Visakhapatnam
-
సింహాచలం ఘటన: బాబూ.. ఇదేం వక్రబుద్ధి.. భక్తుల ఆగ్రహం
సాక్షి, విశాఖపట్నం: సింహాచలం ప్రమాద బాధితులకు పరిహారంలోనూ సీఎం చంద్రబాబు తన వక్ర బుద్ధిని చాటుకున్నారు. బాధితులకు పరిహారం సింహాచలం దేవస్థానం నుంచి చెల్లించారను. చనిపోయిన ఒక్కొక్కరికి 25 లక్షలు, గాయపడిన వారికి మూడు లక్షల పరిహారం అందించగా, మొత్తంగా కోటి 78 లక్షల రూపాయలు దేవస్థానం నుంచి చెల్లింపు చేశారు. ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.దేవాలయ అభివృద్ధికి వినియోగించాల్సిన నిధులను బాధితులకు ఇవ్వడంపై భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిహార విషయంలో ప్రభుత్వానికి బాధ్యత లేదా అంటూ భక్తులు మండిపడుతున్నారు. ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వాల్సిన పరిహారాన్ని సింహాచలం దేవస్థానం నుంచి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, సింహాచలం ఘటనపై తూతూ మంత్రంగా చర్యలు చేపట్టారు. చివరికి సింహాచలం ప్రమాదంపై ఉద్యోగులే బలయ్యారు. కూటమి ప్రజా ప్రతినిధులందరూ సేఫ్గా బయటపడ్డారు.ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు, కూటమి ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోని ప్రభుత్వం.. ఈవో సహా మరో ఆరుగురు ఇంజనీరింగ్ సిబ్బందిపై వేటు వేయడానికి నిర్ణియించింది. ఇంజనీరింగ్ సిబ్బందిలో కాంట్రాక్ట్ ఉద్యోగిపైన చర్యలకు సిద్ధమైంది. కాంట్రాక్టర్పై క్రిమినల్ చర్యలు కోవడానికి కూటమి సర్కార్ సిద్ధమైంది. కూటమి నాయకులను తప్పించి అధికారులను బలి పశువుల చేశారనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టే కమిటీ నివేదిక ఇచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
ప్రశాంతంగా ఏయూ ఇంజినీరింగ్ ఎంట్రన్స్
విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్( ఏయూఈఈటీ–2025) సోమవారం ప్రశాంతంగా ముగిసింది. విశాఖపట్నంతో పాటు విజయనగరం, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు 6,028 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 5,634 మంది హాజరైనట్లు వర్సిటీ అడ్మిషన్ల విభాగం డైరెక్టర్ డీ.ఏ.నాయుడు వెల్లడించారు.ఎంట్రన్స్ పరీక్ష ప్రిలిమినరీ కీ మంగళవారం సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తామని తెలిపారు. దీనిపై అభ్యంతరాలుంటే ఈ నెల 8 సాయంత్రం 5 గంటలలోగా తెలియజేయాలని పేర్కొన్నారు. ఈనెల 9న సాయంత్రం 6 గంటలకు ఫలితాలు విడుదల చేస్తామని వెల్లడించారు. విశాఖ నగరంలోని గాయత్రి విద్యాపరిషత్ డిగ్రీ కాలేజీ, బుల్లయ్య కాలేజీల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య రాజశేఖర్ తనిఖీ చేసి, పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. -
కరాచీ బేకరీ పేరు తొలగించాలి
ఎంవీపీలో జన జాగరణ సమితి నిరసన ఎంవీపీకాలనీ : పాకిస్తాన్ మూలాలున్న కరాచీ బేకరీ పేర్లను వెంటనే తొలగించాలని జన జాగరణ సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు సమితి నాయకులు ఎంవీపీ కాలనీ సెక్టార్–2లోని కరాచీ బేకరీ వద్ద సోమవారం నిరసనకు దిగారు. బేకరీ బోర్డు తొలగించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యుడు వంశీయాదవ్ మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా భారతీయులను చంపేస్తుంటే దేశంలో పాకిస్తాన్ మూలాలున్న కరాచీ బేకరీల వ్యాపారులు ప్రశాంతంగా ఎలా వ్యాపారాలు సాగిస్తారన్నారు. పాకిస్తాన్ మూలాలతో దేశంలో నడుస్తున్న వ్యాపార సంస్థల పేర్లు 10 రోజుల్లో మార్చకపోతే సహించబోమని హెచ్చరించారు. ఇలాంటి వ్యాపారులపై కేంద్రం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సమితి రాష్ట్ర కన్వీనర్ ఎస్ఎల్ఎన్ వాసు, నగర కన్వీనర్ చింతపల్లి సునీల్కుమార్, అనిల్, రాజేష్, శీను, అన్వేష్ పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ విజేత వైజాగ్
చీరాల రూరల్: యువకులు చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి కనబరిచి సన్మార్గంలో నడవాలని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. స్థానిక ఎన్ఆర్అండ్పీఎం హైస్కూలు క్రీడా మైదానంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న కావూరి పవన్కుమార్ స్మారక రాష్ట్రస్థాయి ఇన్విటేషన్ ఫుట్బాల్ పోటీలు ఆదివారం రాత్రితో ముగిశాయి. ఈ పోటీల్లో రాష్ట్రంలోని అనేక నగరాలు పట్టణాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫైనల్లో విశాఖ, హుబ్లీ జట్టు తలపడ్డాయి. మొదటి ఫస్ట్ హాఫ్లో విశాఖ జట్టు రెండు గోల్స్ చేసింది. సెకండాఫ్లో హుబ్లీ జట్టు పుంజుకొని రెండు గోల్స్ సాధించింది. దీంతో అంపైర్లు ఇరు జట్లకు పెనాల్టీ షూట్ అవుట్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఇరుజట్లు సమంగా నిలిచాయి. మరోసారి అవకాశం ఇవ్వగా వైజాగ్ జట్టు అధిక గోల్స్ సాధించి విజేతగా నిలిచింది. రూ. 50 వేల నగదు బహుమతితో పాటు కప్ను ఎమ్మెల్యే చేతుల మీదుగా క్రీడాకారులు అందుకున్నారు. -
జీవీఎంసీకి 300 వినతులు
డాబాగార్డెన్స్: జీవీఎంసీలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 300 వినతులు అందాయి. అత్యధికంగా జోన్–8 నుంచి 227 వినతులు రావడం గమనార్హం. జోన్–2 నుంచి 17, జోన్–3 నుంచి 20, జోన్–4 నుంచి 15, జోన్–5 నుంచి 6, జోన్–6 నుంచి 9, జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి 6 ఫిర్యాదులు వచ్చాయి. మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రజల నుంచి ఫిర్యాదు స్వీకరించారు. అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి, ప్రధాన ఇంజినీర్ పి.శివప్రసాదరాజు, చీఫ్ సిటీ ప్లానర్ ఎ.ప్రభాకరరావు, ప్రధాన వైద్యాధికారి నరేష్కుమార్, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి, డీసీఆర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
పశు సంవర్థక శాఖ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎన్నిక
ఆరిలోవ: ఉమ్మడి విశాఖ జిల్లా పశు సంవర్థక శాఖ ఆఫీసర్స్ సర్వీస్ అసోసియేషన్ ఎన్నిక సోమ వారం ఆ శాఖ జిల్లా సంయుక్త సంచాలక కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిటీని అసోసియేషన్ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఏడీ డాక్టర్ ఆర్.సింహాద్రప్పడు(ఆండ్రాలజీ విభాగం, విశాఖ), కార్యదర్శిగా ఏడీ డాక్టర్ సీహెచ్ ఎం.ఎం.గంగాధర్(యలమంచిలి), కోశాధికారిగా ఏడీ డాక్టర్ బి.సౌజన్య(అనకాపల్లి), ఉపాధ్యక్షుడిగా ఏడీ డాక్టర్ పి.చంద్రశేఖర్(చింతపల్లి), సంయుక్త కార్యదర్శిగా ఏడీ డాక్టర్ పి.రాజగోపాల్ ఎన్నికయ్యారు. పశు సంవర్థక శాఖ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ పి.ఎస్.జి బాలకృష్ణ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. నూతన కమిటీకి అసోసియేషన్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. -
అర్జీ పునరావృతమైతే అధికారులదే బాధ్యత
మహారాణిపేట : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్ సోమవారం కలెక్టరేట్లో జరిగింది. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన అర్జీదారుల నుంచి వినతులను కలెక్టర్తోపాటు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డీఆర్వో భవానీ శంకర్, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వర్మ వినతులు స్వీకరించారు. అనంతరం పీజీఆర్ఎస్ నిర్వహణ, స్వర్ణాంధ్ర లక్ష్య సాధన, పీ 4 సర్వే, తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్కు వచ్చిన అర్జీలకు శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అర్జీ పునరావృతం అయ్యిందంటే అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సీఎంఓ కార్యాలయం నుంచి వచ్చిన దరఖాస్తులు మళ్లీ రీ ఓపెన్ అయితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. పరిష్కరించిన అర్జీదారుల వద్దకు వెళ్లి వారి ఫీడ్ బ్యాక్ను సేకరించి మొబైల్ యాప్ ఫీడ్ బ్యాక్ కలెక్షన్ రిపోర్ట్లో నమోదు చేయాలని ఆదేశించారు. కాగా సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు మొత్తం 225 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 81, పోలీసు శాఖకు సంబంధించి 14, జీవీఎంసీకి సంబంధించి 79, ఇతర విభాగాలకు సంబంధించి 51 వినతులు ఉన్నాయి. కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ -
చార్ధామ్ యాత్రలో అపశ్రుతి
ఆక్సిజన్ అందక గాజువాక వాసి పాలవెల్లి మృతి గాజువాక: చార్ధామ్ యాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆక్సిజన్ అందకపోవడంతో గాజువాకకు చెందిన ఒక జీవీఎంసీ ఉద్యోగి మృతి చెందారు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలివి. గాజువాక రాజీవ్నగర్లో నివాసముంటున్న పాలవెల్లి.. జీవీఎంసీ గాజువాక జోన్లో ట్యాక్స్ కలెక్టర్గా పని చేస్తున్నారు. ఆయన తన మిత్ర బృందంతో కలిసి గత నెల 30న చార్ధామ్ యాత్రకు బయలుదేరారు. ఆదివారం కేదార్నాథ్ వెళ్తుండగా ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. గమనించిన సహచరులు ఆయన్ని దగ్గరలోని రుద్రప్రయాగ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అక్కడే పోస్టుమార్టం పూర్తి చేసి, మృతదేహాన్ని ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి విమానంలో గాజువాకకు తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేసుకున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
సంగతేంటి?
మంత్రుల కమిటీ● సింహాచలం ఆలయంలో గోడ కూలిన ఘటనలో బాధ్యులపై చర్యలు ● ఆలయ ఈవోతో సహా ఏడుగురు అధికారుల సస్పెన్షన్ ● కాంట్రాక్టర్ లక్ష్మీనారాయణపై క్రిమినల్ చర్యలకు ఆదేశం ● మంత్రుల కమిటీ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నా చర్యల్లేవు.. ● నిజాలను గోడ వెనకే సమాధి చేసేసిన త్రిసభ్య కమిషన్ సింహాచలం దేవస్థానంలో దుర్ఘటనపై కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తప్పంతా అధికారులు, దిగువస్థాయి సిబ్బందిదే అన్నట్లుగా వారిపైనే వేటు వేసింది. దాసుని తప్పు దండనతోనే సరి అన్నట్లుగా.. పనుల పర్యవేక్షణ అంటూ ప్రచార ఆర్భాటానికి పరిమితమై.. భక్తుల ప్రాణాలతో చెలగాటమాడిన మంత్రుల కమిటీ మీద మాత్రం ఈగ వాలనీయకుండా జాగ్రత్తపడింది. సాక్షి, విశాఖపట్నం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం సందర్భంగా తాత్కాలికంగా నిర్మించిన గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందిన ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. త్రిసభ్య కమిషన్ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా సింహాచలం దేవస్థానం ఈవో కె.సుబ్బారావు, ఈఈ డీజీ శ్రీనివాసరాజు, డిప్యూటీ ఈఈ కేఎస్ఎన్ మూర్తి, జేఈ కే.బాబ్జీతో పాటు ఏపీటీడీసీకి చెందిన ఈఈ కె.రమణ, డిప్యూటీ ఈఈ ఏబీవీఎల్ఆర్ స్వామి, ఏఈ పి.మదన్మోహన్లను సస్పెన్షన్కు ఆదేశించింది. అదేవిధంగా గోడ నిర్మించిన కాంట్రాక్టర్ లక్ష్మీనారాయణపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా చందనోత్సవ ఏర్పాట్ల పర్యవేక్షణ కోసమంటూ ఏర్పాటు చేసిన కమిటీలో ఉంటూ.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు మంత్రులపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. మంత్రులూ ఘటనకు బాధ్యులేగా..? మూడు రోజుల పాటు విచారణ అంటూ హడావుడి చేసిన త్రిసభ్య కమిషన్ కూడా ఏకపక్షంగా వ్యవహరించి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. గోడ ఎవరు కట్టారు?.. ఎందుకు కట్టారు.? దాని వెనక ఎవరు ఉన్నారు.. నిబంధనలు ఏమైనా ఉల్లంఘించారా అనే కోణాల్లో కేవలం అధికారులకు సంబంధించే విచారణ చేపట్టారే తప్ప.. మంత్రుల కోణం నుంచి కించిత్తు దర్యాప్తు చెయ్యలేదు. వాస్తవానికి చందనోత్సవ ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం ఏప్రిల్ 7వ తేదీన నలుగురు మంత్రులతో ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మంత్రులు వంగలపూడి అనిత, ఆనం రామనారాయణరెడ్డి, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, అనగాని సత్యప్రసాద్తో పాటు అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు, ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జిల్లా అధికారులున్నారు. కమిటీ నియమించిన తర్వాత నుంచి మంత్రుల బృందం కొండపైనే నిరంతర పర్యటన, సమీక్షలంటూ హడావుడి చేసింది. మీడియా సమక్షంలో ప్రచారం కోసం నానాయాగీ చేసింది. కానీ క్షేత్రస్థాయిలో పనులు ఎలా జరుగుతున్నాయి.? ఎవరెవరు ఏయే బాధ్యతలు తీసుకుంటున్నారు.. క్యూలైన్లు బాధ్యత ఎవరిది? లైన్లలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయనే దానిపై కేవలం అడిగి తెలుసుకున్నారే తప్ప.. ఏమాత్రం పరిశీలించలేదు. వీరి బాధ్యతారాహిత్యమే ప్రమాదానికి ప్రధాన కారణమనడంలో ఎలాంటి సందేహం లేదు. -
నమ్మివానిపేటలో హైడ్రామా
ఆత్మహత్య చేసుకుంటానని దత్తిరాజేరు వాసి హల్చల్ తగరపువలస: జీవీఎంసీ రెండో వార్డు నమ్మివానిపేటలో ఓ ఇంటి మేడపైకి సోమవారం ఉదయం విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం చినకాదకు చెందిన ఆవాల ఎర్రయ్య ఎక్కి హల్చల్ చేశాడు. ఆ ఇంటిని ఆనుకుని ఉన్న విద్యుత్ స్తంభంనకు వేలాడుతున్న వైర్లు పట్టుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. స్థానికులు, ఎర్రయ్య భార్య నరసయ్యమ్మ తెలిపిన వివరాలివి. ఎర్రయ్య ఫూల్బాగ్ కాలనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. ఇటీవల అతని కుమారుడు మణికంఠకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో సంగివలస అనిల్ నీరుకొండ ఆసుపత్రిలో మూడు రోజుల క్రితం చికిత్స నిమిత్తం చేర్పించారు. ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ బాధపడుతున్న మణికంఠకు వైద్యులు చికిత్స చేస్తున్నారు. అయితే కుమారుని ఆరోగ్యం బాగాలేదన్న మనస్థాపంతో ఆసుపత్రి ఆరో అంతస్తు నుంచి సోమవారం ఉదయం 4 గంటల సమయంలో ఎర్రయ్య కిందకు దిగాడు. పక్కనే ఉన్న నమ్మివానిపేట గ్రామానికి చేరుకుని ఓ ఇంటి మేడపైకి చేరి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అప్పటికే స్థానికులు మేల్కొని ఉండటంతో.. గ్రామస్తులందరికీ సమాచారమిచ్చారు. కుమారుడి ఆరోగ్యం బాగా లేదని, ఎవరో తనను చంపడానికి వస్తున్నట్టు రకరకాలుగా స్థానికులకు చెప్పాడు. దీంతో వారు ఎర్రయ్యకు నచ్చజెప్పి ఉదయం 6.15 గంటల సమయంలో కిందకు దించారు. తర్వాత ఆసుపత్రిలో ఉన్న భార్యకు సమాచారం అందించారు. అప్పటికే అక్కడకు చేరుకున్న భీమిలి పోలీసులు ఎర్రయ్యకు కౌన్సెలింగ్ ఇచ్చి ఆసుపత్రికి తరలించారు. -
జీసీసీ విశ్రాంత అధికారి 15 ఏళ్ల పోరాటం
మహారాణిపేట: గిరిజన కో–ఆపరేటివ్ కార్పొరేషన్(జీసీసీ)లో అధికారిగా పనిచేసిన తాను 15 ఏళ్ల కిందట ఉద్యోగ విరమణ చేశానని, నేటికీ జీసీసీ యాజమాన్యం తనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదని శేఖర మంత్రి ఆదినారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆదినారాయణ మీడియాతో మాట్లాడుతూ.. తాను గతంలో జీసీసీలో ఫైనాన్స్ జనరల్ మేనేజర్గా పని చేసినప్పుడు ఆదాయ పన్ను శాఖ నుంచి పన్ను చెల్లింపు కోసం పలుసార్లు నోటీసులు వచ్చాయన్నారు. తాము కొన్న అటవీ ఉత్పత్తులను అమ్మే వ్యాపారుల వద్ద ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్(టీసీఎస్) వసూలు చేయలేదని, అందువల్ల అప్పుడు తమకు ఐటీ శాఖ రూ.1.35 కోట్లు ఫైన్ వేసిందన్నారు. అప్పుడు జీసీసీ ఫైనాన్స్ జీఎంగా ఉన్న తాను తమ ట్యాక్స్ కమిషనర్ సలహా మేరకు.. అన్ని మినహాయింపులు పోను మిగిలిన రూ.39 లక్షలను ఐటీ శాఖకు కట్టినట్లు వివరించారు. అయితే ఈ అంశాన్ని అప్పటి జీసీసీ పరిపాలన బోర్డుకు నివేదించినా వారు తన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా తనకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ను 15 ఏళ్లుగా ఆపేశారని, సమస్యను పరిష్కరించి తనకు న్యాయం చేయాలని ఆదినారాయణ కలెక్టర్తో పాటు జేసీ మయూర్ అశోక్ను కోరారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదని కలెక్టర్కు ఫిర్యాదు -
త్వరలో చీమలాపల్లి కన్వెన్షన్ సెంటర్ ప్రారంభం
పెందుర్తి: జీవీఎంసీ 95వ వార్డు చీమలాపల్లిలో నిర్మిస్తున్న అధునాతన కన్వెన్షన్ సెంటర్ను అతి త్వరలో ప్రారంభించనున్నామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో విడుదలైన రూ.6.24 కోట్ల వీఎంఆర్డీఎ నిధులతో నిర్మిస్తున్న కన్వెన్షన్ సెంటర్ను సోమవారం ఆయన పరిశీలించారు. 2022లో ప్రారంభమైన పనులు ప్రస్తుతం తుది దశకు వచ్చాయని అధికారులు మంత్రికి వివరించారు. మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రి సూచించారు. ఏపీ ఆయిల్ఫెడ్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, కార్పొరేటర్లు ముమ్మన దేముడు, అధికారులు పాల్గొన్నారు. -
దేవస్థానం సొమ్మే..!
అర్జీ పునరావృతమైతే అధికారులదే బాధ్యత పరిహారం కూడా● సింహాచలం ఆలయంలో గోడ కూలిన ఘటనలో ఏడుగురు దుర్మరణం, ఒకరికి గాయాలు ● మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున ప్రకటించిన ప్రభుత్వం ● ఇప్పుడు దేవస్థానం ఖజానా నుంచే బాధితులకు చెల్లింపులు 8లోసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : కూటమి ప్రభుత్వం మరోసారి తన బుద్ధి చూపించుకుంది. సింహాచలంలో జరిగిన విషాదానికి పరిహారాన్ని దేవస్థానంపై రుద్దేసింది. కొండపై గోడ కూలిన ఘటనలో మృతి చెందిన కుటుంబ సభ్యులకు దేవస్థానం ఖజానా నుంచే రూ.1.78 కోట్లు చెల్లింపులు చేసింది. చందనోత్సవం రోజున సింహాచలం కొండపై గోడ కూలి ఏడుగురు భక్తులు సజీవ సమాధి కాగా, ఒకరు గాయపడిన విషయం తెలిసిందే. ఈ మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, క్షతగాత్రుడికి రూ.3 లక్షలు పరిహారంగా కూటమి ప్రభుత్వం ప్రకటించింది. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హోం మంత్రి అనిత, ఇతర మంత్రులు కూడా హామీలు ఇచ్చేశారు. కానీ ఇప్పుడు దేవాలయం నిధులు కేటాయించడం పట్ల ఆలయ వర్గాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దేవస్థానం ఖజానా నుంచే చెల్లింపులు చందనోత్సవం నిర్వహణలో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైందని వామపక్ష, ఇతర ప్రజా సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నాయి. మృతుల కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యో గం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. అన్ని వర్గాల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పరిహారాన్ని వెంటనే బాధిత కుటుంబాల కు అందించాలని సింహాచలం దేవస్థానం అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఖజానా నుంచి కాకుండా దేవస్థానం నిధుల నుంచే బాధితులకు చెల్లింపులు చేయాలని తేల్చి చెప్పింది. దీంతో దేవస్థానం అధికారులు ఆగమేఘాల మీద బాధితుల కు చెక్కులు పంపిణీ చేసినట్లు సమాచారం. మృతుని కుటుంబానికి రూ.25 లక్షలు చొప్పున రూ.1.75 కోట్లు, క్షతగాత్రుడికి రూ.3 లక్షలు చెల్లించారు. దేవాలయం అభివృద్ధికి వెచ్చించాల్సిన నిధులు వాస్తవానికి ఘటన జరిగిన రోజున మృతుల కుటుంబాలకు నష్టపరిహారాన్ని ప్రభుత్వమే నేరుగా ప్రకటించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే ఖజానా నుంచి పరిహారం అందిస్తుందని అందరూ భావించారు. అయితే దేవాలయం అభివృద్ధికి వెచ్చించాల్సిన నిధుల నుంచి పరిహారం కింద బాధిత కుటుంబాలకు అందజేసింది. ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా ఉండేందుకు భక్తులు దేవాలయానికి సమర్పించిన కానుకల నుంచి ఇవ్వడాన్ని ఆలయ వర్గాలు సైతం తప్పుబడుతున్నాయి. దేవాలయం అభివృద్ధికి కేటాయించాల్సిన నిధులు ఇలా పరిహారాల రూపంలో ఇచ్చుకుంటూ పోతే ఆలయ అభివృద్ధి కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ తీరుపై విమర్శలు సింహాచలం ఘటనలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు, పరిహారం చెల్లింపులపై వామపక్షాల నుంచే కాకుండా అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమి అసమర్థ పాలన కారణంగా జరిగిన ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బాధిత కుటుంబాలకు దేవస్థానం ఖజానా నుంచే పరిహారం అందించి ప్రభుత్వం తప్పించుకోడాన్ని తప్పుబడుతున్నాయి. ఇవి ప్రభుత్వ హత్యలే అని, మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. చందనోత్సవ నిర్వహణపై ఐదుగురు మంత్రుల కమిటీ నెల రోజుల పాటు విశాఖలోనే తిష్ట వేసి ఏర్పాట్లు చేసిన వేడుకల్లో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారని, దీనికి మంత్రులను కూడా బాధ్యులను చేయాలని పట్టుబడుతున్నారు. దేవదాయ శాఖ నుంచి వచ్చాయి దేవదాయ శాఖ నుంచి పరిహారం కింద నిధులు కలెక్టర్ నిధికి వచ్చాయి. వాటిని మాత్రమే బాధిత కుటుంబాలకు చెల్లించాం. – ఎం.ఎన్.హరేందిరప్రసాద్, జిల్లా కలెక్టర్ -
163 ఏళ్ల తర్వాత మళ్లీ విశాఖ తీరంలో దర్శనం
సాక్షి, విశాఖపట్నం: విభిన్న జీవరాశుల సమాహారమే సాగరగర్భం. విశాల సముద్రంలో మనకు సాధారణంగా కనిపించే జీవులతో పాటు.. ఎన్నో అరుదైన జీవజాతులు దాగి ఉన్నాయి. అలాంటి అరుదైన జీవరాశుల్లో ఒకటి సీ స్లగ్స్(సముద్రపు నత్తలు). సుమారు 163 ఏళ్ల తర్వాత విశాఖ తీరంలో మళ్లీ దర్శనమిచ్చి సముద్ర జీవశాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచాయి. తూర్పు తీర పరిరక్షణ బృందం రూపొందిస్తున్న జీవ వైవిధ్య డాక్యుమెంటరీలో భాగంగా తెన్నేటిపార్క్ సమీపంలో ఇవి తారసపడ్డాయి.1862లో ఆవిష్కరణ.. ఆ తర్వాత అదృశ్యంసముద్ర జీవ వైవిధ్యంపై పరిశోధనల్లో భాగంగా 1862లో బ్రిటిష్ మైరెన్ శాస్త్రవేత్తలు జోష్వా ఆల్డర్, ఆల్బెనీ హ్యాన్కాక్ దక్షిణ భారతదేశం, శ్రీలంక తీరాల్లో పర్యటించారు. విశాఖపట్నం సందర్శనకు వచ్చినప్పుడు లాసన్స్ బే కాలనీ సమీపంలోని రాళ్ల మధ్యలో వారు గుల్ల(షెల్) లేని విభిన్న సముద్రపు నత్తలను అన్వేషించారు. ఆ సమయంలో వారు 19 రకాల నత్తలను గుర్తించారు. వాటిలో వారు అంతకుముందు ఎక్కడా చూడని.. అత్యంత అరుదైన ఒక జాతిని ఫిడియానా యునిలేనిటాగా వర్గీకరించారు. ఈ జాతి విశాఖ జలాల్లో తప్ప ప్రపంచంలో మరెక్కడా కనిపించలేదని తమ పరిశోధన జర్నల్స్లో ప్రత్యేకంగా పొందుపరిచారు. ఆల్డర్, హ్యాన్కాక్లు ఈ అరుదైన జీవిపై రాసిన జర్నల్స్ ప్రస్తుతం లండన్ మ్యూజియంలో భద్రపరిచి ఉంది. ఆ తర్వాత ఈ ఫిడియానా యునిలేనిటా జాతి సీ స్లగ్స్ మళ్లీ ప్రపంచంలో ఎక్కడా కనిపించలేదు. ఏ పుస్తకాల్లో.. ప్రచురణల్లో కూడా వాటి ఆనవాళ్లు లభ్యం కాలేదు. అవి కనుమరుగు అయిపోయాయని చాలామంది భావించారు.163 ఏళ్ల తర్వాత..ఈస్ట్ కోస్ట్ కన్జర్వేషన్ టీమ్(ఈసీసీటీ) ‘సిటీ నేచర్ ఛాలెంజ్’పేరుతో విశాఖలోని జీవవైవిధ్యంపై ఒక డాక్యుమెంటరీని రూపొందిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఈసీసీటీ వ్యవస్థాపకుడు, మైరెన్ బయాలజిస్ట్ శ్రీ చక్ర ప్రణవ్, సభ్యులు డా.దీపు విశ్వేశ్వరరావు, చంద్రశేఖర్లతో కలిసి విశాఖ తీర ప్రాంతంలో అన్వేషించారు. ఈ క్రమంలో తెన్నేటి పార్క్ సమీపంలోని రాళ్ల మధ్యలో ఈ అరుదైన సీ స్లగ్స్ను గుర్తించారు. అవి గతంలో బ్రిటిష్ శాస్త్రవేత్తలు విశాఖలో గుర్తించిన ఫిడియానా యునిలేనిటా జాతికి చెందినవని నిర్ధారించుకున్నారు. సరిగ్గా 163 ఏళ్ల తర్వాత ఈ అరుదైన జీవి మళ్లీ విశాఖ తీరంలో కనిపించడం వారిని ఆశ్చర్యపరిచింది. విశాఖపట్నం, శ్రీకాకుళం సముద్ర జలాల్లోని రాళ్ల మధ్య ఈ అరుదైన జీవజాలం కనిపిస్తున్నట్లు వారి పరిశోధనల్లో వెల్లడైంది.విషమే సీ స్లగ్స్ రక్షణ కవచంసాధారణంగా సముద్రపు నత్తలకు తమను తాము రక్షించుకోవడానికి గట్టి గుల్ల ఉంటుంది. అయితే అరుదైన ఫిడియానా యునిలేనిటా జాతి సీ స్లగ్స్కు గుల్ల ఉండదు. బదులుగా వాటి శరీరంపైనే విషపూరితమైన రక్షణ కవచం ఉంటుంది. నిజానికి ఫిడియానా యునిలేనిటా శరీరం మొత్తం విషమే కవచంలా పనిచేస్తుంది. ఏ జీవి వీటిని ఆహారంగా తీసుకున్నా వెంటనే మృతి చెందుతాయి. అందుకే ఇతర సముద్ర జీవులు వీటి జోలికి రావు. ఇవి ప్రధానంగా కొన్ని రకాల కోరల్స్, హైడ్రాయిడ్స్ను ఆహారంగా తీసుకుంటాయి. వీటి ఆహారమైన కోరల్స్లోని విషపూరిత పదార్థాలను ఇవి తమ శరీర కణజాలంలోకి గ్రహించి, నిల్వ చేసుకుంటాయి. ఈ విషాన్ని ఇవి తమ రక్షణ కోసం ఉపయోగిస్తాయి. ఆటుపోట్ల సమయంలో నీరు వెనక్కి వెళ్లిపోయినప్పుడు ఏర్పడే చిన్న నీటి గుంటల్లో ఇవి కనిపిస్తుంటాయి. ఇవి పగటిపూట సూర్యరశ్మికి భయపడి రాళ్ల కింద దాక్కుని.. రాత్రి సమయంలో బయటకు వచ్చి ఆహారం సేకరిస్తాయి.జీవ వైవిధ్యంపై అవగాహనవిశాఖపట్నం తీరంలో గుర్తించిన సీ స్లగ్ జాతుల జాబితాను రూపొందిస్తూ.. వాటిపై మరింత లోతుగా పరిశోధనలు చేస్తున్నాం. ‘సిటీ నేచర్ ఛాలెంజ్’వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు జీవ వైవిధ్యంపై అవగాహన కల్పించడంలో ఈ తరహా పరిశోధనలు ఎంతగానో ఉపయోగపడతాయి. సముద్ర పరిశోధకులకు సీ స్లగ్స్తో పాటు ఫ్లాట్వార్మ్లు వంటి అరుదైన జీవజాతులు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ కనిపించడం శుభపరిణామం.– శ్రీ చక్ర ప్రణవ్, ఈసీసీటీ వ్యవస్థాపకుడు, మైరెన్ బయాలజిస్ట్ సీస్లగ్స్ -
కుట్టు మిషన్ల పథకంలో రూ.157 కోట్ల స్కాం?
