breaking news
Visakhapatnam
-
దిగొచ్చిన మద్యం వ్యాపారి
డాబాగార్డెన్స్: జీవీఎంసీ 38వ వార్డులో మతపరమైన ప్రాంతం సమీపంలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణంపై స్థానికులు, ముఖ్యంగా మహిళలు చేస్తున్న ఆందోళనకు ఎట్టకేలకు ఫలితం దక్కింది. దుకాణం యజమాని రెండు రోజుల్లో షాపు ఖాళీ చేస్తానని హామీ ఇవ్వడంతో మహిళలు తమ నిరసనను విరమించారు.ఈ ప్రాంతంలో దర్గా, చర్చి, కన్యకాపరమేశ్వరి, రాములవారి ఆలయాలు, కృష్ణుడి ఆలయం వంటి పలు మతపరమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ ఆలయాలకు సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడం వల్ల భక్తులకు, ముఖ్యంగా మహిళలకు ఇబ్బందులు ఎదురవుతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం నిబంధనలను విస్మరించి ఈ దుకాణానికి అనుమతి ఇచ్చిందని వారు ఆరోపించారు. కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద హడావుడిగా తెరిచిన ఈ దుకాణంపై రెండు రోజుల క్రితం మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీంతో రెండు రోజులు దుకాణం తెరవలేదు. సోమవారం తిరిగి దుకాణం తెరవడంతో స్థానికులు మరోసారి రోడ్డుపై బైఠాయించి తీవ్ర నిరసన తెలిపారు. సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో స్థానికులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ స్పందించి ఎకై ్సజ్ శాఖ అధికారిని విచారణకు ఆదేశించారు. అయితే సంబంధిత శాఖ అధికారి పరిశీలించి వెళ్లిన వెంటనే మద్యం దుకాణం తెరిచి విక్రయాలు ప్రారంభించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వన్టౌన్ సీఐ జీడీ బాబు ఆందోళనకారులను సర్దిచెప్పే ప్రయత్నం చేసినా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళలు నినాదాలు చేస్తూ దుకాణాన్ని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. చివరకు, మహిళల నిరసన ముందు దుకాణం యజమాని దిగిరాక తప్పలేదు. సోమవారం సాయంత్రం యజమాని స్వయంగా వచ్చి రెండు రోజుల్లో షాపు ఖాళీ చేస్తానని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు. మహిళల ఆందోళనకు తలొగ్గిన వైనం రెండ్రోజుల్లో షాపు ఖాళీ చేస్తానని హామీ ఆందోళన విరమించిన 38వ వార్డు వాసులు -
ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు
తగరపువలస : ఆనందపురం ఫ్లై ఓవర్పై సోమవారం మధ్యాహ్నం ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టిన సంఘటనలో తండ్రి మృతి చెందగా కుమారుడికి గాయాలయ్యాయి. ఆనందపురం సీఐ వాసునాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం బొమ్మిక జగన్నాథపురానికి చెందిన కరకవలస రమణమూర్తి(57) తన కుమారుడు దేవీ సంతోష్తో కారులో మద్దిలపాలెంలోని తన అల్లుడి ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఫ్లై ఓవర్పై ఆగి ఉన్న లారీని కారు ఢీకొనగా నుజ్జునుజ్జుయింది. అందులో చిక్కుకుని తీవ్రగాయాలతో తండ్రి మరణించగా బెలూన్లు తెరుచుకోవడంతో కుమారుడు గాయాలతో బయటపడ్డాడు. క్షతగాత్రుడిని సంగివలసలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఆనందపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి దుర్మరణం, కుమారుడికి గాయాలు -
తప్పుడు కేసులు పెట్టి, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు
ఎమ్మెల్సీ వరుదు కల్యాణిఅల్లిపురం: కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులతో ప్రతి పక్షాల గొంతు నొక్కాలని చూస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆరోపించారు. జూన్ 23న జరిగిన యువత పోరు కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మహారాణిపేట పోలీసులు స్టేషన్కి రావాలని నోటీసు ఇవ్వటంతో సోమవారం వెళ్లారు. విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి, గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి ష్యూరిటీలు సమర్పించిన తర్వాత బెయిల్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. ప్రశ్నించే గొంతుకలను నొక్కాలని చూస్తున్నారన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై పోరాటాలు కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ కార్యాలయం పర్యవేక్షకులు రవి రెడ్డి, పార్టీ అనుబంధ విభాగాల ప్రతినిధులు రవి, జీలకర్ర నాగేంద్ర, బొడ్డ గోవింద్, శ్రీదేవి, లక్ష్మి పాల్గొన్నారు. -
స్టీల్ప్లాంట్ క్వార్టర్లలో దొంగల హల్చల్
భారీగా బంగారం, నగదు చోరీ ఉక్కునగరం: స్టీల్ప్లాంట్ టౌన్షిప్లో దొంగలు హల్చల్ చేశారు. ఒకే రాత్రి, ఒకే సెక్టార్లోని ఐదు క్వార్టర్లలో చోరీలకు పాల్పడటం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఈ ఘటనల్లో నగదు, బంగారం, వెండితో పాటు ఓ మోటార్ సైకిల్ కూడా చోరీకి గురైనట్లు స్టీల్ప్లాంట్ క్రైం పోలీసులు వెల్లడించారు. ఎస్.ఎం.ఎస్–2 సీనియర్ టెక్నీషియన్ ఇంట్లో భారీ చోరీ సెక్టార్–6లోని 335 డి క్వార్టర్లో నివసిస్తున్న ఎస్.ఎం.ఎస్–2 విభాగం సీనియర్ టెక్నీషియన్ సీహెచ్ఈ రాజ్కుమార్ ఈనెల 5న తమ కుటుంబంతో అత్తగారింటికి వెళ్లారు. 7న పొరుగింటికి చెందిన సత్యనారాయణ ఫోన్ చేసి రాజ్కుమార్ ఇంటి తలుపు తెరిచి ఉన్న విషయాన్ని తెలియజేశారు. వారు వచ్చి చూడగా, ఇంట్లో ఉన్న 3 తులాల బంగారం, రూ. 50 వేలు, 70 తులాల వెండి చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. టిఫిన్ షాప్ యజమాని బైక్ అపహరణ అదే సెక్టార్లోని 327 డీ క్వార్టర్లో నివసిస్తున్న పి.రాధాకృష్ణ, సెక్టార్–6 కాంప్లెక్స్లో టిఫిన్ షాప్ నడుపుతున్నారు. ఈనెల 6న రాత్రి ఇంటికి వచ్చి తన మోటార్సైకిల్ను బయట పార్క్ చేశారు. మరుసటి రోజు ఉదయం చూసేసరికి బైక్ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో ఉద్యోగి ఇంట్లో .. ఇదే సెక్టార్లోని మరో క్వార్టర్లో నివసిస్తున్న ఓ ఉద్యోగి ఊరిలో లేని సమయంలో దొంగలు అతని ఇంట్లో చొరబడ్డారు. ఇంటి నుంచి 45 గ్రాముల బంగారం, రూ. లక్ష చోరీకి గురైనట్లు సమాచారం. ఆ ఉద్యోగి తిరిగి వచ్చాక పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉంది. ఎస్ఐ ఇంటి తాళం విరగ్గొట్టి... ఆశ్చర్యకరంగా ఇదే సెక్టార్లోని ఓ ఎస్ఐ క్వార్టర్లో కూడా దొంగలు లాక్ విరగ్గొట్టి లోపలికి ప్రవేశించారు. అయితే ఇంట్లో పోలీసు దుస్తులు చూసి భయపడి అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. పోలీసుల దర్యాప్తు సమాచారం అందుకున్న వెంటనే క్లూస్ టీం ఘటనా స్థలాలకు చేరుకుని చోరీ జరిగిన అన్ని క్వార్టర్లలో వేలిముద్రలు సేకరించింది. ఈ కేసును పర్యవేక్షిస్తున్న క్రైం ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుని చోరీ సొత్తును రికవరీ చేస్తామని పేర్కొన్నారు. స్టీల్ప్లాంట్ టౌన్షిప్లో ఒకేసారి ఇన్ని చోరీలు జరగడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు నిఘాను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. -
ప్రజలతో దురుసుగా ప్రవర్తిస్తే చర్యలు
మహారాణిపేట : ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం వహించినా, కార్యాలయాలకు వచ్చే ప్రజలతో దురుసుగా ప్రవర్తించినా చర్యలు తప్పవని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అధికారులను హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో ఆయన పలు అంశాలపై సమీక్షించారు. గతంలో అందిన ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యలను పరిశీలించిన కలెక్టర్, కాల్ సెంటర్ ఫీడ్బ్యాక్ను విశ్లేషించారు. ప్రజల పట్ల అధికారులు, సిబ్బంది వ్యవహరించే తీరు మెరుగుపడాలని సూచించారు. అందిన ఫిర్యాదును పరిష్కరించే క్రమంలో ఫిర్యాదుదారులతో ఫోన్లో మాట్లాడి, సంతృప్తికరంగా సమస్యలను పరిష్కరించాలని హితవు పలికారు. పోలీస్ శాఖలో అవలంబిస్తున్న ఎండార్స్మెంట్ విధానాన్ని మార్చాలని, సమస్యపై తీసుకున్న చర్యలను వివరిస్తూ ఫిర్యాదుదారుకు ఎండార్స్మెంట్ ఇవ్వాలని ఆదేశించారు. విచారణకు ఆదేశం ఆనందపురం మండలం, వెల్లంకి గ్రామంలో సర్వే ప్రక్రియలో క్షేత్రస్థాయి అధికారి నిర్లక్ష్యం ప్రదర్శించి, నగదు కూడా అడిగారని వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని సర్వే శాఖ ఏడీని కలెక్టర్ ఆదేశించారు. నిజం నిరూపితమైతే సదరు సర్వేయర్ను సస్పెండ్ చేయాలన్నారు. అలాగే ఫీడ్బ్యాక్ సర్వేలో తేలిన ఏడుగురు సిబ్బంది దురుసు ప్రవర్తనపై వారికి నోటీసులు ఇవ్వాలని పీజీఆర్ఎస్ నోడల్ అధికారిని ఆదేశించారు. 347 వినతులు సోమవారం పీజీఆర్ఎస్కు ప్రజల నుంచి 347 వినతులు అందాయి. వీటిలో రెవెన్యూ శాఖకు 136, జీవీఎంసీకి 66, పోలీస్ శాఖకు 22, ఇతర అంశాలకు సంబంధించి 123 ఫిర్యాదులు ఉన్నాయి. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్. భవాని శంకర్, ఏడీసీ వర్మ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లాలోని అన్ని విభాగాల అధికారులు, వర్చువల్గా మండల తహశీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. జీవీఎంసీ పీజీఆర్ఎస్కు 138 వినతులుడాబాగార్డెన్స్: జీవీఎంసీ కమిషనర్గా కేతన్ గార్గ్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్తో పాటు నగర మేయర్ పీలా శ్రీనివాస్ ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 138 వినతులు అందగా, వాటిలో అత్యధికంగా పట్టణ ప్రణాళికా విభాగానికి 64 ఫిర్యాదులు వచ్చాయి. అడ్మినిస్ట్రేషన్ అండ్ అకౌంట్స్ విభాగానికి 8, రెవెన్యూ విభాగానికి 16,ప్రజారోగ్య విభాగానికి 13, ఇంజనీరింగ్ విభాగానికి 24, మొక్కల విభాగానికి 4,యూసీడీ విభాగానికి 9 వచ్చాయి. అధికారులు వెంటనే స్పందించి ఫిర్యాదులను పరిష్కరించాలని కమిషనర్ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి, ప్రధాన ఇంజినీర్ పల్లంరాజు, ప్రధాన వైద్యాధికారి నరేష్కుమార్, సిటీ ప్లానర్ మీనాకుమారి, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. పలువురికి నోటీసులు ఇవ్వాలని ఆదేశం పీజీఆర్ఎస్లో కలెక్టర్ హరేందిర ప్రసాద్ -
జయహో.. జగన్నాథా
● నేత్రపర్వంగా తిరుగు రథయాత్ర ● దారి పొడవునా భక్తుల బ్రహ్మరథండాబాగార్డెన్స్ : టర్నర్ చౌల్ట్రీలో గల గుండిచా మందిరంలో 11 రోజులపాటు పూజలందుకున్న సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథుడు సోమవారం పునఃపయనమయ్యాడు. పది అవతారాలతో భక్తులకు దర్శనమిచ్చిన స్వామిని తోడ్కొని రథం వైభవరీతిలో వెళ్లింది. టర్నర్ చౌల్ట్రీ నుంచి ప్రారంభమైన తిరుగు రథయాత్ర ఆంజనేయస్వామి ఆలయం, పూర్ణామార్కెట్, ఏవీఎన్ కాలేజ్ డౌన్రోడ్డు మీదుగా టౌన్ కొత్తరోడ్డులో గల జగన్నాథస్వామి ఆలయం వరకు సాగింది. ఆలయ ఈవో టి.రాజగోపాల్రెడ్డి, దేవదాయ శాఖ సహాయ కమిషనర్, ఫెస్టివల్ ఆఫీసర్ టి.అన్నపూర్ణ, పలు ఆలయాల ఈవోలు గుండిచా మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామి దర్శనానికి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు దారి పొడవునా బ్రహ్మరథం పట్టారు. రథం లాగేందుకు పోటీపడ్డారు. టర్నర్ చౌల్ట్రీ నుంచి బయల్దేరిన రథం మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ నయనమనోహరంగా సాగిపోయింది. స్వామికి మంగళవారం సంప్రోక్షణ పీఠారోహణ నిర్వహించనున్నట్టు ఈవో రాజగోపాల్రెడ్డి, అర్చకులు తెలిపారు. తిరుగు రథయాత్ర నేపథ్యంలో టర్నర్ చౌల్ట్రీ నుంచి టౌన్కొత్తరోడ్డు వరకు ట్రాఫిక్ మళ్లించారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఎటువంటి వాహనాలు ప్రవేశించకుండా రోడ్డును క్లోజ్ చేశారు. -
యువకుడు అనుమానాస్పద మృతి
అల్లిపురం: కొబ్బరితోటకు చెందిన కనకరాజు (32) అనుమానాస్పద మృతి స్థానికంగా కలకలం రేపింది. ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న కనకరాజు శనివారం జీతం అందుకున్న తర్వాత నలుగురు స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. ఆ రాత్రి 12 గంటల సమయంలో డాల్ఫిన్ వద్ద తన ద్విచక్రవాహనం వదిలేసి తిరిగి వస్తానని చెప్పి వెళ్లినవాడు మళ్లీ రాలేదు. ఆదివారం మధ్యాహ్నం కనకరాజు చెల్లి నాగజ్యోతికి కానిస్టేబుల్ ఫోన్ చేసి, ఫొటో పంపగా, అది తన తమ్ముడేనని గుర్తించింది. కనకరాజు మృతి చెందాడని, కేజీహెచ్ మార్చురీలో మృతదేహం ఉందని కానిస్టేబుల్ నాగజ్యోతికి చెప్పాడు. దీంతో టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన నాగజ్యోతి, తన తమ్ముడు మద్యం తాగి అదుపుతప్పి కిందపడటం మృతిచెంది ఉండొచ్చని, లేదా మరే ఇతర కారణమైనా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. పోలీసులు దర్యాప్తు చేసి నిజానిజాలు వెల్లడించాలని కోరారు. మృతుడి కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రం ఇది ప్రమాదం కాదని, హత్య అయి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విచారణ చేస్తున్నాం టూటౌన్ సీఐ వీవీసీఎం ఎర్రంనాయుడు మాట్లాడుతూ, ఇప్పటికే అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశామని తెలిపారు. మృతదేహానికి పోస్ట్మార్టం చేయించి బంధువులకు అప్పగించామన్నారు. కింద పడటంతో తల వెనుక బలమైన గాయం తగలడం వల్లే మరణించినట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని, సమగ్ర దర్యాప్తు చేసి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటామని సీఐ వివరించారు. తాగి పడిపోవడంతో ప్రమాదం జరిగిందని పోలీసుల నిర్థారణ హత్యేనని బంధువుల అనుమానం దర్యాప్తు చేస్తున్నామన్న టూటౌన్ సీఐ -
‘జిక్కీ’కి పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు
ఆరిలోవ: ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీస్ విభాగంలో సేవలందించిన బెల్జియం మెలనాయిస్ జాతికి చెందిన పోలీస్ జాగిలం ‘జిక్కీ’ అనారోగ్యం కారణంగా సోమవారం మరణించింది. కై లాసగిరి ఏఆర్ పోలీస్ మైదానంలో పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. జిక్కీ మృతిపై అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సంతాపం తెలిపారు. ఏఆర్ డీఎస్పీ పి.నాగేశ్వరరావు, సీఐలు, ఇతర సిబ్బంది జిక్కీ మృతదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ పి.నాగేశ్వరరావు మాట్లాడుతూ జిక్కీ ఏడేళ్లుగా పోలీసులకు విశేష సేవలు అందించిందని గుర్తు చేశారు. 2018లో విజయవాడ 6వ బెటాలియన్ డాగ్ స్క్వాడ్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందిన జిక్కీ, వాసన ఆధారంగా నేరస్తులను గుర్తించడం, గల్లంతైన సొత్తును కనుగొనడంలో అద్భుత ప్రతిభ కనబరిచిందని ప్రశంసించారు. శాంతిభద్రతల పరిరక్షణ, చెక్పోస్టుల తనిఖీల్లోనూ పోలీసులకు జిక్కీ ఎంతో సహకారం అందించిందన్నారు. -
రేపే గిరి ప్రదక్షిణ
జీవీఎంసీ హెల్ప్లైన్ నెంబర్ 0891-2507225 టోల్ ఫ్రీ నెంబరు 1800-4250-0009 సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనసింహస్వామి కొలువైన సింహగిరి ప్రదక్షిణ(గిరి ప్రదక్షిణ) బుధవారం జరగనుంది. లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారని అంచనావేసి కలెక్టర్ హరేందిర ప్రసాద్, దేవస్థానం ఈవో వి.త్రినాథరావు ఆధ్వర్యంలో అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తులు సేద తీరేందుకు 29 ప్రాంతాల్లో స్టాళ్లు, 31 చోట్ల వైద్య శిబిరాలు, 12 ప్రదేశాల్లో 17 అంబులెన్సులు, 5 ప్రదేశాల్లో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి ప్రతీ స్టాల్ వద్ద మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. భక్తులు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకోవాలి కొండదిగువ స్వామి తొలిపావంచా వద్ద నుంచి బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు స్వామి మూలవిరాట్, ఉత్సవమూర్తులు కొలువుదీరిన ప్రచార రథం బయలుదేరుతుంది. రథంతో పాటు గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులంతా ఆ సమయానికి తొలిపావంచా వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. పుష్పరథం తిరిగే మార్గం తొలిపావంచా, అడవివరం, పైనాపిల్కాలనీ, సెంట్రల్జైల్, హనుమంతవాక, విశాలాక్షినగర్, జోడుగుళ్లపాలెం, తెన్నేటి పార్కు, అప్పుఘర్, ఎంవీపీ కాలనీ డబుల్రోడ్డు, మద్దిలపాలెం, సత్యం జంక్షన్, ఎన్ఏడీ కొత్తరోడ్డు, గోపాలపట్నం, ప్రహ్లాదపురం మీదుగా తిరిగి సింహాచలం చేరుకుంటుంది. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టంలు ఏర్పాటుచేసే ప్రదేశాలు తొలిపావంచా, పాతగోశాల జంక్షన్, అడవివరం జంక్షన్, అప్పుఘర్, మాధవధార దర్శన సమయాలు 9వ తేదీన ఉదయమే గిరి ప్రదక్షిణ ప్రారంభించి అదే రోజు రాత్రికి తిరిగి సింహాచలం చేరుకునే భక్తులకు రాత్రి 10 గంటల వరకు దర్శనాలు లభిస్తాయి. 10వ తేదీ ఉదయం 5.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు నిర్విరామంగా దర్శనాలు కల్పిస్తారు. తిరిగి సాయంత్రం 5 నుంచి రాత్రి 7గంటల వరకు దర్శనాలు లభిస్తాయి. 10న ఆలయ ప్రదక్షిణలు సింహగిరిపై 10న ఆలయ ప్రదక్షిణలు చేసే భక్తులను తెల్లవారుజామున 3గంటల నుంచి అనుమతిస్తారు. ఉచిత ప్రయాణం 10వ తేదీ ఉదయం 3 గంటల నుంచి భక్తుల రద్దీ ముగిసే వరకు కొండపై నుంచి దిగువకు, దిగువ నుంచి కొండపైకి 50 ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేశారు. దేవస్థానం బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. స్టాళ్లు, మెడికల్ క్యాంపులు స్టాళ్లు, మెడికల్ క్యాంపులు స్వామి తొలిపావంచా, అడవివరం గ్రౌండ్, పైనాపిల్కాలనీ, సెంట్రల్జైల్, ముడసర్లోవ పార్కు, చినగదిలి, పెదగదిలి, ఎల్.వి.ప్రసాద్ కంటి ఆస్పత్రి, జోడుగుళ్లపాలెం, తెన్నేటి పార్కు, అప్పుఘర్, వెంకోజీపాలెంలోని ఆంజనేయస్వామి ఆలయం, సీతమ్మధారలోని అల్లూరి సీతారామరాజు విగ్రహం, నరసింహనగర్, సింగాలమ్మ ఆలయం డాక్యార్ట్ క్వార్టర్స్, పోర్టు డీఎల్బి క్వార్టర్స్, సీఐఎస్ఎఫ్ క్వార్టర్స్, మురళీనగర్, మాధవధార వాటర్ఫాల్స్, మాధవధార, ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డు కార్యాలయం, ఆర్అండ్బి కార్యాలయం, ఎన్ఎస్టీఎల్ ఫ్యామిలీ గేట్, లక్ష్మీనగర్, కుమారి కల్యాణమండపం, పాత గోశాల జంక్షన్, అడవివరం ఆరోగ్య కేంద్రం ఏరియా, శ్రీదేవి కాంప్లెక్స్, సింహగిరి మెట్లమార్గంలో ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాట్లు ఇలా.. ● తొలిపావంచా వద్ద భక్తులు కొబ్బరికాయలు కొట్టేందుకు 45 క్యూలు, 100 ఇనుప గడ్డర్లు ిసిద్ధం చేస్తున్నారు. అడవివరం నుంచి హనుమంతవాక వెళ్లే బీఆర్టీఎస్ మార్గంలోని రెండో టోల్గేట్ వద్ద 20 ఇనుప గడ్డర్లు, 10 క్యూలు ఏర్పాటు చేస్తున్నారు. ● గిరి ప్రదక్షిణ మార్గంలో దాదాపు 40 ప్రాంతాల్లో 400 తాత్కాలిక మరుగుదొడ్లను జీవీఎంసీ ఏర్పాటు చేస్తోంది. దేవస్థానం ఏర్పాటు చేసే అన్ని స్టాళ్లలో జీవీఎంసీ మంచినీటి సరఫరా చేస్తోంది. ● అప్పుఘర్ వద్ద స్నానాలు ఆచరించే భక్తుల సౌకర్యార్థంతాత్కాలిక మరుగుదొడ్లు, వైద్యశిబిరం, రెండు జనరేటర్లు, కమాండ్ కంట్రోలింగ్ సిస్టం ఏర్పాటు చేస్తున్నారు. 60 మంది గజ ఈతగాళ్లను మూడు షిప్టుల్లో విధులు నిర్వహించే విధంగా ఏర్పాటు చేశారు. ● మాధవధార వద్ద 60 తాత్కాలిక మరుగుదొడ్లు, ఒక వైద్య శిబిరం, 50 ఎల్ఈడీ లైట్లు, ఒక జనరేటర్, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం సిద్ధం చేస్తున్నారు. ● పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ● గిరి ప్రదక్షిణ మార్గంలో 9వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. ● 10న ఆలయ ప్రదక్షిణలకు గాను ఉత్తర రాజగోపురం, దక్షిణ రాజగోపురం వద్ద వంతెనలను సిద్ధం చేస్తున్నారు. ● 10వ తేదీన సింహగిరికి వచ్చే భక్తుల కోసం 10,800 రన్నింగ్ ఫీట్ మేర క్యూలను ఏర్పాటు చేశారు. ఒకేసారి సుమారు 9 వేల మంది క్యూల్లో వేచి ఉండవచ్చు. ● 10న కేవలం కొండపైకి మెట్లమార్గంలో వెళ్లే భక్తులను మాత్రమే అనుమతిస్తారు. స్వామి దర్శనం తర్వాత కొండదిగువకి ఉచితంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ● అగ్నిమాపక శకటాలను అందుబాటులో ఉంచుతున్నారు. ● రెండో ఘాట్రోడ్డు వద్ద స్వామివారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ● 9,10 తేదీల్లో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు తొలిపావంచా వద్ద పుష్పరథం ప్రారంభం 10న ఉదయం 5.30 గంటల నుంచి దర్శనాలు భక్తులు ప్రదక్షిణ చేసే మార్గం తొలిపావంచా, అడవివరం, పైనాపిల్కాలనీ, సెంట్రల్జైల్, హనుమంతవాక, విశాలాక్షినగర్, జోడుగుళ్లపాలెం, తెన్నేటి పార్కు, అప్పుఘర్, ఎంవీపీకాలనీ, సీతమ్మధార, నరసింహనగర్, పోర్టు డీఎల్బీ క్వార్టర్స్, కప్పరాడ, మురళీనగర్, మాధవధార, ఆర్అండ్బీ కార్యాలయం, లక్ష్మీనగర్, కుమారి కల్యాణమండపం, ప్రహ్లాదపురం మీదుగా తిరిగి సింహాచలం చేరుకోవాలి. -
ఏయూ అనుబంధ కళాశాలల అభివృద్ధికి కృషి
మద్దిలపాలెం: విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెరిగేలా విశ్వవిద్యాలయంతో అనుబంధ కళాశాలలు కలిసి ముందుకు సాగాలని ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ సూచించారు. ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఏయూ అనుబంధ కళాశాలల కరస్పాండెంట్లు, ప్రిన్సిపాళ్లతో సోమవారం సమావేశమయ్యారు. పరీక్షల నిర్వహణ సక్రమంగా, పటిష్టంగా జరగాలన్నారు. బీఈడీ, న్యాయ కళాశాల పనితీరు మరింత మెరుగు పడాలన్నారు. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా అనుబంధ కళాశాలలను భాగస్వాములను చేస్తూ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రొంగ్రాంలను ప్రారంభిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అనుబంధ కళాశాలల్ని భాగస్వామ్యం చేస్తూ రూరల్ ఔట్రీచ్ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ సహకారంతో నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తూ 100 ఫ్యాకల్టీ, 10వేల మంది విద్యార్థులను ఏఐ, డీప్ లెర్నింగ్ రంగాలలో నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్.ధనుంజయరావు మాట్లాడుతూ అనుబంధ కళాశాల గుర్తింపు, ఫీజులు, కోర్సుల నిర్వహణ తదితర అంశాలను చర్చించడానికి, కళాశాలల సమస్యలను తెలుసుకోవడానికి ఈ సమావేశాన్ని ఓ వేదికగా మార్చుకోవాలని సూచించారు. సీడీసీ డీన్ ఆచార్య టి.వెంకటకృష్ణ, యూజీ పరీక్షల డీన్ ఆచార్య నానాజీరావు, అనుబంధ కళాశాలల అసోసియేషన్ కార్యదర్శి రమణాజీ తమ పరిధిలోని అంశాలను వివరించారు. అసోసియేషన్ అధ్యక్షుడు పైడా కృష్ణప్రసాద్, గౌరవ అధ్యక్షుడు బలరామకృష్ణ, గాయత్రి విద్యా పరిషత్ కార్యదర్శి ఆచార్య పి.సోమరాజు తదితరులు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డీన్లు ఆచార్య కె.రమాసుధ, కె.శ్రీనివాసరావు, కె.రాంబాబు, బి.మునిస్వామి, ఎస్.హరినాథ్, పి.శ్యామల, డీఏ నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
పీ–4పై కలెక్టర్ సమీక్ష
మహారాణిపేట : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీ–4 విధానానికి అధికారులు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో పీ–4 సర్వేపై అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన కీలక సూచనలు చేశారు. జిల్లాలో ఇప్పటికే గుర్తించిన బంగారు కుటుంబాల అవసరాలను తెలుసుకోవాలని, వారిని దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చే 10 వేల మంది మార్గదర్శులను వారం రోజుల్లో గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి సచివాలయం పరిధిలో రోజుకు 50 బంగారు కుటుంబాల అవసరాలను గుర్తించి, జిల్లా మొత్తంలో రోజుకు 1,300 మందికి సంబంధించిన వివరాలపై సర్వే పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. పారిశ్రామిక, సేవా, ఇతర రంగాల్లో ఆర్థికంగా సమర్థత కలిగిన వారిని మార్గదర్శులుగా గుర్తించాలని సూచించారు. ఒక్కో మార్గదర్శి కనీసం పది కుటుంబాలను దత్తత తీసుకునేలా ప్రోత్సహించాలని, సమాజంలో దిగువ స్థాయిలో ఉన్న 20 శాతం మంది పేదలకు అండగా నిలవాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఏపీఐఐసీ, పారిశ్రామిక సంస్థలు, పర్యాటక ప్రాజెక్టుల నిర్వాహకులు, వివిధ వ్యాపార కంపెనీలు, అసోసియేషన్లు పీ–4లో ఉత్సాహంగా భాగస్వామ్యం కావాలని, దీనికి సంబంధిత అధికారులు బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. అధికారులు కూడా కనీసం ఒక కుటుంబాన్ని దత్తత తీసుకోవాలని హితవు పలికారు. తగిన ప్రోఫార్మా రూపొందించి అధికారులందరికీ సర్క్యులేట్ చేయాలని సీపీఓను ఆదేశించారు. -
మద్యం మత్తులో దాడి
నలుగురికి గాయాలు.. ఆరుగురిపై కేసులు గోపాలపట్నం : తమను అవమానిస్తున్నారని కక్ష పెట్టుకుని, నలుగురిపై కత్తితో దాడికి పాల్పడిన ఘటన ఆదివారం రాత్రి కొత్తపాలెం ప్రధాన రహదారి గవర రామాలయం వద్ద చోటు చేసుకుంది. గోపాలపట్నం ఎస్ఐ రామారావు, స్థానికులు తెలిపిన వివరాలు.. కొత్తపాలేనికి చెందిన లైటింగ్ డెకరేషన్ ఈవెంట్ పనులు చేస్తున్న కొందరు రోజూ గవర రామాలయం వద్ద కూర్చుని బాతాఖానీ కొడుతుంటారు. రోజూ అవమానకరంగా వేధిస్తున్నారన్న కక్షతో సురేంద్ర అనే వ్యక్తి మరి కొందరితో వచ్చి కత్తితో సరపాక రాజేష్, సూరికొండ మణికంఠ, లంక రమణ, అమరపిల్లి కనకరాజులపై దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడిన వారంతా ఫుల్లుగా మద్యం, గంజాయి సేవించి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఆరుగురిపై కేసు : దాడికి పాల్పడిన వారిలో ఆరుగురిపై గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో ఒకరు పరారీలో ఉండగా ఐదుగురిని అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఎస్ఐ రామారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా భయాందోళనకు గురి చేసింది. ఏ విధమైన కక్షలు లేవని నిక్నేమ్తో పిలుస్తున్నారన్న అక్కసుతో దాడి చేశారని గాయపడ్డ వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ముగ్గురికి తీవ్ర గాయాలుకాగా, ఒకరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడ్డవారిని కేజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. -
నేడు వాడవాడలా వైఎస్సార్ జయంతి వేడుకలు
వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికే విశాఖ జిల్లా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. తాగునీటి సమస్య, అచ్యుతాపురం సెజ్, పరవాడ ఫార్మాసిటీ, గంగవరం పోర్టు భూసేకరణ వివాదాలు పరిష్కారం కాకుండా ఉన్నాయి. అలాగే స్టీల్ ప్లాంట్, బీహెచ్పీవీ, షిప్యార్డులు నష్టాల్లో కూరుకుపోయాయి. ఈ సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో 2005 జనవరిలో వైఎస్సార్ విశాఖలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. విశాఖ నగరంలో తాగునీటి సమస్యకు పరిష్కారం చూపారు. అచ్యుతాపురం, ఫార్మా సెజ్లకు భూముల ధరలు నిర్ణయించి, పునరావాస ప్యాకేజీలు ప్రకటించారు. నష్టాల్లో ఉన్న స్టీల్ప్లాంట్ను గట్టెక్కించి, రెండో దశ విస్తరణకు నిర్ణయం తీసుకున్నారు. బీహెచ్పీవీని బీహెచ్ఈఎల్లో విలీనం చేయాలని, షిప్యార్డును రక్షణ శాఖలో విలీనం చేసి పునరుజ్జీవింపచేయాలని నిర్ణయించారు. గ్రేటర్ హోదా కల్పన ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న మహా విశాఖ ప్రతిపాదనలకు వైఎస్సార్ ముఖ్యమంత్రి కాగానే కార్యరూపం ఇచ్చారు. 2005 నవంబర్ 22న విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కు గ్రేటర్ హోదా కల్పించారు. దీంతో విస్తీర్ణం 111 చ.కి.మీ. నుంచి 540 చ.కి.మీ.లకు పెరిగింది. వైఎస్సార్ మరణానంతరం జీవీఎంసీ వార్డుల విస్తరణ నిలిచిపోయింది. వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరో 10 పంచాయతీలను విలీనం చేసి, జీవీఎంసీని ప్రస్తుతం 98 వార్డులుగా విస్తరించారు. టాప్ నగరాల్లో విశాఖ.. వైఎస్సార్ చొరవతో విశాఖ జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ పునర్నిర్మాణ పథకం (జేఎన్ఎన్యూఆర్ఎం) కిందకు వచ్చింది. దేశవ్యాప్తంగా ఈ పథకం అమలైన 63 నగరాల్లో వైజాగ్ ఒకటి. ఈ పథకం ద్వారా విశాఖకు రూ.1885 కోట్ల విలువైన అభివృద్ధి పనులు మంజూరయ్యాయి. బీఆర్టీఎస్ కారిడార్లు, ఫ్లై ఓవర్లు, తాగునీరు, భూగర్భ మురుగునీటి వ్యవస్థతో సహా 20కి పైగా కీలక ప్రాజెక్టులు ఆయన హయాంలోనే ప్రారంభమయ్యాయి. గోడు చెప్పిన వారందరికీ గూడు నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చాలనే సంకల్పంతో వైఎస్సార్ రాజీవ్ గృహకల్ప పథకాన్ని ప్రారంభించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు మంజూరు చేసి, నగర పరిధిలో లక్షకు పైగా పునరావాస కాలనీలను నిర్మించారు. రాజీవ్ గృహకల్ప ద్వారా రూ.650 కోట్లతో 15,320 ఇళ్లు, జేఎన్ఎన్యూఆర్ఎం ద్వారా రూ.600 కోట్లతో 15 వేల గృహాలు, వాంబే కింద రూ.400 కోట్లతో 9 వేల ఇళ్లు నిర్మించారు. యువతకు ఉపాధి.. 2008 జనవరి 2న వైఎస్సార్ ఉపాధి పథకాన్ని ప్రారంభించి, యువతకు 13 అంశాల్లో శిక్షణ ఇచ్చి, 70 శాతం ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన మరణానంతరం ఈ పథకానికి గ్రహణం పట్టింది. చంద్రబాబు హయాంలో నిరుద్యోగం పెరిగింది. తిరిగి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి లక్షలాది ఉద్యోగాలను అందించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ పేరుతో కాలయాపన చేస్తోంది. ఎయిర్పోర్టుకుఅంతర్జాతీయ హోదా.. రూ.100 కోట్లు ఖర్చు చేసి విశాఖ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించిన ఘనత వైఎస్సార్దే. దీంతో అంతర్జాతీయ సర్వీసులు పెరిగాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ పాలనలో రాయితీలు నిలిపివేయడంతో సర్వీసులు రద్దయ్యాయి. వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. కార్గో సర్వీసులు కూడా మొదలయ్యాయి. ఆయన హయాంలోనే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శంకుస్థాపన జరిగింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం విశాఖ విమాన సర్వీసులపై సవతితల్లి ప్రేమ కురిపిస్తోందని ఆరోపణలున్నాయి. విమ్స్ ఏర్పాటుకు శ్రీకారం ఉత్తరాంధ్ర ప్రజలకు నిమ్స్ తరహా వైద్య సేవలు అందించే లక్ష్యంతో వైఎస్సార్ 2006లో విమ్స్ ఆస్పత్రికి శ్రీకారం చుట్టారు. రూ.250 కోట్లతో 2007లో శంకుస్థాపన జరిగి, 2009 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన మరణానంతరం పనులు మందగించాయి. చంద్రబాబు ప్రభుత్వం విమ్స్ను ప్రైవేటుపరం చేయాలని ప్రయత్నించగా వైఎస్సార్సీపీ అడ్డుకుంది. అనంతరం వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా చేసిన అభివృద్ధి ప్రస్తుతం విమ్స్ ఉత్తరాంధ్రలో పెద్ద ఆస్పత్రిగా భాసిల్లుతోంది. ఏలేరు నీటిని తీసుకొచ్చి... గోదావరి జలాలను విశాఖ, ఉత్తరాంధ్ర అవసరాలకు మళ్లించే లక్ష్యంతో వైఎస్సార్ పోలవరం ఎడమ కాలువ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా, ఏలేరు నీటిని మళ్లించడం ద్వారా స్టీల్ప్లాంట్కు ఎదురయ్యే నీటి సమస్యను పరిష్కరించారు. ఆయన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేశారు. గిరి ‘జనాని’కి బాసటగా.. విశాఖ ఏజెన్సీలో కాఫీ ప్లాంటేషన్ ప్రాజెక్టును వైఎస్సార్ తీసుకొచ్చి, రూ.144 కోట్లు కేటాయించి 60 వేల మంది గిరిజనులకు ఉపాధి కల్పించారు. పోడు వ్యవసాయాన్ని నేరంగా భావించే కాలంలో, వైఎస్సార్ 2009 జులై 12న అటవీ హక్కుల గుర్తింపు చట్టం ద్వారా గిరిజనులకు హక్కు పత్రాలు పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఆయన మరణానంతరం భూ పంపిణీ జరగలేదు. తిరిగి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సాగు చేస్తున్న గిరిజనులకు హక్కు పత్రాలు అందజేశారు. విశాఖ సమగ్రాభివృద్ధికి వైఎస్సార్ హయాంలోనే అడుగులు వైఎస్సార్ మరణంతో కుంటుపడిన అభివృద్ధి వైఎస్ జగన్ హయాంలో పరుగులు నేడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి ఐటీకి ఆద్యుడు.. విశాఖను ఐటీ హబ్గా మార్చాలని వై.ఎస్. రాజశేఖరరెడ్డి సంకల్పించారు. దీనికోసం నగరంలోని మూడు కొండల కింద ఉన్న 100 ఎకరాల ప్రాంతాన్ని గుర్తించి, కనీసం 100 ఉద్యోగాలు కల్పించే ఐటీ కంపెనీలకు మౌలిక సదుపాయాలతో ప్లాట్లు అందించారు. దాదాపు 200 కంపెనీలు ముందుకురాగా, 70 శాతం కార్యకలాపాలు ప్రారంభించాయి. సత్యం, విప్రో వంటి పెద్ద కంపెనీలు కూడా ఇక్కడ శాాఖలను విస్తరించాయి. వైఎస్సార్ మరణానంతరం విశాఖ ఐటీ ప్రగతి కుంటుపడింది. టీడీపీ హయాంలో కంపెనీలకు రాయితీలు అందకపోవడంతో అవి వెనక్కి వెళ్లిపోయాయి. సుమారు పదేళ్ల పాటు విశాఖ ఐటీ రంగం స్తంభించిపోయింది. 2019లో వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించడం, ఐటీ కంపెనీల స్థాపనకు ప్రోత్సాహం, అదానీ డేటా సెంటర్ శంకుస్థాపన వంటి చర్యలతో తిరిగి ఐటీ అభివృద్ధి పుంజుకుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఐటీ అభివృద్ధి కేవలం మాటలకే పరిమితమైంది. సాక్షి, విశాఖపట్నం: మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి వేడుకలు మంగళవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తెలిపారు. ఇక్కడ ఉదయం 9 గంటలకు మెగా రక్తదానం శిబిరం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఉదయం 9.30 గంటలకు పార్క్ హోటల్ జంక్షన్లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తామన్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణులంతా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. -
పోలీసులు సమర్థవంతంగా సేవలు అందించాలి
ఏయూక్యాంపస్: ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లను పంపిణీ చేసి, కొత్త వాహనాలను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత సోమవారం బీచ్ రోడ్డులో ప్రారంభించారు. పోలీసులు మరింత సమర్ధవంతంగా సేవలందించాలని ఈ సందర్భంగా ఆమె అన్నారు. విశాఖ పోర్ట్ ట్రస్ట్, సౌత్ ఏషియా ఎల్పీజీ కంపెనీ లిమిటెడ్ సౌజన్యంతో మొత్తం 200 ఏసీ హెల్మెట్లను అందజేశారు. ఒక్కో హెల్మెట్ను 3 గంటలు చార్జ్ చేస్తే 8 గంటల పాటు పనిచేస్తుందని తెలిపారు. వీటి విలువ సుమారు రూ. 46 లక్షలన్నారు. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు కొత్తగా 64 వాహనాలను మంజూరు చేసింది. వీటిలో 60 టీవీఎస్ అపాచీలు, 4 రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాలు ఉన్నాయన్నారు. వీటితో పోలీసులు ట్రాఫిక్, శాంతిభద్రతల విధులను మరింత సమర్థంగా నిర్వహించగలరని హోం మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ పోర్ట్ ట్రస్ట్ సహకారంతో రూ. 17 లక్షల వ్యయంతో సమకూర్చిన డ్రోన్లను కూడా హోం మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. హెచ్పీసీఎల్ యాజమాన్యం సీఎస్ఆర్ నిధుల నుంచి రూ. 15.6 లక్షల వ్యయంతో అందించిన రెండు కాంపాక్టర్లను కూడా స్పెషల్ బ్రాంచ్లో ఫైల్స్ నిర్వహణకు వినియోగిస్తామని కమిషనర్ డాక్టర్ శంఖభ్రత బాగ్చి తెలిపారు. కార్యక్రమంలో డీసీపీలు అజిత, మేరీ ప్రశాంతి, లతా మాధురి, ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
విశాఖ మదిలో రాజన్న
మంచితనానికి మరో పేరు, మానవత్వానికి ప్రతిరూపం, చిరునవ్వుకు చిరునామా, అచ్చతెలుగు పంచెకట్టుకు వన్నె తెచ్చిన రైతు బాంధవుడు, తెలుగుదనానికి నిండైన రూపం.. ఆయనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి. ఆయన తలంపుకొస్తే రైతన్నకు కొండంత ధైర్యం. అక్కచెల్లెమ్మలకు భరోసా.. విద్యార్థి లోకానికి ‘నేనున్నానంటూ’ వెన్నుతట్టి ప్రోత్సహించిన అనుభూతి. ఉమ్మడి విశాఖ జిల్లాలో మారుమూల ప్రాంతాలను సైతం అభివృద్ధి చేసి జిల్లాపై చెరగని ముద్ర వేశారు. ఆయన అందించిన అభివృద్ధి ఫలాలు ఇప్పుడు కళ్ల ముందు కదలాడుతున్నాయి. మంగళవారం రాజన్న జయంతి సందర్భంగా ఆయన చేపట్టిన అభివృద్ధి,సంక్షేమాన్ని గుర్తుచేసుకుందాం.వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినçప్పటికే విశాఖ జిల్లా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. తాగునీటి సమస్య, అచ్యుతాపురం సెజ్, పరవాడ ఫార్మాసిటీ, గంగవరం పోర్టు భూసేకరణ వివాదాలు పరిష్కారం కాకుండా ఉన్నాయి. అలాగే స్టీల్ ప్లాంట్, బీహెచ్పీవీ, షిప్యార్డులు నష్టాల్లో కూరుకుపోయాయి. ఈ సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో 2005 జనవరిలో వైఎస్సార్ విశాఖలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. విశాఖ నగరంలో తాగునీటి సమస్యకు పరిష్కారం చూపారు. అచ్యుతాపురం, ఫార్మా సెజ్లకు భూముల ధరలు నిర్ణయించి, పునరావాస ప్యాకేజీలు ప్రకటించారు. నష్టాల్లో ఉన్న స్టీల్ప్లాంట్ను గట్టెక్కించి, రెండో దశ విస్తరణకు నిర్ణయం తీసుకున్నారు. బీహెచ్పీవీని బీహెచ్ఈఎల్లో విలీనం చేయాలని, షిప్యార్డును రక్షణ శాఖలో విలీనం చేసి పునరుజ్జీవింపచేయాలని నిర్ణయించారు. గ్రేటర్ హోదా కల్పన ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న మహా విశాఖ ప్రతిపాదనలకు వైఎస్సార్ ముఖ్యమంత్రి కాగానే కార్యరూపం ఇచ్చారు. 2005 నవంబర్ 22న విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కు గ్రేటర్ హోదా కలి్పంచారు. దీంతో విస్తీర్ణం 111 చ.కి.మీ. నుంచి 540 చ.కి.మీ.లకు పెరిగింది. వైఎస్సార్ మరణానంతరం జీవీఎంసీ వార్డుల విస్తరణ నిలిచిపోయింది. వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరో 10 పంచాయతీలను విలీనం చేసి, జీవీఎంసీని ప్రస్తుతం 98 వార్డులుగా విస్తరించారు. టాప్ నగరాల్లో విశాఖ.. వైఎస్సార్ చొరవతో విశాఖ జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ పునరి్నర్మాణ పథకం (జేఎన్ఎన్యూఆర్ఎం) కిందకు వచ్చింది. దేశవ్యాప్తంగా ఈ పథకం అమలైన 63 నగరాల్లో వైజాగ్ ఒకటి. ఈ పథకం ద్వారా విశాఖకు రూ.1885 కోట్ల విలువైన అభివృద్ధి పనులు మంజూరయ్యాయి. బీఆర్టీఎస్ కారిడార్లు, ఫ్లై ఓవర్లు, తాగునీరు, భూగర్భ మురుగునీటి వ్యవస్థతో సహా 20కి పైగా కీలక ప్రాజెక్టులు ఆయన హయాంలోనే ప్రారంభమయ్యాయి. గోడు చెప్పిన వారందరికీ గూడు నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చాలనే సంకల్పంతో వైఎస్సార్ రాజీవ్ గృహకల్ప పథకాన్ని ప్రారంభించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు మంజూరు చేసి, నగర పరిధిలో లక్షకు పైగా పునరావాస కాలనీలను నిర్మించారు. రాజీవ్ గృహకల్ప ద్వారా రూ.650 కోట్లతో 15,320 ఇళ్లు, జేఎన్ఎన్యూఆర్ఎం ద్వారా రూ.600 కోట్లతో 15 వేల గృహాలు, వాంబే కింద రూ.400 కోట్లతో 9 వేల ఇళ్లు నిర్మించారు. యువతకు ఉపాధి.. 2008 జనవరి 2న వైఎస్సార్ ఉపాధి పథకాన్ని ప్రారంభించి, యువతకు 13 అంశాల్లో శిక్షణ ఇచ్చి, 70 శాతం ఉపాధి కలి్పంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన మరణానంతరం ఈ పథకానికి గ్రహణం పట్టింది. చంద్రబాబు హయాంలో నిరుద్యోగం పెరిగింది. తిరిగి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి లక్షలాది ఉద్యోగాలను అందించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ పేరుతో కాలయాపన చేస్తోంది. ఎయిర్పోర్టుకు అంతర్జాతీయ హోదా.. రూ.100 కోట్లు ఖర్చు చేసి విశాఖ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించిన ఘనత వైఎస్సార్దే. దీంతో అంతర్జాతీయ సరీ్వసులు పెరిగాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ పాలనలో రాయితీలు నిలిపివేయడంతో సరీ్వసులు రద్దయ్యాయి. వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సరీ్వసులు తిరిగి ప్రారంభమయ్యాయి. కార్గో సరీ్వసులు కూడా మొదలయ్యాయి. ఆయన హయాంలోనే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శంకుస్థాపన జరిగింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం విశాఖ విమాన సరీ్వసులపై సవతితల్లి ప్రేమ కురిపిస్తోందని ఆరోపణలున్నాయి. విమ్స్ ఏర్పాటుకు శ్రీకారం ఉత్తరాంధ్ర ప్రజలకు నిమ్స్ తరహా వైద్య సేవలు అందించే లక్ష్యంతో వైఎస్సార్ 2006లో విమ్స్ ఆస్పత్రికి శ్రీకారం చుట్టారు. రూ.250 కోట్లతో 2007లో శంకుస్థాపన జరిగి, 2009 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన మరణానంతరం పనులు మందగించాయి. చంద్రబాబు ప్రభుత్వం విమ్స్ను ప్రైవేటుపరం చేయాలని ప్రయతి్నంచగా వైఎస్సార్సీపీ అడ్డుకుంది. అనంతరం వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా చేసిన అభివృద్ధి ప్రస్తుతం విమ్స్ ఉత్తరాంధ్రలో పెద్ద ఆస్పత్రిగా భాసిల్లుతోంది. ఏలేరు నీటిని తీసుకొచ్చి... గోదావరి జలాలను విశాఖ, ఉత్తరాంధ్ర అవసరాలకు మళ్లించే లక్ష్యంతో వైఎస్సార్ పోలవరం ఎడమ కాలువ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా, ఏలేరు నీటిని మళ్లించడం ద్వారా స్టీల్ప్లాంట్కు ఎదురయ్యే నీటి సమస్యను పరిష్కరించారు. ఆయన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేశారు. గిరి ‘జనాని’కి బాసటగా.. విశాఖ ఏజెన్సీలో కాఫీ ప్లాంటేషన్ ప్రాజెక్టును వైఎస్సార్ తీసుకొచ్చి, రూ.144 కోట్లు కేటాయించి 60 వేల మంది గిరిజనులకు ఉపాధి కలి్పంచారు. పోడు వ్యవసాయాన్ని నేరంగా భావించే కాలంలో, వైఎస్సార్ 2009 జులై 12న అటవీ హక్కుల గుర్తింపు చట్టం ద్వారా గిరిజనులకు హక్కు పత్రాలు పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఆయన మరణానంతరం భూ పంపిణీ జరగలేదు. తిరిగి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సాగు చేస్తున్న గిరిజనులకు హక్కు పత్రాలు అందజేశారు. ఐటీకి ఆద్యుడు.. విశాఖను ఐటీ హబ్గా మార్చాలని వై.ఎస్. రాజశేఖరరెడ్డి సంకలి్పంచారు. దీనికోసం నగరంలోని మూడు కొండల కింద ఉన్న 100 ఎకరాల ప్రాంతాన్ని గుర్తించి, కనీసం 100 ఉద్యోగాలు కలి్పంచే ఐటీ కంపెనీలకు మౌలిక సదుపాయాలతో ప్లాట్లు అందించారు. దాదాపు 200 కంపెనీలు ముందుకురాగా, 70 శాతం కార్యకలాపాలు ప్రారంభించాయి. సత్యం, విప్రో వంటి పెద్ద కంపెనీలు కూడా ఇక్కడ శా>ఖలను విస్తరించాయి. వైఎస్సార్ మరణానంతరం విశాఖ ఐటీ ప్రగతి కుంటుపడింది. టీడీపీ హయాంలో కంపెనీలకు రాయితీలు అందకపోవడంతో అవి వెనక్కి వెళ్లిపోయాయి. సుమారు పదేళ్ల పాటు విశాఖ ఐటీ రంగం స్తంభించిపోయింది. 2019లో వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించడం, ఐటీ కంపెనీల స్థాపనకు ప్రోత్సాహం, అదానీ డేటా సెంటర్ శంకుస్థాపన వంటి చర్యలతో తిరిగి ఐటీ అభివృద్ధి పుంజుకుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఐటీ అభివృద్ధి కేవలం మాటలకే పరిమితమైంది.నేడు వాడవాడలా వైఎస్సార్ జయంతి వేడుకలుసాక్షి, విశాఖపట్నం: మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి వేడుకలు మంగళవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తెలిపారు. ఇక్కడ ఉదయం 9 గంటలకు మెగా రక్తదానం శిబిరం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఉదయం 9.30 గంటలకు పార్క్ హోటల్ జంక్షన్లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తామన్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణులంతా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. -
గిరి ప్రదక్షిణకు 2,460 మందితో బందోబస్తు
అల్లిపురం: గిరి ప్రదక్షిణకు 2,460 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఈ ఏడాది గిరి ప్రదక్షిణకు 6 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. భక్తులకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గిరి ప్రదక్షిణ మార్గంలో వీధి లైట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. టాయిలెట్స్, మంచినీళ్లు, అంబులెన్స్లు ఎక్కడికక్కడ ఏర్పాటు చేశామన్నారు. భక్తులను హెచ్చరిస్తూ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, బీచ్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్లతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. -
విశాఖ: సంచలన కేసు.. కూటమి నేతలకు లింకులు?
