breaking news
Visakhapatnam
-
‘చంద్రబాబు.. వెన్నుపోటు మ్యాన్, మోసాల మ్యాన్’
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో తాగునీటి సమస్య తీవ్రంగా మారిందని, ప్రజలకు గుక్కెడు నీరు కూడా అందించలేని స్థితి నెలకొందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం మాటల్లో భారీ ప్రచారం చేసుకుంటోందని, క్షేత్రస్థాయిలో మాత్రం ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. విశాఖను గతంలో వైఎస్ జగన్ విశ్వనగరంగా తీర్చిదిద్దితే.. కూటమి పాలకులు వినాశన నగరంగా మార్చారని మండిపడ్డారు.వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో తాగునీరు, సాగునీరు, పరిశ్రమలకు అవసరమైన నీరు అందడం లేదు. పోలవరం నీళ్లు తీసుకొచ్చామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంటే.. నగరంలో తాగునీటి కోసం ప్రజలు రోడ్లపై ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా గ్రావిటీతో నీరు రాకపోయినా, పురుషోత్తపట్నం నుంచి పాత పంపులు, మోటార్లతో నీటిని తరలించి ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు.విశాఖలో వందల కోట్ల విలువైన భూములను కేవలం 99 పైసలకే కట్టబెడుతున్నారంటూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు. “99 పైసలకు పిల్లాడికి కనీసం చాక్లెట్ వస్తుందా? అలాంటిది వేల కోట్ల విలువైన భూములను ఎలా ఇస్తారు?” అని ప్రశ్నించారు. చంద్రబాబు వాటర్ మ్యాన్ కాదు.. ‘వెన్నుపోటు మ్యాన్’, ‘మోసాల మ్యాన్’ అని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో విశాఖలో నీటి సమస్య మరింత తీవ్రమైందని, నీటి సరఫరాలో కనీస ప్రణాళిక, భవిష్యత్ అవసరాలపై ముందుచూపు కనిపించడం లేదని విమర్శించారు. నీటి సమస్యపై ముందస్తు ప్రణాళిక ఉన్నప్పటికీ అధికారులు ఏం చేశారని ప్రశ్నించారు. డబ్బులు చెల్లించినా ట్యాంకర్లు సకాలంలో రాని పరిస్థితి ఉందని, విశాఖలో మట్టి మాఫియాను మించి ‘నీటి మాఫియా’ తయారైందని ఆరోపించారు.పోర్టు కాలుష్యాన్ని అరికట్టడంలో విఫలమైన అధికారులు ‘ఆపరేషన్ లంగ్స్’ పేరుతో చిరు వ్యాపారులు, తోపుడు బండ్లపై ప్రతాపం చూపుతున్నారని విమర్శించారు. స్టీల్ప్లాంట్ కార్మికులను రోడ్డున పడేసి ప్రైవేటీకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని అన్నారు. విశాఖలోని సుమారు 20 లక్షల మంది ప్రజల నీటి అవసరాలను తీర్చలేని పాలకులు మాటల్లో మాత్రం కోటలు దాటుతున్నారని అన్నారు. స్థానిక ఎంపీకి ప్రజల నీటి కష్టాల కంటే బీచ్ షాక్స్, భూములపైనే ఆసక్తి ఉందంటూ విమర్శించారు. నీటి సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరించకపోతే విశాఖ ప్రజలతో కలిసి మహా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. రెడ్బుక్ రాజకీయాలు, కక్ష సాధింపులు పక్కనపెట్టి ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పాలకులకు ప్రజలు తగిన సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు.ఇదీ చదవండి: వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా చంద్రశేఖర్ -
‘చంద్రబాబు వాటర్ మెన్ కాదు.. క్వార్టర్ మెన్’
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు వాటర్ మెన్ కాదు.. క్వార్టర్ మెన్.. మంచి నీరు ఇవ్వలేదు.. మందు మాత్రం ఇస్తున్నారంటూ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఇవాళ (ఆదివారం) విశాఖ నగర వైఎస్సార్సీపీ కార్యాలయంలో తూర్పు నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. రీజనల్ కోఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, కేకే రాజు, వరుదు కళ్యాణి, మాజీ మేయర్ హరి వెంకట కుమారి పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించారు.ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. మూడు రోజులకు ఒకసారి మంచి నీరు ఇస్తున్నారు.. వేలాది బోర్లు ఎండిపోతున్నాయి. మంచి నీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం ఉంటే ఎంత.. పోతే ఎంత? ఇప్పుడే ఇలా ఉంటే ఎండాకాలంలో మంచి నీటి పరిస్థితి ఏమిటి? మంచి నీటి సమస్యను పరిష్కరించడంలో చంద్రబాబు విఫలమయ్యారు’’ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబు నైజం యూజ్ అండ్ త్రో పాలసీ: కన్నబాబుకురసాల కన్నబాబు మాట్లాడుతూ.. వెన్నుపోటు పార్టీ మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ‘‘చంద్రబాబుది వెన్నుపోటు పార్టీ అయితే వైఎస్సార్సీపీది వెన్ను చూపని పార్టీ. యాదవ సామాజిక వర్గానికి సాధారణ మహిళను జీవీఎంసీ మేయర్గా వైఎస్ జగన్ చేశారు.. యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళను చంద్రబాబు మేయర్ పీఠం నుంచి దించేశారు. చంద్రబాబు నైజం యూజ్ అండ్ త్రో పాలసీ...రుషి కొండపై భవనం కడితే తప్పుడు ప్రచారం చేశారు. కూటమి పాలనలో విశాఖ నగరంలో కొండలను పిండి చేస్తున్నారు. రూపాయికి చాక్లెట్ కూడా రాదు. కానీ ఎకరా భూమి 99 పైసలకు ఇచ్చేస్తున్నారు. మూడు రోజులకు ఒకసారి వాటర్ ఇచ్చేవాడు వాటర్ మ్యాన్ నా? చంద్రబాబు చేసిన మోసాన్ని గడప గడపకు తీసుకువెళ్లాలి. పెన్షన్లు తీసుకొనే వారిని చంద్రబాబు తాగు బోతులుగా చిత్రీకరిస్తున్నారు. పేకాట ఆడే వారికి డీఎస్సీలో ఉద్యోగాలు ఇచ్చారు’’అని కన్నబాబు దుయ్యబట్టారు. అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారు: వరుదు కల్యాణివైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ‘‘అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం కోసం రూ.2 లక్షల 40 వేల కోట్లు ఖర్చు చేయాలి. మూడేళ్లలో కేవలం 32 వేల కోట్ల ఖర్చు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్త ఒక సైనికుడులా పని చేయాలి. కూటమికి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు’’ అని ఆమె పేర్కొన్నారు.విశాఖ నగర వైఎస్సార్సీపీ అధ్యక్షులు కేకే రాజు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించుకోవాలి. స్థానిక సమస్యలు మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాలి. వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి, సంక్షేమం పథకాలను ప్రజలకు వివరించాలి. చెప్పిన హామీలు కంటే ఎక్కువగా వైఎస్ జగన్ అమలు చేశారు. విశాఖకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. యాదవులకు విశాఖ మేయర్ పదవి వైఎస్ జగన్ ఇచ్చారు. జీవీఎంసీలో కీలకమైన పదవులు బడుగు బలహీన వర్గాలు వారికి ఇచ్చారు’’ అని ఆయన వివరించారు.ఇదీ చదవండి: ఏడు దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా చంద్రబాబూ? -
వైఎస్సార్సీపీకి కార్యకర్తలే బలం
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీకి వైఎస్ జగన్మోహన్రెడ్డి, క్షేత్రస్థాయిలో కార్యకర్తలే బలమని, మిగతా వారంతా పార్టీలోకి వస్తుంటారు.. పోతుంటారని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఆ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. భీమిలి నియోజకవర్గ వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అధ్యక్షతన శనివారం జరిగింది. ప్రభుత్వ తీరుపై వారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాజకీయ చరిత్రలో చంద్రబాబు లాంటి వెన్నుపోటుదారుడు ప్రపంచంలోనే ఎవరూ ఉండరని, ఆ మాట స్వయంగా ఆయనకు పిల్లనిచ్చిన సొంత మామ ఎన్టీఆర్ చెప్పారని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన టీడీపీని ‘వెన్నుపోటు పార్టీ’గా నామకరణం చేసి, ఆ పార్టీ దుర్మార్గాలను ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల ధైర్యం జగన్ : కురసాల కన్నబాబు మాట్లాడుతూ కార్యకర్తలకు ధైర్యం కల్పించే ఏకై క నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని అన్నారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో సోనియా గాంధీ నుంచి చంద్రబాబు వరకు ఎంతో మంది ఒత్తిళ్లు తెచ్చినా ఎక్కడా బెదరలేదని తేల్చిచెప్పారు. 15 ఏళ్ల పార్టీ చరిత్రలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నామని, నాయకులు వస్తుంటారు.. పోతుంటారు కానీ కార్యకర్త ఎప్పటికీ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తూ.. పెన్షన్ డబ్బులు ఇస్తే సాయంత్రానికి తాగుతున్నారని చంద్రబాబు అనడం హాస్యాస్పదమని కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో తాగుడు పెరగడానికి కారణం చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. జొమాటో, స్విగ్గీలో ఫుడ్ డెలివరీ చేసినట్లుగా రాష్ట్రంలో మద్యం డోర్ డెలివరీ చేస్తున్న ఘనత చంద్రబాబుదేనని మండిపడ్డారు. విశాఖలో మూడు రోజులకు ఒకసారి మంచినీళ్లు ఇవ్వలేని అసమర్థతలో ఉంటూ, అధికారులతో సమావేశాలు పెట్టి వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులకు ఎలాంటి పనులు చేయొద్దంటూ అక్రమ ఆంక్షలు విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత తమ ప్రభుత్వ హయాంలో పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించామని గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో అన్ని హామీలు గుప్పించి, ఇప్పుడు ‘ఏరు దాటాక బోడి మల్లన్న’ అన్నట్లుగా సీఎం వ్యవహరిస్తున్నారని విమర్శించారు. భీమిలిలో లోకేష్ తోడల్లుడుకు రూ.వేల కోట్ల విలువైన 54 ఎకరాల ప్రభుత్వ భూములను కట్టబెట్టారని ఆరోపించారు. అదేవిధంగా పెట్టుబడుల పేరుతో తన బినామీలకు, బంధువులకు, పేరు ఊరు లేని రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఎకరా 99 పైసలకే ప్రభుత్వ భూములు కట్టబెట్టారని ఆరోపించారు. భోగాపురం ఎయిర్పోర్టుకు తానే కొబ్బరికాయ, గుమ్మడికాయ కొట్టానని చెప్పుకుంటున్న చంద్రబాబు.. మరి దానికి మధ్యలో పనిచేసిందెవరని ప్రశ్నించారు. కేవలం పచ్చి పబ్లిసిటీతోనే ఆ పార్టీ బతుకుతోందని, సమీక్షలు, సాష్టాంగ నమస్కారాలు చేయడం మానేసి ప్రజలకు ఫలితాలు చూపించాలని హితవు పలికారు. డీఎస్సీపై సీబీఐ విచారణ వేయాల్సిందే: గుడివాడ అమర్నాథ్, కేకే రాజు డీఎస్సీ ప్రక్రియలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ వేసి తీరాల్సిందేనని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, కేకే రాజు డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటాలో కనీసం ఆటలు రాని వారికి కూడా ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు. హర్యానాలో సీఎం, ఆయన కుమారుడు ఇదే తరహా అక్రమాలకు పాల్పడితే న్యాయస్థానం జైలు శిక్ష విధించిందని గుర్తుచేశారు. భవిష్యత్తులో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అప్పటికి చంద్రబాబు వయస్సు 70 ఏళ్లు దాటుతుందని, ఆయన కుమారుడిని జైలుకు పంపించడం వందశాతం ఖాయమని హెచ్చరించారు. -
కేజీహెచ్లో అందుబాటులోకి ‘క్రిటికల్ కేర్ బ్లాక్’
మహారాణిపేట: కేజీహెచ్లో రూ.23.75 కోట్ల వ్యయంతో నిర్మించిన నాలుగు అంతస్తుల అత్యాధునిక క్రిటికల్ కేర్ బ్లాక్(సీసీబీ) శనివారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు ఈ భవనాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్యాదవ్ విజయవాడ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అదే సమయంలో కేజీహెచ్లో ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, పి.విష్ణుకుమార్రాజు, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు చైర్మన్ సీతాంరాజు సుధాకర్ సంయుక్తంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ క్రిటికల్ కేర్ బ్లాక్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలు అత్యున్నత ప్రమాణాలతో ఉండి, కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా లేని స్థాయి సదుపాయాలు ఇక్కడ లభ్యమవుతాయన్నారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు మాట్లాడుతూ కేజీహెచ్ అభివృద్ధి ద్వారా లక్షలాది మంది పేదలకు మేలు జరుగుతుందని తెలిపారు. రానున్న రోజుల్లో ఓపీ బ్లాక్తో పాటు మరిన్ని వైద్య పరికరాలు, మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జేసీ విద్యాధరి, కేజీహెచ్ సూపరింటెండెంట్ డా.వాణి, ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సంధ్యారాణి, అడ్మినిస్ట్రేటర్ రమణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు, పలువురు వైద్యులు, ఇంజినీర్లు పాల్గొన్నారు. -
4,311 రకాల వంటకాలతో నివేదన
తగరపువలస: హరేకృష్ణ మూవ్మెంట్ వ్యవస్థాపకుడు, హరేకృష్ణ మంత్రాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల 130వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భక్తులు ఆయనకు శనివారం 4311 రకాల వంటకాలను సమర్పించారు. ఆనందపురం మండలం గంభీరం ఐఐఎంవీ రోడ్డులోని హరేకృష్ణ వైకుంఠంలో వ్యాసపూజ సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాధా మదన మోహనుల మందిరంలో ప్రభుపాదుల వారి వ్యాసపూజ సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించి ఆయనను స్మరించుకున్నారు.శ్రీకృష్ణ జన్మాష్టమి అనంతరం ఈ కార్యక్రమాన్ని గురుదక్షిణగా సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రభుపాదుల వారిని గురువుగా స్వీకరించిన భక్తులు ఆయన విగ్రహం ముందు వివిధ రకాల వంటకాలను ఉంచి పూజలు నిర్వహించారు.హరేకృష్ణ మూవ్మెంట్ అధ్యక్షుడు నిష్క్రించిన భక్తదాస మాట్లాడుతూ.. భక్తులు తమ ఇళ్ల వద్ద శుచి, శుభ్రతతో రుచికరమైన సాత్విక, తీపి పదార్థాలను తయారు చేసి సమర్పిస్తారని తెలిపారు. గురువుకు సమర్పించిన అనంతరం హారతి నిర్వహించి భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేసినట్లు చెప్పారు. -
వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్గా ఎల్లో మీడియా తప్పుడు కథనాలు
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ నాయకులనే టార్గెట్గా ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోందని పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంటే రైతాంగం పడుతున్న ఇబ్బందులు, ఆకాశాన్నంటిన నిత్యావసర ధరలతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, విశాఖలో తాగునీరు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను పచ్చ మీడియా చూపిస్తే ఆ సంస్థలపై ప్రజలకు గౌరవం పెరుగుతుందని హితవు పలికారు. శనివారం పార్టీ కార్యాలయంలో విశాఖ తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావుతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. మార్గదర్శిలో అవకతవకలపై ఈనాడులో ఎందుకు రాయడం లేదని ప్రశ్నించారు. వెల్ఫేర్ సంస్థలో ఉన్న ప్రతి కస్టమర్కు న్యాయం జరిగిందని మళ్ల స్పష్టం చేశారు. ప్రజల పక్షాన పోరాటం ఆగదు ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని ఎల్లో మీడియా వక్రీకరించి ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు పార్టీ నేతలపై వ్యక్తిగతంగా బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఎన్ని తప్పుడు కథనాలు రాసినా ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణను తగ్గించలేరని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా ప్రజల కోసం పనిచేయడమే తమ పార్టీ లక్ష్యమని చెప్పారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్పై కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్లలో వ్యక్తిగత విషయాలను భూతద్దంలో చూపిస్తూ తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం జరిగిందన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలకు వైఎస్సార్ సీపీ భయపడేది లేదని స్పష్టం చేశారు. మళ్ల విజయప్రసాద్కు పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని, పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు పార్టీ పెద్దలందరి మద్దతు ఆయనకు ఉంటుందని తెలిపారు. రేపు నిర్వహించనున్న నియోజకవర్గ స్థాయి సమావేశంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. నియోజకవర్గంలోని సమస్యలు, పార్టీ సంస్థాగత అంశాలు, ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. కుటుంబాలను మనస్తాపానికి గురిచేయడం తగదు: మళ్ల విజయప్రసాద్ తనపై వస్తున్న నిరాధార వార్తల వల్ల కుటుంబ సభ్యులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారని మళ్ల విజయప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. గత 30 ఏళ్లుగా ఎంతో కష్టపడి వెల్ఫేర్ సంస్థను అభివృద్ధి చేశానని, సంస్థలో ఉన్న ప్రతి కస్టమర్కు పూర్తి న్యాయం జరిగిందని స్పష్టం చేశారు. అధికారులు కోరిన సమాచారాన్ని అందించామని, ఈడీ దాడులను అడ్డంపెట్టుకుని తనపై బురద జల్లాలని చూస్తే సహించేది లేదన్నారు. తప్పు చేసేవాడినైతే ఈపాటికి పారిపోయి ఉండేవాడినని, చట్టపరమైన వ్యవస్థలపై తనకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు. పేపర్లు, ఛానళ్లు ఉన్నాయని ఇష్టానుసారంగా రాస్తే ప్రజలు గమనిస్తున్నారని, కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందని అన్నారు. మహానేత వైఎస్సార్ ఆశీస్సులతో 2009లో ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయాల్లో అడుగుపెట్టానని తెలిపారు. గత 20 ఏళ్లుగా స్వార్థం, స్వప్రయోజనం కోసం తాను ఏనాడూ పనిచేయలేదని, తాను చేసిన ప్రతి పని ద్వారా పదిమందికి మేలు కలిగేలా పనిచేశానని మళ్ల విజయప్రసాద్ అన్నారు. -
చుక్క నీరు లేక అవస్థలు
వాటర్ ట్యాంకర్లు బుక్ చేసుకున్నా రావడం లేదు. బోర్ల నుంచి కూడా నీరు రావడం లేదు. జీవీఎంసీ నీటిని సరఫరా చేయడం లేదు సరికదా... కొనుక్కుందామన్నా ఇవ్వడం లేదు. ఇంట్లో చుక్క నీరు లేదు. ఉదయమైతే రోజు ఎలా గడపాలో అర్థం కావడం లేదు. మా ఇబ్బందులు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. రాత్రి వేళ మహిళలం కూడా రోడ్డుపైకి వచ్చి ధర్నా చేస్తున్నామంటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. –డాక్టర్ శిరిషా, ఎంవీవీ సిటీ రోజుకు 4 ట్యాంకర్ల నీరే ఇస్తున్నారు ఎంవీవీ గేటెడ్ కమ్యూనిటీలోని 6017 ప్లాట్లో నివాసముంటున్నాం. నీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. కనీస బాత్రూమ్ అవసరాలు తీర్చుకోవడానికి కూడా పిల్లలు, వృద్ధులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. రోజుకు కేవలం 4 ట్యాంకర్ల నీరు మాత్రమే ఇస్తున్నారు. 10 ట్యాంకర్లు దాటితే బుకింగ్ ఆపేస్తున్నారు. –రామ్కుమార్, సీనియర్ సిటిజన్ నాలుగు రోజులుగా తీవ్ర ఇబ్బంది నాలుగు రోజుల నుంచి పరిస్థితి మరీ దారుణంగా మారింది. నీరు ఇవ్వడం లేదు. కొనుక్కుందామన్నా అనుమతించడం లేదు. ఇది ఎక్కడి న్యాయం? నీరు లేకపోతే ఎలా జీవించాలి? ఎవరినీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో మేం రాత్రి వేళ జీవీఎంసీ పంప్హౌస్ దగ్గరకు రాలేదు. మా ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలనే ఇక్కడికి వచ్చాం. –డాక్టర్ గోపాల కృష్ణారావు -
ద్విచక్ర వాహనాల చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్
పరవాడ: ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను శనివారం పరవాడ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ ఎల్.భాస్కరరావు తెలిపిన వివరాల ప్రకారం..ం వాడచీపురుపల్లిలో గత నెల 29న హోండా షైన్, ఈ నెల 11న హోండా యాక్టీవా వాహనాలు చోరీకి గురైనట్లు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అనుమానితుడిగా అదే గ్రామానికి చెందిన మచ్చ రామచంద్రరావును అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో అతడు పరవాడ, గాజువాక, మల్కాపురం ప్రాంతాల్లో ఐదు వాహనాల చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. అలాగే, నిందితుడికి సహకరించిన విశాఖపట్నానికి చెందిన దెబ్బ జోసెఫ్ కిశోర్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. రామచంద్రరావుపై గాజువాక, దువ్వాడ, మల్కాపురం పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే చోరీ కేసులు నమోదై ఉన్నట్లు సీఐ తెలిపారు. చోరీ చేసిన నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకొని, నిందితులను రిమాండ్కు తరలించారు. ఈ కేసును ఛేదించిన ఎస్ఐ భీమరాజు, క్రైమ్ హెడ్ కానిస్టేబుల్ ఎస్.వి.సాయి సంతోష్, హెచ్సీ సునీల్, పీసీ కిశోర్లను సీఐ అభినందించారు. -
చాకచక్యంతో కాపాడిన పోలీసులు
యువతి ఆత్మహత్యాయత్నం పెందుర్తి: ఇంట్లో జరిగిన వివాదం కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ యువతిని పోలీసులు చాకచక్యంగా రక్షించారు. వివరాలివి. స్థానిక టీచర్స్ కాలనీలో ఓ యువతి(19) తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటుంది. శనివారం మధ్యాహ్నం ఇంట్లో చిన్నపాటి వివాదం జరిగింది. ఈ క్రమంలో సదరు యువతి తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఆమె తీరుపై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా తలుపు తీయలేదు. తక్షణమే పెందుర్తి పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన సీఐ కె.వి.సతీష్కుమార్ ఆదేశాల మేరకు బ్లూకోట్స్ పీసీ చంద్రశేఖర్ అక్కడికి చేరుకుని తలుపును బలవంతంగా తెరిచారు. అప్పటికే ఉరికి వేళాడుతున్న యువతిని కిందకి దించడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. ప్రాథమిక చికిత్స అనంతరం యువతితో పాటు తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. -
గొంతెండుతున్నా పట్టదా?
మధురవాడ: నెల రోజులకు పైగా జీవీఎంసీ తాగునీరు సరఫరా చేయకపోవడంతో పాటు, కొనుక్కుందామన్నా నీరు అందించకపోవడంపై పీఎంపాలెం ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఎదురుగా ఉన్న ఎంవీవీ సిటీ గేటెడ్ కమ్యూనిటీ వాసులు భగ్గుమన్నారు. నగరంలో నీటి కరువు ముంచుకొస్తున్నా పాలకులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేకపోవడంతో శనివారం రాత్రి 9 గంటల సమయంలో సుమారు 400 మంది నివాసితులు యండాడ జీవీఎంసీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను ముట్టడించారు. ఈ సందర్భంగా తమకు తాగునీరు అందించాలని, సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అధికారుల తీరుకు వ్యతిరేకంగా సెల్ఫోన్ ఫ్లాష్లైట్లు వెలిగించి పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. నివాసితులు కార్లు, ద్విచక్ర వాహనాల్లో మూకుమ్మడిగా తరలివచ్చి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12 బ్లాకుల్లో 1,428 నివాసాలున్న తమ గేటెడ్ కమ్యూనిటీకి రోజుకు కనీసం 9 లక్షల లీటర్ల నీరు అవసరమవుతుందని తెలిపారు. జీవీఎంసీ అధికారులు రోజుకు కనీసం 12 ట్యాంకర్ల ద్వారానైనా నీటిని అందించడం లేదని, తాగునీరు కొనుక్కుందామన్నా 10 ట్యాంకర్లు దాటిన తర్వాత బుక్ కాకుండా బ్లాక్ చేస్తున్నారని వాపోయారు. తాము వాడుక నీరే కాక, తాగునీరు కూడా లభించక ఇబ్బందులు పడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులకు చీమకుట్టినట్లయినా లేదని విమర్శించారు. డేటా సెంటర్కు నీటి సరఫరా నేపథ్యంలో నగరంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకున్నా పాలకులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల ద్వారా కొనుగోలు చేద్దామన్నా వాటిని కూడా ఆపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు తాగునీరు అందించకపోతే ఎంతటి ఆందోళనకై నా వెనుకాడేది లేదన్నారు. అవసరమైతే ఆది వారం జాతీయ రహదారిపై ధర్నా చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. తక్షణమే ఈ గేటెడ్ కమ్యూనిటీకి 8 జీవీఎంసీ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రాత్రి 10 గంటల తర్వాత ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. ఎంవీవీ సిటీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. వంశీ, కార్యదర్శి జగదీశ్వరరావు, లక్ష్మీనారాయణ, జగన్నాథరావు పాల్గొన్నారు. -
బిగ్ లూటీ!
ఏఐ ముసుగులోసాక్షి, విశాఖపట్నం: ‘చేప పిల్లను చూపించి.. కొండముచ్చును దొంగిలించినట్లుంది’ రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ఆడుతున్న నాటకం. కేవలం వెయ్యి ఉద్యోగాలనే ఎరగా చూపి, రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని కార్పొరేట్ కంపెనీకి ధారాదత్తం చేసేందుకు సిద్ధపడింది. భీమిలి పరిధిలో 512 మెగావాట్ల ‘గ్రీన్ ఇంటిగ్రేటెడ్ ఏఐ డేటా సెంటర్’ కోసం హడావుడిగా తెరపైకి వచ్చిన ఓ ప్రైవేట్ సంస్థకు రూ.5 వేలు కోట్లకు పైగా రాయితీలను దోచిపెడుతుంది. ఈ ప్రాజెక్టు ఆమోద ప్రక్రియ అంతా ఓ పెద్ద మాయాజాలంలా సాగింది. ఒక పేరుతో ప్రతిపాదనలు పంపి, నెల రోజులకే పేరు మార్చేసిన సంస్థకు విలువైన ప్రభుత్వ భూములను ధారాదత్తం చేయడం వెనుక భారీ లాబీయింగ్ జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పచ్చని పల్లెల్లో సహజసిద్ధమైన వాగులు, ప్రజా రహదారులను సైతం మళ్లించేందుకు ప్రభుత్వం అధికారికంగా అనుమతులు ఇవ్వడం వెనుక పెద్ద ఎత్తున లాలూచీ ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లూటీకి అధికారిక ఆమోదముద్ర భీమునిపట్నం మండలం అమనాం గ్రామంలో 512 మెగావాట్ల సామర్థ్యంతో గ్రీన్ ఇంటిగ్రేటెడ్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం ఆగస్టు 22న జీవో–59 జారీ చేసింది. ’ఏఎం ఏఐ ఫ్యాక్టరీ వైజాగ్ ప్రైవేట్ లిమిటెడ్’ ఆధ్వర్యంలో సుమారు రూ.31,387 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టును 28 నెలల వ్యవధిలో పూర్తి చేయాలని నిర్దేశించారు. దీనిద్వారా కేవలం 1,000 మందికి మాత్రమే ఉపాధి అవకాశాలు లభిస్తాయని, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) సిఫార్సుల మేరకు ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రతిపాదనలకో పేరు.. ప్రాజెక్టుకో పేరు భారీ ప్రాజెక్టుల విషయంలో పారదర్శకత వహించాల్సింది పోయి, ప్రతిపాదనల నుంచి ఆమోదం వరకు అంతా రహస్యంగా కానిచ్చేశారు. తొలుత ఈ ఏడాది జూన్ 23న ‘ఏఎం ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు వచ్చాయి. కేవలం నెల రోజుల్లోనే, అంటే జూలై 31న ‘ఏఎం ఏఐ ఫ్యాక్టరీ వైజాగ్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే కొత్త సంస్థ తెరపైకి వచ్చింది. మాతృసంస్థకు 51 శాతం వాటా ఉందన్న కుంటిసాకుతో, రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన కొత్త సంస్థకు రూ.వేల కోట్ల రాయితీలను బదిలీ చేయడం వెనుక భారీగా ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు వస్తున్నాయి. భవిష్యత్తులో ప్రాజెక్టు నిర్మించకపోయినా, బ్యాంకుల రుణాలు ఎగ్గొట్టినా ఆ బాధ్యత కేవలం ఈ కొత్త కంపెనీకే పరిమితమయ్యేలా కుట్ర పన్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో ఉద్యోగానికి రూ.5 కోట్ల సబ్సిడీ రూ.31,387 కోట్ల భారీ పెట్టుబడితో ప్రాజెక్టు వస్తోందని ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం, దీని ద్వారా వచ్చేది కేవలం 1,000 ఉద్యోగాలేనని జీవోలోనే స్పష్టం చేసింది. సాధారణంగా ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే కనీసం 10 వేల మందికై నా ఉపాధి దక్కాలి. కానీ, కేవలం వెయ్యి మందికి ఉద్యోగాలిచ్చే సంస్థకు ప్రభుత్వం ఏకంగా రూ.5,000 కోట్లకు పైగా పన్నుల మినహాయింపులు ఇస్తోంది. ఈ లెక్కన చూస్తే సగటున ఒక్కో ఉద్యోగానికి ప్రభుత్వం రూ.5 కోట్ల మేర ప్రజాధనాన్ని సబ్సిడీగా కట్టబెడుతోంది! ప్రకృతి విధ్వంసానికి పచ్చజెండా కార్పొరేట్ సంస్థ ప్రయోజనాల కోసం అమనాం గ్రామంలో ప్రకృతిని నాశనం చేసేందుకు సైతం వెనుకాడటం లేదు. సర్వే నంబర్లు 104/1, 101/3, 101/4, 98/2లలో ప్రవహించే సహజసిద్ధమైన వాగును, సర్వే నంబర్లు 105, 107 మీదుగా వెళ్లే ప్రజా రహదారిని సైతం మళ్లించేందుకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. దీనికితోడు స్థానికులైన నిరుపేదలు ఆధారపడే డీ–పట్టా భూములతో పాటు సర్వే నంబర్లు 110, 102, 106/16ల్లోని సుమారు 6.82 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీఐఐసీ ద్వారా ఆ సంస్థకు కట్టబెడుతున్నారు. సాధారణంగా భూ కేటాయింపుల్లో ఎకరం ధరను స్పష్టంగా పేర్కొనే ప్రభుత్వం, ఇందులో మాత్రం ‘యాక్చువల్ కాస్ట్ బేసిస్’ (అసలు ధర) పద్ధతి అని తెలివిగా దాటవేసింది. భోగాపురం విమానాశ్రయం సమీపంలో ఉండటంతో ఇక్కడ ఎకరం భూమి ధర రూ.8 కోట్లకు పైగా ఉంది. అంటే దాదాపు రూ.50 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.5 కోట్లకే ధారాదత్తం చేస్తున్నారు. భీమిలిలో ఏఐ డేటా సెంటర్ పేరుతో అడ్డగోలు దోపిడీ 1,000 ఉద్యోగాల ఎర చూపి రూ.5 వేల కోట్ల రాయితీలు ధారాదత్తం ప్రతిపాదనలు పంపిన నెల రోజులకే రూపుమార్చుకున్న కంపెనీ రూ.31,387 కోట్ల ప్రాజెక్టు వెనుక భారీ లాబీయింగ్ అనుమానాలు సహజసిద్ధమైన వాగులు, దారుల విధ్వంసానికి పచ్చజెండా రెండు దశాబ్దాల పాటు రాయితీలు ఆర్థిక రాయితీల రూపంలో ఈ సంస్థకు ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. క్రాస్ సబ్సిడీ సర్చార్జి మినహాయింపు: 20 ఏళ్ల పాటు గరిష్టంగా రూ.3,000 కోట్లు విద్యుత్ ట్రాన్స్మిషన్, వీలింగ్ చార్జీలు: రూ.1,250 కోట్లు క్యాపిటల్ సబ్సిడీ (10 ఏళ్లకు): రూ.300 కోట్లు ఎస్జీఎస్టీ రీయింబర్స్మెంట్: రూ.490 కోట్లు ఇతర మినహాయింపులు విద్యుత్ పన్ను కింద రూ.90 కోట్లు ఫైబర్ యాక్సెస్పై రూ.30 కోట్లు స్టాంప్ డ్యూటీ మినహాయింపు కింద రూ.16 కోట్లు కేవలం 28 నెలల్లో పూర్తయ్యే ప్రాజెక్టుకు రాబోయే 20 ఏళ్ల పాటు రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని ఇలా దోచిపెట్టడంపై ప్రజలు, పర్యావరణవేత్తల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. -
విశాఖ మార్కెట్లోకి ‘టయోటా హైలక్స్ 2026’
మహారాణిపేట: విశాఖలో మోడీ టయోటా ఆధ్వర్యంలో సరికొత్త ‘టయోటా హైలక్స్ 2026’వాహనాన్ని శనివారం ఆవిష్కరించారు. బలం, భద్రత, సౌకర్యం, అడ్వెంచర్ లక్షణాలతో రూపొందిన ఈ మోడల్కు ఆటోమొబైల్ ప్రియుల నుంచి విశేష స్పందన లభించింది. నూతన హైలక్స్ 2026లో శక్తివంతమైన 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్తో పాటు 6–స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అందుబాటులో ఉంది. 2డబ్ల్యూడీ, 4 డబ్ల్యూడీ ఆప్షన్లలో లభించే ఈ వాహనం 204 బీహెచ్పీ పవర్, 500 ఎన్ఎం టార్క్ను అందిస్తూ మెరుగైన పనితీరును ప్రదర్శిస్తుందని షోరూం ప్రతినిధులు తెలిపారు. భద్రతపరంగా 7 ఎయిర్బ్యాగులు, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయని చెప్పారు. ఏడీసీపీ నరసింహమూర్తి, మోడీ టయోటా సేల్స్ వైస్ ప్రెసిడెంట్ ఆచార్య, సర్వీస్ వైస్ ప్రెసిడెంట్ ఓవీఎస్ అవినాష్, సేల్స్ మేనేజర్ పాల్గొన్నారు. -
వసుంధరా దొరస్వామికి ప్రతిష్టాత్మక అవార్డు
మద్దిలపాలెం: అంతర్జాతీయంగా ఖ్యాతి గాంచిన భరతనాట్య నర్తకి, నృత్య దర్శకురాలు, పరిశోధకురాలు డాక్టర్ వసుంధరా దొరస్వామి 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ‘పద్మభూషణ్ గురు డాక్టర్ సరోజా వైద్యనాథన్ ఎక్సలెన్స్ అవార్డు’కు ఎంపికయ్యారు. ఈ నెల 26, 27 తేదీల్లో మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించనున్న ‘వైశాఖి నృత్యోత్సవ్’సందర్భంగా ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్టు నటరాజ్ మ్యూజిక్–డాన్స్ అకాడమీ వ్యవస్థాపకుడు బి.ఆర్.విక్రమ్ గౌడ్ తెలిపారు. అష్టాంగ యోగాతో భరతనాట్యానికి కొత్త శక్తి మైసూరుకు చెందిన డాక్టర్ వసుంధరా దొరస్వామి ఏడు దశాబ్దాల సుదీర్ఘ నృత్య ప్రయాణంతో శాసీ్త్రయ నృత్యరంగంలో ప్రత్యేక స్థానం సంపాదించారు. అష్టాంగ విన్యాస యోగాను భరతనాట్యంతో సమన్వయం చేసిన తొలి కళాకారిణిగా గుర్తింపు పొందిన ఆమె.. గురు శ్రీ పట్టాభి జోయిస్ వద్ద శిక్షణ పొంది ఈ రెండు కళల అనుసంధానంపై పరిశోధన చేసి డాక్టరేట్ సాధించారు. ‘పాంచాలి’, ‘గంగా లహరి’, ‘సామవేద’వంటి ఆమె సోలో నృత్య రూపకాలు విశేష ప్రశంసలు అందుకున్నాయి. -
‘కీర్తిచక్ర‘ శ్రీనివాస్కు ఘన నివాళి
సీతంపేట: ఉత్తరాంధ్ర చాత్తాద శ్రీవైష్ణవ సంఘం ఆధ్వర్యంలో ‘కీర్తిచక్ర’ పందిళ్లపల్లి శ్రీనివాస్(ఐఎఫ్ఎస్) జయంతి వేడుకలను శనివారం విశాఖ పౌర గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. కర్ణాటక కేడర్కు చెందిన అటవీ శాఖ అధికారి శ్రీనివాస్ తన సేవా కాలంలో అటవీ సంరక్షణలో పలు సంస్కరణలు ప్రవేశపెట్టి ప్రత్యేక గుర్తింపు పొందారని వక్తలు కొనియాడారు. ఆయన చిత్ర పటానికి సంఘం ప్రతినిధులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా సభాధ్యక్షుడు తిరుపతి రాజమన్నారు మాట్లాడుతూ గంధం చెక్కల, ఏనుగు దంతాల స్మగ్లింగ్తో మూడు రాష్ట్రాలను వణికించిన వీరప్పన్ను ధైర్యంగా ఎదుర్కొన్న అధికారి శ్రీనివాస్ అని కొనియాడారు. శాంతిచర్చల పేరుతో పిలిచి కిరాతకంగా హత్య చేసిన ఘటనను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ సోదరీమణులు రామలక్ష్మి, రాజ్యలక్ష్మి పాల్గొని భావోద్వేగంతో నివాళులర్పించారు. ఇదే వేదికపై సంఘ పూర్వ అధ్యక్షులు గోపాలకృష్ణ, లక్ష్మణమూర్తిని ఘనంగా సత్కరించారు. పరవస్తు సూరి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి శతపత్రం వెంకటేశ్వర్లు అనుసంధానకర్తగా వ్యవహరించారు. పలువురు వైష్ణవ బంధువులు, పుర ప్రముఖులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఏపీకి బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
సాక్షి, విజయవాడ: ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచనను వాతావరణ శాఖ జారీ చేసింది. పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని.. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలతో పాటు యానాంలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం భారీ వర్షాలు కురిశాయి. విజయవాడలో వేకువజాము నుంచి దాదాపు 3 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపుల ధాటికి బెజవాడ వాసులు బెంబేలెత్తిపోయారు. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.ముఖ్యంగా బెంజిసర్కిల్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు భారీ స్థాయిలో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. ఏలూరు రోడ్డులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోనూ శనివారం వేకువజామున భారీ వర్షం కురిసింది. ఉ.8 గంటల వరకు జిల్లాలో సగటున 37.4 మిల్లీవీుటర్ల వర్షపాతం నమోదైంది.పి.గన్నవరంలో అత్యధికంగా 60.0 మిల్లీవీుటర్ల వర్షపాతం నమోదైంది. ఇదిలా ఉండగా, ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అల్లూరి సీతారామరాజు జిల్లా దారకొండ పంచాయతీ గంగవరం వద్ద గిరిజనులు నిర్మించుకున్న తాత్కాలిక తూరల వంతెన వరద ధాటికి కొట్టుకుపోయింది. ఒడిశా వైపు వెళ్లే మార్గంలో సుమారు 30 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.ఇదీ చదవండి: చవితి పూట.. ధరల మంట -
కార్యకర్తలే వైఎస్సార్సీపీ బలం
మహారాణిపేట: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలం, వెన్నెముక కార్యకర్తలే అని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. భీమిలి నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీకి బలమైన కేడర్ ఉందన్నారు. వైఎస్సార్ సీపీలో అక్కడ అధినేత జగనన్న.. ఇక్కడ పార్టీ జెండా మోసే కార్యకర్తలు ఎప్పటికీ పదిలంగానే ఉంటారన్నారు. మధ్యలో పార్టీలోకి చాలా మంది వస్తుంటారు.. పోతుంటారు.. వాళ్ల కారణంగా పార్టీకు ఎటువంటి నష్టం వాటిల్లదని పేర్కొన్నారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో కేకే రాజు అధ్యక్షతన భీమిలి నియోజకవర్గ పరిధిలోని జీవీఎంసీ 1 నుంచి 8, 98వ వార్డుల సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, జిల్లా స్థాయి నాయకులతో శుక్రవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ.. నియోజకవర్గానికి కొత్త సమన్వయకర్తను నియమించే వరకు పార్టీ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిల్లో పార్టీ షెడ్యూల్ ప్రకారం నిర్వహించాల్సిన ప్రతి కార్యక్రమాన్ని ఎలాంటి విరామం లేకుండా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తగరపువలస శ్రీనివాస కళ్యాణ మండపంలో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు భీమిలి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరగనుందన్నారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భీమిలి నియోజకవర్గ పరిశీలకుడు తైనాల విజయ్కుమార్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో రెండు రోజులుగా రూరల్, అర్బన్ మండల నాయకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశామన్నారు. పార్టీ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించామన్నారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న అనేక మంది సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరైనట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయనున్నట్లు పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు అందరూ ఐక్యంగా పనిచేస్తే భీమిలి నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీకి మరింత బలమైన పునాది ఏర్పడుతుందన్నారు. పార్టీ నేతలు చెన్నాదాస్, పోతిన హనుమంతరావు, పోతిన శ్రీనువాసరావు, కొండలరావు, అక్కరమాని రామునాయుడు, మారుతీ ప్రసాద్, పోలిరెడ్డి, జగపల్లి ప్రసాద్, పోతిన ప్రసాదరావు, జగపల్లి నరేష్, కరుణాకర్ రెడ్డి, కర్రి స్వామి, కొలుసు ఈశ్వరరావు, పిల్లా సుజాత, రాజేశ్వరి, బి.పద్మావతి, అప్పల రాజు రులు పాల్గొన్నారు. -
అదానీ గంగవరం పోర్టుకు అవార్డు
పెదగంట్యాడ: అదానీ గంగవరం పోర్టుకు 25వ గ్లోబల్ గ్రీన్టెక్ ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబిలిటీ అవార్డ్స్–2026 దక్కింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పోర్టు యాజమాన్యం చేపడుతున్న కార్యక్రమాలను గుర్తించిన గ్రీన్టెక్ ఫౌండేషన్ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా పోర్టు యాజమాన్య ప్రతినిధులు మాట్లాడుతూ అవార్డు లభించడం సంతోషంగా ఉందన్నారు. రాజస్థాన్లోని జోధ్పూర్లో నిర్వహించిన కార్యక్రమంలో గ్రీన్టెక్ ఫౌండేషన్ ప్రతినిధుల చేతుల మీదుగా గంగవరం పోర్టు ప్రతినిధులు అవార్డును అందుకున్నారు. -
విశాఖ పర్యాటకానికి సీప్లేన్ ఊతం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా విశాఖపట్నం పోర్టు అథారిటీ సీప్లేన్ క్రూయిజ్ సేవలకు సన్నాహాలు చేస్తోంది. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ సేవలకు సంబంధించిన డీపీఆర్ను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ప్రతిపాదిత ఏరోడ్రోమ్ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర పర్యాటక శాఖ అదనపు కార్యదర్శి సుమన్ బిల్లా గురువారం అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ను సందర్శించారు. కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖల అధికారులతో కలిసి టెర్మినల్లోని సదుపాయాలు, సీప్లేన్ కార్యకలాపాలకు అనుకూల పరిస్థితులను పరిశీలించారు. ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే విశాఖకు పర్యాటకుల రాక పెరగడంతోపాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అధికారులు భావిస్తున్నారు. -
కథ మారలేదు!