మహారాణిపేట: కుట్టు మిషన్లు ఇస్తామని చెప్పి దాదాపు రూ.157 కోట్లను కొట్టేసేందుకు కూటమి ప్రభుత్వం స్కెచ్ వేసిందని వైఎస్సార్ సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్ ఆరోపించారు. మద్దిలపాలెంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మధ్యతరగతి బీసీ మహిళలకు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి, కాపు మహిళలకు కుట్టు శిక్షణ పథకంలో మిషన్లు అందించేందుకు తొలుత రూ.100 కోట్లతో ప్రతిపాదించారన్నారు. ఆ తర్వాత ఈ పథకాన్ని రూ.257 కోట్లకు పెంచి భారీ అవినీతికి పాల్పడుతున్నట్లు భరత్ ఆరోపించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు 175 నియోజకవర్గాల్లో మూడు నుంచి ఐదు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, అందులో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఆ మాట చెప్పి 50 రోజులు దాటినా 50 నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికీ శిక్షణ మొదలు కాలేదన్నారు. కుట్టు మిషన్ల పేరు చెప్పి రూ.కోట్లు కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతోందని భరత్ అన్నారు. ఈ పథకానికి సంబంధించి టెండర్లో పాల్గొన్న ఎల్1కు కేవలం 5 శాతం పని మాత్రమే అప్పగించి.. ఎల్ 2, ఎల్ 3కి సుమారు 95 శాతాన్ని పని అప్పగించడంతో వీరి అవినీతి ఏ రకంగా ఉందో తెలుస్తోందన్నారు. గుజరాత్లో తక్కువ నాణ్యత కలిగిన మిషన్లను రూ.4,300కు కొనుగోలు చేశారని, ఒకరి శిక్షణ కోసం అవుట్ సోర్సింగ్ సంస్థకు రూ.3,000 కేటాయించారన్నారు. ఒక లక్ష మందికి రూ.7,300 చొప్పున రూ.73 కోట్లు ఖర్చు అవుతుండగా.. టెండర్ విలువ మాత్రం రూ.257 కోట్లకు చూపించి భారీ కుంభకోణానికి స్కెచ్ వేశారని భరత్ విమర్శించారు. బీసీ మహిళల పేరుతో జరుగుతున్న ఈ స్కాంను ప్రజలకు వివరించి, ప్రజాధనం వృథా కాకుండా అడ్డుకుంటామని భరత్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ సీపీ నేత భరత్ ఆరోపణలు -
వేసవి క్రీడా శిబిరాలు ఆరంభం
విశాఖ స్పోర్ట్స్: రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో విశాఖలో 27 క్రీడాంశాల్లో వార్షిక వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈనెల 31వ తేదీ వరకు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 3.30 నుంచి 6.30 గంటల వరకు ఈ శిబిరాలు జరగనున్నాయి. అథ్లెటిక్స్, బాల్ బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, హాకీ, కబడ్డీ, వాలీబాల్ తదితర క్రీడాంశాల్లో ఎంపిక చేసిన ఆయా ప్రాంతాల్లో శిబిరాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వేసవి క్రీడా శిబిరాల వాల్ పోస్టర్ను కలెక్టర్ హరేందిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డీఆర్వో భవాని శంకర్, జీవీఎంసీ అదనపు కమిషనర్ వర్మ విడుదల చేశారు. -
విశాఖలో విషాదం.. స్కూటీపై వెళుతున్న మహిళ స్పాట్లో మృతి
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో భారీ వర్షాల కారణంగా విశాఖలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తున్న మహిళపై చెట్టు విరిగి పడిపోవడంతో సదరు మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.వివరాల ప్రకారం.. విశాఖలోని సీతమ్మధారలో విషాదం నెలకొంది. సితార అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న పూర్ణిమ (38) ఈరోజు ఉదయం తన స్కూటీపై రోడ్డు మీద వెళ్తోంది. ఈ సందర్భంగా ఆమెపై చెట్టు విరిగి పడిపోయింది. ఈ ఘటనలో బాధితురాలు అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ప్రమాదంలో కారు, బైక్ సహా ఇతర వాహనాలు దెబ్బతిన్నాయి. ఇక, సమాచారం అందిన వెంటనే పోలీసులు, మున్సిపల్ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మహిళ మృతి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
పీతల మూర్తి యాదవ్పై చర్యలకు డిమాండ్
బీచ్రోడ్డు: పిఠాపురం కాలనీలోని వాంబే గృహ గోడ కూల్చడంపై రజకుల సేవా సంఘం వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం నిరసన చేపట్టారు. గోడ కూల్చివేతకు సంబంధించి టౌన్ ప్లానింగ్ సిబ్బందిని 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పంపించాడని ఆరోపిస్తూ.. జనసేన పార్టీ అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేద ప్రజలపై మూర్తి యాదవ్ దౌర్జన్యం చేస్తున్నాడని మండిపడ్డారు. పిఠాపురంకాలనీలో ప్రభుత్వం ఇచ్చిన వాంబే గృహాల్లో ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్నామన్నారు. పీతల మూర్తిని స్థానికులు పట్టించుకోకపోవడంతో వార్డు ప్రజలపై దౌర్జన్యం మొదలుపెట్టాడని ధ్వజమెత్తారు. ఇందులో భాగంగా ప్రహరీని విరగొట్టించాడని దుమ్మెత్తి పోశారు. అతని దగ్గర నాలుగేళ్లుగా లంచం తీసుకుని పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్ సెక్రటరీ జ్యోతిని పంపి.. ఈ పని పూర్తి చేయించాడని ఆరోపించారు. వార్డు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న పీతల మూర్తిపై పవన్ కల్యాణ్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అతని నుంచి 22వ వార్డు ప్రజలను కాపాడాలని కోరారు. -
తాత్కాలిక కట్టలు.. రూ.లక్షలు వృథా
గోస్తనీ నదిపై చెక్డ్యామ్లు నిర్మిస్తే నీటిని నిల్వ చేసుకోవచ్చని మేధావులు సూచిస్తున్నా.. ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. పాండ్రంగి పంచాయతీ పరిధిలో మునివానిపేట నుంచి తగరపువలస వరకు ఒక్క చెక్డ్యామ్ కూడా లేదు. గతంలో తాటితూరు వద్ద నిర్మించిన చెక్డ్యామ్ను కొందరు ధ్వంసం చేయడంతో నీరు నిలవడం లేదు. దీంతో భీమిలి జోనల్ అధికారులు ఏటా సామియ్యవలస వద్ద ఇసుక బస్తాలు, మట్టి కట్టల పేరుతో రూ.లక్షలు నదిలో కుమ్మరిస్తున్నారు. ఏప్రిల్లో ఏర్పాటు చేసే ఈ తాత్కాలిక కట్టలు.. జూన్లో వచ్చే వర్షాలకు కొట్టుకుపోతున్నాయి. -
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గోడ కూలింది
సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్కేఎస్వీ కుమార్ మధురవాడ: ప్రభుత్వం, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వల్లే చందనోత్సవం రోజు సింహాచలంలో గోడ కూలిందని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్.కె.ఎస్.వి.కుమార్ అన్నారు. ప్రభుత్వ తప్పిదం వల్ల జరిగిన ఘోర ప్రమాదాన్ని వర్షం కారణంగా చూపడం వెనుక.. వారు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడమే తప్ప మరొకటి కాదన్నారు. గోడ కూలి మృతి చెందిన సాఫ్ట్వేర్ దంపతులు పిళ్లా ఉమామహేశ్వరరావు, శైలజ కుటుంబ సభ్యులను ఆదివారం వారి స్వగృహంలో పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కనీసం పిల్లర్లు, కాంక్రీట్ బెల్టులు లేకుండా గోడ ఎలా కట్టారని ప్రశ్నించారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్లే నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని, వారి కుటుంబాలకు కనీసం కోటి రూపాయలైనా పరిహారం ఇవ్వాలన్నారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం శాశ్వత ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు, ప్రజలకు ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. ఆయన వెంట సీపీఎం నాయకులు కృష్ణారావు, డి.అప్పలరాజు, రాజ్కుమార్ తదితరులు ఉన్నారు. -
గోస్తనీ
గొంతెండుతోందిచెక్డ్యామ్ల నిర్మాణంతోనే మేలు విశాఖపట్నం, విజయనగరం జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాలకు జీవనాధారమైన గోస్తనీ నది నేడు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. జీవీఎంసీతో పాటు భీమిలి, పద్మనాభం, ఆనందపురం మండలాలు, విజయనగరం జిల్లాలోని పలు పంచాయతీల తాగునీటి అవసరాలను తీర్చే ఈ నది.. ఇసుకాసురుల దాటికి, సరైన ప్రణాళిక లోపంతో ప్రజల దాహార్తిని తీర్చలేని స్థితికి చేరుకుంది. వేసవి వచ్చిందంటే చాలు నది ఎండిపోవడం, ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడటం పరిపాటిగా మారింది. ప్రభుత్వాలు, అధికారులు కేవలం తాత్కాలిక పరిష్కారాలపై ఆధారపడుతుండటంతో ఈ సమస్య మరింత జఠిలంగా మారుతోంది. – తగరపువలస నీరు లేని ప్రాంతంలో ఊటబావితాత్కాలిక పరిష్కారాలతో ప్రజాధనం వృథాఇసుకాసురుల దాటికి బలైన నది బోరు నీళ్లే దిక్కు? భీమిలి మున్సిపాలిటీ గతంలో ఏటా మార్చి నుంచి జూన్ వరకు తీవ్ర తాగునీటి సమస్యను ఎదుర్కొనేది. 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ‘నగరబాట’ కార్యక్రమంలో ఇక్కడ ప్రజల కష్టాలు చూసి.. రూ.12 కోట్లతో తాగునీటి పథకాన్ని మంజూరు చేశారు. సామియ్యవలస వద్ద పంప్హౌస్, ఆరు ఊటబావులు నిర్మించి నిరంతర నీటి సరఫరాకు మార్గం వేశారు. అయితే పాండ్రంగి, మజ్జివలస, తాటితూరు, టి.నగరపాలెం, తగరపువలస ప్రాంతాల్లో ఇసుక తవ్వకాల ప్రభావంతో సామియ్యవలస వద్ద కూడా ఏప్రిల్, మేలో నీటి లభ్యత తగ్గిపోతోంది. ప్రస్తుతం రెండు ఊటబావులు పనిచేయకపోవడంతో ప్రత్యామ్నాయంగా రెండు బోర్లు తవ్వి నీటిని భీమిలి జోన్ ప్రజలకు సరఫరా చేస్తున్నారు. అయితే ఈ బోర్ల నీరు తాగడానికి అనుకూలంగా లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు భీమిలిలోని కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు, విద్యాసంస్థలు నదిని ఆనుకుని బోర్ల ద్వారా రోజూ వందలాది ట్యాంకర్లతో నీటిని అక్రమంగా తరలించుకుపోతున్నారు. ఈ అక్రమ నీటి రవాణా పలువురికి కాసులు కురిపిస్తోంది. గోస్తనీ నది విశాఖ, విజయనగరం జిల్లాల్లోని సుమారు 5 నుంచి 6 లక్షల మంది ప్రజల రోజువారీ తాగునీటి అవసరాలను తీరుస్తోంది. ఆనందపురం మండలం బోని వద్ద నుంచి జీవీఎంసీకి, పద్మనాభం మండలం పాండ్రంగి సమీపంలోని సామియ్యవలస వద్ద నిర్మించిన ఊట బావులు, పంప్హౌస్ల ద్వారా భీమిలి జోన్కు నీటిని సరఫరా చేస్తున్నారు. అలాగే గ్రామీణ నీటి సరఫరా విభాగం నదీ తీరంలో బోర్లు వేసి.. ఆ నీటిని రక్షిత మంచినీటి పథకాల ట్యాంకులకు తరలించి ప్రజలకు అందిస్తోంది. వేసవి కష్టం.. తాటిపూడిపైనే భారం ప్రతి ఏటా ఏప్రిల్, మేలో గోస్తనీ నది చాలా చోట్ల ఎండిపోతుంది. దీంతో జీవీఎంసీ సహా అనేక పంచాయతీల్లో తాగునీటి సమస్య తీవ్రమవుతుంది. ఆ సమయంలో వర్షాలు పడితే కొంత ఉపశమనం లభిస్తుంది. లేదంటే విజయనగరం జిల్లాలోని తాటిపూడి రిజర్వాయర్ నుంచి వచ్చే నీరే దిక్కు. ప్రస్తుతం రెండు వారాల కిందట విడుదల చేసిన నీరు నదిలో చేరినా.. అది కేవలం మరో పది రోజులకు మాత్రమే సరిపోతుందని అంచనా వేస్తున్నారు. మరోమారు రిజర్వాయర్ నుంచి నీరు విడుదల కావడం లేదా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం జరిగితేనే తాగునీటి సమస్య నుంచి గట్టెక్కే అవకాశం ఉంది. ఇసుక తవ్వకాలతోనే ఈ పరిస్థితి గత టీడీపీ ప్రభుత్వ(2014–2019) హయాంలో గోస్తనీ నదిలో విచ్చలవిడిగా జరిగిన ఇసుక తవ్వకాలు నది సహజ స్వరూపాన్ని దెబ్బతీశాయి. పద్మనాభం మండలం పొట్నూరు నుంచి తగరపువలస వరకు ఇసుకాసురులు నది గర్భాన్ని తోడేశారు. కోట్ల విలువైన ఇసుకను తరలించడంతో నీటి నిల్వ సామర్థ్యం పూర్తిగా దెబ్బతింది. ఫలితంగా నేడు నదీ పరీవాహక ప్రాంతం ముళ్ల చెట్లు, గోతులతో నిండిపోయి అడవిని తలపిస్తోంది. నీటి జాడ కనిపించడమే గగనమైపోయింది. -
ప్రైవేటులో ‘ఉచితం’ అందేనా..!
● వైఎస్సార్ సీపీ హయాంలో 25 శాతం సీట్లు పక్కాగా అమలు ● గతేడాది 2,989 మంది పేద విద్యార్థులకు ప్రయోజనం ● జిల్లాలో 621 ప్రైవేటు స్కూళ్లలో అడ్మిషన్లు పొందే అవకాశం ● ఈ నెల 19 వరకు దరఖాస్తు గడువు షెడ్యూల్ ● ఈ నెల 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ● ఈ నెల 20 నుంచి 24 మధ్య అర్హులైన విద్యార్థుల జాబితాను ప్రకటిస్తారు. ● ఈనెల 29న మొదటి రౌండ్ లాటరీ నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేస్తారు. ● జూన్ 8న ఎంపికై న విద్యార్థులు స్కూళ్లలో చేరాలి. ● జూన్ 11న రెండో రౌండ్ లాటరీ నిర్వహించి, విద్యార్థులను ఎంపిక చేస్తారు. ● జూన్ 18న విద్యార్థులు స్కూళ్లలో చేరాల్సి ఉంటుంది. విశాఖ విద్య : ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు ఉచితంగా అందించేందుకు జిల్లా విద్యాశాఖాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. 2025–26 విద్యా సంవత్సరానికి రాష్ట్ర సిలబస్తో పాటు ఐబీ/ఐసీఎస్ఈ/సీబీఎస్ఈ బోధన అందిస్తున్న జిల్లాలోని 621 ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించేలా అధికారులు క్షేత్రస్థాయిలో సమీక్షిస్తున్నారు. అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులు ఆన్లైన్ ద్వారా లేదా సమీపంలోని సచివాలయాల్లో అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొండికేస్తున్న ప్రైవేటు యాజమాన్యాలు ఒకటో తరగతిలో 25 శాతం సీట్లు ఉచితంగా పేద విద్యార్థులకు ఇచ్చే క్రమంలో గుర్తింపు ఉన్న ప్రైవేటు స్కూళ్లు పూర్తి వివరాలను కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో పొందుపరచాలి. అయితే జిల్లాలోని కొన్ని ప్రైవేటు స్కూళ్ల వివరాలు వెబ్సైట్లో నమోదు కాలేనట్లుగా తెలుస్తోంది. గతంలో ఫీజులు పెండింగ్ ఉన్నాయంటూ కొన్ని యాజమాన్యాలు కో ర్టును సైతం ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. నగరంలో క్రేజ్ ఉన్న స్కూళ్ల యాజమాన్యాలు విద్యా హక్కు చట్టానికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నాయి. వైఎస్సార్సీపీ హయాంలో పకడ్బందీగా అమలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో పేద విద్యార్థులకు ఉచిత విద్యను పకడ్బందీగా అమలు చేశారు. 2022–23లో 86 మంది, 2023–24లో 1,227 మంది, 2024–25లో 2,989 మంది ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఉచిత సీట్లు కేటాయించిన పాఠశాలలకు ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఫీజులను పాఠశాల యాజమాన్యాలకు చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. కూటమి ప్రభుత్వం గత ఏడాది, ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు బకాయిలను చెల్లించకపోవడంతో జిల్లాలోని చాలా పాఠశాలల యాజమాన్యాలు ఉచిత సీట్లు ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో 2025–26 విద్యా సంవత్సరంలో ఎంత మంది ఉచిత విద్యను పొందుతారనేది వేచి చూడాల్సి ఉంది. సద్వినియోగం చేసుకోవాలి విద్యాహక్కు చట్టం మేరకు గుర్తింపు ఉన్న ప్రైవేటు స్కూళ్లలో ఒకటో తరగతిలో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు ఇవ్వాలి. దీన్ని అర్హులైన వారంతా సద్వినియోగం చేసుకోవాలి. ఉచిత విద్య ప్రవేశాలపై ప్రతీ రోజూ డీఈవోల పర్యవేక్షణలో మండలాల వారీగా సమీక్షిస్తున్నాం. – బి.విజయ్ భాస్కర్, ఆర్జేడీసచివాలయాల వారీగా సమీక్ష పేద విద్యార్థులకు ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాలో గుర్తింపు గల స్కూళ్లు కచ్చితంగా వెబ్సైట్లో నమోదయ్యేలా దృష్టి పెట్టాం. సచివాలయాల వారీగా దీనిపై సమీక్షిస్తున్నాం. అర్హులంతా గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి. – డాక్టర్ జె.చంద్రశేఖర్ రావు, ఏపీసీ, సమగ్ర శిక్ష, విశాఖ జిల్లా -
ఆ.. 2,865 టికెట్లు ఎవరికిచ్చారు?