సాక్షి, విశాఖపట్నం: నగరంలో తీవ్ర కలకలం రేపిన డ్రగ్స్ కేసు పూటకో మలుపు తిరుగుతోంది. అరెస్టుల సంఖ్య పెరగడంతో పాటు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా.. ఈ కేసులో కూటమి నేతల కుమారులు ఉన్నట్లు, వాళ్లను తప్పించే ప్రయత్నాలు జరిగిపోయాయని సమాచారం.ప్రశాంత నగరంగా పేరున్న విశాఖ.. ఏడాది కాలంగా నేరాలకు అడ్డాగా మారిపోయింది. ఎన్నడూ లేనివిధంగా తాజాగా డ్రగ్స్ కేసు బయటపడింది. అయితే ఈ విచారణలో తీగ లాగితే లింకులు బయటకు వస్తున్నాయి. డ్రగ్స్ కేసులో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తొలుత త్రీటౌన్ పోలీసులు ప్రకటించారు. అయితే శనివారం నాటికి అందులో ఇద్దరిని మాత్రమే అరెస్ట్ చేసినట్లు చూపించారు. అక్షయ్ కుమార్ అలియాస్ మున్నా, సౌతాఫ్రికాకు చెందిన థామస్ను అరెస్టు చేసినట్టు తెలిపారు. మిగిలిన ముగ్గురిని అనుమానితులుగా పేర్కొన్న పోలీసులు.. ఆదివారం మరొకరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నగరానికి చెందిన డాక్టర్ శ్రీ కృష్ణ చైతన్య వర్మ రూ. 65 వేల రూపాయలు తో డ్రగ్స్ కొనుగోలు చేయడానికి ప్రయత్నించారని, ఆయన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని వెల్లడించారు. అయితే.. ఈ కేసులో కూటమి నేతలకు లింకులు ఉన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ డ్రగ్స్కేసులో కూటమి నేతల కుమారులు ఉన్నారని సమాచారం. దీంతో కూటమి ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ స్వయంగా రంగంలోకి దిగారు. ఓ ఎమ్మెల్యే ఫోన్ కాల్తో ముగ్గురిని ఈపాటికే బయటకు పంపించేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామంపై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి. -
ప్రేమతో.. టీకా!
● విశ్వసనీయ నేస్తాలకు రేబిస్ నుంచి రక్షణ ● ఉచిత రేబిస్ టీకా కార్యక్రమానికి విశేష స్పందన డాబాగార్డెన్స్: నగరంలోని జడ్జికోర్టు సమీపంలోని ప్రభుత్వ పశువైద్య శాల ప్రాంగణం ఆదివారం సందడిగా కనిపించింది. విభిన్న జాతుల శునకాలు, వాటిని ప్రేమగా లాలిస్తున్న యజమానులతో ఆ ప్రాంతమంతా కళకళలాడింది. ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జీవీఎంసీ నిర్వహించిన ఉచిత యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. చిట్టి పొట్టి పప్పీల నుంచి రాజసంగా నడిచే పెద్ద శునకాల వరకు.. ఒకటా రెండా.. ఎన్నెన్నో జాతులు, వర్ణాలతో ఆ ప్రాంగణం నిండిపోయింది. నగరం నలుమూలల నుంచి శునక ప్రేమికులు తమ ప్రియమైన నేస్తాలకు రేబిస్ నుంచి రక్షణ కల్పించడానికి తరలివచ్చారు. తమ వంతు కోసం ఓపికగా ఎదురుచూస్తూ.. యజమానుల మాట వింటూ, వారు చూపించే ప్రేమకు ప్రతీకగా నిలుస్తూ ఆ శునకాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ‘జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు వ్యాపించే ప్రమాదకరమైనవే జూనోటిక్ వ్యాధులు. రేబిస్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి పెంపుడు జంతువులను, తద్వారా మనల్ని మనం కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత’ అని జీవీఎంసీ సిటీ వెటర్నరీ అధికారి కిశోర్ తెలిపారు. ఇందులో భాగంగానే ఈ ఉచిత టీకా శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. -
చదరంగం పోటీల విజేతలు కృష్ణ, దివ్య
విశాఖ స్పోర్ట్స్: విశాఖ జిల్లా అండర్–13 చదరంగం జట్ల ఎంపిక పోటీల్లో ఓపెన్ విభాగంలో కృష్ణ వరణ్య, బాలికల విభాగంలో దివ్యదర్శిని విజేతలుగా నిలిచారు. ఈ పోటీల్లో ఓపెన్లో 138 మంది, బాలికల విభాగంలో 53 మంది క్రీడాకారులు పోటీపడ్డారు. ఆల్ విశాఖ చదరంగం సంఘం ఆధ్వర్యంలో ఆదివారం విశాఖ వేలీ పాఠశాలలో ఓపెన్ విభాగంలో ఏడు రౌండ్లు, బాలికలకు ఆరు రౌండ్ల పాటు పోటీలు నిర్వహించారు. ఓపెన్ విభాగంలో కృష్ణవరణ్య ఏడు పాయింట్లతో విజేతగా నిలవగా, శివేన్ ఆరు పాయింట్లతో నిలిచి జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. బాలికల విభాగంలో దివ్యదర్శిని ఆరు పాయింట్లతో, ఆఫ్షీన్ ఐదు పాయింట్లతో నిలిచి జిల్లా జట్టులో స్థానం సంపాదించారు. ఓపెన్ విభాగంలో హర్ష ఆరు పాయింట్లు సాధించనప్పటికీ టైబ్రేక్స్లో వెనుకబడ్డాడు. జస్విన్, లక్షిత్, ఏఎఫ్ఎం ప్రియకమల, శశాంక్, ఉద్దవ్, ఏఎఫ్ఎం వినాయక్, యోగేష్ ఐదున్నర పాయింట్లతో పోటీలను ముగించారు. రేటింగ్ ఆటగాళ్లైన అనిరుథ్ ఐదు పాయింట్లు, కల్యాణ్, వెంకట్ కీరత్, అనిష్ నాలుగున్నర పాయింట్లు మాత్రమే సాధించగలిగారు. బాలికల విభాగంలో రేటింగ్ క్రీడాకారిణులు హెమిషా, సాత్విక, ఈషా ఐదేసి పాయింట్లు సాధించినా, టైబ్రేక్స్లో వెనుకబడి జిల్లా జట్టుకు అర్హత సాధించలేకపోయారు. ఫిడే రేటింగ్ సత్యశ్రీ విద్య నాలుగున్నర పాయింట్లు, సమన్వి మూడు పాయింట్లతో ముగించారు. అంతర్ జిల్లాల పోటీలు ఆగస్టు 2, 3 తేదీల్లో కృష్ణా జిల్లాలో జరగనున్నాయి. -
చిన్నబోయిన వైకల్యం!
ఏయూ క్యాంపస్: వైకల్యం వారికి అవరోధాలు కలిగించి ఉండవచ్చు. కానీ మనోధైర్యం వారిని ముందుకు నడిపిస్తోంది. ఆదివారం బీచ్రోడ్డులో మనసుకు ఆనందాన్నిచ్చే ఈ దృశ్యం కనిపించింది. సాయంత్రం వేళలో పలువురు దివ్యాంగులు బీచ్ను సందర్శించారు. కొంత మంది ట్రై సైకిళ్లపై, మరికొందరు నడుచుకుంటూ వచ్చారు. ఎత్తుగా ఉన్న ఓ ప్రదేశంలో ట్రై సైకిల్పై వస్తున్న మిత్రుడిని మరొక దివ్యాంగుడైన మిత్రుడు వెనకుండి ముందుకు నెడుతూ సాయం చేశాడు. వేరొకరిపై ఆధారపడకుండా తమకు తామే సాయపడుతూ ముందుకు సాగారు. మనోధైర్యంతో సాగితేవైకల్యం కూడా చిన్నబోతుందని వీరిని చూసే ఎవరికై నా.. అనిపించక మానదు. – ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
7,500 రేబిస్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ
ఆరిలోవ: ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని పశు వైద్యశాలల్లో ఆదివారం ఉచిత రేబిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించినట్లు పశుసంవర్థక శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. కరుణాకరరావు తెలిపారు. మొదటి రోజు జిల్లా వ్యాప్తంగా సుమారు 7,500 కుక్కలకు ఉచితంగా రేబిస్ వ్యాక్సిన్ డోసులు వేసినట్లు వెల్లడించారు. చినగదిలి పశు వైద్యశాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమం కోసం జిల్లా మొత్తానికి 20 వేలు డోసులను సిద్ధం చేశామన్నారు. ఆదివారం అందుబాటులో లేని పెంపకందారులు సోమవారం నుంచి తమ కుక్కలను పశు వైద్యశాలలకు తీసుకెళ్లి టీకాలు వేయించుకోవాలని జేడీ సూచించారు. పెంపుడు కుక్కల యజమానులు జూనోసిస్ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మొదటి రోజు జరిగిన వ్యాక్సినేషన్ ప్రక్రియలో గోపాలపట్నం పశు వైద్యశాలలో అత్యధికంగా 800కు పైగా కుక్కలకు రేబిస్ టీకాలు వేసినట్లు జేడీ కరుణాకరరావు వెల్లడించారు. -
గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్పై ఏయూ అతిథి అధ్యాపకుల ఆగ్రహం
మద్దిలపాలెం: ఆంధ్ర యూనివర్సిటీలో కూటమి ప్రభుత్వం సిక్స్మెన్ కమిటీ ద్వారా సెలెక్టయి, పనిచేస్తున్న అతిథి అధ్యాపకులను కాదని, నోటిఫికేషన్ జారీ చేసి, కొత్తగా దరఖాస్తులు కోరడం అన్యాయమని అతిథి అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఎం.సురేష్మీనన్ ఆక్షేపించారు. ఏయూలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు ఏటా రివ్యూ జరగటం సర్వసాధారణమని, కానీ కూటమి ప్రభుత్వంలోనే సెలక్టయి, ఆరు మాసాలు కాకుండానే మళ్లీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తామనడం ఆక్షేపణీయమన్నారు. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు చేసినట్టే తమకూ రివ్యూ నిర్వహించి, మిగిలిన ఖాళీలకు కొత్త వారిని ఇంటర్వ్యూ చేయాలని కోరారు. ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్, అడ్జెస్ట్మెంట్ ప్రొఫెసర్, చైల్డ్ ప్రొపెషనర్లకు నెలకు రూ.80 వేలు చొప్పున జీతం చెల్లిస్తున్నా, వారికి రివ్యూ గానీ, ఇంటర్వ్యూలు గానీ లేవని, తమకు మాత్రం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించడం, ముమ్మాటికీ అణచివేతలో భాగమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ను సోమవారం కలిసి, తమ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సమావేశంలో అతిథి అధ్యాపకులు ప్రసాద్, విక్రమ్, దాస్, గిరీష్ దేవా, రాయ్, వెంకట్, ఫణి అంబేడ్కర్, ద్రాక్షాయణి, భాను, మృత్యుంజయ, సురేంద్ర, వెంకటరమణ, రవి, ఇంజనీరింగ్ అతిథి అధ్యాపకులు పాల్గొన్నారు. -
ఆన్లైన్లో 10 వేల నాటక పుస్తకాలు
సీతంపేట: నాటకం కోసం జీవితాన్ని అంకితం చేసిన బాదంగీర్ సాయి జ్ఞాపకార్థం 10 వేల నాటక పుస్తకాలను డిజిటలైజ్ చేసి, ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని విశ్రాంత ఐఏఎస్ గుమ్మళ్ల బలరామయ్య ప్రశంసించారు. రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో ద్వారకానగర్లోని పౌరగ్రంథాలయంలో ఆదివారం ‘తెలుగు నాటక డిజిటల్ గ్రంథాలయం’ వెబ్సైట్ ఆవిష్కరణ సభ జరిగింది. మనసు ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మన్నం వెంకటరాయుడు, అతిథులతో కలిసి ఈ వెబ్సైట్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బలరామయ్య మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు నాటకాలను అందించడానికి బాదంగీర్ సాయి స్వయంగా ఒక లైబ్రరీని నిర్వహించారన్నారు. సాయి అద్దె ఇంట్లో ఉంటూనే 10 వేల నాటకాల పుస్తకాలను సేకరించారని, ఎవరైనా నాటక పుస్తకం కావాలంటే ఆయన జిరాక్స్ తీసి ఇచ్చేవారని గుర్తు చేశారు. తన కుమార్తె సృజన జీవీఎంసీ కమిషనర్గా ఉన్న సమయంలో టీఎస్సార్ కాంప్లెక్స్లో నాటక గ్రంథాలయం ఏర్పాటు చేసినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. తెలుగు నాటకాల డిజిటలైజేషన్ను మొదట వెంపటి రాధాకృష్ణ ప్రారంభించారని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని మన్నం వెంకటరాయుడు సహకారంతో ఈ నాటకాలను డిజిటలైజ్ చేయడం అభినందనీయమన్నారు. రైటర్స్ అకాడమీ చైర్మన్ వి.వి.రమణమూర్తి కృషితో ఈ వెబ్సైట్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మాట్లాడుతూ పుస్తక పఠనంపై ఆసక్తి తగ్గిపోతున్న ప్రస్తుత తరుణంలో నాటకాలను డిజిటలైజ్ చేసి వెబ్సైట్లో పొందుపరచడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. డాక్టర్ మన్నం వెంకటరాయుడు మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు 40 వేల కథలను వెబ్సైట్లో ఉంచామని, ప్రతి నెలా 5 వేల మందికి పైగా వాటిని వీక్షించి చదువుతున్నారని చెప్పారు. ఇంకా 75 వేల కథలు వెబ్సైట్లో పెట్టాల్సి ఉందని వెల్లడించారు. కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ ఎం.వి.రఘు, విశ్రాంత ఐపీఎస్ అధికారి అత్తిలి సుధాకర్, నటుడు కొల్లి మోహనరావు, మేడా మస్తాన్రెడ్డి, వెంపటి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ‘తెలుగు నాటక డిజిటల్ గ్రంథాలయం’ వెబ్సైట్ ప్రారంభం -
సాయంకాలం.. సాగరతీరం
ఏయూక్యాంపస్: సాయంకాలం.. సాగరతీరం.. అంటూ నగరవాసులు, సందర్శకులు ఆర్.కె.బీచ్కు తరలివచ్చారు. చల్లటి వాతావరణం, సముద్రపు గాలి ఆహ్లాదకరంగా ఉండటంతో ఆనందంగా గడిపారు. పిల్లలు ఇసుకలో ఆడుకుంటూ, కేరింతలు కొడుతూ సందడి చేశారు. అలల సవ్వడులు, చల్లటి గాలులు అందరినీ మైమరిపించాయి. చాలామంది సాయంత్రం వేళ అస్తమిస్తున్న సూర్యుడి అందాలను తమ కెమెరాల్లో బంధించారు. మరికొందరు బీచ్లో దొరికే రకరకాల స్నాక్స్ను తింటూ, సముద్రపు అందాలను వీక్షించారు. – ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
ఆకట్టుకున్న టామీ టామీ వీధి నాటిక
సీతంపేట: సుదర్శన్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ద్వారకానగర్ పౌరగ్రంథాలయం ఎదుట ఆరుబయట ‘టామీ టామీ టామీ’వీధి నాటిక ప్రదర్శించారు. ఉన్నత వర్గానికి, సామాన్య వర్గానికి న్యాయం ఎలా జరుగుతుందో తెలియజేసే ఇతివృత్తంతో కళాకారులు ప్రదర్శించిన ఈ నాటిక ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కుక్కకు ఉన్న విలువ మనిషి లేదని తెలిపేలా కళాకారులు నాటిక ప్రదర్శించి రక్తి కట్టించారు. ఈ నాటికలో చలసాని కృష్ణ ప్రసాద్ హెడ్ కానిస్టేబుల్గా, జి.కన్నబాబు కానిస్టేబుల్గా, కె.శేషగిరిరావు ట్రాఫిక్ కానిస్టేబుల్గా, పి.మురళీధర్ ఖాళీ కుర్రాడిగా, బి.అప్పన్నకుమార్ యువకుడిగా, వర్రె నాంచారయ్య బూతద్దాల ముసలోడిగా, ఎన్.గౌరీశ్వరరావు కోర్టు గుమాస్తాగా, చంద్రాన దుర్గాప్రసాద్, బొబ్బా ధవళేశ్వరరావు డీఎస్పీ ఆర్డర్లీగా నటించి మెప్పించారు. -
అప్పుల కుప్ప.. యోగాంధ్ర గొప్ప
● యోగాసనాలకు రూ.75 కోట్లు ఖర్చు ● ప్రభుత్వం విదిల్చింది కేవలం రూ.28 కోట్లు ● పనులు చేసిన కాంట్రాక్టర్లకు పెండింగ్లో బిల్లులు ● కలెక్టరేట్ చుట్టూ కాంట్రాక్టర్ల ప్రదక్షిణలుమహారాణిపేట: యోగాంధ్ర రికార్డుల మాటెలా ఉన్నా.. అప్పుల భారం మాత్రం తలనొప్పిగా మారింది. టెంట్ల నుంచి స్నాక్స్ వరకు బిల్లుల చెల్లింపులతో అధికారుల తలబొప్పి కడుతోంది. యోగాంధ్ర పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు బిల్లుల కోసం కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమ బిల్లులు చెల్లించాలని అధికారుల వద్ద మొర పెట్టుకుంటున్నారు. యోగాంధ్ర కార్యక్రమం పూర్తి అయి 15 రోజులు అవుతున్నా ఇంకా ఎలాంటి బిల్లులు చెల్లించలేదని వ్యాపారులు, కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. గత నెల 21న విశాఖలో యోగా విన్యాసాల కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని మోదీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబా బు, ఇతర ప్రముఖలతో కార్యక్రమం పూర్తయింది. దాదాపు 3 లక్షల మందితో యోగాసనాలు వేసి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు. ఈ కార్యక్రమం నిర్వహణకు సుమారు రూ.75 కోట్లు ఖర్చు జరిగిందని అధికారులు చెబుతున్నారు. యోగాంధ్ర నిర్వహణ కు కూటమి సర్కార్ రెండు విడతల్లో రూ.28 కోట్లు విడుదల చేసింది. మిగిలిన నిధులు విడుదల చే యాలని జిల్లా యంత్రాంగం లేఖ కూడా రాసింది. కంపార్ట్మెంట్ల నిర్మాణానికి భారీగా ఖర్చు విశాఖ ఆర్కె బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు మొత్తం 368 కంపార్ట్మెంట్లు నిర్మించారు. ఒక్కొక్క కంపార్ట్మెంట్లో 1000 మంది ఉండేలా రూపొందించారు. దీనికే బిల్లు తడిసి మోపుడయింది. అరకొర నిధులతో చేపట్టిన పలు పనులు అంచనాలు మించిపోయాయి. వీటితో పాటు స్టేజీల నిర్మాణం కూడా జరిగింది. యోగా వేడుకల్లో పాల్గొనే వారికి కేంద్ర ప్రభుత్వం మ్యాట్లు, టీ షర్ట్లు ఇచ్చింది. అలాగే స్నాక్స్ కూడా పంపిణీ చేశారు. దాదాపు రూ.8 నుంచి రూ.9 లక్షల వరకు స్నాక్స్, ఇతర ఆహార పదార్థాల కోసం వెచ్చించారు. అలాగే వీఐపీలు, వీవీఐపీలకు హోటళ్లలో బస, వారు తిరగడానికి కార్ల ఏర్పాటు వంటి వాటికి భారీగా ఖర్చయింది. అయితే అయిన ఖర్చులో సగానికి పైగా చెల్లింపులు జరగలేదు. ఫలితంగా ఈ పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. బిల్లుల కోసం కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. -
ఎవరో?
మున్నా భాయ్ ● ఢిల్లీ నుంచి 25 గ్రాముల కొకై న్ విశాఖకు తీసుకొచ్చిన నిందితులు ● ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ దొరకడం నగరంలో ఇదే తొలిసారి ● బయటకు పొక్కనివ్వకూడదంటూ కూటమి నేతల ఫోన్లు ● మున్నాతో టీడీపీ నేతలకు సంబంధాలున్నట్లుగా గుర్తింపు ● తెర వెనుక పేర్లు బయటపడనీయకుండా కూటమి నేతల ఒత్తిళ్లు ● డ్రగ్స్ దొరికినా నోరు మెదపని ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ప్రశ్నించే పవన్.. ఏమయ్యారు..? ‘నార్కోటిక్ హబ్గా ఆంధ్రప్రదేశ్ మారుతోంది. గంజాయికి నిలయంగా ఏపీ తయారైంది. ఏ రాష్ట్రంలో గంజాయి దొరికినా.. ఏపీ నుంచి.. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి వెళ్తోంది. రాష్ట్రాన్ని గంజాయి హబ్గా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మార్చేసింది’ ● ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చీమ చిటుక్కుమంటే చాలు ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇదిగో ఇలా ట్వీట్స్తో సోషల్మీడియాలో రెచ్చిపోయేవారు. ● కట్ చేస్తే.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి కేసులు పెరుగుతూ వస్తున్నాయి. రాష్ట్రంలో ఎటు చూసినా గంజాయి పట్టుబడుతోంది. విశాఖలో వరుసగా డ్రగ్స్ దొరుకుతున్నాయి. ఇంత జరుగుతున్నా పవన్ కల్యాణ్ మాత్రం మౌనముని అవతారమెత్తేశారు. ఏమీ జరగనట్లు తనకేమీ తెలియనట్లుగా నిద్ర నటిస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం : నగరంలో డ్రగ్స్ రవాణా వెనుక పెద్ద తలలే ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి నేతల వారసులే మత్తు పదార్థాల సూత్రధారులనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దొరికిన వారే దొంగలన్నట్లుగా చిత్రీకరించి.. డ్రగ్స్ రవాణా వెనుక ఎవరి హస్తం ఉందన్న అంశాలను కూటమి నేతలు తొక్కిపెట్టేందుకు తెరవెనుక ప్రయత్నాలు జోరుగా చేస్తున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన ఓ టీడీపీ ఎంపీ పోలీసులపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నారని తెలుస్తోంది. కీలక సూత్రధారిగా ఉన్న అక్షయ్కుమార్ అలియాస్ మున్నా కాల్ రికార్డులను పరిశీలించిన పోలీసులు అతడికి కొంతమంది కూటమి నేతలతో సంబంధాలున్నట్లుగా గుర్తించినట్లు సమాచారం. సెంట్రల్ ఏజెన్సీ సమాచారంతో డ్రగ్ పెడ్లర్స్పై దాడులు నిర్వహించిన త్రీ టౌన్ పోలీసులు రెండురోజుల క్రితం నగర చరిత్రలోనే భారీ మొత్తంలో డ్రగ్స్ను పట్టుకున్నారు. 25 గ్రాముల కొకైన్తోపాటు రూ.3.5 లక్షల నగదు, కారు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ రాకెట్ను ఛేదించిన కొద్ది గంటల వ్యవధిలోనే పోలీసులకు కూటమి నేతల నుంచి ఫోన్లు రావడం మొదలయ్యాయి. అప్పటికే డ్రగ్స్ పట్టుకున్నట్లు బయటకు తెలియడంతో పోలీసులు వివరాలు వెల్లడించారు. అయినా కూటమి నేతల నుంచి ఒత్తిళ్లు ఆగకపోవడంతో పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. డ్రగ్స్ వచ్చిన గంటలోనే ఓ నేతకు ఫోన్ దక్షిణాఫ్రికాకు చెందిన థామస్తోపాటు విశాఖకు చెందిన అక్షయ్ కుమార్ అలియాస్ మున్నా ఇందులో కీలకంగా వ్యవహరించారు. డ్రగ్స్ని ఢిల్లీ నుంచి విశాఖకు తీసుకొచ్చిన గంట వ్యవధిలోనే ఉత్తరాంధ్రకు చెందిన ఓ నాయకుడికి ఫోన్ కాల్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. మున్నా ఫోన్లో కాంటాక్ట్ లిస్ట్లోనూ, కాల్ లిస్ట్లోనూ ఓ ఎంపీ ఫోన్ నంబర్తో పాటు టీడీపీ నేతలు, వారి వారసుల ఫోన్ నంబర్లు ఉన్నట్లు సమాచారం. అరెస్ట్ చేసిన ఐదుగుర్ని విచారించిన పోలీసులు.. వారి వద్ద నుంచి మరో ముగ్గురు పేర్లు రాబట్టారు. ఈ ముగ్గురికీ రాజకీయ నేతలతో సత్సంబంధాలు ఉండటం, ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం. వారిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన క్షణాల వ్యవధిలోనే కూటమి నేతల నుంచి పోలీసులకు ఫోన్ల మీద ఫోన్లు వచ్చేశాయని తెలుస్తోంది. దీంతో పోలీసులు తాము తీసుకొచ్చిన ముగ్గుర్నీ కేవలం 10 నిమిషాల్లోనే బయటకు పంపించేశారని సమాచారం. తేనె తుట్టె కదిపితే.. కూటమి నేతలు, వారి వారసుల పేర్లు డ్రగ్స్ రాకెట్లో బట్టబయలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో.. విచారణ ముందుకు జరగకుండా అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఒత్తిళ్లకు లొంగకుండా విచారిస్తే.. మున్నా వెనుక ఉన్న భాయ్ ఎవరనేది తెలిసే అవకాశం ఉన్నా.. ప్రభుత్వం మాత్రం డ్రగ్స్ కేసును తొక్కి పెట్టేందుకు చూస్తోంది. డ్రగ్స్ కేసులో వైద్యుడి అరెస్టు ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు ఆదివారం కూర్మన్నపాలేనికి చెందిన వైద్యుడు శ్రీకృష్టచైతన్యను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అతడు డ్రగ్స్ కోసం అక్షయ్ కుమార్కు రూ.65 వేలు చెల్లించినట్లు విచారణలో పేర్కొన్నాడు. అతడికి వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. -
రోటరీ క్లబ్ సౌత్ ప్రెసిడెంట్గా శివకుమార్రెడ్డి
బీచ్రోడ్డు: రోటరీ క్లబ్ విశాఖపట్నం సౌత్ ప్రెసిడెంట్గా వి.శివకుమార్ రెడ్డి నియమితులయ్యారు. నగరంలో ఆదివారం జరిగిన ప్రమాణస్వీకారోత్సవంలో నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించింది. ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా ఆర్వీ రాజశేఖర్, ట్రెజరర్గా పి.ప్రభాకర్, ఇతర విభాగాల ప్రతినిధులను ప్రకటించారు. ముఖ్యఅతిథి ఆచార్య వి.సుబ్రమణ్యం మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు చేయూతనిచ్చేందుకు రోటరీ క్లబ్ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆచార్య కె.తిమ్మారెడ్డి, క్లబ్ పూర్వ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఛాయాదేవి, నూతన అధ్యక్షుడు శివకుమార్రెడ్డి క్లబ్ భవిష్యత్ కార్యాచరణను వివరించారు. గాజువాక చెట్టివానిపాలెం పాఠశాలలో విద్యార్థులకు ప్రతి శుక్రవారం ఫ్రూట్స్, గర్భిణులకు నెలకోసారి పౌష్టికాహారాన్ని తమ క్లబ్ ద్వారా అందిస్తామన్నారు. -
అణగారిన వర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్రామ్
మహారాణిపేట: అణగారిన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ బాబూ జగ్జీవన్రామ్ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. ఆదివారం మద్దిలపాలెంలో గల వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు బోని శివరామకృష్ణ ఆధ్వర్యంలో బాబూ జగ్జీవన్రామ్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. జగ్జీవన్రామ్ చిత్రపటం వద్ద సమన్వయకర్తలు మళ్ల విజయప్రసాద్, మొల్లి అప్పారావుతో కలిసి కేకే రాజు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదుగురు ప్రధానుల వద్ద కేంద్రమంత్రిగా పని చేసి, అన్ని శాఖలకు న్యాయం చేశారని కొనియాడారు. అనంతరం పేదలకు చీరలు పంపిణీ చేశారు.కార్యక్రమంలో పార్టీ కార్యాలయం పర్యవేక్షకుడు రవిరెడ్డి, ముఖ్యనేత జహీర్ అహ్మద్, కార్పొరేటర్లు అనిల్కుమార్ రాజు, రెయ్యి వెంకటరమణ, బిపిన్ కుమార్ జైన్, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు పేడాడ రమణికుమారి, సనపల రవీంద్ర భరత్, పులగం కొండారెడ్డి, రామి రెడ్డి, వంకాయల మారుతీ ప్రసాద్, బోండా ఉమా మహేశ్వరరావు, మార్కేండేయులు, జిల్లా పార్టీ కమిటీ మంచా నాగమల్లేశ్వరి, ఎం.సత్యనారాయణ, పద్మ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
శేషపాన్పుపై జగన్నాథస్వామి
● ముగిసిన దశావతారాలు ● నేడు తిరుగు రథయాత్ర డాబాగార్డెన్స్: టర్నర్ చౌల్ట్రీలో కొలువైన జగన్నాథ స్వామి ఆదివారం శేషపాన్పుపై భక్తులకు దర్శనమిచ్చారు. తొలి ఏకాదశి, దశావతారాలు చివరి రోజు కావడంతో బలభద్ర, సుభద్ర సమేత జగన్నాథ స్వామిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పాణంగిపల్లి జగన్నాథాచార్యులు, పాణంగిపల్లి రంగనాథాచార్యులు, పాణంగిపల్లి కేశవాచార్యులు, యేడిద సురేషుబాబు స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆలయ ఈవో టి.రాజగోపాల్రెడ్డి ఏర్పాట్లు పర్యవేక్షించారు. కాగా.. స్వామి తిరుగుయాత్ర సోమవారం నిర్వహిస్తున్నట్లు ఈవో తెలిపారు. సాయంత్రం 5.10 గంటలకు తిరుగుయాత్ర ప్రారంభమవుతుందని, టర్నర్ సత్రం నుంచి మేళ తాళాలు, బాణసంచాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి తిరిగి ప్రధాన ఆలయానికి చేరుకుంటారని వెల్లడించారు. -
నిషేధిత మందులు యథేచ్ఛగా అమ్మకాలు
మహారాణిపేట: స్మార్ట్ సిటీ విశాఖలో నిషేధిత మందుల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందులు, ఇంజక్షన్లు, గర్భస్రావ కిట్లు, లైంగిక సామర్థ్యం పెంచే వయాగ్రా వంటి ఔషధాలను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. కొన్ని మెడికల్ షాపులు, ఏజెన్సీలు అక్రమాలకు అడ్డాగా మారాయి. అధికారుల పర్యవేక్షణ లోపం, మామూళ్ల ఆరోపణల నడుమ ‘మెడికల్ మాఫియా’ తన కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తోంది. వాస్తవానికి వీటి విక్రయాలపై నిషేధం ఉన్నప్పటికీ.. ఎమ్మార్పీకి మించి అమ్మకాలు సాగిస్తుండడం గమనార్హం. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా సుమారు 4,500 మందుల దుకాణాలు, హోల్సేల్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటిలో అనేక షాపులు ప్రభుత్వ నిబంధనలను గాలికి వదిలేశాయి. కనీస అర్హత కలిగిన ఫార్మసిస్టులు లేకుండా, అమ్మకపు వివరాలు నమోదు చేసే కంప్యూటర్లు, రిజిస్టర్లు లేకుండానే వ్యాపారం సాగిస్తున్నాయి. కాలం చెల్లిన మందులను సైతం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా దగ్గు మందులు, నొప్పి నివారణ మందులు, మత్తును కలిగించే ఇంజక్షన్లను యువతకు సులభంగా విక్రయిస్తున్నారు. నగరంలో కొన్ని ప్రాంతాల్లో వయాగ్రా అమ్మకాలు అనధికారికంగా జరుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా నగరంలోని జిల్లా పరిషత్, రెల్లివీధి, కురుపాం మార్కెట్, కొత్త రోడ్డు, ఎంవీపీ కాలనీ, పెదవాల్తేరు వంటి ప్రాంతాలు ఈ అక్రమ దందాకు కేంద్రాలుగా మారాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వయాగ్రా, అబార్షన్ కిట్లను ఎమ్మార్పీ ధర కంటే అధిక ధరకు అమ్ముతూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. వయాగ్రా, అబార్షన్, మత్తు మందుల కిట్ల విక్రయం జోరుగా కాలం చెల్లిన మందుల అమ్మకాలు కొన్ని మందుల షాపులు, ఏజెనీల్లో అక్రమాలు దాడులు చేస్తున్నా పట్టించుకోని మెడికల్ మాఫియా మొక్కుబడిగా తనిఖీలు ఔషధ నియంత్రణ మండలి, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, పోలీసులు, ఈగల్ వంటి వివిధ శాఖలు అడపాదడపా దాడులు చేస్తున్నా ఫలితం శూన్యంగానే ఉంటోంది. దాడుల తర్వాత కొద్ది రోజులకే మాఫియా మళ్లీ తమ అక్రమ వ్యాపారాన్ని యథావిధిగా ప్రారంభిస్తోంది. కొన్ని శాఖలకు మామూళ్లు అందుతుండటమే దీనికి కారణమన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఔషధ నియంత్రణ శాఖలో సిబ్బందికి వాహనాలు వంటి కనీస సౌకర్యాలు లేకపోవడంతో తనిఖీలు మొక్కుబడిగా మారుతున్నాయన్న విమర్శలున్నాయి. తనిఖీల్లో బిల్లులు లేకుండా అమ్మకాలు జరపడం, ప్రిస్క్రిప్షన్ వివరాలు నమోదు చేయకపోవడం, ఫార్మసిస్టులు అందుబాటులో లేకపోవడం వంటి అనేక ఉల్లంఘనలు బయటపడినా, చర్యలు మాత్రం నామమాత్రంగానే ఉంటున్నాయి. ఈ ఆరోపణలపై ఔషధ నియంత్రణ శాఖ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ విజయకుమార్ వద్ద ప్రస్తావించగా.. ‘వయాగ్రా, అబార్షన్ కిట్ల అమ్మకాలు మా దృష్టికి రాలేదు. మేము రెగ్యులర్గా తనిఖీలు చేస్తున్నాం. ఒకవేళ ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరిపితే, వారి షాపు లైసెన్సులను తక్షణమే రద్దు చేస్తాం’అని ‘సాక్షి’కి తెలిపారు. -
వైఎస్సార్ జయంతి రోజున సేవా కార్యక్రమాలు చేయండి
సాక్షి, విశాఖపట్నం: మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి వేడుకలను ఈ నెల 8వ తేదీన ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పిలుపునిచ్చారు. వైఎస్సార్ పుట్టినరోజున వాడవాడలా సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రక్తదాన శిబిరాలు, పుస్తకాల పంపిణీ, పేదలకు అన్నదానం, దుస్తుల పంపిణీ, ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ వంటి సేవాకార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ సేవాదళ్, యువజన విభాగం, విద్యార్థి విభాగం అధ్యక్షులు సేవాకార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వైఎస్సార్ సీపీ యువతంతా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. -
ట్రాన్స్పాండర్
మత్స్యకారుల పాలిట దిక్సూచి మహారాణిపేట: సముద్రంలో వేట సాగిస్తున్న మత్స్యకారులు తరచుగా తుపానులు, ఇతర ప్రకృతి వైపరీత్యాల బారిన పడి ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. అలాగే సరిహద్దులు దాటి ఇతర దేశాల భద్రతా సిబ్బందికి చిక్కి జైళ్లలో మగ్గుతున్నారు. సముద్రంలో సెల్ఫోన్లకు సిగ్నల్స్ లేకపోవడం వల్ల తుపానుల ముప్పును గుర్తించలేకపోవడం, చిన్నపాటి తప్పిదాలతో సరిహద్దులు దాటడం వంటి సమస్యలను మత్స్యకారులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, కేంద్ర మత్స్యశాఖ మత్స్యకారుల కోసం సరికొత్త పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది. 100 శాతం సబ్సిడీతో ‘ట్రాన్స్పాండర్’ అనే దిక్సూచిని గంగపుత్రులకు అందిస్తూ, వారిని సురక్షితంగా ఉంచడానికి అభయమిస్తోంది. బోట్లకు అమరిక ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ అత్యాధునిక స్పేస్ టెక్నాలజీ ఆధారిత ట్రాన్స్పాండర్లను రూపొందించింది. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై) పథకం కింద ఇది పూర్తి ఉచితంగా (100 శాతం రాయితీతో) అందిస్తున్నారు. జిల్లాలో మొత్తం 350 మోటరైజ్డ్, 760 మెకనైజ్డ్ బోట్లకు అంటే.. మొత్తంగా 1100 బోట్లకు ఈ ట్రాన్స్పాండర్లను అమర్చాలని మత్స్యశాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ మేరకు మత్స్యకారులకు ట్రాన్స్పాండర్పై సమగ్ర అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు 634 బోట్లలో ట్రాన్స్పాండర్లున్నాయి. వీటిని ఎలా వినియోగించాలనే అంశంపై ప్రతి మత్స్యకారుడికీ అవగాహన కల్పిస్తున్నారు. సమగ్ర సమాచారం అందించేలా... సముద్రంలో వాతావరణం ఎలా ఉంది.? తుపాను హెచ్చరికలు ఏమైనా ఉన్నాయా.? అనే సమాచారం అందించేలా దీన్ని రూపొందించారు. వేటకు వెళ్లే మత్స్యకారులు కొన్ని సందర్భాల్లో ఫోన్ సిగ్నల్స్ను కోల్పోతారు. అటువంటి సమయంలో వారికి తుపాను సమాచారం, ఇతర ప్రమాదాల సమాచారం చేర్చాలంటే అత్యంత కష్టం. అలాంటి సమయంలో ఈ ట్రాన్స్పాండర్లు మత్స్యకారులకు ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తుంది. తద్వారా వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడానికి సహాయపడుతుంది. సరిహద్దులు దాటకుండా మత్స్యకారులను హెచ్చరించి, ఇతర దేశాల భద్రతా సిబ్బందికి చిక్కుకోకుండా కాపాడుతుంది. సముద్రంలో ప్రమాదం జరిగితే శాటిలైట్ ద్వారా కోస్టుగార్డు, మత్స్యశాఖ కార్యాలయం, బోటు యజమానికి సమాచారం వెళ్తుంది. అంతేకాదు చేపల లభ్యతకు సంబంధించిన సమాచారాన్ని ఇది అందిస్తుంది. ఈ పరికరంలో రెండు భాగాలుంటాయి. ఒకటి బోటుకు, మరొకటి డ్రైవర్ వద్ద అమర్చుతారు. ఇది బ్యాటరీ సాయంతో పని చేస్తుంది. అయితే కొందరు మత్స్యకారులు వీటిని అమర్చినప్పటికీ.. స్విచ్ ఆఫ్ చేసేస్తున్నారు. ఫలితంగా ఆ బోట్లకు సందేశాలు పంపించడం ఇబ్బందవుతోంది. వేట కోసం బోటు ప్రారంభించిన వెంటనే ట్రాన్స్పాండర్ స్విచ్ ఆన్ చేస్తే సమాచారం అందించగలమని, ఈ విషయంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలంటూ ఆ శాఖ అధికారులు సూచిస్తున్నారు. సరిహద్దు హెచ్చరికలను అందించే అత్యాధునిక వ్యవస్థ జిల్లాలో 1,100 బోట్లకు అమర్చేందుకు మత్స్యశాఖ సన్నద్ధం ఇప్పటివరకు 634 బోట్లకు శతశాతం రాయితీతో అందజేత -
ఇక శత్రు డ్రోన్లు ఢమాలే..
సాక్షి, విశాఖపట్నం: సముద్ర జలాల్లో శత్రు దేశాల డ్రోన్లు, మానవ రహిత వైమానిక వాహనాలు కనిపిస్తే వెంటనే జలసమాధి చేసే వ్యవస్థకు భారత రక్షణ మంత్రిత్వ శాఖ పదును పెడుతోంది. ఇటీవల దాయాది దేశం పాకిస్థాన్ భారత్పై డ్రోనాస్త్రాలు సంధించగా వాటిని తుత్తునియలు చేసిన విషయం తెలిసిందే. దీనిని ఆదర్శంగా తీసుకుని సముద్ర జలాల్లో శత్రుదేశాల మానవ రహిత వైమానిక వాహనాలు దూరంలో ఉన్నప్పుడే పసిగట్టి.. వాటిని జల సమాధి చేసే యాంటీ డ్రోన్ వ్యవస్థని యుద్ధ నౌకల్లో ఏర్పాటుకు హిందూస్థాన్ షిప్యార్డు పెంటగాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ఆదివారం ఒప్పందం కుదుర్చుకుంది. షిప్యార్డు సీఎండీ కమొడర్ హేమంత్ ఖత్రీ నేతృత్వంలో పీఆర్ఎస్ సంస్థ ఎండీ డాక్టర్ స్వామినాథన్ మణికందన్, షిప్యార్డు డైరెక్టర్ వెంకటేశ్వర్లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.30 కి. మీ దూరంలోనే పసిగట్టేలా..ప్రస్తుతం కొన్ని యుద్ధ నౌకల్లో షార్ట్ రేంజ్ కమ్యునికేషన్ సిస్టమ్ అమల్లో ఉంది. వీటి ద్వారా నాలుగు లేదా ఐదు కిలోమీటర్ల దూరంలో డ్రోన్లు, మానవ రహిత విమానాల్ని పసిగట్టి సమాచారాన్ని ప్రధాన కేంద్రానికి అందిస్తుంటాయి. కానీ.. ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా కుదుర్చుకున్న ఈ ఒప్పందంతో అధునాతన యాంటీ డ్రోన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది.యుద్ధ నౌకలకు డ్రోన్ ముప్పు ఉండదికసముద్ర జలాల్లో పహారా కాస్తున్న యుద్ధ నౌకలకు ఈ ఒప్పందం ద్వారా సమగ్ర రక్షణ లభిస్తుంది. దీర్ఘ శ్రేణి కమ్యూనికేషన్ వ్యవస్థని త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నాం. రక్షణ రంగ సాంకేతికతలో షిప్యార్డు భాగస్వామ్యం మరింత పెరుగుతోంది. వచ్చే త్రైమాసికంలో ఇంటిగ్రేషన్ ట్రయల్స్ని ప్రారంభిస్తాం. తర్వాత తొలి విడతలో ఫ్రంట్లైన్ యుద్ధ నౌకల్లో ఈ రియల్ టైమ్ డిటెక్షన్ ట్రాకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తాం. – కమొడర్ హేమంత్ ఖత్రి, సీఎండీ, హెచ్ఎస్ఎల్యాంటీ డ్రోన్ వ్యవస్థ ప్రత్యేకతలివీ⇒ రియల్టైమ్ డిటెక్షన్ ట్రాకింగ్ ద్వారా 30 కిలోమీటర్ల దూరంలోని డ్రోన్లనూ సులువుగా గుర్తించవచ్చు. ⇒ ఒక్క అడుగు కూడా కదలనియ్యకుండా ధ్వంసం చేయొచ్చు. ⇒ 400 ఎంహెచ్జెడ్ 6గిగా హెడ్జ్ స్పెక్ట్రమ్ పరిధిలో ఉన్న యుద్ధ నౌకలు, నౌకాదళ కేంద్రాలకు ఈ యాంటీ డ్రోన్ వ్యవస్థ శత్రుదేశాల సమాచారాన్ని క్షణాల్లో చేరవేస్తుంది. -
ఇలా తయారయ్యారేంట్రా బాబూ.. శ్రుతి మించిన యువతి బర్త్డే..
