురాయిగా నిలవనుంది. త్రీడీ ప్రింటింగ్ భవనం : అదేవిధంగా తూర్పు నౌకాదళంలో ఇటీవల చేరిన అగ్నివీర్ల కోసం ప్రత్యేక భవనాన్ని ఐఎన్ఎస్ కళింగలోనే నిర్మించారు. అత్యాధునిక సాంకేతికతతో 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో ఈ భవనాన్ని నిర్మించారు. అగ్నివీర్ల వసతి కోసం ఈ భవనాన్ని వినియోగించనున్నారు. -
ఏయూలో 17న ఎన్ఎస్టీఎల్ అకడమిక్ కాన్ఫరెన్స్
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం నేవల్ సైన్స్ టెక్నాలాజికల్ లేబరేటరీ (ఎన్ఎస్టీఎల్) సహకారంతో ఈనెల 17వ తేదీన ఎన్ఎస్టీఎల్ అకడమిక్ కాన్ఫరెన్స్– 2025ను నిర్వహిస్తున్నట్లు ఎన్ఎస్టీఎల్ డైరెక్టర్ డాక్టర్ అబ్రహం వర్గీస్ తెలిపారు. బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా సదస్సు నిర్వహించనున్నామన్నారు. బ్రోచర్, రిజిస్ట్రేషన్కు సంబంధించిన వెబ్సైట్ను ఎన్ఎస్టీఎల్ డైరెక్టర్ డాక్టర్ అబ్రహం, ఏయూ వీసీ జీపీ రాజశేఖర్ ఆవిష్కరించారు. శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో ఇటువంటి సాంకేతిక కార్యక్రమం విశ్వవిద్యాలయానికి మరింత ప్రతిష్టను అందిస్తుందని వీసీ చెప్పారు. -
మీ సంకల్పానికి సలాం
దివ్యాంగుల చేతిలో రూపుదిద్దుకున్న దీపావళి ప్రమిదలుసీతంపేట: వైకల్యం.. శారీరకమైనా, మానసికమైనా కుంగిపోవాల్సిన పనిలేదు. ఇది తలరాత అని చింతించాల్సిన అవసరం అంతకంటే లేదు. చీకట్లను చీల్చుకుని వచ్చే కాంతి రేఖలా జీవితంలో ఎదగవచ్చని ఆ చిన్నారులు నిరూపిస్తున్నారు. ఓ వైపు అక్షరాలు దిద్దుతూనే మరోవైపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. తమ భవితకు బాటలు వేసుకుంటూ.. జీవితం వికసించేలా ప్రయత్నిస్తున్నారు. గెలుపు బాటలో పయనించేందుకు ఓర్పుతో ముందుకు సాగుతున్నారు. చిట్టి చేతులతో దీపావళికి రంగురంగుల ప్రమిదలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఎంతో ఓపికతో నైపుణ్యత సాధించిన వారి సంకల్పానికి ఎవరైనా సలామ్ కొట్టాల్సిందే. మా విద్యార్థులు దివ్యాంగులు కాదు.. ప్రత్యేక సామర్థ్యం కలిగిన చిన్నారులు అంటూ వారి జీవితాన్ని రంగులమయం చేస్తోంది ప్రజ్వల్ వాణి వెల్ఫేర్ సొసైటీ. అక్కయ్యపాలెం జగన్నాథపురంలో గల ప్రజ్వల్ వాణి వెల్ఫేర్ సొసైటీలో శిక్షణ పొందుతున్న దివ్యాంగ పిల్లలు అద్భుతమైన ప్రమిదలు తయారు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ‘ఖుషీ దీప్’ ప్రాజెక్టులో భాగంగా, చిన్నారులు మట్టి ప్రమిదలకు ఎరుపు, ఆకుపచ్చ, నీలం వంటి రంగులు అద్ది, కుందన్స్ అంటించి వాటిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా సొసైటీ వ్యవస్థాపకురాలు జేవీఎల్ సుచిత్ర మాట్లాడుతూ దివ్యాంగ పిల్లల్లో ఆత్మవిశ్వాసం, నైపుణ్యాలు పెంపొందించేలా ప్రతి ఏటా దీపావళి ప్రమిదలను వారి చేత తయారు చేయిస్తున్నట్టు తెలిపారు. తయారు చేసిన ఈ ప్రమిదలను నగరంలోని కళాశాలలు, పాఠశాలలు, మాల్స్, బీచ్రోడ్, గేటెడ్ కమ్యూనిటీలలో ప్రదర్శించి, పిల్లల చేత విక్రయిస్తామన్నారు. ఇలా విక్రయించడం ద్వారా చిన్నారులలో సేల్స్ నైపుణ్యాలు, వృత్తిపరమైన శిక్షణ, స్వావలంబన పెంపొందుతాయని ఆమె వివరించారు. -
మనవడు మహా ముదురు
విశాఖ సిటీ : క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. కంచరపాలెంలో బామ్మ, మనవడిని కట్టేసి.. బంగారం, నగలు దోచుకున్నది ఇంటి దొంగే అని గుర్తించారు. ఈ దోపిడీలో మాస్టర్ మైండ్ మనవడే అన్నదే ఇక్కడ అసలు ట్విస్ట్. అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు థ్రిల్లర్ సినిమాను తలదన్నెలా ముగ్గురి స్నేహితులతో కలిసి సొంతింట్లోనే దోపిడీకి పక్కాగా ప్లాన్ చేసి బంగారు ఆభరణాలు, నగదు దోచేశాడు. సాంకేతికత ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయాన్ని తెలుసుకుని షాక్కు గురయ్యారు. తన సొంత ఇంటికే కన్నం వేసిన కృష్ణకాంత్ (19)తో పాటు అతని ముగ్గురు స్నేహితులు పరపతి ప్రమోద్ కుమార్ (30), షేక్ అభిషేక్ (21), అవసరాల సత్యసూర్యకుమార్ (24)లను అరెస్టు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. శుక్రవారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. జీవీఎంసీలో కాంట్రాక్టు పనులు చేసే ఆనంద్రెడ్డి కుటుంబంతో కలిసి కంచరపాలెంలో ఇంద్రానగర్ 5వ వీధిలో నివాసముంటున్నాడు. ఇతడు ఈ నెల 4వ తేదీన శుభకార్యం కోసం హైదరాబాద్కు వెళ్లాడు. 5వ తేదీ రాత్రి సుమారు 12.30 గంటలకు గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఇంటి వెనుక తలుపు పగలగొట్టి లోనికి ప్రవేశించారు. ఆ సమయంలో ఇంట్లో ఆనంద్రెడ్డి తల్లితో పాటు కుమారుడు ధర్మాల కృష్ణకాంత్ నిద్రలో ఉన్నారు. ఆ అగంతకులు బామ్మ, మనవుడ్ని ప్లాస్టర్, ప్లాస్టిక్ ట్యాగ్ వైర్లతో కట్టేసి నిర్బంధించారు. ఆమె ఒంటిపై ఉన్న 12 తులాల బంగారు ఆభరణాలు, మనవడి చేతికి ఉన్న డైమండ్ రింగ్, బీరువాలో ఉన్న రూ. 50 వేలు దోచుకున్నారు. తర్వాత ఇంటి ముందు పార్క్ చేసిన మహీంద్ర ఎక్స్యూవీ వాహనాన్ని కూడా దొంగలించి అక్కడ నుంచి పరారయ్యారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు కేసు దర్యాప్తు కోసం నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ (క్రైమ్స్) లతా మాధురి ఆధ్వర్యంలో ఇన్చార్జ్ క్రైమ్ ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి పర్యవేక్షణలో వెస్ట్ క్రైమ్ సీఐ మీసాల చంద్రమౌళి, ఎస్ఐ షేక్ అబ్దుల్ మరూఫ్, సీసీఎస్ సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. నిందితుల కోసం ఒకవైపు నగరంలో గాలిస్తూనే మరోవైపు వారి మొబైల్ డేటాలో అనుమానాస్పద యాప్లు, ట్రేడింగ్కు సంబంధించిన హిస్టరీ, ప్లాస్టర్ సెర్చ్ హిస్టరీ వంటి ఆధారాలను గుర్తించారు. దీంతో పోలీసులు నిందితుల కోసం విజయవాడ, హైదరాబాద్లలో గాలించారు. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో నిందితులు తిరిగి విశాఖకు వచ్చి బంగారం, నగదు పంచుకుంటుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు. వారి నుంచి రూ.2.1 లక్షలు, 12 తులాల బంగారు ఆభరణాలు, మహీంద్రా కారును స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. థ్రిల్లర్ సినిమా స్టైల్లో... ప్రధాన నిందితుడు కృష్ణకాంత్ తండ్రి ఆనంద్రెడ్డిలా వ్యాపారంలో సక్సస్ అవ్వాలని ఆన్లైన్ ట్రేడింగ్ చేశాడు. ఇందులో భారీగా నష్టపోయాడు. అప్పులు తీర్చేందుకు స్నేహితులు పీఎం పాలెంకు చెందిన పరపతి ప్రమోద్ కుమార్, కేఆర్ఎం కాలనీకి చెందిన షేక్ అభిషేక్, మధురవాడకు చెందిన అవసరాల సత్య సూర్యకుమార్లతో కలిసి సొంత ఇంట్లోనే దొంగతనం చేయాలని ప్రణాళిక చేశాడు. వారం రోజుల ముందు వీరు సెల్ కాన్ఫరెన్స్లో నేరానికి ఏం ఉపయోగించాలి.. ఎలా తప్పించుకోవాలో ప్లాన్ చేశారు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు కూడా పని చెయ్యకపోవడంతో ఆ విషయం కూడా మాట్లాడుకుని నేరం చేస్తున్న సమయంలో హిందీ తప్ప మరే భాష మాట్లాడకూడదని నిర్ణయించుకున్నారు. ఈ సమయంలో కృష్ణకాంత్ తండ్రి ఆనంద్రెడ్డి హైదరాబాద్కు వెళ్లడంతో వీరు ఈ నెల 5వ తేదీ రాత్రికి ప్లాన్ అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్న విధంగా బామ్మతో పాటు కృష్ణకాంత్ను కట్టేసి బంగారం, నగదు దోచుకున్నారు. అనంతరం ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న ఆనంద్రెడ్డి కార్లో పరారయ్యారు. అక్కడి నుంచి ఎన్ఏడీ, గోపాలపట్నం, ప్రహ్లాదపురం, అడవివరం, హనుమంతవాక వైపు నుంచి మారికవలస వెళ్లి అక్కడ నిర్మానుష్య ప్రాంతంలో రోడ్డు పక్కన కారు వదిలి ఆటో ద్వారా ఆర్టీసీ కాంప్లెక్స్కు వచ్చారు. బస్సులో ముందు విజయవాడ, అక్కడి నుంచి హైదరాబాద్ పారిపోయారు. -
సివిల్స్ శిక్షణకు
2021లో రూ.3 కోట్లతో అత్యాధునిక హంగులతో స్టడీ సర్కిల్ భవన నిర్మాణం ఏపీ స్టడీ సర్కిల్ నిర్వీర్యంఉద్యమించేందుకు సన్నద్ధం ఏపీ స్టడీ సర్కిల్ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు మొత్తుకుంటున్నా ఆలకించని కూటమి సర్కారు అంబేడ్కర్ స్టడీ సర్కిళ్ల ద్వారా సాధారణ పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తామని చెబుతోంది. సివిల్స్, గ్రూప్స్ శిక్షణకు అవకాశం కల్పించకుండా కేవలం ఐబీపీఎస్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ, బ్యాంకు ఉద్యోగాల పరీక్షలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అభ్యర్థుల నుంచి ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించింది. అది కూడా ప్రిలిమ్స్ కాకుండా కేవలం మెయిన్స్ మాత్రమే శిక్షణ ఇవ్వాలని నిర్ణయించడం పట్ల నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కూటమి ప్రభుత్వం ఏపీ స్టడీ సర్కిల్ను నిర్వీర్యం చేస్తోందని మండిపడుతున్నారు. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇంటికో ఉద్యోగం లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తామని నమ్మబలికిన చంద్రబాబు సర్కారు ఉద్యోగాలు కాదు కదా.. కనీసం నిరుద్యోగ యువతకు శిక్షణ కూడా ఇవ్వకుండా అడ్డుపడుతోంది. వైఎస్సార్ సీపీ హయాంలో ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు అందించిన ఏపీ స్టడీ సర్కిల్ మనుగడనే కూటమి సర్కారు ప్రశ్నార్థకంగా మార్చేసింది. యూపీఎస్సీ సివిల్స్, ఏపీపీఎస్సీ గ్రూప్–1, 2 శిక్షణ తరగతులను పూర్తిగా ఎత్తి వేయడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు ఉచిత శిక్షణ అందకుండా పోయింది. 2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక ఏపీ స్టడీ సర్కిల్కు పునరుజ్జీవం కల్పించింది. మన రాష్ట్రానికి చెందిన యువత కోసం విశాఖలో ఏపీ స్టడీ సర్కిల్ భవన నిర్మాణాన్ని చేపట్టింది. రుషికొండ ప్రాంతంలో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించి సుమారు రూ.3 కోట్లతో అత్యాధునిక హంగులతో స్టడీ సర్కిల్ భవనాన్ని 2021లో నిర్మించింది. పరిపాలన భవనంతో పాటు వసతి గృహానికి సంబంధించి రెండు భవనాలను జీ+2 విధానంలో అందుబాటులోకి తెచ్చింది. గత ప్రభుత్వం వరుసగా మూడేళ్ల పాటు ఈ కేంద్రంలో సివిల్స్ పరీక్షలకు సిద్ధమయ్యే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించగా పలువురు ఉద్యోగాలు కూడా సాధించారు. నిరుద్యోగుల పడిగాపులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏపీ స్టడీ సర్కిల్ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ గ్రాడ్యుయేట్లకు ఉచిత శిక్షణ తరగతులను నిలిపివేసింది. 2024–25లో సివిల్స్ ఉచిత వసతి శిక్షణ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. స్టడీ సర్కిల్ నోటిఫికేషన్ కోసం వందల మంది నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు పడిగాపులు కాస్తున్నారు. వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని ఏపీ స్టడీ సర్కిల్స్ స్టూడెంట్స్ ఫోరం ప్రతినిధులు ఆందోళనకు దిగుతున్నారు. వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి తక్షణమే ఏపీ స్టడీ సర్కిల్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. నోటిఫికేషన్ రాకపోవడంతో నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు సివిల్స్, గ్రూప్స్ పరీక్షల శిక్షణకు దూరమవుతున్నారు. ప్రైవేట్ సంస్థల్లో శిక్షణ పొందే స్థోమత లేక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులు నష్టపోతున్నారు. కూటమి ప్రభుత్వం సివిల్స్ ఉచిత వసతి శిక్షణ నోటిఫికేషన్ వెంటనే ఇవ్వాలి. – కొల్లు ఆనంద్కుమార్, అధ్యక్షుడు, ఏపీ స్టడీ సర్కిల్ స్టూడెంట్స్ ఫోరం -
ఏసీఎఫ్ఐ ఏపీ చాప్టర్ చైర్మన్గా సాంబశివరావు
సాక్షి, విశాఖపట్నం : ఎయిర్ కార్గో ఫోరం ఇండియా(ఏసీఎఫ్ఐ) ఆంధ్రప్రదేశ్ చాప్టర్ చైర్మన్గా జి.సాంబశివరావు ఎన్నికయ్యారు. ఈ మేరకు ఏసీఎఫ్ఐ ప్రధాన కార్యాలయం శుక్రవారం ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో ప్రస్తుతం విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయాలు ఎగుమతి దిగుమతుల్లో కార్గో కార్యకలాపాలకు అపారమైన అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు. ముఖ్యంగా ఫార్మా ఉత్పత్తులు, సముద్ర ఉత్పత్తులు (రొయ్యలు, చేపలు), పూలు, మొక్కలు, పరిశ్రమలు, నౌకా స్పేర్స్ వంటి వస్తువుల ఎగుమతితో పాటు బంగారం, వెండి, వజ్రాలు వంటి వస్తువుల దిగుమతులు విస్తృతంగా జరుగుతున్నాయన్నారు. వీటి ద్వారా రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలు పెరగడంతో పాటు స్థానిక యువతకు, మహిళలకు, లాజిస్టిక్స్ రంగంలో ఉపాధి అవకాశాలు ఏర్పడేందుకు కృషి చేస్తాన న్నారు. ఏపీలో ఎయిర్ కార్గో కనెక్టివిటీ మెరుగుపడితే, ఇది పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లకు ఉపయోగకరంగా ఉంటుందని, ఉత్తరాంధ్ర జిల్లాలకు అవకాశాలు కలుగుతాయన్నారు. -
బంగారంలాంటి మాట.. అనసూయ నోట..
ఏయూక్యాంపస్: బంగారం కేవలం మహిళలకు అలంకరణకు ఉపకరించే ఆభరణం మాత్రమే కాదని కుటుంబాలకు ఆర్థిక భరోసాను కూడా ఇస్తుందని సినీనటి అనసూయ భరద్వాజ్ అన్నారు. బీచ్రోడ్డులో ఓ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ మహిళలకు బంగారు ఆభరణాలు ధైర్యాన్ని, భరోసాను కల్పిస్తాయన్నారు. కుటుంబంలో ఆర్థిక అవసరాలకు పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు బంగారం ఒక విలువైన ఆసరాగా నిలుస్తుందన్నారు. ఆర్థిక అవసరాలకు, పెట్టుబడికి బంగారం ఒక మార్గంగా నిలుస్తోందన్నారు. విశాఖ నగరం అంటే తనకు ఎంతో ఇష్టమని, ఎప్పుడు వచ్చినా ఇక్కడ రెండు,మూడు రోజులు ఉండటానికి ఇష్టపడతానన్నారు. -
గంటా ఇంటి వద్ద వీధివ్యాపారుల నిరసన
ఎంవీపీకాలనీ: ఎంవీపీ కాలనీ సెక్టార్–4లోని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇంటి ఎదుట వీధివ్యాపారులు నిరసన చేపట్టారు. శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈ నిరసన కార్యక్రమం జరిగింది. మధురవాడలో ఫుట్పాత్లను ఆనుకొని ఉన్న దుకాణాలను ఇటీవల జీవీఎంసీ తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. భీమిలి జోన్కు చెందిన వీధివ్యాపారులు సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి, జీవీఎంసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీవీఎంసీ వీధివ్యాపారుల పొట్ట కొట్టిన నేపథ్యంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దీనికి సమాధానం చెప్పాలని నిలదీశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జోన్ ఇన్చార్జి వెంకటరావు మాట్లాడుతూ విశాఖలో వీధివ్యాపారుల చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం అందుబాటులోకి తెచ్చిన 2014 స్ట్రీట్ వెండర్స్ చట్టం వీధివ్యాపారులకు రక్షణ కల్పిస్తున్నప్పటికీ, జీవీఎంసీ నియంతగా వ్యవహరిస్తోందన్నారు. షాపులు తొలగిస్తే నగరంలోని వీధివ్యాపారులంతా తమ కుటుంబాన్ని ఎలా పోషించుకోవా లంటూ ప్రశ్నించారు. స్మార్ట్సిటీ పేరుతో విశాఖను పెద్ద వ్యాపారస్తులకు కట్టబెట్టేందుకు జీవీఎంసీ కొనసాగిస్తున్న నియంతృత్వ విధానం సరికాదన్నారు. ఇప్పటికై నా విశాఖలోని ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై స్పందించి, వీధివ్యాపారులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ భూమిలో టీడీపీ నాయకుల దౌర్జన్యం
తగరపువలస: ఆనందపురం మండలం పందలపాక పంచాయతీ బాకూరుపాలెం సర్వే నంబర్ 71లోని రూ.4 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిలో టీడీపీ నేతల కన్ను పడింది. ఆ పార్టీ నేతలు వెన్ని రమణ, రాజు, సత్యవతి గతంలో దౌర్జన్యం చేసి నీలగిరి మొక్కలు వేశారు. అలాగే నెలరోజుల క్రితం అదే స్థలంలో మామిడిమొక్కలు వేయడానికి ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. పందలపాక నుంచి తర్లువాడకు వెళ్లే మార్గంలో బాకూరుపాలెంలో ఉన్న ఈ విలువైన భూమిని గ్రామ అవసరాలకు వినియోగించుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఈ స్థలంలో అంగన్వాడీ భవనాన్ని నిర్మించుకునేందుకు పంచాయతీ పాలకవర్గం ఎం బుక్లో కూడా రికార్డు చేసింది. మళ్లీ మూడు రోజుల క్రితం టీడీపీ నాయకులు ఇదే స్థలంలో ట్రాక్టర్లతో దున్ని మొక్కలు వేయడానికి ప్రయత్నించగా వీఆర్వో దుర్గా రమేష్ అడ్డుకున్నారు. ఈ స్థలంపై టీడీపీ నాయకులతో విబేధాల కారణంగా ఇది వరకే బాకూరుపాలెం గ్రామస్తులు సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తీర్పు వెలువడవలసి ఉండగా నాయకులు టీడీపీలో ప్రముఖుల పేర్లు చెపుతూ దౌర్జన్యం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇదిలావుండగా కబ్జాకు పాల్పడుతున్న వారు టీడీపీకి చెందినవారు కాదని పంచాయతీకి చెందిన ఆ పార్టీ నాయకులు తప్పించుకు తిరుగుతున్నారు. కోర్టు వివాదంలో ఉన్న ఈ విలువైన స్థలంలో తరచూ టీడీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడుతూ గ్రామంలో అశాంతి కలిగిస్తున్నా ఆనందపురం రెవెన్యూ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని బాకూరుపాలెం ప్రజలు వాపోతున్నారు. విలువైన స్థలాన్ని గ్రామ అవసరాలకే ఉపయోగపడాలంటున్నారు. అధికార పార్టీ అండ చూసుకుని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ విషయాన్ని పందలపాక వీఆర్వో దుర్గా రమేష్ దృష్టికి మరోమారు తీసుకురాగా కోర్టు తీర్పు పెండింగ్లో ఉన్నందునే జోక్యం చేసుకోలేకపోతున్నామన్నారు. ఈ విషయాన్ని తహసీల్ధార్ శ్రీనుబాబు దృష్టికి తీసుకువెళ్లానన్నారు. వెన్ని కుటుంబ సభ్యులు తమ వద్ద ఈ స్థలానికి సంబంధించి పట్టాలు ఉన్నాయన్నారన్నారు. కానీ అవి తమ వద్ద ఉన్న రికార్డులతో సరిపోవడం లేదన్నారు. మూడు రోజుల క్రితం సర్వే నంబర్ 71లో దున్నడానికి వస్తే అడ్డుకున్నామన్నారు. కోర్టు తీర్పు వచ్చే వరకు ఈ స్థలంలో ఎలాంటి మొక్కలు, నిర్మాణాలు చేపట్టకూడదన్నారు. -
రౌడీషీటర్ దారుణ హత్య!
ఎంవీపీకాలనీ : ఇద్దరు రౌడీషీటర్ల మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం ఒకరి హత్యకు దారి తీసింది. ఈ నెల 7వ తేదీ రాత్రి సీతమ్మధారలోని ఆక్సిజన్ టవర్స్ వద్ద జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దీనిపై ఎంవీపీ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కశింకోట శ్రీధర్, గౌరీశంకర్ పాతనేరస్తులు. శ్రీధర్పై విజయవాడలో, గౌరీశంకర్పై యలమంచిలిలో రౌడీషీట్లు ఉన్నాయి. వీరు పలు నేరాల్లో నిందితులు కాగా విశాఖలోని త్రీటౌన్, పీఎం పాలెం పోలీసు స్టేషన్ల పరిధిలో సైతం గతంలో కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల్లో భాగంగా ఈ నెల 7వ తేదీన ఇద్దరు విశాఖ జిల్లా కోర్టుకు వాయిదాకు హాజరయ్యారు. అనంతరం కారులో నగరమంతా తిరుగుతూ మద్యం సేవించారు. 7వ తేదీ రాత్రి 2 గంటల సమయంలో (8వ తేదీ తెల్లవారి) సీతమ్మధార ఆక్సిజన్ టవర్స్ సమీపంలో ఓ మహిళ విషయమై వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది ఘర్షణకు దారి తీయడంతో గౌరీశంకర్ శ్రీధర్పై దాడిచేసి పలు చోట్ల కత్తితో గాయపరిచాడు. నరాలు తెగి విపరీతంగా రక్తస్రావం కావడంతో శ్రీధర్ స్పృహ కోల్పోయాడు. మద్యం మత్తులో ఉన్న గౌరీశంకర్ కారులో శ్రీధర్ను వేసుకొని యలమంచిలి వైపు బయలుదేరాడు. ఉదయం 6 గంటలకు యలమంచిలి వద్ద పరిశీలించగా శ్రీధర్ మరణించినట్లు గుర్తించాడు. దీంతో కాళ్లు, చేతులు కట్టేసి యలమంచిలిలోని పోలవరం కెనాల్లోకి మృతదేహాన్ని విసిరేసి అక్కడి నుంచి పరారయ్యాడు. వేరే కేసులో ఈ నెల 9న పోలీసులు గౌరీశంకర్ను విచారిస్తున్న సయయంలో ఈ హత్యోదంతం వెలుగు చూసినట్లు ఎంవీపీ సీఐ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఉదయం పరిశీలించగా బాడీ లభ్యమైందన్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ఈ ఘటనపై శ్రీధర్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు. -
యుద్ధ నౌకకు ‘పనోరమ’ తోడుగా!
సాక్షి, విశాఖపట్నం: సముద్రంలో నిత్యం పహారా కాసే యుద్ధ నౌకలు, సాగర గర్భంలో శత్రువుల్ని మట్టుబెట్టాలనే లక్ష్యంతో గస్తీ కాసే సబ్మెరైన్లకు కొన్ని సందర్భాల్లో సరైన వాతావరణ సమాచారం అందడం లేదు. ఫలితంగా నడిసముద్రంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ హెచ్చరికల్ని ఎప్పటికప్పుడు అందిస్తూ.. వార్షిప్లని అప్రమత్తం చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ సరికొత్త యాప్ని అందుబాటులోకి తీసుకొచి్చంది. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా నేవల్ ఓషనాలజీ ఆధ్వర్యంలో పనోరమ వెర్షన్ 3.0 అప్లికేషన్ రియల్టైమ్ మల్టీమోడల్ వెదర్ అప్లికేషన్గా వ్యవహరించనుంది. వాతావరణ సమాచారం పక్కాగా.. పనోరమా వెర్షన్ 3.0 ద్వారా సమగ్ర వాతావరణ సమాచారం ముందస్తుగానే అందించేలా డిజైన్ చేశారు. దీనిని ఇండియన్ నేవీకి చెందిన నేవల్ ఓషనాలజీ, భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్(బీఐఎస్ఏజీ అండ్ ఎన్) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. దీని ద్వారా నేవీ సిబ్బందికి వాతావరణ సమాచారం పక్కాగా అందనుంది. విపత్కర సమయంలో సముద్రంలో నేవిగేషన్గా కూడా వినియోగించవచ్చు. ఇండియన్ నేవీ డిజిటల్ విజన్, ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఈ అప్లికేషన్ని రూపొందించినట్లు నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. ఈ అప్లికేషన్ని భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి ఢిల్లీలో లాంఛనంగా ప్రారంభించారు. -
జన జాతర
సాక్షి, అమరావతి : కర్ఫ్యూను తలపిస్తూ మోహరించిన పోలీసులు.. అడుగడుగునాఆంక్షలు.. బారికేడ్లు.. ఆటోవాలాలకు బెదిరింపులు.. పార్టీ నేతలకు వేధింపులు.. ఖాకీల దిగ్బంధంలో నర్సీపట్నం మెడికల్ కాలేజీ రోడ్డు..! ఉత్తరాంధ్రలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనను అడ్డుకునేందుకు కూటమి సర్కారు ఎన్ని ఆంక్షలు పెట్టినా జన సునామీ ఎదుట తల వంచక తప్పలేదు! జోరు వర్షంతో పాటు ప్రజల అభిమానంతో తడిసి ముద్ద కావడంతో 65 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణాన్ని వైఎస్ జగన్ ఏకంగా 6 గంటల పాటు ఎడతెరపి లేకుండా సాగించాల్సి వచ్చింది. వాహనాలను పోలీసులు అడ్డుకున్నా ప్రజలు పెద్ద ఎత్తున ఆయన వెంట తరలి వచ్చారు. ఇటీవలి కాలంలో అతి పెద్ద రాజకీయ సభగా పరిశీలకులు దీన్ని అభివర్ణిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నా అశేష ప్రజాదరణతో జనం గుండెల్లో జగన్ చిరస్థాయిగా నిలిచారని.. ఇంటికే పథకాలు, సేవలతో పేదల జీవితాల్లో చెరగని ముద్ర వేశారని పేర్కొంటున్నారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రజా ఉద్యమానికి పిలుపునిస్తూ వైఎస్ జగన్ నర్సీపట్నం వైద్య కశాశాలను సందర్శించిన నేపథ్యంలో.. చంద్రబాబు సర్కారు దారుణ పాలన వైఫల్యాలు, సూపర్ సిక్స్ మోసాలు, రెడ్బుక్ కుట్రలు మరోసారి సర్వత్రా చర్చనీయాంశంగా మారాయని విశ్లేషిస్తున్నారు. పేదల జీవితాల్లో మార్పు కోసం తాపత్రయపడుతూ.. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన మంచి, తీసుకొచ్చిన విప్లవాత్మక వ్యవస్థలు, సంపద సృష్టిని గుర్తు చేసుకుంటున్నారు. సచివాలయాలు, వలంటీర్లు, ఆర్బీకేలు లాంటి వినూత్న వ్యవస్థల ద్వారా ఊరు దాటాల్సిన అవసరం లేకుండా ఇంటివద్దే పథకాలు, పౌర సేవలు అందాయని గ్రామాల్లో చర్చ జరుగుతోంది. కోవిడ్ సంక్షోభంలోనూ ఎక్కడా ఆగకుండా డీబీటీ ద్వారా నేరుగా పథకాలు అందించటాన్ని ప్రస్తావిస్తున్నారు. గత 16 నెలల కూటమి పాలనలో ఎంతో నష్టపోయామని.. బాబు చేతిలో మోసపోయామని అన్ని వర్గాల ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. ఐఆర్, నాలుగు డీఏలు పెండింగ్లో పెట్టారని, పీఆర్సీ ఊసే లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. బాబు ష్యూరిటీ పోయి.. మోసం గ్యారెంటీగా మారిందని.. వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని.. ఇసుక దోపిడీ.. విద్యుత్తు చార్జీల బాదుడు.. నకిలీ మద్యంతో అమాయకులు ప్రాణాలు పోతున్నాయని.. ఏడాది తిరగక ముందే కూటమి పాలనపై ప్రజలకు భ్రమలు పూర్తిగా తొలగిపోయాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.ఆరోగ్యానికి సంపూర్ణ భరోసా..వైఎస్ జగన్ వైద్య, ఆరోగ్య శాఖలో జీరో వేకెన్సీ విధానాన్ని అమలు చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యానికి భరోసా కల్పించారు. ఫ్యామిలీ డాక్టర్, హెల్త్ క్లినిక్స్ ద్వారా ప్రజారోగ్య పరిరక్షణకు పెద్ద పీట వేశారు. వందేళ్లుగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కేవలం రెండే రెండు మెడికల్ కాలేజీలు ఉండగా... మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో ఏకంగా నాలుగు కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం గమనార్హం. మాట ప్రకారం ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల రీసెర్చ్ సెంటర్, అతిపెద్ద డయాలసిస్ సెంటర్ నిర్మించారు. ఉత్తరాంధ్రతో పాటు మైదాన ప్రాంత గిరిజనులకు ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ ఐదు గిరిజన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయగూడెం, దోర్నాలల్లో ఆస్పత్రుల నిర్మాణం చేపట్టారు. చంద్రబాబు గద్దెనెక్కిన వెంటనే మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం ఆగిపోయింది. భావి తరాలకు విలువైన సంపద సృష్టిస్తూ ప్రభుత్వ రంగంలో 17 కొత్త మెడికల్ కాలేజీలకు వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుడితే.. పది కాలేజీలను చంద్రబాబు సర్కారు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతోంది. చంద్రబాబు సర్కారు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకుండా పెండింగ్ పెట్టడంతో రోగులకు వైద్యం నిలిచిపోయిన దుస్థితి.పిల్లలకు మోసం.. వైఎస్ జగన్ హయాంలో నాడు – నేడు, ఇంగ్లీషు మీడియం స్కూళ్లు, ట్యాబ్లు, డిజిటల్ తరగతి గదులు, 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్్ట, అమ్మఒడి, గోరుముద్ద, విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, ఐబీ, టోఫెల్, ద్వారా ప్రభుత్వ విద్యా వ్యవస్థను సమున్నతంగా తీర్చిదిద్ది పిల్లల చదువులకు గట్టి భరోసా కల్పించారని చర్చించుకుంటున్నారు. అదే ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏకంగా దాదాపు ఐదు లక్షల వరకు తగ్గిపోవడం ప్రభుత్వ విద్యావ్యవస్థ దుస్థితి, తల్లిదండ్రుల్లో సన్నగిల్లిన నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తోందని పేర్కొంటున్నారు. విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు చెల్లించకపోవడంతో పిల్లలు చదువులకు దూరమవుతున్నారు. ఆర్వో ప్లాంట్ల నిర్వహణ కూడా సరిగా చేయకపోవడంతో కురుపాంలో ఇద్దరు విద్యార్థనులు మృతి చెందారు. పిల్లలకు పచ్చకామెర్లు సోకితే కనీసం పట్టించుకున్న దిక్కు లేకుండా పోయింది.అన్నదాతకు మహిళలకు దగా..ఈ ప్రభుత్వం వ్యవసాయ సీజన్లో కనీసం ఎరువులు కూడా సమకూర్చలేకపోయిందని, యూరియా నల్ల బజారుకు తరలిపోగా.. ఏ పంటకూ మద్దతు ధరలు దక్కక అన్నదాతలు అగచాట్లు పడుతున్నారని గుర్తు చేస్తున్నారు. ఇంటికే సేవలందించిన వలంటీర్ల వ్యవస్థను రద్దు చేసి నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని పేర్కొంటున్నారు. రైతులకి ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్ గాలికి ఎగిరిపోయింది. ఇన్పుట్ సబ్సిడీకి దిక్కే లేదు. ఈ క్రాప్ కనపడకుండా పోయింది. ఆర్బీకేలు, సచివాలయాలు నిర్వీర్యమయ్యాయి. పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కాకుండా అన్నదాతా సుఖీభవ ద్వారా తామే ఏటా రూ.20 వేలు చొప్పున ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ లెక్కన రెండేళ్లకు కలిపి రూ.40 వేలకుగాను ఇచ్చింది కేవలం రూ.5 వేలు మాత్రమే. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ తల్లికి వందనం కింద ఏటా రూ.15 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చి గత ఏడాది చంద్రబాబు పూర్తిగా ఎగరగొట్టేశారు. రెండో ఏడాది తూతూమంత్రంగా అమలు చేసి 30 లక్షల మంది పిల్లలకు ఎగ్గొట్టారు. ఆడబిడ్డ నిధి కింద రాష్ట్రంలో మహిళలందరికీ ఏటా రూ.18 వేల చొప్పున ఇస్తామన్న హామీని ఎగ్గొట్టారు. అటు 20 లక్షల ఉద్యోగాలూ లేవు.. ఇటు నిరుద్యోగ భృతీ ఇవ్వట్లేదు! ఈ నేపథ్యంలో అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఉంది? ప్రభుత్వ ఆధ్వర్యంలో విద్య, వైద్య రంగాలను బలోపేతం చేసి పటిష్టంగా నిర్వహించాల్సిన ఆవశ్యకతపై సర్వత్రా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.ప్రైవేట్ దోపిడీకి చెక్ పెడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా మంచి చేసే కార్యక్రమంలో భాగంగా 17 కొత్త మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాం. 52 ఎకరాల్లో ఉన్న నర్సీపట్నం మెడికల్ కాలేజీకి సంబంధించి.. కోవిడ్ లాంటి సంక్షోభం ఉన్నా కూడా, రూ.500 కోట్ల ఖర్చుతో 2022 డిసెంబర్ 30న కాలేజీకి శంకుస్థాపన చేశాం -నర్సీపట్నం నియోజకవర్గం భీమబోయినపాలెం మెడికల్ కాలేజీ సందర్శనలో వైఎస్ జగన్ -
‘కల్తీ మద్యం కుంభకోణంలో ఉన్న పెద్దలంతా బయటకు రావాలి’
విశాఖ: కల్తీ మద్యం కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. ఏపీలో కల్తీ మద్యం ఘటనలే దేశంలో అతి పెద్ద కుంభకోణం అని ఆమె పేర్కొన్నారు. ఈరోజు(శుక్రవారం, అక్టోబర్ 10వ తేదీ) విశాఖలో ప్రెస్మీట్లో ఆమె మాట్లాడుతూ.. ‘ ఈ కుంభకోణం లో ఉన్న పెద్దలు అందరూ బయటికి రావాలి. టిడిపికి నిజంగా సంబంధం లేకపోతే ఎందుకు సిబిఐ విచారణకు వెనకాడుతున్నారు. సీఎం చంద్రబాబు, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ఇంటి సమీపంలోనే నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు. కల్తీ మద్యానికి సూత్రధారులు పాత్ర దారులు టిడిపి నేతలు. నాణ్యమైన విద్య వైద్య ఆంధ్రప్రదేశ్గా వైఎస్ జగన్ మార్చితే.. కల్తీ మధ్య ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని చంద్రబాబు మార్చారు. కల్తీ మద్యం రాష్ట్రంలో ఏరులై పాలిస్తున్నారు. కల్తీ మద్యాన్ని కుటీర పరిశ్రమగా టిడిపి నేతలు మార్చుకున్నారు. ఊరూరా కల్తీ మద్యానికి టిడిపి నేతలు పాల్పడుతున్నారు. నారావారి పాలన కల్తీ సారా పాలనగా మారింది. కల్తీ మద్యానికి ఎంతోమంది బలయ్యారు.. నకిలీ మద్యం మీద ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలపై లేదు. ప్రతి మూడు బాటిల్లో ఒకటి కల్తీ మద్యమే’ అని వరుదు కళ్యాణి స్పష్టం చేశారు. కల్తీ మద్యంపై సీబీఐ విచారణ జరపాలి: ఎంపీ మిథున్రెడ్డి -
సమస్యలు వింటూ.. భరోసానిస్తూ..