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి చందనోత్సవం టికెట్ల విక్రయాలు, దర్శనాల నిర్వహణకు సంబంధించి దేవస్థానం విడుదల చేసిన జాబితాలో పలు వ్యత్యాసాలు, అస్పష్టతలు ఉన్నాయి. ముఖ్యంగా టికెట్ల సంఖ్య, తెల్లవారుజామున కల్పించిన అంతరాలయ దర్శనాల విషయంలో అధికారుల లెక్కలపై భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సింహాచలం దేవస్థానం ఈవో కె. సుబ్బారావు పేరిట ఆదివారం విడుదలైన జాబితా ప్రకారం.. ఈ ఏడాది చందనోత్సవం సందర్భంగా రూ. 300 టికెట్లు ఆఫ్లైన్లో 15,495, ఆన్లైన్లో 7,591 కలిపి మొత్తం 23,086 విక్రయించారు. అలాగే రూ.1000 టికెట్లు ఆఫ్లైన్లో 13,803, ఆన్లైన్లో 3,999 కలిపి మొత్తం 17,802 జారీ చేశారు. రూ.1500 టికెట్లు కేవలం ఆఫ్లైన్లో 3,000 విక్రయించినట్లు పేర్కొన్నారు. వీటికి అదనంగా 496 అంతరాలయ టికెట్లుగా చూపించారు. ఈ లెక్కల ప్రకారం మొత్తంగా 44,384 టికెట్లు విక్రయించినట్లు జాబితాలో ఉంది. అయితే గత నెల 24 నుంచి 29 వరకు రోజువారీగా టికెట్ల విక్రయాల జాబితాను పరిశీలిస్తే.. మొత్తం 41,519 టికెట్లు మాత్రమే అమ్ముడైనట్లు పేర్కొన్నారు. దీంతో దేవస్థానం విడుదల చేసిన మొత్తం లెక్కకు, రోజువారీ లెక్కలకు మధ్య 2,865 టికెట్ల వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. కాగా.. తెల్లవారుజామున అంతరాలయ దర్శనం కేవలం 496 మందికి మాత్రమే కల్పించినట్లు అధికారులు చూపించడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చందనోత్సవం రోజు ఉదయం చాలా మందిని అంతరాలయ దర్శనానికి అనుమతించినట్లు భక్తులు, స్థానికులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. వారి అంచనా ప్రకారం అంతరాలయ దర్శనం పొందిన వారి సంఖ్య వెయ్యికి పైగానే ఉంటుందని అంటున్నారు. దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త, టీటీడీ నుంచి పట్టు వస్త్రాలు సమర్పించేవారు, మంత్రులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు మాత్రమే ఉచితంగా అంతరాలయ దర్శనం కల్పిస్తామని దేవస్థానం ఈవో కె.సుబ్బారావు ప్రకటించారు. తీరా ఈవో ప్రకటనకు, క్షేత్రస్థాయిలో పరిస్థితికి పొంతనే లేకుండా పోయింది. గత ఏడాదితో పోలిస్తే టికెట్ల విక్రయాలు పెరిగినట్లు దేవస్థానం పేర్కొంది. 2024లో మొత్తం 32,461 టికెట్లు విక్రయించగా, ఈ సంవత్సరం 44,384 టికెట్లు అమ్ముడైనట్లు తెలిపింది. రూ.300, రూ.1000 టికెట్లలో గత ఏడాది కంటే ఈ ఏడాది అదనంగా 12,889 టికెట్లు విక్రయించామని పేర్కొంది. గత ఏడాది ఆన్లైన్లో రూ.300, రూ.1000 టికెట్లు కలిపి 8,216 విక్రయించగా, ఈ ఏడాది 11,590 అమ్ముడైనట్లు నివేదించారు. అంటే ఆన్లైన్లో 3,374 టికెట్లు అదనంగా విక్రయించామని చెబుతున్నారు. అయితే రూ.1000 టికెట్లు తొలిరోజు మాత్రమే ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని, మిగతా ఏ రోజుల్లోనూ ఆ టికెట్లు లభించలేదని భక్తులు వాపోతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై పారదర్శకత కొరవడిందని విమర్శిస్తున్నారు. -
వైఎస్సార్ సీపీ బలోపేతానికి సమష్టి కృషి
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం మోసాలు, అబద్ధపు హామీలను ప్రజల ముందు ఎండగట్టి.. వైఎస్సార్ సీపీ బలోపేతానికి సమష్టిగా పనిచేద్దామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు పిలుపునిచ్చారు. ఈ నెల 9న పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కె.కె.రాజు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో నూతన జిల్లా కార్యవర్గం, అనుబంధ విభాగాల అధ్యక్షులతో మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కె.కె.రాజు మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా నియమించారని, ఈ పదవి తనకు మరింత బాధ్యతను పెంచిందన్నారు. పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకుంటూ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. కూటమి ప్రభుత్వ 11 నెలల పాలనలో ఉత్తరాంధ్రకు ముఖ్యంగా విశాఖ నగరానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. రానున్న కాలంలో ప్రభుత్వ వైఫల్యాలను ఏ విధంగా ఎండగట్టాలి? కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు ఎటువంటి ప్రణాళికలు రూపొందించాలనే అంశాలపై చర్చించారు. ఈ నెల 9న ఉదయం 10 గంటలకు జరగనున్న జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, అనకాపల్లి అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలు హాజరవుతున్నట్లు చెప్పారు. సమావేశంలో సమన్వయకర్త తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి, పార్టీ కార్యాలయ పర్యవేక్షకుడు రవి రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు బానాల శ్రీనివాసరావు, చెన్నా జానకీరామ్, బోని బంగారు నాయుడు, రాజన్న వెంకట్రావు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు పిలుపు 9న బాధ్యతల స్వీకరణ -
ఇంకెన్నాళ్లీ నిరీక్షణ?
● జనవరిలో దక్షిణ కోస్తా రైల్వేజోన్కు ప్రధాన మోదీ శంకుస్థాపన ● ఇంతవరకూ భూమి చదునుకు మాత్రమే పరిమితమైన పనులు ● భవన నిర్మాణాలకు మరో రెండేళ్లుపట్టే అవకాశం ● తాత్కాలిక కార్యకలాపాలకు భవనాలున్నా స్పందించని రైల్వే శాఖ ● ఇప్పట్లో జోన్ కార్యకలాపాలు ఉండవంటున్న వాల్తేరు అధికారులురాజకీయాలకు రైల్వే జోన్ బలి! కూటమి నేతల నిర్లక్ష్యం, ఒడిశా రాజకీయాలకు ఉత్తరాంధ్రుల చిరకాల స్వప్నమైన రైల్వే జోన్ పనులు ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. కనీసం తాత్కాలిక భవనాల్లో కార్యకలాపాలు ప్రారంభించాలంటూ కూటమి ఎంపీలు గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ రైల్వే మంత్రికి, బోర్డును కానీ కోరడం లేదు. శంకుస్థాపన చేసి నాలుగు నెలలు గడిచినా దీనిపై ఏ ఒక్క కూటమి ఎంపీ నోరు మెదపకపోవడం జోన్ పాలిట శాపంగా మారింది. దీన్ని ఆసరాగా తీసుకొని ఒడిశా పావులు కదుపుతోంది. అత్యధిక ఆదాయం వచ్చే వాల్తేరు డివిజన్ను వదులుకోవడం ఇష్టం లేని ఒడిశాలోని ఈస్ట్కోస్ట్ రైల్వే జోన్ అధికారులు తెర వెనుక రాజకీయాలు నడుపుతున్నారు. అక్కడ రాజకీయ నేతలు కూడా వీరికి సహకరించడంతో.. రైల్వే బోర్డు ఒడిశా ఏం చెబితే అదే చేస్తోంది. ఫలితంగా విశాఖ జోన్ బలవుతూ వస్తోంది. సాక్షి, విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్కు శంకుస్థాపన జరిగి నాలుగు నెలలు.. టెండర్లు ఖరారు చేసి ఐదు నెలలు పూర్తయినా.. ఇంకా భూమి చదును చేసే పనులకే పరిమితమైంది. భవనాలు నిర్మించేందుకు మరో రెండేళ్ల సమయం పట్టేలా కనిపిస్తోంది. తాత్కాలిక కార్యకలాపాలకు భవనాలు సిద్ధంగా ఉన్నా రైల్వే శాఖ మాత్రం ముందుకు రావడంలేదు. గతంలోనే ఇక్కడ ఉన్న భవనాల జాబితాను వాల్తేరు అధికారులు పంపించినా.. స్పందించకపోవడం చూస్తుంటే మరో రెండేళ్ల పాటు జోన్ కార్యకలాపాలు మొదలవ్వవేమోనన్న అనుమానాలు బలపడుతున్నాయి. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు 2019లో కేంద్రం పచ్చజెండా ఊపింది. జోన్కు సంబంధించిన డీపీఆర్ని అదే ఏడాది చివర్లో ఇచ్చేసినా రాజకీయ కక్షతో ముందడుగు వేయలేదు. 2024 ఎన్నికల అనంతరం నవంబర్లో టెండర్లు ఆహ్వానించారు. జనవరిలో ప్రధాని చేతుల మీదుగా జోన్ భవనాలకు శంకుస్థాపన చేశారు. అయినా ముడసర్లోవలో భూమి చదును చేసే పనుల్లోనే ఇంకా రైల్వే శాఖ నడిపిస్తోంది. ఈ భూములను తాము సాగుచేసుకుంటున్నామని స్థానికులు ఆందోళన చేయగా.. కూటమి నేతలు రంగంలోకి దిగి జోన్ భవనం వచ్చిన తర్వాత.. అందులో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మాయమాటలు చెప్పి వారిని శాంతింపజేశారు. అయినా.. ఇంకా చదును పనులే సా..గుతున్నాయి. తాత్కాలికానికి భవనాలు సిద్ధంగా ఉన్నా..! బిల్డింగ్ నిర్మాణంతో పనిలేకుండా జోన్ కార్యకలాపాలు ప్రారంభించాలని కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. తాత్కాలిక కార్యాలయంగా ప్రస్తుతం ఉన్న వాల్తేరు డీఆర్ఎం కార్యాలయాన్ని వినియోగించుకోవచ్చు. ఈ విషయాన్ని ఇప్పటికే సౌత్ కోస్ట్ జోన్ ఓఎస్డీ.. తాను సమర్పించిన జోన్ డీపీఆర్లోనూ పొందుపరిచారు. రైల్వేస్టేషన్ పునర్నిర్మాణంలో భాగంగా స్టేషన్ బయట ‘గతిశక్తి’ పథకంలో భాగంగా 4 అంతస్తుల భవనాలు రెండు నిర్మించారు. ఒక్కో అంతస్తులో 4,500 చదనపు అడుగుల స్థలం అందుబాటులో ఉంది. కింద గ్రౌండ్ ఫ్లోర్తో కూడా కలుపుకొంటే దాదాపు 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన కొత్త భవనాలు ఉన్నాయి. తాత్కాలిక కార్యకలాపాలు చేపట్టేందుకు గెజిట్ విడుదల చేయాల్సి ఉన్నా బోర్డు నుంచి ఎలాంటి సూచనలు కనిపించడం లేదని వాల్తేరు అధికారులు చెబుతున్నారు. రెండేళ్ల క్రితమే తాత్కాలిక భవనాల జాబితా పంపించామని, ఇప్పటికీ అతీగతి లేకపోవడం చూస్తే ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటున్నారు. కూటమి ఎంపీలు, ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని విశాఖవాసులు కోరుతున్నారు. జీఎం నియామకం ఎప్పుడో..? రైల్వే జోన్ కార్యకలాపాలను ప్రారంభించడానికి రైల్వేశాఖ మీనమేషాలు లెక్కిస్తోంది. రెండేళ్లలో జోనల్ కార్యాలయ నిర్మాణం పూర్తి చేసి, ఆ తరువాత ఆపరేషన్లు ప్రారంభిస్తామని సాకులు చెబుతోంది. ఇప్పటివరకు ప్రకటించిన రైల్వే జోన్లలో ఎక్కడా.. ఈ తరహా పరిస్థితులు కనిపించలేదు. జోన్ ప్రకటించిన తరువాత కార్యకలాపాల్ని తాత్కాలిక భవనాల్లో ప్రారంభించి.. కొత్త భవనాల నిర్మాణం అనంతరం అక్కడికి మార్చేవారు. కానీ విశాఖ జోన్ విషయంలో మాత్రం ఆది నుంచీ పూర్తి విరుద్ధంగా సాగుతోంది. కొత్త భవన నిర్మాణాలు చేపట్టిన తర్వాతే ఆపరేషన్లు ప్రారంభిస్తామంటూ రైల్వేశాఖ చెబుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. దక్షిణ మధ్య రైల్వే నుంచి విడదీసిన గుంటూరు, గుంతకల్, విజయవాడ డివిజన్లను, విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్ను కలిపి ‘దక్షిణ కోస్తా’ జోన్గా ప్రకటించారు. దాదాపు ఏపీ మొత్తం ఈ జోన్లోనే ఉండటంతో రాష్ట్రమంతటికీ సేవలందనున్నాయి. కొత్త రైళ్లు కావాలన్నా, రైల్వే లైన్లు కావాలన్నా జోనల్ అధికారులే ప్రతిపాదనలు పెట్టాలి. ఇది జరగాలంటే జోన్కు తొలుత జనరల్ మేనేజర్(జీఎం) నియామకం చేపట్టాలి. ఈ విషయంలోనూ బోర్డు స్పందించడం లేదు. -
● వానమ్మ.. వాన!
● వర్షాలతో ఉపశమనం ● మొన్నటి వరకూ గరిష్ట ఉష్ణోగ్రతలతో విలవిల ● మరో రెండు రోజుల పాటు జిల్లాలో అక్కడక్కడా వానలు సాక్షి, విశాఖపట్నం : అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో కొంత కాలంగా వాతావరణంలో భిన్నమైన మార్పులు కనిపిస్తున్నాయి. సాధారణంగా మే నెల అంటే.. భానుడి భగభగలు.. సెగలు కక్కించే ఉక్కపోత.. ఊపిరి సలపని వడగాలుల తీవ్రతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. కానీ.. ఈసారి మాత్రం కొద్ది రోజుల పాటు చల్లని వాతావరణం ఏర్పడుతోంది. కొద్ది రోజులుగా.. వాతావరణం ఎండలతో మొదలై.. మధ్యలో వర్షాలు పడి మళ్లీ.. ఎండలు పెరిగి.. సాయంత్రం నాటికి మబ్బుల వాతావరణంతో చల్లబడుతోంది. ప్రతి రోజూ సాయంత్రం ఒక్కసారిగా మబ్బులు నగరానికి గొడుగులు పడుతున్నాయి. ఈ నెల 1 నుంచి 4వ తేదీ వరకూ జిల్లాలో సగటు వర్షపాతం కంటే మూడు రెట్లకు పైగా అధికంగా నమోదవ్వడం విశేషం. దశాబ్ద కాలంలో మే నెలలో మొదటి 4 రోజులు ఈ తరహా వర్షపాతం నమోదుకావడం ఇదే ప్రథమమని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మే 1 నుంచి 4 వరకూ సగటు వర్షపాతం 5.1 మి.మీ కాగా.. ఈసారి 17 మి.మీ వర్షపాతం నమోదైంది. ప్రీమాన్సూన్ సీజన్లో వర్షాలు కురవడం సర్వసాధారణమే అయినా.. ఈసారి మాత్రం అకాల వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం(సీడబ్ల్యూసీ) అధికారులు చెబుతున్నారు. మరో రెండు మూడు రోజుల పాటు ఇదే వాతావరణం ఉంటుందని వెల్లడించారు. జిల్లాలో ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయనీ.. నగర పరిధిలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు. ఈదురుగాలుల ప్రభావం కొనసాగుతుంటుందనీ.. ఉరుములు, మెరుపుల తీవ్రత కూడా అధికంగా ఉంటుందని చెబుతున్నారు. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. -
‘నీట్’గా.. ప్రశాంతంగా..
సాక్షి, విశాఖపట్నం/మురళీనగర్: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి గాను నీట్ యూజీ–2025 పరీక్ష జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో 16 కేంద్రాల్లో 7 వేల మందికి పైగా విద్యార్థులు పరీక్ష రాశారు. కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ పరీక్ష కేంద్రానికి 480 మందిని కేటాయించగా 474 మంది పరీక్ష రాసినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ కె.నారాయణరావు చెప్పారు. గైస్లోని పరీక్ష కేంద్రానికి 480 మందిని కేటాయించగా 471 మంది పరీక్షకు హాజరైనట్లు చీఫ్ సూపరింటెండెంట్, కాలేజీ ప్రిన్సిపాల్ కె.వెంకటరమణ తెలిపారు. రెండు సెషన్స్లో జరిగిన ఈ పరీక్షను ఎన్టీఏ అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు ఈసారి సమగ్ర విధానాన్ని అనుసరించింది. కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక కేంద్రీకృత కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి.. జిల్లాలో క్షేత్రస్థాయిలో పరీక్షల నిర్వహణను నిరంతరం పర్యవేక్షించారు. అయితే చెవిదిద్దులు, కాలి మెట్టెలు, చైన్లు వంటివి తొలగించిన తర్వా తే పరీక్ష కేంద్రంలోకి అడుగు పెట్టేలా కఠినంగా వ్యవహరించడంతో అమ్మాయిలు కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరీక్ష పత్రం కఠినంగా ఉన్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. ఫిజిక్స్ చాలా కష్టతరంగా.. కెమిస్ట్రీ మధ్యస్థంగా.. బయాలజీ చాలా సులభంగా ఉందని విద్యార్థులు పేర్కొన్నారు. ● జిల్లాలో 16 కేంద్రాల్లో నీట్ పరీక్ష -
ఆ.. నర్సులకు నైట్ డ్యూటీలు
డాబాగార్డెన్స్: కేజీహెచ్లో కొన్నేళ్లుగా రాత్రి విధుల నుంచి తప్పించుకుంటున్న నర్సులకు ఎట్టకేలకు నైట్ డ్యూటీలు కేటాయించారు. ‘కొందరికే నైట్ డ్యూటీ ఎందుకు?’ శీర్షికతో గత నెల 23న ‘సాక్షి’ఓ కథనం ప్రచురించింది. కొన్నేళ్లుగా హెడ్ నర్స్ జెస్సీ ఈవెంజలీన్తో పాటు స్టాఫ్ నర్సులు నీలవేణి, ఎస్వై సత్యవతి, పాత్ర మోసెస్, ఎంవీ నాగమణి దేవి రాత్రి విధుల నుంచి ఏవేవో కారణాలు చూపుతూ తప్పించుకుంటున్నారు. వీరితో పాటు మరికొందరు ఈ జాబితాలో ఉన్నారు. ఈ కథనానికి స్పందించిన కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద్ ఆ మరుసటి రోజే నర్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు, హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సులతో సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వర్తించాలని, రొటేషన్ ప్రకారం నైట్ డ్యూటీలు చేయాలని ఆ సమావేశంలో స్పష్టం చేశారు. ఇటీవల కేజీహెచ్ను సందర్శించిన అదనపు డీఎంఈ కూడా పలు ఆదేశాలిచ్చారు. వార్డుల్లో ఏ సమస్య ఉన్నా హెడ్ నర్సులదే బాధ్యత అని, బ్లాకుకు ఒక హెడ్ నర్సు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో హెడ్ నర్స్ జెస్సీ ఈవెంజలీన్తో పాటు స్టాఫ్ నర్సులు నీలవేణి, ఎస్వై సత్యవతి, పాత్ర మోసెస్, ఎంవీ నాగమణి దేవికి ప్రస్తుతం నైట్ డ్యూటీలు కేటాయించారు. డీఎంఈ ఆదేశాల మేరకు బ్లాకుకు ఒక హెడ్ నర్స్ను నియమించారు. -
హైకోర్టు న్యాయమూర్తి ప్రియదర్శిని మృతికి సంతాపం
మహారాణిపేట/డాబాగార్డెన్స్ : తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి, విశాఖ వాసి జస్టిస్ మాటూరి గిరిజా ప్రియదర్శిని (54) హైదరాబాద్లో ఆకస్మిక మృతి పట్ల విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎం.కె.శ్రీనివాస్ సంతాపం వ్యక్తం చేశారు. నగరానికి చెందిన జస్టిస్ ప్రియదర్శిని ఎంబీఎం లా కళాశాల నుంచి 1995లో న్యాయపట్టా అందుకున్నారు. 1995లోనే విశాఖ బార్ అసోసియేషన్లో పేరు నమోదు చేసుకున్నారు. అనంతరం ప్రముఖ న్యాయవాదులు ఉమాబాలాజీ, ఎన్.బద్రీనాథ్ దగ్గర న్యాయవాదిగా శిక్షణ పొందారు. 2008లో అదనపు జిల్లా న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. 2022లో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. ఇందిరా ప్రియదర్శిని సహచరులు లక్ష్మీ రాంబాబు, మంజులత, అరుణ కుమారి హేమలత తదితరులు తమ సంతాప సందేశాన్ని తెలిపారు. జిల్లా కోర్టు సమీపంలో బీఏకే చాంబర్స్లో ఆదివారం నిర్వహించిన సంతాప సభలో ఏపీ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు బైపా అరుణ్కుమార్ ఆమె చిత్రపటాని కి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. న్యాయవాదులు వాగుపల్లి చిన్నారావు, డాక్టర్ టి.బోసుబాబు, పాకా సత్యనారాయణ, లాయర్స్ ఫోరమ్ ఫర్ జస్టిస్ గుడిపల్లి సుబ్బారావు, నిమ్మకాయల ఈశ్వరరావు, సి.రవి, పడమట సురేష్, కోమల కిరణ్ పాల్గొన్నారు. -
బాధితులకు పరిహారం అందజేత
మధురవాడ/మద్దిలపాలెం/సింహాచలం/ఆరిలోవ: సింహాచలం చందనోత్సవం సందర్భంగా గోడ కూలి ఏడుగురు మృతి చెందగా, ఒక్కరు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో బాధితులకు ఆదివారం ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. జీవీఎంసీ 7వ వార్డు చంద్రంపాలేనికి చెందిన పిళ్లా ఉమామహేశ్వరరావు, శైలజ దంపతుల కుటుంబానికి రూ.50 లక్షలు(ఒక్కొక్కరికి రూ.25 లక్షలు), పాత అడవివరం నివాసి ఎడ్ల వెంకటరావు కుటుంబ సభ్యులకు 25 లక్షల చొప్పున జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ నష్టపరిహారం చెక్కులు అందజేశారు. జీవీఎంసీ 15వ వార్డు పాత వెంకోజీపాలెం ఉమానగర్కు చెందిన పైలా వెంకటరత్నం, ఆమె ఆడపడుచు గుజ్జరి మహాలక్ష్మి కుటుంబ సభ్యులకు చెరో రూ.25 లక్షలు, గాయాలు పాలైన జీవీఎంసీ 11వ వార్డు పరిధి ఆరిలోవ బాలాజీనగర్కు చెందిన పైలా ప్రవీణ్కు రూ.3లక్షలు చొప్పున జేసీతోపాటు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పరిహారం చెక్కులను అందించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, ప్రమాదంపై విచారణ జరుగుతోందని జేసీ తెలిపారు. కుటుంబ సభ్యులు ఒకరికి ఉద్యోగం కల్పించాలని పలువురు బాధితులు కోరగా.. త్వరలోనే ఉద్యోగం ఇప్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఉద్యోగం తన మరిది భార్యకి ఇవ్వాల్సిందిగా వెంకటరావు భార్య కోరడంతో.. ఈ విషయంపై కుటుంబ సభ్యులంతా అంగీరపత్రాన్ని ఇవ్వాలని జేసీ సూచించారు. ఆర్డీవో సంగీత్ మాథూర్, విశాఖ రూరల్ తహసీల్దార్లు రమేష్, పాల్ కిరణ్ పాల్గొన్నారు. -
మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: పశ్చిమ బెంగాల్ తీరంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఒడిశా తీరం మీదుగా కోస్తాంధ్ర వరకూ విస్తరించి ఉంది. ప్రస్తుతం ఇది సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తున కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో నేడు, రేపు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి.గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో గరిష్టంగా 50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే సూచనలున్నాయి. దక్షిణకోస్తా జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. గంటకు 50 నుంచి 60 కి.మీ. గరిష్టంగా 70 కి.మీప వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం పిడుగులతో కూడిన అకాల వర్షాలు కురిశాయి.కాకినాడ జిల్లా కాజులూరులో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రంలోని 130 ప్రాంతాల్లో 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతాలు నమోదయ్యాయి. అదే సమయంలో ఆదివారం నంద్యాల జిల్లా గోనవరం, నెల్లూరు జిల్లా సోమశిల, తిరుపతి జిల్లా వెంకటగిరి, వైఎస్సార్ జిల్లా కమలాపురం తదితర ప్రాంతాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోద య్యాయి. మరో రెండు రోజులు రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.పశ్చిమ విఘ్నాల వల్లే..రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి వాతావరణానికి వెస్ట్రన్ డిస్టర్బెన్స్ (పశ్చిమ విఘ్నాలు) కార ణమని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీని కారణంగా ప్రస్తుతం రెండు ఉపరితల ద్రోణులు ఏర్పడ్డాయి. ఇవి ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, తమిళనాడు వ్యాప్తంగా విస్తరించి ఉండటంతో వర్షాలు కురుస్తున్నాయి. భూమి నుంచి మూడు కిలోమీటర్ల పైకి వెళ్లే వరకూ వెస్ట్రన్ డిస్టర్బెన్స్ ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావంతో వీచే గాలులు సముద్రం నుండి ఎక్కువ శాతం తేమను తీసుకుని అప్పటికప్పుడు మేఘాలుగా ఏర్పడతాయి. -
ఏపీకి భారీ వర్ష సూచన. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ
విశాఖ : రాబోవు కొన్ని గంటల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. దాంతో పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. కోస్తా, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.గంటలకు 60 నుంచి 80 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీయవచ్చని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉన్నట్లు స్పష్టం చేసింది. దాంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) హెచ్చరించింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.ఐదు జిల్లాలకు రెడ్ అలెర్ట్రాగల రెండు మూడు గంటల వ్యవధిలో ప్రకాశం, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని, గంటకు 60 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనవసరంగా బయటకు రాకూడదని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని విజ్ఞప్తి చేశారు విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ, రోణంకి కూర్మనాథ్,పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్మరోవైపు అల్లూరి సీతారామరాజు, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ జిల్లాలతో పాటు వాటి పరిసర ప్రాంతాల్లోనూ వర్షాలు పడే సూచనలున్నాయని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక్కడ పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. -
భీమిలి వివాహిత కేసు.. బయటపడ్డ సంచలన నిజాలు
సాక్షి, విశాఖపట్నం: భీమిలి మండలం దాకమర్రి వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన క్రాంతి కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం ఆరు బృందాలు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. కేసు వివరాలను విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి మీడియాకు వెల్లడించారు. దాకమర్రి పంచాయతీ శివారు 26వ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఫార్చ్యూన్ హిల్స్ వుడా లేఅవుట్లో నిన్న(శుక్రవారం) ఉదయం సగం కాలిన మహిళ మృతదేహాన్ని భీమిలి పోలీసులు గుర్తించారు.ఆ మహిళను హంతకులు గొంతు కోసి తరువాత పెట్రోల్తో దహనం చేసినట్టు గుర్తించారు. మెడలో కాలిన నల్లపూసల గొలుసు ఉండటంతో మృతురాలు వివాహితగా గుర్తించారు. ఆరు ప్రత్యేక బృందాలుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ కేసు మిస్టరీని ఛేదించారు. మృతురాలు వెంకటలక్ష్మికి క్రాంతి కుమార్తో అనే వ్యక్తికి అక్రమ సంబంధం ఉన్నట్లు పోలీసులు తేల్చారు.క్రాంతి కుమార్కు ఇద్దరు భార్యలు ఉండగా, అతడు రెండో భార్యతో మృతురాలి ఇంటి పక్కన ఉండేవాడు. క్రాంతికుమార్, మృతురాలికి మధ్య స్నేహం కుదిరింది. అతనికి వెంకటలక్ష్మితో వివాహేతర సంబంధం ఏర్పడటంతో రెండో భార్యకు, వెంకటలక్ష్మికి మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో రెండో భార్యను వేరే బ్లాక్కు మార్చాడు. అయినా వెంకటలక్ష్మితో వివాహేతర సంబంధం కొనసాగించాడు.ఈ విషయంలో మొదటి భార్య, రెండో భార్యతో తరచు గొడవలు జరుగుతున్నాయి. మరో వైపు వెంకటలక్ష్మి.. తనతోనే ఎక్కువసేపు గడపాలని తనతోనే ఉండాలంటూ క్రాంతికుమార్పై ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో ఎలాగైన వెంకటలక్ష్మిని వదిలించుకోవాలని.. ప్లాన్ చేశాడు. వెంకటలక్ష్మిని బయటకు తీసుకెళ్లాడు. ఇద్దరు ఐస్క్రీమ్ తిన్నారు. అనంతరం బైక్లో పెట్రోల్ కొట్టించి.. బాటిల్లో కూడా కొట్టించాడు. ఇంటి వద్ద పెట్రోల్ దొంగలు ఉన్నారని.. అందుకే బాటిల్లో పెట్రోల్ కొట్టించానంటూ వెంకటలక్ష్మితో చెప్పాడు.శారీరకంగా కలుద్దామని చెప్పి దాకమర్రి లేవట్కి తీసుకెళ్లి వెంకటలక్ష్మిని కత్తితో గొంతు కోసి చంపేశాడు. తరువాత ఆమె ఒంటిపై ఉన్న నగలు తీసుకుని.. తరువాత పెట్రోల్ పోసి తగలుపెట్టాడు. కేసు విచారణలో మొదట వెంకటలక్ష్మిని గుర్తించాము. తర్వాత కాంత్రితో వెళ్తున్నట్లు తన తల్లి చెప్పిందని కొడుకు పోలీసులకు చెప్పారు. ఆ కోణంలో విచారణ చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. -
సింహాచలం ఘటనపై అశోక్ నోరిప్పలేదేం
సింహాద్రి అప్పన్న చందనోత్సవం సందర్భంగా భారీ ఎత్తున భక్తులు వచ్చిన తరుణంలో ఏర్పాట్లు... భద్రత వంటి చర్యలను గాలికి వదిలేసిన ప్రభుత్వం ఏడుగురు భక్తుల ప్రాణాలను గాలిలో కలిపేసింది. దీనికి సంబంధించి ఇప్పుడు బయటపడుతున్న పలు లోపాలు చూస్తూ భక్తులు విష్టి పోతున్నారు. అతి తక్కువ సమయంలో గోడ నిర్మించలేనని కాంట్రాక్టర్ చెప్పినప్పటికీ పరవాలేదు మేము చూసుకుంటాం ఏదోలా పూర్తిచేసేయ్ అంటూ దేవాలయ యాజమాన్యం మంత్రులు తనపై ఒత్తిడి చేసి తూతూ మంత్రంగా పనులు పూర్తి చేయించారని కాంట్రాక్టర్ అంగీకరించారు. ఇదిలా ఉండగా ఉత్సవానికి ముందు పలువురు మంత్రులు సింహాచలాన్ని సందర్శించి ఏర్పాట్లు పర్యవేక్షించినట్లు పరిశీలించినట్లు సూచనలు సలహాలు ఇచ్చినట్లు పత్రికల్లో కథనాలు ఫోటోలు అయితే వేయించుకున్నారు కానీ వారు ఎక్కడ ఏమి చూసినట్లు లేదు. అలా వచ్చి మామూలుగా అధికారులతో సమావేశమై జ్యూస్ తాగి స్నాక్స్ తిని వెళ్లిపోయారు అన్నది ఈ సంఘటన తర్వాత అర్థమవుతుంది. ఇదంతా ఎలా ఉండగా సింహాచలం దేవస్థానానికి సంబంధించి అనువంశిక ధర్మకర్త ట్రస్ట్ బోర్డు చైర్మన్ అశోక్ గజపతిరాజు ఈ అంశంపై ఇంతవరకు కిక్కురుమనలేదు. గతంలో ఆయన ధర్మకర్తృత్వం లోని రామతీర్థం గుట్టపై శ్రీరాముని విగ్రహాన్ని కొంతమంది దుండగులు ధ్వంసం చేసిన ఘటన కు సంబంధించి ఆయన స్పందన విపరీతంగా ఉండేది. కళ్ళు ఎగరేస్తూ గాలిలో చేతులు తిప్పుతూ నాటి వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని తూలనాడారు. చైర్మన్ అయిన తనకు కూడా ఏమాత్రం సమాచారం లేదని బాధ్యత వహిస్తే పరిస్థితి వేరుగా ఉండేది అన్నట్లుగా ఆయన మాట్లాడారు. నాటి సంఘటనకు వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తి బాధ్యత అని దుమ్మెత్తి పోశారు.నేడు సౌండ్ లేదేం అశోక్ రాజానేడు సింహాచలం అప్పన్న స్వామికి చందనోత్సవం సందర్భంగా తొలి దర్శనం చేసుకుని పట్టు వస్త్రాలు సమర్పించేది కూడా విజయనగరం పూసపాటి కుటుంబీకులే. గతంలో ఆనందగజపతి రాజు ఈ సాంప్రదాయం పాటించగా నేడు అశోక్ గజపతి అప్పన్నకు చైర్మన్ హోదాలో పట్టు వస్త్రాలు సమర్పిస్తూ వస్తున్నారు. మరి దేవాలయ చైర్మన్గా ఆయనకు ఈ దుర్ఘటనతో సంబంధం లేదా..? బాధ్యత లేదా ? అంత పెద్ద ప్రమాదం జరిగి ఏడుగురు ప్రాణాలు కోల్పోయి మరికొందరు ఆసుపత్రిపాలవగా ఆయన మాత్రం ఏ మాత్రం నోరు విప్పడం లేదు. ఉత్సవాలకు ముందు మంత్రులతో పాటు ఆయన కూడా సమీక్షలో పాల్గొని ఆహా ఓహో అది చేశాను ఇది చేశాం అంటూ ఫోటోలు ప్రకటనలు ఇచ్చి ఇంటికి వచ్చారు తప్ప ప్రమాదం జరిగి ఇన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోయిన ఆయన ఏమాత్రం స్పందించడం గాని.. దేవాలయ ట్రస్ట్ బోర్డు తరఫున ఓ ప్రకటన కానీ ఇవ్వలేదు.. అసలు ఆ సంఘటన జరిగినట్లే ఆయన గుర్తించినట్లు కనిపించలేదు. ఎందుకంటే తాను కొనసాగుతూ వస్తున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఏ ఆలయంలో ఏం జరిగినా ఆయనకు కనిపించదు.. వినిపించదు. అదే వైయస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా చిత్ర విచిత్రమైన అభినయాలతో అశోక్ గజపతి మీడియా ముందుకు వచ్చేస్తారు.. ఇప్పుడు ఈ సంఘటన జరిగినప్పుడు కూడా ఆయన నోరు విప్పితే తన హుందాతనానికి మరింత గౌరవం వచ్చేదని ప్రజలు అంటున్నారు::సిమ్మాదిరప్పన్న -
సింహాచలం విషాదం.. గోడ నిర్మాణం వద్దని వైదికులు, అర్చకులు వారించినా..