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో ఓ యువతి పుట్టిన రోజు వేడుకలు శ్రుతి మించాయి. నగర నడిబొడ్డున సిరిపురం జంక్షన్లో బర్త్ డే వేడుకలు పేరుతో విద్యార్థులు హంగామా సృష్టించారు. సుమారు 30 మంది వరకు యువకులు.. యువతి పుట్టిన రోజును సెలెబ్రేట్ చేశారు.అయితే, కేకులు కట్ చేసి ఒకరిపై ఒకరు విసురుకున్నారు. రోడ్లపై గన్ ఫైర్ క్రాకర్స్తో పరిగెత్తుకుంటూ వాహనదారులపై కేకులు విసురుతూ హల్చల్ చేశారు. వీరి విపరీత చేష్టలకు వాహనదారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. -
వారసత్వం, సమర్థత కలిగిన నేత మాధవ్
సీతంపేట: పి.వి.చలపతిరావు వారసుడిగా రాజకీయ ప్రవేశం చేసి, స్వయంకృషితో అంచెలంచెలుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగిన పీవీఎన్ మాధవ్ను పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు అభినందించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు అధ్యక్షతన శనివారం పోర్టు కళావాణి స్టేడియంలో ఆత్మీ య అభినందన సభ జరిగింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ శ్రీ భరత్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు గణబాబు, పంచకర్ల రమేష్బాబు, పి.విష్ణుకుమార్ రాజు, బండారు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు దాడి వీరభద్రరావు, పీలా గోవింద్, విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్, మాజీ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, సత్యారావు తదితరులు మాధవ్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మాధవ్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం కలిగిన నాయకుడని ప్రశంసించారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి ఎదగడం గొప్ప విషయమన్నారు. మాధవ్ తండ్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారని, ఆ తర్వాత విశాఖ నుంచి కంభంపాటి హరిబాబు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారని గుర్తు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఎంపీలు, ఎమ్మెల్యేల అభినందనలు -
పనిమనిషే దొంగ
● సుజాతనగర్లోని ఓ ఇంట్లో 17 తులాల బంగారం, వజ్రాలు మాయం ● చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు ● సొత్తు స్వాధీనం పెందుర్తి: తాను పనిచేస్తున్న ఇంటికే కన్నం వేసి, యజమానులకు దాదాపు రూ. 22 లక్షల విలువైన బంగారు, వజ్రాభరణాలను అపహరించిన ఓ ఘనురాలిని పోలీసులు అరెస్టు చేశారు. మూడేళ్లుగా నమ్మకంగా పనిమనిషిగా ఉంటూ, యజమాని కుటుంబం లేని సమయం చూసి చేతివాటం ప్రదర్శించిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెస్ట్ జోన్ క్రైమ్ ఏసీపీ డి. లక్ష్మణరావు శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సుజాతనగర్ మెయిన్ రోడ్డు సమీపంలో నివసించే మండపాటి రాఘవేంద్ర, కొత్తవలస మండలం మంగళపాలెంలోని గురుదేవ ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. ఆయన భార్య కూడా ఉద్యోగిని. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం ఇంటి పనుల కోసం వేపగుంట సమీపంలోని వరలక్ష్మీనగర్కు చెందిన తనుబుద్ది సత్యవతిని పనిమనిషిగా నియమించుకున్నారు. సత్యవతి నమ్మకంగా ఉండటంతో, రాఘవేంద్ర దంపతులు విధులకు వెళ్లినప్పుడు ఇంటి బాధ్యతలను ఆమెకే అప్పగించేవారు. గత నెల 25న రాఘవేంద్ర దంపతులు విధులకు వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చిన తరువాత బీరువా తెరవడానికి ప్రయత్నించగా లోపల వస్తువులన్నీ చిందరవందరగా ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చిన రాఘవేంద్ర బీరువాను పరిశీలించగా అందులో ఉన్న సుమారు 206.86 గ్రాముల బంగారం, రూ. 2 లక్షల విలువైన వజ్రాభరణాలు మాయమైనట్లు గుర్తించారు. వెంటనే పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా పనిమనిషి సత్యవతి కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. విచారణలో ఆమె చోరీకి పాల్పడినట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ప్రశ్నించగా సత్యవతి నేరం ఒప్పుకుందని ఏసీపీ తెలిపారు. చోరీ సొత్తును ఆమె నుంచి స్వాధీనం చేసుకుని నిందితురాలిని రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ లక్ష్మణరావు వివరించారు.ఈ కేసులో ప్రతిభ కనబరిచిన వెస్ట్ జోన్ సీఐ ఎన్. శ్రీనివాసరావు, పెందుర్తి ఎస్ఐ డి. సూరిబాబు, ఏఎస్ఐ కె. శ్రీనివాసరావు, హెచ్సీలు జి. నాగరాజు, టి. పద్మజ, పీసీలు ఎల్. సింహాచలం నాయుడు, ఎల్. త్రిమూర్తులు, టి. శివప్రసాద్, బి. దేముడునాయుడు, ఎల్.కె. తాతారావు, ఆర్. సంతోషి, పి. హైమావతి, జి. శ్రీనివాసరావు, వి. విజయ్కుమార్, యూ. చంద్రకళలను ఉన్నతాధికారులు అభినందించారు. -
వైద్యంలో రోగి పూర్వ చరిత్ర పరిశీలన కీలకం
● నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ● మధురవాడలో ఐసాకాన్ సౌత్ జోన్ కాన్ఫరెన్స్ ప్రారంభం మధురవాడ: వైద్య విధానంలో రోగి పూర్వ చరిత్ర పరిశీలన వైద్యులకు ఎంతగానో ఉపయోగపడుతుందని నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి అన్నారు. ఈ అంశం అనస్తీషియా వైద్యులతో పాటు అన్ని విభాగాల వైద్యులకు ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. మధురవాడలోని విశాఖ వి.కన్వెన్షన్ సెంటర్లో ఐసాకాన్ పేరుతో నిర్వహిస్తున్న 40వ ఇండియన్ అనస్తీషియా సౌత్ జోన్ కాన్ఫరెన్స్, 34వ రాష్ట్ర మహా సభలను శనివారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వైద్యంలో అనస్తీషియాకు ఎంతో ప్రాధాన్యత ఉందని, ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో వైద్య విధానాల్లో వస్తున్న మార్పులు, నూతన పోకడలు, సాంకేతికతపై వైద్యులతో పాటు పీజీ విద్యార్థులు దృష్టి సారించాలని సీపీ సూచించారు. ఐఎస్ఏ జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ బాలవెంకట్, డాక్టర్ బాజువాలు మాట్లాడుతూ.. చికిత్సల సందర్భంగా రోగికి నొప్పి లేకుండా మత్తు ఇవ్వడంతో పాటు తిరిగి యథాస్థితికి తీసుకురావాలన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సూరిశెట్టి శ్రీనివాసరావు సదస్సు ప్రాధాన్యతను, వైద్య రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పుల గురించి క్షుణ్ణంగా వివరించారు. సదస్సులో భాగంగా పలువురు వైద్యులు, వైద్య విద్యార్థులు ప్రచురించిన పత్రాలను నిపుణులకు సమర్పించారు. యువ వైద్యులకు క్విజ్ పోటీలు నిర్వహించి, బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి సీపీ బాగ్చికి శాలువాలు కప్పి, జ్ఞాపిక అందజేసి సత్కరించారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి, ఒడిశా, మధ్యప్రదేశ్కు చెందిన సుమారు 1,300 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ రంగంలో ఉన్న పీజీ విద్యార్థులు, ప్రాక్టీషనర్స్కు అవసరమయ్యే వెంటిలేటర్లు, మత్తు యంత్రాలు, ఆపరేషన్లలో ఉపయోగించే పరికరాలు, మొదలైన 36 రకాల స్టాళ్లతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఐఎస్ఏ మాజీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఠాగూర్, డాక్టర్ చక్రరావు, డాక్టర్ కామేశ్వరరావు, డాక్టర్ కుచెల్బాబు, డాక్టర్ భీమేశ్వరరావు, ఏపీ మాజీ అధ్యక్షుల, నగర బ్రాంచ్ అధ్యక్షుడు డాక్టర్ కె. పరంజి తదితరులు పాల్గొన్నారు. -
సమ్మోహన భరితం.. సత్యభామ నృత్యోత్సవం
మద్దిలపాలెం: మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో నటరాజ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో 11వ సత్యభామ యువ నృత్యోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి రోజు అంతర్జాతీయ స్థాయి భారతీయ శాసీ్త్రయ నృత్య కళాకారుల అద్భుత ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఈ ప్రతిష్టాత్మక నృత్యోత్సవంలో భాగంగా సత్యభామ నేషనల్ అవార్డులు – 2025లను గీతా నారాయణ సుద గాని – కూచిపూడి (ఏపీ), సంజనా పుట్ట – కూచి పూడి (అమెరికా), డా. మనీషా మిట్టల్ – భరతనాట్యం (కర్ణాటక), అపర్ణ శర్మ ఈ.జీ – కేరళ నాటనం (కేరళ), లక్ష్మీశ్రవణ్ – భరతనాట్యం (కర్ణాటక)లకు ప్రదానం చేశారు. వివిధ రాష్రాలకు చెందిన నృత్యోత్సవ డైరెక్టర్లు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సెంట్రల్ జీఎస్టీ అదనపు కమిషనర్ మహమ్మద్ అలీ మాట్లాడుతూ, ఈ ఉత్సవం భారతీయ శాసీ్త్రయ నృత్యాలకు గొప్ప వేదికగా నిలుస్తుందని, కళాకారులకు తమ నృత్యాన్ని ప్రపంచానికి చూపించే అవకాశం కలుగుతుందని అన్నారు. రిటైర్డ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రవిశంకర్ నారాయణ్ సుధాగా ని, రైటర్స్ అకాడమీ అధ్యక్షుడు వి.వి. రమణమూర్తి పాల్గొన్నారు. జాతీయ నృత్య పోటీలు : నటరాజ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ వ్యవస్థాపకులు, నృత్యోత్సవాల సారఽఽథి బత్తిన విక్రమ్ గౌడ్ మాట్లాడుతూ తొలిరోజు జరిగిన జాతీయ నృత్య పోటీలలో సుమారు వందకు పైగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు పాల్గొన్నారని తెలిపారు. పశ్చిమ బెంగాల్కు చెందిన భరతనాట్యం, కథాకళి నృత్య కళాకారిణి పరిమిత ముఖర్జీ, మణిపూరి రాష్ట్రానికి చెందిన సుమనలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. భరతనాట్యం, కూచిపూడి, మణిపూరి, ఒడిస్సీ వంటి భారతీయ శాసీ్త్రయ నృత్యాలతో పాటు జానపద నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. -
నేషనల్ సిల్క్ ఎక్స్పో ప్రారంభం
తాటిచెట్లపాలెం: వివాహ, పండగల సీజన్ సందర్భంగా నగర వాసులకు విభిన్న వస్త్రాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు నేషనల్ స్కిల్ ఎక్స్పో నిర్వాహకులు తెలిపారు. వాల్తేర్ మెయిన్రోడ్డులోని గ్రీన్ పార్క్ హోటల్లో శనివారం నేషనల్ సిల్క్ ఎక్స్పో ప్రారంభమైంది. మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్కు చెందిన ప్రసిద్ధ పైథాని సిల్క్, సాఫ్ట్ సిల్క్, కాశిదా సిల్క్ చీరలు, చందేరి, మహేశ్వరి, బలుచారి, జామ్దాని, థగ్గిల్, తకై మస్లిన్ సిల్క్ వస్త్రాలు, లెనిన్ తదితర చీరలన్నీ ఒకే చోట అందుబాటులో ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 9వ తేదీ వరకు ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎగ్జిబిషన్ కం సేల్ అందుబాటులో ఉంటుందన్నారు. ప్రవేశం ఉచితమని, అన్ని డెబిట్, క్రెడిట్ కార్డులను చెల్లింపులకు అంగీకరిస్తామన్నారు. -
ఆవిష్కరణల కేంద్రంగా ఏపీని తీర్చిదిద్దుదాం
ఏయూక్యాంపస్: ఆంధ్రప్రదేశ్ను ఆవిష్కరణల్లో అగ్రగామిగా తీర్చిదిద్దాలని ఎంపీ ఎం.శ్రీ భరత్ పిలుపునిచ్చారు. శనివారం బీచ్రోడ్డులోని ఒక హోటల్లో జరిగిన ఇన్ఫినిటీ విశాఖపట్నం 2025 సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సులో భారతీయ విద్యా విధానం, పర్యవేక్షణ, ఆవిష్కరణ అనే కీలక అంశాలపై నిపుణులు చర్చించారు. పరిశ్రమలు, విద్యా వ్యవస్థలు సమన్వయంతో పని చేయడం ద్వారా రాష్ట్రాన్ని ఐటీ, ఐటీ ఆధారిత రంగాల్లో అగ్రగామిగా నిలపడంపై నిపుణులు తమ విలువైన సూచనలు అందించారు. సదస్సులో భాగంగా ఆవిష్కరణలు, భవిష్యత్తుకు అవసరమైన సాంకేతికతలు, డెమో జోన్స్, స్టార్టప్ పిచెస్, విద్యార్థుల ఆవిష్కరణలను ప్రదర్శించారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి అత్యాధునిక రంగాలపై చర్చలు జరిగాయి. మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, కేపీఎంజీ, క్లౌడ్ 4సీ, పాత్ర ఇండియా వంటి సంస్థల నిపుణులు తమ ప్రత్యక్ష ఉదాహరణలు, నైపుణ్యాలను పంచుకున్నారు. ఐటీఏఏపీ అధ్యక్షురాలు లక్ష్మీ ముక్కవిల్లి, జీఐఐ ఏపీ అధ్యక్షుడు జి.మురళీకృష్ణ, ఎస్టీపీఐ అదనపు డైరెక్టర్ డాక్టర్సురేష్, ఎఫ్ట్రానిక్స్ సీఈవో రామకృష్ణ దాసరి పాల్గొన్నారు. -
సంకల్పంతో స్వర్ణాంధ్ర సాధిద్దాం
ప్రజా ప్రతినిధులతో జరిగిన సమీక్షలో కలెక్టర్ మహారాణిపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీ–4 విధానం అమలు, ఆచరణలో అందరూ కలిసి రావాలని, సంపూర్ణ సహకారం అందించటం ద్వారా స్వర్ణాంధ్ర సాధనలో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. స్వర్ణాంధ్ర–2047, జిల్లా, నియోజవర్గ స్థాయి ప్రణాళికపై శనివారం సాయంత్రం కలెక్టరేట్లో ఆయన అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్ రాజు, పంచకర్ల రమేశ్ బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర–2047 విజన్లో భాగంగా పీ–4 విధానం అమలవుతుందని తెలిపారు. సమాజంలో దిగువ స్థాయిలో ఉన్న 20 శాతం మంది ప్రజలను పైకి తీసుకొచ్చేందుకు ఉన్నత స్థాయిలో ఉన్న ప్రజలు ముందుకు రావాల్సి ఉందన్నారు. కార్యక్రమ పర్యవేక్షణకు ఇన్చార్జి మంత్రి అధ్యక్షతన జిల్లా స్థాయిలో కమిటీ ఉంటుందన్నారు. పీ–4 విధానం అమల్లో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 73 వేల బంగారు కటుంబాలను గుర్తించామని, వాటిని మార్గదర్శకులకు అనుసంధానం చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర సాధనలో భాగంగా పేద ప్రజలకు ముందుగా ప్రభుత్వ యంత్రాంగం నుంచి అందాల్సిన సాయాన్ని అందించాలని, తర్వాత మిగిలిన వర్గాల నుంచి సాయం తీసుకోవాలని ప్రజా ప్రతినిధులు సూచించారు. స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు, సమాజంలో ఆర్థికంగా స్థిరపడిన వారి నుంచి సహాయం తీసుకుని పీ–4 విధానాన్ని పక్కాగా అమలు చేద్దామని, స్వర్ణాంధ్ర కలల సాకారాన్ని నిజం చేద్దామని ప్రజా ప్రతినిధులంతా పేర్కొన్నారు. అనంతరం అధికారులు, సామాజిక వేత్తల నుంచి సలహాలు, అభిప్రాయాలు సేకరించారు. వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు, పారిశ్రామికవేత్తలు, సీఐఐ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ కమిటీల్లో విశాఖ నేతలకు చోటు
తాటిచెట్లపాలెం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు నగరానికి చెందిన పలువురు నాయకులను పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో వివిధ హోదాల్లో నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విద్యార్థి విభాగం జాయింట్ సెక్రటరీగా బానాల తరుణ్కుమార్ (విశాఖ ఉత్తర), రాష్ట్ర వలంటీర్స్ విభాగం జనరల్ సెక్రటరీగా పులుగం శ్రీనివాసరెడ్డి(విశాఖ తూర్పు), రాష్ట్ర వలంటీర్స్ విభాగం జాయింట్ సెక్రటరీగా బుస అప్పలనాయుడు (విశాఖ పశ్చిమ), రాష్ట్ర సోషల్ మీడియా విభాగం సెక్రటరీగా గోపిరాజు వంక (విశాఖ పశ్చిమ), రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శులుగా జి.గణేష్రెడ్డి (విశాఖ తూర్పు), నమ్మి నాగేశ్వరరావు(విశాఖ ఉత్తర), రాష్ట్ర ఆర్టీఐ విభాగం సెక్రటరీగా సింగారపు సత్యనారాయణ (విశాఖ పశ్చిమ), రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ జాయింట్ సెక్రటరీగా ప్రగడ ప్రసాద్ (గాజువాక) నియమితులయ్యారు. -
ఘనంగా జగన్నాథుని తిరుగు యాత్ర
బీచ్రోడ్డు: ఉత్కళ్ సంస్కృతి సమాజ్ ఆధ్వర్యంలో జగన్నాథ స్వామి రథయాత్ర ముగింపు వేడుక శనివారం అత్యంత వైభవంగా జరిగింది. తొమ్మిది రోజుల కిందట లాసన్స్బే కాలనీలోని గుండిచా ఆలయానికి వెళ్లిన జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి తిరిగి దసపల్లాలోని ప్రధాన ఆలయానికి చేరుకున్నారు. భక్తులు భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగారు. ఈ ఊరేగింపులో ఒడిస్సీ, కూచిపూడి నృత్యాలు, ఒడిశా కళాకారుల ‘థింసా’నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రధాన ఆలయానికి చేరుకున్నాక.. లక్ష్మీదేవిని శాంతిపజేయడానికి జగన్నాథుడు రసగుల్లాలు సమర్పించే సంప్రదాయాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో సుమారు 3 వేల మంది భక్తులు పాల్గొని ప్రసాదం స్వీకరించారు. సమాజ్ అధ్యక్షుడు జె.కె. నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
గిరి ప్రదక్షిణ ఏర్పాట్లలోనూ అదే నిర్లక్ష్యం
● తొలిపావంచా వద్ద కూలిన షెడ్ ● మారని ఇంజినీరింగ్ అధికారుల తీరు ● తప్పిన పెను ప్రమాదం సింహాచలం: ఈ నెల 9, 10 తేదీల్లో జరగనున్న గిరి ప్రదక్షిణ ఉత్సవ ఏర్పాట్లలో భాగంగా సింహాచలం కొండదిగువ తొలి పావంచా వద్ద నిర్మిస్తున్న తాత్కాలిక షెడ్ శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడ భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన దేవస్థానం ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యాన్ని మరోసారి బహిర్గతం చేసింది. సింహాచలంలోని కొండ దిగువ తొలిపావంచాకి ఒక విశిష్టత ఉంది. గిరి ప్రదక్షిణ రోజుల్లో ఇక్కడే కొబ్బరికాయ కొట్టి భక్తులు నడక ప్రారంభిస్తారు. 32 కిలోమీటర్లు ప్రదక్షిణ చేసి తిరిగి ఇక్కడే కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణ ముగిస్తారు. ఆ రోజు తొలి పావంచా వద్ద నెలకునే రద్దీ అంతా ఇంతా కాదు. వీరి సౌకర్యార్థం తొలిపావంచా పక్కనే ఉన్న అర ఎకరం విశాల ప్రాంగణంలో దాదాపు 20 క్యూలను ఏర్పాటు చేశారు. భక్తులు ఎండ, వాన నుంచి రక్షణ పొందేందుకు రెండు రోజులుగా ఈ షెడ్లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ పనులను ఇంజినీరింగ్ పర్యవేక్షించకుండా పూర్తిగా కాంట్రాక్టర్పైనే వదిలేశారు. పైగా ఈసారి రాష్ట్రంలోని పలు దేవస్థానాల నుంచి 20 మంది వరకు ఇంజినీరింగ్ అధికారులను డిప్యూటేషన్పై ఇక్కడకు రప్పించారు. అయితే నిర్మాణ పనుల నాణ్యతను పర్యవేక్షించడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 30న చందనోత్సవం రోజున గోడకూలి ఏడుగురు మరణించిన ఘటన నుంచి కూడా అధికారులు పాఠాలు నేర్చుకోలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన దేవస్థానం ఈవో వి.త్రినాథరావు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రూ.5.80 లక్షల విలువైన ఈ పనులను కేఎస్ఆర్ సప్లయర్స్ అనే కాంట్రాక్టర్కు అప్పగించగా, వారు మరో సబ్–కాంట్రాక్టర్తో పనులు చేయిస్తున్నట్లు తెలిసింది. క్రేన్ సహాయంతో పనులు చేస్తుండగా షెడ్ కూలిందని ప్రాథమికంగా నిర్ధారించారు. భక్తుల భద్రత దృష్ట్యా, కూలిన షెడ్ను పూర్తిగా తొలగించాలని, ఇకపై ఎలాంటి షెడ్లు ఏర్పాటు చేయకుండా కేవలం క్యూలు మాత్రమే కొనసాగించాలని ఈవో ఆదేశించారు. ఉత్సవాల సమయంలో ఇదే ఘటన జరిగి ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేదని పలువురు భక్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కూటమి మోసాలు ఎండగడదాం..
● ఫేక్ రాజకీయాలు చేసేదే చంద్రబాబు ● ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం రా..? ● జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, కేకే రాజు ప్రజల పక్షాన గొంతు వినిపించాలిఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీకి మన అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, కార్యకర్తలే బలమని కొనియాడారు. ఏడాది కూటమి పాలనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు, మహిళలపై అఘాయిత్యాలు తప్ప ఏమి లేదన్నారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన గొంతు వినిపించాలని.. కూటమి వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. ఎన్నికలకు ముందు మ్యానిఫెస్టో పెట్టడం.. తరువాత వెబ్సైట్ నుంచి తొలగించడం చంద్రబాబుకు అలవాటని.. అందుకే మనం టెక్నాలజీతో మొబైల్లోనే మ్యానిఫెస్టో చూపిద్దామన్నారు. విశాఖలో ఎకరా 99 పైసలకే కారుచౌకగా ప్రభుత్వ భూములను ధారాదత్తం చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని భూస్థాపితం చేస్తానని పగటి కలలు కంటున్నాడని, సోనియాగాంధీ వల్లే కాలేదు.. నువ్వేమి చేయగలవన్నారు. సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని ఎండగడతామని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. శనివారం రుషికొండ ఏ1 గ్రాండ్ హోటల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముందుగా పార్టీ నేతలంతా మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ.. రీకాలింగ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో’ క్యూఆర్ స్కాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఏవిధంగా మోసం చేస్తుందో క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి ప్రజలకు వివరించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫొటోలు, సంతకాలతో కూడిన మ్యానిఫెస్టో, బాండ్లను ఎన్నికల ముందు ఇంటింటికీ అందజేశారన్నారు. వాటిని ఇప్పుడు చెత్తబుట్టకే పరిమితం చేశారన్నారు. మ్యానిఫెస్టోలో హామీలు అమలు చేయలేదని ప్రశ్నిస్తే.. నాలుక మందమని చంద్రబాబు, తాటతీస్తానని పవన్కల్యాణ్ అంటున్నారని మండిపడ్డారు. సూపర్సిక్స్ హామీలు అమలు చేయకుండానే అన్ని ఇచ్చేశానని చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. తమ పార్టీని ఫేక్ అంటున్న ఆయన, హామీలు ఎగ్గొట్టిన కూటమి ప్రభుత్వం పెద్ద ఫేక్, ఆరాచకాలు చేస్తున్న టీడీపీ ఫేక్ అని అన్నారు. ఇంతకీ ఎవరు ఫేక్ అనేది ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం రా..? అని సవాల్ విసిరారు. ఆగస్టులో ఉచిత బస్సు పథకం అమలు అంటున్నారు. అ వి పరిమితులతో కూడినవని లీక్లు ఇస్తున్నారన్నారు. ఆడబిడ్డ నిధి, పీ–4 అంటూ కాలయాపన చేస్తున్నారు. ఈ ఏడాదిలో ఏప్రిల్, మే నెలలో అన్నదాత సుఖీభవ అందజేస్తామని శాసనమండలిలో లోకేష్ చెప్పారని.. తండ్రి వంద అబద్ధాలు మాట్లాడితే.. కొడుకు 200 అబద్ధాలు, మోసాలు మాట్లాడుతున్నాడన్నారు. ● భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన అన్నీ హామీలు అమలు చేశాం.. కానీ దురదృష్టవశాత్తు ఓటమి పాలయ్యాం తప్ప ప్రజల మనస్సులో వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రేమ, అభిమానం పోలేదన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో విశాఖలో కబ్జాలు, మోసాలు, దందాలు మాత్రమే జరుగుతున్నాయని, ప్రజల సంక్షేమం కోసం కనీసం ఆలోచన చేయడం లేదన్నారు. ● ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మాట్లాడుతూ కూటమి పార్టీలు ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేసిన పాపాన పోలేదన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను, ప్రసంగాలను ఒక్కసారి ప్రజలకు గుర్తుచేయాలన్నే ఉద్దేశంతో క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా మీ ముందుకు తెచ్చామన్నారు. ఈ మోసాలను గ్రామాల్లో, వార్డుల్లో ప్రతీ ఒక్కరికి వివరించాలన్నారు. ● ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ ఎన్ఏడీ అంటే నేరాలు, అత్యాచారాలు, దాడులుగా మారిందన్నా రు. ఏడాది పాలనలో రాష్ట్రంలో రోజుకు సగటున 70 మందిపై మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నట్లు హోంమంత్రే వెల్లడించారన్నారు. ఏడాదిలో ప్రజలకు ఇవ్వాల్సిన రూ.81 వేల కోట్ల సంక్షేమానికి ఎగవేశారన్నారు. కూటమి నేతలు సుపరిపాలనకు తొలి అడుగు అంటున్నారని.. సుపరిపాలనకు ఇది తుంటి అడుగు మాత్రమేనని ఎద్దేవా చేశారు. ● తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు మాట్లాడుతూ ఈ సమావేశం పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపిందన్నారు. కూటమి ఏడాది పాలనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు, కేసులు పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలుచేశారన్నారు. సంక్షేం, అభివృద్ధి, యువత, నిరుద్యోగుల భవిష్యత్తు అన్ని కాలరాసి.. కూటమి నాయకులు, కార్యకర్తల జేబులు నింపుకుంటున్న పరిస్థితులు ఉన్నాయన్నారు. ● దక్షిణ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ మాట్లాడుతూ బాబే మోసం.. ఎంతో మందిని తొక్కేసి వెన్నుపోటు పొడిచి ఎలా ఎదిగాడో ప్రజలందరికీ తెలుసన్నారు. దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో కూడా ఏడాది కాలంలో ప్రభుత్వంపై ఇంత పెద్ద స్థాయిలో వ్యతిరేకత లేదన్నారు. రానున్న ఎన్నికల్లో సింగిల్గా గెలవగలవా పవన్ కల్యాణ్ అని ప్రశ్నించారు. జమిలీ ఎన్నికలు వస్తే నా చాప్టర్ క్లోజ్ అని మోదీ, అమిత్ షా కాళ్లు మీద పడుతున్న పరిస్థితి చంద్రబాబుదన్నారు. ● మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ మాట్లాడుతూ కూటమి ఏడాది పాలనలో ఏమి చేశారని ప్రజల ముందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. మామను వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్న నాటి నుంచి నేటి వరకు పొత్తులతోనే పోటీ చేసి చంద్రబాబు అధికారం చేపట్టారన్నారు. మానిఫెస్టోలో హామీలను వంద శాతం అమలుచేసిన ఘనత జగన్మోహన్రెడ్డికి దక్కిందన్నారు. ● విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు కదిరి బాబూరావు మాట్లాడుతూ బాబు వస్తే జాబ్ గ్యారెంటీ అన్నారు. నిరుద్యోగులకు భృతి అన్నారు. ఇలా రైతు నుంచి విద్యార్థి వరకు అన్ని వర్గాల వారిని ఈ ప్రభుత్వం మోసం చే స్తోందన్నారు. ● గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్రెడ్డి మాట్లాడుతూ జగనన్న అడుగు జాడల్లో మనం అడుగు వేసి కూటమి మోసాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, పసుపులేటి బాలరాజు, జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర, మాజీ ఎమ్మెల్యేలు అన్నంరెడ్డి అదీప్రాజ్, తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకటరామయ్య, మాజీ మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, డిప్యూటీ మేయర్ కె.సతీష్, పార్టీ కార్యాలయ పర్యవేక్షకుడు రవిరెడ్డి, రాష్ట్ర అనుబంధ విభాగల అధ్యక్షులు బొల్లవరపు జాన్ వెస్లీ, పేర్ల విజయ్ చందర్, జీవిఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, ముఖ్యనేతలు రొంగలి జగన్నాథం, జియ్యాని శ్రీధర్, ఉరుకూటి అప్పారావు, వుడా రవి, ఐహెచ్ ఫరూఖీ, బోని శివరామకృష్ణ, అల్లు శంకర్రావు, పిల్లా సుజాత సత్యనారాయణ, పోతిన శ్రీనివాసరావు, పిల్లి సుజాత నూకరాజు, అల్లంపల్లి రాజుబాబు, దాట్ల వెంకట అప్పల ప్రసాద్ రాజు, మహంతి, మంతెన మాధవి వర్మ, పల్లా చిన్నతల్లి, డాక్టర్ జహీర్ అహ్మద్, సతీష్ వర్మ, మంత్రి రాజశేఖర్, నడిపంపల్లి కృష్ణంరాజు, బోని బంగారు నాయుడు, చెన్నా జానకీరామ్, గల్లా శ్రీనివాస్, గండ్రెడ్డి శ్రీనివాస్, మువ్వల సురేష్, ద్రోణంరాజు శ్రీ వాస్తవ, బాకీ శ్యామ్కుమార్ రెడ్డి, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు అబంటి శైలేష్ , ఉరుకూటి చందు, పేడాడ రమణి కుమారి, బోని అప్పలనాయుడు, సనపల రవీంద్ర భరత్, బర్కత్ అలీ, పులగం కొండా రెడ్డి, మామిడి శివ రామకృష్ణ, సేనాపతి అప్పారావు, పీలా ప్రేమ కిరణ్ జగదీష్, రామి రెడ్డి, చిక్కాల సత్యనారాయణ, అనిల్ కుమార్, కల్పన, దిలిప్ కుమార్, బాజీ నాయుడు, మారుతీ ప్రసాద్, బోండా ఉమామహేశ్వర రావు, వాసుపల్లి యల్లాజీ, జీలకర్ర నాగేంద్ర, దేవరకొండ మార్కేండేయులు, నీలి రవి, శ్రీదేవివర్మ, బయ్యవరపు రాధ, పార్టీ జిల్లా కార్యదర్శులు, రాష్ట్ర అనుబంధ విభాగం ఉపాధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ విభాగం జోనల్ అధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ విభాగం ప్రధాన కార్యదర్శులు, అసెంబ్లీ నియోజకవర్గ అనుబంధ విభాగం అధ్యక్షులు, పార్టీ జిల్లా అధికారి ప్రతినిధులు, మండల, డివిజన్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ విభాగం సభ్యులు, మండల, వార్డు, జిల్లా కమిటీ సభ్యులు, మండల, జిల్లా అనుబంధ విభాగం కమిటీ సభ్యులు, డివిజన్ అనుబంధ విభాగం అధ్యక్షులు, పోలింగ్ బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు. హాజరైన పార్టీ కార్యకర్తలు‘బాబు ష్యూరిటీ–మోసాలు గ్యారెంటీ’ పేరిట చంద్రబాబు మ్యానిఫెస్టోను గుర్తు చేద్దాం విలువలు, విశ్వసనీయత అంటేనే జగన్పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ గత ఐదేళ్లలో విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలను పరిచయం చేసిందే వైఎస్ జగన్మోహన్రెడ్డిని కొనియాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అధికారం చేపట్టిన మరుక్షణం అమలుచేశాన్నారు. కూటమి నేతలు సూపర్ సిక్స్తోపాటు 140కి పైగా హామీలు ఇచ్చి గద్దెనెక్కాక వాటిని విస్మరించారన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి రీకాలింగ్ బాబుస్ మానిఫెస్టో పేరిట చంద్రబాబు హామీలన్నీ గుర్తు చేయాలన్నారు. గ్రామ స్థాయి, మండల స్థాయి, వార్డుల్లో కూడా సమావేశాలను ఏర్పాటు చేసి ప్రజలకు కూటమి మోసాలు, వైఫల్యాలను వివరిద్దామన్నారు. ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబురాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ పీ4తో పేదరికం పోగొట్టగలరా..? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నాడన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా పాలన సాగిందన్నారు. ‘బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ‘ పేరిట ప్రతి ఇంటికి వెళ్లి క్యూ ఆర్ కోడ్ ద్వారా రీకాలింగ్ బాబుస్ మానిఫెస్టో పేరిట వివరించాలన్నారు. -
రూ.103 కోట్లతో జైళ్ల అభివృద్ధి
ఆరిలోవ: రాష్ట్రంలో వివిధ జైళ్లలో రూ.103 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఏపీ జైళ్ల శాఖ ఐజీ ఇండ్ల శ్రీనివాస్ తెలిపారు. ఈ పనుల కోసం పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ సిద్ధం చేసిన డిజైన్ను అప్రూవల్ కోసం ప్రభుత్వానికి పంపించామని, అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని తెలియజేశారు. విశాఖ కేంద్ర కారాగారాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఇక్కడ జైల్ సూపరింటెండెంట్ ఎం.మహేష్బాబు, డిప్యూటీ సూపరింటెండెంట్లు జవహర్బాబు, సాయి ప్రవీణ్, సూర్యకుమార్, జైలర్లతో కలసి పలు బ్యారక్లు, ఆస్పత్రులను పరిశీలించారు. ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాలు, అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జైళ్ల అభివృద్ధికి కృషి జరుగుతోందన్నారు. విశాఖ కేంద్ర కారాగారంలో రూ.10 కోట్లతో 250 మంది ఖైదీల సామర్ధ్యం కలిగిన కొత్త బ్యారక్ నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు. ఐసీజీఎస్ 2.0తో శాఖల మధ్య సమన్వయం జైళ్ల శాఖతో పోలీస్, న్యాయ శాఖలను అనుసంధానం చేస్తూ ఇంటిగ్రేటెడ్ క్రిమినల్ జస్టిస్ సిస్టం 2.0(ఐసీజీఎస్) టెక్నాలజీని ఏర్పాటు చేశామని, దీని వల్ల ఆ మూడు శాఖల మధ్య సమన్వయం ఏర్పడుతుందని తెలిపారు. ల్యాప్టాప్లు, డెస్క్ టాప్లు వినియోగించి, ఆన్లైన్ విధానం అమలు జరుగుతుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 14 కేంద్ర కారాగారాల్లో సూపరింటెండెంట్లకు ఒక్కో ల్యాప్టాప్ చొప్పున అందించామన్నారు. వీటితో పాటు అన్ని కేంద్ర కారాగారాలు, జిల్లా, సబ్ జైళ్లకు మరో 108 డెస్క్టాప్లు అందించామని తెలిపారు. దీనివల్ల సాంకేతిక, పరిపాలనా విధానం, సీసీ కెమెరాల పనితీరు, అవి ఏ విధమైన సాంకేతికతతో కూడి ఉన్నాయి, ఖైదీల పూర్తి వివరాలు, బయోమెట్రిక్ విధానం తదితర అంశాలు స్పష్టంగా నమోదై ఉంటాయన్నారు. ఆ వివరాలు అవసరం మేరకు అందుబాటులో ఉంటాయని వివరించారు. జైళ్ల శాఖ ఐజీ ఇండ్ల శ్రీనివాస్ -
లోక్ అదాలత్లో 10,136 కేసుల పరిష్కారం
కేసుల రాజీలో రాష్ట్రంలో రెండో స్థానంవిశాఖ లీగల్: హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం నిర్వహించిన మెగా జాతీయ లోక్ అదాలత్లో 10,136 కేసులను పరిష్కరించి, ఉమ్మడి విశాఖ జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచిందని విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు తెలిపారు. సివిల్ 291, క్రిమినల్లో 9713, ప్రీ లిటిగేషన్లో 132 కేసులు రాజీ చేశామని వివరించారు. ఉమ్మడి విశాఖలో కేసుల రాజీకి 37 బెంచీలు ఏర్పాటు చేశామన్నారు. అత్యధికంగా ఒక కేసులో బీమా సంస్థ 80 లక్షలు చెల్లించి రికార్డు నెలకొల్పిందన్నారు. సంస్థ ప్రతినిధులను జిల్లా న్యాయమూర్తి అభినందించారు. జిల్లావ్యాప్తంగా 4,900 కేసులు గుర్తించగా ఇప్పటికే 5,000 కేసులు వరకు రాజీ చేశామని న్యాయమూర్తి తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో కొనసాగిందన్నారు. కేసుల రాజీ వల్ల మొత్తం దాదాపు రూ.25 కోట్ల వరకు ఉంది. న్యాయ సేవ ప్రాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎంకే శ్రీనివాస్, రాష్ట్ర బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు ఎస్.కృష్ణమోహన్, ఇతర సభ్యులు పాల్గొన్నారు. -
ఏడాది పాలన సంతృప్తినిచ్చింది
మహారాణిపేట: జిల్లా కలెక్టర్గా ఏడాది పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషాన్ని, సంతృప్తినిచ్చిందని కలెక్టర్ ఎం.ఎన్.హరిందిర ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పర్యాటక, విద్యా, ఐటీ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. రైల్వే జోన్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవడం, మెట్రో రైలుకు భూసేకరణ వంటి కీలక పనులు తన హయాంలోనే జరగడం శుభపరిణామమని అన్నారు. ఈ ఏడాది కాలంలో ప్రధానమంత్రి రెండుసార్లు విశాఖను సందర్శించడం, విశాఖ వేదికగా ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన, పలు జాతీయ రహదారుల ప్రారంభోత్సవాలు చేపట్టడం సంతోషించదగ్గ పరిణామాలని పేర్కొన్నారు. యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకోవడం మరిచిపోలేని అనుభూతినిచ్చిందని కలెక్టర్ గుర్తుచేసుకున్నారు. మరికొద్ది రోజుల్లో డబుల్ డెక్కర్ బస్సులు నగరంలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. నగరంలో పేరున్న హోటళ్ల నిర్మాణం శరవేగంగా సాగుతోందని చెప్పారు. విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు సుమారు 45 నిమిషాల్లోనే చేరుకునే విధంగా రోడ్డు, వంతెనల నిర్మాణాలు వచ్చే జూన్ నాటికి పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. షీలానగర్ నుంచి సబ్బవరం వరకు జాతీయ రహదారి నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. విశాఖ నగరంలో 33 శాతం పైబడి పచ్చదనం ఉండేలా చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ హరేందిర ప్రసాద్ వెల్లడించారు. కలెక్టర్ హరేందిర ప్రసాద్ -
సమన్వయంతో విజయవంతం చేద్దాం
గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై కలెక్టర్ హరేందిర ప్రసాద్ సమీక్ష మహారాణిపేట: శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించే గిరి ప్రదక్షిణ మహోత్సవాన్ని సమన్వయంతో విజయవంతం చేద్దామని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అన్నారు. కలెక్టరేట్లో శనివారం జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరి ప్రదక్షిణకు 5–6 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున పటిష్టమైన పోలీస్ బందోబస్తు, క్యూలు, రద్దీ ప్రదేశాల్లో తోపులాటలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రతి 200 మీటర్లకు ఒకటి చొప్పున 132 తాగునీటి పాయింట్లు, 500 మరుగుదొడ్లు, ఆరు కంట్రోల్ రూమ్లు, ఐదు చోట్ల పబ్లిక్ అడ్రస్ సిస్టం, 13 పార్కింగ్ ప్రాంతాలు, 50 ఉచిత బస్సు సర్వీసులు, 18 నెట్వర్కింగ్ ఆసుపత్రులకు అనుసంధానంగా 32 వైద్య శిబిరా లు, 18 అంబులెన్సులు సిద్ధం చేసినట్లు చెప్పారు. రద్దీ ప్రాంతాల్లో 190 ఎల్ఈడీ దీపాలు, నిరంతర విద్యుత్ సరఫరా కోసం 9 జనరేటర్లు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా 9, 10 తేదీల్లో మద్యం దుకాణాలు మూసివేత, అప్పుఘర్ వద్ద 5 బోట్లు, 60 మంది గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారని కలెక్టర్ వెల్లడించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు సూచించారు. 2 గంటలకు ప్రచార రథం ప్రారంభం దేవస్థానం ఈవో త్రినాథరావు మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు తొలిపావంచా వద్ద అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు ప్రచార రథాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. ఆ రోజు రాత్రి 10 నుంచి 11 గంటల మధ్యలో రథం ఆలయానికి చేరుకుంటుందని, స్వామి పవళింపు సేవ, ఇతర లాంఛనాల అనంతరం 10వ తేదీ ఉదయం 5 గంటలకు స్వామి దర్శనాలు ప్రారంభమవుతాయని చెప్పారు. -
తూర్పు తీరంలో పగడపు దిబ్బలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ తీరంలోని పూడిమడక, రుషికొండ, మంగమారిపేట, విజయనగరం జిల్లా చింతపల్లి వద్ద అరుదైన పగడపు దిబ్బలకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. ఎన్విరాన్మెంటల్ సైన్స్ అరై్కవ్స్లో ప్రచురితమైన ‘డైవర్సిటీ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కోరల్ కమ్యూనిటీ ఫ్రం విశాఖపట్నం కోస్ట్, ఏపీ’ అనే ఆర్టికల్లో ఈ విషయం స్పష్టమైంది. జూలై 1న ప్రచురితమైన ఈ నివేదిక, ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరం కూడా పగడపు దిబ్బలకు నెలవుగా ఉందని తేటతెల్లం చేసింది. తద్వారా ఇప్పటివరకు పగడపు దిబ్బలు ఉన్నాయని పేర్కొంటూ వచ్చిన నివేదికలకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించిందని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) చేసిన సర్వేలో పాల్గొన్న లివిన్ అడ్వెంచర్స్ ఫౌండర్ బలరాం ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటివరకు పగడపు దిబ్బలు భారతదేశంలో లక్షద్విప్, అండమాన్–నికోబార్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, గల్ఫ్ ఆఫ్ కచ్లకే పరిమితమని భావించేవారు. ఇందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్లోని తూర్పు తీరం కూడా పగడపు దిబ్బలకు నెలవుగా ఉందని అంతర్జాతీయ తేటతెల్లమయింది. 2019 నుంచి 2023 వరకు...! వాస్తవానికి పగడపు దిబ్బల ఉనికి కోసం డేటాను సేకరించేందుకు, పరిశోధన చేసేందుకు 2019 నుంచి 2023 వరకు విజయనగరం జిల్లాలోని చింతపల్లి నుంచి పూడిమడక వరకూ సర్వే చేశారు. మొత్తం 15 ప్రదేశాల్లో ఈ అధ్యయనం సాగింది. ఈ అధ్యయన నివేదికలు పలుమార్లు వెలువరించారు. అయితే అంతర్జాతీయ గుర్తింపు లభించడం ఇదే మొదటిసారి. తద్వారా ఆంధ్రా తీరం సముద్ర జీవ వైవిధ్యానికి నెలవుగా ఉందని అధికారికంగా గుర్తింపు లభించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చింతపల్లి నుంచి పూడిమడక వరకు 15 ప్రదేశాల్లో జరిపిన అధ్యయనం సందర్భంగా సాగర గర్భంలో 30 మీటర్ల లోతుల వరకు అన్వేషణ సాగించారు. స్థానిక స్కూబా డైవింగ్ సంస్థ లివిన్ అడ్వెంచర్స్తో కూడిన నలుగురు శాస్త్రవేత్తల బృందం ఈ అధ్యయనాన్ని చేపట్టింది. పొరిటిడే, అగారిసిడె, డెండ్రోఫిలిడే వంటి అరుదైన పగడపు దిబ్బలున్నట్టు గుర్తించారు. వాస్తవానికి చింతపల్లి వద్ద 12 రకాల పగడపు దిబ్బలు, రుషికొండ వద్ద 6, పూడిమడక వద్ద 5, మంగమారిపేట వద్ద 3 రకాల పగడపు దిబ్బలు ఉన్నట్లు గుర్తించారు. చింతపల్లి వద్ద ఎక్కువగా పగడపు దిబ్బలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, పూడిమడక వద్ద ఉన్న పగడపు దిబ్బల్లో కొంతభాగం తీసి మరో చోటికి తరలించి పెంచేందుకూ అవకాశం ఉందని తేలింది. యాంటీ క్యాన్సర్ మందుల తయారీకీ...! సముద్ర గర్భంలో ఉండే ఈ పగడపు దిబ్బలు సముద్ర పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉపయోగమనే అభిప్రాయం ఉంది. పగడాల ద్వారా వచ్చే కాల్షియం కార్పొనేట్ వల్ల ఇవి ఏర్పడతాయి. వీటిలో కొన్ని పోషకాలు ఉంటాయి. ఈ పగడపు దిబ్బల ద్వారా సముద్రంలో ఉండే జీవరాశులు మరింతగా పెరిగేందుకు దోహదం చేస్తాయనేది శాస్త్రవేత్తల అభిప్రాయం. ఈ పగడపు దిబ్బలను యాంటీ బయోటిక్స్, యాంటీ క్యాన్సర్ వంటి మెడిసిన్స్ తయారీలోనూ ఉపయోగిస్తారని తెలుస్తోంది. అంతేకాకుండా సముద్రతీరం కోతకు గురికాకుండా సహజసిద్ధంగా ఇవి కాపాడతాయని కూడా అధ్యయనాల్లో తేలింది. మరోవైపు అలల తీవ్రతను కూడా తగ్గించేందుకు ఇవి దోహదం చేస్తాయి. ఈ నేపథ్యంలఈ పగడపు దిబ్బలు స్కూబా డైవింగ్, స్నోర్కింగ్ ద్వారా టూరిజం అభివృద్ధికి కూడా దోహదం చేస్తాయి. అంతర్జాతీయంగా తొలిసారి గుర్తింపు మన సముద్ర తీరంలో పగడపు దిబ్బలు ఉన్నట్టు గతంలో మేం జీఎస్ఐతో కలిపి జరిపిన అధ్యయనంలో తేలింది. అయితే, ఈ అధ్యయనానికి తొలిసారిగా ఈ నెల 1వ తేదీన ప్రచురణ ద్వారా అంతర్జాతీయ గుర్తింపు లభించింది. పగడపు దిబ్బల ద్వారా మత్స్య సంపదకు ఎంతో ఉపయోగం. కాలుష్యం బారిన పడకుండా వీటిని కాపాడుకోవాల్సిన అవసరం మాత్రం ఎంతో ఉంది. – బలరాం, లివిన్ అడ్వెంచర్స్, ఫౌండర్ -
జూన్, జూలైలో నిరాశ... ఆగస్టుపైనే ఆశ..!
సాక్షి, విశాఖపట్నం: రుతుపవనాలు ప్రవేశించి నెల గడిచినా.. రాష్ట్రంలో లోటు వర్షపాతం కొనసాగుతోంది. ఆగస్ట్లో వరుసగా రాబోతున్న రెండు అల్పపీడనాలు బలపడితే మంచి వర్షాలకు ఆస్కారం ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రైతుకు ఇది కొంత ఉపశమనం కలిగించే మాటే అయినప్పటికీ, వాస్తవ పరిస్థితి ఎలా ఉంటుందన్న ఆలోచనే ఆందోళనకు గురిచేస్తోంది. దశాబ్ద కాలం తర్వాత.. వాతావరణ శాఖ అంచనాలకు అనుగుణంగా ముందస్తుగా నైరుతి పలకరించడంతో అన్నదాతలు ఖుషీ అయ్యారు.మే నెలాఖరులో కురిసిన భారీ వర్షాలతో.. ఏరువాకకు ముందే పంటల సాగు ప్రారంభించారు. కానీ జూన్లో ఆశించిన మేర వర్షాలు నమోదు కాకపోవడంతో రైతుల కళ్లల్లో ఆందోళన ఛాయలు కనిపిస్తున్నాయి. మబ్బులు పట్టినా వర్షం పూర్తిస్థాయిలో కురవలేదు. ప్రతి రోజూ వర్షం కురిసినట్లే అనిపించినా.. భారీ వర్షాలు లేకపోవడంతో.. లోటు వర్షపాతం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది.జూన్ 1 నుంచి జూలై 5 వరకూ రాష్ట్ర సగటు వర్షపాతం 115.6 మిల్లీమీటర్లుగా ఉండాల్సి ఉండగా, 93.9 మిల్లీమీటర్లే నమోదైంది. జూలై మొదటి వారంలో అన్ని జిల్లాల్లోనూ ముసురు వాతావరణం కనిపించినా లోటు పూడ్చేంత భారీ వానలు కురవలేదు. ఈ నెలలోనూ ఆశించిన స్థాయి వర్షాలు పడే సూచనలు కనిపించడం లేదు. ఈ నెల మూడో వారంలో ఏర్పడే అల్పపీడనం ఏమైనా ఫలితాలిచ్చే అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అడపాదడపా వర్షాలు కురిసినప్పటికీ, అవి లోటును భర్తీ చేసే స్థితిలో లేకపోవడంతో.. ఆగస్టు నెలలో కురిసే వానలపైనే రైతు ఆశలు పెట్టుకున్నాడు. -
సింహాచలం అప్పన్న సన్నిధిలో మరో ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: చందనోత్సవం ఘటన మరువకముందు సింహాద్రి అప్పన్న సన్నిధిలో మరో ప్రమాదం జరిగింది. తొలిపావంచా వద్ద గిరి ప్రదక్షిణ కోసం వేసిన భారీ రేకుల షెడ్డు కూలిపోయింది. ఈ సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కూటమి ప్రభుత్వంలో ఆలయాల పట్ల, భక్తుల పట్ల వహిస్తున్న నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. సింహాద్రి అప్పన్న సన్నిధిలో శనివారం(జులై 5న) తొలిపావంచా వద్ద వేసిన భారీ రేకుల షెడ్డూ కూలిపోయింది. ఫోల్స్ క్రింద కాంక్రీట్ వేయక పోవడంతో బరువు ఎక్కువై షెడ్డు కూలిందని నిర్ధారణ అయ్యింది. షెడ్డు కింద ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 9వ తేదీన గిరి ప్రదక్షిణ జరగాల్సి ఉండగా.. ఇప్పుడు ఈ ప్రమాదంతో ఏర్పాట్లపై భక్తులు ఆందోళన చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే సింహాద్రి అప్పన్న చందనోత్సవం సందర్భంగా జరిగిన దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 30వ తేదీన ఈదురు గాలితో నాసిరకం గోడ కూలిపోయి క్యూ లైన్లో ఉన్న భక్తుల మీద పడింది. ఆ ఘటనలో మరో 15 మందికి గాయాలయ్యాయి కూడా. ఇది మరువకముందు అదే ఆలయ ప్రాంగణంలో మరో ఘటన చోటుచేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అంతకు ముందు.. ఈ ఏడాది తిరుపతిలో జనవరి 8వ తేదీన వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ క్యూలైన్లలో తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతిచెందారు. 44 మంది తీవ్రంగా గాయపడ్డారు. పవిత్ర పుణ్యక్షేత్రాల్లో వరుసగా చోటు చేసుకుంటున్న అపచారాలు, అనూహ్య ఘటనలు భక్త కోటిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతూ.. వారి భద్రత పట్ల సర్కారు తీవ్ర నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేస్తున్నాయి. ఇప్పుడు మరో ప్రమాదం.. చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
తూర్పు తీరంలో పగడపు దిబ్బలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ తీరంలోని పూడిమడక, రుషికొండ, మంగమారిపేట, విజయనగరం జిల్లా చింతపల్లి వద్ద అరుదైన పగడపు దిబ్బలు ఉన్నాయని అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. ఎన్విరాన్మెంటల్ సైన్స్ అరై్కవ్స్లో ప్రచురితమైన ‘డైవర్సిటీ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కోరల్ కమ్యూనిటీ ఫ్రం విశాఖపట్నం కోస్ట్, ఏపీ’ అనే ఆరి్టకల్లో ఈ విషయం స్పష్టమైంది. జూలై 1న ప్రచురితమైన ఈ నివేదిక, ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరం కూడా పగడపు దిబ్బలకు నెలవుగా ఉందని తేటతెల్లం చేసింది. తద్వారా ఇప్పటివరకు పగడపు దిబ్బలు ఉన్నాయని పేర్కొంటూ వచ్చిన నివేదికలకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించిందని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) చేసిన సర్వేలో పాల్గొన్న లివిన్ అడ్వెంచర్స్ ఫౌండర్ బలరాం ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటివరకు పగడపు దిబ్బలు భారతదేశంలో లక్షదీ్వప్, అండమాన్–నికోబార్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, గల్ఫ్ ఆఫ్ కచ్లకే పరిమితమని భా వించేవారు. ఇందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్లోని తూర్పు తీరం కూడా పగడపు దిబ్బలకు నెలవు గా ఉందని అంతర్జాతీయ తేటతెల్లమయింది. 2019 నుంచి 2023 వరకు...! వాస్తవానికి పగడపు దిబ్బల ఉనికి కోసం డేటాను సేకరించేందుకు, పరిశోధన చేసేందుకు 2019 నుంచి 2023 వరకు విజయనగరం జిల్లాలోని చింతపల్లి నుంచి పూడిమడక వరకూ సర్వే చేశారు. మొత్తం 15 ప్రదేశాల్లో ఈ అధ్యయనం సాగింది. ఈ అధ్యయన నివేదికలు పలుమార్లు వెలువరించారు. అయితే అంతర్జాతీయ గుర్తింపు లభించడం ఇదే మొదటిసారి. తద్వారా ఆంధ్రా తీరం సముద్ర జీవ వైవిధ్యానికి నెలవుగా ఉందని అధికారికంగా గుర్తింపు లభించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చింతపల్లి నుంచి పూడిమడక వరకు 15 ప్రదేశాల్లో జరిపిన అధ్యయనం సందర్భంగా సాగరగర్భంలో 30 మీటర్ల లోతుల వరకు అన్వేషణ సాగించారు. స్థానిక స్కూబా డైవింగ్ సంస్థ లివిన్ అడ్వెంచర్స్తో కూడిన నలుగురు శాస్త్రవేత్తల బృందం ఈ అధ్యయనాన్ని చేపట్టింది. పొరిటిడే, అగారిసిడె, డెండ్రోఫిలిడే వంటి అరుదైన పగడపు దిబ్బలున్నట్టు గుర్తించారు. వాస్తవానికి చింతపల్లి వద్ద 12 రకాల పగడపు దిబ్బలు, రుషికొండ వద్ద 6, పూడిమడక వద్ద 5, మంగమారిపేట వద్ద 3 రకాల పగడపు దిబ్బలు ఉన్నట్టు గుర్తించారు. చింతపల్లి వద్ద ఎక్కువగా పగడపు దిబ్బలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, పూడిమడక వద్ద ఉన్న పగడపు దిబ్బల్లో కొంతభాగం తీసి మరో చోటికి తరలించి పెంచేందుకూ అవకాశం ఉందని తేలింది. అంతర్జాతీయంగా తొలిసారి గుర్తింపు మన సముద్ర తీరంలో పగడపు దిబ్బలు ఉన్నట్టు గతంలో మేం జీఎస్ఐతో కలిపి జరిపిన అధ్యయనంలో తేలింది. అయితే, ఈ అధ్యయనానికి తొలిసారిగా ఈ నెల 1వ తేదీన ప్రచురణ ద్వారా అంతర్జాతీయ గుర్తింపు లభించింది. పగడపు దిబ్బల ద్వారా మత్స్యసంపదకు ఎంతో ఉపయోగం. కాలుష్యం బారిన పడకుండా వీటిని కాపాడుకోవాల్సిన అవసరం మాత్రం ఎంతో ఉంది. – బలరాం, లివిన్ అడ్వెంచర్స్, ఫౌండర్ సముద్ర గర్భంలో యాంటీ క్యాన్సర్ మందుల తయారీ ...! సముద్ర గర్భంలో ఉండే ఈ పగడపు దిబ్బలు సముద్ర పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉపయోగమనే అభిప్రాయం ఉంది. పగడాల ద్వారా వచ్చే కాల్షియం కార్బోనేట్ వల్ల ఇవి ఏర్పడతాయి. వీటిలో కొన్ని పోషకాలు ఉంటాయి. ఈ పగడపు దిబ్బల ద్వారా సముద్రంలో ఉండే జీవరాశులు మరింతగా పెరిగేందుకు దోహదం చేస్తాయనేది శాస్త్రవేత్తల అభిప్రాయం. అంతేకాకుండా ఈ పగడపు దిబ్బలను యాంటీ బయోటిక్స్, యాంటీ క్యాన్సర్ వంటి మెడిసిన్స్ తయారీలోనూ ఉపయోగిస్తారని తెలుస్తోంది. అంతేకాకుండా సముద్రతీరం కోతకు గురికాకుండా సహజసిద్ధంగా ఇవి కాపాడతాయని కూడా అధ్యయనాల్లో తేలింది. మరోవైపు అలల తీవ్రతను కూడా తగ్గించేందుకు ఇవి దోహదం చేస్తాయి. ఈ నేపథ్యంలో వీటి పగడపు దిబ్బలను చూసేందుకు స్కూబా డైవింగ్, స్నోర్కింగ్ ద్వారా టూరిజం అభివృద్ధికి కూడా దోహదం చేస్తాయి. -
గంటాను గెలిపించి తప్పు చేశాం..
విశాఖపట్నం: ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యవహారశైలిపై అసంతృప్తితో ఉన్న జీవీఎంసీ భీమిలి జోన్ 2, 3 వార్డు నాయకులు, భీమిలి మండల నాయకులు శుక్రవారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీకి ఫిర్యాదు చేశారు. గంటాను గెలిపించుకోవడం తమకు భస్మాసురహస్తం అయిందని వారు బాబ్జీ వద్ద వాపోయినట్లు తెలిసింది. ఈ నెల 7న తాళ్లవలసలో జరగనున్న ‘సుపరిపాలన తొలి అడుగు’ కార్యక్రమం గురించి అదే గ్రామానికి చెందిన పార్టీ మండల అధ్యక్షుడు డీఏఎన్ రాజుకు ఇప్పటివరకు సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గంటా వెంట ఉన్న వ్యక్తి (స్వామి) ఇప్పుడు కూటమి నాయకుల నెత్తిన కూర్చుని సెటిల్మెంట్లు చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. గంటా శైలి మారకపోతే తమ దారి తాము చూసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. శనివారం ఢిల్లీ నుంచి రానున్న ఎంపీ భరత్కు ఫిర్యాదు చేసిన అనంతరం.. అమరావతి వెళ్లి పార్టీ అధిష్టానం దృష్టికి తమ సమస్యను వివరిస్తామని నాయకులు తెలిపారు. బాబ్జీకి ఫిర్యాదు చేసిన వారిలో డీఏఎన్ రాజు, యరబాల అనిల్ ప్రసాద్, పతివాడ రాంబాబు, సాగిరాజు రాంబాబు, గరికిన పరశురాం, మరగడ రఘురామిరెడ్డి, లక్ష్మణరావు, వివిధ పంచాయతీల నాయకులు ఉన్నారు. అంతకు ముందు వారంతా డీఏఎన్ రాజు ఇంటి వద్ద సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. -
ఓపెన్ కుట్ర!
