breaking news
Visakhapatnam
-
దుష్ట ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు
చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యంగా ఉన్నారు కానీ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ తీసుకురాలేకపోయారని విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకుడు కదిరి బాబూరావు అన్నారు. జగన్ ఒక టర్మ్లో రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలను నిర్మించారు.. ఇప్పుడు వాటిని పీపీపీ విధానంలో ప్రైవేటుకు అప్పగించాలని చంద్రబాబు నిర్ణయించడం దారుణమన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తే సీట్లను ధనవంతులే కొనుక్కుంటారని తెలిపారు. పేదలకు వైద్య విద్యను దూరం చేయడం దుర్మార్గమని అన్నారు. చంద్రబాబు నిర్ణయం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది.. మాజీ సీఎం పిలుపుతో లక్షల మంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. రానున్న రాజుల్లో ప్రజలే చంద్రబాబుకు గట్టి బుద్ధి చెబుతారన్నారు. -
ప్రజలకు జవాబుదారీగా ఉండాలి
మహారాణిపేట : పీజీఆర్ఎస్ వేదికగా ప్రజలు సమర్పించే వినతుల పరిష్కార క్రమంలో వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టవద్దని, తూతూమంత్రపు చర్యలతో సరిపెట్టవద్దని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతులు స్వీకరించిన సందర్భంగా ఆయన పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అధికారులు బాధ్యతగా, జవాబుదారీతనంతో పని చేయాలని, ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం, అమర్యాదగా ప్రవర్తించడం, గంటల తరబడి వేచి ఉంచడం చేయకూడదని కలెక్టర్ హెచ్చరించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ శాఖలు తమ పనితీరు మార్చుకోవాలని, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా ఫిర్యాదులను నాణ్యమైన రీతిలో పరిష్కరించాలని సూచించారు. ఆర్డీవోలు, తహసీల్దార్లు తమ చర్యలను పునఃసమీక్షించుకోవాలని హితవు పలికారు. ఫిర్యాదుల స్థితిగతులను ప్రజలకు తెలియజేయాల్సిన కనీస బాధ్యత అందరిపై ఉంటుందని పేర్కొన్నారు. సర్వే రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలు వాటికందిన ఫిర్యాదులను, తీసుకున్న చర్యలను పునఃపరిశీలించుకోవాలని సూచించారు. సోమవారం పీజీఆర్ఎస్కు ప్రజల నుంచి 299 వినతులు అందాయి. వీటిలో రెవెన్యూ విభాగానికి చెందినవి 132, జీవీఎంసీకి 76, పోలీస్ విభాగానికి సంబంధించినవి 24, ఇతర విభాగాలకు చెందినవి 67 వినతులు ఉన్నాయి. కలెక్టర్తోపాటు ఇంచార్జి డీఆర్వో సత్తిబాబు, ఇంచార్జి ఆర్డీవో ప్రజల నుంచి ఈ వినతులను స్వీకరించగా, అన్ని విభాగాల జిల్లాస్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భర్తను భుజంపై మోసుకుంటూ.. తన కుటుంబాన్ని పోషించడానికి, నివాసం కోసం స్థలం కేటాయించాలని కోరుతూ.. వేదుళ్లనరవ ప్రాంతానికి చెందిన గృహిణి బి. శాంత సోమవారం కలెక్టరేట్కు చేరుకుంది. దివ్యాంగుడైన భర్తను భుజంపై మోసుకుని నేరుగా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ వద్దకు వెళ్లింది. తమకు నివాసం కోసం స్థలం కేటాయించడంతో పాటు, కుటుంబ పోషణ నిమిత్తం రుణాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ గృహిణి తన భర్తను మోసుకొని కలెక్టర్ను కలవడానికి వచ్చిన దృశ్యం, వారి దీన పరిస్థితికి అద్దం పట్టింది. సొంత ప్రాంతంలోనే స్థలం ఇవ్వాలి వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా దూరంగా కేటాయించిన స్థలం వద్దని పద్మనాభం మండలం రెడ్డిపల్లిలో నివసిస్తున్న వాడపల్లి సంజీవి అనే వృద్ధురాలు కలెక్టర్ను వేడుకుంది. దివ్యాంగుడైన తన కుమారుడితో కలిసి కలెక్టర్ హరేందిర ప్రసాద్ను కలిసిన ఆమె, అనకాపల్లి మండలంలో మంజూరు చేసిన ఇంటి స్థలం తమకు చాలా దూరం కావడం వల్ల ఉపయోగం లేదని తెలిపింది. తన పరిస్థితిని, వృద్ధాప్యాన్ని దృష్టిలో ఉంచుకుని, తాను నివసిస్తున్న రెడ్డిపల్లిలో గానీ, పద్మనాభం మండలంలో గానీ స్థలం కేటాయిస్తే ఇల్లు కట్టుకుంటానని కలెక్టర్కు వినతి పత్రం సమర్పించింది. -
చంద్రబాబు రాష్ట్రాన్ని అమ్మేయాలని చూస్తున్నారు
మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పేదలకు కూడా వైద్య విద్య, వైద్య సేవలు అందించాలన్న సంకల్పంతో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులు నిర్మిస్తే.. చంద్రబాబు మాత్రం వాటిని కార్పొరేట్లకు దోచిపెట్టాలని చూస్తున్నారని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురుసాల కన్నబాబు మండిపడ్డారు. ప్రజల సొమ్ము, ఆస్తులను ధారాదత్తం చేయడానికి సిగ్గనిపించడం లేదా? అని ప్రశ్నించారు. సీనియార్టీ అంతా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడమేనా.. విశాఖ అంటే అంత తేరగా, ఉత్తరాంధ్ర అంత చవకగా కనిపిస్తుందన్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలకు అత్తింటి ఆస్తిలాగా అమ్మేస్తూ ఉంటే ప్రజలు చూస్తూ ఉంటారా? విశాఖలో ఎకరం 99 పైసలకు ఇస్తున్న చంద్రబాబు, పేదల ఇళ్లకు గజం రూ.99కి ఇస్తారా? అని ప్రశ్నించారు. 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఈ కాలేజీలను వెనక్కు తీసుకుని ప్రభుత్వమే నడిపిస్తుందన్నారు. విశాఖలో చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని విశాఖలో ఆస్తులు ముట్టుకోవాలనుకున్నా.. ప్రైవేటు వారికి కట్టబెట్టాలనుకున్నా భయపడేలా ఇక్కడున్న ప్రజలు గళమెత్తాలన్నారు. -
2029లో ఆ కాలేజీలను ప్రభుత్వపరం చేస్తాం
చేతకాని దద్దమ్మ చంద్రబాబు సర్కార్ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులను ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించడం దారుణమని విశాఖ దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్కుమార్ అన్నారు. జగన్ చదువునిచ్చి అందరినీ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దితే.. చంద్రబాబు మాత్రం యువతను అడుక్కునేలా చేస్తున్నారన్నారు. పేద విద్యార్థులకు జ్ఞానం ఇవ్వాలని జగన్ సంకల్పిస్తే.. చంద్రబాబు వారి నోటి నుంచి చదువును దూరం చేస్తున్నారని వాపోయారు. ఇవి కేవలం ఇంకుతో పెట్టిన సంతకాలు కాదు.. సరిహద్దుల్లో రక్తం చిందించే సైనికుల కంటే విలువైన ఇంకుతో పెట్టిన సంతకాలన్నారు. గవర్నర్ గారు చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా చేయండి. 2029లో వైఎస్ జగన్మోహన్రెడ్డి తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని, ప్రైవేటు చేస్తున్న కాలేజీలన్నింటినీ ప్రభుత్వపరం చేస్తారన్నారు. -
వీఐపీ రోడ్డులో సౌత్ ఇండియా షాపింగ్మాల్ ప్రారంభం
బీచ్రోడ్డు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో తన కార్యకలాపాలను విస్తరిస్తున్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్, విశాఖలోని వీఐపీ రోడ్లో తన 38వ షోరూమ్ను ఘనంగా ప్రారంభించింది. ప్రముఖ సినీతార కీర్తి సురేష్ జ్యోతిని వెలిగించి నూతన షోరూమ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైవిధ్యభరితమైన కలెక్షన్లతో ఈ షోరూమ్ పండగ వాతావరణాన్ని ముందుగానే తీసుకువచ్చిందని, ఇది ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఆర్.ఎస్. బ్రదర్స్ రిటైల్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్లు వైజాగ్ ప్రజలకు స్వాగతం పలుకుతూ కుటుంబంలోని అన్ని తరాల వారి అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకు అందజేస్తామని హామీ ఇచ్చారు. సంస్థ చైర్మన్ పొట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ షోరూమ్ ద్వారా 38వ మైలురాయిని చేరుకోవడం ఆనందదాయకమని, వైజాగ్ వాసుల అభిరుచులను ప్రతిబింబించే వైరెటీలను అందిస్తామని చెప్పారు. మేనేజింగ్ డైరెక్టర్ సీర్ణ రాజమౌళి మాట్లాడుతూ రాబోయే పండుగలకు మరింత శోభనిచ్చే షాపింగ్ అనుభూతిని ఈ కొత్త షోరూమ్ తప్పకుండా అందజేస్తుందని హామీ ఇచ్చారు. హోల్టెం డైరెక్టర్ తిరువీధుల ప్రసాదరావు మాట్లాడుతూ, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి వేడుకలకు అనువైన అన్ని రకాల వైరెటీలు తమ షోరూమ్లో సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. వైజాగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో సంప్రదాయం మొదలుకుని సరికొత్త ఫ్యాషన్లను మేళవిస్తూ, పండగ చీరెలు, పట్టు వైరెటీలు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఎథ్నిక్ వేర్, ఇండో–వెస్ట్రన్ కేటగిరీల కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. కార్యక్రమంలో మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, గణబాబు పాల్గొన్నారు. -
క్రీడా సముదాయం, కళావాణి ఆడిటోరియం స్వాధీనం
సీతంపేట: లీజు ఒప్పందాల నిబంధనలు పాటించనందున, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ (వీపీఏ) అక్కయ్యపాలెంలోని పోర్టు స్టేడియం, సాలిగ్రామపురంలో ఉన్న నెహ్రూ క్రీడా, సాంస్కృతిక సముదాయంలోని క్రీడా సముదాయం, అలాగే కళావాణి ఏ/సీ ఆడిటోరియంను సోమవారం తిరిగి స్వాధీనం చేసుకుంది. క్రీడా సముదాయాన్ని గతంలో ఎం.ఎస్ విశ్వనాథ్ స్పోర్ట్స్, కన్వెన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు, కళావాణి ఆడిటోరియంను ఎం.ఎస్ విశ్వనాథ్ అవెన్యూస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్కు లీజుకు ఇచ్చారు. లీజు నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా వీపీఏ సెప్టెంబర్ 11న రద్దు నోటీసులను జారీ చేసింది. అవసరమైన ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం, రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ అధికారుల సమక్షంలో పోర్టు అథారిటీ సోమవారం వీటిని తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ ప్రక్రియ చట్ట ప్రకారం నిర్వహించినట్టు పోర్టు అథారిటీ పేర్కొంది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, ఈ సౌకర్యాల రక్షణకు చర్యలు తీసుకొని, భవిష్యత్తు వినియోగంపై వీపీఏ పరిశీలించనుందని తెలిపింది. రోడ్డున పడ్డ కుటుంబాలు విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ లీజు రద్దు చేసి స్వాధీనం చేసుకోవడంతో.. అందులో పనిచేస్తున్న సుమారు 250 కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డాయి. పర్యాటకులను ఆకర్షించే విధంగా కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేసిన ఈ స్టేడియంలో ఫన్ గేమ్స్, అడ్వెంచర్ గేమ్స్, స్నో వరల్డ్, వాటర్ పార్క్, ఫుడ్ జోన్, గో కార్టింగ్, స్విమ్మింగ్ పూల్, 12డి థియేటర్ వంటి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ఈ ఏడాది సెప్టెంబరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బెస్ట్ యూనిక్ టూరిజం ప్రాజెక్టుగా అవార్డులు కూడా అందుకుంది. హఠాత్తుగా పోర్టు అథారిటీ ఈ సముదాయాన్ని మూసివేయడంతో తమకు అన్యాయం జరిగిందంటూ కార్మికులు ఆందోళన చేపట్టారు. -
నగరంలో ‘గుర్రం పాపిరెడ్డి’
బీచ్ రోడ్డు : డార్క్ కామెడీ, నవ్వులు, ట్విస్టులతో రాబోతున్న ‘గుర్రం పాపిరెడ్డి’ చిత్రబృందం నగరంలో సందడి చేసింది. సినిమా ప్రచారంలో భాగంగా హీరో నరేష్ అగస్త్య, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, ఇతర నటీనటులు విశాఖకు వచ్చారు. ఈ చిత్రం ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో నరేష్, హీరోయిన్ ఫరియా మాట్లాడుతూ ఒక శవాన్ని దొంగిలించడానికి శ్రీశైలం అడవిలోకి వెళ్లిన నలుగురు స్నేహితుల చుట్టూ కథ తిరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో జరిగే గందరగోళం, అనూహ్య మలుపులు, హాస్యాన్ని మేళవించి సినిమాను రూపొందించినట్లు చెప్పారు. లెజెండరీ నటుడు బ్రహ్మానందం న్యాయమూర్తి పాత్రలో, అలాగే తమిళ నటుడు యోగిబాబు కీలక పాత్ర పోషించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందన్నారు. ఈ చిత్రానికి మురళి మనోహర్ దర్శకత్వం వహించగా, వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ సంయుక్తంగా నిర్మించారన్నారు. -
చంద్రబాబు అహంకారాన్ని ప్రజలే దించుతారు
మెడికల్ కాలేజీల రౖపైవేటీకరణ నిర్ణయం చంద్రబాబు సర్కార్ చారిత్రక తప్పిదమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. అధికారం ఉందన్న అహంకారంతో చంద్రబాబు పేదలకు అందే వైద్య విద్య, వైద్యాన్ని దూరం చేయాలని చూస్తున్నారన్నారు. తన ప్రైవేటు తొత్తులకు కట్టబెట్టేందుకు ఈ పీపీపీ విధానాన్ని తెరపైకి తీసుకువచ్చారని తెలిపారు. ఈ నిర్ణయంతో పేదలకు వైద్య విద్య దూరమవుతుందని, వైద్యం కూడా అందకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే మెడికల్ కాలేజీల రౖపైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించిందన్నారు. ప్రభుత్వం మెడలు వంచైనా మెడికల్ కాలేజీలను ప్రభుత్వంలోనే కొనసాగేలా ఈ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. చంద్రబాబు అహంకారాన్ని ప్రజలే దించుతారన్నారు. -
స్కేటింగ్ మారథాన్ విజేతలు ఆనంద్, విశ్వనాథ
విశాఖ స్పోర్ట్స్ : ముడసర్లోవ గోల్ఫ్ క్లబ్ సమీపంలోని రోడ్డుపై జరిగిన జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్ చివరిదైన 42 కిలోమీటర్ల మారథాన్ పరుగు పోటీలు ఉత్సాహంగా ముగిశాయి. మాస్టర్స్, జూనియర్స్, సీనియర్స్ మెన్, ఉమెన్ విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించారు. మెన్ మారథాన్లో స్కేటింగ్ ప్రపంచ చాంపియన్గా ఇప్పటికే పేరుగాంచిన ఆనందకుమార్ వేల్కుమార్ (తమిళనాడు) 1:14:00 గంటల్లో రేసు పూర్తి చేసి జాతీయ విజేతగా నిలిచాడు. తమిళనాడుకు చెందిన జీవన్రాజ్ ద్వితీయ స్థానంలో, విష్ణు ప్రసాద్ (పుదుచ్చేరి) తృతీయ స్థానంలో నిలిచారు. మహిళల విభాగంలో తమన్నా సైనీ (జమ్మూ కాశ్మీర్) 1:40:09 గంటల్లో పూర్తిచేసి విజేతగా నిలవగా, వర్షిణి అపర్ణ (కర్ణాటక) ద్వితీయ స్థానంలో, అనుష్కా మెహతా (గుజరాత్) తృతీయ స్థానంలో నిలిచారు. 35+ మాస్టర్స్ విభాగంలో రాఘవేంద్ర విశ్వనాథ (కర్ణాటక) విజేతగా, అర్జున్ నిచానీ (మహారాష్ట్ర) ద్వితీయ స్థానంలో, శ్రావణ్ కుమార్ (తెలంగాణ) తృతీయ స్థానంలో నిలిచారు. పోటీల ముగింపు సందర్భంగా రాష్ట్ర రోలర్ స్కేటింగ్ సంఘం అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, కార్యదర్శి పి.థామస్, సమాఖ్య ప్రతినిధి భగీరథ్ సహా నిర్వాహక ప్రతినిధులు లక్ష్మణ్, రవి.. పోటీలను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ముగిసిన జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్ -
ప్రతి మహిళా సంపన్నురాలు కావాలి
మద్దిలపాలెం: రాష్ట్రంలో ప్రతి మహిళా సంపన్నురాలు కావాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. అందులో భాగంగానే ప్రతి జిల్లాలో రూ. 5 కోట్లతో క్లస్టర్ విధానాన్ని తీసుకొస్తామని, రూ. 10 కోట్లతో కామన్ స్పెషాలిటీ సెంటర్ను నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సోమవారం డీఆర్డీఏ, సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిల భారత డ్వాక్రా బజార్ – 2025ను స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్, విజయనగరం డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జునలతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్ కల్పించాలనే ఉద్దేశంతోనే సరస్ వంటి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామని గుర్తు చేశారు. కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ ప్రదర్శనలో 250 స్టాళ్లు ఏర్పాటు చేశామని, బ్యాంకర్లు, నాబార్డు ప్రోత్సాహం అందించాయని తెలిపారు. మహిళలకు అన్ని రకాల వసతులు కల్పించామని, ప్రజలకు ఆహ్లాదం అందించేలా సాంస్కృతిక ప్రదర్శనలు కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా వివిధ బ్యాంకర్లకు, దాతలకు అతిథుల చేతుల మీదుగా సత్కారం చేసి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి.సరస్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ -
రాయ్పూర్ విజయం
విశాఖ స్పోర్ట్స్ : రైల్వే గ్రౌండ్స్లో సోమవారం రాత్రి ఫ్లడ్లైట్ల వెలుతురులో జరిగిన డీఆర్ఎం కప్ ఆహ్వాన ఫుట్బాల్ టోర్నీ మ్యాచ్లో రాయ్పూర్ (ఎస్ఈసీఆర్) జట్టు సంబల్పూర్ రైల్వే జట్టుపై విజయం సాధించింది. ఏ పూల్లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్ నిర్ణీత సమయంలో ఇరు జట్లు రెండేసి గోల్స్ చేసి సమానంగా నిలిచాయి. దీంతో విజేతను నిర్ణయించేందుకు టైబ్రేకర్ను నిర్వహించగా, రాయ్పూర్ జట్టు విజయాన్ని అందుకుంది. ఈ ఆహ్వాన ఫుట్బాల్ టోర్నీలో మొత్తం 14 జట్లు రెండు పూల్స్లో పోటీపడుతున్నాయి. -
త్వరలోనే సొంత భవనంలోకి ఎన్ఐవో
రుషికొండలో నిర్మితమవుతున్న ఎన్ఐవో శాశ్వత భవనంసాక్షి, విశాఖపట్నం: దశాబ్ద కాలం సుదీర్ఘ పోరాటం తర్వాత నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (ఎన్ఐవో) ప్రాంతీయ కార్యాలయం విశాఖపట్నంలో సొంత భవనంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. తూర్పు తీరంలో సముద్ర పరిశోధనలకు ఊతమిచ్చే ఏకై క అధ్యయన సంస్థ అయిన ఎన్ఐవో కార్యాలయం 1976 నుంచి పెదవాల్తేరు బస్ డిపో సమీపంలోని అద్దె భవనంలో కొనసాగుతోంది. సుమారు రూ. 30 కోట్ల వ్యయంతో బీచ్కు ఆనుకొని రుషికొండ బే పార్క్ సమీపంలో 3.25 ఎకరాల్లో నూతన భవనం నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ భవనాన్ని జనవరి నెలలో కేంద్ర మంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తూర్పు తీరం.. బంగాళాఖాతంలో సముద్ర పరిశోధన కార్యకలాపాలను ఇక్కడి నుంచే నిర్వహిస్తున్న ఎన్ఐవో... తీరప్రాంత వాతావరణం, సముద్ర అడుగుభాగంలోని ఖనిజ వనరులు, సెడిమెంట్లు, సీబెడ్ మ్యాపింగ్, అలలు, ప్రవాహాలు, మాన్సూన్, వాతావరణ మార్పులపై పరిశోధనలు చేస్తుంది. అంతేకాక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల సముద్ర, తీరప్రాంత సమస్యల పరిష్కారానికి కూడా ఇది కృషి చేస్తుంది. జనవరిలో ప్రారంభోత్సవానికి సన్నాహాలు.! అవరోధాలు తొలగిన తర్వాత ఎన్ఐవో సొంత భవన నిర్మాణ పనులు ప్రారంభమై జోరుగా సాగుతున్నాయి. పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. ఇంటీరియర్ పనులు, అనుసంధాన రహదారి పనులు జరుగుతున్నాయి. ఎన్ఐవో భవన సముదాయానికి కేంద్ర ప్రభుత్వం రూ.30 కోట్లు మంజూరుచేస్తూ.. నిర్మాణ పర్యవేక్షణ పనులు సీపీడబ్ల్యూడీకి అప్పగించింది. కోల్కతాకు చెందిన కాంట్రాక్టర్ పనుల టెండర్ దక్కించుకున్నారు. రూ.30 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని మూడు బ్లాకుల్లో నిర్మిస్తున్నారు. పరిపాలన భవనమంతా ఒక బ్లాక్లు, రీసెర్చ్ కోసం మరో బ్లాక్, ఇతర అవసరాలకు మూడో బ్లాక్ని వినియోగించనున్నారు. ఎదురుగా ఉన్న సముద్రం నుంచి నేరుగా లేబొరేటరీకి అవసరమైనంత నీరు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని సైంటిస్ట్ ఇన్చార్జ్ డా.వీవీఎస్ఎస్ శర్మ తెలిపారు. సంబంధిత కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ దొరికిన వెంటనే ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఈ భవనం అందుబాటులోకి వచ్చిన తర్వాత.. సముద్ర పరిశోధనల్లో మరింత పురోగతి ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సముద్ర నీటిమట్టం పెరుగుదల, కాలుష్యం హెచ్చుతగ్గులు, అంతర్భాగంలో జరిగే మార్పులు అన్నీ ఇక్కడ అధ్యయనం చేస్తామని డా.శర్మ తెలిపారు. 2015లో శంకుస్థాపన జరిగినా.. సొంత భవనం కోసం ఎన్ఐవో సుదీర్ఘ కృషి చేసింది. 2015లో శంకుస్థాపన జరిగినా.. భవనం కోస్టల్ రెగ్యులేటరీ జోన్ (సీఆర్జెడ్) పరిధిలో ఉండటం వల్ల అనుమతులు పొందడానికి అవస్థలు ఎదురయ్యాయి. స్థానిక ఇబ్బందులను కూడా ప్రభుత్వాల సహకారంతో పరిష్కరించుకున్న తర్వాత ఇప్పుడు కొత్త భవనం సముద్ర పరిశోధనలకు మరింత ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. -
సమస్యల పరిష్కారం కోసం ఎన్నాళ్లు తిరగాలి
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వివిధ విభాగాలకు సంబంధించి మొత్తం 92 వినతులు అధికారులకు అందాయి. తాము గత కొంతకాలంగా అధికారుల వద్ద మొరపెట్టుకుంటున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదని, ఇలా ఎంత కాలం తిరిగాలని పలువురు ఫిర్యాదుదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశానికి హాజరైన పౌరులు అనేక ముఖ్య సమస్యలను మేయర్, అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా 29వ వార్డులోని దిబ్బలపాలెం రామాలయ వీధికి చెందిన ఒక పౌరుడు, తమ రామాలయం వద్ద ఉన్న శిథిలావస్థ భవనాన్ని తొలగించాలని, అలాగే పరిసర ఇళ్ల గోడలకు రావిచెట్టు వేర్లు పాకుతున్నందున వాటిని కూడా తొలగించాలని గతంలో రెండు మూడు సార్లు విన్నవించినట్లు తెలిపారు. దీనితో పాటు వీధిలైట్లు ఏర్పాటు చేయాలని మరొకరు, బీటీ రోడ్లు వేయాలని ఇంకొకరు వినతిపత్రాలు సమర్పించారు. నగరంలో ఆక్రమణలు జోరుగా సాగుతున్నాయని ఇంకో పౌరుడు ఫిర్యాదు చేశారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ పీలా శ్రీనివాసరావు, అదనపు కమిషనర్ ఎస్ఎస్ వర్మ కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధాన ఇంజినీర్ సత్యనారాయణరాజు, ప్రధాన వైద్యాధికారి నరేష్కుమార్, ప్రధాన సిటీ ప్లానర్ ప్రభాకరరావు, డీసీఆర్ శ్రీనివాసరావు, డీడీహెచ్ దామోదరరావు, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి, స్పోర్ట్స్ డైరెక్టర్ ఇఏ రాజుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జీవీఎంసీ పీజీఆర్ఎస్పై నగరవాసుల అసంతృప్తి -
సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న వ్యక్తి అరెస్ట్
విశాఖ సిటీ: నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ నిర్వహిస్తున్న మోసగాళ్లకు మ్యూల్ బ్యాంక్ అకౌంట్లను సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హెచ్బీ కాలనీకి చెందిన ఒక వ్యక్తికి వాట్సాప్ ద్వారా ‘ఆరాధ్య మిశ్రా’ అనే మహిళ నుంచి మెసేజ్ వచ్చింది. తాను స్టాండర్డ్ చార్టర్డ్ గ్రూప్ నుంచి మాట్లాడుతున్నానని చెప్పిన ఆ మహిళ.. 700 శాతం లాభాలు పొందవచ్చని ఆశ చూపింది. ఆమె పంపిన లింక్ ద్వారా ఫిర్యాదుదారుడు ‘ఎస్ఎల్ ఎలైట్’ అనే అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకుని, ఐపీవోలు, షేర్లు, ఇండెక్స్ ట్రేడింగ్లో మొత్తం రూ. 32 లక్షలు పెట్టుబడిగా పెట్టారు. అయితే తరువాత నగదు విత్డ్రా చేయాలనుకున్నప్పుడు, అదనపు సర్వీస్ ట్యాక్స్, ప్రాసెసింగ్ చార్జీలు చెల్లించాలని రావడంతో తాను మోసపోయినట్లు గ్రహించి, వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బ్యాంక్ లావాదేవీలను పరిశీలించగా, మ్యూల్ బ్యాంకు అకౌంట్లను సరఫరా చేస్తున్నట్లు గుర్తించిన విజయవాడకు చెందిన అడుసుమిల్లి శివరాంప్రసాద్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇతడి ద్వారా మరి కొంతమంది నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ నిర్వహిస్తున్న వారికి బ్యాంకు అకౌంట్లు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు సమాచారం రాబట్టారు. ప్రస్తుతం వారిపై నిఘా పెట్టారు. -
చంద్రబాబు నిర్ణయానికి నిరసనగా పోటెత్తిన జనం కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన జిల్లాలో 4.15 లక్షల సంతకాల ప్రతులతో భారీ ర్యాలీ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించిన పార్లమెంట్ పరిశీలకుడు కదిరి బాబూరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు
విశాఖ సిటీ : వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటుకు అప్పగించాలన్న చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజాగ్రహం పెల్లుబికింది. పేద విద్యార్థులకు వైద్య విద్య, వైద్యాన్ని దూరం చేసే ప్రభుత్వ పన్నాగంపై కదం తొక్కింది. మెడికల్ కాలేజీలను కార్పొరేట్లకు దోచిపెట్టే దురాలోచనపై దండెత్తింది. చంద్రబాబు ప్రభుత్వ ప్రైవేటు విధానాలకు వ్యతిరేకంగా నిరసన గళమెత్తింది. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పేదలకు వైద్య విద్య, వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులు నిర్మిస్తే.. వాటిని చంద్రబాబు తన తొత్తులకు కట్టబెట్టే ప్రయత్నాలను లక్షల మంది ప్రజానీకం సంతకాల ద్వారా వ్యతిరేకించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి సేకరించిన 4,15,500 సంతకాల పత్రాలను కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపించే కార్యక్రమానికి కూడా జనం పోటెత్తారు. సోమవారం ఉదయం జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి మద్దిలపాలెం వరకు జరిగిన ఉద్యమ ర్యాలీ వేలాది మంది జనసందోహంతో నిండిపోయింది. హోరెత్తిన ర్యాలీ జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహానికి వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకుడు కదిరి బాబూరావు, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, పి.రవీంద్రబాబు, నియోజకవర్గాల సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్కుమార్, మళ్ల విజయ్ప్రసాద్, తిప్పల దేవన్రెడ్డి, మొల్లి అప్పారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి వేలాదిగా తరలివచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు, విద్యార్థులు, ప్రజలతో ర్యాలీ బయలుదేరింది. ఒకవైపు కోలాటాలు, కోబ్రా నృత్యాలు, డీజేలతో ఆ ప్రాంతాలు దద్దరిల్లిపోయాయి. సుమారు 2 కిలోమీటర్ల మేర ర్యాలీగా వెళ్లి మద్దిలపాలెం జంక్షన్లో తెలుగుతల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సంతకాల పత్రాల వాహనానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకుడు కదిరి బాబూరావు జెండా ఊపి తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి పంపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, పండుల రవీంద్రబాబు, సమన్వయకర్తలు మళ్ల విజయ ప్రసాద్, మొల్లి అప్పారావు, తిప్పల దేవన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకటరామయ్య, డిప్యూటీ మేయర్ కె.సతీష్, సీఈసీ సభ్యులు కోలా గురువులు, కాయల వెంకటరెడ్డి, మాజీ మేయర్ గొలగాని హరివెంకటకుమారి, పార్టీ ముఖ్య నాయకులు సిరిసహస్ర(సిరిమ్మ), జియ్యాని శ్రీధర్, ఉరుకూటి అప్పారావు, రొంగలి జగన్నాథం, బాణాల శ్రీనివాసరావు, డాక్టర్ సీఎంఏ జహీర్ అహ్మద్, దాట్ల వెంకటఅప్పలప్రసాద్ రాజు, పిన్నమరాజు సతీష్ వర్మ, పోతిన హనుమంతరావు, తాడి జగన్నాథరెడ్డి, కిరణ్రాజు, గొండేశి మహేశ్వర రెడ్డి, చెన్నాదాస్, పల్లా దుర్గారావు, కోరుకొండ వెంకటరత్నస్వాతిదాస్, గుడ్ల వెంకటరమణిరెడ్డి, మంచా నాగమల్లీశ్వరి, దుప్పలపూడి శ్రీనివాసరావు, బొల్లవరపు జాన్వెస్లీ, పెర్ల విజయ్చంద్ర, పిల్లి సుజాత, ద్రోణంరాజు శ్రీవాస్తవ, చెన్నా జానకిరామ్, పిల్లా సుజాత ,గొలగాని శ్రీనివాస్,రవి రాజు, అల్లు శంకర్రావు, అక్కరమాని పద్మ, రామునాయుడు, దౌలపల్లి ఏడుకొండల రావు, కటారి అనీల్కుమార్, నక్కిల లక్ష్మీ, శాడి పద్మారెడ్డి, బిపిన్ కుమార్ జైన్, గుండాపు నాగేశ్వరరావు, కోడిగుడ్ల పూర్ణిమ, వావిలపల్లి ప్రసాద్, రెయ్యి వెంకటరమణ, బర్కత్ అలీ, కేవీ శశికళ, బల్ల లక్ష్మణ్, మహమ్మద్ ఇమ్రాన్, గుడివాడ సాయిఅనూష, లతీష్, ఉరుకూటి రామచంద్రరావు, భూపతిరాజు సుజాత, సేనాపతి అప్పారావు, ఎండీ షరాఫీ, అంబటి నాగ వినాయక శైలేష్, ముట్టి సునీల్కుమార్, తుమ్మలూరి జగదేష్ రెడ్డి, నీలపు కాళిదాస్రెడ్డి, పెడాడ రమణికుమారి, బోనిఅప్పలనాయుడు, సనపల రవీంద్రభరత్, బోని శివ రామకృష్ణ, బాజీ నాయుడు, కర్రి రామారెడ్డి, శ్రీదేవి వర్మ, వంకాయల మారుతీప్రసాద్, సకలభక్తుల ప్రసాద్రావు, ఆడేపల్లి రవిబాబు, దేవరకొండ మార్కడేయులు, బోండా ఉమామహేశ్వరరావు, జి.నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
30న అప్పన్న ఉత్తరద్వార దర్శనం
సింహాచలం: ఈనెల 30న ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్తరద్వార దర్శనానికి అన్నిశాఖల సమన్వయంతో ఏర్పా ట్లు చేస్తున్నట్టు దేవస్థానం ఇన్చార్జి ఈవో ఎన్.సుజాత తెలిపారు. ఏర్పాట్లపై సోమవారం పలు శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. 30న తెల్లవారుజామున ఒంటి గంట నుంచి వైదిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయ, ఆరోజు 5.30 నుంచి 11 గంటల వరకు ఆలయ ఉత్తర రాజగోపురంలో వైకుంఠ ద్వార ద్వార దర్శనం భక్తులకు కల్పిస్తామన్నారు. 40 వేల మందికి పైగా భక్తులు ఉత్తర ద్వార దర్శనానికి వస్తారని అంచనా వేసినట్టు తెలిపారు. అన్ని దర్శన క్యూల్లో మంచినీరు అందిస్తామన్నారు. 20 వేల మంది భక్తులకు అన్నప్రసాద భవనంలో పొంగలి, పులుసు ప్రసాదం అందిస్తామన్నారు. భక్తులు ఉత్తర ద్వార దర్శనాన్ని వీక్షించేందుకు సింహగిరిపై రిసెప్షన్ కేంద్రం, కల్యాణం గ్రౌండ్ల్లో భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటుచేస్తామన్నారు. ఈనెల 29 రాత్రి 7 గంటల తర్వాత సింహగిరిపై బస్సులు అనుమతించమని, 30న తెల్లవారుజామున 4 గంటల నుంచి బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహిస్తారని తెలిపారు. దేవస్థానం ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, సీతారామాచార్యులు, డిప్యూటీ ఈవో రాధ, ఈఈ రమణ, ఏసీపీ పృథ్వీతేజ్, గోపాలపట్నం సీఐ ఎల్.ఎస్.నాయుడు, ఆర్టీసీ, మెడికల్ అండ్ హెల్త్, ఎకై ్సజ్, ఫైర్ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ఏఐసీటీఈ అటల్ వాణి సదస్సు
మురళీనగర్: అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఆధ్వర్యంలో కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో అటల్ వాణి జాతీయ సదస్సు మంగళ, బుధవారాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు సదస్సు కోఆర్డినేటర్ డాక్టర్ కె.నారాయణరావు తెలిపారు. సోమవారం పాలిటెక్నిక్ కాలేజీలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రత్నకుమార్తో కలిసి బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘డిజిటల్ మేకోవర్ ఇన్ ఇంజినీరింగ్ అప్లికేషన్స్–ఇన్నోవేషన్, టెక్నాలజీ అండ్ సస్టైనబిలిటీ’ అనే అంశంపై నిపుణులు చర్చిస్తారన్నారు. స్థానిక భాషల ద్వారా సాంకేతిక విజ్ఞానాన్ని ప్రజల జీవన విధానంతో అనుసంధానం చేయడం ఏఐసీటీ అటల్ వాణి ప్రధాన ఉద్దేశమన్నారు. సదస్సులో దేశవ్యాప్తంగా అధ్యాపకులు, పరిశోధకులు, పరిశ్రమ నిపుణులు, పీజీ విద్యార్థులు, పరిశోధన పండితులు మొత్తం 60 అత్యున్నత స్థాయి శాసీ్త్రయ పరిశోధనా పత్రాలను ప్రదర్శిస్తారన్నారు. వివిధ విశ్వవిద్యాలయాలు, ప్రముఖ పరిశ్రమల నుంచి 10 మంది నిపుణుల ప్రసంగాలు ఉంటాయన్నారు. సదస్సుకు కో–కోఆర్డినేటర్లుగా సీనియర్ లెక్చరర్ డాక్టర్ రాజు చిట్ల, లెక్చరర్ భరణి మారోజు వ్యవహరిస్తారు. మెకానికల్ విభాగాధిపతి డాక్టర్ కె.ఫణికృష్ణ పర్యవేక్షిస్తారు. -
‘మాపై కేసులు.. అప్పులు.. తండ్రీకొడుకుల గొప్పలు ఇవే మిగిలాయి’
విశాఖ : కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఏ వర్గానికి మంచి జరగలేదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత గుడివాడ అమర్నార్ మరోసారి ధ్వజమెత్తారు. ఐటీ కంపెనీల ముసుగులో ప్రజల ఆస్తులను ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. తమ కేసులు బనాయించడం, లప్పులు చేయడం, తండ్రీ కొడుకులు గొప్పలు చెప్పుకోవడం ఇవే మిగిలాయని ఎద్దేవా చేశారు. ఈరోజు(సోమవారం, డిసెంబర్ 15వ తేదీ) అమర్నాథ్ మాట్లాడుతూ.. ‘పెద్ద కంపెనీలకు భూములు ఇవ్వడం.. పెట్టుబడులను ప్రోత్సాహించడం సహజం. రియల్ ఎస్టేట్ కంపెనీకి భూములు కట్టాబేడుతున్నారు. ఆ కంపెనిల్లో సత్వ ఒకటి. సత్త్వ కంపెనీకి 30 ఎకరాలు రిషికొండలో ఇచ్చారు. మార్కెట్ విలువ రూ. 40 కోట్లు ఎకరా ఉంటుంది.మొత్తం 30 ఎకరాలు రూ. 45 కోట్లకే ప్రభుత్వం కేటాయించింది. సత్త్వ ఉద్యోగాలు ఇవ్వదు. ఇది ఒక అద్దెలకు ఇచ్చుకునే సంస్థ. భూమి కేటాయించిన 90 రోజుల్లో ప్రభుత్వానికి డబ్బులు కట్టాలి. ఇప్పటి వరకూ డబ్బులు సత్త్వ కంపెనీ కట్టలేదు. డబ్బులు కట్టడానికి గడువు పెంచుతూ జిఓ ఇచ్చారు. వడ్డీ కూడా లేకుండా చేశారు. రూ. 1500 కోట్లు విలువ చేసే భూమి 45 కోట్లకు కొట్టేసి.. ఆ డబ్బులు కూడా కట్టడం లేదు. సత్త్వ వెనక సీఎం చంద్రబాబు, లోకేష్ ఉన్నారు. ఆ సంస్థ చేసే నిర్మానాలకు 50 శాతం మళ్ళీ ఇన్సెంటివ్ ఇస్తున్నారు. దేశంలో ఎక్కడైనా ఇలాంటి ఒప్పందం ఉందా..?. 50% భూమిలో గృహ నిర్మానాలు చేసుకోడానికి అనుమతి ఇచ్చారు..ఇంతకన్నా దారుణం ఇంకెక్కడైనా ఉందా..?, సత్త్వ అన్ని రాష్ట్రల్లో వేలంలో భూములు కొనుక్కుంది’ అని స్పష్టం చేశారు. -
యురేకా...