విశాఖ: సింహాచలం చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్ విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.సింహాచలం గోడ నిర్మాణంలో ఎలాంటి టెండర్ లేదు. నోటి మాటతో నిర్మాణం జరిగింది. దీంతో పాటు వైదిక నిబంధనలను ఉల్లంఘించినట్లు సింహాచలం చందనోత్సవంలో జరిగిన దుర్ఘటనపై త్రిసభ్య కమిటీ చేపట్టిన రెండో రోజు విచారణలో తేలింది. విచారణలో భాగంగా త్రిసభ్య కమిషన్ విషాదానికి సంబంధించి ఆలయ అర్చకులు, వైదికుల నుంచి కీలక సమాచారాన్ని సేకరించింది. సింహగిరిలో కూలిన గోడపై త్రిసభ్య కమిటీ సభ్యుల విచారణలో.. దేవాలయంలో నోటి మాటతో గోడ నిర్మాణం చేపట్టారని, అనుమతులు, ప్రొసీజర్ ఫాలోకాలేదని స్పష్టమైంది. పైగా వైదిక నిబంధనలు సైతం ఉల్లంఘించారని.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్కు సింహాచలం ఆలయ అర్చకులు వివరించారు. ‘మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్కు విరుద్ధంగా నిర్మాణం చేపట్టొద్దని ముందే చెప్పాం. అయినా మా మాట వినకుండా గోడ నిర్మాణం చేపట్టారని’ సింహాచలం వైదికులు, అర్చకులు వివరించారు. అర్చకులు, వైదికులు ఇచ్చిన సమాచారాన్ని, వివరణలను ఇవాళ ఏపీ ప్రభుత్వానికి సమర్పించే నివేదికలో త్రిసభ్య కమిషన్ పొందుపరచనుంది. -
విద్యుత్ తీగకు కేబుల్ వైరు తగిలి సాఫ్ట్వేర్ ఉద్యోగిని..
మర్రిపాలెం(విశాఖపట్నం): విద్యుత్ షాక్కు గురై ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని దుర్మరణం పాలైంది. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధి మురళీనగర్లోని అయ్యప్పనగర్లో ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జి.వి.పద్మావతి (29) తన భర్త అజయ్తో కలిసి అయ్యప్పనగర్లో నివాసముంటున్నారు. ఆమె నగరంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ, ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. రెండవ అంతస్తులో నివాసం ఉంటున్న వీరు పాల ప్యాకెట్లను కింద సెల్లార్ నుంచి తెచ్చుకోవడానికి ప్లాస్టిక్ డబ్బాకు కేబుల్ వైరు కట్టి ఉపయోగిస్తున్నారు. శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో పద్మావతి ఎప్పటిలాగే రెండవ అంతస్తు నుంచి కేబుల్ వైర్ సహాయంతో సెల్లార్లోని పాల ప్యాకెట్లను తీసుకుంటున్నారు. అయితే గురువారం రాత్రి కురిసిన వర్షం కారణంగా కేబుల్ వైరు విద్యుత్ తీగలకు తగిలింది. ఇది గమనించని పద్మావతి విద్యుత్ షాక్కు గురైన అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందారు. భర్త అజయ్ వెంటనే కంచరపాలెం పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ షేక్ సమీర్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కూర్మన్నపాలేనికి చెందిన పద్మావతికి నాలుగేళ్ల కిందట అజయ్తో వివాహమైంది. వీరికి పిల్లలు లేరు. అజయ్ మిలటరీ ఇంజినీరింగ్ సరీ్వస్ (ఎంఈసీ)లో కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారు. -
అశోక్ గజపతికి బాధ్యత లేదా?
సింహాచలం: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి క్షేత్ర చరిత్రలో కనీవినీ ఎరుగని దుర్ఘటన చోటుచేసుకుంది. చందనోత్సవం రోజున షాపింగ్ కాంప్లెక్స్ వద్ద నాసిరకంగా నిర్మించిన గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.ఈ ఘటన జరిగి మూడు రోజులు గడుస్తున్నా, దేవస్థానం వంశపార ధర్మకర్త పూసపాటి అశోక్గజపతిరాజు మాత్రం ఇంతవరకు సంఘటనా స్థలాన్ని సందర్శించక పోవడం, మృతుల కుటుంబాలను పరామర్శించకపోవడం విమర్శలకు దారితీస్తోంది. చందనోత్సవం రోజున స్వామివారి తొలి దర్శనం చేసుకునేది వంశపార ధర్మకర్తలే. ఆనవాయితీ ప్రకారం.. అశోక్గజపతిరాజు మే 29న రాత్రి సింహగిరిపై బస చేసి, 30న తెల్లవారుజామున కుటుంబసమేతంగా తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆయన అక్కడే ఉన్న సమయంలో గోడ కూలి ప్రమాదం జరిగింది. భారీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగినా, అంబులెన్సులు, పోలీసు వాహనాల సైరన్లు మారుమోగినా అశోక్గజపతిరాజు ప్రమాద స్థలానికి రాలేదు. మూడు రోజులు గడిచినా ఆయన సంఘటనా స్థలాన్ని సందర్శించకపోవడం, మృతుల కుటుంబాలను పరామర్శించకపోవ డంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో దేవస్థానంలో జరిగిన చిన్న చిన్న విషయాలపై సైతం మీడియా ముందుకు వచ్చి విమర్శలు గుప్పించిన అశోక్గజపతిరాజు, ఇప్పుడు ఇంతటి ఘోర ప్రమాదం జరిగినా స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. భక్తుల సౌకర్యాలే ముఖ్యమని నీతులు చెప్పే ఆయన, వారి మరణం పట్ల వ్యవహరించిన తీరు బాధాకరమని అంటున్నారు. మృతుల కుటుంబాలకు దేవస్థానం తరఫున నష్టపరిహారం అందించాల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఎంపీదీ అదే దారి.. సింహగిరిపై చందనోత్సవంరోజు గోడ కూలి ఏడుగురు భక్తులు మృతిచెందిన ఘోర ప్రమాదంలో ఎంపీ భరత్ ఇప్పటివరకు మృతుల కుటుంబాలను పరామర్శించలేదు. ఆయన తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. -
పుష్పయాగానికి పూలు తరలింపు
ఎంవీపీ కాలనీ: తిరుపతిలోని శ్రీ కొండండరామస్వామి వారి పుష్పయాగం కోసం విశాఖ నుంచి వివిధ రకాల పూలను తరలించారు. కార్తీక దినోత్సవ కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి సేకరించిన ఈ పుష్పాలను శుక్రవారం ఉదయం ఎంవీపీ కాలనీలోని టీటీడీ ఈ–దర్శనం కౌంటర్ వద్ద భక్తుల సందర్శన కోసం ఉంచారు. మహిళా భక్తులు ముందుగా పూలను అందంగా తీర్చిదిద్ది ప్యాకింగ్ చేశారు. అనంతరం సంకల్పం చేసి, శాస్త్రోక్తంగా ఈ పూలను తిరుమలకు పంపించారు. కలువలు, తామరలతో పాటు పలు రకాల పూలు ఉన్నాయని ఆధ్యాత్మిక వేత్త హిమాన్షు ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన మహిళా భక్తులు పాల్గొన్నారు. -
ప్రత్యేక తరగతులు పరిశీలించిన డీఈవో
గోపాలపట్నం: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదో తరగతి ప్రత్యేక తరగతులను జిల్లా విద్యాశాఖాధికారి ప్రేమ్కుమార్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతులకు హాజరైన విద్యార్థులను ఆయన పలు ప్రశ్నలు వేసి వారి సామర్థ్యాన్ని పరిశీలించారు. పాఠశాలలో ఉన్న సదుపాయాలు, తరగతుల నిర్వహణ పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలి, చదివే విధానం గురించి వివరించారు. పరీక్షలు రాసే మెలకువలను తెలియజేశారు. ఉపాధ్యాయులు విద్యార్థుల హాజరును పెంచాలని సూచించారు. -
బాబూ.. ‘గ్యాస్’ డబ్బులేవీ?
డాబాగార్డెన్స్: ఉచిత గ్యాస్ సిలిండర్లు, నెలకు రూ.1500 నగదు బదిలీ, తల్లికి వందనం తదితర సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపిస్తూ మహిళలు శుక్రవారం నిరసనకు దిగారు. ‘బాబు గారూ.. గ్యాస్ సిలిండర్ డబ్బులు ఎప్పుడు చెల్లిస్తారు?’అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జీవీఎంసీ 31వ వార్డు కృష్ణాగార్డెన్స్ రామాలయం వద్ద ఐద్వా, సిటు సంయుక్త ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్లో ఒక్కటి కూడా అమలు కాలేదని మండిపడ్డారు. గ్యాస్ సిలిండర్కు సంబంధించి వంద మందిలో కేవలం 30 మందికి మాత్రమే నగదు అందిందని.. మిగిలిన వారికి ఇవ్వడం లేదని ఆరోపించారు. తాము సిలిండర్కు చెల్లించిన పూర్తి మొత్తాన్ని తిరిగి తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నెలకు రూ.1500 చొప్పున ప్రతి మహిళా ఖాతాలో జమ చేస్తామని చెప్పిన హామీ కేవలం నీటి మూటగానే మిగిలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లికి వందనం పథకం ఊసే లేదని, ఉచిత బస్సు సౌకర్యం కూడా అమలు కావడం లేదని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలను ప్రభుత్వం పెంచుతోందని, తాజాగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.811 నుంచి రూ.861కి పెంచడం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర భారం మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలపై ఎందుకు నోరు మెదపడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు కూడా ప్రభుత్వ తీరుతో బయటకు కక్కలేక.. లోలోన మదన పడతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఎలా మంచి ప్రభుత్వం అని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. నిరసనలో సిటు నాయకులు కర్రి గణేష్, ఎం.సుబ్బారావు, లెనిన్, అమ్మాజీ, అరుణ, లక్ష్మి, సరోజిని, వెంకటలక్ష్మి, పార్వతి, కాంతం, రామయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మహిళలు జీవీఎంసీ 31వ వార్డులో నిరసన -
కాలువలో పడి వ్యక్తి మృతి
అక్కిరెడ్డిపాలెం: గాజువాక మండలం చినగంట్యాడ గ్రామం అమరావతి పార్కు వద్ద గల కాలువలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ పడి శుక్రవారం మృతి చెందాడు. గాజువాక పోలీసులు తెలిపిన వివరాలివి.. గాజువాక మండలం, పాతకర్ణవానిపాలేనికి చెందిన పి.వెంకటరమణమూర్తి (60) ఆఫ్టింగ్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. నాలుగు నెలలుగా అతను డ్రైవింగ్కు వెళ్లడం లేదు. నాలుగేళ్ల కిందటఅతని భార్య చనిపోవడంతో మద్యానికి బానిసయ్యాడు. రోజూ మాదిరిగానే గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. శుక్రవారం ఉదయం వరకూ ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు గాలించగా కాలువలో పడి మృతి చెందినట్టు గుర్తించారు. అతనికి ముగ్గురు పి ల్లలు ఉన్నారు. పెద్ద కుమారుడు హరికృష్ణ ఫిర్యాదు మేరకు గాజువాక సీఐ పార్థసారధి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మంత్రుల కమిటీ నిర్లక్ష్యమే కారణం
● త్రిసభ్య కమిషన్ నిష్పక్షపాతంగా విచారణ జరపాలి ● సింహాచలం సంఘటన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి ● కాంక్రీట్ పునాది, పిల్లర్లు లేకుండా గోడ నిర్మాణంలో అవినీతి జరిగింది ● మృతుల కుటుంబాలకు రూ.కోటి, క్షతగాత్రులకు రూ.10 లక్షలు ఇవ్వాలి ● త్రీ మెన్ కమిషన్కు వినతి పత్రం అందజేసిన సీపీఎం సాక్షి, విశాఖపట్నం : చందనోత్సవం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదుగురు మంత్రుల కమిటీ బాధ్యతా రాహిత్యం వల్లే సింహాచలం ఘోర దుర్ఘటన జరిగిందని సీపీఎం విశాఖ జిల్లా బృందం ఆరోపించింది. చందనోత్సవ విషాద ఘటనపై ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిషన్ సర్క్యూట్ హౌస్లో రెండో రోజు విచారణ చేపడతున్న నేపథ్యంలో సిపిఎం విశాఖ జిల్లా బృందం కలిసి కమిషన్కు వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గు నాయుడు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, కార్పొరేటర్ గంగారావు కమిషన్తో మాట్లాడుతూ చందనోత్సవ నిర్వహణ, ఏర్పాట్లు పరిశీలనకు నియమించిన ఐదుగురు మంత్రుల కమిటీ బాధ్యతారాహిత్యం కారణంగానే ఈ పెను విషాదం సంభవించిందని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. నిస్పక్షపాతంగా విచారణ నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం సీపీఎం నేతలు మీడియాతో మాట్లాడుతూ మంత్రుల కమిటీ తగిన పర్యవేక్షణ, నూతన నిర్మాణాల తనిఖీలు, కట్టుదిట్టమైన ఏర్పాట్లు, అన్నిరకాల భద్రతా చర్యలు తీసుకొని ఉన్నట్లయితే ఈ దుర్ఘటన జరిగుండేది కాదని అభిప్రాయపడ్డారు. చందనోత్సవానికి కేవలం కొన్ని రోజులకు ముందు అతిపెద్ద గోడ నిర్మాణం చేయడం, అదికూడా తగిన ప్లాన్, కాంక్రీట్ పునాది, పిల్లర్లు లేకుండా నాసిరకం మెటీరియల్తో నిర్మించడం కారణంగా ప్రమాదం సంభవించిందన్నారు. ఇందులో పెద్దఎత్తున అవినీతి జరిగిందనేది స్పష్టంగా కనిపిస్తోందన్న విషయాన్ని కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. కాంట్రాక్టర్ తోపాటు పనిని పర్యవేక్షించాల్సిన ఇంజనీర్లు, దేవాలయ అధికారులు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మంత్రుల కమిటీతో పాటు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు కూడా నిర్లక్ష్య వైఖరి అవలంబించడం వల్లనే ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన దురదృష్టకర ఘటన జరిగిందని, వీరందరిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చందనోత్సవం ఏర్పాట్లు పై ఎప్పటి కప్పుడు సమీక్షలు చేయడంలో విఫలమైందని వ్యాఖ్యానించారు. దుర్ఘటనలో చనిపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ. 25 లక్షలు మాత్రమే నష్టపరిహారం ఇవ్వడం న్యాయ సమ్మతం కాదని, ఒక్కొక్కరికీ రూ.కోటి పరిహారం అందించాలని, కాంట్రాక్టు ఉద్యోగం కాకుండా పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు జగ్గునాయుడు, గంగారావు అన్నారు. కమిషన్ చైర్మన్కు వినతి పత్రం సమర్పించిన వారిలో పార్టీ నేతలు ఆర్కే, ఎస్వీ కుమార్, పి.మణి, జగన్, జ్యోతీశ్వరరావు ఉన్నారు. -
అపోలోలో గుండె, పేస్మేకర్ పరీక్షలు ఉచితం
బీచ్రోడ్డు: నేటి జీవన పరిస్థితుల్లో ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించి, ముందుగానే వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని అపోలో ఆసుపత్రి కార్డియాలజీ వైద్య నిపుణులు డాక్టర్ వినీషా సూచించారు. రామ్నగర్లోని అపోలో ఆసుపత్రిలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి ఒక్కరికి చాతీ నొప్పి వచ్చినప్పుడు అది గుండెకు సంబంధించిన సమస్యనా లేదా గ్యాస్ట్రిక్ సమస్యనా అనే ఆలోచన వస్తుందని, ఇకపై ఎలాంటి ఆలోచన లేకుండా నేరుగా అపోలో ఆసుపత్రికి వస్తే ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈసీజీ, కొలెస్ట్రాల్, రక్త పరీక్షలు నిర్వహించి సమస్యను నిర్ధారిస్తామని, ఒకవేళ గుండెకు సంబంధించిన సమస్య అయితే ఉచితంగా కార్డియాలజీ నిపుణులతో వైద్య సలహాలు అందిస్తామని వివరించారు. ఇప్పటి వరకు 800 మందికిపైగా ఈ పరీక్షలను ఉచితంగా నిర్వహించినట్లు ఆమె పేర్కొన్నారు. అలాగే డివైస్ క్లినిక్ ఏర్పాటు చేశామని, ఈ క్లినిక్లో పేస్మేకర్ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా కేవలం రూ.999లకే జనరల్ హెల్త్ చెకప్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఈ అవకాశం ఈ నెల 15వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని, నగరవాసులు వినియోగించుకోవాలని కోరారు. డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ టి.రవికాంత్, అడ్మినిస్ట్రేటర్ సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ తీగకు కేబుల్ వైరు తగిలి సాఫ్ట్వేర్ ఉద్యోగిని..