పార్క్ స్థలాలపై● స్వయంగా మంత్రి నారాయణ సిఫారసు ● ‘రియల్’ ప్రయోజనాలకు మధురవాడ జీవీఎంసీ పార్కు స్థలం ● కనీసం కౌన్సిల్ సమావేశం లేకుండానే పార్కు స్థలాల అప్పగింత ● నరవలోని పార్కు స్థలాన్ని ఓపెన్ స్పేస్గా చెబుతూ చక్రం తిప్పిన మరో ఎమ్మెల్యే ● 20 ఎకరాలను రాయించుకుని తన ‘గుణా’న్ని బయటపెట్టుకున్న అధికారపార్టీ ‘బాబు’ ● తతంగమంతా ఆయన ‘రియల్’ ప్రయోజనాల కోసమే... ● చేష్టలుడిగి చూస్తున్న మేయర్, డిప్యూటీ మేయర్ ఇది 1981లో సాంఘిక సంక్షేమశాఖ నరవ రెవెన్యూ గ్రామ పరిధిలో వేసిన లే–అవుట్. ఇందులో మార్క్ చేసింది పార్కు స్థలం. అయితే, ఇప్పుడు అధికార ఎమ్మెల్యే తన ‘గుణ’ం చూపించడంతో ఇది కాస్తా పార్కు స్థలం కాకుండా పోయింది. బహిరంగ ప్రదేశం (ఓపెన్ స్పేస్) అని రికార్డులను తారుమారు చేసి వెనుక ఉన్న 20 ఎకరాల రియల్ ఎస్టేట్ భూమికి రోడ్డు కోసం 180 గజాల స్థలాన్ని తీసేసుకునేందుకు అనుకూలంగా మున్సిపల్శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్ ఆదేశాలు జారీచేశారు. ఇది స్వయంగా మున్సిపాలిటీలకు చెందిన పార్కు స్థలాలను కాపాడాల్సిన సంబంధిత మంత్రి నారాయణ మధురవాడలోని బటర్ ఫ్లై పార్కు స్థలాన్ని అప్పగించాలంటూ సిఫారసు చేస్తూ రాసిన లేఖ. దీంతో ఏకంగా కనీసం కౌన్సిల్ సమావేశం కూడా లేకుండానే రోడ్డు కనెక్టివిటీ లేని స్థలాన్ని జీవీఎంసీకి అప్పగించి.. పార్కు స్థలాన్ని కొట్టేశారు. ఈ రెండు వ్యవహారాల్లోనూ నిబంధనల మేరకు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కౌన్సిల్ అనుమతి తీసుకోవాలి. అయితే రెండింటిలోనూ కేవలం అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రి చక్రం తిప్పడంతో ఏకంగా మున్సిపల్ పార్కు స్థలాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. ఒకవైపు జీవీఎంసీ పార్కు స్థలాన్ని అప్పగించి... కనెక్టివిటీ లేని స్థలాన్ని తీసుకుంటుండగా...మరో దగ్గర ఉన్న పార్కు స్థలాన్ని పార్కు కాదు... ఓపెన్ స్పేస్ అంటూ భూ బదలాయింపు కింద రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం తీసుకోవడం గమనార్హం. అయినప్పటికీ మేయర్, డిప్యూటీ మేయర్లు నోరు మెదపకపోవడం గమనార్హం. అంతేకాకుండా పెందుర్తి నియోజకవర్గంలోని నరవ పార్కు స్థలం విషయంలో నియోజకవర్గ ఎమ్మెల్యేకు సంబంధం లేకుండా వేరే నియోజకవర్గ ఎమ్మెల్యే చక్రం తిప్పారు. అంతేకాకుండా సంబంధిత భూములు కూడా ఆయనకు చెందిన బినామీ చేతుల్లోనే ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. మధురవాడలోని 1.05 ఎకరాల లేఅవుట్ ఓపెన్ స్పేస్లో బటర్ఫ్లై పార్కును జీవీఎంసీ అభివృద్ధి చేస్తోంది. అయితే, ఈ పార్కు వెనుక స్థానిక కూటమి నేతకు చెందిన 2 ఎకరాల భూమి ఉంది. ఆ నేత తన భూమికి రోడ్డు మార్గం కోసం పార్కు స్థలంలోని కొంత భాగాన్ని తీసుకుని, దానికి బదులుగా తన భూమిలో కొంత స్థలాన్ని జీవీఎంసీకి ఇచ్చేందుకు పావులు కదిపారు. ఇందుకోసం కూటమిలోని సీనియర్ ఎమ్మెల్యేను కలిసి ‘వాటాలు’ మాట్లాడుకున్నారని తెలుస్తోంది. ఆ ఎమ్మెల్యే తనకున్న మున్సిపల్ శాఖలోని ‘బలాన్ని’ ఉపయోగించి, స్థలాన్ని అప్పగించేందుకు వీలుగా వ్యవహారాలను నడిపారు. దీనికి అనుగుణంగా మున్సిపల్ శాఖ ఉత్తర్వులు కూడా జారీచేసింది. ఈ బదలాయింపుతో వెనుక ఉన్న 2 ఎకరాల భూమి విలువ ఒక్కసారిగా పెరిగి, గజం ఏకంగా రూ. 50 వేల రిజిస్ట్రేషన్ విలువ పలికే స్థాయికి చేరుకుంది. ఇది కేవలం రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమే జీవీఎంసీ పార్కు స్థలాన్ని అప్పగించారనడానికి స్పష్టమైన నిదర్శనం. నరవ రెవెన్యూ గ్రామంలో పార్కు స్థలం మాయం పెందుర్తి నియోజకవర్గంలోని నరవ రెవెన్యూ, జీవీఎంసీ 88వ వార్డు పరిధిలోని సర్వే నంబరు 10/9లో 1981లో సాంఘిక సంక్షేమశాఖ వేసిన లేఅవుట్లో పార్కు స్థలంగా గుర్తించిన 180 గజాల స్థలాన్ని ఇచ్చేయాలని, అందులో 12 మీటర్ల రహదారి నిర్మించుకుంటానని ఆ లేఅవుట్ వెనుక 20 ఎకరాలను తన అనుచరుల చేతుల్లో ఉంచుకున్న కూటమి ఎమ్మెల్యే చక్రం తిప్పారు. వాస్తవానికి ఈ 20 ఎకరాల స్థలం సదరు ఎమ్మెల్యేదే అనే ప్రచారం ఉంది. ఇందుకోసం లేఅవుట్లోని పార్కు స్థలాన్ని ‘ఓపెన్ స్పేస్’గా అబద్ధపు రికార్డులు సృష్టించి, అనుమతి వచ్చే విధంగా అధికార పార్టీ నేతలు తమ నిజస్వరూపాన్ని చూపించారని తెలుస్తోంది. ఈ రెండు వ్యవహారాల్లోనూ జీవీఎంసీ పరిధిలో ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే పార్కు స్థలాలను కూటమి నేతలు తమ రియల్ ప్రయోజనాల కోసం కాజేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. అది కూడా కనీసం జీవీఎంసీ కౌన్సిల్ అనుమతి తీసుకోకుండానే ఈ నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. కౌన్సిల్కు తెలియకుండానే...! వాస్తవానికి జీవీఎంసీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కౌన్సిల్, స్టాండింగ్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరి. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో ఏవైనా పనులు చేపట్టినప్పటికీ... తర్వాత ర్యాటిఫై కోసమైనా కౌన్సిల్, స్టాండింగ్ కమిటీకు వెళ్లాల్సిందే. అయితే ప్రతిపక్ష వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను బలవంతంగా లాక్కోవడం ద్వారా అటు కౌన్సిల్లోనూ, ఇటు స్టాండింగ్ కమిటీలోనూ కూటమి నేతలదే మెజార్టీ ఉంది. ఈ నేపథ్యంలో కౌన్సిల్లో ఉంచి పార్కు స్థలాల అప్పగింతపై అనుమతి తీసుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ కౌన్సిల్ను కనీసం పట్టించుకోకుండా వ్యవహారాలు నడుపుతున్నారు. దీనిపై అటు మేయర్ కానీ, ఇటు డిప్యూటీ మేయర్ కానీ కనీసం అడిగే సాహసం కూడా చేయలేకపోవడం దారుణంగా ఉందని ఆ పార్టీ కార్పొరేటర్లే వాపోతున్నారు. అయితే కౌన్సిల్ ముందు ఉంచితే వీటిని వ్యతిరేకించే అవకాశం ఉందనే ఆందోళనతోనే నేరుగా వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. అయినప్పటికీ జీవీఎంసీ కౌన్సిల్ అనుమతితోనే ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ స్పష్టంగా తన అభిప్రాయంగా పేర్కొంది. అయినప్పటికీ తోసిరాజని నేరుగా మంత్రి, ఎమ్మెల్యేల సిఫారసుతో వ్యవహారాలను చక్కబెట్టుకుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం -
టూరిజం సర్క్యూట్ హబ్గా భీమిలి
అల్లూరి జయంతిలో మంత్రి కందుల దుర్గేష్ పద్మనాభం : జిల్లాలోని పలు ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు భీమిలిని సర్క్యూట్ హబ్గా ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మండపంలోని పాండ్రంగిలో శుక్రవారం నిర్వహించిన అల్లూరి జయంతి వేడుకల్లో ఆయన ఈ విషయం వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు జన్మస్థలం పాండ్రంగి, పొట్నూరులోని శ్రీకృష్ణదేవరాయల విజయస్తంభం,పద్మనాభం యుద్ధ స్థలం, గిరిపై అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. అల్లూరి సీతారామరాజు 22 ఏళ్ల వయసులోనే మన్యంలో గిరిజనులు పడుతున్న కష్టాలు చూసి బ్రిటీష్ వారిపై పోరాటం చేసిన మహనీయుడని ఆయన కొనియాడారు. అల్లూరి ఆలోచనా విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని మంత్రి ఉద్ఘాటించారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, పాండ్రంగి సమీపంలోని గోస్తని నదిపై వంతెన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్డీవో సంగీత్ మాధుర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మాజీ ఎమ్మెల్యే ఆర్ఎస్డీపీ అప్పలనరసింహరాజు, జనసేన భీమిలి ఇన్చార్జి పంచకర్ల సందీప్, సర్పంచ్ పల్లి ఝాన్సీ, ఎంపీటీసీ సభ్యురాలు నారాయణమ్మ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు వైఎస్సార్ సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సా ర్ సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం శనివారం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు రుషికొండలోని ఏ1–గ్రాండ్ హోటల్లో జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, ఎంపీ గొల్ల బాబూరావు, పార్లమెంట్ పరిశీలకులు కదిరి బాబురావు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె. సుభద్ర, నియోజకవర్గ సమన్వయకర్తలు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ, కూటమి పాలనలో ఏడాదిలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చేసిన మోసాలను ప్రజలకు తెలియజేసేందుకు ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ పేరిట వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. సమావేశానికి జిల్లాలోని కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఎంపీటీసీలు, హాజరుకావాలని కేకే రాజు పిలుపునిచ్చారు. -
రుణాల మంజూరులో బ్యాంకర్లదే కీలక పాత్ర
మహారాణిపేట: సామాన్యులు, రైతుల ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చడంలో బ్యాంకర్లు కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం జరిగిన సమీక్షలో వివిధ బ్యాంకుల ప్రతినిధులు, అధికారులతో ఆయన మాట్లాడారు. వార్షిక రుణ ప్రణాళిక ప్రకారం సేవలను మరింత విస్తరించాలని, రుణ మంజూరు ప్రక్రియలో సరళతర విధానాలు పాటించాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు అందించే రుణాలను సకాలంలో రెన్యూవల్ చేయాలన్నారు. వారి పొదుపు ఖాతాలోని 50 శాతం సొమ్మును ఆటోమేటిక్గా ఎఫ్డీ చేయాలని ఆదేశించారు. రైతులు, ఎం.ఎస్.ఎం.ఈ. ఔత్సాహికులకు అండగా నిలవాలని, రుణ ప్రక్రియలో సరళతర విధానాలు అవలంబించాలని సూచించారు. వ్యవసాయ, విద్యా రుణాలను త్వరితగతిన మంజూరు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పథకాలపై లబ్ధిదారులకు అవగాహన బ్యాంకింగ్ సేవలపై, సైబర్ మోసాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, తగిన సహకారం అందించాలని కలెక్టర్ సూచించారు. వ్యవసాయాధారిత పథకాలు, కిసాన్ క్రెడిట్ పథకం, పీఎం స్వానిధి, పీఎంఈజీపీ, స్టాండ్ అప్ ఇండియా, నేషనల్ అర్బన్, రూరల్ లైవ్లీహుడ్ మిషన్, బీసీ, ఎస్సీ, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా అందే రుణ పథకాలు, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, అగ్రి క్లినిక్ – అగ్రి బిజినెస్ సెంటర్ల ఆవశ్యకతపై సంబంధిత లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు.పీఎం సూర్యఘర్ పథకానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆగస్టు 15వ తేదీ లోగా కిసాన్ క్రెడిట్ పథకం, మత్స్యకార సేవా పథకాల కార్డుల జారీకి సంబంధించిన ప్రక్రియలను పూర్తి చేయాలని ఆదేశించారు. లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరావు, హౌసింగ్ పీడీ సత్తిబాబు, యూసీడీ పీడీ సత్యవాణి, డీఆర్డీఏ పీడీ లక్ష్మీపతి, నాబార్డు ఏజీఎం బసంత్ కుమార్, మత్స్యశాఖ, పశుసంవర్ధక, వ్యవసాయ శాఖ జేడీలు లక్ష్మణరావు, కరుణాకరరావు, అప్పలస్వామి పాల్గొన్నారు. -
‘ప్రసాద్’ పనుల వేగవంతానికి కృషి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సింహాచలం: వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయ క్షేత్రంలో కేంద్ర ప్రభుత్వం రూ.54 కోట్లతో చేపట్టిన ప్రసాద్ పథకం పనులను వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్ అన్నారు. శుక్రవారం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సింహాచలం దేవస్థానంలో రూ.54 కోట్లతో చేపట్టిన ప్రసాద్ పథకం అభివృద్ధి పనులు 50 శాతం పూర్తయ్యాయని, మిగిలిన 50 శాతం పనులు వేగంగా జరిగేలా చూస్తానన్నారు. వరాహ పుష్కరిణి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పూల తోట, గోశాల ఎంతో పురాతనమైనవని, వాటి వైభవం మరింత పెరగాలన్నారు. భైరవస్వామి ఆలయానికి వెళ్లే మార్గాన్ని పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. దర్శనార్థం వచ్చిన మాధవ్ ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసు కుని బేడా మండపంలో ప్రదక్షిణ చేశారు. అంతరాలయంలో ఆయ న పేరు మీద అర్చకులు స్వామికి అష్టోత్తర పూజ నిర్వహించారు. వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి ప్రసాదం, జ్ఞాపిక, శేషవస్త్రాలను దేవస్థానం ఈవో వి.త్రినాథరావు అందజేశారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పరశురామరెడ్డి, 98వ వార్డు అధ్యక్షుడు ఆర్. వర్మ, విశ్వహిందూ పరిషత్ నాయకుడు పూడిపెద్ది శర్మ తదితరులు పాల్గొన్నారు. -
బాలికపై లైంగికదాడికి యత్నం
బీచ్రోడ్డు: నగరానికి చెందిన బాలికపై లైంగికదాడికి పాల్పడిన కేసులో స్విగ్గీ డెలివరీ బాయ్ పిన్నింటి చంద్రశేఖర్ను మూడో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన మద్దిలపాలెం సీఎంఆర్ వెనుక వైపున ఉన్న వినాయక్ నగర్లో జరిగింది. శ్రీకాకుళం జిల్లా రణస్థలానికి చెందిన పిన్నింటి చంద్రశేఖర్ కొన్నేళ్లుగా వినాయక్నగర్లో నివాసం ఉంటూ.. స్విగ్గీ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. చంద్రశేఖర్ ఉంటున్న ఇంటి కిందనే ఏడో తరగతి చదువుతున్న బాలిక కుటుంబం ఉంటోంది. ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో చంద్రశేఖర్ ఆ బాలికను తన ఇంటికి పిలిచాడు. బాలిక పైకి రాగానే ఆమైపె లైంగిక దాడికి యత్నించాడు. దీంతో బాలిక పెద్దగా అరవడంతో చుట్టుపక్కల వారు చేరుకుని ఆమెను రక్షించారు. సమాచారం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు జరిగిన విషయంపై మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు చంద్రశేఖర్పై పోక్సో కేసు నమోదు చేశారు. అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్కు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సీఎం చంద్రబాబుపై ఫిర్యాదు
బీచ్రోడ్డు: గుంటూరులో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సింగయ్యపై రాష్ట్ర సీఎం చంద్రబాబ అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ వైఎస్సార్సీపీ దళిత నాయకులు మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శుక్రవారం సీఐ పైడయ్యకు అందజేసిన ఈ ఫిర్యాదులో.. మృతిచెందిన వ్యక్తిని ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఘోరమైనవి, కుల ప్రాతిపదికన కించపరిచేవిగా ఉన్నాయన్నారు. అవి ఎస్సీ మాదిగ సామాజిక వర్గ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొ న్నారు. ఈ వ్యాఖ్యలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బోని శివరామకృష్ణ మాట్లాడుతూ సింగయ్య మృతి పట్ల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ కేసు కోర్టులో విచారణలో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. చంద్రబాబు తన ప్రసంగంలో సింగయ్య గురించి ‘కుక్క మాదిరిగా తీసి పక్కన పడేసి వెళ్లిపోయారు’ వంటి పదాలు వాడారని, ఈ వ్యాఖ్యలు అమానుషమైనవని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు శెట్టి కామేశ్వరరావు, దేవరకొమడ మార్కండేయలు తదితరులు పాల్గొన్నారు. -
కూటమి కన్ను
వీఎంఆర్డీఏ భూములపై● మధ్యతరగతి పేరుతో ‘ప్రైవేట్’కు పెద్ద పీట ● ‘ఐకానిక్’ టవర్ ముసుగులో భూముల పందేరం ● మధురవాడలో 4.07 ఎకరాల్లో 50 అంతస్తుల నిర్మాణం ● మిథిలాపురి కాలనీ, మధురవాడ, మారికవలస, వేపగుంట ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు ● పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం ● వీఎంఆర్డీఏ బోర్డు సమావేశంలో తీర్మానంబోర్డు సమావేశంలో పలు అంశాలకు ఆమోదం చైర్మన్ ప్రణవ్గోపాల్ అధ్యక్షతన జరిగిన వీఎంఆర్డీఏ బోర్డు సమావేశంలో కమిషనర్ విశ్వనాథన్తో పాటు బోర్డు సభ్యులు వర్చువల్గా పాల్గొన్నారు. ఇందులో పలు అంశాలకు బోర్డు ఆమోద ముద్ర వేసింది. మధురవాడ, మిథిలాపురి కాలనీ, మారికవలస, వేపగుంట, ఇతర ప్రాంతాల్లో పీపీపీ విధానంలో అపార్టుమెంట్ల నిర్మాణాలకు ఆమోదించింది. ● అనకాపల్లి జిల్లా కొత్తూరు గ్రామం సర్వే నెంబర్ 608/1పీలో ఉన్న 5.68 ఎకరాల విస్తీర్ణంలో రూ 5.35 కోట్ల వ్యయంతో పిల్లల కోసం సిటీ లెవెల్ పార్క్ నిర్మాణానికి ఆమోదించింది. ఇందులో ఆట స్థలం, యోగా చేసుకునేందుకు యోగా ముద్ర విగ్రహాలతో కూడిన నిర్దేశిత ప్రదేశం, జిమ్ పరికరాలు, యాంఫీ థియేటర్, బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్, టెన్నిస్, ఫుట్బాల్ కోర్టులు, స్కేటింగ్ రింక్, ఇతర సదుపాయాలు ఉండనున్నాయి. ● వేపగుంట–పినగాడి బృహత్తర ప్రణాళిక రహదారి అభివృద్ధికి పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. గ్రామీణ ప్రాంతంలో 4 కి.మీ. పొడవైన రోడ్డును వీఎంఆర్డీఏ, అర్బన్ ప్రాంతంలో మిగిలిన 3 కి.మీ రహదారిని జీవీఎంసీ మొత్తంగా రూ.14.8 కోట్లతో నిర్మించనున్నారు. ● బీచ్ రోడ్లోని వీఎంఆర్డీఏ పార్కులో రూ 2.50 కోట్లతో ప్రస్తుతమున్న స్కేటింగ్ రింక్ పక్కనే 63వ జాతీయ రోలర్ స్కేటింగ్ క్రీడా పోటీల నిర్వహణకు, అంతర్జాతీయ పోటీలకు అనువుగా రాష్ట్రంలోనే మొట్ట మొదటి స్కేట్ బోర్డ్ పార్క్ నిర్మాణానికి ఆమోద ముద్ర వేశారు. సమాశంలో రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఇతర బోర్డు సభ్యులు పాల్గొన్నారు. విశాఖ సిటీ: కూటమి ప్రభుత్వ ప్లాన్ ఆ పార్టీ నేతలకు కాసుల వర్షం కురిపించనుంది. ‘మధ్య తరగతి’ పేరు చెప్పి భారీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి స్కెచ్ వేసింది. వీఎంఆర్డీఏ స్థలాల అభివృద్ధి పేరుతో విలువైన భూములను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయాలని నిర్ణయించింది. కూటమి ప్రజా ప్రతినిధులు, వారి అనుచరుల ద్వారా నగరంలో భారీ ఆకాశ హర్మ్యాల నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో శుక్రవారం జరిగిన వీఎంఆర్డీఏ బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడింది. ప్రైవేట్, పబ్లిక్ భాగస్వామ్యం(పీపీపీ) పేరుతో నగరంలో ఐదు ప్రాంతాల్లో రూ.కోట్లు విలువ చేసే భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టనున్నారు. ఈ స్థలాల్లో భారీ అపార్టుమెంట్లను నిర్మించనున్నారు. నిబంధనలు పక్కదారి కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వీఎంఆర్డీఏలో పాలన పక్కదారి పట్టింది. ప్రాజెక్టుల టెండర్ల నుంచి షాపుల వేలం వరకు అన్నింటిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలకు కై లాసగిరిపై బ్యాటరీ కార్లకు అనుమతులిచ్చేశారు. దీనిపై ‘సాక్షి’లో కథనాలు రావడంతో టెండర్ల ప్రక్రియను చేపట్టారు. సిరిపురం జంక్షన్లోని ‘ది డెక్’మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అండ్ కమర్షియల్ భవన నిర్వహణను సింగిల్ టెండర్ వేసిన సంస్థకే కట్టబెట్టేశారు. బీచ్ రోడ్డులో టీయూ–142 మ్యూజియం నిర్వహణ టెండర్.. కూటమి ప్రజాప్రతినిధికి సంబంధించిన కాంట్రాక్టర్కు దక్కలేదన్న కారణంగా ఆ టెండర్నే రద్దు చేశారు. ఆ పనులకు మళ్లీ టెండర్లను ఆహ్వానించారు. షాపుల లీజుల వ్యవహారం ఒక మాయాజాలంగా మారింది. అప్సెట్ ధరలకే షాపుల కేటాయింపులు జరిగిపోతున్నాయి. ఇలా వీఎంఆర్డీఏలో అన్ని టెండర్లు, వేలం, ఇతర పనులన్నీ కూటమి ప్రజాప్రతినిధులు, వారి అనుచరుల ఖాతాల్లోకి చేరుతున్నాయి. కూటమి ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు కారణంగా అధికారులు సైతం చేష్టలుడిగి చూస్తున్నారు. వారి ఆదేశాలను శిరసావహించడానికే పరిమితమవుతున్నారు. మధురవాడలో 50 అంతస్తుల నిర్మాణం నగరంలో ఐదు ప్రాంతాల్లో పీపీపీ విధానంలో అపార్టుమెంట్ల నిర్మాణానికి వీఎంఆర్డీఏ బోర్డు సమావేశంలో అనుమతులు ఇచ్చేశారు. ప్రధానంగా మధురవాడ సర్వే నంబర్ 331/1లో 4.07 ఎకరాల స్థలం ఉంది. ఇందులో 50 అంతస్తులతో ఐకానిక్ రెసిడెన్షియల్ భవనాన్ని నిర్మించడానికి అనుమతించారు. ఇందులో 3, 4 బీహెచ్కే ఫ్లాట్స్, 4 బీహెచ్కే డూప్లెక్స్లతో కలిగిన 6 టవర్లను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, పూల్ డెక్, పిల్లల ఆటల ప్రాంగణం, సైకిల్ ట్రాక్, జాగింగ్ ట్రాక్, ఇతర అత్యాధునిక వసతులతో జాయింట్ మోడల్/పీపీపీ పద్ధతిలో నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు లేకపోవడంతో ఈ ప్రాజెక్టు సామాన్య, మధ్య తరగతి వారు కొనుగోలు చేసే అవకాశం లేదు. మధ్యతరగతి కోసమంటూ.. వీఎంఆర్డీఏకు మిథిలాపురి కాలనీ, మధురవాడ, మారికవలస, వేపగుంట, ఇతర ప్రాంతాల్లో ఉన్న స్థలాల్లో మధ్య తరగతి కుటుంబాలకు అందుబాటులో ధరల్లో అపార్టుమెంట్లను నిర్మించేందుకు బోర్డు అనుమతులిచ్చింది. వీటిలో 2, 2.5, 3 బెడ్రూమ్లతో ఫ్లాట్లను అభివృద్ధి చేయనున్నారు. వీటిని కూడా పీపీపీ పద్ధతిలో నిర్మాణాలను చేపట్టనున్నారు. దశాబ్దం కిందట వీఎంఆర్డీఏ పీపీపీ విధానంలో మధురవాడలో హరిత ప్రాజెక్టును చేపట్టింది. దీని నిర్మాణం ఏళ్ల తరబడి కొనసాగింది. ఈ నిర్మాణంలో అనేక వివాదాలు ముసురుకున్నాయి. దీంతో అప్పటి నుంచి వీఎంఆర్డీఏ పీపీపీ విధానంలో మరో అపార్ట్మెంట్ నిర్మాణానికి పూనుకోలేదు. తాజాగా కూటమి ప్రభుత్వంలో మళ్లీ అదే విధానం పేరుతో ఆకాశహర్మ్యాలకు సిద్ధమవుతోంది. అయితే ఈ ప్రాజెక్టులను కూటమి నేతలకే చేజిక్కించుకునే అవకాశాలు ఉన్నాయన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. భూములు కొట్టేసేందుకు కుట్ర విశాఖలో వీఎంఆర్డీఏకు విలువైన భూములు ఉన్నాయి. ఈ స్థలాలను ఇప్పటి వరకు పర్యాటక ప్రాజెక్టులకు మాత్రమే పీపీపీ విధానంలో కేటాయించారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వీటిపై ఆ పార్టీల నేతలు, వారి అనుచరుల కన్ను పడింది. వీటిని కొట్టేసేందుకు తెరవెనుక ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనికి తగ్గట్టుగానే కూటమి ప్రభుత్వం వీఎంఆర్డీఏ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ధరల్లో అపార్టుమెంట్ల నిర్మాణం పేరుతో ఈ విలువైన భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు వీఎంఆర్డీఏ బోర్డు కూడా ఆమోద ముద్ర వేసింది. దీని ప్రకారం త్వరలోనే పీపీపీ విధానంలో భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు కేటాయించనున్నారు. కేవలం కూటమి నేతలు, వారి అనుచరులకు లబ్ధి చేకూర్చడానికే ఈ నిర్ణయం తీసుకున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. -
అనస్తీషియాలో ఆధునిక పోకడలు
విశాఖ వేదికగా నేటి నుంచి వైద్యుల సదస్సు మధురవాడ: విశాఖ వేదికగా 40వ ఇండియన్ సొసైటీ ఆఫ్ అనస్తీషియాలజిస్ట్స్ సౌత్ జోన్ కాన్ఫరెన్స్ శని, ఆదివారాల్లో నిర్వహించనున్నట్లు ఐఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సూరిశెట్టి శ్రీనివాసరావు, నిర్వహణ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. అనస్తీషియా వైద్యంలో వస్తున్న కొత్త పరిజ్ఞానంపై అవగాహన, రోగులకు మరింత మంచి సేవలు అందించే విషయాలు పరస్పరం తెలుసుకునేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం మధురవాడ వి.కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన సమావేశంలో వారు ఇతర రాష్ట్ర, జిల్లా ప్రతినిధులతో కలసి మాట్లాడారు. ఆధునిక నొప్పి నివారణా పద్ధతులు, వైద్యంలో వస్తున్న మెళకువలు, పరిజ్ఞానం ఎక్స్ఛేంజ్ తదితర అంశాలు సదస్సులో ఉంటాయన్నారు. సదస్సుకు సౌత్ ఇండియా పరిధిలోని ఏపీ, తెలంగాణాతో పాటు కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి, ఒడిశా, మధ్యప్రదేశ్కు చెందిన 1,300 మంది ప్రతినిధులు హాజరు కానున్నా రని పేర్కొన్నారు. ఈ రంగంలో ఉన్న పీజీ విద్యా ర్థులు, ప్రాక్టీషనర్స్కు అవసరమయ్యే 36 రకాల పరికరాలతో కూడిన ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. -
మూసేయడానికే కూటమి మొగ్గు!
సాక్షి, విశాఖపట్నం: పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన పాఠశాలను కొనసాగించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బ్రతిమాలుతుంటే ఆ పాఠశాల ఉపాధ్యాయులకు వలంటరీ రిటైర్మెంట్ స్కీమ్(వీఆర్ఎస్) ఇచ్చి పంపేయాలని విశాఖ ఎంపీ, గాజువాక ఎమ్మెల్యేలు ఉక్కు యాజమాన్యానికి సిఫార్సు చేయడం పట్ల అందరూ నివ్వెరపోతున్నారు. అధికారంలో ఉన్నవారు పాఠశాలను నిలబెట్టాల్సింది పోయి మూసివేయడానికి మద్దతివ్వడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. నాలుగు దశాబ్దాల క్రితం స్టీల్ప్లాంట్ యాజమాన్యం ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికుల పిల్లల కోసం ఉక్కునగరంలోని సెక్టార్–5లో విశాఖ విమల విద్యాలయం(వీవీవీ) తెలుగు మీడియం పాఠశాలను ఏర్పాటు చేశారు. నగరానికి చెందిన డయాసిస్ సంస్థకు పాఠశాల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. అక్కడి ఉపాధ్యాయులకు ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా వేతనాలు చెల్లించేవారు. దాదాపు రెండు వేల మంది విద్యార్థులు చదువుకుంటున్న ఈ పాఠశాలలో 28 మంది పర్మినెంట్, అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు, 60 మంది సిబ్బంది ఉన్నారు. పాఠశాల నిర్వహణకు ఏడాదికి రూ.5 కోట్లు వ్యయం అవుతోంది. ఫీజుల రూపేణా రూ.2 కోట్లు వసూలవుతుండగా, మిగిలినది ఉక్కు యాజమాన్యం సహాయంగా అందజేస్తూ వస్తోంది. గతేడాది ఉక్కు యాజమాన్యం పాఠశాల నిర్వహణకు తాము సహకరించలేమని, సొంత నిధులతో నిర్వహించుకోవాలని తేల్చింది. దీంతో రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల నేతృత్వంలో పెద్ద ఎత్తున ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ఆ ఒత్తిడికి లొంగి గతేడాది పాఠశాల నిర్వహణకు యాజమాన్యం ముందుకు వచ్చింది. ఈ ఏడాది కథ మళ్లీ మొదటికి రాగా.. మూడు నెలల క్రితం డయాసిస్ సంస్థ పాఠశాల కొనసాగించడానికి అనుమతి కోసం ఉక్కు యాజమాన్యానికి లేఖ రాసింది. అయినప్పటికీ యాజమాన్యం నుంచి స్పందన కనిపించలేదు. ఇతర పాఠశాలలు ప్రారంభమై మూడు వారాలవుతున్నా వీవీవీ ప్రారంభం కాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఈ అంశంపై గత నెల 23న ఉక్కు యాజమాన్యం ప్రతినిధులతో జరిగిన సమావేశంలో యాజమాన్యం పాఠశాలను తెరవడానికి సంబంధించిన అనుమతి పత్రం ఇస్తామని చెప్పినట్టు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. ఇది జరిగి రెండు వారాలు కావస్తున్నా పాఠశాల తెరవకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. బట్టబయలైన కూటమి ప్రభుత్వ నైజం.. ఇదిలా ఉండగా ఈ అంశంపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పలుమార్లు స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఎంపీ శ్రీభరత్లను కలిసి పాఠశాల తెరిచేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాము ప్రయత్నిస్తున్నామని, ఉక్కు యాజమాన్యం వినటం లేదని ఎంపీ, ఎమ్మెల్యే పలుమార్లు వారికి చెబుతూ వచ్చారు. ఒకవైపు వారితో అలా చెబుతూ మరోవైపు యాజమాన్యానికి ఉపాధ్యాయుల వీఆర్ఎస్ కోసం సిఫార్సు చేయడం పట్ల కూటమి ప్రభుత్వం నైజం బయట పెట్టారు. -
కాంట్రాక్టులన్నీ స్వీప్!
ఈ ఫొటోలో ఉన్న స్వీపింగ్ యంత్రాలు నెల్లూరు మున్సిపాలిటీలోనివి. గతంలో టీడీపీ పాలనలో సరఫరా చేసిన ఏడేళ్లకే ఈ వాహనాలు మూలకు చేరాయి. వాస్తవానికి.. వాహనాల కాలపరిమితి రవాణాశాఖ లెక్క ప్రకారం 15 ఏళ్లు. అయితే, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసిన ఈ వాహనాలు మూణ్ణాలకే మూలకు చేరాయి.ఏపీ27టీజెడ్ 2131 రిజిస్ట్రేషన్ నెంబరు కలిగిన ఈ స్వీపింగ్ యంత్రాన్ని నెల్లూరు మున్సిపాలిటీకి 2017లో సరఫరా చేశారు. అయితే, ఇది కాస్తా 2018లో మరమ్మతులకు గురికావడంతో అప్పటి నుంచి ఈ స్వీపింగ్ యంత్రం శ్రీ రాజరాజేశ్వరి ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ గోడౌన్లోనే మూలుగుతోంది. దీనిపై నెల్లూరు మున్సిపల్ అధికారులు అడిగేందుకూ సాహసించడంలేదు. - సాక్షి ప్రతినిధి, విశాఖపట్నంఇప్పుడీ స్వీపింగ్ యంత్రాల నిర్వహణ, మరమ్మతు (ఓ అండ్ ఎం) పేరుతో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో కాంట్రాక్టులన్నీ ఈ సంస్థకే అప్పగించేందుకు రంగం సిద్ధంచేస్తున్నారు. మంత్రి పేరుతో అన్ని మున్సిపాలిటీల్లోని అధికారులు, టీడీపీ కూటమి నేతలను ఈ సంస్థ ప్రతినిధులు కలుస్తూ తమకే కాంట్రాక్టు వచ్చేలా నిబంధనలు రూపొందించుకుంటున్నారనే విమర్శలున్నాయి. వాస్తవానికి.. సదరు సంస్థ సరఫరా చేసిన 125 వాహనాల్లో ఇప్పటికీ 61 వాహనాలు మున్సిపాలిటీల పేరిట ఇంకా రిజిస్ట్రేషన్ కూడా కాలేదు.అయినప్పటికీ సదరు సంస్థ యంత్రాల కొనుగోలు సమయంలో టెండరు దాఖలు చేసినప్పుడు ఉంచిన ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ) కూడా చెల్లించేందుకు ఫైళ్లు వేగంగా కదులుతున్నాయి. మరోవైపు.. సదరు సంస్థ సరిగ్గా వాహనాలను నిర్వహించడంలేదని.. వాటికి మరమ్మతులు చేయడంలేదని పేర్కొంటూ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఈ సంస్థను 2023లో టెర్మినేట్ చేసింది. సాధారణంగా టర్మినెట్ చేసిన సంస్థకు పనులు అప్పగించకూడదు. కానీ, గుంటూరులో శ్రీ రాజరాజేశ్వరి ఎంటర్ర్పైజెస్ దాఖలు చేసిన సింగిల్ టెండర్కే పనులు అప్పగించగా మిగిలిన మున్సిపాలిటీల్లోనూ ఓ మంత్రి పేరుతో ఓ అండ్ ఎం కాంట్రాక్టులను ఊడ్చేసేందుకు రంగం సిద్ధమైంది.రిజిస్ట్రేషన్ చేయకుండానే..వాస్తవానికి.. రూ.41 కోట్లు వెచ్చించి 125 స్వీపింగు వాహనాలను శ్రీ రాజరాజేశ్వరి ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ ద్వారా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ 2017లో కొనుగోలు చేసింది. ఈ వాహనాలను రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీలకు ఆ సంస్థ సరఫరా చేసింది. అయితే, ఇందులో 62 వాహనాలకు ఇప్పటివరకు ఆయా మున్సిపాలిటీల పేరిట రిజిస్ట్రేషన్లు కాలేదు. అయినప్పటికీ ఆ సంస్థకు అప్పట్లో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ బిల్లులు చెల్లించింది. అయితే, ఈ వాహనాలను ఆయా మున్సిపాలిటీలు సొంత నిధులతో రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ముందుకొస్తే.. చేయిస్తానని సదరు సంస్థ ఇప్పుడు చెబుతున్నట్లు తెలుస్తోంది.ఇందుకు కూడా సంసిద్ధత తెలిపి.. ఆ భారాన్ని మున్సిపాలిటీలపై వేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అయితే, మొత్తం 125 వాహనాల్లో సగానికి పైగా వాహనాలకు ఇంజన్లు లేవు. వీటిని రిజిస్ట్రేషన్ చేసేందుకు రవాణా శాఖాధికారులు అంగీకరించే అవకాశంలేదని మున్సిపల్ శాఖ సిబ్బంది చెబుతున్నారు. ఇక నెల్లూరు మున్సిపాలిటీలో ఇప్పటికే రూ.8 కోట్లతో టీపీఎస్ సంస్థ ద్వారా ఐదు కొత్త స్వీపింగ్ యంత్రాలు కొనుగోలు చేశారు.వీటికి రానున్న ఐదేళ్ల పాటు రాజరాజేశ్వరి సంస్థకు ఓ అండ్ ఎం బాధ్యతలను సింగిల్ టెండర్లో అప్పగించడం గమనార్హం. ఇదే తరహాలో తిరుపతి, గుంటూరు, విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు తదితర మున్సిపాలిటీల్లో కూడా కొత్త స్వీపింగ్ యంత్రాల నిర్వహణ, మరమ్మతు పనులను మళ్లీ ఈ సంస్థకే అప్పగించేందుకు అధికారులను మంత్రి పేరుతో ఒత్తిళ్లు చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.ఒకదాని పరికరాలు మరో దానికి..ఇక సాధారణంగా ఏదైనా వాహనంలో ఒక పరికరం పాడైతే మరో పరికరాన్ని అమర్చి బాగుచేయాల్సి ఉంటుంది. కానీ, ఒక వాహనానికి చెందిన పరికరాన్ని మరోదానికి అమర్చడం పరిపాటిగా మారింది. ఇలా మొత్తం వాహనాలను డొల్లకింద మార్చేశారు. ఫలితంగా.. అనేక వాహనాల్లో ఏకంగా ఇంజిన్లు, బ్లోయర్లు, రేడియేటర్లు వంటి ముఖ్యమైన పరికరాలు మాయమై మూలకు చేరాయి.తిరుపతి, నెల్లూరు, గుంటూరులో మాత్రం ఆయా మున్సిపాలిటీలు సొంత నిధులతో మరమ్మతులు చేయించి తిప్పుకుంటున్నాయి. అయినప్పటికీ ఇప్పుడు మరోసారి రానున్న ఐదేళ్లపాటు కూడా ఇదే సంస్థకు ఓ అండ్ ఎం అప్పగించేందుకు సిద్ధమవుతుండటం గమనార్హం. ఇప్పటికే గుంటూరు మున్సిపాలిటీలో సింగిల్ టెండర్ ద్వారా శ్రీ రాజరాజేశ్వరి ఎంటర్ప్రైజెస్కు అప్పగించగా.. తిరుపతి, విశాఖ, కర్నూలు, నెల్లూరులోనూ ఇదే తరహా మంత్రాంగం నడుస్తున్నట్లు తెలుస్తోంది. -
‘తొలి అడుగు’ బహిష్కరణ
కొమ్మాది: రుషికొండలో నిర్వహించిన సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమాన్ని టీడీపీ వార్డు అధ్యక్షుడు చెట్టిపల్లి గోపి, ఆయన వర్గం బహిష్కరించింది. జీవీఎంసీ 8వ వార్డు రుషికొండలో గురువారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. షెడ్యూల్ ప్రకారం ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు ప్రారంభించాల్సి ఉండగా.. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మధ్యాహ్నం 12 గంటలకు వచ్చారు. అప్పటి వరకు ప్రజలు వర్షంలో తడుస్తూ ఆయన కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా పలు సమస్యలను స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. డ్రైనేజీలు నిర్మించాలని కోరారు. కాగా.. వార్డులో నెలకొంటున్న రాజకీయాల పరిణామాల నేపథ్యంలో గోపి వర్గం టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంది. -
పరశురాముడిగా జగన్నాథుడు
డాబాగార్డెన్స్: టర్నర్ చౌల్ట్రీలో వేంచేసియున్న జగన్నాథస్వామిని దర్శించుకునేందుకు గురువారం భక్తులు బారులు తీరారు. దీంతో ఆ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. దశావతారాల్లో భాగంగా స్వామి పరశురామావతారంలో దర్శనమివ్వగా.. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. సామూహిక లలితా సహస్రనామ పారాయణ, సామూహిక భగవద్గీత, విష్ణు సహస్రనామ పారాయణ నిర్వహించారు. సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆలయ ఈవో టి.రాజగోపాల్రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. రథయాత్రలో భాగంగా శుక్రవారం జగన్నాథ స్వామి శ్రీరామావతారంలో భక్తులకు దర్శనమిస్తారని ఈవో రాజగోపాల్రెడ్డి తెలిపారు. -
మాస్టర్ స్ట్రోక్..!