కమిషనర్ మారినా.. తమవారికి పనులు అప్పగించేందుకేనా? గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ మ్యూజియంల నిర్వహణ బాధ్యతలను సంబంధిత రంగంలో అనుభవం ఉన్న సంస్థలకు మాత్రమే అప్పగించారు. పనులను విడివిడిగా విభజించి టెండర్లు ఆహ్వానించారు. ఇప్పుడు అందుకు భిన్నంగా.. కురుసుర సబ్మైరెన్ మ్యూజియం, కల్వరి ఫిన్, టీయూ–142 మ్యూజియం, సీ హ్యారియర్ ఎయిర్క్రాఫ్ట్, యుహెచ్–3హెచ్ మ్యూజియంల నిర్వహణకు ఒకే టెండర్ను ఆహ్వానించారు. దీనికి తోడు కాంట్రాక్టు సంస్థకు రూ.1.50 కోట్ల టర్నోవర్ ఉండాలని, రూ.75 లక్షల విలువైన ‘సింగిల్ వర్క్’ చేసిన అనుభవం తప్పనిసరి అని పేర్కొన్నారు. గత రెండేళ్లలో హౌస్కీపింగ్ పనులు చేసి ఉండాలనే షరతునూ విధించారు. అంటే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హౌస్కీపింగ్ పనుల్లో ఉన్న సంస్థలకే ఈ మ్యూజియంల నిర్వహణ బాధ్యతలు అప్పగించేలా నిబంధనలు రూపొందించారన్న ఆరోపణలకు ఈ షరతులు బలం చేకూరుస్తున్నాయి. సాధారణంగా రూ.కోటి లోపు విలువైన హౌస్కీపింగ్, మెయింటెనెన్స్ పనులకు ఇలాంటి ‘సింగిల్ వర్క్’ నిబంధన విధించడం అరుదు. మొత్తం పనులను ఒకే సంస్థకు అప్పగించాలనే ఉద్దేశంతోనే ఈ షరతులను రూపొందించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కమిషనర్ మారినా.. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ)లో టెండర్ల వ్యవహారం మారడం లేదు. గతంలో వివాదాస్పదమైన నిబంధనలతో పిలిచిన టెండర్లను రద్దు చేసినా.. ఇప్పుడు అవే షరతులతో మళ్లీ టెండర్లు ఆహ్వానించడం అధికారుల తీరుపై అనుమానాలకు తావిస్తోంది. సబ్మైరెన్, యుద్ధ విమానాలు, మ్యూజియంల నిర్వహణకు సంబంధించి ‘సాక్షి’ జూన్, జూలై నెలల్లో వరుస కథనాలు ప్రచురించడంతో అప్పటి కమిషనర్ టెండర్లను రద్దు చేశారు. కమిషనర్ బదిలీతో కథ ముగిసిందనుకుంటే.. మళ్లీ అదే నిబంధనలతో ప్రక్రియ మొదలైంది. అనుభవానికి మంగళం బీచ్రోడ్డులో కొలువుదీరిన సబ్మైరెన్, యుద్ధ విమాన మ్యూజియంలు విశాఖకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. దేశ సాహసోపేత చరిత్రను విద్యార్థులు, పర్యాటకులకు పరిచయం చేస్తున్న వీటి నిర్వహణలో సాంకేతిక నైపుణ్యం అత్యంత కీలకం. గతంలో టెండర్ నిబంధనల్లోనూ దీనికే ప్రాధాన్యం ఉండేది. యుద్ధ విమానాలు, సబ్మైరెన్లు, మ్యూజియంల నిర్వహణలో అనుభవం ఉన్న సంస్థలకే అర్హత కల్పించేవారు. ఇప్పుడు మాత్రం ఆ షరతును పక్కనపెట్టి.. కేవలం హౌస్కీపింగ్ పనులు చేసిన అనుభవం ఉంటే సరిపోతుందనే నిబంధనను తీసుకొచ్చారు. ఇదే అంశంపై ‘సాక్షి’ కథనాలు ప్రచురించడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అప్పటి కమిషనర్ టెండర్లను రద్దు చేశారు. తాజాగా మళ్లీ అదే అర్హతను కొనసాగిస్తూ టెండర్లకు ఆహ్వానం పలకడం గమనార్హం. ‘వీఎంఆర్డీఏ డెక్’లోనూ అవే షరతులు ‘వీఎంఆర్డీఏ డెక్’ నిర్వహణ టెండర్లోనూ ఇదే తరహా నిబంధనలు కనిపిస్తున్నాయి. మ్యూజియంల నిర్వహణకు పెట్టిన షరతులతోనే పోలిన అర్హతలను ఇక్కడా చేర్చడం.. ఒకే సంస్థకు అనుకూలంగా టెండర్ ప్రక్రియను రూపొందిస్తున్నారన్న అనుమానాలకు బలం చేకూరుస్తోంది. గతంలో వివాదాస్పద నిబంధనలతో పిలిచిన టెండర్లను రద్దు చేసినా.. కొత్త కమిషనర్ వచ్చిన తర్వాత వాటినే మళ్లీ అమలు చేయడం వెనుక ఆంతర్యమేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కీలకమైన మ్యూజియంల నిర్వహణ విషయంలో నాణ్యత, సాంకేతిక అనుభవానికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా హౌస్కీపింగ్ అనుభవాన్ని ప్రామాణికంగా తీసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టెండర్ ప్రక్రియలో పోటీని పెంచాల్సిన అధికారులు.. ప్రత్యేక నిబంధనలతో పోటీని పరిమితం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీఎంఆర్డీఏ టెండర్లలో కొనసాగుతున్న అడ్డగోలు పర్వం యుద్ధ విమానాల టెండర్లపై వీడని బెట్టు తమ అనుయాయులకు కట్టబెట్టేందుకు మళ్లీ అవే నిబంధనలు గతంలో టెండర్లు రద్దు చేసిన కమిషనర్ కమిషనర్ బదిలీ అయినా.. అవే కండిషన్లతో మళ్లీ టెండర్లు -
వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల్లో పలువురికి చోటు
మహారాణిపేట: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల కమిటీల్లో పలువురికి చోటు కల్పించారు. రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీలో ఇద్దరికి, జిల్లా అనుబంధ విభాగాల కమిటీల్లో ఆరుగురికి పదవులు కేటాయించారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర వాణిజ్య విభాగం వైస్ ప్రెసిడెంట్గా కుల్లికూరి మంగరాజు (గాజువాక), రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా కంబాల సందీప్ (విశాఖ తూర్పు)ను నియమించారు. అదేవిధంగా జిల్లా అనుబంధ విభాగాల ఎస్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్గా శీరం రమణ (గాజువాక), వలంటీర్ విభాగం వైస్ ప్రెసిడెంట్గా గొండేసి రామిరెడ్డి (గాజువాక), గ్రీవెన్స్ సెల్ ప్రధాన కార్యదర్శిగా కామిరెడ్డి వెంకటరెడ్డి (గాజువాక), జిల్లా ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ విభాగం కార్యదర్శిగా బోయిడపు బాబురావు (గాజువాక), జిల్లా వాణిజ్య విభాగం కార్యదర్శిగా కె. నీలాద్రిరెడ్డి (గాజువాక), జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శిగా పెద్దింటి మహేష్ (విశాఖ నార్త్)ను నియమించారు. -
వరలక్ష్మీ నమోస్తుతే
సింహాచలం: సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి క్షేత్రంలో శుక్రవారం జరిగిన ఉచిత సామూహిక వరలక్ష్మీవ్రతాలకు మహిళలు పోటెత్తారు. మొత్తం మూడు వేదికలపై నాలుగు బ్యాచ్ల్లో జరిగిన వ్రతాల్లో 6,150 మంది మహిళలు పాల్గొని, భక్తి శ్రద్ధలతో ఆచరించారు. లక్ష్మీదేవి నామస్మరణలో మునిగితేలారు. సింహగిరిపై ఆలయ ఉత్తర రాజగోపురం ఎదురుగా ఉన్న వార్షిక కల్యాణోత్సవ ప్రాంగణం, కొత్తగా నిర్మించిన క్యూకాంప్లెక్స్, పీఏసీ బిల్డింగ్లో నాలుగు వేదికలు ఏర్పాటు చేసి లక్ష్మీదేవి విగ్రహాలను వేంజేపచేశారు. ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నాలుగు బ్యాచ్ల్లో వరలక్ష్మీవ్రతాలు నిర్వహించారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, మండపారాధన, కలశారాధన, అష్టోత్తర శత కుంకుమ పూజలు ఘనంగా జరిపారు. మహిళల చేత లక్ష్మీదేవి అష్టోత్తర శతనామాలను పఠింపజేస్తూ అర్చకులు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరింపజేశారు. అనంతరం శ్రావణ మంగళ గౌరీదేవి వ్రత కథ వివరించారు. పూజలో పాల్గొన్న మహిళలకు దేవస్థానం ఉచితంగా పసుపు కుంకుమలు, మట్టి కలశం, గాజులు, రవికెలు, స్వామివా రి రాగి మాడ, కొబ్బరికాయలు, ప్రసాదం అందజేసింది. కొండ దిగువ నుంచి సింహగిరిపైకి, సింహగిరి నుంచి కొండదిగువకు దేవస్థానం బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించారు. ఉచితంగా స్వామివారి దర్శనాన్ని, అన్నప్రసాద భవనంలో భోజనాన్ని అందజేశా రు. దేవస్థానం ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసా చార్యులు, కరి సీతారామాచార్యుల పర్యవేక్షణలో అర్చకులు, వేద పడింతులు, వేద పాఠశాల విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ సతీమణితోపాటు, దేవస్థానం ట్రస్ట్బోర్డు సభ్యులు కరక దేముడు, ఉషశ్రీ, మధుపాడ సన్యాసిరావు పాల్గొన్నారు. దేవస్థానం ఈవో వెంకటరావు ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
వినాయక మండపం పనుల్లో విషాదం
పనులు చేస్తుండగా జారిపడి వ్యక్తి మృతి మల్కాపురం: వినాయక మండపం ఏర్పాటు పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. 58వ వార్డు పిలకవానిపాలెం ప్రాంతంలో వినాయక చవితి ఉత్సవాలకు మండపం పనులు జరుగుతున్నాయి. రాడ్ బెండింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కాకి వేణు (54) గురువారం రాత్రి ఐదు అడుగుల ఎత్తులో ఉండి మండపానికి అవసరమైన కర్రలను కడుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ కిందకు జారిపడటంతో తల వెనుక భాగంలో తీవ్ర గాయమైంది. స్థానికులు వెంటనే సెయింట్ ఆన్స్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయంపై గాజువాక పోలీసులకు సమాచారం అందించారు. -
చినుకు పలకరించే.. నగరి పులకరించే!
సాక్షి, విశాఖపట్నం : బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం నుంచే ఆకాశం దట్టంగా మేఘావృతమై.. నగరమంతటా ఎడతెరిపి లేకుండా ముసురులా వర్షం కురిసింది. భానుడి భగభగలతో విలవిల్లాడిన సాగరతీర నగరాన్ని చిరుజల్లులు పలకరించడంతో ప్రకృతి ఒక్కసారిగా పులకరించింది. బుధవారం అర్ధరాత్రి నుంచే మొదలైన వాన గురువారం ఉదయం వరకు కొనసాగింది. దీంతో విధులకు, పాఠశాలలకు వెళ్లే వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని రహదారులపైకి స్వల్పంగా నీరు చేరడంతో అక్కడక్కడ వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ నెమ్మదించింది. అల్పపీడనం ప్రభావంతో రానున్న మరికొన్ని గంటల్లో నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఒకటి రెండు చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. -
బిజినెస్ ఎక్స్పోలో సీడబ్ల్యూసీ సేవలు
అల్లిపురం: గిడ్డంగులు, లాజిస్టిక్స్ సేవలు, వ్యాపార అవకాశాలపై దృష్టి సారిస్తూ కేంద్ర గిడ్డంగుల సంస్థ (సీడబ్ల్యూసీ) ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్పోలో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసింది. నగరంలో శుక్రవారం నుంచి ఈ నెల 13 వరకు జరుగుతున్న ఎక్స్పోలో సీడబ్ల్యూసీ, ప్రాంతీయ కార్యాలయం–అమరావతి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అందిస్తున్న సేవలను ప్రదర్శిస్తోంది. రాష్ట్రంలోని 35 ప్రాంతాల్లో సుమారు 9.77 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంతో సీడబ్ల్యూసీ సేవలు అందిస్తోంది. ఆధునిక శాసీ్త్రయ గిడ్డంగులతో పాటు రోడ్డు రవాణా, కంటైనర్ రైలు లాజిస్టిక్స్, సరకు నిర్వహణ, పెస్ట్ కంట్రోల్, ధాన్య నాణ్యత పరీక్షలు, ఇతర విలువ ఆధారిత సేవలను అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. -
కవితకు ‘మహిళా మారిటైమ్ లీడర్షిప్ అవార్డు’
సింథియా: హిందూస్తాన్ షిప్యార్డ్ లిమిటెడ్లో సీనియర్ మేనేజర్ (ప్లానింగ్)గా పనిచేస్తున్న ఆదితమ్ కవిత ప్రతిష్టాత్మక ఐటీ ఇన్ఫ్రా గ్లోబల్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ అవార్డ్స్–2026లో ‘ఉమెన్ ఇన్ మారిటైమ్ లీడర్షిప్’ అవార్డును అందుకున్నారు. సముద్ర పరిశ్రమ, నౌకానిర్మాణ రంగాల్లో విశేష నాయకత్వం, వృత్తిపరమైన ప్రతిభ, నూతన ఆవిష్కరణలు, సేవలు అందిస్తున్న మహిళా నాయకులకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. దాదాపు రెండు దశాబ్దాలుగా డిజైన్, బిజినెస్ డెవలప్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో కవిత అందించిన సేవలను గుర్తించి ఈ గౌరవం దక్కిందని హెచ్ఎస్ఎల్ వర్గాలు తెలిపాయి. -
టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరంనకు విశేష స్పందన
అల్లిపురం: జీవీఎంసీ పరిధిలో ఏపీడీపీఎంఎస్, ఎల్ఆర్ఎస్, టీడీఆర్ పెండింగ్ సమస్యల పరిష్కారానికి నిర్వహించిన ప్రత్యేక టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరంనకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. గురు, శుక్రవారాల్లో నిర్వహించిన ఫోరంలో మొత్తం 438 వినతులు అందగా, అందులో 237 అర్జీలు పరిష్కరించినట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఏపీడీపీఎంఎస్కు సంబంధించి 100, ఎల్ఆర్ఎస్కు 304, టీడీఆర్పై 34 వినతులు అందాయి. పరిష్కరించిన వాటిలో ఏపీడీపీఎంఎస్ 124, ఎల్ఆర్ఎస్ 95, టీడీఆర్ 18 ఉన్నాయి. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా పెండింగ్ సమస్యలను ఒకేచోట పరిష్కరించేందుకు ప్రత్యేక ఫోరం ఏర్పాటు చేసినట్లు కమిషనర్ కేతన్గార్గ్ ఈ సందర్భంగా0 తెలిపారు. అందిన ప్రతి అర్జీని నిబంధనల మేరకు క్షుణ్ణంగా పరిశీలించి, అనవసర జాప్యానికి తావులేకుండా పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న అంశాలను నిరంతరం పర్యవేక్షించి సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. రెండు రోజుల్లో 438 వినతులు.. 237 దరఖాస్తుల పరిష్కారం -
నీటి కొరతపై సమన్వయ చర్యలు చేపట్టాలి
బీచ్రోడ్డు: నగరంలో తాగునీటి సమస్యను అధిగమించేందుకు అందుబాటులో ఉన్న జలవనరులను సమర్థంగా వినియోగించాలని ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ సూచించారు. శుక్రవారం వీఎంఆర్డీఏ కార్యాలయంలో నగర తాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. రైవాడ, ఏలేరు, మేఘాద్రిగెడ్డ జలాశయాల్లోని నీటిని సమర్థంగా వినియోగించాలని, జీవీఎంసీ, సాగునీటి శాఖలు సమన్వయంతో పనిచేయా లని ఆదేశించారు. నీటి కొరత ఉన్న ప్రాంతాలను ముందుగా గుర్తించి ట్యాంకర్ల ద్వారా సరఫరా పెంచాలని సూచించారు. ఏలేరు కాలువలో పూడికతీత పనులు పూర్తయితే నీటి ప్రవాహం పెరుగుతుందని అధికారులు వివరించారు. వచ్చే ఏడాది జూన్ వరకు నగరానికి అవసరమైన నీటి నిల్వపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ విప్ గణబాబు, ఎమ్మెల్యేలు గ పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల రమేష్బాబు, కొణతాల రామకృష్ణ, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పాల్గొన్నారు. -
ప్రేమకు అడ్డుగా ఉందనే..
అల్లిపురం: చెల్లెలి ప్రేమ వ్యవహారాన్ని వ్యతిరేకించిందన్న కక్షతోనే ఫార్మసిస్ట్పై హత్యాయత్నం జరిగినట్లు నిర్ధారణైంది. అల్లిపురంలో గత బుధవారం గంగ తన ఇంట్లో అపస్మారక స్థితిలో ఉండటానికి వెనుక ఉన్న మిస్టరీని రెండో పట్టణ పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి శుక్రవారం టూటౌన్ పోలీస్ స్టేషన్లో మీడియాకు వెల్లడించారు. ప్రేమను వ్యతిరేకించిందని.. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన మండంగి తులసమ్మ కుమార్తె మండంగి గంగ (34) రామ్నగర్లోని అపోలో ఫార్మసీలో గత ఎనిమిదేళ్లుగా ఫార్మసిస్ట్గా పనిచేస్తోంది. ఆమె భానోజ్నగర్లోని అగర్వాల్ ఆస్పత్రి డౌన్లో తన చెల్లెలు చంద్రమ్మతో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తోంది. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలానికి చెందిన బిసాయి ప్రదీప్కు గంగ చెల్లెలు చంద్రమ్మతో ప్రేమ వ్యవహారం ఉంది. దీనిని అక్క గంగ తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో ప్రదీప్ ఆమైపె కక్ష పెంచుకున్నాడు. గంగను అడ్డు తొలగించుకుంటేనే తాము ఒక్కటవుతామని భావించిన నిందితుడు ఆమెను హత్య చేయాలని పథకం పన్నాడు. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి.. గత మంగళవారం అర్ధరాత్రి సుమారు 12:30 గంటల సమయంలో గంగ ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న సమయాన్ని ప్రదీప్ ఆసరాగా చేసుకున్నాడు. ఎవరికీ తెలియకుండా ఇంట్లోకి ప్రవేశించి, తన వెంట తెచ్చుకున్న షూ లేస్తో ఆమె మెడకు బిగించాడు. అనంతరం చేతులను వెనక్కి కట్టి హత్య చేయడానికి ప్రయత్నించాడు. గంగ స్పృహ కోల్పోయి మృతి చెందిందని భావించి నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. చికిత్స పొందుతున్న బాధితురాలు.. బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో గంగ ఆరోగ్యం విషమంగా ఉందన్న సమాచారంతో కుటుంబ సభ్యులు ఆమెను అపోలో ఆస్పత్రికి తరలించారు. గంగ మెడపై తాడు బిగించిన ఆనవాళ్లు, తలకు చుట్టిన టవల్పై రక్తపు మరకలు ఉండటంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి తల్లి మండంగి తులసమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం గంగ అపోలో ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రత్యేక బృందాలతో నిందితుడి అరెస్ట్ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాక్షులను విచారించడంతో పాటు పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, సీడీఆర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. నిందితుడిని పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడి ఆచూకీని గుర్తించి, అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బిసాయి ప్రదీప్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. ఈ సమావేశంలో టూటౌన్ సీఐ బండారు అప్పలనాయుడు, మహారాణిపేట సీఐ జి.గోవిందరావు పాల్గొన్నారు. -
బ్యాంకర్ల గళం.. కేంద్రానికి సెగ
బీచ్రోడ్డు/విశాఖ విద్య : బ్యాంకు ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జాతీయ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య ఉప ప్రధాన కార్యదర్శి ఎ.సుష్మ డిమాండ్ చేశారు. శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. బ్యాంకు సంఘాల ఐక్య వేదికలో కీలక భాగస్వామిగా ఉన్న జాతీయ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య మూడు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచిందని సుష్మ తెలిపారు. ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం డిమాండ్ కొత్తది కాదన్నారు. 2015 ఒప్పందంలోనే రెండో, నాలుగో శనివారాలకు సెలవులు ప్రకటించారని, మిగిలిన శనివారాలకు కూడా సెలవులు కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. 2024 మార్చిలో జరిగిన ఒప్పందంలో బ్యాంకుల సంఘం ఇందుకు అంగీకరించిందన్నారు. దీనికి ప్రతిగా ఉద్యోగులు సోమవారం నుంచి శుక్రవారం వరకు 40 నిమిషాలు అదనంగా పనిచేసేందుకు అంగీకరించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏకీకృత పెన్షన్ పథకం ద్వారా హామీ పెన్షన్ అవసరాన్ని కేంద్రం గుర్తించినప్పుడు, బ్యాంకు ఉద్యోగులకు ఎందుకు వర్తింపజేయకూడదని ఆమె ప్రశ్నించారు. పదవీ విరమణ తేదీతో సంబంధం లేకుండా అన్ని పెన్షనర్లకు 8,088 పాయింట్ల వరకు కరువు భత్య విలీన ప్రయోజనం, కొత్త ధరల సూచీ ప్రయోజనాలను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు సీఐటీయూ మద్దతు దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు సీఐటీయూ జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సమ్మె సందర్భంగా జీవీఎంసీ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేవీఎస్ కుమార్ మాట్లాడుతూ.. బ్యాంకు ఉద్యోగులు చాలా కాలంగా కోరుతున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఐక్య పోరాటాల ద్వారానే ప్రభుత్వ విధానాలను ఎదుర్కొనగలమన్నారు. కార్మికులు, ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఎక్కడ పోరాడినా సీఐటీయూ వారికి సంఘీభావంగా నిలుస్తుందని తెలిపారు. సీతమ్మధారలో.. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు సీతమ్మధార యూనియన్ బ్యాంక్ ఇండియా కార్యాలయం వద్ద ఉద్యోగులు, అధికారులు సమ్మెలో పాల్గొన్నారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కన్వీనర్ ఆర్.వసంతరావు,సీపీఐ కార్యదర్శి సత్యనారాయణ మూర్తి యూనియన్స్ నాయకులు అచ్యుతరావు, త్రినాథ్, రాజు, మహేంద్ర, కమలాకర్, రమేశ్, ఏటా ప్రసాద్, రవి, ఆడారి శ్రీనివాస్, స్వాతి, ప్రత్యూష, వైశాలి, ఆటో యూనియన్ నేత పడాల గోవింద్ పాల్గొన్నారు. -
తండ్రి లేని లోటు భరించలేక.. సాఫ్ట్వేర్ ఉద్యోగి బలవన్మరణం
మధురవాడ: తండ్రి మరణం తీరని విషాదంగా మిగిలింది. ఆ బాధ నుంచి కోలుకోలేక ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మారికవలసలో చోటుచేసుకున్న ఈ ఘటన విషాదాన్ని నింపింది. పీఎంపాలెం పోలీసుల వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా ఎస్.కోటకు చెందిన గోర్లపల్లి చైతన్య (29)కు అనకాపల్లి జిల్లా అడ్డురోడ్డుకు చెందిన ఝాన్సీ (23)తో 2025లో వివాహమైంది. వీరు మారికవలస విశ్వనాథ్ అవెన్యూలోని 202వ ఫ్లాట్లో నివాసం ఉంటున్నారు. చైతన్య ఇన్ఫోసిస్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తూ వర్క్ ఫ్రం హోమ్ విధులు నిర్వహిస్తున్నాడు. సుమారు తొమ్మిది నెలల క్రితం తండ్రి రవికుమార్ మృతి చెందడంతో చైతన్య తీవ్రంగా కుంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. తండ్రితో ఉన్న అనుబంధాన్ని మరచిపోలేక బాధపడుతున్న చైతన్యకు భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్నపాటి మనస్పర్థలు కూడా మానసిక ఒత్తిడిని పెంచినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గురువారం రాత్రి భార్యాభర్తలిద్దరూ బెడ్రూమ్లోకి వెళ్లారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఝాన్సీ నిద్రలేచి చూడగా చైతన్య కనిపించలేదు. మరో బెడ్రూమ్లోకి వెళ్లి చూడగా తలుపు గడియపెట్టి ఉంది. ఎన్నిసార్లు తలుపు కొట్టినా స్పందించకపోవడంతో ఇరుగుపొరుగు వారి సహాయంతో తలుపు బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ చైతన్య ఫ్యాన్కు ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు. వెంటనే సమాచారం అందించడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. తన భర్త మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని ఝాన్సీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కోటి గాజులు.. 117 అడుగులు
కోటి గాజులతో, 117అడుగుల్లో దివ్య కంకణ అలంకార మహాగణపతి గాజువాక శ్రీనగర్లో కొలువుదీరనున్నారు. 120 అడుగుల ఎత్తున్న మండపంలో టిప్పరు మట్టి, 400 వెదురు బొంగులతో అనకాపల్లి జిల్లాకు చెందిన ఆరిపాక కృష్ణ ఆధ్వర్యంలో 26మంది కళాకారులు రెండు నెలలుగా ఈ విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. యమలోకం సెట్, డైనోసర్ పార్కు కూడా తీర్చిదిద్దారు. ఇక్కడ రవిచంద్ర ఆర్ట్స్ రూపొందించిన ఏఐ వినాయకుడి విగ్రహం భక్తులతో మాట్లాడనుంది. ఎస్వీ ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ భారీ వినాయకుడికి ప్రతిష్టించిన చోటే అనుపు మహోత్సవం మహోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు కొసిరెడ్డి గణేష్, కొసిరెడ్డి పృథ్వి తెలిపారు. – గాజువాక – గాజువాకలో భారీ గణపతి -
మట్టి వినాయకులతో పర్యావరణానికి మేలు
మహారాణిపేట: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి పిలుపునిచ్చారు. వినాయక చవితి సందర్భంగా పర్యావరణానికి హాని కలిగించే రసాయన రంగులు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా సహజసిద్ధమైన మట్టి ప్రతిమలను వినియోగించాలని సూచించారు. కలెక్టరేట్లోని ఉద్యోగులకు గురువారం ఆమె మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేసి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హిత వినాయక ప్రతిమలను వినియోగించి.. ఆదర్శంగా నిలవాలని కోరారు. అనంతరం మట్టి గణపతి ప్రతిమల పోస్టర్ను జేసీ ఆవిష్కరించారు. పీసీబీ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలు సమకూర్చారు. కార్యక్రమంలో పీసీబీ ఈఈ ముకుందరావు, కలెక్టరేట్ ఏవో బీవీ రాణి, వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఉచితం కాదు షరతుల మయం!
సాక్షి, విశాఖపట్నం: ‘గణేష్ మండపాలకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నాం’.. ఈ ప్రకటన వినడానికి ఎంతో సంతోషంగా ఉన్నా, ఆ ‘ఉచితం’ వెనుక అధికారులు విధించిన షరతులు చూస్తే ఉత్సవ కమిటీలకు కరెంట్ షాక్ తగులుతోంది. భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా పండుగ చేసుకుందామనుకున్న భక్తులపై భద్రత పేరుతో మోయలేని భారాన్ని మోపుతున్నారు. క్షేత్రస్థాయికి ఏమాత్రం పొంతనలేని, ఆచరణ సాధ్యంకాని నిబంధనలతో సామాన్యుల ఉత్సాహంపై చన్నీళ్లు చల్లుతున్నారు. పండుగ పూట వెలుగులు నింపాల్సిన విద్యుత్ శాఖ.. తాము విధించిన షరతులతో మండపాల నిర్వాహకులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పరిమితి దాటితే భారీ బిల్లులు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీఈపీడీసీఎల్ వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా ప్రకటనైతే చేసింది కానీ, అందులో విధించిన ఆంక్షలు చూస్తే ఎవరైనా విస్తుపోవాల్సిందే. గ్రామీణ ప్రాంతాల్లో 3 కిలోవాట్లు, పట్టణాల్లో 5 కిలోవాట్లు మాత్రమే లోడ్కు అనుమతిస్తామని షరతు పెట్టింది. సాధారణంగా మండపాల వద్ద కాంతి, ధ్వని ఏర్పాట్లు కాస్త భారీగానే ఉంటాయి. ఈ కొద్దిపాటి లోడ్ ఆ అలంకరణలకు ఏమాత్రం సరిపోదు. ఒకవేళ ఆ పరిమితి దాటితే సాధారణ తాత్కాలిక కనెక్షన్ కింద ఛార్జీలు వసూలు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఉచితం పేరుతో చివరకు భారీ బిల్లులు కట్టక తప్పదన్న ఆందోళన ఉత్సవ కమిటీల్లో నెలకొంది. కార్యాలయాల చుట్టూ తిరగక తప్పదు ఈ ’ఉచిత’ కనెక్షన్ పొందడం అంత తేలికై న వ్యవహారమేమీ కాదు. దీనికోసం నిర్వాహకులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందే. నిర్ణీత నమూనాలో వివరాలు నమోదు చేసి, అనుమతులు తీసుకుంటేనే కనెక్షన్ ఇస్తారు. అలా కాకుండా అనధికారికంగా విద్యుత్తు వాడితే దొంగతనం కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. పండుగ ఏర్పాట్ల హడావుడిలో ఉండే యువతకు దరఖాస్తుల ప్రక్రియ, ఆఫీసుల చుట్టూ తిరగడం అదనపు భారంగా మారింది. సామాన్య భక్తులకు గుదిబండ వీధుల్లో చిన్నపాటి మండపాలు ఏర్పాటు చేసే సామాన్యులపైనా విద్యుత్ శాఖ ఖరీదైన నిబంధనలు రుద్దుతోంది. డిస్ట్రిబ్యూషన్ బోర్డులు వాటర్ప్రూఫ్గా ఉండాలని, వాటిలో ఎంసీబీ లేదా ఈఎల్సీబీలతో పాటు తగిన సామర్థ్యం ఉన్న ఫ్యూజ్ వాడాలని స్పష్టం చేసింది. స్థానికంగా తెలిసిన వారితో తక్కువ ఖర్చుతో పనులు చేయించుకునేవారికి ఈ భద్రతా ఏర్పాట్లు తలకు మించిన ఆర్థిక భారంగా పరిణమించాయి. క్షేత్రస్థాయి పరిస్థితులకు ఏమాత్రం పొంతనలేని విధంగా ఈపీడీసీఎల్ ఎర్తింగ్ నిబంధనలున్నాయి. ప్రతి మండపానికి తప్పనిసరిగా ప్రత్యేక ఎర్తింగ్ ఉండాలని, ఆ రాడ్ తడి నేలలో పాతాలని అధికారులు ఆదేశించారు. కాంక్రీట్ రోడ్లు, ఇరుకై న అపార్ట్మెంట్ల మధ్య వెలిసే మండపాలకు నగరాల్లో తడి నేల ఎక్కడినుంచి తేవాలని నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. వెలుగులపైనా ఆంక్షలే.. వినాయక మండపాలుండే వీధుల్లో చేసే విద్యుత్ అలంకరణలపైనా అధికారుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. పాత బల్బులు వాడకూడదని, కేవలం ఎల్ఈడీలే వినియోగించాలని హుకుం జారీ చేశారు. ఐఎస్ఐ మార్క్ ఉన్న నాణ్యమైన వైర్లనే వాడాలని, జాయింట్లు లేకుండా ఇన్సులేషన్ టేపులు వేయాలని స్పష్టం చేశారు. సీరియల్ సెట్లు, లైట్లు గోడలకు నేరుగా తగలకుండా ఏర్పాటు చేయడం, మల్టీ–ప్లగ్ ఓవర్లోడింగ్ చేయకూడదని చెప్పడం నిర్వాహకులను అయోమయానికి గురిచేస్తోంది. ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యతంతా నిర్వాహకులపై నెట్టేసే విధంగా విద్యుత్ శాఖ అధికారులు చేతులు దులుపుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
● మట్టి పరిమళం.. ముత్యాలశోభ
ప్రకృతికి, మానవ జీవనానికి నడుమ ఉన్న అవినాభావ సంబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించే పర్వదినం వినాయక చవితి. మరో నాలుగు రోజుల్లో ఆ గణనాథుడి ఆగమనం అనగానే, ఊరూ..వాడా ఆధ్యాత్మిక శోభతో పరవశిస్తోంది. ప్రకృతే మన మూలం.. ప్రకృతిలోనే మన గమ్యం అనే జీవన సత్యాన్ని చాటుతూ మృణ్మయ రూపాన్ని మలచడంలో కొందరు కళాకారులు నిమగ్నం కాగా.. సృజనాత్మకతకు కొత్త రంగులు అద్దుతూ విభిన్నంగానూ విగ్రహాలు రూపొందుతున్నాయి. కేవలం మట్టికే పరిమితం కాకుండా, అంబరమంత భక్తితో సాగర గర్భాన లభించే గవ్వలను అపురూపమైన బొజ్జ గణపయ్యగా తీర్చిదిద్దుతున్నారు. ఇక స్వచ్ఛతకు ప్రతీక అయిన అమూల్యమైన ముత్యాలను పేర్చి దైవిక కాంతులు వెదజల్లే ఏకదంత రూపాలకూ ప్రాణం పోస్తున్నారు. ఇలా మట్టి పరిమళం నుంచి ముత్యాల శోభ వరకు భిన్న ఆకృతుల్లో సిద్ధమవుతున్న పార్వతీ నందనుడికి స్వాగతం పలికేందుకు నగరమంతా ముస్తాబవుతోంది. – ఫొటోలు: సాక్షి, ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం ఫ్యాంట్, షర్ట్తో మోడర్న్ గణేశుడుహయగ్రీవుడి ఒడిలో బుజ్జి గణపతి సైకిల్పై స్వారీకి సిద్ధం.. భిన్న ఆకృతుల్లో బొజ్జ గణపయ్య -
సాగర తీరంలో స్వచ్ఛత అభియాన్
ఏయూ క్యాంపస్: సాగర తీరంలో స్వచ్ఛత అభియాన్ కార్యక్రమంలో ఐఏటీవో సభ్యులు పాల్గొన్నారు. ఆర్.కె బీచ్ వద్ద సముద్ర తీరంలో ఉన్న వ్యర్ధాలను ఏరివేసి గురువారం స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. విశాఖ వేదికగా జరుగుతున్న ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (ఐఏటీవో) వార్షిక సమ్మేళనంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఐఏటీవో సభ్యులు పెద్దసంఖ్యలో పాల్గొని సాగర తీరంలో ఉన్న పాలిథిన్ కవర్లు, ప్లాస్టిక్ సీసాలు, ఇతర వ్యర్థాలను ఏరివేసి జీవీఎంసీ సిబ్బందికి అందజేశారు. ఐఏటీవో అధ్యక్షుడు రవి గోసైన్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రజనీష్ కై స్థా, వైస్ ప్రెసిడెంట్ సంయజ్ రజ్ఞాన్, ఏిపీ టూరిజం అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
సర్కారు ఉదాసీనత– అధికారుల నిర్లక్ష్యం
విశాఖలో కాలుష్యానికి వాతావరణంలో వస్తున్న మార్పులే కారణమంటూ ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు బాధ్యతల నుంచి తప్పుకునే ప్రయత్నంలా ఉన్నాయని ప్రజలు మండిపడుతున్నారు. పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలను గాలికొదిలేశారన్న విమర్శలు వస్తున్నాయి. పరిశ్రమలు కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటిస్తున్నాయా లేదా అని తనిఖీ చేయాల్సిన ఏపీపీసీబీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కాలుష్య నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోకపోతే విశాఖ నగరం మరో ‘ఢిల్లీ’గా మారే ప్రమాదముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
విషపట్నం
నగరంలో కమ్ముకుంటున్న కాలుష్య మేఘాలు ‘స్వచ్ఛ వాయు సర్వేక్షణ్’లో 21వ స్థానానికి పడిపోయిన నగరం ప్రతి 10 రోజుల్లో 7 రోజులు విషవాయువులే పీలుస్తున్న విశాఖవాసులు కాలుష్య నియంత్రణను గాలికొదిలేసిన ప్రభుత్వం వాతావరణ మార్పులే కారణమంటూ వింతవాదనలు సాక్షి, విశాఖపట్నం: ఒకవైపు సాగర తీరపు ప్రకృతి అందాలు.. మరోవైపు ఉక్కిరిబిక్కిరి చేసే పారిశ్రామిక ఉద్గారాలు! పచ్చదనానికీ, కాలుష్యానికీ మధ్య ఏళ్లుగా నడుస్తున్న పోరాటంలో విశాఖపట్నం మెల్లమెల్లగా విషవాయువుల వలయంలోకి జారుకుంటోంది. నగరంలో రోజురోజుకూ దిగజారుతున్న గాలి నాణ్యతే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ‘స్వచ్ఛ వాయు సర్వేక్షణ్–2026’ నివేదికలో విశాఖపట్నం 172 పాయింట్లతో ఏకంగా 21వ స్థానానికి దిగజారిపోవడం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అభివృద్ధి, సంపద సృష్టి జపంతో అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం.. ప్రజల ప్రాణవాయువును కాపాడటంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పరిశ్రమలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో విశాఖవాసుల ఆరోగ్యానికి గ్యారెంటీ కరువైంది. ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ’పీఎం’ లెవెల్స్ నగరంలో గాలి నాణ్యతను సూచించే సూక్ష్మ ధూళి కణాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. సాధారణంగా గాలిలో పీఎం–10 కణాలు 60 మైక్రోగ్రాములు/క్యూబిక్ మీటర్, పీఎం–2.5 కణాలు 40 మైక్రోగ్రాములు/క్యూబిక్ మీటర్ లోపు ఉండాలి. కానీ, విశాఖలోని పారిశ్రామిక ప్రాంతాలు, పోర్టు పరిసరాలు, కంచరపాలెం, జ్ఞానాపురం, గాజువాక వంటి ప్రాంతాల్లో ఇవి నిత్యం 100 నుంచి 150 మార్కును దాటుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పీఎం–10 సగటు 84 ఉంటే, ఒక్క విశాఖలోనే అది 140 దాటుతుండటం గమనార్హం. అలాగే, నైట్రోజన్ డయాకై ్సడ్ రాష్ట్ర సగటు 23 మైక్రోగ్రాములు/క్యూబిక్ మీటర్లు ఉండగా, విశాఖలో అత్యధికంగా 47.41గా నమోదైంది. అత్యంత ప్రమాదకరమైన పీఎం–2.5 కణాలు గాలిలో విపరీతంగా కలిసిపోతుండటంతో నగర ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తరచూ ‘పూర్’ కేటగిరీలోనే కనిపిస్తోంది. కాలుష్యానికి ప్రధాన కారణాలు బొగ్గు, ముడిసరుకుల రవాణా : విశాఖ పోర్టు నుంచి బొగ్గు, ఐరన్ ఓర్ వంటి ముడిసరుకులను రవాణా చేయడం వల్ల విపరీతంగా ధూళి రేగుతోంది. పారిశ్రామిక ఉద్గారాలు : ఫార్మాసిటీ, పరవాడ, స్టీల్ప్లాంట్ వంటి భారీ పరిశ్రమల నుంచి నిరంతరం విషవాయువులు, రసాయన ఉద్గారాలు గాలిలో చేరుతున్నాయి. వాహనాల రద్దీ ..రోడ్డు దుమ్ము: నగరంలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరగడం, రోడ్లపై పేరుకుపోతున్న దుమ్మును తొలగించకపోవడం మరో ప్రధాన కారణం. గతంలో ఈ దుమ్మును అరికట్టేందుకు క్రమం తప్పకుండా రోడ్లపై నీళ్లు చల్లడం, యాంటీ స్మాగ్ గన్స్ ఉపయోగించడం వంటి చర్యలు చేపట్టేవారు. ప్రస్తుతం అటువంటి చర్యలేవీ నగరంలో కనిపించడం లేదు. -
ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
కాలుష్యం పంజా విసరడంతో విశాఖ ప్రజలు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారు. అతి సూక్ష్మమైన పీఎం–2.5 కణాలు శ్వాస ద్వారా నేరుగా ఊపిరితిత్తులు, రక్తంలోకి ప్రవేశిస్తుండటంతో శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నాయి. ఆస్తమా, బ్రోంకై టిస్, అలర్జీలు, కంటి మంటల సమస్యలతో ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు ఈ కాలుష్య గాలిని పీల్చి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేజీహెచ్, ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రుల్లో నమోదవుతున్న ఓపీ కేసులే ఇందుకు సజీవ సాక్ష్యం. -
1,600 మంది ఖైదీలు.. 201 మందే సిబ్బంది
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారం ఉద్యోగుల కొరతతో సతమతమవుతోంది. అవసరమైన స్థాయిలో సిబ్బంది లేకపోవడంతో పరిపాలన, పర్యవేక్షణ విధుల నిర్వహణ ఇబ్బందికరంగా మారింది. ఓవైపు జైలు సామర్థ్యానికి మించి ఖైదీలు ఉండగా, మరోవైపు వారిని పర్యవేక్షించేందుకు సరిపడా సిబ్బంది లేకపోవడం సవాలుగా మారింది. ప్రస్తుతం కేంద్ర కారాగారంలో 47 మంది ఉద్యోగుల కొరత ఉంది. జైలు సామర్థ్యం ప్రకారం 914 మంది ఖైదీలు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం సుమారు 1,600 మంది ఉన్నారు. వీరిలో దాదాపు 60 శాతం మంది గంజాయి కేసుల్లో ఉన్న ఖైదీలే ఉన్నారు. మిగిలిన వారిలో శిక్ష పడిన ఖైదీలు, ఇతర నేరాల్లో రిమాండ్లో ఉన్నవారు ఉన్నారు. జైలు సామర్థ్యానికి అనుగుణంగా 248 మంది ఉద్యోగులు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 201 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. జైలు పర్యవేక్షణాధికారి నుంచి వార్డర్లు, వైద్య సిబ్బంది, మినిస్టీరియల్ సిబ్బంది, ఇన్స్ట్రక్టర్ల వరకు వివిధ స్థాయిల్లో ఖాళీలు ఉన్నాయి. కొన్నేళ్లుగా జైలు శాఖలో ఉద్యోగాల భర్తీ జరగకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని ఉద్యోగులు చెబుతున్నారు. సామర్థ్యానికి మించి ఖైదీలు ఉన్నప్పటికీ, అందుకు తగిన సంఖ్యలో సిబ్బంది లేకపోవడం వల్ల విధుల నిర్వహణ భారంగా మారిందని పేర్కొంటున్నారు. వివిధ విభాగాల్లో ఖాళీలు ఇలా.. ఎగ్జిక్యూటివ్ విభాగంలో అడిషనల్ సూపరింటిండెంట్–1, డిప్యూటీ సూపరింటిండెంట్–1, డిప్యూటీ జైలర్లు–2, చీఫ్ హెడ్ వార్డర్–1, వార్డర్లు–29 (మెన్–28, ఉమెన్–1) ఖాళీగా ఉన్నాయి. మెడికల్ విభాగంలో ల్యాబ్ అసిస్టెంట్–1, మేల్ నర్సింగ్–1, ఫిమేల్ నర్సింగ్–1 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మినిస్టీరియల్ విభాగంలో ఆఫీస్ సూపరింటిండెంట్–1, రికార్డ్ అసిస్టెంట్–1, ఎల్ఎంవీ డ్రైవర్–1, ఇంజిన్ డ్రైవర్–1, వైర్మెన్–1, తోటీలు–4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మేనిఫ్యాక్షర్ విభాగంలో బ్యాండీమెన్–1 పోస్టు ఖాళీగా ఉంది. జైల్లో ఉద్యోగుల కొరత -
కాపులను మేయర్ అభ్యర్థిగా ప్రకటించాలి