ఆశ్రమ పాఠశాల విద్యార్థులను పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిడాబాగార్డెన్స్: పచ్చకామెర్లతో బాధపడుతూ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న పార్వతీపురం జిల్లా కురుపాం మండలం శివన్నపేట గురుకులం ఆశ్రమ పాఠశాల హాస్టల్ విద్యార్థులను మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం రాత్రి పరామర్శించారు. కేజీహెచ్ పిల్లల వార్డులో చికిత్స పొందుతున్న సుచిత్ర, లాస్య, స్మైల్, భవిష్య, మాధవి, కీర్తన, సాయి, ప్రణవి, గ్రీష్మ, విద్యా, రమ్య, సంజన, అశ్విని, ధరణి, అఖిల, దీపిక, నీహరిక తదితర పిల్లల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. కాసేపు పిల్లలతో ముచ్చటించారు. తాగునీరు, భోజనం బాగోలేదని విద్యార్థినులు చెప్పారు. ఆర్వో ప్లాంట్ పనిచేయడం లేదని, మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయని వాపోయారు. వార్డులో చికిత్స పొందుతున్న పిల్లలందర్నీ ఆప్యాయంగా పలకరించగా.. వారంతా సంతోషంగా వైఎస్ జగన్తో మాట్లాడారు.కేజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి -
ఎండకు భయపడలేదు.. వర్షానికి వెరవలేదు..
మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పర్యటనకు జనం పోటెత్తారు. ఎయిర్పోర్టు నుంచి ప్రారంభమైన జనజాతర.. నర్సీపట్నం చేరేసరికి సముద్రంలా ఉప్పొంగింది. జై జగన్ అంటూ చేసిన నినాదాలతో జంక్షన్లు మార్మోగిపోయాయి. గోపాలపట్నం, వేపగుంట, చినముషిడివాడ, పెందుర్తి ప్రాంతాల్లో విశాలమైన బీఆర్టీఎస్ రహదారి కూడా జనసంద్రంగా మారిపోయింది. మధ్యాహ్నం 2 గంటలకు మండే ఎండలోనూ జగన్కు హారతులు పడుతూ.. పూలు జల్లుతూ, గజమాలలు వేస్తూ కరచాలనాలు చేశారు. అక్కడి నుంచి అనకాపల్లికి చేరుకున్న తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం చిల్లుపడినట్లు ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. అయినప్పటికీ.. ఏ ఒక్కరూ వెనక్కు వెళ్లలేదు. ఆ జోరు వర్షంలోనే జగన్కు జేజేలు కొట్టారు. అనకాపల్లి నుంచి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ వరకు జగన్ను జనసునామీలా చుట్టేశారు. కాన్వాయ్ కదిలేందుకు కూడా వీలులేకుండా బారులు తీరారు. అభిమానంతో ఉరకలెత్తుతున్న ప్రజల్ని చూసి వైఎస్ జగన్.. అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. నర్సీపట్నం చేరుకున్నాక జై జగన్ నినాదాలు మరింత మిన్నంటాయి. వైద్య కళాశాల వద్ద పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జగన్కు స్వాగతం పలికారు. -
అడుగడుగునా అదే ఆప్యాయత
మండుటెండలోనూ అడుగు వెనక్కిపడలేదు. అడ్డంకులు సృష్టించినా జన సునామీ చేతులెత్తి మొక్కుతూ.. మనసారా అభివాదం చేస్తూ.. ముందుకు సాగిన మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ఆకాశం చిల్లుపడేలా వర్షం పడినా వెరవలేదు. అదే అభిమానం.. చెక్కు చెదరని ఆదరణ. విశాఖ పర్యటనకు వచ్చిన జననేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి ప్రజలు అడుగడుగునా హారతులు పట్టారు. ప్రతి జంక్షన్లోను పూల వర్షం కురిపించారు. గజమాలలతో స్వాగతాలు పలికారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి మాకవరపాలెం మెడికల్ కాలేజీ వరకు సాగిన ఈ పర్యటనలో బ్రహ్మరథం పట్టారు. ఈ పర్యటనకు జనాలు రాకుండా చేసేందుకు కూటమి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినావాటన్నింటినీ పటాపంచలు చేశారు. బారికేడ్లు, రోప్ పార్టీలు, చెక్పోస్టులు జనహోరు ముందు నిలవలేకపోయాయి. జంక్షన్లు జనజాతరను తలపించాయి. మార్గంమధ్యలో బాధలు, సమస్యలతో వచ్చిన వారి నుంచి వినతులు స్వీకరిస్తూ.. వారికి భరోసా ఇస్తూ.. సుమారు 60 కిలోమీటర్ల మేర అభిమానంతో వచ్చిన ప్రతి ఒక్కరికీ అభివాదాలు చేస్తూ.. జనసునామీలో ముందుకు సాగారు. అభిమాన నేతకు కరచాలనం చేసేందుకు మహిళలు, వృద్ధులు, యువత పోటీ పడ్డారు. సాధారణంగా 60 కిలోమీటర్ల ప్రయాణానికి గంటన్నర సమయం పడుతుంది. కానీ విశాఖను చుట్టేసిన జన సంద్రాన్ని తన చిరునవ్వుతో పలకరిస్తూ సాగిన ఆయన పర్యటనకు 6 గంటలు పట్టిందంటే ప్రజానీకం ఎలా వెల్లువలా వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. – విశాఖ సిటీనర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలను పీపీపీ విధానంలో ప్రైవేటుపరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ఇందులో భాగంగానే అసలు మెడికల్ కాలేజీల నిర్మాణాలే జరగలేదని, మాకవరపాలెంలో నిర్మాణంలో ఉన్న కాలేజీకి జీవో ఉంటే చూపించాలని మంత్రులు సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నర్సీపట్నం మెడికల్ కాలేజీ నిర్మాణాలను పరిశీలించడానికి గురువారం విశాఖకు వచ్చారు. జగన్ పర్యటనకు భారీగా జనసందోహం తరలివస్తుండడంతో కూటమి ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. దీంతో ముందు ఆయన రోడ్షోకు అనుమతి లేదని పోలీసులతో చెప్పించింది. ఎన్ని అడ్డంకులు సృష్టించిన రోడ్షో ఆగేది లేదని వైఎస్సార్సీపీ నేతలు తెగేసి చెప్పడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. జగన్ రోడ్షో చేస్తే జనసునామీ తప్పదని భావించిన చంద్రబాబు ప్రభుత్వం రాత్రికి రాత్రి షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది. పోలీసుల సాయంతో ఆటోలు, ప్రైవేటు వాహన యజమానులతో సమావేశాలు పెట్టించి.. జగన్ కార్యక్రమానికి జనాలను తీసుకువెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేయించింది. అలాగే వైఎస్సార్సీపీ నేతలకు ఫోన్లు చేయించి జన సమీకరణ చేయకూడదని బెదిరించే ప్రయత్నం చేసింది. గురువారం తెల్లవారుజాము నుంచే రోడ్లపై బారికేడ్లు, రోప్ పార్టీలు దర్శనమిచ్చాయి. గ్రామాల్లో చెక్పోస్టులు వెలిశాయి.● ప్రధానంగా విశాఖ ఎయిర్పోర్టు వద్ద మాజీ సీఎం జగన్మోహన్రెడ్డికి స్వాగతం పలికేందుకు వేల మంది జనాలు వస్తారని భావించిన పోలీసులు ఎన్ఎస్టీఎల్ గేటు ఎదురుగా బలగాలను మోహరించారు. ఆటోలు, ప్రైవేటు వాహనాల్లో గ్రూపులుగా విమానాశ్రయం రహదారిలోకి వెళ్లకుండా నిరోధించే ప్రయత్నం చేశారు. ఎయిర్పోర్టు రహదారి ప్రారంభంలో కూడా పోలీసులు వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులను అడ్డుకున్నారు.● ఎయిర్పోర్టు నుంచి మాజీ సీఎం జగన్ కాన్వాయ్ బయలుదేరిన తర్వాత ఎన్ఏడీ కొత్త రోడ్డు వద్ద వెనుక ఉన్న వైఎస్సార్సీపీ ముఖ్య నాయకుల వాహనాలను అడ్డగించారు. కేవలం పోలీస్ ఎస్కార్ట్తోనే జగన్ కాన్వాయ్ను అనుమతించారు.● గోపాలపట్నం, సింహాచలం ముఖద్వారం, వేపకుండా కూడలి, పెందుర్తి– అనకాపల్లి ప్లైఓవర్ బ్రిడ్జి ప్రాంతాల్లోను పోలీసులు ఇదే తరహా ధోరణిని అవలంబించారు.● పోలీసులు కాన్వాయ్లోని వాహనాలను అడ్డుకున్న ప్రతిసారి.. నిమిషాల వ్యధిలో రెట్టించిన ఉత్సాహంతో పార్టీ శ్రేణుల వాహనాలు ఎక్కడకక్కడ కాన్వాయ్లో వచ్చి చేరాయి.● పెందుర్తి హైవేపైనా అడ్డుకోగా పినగాడి, సబ్బవరం, అనకాపల్లి ఇలా.. పార్టీ శ్రేణుల వాహనాలు కాన్వాయ్లో కలుస్తూ పర్యటనకు మరింత ఊపు తెచ్చారు.● అనకాపల్లి మండలం మార్టూరు జంక్షన్ వద్ద వాహనదారులను సైతం ఎక్కడకు వెళుతున్నారో తెలుసుకున్న తర్వాతే పంపించారు. కొత్తూరు జంక్షన్ వద్ద జగన్ను చూసేందుకు వెళుతున్న జనాలను పోలీసులు అడ్డగించారు.● కశింకోట మండలం నర్సింగపల్లి వద్ద ఆటోల్లో ప్రయాణికులను వెళ్లనీయలేదు. అత్యవసర పనులపై వెళుతున్నట్లు ఆధారాలు చూపిస్తే గానీ ఆటోల్లో ప్రయాణికులను ముందుకు కదలనీయలేదు.● యలమంచిలి ఫ్లై ఓవర్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. షేకిళ్లపాలెం హైవేలో సైతం ద్విచక్ర వాహనదారులను వెళ్లకుండా అడ్డుకున్నారు.● నర్సీపట్నం నియోజకవర్గంలో ఇతర గ్రామాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సుల్లో పోలీసులు ఎక్కి మరీ ప్రయాణికులు ఎక్కడకు వెళుతున్నారని ఆరా తీసి పంపించారు.కష్టాలు వింటూ.. వినతులు స్వీకరిస్తూ..● మాజీ సీఎం జగన్ పర్యటనలో ప్రజలు, గ్రామస్తులు తమ కష్టాలు, సమస్యలను విన్నవించుకునేందుకు పోటీ పడ్డారు. ప్రతి ఒక్కరి బాధలను వింటూ భరోసా ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.● ఎయిర్పోర్టు దాటిన తరువాత కాకానినగర్ వద్ద వైఎస్సార్ సీపీ గాజువాక సమన్వయకర్త దేవన్రెడ్డి ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు మంత్రి రాజశేఖర్, అయోధ్యరామయ్యతో పాటు పలువురు జగన్ను కలిశారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ, కార్మికుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. స్టీల్ప్లాంట్ను కాపాడుకోవడమే వైఎస్సార్సీపీ లక్ష్యమని, కార్మికులకు అండగా ఉంటామని జగన్ హామీ ఇచ్చి ముందుకు కదిలారు.● బి.భీమవరంలో బల్క్ డ్రగ్ పార్క్ బాధిత నిర్వాసితులు కలిశారు. ఆ పార్క్ వల్ల జరిగే నష్టాలను వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. వారి కష్టాలను తెలుసుకున్న జగన్.. బాధితులు తీసుకొచ్చిన ప్లకార్డును పట్టుకుని వారికి మద్దతు తెలిపారు.● గోవాడ షుగర్ ఫ్యాక్టరీని కాపాడాలని రైతులు, కార్మికులు జగన్ను కోరారు.● తాళ్లపాలెం జంక్షన్ వద్ద ఎన్ఏవోబీ నిర్వాసితులు వినతిపత్రం అందజేశారు.● ఇలా అనేక ప్రాంతాల్లో స్థానిక సమస్యలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై జగన్కు వినతిపత్రాలు అందజేశారు.పాల్గొన్నది వీరే..శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, ఎంపీలు పిల్లి సుభాష్చంద్రబోస్, తనూజరాణి, పార్టీ విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లా అధ్యక్షులు కేకే రాజు, అమర్నాథ్, మజ్జి శ్రీనివాసరావు, మాజీ డిప్యూటీ సీఎంలు బూడి ముత్యాలనాయుడు, పీడిక రాజన్నదొర, పుష్పశ్రీవాణి, ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రులు విడదల రజినీ, పేర్ని నాని, దాడిశెట్టి రాజా, సిదిరి అప్పలరాజు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్యేలు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, రేగం మత్స్యలింగం, జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, పార్లమెంట్ పరిశీలకులు సూర్యనారాయణరాజు, కదిరి బాబురావు, శోభాహైమావతి, మాజీ ఎమ్మెల్యేలు పెట్ల ఉమాశంకర్ గణేష్, వాసుపల్లి గణేష్కుమార్, కరణం ధర్మశ్రీ, కంబాల జోగులు, మళ్ల విజయప్రసాద్, అన్నంరెడ్డి అదీప్రాజ్, కె.భాగ్యలక్ష్మీ, మాజీ ఎంపీలు భీశెట్టి వెంకట సత్యవతి, గొడ్డేటి మాధవి, సమన్వయకర్తలు మలసాల భరత్కుమార్, మొల్లి అప్పారావు, దేవన్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శిలు చింతకాయల సన్యాసిపాత్రుడు, చిక్కాల రామారావు, వీసం రామకృష్ణ, పైలా శ్రీనివాసరావు, దంతులూరి దిలీప్కుమార్, ఉత్తరాంధ్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, సినీనటుడు జోగినాయుడు, ముఖ్యనేతలు డాక్టర్ లక్ష్మీకాంత్, ఎర్రాపాత్రుడు, మున్సిపల్ చైర్మన్ బోడపాటి సుబ్బలక్ష్మీ, వైఎస్ చైర్మన్ కొనేటి రామకృష్ణ, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి చింతకాయల వరుణ్, మాకవరపాలెం ఎంపీపీ రుత్తల సర్వేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు చిటికెల రమణ, జెడ్పీటీసీ పెట్ల సత్యవేణి తదితరులు పాల్గొన్నారు. -
జెడ్ ప్లస్ సెక్యూరిటీ తెలియదా?.. సీపీ హుందాగా మాట్లాడాలి: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర పర్యటనను విజయవంతం చేసినందుకు పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో విశాఖ సీపీ వ్యాఖ్యలపై అమర్నాథ్ మండిపడ్డారు. వైఎస్ జగన్ జెడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉన్నారనే విషయం సీపీకి తెలియదా? అని ప్రశ్నించారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మెడికల్ కాలేజీలపై తమ విధానం ఏంటో మరోసారి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. కోట్లాది మంది ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలనేది వైస్ జగన్ విధానం. వైఎస్ జగన్ పర్యటన విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు. ఉచితంగా ఇవాల్సిన మెడికల్ సీటును పీపీపీ పద్ధతిలో 66 లక్షలకు కొనుక్కోవాల్సిన పరిస్థితి విద్యార్ధులకు ఏర్పడింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకమని జగన్ చెప్పారు.చిరు వ్యాపారులు తమ కష్టాన్ని జగగ్కు చెప్పుకున్నారు. గోవాడ రైతులు ఫ్యాక్టరీ దుస్థితిని జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో షుగర్ ఫ్యాక్టరీకి 89 కోట్లు సహాయం చేశారు. రైతులకు అండగా ఉంటామని జగన్ హామీ ఇచ్చారు. బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు జగన్ను కలిసి తమ వేదన చెప్పుకున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారమే బల్క్ డ్రగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తన పర్యటనలో కేజీహెచ్లో చికిత్స పొందుతున్న చిన్న పిల్లలను పరామర్శించారు. చనిపోయిన వారికి ఐదు లక్షలు పరిహారం పార్టీ తరపున అందించారు అని తెలిపారు.అలాగే, వైఎస్ జగన్ పర్యటనకు పోలీసులు అనేక ఆంక్షలు పెట్టారు. పర్యటనకు ప్రజలు రాకుండా అడ్డుకోవాలని చూశారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా భారీ స్థాయిలో ప్రజలు వచ్చారు. విశాఖ నగర కమిషనర్ చాలా సీనియర్ ఐపీఎస్ అధికారి. సీపీ హుందాగా మాట్లాడాలి. మాజీ సీఎం జగన్ జెడ్ ప్లస్ కేటగిరిలో ఉన్నారనే సంగతి సీపీకి తెలియదా?. వైఎస్ జగన్ను ఉద్దేశించి ఎమ్మెల్యే అంటూ సీపీ మాట్లాడడం సరికాదు. తన వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకోవాలి. ఎమ్మెల్యేకు అయితే ఎందుకు మూడువేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు?’ అని ప్రశ్నించారు. -
‘శ్రద్ధ’తో నిరాశ్రయులకు రక్ష
అల్లిపురం: దేశవ్యాప్తంగా అనాథలు, నిరాశ్రయులు, మానసిక వికలాంగులు, వృద్ధులు రోడ్లపై నిత్యం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లు, సరైన దుస్తులు లేక దీన స్థితిలో తిరిగే ఇలాంటి వారికి సహాయం అందించేందుకు జీవీఎంసీ సహకారంతో ఏయూటీడీ సంస్థ నగరంలో పలుచోట్ల నిరాశ్రయ వసతి గృహాలను నిర్వహిస్తోంది. ఈ వసతి గృహాల్లో నిరాశ్రయుల కోసం ఆహారం అందించడంతో పాటు, చికిత్స వరకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. మానసిక వికలాంగులకు ప్రత్యేక చికిత్స సామాజిక సేవా రంగంలో మెరుగైన సేవలు అందిస్తున్న ఏయూటీడీ.. నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడంతో పాటు మానసిక వికలాంగులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో దీనస్థితిలో, మలమూత్రాలతో తడిసిపోయి తిరిగే ఇలాంటి వారి గురించి సమాచారం అందిన వెంటనే ఏయూటీడీ సిబ్బంది స్పందిస్తారు. వారికి అక్కడికక్కడే సపర్యలు చేసి, బట్టలు మార్చి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుంటారు. వీరికి ప్రత్యేకంగా మానసిక చికిత్సాలయంలో చికిత్స అందించడంతో పాటు, ప్రముఖ సంస్థ శ్రద్ధ ఫౌండేషన్ ద్వారా ప్రత్యేక మెడికేషన్ అందించి వారిని సాధారణ మనుషులుగా తీర్చిదిద్దుతున్నారు. పోలీస్ కమిషనర్ సహకారంతో ‘మిషన్ జ్యోతిర్గమయ’ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి సహకారంతో ఇటీవల విశాఖలో ‘మిషన్ జ్యోతిర్గమయ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 270 మంది నిరాశ్రయులను గుర్తించి, ఏయూటీడీ వసతి గృహంలో ఆశ్రయం కల్పించారు. వారిలో మానసికంగా బాధపడుతున్న వారికి శ్రద్ధ ఫౌండేషన్ ద్వారా మందులు వాడించడంతో ఆరోగ్యం మెరుగుపడిన అనంతరం వారి వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు అప్పగించే కార్యక్రమాన్ని శ్రద్ధ ఫౌండేషన్, ఏయూటీడీ సంయుక్తంగా చేపట్టాయి. పూణేకు చెందిన శ్రద్ధ ఫౌండేషన్కు దేశవ్యాప్తంగా పెద్ద నెట్వర్క్ ఉంది. దాని సహాయంతో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన నిరాశ్రయులను వారి కుటుంబ సభ్యులకు అప్పగించిన ఘటనలు కోకొల్లలు. సంవత్సరాలు గడిచిపోయి, ఇంక చనిపోయారని అనుకున్న వారు కూడా కుటుంబ సభ్యుల చెంతకు చేరి ఆశ్చర్యపరిచిన సందర్భాలు అనేకం. ఈ సంస్థల సేవలతో అనేక కుటుంబాల్లో తిరిగి ఆనందం నిండుతోంది. టీఎస్ఆర్ కాంప్లక్స్ పురుషుల నిరాశ్రయ వసతి గృహంలో ఆశ్రయం పొందుతున్న నిరాశ్రయులు టీఎస్ఆర్ కాంప్లెక్స్లో పంక్తి భోజనాలు చేస్తున్న మహిళలు, పురుషులు మానసిక వ్యాధితో కటుంబాన్ని కోల్పోయాను మానసిక వ్యాధితో నా కుటుంబాన్ని కోల్పోయాను. వ్యాధితో బాధపడుతూ దిక్కుతోచకుండా రోడ్డునపడ్డాను.. నన్ను ఏయూటీడీ సిబ్బంది అక్కున చేర్చుకుని చికిత్స అందజేశారు. ఇప్పుడు నా ఆరోగ్యం బాగుపడింది. ఇప్పుడు ఇక్కడే చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాను. – బి.వీరేశలింగం, నిరాశ్రయుడు ఏయూటీడీ – శ్రద్ధ భాగస్వామ్యానికి ఏడాది పూర్తి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న అసోసియేషన్ ఫర్ అర్బన్ అండ్ ట్రైబల్ డెవలప్మెంట్ (ఏయుటీడీ), శ్రద్ధ రిహాబిలిటేషన్ ఫౌండేషన్, ముంబై మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ఏడాది గడిచింది. ఏడాది కాలంలో, భారతదేశం వ్యాప్తంగా సంచరించే మానసిక వ్యాధిగ్రస్త నిరాశ్రయులను చికిత్స చేసి, కోలుకున్న తర్వాత 94 మందిని వారి కుటుంబాలతో మళ్లీ కలిపారు. వీరిలో ఒక తల్లి–పిల్ల జంట కూడా ఉంది, ఇప్పటి వరకు కుటుంబాలతో కలసిన వారు 36 మంది (22 పురుషులు, 14 మహిళలు, 1 చిన్నారి). ఏయుటీడీ నుండి మహారాష్ట్రలోని శ్రద్ధ కర్జట్, నాగ్పూర్ కేంద్రాలకు తరలించి, అక్కడ చికిత్స అనంతరం కుటుంబాలతో మళ్లీ కలిసిన వారు 58 మంది (47 పురుషులు, 11 మహిళలు). స్థానిక వైద్యులు, సంస్థలలో డాక్టర్ సత్వ వంశీ, వరుణ్ ల్యాబ్, గాయత్రి విద్యా పరిషత్ మెడికల్ కాలేజ్, స్నేహ సంద్య ఏజ్ కేర్ ఫౌండేషన్ వంటి వారు కూడా తమ సేవలు, సహకారాలు అందించారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి సహకారంతో మరింత మందిని వారి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చగలిగాం. ఏయుటీడీ కార్యదర్శి ప్రగడ వాసుతో కలసి శ్రద్ధ ఫౌండేషన్ పరిచేయడం ఆనందంగా ఉంది. – డాక్టర్ భారత్ వట్వాని (ఎమ్డీ సైకియాట్రీ), సంస్థాపక ట్రస్టీ – శ్రద్ధ రిహాబిలిటేషన్ ఫౌండేషన్ ఇప్పటి వరకు 309 మందిని రెస్క్యూ చేశాం 2013 నుంచి ఇప్పటి వరకు 309 మందిని రెస్య్కూ చేశాం. అందులో 94 మహిళలు, 209 మంది పురుషులను వారి వారి సొంత రాష్ట్రాలకు పంపగలిగాం. పూణేలోని శ్రద్ధ ఫౌండేషన్ ద్వారా అప్పగించగలిగాం. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గతంలో మానవతా దృక్ఫథంతో వారికి రక్షించాలని, రెస్క్యూ చేయాలని ఆర్డర్స్ పాస్ చేశారు. కాని వాటిని ఇప్పుడు అమలు చేయని పరిస్థితి. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం సకాలంలో స్పందించి సహకారం అందజేస్తే మరిన్ని సేవలు అందించగలం. – ప్రగడ వాసు, ఏయుటీడీ కార్యదర్శిరెండేళ్లుగా ఆశ్రయం కల్పించారు నాది తమిళనాడు. నా అన్నవారు ఎవరూ లేరు. మానసికంగా బాలేక దారితప్పి విశాఖ రైల్వే స్టేషన్కు వచ్చేశా. ఏడీటీడీ వారు రక్షించి చికిత్స చేయించారు.. రెండేళ్లుగా జీవీఎంసీ, ఏయూటీడీ నిరాశ్రయ వసతి గృహంలో ఆశ్రయం కల్పించారు. అన్ని రకాల వసతులు అందుతున్నాయి. – జి.హేమానంద్, తమిళనాడు -
మత్స్య సంపద నాణ్యత, మార్కెటింగ్ మెరుగుదలపై దృష్టి
మహారాణిపేట: సంప్రదాయ మత్స్యకారుల అవసరాలు, సుస్థిర వేట విధానాలపై అవగాహన పెంచే లక్ష్యంతో సెంట్రల్ మైరెన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సంప్రదింపుల వర్క్షాప్ విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ హాజరై ప్రసంగించారు. మత్స్య సంపద నాణ్యత, మార్కెటింగ్ మెరుగుదలపై దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా సముద్ర సంపద పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న మత్స్యకారులను కలెక్టర్ ‘నీలి యోధులు’గా అభివర్ణించి, వారిని ఘ నంగా సన్మా నించారు. మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ పి. లక్ష్మణ రావు, ప్రధాన శాస్త్రవేత్తలు శాస్త్రవేత్తలు డాక్టర్ కిజకుడన్, డాక్టర్ మధుసూదన రావు, డాక్టర్ మీనా, ఎంపీడా డీడీ మహంతి సహా ఇతర సీఎమ్ఎఫ్ఆర్ఐ శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్నారు. -
రాజకీయ కక్షతోనే బదిలీ..!