కొత్త లేఅవుట్లకు..బృహత్తర ప్రణాళిక పేరుతో కొత్త లేఅవుట్ల ప్లాన్లకు మోకాలడ్డు కూటమి ప్రజాప్రతినిధుల కుయుక్తులు● మాస్టర్ ప్లాన్–2041లో మార్పులకూ పట్టు ● మాస్టర్ప్లాన్ రోడ్లు వస్తాయన్న నెపంతో లేఅవుట్లకు అనుమతుల నిరాకరణ ● దరఖాస్తు చేసుకునే వారితో మంతనాలు ● తమ వాటాలు ఇవ్వకుంటే ప్లాన్లు రాకుండా చేస్తామని హెచ్చరికలు ● స్థిరాస్తి వ్యాపారానికి గుదిబండలా ప్రజాప్రతినిధుల నిర్ణయాలు విశాఖ సిటీ : కూటమి ప్రజాప్రతినిధుల ‘మాస్టర్ ప్లాన్’ స్థిరాస్తి రంగం ఊపిరి ఆపేసేలా ఉంది. బృహత్తర ప్రణాళిక పునఃపరిశీలన ప్రక్రియ విశాఖ రియల్ ఎస్టేట్ను వెంటిలేటర్పైకి ఎక్కించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లాలో భూక్రయ, విక్రయాల్లో స్తబ్దత కొనసాగుతోంది. రాజకీయ స్వలాభం, స్వప్రయోజనాల కోసం కూటమి ప్రజాప్రతినిధులు వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్–2041 సవరణలకు పూనుకోవడం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మరింత శాపంగా పరిణమించింది. ప్రధానంగా బృహత్తర ప్రణాళిక రహదారుల పేరుతో కొత్త అవుట్లకు మోకాలడ్డుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది స్థిరాస్తి వ్యాపారులకు మరింత నష్టాన్ని తెచ్చిపెడుతోంది. లేఅవుట్లకు అనుమతులు నిరాకరణ? వీఎంఆర్డీఏ బృహత్తర ప్రణాళిక–2041 పునః పరిశీలన పేరుతో కూటమి ప్రభుత్వం మరోసారి ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తోంది. వాస్తవానికి గత నెలలోనే ఫిర్యాదుల స్వీకరణకు గడువు ముగిసింది. ఈ ప్రక్రియలో వేల సంఖ్యలో అభ్యంతరాలు వస్తాయని కూటమి ప్రజాప్రతినిధులు భావించారు. కానీ అనూహ్యంగా కేవలం 755 ఫిర్యాదులు మాత్రమే వచ్చాయి. దీంతో అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 17వ తేదీ వరకు గడువు పొడిగించారు. మాస్టర్ప్లాన్లో సవరణల పేరుతో ప్రజాప్రతినిధులు భారీగా లబ్ధి పొందేందుకు స్కెచ్ వేస్తున్నారు. ఒకవైపు తమ భూముల ధరలు పెంచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూనే మరోవైపు ప్రైవేటు లేఅవుట్లకు అనుమతులు రాకుండా అడ్డుపడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బృహత్తర ప్రణాళిక రహదారులు వస్తాయన్న నెపంతో కొత్త లేఅవుట్లను అనుమతులు ఇవ్వకుండా హోల్డ్లో పెడుతున్నట్లు రియల్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటాల కోసం మంతనాలు మాస్టర్ ప్లాన్ పూర్తయినంత వరకు కొత్తగా లేఅవుట్లకు అనుమతులు మంజూరు చేయకూడదని కూటమి ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిళ్లు తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బృహత్తర ప్రణాళికను పూర్తి చేసేందుకు మరో మూడు, నాలుగు నెలలు పట్టే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. దీన్ని అడ్డుపెట్టుకుని వారి అనుచరులు రియల్ వ్యాపారులతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. తమ వాటాలు ఇవ్వకుండా లేఅవుట్లకు అనుమతులు వచ్చే అవకాశం లేదని బేరసారాలు చేస్తున్నట్లు వ్యాపారుల్లో చర్చ జరుగుతోంది. అసలే అంతంత మాత్రంగా ఉన్న స్థిరాస్తి రంగం.. కూటమి నేతల కారణంగా మరింత పతనమయ్యే ప్రమాదముందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. మందగమనంలో స్థిరాస్తి రంగం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలో స్థిరాస్తి రంగం కుదేలైంది. భూముల క్రయవిక్రయాలు గణనీయంగా తగ్గిపోయాయి. ప్రస్తుతమున్న ప్రాజెక్టుల్లోనూ ఫ్లాట్లు, వెంచర్లలో ప్లాట్ల అమ్మకాలు పడిపోయాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.1,526 కోట్లు లక్ష్యంగా కాగా.. కేవలం 75 శాతం మేర ఆదాయం మాత్రమే సమకూరడమే జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైందనడానికి నిదర్శనం. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.వెయ్యి కోట్లు లక్ష్యానికి మించి రూ.1060.03 కోట్లు సమకూరింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొత్తగా వెంచర్లు, నిర్మాణాలకు ఎవరూ సాహసించడం లేదు. గత ఏడాది కాలంగా కొత్త లేఅవుట్ల అభివృద్ధికి ఎవరూ ముందుకు రాకపోవడం జిల్లాలో స్థిరాస్తి రంగ పరిస్థితికి అద్దం పడుతోంది. గతంలో వీఎంఆర్డీఏ పరిధిలో పదుల సంఖ్యలో కొత్త లేఅవుట్లకు దరఖాస్తులు వచ్చేవి. ఇప్పుడు కేవలం ముగ్గురు, నలుగురు వ్యాపారులు మాత్రమే లేఅవుట్లకు దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తోంది. వీటికి కూడా బృహత్తర ప్రణాళిక పేరుతో అడ్డంకులు సృష్టిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. -
దళితులంటే చంద్రబాబుకు చిన్నచూపు
హైదరాబాద్ టు పరవాడ ● దళిత నేత న్యాయపోరాటానికి వాసుపల్లి రూ.10 వేల సాయం ● అజయ్కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలి మీడియా ఎదుట ప్రవేశపెట్టిన కల్తీ మద్యం తయారు చేస్తున్న నిందితులుహైదరాబాద్ నుంచి స్పిరిట్ను 5 లీటర్ల క్యాన్లలో తెప్పించుకుని, దానిలో కారామిల్ అనే రసాయనం కలిపిన వెంటనే ఏసీ బ్లాక్ విస్కీలా రంగు మారిపోతుంది. దానిని మద్యం ఖాళీ క్వార్టర్ (180 మి.లీ.) బాటిళ్లలో వేసి అసలు విస్కీని పోలేలా స్టిక్కర్లు, మూతలు పెట్టి సీల్ చేస్తున్నారు. ఇలా తయారు చేసిన బాటిళ్లను బెల్టు షాపులకు ఒక్కో బాటిల్ రూ.120 నుంచి రూ.130కి విక్రయిస్తున్నారు. దాన్ని బెల్టు షాపుల వాళ్లు వినియోగదారులకు రూ.150 నుంచి రూ.180 వరకూ సరఫరా చేస్తున్నారు. ఈ కల్తీ మద్యం తయారీతో ఏడు రెట్లు లాభం పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి 72 లీటర్ల స్పిరిట్, 455 ఖాళీ బాటిళ్లు, 1389 మూతలు, బాటిళ్లపై అతికించడానికి ముద్రించిన ఏసీ బ్లాక్ స్టిక్కర్లు, కారామిల్ రసాయనం, యంత్ర సామగ్రిని స్వాధీనపర్చుకున్నారు. నిందితులు ఒక లీటర్ స్పిరిట్ రూ.100కి కొనుగోలు చేస్తున్నారని, 5 లీటర్ల స్పిరిట్తో 27 కల్తీ మద్యం క్వార్టర్ బాటిళ్లు తయారు చేస్తున్నారని ఆయన తెలిపారు. కల్తీ మద్యం తాగితే కాలేయ సంబంధ వ్యాధుల బారిన పడతారని, చివరకు ప్రాణాంతకంగా మారుతుందని సీఐ తెలిపారు. ఇలాంటి కల్తీ మద్యం తయారీ ముఠాల సమాచారం తమకు అందించాలని ఆయన కోరారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఇంకా నిందితులెవరైనా ఉంటే వారిపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. డాబాగార్డెన్స్: చంద్రగిరిలో దళిత కుటుంబంపై జరిగిన అమానుష దాడిని మాజీ ఎమ్మెల్యే, విశాఖ దక్షిణ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్కుమార్ తీవ్రంగా ఖండించారు. రాజకీయ కక్షతో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు అజయ్కుమార్, అతని కుటుంబంపై పచ్చ మూకలు చేసిన దాడి అమానుషమన్నారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద న్యాయపోరాటం చేస్తున్న అజయ్కుమార్ కుటుంబానికి వాసుపల్లి గణేష్కుమార్ తన వంతుగా ఫోన్పే ద్వారా రూ.10వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దళిత కుటుంబాన్ని అవమానించిన వారిపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు దళితులంటే ఎప్పుడూ చిన్నచూపేనని, కూటమి ప్రభుత్వంలో దళితులపై జరుగుతున్న వరుస దాడులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నోరు మెదపకపోవడం సిగ్గుచేటన్నారు. చంటిపిల్ల తల్లి అని కూడా చూడకుండా అజయ్కుమార్ భార్యపై దాడి చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. పోలీసులు కూడా స్పందించకపోవడం దారుణమన్నారు. దళిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని వాసుపల్లి స్పష్టం చేశారు. జగన్మోహన్రెడ్డి పాలనలో ఇటువంటి దాడులు జరగలేదని, చంద్రబాబు, లోకేష్ల రెడ్బుక్ రాజ్యాంగం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. యలమంచిలి రూరల్: ఆస్పత్రుల్లో చేతులు శుభ్రపర్చుకునేందుకు ఉపయోగించే స్పిరిట్తో కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. పరవాడలో స్థావరం ఏర్పాటు చేసుకుని కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. బెల్టు షాపులకు యథేచ్ఛగా సరఫరా చేస్తున్నారు. ఎకై ్సజ్ పోలీసులు పలుచోట్ల దాడులు చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. నిందితుల దగ్గర్నుంచి 72 లీటర్ల స్పిరిట్, కల్తీ మద్యం తయారీకి ఉపయోగిస్తున్న యంత్ర సామగ్రి, ఖాళీ మద్యం బాటిళ్లు, స్టిక్కర్లు, రంగు కోసం కలిపే రసాయనం స్వాధీనపరుచుకున్నారు. యలమంచిలి ఎకై ్సజ్ సీఐ పి.తేజో వెంకటకుమార్ గురువారం సాయంత్రం యలమంచిలిలో ఉన్న తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేసిన వివరాలివి.. మాకవరపాలేనికి చెందిన రుత్తల రాము ఉపాధి నిమిత్తం అచ్యుతాపురంలో ఉంటున్నాడు. అక్రమమార్గంలో డబ్బు సంపాదించడానికి కల్తీ మద్యం వ్యాపారం లాభదాయకంగా ఉంటుందని తెలుసుకున్నాడు. పరవాడకు చెందిన యలమంచిలి వెంకటేశ్వర్రావు అలియాస్ వెంకటేష్తో కలిసి కల్తీ మద్యం తయారీ చేస్తున్నాడు. ఇందుకోసం పరవాడలో అద్దెకు ఇంటిని తీసుకున్నారు. ఆ ఇంటిని స్థావరంగా చేసుకుని ఏసీ బ్లాక్ బ్రాండ్ కల్తీ మద్యం తయారు చేసి అచ్యుతాపురం సహా పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 2వ తేదీ బుధవారం సాయంత్రం అచ్యుతాపురంలో రుత్తల రాము అనే వ్యక్తిపై అనుమానంతో అతని ఇంటి వద్ద తనిఖీ చేయగా 5 లీటర్ల కల్తీ మద్యం క్యాన్లు పట్టుబడ్డాయి. తర్వాత అతడ్ని విచారించగా పరవాడలో ఒక ఇంటిలో కల్తీ మద్యం తయారు చేస్తున్నట్టు తెలుసుకుని అక్కడకు వెళ్లిన ఎకై ్సజ్ పోలీసులు స్పిరిట్తో మద్యం తయారు చేస్తున్నట్టు గుర్తించారు. కల్తీ మద్యం తయారీకి వినియోగిస్తున్న యంత్ర సామగ్రిమాట్లాడుతున్న కలెక్టర్ హరేందిర ప్రసాద్ రైతుబజార్లలో పార్కింగ్ నిర్వహణకు టెండర్లు గోపాలపట్నం : రైతుబజార్లలో వాహనాల పార్కింగ్ నిర్వహణ కోసం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వేలం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ వేలంలో పాల్గొనడానికి ఆసక్తి గలవారు రూ.10,000 ధరావత్తును ‘సంయుక్త కలెక్టర్, రైతు బజార్లు, విశాఖపట్నం’ పేరిట డీడీ, లేదా చెక్కు రూపంలో జత చేయాలి. దరఖాస్తులను ఆగస్టు 5 నుంచి 11వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు అందించాలని మార్కెటింగ్ శాఖ తెలిపింది. ఎంవీపీ కాలనీ రైతు బజార్ పార్కింగ్కు నెలవారీ అద్దె రూ.1.05లక్షలు, గోపాలపట్నం రూ.80,671, మధురవాడ రూ 4,850, కంచరపాలెం రూ51,750 నిర్ణయించారు. వినియోగదారుల వద్ద వసూలు చేయాల్సిన ధరలు సైకిల్ రూ.2, ద్విచక్రవాహనాలకు రూ.5, ఆటోలకు రూ.10, కార్లకు రూ.20 వసూలు చేయాలని తెలిపింది. వివరాలకు 9959592474, 9030819082 సంప్రదించవచ్చు.నకిలీ సిగరెట్ల సరఫరా, విక్రయం కేసులో నలుగురి అరెస్ట్ పీఎంపాలెం: ప్రముఖ కంపెనీల బ్రాండ్ పేరుతో నకిలీ సిగరెట్లు సరఫరా, విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను పీఎంపాలెం పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాలివి. ఇంపీరియల్ టొబాకో కంపెనీ(ఐటీసీ) గోల్డ్ఫ్లాక్ కింగ్స్ తదితర సిగరెట్లను పలువురు డీలర్ల ద్వారా పాన్ షాపులకు సరఫరా చేస్తోంది. రుషికొండ ఐటీ హిల్స్ రోడ్డులో దుకాణం నడుపుతున్న ఎండాడకు చెందిన రాజు.. ఐటీసీ బ్రాండ్ సిగరెట్ల మధ్య నకిలీ సిగరెట్లు విక్రయిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో సంస్థ ప్రతినిధులు బుధవారం దుకాణం వద్దకు వెళ్లి తనిఖీ చేయగా నకిలీ సిగరెట్ ప్యాకెట్లు లభించాయి. అతన్ని విచారించగా నగరంలోని శంకరమఠం ప్రాంతానికి చెందిన వెంకటరమణ, కోటేశ్వర గుప్తా తనకు నకిలీ సిగరెట్లు సరఫరా చేస్తున్నారని చెప్పాడు. ఈ క్రమంలో కంపెనీ ప్రతినిధులు వారి షాపుల్లో తనిఖీ చేయగా వారి వద్ద 280 నకిలీ గోల్డ్ఫ్లాక్ సిగరెట్ ప్యాకెట్లు లభించాయి. అదే సమయంలో పీఎంపాలెం ప్రాంతానికి చెందిన మరో దుకాణ దారు పొట్నూరు శివ నకిలీ సిగరెట్లు కొనడానికి వారి వద్దకు వచ్చాడు. అతను కూడా నకిలీ సిగరెట్లు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. సంస్థ ప్రతినిధులు తగిన ఆధారాలతో ఈ నలుగురినీ పీఎంపాలెం పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించగా, వారు మోసానికి పాల్పడినట్లు అంగీకరించారు. ఎస్ఐ రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని సీఐ తెలిపారు. -
పేద రోగికి ‘ఆసరా’ కరువు
● కూటమి ప్రభుత్వంలో అటకెక్కిన ఆరోగ్య ఆసరా ● సాయం ఆగిపోవడంతో పేద రోగుల అవస్థలు ● వైఎస్సార్ సీపీ హయాంలో 1,69,836 మందికి రూ.98.43 కోట్ల సాయం మహారాణిపేట: ఆరోగ్యశ్రీ పథకం కింద శస్త్రచికిత్సలు చేయించుకున్న పేద రోగులు కోలుకునే సమయంలో ఆర్థిక భరోసా కల్పించే ‘ఆరోగ్య ఆసరా’ పథకం అమలు నిలిచిపోయింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో దిగ్విజయంగా కొనసాగిన ఈ పథకం.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అటకెక్కింది. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పథకం కింద నిధులు విడుదల చేయకుండా కాలయాపన చేస్తుండటంతో డిశ్చార్జ్ సమయంలో అందాల్సిన ఆర్థిక సాయం కోసం రోగులు, వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ నిరాశకు గురవుతున్నారు. ఆరోగ్యశ్రీలో శస్త్రచికిత్స అనంతరం జీవన భృతి కోసం వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకాన్ని 2019 డిసెంబర్ 2న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద శస్త్రచికిత్స చేయించుకున్న రోగి కోలుకునే వరకు, రోజుకు రూ. 225 చొప్పున, నెలకు గరిష్టంగా రూ. 5,000 వరకు జీవన భృతిని అందించేవారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే రోజే ఈ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేవారు. సాధారణ ప్రసవాలకు, సిజేరియన్లకు రూ. 5,000, గుండె సంబంధిత సర్జరీలకు రూ. 5,000 నుంచి రూ. 10,000 వరకు చికిత్సను బట్టి సాయం అందేది. ఆస్పత్రుల నుంచి ఇంటికి వెళ్లాక కోలుకునే వరకు కుటుంబ అవసరాలు తీర్చుకునేందుకు వారికి ఈ సాయం ఎంతో ఉపయోగపడేది. జిల్లాలో మొత్తం 52 నెట్వర్క్ ఆస్పత్రులు, 20 డెంటల్ ఆస్పత్రులు ఎన్టీఆర్ వైద్య సేవ పరిధిలో ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో మొత్తం 1,69,836 మందికి ఆసరా పథకం ద్వారా రూ.98.43 కోట్లు అందజేశారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పేదల వైద్యానికి పెద్దపీట వేసింది. ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ ఫిజీషియన్ వంటి పలు కార్యక్రమాలను అమలుచేసింది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయడం ద్వారా, ఆపదలో ఉన్న పేదలందరికీ నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కొండంత అండగా నిలిచారు. అనారోగ్య సమస్యల వల్ల పేదలు ఆర్థికంగా నష్టపోకూడదని, క్యాన్సర్ వంటి ఖరీదైన జబ్బుల చికిత్సకు పరిమితి లేకుండా సాయం అందించారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ వైద్యం.. పేదలకు క్రమంగా దూరమవుతోంది. ఆసరా పథకం కింద నిధులు విడుదల కాకపోవడంతో శస్త్రచికిత్సలు చేయించుకున్న రోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. డిశ్చార్జ్ సమయంలో డబ్బులు వస్తాయని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతోంది. ‘ఆసరా డబ్బులు ఎప్పుడు వస్తాయి?’ అని వారు ఆసుపత్రి సిబ్బందిని అడుగుతుండగా, ఏమి సమాధానం చెప్పాలో తెలియక సిబ్బంది సైతం అయోమయంలో ఉన్నారు. విశ్రాంతి సమయంలో కుటుంబ పోషణకు ఉపయోగపడే ఈ సాయం ఆగిపోవడంతో.. పేద రోగులు ఆర్థికంగా మరింత కుంగిపోతున్నారు. ఆసరా అందించిన ప్రయోజనం ఇదీ.. సంవత్సరం రోగులు పొందిన లబ్ధి 2020–21 18,160 రూ.12.04 కోట్లు 2021–22 33,749 రూ.21.23 కోట్లు 2022–23 29,737 రూ.17.73 కోట్లు 2023–24 58,839 రూ.32.43 కోట్లు 2024–25 29,351 రూ.15.00 కోట్లు (కూటమి ప్రభుత్వం ఏర్పడిన వరకు) -
13 మంది క్రికెట్ బెట్టింగ్రాయుళ్ల అరెస్ట్
అల్లిపురం: క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న 13 మందిని నగర సైబర్ క్రైం పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి 57 మొబైల్ ఫోన్లు, 137 బ్యాంకు బుక్స్, 11 ల్యాప్ టాప్లు, 132 ఏటీఎం కార్డులు, 4 సీసీ కెమెరాలు, 2 రూటర్లు, ఒక క్యాష్ కౌంటింగ్ మెషీన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనరేట్లో గురువారం సీపీ శంఖబ్రత బాగ్చి వివరాలు వెల్లడించారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా అమాయకులను తప్పుదోవ పట్టిస్తూ, క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారికి మ్యూల్ బ్యాంకు అకౌంట్స్ సరఫరా చేస్తున్న కశింకోటకు చెందిన ఓ వ్యక్తిని సైబర్ క్రైం పోలీసులు ఇదివరకే అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. అతని నుంచి రాబట్టిన సమాచారం మేరకు ఆధునిక సాంకేతిక సహాయంతో బెంగళూరు స్థావరంగా ఉన్న డెన్ను గుర్తించారు. దానిపై దాడి చేసి అక్కడున్న 13 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మధ్యప్రదేశ్కు చెందిన ఒకరు, చత్తీస్గఢ్కు చెందిన 8 మంది, జార్ఖండ్, బిహార్లకు చెందిన చెరో ఇద్దరు ఉన్నట్లు తెలిపారు. వీరంతా ఆన్లైన్ ద్వారా పరిచయమై, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వివిధ రాష్ట్రాల్లో ఉన్న వాళ్లతో ఆన్లైన్లో పరిచయాలు పెంచుకున్నారు. తద్వారా మ్యూల్ బ్యాంక్ అకౌంట్లను కొరి యర్ ద్వారా సేకరించి వాటిని ఆన్లైన్ బెట్టింగ్ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నట్లు సీపీ తెలిపారు. అమాయకులైన వారిని బెట్టింగ్ ఊబిలోకి లాగి, అప్పులపాలు చేస్తూ వారి నుంచి డబ్బులు దండుకుంటున్నారని పేర్కొన్నారు. వీరితో రెడ్డన్న 462, బేటాబాయి 52 వెబ్సైట్లు నడుపుతున్నారన్నారు. ప్రతి టీంలో షిఫ్ట్కు ఇద్దరు చొప్పున 24 గంటలూ పనిచేస్తూ అమాయకుల నుంచి డబ్బులు దోచుకుంటున్నారని వెల్లడించారు. సైబర్ క్రైమ్ ఫిర్యాదుల కోసం http:// www.cybercrime. gov. in లేదా 1930 లేదా 7995095799కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. -
ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్య అమలు చేయాలి
కలెక్టర్కు వైఎస్సార్ సీపీ వినతి మహారాణిపేట: విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలలు ఉచిత విద్యను అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని, దీనిపై తగు చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు డిమాండ్ చేశారు. ప్రతి ఏటా ప్రైవేట్ పాఠశాలలు ప్రవేశ తరగతిలో 25 శాతం సీట్లను సామాజికంగా వెనుకబడిన, ఆర్థికంగా బలహీనమైన వర్గాలకు ఉచితంగా కేటాయించాలని కలెక్టర్కు సమర్పించిన వినతి పత్రంలో కోరారు. పిల్లల నుంచి ఎటువంటి ప్రవేశ పరీక్షలు, ఫీజులు, దరఖాస్తు రుసుం వసూలు చేయరాదని, పాఠశాల యాజమాన్యాలు ఈ విధానాన్ని కచ్చితంగా పాటించాలని గురువారం కలెక్టర్ కార్యాలయం ఎదుట మీడియా ద్వారా డిమాండ్ చేశారు. అయితే చాలా పాఠశాలలు ఈ చట్టాన్ని పాటించడం లేదని కె.కె.రాజు అన్నారు. పేద కుటుంబాల పిల్లలు, దివ్యాంగులు, అనాథలు వంటి వారు ప్రవేశం కోసం దరఖాస్తు చేసినప్పటికీ.. వివిధ అడ్డంకులు కల్పించి తిరస్కరిస్తున్నారన్నారు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధమని, పేద పిల్లల విద్యా భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తున్న పాఠశాలలపై సమగ్ర విచారణ చేపట్టి.. తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్, పార్టీ కార్యాలయం పర్యవేక్షకుడు రవి రెడ్డి, జీవీఎంసీ వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ బానాల శ్రీనివాస్, పార్టీ ముఖ్య నాయకులు ద్రోణంరాజు శ్రీవత్సవ, సతీష్ వర్మ, పీలా వెంకటలక్ష్మి, కార్పొరేటర్లు పద్మా రెడ్డి, శశికళ, జిల్లా అనుబంధ విభాగం అధ్యక్షులు అంబటి శైలేష్, పేడాడ రమణి కుమారి, శివరామకృష్ణ, సనపల రవీంద్ర భరత్, పులగం కొండారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మల్లేశ్వరి, పార్టీ నాయకులు శేఖర్, సాగర్, సూర్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
డ్రగ్స్, గంజాయి రవాణాపై ప్రత్యేక డ్రైవ్
తాటిచెట్లపాలెం: విశాఖపట్నం రైల్వేస్టేషన్ మీదుగా మాదక ద్రవ్యాలు, గంజాయి రవాణా కాకుండా ప్రత్యేక దృష్టి సారించినట్లు డీసీపీ–1 అనిత వేజెండ్ల తెలిపారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు గురువారం విశాఖ రైల్వే స్టేషన్లో పలు రైళ్లలో నగర పోలీసులు, జీఆర్పీ, ఆర్పీఎఫ్, ఈగల్ టీం, డాగ్ స్వ్కాడ్ బృందాలు సంయుక్తంగా తనిఖీలు చేపట్టాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వే పోలీస్ పి.రామచంద్రరావు, జీఆర్పీ ఇన్స్పెక్టర్ సీహెచ్ ధనుంజయనాయుడు, రైల్వే భద్రతా దళం ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ఈగల్ టీం ఇన్స్పెక్టర్ కల్యాణి నేతృత్వంలో మూడో నంబర్ ప్లాట్ఫాంపై గురుదేవ్ ఎక్స్ప్రెస్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికుల లగేజీలు, కోచ్లను పరిశీలించారు. రైల్వేస్టేషన్ పరిధిలో నిరంతరం తనిఖీలు చేస్తామని జీఆర్పీ సీఐ తెలిపారు. -
రేపు జాతీయ లోక్ అదాలత్
విశాఖ–లీగల్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని అన్ని న్యాయస్థానాల్లో జూలై 5వ తేదీన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జరుగుతుందని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయస్థానాల్లో ఉన్న పెండింగ్ కేసులు, సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటార్ ప్రమాదాల నష్ట పరిహారాల కేసులు, సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం కేసులు, మనీ రికవరీ కేసులు, ల్యాండ్ అక్విజిషన్ కేసులు, కార్మిక, కుటుంబ తగాదాలు (విడాకులు కేసులు కాకుండా), పారిశ్రామిక వివాదాలు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, న్యాయ సేవా సదన్, విశాఖపట్నంలో లేదా 0891–2560414, 2575046 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు. -
రేపు వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశం
దేవదాయ భూముల పరిరక్షణకు చర్యలు 8లోవేదిక రుషికొండలోని ఏ1 గ్రాండ్ హోటల్ సాక్షి, విశాఖపట్నం: రుషికొండలోని ఏ1 గ్రాండ్ హోటల్ లో ఈ నెల 5న వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు తెలిపారు. సమావేశంలో భాగంగా ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ‘బాబు ష్యూరిటీ.. మోసాలు గ్యారెంటీ’ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, ఎంపీ గొల్ల బాబూరావు, పార్లమెంట్ పరిశీలకుడు కదిరి బాబూరావు హాజరవుతున్నట్లు తెలిపారు. జిల్లాలో ని అన్ని నియోజవర్గాల సమన్వయకర్తలు, కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, మండల అధ్యక్షులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీలు, రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, యువజన విభాగం అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని పిలుపునిచ్చారు. -
నగరాభివృద్ధి ప్రాజెక్టులపై దృష్టి సారించాలి
జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ డాబాగార్డెన్స్: విశాఖ నగరాభివృద్ధి ప్రాజెక్టులపై దృష్టి సారించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బీచ్ సమీపంలోని స్మార్ట్సిటీ కార్యాలయంలో జీవీఎంసీ ఇంజినీరింగ్ అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. విశాఖ నగరాభివృద్ధి దిశగా జీవీఎంసీ అన్ని జోన్లలో ఇప్పటికే ప్రతిపాదించిన రోడ్లు, యాన్యువిటీ మోడల్ ప్రతిపాదనలు, అభివృద్ధిపై సమీక్షించారు. రోడ్లు, కాలువలు, కల్వర్టులు, కూడళ్ల అభివృద్ధి, మీడియన్లు, విద్యుత్ దీపాలు, నీటి సరఫరా నిర్వహణ, డిశాలినేషన్ ప్లాంట్ తదితర పనులపై దృష్టి సారించాలని వారిని ఆదేశించారు. పార్కుల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, తాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి పనులు వేగవంతం చేసి, ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. నగరంలో నిర్మాణంలో ఉన్న భూగర్భ డ్రైనేజీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, రుషికొండ వద్ద డ్రైనేజీ స్కీమ్ పనులపై కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. నగరాన్ని ఆకర్షణీయంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దేందుకు జీవీఎంసీ ఇంజినీరింగ్ విభాగం ప్రత్యేకంగా దృష్టి సారించేలా చర్యలు చేపట్టాలని ప్రధాన ఇంజినీర్ పల్లంరాజును ఆదేశించారు. సమావేశంలో జీవీఎంసీ అదనపు కమిషనర్ వర్మ, పర్యవేక్షక ఇంజినీర్లు, స్మార్ట్ సిటీ మేనేజర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మ ఆశీస్సులతోనే ఉన్నత పదవి
● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ● ఎయిర్పోర్టులో ఘన స్వాగతం గోపాలపట్నం: అమ్మ దీవెనలతో భారతీయ జనతాపార్టీలో ఇంత ఉన్నతమైన పదవి దక్కడం ఎంతో గర్వంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన తరువాత తొలిసారిగా గురువారం విశాఖ చేరుకున్న ఆయనకు ఎయిర్ పోర్టులో పార్టీ నేతలు, అభిమానులు భారీ సంఖ్యలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీని అగ్రగామిగా బలోపేతం చేస్తానని స్పష్టం చేశారు. విశాఖ వాసిగా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను తాను సందర్శించానని, రాయలసీమ నుంచి శ్రీకాకుళం వరకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పథకాలను ఇంటింటికీ తీసుకెళ్తానని తెలిపారు. భవిష్యత్తులో బీజేపీని రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా తయారు చేస్తానని మాధవ్ ధీమా వ్యక్తం చేశారు. అనంతరం, ఆయన విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీగా లాసన్స్ బే కాలనీలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. -
‘సింగయ్య భార్య వాస్తవాలు చెప్పింది’
విశాఖ: హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్రావు మండిపడ్డారు. ప్రజా సమస్యలపై మాట్లాడే ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కుతున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారన్నారు‘శవరాజకీయాలపై పేటెంట్ హక్కు చంద్రబాబుది. సింగయ్య భార్య వాస్తవాలు చెప్పింది. అంబులెన్స్లో నా భర్తకు ఏదో జరిగిందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. సింగయ్య భార్యను లోకేష్ మనుషులు ఎందుకు బెదిరించారు. వైఎస్ జగన్ను చూసి పాలక పక్షం భయపడుతోంది. ఏఐ ద్వారా జగన్పై తప్పుడు ప్రచారం చేశారు. తండ్రీ కొడులు ఇద్దరూ జగన్కు వస్తున్న ప్రజాదరణ చూసి పిచ్చెక్కిపోతున్నారు. కూటమికి ఓటు వేసి ప్రజలు మోసపోయారు..షరతులు పెట్టి తల్లికి వందనం కట్ చేశారు.. పురుగులు పట్టిన అన్నం విద్యార్థులకు పెడుతున్నారు. హోమ్ మంత్రి అనిత చేసిన భోజనంలో బొద్దింక వచ్చింది. బొద్దింక ఘటనపై చంద్రబాబు సమాధానం చెప్పాలి.’ అని జూపూడి డిమాండ్ చేశారు. -
విశాఖలో తీగ లాగితే.. బెంగళూరులో కదిలిన డొంక
సాక్షి, విశాఖపట్నం: మరో బెట్టింగ్ యాప్ ముఠాను విశాఖ పోలీసులు గుట్టురట్టు చేశారు. విశాఖలో తీగ లాగితే.. బెంగళూరులో డొంక కదిలింది. ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 13 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను విశాఖ పోలీసులు.. బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. నిందితులు.. బెంగళూరులో బెట్టింగ్ డెన్ ఏర్పాటు చేసి బెట్టింగ్కు పాల్పడుతున్నారు. విశాఖకు చెందిన రవికుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ ప్రారంభించారు.బెట్టింగ్ ముఠాలో అనకాపల్లి జిల్లా కసింకోటకు చెందిన నిందితుడు కీలక పాత్ర వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బెట్టింగ్ ముఠా సభ్యులు వద్ద నుంచి 57 మొబైల్ ఫోన్లు,137 బ్యాంకు పాస్ పుస్తకాలు, 11 ల్యాప్ టాప్లు, 132 ఏటిఎం కార్డులు, 4 సీసీ కెమెరాలు, ఒక కౌంటింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో మధ్యప్రదేశ్, జార్ఖండ్, బిహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. -
వానొస్తే వణుకే.!
డాబాగార్డెన్స్: చిన్నపాటి వర్షానికే విశాఖ నగరం వణికిపోతోంది. అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో కురిసే వర్షాలకు నగరం ముంపునకు గురవుతోంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, కొండవాలు, గెడ్డల సమీపంలో నివసించే ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. దశాబ్దాల కాలంగా పాత నగరం ముంపునకు గురవుతోంది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయంతో తూర్పు, ఉత్తర, దక్షిణ నియోజకవర్గాల ప్రజలు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ప్రమాదకరంగా గెడ్డలు నగరంలో పలు గెడ్డల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గంగులగెడ్డ, ఎర్రిగెడ్డ సహా పలు ప్రధాన కాలువలు(గెడ్డలు) ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. పేరుకుపోయిన చెత్త, పూడికను సకాలంలో, పూర్తి స్థాయిలో తొలగించకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఫలితంగా చిన్నపాటి వర్షానికే గెడ్డలు పొంగిపొర్లి, సమీపంలోని ఇళ్లను, కాలనీలను ముంచెత్తుతున్నాయి. ఉధృతంగా ప్రవహించే ఈ గెడ్డల ప్రవాహంలో ప్రమాదవశాత్తు జారిపడితే ప్రాణాలతో బయటపడటం అసాధ్యంగా మారింది. కళ్లెదుటే మృత్యుఘోష ఈ గెడ్డలు ఎంత ప్రమాదకరంగా మారాయో చెప్పడానికి ఈ సంఘటనలే నిదర్శనం. 2015 సెప్టెంబర్లో డాక్టర్ వి.ఎస్. కృష్ణ ప్రభుత్వ కళాశాల సమీపంలో వరద నీటి కాలువలో ఆరేళ్ల బాలిక అతిథి కొట్టుకుపోయింది. భారీ వర్షంలో రెండు మూడు రోజుల పాటు పోలీసులు, స్థానిక నివాసితులు, అగ్నిమాపక శాఖ, జీవీఎంసీ, నేవీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. ఐదారేళ్ల కిందట దక్షిణ నియోజకవర్గంలోని గంగులగెడ్డ ఉధృతంగా ప్రవహిస్తుండగా.. ఓ ఇంటి వద్ద ఉన్న వృద్ధురాలు అందరూ చూస్తుండగానే నీటిలో కొట్టుకుపోయారు. దాదాపు 20 రోజుల పాటు పొక్లెయిన్లు, క్రేన్లతో గాలించినా ఆమె జాడ తెలియరాలేదు. ఆ కుటుంబానికి తీరని శోకం మిగిలింది. తాజాగా 54వ వార్డు నలందనగర్లో నివాసముంటున్న ఆటోడ్రైవర్ కట్ట వడ్డీకాసులు(48) బహిర్భూమికి వెళ్లి గెడ్డలో కాలుజారి పడిపోయాడు. సుమారు 8 గంటల పాటు రెస్క్యూ బృందాలు శ్రమించినా, ఆయన్ను ప్రాణాలతో కాపాడలేకపోయాయి. చివరికి ఆయన మృతదేహాన్నే వెలికితీయగలిగారు. మారని పాతనగరం తలరాత పాతనగరం వాసుల కష్టాలు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికలొచ్చినప్పుడు నేతలు రూపురేఖలు మారుస్తామని హామీలివ్వడం, గెలిచాక మరిచిపోవడం పరిపాటిగా మారింది. రామకృష్ణా జంక్షన్, ప్రసాద్ గార్డెన్స్, వెలంపేట, పూర్ణామార్కెట్, పెరికివీధి వంటి ప్రాంతాలు ఏ మాత్రం వర్షం కురిసినా ఇట్టే జలమయమవుతాయి. భారీ వర్షం పడితే ఇళ్లలోకి నీరు చేరి, నివాసితులు నీటిలోనే నిద్రలేని రాత్రులు గడపాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రామకృష్ణా జంక్షన్, ప్రసాద్ గార్డెన్స్, పండావీధి, వెలంపేట, పూర్ణా మార్కెట్, పెరికివీధి, రాజారామ్మోహన్రాయ్ రోడ్డు, స్టేడియం రోడ్డు తదితర ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు. బిక్కుబిక్కుమంటున్న కొండవాలు, గెడ్డల ప్రాంతాల ప్రజలు కళ్లముందే కొట్టుకుపోతున్న ప్రాణాలు ముంపు నీటిలో పాతనగరం యుద్ధప్రాతిపదికన చర్యలకు కమిషనర్ ఆదేశంపెద్ద ఎత్తున చర్యలు చేపట్టాం జీవీఎంసీ పరిధిలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చేస్తున్నాం. ముఖ్యంగా మురుగు కాలువలు, గెడ్డలపై దృష్టి పెట్టాం. గెడ్డల్లో పేరుకుపోయిన చెత్తను యుద్ధప్రాతిపదికన తొలగిస్తున్నాం. ఇప్పటికే పలు గెడ్డలు, కాలువల్లో సిల్ట్ తీయించాం. వర్షాకాలం దృష్ట్యా మలేరియా, డెంగ్యూ జ్వరాలపై సీజనల్ సర్వే నిర్వహించనున్నాం. – కేతన్ గార్గ్, కమిషనర్, జీవీఎంసీఅధికారుల అరకొర చర్యలు ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో జీవీఎంసీ అధికారులు మేల్కొని అప్పుడప్పుడు గెడ్డల్లో పూడికతీత పనులు చేపట్టినా.. అది తూతూమంత్రంగానే సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గెడ్డల నుంచి తీసిన చెత్త, సిల్ట్ను అక్కడే గట్లపై వదిలేయడంతో, వర్షాలకు అది తిరిగి గెడ్డల్లోకే జారిపోతోంది. దీంతో చేసిన పనికి ఫలితం లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో నగర కమిషనర్ కేతన్ గార్గ్ సంబంధిత అధికారులతో సమీక్షించి, యుద్ధ ప్రాతిపదికన ముంపు నివారణ చర్యలు చేపట్టాలని, గెడ్డల్లో పూడికను పూర్తిగా తొలగించాలని ఆదేశాలు జారీ చేయడం కాస్త ఊరటనిచ్చే అంశం. ఈ ఆదేశాలతో ప్రధాన గెడ్డల్లో చెత్త, సిల్ట్ తొలగిస్తున్నారు. ఈ పనులు పూర్తిస్థాయిలో చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అల్లిపురం: రాష్ట్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం ఆయన విజయనగరం జిల్లా మధుపాడ గ్రామం కృష్ణాపురం వాటర్ హెడ్ వర్క్స్ వద్ద సుమారు రూ.2.64 కోట్ల జీవీఎంసీ నిధులతో నిర్మించిన తారు రోడ్లను మేయర్ పీలా శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభించారు. విశాఖ నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు అవసరమయ్యే మౌలిక వసతుల కల్పనకు జీవీఎంసీ కృషి చేస్తుందని మేయర్ అన్నారు. నగర ప్రజలకు తాటిపూడి రిజర్వాయర్ ద్వారా మంచినీరు సరఫరా అవుతుందన్నారు. అనంతరం తాటిపూడి వాటర్ హెడ్ పైప్లైన్ పనులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. జీవీఎంసీ కార్యనిర్వాహక ఇంజినీరు మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మర్రిపాలెం : తాటిచెట్లపాలెం జాతీయ రహదారి వద్ద బుధవారం వేకువజామున కారును లారీ ఢీకొట్టడంతో రాము అనే యువకుడు మృతిచెందాడు. శంకరమఠం ప్రాంతానికి చెందిన చందక రాము (25), అతడి స్నేహితులు పైడిరాజు, రాజేష్, చిరంజీవి కలిసి కారులో శంకరమఠం నుంచి ఎన్ఏడీ కూడలికి వెళ్లారు. మళ్లీ శంకరమఠం వెళ్లేందుకు ఊర్వశి జంక్షన్ మీదుగా తాటిచెట్లపాలెం సిగ్నల్ వద్ద మలుపు తిప్పుతున్న క్రమంలో మద్దిలపాలెం నుంచి ఎన్ఏడీ వైపు వెళ్తున్న గుర్తు తెలియని లారీ కారుని ఎడమ వైపు వెనుక భాగంలో బలంగా ఢీకొట్టింది. దీంతో అటువైపు కూర్చున్న రాము అక్కడికక్కడే మృతిచెందగా కారులో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కంచరపాలెం ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. మృతుడు రాము యాక్ట్ కేబుల్లో పనిచేస్తున్నారని, అతడికి ఏడాదిన్నర క్రితం వివాహం జరిగిందని పోలీసులు తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తున్నామని తెలిపారు. -
అంతర్జాతీయ స్థాయిలో టూరిజం ప్రాజెక్టులు
మహారాణిపేట : అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విశాఖలో టూరిజం ప్రాజెక్టుల రూపకల్పన జరగాలని, భవిష్యత్లో స్టార్ రేటింగ్ కలిగిన 10 వేల రూమ్లు అందుబాటులోకి తేవాల్సి ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు. బుధవారం జిల్లాకు విచ్చేసిన ఆయన విజయనగరం, విశాఖ జిల్లాల అధికారులతో స్థానిక కలెక్టరేట్ మీటింగ్ హాలులో సమావేశమయ్యారు. తొలుత ఉమ్మడి జిల్లాల్లో చేపట్టబోయే టూరిజం ప్రాజెక్టులపై సమీక్షించి, సూచనలు చేశారు. భోగాపురం మండల పరిధిలో నిర్మించబోయే ఒబెరాయ్ హోటల్, విశాఖ జిల్లా భీమిలి మండల పరిధిలోని అన్నవరంలో నిర్మించే మై ఫెయిర్స్ హోటల్ నిర్మాణాలకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన చేపట్టాలని, నిర్ణీత సమయంలోగా ఆయా కంపెనీలకు భూమిని అందజేయాలని ఆదేశించారు. కనెక్టింగ్ రోడ్లు నిర్మించాలని, విద్యుత్ సౌకర్యం కల్పించాలని సూచించారు. గోస్తనీ నది నుంచి పైప్లైన్ల ద్వారా ఆయా హోటళ్ల తాగునీటి అవసరాలకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం విశాఖ జిల్లాలో చేపట్టబోయే టూరిజం ప్రాజెక్టులు, పర్యాటక శాఖ పరిధిలో ఉన్న భూముల క్రమబద్ధీకరణ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. నగర పరిధిలో చేపట్టబోయే ప్రాజెక్టులు, భూసేకరణ ప్రక్రియపై స్పెషల్ సీఎస్కు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ వివరించారు. వీఎంఆర్డీఏ కమిషనర్ కె.విశ్వనాథన్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జేసీ కె.మయూర్ అశోక్, విజయనగరం జేసీ సేతుమాధవన్, ఒబెరాయ్, మై ఫెయిర్స్ హోటళ్ల ప్రతినిధులు శంకర్, మనోజ్, విజయనగరం ఆర్డీవో కీర్తి, భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్, తదితరులు పాల్గొన్నారు. -
‘సుపరిపాలనలో తొలిఅడుగు’ బహిష్కరణ
తగరపువలస: భీమిలి మండలం అన్నవరం పంచాయతీలో బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని టీడీపీ మండల అధ్యక్షుడు డీఏఎన్ రాజు, అతని వర్గం బహిష్కరించింది. ఇప్పటికే ఆరుసార్లుగా మండల పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న డీఏఎన్ రాజు స్థానంలో కొత్త అధ్యక్షుడి కోసం పార్టీలో విస్తృతంగా చర్చలు జరిగాయి. రాజు, యరబాల అనిల్ప్రసాద్ పేర్లు ప్రతిపాదించినప్పటికీ.. ఏడాది కిందట ఎన్నికల ముందు వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన జెడ్పీటీసీ సభ్యుడు గాడు వెంకటప్పడు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సరగడ అప్పారావు పేరును ప్రతిపాదించి పార్టీ అధిష్టానానికి పంపించారు. దీనిని వ్యతిరేకించిన రాజు, అనిల్ ప్రసాద్ వర్గం ఎంపీ భరత్ ద్వారా నిలుపుదల చేయించి విజయం సాధించారు. దీంతో ప్రతి పంచాయతీలో టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఈ క్రమంలో డీఏఎన్ రాజు పార్టీకి దూరంగా ఉండిపోవడంతో అతని వర్గానికి పార్టీ కార్యక్రమాల గురించి ఎవరూ సమాచారం అందించడం లేదు. దీంతో రాజు వర్గం ఇతర పార్టీల వైపు చూస్తోంది. సరగడ అప్పారావు కంటే అనిల్ ప్రసాద్ కార్యకర్తలతో కలిసి పని చేస్తాడని గుర్తించడంలో ఎమ్మెల్యే గంటా విఫలం అయ్యారని రాజు వర్గం గుర్రుగా ఉంది. మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి కాకుండా ఎన్నికల ముందు వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన వెంకటప్పడుకు ప్రాధాన్యమివ్వడం రాజు, అనిల్ ప్రసాద్లతో పాటు వారి అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నాయి. దీంతోనే అన్నవరం కార్యక్రమాన్ని బహిష్కరించాయి. -
5 నుంచి తుది విడత చందనం అరగదీత
సింహాచలం: సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఈ నెల 5 నుంచి తుది(4వ) విడత చందనం అరగదీతను ప్రారంభించేందుకు దేవస్థానం వైదిక, అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు బుధవారం చందనం చెక్కలను అరగదీతకు అనువుగా ఉద్యోగి సాంబ ముక్కలుగా కోశారు. ఆలయ ఏఈవో ఆనంద్కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ నెల 10న ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని ఆ రోజు స్వామికి తుది విడతగా మూడు మణుగుల(సుమారు 125 కిలోలు) పచ్చి చందనం సమర్పిస్తారు. ఆ చందనాన్ని సమకూర్చేందుకు అరగదీతను చేపట్టనున్నారు. ఏడాదిలో స్వామికి నాలుగుసార్లు మూడు మణుగుల చొప్పున చందనాన్ని సమర్పిస్తారు. చందనోత్సవం రోజు, వైశాఖ పౌర్ణమి, జ్యేష్ట పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో ఈ చందన సమర్పణ ఉంటుంది. -
నగరంలో ఏఐ నిఘా నేత్రాలు
విశాఖ సిటీ : ట్రాఫిక్ పోలీసులు లేరని సిగ్నిల్ జంప్ చేద్దామని.. పోలీసుల చూపు మరల్చి ట్రిపుల్ రైడింగ్లో దూసుకుపోదామని.. హెల్మెట్ ధరించకుండా బైక్లపై రోడ్ల మీద చక్కర్లు కొట్టేద్దామని.. నేరాలు చేసి దర్జాగా నగర రోడ్లపై తిరుగుదామనుకుంటే ఇకపై కుదరదు. మూడో కన్ను ఇట్టే పట్టేస్తుంది. చలానా వేసేస్తుంది. వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే సీసీ కెమెరాల ఏర్పాటుకు నగర పోలీస్ శాఖ కసరత్తును వేగవంతం చేసింది. ఇందుకోసం ముఖ ఆధారిత గుర్తింపు సాంకేతికతను నగరంలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. 7,500లకు పైగా సీసీ కెమెరాలు జిల్లాలో ప్రస్తుతం 7,500లకు పైగా సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. ప్రస్తుతం 90 శాతం కేసులు ఈ నిఘా కెమెరాల ద్వారానే పరిష్కారమవుతున్నాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దీంతో నగరంలో ఈ సీసీ కెమెరాల సంఖ్యను విస్తృతం చేయాలని సీపీ నిర్ణయించారు. నగరంలోనే కాకుండా, శివారు ప్రాంతాల్లో సైతం ప్రజలు వెళ్లగలిగే అన్ని చోట్లా ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసులు గట్టి నిర్ణయంతో ఉన్నారు. వీటివల్ల నగరంలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు. ఏఐ ద్వారా ట్రాఫిక్ నిర్వహణ జిల్లాలో పోలీసులు ట్రాఫిక్ రద్దీ నియంత్రణతో పాటు నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ ధారణపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. కొన్ని జంక్షన్లలో తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలు పాటించని వారికి చలానాలు వేస్తున్నారు. ఇకపై ఇటువంటి మాన్యువల్ విధానానికి స్వస్తి చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఫైన్లు వేసే విధానాన్ని అమలు చేసేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రోడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ను అమలు పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నగర పరిధిలో ట్రాఫిక్ను సమర్థవంతంగా నిర్వహించేందుకు దేశంలోని ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలను ఆహ్వానించారు. సదరు కంపెనీల ప్రతినిధులు బుధవారం కలెక్టరేట్లో ఎంపీ భరత్, కలెక్టర్ హరేందిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సమక్షంలో ప్రజెంటేషన్ ఇచ్చారు. నేరాలు, ట్రాఫిక్ నియంత్రణపై పోలీసుల ప్రత్యేక దృష్టి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఆటోమేటిక్గా చలానా కలెక్టరేట్లో ప్రజెంటేషన్ ఇచ్చిన సాఫ్ట్వేర్ సంస్థలు ఆటోమేటిక్గా చలానాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ట్రాఫిక్ వ్యవస్థ ద్వారా అతివేగం, పరిమితికి మించి వాహనాన్ని నడపడం, హెల్మెట్ లేకుండా ప్రయాణం, సిగ్నల్ జంపింగ్, రాంగ్ పార్కింగ్, రాంగ్ రూట్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘనులు దొరికిపోనున్నారు. వారికి ఆటోమేటిక్గా ట్రాఫిక్ చలానాలు జారీ అయిపోతాయి. అలాగే ముఖ ఆధారిత గుర్తింపు సాంకేతికతను నగరంలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే నగర జంక్షన్లలో గల సిగ్నలింగ్ వ్యవస్థను ఏకీకృతం చేయనున్నారు. తద్వారా ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని పోలీసులు భావిస్తున్నారు. అలాగే ట్రాఫిక్ రద్దీని బట్టి సిగ్నల్ వ్యవస్థ పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. -
డబుల్ డెక్కర్ బస్ ట్రయల్ రన్
● నగరవాసులకు త్వరలో అందుబాటులోకి తీసుకొస్తాం ● పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ అల్లిపురం / కొమ్మాది : విశాఖ నగర ప్రజలు, యాత్రికులకు డబుల్ డెక్కర్ బస్సులు త్వరలో అందుబాటులోకి వస్తాయని రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ పేర్కొన్నారు. బుధవారం టూరిజం అభివృద్ధి కార్యక్రమాలపై విశాఖ జిల్లాకు విచ్చేసిన ఆయన సాగర్నగర్ బీచ్ వద్ద ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయం ప్రాంగణంలో డబుల్ డెక్కర్ బస్సులు, సంబంధిత చార్జింగ్ స్టేషన్ను జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అజయ్ జైన్ మాట్లాడుతూ త్వరలో హాఫ్ ఆన్ – హాఫ్ ఆఫ్ పేరుతో డబుల్ డెక్కర్ బస్సులు నగరంలో అందుబాటులోకి రానున్నాయన్నారు. అందుబాటులో ఉన్న రెండు డబుల్ డెక్కర్ బస్సులతో ట్రయల్ రన్ నిర్వహించారు. టూరిజం ద్వారా విశాఖ నగరం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్, టూరిజం శాఖ సంయుక్తంగా విశాఖ పోర్ట్ అథారిటీ సౌజన్యంతో వీటిని అందుబాటులోకి తీసుకురానుందని తెలిపారు. అనంతరం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ విశాఖ నగర ప్రజలు, పర్యాటకుల ఆహ్లాదకర ప్రయాణానికి డబుల్ డెక్కర్ బస్సులు అనువుగా ఉంటాయన్నారు. -
చంద్రబాబు మోసాలను ప్రజలకు తెలియజేద్దాం
● 5న ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ’కార్యక్రమం ● విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు పిలుపుమహారాణిపేట: వెంకోజీపాలెంలోని సీఎంఆర్ ఫంక్షన్ హాలులో ఈ నెల 5న నిర్వహించనున్న ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు పిలుపునిచ్చారు. మద్దిలపాలెంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు, వివిధ అనుబంధ సంస్థల నాయకులతో బుధవారం ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ.. ‘బాబు ష్యూరిటీ –మోసం గ్యారెంటీ’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వ హిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా స్థాయి నుంచి మండల, వార్డు, గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లాలని సూచించారు. ఆ రోజు ఉదయం 9.30 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖులు జిల్లా స్థాయి ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ’కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, పార్లమెంట్ పరిశీలకుడు కదిరి బాబూరావు, రాజ్యసభ సభ్యులు గొల్ల బాబూరావు, సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్ కుమార్, మళ్ల విజయ ప్రసాద్, మజ్జి శ్రీనివాసరావు, మొల్లి అప్పారావు, తిప్పల దేవన్ రెడ్డితో పాటు శాసన మండలి సభ్యులు, మాజీ శాసన సభ్యులు, మాజీ మేయర్ హాజరవుతారని కె.కె.రాజు వెల్లడించారు. ఈ సమావేశంలో సమన్వయకర్త మొల్లి అప్పారావు, పార్టీ ముఖ్య నాయకులు ఫరూక్, సతీష్ వర్మ, ద్రోణంరాజు శ్రీవాత్సవ, అల్లంపల్లి రాజాబాబు, అనుబంధ విభాగం అధ్యక్షులు ఉరుకూటి రామచంద్ర రావు, పేడాడ రమణి కుమారి, సనపల రవీంద్ర భరత్, వంకాయల మారుతీ ప్రసాద్, దేవరకొండ మార్కండేయులు, బొండా ఉమా మహేశ్వర రావు, కర్రి రామారెడ్డి, బర్కత్ అలీ, పులగం కొండా రెడ్డి, సేనాపతి అప్పారావు, బోని శివ రామకృష్ణ, పీలా ప్రేమ కిరణ్ జగదీష్, చిక్కాల సత్యనారాయణ, జోన్ విభాగం అధ్యక్షులు అంబటి నాగ వినాయక శైలేష్, కార్పొరేటర్లు రెయ్యి వెంకట రమణ, కరజాడ వెంకట నాగ శశికళ, పద్మా రెడ్డి, అనుబంధ విభాగం రాష్ట్ర నాయకులు నీలి రవి, నీలపు కాళిదాస్ రెడ్డి, బెందాళం పద్మావతి, కె.వి.బాబా, బయ్యవరపు రాధ, ఈతలపాక విజయ భాస్కర్, తుమ్మలూరు జగదేష్ రెడ్డి, ఆకెళ్ల వెంకట రమణ మూర్తి, సరగడం పతిని రావు, ప్రగడ ప్రసాద్, బెవర జగదీశ్వరరావు, గోపిరాజ్ వంక, జగుపిల్ల నరేష్, కనకళ ఈశ్వరరావు, మల్లా దేవి విశాలి, బోస రామ లక్ష్మి, బొర్రా విజయలక్ష్మి, కాంట్రేడి రామన్న పాత్రుడు, తుల్లి చంద్రశేఖరరావు, పోతిబంతి హరికృష్ణ, రేఖ ఉషా రాణి, బాణాల తరుణ్ కుమార్, చేకూరి హరీష్ వరం, పులగం శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్కెచ్!