సీతంపేట: నగర జనాభాలో 50 శాతానికిపైగా కాపులు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నగర మేయర్గా కాలేకపోయారని కాపుసేన రాష్ట్ర అధ్యక్షుడు బి. నారాయణమూర్తి అన్నారు. ఆంధ్రప్రదేశ్ కాపుసేన ఆధ్వర్యంలో శంకరమఠం రోడ్డులోని ఓ హోటల్లో గురువారం కాపు ముఖ్య నేతల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు మేయర్ అభ్యర్థిగా కాపులకు అవకాశం కల్పిస్తే కాపులంతా ఐక్యంగా పనిచేసి ఆ అభ్యర్థిని గెలిపించుకుంటామని అన్నారు. విశాఖ మున్సిపాలిటీ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు కాపులు మేయర్ కాలేకపోవడం ఆవేదన కలిగించే అంశమన్నారు. ఈ లోటును తీర్చేలా టీడీపీ, బీజేపీ, జనసేన, వైఎస్సార్సీపీ పార్టీలు కాపు అభ్యర్థిని మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తే కాపుసేన పూర్తి మద్దతు అందిస్తుందని తెలిపారు. సమావేశంలో కాపుసేన నాయకులు గొల్లకోట వెంకట సుబ్బారావు, చంద్రమౌళి, దాసరి రాధాకృష్ణ, లంకా భాస్కరరావు, కాసాపు సత్యనారాయణ, పెద్దిశెట్టి ఉషశ్రీ, పీలా వెంకటలక్ష్మి, గాదె బాలాజీ, ముక్కా కిషోర్, పోతు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
సాక్షి ఫొటోగ్రాఫర్లకు అవార్డులు
మహారాణిపేట: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా (పీఏఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ ఫొటోగ్రఫీ పోటీల్లో సాక్షి ఫొటోగ్రాఫర్లకు అవార్డులు లభించాయి. ‘నా భారతదేశం..80 ఏళ్ల ప్రజాస్వామ్యం, స్వాతంత్య్రం’ అనే ఇతివృత్తంతో జాతీయ ఫొటోగ్రఫీ పోటీ–2026ను నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఫొటోగ్రాఫర్ల నుంచి ఈ పోటీకి విశేష స్పందన లభించింది. 16 రాష్ట్రాలకు చెందిన 182 మంది ఫొటో కళాకారులు మొత్తం 352 చిత్రాలను పోటీకి సమర్పించారు. ఈ పోటీల్లో సాక్షి అసిస్టెంట్ చీఫ్ ఫొటోగ్రాఫర్ పీఎల్ మోహన్ రావు, స్టాఫ్ ఫొటోగ్రాఫర్ ఎమ్డీ నవాజ్లు జాతీయ స్థాయిలో ఉత్తమ ఫొటోగ్రాఫర్లుగా ఎంపికయ్యారు. విజేతలకు అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా గుంటూరులోని నాగార్జున సాగర్ యూనివర్సిటీ ఆడిటోరియంలో అవార్డుల ప్రదానోత్సవం నిర్వహిస్తారు. అవార్డులు అందుకున్న ఇద్దరు ఫొటోగ్రాఫర్లను పలువురు అభినందించారు. -
మృత్యువులోనూ వీడని స్నేహ బంధం
అచ్యుతాపురం రూరల్ : పెన్షన్ దరఖాస్తు చేసుకునేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు గీత కార్మికులను వెనుక నుంచి వేగంగా వచ్చిన బైక్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన బుధవారం మండల కేంద్రమైన అచ్యుతాపురానికి కూత వేటు దూరంలో ఉన్న వెదురువాడ గ్రామ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మెట్టధర్మవరం గ్రామానికి చెందిన గీత కార్మికులు పెంకే మారయ్య (53), రెడ్డి అప్పారావు (53) బుధవారం ఉదయం 10 గంటల సమయంలో టీవీఎస్ మోపేడ్ (ఏపీ40హెచ్జీ8272) నెంబరు గల ద్విచక్ర వాహనంపై వెదురువాడ సచివాలయానికి బయలు దేరారు. మారయ్య వాహనం నడుపుతుండగా, అప్పారావు వెనుక కూర్చు న్నారు. పూడి ఆర్అండ్ఆర్ కాలనీ కూడలికి సుమారు 100 మీటర్ల దూరంలో యలమంచిలి వైపు నుండి వేగంగా, అజాగ్రత్తగా వచ్చిన గ్లామర్ బైక్ (ఏపీ31డీజెడ్7909) వారి వాహనాన్ని బలంగా ఢీకొంది. ప్రమాదంలో మారయ్య, అప్పారావులకు తీవ్రంగా గాయాలు కావడంతో రోడ్డుపై పడిపో యారు. వెంటనే అంబులెన్స్లో అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్కు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో రెడ్డి అప్పారావు మృతి చెందగా, అదే రోజు రాత్రి 11.30 గంటల సమయంలో పెంకే మార య్య కూడా మృతి చెందారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు కుటుంబ పెద్దలు మృత్యువాత పడడంతో ఆ కుటుంబాల్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. -
నీటి కోసం జాగారం.. మహిళల ఆందోళన
మధురవాడ: అర్ధరాత్రి జీవీఎంసీ తాగునీటి సరఫరా.. అదీ సన్నటి ధార.. కనీసం నాలుగైదు బిందెలు కూడా నిండటం లేదంటూ పీఎంపాలెం 6వ వార్డు లక్ష్మివానిపాలెం మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలలుగా రోజు తప్పించి రోజు కుళాయిల ద్వారా అరకొరగా నీరు వస్తోందని, దీంతో చెంబులు, పల్లాలు, లోటాలతో నీరు పట్టుకోవాల్సి వస్తోందని వాపోయారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాకపోవడంతో గురువారం లక్ష్మివానిపాలెం నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని ఎండాడ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్దకు మహిళలు తరలివచ్చి నిరసన చేపట్టారు. పీఎంపాలెం రెండో బస్టాప్ సమీపంలోని లక్ష్మివానిపాలెం పరిసర ప్రాంతాల్లో సుమారు 400 కుటుంబాలు నివసిస్తున్నాయని మహిళలు తెలిపారు. రాత్రి 9 గంటల నుంచి 11.30 గంటల మధ్య నీరు సరఫరా చేస్తున్నారని, అదీ సన్నటి ధారగా రావడంతో రాత్రివేళల్లో జాగారం చేయాల్సి వస్తోందన్నారు. తమకు తాగునీరు సరఫరా చేసే వరకు కదిలేది లేదంటూ జీవీఎంసీ తాగునీటి విభాగం డీఈఈ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ట్యాంకర్ల ద్వారా సరఫరా కుళాయిల ద్వారా రోజు తప్పించి రోజు నీరు సరఫరా చేయడంతో పాటు, జీవీఎంసీ వాటర్ ట్యాంకర్ ద్వారా ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు నీరు అందిస్తామని తాగునీటి విభాగం ఏఈ సురేష్ హామీ ఇచ్చారు. సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజల సమస్యలపై సావధానంగా స్పందించాలని ఆదేశించారు. తాగునీటికి సంబంధించిన ఇబ్బందులను తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. దీంతో మహిళలు ఆందోళన విరమించారు. -
యువతి పరిస్థితి విషమం
అల్లిపురం: నగరంలోని అపోలో ఫార్మసీలో పనిచేస్తున్న ఫార్మసిస్ట్ గంగ (34) పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆమె ఆరిలోవ అపోలో ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆ స్థితికి చేరుకోడానికి గల కారణాలు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. బుధవారం మధ్యాహ్నం గంగ తలకు టవల్ చుట్టి, మెడకు పైజామా లాడా బిగించి అపస్మారక స్థితిలో ఉండగా.. ఇంటికి వెళ్లిన సహోద్యోగి రంజిత్ గమనించారు. వెంటనే మరో ఇద్దరి సహాయంతో 112కు సమాచారం అందించారు. పోలీసులు ఆమెను కేజీహెచ్కు తరలించగా.. అనంతరం మెరుగైన వైద్యం కోసం అపోలో ఆసుపత్రికి మార్చారు. ఇదిలా ఉంటే.. ఆమైపె దాడికి పాల్పడింది ఎవరు? ఎందుకు చేశారు? అనే కోణాల్లో టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గంగ నివాసం సమీపంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితులను గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. స్నేహితులు, పరిచయస్తుల్లో ఎవరైనా దాడికి పాల్పడ్డారా? అనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది. ఆమె సోదరి క్యాంపు నుంచి శుక్రవారం నగరానికి రానున్నారు. ఆమె ద్వారా ఏదైనా సమాచారం లభిస్తే ఈ కేసు చిక్కుముడి వీడే అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. -
న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి
మహారాణిపేట: తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టు ఉద్యోగులు నిరసన చేపట్టారు. గురువారం కేజీహెచ్ ప్రాంగణంలో కళ్లకు నల్లగుడ్డలు కట్టుకుని మానవహారం, నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ ఎస్.కె.ఆశా మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో ఏళ్ల తరబడి సేవలందిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ తక్షణమే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. రెగ్యులరైజేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు 100 శాతం గ్రాస్ వేతనం చెల్లించాలన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా అందించడంతో పాటు, కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం కల్పించాలని కోరారు. ఉద్యోగుల భవిష్యత్ భద్రత కోసం ఈపీఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు. జిల్లా జేఏసీ కన్వీనర్ కిశోర్రావు మాట్లాడుతూ పీహెచ్సీల నుంచి టీచింగ్ ఆస్పత్రుల వరకు పగలు, రాత్రి తేడా లేకుండా ప్రజలకు వైద్య సేవలందిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. -
సృజనశీలురు.. బాలమేధావులు
ఆరిలోవ : ఆలోచనకు పదునుపెడితే అద్భుతాలు సృష్టించవచ్చని విశాఖ జిల్లా విద్యార్థులు నిరూపించారు. వారిలోని సృజనాత్మకత, శాసీ్త్రయ దృక్పథం జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టాయి. ప్రతిష్టాత్మక ’ఇన్స్పైర్ మనక్’ జాతీయ స్థాయి పోటీలకు విశాఖ జిల్లా నుంచి మూడు వినూత్న ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. గత రెండేళ్లుగా (2024, 2025) కరోనా తదితర కారణాల వల్ల జాతీయ పోటీలు నిర్వహించకపోవడంతో, ఈసారి న్యూఢిల్లీలో నిర్వహించనున్న పోటీల్లో 2023–24, 2024–25 విద్యాసంవత్సరాలకు ఎంపికై న విద్యార్థులకు తమ ఆవిష్కరణలను ప్రదర్శించే అవకాశం లభించిందని జిల్లా సైన్స్ అధికారి రాజారావు తెలిపారు. డీఈవో అభినందనలు జాతీయ స్థాయికి ఎంపికై న బాలమేధావులు యశస్విని, హారిక, మహేష్లను డీఈవో ఎన్.ప్రేమకుమార్, సైన్స్ కోఆర్డినేటర్ రాజారావు ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా నుంచి మరిన్ని వినూత్న ఆలోచనలు వెలికితీసేలా, రాబోయే రోజుల్లో మరింత మంది విద్యార్థులు ఇన్స్పైర్ మనక్కు ఎంపికయ్యేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని సూచించారు. జాతీయ స్థాయికి ఎంపికై న ప్రాజెక్టుల విశేషాలుచంద్రునిపై భవిష్యత్ ఇంధన అన్వేషణ రూపొందించిన విద్యార్థిని: గుంట యశస్విని (9వ తరగతి, కేథరిన్ పబ్లిక్ స్కూల్, భీమిలి– 2023–24) ప్రాజెక్టు ప్రత్యేకత: భూమిపై ఇంధన వనరులు తగ్గిపోతున్న తరుణంలో, భవిష్యత్ తరాల అవసరాల కోసం చంద్రుడిపై లభించే ఇంధన వనరులను ఎలా అన్వేషించవచ్చో, వాటిని మానవాళికి ఏ విధంగా వినియోగించుకోవచ్చో ఈ ప్రాజెక్టు ద్వారా యశస్విని అత్యంత స్పష్టంగా వివరించింది. డిటాచింగ్ రైల్వే బ్రిడ్జి రూపొందించిన విద్యార్థిని: కర్రోతు హారిక (విద్యాసాగర్ పాఠశాల, భీమిలి– 2024–25) ప్రాజెక్టు ప్రత్యేకత: రైలు ప్రమాదాలను నివారించడంతో పాటు జలమార్గాల్లో రవాణాకు అంతరాయం కలగకుండా ఈ వంతెనను రూపొందించారు. సాధారణ సమయంలో రైళ్ల రాకపోకల కోసం మూసి ఉండే ఈ వంతెన, నీటి మార్గం ద్వారా ఓడలు లేదా పడవలు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఒక భాగాన్ని పైకి ఎత్తడం, దించడం చేస్తుంది. ప్రాథమిక విద్యుత్ నియంత్రణ ద్వారా యాంత్రిక కదలికలు జరిగేలా దీనిని డిజైన్ చేశారు. ఐవోటీ (ఆర్ఎఫ్ఐడీ) వాటర్ ట్యాప్స్ రూపొందించిన విద్యార్థి: బి.మహేష్ (10వ తరగతి, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులం, శ్రీకృష్ణాపురం–2024–25) ప్రాజెక్టు ప్రత్యేకత: పాఠశాలలు, గురుకులాలు, విద్యార్థుల వసతి గృహాల్లోని స్నానపు గదులు, మరుగుదొడ్లలో ట్యాప్స్ నుంచి జరిగే నీటి వృథాను అరికట్టడానికి ఈ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలా తక్కువ విద్యుత్ వినియోగంతో పనిచేసే ఈ ఐవోటీ ట్యాప్స్ సమాజానికి ఎంతో ఉపయోగకరం. -
ఇటలీలోని లోవోర్నోకు చేరుకున్న ఐఎన్ఎస్ సుదర్శిని
సింథియా: లోకాయన్–2026 సముద్రయాన యాత్రలో భాగంగా భారత నౌకాదళానికి చెందిన శిక్షణా నౌక ఐఎన్ఎస్ సుదర్శిని ఇటలీలోని లోవోర్నోకు చేరుకుంది. ఈ పర్యటనలో భాగంగా 10 దేశాల మీదుగా 17,400 నాటికల్ మైళ్లకు పైగా సముద్ర ప్రయాణం చేసి భారతదేశ సముద్ర సంప్రదాయాలను, స్నేహస్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లిందని నేవీ వర్గాలు తెలిపాయి. లోవోర్నోకు వెళ్లే మార్గంలో సముద్రంలో ఇటాలియన్ నావికాదళానికి చెందిన సెయిలింగ్ ట్రైనింగ్ షిప్ ఐటీఎస్ పాలినూరోతో కలిసి ఐఎన్ఎస్ సుదర్శిని సముద్ర విన్యాసాన్ని నిర్వహించింది. ఈ సంయుక్త విన్యాసంలో ఇరు నౌకలు సమన్వయంతో కూడిన విన్యాసాలు, తెరచాపలను నడిపే డ్రిల్స్ నిర్వహించాయి. అలాగే రెండు నౌకల సిబ్బంది పరస్పరం సంభాషించడంతోపాటు వృత్తిపరమైన అంశాలను పంచుకునేందుకు అవకాశం కల్పించారు. ఐఎన్ఎస్ సుదర్శిని లోవోర్నో రేవులో ఉన్న సమయంలో భారతీయ శిక్షణార్థులు, ఇటాలియన్ క్యాడెట్ల మధ్య క్రాస్డెక్ సందర్శనలు జరిగాయని నేవీ అధికారులు తెలిపారు. నౌకను మరింత మంది సందర్శించేందుకు వీలుగా సందర్శకుల కోసం అందుబాటులో ఉంచినట్లు నేవీ వర్గాలు పేర్కొన్నాయి. -
కడలిని చిలికి.. కలలను వెలికి
సాక్షి, విశాఖపట్నం: ఎన్నో అంతుచిక్కని రహస్యాలకు, అపారమైన వనరులకు నిలయమైన కడలి గర్భంలో దాగి ఉన్న విశేషాలతోపాటు వాతావరణ గుట్టును విప్పేందుకు భారతదేశం మరో కీలక అడుగు వేసింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏకంగా ఒక ‘ఫ్లోటింగ్ రీసెర్చ్ స్టేషన్’ లాంటి భారీ పరిశోధన నౌకను అందుబాటులోకి తీసుకొచ్చింది. సుమారు రూ.840 కోట్ల అంచనా వ్యయంతో కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్(జీఆర్ఎస్ఈ) ఈ వెసల్ను ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషియన్ రీసెర్చ్ (ఎన్సీపీవోఆర్) అవసరాల కోసం కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ పరిశోధన నౌక ‘సాగర్ మంథన్’ రెండు రోజుల క్రితం జలప్రవేశం చేసి సాగర మథనానికి సిద్ధమైంది. కదిలే ప్రయోగశాల సాగర్ మంథన్.. కేవలం సముద్రంపై ప్రయాణించే నౌక మాత్రమే కాదు.. శాస్త్రీయ హంగులు ఉన్న కదిలే ప్రయోగశాల. సముద్రంలో సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించేందుకు, ఆన్–బోర్డ్ డేటా ప్రాసెసింగ్ చేయడానికి వీలుగా శాస్త్రవేత్తలకు ఇందులో అత్యుత్తమ సౌకర్యాలు కల్పించారు. యువ శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులకు పరిశోధనలపై శిక్షణ ఇచ్చేందుకు కూడా ఈ ఫ్లోటింగ్ రీసెర్చ్ వెసల్ ప్రధాన వేదిక కానుంది. 6 కిలోమీటర్ల లోతు వరకు సర్వేలు సముద్ర గర్భంలో ఏకంగా 6 కిలోమీటర్ల లోతు వరకు వెళ్లి కచ్చితమైన సర్వేలు చేయగల సామర్థ్యం సాగర్ మంథన్ సొంతం. అండర్వే స్వాత్ మలీ్టబీమ్, జియోఫిజికల్ సిస్మిక్ సర్వేల ద్వారా భూమి కింది పొరల్లోని వనరులను, భౌగోళిక పరిస్థితులను సులువుగా గుర్తిస్తుంది. సముద్రపు నీటి వాహకత, ఉష్ణోగ్రత, లోతు వంటి కీలక అంశాలను కచ్చితంగా అంచనా వేస్తుంది. అత్యాధునిక వలలను ఉపయోగించి వివిధ లోతుల్లోని నీటి నమూనాలను, జీవ నమూనాలను ఏకకాలంలో సేకరించడంలో ఈ నౌక సామర్థ్యం అది్వతీయమనే చెప్పవచ్చు.వాతావరణం గుట్టు విప్పేలా.. కోరర్స్, గ్రాబ్స్, చైన్ బ్యాగ్ డ్రెడ్జ్ల ద్వారా సముద్ర గర్భం నుంచి మట్టి, రాళ్ల నమూనాలను సాగర్ మంథన్ నౌక సేకరిస్తుంది. ఉపరితల వాతావరణ పరిస్థితులు, సముద్ర ప్రవాహాల వేగాన్ని కొలవడం, ఎగువ వాతావరణ డేటాను నిక్షిప్తం చేయడం వంటి కీలక పనులను ఈ ఫ్లోటింగ్ స్టేషన్ షిప్ సమర్థవంతంగా నిర్వహిస్తుంది. తీరప్రాంతాలతో పాటు డీప్సీ మూరింగ్, డేటా బుయ్ ఆపరేషన్స్ చేపట్టడంలో దేశంలో ఇది అత్యంత కీలకంగా మారనుంది. అనేక రికార్డులు సొంతం దీనిని రికార్డు వేగంతో నిర్మించారు. నౌక కీల్ వేసిన కేవలం 5 నెలల వ్యవధిలోనే ఇంత భారీ ప్రాజెక్టును జల ప్రవేశం చేయించడం ఓ రికార్డు. 89.50 మీటర్ల పొడవు, 18.80 మీటర్ల వెడల్పు, 5,900 టన్నుల బరువైన ఈ నౌక.. గరిష్టంగా గంటకు 14 నాటికల్ మైళ్ల వేగంతో దూసుకుపోగలదు. దేశీయంగా నౌకానిర్మాణ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు, పెరుగుతున్న మన ఇంజినీరింగ్ సామర్థ్యానికి ‘సాగర్ మంథన్’ నిలువెత్తు నిదర్శనం. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో 75 శాతం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ వెసల్.. సముద్ర పరిశోధన రంగంలో స్వయం సమృద్ధిని చాటుతోంది. -
పర్యాటకం.. అటకెక్కిపాయె!
సాక్షి, విశాఖపట్నం: ప్రకృతి అందాలకు నెలవైన ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యాటకం పడకేసింది. విశాఖ నగరంలో పలు ప్రాజెక్టులు పునాది రాళ్లకే పరిమితం కాగా.. గిరిజన సంస్కృతికి కేరాఫ్గా నిలిచిన అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో విశాఖలో ఇటీవల నిర్వహించిన సదస్సులో పర్యాటక రంగం అభివృద్ధిపై పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. గత రెండేళ్లలో ఒకటీ అర ప్రాజెక్టులు మినహా పెద్దగా పర్యాటక రంగం అభివృద్ధి చెందిన దాఖలాలు కనిపించడం లేదని అధికారులు సైతం పెదవి విరిచారు. ప్రభుత్వం శంకుస్థాపనలకే పరిమితమవుతూ.. ప్రాజెక్టుల అభివృద్ధిపై పెద్దగా దృష్టిసారించకపోవడం, స్థానిక పర్యాటక అధికారులు సైతం తమకేమీ సంబంధం లేదన్నట్లుగా అంటీముట్టనట్లు వ్యవహరించడం పర్యాటక రంగం పతనానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. పుష్కలమైన అవకాశాలున్న అల్లూరి జిల్లాను పూర్తిగా విస్మరించడంతో.. ఈ ఏడాది పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. పర్యాటకుల సందడి ఏదీ ఉమ్మడి విశాఖ జిల్లాకు పర్యాటకుల రాక ఈ ఏడాది దారుణంగా పడిపోయింది. ముఖ్యంగా పర్యాటకులు ఎక్కువగా సందర్శించే అల్లూరి జిల్లాలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. 2025లో 72,10,942 మంది పర్యాటకులు జిల్లాను సందర్శించగా.. ఈ ఏడాది జూలై నాటికి కేవలం 2,79,553 మంది మాత్రమే వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పర్యాటక ప్రాంతాల్లో కొత్తగా సందర్శనీయ స్థలాలను అభివృద్ధి చేయకపోవడంతో క్రమంగా పర్యాటకుల సంఖ్య తగ్గిపోతోంది. అందుబాటులో ఉన్న ప్రాంతాలను అభివృద్ధి చేసి, కొత్త ఆకర్షణలను అందుబాటులోకి తీసుకురావడంలో పర్యాటక శాఖ విఫలమవుతోంది. కాగితాల్లోనే పెట్టుబడులు ఏపీటీడీసీ విశాఖ రీజియన్ పర్యవేక్షణలో అల్లూరి జిల్లాలో రూ.375 కోట్ల పెట్టుబడులు, 925 ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించిన మూడు పర్యాటక ప్రాజెక్టులు ఇంకా డీపీఆర్ తయారీ దశలోనే మగ్గుతున్నాయి. రూ.15 కోట్లతో వైజాగ్ రిక్రియేషన్ ప్రై. లిమిటెడ్, రూ.350 కోట్లతో సన్విక్ గోల్ఫ్ హెవెన్ ప్రై. లిమిటెడ్, రూ.10 కోట్లతో ఉర్మికా లీజర్ సర్వీసెస్ చేపట్టాల్సిన ప్రాజెక్టులు డీపీఆర్ తయారీ దశను దాటలేదు. కనీసం ఈ ప్రాజెక్టులనైనా ప్రారంభించేందుకు ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇవి నిజంగా పెట్టుబడులేనా? లేక చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ఉత్తుత్తి ఒప్పందాలా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అరకు మండలం కొత్తవలసలో రూ.18 కోట్లతో చేపట్టాల్సిన టెంట్ సిటీ పనులు ఇంకా టెండర్ దశలోనే ఉన్నాయి. లంబసింగిలో రూ.6.13 కోట్లతో చేపట్టిన టెంట్ సిటీ పనులు అసంపూర్తిగా కొనసాగుతున్నాయి. అంజోడ, అరకు, ముంచంగిపుట్టు, చింతపల్లి ప్రాంతాల్లో కారవాన్ టూరిజం ప్రాజెక్టులు ఇంకా టెండర్ల దశలోనే ఉన్నాయి. అడ్వెంచర్ టూరిజం ప్రాజెక్టులకు సంబంధించిన ఫైళ్లు సైతం ఇంకా సర్క్యులేషన్లోనే ఉండిపోవడం గమనార్హం. భూములున్నా.. అభివృద్ధి శూన్యం అల్లూరి జిల్లాలో పర్యాటక శాఖకు మొత్తం 180.39 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. ఇందులో ఏకంగా 92.86 ఎకరాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా నిరుపయోగంగా పడి ఉన్నాయి. ప్రభుత్వం పర్యాటక శాఖను పూర్తిగా గాలికొదిలేయడంతో.. స్థానిక అధికారులు సైతం ఇక్కడి అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా పర్యాటక శాఖ కార్యాలయంలో కనీసం రెగ్యులర్ అధికారులు, తగినంత సిబ్బంది, కార్యాలయ వాహనాలు కూడా లేని దుస్థితి నెలకొంది. పర్యాటక కేంద్రాల్లో కనీసం చెత్తకుండీలు, సైనేజ్ బోర్డులు కూడా ఏర్పాటు చేయలేని దయనీయ పరిస్థితి తమ శాఖలో ఉందని కొందరు పర్యాటక శాఖ సిబ్బంది వాపోతుండటం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీకి బిగ్ అలర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో దక్షిణ ఒరిస్సా ఉత్తరాంధ్ర ప్రాంతాల మధ్య అల్పపీడనం బలపడుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా 9.4 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తీరం వెంబడి ఈదురు గాలులు కొనసాగుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో రెండు రోజులపాటు ఉత్తర కోస్తాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.ఇవాళ(గురువారం) శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం, అనకాపల్లి, కాకినాడ, అల్లూరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ భారీ వర్షాలు పడే జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.రేపు (శుక్రవారం) అనకాపల్లి, అల్లూరు, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లా, పశ్చిమగోదావరి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. రేపు(శుక్రవారం) భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపు(శుక్రవారం) ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారులు.. రెండు రోజులపాటు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని ఆదేశించారు.విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో వర్షాలు మొదలయ్యాయి. ఇప్పటి వరకూ ప్రకాశం 4 సెం.మీ, అనకాపల్లి 4, భీమిలి 2, పల్నాడు 2, గుంటూరు 2, ఎన్టీఆర్ 1.5, విజయనగరం 1.5, తుని 1 సెం.మీ వర్షపాతం నమోదైంది. -
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో గురువారం ఉదయం 5.30 గంటలకు ఉత్తర బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.అలాగే, అల్పపీడనం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉండటంతో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రానున్న 48 గంటల పాటు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని సూచించింది. ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొంది. దీంతో సముద్రంలో అలలు ఎగసిపడే అవకాశం ఉందని తెలిపింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు కోరారు.🚨 ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం: APSDMA హెచ్చరిక 🚨ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది :రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ 🌧️ ఉత్తరాంధ్ర జిల్లాలలో 2రోజులు మేఘావృతమైన వాతావరణంతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.#lowpressure pic.twitter.com/5UKhlBU2l6— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) September 10, 2026మరోవైపు.. తెలంగాణలో కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. గురువారం (సెప్టెంబర్ 10) రాష్ట్రవ్యాప్తంగా వేడి, ఉక్కపోత పరిస్థితులు కొనసాగుతూనే.. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పలుచోట్ల అక్కడక్కడా వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, పిడుగులతో కూడిన ఉరుములు కనిపించే అవకాశం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, నల్గొండ జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.సెప్టెంబర్ 11, 12 తేదీల్లో రాష్ట్రానికి భారీ వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు, బలమైన గాలుల హెచ్చరికను వాతావరణ శాఖ జారీ చేసింది. సెప్టెంబర్ 13న కూడా ఉరుములు, మెరుపులు, బలమైన గాలుల హెచ్చరిక కొనసాగనుంది. ఇక, హైదరాబాద్లోనూ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉంది. SEPTEMBER 10, 2026 FORECAST ⚠️⛈️ HOT and HUMID conditions to continue even today across Telangana Scattered MODERATE RAINS and THUNDERSTORMS expected in North, East TG like Bhadradri - Kothagudem, Mahabubabad, Mulugu, Bhupalapally, Khammam, Adilabad, Asifabad, Mancherial,…— Telangana Weatherman (@balaji25_t) September 10, 2026 -
అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ దొంగల అరెస్ట్
మధురవాడ: వృద్ధురాలి మెడలో నుంచి అపహరించిన బంగారు నల్లపూసల తాడును స్వాధీనం చేసుకుని, ఇద్దరు అంతర్రాష్ట్ర చైన్ స్నాచర్లను పీఎంపాలెం పోలీసులు నాలుగు రోజుల్లోనే అరెస్టు చేశారు. ఈ వివరాలను పీఎంపాలెం క్రైం పోలీస్ స్టేషన్లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో క్రైం ఏసీపీ వెంకటరావు, ఇన్స్పెక్టర్ బీఎస్ఎస్ ప్రకాశ్ వెల్లడించారు. పీఎంపాలెం షిప్యార్డు లేఅవుట్లో నివాసం ఉంటున్న పాంగ పుణ్యవతి (64) ఈ నెల 5న సాయంత్రం 5 గంటల సమయంలో పీఎంపాలెం డబుల్ రోడ్డు సమీపంలోని విజేత సూపర్ మార్కెట్ వద్ద నుంచి తన రాయల్ అపార్ట్మెంట్కు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు ఆమెను వెంబడించి, మెడలోని బంగారు నల్లపూసల గొలుసును తెంపుకుని పరారయ్యారు. అయితే పుణ్యవతి గొలుసును గట్టిగా పట్టుకోవడంతో కొంత భాగం ఆమె చేతిలోనే ఉండగా, మిగిలిన భాగాన్ని దొంగలు అపహరించారు. ఈ ఘటనతో ఆమె షాక్కు గురై కిందపడిపోయారు. స్థానికులు వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్కు, 112కు సమాచారం అందించడంతో క్రైం డీఎస్ఐ ప్రకాశరావు సిబ్బందితో కలిసి పది నిమిషాల్లో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నార్త్జోన్ క్రైం ఇన్స్పెక్టర్ బీఎస్ఎస్ ప్రకాశ్ ఆధ్వర్యంలో పోలీసులు సీసీ కెమెరాలు, ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుల కదలికలను గుర్తించారు. వారు అద్దెకు తీసుకున్న వాహనం వివరాలను సేకరించి, దాని ఆధారంగా నిందితులను గుర్తించారు. చోరీ అనంతరం నిందితులు విజయవాడకు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు ఇతర నేరాలకు పాల్పడకుండా అప్రమత్తం చేశారు. అనంతరం నిందితులు తమ స్వస్థలమైన ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లా సర్ధానాకు వెళ్లినట్లు గుర్తించిన పీఎంపాలెం పోలీసులు అక్కడికి వెళ్లి కమిల్ మాలిక్ (30), జావేద్ మాలిక్ (31)లను అరెస్టు చేశారు. చాకచక్యంగా వ్యవహరించి కేవలం నాలుగు రోజుల్లోనే అంతర్రాష్ట్ర నిందితులను పట్టుకుని, సుమారు 14 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పీఎంపాలెం క్రైం పోలీసులను ఏసీపీ వెంకటరావుతోపాటు ఇతర ఉన్నతాధికారులు అభినందించారు. -
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ల్లో భారత్ నేవీ చీఫ్ పర్యటన
సింథియా: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నౌకాదళాలతో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో భారత నౌకాదళ అధిపతి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ బుధవారం నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో పర్యటిస్తున్నారు. జూన్లో జరిగిన రెండో భారత్–ఆస్ట్రేలియా రక్షణ మంత్రుల చర్చలు, జూలైలో జరిగిన మూడో భారత్–ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సమావేశం అనంతరం పెరుగుతున్న రక్షణ సహకారానికి కొనసాగింపుగా ఈ పర్యటన జరుగుతోంది. పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా నేవీ, రక్షణ శాఖ ఉన్నతాధికారులతో అడ్మిరల్ స్వామినాథన్ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. సముద్ర భద్రత, నావికా కార్య కలాపాలు, పరస్పర సమన్వయం, సమాచార మార్పిడి, శిక్షణ, వృత్తిపరమైన మార్పిడులను మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించనున్నారు. అనంతరం న్యూజిలాండ్ నేవీ, రక్షణ శాఖ ఉన్నతాధికారులతోనూ ఆయన సమావేశమై ద్వైపాక్షిక నావికా సహకారాన్ని విస్తరించే అంశాలపై చర్చలు జరపనున్నారు. ఈ పర్యటనతో సముద్ర భద్రత, ప్రాంతీయ సహకారంతో పాటు రక్షణ, భద్రతా రంగాల్లో ఇరుదేశాలతో భారత్ సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని నేవీ వర్గాలు తెలిపాయి. -
ప్రభుత్వ రుణాలు, ఉద్యోగాల పేరిట మోసం
అల్లిపురం: ప్రభుత్వ పథకాల కింద రుణాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు, పార్ట్టైమ్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేస్తున్న మట్ట కామరాజు(51)ను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. పీఎంఈజీపీ, ముద్ర పథకాల కింద రూ.10–15 లక్షల వరకు రుణాలు ఇప్పిస్తానని నిందితుడు నమ్మబలికాడు. ప్రాసెసింగ్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్, ప్రాజెక్ట్ రిపోర్టు, ఉద్యోగ శిక్షణ తదితర చార్జీల పేరుతో పలువురి నుంచి సుమారు రూ.50 లక్షలు వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. రూ.10 లక్షల రుణం ఇప్పిస్తానని చెప్పి ఓ బాధితుడి నుంచి రూ.65,700 వసూలు చేసి, మోసం చేసిన కేసులో నిందితుడిని సాంకేతిక ఆధారాలతో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 6 మొబైల్ ఫోన్లు, 22 సిమ్ కార్డులు, డెస్క్టాప్, 4 డైరీలు, చెక్బుక్లు, 3 స్టాంప్ ప్యాడ్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది. -
13 ఏళ్ల కన్నీటి వేదనకు తెర
ఎన్ఏడీ జంక్షన్: పదమూడేళ్ల క్రితం కుటుంబ సభ్యుల నుంచి తప్పిపోయిన కుమారుడు చనిపోయి ఉంటాడని భావించిన ఆ తల్లిదండ్రులకు ఒక్కసారిగా అతడు సజీవంగా కళ్లముందు కనిపిస్తే.. ఆ ఆనందం మాటల్లో వర్ణించలేనిది. ఎన్ఏడీ కొత్తరోడ్డులో జరిగిన ఓ మానవీయ ఘటన ఆ కుటుంబంలో తిరిగి సంతోషాన్ని నింపింది. జీవీఎంసీ నైట్ షెల్టర్ సిబ్బంది, శ్రద్ధ ఫౌండేషన్ సమష్టి కృషితో 13 ఏళ్లుగా ఆచూకీ లేని వినోద్ తన కుటుంబ సభ్యుల చెంతకు చేరాడు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని రాంపుర గ్రామానికి చెందిన వినోద్ 13 ఏళ్ల క్రితం కుటుంబ సభ్యుల నుంచి తప్పిపోయాడు. కొంతకాలానికి మానసిక స్థితి కోల్పోయాడు. 2025 సెప్టెంబరులో ఎన్ఏడీ కొత్తరోడ్డు పరిసరాల్లో దిక్కుతోచని స్థితిలో తిరుగుతుండగా 90వ వార్డు బుచ్చిరాజుపాలెం జీవీఎంసీ నైట్ షెల్టర్ మేనేజర్ ఎల్లేటి మమత గమనించారు. వెంటనే అతడికి నైట్ షెల్టర్లో ఆశ్రయం కల్పించి, మానసిక ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించారు. కోలుకున్నాక వివరాలు వెల్లడి : చికిత్సతో క్రమంగా కోలుకున్న వినోద్ తన పేరు, స్వస్థలం రాంపుర గ్రామమని తెలిపాడు. దీంతో మమత ఈ విషయాన్ని శ్రద్ధ ఫౌండేషన్ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. ఫౌండేషన్ సభ్యులు వివరాలను ఆధారంగా చేసుకుని ఉత్తరప్రదేశ్లోని వినోద్ కుటుంబ సభ్యులను గుర్తించి సమాచారం అందించారు. అనంతరం వినోద్ను వారి చెంతకు చేర్చారు. అవధుల్లేని ఆనందం : 13 ఏళ్లుగా చనిపోయాడనుకున్న కుమారుడు సజీవంగా తమ ముందుకు రావడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కుమారుడిని ఆప్యాయంగా హత్తుకుని ఆనందభాష్పాలతో వారు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ దృశ్యం తమను తీవ్రంగా కదిలించిందని ఫౌండేషన్ సభ్యులు బుధవారం మీడియాకు తెలిపారు. తమ కుమారుడిని తిరిగి తమ చెంతకు చేర్చిన నైట్ షెల్టర్ సిబ్బందికి, శ్రద్ధ ఫౌండేషన్ ప్రతినిధులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
కార్మిక నేత బలరాం కన్నుమూత
కొమ్మాది: కార్మిక నేత, స్వాతంత్య్ర సమరయోధుడు కె.బలరాం (100) బుధవారం సాగర్నగర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ఆయన చురుకుగా పాల్గొన్నారు. అనంతరం కార్మిక రంగంలోనూ విశేష సేవలందించారు. ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేసి కార్మికుల హక్కుల సాధన కోసం అలుపెరుగని పోరాటం చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం, హిందుస్థాన్ షిప్యార్డ్, నేవల్ డాక్యార్డ్ వంటి భారీ పరిశ్రమల్లో పనిచేసి వేలాది మంది కార్మికుల సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ, కార్మిక సంఘాల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. -
కనీస వేతనాల కోసం ధర్నా
సీతంపేట: విశాఖలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్ట్, నాన్ పర్మినెంట్, తాత్కాలిక కార్మికులకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. బుధవారం అక్కయ్యపాలెంలోని రీజనల్ లేబర్ కమిషనర్ ఆఫీస్ వద్ద సిటూ నాయకులు, కార్మికులు ధర్నా చేసి, అధికారులకు వినతిపత్రం అందించారు.. ఈ సందర్భంగా జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి.కుమార్, ఉపాధ్యక్షుడు బి.జగన్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను కొనసాగించడంలో కీలక పాత్ర పోషిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు చట్టబద్ధంగా అందాల్సిన వేతనాలు, సంక్షేమ సౌకర్యాలు అనేక చోట్ల పూర్తిస్థాయిలో అమలు కావడం లేదన్నారు. లేబర్ కమిషనర్ కార్యాలయం పరిధిలో ఇప్పటికే దాఖలైన పలు కార్మిక వివాదాలు, ఫిర్యాదులు, కేసులు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా.. కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న యాజమాన్యాలు, కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైల్వే కాంట్రాక్ట్ వర్కర్ సీనియర్ రాష్ట్ర కార్యదర్శి వి.వి.ఎల్.నరసింహులు, స్టీల్ప్లాంట్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నమ్మి రమణ, సత్యవతి, సోమేష్, రైల్వే వేగన్ వర్క్షాప్ యూనియన్ నాయకులు ఎం.రాంబాబు, అవతారం, రాజుతల్లి, షిప్యార్డ్ యూనియన్ నాయకులు పెంటారావు, పోర్ట్ యూనియన్ నాయకులు శ్రీను, నూకరాజు తదితరులు పాల్గొన్నారు. -
అప్పన్న సన్నిధిలో సినీ దర్శకుడు శివ నిర్వాణ
‘ఇరుముడి’ విజయంపై హర్షం సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని సినీ దర్శకుడు శివ నిర్వాణ కుటుంబసమేతంగా బుధవారం దర్శించుకున్నారు. ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో ఆయన పేరిట అర్చకులు అష్టోత్తరపూజ నిర్వహించారు. వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వామివారి ప్రసాదం, శేషవస్త్రంలను ఏఈవో పిల్లా శ్రీనివాసరావు అందించారు. ఇటీవల తాను దర్శకత్వం వహించిన ఇరుముడి సినిమా విశేషంగా ప్రేక్షకాదరణ పొందడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. -
పిడుగు పాటుకు రైతు మృతి
సబ్బవరం: పిడుగు రూపంలో వచ్చిన ప్రకృతి విపత్తు ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. మండలంలోని అంతకాపల్లి శివారు రావలమ్మపాలేనికి చెందిన రైతు సబ్బవరపు శ్రీరామ్(54) బుధవారం పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, స్థానికుల వివరాల ప్రకారం.. శ్రీరామ్ స్థానిక జగనన్న కాలనీలో నివాసం ఉంటున్నాడు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో సమీప ప్రాంతానికి బహిర్భూమికి వెళ్లాడు. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుండగా ఆయన సమీపంలో పిడుగు పడింది. దీంతో తల, ముఖానికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న వీఆర్వో వాత్సల్యరాయ్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. శ్రీరామ్కు భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు నాగమణి, లాస్య ఉన్నారు. నాగమణికి ఇప్పటికే వివాహం కాగా.. చిన్న కుమార్తె లాస్య వివాహం వచ్చే నెలలో జరగాల్సి ఉంది. పెళ్లి ఏర్పాట్లతో కళకళలాడాల్సిన ఇంట్లో పిడుగుపాటుతో విషాదం నెలకొంది. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న శ్రీరామ్ అకాల మరణంతో భార్య, కుమార్తెలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
అప్పన్న సన్నిధిలో సినీ దర్శకుడు శివ నిర్వాణ
ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాలి రానున్న ఎన్నికల్లో కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, టీడీపీ చేసే రాజకీయ కుయుక్తులు, ప్రలోభాలతోపాటు పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని వైఎస్సార్ సీపీ శ్రేణులపై చేసే ఒత్తిళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలని, అవసరమైతే న్యాయపరంగానూ పోరాడాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పిలుపునిచ్చారు. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టంగా పూర్తి చేయడంతోపాటు ప్రతి నాయకుడు, కార్యకర్త వివరాలను పూర్తిస్థాయిలో సేకరించి నమోదు చేయాలని చెప్పారు. ఫొటో, ఓటర్ కార్డు తదితర వివరాలతో పారదర్శకమైన పార్టీ డేటాను రూపొందించాలని సూచించారు. ప్రతి కార్యకర్తకు పార్టీ బాధ్యతలు, కార్యక్రమాలను స్పష్టంగా తెలియజేయాలన్నారు. సంస్థాగత నిర్మాణం బలంగా ఉంటేనే రాజకీయ సవాళ్లను సమర్థంగా ఎదుర్కోగలమన్నారు. -
పింఛన్.. సర్వర్ డౌన్!