విశాఖ సిటీ : విశాఖ అభివృద్ధికి కీలకమైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి.. సమర్థవంతమైన, నిజాయతీ గల అధికారిగా గుర్తింపు తెచ్చుకున్న విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(వీఎంఆర్డీఏ) కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్పై కూటమి ప్రభుత్వం బదిలీ వేటు వేయడంపై అధికార వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. కూటమి నేతల అక్రమాలు సాగనీయడం లేదన్న అక్కసుతోనే ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తీసుకువచ్చి బదిలీ చేయించినట్లు వార్తలు గుప్పుమం టున్నాయి. ప్రధానంగా మాస్టర్ప్లాన్లో ఇష్టానుసారంగా మార్పులు, చేర్పులకు కూటమి ప్రజాప్రతినిధులు గట్టిగా పట్టుబడుతున్నారు. వారి భూములు, అనుచరుల వ్యాపారాలకు అనుగుణంగా మాస్టర్ప్లాన్లో సవరణలకు చేస్తున్న సిఫార్పులను పట్టించుకోని కారణంగానే కూటమి నేతలు కత్తి కట్టినట్లు వార్తలు వినిపిస్తున్నారు. ఇదిలా ఉంటే వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్గోపాల్ కమిషనర్పై కక్ష కట్టి ఎమ్మెల్యేలతో ఫిర్యాదు చేయించినట్లు గత కొద్ది నెలలుగా అధికారుల మధ్య చర్చ జరుగుతోంది. మూడు నెలలుగా కమిషనర్ను బదిలీ చేస్తున్నట్లు ప్రచారం లెవనెత్తారు. ఇందుకు తగ్గట్లుగానే కమిషనర్ విశ్వనాథన్ను ప్రభుత్వం బదిలీ చేయడం గమనార్హం. పాలనలో తనదైన ముద్ర కె.ఎస్.విశ్వనాథన్ జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేసిన నాటి నుంచి సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు పొందారు. రాజకీయ, అధికారుల అక్రమాలకు అడ్డుకట్టవేస్తూ వస్తున్నారు. అనంతరం ఆయన జీవీఎంసీ అదనపు కమిషనర్గా కొన్నాళ్లు పనిచేసి 2024, జూలై 23న వీఎంఆర్డీఏ కమిషనర్గా విశ్వనాథన్ బాధ్యతలు చేపట్టారు. సంస్థలో దీర్ఘకాలంగా నెలకొన్న అవినీతిపై దృష్టి పెట్టారు. వీఎంఆర్డీచే చేపట్టిన అనేక ప్రాజెక్టులు ఏళ్లుగా సా..గుతున్న ప్రాజెక్టులతో పాటు అధికారులను సైతం పరుగులు పెట్టించారు. అక్రమాలకు అడ్డుపడుతున్నారనే అక్కసుతో.. నిక్కచ్చిగా ఉండే విశ్వనాథన్ వ్యవహార శైలిపై కూటమి నేతలు ముందు నుంచీ గుర్రుగా ఉన్నారు. ఇదే సమయంలో వీఎంఆర్డీఏ చైర్మన్గా ప్రణవ్గోపాల్ నియమితులయ్యారు. కమిషనర్గా విశ్వనాథన్ ఉంటే వీఎంఆర్డీఏలో తమ అక్రమాలు సాగవన్న నిర్ణయానికి వచ్చారు. కొద్ది నెలల క్రితం కమిషనర్ విశ్వనాథన్, చైర్మన్ ప్రణవ్గోపాల్ మధ్య వివాదం చోటుచేసుకుంది. ఒక హోటల్లో జరిగిన కార్యక్రమంలో కమిషనర్ను చైర్మన్ దఫేదార్ తోశారు. దీనిపై కమిషనర్ విశ్వనాథన్ అతడిపై సీరియస్ అయ్యారు. ఇదే అదునుగా భావించిన చైర్మన్.. కమిషనర్కు వ్యతిరేకంగా సిబ్బందితో నిరసన చేయించాలని భావించినట్లు సంస్థలో చర్చ జరిగింది. ఆ పనిచేయకపోయినప్పటికీ.. కమిషనర్పై ఎమ్మెల్యేల ద్వారా ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేయించినట్లు వార్తలు వినిపించాయి. అతడిని ఇక్కడి నుంచి బదిలీ చేయాలని ఒత్తిడి తీసుకువచ్చారన్న టాక్ ఉంది. గత కొద్ది నెలలుగా కమిషనర్ బదిలీ తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఐ అండ్ పీఆర్ డైరెక్టర్గా బదిలీ తాజాగా ఐఏఎస్ అధికారుల బదిలీల్లో వీఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్ కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ఇక్కడి నుంచి ఐ అండ్పీఆర్ డైరెక్టర్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముఖేష్కుమార్ మీనా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో కొత్తగా ఎవరినీ నియమించలేదు. కలెక్టర్ ఎం.ఎన్.హరేందిరప్రసాద్కు వీఎంఆర్డీఏ కమిషనర్గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అక్రమాలు సాగవన్న అక్కసుతోనే ప్రజాప్రతినిధుల ఫిర్యాదులు? వీఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్పై బదిలీ వేటు ఐ అండ్ పీఆర్ డైరెక్టర్గా నియామకం కలెక్టర్కు వీఎంఆర్డీఏ కమిషనర్గా పూర్తి అదనపు బాధ్యతలు -
మద్యం మత్తులో నిందితుడు హల్చల్
డీ మార్ట్ భవనంపై నుంచి దూకుతానంటూ బెదిరింపులు గోపాలపట్నం: మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి డీ మార్ట్ భవనంపైకి ఎక్కి, కిందకు దూకేస్తానని బెదిరించి కలకలం సృష్టించాడు. గోపాలపట్నం, గాజువాక పోలీసులు అతన్ని కిందకు దించి, పరిస్థితిని సుఖాంతం చేశారు. వివరాల్లోకి వెళితే.. కొద్ది రోజులుగా పరారీలో ఉన్న హత్యకేసు నిందితుడు వడ్డాది కృష్ణ గోపాలపట్నం ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో గాజువాక, గోపాలపట్నం పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు. అయితే మద్యం సేవించి ఉన్న కృష్ణ, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు గోపాలపట్నంలోని డీ మార్ట్ భవనం పై అంతస్తు సన్షెడ్పైకి ఎక్కాడు. కిందకు దూకేస్తా అని హల్చల్ చేయడంతో.. ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందారు. పోలీసులు, స్థానికులు కలిసి రగ్గు లాంటి దాన్ని కింద పట్టుకుని అతన్ని కాపాడేందుకు యత్నించారు. ఎట్టకేలకు పోలీసులు అతన్ని నచ్చజెప్పి, సురక్షితంగా కిందకు దించారు. దీంతో అక్కడ గుమిగూడిన వారంతా ఊపిరి పీల్చుకున్నారు. వడ్డాది కృష్ణ గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యా యత్నం కేసులో నిందితుడు. కొద్ది రోజులుగా పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. గోపాలపట్నం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని గాజువాక పోలీసులకు అప్పగించారు. -
పరుగుల ఫన్డుగ
విశాఖ స్పోర్ట్స్ : రెండు పులులు బరిలోకి దిగితే ఎలా ఉంటుందో తెలుసా? ఒకరిపై ఒకరు పంజా విసురుకుంటే ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? విశాఖ వేదికగా జరిగిన మహిళల క్రికెట్ మ్యాచ్లో టీం ఇండియా బ్యాటర్ రిచా ఘోష్, సఫారీ బ్యాటర్ నాడిన్ డి క్లర్క్ తమ ప్రదర్శనతో ఆ ప్రశ్నలకు బదులిచ్చారు. నువ్వా నేనా అన్నట్టు ఫ్లడ్లైట్ల వెలుగుల్లో వీరిద్దరూ పరుగుల వరద సృష్టించారు. మ్యాచ్కు ముందు విశాఖలో వరుణుడు కాసేపు ఆనందపు జల్లులు కురిపించాడు. దీంతో తమకు అనుకూలంగా ఉంటుందని భావించిన దక్షిణాఫ్రికా టీం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అనుకున్నట్టే టాప్ ఆర్డర్లు ఒక్కక్కరిగా పెవిలియన్కు చేరుకున్నారు. వంద పరుగులకే టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. ఇలాంటి సమయంలో రిచా ఘోష్ సివాంగిలా విరిచుకుపడింది. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. అంతవరకు పట్టు బిగించామన్న దక్షిణాఫ్రికాకు చెమటలు పట్టించింది. 11 ఫోర్లు, మూడు భారీ సిక్సర్లతో 94 పరుగులు సాధించింది. ఆఖరి ఓవర్ భారీ సిక్స్కు ప్రయత్నించి దురదృష్టవశాత్తూ క్యాచ్ఔట్గా వెనుతిరిగింది. అయితే అప్పటికే భారత్ స్కోరు 251 చేరింది.భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు తడపడ్డారు. 81 పరుగులకే 5 కీలక వికెట్లు చేజార్చుకున్నారు. ఈ క్రమంలో భారత్ విజయం నల్లేరుమీద నడకే అనున్నారంతా... కానీ అప్పుడు సివంగిలా నాడిన్ డి క్లర్క్ ఎదురుదాడికి దిగింది. ఒంటి చేత్తో భారీ లక్ష్యాన్ని ఉఫ్ అని ఊదేసింది. కేవలం 54 బంతుల్లో 84 పరుగులు చేసింది. ఇందులో 8 ఫోర్లు, 5 భారీ సిక్సర్లు ఉన్నాయి. చివరి ఓవర్లలో ఆకాశమే హద్దుగా సిక్సర్ల వర్షం కురిపించడంతో సఫారీల విజయ సంబరాలు అంబరాన్నంటాయి. -
తప్పించుకు తిరుగుతున్న నిందితుడికి రిమాండ్
అల్లిపురం: లైంగిక దాడి కేసులో రెండేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడ్ని మహారాణిపేట పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ మేరకు వివరాలను ఇన్స్పెక్టర్ దివాకర్ యాదవ్ తెలిపారు. ప్రకాశం జిల్లా, చీరాల ప్రాంతానికి చెందిన పదార్థి వీరేంద్ర అలియాస్ చెర్రీ, 2017లో నమోదైన లైంగిక దాడి కేసులో అరెస్ట్ అయ్యి, ఆ తర్వాత బెయిల్పై విడుదలయ్యాడు. బెయిల్ పొందిన తర్వాత అతను కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో నిందితుడిపై కోర్టు నాన్–బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సెల్ ఫోన్ వాడకుండా, ఎవరికీ చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని, సీఐ దివాకర్ యాదవ్ నేతృత్వంలోని పోలీసులు చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం నిందితుడిని రిమాండ్కు తరలించారు. -
అంతర్మధనంలో అధికార టీడీపీ
సాక్షి, విశాఖపట్నం: తమ కుట్రలు విఫలం కావడంతో ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలని చూస్తే.. వైఎస్సార్సీపీ కేడర్ సైతం విస్తుపోయే రేంజ్లో సూపర్ సక్సెస్ కావడంతో అధికార టీడీపీ ఇప్పుడు అంతర్మధనంలో పడిపోయింది(YS Jagan Uttarandhra Tour Success).జగన్ పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలని ఆంక్షల పేరిట ఆటంకాలు సృష్టించింది కూటమి ప్రభుత్వం. ఖాకీలను ప్రయోగించి జనాన్ని రాకుండా ప్రయత్నించింది. అయితే చెక్పోస్టులు, బారికేడ్లను జగన్ మీద ఉన్న అభిమానం బద్దలు కొట్టేసింది. జనాలు తండోపతండాలుగా తరలి రావడం చూసి పోలీసులే కంగుతిన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి మాకవరపాలెం వరకు.. దారి పొడవునా జగన్ ఆగిన చోటల్లా ఇసకేస్తే రాలని జనమే కనిపించారు. ఆంక్షల వలయాన్ని చేధించుకుని.. గుట్టలు, పొలాల గుండా కొందరు యువకులు బైకులపై తరలి రావడం గమనార్హం. తొలుత.. ఈ పర్యటన కోసం దళితులను వాడుకోవాలని అధికార టీడీపీ విశ్వప్రయత్నాలు చేసింది. డాక్టర్ సుధాకర్ పేరుతో హోర్డింగులు ఏర్పాటు చేయించడంతో పాటు ఫకార్డుల ప్రదర్శన చేయించాలని స్కెచ్ వేసింది. అయితే దళితులు ఆ కుట్రలకు లొంగలేదు. పైపెచ్చు జగన్ ర్యాలీకి భారీగా తరలి వచ్చారు. వివిధ వర్గాలు సైతం జగన్ను కలిసి తమ గోడును వెల్లదీసుకోవడం.. ప్రభుత్వానికి ఏమాత్రం మింగుడుపడని విషయం. ఇంకోవైపు..చివరకు ప్రకృతిపైనా పచ్చ బ్యాచ్ ఆశలు పెట్టుకోగా.. అది నెరవేరలేదు. కుండపోత వర్షంలోనూ రోడ్డు పొడవునా.. మహిళలు, వృద్ధులు, రైతులు బారులు తీయడం.. ఎల్లో మీడియాకు సైతం సహించనట్లుంది. అందుకే ట్రాఫిక్ జామ్, షరతుల ఉల్లంఘన పేరుతో విషం చిమ్ముతోంది. వెరసి..ఊహించని రీతిలో జగన్ ఉత్తరాంధ్ర పర్యటన సక్సెస్ కావడంతో కరకట్ట బంగ్లాకు ఏం సమాధానం చెప్పుకోవాలో అని ఉత్తరాంధ్ర తమ్ముళ్లు తెగ మదనపడిపోతున్నారు.క్లిక్ చేయండి: ఉత్తరాంధ్రలో జగన్ కోసం జన సునామీ.. చూశారా? -
జడివానలో.. జన ఉప్పెన
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం, సాక్షి, అనకాపల్లి: సాగర తీరంలో జన ఉప్పెన ఎగసిపడింది. ఉత్తరాంధ్ర పర్యటనలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి సర్కారు పోలీసుల ద్వారా ఎన్ని ఆంక్షలు విధించినా, బెదిరింపులకు పాల్పడినా వెరవకుండా సంక్షేమ సారథికి తోడుగా జనవాహిని ఉప్పొంగింది. మండుటెండలో గంటల తరబడి నిరీక్షించి ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నారు. మధ్యాహ్నం తర్వాత జోరు వర్షంలోనూ అదే జోరు కొనసాగింది. పూల వర్షాలు, హారతులు, గజ మాలలతో బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా నీరాజనంవిశాఖ విమానాశ్రయం నుంచి ప్రారంభమైన వైఎస్ జగన్ పర్యటన గోపాలపట్నం, పెందుర్తి, అనకాపల్లి మీదుగా నర్సీపట్నం మెడికల్ కాలేజీ వరకు సాగింది. 63 కిలోమీటర్ల దూరానికి సాధారణంగా గంటన్నర పడుతుంది. కానీ జనహోరులో వైఎస్ జగన్ పర్యటనకు 6 గంటలకు పైగా పట్టింది. గోపాలపట్నం వద్ద ప్రారంభమైన జన యాత్ర మాకవరపాలెం మెడికల్ కళాశాలకు చేరేసరికి సాగరాన్ని తలపించింది. వేపగుంట వద్ద పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు జగన్ను చూసేందుకు పోటెత్తారు. సుజాతనగర్, చినముషిడివాడలో కూడా పెద్ద ఎత్తున జనాలు తరలివచ్చారు. పెందుర్తి జంక్షన్ నుంచి పినగాడి జంక్షన్ వరకూ ఆత్మీయ నేతతో కరచాలనానికి పోటీ పడ్డారు. అక్కడి నుంచి జాతీయ రహదారిపై సబ్బవరం మీదుగా అనకాపల్లిలో కొత్తూరు జంక్షన్కు చేరుకున్నారు.జోరు వానలోనూ..అనకాపల్లి నుంచి జన ప్రవాహం జగన్ కాన్వాయ్ను ముందుకు కదలనీయకుండా చేసింది. ఆ సమయంలో భారీ వర్షం పడినా వెనక్కు తగ్గలేదు. కొత్తూరు జంక్షన్ నుంచి కశింకోట మీదుగా.. తాళ్లపాలెం వరుకూ జనాలతో కిక్కిరిసిపోయింది. ఒకవైపు కుండపోతగా వర్షం పడుతున్నప్పటికీ.. తడుస్తూనే జై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నర్సీపట్నంలోకి ప్రవేశించాక జై జగన్ నినాదాలు మిన్నంటాయి. వై.భీమవరం, కన్నూరుపాలెం మీదుగా సాయంత్రానికి మాకవరపాలెం మెడికల్ కాలేజీకి చేరుకున్నారు. రాత్రి నుంచి అక్కడే బస..వైఎస్ జగన్ వస్తున్నారని తెలియడంతో మాకవరపాలెం మెడికల్ కళాశాల ప్రాంగణానికి గురువారం వేకువజామునే వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకున్నారు. ముందురోజు సాయంత్రం నుంచి పోలీసులు బెదిరిస్తున్నా వెనుకంజ వేయలేదు. కొందరు ముందురోజు రాత్రే చేరుకుని అక్కడే నిద్రించారు. తెల్లవారు జాము నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు 12 గంటల పాటు ఎండ, వాన, తిండి పట్టించుకోకుండా వేచి చూశారు. వైఎస్ జగన్ మెడికల్ కళాశాల ప్రాంగణం వద్దకు రాగానే కేరింతలు కొట్టారు. ఆంక్షలు ఛేదించుకునిఒకవైపు పోలీసుల బారికేడ్లు.. ఆటోవాలాలకు బెదిరింపులు... అర్ధరాత్రి నుంచే పోలీస్ దిగ్భందంలో మెడికల్ కాలేజీ రోడ్డు..! ఇలా వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి సర్కారు ఎన్ని ఆంక్షలు పెట్టినా జనం హోరు ముందు తుస్సుమన్నాయి. జగన్ కాన్వాయ్ సాగిన ప్రతి జంక్షన్ జన హోరుతో దద్ధరిల్లిపోయింది. జోరు వర్షంతో పాటు ప్రజల అభిమానంతో తడిసి ముద్ద కావడంతో మాజీ సీఎం వైఎస్ జగన్ 65 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణాన్ని ఏకంగా 6 గంటల పాటు ఎడతెరపి లేకుండా సాగించాల్సి వచ్చింది. ఉత్తరాంధ్రలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలని చంద్రబాబు సర్కారు మొదటి నుంచీ తీవ్రంగా యత్నించింది. అందులో భాగంగా మొదట రోడ్డు మార్గానికి అనుమతిచ్చేది లేదని అటు అనకాపలి ఎస్పీ, ఇటు విశాఖ పోలీసు కమిషనర్ల ద్వారా చెప్పించారు. అవసరమైతే హెలికాప్టర్ ద్వారా వెళ్లాలంటూ ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ జగన్ పర్యటన కొనసాగుతుందని... రోడ్డు మార్గంలోనే వస్తారని పార్టీ నేతలు తేల్చి చెప్పారు. దీంతో ప్రభుత్వం చివరకు రోడ్డు మార్గం రూట్ మార్చి పర్యటనకు అనుమతించింది. అయితే ఇందుకోసం ఏకంగా 18 షరతులను విధించింది. ఇక ఆటోవాలాలను పిలిపించి జగన్ పర్యటనకు జనాలను తరలిస్తే కేసులు పెడతామంటూ పోలీసుల ద్వారా బెదిరించింది. మరోవైపు ఎక్కడికక్కడ రాత్రికి రాత్రి బారికేడ్లను ఏర్పాటు చేశారు. రాత్రి నుంచే కార్లు, ద్విచక్ర వాహనాల్లో వెళ్లే వారిని ఎక్కడికక్కడ అడ్డగించి ఆరా తీశారు. ఎక్కడకు వెళుతున్నారంటూ సవాలక్ష ప్రశ్నలు వేశారు. అయినప్పటికీ వైఎస్ జగన్ వచ్చే సమయానికి ఎక్కడికక్కడ జనంతో జంక్షన్లన్నీ నిండిపోయాయి. ఆర్టీసీ బస్సుల్లో కొందరు... నడుచుకుంటూ మరికొందరు.... పోలీసుల కళ్లుగప్పి.... పొలాల్లో నడిచి, బైకులపై వచ్చి చివరకు తమ అభిమాన నేత వద్దకు చేరుకున్నారు. ఫలితంగా 65 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గంలో ప్రయాణించేందుకు ఏకంగా 6 గంటలకుపైగా సమయం తీసుకుందంటే జనవాహిని ఎలా ఉందో పరిస్థితిని ఊహించుకోవచ్చు. మొత్తంగా అటు పోలీసుల లెక్కలకు మించి ఇన్ని ఆంక్షల మధ్య కూడా ప్రభంజనంలా జనం తరలిరావడంతో చేసేదేమీ లేక చేతులెత్తేసిన పరిస్థితి నెలకొంది. -
‘ఉక్కు’ సంకల్పంతో అండగా ఉంటాం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఉక్కు సంకల్పంతో ఎప్పుడూ అండగా ఉంటామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. గురువారం నర్సీపట్నం పర్యటన సందర్భంగా విశాఖ ఎయిర్పోర్టు నుంచి రోడ్డు మార్గంలో వెళ్తున్న వైఎస్ జగన్ను స్టీల్ ప్లాంట్ కార్మికులు కలిశారు. ప్లాంట్ను ఎలాగైనా కాపాడాలని కోరారు. కాకానినగర్ వద్ద వారంతా వైఎస్ జగన్ కోసం నిరీక్షించి తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగ, కార్మిక సంఘం నాయకులతో మాట్లాడిన వైఎస్ జగన్ తాజా పరిణామాల గురించి చర్చించారు. స్టీల్ ప్లాంట్ను కాపాడతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన టీడీపీ కూటమి మోసం చేస్తోందని వారంతా ఆవేదన వ్యక్తంచేశారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నంత వరకూ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని.. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కో విభాగాన్ని ప్రైవేట్పరం చేస్తుండటం ఆందోళన కలిగిస్తోందని వాపోయారు. స్టీల్ ప్లాంట్పై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం.. విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్రత్యేకంగా గనులు కేటాయించడం.. సెయిల్లో విలీనం చేయడంతో పాటు సంస్థలో తొలగించిన ఉద్యోగులను తిరిగి వి«ధుల్లోకి తీసుకోవాలనే డిమాండ్లతో పోరాటం చేస్తున్నామని కార్మిక సంఘాల నాయకులు వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. సంఘటితంగా పోరాడదాం.. స్టీల్ ప్లాంట్ కార్మికుల విన్నపాలపై వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. వారి ప్రతి డిమాండ్ని పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వం ఎదుట ఉంచుతామని హామీ ఇచ్చారు. తాము అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా.. ఎప్పుడూ తమ వైఖరి ఒక్కటేనని, స్టీల్ప్లాంట్ను కాపాడుకోవడమే లక్ష్యమని పునరుద్ఘాటించారు. వైఎస్సార్సీపీ స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఎప్పుడూ తోడుగా ఉంటుందని, ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదన్నదే తమ లక్ష్యమని తేల్చి చెప్పారు. ఆ దిశగా నిరంతరం కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. అన్ని డిమాండ్లపైనా కలసికట్టుగా పోరాటం చేద్దామని వారికి గట్టి భరోసా ఇచ్చారు. -
ఆధునిక దేవాలయాలను అమ్మేస్తున్నారు: వైఎస్ జగన్
రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అవసరమైన ఖర్చు రూ.8 వేల కోట్లు. ఇందులో రూ.3 వేల కోట్లను మా హయాంలోనే ఖర్చు చేసి ఈ స్థాయికి తీసుకొచ్చాం. ఏటా కేవలం రూ.1000 కోట్లు ఖర్చు చేస్తే.. కొన్ని కోట్ల మందికి ఆధునిక దేవాలయాల లాంటి వైద్య కాలేజీల ద్వారా పేదవాడికి ఉచితంగా వైద్యం అందుబాటులోకి వస్తుంది. మరి ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీల కోసం ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఖర్చు చేయలేరా? అని చంద్రబాబుని అడుగుతున్నా రూ.2 లక్షల కోట్లు అమరావతిలో పెట్టడానికి సిద్ధపడుతూ.. రూ.70 వేల కోట్లకు టెండర్లు పిలిచామని చెబుతున్నారు. మరి కోట్ల మంది పేదలకు మేలు చేస్తూ.. ఉచితంగా వైద్యమందించే మెడికల్ కాలేజీలకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేయలేమంటూ ప్రైవేటువారికి అమ్మేసే కార్యక్రమం చంద్రబాబు హయాంలో జరుగుతోంది. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఆయనకు బుద్ధి రావాలని పోరాట కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అనకాపల్లిలో అశేష జనవాహినికి అభివాదం చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘ఇదిగోనయ్యా..! 2022 ఆగస్టు 8న జారీ చేసిన జీవో నం.204. మెడికల్ కాలేజీ నిర్మాణానికి జీవో ఇవ్వలేదంటూ స్పీకర్ పదవిలో ఉంటూ అబద్ధాలు చెప్పినందుకు ఆ పదవికి నువ్వు అర్హుడివేనా? ఆలోచించుకో...! తప్పుడు మాటలు చెబుతూ, ప్రజల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో చంద్రబాబుతో చేతులు కలిపినందుకు తలదించుకోవాలి..’ – నర్సీపట్నం నియోజకవర్గం భీమబోయినపాలెం మెడికల్ కాలేజీ వద్ద మీడియాతో వైఎస్ జగన్ నర్సీపట్నానికి సంబంధించిన సీనియర్ నాయకుడు, సీనియర్ ఎమ్మెల్యే, స్పీకర్ పదవిలో ఉంటూ... చంద్రబాబులా తప్పుడు మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెబుతున్నారు. తాను కూడా చంద్రబాబు కంటే నాలుగు ఆకులు తక్కువ కాదు అని నిరూపించుకుంటున్నారు. స్పీకర్కు చెబుతున్నా... అబద్ధాలతో ప్రజల్ని మోసం చేయడం ఎంత వరకూ ధర్మమని అడుగుతున్నా. క్షమాపణ చెబుతావా? ఈ మెడికల్ కాలేజీకి జీవో లేదని అంటారా.. ఇదిగోనయ్యా.. ఆగస్టు 8, 2022న జారీ చేసిన జీవో నం.204. చంద్రబాబు జూన్ 2024లో అధికారంలోకి రాగా సెపె్టంబర్ 3న ఒక మెమో జారీ చేశారు. మొత్తం 17 మెడికల్ కాలేజీల నిర్మాణం ఆపాలంటూ మెమో జారీ చేశారు. అన్ని మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి వదిలేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ మెడికల్ కాలేజీలకు నిధులు లేవని చెబుతున్నారు. అయ్యా చంద్రబాబూ..! ఇక్కడ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే, స్పీకర్కు కూడా చెబుతున్నా. నాబార్డ్ ఫండ్స్ అప్పట్లోనే ఈ ప్రాజెక్టులకు టై–అప్ చేశాం. నాబార్డ్ ఫండ్స్ మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ ఇ్రన్ఫాస్ట్రక్చర్ కేటగిరీలో ఈ మెడికల్ కాలేజీల్ని చేర్చాం. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘‘పేదలకు ఉచితంగా వైద్యం అందించేందుకు ఉద్దేశించిన వైద్య కళాశాలలను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను రచ్చబండ సాక్షిగా ప్రజలకు వివరిస్తాం. దీన్ని నిరసిస్తూ శుక్రవారం నుంచి రచ్చబండ కార్యక్రమాన్ని చేపడతాం. నవంబరు 24 నాటికి రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాలు సేకరించి గవర్నర్కు అందచేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా మేం శ్రీకారం చుట్టిన 17 కొత్త మెడికల్ కాలేజీల్లో మా హయాంలోనే దాదాపుగా ఏడు కాలేజీలు పూర్తి కాగా ఐదు చోట్ల మా ప్రభుత్వంలోనే తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. పులివెందుల మెడికల్ కాలేజీకి ఎంబీబీఎస్ సీట్లను కేటాయిస్తే, మాకు వద్దంటూ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. పేదలకు చేరువలో ఉచితంగా మెరుగైన వైద్యం కోసం ఉద్దేశించిన మెడికల్ కాలేజీల నిర్మాణానికి నాబార్డుతో పాటు కేంద్రం నుంచీ వడ్డీ లేని నిధులను మా ప్రభుత్వంలో టై–అప్ చేశాం. కేవలం ఏటా రూ.1,000 కోట్ల చొప్పున రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే ఆ కాలేజీలు పూర్తవుతాయి. అది కూడా చేయలేకపోతే చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క రంగం బాగుపడలేదు. విశాఖలో షాపులను తొలగించి 32 వేల మందిని రోడ్డున పడేశారు. గిరిజన విద్యార్థుల హాస్టళ్లలో మా ప్రభుత్వం ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే.. ఈ సర్కారు కనీసం ఫిల్టర్లను కూడా మార్చడం లేదు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులకు బకాయిలు చెల్లించడం లేదు. విశాఖ స్టీలు ప్లాంటులో 32 విభాగాలను ప్రైవేటుపరం చేస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే స్టీలు ప్లాంట్ కార్మీకులకు షోకాజ్ నోటీసులు జారీచేస్తున్నారు..’ అని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. గురువారం ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరంపాలెం మండలం భీమబోయినపాలెంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు గత ప్రభుత్వం అసలు జీవో ఇవ్వలేదని... దమ్ము, ధైర్యం ఉంటే దాన్ని చూపించాలంటూ స్పీకర్ విసిరిన సవాల్పై ఘాటుగా ప్రతిస్పందించారు. స్థానికంగా ప్రాతినిథ్యం వహిస్తున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఉన్నత పదవిలో ఉంటూ చంద్రబాబు మాదిరిగా అబద్ధాలు చెబుతున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. ఆయనకు ఆ పదవిలో ఉండేందుకు అర్హత ఉందా? అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. నర్సీపట్నం మెడికల్ కాలేజీ వద్దకు వస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి, భారీగా తరలివచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు కోట్లాది మంది పేదలకు మేలు.. చెంతనే సూపర్ స్పెషాల్టీ వైద్యం ఈ రోజు ఇక్కడ వెనుక కనిపిస్తున్నవి నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించిన మెడికల్ కాలేజీ నిర్మాణాలు. ఉత్తరాంధ్రకు మంచి చేస్తూ.. అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఒక మెడికల్ కాలేజీ నిర్మాణం దాదాపు 52 ఎకరాల్లో కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇలా 17 కొత్త మెడికల్ కాలేజీలకు మా హయాంలో శ్రీకారం చుట్టాం. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు ద్వారా ఏడెనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం పేదలకు చేరువలో ఉచితంగా అందుతాయి. ఆ ఆధునిక దేవాలయాల వల్ల ఇది సాధ్యమవుతుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ వస్తే ఆ ఏడెనిమిది నియోజకవర్గాల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవీ పేదవాడిని దగా చేయలేని పరిస్థితులు ఏర్పడతాయి. పక్కనే ప్రభుత్వ మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ సేవలు పేదవాడికి ఉచితంగా అందుబాటులో ఉన్నప్పుడు ఎక్కువ రేట్లు వసూలు చేసే ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. మొత్తంగా 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వం నిర్వహిస్తే ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఉచితంగా వైద్యం పేదవాడికి చేరువలో అందుబాటులోకి వస్తుంది. ప్రైవేట్ ఆస్పత్రుల దగాకు తెర పడుతుంది. మరి ఇలాంటి ఆధునిక దేవాలయాల్ని ఎందుకు మూసేస్తున్నారని ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా. విశాఖపట్నం ఎయిర్పోర్టు నుంచి జాతీయ రహదారిపైకి వచ్చిన వైఎస్ జగన్కు అపూర్వ స్వాగతం కోవిడ్ ఇబ్బందుల్లోనూ నర్సీపట్నం మెడికల్ కాలేజీకి ప్రణాళిక చేశాం.. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేట్పరం చేసేస్తే ఇక వారే నడుపుతారు. అంతా ప్రైవేట్ వాళ్లే ఉంటే.. మరి పేదవాడికి ఏ రకంగా భరోసా ఉంటుంది? ఉచిత వైద్యం అన్నది పేదవాడికి ఎలా అందుబాటులోకి వస్తుంది? ఈరోజు ఇక్కడ 52 ఎకరాల్లో కొత్త మెడికల్ కాలేజీ నిర్మాణం జరుగుతోంది. 2022 డిసెంబర్ 30న ఈ కాలేజీకి శంకుస్థాపన చేశాం. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులున్నా, సంక్షోభంలో ఉన్నా ఈ కాలేజీకి రూ.500 కోట్లు ఖర్చు చేయాలని ప్రణాళిక చేశాంఈ కాలేజీ పూర్తయితే 600 బెడ్స్తో పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తూ.. సంవత్సరానికి 150 మెడికల్ సీట్లు ఇక్కడ అందుబాటులోకి వచ్చేవి. ఈ ప్రాంతమంతటికీ ఇక్కడి మెడికల్ కాలేజీ దిక్సూచీగా ఉండేది. పాయకరావుపేట, తూర్పు గోదావరి పరిధిలోని తుని నియోజకవర్గం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇదే మెడికల్ హబ్ అవుతుంది. ఈ రోజు ఏ ఇబ్బంది వచ్చినా.. విశాఖలోని కేజీహెచ్కు వెళ్లాల్సి వస్తోంది. వందల మంది రోగులకు అక్కడ సరిగా వైద్యం అందించలేని పరిస్థితి నెలకొంది. మెడికల్ సీట్లను.. బాబు వద్దన్నారు 17 కొత్త మెడికల్ కాలేజీల్లో 7 కాలేజీలు మేం అధికారంలో ఉన్నప్పుడే దాదాపుగా పూర్తయ్యాయి. మేం అధికారంలో ఉండగానే 5 మెడికల్ కాలేజీలు పూర్తై తరగతులు కూడా ప్రారంభించాం. 2023–24లోనే విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కాలేజీల్లో క్లాసులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే దాదాపు 800 మెడికల్ సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. 