విజేతలు వీరే... ● 42 కిలోమీటర్ల మారథాన్ పురుషుల విభాగంలో కెబేడ గుమెస్సా 2.29గంటల 39 సెకన్లలో పరుగు పూర్తి చేసి విజేతగా నిలిచారు. ఆ తర్వాత పి. రామ్వెట్టి 2.29గంటల 47 సెకన్లలో, స్టీఫెన్ 2.37గంటల 20 సెకన్లలో పూర్తి చేసి రన్నరప్లుగా నిలిచారు. ● 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్ (సబ్మైరెన్ హాఫ్ మారథాన్) మహిళల ఓపెన్ విభాగంలో సంగమిత్ర మెహతా 1.27 గంటల 41 సెకన్లలో పరుగు పూర్తి చేసి విజేతగా నిలిచారు. ఎం. ఉమ, జ్యోతిదుర్గ రన్నరప్ స్థానాలను దక్కించుకున్నారు. 35–50 ఏళ్ల వారి విభాగంలో హర్మీత్, 50+ విభాగంలో అమర్జీత్ విజేతలుగా నిలిచారు. ● 10 కిలోమీటర్ల పరుగు (ఎయిర్క్రాఫ్ట్ రన్) మహిళల విభాగంలో విశాఖకు చెందిన అథ్లెట్ ఎల్. మెర్సీగ్రేస్ 43.10 సెకన్లలో పరుగును పూర్తి చేసి విజేతగా నిలిచారు. ఆమె రూ.25,000 ప్రోత్సాహకాన్ని అందుకున్నారు. టి. వాణి, సౌమ్య రన్నరప్ స్థానాలను దక్కించుకున్నారు. పురుషుల విభాగంలో ప్రశాంత్ 32 నిమిషాల 54 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలవగా, ఎం. హరీష్, సూర్యజిత్ రన్నరప్లుగా నిలిచారు. ఉరిమే ఉత్సాహం.. -
కోటి సంతకాల ఉద్యమ ర్యాలీకి తరలిరండి
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన ‘కోటి సంతకాల సేకరణ’ ప్రజా ఉద్యమం విజయవంతమైందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తెలిపారు. రెండు నెలలుగా ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించిందని, లక్ష్యాన్ని మించి కోటి సంతకాలను సేకరించామని ఆయన పేర్కొన్నారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సేకరించిన ఈ కోటి సంతకాల పత్రాలను సోమవారం జిల్లా పార్టీ కార్యాలయం నుంచి తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయానికి తరలించనున్నామన్నారు. ఈ సందర్భంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సంతకాల పత్రాల ప్రదర్శన, అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా వాటిని తరలిస్తామని తెలిపారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు వైఎస్సార్సీపీ ఉద్యమాన్ని కొనసాగిస్తుందని కేకే రాజు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, రాజ్యసభ్యుడు గొల్ల బాబురావు, పార్లమెంట్ పరిశీలకులు కె.బాబూరావు, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, పండుల రవీంద్రబాబు, కుంబా రవిబాబు, సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్కుమార్, మళ్ల విజయప్రసాద్, మొల్లి అప్పారావు, తిప్పల దేవన్రెడ్డి హాజరుకానున్నారు. ర్యాలీ జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి సీఎంఆర్ సెంట్రల్ జంక్షన్ వరకు సాగుతుందన్నారు. ర్యాలీలో ప్రజలు, యువత, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. -
రన్డే
సండే..సాగరతీరంలో ఉత్సాహంగా నేవీ మారథాన్ తరలివచ్చిన వేలాది మంది ఔత్సాహికులు, క్రీడాకారులువిశాఖ స్పోర్ట్స్ : విశాఖ సాగర తీరం పరుగు వీరులతో కిక్కిరిసిపోయింది. భారత నావికాదళం ఆధ్వర్యంలో పదోసారి నిర్వహించిన వైజాగ్ నేవీ మారథాన్కు వయోబేధం లేకుండా ఔత్సాహికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. లేలేత సూర్య కిరణాలు శరీరానికి వేడితో పాటు ఉత్తేజాన్నిస్తుండగా, దాదాపు పదిహేడు వేల మంది ఈ పరుగులో భాగస్వామ్యం అయ్యారు. ఈ మారథాన్లో కొందరు విదేశీ అథ్లెట్లు సైతం పాల్గొని పతకాలను సొంతం చేసుకున్నారు.నేవీ డే వేడుకల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన ఈ పరుగును ఫిట్నెస్, సముద్ర ఆహ్లాద వాతావరణంపై అవగాహనతో పాటు నేవీ డే స్ఫూర్తిని పెంపొందించేందుకు నిర్వహించారు. విదేశీ అథ్లెట్లు పాల్గొన్న ఈ పోటీల్లో ముఖ్యంగా ఇథియోపియాకు చెందిన పరుగు వీరులు విజేతలుగా నిలిచారు. విశాఖలోని ఐకానిక్ ఆర్కే బీచ్ వెంబడి ఉన్న విశ్వప్రియ ఫంక్షన్ హాల్ నుంచి నాలుగు ప్రధాన కేటగిరీల్లో పరుగు సాగింది. రన్లో పాల్గొన్నవారికి రిఫ్రెషింగ్, 12 హైడ్రేషన్ పాయింట్లతో పాటు వైద్యసౌకర్యాలు కల్పించారు. ఆరేకే బీచ్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై విజేతలకు పతకాలతో పాటు నగదు ప్రోత్సాహాకాల్ని అందించారు. ఉదయం నుంచి యువతీయుకులు డ్యాన్స్లు చేస్తూ ఉర్రూతలూగించారు. 42 కిలోమీటర్ల రన్ను తూర్పు నౌకాదళ కమాండ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా ప్రారంభించగా..21 కిలోమీటర్ల రన్ను నౌకాదళ కమాండ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా సతీమణి ప్రియభల్లా ప్రారంభించారు..నేవీ అధికారులు, వారి కుటుంబసభ్యులతో పాటు కలెక్టర్ హరేందిర ప్రసాద్ పాల్గొన్నారు. -
పెద్ద మనసు చాటుకున్న వాసుపల్లి
డాబాగార్డెన్స్: బంగ్లాదేశ్లో చిక్కుకుపోయిన నెల్లిమర్లకు చెందిన 9 మంది మత్స్యకారుల కుటుంబాలకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల నష్టపరిహారం ఇచ్చి భరోసా కల్పించాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆశీల్మెట్ట కార్యాలయంలో మత్స్యకార బాధిత కుటుంబాలను ఆదుకున్నారు. మొత్తం 9 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.5 వేలు చొప్పున సాయం అందించడంతో పాటు 25 కేజీల రైస్ బ్యాగ్ ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రభుత్వ స్పందనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మిత్ర దేశంలో బందీగా ఉన్న వారిని విడిపించడానికి చంద్రబాబు ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం మత్స్యకారుల పట్ల నిర్లక్ష్యాన్ని సూచిస్తోందన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో శత్రుదేశమైన పాకిస్తాన్ చెర నుంచి 20 మంది మత్స్యకారులను విడిపించి ఫ్లైట్లో తీసుకొచ్చి ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు తక్షణ సాయం అందించిన మత్స్యకార పక్షపాతి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని వాసుపల్లి గుర్తు చేశారు. బాధితులు చెర నుంచి విడుదలయ్యే వరకు వారికి రేషన్ కూడా అందిస్తామని వాసుపల్లి ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు లండా రమణ, గంగళ్ల రామరాజు, బొడ్డు ఆనంద్, బర్రి కొండలరావు, ఆకుల యేసు, గుంటు ఆనంద్, చోడిపిల్లి శివ, వాసుపల్లి ధనరాజు, దూడ అప్పారావు, దూడ తాతారావు, చేపల నూకరాజు, వేణు, సాగర్, ప్రసాద్, సతీష్, సూరని రాము, దూడ అప్పలరాజు, ముజీబ్ఖాన్, గురజాపు రవి, ఈతలపాక విజయ్, అరుణ, వాసు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం స్పందించకపోయినా వాసుపల్లి గణేష్కుమార్పెద్ద మనసు చాటుకోవడంపై మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు. -
సంరంభానికి సిద్ధం
యుద్ధ నౌకల సాక్షి, విశాఖపట్నం : మహాసముద్రాల మధ్య స్నేహపూర్వక బంధాల్ని బలోపేతం చేసేందుకు, అంతర్జాతీయ సమన్వయం, సహకారంతో నావికాదళ పరాక్రమాన్ని చాటిచెప్పేందుకు విశాఖపట్నం సిద్ధమవుతోంది. తూర్పు నౌకాదళ కేంద్రంగా అభివృద్ధి చెందిన విశాఖ తీరం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అతిపెద్ద యుద్ధ నౌకల సంరంభానికి ఆతిథ్యం ఇవ్వనుంది. 2026 ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు పది రోజుల పాటు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్)తో పాటు మినీ ఐఎఫ్ఆర్గా పిలిచే మిలాన్–2026, ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం (ఐఓఎన్ఎస్)లను ఏకకాలంలో ఇక్కడ నిర్వహించనున్నారు. ఈ మహోత్సవం కోసం తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు ముగిశాయి. ఆరు నెలల క్రితం నుంచి ఐదుసార్లకు పైగా సమీక్షలు నిర్వహించగా.. తాజాగా శనివారం తుది ప్రణాళిక సమావేశం జరిగింది. ఈఎన్సీ హెడ్క్వార్టర్స్ ఆపరేషన్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ మనోజ్ ఝా ఆధ్వర్యంలో జరిగిన ఈ తుది సమావేశానికి 60 దేశాలకు చెందిన నౌకాదళ ప్రతినిధులు ప్రత్యక్షంగా, వర్చువల్గా హాజరయ్యారు. స్నేహభావం, సమన్వయంతో ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని ఈ సమావేశంలో తీర్మానించారు. 145 దేశాలకు ఆహ్వానం.. 2001లో భారత్లో తొలిసారి ముంబైలో ఐఎఫ్ఆర్ నిర్వహించిన సమయంలో 25 దేశాలు హాజరయ్యాయి. 2016లో విశాఖలో నిర్వహించినప్పుడు 51 దేశాలు హాజరయ్యాయి. 2025లో ఇండోనేషియాలోని బాలి సముద్ర తీరంలో ఐఎఫ్ఆర్లో 30 దేశాలు పాల్గొన్నాయి. ఈసారి మాత్రం రికార్డు స్థాయిలో ఐఎఫ్ఆర్, మిలాన్–2026 కోసం ఇప్పటివరకూ 137 దేశాలకు ఆహ్వానం పంపించింది. ఇప్పటి వరకూ 61 దేశాలు నమోదు చేసుకున్నాయి. 61 దేశాలకు సంబంధించి 23 యుద్ధ నౌకలు రాబోతున్నా యి. మిగిలిన దేశాలు త్వరలోనే సమ్మతిని వెల్లడించే అవకాశం ఉంది. ఈ విన్యాసాల్లో భారత నావికా దళానికి చెందిన సర్ఫేస్ యుద్దనౌకలు, జలాంతర్గాములతోపాటు నావల్ ఏవియేషన్ విమానాలు పాల్గొంటున్నాయి. ఢిల్లీ క్లాస్, రాజ్పుత్ క్లాస్, కమోర్తా క్లాస్, విశాఖ క్లాస్, శివాలిక్ క్లుస్, బ్రహ్మపుత్ర క్లాస్, నీలగిరి మొదలైన తరగతులకు చెందిన యుద్ధ నౌకలతో పాటు జలాంతర్గాములు, యుద్ధనౌకలకు అన్నివిధాల సహకారాన్ని అందించే ఫ్లీట్ ట్యాంకర్లు, టార్పెడో రికవరీ వెసల్స్, గ్రీన్టగ్స్ సత్తా చాటనున్నాయి. అలాగే కోస్ట్ గార్డ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్ఐఓటీ) వంటి ఇతర సముద్ర సంస్థలకు చెందిన నౌకలు ఈ ఫ్లీట్ రివ్యూలో భాగస్వామ్యం కానున్నాయి. అత్యాధునిక సర్ఫేస్ యుద్ధనౌకలు, జలాంతర్గాములు ఈ విన్యాసాల్లో భారత నావికాదళానికి చెందిన అత్యాధునిక సర్ఫేస్ యుద్ధనౌకలు, జలాంతర్గాములు, నావల్ ఏవియేషన్ విమానాలు పాల్గొననున్నాయి. ఇందులో ఢిల్లీ క్లాస్, రాజ్పుత్ క్లాస్, కమోర్తా క్లాస్, విశాఖ క్లాస్, శివాలిక్ క్లాస్, బ్రహ్మపుత్ర క్లాస్, నీలగిరి వంటి వివిధ తరగతులకు చెందిన యుద్ధ నౌకలు, జలాంతర్గాములతో పాటు సహాయకారి నౌకలైన ఫ్లీట్ ట్యాంకర్లు, టార్పెడో రికవరీ వెసల్స్ వంటివి తమ సత్తా చాటనున్నాయి. వీటితో పాటు కోస్ట్ గార్డ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్ఐఓటీ) వంటి సముద్ర సంస్థలకు చెందిన నౌకలు కూడా ఈ సమీక్షలో భాగస్వామ్యం కానున్నాయి. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ సహకారంతో 2022లో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూతో పాటు మిలాన్ను, 2024 ఫిబ్రవరిలో మరోసారి మిలాన్ విన్యాసాలను విశాఖ విజయవంతంగా నిర్వహించింది. ఇప్పుడు ఐఎఫ్ఆర్కు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా అంతర్జాతీయ యుద్ధనౌకల ప్రదర్శనల కేంద్రంగా విశాఖ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోనుంది. ముగిసిన నౌకాదళ సన్నాహక సమావేశాలు విశాఖలో ఐ.ఎఫ్.ఆర్, మిలాన్, ఐఓఎన్ఎస్ నిర్వహణ ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు విశాఖ తీరంలో యుద్ధ వాతావరణం ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో ముగిసిన మూడు దఫాల సమీక్షలు సమీక్షలకు హాజరైన 60 దేశాలకు చెందిన నౌకాదళ ప్రతినిధులు ఎప్పుడు... ఎలా.. ఎవరెవరు.? ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్–2026, ఐఓఎన్ఎస్ కాంక్లేవ్ ఆఫ్ చీఫ్స్(సీవోసీ) కార్యక్రమాలు ఫిబ్రవరి 15 నుంచి 25 వరకూ విశాఖ వేదికగా వరుసగా నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 15 నుంచి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్ఆర్) ప్రారంభం కానుంది. డాక్టేరియన్, జాయింట్ ఆపరేషన్లపై ఐఎఫ్ఆర్లో మిత్రదేశాలతో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 15 నుంచి వివిధ దేశాల నుంచి యుద్ధ నౌకలు, నౌకాదళ ప్రతినిధులు విశాఖకు రానున్నారు. 18న ప్రధాన కార్యక్రమం జరుగుతుంది. ఫ్లీట్ని భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము సమీక్షించనున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ విన్యాసాలు, సదస్సు కార్యక్రమాల్లో 19వ తేదీ కీలకమైనది. ఫిబ్రవరి 19న సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పరేడ్ని బీచ్రోడ్డులో నిర్వహిస్తున్నారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారు. అదేవిధంగా మిలాన్–2026 కూడా 19న ప్రారంభం కానుంది. దీంతో పాటు రక్షణ దళం, నౌకాదళంలో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించే అంశాలపై చర్చించేందుకు ఇండియన్ ఓషన్ నేషనల్కాంక్లేవ్(ఐఓఎన్ఎస్) సదస్సుని మహాసాగర్ పేరుతో అంతర్జాతీయ సదస్సు ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు 25 సభ్యదేశాల చీఫ్లతో పాటు వివిధ దేశాలకు సంబంధించిన అతిథులు రాబోతున్నారు. ఐఎఫ్ఆర్, మిలాన్లో 19 నుంచి 20 వరకూ హార్బర్ ఫేజ్ విన్యాసాలు జరుగుతాయి. 21 నుంచి 25 వరకూ సీ ఫేజ్ విన్యాసాలు నిర్వహిస్తారు. -
ఉత్సాహంగా పరుగు
పరుగు సాగిందిలా... ● 42కిలోమీటర్ల ఎయిర్క్రాఫ్ట్ కారియర్ మారథాన్ ఉదయం 4.15 గంటలకే ప్రారంభమైంది. ఇది ఐఎన్ఎస్ కళింగ వద్ద యూ టర్న్ తీసుకుని తిరిగి ప్రారంభ వేదిక వద్దకు చేరుకోవడంతో ముగిసింది. ● 21 కిలోమీటర్ల సబ్మైరెన్ హాఫ్ మారథాన్ ఉదయం 4.30 గంటలకు మొదలై, గాయత్రి కళాశాల వద్ద యూటర్న్ తీసుకుంది. ● 10 కిలోమీటర్ల ఎయిర్క్రాఫ్ట్ రన్ ఉదయం 5.30 గంటలకు ప్రారంభమై, తెన్నేటి పార్క్ వద్ద యూటర్న్ తీసుకుంది. ● 5 కిలోమీటర్ల ఫ్రిగేట్ పరుగు (సరదా పరుగు) ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. చిన్నారులు సైతం హుషారుగా పాల్గొన్నారు. ఇది కురుసురా సబ్మైరెన్ మ్యూజియం మీదుగా వైఎస్సార్ విగ్రహం చెంత యూటర్న్ తీసుకుని ముగిసింది. -
కార్మికులకు నష్టం చేసే 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలి
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు డాబాగార్డెన్స్: సీఐటీయూ 28వ ఆలిండియా మహాసభలు ఈ నెల 31 నుంచి జనవరి 4 వరకు తొలిసారిగా విశాఖలో జరగనున్నాయి. ఈ సందర్భంగా జనవరి 4న ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి నిర్వహించే మహా ప్రదర్శనకు కార్మిక కుటుంబాలను పెద్ద సంఖ్యలో తరలించాలని సిటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు పిలుపునిచ్చారు. జగదాంబ జంక్షన్ సమీపంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం జరిగిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహాసభల విజయవంతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. జిల్లాలో ఇప్పటికే ‘శ్రామిక ఉత్సవాల’ పేరిట సాంస్కృతిక కార్యక్రమాలు, ఎగ్జిబిషన్లు ప్రారంభమయ్యాయని తెలిపారు. సోమవారం వాడవాడలా జెండాలు ఎగురవేసి, ఫ్యాక్టరీల వద్ద, కార్మికుల కాలనీల్లో విస్తృతంగా ప్రచారం చేపట్టాలని ఆయన సూచించారు. స్టీల్ప్లాంట్తో సహా ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ ఉద్యమాలను, లేబర్ కోడ్స్ వల్ల కలిగే ప్రమాదాన్ని కార్మికులకు వివరించాలన్నారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు కె.లోకనాథం, ఎం.జగ్గునాయుడు, ఆర్కేఎస్వీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వివిధ రంగాలకు చెందిన సంఘాల నాయకులు కూడా హాజరై మహాసభల ఏర్పాట్ల గురించి వివరించారు. -
నేడు ఏపీ పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం ఎన్నికలు
మహరాణిపేట: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం, జెడ్పీ యూనిట్ ఎన్నికలు సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి జరగనున్నాయి. జెడ్పీ ప్రాంగణంలోని పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం భవనంలో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి డి. సీతారామరాజు ఒక ప్రకటనలో తెలియజేశారు. జెడ్పీ, పీఆర్, ఆర్డబ్ల్యూఎస్ విభాగాలలో పనిచేస్తున్న మినిస్టీరియల్ ఉద్యోగులందరూ ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా పాల్గొనవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికలకు పరిశీలకులుగా రిటైర్డు ఎంపీడీవో యు. కుర్మారావు వ్యవహరించనున్నారు. -
వ్యక్తిపై కార్పొరేటర్ మూర్తియాదవ్ అనుచరుడి దాడి?
ఎంవీపీకాలనీ: మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు దేవర శంకర్పై రౌడీషీటర్ భోగ రవిశంకర్ రాడ్డుతో దాడికి పాల్పడ్డాడు. శనివారం రాత్రి కళాభారతి రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివి. బాధితుడు దేవర శంకర్ శనివారం రాత్రి కళాభారతి రోడ్డులో ఉండగా, రౌడీషీటర్ రవిశంకర్ ద్విచక్ర వాహనంపై అటుగా వెళ్తున్నాడు. ఈ క్రమంలో శంకర్.. రవిశంకర్ను చూపిస్తూ పరుష పదజాలంతో దూషించాడు. దీంతో ఆవేశానికి లోనైన రవిశంకర్ వెనక్కి వచ్చి దేవర శంకర్పై ఇనుప రాడ్డుతో బలంగా దాడి చేశాడు. ఈ దాడిలో శంకర్ దవడ ఎముక, పళ్లు విరిగిపోయి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎంవీపీ సీఐ ప్రసాద్ తెలిపారు. రవిశంకర్పై గతంలోనే రౌడీషీట్ ఉందని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కాగా.. రౌడీ షీటర్ రవిశంకర్ 22వ వార్డు కార్పొరేటర్ మూర్తియాదవ్కు అనుచరుడిగా జోరుగా ప్రచారం జరుగుతోంది. కార్పొరేటర్ మూర్తియాదవ్కు, బాధితుడు దేవర శంకర్కు మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నాయి. వార్డులో జరుగుతున్న అక్రమాలను శంకర్ సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి కళాభారతి రోడ్డులో ఉన్న అతనిపై రౌడీషీటర్ రవిశంకర్ ఉద్దేశపూర్వకంగా దాడికి పాల్పడినట్లు సమాచారం. దీంతో అక్కడ ఉన్న స్థానికులు శంకర్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. అయితే మూర్తియాదవ్పై ఇప్పటికే స్థానికులు తీవ్ర ఆగ్రహంతో ఉండగా తాజా అతని అనుచరుడైన రౌడీషీటర్.. శంకర్పై భౌతికదాడులకు దిగడం స్థానికులను మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. -
ఖైదీలకు భగవద్గీత పారాయణం
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారంలో ఆదివారం ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు ఖైదీల కోసం భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఖైదీలకు ఇస్కాన్ ప్రతినిధులు భగవద్గీతలోని సారాంశాన్ని, ముఖ్య సందేశాన్ని వివరించారు. మానవ జీవితంలో సత్యం, ధర్మం పాటించడం ఎంత అవసరమో భగవద్గీత బోధనలు నిజ జీవితంలో ఎలా ఉపయోగపడతాయో వారు ఖైదీలకు సూచించారు. కారాగారంలో ఉన్నవారు తమ జీవితంలో పరివర్తన చెందడానికి, మంచి మార్గంలో నడవడానికి గీత స్ఫూర్తిని అందిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఖైదీలకు భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ సంస్థ ప్రతినిధులతో పాటు జైలు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
జీవీఎంసీకి ప్రతిష్టాత్మక పీఆర్ఎస్–2025 జాతీయ అవార్డులు
డాబాగార్డెన్స్: పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో నిర్వహించిన 47వ అఖిల భారత పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్–2025లో జీవీఎంసీ మూడు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను సాధించింది. ఈ విషయాన్ని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ‘ఎంపవరింగ్ గ్రోత్, ప్రిజర్వింగ్ రూట్స్, పీఆర్ విజన్ ఫర్ 2047’ అనే థీమ్తో జరిగిన ఈ సదస్సులో జీవీఎంసీ అమలు చేసిన ప్రజా సంక్షేమం, మహిళా సాధికారత, ఆర్థిక బలోపేతం, సామాజికాభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా అవగాహన కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో ఈ గుర్తింపు లభించింది. ఉత్తరాంఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, శాసనసభ స్పీకర్ రీతూ ఖండూరీ భూషణ్ చేతుల మీదుగా జీవీఎంసీ తరఫున అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి, పౌర సంబంధాల అధికారి ఎన్. నాగేశ్వరరావు అవార్డులు అందుకున్నారు. -
కనకమహాలక్ష్మి సేవలో నటి శ్రీలీల
డాబాగార్డెన్స్: సినీ నటి శ్రీలీల ఆదివారం విశాఖ ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆమెకు స్వాగతం పలికిన అర్చకులు.. ఆలయ సంప్రదాయం ప్రకారం అమ్మవారికి విశేష పూజలు చేయించారు. అనంతరం వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందించగా, ఆలయ ఈవో శోభారాణి అమ్మవారి శేషవస్త్రాలను, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అప్పన్న సన్నిధిలో శ్రీలీల సింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఆదివారం సినీ నటి శ్రీలీల దర్శించుకున్నారు. ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో అర్చకులు అష్టోత్తరంపూజ నిర్వహించారు. వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ప్రసాదం, శేషవస్త్రాలను సూపరింటిండెంట్ సత్య శ్రీనివాస్ అందజేశారు. -
అబ్బాయిలో సానుకూల మార్పు వస్తోంది
మా అబ్బాయికి ఏడీహెచ్డీ, ఆటిజం సమస్యలు ఉన్నాయని గుర్తించి, వైద్యుల సూచన మేరకు స్కేటింగ్లో చేర్పించాం. 8 ఏళ్లుగా సాధన చేస్తున్నాడు. క్రీడలను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడం ఇది మూడోసారి. గతంలో గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించాడు. శారీరక వయసు 14 ఏళ్లు అయినా, మానసిక వయసు 8 ఏళ్లే. కానీ క్రీడల వల్ల ఇప్పుడు అందరితో కలవడం, మాట్లాడటం, ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం అలవాటు చేసుకున్నాడు. – ఎం.నరసింహరాజు, క్రీడాకారుడి తండ్రి -
ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
ఎంవీపీకాలనీ: ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహన్రావు విమర్శించారు. ఆదివారం ఎంవీపీ కాలనీలోని ఎల్ఐసీ ఐక్యతా భవన్లో జరిగిన యూటీఎఫ్ విశాఖపట్నం జిల్లా 50వ కౌన్సిల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా 12వ పీఆర్సీని అమలు చేయకపోవడం, కనీసం చైర్మన్ను కూడా నియమించకపోవడం విచారకరమన్నారు. పీఆర్సీ గడువు ముగిసి రెండేళ్లు దాటిందని, ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలలో ఒక్క డీఏ మాత్రమే చెల్లించారని మండిపడ్డారు. 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులకు పరీక్షలు నిర్వహించడం, టెట్ కత్తిని వేలాడదీయడం వంటి అరాచకాలు ప్రభుత్వం పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు దాసరి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి టీఆర్ అంబేడ్కర్ తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగిన ఆపరేషన్ లంగ్స్ 2.0
319 ఆక్రమణల తొలగింపు డాబాగార్డెన్స్: జీవీఎంసీ పరిధిలో చేపట్టిన ‘ఆపరేషన్ లంగ్స్ 2.0’రెండో రోజైన ఆదివారం కూడా కొనసాగింది. నగరంలోని అన్ని జోన్ల పరిధిలో ఫుట్పాత్లను ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలు, కట్టడాలను టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు. ఎనిమిది జోన్లలో కలిపి ఆదివారం ఒక్క రోజే మొత్తం 319 ఆక్రమణలను తొలగించినట్లు ప్రధాన సిటీ ప్లానర్ ప్రభాకరరావు వెల్లడించారు. జోన్–1లో క్లాక్ టవర్ నుంచి తగరపువలస జంక్షన్ వరకు 20, జోన్–2లో ఎండాడ నుంచి రుషికొండ 100 అడుగుల రోడ్డు వరకు 60, జోన్–3లో స్పోర్ట్స్ ఎరీనా నుంచి బీఎస్ఎన్ఎల్ క్వార్టర్స్ వరకు, అలాగే మహాలక్ష్మీ అపార్టుమెంట్ నుంచి జాతీయ రహదారి(శివాజీ పార్క్ రోడ్డు) వరకు 42, జోన్–4లో లీలామహాల్ జంక్షన్ నుంచి సౌత్జైల్ రోడ్డు వరకు 27, జోన్–5లో ఇండస్ట్రీయల్ ఎస్టేట్ నుంచి మర్రిపాలెం జంక్షన్ వరకు 34, జోన్–6లో శ్రీనగర్ నుంచి దుర్గానగర్ రోడ్డు, బీసీ రోడ్డు జంక్షన్ నుంచి గంగవరం పోర్టు వరకు 53, జోన్–7లో ఎన్టీఆర్ విగ్రహం నుంచి చింతా వారి వీధి వరకు 18, జోన్–8లో ఆర్ఆర్ వెంకటాపురం నుంచి వేపగుంట వరకు, వేపగుంట జంక్షన్ నుంచి గోపాలపట్నం జంక్షన్ వరకు, అలాగే రైల్వేస్టేషన్ రోడ్డు వరకు మొత్తం 65 ఆక్రమణలను తొలగించినట్లు ప్రధాన సిటీ ప్లానర్ తెలిపారు. -
వీరెంతో స్పెషల్!
ఏయూ క్యాంపస్: సాధన, ఏకాగ్రత, పట్టుదల.. ఇవి సాధారణ క్రీడాకారులకే ఎంతో సవాలుతో కూడుకున్న అంశాలు. అలాంటిది ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులు, శారీరక, మానసిక సవాళ్లను అధిగమించి క్రీడల్లో రాణించడమంటే మాటలు కాదు. అసాధ్యం అనుకునే దానిని సుసాధ్యం చేస్తూ.. చక్రాలపై ఆత్మవిశ్వాసంతో దూసుకెళ్లారు. గెలుపోటములతో సంబంధం లేకుండా.. జాతీయ రోలర్ స్కేటింగ్ పోటీల్లో ‘స్పెషల్’చిల్డ్రన్స్ చేసిన సందడి అందరి హృదయాలను హత్తుకుంది. నగరంలో జరుగుతున్న 63వ జాతీయ రోలర్ స్కేటింగ్ పోటీలు ఆదివారం ప్రత్యేక పోటీలకు వేదికయ్యాయి. ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారుల(దివ్యాంగుల) కోసం సింగిల్ ల్యాప్, డబుల్ ల్యాప్ స్పీడ్ స్కేటింగ్ పోటీలు నిర్వహించారు. 6 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి జరిగిన ఈ పోటీల్లో ఇన్లైన్, క్వాడ్ విభాగాల్లో కాళ్లకు చక్రాలు కట్టుకుని దివ్యాంగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 15 రాష్ట్రాల నుంచి 130 మంది చిన్నారులు ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, కేరళ, గుజరాత్, కర్నాటక, బిహార్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హర్యానా, ఒడిశా, ఛండీగఢ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్ తదితర 15 రాష్ట్రాల నుంచి దాదాపు 130 మంది క్రీడాకారులు హాజరయ్యారు. రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఆర్ఎస్ఎఫ్ఐ) గత నాలుగేళ్లుగా శారీరక వైకల్యం ఉన్న వారితో పాటు, మానసిక వైకల్యం కలిగిన చిన్నారులకు కూడా జాతీయ స్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం కల్పిస్తూ ప్రోత్సహిస్తోంది. కాగా.. ఆటను ఆస్వాదించాలన్న తపన ప్రత్యేక అవసరాల గల పిల్లల్లో ముఖాల్లో స్పష్టంగా కనిపించింది. ఏడీహెచ్డీ, ఆటిజం వంటి సమస్యలున్న చిన్నారులు రింక్లో ఎంతో సమన్వయంతో స్కేటింగ్ చేస్తుంటే, గ్యాలరీలో ఉన్న వారి తల్లిదండ్రులు ఆనందంతో కేరింతలు కొట్టారు. చిన్నారుల బంగారు భవిష్యత్తు కోసం క్రీడలను ఒక థెరపీలా భావిస్తూ తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. దీని వల్ల పిల్లల్లో ఏకాగ్రత, స్థిరత్వం పెరగడంతో పాటు, నలుగురిలో కలివిడిగా తిరిగే నైపుణ్యాలు మెరుగుపడుతున్నాయని వారు తెలిపారు. స్కేటింగ్లో ఉత్సాహంగా ముందుకు సాగుతున్న ప్రత్యేక అవసరాలు గల పిల్లలుమేధో వైకల్య స్కేటింగ్ పోటీల విజేతలు వీరే.. విశాఖ స్పోర్ట్స్: ఇన్లైన్ స్పీడ్ స్కేటింగ్లో 6–8 ఏళ్ల బాలుర విభాగంలో రేయాంశ్, 10–12 ఏళ్ల క్యాడెట్ బాలుర విభాగంలో సూర్యరామ, 12–15 ఏళ్ల సబ్ జూనియర్స్ విభాగంలో రిత్విక్, 15–18 ఏళ్ల జూనియర్స్ విభాగంలో సాయి నిఖిల్ విజేతలుగా నిలిచారు. క్వాడ్ స్పీడ్ స్కేటింగ్లో 6–8 ఏళ్ల బాలుర విభాగంలో కేదార్, బాలికల విభాగంలో లిఖిత శ్రీ ప్రథమ స్థానంలో నిలిచారు. అలాగే 8–10 ఏళ్ల క్యాడెట్ విభాగంలో ఉజ్వల్ శ్రీనివాస్, ధార్మిక, 10–12 ఏళ్ల క్యాడెట్ విభాగంలో సాధిక్, చెన్నకేశవ, 15–18 ఏళ్ల జూనియర్ విభాగంలో సిద్ధార్థ్ తమ ప్రతిభను కనబరిచారు. -
విశేష స్పందన
‘సాక్షి’ స్పెల్ బీ సెమీ ఫైనల్స్కుసీతంపేట: ‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘స్పెల్ బీ 2025–26’ సెమీఫైనల్ పోటీలకు విశేష స్పందన లభించింది. సీతమ్మధార నార్త్ ఎక్స్టెన్షన్లోని శ్రీవిశ్వ స్కూల్లో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నాలుగు కేటగిరీల్లో ఈ పోటీలు జరిగాయి. రీజనల్ లెవెల్లో జరిగిన ఈ పోటీల్లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి పలు పాఠశాలలకు చెందిన 120 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు నాలుగు కేటగిరీల్లో పోటీలు నిర్వహించారు. 40 నిమిషాల వ్యవధితో, 40 మార్కులకు ఈ పరీక్ష జరిగింది. ఇందులో గెలుపొందిన విజేతలు హైదరాబాద్లో జరగనున్న ఫైనల్ పోటీల్లో పాల్గొంటారు. ఈ పోటీలకు ‘డ్యూక్స్ వేఫీ’ప్రధాన స్పాన్సర్గా, ‘ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్(రాజమండ్రి)’అసోసియేట్ స్పాన్సర్గా వ్యవహరించారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా ‘సాక్షి’ స్పెల్ బీ పోటీలు దోహదపడుతుండటంతో.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు స్వయంగా పిల్లలను పరీక్ష కేంద్రాలకు తీసుకువచ్చారు. దీంతో శ్రీవిశ్వ స్కూల్ ఆవరణ సందడిగా మారింది. ఈ పోటీలను ‘సాక్షి’ విశాఖ బ్రాంచి మేనేజర్ వి.వి.ఎస్.చంద్రరావు పర్యవేక్షించగా, శ్రీ విశ్వ విద్యాసంస్థల చైర్మన్ కె.ధర్మరాజు, డైరెక్టర్ పి.సూర్యనారాయణ పాల్గొన్నారు.భాషా నైపుణ్యాలు మెరుగుపడతాయి ‘సాక్షి’స్పెల్ బీ పోటీలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. గతంలో కూడా ఒకసారి హాజరయ్యాను. స్పెల్ బీ వల్ల ఉచ్చారణ, భాషాజ్ఞానం పెరుగుతాయి. కొత్త పదాలు తెలుస్తాయి. ప్రతి విద్యార్థి ఇందులో పాల్గొనడం వల్ల, ముఖ్యంగా తెలుగు మాధ్యమం విద్యార్థులు తమ ఇంగ్లిష్ స్పెల్లింగ్ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవచ్చు. – పి.జీవన్ కుషాల్, వేపగుంట క్రమం తప్పకుండా పోటీలు విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలు పెంపొందించేలా ‘సాక్షి’మీడియా ఏటా స్పెల్బీ, మ్యాథ్స్బీ పోటీలు నిర్వహిస్తోంది. ఈసారి సెమీఫైనల్ పోటీలకు మా పాఠశాల వేదిక కావడం సంతోషంగా ఉంది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల నుంచి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇటువంటి పోటీల వల్ల ఇంగ్లిష్, మ్యాథ్స్లో వారు మరింత పట్టు సాధించగలరు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఇటువంటి పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి. – ఎ.ఆర్.కె.శివాజీ, డైరెక్టర్, శ్రీవిశ్వ స్కూల్ ఇంగ్లిష్పై పట్టు సాధించవచ్చు ‘సాక్షి’పేపర్లో ప్రకటన చూసి, మా స్కూల్ టీచర్లు చెప్పడంతో పలాస నుంచి స్పెల్ బీ సెమీఫైనల్ పోటీలకు హాజరయ్యాను. ఇంగ్లిష్ పదాల ఉచ్చారణ, కొత్త పదాలు నేర్చుకున్నాను. ఇంగ్లిష్ వకాబులరీ, ఫోనిక్స్, సౌండ్స్పై అవగాహన పెంచుకుని భాషపై పట్టు సాధించడానికి ‘సాక్షి’నిర్వహించిన ఈ పోటీలు ఎంతగానో సహాయపడతాయి. – దాసరి తేజేశ్వరరావు, 8వ తరగతి, పలాస ఫైనల్స్కు వెళ్తానన్న నమ్మకం ఉంది నేను శ్రీకాకుళంలో 8వ తరగతి చదువుతున్నాను. ఇప్పటి వరకు నిర్వహించిన రౌండ్లలో గెలుపొంది, ఇప్పుడు సెమీ ఫైనల్ పోటీకి చేరుకోవడం ఆనందంగా ఉంది. ఇంగ్లిష్ నైపుణ్యాలు మెరుగుపర్చుకోవడానికి స్పెల్ బీ ఎంతో ఉపయోగపడుతుంది. – రౌతు చైతన్య, 8వ తరగతి, శ్రీకాకుళం -
పోర్టును గాలికొదిలేశారు..!
సాక్షి, విశాఖపట్నం : మేజర్ పోర్టులతో పోటీపడుతూ.. సరకు రవాణాలో దూకుడుగా వెళ్తున్న విశాఖపట్నం పోర్టు అథారిటీ(వీపీఏ)కి కేంద్ర ప్రభుత్వం బ్రేకులు వేసేసింది. ఒకేసారి ఉన్నతాధికారులను బదిలీ చేసి.. వారి స్థానంలో కొత్తవారిని నియమించకుండా.. పోర్టు కార్యకలాపాలను గాలికొదిలేసింది. ఇదే అదనుగా ఓ మహిళా అధికారి పోర్టులో పెత్తనం చెలాయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇన్చార్జ్ చైర్మన్ కూడా పట్టించుకోకపోవడంతో ఆయా విభాగాధికారులు ఎవరికివారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.ముందుకు కదలని ఫైళ్లు విశాఖ పోర్టు అనాథగా మారిపోయింది. అధికారులంతా బదిలీ అవ్వడంతో కార్యకలాపాలు, ఇతర వ్యవహారాలు అస్తవ్యస్తమైపోయాయి. పోర్టు చైర్మన్ డా.అంగముత్తుని ముంబై పోర్టు చైర్మన్గా బదిలీ చేయడంతో పాటు వీపీఏ ఇన్చార్జ్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించారు. అయినా.. చైర్మన్ మాత్రం ముంబైకే పరిమితమయ్యారు. నెలలో ఒకట్రెండు సార్లు మాత్రమే పోర్టుకు వస్తూ.. తూతూ మంత్రంగా సమీక్షలు నిర్వహించి వదిలేస్తున్నారు. దీంతో పాలన గాడితప్పింది. ఇక డిప్యూటీ చైర్మన్గా దుర్గేష్ కుమార్ దూబే పదవీ కాలం ఇంకో రెండు నెలలు ఉన్నా.. ఇటీవలే బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. పోర్టు చరిత్రకు భిన్నంగా డిప్యూటీ చైర్మన్ పదవీకాలం ఉన్నప్పటికీ బదిలీ చేసేశారు. రిలీవ్ అయ్యేందుకు ఈ నెల 19వ తేదీ వరకూ సమయం ఉన్నా బదిలీ విషయంలో జరిగిన అన్యాయంతో పోర్టు వ్యవహారాల్ని పట్టించుకోవడం మానేశారు. అదేవిధంగా ఏళ్ల తరబడి సెక్రటరీగా వ్యవహరించిన వేణుగోపాల్ని పారాదీప్ పోర్టుకు డిప్యూటీ చైర్మన్గా బదిలీ చేశారు. పరిపాలన వ్యవహారాల ఫైళ్లు ముందుకు కదిపే ఉన్నతాధికారులు లేకపోవడంతో పోర్టులో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారిపోయింది. అంతా ఆమె కనుసన్నల్లోనే..! ట్రాఫిక్ విభాగంలో ఉన్నతాధికారి అనారోగ్యం కారణంగా అంతంత మాత్రంగానే విధుల నిర్వహణలో భాగస్వామ్యమవుతున్నారు. దీంతో ఈ విభాగంలో కార్యకలాపాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. కేవలం షిప్స్ బెర్తింగ్, లోడింగ్, అన్లోడింగ్ వ్యవహారాలు కిందిస్థాయి సిబ్బంది ద్వారా మేనేజ్ చేస్తున్నారు. ఇలా పోర్టులో ప్రతి విభాగాన్ని నడిపించే నాయకత్వం లేకపోవడంతో వ్యవహారాలు సరిగా జరడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉన్నతాధికారులెవ్వరూ లేకపోవడంతో ఓ మహిళా అధికారి.. అంతా తానై పోర్టులో చక్రం తిప్పుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమెపై గతంలో సీబీఐ దాడులు జరిగాయి. తర్వాత విధుల్లో చేరిన సదరు మహిళా అధికారి ఇప్పుడు పోర్టులో గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారంటూ విమర్శలొస్తున్నాయి. పోర్టులో అన్ని విభాగాల్లోనూ ఆమె తలదూర్చి.. ఉద్యోగుల్ని ఇబ్బంది పెడుతున్నారంటూ పోర్టు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. వీలైనంత త్వరగా విభాగాధిపతులను నియమించి పోర్టును తిరిగి గాడిలో పెట్టాలంటూ ఉద్యోగులు కోరుతున్నారు. -
మళ్లీ ఆపరేషన్ లంగ్స్
డాబాగార్డెన్స్: ఆపరేషన్ లంగ్స్–2 మళ్లీ మొదలైంది. ఎప్పుడు ఎవరిపై విరుచుకుపడతారోనన్నా ఆందోళనతో చిరువ్యాపారులు బిక్కుబిక్కుమంటున్నారు. దాదాపు మూడు నెలల కిందట భాగస్వామ్య సదస్సు, నగరాభివృద్ధి పేరిట జీవీఎంసీ పరిధిలో వేలాది దుకాణాలు తొలగించి చిరు వ్యాపారులను రోడ్డున పడేశారు. ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. ఇప్పటి వరకు దుకాణాలు కోల్పోయిన వారిని పట్టించుకున్న నాథుడే కరువ య్యాడు. మళ్లీ శనివారం జీవీఎంసీ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు జీవీఎంసీ పరిధిలో 336 ఆక్రమణలు తొలగించారు. ఆపరేషన్ లంగ్స్ 2.0లో భాగంగా అన్ని జోన్లలో రోడ్లపై ఆక్రమణలు తొలగిస్తున్నట్లు చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకరరావు తెలిపారు. ప్రజా సౌకర్యార్థమై ఆక్రమణల తొలగింపు కొనసాగిస్తూ ప్రత్యేక కార్యాచరణ చేపట్టడం జరిగిందన్నారు. ● జోన్–1 పరిధి ఒకటో వార్డులో అంబేడ్కర్ విగ్రహం నుంచి తగరపువలస వైఎస్సార్ విగ్రహం వరకు 15 ఆక్రమణలు, జోన్–2 పరిధి 5, 7 వార్డుల్లో మారికవలస జంక్షన్ నుంచి బోయపాలెం రోడ్డు వరకు, చంద్రంపాలెం నుంచి హైస్కూల్ వరకు 40 ఆక్రమణలు, జోన్–3 పరిధి 18వ వార్డులో సమతా కాలేజీ సర్కిల్, ఏఎస్ రాజా కాలేజీ సర్కిల్లో 23 ఆక్రమణలు, జోన్–4 పరిధి 31వ వార్డు లీలామహాల్ జంక్షన్ నుంచి సౌత్ జైల్ రోడ్డు వరకు 31 ఆక్రమణలు, జోన్–5 పరిధి 54, 55, 56, 57 వార్డుల్లో కంచరపాలెం నుంచి ఎన్ఏడీ జంక్షన్ వరకు 80 ఆక్రమణలు, జోన్–6 పరిధి 65, 66, 71, 72, 75, 76 వార్డుల్లో శ్రీనగర్ నుంచి దుర్గానగర్ రోడ్డు, బీసీ రోడ్డు జంక్షన్ నుంచి గంగవరం పోర్టు రోడ్డు వరకు 70 ఆక్రమణలు, జోన్–7 పరిధి 82, 83 వార్డుల్లో నెహ్రూచౌక్ నుంచి తహసీల్దార్ కార్యాల యం వరకు 12 ఆక్రమణలు, జోన్–8 పరిధి 97వ వార్డు సుజాతనగర్ 80 ఫీట్ రోడ్డు నుంచి ఎలక్ట్రికల్ ఆఫీస్ వరకు 30 ఆక్రమణలు తొలగించినట్టు సీసీపీ తెలిపారు.జీవీఎంసీ పరిధిలో 336 ఆక్రమణల తొలగింపు -
సోనోవిజన్లో ఎల్జీ ఉత్పత్తులు ప్రారంభం
విశాఖ సిటీ: గృహోపకరణాల దిగ్గజ సంస్థ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ డైమండ్ పార్క్ వద్ద ఉన్న సోనోవిజన్ షోరూమ్లో కొత్త ప్రీమియం రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లను ప్రారంభించింది. ఈ గ్రాండ్ ప్రొడక్ట్ లాంచ్ ఈవెంట్ను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎల్జీ ప్రొడక్ట్ హెడ్(రిఫిజిరేటర్లు) అశోక్బాబు మసం, రీజనల్ బిజినెస్ హెడ్ కె.వి.కృష్ణాజీ, షోరూమ్ బ్రాంచ్ మేనేజర్ పవన్ మోంగా, ఉగంధర్ ఇల్లిబిల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్ట్రా గ్లామ్ సిరీస్ సైడ్–బై–సైడ్ రిఫ్రిజిరేటర్లతో పాటు ఆధునిక ఫీచర్లతో కూడిన ఫ్రంట్లోడ్, టాప్లోడ్ వాషింగ్ మెషీన్లను ఆవిష్కరించారు. -
పోర్టును గాలికొదిలేశారు..!