మర్రిపాలెం: విద్యుత్ షాక్కు గురై ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని దుర్మరణం పాలైంది. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధి మురళీనగర్లోని అయ్యప్పనగర్లో ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జి.వి.పద్మావతి (29) తన భర్త అజయ్తో కలిసి అయ్యప్పనగర్లో నివాసముంటున్నారు. ఆమె నగరంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ, ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. రెండవ అంతస్తులో నివాసం ఉంటున్న వీరు పాల ప్యాకెట్లను కింద సెల్లార్ నుంచి తెచ్చుకోవడానికి ప్లాస్టిక్ డబ్బాకు కేబుల్ వైరు కట్టి ఉపయోగిస్తున్నారు. శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో పద్మావతి ఎప్పటిలాగే రెండవ అంతస్తు నుంచి కేబుల్ వైర్ సహాయంతో సెల్లార్లోని పాల ప్యాకెట్లను తీసుకుంటున్నారు. అయితే గురువారం రాత్రి కురిసిన వర్షం కారణంగా కేబుల్ వైరు విద్యుత్ తీగలకు తగిలింది. ఇది గమనించని పద్మావతి విద్యుత్ షాక్కు గురైన అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందారు. భర్త అజయ్ వెంటనే కంచరపాలెం పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ షేక్ సమీర్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కూర్మన్నపాలేనికి చెందిన పద్మావతికి నాలుగేళ్ల కిందట అజయ్తో వివాహమైంది. వీరికి పిల్లలు లేరు. అజయ్ మిలటరీ ఇంజినీరింగ్ సర్వీస్ (ఎంఈసీ)లో కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారు. -
అప్పన్న ఆలయంలో ఘనంగా తిరునక్షత్రం పూజలు
సింహాచలం: శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో విశిష్టాద్వైత స్థాపకులు భగవత్ రామానుజాచార్యుల 1008వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఏటా ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ తిరునక్షత్రం పూజలు గత నెల 28న ప్రారంభమయ్యాయి. చివరి రోజైన శుక్రవారం జయంతి సందర్భంగా ఆలయ బేడామండపంలోని హంసమూలన గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవి, భగవత్ రామానుజాచార్యుల ఉత్సవమూర్తులతో పాటు ఆళ్వారులను వేంజింపజేశారు. అనంతరం షోడశోపచార పూజలు, విశేష హారతులు, పారాయణాలు నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు, అర్చకులు, పారాయణదారులు ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం రామానుజాచార్యుల తిరువీధి ఉత్సవం వైభవంగా జరిగింది. -
హడావుడి
అతిథి గృహంలో● సర్క్యూట్ హౌస్లో రెండోరోజు విచారణ ● సింహాచలం విషాద ఘటనపై త్రిసభ్య కమిషన్ ● అర్చకుల నుంచి రెవెన్యూ సిబ్బంది వరకూ ప్రతి ఒక్కరినీ విచారించిన కమిషన్ ● మృతదేహాలు వెలికి తీసిన వారంతా సంప్రోక్షణ చేసుకోకుండానే విధుల్లోకి రావడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన అర్చకులు ● నేడు ప్రభుత్వానికి నివేదిక అందజేత సాక్షి, విశాఖపట్నం : ఊహకందని దారుణం.. సింహగిరి చరిత్రలో విషాద పేజీగా నిలిచిపోయిన చందనోత్సవం దుర్ఘటనపై ప్రాథమిక విచారణ పూర్తయింది. తొలిరోజున సింహాచలంపై సాగగా.. మలిరోజున ప్రభుత్వ అతిథి గృహం వద్ద హడావుడి కనిపించింది. అర్చకులు, వేదపండితులతో పాటు రెవెన్యూ, దేవదయ ధర్మాదాయ.. విభిన్న శాఖల అధికారులు, సిబ్బంది విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ సుదీర్ఘ విచారణ సాగింది. దుర్ఘటనపై అన్ని విభాగాల నుంచి సమాచారం సేకరించిన త్రిసభ్య కమిషన్ ప్రభుత్వానికి శనివారం నివేదిక సమర్పించనుంది. సింహాచలంలో ఏటా ఒక రోజు జరిగే పవిత్ర పర్వదినం అప్పన్న నిజరూపదర్శనం.. చందనోత్సవం విషాదోత్సవంగా మారిపోయిన ఘటన నుంచి విశాఖవాసులు ఇంకా తేరుకోలేకపోతున్నారు. దేవాలయ చరిత్రలో ఇలాంటి దురదృష్టకరమైన ఘటన జరగడం ఇదే తొలిసారి కావడంతో.. భక్తులు ఆందోళన చెందుతున్నారు. మంత్రుల నిర్లక్ష్యంతో ఏడుగురు ప్రాణాలు బలిగొన్న తర్వాత ఉలిక్కి పడిన ప్రభుత్వం.. హడావుడిగా నియమించిన త్రిసభ్య కమిషన్ రెండు రోజుల విచారణ పూర్తి చేసింది. 72 గంటల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయడంతో.. గురువారం, శుక్రవారం రెండు రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ చేపట్టి సమగ్ర వివరాలు సేకరించింది. ఆది నుంచీ గోడ కట్టకూడదని చెప్పినా వినిపించుకోకుండా.. కట్టడం వల్లనే విషాదం చోటు చేసుకుందని అర్చకులు వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో.. త్రిసభ్య కమిషన్ దేవస్థాన అర్చకులను కూడా విచారించింది. మాడవీధిని ఆనుకొని రక్షణ గోడ ఉన్నప్పుడు దాని పక్కన కొత్తగా మరో గోడ కట్టడం సరికాదంటూ వైదికులు చెప్పినా పట్టించుకోలేదని కమిషన్కు చెప్పినట్లు సమాచారం. ప్రభుత్వం ఈ మహాపచారం చెయ్యడం వల్లే పెను విషాదం సంభవించిందని కూడా కమిషన్ ముందు తమ స్పందన వెలిబుచ్చినట్లు తెలుస్తోంది. అదేవిధంగా మృతదేహాల వెలికితీత, శిథిలాల తొలగింపులో పాల్గొన్న సిబ్బందిని పుణ్యస్నానాలు ఆచరింపజేయకుండా, సంప్రోక్షణ చేసుకోనివ్వకుండా.. విధుల్లోకి తిరిగి చేర్చడంపైనా అర్చకులు కమిషన్ ముందు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇలా ప్రతి విషయంలోనూ ఆగమశాస్త్ర ఉల్లంఘనలు జరిగాయని కమిషన్కు అర్చకులు వెల్లడించారు. వరదనీటి వ్యవస్థ లేదా..? సింహాచలంలో వరద నీటిని నియంత్రించేందుకు సరైన వ్యవస్థ లేకపోవడంపై కమిషన్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. 2018లో రూపొందించిన దేవస్థానం మాస్టర్ప్లాన్లోనూ ఈ అంశాన్ని పొందుపరచకపోవడంపై దేవస్థానం అధికారులు, వీఎంఆర్డీఏ అధికారులపైనా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రెండు మూడు దశాబ్దాలుగా సింహగిరిపై పడుతున్న సగటు వర్షపాతాన్ని పరిగణనలోకి తీసుకొని.. దానికనుగుణంగా నియంత్రించే వ్యవస్థను ఏర్పాటు చేసుకోకపోవడం సరికాదని సూచించింది. కనీసం వరద నీటి నియంత్రణకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలపై అధికారులు దృష్టి సారించకపోవడంపైనా విస్మయం చెందారు. మాస్టర్ప్లాన్లో ఉల్లంఘనలు ఉన్నట్లు కూడా ఉన్నాయని గుర్తించిన త్రిసభ్య కమిషన్... ఈ విషయంపై ఎందుకు దృష్టిసారించలేదని ఆయా శాఖల అధికారుల్ని ప్రశ్నించింది. రెండు రోజుల పాటు జరిగిన విచారణలో అన్ని శాఖల నుంచి సమగ్ర వివరాల్ని సేకరించిన కమిషన్.. శనివారం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదికను అనుసరించి.. ప్రభుత్వం ఎవరిపై చర్యలు తీసుకోవాలన్నదానిపై నిర్ణయం తీసుకోనుంది. అయితే కేవలం చిన్న స్థాయి అధికారులపైనే ప్రతాపం చూపించి.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మంత్రులపై కనీస చర్యలు ఉండవనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వమే అసలు దోషి.! ఈ ప్రమాదం వెనుక ప్రభుత్వ నిర్లక్ష్యమే తప్ప.. ఇంకోటి లేదన్నది ప్రతి ఒక్కరి నుంచి వినపడుతోంది. భారీస్థాయిలో భక్తులు వస్తారని, ప్రతి చందనోత్సవానికి వర్షం పడుతుందని తెలిసినా.. ఏర్పాట్లు విషయంలో కనీస జాగ్రత్తలు పాటించకపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిర్వహణ ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదుగురు మంత్రుల కమిటీ బాధ్యతారాహిత్యం ఏడుగుర్ని పొట్టనపెట్టుకుందనీ.. వారిపైనా చర్యలు తీసుకోవాలంటూ సీపీఎం డిమాండ్ చేస్తోంది. కేవలం.. అధికారులు, ప్రభుత్వ సిబ్బందిని బలి చెయ్యకుండా.. ఈ ప్రమాదం వెనుక ఉన్న మంత్రులపైనా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలంటూ ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు. తప్పు మాది కాదంటే.. మాది కాదు శాఖల వారీగా విచారణ కొనసాగింది. దేవస్థాన అధికారులు, ఇంజినీర్లను తొలుత విచారించారు. గోడ నిర్మాణం, ప్రసాద్ పనుల ఆలస్యం.. మొదలైన విషయాలపై ఆరా తీశారు. అదే సమయంలో టూరిజం ఇంజినీరింగ్ అధికారులను కూడా విచారణకు హాజరవ్వమని ఆదేశించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఇరు విభాగాల్ని ఒకేసారి విచారించిన కమిటీ ముందు.. గోడ నిర్మాణం, పనుల ఆలస్యం మొదలైన అంశాల్లో తప్పు మా శాఖది కాదు.. టూరిజం వాళ్లదేనని దేవస్థానం అధికారులు.. తమది కాదు.. వాళ్లదేనని టూరిజం ఇంజినీర్లు వాదించుకొని.. ఒకరిపై ఒకరు తప్పు నెట్టేసుకునేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. దేవస్థాన ఇంజినీర్లతో పాటు టూరిజం ఇంజినీర్లది కూడా బాధ్యత ఉందని, వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ జిల్లా అధికారులు కమిషన్కు నివేదించినట్లు సమాచారం. -
అశోక్ గజపతికి బాధ్యత లేదా?
● ప్రమాద సమయంలో సింహగిరిపైనే అశోక్ ● మృతుల కుటుంబాల ను పరామర్శించలేదు ● కనీసం సంఘటనా స్థలానికి రాని వైనం సింహాచలం: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి క్షేత్ర చరిత్రలో కనీవినీ ఎరుగని దుర్ఘటన చోటుచేసుకుంది. చందనోత్సవం రోజున షాపింగ్ కాంప్లెక్స్ వద్ద నాసిరకంగా నిర్మించిన గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.ఈ ఘటన జరిగి మూడు రోజులు గడుస్తున్నా, దేవస్థానం వంశపార ధర్మకర్త పూసపాటి అశోక్గజపతిరాజు మాత్రం ఇంతవరకు సంఘటనా స్థలాన్ని సందర్శించక పోవడం, మృతుల కుటుంబాలను పరామర్శించకపోవడం విమర్శలకు దారితీస్తోంది. చందనోత్సవం రోజున స్వామివారి తొలి దర్శనం చేసుకునేది వంశపార ధర్మకర్తలే. ఆనవాయితీ ప్రకారం.. అశోక్గజపతిరాజు మే 29న రాత్రి సింహగిరిపై బస చేసి, 30న తెల్లవారుజామున కుటుంబసమేతంగా తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆయన అక్కడే ఉన్న సమయంలో గోడ కూలి ప్రమాదం జరిగింది. భారీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగినా, అంబులెన్సులు, పోలీసు వాహనాల సైరన్లు మారుమోగినా అశోక్గజపతిరాజు ప్రమాద స్థలానికి రాలేదు. మూడు రోజులు గడిచినా ఆయన సంఘటనా స్థలాన్ని సందర్శించకపోవడం, మృతుల కుటుంబాలను పరామర్శించకపోవ డంతో భక్తులు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో దేవస్థానంలో జరిగిన చిన్న చిన్న విషయాలపై సైతం మీడియా ముందుకు వచ్చి విమర్శలు గుప్పించిన అశోక్గజపతిరాజు, ఇప్పు డు ఇంతటి ఘోర ప్రమా దం జరిగినా స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. భక్తుల సౌకర్యాలే ముఖ్యమని నీతులు చెప్పే ఆయన, వారి మరణం పట్ల వ్యవహరించిన తీరు బాధాకరమని అంటున్నారు. మృతుల కుటుంబాలకు దేవస్థానం తరఫున నష్టపరిహారం అందించాల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఎంపీదీ అదే దారి.. సింహగిరిపై చందనోత్సవంరోజు గోడ కూలి ఏడుగురు భక్తులు మృతిచెందిన ఘోర ప్రమాదంలో ఎంపీ భరత్ ఇప్పటివరకు మృతుల కుటుంబాలను పరామర్శించలేదు. ఆయన తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. -
ఆరిలోవ ఏఎస్ఐ మృతి
ఆరిలోవ: ఆరిలోవ పోలీస్స్టేషన్ ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న రమణ మరణించారు. అప్పుఘర్లో నివాసం ఉంటున్న ఆయన గత నెల 30న జరిగిన చందనోత్సవంలో విధులు నిర్వర్తించారు. అనంతరం అస్వస్థతకు గురైన ఆయన సెలవు తీసుకున్నారు. శుక్రవారం ఇంటి వద్ద అతని బైక్ స్టాండ్ వేస్తుండగా అదుపు తప్పి కిందపడటంతో తలకు తీవ్ర గాయమైంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేసరికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు ఆరిలోవ సీఐ హెచ్.మల్లేశ్వరరావు తెలిపారు. రమణ గుండె, ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ.. రెండేళ్లుగా చికిత్స పొందుతున్నట్లు ఆయన చెప్పారు. రమణకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన పీఎంపాలెం పోలీస్ స్టేషన్ ట్రాఫిక్లో పని చేసి నాలుగేళ్ల కిందట బదిలీపై ఆరిలోవ వచ్చారు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. -
జీవీఎంసీ టౌన్ప్లానింగ్ ఓపెన్ ఫోరానికి 23 వినతులు
డాబాగార్డెన్స్: జీవీఎంసీలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరానికి 23 వినతులు వచ్చాయని చీఫ్ సిటీ ప్లానర్ ఎ ప్రభాకరరావు తెలిపారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో సీపీలు, డీసీపీలు, ఏసీపీలతో కలిసి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రభాకర రావు మాట్లాడుతూ, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో టౌన్ ప్లానింగ్ సంబంధిత ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నందున, వాటిని ప్రత్యేకంగా పరిష్కరించేందుకు ప్రతి శుక్రవారం టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ వారం అందిన 23 వినతుల్లో జోన్–2 నుంచి ఐదు, జోన్–3 నుంచి తొమ్మిది, జోన్–4 నుంచి ఒకటి, జోన్–5 నుంచి మూడు, జోన్–6 నుంచి నాలుగు, జోన్–8 నుంచి ఒకటి చొప్పున ఉన్నాయని ఆయన వివరించారు. అందిన వినతులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆయన ఆదేశించారు. -
గ్రిల్స్ దాటే ప్రయత్నంలో..
పీఎంపాలెం: పీఎంపాలెం పోలీస్స్టేషన్ పరిధిలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఇంటికి మరో పది నిమిషాల్లో చేరుకోవాల్సి ఉండగా.. చిన్న పొరపాటు వల్ల ఓ పెయింటర్ విద్యుత్ షాక్కు గురై ప్రాణాలు కోల్పోయాడు. సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాలివి.. దుడ్డు కృష్ణ కుమార్(38) కొమ్మాది వైఎస్సార్ కాలనీలోని బ్లాక్ నంబరు 31 జీఎఫ్8లో తన భార్య సునీత, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. పెయింటింగ్ పనులే అతని జీవనాధారం. గురువారం ఉదయం ఎప్పటిలాగే పనికి వెళ్లిన కృష్ణ కుమార్.. రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో కొమ్మాది కూడలి వద్ద ఆటో దిగాడు. మరో పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటానని భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. 9.45 గంటల సమయంలో టీఎఫ్సీ బేకరీకి ఎదురుగా జాతీయ రహదారి మధ్యలో ఉన్న గ్రిల్స్ను దాటే ప్రయత్నంలో.. అక్కడ సెంటర్ లైటింగ్ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాన్ని పట్టుకున్నాడు. గ్రిల్స్ ఎక్కే క్రమంలో స్తంభానికి ఉన్న విద్యుత్ ప్రవహిస్తున్న వైర్లు తాకడంతో.. షాక్కు గురై కిందపడిపోయాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న కృష్ణ కుమార్ను గమనించిన స్థానికులు అతని భార్య సునీతకు సమాచారం అందించారు. వెంటనే ఆమె అక్కడికి చేరుకుని.. భర్తను చికిత్స నిమిత్తం గాయత్రీ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పీఎం పాలెం పోలీసులు ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. మృతుడి భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు. -
నోటి మాటతో గోడ కట్టారు
సాక్షి, విశాఖపట్నం: ఏకంగా ఐదుగురు మంత్రులు స్వయంగా పర్యవేక్షించినా సింహగిరిపై ఏడుగురు భక్తుల ప్రాణాలు బలై పోయిన నేపథ్యంలో తన దారుణ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు కూటమి సర్కారు అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలో ప్రజల దృష్టి మళ్లించేందుకు గోడ నిర్మాణంలో వైదిక నియమాల ఉల్లంఘన జరిగిందా? ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా చేపట్టారా? అనే అంశాలను తాజాగా తెరపైకి తెచ్చింది. ఇంజనీర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని దేవదాయ – పర్యాటక శాఖల మధ్య సమన్వయం లోపించిందంటూ పక్కదారి పట్టించే ఎత్తుగడలకు తెర తీసింది. మంత్రుల పర్యవేక్షణలోనూ ఇంత దారుణం జరగడం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టంగా తెలుస్తున్నా మభ్యపుచ్చే యత్నాలు చేయడంపై సర్వత్రా విభ్రాంతి వ్యక్తమవుతోంది. సింహాచలంలో భక్తుల మృత్యువాతపై రెండు రోజుల పాటు విచారణ జరిపిన త్రిసభ్య కమిషన్ శనివారం సాయంత్రం ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. తొలిరోజు కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, ఈవో, ఏఈవో, దేవస్థానం అధికారులను విచారించగా రెండోరోజు సర్క్యూట్ హౌస్లో విచారణ జరిపారు. నోటిమాటతో గోడ కట్టారని.. ఎలాంటి డిజైన్, అనుమతులు లేవని ప్రాథమికంగా తేలినట్లు కమిషన్ సభ్యులు చెప్పారు. సింహాచలంలో చందనోత్సవం సందర్భంగా గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందిన ఘటనపై సురేష్ కుమార్ చైర్మన్గా, సభ్యులు ఆకె రవికృష్ణ, వెంకటేశ్వరరావులతో ప్రభుత్వం విచారణ కమిషన్ను నియమించిన విషయం తెలిసిందే. మాస్టర్ప్లాన్కు సంబంధించిన మ్యాప్లు, డ్రాఫ్ట్ కాపీలను కమిషన్ సేకరించింది. గోడ నిర్మాణం చేపట్టొద్దని ముందుగానే అధికారుల్ని హెచ్చరించామని దేవస్థానం అర్చకులు, వైదిక పండితులు పేర్కొన్నట్లు సమాచారం. కలెక్టర్ హరేంధిరప్రసాద్, విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ విచారణకు హాజరై తాము సేకరించిన వివరాలను కమిషన్కు అందించారు. ఇంజనీర్ల నిర్లక్ష్యమే ప్రమాదానికి ప్రధాన కారణమని సీపీ తన నివేదికలో స్పష్టం చేసినట్లు సమాచారం. ఏప్రిల్ 29, 30వ తేదీలకు సంబంధించిన ఆలయ ప్రాంగణంలో సీసీటీవీ ఫుటేజీని స్వాదీనం చేసుకున్నట్లు తెలిసింది. విచారణ అనంతరం కమిషన్ చైర్మన్ సురేష్ కుమార్ మీడియాతో శుక్రవారం మాట్లాడారు. ‘శనివారం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పిస్తాం. పూర్తిస్థాయి నివేదికకు నెల సమయం ఉన్నందున మరికొంత మందిని విచారిస్తాం. మాస్టర్ప్లాన్కు విరుద్ధంగా కొన్ని పనులు జరిగినట్లు మా దృష్టికి వచ్చాయి. ఎవరి ఆమోదంతో మార్పులు చేశారో తెలియాల్సి ఉంది. గోడ నిర్మాణ పనులకు ఎలాంటి అనుమతులు లేవు. ఎవరు అనుమతి ఇచ్చారు? స్ట్రక్చరల్ డిజైన్లు, మెటీరియల్కు సంబంధించి ఒక్క రికార్డు కూడా లేదు. కేవలం నోటిమాట ద్వారానే గోడని నిర్మించినట్లు ప్రాథమికంగా నిర్థారించాం. ‘ప్రసాద్’ పథకం కింద మంజూరైన పనులు 2024 ఆగస్ట్ నాటికే పూర్తి కావాలి. ఆలస్యంపై దేవస్థానం, టూరిజం అధికారులు వేర్వేరు కారణాలు చెబుతున్నారు. శాఖల మధ్య సమన్వయ లోపం ఉంది..’ అని కమిషన్ చైర్మన్ పేర్కొన్నారు. -
సింహాచలం ఘటన: ముగిసిన త్రీమెన్ కమిటీ ప్రాథమిక విచారణ
విశాఖ :సింహాచలంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతిచెందిన దుర్ఘటనలో త్రీమెన్ కమిటీ ప్రాథమిక విచారణ ముగిసింది. దీనిపై ప్రభుత్వానికి రేపు(శనివారం) నివేదిక ఇవ్వనుంది త్రీమెన్ కమిటీ. దీనివలో భాగంగా త్రీమెన్ కమిటీ చైర్మన్, మున్సిపల్ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ మాట్లాడుతూ ‘ సింహాచలం దుర్ఘటనపై రేపు ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం. ప్రమాదానికి కారణమైన గోడను నోటి మాటతో కట్టేశారు. గోడ నిర్మాణానికి ఎటువంటి అనుమతులు లేవు.విచారణలో భాగంగా వివిధ శాఖల వారిని విచారించాం. వైదిక నియమాలను ఉల్లంఘించినట్లు ఆలయ అర్చకులు చెప్పారు. ఆగమ శాస్త్రపరమైన సలహాలు లేకుండానే గోడ నిర్మించారని వైదికులు మా దృష్టికి తీసుకొచ్చారు. మాస్టర్ ప్లాన్ ఉల్లంఘనలు కనిపించాయి. ఎవరి అనుమతిలో మాస్టర్ ప్లాన్ పై నిర్ణయాలు తీసుకున్నారో తేలాలి. ప్రసాద్ స్కీం పనులు గత ఏడాది ఆగస్టులో పూర్తి కావాల్సి ఉంది. ఆలస్యానికి కారణం ఏంటని అడిగితే భిన్నమైన సమాధానాలు వచ్చాయి. అధికారుల మధ్య సమన్వయంపై ఉన్నతాధికారులతో మాట్లాడాలి’ అని స్పష్టం చేశారు.కాగా, సింహాచలం చందనోత్సవంలో గోడ కుప్పకూలి ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. రూ.300 టికెట్ కౌంటర్ వద్ధ ఈ ప్రమాదం జరిగింది. ఇటీవలే అక్కడ గోడ నిర్మించారు. గోడ నాసిరకంగా నిర్మించడం వలనే కూలిపోయిందని అధికారులు భావిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున 2-3 గంటల మధ్య రూ.300 క్యూ లైన్లో ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతులను విశాఖపట్నం మధురవాడ సమీపంలోని చంద్రంపాలెం గ్రామానికి చెందిన పిళ్లా ఉమామహేశ్వరరావు (30), ఆయన భార్య శైలజ (26)గా అధికారులు గుర్తించారు. వీరితో పాటు పిల్లా శైలజ తల్లి వెంకటరత్నం, మేనత్త గుజ్జురి మహాలక్ష్మి కూడా ఈ ఘటనలో మృతిచెందారు. -
‘ఆ దుర్ఘటనకు మంత్రుల కమిటీ బాధ్యత వహించాలి’
విశాఖ : సింహాచలం దుర్ఘటనపై ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ విచారణ కొనసాగుతున్న సందర్భంలో వారిని సీపీఎం నేతలు కలిశారు. సింహాచలం గోడ కూలిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఎం నేతలు కోరారు. ఈ దర్యాప్తు అనేది ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా జరగాలన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ‘అ‘ సింహాచలం గోడ కూలిన దుర్ఘటనలో మరణనించిన వారికి రూ. కోటి పరిహారం ఇవ్వాలి. బాధిత కుటుంబ సభ్యులకు పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. క్షతగాత్రులకు రూ. 10 లక్షలు నష్ట పరిహారం ఇవ్వాలి. రక్షణగా ఉండాల్సిన గోడే భక్తులను భక్షించింది. ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ కూడా బాధ్యత వహించాలి. మంత్రుల కమిటీ పనుల తనికీల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించింది. అధికారులు, కాంట్రాక్టర్ను ఒక్కరినే బలి చేయడం కాదు అసలైన బాధ్యులైన గుర్తించాలి. గోడ నాశిరకంగా కట్టారు.. ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది.’ అని వారు విమర్శించారు.కాగా, సింహాచలం చందనోత్సవంలో గోడ కుప్పకూలి ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. రూ.300 టికెట్ కౌంటర్ వద్ధ ఈ ప్రమాదం జరిగింది. ఇటీవలే అక్కడ గోడ నిర్మించారు. గోడ నాసిరకంగా నిర్మించడం వలనే కూలిపోయిందని అధికారులు భావిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున 2-3 గంటల మధ్య రూ.300 క్యూ లైన్లో ప్రమాదం జరిగింది. మృతులను యడ్ల వెంకటరావు(48),దుర్గా స్వామినాయుడు(32), మణికంఠ(28)గా గుర్తించారు.ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతులను విశాఖపట్నం మధురవాడ సమీపంలోని చంద్రంపాలెం గ్రామానికి చెందిన పిళ్లా ఉమామహేశ్వరరావు (30), ఆయన భార్య శైలజ (26)గా అధికారులు గుర్తించారు. వీరితో పాటు పిల్లా శైలజ తల్లి వెంకటరత్నం, మేనత్త గుజ్జురి మహాలక్ష్మి కూడా ఈ ఘటనలో మృతిచెందారు. -
విశాఖలో విషాదం.. సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి
సాక్షి, విశాఖపట్నం: విద్యుత్ షాక్కు గురై సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి చెందింది. మురళీనగర్లో ఇవాళ ఉదయం 7 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రెండో అంతస్తు నుంచి కేబుల్ వైర్ ద్వారా పై అంతస్తు నుండి పాల ప్యాకెట్ తీస్తున్న క్రమంలో జీవీ పద్మావతి(29) విద్యుత్ షాక్కు గురైంది. ఆమె భర్త అజయ్ ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు.మరో విషాద ఘటనలో..ప్రేమ వివాహానికి అంగీకరించలేదని మనస్తాపం చెందిన ఓ చెందిన యువకుడు గురువారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. అక్కయ్యపాలెంలోని జగన్నాథపురానికి చెందిన కొణతాల లోకనరేంద్ర(29) సొంతంగా క్యాబ్ నడుపుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించాడు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామనుకున్నాడు. యువతి తల్లిదండ్రులకు విషయం తెలియడంతో ఫోర్త్టౌన్ పోలీస్స్టేషన్కు వెళ్లారు.ఇరు కుటుంబాల సమక్షంలో ఇరువురికి సంబంధం లేనట్టు ఉంటామని ఒప్పకున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 9న యువతికి పెళ్లి చేసేందుకు ముహూర్తం నిశ్చయించారు. విషయం తెలుసుకున్న యువకుడు ఆ అమ్మాయినే చేసుకుంటానని తల్లిదండ్రుల్ని బతిమాలాడు. వారు నిరాకరించడంతో గురువారం మధ్యాహ్నం ఇంట్లో గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు.ఎంతకీ తలుపులు తీయకపోవడంతో పోలీసులకు తెలిపి, యువతితో మాట్లాడించి బయటకు రప్పించేందుకు ప్రయతి్నంచారు. అయినా స్పందన లేకపోవడంతో పోలీసులు తలుపులు బద్దలుకొట్టి చూడగా ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని, మరణించి ఉన్నాడు. తండ్రి చంద్రరావు ఫిర్యాదు మేరకు సీఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