రూ. 208 కోట్ల టీడీఆర్కు అసలు కథ ఇదీ! పూసపాటి లక్ష్మీ నరసింహరాజుకు రేవళ్లపాలెం ప్రాంతంలో 233 ఎకరాల భూమి ఉంది. రహదారి నిర్మాణంలో ఆయన కోల్పోయిన 9,475.71 చదరపు గజాల స్థలానికి సంబంధించి, అతని కుమారుడైన జోగి జగన్నాథ దేవవర్మకు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) ఇచ్చారు. ఆ జీపీఏ హోదాలో ఆయన టీడీఆర్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. జీవీఎంసీ అధికారులు నిబంధనల ప్రకారం కోల్పోయిన భూమికి నాలుగింతలు, అంటే 37,902.84 చదరపు గజాలకు టీడీఆర్ను జారీ చేశారు. అప్పట్లో గజం విలువ రూ. 55,000గా పేర్కొనడంతో.. ఈ టీడీఆర్ మొత్తం విలువ రూ. 208.40 కోట్లకు చేరింది. తదనంతరం ఈ టీడీఆర్ హక్కులను సదరు యజమాని సాయికృష్ణారెడ్డికి బదిలీ చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఈ ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు అందడంతో టీడీఆర్ను రద్దు చేస్తున్నట్టు మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్ ఆదేశాలు జారీచేశారు. మధురవాడలోని ఓ భూమికి సంబంధించిన ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్ (టీడీఆర్) వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో జారీచేసిన టీడీఆర్ను రద్దు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో వెసులుబాటు.. కూటమి నేతల జేబులు నింపుకునేందుకేనని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకుని ఒక ఎమ్మెల్యే, మంత్రి సుమారు రూ.50 కోట్ల భారీ ఒప్పందానికి తెరలేపినట్లు అధికార కూటమిలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : మధురవాడ గ్రామం సర్వే నంబర్ 2పీకి చెందిన భూమికి సంబంధించి పీఎల్ఎన్ రాజు పేరుతో జారీచేసిన టీడీఆర్ను గత నెల 5వ తేదీన మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. వాస్తవానికి ఈ టీడీఆర్ జారీచేయకూడదని, ఇందులో భారీగా మతలబు జరిగిందంటూ కూటమి నేతలు గతంలో విమర్శలు గుప్పించారు. ప్రైవేటు వ్యక్తులు తమ లేఅవుట్ కోసం రహదారి ఏర్పాటు చేసుకున్న తర్వాత, దానికి టీడీఆర్ ఎలా జారీ చేస్తారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం టీడీఆర్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే రద్దు ఉత్తర్వుల చివర్లో ‘కొత్త దరఖాస్తులను టీడీఆర్ కమిటీ ముందుంచి నిర్ణయం తీసుకోవాలి’ అని ఒక మెలిక పెట్టింది. ఇప్పుడు ఇదే అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు నగరంలోని ఓ ఎమ్మెల్యేతో పాటు మంత్రి కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో రూ.50 కోట్ల డీల్ కుదరడంతో.. కొద్ది రోజుల కిందట అదే సర్వే నంబర్ 2పీకి టీడీఆర్ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి అనుగుణంగా టీడీఆర్ జారీకి రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది. వాస్తవానికి టీడీఆర్ రద్దు ఉత్తర్వుల్లో ఎక్కడా విచారణ జరిపినట్టు గానీ, అధికారులను బాధ్యులను చేయడం గానీ జరగలేదు. కేవలం కొత్త ఒప్పందం కోసమే రద్దు నాటకం ఆడారని, అందుకే గతంలో ఆరోపణలు చేసిన కూటమి నేతలు ఇప్పుడు మౌనంగా ఉన్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రద్దు పేరుతో కపట నాటకం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలంటూ మెలిక ఓ మంత్రి, ఎమ్మెల్యే అండదండలతో వ్యవహారం తాజాగా టీడీఆర్ కోసం దరఖాస్తు రూ.50 కోట్లకు డీల్ కుదిరినట్టు కూటమిలోనే గుసగుసలు రంగంలోకి సీనియర్ ఎమ్మెల్యే? మధురవాడ జాతీయ రహదారి నుంచి రేవళ్లపాలెం మీదుగా నవోదయ పాఠశాల వరకు 2014లో రహదారి నిర్మాణం చేపట్టారు. ఈ రహదారి నిర్మాణం వల్ల 2పీ సర్వే నంబర్లోని 9,475.71 చదరపు గజాల భూమిని కోల్పోయామని టీడీఆర్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఈ టీడీఆర్ను రద్దు చేసినప్పటికీ, కొత్త దరఖాస్తులకు అవకాశం ఇవ్వడం వెనుక ఉన్న ఆంతర్యం ఇప్పుడు బయటపడుతోంది. టీడీఆర్ రద్దయిన తర్వాత నగరానికి చెందిన ఒక సీనియర్ టీడీపీ ఎమ్మెల్యే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఒక మంత్రితో మాట్లాడి రూ.50 కోట్ల ఒప్పందం కుదిర్చారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ డీల్ ఖరారైన తర్వాతే తిరిగి అదే సర్వే నంబర్పై టీడీఆర్ కోసం దరఖాస్తు చేశారని సమాచారం. ప్రస్తుతం ఈ దరఖాస్తు పురపాలక శాఖ పరిశీలనలో ఉంది. అంతా సవ్యంగా జరిగితే త్వరలోనే టీడీఆర్ జారీ అయ్యే అవకాశాలున్నాయని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదే జరిగితే కేవలం కొత్త డీల్ కోసమే టీడీఆర్ రద్దు నాటకాన్ని ఆడారన్నది స్పష్టమవుతుంది. -
విశాఖ చరిత్రలో ‘క్రూయిజ్ టెర్మినల్’ ఓ మైలురాయి
● వర్చువల్గా కార్డేలియా షిప్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి సోనోవాల్ ● రాష్ట్రంలో క్రూయిజ్ టూరిజం అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ● విశాఖ క్రూయిజ్ టెర్మినల్ నుంచి బయలుదేరిన క్రూయిజ్ షిప్ సాక్షి, విశాఖపట్నం : విశాఖ చరిత్రలో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ ఓ మైలురాయి అని కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్ అన్నారు. బుధవారం పోర్టు అడ్మినిస్ట్రేటివ్ సమావేశ మందిరంలో కార్డెలియా క్రూయిజ్ షిప్ విశాఖ–చైన్నె సర్వీస్ను వర్చువల్ విధానంలో ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నేరుగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, కలెక్టర్ ఎం.హరేందిర ప్రసాద్, పోర్టు చైర్మన్ అంగముత్తు పాల్గొన్నారు. పోర్టు అడ్మినిస్ట్రేషన్ సమావేశం మందిరంలో కార్డెలియా టూరిజం షిప్లో ప్రయాణించే కుటుంబాలకు కందుల దుర్గేష్ బోర్డింగ్ పాస్లు అందజేశారు. అనంతరం విశాఖ పోర్టులో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్కు చేరుకున్న కార్డెలియా క్రూయిజ్ షిప్ను సందర్శించారు. క్రూయిజ్ నౌకలో వసతులు, పర్యాటకులకు అందించే సౌకర్యాలు, ప్రయాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీటీడీసీ ఏర్పాటు చేసిన పర్యాటక స్టాళ్లను మంత్రి దుర్గేష్, ప్రజాప్రతినిధులు, అధికారులు సందర్శించారు. అనంతరం టెర్మినల్ బిల్డింగ్, స్పెషల్ లాంజ్, టూరిజం ఆపరేటర్స్ కౌంటర్స్ తదితర అంశాలను పరిశీలించారు. బుధవారం సాయంత్రం 7.30 గంటలకు విశాఖ నుంచి క్రూయిజ్ షిప్ బయలుదేరింది. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ విశాఖ పోర్టు అథారిటీ అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ ఏర్పాటు చేయడం గర్వంగా ఉందన్నారు. రాష్ట్రంలో వీలైనంత త్వరగా క్రూయిజ్ టూరిజంను మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మట్లాడుతూ విశాఖ పోర్టుకు మరిన్ని క్రూయిజ్ లైనర్లు రావాలని ఆకాంక్షిస్తూ, అందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. పోర్టు చైర్మన్ ఎం.అంగముత్తు మాట్లాడుతూ ప్రతి 50 కిలోమీటర్లకు ఒక సముద్ర సంబంధిత కేంద్రంగా, షిప్ బిల్డింగ్, స్కిల్ డెవలప్మెంట్, కోస్టల్ లేదా క్రూయిజ్ టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రతీ ఏడాది 5,000 మంది విద్యార్థులకు క్రూయిజ్ ఆధారిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కల్పించి, ఉపాధి అవకాశాలకు సిద్ధం చేస్తామని వెల్లడించారు. వర్చవల్ విధానంలో కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలరవాణా సహాయ మంత్రి శాంతను ఠాకూర్, కేంద్ర సెక్రటరీ రామచంద్రన్ పాల్గొన్నారు. -
‘కూటమి’ కక్కుర్తి
● వర్క్ ఆర్డర్ కూడా లేకుండా వాటర్ ట్యాంక్ కూల్చివేతకు సిద్ధం ● ఒక్కసారిగా కుప్పకూలిన ట్యాంక్.. ఇద్దరు కూలీలకు తీవ్రగాయాలు ● ప్రాణాపాయస్థితిలో కేజీహెచ్కు తరలింపు, గుట్టుచప్పుడు కాకుండా చికిత్స ● రూ.40 వేల కాంట్రాక్ట్ కోసం కూటమి నాయకుల దిగజారుడుతనం ● పెందుర్తి మండలంలో ఘటన పెందుర్తి: అధికార కూటమి నాయకుల కాసుల కక్కుర్తి ఇద్దరు దినసరి కూలీల ప్రాణాల మీదకు తెచ్చింది. పంచాయతీ నుంచి కనీసం అనుమతి, వర్క్ ఆర్డర్ లేకుండా కేవలం కాంట్రాక్టర్కు, తమకు లబ్ధి కలగాలన్న దురాశతో పాతబడిన వాటర్ ట్యాంక్ను తొలగించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ట్యాంక్ ఒక్కసారిగా కుప్పకూలడంతో అందులో ఉన్న ఇద్దరు కూలీలు తీవ్రగాయాలతో ప్రాణాపాయస్థితిలో ఉన్నారు. పెందుర్తి మండలం ముదపాక పంచాయతీ బొడ్డునాయుడుపాలెంలో సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యంత్రాలతో తొలగించాల్సిన పాత ట్యాంక్ను కేవలం ఇద్దరు కూలీలతో తొలగింపు ప్రక్రియ చేపట్టడంతో పాటు తగిన రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ట్యాంక్లో ఉన్న దొగ్గవానిపాలెంకి చెందిన కూలీలు ఆర్.శివప్రసాద్(30), దమ్ము నవీన్(17) తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని కాంట్రాక్టర్, స్థానిక జనసేన నాయకులు కేజీహెచ్కు తరలించి గట్టుచప్పుడు కాకుండా చికిత్స చేయిస్తున్నారు. శివప్రసాద్ తలకు తీవ్ర గాయం కావడంతో మంగళవారం వేకువజామున మెదడుకు శస్త్రచికిత్స చేశారు. వెన్నుపూసకు, గజ్జల్లో తీవ్రగాయాలు కావడంతో నవీన్ అత్యవసర చికిత్స విభాగంలో ఉన్నట్లు సమాచారం. కాగా ఈ ప్రమాదం విషయం జిల్లా ఉన్నతాధికారులకు తెలిసినా విషయాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అసలేం జరిగింది? ముదపాక పంచాయతీ బొడ్డునాయుడుపాలెంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రూ.24 లక్షల జలజీవన్ మిషన్ నిధులతో మంచినీటి పథకాన్ని నిర్మించారు. కాగా అదే గ్రామంలో వినియోగంలో లేని మంచినీటి పథకం ట్యాంక్ ప్రమాదకరస్థితిలో ఉంది. ఈ క్రమంలో దాన్ని తొలగించేందుకు దాదాపు రెండు నెలల క్రితం పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసింది. తొలగింపు చేసేందుకు అధికారుల అభిప్రాయం కూడా తీసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ట్యాంక్ తొలగింపునకు పంచాయతీ పాలకవర్గంతో పాటు కార్యదర్శి అనుమతి కూడా ఉండాలి. ట్యాంక్ తొలగింపునకు పూర్తిస్థాయి అనుమతితో పాటు అయ్యే ఖర్చును కూడా పంచాయతీ నిధులనే వెచ్చించాలి. ఈ క్రమంలో గ్రామీణ నీటిసరఫరా విభాగం అధికారులు ట్యాంక్ తొలగింపునకు రూ.40 వేలు పైచిలుకు అవుతుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఆయా నిధులను కేటాయిస్తూ.. దాన్ని తొలగించే కాంట్రాక్టర్ వివరాలను పొందుపరుస్తూ అధికారికంగా పంచాయతీ నుంచి తీర్మానం రూపంలో అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఇక్కడే స్థానిక జనసేన నాయకులు వేలు పెట్టారు ‘అనుమతి లేదు ఏమీ లేదు’ మాకు నచ్చిన కాంట్రాక్టర్ను పెట్టుకుంటాం.. బిల్లులు ఇవ్వండి అంటూ పరోక్షంగా అధికారులకు చెప్పారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం పంచాయతీ పాలకవర్గానికి గానీ, పంచాయతీ కార్యదర్శికి గానీ తెలియకుండా చింతలగ్రహారానికి చెందిన కాంట్రాక్టర్ సత్తిబాబు ఇద్దరు కూలీలు నవీన్, శివప్రసాద్లను తీసుకువచ్చి కూల్చివేత ప్రక్రియ ప్రారంభించారు. అయ్యో పాపం ఓ వైపు నిబంధనల ప్రకారం అనుమతి లేకుండా కేవలం కూటమి నాయకుల జోక్యంతో పనులు ప్రారంభించారు. మరోవైపు యంత్రాలతో చేయాల్సిన పనిని కేవలం ఇద్దరు కూలీలను పెట్టారు. ఈ క్రమంలో ట్యాంక్ లోపలకు వెళ్లి శిథిలాలను తొలగిస్తున్న క్రమంలో.. ట్యాంక్ దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా కిందకు పడిపోవడంతో అందులో ఉన్న నవీన్, శివప్రసాద్కు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రాణాపాయస్థితిలో కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. అంతా గప్చుప్ ప్రమాద సయయంలో గ్రామంలో భీతవహ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు. ట్యాంక్ ఖాళీ స్థలంలో పడింది కాబట్టి సరిపోయింది గానీ అదే మరోవైపు పడితే అటువైపు ఇళ్లు ఉన్నాయి. నష్టం తీవ్రంగా ఉండేది. కాగా ప్రమాద విషయాన్ని బయటకు పొక్కకుండా కూటమి నాయకులు విశ్వప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. నియోజవర్గంలోని ఓ ముఖ్యనేత ద్వారా జిల్లా ఉన్నతాధికారులపై ఒత్తిడి తేవడంతో కేజీహెచ్లో బాధిత కూలీలకు గుట్టుచప్పుడు కాకుండా చికిత్స చేయిస్తున్నారు. అపస్మారకస్థితిలో ఉన్న శివప్రసాద్కు కేజీహెచ్ చరిత్రలోనే తొలిసారిగా వేకువజామున శస్త్రచికిత్స చేయించినట్లు తెలిసింది. అదే క్రమంలో బాధిత కుటుంబాలను కూడా విషయాన్ని ఎవరికీ చెప్పకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. మొత్తానికి ఆదిపత్యం కోసం, కాసుల కక్కుర్తి కోసం కూటమి నాయకులు వ్యవహరించిన తీరుపై సర్వాత్రాల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
12 నెలలుగా 430 కోట్ల బకాయిలు
● బిల్లులు చెల్లించండి మహాప్రభో! ● జీవీఎంసీ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వేడుకోలు డాబాగార్డెన్స్: బిల్లుల బకాయిలు వెంటనే చెల్లించాలని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.వి.వి.నాగరాజు, ప్రధాన కార్యదర్శి ఎం. సంజీవరెడ్డి కోరారు. అప్పులు చేసి పనులు పూర్తి చేసిన ఎందరో చిన్న కాంట్రాక్టర్లు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లుల కోసం జీవీఎంసీ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్న వారు కొందరైతే.. అనారోగ్యం బారిన పడిన వారు మరికొందరున్నారని తెలిపారు. నగరంలోని ఓ హోటల్లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిందని ఎంతో ఆశపడ్డామని, అయితే ఏడాదిగా చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో చాలా మంది కాంట్రాక్టర్లు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ప్రభుత్వం నిధి పోర్టల్ను ఏర్పాటు చేసిందని, అయితే దీని వల్ల కాంట్రాక్టర్లకు పెద్దగా లాభం లేదన్నారు. పాత బిల్లులు అందులో అప్లోడ్ కావడం లేదని వివరించారు. గత 12 నెలలుగా సుమారు రూ.430 కోట్లు బకాయిలున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా కొన్ని చిన్న పనులకు టెండర్లు పిలిచి రద్దు చేయడం, ఆ పనులను పెద్ద కాంట్రాక్టర్లకు ఒకేసారి అప్పగించడం వల్ల చిన్న కాంట్రాక్టర్లకు పనులు లేకుండా పోయాయన్నారు. అధికారిక ఆమోదం లేకపోయినా పనులు పూర్తి చేసిన తర్వాత ఫైల్ ప్రాసెసింగ్లో జాప్యం కారణంగా కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు. ఫైల్ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడంతో మెయిన్ ఆఫీస్కి, జోనల్ ఆఫీస్కి మధ్య సరైన కమ్యూనికేషన్ లేక కాంట్రాక్టర్లు అవస్థలు పడుతున్నారని వివరించారు. ఈ సమస్యలపై మేయర్ పీలా శ్రీనివాసరావు, కమిషనర్ కేతన్ గార్గ్ స్పందించి కాంట్రాక్టర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అసోసియేషన్ నాయకులు కోరారు. అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.రమేష్, ప్రతినిధులు శ్రీనివాసరావు, జి.సింహాచలం, బి.కృష్ణ, అప్పలనాయుడు, రవికుమార్, పలువురు సభ్యులు పాల్గొన్నారు. -
ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ ప్రతినిధుల పర్యటన
నక్కపల్లి: ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు మంగళవారం మండలంలో పర్యటించారు. కంపెనీ కోసం ప్రభుత్వం కేటాయించిన భూములను వారు పరిశీలించారు. అమలాపురం, డీఎల్ పురం, వేంపాడు, బోయపాడు తదితర గ్రామాల్లో స్టీల్ప్లాంట్ కోసం మొదటి విడతలో 2080 ఎకరాలను కేటాయించింది. జాతీయ రహదారి కాగిత నుంచి స్టీల్ప్లాంట్ వరకు డబుల్ లైన్ రోడ్డు నిర్మాణం చేపట్టింది. దీంతో కంపెనీ ప్రతినిధులు తమకు కేటాయించిన భూములను, అక్కడ ఏపీఐఐసీ వారు చేపట్టిన మౌలిక సదుపాయాల పనులను పరిశీలించారు. రెవెన్యూ అధికారులు స్టీల్ప్లాంట్ కోసం కేటాయించిన భూములు, వాటి వివరాలు, భౌగోళిక స్వరూపాన్ని కంపెనీ ప్రతినిధులకు చూపించారు. ముఖ్యంగా డీఎల్పురం వద్ద కంపెనీ నిర్మించే క్యాప్టివ్ పోర్టు పరిసరాలను పరిశీలించారు. వెసల్స్, మెటీరియల్ హ్యాండ్లింగ్ కోసం మొదటి విడతలో పోర్టు నిర్మాణం కోసం 168 ఎకరాలు అవసరం కానుంది. వీరి మిట్టల్ కంపెనీ ప్రతినిధుల వెంట తహసీల్దార్ ఆర్.నర్సింహమూర్తి ఉన్నారు. -
‘జర్నలిస్ట్ల పిల్లలకు స్కూల్ ఫీజులో రాయితీ’
మహారాణిపేట: జిల్లాలోని జర్నలిస్ట్లకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు వారి పిల్లలకు స్కూల్ ఫీజులో 50 శాతం రాయితీ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. జాతీయ జర్నలిస్ట్ల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, పలువురు జర్నలిస్ట్ నాయకులు మంగళవారం కలెక్టర్ను కలిశారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో యోగాంధ్ర నమోదైన నేపథ్యంలో కలెక్టర్కు అభినందనలు తెలిపి, సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు, ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి.నారాయణ్ మాట్లాడుతూ జర్నలిస్ట్లకు గతేడాది అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారని, ఈ ఏడాది కూడా కార్పొరేట్ ఆసుపత్రిలో నిర్వహించేలా తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టామని, ఇప్పటికే సంబంధిత విభాగం అధికారులకు ఆ బాధ్యత అప్పగించినట్లు కలెక్టర్ తెలిపారు. జర్నలిస్ట్ల పిల్లలకు స్కూల్ ఫీజు రాయితీ కల్పించాలని, ఇప్పటికే వినతిపత్రం అందించామని వివరించగా, ఫీజు రాయితీ కల్పించడానికి తగిన ఆదేశాలు ఇచ్చామన్నారు. రెండు రోజుల్లో జిల్లా విద్యా శాఖ ద్వారా ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. జర్నలిస్ట్లు జి.శ్రీనివాసరావు, బ్రాడ్కాస్ట్ అసోసియేషన్ కార్యదర్శి కింతాడ మదన్, స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీఎస్ జగన్మోహన్, కార్యనిర్వాహక సభ్యుడు అరుణ్కుమార్, రమణమూర్తి, నగేష్బాబు పాల్గొన్నారు. -
ప్రజారోగ్యం, సుందరీకరణకు ప్రాధాన్యం
మహారాణిపేట: పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం పెంపుదల, ప్రజారోగ్య పరిరక్షణ వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వ సంస్థలు, జిల్లా యంత్రాంగం, జీవీఎంసీ కలిసి పనిచేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ సూచించారు. ఆయా సంస్థల మధ్య సమన్వయం లోపించకుండా ఉండేందుకు ప్రత్యేక ప్రతినిధులను నియమించుకోవాలని ఆదేశించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని స్థానిక సంస్థలు, కేంద్ర సంస్థలు వ్యవహరించాల్సి ఉంటుందని నిర్దేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో మంగళవారం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్తో కలిసి కేంద్ర సంస్థల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశమయ్యారు. కేంద్ర సంస్థలు తప్పకుండా జీవీఎంసీతో అనుసంధానమై పారిశుధ్య చర్యలు చేపట్టాలన్నారు. ప్రధానంగా పోర్ట్, రైల్వే, గెయిల్, ఎన్హెచ్ఏఐ, ఐవోసీఎల్, స్టీల్ప్లాంట్, హెచ్పీసీఎల్, కోరమాండల్, గంగవరం పోర్టు పరిసరాల్లో పారిశుధ్య సమస్యలపై ఇరువర్గాల వారు క్షేత్రస్థాయి పరిశీలన చేసి శాశ్వత చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. నాలుగు అంశాలపై దృష్టి సారించాలి ప్రజారోగ్యం దృష్ట్యా కేంద్ర సంస్థలు ప్రధానంగా నాలుగు అంశాలపై దృష్టి సారించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అన్నారు. ఆయా కేంద్ర పరిశ్రమలు, సంస్థలు, యూనిట్ల పరిధిలో పక్కా పారిశుధ్య చర్యలు చేపట్టాలని, ప్రత్యేక సిబ్బందిని నియమించుకుని నిరంతరం ఈ ప్రక్రియను కొనసాగించాలని సూచించారు. మురుగునీరు పారేందుకు అడ్డంకులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. పూడిక తొలగింపు పనులు ఎప్పటికప్పుడు చేపట్టాలని పేర్కొన్నారు. అలాగే పచ్చదనం పెంపుదలకు, సుందరీకరణకు అధిక ప్రాధాన్యమివ్వాలన్నారు. జీవీఎంసీ సీఎంవో నరేష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
అర్చకుడి అదృశ్యంపై లోతుగా దర్యాప్తు
భీమునిపట్నం: భీమిలిలోని భ్రమరాంబికా సహిత చోడేశ్వరస్వామి ఆలయ అర్చకుడు ఏడిద గణేష్ సుబ్రహ్మణ్య శాస్త్రి(49) అదృశ్యంపై దర్యాప్తునకు ఎస్ఐ స్థాయి అధికారిని నియమించినట్లు సీఐ తిరుమలరావు తెలిపారు. పోలీస్స్టేషన్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు. అర్చకుడు ఈ ఏడాది ఏప్రిల్ 24న తిరుపతి బయలుదేరి వెళ్లినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 26న ఆయన నుంచి ఫోన్ వచ్చిందని, ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని చెప్పారు. కాగా.. అర్చకుడికి మద్యం సేవించే అలవాటు ఉంది. గతంలోనూ ఇలానే పలు ప్రాంతాలను వెళ్లిన శాస్త్రి కొద్ది రోజుల తర్వాత ఇంటికి వచ్చేవారు. అలానే వస్తారని కుటుంబ సభ్యులు వేచి చూశారు. అయినప్పటికీ రాకపోవడంతో మే 4న తిరుపతి స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అక్కడి పలు ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో అర్చకుడి ఆచూకీ పరిశీలించగా లభించలేదు. దీంతో అతని భార్య మాధురి మే 13న భీమిలి స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తర్వాత ఈ కేసులో ఎటువంటి పురోగతి కనిపించలేదు. దీంతో గత నెల 23న ‘భీమిలి అర్చకుడు తిరుపతిలో అదృశ్యం’శీర్షికన ‘సాక్షి’లో వార్త ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో పోలీసులు గత నెల 25న తిరుపతి వెళ్లి.. అర్చకుడి కోసం గాలించారు. ఈ క్రమంలో అర్చకుడి ఫోన్ తిరుపతిలో ఒక వ్యక్తి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతన్ని విచారించారు. అర్చకుడి వద్ద డబ్బులు లేకపోవడంతో రూ.700లకు ఫోన్ను విక్రయించినట్లు విచారణలో తేలింది. ఫోన్తో పాటు నలుగురిని అదుపులోకి తీసుకుని పూర్తిస్థాయిలో విచారించినప్పటికీ.. అర్చకుడి ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులు 30న భీమిలికి తిరిగి వచ్చేశారు. ఈ కేసును మరింత లోతుగా విచారించడానికి ఎస్ఐ స్థాయి అధికారిని నియమించినట్లు సీఐ తెలిపారు. -
జూలో ఎన్క్లోజర్ల పునరుద్ధరణకు చర్యలు
ఆరిలోవ : ఇందిరాగాంధీ జా పార్కులో అవసరమైన ఎన్క్లోజర్లు పునరుద్ధరణకు నివేదిక సిద్ధం చేయాలని జూ అధికారులకు రాష్ట్ర అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రాహుల్ పాండే సూచించారు. జూ పార్కును మంగళవారం ఆయన సందర్శించారు. విశాఖ సీఎఫ్ మహ్మద్ దివాన్ మైదీన్, జూ క్యూరేటర్ జి.మంగమ్మ, అధికారులతో కలసి ఆయన జూలో ఎన్క్లోజర్లు, వన్యప్రాణులను పరిశీలించారు. ఇటీవల జూలో నిర్మించిన కొత్త ఎన్క్లోజర్లు, మరమ్మతులు చేపట్టిన ఎన్క్లోజర్లను పరిశీలించి వాటి కోసం ఎంత నిధుల ఖర్చుచేశారు.. సీఎస్ఆర్ నిధులు ఏఏ సంస్థలు నుంచి వచ్చాయి.. తదితర వాటిపై ఆరా తీశారు. ఇటీవల పునరుద్ధరించిన సీతాకోక చిలుకల పార్కు, కొత్తగా నిర్మించిన అడవి కుక్కల పునరుత్పత్తి కేంద్రం అదనపు విభాగాన్ని పరిశీలించారు. వన్యప్రాణులు ఆరోగ్యం, వాటికి అందిస్తున్న వైద్య సేవలు, ఆహారంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన జూ అధికారులతో మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న రాబందుల ఎన్క్లోజరు పనులు వేగవంతం చేయాలని సూచించారు. అభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని రాబోయే ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలన్నారు. ప్రతి విభాగంలో అవసరమైన ఎన్క్లోజర్ల పునరుద్ధరణ, సీఎస్ఆర్ నిధుల ద్వారా మరమ్మతులు, సుందరీకరణ చేపట్టడానికి నివేదిక తయారు చేయాలన్నారు. వాటితో పాటు జూలో అక్వేరియం, స్లాత్బేర్, రెడ్నెక్డ్ వాల్లబీ, అడవి పిల్లుల ఎన్క్లోజర్ను పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్శనలో జూ అసిస్టెంట్ క్యూరేటర్ గోపి, జూ వైద్యుడు డాక్టర్ భాను, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రాహుల్ పాండే -
రౌడీషీటర్ హత్య
మర్రిపాలెం : జ్ఞానాపురం శ్మశానవాటికలో రౌడీషీటర్ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. అల్లిపురం ప్రాంతానికి చెందిన నాగమణి ఎల్లాజీ(35)పై గతంలో వన్టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ ఉంది. ఇటీవల జైలు నుంచి బెయిల్పై వచ్చిన ఎల్లాజీ జ్ఞానాపురం శ్మశాన వాటిక సిబ్బందితో మంగళవారం మధ్యాహ్నం సుమారు 3.30 గంటల సమయంలో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో తనతో తీసుకువచ్చిన పాకెట్ కత్తిని చూపించి బెదిరించాడు. దీంతో సహనం కోల్పోయిన సిబ్బందిలో ఒకరు చేతిలో ఉన్న గెడ్డపారతో ఎల్లాజీ తలపై బలంగా మోదడంతో రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. అయితే మృతదేహానికి దహనసంస్కారాలు నిర్వహించేందుకు సదరు సిబ్బంది పన్నాగం పన్నారని సమాచారం. ఈ క్రమంలో కంచరపాలెం పోలీసులు రంగప్రవేశం చేసి మృతదేహాన్ని కేజీహెచ్కు పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. -
స్నేహితురాలి ఇంటికే కన్నం
● కబుర్లు చెప్పడానికి వచ్చి 18 తులాల బంగారు ఆభరణాల చోరీ ● నిందితురాలి అరెస్ట్, రూ.15 లక్షల విలువైన సొత్తు రికవరీపెందుర్తి : స్నేహితురాలి ఇంటికే కన్నం వేసింది ఓ ఘనురాలు. కబుర్లు చెబుదామని రోజూ ఇంటికి వచ్చి నగలు భద్రపరిచే ప్రదేశాన్ని కనిపెట్టి చాకచక్యంగా ఎత్తుకుపోయింది. దాదాపు మూడు నెలల తరువాత స్నేహితురాలిపై అనుమానం రావడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. మంగళవారం పెందుర్తి పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో వెస్ట్ జోన్ క్రైం విభాగం ఏసీపీ డి.లక్ష్మణరావు ఆయా వివరాలను వెల్లడించారు. సింహచలం సమీపంలోని విరాట్నగర్కు చెందిన రెయ్య జ్యోతి, చినముషిడివాడకు చెందిన ఎస్.వాణి స్నేహితులు. జ్యోతి భర్త కెనరా బ్యాంక్లో క్లర్క్గా పనిచేస్తున్నారు. కాగా వాణి తరచూ జ్యోతి ఇంటికి వచ్చేది. కబుర్లు చెబుతూ ఇంటిలో కలియతిరిగేది. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చి 15న వాణి జ్యోతి ఇంటికి వచ్చి సాయంత్రం తిరిగి వెళ్లిపోయింది. రాత్రికి ఇంట్లో పడకగదిలో బంగారం మాయం అయినట్లు జ్యోతి గుర్తించింది. తొలుత ఎవరో ఎత్తుకుపోయారని భావించారు. కొద్దిరోజులకు తన స్నేహితురాలు వాణి తన ఇంటికి రావడం మానేసింది. దాంతో పాటు ఆమె నడవడికలో మార్పులు రావడాన్ని గమనించిన జ్యోతి ఆమెను అనుమానించి జూన్ 9న పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉన్నతాధికారుల సూచనలతో కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పెందుర్తి క్రైం పోలీసులు వాణిపై నిఘా ఉంచారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వాణి నేరం చేసినట్లు నిర్ధారించుకున్న పోలీసులు.. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా నిజం ఒప్పుకుంది. నిందితురాలిని అరెస్ట్ చేసి రూ.15 లక్షల విలువైన 228.73 గ్రాములు(సుమారు 18 తులాలు) బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్లు ఏసీపీ వెల్లడించారు. కేసులో ప్రతిభ కనబరిచిన క్రైం విభాగం వెస్ట్ జోన్ సీఐ ఎన్.శ్రీనివాసరావు, పెందుర్తి ఎస్ఐ డి.సూరిబాబు, ఏఎస్ఐ కె.శ్రీనివాసరావు, హెచ్సీలు జి.నాగరాజు, టి.పద్మజ, పీసీలు పి.పైడిరాజు, జీవీవీ కిషోర్, టి.శివప్రసాద్, బి.దేముడుబాబు, ఎల్.కె తాతారావు, ఆర్.సంతోషిలను ఉన్నతాధికారులు అభినందించారు. -
రేషన్ కష్టాలు
రేషన్ సరకుల కోసం ఈ నెల కూడా కార్డుదారులకు కష్టాలు తప్పలేదు. జోరు వానలో తడుస్తూ సరకులు మోసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. గత నెల నుంచి ఎండీయూ వాహనాలను కూటమి సర్కార్ నిలిపేసిన విషయం తెలిసిందే. దీంతో ఇంటి వద్దే రేషన్ అందుకునే లబ్ధిదారులు ఇప్పుడు రేషన్ డిపోల వద్ద క్యూలు కడుతూ.. సరకుల్ని మోసుకెళ్లేందుకు నానా ఇక్కట్లు పడుతున్నారు. కొన్ని ఏరియాల్లో రేషన్ షాపులు నిర్ణీత సమయానికి తెరవక పోవడంతో వర్షంలో గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. సర్వర్ల మొరాయింపు షరా మామూలే..! – మహారాణిపేట కూటమి గూడు పుఠాణి 94 శాతం పింఛన్ల పంపిణీఎన్నికలకు ముందు గ్రామంలో 3, నగరంలో 2 సెంట్ల స్థలం ఇస్తామని హామీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఒక్క గజం కూడా ఇవ్వని చంద్రబాబు -
రాజీమార్గమే శ్రేయస్కరం
మహారాణిపేట: జిల్లాలో ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ మంగళవారం 94.04 శాతం పూర్తయింది. పింఛన్ల పంపిణీ పూర్తయిన తర్వాతే బదిలీ అయిన సచివాలయ ఉద్యోగులు రిలీవ్ కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో.. చేసేది లేక ఎక్కడి వారు అక్కడే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లాలో మొత్తం 1,58,681 పింఛన్లు ఉండగా, ఇందుకోసం ప్రభుత్వం రూ.69,60,82,500 విడుదల చేసింది. మంగళవారం రాత్రి 7 గంటల సమయానికి 94.04 శాతం అంటే 1,49,173 మందికి రూ.65.26 కోట్ల అందజేశారు. బయోమెట్రిక్ గుర్తింపు ద్వారా లబ్ధిదారులకు సచివాలయ సిబ్బంది పింఛన్లు అందజేశారు. మిగిలిన వారికి బుధవారం అందజేస్తామని డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ లక్ష్మీపతి తెలిపారు. 5న మెగా లోక్ అదాలత్ విశాఖ లీగల్: రాజీ మార్గమే రాజమార్గమని జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు అన్నారు. ఈ నెల 5న జరగనున్న మెగా లోక్ అదాలత్ సందర్భంగా.. న్యాయమూర్తి బ్యాంకు, చిట్ఫండ్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాజీపడటానికి వీలున్న అన్ని కేసులను పరిష్కరించే దిశగా కృషి చేయాలని వారికి సూచించారు. బ్యాంకుల్లో పెండింగ్లో ఉన్న చెక్ బౌన్స్ కేసుల్లో ఇరువర్గాలు రాజీ చేసుకోవడానికి ముందుకు రావాలని కోరారు. చిట్ఫండ్ కంపెనీలు కూడా తమ పరిధిలో సాధ్యమైనంత మేరకు ఇరువర్గాలు రాజీ కుదుర్చుకోవాలని న్యాయమూర్తి సూచించారు. -
ముంచెత్తిన వర్షం
మహారాణిపేట: జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి భారీ వర్షం కురిసింది. అల్పపీడన ప్రభావంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అయితే ఈ భారీ వర్షం జనజీవనానికి అంతరాయం కలిగించింది. ఈదురుగాలులకు పందిమెట్ట, బుల్లయ్య కాలేజీ వద్ద చెట్లు నేలకొరిగాయి. ఆశీలమెట్ట వద్ద హోర్డింగులు కూలిపోయాయి. జ్ఞానాపురం రైల్వే వంతెన, ఆర్టీసీ కాంప్లెక్స్, డాబాగార్డెన్స్, పూర్ణామార్కెట్, కంచరపాలెం సహా అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లాలో అత్యధికంగా భీమిలిలో 36.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. అత్యల్పంగా పద్మనాభంలో 10.8 మిల్లీమీటర్లుగా నమోదైంది. -
అధ్వానంగా సదుపాయాలు
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అన్ని లేఅవుట్లలో మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టింది. బీటీ రోడ్ల నుంచి మంచి నీటి సదుపాయాల వరకు అన్నింటినీ పనులను చేపట్టింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మౌలిక సదుపాయాల పనులన్నీ నిలిచిపోయాయి. ఇప్పటికీ రోడ్ల పనులు పూర్తి కాలేదు. డ్రైనేజీలు కనిపించడం లేదు. అనేక చోట్ల విద్యుత్ స్తంభాలను సైతం ఏర్పాటు చేయలేదు. వాస్తవనికి 2026 నాటికి ఈ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని కూటమి ప్రజాప్రతినిధులు చెబుతున్నప్పటికీ.. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఒక్కో లేఅవుట్లో పదుల సంఖ్యలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి త్వరలో గృహ ప్రవేశ కార్యక్రమాలను చేపట్టాలని అధికారులకు ఆదేశాలు అందినట్లు సమాచారం. -
గిరి ప్రదక్షిణకు పకడ్బందీ ఏర్పాట్లు
● 32 కి.మీ.పరిధిలో వీధి దీపాలుసీసీ కెమెరాలు, వైద్య శిబిరాలు ● 132 పాయింట్లలో తాగునీటి సదుపాయం ● స్నానఘట్టం వద్ద గజ ఈతగాళ్లు, హైమాస్ట్ లైట్ల ఏర్పాటు ● కలెక్టర్ హరేందిర ప్రసాద్ వెల్లడి మహారాణిపేట: శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించనున్న సింహాచలం గిరి ప్రదక్షిణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పోలీస్, రెవెన్యూ, దేవస్థానం, ఇతర శాఖల అధికారులతో ఆయన గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 9న తెల్లవారుజాము నుంచి 10వ తేదీ సాయంత్రం వరకు కొండదిగువ తొలిపావంచా వద్ద భక్తుల రద్దీని, ట్రాఫిక్ను నియంత్రించడానికి పోలీస్ బందోబస్తు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. క్యూలు, రద్దీ ప్ర దేశాల వద్ద తోపులాటలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. భక్తులకు సౌకర్యాలు, వైద్య సేవలు లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున 32 కిలోమీటర్ల మేర 132 పాయింట్లలో తాగునీటి సౌకర్యం, 400 మరుగుదొడ్లు, పారిశుధ్యంతో పాటు రద్దీ ప్రదేశాల్లో లైటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అవసరమైన అంబులెన్సులు, 32 వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని, ప్రతి శిబిరం వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులతో పాటు ఒక వైద్యుడు, ఏఎన్ఎం లేదా ఆశ కార్యకర్తను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. భక్తులు ప్రదక్షిణ చేసే మార్గంలో, రద్దీ ప్రాంతాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండాలని, అవసరమైన మేరకు జనరేటర్లను సిద్ధం చేసుకోవాలని ఈపీడీసీఎల్ అధికారులను సూచించారు. ముందుజాగ్రత్త చర్యగా 9, 10 తేదీల్లో మద్యం దుకాణాలను మూసివేయా లని ఎకై ్సజ్ శాఖ అధికారులకు సూచించారు. భక్తుల సౌకర్యార్థం అవసరమైన బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచనలు చేశారు. సింహగిరిపై అగ్నిమాపక యంత్రం, ఫైర్ నియంత్రణ పరికరాలతో పాటు అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. విద్యుత్ తీగలు వేలాడకుండా చూసుకోవాలని, గిరి ప్రదక్షిణ జరిగే దారిలో వాహనాలు అడ్డదిడ్డంగా నిలపకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. యాప్తో సాంకేతిక సాయం అత్యవసర సమయాల్లో ప్రత్యేక యాప్ ద్వారా సహాయం అందించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉంటుందని కలెక్టర్ తెలిపారు. అలాగే ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించి ‘అస్త్రం’యాప్ ద్వారా సహాయం పొందవచ్చని సీపీ శంఖబ్రత బాగ్చి సూచించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వాలని సీపీ ఆదేశించారు. పటిష్టమైన బారికేడింగ్ ఏర్పాటు చేయాలని, హనుమంతువాక, ఇసుకతోట జంక్షన్ల వద్ద తాత్కాలిక వంతెనలు నిర్మించాలని సీపీ సూచించారు. సమీక్షలో డీసీపీలు అజిత, మేరీ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, సింహాచలం ఈవో త్రినాథరావు, డీఆర్వో భవానీ శంకర్, జీవీఎంసీ అదనపు కమిషనర్ రమణమూర్తి, భీమిలి ఆర్డీవో సంగీత్ మాథుర్, రెవెన్యూ, దేవస్థానం, జీవీఎంసీ, పోలీస్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన సింహాచలం: గిరి ప్రదక్షిణకు సంబంధించిన ఏర్పాట్లపై మంగళవారం కలెక్టర్ హరేందిర ప్రసాద్.. నగర సీపీ శంఖబ్రత బాగ్చి, జేసీ మయూర్ అశోక్, సింహాచలం ఈవో త్రినాథరావుతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. గిరి ప్రదక్షిణ జరిగే అప్పుఘర్, వెంకోజీపాలెం, సీతమ్మధార, మాధవదార, మురళీనగర్, ప్రహ్లాదపురం, కుమారి కల్యాణ మండపం మీదుగా సింహాచలంలోని తొలి పావంచా వరకు ఆయన సందర్శించి.. ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించారు. సింహాచలం తొలిపావంచా వద్ద భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. -
గెడ్డలో పడి ఆటోడ్రైవర్ మృతి
కంచరపాలెం: బహిర్భూమికి వెళ్లిన ఆటోడ్రైవర్ నలందనగర్ ప్రధాన గెడ్డలో ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. రెస్క్యూ(జీవీఎంసీ, ఫైర్, పోలీస్) బృందం సుమారు 8 గంటలు శ్రమించినప్పటికీ.. ఫలితం లేకపోయింది. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు, అధికారులు తెలిపిన వివరాలివి.. జీవీఎంసీ 54వ వార్డు ఐటీఐ జంక్షన్ పరిధిలోని నలందనగర్లో నివాసముంటున్న కట్ట వడ్డీకాసులు(48) ఆటో డ్రైవర్. తన భార్య రుక్మిణితో కలిసి స్క్రాప్ వ్యాపారం కూడా చేస్తుంటాడు. మంగళవారం ఉదయం సుమారు 6.30 గంటల ప్రాంతంలో నలందనగర్ జాతీయ రహదారి వంతెన కింద గెడ్డ పక్కకు బహిర్భూమికి వెళ్లాడు. తెల్లవారుజాము నుంచి కుండపోతగా వర్షం పడుతుండటంతో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది. ఈ క్రమంలో ఆయన గెడ్డలోకి జారిపడ్డాడు. ఈ క్రమంలో వడ్డీకాసులు గట్టిగా కేకలు వేయడంతో.. భార్య రుక్మిణి వెంటనే అక్కడకు చేరుకుని తన చున్నీని అందించి కాపాడే ప్రయత్నం చేసింది. అయితే నీటి ప్రవాహానికి వడ్డీకాసులు కొట్టుకుపోయి వంతెన కింద గెడ్డలో చిక్కుకుపోయాడు. సహాయక చర్యలు.. మృతదేహం వెలికితీత సమాచారం అందుకున్న జీవీఎంసీ, ఫైర్, పోలీస్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జీవీఎంసీ జోన్–5 కమిషనర్ బొడ్డేపల్లి రాము పర్యవేక్షణలో మూడు క్రేన్లు, పొక్లెయిన్ల సహాయంతో వడ్డీకాసులును రక్షించేందుకు ప్రయత్నాలు చేశారు. సుమారు 8 గంటలు శ్రమించినప్పటికీ.. వడ్డీకాసులు ప్రాణాలు కాపాడలేకపోయారు. చివరికి రెస్క్యూ బృందం ఆయన మృతదేహాన్ని వెలికి తీసింది. కంచరపాలెం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. సీఐ చంద్రశేఖర్ నేతృత్వంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జోనల్ కమిషనర్ రాము దగ్గరుండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కళ్లముందే తన భర్త కాలువలో గల్లంతవడంతో భార్య రుక్మిణి, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 8 గంటలు శ్రమించిన రెస్క్యూ బృందం -
వాల్తేరు డీఆర్ఎం స్టీల్ప్లాంట్ సందర్శన
ఉక్కునగరం: వాల్తేరు డివిజన్ డీఆర్ఎం లలిత్ బోహ్రా మంగళవారం విశాఖ స్టీల్ప్లాంట్ను సందర్శించారు. రైల్వే, విశాఖ స్టీల్ప్లాంట్ల మధ్య సహృద్భావ సంబంధాల పెంపు, సరుకు రవాణా కార్యకలాపాలు, మౌలిక సదుపాయాల సమన్వయాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ఆయన రైల్వే అధికారుల బృందంతో సహా స్టీల్ప్లాంట్కు విచ్చేశారు. సమావేశంలో సరుకు రవాణా పెంపు, రేక్ నిర్వహణ సామర్థ్యం పెంచడం, ప్రణాళికాయుతంగా ఇరు సంస్థల మధ్య వాణిజ్యం అభివృద్ధి తదితర అంశాలను చర్చించారు. రేక్ రిటెన్షన్ టైమ్ తగ్గించడం, మొత్తం కార్యాచరణ పనితీరును పెంచడానికి లాజిస్టిక్స్ను మెరుగుపరచడం వంటి విషయాలు సమావేశంలో చర్చకు వచ్చాయి. స్టీల్ప్లాంట్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) ఎ.కె.బాగ్చీతో పాటు ఉన్నత స్థాయి అధికారుల బృందంతో జరిగిన సమావేశంలో రైల్వే సీనియర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్, సీనియర్ డివిజన్ మెకానికల్ ఇంజనీర్ పాల్గొన్నారు. -
మనవడిని అమ్మేసిన తాత
తాటిచెట్లపాలెం(విశాఖపట్నం): కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేని తండ్రి, తన కుమార్తెకు పుట్టిన మగబిడ్డను ఆమెకు తెలియకుండానే దత్తత ఇచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు నేరుగా పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది. అరకు ప్రాంతానికి చెందిన పెట్టెల దివ్య (23) అదే ప్రాంతానికి చెందిన జాన్బాబును ప్రేమించి వివాహం చేసుకుంది. దివ్య తండ్రి పి. శుక్రకు ఈ వివాహం మొదటి నుంచి ఇష్టం లేదు. వారిద్దరినీ విడదీయడానికి అతను పలు ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలో దివ్య, జాన్బాబు మధ్య మనస్పర్థలు రావడంతో వారు విడివిడిగా ఉంటున్నారు. ఈ సమయంలో దివ్య గర్భవతి కావడంతో, ప్రసవం కోసం ఆమె తండ్రి శుక్ర విశాఖలోని కై లాసపురం ప్రాంతానికి తీసుకువచ్చి, అద్దె ఇంట్లో ఉంచాడు. దివ్యకు కేజీహెచ్లో మగబిడ్డ జన్మించాడు. బిడ్డకు పచ్చకామెర్లు ఉన్నాయని, అనారోగ్యంగా ఉన్నాడని, వైద్యం చేయించాలని చెప్పి, దివ్యతో పలు పత్రాలపై సంతకాలు చేయించాడు. అనంతరం తల్లికి తెలియకుండా ఆ బిడ్డను దత్తత పేరుతో విక్రయించాడు. రెండు నెలలు గడిచినా బిడ్డ ఆచూకీ తెలియకపోవడంతో దివ్య తన తండ్రిని నిలదీసింది. సరైన సమాధానం రాకపోవడంతో, దివ్య మొదట కంచరపాలెం పోలీస్స్టేషన్లో, ఆపై నేరుగా పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేసింది. కమిషనర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టి బిడ్డ ఆచూకీని కనుగొన్నాయి. బిడ్డను మొదట ఆర్అండ్బీ వద్ద గల శిశుగృహకు అప్పగించారు. సోమవారం పోలీసుల సమక్షంలో ఆ బిడ్డను తల్లిదండ్రులైన దివ్య, జాన్బాబులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. -
వైఎస్సార్సీపీ నాయకుల అరెస్ట్..స్టేషన్ బెయిల్పై విడుదల
అల్లిపురం(విశాఖ జిల్లా): వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గత నెల 23న జరిగిన యువత పోరు కార్యక్రమంలో పాల్గొన్న 13 మంది నాయకులపై విశాఖ మహారాణిపేట పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ అధ్యక్షుడు తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకటరామయ్య, కోలా గురువులు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉరుకూటి చందు తదితర నాయకులపై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు మహారాణిపేట పోలీసులు సోమవారం నోటీసులు జారీ చేశారు. దీంతో వారంతా స్టేషన్కు వెళ్లి, ష్యూరిటీలు సమరి్పంచి, స్టేషన్ బెయిల్పై వచ్చారు. నిరసన తెలిపినా తప్పేనా? కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన, నిరుద్యోగ భృతి అందించకుండా మోసగించిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ హామీలు అమలు చేయనందుకు నిరసనగా తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జూన్ 23న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల వద్ద ‘యువత పోరు‘పేరిట నిరసన తెలిపినట్లు పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతం కావడంతో జీరి్ణంచుకోలేని కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించిందని ఆరోపించారు.పోలీసులు జారీ చేసిన నోటీసులను గౌరవించి స్టేషన్కు స్వయంగా వచ్చి ష్యూరిటీలు సమర్పించామన్నారు. కూటమి ప్రభుత్వ తప్పుడు కేసులకు భయపడేది లేదన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ పేరిట కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు. కేకే రాజు వెంట డిప్యూటీ మేయర్ కటుమూరి సతీశ్ , పార్టీ కార్యాలయ పర్యవేక్షకుడు రవిరెడ్డి, ఉరుకూటి అప్పారావు, ఫ్లోర్ లీడర్ బానాల శ్రీనివాసరావు, కార్పొరేటర్లు పి.వి.సురేష్, జిల్లా అనుబంధ విభాగం అధ్యక్షులు సేనాపతి అప్పారావు, రాయపురెడ్డి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
డిజిటల్ అసిస్టెంట్ల పడిగాపులు
● ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్ సాయంత్రానికి.. ● కూటమి నేతల సిఫార్సుల కారణంగానే ఆలస్యం ● ఉద్యోగుల ఆగ్రహం, ఆందోళన మహారాణిపేట: ఉమ్మడి విశాఖ జిల్లాలోని పంచాయతీరాజ్ డిజిటల్ అసిస్టెంట్ల (గ్రేడ్–6) బదిలీల కౌన్సెలింగ్ సోమవారం తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఉదయం 9 గంటల నుంచి డీపీవో కార్యాలయం వద్దకు డిజిటల్ అసిస్టెంట్లు చేరుకున్నారు. 11 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా సాయంత్రం 6 గంటలకు ప్రక్రియ ప్రారంభించారు. భోజనం లేకుండా పడిగాపులు కాయడంతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రజాప్రతినిధుల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన సిఫార్సు లేఖలే బదిలీల కౌన్సెలింగ్ జాప్యానికి కారణమని తెలుస్తోంది. ప్రజాప్రతినిధులు కోరిన పోస్టింగ్లు, ఇతర వ్యవహారాలపై అధికారులు సాయంత్రం వరకు చర్చలు జరపడం వల్ల కౌన్సెలింగ్ ఆలస్యమైంది. పోస్టుల ఖాళీల జాబితాను బయట పెట్టకుండానే కౌన్సెలింగ్ చేపట్ట డంపై పారదర్శకత లేదని అసిస్టెంట్లు ఆరోపించారు. పైరవీలకు పెద్దపీట? మొత్తం 549 మంది డిజిటల్ అసిస్టెంట్లలో 95 శాతం మంది ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నవారే. స్థాన చలనం తప్పదని తెలియడంతో, తమకు నచ్చిన స్థానాల కోసం పోటీ పడ్డారు. డీపీవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మొదట దివ్యాంగులు, స్పౌజ్, అనారోగ్యంతో ఉన్నవారికి పోస్టింగ్లు కేటాయించారు. ఆ తర్వాత కూటమి ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకే జనరల్ బదిలీలు జరిగాయని ఆరోపణలు వినిపించాయి. బదిలీల్లో పైరవీలకు పెద్దపీట వేశారని ఆరోపణలు రావడంతో, కొందరు అసిస్టెంట్లు నిరసన వ్యక్తం చేస్తూ, తమకు సరైన పోస్టింగ్ కావాలని డిమాండ్ చేశారు. అగ్రికల్చర్ అసిస్టెంట్ల బదిలీలపై విమర్శలు మధురవాడ: జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో శని, సోమవారాల్లో జరిగిన సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్ బదిలీల కౌన్సెలింగ్పై విమర్శలు వెల్లువెత్తాయి. కౌన్సెలింగ్లో కూటమి ఎమ్మెల్యేలు, నాయకుల సిఫార్సులకే ప్రాధాన్యత ఇచ్చారని పలువురు ఆరోపించారు. ప్రిఫరెన్షియల్ కేటగిరి, సీనియారిటీ, కోర్టు మార్గదర్శకాలను పక్కన పెట్టి, అస్తవ్యస్తంగా బదిలీలు చేశారని ఉద్యోగులు వాపోతున్నారు. రేషనలైజేషన్ పేరుతో ఐదేళ్లు నిండని, శారీరక సవాళ్లు ఎదుర్కొంటున్న ఉద్యోగులను కూడా కౌన్సెలింగ్కు పిలిచి ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరగనివారు కోర్టును ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. -
5న వైఎస్సార్ సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్ సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 5వ తేదీన ఉదయం 9.30 గంటలకు వెంకోజిపాలెం సీఎంఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు తెలిపారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘బాబు ష్యూరిటీ–మోసాలు గ్యారెంటీ’ పేరిట కూటమి ప్రభుత్వ మోసాలను ఎండగడతామని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏ విధంగా ఎగనామం పెడుతుందో ప్రజలకు తెలియజేస్తామన్నారు. ఈ సమావేశానికి పార్టీ శ్రేణులంతా హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్ కుమార్, మొల్లి అప్పారావు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ కుమార్, చింతలపూడి వెంకట రామయ్య, డిప్యూటీ మేయర్ కె.సతీష్, పార్టీ కార్యాలయం పర్యవేక్షకుడు రవిరెడ్డి, రాష్ట్ర పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు బొల్లవరపు జాన్వెస్లీ, పేర్ల విజయచందర్, పోతిన శ్రీనివాసరావు, మహంతి, పార్టీ ముఖ్య నాయుకులు కోలా గురువులు, ఉరుకూటి అప్పారావు, పివిఎస్ఎన్ రాజు (వుడా రవి), డాక్టర్ సిఎంఎ జహీర్ అహ్మద్, బాణాల శ్రీనివాసరావు, గొలగాని శ్రీనివాస్, నడింపల్లి కృష్ణంరాజు, జి.శ్రీనివాస్, మువ్వల సురేష్, ద్రోణంరాజు శ్రీ వాస్తవ తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి అమల్లోకి పెరిగిన రైలు చార్జీలు
తాటిచెట్లపాలెం: సామాన్య, మధ్య తరగతి ప్రయాణికుల ప్రధాన రవాణా సాధనం రైలు. ఇతర ప్రయాణ సాధనాలతో పోల్చుకుంటే తక్కువ చార్జీలకు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంలో రైల్వే కీలకం. రైల్వే చార్జీలు స్వల్పంగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ పెంచిన చార్జీలు నేటి(జూలై 1) నుంచి అమల్లోకి రానున్నాయి. సబర్బన్(సింగిల్ జర్నీ), సీజన్ టికెట్స్(సబర్బన్, నాన్ సబర్బన్), రిజర్వేషన్ చార్జీలు, సూపర్ఫాస్ట్ చార్జీలు, ఇతర చార్జీల్లో ఎలాంటి మార్పుల్లేవు.ఆర్డినరీ నాన్ ఏసీ(నాన్–సబర్బన్)సెకండ్ క్లాస్ మొదటి 500 కి.మీ.లకు మార్పులేదు. ఆపై కి.మీ.కు 0.5(అర) పైసా చొప్పున పెంచారు. 501 నుంచి 1500 కి.మీ. వరకు రూ.5, 1501 నుంచి 2500 కి.మీ. రూ.10, 2501 నుంచి 5 వేల కి.మీ. వరకు రూ.15 చొప్పున చార్జీలు పెరగనున్నాయి. స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్కు కి.మీ.కు అర పైసా చొప్పునే పెరుగుదల ఉంది.మెయిల్ ఎక్స్ప్రెస్(నాన్–ఏసీ): సెకండ్ క్లాస్, స్లీప్ క్లాస్, ఫస్ట్ క్లాస్ కేటగిరీలో కిలో మీటర్కు పైసా చొప్పున చార్జీలలు పెరిగాయి.ఏసీ క్లాస్లు: ఏసీ చైర్కార్, 3 టైర్, 2 టైర్, ఫస్ట్ క్లాస్/ఈసీ/ఈఏ కిలో మీటర్కు 2 పైసలు చొప్పున పెంచిన చార్జీలు అమల్లోకి రానున్నాయి. -
గిరి ప్రదక్షిణకు ప్రత్యేక ఏర్పాట్లు కల్పించండి
డాబాగార్డెన్స్: ఈ నెల 9న జరగనున్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున, ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ను సింహాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.త్రినాథరావు అభ్యర్థించారు. జీవీఎంసీ కమిషనర్ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గిరి ప్రదక్షిణ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తాగునీరు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, బీచ్లో స్నానపు గదులు, మరుగుదొడ్లు, రోడ్ల అభివృద్ధి వంటి ఏర్పాట్లు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ను ఆలయ ప్రధాన అర్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు వేదమంత్రాలతో ఆశీర్వదించి, స్వామి ప్రసాదం, చందనం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్, అర్చకులు పాల్గొన్నారు. -
తండ్రి బాటలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పీఠంపై..