సాక్షి, విశాఖపట్నం: మేజర్ పోర్టులతో పోటీపడుతూ.. సరకు రవాణాలో దూకుడుగా వెళ్తున్న విశాఖపట్నం పోర్టు అథారిటీకి కేంద్ర ప్రభుత్వం బ్రేకులు వేసేసింది. ఒకేసారి ఉన్నతాధికారులను బదిలీ చేసి.. వారి స్థానంలో కొత్తవారిని నియమించకుండా.. పోర్టు కార్యకలాపాలను గాలికొదిలేసింది. ఇదే అదనుగా ఓ మహిళా అధికారి పోర్టులో పెత్తనం చెలాయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇన్చార్జ్ చైర్మన్ కూడా పట్టించుకోకపోవడంతో ఆయా విభాగాధికారులు ఎవరికివారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ముందుకు కదలని ఫైళ్లు : విశాఖ పోర్టు అనాథగా మారిపోయింది. అధికారులంతా బదిలీ అవ్వడంతో కార్యకలాపాలు, ఇతర వ్యవహారాలు అస్తవ్యస్తమైపోయాయి. పోర్టు చైర్మన్ డా.అంగముత్తుని ముంబై పోర్టు చైర్మన్గా బదిలీ చేయడంతో పాటు వీపీఏ ఇన్చార్జ్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించారు. అయినా.. చైర్మన్ మాత్రం ముంబైకే పరిమితమయ్యారు. నెలలో ఒకట్రెండు సార్లు మాత్రమే పోర్టుకు వస్తూ.. తూతూ మంత్రంగా సమీక్షలు నిర్వహించి వదిలేస్తున్నారు. దీంతో పాలన గాడితప్పింది. ఇక డిప్యూటీ చైర్మన్గా దుర్గేష్ కుమార్ దూబే పదవీ కాలం ఇంకో రెండు నెలలు ఉన్నా.. ఇటీవలే బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. పోర్టు చరిత్రకు భిన్నంగా డిప్యూటీ చైర్మన్ పదవీకాలం ఉన్నప్పటికీ బదిలీ చేసేశారు. రిలీవ్ అయ్యేందుకు ఈ నెల 19వ తేదీ వరకూ సమయం ఉన్నా బదిలీ విషయంలో జరిగిన అన్యాయంతో పోర్టు వ్యవహారాల్ని పట్టించుకోవడం మానేశారు. అదేవిధంగా ఏళ్ల తరబడి సెక్రటరీగా వ్యవహరించిన వేణుగోపాల్ని పారాదీప్ పోర్టుకు డిప్యూటీ చైర్మన్గా బదిలీ చేశారు. పరిపాలన వ్యవహారాల ఫైళ్లు ముందుకు కదిపే ఉన్నతాధికారులు లేకపోవడంతో పోర్టులో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారిపోయింది. అంతా ఆమె కనుసన్నల్లోనే..! ట్రాఫిక్ విభాగంలో ఉన్నతాధికారి అనారోగ్యం కారణంగా అంతంత మాత్రంగానే విధుల నిర్వహణలో భాగస్వామ్యమవుతున్నారు. దీంతో ఈ విభాగంలో కార్యకలాపాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. కేవలం షిప్స్ బెర్తింగ్, లోడింగ్, అన్లోడింగ్ వ్యవహారాలు కిందిస్థాయి సిబ్బంది ద్వారా మేనేజ్ చేస్తున్నారు. ఇలా పోర్టులో ప్రతి విభాగాన్ని నడిపించే నాయకత్వం లేకపోవడంతో వ్యవహారాలు సరిగా జరడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉన్నతాధికారులెవ్వరూ లేకపోవడంతో ఓ మహిళా అధికారి.. అంతా తానై పోర్టులో చక్రం తిప్పుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమైపె గతంలో సీబీఐ దాడులు జరిగాయి. తర్వాత విధుల్లో చేరిన సదరు మహిళా అధికారి ఇప్పుడు పోర్టులో గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారంటూ విమర్శలొస్తున్నాయి. పోర్టులో అన్ని విభాగాల్లోనూ ఆమె తలదూర్చి.. ఉద్యోగుల్ని ఇబ్బంది పెడుతున్నారంటూ పోర్టు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. వీలైనంత త్వరగా విభాగాధిపతులను నియమించి పోర్టును తిరిగి గాడిలో పెట్టాలంటూ ఉద్యోగులు కోరుతున్నారు. -
నాడు ముంపు
తొమ్మిది జిల్లాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక నేడు హ్యాపీఆదివారం శ్రీ 14 శ్రీ డిసెంబర్ శ్రీ 2025మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి మహారాణిపేట: విశాఖ ఎకనామిక్ రీజియన్ ద్వారా తొమ్మిది జిల్లాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు జిల్లా ఇంచార్జి మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి తెలిపారు. శనివారం ప్రభుత్వ అతిథి గృహంలో శాసన సభ్యులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విశాఖపై ప్రత్యేక అభిమానం ఉందని, శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు తొమ్మిది జిల్లాలతో వీఈఆర్ ఏర్పాటు చేశారని మంత్రి చెప్పారు. వచ్చే నెలలో వైజాగ్ బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు తెలిపారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ తొమ్మిది ఐటీ కంపెనీలకు శంకుస్థాపన చేశామని, గూగుల్ రాకతో విశాఖ ముఖచిత్రం మారబోతుందని అన్నారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ వీఈఆర్ లక్ష్యం 2031 నాటికి 10 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకురావడమేనని తెలిపారు. స్టీల్ ప్లాంట్ బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. విశాఖ ఉత్తర ఎమ్మెల్యే పి. విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ 2031 నాటికి 135 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్కు నిధులు కేటాయించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని తెలిపారు. సమావేశంలో ఏపీ గ్రోవర్స్ ఆయిల్స్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గండిబాబ్జీ, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు పాల్గొన్నారు. సాక్షి, విశాఖపట్నం : ‘హుద్హుద్ వంటి తుపాన్లు పరంగా చూస్తే విశాఖపట్నం సునిశిత ప్రాంతం. ఇక్కడ రాజధాని అంటే రిస్క్తో కూడుకున్న వ్యవహారం.’ ‘సముద్ర మట్టాలు పెరుగుతుండటం వల్ల తీర ప్రాంత నగరమైన విశాఖపట్నం ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. ఉత్తర కోస్తా తీరం నుంచి 100 కి.మీ దూరంలో సముద్రంలో చీలిక ఉంది. సునామీ వస్తే క్షణాల్లో ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది’ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన సమయంలో చంద్రబాబు అండ్ కో కలిసి పచ్చపత్రికల సాయంతో విశాఖపట్నంపై చిమ్మిన విషం ఇది. కానీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. విశాఖపట్నం మోస్ట్ హ్యాపియెస్ట్ సిటీ. అత్యంత సురక్షిత నగరం. ప్రపంచమంతా మెచ్చే నగరం అంటూ చంద్రబాబు వైజాగ్ భజన చేస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు రెండు నాల్కల ధోరణే అవలంబిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో మాట చెప్పడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యగా మారిపోయింది. సీఎం కుర్చీలో కూర్చున్న ప్రతిసారీ వైజాగ్ ఆర్థిక రాజధాని అంటూ ఊదరగొట్టే ఆయన.. ఆ దిశగా అభివృద్ధి చెందేందుకు అవకాశం వచ్చినప్పుడు మాత్రం పూర్తిగా మాటమార్చేశారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార వికేంద్రీకరణ జరిగితే రాష్ట్రమంతా సమాంతరంగా అభివృద్ధి చెందుతుందని భావించి.. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా.. అమరావతిని శాసన రాజధానిగా.. కర్నూలును న్యాయరాజధానిగా ప్రకటించారు. అప్పుడే చంద్రబాబు తన వైఖరిని బయటపెట్టుకున్నారు. రాజధానిగా విశాఖకు ఎలాంటి అవకాశాలు లేవని. తుపాన్లు, సముద్ర ముంపుతో భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవంటూ తన అనుయాయ పత్రికలు, ప్రసారమాధ్యమాల ద్వారా.. పార్టీ నాయకుల ద్వారా ప్రచార హోరు సాగించారు. విశాఖ అభివృద్ధి కాకుండా విశ్వప్రయత్నాలు చేశారు. అప్పటి నుంచే విశాఖ వైపు అడుగులు అధికారంలో రాగానే బాబు గారి ‘విశాఖ’ రంగు మారెనూ.. నాడు కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ప్రకటించిన వైఎస్ జగన్ ఆ సమయంలో విశాఖపై విషం చిమ్మిన టీడీపీ, జనసేన నేతలు సముద్రం ముందుకొచ్చి మునిగిపోతుందంటూ విష ప్రచారం భూకంపాల తీవ్రతా ఉందంటూ పచ్చరాతలు అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ చుట్టూ ప్రదక్షిణలు నగరం అత్యంత సురక్షితమంటూ హడావుడి చేస్తున్న చంద్రబాబు బ్యాచ్ -
రాజీమార్గమే రాజమార్గం
విశాఖ లీగల్: రాజీమార్గమే రాజమార్గమని విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు అన్నారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా ప్రాధికార సంస్థ కార్యాలయంలో జాతీయ మెగా లోక్ అదాలత్ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కక్షిదారులకు సత్వర న్యాయం లోక్ అదాలత్ ద్వారా లభిస్తుందన్నారు. శాశ్వతమైన పరిష్కారం, ఫలాలను అందించే రాజీమార్గాన్ని కక్షిదారులు ఎంచుకోవాలన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన మెగా లోక్దాలత్కు విశేష స్పందన లభించిందన్నారు. మూడు జిల్లాల పరిధిలో 43 ప్రత్యేక బెంచీలను ఏర్పాటు చేశామని, న్యాయస్థానంలో రాజీకి అనుగుణంగా 25 వేల పైచిలుకు కేసులను గుర్తించామన్నారు. న్యాయవాదులు, కక్షిదారులు, సిబ్బంది, అధికారులు, బ్యాంకులు, బీమా కంపెనీలు అందించిన సేవలకు న్యాయమూర్తి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు మాట్లాడుతూ లోక్ అదాలత్తో తొలిసారిగా రెండు కేసుల్లో రూ.2 కోట్లు అందించినట్లు వివరించారు. ఐసీఐసీఐ బ్యాంక్, ద న్యూ ఇండియా ఎస్యురెన్స్ కంపెనీల ద్వారా రూ.1.9 కోట్లు బాధితులకు అందజేశారు. ఏడో అదనపు జిల్లా కోర్టులో రూ.40 లక్షలు, 12వ అదనపు జిల్లా కోర్టులో రూ.1.5 కోట్లు పరిహారంగా అందజేశారు. తొలిసారిగా భారీ మొత్తంలో పరిహారాన్ని వినియోగదారులకు అందించి న్యాయస్థానాలకు సహకరించిన బీమా కంపెనీలకు కార్యదర్శి సన్యాసినాయుడు అభినందించారు. కేసుల వివరాలు 160 మోటారు ప్రమాద కేసులను పరిష్కరించి నష్టపరిహారం కింద రూ.12,55,19,761 అందజేశారు. సివిల్ 430 కేసులు, క్రిమినల్ 13,722 కేసులు, సీ్త్ర లిటిగేషన్ 157 కేసులు రాజీ చేయడంలో ఉమ్మడి విశాఖ జిల్లా రాష్ట్రంలో ఆరో స్థానంలో నిలిచిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. కోర్టులో ఉన్న సివిల్ మార్టిగేజ్ సూట్ కేసులో రూ.50 లక్షలు కేసు రాజీ కుదరింది. పీఎల్సీలో రూ.70 లక్షలు విచారణకు ముందే (కరూర్ వైశ్య బ్యాంకు) రాజీ ప్రయత్నాల ద్వారా సెటిల్మెంటు పూర్తయింది. అయిదు కేసులకు సంబంధించిన భార్యభర్తలు తిరిగి కలిసి జీవించడానికి అంగీకారం కుదిరింది. -
‘ఆల్పైన్’లో ఏపీ స్కేటర్ల స్వర్ణాల పంట
విశాఖ స్పోర్ట్స్: జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్లో భాగంగా తొట్లకొండ సర్క్యూట్లో జరుగుతున్న ఆల్పైన్, డౌన్హిల్ ఈవెంట్లు శనివారంతో ఉత్సాహంగా ముగిశాయి. 12 ఏళ్లు పైబడిన వారి కోసం నిర్వహించిన ఈ పోటీల్లో ఆల్పైన్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ స్కేటర్లు సత్తాచాటి స్వర్ణాలు కై వసం చేసుకోగా, డౌన్హిల్లో తమిళనాడు రైడర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. ఆల్పైన్ స్కేటింగ్ ఇలా... ఇన్లైన్ ఆల్పైన్ స్కేటింగ్ అనేది తారు రోడ్డుపై నిర్వహించే సాహసోపేతమైన క్రీడ. ఇందులో పాల్గొనేవారు వేగంతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని జోడించి దూసుకుపోవాల్సి ఉంటుంది. థ్రిల్తో కూడిన ఈ రేస్లో చిన్న చేతికర్రల సహాయం తీసుకోవచ్చు. మార్గమధ్యలో ఉండే అవరోధాలను చాకచక్యంగా దాటుతూ రేస్ పూర్తి చేయాలి. ఈ క్లిష్టమైన అంశంలో ఆంధ్రప్రదేశ్ స్కేటర్లు అద్భుతంగా రాణించి ఏకంగా ఏడు స్వర్ణ పతకాలను కొల్లగొట్టారు. డౌన్హిల్ స్కేటింగ్ ఇలా... డౌన్హిల్ అంశంలో రైడర్లు స్కేట్బోర్డ్పై తమ శరీర బరువును నియంత్రించుకుంటూ ఎత్తైన ప్రదేశం నుంచి కిందకు జారుతూ ప్రతిభ చూపాలి. ఇందులో శరీర బరువులో దాదాపు 80 శాతాన్ని ముందుకు వంచుతూ, బరువును మార్చుకుంటూ, దిగువ శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లడమే ఈ అంశంలోని ప్రత్యేకత. ఇందులో తమిళనాడు రైడ ర్లు చక్కటి ప్రదర్శనతో స్వర్ణాలు అందుకున్నారు. ఆల్పైన్ విజేతలు వీరే.. 12–15 ఏళ్ల బాలికల విభాగంలో వి.అమృత, బాలురలో జె.జశ్వంత్ విజేతలుగా నిలిచారు. 15–18 ఏళ్ల బాలుర విభాగంలో వెంకట నాగ మురళీ స్వర్ణం సాధించాడు. 18 ఏళ్లు పైబడిన(సీనియర్) మహిళల విభాగంలో వెంకట రమ్యశ్రీ, పురుషుల విభాగంలో వెంకట పవన్ విజేతలుగా నిలిచారు. వీరంతా ఏపీకి చెందిన వారే. 15–18 ఏళ్ల బాలికల విభాగంలో మాత్రం తమిళనాడుకు చెందిన అహల్య విజేతగా నిలిచింది. డౌన్హిల్ విజేతలు వీరే.. 12–15 ఏళ్ల బాలికల విభాగంలో ఎస్.నందిని, బాలురలో ఎస్.పవన్, 15–18 ఏళ్ల బాలికల విభాగంలో శృతి, బాలురలో గురు హర్షన్, 18 ఏళ్లు పైబడిన మహిళల విభాగంలో వర్షిణి, పురుషుల విభాగంలో కిశోర్ కృష్ణ విజేతలుగా నిలిచారు. వీరంతా తమిళనాడుకు చెందినవారు. ఆంధ్ర స్కేటర్లు ఐశ్వర్య, రమ్యశ్రీ, మనస్వి కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. రోడ్ రేస్(వన్ ల్యాప్) ఫలితాలిలా.. 12–15 ఏళ్ల బాలికల విభాగంలో అనుష్క తైగల్ (యూపీ), బాలురలో శంతను అగర్వాల్ (హర్యానా), 15–18 ఏళ్ల బాలికల విభాగంలో అరుంధతి సహాని(తమిళనాడు), బాలురలో సంజయ్ (తమిళనాడు), 18 ఏళ్లు పైబడిన మహిళల విభాగంలో ఎం.కల్పన (తమిళనాడు), పురుషుల విభాగంలో ఆర్యన్పాల్ సింగ్ (హర్యానా) ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణ పతకాలు సాధించారు. డౌన్హిల్లో సత్తాచాటిన తమిళనాడు రైడర్లు -
సరకు రవాణాలో వాల్తేర్ డివిజన్ సరికొత్త రికార్డు
తాటిచెట్లపాలెం: ఈస్ట్కోస్ట్ రైల్వే, వాల్తేరు డివిజన్ సరకు లోడింగ్లో గత రికార్డులను అధిగమించి కొత్త మైలురాయిని చేరుకుంది. డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్ర ఈ విషయాన్ని తెలిపారు. శుక్రవారం వాల్తేరు డివిజన్ సరకు లోడింగ్ అన్లోడింగ్లో 100 మిలియన్ టన్నుల మార్కును చేరుకుందని శనివారం మీడియాకు వివరించారు. గతంలో 288 రోజుల్లో చేరుకున్న ఈ రికార్డును ఈసారి కేవలం 256 రోజుల్లోనే పూర్తిచేసి రికార్డు సృష్టించింది. ఈ ఘనత సాధించడంలో కృషి చేసిన ఆపరేషన్స్, కమర్షియల్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్ సహా అన్ని విభాగాల సిబ్బందిని, అలాగే సహకరించిన కస్టమర్లను, భాగస్వాములను డీఆర్ఎం లలిత్ బోహ్ర అభినందించారు. -
పోలీసుల ఆరోగ్య భద్రతే లక్ష్యం
విశాఖ సిటీ: సమాజ భద్రత కోసం అహర్నిశలు ఒత్తిడితో కూడిన విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు, వారి కుటుంబాల భద్రతే తన లక్ష్యమని పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పేర్కొన్నారు. శనివారం పోలీస్ సమావేశ మందిరంలో పోలీస్ కుటుంబాల బాలికలకు హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ జరగని విధంగా విశాఖలో తొలిసారిగా పోలీసుల ఆరోగ్య భద్రత కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే పోలీస్ కుటుంబాలకు రూ.47 లక్షలతో ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పించినట్లు వెల్లడించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది కుటుంబాలకు చెందిన 9 నుంచి 14 ఏళ్ల బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్లు వేయిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సహకరించిన చైతన్య స్రవంతి, నాట్కో ట్రస్ట్, లయన్స్ క్లబ్ ఛారిటబుల్ ట్రస్ట్, లయన్స్ క్యాన్సర్ అండ్ జనరల్ హాస్పిటల్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వ్యాక్సిన్ ఉపయోగాలను అందరికీ అవగాహన కల్పించేందుకు త్వరలోనే బీచ్ రోడ్డులో ర్యాలీ నిర్వహిస్తామన్నారు. హోంగార్డులకు ఆరోగ్య బీమా ఆలోచన త్వరలో హోంగార్డుల కుటుంబాలకు ఈ హెచ్పీవీ వ్యాక్సిన్లతో పాటు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించే ఆలోచన చేస్తున్నామన్నారు. ఇందుకోసం దాతలు హోం గార్డ్స్ వెల్ఫేర్ ఫండ్కు నిధులు విరాళం ఇస్తే వారి కుటుంబాలకు ఆ సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అలాగే పోలీసులు ఒత్తిడితో కూడిన విదులు నిర్వర్తిస్తుండడంతో ఎక్కువగా హృద్రోగంతో భాదపడుతున్నారని, ఇటువంటి ముప్పును ముందుగానే గుర్తించేందుకు అవసరమైన పరీక్షలకు కూడా దాతలు, స్వచ్ఛంద, ఇతర సంస్థలు సహకరించాలని కోరారు. -
కనుల పండువగా శ్రీవారి కల్యాణం
పీఎం పాలెం: రెండు రోజులుగా జరుగుతున్న చైతన్య అన్నమయ్య మ్యూజిక్ అసోసియేషన్ సంగీత ఉత్సవాలు శనివారం రాత్రితో ముగిశాయి. ముగింపు సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. నగరంలోని అధిక సంఖ్యలో భక్తులు ఈ కల్యాణానికి హాజరయ్యారు. అన్నమయ్య 12వ తరానికి చెందిన శ్రీమాన్ హరినామాచార్యులు హాజరు కావడం ప్రత్యేకత సంతరించుకుంది. గోపినాంబల శేషాచార్య స్వామి వివాహ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కల్యాణం సందర్భంగా టీటీడీ ఏ గ్రేడ్ ఆస్థాన గాయకులు బి. రంగనాథ్, కె. సాయిశంకర్ అన్నమయ్య కీర్తనలను అత్యంత మధురంగా ఆలపించారు, కార్యక్రమానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, వైజాగ్ కన్వెన్షన్ ఎండీ నరసింహారావు పాల్గొన్నారు. -
జీవితానికి సిలబస్ ఉండదు.. అనుభవమే పాఠం
ఏయూ వేదికగా సుధామూర్తి స్ఫూర్తిదాయక ప్రసంగం ● ఘనంగా ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనంమద్దిలపాలెం: వందేళ్ల చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం(వేవ్స్–2025) ఆదివారం ఘనంగా జరిగింది. బీచ్రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో పూర్వ విద్యార్థుల ఉత్సాహం నడుమ సాగిన ఈ కార్యక్రమానికి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి ముఖ్య అతిథిగా హాజరై తన అద్భుత ప్రసంగంతో విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపారు. విశ్వవిద్యాలయాన్ని ‘విద్యను అందించే దేవాలయం’గా అభివర్ణించిన సుధామూర్తి.. సి.ఆర్.రెడ్డి వంటి మహనీయుల త్యాగాలను, సర్వేపల్లి రాధాకృష్ణన్ వేసిన పునాదులను గుర్తుచేసుకున్నారు. నేర్చుకోవడం, ప్రశ్నించడం ఆపేసిన రోజే మనం వృద్ధులం అవుతామని, నిత్యం కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటేనే సంతోషంగా జీవించగలమన్నారు. కళాశాలలో సిలబస్ ఉంటుంది, కానీ జీవితానికి సిలబస్ ఉండదన్నారు. ఇక్కడ ఆచార్యులు మార్గదర్శకం చేస్తారని, కానీ బయట మన అనుభవాలే పాఠాలు నేర్పుతాయని చెప్పారు. చాట్ జీపీటీ సమాచారాన్ని ఇవ్వగలదేమో కానీ, ఒక వ్యక్తి వృత్తి అనుభవానికి అది ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేశారు. మీ మారథాన్లో మీరే పరుగెత్తాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. సంపద పెరిగే కొద్దీ దానం చేసే గుణం పెరగాలని, నచికేతుడు–యమధర్మరాజు సంభాషణ, గంగ కథలను ఉదాహరిస్తూ నైతిక విలువలతో కూడిన జీవనం సాగించాలని ఉద్బోధించారు. ఏయూ పూర్వ విద్యార్థుల సంఘం వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ గ్రంథి మల్లికార్జునరావు మాట్లాడుతూ.. విశాఖపట్నం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, ఇది ‘గేట్వే ఆఫ్ ది ఈస్ట్’గా మారుతోందన్నారు. పూర్వ విద్యార్థులు తమ సమయం, నైపుణ్యం లేదా ధనంలో ఏదో ఒక రూపంలో వర్సిటీకి తిరిగి ఇవ్వాలని పిలుపునిచ్చారు. కనీసం ఒక్క విద్యార్థికై నా మార్గదర్శకత్వం వహించాలని కోరారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ.. శతాబ్ది ఉత్సవాల వేళ మహిళా సాధికారత థీమ్తో ఈ సమ్మేళనం జరగడం విశేషమన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రదర్శించిన అష్టలక్ష్మి నృత్య రూపకం, విదేశీ విద్యార్థుల నృత్యాలు, జానపద కళారూపాలు ఆహూతులను మంత్రముగ్ధులను చేశాయి. ముఖ్య అతిథి సుధామూర్తిని ఘనంగా సత్కరించి, రాఘవేంద్రస్వామి జ్ఞాపికను అందజేశారు. అలాగే డాక్టర్ దేవ హెచ్ పురాణం, ఆచార్య ఎ.జానకిరావు, డాక్టర్ జి.నిర్మలలను సత్కరించారు. ఏయూ అలుమ్ని సావనీర్ను ఆవిష్కరించారు. ఉదయం ఎంపీ సుధామూర్తి కట్టమంచి రామలింగారెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. ఏయూలో ఉన్న తాళపత్రాల జ్ఞానాన్ని నిపుణులతో అధ్యయనం చేయించి, వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. బీచ్రోడ్డులోని రతన్ టాటా ఆవిష్కరించిన పైలాన్ను సందర్శించారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఏయూ రెక్టార్ పి.కింగ్, రిజిస్ట్రార్ కె.రాంబాబు, పూర్వ వీసీలు, మాజీ మంత్రులు, ఎన్నారైలు పాల్గొన్నారు. ప్రసంగిస్తున్న రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తికార్యక్రమానికి హాజరైన పూర్వవిద్యార్థులువేదికపై విద్యార్థుల నృత్యాలు -
కోటి సంతకాల ఉద్యమానికి విశేష ఆదరణ
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో సామాన్య ప్రజ లు, మేథావులు, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు ఇచ్చారని ఆ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు కొనియాడారు. సంతకాల సేకరణ పత్రాలను ఈ నెల 15న జిల్లా పార్టీ కార్యాలయం నుంచి విజయవాడలోని కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపించనున్న ఈ కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో అత్యంత భారీగా నిర్వహించేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం మద్దిలపాలెంలో గల పార్టీ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన జిల్లా పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కోటి సంతకాల సేకరణ పత్రాల ప్రదర్శనకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ చేపట్టిన ‘కోటి సంతకాల ప్రజా ఉద్యమం’కు అన్ని నియోజకవర్గాల్లో అనూహ్య స్పందన లభించిందన్నారు. ఈ నెల 15న ఉదయం 9.30 గంటలకు జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం నుంచి మద్దిలపాలెం సీఎంఆర్ సెంట్రల్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి సేకరించిన సంతకాల పత్రాలను వాహనంలో తరలించనున్నట్లు తెలిపారు. సమావేశంలో సమన్వయకర్తలు మళ్ల విజయ ప్రసాద్, వాసుపల్లి గణేష్ కుమార్, తిప్పల దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, పండుల రవీంద్రబాబు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకటరామయ్య, డిప్యూటీ మేయర్ కె.సతీష్, మాజీ మేయర్ గొలగాని హరివెంకటకుమారి, ఎస్ఈసీ సభ్యులు జియ్యాని శ్రీధర్, డాక్టర్ జహీర్ అహ్మద్, పిన్నమరాజు సతీష్ వర్మ, పోతిన హనుమంతురావు, రాష్ట్ర పార్టీ సంయుక్త కార్యదర్శి తాడి జగన్నాథరెడ్డి , చెన్నాదాస్, గుడ్ల రమణిరెడ్డి, మంచ మల్లేశ్వరి, పల్లా దుర్గారావు, కార్పొరేటర్లు అల్లు శంకర్ రావు, అనిల్కుమార్రాజు, రాష్ట్ర పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు జాన్ వెస్లీ, పేర్ల విజయ్చంద్ర, పోతిన శ్రీనివాసరావు, మహంతి, ద్రోణంరాజు శ్రీవాస్తవ, జిల్లా పార్టీ కమిటీ, జోనల్ అనుబంధ విభాగాల అధ్యక్షులు అంబటి శైలేష్, సునీల్ కుమార్, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులకు ఉరుకూటి చందు, బోని శివరామకృష్ణ, భర్కత్ అలీ, కటికల కల్పన, సేనాపతి అప్పారావు, శ్రీదేవి వర్మ, వంకాయల మారుతీ ప్రసాద్, జీలకర్ర నాగేంద్ర, ప్రసాద్రావు, మార్కెండేయులు పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న కేకే రాజు చిత్రంలో సమన్వయకర్తలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు -
లక్కీ షాపింగ్మాల్ ప్రారంభం
15వ స్టోర్ను ప్రారంభించిన అనసూయడాబాగార్డెన్స్: దక్షిణ భారతదేశంలో పేరుగాంచిన లక్కీ షాపింగ్ మాల్ తమ 15వ స్టోర్ను శనివారం విశాఖలో ప్రారంభించింది. ప్రముఖ సినీ నటి అనసూయ భరద్వాజ్ జ్యోతి ప్రజ్వలన చేసి నూతన షోరూమ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నటి అనసూయ మాట్లాడుతూ లక్కీ షాపింగ్ మాల్ నాణ్యమైన దుస్తులను సరసమైన ధరలకే విక్రయించడం ద్వారా కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఫ్యాషన్ ప్రపంచంలో నిలుస్తోందని ప్రశంసించారు. షోరూమ్ అధినేతలు రత్తయ్య, శ్రీను, స్వామి మాట్లాడుతూ కస్టమర్ల నమ్మకమే తమకు ఈ మైలురాయి అని, నాణ్యతతో పాటు బడ్జెట్ ధరల్లో ఉత్తమ సేవలు, వస్త్రాలు అందిస్తామని తెలిపారు. ఫ్యామిలీ కలెక్షన్స్లో లేడీస్ వేర్, మెన్స్ వేర్, శారీస్, లెహంగాస్, టీ షర్ట్స్ వంటి అపరిమిత కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, గణబాబు, సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ, కంకటాల అధినేత కంకటాల మల్లిక్, పైడా కృష్ణప్రసాద్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
గురుకుల కాంట్రాక్ట్ ఉద్యోగి ఆత్మహత్య
మృతుడుది శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలో మజ్జాడపేట మధురవాడ: మారికవలసలోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో కాంట్రాక్ట్ మల్టీపర్పస్ వర్కర్గా పనిచేస్తున్న మజ్జాడ ఉమా మహేష్ (27) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శనివారం జరిగింది. శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలోని మజ్జాడ పేటకు చెందిన మహేష్ నాలుగేళ్లుగా ఈ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం ఉదయం 11.30 గంటల సమయం దాటినా అతను తన గదిలో నుంచి బయటకు రాకపోవడంతో సహచర సిబ్బంది గమనించారు. పాఠశాల ప్రిన్సిపాల్ శివప్రసాద్ సమాచారం మేరకు, పీఎం పాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మహేష్ శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇతనికి ఇటీవలే నిశ్చితార్థం కూడా జరిగింది. సకాలంలో వివాహం కాకపోవడం,ఇతర కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ఇదిలావుండగా ఉద్యోగ సమస్యలు వల్లే మా కుమారుడు ఆత్మచేసుకుని ఉంటాడని తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. తండ్రి మజ్జాడ నారాయణరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విశాఖ ఉక్కు ప్రై'వేటు'కే!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ ఉక్కు శరవేగంగా ప్రైవేటు చేతుల్లోకి వెళ్లిపోతోంది..! ఆంధ్రుల హక్కు వడివడిగా చేజారిపోతోంది..! స్టీల్ ప్లాంట్ను కాపాడుతాం... లాభాల బాట పట్టిస్తాం అంటూ ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిన సీఎం చంద్రబాబు అధికారం దక్కాక ప్లేటు ఫిరాయించేస్తున్నారు..! గత ఏడాదిన్నరగా ప్లాంట్ను ప్రైవేటుకు కట్టబెట్టే దిశగా ఒక్కో అడుగు వేస్తున్నారు..! ఈ క్రమంలో తొలుత కాంట్రాక్టు కార్మికులను నిర్దాక్షిణ్యంగా తొలగించారు. రెగ్యులర్ ఉద్యోగులను వీఆర్ఎస్ ద్వారా ఇంటికి పంపారు. పొమ్మనలేక పొగబెట్టినట్లు... ఉన్న ఉద్యోగులకు జీతాల చెల్లింపును ఆలస్యం చేస్తున్నారు. అదీ సరిపోక ఉత్తత్పికి తగిన వేతనం అంటూ మెలికపెట్టారు. ఇక ఇటీవల మరింత ముందుకెళ్లి ‘‘ఉద్యోగులు ఇంట్లో పడుకుంటే జీతాలివ్వాలా? ప్రభుత్వ రంగంలో ఉంది కదా? అని బెదిరించలేరు’’ అంటూ సీఎం చంద్రబాబు దారుణ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఏకంగా స్టీల్ ప్లాంట్ ప్రధాన ఉత్పత్తి విభాగం అయిన ఆపరేషన్స్ విభాగాన్ని ప్రైవేటుపరం చేసేందుకు వీలుగా టెండర్ నోటీసులు జారీ చేశారు. ఇంతకాలం దాగుడుమూతలుస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఇంతకాలం దాగుడుమూతలు ఆడింది ప్రభుత్వం. ఇప్పుడు మాత్రం వేగంగా ప్రైవేట్పరం చేసేందుకు చర్యలు వేగిరం చేస్తోంది. ఇప్పటివరకు కేవలం మొత్తం నిర్వహణ (టోటల్ మెయింటినెన్స్) పనులను మాత్రమే ప్రైవేటుకు అప్పగించారు. ఇప్పటివరకు మెయింటినెన్స్ పనులకు పరిమితమైన ప్రైవేటీకరణ ఇప్పుడు ఆపరేషన్స్కూ వర్తింపు కాగా, ప్రైవేటుపరం చేసేందుకు వీలుగా మొదట 46 విభాగాలను ఎంపిక చేశారు. తర్వాత పలు విభాగాల నిర్వహణకు ఆగస్టులో తొలి విడతగా ఒకేరోజు 32 ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) దరఖాస్తులు ఆహ్వానించారు. ఇలా ఆర్ఎంహెచ్పీ, సెంటర్ ప్లాంట్ మెయింటెనెన్స్కు ఈవోఐలు జారీ చేశారు. తర్వాత థర్మల్ పవర్ ప్లాంట్–1, థర్మల్ పవర్ ప్లాంట్–2, ఎస్ఎంఎస్ సీసీఎం–4, మాధారం మైన్స్, ఫౌండ్రీ, సెంట్రల్ మెషిన్ షాప్ (సీఎంఎస్) వంటి అనేక ఇతర విభాగాలను కూడా ప్రైవేట్కు కట్టబెట్టే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.ప్లాంట్కు వెన్నెముక ఇది...స్టీల్ ప్లాంట్లోని ప్రధాన ఉత్పత్తి విభాగం ఎస్ఎంఎస్–1లో కోల్ కెమికల్ డిపార్ట్మెంట్ (సీసీడీ) ప్రైవేటీకరణకు టెండర్లు ఆహ్వానిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఆరు కంటిన్యూస్ క్యాస్టింగ్ మెషీన్ (సీసీఎం)లతో పాటు గ్యాస్ కటింగ్ మెషీన్లను ప్రైవేటుకు ఇచ్చేందుకు టెండర్లు పిలవడంతో ప్లాంట్ ఉద్యోగుల్లో కలకలం మొదలైంది. స్టీల్ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్లో తయారయ్యే హాట్ మెటల్ను స్టీల్ మెల్ట్ షాప్(ఎస్ఎంఎస్)లో వివిధ ప్రక్రియల ద్వారా శుద్ధి చేసి లిక్విడ్ స్టీల్గా తయారు చేస్తారు. ఈ ద్రవపు ఉక్కును ఫినిష్డ్ స్టీల్గా తయారు చేసే ప్రక్రియలో తొలుత సీసీఎంల ద్వారా బ్లూమ్స్గా మారుస్తారు. ఈ బ్లూమ్స్ను డిమాండ్ను బట్టి రోలింగ్ మిల్స్ విభాగంలో రీబార్స్, యాంగిల్స్, చానెల్స్ తదితర ఫినిష్డ్ స్టీల్గా చేస్తారు. కన్వర్టర్లో తయారైన లిక్విడ్ స్టీల్ను సీసీఎంలో పంపడం ద్వారా బ్లూమ్స్ తయారవుతాయి. గతంలో 3 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉన్నప్పుడు ఎస్ఎంఎస్–1లో సీసీఎంల ద్వారా ఏడాదికి 2.82 మిలియన్ టన్నుల బ్లూమ్లు ఉత్పత్తి చేసేవారు. ఆధునికీకరణ తర్వాత సామర్థ్యం 3.5 మిలియన్ టన్నులకు పెరిగింది. తద్వారా 3.29 మిలియన్ టన్నుల బ్లూమ్స్ తయారయ్యే సామర్థ్యం ఏర్పడింది. స్టీల్ ప్లాంట్ నిర్వహణలో సీసీడీ ఇంతటి కీలక విభాగం. ఇలాంటిదానిని ప్రైవేట్కు ఇస్తే... ప్లాంట్ మొత్తం వారి చేతుల్లో పెట్టినట్లేననే ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. 680 మంది ఉద్యోగులను తొలగించే ప్రమాదం పొంచి ఉందని భయపడుతున్నారు. ఇప్పటికే వేలమంది కార్మికులను ఖర్చు నియంత్రణ (కాస్ట్ కటింగ్) పేరుతో బయటకి పంపారని గుర్తుచేస్తున్నారు. తాజా టెండర్లలో కూడా పూర్తిగా ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోని భారీ ప్రైవేటు సంస్థలే పాల్గొనే విధంగా నిబంధనలను రూపొందించారనే ఆరోపణలు వస్తున్నాయి. రూ.131.33 కోట్ల విలువైన ఆపరేషన్స్ పనులకు టెండర్ తుది గడువును జనవరి 3వ తేదీగా నిర్ణయించారు. 4వ తేదీన బిడ్ను తెరిచి ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు. విశాఖ ఉక్కుకు కాకుండా మిట్టల్ కోసం పాటదశాబ్దాల చరిత్ర ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్పై చంద్రబాబు ప్రభుత్వ వైఖరి ఇటీవల మరింత స్పష్టమైంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ ఆంధ్రుల హక్కుగా గొప్పగా చెప్పుకొనే ఈ ప్లాంట్కు సొంత గనులు ఇవ్వాలని కోరలేదు. సరికదా... నక్కపల్లి వద్ద ఏడాదికి 24 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు చంద్రబాబు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాక ఈ ప్రైవేట్ ప్లాంట్కు బొగ్గు గనులు ఇవ్వాలని కూడా టీడీపీ కూటమి ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ముద్ర వేసి.. వదిలించుకునే కుట్ర...విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం దొడ్డిదారి ప్రయత్నాలు చేసింది. మొదట ప్లాంట్ నష్టాల్లో ఉందంటూ ముద్ర వేసింది. అంతేకాక నెలల పాటు ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా వేధించడం మొదలుపెట్టారు. అనంతరం ప్లాంటులో ఉన్న కాంట్రాక్టు కార్మికులను 5,500 మందిని తొలగించారు. ఇక రెగ్యులర్ ఉద్యోగులను కూడా వీఆర్ఎస్ ద్వారా 1,590 మందిని ఇంటికి సాగనంపారు. ఉద్యోగులు ఇంట్లో పడుకుని జీతాలు ఇవ్వాలంటే ఎలా ఇస్తాం? అంటూ ఏకంగా సీఎం చంద్రబాబు నవంబరు 15న విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు సందర్భంగా వ్యాఖ్యానించారు. తద్వారా ఉద్యోగుల నైతిక స్థ్యైర్యాన్ని దెబ్బతీశారు. ప్రజల్లో వారి పట్ల వ్యతిరేక ధోరణి వచ్చేలా వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే అసలు సక్రమంగా జీతాలివ్వకుండా... ఉత్పత్తికి తగిన వేతనం అంటూ మెలికపెట్టారు. మూడో విడతలో మరో వెయ్యిమంది ఉద్యోగులను ఇంటికి పంపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఉద్యోగులు ఇంట్లో తిని పడుకుంటే జీతాలివ్వాలా అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించాక వెంటనే యాజమాన్యం ఉత్పత్తికి తగిన వేతనమంటూ కొత్త విధానాన్ని ప్రకటించింది. తాజాగా ప్లాంట్ ఆపరేషన్స్ను ప్రైవేట్పరం చేసేందుకు టెండర్లను ఆహ్వానించి మిగిలిన ఉద్యోగులను కూడా సాగనంపేందుకు నిర్ణయించుకున్నట్టు స్పష్టమవుతోంది.కాపాడడమంటే ఇదేనా చంద్రబాబూ..?స్టీల్ ప్లాంట్ను కాపాడతాం అంటూ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు గెలిచాక పట్టించుకోవడం మానేశారు. ప్రైవేటీకరణకు బాటలు వేస్తున్నారని ప్లాంట్ కార్మికులు మండిపడుతున్నారు. ఒత్తిడి పెరగడంతో చివరకు ‘ప్యాకేజీ’ అంటూ కొత్త నాటకం మొదలుపెట్టారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అయితే, ప్యాకేజీలో భాగంగా చేసుకున్న ఒప్పందం ప్రకారం మూడు బ్లాస్ట్ ఫర్నేస్లు నడపడం, శాశ్వత, కాంట్రాక్టు ఉద్యోగులను గణనీయంగా తగ్గించడం వంటి చర్యలు ప్రారంభించారని విమర్శిస్తున్నారు. అంతేకాక ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలను తగ్గించి, గత ఏడాది సెప్టెంబర్ నుంచి పూర్తి జీతాలు చెల్లించడం లేదని వాపోతున్నారు. ఇప్పుడు ఆపరేషన్స్ విభాగం టెండర్లు పూర్తయితే... మరింతమంది శాశ్వత ఉద్యోగులను తొలగించే ప్రమాదం ఉందని ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.మొదటి నుంచి వైఎస్సార్సీపీ పోరాటంవిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ మొదటినుంచి ఒకే పంథా అనుసరిస్తోంది. ప్రైవేటీకరణ ప్రయత్నాలను వెనక్కి తీసుకునేవరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేసింది. వైఎస్సార్సీపీ దీర్ఘకాలం పాటు ఒత్తిడిని కొనసాగించడంతో ఆ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రైవేటీకరణపై అడుగులు ముందుకుపడలేదు.దొడ్డిదారిలో కుట్రవిశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుపరం చేసే కుట్రలు చాలా రోజులుగా జరుగుతున్నాయి. ఇందులోభాగంగా ఎస్ఎంఎస్–1లో సీసీడీ సెక్షన్ ప్రైవేటీకరణకు టెండర్లు పిలిచారు. తద్వారా ఈ విభాగంలో పనిచేసే 450 మంది రెగ్యులర్, 230 మంది కాంట్రాక్టు ఉద్యోగుల ఉద్యోగాలు తొలగిస్తారనే ఆందోళన నెలకొంది. టెండర్లలో పాల్గొనే సంస్థలకు విధించిన నిబంధనలన్నీ చంద్రబాబు ప్రభుత్వం కనుసన్నల్లోని భారీ ప్రైవేటు సంస్థలకు కావాల్సిన విధంగా ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే ప్లాంట్ను దొడ్డిదారిలో ప్రైవేటుపరం చేసే కుట్రగా అర్థమవుతోంది. – జగ్గునాయుడు, గౌరవాధ్యక్షుడు, విశాఖ స్టీల్ ప్లాంట్, సీఐటీయూముక్తకంఠంతో ఖండిస్తున్నాంఏవో చిన్నచిన్న విభాగాలను కాకుండా ఏకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఆపరేషన్స్ సెక్షన్నే ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది మొత్తం ప్లాంట్ను ప్రైవేటుపరం చేసేందుకేనని స్పష్టమవుతోంది. ఒకవైపు ప్రైవేటుకు ఇవ్వమని చెబుతూనే, మరోవైపు కీలక విభాగాలను ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టేందుకు టెండర్లను పిలవడం ఏమిటి? ఇదంతా చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం పూర్తి సహకారంతోనే జరుగుతోంది. దీనిని ప్లాంట్ కార్మికులతో పాటు ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించాలి. – దాలినాయుడు, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ స్టీల్ ప్లాంట్ అధ్యక్షులుటెండర్లను రద్దు చేయాలి స్టీల్ మెల్ట్ షాప్ (ఎస్ఎంఎస్)... స్టీల్ప్లాంట్కు గుండెకాయ వంటిది. దానిని ప్రైవేటీకరించడం అంటే ప్లాంట్ను ప్రైవేటీకరణే అవుతుంది. మెయింటినెన్స్ పనులకు పరిమితమైన ప్రైవేటీకరణను ఆపరేషన్స్కూ వర్తింపజేయడం దుర్మార్గం. యాజమాన్యం వెంటనే ఈ టెండర్లను రద్దు చేయాలి. – ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి, ఏఐటీయూసీ స్టీల్ప్లాంట్ విభాగం -
‘2 లక్షల 66 వేల కోట్లు అప్పులు.. ఒక్క కొత్త పెన్షనైనా ఇచ్చారా?’
విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అప్పుల అంధ్రప్రదేశ్ మారుస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. చంద్రబాబు అప్పులే పరమావధిగా చేస్తున్నారని విమర్శించారు. ఇన్ని అప్పులు చేసినా ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా? అపి బొత్స ప్రశ్నించారు. ఈరో.జు(శనివారం, డిసెంబర్ 13వ తేదీ) విశాఖపట్నం నుంచి మీడియాతో బొత్స మాట్లాడుతూ.. ‘ చంద్రబాబు 18 నెలల కాలంలో 2 లక్షల 66 వేల కోట్లు అప్పులు చేశారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారు. వైఎస్సార్సీపీ హయాంలో చేసిన అప్పులకు లెక్కలు చెప్పాం. మరి కూటమి పాలనలో చంద్రబాబుేచేసిన అప్పులకు ఎందుకు లెక్కలు చెప్పడం లేదు. వైఎస్సార్సీపీ హయాంలో చేసిన అప్పులతో రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు, పోర్ట్లు, ఆర్బీకేలతో పాటు అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశాం. చంద్రబాబు చేసిన అప్పులుపారదర్శకంగా ప్రజలకు వివరించాలి. చంద్రబాబు ఇన్ని అప్పులు చేసినా ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు’ అని మండిపడ్డారు. బొత్స సత్యనారాయణ ఏమన్నారంటే..ఆరోగ్యంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారిందిచంద్రబాబు 18 నెలల కాలంలో రెండు లక్షలు 66 వేల కోట్లు అప్పు తెచ్చారు..వైయస్ జగన్ ఐదేళ్ల పాలనలో 3 లక్షల 44 కోట్లు అప్పు తెచ్చారు..డైరెక్టర్ ట్రాన్స్ఫర్ సిస్టం ద్వారా 2 లక్షల కోట్ల కు పైగా ఖర్చు చేశారు..చంద్రబాబు తెచ్చిన అప్పులకు లెక్క పత్రం లేదు..దేనికి ఖర్చు పెట్టారో తెలియదు..వైఎస్ జగన్ 10 లక్షలు 20 లక్షల కోట్లు అప్పులు తెచ్చారని తప్పుడు ప్రచారం చేశారు..జగన్ తెచ్చిన అప్పులతో శ్రీలంకగా మారిపోతుందన్నారు..చెత్తనుండి సంపద సృష్టిస్తామని చెప్పి చంద్రబాబు లక్షల కోట్ల అప్పులు చేస్తున్నారు..కూటమి పాలనలో ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది.అన్ని రంగాల్లో రాష్ట్రం వెనుకబడి ఉంది..పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదు..చేయి తడిపితే కానీ పనులు జరజని ఏపీలో పని జరగదురాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి నెలకొంది..జగన్ అప్పులు తెచ్చి 90% వివిధ పథకాల ద్వారా ప్రజలకు ఇచ్చారుచంద్రబాబు అప్పల గురించి పవన్ కళ్యాణ్ గొప్పగా చెప్తున్నారు..ప్రభుత్వం చేస్తున్న అప్పులు రాష్ట్ర అభివృద్ధికి చేటు.. -
మత్స్య రంగానికి విలువ జోడిస్తే అధిక వృద్ధి
ఏయూక్యాంపస్: మత్స్య రంగానికి విలువను జోడిస్తే అధిక వృద్ధి సాధించవచ్చని సీఫుడ్స్ ఎక్స్పోర్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీ య అధ్యక్షుడు జి.పవన్కుమార్ అన్నారు. బీచ్రోడ్డులోని ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్–సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ ఆధ్వర్యంలో శుక్రవారం ఫిషరీస్ ఇంక్యుబేషన్ సెంటర్ సంయుక్తంగా మత్స్య రంగంలో విలువ ఆధారిత సుస్థిర వ్యాపార అవకాశాలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ల మేనేజర్లు, సూపర్వైజర్లకు ఉన్నత స్థాయి శిక్షణ కార్యక్రమాలు ఎంతో అవసరమన్నారు. రెడీ టు ఈట్, రెడీ టు కుక్ ఉత్పత్తులకు అపారమైన అవకాశాలున్నాయన్నారు. శాస్త్రవేత్త డాక్టర్ బి.మధుసూదనరావు.. మత్స్య, ఆక్వా కల్చర్ రంగాల్లో ఆవిష్కరణలు ప్రోత్సహించే దిశగా ఇంక్యుబేషన్ సెంటర్ పనితీరును వివరించారు. డాక్టర్ పి.విజి, డాక్టర్ జెస్మి దేబ్ బర్మ మాట్లాడుతూ వాణిజ్యీకరణకు సిద్ధంగా ఉన్న విలువ ఆధారిత చేపల ఉత్పత్తులు, ఉప ఉత్పత్తులను, సముద్ర నాచు వినియోగాన్ని వివరించారు. ఐసీఏఆర్–సీఐఎఫ్టీ అభివృద్ధి చేసిన వివిధ విలువ ఆధారిత ఉత్పత్తులు, ఉప ఉత్పత్తులు, సీ వీడ్ ఉత్పత్తుల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. -
మెడ్టెక్తో ఆస్ట్రేలియా వర్సిటీ ఒప్పందం
పెదగంట్యాడ: మెడ్టెక్ జోన్(ఏఎంటీజెడ్)తో పాటు రాష్ట్రంలోని పలు సంస్థలతో యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా శుక్రవారం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా విశాఖను ఇండో–పసిఫిక్ ప్రాంతంలో హెల్త్ టెక్నాలజీ, రక్షణ పరిశోధనలకు ప్రధాన కేంద్రంగా మార్చనున్నారు. ఒప్పందంలో భాగంగా మెడ్టెక్ ఇన్నోవేషన్, క్లినికల్ ట్రయల్స్, గ్లోబల్ హెల్త్ టెక్నాలజీలో సంయుక్త పరిశోధనలు జరుగుతాయి. సముద్ర గర్భంలో నిఘా, యాంటీ సబ్మైరెన్ వార్ఫేర్, బ్లూ ఎకానమీ వంటి అంశాల్లో ఇరు సంస్థలు కలిసి పనిచేస్తాయి. విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ఇంటర్న్షిప్లు, పరిశోధన అవకాశాలు లభిస్తాయి. భారత్–ఆస్ట్రేలియా సంబంధాలను బలోపేతం చేస్తూ, తూర్పు భారత మహాసముద్రంలో ప్రాంతీయ భద్రతను పెంచడం ఈ ఒప్పంద లక్ష్యమని మెడ్టెక్ జోన్ సీఈవో జితేంద్ర శర్మ తెలిపారు. ఈ మేరకు యూడబ్ల్యూఏ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ అమిత్ చక్మా, వర్సిటీ ప్రతినిధులతో కలిసి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. -
అక్రమ మద్యాన్ని నివారించాలి
విశాఖ సిటీ: ఉత్తరాంధ్రలో అక్రమ మద్యాన్ని పూర్తిగా నివారించాలని రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఎకై ్సజ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. శుక్రవారం వీఎంఆర్డీఏ భవన్లో ఉన్న ఎకై ్సజ్ కార్యాలయంలో విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల ఎకై ్సజ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో అధికారుల పనితీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెల్ట్ షాపులపై ఉక్కు పాదం మోపాలని చెప్పారు. నాటు సారా, కల్తీ మద్యం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని స్పష్టం చేశారు. సమావేశంలో ఉత్తరాంధ్ర జిల్లాల డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
సెంచూరియన్ యూనివర్సిటీ–చత్తీస్గఢ్ ఫోరెన్సిక్ ల్యాబ్ మధ్య ఎంవోయూ
భువనేశ్వర్: ఒడిశా, ఆంధ్రప్రదేశ్లోని సెంచూరియన్ యూనివర్సిటీ, చత్తీస్గఢ్ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ మధ్య అకడమిక్, పరిశోధన భాగస్వామ్యానికి ఎంఓయూ కుదిరింది. ఎస్ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ ఎస్సీ ద్వివేది, సెంచూరియన్ రిజిస్ట్రార్ డాక్టర్ అనిత పాత్ర ఈ మేరకు సంతకాలు చేశారు. ల్యాబ్ సదుపాయాలు, శాసీ్త్రయ నైపుణ్యాలను పరస్పరం పంచుకోవడం, సంయుక్త శిక్షణ–పరిశోధన కార్యక్రమాలు ఈ ఎంఓయూ లక్ష్యాలు. విద్యా పరిశోధన–ప్రాయోగిక ఫోరెన్సిక్ సేవల మధ్య అంతరం తగ్గించి, నైపుణ్యాభివృద్ధికి బలమైన వేదిక సృష్టిస్తామని ద్వివేది అన్నారు. విద్యార్థులు ఫోరెన్సిక్ రంగంలో పోటీ సామర్థ్యం, ఉపాధి అవకాశాలు పొందుతారని అనిత తెలిపారు. సెంచూరియన్ను ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా ప్రభుత్వం గుర్తించిన సంగతి తెలిసిందే. -
రిలేలో ఏపీ బాలికలకు స్వర్ణం
విశాఖ స్పోర్ట్స్: నగరంలో జరుగుతున్న 63వ జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్లో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ స్కేటర్లు మిశ్రమ ఫలితాలను సాధించారు. 12 ఏళ్లు పైబడిన వారికి నిర్వహించిన రోడ్ రేస్–2లో ఏపీ క్రీడాకారులు పతకాల కోసం తీవ్రంగా పోటీపడ్డారు. వంకరగా, నేరుగా ఉండే మూడు లూప్లతో, బహుళ దశలుగా సాగే ఈ రేసులో ఏపీకి చెందిన తనూజ త్రుటిలో స్వర్ణాన్ని చేజార్చుకుంది. రోడ్ రేస్ ఫలితాలివే.. 12–15 ఏళ్ల బాలికల విభాగం: బోయపాలెం సర్క్యూట్లో జరిగిన క్వాడ్ 1,500 మీటర్ల రేసు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. పుదుచ్చేరి క్రీడాకారిణి శ్రీఆన్యా 2.55.06 నిమిషాల్లో గమ్యాన్ని చేరి విజేతగా నిలిచారు. ఏపీకి చెందిన వి.తనూజ సాయి కేవలం 0.05 సెకన్ల స్వల్ప తేడాతో(2.55.11 నిమిషాలు) వెనుకబడి, రన్నరప్గా వెండి పతకంతో సరిపెట్టుకుంది. 15–18 ఏళ్ల బాలుర విభాగం: క్వాడ్ 3000 మీటర్ల ఫైనల్లో చండీగఢ్కు చెందిన హితిన్ షైనీ 5.36.82 నిమిషాల్లో రేసు పూర్తి చేసి విజేతగా నిలిచాడు. 18+ సీనియర్ బాలుర విభాగం: జమ్ముకశ్మీర్కు చెందిన కార్తీకేయ పూరి 5.29.65 నిమిషాల్లో గమ్యాన్ని చేరి విజేతగా నిలిచాడు. మహిళల విభాగంలో తమిళనాడుకు చెందిన ఎస్. సింధు 6.46.79 నిమిషాల్లో రేసు పూర్తి చేసి ప్రథమ స్థానంలో నిలిచారు. ఇదే రేసులో మహారాష్ట్రకు చెందిన విశాల్ చనేకర్ ద్వితీయ స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్కు చెందిన అంచిత తృతీయ స్థానం, గౌరి సుప్రజ చతుర్థ స్థానం దక్కించుకున్నారు. రిలేలో మెరిసిన ఏపీ బాలికలు 12–15 ఏళ్ల బాలికల రిలే విభాగంలో ఆంధ్రప్రదేశ్ జట్టు అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని కై వసం చేసుకుంది. భవ్యశ్రీ, శ్రీవత్సాంకిత, అద్విక రమ్య, కె.ఖ్యాతి సభ్యులుగా ఉన్న జట్టు సమష్టిగా రాణించి విజయపథాన దూసుకెళ్లింది. బాలుర రిలేలో హర్యానాకు చెందిన ఆరవ్ రావత్, షంతను అగర్వాల్, లావ్యాన్సు ఖండోడియా జట్టు స్వర్ణాన్ని అందుకుంది. రోలర్ హాకీలో.. జూనియర్ బాలికల విభాగంలో లీగ్ దశలో ఏపీ జట్టు 1–0 గోల్స్ తేడాతో కేరళపై విజయం సాధించింది. సీనియర్ మెన్ విభాగంలో ఏపీ జట్టు ఆధిపత్యం ప్రదర్శిస్తూ 9–2 గోల్స్ తేడాతో తమిళనాడుపై ఘన విజయం సాధించింది. జూనియర్ బాలురు విభాగంలో పంజాబ్ చేతిలో ఏపీ జట్టు 0–7 తేడాతో పరాజయం పాలైంది. ఉత్కంఠగా రోలర్ హాకీ -