3 బ్యాచ్లు అడ్మిషన్లు కూడా పొందాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చేసరికి పాడేరులో 50 సీట్లతో కాలేజీలో క్లాసులు కూడా మొదలైన పరిస్థితులు కనిపించాయి. పులివెందులలో కూడా 50 సీట్లుతో క్లాసులు ప్రారంభించాలంటూ నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతి ఇస్తే.. మాకు సీట్లు వద్దు, మెడికల్ కాలేజీ వద్దంటూ చంద్రబాబు వెనక్కి పంపించేశారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం 2022 ఆగస్టు 8వ తేదీన జారీ చేసిన జీవో కాపీని చూపిస్తున్న జగన్ ఏడాదికి రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేయలేరా? రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అవసరమైన ఖర్చు రూ.8 వేల కోట్లు. ఇందులో రూ.3 వేల కోట్లను చంద్రబాబు అధికారంలోకి వచ్చే సరికే మా హయాంలోనే ఖర్చు చేసి ఈ స్థాయికి తీసుకొచ్చాం. మరి ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీల కోసం ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఖర్చు చేయలేరా? అని చంద్రబాబుని అడుగుతున్నా. సంవత్సరానికి కేవలం రూ.1000 కోట్లు ఖర్చు చేస్తే.. కొన్ని కోట్ల మందికి ఆధునిక దేవాలయాల లాంటి వైద్య కాలేజీల ద్వారా పేదవాడికి ఉచితంగా వైద్యం అందుబాటులోకి వస్తుంది. రాష్ట్రంలో 2019 నాటికి ఉన్న మెడికల్ సీట్లు కేవలం 2,360 సీట్లు అయితే మరో 2,550 సీట్లు అదనంగా ఈ 17 కాలేజీల ద్వారా సమకూరుతాయి. అంటే రాష్ట్రంలో మొత్తం 4,910 సీట్లు మెడిసిన్ చదివే పిల్లలకు అందుబాటులోకి వస్తాయి. ఇటు మన విద్యార్థులకు మెడికల్ సీట్లు.. అటు కోట్లాది మంది పేదలకు చేరువలో సూపర్ స్పెషాల్టీ వైద్యాన్ని ఉచితంగా అందించే ఆధునిక దేవాలయాలివి. ఇవన్నీ చంద్రబాబు దగ్గరుండి ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసే కార్యక్రమం చేస్తున్నారు. అమరావతిలో 50 వేల ఎకరాలు కాదు.. మరో 50 వేల ఎకరాలు సేకరించి.. రూ.2 లక్షల కోట్లు కేవలం అక్కడ కరెంట్, రోడ్లు, డ్రైనేజీలు, నీళ్లు, మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేస్తారు. గతంలో 50 వేల ఎకరాలకు ఎకరానికి రూ.2 కోట్లు చొప్పున మొత్తం రూ.లక్ష కోట్లు కావాలన్నారు. కానీ ఖర్చు చేసింది రూ.4,500 కోట్లు. మళ్లీ ఇవాళ 50 వేలు సరిపోవు.. మరో 50 వేల ఎకరాలు కావాలని తీసుకుంటున్నారు. అంటే ఆ 50 వేల ఎకరాలకు మౌలిక సదుపాయాల కోసం మరో రూ.లక్ష కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధ పడుతున్నారు. ఆర్వో ప్లాంట్ ఫిల్టర్లూ మార్చడం లేదు.. ఇవాళ చంద్రబాబు దారుణ పాలన చూస్తే.. కురుపాం గిరిజన గురుకుల పాఠశాలలో 170 మందికి హెపటైటిస్–ఏ వస్తే వారిని పట్టించుకున్న దిక్కులేదు. జాండిస్ సోకినట్లు సెపె్టంబరు 10న గుర్తించినా జాగ్రత్తలు తీసుకోలేదు. కనీసం స్క్రీనింగ్ చేపట్టాలన్న ఆలోచన కూడా చేయకపోవడం దారుణం. ఇద్దరు విద్యారి్థనులు చనిపోయిన తర్వాత స్క్రీనింగ్ చేస్తే.. 170 మందికి పచ్చ కామెర్లున్నాయని తేలింది. నాడు–నేడు మనబడి కింద మన హయాంలో కురుపాం స్కూల్లో ఆర్వో ప్లాంట్ పెట్టాం. కానీ ఈ ప్రభుత్వం దాని ఫిల్టర్స్ కూడా మార్చడం లేదు. దీంతో అవి నిరుపయోగమయ్యాయి. హాస్టల్ ఆర్వో ప్లాంట్ ఫిల్టర్లు కూడా మార్చలేని పరిస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. నర్సీపట్నం మెడికల్ కాలేజీ పూర్తయితే ఎలా ఉంటుందనే నమూనా ఫొటోను చూపిస్తున్న వైఎస్ జగన్ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు.. దారిలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు నన్ను కలిశారు. నాడు ఎన్నికల ముందు విశాఖ ఉక్కు కంపెనీని కాపాడతానని కూటమి నేతలు చెప్పారు. చంద్రబాబు వచ్చిన తర్వాత 32 విభాగాలను ప్రైవేటుపరం చేశారు. వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసేశారు. ప్రశ్నిస్తే షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు. జీతాలు కూడా ఇవ్వడం లేదు. వీఆర్ఎస్ డబ్బులూ ఇవ్వడం లేదు. చెరకు రైతుల ఆవేదన పట్టదా? చెరకు కార్మీకులు కూడా నన్ను కలిశారు. 2014–19 మధ్య ప్రభుత్వం ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీని నాశనం చేస్తే మేం అధికారంలో ఉన్నప్పుడు రూ.89 కోట్లు ఇచ్చి ఆదుకున్నాం. ఈరోజు ప్రభుత్వం మరో రూ.35 కోట్లు బకాయి పెట్టింది. రైతుల ఆవేదన చంద్రబాబుకి వినిపించడం లేదు. అందరినీ రోడ్డున పడేస్తున్నారు..! బల్క్ డ్రగ్స్ కంపెనీ కోసం పక్కనే నక్కపల్లిలో 4000 ఎకరాల భూమి ఉన్నా రాజయ్యపేటలో భూముల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడంతో మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. అయినా చంద్రబాబు ఆలకించడం లేదు. మరి వారికి ఎవరు ఊరటనిస్తారు? విశాఖలో చిరు వ్యాపారుల పొట్ట కొట్టారు. 4,500 చిన్న షాపులు తీసేశారు. 32 వేల మంది ఎలా బతుకుతారు? అందరినీ రోడ్డున పడేస్తున్నారు. చరిత్రహీనుడిగా మిగిలిపోతావ్...! ఈరోజు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు నిర్వీర్యమయ్యాయి. విద్యార్థులు, రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. ఆర్బీకేలు నిర్వీర్యం. ఈ–క్రాప్ తెరమరుగైపోయింది. సూపర్సిక్స్, సూపర్ సెవెన్ అంటూ మోసాలు చేస్తున్నారు. అన్ని పథకాలు రద్దు చేసేశారు. దీంతో పేదలు, రైతులు, మహిళలు, పిల్లలు, విద్యార్థుల బతుకులు రోడ్డున పడ్డాయి. అయ్యా చంద్రబాబూ.. ఇప్పటికైనా బుద్ధి, జ్ఞానం ఉంటే మార్పు తెచ్చుకో. ప్రజలకు తోడుగా ఉండు. లేకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. నేటి నుంచి రచ్చబండ.. కోటి సంతకాల సేకరణచంద్రబాబూ.. మీరు చేస్తున్న పనులకు నిరసనగా రేపటి నుంచి (అక్టోబర్ 10) నవంబరు 22 వరకు గ్రామ, వార్డు స్థాయిలో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు వివరిస్తాం. చంద్రబాబు సూపర్సిక్స్, సెవెన్ పేరుతో చేసిన మోసాలను కూడా రచ్చబండలో తెలియచేస్తాం. ప్రతి గ్రామం నుంచి 500 సంతకాలు, ప్రతి నియోజకవర్గం నుంచి 50 వేలకు తక్కువ కాకుండా సంతకాలు సేకరిస్తాం. రాష్ట్రం మొత్తం మీద కోటి సంతకాలు సేకరిస్తాం. అక్టోబరు 28న నియోజకవర్గ కేంద్రాలు, నవంబరు 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తాం. ఆ తర్వాత నవంబరు 23న నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, ఆ మర్నాడు నవంబరు 24న జిల్లా కేంద్రాల నుంచి విజయవాడకు ఆ సంతకాల పత్రాలు లారీల్లో వస్తాయి. ఆ తర్వాత గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకుని వాటన్నింటినీ సమర్పిస్తాం. మాతో కలిసి వచ్చే వారందరినీ కూడగడతాం. చంద్రబాబు ఇప్పటికైనా తన నిర్ణయం మార్చుకోవాలి. బుద్ధి తెచ్చుకోవాలి.వందేళ్లలో ఉత్తరాంధ్రలో వచ్చింది రెండు మెడికల్ కాలేజీలు...జగన్ హయాంలోనే ఉత్తరాంధ్రలో 4 మెడికల్ కాలేజీలు.. ఐదు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు... పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్1923 నుంచి 2019 వరకూ రాష్ట్రంలో ఉన్న మొత్తం గవర్న్మెంట్ మెడికల్ కాలేజీలు కేవలం 12 మాత్రమే. ఉత్తరాంధ్రని తీసుకుంటే 1923లో బ్రిటిష్ వాళ్లు కట్టిన కేజీహెచ్ ఏఎంసీ కాలేజీ మాత్రమే అందుబాటులో ఉంది. తర్వాత నాన్న వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో శ్రీకాకుళంలో రిమ్స్ ఏర్పాటు చేశారు. నాన్న పుణ్యాన శ్రీకాకుళంలో రిమ్స్, బ్రిటిష్ వాళ్ల పుణ్యాన కట్టిన కేజీహెచ్ మాత్రమే ఉన్నాయి. అంటే వందేళ్లలో ఉత్తరాంధ్రలో వచ్చింది రెండు మెడికల్ కాలేజీలు మాత్రమే. వైఎస్సార్సీపీ హయాంలో.. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్రలో ఏకంగా మరో 4 కొత్త మెడికల్ కాలేజీలకు ప్రభుత్వ ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టాం. విజయనగరం, పార్వతీపురం, పాడేరు, నర్సీపట్నం కాలేజీల నిర్మాణాన్ని చేపట్టాం. ఈ నాలుగింటిలో పాడేరు, విజయనగరం మెడికల్ కాలేజీల్లో ఇప్పటికే క్లాసులు మొదలయ్యాయి. విజయనగరం కాలేజీ 2023లోనే ప్రారంభమైంది. 2024 ఎన్నికల నాటికి సిద్ధమైన పాడేరు కాలేజీలో కూడా క్లాసులు ప్రారంభమయ్యాయి. ఈ రెండు కాలేజీల్లో క్లాసులు ప్రారంభం కాగా మరో రెండు కొత్త కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. పార్వతీపురంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ ఫొటోలు, టీచింగ్ కాలేజీ ఫొటోలు కళ్ల ఎదుటే కనిపిస్తున్నాయి. నర్సీపట్నంలో ఇక్కడే నిర్మాణంలో ఉన్న ఈ కాలేజీ కూడా మన కళ్లకు కనిపిస్తోంది. మరోవైపు పలాసలో మనం నిర్మీంచిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కూడా కళ్లెదుటే కనిపిస్తోంది. ఐదు మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు తెచ్చాం. సీతంపేట, పార్వతీపురం మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్ దాదాపుగా పూర్తయ్యాయి. ఉత్తరాంధ్రకు ఇంత మంచి చేసే కార్యక్రమాలు జరుగుతుంటే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. -
తప్పు ఒప్పుకోండి.. అబద్ధాలు ఆపండి: వైఎస్ జగన్
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఆస్పత్రిలో 64 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. 200 కిలోమీటర్ల దూరం నుంచి కేజీహెచ్కు వచ్చారు. ఎంత సీరియస్గా ఉంటే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొస్తారు? అయినా ప్రభుత్వం స్పందించక పోవడం దుర్మార్గం. గిరిజన విద్యార్థులను పట్టించుకోకపోవడం దారుణం. మరోసారి ఈ తరహా దారుణాలు జరగకుండా సమస్య పరిష్కరించేలా చూడాల్సింది పోయి.. తప్పులు దాచాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. చేసిన తప్పులు ఒప్పుకొని ప్రాయశ్చిత్తం చేసుకుంటే దేవుడు క్షమిస్తాడు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.25 లక్షలు, చికిత్స పొందుతున్న విద్యార్థులకు రూ.లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలి. లేదంటే బాధిత కుటుంబాల తరఫున న్యాయ పోరాటం చేస్తాం.కప్పిపుచ్చే కార్యక్రమం ఇకనైనా ఆపండి. హోం మంత్రి వాటర్ కంటామినేషన్ కాదు అని మాట్లాడుతుండటం ఆశ్చర్యం అనిపిస్తోంది. అసలు పచ్చ కామెర్లు నీటి కాలుష్యం వల్లే వస్తాయనే విషయం ఆమెకు తెలీదేమో! ఒకే స్కూల్ నుంచి 170 మందికి ఒకేసారి వచ్చిందంటే దేని వల్ల వచ్చింది? 65 మంది ఒకే స్కూల్కు చెందిన వారు జాండిస్తో ఇక్కడ అడ్మిట్ అయ్యారు. ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి ప్రభుత్వానికి? నోరు తెరిస్తే అబద్ధాలు ఆడడం అలవాటైపోయింది. - వైఎస్ జగన్సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం గిరిజన విద్యార్థులను పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆస్పత్రి పాలైతే తప్పులు దాచాలని చూడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తప్పు ఒప్పుకుని, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కురుపాంలోని గిరిజన బాలికల వసతి గృహంలో పచ్చకామెర్ల బారిన పడి చికిత్స పొందుతున్న విద్యార్థుల్ని గురువారం రాత్రి ఆయన విశాఖలోని కేజీహెచ్లో పరామర్శించారు.నర్సీపట్నం మెడికల్ కాలేజీ పర్యటన అనంతరం.. రాత్రి 8.15 గంటలకు కేజీహెచ్లోని పిల్లల వార్డుకు నేరుగా చేరుకున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న 21 మంది విద్యార్థుల్ని పరామర్శించారు. బాధిత విద్యార్థులు, వారి తల్లులతో మాట్లాడి.. వ్యాధుల బారిన పడటానికి గల కారణాలు, హాస్టల్ వద్ద పరిస్థితులు, చికిత్స అందుతున్న తీరు.. తదితర విషయాలపై ఆరా తీశారు. మొదలైన వివరాల్ని ఆరా తీశారు. అందరికీ భరోసా కల్పించి.. త్వరగా కోలుకోవాలని ఆశీర్వదించారు. అనంతరం కేజీహెచ్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..నీటి కాలుష్యమని వైద్యులు చెబుతున్నారు..కురుపాంలోని గిరిజన బాలికల వసతి గృహంలో 5, 6, 7 తరగతుల పిల్లలు పచ్చ కామెర్లతో కేజీహెచ్లో చేరారు. పిల్లలు, వారి తల్లిదండ్రులు నీళ్లు బాగోలేవనే చెప్పారు. వైద్యులు కూడా నీటి కాలుష్యం కారణంగానే వ్యాధులు ప్రబలాయని చెబుతున్నారు. మినరల్ వాటర్ ప్లాంట్ పనిచేస్తే వాటర్ కంటామినేషన్ ఎందుకు జరుగుతుంది? అది పని చేయడం లేదు. ఒకే హాస్టల్కు చెందిన దాదాపు 170 మంది విద్యార్థులకు పచ్చకామెర్లు వస్తే.. ఇక్కడకు వచ్చిన మంత్రులు, ప్రభుత్వ పెద్దలు దానికి గల కారణాల్ని, ప్రభుత్వ వైఫల్యాల్ని కప్పిపుచ్చాలని ప్రయత్నిస్తున్నారు. అంతేతప్ప.. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఎలా ఇవ్వాలి.. అక్కడ తలెత్తిన సమస్యల్ని ఎలా పరిష్కరించాలనే దానిపై ఆలోచించక పోవడం దారుణం.పరిహారం ఇవ్వకపోతే న్యాయపోరాటంఅభం శుభం తెలియని ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. వారి కుటుంబాలకు ఇంత వరకు పరిహారం ఇవ్వలేదు. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. చికిత్స పొందుతున్న పిల్లల బాధ్యత ప్రభుత్వం తీసుకుని 170 మందికి రూ.లక్ష చొప్పున పరిహారం అందించాలి. ఇది మెడికో లీగల్ కేసు. ఎస్టీ పిల్లలను పట్టించుకున్న పరిస్థితి లేని ప్రభుత్వం ఇది. ప్రభుత్వం వీరికి పరిహారం ఇవ్వకపోతే అవసరమైతే వైఎస్సార్సీపీ వీరి తరఫున కోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేసి మరీ.. పరిహారం ఇప్పించే కార్యక్రమం చేస్తుంది.దేవుడు కూడా క్షమించడు..తక్షణమే హాస్టల్లో మినరల్ వాటర్ ప్లాంట్ మరమ్మతు చేయించండి. బాత్ రూమ్లు రిపేర్ చేయాలి. శానిటేషన్పై దృష్టి పెట్టాలి. వసతుల కల్పనపై శ్రద్ధ పెట్టాలి. ప్రభుత్వం తప్పు చేసిందని ఒప్పుకుని, చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకుంటే కనీసం దేవుడు కొద్దో గొప్పొ క్షమిస్తాడేమో. లేకపోతే దేవుడు కూడా క్షమించే పరిస్థితి ఉండదని గుర్తు పెట్టుకోవాలి. దీన్ని కప్పిపుచ్చే కార్యక్రమం ఇకనైనా ఆపండి. హోం మంత్రి వాటర్ కంటామినేషన్ కాదు అని మాట్లాడుతుండటం ఆశ్చÆý‡్యం అనిపిస్తోంది. అసలు పచ్చ కామెర్లు నీటి కాలుష్యం వల్లే వస్తాయనే విషయం ఆమెకు తెలీదేమో. 65 మంది ఒకే స్కూల్కు చెందిన వారు జాండిస్తో ఇక్కడ అడ్మిట్ అయ్యారు. ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి ప్రభుత్వానికి? తప్పు ఒప్పుకోమని చెప్పండి. దానికి ప్రాయశ్చిత్తంగా ఏమేం చేయాలో చేయండి. చనిపోయిన ఇద్దరు పిల్లల తల్లులకు తోడుగా ఉండే కార్యక్రమం చేయాలి. పరిహారం ఇవ్వండి. వసతుల మీద ధ్యాస పెట్టండి. పిల్లలు బతికే పరిస్థితి.. చదివే పరిస్థితి ఉండేలా చర్యలు తీసుకోండి.గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడొద్దుఎవరైనా పట్టించుకున్నారా అని ఓ తల్లిని ప్రశ్నిస్తే.. ఎవరూ పట్టించుకోలేదని ఆవేదనతో చెబుతున్నారు. ఇదే పార్వతీపురంలో ఆస్పత్రి నిర్మాణం ఆపకుండా కట్టించి ఉంటే ఆ ఆస్పత్రి అందరినీ కాపాడేది. 200 కిలోమీటర్ల దూరంలోని ఈ ఆస్పత్రికి రాకుండా అక్కడే మెడికల్ కాలేజీ ద్వారా అందరి ప్రాణాలు బాగుపడేవి. దాన్ని నాశనం చేస్తున్నారు. గిరిజనుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. పైగా అబద్ధాలు. నీటి కాలుష్యం లేదంటూ అవే అబద్ధాలు చెప్పుకుంటూ మళ్లీ దాని గురించి దుష్ప్రచారాలు చేయడానికి సిగ్గుండాలి’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు. మృతి చెందిన ఇద్దరు విద్యార్థుల కుటుంబాలకు వైఎస్సార్సీపీ తరఫున రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను)కు వైఎస్ జగన్ ఈ బాధ్యత అప్పగించారు.ఆయన ప్రతిపక్ష నేత కాదు..పోలీస్ కమిషనర్ ఓవరాక్షన్విశాఖలో వైఎస్ జగన్ పర్యటనను ఆద్యంతం అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. చివరికి కేజీహెచ్లో కురుపాం ప్రాంతానికి చెందిన పచ్చకామెర్ల బాధిత విద్యార్థుల్ని పరామర్శించేందుకు వచ్చినా.. అడుగడుగునా అవరోధాలు సృష్టించింది. కేజీహెచ్కు ఎవ్వరూ రాకుండా దాదాపు 500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. స్వయంగా నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ వచ్చి.. కేజీహెచ్ని ఖాకీ వలయంలో బంధించారు. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులతో వైఎస్ జగన్ మాట్లాడకూడదనే ఉద్దేశంతో.. పక్కనే ఉన్న సీఎస్సార్ బ్లాక్కు తరలించి.. అక్కడ నిర్బంధించారు.వైఎస్సార్సీపీ నేతలు ఒత్తిడి తేవడంతో ఒక విద్యార్థిని తల్లికి మాత్రమే అనుమతించారు. మీడియాపైనా సీపీ బాగ్చీ చిందులు తొక్కారు. కేజీహెచ్ నుంచి మీడియా ప్రతినిధులు వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేశారు. ప్రతిపక్షనేత వస్తే మీడియాతో మాట్లాడనివ్వరా.. అని కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి సీపీ మరింత అత్యుత్సాహం ప్రదర్శిస్తూ.. ఆయన ప్రతిపక్ష నేత కాదని, ఎమ్మెల్యే అని వ్యాఖ్యానించారు. అలాగైతే.. మీడియా ఆయనతో మాట్లాడకూడదా.. అని అడగ్గానే అక్కడి నుంచి విçసురుగా వెళ్లిపోయారు. కేజీహెచ్ సిబ్బంది, వై§ý ్యులు, రోగుల బంధువులు వైఎస్ జగన్ని చూసేందుకు పోలీసుల అడ్డంకులను లెక్కచేయకుండా పెద్ద ఎత్తున పిల్లల వార్డుకు చేరుకున్నారు. వందల మంది పోలీసులతో బందోబస్తు పెట్టినా అభిమానాన్ని ఆపలేక తుదకు చేతులెత్తేశారు.ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మా పాప చనిపోయిందిమా పాప కల్పనకు సరైన ట్రీట్మెంట్ అందలేదు. ప్రభుత్వం తరఫున ఎవ్వరూ పట్టించుకోలేదు. మా పాపను ఇక్కడికి తీసుకు రావడానికి ఎంత కష్టపడ్డామో.. అయినా మంచి వైద్యం అందలేదు. ఎన్నో రోజుల నుంచి బాగోలేకపోయినా హాస్టల్ వాళ్లు చెప్పలేదు. కురుపాం, పార్వతీపురం, విజయనగరం, వైజాగ్.. ఇలా పలు చోట్ల ఆస్పత్రులకు తిప్పాను. ఎక్కడా సరైన ట్రీట్మెంట్ చేయలేదు. ఐసీయూలో పెట్టలేదు. మా పాపకు ఆక్సిజన్ కూడా పెట్టలేదు. ఎవ్వరూ బతికించలేకపోయారు. ఇంత కష్టం వచ్చినా ఎవ్వరూ పట్టించుకోకపోవడం వల్లే మా పాప చనిపోయింది. – మృతి చెందిన కల్పన తల్లి తోయక జయమ్మ -
ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి: వైఎస్ జగన్
విశాఖ: నగరంలోని కేజీహెచ్ ఆస్పత్రిలో పచ్చకామెర్లతో చికిత్స పొందుతున్న కురుపాం పాఠశాల విద్యార్థులను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. గురువారు(అక్టోబర్ 9వ తేదీ) అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో పర్యటనల సందర్భంగా కేజీహెచ్లోని పచ్చకామెర్ల బాధిత విద్యార్థులను వైఎస్ పరామర్శించారు. పచ్చకామెర్ల బారిన పడ్డ బాధిత విద్యార్థులతో వైఎస్ జగన్ మాట్లాడారు. విద్యార్థుల ఆరోగ్యంపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కేజీహెచ్ బయట మీడియాతో మాట్లాడారు. మీడియాను కేజీహెచ్ ప్రాంగణంలోకి అనుమతి నిరాకరించడంతో బయట మీడియాతో మాట్లాడారు వైఎస్ జగన్. ‘170 మంది విద్యార్థులకు పచ్చకామెర్లు వచ్చాయి. పచ్చకామెర్లతో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలి. స్కూళ్లు, హాస్టల్స్లో బాత్రూమ్లను శానిటేషన్ చేయాలి. ఒకే స్కూల్ నుంచి 65 మంది విద్యార్థులు కేజీహెచ్లో చేరారు. కురుపాం నుంచి 200 కి.మీ దూరంలో కేజీహెచ్ రావాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని బట్టి కేసులు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. పార్వతీపురంలో ఆస్పత్రి నిర్మాణం ఆపకుండా ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కలుషిత నీటి వల్లే పిల్లలకు ఈ పరిస్థితి. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి. 170 మంది పిల్లలకు రూ. లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలి. ఇప్పటికైనా వాటర్ ప్లాంట్ను రిపేర్ చేయించాలి. పిల్లల తరఫున మేం మెడికో లీగల్ కేసు వేస్తాం. వైఎస్సార్సీపీ తరఫున మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల సాయం అందజేస్తాం’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: ‘మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే.. పేదవారికి వైద్యం ఎలా అందుతుంది?’ -
వైఎస్ జగన్ పర్యటన.. కేజిహెచ్ వద్ద విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఓవరాక్షన్
సాక్షి,విశాఖ: వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనతో కేజీహెచ్ వద్ద పోలీస్ సీపీ శంఖ బ్రత బాగ్చి ఓవర్ యాక్షన్ చేశారు.కేజీహెచ్ వద్ద వైఎస్ జగన్ ప్రెస్మీట్కు అనుమతించలేదు. ఆస్పత్రి నుంచి మీడియాను బయటకు పంపించేశారు. వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడకూడదని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న పిల్లలను పరామర్శించేందుకు వస్తున్న వైఎస్ జగన్ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వీలు లేదంటూ పోలీసులు హుకుం జారీ చేశారు. కేజీహెచ్ పీడియాట్రిక్ వార్డు నుంచి దూరంగా వెళ్లిపోవాలని ఆదేశించారు.మరోవైపు కేజీహెచ్కు చేరుకున్న వైఎస్ జగన్..కామెర్లతో బాధపడుతున్న విద్యార్థులను పరామర్శించారు. బాధిత విద్యార్థులతో మాట్లాడారు. పిల్లల ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. -
వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర పర్యటన సూపర్ సక్సెస్..
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉత్తరాంధ్ర పర్యటన సూపర్ సక్సెస్ అయ్యింది. ప్రభుత్వ పెద్దల కుట్రలు, పోలీసుల అడ్డంకులు అన్నీ దాటి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి మాకవరపాలెం మెడికల్ కాలేజీ వరకు జగన్ వెంట జనం నడిచారు.అనకాపల్లి నుంచి రాజుపాలెం వరకు కుండపోత వర్షం కురిసినా, ప్రజల ఉత్సాహం తగ్గలేదు. మహిళలు, వృద్ధులు వర్షంలో తడుస్తూనే జగన్ కోసం ఎదురు చూశారు. కొత్తూరు జంక్షన్ వద్ద టీడీఆర్ బాధితులు, వర్షంలో తడుస్తూనే జగన్ను కలిశారు. తాళ్లపాలెం జంక్షన్ వద్ద రోడ్లు చెరువులా మారినా, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులు మోకాళ్ల లోతు నీళ్లలో జగన్ కోసం వేచి చూశారు. రైతుల కష్టాన్ని చూసి చలించిన జగన్, వర్షంలో తడుస్తూనే బాధితులతో మాట్లాడారు.జగన్ పర్యటనను విఫలం చేసేందుకు అధికారిక యంత్రాంగం ప్రయత్నించినా, ప్రజల ఆదరణ ఆ ప్రయత్నాలను తుడిచిపెట్టేసింది. కూటమి ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి, జగన్ కాన్వాయ్లోని వాహనాలను నిలిపి వేసినా, క్యాడర్ పొలాల నుంచి బైకులపై వచ్చి, వర్షంలోనూ హారతులు పట్టారు. గుమ్మడి కాయలతో స్వాగతం పలికారు. జై జగన్ నినాదాలతో ఉత్తరాంధ్ర మార్మోగింది. ఎయిర్పోర్ట్ నుంచి మాకవరపాలెం వరకు 63 కి.మీ. దూరాన్ని 6 గంటలకు పైగా ప్రయాణించి, ప్రజల ఆదరణతో జగన్ పర్యటన సూపర్ సక్సెస్గా నిలిచింది. ఈ పర్యటనతో వైఎస్సార్సీపీ కేడర్లో కొత్త ఉత్సాహం నెలకొంది.(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
జగన్ పర్యటనలో పోలీసుల నిర్లక్ష్యం
అనకాపల్లి జిల్లా : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనకాపల్లి జిల్లా పర్యటనలో పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడింది. మాకవరపాలెం మెడికల్ కాలేజీలో పోలీసుల పనితీరు దారుణంగా ఉంది. ఏకంగా జగన్ కార్వాన్ మీదకు జనం ఎక్కినా పోలీసులు పట్టించుకోలేదు. జనం ఇలా కార్వాన్ మీదకు ఎక్కినా పోలీసులు మాత్రం చోద్యం చూశారు. ఈ పర్యటనలో మధ్మాహ్నం నుండి వర్షంలో తడుస్తూ వచ్చారు వైఎస్ జగన్. కార్వాన్ లోపలికి వెళ్లి దుస్తులు మార్చుకునేందుకు కూడా వైఎస్ జగన్ అవకాశం లేకుండా పోయింది. జనాన్ని అదుపు చేయకుండా వదిలేశారు ఖాకీలు. ప్రెస్మీట్ సమయంలోనూ గ్యాలరీలోకి జనాన్ని పంపారు పోలీసులు. దాంతో జగన్ మాట్లాడే సమయలో గందరగోళ పరిస్థితి నెలకొంది. పోలీసుల కారణంగా అక్కడ తోపులాట కూడా చోటు చేసుకుంది. కొందరు ఖాకీలు వ్యవహరించిన తీరుపై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై మండిపడింది. మరొకవైపు వైఎస్ జగన్ పర్యటన సక్సెస్ కావడంతో పార్టీ కేడర్లో ఫుల్జోష్ నెలకొంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజం -
విశాఖలో వైఎస్ జగన్.. పోలీసుల ఓవరాక్షన్
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ విశాఖ పర్యటన సందర్భంగా పోలీసులు ఓవరాక్షన్ చేశారు. వైఎస్ జగన్ కాన్వాయ్లోని వాహనాలను పోలీసులు ఆపేశారు. కేవలం నాలుగు వాహనాలను మాత్రమే పోలీసులు అనుమతించారు.వివరాల ప్రకారం.. వైఎస్ జగన్ విశాఖ పర్యటన సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఎన్ఏడీ జంక్షన్ వద్ద కాన్వాయ్ వాహనాలను ఆపేసి.. కేవలం నాలుగు వాహనాలను మాత్రమే పోలీసులు అనుమతించారు. నేతల కార్లు, బైకులను అడ్డుకుంటున్నారు. అభిమానంతో వస్తున్న ప్రజలను కూడా పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు.. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలోనూ పోలీసులు ఓవరాక్షన్కు దిగారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను, వైఎస్ జగన్ అభిమానులను పోలీసులు అడ్డుకుంటున్నారు. సామాన్య ప్రజలను కూడా పోలీసులు అత్యుత్సాహంతో అడ్డుకుంటున్నారు. అటు, స్థానికంగా ఉన్న షాపులను సైతం పోలీసులు మూయిస్తున్నారు. కార్యకర్తలు, అభిమానులు దూరంగా వెళ్లిపోవాలంటూ పోలీసులు బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో, పోలీసుల తీరును అభిమానులు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. అనకాపల్లి..వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా అనకాపల్లిలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అనకాపల్లి నుంచి నర్సీపట్నం వెళ్లే మార్గంలో ఫ్లెక్సీలు కట్టకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో, వైఎస్సార్సీపీ నేతలు పోలీసు తీరుపై ప్రశ్నిస్తున్నారు. పోలీసులపై మండిపడుతున్నరు. కూటమి నేతల ఫ్లెక్సీలు వదిలేసి వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలనే అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పక్షపాతం చూపిస్తున్నారని అంటున్నారు.. -
వైఎస్ జగన్ను కలిసిన స్టీల్ ప్లాంట్ కార్మికులు
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర జిల్లా పర్యటనలో భాగంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ను స్టీల్ ప్లాంట్ కార్మికులు కలిశారు. తమ సమస్యలపై కార్మికులు.. వైఎస్ జగన్కు వినతి పత్రం అందజేశారు. ఈ క్రమంలో వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ వారితో మాట్లాడారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అదే స్టాండ్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఒప్పుకోం. స్టీల్ప్లాంట్ కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధం. గతంలో అసెంబ్లీలో తీర్మానం చేశాం, ప్రధానికి లేఖలు రాశాం. స్టీల్ప్లాంట్పై పార్లమెంట్లోనూ ప్రశ్నిస్తాం అని భరోసా ఇచ్చారు. అనంతరం, వైఎస్ జగన్కు స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. స్టీల్ప్లాంట్కు రావాలని వైఎస్ జగన్ను ఆహ్వానించాం. స్టీల్ ప్లాంట్కు వచ్చి మద్దతిస్తానని హామీ ఇచ్చారు. మాకు మద్దతు ఇచ్చిన వైఎస్ జగన్కు కృతజ్ఞతలు. మరోవైపు.. విశాఖలో వైఎస్ జగన్ను కలిసేందుకు బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు వచ్చారు. నక్కపల్లి మండలానికి చెందిన 16 గ్రామాల మత్స్యకారులు విశాఖకు తరలి వచ్చారు. ఈ క్రమంలో జి.భీమవరం వద్ద పోలీసులు.. మత్స్యకారులను అడ్డుకున్నారు. వైఎస్ జగన్ను కలిసేందుకు అనుమతి లేదన్నారు. దీంతో, ఎలాగైనా వైఎస్ జగన్ను కలిసి తీరుతామని మత్స్యకారులు తెలిపారు. అనంతరం, కూటమి నేతలను నమ్మి ఓటు వేసినందుకు తమను నిలువునా మోసం చేశారని గంగపుత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్య కారక పరిశ్రమలు తమకు వద్దని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. -
వైజాగ్ అభివృద్ధికి జగన్ ఏం చేశారంటే..