మహారాణిపేట: కొత్త పింఛన్ల దరఖాస్తుల ప్రక్రియ వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు చుక్కలు చూపిస్తోంది. సాంకేతిక సమస్యలు, నిబంధనల కొర్రీలతో దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే ప్రభుత్వం హడావుడిగా ఈ ప్రక్రియ చేపట్టిందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పింఛన్ మంజూరుకు ఎలాంటి స్పష్టమైన గడువు లేకపోవడం, మంజూరు అధికారాలను ఎంపీడీవోల నుంచి తొలగించడం వంటి నిర్ణయాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మందకొడిగా ఆన్లైన్ ప్రక్రియ.. గత సోమవారం ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ తొలిరోజు నుంచి నెమ్మదిగా సాగుతోంది. మూడు రోజుల్లో విశాఖ నగరంతో పాటు నాలుగు మండలాల పరిధిలోని మొత్తం 607 సచివాలయాల్లో కలిపి 6,836 దరఖాస్తులు అందాయి. 7వ తేదీన 1,773, 8న 3,140, 9న 1,923 దరఖాస్తులు వచ్చాయి. అయితే సర్వర్ సమస్యలు, ఓటీపీలు సకాలంలో రాకపోవడంతో సచివాలయ సిబ్బందికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. షాకిస్తున్న విద్యుత్ నిబంధనలు విద్యుత్ వినియోగానికి సంబంధించిన నిబంధనలు దరఖాస్తుదారులకు పెనుభారంగా మారాయి. 300 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగం ఉన్న వారి వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ కావడం లేదు. అలాగే దరఖాస్తుదారుడి పేరిట కనీసం విద్యుత్ మీటరు ఉండరాదనే నిబంధన కూడా ఇబ్బందికరంగా మారింది. నాయి బ్రాహ్మణులు, రజకులు, మత్స్యకారులు, డప్పు కళాకారులు దరఖాస్తు చేసుకునే సమయంలో గుర్తింపు కార్డులు అడుగుతుండటంతో ప్రక్రియ ముందుకు సాగడం లేదు. సచివాలయాల్లో పట్టించుకునే నాథుడేడీ? ఆన్లైన్ సమస్యలతో వృద్ధులు అల్లాడిపోతున్నారు. గంటల తరబడి సచివాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నా, కీలకమైన వెల్ఫేర్, డిజిటల్ అసిస్టెంట్లు అందుబాటులో ఉండటం లేదనే ఆరోపణలున్నాయి. అధికారుల స్పందన అంతంత మాత్రంగానే ఉండటంతో వృద్ధులు, వితంతువులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఈ సాంకేతిక అడ్డంకులను వెంటనే తొలగించి, తమ కష్టాలు తీర్చాలని కోరుతున్నారు. -
కూటమిలో కుమ్ములాటలే మనకు ప్లస్
కూటమిలో ఇప్పటికే కుమ్ములాటలు మొదలయ్యాయని, స్థానిక ఎన్నికల్లో వారి మధ్య జరిగే పోరు వైఎస్సార్ సీపీకి లాభం చేకూరుస్తుందని రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు అన్నారు. రాష్ట్రంలోనే అత్యంత పెద్ద నగరమైన విశాఖలో అంతర్జాతీయ విమానాశ్రయం లేకుండా పోయిందని, నగరవాసులు తాగునీటి కొరతతో అల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభ్యున్నతి కోసం పనిచేసే ఏకై క పార్టీ వైఎస్సార్సీపీ అని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. -
సీఎంకు వెయ్యి పోస్టు కార్డులు
మహారాణిపేట: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతూ, నిరసన తెలియజేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టినట్లు జిల్లా జేఏసీ కన్వీనర్ కిషోర్రావు తెలిపారు. కేజీహెచ్ క్లాక్టవర్ నుంచి బుధవారం పోస్ట్కార్డు ఉద్యమం నిర్వహించారు. రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, విశాఖపట్నం జిల్లా జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించిన అనంతరం మానవహారంగా ఏర్పడ్డారు. కిషోర్రావు మాట్లాడుతూ తమ డిమాండ్లను మానవతా దృక్పథంతో పరిశీలించాలని కోరుతూ ముఖ్యమంత్రికి వెయ్యి మంది ఉద్యోగులు పోస్టుకార్డులు పంపినట్లు తెలిపారు. జేఏసీ చైర్మన్ ఎస్.కె.ఆశ మాట్లాడుతూ ఏళ్ల తరబడి వైద్య ఆరోగ్య శాఖలో సేవలందిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలన్నారు. రెగ్యులరైజేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు 100శాతం గ్రాస్ వేతనం చెల్లించాలని, విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరారు. జేఏసీ నాయకుడు శివప్రసాద్, జేఏసీ కో–చైర్మన్ పైడిరాజు మాట్లాడుతూ ఈపీఎఫ్, హెల్త్కార్డు తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖకు చెందిన అన్ని విభాగాల కాంట్రాక్ట్ ఉద్యోగులు సంఘం నాయకులు, జేఏసీ నాయకులు రాజశేఖర్,పద్మావతి, దుర్గాభవాని, కేకే రాజు, కె.నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారం దిశగా పనిచేయాలి
జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులకు వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వస్తుందన్న స్పష్టత వచ్చిందని దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్కుమార్ అన్నారు. అందుకే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అందజేస్తున్న వినతులపై అధికారులు సానుకూలంగా స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రతి వార్డు పరిధిలో ప్రజా సమస్యలపై పార్టీ నాయకులు, కార్యకర్తలు దృష్టి సారించి.. వాటి పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని సూచించారు. -
కూటమి వైఫల్యాలను ఎండగడదాం ప్రజలకు అండగా నిలుద్దాం
పార్టీ కోసం కష్టపడిన వారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు గ్రామ, వార్డు, జిల్లా స్థాయి కమిటీలు చురుగ్గా పనిచేయాలి ‘వెన్నుపోటు పార్టీ–వెన్నుపోటు పాలన’ బుక్లెట్ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి సోషల్ మీడియా, లీగల్ సెల్ విభాగాలు బలోపేతం చేయాలి జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో బొత్స, కేకే రాజు పిలుపు సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు అవకాశం లేకుండా చూడాలన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికే టికెట్లు లభిస్తాయన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముందుగా కేకే రాజు, గొల్ల బాబూరావు, కదిరి బాబూరావు, బొత్స ఝాన్సీలక్ష్మి, కుంబా రవిబాబు, నియోజకవర్గ సమన్వయకర్తలతో కలిసి వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ‘వెన్నుపోటు పార్టీ – వెన్నుపోటు పాలన’ బుక్లెట్ను ఆవిష్కరించారు. పార్టీ గుర్తింపు కార్డులను నేతలకు అందజేశారు. వెన్నుపోటు పార్టీ.. వెన్నుపోటు పాలన టీడీపీ ఒక వెన్నుపోటు పార్టీ అని, జనాలను మోసం చేస్తూ వెన్నుపోటు పాలన సాగిస్తోందని బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనలో అరాచకాలు, దౌర్జన్యాలు, భూ దోపిడీలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు అమ్ముకున్నారని మండిపడ్డారు. టెట్ క్వాలిఫై అవ్వకపోయినా ఉద్యోగాలు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెడతామంటున్నారని, దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తున్నా ప్రభుత్వం మొద్దు నిద్దరపోతోందని దుయ్యబట్టారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నుంచి నీళ్లు తెచ్చి.. పోలవరం నీళ్లు అంటూ చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. పార్టీ మారిన మజ్జి శ్రీనివాసరావు తీరుపై బొత్స స్పందిస్తూ.. రాజకీయాల్లో మనిషికి స్వార్థం ఉంటుందని, మనుషులు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ పార్టీ మాత్రం శాశ్వతమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ పరిశీలకుడు కదిరి బాబురావు, పీఏసీ సభ్యుడు తిప్పల నాగిరెడ్డి, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకట రామయ్య, శోభా హైమవతి, నియోజకవర్గ పరిశీలకులు పేడాడ రమణికుమారి, జహీర్ అహ్మద్, వీసం రామకృష్ణ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సుంకర గిరిబాబు, పార్టీ పర్యవేక్షకులు గుడిమెట్ల రవిరెడ్డి, ముఖ్యనాయకులు కోలా గురువులు, కటుమూరి సతీష్, బాణాల శ్రీనివాసరావు, రొంగలి జగన్నాథం, ఐహెచ్ ఫారూఖీ, జాన్వెస్లీ, పోతిన హనుమంతురావు, పీలా వెంకటలక్ష్మి, తాడి జగన్నాథరెడ్డి, జీఎస్వీవీ కేఏఎన్ రాజు, కోరుకొండ వెంకటరత్న స్వాతి, పీవీఎస్వీ ప్రసాద్రాజు, పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, వార్డు అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యనిర్వాహక అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, మాజీ కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. హాజరైన పార్టీ శ్రేణులు -
షణ్ముఖ శర్మకు ‘కొప్పరపు కవుల’ పురస్కారం
మద్దిలపాలెం: కొప్పరపు కవుల కళాపీఠం 24వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం కళాభారతి ఆడిటోరియంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రవచనకారుడు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మకు ప్రతిష్టాత్మక ‘కొప్పరపు కవుల జాతీయ ప్రతిభా పురస్కారం–2026’ను ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణ మోహన్, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ దుర్గా ప్రసాద్, ఆచార్య విశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రి, ఆచార్య తాడేపల్లి పతంజలిశాస్త్రి, అమెరికాకు చెందిన ప్రముఖ హృద్రోగ నిపుణుడు డాక్టర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా పురస్కారాన్ని అందజేశారు. కార్యక్రమానికి ఆచార్య బేతవోలు రామబ్రహ్మం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ మాట్లాడుతూ భారతీయ వాజ్మయంలో విద్యార్థులను తీర్చి దిద్దుతున్న అభినవ వ్యాసుడు సామవేదం షణ్ముఖశర్మ అని ప్రశంసించారు. కొప్పరపు సోదరకవుల పద్యాలు తెలుగు పాఠ్యాంశాలుగా రావాలని తద్వారా తెలుగు భాషకు పూర్వ వైభవం తేవాలని ఆకాంక్షించారు. గౌరవ అతిథి ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ భారతీయ అవధాన ప్రక్రియను శిఖర స్థాయికి తీసుకెళ్లిన కొప్పరపు సోదరకవుల స్మారకంగా వారి పేరిట అవధాన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రజలందరి సంతకాలతో ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించాలని సూచించారు. అనంతరం ‘దైవ సంకల్పం’ అనే అంశంపై సుమారు గంటపాటు సామవేదం షణ్ముఖ శర్మ చేసిన ప్రవచనం అందరినీ ఆకట్టుకుంది. -
పశువుల మాయం వెనుక జీవీఎంసీ సిబ్బంది హస్తం?
20వ వార్డులో యాదవుల ఆగ్రహం బీచ్రోడ్డు: నగరంలో పశువుల మాయంపై జీవీఎంసీ సిబ్బందిపై ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. జీవీఎంసీ 20వ వార్డు పరిధిలో గత ఆరు నెలల్లో 15కు పైగా ఆవులు, గేదెలు కనిపించకుండా పోయాయని యాదవ కులస్తులు ఆరోపించారు. జీవనాధారమైన పశువులు మాయమవడంతో లక్షల రూపాయల నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు వారాల క్రితం ఒమ్మి కాశీకి చెందిన రెండు గేదెలు మాయమవ్వడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సీసీ కెమెరాల్లో జీవీఎంసీ పశువుల తరలింపు వాహన డ్రైవర్ గేదెలను తీసుకెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయని బాధితులు తెలిపారు. అధికారిక అనుమతులు లేకుండానే తరలింపు జరిగిందని ఆరోపించారు. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న డ్రైవర్పై గతంలోనూ ఫిర్యాదులు వచ్చాయని, రెండు నెలల పాటు సస్పెన్షన్కు గురయ్యాడని స్థానికులు పేర్కొన్నారు. ఈ దందా వెనుక మరికొందరు సిబ్బంది, దళారుల ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ విషయంపై మంగళవారం 30 మందికి పైగా యాదవ కులస్తులు మూడో పట్టణ నేర విభాగ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా ఆధారాలు, గత ఫిర్యాదుల వివరాలను అందించారు. కేసు నమోదు చేసి, పశువులను తిరిగి ఇప్పించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జీవీఎంసీ కమిషనర్ స్వయంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఎంపిక వివరాలు వెల్లడించాలి
ఆరిలోవ: డీఎస్సీ నియామక ప్రక్రియలో జిల్లాలో స్పోర్ట్స్ కోటా ద్వారా ఎంపికై న అభ్యర్థుల జాబితా వివరాలను వెల్లడించాలని వైఎస్సార్సీపీ ఆర్టీఐ విభాగం నాయకులు మంగళవారం విద్యాశాఖ అధికారులను కోరారు. ఈ మేరకు డీఈవో కార్యాలయంలో అదనపు డైరెక్టర్ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో స్పోర్ట్స్ కోటా ద్వారా ఎంపికై న అభ్యర్థుల పూర్తి వివరాలను రికార్డుల ఆధారంగా వెల్లడించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఆర్టీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు జీలకర్ర నాగేంద్ర మాట్లాడుతూ డీఎస్సీ ద్వారా స్పోర్ట్స్ కోటాలో ఎంపికై న అభ్యర్థుల పేర్లు, వారి ఎంపికకు సంబంధించిన పూర్తి వివరాలు, అభ్యర్థుల ప్రాంతాలు, ఏ పాఠశాలల్లో పోస్టింగులు పొందారనే వివరాలు, టెట్ అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య, వారి పేర్లను విద్యాశాఖ అధికారులు వెల్లడించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వడ్డాది కుమార్, దశమంతుల చిన్న, శ్రీవంశీ, షేక్ బాబ్జి, బాలకృష్ణ, సంతోష్ కుమార్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి శుభకార్యాలకు విరామం
మహారాణిపేట: వివాహాలు, శుభకార్యక్రమాలకు తాత్కాలికంగా బ్రేక్ పడనుంది. భాద్రపద మాసం శూన్య మాసంగా పరిగణించడంతో అక్టోబర్ 10 వరకు 34 రోజుల పాటు శుభ ముహూర్తాలు ఉండవు. అక్టోబర్ 11 నుంచి తిరిగి వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి కార్యక్రమాలకు అనుకూలమైన ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. శ్రావణం, నిజ జ్యేష్ఠ మాసాల్లో భారీ సంఖ్యలో వివాహాలు జరగడంతో ఇటీవల వరకు కల్యాణ మండపాలు, పుణ్యక్షేత్రాలు పెళ్లి సందడితో కళకళలాడాయి. వేద మంత్రాల సాక్షిగా వేలాది జంటలు ఒక్కటయ్యాయి. నిశ్చితార్థాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు కూడా పెద్ద ఎత్తున జరిగాయి. అక్టోబర్ 11 నుంచి మళ్లీ సందడి అక్టోబర్ 11 నుంచి డిసెంబర్ చివరి వరకు పలు శుభ ముహూర్తాలు ఉన్నాయని వేద పండితులు చెబుతున్నారు. అక్టోబర్ 11, 14, 29, 30 తేదీలతో పాటు నవంబర్లో 5, 11 నుంచి 15 వరకు, 18 నుంచి 26 వరకు, డిసెంబర్లో 2, 3, 4, 10 నుంచి 13 వరకు, 15 నుంచి 19 వరకు, 22, 23, 27, 29, 30, 31 తేదీల్లో వివాహాలు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు ఉన్నాయని పేర్కొంటున్నారు.ఈ విరామ సమయంలో అన్నప్రాసన, అక్షరాభ్యాసం, నామకరణం, సీమంతాలు, రిజిస్ట్రేషన్లు వంటి కార్యక్రమాలు మాత్రమే నిర్వహించవచ్చని పండితులు చెబుతున్నారు. భాద్రపదంలో శుభకార్యాలకు విరామం భాద్రపద మాసంలో వినాయక చవితి, మహాలయ పక్షం వంటి పర్వదినాలకు ప్రాధాన్యం ఉంటుంది. ఈ కాలంలో దేవతారాధన, పితృకార్యాలకు ప్రాముఖ్యత ఇస్తారు. సంప్రదాయ ముహూర్త శాస్త్రం ప్రకారం వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు నిర్వహించరు. అశ్వయుజ మాసం నుంచి తిరిగి శుభ ముహూర్తాలు ప్రారంభమవుతాయి. – గంగవరపు పార్వతీశ్వర శర్మ, శైవగామ పండితులు, సీతంపేట -
జైలులో బెంచీల తయారీకి ఎల్అండ్టీ ఆర్డర్
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారంలో ఖైదీలు తయారు చేసిన స్కూల్ బెంచీలను ఎల్అండ్ టీ కంపెనీకి మంగళవారం అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం సీఎస్ఆర్ నిధులతో బెంచీలను తయారు చేయించేందుకు ఎల్అండ్టీ కంపెనీ జైలుకు ఆర్డర్ ఇచ్చింది. ఇందులో భాగంగా డస్క్లతో కూడిన 100 స్కూల్ బెంచీలను సిద్ధం చేసి, ఎల్అండ్టీ కంపెనీకి చెందిన వ్యానులో జైలు అధికారులు మంగళవారం పంపించారు. ప్రస్తుతం పంపిస్తున్న ఈ 100 బెంచీలను మధురవాడ ప్రాంతంలోని చంద్రంపాలెం ఉన్నత పాఠశాలకు అందజేయనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా జైలు సూపరింటెండెంట్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎల్అండ్టీ కంపెనీ నుంచి ఇటీవల 400 స్కూల్ బెంచీల తయారీకి ఇండెంట్ వచ్చిందన్నారు. విడతల వారీగా 100 బెంచీల చొప్పున అందజేస్తున్నామని తెలిపారు. మంగళవారం ఒక విడత బెంచీలను పంపించామని, మరో మూడు విడతల్లో మిగిలిన బెంచీలను అందజేస్తామని పేర్కొన్నారు. జైలులోని ఖైదీలకు ఉపాధి కల్పించడంలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. సామాజిక బాధ్యతలో భాగంగా ముందుకు వచ్చే కంపెనీలు తమ ఉత్పత్తుల తయారీకి జైళ్లకు ఆర్డర్లు ఇచ్చేందుకు సహకరించాలని ఆయన కోరారు. -
కుష్ఠువ్యాధి గుర్తింపునకు 11 నుంచి ఇంటింటి సర్వే
మహారాణిపేట: జిల్లాలో ఈనెల 11 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్న ‘ఇంటింటి కుష్ఠు వ్యాధి గుర్తింపు సర్వే’ పోస్టర్లు, బ్యానర్లను కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ కలెక్టరేట్లోని సమా వేశ మందిరంలో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ‘అంగవైకల్యాన్ని నివారించడానికి ముందుగానే కుష్ఠు వ్యాధిని గుర్తించి చికిత్స అందిస్తాం’ అనే లక్ష్యంతో జిల్లావ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సర్వేకు సహకరించాలని, శరీరంపై స్పర్శ తెలియని, అనుమానాస్పద మచ్చలు ఉంటే సర్వే బృందానికి తెలిపి పరీక్షలు చేయించుకోవాలని కోరారు. జిల్లా కుష్ఠు వ్యాధి, ఎయిడ్స్, క్షయ నివారణ అధికారి డాక్టర్ ఆర్.రమేష్ మాట్లాడుతూ ఆశ కార్యకర్తలు, పురుష ఆరోగ్య కార్యకర్తలు ప్రతి ఇంటినీ సందర్శించి కుటుంబ సభ్యులను పరీక్షిస్తారని తెలిపారు. అనుమానిత కేసులకు మరోసారి పరీక్షలు నిర్వహించి, వ్యాధి నిర్థారణ అయితే బహుళ ఔషధ చికిత్స అందిస్తారని చెప్పారు. కార్యక్రమంలో పీఎంవో వెంకటరమణ డీఎన్ఎంవో డాక్టర్ పద్మజ తదితరులు పాల్గొన్నారు. -
ఎండ.. వాన.. ఉక్కపోత!
సాక్షి, విశాఖపట్నం: సెప్టెంబర్ నెలలోనూ ఎండలు నడి వేసవిని తలపిస్తున్నాయి. వర్షాకాలమైనా వరుణుడు ముఖం చాటేయడంతో భానుడి భగభగలకు నగరవాసులు అల్లాడుతున్నారు. మంగళవారం సెప్టెంబర్లోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. 1951 నుంచి వాతావరణ గణాంకాలు పరిశీలిస్తే.. మహరాణిపేటలో నమోదైన 38.3 డిగ్రీలే అత్యధికం కావడం గమనార్హం. మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడిన నగరవాసులకు సాయంత్రం కురిసిన వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. దాదాపు 30 నిమిషాల పాటు గురుద్వారా, ఎన్ఏడీ, సీతమ్మధార, అక్కిరెడ్డిపాలెం, ఆరిలోవ, ఆనందపురం, గోపాలపట్నం తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. అయితే వర్షం ఆగిన కొద్దిసేపటికే ఉక్కపోత మొదలవడంతో ప్రజలు మళ్లీ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షపాతం వివరాలివీ... ప్రాంతం వర్షపాతం (మిమీల్లో) సీతమ్మధార 15.92 అక్కిరెడ్డిపాలెం (పెందుర్తి) 10.5 రైల్వే న్యూకాలనీ 2.0 ఆరిలోవ 1.99 రేసపువానిపాలెం 1.25 గంభీరం 0.75 మధురవాడ 0.75 హెచ్బీకాలనీ 0.50 ఆనందపురం 0.50 నగరంలో ఎండ తీవ్రత ఇలా.. ప్రాంతం ఉష్ణోగ్రత (డిగ్రీల్లో) మహరాణిపేట 38.3 ములగాడ 38.2 అక్కిరెడ్డిపాలెం (పెందుర్తి) 37.7 పద్మనాభం 37.4 ఆనందపురం 37.2 గంగవరం 37.1 గోపాలపట్నం 36.9 ఆరిలోవ 35.6 సీతమ్మధార 35.0 -
అంతా అవినీతి ట్రాకింగ్
బీచ్రోడ్డులో సైకిల్ ట్రాక్ సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో టెండర్లు పిలిచిన తర్వాత ప్రైస్ బిడ్ తెరిచి, తక్కువ ధర కోట్ చేసిన సంస్థకు కాంట్రాక్టు అప్పగించడం ఆనవాయితీ. అయితే, గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్లో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహారాలు సాగుతున్నాయి. ముందుగానే కాంట్రాక్టరును ఎంపిక చేసి, పనులు మొదలుపెట్టాక టెండర్ తెరిచి, సదరు కాంట్రాక్టర్కే పనులు దక్కినట్లు ప్రకటిస్తున్నారు. జీవీఎంసీ పరిధిలో జరుగుతున్న సైకిల్ ట్రాక్ పనులే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. సాధారణంగా టెండర్ గడువు 15 రోజులు, అత్యవసర పనులైతే వారం రోజులు ఉంటుంది. కానీ, ఈ సైకిల్ ట్రాక్ పనులకు మాత్రం కేవలం మూడు రోజుల గడువు మాత్రమే విధించారు. పోనీ టెండర్ ఖరారయ్యే వరకై నా ఆగారా అంటే అదీ లేదు. ‘ఎలాగైనా కాంట్రాక్టు నీకే వస్తుంది’ అని జీవీఎంసీ ఉన్నతాధికారి ఇచ్చిన హామీతో సదరు కాంట్రాక్టర్ గత శుక్రవారమే పనులు ప్రారంభించారు. శనివారం సాయంత్రం 5 గంటలకు టెండర్ తెరిచి, అనుకున్నట్లే అతడే ఎంపికై నట్లు ప్రకటించారు. రాజమండ్రి నుంచి తనకు పరిచయం ఉన్న కాంట్రాక్టర్కు పనులు కట్టబెట్టేందుకే ఉన్నతాధికారి నిబంధనలు మార్చారని, వీరిద్దరి మధ్య ఉన్న ‘బంధం’ ఇప్పుడు జీవీఎంసీలో చర్చనీయాంశంగా మారింది. ఎవరూ పోటీ పడకుండా పక్కా ప్లాన్ సాధారణ నిబంధనల ప్రకారం ప్రభుత్వ శాఖల్లో రూ.20 లక్షల లోపు అంచనా వ్యయం ఉన్న పనులకు అనుభవం లేకపోయినా, గుర్తింపు పొందిన ఏ కాంట్రాక్టు సంస్థ అయినా పాల్గొనవచ్చు. అయితే, ఆర్కే బీచ్ నుంచి సాగర్ నగర్ వరకు చేపడుతున్న రూ.కోటి విలువైన సైకిల్ ట్రాక్ వర్క్ను ఐదు భాగాలుగా విభజించి, ఒక్కో టెండర్ అంచనా వ్యయాన్ని రూ.16,79,533గా నిర్ణయించారు. మిగతా వారెవరూ పోటీ పడకుండా ఉండేందుకు దరఖాస్తుదారు గడిచిన ఏడాది కాలంలో 4,000 చదరపు మీటర్ల మేర ‘హాట్ అప్లైడ్ థర్మోప్లాస్టిక్ రోడ్ మార్కింగ్ కాంపౌండ్’ పని చేసి ఉండాలనే ప్రత్యేక అర్హతను జోడించారు. ఈ అనుభవం కేవలం సదరు రాజమండ్రి కాంట్రాక్టరుకు మాత్రమే ఉండటంతో, ఉన్నతాధికారి ఒత్తిడి తెచ్చి మరీ ఈ నిబంధనను చేర్పించినట్లు తెలుస్తోంది. ఆ ప్రకారమే ఐదు భాగాల పనులనూ ఆ ఒక్క సంస్థకే కట్టబెట్టారు. మూడు రోజుల్లోనే మమ అనిపించారు! ఈ షార్ట్ టెండర్ ప్రక్రియ ప్రారంభం నుంచి ముగింపు వరకు అంతా వేగంగా, ముందస్తు ప్రణాళికతో జరిగిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏ ప్రభుత్వ శాఖలోనైనా ‘షార్ట్ టెండర్’కు కనీసం వారం రోజుల గడువు ఇస్తారు. కానీ, ఈ పనులకు సెప్టెంబర్ 2న సాయంత్రం 5 గంటలకు ప్రారంభించి, సెప్టెంబర్ 5 సాయంత్రం 5 గంటలకే టెండర్ ముగించారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే టెండర్లు పిలవడం, శనివారం సాయంత్రం హడావుడిగా ఓపెన్ చేసి వెంటనే ఫైనల్ చేయడం చూస్తుంటే.. ఈ తంతంతా సదరు ఉన్నతాధికారి కనుసన్నల్లోనే నడిచిందని స్పష్టమవుతోంది. -
రోడ్డు భద్రతా శిక్షణకు 6 ఏళ్లు
గోపాలపట్నం: విశాఖపట్నం ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో రవాణా శాఖ, హోండా మోటార్ సైకిల్ స్కూటర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రాథమిక రోడ్డు భద్రతా శిక్షణ కార్యక్రమం ఆరేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఉప రవాణా కమిషనర్ ఆర్సీహెచ్ శ్రీనివాసరావు మాట్లాడారు. శిక్షణ తరగతులను 2020లో ప్రారంభించారని, ఇప్పటి వరకు 1,26,090 మందికి శిక్షణ ఇచ్చారని తెలిపారు. లెర్నింగ్ లైసెన్స్కు హాజరయ్యేవారంతా ఇక్కడ ప్రాథమిక శిక్షణ పొందుతారన్నారు. ప్రతీ అభ్యర్థికి రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు, సురక్షిత డ్రైవింగ్ పద్ధతులు, ప్రమాదాల నివారణ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. శిబిరంలో హోండా ప్రతినిధులతో పాటు మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం.బుచ్చిరాజు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారన్నారు. కార్యక్రమంలో హోండా సంస్థ ప్రతినిధులు ఆశిక్, సాయి మౌళి రవాణా శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికల కోసమే కొత్త పింఛన్ల డ్రామా
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసి దగా పాలన సాగిస్తోందని మాజీ డిప్యూటీ సీఎం, శ్రీకాకుళం, పార్వతీపురం జిల్లాల వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ బూడి ముత్యాలనాయుడు ధ్వజమెత్తారు. మంగళవారం విశాఖలోని మద్దిలపాలెంలో గల వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారం చేపట్టి రెండున్నరేళ్ల తరువాత స్థానిక ఎన్నికల దృష్ట్యా నేటి నుంచి ఏడు రోజుల పాటు కొత్త పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని ఆయన విమర్శించారు. రెండున్నరేళ్ల తరువాత కొత్త పెన్షన్లు ఇస్తూ..అది కూడా దరఖాస్తు చేసుకోవడానికి కేవలం ఏడు రోజులు మాత్రమే గడువు ఇవ్వడం సరికాదని హితవు పలికారు. అర్హులైన వారందరికీ అవకాశం దక్కేలా దరఖాస్తు గడువును మరిన్ని రోజులు పెంచాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ నాయకుల చుట్టూ కొత్త పెన్షన్ దారులను తిప్పుకుంటున్నారని, ఇది సరైన విధానం కాదన్నారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎండిపోయిన నారుమళ్లు.. కరువు విలయతాండవం చంద్రబాబు సీఎంగా ఉంటే రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుందని విమర్శించారు. వర్షాలు పడక నారుమళ్లు ఎండిపోతుంటే రైతన్నలు ఆకాశం వైపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక నష్టపోతుంటే, ప్రభుత్వం ఎలాంటి చలనం లేకుండా మొద్దునిద్ర నటిస్తోందని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ఎన్నికలకు ముందు ధరలను అదుపు చేస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ పాలనే స్వర్ణయుగం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పారదర్శకమైన, అవినీతి రహిత పాలన అందించామని ముత్యాలనాయుడు పేర్కొన్నారు. 2019–24 వరకు అర్హులైన వారు ఎప్పుడైనా పింఛన్లకు దరఖాస్తు చేసుకునేలా పోర్టల్ను ఆన్లైన్లోనే అందుబాటులో ఉంచామని చెప్పారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రజల గడప వద్దకే పాలన అందించామని గుర్తుచేశారు. వైఎస్ జగన్ పాలనలో పార్టీలకతీతంగా అర్హులైన వారందరికీ పెన్షన్లు, ఇళ్లు, ఇళ్ల స్థలాలు అందించామని, రైతులు సైతం ఆనందంగా ఉన్నారని తెలిపారు. చంద్రబాబు చెప్పే మాయమాటలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. మోసపూరిత హామీలు.. 6.20 లక్షల పింఛన్ల తొలగింపు కూటమి అధికారంలోకి వస్తే 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పారని, కానీ గత 26 నెలలుగా కొత్త పెన్షన్లు ఎందుకు మంజూరు చేయలేదని ముత్యాలనాయుడు నిలదీశారు. పైగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా 6,20,000 మంది పేదల పింఛన్లను దారుణంగా తొలగించారని మండిపడ్డారు. వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి 60 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్న మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లు మంజూరు చేశారని, ఐదేళ్ల కాలంలో 10 లక్షలకు పైగా కొత్త పెన్షన్లు ఇచ్చారని గుర్తు చేశారు. అలాగే, ’ఇంటికొక ఉద్యోగం’, ’నిరుద్యోగ భభృతి నెలకు రూ. 3,000’, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ’ఆడబిడ్డ నిధి’ కింద నెలకు రూ. 1,500 ఇస్తామని చెప్పి చంద్రబాబు ప్రజలను దారుణంగా మోసం చేశారని ధ్వజమెత్తారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోయిన చంద్రబాబు తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
వార్డుల డీలిమిటేషన్లో అడ్డగోలు మార్పులు
డాబాగార్డెన్స్ : జీవీఎంసీ వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియలో ప్రజల సౌలభ్యం, పరిపాలనా అవసరాలు, స్థానిక సంప్రదాయాలను పూర్తిగా పక్కనబెట్టి అడ్డగోలుగా మార్పులు చేస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు తీవ్రంగా ఆరోపించారు. మంగళవారం జీవీఎంసీ అదనపు కమిషనర్ను తన చాంబర్లో కలిసిన ఆయన, డీలిమిటేషన్పై పార్టీ సమన్వయకర్తలతో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నగరంలో వార్డుల సంఖ్యను 120కి పెంచే ప్రక్రియలో భాగస్వాములైన ప్రజల అభిప్రాయాలను విధిగా సేకరించాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ అంశం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో పెండింగ్లో ఉన్నప్పటికీ, అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ మ్యాపింగ్లో మార్పులు చేర్పులు చేయడం సరికాదని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే మార్పులు ప్రస్తుతం చేపడుతున్న డీలిమిటేషన్లో ప్రజా సౌకర్యం కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని కె.కె.రాజు ఆరోపించారు. కులాలు, రాజకీయ పార్టీల ప్రాతిపదికన వార్డులను విభజించడం వల్ల భవిష్యత్తులో స్థానికుల మధ్య విభేదాలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఒకే గ్రామం లేదా ప్రాంత ప్రజలను వేర్వేరు వార్డుల్లోకి మార్చడం, ఆయా ప్రాంతాల దేవాలయాలు, గ్రామ సంఘాలను ఇతర వార్డుల్లో కలపడం అనుచితమన్నారు. దశాబ్దాలుగా నగరానికి ఉన్న సామాజిక అనుబంధాలను, సంప్రదాయాలను గౌరవించాలని కోరారు. వార్డు సచివాలయ సేవలకు విఘాతం కలగొద్దు గతంలో ప్రజలకు సేవలు సులభంగా అందేలా వార్డు సచివాలయ వ్యవస్థను తీర్చిదిద్దారని గుర్తుచేశారు. ఇప్పుడు ప్రతిపాదించిన మ్యాపింగ్ వల్ల సచివాలయాల పరిధులు మారి, నివాసితులకు తాగునీరు, డ్రైనేజీ, రహదారులు వంటి మౌలిక వసతుల సమస్యల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ఎన్నికల నిబంధనలు, చట్టాలు, జీవోలకు అనుగుణంగానే ఈ ప్రక్రియ సాగాలని స్పష్టం చేశారు. మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి డీలిమిటేషన్లో చేసిన మార్పులపై ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించి, తిరిగి ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని ఆయన డిమాండ్ చేశారు. కూటమి నాయకుల రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా నగర ప్రజల ప్రయోజనాలకే అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని, గ్రీవెన్స్ కార్యక్రమాలకు ప్రాముఖ్యతనిచ్చి సమస్యలను పరిష్కరించాలని కోరారు. వైఎస్సార్సీపీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు. వినతిపత్రం అందజేసిన వారిలో పార్టీ సమన్వయకర్తలు తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు, మాజీ డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్, కార్యాలయ పర్యవేక్షకులు రవిరెడ్డి, నాయకులు బాణాల శ్రీనివాసరావు, పేడాడ రమణి కుమారి, సాడి పద్మారెడ్డి, రెయ్యి వెంకటరమణ, బిపిన్ కుమార్ జైన్, జీలకర్ర నాగేంద్ర, నీలి రవి, కె.రామిరెడ్డి, శ్రీదేవి వర్మ, చొల్లంగి నాగేశ్వరరావు, మువ్వల సంతోష్, సారిపిల్లి సంతోష్, సూర్య తదితరులు పాల్గొన్నారు. -
‘సామవేదం’కు కొప్పరపు కవుల పురస్కారం
మద్దిలపాలెం: సుప్రసిద్ధ ప్రవచనకారుడు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ప్రతిష్టాత్మక కొప్పరపు కవుల జాతీయ ప్రతిభా పురస్కారం–2026కు ఎంపికయ్యారు. కొప్పరపు కవుల కళాపీఠం 24వ వార్షికోత్సవం సందర్భంగా బుధవా రం సాయంత్రం 6 గంటలకు కళాభారతి ఆడిటోరియంలో పురస్కార ప్రదాన కార్యక్రమం జరగనుంది. మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నా యుడు, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాద్, అమెరికాకు చెందిన హృద్రోగ నిపుణుడు డాక్టర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి అతిథులుగా హాజరుకానున్నారు. మహా సహస్రావధాని డాక్టర్ మాడుగుల నాగఫణిశర్మ సభకు అధ్యక్షత వహించనున్నారు. విశిష్ట అతిథులుగా ఆచార్య విశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రి, ఆచార్య తాడేపల్లి పతంజలిశాస్త్రి హాజరుకానున్నారు. భారతీభూషణ రాంభట్ల నృసింహశర్మ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారని పీఠం అధ్యక్షుడు మాశర్మ తెలిపారు. -
ఉల్లిక్కి పోటు!
విశాఖ విద్య: ఉల్లి ధరల మంటకు సామాన్యుడి కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. మొన్నటి వరకు కేజీ రూ.30 పలికిన ఉల్లి.. ఇప్పుడు బయట మార్కెట్లో రూ.70 దాటింది. ధర రోజుకో మెట్టు ఎక్కుతుండటంతో జనం రైతుబజార్ల వైపు పరుగులు తీస్తున్నారు. అక్కడ కాస్త తక్కువ ధరకు దొరుకుతుందన్న ఆశతో తెల్లవారుజామునే క్యూలు కడుతున్నారు. కానీ రైతుబజార్లకు సరిపడా సరకు కేటాయించని పరిస్థితి. ఒకవేళ ఉల్లి దొరికినా.. నాణ్యతపై కొనుగోలుదారులు పెదవి విరుస్తున్నారు. ధరల నియంత్రణలో ప్రభుత్వ యంత్రాంగం ప్రేక్షకపాత్ర పోషిస్తుండటంతో.. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెట్లో మంట.. రైతుబజారులో స్టాక్ కొరత ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరగడంతో కుటుంబ బడ్జెట్లపై అదనపు భారం పడుతోంది. బహిరంగ మార్కెట్లో కేజీ రూ.70కుపైగా పలుకుతుండగా.. ధరలు రోజుకో విధంగా మారుతున్నాయి. దీంతో తక్కువ ధరకు లభించే రైతుబజార్లే సామాన్యులకు ప్రత్యామ్నాయంగా మారాయి. సీతమ్మధార రైతుబజారులో కొనుగోలుదారుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నాలుగు కౌంటర్ల ద్వారా విక్రయాలు చేపడుతున్నారు. కేజీ రూ.53 చొప్పున విక్రయిస్తున్నా.. సరకు పరిమితంగా ఉండటంతో వినియోగదారుల అవసరాలు పూర్తిగా తీరడం లేదు. రోజుకు 100 బస్తాల సరకు మాత్రమే వస్తుండగా.. కనీసం 200 బస్తాలు కేటాయిస్తేనే డిమాండ్కు అనుగుణంగా విక్రయాలు సాగుతాయని రైతుబజారు వర్గాలు చెబుతున్నాయి. బియ్యం కూడా భారమే... ఉల్లితో పాటు బియ్యం విక్రయాలపైనా రైతుబజార్లలో డిమాండ్ పెరిగింది. బయట మార్కెట్లో ధరలు గణనీయంగా పెరగడంతో సగటు వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. సీతమ్మధార రైతుబజారులో సబ్సిడీ కింద కేజీ బియ్యాన్ని రూ.52కు విక్రయిస్తుండగా.. సూపర్బజారులో అదే బియ్యం కేజీ రూ.63కు విక్రయిస్తున్నారు. అయితే రైతుబజారుకు కూడా సరిపడా స్టాక్ కేటాయించకపోవడంతో కొనుగోలుదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. భవిష్యత్తులో బియ్యం ధరలు మరింత పెరుగుతాయన్న ప్రచారం కూడా ప్రజల్లో ఆందోళన పెంచుతోంది. దీంతో కొందరు ముందుగానే బియ్యం కొనుగోలు చేసి ఇళ్లలో నిల్వ చేసుకుంటున్నారు. ఫలితంగా రైతుబజార్లలో అందుబాటులో ఉన్న బియ్యానికి డిమాండ్ మరింత పెరుగుతోంది. బహిరంగ మార్కెట్లో కేజీ రూ.70 పైనే రైతు బజార్లలో సరిపడా స్టాక్ లేక అవస్థలు బియ్యానికీ పెరిగిన గిరాకీ!సరఫరా పెంచాలి.. మార్కెట్పై నిఘా పెట్టాలి నిత్యావసరాల ధరలు పెరుగుతున్న సమయంలో ప్రభుత్వం కేవలం విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో సరిపెట్టకుండా.. వాటికి సరిపడా సరకు అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. ఒకవైపు బయట మార్కెట్లో ధరలు పెరుగుతుండగా.. మరోవైపు తక్కువ ధరకు విక్రయించే రైతుబజార్లలో సరిపడా స్టాక్ లేకపోతే ప్రయోజనమేంటని ప్రశ్నిస్తున్నారు. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్నారన్న ఆరోపణలపై అధికారులు తనిఖీలు చేపట్టడంతో పాటు.. మార్కెట్లో ధరల కదలికను నిరంతరం పర్యవేక్షించాలని కోరుతున్నారు. ఉల్లి, బియ్యం వంటి నిత్యావసరాల సరఫరా పెంచి, ధరల నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఉల్లి కోసం ఉదయం నుంచే క్యూ బయట మార్కెట్తో పోలిస్తే రైతుబజారులో ధర తక్కువగా ఉండటంతో ప్రజలు అక్కడే కొనుగోలు చేసేందుకు పోటీపడుతున్నారు. అయితే పరిమిత స్టాక్ కారణంగా క్యూలు పెరుగుతున్నాయి. కొందరికి సరకు దొరికినా.. మరికొందరు ఖాళీ చేతులతో వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ధరలు పెరిగినప్పుడు మార్కెట్ను నియంత్రించాల్సిన పౌరసరఫరాల శాఖ సరఫరా పెంచడంలో విఫలమవుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిమాండ్కు తగ్గట్టుగా సరకు అందుబాటులోకి వస్తేనే ధరలపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని వినియోగదారులు అంటున్నారు. ఉల్లిపాయను కోస్తే కన్నీళ్లు రావడం సహజం. కానీ, కొనకముందే దాని ధర చూసి కళ్లల్లో నీళ్లు తిరగడం నగరంలో నిత్యకృత్యంగా మారింది. మార్కెట్ మాయాజాలం పేద, మధ్యతరగతి జేబులకు చిల్లులు పెడుతుంటే.. చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం ఉల్లి కొరతను కృత్రిమంగా సృష్టిస్తున్న వ్యాపారులకు పరోక్షంగా కొమ్ముకాస్తోంది. ఉపశమనం కల్పించాల్సిన రైతుబజార్లలో నాణ్యత లేని సరకు, అరకొర సరఫరాతో వినియోగదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. -
ప్రజా సమస్యలపై విస్తృత ప్రచారం
మహారాణిపేట: ప్రజా సమస్యలను ఎండగడుతూ వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో ప్రచార విభాగం కీలకంగా పనిచేస్తుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షులు కే. రాజశేఖర్ అన్నారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర ప్రచార కమిటీ అధ్యక్షులు, జోన్–1 జీవీ రవి రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార విభాగం విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయమే లక్ష్యంగా ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తామని రాజశేఖర్ తెలిపారు. విశాఖ భూఅక్రమణలు, భోగాపురం విమానాశ్రయ బాధితుల సమస్యలు, గూగుల్ డేటా సెంటర్కు భూముల కేటాయింపుతో ప్రభావితమైన వారి సమస్యలపై ప్రజల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. జీవీ రవి రాజు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఉత్తరాంధ్రలో ప్రచార కమిటీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో ప్రచార కమిటీ జిల్లా అధ్యక్షుడు ఉమ్మడి కళ్యాణ్, జి. మనోజ్ కుమార్, పి. ఈశ్వర్రావు, బోర కుమార్ రెడ్డి, సంపంగి సురేష్, దల్లి రామకృష్ణారెడ్డి, పాత్రో శ్రీనివాస్, జి. వెంకట రమణారెడ్డి, వి. ఈశ్వరరావు, సి.ఎస్. రెడ్డి, జీరి వెంకటరెడ్డి, వి. జ్యోతి ప్రకాష్, ఎస్. గణేష్ రెడ్డి, గంటా కామరాజు తదితరులు పాల్గొన్నారు. -
హార్బర్లో తూనికలు, కొలతల శాఖ దాడులు
మహారాణిపేట: ఫిషింగ్ హార్బర్లోని చేపల వ్యాపారులపై లీగల్ మెట్రాలజీ అధికారులు మంగళవారం మెరుపు దాడులు నిర్వహించారు. లీగల్ మెట్రాలజీ డిప్యూటీ కంట్రోలర్ కేటీ రవికుమార్ ఆధ్వర్యంలో పరిధిలోని ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేపట్టారు. ముద్రలు, సీలు లేని కాటాలను కొంతమంది వ్యాపారులు వినియోగిస్తున్నట్లు పీజీఆర్ఎస్లో ఫిర్యాదులు అందాయి. తూనికలు, కొలతల శాఖ నిబంధనల్లోని లోపాలను ఆసరాగా చేసుకుని వినియోగదారులను మోసగిస్తున్నట్లు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ కంట్రోలర్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో నిబంధనలకు విరుద్ధంగా కాటాలు వినియోగిస్తున్న వారిపై మొత్తం 19 కేసులు నమోదు చేశారు. కొంతమంది వ్యాపారులు కాటాలను దాచిపెట్టినట్లు అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కంట్రోలర్ రవికుమార్ మాట్లాడుతూ అక్రమాలను అరికట్టేందుకు ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. వ్యాపారులు వినియోగించే కాటాలకు తప్పనిసరిగా ప్రభుత్వ సీలు, ముద్రలు ఉండాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడుల్లో సిటీ ఇన్స్పెక్టర్ దామోదర నాయుడు, గాజువాక ఇన్స్పెక్టర్ రాజారమేష్, పాడేరు ఇన్స్పెక్టర్ అనూరాధ, అనకాపల్లి ఇన్స్పెక్టర్ పద్మావతి, అనకాపల్లి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వెంకటరావు, టెక్నికల్ అసిస్టెంట్ ఇస్మాయిల్ పాల్గొన్నారు. -
ఘనంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవిర్భావ దినోత్సవం
బీచ్రోడ్డు: బ్యాంక్ ఆఫ్ ఇండియా 121వ ఆవిర్భావ దినోత్సవాన్ని విశాఖ జోన్ పరిధిలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం జోనల్ కార్యాలయంలో జ్యోతి ప్రజ్వలనతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం కేక్ కటింగ్, సిబ్బంది సమావేశాలు జోన్ పరిధిలోని 87 శాఖల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా జోనల్ కార్యాలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. ఉచిత ఆరోగ్య పరీక్షా శిబిరం, వివిధ శాఖల్లో రక్తదాన శిబిరాలు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కస్టమర్ మీట్స్ నిర్వహించి, బ్యాంక్తో అనుబంధం ఉన్న ప్రముఖ ఖాతాదారులను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. వేడుకల్లో భాగంగా విశాఖ మోడల్ స్కూల్ ఫర్ ది బ్లైండ్, గాజువాకకు విరాళం అందజేశారు. అనంతరం నిర్వహించిన రిటైరీల మీట్లో మాజీ ఉద్యోగులను సత్కరించారు. సోమవారం ఆర్.కే. బీచ్ రోడ్డులో ఉత్సాహభరితమైన మారథాన్ నిర్వహించారు. -
పర్యాటకం.. అటకెక్కిపాయె!