బంగ్లాదేశ్ చెరలోనే మత్స్యకారులు
డాబాగార్డెన్స్: బంగ్లాదేశ్లో చిక్కుకుపోయిన 9 మంది ఉత్తరాంధ్ర మత్స్యకారులను విడిపించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్కుమార్ ఆరోపించారు. శుక్రవారం ఆశీలమెట్టలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్గాంధీ, ఇతర నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. అక్టోబర్ 9న బంగ్లాదేశ్లో భోగాపురం, నెల్లిమర్లకు చెందిన 9 మంది మత్స్యకారులు చిక్కుకుపోయారని, వారిని విడిపించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. కనీసం వారి కుటుంబాలకు ఉపాధి కూడా కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్యకారులంటే మొదటి నుంచి చిన్న చూపు చూసే చంద్రబాబు వైఖరి ఇప్పటికీ మారలేదని, నేవీకి చిక్కిన వారు బయటకు రావడానికి ఆరు నెలలు పడుతుందని బాధ్యతారాహిత్యంగా చెప్పడం దారుణమన్నారు. జనసేన ఎమ్మెల్యే నియోజకవర్గానికి చెందిన మత్స్యకారులకు అన్యాయం జరిగితే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మత్స్యకారుల ఓట్లతో గెలిచిన పవన్ కల్యాణ్.. వారికి కష్టం వచ్చినప్పుడు ఎందుకు స్పందించడం లేదన్నారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే నిర్లక్ష్యంగా మాట్లాడడం సరికాదన్నారు. గతంలో శ్రీకాకుళం మత్స్యకారులు పాకిస్తాన్లో చిక్కుకున్నప్పుడు, నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణమే స్పందించి వారిని విడిపించారని గుర్తుచేశారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ అభివృద్ధికి రూ.152 కోట్లు కేటాయించడమే కాకుండా, అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఒక్కో బోటుకు రూ.40 లక్షల చొప్పున పరిహారం అందించిన ఘనత జగన్దేనని తెలిపారు. కానీ హుద్హుద్ సమయంలో చంద్రబాబు నష్టపోయిన బోట్లకు కేవలం రూ.5లక్షలు ప్రకటించి ఇవ్వలేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1.30 కోట్లను తక్షణమే విడుదల చేసి ఆదుకున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో తోటి మత్స్యకారుడిగా.. తన వంతు బాధ్యతగా ఒక్కో కుటుంబానికి రూ.5వేల చొప్పున, మొత్తం రూ.45 వేల ఆర్థిక సాయాన్ని వాసుపల్లి ప్రకటించారు. బాధిత కుటుంబాలకు తక్షణమే రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని, కేంద్రంతో మాట్లాడి మత్స్యకారులను వెంటనే స్వదేశానికి రప్పించాలని డిమాండ్ చేశారు. కొండా రాజీవ్గాంధీ మాట్లాడుతూ జగన్ది మమకారపు పాలనైతే, చంద్రబాబుది అహంకారపు పాలన అని విమర్శించారు. చంద్రబాబు సర్కార్లో పవన్ కల్యాణ్కు పవర్ లేదని విమర్శించారు. సమావేశంలో 37వ వార్డు కార్పొరేటర్, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నా జానకీరామ్, వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
సోలార్ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలి
ఈపీడీసీఎల్ అధికారులతో చీఫ్ సెక్రటరీ విజయానంద్ సాక్షి, విశాఖపట్నం : ఫీడర్ లెవెల్ సోలరైజేషన్ కార్యక్రమం ప్రారంభానికి, వర్చువల్ విధానంలో సీఎం చంద్రబాబు చేపట్టబోయే శంకుస్థాపన కార్యక్రమాలకు ఈ నెలాఖరులోగా ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని 11 జిల్లాలు సిద్ధం కావాలని చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ అధికారులను ఆదేశించారు. సాగర్నగర్లోని సీఓఈఈటీ భవనంలో పీఎం కుసుమ్, పీఎం సూర్యఘర్ పథకం, ఫీడర్ లెవెల్ సోలరైజేషన్, ఎస్సీ, ఎస్టీ రూఫ్ టాప్ సోలార్, పీఎం ఈ డ్రైవ్ పథకాలతో పాటు ఎంఎన్ఆర్ఈ, ఆర్డీఎస్ఎస్ ప్రాజెక్టులపై ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి, నెడ్ క్యాప్ ఎండీ ఎం.కమలాకరబాబు, కలెక్టర్లు, ఈపీడీసీఎల్ అధికారులతో కలిసి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈపీడీసీఎల్ చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిని సీఎండీ పృథ్వీతేజ్ వివరించారు. నెలకు 10 మెగావాట్ల చొప్పున జరుగుతున్న ఇన్స్టాలేషన్లను రోజుకు ఒక మెగావాట్ సామర్థ్యానికి పెంచేలా పీఎం సూర్యఘర్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు. చీఫ్ సెక్రటరీ విజయానంద్ మాట్లాడుతూ ఈపీడీసీఎల్ పరిధిలో 2 లక్షల ఎస్సీ, ఎస్టీ గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి వచ్చే ఏడాది మార్చిలోగా సమ్మతి తీసుకొని వారి ఇళ్లపై రెండు కిలోవాట్ల చొప్పున మొత్తం 400 మెగావాట్ల సామర్థ్యంతో రూఫ్ టాప్ సోలార్ పనులను పూర్తి చేయాలన్నారు. పీఎం కుసుమ్ పథకం కింద ఫీడర్ సోలరైజేషన్లో సంస్థ పరిధిలోని 8 జిల్లాల్లో 220 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్న సోలార్ ప్లాంట్లకు భూసేకరణను వేగవంతం చేయాలని ఆదేశించారు. పీఎం ఈ డ్రైవ్ పథకంలో భాగంగా వెహికల్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు పనులను త్వరితగతిన చేపట్టాలని సూచించారు. సమావేశంలో అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్లు విజయ కె.ఎస్.రామసుందర రెడ్డి, స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎన్.ప్రభాకర రెడ్డి, ఈపీడీసీఎల్ డైరెక్టర్లు టి.వి.సూర్యప్రకాష్, టి.వనజ, ఎస్.హరిబాబు, సీజీఎంలు ఎల్.దైవప్రసాద్, వి.విజయలలిత, బి.అశోక్ కుమార్, పి.శ్రీనివాస్, ఎస్ఈలు, ఈఈలు పాల్గొన్నారు. రేపటి నుంచి ఇంధన పరిరక్షణ వారోత్సవాలు ఇంధన పరిరక్షణ వారోత్సవాల పోస్టర్ను చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ ఆవిష్కరించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 14 నుంచి 20 వరకు ఇంధన పరిరక్షణ వారోత్సవాలను నిర్వహించి ప్రజల్లో ఇంధన పొదుపుపై అవగాహన పెంపొందించాలని సూచించారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్ పోటీలను నిర్వహించాలన్నారు. -
కదంతొక్కిన అంగన్వాడీలు
బీచ్రోడ్డు : తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించకుంటే.. సమ్మె చేసేందుకు సిద్ధమవుతామని అంగన్వాడీలు కార్యకర్తలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో కదంతొక్కారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నా.. న్యాయం జరగకపోవడం అన్యాయమని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఆర్.కె.ఎస్.వి.కుమార్ మాట్లాడుతూ అధికారంలోకి వస్తే అంగన్వాడీలకు న్యాయం చేస్తామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిలబెట్టుకోవాలన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలని, చట్ట ప్రకారం గ్రాట్యూటీ చెల్లించాలని, 42 రోజుల సమ్మె కాలంలో అంగన్వాడీలు లేవనెత్తిన ప్రతి డిమాండ్ను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటలక్ష్మి మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, గ్రాట్యూటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 1,810 మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలన్నారు. ఫ్రీ స్కూల్ పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడంతోపాటు 5 సంవత్సరాల్లోపు పిల్లలందరూ అంగన్వాడీ సెంటర్లలో ఉండాలని జీవో ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ విశాఖ జిల్లా కమిటీ గౌరవ అధ్యక్షురాలు మణి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు పి.శ్యామల. ఎం.వెంకట లక్ష్మి, ఎ.నూకరత్నం, పి.సీత, విజయ, సుబ్బలక్ష్మి, రాధ, మంజుల, ఐఎఫ్టీయూ నాయకులు లక్ష్మి, గీత, రామలక్ష్మి పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు సిద్ధం -
విశాఖ–బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
తాటిచెట్లపాలెం: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం–బెంగళూరు–విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ పవన్కుమార్ తెలిపారు. విశాఖపట్నం–ఎస్ఎంవీటీ బెంగళూరు(08501) స్పెషల్ ఈ నెల 15వ తేదీన మధ్యాహ్నం 3.20 గంటలకు విశాఖలో బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12.45 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఎస్ఎంవీటీ బెంగళూరు–విశాఖపట్నం (08502) స్పెషల్ ఈ నెల 16వ తేదీన మధ్యాహ్నం 3.50 గంటలకు ఎస్ఎంవీటీ బెంగళూరులో బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైలు ఒక సెకండ్ ఏసీ, 2–థర్డ్ ఏసీ, 12–స్లీపర్క్లాస్, 3 జనరల్ సెకండ్ క్లాస్, 2–సెకండ్ క్లాస్ కం లగేజి కం బ్రేక్ వ్యాన్ కోచ్లతో నడుస్తుంది. -
నేడు లోక్ అదాలత్
విశాఖలీగల్: ఉమ్మడి విశాఖలో శనివారం జరగనున్న జాతీయ లోక్ అదాలత్ కోసం ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు తెలిపారు. కేసుల రాజీ కోసం మొత్తం 39 బెంచీలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. విశాఖ నగరంతోపాటు గాజువాక, అనకాపల్లి, ఎలమంచిలి, చోడవరం, నర్సీపట్నం, పాడేరు, అరకు, చింతపల్లి ప్రాంతాల్లో కూడా లోక్ అదాలత్ బెంచ్లు పనిచేస్తాయన్నారు. పదివేలకు పైగా కేసులు పరిష్కరించే అవకాశం ఉందని న్యాయ సేవ ప్రాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు వెల్లడించారు. క్రిమినల్ కంపౌండబల్ కేసులు, ఎకై ్సజ్ కేసులు, బ్యాంక్ రికవరీ, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్, ఫ్యామిలీ సివిల్ తదితర కేసులను సామరస్యంతో పరిష్కరించాలన్నారు. పోలీసు స్టేషన్లలో పెండింగ్లో ఉన్న కంపౌండబుల్ నేరాలు ఎకై ్సజ్ కేసులను గుర్తించి పార్టీలకు నోటీసులు జారీ చేయాలని పోలీసు, ఎకై ్సజ్ అధికారులకు సూచించారు. -
ఏయూ ‘వేవ్స్’కు సర్వం సిద్ధం
ముఖ్య అతిథిగా ఎంపీ సుధామూర్తి మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల వేళ.. పూర్వ విద్యార్థుల వార్షిక మహా సమ్మేళనం ‘వేవ్స్–2025’నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బీచ్రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. మహిళా సాధికారత థీమ్తో ఈ సారి నిర్వహిస్తున్న సమ్మేళనానికి సుమారు 10వేల మంది పూర్వ విద్యా ర్థులు నమోదు చేసుకున్నారని ఏఏఏ చైర్మన్ కె.వి.వి.రావు తెలిపారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రధాన వేదిక బయట ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఉదయం ఆయా విభాగాల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతాయి. ముఖ్య అతిథి సుధామూర్తి.. ఏయూ వ్యవస్థాపక ఉపకులపతి కట్టమంచి రామలింగారెడ్డి విగ్రహానికి నివాళులర్పిస్తారు. ఈ సందర్భంగా ఏయూ పరిపాలన భవనం, అలుమ్ని కార్యాలయాలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. ఏయూ అలుమ్ని వ్యవస్థాపక అధ్యక్షుడు జి.ఎం రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గోనున్నారు. -
నేడు బాటలు
నాటి అడుగులు.. విశాఖ సిటీ: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు విద్యార్థులకు వరంగా మారాయి. యూనివర్సిటీ విద్యా విధానంలో తీసుకొచ్చిన సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయి. ప్రతిష్టాత్మక ఏయూలో సరికొత్త కేంద్రం ఏర్పాటుకు అడుగులు పెడుతున్నాయి. అలాగే ఏయూలో బీటెక్ రెండేళ్లు పూర్తి చేసి ప్రతిభ చూపించిన విద్యార్థులకు వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీలో ప్రవేశం పొందే అవకాశం కలగనుంది. ఇందుకు సంబంధించి గత ఒప్పందాలకు కొనసాగింపుగా మరో ఎంవోయూపై వెస్ట్రన్ యూనివర్సిటీ వీసీ అమిత్ చక్మా, ఏయూ వీసీ ప్రొఫెసర్ రాజశేఖర్ సంతకాలు చేశారు. 2023లోనే ఆస్ట్రేలియన్ కార్నర్కు ఒప్పందం ఏయూలో ఆస్ట్రేలియన్ కార్నర్ ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వ హయాంలో ఏయూ అధికారులు నిర్ణయించారు. దీని కోసం 2022లో వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ అమిత్ చక్మా ఏయూను సందర్శించారు. అనంతరం సీఎంవో ఆఫీస్ సూచనల మేరకు వెస్ట్రన్ ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం, అప్పటి రాష్ట్ర ఐటీ, స్కిల్ డెవలప్మెంట్ కార్యదర్శి సౌరభ్గౌర్ ఏయూను సందర్శించారు. ఏయూలో అమెరికన్ కార్నర్ పక్కనే ఆస్ట్రేలియన్ కార్నర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కార్నర్ను 2023 డిసెంబర్లోనే ప్రారంభించారు. అదే ఏడాది బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్విన్నింగ్ ప్రోగ్రామ్లను ప్రారంభించాలని భావించారు. అలాగే ఇంకుబేషన్ కార్యక్రమాలకు మెంటరింగ్ అందించడానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం, వెస్ట్రన్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం మధ్య ఆన్లైన్ ద్వారా ఎంవోయూ కూడా జరిగింది. ఇప్పుడు అదే ఒప్పందానికి మళ్లీ.. గతంలో జరిగిన ఒప్పందాలకు కొనసాగింపుగా తాజాగా మరో ఒప్పందానికి ఏయూ అధికారులు శ్రీకారం చుట్టారు. వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ వీసీ చక్మా శుక్రవారం ఏయూను సందర్శించారు. గతంలో చేసుకున్న ఒప్పందాలు, ప్రారంభించిన ఆస్ట్రేలియన్ కార్నర్ కేంద్రాన్ని పరిశీలించారు. వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీకి భారత్లో ముంబై, చైన్నె నగరాల్లో క్యాంప్లు ఉన్నాయి. ఏయూలో వెయ్యి మందికి పైగా విదేశీ విద్యార్థులు ఉన్నట్లు వీసీ చక్మా గుర్తించారు. దీంతో ఏయూ విద్యార్థులకు వెస్ట్రన్ యూనివర్సిటీలో ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించారు. దీని కోసం శుక్రవారం ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ వీసీ చక్మా, ఏయూ వీసీ ప్రొఫెసర్ రాజశేఖర్ ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా ఏయూలో రెండేళ్లు బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పూర్తి చేస్తే వారి ప్రతిభ ఆధారంగా వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీలో ప్రవేశం కల్పించనున్నారు. ఈ రెండేళ్లు విద్యార్థులు ఆస్ట్రేలియా వెళ్లి బీటెక్ కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ బీటెక్ కోర్సు కోసం ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ కార్యక్రమం ఎంవోయూలో భాగంగా ఉంది. దీని ప్రకారం అక్కడి యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఏయూకు వచ్చి విద్యా బోధన చేయనున్నారు. అలాగే ఏయూ ప్రొఫెసర్లు సైతం ఆస్ట్రేలియా యూనివర్సిటీలో బోధించే అవకాశం కలగనుంది. 2023లో ఏయూలో ఆస్ట్రేలియన్ కార్నర్ ఏర్పాటుకు ఒప్పందం ఇప్పుడు వెస్ట్రర్న్ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీలో బీటెక్ విద్యకు అవకాశం ఏయూలో బీటెక్ సీఎస్ఈలో రెండేళ్లు పూర్తి చేసి ప్రతిభ చూపించిన వారికి చాన్స్ మిగిలిన రెండేళ్లు వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీలో ప్రవేశం వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ వీసీ అమిత్ చక్మా ఏయూ సందర్శన గత ఒప్పందం కొనసాగింపుగా శుక్రవారం మరో ఎంవోయూ -
ప్రపంచంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా విశాఖ
సాక్షి, విశాఖపట్నం : ప్రపంచంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా విశాఖపట్నం అవతరించబోతోందని సీఎం చంద్రబాబు అన్నారు. కాపులుప్పాడ ఐటీ హిల్స్లో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ నిర్మాణానికి చంద్రబాబు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్ హౌస్ కంపెనీగా ఉన్న కాగ్నిజెంట్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తూ విశాఖలో అడుగుపెట్టిందన్నారు. ఏఐ, డేటా సెంటర్లతో విశాఖ.. ఐటీ డెస్టినేషన్గా నాలెడ్జ్ ఎకానమీ కేంద్రంగా తయారవుతోందని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం, మెట్రో లాంటి అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు వస్తాయని వెల్లడించారు. నౌకాదళ కేంద్రం నుంచి టూరిజం కేంద్రంగా, ఇప్పుడు టెక్ సిటీగా విశాఖ ఎదిగిందని తెలిపారు. గూగుల్ కూడా త్వరలోనే డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోందనీ.. 2032కి 130 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా విశాఖ ఎకనామిక్ రీజియన్ తయారవుతుందని ఆకాంక్షించారు. కాగ్నిజెంట్తో పాటు.. టెక్ తమ్మిన, సత్వా డెవలపర్స్, ఇమాజిన్నోవేట్ టెక్ సొల్యూషన్స్ ఇండియా, ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్, మదర్సన్ టెక్నాలజీస్, క్వార్క్స్ టెక్నోసాఫ్ట్, ఏసీఎన్ హెల్త్ కేర్ ఆర్సీఎం సర్వీసెస్, నాన్రెల్ టెక్నాలజీస్ వంటి సంస్థలకు సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ శంకుస్థాపనలు చేశారు. అనంతరం రుషికొండలో జరిగిన వైజాగ్ ఎకనమిక్ రీజియన్ అభివృద్ధి సమీక్షలో చంద్రబాబు మాట్లాడుతూ కై లాసగిరి నుంచి భీమిలి వరకు తీర ప్రాంతాన్ని రాష్ట్ర పర్యాటకానికి కోర్ సిటీగా అభివృద్ధి చేయాలని మాస్టర్ ప్లాన్లో రూపొందించామన్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు కె.అచ్చెన్నాయుడు, నారాయణ, టీజీ భరత్, కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, కొల్లు రవీంద్రతో పాటు సీఎస్ విజయానంద్, 9 జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. -
రీ సర్వేలో కాసుల వేట
మహారాణిపేట: జిల్లాలో చేపట్టిన భూముల రీ సర్వే ప్రక్రియ అవినీతికి అడ్డాగా మారింది. ప్రజాసేవే పరమావధిగా పనిచేయాల్సిన కొందరు సర్వే ఉద్యోగులు.. అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. జీతాలు తీసుకుంటున్నప్పటికీ, అదనపు ఆదాయం కోసం రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. రీ సర్వేను సక్రమంగా పూర్తి చేయాలంటే రైతులు భారీగా ముడుపులు చెల్లించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. మామూళ్లు ఇవ్వని పక్షంలో, లేనిపోని మెలికలు పెడుతూ దరఖాస్తులను పక్కన పెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 64 గ్రామాల్లో నత్తనడకన సర్వే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. పెందుర్తి, గాజువాక, ఆనందపురం, పద్మనాభం, భీమిలి, విశాఖ రూరల్ మండలాల పరిధిలోని 64 గ్రామాల్లో రీ సర్వే పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డ్రోన్లు, రోవర్లు, జీపీఎస్ వంటి ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. ప్రభుత్వ, జిరాయితీ, ఇనాం భూములను సర్వే నంబర్ల వారీగా రికార్డు చేస్తున్నారు. అయితే, రెండు విడతల సర్వే ఇంకా కొలిక్కి రాలేదు. మూడో విడత పనులు గొడవలు, వివాదాలతో స్తంభించిపోయాయి. ఈ ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందనే దానిపై ఎవరివద్దా స్పష్టత లేదు. ముడుపులు ఇస్తేనే మోక్షం తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, గ్రామ రెవెన్యూ అధికారి తదితరులు ఈ సర్వేలో పాల్గొంటున్నారు. మండల సర్వేయర్, డివిజనల్ సర్వేయర్, చైన్మెన్, ఇతర సిబ్బంది సహకారంతో చేస్తున్న రీ సర్వేలో అవినీతి విచ్చలవిడిగా సాగుతోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కొందరు అధికారులు చిన్నపాటి సాంకేతిక సమస్యలను సాకుగా చూపి సర్వేలను నిలుపుదల చేస్తున్నారు. చేతులు తడిపితేనే పనులు జరుగుతున్నాయి. మరోవైపు, ఈ వ్యవహారంలోకి దళారులు ప్రవేశించి, అధికారులకు సహకారం అందిస్తామంటూ అనధికార వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇదేమని ప్రశ్నించిన రైతులపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఘర్షణలకు దిగుతున్న సంఘటనలు కూడా ఉన్నాయి. రికార్డుల పేరుతో .. క్షేత్రస్థాయిలో సాగులో ఒకరుంటే, పాత రెవెన్యూ రికార్డుల్లో మరొకరి పేరు ఉంటోంది. ఈ వ్యత్యాసాన్ని ఆసరాగా చేసుకుని అధికారులు రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ భూములు, ట్యాంక్ పోరంబోకు, గ్రామ కంఠం, ఇనాం భూముల విషయంలో అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అన్నదమ్ముల తగాదాలు, కుటుంబ వివాదాలు ఉన్న భూముల్లో సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, వాటిని మరింత జఠిలం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేసి తమకు న్యాయం చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు. -
మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ప్రైవేటు బస్సు బోల్తా
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: దుర్గమ్మ.. చినవెంకన్న.. శివయ్య.. దత్తాత్రేయుడు.. సూర్యనారాయణుడు.. సింహాద్రి అప్పన్న.. అందరి దర్శనం చేసుకున్నారు. భద్రాచలం సీతారాముల్ని దర్శించుకునేందుకు బయల్దేరారు. అంతలోనే పొగమంచు పగబట్టింది. రోడ్డు మలుపు మృత్యువుగా మారి 9 మందిని పొట్టనపెట్టుకుంది. తీర్థయాత్ర చివరి ఘట్టానికి చేరుకుంటున్న సమయంలో మృత్యులోకానికి చేరుకున్నారు. నిన్నటివరకూ తమతో ప్రయాణించిన వారు.. ఇప్పుడు విగతజీవులుగా మారిపోయారని తెలిసి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. చిత్తూరులో మొదలైన ప్రయాణం.. చింతూరు సమీపంలో శాశ్వతంగా ఆగిపోయింది. తులసిపాక ఘాట్ రోడ్డులో బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో 9 మంది మృతి చెందగా.. 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరికి ప్రాణాపాయం లేదని వైద్యులు చెబుతున్నారు. గాయపడిన వారికి చింతూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు. సాయంత్రం మృతదేహాలను, తీవ్రంగా గాయపడిన నలుగురు క్షతగాత్రులను అంబులెన్సులలో చిత్తూరు పంపించారు. మిగతా క్షతగాత్రులను మినీ బస్సుల్లో వారి స్వగ్రామాలకు పంపించారు.రాజుగారి మెట్ట వద్ద..అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు–మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో తులసిపాకలోని రాజుగారి మెట్ట వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బస్సు అరకు నుంచి భద్రాచలం వెళ్తుండగా శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ప్రమాదం సంభవించింది. మొత్తం 37 మంది ప్రయాణిస్తున్న బస్సులో 32 మంది తీర్థయాత్రలకు వచ్చిన వారు కాగా.. ఒకరు ఆర్గనైజర్, ఇద్దరు వంట మనుషులు ఉన్నారు. ఇద్దరు డ్రైవర్లు కలిపి మొత్తం 37 మంది బస్సులో ప్రయాణిస్తున్నారు. ఇందులో డ్రైవింగ్ చేస్తున్న మొదటి డ్రైవర్కు గాయాలు కాగా.. పక్కనే ఉన్న మరో డ్రైవర్కు చేయి విరిగింది. వీరిలో 9 మంది మృతి చెందారు. 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన ఆరుగురు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. మృతులంతా చిత్తూరు జిల్లా వారే. ఘటనా స్థలంలో 3 అంబులెన్స్లు, 5 పోలీసు వాహనాలతో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన 22 మందికి చింతూరు ఆస్పత్రిలో చికిత్స అందించారు. గాయపడిన వారిలో ఒకరికి తలకు గాయం కావడంతో.. మొదట్లో భద్రాచలం ఆస్పత్రికి తరలిద్దామనుకున్నారు. అయితే, ఇబ్బందేమీ లేదని తేలడంతో చింతూరు ఆస్పత్రిలోనే చికిత్స అందించారు.పుణ్యక్షేత్రాల సందర్శనకు వచ్చి..చిత్తూరు నగర చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన 32 మంది పుణ్యక్షేత్రాల దర్శనం కోసం టూర్ వేసుకునున్నారు. వీరిలో 20 మంది మహిళలున్నారు. ఈ నెల 6న మిట్టూరులోని విఘ్నేశ్వర ట్రావెల్స్కు చెందిన ఏపీ 39 యూఎం 6543 నంబర్ బస్సులో బయలుదేరారు. మురకం బట్టుకు చెందిన రామ్మూర్తి అనే ప్రైవేట్ ఏజెంట్ ద్వారా బస్ బుక్ చేసుకున్నారు. తొలుత కోటప్పకొండ, అమరావతి, మంగళగిరి, విజయవాడ కనకదుర్గమ్మ, ద్వారకాతిరుమల, భీమవరం, పాలకొల్లు, అంతర్వేది, ద్రాక్షారామం, పెనుగొండ, సామర్లకోట, పిఠాపురం, కోటిపల్లి, అన్నవరం, అరసవల్లి, శ్రీకూర్మం చూసుకొని గురువారం విశాఖ చేరుకున్నారు. ఇక్కడ సింహాచలం దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత నేరుగా అరకు లోయకు వెళ్లారు. అక్కడ నుంచి గురువారం సాయంత్రం 5 గంటలకు అరకు నుంచి భద్రాచలం వెళుతున్న క్రమంలో దుర్ఘటన జరిగింది. కాగా, హోంమంత్రి అనిత, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి, కలెక్టర్ దినేష్కుమార్, ఎస్పీ అమిత్బర్దర్, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఘటనాస్థలాన్ని, స్థానిక ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాలను పరిశీలించారు. క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం తరఫున రూ 2 లక్షలు పరిహారంగా ఇవ్వనున్నట్లు మంత్రి రాంప్రసాద్రెడ్డి ప్రకటించారు. తీవ్రగాయాలైన వారికి రూ.2 లక్షలు, సాధారణ గాయాలైన వారికి రూ. 50 వేలు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రంపచోడవరం నియోజకవర్గ ఇన్చార్జి నాగులపల్లి ధనలక్ష్మి క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మృతుల వివరాలుమృతుల్లో చిత్తూరు నగరానికి చెందిన నాగేశ్వరరావు(68), శ్రీకళాదేవి (64), కావేరి కృష్ణ(70), శ్యామల(67), తవణంపల్లె మండలానికి చెందిన దొరబాబు(37), పలమనేరుకు చెందిన దంపతులు శివశంకరరెడ్డి(47), సునంద (45), పెనుమూరుకు చెందిన కృష్ణకుమారి(47), తెనాలి శైలజారాణి(64) ఉన్నారు.అతివేగం.. పొగమంచే కారణంబస్సులో ప్రసాద్, మధు అనే ఇద్దరు డ్రైవర్లుండగా.. మధు బస్సు నడుపుతున్నట్టు క్షతగాత్రులు చెప్పారు. మలుపుల వద్ద కూడా వేగంగా వెళ్తుండగా.. నెమ్మదిగా వెళ్లాలని చెప్పినట్టు బాధితులు తెలిపారు. చాలామంది గాఢ నిద్రలో ఉండగా.. దట్టంగా కురుస్తున్న పొగమంచుతో రోడ్డు కనిపించకపోయినా.. వేగంగా మలుపు తిప్పడంతో తులసిపాక వద్ద మరో మలుపు ఉన్నట్టు డ్రైవర్ గుర్తించలేకపోయాడు. దీంతో బస్సు వేగాన్ని నియంత్రించలేక అదుపుతప్పి లోయలో పడిపోయింది. ప్రయాణికులు నిద్ర నుంచి తేరుకునేలోపే 9 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మృతుల్లో ఐదుగురు మహిళలు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికుల హాహాకారాలతో ఘాట్రోడ్డు విషాదకరంగా మారిపోయింది. కిటికీ పక్కన కూర్చున్న ప్రయాణికులు మాత్రం చిన్న గాయాలతో బయటపడగలిగారు. నడిచేందుకు వీలుగా ఉన్న దారికి అటుఇటుగా ఉన్న సీట్లల్లో కూర్చున్న ప్రయాణికులు మాత్రం వెంటనే కిందపడిపోయారు. బస్సు ఏటవాలుగా బోల్తాపడటంతో ఒక్కసారిగా నిద్ర మత్తులోనే కిందపడి జారుకుంటూ వెనక్కి వెళ్లి గుద్దుకోవడంతో కనీసం ప్రాణాలు కాపాడుకునేందుకు కూడా ప్రయత్నించే అవకాశం లేకుండా పోయిందని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి భద్రాచలానికి ఇంకో 2 గంటల్లోగా చేరుకుంటారనేలోగా ఘోర ప్రమాదం జరిగింది.తీరిగ్గా.. తాపీగా..ఈ ఘాట్రోడ్డులో ప్రయాణం భయంగానే ఉంటుంది. చురుకైన మలుపులతో పాటు రోడ్డు మధ్య గుంతలతో ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. పాడైపోయిన ఈ రోడ్లను బాగు చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని స్థానికులు పదేపదే కోరుతున్నా కనీసం గుంతలు కూడా పూడ్చిన పాపాన పోలేదు. గతంలోనూ ఈ ఘాట్రోడ్డులో పలు ప్రమాదాలు జరిగాయి. 15 అక్టోబర్ 2019లో కర్ణాటకకు చెందిన ప్రయాణికులు ఇక్కడి రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మారేడుమిల్లి ప్రాంతం పర్యాటకులను బాగా ఆకర్షిస్తోంది. ఇప్పుడు సీజను కూడా. వచ్చే మార్చి నెలాఖరు వరకూ ప్రకృతి అందాలను తిలకించేందుకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయానికి ముందే రోడ్లను బాగు చేయాల్సిన అవసరం ఉంది. అయితే, ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. గత సంక్రాంతి సీజన్కే గుంతలు లేని రోడ్లను అభివృద్ధి చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఏడాది దాటి మరో సంక్రాంతి వస్తున్నప్పటికీ రోడ్లను మాత్రం పట్టించుకోవడం లేదు. తాజా ప్రమాదంతో తీరిగ్గా స్పందించిన ప్రభుత్వం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ భారీ వాహనాలకు ఘాట్ రోడ్డులో అనుమతి నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.వైఎస్ జగన్ దిగ్భ్రాంతిఅల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలువురు యాత్రికులు మరణించడం అత్యంత విషాదకరమని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ ప్రమాదం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని, తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎం చంద్రబాబు విచారంబస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తంచేశారు. బస్సు ప్రమాదం గురించి అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారని, పలువురు మృతిచెందగా, గాయపడిన వారిని చింతూరు ఆస్పత్రికి తరలించామని అధికారులు తెలిపారు. అవసరమైన వారిని మెరుగైన వైద్యం కోసం ఇతర ఆస్పత్రులకు తరలిస్తున్నట్లు చెప్పారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సీఎం ఆదేశించారు. మృతుల్లో 8 మంది చిత్తూరు జిల్లా వాసులేచిత్తూరు అర్బన్: మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో బస్సు లోయలో పడిన దుర్ఘటన పదుల కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. దుర్మరణం పాలైన వారిలో 8 మంది చిత్తూరు జిల్లాకు చెందిన వారు కాగా.. తిరుపతి జిల్లాకు చెందిన మరో మహిళ ఉన్నారు. మరో 24 గంటలు దాటితే ఎవరి ఇళ్లకు వారు చేరుకునేవారు. మృతుల్లో ఒకరైన శ్రీకళాదేవి విశ్రాంత ప్రధానోపాధ్యాయిని. ఆరేళ్ల క్రితం భర్త చనిపోగా.. కొడుకు బసవంత్రెడ్డి యూఎస్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. ఇతను వస్తే తప్ప శ్రీకళాదేవి మృతదేహాన్ని చిత్తూరుకు తీసుకొచ్చేవాళ్లు లేరు. మరో మృతుడు నాగేశ్వరరావు చిత్తూరు న్యూట్రిన్ సంస్థలో పనిచేసి రిటైరయ్యారు. భార్య అమ్ములు, బాయ్తో కలిసి ఉంటున్నారు. పిల్లలు లేకపోయినా ఈ దంపతులు అన్యోన్యంగా ఉంటూ నాగేశ్వరరావుకు వచ్చే పింఛన్ డబ్బుతో కాలం గడుపుతున్నారు. చిత్తూరు నగరం గిరింపేటకు చెందిన శ్యామల విద్యుత్ శాఖలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేసి రిటైర్ అయ్యారు. భర్త చనిపోవడంతో హైదరాబాద్లో కుమార్తె వద్ద ఉంటున్నారు. చిత్తూరు నగరం మిట్టూరుకు చెందిన కావేరి కృష్ణ సైతం ప్రమాదంలో మృతి చెందారు. ఇతడి కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. తవణంపల్లెకు చెందిన దొరబాబు దాదాపు 20 ఏళ్లుగా వంట పనిచేస్తున్నాడు. పెళ్లయ్యి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పూరిగుడిసెలో కాపురముంటున్న ఈ కుటుంబానికి రెక్కాడితేగానీ డొక్కాడదు. మృతుడి భార్య సుమలత సున్నిత మనసు్కరాలు కావడంతో ఆమె భర్త చనిపోయిన విషయం ఇప్పటివరకు చెప్పలేదు. పలమనేరుకు చెందిన శివశంకర్రెడ్డి, సునంద దంపతుల ఒక్కగానొక్క కుమారుడు వెంకటసాయి బీడీఎస్ చదువుతున్నాడు. బెంగళూరు కేఆర్ పురంలో స్థిరపడ్డ మరో మహిళ కృష్ణకుమారి స్వగ్రామం పెనుమూరు మండలం బలిజపల్లె. ఈమె భర్త హరినాథరెడ్డి హిటాచీలతో వివిధ పనులు చేయిస్తుంటారు. భార్య మరణవార్త విన్నాక కన్నీటి పర్యంతమైన హరినాథరెడ్డి హుటాహుటిన చింతూరు బయలుదేరాడు. తిరుచానూరు పంచాయతీ టెలిఫోన్ కాలనీకి చెందిన విశ్రాంత అధికారిణి తెనాలి శైలజారాణి ఐదేళ్ల క్రితం గ్రంథాలయ అధికారిణిగా రిటైరయ్యారు. అప్పటి నుంచి టెలిఫోన్ కాలనీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ ఒంటరిగా జీవనం సాగిస్తోంది. తరచూ ఆధ్మాత్మిక యాత్రలు, తీర్థయాత్రలకు వెళ్తూ వచ్చేది. వీరంతా ఈ నెల 6న రాత్రి 9 గంటలకు చిత్తూరు నుంచి ట్రావెల్ బస్సులో బయలుదేరారు. వీరంతా 13వ తేదీన మహానంది, అహోబిలం, బ్రహ్మంగారి మఠం, ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయం, తాళ్లపాక అన్నమయ్య ప్రాంగణం చూసుకుని చిత్తూరు చేరుకోవాల్సి ఉంది. ఇంతలో రోడ్డు ప్రమాదం జరగడంతో విహార యాత్ర విషాదంగా ముగిసింది. టూర్లో అరకు లేకపోయినా..ఈ యాత్రలో అరకు వెళ్లాలని ఎవరూ అనుకోలేదు. గురువారం ఉన్నట్టుండి అరకు వెళ్లాలని పలువురు పట్టుబట్టారు. దీంతో ఒక్కొక్కరి నుంచి రూ.500 అదనంగా వసూలు చేసి అరకు వెళ్లడం, అటు నుంచి భద్రాచలం వస్తుండగా ప్రమాదం జరిగిందని ప్రయాణికురాలు పద్మజ తెలిపారు.బస్సు ఒకరిది.. ఆపరేటర్ మరొకరుచిత్తూరు రూరల్ (కాణిపాకం): చింతూరు–మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో రాజుగారి మెట్ట వద్ద లోయలో పడిన బస్సు చిత్తూరు నగరం మురకంబట్టుకు చెందిన రామ్మూర్తికి చెందినది. ఇతడు 30 ఏళ్లుగా బస్సు సర్వీసులు నడుపుతున్నారు. ఇతనికి ప్రస్తుతం రెండు బస్సులున్నాయి. అందులో ఏపీ 39యూఎం 6543అనే బస్సు అదుపు తప్పింది. ఘోర ప్రమాదానికి కారణమైంది. ఈ బస్సును రెండేళ్ల క్రితం విఘ్నేశ్వర ట్రావెల్స్ సంస్థ రామ్మూర్తి నుంచి అద్దెకు తీసుకుని టూర్స్ నిర్వహిస్తోంది. పన్నీర్ సెల్వం అనే వ్యక్తి విఘ్నేశ్వర ట్రావెల్స్ను నడిపిస్తున్నారు. ఇతని ద్వారా దొడ్డిపల్లికి చెందిన వజ్రమణి అనే వ్యక్తి టూరిస్టు ఏజెంట్గా వ్యవహరిస్తున్నాడు. ఇతని ద్వారా విహార యాత్రలకు వెళ్లే వారి పూర్తి వివరాలు ట్రావెల్స్ నిర్వాహకుల వద్ద ఉండటం లేదు. దీనిపై ట్రావెల్స్ నిర్వాహకులు దృష్టి సారించడంలేదని తెలుస్తోంది.‘ఫిట్నెస్ ఎలా ఇచ్చారో’ప్రమాదానికి గురైన బస్సు 2012లో రిజిస్ట్రేషన్ అయింది. గత నెల 6న ఫిట్నెస్ సర్టిఫికెట్(ఎఫ్సీ) చేయించారు. ఈ గడువు 2026 నవంబర్ 7 వరకు ఉంది. చిత్తూరు నగర బంగారుపాళ్యం సమీపంలోని ఆటోమెటిక్ టెస్టింగ్ సెంటర్లో ఎఫ్సీ చేయించారు. అక్కడికి బండి వెళ్లకుండానే ఎఫ్సీ చేయించారా, లేకుంటే బండి లోపాలను చూడకుండా ఎఫ్సీ ఇచ్చారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బండి కండిషన్ ఆధారంగానే ఇచ్చారా అనే అనుమానాలు ఉన్నాయి.డ్రైవర్ల వివరాలు ఇలా..బస్సులో మధు, ప్రసాద్ అనే ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. మధు 2014లో హెవీ లైసెన్స్ తీసుకున్నాడు. ఈ లైసెన్స్ కాలపరిమితి 2030 వరకు ఉంది. ఇతనిపై ఇంతవరకు ఎలాంటి కేసులు, ప్రమాద సమస్యలు లేవని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రసాద్ మరో డ్రైవర్ కూడా 2006లో హెవీ లైసెన్స్ పొందాడు. ఈ లైసెన్స్ గడువు 2026 జూన్ 26తో ముగియనుంది. ఇతడి హయాంలో కూడా ప్రమాదాలు జరగలేదని అధికారులు చెబుతున్నారు.ఒక్కొక్కరిదీ ఒక్కో కన్నీటి గాథకూతురు, అల్లుడిని కోల్పోయిన వృద్ధురాలు భర్తను కోల్పోయిన రిటైర్డ్ టీచర్ దుర్ఘటనలో కదిలించే ఉదంతాలునేను పోయి వాళ్లు బతికినా బాగుండేది... ‘‘కూతురు సునందన, అల్లుడు శివశంకర్రెడ్డి, సమీప బంధువు శ్రీకళ (భర్త మేనకోడలు)తో కలిసి తీర్థయాత్రకు బయల్దేరా. ప్రమాదంలో వీరంతా ప్రాణాలు కోల్పోయారు. ఎంతో జీవితం ఉన్న వారి బదులు నేను చనిపోయినా బాగుండేది. నా భర్త రామచంద్రారెడ్డి వృద్ధాప్యంతో బాధపడుతున్నాడు. – వరిగపల్లి కుమారిహెల్పర్గా తెచ్చిన వంట మనిషి ప్రాణాలు కోల్పోయాడు మాంసం దుకాణం నడిపే నన్ను వంట మనిషి దొరబాబు రోజు కూలీకి హెల్పర్గా రమ్మన్నాడు. ప్రమాదంలో దొరబాబు మృతి చెందగా నా కాలికి గాయాలయ్యాయి. మృతదేహాలు నా మీద పడడంతో ఊపిరి ఆడలేదు. ఎలాగోలా కిటీకి నుంచి బయటకు వచ్చా – చిత్తూరుకు చెందిన సయ్యద్ ఇర్ఫాన్బ్రేక్ పడడం లేదని డ్రైవర్ చెప్పాడు... బస్సు ప్రమాదానికి ముందు నాకు మెలకువ వచి్చంది. బ్రేక్ పడడం లేదని డ్రైవర్ మధు చెప్పాడు. ఈ లోగానే బస్సు ప్రమాదానికి గురైంది. బోల్తా పడడంతో నా చేయి విరిగింది. బస్సు కిందకు దిగి నేను రెండు మృతదేహాలను బయటకు తీశా. – రెండో డ్రైవర్ పోగల ప్రసాద్తుపానుతో ఆగాం.. ప్రమాదం బారినపడ్డాం తీర్థయాత్రలకు గత నెల 23న బయలుదేరాలని భావించాం. ఆ సమయంలో తుపాను రావడంతో ప్రయాణం వాయిదా పడింది. దీంతో ఈ నెల 6న బయల్దేరాం. దుర్ఘటనలో నా తలకు తీవ్ర గాయమైంది. – చిత్తూరుకు చెందిన పద్మజమమ్మల్ని రమ్మన్న స్నేహితులు చనిపోయారు మా వీధిలో ఉంటున్న స్నేహితులు సరదాగా ఆంధ్రా చూసి వద్దాం రమ్మంటే వారితో బయల్దేరా. ప్రమాదంలో మా తలలకు తీవ్ర గాయాలయ్యాయి. విషాదం ఏమంటే.. మమ్మల్ని రమ్మని చెప్పిన నాగేశ్వరరావు, శ్రీకళ మృత్యువాత పడ్డారు. – చిత్తూరుకు చెందిన అక్కాచెల్లెళ్లు షేక్ అష్రఫ్, ముంతాజ్ మనశ్శాంతి కోసం వస్తే నా స్వామి చనిపోయాడు మేం ఇద్దరం రిటైర్డ్ టీచర్లం. కొంతకాలం క్రితం గుండె ఆపరేషన్ చేయించుకున్నా. పిల్లలు లేరనే బాధలో ఉన్న మేము మనశ్శాంతి కోసం తీర్థయాత్రలకు బయల్దేరాం. ఇప్పుడు ప్రమాదంలో భర్తను కోల్పోయా. ఆయన లేని జీవితాన్ని ఊహించుకోలేను. – చిత్తూరుకు చెందిన నాగేశ్వరరావు భార్య అమ్ములుబాయి – చింతూరు/మోతుగూడెం -
‘నాడు వైఎస్ జగన్ చెప్పిందే.. ఇప్పుడు బాబు చెబుతున్నారు’
విశాఖపట్నం: నగర పరిధిలో పెద్ద ఎత్తున భూ పందేరం నడుస్తుందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ ధ్వ.జమెత్తారు. ఏపీలో రూపాయికి, అర్థ రూపాయికి భూ కేటాయింపులు చేస్తున్నారని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల్లో కూడా భూములు ఇలానే ఇస్తున్నారా? అని నిలదీశారు. కేవలం ఏపీలోనే రూపాయికి, అర్థ రూపాయికి భూ కేటాయింపులు జరుగుతున్నాయన్నారు. ఈ రోజ(శుక్రవారం, డిసెంబర్ 12వ తేదీ) విశాఖపట్నం నుంచి మీడియాతో మాట్లాడిన గుడివాడ అమర్నాథ్.. ఏపీలో భూ పందేరంలో భాగంగానే ఈ తరహా కేటాయింపులు జరగుతున్నాయని మండిపడ్డారు. తమ హయాంలో ఏ కంపెనీకి రూపాయికి భూములు ఇవ్వలేదన్నారు. ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పరిశ్రమ వైఎస్సార్సీపీ హయాంలోనే వచ్చిందన్నారు. నాడు జగన్ ఏం చెప్పారో.. చంద్రబాబు అదే చెబుతున్నారువిశాఖ గురించి నాడు తమ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏం చెప్పారో.. నేడు చంద్రబాబు కూడా అదే చెబుతున్నారన్నారు. విశాఖ అనేది మన రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ అని జగన్ ఏనాడో చెప్పారని, ఇప్పుడు అదే మాట చంద్రబాబు కూడా చెబుతున్నారన్నారు. 2014లో విశఖను చంద్రబాబు ఎందుకు గుర్తించలేకపోయారన్నారు. ‘ రాష్ట్రానికి పరిశ్రమల రావడం అనేది ఒక కంటిన్యూ ప్రాసెస్..ిశాఖకు ఇన్ఫోసిస్ లాంటి గొప్ప ఐటీ పరిశ్రమ తెచ్చిన ఘనత వైఎస్ జగన్ది. ఇన్ఫోసిస్ లాంటి సంస్థ విశాఖ వచ్చింది కాబట్టి మిగతా ఐటీ పరిశ్రమలు విశాఖ నగరానికి తరలివస్తున్నాయి.టిసిఎస్ విశాఖ రావడానికి జగన్ కృషి ఉంది. పెద్ద కంపెనీలకు భూమి ఇవ్వడంలో తప్పులేదు. రియల్ ఎస్టేట్ సంస్థలకు కారుచౌకగా భూములు కట్ట బేడుతున్నారు. సత్వ, కపిల్ వంటి రియల్ ఎస్టేట్ సంస్థలకు వేల కోట్ల భూములను తక్కువ రేటుకు ఎందుకు ఇస్తున్నారు?, మీకు నచ్చిన సంస్థలకు రూపాయి అర్ధ రూపాయికి ఇస్తామంటే ఎలా..?, సత్వకు ఇచ్చిన భూమిలో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు, ప్లాట్స్ కట్టుకోమని ఎలా అనుమతులు ఇస్తారు?, రియల్ ఎస్టేట్ సంస్థలకు భూమి తక్కువ రేటుకు ఇవ్వడమే కాకుండా ప్రభుత్వ రాయితీలు ఇస్తారా?, లులు సంస్థ గుజరాత్ రాష్ట్రంలో ఎకరా భూమి కోట్లాది రూపాయలకు కొంటారు. మన రాష్ట్రంలో నామమాత్రపు ధరకు కట్టబెడతారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు. లోకేష్ను ప్రమోట్ చేయడం కోసం ప్రభుత్వ ధనంతో ప్రచారం చేస్తున్నారు. ప్రకటనల్లో కనీసం పరిశ్రమల శాఖ మంత్రి ఫోటో కూడా వేయడం లేదు. వైఎస్ జగన్ విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తానంటే మునిగిపోతుందని వార్తలు రాశారు. చంద్రబాబు విశాఖను అభివృద్ధి చేస్తానంటే ఆహా ఓహో అంటూ వార్తలు రాస్తున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు లోకేష్ తో పాటు మోదీ, పవన్ కళ్యాణ్ ఫోటోలు వేసేవారు.. నేడు ప్రకటనల్లో మోడీ పవన్ ఫోటోలు చుక్కలా మారిపోయాయి’ అని విమర్శించారు. -
16న సింహగిరిపై నెలగంట
ఆయా పర్వదినాల్లో దర్శనాల వేళల్లో మార్పు, ఆర్జిత సేవలు నిలుపుదల సింహాచలం: సింహగిరిపై ఈనెల 16న నెలగంట ఉత్సవాన్ని విశేషంగా నిర్వహించనున్నట్టు దేవస్థానం ఇన్చార్జి ఈవో ఎన్.సుజాత తెలిపారు. ఆరోజు నుంచి నెలరోజులపాటు ధనుర్మాసం పూజలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈనెల 16 నుంచి జనవరి 19వరకు సుప్రభాత సేవ, ఉదయం ఆరాధన టికెట్లు, ఈనెల 30 నుంచి జనవరి 19 వరకు సహస్రనామార్చన టికెట్లు రద్దు చేసినట్టు తెలిపారు. 16 నుంచి ధనుర్మాస ఉత్సవాలు ధనుర్మాస ఉత్సవాలు ఈనెల 16న ప్రారంభమవుతాయని, ఆరోజు మధ్యాహ్నం 1.01 గంటకు సింహగిరిపై రాజగోపురంలో నెలగంట మోగిస్తారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి, గోదాదేవికి విశేష పూజలు, తిరువీధి నిర్వహిస్తారు. తొలి పాశుర విన్నప పారాయణాన్ని నిర్వహిస్తారు. నెలగంట సందర్భంగా ఆరోజు ఉదయం 11.30 నుంచి మద్యాహ్నం 2.30 గంటల వరకు స్వామివారి దర్శనాలు లభించవు. 20 నుంచి పగల్పత్తు ఉత్సవాలు ఈనెల 20 నుంచి 29 తేదీ వరకు పగల్పత్తు ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతీ రోజూ ఉదయం తిరువీధి ఉత్సవం(అయ్యవారి సేవ) నిర్వహిస్తారు. ఆ రోజుల్లో ఆర్జిత సేవలన్నీ రద్దు చేశారు. 30 నుంచి రాపత్తు ఉత్సవాలు ఈనెల 30 నుంచి జనవరి 9వ తేదీ వరకు రాపత్తు ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతీ రోజూ సాయంత్రం 5 గంటలకు స్వామికి ఒక్కోరోజు ఒక్కో అలంకారంలో తిరువీధి నిర్వహిస్తారు. ఆయా రోజుల్లో రాత్రి 7 గంటల తర్వాత దర్శనాలు లభించవు. జనవరి 11న కూడారై ఉత్సవం జనవరి 11న ఆలయంలో కూడారై ఉత్సవం నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు దర్శనాలు లభించవు. 14న గోదా రంగనాథుల కల్యాణోత్సవం జనవరి 14న భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని సాయంత్రం 5 నుంచి 6.30 గంటల వరకు గోదా రంగనాథుల కల్యాణోత్సవం నిర్వహిస్తారు. ఆరోజు నిత్యకల్యాణం ఉదయం లేకపోవడంతో సాయంత్రం ఉభయదాతలకు అవకాశం కల్పిస్తారు. -
సింహగిరిపై శ్రీనృసింహ దీక్షల వైభవం
32 రోజుల దీక్షలు ప్రారంభం సింహాచలం : సింహగిరిపై 32 రోజుల శ్రీ నృసింహ దీక్షలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి దేవస్థానం అర్చకులు శాస్త్రోక్తంగా మాలధారణ చేశారు. ఆలయ రాజగోపురం పక్కన మాడవీధిలో ప్రత్యేకంగా వేదిక ఏర్పాటుచేసి శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ప్రతిమను ఉంచారు. దేవస్థానం ఏఈవో తిరుమలేశ్వరరావు, సూపరింటెండెంట్ మూర్తి, అర్చకులు ఆలయంలో నుంచి తులసి మాలలను ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామిచెంతన ఉంచి విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం నిర్వహించారు. స్వామివారి అష్టోత్తర శతనామావళిని దీక్షాధారులందరిచేత పఠింపజేశారు. అనంతరం మాలధారణ చేశారు. తులసి మాల, ప్రతిమ ఉచితంగా అందజేయడంతోపాటు స్వామివారి అంతరాలయ దర్శనాన్ని కల్పించారు. దీక్ష తీసుకున్నవారిలో సింహాచలం ప్రాంతానికి చెందిన శ్రీ చందన పెరుమాళ్ పీఠం, సింహాద్రిమఠం, శ్రీనృసింహ పెరుమాళ్ పీఠంకి చెందిన భక్తులు ఉన్నారు. దేవస్థానం ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు, అర్చకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా ఈనెల 3 నుంచి 41 రోజుల శ్రీ నృసింహ దీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. జనవరి 12వ తేదీన రెండు దీక్షల విరమణ కార్యక్రమం ఉంటుందని అధికారులు తెలిపారు. -
క్రీడకు కళ తోడైతే..