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు తన పాలనా కాలంలో రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాను ఆర్థిక శక్తిస్థావరంగా మలచడానికి అనేక కార్పొరేట్ కార్యక్రమాలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు సృష్టించారు. విశాఖపట్నం దక్షిణాసియాలోని ముఖ్యమైన ఓడరేవు నగరంగా ఉండటం వల్ల దీన్ని ఐటీ, ఫార్మా, టూరిజం, ఇండస్ట్రీలకు హబ్గా మార్చడానికి జగన్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. జగన్ నేడు విశాఖ పర్యటన సందర్భంగా తన పాలనా కాలంలో జిల్లాలో నిర్వహించిన కార్పొరేట్ కార్యక్రమాలను తెలుసుకుందాం. భవిష్యత్ వ్యాపార అభివృద్ధి కోసం సిద్ధం చేసిన ప్రణాళికలను చూద్దాం.కార్పొరేట్ కార్యక్రమాలుజగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత 2019-2024 మధ్యకాలంలో విశాఖపట్నం జిల్లాను పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యంగా మార్చడానికి అనేక కార్పొరేట్ కార్యక్రమాలు, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (GIS) వంటి పెద్ద ఈవెంట్లు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు ఫార్మా, ఐటీ, ఇండస్ట్రియల్ పార్కులు, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలపై దృష్టి సారించాయి. 2023 మార్చిలో విశాఖపట్నంలోనే నిర్వహించిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (GIS) ఒక మైలురాయి. ఈ సమ్మిట్లో 352 ఒప్పందాలు జరిగాయి. దాంతో రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్ల చేరాలనే లక్ష్యం నిర్ణయించుకున్నారు. వీటిలో సుమారు 39% ఇప్పటికే పెట్టుబడులుగా మారాయి. GIS వేదిక నుంచి జగన్ 14 పరిశ్రమలను భౌతికంగా ప్రారంభించారు. ఈ పరిశ్రమలకు మొత్తం రూ.3,841 కోట్ల పెట్టుబడితో 9,108 ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది.విశాఖపట్నం జిల్లాలో నేరుగా ప్రారంభించిన కార్పొరేట్ కార్యక్రమాలలో 2023 అక్టోబర్లో ఐదు కంపెనీల ప్రారంభం ముఖ్యమైనది. మొత్తం రూ.1,371 కోట్ల పెట్టుబడితో ఈ కంపెనీలు 2,950 ఉద్యోగాలు సృష్టించాయి. వీటిలో..ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్: రూ.500 కోట్ల పెట్టుబడితో 1,000 ఉద్యోగాలు. జావా, J2EE, SAP, డేటా సైన్స్ వంటి టెక్నాలజీలపై దృష్టి, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎనర్జీ, రిటైల్ రంగాలకు సేవలు అందిస్తుంది.ఈజియా స్టెరైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఫార్మా సిటీలో): రూ.500 కోట్ల పెట్టుబడి, 700 ఉద్యోగాలు. సంవత్సరానికి 300 మిలియన్ ఇంజెక్టబుల్ యూనిట్లు ఉత్పత్తి.లారస్ ల్యాబ్స్ (అచ్చుతపురం సెజ్లో): రూ.440 కోట్ల పెట్టుబడి, 500 ఉద్యోగాలు.లారస్ సింథటిక్స్: రూ.191 కోట్ల పెట్టుబడి, 300 ఉద్యోగాలు.మరో లారస్ ల్యాబ్స్ యూనిట్: రూ.240 కోట్ల పెట్టుబడి, 400 ఉద్యోగాలు (ఫౌండేషన్ స్టోన్).అనకాపల్లిలో ఫార్మా సిటీ అభివృద్ధి జగన్ పాలనలో వేగవంతమైంది. 2023 అక్టోబర్లో మూడు ఫార్మా కంపెనీలను ప్రారంభించి రెండు బల్క్ డ్రగ్ యూనిట్లకు శంకుస్థాపన వేశారు. ఈ ప్రాజెక్టులకు మొత్తం రూ.1,611 కోట్ల పెట్టుబడితో వేలాది ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 2019 నుంచి 107 పెద్ద పరిశ్రమలు రూ.46,002 కోట్ల పెట్టుబడితో ప్రారంభమయ్యాయి. వీటి ద్వారా 1,06,249 ఉద్యోగాలు వచ్చాయి. వీటిలో విశాఖపట్నం జిల్లా భాగస్వామం అధికంగానే ఉంది. అలాగే 88 ఒప్పందాలతో రూ.44,963 కోట్ల లక్ష్యం పెట్టుకున్నారు. వీటిలో రూ.38,573 కోట్లు ఇప్పటికే పెట్టుబడులుగా మారాయి. ఈ కార్యక్రమాలు విశాఖపట్నంను ఫార్మా, ఐటీ హబ్గా మార్చాయి.భవిష్యత్ ప్రణాళికలుజగన్ పాలనలో విశాఖపట్నంను భవిష్యత్తులో గ్లోబల్ మెట్రోపాలిస్గా మార్చడానికి ‘విజన్ విశాఖ’ (Vision Visakha) ప్రణాళికను 2024 మార్చి 5న ప్రకటించారు. 10 సంవత్సరాల ప్లాన్కు మొత్తం రూ.1.05 లక్ష కోట్ల పెట్టుబడిని నిర్ణయించారు. ఈ పెట్టుబడులు ఐటీ, టూరిజం, ఎడ్యుకేషన్, ఇండస్ట్రీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో ఉపయోగపడతాయి. 5 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టిస్తాయి. విశాఖను హైదరాబాద్, చెన్నైలతో పోటీపడేలా మార్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ల మధ్య సహకారం నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ప్రణాళికలు ఇలా..ఇండస్ట్రియల్ డెవలప్మెంట్: 30 ప్రాజెక్టులకు రూ.33,080 కోట్లు (విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో). ఇందులో NTPC హైడ్రోజన్ పార్క్ (రూ.20,225 కోట్లు), TVS లాజిస్టిక్స్ పార్కులు (రూ.1,500 కోట్లు), JSW ఇండస్ట్రియల్ పార్క్ (రూ.532 కోట్లు), ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్, ఇన్క్యుబేషన్ ఫెసిలిటీలు (APIS, STPI, NASSCOM, ఆంధ్ర యూనివర్సిటీ).ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్పోర్టేషన్: భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ (రూ.4,727 కోట్లు), విశాఖ మెట్రో రైల్ (రూ.14,000-14,309 కోట్లు), హై-స్పీడ్ రైల్ కారిడార్లు (హైదరాబాద్-విశాఖ, విజయవాడ-బెంగళూరు). స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్కు రూ.1,906.15 కోట్లు. బీచ్ కారిడార్ (భోగాపురం నుంచి నగరం వరకు 6-లేన్ రోడ్)కు రూ.960 కోట్లు.ఎనర్జీ, గ్రీన్ టెక్: అదానీ డేటా సెంటర్ (రూ.27,000 కోట్లు), NTPC గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ (రూ.27,000 కోట్లు).ఇదీ చదవండి: ఉద్యోగం చేస్తూనే కోట్లు సంపాదించే మార్గాలు.. -
వైద్య కళాశాలల రక్షణకు 'వైఎస్ జగన్' పోరు బాట
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యం, రాష్ట్ర పిల్లల భవితవ్యానికి గొడ్డలి పెట్టులా మారిన ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరుకు సిద్ధం అయ్యారు. గత ప్రభుత్వంలో నిర్మాణం ప్రారంభమైన నర్సీపట్నం వైద్య కళాశాలను నేడు ఆయన స్వయంగా సందర్శించనున్నారు. తద్వారా ప్రభుత్వ వైద్య కళాశాలలను పరిరక్షించేలా.. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమానికి అంకురార్పణ చేయనున్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలకు ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయడంతో పాటు, మన విద్యార్థుల డాక్టర్ కలను సాకారం చేయడం కోసం గత ప్రభుత్వంలో రూ.8,480 కోట్లతో 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) నిర్వహణ పేరిట ప్రజా సంపద అయిన వైద్య కళాశాలలను పచ్చ కార్పొరేట్ గద్దలకు 66 ఏళ్ల పాటు లీజు పేరుతో కారు చౌకగా, అప్పనంగా బాబు ప్రభుత్వం కట్టబెడుతోంది. రెండు దశల్లో 10 వైద్య కళాశాలలను ప్రైవేట్కు ధారాదత్తం చేసేలా ప్రణాళికలు రచించి, ఇప్పటికే తొలి దశలో నాలుగు కళాశాలలకు టెండర్లు పిలిచిన విషయం తెలిసిందే. ఉన్నత ఆశయానికి తూట్లు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా మార్చి, ప్రతి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలను అందుబాటులోకి తెస్తామని 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ మేరకు జిల్లాల పునర్విభజన చేయడమే కాకుండా ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండేలా 17 కొత్త కళాశాలల నిర్మాణం చేపట్టారు. కళాశాలలకు అనుబంధంగా ఉండే బోధనాస్పత్రులను హబ్లుగా అభివృద్ధి చేసి, జిల్లా పరిధిలోని ప్రైమరీ, సెకండరీ హెల్త్ ఆస్పత్రులను అనుసంధానించి.. పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచితంగా నాణ్యమైన స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించాలని సంకల్పించారు. వైఎస్ జగన్ విధానంలో ప్రతి వైద్య కళాశాల, బోధనాస్పత్రి పూర్తిగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడిచేవి. వీటిలో పనిచేసే ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర వైద్య సిబ్బందిని ప్రభుత్వమే నియమించేది. కళాశాల, ఆస్పత్రిపై ప్రభుత్వ అజమాయిషీ ఉండేది. ఎక్కడా ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల అజమాయిïÙ, వారి లాభార్జనకు ఆస్కారం లేదు. దీంతో చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి గుండె, కిడ్నీ, మెదడు, క్యాన్సర్ జబ్బులకు చికిత్సతో పాటు, అవయవాల మార్పిడి వంటి ఖరీదైన వైద్య సేవలు, రక్త పరీక్షలు, ఇతర డయగ్నోస్టిక్ సేవలు ప్రజలకు పూర్తి ఉచితంగా లభించేవి. దీంతో ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీ నుంచి ప్రజలకు విముక్తి లభించేది. ఈ ఉన్నత ఆశయానికి తూట్లు పొడుస్తూ ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్కు కట్టబెట్టి, ప్రజలు మళ్లీ కార్పొరేట్ దోపిడీకి గురయ్యేలా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రైవేట్కు కట్టబెడుతున్న వైద్య కళాశాలల్లో పూర్తి స్థాయిలో ఉచిత వైద్య సేవలే ఉండబోవని ప్రభుత్వం రూపొందించిన టెండర్ నిబంధనలే చెబుతున్నాయి. 620 పడకల సామర్థ్యంతో నడిచే బోధనాస్పత్రుల్లో ఒక్కటంటే ఒక్క పడక కూడా ఉచిత వైద్యానికి కేటాయించరు. ఈ కళాశాలల్లో వంద శాతం పడకలతో కార్పొరేట్ సంస్థలు వ్యాపారం చేసుకోనున్నాయి. ప్రైవేట్ తరహాలోనే ఫీజుల దోపిడీ ⇒ కొత్త వైద్య కళాశాలలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయడంతో పాటు, వాటి నిర్వహణకు ఆరి్థక వనరులు సమకూర్చుకునే లక్ష్యంతో గత వైఎస్ జగన్ ప్రభుత్వం సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఇందులో భాగంగా ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కంటే ఎంతో తక్కువగా ఫీజులు ఖరారు చేసింది. ⇒ మధ్య తరగతి కుటుంబాల వారు సైతం భరించగలిగేలా ఎంబీబీఎస్ సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఉండే 35 శాతం సీట్లకు రూ.12 లక్షలు, 15 శాతం ఎన్ఆర్ఐ సీట్లకు రూ.20 లక్షల చొప్పున ఫీజుల విధానం ప్రవేశపెట్టారు. ఈ నిధులను కేవలం ఆ వైద్య కళాశాలల అభివృద్ధి కోసమే వెచ్చించేలా ప్రణాళిక వేశారు. అంతకు మించి ప్రైవేట్ కళాశాలల్లో మాదిరిగా విద్యార్థులపై ఫీజుల దోపిడీ లేకుండా చేశారు. ఈ విధానంపై అప్పట్లో కూటమి పార్టీలు, ఎల్లో మీడియా తీవ్ర స్థాయిలో దు్రష్పచారం చేశాయి. ⇒ తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో సెల్ప్ ఫైనాన్స్ విధానానికి సంబంధించిన 107, 108 జీవోలను రద్దు చేస్తామని ప్రస్తుత విద్యా శాఖ మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు. గద్దెనెక్కాక తమదైన శైలిలో విద్యార్థులకు వెన్నుపోటు పొడుస్తూ ఏకంగా కళాశాలలనే ప్రైవేట్కు కట్టబెట్టేస్తున్నారు. ⇒ బాబు ప్రవేశపెట్టిన పీపీపీ విధానంలో ప్రైవేట్ వైద్య కళాశాలల్లో మాదిరిగానే ఫీజుల దోపిడీకి లైసెన్స్ ఇచ్చేస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఎంబీబీఎస్ బీ కేటగిరి సీటుకు ఏటా రూ.13.20 లక్షలు, ఎన్ఆర్ఐ కోటాకు రూ.39.60 లక్షల ఫీజులు ప్రైవేట్లో వసూలు చేస్తున్నారు. ఇదే ఫీజుల స్వరూపాన్ని పీపీపీకి ప్రభుత్వం ప్రతిపాదించింది. ⇒ ఈ లెక్కన 5 ఏళ్లకు సెల్ఫ్ ఫైనాన్స్ సీటుపై రూ.6 లక్షలు, ఎన్ఆర్ఐ కోటాలో రూ.98 లక్షల చొప్పున విద్యార్థులపై అదనపు భారం పడే అవకాశం ఉంది. ప్రభుత్వం నడిపే వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ పూర్తయ్యాక ఏడాది పాటు హౌస్ సర్జన్గా సేవలు అందించే సమయంలో నెలకు రూ.26 వేల చొప్పున ఏడాదికి రూ.3.12 లక్షల స్టైఫండ్ ఇస్తారు. ఈ నేపథ్యంలో కొత్త వైద్య కళాశాలలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళితే స్టైఫండ్ సరిగా అందదు. దీనికి తోడు అదనపు ఫీజుల దోపిడీకి గురవుతారు. ⇒ భవిష్యత్లో అందుబాటులోకి వచ్చే పీజీ సీట్లకు సైతం బీ కేటగిరికి రూ.9.93 లక్షలు, ఎన్ఆర్ఐ కోటాకు రూ.57.50 లక్షలు చొప్పున ఫీజులు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పైకి మాత్రం విద్యార్థులపై ఎటువంటి భారం ఉండదని ప్రచారం చేస్తుండటం గమనార్హం.కళ్లెదుటే సాక్ష్యం ⇒ ఏపీ విభజన చట్టంలో భాగంగా మంగళగిరిలో కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్ నిర్మాణం చేపట్టింది. 2016–17లో నిర్మాణానికి కేంద్రం శంకుస్థాపన చేసింది. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం చేస్తున్నట్టుగా ఏక కాలంలో నిర్మాణాలన్నీ చేపట్టాక ఎయిమ్స్ కార్యకలాపాలు ప్రారంభించలేదు. కేవలం 50 మంది విద్యార్థులతో తాత్కాలిక భవనాల్లో తరగతులు ప్రారంభించింది. ⇒ రెండు బ్యాచ్లకు విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాలలోనే తరగతులు నిర్వహించారు. మంగళగిరిలో విద్యార్థులకు తరగతుల నిర్వహణకు వీలుగా భవనాలు అందుబాటులోకి వచ్చాకే విద్యార్థులను అక్కడికి తరలించారు. 2016–17లో శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ నిర్మాణం గతేడాదిలో పూర్తి అయింది. అంటే దాదాపు తొమ్మిదేళ్లు ఎయిమ్స్ నిర్మాణం కొనసాగింది. అయితే వైఎస్ జగన్ చేపట్టిన నిర్మాణాల విషయంలో మాత్రం ఒకేసారి నిర్మాణాలెందుకు పూర్తి చేయలేదన్నట్టుగా బాబు ప్రభుత్వం దాడి చేస్తూ అభాసుపాలవుతోంది. నేడు వైఎస్ జగన్ అనకాపల్లి, విశాఖ జిల్లాల పర్యటనవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు (గురువారం) అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం భీమబోయినపాలెం (ఎన్ఏడీ జంక్షన్, వేపకుంట, పెందుర్తి, కొత్తూరు జంక్షన్, తాళ్ళపాలెం జంక్షన్ మీదుగా) వెళతారు. అక్కడ కూటమి ప్రభుత్వం అర్ధంతరంగా నిర్మాణం నిలిపి వేసిన ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి విశాఖపట్నం కేజీహెచ్ (వయా తాళ్ళపాలెం జంక్షన్, కొత్తూరు జంక్షన్, పెందుర్తి, వేపకుంట, ఎన్ఏడీ జంక్షన్)కు చేరుకుంటారు. విష జ్వరాలతో కేజీహెచ్లో చికిత్స పొందుతున్న గిరిజన విద్యార్థులను పరామర్శిస్తారు. సాయంత్రం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు.15.. 23.. ఏళ్లు ఎందుకు పడుతుంది? ⇒ 17 వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులు అత్యాధునిక వసతులతో అందుబాటులోకి తేవడం కోసం కేంద్ర సాయం, స్పెషల్ అసిస్టెన్స్ టు ది స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పథకం, నాబార్డు లోన్ల ద్వారా రూ.8,480 కోట్ల నిధులు గత ప్రభుత్వంలోనే సమకూర్చారు. ఈ క్రమంలో కళాశాలల నిర్మాణానికి నిధుల సమస్య లేదు. ⇒ గత ప్రభుత్వంలో 2023–24లో ఏలూరు, రాజమండ్రి, నంద్యాల, మచిలీపట్నం, విజయనగరం కళాశాలలు ప్రారంభించి 750 ఎంబీబీఎస్ సీట్లు సమకూర్చారు. ⇒ 2024–25లో పులివెందుల, ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పాడేరు కళాశాలలు ప్రారంభించడానికి చర్యలు తీసుకున్నారు. ఎన్నికలు మొదలయ్యే నాటికే పాడేరు, పులివెందుల వైద్య కళాశాలలను సిద్ధం చేశారు. మిగిలిన మూడు కళాశాలలు సైతం మొదటి ఏడాది తరగతులకు సంబంధించి చిన్న చిన్న వసతులు సమకూర్చాల్సి ఉండింది. ⇒ ఈ చర్యల ఫలితంగానే గతేడాది పాడేరు, పులివెందులకు 50 చొప్పున సీట్లతో అడ్మిషన్లకు ఎన్ఎంసీ అనుమతులు ఇచ్చింది. తరగతులు ప్రారంభం అయ్యే నాటికి మిగిలిన సౌకర్యాలు సమకూరుస్తామని ప్రభుత్వం అండర్ టేకింగ్ ఇచ్చి ఉంటే ఆదోని, మదనపల్లె, మార్కాపురం కళాశాలలు కూడా ప్రారంభం అయి ఉండేవి. ⇒ వైఎస్ జగన్ విధానంలో వెళితే కళాశాలలు పూర్తి చేయడానికి 15 ఏళ్లు.. 23 ఏళ్లు పడుతుందని ప్రభుత్వం దుర్మార్గంగా ప్రచారం చేస్తోంది. దేశంలో ఎక్కడైనా ఇటు ప్రైవేట్, అటు ప్రభుత్వ రంగాల్లో వైద్య కళాశాలలను వంద శాతం నిర్మాణం పూర్తి చేశాకే ప్రారంభించరనే వాస్తవాన్ని మరుగున పరుస్తోంది. ⇒ రూ.వందల కోట్ల ప్రజా ధనాన్ని దుబారా చేస్తూ ప్రజారోగ్య పరిరక్షణలో కీలకమైన వైద్య కళాశాలల నిర్మాణానికి మాత్రం నిధులు లేమిని సాకుగా చూపుతుండటంపై ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. ⇒ అస్మదీయులకు మేలు చేయడం కోసం సీఎం చంద్రబాబు చేసిన కుట్రలతో రాష్ట్ర విద్యార్థులు రెండేళ్లలో 2,450 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయారు. -
ఆటోలు తిప్పొద్దు..ఫ్లెక్సీలు కట్టొద్దు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రభుత్వ నూతన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు తలపెట్టిన ఉత్తరాంధ్ర పర్యటన, ప్రజా ఉద్యమం కార్యక్రమాలను అడ్డుకునేందుకు టీడీపీ కూటమి సర్కారు కుటిల యత్నాలు పన్నుతోంది. గురువారం నర్సీపట్నం నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ప్రజలను తరలించవద్దంటూ ఆటోవాలాలు, పార్టీ నేతలపై ప్రభుత్వం బెదిరింపులకు దిగింది. వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పార్టీ మండల అధ్యక్షులు, సర్పంచ్లు, ఎంపీటీసీలకు పోలీస్స్టేషన్ల నుంచి ఫోన్ కాల్స్ చేసి బెదిరిస్తున్నారు. అనకాపల్లి టౌన్, రూరల్, కశింకోట, యలమంచిలి రూరల్, యలమంచిలి టౌన్, నర్సీపట్నం టౌన్, రూరల్, చోడవరం టౌన్ పోలీసుల నుంచి పార్టీ నేతలకు బెదిరింపు కాల్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి. వైఎస్సార్ సీపీ ముఖ్యనేతలు, మండల, గ్రామ స్థాయి నాయకులను హౌస్ అరెస్ట్లు చేసేందుకు పథకం వేసినట్లు తెలుస్తోంది. మాకవరపాలెం మండల కేంద్రం ఇప్పటికే వందల మంది పోలీసులతో నిండిపోయింది. విశాఖ విమానాశ్రయం నుంచి వైఎస్ జగన్ రోడ్డు మార్గంలో ప్రయాణించి నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండల పరిధిలోని భీమబోయినపాలెం వద్ద నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ భవనాలను పరిశీలించేలా రూట్ మ్యాప్ సిద్ధమైంది. అనంతరం ఆయన అక్కడ విలేకరులతో మాట్లాడనున్నట్లు పార్టీ నేతలు పోలీసులకు సమాచారం అందించారు. అయితే రోడ్డు మార్గంలో అనుమతి ఇవ్వలేమని ఒకసారి.. హెలికాప్టర్లో వెళ్లాలంటూ మరోసారి.. ఫలానా మార్గంలోనే వెళ్లాలంటూ ఇంకోసారి.. ఇలా ఎప్పటికప్పుడు చంద్రబాబు సర్కారు అడ్డంకులు సృష్టిస్తోంది. అయితే వైఎస్ జగన్ పర్యటన ముందుగా ప్రకటించిన ప్రకారం యథాతథంగా సాగుతుందని వైఎస్సార్సీపీ స్పష్టంగా ప్రకటించడంతో చివరకు పలు షరతులు,ఆంక్షలు విధిస్తూ అనుమతించారు. ఎన్ని షరతులు విధించినా జనం వెల్లువలా తరలివస్తారని గ్రహించడంతో ప్రజలను తరలించకుండా అడ్డుకునే యత్నాలకు దిగినట్లు తెలుస్తోంది. ఆటోవాలాలను పిలిపించి గురువారం జగన్ పర్యటనకు జనాలను తరలించవద్దంటూ పోలీసుల ద్వారా సర్కార్ హెచ్చరిస్తోంది.వైఎస్సార్సీపీ నేతలకు పోలీసులు ఫోన్ కాల్స్..ఒకవైపు పర్యటనకు అనుమతి లేదంటూ తొలుత బెదిరింపులకు దిగిన పోలీసులు తర్వాత కొత్త మార్గంలో వెళ్లాలంటూ అడ్డంకులు సృష్టిస్తున్నారు. ప్రజలను తరలించకుండా ఇప్పటికే ఆటోవాలాలను బెదిరించిన పోలీసులు బుధవారం సాయంత్రం నుంచి వైఎస్సార్సీపీ నేతలకు ఫోన్లు చేయడం గమనార్హం. మీరెక్కడ ఉన్నారు? సీఐ పిలుస్తున్నారు.. వచ్చి కలవాలంటూ స్థానిక పోలీస్ స్టేషన్ల నుంచి పార్టీ నేతలకు ఫోన్లు చేస్తున్నారు. ఎంత చేసినా జగన్ పర్యటనను, జన వాహినిని అడ్డుకోలేమని గ్రహించడంతో ఫ్లెక్సీల వ్యూహాన్ని ఆశ్రయించారు. జాతీయ రహదారిపై గతంలో ఏర్పాటు చేసిన కూటమి నేతల ఫ్లెక్సీలను తొలగించకపోవడం గమనార్హం. కూటమి నేతల ఫ్లెక్సీలు రోజుల తరబడి అలానే దర్శనమిస్తుండగా.. వైఎస్సార్ సీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. 500 మందికి మించి గుమికూడవద్దంటూ ఆంక్షలు విధించడంతోపాటు అసలు ఫ్లెక్సీలు కట్టవద్దంటూ షరతులు విధిస్తున్నారు. అభిమానాన్ని చాటుకునేందుకు కూడా ఆంక్షలేమిటంటూ ప్రజలు మండిపడుతున్నారు. గతంలో ఎన్నడూ ఈ తరహాలో షరతులు, బెదిరింపులు చూడలేదని పేర్కొంటున్నారు.కళ్ల ముందే కనిపిస్తున్నా...రాష్ట్రవ్యాప్తంగా గత ప్రభుత్వంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 5 నూతన వైద్య కళాశాలలు గత ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమయ్యాయి. పాడేరు మెడికల్ కాలేజీలో 50 మంది విద్యార్థులకు సీట్లు కూడా కేటాయించారు. పులివెందుల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ అనుమతులిచ్చినా బాబు సర్కారు కుట్రపూరితంగా అడ్డుకుని వద్దంటూ లేఖ రాసింది. ఇవి రెండూ గత ప్రభుత్వ హయాంలోనే అన్ని వసతులతో ప్రారంభానికి సిద్ధమయ్యాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండల పరిధిలోని భీమబోయినపాలెం వద్ద రూ.500 కోట్లతో 50 ఎకరాల్లో 13.21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని వైఎస్సార్ సీపీ హయాంలోనే చేపట్టగా ఇప్పటికే 60 శాతం నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. ఇదంతా కళ్ల ముందే స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే దుర్బుద్ధితో కూటమి ప్రభుత్వం రాగానే పనులను పూర్తిగా నిలిపివేసింది. అసలు మెడికల్ కాలేజీలకు అనుమతులే లేవంటూ చంద్రబాబు మొదలు మంత్రుల వరకూ అంతా బుకాయించగా నేషనల్ మెడికల్ కమిషన్ ఈ దుష్ప్రచారానికి చెక్ పెట్టింది. దీంతో ప్రభుత్వ పెద్దలు కొత్త రాగం అందుకున్నారు. పీపీపీ పాట పాడుతూ విలువైన సంపద లాంటి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమానికి వైఎస్సార్ సీపీ పిలుపునిచ్చింది. పేద, మధ్య తరగతి విద్యార్థులకు మెడికల్ విద్య అందుబాటులోకి రావడంతో పాటు పేదలకు చేరువలో సూపర్ స్పెషాల్టీ వైద్య సేవలు అందించే ప్రభుత్వ వైద్య కళాశాలలను కూటమి సర్కారు ప్రైవేట్ చేతుల్లో పెట్టి వ్యాపారానికి సిద్ధం కావడం పట్ల సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.స్టీల్ ప్లాంట్ కార్మికులను కలవకుండా...విమానాశ్రయం నుంచి గాజువాక, అనకాపల్లి మీదుగా వైఎస్ జగన్ పర్యటన సాగితే మధ్యలో స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం గుండా వెళుతుంది. అక్కడ భారీ సంఖ్యలో స్టీల్ప్లాంట్ కార్మికులు తరలివచ్చి తమ ఆక్రోశం, ఆవేదనను నేరుగా వైఎస్ జగన్కు విన్నవించే అవకాశం ఉందని కూటమి సర్కారు ఆందోళన చెందుతోంది. దీంతో కుటిల బుద్ధితో రూటు మార్చేసింది. ప్రధాన రహదారి గుండా వెళ్లకుండా ఎన్ఏడీ, పెందుర్తి మీదుగా పర్యటనకు అనుమతిచ్చారు. చంద్రబాబు సర్కారు అణచివేత విధానాలు, గొంతు నొక్కడంపై స్టీల్ప్లాంట్ కార్మికులతో పాటు ప్రజలందరూ మండిపడుతున్నారు. స్టీలు ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలపై కార్మికులు మండిపడుతున్నారు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్లో 32 విభాగాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులు (ఈవోఐ) ఆహ్వానించడం గమనార్హం. ఇక స్టీల్ప్లాంట్ కార్మికులకు సుమారు 4 నెలల వేతనం పెండింగ్లో ఉంది. -
కనీసం తాగునీరూ ఇవ్వలేకపోయారు
సాక్షి, విశాఖపట్నం/డాబాగార్డెన్స్/ మహరాణిపేట/ బీచ్రోడ్డు/సాక్షి, పార్వతీపురం మన్యం: కూటమి సర్కారు నిర్లక్ష్యం మన్యంలో మరణ మృదంగం మోగిస్తోంది. మన్యం జిల్లాను జ్వరాలు, పచ్చ కామెర్లు వణికిస్తున్నాయి. సర్కారు నిర్వాకం కారణంగా ఉన్నత చదువులు చదివి.. గిరిసీమల బతుకు చిత్రాన్ని మార్చాలనుకున్న విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. ఇప్పటికే ఇద్దరు విద్యార్థినులను మృత్యువు కబళించింది. మరో 120 మందికి పైగా ఆస్పత్రి పాలయ్యారు. ఇదే కురుపాం నియోజకవర్గంలో మరో ఇద్దరు యువకులు కూడా పచ్చ కామెర్లతో మృత్యువాతపడ్డారు. గురుకులంలో విద్యార్థినులకు హెపటైటిస్–ఏ సోకినట్టు చెబుతున్నారు. కలుషిత నీరు, ఆహారం, మరుగుదొడ్ల నిర్వహణ అధ్వానంగా ఉండటం వల్ల ఇది మరింతగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే.. ప్రభుత్వం దీనికంతటికీ కారణం పిల్లలే అనేలా వ్యవహరిస్తోంది. సెలవులకు ఇళ్లకు వెళ్లి, అక్కడ ఇంటి దగ్గర ఏం తిన్నారో.. ఆరోగ్యం పాడైతే అది మీ పిల్లల తప్పవుతుందే తప్ప.. హాస్టల్, స్కూల్కు ఏం సంబంధం అంటూ కొందరు కూటమి నాయకులు, అధికారులు వ్యాఖ్యలు చెయ్యడం గిరిజనులను మరింత బాధిస్తున్నాయి. విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వార్డెన్లు భోజనం సప్లై చేశారా అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.రెండు నెలల ముందే..వాస్తవానికి రెండు నెలల క్రితమే ఒక విద్యార్థిని అనారోగ్యం పాలైనట్టు తెలుస్తోంది. గత నెల 25నే ఓ విద్యార్థి, ఈ నెల మొదట్లో మరో విద్యార్థిని మరణించారు. అప్పటికీ ప్రభుత్వం, అధికారులు తేలిగ్గానే తీసుకున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు పట్టించుకోలేదు. ఇప్పుడు ఊరూరా పాకుతోంది. ఏకలవ్య పాఠశాల, పక్కనే ఉన్న బాలిక వసతి గృహంలో సరైన వసతులులేకపోవడం, అపరిశుభ్ర వాతావరణం, మురుగు నీరు కలిసిన తాగు నీరే విద్యార్థులకు ఇవ్వడం, అవే వంటకు వాడటం.. మొత్తంగా ప్రభుత్వ నిర్లక్ష్యం ఈ మృత్యుకేళికి ప్రధాన కారణం. వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించి.. వైద్య సహాయక చర్యలపై ఆరా తీసిన తర్వాతే... విద్యార్థులకు వైద్య సేవలు ముమ్మరం చెయ్యడం ప్రారంభించారు.హాస్టల్లో బాలికల అవస్థలు వర్ణనాతీతం.!బాలికల వసతి గృహంలో సౌకర్యాలు అతి దారుణంగా ఉన్నాయి. ఈ వసతి గృహంలో మొత్తం 611 మంది బాలికలు ఉన్నారు. రెండు బ్లాక్లలో కలిపి 6 టాయిలెట్స్ మాత్రమే. దీంతో బాలికలు పడే వేదన వర్ణనాతీతం. ఏకలవ్య పాఠశాలలో బాలురుకి సరైన వసతి సౌకర్యమే లేదు. పాఠశాలలో 300 మందికిపైగా విద్యార్థులున్నారు. ఇందులో 150 మంది వరకూ బాలురు ఉన్నారు. వీరికి, టీచింగ్ స్టాఫ్కి కలిపి ఉన్నవి 10 బాత్రూమ్లే. పడుకొనేందుకు కూడా చోటు వెదుక్కోవాల్సిన దుస్థితి. ఎవరైనా ఊళ్లకు వెళ్తే వేరే విద్యార్థులు పడుకునేందుకు చోటు దొరుకుతుంది. దుస్తులు ఆరబెట్టేందుకు కూడా క్లాస్రూమ్ల కిటికీలే గతి.పెద్దలకూ వ్యాపిస్తున్న వ్యాధిగురుకుల పాఠశాలలో భాగ్యలక్ష్మి అనే ఉద్యోగికి కామెర్లు రావడంతో కేజీహెచ్కు తరలించారు. మరొకరికి కూడా ఈ లక్షణాలు ఉన్నట్టు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం మరో ఎనిమిది మందిని కేజీహెచ్కు తరలించారు. తాజాగా జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో పెద్దలకు కూడా ఈ లక్షణాలు బయటపడుతున్నాయి. బాలేసు గ్రామానికి చెందిన నిమ్మక సుమన్, చినదోడ్జ గ్రామానికి చెందిన నిమ్మక ప్రశాంత్ అనే ఇద్దరు యువకులు కామెర్లతోనే మృతి చెందినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.సమస్య చెబుదామని వస్తే కేసులురెండు రోజుల క్రితం జిల్లా ఆసుపత్రికి వచ్చిన రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, గుమ్మిడి సంధ్యారాణికి సమస్యలు వివరించడానికి వచ్చిన గిరిజన సంఘాల నాయకుల్లో పాలక రంజిత్కుమార్, కూరంగి సీతారాంపై అక్రమ కేసు పెట్టారు. తహసీల్దారు వద్ద బైండోవర్ చేయించారు. కూరంగి సీతారాం కురుపాం గురుకుల పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ కూడా. ఆయన కుమార్తె ఇదే పాఠశాలలో చదువుతూ, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రభుత్వ తప్పును కప్పిపుచ్చుకునేందుకే రంజిత్కుమార్, సీతారాంపై కేసులు బనాయించారని సీపీఎం నాయకులు బీవీ రమణ, సీపీఐ నేత ఆర్వీఎస్ కుమార్, రైతు కూలీ సంఘం నాయకులు ఎం.భాస్కరరావు తెలిపారు. తక్షణమే కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.