సాక్షి, విశాఖపట్నం: ప్రకృతి అందాలకు నెలవైన ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యాటకం పడకేసింది. విశాఖ నగరంలో పలు ప్రాజెక్టులు పునాది రాళ్లకే పరిమితం కాగా.. గిరిజన సంస్కృతికి కేరాఫ్గా నిలిచిన అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో విశాఖలో ఇటీవల నిర్వహించిన సదస్సులో పర్యాటక రంగం అభివృద్ధిపై పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. గత రెండేళ్లలో ఒకటీ అర ప్రాజెక్టులు మినహా పెద్దగా పర్యాటక రంగం అభివృద్ధి చెందిన దాఖలాలు కనిపించడం లేదని అధికారులు సైతం పెదవి విరిచారు. ప్రభుత్వం శంకుస్థాపనలకే పరిమితమవుతూ.. ప్రాజెక్టుల అభివృద్ధిపై పెద్దగా దృష్టిసారించకపోవడం, స్థానిక పర్యాటక అధికారులు సైతం తమకేమీ సంబంధం లేదన్నట్లుగా అంటీముట్టనట్లు వ్యవహరించడం పర్యాటక రంగం పతనానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. పుష్కలమైన అవకాశాలున్న అల్లూరి జిల్లాను పూర్తిగా విస్మరించడంతో.. ఈ ఏడాది పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. పర్యాటకుల సందడి ఏదీ ఉమ్మడి విశాఖ జిల్లాకు పర్యాటకుల రాక ఈ ఏడాది దారుణంగా పడిపోయింది. ముఖ్యంగా పర్యాటకులు ఎక్కువగా సందర్శించే అల్లూరి జిల్లాలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. 2025లో 72,10,942 మంది పర్యాటకులు జిల్లాను సందర్శించగా.. ఈ ఏడాది జూలై నాటికి కేవలం 2,79,553 మంది మాత్రమే వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పర్యాటక ప్రాంతాల్లో కొత్తగా సందర్శనీయ స్థలాలను అభివృద్ధి చేయకపోవడంతో క్రమంగా పర్యాటకుల సంఖ్య తగ్గిపోతోంది. అందుబాటులో ఉన్న ప్రాంతాలను అభివృద్ధి చేసి, కొత్త ఆకర్షణలను అందుబాటులోకి తీసుకురావడంలో పర్యాటక శాఖ విఫలమవుతోంది. కాగితాల్లోనే పెట్టుబడులు ఏపీటీడీసీ విశాఖ రీజియన్ పర్యవేక్షణలో అల్లూరి జిల్లాలో రూ.375 కోట్ల పెట్టుబడులు, 925 ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించిన మూడు పర్యాటక ప్రాజెక్టులు ఇంకా డీపీఆర్ తయారీ దశలోనే మగ్గుతున్నాయి. రూ.15 కోట్లతో వైజాగ్ రిక్రియేషన్ ప్రై. లిమిటెడ్, రూ.350 కోట్లతో సన్విక్ గోల్ఫ్ హెవెన్ ప్రై. లిమిటెడ్, రూ.10 కోట్లతో ఉర్మికా లీజర్ సర్వీసెస్ చేపట్టాల్సిన ప్రాజెక్టులు డీపీఆర్ తయారీ దశను దాటలేదు. కనీసం ఈ ప్రాజెక్టులనైనా ప్రారంభించేందుకు ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇవి నిజంగా పెట్టుబడులేనా? లేక చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ఉత్తుత్తి ఒప్పందాలా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అరకు మండలం కొత్తవలసలో రూ.18 కోట్లతో చేపట్టాల్సిన టెంట్ సిటీ పనులు ఇంకా టెండర్ దశలోనే ఉన్నాయి. లంబసింగిలో రూ.6.13 కోట్లతో చేపట్టిన టెంట్ సిటీ పనులు అసంపూర్తిగా కొనసాగుతున్నాయి. అంజోడ, అరకు, ముంచంగిపుట్టు, చింతపల్లి ప్రాంతాల్లో కారవాన్ టూరిజం ప్రాజెక్టులు ఇంకా టెండర్ల దశలోనే ఉన్నాయి. అడ్వెంచర్ టూరిజం ప్రాజెక్టులకు సంబంధించిన ఫైళ్లు సైతం ఇంకా సర్క్యులేషన్లోనే ఉండిపోవడం గమనార్హం. భూములున్నా.. అభివృద్ధి శూన్యం అల్లూరి జిల్లాలో పర్యాటక శాఖకు మొత్తం 180.39 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. ఇందులో ఏకంగా 92.86 ఎకరాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా నిరుపయోగంగా పడి ఉన్నాయి. ప్రభుత్వం పర్యాటక శాఖను పూర్తిగా గాలికొదిలేయడంతో.. స్థానిక అధికారులు సైతం ఇక్కడి అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా పర్యాటక శాఖ కార్యాలయంలో కనీసం రెగ్యులర్ అధికారులు, తగినంత సిబ్బంది, కార్యాలయ వాహనాలు కూడా లేని దుస్థితి నెలకొంది. పర్యాటక కేంద్రాల్లో కనీసం చెత్తకుండీలు, సైనేజ్ బోర్డులు కూడా ఏర్పాటు చేయలేని దయనీయ పరిస్థితి తమ శాఖలో ఉందని కొందరు పర్యాటక శాఖ సిబ్బంది వాపోతుండటం పరిస్థితికి అద్దం పడుతోంది. కాగితాలకే పరిమితమైన అభివృద్ధి అల్లూరి జిల్లాపై దృష్టిసారించని ఏపీటీడీసీ ఇంకా డీపీఆర్ దశలోనే రూ.375 కోట్ల పెట్టుబడులు 2025లో 72.10 లక్షల మంది పర్యాటకుల రాక ఈ ఏడాది జూలై నాటికి 2.79 లక్షల మంది సందర్శన -
ఏపీ డీఎస్సీ స్కామ్లో సంచలన పరిణామం
సాక్షి,విశాఖ: ఏపీ డీఎస్సీ స్కామ్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. విశాఖలో టీచర్ ఉద్యోగాలు పొందిన చిల్లా యోగేశ్వరరావు, మోహినీ దేవిలు సమర్పించిన స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఫేక్ అని తేలడంతో చర్చాంశనీయమైంది. ఈ వ్యవహారంపై ఏపీ ఖోఖో అసోసియేషన్ మాజీ సెక్రెటరీ మేకల సీతారామిరెడ్డి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(శాప్) అధికారులకు సంచలన లేఖ రాశారు.ఈ ఫేక్ సర్టిఫికేట్ల బండారాన్ని సాక్షి టీవీ తొలుత బయటపెట్టగా, తాజాగా ఖోఖో అసోసియేషన్ అధికారిక లేఖతో విషయం మరింత స్పష్టమైంది. శాప్కు రాసిన లేఖలో‘చిల్లా యోగేశ్వరరావు, మోహినీ దేవిలకు సర్టిఫికేట్లు మేం ఇవ్వలేదు.శాప్ నుండి వీళ్ల అభ్యర్థిత్వంపై ఎలాంటి సమాచారం మాకు అందలేదు. వీళ్లు ఇద్దరికి మేం ఎలాంటి మెరిట్ సర్టిఫికేట్లు ఇవ్వలేదు. మా టోర్నమెంట్ల జాబితాల్లో ఎక్కడా వీరి పేర్లు లేవు. శాప్కి మేం పూర్తి వివరాలు అందిస్తున్నాం. వీళ్లు పొందుపర్చిన సర్టిఫికేట్లు చెల్లవు.నకిలీ, ఫోర్జరీ సర్టిఫికేట్లపై విచారణ జరపాలి. ఆ సర్టిఫికేట్లపై చర్యలు తీసుకోవాలి. శాప్కి మేం పూర్తి సహకారాన్ని అందిస్తాం’అని ఏపీ ఖోఖో అసోసియేషన్ మాజీ సెక్రెటరీ మేకల సీతారామిరెడ్డి లేఖలో పేర్కొన్నారు. -
బాత్రూంలో ఆరు అడుగుల నాగుపాము కలకలం
విశాఖపట్నం: జీవీఎంసీ 89వ వార్డు కొత్తపాలెం ఖర్వేల్ నగర్లో ఓ ఇంటి మరుగుదొడ్డి గదిలోకి ఆరు అడుగుల నాగుపాము చొరబడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ మేడుకొండ సునీల్ ఘటనాస్థలికి చేరుకుని చాకచక్యంగా పామును సురక్షితంగా పట్టుకుని బాటిల్లో బంధించారు. అనంతరం పామును అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని తెలిపారు. ఎక్కడైనా పాములు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని, వాటిని చంపవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సునీల్ సేవలను స్థానికులు అభినందించారు. చదవండి: అక్కా.. నన్ను చంపేస్తారు..! -
అక్కా.. నన్ను చంపేస్తారు..!
విశాఖపట్నం: రెక్కాడితే గానీ డొక్కాడని సామాన్య మత్స్యకార కుటుంబం వారిది. కష్టాల కడలిని ఈదుతూ నాలుగు రాళ్లు సంపాదించుకునేందుకు పొరుగు జిల్లా నుంచి వలసొచ్చిన ఆ కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది. రాత్రి ‘బయటకు వెళ్లి వస్తా’నని చెప్పి వెళ్లిన వ్యక్తి.. తెల్లవారేసరికి సముద్రతీరంలో విగతజీవిగా కనిపించడంతో భార్యాపిల్లలు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. సముద్రపు ఒడ్డున రక్తపు మడుగులో.. వన్ టౌన్ సీఐ వరప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన మైలపల్లి చంటి(30) కొంతకాలంగా విశాఖ ఫిషింగ్ హార్బర్లో చేపలవేట చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య, పిల్లలతో కలిసి స్థానిక పెయిన్దొరపేటలో నివాసం ఉంటున్నాడు. వారం రోజులుగా వేటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్న చంటి, ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో బయటకు వెళ్లాడు. సోమవారం ఉదయం నేవల్ కోస్టల్ బ్యాటరీ సమీపంలోని గంగాలమ్మ గుడి వద్ద రక్తపు మడుగులో కనిపించాడు. చంటిని గుర్తించిన స్థానిక మత్స్యకారులు పోలీసులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని వ్యక్తులు అతడి తలపై కర్రలతో బలంగా కొట్టి, మెడకు నైలాన్ తాడు బిగించి అత్యంత కిరాతకంగా హతమార్చినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ముందే ఊహించినా.. దక్కని ప్రాణం ఈ దారుణం వెనుక పక్కా ప్రణాళిక ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు వ్యక్తులు తనను చంపేస్తామని బెదిరిస్తున్నట్లు ఆదివారమే చంటి తన సోదరి అప్పలకొండ వద్ద వాపోయాడు. అంతలోనే.. హత్యకు గురికావడం ఆ కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ బెదిరింపులకు పాల్పడినవారే ఈ ఘాతుకానికి ఒడిగట్టారా? లేక మరేదైనా వివాదం ఉందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుడి సోదరి అప్పలకొండ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్లతో ఘటనా స్థలాన్ని పరిశీలించి కీలక ఆధారాలు సేకరించారు. నిందితులను గుర్తించేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు. కష్టపడి బతికే మత్స్యకారుడి ప్రాణాలు గాల్లో కలసిపోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది. చదవండి: భర్త ఫోన్ ఎత్తలేదని భార్య ఆత్మహత్య -
సర్టిఫి‘కేట్లు’ కలకలం..!
సాక్షి, విశాఖపట్నం: మెగా డీఎస్సీలో ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారగా.. ఉమ్మడి విశాఖతోపాటు ఇతర జిల్లాల్లోనూ నకిలీ ధ్రువపత్రాలతో పలువురు ఉద్యోగాలు పొందారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్పోర్ట్స్ కోటాతోపాటు వీహెచ్ (విజువల్లీ హ్యాండీక్యాప్డ్), ఈడబ్ల్యూఎస్ (ఎకనామికల్లీ వీకర్ సెక్షన్) కేటగిరీల్లోనూ నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి, మెరిట్ను పక్కనపెట్టి ఉద్యో గాలు పొందారన్నది పలువురు బాధిత అభ్యర్థుల ప్రధాన ఆరోపణ. 66.6 మార్కులొచ్చినా..విశాఖకు చెందిన దేవగుటపు సంతోష్ పార్వతి డీఎస్సీ పీజీటీ పరీక్షలో 66.6 మార్కులు (హాల్ టికెట్ నెం. ఎండీఎస్సీ 0124213) సాధించారు. ఓసీ సామాజిక వర్గానికి చెందిన ఆమెకు జోన్–1లో 92వ ర్యాంక్ లభించింది. పీజీటీలో మొత్తం 10 పోస్టులు ఉండగా తనకంటే చాలా తక్కువ మార్కులు సాధించిన వ్యక్తికి వీహెచ్ కోటా కింద ఉద్యోగం దక్కడం వల్ల తనకు అవకాశం చేజారిందని ఆమె వాపోతోంది. 46 మార్కులతో 852వ ర్యాంక్ పొందిన అశోక్కుమార్కు (హెచ్టీ నెం.ఎండీఎస్సీ 0242090) ఈడబ్ల్యూఎస్, వీహెచ్ కోటా కింద ఉద్యోగం లభించింది. తనకు రావాల్సిన ఉద్యోగాన్ని నకిలీ వీహెచ్ సర్టిఫికెట్ ద్వారా పొందినట్లు సంతోష్ పార్వతి ఆరోపిస్తోంది. ఇదే రీతిలో వైఎస్సార్ కడప జిల్లా పులివెందులకు చెందిన భాస్కర్రెడ్డి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ విభాగంలో 72.52 మార్కులతో 68వ ర్యాంక్ సాధించినప్పటికీ ఉద్యోగం దక్కలేదని సంతోష్ పార్వతి చెబుతున్నారు. గుంటూరు జీజీహెచ్ నుంచి నకిలీ హ్యాండిక్యాప్ సర్టిఫికెట్ తెచ్చుకున్న గోనెగుంట సుభాషిణి టెట్ అర్హత కూడా లేకపోయినా 48 మార్కులతో ఉద్యోగం పొందారని ఆమె ఆరోపిస్తున్నారు. మరోవైపు మదనపల్లికి చెందిన అంజనప్పకు ఒక కన్ను లేకపోయినా.. వైద్య పరీక్షల్లో 30 శాతం వైకల్యమే ఉన్నట్లు నిర్ధారించడంతో ఉద్యోగం ఇవ్వలేదని బాధిత అభ్యర్థులు చెబుతున్నారు. రీ–వెరిఫికేషన్లో 40 శాతం వైకల్యం ఉన్నట్లు తేలిందని పేర్కొంటున్నారు. తనకు ఇది చివరి డీఎస్సీ అని, వయసు కారణంగా మరోసారి పరీక్ష రాసే అవకాశం లేదని పార్వతి చెబుతున్నారు. బంగారం తాకట్టు పెట్టి సుమారు రూ.60 వేల వరకు ఖర్చు చేసి న్యాయస్థానాన్ని ఆశ్రయించానని తెలిపారు.700 మందికిపైగా నష్టపోయారా?రాష్ట్రవ్యాప్తంగా మెరిట్ సాధించి 1 : 1 నిష్పత్తిలో వెరిఫికేషన్కు హాజరైన 700 మందికిపైగా అభ్యర్థులు నకిలీ సర్టిఫికెట్ల కారణంగా ఉద్యోగాలు కోల్పోయారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై మంత్రి లోకేశ్తోపాటు అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని మండిపడుతున్నారు. -
జలవనరుల శాఖ సీఈ తిరుమలరావు బాధ్యతలు
ఎంవీపీకాలనీ: జలవనరులశాఖ ఉత్తరాంధ్ర చీఫ్ ఇంజినీర్గా డి.తిరుమలరావు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు సీఈగా ఉన్న రామ్గోపాల్ ఇటీవల ఉద్యోగ విరమణ చేయడంతో, తిరుమలరావును ఆ స్థానంలో ప్రభుత్వం నియమించింది. దీంతో ఆయన సోమవారం ఉషోదయ జంక్షన్లోని కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. గతంలో విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన ప్రస్తుతం ధవళేశ్వరంలో ఎస్ఈగా విధులు నిర్వర్తిస్తూ, పదోన్నతిపై ఇక్కడికి వచ్చారు. పలువురు విభాగ ఇంజినీరింగ్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యుటీ ఇంజినీర్ శ్రీహరి, ఈఈ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
స్వచ్ఛ వాయువుతోనే ఆరోగ్యకర జీవనం
మహారాణిపేట: స్వచ్ఛమైన వాయువు అందరికీ అందాలంటే కాలుష్య నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) చైర్మన్ డా. పి.కృష్ణయ్య పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.3 కోట్లతో వాయు నాణ్యతను గుర్తించే పరికరాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ‘స్వచ్ఛ వాయువు–నీలాకాశం కోసం స్వచ్ఛమైన గాలి’ కార్యక్రమంలో భాగంగా ఏపీపీసీబీ, జీవీఎంసీ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం బీచ్రోడ్డులో గ్రీన్ వాకథాన్ నిర్వహించారు. వీపీఏ చైర్మన్ జస్మిత్ సింగ్ బింద్రా, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, పోర్టు వైస్ చైర్పర్సన్ రోషణి అపరంజితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జెన్ జీ సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయాలని సూచించారు. పోర్టు చైర్మన్ జస్మిత్ సింగ్ బింద్రా మాట్లాడుతూ పోర్టు పరిధిలో మొక్కల పెంపకాన్ని విస్తృతంగా చేపడుతున్నామన్నారు. ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు మాట్లాడుతూ కాలుష్య నియంత్రణలో భాగంగా ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచుతున్నామన్నారు. వాయు కాలుష్యంపై వర్క్షాప్ స్వచ్ఛ వాయు దివస్ సందర్భంగా జీవీఎంసీ కార్యాలయంలో వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ మాట్లాడుతూ పరిశ్రమలను ప్రోత్సహించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు అవసరమైన సాంకేతికతను అందిపుచ్చుకుని పరిశ్రమలు ముందుకు సాగడం అభినందనీయమన్నారు. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు జీవీఎంసీ ఆధునిక ఆటోమేటెడ్ సిగ్నలింగ్ వ్యవస్థను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ చెప్పారు. -
ఆరు అడుగుల నాగుపాము కలకలం
గోపాలపట్నం: జీవీఎంసీ 89వ వార్డు కొత్తపాలెం ఖర్వేల్ నగర్లో ఓ ఇంటి మరుగుదొడ్డి గదిలోకి ఆరు అడుగుల నాగుపాము చొరబడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ మేడుకొండ సునీల్ ఘటనాస్థలికి చేరుకుని చాకచక్యంగా పామును సురక్షితంగా పట్టుకుని బాటిల్లో బంధించారు. అనంతరం పామును అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని తెలిపారు. ఎక్కడైనా పాములు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని, వాటిని చంపవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సునీల్ సేవలను స్థానికులు అభినందించారు. -
అక్కా.. నన్ను చంపేస్తారు..!
అల్లిపురం: రెక్కాడితే గానీ డొక్కాడని సామాన్య మత్స్యకార కుటుంబం వారిది. కష్టాల కడలిని ఈదుతూ నాలుగు రాళ్లు సంపాదించుకునేందుకు పొరుగు జిల్లా నుంచి వలసొచ్చిన ఆ కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది. రాత్రి ‘బయటకు వెళ్లి వస్తా’నని చెప్పి వెళ్లిన వ్యక్తి.. తెల్లవారేసరికి సముద్రతీరంలో విగతజీవిగా కనిపించడంతో భార్యాపిల్లలు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. సముద్రపు ఒడ్డున రక్తపు మడుగులో.. వన్ టౌన్ సీఐ వరప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన మైలపల్లి చంటి(30) కొంతకాలంగా విశాఖ ఫిషింగ్ హార్బర్లో చేపలవేట చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య, పిల్లలతో కలిసి స్థానిక పెయిన్దొరపేటలో నివాసం ఉంటున్నాడు. వారం రోజులుగా వేటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్న చంటి, ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో బయటకు వెళ్లాడు. సోమవారం ఉదయం నేవల్ కోస్టల్ బ్యాటరీ సమీపంలోని గంగాలమ్మ గుడి వద్ద రక్తపు మడుగులో కనిపించాడు. చంటిని గుర్తించిన స్థానిక మత్స్యకారులు పోలీసులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని వ్యక్తులు అతడి తలపై కర్రలతో బలంగా కొట్టి, మెడకు నైలాన్ తాడు బిగించి అత్యంత కిరాతకంగా హతమార్చినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ముందే ఊహించినా.. దక్కని ప్రాణం ఈ దారుణం వెనుక పక్కా ప్రణాళిక ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు వ్యక్తులు తనను చంపేస్తామని బెదిరిస్తున్నట్లు ఆదివారమే చంటి తన సోదరి అప్పలకొండ వద్ద వాపోయాడు. అంతలోనే.. హత్యకు గురికావడం ఆ కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ బెదిరింపులకు పాల్పడినవారే ఈ ఘాతుకానికి ఒడిగట్టారా? లేక మరేదైనా వివాదం ఉందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుడి సోదరి అప్పలకొండ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్లతో ఘటనా స్థలాన్ని పరిశీలించి కీలక ఆధారాలు సేకరించారు. నిందితులను గుర్తించేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు. కష్టపడి బతికే మత్స్యకారుడి ప్రాణాలు గాల్లో కలసిపోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది. -
కొడుకుల ఆదరణ కోసం వృద్ధుడి వేడుకోలు
‘నా వయసు 92 ఏళ్లు. వృద్ధాప్యంలో నాకు తోడు కావాలి. నన్ను నా కుమారుడి దగ్గరకు చేర్చి న్యాయం చేయండి ప్లీజ్ సార్..’ అంటూ ఓ వృద్ధుడు పీజీఆర్ఎస్లో అధికారుల ఎదుట తన గోడును వెళ్లబోసుకున్నాడు. భీమిలి ప్రాంతానికి చెందిన బి. సూర్యనారాయణ తనను కుమారుల వద్దకు పంపించాలని కోరుతూ సోమవారం పీజీఆర్ఎస్లో భీమిలి ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు.సూర్యనారాయణ ఏపీఎస్ఈబీలో ఇంజినీర్గా పనిచేసి పదవీ విరమణ పొందారు. తనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారని తెలిపారు. ఇద్దరు కుమార్తెలకు వివాహాలు చేసి బాధ్యతలు నిర్వర్తించానని, అయితే ప్రస్తుతం వృద్ధాప్యంలో తనను చూసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పీఎం పాలెంలోని ఓ వృద్ధాశ్రమంలో జీవనం సాగిస్తున్నానని తెలిపారు. తన చిన్న కుమారుడు ఎన్ఏడీలో పనిచేసి పదవీ విరమణ పొంది ప్రస్తుతం భీమిలిలో నివాసం ఉంటున్నారని, పెద్ద కుమారుడు హైదరాబాద్లోని ఓ కంపెనీలో పనిచేసి రిటైర్ అయి అక్కడే ఉంటున్నారని వివరించారు.జీవిత చరమాంకంలో తనకు కుటుంబ సభ్యుల ఆదరణ, ఆప్యాయత అవసరమని పేర్కొంటూ, తనను చిన్న కుమారుడి వద్దకు చేర్చేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీవోను వేడుకున్నారు. వృద్ధుడి పరిస్థితిని మానవీయ దృక్పథంతో పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. – మహారాణిపేట -
సరికొత్త పల్సర్ శ్రేణి ఆవిష్కరణ
బీచ్రోడ్డు: పల్సర్ బ్రాండ్ 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా రెండు కోట్లకు పైగా వాహనాల విక్రయాల సందర్భంగా సిరిపురంలోని వరుణ్ బజాజ్ షోరూంలో సరికొత్త పల్సర్ శ్రేణిని సోమవారం ఆవిష్కరించారు. స్పోర్టీ స్వభావాన్ని కొనసాగిస్తూ ఆధునిక డిజైన్, మెరుగైన పనితీరు, అధునాతన సాంకేతిక ఫీచర్లతో కొత్త పల్సర్ 150ను తీర్చిదిద్దారు. బోల్డ్, మస్క్యులర్ డిజైన్, వోల్ఫ్–ఐ ఎల్ఈడీ హెడ్ల్యాంప్, క్రిస్టల్ టెయిల్ ల్యాంప్స్, స్పోర్టీ పెంటగాన్ సైలెన్సర్ దీని ప్రత్యేక ఆకర్షణ. 14 పీఎస్ శక్తినిచ్చే సరికొత్త ఇంజిన్, తక్కువ ఆర్పీఎంలో అధిక టార్క్, 150 సీసీ విభాగంలో తొలిసారిగా క్రాల్ టెక్, స్పోర్ట్, రోడ్, రైన్ రైడ్ మోడ్లు, ఐడిల్ స్టార్ట్/స్టాప్, ఆయిల్–కూల్డ్ ఇంజిన్ వంటి ఫీచర్లు అందించారు. 5 అంగుళాల టీఎఫ్టీ డిస్ప్లే, గూగుల్ మ్యాప్స్ మిర్రరింగ్, యూఎస్బీ–సీ చార్జింగ్, ట్విన్ డిస్క్ బ్రేకులు తదితర సదుపాయాలున్నాయి. తక్కువ డౌన్పేమెంట్తో వాహనం అందుబాటులో ఉంటుందని, బుకింగ్స్కు మంచి స్పందన లభిస్తోందని షోరూం సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఎం అబ్బాస్ శేఖరన్, వరుణ్ బజాజ్ సీఈవో శ్రీనివాస్, వరుణ్ సిబ్బంది పాల్గొన్నారు. -
24 మందికి వేతన వ్యత్యాసం చెల్లింపు
సీతంపేట: కార్మికులకు కనీస వేతనాల వ్యత్యాసం కింద 2లక్షల 81 వేల 607 రూపాయలను సంబంధిత యాజమాన్యాలు చెల్లించాయి. కార్మికశాఖ అధికారులు ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో కనీస వేతనాల కంటే తక్కువమొత్తంలో వేతనాలు చెల్లిస్తున్నట్టు గుర్తించి, సంబంధిత యాజమాన్యాలకు సూచనలు చేశారు. స్పందించిన యాజమాన్యాలు ఈ బకాయి మొత్తాన్ని 24 మంది కార్మికులకు అందజేశారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ ఉప కమిషనర్ కె.దినేష్కుమార్ మాట్లాడుతూ కార్మికులకు చట్టపరంగా అందాల్సిన కనీస వేతనాలు పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. యాజమాన్యాలు కార్మిక చట్టాలను తప్పనిసరిగా పాటించేలా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని కొనసాగిస్తూనే, కార్మిక చట్టాలను అమలుకు ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నారు. -
యాదవులకు వెన్నుపోటు!
డాబాగార్డెన్స్: ‘ఓడ దాటేదాకా ఓడ మల్లన్న.. ఓడ దాటాక బోడి మల్లన్న’.. ఈ సామెత చంద్రబాబు ప్రభుత్వానికి సరిగ్గా సరిపోతుంది. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం యాదవ సామాజిక వర్గాన్ని ఉద్ధరించేస్తానని చెప్పుకొచ్చిన బాబు.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కరివేపాకులా పక్కనపడేశారని కూటమి నేతలే అంగీకరిస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు గడుస్తున్నా యాదవ సామాజిక వర్గానికి మొండిచేయే ఎదురవుతోందని స్వయంగా ఆ పార్టీల యాదవ సామాజికవర్గ నేతలే మీడియాకెక్కడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్ సీటుతో పాటు మెజార్టీ కార్పొరేటర్ స్థానాలను యాదవులకు కేటాయించాలని సోమవారం డిమాండ్ చేయడం ఆయా పార్టీల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. వైఎస్సార్సీపీ హయాంలో అగ్రతాంబూలం గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో (2019–2024) యాదవ సామాజిక వర్గానికి సామాజిక న్యాయం చేకూరిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. విశాఖ నగర చరిత్రలోనే తొలిసారిగా యాదవ మహిళ గొలగాని హరి వెంకటకుమారికి విశాఖ నగర ప్రథమ పౌరురాలిగా మేయర్ పీఠాన్ని అప్పగించి ఆ వర్గానికి అత్యున్నత గౌరవాన్ని అందించింది. అదేవిధంగా వంశీకృష్ణ శ్రీనివాస్కు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ పదవి కల్పించడంతో పాటు, వీఎంఆర్డీఏ చైర్మన్గా అక్కరమాని విజయనిర్మలకు బాధ్యతలు అప్పగించి యాదవులకు అండగా నిలిచింది. యాదవుల సంక్షేమం, సమగ్రాభివృద్ధి కోసం ప్రత్యేకంగా ‘ఆంధ్రప్రదేశ్ యాదవ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ ఏర్పాటు చేసి సామాజిక సాధికారతకు బాటలు వేసింది. రాజకీయ ప్రాధాన్యతతో పాటే ఆర్థిక పురోగతికి పెద్దపీట వేశారు. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 45 నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న యాదవ మహిళల జీవనోపాధి కోసం ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేల ఆర్థిక సాయాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. కూటమి పాలనలో తీవ్ర వివక్ష కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత యాదవుల పరిస్థితి తలకిందులైంది. కేబినెట్లోనే కాకుండా, నామినేటెడ్, ఇతర పార్టీ పదవుల్లో యాదవులకు ప్రాధాన్యత కల్పించకపోవడంపై గత కొద్దికాలంగా ఆ సామాజికవర్గంలో అసంతృప్తి రగులుతోంది. తాజాగా జీవీఎంసీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతుండటంతో ఇప్పుడు కూటమి పార్టీలకు చెందిన యాదవ వర్గ నాయకులే బయటకు వచ్చి కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా సీట్లు కేటాయించాలని మొరపెట్టుకోవాల్సిన దుస్థితి దాపురించింది. ఇదిలా ఉంటే చంద్రబాబు సర్కారు యాదవులపై చూపుతున్న నిర్లక్ష్య వైఖరిపై రానున్న రోజుల్లో నిరసన గళం విప్పేందుకు ఆ సామాజిక వర్గం సమాయత్తమవుతోంది. మేయర్ సీటు యాదవులకే ఇవ్వాలి కూటమికి యాదవ సంఘాల డిమాండ్ బీచ్రోడ్డు: జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి తరఫున మేయర్ అభ్యర్థిగా యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే అవకాశం కల్పించాలని యాదవ సంక్షేమ సంఘం, కూటమి యాదవ నాయకులు కోరారు. రాంనగర్లోని ఓ హోటల్లో వియ్యపు సత్యనారాయణమూర్తి (మూర్తి యాదవ్) అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు అక్కరమాని వెంకట్రావు, యాదవ ఎంప్లాయీస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ప్రగాఢ చిన్నారావు మాట్లాడారు. జనాభా నిష్పత్తికి అనుగుణంగా యాదవులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సిన బాధ్యత కూటమిపై ఉందన్నారు. మేయర్ పదవితో పాటు వార్డు స్థాయిలోనూ యాదవులకు గణనీయ సంఖ్యలో కార్పొరేటర్ టికెట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు త్వరలో వినతిపత్రం అందజేస్తామని చెప్పారు. -
గుంతల పూడ్చివేతకు ‘కొత్త డాక్టర్’
అల్లిపురం: నగర రహదారులపై గుంతలను వేగంగా పూడ్చేందుకు జీవీఎంసీ ఆధునిక ‘ప్యాచ్హోల్ డాక్టర్’ యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. రూ.1.30 కోట్లతో కొనుగోలు చేసిన ఈ యంత్రం పనితీరును కేర్ హాస్పిటల్ సమీపంలో కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్తో కలిసి సోమవారం పరిశీలించి, ప్రారంభించారు. రహదారి గుంతలను శుభ్రపరచడం, బిటుమెన్ మిశ్రమంతో పటిష్టంగా ప్యాచ్వర్క్ చేసేందుకు ఈ యంత్రం ఉపయోగపడుతుంది. జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్ మాట్లాడుతూ ఈ యంత్రం రోజుకు 10–15 ప్రాంతాల్లో, సుమారు 300 చ.మీ. విస్తీర్ణంలో ప్యాచ్వర్క్ చేపట్టే సామర్ధ్యం కలిగి ఉందన్నారు. అన్ని జోన్లలో అవసరాన్ని బట్టి యంత్రాన్ని వినియోగిస్తామని, అధిక వాహన రాకపోకలు ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యమిస్తామని చెప్పారు. యంత్రాన్ని సరఫరా చేసిన సంస్థే మూడేళ్లపాటు ఆపరేషన్, నిర్వహణ బాధ్యతలు చేపడుతుందని వివరించారు. కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ మాట్లాడుతూ, రహదారి గుంతలను ఎప్పటికప్పుడు గుర్తించి, తక్షణమే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మెకానికల్ విభాగం పర్యవేక్షక ఇంజినీర్ ఎస్ఈ రాయల్ బాబు పాల్గొన్నారు. -
అర్జీలకు తక్షణ పరిష్కారం
మహారాణిపేట: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు చురుగ్గా వ్యవహరించి, నిర్ణీత సమయంలో నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఆయన, ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా పీజీఆర్ఎస్లో మొత్తం 318 వినతులు అందాయి. కార్యక్రమంలో జేసీ విద్యాధరి, డీఆర్వో ఎం. విశ్వేశ్వరనాయుడు, ఆర్డీవో సంగీత్ మాధుర్ తదితరులు పాల్గొన్నారు. -
ట్రాక్తప్పారు!
ఆర్కే బీచ్ నుంచి సాగర్నగర్ వరకు సైకిల్ ట్రాక్ నిర్మాణానికి టెండర్లు షార్ట్ టెండర్ పనులకు ఎన్నడూ లేని విధంగా కఠిన నిబంధనలు రాజమండ్రి కాంట్రాక్టర్ కోసం నిబంధనలు తుంగలో తొక్కిన అధికారులు రూ. కోటి పనులను గుట్టుచప్పుడు కాకుండా 5 భాగాలుగా విభజన కేవలం 3 రోజుల్లోనే టెండర్ పూర్తి.. ఆగమేఘాల మీద ఫైనల్టెండర్లలోసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : మహా విశాఖ నగర పాలక సంస్థలో షార్ట్ టెండర్ల ప్రక్రియ అపహాస్యంగా మారింది. ఇటీవల వీఎంఆర్డీఏ టెండర్ల వ్యవహారం తీవ్ర ఆరోపణలకు దారితీయగా, ఇప్పుడు జీవీఎంసీ సైతం అదే బాటలో పయనిస్తోంది. ఆర్కే బీచ్ నుంచి సాగర్నగర్ వరకు నిర్మించ తలపెట్టిన సైకిల్ ట్రాక్ పనుల టెండర్లలో హస్తలాఘవం ప్రదర్శించారు. ఒక ఉన్నతాధికారికి అత్యంత సన్నిహితుడైన కాంట్రాక్టర్ కోసం ప్రత్యేక నిబంధనల మెలికలు పెట్టి, పనులను కట్టబెట్టేశారు. కేవలం మూడు రోజుల్లోనే ఈ టెండర్ ప్రక్రియను ముగించి, శనివారం సాయంత్రానికల్లా అధికారిక ముద్ర వేయడం తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది. ఒత్తిళ్లతో వింత షరతులు! సాధారణంగా జీవీఎంసీలో రూ.20 లక్షల లోపు అంచనా వ్యయం ఉన్న షార్ట్ టెండర్లకు కాంట్రాక్టర్ల అనుభవానికి సంబంధించి కఠినమైన షరతులు ఉండవు. కానీ, ఆర్కే బీచ్ నుంచి సాగర్నగర్ వరకు థర్మోప్లాస్టిక్ సైకిల్ ట్రాక్ నిర్మాణ పనుల విషయంలో మాత్రం అధికారులు వింతపోకడలు పోయారు. సుమారు రూ. కోటి విలువైన ఈ ప్రాజెక్టును చిన్న భాగాలుగా విభజించి, ఒక్కో టెండర్ను కేవలం రూ.16,79,533 అంచనా వ్యయంతో ఆహ్వానించారు. అయితే, ఈ పనులకు దరఖాస్తు చేసే కాంట్రాక్టర్ గత ఏడాది వ్యవధిలోనే ఏకంగా 4,000 చదరపు మీటర్ల మేర ‘హాట్ అప్లైడ్ థర్మోప్లాస్టిక్ రోడ్ మార్కింగ్ కాంపౌండ్’ పని పూర్తి చేసి ఉండాలనే అత్యంత కఠినమైన నిబంధనను చేర్చారు. అత్యల్ప అంచనా వ్యయం ఉన్న పనులకు ఇలాంటి భారీ షరతు విధించడం వెనుక అసలు ఆంతర్యం ఏమిటన్నది ఇప్పుడు నగరంలో చర్చనీయాంశంగా మారింది. ఆ ఒక్కరి కోసమే ఈ వ్యూహం! టెండర్లో ప్రతిపాదించిన ఈ 4 వేల చ.మీటర్ల నిబంధన వెనుక పెద్ద కథే నడిచినట్లు స్పష్టమవుతోంది. రాజమండ్రికి చెందిన ఒక కాంట్రాక్టర్ను దృష్టిలో ఉంచుకునే ఈ కండిషన్ నిబంధనల పుస్తకంలో చేరా్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతర కాంట్రాక్టర్లు ఎవరూ పోటీలో లేకుండా ముందే అడ్డుకట్ట వేసేందుకే ఈ ముందస్తు వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. ఇటీవల జీవీఎంసీలో బాధ్యతలు చేపట్టిన ఒక ఉన్నతాధికారి, గతంలో రాజమండ్రిలో విధులు నిర్వర్తించిన సమయంలో సదరు కాంట్రాక్టర్తో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యమే ఇక్కడ పనిచేసిందని, ఆ ఉన్నతాధికారి ఒత్తిడి మేరకే కింది స్థాయి సిబ్బంది నిబంధనలను మార్చక తప్పలేదని విశ్వసనీయ సమాచారం. 5 భాగాలుగా పనుల విభజన టెండర్ ప్రక్రియలో ఉన్నత స్థాయి తనిఖీలకు, పరిశీలనకు బ్రేక్ వేసేందుకు పనులను విభజించడం జీవీఎంసీలో పరిపాటిగా మారింది. సుమారు రూ. కోటి విలువైన ప్రాజెక్టును ఒకే టెండర్గా పిలిస్తే, నిబంధనల ప్రకారం ఉన్నతాధికారుల ఆమోదం పొంది, పారదర్శకంగా తనిఖీలు నిర్వహించాల్సి వస్తుంది. ఈ తలనొప్పి లేకుండా, స్థానికంగానే చక్రం తిప్పేందుకు వీలుగా ఆ భారీ పనిని 5 చిన్న చిన్న భాగాలుగా విడగొట్టారు. తద్వారా తమకు కావాల్సిన వ్యక్తికే పనులను అప్పగించే ప్రక్రియను యంత్రాంగం సులభతరం చేసుకుంది. మూడు రోజుల్లోనే ముగించేశారు! ఈ షార్ట్ టెండర్ ప్రక్రియ ప్రారంభం నుంచి ముగింపు వరకు అత్యంత వేగంగా, పక్కా పథకం ప్రకారం జరిగిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏ ప్రభుత్వ శాఖలోనైనా ‘షార్ట్ టెండర్’ పిలిచినా దరఖాస్తు దాఖలుకు కనీసం వారం రోజుల గడువు ఇస్తారు. కానీ, ఈ సైకిల్ ట్రాక్ పనులకు సెప్టెంబర్ 2న సాయంత్రం 5 గంటలకు టెండర్ ప్రారంభించి, సెప్టెంబర్ 5న సాయంత్రం 5 గంటలకే ముగించేశారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే టెండర్లు పిలవడం, అదే రోజు (శనివారం సాయంత్రం) హడావుడిగా టెండర్ బాక్స్ ఓపెన్ చేసి, తక్షణమే సదరు కాంట్రాక్టర్ను ఫైనల్ చేయడం చూస్తుంటే.. ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే ఈ తంతు అంతా నడిచిందని అర్ధమవుతోంది. నిబంధనలను బేఖాతరు చేస్తూ సాగిన ఈ వ్యవహారం జీవీఎంసీ టెండర్ల పారదర్శకతను ప్రశ్నార్థకం చేస్తోంది. -
‘అర్జీ’లకు ఆంక్షలా?
మహారాణిపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే సామాన్యులపై ఆంక్షలు విధించడంతో కలెక్టరేట్ వద్ద సోమవారం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్కు వినతులు అందించేందుకు వచ్చిన వారిని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. వినతిపత్రాలు పరిశీలించిన తర్వాతే కలెక్టరేట్లోకి పంపడంతో పలువురు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా కలెక్టరేట్లోకి వాహనాలను నుమతించకపోవ డంతో బయట భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య తలెత్తింది. మహారాణిపేట సీఐ గోవిందరావు ఆధ్వర్యంలో ఎస్ఐ కిరణ్ పర్యవేక్షణలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. పై అధికారుల ఆదేశాల మేరకే ఈ చర్యలు చేపట్టినట్లు సీఐ తెలిపారు. అవసర పనులకూ అడ్డంకులు కలెక్టరేట్లోని ఎస్బీఐ శాఖ, పోస్టాఫీస్, ట్రెజరీ కార్యాలయాలకు వెళ్లేవారిని కూడా పోలీసులు ప్రశ్నించారు. అవసరమైన పత్రాలు చూపిన వారినే లోపలికి అనుమతించారు. దీంతో వివిధ పనులపై వచ్చిన ప్రజలు కొంతసేపు అయోమయానికి గురయ్యారు. వాహనాల నిలిపివేతతో ప్రమాదాలు కలెక్టరేట్ బయట వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. పీజీఆర్ఎస్కు వచ్చిన ప్రజలు, వివిధ సంఘాల ఆందోళనలతో ప్రాంగణం రద్దీగా మారింది. ఈ క్రమంలో ద్విచక్రవాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలు చోటుచేసుకున్నాయి. పలువురు స్వల్పంగా గాయపడగా, వాహనాలు దెబ్బతిన్నాయి. -
పుట్టినరోజు నాడే నూరేళ్లు నిండాయి!