ఏయూక్యాంపస్: క్రీడా స్ఫూర్తికి కళాత్మకత తోడైతే ఆ దృశ్యం అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం విశాఖ వేదికగా జరుగుతున్న 63వ జాతీయ రోలర్ స్కేటింగ్ పోటీల్లో ఇదే ఆవిష్కృతమైంది. నగరంలోని శివాజీ పార్క్ వేదికగా ఉత్సాహంగా సాగిన ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ విభాగం పోటీలు గురువారంతో ముగిశాయి. కేవలం శారీరక దారుఢ్యం, వేగమే కాకుండా.. సంగీతానికి అనుగుణంగా హావభావాలను పలికిస్తూ, చక్రాలపై చిన్నారులు చేసిన నాట్యం చూపరులను కట్టిపడేసింది. ఆర్టిస్టిక్ స్కేటింగ్లో జంప్లు, స్పిన్లు, ఫుట్ వర్క్తో పాటు నృత్య సౌందర్యం కీలకం. ఈ పోటీల్లో 6 నుంచి 15 ఏళ్ల వయసున్న బాలబాలికలు ఫిగర్స్, ఫ్రీ స్కేటింగ్, డ్యాన్స్ స్కేటింగ్, ప్రెసిషన్ విభాగాల్లో తమ ప్రతిభను చాటారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు తమ అభినయంతో విశాఖ వేదికను మురిపించారు. ఏళ్ల తరబడి చేస్తున్న కఠోర సాధన, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వీరి ప్రదర్శనలు ఈ క్రీడలో భారతీయ భవిష్యత్తును చాటి చెప్పాయి. కఠోర సాధన. నాలుగేళ్ల వయసు నుంచే స్కేటింగ్ నేర్చుకుంటున్నాను. ఇది నాకు నాలుగో జాతీయ స్థాయి పోటీ. ఇప్పటివరకు 8 గోల్డ్, 3 బ్రాంజ్, 2 సిల్వర్ మెడల్స్ సాధించాను. ఈ స్థాయికి రావడానికి రోజూ ఉదయం 4 గంటలకే లేచి, ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటలు సాధన చేస్తాను. – బి.లాస్య శ్రీ చదువు, క్రీడ.. సమన్వయం గత తొమ్మిదేళ్లుగా స్కేటింగ్లో శిక్షణ తీసుకుంటున్నాను. ప్రస్తుతం విశాఖ వ్యాలీ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నా. ఆర్టిస్టిక్ విభాగంలో ఇప్పటివరకు 100కి పైగా పతకాలు సాధించాను. రోజూ రెండు గంటల పాటు సాధన చేస్తూనే, చదువుకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తున్నాను. ఈ సారి జాతీయ పోటీల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. – ఎ.వైణవి అంతర్జాతీయ పతకాలే లక్ష్యం ఆర్టిస్టిక్ స్కేటింగ్తో పాటు ఇన్లైన్, ఫిగర్, ఫ్రీ స్టైల్ విభాగాల్లోనూ రాణిస్తున్నాను. ఇప్పటివరకు 90కి పైగా మెడల్స్ సాధించాను. ఈ ఏడాది దక్షిణ కొరియాలో జరిగిన ఏషియన్ రోలర్ స్కేటింగ్లో, 2023లో ఆస్ట్రేలియా పసిఫిక్ కప్లో నాలుగు స్వర్ణ పతకాలు గెలవడం నా కెరీర్లో మరిచిపోలేను. అంతర్జాతీయ వేదికలపై దేశానికి మరిన్ని పతకాలు తేవడమే నా లక్ష్యం. – బి.రిషిల్ ఆసియా క్రీడల అనుభవంతో.. గత 11 ఏళ్ల సాధనలో 80కి పైగా పతకాలు వచ్చాయి. 2023లో చైనాలో జరిగిన ఏషియన్ గేమ్స్లో పాల్గొని పతకాలు సాధించడం మంచి అనుభవాన్ని ఇచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న నేషనల్స్లో రెండు సిల్వర్, ఒక బ్రాంజ్ మెడల్ రావడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్నాను. – ఆర్.కెలిన్ కార్తికేయన్ డాక్టరవుతా.. స్కేటింగ్లో రాణిస్తా.. నేను గత 13 ఏళ్లుగా స్కేటింగ్ చేస్తున్నాను. జాతీయ స్థాయిలో ఇప్పటివరకు 7 బంగారు పతకాలు సాధించాను. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్నాను. వచ్చే ఏడాది నీట్ రాసి వైద్య వృత్తిలోకి వెళ్లాలనేది నా ఆశయం. సమయాన్ని ప్రణాళికాబద్ధంగా వాడుకుంటూ అటు చదువులోనూ, ఇటు స్కేటింగ్లోనూ రాణిస్తున్నాను. – పి.సహీరా -
సిల్క్ ఎక్స్ పో వస్త్ర సంబరాలు
డాబాగార్డెన్స్: వివాహాది వేడుకలకు కావల్సిన విశిష్ట, విభిన్న వస్త్రాల ప్రదర్శన నేషనల్ ఎక్స్ పో ఎగ్జిబిషన్ కమ్ సేల్ నగరానికి వచ్చింది. ఈ వస్త్ర ప్రదర్శన ఈ నెల 16వ తేదీ వరకు వాల్తేర్ మెయిన్రోడ్డులో ఉన్న హోటల్ గ్రీన్పార్క్లో ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాల సాంస్కృతిక బంధాలు, వివిధ రాష్ట్రాల మగ్గాల ఉత్పత్తులను ఒకే ప్లాట్ఫాంపైకి తీసుకొచ్చారు. ప్రదర్శనలో వేలాది రకాల పట్టు, కాటన్ డిజైన్ దుస్తులు, డిజైనర్ చీర, బ్లౌజ్లు, కుర్తాలు వంటివి 50 శాతం వరకు తగ్గింపుతో అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. మహారాష్ట్ర సొగసైన పైథానీ సిల్క్ చీరలు, కర్నాటక సిల్క్, సాఫ్ట్ సిల్క్, కాషిడా సిల్క్, మధ్యప్రదేశ్ ప్రసిద్ధి చందేరి, మహేశ్వరి సిల్క్, హ్యాండ్ పెయింట్, బలుచారి, జమ్దాని, తంగైల్, ధకై మస్లిన్ సిల్క్, పశ్చిమ బెంగాల్ లినెన్ చీర కాంత వర్క్, స్టిచ్ చీరలు ఉన్నాయన్నారు. అలాగే నేత చీరలు, దుప్పట్లు, సల్వార్ మెటీరియల్, బిహార్ భాగల్పూర్ సిల్క్, గుజరాత్ సాంప్రదాయ బంధిని, కచ్ ఎంబ్రాయిడరీ, పటోలా, తమిళనాడు కంజీవర, జమ్మూ కాశ్మీర్ తాబి సిల్క్, ప్రింట్ చీరలు కూడా ప్రదర్శనలో కలవని పేర్కొన్నారు. -
విహారంలో విషాదం
హుకుంపేట: విహార యాత్రకు వచ్చిన ఇంజినీరింగ్ విద్యార్థుల బృందంలో ఒకరు మృతితో విషాదం నెలకొంది. వీరు ప్రయాణిస్తున్న కారు వంతెన గోడలను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రముఖ పర్యాటక ప్రాంతం వంజంగి హిల్స్ను గురువారం వేకువజామున సందర్శించారు. తిరుగు ప్రయాణంలో భాగంగా అరకు బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు మండలంలోని జాతీయరహదారిలో రాళ్లగెడ్డ వద్ద వంతెనను ఢీకొట్టింది. డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న ఇంజినీరింగ్ విద్యార్థి గుడివాడ రుద్రసాయి(19)కి తీవ్ర గాయాలు కావడంతో సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. మరో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు నారికంట్ల శ్రీయన్ నిహర్(19), శ్రీవాత్సవ(19)కు కూడా తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యసేవలు అనంతరం హుటాహుటిన విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వీరి పరిస్థితి కూడా విషమంగానే ఉంది. మృతుడు రుద్రసాయిది విజయనగరం జిల్లా గరివిడి మండలం వెదుళ్లవలస. అతని మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రి శవ పరీక్షల గదిలో భద్రపరిచారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న అతని తండ్రి రామ్మూర్తినాయుడు, కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. గుండెలవిసేలా రోదించారు. పొగమంచు అధికంగా ఉండడంతో రోడ్డు కనిపించక ఈ ప్రమాదం జరిగినట్టుగా ఎస్ఐ సూర్యనారాయణ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
న్యాయం చేయకుండా డిశ్చార్జ్ చేస్తారా?
కేజీహెచ్ ప్రసూతి వార్డు ఎదుట బాలింత ఆందోళన మహారాణిపేట: కేజీహెచ్లో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తమ శిశువు మృతి చెందిందని, ఈ ఘటనపై విచారణ పూర్తి కాకుండానే తమను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయడం తగదని బాలింత పి.ఉమాదేవి, ఆమె భర్త సూర్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం కేజీహెచ్ ప్రసూతి వార్డు ఎదుట బాధితులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. కొంతమంది వైద్యుల నిర్లక్ష్యం వల్ల తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. తమకు న్యాయం చేయకపోగా, ఇప్పుడు అర్ధాంతరంగా ఇంటికి వెళ్లిపోవాలని ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు. వైద్యుల వైఖరిపై ఇప్పటికే కలెక్టర్కు, ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. ‘ప్రసూతి వైద్యులు సక్రమంగా పర్యవేక్షించి ఉంటే మా మగబిడ్డ దక్కేవాడు. వారి నిర్లక్ష్యం వల్లే బాబు చనిపోయాడు. ఆ ఇద్దరు వైద్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి’ అని బాలింత ఉమాదేవి డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోకుండా తమను డిశ్చార్జ్ చేసి పంపడం అన్యాయమని వారు కన్నీటి పర్యంతమయ్యారు. దీనిపై కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి స్పందిస్తూ.. ఈ ఘటనపై కేజీహెచ్కు సంబంధం లేని వైద్యుల చేత విచారణ జరిపించాలని కలెక్టర్ ఆదేశించినట్లు తెలిపారు. ముగ్గురు వైద్యులతో విచారణ ఈ ఘటనపై ముగ్గురు వైద్యులతో కమిటీని నియమించారు. డీఎంహెచ్వో డాక్టర్ పి.జగదీశ్వరరావు, వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ అధికారి డాక్టర్ రాధారాణి, అగనంపూడి ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీప్రసన్న విచారణ చేసి నివేదికను కలెక్టర్కు సమర్పిస్తారు. -
చదువులో టాపర్.. స్కేటింగ్లో సూపర్
5 అంతర్జాతీయ పతకాలు సొంతంవిశాఖ స్పోర్ట్స్: జాతీయ స్థాయిలో రాణిస్తే మనకే గర్వకారణం.. అదే అంతర్జాతీయ స్థాయిలో పతకం సాధిస్తే అది దేశానికే గర్వకారణం.. ఇదే మాటను తన ఆశయంగా మార్చుకుంది విశాఖకు చెందిన ఆర్టిస్టిక్ స్కేటర్ శ్రీసాహితి. సరదాగా మొదలైన ప్రయాణాన్ని సీరియస్ కెరీర్గా మలచుకుని, పతకాల పంట పండిస్తోంది. ఒకే ఏడాది జాతీయ స్థాయిలో ఏడు పతకాలను కొల్లగొట్టిన సాహితి.. అంతర్జాతీయ వేదికలపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తోంది. నాలుగున్నరేళ్లకే స్కేట్స్ కట్టి.. 2016లో తన అన్నయ్య శ్రీసాకేత్తో కలిసి వేసవి శిక్షణ శిబిరానికి వెళ్లిన శ్రీసాహితికి అక్కడ స్కేటింగ్ పై ఆసక్తి కలిగింది. అప్పుడు ఆమె వయసు కేవలం నాలుగున్నరేళ్లు. కోచ్లు చెప్పే మెలకువలను ఇట్టే గ్రహించే ఆమె ప్రతిభను చూసి అంతా ఆశ్చర్యపోయారు. శిక్షణ తీసుకున్న రెండు నెలల్లోనే జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని స్వర్ణ పతకాన్ని సాధించింది. అక్కడి నుంచి ఇక వెనుదిరిగి చూడలేదు. పతకాల ప్రవాహం : జిల్లా స్థాయి నుంచి మొదలుకొని జాతీయ స్థాయి వరకు శ్రీసాహితి ఇప్పటివరకు మొత్తం 106 పతకాలను సాధించడం విశేషం. కేవలం జాతీయ స్థాయిలోనే కాకుండా, అంతర్జాతీయ రింక్లలోనూ తన సత్తా చాటి ఐదు పతకాలను కై వసం చేసుకుంది. తైవాన్లో జరిగిన ఆసియన్ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్లో సోలో డాన్స్ విభాగంలో తన తొలి అంతర్జాతీయ స్వర్ణాన్ని గెలుచుకుంది. ఆసియానియా పసిఫిక్ కప్ ఇన్లైన్ పోటీల్లోనూ స్వర్ణం సాధించి ఔరా అనిపించింది. నగరంలో జరుగుతున్న జాతీయ రోలర్ స్కేటింగ్ పోటీల్లో 12–15 బాలికల విభాగం ఫ్రీ స్కేటింగ్ విభాగంలో సాహితి స్వర్ణ పతకం సాధించింది. చదువులోనూ చురుకుదనం : ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న శ్రీసాహితి.. క్రీడల్లోనే కాదు చదువులోనూ టాపరే. తనకు ఎంతో ఇష్టమైన ఫిగర్ స్కేటింగ్పై ప్రత్యేక దృష్టి సారించిన ఆమె, టెక్నికల్ అంశాల్లోనూ పట్టు సాధించింది. ‘జాతీయ స్థాయిలో ఒకేసారి ఏడు పతకాలు వచ్చినప్పుడే అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించగలననే నమ్మకం వచ్చింది. దేశం తరఫున ఆడి గెలిస్తే వచ్చే గౌరవమే వేరు’ అని శ్రీసాహితి ‘సాక్షి’తో పేర్కొంది. ప్రస్తుతం సాహితి మరోసారి ఆసియన్ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్లో సత్తా చాటేందుకు సన్నద్ధమవుతోంది. -
ఆర్టిస్టిక్లో ఆంధ్రా అదుర్స్
విశాఖ స్పోర్ట్స్: జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ స్కేటర్లు సత్తా చాటారు. స్వర్ణాలే లక్ష్యంగా దూసుకెళ్లి ఆర్టిస్టిక్ చాంపియన్షిప్ హోదాను నిలబెట్టుకున్నారు. గురువారంతో ముగిసిన ఆర్టిస్టిక్ విభాగం పోటీల్లో చిన్నారుల నుంచి సీనియర్ల వరకు ఏపీ క్రీడాకారులు స్వర్ణ పతకాలను కై వసం చేసుకున్నారు. ఈ పోటీల్లో తెలంగాణ, గుజరాత్, కర్నాటక, తమిళనాడు స్కేటర్లు కూడా నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు. విభాగాల వారీగా విజేతలు వీరే.. ఫ్రీ స్కేటింగ్: 12–15 ఏళ్ల బాలికల విభాగంలో బి.సాయి సాహితి, బాలురలో ఎస్.శంకర్, 8–10 ఏళ్ల బాలురలో జీవన్ ఆదిత్య, 10–12 ఏళ్ల బాలికల్లో సుదీక్ష సాయి, బాలురలో చేతన్ ఆశిష్, 15–18 ఏళ్ల బాలికల్లో గ్రీష్మ, బాలురలో దినేష్, 18 ఏళ్లు పైబడిన (18+) బాలుర విభాగంలో వైష్ణవ్ (వీరంతా ఏపీ) విజేతలుగా నిలిచారు. ఇక 6–8 ఏళ్ల బాలికల్లో పి.రుత్విక, డి.ఆర్జిత్ (తెలంగాణ), 8–10 ఏళ్ల బాలికల్లో జులినా(కేరళ) ప్రథమ స్థానంలో నిలిచారు. కపుల్ స్కేటింగ్: 6–8 ఏళ్ల విభాగంలో విజయ్–మహీరా జోడి, 8–10 ఏళ్లలో పశ్యంత్–హర్షిణి జోడి (ఏపీ) విజేతలుగా నిలిచారు. 10–12 ఏళ్లలో బెన్నీ–అద్విక, 12–15 ఏళ్లలో వెంకటరామ్–అన్విత, 15–18 ఏళ్లలో మురళీ–తనిష్క, 18+ విభాగంలో తేజేస్–జయేష్ జోడి (తెలంగాణ) విజయం సాధించారు. పెయిర్ స్కేటింగ్: 8–10 ఏళ్ల విభాగంలో భీష్మ–వేదాంశి, 12–15 ఏళ్లలో వినీత్–సుష్రీత జోడి (ఏపీ) విజేతలుగా నిలవగా.. 6–8 ఏళ్లలో ఓర్జిత్–రుత్విక, 10–12 ఏళ్లలో సాత్విక్–అద్విక జోడి(తెలంగాణ) పతకాలు సాధించారు. ఇన్లైన్: 8–10 ఏళ్ల బాలికల్లో ఎం.రుత్విక, 10–12 బాలురలో తేజ్సాకేత్, 12–15 బాలికల్లో జెస్సికా శ్రీ, బాలురలో విరీత్, 15–18 బాలికల్లో క్షేత్ర(వీరంతా ఏపీ) విజేతలుగా నిలిచారు. 8–10 ఏళ్ల బాలురలో లక్ష్మణ్ జీవాంస్ (తెలంగాణ) ప్రథమ స్థానం దక్కించుకున్నాడు. సోలో డాన్స్: ఎ.విజయ్, హరి కమల్ (ఏపీ) విజేతలుగా నిలిచారు. తెలంగాణ నుంచి జెస్సికా బెన్, సాకేత్, అద్విక, జాస్ బెన్నీ, వెంకట్రామ్, మురళీ పతకాలు సాధించగా.. మహారాష్ట్ర నుంచి ఎస్.గాంధీ, హర్షల్ మమ్మానియా, రీగా అగర్వాల్, కాంతి శ్రీ ఆయా విభాగాల్లో విజేతలుగా నిలిచారు. ఫిగర్ స్కేటింగ్: 6–8 ఏళ్ల విభాగం బాలికల్లో మిషికా(గుజరాత్), బాలురలో డి.ఓర్జిత్(తెలంగాణ), 8–10 ఏళ్ల బాలికల్లో ఆర్నా హేమల్(గుజరాత్), బాలురలో కె.సాకేత్(తెలంగాణ), 10–12 ఏళ్ల బాలురలో చేతన్ ఆశిష్, బాలికల్లో రష్మిత(ఏపీ), 12–15 ఏళ్ల బాలురలో రుషిల్ బెండీ, బాలికల్లో వైణవి, 15–18 ఏళ్ల బాలికల్లో పి.ఆశ్రిత, బాలురలో ఎన్.శౌర్య, 18 ఏళ్లు పైబడిన బాలికల విభాగంలో భవ్యశ్రీ, బాలురలో హరికమల్(ఏపీ) విజేతలుగా నిలిచారు. క్వార్టెట్, గ్రూప్ ఈవెంట్: క్వార్టెట్ విభాగం 6–8 ఏళ్లలో కె–పాప్ గ్రూప్, 8–10 ఏళ్లలో ది జంగిల్ బుక్ గ్రూప్, 10–12 ఏళ్లలో వారియర్స్ గ్రూప్, 12–15 ఏళ్లలో ది పైరేట్స్ ఆఫ్ కరేబియన్ గ్రూప్, 18 ఏళ్లు పైబడిన వారిలో బ్లాక్ పాంథర్స్ గ్రూప్ విజేతలుగా నిలిచాయి. ప్రెసిషన్ విభాగం 15 ఏళ్ల లోపు విభాగంలో మైస్టిక్ గ్రూప్, 15 ఏళ్లు పైబడిన వారిలో (15+) యానిమల్ గ్రూప్ విజేతలుగా నిలవగా, షో–గ్రూప్ 15 ఏళ్ల లోపు విభాగంలో ది రోబోస్, 15 ఏళ్లు పైబడిన వారిలో మైకేల్ జాక్సన్ గ్రూప్ విజేతలుగా నిలిచాయి. -
చెదలు
● నవ్వి పోదురు గాక.. మాకేంటి సిగ్గుఏయూ దూర విద్యకుచేతి రాతతో డిగ్రీ థర్డ్ సెమిస్టర్ హిందీ క్వశ్చన్ పేపర్ తయారీ స్టడీ సెంటర్లకు పేపర్ను మెయిల్ చేస్తుండడంపై విస్మయం వాటిని ప్రింట్లు తీసి విద్యార్థులకు పంపిణీ చేస్తున్న నిర్వాహకులు విశాఖ సిటీ: ఆంధ్రా యూనివర్సిటీ దూర విద్యకు చెదలు పట్టింది. ఈ విభాగం అధికారుల తీరు విమర్శలకు దారి తీస్తోంది. వీరి నిర్లక్ష్యంతో వందేళ్ల వర్సిటీ పరువు మంటగలుస్తోంది. దూర విద్య పరీక్షల నిర్వహణ నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఏటా వేలాది మందికి నిర్వహించే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పరీక్షలకు ప్రింటెడ్ ప్రశ్నా పత్రాలు ఇవ్వకపోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. నవ్విపోదురు గాక.. మాకేంటి సిగ్గు అన్నట్లు ప్రైవేటు స్కూళ్లు కూడా ఇవ్వని విధంగా చేతి రాతతో ప్రశ్నా పత్రాన్ని తయారు చేసి దాన్ని స్కాన్ చేసి స్టడీ సెంటర్లకు పంపిస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మెయిల్కు వచ్చిన క్వశ్చన్ పేపర్ను స్టడీ సెంటర్ల నిర్వాహకులు ప్రింట్లు తీసుకుని విద్యార్థులకు పంపిణీ చేస్తుండడం గమనార్హం. చేతి రాతతో హిందీ ప్రశ్నా పత్రం ఆంధ్రా యూనివర్సిటీ దూర విద్య డిగ్రీ థర్డ్ సెమిస్టర్ పరీక్షల ప్రశ్నా పత్రాలను చూసిన విద్యార్థులు షాక్కు గురయ్యారు. హిందీ ప్రశ్నా పత్రాన్ని చూసిన వారంతా ఇది ఒరిజినల్ పేపరా? కాదా? అన్న సందేహ స్థితిలో ఉండిపోయారు. చిన్న చిన్న వీధి బడుల్లో కూడా లేని విధంగా చేతి రాతతో ఉన్న క్వశ్చన్ పేపర్ ఇవ్వడంపై స్టడీ సెంటర్ల నిర్వాహకులే కాకుండా విద్యార్థులు సైతం కంగుతిన్నారు. శతాబ్ది ఉత్సవాలు చేసుకుంటున్న ప్రతిష్టాత్మక ఏయూ పరీక్షల నిర్వహణ మరీ ఇంత అధ్వానంగా ఉంటుందా? అని నవ్వుకుంటున్నారు. సాధారణంగా ఇతర యూనివర్సిటీలు ప్రింటెడ్ ప్రశ్నా పత్రాలను పరీక్షలకు ముందు రోజే స్టడీ సెంటర్లకు, కాలేజీలకు పంపిస్తుంటాయి. కానీ ఏయూ దూరవిద్య అధికారులు మాత్రం చేతితో క్వశ్చన్ పేపర్ రాసి దాన్ని స్కాన్ చేసి స్టడీ సెంటర్లు, కాలేజీలకు మెయిల్లో పంపిస్తుండడం విశేషం. ఆ పేపర్ను నిర్వాహకులు జెరాక్సులు తీసి పరీక్షలకు వచ్చే విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు. ఏయూ పరువు తీసిన అధికారులు ఏయూ డిస్టెన్స్ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు గుర్తింపు లేని స్టడీ సెంటర్లలో పరీక్షల నిర్వహణపై ఆరోపణలు వినిపిస్తుండగా.. మరోవైపు పరీక్షల నిర్వహణను గాలికి వదిలేస్తున్నారు. ఏయూ ప్రతిష్టను దిగజారుస్తున్నారు. ఈ రోజుల్లో గుర్తింపు లేని పాఠశాలల్లో కూడా చేతి రాత ప్రశ్నా పత్రాలు ఇవ్వడం లేదు. కానీ ఏయూ డిస్టెన్స్ అధికారులు మాత్రం ఇందుకు విరుద్ధంగా సరికొత్త సంప్రదాయానికి తెరలేపారు. ఏయూకు ఏటా రూ.50 నుంచి రూ.60 కోట్లు ఆదాయం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నుంచి వస్తోంది. అయినప్పటికీ.. పరీక్షా ప్రశ్నా పత్రాలను టైప్ చేసి సెంటర్లకు పంపించకుండా చేతి రాతతో రాసి మెయిల్ చేస్తుండడం అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
దారులన్నీ అమ్మ సన్నిధికే..
డాబాగార్డెన్స్: బురుజుపేటలో కొలువైన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మార్గశిర మాసం మూడో గురువారం కావడంతో అమ్మవారి దర్శనం కోసం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా, రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. బుధవారం అర్ధరాత్రి నుంచే క్యూల్లో బారులు తీరారు. భక్తి ప్రపత్తులతో జరిగిన పూజల నడుమ.. స్థానిక ఎమ్మెల్యే అనుచరుల హడావుడి, ఆలయ నిర్వహణలో పోలీసుల పెత్తనం సామాన్య భక్తులను, ఆలయ సిబ్బందిని ఇబ్బందులకు గురిచేయడం గమనార్హం. విశేషంగా పూజలు : మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు అమ్మవారికి పంచామృతాభిషేకాలు, సహస్రనామార్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.05 గంటల నుంచి 1.30 గంటల వరకు స్వర్ణాభరణాలతో అలంకరించిన అమ్మవారు భక్తులకు దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. అంతకుముందు గణపతి పూజ, పుణ్యాహవచనం, రుత్విక్ వరణ, వేద పారాయణాలు, శ్రీచక్రార్చన, లక్ష్మీ హోమం జరిపారు. భక్తులు సమర్పించిన పసుపు కుంకుమ నీళ్లతో జలాభిషేకం, భారీ ఎత్తున క్షీరాభిషేకం నిర్వహించి అమ్మవారికి పసుపు పూశారు. అనంతరం వెండి కవచాలు తొడిగి, దర్శనాలు కల్పించారు. ఎమ్మెల్యే అనుచరుల హడావుడి ఓవైపు భక్తులు గంటల తరబడి క్యూల్లో వేచి ఉండగా, మరోవైపు స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ హవా ఆలయంలో స్పష్టంగా కనిపించింది. గురువారం జరిగిన తొలిపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే, తన వెంట సుమారు 200 మంది అనుచరులను తీసుకురావడంతో ఉత్సవాల్లో గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యే సిఫార్సు లేఖలు, ఉత్సవ కమిటీ సభ్యుల అనుచరులతో ఆలయ ప్రాంగణం నిండిపోయింది. ఎటు చూసినా ఎమ్మెల్యే మనుషులే కనిపించడంతో.. సామాన్య భక్తులతో పాటు విధుల్లో ఉన్న ఆలయ సిబ్బంది కూడా తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. వన్టౌన్ సీఐనే అడగండి.. ఆలయ ఈవో పాత్ర నామమాత్రంగా మారిందనే విమర్శలు వినిపించాయి. అమ్మవారి దర్శన ఏర్పాట్ల గురించి ఎవరైనా ఈవో కె.శోభారాణిని ఫోన్లో సంప్రదిస్తే.. ‘నాకు సంబంధం లేదు, అంతా వన్టౌన్ సీఐనే అడగండి’ అని బదులివ్వడం చర్చనీయాంశమైంది. ఆలయ నిర్వహణలో ఈవోకు ప్రాధాన్యత తగ్గిందా? లేక పోలీసుల పెత్తనం పెరిగిందా? అన్న అనుమానాలకు ఈ ఘటన తావిచ్చింది. ట్రాఫిక్ అవస్థలు భక్తులకు దేవస్థానం తరపున వాటర్ ప్యాకెట్లు అందజేశారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్నదానం ఏర్పాటు చేశారు. వీవీఐపీలు, వృద్ధులు, వికలాంగులకు సీతారామస్వామి ఆలయం వైపు నుంచి దర్శనం కల్పించారు. నగరం నుంచి పాతపోస్టాఫీస్ వైపు వెళ్లే వాహనాలను టౌన్ కొత్తరోడ్డు జంక్షన్ వద్ద మళ్లించారు. సీబీఎం హైస్కూల్, పద్మానగర్ మీదుగా వన్టౌన్ రాణిబొమ్మ వైపు ట్రాఫిక్ మళ్లించడంతో ఆయా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయి.. వాహనదారులు ఇబ్బంది పడ్డారు. -
సింహాచలం వరకు డబుల్ డెక్కర్ బస్సు
సింహాచలం: నగరంలో బీచ్రోడ్డుకే పరిమితమైన డబుల్ డక్కర్ ఎలక్ట్రిక్ బస్సు.. ఇక నుంచి పవిత్ర పుణ్యక్షేత్రం సింహాచలంలో కూడా కనువిందు చేయనుంది. ఆ బస్సు సర్వీసును సింహాచలం వరకు పొడిగించారు. గురువారం బస్సు సింహాచలం చేరుకుంది. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకునేందుకు నగరంలో నుంచి సింహాచలం వచ్చే భక్తులకు, పర్యాటకులకు ఈ బస్సు కొత్త అనుభూతిని కలిగించనుంది. రోజుకి మూడు ట్రిప్పులు సింహాచలం వరకు బస్సు తిరుగుతుందని పర్యాటక సిబ్బంది తెలిపారు. కాగా టైమింగ్స్ మాత్రం ఇంకా ప్రకటించలేదు. అలాగే సింహగిరి ఘాట్రోడ్డులో బస్సు వెళ్లేందుకు అనుకూలంగా లేకపోవడంతో కేవలం కొండదిగువ వరకు మాత్రమే వెళ్తుంది. -
స్టీల్ప్లాంట్ ఫైనాన్స్ డైరెక్టర్గా వినయ్ కుమార్
ఉక్కునగరం: విశాఖ స్టీల్ప్లాంట్ డైరెక్టర్(ఫైనాన్స్)గా సెయిల్ జనరల్ మేనేజర్ వినయ్ కుమార్ నియమితులయ్యారు. స్టీల్ప్లాంట్ డైరెక్టర్(ఫైనాన్స్) పదవీ విరమణ చేసినందున ఆ బాధ్యతలను డైరెక్టర్(కమర్షియల్) జి.వి.ఎన్.ప్రసాద్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ బుధవారం వినయ్కుమార్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఐదేళ్లు లేదా తదుపరి ఉత్తర్వుల వరకు ఆయన ఈ పోస్టులో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది. డాబాగార్డెన్స్: జీవీఎంసీ పరిధిలోని ఆస్తి, ఖాళీ జాగా పన్నుల వసూళ్లు వేగవంతం చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో డీసీఆర్ శ్రీనివాసరావు, రెవెన్యూ ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులతో పాటు పాత బకాయిలు, నీటి చార్జీల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సచివాలయ అడ్మిన్ కార్యదర్శులతో సమీక్షించి, రోజుకో సచివాలయ పరిధిలోని ఇళ్లను సందర్శించి పన్నులు వసూలు చేయాలన్నారు. 98 వార్డుల్లో ఉన్న సహాయక ఇంజనీర్లు, ఎమినిటీ కార్యదర్శులను సమన్వయం చేసుకుని పనిచేయాలని రెవెన్యూ ఆఫీసర్లను ఆదేశించారు. జీవీఎంసీ ఆస్తి పన్నులు చెల్లించేందుకు సీడీఎంఏ వెబ్సైట్ అందుబాటులో ఉన్నప్పటికీ, జీవీఎంసీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో పన్నులు చెల్లించేలా అవగాహన కల్పించాలన్నారు. మొండి బకాయిలపై చర్యల కోసం జోనల్ కమిషనర్ స్థాయిలో జప్తు నోటీసులు ఆయా భవనాల వద్ద అతికించాలన్నారు. జీవీఎంసీ పన్ను వసూళ్లు వేగవంతం చేయండి -
అద్భుతం.. విశాఖ బాలోత్సవం
డాబాగార్డెన్స్: విశాఖ బాలోత్సవంలో రెండో రోజైన బుధవారం విద్యార్థుల సృజనాత్మకత ఆకాశాన్ని తాకింది. సెయింట్ ఆంథోని తెలుగు మీడియం స్కూల్ వేదికగా వార్తా రచన, కథా రచన, కవితా రచన, కథా విశ్లేషణ, డిబేట్(టీమ్), వక్తృత్వం(తెలుగు–ఇంగ్లిష్), అంతర్జాలంలో అన్వేషణ, మెమరీ టెస్ట్, కథ చెపుతాను, జానపద నృత్యం(సోలో), దేశభక్తి గీతాలాపన (బృందం–సోలో), లఘు నాటికలు, క్లాసికల్ డ్యాన్స్(సోలో), ఏకపాత్రాభినయం, జానపద గీతాలాపన(బృందం), వాయిద్య గానం(ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్), జానపద నృత్యం(బృందం), స్టాండప్ కామెడీ వంటి విభిన్న పోటీలు నిర్వహించారు. ఇంటర్నెట్ అన్వేషణలో ట్రంప్ భారత్పై విధించిన టారిఫ్లు అనే అంశం, వార్తా రచన కేటగిరీలో విశాఖపట్నంలో పెరుగుతున్న మత్తు, గంజాయిపై చర్యలు, ప్రతి వార్డ్కు ఒక క్రీడా మైదానం ఏర్పాటు వంటి సామాజిక సమస్యలపై చర్చించారు. వివిధ అంశాల్లో ఉపన్యాసాలతో విద్యార్థులు తమలో దాగివున్న ప్రతిభను, సామాజిక అవగాహనను చాటిచెప్పారు. నగరంలోని ప్రముఖ కవులు, కళాకారులు, విద్యావేత్తలు 100 మంది న్యాయ నిర్ణేతలుగా, మరో 100 మంది వలంటీర్లుగా సహకరించారు. -
సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
మహారాణిపేట/మధురవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శుక్రవారం విశాఖ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ బుధవారం ఉదయం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించగా, సాయంత్రం సీపీ శంఖబ్రత బాగ్చితో కలిసి మధురవాడ ఐటీ హిల్స్లో క్షేత్రస్థాయి ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం శుక్రవారం ఉదయం ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో ఐటీ హిల్ నం.3 హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హరిత రిసార్ట్స్ పక్కన ఉన్న స్థలానికి చేరుకుని, ఉదయం 10.30 గంటలకు కాగ్నిజెంట్ క్యాంపస్కు భూమిపూజ చేస్తారు. అనంతరం ఐటీ ప్రతినిధులతో భేటీ అవుతారు. అక్కడి నుంచి రుషికొండలోని ఏ–1 గ్రాండ్ కన్వెన్షన్ హాలుకు వెళ్లి వైజాగ్ ఎకనామిక్ రీజియన్(వీఈఆర్) సమావేశంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో హెలిప్యాడ్, సభాప్రాంగణం పరిసరాల్లో బారికేడ్లు, పార్కింగ్ వసతి కల్పించాలని, రోడ్లకు మరమ్మతులు, జంగిల్ క్లియరెన్స్ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. భద్రతా పరంగా ఎక్కడా లోపం లేకుండా చూడాలని పోలీసు అధికారులకు సూచించారు. కార్యక్రమాల్లో జేసీ మయూర్ అశోక్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, డీసీపీ మణికంఠ, ఏపీఐఐసీ అధికారులు పాల్గొన్నారు. -
అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం
అల్లిపురం: మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధి బీచ్రోడ్లోని ఫార్చ్యూన్ బీచ్ ఫ్రంట్ అపార్ట్మెంట్లో బుధవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. పోలీసులు, జిల్లా అగ్నిమాపక అధికారి రమణయ్య తెలిపిన వివరాలు.. ఫ్లాట్లో ఉంటున్న ఓ వృద్ధురాలు దేవుడి వద్ద దీపం వెలిగించింది. తరువాత కిటికీ తలుపులు తీయటంతో ఆ గాలికి దీపం ఎగిరి కింద పడింది. కిందనున్న మ్యాట్కు మంటలు అంటుకున్నాయి. అవి రెండు గదులకు వ్యాపించాయి. ప్రమాదంలో రూ.లక్షల విలువైన ఫర్నిచర్ అగ్నికి ఆహుతైనట్లు డీఎఫ్వో తెలిపారు. విషయం తెలుసుకున్న నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఘటనా స్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. ప్రాణ నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టారు. అనంతరం ఆయన అపార్ట్మెంట్లోని ఫైర్ సేఫ్టీ పరికరాలను పరిశీలించారు. -
‘ఇండిగో’ ఇబ్బందుల్ని సమర్ధంగా ఎదుర్కొన్నాం
విశాఖ ఎయిర్పోర్టు డైరెక్టర్ ఎన్.పురుషోత్తం గోపాలపట్నం: ఇండిగో సంక్షోభంలో విశాఖ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టామని విశాఖ ఎయిర్పోర్టు డైరెక్టర్ ఎన్ పురుషోత్తం అన్నారు. ఈ మేరకు విశాఖ విమానాశ్రయంలో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు సమయంలో విశాఖ విమానాశ్రయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, చాలా మంది ప్రయాణికులు ఎయిర్పోర్టుకు రాకముందే విమానాల పరిస్థితిని వివరించగలిగామన్నారు. బుధవారం రద్దయిన విమానాలు బుధవారం కూడా 618/307 హైదరాబాద్ విశాఖ హైదరాబాద్, 217/218 బెంగళూరు–విశాఖ–బెంగళూరు, 581/881 చైన్నె–విశాఖ–చైన్నె, 208/783 హైదరాబాద్–విశాఖ–హైదరాబాద్, 6679/6680 ఢిల్లీ–విశాఖ–ఢిల్లీ, 6285/6286 హైదరాబాద్–విశాఖ–హైదరాబాద్ విమాన సర్వీసులు రద్దయినట్లు వెల్లడించారు. -
రిటైర్డ్ సీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు
ఆరిలోవ: ట్రైబల్ వెల్ఫేర్ కార్పొరేషన్లో చీఫ్ ఇంజినీర్గా పనిచేసి పదవీ విరమణ పొందిన సబ్బవరపు శ్రీనివాస్ నివాసంలో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. నగరంలోని విశాలాక్షినగర్లో ఉన్న ఆయన ఇంటితో పాటు నగరంలోని మరో నాలుగు చోట్ల, హైదరాబాద్, ఏలూరు, విజయనగరం ప్రాంతాల్లోని ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. విశాలాక్షినగర్లోని నివాసంలో శ్రీనివాస్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. శ్రీనివాస్ విజయవాడలో ట్రైబల్ వెల్ఫేర్ కార్పొరేషన్లో చీఫ్ ఇంజినీర్గా పనిచేస్తున్న సమయంలో ఓ కాంట్రాక్టర్ నుంచి బిల్లుల మంజూరు కోసం రూ.25 లక్షలు లంచం తీసుకుంటూ ఈ ఏడాది ఆగస్టు 7న ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఆ కేసులో రిమాండ్లో ఉండగానే ఆయన పదవీ విరమణ పొందారు. ఆ కేసు దర్యాప్తులో భాగంగానే తాజా సోదాలు నిర్వహించినట్లు ఏసీబీ డీఎస్పీ బి.వి.ఎస్.ఎస్.రమణమూర్తి తెలిపారు. సోదాల్లో విశాలాక్షినగర్లోని ప్లాట్తో పాటు సుమారు రూ.కోటి విలువ చేసే స్థిరాస్తుల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని, వీటిని కోర్టులో సమర్పిస్తామని డీఎస్పీ వివరించారు. శ్రీనివాస్ తన సర్వీస్లో నాలుగు సార్లు ఏసీబీకి చిక్కినట్లు వెల్లడించారు. అవినీతికి పాల్పడిన వారు ఉద్యోగ విరమణ పొందినా చట్టం నుంచి తప్పించుకోలేరని డీఎస్పీ స్పష్టం చేశారు. -
‘కోటి’ గళాల గర్జన
సాక్షి, విశాఖపట్నం, నెట్వర్క్: చంద్రబాబు సర్కారు కక్షపూరిత విధానాలతో ప్రభుత్వం కొత్త మెడికల్ కళాశాలలను ప్రైవేట్పరం చేయడం.. ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాలను బుధవారం నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు, మీడియా సమావేశాలు నిర్వహించి ప్రత్యేక బాక్సుల్లో భద్రపరిచి ఆయా జిల్లా కేంద్రాలకు తరలించారు. నియోజకవర్గ పార్టీ కార్యాలయాల వద్ద వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు జెండా ఊపి కోటి సంతకాల వాహనాలను ప్రారంభించారు. పలుచోట్ల మహిళలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని కోటి సంతకాల వాహనాలకు హారతి పట్టారు. ఇకనైనా చంద్రబాబు సర్కారుకు కనువిప్పు కలగాలని, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని దేవుడిని ప్రార్థించారు. యువత, విద్యార్థులు, మేధావులు, ప్రజలు ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీల్లో పాల్గొని మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినదించారు. వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 10న రచ్చబండగా మొదలై మారుమూల గిరిజన గూడేల నుంచి నగరాల దాకా ఉద్ధృతంగా ఈ కార్యక్రమం సాగింది. కాకినాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయానికి భారీ ర్యాలీగా వెళుతున్న యువత, నాయకులు, పార్టీ శ్రేణులు అన్ని మండలాలు, అన్ని పంచాయతీల్లో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రెండు నెలలుగా మహోద్యమంలా సాగిన కోటి సంతకాల సేకరణలో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా, భారీగా పాల్గొన్నారు. నవంబరు 12న రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నిర్వహించిన ర్యాలీల్లో విద్యార్థులు, యువత, మేధావులు పెద్ద ఎత్తున పాల్గొని మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని నిరసిస్తూ కదం తొక్కారు. కోటి సంతకాల మహా ఉద్యమంతో చంద్రబాబు సర్కార్కు ఇకనైనా కనువిప్పు కలగాలని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే చంద్రబాబు సర్కార్కు బుద్ధి చెప్పేందుకు ఎలాంటి ఉద్యమాలకైనా సిద్ధమంటూ హెచ్చరించారు. సంతకాల పత్రాలతో విశాఖలో భారీ బైక్ ర్యాలీ చేపడుతున్న ప్రజలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ⇒ ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సేకరించిన సంతకాలను బుధవారం జిల్లా కేంద్రానికి ర్యాలీగా తరలించారు. దర్శి నుంచి ఒంగోలుకు వాహనాల ర్యాలీని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ జెండా ఊపి ప్రారంభించారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. గిద్దలూరులో కేపీ నాగార్జునరెడ్డి, మార్కాపురంలో అన్నా రాంబాబు, కొండపిలో ఆదిమూలపు సురేష్, సంతనూతలపాడులో మేరుగు నాగార్జున, కనిగిరిలో దద్దాల నారాయణ యాదవ్ ర్యాలీలను ప్రారంభించారు. ఒంగోలు నియోజకవర్గంలో సేకరించిన 62 వేల సంతకాలను పార్టీ జిల్లా కార్యాలయానికి చేర్చినట్లు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు తెలిపారు. ⇒ పశ్చిమ గోదావరి జిల్లాలో కోటి సంతకాలతో వాహనాల ర్యాలీలను భారీ ఎత్తున నిర్వహించారు. మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడపాలని డిమాండ్ చేశారు. తణుకులో మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు, తాడేపల్లిగూడెంలో మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, నరసాపురంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, ఆచంటలో మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, భీమవరంలో నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు, పాలకొల్లులో నియోజకవర్గ సమన్వయకర్త గుడాల శ్రీహరిగోపాలరావు, ఉండిలో నియోజకవర్గ సమన్వయకర్త పీవీఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో ర్యాలీలు జరిగాయి. వైద్య కళాశాలలను ప్రభుత్వమే నడిపేలా చంద్రబాబు బుద్ధి మార్చాలని దేవుడిని కోరుతూ తణుకు నియోజకవర్గం వేల్పూరు, అత్తిలిలో మహిళలు సంతకాల ప్రతులకు మంగళ హారతులిచ్చి సాగనంపారు. ⇒ తిరుపతి, చిత్తూరు జిల్లాలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రతులను తిరుపతి వైఎస్సార్సీపీ కార్యాలయంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డికి అందజేశారు. అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించారు. పుంగనూరులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రతుల ప్రత్యేక వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గంగాధర నెల్లూరులో మాజీ మంత్రి నారాయణస్వామి, నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజా, చిత్తూరులో విజయానందరెడ్డి, శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, వెంకటగిరిలో నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, గూడూరులో ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, నాయుడుపేటలో కిలివేటి సంజీవయ్య, నాగలాపురంలో నూకతోటి రాజేష్, తవణంపల్లిలో డాక్టర్ సునీల్కుమార్, పలమనేరులో వెంకటేగౌడ్, కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల ప్రతులను ప్రత్యేక వాహనంలో తిరుపతికి తరలించారు. ⇒ ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. నియోజకవర్గ కేంద్రాల నుంచి వాహనాల్లో కోటి సంతకాల పత్రాల బాక్సులను తరలించారు. పోలీసులు అడ్డుకున్నా వెనకడుగు వేయకుండా ర్యాలీలు నిర్వహించారు. పలాస నియోజకవర్గంలో మాజీ మంత్రి అప్పలరాజు ఆధ్వర్యంలో పత్రాలను తరలించారు. ⇒ విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో సుమారు 10 లక్షల సంతకాలు సేకరించారు. విశాఖ జిల్లా మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయానికి అన్ని నియోజకవర్గాల నుంచి వాహనాల్లో కోటి సంతకాల బాక్స్లు చేరుకున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో సమన్వయకర్తలు మళ్ల విజయప్రసాద్, వాసుపల్లి గణేష్కుమార్, మజ్జి శ్రీనివాసరావు, తిప్పల దేవన్రెడ్డి, మొల్లి అప్పారావు, నియోజకవర్గం పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో నియోజకవర్గాల సమన్వయకర్తలతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, సమన్వయకర్తలు కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర్ గణేష్, కంబాల జోగులు, అన్నంరెడ్డి అదీప్రాజ్, పార్లమెంట్ పరిశీలకులు శోభాహైమావతి, పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ పాల్గొన్నారు. అల్లూరి జిల్లాలో పాడేరులోని పార్టీ కార్యాలయానికి వ్యానుల్లో సంతకాల పత్రాల బాక్స్లు చేరుకున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు మత్సరాస విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో వాటిని సేకరించారు. కార్యక్రమంలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర తదితరులు పాల్గొన్నారు. -
డిజిటల్ రైతు బజార్
ఎంవీపీకాలనీ: రైతులు పండించే గ్రామీణ ఉత్పత్తులు వినియోగదారులకు మరింత చేరువకానున్నాయి. ఇందుకు అనుగుణంగా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ.. మార్కెటింగ్ పద్ధతుల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రైతు బజార్ల వ్యవస్థ ద్వారా రైతులకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తుండగా.. తాజాగా ‘ఆన్లైన్ డెలివరీ’విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని వల్ల కొనుగోలు ప్రక్రియ మరింత సులభతరం కానుంది. దీని కోసం ఇప్పటికే ప్రత్యేక వెబ్సైట్ను ప్రారంభించగా, త్వరలో మొబైల్ యాప్ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. నగరంలోని ఎంవీపీకాలనీ రైతుబజార్లో ఈ ఆన్లైన్ విక్రయాలను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సేవలకు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తుండటం రైతుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ప్రత్యేక వెబ్సైట్ ద్వారా.. ఆన్లైన్ కూరగాయల విక్రయాల కోసం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ https://www.digi rythubazaarap.com వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చింది. మెషెంట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఈ సేవలను అందిస్తున్నారు. ఎంవీపీకాలనీ రైతుబజార్ వేదికగా ఈ పైలట్ ప్రాజెక్టు మొదలైంది. ఈ సేవలను పొందాలనుకునే వినియోగదారులు తొలుత పైన పేర్కొన్న వెబ్సైట్లో రిజిస్ట్రర్ చేసుకోవాలి. అనంతరం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఉత్పత్తులు, వాటి ధరలు స్క్రీన్పై డిస్ప్లే అవుతాయి. కావాల్సిన వాటిని ఎంపిక చేసుకుని ఆర్డర్ చేయాలి. ఈ ఆర్డర్లను ఎంవీపీ రైతుబజార్లో మెషెంట్ సొల్యూషన్స్ టెక్నికల్ టీమ్ స్వీకరిస్తుంది. ఆర్డర్కు అనుగుణంగా అక్కడి రైతుల నుంచి కూరగాయలను సేకరించి, ప్రత్యేకంగా ప్యాకింగ్ చేస్తారు. అనంతరం ‘మైబాక్స్’ డెలివరీ పార్ట్నర్ ద్వారా వినియోగదారుడికి చేరవేస్తారు. వినియోగదారులు క్యాష్ ఆన్ డెలివరీ లేదా యూపీఐ పద్ధతిలో డబ్బులు చెల్లించే వెసులుబాటు కల్పించారు. ప్రస్తుతం ఎంవీపీ రైతుబజార్ పరిధిలోని 5 కిలోమీటర్ల వరకు మాత్రమే ఈ సేవలు అందిస్తున్నారు. ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ‘డిజి రైతుబజార్’ పేరుతో ప్రత్యేక యాప్ను రూపొందిస్తున్నారు. మరో రెండు వారాల్లో ఈ యాప్ సేవలు అందుబాటులోకి వస్తాయని మార్కెటింగ్ శాఖ వర్గాలు వెల్లడించాయి. -
సేవలకు ఆకాశమే హద్దు
ఏయూక్యాంపస్: సచివాలయ మహిళా పోలీసులకు విధులు కేటాయించేందుకు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖ బ్రత బాగ్చి సమావేశం నిర్వహించారు. మంగళవారం ఆర్మ్డ్ రిజర్వ్ మైదానంలో దాదాపు 430 మంది మహిళా పోలీసులతో ఆయన సమావేశమయ్యారు. కంప్యూటర్ పరిజ్ఞానం, డేటా ఎంట్రీ నైపుణ్యం ఉన్నందున వారికి 10 రకాల నిర్దిష్ట విధులను కేటాయించారు. ఇ–కాప్స్ ఆపరేటర్లకు, దర్యాప్తు అధికారులకు సహాయపడటం, సైబర్ నేరాలు, డ్రగ్స్, మహిళా భద్రతపై అవగాహన కల్పించడం, రిసెప్షన్ బాధ్యతలు, రికార్డుల అప్డేట్, కౌన్సెలింగ్, ఫీల్డ్లో సమాచార సేకరణ, సమన్ల జారీ, లోక్ అదాలత్ పనులు, పిటిషన్లపై బాధితులకు సమాచారం ఇవ్వడం వంటి బాధ్యతలను వారికి అప్పగించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. మహిళా పోలీసుల విధి నిర్వహణకు ఆకాశమే హద్దని, శాఖకు మంచి పేరు తెచ్చేలా పనిచేయాలని సూచించారు. అనంతరం సిబ్బంది తమ సమస్యలను వివరించగా, పరిష్కరిస్తామని సీపీ హామీ ఇచ్చారు. -
మహా నగరం.. దోమలతో నిత్యం నరకం
మహారాణిపేట: స్మార్ట్ సిటీ విశాఖలో పారిశుధ్యం పడకేసింది. ఎటు చూసినా పేరుకుపోతున్న చెత్త, మురుగు కాలువల్లో పూడికలు తీయకపోవడంతో నగరం దోమలకు నిలయంగా మారింది. ఫలితంగా విశాఖ వాసులు విష జ్వరాల బారిన పడి విలవిలలాడుతున్నారు. ఒకవైపు పెరుగుతున్న చలి తీవ్రత, మరోవైపు పారిశుధ్య లోపం వెరసి దోమలు స్వైర విహారం చేస్తుండటంతో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు పంజా విసురుతున్నాయి. దీనికి తోడు స్క్రబ్ టైఫస్ కేసులు కూడా నమోదవుతుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. జ్వరాలను నియంత్రణ చేయాల్సిన ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కొరవడుతోంది. పేరుకుపోతున్న చెత్త : నగరంలో పారిశుధ్య నిర్వహణ పూర్తిగా గాడి తప్పింది. ఎక్కడ చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా పూర్ణామార్కెట్ వెనుకభాగం, దొండపర్తి–లలితానగర్ (వంతెన వద్ద), వెలంపేట, రేసవానిపాలెం ఐటీ సంస్థ ప్రాంతం, ప్రసాద్ గార్డెన్స్, రెల్లివీధి, పంజా జంక్షన్, అల్లిపురం, రామకృష్ణ జంక్షన్ రైతుబజార్ తదితర ప్రాంతాలు డంపింగ్ యార్డులను తలపిస్తున్నాయి. రెండు, మూడు రోజులు పారిశుధ్య కార్మికులకు వరస సెలవులు వస్తే పరిస్థితి మరీ దారుణంగా మారుతోంది. కాలువల్లో పూడికలు సకాలంలో తీయకపోవడంతో మురుగు నీరు నిల్వ ఉండి దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారుతున్నాయి. కిటకిటలాడుతున్న ఆసుపత్రులు : దోమల విజృంభణతో కేజీహెచ్ సహా నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రులకు జ్వర పీడితులు పోటెత్తుతున్నారు. రోజురోజుకూ డెంగ్యూ బాధితుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సాధారణ జ్వరాల కంటే డెంగ్యూ అత్యంత ప్రమాదకరమని, ఇందులో ప్లేట్లెట్స్ వేగంగా పడిపోతాయని, సకాలంలో వైద్యం అందకపోతే ప్రాణాపాయం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కేజీహెచ్లోని భావనగర్ వార్డు ఏఎంసీ యూనిట్లో జ్వర బాధితుల కోసం ప్రత్యేకంగా 20 పడకలు ఏర్పాటు చేశారు. రోజువారీ ఓపీకి వస్తున్న వారిలో 10 నుంచి 20 మందికి పైగా జ్వర బాధితులే ఉంటున్నారని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి తెలిపారు. సమన్వయలోపం : జ్వరాల నియంత్రణలో మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖల మధ్య సమన్వయం కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. జిల్లా మలేరియా అధికారి ఎం.తులసి మాట్లాడుతూ.. ‘కలెక్టర్ ఆదేశాల మేరకు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు, ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నాం. డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉంచాం’ అని తెలిపారు. అయితే క్షేత్రస్థాయిలో పారిశుధ్యం మెరుగుపడకపోతే రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది. -
సీనియర్ న్యాయవాదికి మాతృవియోగం
అల్లిపురం: ప్రముఖ న్యాయవాది నల్లమిల్లి శ్రీవెంకటరెడ్డి మాతృమూర్తి నల్లమిల్లి భానుమతి (75) కన్నుమూశారు. అనారోగ్యంతో కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున ఆమె తుదిశ్వాస విడిచారు. భానుమతి మృతి పట్ల విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.కె.శ్రీనివాసరావు, లాలం పార్వతి నాయుడుతో పాటు కార్యవర్గ సభ్యులు, బార్ కౌన్సిల్ సభ్యుడు నర్సింగరావు, సీనియర్ న్యాయవాది ఎండీ హబీబుల్లా తదితర న్యాయవాదులు సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం 9 గంటలకు అక్కయ్యపాలెం 80 అడుగుల రోడ్డులోని చిన్నమసీదు నుంచి ఆమె అంతిమయాత్ర ప్రారంభమవుతుందని శ్రీవెంకటరెడ్డి తెలిపారు. -
రోజుకు 50 ఆర్డర్లు వస్తున్నాయి..