● ఒక్క నామినేషనే దాఖలు కావడంతో మాధవ్ ఎన్నిక లాంఛనమే.. ● తండ్రి పీవీ చలపతిరావు బీజేపీ కురువృద్ధుల్లో ఒకరుఎంవీపీకాలనీ: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పోకల వంశీ నాగేంద్ర మాధవ్ (పీవీఎన్ మాధవ్) నియామకం దాదాపు ఖరారైంది. కొన్ని రోజులుగా అధ్యక్ష పదవిపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్ర బీజేపీ ముఖ్య నాయకులతో పాటు కేంద్ర పెద్దల మద్దతు పీవీఎన్ మాధవ్కు పుష్కలంగా ఉండటంతో ఆయన ఎన్నిక లాంఛనంగా మారింది. రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నికలకు సంబంధించి సోమవారం ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడమే ఇందుకు స్పష్టమైన నిదర్శనం. పార్టీ ఎన్నికల పరిశీలకుడు పీసీ మోహన్, ఎన్నికల అధికారి పాక వెంకట సత్యనారాయణలకు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మతో పాటు విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పరశురామరాజు తదితరులు మాధవ్ నామినేషన్ పత్రాలను అందజేశారు. దీంతో ఆయన ఎన్నిక లాంఛనం కాగా, మంగళవారం అధికారిక ప్రకటన వెలువడనుంది. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని... పీవీఎన్ మాధవ్.. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకుల్లో ఒకరిగా నిలిచిన దివంగత పీవీ చలపతిరావు తనయుడు. బీజేపీ ఆవిర్భవించిన తొలినాళ్లలో పీవీ చలపతిరావు రాష్ట్ర పార్టీ ముఖ్య నాయకుల్లో ఒకరుగా విశేష సేవలందించారు. ఆంధ్ర ఉద్యమంతో పాటు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో చురుకుగా పాల్గొన్నారు. 1945లోనే ఆర్ఎస్ఎస్లో చేరి, 1974, 1980లో ఎమ్మెల్సీగా సేవలు అందించి 87వ ఏట మరణించారు. ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకున్న పీవీఎన్ మాధవ్, తండ్రి బాటలోనే పయనించి ఆర్ఎస్ఎస్లో సభ్యుడయ్యారు. తొలి నుంచి బీజేపీలో క్రియాశీలక పాత్ర పోషించారు. విశాఖలో అనేక బీజేపీ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించి అగ్ర నాయకుల మన్ననలు అందుకున్నారు. ఆర్ఎస్ఎస్, బీజేవైఎంలో (భారతీయ జనతా యువ మోర్చా) పలు కీలక పదవులు నిర్వహించారు. 2017లో ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై పార్టీకి విలువైన సేవలు అందించారు. శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్గా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గత కొన్నేళ్లుగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక దాదాపు ఖరారైనందున విశాఖలోని బీజేపీ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. -
35 మంది ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ
మద్దిలపాలెం: జిల్లాలోని ఆర్టీసీ డిపోలలో పనిచేస్తున్న 35 మంది సూపర్వైజర్లు, సిబ్బంది సోమవారం పదవీ విరమణ చేశారు. విశాఖ డిపోలో సోమవారం నిర్వహించిన పదవీ విరమణ సత్కార కార్యక్రమంలో ఆర్టీసీ విశాఖ రీజినల్ మేనేజర్ బి. అప్పలనాయుడు పాల్గొన్నారు. పదవీ విరమణ పొందిన వాల్తేరు, మద్దిలపాలెం, విశాఖ స్టీల్ సిటీ, గాజువాక, మధురవాడ డిపోల కార్మికులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని, వారికి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ త్వరలో అందజేస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో డిపో మేనేజర్లు, సూపర్వైజర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
విలాసాల నౌక వచ్చేస్తోంది!
విశాఖ సిటీ : సాగర విహార ప్రపంచానికి విశాఖ మరోసారి స్వాగతం పలుకుతోంది. సముద్ర జలాల్లో తేలియాడే అద్భుత సౌధం మళ్లీ నగరానికి వచ్చేస్తోంది. అలలపై ఆహ్లాదకర ప్రయాణాన్ని అందించనుంది. విలాసవంతమైన సముద్ర విహార నౌకను చెన్నై–విశాఖపట్నం–పుదుచ్చేరి–చెన్నైల మధ్య నడపడానికి కార్డేలియా క్రూయిజ్ సంస్థ మళ్లీ ముందుకొచ్చింది. విశాఖ నుంచి జూలై 2, 9, 16 తేదీల్లో మూడు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది.2022 జూన్లో ఇదే సంస్థ విశాఖ నుంచి క్రూయిజ్ నౌకను నడిపింది. ఈ నౌకలో విహరించేందుకు విశాఖ ప్రజలే కాకుండా చుట్టు పక్కల రాష్ట్రాల పర్యాటకులు పోటీ పడ్డారు. దీంతో 85 శాతం మేర ఆక్యుపెన్సీతో ఆ ఏడాది సెపె్టంబర్ వరకు నడిచింది. ఈసారి విశాఖ పోర్టులో కొత్తగా నిర్మించిన ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెరి్మనల్ నుంచి ఈ విహార నౌక రాకపోకలు సాగించనుంది. ఇప్పటికే ఆన్లైన్లో టికెట్ల విక్రయాలను సైతం ప్రారంభించింది. విహార యాత్ర ఆరంభం ఇలా.. సెవెన్ స్టార్ హోటల్కు మించి విలాసవంతమైన నౌకలో విహారం.. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా 24 గంటలు వినోదం.. విభిన్న వంటకాలతో రుచికరమైన ఆహారం.. ఆరోగ్యానికి జిమ్, ఫిట్నెస్ సెంటర్ల సౌకర్యం.. స్విమ్మింగ్ పూల్స్లో జలకాలాటలు.. రాక్ క్లైంబింగ్ విన్యాసాలు.. ఆహ్లాదపరిచే డ్యాన్స్ షోలు.. అబ్బురపరిచే మ్యాజిక్ ప్రదర్శనలు.. సినిమా థియేటర్లు.. ఇలా ఎటువంటి ఒత్తిడి లేకుండా.. సమయం తెలియకుండా 24/7 ఎంజాయ్ చేసే లగ్జరీ విహార యాత్ర విశాఖ నుంచి ప్రారంభమవుతోంది.జూన్ 30న చెన్నైలో బయల్దేరిన ఈ క్రూయిజ్ నౌక జూలై 2వ తేదీ ఉదయం విశాఖకు వస్తుంది. అదే రోజు సాయంత్రం ఇక్కడ నుంచి బయలుదేరి 4వ తేదీన పుదుచ్చేరికి చేరుకుంటుంది. మళ్లీ అదే రోజు అక్కడి నుంచి బయలుదేరి 5వ తేదీన చెన్నై వెళుతుంది. దీంతో ఒక ట్రిప్పు పూర్తవుతుంది. ఆ తరువాత జూలై 7న చెన్నైలో మరో ట్రిప్పు ప్రారంభమై.. 9వ తేదీన విశాఖకు చేరుకుని.. మళ్లీ ఇక్కడి నుంచి బయలుదేరి 12వ తేదీన చెన్నైలో ముగుస్తుంది. మూడో ట్రిప్పు జూలై 14న చెన్నైలో మొదలై 16వ తేదీకి విశాఖకు చేరుకుంది. తిరిగి అదే రోజు ఇక్కడి నుంచి ప్రారంభమై 19వ తేదీన చెన్నైలో ముగుస్తుంది. క్రూయిజ్లో సదుపాయాలు ⇒ కార్డేలియా ఎంప్రెస్ క్రూయిజ్ నౌక ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంది. ⇒ మొత్తం 11 అంతస్తులతో ఉండే ఈ క్రూయిజ్ మొదటి ఫ్లోర్లో ఇంజిన్, రెండో ఫ్లోర్లో కార్గో ఉంటుంది. ⇒ మూడో ఫ్లోర్ నుంచి పాసింజర్ లాంజ్ మొదలవుతుంది. ⇒ అక్కడి నుంచి ఎలివేటర్ ద్వారా పదో అంతస్తు వరకు చేరుకోవచ్చు. ⇒ పదో ఫ్లోర్లో డెక్ లాంటి పెద్ద టెరస్ర్ ఉంటుంది. ⇒ 11వ అంతస్తులో ఉండే ప్రత్యేక సెటప్ ద్వారా సూర్యోదయం, సూర్యాస్తమయాలను వీక్షించడం మధురానుభూతిని కలిగిస్తుంది. ⇒ లగ్జరీ సూట్(8వ ఫ్లోర్) మినహా మిగిలిన అన్ని రకాల రూమ్స్ దాదాపుగా అన్ని ఫ్లోర్లలో ఉంటాయి. ⇒ ఫుడ్కోర్టులు, మూడు స్పెషాలిటీ రెస్టారెంట్లు, 5 బార్లు, స్పా, సెలూన్ అందుబాటులో ఉన్నాయి. ⇒ చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఫన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పిల్లలు ఆడుకోవడానికి ప్రత్యేకంగా ఈ నౌకలో కార్డేలియా కిడ్స్ అకాడమీ పేరుతో విశాల ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ⇒ జిమ్, ఫిట్నెస్ సెంటర్, స్విమ్మింగ్ పూల్, కేసినో, డ్యాన్సులు, కామెడీ, మ్యాజిక్ షోల కోసం ఆడిటోరియం, కొత్త సినిమాలను వీక్షించడానికి థియేటర్, నైట్ క్లబ్, 24 గంటల సూపర్ మార్కెట్, ల్రైబరీ ఇలా క్షణం కూడా బోర్ కొట్టకుండా అనేక సదుపాయాలు, సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ⇒ డీజే ఎంటర్టైన్మెంట్, లైవ్ బ్యాండ్ను ఎంజాయ్ చేయవచ్చు. ⇒ అడ్వెంచర్ యాక్టివిటీస్, షాపింగ్మాల్స్, లైవ్ షోలు కూడా అలరిస్తాయి. ⇒ టికెట్ తీసుకున్న ప్రతీ ఒక్కరికీ క్యాసినోలో ఎంట్రీ ఉచితం. ⇒ లిక్కర్, ఇతర సర్విసులకు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.గత ప్రభుత్వ చొరవతో విశాఖకు క్రూయిజ్ విశాఖలో క్రూయిజ్ రాక దీర్ఘకాల కలగా ఉండేది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. విలాసవంతమైన క్రూయిజ్ నౌక ప్రయాణం విశాఖలో అందుబాటులో ఉంటే.. ఇక్కడకు పర్యాటకుల తాకిడి మరింత పెరుగుతుందని భావించింది. ఇందుకోసం కార్డేలియా సంస్థతో సంప్రదింపులు జరిపింది. వాస్తవానికి కార్డేలియా క్రూయిజ్ సర్విసు విశాఖకు లేదు. ముంబయి, చెన్నై, గోవా, అండమాన్, లక్షద్విప్ వంటి ప్రాంతాల్లో ఉండేది.రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటక శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో విశాఖ నుంచి సర్విసు నడిపేందుకు అంగీకరించింది. అది కూడా ముందుగా మూడు సర్విసులు నడిపి డిమాండ్ను బట్టి నిర్ణయం తీసుకోవాలని భావించింది. కానీ విశాఖవాసులే కాకుండా పశ్చిమబెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు విశాఖ నుంచి క్రూయిజ్ విహార యాత్రకు పోటీ పడ్డారు. దీంతో ఆ సర్విసును సెపె్టంబర్ వరకు పొడిగించింది.క్యాసినో ఆడాలంటే.. రాష్ట్రంలో క్యాసినో ఆడేందుకు ప్రభుత్వం అనుమతి లేదు. ఇందుకు కొంత సమయం వేచి ఉండాల్సిందే. నౌక ప్రయాణం ప్రారంభమై 20 మైళ్లు వెళ్లిన తరువాత క్యాసినో ఆడేందుకు అవకాశం ఉంటుంది. -
ఒంట్లో బాలేదు.. కొంతసేపు ఉండి వస్తాను
ఆరిలోవ: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జిలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. స్నేహితులతో కలిసి కొంత సమయం గడిపిన తర్వాత అతను మరణించినట్లు తెలుస్తోంది. ఎస్ఐ రాందాస్ తెలిపిన వివరాలివి.. కాకినాడకు చెందిన కుక్కల లోకనాథ్(34) ఎంవీపీ కాలనీలోని సోషల్ వెల్ఫేర్ ఆఫీసులో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చేస్తున్నాడు. అతని భార్య కూడా సోషల్ వెల్ఫేర్ ఆఫీసులో కాంట్రాక్టు పద్ధతిలో అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేటలో ఉద్యోగం చేస్తోంది. అతని అత్తగారిల్లు నగరంలోని దసపల్లా ప్రాంతంలో ఉంది. వారాంతంలో వారు నగరంలోని అత్తవారింటికి వస్తుంటారు. సోషల్ వెల్ఫేర్ విభాగంలో జరుగుతున్న బదిలీలకు సంబంధించి లోకనాథ్ మరో నలుగురు స్నేహితులతో కలిసి శనివారం నగరానికి వచ్చాడు. హనుమంతవాక వద్ద పారామౌంట్ లాడ్జిలో వారంతా రూమ్ తీసుకున్నారు. ఆదివారం అందరూ కలిసి డ్యూటీకి వెళ్లాల్సి ఉండగా.. లోకనాథ్ ‘ఒంట్లో బాలేదు.. కొంతసేపు ఉండి వస్తాను’అని మిగిలిన స్నేహితులకు చెప్పాడు. దీంతో మిగిలిన నలుగురు స్నేహితులు లాడ్జి నుంచి బయలుదేరి డ్యూటీకి వెళ్లిపోయారు. కొంతసేపటికి లోకనాథ్ రూమ్ నుంచి బయటకు వచ్చి ‘కడుపులో మంటగా ఉంది’అని ఓ షాపులో గ్యాస్ట్రిక్కు సంబంధించిన ప్యాకెట్ కొన్నాడు. తిరిగి రూమ్కి వెళ్లిపోయాడు. ‘కడుపు నొప్పిగా ఉంది. కొంత సేపటి తర్వాత వస్తాను’ అని ఆఫీసు హెడ్కు ఫోన్లో చెప్పాడు. ఎంతసేపటికీ లోకనాథ్ డ్యూటీకి రాకపోవడంతో తోటి ఉద్యోగులు మళ్లీ ఫోన్ చేసినా స్పందన లేదు. దీంతో లాడ్జి నిర్వాహకులకు ఫోన్ చేసి చెప్పగా.. స్పందించిన సిబ్బంది రూమ్ తలుపులు తెరిచి చూసేసరికి మంచంపై విగతజీవిగా పడి ఉన్నాడు. లాడ్జి నిర్వాహకులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ మల్లేశ్వరరావు, ఎస్ఐ రాందాస్, సిబ్బంది అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్ఐ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటస్థలం పేరుతో ఆక్రమణ?
తగరపువలస: ఆనందపురం మండలం గిడిజాల పంచాయతీలోని దిబ్బడిపాలెం సర్వే నంబర్ 258లో పెద్ద కొండను ఆనుకుని ఉన్న సుమారు 2 ఎకరాలకు పైగా స్థలం ఆటస్థలం పేరుతో కబ్జా చేసేందుకు స్కెచ్ రెడీ అయింది. దీని విలువ రూ.25 కోట్ల పైమాటే. ఈ ప్రాంత యువకుల క్రీడా అవసరాల పేరుతో కబ్జాల్లో ఘనుడైన కూటమి ప్రభుత్వానికి చెందిన ఒక వ్యక్తి దీని వెనుక ఉన్నట్టు టీడీపీ నాయకులే బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికే ఈ కొండ భాగాన్ని తవ్వి వేలాది లారీల గ్రావెల్ను తరలించి లక్షల రూపాయలు వెనకేసుకున్నాడు. గతంలో కూడా పంచాయతీలో సర్వే నంబర్ 310/5లో 2 ఎకరాలు, 311/14లో 2.04 ఎకరాలు కలిపి రూ.40 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసి రిసార్ట్స్ పేరుతో నడుపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై రెండు నెలల కిందట ఆనందపురం మండలానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడంతో.. మరో విలువైన స్థలాన్ని ఆక్రమించేందుకు జోరుగా పావులు కదుపుతున్నాడు. దీని పై ఎవరూ నోరు మెదపకుండా ఇప్పటి నుంచే నోట్ల కట్టలతో ప్రభావితం చేస్తున్నాడు. రాష్ట్ర క్రీడాశాఖ మంత్రిని తీసుకువచ్చి రాజమార్గం ద్వారా ఈ స్థలాన్ని కొట్టేసే ప్రయత్నాలు జరుగుతున్నట్టు టీడీపీ నాయకులే చెబుతున్నారు. గతంలో ఈ స్థలం పీహెచ్సీకి కేటాయింపు 2014–19 టీడీపీ హయాంలో ఈ స్థలాన్ని అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (పీహెచ్సీ) కేటాయించారు. నెలరోజుల కిందట ఎమ్మెల్యే గంటా వద్దకు కబ్జాల్లో ఆరితేరిన ఈ వ్యక్తి 50 మంది స్థానిక యువకులను తీసుకువెళ్లి చదును చేసిన 2 ఎకరాల స్థలాన్ని ఆటస్థలానికి ఇవ్వాలని కోరగా ఆయన నిరాకరించారు. మండలంలో టీడీపీ నాయకులంతా నిన్ను వ్యతిరేకిస్తున్నారని ముఖం మీదే కుండబద్దలు కొట్టడంతో ఆ వ్యక్తి విసురుగా వెళ్లిపోయాడు. ఇప్పుడు ఆనందపురం తహసీల్దార్ లేకపోవడంతో ఇదే అదనుగా మళ్లీ ఈ స్థలంలో పాగా వేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. గత ఐదేళ్ల వైఎస్సార్ సీపీ పాలనలో ఇక్కడి రిసార్ట్లో పేకాట క్లబ్ నిర్వహించకుండా ఆనందపురం పోలీ సులు గట్టిగా కాపలా కాశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పోలీసులు ఈ కబ్జా రాయుడితో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. సీపీ శంఖబ్రత బాగ్చి బదిలీపై వెళ్లిపోయిన తర్వాత కొత్తగా వచ్చిన అధికారితో మాట్లాడుకుని తిరిగి పేకాట క్లబ్ నిర్వహించాలని ప్రణాళిక రచిస్తున్నాడు. ప్రస్తుతం తహసీల్దార్ లేనందున ఇదే అదనుగా 2 ఎకరాల స్థలాన్ని క్రీడా మైదానం పేరుతో చేజిక్కించుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు. రూ.25 కోట్ల విలువైన భూమి కబ్జాకు యత్నం -
ఇంజినీరింగ్ అసిస్టెంట్ల పడిగాపులు
● సాయంత్రం వరకు ప్రారంభంకాని బదిలీల కౌన్సెలింగ్ ● భారీగా సిఫార్సు లేఖలు.. పైరవీలకే పెద్దపీట మహారాణిపేట : బదిలీల కౌన్సెలింగ్ కోసం ఆదివారం ఉదయాన్నే జిల్లా పరిషత్ కార్యాలయానికి చేరుకున్న సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు సాయంత్రం వరకు పడిగాపులు పడ్డారు. తిండితిప్పలు లేకుండా జిల్లా పరిషత్ ఆవరణలో గట్లు మీద, ఖాళీ ప్రాంతాల్లో నిరీక్షించారు. కౌన్సెలింగ్కు ఎప్పుడు పిలుస్తారా అని ఎదురుచూశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 442 మంది ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ఉన్నారు. ఇందులో 95 శాతం మంది ఐదేళ్లు సర్వీసు పూర్తయిన వారు ఉన్నారు. పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజినీర్ కె.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అధికారులు ఆదివారం జిల్లా పరిషత్ కార్యాలయంలో బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ఉదయాన్నే కౌన్సెలింగ్ కేంద్రానికి చేరుకోగా సాయంత్రం వరకు పిలవలేదు. అసలు ఏమి జరుగుతుందో తెలియక ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ఆందోళన చెందారు. కూటమి ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలు పెద్ద సంఖ్యలో రావడంతో పంచాయతీరాజ్ ఎస్ఈ కె.శ్రీనివాసరావు, ఇతర ఇంజినీరింగ్ అధికారులు తర్జనభర్జన పడినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు అడిగిన పోస్టింగ్లు, ఇతర వ్యవహారాల వల్ల కౌన్సెలింగ్ జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. ఖాళీల జాబితా చివరి నిమిషం వరకు బయట పెట్టకపోవడంపై ఆందోళన వ్యక్తమైంది. కాగా సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన కౌన్సెలింగ్ రాత్రి వరకు కొనసాగింది. తొలుత దివ్యాంగులు, స్పౌజ్, అనారోగ్య పీడితులకు కౌన్సెలింగ్ చేపట్టారు. ఆ తర్వాత కూటమి ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకు బదిలీలు నిర్వహించారన్న ఆరోపణలు వచ్చాయి. -
సర్వేయర్ల ఆందోళన
మహారాణిపేట : సచివాలయ సర్వేయర్లు గ్రేడ్–2 బదిలీల్లోనూ కూటమి ఎమ్మెల్యేల సిఫార్సులకు పెద్దపీట వేశారంటూ సర్వేయర్లు ఆందోళనకు దిగారు. ఆదివారం కలెక్టరేట్ ఆవరణలోని జిల్లా సర్వే విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. సర్వే డిపార్టుమెంటులో ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసిన వారికి ఆదివారం బదిలీ కౌన్సెలింగ్ చేపట్టారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 354 మంది బదిలీ కౌన్సెలింగ్ కోసం వచ్చారు. సర్వే అసిస్టెంట్ డైరెక్టర్లు సూర్యరావు(విశాఖ), గోపాలరావు(అనకాపల్లి) బదిలీ కౌన్సెలింగ్ చేపట్టారు. బదిలీల్లో పైరవీలకు పెద్ద పీట వేస్తున్నారని, సిఫార్సుల వల్ల తాము నష్టపోతున్నామని, జాబితా ప్రకారం బదిలీలు చేయడం లేదని సర్వేయర్లు ఆందోళనకు దిగారు. కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల వల్ల నిజాయితీపరులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బదిలీల్లో సిఫార్సులకు పెద్దపీట వేశారని ఆవేదన -
మళ్లీ సముద్రంలో సందడే సందడి
● వైఎస్సార్సీపీ హయాంలో ప్రారంభమైన కార్డేలియా క్రూయిజ్ యాత్ర ● విశాఖ నుంచి జూలై 2, 9, 16 తేదీల్లో ప్రారంభం ● చైన్నె–విశాఖపట్నం–పుదుచ్చేరి–చైన్నె మధ్య సర్వీసు ● ఇప్పటికే ఆన్లైన్లో ప్రారంభమైన టికెట్ల విక్రయాలువిశాఖ సిటీ : సాగర విహార ప్రపంచానికి విశాఖ మరోసారి స్వాగతం పలుకుతోంది. సముద్ర జలాల్లో తేలియాడే అద్భుత సౌధం మళ్లీ నగరానికి వచ్చేస్తోంది. అలలపై ఆహ్లాదకర ప్రయాణాన్ని అందించనుంది. విలాసవంతమైన సముద్ర విహార నౌకను చైన్నె–విశాఖపట్నం–పుదుచ్చేరి–చైన్నెల మధ్య నడపడానికి కార్డేలియా క్రూయిజ్ సంస్థ మళ్లీ ముందుకొచ్చింది. విశాఖ నుంచి జూలై 2, 9, 16 తేదీల్లో మూడు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. 2022 జూన్లో ఇదే సంస్థ విశాఖ నుంచి క్రూయిజ్ నౌకను నడిపింది. ఈ నౌకలో విహరించేందుకు విశాఖ ప్రజలే కాకుండా చుట్టు పక్కల రాష్ట్రాల పర్యాటకులు పోటీ పడ్డారు. దీంతో 85 శాతం మేర ఆక్యుపెన్సీతో ఆ ఏడాది సెప్టెంబర్ వరకు నడిచింది. ఈసారి విశాఖ పోర్టులో కొత్తగా నిర్మించిన ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ నుంచి ఈ విహార నౌక రాకపోకలు సాగించనుంది. ఇప్పటికే ఆన్లైన్లో టికెట్ల విక్రయాలను సైతం ప్రారంభించింది. విహార యాత్ర ఆరంభం ఇలా.. సెవెన్ స్టార్ హోటల్కు మించి విలాసవంతమైన నౌకలో విహారం.. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా 24 గంటలు వినోదం.. విభిన్న వంటకాలతో రుచికరమైన ఆహారం.. ఆరోగ్యానికి జిమ్, ఫిట్నెస్ సెంటర్ల సౌకర్యం.. స్విమ్మింగ్ పూల్స్లో జలకాలాటలు.. రాక్ కై ్లంబింగ్ విన్యాసాలు.. ఆహ్లాదపరిచే డ్యాన్స్ షోలు.. అబ్బురపరిచే మ్యాజిక్ ప్రదర్శనలు.. సినిమా థియేటర్లు.. ఇలా ఎటువంటి ఒత్తిడి లేకుండా.. సమయం తెలియకుండా 24/7 ఎంజాయ్ చేసే లగ్జరీ విహార యాత్ర విశాఖ నుంచి ప్రారంభమవుతోంది. ఈ క్రూయిజ్ నౌక జూన్ 30న చైన్నెలో బయలుదేరి జూలై 2వ తేదీ ఉదయం విశాఖకు వస్తుంది. అదే రోజు సాయంత్రం ఇక్కడ నుంచి బయలుదేరి 4వ తేదీన పుదుచ్చేరికి చేరుకుంటుంది. మళ్లీ అదే రోజు అక్కడి నుంచి బయలుదేరి 5వ తేదీన చైన్నె వెళుతుంది. దీంతో ఒక ట్రిప్పు పూర్తవుతుంది. ఆ తరువాత జూలై 7న చైన్నెలో మరో ట్రిప్పు ప్రారంభమై.. 9వ తేదీన విశాఖకు చేరుకుని.. మళ్లీ ఇక్కడి నుంచి బయలుదేరి 12వ తేదీన చైన్నెలో ముగుస్తుంది. మూడో ట్రిప్పు జూలై 14న చైన్నెలో మొదలై 16వ తేదీకి విశాఖకు చేరుకుంది. తిరిగి అదే రోజు ఇక్కడి నుంచి ప్రారంభమై 19వ తేదీన చైన్నెలో ముగుస్తుంది. -
కూర్మావతారంలో జగన్నాథుడు
డాబాగార్డెన్స్: టర్నర్ చౌల్ట్రీలో జగన్నాథస్వామి కూర్మావతారంలో ఆదివారం దర్శనమిచ్చారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం 5 నుంచి 6 గంటల వరకు స్వామికి మేలుకొలుపు, నాదస్వరం, 6 నుంచి 7 గంటల వరకు నిత్యపూజ, 7 నుంచి 9.30 గంటల వరకు జగన్నాథస్వామి ప్రార్థనా సంఘంచే ప్రార్థనా తరంగిణి, 9.30 నుంచి 10.30 వరకు సామూహిక లలితా సహస్రనామ పారాయణ, మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సామూహిక భగవద్గీత, విష్ణు సహస్రనామ పారాయణ నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 9.30 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. రథయాత్రలో భాగంగా సోమవారం జగన్నాథ స్వామి వరహావతారంలో భక్తులకు దర్శనమిస్తారని ఈవో తెలిపారు. -
ఉపాధ్యాయులకు సర్దు‘పోటు’
● పెరిగిన విద్యార్థి–ఉపాధ్యాయ నిష్పత్తి ● మిగిలిన స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ● ప్రాథమిక పాఠశాలలకు సర్దుబాటు ● మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థుల చేరికలు ఆరిలోవ : జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ల ఉపాధ్యాయ పోస్టులకు భారీగా కోత పడింది. కూటమి ప్రభుత్వం విద్యా విధానంలో చేపట్టిన మార్పులు, ముఖ్యంగా విద్యార్థి–ఉపాధ్యాయ నిష్పత్తిని మార్చడంతో విద్యాబోధనకు, విద్యార్థుల భవిష్యత్తుకు తీవ్రంగా నష్టం కలిగిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిష్పత్తి పెంపుతో పోస్టులకు కోత ఇటీవల ప్రభుత్వం విద్యార్థి–ఉపాధ్యాయ నిష్పత్తిని 40:1 నుంచి 49:1కి పెంచింది. అంటే ఒక తరగతి గదిలో విద్యార్థుల సంఖ్యను 40 నుంచి 49కి పెంచారు. ఈ నిర్ణయం వల్ల ఉన్నత పాఠశాలల్లో అవసరమైన స్కూల్ అసిస్టెంట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీనికి తోడు ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు మందకొడిగా ఉన్నాయి. ఒక వైపు విద్యార్థుల సంఖ్య తగ్గుతుండగా, మరోవైపు నిష్పత్తిని పెంచడంతో ఉపాధ్యాయ పోస్టులు మిగులుగా(సర్ ప్లస్) తేలాయి. ఈ పరిణామాలు డీఎస్సీ–2025లో స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇదే పరిస్థితి ప్రాథమిక పాఠశాలల్లోనూ నెలకొంది. అక్కడ కూడా విద్యార్థుల సంఖ్య తగ్గడం, నిష్పత్తి పెరగడంతో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల(ఎస్జీటీ) పోస్టుల అవసరం కూడా గతంతో పోలిస్తే తగ్గిపోయింది. వందకు పైగా పోస్టులు మిగులు విశాఖ జిల్లా పరిధిలోని ఏడు మండలాల్లో 56 ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ బదిలీల కౌన్సెలింగ్లో కొత్త నిష్పత్తి కారణంగా సుమారు 100కి పైగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మిగులుగా తేలాయి. ఈ మిగులు ఉపాధ్యాయులను ఏ ఖాళీల్లో సర్దుబాటు చేయాలో తెలియక జిల్లా విద్యాశాఖాధికారులకు కత్తిమీద సాములా మారింది. చివరికి ఉన్నత పాఠశాలల్లో మిగిలిపోయిన స్కూల్ అసిస్టెంట్లను మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులుగా నియమించాల్సి వచ్చింది. దీని వల్ల ఇప్పటివరకు 6 నుంచి 10వ తరగతి వరకు ప్రత్యేక సబ్జెక్టులు బోధించిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు.. ఇప్పుడు 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు అక్షరాలు నేర్పించాల్సిన విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. -
విశాఖ అగ్రపీఠాధిపతికి పాల్లియం ప్రదానం
డాబాగార్డెన్స్: సెయింట్ పీటర్, సెయింట్ పాల్ మహోత్సవ దివ్య బలి పూజ సందర్భంగా సెయింట్ పీటర్ బసిలికాలో ప్రపంచవ్యాప్తంగా కొత్తగా నియమితులైన 54 మంది మెట్రోపాలిటన్ ఆర్చ్ బిషప్లకు 14వ లియో పోప్ పాల్లియంను దీవించి అందజేశారు. ఈ మహోత్సవంలో భారతదేశం నుంచి ముగ్గురు అగ్రపీఠాధిపతులకు ఈ గౌరవం లభించింది. వారిలో విశాఖపట్నం అగ్రపీఠాధిపతిగా పాలనా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉడుముల బాల కూడా ఉన్నారు. కాగా.. పాల్లియం అనేది తెల్లని గొర్రె ఉన్నితో తయారు చేసిన దైవార్చన వస్త్రం. ఇది మెట్రోపాలిటన్ ఆర్చ్ బిషప్కు అధికారిక చిహ్నంగా పరిగణిస్తారు. స్థానిక అగ్రపీఠ పరిధిలోని ఇతర మేత్రాసనములతో పోప్కు ఉండే సమైక్యతను ఇది ప్రతిబింబిస్తుంది. ఉడుముల బాల విశాఖపట్నం అగ్రపీఠాధిపతిగా నియమితులై ఈ గొప్ప గౌరవాన్ని పొందడం అగ్రపీఠానికే కాకుండా, యావత్ భారతదేశానికి గర్వకారణమని పలువురు హర్షం వ్యక్తం చేశారు. -
క్రూయిజ్లో సదుపాయాలు
● కార్డేలియా ఎంప్రెస్ క్రూయిజ్ నౌక ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంది. ● మొత్తం 11 అంతస్తులతో ఉండే ఈ క్రూయిజ్ మొదటి ఫ్లోర్లో ఇంజిన్, రెండో ఫ్లోర్లో కార్గో ఉంటుంది. ● మూడో ఫ్లోర్ నుంచి పాసింజర్ లాంజ్ మొదలవుతుంది. ● అక్కడి నుంచి ఎలివేటర్ ద్వారా పదో అంతస్తు వరకు చేరుకోవచ్చు. ● పదో ఫ్లోర్లో డెక్ లాంటి పెద్ద టెరరస్ ఉంటుంది. ● 11వ అంతస్తులో ఉండే ప్రత్యేక సెటప్ ద్వారా సూర్యోదయం, సూర్యాస్తమయాలను వీక్షించడం మధురానుభూతిని కలిగిస్తుంది. ● లగ్జరీ సూట్(8వ ఫ్లోర్) మినహా మిగిలిన అన్ని రకాల రూమ్స్ దాదాపుగా అన్ని ఫ్లోర్లలో ఉంటాయి. ● ఫుడ్కోర్టులు, మూడు స్పెషాలిటీ రెస్టారెంట్లు, 5 బార్లు, స్పా, సెలూన్ అందుబాటులో ఉన్నాయి. ● చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఫన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పిల్లలు ఆడుకోవడానికి ప్రత్యేకంగా ఈ నౌకలో కార్డేలియా కిడ్స్ అకాడమీ పేరుతో విశాల ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ● జిమ్, ఫిట్నెస్ సెంటర్, స్విమ్మింగ్ పూల్, కేసినో, డ్యాన్సులు, కామెడీ, మ్యాజిక్ షోల కోసం ఆడిటోరియం, కొత్త సినిమాలను వీక్షించడానికి థియేటర్, నైట్ క్లబ్, 24 గంటల సూపర్ మార్కెట్, ల్రైబరీ ఇలా క్షణం కూడా బోర్ కొట్టకుండా అనేక సదుపాయాలు, సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ● డీజే ఎంటర్టైన్మెంట్, లైవ్ బ్యాండ్ను ఎంజాయ్ చేయవచ్చు. ● అడ్వెంచర్ యాక్టివిటీస్, షాపింగ్మాల్స్, లైవ్ షోలు కూడా అలరిస్తాయి. ● టికెట్ తీసుకున్న ప్రతీ ఒక్కరికీ క్యాసినోలో ఎంట్రీ ఉచితం. ● లిక్కర్, ఇతర సర్వీసులకు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. క్యాసినో ఆడాలంటే.. రాష్ట్రంలో క్యాసినో ఆడేందుకు ప్రభుత్వం అనుమతి లేదు. ఇందుకు కొంత సమయం వేచి ఉండాల్సిందే. నౌక ప్రయాణం ప్రారంభమై 20 మైళ్లు వెళ్లిన తరువాత క్యాసినో ఆడేందుకు అవకాశం ఉంటుంది. -
కూటమిలో ‘వైన్ షాపు వార్’
మధురవాడ: కూటమిలోని అంతర్గత లుకలుకలు బయటపడుతున్నాయి. జీవీఎంసీ 5వ వార్డు, మారికవలస జంక్షన్, శారదానగర్ వద్ద వైన్ షాపు ఏర్పాటుకు వ్యతిరేకంగా మహిళలు రోడ్డెక్కారు. దీనికి జనసేన, సీపీఎం నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా జనసేన 5వ వార్డు అధ్యక్షుడు దేవర శివ మాట్లాడుతూ మారికవలస జంక్షన్ సర్వీస్ రోడ్డులో ఇప్పటికే ఒక వైన్ షాపు నివాసాలను ఆనుకొని ఉందని, ఇప్పుడు నివాసాల మధ్య, దానికి అత్యంత దగ్గరలో మరో దుకాణం ఏర్పాటు చేయడం సరికాదన్నారు. ఉన్న ఒక్క షాపుతోనే అనేక ఇబ్బందులు పడుతుంటే, రెండో షాపు ఏర్పాటుతో అవస్థలు రెట్టింపు అవుతాయని చెప్పారు. దీనిని ఆపకపోతే ఎటువంటి పోరాటానికై నా తాము సిద్ధంగా ఉంటామని శివ స్పష్టం చేశారు. సీపీఎం నాయకురాలు భారతి మాట్లాడుతూ ఉన్న షాపు వల్లనే ఇక్కడ మహిళలు తిరగలేకపోతున్నారన్నారు. తమకు మద్యం వద్దు, మంచి నీళ్లు కావాలని నినాదాలు చేశారు. అధికారులు తక్షణమే స్పందించి మద్యం షాపు ఏర్పాటును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాగా.. ఇక్కడ రెండో వైన్ షాపు ఏర్పాటు చేస్తున్న షెడ్ టీడీపీ మాజీ కార్పొరేటర్కు చెందినది కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. పైగా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జనసేన నాయకుడు రోడ్డెక్కి ధర్నాకు దిగడం గమనార్హం. -
ఆకట్టుకున్న చతుర్గుణిత అష్టావధానం
మద్దిలపాలెం: చతుర్గుణిత అష్టావధానం ప్రక్రియ డాక్టర్ బులుసు అపర్ణ ఆధ్వర్యంలో సాహిత్య శ్రావ్యనందకరంగా జరిగింది. మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో ఆదివారం విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో విశ్వనాథ సాహిత్య పీఠం అధ్యక్షుడు పేరాల బాలకృష్ణ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అత్యద్భుతంగా సాగింది. నిషిద్ధాక్షరి, సమస్య దత్తపది, వర్ణన, ఆశువు, వ్యస్తాక్షరి, న్యస్తాక్షరి, వారగణనం, అనువాదం, పురాణం అనే అంశాలపై 32 మంది పృచ్ఛకులు అడిగిన ప్రశ్నలకు డాక్టర్ బులుసు అపర్ణ అసాధారణ రీతిలో.. ఏకధాటిగా పద్యరూపంలో పూరణ చేసి సభికులను రంజింపజేశారు. దీంతో సభికులు తమ కరతాళ ధ్వనులతో అభినందనలు తెలుపగా కళాభారతి మార్మోగిపోయింది. విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ అధ్యక్షుడు మంతెన సత్యనారాయణ రాజు, కార్యదర్శి డాక్టర్ గుమ్మూలూరి రాంబాబు, శ్రీ విశ్వనాథ సాహిత్య పీఠం అధ్యక్షుడు పేరాల బాలకృష్ణ, కార్యదర్శి పేరాల సీతారాం ప్రభుతో కలిసి ముఖ్య అతిథి మధుర కవి డాక్టర్ బులుసు వెంకటేశ్వర్లు జ్యోతి ప్రజ్వలనతో అవధాన ప్రక్రియను ప్రారంభించారు. ప్రముఖ కవి, విమర్శకుడు డాక్టర్ పేరి రవికుమార్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కార్యక్రమంలో ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, డాక్టర్ దాడి వీరభద్రరావు, ఆచార్య రామవరపు శరత్బాబు తదితరులు పాల్గొన్నారు. -
వైభవం.. వరదపాయస సేవ
సింహాచలం: సింహగిరిపై వైకుంఠవాసుడి సన్నిధిలో ఆదివారం వరదపాయసం సేవ విశేషంగా నిర్వహించారు. దేశంలో వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఏటా సింహగిరిపై ఉన్న వైకుంఠవాసుడి మెట్టపై కొలువుదీరిన వైకుఠవాసుడి సన్నిధిలో పాయసం వండి, సమీపంలో ఉన్న పొర్లు బండపై నుంచి జారవిడవడం ఆచారంగా వస్తోంది. దీనినే వరదపాయసం సేవగా పేర్కొంటారు. అప్పన్న ఆలయ అర్చకులు ఉదయం 8 నుంచి పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి పూజలు నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేతుడై కొలువుదీరిన వైకుంఠవాసుడి సన్నిధిలో విష్వక్సేణపూజ, పుణ్యాహవచనం, పంచకలశ ఆవాహనం, పంచకలశ స్నపనం, విశేష ఆరాధన ఘనంగా జరిపారు. విరాట్పర్వ పారాయణం చేశారు. అనంతరం అక్కడే వండిన పాయసాన్ని స్వామికి నివేదించి, సమీపంలో ఉన్న పొర్లు బండపై జారవిడిచారు. భక్తులు పొర్లు బండపై నుంచి జారే పాయసాన్ని ప్రసాదంగా స్వీకరించారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధాన అర్చకుడు కరి సీతారామాచార్యులు, అర్చకులు, పారాయణదారులు, వేదపండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థానం ఈవో వి.త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు. వైకుంఠవాసుడికి విశేషంగా అభిషేకాలు విరాట్పర్వ పారాయణం, పాయసం నివేదన -
సీనియర్ జర్నలిస్ట్ దివాకర్ మృతికి సంతాపం
మహారాణిపేట: సీనియర్ జర్నలిస్టు పైల దివాకర్ కన్నుమూశారు. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో గాయత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దివాకర్ పార్థివదేహాన్ని అక్కయ్యపాలెంలోని ఆయన నివాసంలో సందర్శనార్థం ఉంచారు. సోమవారం ఉదయం 10 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. వివిధ పత్రికల్లో జర్నలిస్టుగా పని చేసిన దివాకర్.. వైజాగ్ జర్నలిస్టు ఫోరం కార్యవర్గ సభ్యుడిగానూ సేవలందించారు. 2010 నుంచి వైఎస్సార్ సీపీ పీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన మృతి తీరని లోటని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
రైలు నుంచి జారిపడిన యువకులు
గోపాలపట్నం: ప్రశాంతి ఎక్స్ప్రెస్ నుంచి ఇద్దరు యువకులు జారిపడగా, వారిలో ఒకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన సింహాచలం రైల్వేస్టేషన్లో చోటు చేసుకుంది. ఆర్పీఎఫ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రశాంతి ఎక్స్ప్రెస్లో పవిత్రా దాస్, సగ్రామ్ దాస్ ప్రయాణిస్తున్నారు. సింహాచలం రైల్వేస్టేషన్లో ఈ రైలుకు హాల్ట్ లేదు. అయితే రైలు స్టేషన్లో నెమ్మదిగా వెళ్తున్న సమయంలో వారు ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ సిబ్బంది గమనించి వారిని కాపాడారు. వారిలో ఒకరికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం 108 వాహనంలో కేజీహెచ్కు తరలించారు. ఈ యువకులు ఒడిశా రాష్ట్రం డెంకనాల్ జిల్లా కుకట గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. బెంగళూరు వెళ్తున్న వీరు ఫుట్బోర్డుపై కూర్చోవడం వల్ల కళ్లు తిరిగి పడిపోయి ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. అదృష్టవశాత్తు ఒకటో నంబర్ ప్లాట్ఫాంపై పడటం వల్ల ప్రాణాపాయం తప్పిందని ఆర్పీఎఫ్ ఎస్ఐ సూరజ్ కుమార్, ఏఎస్ఐ జి.శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ డి.జగదీష్ తెలిపారు. ఒకరికి గాయాలు -
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి
యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహనరావు విశాఖ విద్య: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహనరావు అన్నారు. జిల్లా యూటీఎఫ్ కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు దాసరి నాగేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం ఎన్డీఏలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ జీవో 19 ద్వారా 9 రకాల పాఠశాలలు ఏర్పాటు చేశారని తెలిపారు. దీని వల్ల కొన్ని పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 9,652 మోడల్ ప్రాథమిక పాఠశాలలు, 1,552 ఉన్నత పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలను అప్గ్రేడ్ చేసిన 779 ఉన్నత పాఠశాలలు, 5 వేల ఫౌండేషన్ పాఠశాలలు, 19 వేల బేసిక్ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేశారన్నారు. ఫౌండేషన్, బేసిక్ ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారే ప్రమాదం ఉందని, వీటిని బలమైన పాఠశాలలుగా మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాలల పనివేళల్లో బోధనేతర పనులు, శిక్షణ తరగతులు లేకుండా చూడాలని కోరారు. అదే విధంగా ఆర్థిక బకాయిలు చెల్లించాలని, పీఆర్సీ కమిషన్ నియమించి, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని, డీఏలను చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి టి.ఆర్.అంబేడ్కర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించేందుకు జూలై 5వ తేదీ వరకు డ్రైవ్ చేపట్టాలని, ఇందులో యూటీఎఫ్ కేడర్ పాల్గొనాలని కోరారు. కనీసం మండల స్థాయిలో 10 మంది పిల్లలను, జిల్లా స్థాయిలో 20 మంది పిల్లలను చేర్పించిన వారికి అభినందన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. సమావేశంలో జిల్లా సహాధ్యక్షులు ఎన్.ప్రభాకర్, రొంగలి ఉమాదేవి, కోశాధికారి కె.రాంబాబు, జిల్లా పూర్వ ప్రధాన కార్యదర్శి టి.అప్పారావు, జిల్లా కార్యదర్శులు చుక్క సత్యం, రిజ్వాన్, రియాజ్, సీనియర్ నాయకులు బి.జనార్ధన్తో పాటు వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. -
అట్టహాసం.. ముణ్నాళ్ల ముచ్చటే.!