ఏపీలో భారీ వర్షం.. ఈ జిల్లాల ప్రజలకు విపత్తుల శాఖ హెచ్చరిక
సాక్షి, ప్రకాశం: తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. కర్ణాటక నుంచి రాజస్థాన్ వరకూ.. ఒక బలమైన ద్రోణి ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణపై కూడా కనిపిస్తోంది. ఈ కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తాజాగా శుక్రవారం తెల్లవారుజాము నుంచి ప్రకాశం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. గాలివాన కారణంగా పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం అనుపాలెం దగ్గర రోడ్డుపై భారీ వృక్షం విరిగిపడింది. రోడ్డుపై చెట్టు పడటంతో భారీగా ట్రాఫిక్ స్తంభించి పోయింది. దీంతో, పిడుగురాళ్ల -సత్తెనపల్లి మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రెండు గంటలుగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో పోలీసులు.. చెట్టు తొలగించి రాకపోకలను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారు.రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నట్లు , శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, కాకినాడ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీవర్షాలు, pic.twitter.com/0sPdSsATQK— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) May 1, 2025మరోవైపు.. ప్రకాశం జిల్లాలో ఈరోజు తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేని భారీ వర్షం కురుస్తోంది. కనిగిరిలో ఈదురుగాలితో కూడిన భారీ వర్షం పడుతోంది. ఇక, అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు.. వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ, తెలంగాణలో మరో ఏడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడతాయి. అలాగే.. ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది. ఒక్కోసారి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది.శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, కాకినాడ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, నెల్లూరు, కర్నూలు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల శాఖ హెచ్చరించింది. ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదన్నారు. బలమైన ఈదురుగాలులు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది.ఐఎండీ ప్రకారం నేడు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటూ.. కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, మహారాష్ట్రలో కొంత భాగం కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. బంగాళాఖాతం నుంచి ఏపీలోకి గాలులు బలంగా వస్తున్నాయి. ఈ రోజంతా ఈ పరిస్థితి ఉంటుంది. మరోవైపు.. దేశ రాజధాని ఢిల్లీలో సైతం భారీ వర్షం కురుస్తోంది. దీంతో, రోడ్లన్నీ జలమయమయ్యాయి. -
గోడ చాటున గుట్టు!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: స్వయంగా ఐదుగురు మంత్రుల కమిటీ దాదాపు పక్షం రోజులకుపైగా సింహగిరిపై చందనోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చిన్న చిన్న అంశాలను సైతం పరిగణనలోకి తీసుకొని అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత నమ్మకంగా చెప్పారు. అయినా సరే.. అప్పన్న నిజరూప దర్శన వేళ పెను విషాదం చోటు చేసుకుంది. ఏర్పాట్లలో మంత్రుల కమిటీ దారుణ వైఫల్యం ఏడుగురు భక్తుల ప్రాణాలను బలి తీసుకుంది. కనీసం ఓ గోడను కూడా పటిష్టంగా నిర్మించలేని బాధ్యతా రాహిత్యం భక్తులను పొట్టనబెట్టుకుంది. సాక్షాత్తూ మంత్రుల పర్యవేక్షణలోనే ఇలా జరిగిందంటే ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కాదా? దీన్ని కప్పిపుచ్చుకునేందుకు తాజాగా బహిరంగ విచారణ పేరుతో నాటకాన్ని సర్కారు రక్తి కట్టించింది. చందనోత్సవం రోజు వర్షం కురవడం సాధారణమే అయినప్పటికీ అందుకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పవిత్ర పుణ్యక్షేత్రాల్లో వరుసగా అపచారాలు, కూటమి సర్కారు నిర్వాకాలు, అంతులేని నిర్లక్ష్యం తాజాగా మరోసారి బహిర్గతం కావడంతో ఉలిక్కిపడి కింది స్థాయి ఉద్యోగులు, కాంట్రాక్టర్పై నెపం మోపి తప్పించుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే ఇదంతా కాంట్రాక్టర్, ఉద్యోగుల తప్పిదమేనంటూ అనుకూల మీడియాలో ఇప్పటికే లీకులిచ్చింది. తిరుపతి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తొక్కిసలాట చోటు చేసుకుని ఆరుగురు భక్తులు మృత్యువాత పడితే తన వైఫల్యాలను కప్పిపుచ్చి గుంభనంగా వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సింహాచలంలో మాత్రం బహిరంగ విచారణ చేపట్టి ఈ విషాదానికి కాంట్రాక్టర్, ఉద్యోగులను బాధ్యులుగా చేసి తప్పించుకునేందుకు సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది. అనుమతి లేకుండానే మాస్టర్ ప్లాన్లో మార్పులు ప్రభుత్వ జోక్యం లేకుండా సాధ్యమేనా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.తాత్కాలికమే కదా.. కట్టమన్నారు!‘ప్లానింగ్ ప్రకారం డ్రాయింగ్లో అసలు ఈ గోడ నిర్మాణం లేదని చెప్పా. తాత్కాలికమే కదా...! చందనోత్సవం కోసం కట్టమని ఒత్తిడి తెచ్చారు. మీకు తెలియంది ఏముంది సర్? టూరిజం, దేవదాయ శాఖలు గోడ కట్టమన్నాయి. దేవుడి కార్యక్రమం కదా అని డ్రాయింగ్లో లేకపోయినా అతిక్రమించి చేశా. ఐదు రోజుల్లోనే గోడ నిర్మించా. ఈ గోడ నిర్మాణంపై పరీక్షలు ఏమీ జరగలేదు..’ అని సింహాచలంలో ఏడుగురి సజీవ సమాధికి కారణమైన గోడను నిర్మించిన కాంట్రాక్టరు లక్ష్మణరావు గురువారం విచారణ కమిషన్ ఎదుట వెల్లడించారు. మాస్టర్ ప్లాన్కు విరుద్ధంగా నిర్మింంచిన ఈ గోడ కోసం అంచనాలు రూపొందించడంగానీ, అనుమతి గానీ తీసుకోలేదని కమిషన్ ఎదుట తేలిపోయింది. గోడ కట్టిన తర్వాత కనీసం పరీక్షలు కూడా చేయలేదని బట్టబయలైంది. ఒత్తిడి తెచ్చి పనులు హడావుడిగా చేయించారుసింహాద్రి అప్పన్న చందనోత్సవం సందర్భంగా గోడకూలి ఏడుగురు మృతి చెందిన ఘటనపై 72 గంటల్లో నివేదిక సమర్పించాలంటూ మునిసిపల్, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్కుమార్ నేతృత్వంలో ఐజీ ఆకే రవికృష్ణ, జలవనరులశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) వెంకటేశ్వరరావులతో కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేయడం తెలిసిందే. గురువారం ఉదయం పదిన్నర గంటలకు సింహాచలంలో విచారణ ప్రారంభించిన కమిషన్ గోడ నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్టర్తో పాటు దేవదాయ, టూరిజం శాఖ అధికారులను విచారించింది. గోడ కూలిన ప్రాంతాన్ని పరిశీలించి శిథిలాల నుంచి ఇటుకలు, మట్టిని విచారణ అధికారులు సేకరించారు. కేవలం 5 రోజుల్లోనే గోడ నిర్మాణాన్ని పూర్తి చేశామని... తమ మీద ఒత్తిడి తెచ్చి పనులు హడావుడిగా చేయించారని విచారణాధికారి ఎదుట కాంట్రాక్టర్ కుండబద్దలు కొట్టారు. ప్లాన్లో లేకుండానే పనులు చేయించారని, గోడ పటిష్టతపై ల్యాబ్లో ఎలాంటి పరీక్షలు చేయలేదని తెలిపారు. అనుమతులు లేకుండానే...డ్రాయింగ్లో లేని తాత్కాలిక గోడ నిర్మాణం విషయంలో అనుమతులు తీసుకున్నారా? అని కమిషన్ ఆరా తీసింది. దీనికి సంబంధించిన నోట్ ఫైల్, ఎం బుక్, వర్క్ ఆర్డర్, మీటింగ్ మినిట్స్ లాంటివి లేవని విచారణలో వెల్లడైంది. కేవలం నోటి మాట ఆధారంగా పని చేయలేమని.. డ్రాయింగ్, ప్లానింగ్ ఇవ్వాలని కాంట్రాక్టర్ కోరడం నిజం కాదా? అని సురేష్కుమార్ ప్రశ్నించగా అవునని అధికారులు అంగీకరించారు. మాస్టర్ ప్లాన్కు విరుద్ధంగా..సింహాచలం కొండ ‘యూ’ ఆకారంలో ఉంటుంది. కొండధారలు, ఆకాశగంగ, మాడవీధులు.. ఎక్కడ వర్షం కురిసినా తాజాగా ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న మెట్ల మీద నుంచే నీరంతా కిందకు వెళ్తుంది. అందుకే ఈ ప్రాంతంలో పటిష్టమైన రిటైనింగ్ వాల్ నిర్మించారు. దాన్ని ప్రసాద్ స్కీమ్లో పునర్ నిర్మించేందుకు పాత గోడని తొలగించారు. చందనోత్సవం నేపథ్యంలో తాత్కాలిక గోడని నాసిరకంగా, ఫ్లైయాష్ ఇటుకలతో కట్టారు. అది చిన్నపాటి వర్షానికే కూలిపోయింది. రూ.300 టికెట్ల లైన్ ఫెన్సింగ్ గోడకి ఆనుకొని వేశారు. ఫెన్సింగ్ లేకుంటే శిథిలాలు కొంతమేర తొలగించుకొని భక్తులు బయట పడేందుకు ప్రయత్నించేవారు. కానీ ఫెన్సింగ్ అడ్డుగా ఉండటంతో వాటిని తొలగించడం సాధ్యంకాక భక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు స్పష్టమవుతోంది. అంటే కనీస ప్రణాళిక లేకుండా, భక్తుల భద్రత గురించి ఏమాత్రం ఆలోచన చేయకుండా హడావుడిగా పనులు చేసినట్లు తెలుస్తోంది. నాసిరకంగా నిర్మించారు..తాత్కాలికంగా నిర్మించిన రిటైనింగ్ వాల్ నాసిరకంగా కట్టారు. దానివల్ల వర్షం పడే సమయంలో కూలిపోయిందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అలా ఎందుకు నిర్మించాల్సి వచ్చింది..? హడావుడిగా ఎందుకు చేయాల్సి వచ్చింది? నిజంగా అది నాసిరకంగా ఉందా? అనే వాటికి ఆధారాలు తీసుకున్నాం. ప్రసాద్ స్కీమ్ ఒరిజినల్ పనుల్లో మార్పులు చేర్పులు జరిగాయి. దాని ఆధారంగానే ఈ పనులు చేపట్టారు. ఎవరు అనుమతి ఇచ్చారు? డిజైన్ ఏమిటి? ఎవరు పరీక్షించారనేది విచారిస్తున్నాం. చందనోత్సవం ఉన్నందున త్వరితగతిన చేశామని చెబుతున్నారు. గత ఏడాది కాలంలో మాస్టర్ప్లాన్లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. దానిలో భాగంగా ఈ గోడను నిర్మించారు. మూడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం. ఇటువంటివి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నెల రోజుల్లో సవివర నివేదిక సమర్పించాల్సి ఉంది. అందులో పూర్తిస్థాయి ఎస్వోపీలను పొందుపరుస్తాం. – సురేష్ కుమార్, విచారణ కమిషన్ అధ్యక్షుడు -
కొంపముంచింది
కూటమి నేతల కక్కుర్తేకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పుణ్యక్షేత్రాల్లో ఎన్నడూలేని ఘోరాలు, విషాదాలు సంభవిస్తున్నాయి. భక్తుల సౌకర్యాల కంటే.. ఉత్సవ సమయంలో ఎంత ఎక్కువగా సొమ్ము చేసుకోవచ్చనే దానిపై కూటమి నేతల ఆత్రమే వీటికి కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హోం మంత్రి దగ్గర నుంచి.. భీమిలి ఎమ్మెల్యే వరకూ ప్రతి ఒక్కరూ తమ అనుచరులకు కాంట్రాక్టులు, అనుయాయులకు వీఐపీ టికెట్లు ఇప్పించుకోవడంలోనే నిమగ్నమయ్యారు. ఎంత మంది భక్తులు వస్తారు, ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న దానిపై దృష్టిసారించలేదు. కూటమి నేతల కాసుల కక్కుర్తి ఈ దుర్ఘటనతో మరోసారి స్పష్టమైంది. సాక్షి, విశాఖపట్నం: ఊహకందని విషాదం యావత్ రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఏడుగురి ప్రాణాల్ని బలిగొన్న దుర్ఘటనలో కూటమి ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు.. భారీ వర్షం కారణంగానే ప్రమాదం జరిగిందంటూ ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి నాయకుల వరకూ వంత పాడుతున్నారు. కానీ.. కూటమి నేతల కక్కుర్తి కారణంగానే విషాదం నెలకొందని తెలుస్తోంది. కేవలం తమకు చందనోత్సవం వల్ల ఏం లాభం ఒనగూరుతుందనే దానిపైనే ఎక్కువ దృష్టి సారించారు తప్ప... సామాన్య భక్తులకు అప్పన్న దర్శనం సజావుగా జరిగేలా చూసేందుకు ఎలాంటి ఏర్పాట్లు చెయ్యాలి.. ఎక్కడా ఇబ్బందులు లేకుండా చందనోత్సవాన్ని ఎలా నిర్వహించాలనేదానికి ప్రాధాన్యమివ్వలేదు. ఏర్పాట్లు చేసేందుకు వివిధ రకాల పనుల్ని కాంట్రాక్టు సంస్థలకు అప్పగించారు. ఈ పనులన్నింటినీ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, హోంమంత్రి అనిత స్వయంగా పర్యవేక్షిస్తూ... తమకు నచ్చిన వారికే కాంట్రాక్టులు అప్పగించారు. ఏర్పాట్లన్నీ గంటా అనుచరులకే.. అదే విధంగా.. ఏర్పాట్ల టెండర్ల వ్యవహారమంతా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నడిపించినట్లు సమాచారం. టెంట్లు, లైటింగ్, ఇతర పనులకు సంబంధించిన మొత్తం టెండర్లన్నీ గంటా దగ్గరుండి మరీ అనుచరులకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇలా కాంట్రాక్టుల ద్వారా అనుచరులకు లబ్ధి కలిగించేందుకు ప్రయత్నించారే తప్ప.. భక్తుల గురించి కనీసం పట్టించుకోలేదు. పోనీ ఆ పనులైనా సక్రమంగా చేపట్టారా అంటే.. దానికి కూడా అతీగతీ లేకుండా పోయింది. ఘటన జరిగిన తర్వాత.. బస్సులు కొండపైన నిలిపేయడంతో భక్తులు దిగువనే ఉండిపోయారు. అక్కడ కనీస సౌకర్యాలు అందక నరక యాతన అనుభవించారు. ఇలా.. సింహాచలంలో జరిగిన దారుణానికి ప్రధాన కారణం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే అయినా.. వరుణుడిపై నెట్టేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వాటర్ బాటిళ్ల మాయాజాలం! ప్రతి చందనోత్సవానికి జీవీఎంసీ నీటిని పూర్తిస్థాయిలో సరఫరా చేస్తుంది. దీనికి తోడుగా.. సింహాచలం దేవస్థానానికి మంచినీటి బాటిళ్లని అందించే రెగ్యులర్ కాంట్రాక్టర్ కూడా ఉన్నారు. ప్రతి ఉత్సవానికి వీఐపీలకు 500 మిలీ బాటిల్స్ సరఫరా చేస్తుంటారు. ఈ చందనోత్సవానికి కూడా సదరు కాంట్రాక్టర్ 500 మిలీ బాటిల్స్ని లక్ష సరఫరా చేసే టెండరు అప్పగించారు. జీవీఎంసీ 20 లీటర్ల క్యాన్లు, పేపర్ గ్లాసుల్ని భారీ స్థాయిలో భక్తుల కోసం క్యూలైన్లలో, బస్ పాయింట్స్ దగ్గర, తొలి పావంచా దగ్గర ఏర్పాటు చేసింది. అయినా.. నీటి బాటిళ్లలో హోంమంత్రి మాయాజాలం ప్రదర్శించారు. అవసరం లేకపోయినా.. 250 మిలీ నీటి బాటిల్స్ కచ్చితంగా ఉండాలంటూ హుకుం జారీ చేశారు. భక్తులు లక్షన్నర వరకూ వస్తారని అంచనా వేశారు. అయినా.. 3 లక్షల బాటిల్స్ అవసరమంటూ హోంమంత్రి చెప్పడంతో దీనికి టెండర్లు పిలిచారు. ఈ టెండర్ని హోంమంత్రి ముఖ్య అనుచరుడికి అప్పగించారు. వాస్తవానికి ఈ బాటిల్స్ని 3 లక్షల వరకూ సరఫరా చేస్తామని చెప్పి టెండరు దక్కించుకున్న హోం మంత్రి అనుచరుడు.. కేవలం లక్షన్నర బాటిల్స్ మాత్రమే ఇచ్చి.. లెక్క మాత్రం 3 లక్షలుగా చూపించినట్లు తెలుస్తోంది. -
బాల్యం విద్యా కేంద్రాల పటిష్టతకు చర్యలు
డాబాగార్డెన్స్: ప్రాథమిక విద్యకు జీవీఎంసీ బాల్యం పాఠశాలలు పునాది కావాలని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్లో బాల్యం విద్యా కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు, సూపర్వైజర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి జీవీఎంసీ బాల్యం విద్యా కేంద్రాల పటిష్టత, నమోదు శాతాన్ని పెంచేలా, ఈ వేసవి సెలవుల్లో ప్రణాళికలు చేపట్టాలన్నారు. 3 నుంచి 5 ఏళ్ల పిల్లలకు ఉత్తమ పూర్వ ప్రాథమిక విద్యనందించేలా బాల్యం కేంద్రాలు పని చేయాలన్నారు. అనంతరం బాల్యం విద్యా కేంద్రాల్లో నమోదు శాతం పెంచేందుకు, అక్కడ అందించే విద్య, ఇతర సౌకర్యాల వివరాలతో కూడిన పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ వర్మ, బాల్యం విద్యా పథకం ప్రాజెక్టు కో ఆర్డినేటర్ మోహన్కుమార్ ఆవులపాటి తదితరులు పాల్గొన్నారు. -
ప్రేమ పెళ్లి కాదన్నారని బలవనర్మణం
సీతమ్మధార: ప్రేమ వివాహానికి ఆంగీకరించలేదని మనస్తాపం చెందిన ఓ చెందిన యువకుడు గురువారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. అక్కయ్యపాలెంలోని జగన్నాథపురానికి చెందిన కొణతాల లోకనరేంద్ర(29) సొంతంగా క్యాబ్ నడుపుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించాడు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామనుకున్నాడు. యువతి తల్లిదండ్రులకు విషయం తెలియడంతో ఫోర్త్టౌన్ పోలీస్స్టేషన్కు వెళ్లారు. ఇరు కుటుంబాల సమక్షంలో ఇరువురికి సంబంధం లేనట్టు ఉంటామని ఒప్పకున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 9న యువతికి పెళ్లి చేసేందుకు ముహూర్తం నిశ్చయించారు. విషయం తెలుసుకున్న యువకుడు ఆ అమ్మాయినే చేసుకుంటానని తల్లిదండ్రుల్ని బతిమాలాడు. వారు నిరాకరించడంతో గురువారం మధ్యాహ్నం ఇంట్లో గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఎంతకీ తలుపులు తీయకపోవడంతో పోలీసులకు తెలిపి, యువతితో మాట్లాడించి బయటకు రప్పించేందుకు ప్రయత్నించారు. అయినా స్పందన లేకపోవడంతో పోలీసులు తలుపులు బద్దలుకొట్టి చూడగా ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని, మరణించి ఉన్నాడు. తండ్రి చంద్రరావు ఫిర్యాదు మేరకు సీఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
కిశోర బాలికల వికాసానికి ప్రత్యేక శిక్షణ
ఎంవీపీ కాలనీ: కిశోర బాలికల వికాసంపై ప్రత్యేక శ్రద్ధ వహించేందుకు ఆర్పీలు, ఆశావర్కర్లు, అంగన్వాడీ వర్కర్లకు స్థానిక జీవీఎంసీ ప్రైమరీ స్కూల్ ప్రాంగణంలో గురువారం ప్రత్యేక శిక్షణ అందించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీవో ఎంవీఆర్ కుమారి పాల్గొని, మాట్లాడారు. కిశోర బాలికల్లో పోషక విలువలు, వికాసానికి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ అనంతరం ప్రతి మంగళ, శుక్రవారాల్లో కిశోర బాలికలను గుర్తించి, వారితో ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక కమిటీలుగా ఏర్పాటు చేసి, సమావేశాలు పెట్టాలన్నారు. వీటి ద్వారా బాలికలకు ఆరోగ్యం, విద్యతో పాటు లైఫ్ స్కిల్స్పై అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయా ఆర్పీలు, ఆశావర్కర్లు, అంగన్వాడీ వర్కర్లతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ జె.వినీష తదితరులు పాల్గొన్నారు. -
అమోఘం రిషిక నాట్యం
అంతరంగ ఉత్సవ్–2025లో ప్రథమ స్థానం 5వ తరగతి నుంచే అవార్డులు తల్లి ప్రోత్సాహంతో రిషిక ఎన్నో నృత్య పోటీలలో పాల్గొని తన ప్రతిభను నిరూపించుకుంది. 5వ తరగతిలో ప్రతిష్ఠాత్మకమైన ‘రూట్స్ టు రూట్స్ ఎక్స్ంప్లరి’ అవార్డును అందుకుంది. 6వ తరగతిలో రీజినల్ స్థాయికి చేరుకుని తన ప్రస్థానాన్ని కొనసాగించింది. అదే స్ఫూర్తితో గత సంవత్సరం రీజినల్, రాష్ట్ర స్థాయి పోటీల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 37 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 2 వేల మంది పోటీదారులను అధిగమించి జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకుంది.తాటిచెట్లపాలెం: నగరానికి చెందిన జి. రిషిక తన అకుంఠిత దీక్షతో, అద్భుతమైన ప్రతిభతో దేశవ్యాప్తంగా విశాఖ కీర్తిని చాటిచెబుతోంది. ఇటీవల ముంబయిలోని మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్ లతా మంగేష్కర్ నాట్యగృహ ఆడిటోరియంలో జరిగిన అంతరంగ ఉత్సవ్–2025లో కూచిపూడి నృత్య ప్రదర్శనతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇది మాత్రమే కాదు, 2023–24 సంవత్సరంలో న్యూఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎన్సీఈఆర్టీ సంయుక్తంగా నిర్వహించిన కళా ఉత్సవ్లోనూ రిషిక తన కూచిపూడి నాట్యంతో క్లాసికల్ డ్యాన్స్ బాలికల విభాగంలో స్వర్ణ పతకం సాధించి సంచలనం సృష్టించింది. తద్వారా కేంద్రీయ విద్యాలయ సంఘటన్కు సైతం దేశ రాజధానిలో విశేషమైన గుర్తింపు లభించింది. రిషికలోని అసాధారణ ప్రతిభను స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తించడం విశేషం. గత ఏడాది జరిగిన గణతంత్ర దినోత్సవం, అలాగే విద్యార్థులతో ప్రధాని ముఖాముఖి నిర్వహించే ‘పరీక్షా పె చర్చా’ కార్యక్రమానికి ఆమెను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. ఇటీవల ముంబయిలో విజయం సాధించి నగరానికి తిరిగి వచ్చిన రిషికను కేవీ స్కూల్ సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు. సాధారణ కుటుంబం.. అసాధారణ ప్రతిభ రిషిక తండ్రి ఒక ప్రైవేటు కళాశాలలో గుమస్తాగా పనిచేస్తుండగా, తల్లి బి.రామలక్ష్మి మల్లునాయుడుపాలెంలోని జెడ్పీ హైస్కూల్లో ఆర్ట్/క్రాఫ్ట్ టీచర్గా విధులు నిర్వహిస్తున్నారు. రిషిక చెల్లి ప్రస్తుతం కేవీ వాల్తేర్లో 9వ తరగతి చదువుతోంది. వీరి కుటుంబంలో సంగీతం, నాట్యం వంటి కళలకు సంబంధించి ఎలాంటి నేపథ్యం లేకపోయినా, చిన్ననాటి నుంచే రిషికకు నృత్యంపై ఉన్న అమితమైన ఆసక్తిని తల్లి గుర్తించారు. సినిమా పాటలకు అనుగుణంగా రిషిక చేసే నాట్యాన్ని చూసి మురిసిపోయేది. తల్లి ప్రోత్సాహంతో రిషిక క్లాసికల్ డ్యాన్స్లో చేరింది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రత్యేక ఆహ్వానం రిషిక ప్రతిభకు ముగ్ధులైన న్యూ ఢిల్లీలోని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ నెల 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు న్యూఢిల్లీలో నిర్వహించనున్న ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి ఆమెను ఆహ్వానించింది. ఎన్సీఈఆర్టీ కళాఉత్సవ్ 2023–24 విజేతలకు ఈ ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. వారు రాణిస్తున్న కళారూపాల్లో మరిన్ని మెళకువలు నేర్పించి, వారి ప్రతిభను మరింతగా మెరుగుపరచడమే ఈ ప్రతిభా సంవర్ధన్ – 2025 కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొనేందుకు రిషిక మరోసారి ఢిల్లీకి వెళ్లనుంది. రిషిక సాధించిన విజయాలు కేవలం ఆమె కుటుంబానికే కాకుండా, విశాఖ నగరానికి, కేంద్రీయ విద్యాలయ సంఘటన్కు గర్వకారణం. చిన్న వయస్సులోనే ఆమె కనబరుస్తున్న అకుంఠిత దీక్ష, అద్భుతమైన నృత్య ప్రతిభ ఎందరికో స్ఫూర్తిదాయకం. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి, విశాఖ కీర్తిని వినువీధిన ఎగురవేయాలని ఆశిద్దాం. -
అమోఘం రిషిక నాట్యం
● ఢిల్లీకి విశాఖ కీర్తి ● అంతరంగ ఉత్సవ్–2025లో ప్రథమ స్థానం ● ప్రధాని మెచ్చిన కళాకారిణి 8లోవిషాదంతో ఉలిక్కిపడ్డ వ్యాపారులు కొత్తగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్లోకి ప్రవేశించి నాలుగు రోజులు కూడా గడవకముందే, తమ ప్రాంగణంలో ఇంతటి ఘోర విషాదం చోటుచేసుకోవడంతో సింహగిరి వ్యాపారులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పాదాలమ్మ–బంగారమ్మ ఆలయాల ప్రాంగణంలో తాత్కాలిక దుకాణాల్లో వ్యాపారం చేసుకుంటున్న వర్తకులను, చందనోత్సవానికి కేవలం నాలుగు రోజుల ముందు హడావుడిగా, ఇంకా పూర్తిగా సిద్ధం కాని కొత్త షాపింగ్ కాంప్లెక్స్లోకి తరలించారు. చందనోత్సవ సమయంలో వాహనాల పార్కింగ్ కోసం స్థలం అవసరమని చెప్పడంతో వ్యాపారులు అయిష్టంగానే కొత్త షాపింగ్ కాంప్లెక్స్లోకి మారారు. తరలి వెళ్లిన కొద్ది రోజులకే తమ షాపింగ్ కాంప్లెక్స్ వద్దే ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారని తెలిసి ఆందోళన చెందారు. సింహగిరి చరిత్రలో ఎన్నడూ ఇలాంటి దుర్ఘటన జరగలేదని, అయ్యో పాపం భక్తులంటూ వారు కన్నీటి పర్యంతమయ్యారు. -
ఫిరాయింపు కార్పొరేటర్లకు నిరసన సెగ చూపండి
గోపాలపట్నం: జీవీఎంసీ మేయర్ అవిశ్వాస తీర్మానంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన కార్పొరేటర్లు, నాయకులకు కార్యకర్తల నిరసన సెగ ఎలా ఉంటుందో చవిచూపించాలని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కృష్ణా కళాశాల దరి పార్టీ కార్యాలయంలో గురువారం పశ్చిమ నియోజకవర్గం కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ గుర్తుతో గెలిచిన కార్పొరేటర్లు అమ్ముడుపోవడం దారుణమన్నారు. ఇలాంటి వారిని ప్రజల్లో తిరగనీయవద్దని సూచించారు. వీరి గురించి ప్రజలకు తెలిసేలా నల్లజెండాలతో శాంతియుత కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వార్డుల వారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటానని భరోసానిచ్చారు. ఎవరెన్ని ప్రలోభాలు పెట్టినా లొగకుండా, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్న నియోజకవర్గ పరిధి కార్పొరేటర్లు పీవీ సురేష్, గుండపు నాగేశ్వరరావు, గులిగిందల లావణ్య, బల్ల లక్ష్మణరావులను ఘనంగా సత్కరించారు. తొలుత మేడే సందర్భంగా వైఎస్సార్టీయూసీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అధికార ప్రతినిధి బీఎస్ కృష్ణ, దొడ్డి కిరణ్, బాకి శ్యామ్ కుమార్రెడ్డి, ఆళ్ల పైడిరాజు, పలు వార్డుల అధ్యక్షులు, ఇన్చార్జిలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ పశ్చిమ సమన్వయకర్త మళ్ల విజయ ప్రసాద్ -
ప్రాణాలను బలిగొందా...