వ్యవసాయ మార్కెటింగ్ శాఖ, మా మెషెంట్ సొల్యూషన్స్ సంస్థ సంయుక్తంగా ఈ సేవలను అందిస్తున్నాయి. మార్కెటింగ్ శాఖ సూచనల మేరకు ఎంవీపీకాలనీ రైతు బజార్ను పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసుకున్నాం. మా సంస్థ తరపున ఇద్దరి నుంచి ముగ్గురు ఆర్డర్లను పర్యవేక్షిస్తున్నారు. మైబాక్స్ డెలివరీ పార్ట్నర్స్ ద్వారా సరకులను వినియోగదారులకు చేరవేస్తున్నాం. ప్రస్తుతం రోజుకు 40 నుంచి 50 ఆర్డర్లు వస్తున్నాయి. ఆర్డర్ వచ్చిన గంటలోపే డెలివరీ చేస్తున్నాం. ఈ సేవలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్తే ఆర్డర్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశముంది – శాస్త్రి వేలమూరి, సీనియర్ అసోసియేట్, మెషెంట్ సొల్యూషన్స్ -
నకిలీ పత్రాల తయారీకి పాల్పడిన ఇద్దరి అరెస్ట్
మునగపాక: నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లతో పాటు తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రాలు తయారు చేస్తున్న ఇద్దరిని మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ ప్రసాదరావు తెలిపారు. విశాఖపట్నం ఎండాడకు చెందిన దౌర్ల అనురాధ, తగరపువలసకు చెందిన తూము రాజు, మరో తొమ్మిది మందితో కలిసి నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు, మరణ ధ్రువీకరణ పత్రాలు తయారు చేసి ఇటీవల మధురవాడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రెండు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ డాక్యుమెంట్లు రిజిస్ట్రర్ చేసినట్లు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణలో భాగంగా ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. ఇద్దరు వ్యక్తులకు ఎటువంటి సంబంధం లేని ఆస్తిని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు ముందస్తు కుట్రలో భాగంగా నకిలీ పత్రాలు రూపొందించినట్లు తేలిందన్నారు. ఈ కేసులో మొత్తం 11 మందిపై కేసు నమోదు చేసి మంగళవారం ఇద్దరు నిందితులను అరెస్టు చేశామన్నారు. నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ను మునగపాకలో తయారు చేసినట్టు తెలిసింది. -
స్కేటింగ్లో చిచ్చర పిడుగులు
విశాఖ స్పోర్ట్స్ : జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్లో భాగంగా మంగళవారం తొట్లకొండలో జరిగిన డౌన్హిల్ స్కేటింగ్ పోటీల్లో తమిళనాడు జట్టు సత్తా చాటింది. మెన్లో కిషోర్కృష్ణ విజేతగా నిలిచి స్వర్ణాన్ని అందుకోగా హర్షిత్ ద్వితీయ స్థానంతో (వీరిద్దరూ తమిళనాడు) రజతాన్ని అందుకున్నాడు. సాయంత్(కేరళ) తృతీయ స్థానంలో నిలిచి కాంస్యాన్నందుకున్నాడు. వుమెన్లో వర్షిణి విజేతగా నిలిచి స్వర్ణాన్ని అందుకోగా అమిజిధాని(వీరిద్దరూ తమిళనాడు) ద్వితీయ స్థానంలో నిలిచి రజతాన్ని అందుకుంది. ఆర్.వి.రమ్యశ్రీ(ఆంధ్రప్రదేశ్) తృతీయ స్థానంలో నిలిచి కాంస్యాన్ని సొంతం చేసుకుంది. 15–18 ఏళ్ల బాలుర విభాగంలో గురుహర్షన్(తమిళనాడు), వష్ణావ్ లీమిన్(కేరళ), ఆరవ్ శ్రీజిత్(తమిళనాడు) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలవగా.. బాలిక విభాగంలో శృతి(తమిళనాడు), అక్షర(తమిళనాడు), ఎం.ఐశ్వర్య(ఆంధ్రప్రదేశ్) తొలి మూడు స్థానాల్లో నిలిచారు. లాంఛనంగా స్కేటింగ్ పోటీలు ప్రారంభం జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్ను మంగళవారం వీఎంఆర్డీఏ పార్క్లో లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ హారేందిర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, శాప్ చైర్మన్ రవినాయుడు, ప్రభుత్వ విప్ పివిజిఆర్ నాయుడు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, స్కేటింగ్ సంఘం ప్రతినిధులు పాల్గొ న్నారు. అంతర్జాతీయ స్కేటర్ ఆనంద్కుమార్ను సత్కరించి నగదు ప్రోత్సాహకాన్ని అందించారు. -
సందడిగా బాలోత్సవం
ఆకట్టుకున్న చిన్నారులుడాబాగార్డెన్స్: సెయింట్ ఆంథోనీ తెలుగు మీడియం ప్రైమరీ స్కూల్ వేదికగా మంగళవారం ‘బాలోత్సవం’అట్టహాసంగా ప్రారంభమైంది. ఉత్సవాల్లో పాల్గొన్న చిన్నారులతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. ముందుగా జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.ప్రేమ్కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకే వేదికపై ఇంతమంది పిల్లలను చూడటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రోటరీ ఇంటర్నేషనల్ (3020 డిస్ట్రిక్ట్) గవర్నర్ డాక్టర్ వై.కల్యాణ చక్రవర్తి మాట్లాడుతూ.. రోటరీ సంస్థ సేవాభావంతో పనిచేస్తోందన్నారు. విద్యార్థులను సేవా కార్యక్రమాల వైపు ప్రోత్సహించేందుకు ఇంటరాక్ట్, రోటరాక్ట్ క్లబ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆసరా చారిటబుల్ సొసైటీ ప్రతినిధి శ్రీనాథ్ మాట్లాడుతూ.. పిల్లలు తమ చుట్టూ జరిగే విషయాలను నిశితంగా పరిశీలించాలన్నారు. పాఠశాల కరస్పాండెంట్, ఫాదర్ పి.రత్నకుమార్ మాట్లాడుతూ తమ పాఠశాల ఇంత గొప్ప కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. పిల్లలకు ఇలాంటి పోటీలు మేలు చేస్తాయని రోటరీ విశాఖ వ్యాలీ చైర్మన్ ఎం.వి. జానకిరామ్, డాక్టర్ పీకే జోస్ అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో భాగంగా తొలి రోజు నిర్వహించిన అకడమిక్, కల్చరల్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. కార్యక్రమంలో నరవ ప్రకాశరావు, రోటరీ క్లబ్ విశాఖ అధ్యక్షుడు రఘుపతి, ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షుడు దీపా జేలోకా, బాలోత్సవం ఆహ్వాన సంఘం సభ్యులు పాల్గొన్నారు. -
మైనింగ్ మాఫియా
భీమిలిలో విశాఖ సిటీ : టీడీపీ నేతల అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వ భూములతో పాటు కొండలను సైతం చెరబడుతున్నారు. భూ కబ్జాలు, అక్రమ ఇసుక తవ్వకాలు, అనధికార మైనింగ్ కార్యకలాపాలకు పాల్పడుతూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. తాజాగా భీమిలి నియోజకవర్గంలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. నేరేళ్లవలసలో అక్రమంగా గ్రావెల్ను తరలించుకుపోతోంది. లారీల రాకపోకలకు వీలుగా 300 మీటర్ల మేర ప్రత్యేకంగా రహదారిని నిర్మించుకుని మరీ గ్రావెల్ రవాణా చేస్తోంది. నిత్యం రాత్రి సమయాల్లో వందల లారీల్లో అక్రమంగా గ్రావెల్ తరలిపోతున్నా అధికార యంత్రాంగం పట్టనట్లు వ్యవహరించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. టీడీపీ నేత కనుసన్నల్లోనే.. టీడీపీ నేతలు కొండలు, భూములను సైతం విడిచిపెట్టడం లేదు. కొండ తవ్వకాలతో ఇబ్బందులు వ స్తాయని భావించిన నేత ఏకంగా మైదాన భూముల్లో సైతం మైనింగ్ చేసేస్తున్నాడు. భీమిలి మండలం నేరేళ్లవలస గ్రామం సర్వే నెంబర్–4లో కొండ పోరంబోకు స్థలంలో అక్రమార్కులు గ్రావెల్ తవ్వకాలు చేపడుతున్నారు. భీమిలి కోఆపరేటివ్ సొసైటీ భూముల వెనుక నుంచి లారీల రాకపోకలకు వీలుగా ప్రత్యేకంగా రోడ్డును సైతం ఏర్పాటు చేసుకున్నారు. నిత్యం జేసీబీలతో గ్రావెల్ను 280 లారీల్లో లోడ్ చేస్తూ ఇక్కడి నుంచి తరలించుకుపోతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అటువైపుగా ఎవరూ వెళ్లకుండా ప్రత్యేకంగా ప్రైవేటు సైన్యాన్ని సైతం ఏర్పాటు చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రూ.3 కోట్ల విలువైన గ్రావెల్ తరలింపు గత కొద్ది రోజులుగా యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. ఎవరూ అటువైపు కన్నెత్తి చూడడం లేదని వాపోతున్నారు. నిత్యం వందల లారీలు తిరుగుతున్నాయని, ఇప్పటి వరకు రూ.3 కోట్లు విలువైన గ్రావెల్ తవ్వకాలు జరిగినట్లు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారమంతా టీడీపీ నేత మోరపూడి శ్రీనివాస్ కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అతడికి ప్రజాప్రతినిధుల అండదండలు ఉండడం కారణంగా మైనింగ్, పోలీస్, విజిలెన్స్, రెవెన్యూ శాఖల అధికారులు పట్టించుకోవడం లేదన్న వార్తలు గుప్పుమంటున్నాయి. లారీల రాకపోకలకు వీలుగా రహదారి నిర్మాణం -
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
మహారాణిపేట: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 12న జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లను కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్తో కలిసి మధురువాడ ఐటీ హిల్స్ను సందర్శించిన ఆయన అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను గమనించారు. కాగ్నిజెంట్ కంపెనీకి శంకుస్థాపన చేయనున్న ప్రాంతంలోను, వీఈఆర్(వైజాగ్ ఎకనామిక్ రీజియన్) సమావేశం జరగనున్న ప్రాంతాల్లో అధికారులతో మాట్లాడారు. హిల్ నెం.3 వద్ద హెలిప్యాడ్ను పరిశీలించారు. ఆయన వెంట ఏపీఐఐసీ అధికారులు, కాగ్నిజెంట్ ప్రతినిధులు ఉన్నారు. -
14న నేవీ మారథాన్
మహారాణిపేట: నేవీ డే వేడుకల్లో భాగంగా ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన 10వ ఎడిషన్ వైజాగ్ నేవీ మారథాన్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో జరిగిన కో–ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మారథాన్లో 17 దేశాల నుంచి 17,500 మంది ఔత్సాహికులు భాగస్వామ్యం కానున్నారని, ఈ మేరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పేర్కొన్నారు. వెయ్యి మంది సిబ్బంది, రెండు వేల మంది వాలంటీర్లు సేవల్లో నిమగ్నమవుతారన్నారు. 42 కి.మీ, 21 కి.మీ, 10 కి.మీ, 5 కి.మీ విభాగాల్లో పోటీలు జరగనున్నాయని తెలిపారు. జిల్లా, నేవీ అధికారులు సమన్వయంతో వ్యవహరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. సమావేశంలో కెప్టెన్లు టీఆర్ఎస్ కుమార్, వినోత్ తివారీ, కమాండర్ కిశోర్, లెఫ్టినెంట్ కమాండర్లు పి.మెహంత్ నాయుడు, నరేశ్, ఏడీసీ రమణమూర్తి, ఈపీడీసీఎల్ ఎస్ఈ శ్యాంబాబు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
రెండు వర్గాలకూ ప్రయోజనం
ఈ ఆన్లైన్ విధానం ఇటు రైతులకు, అటు వినియోగదారులకు ఎంతో ఉపయోగకరం. వినియోగదారులకు తాజా ఉత్పత్తులను అందిస్తూనే, రైతుల ఆర్థికాభివృద్ధికి బాటలు వేయాలన్నదే మార్కెటింగ్ శాఖ లక్ష్యం. వినియోగదారులు ఇంట్లోనే ఉండి రైతుబజార్ ధరలకే నాణ్యమైన కూరగాయలు పొందవచ్చు. దీని వల్ల రైతులకు కూడా మంచి మార్కెట్ లభిస్తుంది. ప్రస్తుతం వెబ్సైట్ ద్వారా సేవలు అందుతుండగా, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా డిజి రైతుబజార్ ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తేనున్నాం. వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. – శ్రీనివాస కిరణ్, డీడీ, మార్కెటింగ్ శాఖ -
13న ఏయూ పూర్వ విద్యార్థుల సమావేశం
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వవిద్యార్థుల వార్షిక సమావేశం(వేవ్స్–2025) ఈ నెల 13న నిర్వహిస్తున్నట్లు సంఘం చైర్మన్ కె.వి.వి.రావు తెలిపారు. మంగళవారం ఏయూ అలుమ్ని జీఎంఆర్ సెమినార్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. మహిళా సాధికారత థీంతో వేవ్స్–2025 నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతి థిగా రాజ్యసభ ఎంపీ, మూర్తి ట్రస్ట్ చైర్పర్సన్ సుధామూర్తి హాజరవుతున్నట్లు వెల్లడించారు. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి బీచ్రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుందని, అలుమ్ని వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జీఎంఆర్ కూడా పాల్గొంటారని తెలిపారు. అనంతరం ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్తో కలిసి వేవ్స్ పోస్టర్ను ఆవిష్కరించారు. సంఘ ఉపాధ్యక్షుడు డాక్టర్ కె.కుమార్ రాజ, జనరల్ సెక్రటరీ ఆకుల చంద్రశేఖర్, ఈసీ సభ్యులు పాల్గొన్నారు. -
నేడు వైఎస్సార్సీపీ కార్యాలయానికి సంతకాల పత్రాలు
విశాఖ సిటీ : ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణ పత్రాలను బుధవారం అన్ని నియోజకవర్గాల నుంచి ప్రత్యేక వాహనాల్లో జిల్లా పార్టీ కార్యాలయంలో అందజేస్తున్నట్లు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తెలిపారు. పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జరుగుతున్న కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా లక్షల మంది నుంచి సంతకాలు సేకరించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుంచి ర్యాలీగా బయలుదేరి ఉదయం 10.30 గంటలకు మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో వాటిని అందజేస్తారని వెల్లడించారు. కార్యక్రమంలో పార్లమెంట్, శాసన మండలి సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, సీఈసీ, ఎస్ఈసీ సభ్యులు, రాష్ట్ర, జోనల్, జిల్లా అనుబంధ అధ్యక్షులు, కార్పొరేటర్లు, జెడ్పీటీసీ, ఎంపీపీలు, మండల, వార్డు అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ కమిటీ సభ్యులు, వార్డు కమిటీ, అనుబంధ కమిటీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గం నుంచి ర్యాలీగా.. ● భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) ఆధ్వర్యంలో తగరపువలస అంబేడ్కర్ విగ్రహం నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడి నుంచి జిల్లా పార్టీ కార్యాలయానికి వస్తారు. ● విశాఖ తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు ఆధ్వర్యంలో హెచ్బీ కాలనీలో ఉన్న నియోజకవర్గ పార్టీ కార్యాలయం నుంచి.. ● దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్కుమార్ ఆధ్వర్యంలో ఆశీల్మెట్ట ఆశోక్నగర్లో గల నియోజకవర్గ పార్టీ కార్యాలయం నుంచి.. ● ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో పోర్డ్ స్టేడియం వెనుక గేటు నుంచి .. ● పశ్చిమ సమన్వయకర్త మళ్ల విజయ్ప్రసాద్ ఆధ్వర్యంలో మింది గల నియోజకవర్గ పార్టీ కార్యాలయం నుంచి.. ● గాజువాక సమన్వయకర్త తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో పాత గాజువాక జంక్షన్ నుంచి జిల్లా పార్టీ కార్యాలయానికి వస్తారు. నియోజకవర్గాల నుంచి ర్యాలీగా బయలుదేరి పార్టీ జిల్లా కార్యాలయంలో అందజేత -
గంగవరం పోర్టు ముట్టడి
పెదగంట్యాడ: అదానీ గంగవరం పోర్టులో పనిచేసిన నిర్వాసిత కార్మికులు తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ సోమవారం ఉదయం పోర్టు మెయిన్ గేట్ను ముట్టడించారు. పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గతంలో పోర్టు యాజమాన్యం నిర్వాసిత కార్మికులకు వన్టైమ్ సెటిల్మెంట్ కింద ఒక్కో కార్మికునికి రూ. 27 లక్షలు చెల్లిస్తామని, అలాగే వారిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటామని హామీ ఇచ్చింది. అయితే 20 రోజుల తరువాత 500 మంది కార్మికులకు రూ. 24 లక్షల 80 వేలు మాత్రమే చెల్లించింది. మిగిలిన రూ. 2 లక్షల 20 వేల రూపాయలను ట్యాక్స్ పేరుతో చెల్లించకుండా కాలయాపన చేస్తుండటంతో పాటు, కార్మికులపై ఉన్న కేసులను కూడా ఉపసంహరించుకోలేదు. దీంతో ఆగ్రహించిన కార్మికులు ఒక్కసారిగా పోర్టు గేటు వద్దకు పోటెత్తి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. యాజమాన్యం న్యూపోర్టు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, పోలీసులు గేటు వద్దకు చేరుకుని కార్మికులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కార్మికులు వెనక్కి తగ్గకుండా ఆందోళన కొనసాగించారు. తమకు మిగిలిన డబ్బులు వెంటనే చెల్లించాలని, అక్రమంగా పెట్టిన పోలీస్ కేసులను ఉపసంహరించుకోవాలని, పీఎఫ్ డబ్బులు వెంటనే ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేశారు. కార్మికుల ఆందోళనతో రంగంలోకి దిగిన డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్.. పోర్టు యాజమాన్యం ప్రతినిధులతో చర్చలు జరిపారు. రెండు వారాల్లోగా ఈ సమస్యలను యాజమాన్యంతో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు తమ ఆందోళనను విరమించారు. బకాయిల కోసం కార్మికుల నిరసన -
కనకమహాలక్ష్మి హుండీ ఆదాయం రూ.67.78 లక్షలు
డాబాగార్డెన్స్: కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో సోమవారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. అక్టోబర్ 29 నుంచి డిసెంబర్ 8 వరకు (40 రోజులకు) హుండీల ద్వారా వచ్చిన నగదు, బంగారం, వెండి, ఇతర కానుకలను లెక్కించారు. ఈ హుండీ లెక్కింపు ద్వారా ఆలయానికి మొత్తం రూ. 67,78,784 ఆదాయం సమకూరింది. దీంతో పాటు 46 గ్రాముల 500 మిల్లీ గ్రాముల బంగారం, 669 గ్రాముల వెండి కానుకల రూపంలో లభించాయి. 100 శ్రీలంక కరెన్సీ, 2 యూఎస్ఏ డాలర్లు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన 5 కరెన్సీ, 10 కెనడా డాలర్లు ఉన్నాయి. హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ఈవో కె. శోభారాణి, జిల్లా దేవదాయ ధర్మదాయ శాఖాధికారి టి. అన్నపూర్ణ, ఇన్స్పెక్టర్ ఎం. శ్రీధర్, ఉత్సవ కమిటీ సభ్యులు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ మేనేజర్ డి. రాజు, వన్టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, గోపాలపట్నం శ్రీహరిసేవా సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
పనిచేస్తారు?
మీరెక్కడ దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నమూనా సాక్షి, విశాఖపట్నం : దక్షిణ కోస్తా రైల్వే జోన్కు కేంద్రం గెజిట్ ఇవ్వకుండానే సర్దుబాట్లు, దిద్దుబాట్లతో నడిపిస్తోంది. కొత్త జోన్ పరిధిలోని డివిజన్లు, కొత్తగా ఏర్పాటు చేస్తున్న రాయగడ డివిజన్లో ఎక్కడ పనిచేయాలని కోరుకుంటున్నారో తెలపాలని ఉద్యోగులకు ఈనెల 2వ తేదీన ఆప్షన్లు ఇస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే జోన్ డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక) ఆమోదం సమయంలో చెప్పిన విధంగానే, ప్రస్తుతం ఉన్న నాన్–గెజిటెడ్ పోస్టులను సర్దుబాటు చేస్తూ బోర్డు ఈనెల 4న మరో సర్క్యులర్ విడుదల చేసింది. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించిన సవరించిన డీపీఆర్ను రైల్వేబోర్డు ఈ ఏడాది జూలైలో ఆమోదించింది. అయితే రైల్వే బోర్డు కొత్త పోస్టుల నియామకాలు, నిధుల విషయంలో ఆంక్షలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా ప్రకటనలు, వరుస ఉత్తర్వులు జారీ చేస్తోంది. గెజిట్ విడుదల కాకపోవడంతో తాత్కాలిక కార్యకలాపాల ప్రారంభం ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. వీఎంఆర్డీఏ డెక్లో తాత్కాలిక జీఎం కార్యాలయం పనులు పూర్తయినా.. గెజిట్ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ఉద్యోగులూ.. ఆప్షన్లు ఎంచుకోండి కొత్తగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా జోన్తో పాటు రాయగడ డివిజన్లో పనిచేసేందుకు ఎవరికి ఎక్కడ ఇష్టం ఉందో ఆప్షన్లు ఎంచుకోవాలంటూ రైల్వే బోర్డు మ్యాన్పవర్ ప్లానింగ్ డైరెక్టర్ ఏఎస్ మెహ్రా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేజోన్లో ఉన్న విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్లు విశాఖ కేంద్రంగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్లో చేరబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న వాల్తేరు డివిజన్ రెండుగా విభజించి.. కొంత భాగాన్ని విశాఖ డివిజన్గా, మిగిలిన భాగాన్ని రాయగడ డివిజన్లో చేర్చుతూ డీపీఆర్ తయారు చేశారు. కొత్త జోన్ హెడ్క్వార్టర్స్లో పోస్టింగులతో పాటు రాయగడ డివిజన్లో పనిచేసేందుకు పోస్టింగ్లపై ఆప్షన్లు ఎంచుకోవాలని సూచించారు. జోన్ హెడ్క్వార్టర్ కోసం దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్కోస్ట్ రైల్వే హెడ్క్వార్టర్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు మొదటి ప్రాధాన్యమిస్తుండగా.. రెండో ప్రాధాన్యం కింద మిగిలిన డివిజన్లకు సంబంధించిన వారికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాయగడ డివిజన్ ఆప్షన్లు ఎంచుకునేందుకు వాల్తేరు డివిజన్ ఉద్యోగులకు ప్రథమ ప్రాధాన్యమిచ్చారు. రెండో ప్రాధాన్యత కింద ఈస్ట్కోస్ట్ జోన్, తర్వాత ఇతర జోన్లు ఉద్యోగులు ఆప్షన్లు పెట్టుకోవచ్చని సూచించారు. హెచ్ఆర్ఎంఎస్ ద్వారా ఆప్షన్లు నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది. దీనికి 4 వారాల సమయం ఇస్తున్నట్లు రైల్వే బోర్డు మ్యాన్పవర్ ప్లానింగ్ డైరెక్టర్ ఏఎస్ మెహ్రా ఆదేశించారు. నాన్ గెజిటెడ్ పోస్టుల విభజన షురూ విశాఖ జోన్, రాయగడ డివిజన్ కోసం వివిధ డివిజన్లు, ఈస్ట్కోస్ట్, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లలో విధులు నిర్వర్తిస్తున్న నాన్గెజిటెడ్ ఉద్యోగుల విభజనను కేడర్ ప్రకారం కేటాయింపులు చేస్తూ ఈనెల 4న ఉత్తర్వులు జారీ చేశారు. దక్షిణ కోస్తా జోన్ హెడ్క్వార్టర్స్ కోసం 1,100 నాన్గెజిటెడ్ పోస్టుల బదిలీ జరగాలని డీపీఆర్లో స్పష్టం చేశారు. దానికనుగుణంగా కేడర్ల వారీగా బదిలీలకు ఆమోదముద్ర వేశారు. దీని ప్రకారం దక్షిణ మధ్య రైల్వే జోన్ నుంచి 959, వాల్తేరు డివిజన్ నుంచి 129 పోస్టులు, ఈస్ట్కోస్ట్ జోన్ నుంచి 12 పోస్టులు బదిలీ చేయాలని నిర్ణయించారు. అకౌంట్స్ విభాగంలో 298, ఇంజినీరింగ్ 104, కమర్షియల్ విభాగం నుంచి 101 పోస్టులు బదిలీ చేయనున్నారు. అదేవిధంగా రాయగడ డివిజన్ కోసం డీపీఆర్లో 600 నాన్ గెజిటెడ్ పోస్టులు కేటాయించారు. ఈ డివిజన్ కోసం వాల్తేరు డివిజన్ హెడ్క్వార్టర్స్ నుంచి 381 పోస్టులు, ఈస్ట్కోస్ట్ జోన్ హెడ్ క్వార్టర్స్ నుంచి 219 పోస్టులు కేటాయించారు. పర్సనల్ విభాగంలో 110, ఆపరేటింగ్ నుంచి 72, ఎలక్ట్రికల్ విభాగం 66 పోస్టులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టుల నిర్వహణ బోర్డు ఆమోదించిన ప్రామాణిక హోదాల్లో మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. -
బాల్యవివాహాలు అరికట్టడానికి 100 రోజుల ప్రణాళిక
అధికారులతో ప్రతిజ్ఞ చేయించిన కలెక్టర్మహారాణిపేట: బాల్యవివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ హరేందిర ప్రసాద్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయ మీటింగ్ హాల్లో బాల్యవివాహాలకు వ్యతిరేకంగా అధికారులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందని, దీని ప్రకారం నవంబర్ 27 నుంచి మార్చి 8 వరకు మూడు విడతలుగా ఈ అవగాహన ప్రచారం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రచారంలో భాగంగా అన్ని పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలలో ప్రతిజ్ఞ చేసి క్యాంపెయిన్ నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థులతో ర్యాలీలు, డిబేట్లు, పోటీలు నిర్వహించాలని, స్కూల్ అసెంబ్లీలలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సందేశాలు ఇవ్వాలని సూచించారు. పోలీస్ అధికారులు బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, అనుమానం ఉన్న పెళ్లిళ్ల వద్ద పరిశీలించి, అవసరమైతే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు. మైనర్లకు పెళ్లిళ్లు జరగకుండా మత పెద్దలు సహకరించాలన్నారు. చైల్డ్లైన్ అధికారులు, ఎన్జీవోలు బాల్య వివాహాలు జరుగుతుంటే వాటిని నిలుపుదల చేసి వారికి ఆశ్రయం కల్పించాలని, ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతుంటే 1098 నెంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, ఇన్చార్జ్ డీఆర్వో సత్తిబాబు, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వర్మ, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి రామలక్ష్మి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
టీడీపీ దిగజారుడు రాజకీయం
పెందుర్తి : పెందుర్తి నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీ దిగజారుడు రాజకీయాలకు దిగింది. ఓ మండలస్థాయి నాయకుడి సస్పెన్సన్ను కూడా హుందాగా స్వీకరించకుండా తప్పుడు ప్రచారంతో సోషల్ మీడియా వేదికగా అబాసుపాలైంది. ఓ రకంగా టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి గండి బాబ్జీకి సోమవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పెందుర్తి మండలం చింతగట్లకు చెందిన గండి బాబ్జీ అనుచరుడు గనిశెట్టి కనకరాజును ఆ పార్టీ అదిష్టానం ఆదేశాల మేరకు టీడీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం టీడీపీ మండల కార్యదర్శిగా ఉన్న కనకరాజు గండి బాబ్జీకి అత్యంత సన్నిహితుడు. అయితే గండి బాబ్జీ నాయకత్వాన్ని సహించలేని టీడీపీ మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి వర్గీయులు ఇటీవల అతడిపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అతని అనుచరుడు కనకరాజును టీడీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. అయితే కనకరాజు సస్పెన్షన్ను జీర్ణించుకోలేని గండి బాబ్జీ వర్గీయులు సస్పెండ్ అయింది చింతగట్లకు చెందిన వైఎస్సార్సీపీ మండల కమిటీ సభ్యుడు గనిశెట్టి కనకరాజు అంటూ తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. వైఎస్సార్సీపీలో ఉన్న నాయకుడ్ని టీడీపీ అదిష్టానం ఎలా సస్పెండ్ చేస్తుందో అర్థంగాక సోషల్ మీడియా జనాలు జుట్టుపీక్కుంటున్నారు. పెందుర్తి టీడీపీకి పిచ్చి పరాకాష్టకు చేరిందని నవ్వుకుంటున్నారు. అసలు విషయం ఇదీ.. చింతగట్ల పంచాయతీలో కీలక నాయకుడిగా ఉన్న గనిశెట్టి కనకరాజు(సర్పంచ్ వెంకటలక్ష్మి భర్త) కొన్నాళ్ల క్రితం గండి బాబ్జీ సమక్షంలో టీడీపీలో చేరారు. అయితే తొలి నుంచీ గండి బాబ్జీ మీద కోపంగా ఉన్న బండారు వర్గీయులు కనకరాజు రాకను తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే టీడీపీ పాతకాపులను పట్టించుకోకుండా గండి బాబ్జీ ఇటీవల ప్రకటించిన మండల, వార్డు కమిటీల్లో పూర్తిగా తన అనుచరులకే ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో మరింత చిర్రెత్తుకొచ్చిన బండారు వర్గీయులు బాబ్జీ తీరును ఎండగడుతూ పార్టీ అదిష్టానానికి ఇటీవల ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో బాబ్జీకి ప్రధాన అనుచరుల్లో ఒక్కరైన గనిశెట్టి కనకరాజుతో పాటు అదే గ్రామానికి చెందిన దమ్ము రమేష్ అనే చోటా కార్యకర్తను అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు తాతయ్యబాబు సస్పెండ్ చేశారు. అయితే దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇటు సోషల్ మీడియాలో.. అటు టీడీపీ గ్రూపుల్లో అదే పేరుతో వైఎస్సార్ సీపీలో మండల కమిటీ సభ్యుడిగా ఉన్న గనిశెట్టి కనకరాజును టీడీపీ సస్పెండ్ చేసినట్లు దిగజారుడు రాజకీయాలకు దిగారు. తాతయ్యబాబుపై గండి బాబ్జీ ఫైర్..! మరోవైపు ఈ సస్పెన్షన్ వ్యవహారం విశాఖ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ.. అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు మధ్య చిచ్చుపెట్టింది. తన అనుచరుడు గనిశెట్టి కనకరాజును సస్పెండ్ చేయడం పట్ల తాతయ్యబాబుపై బాబ్జీ ఫైర్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. మరోవైపు కనకరాజు సస్పెన్షన్ను రద్దు చేసుకునేందుకు బాబ్జీ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి పెందుర్తి నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీలోని దుస్థితిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. -
ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించండి
మహారాణిపేట: ఈ నెల 21న జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ కోరారు. సోమవారం కలెక్టర్లో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఐదేళ్లలోపు 2,09,652 మంది చిన్నారులు ఉన్నారని, వారిలో అర్బన్లో 1,93,090 మంది గ్రామీణ ప్రాంతాల్లో 16,562 మంది ఉన్నారని తెలిపారు. 1062 పల్స్ పోలియో బూత్లను ఏర్పాటు చేశామన్నారు. 50 ట్రాన్సిట్ బూత్లను, 85 మొబైల్ బూత్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 22, 23వ తేదీల్లో ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని, దీనికోసం 2004 టీమ్లు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 85 హైరిస్క్ ప్రాంతాలలో 6,497 మంది చిన్నారులు ఉన్నారని, అలాంటి వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పోలియో చుక్కలు వేయాలన్నారు. పల్స్ పోలియోపై సినిమా థియేటర్లు, బస్ స్టేషన్, రైల్వే స్టేషన్లో ప్రచారం చేయాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, ఇన్చార్జ్ డీఆర్వో సత్తిబాబు, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వర్మ, డీఎంహెచ్వో డాక్టర్ జగదీశ్వరరావు, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ శంకర ప్రసాద్, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ అప్పారావు, అధికారులు పాల్గొన్నారు. -
సరస్ ఎగ్జిబిషన్కు పటిష్ట ఏర్పాట్లు
మహారాణిపేట : కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్న సరస్ ఎగ్జిబిషన్–2025కు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే డ్వాక్రా, స్వయం సహాయక సంఘాల సభ్యులు ఉండేందుకు వీలుగా పెందుర్తిలోని టీటీడీసీలో వసతి కల్పించాలన్నారు. నోడల్ అధికారి డీఆర్డీఏ పీడీ లక్ష్మీపతితో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో వ్యవహరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమ నిర్వహణకు పూర్తిస్థాయి సహకారం అందించాలని, స్వయం సహాయక సంఘాలకు తోడ్పాటు అందించాలని బ్యాంకర్లకు సూచించారు. అనంతరం సరస్ ఎగ్జిబిషన్కు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. -
జీవీఎంసీ పీజీఆర్ఎస్కు 86 వినతులు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ అంశాలపై మొత్తం 86 వినతులు వచ్చాయి. అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి ఈ ఫిర్యాదులను స్వీకరించారు. వీటిలో పట్టణ ప్రణాళికా విభాగానికి అత్యధికంగా 33, ఇంజినీరింగ్ విభాగానికి 18, రెవెన్యూ విభాగానికి 12 ఫిర్యాదులు అందాయి. అందిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను అదనపు కమిషనర్ ఆదేశించారు. శిథిల భవనం తొలగింపుపై వినతి జీవీఎంసీ 29వ వార్డు దిబ్బలపాలెం రామాలయం వద్ద శిథిలావస్థలో ఉన్న పాత భవనం, ఆలయానికి ఇబ్బందికరంగా ఉన్న చెట్టును తొలగించాలని శ్రీసీతారామ సేవా సంఘం అధ్యక్షుడు చందక అప్పలరాజు అదనపు కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. శిథిల భవనం నుంచి పాములు వస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, ఈ విషయమై గత నాలుగేళ్లుగా అనేక మార్లు ఫిర్యాదు చేసినా, అధికారులు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. స్థానికుల భద్రత దృష్ట్యా తక్షణమే ఆ భవనం, చెట్టును తొలగించాలని అప్పలరాజు కోరారు. కార్యక్రమంలో జీవీఎంసీ ప్రధాన ఇంజనీర్ పీవీవీ సత్యనారాయణరాజు, ప్రధాన వైద్యాధికారి నరేష్ కుమార్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఘనంగా కేకే రాజు జన్మదిన వేడుకలు
మద్దిలపాలెం: వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు పుట్టినరోజు వేడుకలు మద్దిలపాలెంలో ఘనంగా జరిగాయి. పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన వేడుకల్లో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని కేకే రాజుకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కేడర్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి అభిమానులకు పంపిణీ చేశారు. జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు, అభిమానులు అధిక సంఖ్యలో కోలాహలంగా తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, పసుపులేటి బాలరాజు, ఎమ్మెల్సీలు కుంభా రవిబాబు, వరుదు కల్యాణి, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, తైనాల విజయకుమార్, తిప్పల నాగిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు, గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి, నగర మాజీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావుతో పాటు పలువురు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కె.కె. రాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. -
మల్టీప్లెక్స్లో ఉచిత పార్కింగ్ అమలు చేయాలి
డాబాగార్డెన్స్ : మల్టీప్లెక్స్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజుల నియంత్రణకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వు (జీవో 44)ను కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రముఖ న్యాయవాది, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్గాంధీ డిమాండ్ చేశారు. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన అదనపు కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. జీవో 44 ప్రకారం.. వాణిజ్య సంస్థల్లో మొదటి 30 నిమిషాలు పూర్తి ఉచితంగా పార్కింగ్ చేసుకోవచ్చు. 30 నిమిషాలు దాటి ఒక గంటలోపు, ఏదైనా షాపింగ్ చేసిన బిల్లు లేదా సినిమా టికెట్ చూపించినా పూర్తి ఉచితంగా పార్కింగ్ సౌకర్యాన్ని పొందవచ్చని రాజీవ్గాంధీ గుర్తు చేశారు. ఒకవేళ గంట దాటినా, షాపింగ్ బిల్లు/టికెట్ ధర పార్కింగ్ ఫీజు కంటే ఎక్కువ ఉంటే అప్పుడు కూడా పార్కింగ్ ఉచితమేనని తెలిపారు. ప్రస్తుతం అనేక వాణిజ్య సంస్థలు ఈ నియమాలను ఉల్లంఘిస్తూ అధిక పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నాయని, పౌరులపై భారం పడకుండా తక్షణమే ఈ సమస్య పరిష్కరించాలని ఆయన వినతిలో కోరారు. పార్కింగ్ ఫీజుల నియంత్రణపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వడం, ఫిర్యాదులపై ప్రత్యేక పర్యవేక్షణ బృందాన్ని ఏర్పాటు చేయడం, నియమాలు అతిక్రమించిన సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పౌర హక్కులను కాపాడడంలో జీవీఎంసీ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు పౌరుల తరపున నిరంతరం పోరాటం చేస్తామని కొండా రాజీవ్గాంధీ మీడియాకు తెలియజేశారు. -
కనువిందుగా కొండగుడి పండగ
డాబాగార్డెన్స్ : పాతపోస్టాఫీస్ ప్రాంతంలోని రాస్హిల్స్ కొండపై వెలసిన అమలోద్బవి అమ్మవారిని దర్శించుకోవడానికి సోమవారం అశేష భక్తజనం తరలివచ్చింది. భక్తి పారవశ్యంతో మాతను స్మతిస్తూ.. ఆరాధకుల గీతాలాపనలు.. సర్వమానవ సౌభ్రాతృత్వం కోసం అగ్ర పీఠాధిపతుల బోధనలు.. ఇలా అక్కడ అణువణువునా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి, కృష్ణ జిల్లాల నుంచి అమ్మ కరుణ కోసం తరలివచ్చిన ఆరాధకులతో విశాఖ జనపురిగా మారిపోయింది. కుల, మతాలకు అతీతంగా అమ్మవారిని దర్శించుకోవడంతో పరమత సహనం పరిఢవిల్లింది. భక్తిశ్రద్ధలతో దివ్యపూజా బలి కొండగుడిలో వెలసిన అమలోద్బవి మాత(విశాఖ పురి మేరీమాత) ఉత్సవాలు గత నెల 29న ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 8 సోమవారంతో ఉత్సవాలు ముగిశాయి. సోమవారం ఉదయం దివ్య పూజ జరిపారు. పూజలో ఎక్కువ మంది కన్యసీ్త్రలు రాష్ట్ర నలుమూలల నుంచి హాజరై ప్రార్థనలు చేశారు. ఉదయం 7.30 గంటలకు గుహవద్ద విశాఖ అగ్రపీఠాధిపతి డాక్టర్ ఉడుముల బాల సమిష్టి దివ్యబలి పూజ ప్రసంగమిచ్చారు. 350 మంది వలంటీర్లు, 50 మంది గురువులే గాక నగరంలోని వివిధ చర్చిలకు చెందిన ఫాదర్లు, బ్రదర్స్ ఈ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో చేపట్టారు. వెల్లువలా ఊరేగింపు మధ్యాహ్నం పాతపోస్టాఫీస్ వద్ద ఉన్న సెయింట్ అలెయిసిస్ పాఠశాల నుంచి ఆరాధకులు ప్రదక్షిణగా కొండపై ఉన్న ప్రధాన దేవాలయానికి చేరుకున్నారు. ఆరాధకుల సందర్శనార్ధం ఆలయం బయట అమలోద్బవి స్వరూపాన్ని ఉంచారు. ఆరాధకులు అమ్మవారికి తమ శక్తి మేరకు బంగారం, వెండి కానుకలు సమర్పించుకున్నారు. కొంత మంది తలనీలాలు సమర్పించి తమ భక్తి తత్పరతను చాటుకున్నారు. లూర్ధుమాత గుహ వద్ద దివ్యపూజ బలితో మహోత్సవం ముగిసింది. జోరుగా వ్యాపారం పాతపోస్టాఫీసు, కోటవీధి, ఫెర్రీరోడ్డు, అంబుసరంగ్ వీధి, కన్వేయర బెల్ట్ తదితర ప్రాంతాల్లో సుమారు కిలోమీటర్ల మేర దుకాణాలు వెలిశాయి. వీటిలో ఆధ్యాత్మిక గ్రంథాలు, కొండగుడి చరిత్ర, ఏసుక్రీస్తు, మేరిమాత బొమ్మలు కొలువుదీరాయి. వీటితో పాటు మిఠాయిలు, శనగలు, కర్జూరం వ్యాపారం జోరుగా సాగింది. కొవ్వొత్తుల వ్యాపారం ఎక్కువగా సాగింది. -
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు
పీజీఆర్ఎస్లో అధికారులను హెచ్చరించిన కలెక్టర్ హరేందిర ప్రసాద్ మహారాణిపేట: ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అంశాల్లో అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ కీలక సూచనలు చేశారు. ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూడాలని, సమస్యల శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఒకే సమస్యపై పదేపదే ఫిర్యాదులు వస్తే ఇక నుంచి ఉపేక్షించేది లేదని, నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు. నిర్ణీత సమయంలోగా ప్రతి ఫిర్యాదుపై చర్య తీసుకోవాలన్నారు. సమస్య పరిష్కారం కాకపోతే, అర్జీదారునికి ఎందుకు పరిష్కారం కాలేదో సహేతుక కారణాలతో వివరించాలని సూచించారు. ముఖ్యమంత్రి కార్యాలయం గ్రీవెన్స్పై ప్రత్యేక దృష్టి సారించి తక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఆడిట్ బృందాలు ఈ విషయంలో కీలకంగా వ్యవహరించాలని సూచించారు. 292 వినతులు స్వీకరణ: సోమవారం కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్లో మొత్తం 292 వినతులు సమర్పించారు. వీటిలో రెవెన్యూ విభాగానికి సంబంధించినవి 108 ఉండగా, జీవీఎంసీకి 83, పోలీస్ విభాగానికి 18, ఇతర విభాగాలకు చెందినవి 83 అర్జీలు ఉన్నాయి. జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, ఇన్చార్జి డీఆర్వో సత్తిబాబు, ఏడీసీ వర్మలు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. కార్యక్రమంలో అన్ని విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
నేడు ప్రాంతీయ ఔషధ ప్రయోగశాల ప్రారంభం
ఆరిలోవ: విశాఖలో ప్రాంతీయ ఔషధ పరీక్షల ప్రయోగశాలను మంగళవారం ప్రారంభించనున్నారు. విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆవరణలో ఈ ప్రాంతీయ ఔషధ పరీక్షల ప్రయోగశాల, ఔషధ నియంత్రణ అండ్ పరిపాలన సంయుక్త సంచాలక కార్యాలయాన్ని నిర్మించారు. ఈ భవనం నిర్మాణం సుమారు ఏడు నెలల క్రితమే పూర్తయింది. అక్టోబర్ 27న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి సత్యప్రసాద్తో ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేశారు. అదేరోజు మోంథా తుపాను ప్రభావంతో వాయిదా పడింది. మంత్రి నగరానికి ఎప్పుడు వస్తే అప్పుడే ప్రారంభించాలని అధికారులు ఎదురుచూశారు. దీంతో ఈ కార్యాలయం ప్రజలకు అందుబాటులోకి రాకుండా మిగిలిపోయింది. దీనిపై ఈ నెల 4న ‘సాక్షి’లో ‘ఔషధ ప్రయోగశాల ప్రారంభమె ప్పుడో’ శీర్షికతో కథనం ప్రచురితం కావడంతో జిల్లా అధికారులు స్పందించారు. మంత్రి కోసం ఎదురు చూడకుండానే మంగళవారం కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
విజయోత్సాహంతో.. తిరుగు ప్రయాణం
ప్రత్యేక విమానంలో భువనేశ్వర్ తరలివెళ్లిన క్రికెటర్లు గోపాలపట్నం: విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాపై సాధించిన ఘన విజయంతో టీమిండియా తదుపరి పోరుకు సిద్ధమైంది. శనివారం జరిగిన మ్యాచ్లో విజయఢంకా మోగించిన భారత జట్టు.. ఆదివారం మధ్యాహ్నం విశాఖపట్నం నుంచి బయలుదేరింది. కటక్లో ఈ నెల 9న జరగనున్న టీ–20 మ్యాచ్లో పాల్గొనేందుకు టీమిండియా, దక్షిణాఫ్రికా జట్లు ప్రత్యేక విమానంలో భువనేశ్వర్కు పయనమయ్యాయి. విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న క్రికెటర్లను చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపారు. -
జీతాలకూ ఎదురుచూపులే..