సికిల్సెల్ కేసులూ బయట పడుతున్నాయివిద్యార్థులకు మంచి నీరు అందించడంలోనూ కూటమి సర్కారు కుటిల బుద్ధి ప్రదర్శించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యార్థులకు సురక్షితమైన తాజా నీటిని అందించడానికి ఈ హాస్టల్లో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఏడాది క్రితం పిడుగు పడి ఆర్వో ప్లాంట్ పాడైపోయింది. అప్పటి నుంచి బాగుచెయ్యాలని పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోలేదు. దీంతో.. పక్కనే ఉన్న బోరు నీరు లేదా మేడపైన ట్యాంకు నుంచి వచ్చిన నీటినే ఇక్కడి విద్యార్థులు తాగుతున్నారు. కూటమి ప్రభుత్వం గిరి బాలలకు కనీస స్థాయిలో పౌష్టికాహారాన్ని కూడా అందించలేకపోతోంది. అస్వస్థతకు గురైన విద్యార్థులను పరీక్షించగా, కొన్ని సికిల్సెల్ కేసులు కూడా బయటపడుతుండటం గమనార్హం.విద్యార్థుల ఆరోగ్యాన్ని గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం ప్రతి వసతి గృహంలోనూ నెలకోసారి లేదా రెండు నెలలకోసారి సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించాలి. హాస్టళ్లలో ఉన్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై ఆరాతీసి.. ఇబ్బందులేమైనా గుర్తిస్తే.. హాస్పిటల్కు తీసుకెళ్లాలని రిఫర్ చేస్తుంటారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దాదాపు ఏ వసతి గృహంలోనూ వైద్య పరీక్షలు నిర్వహించట్లేదు. హాస్టల్స్లో ఉండే విద్యార్థుల ఆరోగ్యాన్ని పూర్తిగా విస్మరించింది. బాలికల వసతి గృహంలో, ఏకలవ్య పాఠశాలలోనూ గతేడాది కాలంగా విద్యార్థులు తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారు. అయినా అధికారులు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. వైఎస్ జగన్ వస్తున్నారనీ.. ఈ నెల 3 నుంచి కురుపాం బాధిత విద్యార్థుల్ని కేజీహెచ్కు తరలించడం ప్రారంభించారు. మొత్తం 64 మందిని తీసుకొచ్చారు. ప్రస్తుతం 46 మంది చికిత్స పొందుతున్నారు. వైద్య సేవలు అందుతున్నాయా లేదా..? విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పటికప్పుడు ఆరా తీశారు. వైఎస్సార్సీపీ నేతలు కూడా విద్యార్థుల్ని పరామర్శించి.. వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని భరోసా ఇచ్చారు. విశాఖ జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన ఖరారయ్యాక కూటమి ప్రభుత్వం.. కేజీహెచ్ వైద్యాధికారులపై ఒత్తిడి తెచ్చింది. విద్యార్థులకు త్వరితగతిన వైద్యం అందించి.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చెయ్యాలంటూ హుకుం జారీ చేసింది. దీంతో విద్యార్థులు నీరసంగా ఉన్నా.. అంతా బాగానే ఉందంటూ డిశ్చార్జ్ చేసి.. ఇళ్లకు పంపించడం ప్రారంభించారు. మంగళవారం సాయంత్రం 8 మందిని, బుధవారం రాత్రికి రాత్రి మరో 10 మందిని పంపించేశారు. గురువారం ఉదయం మరికొందర్ని పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. వారికి పూర్తిగా నయం కాకపోవడంతో పార్వతీపురం ఆస్పత్రిలో వైద్యం చేయాలంటూ కేజీహెచ్ అధికారులు డిశ్చార్జ్ సమ్మరీలో రాయడాన్ని బట్టి చూస్తే.. వైఎస్ జగన్ వస్తుండటంతో వైద్యం పూర్తిగా అందించకుండానే కూటమి ప్రభుత్వం బాధిత విద్యార్థుల్ని పంపించేస్తోందని స్పష్టమవుతోంది.విద్యార్థిని మృతిపై అనుమానాలు మహారాణిపేట: కురుపాం గిరిజన బాలికల హాస్టల్ విద్యార్థిని తోయల కల్పన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెకు వ్యాధి ఒకటైతే, వైద్యం మరొకటి చేశారని గిరిజనులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క కల్పన మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండానే తల్లిదండ్రులకు అప్పగించడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది. ఇది ఇతర గిరిజన విద్యార్థులు, తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. అస్వస్థతకు గురైన కల్పనను గత నెల 29న కేజీహెచ్కు తీసుకొచ్చారు. అక్కడ జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో పరీక్షలు చేసి, పచ్చకామెర్ల వ్యాధిగా నిర్ధారించారు. ఈనెల ఒకటో తేదీ ఉదయం కల్పన చనిపోయింది. డెత్ సమ్మరీలో కాంప్లికేటెడ్ సెరిబ్రల్ మలేరియా అని రాశారు. ముందు పచ్చకామెర్లు అని రాసి, డెత్ సమ్మరీలో కాంప్లికేటెడ్ సెరిబ్రల్ మలేరియా అని రాయడంపై గిరిజనులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఇలా మార్చారని ప్రశ్నిస్తున్నారు. కల్పనకు వచి్చన వ్యాధి ఏమిటి, చికిత్స దేనికి చేశారన్న అనుమానాలు కలుగుతున్నాయి. వ్యాధి ఒకటి అయితే మందు మరొకటి ఇచ్చారన్న అనుమానాన్ని గిరిజనులు వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం ఎందుకు చేయలేదు?: చనిపోయిన తర్వాత కల్పన మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండానే తల్లిదండ్రులకు అప్పగించారు. అంటే వైద్యంలో జరిగిన అవకతవకలు బయటపడకుండా ఇలా చేశారని గిరిజనులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా కల్పన మృతి చెందిన విషయాన్ని రహస్యంగా ఉంచారు. ప్రభుత్వం కావాలనే వైద్యుల చేత ఈ తరహాలో చేయించిందన్న విమర్శలు వస్తున్నాయి.అందరు ఒకదగ్గర లేరు కదా?కొందరు వచ్చి.. పిల్లలు ఇంట్లో ఏదో తిని ఉంటారని, అందుకే పచ్చకామెర్లు వచ్చాయని, దీనికి, హాస్టల్కి ఏం సంబంధం అని మాట్లాడారు. మా అబ్బాయే ఇంట్లో తినడం వల్ల పచ్చకామెర్లు వచ్చాయనుకుందాం. 120 మంది పిల్లలూ మా ఇంట్లోనే తిన్నారా? దానివల్లే పచ్చకామెర్లు వచ్చాయా? పిల్లలు మంచంమీద అచేతనంగా పడి ఉంటే.. ఇలా మాట్లాడాలని వారికి ఎలా అనిపిస్తోందో! ఏకలవ్య పాఠశాలలో తాగు నీటికీ బోర్ నీరే వాడుతున్నారు. పాఠశాల చుట్టూ అపరిశుభ్ర వాతావరణమే ఉంది. అడిగితే పట్టించుకునేవారు లేరు. – మండంగి శ్రీనివాస్, బొడ్లగూడ 611 మందికి 6 బాత్రూమ్లే ఉన్నాయిమా హాస్టల్లో 611 మంది అమ్మాయిలం ఉన్నాం. అందరికీ ఆరే బాత్రూమ్లు ఉన్నాయి. ఆర్వో ప్లాంట్ పాడైపోయింది. ట్యాంక్ నీటినే తాగడానికి, వంటకీ కూడా వాడతారు. – కొండగొర్రె మోహిని, టెన్త్ విద్యార్థిని, దండుసుర గ్రామం ఆర్వో ప్లాంట్ పాడైనా పట్టించుకోలేదునా కుమార్తె ఆరో తరగతి చదువుతోంది. హాస్టల్లోనే జ్వరం, వాంతులు మొదలయ్యాయి. పార్వతీపురం ఆస్పత్రికి తీసుకెళ్లాం. హాస్టల్ వద్ద డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు. మురుగు నీరంతా ఒక దగ్గర నిల్వ ఉండిపోవడంతో పాటు బోర్ వాటర్లో కలిసిపోయింది. ఆర్వో ప్లాంట్ పాడైపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. – కె.అప్పారావు, విద్యార్థిని తండ్రి హాస్టల్ అపరిశుభ్రంగా ఉంది..మా పాప జ్వాలను ఈ ఏడాది హాస్టల్లో చేర్పించాం. ముందు జ్వరం ఎక్కువగా వచ్చింది. టెస్ట్స్ చేయిస్తామన్నారు. టెస్ట్స్ చేయించే లోపే జ్వరం మరింత ఎక్కువైంది. నీరసించిపోయింది. సోమవారం కురుపాం హాస్పటల్కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి పార్వతీపురం హాస్పటల్కి, అత్యవసరంగా మంగళవారం కేజీహెచ్కు తీసుకొచ్చారు. హాస్టల్ పరిసర ప్రాంతం అపరిశుభ్రంగా ఉంటుంది. – ఉత్తమ, విద్యార్థిని జ్వాల తల్లి -
కట్టమంచికి అవమానం
విశాఖ సిటీ: ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పాలకవర్గం తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏయూ పాలనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే హాస్టళ్లలో సమస్యలు, పురుగుల భోజనం, విద్యార్థి మరణం వంటి అనేక వివాదాలు చుట్టుముట్టగా, తాజాగా స్నాతకోత్సవ వేదిక మార్పు అంశం అగ్గి రాజేస్తోంది. ఆంధ్రా యూనివర్సిటీ తొలి ఉపకులపతి కట్టమంచి రామలింగారెడ్డి(సీఆర్ రెడ్డి)ని అగౌరవపరిచేలా ఏయూ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని వర్సిటీ వర్గాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. కట్టమంచికి గౌరవార్థంగా ఏయూలో నిర్మించిన ‘కట్టమంచి రామలింగారెడ్డి ఉత్సవ రంగం(కాన్వొకేషన్ హాల్)’లోనే పట్టభద్రుల పట్టాల పండగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే.. చరిత్రలో తొలిసారిగా స్నాతకోత్సవం వేదికను మార్చాలనే నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. కట్టమంచి నుంచి కన్వెన్షన్ సెంటర్కు.. ఏయూలో ఈ నెల 15న 91వ, 92వ స్నాతకోత్సవాలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. రెండేళ్ల పట్టభద్రులకు ఒకేసారి పట్టాలు అందించాలని నిర్ణయించారు. ఎప్పటిలాగే కట్టమంచి రామలింగారెడ్డి ఉత్సవ రంగం హాల్లో కాన్వొకేషన్ జరుగుతుందని అందరూ భావించారు. అయితే.. ఈ స్నాతకోత్సవాన్ని అక్కడి నుంచి బీచ్రోడ్డులో ఉన్న ఏయూ కన్వెన్షన్ సెంటర్కు మార్చినట్లు అధికారులు ప్రకటించారు. దీనిపై ఏయూలో పలు వర్గాల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. స్నాతకోత్సవాన్ని ఉత్సవ రంగంలో కాకుండా వేరే చోట నిర్వహించడం కట్టమంచిని అవమానించడమే అన్న అభిప్రాయాలు బలంగా వ్యక్తమయ్యాయి. ఈ అంశంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో.. కట్టమంచి రామలింగారెడ్డి ఉత్సవ రంగం హాల్ మరమ్మతులకు గురైందన్న సాకును అధికారులు తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పటివరకు జరిగిన అన్ని స్నాతకోత్సవాలు అక్కడే జరిగాయి. తాజాగా 91వ, 92వ కాన్వొకేషన్ను నిర్వహించాలని నిర్ణయించినప్పుడు, ఈలోపే మరమ్మతులు ఎందుకు పూర్తి చేయలేదన్న ప్రశ్నలను ఏయూలో కొందరు సంధిస్తున్నారు. ఏయూ ప్రారంభం నుంచి వస్తున్న సంప్రదాయానికి విరుద్ధంగా వ్యవహరించడాన్ని తప్పుబడుతున్నారు. ఆలస్యంగా మరమ్మతులు కట్టమంచి రామలింగారెడ్డి ఉత్సవ రంగం హాల్ మరమ్మతులకు గురైన మాట వాస్తవమే. పైన సీలింగ్ ఊడి పడే ప్రమాదం ఉంది. 91వ, 92వ కాన్వొకేషన్ నిర్వహించాలని నిర్ణయించడానికి ముందే ఈ మరమ్మతులను పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఆ పని చేయలేదు. ఇదిలా ఉండగా, ఇటీవల ఇందులో పనిచేస్తున్న కార్మికుడొకరు పై నుంచి కిందపడి మరణించారు. దీంతో పోలీసులు తాత్కాలికంగా పనులు నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఫలితంగా మరమ్మతు పనులు మరింత ఆలస్యమయ్యాయి. -
కూటమి కత్తి!
నర్సీపట్నం వైద్య కళాశాలపై..అయ్యన్నా.. ఇదిగో జీవోవిశాఖ సిటీ: రాష్ట్రంలో అన్ని జిల్లాలను కలుపుతూ ఒక మెడికల్ సర్క్యూట్ను ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే గత ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి సంకల్పానికి కూటమి ప్రభుత్వం తూట్లు పొడిచేందుకు సిద్ధమైంది. ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండాలన్న గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ లక్ష్యాన్ని కాలరాసే పన్నాగాలు పన్నుతోంది. పేదలకు వైద్య విద్యతో పాటు.. అత్యాధునిక వైద్య సదుపాయాలు అందించేందుకు గతంలో శ్రీకారం చుడితే.. కూటమి ప్రభుత్వం వాటిని పీపీపీ పేరుతో ప్రైవేటుకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తోంది. పేద, బడుగు, బలహీన వర్గాలకు వైద్య విద్య, వైద్యాన్ని దూరం చేయాలని కంకణం కట్టుకుంది. 2022 డిసెంబర్ 30న అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ పనులకు శంకుస్థాపన చేయగా.. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఈ కళాశాల నిర్మాణాన్ని అడ్డుకోవడానికి చంద్రబాబు అండ్ కో విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అడుగడుగునా అడ్డంకులు సృష్టి రాష్ట్రంలో కొత్తగా 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం శ్రీకారం చుడితే వాటిని అడ్డుకోవడానికి చంద్రబాబు గ్యాంగ్ తీవ్ర ప్రయత్నాలు చేసింది. ప్రధానంగా అనకాపల్లి జిల్లాలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. తొలి విడతలో అనకాపల్లి టౌన్లో ఏర్పాటుకు 50 ఎకరాల స్థలాన్ని కేటాయించగా.. స్థానిక టీడీపీ నేతలు న్యాయస్థానాల ద్వారా అడ్డుకున్నారు. దీంతో అనకాపల్లి నుంచి నర్సీపట్నం నియోజకవర్గానికి వైద్య కళాశాలను తరలించాల్సి వచ్చింది. ఈ మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తయితే గ్రామీణ ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. అలాగే ఏటా 150 ఎంబీబీఎస్ సీట్లలో విద్యార్థులకు ప్రవేశం లభిస్తుంది. తర్వాత పీజీ వైద్య కోర్సులు వస్తాయి. తద్వారా పీజీ వైద్య విద్యార్థులు, వారికి వైద్య విద్య బోధించే ప్రొఫెసర్లు (నిపుణులైన వైద్యులు) అందుబాటులోకి వస్తారు. వారు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి అక్కడే నివాసం ఉండాల్సి ఉంటుంది. దీంతో గ్రామీణ ప్రజలకు 24 గంటలూ అత్యవసర వైద్యం అందుతుంది. కానీ ఈ ప్రభుత్వ వైద్య కళాశాలను కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వాటిని కౌంటర్ చేయలేక కిందామీదా పడుతోంది. ఇది కూటమికి ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశం ఉండడంతో అసలు వైద్య కాలేజీ నిర్మాణాలే జరగలేదని మంత్రులు అబద్దాలకు తెరతీశారు. వందేళ్ల తర్వాత ప్రభుత్వ వైద్య కళాశాల ఉత్తరాంధ్రలో 1921లో ఆంధ్రా మెడికల్ కాలేజీ ఏర్పాటైంది. వందేళ్ల తర్వాత గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నర్సీపట్నం, పాడేరుల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలం భీమబోయినపాలెంలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి రూ.500 కోట్లు కేటాయించింది. 2022 డిసెంబర్ 30న అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2025 నాటికి పూర్తి చేయాలనే సంకల్పంతో 50.15 ఎకరాల్లో 13.21 లక్షల చ.అ. విస్తీర్ణంలో నిర్మాణ పనులు ప్రారంభించారు. ఏటా 150 ఎంబీబీఎస్ సీట్ల అడ్మిషన్లు చేపట్టాలని నిర్ణయించారు. వైఎస్సార్ సీపీ హయాంలోనే మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, నర్సింగ్ కాలేజీ, ఇతర భవనాల నిర్మాణాలు జోరుగా సాగాయి. ఫుటింగ్ దశలో భవనాలు ఉండగా.. ఐటీడీ బ్లాక్, 24x7 బ్లాక్ శ్లాబ్ వేయడం జరిగింది. మార్చురీ బ్లాక్, మెడికల్ గ్యాస్ ప్లాంట్, బయోమెడికల్ గ్యాస్ ప్లాంట్, లాండ్రీ, ఆసుపత్రి కిచెన్ పనులు వేగంగా జరిగాయి. దాదాపు 60 శాతానికి పైగా నిర్మాణపనులు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ కాలేజీ నిర్మాణాలకు బ్రేకులు పడ్డాయి. -
విద్యార్థినుల ఆరోగ్యంతో ఆటలా?
సాక్షి, విశాఖపట్నం : కూటమి ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం కారణంగా.. ఇప్పటికే ఇద్దరు విద్యార్థినుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వంద మందికి పైగా విద్యార్థినులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయినా ప్రభుత్వంలో కించెత్తు పశ్చాత్తాపం కనిపించలేదు. చికిత్స పొందుతున్న విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యతని విస్మరిస్తోంది. వైద్యం అందించడంలోనూ రాజకీయం చేస్తోంది. విశాఖలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన ఖరారవ్వడం.. పచ్చకామెర్లతో బాధపడుతున్న విద్యార్థులను పరామర్శించేందుకు వస్తున్నారని తెలుసుకున్న ప్రభుత్వం..విద్యార్థుల ఆరోగ్యంతో ఆడుకుంటోంది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పూర్తిగా నయమవ్వకుండానే విద్యార్థినులను కేజీహెచ్ నుంచి డిశ్చార్జ్ చేసేస్తున్నారు. బాబ్బాబూ.. పాప ఇంకా నీరసంగా ఉందయ్యా.. అని వేడుకుంటున్నా.. కేజీహెచ్లో వద్దు.. పార్వతీపురం పీహెచ్సీకి వెళ్లిపోండంటూ పంపించేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా.. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలోని ఏకలవ్య పాఠశాల, దానిని ఆనుకొని ఉన్న గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో విషజ్వరాలు ప్రబలి ఇద్దరు విద్యార్థినులు మృత్యు ఒడికి చేరుకున్నారు. 120 మందికి పైగా ఆస్పత్రుల పాలయ్యారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో కురుపాం, పార్వతీపురం ఆస్పత్రుల నుంచి కేజీహెచ్కు 64 మంది విద్యార్థులను తరలించారు. ఆ సమయంలో వీరందరి ఆరోగ్యం కూడా కాస్తా విషమంగా ఉండింది. ప్రతిరోజూ వైఎస్సార్ సీపీ నేతలు పరామర్శించి.. వైద్య సహాయక చర్యలపై ఆరా తీసిన తర్వాతే... విద్యార్థులకు వైద్య సేవలు ముమ్మరం చెయ్యడం ప్రారంభించారు. దీంతో పిల్లలు ఇప్పుడిప్పుడే కాస్తా కోలుకుంటున్నారు. ఆహారం విషయంలోనూ.. బాధిత విద్యార్థినుల ఆహారం విషయంలోనూ అదే నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు. పచ్చకామెర్లతో బాధపడుతున్న వారికి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి. కానీ కేజీహెచ్లో ప్రతిరోజూ అందరికీ అందించే ఉప్మా ఇచ్చారు. హోం మంత్రి అనిత పరామర్శించిన సమయంలో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో.. తర్వాత నుంచి ప్రత్యేక మెనూ ఇస్తున్నారు. మొత్తానికి తమ రాజకీయం కోసం.. విద్యార్థుల ఆరోగ్యాన్ని కూడా కూటమి ప్రభుత్వం లెక్కచేయకపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. వైఎస్ జగన్ వస్తున్నారని..! కేజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థినులను గురువారం సాయంత్రం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శిస్తారని తెలిసినప్పటి నుంచి కూటమి ప్రభుత్వానికి భయం పట్టుకుంది. కురుపాం ఘటనను బాహ్య ప్రపంచానికి తెలియకుండా మాఫీ చేసేందుకు ప్రభుత్వం యత్నించినా బట్టబయలైంది. ఇక వైఎస్ జగన్ వస్తే.. జాతీయ స్థాయి ఇష్యూగా మారుతుందనే ఆందోళన ప్రభుత్వంలో కనిపించింది. దీంతో విద్యార్థినుల ఆరోగ్యంతో చెలగాటమాడేందుకు కూడా వెనుకాడటం లేదు. హోంమంత్రి, ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో నీరసంగా ఉన్నా కనికరించకుండా విద్యార్థినులను కేజీహెచ్ నుంచి డిశ్చార్జ్ చేయడం మొదలుపెట్టారు. మంగళవారం రాత్రి 8 మందిని, బుధవారం రాత్రి ఆదరాబాదరాగా మరో 10 మందిని పంపించేశారు. ప్రస్తుతం 46 మంది ఇక్కడ చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఉదయంలోపు మరో 10 మందిని పంపించేందుకు డిశ్చార్జ్ షీట్స్ సిద్ధం చేస్తున్నారు. పాప నీరసంతో నడవలేకపోతోంది.. రెండు రోజులు ఇక్కడ ఉంచాలని తల్లిదండ్రులు కోరుతున్నా.. ఏం ఫర్వాలేదు.. మీరు కురుపాం పీహెచ్సీలో జాయిన్ అవ్వండంటూ డిశ్చార్జ్ షీట్లో రాసి మరీ పంపించేస్తుండటం దారుణం. వైద్యసేవలు పూర్తిగా అందించకుండానే డిశ్చార్జ్ చేస్తుండటంతో తల్లిదండ్రులు, బాధిత విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మాజీ సీఎం జగన్ పర్యటన ఇలా..
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉదయం 10 గంటలకు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి ఎన్ఏడీ జంక్షన్, గోపాలపట్నం, పెందుర్తి, సబ్బవరం–అనకాపల్లి జాతీయ రహదారి మీదుగా కొత్తూరు జంక్షన్.. అక్కడ నుంచి తాళ్లపాలెం జంక్షన్ మీదుగా మాకవరపాలెం మండలంలో భీమబోయినపాలెం మెడికల్ కళాశాలకు చేరుకుంటారు. అక్కడ కళాశాలను పరిశీలించి మధ్యాహ్నం1.30 నుంచి 2.15 గంటల వరకు మీడియాతో మాట్లాడతారు. అనంతరం విశాఖలో గల కేజీహెచ్కు నాలుగు గంటలకు చేరుకుంటారు. కురుపాం గిరిజన ప్రభుత్వ వసతి గృహంలో అస్వస్థతకు గురై కేజీహెచ్లో చికిత్స పొందుతున్న గిరిజన బాలికలను పరామర్శిస్తారు. విశాఖ ఎయిర్పోర్టు నుంచి సాయంత్రం ఆరు గంటలకు తిరుగు ప్రయాణమవుతారు. -
జగన్ పర్యటనకు ఆటంకాలు సృష్టిస్తే తీవ్ర పరిణామాలు తప్పవు
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఆటంకా లు సృష్టిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు హెచ్చరించారు. చట్టం పరిధిలోనే పోలీసులు, అధికారులు పనిచేయాలని, అలా కాకుండా అత్యుత్సాహం ప్రదర్శిస్తే రానున్న కాలంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్ప దన్నారు. అధినేత పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కె.కె.రాజు పిలుపునిచ్చారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో విశాఖ పార్లమెంట్ పరిశీల కుడు కదిరి బాబూరావుతో కలిసి బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మా ప్రభుత్వ హయాంలో రూ.8 వేల కోట్లతో పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందాలనే ముందుచూపుతో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాం. వాటి ప్రైవేటీకరణకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం తీరుపై పోరాటం చేస్తున్నాం. ప్రజా నాయకుడు వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకోవడం కాదు... దమ్ముంటే ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కొనసాగించి పేదలకు ఉచితంగా వైద్యం అందించే ప్రయత్నాలు చేయండి. అప్పుడు ప్రజల మనసులు గెలుచుకుంటారు.’అని కూటమి నేతలకు హితవు పలికారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీకి అనుమతి లేదంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కళ్లుండీ కబోదిలా మాట్లాడారు.. అనుమతి ఇవ్వకుండా పోలీసులు రూట్లను మార్చి, ఫ్లెక్సీలు కూడా కట్టనివ్వకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అనుమతి ఇచ్చినా, ఇవ్వకపోయినా జగన్ నర్సీపట్నం వెళ్లడం ఖాయమన్నా రు. ‘ఉత్తరాంధ్ర అభివృద్ధిని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. స్వాగత ఏర్పాట్లను కూడా అధికారులు అడ్డుకుంటున్నారు. చంద్రబాబు ఉత్తరాంధ్రను నాశనం చేస్తున్నారు. ఇక్కడి భూములను, సంపదను దోచుకు తింటుంటే నోరు మూసుకొని ఉండటం సిగ్గు చేటు. ఉత్తరాంధ్ర కూటమి నేతలకు సిగ్గు, శరం ఉంటే చంద్రబాబు చేస్తున్న అన్యాయాలను ప్రశ్నించండి’ అంటూ మండిపడ్డారు. కదిరి బాబూరావు మాట్లాడుతూ ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి, ఆ సమస్యలపై పోరాటం చేసేందుకు వస్తున్న మాజీ సీఎం పర్యటనకు ఆటంకాలు సృష్టించడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదు... అలాంటి వ్యక్తి జగన్ తీసుకొచ్చిన కాలేజీలను ప్రైవేటుకు ఇవ్వడం దుర్మార్గమన్నారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని, చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు -
ఏయూ ఆరోగ్య కేంద్రానికి వైద్యులు
విశాఖ సిటీ : ఎట్టకేలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆరోగ్య కేంద్రంలో పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టారు. నిత్యం 200 మంది వరకు రోగులు వచ్చే ఈ కేంద్రానికి వైద్యులు, సిబ్బంది లేక వైద్య సదుపాయాలు సక్రమంగా అందడం లేదు. ఇటీవలే బీఈడీ విద్యార్థి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడినప్పటికీ ఆక్సిజన్ పెట్టకపోవడంతో మరణించాడు. దీనిపై విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఏయూ ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది లేకపోవడంపై ‘ఆక్సిజన్ పెట్టేవారే లేరు’ అనే శీర్షికను ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై ఏయూ అధికారులు స్పందించారు. కొత్తగా ఏడాది కాలానికి వైద్యులు, సిబ్బందిని నియమించారు. ఏళ్లుగా అరకొర సేవలు : ఏయూలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర, ఇతర సిబ్బంది, విద్యార్థుల కోసం ఆరోగ్య కేంద్రం ఉంది. 24 గంటల పాటు ఇక్కడ వైద్య సేవలు అందించాల్సిన ఈ డిస్పెన్సరీలో కేవలం ఇద్దరేసి చొప్పున వైద్యులు, నర్సులు, ఫార్మసిస్టులు మాత్రమే ఉన్నారు. మూడు షిఫ్టులలో పనిచేసే ఈ ఆరోగ్య కేంద్రానికి నిత్యం ఓపీకి 200 మంది రోగులు వరకు వస్తున్నారు. అరకొర సిబ్బందితో వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. గత నెల 25వ తేదీన బీఈడీ విద్యార్థి మరణంతో ఏయూ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. డిస్పెన్సరీలో వైద్య సేవలు అందించడానికి సిబ్బంది లేని కారణంగా విద్యార్థి చనిపోయినట్లు వారు ఆరోపించారు. దీనిపై ఏయూ ఆరోగ్య కేంద్రం పరిస్థితులపై సాక్షి కథనంతో ఏయూ అధికారులతో కదలిక వచ్చింది. కొత్తగా సిబ్బంది భర్తీకి కొద్ది రోజుల క్రితమే నోటిఫికేషన్ విడుదల చేశారు. తాజాగా ఈ ఆరోగ్య కేంద్రానికి ముగ్గురు వైద్యులు, నలుగురు ఫార్మసిస్టులు, ముగ్గురు స్టాఫ్ నర్సుల నియామకాన్ని చేపట్టారు. -
దివ్యాంగులకు మళ్లీ అగ్ని పరీక్ష
మహారాణిపేట: దివ్యాంగులపై కూటమి ప్రభుత్వం కక్షగట్టింది. వీరిపై కనికరం లేకుండా పరీక్షల పేరుతో అష్టకష్టాలు పెడుతోంది. ఇప్పటికే 1,178 మంది దివ్యాంగుల పెన్షన్లు తొలగించాలని జాబితాను సిద్ధం చేసింది. దీనిపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమైంది. వివిధ కేటగిరీల్లో ఉన్న దివ్యాంగులు పింఛన్ల అపీల్ చేసుకోవడంతో వారికి గత నెల పింఛన్లు మంజూరు చేసింది. దివ్యాంగుల పింఛన్లలో భారీగా కోత విధించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం తాజాగా కఠిన నిర్ణయం తీసుకుంది. అపీల్ చేసుకున్న దివ్యాంగులకు మళ్లీ పరీక్షలు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వైద్యుల ప్యానెల్ను ఏర్పాటు చేసి, బుధ, గురు, శుక్రవారాల్లో నగరంలోని నిర్దేశిత ఆస్పత్రుల్లో సర్టిఫికెట్లను వెరిఫై చేయాలని ఆదేశించడం.. దివ్యాంగుల వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఆందోళనలో అభాగ్యులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తమ పింఛన్లకు ఎప్పుడు ఎసరు వస్తుందోనన్న భయాందోళనతో దివ్యాంగులు కాలం వెళ్లదీస్తున్నారు. రీవెరిఫికేషన్ పేరుతో ప్రభుత్వం తమ జీవితాలతో చెలగాటం ఆడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పునఃపరిశీలనలో తమ వైకల్య శాతాన్ని తగ్గిస్తారేమోనని, లేదా సర్టిఫికెట్ను పూర్తిగా రద్దు చేస్తారేమోనని మదనపడుతున్నారు. అనారోగ్యం లేదా ఇతర కారణాలతో వెరిఫికేషన్కు హాజరు కాలేకపోతే మరుసటి నెల నుంచే పింఛన్ కట్ చేస్తుండటంతో ఏం చేయాలో పాలుపోక సతమతమవుతున్నారు. మంచానపడిన వారిని, మానసిక వికలాంగులను సైతం వదలకుండా నోటీసులు జారీ చేసి ఇబ్బందులకు గురిచేయడం ప్రభుత్వ కనికరలేని వైఖరికి నిదర్శనమని వారు వాపోతున్నారు. ఏరివేతే లక్ష్యంగా.. దివ్యాంగుల పింఛన్ల లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ర్యాండమ్ సర్వేలు, మంచం మీద ఉన్నవారికి ఇంటివద్దకే వెళ్లి రీవెరిఫికేషన్లు నిర్వహించారు. ఇప్పుడు 50 శాతం లోపు వైకల్యం ఉన్నవారికి, గతంలో పింఛన్ నిలుపుదలపై అప్పీల్ చేసుకున్న వారికి మళ్లీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే జిల్లాలో 1,178 మంది పింఛన్లను తొలగించేందుకు జాబితా సిద్ధం చేయడం ప్రభుత్వ ఉద్దేశాన్ని స్పష్టం చేస్తోంది. వ్యతిరేకత రావడంతో గత నెల పింఛన్లు విడుదల చేసినప్పటికీ, ఇప్పుడు మళ్లీ పరీక్షల పేరుతో వారిని వేధించడం దారుణం. కక్షసాధింపు తగదు జిల్లాలో మొత్తం 21,306 మంది దివ్యాంగుల పింఛనుదారులు ఉండగా, ఇప్పటికే 16,187 మంది రీవెరిఫికేషన్ పూర్తయింది. ఇంకా 5,119 మందికి ఈ ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. పరీక్షలు చేసిన వారిలో 1,178 మంది దివ్యాంగుల పింఛన్లకు ఎసరు వచ్చింది. వీరికి కేజీహెచ్, అగనంపూడి ఆస్పత్రి, ప్రాంతీయ కంటి ఆస్పత్రి, ఈఎన్టీ ఆస్పత్రుల్లో ప్రతి బుధ, గురు, శుక్రవారాల్లో వైద్యుల బృందం సదరం సర్టిఫికెట్లను పరిశీలన చేయనుంది. పుట్టుకతోనే వైకల్యంతో బాధపడుతూ, మరొకరి సాయం లేనిదే కదలలేని అభాగ్యులపై ప్రభుత్వం ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం అమానవీయమని, ఈ రీవెరిఫికేషన్ నిబంధనలు తమకు శాపంగా మారాయని దివ్యాంగులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