విశాఖపట్నం: నేడు పుట్టినరోజు. కొత్త దుస్తులు ధరించి, మిత్రులతో సరదాగా గడపాలి. అమ్మానాన్నల ఆశీస్సులు అందుకోవాలి. ఇదీ ఆ యువకుడి ఆశ. కానీ, విధి మరోలా తలచింది. పుట్టినరోజు సంబరాల ఏర్పాట్లు చేసుకుని బైక్పై ఇంటికి వస్తుండగా మృత్యువు కాటేసింది. స్నేహితుడితో కలిసి బైక్పై వస్తుండగా ఎన్ఏడీ జంక్షన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక బస్సు మీద నుంచి వెళ్లిపోవడంతో ఆ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వెనుక కూర్చున్న స్నేహితుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. రెండు బస్సుల మధ్య.. ఎయిర్పోర్ట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాంతినగర్కు చెందిన తంగుడు మదన్ (24) ఆదివారం తన పుట్టినరోజు కావడంతో పార్టీ ఏర్పాట్ల నిమిత్తం మిత్రుడు మణికుమార్తో కలిసి బైక్పై కంచరపాలెం వెళ్లాడు. పనులు ముగించుకుని ఎన్ఏడీ వైపు జాతీయ రహదారిలో వస్తుండగా, ఎన్ఎస్టీఎల్ గేటు ఎదురుగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు వీరి బైక్ను బలంగా ఢీకొట్టింది. దీంతో వీరు ముందు వెళ్తున్న ఫార్మా బస్సును ఢీకొని కిందపడిపోయారు. ఆ సమయంలో మదన్పై నుంచి ప్రైవేట్ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో మదన్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. వెనుక కూర్చున్న కంచరపాలెం యువకుడు మణికుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న ఎయిర్పోర్ట్, ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని 108లో కేజీహెచ్కు తరలించారు. బస్సు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సొంతింటి ఈఎంఐ కోసం శ్రమిస్తూ.. మదన్ తల్లిదండ్రులు ఎన్ఏడీ జంక్షన్లో తోపుడు బండిపై టిఫిన్ సెంటర్ నడుపుతున్నారు. మదన్ డిగ్రీ పూర్తి చేసి తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటూనే, ఈవెంట్లలో డెకరేషన్ పనులు చేస్తూ కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు. ఇటీవలే శాంతినగర్లో ఒక ఫ్లాట్ కొనుగోలు చేయగా, దానికి సంబంధించిన ఈఎంఐలు చెల్లించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. బాధ్యతలు మోస్తూ ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న కొడుకు.. పుట్టినరోజే విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ‘నువ్వు లేకపోతే మాకెవరురా దిక్కు’ అంటూ ఆ తల్లి పెడుతున్న రోదనలు స్థానికులను కలచివేశాయి. చదవండి: భోగాపురంలో దారుణం.. యువకుడ్ని బైక్కు తాళ్లతో కట్టేసి -
ఇందిరమ్మ లేఅవుట్లో పచ్చ రాబందులు!
తగరపువలస: ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ పరిధిలోని ఇందిరమ్మ లేఅవుట్లో టీడీపీ ముఠా భారీ దందాకు తెరతీసింది. సర్వే నంబర్ 125లోని పేదల ఇళ్ల స్థలాలను కొల్లగొడుతూ రూ.కోట్లు దండుకుంటోంది. టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్, ఇద్దరు వార్డు సభ్యులు తమ సామాజికవర్గానికి చెందిన రెవెన్యూ, పోలీస్ ఉన్నతాధికారుల అండదండలతో ఈ దారుణానికి ఒడిగడుతున్నారని స్థానికులు, బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుకూలంగా మారిన 60 అడుగుల రోడ్డు వైఎస్సార్ హయాంలో 2007లో ఇక్కడ 53 మంది నిరుపేదలకు ప్రభుత్వం ఇంటి పట్టాలు మంజూరు చేసింది. అప్పట్లో మౌలిక వసతులు లేకపోవడంతో కొందరు మాత్రమే ఇళ్లు నిర్మించుకోగా, మరికొందరు స్థలాలను ఖాళీగా వదిలేశారు. ఇంకొందరు అవసరార్థం ఇతరులకు విక్రయించారు. అయితే ఇటీవల కార్పొరేట్ వర్గాలకు లబ్ధి చేకూర్చేందుకు బోయపాలెం జాతీయ రహదారి నుంచి జెడ్పీ హైస్కూల్, ఇందిరమ్మ లేఅవుట్ మీదుగా గంభీరం రిజర్వాయర్ వరకు 60 అడుగుల బీటీ రోడ్డు నిర్మించారు. ఈ రహదారి నిర్మాణం టీడీపీ నేతలకు వరంగా మారింది. ఒక్కసారిగా భూముల ధరలు పెరగడంతో ‘పచ్చ’ నేతల కన్ను ఈ లేఅవుట్పై పడింది. బెదిరింపులతో పట్టాల స్వాధీనం? మొత్తం 53 మంది లబ్ధిదారుల్లో ప్రస్తుతం స్థలాల్లో లేని వారిని గుర్తించి, రూ.10 వేల నుంచి రూ.50 వేలు చేతిలో పెట్టి మభ్యపెడుతూ పట్టాలు లాక్కుంటున్నారు. గతంలో ఇక్కడ స్థలాలు కొనుగోలు చేసిన వారిని వీఆర్వో, ఆర్ఐ, తహసీల్దార్ల సహకారంతో తీవ్రంగా బెదిరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికేతరులంటూ భయభ్రాంతులకు గురిచేసి, ఇళ్లు కట్టడానికి వీల్లేదని హెచ్చరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. అప్పట్లో కొనుగోలు చేసిన మొత్తాన్నే ముఖాన కొట్టి బలవంతంగా పట్టాలు స్వాధీనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేజిక్కించుకున్న ఒక్కో ప్లాట్ను బయటి వ్యక్తులకు రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. నకిలీ పట్టాలతో మరో 75 ప్లాట్లు! ఇంతటితో ఆగకుండా లేఅవుట్లోని కొండ భాగాన్ని, గతంలో పట్టాలు ఇచ్చిన స్థలాల మధ్య ఉన్న ఖాళీ స్థలాన్ని చదును చేసి 60 గజాల చొప్పున మరో 75 అనధికార ప్లాట్లను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వీఆర్వో, ఆర్ఐ పూర్తి సహకారంతో నకిలీ పట్టాలు సృష్టించి ఒక్కో స్థలాన్ని రూ.16 లక్షలకు విక్రయిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే అధికారిక, అనధికారికంగా వందకు పైగా ఇళ్ల స్థలాలను అమ్ముకుని దాదాపు రూ.12 కోట్ల వరకు దోచుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ దందాపై మండల తహసీల్దార్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, త్వరలోనే జిల్లా కలెక్టర్, భీమిలి ఆర్డీవోకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తామని బాధితులు చెబుతున్నారు. అర్హులైన అసలైన లబ్ధిదారులకే స్థలాలు దక్కేలా అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
నమో కేరళీయం
మురళీనగర్: నగరంలో నివసిస్తున్న కేరళీయులు తమ సాంప్రదాయ వేడుక ఓనంను ఆదివారం వైభవంగా నిర్వహించారు. ‘నమో కేరళీయం’ అంటూ కుల, మత భేదాలకు అతీతంగా ఆచార వ్యవహారాలతో వేడుకలు జరుపుకున్నారు. బిర్లా కూడలి సమీపంలోని కేరళ కళాసమితిలో ఈ ఉత్సవాలు జరిగాయి.తమ సంస్కృతి, సాంప్రదాయాలను ఎక్కడ ఉన్నా కొనసాగిస్తామని, మాతృభాష మళయాళానికి ప్రాధాన్యతనిస్తామని వారు చాటిచెప్పారు. కళాసమితిని అందంగా ముస్తాబు చేసి ఓనంకు ఆహ్వానం పలికారు. పూక్కళం వద్ద పూజలు ప్రత్యేకంగా అలంకరించిన వేదిక వద్ద ధాన్యపు రాశులు, కొబ్బరి పువ్వు, దీపపు కుందెలు ఏర్పాటు చేసి, పూల తివాచీ పూక్కళంను అమర్చారు. మహిళలు పూక్కళం ఏర్పాటులో ఉత్సాహంగా పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తులతో అలరించారు.బలి చక్రవర్తి ఉత్సవ ప్రాంగణానికి విచ్చేయగా మహిళలు పూలతో స్వాగతం పలికారు. కేరళ సాంప్రదాయ వాద్య పరికరాలతో సందడి చేశారు. కేరళ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని బలి చక్రవర్తి ఆశీర్వదించారు. సామాజిక సేవలో కేరళీయుల ముందంజ ముఖ్య అతిథిగా పాల్గొన్న కేరళ ఎమ్మెల్యే వీటీ బలరామ్ మాట్లాడుతూ కేరళీయులు ఎక్కడ ఉన్నా సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందంజలో ఉంటారని తెలిపారు. తెలుగు ప్రజలతో మమేకమై జీవించాలని ఆకాంక్షించారు.ఉత్తర ఎమ్మెల్యే పి. విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ కేరళీయులు తమ భాష, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం ఆదర్శనీయమన్నారు. నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చి, ఎన్ఎస్టీఎల్ డైరెక్టర్ అబ్రహాం వర్ఘీస్, ఐడీఏఎస్ ఆనంద్ అచ్యుతన్ కుట్టీ శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో కేరళ కళాసమితి అధ్యక్ష, కార్యదర్శులు ఎన్ఎం పిళ్లై, కె. హరిదాస్, కోశాధికారి ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. పలువురికి సత్కారం వివిధ రంగాల్లో రాణించిన కేరళీయులను ఎమ్మెల్యే వీటీ బలరామ్ చేతుల మీదుగా సత్కరించారు. జాతీయ అవార్డు గ్రహీత, కేరళ సినీ నేపథ్య గాయని వైకం విజయలక్ష్మిని ఘనంగా సత్కరించారు.‘కళాకేళం’ మ్యాగజైన్ను వీటీ బలరామ్, కేఏ జాన్, నందినీ మీనన్ తదితరులు ఆవిష్కరించారు. కేరళ సాంప్రదాయ నృత్యాలు, చిత్ర గీతాలు ఆకట్టుకున్నాయి. ఓనం సందర్భంగా 29 రకాల వంటకాలతో తయారు చేసిన ‘సద్య’ను విందుగా అందించారు.విశాఖ నగరం, పరిసర ప్రాంతాలకు చెందిన 1500 మంది కేరళీయులు ఉత్సవంలో పాల్గొన్నారు. -
ఇనుప కంచెలో చిక్కుకున్న ఎలుగుబంటి
ఏలేశ్వరం : పామాయిల్ తోటలోకి వెళ్లేందుకు యత్నించిన ఎలుగు బంటి ఇనుప కంచెలో ఇరుక్కుపోయింది. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పరిమితడక గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. యర్రవరం గ్రామానికి చెందిన తోట వీరగోపాలకృష్ణ అనే రైతు పరిమితడకలో పామాయిల్ సాగు చేస్తున్నాడు. సమీపంలో ఉన్న కొండ నుంచి వచ్చిన ఎలుగుబంటి తోటలోకి వెళ్లేందుకు యత్నించి తోట చుట్టూ ఏర్పాటుచేసిన ఇనుప కంచెలో ఇరుక్కుపోయింది. సమాచారం అందుకున్న అటవీ శాఖాధికారులు దానికి మత్తు మందు ఇచ్చి బంధించారు. అనంతరం దానిని విశాఖపట్నంలోని జూకు తరలించారు. -
విద్యార్థులకు ‘పద్మ పూజిత’ స్కాలర్షిప్లు
మద్దిలపాలెం: విద్యార్థుల ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం అందిస్తూ వారిని ప్రోత్సహించే లక్ష్యంతో పద్మ పూజిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెరిటోరియస్ స్కాలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్–2026ను ఆదివారం మద్దిలపాలెంలోని శంకర ప్యాలెస్లో నిర్వహించారు. ఈ ఏడాది మొత్తం 107 దరఖాస్తులు అందగా.. పరిశీలన అనంతరం 77 మంది విద్యార్థులను స్కాలర్షిప్లకు ఎంపిక చేసి మొత్తం రూ.12.20 లక్షలు పంపిణీ చేశారు. 9, 10వ తరగతి చదువుతున్న 29 మందికి రూ.2.90 లక్షలు, డిగ్రీ, డిప్లొమా, ఫార్మసీ చదువుతున్న 10 మందికి రూ.1.50 లక్షలు, ఇంటర్, బీటెక్ చదువుతున్న 38 మందికి రూ.7.80 లక్షల మెరిట్ స్కాలర్షిప్లు, ధ్రువీకరణ పత్రాలను ఫౌండేషన్ చైర్మన్ ఆర్.వి.ఎస్.వి.బసవరాజు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో ప్రతిభావంతులైన విద్యార్థులకు సహకారం అందిస్తున్నామని తెలిపారు. కృష్ణంరాజు మాట్లాడుతూ విద్యతో ఉజ్వల భవిష్యత్తు సాధ్యమన్నారు. పడాల ప్రసాద్ విద్యార్థులకు ప్రేరణాత్మక సూచనలు చేశారు. సానుకూల దృక్పథంతో విద్యను అభ్యసించాలని పోతినేని నిర్మల సూచించారు. -
హోరాహోరీగా బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీలు
అల్లూరు: ఆంధ్రప్రదేశ్ 12వ సీనియర్ సీ్త్ర, పురుషుల అంతర్ జిల్లాల బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్–2026 పోటీలు హోరాహోరీగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ (ఎస్ఏఏపీ అనుబంధం), నెల్లూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సంయుక్త నిర్వహణలో అల్లూరులోని రామకృష్ణ జూనియర్– డిగ్రీ కళాశాలల వేదికగా మూడు రోజుల పాటు హోరాహోరీగా సాగిన ఈ పోటీలు ఆదివారం ముగిశాయి. విజేతలకు ట్రోఫీలు, జ్ఞాపికలు, అవార్డులను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రదానం చేశారు. పురుషుల విభాగంలో విన్నర్స్గా ప్రకాశం, రన్నరప్గా విశాఖపట్నం, మహిళల విభాగంలో విన్నర్స్గా విశాఖపట్నం, రన్నరప్గా గుంటూరు నిలిచాయి. ఈ కార్యక్రమంలో బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రతినిధులు, కాలేజీ యాజమాన్యం, అధ్యాపకులు, ప్రజాప్రతినిధులు, క్రీడాభిమానులు, విద్యార్థులు పాల్గొని విజేతలను అభినందించారు. -
ప్రజల వనరులు.. కార్పొరేట్లకు ధారాదత్తమా?
డాబాగార్డెన్స్: విశాఖలో భారీ ఏఐ డేటా సెంటర్లకు ప్రజల భూములు, నీరు, విద్యుత్ను ధారాదత్తం చేసే ముందు ప్రభుత్వం సమగ్రంగా పునఃపరిశీలన చేయాలని జాతీయ స్థాయి ప్రజా సదస్సులో పలువురు వక్తలు సూచించారు. గ్రీన్ విశాఖ ఆధ్వర్యంలో ఆదివారం డాబాగార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జాతీయ స్థాయి ప్రజా సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ మాట్లాడుతూ విశాఖలో ఇప్పటికే నీటి వనరులపై ఒత్తిడి ఉన్న నేపథ్యంలో భారీ డేటా సెంటర్లకు నీటి కేటాయింపులపై ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. నగర తాగునీరు, సాగునీటి అవసరాలు, భవిష్యత్ జనాభా పెరుగుదల, పారిశ్రామిక అవసరాలు పరిగణనలోకి తీసుకుని స్వతంత్ర సంస్థతో సమగ్ర వాటర్ ఆడిట్ నిర్వహించాలని సూచించారు. డేటా సెంటర్లకు అవసరమయ్యే విద్యుత్ పరిమాణం, విద్యుత్ గ్రిడ్పై పడే ఒత్తిడి, బ్యాకప్ విద్యుత్ వ్యవస్థలు, వాటి వల్ల ఏర్పడే పర్యావరణ సమస్యలపై నిపుణులతో సమగ్ర అధ్యయనం చేయాలని కోరారు. స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, దీర్ఘకాలిక ఉపాధి అవకాశాలపై స్పష్టమైన హామీలు ఇవ్వాలన్నారు. కూలింగ్ వ్యవస్థలతో నీటి వినియోగం ౖపైపెకి స్వాచ్ ఏపీ సభ్యుడు శ్రీపత్రాయ్ మాట్లాడుతూ విశాఖలో ప్రతిపాదిత డేటా సెంటర్లలో లక్షలాది కంప్యూటింగ్ యూనిట్లు నిరంతరం పనిచేయడం వల్ల భారీగా విద్యుత్ వినియోగం ఉంటుందని, అదే సమయంలో ఉత్పత్తయ్యే వేడిని నియంత్రించేందుకు కూలింగ్ వ్యవస్థలు అవసరమవుతాయన్నారు. కూలింగ్ సాంకేతికతను బట్టి నీటి వినియోగం గణనీయంగా ఉండే అవకాశం ఉందని, దీనిపై ప్రభుత్వం అధ్యయనం చేయాలన్నారు. మానవ హక్కుల వేదిక సభ్యుడు వీఎస్ కృష్ణ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వాలే అభివృద్ధి పేరిట పర్యావరణంపై ఒత్తిడి పెంచుతున్న పరిస్థితి కనిపిస్తోందన్నారు. పర్యావరణ అనుమతులపై అనుమానాలు మద్రాసు హైకోర్టు న్యాయవాది డి.నాగశైలజ మాట్లాడుతూ డేటా సెంటర్లకు పర్యావరణ అనుమతులు మంజూరు చేసిన విధానంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని తెలిపారు. భారీ ప్రాజెక్టులకు పర్యావరణ ప్రభావాలను సమగ్రంగా అధ్యయనం చేయాల్సి ఉండగా, ప్రాజెక్టు స్వరూపం, నిర్మాణ విస్తీర్ణం, నీటి వినియోగం, డీజిల్ నిల్వలు వంటి అంశాలపై మరింత స్పష్టత అవసరమన్నారు. విశాఖలో ప్రతిపాదిత ఏఐ డేటా సెంటర్ల నేపథ్యంలో పర్యావరణం, ప్రజా వనరులు, భూ హక్కులు, విద్యుత్, నీటి వినియోగం, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు సంబంధించి పలు కీలక డిమాండ్లతో విశాఖపట్నం డిక్లరేషన్ను ప్రకటించారు. -
ఆర్ఐఎన్ఎల్ ప్లాట్లకు యూనియన్ బ్యాంక్ రుణ సదుపాయం
మహారాణిపేట: విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్)కు చెందిన 459 ప్లాట్లను నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్ఎల్ఎంసీ) ఆన్లైన్ వేలం ద్వారా విక్రయిస్తున్న నేపథ్యంలో, ఈ వేలంలో ప్లాట్లను దక్కించుకునే వారికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణ సదుపాయం కల్పిస్తోంది. ఇందుకు సంబంధించి స్టీల్ప్లాంట్ బ్రాంచ్లో ప్రత్యేక ప్రచార బ్యానర్ను బ్యాంక్ అధికారులు ఆవిష్కరించారు. హెచ్బీ కాలనీ, మద్దిలపాలెం, ఆటోనగర్, గాజువాక ప్రాంతాల్లోని ఈ స్థలాలకు అక్టోబర్ 12, 16 తేదీల్లో ‘ఈ–నివిద’ ప్లాట్ఫామ్పై వేలం జరగనుందని వారు తెలిపారు. అత్యధిక ధరకు ప్లాట్లను దక్కించుకున్న అర్హులైన వ్యక్తులు, డెవలపర్లు, సంస్థలకు తమ అర్హత మేరకు అవసరమైన రుణ సదుపాయాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ స్థలాలు, రుణాలకు సంబంధించిన సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భువనేశ్వర్ జోన్ల పరిధిలోని పలు శాఖల్లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. రుణ సదుపాయం అవసరమైన వారు బ్యాంక్ అధికారులు హేమంత్కుమార్ (7979848314) లేదా సురేష్ (9866363007)లను సంప్రదించవచ్చని సూచించారు. -
సచివాలయ ఉద్యోగులకు వైఎస్సార్సీపీ సంఘీభావం
సచివాలయ ఉద్యోగుల ఆందోళనకు వైఎస్సార్సీపీ సంఘీభావం తెలిపింది. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు దీక్షా శిబిరాన్ని సందర్శించి ఉద్యోగులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి, మెరిట్ ఆధారంగా 1.34 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించారన్నారు. ప్రస్తుతం సచివాలయ ఉద్యోగుల హక్కులను ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపించారు. ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు వారి పోరాటంలో భాగస్వాములుగా ఉంటామని తెలిపారు. ఆందోళనకు మద్దతు తెలిపిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు -
విశాఖ
దద్దరిల్లినసచివాలయ ఉద్యోగుల ఆగ్రహం రెండు రోజుల నిరసనకు స్పందన లేకపోవడంతో రోడ్డెక్కిన ఉద్యోగులు ప్రభుత్వ తీరుపై మండిపాటు.. సమస్యల పరిష్కారానికి డిమాండ్ ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రధాన జంక్షన్లో రాస్తారోకో నినాదాలతో హోరెత్తిన ప్రాంతం.. స్తంభించిన ట్రాఫిక్ సంఘీభావం తెలిపిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పోలీసుల మోహరింపుతో ఉద్రిక్తత.. రాత్రి 10.30 గంటల వరకు నిరసనసోమవారం శ్రీ 7 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026ఉద్యోగుల ఆందోళనతో స్తంభించిన ట్రాఫిక్బీచ్రోడ్డు : రెండు రోజులుగా శాంతియుతంగా నిరసన తెలిపినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల నుంచి తరలివచ్చిన సచివాలయ ఉద్యోగులు విశాఖ నగరం నడిబొడ్డున భారీ ఆందోళనకు దిగారు. ఆర్టీసీ కాంప్లెక్స్, ద్వారకానగర్ బస్టాండ్ కూడలిని ముట్టడించి రాస్తారోకో నిర్వహించారు. ఒక్కసారిగా వందలాది మంది ఉద్యోగులు రహదారులపైకి రావడంతో ట్రాఫిక్ స్తంభించింది. చేతుల్లో ఖాళీ వాటర్ బాటిళ్లతో శబ్దాలు చేస్తూ, నినాదాలతో ప్రభుత్వ తీరును నిరసించారు.‘మేం ఉద్యోగులం.. ఊడిగం చేసేవాళ్లం కాదు’ అంటూ చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. తమను కిందిస్థాయి సిబ్బందిగా తక్కువ చేసి చూస్తున్నారని, విధి నిర్వహణలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకారులను చెదరగొట్టే క్రమంలో పోలీసులు, ఉద్యోగుల మధ్య స్వల్ప తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. రాత్రి మొబైల్ ఫ్లాష్ లైట్లతో నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగుల దీక్ష విరమణ అధికారుల హామీతో సచివాలయ ఉద్యోగులు రాత్రి 10.30 గంటలకు రిలే నిరాహార దీక్షలను విరమించారు. జిల్లా పంచాయతీ అధికారి, రెవెన్యూ అధికారులు, డీసీపీ దీక్షా శిబిరానికి చేరుకుని ఉద్యోగులతో చర్చించారు. వారం రోజుల్లో గ్రామ, వార్డు సచివాలయాల శాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శి, సంచాలకులతో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో 7 వేల మంది ఉద్యోగులు ఉద్యమాన్ని విరమించగా, నిరవధిక దీక్ష చేస్తున్న 20 మంది కూడా దీక్ష ముగించారు. హామీ మేరకు సమావేశం నిర్వహించకపోతే రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి, వాట్సాప్ గ్రూపుల నుంచి నిష్క్రమణ, పెన్డౌన్ కార్యక్రమాలు చేపడతామని ఉద్యోగులు హెచ్చరించారు. -
జీవో నం.11 రద్దు చేయాలి
జీవో నం.11 వల్ల మా ఉద్యోగ భద్రత దెబ్బతింటోంది. ఒక శాఖ నుంచి మరో శాఖకు బదిలీలు చేస్తూ సర్వీసును అస్థిరంగా మార్చుతున్నారు. గ్రామాల్లో అన్ని ఆన్లైన్ సేవలు అందిస్తున్నా జేఏసీలో కూడా ప్రాతినిధ్యం లేదు. పెండింగ్లో ఉన్న రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు, ప్రొబేషన్ బకాయిలు వెంటనే మంజూరు చేయాలి. సాయంత్రం 5 గంటల తర్వాత వాట్సాప్ సందేశాలతో ఒత్తిడి చేయడం ఆపాలి. మేము ఉద్యోగులం.. యంత్రాలం కాదు. ప్రభుత్వం తీరు మార్చుకోవాలి. – సాంబమూర్తి, డిజిటల్ అసిస్టెంట్, శ్రీకాకుళం -
విద్యార్థులకు ‘సంఖ్య’ గోల్డెన్ ఛాన్స్
సాక్షి, విశాఖపట్నం: సెమీకండక్టర్ రంగంలో అడుగుపెట్టాలని ఉత్సాహం చూపే ఇంజనీరింగ్ విద్యార్థులకు విశాఖకు చెందిన ప్రముఖ సిస్టమ్ డిజైన్ ఆటోమేషన్ సంస్థ ‘సంఖ్య టెక్నాలజీస్’ ఒక అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రొఫెషనల్ గ్రేడ్ చిప్ డిజైన్ టూల్స్ను విద్యార్థులకు ఉచితంగా అందించేందుకు ‘ఎస్సీసీఐ సెమీకండక్టర్ డిజైన్– పరికల్పక్’ పేరుతో ఉచిత చిప్ రూపకల్పన సాధన ప్రోగ్రామ్ మొదటి దశను విజయవంతంగా ప్రారంభించింది. ఇందుకోసం తొలి దశలో 4 విద్యా సంస్థలు నమోదు చేసుకోగా.. 2 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుందని సంస్థ ప్రకటించింది. ఇటీవల కాలంలో సెమీకండక్టర్ చిప్ డిజైన్ పట్ల విద్యార్థుల్లో ఆసక్తి విపరీతంగా పెరిగింది. దీనికి అనుగుణంగా అనేక యూనివర్సిటీలు తక్కువ ఖర్చుతో సెమీకండక్టర్ ల్యాబ్లను ఏర్పాటు చేయడానికి మొగ్గు చూపుతున్నాయి. కేవలం ఓపెన్ సోర్స్ టూల్స్ను ఉపయోగించి సమగ్రమైన ల్యాబ్లను ఏర్పాటు చేయడం సులువు కాదు. అందుకే.. ఈ లోటును భర్తీ చేసేందుకు సాంఖ్య టెక్నాలజీస్.. టూల్స్ పార్టనర్గా ముందుకొచ్చింది. ఇందులో భాగంగా.. భారతీయ యూనివర్సిటీలకు ‘సంఖ్య టెరాప్టర్ డిజైనర్–2026 స్టూడెంట్ ఎడిషన్ అకడమిక్ లైసెన్స్లను అందిస్తోంది. 5 యూఎస్ పేటెంట్లు మంజూరు.. సంఖ్య టెక్నాలజీస్ 1996లో చైన్నెలో ఒక గ్యారేజ్ స్టార్టప్గా ప్రారంభమైంది. ప్రస్తుతం చైన్నె, విశాఖపట్నంలలో డెవలప్మెంట్ కేంద్రాలతో ప్రాసెసర్ డిజైన్ ఆటోమేషన్లో గ్లోబల్ టెక్నాలజీ లీడర్గా ఎదిగింది. ఈ సంస్థకు ఇప్పటికే 5 యూఎస్ పేటెంట్లు మంజూరయ్యాయి. మరికొన్ని పెండింగ్లో ఉన్నాయి. ఇక ఎస్సీసీఐ అనేది 2011లో లాభాపేక్ష లేని సంస్థగా గ్రావిటీ 2.0 రీసెర్చ్ ఫౌండేషన్లో స్వయంప్రతిపత్తి (అటానమస్) విభాగంగా ఏర్పాటు చేశారు. సృజనాత్మక ఆలోచనలు ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు అధునాతన టూల్స్ను అందించే ఎకోసిస్టమ్ను ఈ సంస్థ అభివృద్ధి చేస్తోంది. ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ను ప్రోత్సహిస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ రంగంలో నిపుణుల కొరత తీవ్రంగా ఉన్న తరుణంలో భారత్ ఈ రంగంలో వేగంగా ఎదుగుతోంది. ముఖ్యంగా సెమీకండక్టర్ డిజైన్ నైపుణ్యాలకు మన దేశంలో బలమైన పునాది ఉండటం శుభపరిణామం. దేశీయంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల మార్కెట్ విస్తరిస్తున్న నేపథ్యంలో, భవిష్యత్తులో ఈ రంగంలో నిపుణులకు మరింత డిమాండ్ ఏర్పడనుంది. ఈ ప్రాంతంలో ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ను ప్రోత్సహించడం ద్వారా అడ్వాన్స్డ్ టెక్నాలజీల రూపకల్పన, అభివృద్ధికి ఇది కీలక కేంద్రంగా ఎదుగుతుందని ఆశిస్తున్నాం. – మురళి బులుసు, సంఖ్య టెక్నాలజీస్ స్ట్రాటజీ వైస్ ప్రెసిడెంట్ తొలి విడతలో 2 వేల మందికి.. ఈ ఉచిత చిప్ రూపకల్పన సాధన ప్రోగ్రామ్ తొలి దశలో ఇప్పటికే నాలుగు విద్యా సంస్థలు రిజిస్టర్ చేసుకున్నాయి. దీని ద్వారా సుమారు 2,000 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుందని సంస్థ అంచనా వేస్తోంది. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ప్లాట్ఫారమ్. ఇందులో సంఖ్య టెక్నాలజీస్కు చెందిన సొంత టూల్స్తో పాటు, ఇండస్ట్రీ–స్టాండర్డ్ థర్డ్ పార్టీ టూల్స్, ఓపెన్ సోర్స్ టూల్స్ కూడా అనుసంధానించి ఉంటాయి. ముఖ్యంగా వీఎల్సీసీ కోర్సులు అభ్యసించే విద్యార్థులకు ఈ చిప్ ఎంతో ఉపయుక్తం కానుంది. -
పీజీఆర్ఎస్లో క్యూఆర్ కోడ్ విధానం
మహారాణిపేట: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి అమలు చేస్తున్న పీజీఆర్ఎస్ సేవల్లో క్యూఆర్ కోడ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ను మొబైల్ ద్వారా స్కాన్ చేసి అర్జీ పరిష్కారంపై ప్రజలు నేరుగా ఫీడ్బ్యాక్ నమోదు చేయవచ్చని పేర్కొన్నారు. నమోదైన అభిప్రాయాలను ఉన్నతాధికారులు పరిశీలించి, పరిష్కార నాణ్యతను సమీక్షిస్తారని తెలిపారు. ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. కొత్త పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణ మహారాణిపేట: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద కొత్త పెన్షన్ల మంజూరుకు అర్హులైన వారి నుంచి సెప్టెంబర్ 7 నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ తెలిపారు.స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ, ఆన్లైన్ నమోదు, ఈ–కేవైసీ ప్రక్రియ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆధార్, రైస్కార్డు/ఆదాయ ధ్రువీకరణ పత్రం, సంబంధిత కేటగిరీ ధ్రువీకరణ పత్రాలను దరఖాస్తుతో జత చేయాలని సూచించారు.అర్హత పరిశీలన, క్షేత్రస్థాయి తనిఖీ అనంతరం ప్రభుత్వ అనుమతి, బడ్జెట్ లభ్యత మేరకు పెన్షన్లు మంజూరు చేస్తామని తెలిపారు. అర్హులైన వారు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఐటీఐల్లో మిగులు సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం కంచరపాలెం: నరవ, గడుగుపల్లి ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రాల్లో (ఐటీఐ) 2026–27 విద్యా సంవత్సరానికి మిగులు సీట్ల భర్తీ కోసం ఐదో విడతలో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు నరవ ఐటీఐ ప్రిన్సిపాల్ బి. విజయలక్ష్మి తెలిపారు. అర్హులైన అభ్యర్థులు సోమవారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకుని కౌన్సెలింగ్కు హాజరు కావాలని సూచించారు. -
జీవీఎంసీ వార్డుల పెంపుపై స్పష్టత లేదు
సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీలో కార్పొరేషన్ వార్డుల సంఖ్య పెంపు అంశంలో ప్రభుత్వం, అధికారుల మధ్య సమన్వయం, స్పష్టత కొరవడిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు విమర్శించారు. ఆదివారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో జీవీఎంసీ వార్డుల డీలిమిటేషన్కు సంబంధించి అధికారులు విడుదల చేసిన నోటిఫికేషన్పై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తొలుత 98 నుంచి 120 వార్డులకు పెంచుతామని, మరోవైపు భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి తదితర గ్రామాలు, మండలాలను నగర పరిధిలోకి తీసుకొస్తామని ప్రకటించడం వల్ల ప్రజల్లో గందరగోళం నెలకొందన్నారు. ఎన్నో దశాబ్దాలుగా కలిసి మెలిసి జీవిస్తున్న గ్రామాలను డీలిమిటేషన్ పేరుతో అడ్డదిడ్డంగా విభజించడం వల్ల ఆయా ప్రాంతాల సామాజిక, సాంస్కృతిక స్వరూపం దెబ్బతింటుందని ఆయన అన్నారు. గ్రామాల మధ్య ఉన్న అనుబంధాలు, తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయాలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం సరిహద్దుల మార్పులు చేయడం సరైన విధానం కాదన్నారు.120 వార్డులు చేసినా, 150 వార్డులు చేసినా వైఎస్సార్ సీపీకి ఎలాంటి అభ్యంతరం లేదని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలను ఎదుర్కొనేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని కేకే రాజు స్పష్టం చేశారు. అయితే ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ప్రజలకు పరిపాలనా సౌలభ్యం ఉండటం ముఖ్యమన్నారు. ఇటీవల విడుదల చేసిన వార్డుల డీలిమిటేషన్ నోటిఫికేషన్లో మార్పులపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. 2026 మే నెలలో విడుదల చేసిన నోటిఫికేషన్కు, ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్కు మధ్య నాలుగు నెలలు కూడా పూర్తికాకముందే మార్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో అధికారులు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, వినతుల ఆధారంగా మార్పులు చేసినట్లయితే.. ఎవరి అభ్యంతరాల మేరకు ఏయే మార్పులు చేశారో బహిరంగంగా తెలియజేయాలని కోరారు. నోటిఫికేషన్లో కానీ, పత్రికా ప్రకటనలో కానీ వివరాలు స్పష్టంగా పేర్కొనకుండా మార్పులు చేయడం సరైన విధానం కాదన్నారు.అదేవిధంగా పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన సచివాలయాల మ్యాపింగ్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కేకే రాజు కోరారు. కొన్ని ప్రాంతాల్లో ఒక వార్డుకు సంబంధించిన సచివాలయాన్ని మరో వార్డుతో మ్యాపింగ్ చేయడం వల్ల ప్రజలకు పరిపాలనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఒక వార్డులో ఉన్న సచివాలయం అదే వార్డుకు అనుసంధానమై ఉండేలా మ్యాపింగ్ చేయాలని వైఎస్సార్ సీపీ కోరుకుంటోందని కేకే రాజు తెలిపారు. -
ఉద్యోగం చేస్తాం.. ఊడిగం చెయ్యం
సాక్షి, విశాఖపట్నం/బీచ్రోడ్డు: సచివాలయ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద 3 రోజులుగా చేపట్టిన ఆందోళన తీవ్రరూపం దాల్చింది. జోన్–1 పరిధి ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాలకు చెందిన వందలాది మంది గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఆదివారం గాంధీ విగ్రహం వద్ద ఉద్యోగులు ఆందోళన ప్రారంభించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల ప్రకటనలు రాకపోవడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అక్కడి నుంచి భారీ ర్యాలీగా వెళ్లి సమీపంలో ఉన్న ద్వారకా బస్స్టేషన్, ప్రధాన రహదారి కూడలిని ముట్టడించారు. ఆర్టీసీ కాంప్లెక్స్కు వచ్చే కీలక దారులను దిగ్బంధించారు. రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. చేతుల్లో ఖాళీ వాటర్ బాటిళ్లతో శబ్దాలు చేస్తూ.. ‘ఉద్యోగం చేస్తాం... ఊడిగం చెయ్యం’, ‘ఉయ్ వాంట్ జస్టిస్’అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆందోళనకారులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు రావడంతో వారికి, ఉద్యోగులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది.బకాయిలు చెల్లించాలి.. వేధింపులు ఆపాలిఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు తమ ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. 2 రోజులుగా విధులు బహిష్కరించి.. రోడ్లపై ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నా.. ప్రభుత్వం కనీçసం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివాదాస్పద జీవో నం.11ను వెంటనే రద్దు చేయాలని, డిప్యూటేషన్లు విధానాన్ని నిలిపివేసి ప్రమోషన్లు వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేసి ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ని అమలు చేయాలని నినాదాలు చేశారు. ప్రొబేషన్ కాలానికి సంబంధించిన 9 నెలల బకాయిలు, వార్షిక ఇంక్రిమెంట్లు చెల్లించాలని, ప్రతిరోజు సాయంత్రం 5 తర్వాత వాట్సప్ సందేశాలతో వేధించడం తక్షణమే ఆపాలని నినాదాలు చేశారు. ఆర్డీవో వచ్చి సచివాలయ ఉద్యోగులతో మాట్లాడారు. తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకూ ఆందోళన విరమించబోమంటూ తెగేసి చెప్పడంతో.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానంటూ ఆర్డీవో అక్కడి నుంచి వెళ్లిపోయారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనను జోన్ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఉధృతం చేస్తామని ఉద్యోగులు హెచ్చరించారు. ట్రాఫిక్ జామ్ అవుతుండటంతో పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాహనాల్ని మళ్లించారు. రాత్రి అవుతున్నా.. ఆందోళన విరమించకుండా.. వంటావార్పు చేపట్టారు. సెల్ ఫోన్లో లైట్లు ఆన్ చేసి నిరసన కొనసాగించారు. వీరికి వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు సంఘీభావం తెలిపారు. -
ఏపీలో కదులుతున్న డీఎస్సీ అక్రమాల డొంక
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో డీఎస్సీ అక్రమాల డొంక కదులుతోంది. టెట్ అర్హత లేకుండా టీచర్ ఉద్యోగాలు.. డీఎస్సీ కుంభకోణం బద్దలవుతోంది. వరుస అవకతవకలు వెలుగులోకి వస్తున్నాయి. విశాఖలో ఒకే కుటుంబంలో ఇద్దరికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టెట్ అర్హత లేకుండానే ఉద్యోగాలు ఇచ్చినట్టు తేలింది.టెట్ పాస్ కాకుండానే టీచర్ ఉద్యోగం పొందిన చిల్లా యోగీశ్వరరావు.. అతని చెల్లి మోహిని దేవికి కూడా స్పోర్ట్స్ కోటాలో టీచర్ పోస్ట్ వచ్చింది. టెట్ సెర్టిఫికెట్ పెట్టకపోయినా యోగీశ్వరరావుకి ఎస్జీటీ ఉద్యోగం ఇచ్చేశారు. టెట్ అర్హత రావాలంటే 75 మార్కులు రావాలి.. మూడుసార్లు టెట్ రాసినా 75 మార్కులు రాలేదు. అయినా చంద్రబాబు సర్కార్ ఉద్యోగం ఇచ్చేసింది.వెలుగులోకి మరో టీచర్ వ్యవహారం..స్పోర్ట్స్ కోటాలో మరో టీచర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. టెట్ అర్హత లేకుండానే ఓ మహిళకు స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉద్యోగం కట్టబెట్టారనే ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. జంపాల ఉషా అనే మహిళకు ఎస్ఏ తెలుగు ఉద్యోగం ఇచ్చినట్లు తేలింది. స్పోర్ట్స్ కోటాలోనే జాబ్ దక్కించుకున్న ఉషా.. తెలుగు టెట్ పాస్ కాలేదు. దరఖాస్తులో ఎస్ ఏ బయాలజీగా ఉషా పేర్కొంది. సెలక్షన్ లిస్ట్లో ఎస్ఏ తెలుగు ఉద్యోగం ప్రభుత్వం ఇచ్చేసింది. సర్టిఫికేట్లలో మ్యాథ్స్, సైన్స్ మాత్రమే టెట్ రాసినట్టు వెల్లడించగా.. ప్రభుత్వ అప్లోడ్ చేసిన సర్టిఫికేట్లలో తెలుగు టెట్ అర్హత కానరాలేదు. ఆమె రాసిన హాల్ టిక్కెట్ నెంబర్తో తెలుగు టెట్ కానరాలేదు.హోళగుంద మండలంలో తెలుగులో అసలు టెట్ రాసినట్టుగా రికార్డ్ అందుబాటులో లేదు. టెట్ రికార్డుల్లో ఎక్కడా ఆమె తెలుగు రాసినట్టు ఆనవాళ్లు దొరకలేదు. ఆమె సర్టిఫికేట్లలో కూడా ఎక్కడా లేని తెలుగు టెట్ అర్హత సర్టిఫికేట్. ఎస్కేయూ యూనివర్సిటీ స్పోర్ట్స్ సర్టిఫికేట్లతో టీచర్ పోస్ట్ ఇచ్చేశారు. హోళగుంద మండలం వందవాగిలి స్కూల్లో తెలుగు టీచర్గా ఉద్యోగం పొందారు. ఈమె టెట్ అర్హతపై విచారణ జరపాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.కాగా, స్పోర్ట్స్ కోటా పేరుతో నచ్చినోళ్లకు నకిలీ సర్టిఫికేట్లు ఇచ్చేసి ఆ సర్టిఫికెట్లతో ఉద్యోగాలిచ్చేసిన కుంభకోణం ఇప్పుడు రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఎక్కడో ఒకచోట నకిలీ సర్టిఫికెట్ బయటపడుతోంది.. మరోచోట వేరొకరి ధ్రువపత్రంతో ఉద్యోగం కొట్టేశారన్న ఫిర్యాదు వస్తోంది.. ఇంకొకచోట గడువు ముగిసిన తర్వాత సర్టిఫికెట్ మార్చుకునే అవకాశం ఎలా వచ్చిందన్న ప్రశ్న తలెత్తుతోంది.మరొక వ్యవహారంలో గుర్తింపు లేని క్రీడా సంఘం ధ్రువపత్రాలతోనే కొలువులు దక్కాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకే నియామక ప్రక్రియలో ఒక్కొక్కరికి ఒక్కో నిబంధన వర్తించినట్లుగా కనిపిస్తుండటమే ఇప్పుడు అసలు అనుమానాలకు తావిస్తోంది. మెరిట్లో ముందున్నవారికి అన్యాయం జరిగిందన్న ఆరోపణల నుంచి.. అనుమానాస్పద సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వ్యవహారాల వరకు.. ఒక్కొక్కటిగా బయటకొస్తున్న ఉదంతాలు మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఎంపిక ప్రక్రియలో జరిగిన అక్రమాలను బయటపెడుతున్నాయి. ఇదీ చదవండి: ఆట దగా.. ‘కోటా’ దగా! -
గురువుల సేవలకు కొలమానమే లేదు
విశాఖ విద్య: ఉపాధ్యాయుల సేవలకు కొలమానం లేదని, వారి సేవలు వెలకట్టలేనివని కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అన్నారు. తన జీవితంలో ఎంతోమంది ఉపాధ్యాయులు మార్గదర్శకులుగా నిలిచారని, వారిలో ఇద్దరు ఉపాధ్యాయులు నేర్పిన విలువలు ఇప్పటికీ తనకు గుర్తున్నాయని చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 80 మందికి పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం ఏయూ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ భావోద్వేగానికి లోనయ్యారు. తన తల్లి విజయ భారతి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా సేవలందించారని, ఆమె రెండుసార్లు అవార్డులు అందుకున్న సమయంలో తాను పక్కనే ఉన్నానని గుర్తుచేసుకున్నారు. ప్రతి వ్యక్తి విజయం వెనుక ఒక ఉపాధ్యాయుడి కృషి తప్పకుండా ఉంటుందన్నారు. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు ఉపాధ్యాయులకు ఇష్టమైన విద్యార్థిగా ఉండాలని ఎప్పుడూ తపించేవాడినని చెప్పారు. తాను ఐఏఎస్ అధికారి కాకపోయి ఉంటే తప్పకుండా ఉపాధ్యాయ వృత్తినే ఎంచుకునేవాడినని వెల్లడించారు. కేవలం కరిక్యులమ్ను పూర్తి చేయడానికే పరిమితం కాకుండా ఉత్తమ బోధనా విధానాలను అవలంబిస్తే ఆశాజనక ఫలితాలు సాధించవచ్చని అన్నారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ తన ఎంపీ ల్యాడ్స్ నిధులను విద్య, ఆరోగ్య రంగాల అభివృద్ధికే ప్రాధాన్యంగా కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయుల సేవలను అవార్డులతో కొనలేమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గణబాబు, విష్ణుకుమార్ రాజు, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ సతీష్, డీఈవో ప్రేమకుమార్, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, అవార్డు గ్రహీతలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులకు ఎంపీ శ్రీభరత్, కలెక్టర్ పురస్కారాలను అందజేశారు. -
గణేష్ ఉత్సవాలకు అనుమతి తప్పనిసరి
అల్లిపురం: ఈ నెల 14వ తేదీ నుంచి నిర్వహించనున్న గణేష్ చతుర్థి ఉత్సవాలకు నిర్వాహకులు ముందస్తుగా సింగిల్ విండో ఆన్లైన్ పర్మిషన్ సిస్టమ్ ద్వారా అనుమతి పొందాలని పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి సూచించారు. శనివారం పోలీస్ కమిషనరేట్లో నిర్వహించిన విలేకరులతో ఆయన మాట్లాడు తూ మండపం ఏర్పాటు చేసే ప్రదేశం, ఉత్సవాల వ్యవధి, కార్యక్రమాలు, అంచనా జనసమూహం, విద్యుత్, అగ్నిమాపక భద్రత, సౌండ్ సిస్టమ్, నిమజ్జనం తేదీ, సమయం, ఊరేగింపు మార్గం తదితర వివరాలను ఆన్లైన్ దరఖాస్తులో నమోదు చేయాలన్నారు. అనుమతి మంజూరైన తర్వాత మండపానికి క్యూఆర్ కోడ్ జారీ చేస్తామని, దానిని స్పష్టంగా ప్రదర్శించాలని తెలిపారు. అనుమతి లేని ప్రదేశాలు, ప్రజా రహదారులు, ఫుట్పాత్లపై మండపాలు ఏర్పాటు చేయరాదన్నారు. ఆసుపత్రులు, పాఠశాలలు, పోలీస్, ఫైర్ స్టేషన్లకు వెళ్లే మార్గాలకు ఆటంకం కలిగించరాదని, అత్యవసర వాహనాలకు మార్గం ఖాళీగా ఉంచాలని సూచించారు. ● మండపాల్లో విద్యుత్ వైరింగ్ సురక్షితంగా ఉండేలా చూడాలని, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, నీరు, ఇసుక అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఎల్పీజీ సిలిండర్లు, పెట్రోల్, డీజిల్ వంటి మండే పదార్థాలను నిల్వ చేయరాదన్నారు. అవసరమైన చోట సీసీటీవీలు ఏర్పాటు చేయాలని, రాత్రివేళ మండపాల వద్ద బాధ్యతగల వ్యక్తులు ఉండేలా చూడాలని సూచించారు. సౌండ్ సిస్టమ్కు అనుమతులు తీసుకుని నిర్దేశిత శబ్ద పరిమితులు, సమయాల్లోనే వినియోగించాలని, డీజే వినియోగంపై నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. ● గణేష్ ఉత్సవాల పేరుతో బలవంతంగా చందాలు వసూలు చేయరాదని, మండపాల వద్ద జూదం, మద్యం, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు తావివ్వరాదన్నారు. పర్యావరణహిత విగ్రహాలు, సహజమైన రంగులను వినియోగించాలని సూచించారు. నిమజ్జనం ఊరేగింపు కోసం మార్గం, సమయం, పాల్గొనే భక్తులు, వాహనాల వివరాలను ముందుగానే పోలీసులకు అందజేయాలని తెలిపారు. ఊరేగింపుల్లో డీజే, మద్యం, మత్తుపదార్థాలు, బాణసంచాకు అనుమతి లేదన్నారు. ● అనుమతి నిబంధనలు ఉల్లంఘించినా, నిర్వాహకులు లేదా కమిటీ సభ్యుల నిర్లక్ష్యంతో అవాంఛనీయ ఘటనలు జరిగినా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. ఉత్సవాలను శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు నిర్వాహకులు, భక్తులు పోలీసు, సంబంధిత శాఖలకు సహకరించాలని కోరారు. పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పీవీసీ స్టేటస్ ఇక ఆన్లైన్లో.. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ (పీవీసీ) అప్లికేషన్ స్టేటస్ను సులభంగా తెలుసుకునేందుకు సిటీ స్పెషల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఈ మేరకు శనివారం పీవీసీ పోస్టర్ను ఆవిష్కరించారు. నగరంలోని స్టేట్, సెంట్రల్ డిఫెన్స్ విభాగాల్లో పని చేసే ప్రైవేట్ వ్యక్తులకు ఈ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్లు జారీ చేస్తామన్నారు. అలా రోజుకి సుమారు 50 నుంచి 60 అప్లికేషన్లు వస్తుంటాయన్నారు. దరఖాస్తుదారులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే తక్షణమే పీవీసీ స్టేటస్ తెలుస్తుందని వివరించారు. -