మహారాణిపేట: అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. ప్రస్తుతం వారిని నెలల తరబడి పస్తులు ఉంచుతోంది. ఏకంగా ఏడు నెలల పాటు జీతాలు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. కీలకమైన కేజీహెచ్, ఆంధ్రా మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న 39 మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది జీతాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వీరు ఈ ఏడాది మే నుంచి విధుల్లో ఉన్నారు. నాటి నుంచి నేటి వరకు వారికి ఒక్క రూపాయి కూడా జీతం అందలేదు. ఏడు నెలలుగా జీతాలు రాకపోవడంతో కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందని, ఇల్లు గడవని దుస్థితి నెలకొందని వారు వాపోతున్నారు. జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియక వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అనుమతులున్నా.. అవుట్సోర్సింగ్ సిబ్బంది నియామకం కోసం ఇన్చార్జి మంత్రి, కలెక్టర్ నుంచి అనుమతులు వచ్చినా, ఆ ఫైల్ ముందుకు కదలడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం కలెక్టర్ అనుమతి ఇచ్చిన ఫైల్ను ఎంప్లాయిమెంట్ అధికారి ద్వారా ఏపీ అవుట్సోర్సింగ్ శాఖకు పంపి ఆమోదం పొందాల్సి ఉంది. కానీ, ఆ ఫైల్ను ఎంప్లాయిమెంట్ అధికారికి పంపకుండా కేజీహెచ్లోనే తొక్కిపెడుతున్నట్లు సమాచారం. పర్యవేక్షణ లోపం : కేజీహెచ్, ఏఎంసీలలో అడుగడుగునా పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పరిపాలన లోపాలు, ఆధిపత్య పోరు వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేజీహెచ్ సూపరింటెండెంట్, ఏఎంసీ ప్రిన్సిపాల్ పేరుకే ఉన్నారు గానీ.. పలు కార్యకలాపాల్లో అధికారుల అతిజోక్యం వల్ల పనులు సకాలంలో జరగడం లేదు. అనేక పాలనాపరమైన అంశాలు కుంటుపడుతున్నాయి. కలెక్టర్ చొరవ చూపాలి గత ఏడు నెలలుగా జీతాలు లేక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఉద్యోగ భద్రతపై భయంతో సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్న 39 కుటుంబాలను ఆదుకునేందుకు కలెక్టర్ తక్షణమే స్పందించి, తమకు న్యాయం చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. జీతాలకూ లంచాలా? పెండింగ్లో ఉన్న జీతాల ఫైలును కదిలించడానికి కేజీహెచ్లోని కొందరు అధికారులు బేరసారాలకు దిగినట్లు తెలుస్తోంది. వైరాలజీ ల్యాబ్, ఇతర వార్డుల్లో పనిచేస్తున్న సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ముడుపులు డిమాండ్ చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చే చాలీచాలని జీతంతో కుటుంబాన్ని పోషించుకోవాలా? లేక అధికారులకు ముడుపులు ఇవ్వాలా? అని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కొండగుడికి పండగొచ్చింది..!
డాబాగార్డెన్స్: పాత పోస్టాఫీస్ వద్ద గల కొండగుడి(రాస్హిల్స్)పై కొలువుదీరి కులమతాలతో సంబంధం లేకుండా భక్తులంతా కొలిచే తల్లి అమలోద్బవి (విశాఖపురి మేరిమాత). మేరీ మాత పుణ్యక్షేత్రం విశాఖపురికి ప్రత్యేక ఆభరణం. దీనినే ‘కొండగుడి’గా భక్తులు పిలుచుకుంటారు. సోమవారం జరిగే కొండగుడి జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలీస్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు మేరిమాత ఉత్సవం పురస్కరించుకొని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేసింది. భక్తులు ఆలయానికి సమర్పించిన బంగారు, వెండి ఆభరణాలను ఆలయ ఆవరణలో ప్రదర్శిస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి సెయింట్ ఎలాసిస్ పాఠశాలలో వసతి సౌకర్యం ఉంటుంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. రాస్ హిల్స్ దిగువన పోలీస్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు పండగకు సుమారు లక్ష మందికి పైగా వచ్చే అవకాశాలు ఉన్నందున పోలీసులు భక్తులకు పలు సూచనలు చేశారు. పాత పోస్టాఫీస్కు ఆర్టీసీ బస్సులతో పాటు వచ్చే అన్ని వాహనాలు పూర్ణామార్కెట్, టౌన్కొత్తరోడ్డు, రీడింగ్రూమ్, కురుపాం మార్కెట్, వన్టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా రాణిబొమ్మ వరకు అనుమతిస్తారు. బీచ్రోడ్డు, కోటవీధి వైపు నుంచి వచ్చే వాహనాలను బీచ్రోడ్డులోని సెయింట్ అలోసిస్ స్కూల్ వరకు మాత్రమే అనుమతిస్తారు. సీహార్స్ జంక్షన్ నుంచి రాస్హిల్స్కు వచ్చే ద్విచక్ర, నాలుగు చక్ర వాహనాలకు పోర్టు ప్రధాన గేట్ వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. కన్వేయర్ బెల్ట్ రోడ్డులో సీహార్స్ జంక్షన్, రైల్ క్రాసింగ్ జంక్షన్ నుంచి రోజ్ హిల్స్ కొండ డౌన్ వరకు ఎలాంటి వాహనాలు అనుమతించరు. పోర్టు ఏరియాలోని వేంకటేశ్వర గుడి నుంచి రాస్హిల్స్ వైపు కూడా వాహనాలు అనుమతించరు. ద్విచక్ర వాహన చోదకులు తమ వాహనాలను కృష్ణథియేటర్, పాత రైల్వేస్టేషన్ స్థలం వద్ద పార్కింగ్ చేసుకోవాలి. కార్లను హార్బర్, ఓల్డ్ పోలీస్స్టేషన్ వెనుక అదానీ రోడ్డులో, పోర్టు వేంకటేశ్వర గుడి వద్ద పార్కింగ్ చేసుకోవాలి. యాత్రికులు తీసుకు వచ్చిన బస్సులు కాన్వెంట్ జంక్షన్ సమీపంలోనే పార్కింగ్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. -
నిరంతర శ్రామికులు పాత్రికేయులు
ఏసీపీ అప్పలరాజు పీఎంపాలెం: నిత్యం పని ఒత్తిడిలో ఉండే పాత్రి కేయులు.. ఆటవిడుపుగా ఇలా వనసమారాధన ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని నార్త్ జోన్ ఏసీపీ జి.అప్పలరాజు అన్నారు. ఆదివారం శిల్పారామంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల వనసమారాధన ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ, అందరి సహకారంతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని అన్నారు. నిరంతర ఒత్తిడిని ఎదుర్కొంటూనే పోలీసులు, పాత్రికేయులు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతున్నారని కొనియాడారు. జాతీయ జర్నలిస్టు సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ.. పాత్రికేయుల సంక్షేమమే పరమావధిగా ఫెడరేషన్ పని చేస్తోందన్నారు. ఫెడరేషన్ నగర అధ్యక్షుడు పోతిమహంతి నారాయణ్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల కుటుంబ సభ్యులందరినీ ఒకచోట చేర్చి, ఉత్సాహంగా ఒక రోజు గడపాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఎన్ఐఎఫ్ఎస్ సీఈవో సునీల్ మహంతి, ఆయుష్ ఆసుపత్రి డాక్టర్ ఆమన్ సాయి, ఫెడరేషన్ కార్యదర్శి జి.శ్రీనివాసరావు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ సాంబశివరావు, పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా జూనియర్ రాజబాబు హాస్యం, కూచిపూడి, జానపద నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. -
రెయిన్బో నూతన కేంద్రం ప్రారంభం
అందుబాటులోకి అత్యవసర, ఓపీడీ సేవలు బీచ్రోడ్డు: ప్రముఖ పీడియాట్రిక్ మల్టీ స్పెషాలిటీ, పెరినాటల్ కేర్ ఆసుపత్రి అయిన రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్.. సిరిపురంలోని కై లాసమెట్టలో తమ కొత్త 24/7 చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ, ఓపీడీ సెంటర్ను ప్రారంభించింది. ఈ సెంటర్ను నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ప్రారంభించి మాట్లాడారు. చిన్న పిల్లలకు సకాలంలో వైద్యం అందించకపోతే ఆరోగ్యం విషమించే ప్రమాదముందన్నారు. ఇటువంటి క్లిష్టమైన సమయాన్నే వైద్య పరిభాషలో గోల్డెన్ అవర్గా వ్యవహరిస్తారని తెలిపారు. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఈ పీడియాట్రిక్ అత్యవసర సేవలను ఆరంభించడం ద్వారా నగరంలో పీడియాట్రిక్ కేర్ సేవలు మరింత విస్తృతమవుతాయన్నారు. ఈ ప్రాంతం అంతటా ఉన్న కుటుంబాలకు సకాలంలో, ప్రత్యేకమైన, సమగ్రమైన పీడియాట్రిక్ సంరక్షణను అందించే సామర్థ్యం ఈ కేంద్రానికి ఉందని పేర్కొన్నారు. రెయిన్బో హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ రజిని ముఖర్జీ మాట్లాడుతూ.. సకాలంలో పిల్లలపై దృష్టి సారించి అత్యవసర, అవుట్ పేషెంట్ సంరక్షణ చికిత్సలను అందించడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. శిక్షణ పొందిన పీడియాట్రిక్ నిపుణుల సహకారంతో సమర్థవంతంగా వైద్య సేవలందించేందుకు ఈ కేంద్రం సంసిద్ధంగా ఉందని వివరించారు. డాక్టర్ శాశ్వత్ మహంతి మాట్లాడుతూ పిల్లల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకే ఈ అత్యవసర, ఓపీడీ సేవలను రూపొందించినట్లు పేర్కొన్నారు. సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ చుప్పన రాగసుధ మాట్లాడుతూ ఈ సెంటర్లోని సేవలకు ‘బర్త్ రైట్ బై రెయిన్బో హాస్పిటల్స్’మద్దతు ఇస్తుందన్నారు. మహిళలు, పిల్లల సంరక్షణ, సంతానోత్పత్తిలో ప్రత్యేక సేవలు, ప్రపంచ స్థాయి వైద్య నైపుణ్యం, మెరుగైన ఆరోగ్య ఫలితాలను అందించడమే ఈ కేంద్రం లక్ష్యమని వివరించారు. -
కూలిన షాపింగ్ మాల్ స్లాబ్
గుట్టుచప్పుడు కాకుండా తొలగింపు!కంచరపాలెం: ఇండస్ట్రియల్ ఎస్టేట్లో జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు పక్కన, గ్రీన్ బెల్ట్కు ఆనుకుని జరుగుతున్న ఓ ప్రముఖ షాపింగ్ మాల్ నిర్మాణంలో అపశ్రుతి చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవన స్లాబ్లో కొంత భాగం ఆదివారం వేకువజామున ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ భవనం నగరానికి చెందిన ఓ ప్రముఖ వస్త్ర వ్యాపారిదని స్థానికులు చెబుతున్నారు. స్లాబ్ కూలిన వెంటనే విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు, యాజమాన్యం అటువైపు రహదారిని మూసివేసి హడావిడిగా పొక్లెయిన్లతో శిథిలాలను తొలగించడం గమనార్హం. నిర్మాణంలో నాణ్యత లోపించడం వల్లే స్లాబ్ కూలిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే స్లాబ్ కూలిన సమయంలో అక్కడ ఎవరైనా ఉన్నారా? ప్రమాద తీవ్రత ఎంత? అనే విషయాలు తెలియాల్సి ఉంది. మరోవైపు కనీసం సెట్ బ్యాక్ కూడా వదలకుండా నిర్మాణం చేపడుతున్నా.. పర్యవేక్షించాల్సిన ఇండస్ట్రియల్ ఎస్టేట్ అధికారులు, జీవీఎంసీ టౌన్ప్లానింగ్ అధికారులు చోద్యం చూస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా, స్లాబ్ కూలిన మాట వాస్తవమేనని, అయితే ఈ ఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని కంచరపాలెం పోలీసులు తెలిపారు. -
● రూల్స్ పెట్టినోళ్లే.. ఇరుక్కుపోయారు!
నిబంధనలు అమలు చేయాల్సిన పోలీసులే.. ఆ నిబంధనలను అతిక్రమించారు. భారీ వాహనాలు రాకుండా పోలీస్ శాఖ నౌరోజీ రోడ్డులో ఇనుప గడ్డర్ ఏర్పాటు చేసింది. విషయం తెలిసినా.. ఆదివారం నోవాటెల్ వైపు నుంచి నగరంలోకి వచ్చేందుకు ఓ పోలీస్ వ్యాన్ డ్రైవర్ నౌరోజీ రోడ్డును ఎంచుకున్నారు. అజాగ్రత్తగా వ్యవహరించిన ఆయన.. వాహనాన్ని ముందుకు పోనివ్వడంతో అది కాస్త ఆ ఇనుప గడ్డర్ కింద ఇరుక్కుపోయింది. దీంతో చేసేదేం లేక పోలీసులు టైర్లలో గాలి తీస్తూ, ఇనుప రాడ్ ఎత్తి పట్టుకుంటూ నానా తంటాలు పడ్డారు. మొత్తానికి అతికష్టం మీద వాహనాన్ని బయటకు తీశారు. మరోవైపు.. ఇదే మార్గంలో వచ్చిన పర్యాటకుల వాహనం కూడా లగేజీ కారణంగా ఇదే రాడ్ కింద చిక్కుకుపోయింది. వ్యాన్ను తప్పించేందుకు నానా అవస్థలు పడ్డారు. – డాబాగార్డెన్స్ -
ముగిసిన మార్షల్ ఆర్ట్స్ పోటీలు
పరవాడ: గొర్లెవానిపాలెం ఇండోర్ స్టేడియంలో రెండు రోజుల పాటు జరిగిన ఎస్జీఎఫ్ 69వ రాష్ట్ర స్థాయి థంగ్–టా(మార్షల్ ఆర్ట్స్) పోటీలు ఆదివారం ముగిశాయి. అండర్–14, 17, 19 విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో ప్రతిభ చూపిన వారిని జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. వీరు వచ్చే ఏడాది జనవరి 17 నుంచి 22 వరకు ఢిల్లీలో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొంటారని ఎస్జీఎఫ్ కార్యదర్శి కె.ఎం.నాయుడు తెలిపారు. ముగింపు సమావేశంలో ఎస్జీఎఫ్ అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె.ఎం.నాయుడు మాట్లాడారు. ప్రశాంత వాతావరణంలో, సజావుగా పోటీలు నిర్వహించడానికి సహకరించిన అనకాపల్లి డీఈవో గిడ్డి అప్పారావు నాయుడు, పరవాడ ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్లు, అనకాపల్లి ఉప విద్యాశాఖాధికారి పొన్నాడ అప్పారావు, ఎంఈవో దివాకర్రావు, రాష్ట్ర పరిశీలకుడు శ్రీహరిరాజు, ఏవీడీ ప్రసాద్, నిర్వహణ కమిటీ ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ పోటీలకు ఎంపికై ంది వీరే.. అండర్–14 బాలుర విభాగం: వివిధ బరువుల విభాగాల్లో షణ్ముఖ సాత్విక్ (విశాఖ), వి.సాత్విక్ (కృష్ణా), జె.హరీష్ (విశాఖ), ఎస్.కె.అయాన్ (విజయనగరం), వై.మోక్షిత్ (కృష్ణా), పి.ఎస్.ఎస్.రిత్విక్ (తూర్పు గోదావరి) బాలికల విభాగం: వివిధ బరువుల విభాగాల్లో ప్రణీత (విశాఖ), అమీర్ ఇరాన్ (కర్నూలు), సుధీక్ష (తూర్పు గోదావరి), తులసి (విశాఖ), త్రివేణి (విశాఖ), మేఘన (విశాఖ) అండర్–17 బాలుర విభాగం: పవన్కుమార్ (విశాఖ), సి.హెచ్.చరణ్తేజ (విశాఖ), కె.ఆకాష్ (విజయనగరం), జాన్పాల్ (గుంటూరు) బాలికల విభాగం: సాయి రజని (విశాఖ), ధాన్సీ (విజయనగరం), మణికర్ణిక (కృష్ణా), ప్రవల్లిక (విశాఖ), డి.హర్షిణి (విశాఖ), సుహానా (కర్నూలు) అండర్–19 బాలుర విభాగం: పి.వినయ్కుమార్ (విజయనగరం), అఖిల్ (గుంటూరు), చెన్నకేశవ (వైఎస్సార్ కడప), వెంకటేష్ (విజయనగరం), రోహిత్ (విజయనగరం), లక్ష్మీ ప్రణీత్ (కృష్ణా) బాలికల విభాగం: సుల్తానా (కర్నూలు), శ్రీహిత (విజయనగరం), శ్రీలత (గుంటూరు), మానస (విశాఖ), జ్యోతి (విశాఖ), సురేఖ (కర్నూలు) -
రసవత్తరంగా రోలర్ హాకీ
నేటి నుంచి స్కేట్బోర్డ్ పోటీలు విశాఖస్పోర్ట్స్: జాతీయ రోలర్ స్కేటింగ్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. పోటీల్లో భాగంగా ఆదివారం వీఎంఆర్డీఏ పార్కులోని రింక్–1, రింక్–2లలో టైనీటాట్స్, కాడెట్, సబ్ జూనియర్ విభాగాల రోలర్ హాకీ పోటీలను నిర్వహించారు. చిన్నారులు తమ స్కేటింగ్ విన్యాసాలతో వీక్షకులను ఆకట్టుకున్నారు. ఈ విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ బాలబాలికల జట్లు వివిధ రాష్ట్రాల జట్లతో పోటీపడ్డాయి. మరోవైపు డైనమిక్ స్కేట్బోర్డ్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఆదివారం ప్రత్యేక ప్రాక్టీస్ సెషన్ నిర్వహించారు. సోమవారం నుంచి వీఎంఆర్డీఏ పార్క్లోని స్కేట్బోర్డ్ వేదికగా ఈ పోటీలు ప్రారంభం కానున్నాయి. -
పూర్వ విద్యార్థుల సహకారం.. వర్సిటీకి వరం
ఏయూ వీసీ రాజశేఖర్ మద్దిలపాలెం: ఆంధ్రవిశ్వవిద్యాలయ అభివృద్ధికి పూర్వ విద్యా ర్థులు అందిస్తున్న సహకారం నిరుపమానమని ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ కొనియాడారు. ఆదివారం ఏయూ ప్రాంగణంలో పూర్వ విద్యార్థుల సమావేశాలు జరిగాయి. 1975 ఎమ్మెస్సీ ఫిజిక్స్ బ్యాచ్ స్వర్ణోత్సవ సమావేశాన్ని ఫిజిక్స్ విభాగంలో నిర్వహించారు. అలాగే ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలోని వై.వి.ఎస్ మూర్తి ఆడిటోరియంలో ఇంజినీరింగ్ కళాశాల పూర్వవిద్యార్థుల సంఘం 11వ వార్షిక సర్వసభ్య సమావేశం, ఆత్మీయ సమ్మేళనం జరిగాయి. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాలకు వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విశ్వవిద్యాలయ వికాసానికి, మౌలిక వసతుల కల్పనకు పూర్వవిద్యార్థులు విలువైన సహకారాన్ని అందిస్తున్నారని ప్రశంసించారు. ముఖ్యంగా ఇంజినీరింగ్ కళాశాల పూర్వవిద్యార్థులు స్వయంగా హాస్టల్ భవన సదుపాయాన్ని కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 1975 ఎమ్మెస్సీ ఫిజిక్స్ పూర్వవిద్యార్థుల సమావేశం విశ్రాంత ఎస్బీఐ చీఫ్ మేనేజర్ ఆర్.కామేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి రాఘవేంద్రమూర్తి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 50 ఏళ్ల కిందట చదువుకున్నవారంతా ఇలా ఒకే వేదికపై కలుసుకోవడం గొప్ప అనుభూతినిచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. వై.వి.ఎస్ మూర్తి ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో ప్రత్యేక అతిథిగా లాన్సమ్ ప్రాజెక్ట్స్ చైర్మన్, ఏయూ ఇంజినీరింగ్ కళాశాల పూర్వవిద్యార్థి కె.ఉమేష్, రెక్టార్ ఆచార్య పి.కింగ్, మహిళా ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.పద్మశ్రీ ప్రసంగించారు. విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు నగదు పురస్కారాలు, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. -
విశాఖ
క్షిపణి ప్రయోగ కేంద్రంగా సాక్షి, విశాఖపట్నం : భారత నౌకాదళంలో కీలక ప్రాంతంగా వ్యవహరించేలా విశాఖపట్నం అభివృద్ధి చెందుతోంది. అణ్వాయుధ పరీక్షల్లోనూ తనదైన ముద్ర వేస్తూ విశాఖ తీరంలో.. అత్యంత కీలకమైన ప్రయోగాలకు వేదికగా మారుతోంది. గతేడాది కే4 బాలిస్టిక్ మిసైల్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన తొలి నగరంగా రక్షణ శిఖరాలెక్కిన విశాఖ.. మరో మిసైల్ టెస్టింగ్కు సిద్ధమవుతోంది. ఈ నెల 11న విశాఖ సముద్ర జలాల్లో క్షిపణి ప్రయోగం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా.. 1,190 కిలోమీటర్ల మేర నో ఫ్లై జోన్గా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈస్ట్రన్ నేవల్ కమాండ్ వార్ బేస్ నుంచి హిందూ మహా సముద్రం కలిసే ప్రాంతం వరకూ డేంజర్ జోన్గా ప్రకటించింది. ఇప్పటికే అత్యాధునిక స్టాటిక్ ఫైరింగ్ ఫెసిలిటీ కేంద్రం ‘త్రినేత్ర’ విశాఖలో అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. వరుస ప్రయోగాలకు కేంద్రంగా విశాఖ మారనుందని అంచనా వేస్తున్నారు. విశాఖ సముద్రంలో ప్రయోగించనున్న క్షిపణి పరీక్ష కోసం ప్రమాద ప్రాంతాన్ని విస్తరిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. నోటీస్ టు ఎయిర్మెన్ (నోటమ్) ప్రకారం, ఈ మిసైల్ టెస్టింగ్ ఈ నెల 11న జరగనుందని స్పష్టమవుతోంది. ఇందుకోసం మొత్తం 1,190 కి.మీ. ప్రాంతం వరకూ డేంజర్ జోన్గా డిక్లేర్ చేశారు. రెండు వారాల క్రితం విశాఖ తీరంలో డిసెంబర్ 1 నుంచి 4 మధ్యలో మిసైల్ టెస్టింగ్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకోసం అప్పట్లో 3,485 కిమీ ప్రాంతాన్ని డేంజర్ జోన్గా డిక్లేర్ చేశారు. దాన్ని రద్దు చేస్తూ తాజాగా కొత్త నో ఫ్లైజోన్ని ప్రకటించారు. విమాన కార్యకలాపాలు, సముద్ర భద్రతని ప్రభావితం చేసేందుకు యుద్ధ నౌకలు, జలాంతర్గాము ల్ని అప్రమత్తం చేసేందుకు ఈ డేంజర్ జోన్ని ప్రకటించారు. దీని ఆధారంగా పైలట్లు, విమానయాన సంస్థలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు నోటమ్ ద్వారా అధికారిక నోటిఫికేషన్ని అందజేయనున్నారు. ఈ డేంజర్ జోన్ ప్రకటన ఉన్నంతవరకూ ఆ పరిధిలో పౌర, యుద్ధ విమానాలు ఎగరనీయకుండా దారిమళ్లించనున్నారు. భారత కాలమానం ప్రకారం 11వ తేదీ ఉదయం 4 గంటల నుంచి 5 గంటల మధ్య కాలంలో ఈ మిసైల్ టెస్టింగ్ ఉండే అవకాశం ఉందని భారత రక్షణ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. త్రినేత్ర రాకతో మరింత కీలకంగా.. వ్యూహాత్మక నేవల్ బేస్ ఐఎన్ఎస్ కళింగ.. అత్యాధునిక వ్యవస్థలకు కేంద్ర బిందువుగా మారింది. నావల్ వెపన్ సిస్టమ్స్ను పరీక్షించడానికి సుమారు రూ.5 కోట్లతో అత్యాధునిక నేవల్ ఆర్మమెంట్ ఇన్స్పెక్టొరేట్ కేంద్రం ‘త్రినేత్ర’ని ఈస్ట్రన్ నేవల్ కమాండ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. నౌకాదళ ఆయుధ సంపత్తి నాణ్యత పరిశీలన, లైఫ్టైమ్ చెకింగ్ మొదలైన అంశాల కోసం... ఇప్పటి వరకూ ఫారిన్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ (ఓఈఎం)లపైనే భారత నౌకాదళం ఆధారపడేది. ఇకపై భీమిలి కేంద్రంగా ఐఎన్ఎస్ కళింగలో ఏర్పాటు చేసిన త్రినేత్ర ద్వారా ఈ పరీక్షలు విజయవంతంగా నిర్వహించనున్నారు. క్షిపణులు, రాకెట్లు, ఆయుధాల సామర్థ్యమెలా ఉంది.? ఇంకా వాటి జీవిత కాలం ఎన్ని రోజులు ఉంటుంది.? మొదలైన పరిశీలనల్ని చేసే అత్యాధునిక సాంకేతికత త్రినేత్రలో ఏర్పాటు చేశారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇక్కడి పరికరాల్ని తయారు చేసినట్లు తూర్పు నౌకాదళవర్గాలు చెబుతున్నాయి. స్టాటిక్ ఫైరింగ్ ఫెసిలిటీ సెంటర్లో క్షిపణులు, రాకెట్లు, సంబంధిత వ్యవస్థల కీలక పనితీరు వివరాల్ని నమోదు చేయడంతో పాటు.. రికార్డ్ కూడా చేసేలా రూపొందించారు. దీని ద్వారా.. నావల్ ఆర్మమెంట్ సిస్టమ్స్ పనితీరుకు సంబంధించి సమగ్రంగా అంచనా వెయ్యొచ్చు. ఆయుధ పరీక్ష మౌలిక సదుపాయాల కల్పనలో త్రినేత్ర ఒక ప్రధాన మైలురాయిగా నిలవనుంది. విశాఖ తీరానికి కొత్తేంకాదు..! విశాఖ తీరానికి క్షిపణి ప్రయోగాలు కొత్తేంకాదు. ఇప్పటికే అత్యంత కీలకమైన మిసైల్ టెస్టింగ్ నిర్వహించి.. చరిత్ర సృష్టించింది. గతేడాది నవంబర్లో అణ్వాయుధ సామర్థ్యం గల బాలిస్టక్ మిసైల్ను భారత నౌకాదళం విశాఖ తీరంలో విజయవంతంగా నిర్వహించింది. విశాఖ షిప్బిల్డింగ్ సెంటర్లో నిర్మించిన న్యూక్లియర్ సబ్మైరెన్ ఐఎన్ఎస్ అరిఘాత్ నుంచి కే4 బాలిస్టిక్ మిసైల్ని పరీక్షించగా.. 3500 కిలోమీటర్ల రేంజ్ను అత్యంత వేగవంతంగా లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ అణునిరోధక శక్తిని పెంచే సామర్థ్యం గణనీయంగా పెరిగి.. అగ్రదేశాలకు విశాఖ నుంచి సవాల్ విసిరింది. ఈ ప్రయోగంతో ఆసియా దేశాల్లో చైనాతో పోటీగా భారత్ నిలిచింది. ఇప్పటి వరకూ సబ్మైరెన్ల నుంచి మిసైల్ దాడి చెయ్యగల సామర్థ్యం ఆసియా దేశాల్లో కేవలం చైనాకు మాత్రమే ఉండేది. కే–4 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం తర్వాత సబ్మైరెన్ నుంచి అణుదాడి చేయగల సామర్థ్యం కలిగి ఉన్న ఆసియా దేశాల్లో రెండో దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. భవిష్యత్తులో మరో అణు జలాంతర్గామి భారత్ అమ్ముల పొదిలోకి రానుంది. ఇది వస్తే.. 5000 కిమీ రేంజ్ ఉన్న కే5 మిసైల్స్ని కూడా ప్రయోగించే సామర్థ్యం భారత్ సొంతం కానుంది. ఇప్పుడు ఏ క్షిపణి ప్రయోగం చేస్తారన్న అంశాన్ని రక్షణ వర్గాలు గోప్యంగా ఉంచాయి. -
రోడ్లపై చెత్త వేస్తే భారీ జరిమానా
డాబాగార్డెన్స్: నగరంలో రాత్రివేళ పారిశుధ్య పనులను మెరుగుపరచడమే లక్ష్యంగా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ శనివారం అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జోన్–3, 4 పరిధిలోని ఆర్టీసీ కాంప్లెక్స్, సిరిపురం, సత్యం జంక్షన్, సీతమ్మధార, డైమండ్ పార్క్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు చిత్తశుద్ధితో పనిచేయాలని, నగర సుందరీకరణలో రాత్రివేళ పనులు కీలకమని కమిషనర్ సూచించారు. దుకాణాల ముందు చెత్త వేస్తూ నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులను గుర్తించి.. రాత్రి వేళల్లో ‘షీ’ టీమ్స్ ద్వారా భారీ జరిమానాలు విధించాలని ఆదేశించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వెనుక (ప్యాకేజ్–15) ఫుట్పాత్లపై అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసిన వారిపై టౌన్ ప్లానింగ్ విభాగం సహకారంతో రూ.10 వేల జరిమానా విధించాలని లేదా తొలగించాలని ఆదేశించారు. రాత్రి విధుల్లో ఉన్న 375 మంది కార్మికుల్లో 12 శాతం మంది గైర్హాజరైనట్లు గుర్తించారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఎస్ఎస్–2 అధికారి క్షేత్రస్థాయిలో లేకపోవడం, సిబ్బంది హాజరు వివరాలు లేకపోవడంతో కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, ప్రతి ప్రాంతం శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య అధికారులకు కమిషనర్ స్పష్టం చేశారు. -
ఒకమారు కలిసిన అందం..
ఉత్సాహంగా కార్తీక్ మ్యూజిక్ షో ఏయూక్యాంపస్: విశాఖ యువతకు ఒక మధురానుభూతిని పంచుతూ గాయకుడు కార్తీక్ లైవ్ షో ఆదివారం సాయంత్రం ఎంజీఎం గ్రౌండ్లో ఉత్సాహంగా జరిగింది. ‘చిలిపిగ చూస్తా వలా..’ వంటి గీతాలను ఆలపిస్తూ కార్తీక్ ప్రేక్షకులను అలరించారు. ‘మహాగణపతిః మనసా స్మరామి’ అనే శాసీ్త్రయ గీతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం, అనంతరం ‘ఒకమారు కలిసిన అందం’ వంటి పాటలతో యువతలో జోష్ నింపింది. సుమారు రెండు గంటలకు పైగా సాగిన మ్యూజిక్ షోలో నగర యువత పెద్ద సంఖ్యలో హాజరై కార్తీక్తో గొంతు కలిపారు. తన పాటలతో కార్తీక్ సండే సాయంత్రాన్ని సంగీత సాగరంగా మార్చగా, యువత ఉత్సాహంగా స్టెప్పులేశారు. ‘ఏముందిరా వైజాగ్’ అంటూ కార్తీక్ అన్న మాటలకు యువత కేరింతలు కొట్టింది. కార్యక్రమానికి భారీగా జనం తరలిరావడంతో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పార్కింగ్ ఏర్పాట్లు, క్యూలైన్ల నిర్వహణ వంటి అంశాల్లో పోలీసులకు కొంత ఇబ్బంది తప్పలేదు. పాడుతున్న కార్తీక్ -
రాజకీయాలకు కులాన్ని ఆపాదించవద్దు
ఆరిలోవ: కులం రాజకీయాలకు అతీతంగా ఉండాలని, అది తల్లి లాంటిదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం ముడసర్లోవ పార్కులో కాపు యువసేన ఆధ్వర్యంలో వనసమారాధన ఘనంగా జరిగింది. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, నాయకులతో పాటు వేలాది మంది కాపు సామాజిక వర్గీయులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు అతిథులను అలరించాయి. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆత్మీయ కలయిక పేరుతో వేలమందిని ఒకే వేదికపైకి తెచ్చిన కాపు యువసేన అధ్యక్షుడు సేనాపతి వెంకటేష్ను అభినందించారు. ‘రాజకీయాలకు కులాన్ని ఆపాదించకూడదు. కులం తల్లి లాంటిది. ఎవరైనా తన కులం పేరును ధైర్యంగా చెప్పుకోవాలి. రాజకీయాల్లోకి వచ్చాక అన్ని వర్గాల సహకారం వల్లే నేను ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచాను. కానీ నా కులం వల్లే మంత్రిని అయ్యాను.’ అని బొత్స వ్యాఖ్యానించారు. కులస్తులు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుని, సహకారం అందించేలా కుల సంఘాలు ఉండాలని ఆయన సూచించారు. ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, పాలవలస యశస్విని, శివశంకర్ తదితరులు ప్రసంగించారు. కాపులంతా ఐకమత్యంతో ఉండాలని, రాజకీయంగా ఎదగడానికి అందరూ సహకరించుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, కొండా రాజీవ్ గాంధీ, ఆకుల అప్పలసూరి, పంచకర్ల సందీప్, గంట్ల శ్రీనుబాబు, పెద్దింటి ఉషశ్రీ, మజ్జి దేవిశ్రీ, ఏడువాక సన్యాసిరావు, అన్నం తిరుపతిరావు, బండి నరేష్, పోతు ప్రసాద్, డాక్టర్ నాగరాజు, పలక శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
న్యాయశాఖ సిబ్బందికీ వేతన వెతలు
విశాఖ లీగల్: రాష్ట్రంలోని ప్రత్యేక న్యాయస్థానాల న్యాయమూర్తులు, సిబ్బందికి ఆదివారం రాత్రి వరకు కూడా జీతాలు విడుదల కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం జీతాలను విడుదల చేయకపోవడంతో న్యాయశాఖ ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా.. ఎస్సీ, ఎస్టీ కోర్టులు, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు, ఇతర ప్రత్యేక కోర్టుల సిబ్బందికి ఈనెల జీతాలు అందలేదు.దీంతో అధికారులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే జీతాలు విడుదల చేయాలని సిబ్బంది కోరుతున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2,000 నుంచి 3,000 మంది సిబ్బందికి ప్రతీనెలా జీతాలు సక్రమంగా అందడంలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. డిసెంబరు 7వ తేదీ నాటికి కూడా జీతాలు అందలేదని విశాఖలోని న్యాయ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తంచేశారు. -
‘పౌర విమానయాన శాఖను లోకేష్ రివ్యూ చేయడం ఏంటీ?’
సాక్షి, విశాఖపట్నం: దేశంలో ఎన్నడు లేని విధంగా విమానయాన రంగంలో సంక్షోభం ఏర్పడిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సమస్యను పరిష్కరించలేక మంత్రి రామ్మోహన్ నాయుడు చేతులు ఎత్తేశారంటూ మండిపడ్డారు.‘‘మన తెలుగు వాడికి విమానయాన శాఖ మంత్రి పదవి వచ్చిందని సంతోషించాము. దేశంలో మన తెలుగువారి పరువు, ప్రపంచంలో మన దేశం పరువును మంత్రి తీశారు. ప్రజలు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మంత్రి క్షమాపణ చెప్పాలి. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి. ఇది మా డిమాండ్ కాదు.. దేశ ప్రజలు కూడా అదే కోరుతున్నారు. విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు సమర్థుడు కాదని దేశ ప్రజలు అంటున్నారు...ఇండిగో సమస్యను లోకేష్ వార్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్నారని టీడీపీ నేతలు చెప్తున్నారు. ఇండిగో సమస్యను పరిష్కరించడానికి లోకేష్ ఎవరు.. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న మంత్రుల్లో లోకేష్ ఒకరు. ఇలాంటి మాటలు మాట్లాడడానికి టీడీపీ నేతలకు సిగ్గు లేదా.. తండ్రి ఆఖరి చూపులకు వెళ్లలేని పరిస్థితి బిడ్డలకు ఏర్పడింది. నూతన వధూవరులను బంధువులు కలవలేని పరిస్థితి నెలకొంది. ఇండిగో సమస్యను అడ్డం పెట్టుకొని మిగతా సంస్థలు విపరీతంగా రేట్లు పెంచాయి...విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే 30,000 పెట్టీ టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. భోగాపురం ఎయిర్పోర్టుకు వచ్చి నెత్తి మీద హెల్మెంట్ పెట్టుకొని రీల్స్ తీయడం తప్పితే రామ్మోహన్ నాయుడు మంత్రిగా ఏం చేశారు.. భోగాపురం ఎయిర్ పోర్టు పనులు వేగంగా జరగడానికి కారణం వైఎస్ జగన్. ఎల్లో మీడియాలో లోకేష్ను జాకీలు ఎత్తినట్లు నేషనల్ మీడియాలో ఎత్తలని టీడీపీ నేతలు చూశారు. టీవీ-5 సాంబశివరావు దగ్గర జాకీలు ఎత్తినట్లు ఎత్తితే నేషనల్ మీడియా ఊరుకుంటుందా?. మంత్రి రామ్మోహన్ రీల్స్ మానివేసి సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాలి.. టీడీపీ పబ్లిసిటీ పిచ్చి వలన దేశంలో తెలుగు వారి పరువు పోయింది’’ అని గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. -
గూగుల్తో ఎంవోయూ ఓ రహస్యం!
సాక్షి, విశాఖపట్నం: గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై చంద్రబాబు ప్రభుత్వం ముందునుంచీ నిజాలు దాచిపెట్టి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. గూగుల్తో ప్రభుత్వం చేసుకున్న ఎంవోయూకి సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకుంటే.. ‘ఈ వివరాలు ఇవ్వకూడదు. కాన్ఫిడెన్షియల్’ అంటూ సమాధానమివ్వడం చర్చనీయాంశంగా మారింది. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు బాబు ప్రభుత్వం చెబుతున్న గూగుల్ డేటా సెంటర్ ఎంవోయూ వివరాలు ఇవ్వాలంటూ అనకాపల్లి జిల్లాకు చెందిన బుద్దా చక్రధర్ గత నెల 4న ఏపీఐఐసీకి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై రాష్ట్ర సచివాలయం అసిస్టెంట్ సెక్రటరీ పేరుతో ప్రభుత్వం పోస్టు ద్వారా పంపిన జవాబు శనివారం చక్రధర్కు చేరింది. ‘ఈ ఎంవోయూ వివరాలు చాలా రహస్యంగా ఉంచాలి’ అని స్పష్టంచేసింది. దీనిపై మానవ హక్కుల వేదిక, యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్ ప్రతినిధులు మండిపడుతున్నారు. డేటా సెంటర్ ఒప్పందాన్ని గేమ్చేంజర్గా చెబుతున్న ప్రభుత్వం.. అసలు ఎంవోయూ విషయాలను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ఎందుకు నిరాకరిస్తోందని ప్రశ్నిస్తున్నారు. స.హ.చట్టం ప్రాథమిక సూత్రాల ఉల్లంఘన!ఎంవోయూ వివరాలు ఇవ్వకుండా సమాచార హక్కు చట్టం–2005 ప్రాథమిక సూత్రాలను చంద్రబాబు ప్రభుత్వం ఉల్లంఘించినట్లేనని మానవహక్కుల వేదిక ఏపీ, తెలంగాణ కో–ఆరి్డనేషన్ కమిటీ సభ్యుడు వీఎస్ కృష్ణ, యూఎఫ్ఆర్టీఐ కో–కన్వీనర్ చక్రధర్ వ్యాఖ్యానించారు. -
సమర్థంగా ఓటర్ల జాబితా మ్యాపింగ్
మహారాణిపేట: ఓటర్ల జాబితా సమగ్రతను కాపాడేందుకు.. కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధానాల ప్రకారం జిల్లాలో ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ జిల్లా అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లాలో పర్యటించిన ఆయన, కలెక్టరేట్లో కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, ఈఆర్వోలు, ఏఆర్వోలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ముందస్తు ఎస్ఐఆర్ నేపథ్యంలో అధికారులు ఒత్తిడికి గురికాకుండా, బాధ్యతయుతంగా, ప్రణాళికాబద్ధంగా విధులు నిర్వర్తించాలి. ఓటర్ల పేర్లు, వారి తల్లి/తండ్రి పేర్లను ధ్రువీకరించడానికి 2002 నాటి ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకోవాలి. 2002 జాబితాను ప్రస్తుత 2025 జాబితాతో సరిపోల్చి వివరాలను నమోదు చేయాలి. ఆయా పోలింగ్ స్టేషన్లు, నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలను మ్యాపింగ్ చేయాలి. ఈ ప్రక్రియలో స్వీయ పత్రాల స్వీకరణ పారదర్శకంగా జరిగేలా చూడాలి. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించాలి.’అని ఆదేశించారు. 24.54శాతం మ్యాపింగ్ పూర్తి జిల్లాలో మొత్తం 20,20,726 మంది ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ హరేందిర ప్రసాద్ వెల్లడించారు. ఇప్పటివరకు 2,81,415 మంది వివరాలను మ్యాపింగ్ చేశామని, ఇది మొత్తం ప్రక్రియలో 24.54 శాతమని వివరించారు. వారసులు, ఇతర కుటుంబ సభ్యుల వివరాలను కూడా జాగ్రత్తగా అనుసంధానం చేస్తున్నామన్నారు. అయితే జిల్లాలో అధిక భాగం పట్టణ ప్రాంతాలు కావడం, వలస కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల క్షేత్రస్థాయిలో వివరాల సేకరణ కొంత క్లిష్టంగా మారుతోందని ఈఆర్వోలు తెలిపారు. -
సమసమాజం కోసం అంబేడ్కర్ కృషి
సమసమాజ నిర్మాణం కోసం జీవితాంతం కృషి చేసిన డా.బి.ఆర్.అంబేడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత అందరిపై ఉందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె రాజు అన్నారు. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా శనివారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో, డాబాగార్డెన్స్లోని అంబేడ్కర్ విగ్రహాలకు జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు బోని శివరామకృష్ణ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేడ్కర్ సిద్ధాంతాలను పాటించడం ద్వారా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజమైన సామాజిక న్యాయాన్ని రాష్ట్రంలో అమలు చేశారన్నారు. తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్, డిప్యూటీ మేయర్ కె. సతీష్, మాజీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, ఎస్ఈసీ సభ్యులు జహీర్ అహ్మద్, సతీష్ వర్మ, సంయుక్త కార్యదర్శి తాడి జగన్నాథరెడ్డి, రాష్ట్ర, జోనల్ విభాగాల అధ్యక్షులు జాన్ వెస్లీ, పేర్ల విజయ్చందర్, ద్రోణంరాజు శ్రీ వత్సవ్, ముట్టి సునీల్ కుమార్, ఉరుకుటి రామచంద్రరావు, పేడాడ రమణి కుమారి, సనపల రవీంద్ర భరత్, సేనాపతి అప్పారావు, కర్రి రామ రెడ్డి, శ్రీదేవి వర్మ, వాసుపల్లి ఎల్లాజీ, వంకాయల మారుతీప్రసాద్, నీలి రవి, మాజీ చైర్మన్లు అల్లంపల్లి రాజబాబు, పల్లా చిన్నతల్లి, నాయకులు శశికళ, బిపిఎన్ కుమార్ జైన్, మువ్వల లక్ష్మి, కోమటి శ్రీనివాసరావు, పల్లా దుర్గారావు, రామన్న పాత్రుడు, మల్లేశ్వరి, చొక్కర శేఖర్ తదితరులు పాల్గొన్నారు. – మహారాణిపేట -
సైడ్ లైట్స్
●వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ– వీడీసీఏ స్టేడియం టీమిండియాకు మరోసారి కలిసొచ్చింది. విశాఖ వేదికగా భారత్కు ఇది 8వ విజయం కావడం విశేషం. ●ఎట్టకేలకు 20 వన్డేల తర్వాత భారత్ టాస్ నెగ్గింది. టీమ్ అనలిస్ట్ హరి సూచన మేరకు తాను ఎడమ చేత్తో కాయిన్ ఎగరేసి టాస్ గెలిచినట్లు కెప్టెన్ కె.ఎల్ రాహుల్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ●ఛేజింగ్లో యశస్వి జైస్వాల్ అదరగొట్టాడు. తన కెరీర్లో తొలి వన్డే సెంచరీని విశాఖలో నమోదు చేసి, జట్టు విజయానికి బాటలు వేశాడు. ●రోహిత్ మెరుపు ఆరంభం ఇవ్వగా, చివర్లో కోహ్లీ తనదైన శైలిలో అర్ధ సెంచరీ పూర్తి చేసి, విన్నింగ్ షాట్తో మ్యాచ్ను, సిరీస్ను భారత్ వశం చేశాడు. ●డికాక్ (106) సెంచరీతో దక్షిణాఫ్రికా 168/2తో పటిష్టంగా ఉన్నా.. భారత బౌలర్లు పుంజుకున్నారు. ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ స్పిన్ మాయాజాలంతో సఫారీలను 270 పరుగులకే కట్టడి చేశారు. ●టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పుట్టిన రోజు సందర్భంగా మైదానంలోనే జట్టు సభ్యులు సంబరాలు జరిపారు. ●రోహిత్, కోహ్లీపై అభిమానంతో ఫ్యాన్స్ ఫ్లకార్డులు ప్రదర్శించారు. ‘రో–కో’ నినాదాలతో స్టేడియం హోరెత్తింది. ●మ్యాచ్ జరుగుతుండగా ప్రేక్షకులంతా తమ సెల్ఫోన్ ఫ్లాష్ లైట్లు ఆన్ చేసి స్టేడియంలో సరికొత్త కాంతులు నింపారు. ●స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్, జీవీఎంసీ సహకారంతో ఏర్పాటు చేసిన ‘ఎకో ఫ్రెండ్లీ సెల్ఫీ పాయింట్’ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ తెలిపారు. ●ఉదయం 9 గంటల నుంచే అభిమానులు స్టేడియం వద్దకు పోటెత్తారు. టికెట్ ఉన్న వారిని మాత్రమే అనుమతించేలా పోలీసులు పటిష్టమైన బారికేడ్లు, బందోబస్తు ఏర్పాటు చేశారు. – విశాఖస్పోర్ట్స్/ పీఎంపాలెం -
సదరన్, సెంట్రల్ రైల్వే జట్లు చాంపియన్స్
విశాఖ స్పోర్ట్స్ : 72వ ఆలిండియా రైల్వే మెన్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్ను సదరన్ రైల్వే జట్టు కై వసం చేసుకోగా.. 11వ ఆలిండియా రైల్వే వుమెన్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్ను సెంట్రల్ రైల్వే జట్టు సాధించింది. ఈకో రైల్వే క్రీడా సంఘం ఆధ్వర్యంలో విశాఖ రైల్వే స్టేడియం వేదికగా నాలుగు రోజుల పాటు 16 కేటగిరీల్లో మెన్, వుమెన్కు నిర్వహించిన పోటీల్లో 17 రైల్వే జట్లు పోటీపడ్డాయి. ముగింపు కార్యక్రమానికి డీఆర్ఎం లలిత్ బొహ్రా హాజరై విజేతలకు ట్రోఫీలందించారు. మెన్ చాంపియన్షిప్లో 190 పాయింట్లతో సదరన్ రైల్వే వెయిట్లిఫ్టర్లు విజేతగా నిలవగా 188 పాయింట్లతో నార్తర్న్ రైల్వే రన్నరప్గా నిలిచింది. వుమెన్ చాంపియన్లో 184 పాయింట్లు సాధించిన సెంట్రల్ రైల్వే వెయిట్లిఫ్టర్లు విజేతగా నిలవగా 174 పాయింట్లతో నార్తర్న్ రైల్వే వెయిట్లిఫ్టర్లు రన్నరప్గా నిలిచారు. వ్యక్తిగత చాంపియన్షిప్లో మహిళా విభాగంలో కోమల్ కోఫర్(నార్త్ సెంట్రల్ రైల్వే), మెన్ విభాగంలో టి.మాథవన్(నార్త్రన్ రైల్వే) బెస్ట్ లిఫ్టర్లుగా ఎంపికయ్యారు. రైల్వే అధికారులు అజయ్శర్మ, బి.శాంతారామ్, కె.రామారావు, ఎం.హరనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
విశాఖ నుంచి హైదరాబాద్కు ప్రతి రోజూ 100 శాతం ఆక్యుపెన్సీతో విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. కానీ శనివారం ఒక్క విమాన సర్వీస్ కూడా హైదరాబాద్కు లేకపోవడం విమానయాన సంక్షోభానికి అద్దం పడుతోంది. శుక్రవారం 15 విమాన సర్వీసులు రద్దు కాగా శనివారం 9 సర్వీసులకు ఇండి
హైదరాబాద్కు విమానాల్లేవుసాక్షి, విశాఖపట్నం : అతిపెద్ద పౌర విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభం ప్రయాణికులకు ప్రాణసంకటంగా మారింది. సర్వీసులు ఈరోజే ప్రారంభమవుతాయని సర్ది చెబుతున్న ఇండిగో.. చివరి నిమిషంలో సర్వీసులు రద్దు చేసేస్తున్నామంటూ ప్రకటిస్తోంది. దీంతో అత్యవసర ప్రయాణాల కోసం విమానాలపై ఆధారపడిన వారి అవసరాన్ని ఆసరాగా తీసుకుంటూ.. ఇతర సంస్థలు భారీగా టికెట్ ధరల్ని పెంచేస్తూ దోచుకుంటున్నాయి. తప్పనిసరిగా వెళ్లాల్సిన ప్రయాణికులు ఊసురోమంటూ జేబులు ఖాళీ చేసుకుంటు మరీ వెళ్లాల్సి వస్తోంది. గత నాలుగు రోజులుగా ఇండిగో విమాన సర్వీసులు విశాఖ నుంచి రద్దవుతున్నాయి. తొలి రెండు రోజుల్లో 5 నుంచి 8 సర్వీసులు, శుక్రవారం 15, శనివారం 9 సర్వీసులు రద్దు చేసినట్లు ఇండిగో సంస్థ ప్రకటించింది. ఇక్కడి నుంచి రోజూ దాదాపు 5 వేల మంది ప్రయాణికులు ఇండిగో విమానాల్లో ప్రయాణిస్తుంటారు. ఇండిగోలో నెలకొన్న అంతర్గత సమస్యల వల్ల రెండు మూడు రోజులుగా భారీ సంఖ్యలో విమానాలు క్యాన్సిల్ చేస్తున్నారు. భారీగా పెరిగిన టికెట్ ధరలు వైజాగ్ ఎయిర్పోర్టు నుంచి హైదరాబాద్, ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చైన్నె, ఢిల్లీ, తిరుపతి దేశీయ సర్వీసులతో పాటు అబుదాబీ అంతర్జాతీయ సర్వీసులున్నాయి. ఆయా నగరాలకు వెళ్లే 15 సర్వీసులను ఇండిగో శుక్రవారం రద్దు చేసింది. అంతేకాకుండా మిగిలిన సర్వీసుల రాకపోకల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. ఈ ప్రభావం టికెట్ ధరలపై పడింది. ప్రయాణికుల అవసరాన్ని క్యాష్ చేసుకునేలా మిగిలిన విమానయాన సంస్థలు టికెట్ రేట్లను గణనీయంగా పెంచేశాయి. ఉదాహరణకు విశాఖ నుంచి ముంబైకి సాధారణ రోజుల్లో 6,612 నుంచి రూ. 7,132 వరకూ ఉంటుంది. ఆదివారం (7వ తేదీన) విశాఖ నుంచి ముంబైకి వెళ్లే బదులు విశాఖ నుంచి సింగపూర్ రెండు సార్లు వెళ్లి రావొచ్చు అనేంతలా టికెట్ ధరలు పెంచేశారు. 7వ తేదీన సింగపూర్కు టికెట్ ధర రూ.17,309 ఉంటే.. ముంబైకి ఏకంగా రూ.56,798కి పెంచేశారు. విశాఖ నుంచి అహ్మదాబాద్కు రూ.7,500 నుంచి రూ.8,500 వరకూ టికెట్ ధర ఉంది. ఇప్పుడు ఏకంగా రూ.50,000 దాటింది. వైజాగ్ నుంచి హైదరాబాద్కు రూ.3,500 నుంచి రూ.4,500 వరకూ టికెట్ ధర ఉంటుంది. ఇప్పుడు ఏకంగా రూ.25,000గా మారిపోయింది. రూల్స్ పట్టించుకోని ఎయిర్లైన్స్ సంస్థలు: టికెట్ ధరలు మోతమోగిపోతుండటంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. విమానయాన సంక్షోభం సందర్భంగా ఇతర ఎయిర్లైన్స్ సంస్థలు ఇష్టం వచ్చినట్లుగా రేట్లు పెంచడంపై విమర్శలు వస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. దూరం బట్టి నిర్దేశించిన టికెట్ ధరల్నే వసూలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. 500 కి.మీ వరకు అన్ని పన్నులతో కలిపి రూ.7,500 గరిష్ట చార్జీ వసూలు చేయాలని, 500–1000 కి.మీ వరకూ రూ.12 వేలు, 1000–1500 కి.మీ వరకూ రూ.15 వేలు, 1500 కి.మీ పైన అయితే రూ.18,000 టికెట్ ధరలుగా నిర్ణయించింది. అయినా.. విమానయాన సంస్థలు తమకు నచ్చినట్లుగానే టికెట్ ధరలు పెంచేస్తున్నాయి. ఇండిగో సంస్థలో సంక్షోభం సమసిపోయేంత వరకూ విమాన ప్రయాణాలు మానుకోవడమే బెటర్ అన్నట్లుగా ప్రయాణికులు భావిస్తున్నారు. రద్దయిన విమానాలు శనివారం 9 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. విశాఖ–చైన్నె (845), విశాఖ–ముంబై(6,585), విశాఖ–హైదరాబాద్(6645), విశాఖ–హైదరాబాద్(783), విశాఖ–బెంగళూరు(2772), విశాఖ–కోల్కత్తా (617), విశాఖ–హైదరాబాద్ (883), విశాఖ–హైదరాబాద్(6286), విశాఖ–ఢిల్లీ(6680) విమానాలు రద్దయ్యాయి. -
మహిళ దారుణ హత్య
సింహాచలం: 98వ వార్డు పరిధి సూర్యకాంతం లేఅవుట్లో మహిళ హత్య గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెందుర్తి మండలం చినముషిడివాడ సమీపంలోని లక్ష్మీనగర్కి చెందిన వనుము శ్రీనివాసరావు (64) విజయనగరానికి చెందిన అల్ల దేవి (35) సహజీవనం చేస్తున్నారు. భార్యభర్తలమని చెప్పి నెలరోజుల క్రితం 98వ వార్డు పరిధి సూర్యకాంతం లేఅవుట్లోని ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఉంటున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇద్దరు పెద్ద ఎత్తున గొడవ పడ్డారు. మహిళా వాచ్మెన్ ఫ్లాట్కి వెళ్లి ఏమి జరిగిందని అడగ్గా నీకెందుకని కిటికీలో నుంచి శ్రీనివాసరావు సమాధానం ఇచ్చాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో శ్రీనివాసరావు ఫ్లాట్కి తాళం వేసి బయటికి వెళ్లిపోయాడు. మహిళా వాచ్మెన్కి అనుమానం వచ్చి ఫ్లాట్కి వెళ్లి తలుపుకొట్టింది. ఎంతకీ తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి మిగతా ఫ్లాట్ల వాళ్లకు తెలిపింది. వాళ్లు వెంటనే 112కి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫ్లాట్ తలుపులు తెరిచి చూసేసరికి దేవి తలకు తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలో ఉంది. వెంటనే కేజీహెచ్కి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్మాప్తు చేస్తున్నారు. కాగా శ్రీనివాసరావు ఫ్లాట్కి వచ్చినప్పుడు.. వెళ్లేటప్పుడు ముఖానికి హెల్మెట్ పెట్టుకుంటాడని స్థానికులు చెబుతున్నారు. శ్రీనివాసరావు.. దేవి తలపై గట్టిగా కొట్టి హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. -
జైస్వాల్ జోరు..