మంచి టీచర్లుగా పోటీ పడి పనిచేయండి
మహారాణిపేట: ఆదర్శ ఉపాధ్యాయులుగా నిలిచేందుకు, విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు పోటీపడి పనిచేయాలని నూతన ఉపాధ్యాయులకు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ హితబోధ చేశారు. మెగా డీఎస్సీలో ఎంపికై న ఉపాధ్యాయులకు మధురవాడ ఐటీ హిల్స్లోని శ్రీకళాశ్ విద్యా సంస్థలో వారం రోజుల పాటు ఏర్పాటు చేసిన ఇండక్షన్ ట్రైనింగ్ శిబిరాన్ని బుధవారం కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి పలు విషయాలపై మాట్లాడారు. ఎంతో కష్టపడి ప్రభుత్వ కొలువు సాధించడం అభినందనీయమని, ఇదే స్ఫూర్తితో మంచి ఉపాధ్యాయులుగా ఉండేందుకు కష్టపడి పని చేయాలన్నారు. శిక్షణ కాలంలో ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా ఆకళింపు చేసుకోవాలన్నారు. క్రమశిక్షణతో, వృత్తిని ప్రేమిస్తూ పని చేస్తేనే ఉత్తమ ఫలితాలు వస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ అలవర్చుకొని, బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలన్నారు. ఆధునిక బోధనా పద్ధతుల గురించి తెలుసుకొని ఆచరణలో పెట్టాలన్నారు. సిలబస్, టైమ్ టేబుల్ ప్రకారం పాఠం చెప్పామనే కాకుండా, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలన్నారు. బడికి రావాలనే కుతూహలాన్ని విద్యార్థుల్లో కల్పించాలన్నారు. మీ జీవితంలో బాగా పాఠం చెప్పిన గురువులను ఇప్పటికీ ఎలా గుర్తుంచుకుంటారో.. అదే మాదిరిగా మిమ్మల్ని మీ విద్యార్థులు కూడా గుర్తుంచుకునేలా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్, శిక్షకులు పాల్గొన్నారు. నూతన ఉపాధ్యాయులకు కలెక్టర్ హితబోధ -
ఏయూ రెక్టార్గా ఆచార్య కింగ్
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం రెక్టార్గా కెమికల్ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ ఆచార్యులు పులిపాటి కింగ్ నియమితులయ్యారు. ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ బుధవారం ఆచార్య కింగ్కు నియామక ఉత్తర్వులు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆచార్య కింగ్ రెక్టార్గా బాధ్యతలు స్వీకరించారు. కెమికల్ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ ఆచార్యులుగా ఉన్న ఆచార్య కింగ్ గతంలో ఏయూ ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్స్ చీఫ్ వార్డెన్గా, కృష్ణా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్గా, కెమికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతిగా తదితర పదవులను నిర్వహించారు. ఆయన ఏయూ నుంచి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉత్తమ అకడమీషియన్ అవార్డును, అమెరికాకు చెందిన అండన్ ఫౌండేషన్ టీచింగ్ ఎక్సలెన్స్ అవార్డును కూడా అందుకున్నారు. ఈ సందర్భంగా ఆచార్య కింగ్కు వర్సిటీ ఆచార్యులు శుభాకాంక్షలు తెలిపారు. -
హ్యాట్రిక్పై భారత్ కన్ను
విశాఖ స్పోర్ట్స్/పీఎంపాలెం: విశాఖ నగరంలో క్రికెట్ సందడి నెలకొంది. అంతర్జాతీయ మహిళా క్రికెట్కు తొలిసారిగా వేదికగా నిలిచిన సందర్భంలో.. నగరం మొత్తం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. ఐసీసీ మహిళల ప్రపంచ కప్లో భాగంగా.. హ్యాట్రిక్ విజయం లక్ష్యంగా భారత జట్టు గురువారం పటిష్టమైన దక్షిణాఫ్రికాతో తలపడనుంది. పీఎంపాలెంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ డే అండ్ నైట్ వన్డే మ్యాచ్ కోసం సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఇరు జట్లు స్టేడియంలో ఫ్లడ్లైట్ల వెలుతురులో ప్రాక్టీస్ చేసుకున్నాయి. విజయోత్సాహంతో బరిలోకి భారత్ ప్రస్తుత టోర్నీలో భారత జట్టు అద్భుతమైన ఫామ్లో ఉంది. ఆడిన తొలి రెండు మ్యాచ్ల్లో శ్రీలంకపై 59 పరుగులు, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై 88 పరుగుల భారీ తేడాతో ఘన విజయాలు సాధించింది. విశాఖ వేదికగా అదే జోరును కొనసాగించాలని కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సేన పట్టుదలగా ఉంది. బ్యాటింగ్లో హర్లీన్(94 పరుగులు), దీప్తి శర్మ (78 పరుగులు), ప్రతీక (68 పరుగులు) సూపర్ ఫామ్లో ఉండగా, బౌలింగ్లోనూ దీప్తి శర్మ (6 వికెట్లు), క్రాంతి, స్నేహ రాణా (చెరో 4 వికెట్లు) ప్రత్యర్థులకు సింహస్వప్నంలా మారారు. బ్యాటింగ్కు స్వర్గధామమైన విశాఖ పిచ్పై వీరు మరింతగా రాణిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. అభిమానుల కోలాహలం విశాఖ మహిళల ప్రపంచ కప్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వడం ఇదే ప్రప్రథమం. దీంతో నగర క్రీడాభిమానుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. భారత్, దక్షిణాఫ్రికాతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి దిగ్గజ జట్లు ఇక్కడ ఆడనుండటంతో స్టేడియం పరిసరాల్లో పండగ వాతావరణం నెలకొంది. స్థానిక యువ క్రీడాకారిణులను ప్రోత్సహించే దిశగా స్టేడియంలోని ఒక స్టాండ్కు భారత మహిళా క్రికెట్ దిగ్గజం, హైదరాబాదీ మిథాలీ రాజ్ పేరు, ఒక ప్రవేశ ద్వారానికి ఆంధ్ర క్రీడాకారిణి కల్పన పేరు పెట్టడం విశేషం. ఇది భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు. భారీ బందోబస్తు.. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్కు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వాహకులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. స్టేడియం లోపల, వెలుపల సుమారు 1,100 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పీఎంపాలెం సీఐ జి.బాలకృష్ణ తెలిపారు. ప్రతి ప్రవేశ ద్వారం వద్ద సీఐ స్థాయి అధికారి పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు, వరుణుడు అంతరాయం కలిగించే అవకాశం ఉన్నప్పటికీ.. స్టేడియంలో ఉన్న ఆధునిక డ్రైనేజీ వ్యవస్థతో వర్షం నీరు త్వరితగతిన బయటకు వెళ్లే ఏర్పాట్లు ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురవనంత వరకు మ్యాచ్ ఫలితం తేలే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రాక్టీస్ చేస్తున్న దక్షిణాఫ్రికా ఆటగాళ్లు -
పెల్లుబికిన ప్రజాగ్రహం
పెదగంట్యాడ: సిమెంట్ పరిశ్రమ కాలుష్యం బారిన పడి అనారోగ్యం పాలవుతామంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ వద్దంటూ చేస్తున్న ఆందోళనలను.. అధికారులు, పాలకులకు వినతులు అందజేసినా పట్టించుకోకుండా ప్రజాభిప్రాయ సేకరణకు పూనుకోవడంతో ఆగ్రహంతో రగిలిపోయా రు. కాలుష్యం కాటేస్తుందని ఒడిశా వాసులు తరిమికొట్టేసిన ఫ్యాక్టరీ తమ ప్రాణాలు కంటే ముఖ్యం కాదని స్పష్టం చేశారు. దీంతో గంగవరం పోర్టు ఆధ్వర్యంలో అంబుజా సిమెంట్స్ గ్రైండింగ్ కోసం బుధవారం 75వ వార్డు పరిధిలోని జీవీఎంసీ మైదానంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. మహిళలు, పిల్లలు, పెద్దలు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు తరలివచ్చి అంబూజా సిమెంట్స్ గో బ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి ఆర్డీవో శ్రీలేఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ ముకుందరావు, పెదగంట్యాడ తహసీల్దార్ పి.అమల హాజరయ్యారు. ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో 11.30 గంటల సమయంలో కార్యక్రమాన్ని ముగించడంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అడ్డుకున్న నాయకులు, ప్రజా ప్రతినిధులు.. ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకునేందుకు జనంతో పాటు ప్రజా సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు సైతం అక్కడకు చేరుకున్నారు. డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్, కార్మిక సంఘాల నాయకులు మంత్రి రాజశేఖర్, ఆదినారాయణ, సీపీఐ నాయకుడు కసిరెడ్డి సత్యనారాయణ, కార్పొరేటలు ఏజే స్టాలిన్, పులి లక్ష్మీబాయి, మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి, నాయకులు తిప్పల దేవన్రెడ్డి,గొందేశి శ్రీనివాస్రెడ్డి, మార్టుపూడి పరదేశి, మంత్రి శంకరనారాయణ, ధర్మాల శ్రీను, గొందేశి వెంకటరమణారెడ్డి, కొయ్య భారతి, మధుసూదన్రెడ్డి, సుమన్ రెడ్డి, గుడివాడ లతీష్ తదితరులు ప్రజలతో కలిసి కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. 3 గంటల తర్వాత.. : మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని మళ్లీ మొదలు పెట్టారు. ఆ ప్రాంతం చుట్టూ పోలీసు బలగాలను మోహరించారు. దీంతో గంగవరం పోర్టులో పని చేస్తున్న కార్మికులతో అభిప్రాయ సేకరణ చేపట్టారని సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో మళ్లీ ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు అక్కడకు చేరుకునే ప్రయత్నం చేశారు. అయితే నాయకులతో పాటు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ పెదగంట్యాడ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని నాయకులతో సమావేశమయ్యారు. వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే నాయకులు ససేమిరా అనడంతో ప్రజాభిప్రాయసేకరణను వాయిదా వేశారు. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామన్న విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించారు. అప్పుడు అందరూ సహకరించాలని ఆయన కోరారు. -
‘వైఎస్ జగన్ పర్యటన యథావిధిగా కొనసాగుతుంది’
విశాఖ. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నర్సీపట్నం పర్యటన రేపు(గురువారం, అక్టోబర్ 9వ తేదీ) యథావిధిగా కొనసాగుతుందని పార్టీ ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. రేపు ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్ ఎయిర్పోర్టుకు చేరుకుని, రోడ్డు మార్గాన మెడికల్ కాలేజ్కి వెళ్తారని తెలిపారు. స్టీల్ప్లాంట్ మీదుగా వెళ్లేందుకు పోలీసులు రూట్ మార్చారన్నారు. ‘ వైఎస్ జగన్ తన తిరుగు ప్రయాణంలో కేజీహెచ్కు వెళ్తారు. పచ్చకామెర్లతో బాధపడుతున్న విద్యార్థులను పరామర్శిస్తారు. 70 మంది వివిధ హాస్పిటల్స్ లో అనారోగ్యంతో బాధపడుతున్నారు.ఇప్పటివరకు నలుగురు విద్యార్థులు మరణించారు. వైఎస్ జగన్ అంటే చంద్రబాబుకు భయం. వైఎస్ జగన్ బయటకు వస్తున్నారంటేనే చంద్రబాబుకు వణుకు పుడుతుంది.జగన్ పర్యటనకు ప్రజలు రాకుండా భయపెడుతున్నారు. వైఎస్సార్సీపీ నేతలు కట్టే ఫ్లెక్సీలను అడ్డుకుంటున్నారు.అరిచేతను అడ్డంపెట్టి సూర్యకాంతిని అడ్డుకోలేరు. ఆంక్షలుతో వైఎస్ జగన్ను ఆపలేరు. మనుషులు ఉండే హాస్పటల్లో నిర్మించలేని చంద్రబాబు పశువులకు హాస్టల్స్ పెడతారట’ అని విమర్శించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ‘జగన్ పర్యటనపై పోలీసులు హైడ్రామా నడిపారు. స్టీల్ ప్లాంట్ కార్మికులను కలవడానికి వీల్లేదు అంటూ రూటు మార్చారు. మాకు ప్రజా సమస్యల ముఖ్యం. పోలీసుల రూట్ మార్చిన వైఎస్ జగన్ నర్సీపట్నం వెళుతున్నారు. వైఎస్ జగన్ కలవడానికి వచ్చే ప్రజలను పోలీసులు అడ్డుకోవాలని చూస్తున్నారు. జగన్ పర్యటనకు లేనిపోని ఆంక్షలు పెట్టారు. 10 కార్లు మాత్రమే కాన్వాయ్ లో ఉండాలంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా?, రాచరిక పాలనలో ఉన్నామా? అనే అనుమానం కలుగుతుంది. జగన్ పర్యటనను ఎంత అణగదొక్కాలని చూస్తే అంత తిరుగుబాటు మొదలవుతుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి. స్టీల్ ప్లాంట్, బల్క్ డ్రగ్ పార్క్, గోవాడ సుగర్ ఫ్యాక్టరీ, చిరు వ్యాపారుల సమస్యలు ఉన్నాయి’ అని తెలిపారు. -
‘విద్యార్థుల మరణాలకు ప్రభుత్వానిదే బాధ్యత’
సాక్షి,విశాఖ: విద్యార్థుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఏపీ మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి డిమాండ్ చేశారు. విశాఖ కేజీహెచ్లో పచ్చకామెర్లతో బాధపడుతున్న విద్యార్థులను పరామర్శించారు. అంనతరం,ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘విద్యార్థులకు స్క్రినింగ్ టెస్టులు చేయించారనేది అబద్ధం. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పచ్చకామెర్లతో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. గురుకుల పాఠశాలలో శాటినేషన్ లోపమే కారణం.ఇప్పటికీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో పరీక్షలు చేయించడం లేదు. అసలు ఎంతమందికి వైద్య పరీక్షలు నిర్వహించారో చెప్పాలి. ఇవాళ మరో ఆరుగురు విద్యార్థులు కేజీహెచ్ వచ్చారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పచ్చ కామెర్లతో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు’అని ’ధ్వజమెత్తారు. -
‘గిరిజన విద్యార్థులు చనిపోతే సీఎం చంద్రబాబు పట్టించుకోరా?’
కేజీహెచ్(విశాఖ): పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం గురుకుల బాలికల పాఠశాలకు చెందిన విద్యార్థులు పచ్చ కామెర్ల బారిన పడితే ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టింకోరా? అని నిలదీశారు వైఎస్సార్సీపీ నేత సీదిరి అప్పలరాజు. ఇందులో ఇద్దురు విద్యార్థినులు చనిపోయినా చంద్రబాబు గానీ, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం కానీ కనీసం పట్టించుకోలేదన్నారు. ఈరోజు(బుధవారం, అక్టోబర్ 8వ తేదీ) విద్యార్థులను పరామర్శించడానికి విశాఖ కేజీహెచ్కు వెళ్లిన సీదిరి అప్పలరాజు.. మీడియాతో మాట్లాడారు. ‘ గిరిజన విద్యార్థులు చనిపోతే సీఎం చంద్రబాబు పట్టించుకోరా?,గిరిజన విద్యార్థుల ఆరోగ్యం ప్రభుత్వానికి పట్టదా?, పవన్కు జలుబు చేస్తే సీఎం చంద్రబాబు పరామర్శిస్తారు. గిరిజన విద్యార్థుల మరణాలు.. ప్రభుత్వ హత్యలే. గతంలె నాడు-నేడు ద్వారా విద్యార్థులకు ఎన్నో సౌకర్యాలు కల్పించాం’ అని సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. కాగా, పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం గురుకుల బాలికల పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థినులు పచ్చకామెర్ల బారిన పడిన విషయం తెలిసిందే. వీరిలో తొమ్మిదో తరగతి విద్యార్థిని తోయిక కల్పన, 10వ తరగతికి చెందిన పువ్వల అంజలి పచ్చకామెర్లతో మృత్యువాత పడ్డారు. మంగళవారం మరో ఏడుగురు విద్యార్థినులు ఆస్పత్రిలో చేరడంతో.. ప్రస్తుతం కేజీహెచ్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 50కి చేరుకుంది. ప్రాథమిక చికిత్స కోసం కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రంలో 15 మంది విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. కేజీహెచ్ ఆస్పత్రి నుంచి రికవరీ అయిన కొంతమందిని డిశ్చార్జ్ చేసినట్లు తెలుస్తోంది. పాఠశాలలో మంచి నీటి వసతులు, మరుగుదొడ్లు, మరియు పోషకాహారం సరిగా లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. -
విశాఖ పెదగంట్యాడలో ఉద్రిక్తత.. పోలీసులతో వాగ్వాదం, కుర్చీలు విసిరేసి..
సాక్షి, విశాఖ: విశాఖపట్నంలోని పెదగంట్యాడలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అంబుజా సిమెంట్ ఫ్యాకర్టీ ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్న వేదిక వద్ద స్థానికులు నిరసన చేపట్టారు. దీంతో, స్థానికులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పోలీసులపైకి స్థానికులు తిరగబడ్డారు. పెద్ద సంఖ్యలో స్థానికులు అక్కడికి చేరుకుని నిరసనలు తెలుపుతూ ఖర్చీలను విసిరేశారు. సిమెంట్ ఫ్యాక్టరీ, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.ఇదిలా ఉండగా.. విశాఖలోని పెదగంట్యాలడ (Pedagantyada)లో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించేందుకు గత కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, ఈ సిమెంట్ ఫ్యాక్టరీని స్థానికంగా ఉన్న 26 గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ప్రభుత్వ అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ (Referendum) చేపట్టాలని నిర్ణయించారు. ఈ క్రమంలో మొదటి నుంచి సిమెంట్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్న అన్ని గ్రామల ప్రజలు అక్కడకు చేరుకున్నారు. అనంతరం సిమెంటు ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.అయితే, ముందస్తుగా పోలీసులతో బందోబస్తు (arrangement)ను ఏర్పాటు చేసినప్పటికీ.. నిరసన కారులతో ఒక్కసారిగా వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో స్థానికులు. సిమెంట్ కంపెనీతో జనావాసాలకు ఇబ్బంది కలుగుతుందంటూ ఆందోళన దిగారు. గోబ్యాక్ అంబుజా సిమెంట్ (Ambuja Cement) అంటూ నినాదాలు చేస్తూ ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసుల వారిని అదుపు చేసే ప్రయత్నం చేయడంతో.. ఆగ్రహించిన స్థానికులు మీటింగ్ స్థలంలో ఉన్న కూర్చీలను విసిరేశారు. -
జగన్ పర్యటనను ఆంక్షలతో అడ్డుకోలేరు: గుడివాడ అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనపై ఆంక్షలు పెట్టడం ఏంటీ? అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘వైఎస్ జగన్ రోడ్డు మార్గాన రావడానికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. వైఎస్ జగన్ హెలికాఫ్టర్లో వస్తే పరిశీలిస్తామని పోలీసులు చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రతిపాదించిన రూట్ మ్యాప్ కాకుండా ఖాకీలు వేరే రూట్ మ్యాప్ ఇచ్చారు. విశాఖ స్టీల్ప్లాంట్ కార్మికులను కలవకుండా కూటమి కుట్రలు పన్నుతుంది’’ అంటూ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్ జగన్ పర్యటనకు అనేక అడ్డంకులను కూటమి ప్రభుత్వం సృష్టిస్తోంది. వైఎస్ జగన్ పర్యటనపై విశాఖ అనకాపల్లి జిల్లాల పోలీసులకు అనేక సార్లు సమాచారం ఇచ్చాము. జగన్కు భద్రత కల్పించమని అడిగాము. విశాఖ ఎయిర్ పోర్టు మీదగా గాజువాక, కూర్మనపాలెం, అనకాపల్లి మీదగా నర్సీపట్నం వెళ్లేందుకు అనుమతి అడిగాము. రూట్ మార్చి పోలీసుకు రూట్ మ్యాప్ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు జగన్ను కవలకూడదు అని రూట్ మార్చారు.ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని హామీ ఇచ్చారు. ఎంతోమంది స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు కోల్పోయారు. ప్రజల సమస్యలు మాకు ముఖ్యం. కాబట్టి పోలీసులు అనుమతి ఇచ్చిన మార్గంలోనే వైఎస్ జగన్ వెళ్తారు. స్టీల్ ప్లాంట్, బల్క్ డ్రగ్ పార్క్, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ, మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చాలా ముఖ్యమైన అంశాలు. వైఎస్ జగన్ పర్యటనకు 18 నిబంధనలతో ఆంక్షలు పెట్టారు. ఎయిర్ పోర్టు, ఎన్ఏడీ, గోపాలపట్నం, పెందుర్తి, అనకాపల్లి మీదగా నర్సీపట్నం మెడికల్ కాలేజీ కి వెళ్తారు. పోలీసుల ఆంక్షలతో జగన్ పర్యటనకు వచ్చే ప్రజలను అడ్డుకోలేరు.చంద్రబాబు పర్యటనలో పుష్కరాల సమయంలో 29 మంది భక్తులు చనిపోయారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చంద్రబాబు పర్యటనలో ప్రజలు చనిపోయారు. వాటిని పోలీసులు ఎందుకు పోలీసుల లేఖలో ప్రస్తావించలేదు. కరూర్ అంశాన్ని మాత్రమే ఎందుకు ప్రస్తావించారు. చంద్రబాబు ఆదేశాలు మీద పోలీసు అధికారులు సంతకం పెట్టారు. పోలీసులు ఆంక్షలు పెట్టడం సరికాదు. వాటిపై పునరాలోచన చేయాలి’’ అని అమర్నాథ్ కోరారు.‘‘ఏ రోజు మేము జగన్ పర్యటనకు ఎంతమంది జనాలు వస్తారని చెప్పలేదు. పోలీసులు 65,000 మంది ప్రజలు వస్తారని చెప్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు లక్ష మంది వస్తారని చెప్తున్నారు. పల్లా మాటల ద్వారా కూటమి ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది. జగన్ పర్యటనకు ఎన్ని ఆంక్షలు పెడితే అంత పెద్ద ఎత్తున ప్రజలు నుంచి తిరుగుబాటు మొదలవుతుంది. రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ను డైవర్ట్ చేయడం కోసం వైఎస్ జగన్ పర్యటనపై రాద్ధాంతం చేస్తున్నారు...నిన్నటి వరకు జగన్ పర్యటనకు అనుమతి లేదన్నారు. ఈ రోజు రూటు మార్చి పర్యటన చేపట్టాలని పోలీసులు చెప్తున్నారు. లిక్కర్ స్కామ్లో నెలకు 1000 కోట్లు కూటమి నేతలు సంపాదించారు. 15 నెలల్లో 15 వేల కోట్లు అక్రమంగా సంపాదించారు. అక్రమ మైనింగ్లో కూటమి నేతల ప్రమేయం ఉందని టీడీపీ నేతలే చెబుతున్నారు.’’ అని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. -
ఎవరికీ లేని నిబంధనలు ఉపాధ్యాయులకేనా..?
రాష్ట్రంలో ఏ శాఖలో ఉద్యోగులకు లేని నిబంధనలు ఒక్క ఉపాధ్యాయులకే ఎందుకు పెడుతున్నారో అర్థంకావడంలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధ్యాయులపై ప్రయోగాలు చేస్తున్నాయి. ఉపాధ్యాయులు అవసరాలు పట్టించుకోకుండా, సమస్యలు పరిష్కరించకుండా వదిలేశాయి. ఇలాంటి నిబంధనలు మాత్రం మాపై రుద్దడం మంచిదికాదు. మరో వారంలో టెట్ పరీక్ష కోసం నోటిఫికేషన్ కూడా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. దవాబ్దాలుగా ఇన్ సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు మళ్లీ ప్రత్యేకంగా అర్హత పరీక్ష నిర్వహించడంపై ఉపాధ్యాయ సంఘాలు ఖండిస్తున్నాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సరైన నిర్ణయం ఇంతవరకు ప్రకటించకపోవడం బాధాకరం. – టి.ఆర్ అంబేడ్కర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్ -
స్నేహితుడిపై చాకుతో దాడి
పెదగంట్యాడ: స్నేహితుడిపై చాకుతో దాడి చేసి న యువకుడిని అరెస్ట్ చేసినట్లు గాజువాక పోలీసులు తెలిపారు. అక్కిరెడ్డిపాలేనికి చెందిన కుప్పిలి మణిదీప్, మిందికి చెందిన ఉంగరాల దినేష్ స్నేహితులు. వీరిద్దరూ తరచుగా కలిసి మద్యం సేవిస్తుంటారు. నెల రోజుల కిందట దినేష్ లంకెలపాలెంలోని ఓ ఫార్మా కంపెనీలో దినసరి కూలీగా మణిదీప్ను పనిలో చేర్చాడు. అయితే మణిదీప్ వారం రోజులకే పని మానేశాడు. ఆ వారం రోజుల వేతనాన్ని కాంట్రాక్టర్ దినేష్కు ఇచ్చాడు. ఈ డబ్బులు ఇవ్వాలని మణిదీప్ పదేపదే అడగడంతో, ఆగ్రహానికి గురైన దినేష్ అతడిని చంపుతానని బెదిరించాడు. ఈ నెల 2వ తేదీన.. మణిదీప్ను అక్కిరెడ్డిపాలెం చెరువు వద్దకు రమ్మని దినేష్ ఫోన్ చేసి పిలిచాడు. రాత్రి 8 గంటల సమయంలో ఇద్దరూ చెరువు వద్ద కలుసుకున్నారు. ఆ తరువాత మణిదీప్ తన డబ్బులు ఇవ్వాలని అడగడంతో.. దినేష్ తనతో పాటు తెచ్చుకున్న చాకుతో మణిదీప్పై దాడి చేశాడు. మణిదీప్ కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో దినేష్ అక్కడి నుంచి పారిపోయాడు. మణిదీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గాజువాక సీఐ పార్ధసారధి కేసు నమోదు చేశారు. నిందితుడైన దినేష్ను మంగళవారం శ్రీనగర్ బస్టాప్ వద్ద అరెస్ట్ చేశారు. ఎస్ఐ సూర్యకళ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
చిట్టీల సొమ్ము రూ.కోటితో భార్యాభర్తలు పరార్
కొమ్మాది: చిట్టీల పేరుతో సుమారు కోటి రూపాయల సొమ్మును వసూలు చేసి భార్యాభర్తలు పరారైన సంఘటన ఎండాడలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలివి.. జీవీఎంసీ 8వ వార్డు ఎండాడలో సందీపిని నగర్లోని స్వగృహ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న వై.రమణమ్మ చిట్టీలు వేస్తోంది. ఈ క్రమంలో ఆమె గత కొన్నేళ్లుగా స్థానికుల నుంచి సుమారు కోటి రూపాయల వరకు వసూలు చేసింది. చిట్టీల కాలపరిమితి దగ్గరపడుతుండటంతో.. బాధితులు నాలుగు నెలలుగా ఆమెను డబ్బు అడుగుతున్నారు. అయితే, ఆమె సమయం దాటవేస్తూ వస్తోంది. బాధితులందరూ మూకుమ్మడిగా వచ్చి తమ డబ్బులు అడగగా.. రమణమ్మ తన భర్త ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ అని, తమను ఇబ్బంది పెడితే వివిధ కేసులు బనాయిస్తానని హెచ్చరించింది. దీంతో బాధితులు ఇటీవల పీఎంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే, ప్రస్తుతం రమణమ్మ, ఆమె భర్త పరారీలో ఉన్నారు. మంగళవారం రమణమ్మ ఇంటి వద్ద బాధితులు ఆందోళన చేశారు. పరారీలో ఉన్న రమణమ్మను పట్టుకుని తమ డబ్బును తిరిగి ఇప్పించాలని పీఎంపాలెం పోలీసులను కోరారు. ప్రస్తుతం ఆమె కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు. -
దేశంలో రక్త అవసరాన్ని తీర్చడం అంత సులభం కాదు
మంత్రి సత్యకుమార్ కొమ్మాది: సుమారు 140 కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశంలో రక్త అవసరాలు తీర్చడం అంత సులభం కాదని, ఇలాంటి పరిస్థితుల్లో హేతుబద్ధ వినియోగం జీవన విధానం మారాలని, తద్వారా రక్త సరఫరా కొరతను అధిగమించవచ్చని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. విశాఖలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న ‘రక్తం, రక్త ఉత్పత్తుల హేతుబద్ధ వినియోగం’ అనే అంశంపై జాతీయ వర్క్షాప్ను మంగళవారం ఆయన ప్రారంభించి, మాట్లాడారు. దేశంలో ఏటా అవసరమైన రక్తం సుమారు 1.5 కోట్ల యూనిట్లు అంచనా కాగా, 10–40 లక్షల యూనిట్ల కొరత ఉందని నివేదికలు చెబుతున్నాయన్నారు. రక్తం, దాని ఉత్పత్తులను హేతుబద్ధంగా వినియోగించడం అంటే సరైన సమయంలో సరైన వ్యక్తికి సరైన రక్తన్ని అందించడమేనన్నారు. ఈ వర్క్షాప్ ద్వారా రక్త వినియోగంలో శాసీ్త్రయ, మానవతా దృక్పథం రెండింటినీ సమన్వయం చేయాలని కోరారు. -
గిరిజన బిడ్డల మృతి ప్రభుత్వ నిర్లక్ష్యమే...
కేజీహెచ్లో విద్యార్థినులను పరామర్శించిన షర్మిల మహారాణిపేట: కురుపాం గురుకుల విద్యార్థినుల మరణం పట్ల ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థినులను మంగళవారం ఆమె పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని చూసి చలించిపోయారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సంక్షేమ హాస్టళ్లలో కనీస వసతులు కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, గిరిజన బిడ్డల మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. రాష్ట్రంలోని ఏ హాస్టల్లోనూ ఆర్వో ప్లాంట్లు పనిచేయడం లేదని, వందల మంది విద్యార్థినులకు ఒకే బాత్రూం ఉండటం దారుణమని విమర్శించారు. తాను ‘గుడితో పాటు బడి ముఖ్యం’అని గతంలో చేసిన వ్యాఖ్యలకు మతం రంగు పులిమి తనపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలపై ప్రభుత్వం వెంటనే ఒక హైలెవల్ కమిటీ వేయాలని, రెండేళ్లలో రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లను బాగుచేయాలని ఆమె డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
మాజీ సీఎం జగన్కు ఘన స్వాగతం పలకాలి
మహారాణిపేట: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి విశాఖపట్నం పర్యటన నేపథ్యంలో.. మంగళవారం మద్దిలపాలెంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో వలంటీర్ విభాగ సమావేశం జరిగింది. జిల్లా వలంటీర్ విభాగం అధ్యక్షుడు పీలా ప్రేమ్ కిరణ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు ఉమ్మడి విశాఖకు వస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్కు ఘన స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. వలంటీర్ విభాగం జోనల్ ఇన్చార్జి సునీల్, రాష్ట్ర వలంటీర్ విభాగ ప్రధాన కార్యదర్శి పులగం శ్రీనివాస్ రెడ్డి, సహాయ కార్యదర్శి పచరపల్లి రాము, వలంటీర్ విభాగ జిల్లా కమిటీ సభ్యులు, నియోజకవర్గ అధ్యక్షులు పాల్గొన్నారు. వలంటీర్ల సమావేశంలో కేకే రాజు -
అధికారుల నిర్లక్ష్యమే బలిగొంది..