● పాత పద్ధతిలోనే మెట్లమార్గం నిర్మిస్తే ప్రమాదం జరిగేది కాదు ● అడుగడుగునా అధికారుల నిర్లక్ష్యంసింహాచలం: సింహాచలం కొండపై షాపింగ్ కాంప్లెక్స్ వద్ద నుంచి జోడు భద్రాల ప్రాంగణానికి వెళ్లేందుకు నిర్మించిన కొత్త మెట్లమార్గం రూపకల్పనలో చేసిన మార్పులే ఏడుగురు భక్తుల ప్రాణాలను బలిగొన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో అనేక చందనోత్సవాల సమయంలో అదే స్థలంలో ఉన్న పాత మెట్లమార్గంలో తీవ్రమైన తోపులాటలు, అధిక రద్దీ నెలకొన్నప్పటికీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, దురదృష్టవశాత్తు చరిత్రలో మొదటిసారిగా అదే ప్రదేశంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. వివరాల్లోకి వెళితే, సింహగిరిపై ఉన్న బస్టాండ్ నుంచి ఆలయానికి చేరుకోవడానికి ఉన్న మెట్లమార్గం ఇరువైపులా రెండు బ్లాక్లలో వ్యాపారుల షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి. గతంలో ఈ మెట్లమార్గం నేరుగా జోడు భద్రాల ప్రాంగణానికి చేరుకునేది. చందనోత్సవం రోజుల్లో భక్తులను ఈ మార్గంలోనే వరుస క్రమంలో పంపి నేరుగా జోడు భద్రాల ప్రాంగణానికి వెళ్లేలా ఏర్పాట్లు చేసేవారు. ప్రసాద్ స్కీమ్ కింద పాత షాపింగ్ కాంప్లెక్స్ను తొలగించి, కొత్త దుకాణాలను రెండు బ్లాక్లుగా పాత పద్ధతిలోనే నిర్మించారు.అయితే, ఈ రెండు బ్లాక్ల మధ్య నిర్మించిన కొత్త మెట్లమార్గం విషయంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వహించారు. పాత ప్రణాళికలను అనుసరించకుండా, జోడు భద్రాల వద్దకు చేరుకునే మెట్లను కుడి, ఎడమ వైపులకు మళ్లించారు. మధ్యలో దాదాపు తొమ్మిది అడుగుల ఎత్తులో నాసిరకమైన గోడను నిర్మించడంతో, ఎడమ వైపు నుంచి రూ.300 క్యూలో వెళ్తున్న భక్తులపై అది ఒక్కసారిగా కూలిపోయింది. ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. నేడు కూడా విచారణ సింహాచలంలో గోడ కూలి ఏడుగురు మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం నియమించిన త్రీ మెన్ కమిటీ శుక్రవారం కూడా విచారణ చేయనుంది. దేవస్థానం అధికారులను కూడా విచారించనుంది. గురువారం సంబంధిత ప్రాంతాన్ని బృందం సభ్యులు పరిశీలించి వివరాలు సేకరించారు. వైదిక వర్గాలు చెబుతున్నా లెక్కచేయకుండా... ఏటా శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి కొండ దిగువన నాలుగు పర్యాయాలు ఉత్సవాలు జరుగుతాయి. ఆ సందర్భాలలో స్వామివారి ఉత్సవ విగ్రహాలను కొండపై నుంచి పల్లకిలో దిగువకు తీసుకువస్తారు. గతంలో జోడు భద్రాల నుంచి నేరుగా ఉన్న మెట్లమార్గం ద్వారానే ఊరేగింపు జరిగేది. కొత్త షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం తర్వాత కూడా అదే విధంగా నిర్మించాలని పలువురు వైదిక పండితులు సూచించినప్పటికీ, అధికారులు వారి మాటలను పట్టించుకోలేదని తెలుస్తోంది. వారి నిర్లక్ష్య వైఖరి ఇప్పుడు ఏడుగురు భక్తుల ప్రాణాలను బలిగొన్న విషాదానికి దారితీసింది.గోడ కూలిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న త్రీమెన్ కమిటీ సభ్యులు -
ఉద్యోగ విరమణ చేసిన సిబ్బందికి సీపీ సన్మానం
విశాఖ సిటీ: విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వర్తిస్తూ ఉద్యోగ విరమణ చేస్తున్న ఏడుగురు సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి గురువారం సన్మానించారు. హోంగార్డు కమాండెంట్ కె.వి.ప్రేమ్జిత్, ఎస్ఐ ఐ.నాగరాజు, ఏఆర్ఎస్ఐ కె.అప్పారావు, ఏఎస్ఐ కె.వి.ఎస్.ఎన్.మూర్తి, ఏఎస్ఐ వై.ఈశ్వరరావు, హెచ్సీ టి.రాము, హోంగార్డు పి.శ్రీనివాసరావు ఉద్యోగ విరమణ పొందారు. దీంతో వీరిని కుటుంబ సభ్యులతో కలిపి గురువారం పోలీస్ సమావేశ మందిరానికి ఆహ్వానించారు. పోలీస్ అధికారుల సమక్షంలో వారిని సత్కరించి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపి వీడ్కోలు పలికారు. -
సింహాచలం ఘటనపై ‘పచ్చ’పాతం
విశాఖ సిటీ: పచ్చ పత్రికలు మరోసారి కళ్లున్న కబోదిలా వ్యవహరించాయి. సింహాచలం కొండపై గోడ కూలి ఏడుగురు భక్తులు నిర్జీవులుగా మారితే.. వాస్తవాలను సమాధి చేశాయి. ప్రభుత్వ వైఫల్యాలను అధికారులపై నెట్టేస్తూ తప్పుడు కథనాలు వండి వార్చాయి. చందనోత్సవం ఘటనలో కూటమి ప్రభుత్వం తప్పేమీ లేదనట్లు సాదాసీదా కథనాలతో సరిపెట్టేశాయి. ప్రముఖ దేవాలయాలన్నింట్లోనూ వరుస ప్రమాదాలు సంభవిస్తూ.. భక్తులు ప్రాణాలు కోల్పోతుంటే.. దాన్ని కూడా గత ప్రభుత్వాలు, లేదా అధికారులపైన నిస్సిగ్గుగా నెట్టేస్తూ రోత రాతలు రాస్తున్నాయి. ఇందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన చందనోత్సవ సమయంలోను, తాజా ఘటనలో రాసిన కథనాలే నిదర్శనం నేడు అధికారులపై నెపం.. వైఎస్సార్సీపీ హయాంలో ఒకరు డీ హైడ్రేషన్కు గురైతేనే ప్రభుత్వ వైఫల్యమని తేల్చేసిన పచ్చ పత్రికలు.. నేడు ఏడుగురు సమాధి అయినప్పటికీ.. కూటమి ప్రభుత్వం తప్పులేదన్నట్లు బాకాలు ఊదుతున్నాయి. చందనోత్సవం ఏర్పాట్లపై నెల రోజులుగా ఐదుగురు మంత్రుల కమిటీ సింహాచలంలోనే తిష్ట వేసింది. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామంటూ మంత్రులు ఊదరగొట్టారు. అయితే వీరు చందనోత్సవ ఏర్పాట్లను పక్కనపెట్టి పలు కాంట్రాక్టులను పంచుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. క్యూలైన్లో భక్తులకు మజ్జిగే కాదు.. మంచి నీటిని కూడా అందించలేదు. కానీ మంచి నీటి బాటిళ్ల విక్రయ కాంట్రాక్టును ఒక మంత్రి అనుచరుడికి అప్పగించడం చర్చనీయాంశమవుతోంది. ఇవన్నీ బహిరంగ రహస్యాలే అయినప్పటికీ పచ్చ పత్రికలకు కనిపించలేదు. కానీ అవసరం లేకపోయినప్పటికీ.. తాత్కాలికంగా గోడను నిర్మించి భక్తుల ప్రాణాలను హరిస్తే.. ఆ నెపాన్ని అధికారులపై నెట్టేస్తూ వార్తా కథనాలను ప్రచురించాయి. భక్తుల నెత్తుటి మరకలు కూటమి ప్రభుత్వానికి అంటుకోకుండా తెగ తాపత్రయ పడుతున్నాయి. ఒకవైపు మృతుల కుటుంబ సభ్యులు సైతం ఈ మరణాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని విలపిస్తున్నా.. పచ్చ పత్రికలకు అవేవీ పట్టలేదు. వారి రోదనలు కనిపించలేదు. రాజకీయ పక్షాల నుంచి ప్రజా సంఘాల వరకు సింహాచలం ఘటనలో జరిగిన మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే అని కూటమి ప్రభుత్వ తీరును తూర్పారబడుతుంటే వాటికి వినిపించలేదు. దేవదాయ శాఖ ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్దే తప్పు అంటూ వక్రభాష్యాలకు తెరతీశాయి. ప్రమాదం జరిగినే వెంటనే ప్రభుత్వం స్పందన అద్భుతమంటూ, బాధితులకు పరిహారం, ఉద్యోగం పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ మరోసారి తమ ‘పచ్చ’పాత ధోరణిని బయటపెట్టుకున్నాయి. ఏడుగురు భక్తుల మరణాల్లో వాస్తవాలను ‘సమాధి’చేసిన పచ్చ పత్రికలు ప్రభుత్వ వైఫల్యాలను అధికారులపై నెట్టేస్తూ తప్పుడు కథనాలు చందనోత్సవంలో మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే అంటున్న అన్ని వర్గాలు గతంలో ట్రాఫిక్ రద్దీపైనే నాలుగు పేజీల్లో వక్రభాష్యాలు నేడు కూటమి ప్రభుత్వ తప్పిదాలను ప్రస్తావించని అవే పత్రికలు నాడు వైఎస్సార్సీపీపై విషం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 2023, ఏప్రిల్ 23న చందనోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించింది. సింహాచలం వరాహ నృసింహస్వామి నిజరూప దర్శనం కోసం రెండు లక్షలకు పైగా భక్తులు వచ్చారు. దీంతో సింహాచలం కొండపై ట్రాఫిక్ పెరిగింది. స్వామి దర్శనానికి 3 నుంచి 5 గంటల సమయం పట్టింది. భారీగా భక్తులు రావడంతో ఏర్పడిన ట్రాఫిక్ రద్దీపైనే పచ్చ పత్రికలు విషం కక్కాయి. పతాక శీర్షికతో పాటు నాలుగు పేజీల్లో ‘భక్తులు విల విల’అంటూ తప్పుడు కథనాలు వండి వార్చాయి. ఒకవైపు దేవదాయ శాఖ అధికారులు భక్తులకు మంచినీరు, మజ్జిగ సరఫరా చేసినప్పటికీ.. అవేమీ చేయలేదంటూ అబద్ధపు రాతలు రాశాయి. ఆ సమయంలో విపరీతంగా ఉష్ణోగ్రతలు ఉండడంతో ఎండ వేడిని తట్టుకోలేక ఒక మహిళ స్వల్ప అస్వస్థత కలిగితే.. తాటికాయంత అక్షరాలతో అచ్చేశాయి. -
కారు ఢీకొని జింకకు గాయాలు
కొమ్మాది: బీచ్రోడ్డులో ఇందిరాగాంధీ జూపార్కు సమీపంలో నగరం నుంచి భీమిలి వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు దాటుతున్న జింకను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జింక ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న ఓ యువకుడు గమనించి, గాయపడిన జింకను రోడ్డు పక్కకు చేర్చి నీరు తాగించాడు. అనంతరం దానిని సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టాడు. అయితే, ఇటీవల కాలంలో జింకలు తరచూ జనావాసాల్లోకి రావడం, ప్రమాదాలకు గురికావడంపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రమాదాల బారిన పడి మరికొన్ని జింకలు మృత్యువాత పడుతున్నా అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కార్మిక హక్కుల సాధనకు ఉద్యమం
● మే 20 అఖిల భారత సమ్మెను విజయవంతం చేయండి ● మేడే సభలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు పిలుపుసీతమ్మధార: మేడే స్ఫూర్తితో కార్మిక హక్కుల రక్షణ కోసం ఉద్యమించాలని, మే 20న జరిగే అఖిల భారత సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా గురువారం దొండపర్తి రైల్వే డీఆర్ఎం కార్యాలయం నుంచి ఆశీలమెట్ట వరకు సీఐటీయూ విశాఖ జిల్లా కమిటీ భారీ ప్రదర్శన నిర్వహించింది. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ, కార్మికులు పోరాడి సాధించిన హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు. 29 కార్మి క చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి యజమానులకు ఊడిగం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు వంటి చర్యలను ఆయన తప్పుబట్టారు. స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మోదీ విధానాలనే అమలు చేస్తోందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి. కుమార్ విమర్శించారు. ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకం, వీవోఆర్పీలకు పనిభారం పెంచి వేతనాలు పెంచకుండా వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఆరోపించారు. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. గత 15 ఏళ్లుగా కనీస వేతనాల జీవోలు సవరించకపోవడంతో కార్మికులు నష్టపోతున్నారని, కనీస వేతనం నెలకు రూ. 26 వేలు ఉండేలా జీవోలు ఇవ్వాలని కోరారు. ఆప్కాస్ రద్దు చేసి పాత కాంట్రాక్ట్ విధానం తీసుకురావడం దుర్మార్గమని, ఆప్కాస్ రద్దు చేస్తే కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి.మణి, జిల్లా ఆఫీస్ బేరర్స్ పి.వెంకటరెడ్డి, ఎం.సుబ్బారావు, పి.వెంకటరావు, పి.కృష్ణారావు, జి.అప్పలరాజు, కె.కుమారి, టి.నూకరాజు, టి.నాయుడు, ఆర్.నాయుడు, వై.రాజు, అప్పలనాయుడు, కె.శేఖర్, ఎ.సీతాలక్ష్మి, ఎంసీహెచ్. అప్పడు, కె.జె.అప్పారావు,శ్రీనివాస్, ఝాన్సీ , మల్లీశ్వరి సీతారత్నం, నరేంద్రకుమార్, పెద్ద సంఖ్యలో వివిధ రంగాల కార్మికులు పాల్గొన్నారు. -
నెలరోజుల్లో పూర్తి నివేదిక.. సింహాచలం ఘటనపై త్రీమెన్ కమిటీ
విశాఖపట్నం, సాక్షి: సింహాచలం ఆలయంలో గోడ ఎందుకు కూలింది అనేదానికి కేవలం ఒక్కరు చెప్పినదాని ప్రకారం నిర్ధారణకు రాలేమని.. అందరినీ ప్రశ్నించిన తరువాత ఒక నిర్ణయానికి వస్తామని త్రిసభ్య విచారణ కమిటీ చెబుతోంది. గురువారం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన విచారణ బృందం.. సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడింది.త్రీమెన్ కమిటీ చైర్మన్, మున్సిపల్ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ సాక్షితో మాట్లాడుతూ.. సింహాచలం ప్రమాద ఘటనలో విచారణ కొనసాగుతోంది. సంఘటన స్థలాన్ని పరిశీలించాం. సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నాం. ఇంకా కొన్ని వివరాలు సేకరించాల్సి ఉంది. మూడు రోజుల్లో ప్రాధమిక నివేదిక ఇస్తాం. నెల రోజుల్లో పూర్తి నివేదిక సమర్పిస్తాం..సింహాచలం ఆలయంలో గోడ ఎందుకు కూలింది కారణాలు ఏమిటి అనే దానిపై వివరాలు సేకరిస్తున్నాం. నాసిరకంగా కట్టడం వల్ల జరిగిందా? ప్రణాళిక లేకపోవడం వల్ల జరిగిందా? అనే కోణంలో విచారిస్తున్నాం. కేవలం ఒక్క వ్యక్తి చెప్పిన దాని ప్రకారం నిర్ణయం తీసుకోలేం. అందరినీ ప్రశ్నించిన తరువాత ఒక నిర్ణయానికి వస్తాం. అందరూ అన్ని వివరాలు చెప్పిన తరువాత మళ్ళీ పరిశీలించాల్సిన అవసరం ఉంది అని అన్నారు.ఇక.. గోడ కూలిన ప్రమాద స్థలిలో విచారణ కమిషన్ రీ వెరిఫికేషన్ చేసింది. ఈ క్రమంలో ఈవో సుబ్బారావు, ఈఈ శ్రీనివాసరాజుపై త్రీమెన్ కమిటీ ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే వాళ్లు సరైన సమాధానాలు ఇవ్వలేకపోయారని తెలుస్తోంది. నోట్ ఫైల్, M బుక్, వర్క్ ఆర్డర్, మీటింగ్ మినిట్స్ వంటివి ఏవీ ఫాలో అయ్యారా....? అనే ప్రశ్నలకు అధికారులు తడబడ్డారు. ప్రసాదం స్కీం పై త్రిసభ్య కమిటీ ఇచ్చిన సి ఫార్సులు ఏమయ్యాయన్న ప్రశ్నకు వాళ్ల దగ్గరి నుంచి సరైన సమాధానాలు రాలేదు. మాస్టర్ ప్లాన్ నిబంధనలకు విరుద్ధంగా, ఎటువంటి అనుమతులు పొందకుండా గోడ నిర్మాణం చేసినట్టు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా మంగళవారం అర్ధరాత్రి దాటాకగోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విచారణ నిమిత్తం కూటమి ప్రభుత్వం మున్సిపల్ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ అధ్యక్షతన, ఈగల్ విభాగాధిపతి ఐజీ ఆకే రవికృష్ణ, జలవనరులశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎం.వెంకటేశ్వరరావు సభ్యులుగా త్రిసభ్య కమిటీని నియమించింది. -
సింహాచలం ఘటన.. ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం
విశాఖపట్నం, సాక్షి: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సింహాచలం ప్రమాద ఘటన జరిగిందని.. అలాంటిది ప్రభుత్వ అధికారులతోనే విచారణ జరిపిస్తే ఫలితం ఏముంటుందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. గురువారం సింహాచలంలో ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘చంద్రబాబు ఎప్పుడూ అధికారంలో ఉన్న ఇలాంటి సంఘటనలే జరుగుతున్నాయి. సింహాచలంపై జరిగిన బాధాకరం. జరిగిన ప్రమాదానికి ప్రభుత్వం నిర్లక్ష్యం. ప్రచార పిచ్చి ప్రమాదానికి కారణం అయింది. వీఐపీలకు దర్శనం కల్పించడం మీద ఉన్న శ్రద్ధ భక్తులకు సౌకర్యం కల్పించడంపై లేదు. ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరు చనిపోవడం చాలా బాధాకరం.మంత్రులు చందనోత్సవాన్ని చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా జరుపుతామన్నారు. సింహాచలంపై ఏడుగురు గురు భక్తులు చనిపోయిన సంఘటన ఎన్నడు జరగలేదు. మరణాలపై చంద్రబాబు చాలా తేలికగా మాట్లాడుతున్నారు. మరణాలపై ఆయనకు చీమ కుట్టినట్లు కూడా లేదు. మరణాలపై ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం. సింహాచలం ప్రమాద ఘటనపై ప్రభుత్వ అధికారులతో విచారణ జరిపితే ఏమి లాభం?. ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణ ఎందుకు వేయలేదు. జ్యుడీషియల్ కమిటీతో విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయి. అందుకే వైఎస్సార్సీపీ తరఫున మేం డిమాండ్ చేస్తున్నాం. కమిటీ ముందు కాంట్రాక్టర్ నిజాలు చెప్పాడు. నాలుగు రోజుల్లో గోడ కట్టామని చెప్పారాయన. ఆ గోడకు డిజైన్, టెండర్ లేవు. కాంట్రాక్టర్ పై ఒత్తిడి చేసిన వాళ్ళు ఎవరో తెలియాలి. దేవాలయాలు భక్తులు అంటే చాలా నిర్లక్ష్యం కనిపిస్తుంది. చంద్రబాబు ఎప్పుడూ అధికారంలో ఉన్న ఇలాంటి సంఘటనలే జరుగుతున్నాయి. కొండపై 7 మంది చనిపోతే కనీసం శుద్ధి చేయాలనే ఆలోచన ఉండాలి కదా. మరణాలు తరువాత సంప్రోక్షణ చేయడం మన సంప్రదాయం. ప్రమాద ఘటనపై పరామర్శకు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎందుకు రాలేదు?. జనసేన కార్యకర్త అయితేనే పవన్ పరామర్శ చేస్తారా?. మిగతా వారిని పరామర్శించరా?.ప్రభుత్వంలో ఉండి మీరు చేయాల్సిన పనిని వైఎస్ జగన్ చేస్తున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. చనిపోయిన వారి కుటుంబాలకు పార్టీ తరుపున 2 లక్షల రూపాయలు ఆర్ధిక సాయం అందిస్తున్నాం అని బొత్స అన్నారు. -
సింహాచలం ఘటన: సంచలన విషయాలు చెప్పిన కాంట్రాక్టర్
విశాఖ: సింహాచలం పుణ్యకేత్రంలో గోడ కూలి ఏడుగురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. అయితే వారం రోజుల వ్యవధిలో గోడ కట్టడం కారణంగానే ఈ దారుణం చోటు చేసుకుంది. దీనిపై గోడ కట్టిన కాంట్రాక్టర్ లక్ష్మణరావు సంచలన విషయాలు వెల్లడించారు. ఈ దుర్ఘటనపై ఏర్పాటు చేసిన కమిటీ విచారణ చేపట్టగా కాంట్రాక్టర్ లక్ష్మణరావు సంచలన నిజాలు బయటకు చెప్పారు. చందనోత్సవానికి సమయం చాలా తక్కువ సమయం ఉందని, తాను గోడ కట్టనని చెబితే బలవంతంగా ఆ గోడను కట్టించారన్నారు. దేవస్థానం, టూరిజం అధికారులు బలవంతంగా తన చేత గోడ కట్టించారని కమిటీ విచారణ సందర్భంగా లక్ష్మణరావు వెల్లడించారు.ఆరు రోజుల వ్యవధిలో ఒక గోడ కట్టడం సాధ్యం కాదని ముందే చెప్పానని, కేవలం నాలుగు రోజుల ముందే గోడ పనులు మొదలు పెట్టాననన్నారు. టెంపరరీ గోడ అని చెప్పడంతోనే గోడ కట్టానన్నారు లక్ష్మణరావు. ఇద్దరిలో ఎవరు నిజం చెప్తున్నారు..?గోడ కట్టే సమయంలో ఇంజినీర్ లేరని కాంట్రాక్టర్ లక్ష్మణరావు చెప్పగా, ఇంజినీర్ అక్కడే ఉన్నారని అధికారులు చెప్పారు. దాంతో కమిటీ సభ్యుల్లో అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంతకీ ఇంజినీర్ ఉన్నాడా.. లేడా అని నిలదీశారు. ఇద్దరిలో ఎవరు చెప్పేది నిజం అని కమిటీ ప్రశ్నించింది. కాగా, సింహాచలం చందనోత్సవంలో గోడ కుప్పకూలి ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. రూ.300 టికెట్ కౌంటర్ వద్ధ ఈ ప్రమాదం జరిగింది. ఇటీవలే అక్కడ గోడ నిర్మించారు. గోడ నాసిరకంగా నిర్మించడం వలనే కూలిపోయిందని అధికారులు భావిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున 2-3 గంటల మధ్య రూ.300 క్యూ లైన్లో ప్రమాదం జరిగింది. మృతులను యడ్ల వెంకటరావు(48),దుర్గా స్వామినాయుడు(32), మణికంఠ(28)గా గుర్తించారు.ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతులను విశాఖపట్నం మధురవాడ సమీపంలోని చంద్రంపాలెం గ్రామానికి చెందిన పిళ్లా ఉమామహేశ్వరరావు (30), ఆయన భార్య శైలజ (26)గా అధికారులు గుర్తించారు. వీరితో పాటు పిల్లా శైలజ తల్లి వెంకటరత్నం, మేనత్త గుజ్జురి మహాలక్ష్మి కూడా ఈ ఘటనలో మృతిచెందారు. -