రో–కో హుషారు..విశాఖ అంటేనే టీమిండియాకు ‘అచ్చొచ్చిన కోట’ అని మరోసారి రుజువైంది. సముద్ర ఘోషను మించిన అభిమానుల హర్షధ్వానాలు.. స్టేడియం నలువైపులా మార్మోగిన ‘రో–కో’ నినాదాల నడుమ భారత జట్టు కదంతొక్కింది. సిరీస్ విజేతను తేల్చే మ్యాచ్లో సమష్టి కృషితో దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియం వేదికగా శనివారం జరిగిన మ్యాచ్లో.. ప్రతికూల పరిస్థితుల్లో బౌలర్లు మ్యాచ్ను మలుపు తిప్పగా, యశస్వి జైస్వాల్ తన తొలి శతకంతో వీరవిహారం చేశాడు. కిక్కిరిసిన స్టేడియంలో రోహిత్ మెరుపు ఇన్నింగ్స్, కోహ్లీ తనదైన క్లాసిక్ ఫినిషింగ్ ఇవ్వడంతో.. సిరీస్ భారత్ వశమైంది. కోహ్లీ, రోహిత్లపై అభిమానం చాటుతూ ఫ్యాన్స్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. బౌలర్ల సమయస్ఫూర్తి, బ్యాటర్ల దూకుడుతో విశాఖ వాసులకు పసందైన క్రికెట్ విందు లభించింది. – విశాఖ స్పోర్ట్స్ -
బ్రేక్
మొబైల్ టాయిలెట్ల బిల్లులకుడాబాగార్డెన్స్: యోగా దినోత్సవం పేరుతో జీవీఎంసీ ప్రజారోగ్య శాఖ అధికారులు ప్రతిపాదించిన అంశాలపై స్థాయీ సంఘం భగ్గుమంది. ఈ ఏడాది జూన్ 21న యోగా డే సందర్భంగా ఏర్పాటు చేసిన మొబైల్ టాయిలెట్లకు సంబంధించిన చెల్లింపుల వ్యవహారంపై ఈ నెల 4న ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ‘మొబైల్ టాయిలెట్ మస్కా’ కథనం సమావేశంలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఈ కథనం ఆధారంగా సభ్యులు అధికారులను నిలదీయడంతో.. మేయర్ పీలా శ్రీనివాసరావు ఆయా బిల్లుల చెల్లింపులను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. శనివారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ అధ్యక్షతన జరిగిన స్థాయీ సంఘ సమావేశంలో పలు అంశాలపై వాడీవేడిగా చర్చ జరిగింది. రూ.1.62 కోట్ల బిల్లులపై అభ్యంతరం యోగా డే కోసం ఏర్పాటు చేసిన పోర్టబుల్ వీఐపీ టాయిలెట్లకు సంబంధించి, కార్యక్రమం ముగిసిన ఆరు నెలల తర్వాత ఇప్పుడు రూ. 1.62 కోట్ల చెల్లింపుల కోసం అధికారులు ప్రతిపాదనలు తెచ్చారు. దీనిపై సభ్యులు సాడి పద్మారెడ్డి, రాపర్తి త్రివేణి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో నేవీ డే సందర్భంగా ఒక్కో టాయిలెట్(మొత్తం 60)కు కేర్ టేకర్తో కలిపి కేవలం రూ. 4 వేలు చెల్లిస్తే, ఇప్పుడు ఏకంగా రూ. 16,200 ఎలా చెల్లిస్తారని వారు ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో భారీ అవినీతి జరిగిందని సభ్యులు పట్టుబట్టడంతో, అజెండాలోని 199 నుంచి 225 వరకు ఉన్న అంశాలను విచారణ కోసం మేయర్ వాయిదా వేశారు. ‘రాషా’అంటేనే అవినీతి రాషా ఇన్ఫ్రాస్ట్రక్చర్(హైదరాబాద్) సంస్థ అంటేనే అవినీతికి మారుపేరని సభ్యురాలు సాడి పద్మారెడ్డి ఆరోపించారు. భీమిలిలో ఆపరేషన్ మెయింట్నెన్స్ పద్ధతిలో 15వ ఆర్థిక సంఘం నిధులతో 30 ఎంటీడీ సామర్థ్యం గల పోర్టబుల్ మెకనైజ్డ్ గార్బేజ్ ట్రాన్సఫర్ స్టేషన్ను ఆ సంస్థ నిర్మించింది. గతేడాది అక్టోబర్ 15 నుంచి 31 అక్టోబర్ వరకు ట్రయల్ పీరియడ్ నిర్వహించింది. ఈ ఏడాది నవంబర్ 1 నుంచి వచ్చే ఏడాది అక్టోబర్ 31 వరకు మెయింట్నెన్స్ కోసం వచ్చిన అంశంపై సభ్యురాలు సాడి పద్మారెడ్డి స్పందించారు. దీనిపై కమిటీ వేసి, క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుందామని ఆమె కోరగా.. వచ్చే బుధవారం అధికారులతో కలిసి ప్లాంట్ను సందర్శించాలని మేయర్ పీలా శ్రీనివాసరావు నిర్ణయించారు. రాయి తొలగింపునకు రూ.12 లక్షలా? ఏయూ గ్రౌండ్లో హెలిప్యాడ్ వద్ద రాయిని తొలగించడానికి రూ.12 లక్షలు ఖర్చయ్యిందని అధికారులు చూపిన లెక్కలపై సభ్యులు విస్మయం వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి స్థాయి పరిశీలన జరపాలని నిర్ణయిస్తూ ఈ అంశాన్ని వాయిదా వేశారు. అలాగే, బీచ్ రోడ్డులో ఫుట్పాత్ పెయింటింగ్లకు అయిన ఖర్చుపై కూడా మేయర్ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. సిల్వర్ స్పూన్ కాంట్రాక్ట్ రద్దు బీచ్ రోడ్డులోని సిల్వర్ స్పూన్ రెస్టారెంట్..అనుమతికి మించి 367 చదరపు గజాల స్థలాన్ని అదనంగా ఆక్రమించిందని తేలడంతో, ఆ కాంట్రాక్ట్ను రద్దు చేస్తున్నట్లు మేయర్ ప్రకటించారు. ఇకపై ఆ ప్రాంతాన్ని జీవీఎంసీయే నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అధికారుల తీరుపై మేయర్ ఫైర్ స్థాయీ సంఘం దృష్టికి తీసుకురాకుండానే అధికారులు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని, కమిటీకి విలువ ఇవ్వడం లేదని మేయర్ పీలా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కుదరదు.. కమిషనర్ వచ్చి సమాధానం చెప్పాల్సి ఉంటుంది?’ అని ఆయన అధికారులను హెచ్చరించారు. ఈ సమావేశంలో మొత్తం 257 సాధారణ అజెండా అంశాలు, 30 టేబుల్ అజెండా అంశాలు చర్చకు రాగా.. 34 వివాదాస్పద అంశాలను పక్కనబెట్టారు. ఒక అంశాన్ని రద్దు చేశారు. మిగిలిన అంశాలకు సంఘ సభ్యులు ఆమోదం తెలిపారు. -
ఉత్సాహంగా స్కేటింగ్ పోటీలు
విశాఖ స్పోర్ట్స్ : జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్లో భాగంగా తొలి మూడు రోజుల పాటు జరగాల్సిన పోటీల్లో తొలి రోజు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నా రు. అండర్–12 కేటగిరీలో శనివారం వీఎంఆర్డీఏ పార్క్ రింక్లో మూడు అంశాల్లో స్పీడ్ రేస్లతో పాటు రోలర్ హాకీ పోటీలు జరిగాయి. శివాజీ పార్క్లోని రింక్లో ఆరిస్టిక్ పోటీల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 10–12 ఏళ్ల బాల బాలికలకు ఫిగర్ స్కేటింగ్ పోటీలు, సోలో డ్యాన్స్ పోటీలు జరిగాయి. 6–8 ఏళ్లు, 8–10 ఏళ్ల చిన్నారులకు సోలో డ్యాన్స్ కంపల్సరీ పో టీలు నిర్వహించారు. 10–12 ఏళ్ల చిన్నారులకు క్వాడ్ ఫ్రీ పోటీల్లో చక్కటి ప్రతిభ కనబరిచారు. రాష్ట్ర రోలర్ స్కేటింగ్ సంఘం ఆధ్వర్యంలో తొలి రోజు ప్రాథమిక పోటీలు జరగ్గా బాలబాలికలు పోటీపడ్డారు. -
‘ఇండిగో’ సర్వీసులతో ఇక్కట్లు
రేణిగుంట/గన్నవరం/గోపాలపట్నం/కోరుకొండ: విమాన సర్వీసుల్లో అత్యధిక విమానాలు కలిగిన ఇండిగో సంస్థపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రçßæం వ్యక్తంచేస్తున్నారు. తిరుపతి(రేణిగుంట) అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా ప్రతిరోజు 12 ఇండిగో విమానాలు వివిధ ప్రాంతాలకు వెళ్తున్నాయి. ముందస్తు ప్రణాళికతో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో విమానాలు రద్దయ్యాయని ఇండిగో సిబ్బంది తాపీగా చెబుతుండడంతో ప్రయాణికులు వారితో తీవ్ర వాగ్వాదానికి దిగుతున్నారు. ఇక శనివారం రాత్రి 7.50కు హైదరాబాద్కు వెళ్లాల్సిన ఇండిగో సర్వీస్ రద్దయింది. ఇదే అదునుగా ఇతర విమాన సర్వీసులు తమ టికెట్ ధరలను అమాంతం పెంచడంతో ప్రయాణికులు అవస్థలు అన్నీఇన్నీ కావు.శ్రీవారి భక్తుల అగచాట్లు..తిరుపతికి దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, ప్రముఖులు, వ్యాపార వేత్తలు, బడా పారిశ్రామికవేత్తలు శ్రీవారి దర్శనానికి నిత్యం వస్తుంటారు. రావడానికి, తిరిగి వెళ్లడానికి వీరు ముందుగానే విమాన టికెట్లు బుక్ చేసుకుంటారు. అయితే, శ్రీవారి దర్శనానంతరం ఎయిర్పోర్టుకు చేరుకున్న వీరికి విమానం రద్దయిందని చెప్పడంతో ప్రత్యామ్నాయంలేక వారంతా నానా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే, అత్యవసరంగా వేరే నగరాలకు వెళ్లాల్సిన వారి అవస్థలూ చెప్పనలవి కావు. కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా విమానాశ్రయానికి చేరుకున్నాక సర్వీసు రద్దని చెప్పడంపై వారు మండిపడుతున్నారు. పైగా.. వేరే విమాన సర్వీసుల ధరలను ఇదే అదనుగా పెంచేస్తుండడంతో ప్రయాణికుల పరిస్థితి అగ్గిమీద గుగ్గిలంలా తయారైంది.వీసాలు రద్దవుతాయని గగ్గోలు..మూడు రోజులుగా ఇండిగో విమానాలను రద్దవుతుండడంతో ప్రయాణికులు విశాఖ విమానాశ్రయానికి వచ్చి నిరాశతో వెనుదిరుగుతున్నారు. పలు దేశాల్లో ఉద్యోగరీత్యా స్థిరపడిన వారు స్వదేశానికి వచ్చి తిరిగి వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు. విమానాలు రద్దుకావడంతో ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల్లో తమ వీసా గడువు ముగుస్తుందని.. భవిష్యత్తు ఏమవుతుందో అంటూ వారు కంగారుపడుతున్నారు. ఈ పరిస్థితి ఎప్పటికి పరిష్కారమవుతుందో తెలియడంలేదని వాపోతున్నారు. ఇదిలా ఉంటే.. శనివారం విశాఖలో తొమ్మిది ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ఇక తూర్పుగోదావరి జిల్లా మధురపూడిలోని రాజమహేంద్రవరం ఎయిర్పోర్టులో కూడా ఇదే పరిస్థితి. ముంబై నుంచి రావాల్సిన విమానం శనివారం రద్దయింది. ఢిల్లీ నుంచి శుక్రవారం రావల్సిన సర్వీసు శనివారం చేరింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై విమాన సర్వీసులన్నీ ఆలస్యంగానే నడుస్తున్నాయి.ఇండిగో సర్వీసులు ఆలస్యం..పైలెట్ల కొరత, సాంకేతిక సమస్యల కారణంగా ఇండిగో విమాన సర్వీసులు శనివారం కూడా గన్నవరం విమానాశ్రయానికి అలస్యంగా నడిచాయి. ఢిల్లీ–విజయవాడ మధ్య నడిచే సర్వీసును వరుసగా రెండోరోజూ రద్దుచేశారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కడప, విశాఖపట్నం సర్వీసులు గంట నుంచి రెండు గంటల వరకు అలస్యంగా నడిచాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు.. విమాన టికెట్ ధరలు భారీగా పెరగడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గన్నవరం నుంచి హైదరాబాద్, బెంగళూరుకు సుమారు రూ.18 వేలు, న్యూఢిల్లీకి రూ.35 వేలు నుంచి రూ.42 వేలు వరకు టికెట్ ధర పెరిగిందని చెబుతున్నారు.కనీస సమాచారం ఇవ్వలేదు..ముంబై వెళ్లేందుకు 15 రోజులు ముందుగా ఇండిగో సర్వీసులో టికెట్ బుక్చేసుకున్నా. ఇవాళ ముంబై వెళ్లేందుకు రేణుగుంట ఎయిర్పోర్టుకు చేరుకున్నాక విమానం రద్దయిందని ఇండిగో సిబ్బంది చెప్పారు. ముందస్తు సమాచారం ఇచ్చి ఉంటే వేరే ఏర్పాట్లు చేసుకునే వాళ్లం. ఇప్పుడు మీ డబ్బులు తిరిగిస్తామంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. – వెంకటేష్, తిరుపతి -
విద్యారంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసింది
పార్వతీపురం మన్యం: పార్వతీపురం మన్యం జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకురాలు, మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి చంద్రబాబు పై మండిపడ్డారు.పుష్పశ్రీవాణి మాట్లాడుతూ.. చంద్రబాబు మొదటి సారి మన్యం జిల్లాకు వచ్చారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్ట్ లకు నిధులు విడుదల అవుతాయని ప్రజలు ఆశించారు. జిల్లా అభివృద్ధికి కొత్త ప్రాజెక్టులు ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ అలాంటివి ఏమీ మాట్లాడలేదు.పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ వలన జిల్లా ప్రజలకు ఏం ఉపయోగం లేదు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఒక్క స్కూల్ తరగతి గది కూడా కట్టలేదు. ఒక్క టేబుల్ కుర్చీ కూడా ఇవ్వలేదు. అందుకే క్లాస్ రూమ్ సెట్ వేసుకొని కార్యక్రమం చేసుకోవాల్సి వచ్చింది.ఈ ప్రభుత్వంలో విద్యా రంగానికి ఏం చేస్తున్నారో చెప్పలేక పోయారు. వైఎస్ జగన్ కట్టించిన స్కూల్లో కార్యక్రమం చేస్తే స్కూల్స్ అభివృద్ధి కనిపిస్తుందని సినిమా సెట్ వేసుకొని వారి దుర్బుద్ధిని బయట పెట్టుకున్నారు.వైఎస్ జగన్ పాలనలోని పథకాల పేర్లు మార్చడం తప్ప ఈ ప్రభుత్వం ఒక్క పథకం అయినా తెచ్చిందా. విద్యారంగాన్ని ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని పుష్పశ్రీవాణి పేర్కొంది . -
యాదవులకు చంద్రబాబు సర్కార్ వెన్నుపోటు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో యాదవ భవనం కోసం కేటాయించిన భూమిని కూటమి ప్రభుత్వం రద్దు చేయడంపై యాదవ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యాదవుల విజ్ఞప్తి మేరకు ఎండాడ హైవే సమీపంలో 50 కోట్లు విలువైన 50 సెంట్ల భూమిని యాదవ భవన నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించింది. ఆ స్థలంలో వారు భూమిపూజ కూడా నిర్వహించారు.అయితే తాజాగా చంద్రబాబు ప్రభుత్వం ఆ కీలక ప్రాంతంలో ఉన్న భూకేటాయింపును రద్దు చేసి హైవేకు దూరంగా ఓ మారుమూల ప్రాంతంలో తక్కువ రేటు పలికే భూమిని ప్రత్యామ్నాయంగా కేటాయించడం యాదవ వర్గాల ఆవేదనకు కారణమైంది. రాజకీయ దురుద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని వైఎస్సార్సీపీ యాదవ సంఘాల నేతలు మండిపడుతున్నారు.వైఎస్ జగన్ హయాంలో యాదవులకు రాజకీయంగా ప్రత్యేక ప్రాధాన్యత కల్పించారు. విశాఖ నగరంలోని పలు కీలక పదవులు కూడా యాదవ సంఘాల నాయకులకు అప్పగించారని వారు గుర్తు చేశారు. యాదవుల కోసం జగన్ ఇచ్చిన విలువైన భూమిని రద్దు చేసి నగరానికి దూరంగా ఉన్న తక్కువ రేటు స్థలాన్ని కేటాయించడం అన్యాయం అని వారు విమర్శిస్తున్నారు.భవనం నిర్మాణం ఆలస్యానికి గురి కాకుండా పూర్వం కేటాయించిన విలువైన భూమినే తమకు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే వైఎస్ జగన్ కేటాయించిన స్థలాన్ని రద్దు చేశారు. అందుకే మారుమూల ప్రాంతంలో యాదవ భవనంకు స్థలం కేటాయించారని విశాఖ తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త మాజీ మేయర్ హరి వెంకట కుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
లాడ్జిలో తల్లీకొడుకుల ఆత్మహత్య
సింహాచలం: అడవివరంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో తల్లీకొడుకులు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. గోపాలపట్నం సీఐ ఎల్.ఎస్.నాయుడు తెలిపిన వివరాలివి.. నగరంలోని గాజువాకకు చెందిన కుడుపూడి నీలావతి (60), ఆమె కుమారుడు కుడుపూడి గయప్పాంజన్ (40) శుక్రవారం అడవివరం వచ్చారు. వారు స్థానిక పోస్టాఫీసు వీధిలోని సిరిచందన కల్యాణమండపం అనుబంధ గదుల్లో(లాడ్జి) ఒకటి అద్దెకు తీసుకున్నారు. వారు గదిలోకి వెళ్లిన తర్వాత ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో, అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది గోపాలపట్నం పోలీసులకు సమాచారం అందించారు. రాత్రి 8.30 గంటల సమయంలో ఘటనా స్థలానికి చేరుకున్న లా అండ్ ఆర్డర్ సీఐ ఎల్.ఎస్.నాయుడు, సిబ్బంది గది తలుపులు తెరిచి చూడగా.. తల్లీకొడుకులు ఉరి వేసుకుని విగతజీవులుగా కనిపించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధార్ కార్డుల ఆధారంగా మృతులు పాతగాజువాక శ్రామికనగర్కు చెందినవారని, వారిని తల్లీకొడుకులుగా పోలీసులు నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. కాగా, వీరి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. గయప్పాంజన్ టీసీఎస్లో పనిచేస్తున్నాడు. ఆయన భార్య 2023లో నాంపల్లి స్టేషన్లో గయప్పాంజన్పై కేసు పెట్టింది. -
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీలో పలువురికి చోటు
ఎంవీపీకాలనీ : వైఎస్సార్సీపీ రాష్ట్ర స్థాయి కమిటీల్లో పలువురు జిల్లా నాయకులకు చోటు దక్కింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. స్టేట్ లీగల్ సెల్ ఉపాధ్యక్షురాలిగా కె.వెంకటనాగ శశికళ (విశాఖ నార్త్), స్టేట్ అంగన్వాడీ వింగ్ ఉపాధ్యక్షురాలిగా పిల్లా సుజాత (భీమిలి), స్టేట్ అంగన్వాడీ వింగ్ కార్యదర్శిగా నక్కా శ్యామల (విశాఖనార్త్), స్టేట్ మహిళ విభాగం ప్రధాన కార్యదర్శిగా నల్లా కృపాజ్యోతి (విశాఖ ఈస్ట్), కార్యదర్శులుగా పతివాడ వెంకటలక్ష్మి (విశాఖ ఈస్ట్), యల్లబిల్లి వరలక్ష్మి (విశాఖ నార్త్), స్టేట్ బీసీ సెల్ కార్యదర్శిగా కురుకూటి అప్పలనారాయణ (భీమిలి), స్టేట్ ఎస్సీ సెల్ కార్యదర్శిగా కొరువాడ చిన్నారావు (విశాఖ నార్త్), స్టేట్ సోషల్ మీడియా వింగ్ ప్రధాన కార్యదర్శిగా జి.పెంటారెడ్డి (గాజువాక), స్టేట్ సోషల్ మీడియా వింగ్ అదనపు కార్యదర్శిగా జె.లీలానాగవలి (విశాఖ వెస్ట్), స్టేట్ పబ్లిసిటీ వింగ్ కార్యదర్శులుగా సరగడం పత్నిరావు (విశాఖ వెస్ట్), బొర కుమార్రెడ్డి (విశాఖ ఈస్ట్) స్టేట్ పబ్లిసిటీ వింగ్ అదనపు కార్యదర్శులుగా అడపా శివ (విశాఖ సౌత్), బొడ్డేటి అనంత వెంకటవేణు (విశాఖ వెస్ట్), వేదల్ల శ్రీనివాసరావు (విశాఖ వెస్ట్లు) నియమితులయ్యారు. జిల్లా కమిటీల్లో... పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా గనగళ్ల రామరాజు (విశాఖ సౌత్), జిల్లా యూత్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా జి.అప్పలరాజు (గాజువాక), జిల్లా కార్యదర్శులుగా జి.రామిరెడ్డి (గాజువాక), బి.శివరామ్ ప్రసాద్ (విశాఖ నార్త్), జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా కొల్లి దేముడు (గాజువాక), జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా బోరా శశిభూషణ్ (గాజువాక), జిల్లా బీసీ సెల్ కార్యదర్శిగా నంభూరు రాజు (గాజువాక), జిల్లా ఆర్టీ వింగ్ ప్రధాన కార్యదర్శిగా తెంటు గోపాలరావు (గాజువాక), జిల్లా బూత్ కమిటీ వింగ్ ప్రధాన కార్యదర్శిగా ధర్మాల వెంకటరెడ్డి (గాజువాక), కార్యదర్శిగా గుర్రం రాజేష్ (గాజువాక), జిల్లా ఐటీ వింగ్ ప్రధాన కార్యదర్శిగా రెయ్యి జగదీష్రెడ్డి (గాజువాక), కార్యదర్శిగా పండ్రంగి రాజేష్ (గాజువాక), జిల్లా వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శిగా ఎస్.సాయిరామ్ (గాజువాక), కార్యదర్శిగా ఇప్పిలి వెంకటేష్ (గాజువాక), జిల్లా మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శిగా మహ్మాద్ షఫీ (గాజువాక) నియమితులయ్యారు. నియోజకవర్గాల అనుబంధ విభాగాల నాయకులుగా పలువురు నియమితులయ్యారు. విశాఖ వెస్ట్ నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఎం.జాన్ శ్రీకాంత్కుమార్, నియోజవకర్గాల వైఎస్సార్టీఎఫ్ అధ్యక్షులుగా పొన్నాడ అప్పారావు (విశాఖనార్త్), సారిక దివ్యకుమార్ (విశాఖ సౌత్), వి.స్వర్ణలత (విశాఖ వెస్ట్), పి.ఎం.సత్యనారాయణరెడ్డి (గాజువాక) నియమితులయ్యారు. పార్టీ నార్త్ నియోజకవర్గ వార్డు అధ్యక్షులుగా మువ్వల పోలారావు (25వ వార్డు), కర్రి రామారెడ్డి (26వ వార్డు), డొప్పా శ్రీను (48వ వార్డు), మెట్టా ధమయంతి (51వ వార్డు) నియమితులయ్యారు. -
డీఎల్డీవోనే డీడీవోగా మార్చారు
మహారాణిపేట: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2023లో పాలనా వ్యవస్థలో తీసుకొచ్చిన డివిజన్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్(డీఎల్డీవో) విధానాన్నే చంద్రబాబు ప్రభుత్వం డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్(డీడీవో)గా మార్పు చేసిందని తప్ప ఇందులో కొత్తగా ఏమీ లేదని జెడ్పీ చైర్పర్సన్, వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జోనల్ మహిళా విభాగం అధ్యక్షురాలు జల్లిపల్లి సుభద్ర అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ డీఎల్డీవోనే డీడీవో వ్యవస్థగా మార్చారే తప్ప ఇందులో కొత్తదనం గాని, విధివిధానాలు గాని, ఆర్థిక వనరుల సమకూర్చడం గాని ఏమీ లేదన్నారు. జిల్లా పరిషత్కు సంబంధించిన భవనాలనే వీటిని కేటాయిస్తూ జెడ్పీ నిధులనే వాటి ఆధునికీకరణకు కేటాయించడం మరీ దుర్మార్గమన్నా రు. ఇప్పటివరకు పంచాయతీరాజ్ ఉద్యోగులకు అసలు ప్రమోషన్ లేవని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పడం దుర్మార్గమన్నారు. 2023లో డీఎల్డీవో వ్యవస్థను తీసుకువచ్చినప్పుడే పంచాయతీ రాజ్ వ్యవస్థలో ప్రమోషన్లతోనే ప్రారంభమయ్యాయని, ప్రమోషన్లకు శ్రీకారం చుట్టిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. డీఎల్డీవోగా ఎంపీడీవో స్థాయి అధికారులు మాత్రమే ప్రమోట్ చేసి ఆ వ్యవస్థను తీసుకొచ్చారని చెప్పారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో ఈ రోజు ప్రమోషన్ల సంఖ్య పెరిగింది తప్ప.. ప్రమోషన్ అనేది కొత్తగా చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చింది కాదన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో నాలుగు డీడీవో కార్యాలయాలు తీసుకొచ్చారని, అవన్నీ పంచాయతీ రాజ్ భవనాలని చెప్పారు. -
ఏడో వేతన సంఘ సిఫార్సుల మేరకు పెన్షన్ రివిజన్
అనకాపల్లి: బీఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ రివిజన్ ఏడో వేతన సంఘ సిఫార్సుల మేరకు 2.57 ఫార్ములా ప్రకారం జరగాల్సిందేనని ఆలిండియా బీఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ సర్కిల్ కార్యదర్శి డబ్బీరు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక వివేకానంద ఫంక్షన్ హాల్లో ఉమ్మడి విశాఖ జిల్లా బీఎస్ఎన్ఎల్ సర్వసభ్య సమావేశం శుక్రవారం జిల్లా అధ్యక్షుడు కుప్పిలి చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాట్ తీర్పుని అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం దురుద్దేశ పూర్వకంగా హైకోర్టులో అపీలు చేసిందన్నారు. ప్రస్తుతం విచారణ చివరి దశలో ఉందని, పెన్షనర్లకు అనుకూలమైన తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.ఆర్.పట్నాయక్ మాట్లాడుతూ పెన్షనర్లందరూ సంఘటితంగా ఉంటే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి పెన్షన్ రివిజన్ సమస్యను పరిష్కరిస్తుందన్నారు.ఎనిమిదో వేతన సంఘ సిఫార్సుల్లో టేరమ్స్ ఆఫ్ రిఫరెన్స్లో పెన్షనర్లకు సంబంధించిన అంశాలను చేర్చాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నామని చెప్పారు. పెన్షనర్లకు తీవ్ర నష్టం కలిగించే పెన్షన్ వాలిడేషన్ చట్టం 2025ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ విశాఖ జిల్లాలో పెన్షనర్ల సంఘం బలోపేతంగా ఉందని గుర్తు చేశారు. జిల్లా కార్యదర్శి శ్యామసుందరం మాట్లాడుతూ పెన్షనర్ల నోషనల్ ఇంక్రిమెంట్పై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని కోరారు. -
డిపాజిట్లు మళ్లించి.. ఆస్తులు కూడబెట్టి..
‘స్నేహా’ ఆర్థిక నేరం బట్టబయలు అల్లిపురం: ‘స్నేహా మాక్స్’(స్నేహా మ్యూచువల్ ఎయిడెడ్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్), దాని అనుబంధ బినామీ సంస్థల పేరిట జరిగిన భారీ ఆర్థిక మోసాన్ని నగర పోలీసులు ఛేదించారు. అధిక వడ్డీ ఆశ చూపి ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించిన యాజమాన్యం, ఆ నిధులను వ్యక్తిగత అవసరాలకు, బినామీ కంపెనీలకు మళ్లించి విశాఖతో పాటు ఇతర జిల్లాల్లో పెద్ద ఎత్తున స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసు వివరాలను నగర శాంతిభద్రతల డీసీపీ–1 వి.మణికంఠ చందోల్ వెల్లడించారు. నగర పోలీస్ కమిషనరేట్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డిపాజిటర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు స్నేహా మాక్స్, దానికి సంబంధించిన సంస్థలపై నగరంలోని దువ్వాడ, ద్వారకా, గోపాలపట్నం, టూటౌన్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు తెలిపారు. 2014లో స్నేహా మాక్స్గా మార్పు 2008లో రాజేంద్రనగర్, సీతమ్మపేట కేంద్రంగా రిజిస్టర్ అయిన ఈ సొసైటీ పేరును.. సభ్యులకు తెలియకుండానే 2014లో ‘స్నేహా మాక్స్’గా మార్చారు. అనంతరం డిపాజిట్లను మళ్లించి స్థిరాస్తులు కొనుగోలు చేశారు. ఈ కేసులో ప్రధానంగా వ్యవస్థాపక అధ్యక్షుడు కటికల శివ భాగ్యరావు, అధ్యక్షురాలు కె.స్వర్ణలత, వారి కుమారులు కె.శ్రీకాంత్, కె.క్రాంతి కుమార్, డైరెక్టర్/సీఈవో ఎ.పున్నారావు, బినామీ సంస్థలైన పృథ్వీ కన్స్ట్రక్షన్స్, యునైటెడ్ పబ్లికేషన్స్, స్నేహ ప్రియ ఫైనాన్షియల్ సర్వీసెస్, అలాగే బినామీలు ఎస్.ధనుంజయ శరత్, గుమ్మడి మనోరంజన్ తదితరులు ఉన్నట్లు డీసీపీ తెలిపారు. నిందితులకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసి, అనంతరం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. ప్రజల సొమ్ముతో రియల్ దందా సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్ కార్యాలయాల నుంచి సేకరించిన పత్రాల ఆధారంగా.. డిపాజిటర్ల డబ్బు మళ్లించి కొనుగోలు చేసిన ఆస్తులను పోలీసులు గుర్తించారు. శివ భాగ్యారావు కుటుంబ సభ్యులు పృథ్వీ కన్స్ట్రక్షన్స్ పేరిట వెంకన్నపాలెం, రాయపురాజుపేట వద్ద సుమారు 21.12 ఎకరాలు, యలమంచిలిలో దుప్పిటూరులో 0.47 ఎకరాలు, దబ్బందలో 1.50 ఎకరాలు, స్నేహ ప్రియ ఫైనాన్షియల్ సర్వీసెస్ పేరిట షీలానగర్ ఎస్టీబీఎల్ దగ్గర 2,450 చదరపు గజాలు, యునైటెడ్ పబ్లికేషన్స్ పేరిట చిన్నవాల్తేర్లో అక్షయ సత్యప్రసాద్ విస్టాలో 2,125 చ.అడుగుల ఫ్లాట్(రూ.96 లక్షలు), గుమ్మడి మనోరంజన్ పేరిట మర్రిపాలెం ఇండస్ట్రియల్ ఎస్టేట్లో 350 చ.గజాలు కొనుగోలు చేసి, ఇందుకోసం డిపాజిట్లు మళ్లించినట్లు డీసీపీ తెలిపారు. ఈ కేసులో నిందితులపై క్రిమినల్ చర్యలతో పాటు, ఆస్తుల అటాచ్మెంట్కు సిఫార్సు చేసినట్లు వెల్లడించారు. గుర్తించిన ఆస్తులపై ఎలాంటి లావాదేవీలు జరగకుండా హోల్డ్లో పెట్టాలని సబ్ రిజిస్ట్రార్లకు లేఖలు రాశామన్నారు. మిగిలిన బినామీ ఆస్తుల గుర్తింపు కోసం దర్యాప్తు కొనసాగుతోందన్నారు. సమావేశంలో ఈస్ట్ సర్కిల్ ఏసీపీ లక్ష్మణమూర్తి, టూటౌన్ సీఐ వి.వి.సి.ఎం.ఎర్రంనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
22 నుంచి అవుట్సోర్సింగ్ కార్మికుల సమ్మె బాట
డాబాగార్డెన్స్: వాటర్ సప్లయ్, యూజీడీ అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఈ నెల 22వ తేదీ అర్ధరాత్రి నుంచి కార్మికులు సమ్మె బాట పట్టనున్నారని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ లేబర్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు మహదేవ్ ఆనందరావు తెలిపారు. ఈ మేరకు జీవీఎంసీ అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తిని ఆయా విభాగాల అవుట్ సోర్సింగ్ కార్మికులతో కలిసి సమ్మె నోటీస్ అందజేశారు. కౌన్సిల్ తీర్మానాలు, ప్రభుత్వ జీవోలు అమలు చేయడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. జీవీఎంసీలో మంచినీటి సరఫరా విభాగంలో టెక్నికల్ విధులు నిర్వహిస్తున్న వాటర్ సప్లయ్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు.. కౌన్సిల్ తీర్మానం మేరకు కేటగిరీ–1 కింద 148 మందికి రూ.24,500, కేటగిరీ–2 కింద 818 మందికి రూ.21, 500, కేటగిరీ–3 కింద 261 మందికి రూ.18,500 చెల్లించాలన్నారు. అలాగే యూజీడీ వర్కర్స్కు, కెనాల్ సిల్ట్ వర్కర్స్కు గతేడాది మార్చి ఒకటి నుంచి రావల్సిన ఏరియర్స్ చెల్లించాలని, మంచినీటి సరఫరా విభాగంలో అవుట్ సోర్సింగ్ కార్మి కులకు గతేడాది డిసెంబర్ నుంచి రావాల్సిన ఏరియర్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ నెల 22 నుంచి కార్మికులు సమ్మె బాట పట్టనున్నారని తెలిపారు. అదనపు కమిషనర్ను కలిసిన వారిలో ప్రధాన కార్యదర్శి రెల్లి సత్యం, నాయకులు, కార్మికులు ఉన్నారు. -
కార్మికుల నైపుణ్యాభివృద్ధికి రూ.70 కోట్లు
మంత్రి వాసంశెట్టి సుభాష్ బీచ్రోడ్డు: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం, ఆదాయం పెంపే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసిందన్నారు. శుక్రవారం విశాఖలో పర్యటించిన ఆయన పలు భవన నిర్మాణాలను పరిశీలించారు. నగరంలోని ఓ హోటల్లో జరిగిన ఉత్తరాంధ్ర, కోనసీమ జిల్లాల భవన నిర్మాణ కార్మికుల అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. కార్మికుల పిల్లలకు, కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించేలా నైపుణ్య శిక్షణ కోసం రూ.70 కోట్లు కేటాయించామని తెలిపారు. కార్మి కుల పనిదినాలు పెంచడం, ఆదాయం రెట్టింపు చేయడం, లేబర్ అడ్డాల ఏర్పాటు, సాంకేతిక శిక్షణ వంటి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. భద్రతా ప్రమాణాలు పాటించని యాజమాన్యాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. విశాఖలో రూ.106 కోట్ల సెస్సు రావాల్సి ఉండగా, కేవలం రూ.20 కోట్లే వసూలైనట్లు తెలిపారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా రాష్ట్రంలో నిబంధనలు పాటించని సంస్థలపై ఇప్పటి వరకు 160 కేసులు పెట్టామని వివరించారు. ఏపీ బిల్డింగ్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవాల మల్లికార్జున రావు మాట్లాడుతూ కార్మికులకు రూ.10 లక్షల ప్రమాద బీమా, అంత్యక్రియల ఖర్చులు అందేలా చూస్తామన్నారు. సాధారణ మరణానికి కూడా ఆర్థిక సాయం అందించే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. 1996 సంక్షేమ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కార్మికులకు పని, ఆహార, ఆరోగ్య భద్రత కల్పించాలని కార్మిక సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. పిల్లల చదువులకు స్కాలర్షిప్లు, వైద్య సౌకర్యాలు కల్పించాలని కోరారు. -
అనధికార నిర్మాణాలు తొలగించండి
జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్ డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్కు 20 వినతులు వచ్చాయని కమిషనర్ కేతన్గార్గ్ తెలిపారు. జీవీఎంసీ పట్టణ ప్రణాళికాధికారి ప్రభాకరరావు, సీపీలు, డీసీపీలు, ఏసీపీలతో కలిసి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్లోనూ, ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం కార్యక్రమంలో అనధికార నిర్మాణాలపై అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఎల్ఆర్ఎస్, బీపీఎస్ స్కీంలో దరఖాస్తులు చేసుకున్న వాటిని కాకుండా మిగతా అనధికార నిర్మాణాలను గుర్తించి తొలగించాలని ఆదేశించారు. నగరంలో వాణిజ్య సముదాయాలు, దుకాణాల ప్రకటనల బోర్డుల పన్నులతో పాటు, ప్రైవేట్ ప్రకటనల ఏజెన్సీల నుంచి ప్రకటనల పన్నుల వసూళ్లు వేగవంతం చేయాలన్నారు. వాహనాల రాకపోకలు, పాదాచారులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఫుట్పాత్లు, రోడ్డు ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. అధికారుల లాగిన్లోకి వచ్చిన దరఖాస్తులను లాగిన్లో ఎక్కువ కాలం ఉండడంపై అసహనం వ్యక్తం చేస్తూ ఫైల్స్ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. -
జాతీయ స్కేటింగ్కు విశాఖ సై
విశాఖ స్పోర్ట్స్: ఆరేళ్ల విరామం అనంతరం జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్కు విశాఖపట్నం మరోసారి వేదికై ంది. భారత రోలర్ స్కేటింగ్ సమాఖ్య, కేంద్ర క్రీడా, యువజన సర్వీసుల మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ పోటీలు జరగనున్నాయి. 10 రోజుల పాటు జరగబోయే ఈ క్రీడా సంబరంలో చిన్నారుల నుంచి సీనియర్ల వరకు.. బాలబాలికలు, పురుషులు, మహిళలు వివిధ విభాగాల్లో పోటీపడనున్నారు. భారీగా తరలివచ్చిన క్రీడాకారులు దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 34 జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. స్పీడ్, ఆర్టిస్టిక్, రోలర్ హాకీ, ఇన్లైన్ స్కేటింగ్, డెర్బి, స్కేట్బోర్డ్ తదితర 11 అంశాల్లో పోటీలు నువ్వా నేనా అన్నట్లు సాగనున్నాయి. వయసు ఆధారంగా టైనీటాట్స్, క్యాడెట్స్, సబ్–జూనియర్, జూనియర్, సీనియర్స్, మాస్టర్స్.. ఇలా ఆరు కేటగిరీలుగా విభజించి పోటీలు నిర్వహిస్తున్నారు. ముస్తాబైన వేదికలు : అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న ఆంధ్రా స్కేటర్ ఆనందకుమార్తో పాటు, పలువురు జాతీయ స్థాయి స్కేటర్లు ఇప్పటికే విశాఖ చేరుకుని సాధన చేస్తున్నారు. పోటీల నిర్వహణ కోసం నగరంలోని పలు రింక్లను అత్యాధునికంగా తీర్చిదిద్దారు. వీఎంఆర్డీఏ పార్క్, శివాజీ పార్క్ రింక్స్తో పాటు బోయపాలెం రింక్లో స్పీడ్ రేస్ పోటీలు, కై లాసగిరిలో డౌన్హిల్ పోటీలు నిర్వహించనున్నారు. సాంకేతిక కారణాలతో నేటి నుంచి.. వాస్తవానికి ఈ పోటీలు శుక్రవారం నుంచే ప్రారంభం కావాల్సి ఉండగా, కొన్ని సాంకేతిక కారణాల వల్ల శనివారం నుంచి ప్రారంభమవుతాయని రాష్ట్ర రోలర్ స్కేటింగ్ సంఘం అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం వీఎంఆర్డీఏ పార్క్ స్పీడ్ రింక్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శుక్రవారం జరగాల్సిన ఈవెంట్లను శనివారం నిర్వహిస్తామని, తొలి మూడు రోజులు చిన్నారులకు పోటీలు ఉంటాయని వెల్లడించారు. తక్కువ సమయంలోనే పోటీలకు అనువుగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసిందని రోలర్ స్కేటింగ్ సంఘం కార్యదర్శి థామస్ ప్రశంసించారు. స్కేటింగ్ క్రీడలో యువతను ప్రోత్సహించడమే తమ ప్రధానోద్దేశమని పేర్కొన్నారు. పోటీల సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేశామని శీలం లక్ష్మణ్ తెలిపారు. డిఫెండింగ్ చాంపియన్లుగా బరిలోకి.. గతేడాది ఆర్టిస్టిక్ చాంపియన్షిప్లో సత్తాచాటిన ఆంధ్రా స్కేటర్లు ఈ సారి డిఫెండింగ్ చాంపియన్లుగా రింక్లోకి దిగుతున్నారు. స్పీడ్ రేస్లో గత విజేత తమిళనాడు బరిలో ఉంది. రోలర్ హాకీలో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు పంజాబ్, హర్యానా సిద్ధమయ్యాయి. వేటలో ఆంధ్ర స్కేటర్లు