సత్తిబాబు కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన మహారాణిపేట/మర్రిపాలెం: జీవీఎంసీ అవుట్ సోర్సింగ్ లైన్మన్ సత్తిబాబు (47) మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ తోటి ఉద్యోగులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సోమవారం విద్యుదాఘాతంతో సత్తిబాబు మరణించిన సంగతి తెలిసిందే. దీంతో మంగళవారం కేజీహెచ్ మార్చురీ వద్ద వారు నిరసన వ్యక్తం చేశారు. జీవీఎంసీ అధికారులు స్పందించి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అసలేం జరిగిందంటే.. : సోమవారం సాయంత్రం మురళీనగర్ ప్రాంతంలో సత్తిబాబు తన హెల్పర్తో కలిసి వీధి దీపాలకు మరమ్మతులు చేస్తున్నారు. ఈ క్రమంలో స్తంభం పక్కనే ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైరు తగలడంతో ఆయన షాక్కు గురై కిందపడిపోయారు. సహచర ఉద్యోగులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై తోటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వాస్తవానికి వీధి దీపాల మరమ్మతులు చేయాల్సిన రెగ్యులర్ సిబ్బంది రావడం లేదు. వారితో పనులు చేయించకుండా, మాతో ప్రమాదకరమైన పనులు చేయిస్తున్నారు. సత్తిబాబు మరణానికి జీవీఎంసీ అధికారులదే పూర్తి బాధ్యత’అని వారు ఆరోపించారు. ఉద్యోగి చనిపోయి గంటలు గడుస్తున్నా ఏ ఒక్క అధికారి కనీసం పరామర్శించడానికి రాకపోవడంపై వారు మండిపడ్డారు. మృతుడు సత్తిబాబుకు భార్య జ్యోతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోయి వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సీఐ రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
టెట్పై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి
ఇన్సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ పరీక్షలకు మినహాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ఐదు సంవత్సరాలు పైబడి సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా రెండేళ్లలో టెట్ పరీక్ష నుంచి అర్హత సాధించాలని, లేదంటే ఉద్యోగం నుంచి తప్పుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేయడంతో ఉపాధ్యాయ వర్గాలు ఆందోళనకు గురవుతున్నాయి. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం 2010 అక్టోబరు 23 కంటే ముందు నియమితులైన ఉపాధ్యాయులంతా కచ్చితంగా టెట్ అర్హత పరీక్ష ఉత్తీర్ణులు కావాల్సి ఉందన్నారు. దీనివల్ల ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కొందరు ఉపాధ్యాయులు పదోన్నతలను, మరికొందరు పూర్తిగా ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుంది. రెవెన్యూ, పోలీస్, వైద్యలు తదితర వృత్తుల్లో ఉన్నవారికి, ఉన్నతాధికారులకు లేని ఇన్ సర్వీస్ అర్హత ఉపాధ్యాయులకు మాత్రమే వర్తింపజేయడాన్ని తీవరంగా ఖండిస్తున్నాం. – ఇమంది పైడిరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూ -
దక్షిణాఫ్రికా మహిళా జట్టు వచ్చేసింది
విశాఖ స్పోర్ట్స్/గోపాలపట్నం: ఐసీసీ ప్రపంచ మహిళా క్రికెట్ కప్ కీలక ఘట్టానికి విశాఖపట్నం సిద్ధమైంది. ఐదు వన్డే మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనున్న వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఈ నెల 9న జరిగే మొదటి మ్యాచ్ కోసం దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు మంగళవారం నగరానికి చేరుకుంది. విశాఖ వేదికగా తొలి మ్యాచ్ ఆడబోతున్న భారత్ మహిళల జట్టు ఇప్పటికే ఇక్కడికి చేరుకుని మంగళవారం రాత్రి ఫ్లడ్లైట్ల వెలుతురులో ముమ్మరంగా ప్రాక్టీస్ చేసింది. కాగా.. టీమిండియా ఈ టోర్నమెంట్లో హాట్రిక్ విజయంపై కన్నేసింది. గత ప్రపంచ కప్లో ఐదో స్థానంతో సంతృప్తి పడిన భారత్.. ఈ సీజన్లో ఆడిన రెండు మ్యాచ్ల్లో ఘన విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. శ్రీలంకను 59 పరుగుల తేడాతో, పాకిస్తాన్ను 88 పరుగుల తేడాతో ఓడించి మంచి ఊపు మీదుంది. విశాఖ వేదికగా ఆ ఊపును కొనసాగించాలని పట్టుదలతో ఉంది. భారత్ ఈ నెల 9న దక్షిణాఫ్రికాతో, 12న ఆస్ట్రేలియాతో తలపడనుంది. రెండుసార్లు ప్రపంచకప్ ఫైనల్కు చేరినా (2005లో ఆస్ట్రేలియా చేతిలో, 2017లో ఇంగ్లాండ్ చేతిలో) టైటిల్ సాధించలేకపోయిన భారత జట్టు.. ఈసారి కప్ గెలవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. మరోవైపు, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మహిళా జట్లు రెండేసి మ్యాచ్లు ఆడినా పాయింట్ల పట్టికలో వెనుకబడి ఉన్నాయి. విజయమే లక్ష్యంగా టీమిండియా ప్రాక్టీస్ -
టెట్ టెన్షన్
ఉపాధ్యాయులకుఆరిలోవ: దశాబ్దాలుగా ఉద్యోగంలో ఉన్న ఉపాధ్యాయులను టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఉత్తీర్ణత అంశం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. 2010 సంవత్సరం కంటే ముందు నియమితులైన ఉపాధ్యాయులు కూడా తప్పనిసరిగా టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా అమలు కావాల్సిన పరిస్థితి నెలకొనడంతో, రాష్ట్రంలోని ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర సందిగ్ధంలో పడ్డాయి. విద్యా హక్కు చట్టం–2010 ప్రకారం ఉపాధ్యాయ నియామకానికి టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. అయితే, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు మేరకు, 2010 కంటే ముందు వివిధ డీఎస్సీల ద్వారా ఉద్యోగాలు పొందిన వేలాది మంది కూడా టెట్ రాయాల్సి రావడంపై వారు ఆవేదన చెందుతున్నారు. డీఎస్సీ కోసం చదివి ఉద్యోగం సాధించిన మేము ఇప్పుడు మళ్లీ అర్హత పరీక్ష రాయడమేమిటి? అంటూ ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. ఈ తీర్పు ప్రభావం విశాఖ ఉమ్మడి జిల్లాలో భారీగా ఉంది. ఇక్కడ ప్రభుత్వ యాజమాన్యాలలో సుమారు 17,000 మంది ఉపాధ్యాయులు, ప్రైవేట్ పాఠశాలల్లో మరో 12,000 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రైవేట్ టీచర్లు కూడా ఈ తీర్పు ప్రకారం టెట్ ఉత్తీర్ణులు కావాల్సిందే. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, ఇన్ సర్వీస్లో ఉన్నవారు టెట్లో ఉత్తీర్ణులు కాకపోతే ఉద్యోగానికి ఇబ్బంది తప్పదు. ఉద్యోగ విరమణకు ఐదేళ్ల లోపు సర్వీస్ ఉన్నవారికి మినహాయింపు ఇచ్చారు. అంతకంటే ఎక్కువ సర్వీస్ ఉన్నవారు తప్పనిసరిగా ఆగస్టు 31, 2027 లోపు టెట్ పరీక్ష ఉత్తీర్ణులు కావాలి. పదోన్నతి కావాలనుకునేవారు కూడా తప్పనిసరిగా టెట్ రాయాల్సి ఉంటుంది. రెండేళ్ల లోపు టెట్ పాస్ కాకపోతే ఉద్యోగం వదులుకోవాల్సి ఉంటుందని తీర్పులో వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి ఈ కీలక సమయంలో రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం టెట్ అంశంపై ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవడంతో ఉపాధ్యాయుల్లో సందిగ్ధత మరింత పెరిగింది. మరోవైపు, టెట్ పరీక్షపై వారంలో నోటిఫికేషన్ విడుదల కానుందనే వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. దశాబ్దాల సర్వీస్ ఉన్నవారికి పరీక్ష రాయడం, అర్హత సాధించడం తీవ్ర సమస్యగా మారింది. అందువల్ల, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ ఉత్తీర్ణత వ్యవహారంలో మినహాయింపు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన ప్రకటన చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. టెట్ పరీక్ష విధానం ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు రాయాల్సిన టెట్ పరీక్ష వివరాలు: పేపర్లు: ఎస్జీటీలు పేపర్–1, స్కూల్ అసిస్టెంట్లు పేపర్–2 రాయాల్సి ఉంటుంది. మార్కులు: రెండున్నర గంటల (150 నిమిషాలు) సమయంలో 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఉత్తీర్ణత మార్కులు: ఓసీ అభ్యర్థులు: 60 శాతం మార్కులు (90 మార్కులు). బీసీ అభ్యర్థులు: 50 శాతం మార్కులు (75 మార్కులు). ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగు అభ్యర్థులు: 40 శాతం మార్కులు (60 మార్కులు). -
అదానీ సిమెంట్ కంపెనీ వద్దే వద్దు
డాబాగార్డెన్స్: గాజువాక, పెదగంట్యాడ ప్రాంతాల్లో అదానీ సంస్థ 40 లక్షల సామర్థ్యంతో తలపెట్టిన అంబుజా సిమెంట్ కంపెనీ నిర్మాణ ప్రతిపాదనను రద్దు చేయాలని జీవీఎంసీ వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ బానాల శ్రీనివాసరావు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ను మంగళవారం కోరారు. సిమెంట్ కంపెనీ నిర్మాణ ప్రతిపాదన రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ, వెంటనే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేయాలన్నారు. ప్రతిపాదిత సిమెంట్ కంపెనీ వల్ల గాజువాక, పెదగంట్యాడ, కూర్మన్నపాలెం ప్రాంతాలు దుమ్ము, ధూళి, విష కణాలతో నిండిపోతాయని, తాగునీరు కాలుష్యానికి గురవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు శ్వాసకోశ, గుండె, క్యాన్సర్ వంటి ప్రాణాంతక జబ్బుల బారిన పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే అదానీ గంగవరం పోర్టు కారణంగా గాజువాక పరిసర ప్రాంతాలు బొగ్గు, ధూళితో తీవ్రంగా కాలుష్యానికి గురవుతున్నాయని వివరించారు. సిమెంట్ కంపెనీ కోసం కేటాయించిన 20 ఎకరాల భూమిని గంగవరం పోర్టు నిర్మాణానికి ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం కింద ఇచ్చారని, ఈ భూమిలో ఇతర కంపెనీ నిర్మాణం చట్ట విరుద్ధమని, భూ ఒప్పందం కూడా చట్ట వ్యతిరేకమని ఆరోపించారు. బుధవారం రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్వహించనున్న ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొని.. నగర పౌరుల తరపున సిమెంట్ కంపెనీ ప్రతిపాదనను వ్యతిరేకించాలని జీవీఎంసీ కమిషనర్కు అందజేసిన వినతిప్రతంలో విజ్ఞప్తి చేశారు. అలాగే జీవీఎంసీ సీపీఎం ఫ్లోర్ లీడర్ బి.గంగారావు, సీపీఐ ఫ్లోర్ లీడర్ ఏజే స్టాలిన్తో కలిసి ఆయన మేయర్ పీలా శ్రీనివాసరావుకు వినతిపత్రం అందించారు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని అందులో పేర్కొన్నారు. జీవీఎంసీ కమిషనర్కు వైఎస్సార్ సీపీ ఫ్లోర్లీడర్ వినతి -
ఆంక్షలు విధించినా ఆగేది లేదు!
సాక్షి, విశాఖపట్నం : నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలం భీమబోయినపాలెంలో మెడికల్ కళాశాల భవనాలను పరిశీలించడానికి ఈనెల 9వ తేదీన రానున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని అడ్డుకోవడానికి కూటమి ప్రభుత్వం కుట్రచేస్తోందని వైఎస్సార్ సీపీ అనకాపల్లి, విశాఖ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్, కేకే రాజు మండిపడ్డారు. ఎన్ని ఆంక్షలు విధించినా వైఎస్ జగన్ పర్యటన ఆగేది లేదని స్పష్టం చేశారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం వారు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ పర్యటనకు భద్రత కల్పించాలని మూడు రోజుల క్రితమే అనకాపల్లి ఎస్పీ, విశాఖ సీపీని కోరామని, ఇప్పటివరకూ కాలయాపన చేసిన వారు జాతీయ రహదారిపై రోడ్డు మార్గంలో వెళ్లడానికి అనుమతి లేదని చెబుతున్నారన్నారు. విశాఖ నుంచి మాకవరపాలేనికి జాతీయ రహదారి కాకుండా ప్రత్యామ్నాయ రోడ్డు చూపించాలని అడుగుతున్నామన్నారు. అయినా పర్యటనకు తాము అనుమతి కోరలేదని.. సెక్యూరిటీ మాత్రమే కల్పించాలని అడిగామని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలు తెలుసుకొనేందుకు వస్తున్నప్పుడు మీ పర్మిషన్ ఎవరికి కావాలంటూ ధ్వజమెత్తారు. తమ నాయకుడు రోడ్డు మార్గానే మాకవరపాలెం మెడికల్ కాలేజీకి వెళ్తారని, ఎవరు అడ్డుకుంటారో చూస్తామన్నారు. పోలీసులు, ప్రభుత్వం భద్రత కల్పించకపోతే వైఎస్సార్సీపీ కార్యకర్తలే భద్రత కల్పిస్తారని అన్నారు. గతంలో వైఎస్ జగన్ పలు పర్యటనల్లో హెలికాప్టర్కు అనుమతి ఇవ్వలేదని.. ఇప్పుడు హెలికాప్టర్ మీదే రావాలంటున్నారంటే.. తనతో పాటు రాష్ట్రంలో ఉన్న వైఎస్సార్ సీపీ శ్రేణులకు, అభిమానులకు అనుమానం వస్తోందన్నారు. వాతావరణ పరిస్థితులు కూడా సవ్యంగా లేని సమయంలో పదే పదే హెలిప్యాడ్ అనుమతి కోరండి అని చెబుతుంటే, ఇందులో ఏమైనా కుట్ర కోణం ఉందేమోనని అనుమానం ఉందని అభిప్రాయపడ్డారు. తమిళనాడులో జరిగిన సంఘటనను బూచిగా చూపించి అనుమతి ఇవ్వలేమనడం సరికాదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు 65 వేల మంది జనాలు వస్తారని పోలీసులు చెబుతుండడం చూస్తుంటే ప్రభుత్వంపై వ్యతిరేకత అర్థమవుతోందన్నారు. కళ్లు బైర్లు కమ్మి సవాల్ విసిరిన స్పీకర్ అయ్యన్న లాంటి వారి నోటికి తాళాలు వేసేందుకు, ఆయన అసత్య ప్రచారాలకు చెక్ పెట్టి.. మెడికల్ కాలేజీపై వాస్తవాలను తెలియజేసేందుకు వైఎస్ జగన్ ఈనెల 9న మాకవరపాలెం వస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు మళ్ల విజయప్రసాద్, తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకటరామయ్య, విశాఖ తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు పాల్గొన్నారు. -
కురుపాం గురుకుల విద్యార్థినులకు పరామర్శ
మహారాణిపేట: అస్వస్థత, అనారోగ్యంతో కేజీహెచ్లో చికిత్స పొందుతున్న కురుపాం గురుకుల పాఠశాల విద్యార్థినులను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పరామర్శించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్లతో కలిసి మంత్రి మంగళవారం కేజీహెచ్కు వచ్చారు. క్యాజువాలిటీలో చికిత్స పొందుతున్న విద్యార్థినుల వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యాధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..‘ఇప్పటివరకు 53 మంది చికిత్స నిమిత్తం కేజీహెచ్కు రాగా, మంగళవారం 13 మంది డిశ్చార్జి అయ్యారు. పూర్తిస్థాయిలో కోలుకున్న తర్వాత మిగిలిన వారిని కూడా ఒకటి, రెండు రోజుల్లో డిశ్చార్జి చేయిస్తాం’ అని చెప్పారు. కురుపాం ఘటన, అక్కడి పరిస్థితులపై అధికారుల బృందం విచారిస్తోందని, వారు ఇచ్చే నివేదికల ఆధారంగానే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ ఐ.వాణి, ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సంధ్యాదేవి, సీఎస్ఆర్ఎంవో యు.శ్రీహరి, ఇతర వైద్యాధికారులు మంత్రి వెంట ఉన్నారు. మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశం -
కేజీహెచ్ నుంచి గిరిజన విద్యార్థినుల డిశ్చార్జి
మహారాణిపేట: పచ్చకామెర్ల వ్యాధి బారిన పడి కేజీహెచ్లో చికిత్స పొందుతున్న 8 మంది విద్యార్థినులను మంగళవారం పార్వతీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ విద్యార్థినులకు వ్యాధి తగ్గుముఖం పట్టడంతో, వైద్యుల నివేదికల ప్రకారం తరలించినట్లు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి తెలిపారు. డాక్టర్ గిరినాథ్(గ్యాస్ట్రో ఎంట్రాలజీ), డాక్టర్ శివ కల్యాణి (మైక్రోబయాలజీ), డాక్టర్ కృష్ణవేణి (కమ్యూనిటీ మెడిసిన్), డాక్టర్ వాసవి లత (జనరల్ మెడిసిన్), డాక్టర్ చక్రవర్తి (పిల్లల వైద్యుడు)లతో కూడిన ఐదుగురు వైద్యుల బృందం సమర్పించిన నివేదికల ఆధారంగా విద్యార్థులను తరలించినట్లు చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం గురుకుల బాలికల పాఠశాలకు చెందిన 129 మంది విద్యార్థినులు పచ్చకామెర్ల బారిన పడిన విషయం తెలిసిందే. వీరిలో తొమ్మిదో తరగతి విద్యార్థిని తోయిక కల్పన, 10వ తరగతికి చెందిన పువ్వల అంజలి పచ్చకామెర్లతో మృత్యువాత పడ్డారు. మంగళవారం మరో ఏడుగురు విద్యార్థినులు ఆస్పత్రిలో చేరడంతో.. ప్రస్తుతం కేజీహెచ్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 50కి చేరుకుంది. -
సవాల్ విసిరిన అమాత్యులకే చెమటలు
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మొత్తం 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాలు చేపట్టింది. వీటిలో అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో కూడా కాలేజీ నిర్మాణంలో ఉంది. ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలని కూటమి ప్రభుత్వం కుట్ర పన్నింది. మెడికల్ కాలేజీల నిర్మాణమే జరగలేదని హోంమంత్రి వంగలపూడి అనిత, కాలేజీకి అనుమతి ఉంటే చూపించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సవాల్ విసిరారు. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉంటే నిర్మాణం పూర్తయిన ఐదు కాలేజీలతో పాటు నిర్మాణంలో ఉన్న 12 కాలేజీల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. వైద్య కళాశాలలే లేవని బుకాయించే ప్రయత్నం చేసిన కూటమి ప్రభుత్వం బండారం బట్టబయలైంది. ఇంతలో మాకవరపాలెంలో ఉన్న మెడికల్ కాలేజీ సందర్శనకు మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఈ నెల 9వ తేదీన రానున్నారు. దీంతో మెడికల్ కాలేజీలపై సవాల్ విసిరిన అమాత్యులకు చెమటలు పడుతున్నాయి. జగన్ పర్యటనతో కూటమి ప్రభుత్వం అబద్దాలు బయటపడతాయన్న ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. -
జగన్కు భారీ స్వాగత సన్నాహాలు
అగనంపూడి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 9వ తేదీన నర్సీపట్నం నియోజకవర్గంలోని వైద్య కళాశాలను సందర్శించనుండడంతో.. లంకెలపాలెం కూడలి వద్ద భారీ ఎత్తున స్వాగతం పలకడానికి పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నారు. లంకెలపాలెం కూడలి అనకాపల్లి జిల్లాకు ప్రవేశమార్గం అయినందున.. ఇక్కడ భారీ సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు ఆయనకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మాజీ సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, పార్టీ పీఏసీ సభ్యుడు కరణం ధర్మశ్రీ, వైఎస్సార్ సీపీ అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ మంగళవారం లంకెలపాలెం కూడలిని సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. పార్టీ 79వ వార్డు అధ్యక్షుడు అప్పికొండ మహాలక్ష్మినాయుడు, సీనియర్ నాయకులు గండి రవికుమార్, సుందరపు అప్పారావు, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పాలిశెట్టి సురేష్రాజ్, రాష్ట్ర సోషల్ మీడియా అధికారిక ప్రతినిధి కర్రి నరసింగరావు, గంజి సురేష్, సునీల్, సిరపువరపు వాసు, ఉగ్గిన నాగార్జున తదితరులు పాల్గొన్నారు. లంకెలపాలెం వద్ద నేతల ఏర్పాట్ల పరిశీలన -
మంచు కొండల్లో విడిది!
సాక్షి, విశాఖపట్నం: ఒక పర్యాటక ప్రాంతానికి వెళ్లినప్పుడు హోటల్లో బస చేయడం సాధారణం. ఎంత విలాసవంతమైన హోటల్ అయినా అది నాలుగు గోడల మధ్యే ఉంటుంది. కానీ.. ఒక ఊహా ప్రపంచంలో ఉన్నట్లు.. ప్రకృతి మన చుట్టూ ఆవరించినట్లు.. విశాలమైన మంచంపై పడుకుని కళ్లు తెరిస్తే.. ఆ ఊహాలోకం మన చెంతనే ఉన్నట్లు అనిపిస్తే.. ఆ అనుభూతే వేరు కదా! అలాంటి అద్భుత అనుభవాన్ని అందించేందుకు అందాల లంబసింగిలో సరికొత్త పర్యాటక రిసార్టులు రాబోతున్నాయి. వీటినే ‘జియోడెసిక్ డోమ్ రిసార్టులు’ అంటారు. వీటి నిర్మాణానికి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) టెండర్లను ఆహ్వానించింది. లంబసింగిలో కొత్త ఆకర్షణ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని లంబసింగిలో ఏపీటీడీసీకి ఇప్పటికే రిసార్టులు ఉన్నాయి. వాటి పక్కనే ఈ సరికొత్త జియోడెసిక్ డోమ్ గ్లాంపింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని సంస్థ భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న కాటేజీలు, రెస్టారెంట్కు అదనంగా ఈ డోమ్ రిసార్టులను ఏర్పాటు చేస్తే.. ఈ ప్రాంత పర్యాటక ఆకర్షణ మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఊటీని తలపించే శీతల వాతావరణం, చుట్టూ అల్లుకునే దట్టమైన పొగమంచుకు లంబసింగి ప్రసిద్ధి చెందింది. ఏటా ఇక్కడికి వచ్చే సందర్శకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, వారికి సరికొత్త వసతి అనుభవాన్ని అందించేందుకు ఏపీటీడీసీ శ్రీకారం చుట్టింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడ డోమ్ రెస్టారెంట్ నిర్మించాలని ప్రణాళికలు రూపొందించగా.. ప్రస్తుత అధికారులు ఆ ప్రాజెక్టుకు మెరుగులు దిద్ది, పూర్తి స్థాయి డోమ్ రిసార్టులు తీసుకురావాలని నిర్ణయించారు. మూడు నెలల్లో నిర్మాణం పూర్తి లంబసింగికి దేశ, విదేశాల నుంచి పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో.. అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యాటకులకు కొత్త అనుభూతిని అందించేందుకు డోమ్ రిసార్టుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లను ఆహ్వానించాం. కాంట్రాక్టు ఖరారైన మూడు నెలల్లోనే ప్రాజెక్టు పూర్తి చేయాలని నిబంధన విధించాం. భూమికి సంబంధించిన అనుమతుల నుంచి నిర్మాణం పూర్తి చేసి, వినియోగానికి సిద్ధంగా ఉన్న స్థితిలో అప్పగించే వరకు పూర్తి బాధ్యత ఎంపికై న కాంట్రాక్టర్దే. ఇవి అందుబాటులోకి వస్తే ఏజెన్సీలో మరింతగా పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. – జీవీబీ జగదీష్, ఏపీటీడీసీ డివిజనల్ మేనేజర్ రూ. 5.33 కోట్లు.. 15 డోమ్ యూనిట్లు.. ప్రకృతిని వీక్షించడానికి, ఆస్వాదించడానికి వీలుగా.. పర్యాటకుల ఏకాంతానికి భంగం కలగకుండా కొండ ప్రాంతంలో ఈ జియోడెసిక్ డోమ్ రిసార్టులు ఏర్పాటు కానున్నాయి. రూ.5.33 కోట్ల వ్యయంతో మొత్తం 15 డోమ్ రిసార్టులను నిర్మించనున్నారు. ఇందుకోసం ఏపీటీడీసీ ఆర్ఎఫ్పీ(రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్) ఆహ్వానించింది. జియోడెసిక్, పుట్టగొడుగు ఆకారపు డోమ్లతో పాటు, అథారిటీ ఆమోదించిన మరికొన్ని విభిన్న నమూనాల్లో రిసార్టులను నిర్మిస్తారు. వీటికి రెయిలింగ్ సపోర్ట్తో కూడిన బేస్మెంట్ ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంజనీరింగ్ డిజైన్ (ఫీడ్) ఆధారంగా.. పర్యావరణానికి హాని కలగని రీతిలో.. పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించాలన్నది ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ప్రస్తుత కాటేజీలకు ఆనుకుని ఉన్న ఖాళీ ప్రదేశంలో, అలాగే రిసార్ట్ నిర్మాణాల పైన ఉన్న ఎత్తైన ప్రదేశంలో వీటిని నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఒక్కో డోమ్ యూనిట్ 750 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడే 100 చదరపు అడుగుల విస్తీర్ణంలో పిల్లల కోసం ఆటస్థలం కూడా నిర్మించనున్నారు. సందర్శకులు విహరించేందుకు ఆరు సీట్ల ఈవీ బగ్గీలు రెండు అందుబాటులో ఉంచుతారు. ప్రతి డోమ్లో 7/6 బెడ్, రాకింగ్ చైర్, 3/3 సైడ్ టేబుల్స్, వార్డ్రోబ్, లగేజ్ ర్యాక్, డ్రెస్సింగ్ టేబుల్, నాలుగు కుర్చీలతో కూడిన కాఫీ టేబుల్ వంటి సౌకర్యాలు కల్పిస్తారు. -
త్వరితగతిన ఆధార్ సీడింగ్
విశాఖ సిటీ: విద్యుత్ సర్వీస్ నెంబర్లకు ఆధార్ సీడింగ్లో తప్పులను సరిదిద్దే ప్రక్రియను ఏపీఈపీడీసీఎల్ అధికారులు చేపట్టారు. ఒక ఆధార్ నెంబర్కు పదుల సంఖ్యలో విద్యుత్ సర్వీస్ నెంబర్లను జత చేయడం, ఒకరి పేరుతో ఉన్న సర్వీస్ నెంబర్కు మరొకరి ఆధార్ అనుసంధానించడంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై ‘కరెంటోళ్ల నిర్లక్ష్యం.. విద్యుత్ కనెక్షన్లకు ఆధార్ సీడింగ్ అస్తవ్యస్తం’ శీర్షికను సాక్షి కథనం ప్రచురించింది. దీంతో అధికారులు స్పందిస్తూ.. అస్తవ్యస్తంగా ఉన్న ఆధార్ సీడింగ్ తప్పులు వేగవంతంగా సరిదిద్దే కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రకటించారు. కరెంట్ సర్వీస్ నెంబర్కు జత చేసిన తప్పుడు ఆధార్ నెంబర్ను తొలగించేందుకు గతంలో వినియోగదారులు సచివాలయం, అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయం, ఈఆర్వో కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు ఏఈ కార్యాలయంలోనే ఆ సమస్యను పరిష్కరిస్తున్నట్లు ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ జి.శ్యాంబాబు తెలిపారు. కలెక్టరేట్లో జరిగే పీజీఆర్ఎస్లో వచ్చే ఈ తరహా ఫిర్యాదులను సైతం ఇదే విధంగా పరిష్కరించి వినియోగదారులకు సమాచారం అందజేస్తున్నామన్నారు. తప్పులు సరిదిద్దుతున్నామన్న ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ శ్యాంబాబు -
లోన్యాప్ బాధితులకు రికవరీ సొత్తు అందజేత
విశాఖ సిటీ: ఇన్స్టంట్ ఫ్రాడ్ లోన్ యాప్స్ ద్వారా మోసపోయిన బాధితులకు.. కోల్పోయిన మొత్తాన్ని అందించేందుకు రెండో దఫా రిఫండ్ మేళా నిర్వహించినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. మంగళవారం పోలీస్ సమావేశ మందిరంలో ఆయన మాట్లాడుతూ ఫ్రాడ్ లోన్ యాప్స్ ఉచ్చులో అనేక మంది అమాయకులు చిక్కుకుని రూ.లక్షలు నష్టపోతున్నారన్నారు. బాధితుల ఫిర్యాదుల మేరకు కేసులు దర్యాప్తు చేసి ఇప్పటి వరకు రూ.60 లక్షల క్రిప్టో కరెన్సీని సీజ్ చేసినట్లు చెప్పారు. ఆ మొత్తంలో రూ.48 లక్షలను రూ.100 మంది బాధితులకు తొలి దశలో అందజేసినట్లు వెల్లడించారు. రెండో దఫా రిఫండ్ మేళా ద్వారా 26 మంది బాధితులకు రూ.8 లక్షలు అందజేసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో డీసీపీ(క్రైమ్) లతామాధురి, ఏసీపీలు పాల్గొన్నారు. ‘ఎల్ఆర్ఎస్’ను సద్వినియోగం చేసుకోవాలి విశాఖ సిటీ : అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసినవారు ఎల్ఆర్ఎస్ పథకం ద్వారా క్రమబద్ధీకరణ చేసుకోవాలని వీఎంఆర్డీఏ చైర్పర్సన్ ప్రణవ్గోపాల్, కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ సూచించారు. 2025 జూన్ 30 ముందు అనధికార లేఅవుట్లలో కొనుగోలు చేసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. దీని ద్వారా చట్టబద్ధమైన భవన నిర్మాణాలకు అనుమతులు పొందవచ్చన్నారు. లేఅవుట్లలో మౌ లిక సదుపాయాలతో పాటు భవిష్యత్తులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. ఈ నెల 31లోగా నిర్దేశిత డాక్యుమెంట్లతో స్వయంగా గానీ లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్ ద్వారా గానీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. వీఎంఆర్డీఏ ఆఫీస్ గ్రౌండ్ ఫ్లోర్లో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 10న జాబ్మేళా కంచరపాలెం: వివిధ సంస్థల్లో ఖాళీగా ఉన్న సుమారు 100 ఉద్యోగాల భర్తీకి స్థానిక నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్(ఎన్సీఎస్సీ)లో ఈ నెల 10న జాబ్మేళా నిర్వహించనున్నట్లు సెంటర్ ఉప ప్రాంతీయ అధికారి నిట్టాల శ్యామ్సుందర్ తెలిపారు. రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్స్, టీం లీడర్స్, ఆఫీసర్, బీపీవో, టెలీకాలర్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, ఐటీఐ, ఏదైనా డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణత సాఽధించిన 18–30 ఏళ్ల మధ్య వయసు గల అభ్యర్థులు అర్హులుగా పేర్కొన్నారు. జాబ్ లోకేషన్ ఏపీలోని పలు జిల్లాల్లో ఉంటుందన్నారు. -
వైఎస్ జగన్ పర్యటనపై చంద్రబాబు సర్కార్ ఆంక్షలు
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నర్సీపట్నం పర్యటనపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. మళ్లీ తమ కుట్రలకు తెరతీసిన ప్రభుత్వ పెద్దలు.. ఎల్లుండి( గురువారం,అక్టోబర్ 9) నర్సీపట్నం పర్యటనను అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. అనకాపల్లి ఎస్పీ తువీన్ సిన్హాతో చంద్రబాబు సర్కార్ ప్రకటన చేయించారు. గతంలోనూ జగన్ పర్యటనలకు చంద్రబాబు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది.ప్రజల్లోకి ఎప్పుడు వెళ్లినా ఏదో సాకు చూపుతూ చంద్రబాబు ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోంది. చివరికి రైతుల సమస్యలపై పోరాడినా ఆంక్షలే.. ఇప్పుడు మెడికల్ కాలేజీ సందర్శనకు వెళ్తున్నా అడ్డంకులే పెడుతోంది. ఎన్ని ఆటంకాలు సృష్టించినా పర్యటన ఆగేది లేదని వైఎస్సార్సీపీ తేల్చి చెప్పింది. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి నర్సీపట్నం మెడికల్ కాలేజీకి వెళ్లి తీరుతామని స్పష్టం చేసింది.ఈ నెల 9వ తేదీన నర్సీపట్నం మెడికల్ కాలేజీని వైఎస్ జగన్ సందర్శించనున్నారు. రోడ్డు మార్గం గుండా వెళ్లనున్న వైఎస్ జగన్కు తమ సమస్యలు చెప్పుకునేందుకు బాధితులు సిద్ధమయ్యారు. వైఎస్ జగన్ను కలవడానికి స్టీల్ ప్లాంట్ కార్మికులు బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు, గోవర్ షుగర్ ఫ్యాక్టరీ రైతులు సిద్ధమయ్యారు. బాధితులను వైఎస్ జగన్ను కలవనీయకుండా ప్రభుత్వం చేస్తోంది. పోలీస్ ఆంక్షలతో వైఎస్ జగన్ పర్యటనను ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. కూటమి ప్రభుత్వ తీరుపై వైఎస్సార్సీపీ శ్రేణులు మండిపడుతున్నారు. -
నౌకాదళం అమ్ముల పొదిలో మరో అస్త్రం
భారత నౌకాదళం అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. రెండో యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్క్రాఫ్ట్ యుద్ధనౌక ఐఎన్ఎస్ ఆండ్రోత్ను విశాఖలోని నేవల్ డాక్యార్డులో తూర్పు నౌకా దళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ సోమవారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యుద్ధ విమానాలు, సబ్మెరైన్లు, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ల నిర్మాణంతో ఆత్మనిర్భర్ భారత్లో భారత నౌకాదళం నంబర్ వన్గా దూసుకుపోతోందని చెప్పారు.80 శాతం కంటే ఎక్కువ స్వదేశీ పరిజ్ఞానంతో ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా కోల్కతాలో ఈ యుద్ధనౌకను తీర్చిదిద్దారని తెలిపారు. వరుసగా భారత్లో తయారు చేసిన యుద్ధ నౌకలు అందుబాటులోకి రావడం సరికొత్త చరిత్రగా అభివరి్ణంచారు. ఆండ్రోత్ రాకతో సముద్ర రక్షణ మరింత బలోపేతమైందని తెలిపారు. లక్షదీవుల సమూహంలో ఉత్తరాన ఉన్న ప్రముఖ ద్వీపం ‘ఆండ్రోత్’ పేరును ఈ యుద్ధ నౌకకు పెట్టినట్టు వివరించారు.– సాక్షి, విశాఖపట్నంశత్రుదేశాల సబ్మెరైన్లు ఎక్కడ దాక్కున్నా పట్టేస్తుంది సముద్ర నిఘా, శోధన, రెస్క్యూ, తీరప్రాంత రక్షణ కార్యక్రమాల్లో ఆండ్రోత్ చురుగ్గా వ్యవహరిస్తుందని పెందార్కర్ చెప్పారు. శత్రుదేశాల సబ్మెరైన్లు ఎక్కడ దాక్కున్నా పసిగట్టేలా అధునాతన సెన్సార్లు, అత్యా«ధునిక ఆయుధాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలతో ఈ వార్íÙప్ నిరి్మంచినట్టు తెలిపారు. తూర్పు తీర సముద్ర రక్షణ విషయంలో తూర్పు నౌకాదళం రాజీలేని పోరాటం చేస్తోందని పునరుద్ఘాటించారు.ఆండ్రోత్ భారత నౌకాదళ అమ్ముల పొదిలో చేరిన తర్వాత.. యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్లో నావికాదళ సామర్థ్యాన్ని బలోపేతం చేసినట్టేనని తెలిపారు. లోతు తక్కువగా ఉన్న జలాల్లోని శత్రుదేశాల సబ్మెరైన్లని ఆండ్రోత్ వేటాడుతుందనీ.. తీరప్రాంతానికి చేరువలోని జలాలపై నిఘావేసే సామర్థ్యంతో పాటు విమానాలతో సమన్వయం చేసుకుంటూ శత్రు జలాంతర్గాముల్ని వేటాడే సత్తా ఆండ్రోత్ సొంతమని వివరించారు. ఈ కార్యక్రమంలో తూర్పు నౌకాదళాధికారులు, జీఆర్ఎస్ఈ అధికారులు పాల్గొన్నారు.‘ఆండ్రోత్’ విశేషాలు ఇవీ..పొడవు: 77.6 మీటర్లు వెడల్పు: 10.5 మీటర్లు డ్రాఫ్ట్: 2.7 మీటర్లు బరువు: 1,500 టన్నులు వేగం: గంటకు 25 నాటికల్ మైళ్లుసామర్థ్యం: ఏకధాటిగా 100 నాటికల్ మైళ్లుఎక్కడ తయారు చేశారు: కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (జీఆర్ఎస్ఈ)వ్యయం: రూ.789 కోట్లు పనులు ప్రారంభం: 2023 మార్చిలో సిబ్బంది: ఏడుగురు అధికారులు, 50 మంది సెయిలర్స్ (మొత్తం 57 మంది) లక్ష్యం: సముద్రం లోపల దాగివున్న శత్రు జలాంత ర్గాముల్ని గుర్తించడం, వాటిని ట్రాక్ చేసి నాశనం చేయడం అదనపు విధులు: సముద్ర నిఘా, పరిశోధన, విపత్తు, యుద్ధ సహాయక చర్యలు, తీరప్రాంత పరిరక్షణ సెన్సార్ వ్యవస్థ: డీఆర్డీవో కాంబాట్ సూట్, డీఆర్డీవో హల్ మౌంటెడ్ సోనార్, తక్కువ లోతులో సబ్మెరైన్లను గుర్తించే ఎల్ఎఫ్వీడీ సోనార్ ఆయుధ సంపత్తి: దేశీయంగా తయారు చేసిన 30 ఎంఎం సర్ఫేస్ గన్, 6,000 యాంటీ సబ్మెరైన్ రాకెట్ ఒకటి, 2 ట్రిపుల్ లైట్ వెయిట్ టార్పెడో లాంచర్లు, యాంటీ సబ్మెరైన్ మైన్స్, 2 ఓఎఫ్టీ రిమోట్ కంట్రోల్ గన్స్