● దుర్వినియోగమైన ప్రజాధనం ● బయటపడ్డ నాణ్యత డొల్లతనం ● బీచ్రోడ్డులో మొక్కుబడిగా సాగిన ‘యోగాంధ్ర’ పనులు ఏయూక్యాంపస్: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ‘యోగాంధ్ర’ పనులు ముణాళ్ల ముచ్చటగా మిగిలాయి. ప్రజాధనంతో చేపట్టిన సుందరీకరణ పనుల్లోని నాణ్యతలోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతో మొక్కుబడిగా పనులు చేసి కాంట్రాక్టర్లు చేతులు దులుపుకోగా.. ప్రజాధనం నీళ్లపాలైన తీరు నగరవాసులను విస్మయానికి గురి చేస్తోంది. బట్టబయలైన నాణ్యత లోపం నెల రోజుల పాటు హడావుడి చేసి.. బీచ్ రోడ్డుకు వేసిన రంగులు కేవలం వారం రోజుల్లోనే వెలిసిపోవడం పనుల నాణ్యతకు అద్దం పడుతోంది. ప్రధానమంత్రి పాల్గొన్న ఆర్.కె.బీచ్ వేదిక వద్ద నుంచి వీఎంఆర్డీఏ స్మార్ట్ సిటీ పార్క్ వరకు ఫుట్పాత్లకు వేసిన తెలుపు, నలుపు రంగులు పూర్తిగా వెలిసిపోతున్నాయి. కోట్ల రూపాయల ప్రజాధనంతో చేపట్టిన పనులు కనీసం నెల రోజులైనా నిలవకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. పనులు జరుగుతున్నప్పుడే నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ‘సాక్షి’ పలు కథనాలు ప్రచురించింది. అయినప్పటికీ అధికారులు ఒత్తిడిలో వాటిని పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్లు నాసిరకం పనులతో సరిపెట్టారు. కార్యక్రమం జరిగి వారం రోజులకే రంగులు వెలిసిపోవడం, ప్రజాధనం ఎలా దుర్వినియోగమైందో చెప్పడానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. మొక్కల సంరక్షణ ఎక్కడ? రంగుల విషయంలోనే కాక మొక్కల పెంపకంలోనూ ఇదే నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. యోగా విలేజ్, జీవీఎంసీ స్విమ్మింగ్ పూల్, ఏయూ కన్వెన్షన్ సెంటర్ వంటి కీలక ప్రాంతాల్లో నాటిన మొక్కలు నీళ్లు లేక ఎండిపోయి చనిపోతున్నాయి. పాండురంగాపురం వద్ద ఏర్పాటు చేసిన వర్టికల్ గార్డెన్లోని మొక్కల్లో చాలా వరకు జీవం కోల్పోయాయి. కొన్ని మొక్కలను కనీసం మట్టిలో నాటకుండా కుండీలతో సహా వదిలేయడం గమనార్హం. ప్రజాధనం దుర్వినియోగంపై ప్రజల ఆగ్రహం ప్రతిష్టాత్మక కార్యక్రమం పేరుతో కాంట్రాక్టర్లు నాసిరకం పనులు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత తక్కువ కాలంలోనే పనులు పాడైపోతుంటే, ఆ కాంట్రాక్టర్లకు బిల్లులు ఎలా చెల్లిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి జరిగిన పనుల నాణ్యతపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించాలని, బాధ్యులైన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుని, బిల్లుల చెల్లింపును నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే, ప్రజాధనాన్ని దోచుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు ఒక మార్గంగా మారిపోతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
హార్బర్లో చేపల జాతర
మహారాణిపేట: విశాఖ సాగర తీరంలో వేట మళ్లీ ఊపందుకుంది. 61 రోజుల వేట నిషేధాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని సముద్రంలోకి అడుగుపెట్టిన మత్స్యకారుల వలలకు ఇప్పుడు సిరుల పంట పడుతోంది. భారీ ఎత్తున పట్టుబడిన మత్స్య సంపదతో ఆదివారం విశాఖ ఫిషింగ్ హార్బర్ కోలాహలంగా మారింది. ఈ సీజన్ ఆరంభం మత్స్యకారులకు శుభసూచకంగా మారింది. ముఖ్యంగా రొయ్యలు భారీ పరిమాణంలో లభించడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నాణ్యమైన రొయ్యలతో పాటు పీతలు, వంజరాలు, ట్యూనా, చందువాలు, మెత్తని పారలు వంటి రకరకాల చేపలు కూడా పుష్కలంగా దొరికాయి. వేట నిషేధం సత్ఫలితాలనిచ్చిందని, సముద్రంలో మత్స్య సంపద పెరిగిందని మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం కావడంతో ఫిషింగ్ హార్బర్ కొనుగోలుదారులు, వ్యాపారులతో కిటకిటలాడింది. పడవలు ఒడ్డుకు చేరగా.. తాజా చేపల కోసం జనం ఎగబడ్డారు. ఈ చేపలను స్థానిక మార్కెట్లలో విక్రయించడంతో పాటు, ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేందుకు మత్స్యకారులు ఏర్పాట్లు చేశారు. -
వీఆర్ఎస్పై అయోమయం
● ముందుకురాని స్టీల్ప్లాంట్ ఉద్యోగులు ● ఇప్పటివరకు కేవలం 850 దరఖాస్తులుఉక్కునగరం: స్టీల్ప్లాంట్ యాజమాన్యం రెండో విడత ప్రకటించిన వలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ (వీఆర్ఎస్) దరఖాస్తు విషయంలో ఉద్యోగుల్లో అయోమయం నెలకొంది. మూడో బ్లాస్ట్ఫర్నేస్ ప్రారంభించినందున ప్లాంట్ పరిస్థితులు బాగుపడే అవకాశం ఉందని ఉద్యోగులు ఒకవైపు ఆశావాహంగా ఆలోచిస్తుండగా.. రానున్న రోజుల్లో మరింత పని ఒత్తిడి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుందన్న భయం మరోవైపు వెంటాడుతోంది. ఈ పరిస్థితుల్లో ఈ వీఆర్ఎస్ పట్ల ఉద్యోగులు ఆచీతూచి వ్యవహరిస్తున్నారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ, ఆర్థిక సదుపాయాల కోత వంటి కారణాల వల్ల ఈ ఏడాది మార్చి నెలలో వచ్చిన మొదటి వీఆర్ఎస్కు స్పందన లభించింది. అప్పట్లో కూడా వీఆర్ఎస్ పరిహారం, పీఎఫ్, గ్రాట్యుటీ, లీవ్ శాలరీ మొత్తం ఇస్తారా... లేదా అనే సందేహాలతో 1,613 మంది మాత్రమే దరఖాస్తు చేస్తున్నారు. యాజమాన్యం వారికి సకాలంలో అన్ని చెల్లించడంతో అప్పుడు దరఖాస్తు చేయనివారు తప్పు చేశామన్న భావన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఇటీవల కాలంలో పెరిగిన పని ఒత్తిడి, పూర్తి జీతాలు ఇప్పటికీ చెల్లించకపోవడం వంటి కారణాల వల్ల ఈసారి వీఆర్ఎస్ వస్తే కనీసం మూడు వేల మంది దరఖాస్తు చేస్తారని అందరూ ఊహించారు. అయితే అంత స్పందన లేకపోవడం పట్ల అందరూ ఆశ్చర్యపోతున్నారు. గత బడ్జెట్లో మిగిలిన సొమ్ము మేరకు మాత్రమే ఈసారి వీఆర్ఎస్ ఇస్తారని తద్వారా 500 మందికి మించరని ఊహాగానాలు వినిపించడం, ఇప్పటికే సిబ్బంది బాగా తగ్గిన నేపథ్యంలో చాలా విభాగాల్లో విభాగాధిపతులు వచ్చిన దరఖాస్తులను అంగీకరించేది లేదని చెబుతుండటంతో చాలా మంది ఆశావాహులు ఢీలా పడి దరఖాస్తు చేయనట్టు తెలుస్తుంది. అందువల్లే ఇప్పటివరకు సుమారు 850 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని తెలుస్తుంది. జూలై 15 వరకు గడువు ఉన్నందున చివరలో ఎక్కువ దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని మరో వాదన వినిపిస్తున్నది. ఏమైనా గడువు ముగిస్తే కాని వీఆర్ఎస్పై స్పష్టత వచ్చే అవకాశం లేదు. -
● అత్యాధునిక లైటింగ్ వ్యవస్థ, విశాలమైన ప్రాంగణంలో ఏర్పాటు ● విశాఖ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు ఇక వేగవంతం ● దువ్వాడ–పలాస మధ్య రైల్వే లైన్ల వెంట ఫెన్సింగ్ ● మల్లివీడు వద్ద పీపీపీ పద్ధతిలో గతిశక్తి టెర్మినల్ ఏర్పాటు ● దక్షిణ కోస్తా రైల్వే జీఎం కార్యా
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : వందేభారత్ రైళ్ల నిర్వహణ కోసం విశాఖలో కోచింగ్ డిపో ఏర్పాటు చేయనున్నట్లు వాల్తేరు డివిజన్ రైల్వే డివిజనల్ మేనేజర్ (డీఆర్ఎం) లలిత్ బోహ్రా తెలిపారు. రైల్వే యార్డులో అత్యాధునిక లైటింగ్ వ్యవస్థ, విశాలమైన ప్రాంగణంలో డిపో నిర్మాణం జరగనుందని పేర్కొన్నారు. రైళ్ల నిర్వహణ పనుల విషయంలో జాప్యం లేకుండా ఉండేందుకు 24 గంటలు ఈ డిపో పనిచేస్తోందన్నారు. దువ్వాడలో వందేభారత్ రైళ్ల స్టాప్ పాయింట్ కోసం వచ్చే వారం ప్రధాన కార్యాలయానికి ప్రతిపాదనలు పంపనున్నట్టు వివరించారు. అలాగే విశాఖ కేంద్రంగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్కు జనరల్ మేనేజర్ నియామకం జరిగిందని, వారి కార్యాలయం కోసం 3, 4 ప్రాంతాలను తాత్కాలికంగా పరిశీలిస్తున్నామన్నారు. విశాఖ నుంచి దువ్వాడ వరకు కొత్త రైల్వే లైను పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ పనులకు ఉన్న కోర్టు కేసుల అడ్డంకి తొలగిపోయిందని, ఇక పనులు వేగవంతం చేస్తామన్నారు. రైల్వే ప్రయాణికులకు సౌకర్యాలు మరింతగా మెరుగుపరిచే లక్ష్యంతోనే పనిచేస్తున్నామన్నారు. శనివారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. మల్లివీడు వద్ద గతి శక్తి టెర్మినల్..! కొత్తవలస రైల్వే స్టేషన్ దాటిన తర్వాత గల మల్లివీడు రైల్వే స్టేషన్ వద్ద గతిశక్తి టెర్మినల్ (జీసీటీ) ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ మెకానికల్ హ్యాండ్లింగ్, వేర్ హౌసింగ్, ట్రక్ రిపేర్ సెంటర్, ఫ్యూయలింగ్ సెంటర్ ఏర్పాటుకానున్నాయి. మెకానికల్ హ్యాండ్లింగ్ ద్వారా రేకుల లోడింగ్, అన్లోడింగ్ వేగవంతం అవుతుంది. తద్వారా రేకుల అందుబాటు సమయం కూడా పెరుగుతుంది. తద్వారా రేకుల కొరత కూడా కొద్ది మేర తగ్గే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఇప్పటికే టెండర్లను ఆహ్వానించాం. ఆగస్టులో టెండర్ దాఖలుకు గడువు ఉంది. ఇది పూర్తిగా రైల్వే స్థలంలోనే ఏర్పాటు కానుంది. శాటిలైట్ స్టేషన్లగా మరింత అభివృద్ధి..! విశాఖ రైల్వే స్టేషన్ నుంచి ప్రస్తుతం రోజూ 50 వేల మంది వరకూ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. రైల్వే లైన్లు తక్కువగా ఉండటం వల్ల రైళ్ల వేగం కూడా దువ్వాడ నుంచి తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొత్త రైల్వే లైన్ల పనులు సాగుతున్నాయి. 3, 4 రైల్వే లైన్ల పనులు జరుగుతున్నప్పటికీ.. భవిష్యత్ అవసరాల నేపథ్యంలో దువ్వాడ, పెందుర్తి శాటిలైట్ స్టేషన్లుగా మరింత అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉంది. తద్వారా విశాఖ రైల్వే స్టేషన్పై భారం తగ్గుతుంది. ఇప్పటికే దువ్వాడ స్టేషన్లో అభివృద్ధి పనులు సాగుతున్నాయి. పెందుర్తి స్టేషన్లోనూ అభివృద్ధి పనులు చేపడతాం. డీఆర్ఎం లలిత్ బోహ్రావందేభారత్ మెయింట్నెన్స్ డిపోదువ్వాడ నుంచి పలాసకు రయ్ రయ్! దువ్వాడ నుంచి పలాస వరకు రైల్వే లైన్ల వెంట ఫెన్సింగ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. ఇప్పటికే ఈ పనులకు టెండర్లు పూర్తయ్యాయి. సదరు కాంట్రాక్టరుకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్వోఐ) కూడా జారీచేశాం. రానున్న 12 నెలల్లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించాం. ఈ ఫెన్సింగ్ ఏర్పాటుతో రైళ్ల రాకపోకల సందర్భంగా ఎటువంటి ప్రమాదాలకు... రైల్వే లైన్ల క్రాసింగ్కు అవకాశం ఉండదు. తద్వారా రైళ్ల వేగాన్ని గంటకు 160 కిలోమీటర్ల వరకూ తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఈ మార్గంలో రైళ్ల వేగాన్ని పెంచడం ద్వారా ప్రయాణికులు గమ్యాన్ని వేగంగా చేరుకునే అవకాశం ఉంటుంది. రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు..! కోర్టు కేసుతో రైల్వే స్టేషన్లో పనులు ముందుకు సాగలేదు. చివరకు కోర్టు కేసు గెలిచాం. పనులు ప్రారంభిస్తాం. మొత్తం 14 ఫ్లాట్ఫారంలను ప్రధాన బిల్డింగ్ను ప్రయాణికులు చేరేందుకు వీలుగా 72 మీటర్ల పొడవైన కాంకోర్స్ ఏర్పాటవుతుంది. ఇక్కడ ప్రయాణికులు సేదతీరేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడున్న ఫ్లాట్ఫారం సైజు కూడా పెరుగుతుంది. ఇక జ్ఞానాపురం వైపు స్టేషన్ నుంచి నేరుగా బయటకు వెళ్లేందుకు వీలుగా ఫ్లాట్ఫారంల నిర్మాణం ఉంటుంది. మల్టీ లెవల్ కారు పార్కింగ్ సదుపాయంతో పాటు ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. గత 8 నెలలుగా నిలిచిన పనులు పట్టాలెక్కనున్నాయి. దువ్వాడలో వందేభారత్ స్టాప్ కోసం ప్రతిపాదనలు ప్రస్తుతం వైజాగ్–సికింద్రాబాద్ మధ్య రెండు వందేభారత్ రైళ్లు సేవలందిస్తున్నాయి. ప్రయాణికుల నుంచి వీటికి మంచి డిమాండ్ ఉంది. ఈ రెండు రైళ్ల నిర్వహణ సికింద్రాబాద్లోని డిపోలో జరుగుతోంది. విశాఖలో ఈ రైళ్ల నిర్వహణ కోసం డిపో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. త్వరలో ఈ డిపో పనులు ప్రారంభించాలని నిర్ణయించాం. అదేవిధంగా ఈ రైళ్లును దువ్వాడ స్టేషన్లోనూ నిలపాలనే డిమాండ్ ప్రయాణికుల నుంచి ఉంది. దీనిపై వచ్చే వారం ప్రధాన కార్యాలయానికి ప్రతిపాదనలు పంపుతాం. అక్కడి నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. -
సిఫార్సులతో బదిలీలా?
● సచివాలయ ఉద్యోగుల ఆగ్రహం ● బదిలీ ప్రక్రియలో పాల్గొనకుండా నిరసన జగదాంబ: జీవీఎంసీ పరిధిలోని సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ గందరగోళంగా మారింది. ఐదేళ్లు దాటిన సచివాలయ మౌలిక సదుపాయాల కార్యదర్శులకు బదిలీ చేయడానికి కూటమి ప్రభుత్వం ఆమోదం తెలపగా, శనివారం జీవీఎంసీ జోన్–4 సూర్యాబాగ్ కార్యాలయంలో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. అధికారులు ముందుగా చెప్పినట్లు మూడు ఆప్షన్ల ప్రక్రియ కాకుండా, కూటమి నేతల సిఫార్సుల ప్రకారం బదిలీలు జరుగుతున్నాయని సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే కూటమి నేతల సిఫార్సులకు అధికారులు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆప్షన్లో ఇచ్చిన మూడు సచివాలయాల మాట మరచి అధికారులు నేతలకు తొత్తులుగా వ్యవహరించడంతో సీనియర్ కార్యదర్శులకు అన్యాయం జరిగిందని వారు వాపోయారు. బదిలీల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఉద్యోగులు నినాదాలు చేశారు. పారదర్శకంగా బదిలీలు చేయాలంటూ బదిలీల ప్రక్రియ నుంచి బయటకు వచ్చేశారు. అర్హులకు అన్యాయం మరికొందరికి బదిలీ కౌన్సెలింగ్లో ఆప్షన్ కోసం దరఖాస్తు పెట్టుకుని వెళ్లిపోవాలని సూచించినట్లు చెబుతున్నారు. దీనివల్ల అర్హులైన కార్యదర్శులకు అన్యాయం జరుగుతుందని వారు వాపోయారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, బదిలీల ప్రక్రియను సక్రమంగా జరిపించాలని సచివాలయ ఉద్యోగులు కోరుతున్నారు. -
పీలా వర్సెస్ గండి బాబ్జీ
పెందుర్తి : పెందుర్తి నియోజకవర్గంలో టీడీపీ అంతర్గత కుమ్ములాటల మెగా సీరియల్ కొనసాగుతుంది. పార్టీ సమావేశాల్లో టీడీపీలో ఉన్న విబేధాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పార్టీ కీలక నాయకులే రోడ్డెక్కి రచ్చకు దిగుతున్నారు. అధికారంలో ఉండడంతో ఆధిపత్యం కోసం చోటామోటా నాయకుల నుంచి నియోజకవర్గంలోని కీలక నేతలు సైతం కీచులాడుకుంటున్నారు. తాజాగా శనివారం పెందుర్తిలో జరిగిన టీడీపీ నియోజకవర్గస్థాయి సంస్థాగత ఎన్నికల సన్నద్ధ సమావేశంలో మేయర్ పీలా శ్రీనివాసరావు, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి గండి బాబ్జీ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడిచింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎదుటే పరస్పరం దూషణలకు దిగారు. ‘పిలుపు’ల విషయంలో ఇద్దరి మధ్య మాటలు తూటాలు పేలాయి. అసలేం జరిగిందంటే.. పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు కోరాడ రాజబాబు ఆధ్వర్యంలో పెందుర్తిలో ఉదయం 10 గంటలకు సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న గండి బాబ్జీ దాదాపు 2 గంటలు ఆలస్యంగా సమావేశానికి వచ్చారు. అదే సమయంలో మేయర్ పీలా శ్రీనివాసరావు, గండి బాబ్జీ చిరకాల ప్రత్యర్థి అయిన మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కుమారుడు అప్పలనాయుడు తన వర్గీయులతో కలిసి సమావేశానికి వచ్చారు. ఈ క్రమంలో గండి బాబ్జీ ప్రసంగిస్తూ ‘నేను నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిని. రాష్ట్ర స్థాయిలో ఓ కార్పోరేషన్కు చైర్మన్ హోదాలో ఉన్నాను. కానీ నన్ను నియోజకవర్గ పరిధిలో ఉన్న జీవీఎంసీ వార్డుల్లోని ముఖ్య కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదు. అంతా నువ్వే చేసుకుంటున్నావ్’ అంటూ మేయర్ పీలాను ఉద్దేశించి ఘాటుగా స్పందించారు. దీంతో పీలా వెంటనే మైక్ అందుకుని ‘పెందుర్తి పట్టణం నా అడ్డా. నాకు ఇక్కడ తిరుగులేదు. బండారు సత్యనారాయణమూర్తి లాంటి వ్యక్తే నా అనుమతి లేకుండా ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేసేవారు కాదు. నువ్వు మాత్రం పార్టీ కార్యక్రమాలకు కూడా మేయర్ హోదాలో ఉన్న నన్ను పిలవడం లేదు. అయినా అధికారిక కార్యక్రమాలకు నిన్ను ఎందుకు పిలవాలి’ అంటూ అంతే ఘాటుగా బదులిచ్చారు. ఈ క్రమంలో వేదిక మీద నుంచే పీలా, గండి పరస్పరం మాటలు విరుసుకున్నారు. ఇక పరిస్థితి చేదాటిపోతుందన్న సమయంలో కోరాడ, ఇతర నాయకులు కలగజేసుకుని ఇద్దరినీ సముదాయించారు. అందుకేనా.. టీడీపీ ఇన్చార్జిగా ఉన్న గండి బాబ్జీపై ప్రత్యర్థుల కంటే స్వపక్షంలోనే ఎక్కువ మంది గిట్టనివారు ఉన్నా రు. జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు, టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, మేయర్ పీలా శ్రీనివాసరావు అనేకసార్లు గండి బాబ్జీని కౌంటర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. బహిరంగంగానే బాబ్జీపై విమర్శలు దిగుతున్నారు. ఈ క్రమంలో శనివారం సమావేశానికి బాబ్జీకి చిరకాల ప్రత్యర్థి అయిన బండారు కుమారుడు అప్పలనాయుడు, ఇతర నాయకులతో పీలా కలిసి రావడం బాబ్జీకి చిర్రెత్తుకొచ్చినట్లు తెలుస్తుంది. అదే సమయంలో బాబ్జీపై చాలాకాలంగా గుర్రుగా ఉన్న పీలా సైతం సందర్భం చూసి విరుచుకుపడ్డారు. మొత్తానికి పెందుర్తి టీడీపీ కుక్కలు చింపిన విస్తరిగా మారిందని ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. టీడీపీ అంతర్గత సమావేశంలో పరస్పరం దూషించుకున్న మేయర్, టీడీపీ ఇన్చార్జి నువ్వు నన్ను ఎందుకు కార్యక్రమాలకు పిలవడం లేదని నిలదీసిన గండి అధికారిక కార్యక్రమాలకు నిన్నెందుకు పిలుస్తానంటూ పీలా కౌంటర్ పెందుర్తిలో కొన్ని కార్యక్రమాలకు నాకు ఆహ్వానం ఇవ్వడం లేదు: మేయర్ పెందుర్తిలో టీడీపీ కుమ్ములాటలు -
ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే..
కూటమి నేతలకు లబ్ధి చేకూరేలా మాస్టర్ ప్లాన్లో మార్పులకు కసరత్తు ● వీఎంఆర్డీఏ బృహత్తర ప్రణాళిక–2041 పునఃపరిశీలన షురూ.. ● అభ్యంతరాల కోసం జూలై 17 వరకు గడువు పొడిగింపు ● వాటిపై నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల సమక్షంలోనే పరిశీలన ● రేపటి నుంచి జూలై 17 వరకు సమీక్షలు విశాఖ సిటీ : అంతా అనుకున్నట్లే చేస్తున్నారు. విశాఖ బృహత్తర ప్రణాళిక–2041లో మార్పులు, చేర్పులకు సిద్ధమవుతున్నారు. కూటమి ప్రజాప్రతినిధుల సమక్షంలోనే ఈ తంతు పూర్తి చేసేందుకు ముహూర్తం పెట్టేశారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాల పరిశీలన పేరుతో తమ వారికి లబ్ధి చేకూర్చేందుకు పూనుకుంటున్నారు. ఇందుకోసం ఈ నెల 30వ తేదీ నుంచి జూలై 17వ తేదీ వరకు నియోజకవర్గాల వారీ ఆయా ఎమ్మెల్యేల సమక్షంలోనే అభ్యంతరాలపై సమీక్షించాలని నిర్ణయించారు. ఒకవైపు ఫిర్యాదులను పరిశీలిస్తున్నట్లు తేదీలు ఖరారు చేసినప్పటికీ.. అభ్యంతరాల స్వీకరణకు గడువు పొడిగించడం విశేషం. ఇందులో కూటమి ‘రియల్ వ్యాపారానికి’ అనుగుణంగా ప్లాన్లో సవరణలు చేసే అవకాశం ఉందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తోంది. అభ్యంతరాల స్వీకరణకు గడువు పొడిగింపు వీఎంఆర్డీఏ మాస్టర్ప్లాన్–2041లో పునఃపరిశీలన పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. మే 22వ తేదీ నుంచి ఈ నెల 21వ తేదీ వరకు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో కేవలం 755 మాత్రమే అభ్యంతరాలు వచ్చాయి. వాస్తవానికి వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తాయని కూటమి ప్రజాప్రతినిధులు భావించారు. ఆ సంఖ్యను అడ్డుపెట్టుకుని ఇప్పటికే సిద్ధమైన మాస్టర్ప్లాన్–2041పై ఆరోపణలు గుప్పించాలని నిర్ణయించారు. కానీ నామమాత్రంగానే అభ్యంతరాలు రావడంతో కూటమి నేతలు కంగుతిన్నారు. దీంతో ఈ అభ్యంతరాల స్వీకరణ గడువు మరోసారి పొడిగించారు. జూలై 17వ తేదీ వరకు ఫిర్యాదులు చేయవచ్చని తాజాగా ప్రకటించారు. వీఎంఆర్డీఏ కార్యాలయానికి, ఆన్లైన్లో ఫిర్యాదులు ఎక్కువగా రాకపోవడంతో ఆయా జిల్లాల రెవెన్యూ కార్యాలయాల్లో కూడా ప్రజల నుంచి అభ్యంతరాలు తీసుకోవడానికి ఏర్పాట్లు చేశారు. అనకాపల్లి, యలమంచిలి, పాయకరావుపేట తదితర ప్రాంతాల వారి సౌలభ్యం కోసమంటూ అనకాపల్లి ఆర్డీవో కార్యాలయంలో అభ్యంతరాలను ఈ నెల 30, జూలై 1వ తేదీల్లో స్వీకరించనున్నారు. అలాగే ఎస్.కోట, చీపురుపల్లి, విజయనగరం, గజపతినగరం, నెల్లిమర్ల ప్రాంతాల వారు విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో జూలై 14, 15 తేదీల్లో ఫిర్యాదులను అందించే అవకాశం కల్పించారు. పరిశీలనలో సిఫార్సులకే పెద్ద పీట? మాస్టర్ప్లాన్ కోసం వచ్చిన అభ్యంతరాల పరిశీలనకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేల సమక్షంలోనే వీటి పరిశీలనకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి జూలై 17వ తేదీ వరకు నియోజకవర్గాల వారీగా అభ్యంతరాలను పరిశీలించనున్నారు. నిర్ణీత తేదీ, సమయాల్లో ఎమ్మెల్యేలతో పాటు ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటామని చెబుతున్నప్పటికీ.. ఆ పరిస్థితి ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జూలై 16, 17 తేదీల్లో వీఎంఆర్డీఏ కార్యాలయం 3వ అంతస్తులో మెట్రోపాలిటన్ కమిషనర్ విశ్వనాథన్ అభ్యంతరాలను స్వీకరించనున్నారు. కేవలం కూటమి ప్రజాప్రతినిధులు, వారి అనుచరుల రియల్ వ్యాపారానికి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంతో మాస్టర్ప్లాన్లో సవరణకు సిద్ధమవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
నీటికి కటకట
సమ్మె తాత్కాలిక విరమణ ● 2వ తేదీ వరకు డెడ్లైన్ విధించిన కార్మికులు ● లేదంటే 3వ తేదీ నుంచి సమ్మె ● మేయర్తో జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ లేబర్ యూనియన్ చర్చలు డాబాగార్డెన్స్: జీవీఎంసీ తాగునీటి విభాగం ఔట్సోర్సింగ్ కార్మికులు తమ డిమాండ్ల సాధనకు చేపట్టిన సమ్మెను తాత్కాలికంగా విరమించారు. మేయర్ పీలా శ్రీనివాసరావుతో యూనియన్ నాయకులు జరిపిన చర్చలు సఫలం కావడంతో కార్మికులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్మికుల జీతాల పెంపు విషయమై బుధవారం లోపల పరిష్కరించేందుకు మేయర్ పీలా శ్రీనివాసరావు, కమిషనర్ కేతన్ గార్గ్ హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు కార్మికులు సమ్మెను తాత్కాలికంగా విరమించినట్టు జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ లేబర్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఎం.ఆనందరావు సాక్షికి తెలిపారు. బుధవారంలోపు ( వచ్చే నెల 2వ తేదీ) హామీ అమలు కాకపోతే 3వ తేదీ నుంచి తిరిగి సమ్మె బాట తప్పదని ఆయన స్పష్టం చేశారు. పెందుర్తిలోని తన క్యాంప్ కార్యాలయంలో జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ లేబర్ యూనియన్ నాయకులతో మేయర్ చర్చలు జరిపారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు 50 శాతం తాగునీటి సరఫరా చేయగా, మిగిలిన 50 శాతం సాయంత్రానికి పూర్తిగా పునరుద్ధరించినట్టు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు జీవీఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు శనివారం ప్రజలకు తాగునీటి సరఫరా నిరంతరం కొనసాగేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేప ట్టారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సిటీ ఆపరేషన్ సెంటర్లో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు తమ సమస్యల కోసం హెల్ప్లైన్ నెంబరు 0891–2507225ను సంప్రదించవచ్చన్నారు. చుక్క నీటి కోసం తాపత్రయంనీరు దొరక్క దిగాలుగా...జీవీఎంసీ తాగునీటి విభాగం ఔట్సోర్సింగ్ కార్మికుల సమ్మెతో నగరంలో తాగునీటి సమస్య తీవ్రమైంది. రెండు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బిందెలతో రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.‘గుక్కెడు నీరివ్వలేని వారు పాలన ఎలా సాగించగలరు?’ అంటూ జీవీఎంసీ 7వ వార్డులోని వాంబేకాలనీ, 6వ వార్డులోని పీఎం పాలెం జేఎన్ఎన్యూఆర్ఎం బీ–2 కాలనీ, వైఎస్సార్ కాలనీ, వాంబేకాలనీల్లో మహిళలు బిందెలతో నిరసన తెలిపారు. మంచి నీరు కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరికొన్ని వార్డుల్లో ప్రజలు బోరు బావుల వద్ద బారులు తీరారు. ఆరిలోవ కొండవాలు ప్రాంతాలైన దీన్దయాల్పురం, చినగదిలి, పెదగదిలి, సంజయ్గాంధీ కాలనీ, హనుమంతవాక, ఆదర్శనగర్, బీసీ కాలనీ, సింహగిరి కాలనీల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మున్సిపల్ నీరు అందక, బోర్లు పనిచేయక దైనందిన కార్యకలాపాలకు కూడా నీరు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. తాగునీటి కోసం ప్రజలు బోరింగ్లను ఆశ్రయించాల్సి వచ్చింది. –ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
సమాచార శాఖ మంత్రి దృష్టికి జర్నలిస్టుల సమస్యలు
మహారాణిపేట: రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ,జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు కోరారు. శనివారం ఆయన నాయకత్వంలో ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.నారాయణ్, జి.శ్రీనివాస్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఇరోతి ఈశ్వరరావు, మదన్లతో కలిసి రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి జర్నలిస్టులకు త్వరలో హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని, వాటి ప్రీమియంలో 50 శాతం ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల పింఛన్ల విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి తగు నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఇళ్ల స్థలాలు లేదా ఇళ్ల కేటాయింపుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, త్వరలో దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తామని హామీ ఇచ్చినట్టు శ్రీనుబాబు తెలిపారు. అనంతరం న్యూస్పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.సత్యనారాయణ, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రామచంద్రరావు తదితరులు మంత్రిని కలిసి జర్నలిస్టుల సమస్యలను వివరించారు. -
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండి
సీతంపేట: జీవీఎంసీ తాగునీటి విభాగంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికుల సమ్మె వల్ల నగరంలో తలెత్తుతున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కే.కే. రాజు ప్రభుత్వాన్ని కోరారు. కార్మికులు వేతనాల పెంపు కోరుతూ ఎప్పటికప్పుడు సమ్మెలు చేయడం వల్ల నగరంలో తాగునీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందన్నారు. రెండు రోజులుగా విశాఖ ప్రజలు, ముఖ్యంగా కొండవాలు ప్రాంతాల వారు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారని, ప్రజలు తాగునీటి కోసం రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా పర్మినెంట్ ఉద్యోగులతో నీటి సరఫరాను చేపట్టాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుని శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన డిమాండ్ చేశారు. -
విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలు ఆపాలి
డాబాగార్డెన్స్: విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఆపాలని, ప్లాంట్కు సొంత గనులు కేటాయించడమే సరైన పరిష్కారమని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్ చేసింది. బ్లాస్ట్ ఫర్నేస్–3 తిరిగి ఉత్పత్తి ప్రారంభించడాన్ని కమిటీ అభినందించింది. శనివారం వీజేఎఫ్ ప్రెస్క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పోరాట కమిటీ చైర్మన్ సీహెచ్ నరసింగరావు, కమిటీ కో కన్వీనర్స్ డి.ఆదినారాయణ, రామచంద్రరావు, వి.శ్రీనివాసరావుతో కలిసి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే సొంత గనులు ఇవ్వకుండా ప్లాంట్ను నష్టాల్లోకి నెడుతోందని ఆరోపించారు. దీనివల్ల ఏటా రూ. 4 వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. కనీసం స్టీల్ప్లాంట్ను సెయిల్లోనైనా విలీనం చేయాలని వారు కోరారు. కేంద్రం స్టీల్ప్లాంట్లోని ఉత్పత్తి విభా గాల ఆపరేషన్, మెయింటెనెన్స్ పనులను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించాలని నిర్ణయించిందని, సింటర్ ప్లాంట్, రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ విభాగాలకు జూలై 12 నాటికి టెండర్లు ఆహ్వానించిందని తెలిపారు. ఈ విధంగా మొత్తం 13 విభాగాలను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇది పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికులను తొలగించి, ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకువచ్చే ప్రయత్నమని మండిపడ్డారు. 1583 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయని, గత మూడు నెలల్లో సుమారు 5 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను ఎటువంటి నోటీసులు లేకుండా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది నిర్వాసితులను ఉద్యోగాల నుంచి తొలగిస్తుంటే గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాజమాన్యంతో కుమ్మకై ్క మోసగిస్తున్నారని ఆరోపించారు. -
విదేశాల్లో పూర్వ విద్యార్థుల సంఘాలు
● ఎగ్జిట్ ఎంగేజ్మెంట్ ఈవినింగ్ కార్యక్రమంలో ఏయూ వీసీ రాజశేఖర్ మద్దిలపాలెం: విదేశాలలో ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఏయూ ఉపకులపతి ఆచార్య జీపీ రాజశేఖర్ ప్రకటించారు. శనివారం బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసీసీఆర్), ఆంధ్ర విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన ‘ఎగ్జిట్ ఎంగేజ్మెంట్ ఈవినింగ్’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విదేశీ విద్యార్థులతో ఏయూ ప్రయాణం విశ్వవిద్యాలయానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిందని అన్నారు. ఏయూ పూర్వ విద్యార్థులుగా విదేశాల్లో విశ్వవిద్యాలయం ఖ్యాతిని పెంచే విధంగా పనిచేయాలని ఆయన సూచించారు. విదేశీ విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఐసీసీఆర్ స్కాలర్షిప్ విభాగం డైరెక్టర్ సంజీవ్ వేది మాట్లాడుతూ, ఏయూలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న విదేశీ విద్యార్థులు తమతో పాటు భారతీయతను తీసుకువెళుతున్నారని అన్నారు. ఐసీసీఆర్ అందించే స్కాలర్షిప్ల గురించి ఇతర దేశాల్లోని విద్యార్థులకు వివరించి, మరింత మందికి ఉపయోగపడాలని సూచించారు. ఏయూ అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల విభాగం డీన్, రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్.ధనుంజయరావు మాట్లాడుతూ, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 59 దేశాల నుంచి 1,100 మందికి పైగా విదేశీ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నా రని తెలిపారు. వారికి నాణ్యమైన విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు ఏయూతో తమ అనుబంధాన్ని, విశాఖ నగరం, తెలుగు ప్రజల అభిమానాన్ని గుర్తు చేసుకుంటూ తమ అనుభూతులను పంచుకున్నారు. అనంతరం వారికి అల్యూమ్ని కార్డులు అందజేశారు. వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు తమ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు తమ సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ చేసిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఐసీసీఆర్ జోనల్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్, అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల విభాగం అసోసియేట్ డీన్ ఆచార్య ఎన్.ఎం. యుగంధర్ ప్రిన్సిపాల్స్ ఆచార్య ఏ. నరసింహారావు, ఎంవీఆర్ రాజు, జి. గిరిజ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
మానవ మృగానికి ఉరే సరైన శిక్ష
విశాఖపట్నం: పెందుర్తి మండలం వి.జుత్తాడలో నాలుగేళ్ల క్రితం(2021 ఏప్రిల్ 15న) జరిగిన దారుణ హత్యల కేసులో నిందితుడు బత్తిన అప్పలరాజుకు జిల్లా కోర్టు శుక్రవారం మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. ఈ తీర్పుతో బాధిత కుటుంబం, స్థానికులు న్యాయం లభించిందని భావిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు పసిపిల్లలతో సహా ఆరుగురు నిద్రమత్తులోనే ప్రాణాలు కోల్పోగా, అప్పటి నుంచి న్యాయం కోసం నిరీక్షిస్తున్న కుటుంబానికి ఈ తీర్పు కొంత ఊరటనిచ్చింది. అనుమానమే ఆరుగురి ప్రాణాలు తీసింది 2021 ఏప్రిల్ 15 తెల్లవారుజామున జుత్తాడ గ్రామం రక్తసిక్తమైంది. నిందితుడు బత్తిన అప్పలరాజు కుమార్తెకు, అదే గ్రామానికి చెందిన బమ్మిడి విజయ్కిరణ్కు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఇరు కుటుంబాల మధ్య దీర్ఘకాలంగా వివాదం నడుస్తోంది. ఈ పగతో రగిలిపోయిన అప్పలరాజు.. విజయ్కిరణ్ కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ఆ రోజు ఉదయం వారింట్లోకి ప్రవేశించి నిద్రలో ఉన్న బమ్మిడి రమణ(63), బమ్మిడి ఉషారాణి(35), అల్లు రమాదేవి(53), నక్కెళ్ల అరుణ(40), బమ్మిడి ఉదయ్నందన్ (2), బమ్మిడి ఉర్విష విజయ్కిరణ్(6 నెలలు)లను కత్తితో అత్యంత పాశవికంగా హతమార్చాడు. అభంశుభం తెలియని పసికందులను కూడా వదలకుండా చంపడం అందరినీ కలచివేసింది. రక్తపు మడుగులో మృతదేహాల దృశ్యం చూసిన వారందరినీ కన్నీరు పెట్టించింది. న్యాయం దిశగా ... ఈ దారుణ ఘటన అనంతరం అప్పలరాజు పోలీసులకు లొంగిపోయాడు. ప్రభుత్వం కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించి, బాధిత కుటుంబానికి అండగా నిలబడింది. నష్టపరిహారం చెల్లించి, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చింది. పోలీసులు ఈ కేసును అత్యంత పకడ్బందీగా విచారించి కోర్టులో నివేదించారు. నాలుగేళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం, ఈ రోజు విశాఖ కోర్టు అప్పలరాజుకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. బాధిత కుటుంబ సభ్యుల ఆనందం ఈ తీర్పుపై బాధిత కుటుంబ సభ్యులు నాటి ఘటనను తల్చుకుని కన్నీరు పెట్టుకుంటూనే తమ ఆనందం వ్యక్తం చేశారు. ‘మానవ మృగానికి ఉరే సరైన శిక్ష. మా కుటుంబానికి న్యాయం జరిగింది’అని తెలిపారు. ఈ తీర్పు భవిష్యత్తులో ఇలాంటి దారుణాలకు పాల్పడే వారికి ఒక హెచ్చరికగా నిలుస్తుందని పేర్కొన్నారు. -
విశాఖలో వాటర్ ఎమర్జెన్సీ.. తాత్కాలికంగా సమ్మె విరమణ
విశాఖ వాటర్ ఎమర్జెన్సీ అప్డేట్స్.. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో నగర ప్రజలు, పరిశ్రమలు నీటి కోసం అల్లాడుతున్నాయి. తాత్కాలికంగా సమ్మె విరమణ..తాత్కాలికంగా సమ్మె విరమించిన జీవీఎంసీ వాటర్ సప్లై ఉద్యోగులు..మేయర్ విజ్ఞప్తి మేరకు బుధవారం వరకు సమయం ఇచ్చిన వాటర్ సప్లై సిబ్బంది..జీవీఎంసీ పరిధిలో మంచి నీరు అందించేందుకు మరో 7-8 గంటలు సమయం పట్టే అవకాశం..ఇప్పటికే అన్ని ట్యాంకుల్లో నిండుకున్న నీటి నిల్వలు..ట్యాంకులు నింపడానికి 4-5 గంటలు సమయం పట్టే అవకాశం..ఆ తరువాత పంపిణీకి మరో మూడు గంటల సమయం పట్టే ఛాన్స్..ఈరోజు రాత్రికి కేవలం 25 శాతం మంచి నీరు మాత్రమే పంపిణీ అయ్యే సూచనలు..మహిళల ఆందోళన..విశాఖలో వాటర్ ఎమర్జెన్సీ..బక్కన్నపాలెంలో ఖాళీ బిందెలతో నిరసనకు దిగిన మహిళలు..మంచి నీరు లేక తీవ్ర అవస్థలు పడుతున్నామంటున్న మహిళలు..మేయర్తో ఇంకా ప్రారంభం కానీ వాటర్ సప్లై ఉద్యోగుల చర్చలు..చర్చలు సఫలమైనా నీటి విడుదలకు సమయం పట్టే అవకాశం..👉ఆప్కాస్ కార్మికులు సమ్మె బాట పట్టడమే దీనికి కారణం. ఫలితంగా జీవీఎంసీ పరిధిలోని 98 వార్డులతో పాటు పరిశ్రమలకు తాగునీరు పూర్తిగా నిలిచిపోయింది. తాగునీటి విభాగంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికుల డిమాండ్ల పరిష్కారంలో అధికారులు, మేయర్ పీలా శ్రీనివాసరావు ఆసక్తి చూపకపోవడంతో ఈ సమ్మెకు దిగినట్లు కార్మికులు తెలిపారు.👉దీంతో, మూడు లక్షల ఇంటి కులాయిలు, ఆసుపత్రులు సహా పలు కీలక పరిశ్రమలకు మంచి నీటి సరఫరా నిలిచిపోయింది. ఉదయం ఐదు గంటల నుంచి కులాయిలు రావాల్సి ఉన్నప్పటికీ నీటి సరఫరాకు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో పలు కాలనీల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. హెచ్పీసీఎల్, కోరమండల్, ఎస్సార్, ఆర్సీఎల్, పోర్ట్ మొదలగు పరిశ్రమలకు కూడా నీటి సరఫరా ఆగిపోయింది. దాదాపు 30 గంటలుగా పంపింగ్ ప్రక్రియ స్థంభించిపోయింది. ఏలేరు, తాటిపూడి, గోస్తని, గంభీరం, రైవాడ కెనాల్స్ నుంచి వచ్చే నీటిని ఉద్యోగులు నిలిపివేశారు. ఇప్పటికే జీవీఎంసీ పరిధిలో ఉన్న అన్ని ట్యాంకులు ఖాళీ అయినట్టు సమాచారం. తిరిగి ట్యాంకులను నింపాలంటే సుమారు 10 గంటలు సమయం పట్టే అవకాశం ఉంది. సచివాలయ ఉద్యోగులతో ట్యాంకులు నింపాలని జీవీఎంసీ యోచిస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే సాంకేతిక సమస్యలు తప్పవని వాటర్ సప్లై ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు.👉ఇక, నిన్న రాత్రి వరకు జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మె కొనసాగుతోంది. మంచి నీళ్ళు లేక గ్రేటర్ విశాఖ జనం గగ్గోలు పెడుతున్నారు. ఈ క్రమంలో మేయర్తో మరోసారి చర్చలకు వెళ్ళనున్నారు వాటర్ సప్లై ఎంప్లాయిస్ యూనియన్ నేతలు. చర్చలు సఫలం అయితేనే నీటిని విడుదల చేస్తామంటున్న ఉద్యోగులు చెబుతున్నారు. జీవీఎంసీ చరిత్రలో మంచి నీటి సరఫరా ఆగిపోవడం ఇదే మొదటిసారి..👉ఇదిలా ఉండగా.. ఔట్ సోర్సింగ్ కార్మికుల సమ్మెతో నగరంలో నీటి కష్టాలు మొదలయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో పర్మినెంట్ ఉద్యోగులతో కొంతమేర నీటి సరఫరా జరుగుతున్నప్పటికీ, అది అరకొరగానే ఉండటంతో అనేక ప్రాంతాల్లో ప్రజలు తాగునీటి కోసం రోడ్ల మీదకు వచ్చి నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. ముఖ్యంగా కొండవాలు ప్రాంతాల ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు.కార్మికుల డిమాండ్.. 👉ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికుల్లో పదేళ్లు అనుభవం ఉండి, టెక్నికల్ విధులు నిర్వహిస్తున్న సుమారు 900 మందిని సెమీ స్కిల్ కేటగిరీలో చేర్చి, ఆ మేరకు వేతనాలు ఇవ్వాలని కార్మిక సంఘాలు గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. గతేడాది డిసెంబర్లో జీవీఎంసీ కౌన్సిల్ వేతనాల పెంపునకు ఆమోదం తెలపగా, అధికారులు మే నెల నుంచి నెలకు రూ.6 వేలు పెంచుతూ ఆప్కాస్ వెబ్సైట్లో పొందుపరిచారు. అయితే ఆచరణలో పాత వేతనాలే చెల్లించడంతో పాటు, జూన్ నెల జీతాలు కూడా పాత పద్ధతిలోనే అప్లోడ్ చేయడంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేతన పెంపు అమలు చేయాలంటూ కార్మికులు సమ్మె బాట పట్టారు. దీంతో నగరంలో తాగునీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.చర్యలు చేపట్టండి👉తాగునీటి విభాగం ఔట్ సోర్సింగ్ కార్మికులు సమ్మెలో ఉన్నప్పటికీ, ప్రజలకు నీటి సరఫరాలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు జీవీఎంసీ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. తాగునీటి సరఫరాకు ఎలాంటి ఆందోళన చెందవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసిన మేయర్, అసౌకర్యానికి సహకరించాలని కోరారు. -
ఇళ్ల నిర్మాణాలకు రూ.3,200 కోట్లు
సంజనకు ‘శోభానాయుడు యువ పురస్కార్’ అమెరికాలో నివసిస్తున్న ప్రముఖ కూచిపూడి నర్తకి సంజనా పుట్టాకు జూలై 4న విశాఖపట్నంలో ‘పద్మశ్రీ డా. శోభానాయుడు యువ పురస్కార్ – 2025’ ప్రదానం చేయనున్నట్లు నటరాజ్ మ్యూజిక్ – డ్యాన్స్ అకాడమీ వ్యవస్థాపకులు బి.ఆర్. విక్రమ్ కుమార్ ప్రకటించారు. ఈ పురస్కారాన్ని భారతీయ శాసీ్త్రయ నృత్య కళలలో అత్యుత్తమ ప్రతిభను గుర్తించి అందజేస్తారు. సంజన 12 సంవత్సరాలుగా గురువు శ్రీలత సూరి శిక్షణలో కూచిపూడి నృత్యంలో సాధన చేసి, అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ఆమె 2024లో రంగప్రవేశం పూర్తి చేసి, ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, ఆస్టిన్లో ప్రీ–మెడ్ విద్యార్థినిగా ఉన్నారు. క్యాంపస్లో భారతీయ కూచిపూడి నృత్యాన్ని పరిచయం చేయడంలో ఆమె విశేష కృషి చేస్తున్నారు. – మద్దిలపాలెంమహారాణిపేట : రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేసేందుకు ప్రభుత్వం రూ. 3,200 కోట్ల అదనపు ఆర్థిక సాయం అందించిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో మంజూరైన 1.89 లక్షల ఇళ్లలో 43 వేలు పూర్తయ్యాయని, మిగిలినవి 2026 మార్చి నాటికి పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. ఎస్సీ, బీసీలకు రూ. 50 వేలు, ఎస్టీలకు రూ. 75 వేలు, గిరిజన ప్రాంతాల్లోని ఎస్టీలకు రూ. 1 లక్ష అదనపు సాయం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. నాణ్యత, మౌలిక సదుపాయాలపై దృష్టి పెడతామని, పనులు వదిలేసిన గుత్తేదారులపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు. పేదలందరికీ ఇళ్లు : పేదలందరికీ ఇళ్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. విశాఖ కలెక్టరేట్లో శుక్రవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాబోయే నాలుగేళ్లలో అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్లు అందిస్తామని తెలిపారు. ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఇప్పటికే లేఅవుట్లపై కోట్లాది రూపాయలు ఖర్చు చేసిందని ఆయన వివరించారు. మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా విద్యుత్, తాగునీటి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. తాగునీటి కోసం జీవీఎంసీ నుంచి నిధులతో పాటు ప్రభుత్వం నుంచి కూడా నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కలెక్టర్ హరేందిర ప్రసాద్, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డీఆర్వో భవానీ శంకర్, ఆర్డీవో సంగీత్, హౌసింగ్ సీఈ రామ్మోహన్రావు, హౌసింగ్ పీడీ సత్తిబాబు, సంబంధిత హౌసింగ్ ఈఈలు, డీఈలు, పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పాల్గొన్నారు. -
జైలులో సౌకర్యాలపై ఆరా
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారాన్ని శుక్రవారం న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి సన్యాసినాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన జైలులోని ఖైదీల బ్యారక్లను పరిశీలించారు. ఖైదీలతో నేరుగా మాట్లాడిన సన్యాసినాయుడు, వారికి కల్పిస్తున్న సౌకర్యాలు, భోజనం, వైద్య సేవలు, పరిశుభ్రత వంటి అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జైలులో ప్రస్తుతమున్న ఖైదీల సంఖ్య, వారి ప్రవర్తన గురించి జైలు అధికారుల నుంచి సమాచారం సేకరించారు. అనంతరం కారాగారం న్యాయ సహాయ కేంద్రంలో రిమాండ్ ఖైదీలతో మాట్లాడి, వారికి అవసరమైన న్యాయ సలహాలు, సూచనలు అందించారు. కార్యక్రమంలో జైలు డిప్యూటీ సూపరింటెండెంట్లు కె. జవహర్ బాబు, సి. ప్రవీణ్ కుమార్, ఇతర జైలర్లు పాల్గొన్నారు. -
నేటితో ముగియనున్న పాలిసెట్ సర్టిఫికెట్ల పరిశీలన
మురళీనగర్: పాలిటెక్నిక్ కాలేజీల్లో టెక్నికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న పాలిసెట్ కౌన్సెలింగ్ శనివారంతో ముగియనుంది. శుక్రవారం మొత్తం 386 మంది విద్యార్థులకు సర్టిఫికెట్ల పరిశీలన జరిగింది. జీఐఈటీఎస్ లో ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వెంకటరమణ పర్యవేక్షణలో, చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ సిహెచ్. జయప్రకాష్రెడ్డి ఆధ్వర్యంలో 104001 నుంచి 112000 ర్యాంకు వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందులో 152 మందికి సర్టిఫికెట్లు పరిశీలించగా, వారిలో 112 మంది బీసీ, 17 మంది ఓసీ, 23 మంది ఎస్సీ విద్యార్థులు ఉన్నారు.పాలిటెక్నిక్ కాలేజీలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రత్నకుమార్ పర్యవేక్షణలో, జనరల్ హెడ్, చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ డాక్టర్ పి.ఎం. భాషా, లెక్చరర్ నాగరాజు ఆధ్వర్యంలో 112001 నుంచి 120000 ర్యాంకుల వరకు కౌన్సెలింగ్ జరిగింది. ఇక్కడ 234 మందికి సర్టిఫికెట్లు పరిశీలించగా, 166 మంది బీసీ, 26 మంది ఓసీ, 30 మంది ఎస్సీ, 12 మంది ఎస్టీ విద్యార్థులు ఉన్నారు. శనివారం జీఐఈటీఎస్లో 1,20,001 నుంచి 1,27,000 ర్యాంకు వరకు ఉన్న విద్యార్థులు హాజరు కావాలి. పాలిటెక్నిక్ కాలేజీలో 1,27,001 నుంచి చివరి ర్యాంకు వరకు ఉన్న విద్యార్థులు హాజరు కావాలి.ఎస్టీ విద్యార్థులందరూ పాలిటెక్నిక్ కాలేజీకి హాజరు కావాల్సి ఉంటుంది. -
కట్..!
గ్రేటర్కు వాటర్గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో నగర ప్రజలు, పరిశ్రమలు నీటి కోసం అల్లాడుతున్నాయి. ఆప్కాస్ కార్మికులు సమ్మె బాట పట్టడమే దీనికి కారణం. టౌన్ సర్వే రిజర్వాయర్, నరవ హెడ్ వాటర్ వర్క్స్, పద్మనాభంతో పాటు పలు జోనల్ కార్యాలయాల వద్ద కార్మికులు నిరసన తెలుపుతున్నారు. ఫలితంగా జీవీఎంసీ పరిధిలోని 98 వార్డులతో పాటు పరిశ్రమలకు తాగునీరు పూర్తిగా నిలిచిపోయింది. తాగునీటి విభాగంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికుల డిమాండ్ల పరిష్కారంలో అధికారులు, మేయర్ పీలా శ్రీనివాసరావు ఆసక్తి చూపకపోవడంతో ఈ సమ్మెకు దిగినట్లు కార్మికులు తెలిపారు. డాబాగార్డెన్స్: ఔట్సోర్సింగ్ కార్మికుల సమ్మెతో నగరంలో నీటి కష్టాలు మొదలయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో పర్మినెంట్ ఉద్యోగులతో కొంతమేర నీటి సరఫరా జరుగుతున్నప్పటికీ, అది అరకొరగానే ఉండటంతో అనేక ప్రాంతాల్లో ప్రజలు తాగునీటి కోసం రోడ్ల మీదకు వచ్చి నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. ముఖ్యంగా కొండవాలు ప్రాంతాల ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. కార్మికులు ఎందుకు సమ్మె చేస్తున్నారంటే.. ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికుల్లో పదేళ్లు అనుభవం ఉండి, టెక్నికల్ విధులు నిర్వహిస్తు న్న సుమారు 900 మందిని సెమీ స్కిల్ కేటగిరీలో చేర్చి, ఆ మేరకు వేతనాలు ఇవ్వాలని కార్మిక సంఘాలు గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. గతేడాది డిసెంబర్లో జీవీఎంసీ కౌన్సిల్ వేతనాల పెంపునకు ఆమోదం తెలపగా, అధికారులు మే నెల నుంచి నెలకు రూ.6 వేలు పెంచుతూ ఆప్కాస్ వెబ్సైట్లో పొందుపరిచారు. అయితే ఆచరణలో పాత వేతనాలే చెల్లించడంతో పాటు, జూన్ నెల జీతాలు కూడా పాత పద్ధతిలోనే అప్లోడ్ చేయడంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేతన పెంపు అమలు చేయాలంటూ కార్మికులు సమ్మె బాట పట్టారు. దీంతో నగరంలో తాగునీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టండి తాగునీటి విభాగం ఔట్ సోర్సింగ్ కార్మికులు సమ్మెలో ఉన్నప్పటికీ, ప్రజలకు నీటి సరఫరాలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు జీవీఎంసీ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.తాగునీటి సరఫరాకు ఎలాంటి ఆందోళన చెందవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసిన మేయర్, అసౌకర్యానికి సహకరించాలని కోరారు. ఆప్కాస్ కార్మికులు సమ్మె బాట పట్టించుకోని అధికారులు, మేయర్ ప్రజలకు నీటి కష్టాలు -
మానవ మృగానికి ఉరే సరైన శిక్ష
● ఆరుగుర్ని హత్య చేసిన నిందితుడికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు ● నాలుగేళ్ల క్రితం జుత్తాడలో ఘోర సంఘటన పెందుర్తి: పెందుర్తి మండలం వి.జుత్తాడలో నాలుగేళ్ల క్రితం(2021 ఏప్రిల్ 15న) జరిగిన దారుణ హత్యల కేసులో నిందితుడు బత్తిన అప్పలరాజుకు జిల్లా కోర్టు శుక్రవారం మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. ఈ తీర్పుతో బాధిత కుటుంబం, స్థానికులు న్యాయం లభించిందని భావిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు పసిపిల్లలతో సహా ఆరుగురు నిద్రమత్తులోనే ప్రాణాలు కోల్పోగా, అప్పటి నుంచి న్యాయం కోసం నిరీక్షిస్తున్న కుటుంబానికి ఈ తీర్పు కొంత ఊరటనిచ్చింది. అనుమానమే ఆరుగురి ప్రాణాలు తీసింది 2021 ఏప్రిల్ 15 తెల్లవారుజామున జుత్తాడ గ్రామం రక్తసిక్తమైంది. నిందితుడు బత్తిన అప్పలరాజు కుమార్తెకు, అదే గ్రామానికి చెందిన బమ్మిడి విజయ్కిరణ్కు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఇరు కుటుంబాల మధ్య దీర్ఘకాలంగా వివాదం నడుస్తోంది. ఈ పగతో రగిలిపోయిన అప్పలరాజు.. విజయ్కిరణ్ కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ఆ రోజు ఉదయం వారింట్లోకి ప్రవేశించి నిద్రలో ఉన్న బమ్మిడి రమణ(63), బమ్మిడి ఉషారాణి(35), అల్లు రమాదేవి(53), నక్కెళ్ల అరుణ(40), బమ్మిడి ఉదయ్నందన్ (2), బమ్మిడి ఉర్విష విజయ్కిరణ్(6 నెలలు)లను కత్తితో అత్యంత పాశవికంగా హతమార్చాడు. అభంశుభం తెలియని పసికందులను కూడా వదలకుండా చంపడం అందరినీ కలచివేసింది. రక్తపు మడుగులో మృతదేహాల దృశ్యం చూసిన వారందరినీ కన్నీరు పెట్టించింది. న్యాయం దిశగా ... ఈ దారుణ ఘటన అనంతరం అప్పలరాజు పోలీసులకు లొంగిపోయాడు. ప్రభుత్వం కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించి, బాధిత కుటుంబానికి అండగా నిలబడింది. నష్టపరిహారం చెల్లించి, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చింది. పోలీసులు ఈ కేసును అత్యంత పకడ్బందీగా విచారించి కోర్టులో నివేదించారు. నాలుగేళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం, ఈ రోజు విశాఖ కోర్టు అప్పలరాజుకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. బాధిత కుటుంబ సభ్యుల ఆనందం ఈ తీర్పుపై బాధిత కుటుంబ సభ్యులు నాటి ఘటనను తల్చుకుని కన్నీరు పెట్టుకుంటూనే తమ ఆనందం వ్యక్తం చేశారు. ‘మానవ మృగానికి ఉరే సరైన శిక్ష. మా కుటుంబానికి న్యాయం జరిగింది’అని తెలిపారు. ఈ తీర్పు భవిష్యత్తులో ఇలాంటి దారుణాలకు పాల్పడే వారికి ఒక హెచ్చరికగా నిలుస్తుందని పేర్కొన్నారు.