బారు బయటే బీరు..!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: బార్లలోనే కాదు.. బయటా బీరు, మద్యం దందా జోరుగా సాగుతోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత, తెల్లవారుజామున ప్రైవేటు వ్యక్తులను పెట్టి అధిక ధరలకు విక్రయాలు సాగిస్తున్నా.. అసలు బార్ల యాజమాన్యాలపై చర్యలు మాత్రం కనిపించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేజీహెచ్, ఎల్లమ్మతోట, జగదాంబ, సోలిపేట ప్రాంతాల్లోని బార్లతో పాటు వైన్ షాపుల్లోనూ, నగర శివార్లలోనూ ఇదే తరహా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఓల్డ్ టౌన్ ప్రాంతంలో స్థానిక పోలీసులు వరుసగా రెండు, మూడు రోజుల పాటు దాడులు చేసి, అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న వారిని పట్టుకున్నారు. వారం రోజుల క్రితం ఈ దాడులు జరిగాయి. అనంతరం, సదరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బార్లు, వైన్షాపుల యజమానులు, సిబ్బందితో పోలీసులు సమావేశం ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడ ఎన్ని కేసులు పట్టుకున్నామో లెక్కలతో సహా వివరిస్తూ.. బార్లలో పనిచేసే సిబ్బందితో అధిక ధరలకు మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే, చివరకు ఎంత మద్యం పట్టుబడింది అనే విషయంలో పోలీసు లు విడుదల చేసిన ప్రకటనకు, నమోదు చేసిన కేసులకు మధ్య తీవ్ర తేడాలు ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల నుంచి ఫోన్లు రావడం వల్లే ఈ వివరాలు మారాయనే ఆరోపణలు వస్తున్నాయి. బార్ల యాజమాన్యాలను రక్షించేందుకు, అమ్మకాలు బయట జరిగాయనే నెపంతో కేవలం సిబ్బందిపైనే కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ‘ఏటీఎం’ బార్లు..! మద్యం బాటిళ్ల లెక్కల్లో తీవ్ర వ్యత్యాసాలు పోలీసులు నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 115 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. విక్రయిస్తున్న సిబ్బందిపైనే కేసులు పెట్టారు తప్ప, ఎక్కడా బార్ల యాజమాన్యాల జోలికి వెళ్లలేదు. ఇందులో ఒక బార్ యజమాని జనసేన ఎమ్మెల్యేకు, మరొకరు టీడీపీ ఎమ్మెల్యేకు సన్నిహితులు కావడంతోనే లెక్కలు మారాయని సమాచారం. దాడుల సమయంలో ఒక బారు బయట 600 బాటిళ్లు, మరో వైన్ షాపు వద్ద 150 బాటిళ్లు, ఇంకో బార్ వద్ద ఏకంగా 16 కేసుల (800 బాటిళ్లు) మద్యం పట్టుబడినట్లు తెలుస్తోంది. ఇవే లెక్కలను దాడులు జరిపిన తర్వాత పోలీసు స్టేషన్లో బార్ల యాజమాన్యాలు, సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో వెల్లడించినట్టు సమాచారం. కానీ, తుది కేసు నమోదు సమయానికి ఆ సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అంత పెద్ద మొత్తంలో మద్యం లభ్యమైతే, అది కచ్చితంగా సమీపంలోని బార్లు, వైన్ షాపుల నుంచే సరఫరా అయి ఉంటుంది. కానీ పోలీసులు ఆ దిశగా విచారణ జరపకుండా, వారు ఎమ్ఆర్పీకి కొనుక్కొని అధిక ధరలకు అమ్ముకుంటున్నారంటూ విక్రేతలపైనే కేసులు నమోదు చేయడం గమనార్హం. అధికార పార్టీ నేతల బార్ల నుంచే ఈ మద్యం సరఫరా అవుతున్నప్పటికీ, అసలు యజమానులను తప్పించే ప్రయత్నం జరుగుతోంది. అయితే తమకు దొరికిన బాటిళ్ల ప్రకారమే పక్కాగా కేసులు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు. మద్యం ప్రియుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని బార్లు, వైన్షాపులు అధిక ధరలకు ఎప్పుడంటే అప్పుడు మద్యం విక్రయిస్తున్నారు. తెల్లవారుజామునే వేట, ఇతర పనులకు బయలుదేరే కొందరు.. మద్యం సేవించకుండా ఉండలేని పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఈ విక్రయాలు సాగిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. నగరంలో నాలుగైదు బార్లు, వైన్షాపులను మద్యం ప్రియులు ‘ఏటీఎం’ (ఎనీటైం మద్యం)లుగా పిలుచుకుంటున్నారనే ప్రచారం ఉంది. మరికొందరు వీటిని ‘స్విగ్గీ, జొమాటో బార్లు’ అని కూడా అంటున్నట్టు తెలుస్తోంది. నగరంలో ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఉండటంతోపాటు.. పోలీసు కంట్రోల్ రూమ్ నుంచి వాటిని పర్యవేక్షించే అవకాశం ఉంది. దీంతో అక్రమ విక్రయాలకు పాల్పడుతున్న అసలు వ్యక్తులను గుర్తించడం పెద్ద కష్టం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా జరిగిన దాడు ల పరిధిలోని ఓ ప్రార్థనా మందిరం వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించినా.. తెల్లవారుజామున, అర్ధరాత్రి వేళల్లో జరుగుతున్న ‘ఎనీటైం మద్యం’ విక్రయాల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. -
సేవ చేస్తున్నాం.. భద్రత ఇవ్వండి
బీచ్రోడ్డు: రోగుల ప్రాణాలను కాపాడేందుకు పగలు, రాత్రి తేడా లేకుండా నిత్యం ఆస్పత్రుల్లో సేవలు అందిస్తున్నాం’.. మా జీవితాలకు భద్రత కల్పించండి’ అంటూ కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో వెన్నెముకగా నిలుస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ గోడును ప్రభుత్వానికి వినిపించేందుకు ఏపీ స్టేట్ కాంట్రాక్ట్ మెడికల్ జేఏసీ, విశాఖ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం సెంట్రల్ పార్క్ ధర్నా చౌక్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు చేతిలో కొవ్వొత్తులతో శాంతియుతంగా నిరసన తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిత్యం సేవలందిస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రెగ్యులర్ ఉద్యోగికి ఇచ్చే జీతంలో 40 శాతం మాత్రమే కాంట్రాక్ట్ ఉద్యోగికి ఇస్తున్నారని.. ఒకే పని, ఒకే విధులు చేస్తున్నా వివక్ష చూపడం తగదని, వెంటనే 100 శాతం జీతం అమలు చేయాలని కోరారు. కరోనా సమయంలో సేవలు అందించిన ఎందరో ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇలాంటి విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగికి రూ.50 లక్షల ప్రమాద, జీవిత బీమా సౌకర్యం తప్పనిసరిగా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ ఆశా మాట్లాడుతూ ‘ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించకపోతే, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ‘డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆగదని ఇది కేవలం ఆరంభం మాత్రమే’ అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు, వివిధ ఆసుపత్రుల వచ్చిన కాంట్రాక్ట్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంట్రాక్ట్ వైద్య సిబ్బంది ఆవేదన కొవ్వొత్తులతో భారీ ర్యాలీ -
అతిచిన్న జెడ్పీగా విశాఖ
మహారాణిపేట: సుదీర్ఘ చరిత్ర కలిగిన ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ప్రజా పరిషత్ త్వరలోనే మూడు ముక్కలు కానుంది. ఇప్పటివరకు విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఉమ్మడిగా కొనసాగిన ఈ జిల్లా పరిషత్ విభజనకు కూటమి ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విభజన అనంతరం రాష్ట్రంలోనే అత్యంత చిన్న జిల్లా పరిషత్గా విశాఖ ఆవిర్భవించనుంది. ముగియనున్న పాలకవర్గ పదవీకాలం 1959లో సమితులు, తాలుకాలు, జిల్లా బోర్డులుగా విశాఖ జిల్లా పరిషత్ ఆవిర్భవించింది. 1983లో మండల, జిల్లా ప్రజా పరిషత్లుగా రూపుదిద్దుకుంది. 1986లో పూర్తిస్థాయి మండల, జిల్లా ప్రజా పరిషత్గా మారింది. 2021 సెప్టెంబర్ 25న జె.సుభద్ర అధ్యక్షతన కొలువుదీరిన పాలకవర్గ గడువు ఈ ఏడాది సెప్టెంబర్ 24తో ముగియనుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పాలకవర్గాల గడువు ముగుస్తుండటంతో జెడ్పీల విభజన తెరపైకి వచ్చింది. ఈ విభజనతో రాష్ట్రంలో జెడ్పీల సంఖ్య 28కి చేరనుంది. నాలుగు మండలాలకే పరిమితం కొత్త విభజన ప్రకారం విశాఖ జెడ్పీ పరిధిలో భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి అనే 4 మండలాలు మాత్రమే ఉంటాయి. గతంలో 39 జెడ్పీటీసీలు, ఎంపీపీలతో విస్తారంగా ఉన్న విశాఖ జెడ్పీ, ఇప్పుడు కేవలం 4 మండలాలకే పరిమితం కానుంది. కాగా, అనకాపల్లి జెడ్పీ పరిధిలోకి 24 మండలాలు, అల్లూరి జెడ్పీ పరిధిలోకి 11 మండలాలు రానున్నాయి. జీవీఎంసీ విలీనానికి వ్యతిరేకత భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి మండలాలను జీవీఎంసీలో విలీనం చేసేందుకు ఇటీవల నిర్వహించిన గ్రామసభల్లో మెజారిటీ ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. అత్యల్ప గ్రామాల్లో మాత్రమే విలీనానికి సుముఖత వ్యక్తమైంది. సిబ్బంది, అధికారుల కేటాయింపు రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఈనెల 25 తర్వాత విభజన ప్రక్రియ అధికారికంగా అమలులోకి రానుంది. పంచాయతీరాజ్ శాఖలో సీనియారిటీ ఆధారంగా బదిలీలకు, సిబ్బంది సర్దుబాటుకు రంగం సిద్ధమైంది. ఉమ్మడి జెడ్పీ పరిధిలోని 876 మంది అధికారులను, సిబ్బందిని జిల్లాల వారీగా ఈ కింది విధంగా కేటాయించనున్నారు. అనకాపల్లి జిల్లా (24 మండలాలు): 60 శాతం సిబ్బంది ఏఎస్ఆర్ జిల్లా (11 మండలాలు): 30 శాతం సిబ్బంది విశాఖ జిల్లా (4 మండలాలు): 10 సిబ్బంది ప్రతి జిల్లా పరిషత్కు 65 మంది, ప్రతి మండల ప్రజా పరిషత్కు 13 మంది చొప్పున ఉద్యోగులను నియమించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కేటాయింపుల కోసం ఉద్యోగులకు ఆప్షన్లు ఎంచుకునే వెసులుబాటును కూడా కల్పిస్తున్నారు. -
అంబరాన్నంటిన ఉట్టి సంబరం
సింహగిరి రాజగోపురం వద్ద సందడిగా వేడుకమురళీధరుని లీలలను తలపిస్తూ సింహగిరిపై సాగిన ఉట్ల సంబరం భక్తులకు అమితానందాన్ని పంచింది. రంగురంగుల నీటిధారలను తట్టుకుంటూ ఎత్తులో ఉన్న ఉట్టిని కొట్టేందుకు చేసిన సాహసాలు తిలకించిన వారిలోనూ ఉత్సాహాన్ని నింపాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సింహగిరి దివ్యక్షేత్రంలో రాజగోపురం ముంగిట భక్తజన సందోహం నడుమ శనివారం సాయంత్రం సాగిన ఉట్ల సంబరం అందరినీ ఆకట్టుకుంది. ముందుగా స్వామివారి ఉత్సవ మూర్తి గోవిందరాజస్వామిని శ్రీకృష్ణుడిగా అలంకరించి, శ్రీదేవి, భూదేవితో సహా పల్లకిలో కొలువుదీర్చారు. రాజగోపురం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉట్టిని యాదవుడు నమ్మి శివప్రసాద్ అందుకునేందుకు ప్రయత్నించగా ఆలయ ప్రధానార్చకుడు కరి సీతారామాచార్యులు తాడు లాగారు. పెద్ద ఎత్తున భక్తులు ఉత్సవాన్ని తిలకించారు. భక్తులకు వెన్న ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం సింహగిరి మాడ వీధుల్లో తిరువీధి నిర్వహించారు. దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు పాల్గొన్నారు. అలరించిన చిన్ని కృష్ణులు చిన్నారులు చిన్నికృష్ణుడిగా అలరించారు. కృష్ణాష్టమిని పురస్కరించుకుని పదేళ్లలోపు చిన్నారులకు సింహగిరిపై నిర్వహించిన శ్రీకృష్ణవేషధారణ పోటీల్లో పలువురు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కోలాటం ఆకట్టుకుంది. –సింహాచలం -
జీవీఎంసీ 98 టూ 120
డాబాగార్డెన్స్: జీవీఎంసీ పరిధిలో వార్డుల పునర్విభజనకు సంబంధించి ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల కావడంతో నగర పాలనా పటంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుతం ఉన్న 98 వార్డులను 120కి పెంచుతూ ముసాయిదా, సరిహద్దులను ఖరారు చేశారు. దీంతో వార్డుల సంఖ్య పెరగడంతో పాటు జోన్ల రూపురేఖలు కూడా మారనున్నాయి. అభ్యంతరాలుంటే తెలపొచ్చు ప్రతిపాదిత 120 వార్డుల ముసాయిదా సరిహద్దులను శనివారం నుంచి ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు పునర్వ్యవస్థీకరించిన 10 జోనల్ కార్యాలయాలు, నగర పరిధిలోని ముఖ్య ప్రభుత్వ కార్యాలయాల నోటీస్ బోర్డుల్లో వీటిని ప్రదర్శించనున్నారు. జీవీఎంసీ అధికారిక వెబ్సైట్లోనూ ముసాయిదా సరిహద్దుల వివరాలను అందుబాటులో ఉంచారు. ప్రతిపాదిత వార్డుల పునర్విభజన, సరిహద్దులపై ప్రజలకు ఏవైనా సూచనలు, అభ్యంతరాలు ఉంటే ఈ నెల 11వ తేదీలోగా అందజేయాలని కమిషనర్ కేతన్గార్గ్ కోరారు. అందిన అభ్యంతరాలు, సూచనలను పరిశీలించిన అనంతరం తదుపరి ప్రక్రియ చేపడతామని తెలిపారు. గాజువాకలో అత్యధికంగా.. జోన్ల వారీగా చూస్తే అత్యధికంగా గాజువాక జోన్లో నాలుగు వార్డులు పెరిగాయి. తూర్పు, దక్షిణ, ఉత్తర, పశ్చిమ జోన్లలో మూడేసి వార్డులు, మధురవాడలో రెండు వార్డులు అదనంగా చేరాయి. భీమునిపట్నం, అగనంపూడి, అనకాపల్లి, పెందుర్తి జోన్ల్లో ఒక్కో వార్డు చొప్పున పెరిగింది. -
క్రీడల్లో సత్తా చాటిన విశాఖ పోలీసులు
అల్లిపురం: అమరావతిలో శుక్రవారం వరకు జరిగిన 1వ ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో విశాఖ సిటీ పోలీస్ సిబ్బంది అత్యుత్తమ క్రీడా ప్రతిభను కనబరిచి పలు క్రీడాంశాల్లో బంగారు, రజత, కాంస్య పతకాలను సాధించారు. పోలీసు విధుల్లో నిత్యం ప్రజల భద్రత కోసం శ్రమిస్తూనే క్రీడల్లోనూ విశాఖ సిటీ పోలీస్ సిబ్బంది తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ క్రీడా పోటీల్లో విశాఖ సిటీ పోలీస్ తరఫున పాల్గొన్న 65 మంది పోలీస్ సిబ్బందిలో 55 మంది పతకాలు సాధించడం విశేషంగా నిలిచింది. వాలీబాల్, క్రికెట్, హాకీ, ఖోఖో, ఫుట్బాల్, బాక్సింగ్, స్విమ్మింగ్, యోగా, కబడ్డీ, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, బాడీ బిల్డింగ్, కరాటే, ఆర్మ్ రెజ్లింగ్, వాటర్ స్పోర్ట్స్, అథ్లెటిక్స్, చెస్ తదితర క్రీడాంశాల్లో పోలీస్ సిబ్బంది ప్రతిభ కనబరిచారు. పురుషుల విభాగంలో వాలీబాల్లో విశాఖ సిటీ పోలీస్ జట్టు బంగారు పతకం సాధించింది. క్రికెట్, హాకీ, ఖోఖో, ఫుట్బాల్ విభాగాల్లోనూ విశాఖ సిటీ పోలీస్ క్రీడాకారులు బంగారు పతకాలను సాధించారు. బాక్సింగ్లో లైట్ వెయిట్ విభాగంలో బి. అమర్నాథ్ బంగారు పతకం సాధించారు. బాస్కెట్బాల్లో విశాఖ సిటీ పోలీస్ జట్టు రజత పతకం సాధించగా, 4ణ100 మీటర్ల రిలే అథ్లెటిక్స్లో ఎం. కన్నారాజు, పి. దేముడు నాయుడు కాంస్య పతకం సాధించారు. కయాకింగ్లో వి. దాసారావు 200 మీటర్ల విభాగంలో రజత పతకంతో పాటు ఇతర విభాగాల్లో కాంస్య పతకాలను సాధించారు. స్విమ్మింగ్లో విశాఖ సిటీ పోలీస్ సిబ్బంది విశేష ప్రతిభ కనబరిచి 6 బంగారు, 8 రజత, 1 కాంస్య పతకాలను సాధించారు. చెస్లో పి. సురేష్ బంగారు పతకం సాధించారు. బాడీ బిల్డింగ్లో ఎ. దిలీప్ కుమార్ బంగారు పతకం సాధించగా, ఎస్. రాంబాబు, ఎం.కె. రాజు, నూకరాజు రజత పతకాలను సాధించారు. మహిళా పోలీస్ సిబ్బంది కూడా అద్భుత ప్రతిభ కనబరిచారు. మహిళల ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ విభాగాల్లో విశాఖ సిటీ పోలీస్ జట్లు బంగారు పతకాలను సాధించాయి. హ్యాండ్బాల్లో రజత పతకం, బాస్కెట్బాల్లో కాంస్య పతకం సాధించారు. మహిళల అథ్లెటిక్స్లో మంగా లక్ష్మి 4ణ400 మీటర్ల రిలేలో బంగారు పతకం సాధించారు. బాక్సింగ్లో మంగా లక్ష్మి, చి. వరలక్ష్మి, టి. పావని ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించారు. యోగా విభాగంలోనూ విశాఖ సిటీ పోలీసుల ఆధిపత్యం కొనసాగింది. మహిళల యోగా ఆర్టిస్టిక్ గ్రూప్, ఆర్టిస్టిక్ పెయిర్, ట్రెడిషనల్ సోలో విభాగాల్లో పలు బంగారు పతకాలు సాధించారు. టి. చిన్నారి, ఎన్. భవాని, పి. మల్లేశ్వరి తదితరులు అత్యుత్తమ ప్రదర్శన చేశారు. కరాటేలో మహిళల విభాగంలో టి. పావని పలు విభాగాల్లో పతకాలు సాధించగా, పురుషుల కరాటేలో షేక్ బాబ్జీ కాంస్య పతకాలను సాధించారు. పురుషుల యోగాలో డి. సంతోష్ కుమార్ బంగారు, రజత పతకాలు సాధించడంతో పాటు ఆర్మ్ రెజ్లింగ్లోనూ బంగారు పతకం సాధించారు. విజేతలైన పోలీస్ సిబ్బంది శనివారం నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చిని మర్యాదపూర్వకంగా కలవగా, ఆయన విజేతలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు సిబ్బందిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం, క్రమశిక్షణను మరింత బలోపేతం చేయడంలో ఇటువంటి క్రీడా పోటీలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. విధి నిర్వహణతో పాటు క్రీడల్లోనూ విశాఖ సిటీ పోలీస్ సిబ్బంది చూపిన ప్రతిభ పోలీస్ శాఖకు గర్వకారణంగా నిలిచిందన్నారు. 65 మంది పాల్గొనగా 55 మంది పతకాలు సాధించడం విశాఖ సిటీ పోలీసుల క్రీడా సామర్థ్యానికి నిదర్శనంగా నిలిచింది. -
జూకి కొత్త అతిథులు
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కులో సందడి మరింత పెరగనుంది. త్వరలో సందర్శకులను అలరించేందుకు గుజరాత్ నుంచి నాలుగు రకాల వన్యప్రాణులు విశాఖ జూకు చేరాయి. జంతు మార్పిడి విధానంలో భాగంగా గుజరాత్లోని రాధేకృష్ణ టెంపుల్ వెల్ఫేర్ ట్రస్ట్తో జూ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగా అక్కడి నుంచి నాలుగు రకాల జంతువులను తీసుకురాగా.. విశాఖ జూ నుంచి మూడు రకాల జంతువులను గుజరాత్కు తరలించారు. గుజరాత్ నుంచి వచ్చిన జంతువులన్నీ ఆరోగ్యంగా ఉన్నాయని జూ క్యూరేటర్ జి.మంగమ్మ తెలిపారు. ప్రస్తుతం వాటిని కొద్దిరోజులపాటు క్వారెంటైన్లో ఉంచుతామని, అనంతరం ఎన్క్లోజర్లలోకి తరలించి సందర్శకుల సందర్శనకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. కొత్తగా వచ్చిన వాటిలో కాటన్ టాప్ టామరిన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ జంతువులు ఇప్పటివరకు విశాఖ జూలో లేవని, సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయని ఆమె తెలిపారు. ఇవీ కొత్త అతిథులు గుజరాత్ నుంచి మూడు జీబ్రాలు (ఒక మగ, రెండు ఆడ), మూడు రెడ్ నెక్డ్ వాల్లబీలు (ఒక మగ, రెండు ఆడ), నాలుగు కాటన్ టాప్ టామరిన్లు (రెండు మగ, రెండు ఆడ), రెండు కామన్ మార్మోసెట్లు (ఒక మగ, ఒక ఆడ) తీసుకొచ్చారు. వాటికి బదులుగా విశాఖ జూ నుంచి మూడు ఇండియన్ గార్లు (ఒక మగ, రెండు ఆడ), నాలుగు స్టంప్ టైల్డ్ మకాక్స్ (రెండు మగ, రెండు ఆడ), రెండు ఘరియల్స్ (ఒక మగ, ఒక ఆడ) గుజరాత్కు తరలించారు. -
గురువులకు ఘన సత్కారం
బీచ్రోడ్డు: గురు బ్రహ్మ.. గురు విష్ణు.. గురు దేవో మహేశ్వర’ అనే శ్లోకం స్ఫూర్తిగా ఉపాధ్యాయులకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ అన్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డులు అందుకున్న ఐదుగురు విశిష్ట గురువులను తెలుగు శక్తి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శనివారం మేఘాలయ హోటల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రొఫెసర్ బి. బ్రహ్మానందరావు, కె. ఫణి భూషణ్ శ్రీధర్ మాట్లాడుతూ గురుపూజోత్సవాన్ని తెలుగు శక్తి నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం అవార్డు గ్రహీతలను సత్కరించారు. సోషల్ యాక్టివిస్ట్ పాలూరు శేషమాంబ, డాక్టర్ పపూర్ నికుంజ్, ఫిల్మ్ డైరెక్టర్, సోషల్ యాక్టివిస్ట్ వి. వంశీబాబు, బొల్లినేని వెంకటేశ్వరరావు, కె.రాజు పాల్గొన్నారు. -
50వేల మొక్కలతో సస్య గణపతి
డాబాగార్డెన్స్: అనకాపల్లి జిల్లా సిరసిపల్లి చింతామణి గణపతి దత్త క్షేత్రంలో 50 వేల మొక్కలతో 18 అడుగుల ఎత్తైన సస్య గణపతిని ఏర్పాటు చేయనున్నట్లు దేవీ శ్రీదేవి ఎంటర్ప్రైజెస్ నిర్వాహకుడు దేవత హేమ సుధాకర్ తెలిపారు. వీజేఎఫ్ ప్రెస్క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సహజ జలపాతాలు, పక్షుల కిలకిలరావాలు, చేపల కొలను, పచ్చని ప్రకృతి వాతావరణంతో ఈ సస్య గణపతి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించనుందని తెలిపారు. జీరో ప్లాస్టిక్ విధానంలో, ఎలాంటి రసాయన రంగులు లేకుండా సహజ సిద్ధమైన మొక్కలతో ఏడాది పాటు శ్రమించి దీనిని రూపొందించినట్లు చెప్పారు. ఈ నెల 14 నుంచి అక్టోబర్ 4 వరకు ప్రతిరోజూ ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. సస్య గణపతిని ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో విజయ్కుమార్ నాయక్, ఎ. కిరణ్కుమార్, ఆంజనేయరాజు, ఏ. రాజేశ్వరి పాల్గొన్నారు. -
సచివాలయ ఉద్యోగుల ఆందోళన ఉధృతం
ఆదివారం మధ్యాహ్నంలోపు స్పందించకుంటే పాదయాత్ర బీచ్రోడ్డు: సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం జోన్–1 వేదికగా చేపడుతున్న ఉద్యమం రోజురోజుకూ ఉధృతమవుతోంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం ఇప్పటివరకు కనీసం స్పందించకపోవడం వారిలో తీవ్ర ఆవేదనను, ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. శుక్రవారం 20 మంది ఉద్యోగులు ప్రారంభించిన నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతం వస్తుందని వారు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయినప్పటికీ, అధికార యంత్రాంగం నుంచి ఎటువంటి హామీ, చర్చలకు ఆహ్వానం లేకపోవడంతో ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. నేటి మధ్యాహ్నం 3 గంటల వరకే డెడ్లైన్ ప్రభుత్వం స్పందించకపోవటంతో ఉద్యోగ సంఘం నాయకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల లోపు ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాకపోతే, తమ నిరసనను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. మధ్యాహ్నం 3 గంటలకు నాయకులు జీవీఎంసీ గాంధీ విగ్రహం ప్రాంగణం నుంచి సింహాచలం దేవస్థానం వరకు భారీ పాదయాత్ర చేపట్టనున్నట్లు జోన్–1 నాయకత్వం ప్రకటించింది. దేవుడి సన్నిధిలో తమ గోడును వినిపించి, ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని ఉద్యోగులు భావిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి, తక్షణమే చర్చలు జరిపి న్యాయమైన పరిష్కారం చూపాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి. ‘హక్కుల సాధన కోసం.. ఉద్యోగుల భవిష్యత్తు కోసం.. ఐక్యంగా ముందుకు సాగుదాం’ అంటూ వారు పిలుపునిచ్చారు. -
గంభీరం రిజర్వాయర్లో పడి యువకుడి ఆత్మహత్య
ఆనందపురం: మండలంలోని గంభీరం రిజర్వాయర్లో పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకి సమీపంలోని పద్మనాభపురానికి చెందిన శ్రీరామినేని సందీప్ (30) ప్రస్తుతం విశాఖపట్నంలోని మద్దిలపాలెం పిఠాపురం కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 4న ఉదయం ఇస్కాన్ ఆలయానికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిన సందీప్ ఎంతకీ తిరిగి రాలేదు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో గంభీరం రిజర్వాయర్లో ఓ మృతదేహం ఉన్నట్లు శనివారం పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి, దర్యాప్తులో అది సందీప్దిగా గుర్తించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ముగ్గురు కుమారుల్లో చిన్నవాడైన సందీప్ కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని తండ్రి అశోక్ పోలీసులకు తెలిపారు. మనస్తాపంతోనే రిజర్వాయర్లో పడి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ ఎర్రం నాయుడు కేసు నమోదు చేయగా, హెడ్ కానిస్టేబుల్ వెంకటరావు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. చికెన్ ధరలు -
విశాఖ కేంద్ర కారాగారంలో బోర్డు ఆఫ్ విజిటర్స్ సమావేశం
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారంలో శనివారం బోర్డు ఆఫ్ విజిటర్స్ సమావేశం నిర్వహించారు. తొలుత కారాగారంలోని బ్యారక్లు, పరిశ్రమలు, వంటశాల తదితర విభాగాలను అధికారులు పరిశీలించారు.అనంతరం విశాఖ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి జి. శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సీహెచ్. మణికంఠ, జైలు సూపరింటెండెంట్ బి. చంద్రశేఖర్ పాల్గొన్నారు.సమావేశంలో ఖైదీల నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, పునరావాసం, సంక్షేమం, భద్రత, ఆరోగ్యం, వృత్తి నైపుణ్యాల పెంపు, జైలు పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఖైదీల సంక్షేమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం సమావేశంలో పాల్గొన్న అధికారుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. -
ఆయనకు ఇద్దరు భార్యలు.. 15ఏళ్లుగా మొదటి భార్య దూరం!
విశాఖపట్నం జిల్లా: మండల కేంద్రం రావికమతానికి చెందిన నవర మలేశ్వరరావు (42) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. బంధువులు, కుటుంబ సభ్యులు శుక్రవారం ఆయన మృతదేహానికి దహన సంస్కారాలు చేయడానికి ఏర్పాట్లు చేసి, శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో పోలీసులు రంగప్రవేశం చేసి వాటిని నిలిపివేశారు. మలేశ్వరరావు మృతిపై అనుమానాలున్నాయని ఫిర్యాదు రావడంతో మృతదేహాన్ని నర్సీపట్నం ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.మొదటి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మలేశ్వరరావుకు ఇద్దరు భార్యలు కాగా, 2009లో మొదటి భార్య మాధవితో వివాహం జరిగింది. ఆమె 15 సంవత్సరాలుగా భర్తకు దూరంగా ఉంటోంది. మలేశ్వరరావు మృతిపై మొదటి భార్యకు, బంధువులకు అనుమానాలు ఉండటంతో వారు 100కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారని, దీనిపై స్పందించి దహన సంస్కారాలను నిలిపివేసి మృతదేహాన్ని నర్సీపట్నం పోస్టుమార్టానికి తరలించామని రావికమతం ఎస్ఐ రఘువర్మ తెలిపారు. చదవండి: గోదావరిలో దూకిన కుటుంబం -
ఏపీ వ్యాప్తంగా బట్టబయలవుతున్న డీఎస్సీ అక్రమాలు
సాక్షి, విజయవాడ: ఏపీ వ్యాప్తంగా డీఎస్సీ అక్రమాలు బయటపడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోనూ డీఎస్సీ స్పోర్ట్స్ కోటా బండారం బయటపడింది. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందిన పెద్ద అప్పలరాజుపై ఫిర్యాదులు వచ్చాయి. ఉద్యోగం పొందిన వ్యక్తి పేరు “పెద్ద అప్పలరాజు” కాగా, “పాండ అప్పలరాజు” పేరుతో ఉన్న సర్టిఫికెట్ను అప్లోడ్ చేశారు. శాప్ పోర్టల్లో అభ్యర్థి తమ్ముడి పేరుతో ఉన్న సర్టిఫికెట్ను ఎందుకు అప్లోడ్ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే విధంగా, సర్టిఫికెట్ను మూడు సార్లు ఎందుకు మార్చారు? అనే సందేహాలు కలుగుతున్నాయి.ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ..ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ డీఎస్సీ నూయామకాల్లో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. నకిలీ బ్లైండ్ సెర్టిఫికెట్తో ఒక వ్యక్తి ఉద్యోగం పొందాడని మరో మహిళా అభ్యర్థి ఆరోపిస్తున్నారు. స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల జాబితా ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. విశాఖ డీఈవో ప్రేమ్ కుమార్ని స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల జాబితా ఇవ్వాలని సాక్షి మీడియా కోరగా.. జాబితా ఇవ్వకూడదని.. ఉన్నతాదికారుల ఆదేశాలు పాటిస్తున్నామని డీఈవో తెలిపారు. ఏ సమాచారం కావాలన్నా లిఖిత పూర్వకంగా కోరితే ఆర్జేడీకి పంపుతామంటూ వెల్లడించారు.కోనసీమ జిల్లాలో అడ్డగోలుగా పోస్టింగులు..కోనసీమ జిల్లాలో అడ్డగోలుగా డీఎస్సీ అభ్యర్థుల పోస్టింగులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. సఖినేటిపల్లి మండలం అప్పన రాముని లంకకు చెందిన గాయత్రి సాయిశ్రీకి కాట్రేనికోన మండలం బ్రహ్మసమేద్యం పోస్టింగ్ ఇచ్చారు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ రిమార్క్స్లో నాట్ క్వాలిఫైడ్ అని అధికారులు రాశారు. ఆమె బీఈడీ సర్టిఫికెట్లు సబ్మిట్ చేయలేదని అధికారులు స్పష్టం చేశారు. ఫైనల్ లిస్ట్లో మాత్రం బాక్సింగ్ స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వం.. ఉద్యోగం ఇచ్చేసింది. బీఈడీ సర్టిఫికెట్లు లేకపోయినా అధికారులు ఎలా ఉద్యోగం ఇచ్చారో స్పష్టం కాలేదు. 11 సార్లు తెలుగు టెట్ రాసిన ఆమెకు సోషల్ స్కూల్ అసిస్టెంట్గా పోస్టింగ్ ఇచ్చారు. ఈ పోస్టింగ్పై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు పండిట్కు సోషల్ పోస్టింగ్ ఎలా ఇచ్చారో అధికారులు స్పష్టం చేయలేదు.రిజర్వేషన్లలోనూ గోల్మాల్వైఎస్సార్ జిల్లాలోనూ డీఎస్సీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. రిజర్వేషన్లలోనూ గోల్మాల్ చేసి అభ్యర్థులు ఉద్యోగం పొందినట్లు తేలింది. వైఎస్సార్ జిల్లాలో బీసీ–ఈ అభ్యర్థి మనూర్ రసూల్ ఓసీ కింద ఉద్యోగం పొందారు. 2008, 2012, 2018 డిఎస్సీల్లో తాను బీసీ–ఈ కేటగిరీగా నమోదు చేసుకున్న రసూల్.. 2025 డిఎస్సీలో మాత్రం తాను ఓసీ (ఈడబ్ల్యూఎస్) కింద దరఖాస్తు చేసుకుని ఉద్యోగం పొందారు.రసూల్ చేసిన అవకతవకల వల్ల తనకు ఉద్యోగం రాలేదని రాయచోటికి చెందిన జమీల్ ఆరోపిస్తున్నారు. ఈ అక్రమాలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని జమీల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా రిజర్వేషన్లనే మార్చేసి అక్రమంగా ఉద్యోగం పొందడంపై చంద్రబాబు సర్కార్ నోరు విప్పడం లేదు. ఏడాదిగా ఈ అంశంపై జిల్లా యంత్రాంగం విచారణ చేస్తూనే ఉన్నారు. రసూల్ చేసిన అక్రమాలపై చర్యలు తీసుకుని తనకు రావాల్సిన ఉద్యోగం ఇప్పించాలని జమీల్ కోరుతున్నారు.విద్యా శాఖ ప్రకటనతో అనుమానాలుకర్నూలు డీఎస్సీ అక్రమాలు కప్పి పుచ్చేందుకు విద్యాశాఖ ప్రయత్నం చేస్తోంది. విద్యాశాఖ ప్రకటనతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీఎస్సీ అంతా పారదర్శకం అంటూ విద్యాశాఖ మీడియా ప్రకటన చేసింది. కర్నూలు జిల్లా కౌతాళం మండలం, వల్లూరు ఎంపీపీఎస్ (న్యూ) పాఠశాలలో క్రీడా కోటా కింద ఈడిగ ప్రభాకర్, SGT(తెలుగు)గా ఎంపిక, పోస్టింగ్ ప్రక్రియలో అక్రమాలపై పాఠశాల విద్యా శాఖ వివరణ ఇచ్చింది. పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ పేరుతో ప్రకటన విడుదల చేసింది. ఘటన గురించి తెలిసిన వెంటనే శాఖాపరమైన దర్యాప్తును విద్యా శాఖ ప్రారంభించింది.ఉన్నతాధికారులు విచారణ ప్రక్రియను పరిశీలిస్తున్నారు. కర్నూలు డీఈవో విచారణను ప్రారంభించి, సమగ్ర పరిశీలన కోసం సంబంధిత రికార్డులను, వెరిఫికేషన్ ఫైళ్లను తెప్పించారు. విచారణ నివేదిక అందగానే, రిక్రూట్మెంట్, సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని.. డీఎస్సీ-2025 నియామక ప్రక్రియలో సంపూర్ణ పారదర్శకత, ప్రతిభ ఆధారిత ఎంపిక, విధానాన్ని అవలంభించామని పాఠశాల విద్యాశాఖ పునరుద్ఘాటిస్తోంది. -
ఆ నేత్రాలు సజీవం
పెందుర్తి: నేత్రదానంతో ఆయన కళ్లు సజీవంగా నిలవనున్నాయి. మృతుని కుటుంబ సభ్యుల ఔదార్యంతో ఇది సాధ్యమైంది. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక మహాలక్ష్మినగర్ సమీపంలోని బీసీ కాలనీలో నివాసం ఉంటున్న దేశరాజు వెంకటరమణ(64) మంగళవారం ఉదయం బ్రెయిన్స్ట్రోక్తో మరణించారు. మృతుని సన్నిహితుడు ఉదయ్కుమార్ ద్వారా సమాచారం అందుకున్న సాయి హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు దాడి శ్రీనివాస్ నేత్రదానం గురించి కుటుంబ సభ్యులను సంప్రదించారు. మృతుని భార్య లక్ష్మి, కుమారుడు ప్రీతమ్కృష్ణ, కుమార్తె కాత్యాయిని వెంటనే అంగీకారం తెలపడంతో ఎల్వీ ప్రసాద్ మొహిసిన్ నేత్రనిధి ప్రతినిధులు మనోజ్, వాణి మృతుని నేత్రాలను సేకరించారు. -
గాజువాక చిన్నారి చిహ్నికకు అంతర్జాతీయ అవార్డు
అక్కిరెడ్డిపాలెం : నిరంతర సాధన, పట్టుదలతో విభిన్న రంగాల్లో రాణిస్తున్న గాజువాకకు చెందిన తొమ్మిదేళ్ల చిన్నారి పాలమంగళం చిహ్నికకు ప్రతిష్టాత్మక గ్లోబల్ ఇన్స్పిరేషన్ అంతర్జాతీయ అవార్డు– 2026 లభించింది. కరాటే అథ్లెట్గా, మోడల్గా, డ్యాన్సర్గా, యంగ్ ఇన్ఫ్లుయెన్సర్గా, చైల్డ్ కంటెంట్ క్రియేటర్గా చిహ్నిక ప్రతిభ చాటుతోంది. గాజువాకలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న ఆమె రాజేష్, హారిక దంపతుల కుమార్తె. తల్లిదండ్రులు, శిక్షకుల ప్రోత్సాహంతో విద్యతో పాటు పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, మోడలింగ్, కరాటే రంగాల్లో సాధించిన విజయాలకు గుర్తింపుగా ఈ అవార్డుకు ఎంపికై ంది. పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్, తెలుగు ఎక్స్పాట్స్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా సంయుక్తంగా ఈ పురస్కారాన్ని ప్రకటించాయి. ఈ నెల 9న మలేషియా రాజధాని కౌలాలంపూర్లో జరగనున్న కార్యక్రమంలో చిహ్నిక అవార్డును అందుకోనుంది. చిన్నారి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంపై పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు, క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
రైల్వే కీలక ప్రాజెక్టులపై జీఎం సమీక్ష
తాటిచెట్లపాలెం: భద్రత, సమయపాలన, పలు కీలక ప్రాజెక్టులపై సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ విశాఖలోని జనరల్ మేనేజర్ కార్యాలయంలో జోనల్ పరిధిలోని నాలుగు డివిజన్ల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా స్టేషన్లకు రైళ్ల రాకపోకల సమయపాలన, భద్రతా అంశాలు, జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులపై సమీక్షించారు. అన్ని వేళలా నిఘా, భద్రతకు సంబంధించి అవసరమైన చర్యలు చేపడుతూ, ఆయా విభాగాల మధ్య సమన్వయంతో అధికారులు ముందుకు సాగాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రత్యేకంగా రైల్ ఓవర్ బ్రిడ్జిలు, రైల్ అండర్ బ్రిడ్జిలు, లెవల్ క్రాసింగ్ గేట్ల పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఇంజినీరింగ్ స్కేల్ ప్లాన్స్, సిగ్నలింగ్ ఇంటర్లాకింగ్ ప్లాన్స్పై కూడా సమీక్ష నిర్వహించారు. జోన్ పరిధిలోని ఉద్యోగులు, సిబ్బంది అంకితభావంతో పనిచేసి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని జీఎం సూచించారు. సమావేశంలో ఆయా డివిజన్లకు చెందిన డివిజనల్ రైల్వే మేనేజర్లు, వివిధ విభాగాలకు చెందిన ప్రిన్సిపల్ హెడ్స్ పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ గర్జన దిగొచ్చిన సర్కార్
తరలించిన విద్యార్థులను పాఠశాలలోనే కొనసాగిస్తామని హామీ దరఖాస్తు చేస్తే కొత్త అడ్మిషన్లకు అవకాశం పోలీసుల నిర్బంధాలు, అరెస్టులు దాటుకుని ఉద్యమం ఒక్క ఏడాదికే అనుమతిపై తల్లిదండ్రుల్లో అనుమానాలు శాశ్వత పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ, ప్రజా సంఘాల డిమాండ్ మారికవలస గిరిజన గురుకులంపై వెనక్కి తగ్గిన ప్రభుత్వంసాక్షి, విశాఖపట్నం/మధురవాడ: మారికవలస గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థుల తరలింపుపై వైఎస్సార్సీపీ, గిరిజన, ప్రజా సంఘాల పోరాటం ఫలించింది. విద్యా సంవత్సరం మధ్యలో 480 మంది గిరిజన విద్యార్థులను సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ పేరుతో గత నెల 26న అర్ధరాత్రి పోలీసు బందోబస్తుతో బలవంతంగా తరలించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వారం రోజులుగా సాగిన ఆందోళనలు మంగళవారం మరింత ఉధృతం కావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మారికవలసలోనే విద్యార్థుల చదువు కొనసాగించేందుకు అంగీకరించింది. రాత్రింబవళ్లు ఉద్యమం విద్యార్థుల తరలింపును వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, గిరిజన, ప్రజా సంఘాలు పాఠశాల ఎదుట ఆందోళనలు కొనసాగించాయి. రాత్రివేళల్లోనూ రోడ్లపైనే నిద్రిస్తూ నిరసన తెలిపారు. తరలించిన విద్యార్థులను తిరిగి మారికవలసకు తీసుకొచ్చే వరకు ఉద్యమం ఆపేది లేదని స్పష్టం చేశారు. దీంతో ఆందోళన తీవ్రత ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. అడ్డుకున్నా.. ఆగని ఆందోళనలు ఆందోళనలను అడ్డుకునేందుకు పోలీసులు పలుచోట్ల నిర్బంధాలు, ముందస్తు అరెస్టులకు దిగారు. కీలక నేతలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా అడ్డుకోవడంతోపాటు మారికవలస వైపు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. పాఠశాల వద్ద నిరసన తెలిపిన నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అయినా ఆందోళనకారులు వెనక్కి తగ్గకుండా నిరసనలు కొనసాగించారు. ఒక్క ఏడాదికేనా? అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తల్లిదండ్రుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మారికవలసలో చదువుకు అనుమతి ఈ ఒక్క విద్యా సంవత్సరానికే పరిమితమని అధికారులు చెప్పడంతో ఆందోళన మొదలైంది. వచ్చే ఏడాది మళ్లీ తమ పిల్లలను ఇతర ప్రాంతాలకు తరలిస్తారా? అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రభుత్వ నిర్ణయంపై పూర్తిస్థాయి నమ్మకం కలగడం లేదని వారు చెబుతున్నారు. ప్రస్తుతానికి పిల్లల చదువు దెబ్బతినకుండా ఉండాలనే ఉద్దేశంతోనే అంగీకార పత్రాలపై సంతకాలు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాశ్వత పరిష్కారం వచ్చేవరకు పోరాటం గురుకులాన్ని మారికవలసలోనే కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం రాతపూర్వకంగా స్పష్టం చేయాలని, 69వ నంబర్ జీవోను రద్దు చేయాలని ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కుంభా రవిబాబు, మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, మాజీ మంత్రి బాలరాజు, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్కుమార్ డిమాండ్ చేశారు. తాత్కాలిక సర్దుబాట్లతో సమస్యకు పరిష్కారం లభించదని గిరిజన, ప్రజా సంఘాలు పేర్కొన్నాయి. గురుకులాన్ని శాశ్వతంగా ఇక్కడే కొనసాగిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశాయి. వైఎస్సార్సీపీ ఆందోళనకు తెలుగు శక్తి మద్దతు పీఎం పాలెం: మారికవలస గిరిజన గురుకుల పాఠశాల మూసివేతకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన ఆందోళనకు తెలుగు శక్తి సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ సంస్థ అధినేత బీవీ రామ్ తెలిపారు. మంగళవారం తనను పోలీసులు అదుపులోకి తీసుకుని పీఎం పాలెం పోలీస్స్టేషన్లో నిర్బంధించడాన్ని ఆయన ఖండించారు. ఆనందపురం పోలీస్స్టేషన్కు తరలింపు ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, రాష్ట్ర ఎస్ఈసీ సభ్యుడు సతీష్ వర్మ, జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు వంకాయల మారుతి ప్రసాద్, రాష్ట్ర అధికార ప్రతినిధి పనివేలి ఈశ్వరి, జీసీసీ మాజీ చైర్పర్సన్ స్వాతిరాణి, మాజీ మార్కెటింగ్ చైర్మన్ ఆల్ఫా కృష్ణ, జి.వి.రవిరాజు, డీఎల్వో కేంద్ర కమిటీ కన్వీనర్ పెలమాల రంజిత్కుమార్, డీఎస్వో నాయకుడు కె.కొత్తయ్య, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.సురేంద్ర, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అజయ్, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి అప్పలనాయుడు, నాయకులు ఎం.నరేష్, ఎస్.తులసి, వి.ఉదయలను పోలీసులు అరెస్టు చేసి ఆనందపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. మారికవలసలో ‘మాస్’ డ్రామా పోలీసుల కళ్లుగప్పి కేకే రాజు ఎంట్రీ వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు హౌస్ అరెస్ట్ నుంచి తప్పించుకున్న తీరు నగరంలో తీవ్ర ఉత్కంఠ రేపింది. మారికవలస గురుకుల పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లకుండా పోలీసులు ఆయన ఇంటిని ముట్టడించారు. అయితే, కేకే రాజు తన ఇంటి వెనుక మార్గం గుండా తప్పించుకుని, మహిళా కార్యకర్తలతో కలిసి సాధారణ ప్రయాణికుడిలా ఆటోలో పోలీసుల బారికేడ్లను దాటుకుంటూ పాఠశాలకు చేరుకున్నారు. అక్కడ విద్యార్థుల తల్లిదండ్రులకు సంఘీభావం తెలిపిన ఆయనను.. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు. విశాఖ పోలీసులతో పాటు ఏజెన్సీ నుంచి సివిల్ డ్రెస్లో వచ్చిన వంద మందికి పైగా సిబ్బంది కేకే రాజు మెడపట్టుకుని బలవంతంగా బస్సు ఎక్కించి భీమిలి పోలీస్ స్టేషన్కు తరలించారు. దరఖాస్తు చేస్తే.. ఇక్కడే అడ్మిషన్ మంగళవారం వైఎస్సార్సీపీ, గిరిజన, ప్రజాసంఘాల ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో సాయంత్రం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, గురుకులాల ఉన్నతాధికారులు పాఠశాల వద్దకు వచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి.. తమ పిల్లలను మారికవలసలోనే చదివించాలని కోరుతూ లిఖితపూర్వకంగా దరఖాస్తు చేస్తే అడ్మిషన్లు కల్పిస్తామని తెలిపారు. ఇప్పటికే తరలించిన విద్యార్థులను కూడా ఇక్కడే కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు బుధవారం అనకాపల్లి జిల్లాలో పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అనంతరం తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రాలపై సంతకాలు తీసుకునే ప్రక్రియ ప్రారంభమైంది. -
ఏయూలో ‘శతాబ్ది’ దోపిడీ!
విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిపాలన విభాగంలో పాతుకుపోయిన అవినీతి తిమింగలాలు వర్సిటీ ప్రతిష్టను దిగజారుస్తున్నాయి. ఏళ్ల తరబడి చక్రం తిప్పుతున్న కొందరు ఉద్యోగులు అధికారులను గుప్పిట్లో పెట్టుకుని ఏయూ ఖజానాను కొల్లగొడుతున్నారు. తాజాగా శతాబ్ది వేడుకల ముసుగులో బోధన, బోధనేతర సిబ్బంది కోసం నిర్వహించిన ఆటల పోటీలు, సాంస్కృతిక ఉత్సవాల్లో సాగిన దొంగ బిల్లుల వ్యవహారం విశ్వవిద్యాలయంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు ఖర్చే లేని చోట అడ్డగోలుగా రూ.4 లక్షల నకిలీ బిల్లులు సృష్టించి జేబులు నింపుకునేందుకు పక్కా స్కెచ్ వేసిన వైనం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సామగ్రి నుంచి భోజనం దాకా అంతా ఉచితమే! క్రీడల్లో పాల్గొన్న ఉద్యోగులకు కనీసం టీ–షర్టులు, ట్రాక్సూట్లు కూడా కొనివ్వకుండా సొంతంగా బ్యాట్లు, బాల్స్ తెచ్చుకోవాలని చేతులెత్తేశారు. రెండు రోజుల పాటు మైదానంలో ఆడిన సిబ్బందికి మధ్యాహ్నం భోజనం, పెరుగన్నం, చివరికి గొంతు తడుపుకునే మంచినీటిని సైతం కొందరు ఉద్యోగులే సొంత జేబుల్లో నుంచి డబ్బులు తీసి స్పాన్సర్ చేశారు. ఆటల్లో విజేతలకు ఇచ్చిన కప్పులు, మెడల్స్ కూడా జాలాది శ్రీనివాస్ అనే దాత ఆర్థిక సహకారంతో కొనుగోలు చేసినవే. ఉద్యోగ ఉత్సవంలో అలరించిన డ్యాన్సులు, కోలాటం, ఆర్కెస్ట్రాలకు అయిన ఖర్చులనూ ఉద్యోగులే భరించారు. ఈ దాతలకు సాక్షాత్తూ వర్సిటీ వేదికపైనే సన్మానాలు చేసి, వారి వివరాలను అధికారిక వెబ్సైట్లో కూడా ఉంచారు. రూ.4 లక్షల దొంగ లెక్కలేంటి? అసలు పైసా ఖర్చు లేకుండా మొత్తం వ్యవహారం ఉద్యోగుల విరాళాలు, దాతల ఔదార్యంతోనే పూర్తయినప్పుడు.. వైస్ ఛాన్సలర్ ప్రత్యేకంగా మంజూరు చేసిన రూ.2 లక్షల అడ్వాన్స్ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాకుండా, కమిటీలోని ఇతర సభ్యులను పక్కనపెట్టి, మరో రూ.2 లక్షలు కలిపి మొత్తం రూ.4 లక్షల బిల్లులను డిప్యూటీ రిజిస్ట్రార్ (అడ్మిన్) ద్వారా గుట్టుచప్పుడు కాకుండా పాస్ చేయించేందుకు ఓ కీలక ఉద్యోగి తీవ్రంగా పైరవీలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. వీసీ నిగ్గు తేల్చాలి.. బాధ్యులపై వేటు వేయాలి! ఖజానాకు గండికొట్టేలా సాగుతున్న ఈ నకిలీ బిల్లుల బాగోతంపై వైస్ ఛాన్సలర్ తక్షణమే సమగ్ర విచారణకు ఆదేశించాలని ఉద్యోగ వర్గాలు గళమెత్తుతున్నాయి. దాతల వివరాలు, ఈవెంట్ వాస్తవ ఖర్చులు, అడ్వాన్స్ సొమ్ము లెక్కలను బయటకు తీసి పూర్తి రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తే అవినీతి బండారం మొత్తం బట్టబయలవుతుందని డిమాండ్ చేస్తున్నారు. వర్సిటీ ప్రతిష్టకు మచ్చతెస్తూ ప్రజాధనాన్ని స్వాహా చేసేందుకు యత్నించిన అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించాలి
విశాఖ విద్య: సాంకేతికతను సమర్థవంతంగా, సక్రమంగా వినియోగించడం ఎంతో ముఖ్యమని ఐఐటీ తిరుపతి డైరెక్టర్ ఆచార్య కె.ఎన్ సత్యనారాయణ అన్నారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ‘క్వాంటం ఎన్హేన్స్డ్ సస్టైనబుల్ టెక్నాలజీ ఫర్ ఏఐ సిస్టమ్స్ (క్వెస్ట్–ఏఐ)’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సాంకేతికతను సరైన రీతిలో వినియోగించుకునేందుకు ముందస్తు అవగాహన అవసరమన్నారు. భవిష్యత్ సాంకేతిక విప్లవం ఒకే సాంకేతికతపై ఆధారపడకుండా వివిధ సాంకేతికతల సమ్మేళనంగా ఉంటుందని పేర్కొన్నారు. క్వాంటం కంప్యూటింగ్ క్లాసికల్ కంప్యూటర్లకు ప్రత్యామ్నాయం కాదని, భవిష్యత్తులో రెండూ కలిసి పనిచేసే హైబ్రిడ్ విధానం ఉంటుందని తెలిపారు. క్వాంటమ్ టెక్నాలజీ, ఏఐ రంగాల్లో పరిశోధనలు సిద్ధాంతాలకే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే పరిష్కారాలుగా మారాలని ఏయూ వీసీ రాజశేఖర్ అన్నారు. ఫెడరేషన్ యూనివర్సిటీ (ఆస్ట్రేలియా) ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లెక్చరర్ నబిల్ మహమ్మద్ మాట్లాడుతూ ఏఐ, సస్టైనబుల్ టెక్నాలజీ, ఇంధన రంగాల్లో సవాళ్లను అధిగమించేందుకు విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు కలిసి పనిచేయాలని అన్నారు. జపాన్లోని ఒసాకా విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ మార్వాన్ ధారిం భారత్, జపాన్ల మధ్య విద్యా, పరిశోధనా సహకారం మరింత పెరగాలని ఆకాంక్షించారు.బాండ్ యూనివర్సిటీ (ఆస్ట్రేలియా) అసోసియేట్ ప్రొఫెసర్–ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ గ్రెగొరీ స్కుల్మోస్కీ మాట్లాడుతూ క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలయిక భవిష్యత్తులో అనేక రంగాలపై ప్రభావం చూపుతుందని తెలిపారు. ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె. వెంకట సుబ్బయ్య, సీఎస్ఈ విభాగాధిపతి, డీన్ ఆచార్య వి. వల్లి కుమారి మాట్లాడుతూ ఏయూలో తొలిసారిగా క్లస్టర్ విభాగాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. మూడు రోజుల సదస్సులో సుమారు 60 పరిశోధనా పత్రాలను ఎంపిక చేయగా, 300 మందికిపైగా ప్రతినిధులు పాల్గొంటున్నారని వెల్లడించారు.కార్యక్రమంలో అవుట్రీచ్ విభాగం డీన్ ఆచార్య కె. రమా సుధ, విభాగాధిపతులు ఆచార్య టి.ఆర్. జ్యోత్స్న, డి. లలిత భాస్కరి, పి.వి. శ్రీదేవి, పి. స్వప్న, కె. వెంకట రావు తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ఆర్మీ నియామక ర్యాలీ
మహారాణిపేట: అగ్నివీర్ పథకంలో భాగంగా బుధవారం నుంచి ఆర్మీ నియామక ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీ ఈనెల 20వ తేదీ వరకు కొనసాగనుంది. వివిధ జిల్లాలకు చెందిన రాత పరీక్షలో ఉత్తీర్ణులైన 10,350 మంది అభ్యర్థులు ఈ ర్యాలీకి హాజరుకానున్నారు. సెలక్షన్ ప్రక్రియలో భాగంగా 1.6 కిలోమీటర్ల రన్నింగ్ కోసం ఆర్కే బీచ్రోడ్డులో పార్క్ హోటల్ జంక్షన్ నుంచి విశ్వప్రియ కల్యాణమండపం వరకు ట్రాక్ ఏర్పాటు చేశారు. ఆర్మీ నియామక ర్యాలీ నేపథ్యంలో బుధవారం నుంచి ఈనెల 20వ తేదీ వరకు బీచ్రోడ్డులో ఎలాంటి వాహనాలకూ అనుమతి ఉండదు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి, ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి సహకరించాలని అధికారులు కోరారు. -
10న ఉక్కు నిర్వాసితుల మహాధర్నా
పెదగంట్యాడ: ఉక్కు నిర్వాసితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయం చేయాలని నిర్వాసిత నాయకులు డిమాండ్ చేశారు. ఉక్కు నిర్వాసితుల ఐక్య సంఘం, నిర్వాసితుల కాంట్రాక్ట్ యూనియన్ సంయుక్తంగా పెదగంట్యాడలోని నెల్లిముక్కు సామాజిక భవనంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టీల్ప్లాంట్ నిర్మాణం కోసం సర్వం కోల్పోయి ఆర్ కార్డు కలిగిన నిర్వాసితులకు వన్టైమ్ సెటిల్మెంట్ చేయాలన్నారు. మిగులు భూమిలో ఎకరం భూమి, సెటిల్మెంట్ చేసేవరకూ ప్రతి నెల జీవన భృతి కింద రూ.25 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 10న మహాధర్నా తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఈ నెల 10న ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టీల్ప్లాంట్ బీసీ గేట్ వద్ద 5 వేల మందితో మహాధర్నా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మహాధర్నాలో ఉక్కు నిర్వాసితులు కుటుంబాలతో వచ్చి జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు పితాని భాస్కరరావు, ఉమ్మడి అప్పారావు, గల్లా రామకృష్ణ, శీర సంజీవ్, బొంతు అప్పారావు, అంగ దేముడు, పేర్ల జగన్, నెల్లి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణవాయువుకు గ్రహణం
కేజీహెచ్లో అత్యవసర వేళల్లో అందని ఆక్సిజన్మహారాణిపేట: పేదల పెద్దాస్పత్రి కేజీహెచ్లో ప్రాణవాయువుకే కష్టాలు వచ్చాయి. కోవిడ్ విపత్తు సమయంలో ఆక్సిజన్ కొరత లేకుండా అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆరు ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ఆస్పత్రి అవసరాలకు సరిపడా ఆక్సిజన్ను అక్కడికక్కడే ఉత్పత్తి చేసేలా కోట్లాది రూపాయలతో మౌలిక వసతులు కల్పించింది. అప్పట్లో ఎంతో ఉపయోగపడిన ఆ ప్లాంట్లలో ఇప్పుడు నాలుగు పనిచేయడం లేదు. రెండింటిపైనే మొత్తం కేజీహెచ్ భారం పడుతోంది. 1,187 పడకల ఈ ఆస్పత్రికి నిత్యం భారీగా రోగులు వస్తుంటారు. రోజుకు 1,500 నుంచి 2,200 వరకు ఓపీకి, 300 నుంచి 600 మంది వరకు ఇన్పేషెంట్లుగా వస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. సుమారు 26 విభాగాల్లో ఆక్సిజన్ అవసరమయ్యే రోగులకు ప్రస్తుతం పనిచేస్తున్న రెండు ప్లాంట్లే ఆధారం. అత్యవసర వేళల్లో డిమాండ్ పెరిగితే బయట నుంచి ఆక్సిజన్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆరు ఏర్పాటుచేస్తే.. నాలుగు మూత! వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఆరు ప్లాంట్లు కోవిడ్ సమయంలో కేజీహెచ్కు వెన్నుదన్నుగా నిలిచాయి. ఆస్పత్రిలోనే ఆక్సిజన్ ఉత్పత్తి చేసి ఐసీయూలు, అత్యవసర విభాగాలు, వార్డులకు సరఫరా చేశాయి. అయితే నిర్వహణ లోపాలు, సాంకేతిక సమస్యలతో నాలుగు ప్లాంట్లు క్రమంగా మూతపడ్డాయి. చిన్నచిన్న మరమ్మతులు చేయిస్తే తిరిగి పనిచేసే అవకాశం ఉన్నా వాటిని అలాగే వదిలేయడంతో అవి దిష్టిబొమ్మలుగా మారాయి. ప్రస్తుతం కేవలం రెండు ప్లాంట్లపైనే ఆస్పత్రి భారం మొత్తం పడుతోంది. రూ.60 లక్షల సమస్య.. కోట్ల భారం! నాలుగు ప్లాంట్లను మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావడానికి సుమారు రూ.60 లక్షలు ఖర్చవుతుందని నిపుణుల అంచనా. ప్రెషర్ గేజ్, డ్రయ్యర్, ఫిల్లర్, థర్మామీటర్, కంప్రెసర్, విద్యుత్ సెన్సార్లు తదితరాల్లో సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. అంటే.. రూ.60 లక్షలతో పరిష్కరించగల సమస్య కోసం ప్లాంట్లను పక్కనపెట్టి బయట నుంచి ఆక్సిజన్ కొనుగోలు చేస్తున్నారు. నెలనెలా భారీ మొత్తాలు ఖర్చవుతుండగా.. ఏడాదికి ఈ వ్యయం కోట్లకు చేరుతున్నట్లు సమాచారం. ప్రభుత్వానికి శాశ్వత ఆస్తిగా మిగిలే ప్లాంట్లను బాగు చేయకుండా నిరంతర కొనుగోళ్లపై ఆధారపడటం ఎందుకన్న ప్రశ్న తలెత్తుతోంది. కలెక్టర్ ఆదేశాలూ బేఖాతర్ ప్లాంట్ల దుస్థితిపై ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో చర్చ జరిగింది. నాలుగు ప్లాంట్లను మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆదేశాలు జారీ చేసి రెండు నెలలు గడిచినా పనులు మాత్రం ముందుకు సాగలేదు. అత్యవసర వైద్య సేవకు సంబంధించిన అంశంలో కలెక్టర్ ఆదేశాలే అమలు కాకపోవడం అధికార యంత్రాంగం తీరుపై తీవ్ర విమర్శలకు తావిస్తోంది. కమీషన్ల కక్కుర్తే కారణమా? సొంతంగా ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం ఉన్నా, బయటి నుంచి కొనుగోలు చేయడంలోని అంతరార్థంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆక్సిజన్ కొనుగోళ్ల వెనుక కొందరు అధికారులు, వైద్యులకు భారీగా కమిషన్లు ముడుతున్నాయని, ఆ వ్యాపార ప్రయోజనాల కోసమే ప్లాంట్ల మరమ్మతులను తొక్కేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో రోజుకు రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఆక్సిజన్ బిల్లులు చెల్లించలేక పేద రోగులు కేజీహెచ్ను ఆశ్రయిస్తున్నారు. కానీ, ఇక్కడి అధికారుల అవినీతి అస్మదీయ ధోరణి ఆ పేద రోగుల ఊపిరిపై దెబ్బతీస్తోంది. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి, ప్లాంట్లకు మరమ్మతులు చేయించి కేజీహెచ్లో ఆక్సిజన్ సరఫరాను పునరుద్ధరించాలని బాధితులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
వైఎస్సార్ సేవలను స్మరించుకుందాం
సాక్షి, విశాఖపట్నం: మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా జిల్లాలో వాడవాడలా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పిలుపునిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంతో పాటు నియోజకవర్గ, వార్డుల్లోని పార్టీ కార్యాలయాల్లో ఆయనకు ఘన నివాళులర్పించాలన్నారు. అలాగే వైఎస్సార్ విగ్రహాల వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రక్తదానం, అన్నసమారాధన, పండ్లు, రొట్టెల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించి, విశాఖ నగరానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుందామన్నారు. -
సీఎం సార్.. మా డబ్బులు మాకు ఇవ్వండి
మహారాణిపేట: ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు, డిమాండ్ల సాధన కోసం ఏపీజేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఉద్యోగులు మంగళవారం ఆందోళనకు శ్రీకారం చూట్టారు. రాష్ట్ర కార్యవర్గం పిలుపుమేరకు ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఏపీజేఏసీ అమరావతి భాగస్వామ్య డిపార్ట్మెంట్ల సంఘ సభ్యులు(ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు) నల్ల బ్యాడ్జీలు ధరించి తమ అవేదనను ప్రభుత్వానికి తెలిపారు. భీమిలి ఆర్డీవో కార్యాలయం, పెందుర్తి, గాజువాక తహసీల్దార్ కార్యాలయాలు, మధురవాడ జోనల్ కార్యాలయం, జిల్లా పరిషత్ వద్ద అకౌంట్స్ విభాగం, ఆడిట్ విభాగం, డీఎస్వో కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలతో ఆందోళన నిర్వహించారు. జిల్లాలోని రెవెన్యూ విభాగంలో నాల్గవ తరగతి ఉద్యోగుల నుంచి తహసీల్దార్లు వరకు, జీవీఎంసీ అన్ని విభాగాల ఉద్యోగులు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్(ఆర్టీసీ), ప్రభుత్వ ఔట్సోర్సింగ్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, లేబర్ డిపార్ట్మెంట్, కోఆపరేటివ్, మున్సిపల్ టీచర్స్, ప్రభుత్వ డ్రైవర్లు, వెటర్నరీ డాక్టర్లు, వీఆర్వోలు, రికార్డ్ అసిస్టెంట్లు, సివిల్ సప్లైస్ ఉద్యోగులు, డిఫరెంట్లీ ఏబుల్ ఎంప్లాయిస్, పార్ట్ టైం టీచర్లు నల్ల బ్యాడ్జిలు ధరించి విధులకు హాజరైయ్యారు. ఉద్యోగుల మొబైల్లో.. ‘సీఎం సార్ మా డబ్బులు మాకు ఇవ్వండి’అనే పిక్ని వాట్సప్ డీపీలుగా పెట్టుకున్నారు. కలెక్టరేట్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి విశాఖపట్నం జిల్లా చైర్మన్ సత్తి నాగేశ్వర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు, సహ చైర్మన్ ఎస్ఏ త్రినాథరావు, మున్సిపల్ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు అప్పలరాజు, ఏపీఆర్ఎస్ఏ జిల్లా కార్యదర్శి శ్యాంప్రసాద్, సీటీ అధ్యక్షుడు వీవీవీఆర్వీ సత్యనారాయణ, కార్యదర్శి రవిశంకర్, జేఏసీ అమరావతి విశాఖ జిల్లా ఉమెన్ వింగ్ చైర్పర్సన్ శైలజ పాణిగ్రాహి తదితరులు పాల్గొన్నారు. -
రిసార్ట్లో వాచ్మన్పై హత్యాయత్నం
పెందుర్తి: విచ్చలవిడిగా లభిస్తున్న గంజాయి, మద్యం మత్తులో యువకులు అసాంఘిక శక్తులుగా మారుతున్నారు. పుట్టినరోజు పేరిట పెందుర్తి మండలం సౌభాగ్యరాయపురం(ఎస్ఆర్ పురం)లో సోమవారం అర్ధరాత్రి జరిగిన ఓ పార్టీలో 15 మంది యువతీ యువకులు గంజాయి, మద్యం సేవించారు. ఈ క్రమంలో జరిగిన గొడవను ప్రశ్నించిన రిసార్ట్ వాచ్మన్ను బీరు, మద్యం బాటిళ్లతో విచక్షరహితంగా కొట్టి చంపే ప్రయత్నం చేశారు. దాడిలో గాయపడిన వాచ్మన్ ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతున్నాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. నగరంలోని కొబ్బరితోట ప్రాంతానికి చెందిన రోషిణి అనే యువతి తన బాయ్ఫ్రెండ్ కనకల గణేష్(24) పుట్టినరోజు కోసం ఎస్ఆర్ పురంలోని లక్కీ రిసార్ట్ను బుక్ చేసింది. వారిద్దరితో సహా మొత్తం 15 మంది(11 మంది యువకులు, నలుగురు యువతులు) సోమవారం రాత్రి రిసార్ట్కు చేరుకున్నారు. మంగళవారం వేకువజాము వరకు గంజాయి, మద్యం పూటుగా సేవించారు. ఆ తర్వాత అదుపుతప్పి రిసార్ట్లోని సామగ్రిని బద్దలు కొట్టడం మొదలు పెట్టారు. అదే సమయంలో వారితో వచ్చిన యువతులపై కూడా యువకులు దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రిసార్ట్ వాచ్మన్గా ఉన్న బమ్మిడి పైడయ్య(70) మద్యం మత్తులో ఉన్న వారందరినీ వారించే ప్రయత్నం చేశారు. అప్పటికే పూర్తి మత్తులో ఉన్న 15 మందీ మూకుమ్మడిగా పైడయ్యపై బీరు, మద్యం బాటిళ్లతో దాడి చేశారు. దీంతో పైడయ్య కుప్పకూలిపోయాడు. రక్తపు మడుగులోనే 5 గంటలు.. పైడయ్యపై విచక్షణారహితంగా దాడి చేసిన నిందితులు ఒక్కొక్కరిగా రిసార్ట్ నుంచి జారుకున్నారు. పుట్టినరోజు చేసుకున్న గణేష్ మాత్రం మత్తులో రూమ్లోనే ఉన్నాడు. ఉదయం 10 గంటలకు రిసార్ట్లో పనిచేసే హౌస్ కీపింగ్ సిబ్బంది వచ్చి చూడగా పైడయ్య రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే గ్రామస్తులకు సమాచారం ఇవ్వగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న పైడయ్యను వెంటనే ఆస్పత్రికి తరలించారు. రూమ్లో మత్తులో పడి ఉన్న నిందితుడు గణేష్ను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 15 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ కేవీ సతీష్కుమార్ తెలిపారు. ఇటీవలే ఆనందపురం పరిధిలో ఓ రిసార్ట్లో ఇదే తరహా దాడి జరగడం గమనార్హం. గంజాయి, మద్యం విచ్చలవిడిగా దొరకడంతో పాటు కూటమి నాయకుల అండదండలతోనే ఇలా అసాంఘిక శక్తుల ఆగడాలు పెరిగిపోతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. మద్యం మత్తులో రిసార్ట్ గదిలో పడి ఉన్న నిందితుడు గనకల గణేష్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ వాచ్మన్ పైడయ్య (ఇన్సెట్) పైడయ్య(ఫైల్) -
గాయపడిన నాగజెర్రికి శస్త్రచికిత్స
సింథియా: తీవ్రంగా గాయపడిన ఆరు అడుగుల నాగజెర్రికి శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడిన ఘటన మల్కాపురం సింథియా సమీపంలోని క్రాంతినగర్లో చోటుచేసుకుంది. జీవీఎంసీ 63వ వార్డు పరిధి క్రాంతినగర్లో దావీదు తన స్థలానికి ఇనుప కంచెతో వల ఏర్పాటు చేశాడు. అందులో నాగజెర్రిపాము చిక్కుకుని మెడ, నడుము భాగాల్లో తీవ్రంగా గాయపడింది. కొన ఊపిరితో ఉన్న పామును గమనించిన స్థల యజమాని వెంటనే స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం అందించారు. నాగరాజు అక్కడికి చేరుకుని చాకచక్యంగా పామును పట్టుకుని, అనంతరం 40వ వార్డు పరిధిలోని హిందూస్థాన్ షిప్యార్డ్ కాలనీలో ఉన్న గాంధీగ్రామ్ పశువైద్యశాలకు తరలించారు. అక్కడ పశువైద్యాధికారి సీహెచ్. సునీల్కుమార్ సుమారు గంటన్నర పాటు శ్రమించి పాముకు శస్త్రచికిత్స చేశారు. గాయానికి ఆరు కుట్లు వేసినట్లు తెలిపారు. ప్రస్తుతం పాము క్షేమంగా ఉందని డాక్టర్ సునీల్కుమార్ వెల్లడించారు. గాయం పూర్తిగా తగ్గిన అనంతరం పామును సురక్షిత ప్రాంతంలో విడిచిపెడతామని నాగరాజు తెలిపారు. -
సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ప్రారంభం
గోపాలపట్నం: జీవీఎంసీ 92వ వార్డు మేహాద్రి గెడ్డ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలను తొలగించి, ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ను పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గణబాబు మంగళవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈ కేంద్రంలో ఆకాశ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో జేఈఈ, నీట్లో ఉచిత శిక్షణ ఇస్తారని తెలిపారు. ఏటా ప్రతీ విద్యార్థికి సుమారు రూ.65వేలు ఖర్చయ్యే కోర్సు ఇక్కడ పేద విద్యార్థులకు ఉచితంగా లభ్యమవుతుందని తెలియజేశారు. 600మంది విద్యార్థులతో ఎక్స్లెన్స్ సెంటర్లు ప్రారంభిస్తున్నామని, ఇందులో 75శాతం సీట్లు ఎస్సీ విద్యార్థులకు, 25శాతం ఇతర విద్యార్థులకు కేటాయిస్తారని తెలిపారు. ప్రతీ కేంద్రంలో 22 మంది సిబ్బంది ఉంటారన్నారు. ఇందులో 18మంది బోధకులు, ఒక మానిటర్, ఒక కౌన్సెలర్, ఇద్దరు టెక్నికల్ సిబ్బంది ఉంటారని తెలియజేశారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్, సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ కార్యదర్శి డాక్టర్ ఎన్.మోహనరావు, డీసీవో రామకృష్ణ, పాఠశాల ప్రిన్సిపాల్ ప్రియదర్శిని, ఆకాశ్ ఇనిస్టిట్యూట్ సౌత్ జోన్ అకడమిక్ హెడ్ ధీరజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పదోన్నతుల్లో ఓసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి
డాబాగార్డెన్స్: సుప్రీంకోర్టు,హైకోర్టు తీర్పులను అనుసరించి పదోన్నతుల్లో ఓసీలకు రిజర్వేషన్లు కల్పించాలని విద్యుత్ ఓసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం నగరంలోని గ్రీన్పార్క్ హోటల్ సమీపంలోని విద్యుత్ విశ్రాంతి ఉద్యోగుల సంక్షేమ సంఘం హాల్లో విద్యుత్ ఓసీ జేఏసీ ఉద్యోగుల ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డీవీ రంగారావు, ప్రధాన కార్యదర్శి కోట శ్రీనివాసరావు, ఈపీడీసీఎల్ ప్రెసిడెంట్ ఎ. అప్పలరాజు, ప్రధాన కార్యదర్శి తురగా రామకృష్ణ, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ డి. పండుదొర, అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ డి. వెంకట్రెడ్డి, కేటీ భాస్కర్, వైజాగ్ జిల్లా అధ్యక్షుడు పి. ఆనందబాబు తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఓసీలకు పదోన్నతుల రిజర్వేషన్ల విషయంలో జరుగుతున్న అన్యాయంపై చర్చించారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్లను సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు అనుగుణంగా అమలు చేస్తూ పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న మెరిట్ సీనియార్టీ, జెన్యూన్ సమస్యను 2009 నుంచి అమలు చేసేందుకు సహకరించిన ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్కు కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. -
అప్పన్న అన్నప్రసాద పథకానికి రూ.2 లక్షల విరాళాలు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి శాశ్వత అన్నప్రసాద పథకానికి నగరంలోని షీలానగర్కు చెందిన సూరపనేని సుబ్రహ్మణ్యం శుక్రవారం రూ.1,00,116 విరాళాన్ని అందజేశారు. దేవస్థానం తరఫున పీఆర్వో కార్యాలయ సూపరింటెండెంట్ జోగారావు దాతకు బాండ్ అందజేశారు. అలాగే మహారాణిపేటకు చెందిన ఏతముక్కల చంద్రశేఖరరెడ్డి అన్నప్రసాద పథకానికి రూ.1,00,116, గో సంరక్షణ పథకానికి రూ.1,00,116 చొప్పున విరాళాలను చెక్కుల రూపంలో అందించారు. సంబంధిత చెక్కులను పీఆర్వో కార్యాలయంలో డిప్యూటీ ఈవో రాధకు అందజేశారు. దేవస్థానం తరఫున దాతలకు స్వామివారి దర్శనం కల్పించి, ప్రసాదం, శేషవస్త్రాలను ఆలయ అధికారులు అందజేశారు. కార్యక్రమంలో పీఆర్వో కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ వరాహనరసింహం, ముసలినాయుడు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి మృతి
తగరపువలస: స్థానిక మెయిన్ రోడ్డులో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో జీవీఎంసీ భీమిలి జోన్ రెండో వార్డు మామిడిపాలెం గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి చీడి తాతారావు (19) మృతి చెందాడు.చెరకుపల్లి అవంతి డిగ్రీ కళాశాలలో ఫైనలియర్ చదువుతున్న తాతారావు కిరాణా సామగ్రి కోసం తగరపువలసకు వచ్చాడు. ఈ క్రమంలో బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతుడి తండ్రి మల్లికార్జున్ పెయింటర్గా, తల్లి మీనాకుమారి హౌస్ కీపింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మొక్కలే మానవాళికి భవిష్యత్
పెందుర్తి: ‘నేను పుట్టి పెరిగింది అందాల విశాఖలోనే. ఎంతో ఇష్టంగా చదివి గౌరవప్రదమైన వైద్య పట్టా అందుకున్నదీ ఇక్కడే. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే నా ఆకాంక్ష. ప్రకృతిని ప్రేమించి, పరిరక్షించాలి. మొక్కలే మానవాళికి భవిష్యత్ను అందిస్తాయి’ అని మిసెస్ ఇండియన్ అమెరికా–2024 విజేత, వైద్యురాలు డాక్టర్ మాలినీ దాసరి అన్నారు. పెందుర్తి మండలం పెదగాడి సమీపంలోని సంకల్ప కళా గ్రామాన్ని శుక్రవారం ఆమె సందర్శించారు. అక్కడ ప్రకృతి సిద్ధమైన పద్ధతుల్లో తయారవుతున్న ఉత్పత్తులను పరిశీలించి ఆసక్తి కనబరిచారు. సహజ సిద్ధమైన రంగులతో అద్దకం వేసి రూపొందిస్తున్న వస్త్రాలను చూసి అబ్బురపడ్డారు. ఎద్దు గానుగతో తయారు చేస్తున్న విధానాన్ని ఆసక్తిగా గమనించారు. లక్క బొమ్మలను చూసి మురిసిపోయారు. ప్రకృతి సిద్ధంగా పండించిన దినుసులతో తయారు చేసిన పిండి వంటలను రుచి చూసి ప్రశంసిం చారు. సంప్రదాయ పద్ధతుల్లో విత్తనాలు చల్లడం, పప్పు ధాన్యాలను దంచడం వంటి గ్రామీణ జీవన విధానాలను ఆసక్తిగా తిలకించారు. వివిధ రకాల మొక్కలు, వాటి శాసీ్త్రయ నామాలు, ఔషధ ప్రయోజనాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కట్టెల పొయ్యిపై స్వయంగా వంట చేసి సందడి చేశారు. నర్సరీలోని మొక్కలను పరిశీలించారు.ఈ సందర్భంగా డాక్టర్ మాలినీ దాసరి మాట్లాడుతూ సహజసిద్ధంగా పండించిన ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అన్నారు. మంచి, చెడులు మనం చూసే విధానంలోనే ఉంటాయని పేర్కొన్నారు. వైద్య వృత్తిలో కొనసాగుతూనే తనకు ఎంతో ఇష్టమైన ఫ్యాషన్ రంగంలో అడుగుపెట్టినట్లు తెలిపారు. ఫ్యాకల్టీ అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ మెంటర్షిప్, హనరరీ అవుట్స్టాండింగ్ మెచ్యూర్ గర్ల్ హూ ఇన్స్పైర్, హనరీ షేడ్స్ ఆఫ్ సక్సెస్, మిసెస్ తెలుగు యూఎస్ఏ–2025, మిసెస్ ఇండియా వరల్డ్–2025, మిసెస్ ఇండియా అమెరికా–2024, మిసెస్ లూసియానా యూనివర్స్–2024 వంటి అవార్డులు అందుకున్నట్లు వివరించారు. ‘నా పిల్లలకు నేనే రోల్ మోడల్’ అని పేర్కొన్న ఆమె, తాను సాధించిన విజయాల్లో కొంత భాగాన్ని సమాజ సేవకు వినియోగించాలన్నదే తన సంకల్పమని తెలిపారు. కార్యక్రమంలో గ్రీన్ కై ్లమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం, డాక్టర్ మాలినీ దాసరి తల్లి లక్ష్మీకుమారి, కుమార్తెలు సమైక్య, సమైన, సంకల్ప ఆర్ట్ ప్రతినిధులు ఆకుల చలపతిరావు, పార్వతి, జెమిల్యా తదితరులు పాల్గొన్నారు. -
విశాఖ పోర్టు కోసం రెండో టగ్కు కీల్ లేయింగ్
సింథియా: విశాఖపట్నం పోర్ట్ అథారిటీ కోసం హెచ్ఎస్ఎల్ నిర్మిస్తున్న రెండో 60 టన్నుల బోలార్డ్ పుల్ టగ్ (వీసీ 11206)కు శుక్రవారం కీల్ లేయింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఐఆర్ఎస్, సోలాస్ మైరెన్ అధికారుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి విశాఖ పోర్ట్ అథారిటీ చైర్పర్సన్ జస్మిత్ సింగ్ బింద్రా హాజరయ్యారు. ఈ టగ్ల నిర్మాణ పనులు 60 శాతం పూర్తయ్యాయని, అక్టోబర్లో జంట టగ్లను జలప్రవేశం చేయనున్నట్లు హెచ్ఎస్ఎల్ అధికారులు తెలిపారు. ఇవి నౌకల సురక్షిత బెర్తింగ్, పోర్టు కార్యకలాపాల మెరుగుదలకు దోహదపడతాయని పేర్కొన్నారు.కార్యక్రమంలో హెచ్ఎస్ఎల్ సీఎండీ రియర్ అడ్మిరల్ చంద్రశేఖరన్ రఘురామ్, ఐఆర్ఎస్, హెచ్ఎస్ఎల్ అధికారులు పాల్గొన్నారు. -
చంద్రబాబు ప్రభుత్వంలో సహజ సంపదల దోపిడీ
మహారాణిపేట: ‘ప్రజల కోసం సంపద సృష్టిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. కొంతమంది వ్యక్తులు, కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం విశాఖ సహజ సంపదను దోచుకుంటోంది’ అని వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి బి.ఎస్.కృష్ణ (ఆల్ఫా కృష్ణ) ఆరోపించారు. మద్దిలపాలెంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కొండలు, మట్టి తదితర సహజ వనరుల తరలింపు జరుగుతున్నా.. సంబంధిత శాఖల అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రజా సంక్షేమంపై కాకుండా జిల్లాలోని సహజ వనరులను కొల్లగొట్టడంపైనే కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. అధికార పార్టీ నాయకుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు విద్యనందిస్తున్న గురుకుల పాఠశాలను కొనసాగించాలని, ఉన్నట్టుండి ఈ పాఠశాలను ఎందుకు తరలించాల్సి వచ్చిందో ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు సరిపడా తాగునీరు అందించాలి గ్రేటర్ విశాఖలో లక్షలాది మంది ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని బి.ఎస్.కృష్ణ తెలిపారు. ప్రజలకు సరిపడా స్వచ్ఛమైన తాగునీరు అందించాలని, విశాఖలో తాగునీటి సమస్యపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, పెరిగిన ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలల్లో విద్యార్థుల భద్రత, సౌకర్యాలపై ప్రభుత్వం కఠినమైన పర్యవేక్షణ చేయాల్సిన అవసరముందన్నారు.