సింహాచలంలో ప్రమాద స్థలిని పరిశీలించిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, విశాఖపట్నం: సింహాచలంలో ప్రమాద స్థలిని వైఎస్సార్సీపీ నేతలు పరిశీలించారు. గోడ కూలిన ప్రాంతాన్ని మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ పరిశీలించారు. అనంతరం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే ప్రమాదం జరిగిందన్నారు. ఇవి ముమ్మూటికీ ప్రభుత్వ హత్యలేనని మండిపడ్డారు.కాగా, భక్తుల ప్రాణాలతో కూటమి నేతలు చెలగాటమాడుతున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులపైనే దృష్టి పెట్టిన కూటమి నేతలు.. భక్తుల భద్రతను గాలికి వదిలేశారనే విమర్శలు వస్తున్నాయి. తూతూ మంత్రంగా చందనోత్సవ సమీక్షలు నిర్వహించిన కూటమి నేతలు.. కార్పొరేటర్లతో క్యాంపు రాజకీయాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు కొనుగోలుపై ప్రత్యేక దృష్టి పెట్టారు.మేయర్ డిప్యూటీ మేయర్ పదవుల కైవసంపై ప్రతి రోజు ప్రత్యేక సమావేశాలు నిర్వహించిన కూటమి నేతలు.. అడ్డదారిలో పదవుల కోసం హోటల్లో రోజు ప్రత్యేక మంతనాలు జరిపారు. మేయర్ డిప్యూటీ మేయర్ పదవులపై చూపిన శ్రద్ధ భక్తుల భద్రతపై చూపకపోవడంతో కూటమి నేతల తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. -
ప్రభుత్వమే చంపేసింది
అన్యోన్యంగా ఉండే ఆ సాఫ్ట్వేర్ దంపతులు ఎక్కడికైనా కలిసే వెళ్లేవారు..అలా వీరి ఆనందానికి తోడుగా యువతి తల్లి, మేనత్త కూడా బయల్దేరారు..సొంత కాళ్లపై నిలదొక్కుకున్న ఆ కుర్రాడు స్నేహితుడితో కలిసి వచ్చాడు.. కుమారులు స్థిరపడడంతో జీవితంలో నిశ్చింతగా ఉన్నాడు ఆ ఉద్యోగి....ఇలా చీకూచింత లేని వీరంతా అప్పన్న నిజరూపాన్ని దర్శించుకుని తరించాలని భావించారు. కానీ, గోడ మృత్యు రూపంలో ఎదురొచ్చింది. కూలి.. జీవితాలను కుప్పకూల్చింది.. ..తన ఇంటితో పాటు భర్త లేని చెల్లెలు కుటుంబానికి అండగా ఉంటున్న యువకుడిని బలిగొంది..కుమారుడికి రేపోమాపో పెళ్లి చేయాలనుకుంటున్న తండ్రికి తీరని గుండెకోతను మిగిల్చింది..పిల్లలు ఉద్యోగ రీత్యా దూరంగా ఉన్నప్పటికీ భర్తను చూసుకుంటూ ఉన్న భార్యను కుదేలు చేసింది.....ఇప్పుడు ఈ కుటుంబాల మాట ఒక్కటే.. అప్పన్నా ఇక మాకు దిక్కెవరు అని?మధురవాడ, డాబా గార్డెన్స్/ఆరిలోవ (విశాఖ)/అంబాజీపేట: ‘‘మా పిల్లలు, బంధువులను ప్రభుత్వమే చంపేసింది. చందనోత్సవం పుణ్యమా అని సర్కారు మమ్మల్ని రోడ్డు పాల్జేసింది. మా కుటుంబాలలో నిరాశ నింపింది. ఎన్నికల్లో మా అబ్బాయి ఉమామహేశ్వరరావు బంధువులందరితో టీడీపీకి ఓటు వేయించాడు. చివరకు ఆ ప్రభుత్వమే నా కొడుకు, కోడల్ని పొట్టన పెట్టుకుంది’’ అని సింహాచలం ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఉమామహేశ్వరరావు తండ్రి అప్పలనాయుడు, తల్లి శాంతి గుండెలు బాదుకుంటూ విలపించారు. ‘‘సింహాచలం కొండపై నాణ్యత లేని గోడ కట్టారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారు. మా వాళ్ల ప్రాణాలు తీయడానికే అక్కడ గోడ నిర్మించారు. అధికారులు, కాంట్రాక్టర్ను జైలుకు పంపాలి. ప్రభుత్వం నియమించిన కమిటీ ఏమైంది? గోడ పనుల్లో నాణ్యత చూడలేదా?’’ అని శాంతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం మధురవాడ చంద్రంపాలేనికి చెందిన పిల్లా ఉమామహేశ్వరరావు (30), శైలజ (28) దంపతులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. వీరికి 2022 నవంబరులో వివాహమైంది. ఉమా మహేశ్వరరావు హైదరాబాద్ హెచ్సీఎల్లో, శైలజ విశాఖ ఇన్ఫోసిస్లో ఉద్యోగులు. అయితే, విశాఖలోని నివాసానికి సమీపంలో ఓ ఫ్లాట్ తీసుకుని అక్కడినుంచే పనిచేస్తున్నారు. అన్యోన్యమైన ఈ జంటకు దైవ భక్తి ఎక్కువ. ఎక్కడికైనా కలిసే వెళ్తారు. తరచూ టూర్లు వేస్తుంటారు. ఇటీవలే ఊటీ, కొడైకెనాల్, పలు ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్లి వచ్చారు. వీకెండ్స్ కచ్చితంగా ఏదో ఒక గుడికి వెళ్తారు. బుధవారం రాత్రి 9.30 ప్రాంతంలో మహేష్, శైలజ సింహాచలం బయల్దేరారు. ఇది తెలిసి హెచ్బీ కాలనీలో ఉండే శైలజ తల్లి వెంకటరత్నం (45), మేనత్త గుజ్జారి మహాలక్ష్మి (60) కూడా వారితో పయనమయ్యారు. అప్పన్నను కళ్లారా చూసే తరుణం ఆసన్నం కాగా గోడ రూపంలో మృత్యువు కబళించింది. కుమారుడి మరణ వార్త తెలిసి అప్పలనాయుడు, శాంతి హతాశులయ్యారు. తమ కుటుంబంలోని నలుగురిని ఆ దేవుడు ఒకేసారి తీసుకుపోయాడంటూ రోదించారు. ఉమామహేశ్వరరావు, శైలజ దంపతులు మంచి ఉద్యోగాలతో స్థిరపడుతున్న సమయంలో అర్థంతరంగా తనువు చాలించడం వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. చంద్రంపాలెంలో విషాద ఛాయలు అలముకున్నాయి.రోడ్డునపడ్డ రెండు కుటుంబాలుఉమామహేశ్వరరావు కుటుంబంలో అతడే పెద్ద దిక్కు. మూడేళ్ల కిందట భర్తను కోల్పోయిన చెల్లి చంద్రకళ ఇద్దరు ఆడపిల్లలతో పుట్టింట్లోనే ఉంటోంది. అలా రెండు కుటుంబాలకు ఇతడే ఆధారం. ఉమా మహేశ్వరరావు మృతితో రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయి.పెళ్లి చేద్దామనుకుంటుండగా..‘‘విశాఖలో ఇంటీరియర్ వర్క్స్ చేస్తూ పాతిక మందికి ఉపాధి కల్పిస్తున్నా నాన్నా అని మా అబ్బాయి చెప్పేవాడు. దీనికి ఎంతో సంబరపడేవాడిని. వివాహం జరిపించాలనుకునే సమయంలో దేవుడు తీసుకుపోయాడంటూ’’ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట కొర్లపాటివారిపాలెంకు చెందిన పత్తి దుర్గాస్వామినాయుడు (28) తండ్రి వీర వెంకట సత్యనారాయణ బోరున విలపించాడు. దుర్గాస్వామి విశాఖ సీతమ్మపేటలో ఉంటూ.. సీతమ్మధారలో న్యూ డైమండ్ ఇంటీరియర్స్ దుకాణం నడుపుతున్నాడు. సింహాద్రి అప్పన్న నిజ రూప దర్శనానికి తమ ఊరికే చెందిన స్నేహితుడు కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు (శివ) (33)తో కలిసి వెళ్లాడు. గోడ కూలిన ఘటనలో ఇద్దరూ మృత్యువాతపడ్డారు.అధికారుల నిర్లక్ష్యం వల్లే నా భర్త ప్రాణాలు పోయాయి‘‘సింహాచలంలో ఆ గోడ ఇప్పుడు ఎందుకు కట్టారో. నా భర్త ప్రాణాలు తీయడానికేనేమో? వారం క్రితమే నిర్మించారని అందరూ అంటున్నారు. అదీ సరిగా కట్టలేదట. అధికారులు ఏమయ్యారు. వారి నిర్లక్ష్యం వల్లే నా భర్త ప్రాణాలు పోయాయి. ఇప్పుడు నేను ఎలా బతకాలి’’ అని స్టీల్ ప్లాంట్ స్టీల్ మెల్ట్ షాప్ విభాగం ఉద్యోగి, విశాఖ పాత అడవివరంనకు చెందిన ఎడ్ల వెంకటరావు భార్య మహాలక్ష్మి రోదించారు. పల్పెట్ ఆపరేటర్గా అందరితో కలివిడిగా ఉండే వెంకటరావు మృతి చెందడాన్ని సహోద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. చందనోత్సవ స్వామి దర్శనానికి భార్యతో కలిసి వెళ్దామని అనుకున్నా.. చివరకు ఒక్కడే బయల్దేరారు. ‘‘ఒంటరిగా వెళ్లారు. మమ్మల్ని వదిలేశారంటూ’’ మహాలక్ష్మి రోదించిన తీరు కంటతడి పెట్టించింది. మహాలక్ష్మి అడవివరం దగ్గర్లోని రెసిడెన్షియల్ స్కూల్లో హెల్త్ విభాగంలో పనిచేస్తున్నారు. వీరీ ఇద్దరు కుమారులు బెంగళూరులో ఉంటున్నారు. ఒకరు ఇంజనీర్ కాగా.. మరొకరు డాక్టర్. ఇటీవలే డాక్టర్కు వివాహం చేశారు. ఇక వెంకట్రావు సోదరుడు.. ‘‘ఎవరూ లేని నాకు అన్నయ్యే దిక్కు. ఆయన నన్ను వదిలిపోయాడంటూ’’ రోదిస్తూ సొమ్మసిల్లాడు.డాడీ.. నీ పేరిట అన్నదానం చేయిస్తా అన్నాడు..ఈశ్వర శేషారావు మెట్రో కమ్ కంపెనీలో ఫుడ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేశాడు. తల్లిదండ్రులు కూలి పనులు చేస్తుంటారు. ఎదిగొచ్చిన కుమారుడు ఉద్యోగం చేసి ఆదుకుంటాడని అనుకుంటున్న సమయంలో కానరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ శేషారావు తండ్రి శ్రీనివాసరావు, తల్లి సీతామహాలక్ష్మి రోదించారు. ‘మంగళవారం రాత్రి ఫోన్ చేసి డాడీ.. నీ పేరిట సింహాచలం దేవస్థానంలో అన్నదానం చేస్తున్నా అని చెప్పాడు. తెల్లవారేసరికి మాకు దూరమయ్యాడు’ అని వాపోయారు.చందనోత్సవం ముందు పనులు చేయడమేంటి?ఏటా చందనోత్సవానికి వేలాదిమంది భక్తులు వస్తారని తెలుసు. అయినా దర్శనాల తేదీ దగ్గరగా ఉన్న సమయంలో పనులు చేయడం ఏమిటి? ఒకవేళ చేసినా ప్రమాదం ఉందని గ్రహిస్తే వేరే దారిలో భక్తులను పంపించాలి కదా. పోయిన ప్రాణాలను ఎవరు తెస్తారు? ఆ కుటుంబాలకు దిక్కెవరు?– ఐ.నరసయ్యమ్మ, ఉమామహేశ్వరరావు సమీప బంధువుభక్తిభావంతో మెలిగేవారుమహాలక్ష్మి ఎంతో భక్తిభావంతో మెలిగేవారు. అలాంటి వారి ఇంట ఇంత ఘోరమైన దుర్ఘటన జరగడం హృదయాన్ని కలిచివేస్తోంది.– పొట్నూరి సూర్యకుమారి, వెంకోజీపాలెంకళ్లముందు పెరిగిందిమధురవాడలో ఉంటున్న సాఫ్ట్వేర్ దంపతుల మృతుల్లో ఒకరైన శైలజ వెంకోజీపాలెం శెట్టిబలిజ వీధికి చెందిన పైలా కనకరావు, వెంకటరత్నం కుమార్తె. మా కళ్ల ముందు పుట్టి పెరిగిన అమ్మాయి. మూడేళ్ల క్రితమే పెళ్లయ్యింది. ఇంతలోనే ఇంత విషాదం జరిగింది. –అప్పలనర్సమ్మ, శెట్టిబలిజ వీధిప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం : సీపీఎంఇటీవల నిర్మించిన గోడ అత్యంత నాసిరకంగా ఉందని, చిన్న వర్షానికే కూలిపోయిందంటే ఇందులో ఎంత అవినీతి జరిగిందో అధికారులు, ప్రభుత్వం పాత్ర ఎంత ఉందో అర్థమవుతోందని సీపీఎం విశాఖ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బి.గంగారావు అన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు, ఎమ్మెల్యే, ఎంపీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుపతి ఘటన నుంచి ప్రభుత్వం ఏమాత్రం గుణపాఠం నేర్చుకోలేదని.. ఘటనకు పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. సింహాచలం చందనోత్సవం ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, బాధిత కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉపాధి కల్పించాలన్నారు.రూ.కోటి పరిహారం ఇవ్వాల్సిందే : సీపీఐసింహాచలం చందనోత్సవం విశాఖ ప్రజలకు విషాదాన్ని మిగిల్చిందని సీపీఐ విశాఖ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి నష్ట పరిహారం, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ చేసి, కారకులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
చంద్రబాబే బాధ్యుడు: వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సింహాచలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గోడ కూలి ఏడుగురు మృతి చెందిన ఘటనలో పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదేనని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. దాదాపు ఏడాది కాలంగా గుడులు, గోపురాల్లో జరుగుతున్న ఘటనలన్నింటిలో చంద్రబాబే అసలు దోషి అని మండిపడ్డారు. వైకుంఠ ఏకాదశి, చందనోత్సవం ఎప్పుడు జరుగుతాయో ముందే తెలిసినప్పటికీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోక పోవడం చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ధ్వజమెత్తారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు, ఇప్పుడు ఇక్కడ చందనోత్సవం సందర్భంగా గోడ కూలి ఏడుగురు చనిపోవడంలో ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం కళ్లకు కడుతోందని చెప్పారు. సింహాచలం ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు. మొత్తం ఏడుగురు చనిపోగా, ఇందులో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు. చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకు మంచి జరగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. మృతులు పిల్లా ఉమామహేశ్వరరావు, పిల్లా శైలజ కుటుంబ సభ్యులను చంద్రంపాలెం వద్ద ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సింహాచలంలో చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో.. ఎంత మంది భక్తులు వస్తారో తెలిసినా కనీస ఏర్పాట్లు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత ముఖ్యమైన గోడను ముందే ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. 70 అడుగుల పొడవు, 10 అడుగుల ఎత్తున గోడను నాలుగు రోజుల్లో నిర్మాణం పూర్తి చేశారని, ఏమాత్రం నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని ధ్వజమెత్తారు. గాలికి ఫ్లెక్సీ ఊగినట్లు ఈ గోడ కూలిపోయే ముందు ఊగిందని భక్తులు చెబుతున్నారంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో అర్థం అవుతోందన్నారు. ‘ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? మంత్రుల పర్యవేక్షణ ఏమైంది? ఐదుగురు సభ్యుల కమిటీ ఏం చేసింది? టెండర్లు పిలవకుండానే ఇంత పెద్ద గోడ ఎలా నిర్మించారు? కాంక్రీట్ గోడ (రీ ఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ వాల్) కట్టాల్సిన చోట ఫ్లైయాష్ ఇటుకలతో నిర్మించారు. ఎక్కడా కాలమ్స్ లేవు. ఏ మాత్రం నాణ్యత పాటించ లేదు. ఇలాగైతే ఆ గోడ ఎలా నిలబడుతుంది? రెండు రోజుల క్రితం పూర్తయిన ఈ గోడ పక్కనే అంత మంది భక్తులను ఎలా నిలబెట్టారు? ఫలితంగా ఆ గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం దారుణం’ అని నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. బాబు పాలనలో అన్నీ దారుణాలే.. చంద్రబాబు పాలన ప్రారంభమైనప్పటి నుంచి అన్నీ దారుణాలే జరుగుతున్నాయి. రాజకీయాల కోసం తిరుమల శ్రీవారి ప్రసాదంపై దు్రష్పచారం చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కనీస ఏర్పాట్లు చేయడంలో విఫలం కావడం వల్లే తిరుపతిలో భక్తుల మధ్య తొక్కిసలాట జరిగి ఆరుగురు చనిపోయారు. భద్రతా సిబ్బందిని చంద్రబాబు పర్యటనకు కుప్పం పంపారు. అదే సమయంలో తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం వచి్చన భక్తులందరినీ ఓ పార్కులోకి పంపారు. వారందరినీ ఒక్కసారిగా వదలడం వల్ల తొక్కిసలాట జరిగింది. గోశాలలో ఆవులు పెద్ద ఎత్తున మృత్యువాత పడ్డాయి. వైఎస్సార్ జిల్లా కాశినాయన క్షేత్రాన్ని కలెక్టర్ సమక్షంలోనే బుల్డోజర్లతో కూల్చి వేశారు. శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మంలో తాబేళ్లు మృత్యువాత పడ్డాయి. చంద్రబాబు గత పాలనలో గోదావరి పుష్కరాల సందర్భంగా ఆయన ప్రచార ఆర్భాటం కోసం భక్తులను గుంపుగా వదలడం వల్ల తొక్కిసలాట జరిగి 29 మంది మృత్యువాత పడ్డారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు చంద్రబాబు వస్తారు.. ఎంక్వైరీ వేస్తున్నామంటారు. తీరా ఎలాంటి చర్యలూ ఉండవు. ఎందుకంటే ఆయా ఘటనలన్నింటికీ చంద్రబాబే బాధ్యుడు కాబట్టి. తిరుపతి క్యూలైన్లలో తొక్కిసలాట ఘటనలో తూతూ మంత్రంగా కంటి తుడుపు చర్యలు తీసుకున్నారు. పైగా వాటన్నిటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అందుకు సంబంధించిన ఏ అధికారికైనా ఉద్యోగాలు పోతాయి.. యూనిఫాం పోతుందని ఒంట్లో భయం ఉండాలి. అప్పుడే క్రమశిక్షణ ఉంటుంది. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడటం ఆగిపోతుంది. పశ్చాత్తాపం ఉండాలి» ఈ ఫొటో చూడండి.. ఎక్కడైనా కాలమ్స్ కనిపిస్తున్నాయా చెప్పండి? 10 అడుగుల ఎత్తు.. 70 అడుగుల పొడవున్న గోడ కూలిపోయేటప్పుడు ఫ్లెక్సీ మాదిరిగా ఊగిందని చెబుతున్నారు. ఏం నిర్మాణం చేశారు? ఏ రకంగా పని చేయిస్తున్నారు? జగన్ ఇచ్చే లోపే ఆ కుటుంబాలకు రూ.కోటి ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నా. బాధ్యులపై, బాధ్యత తీసుకున్న మంత్రులపై, ఆలయాన్ని నడిపే బాధ్యతలో ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఇటువంటివి పునరావృతం కావు.» ప్రతీదీ డైవర్షన్ పాలిటిక్సే.. ఎక్కడా కూడా తప్పు చేశామన్న పశ్చాత్తాపం వీళ్లలో కనిపించడం లేదు. చంద్రబాబులో అది ఎక్కడా కనిపించదు. నేను ఇక్కడకు వస్తున్నానని తెలుసుకుని మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం, ఒక ఉద్యోగం ప్రకటించారు. ప్రభుత్వం అనేది ప్రజలకు భరోసా ఇచ్చేలా ఉండాలి. ప్రజలకు తోడుగా ఉండాలి.» ఏదైనా ప్రమాదం జరిగి ప్రజలు చనిపోతే.. ప్రభుత్వంలో ఉన్నవారు పశ్చాత్తాపం చెందాలి. మనం ఆ కుటుంబానికి ఏం చేస్తున్నామనేది మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. మన ప్రభుత్వంలో ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ఒక్కొక్క కుటుంబానికి రూ.కోటి ఇచ్చి ఆదుకున్నాం. ప్రభుత్వం చేసిన తప్పు వల్ల ఈ ఘటన జరిగినప్పుడు ఆ కుటుంబానికి నువ్వేం చేస్తున్నావ్ చంద్రబాబూ? నేను ఒకటే చెబుతున్నా.. మీరు ఇచ్చినా.. ఇవ్వకపోయినా.. ఈ కుటుంబాల్ని గుర్తు పెట్టుకుంటున్నాను. మేం మళ్లీ అధికారంలోకి వచి్చన తర్వాత రూ.కోటికి మిగిలిన బ్యాలెన్స్ నేను ఇప్పిస్తాను. » ఈ కార్యక్రమంలో మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, విశాఖ, అనకాపల్లి జిల్లాల అధ్యక్షులు కేకే రాజు, గుడివాడ అమర్నాథ్, భీమిలి ఇన్చార్జ్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, తలశిల రఘురాం, జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, మాజీ ఎంపీ బొడ్డేటి మాధవి, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొన్నారు.ఈ గోడ ఎవరు కట్టారో తెలియదట! ప్రతి చోటా నిర్లక్ష్యమే. ప్రతిచోటా డైవర్షన్ పాలిటిక్సే. డైవర్షన్ పాలిటిక్స్ ఏ స్థాయిలో దిగజారిపోయాయో మంత్రుల ప్రకటనలు చూస్తేనే అర్థమవుతోంది. సింహాచలం ఘటనలో మంత్రులు మొదటగా ఏమన్నారంటే.. ఈ గోడ ఎవరి హయాంలో.. ఎవరు కట్టారో చూడాలని మాట్లాడారు. వారి తీరు చూస్తే.. వేరే వాళ్లపై నెట్టేసేందుకేనని అర్థమవుతోంది. వాళ్ల హయాంలోనే వారం రోజుల క్రితమే గోడ కట్టారని ఎప్పుడైతే తెలుసుకున్నారో.. గోడ పిల్లర్లతో కట్టారో.. సిమెంట్తో కట్టారో.. బ్రిక్స్తో కట్టారో అనేది మాకు తెలీదని మాట్లాడుతున్నారు.ఏమీ తెలుసుకోకపోతే.. ముందస్తు ఏర్పాట్ల పేరుతో మంత్రుల కమిటీ పేరుతో ఎందుకు ఇక్కడికి వచ్చారు? మీ సమక్షంలోనే ముందస్తు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఈ గోడ ఎందుకు కట్టారు? 70 అడుగుల పొడవు.. 10 అడుగుల ఎత్తుతో ఒక్క కాంక్రీట్ పిల్లర్ కూడా లేకుండా గోడ ఎందుకు కట్టించారు? చందనోత్సవం జరిగిన ప్రతిసారీ వర్షం పడింది. కొత్త గోడ అని తెలిసి.. వర్షం పడుతుందని తెలిసినప్పుడు ఈ గోడ పక్కన ఎందుకు భక్తుల్ని ఉంచారు?అండగా ఉంటాం..మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ భరోసా రూ.కోటి పరిహారం వచ్చేలా చూస్తామని హామీమధురవాడ (విశాఖ): చందనోత్సవంలో గోడ కూలి మృతి చెందిన ఉమా మహేశ్వరరావు, శైలజ కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం మధురవాడ చంద్రంపాలెం ఎన్జీవోస్ కాలనీ శ్మశాన వాటిక వద్ద పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. వైఎస్ జగన్ను చూసి మృతుల బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఆయన బాధితులతో మాట్లాడారు. వారు ఎన్ని గంటలకు దేవస్థానానికి వెళ్లారు.. ప్రమాదం ఎలా జరిగింది.. పిల్లలు ఎంత మంది.. పరిహారం ఎంత ఇస్తున్నారు.. తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు.తాము రూ.కోటి అడిగామని, రూ.25 లక్షలు, ఉద్యోగం ఇస్తామని మంత్రులు చెప్పారన్నారు. అది ప్రభుత్వ ఉద్యోగమా.. ప్రైవేటు ఉద్యోగమా అని అడగ్గా.. ప్రభుత్వ ఉద్యోగమేనని చెప్పారు. తమ కుటుంబాన్ని అన్ని విధాలుగా పోషించే వ్యక్తి చని పోయాడని, మూడేళ్ల క్రితం అల్లుడు కూడా చనిపోయాడని, చెల్లి పిల్లలను కూడా తమ కొడుకే సాకుతున్నాడని ఇప్పుడు అతడు కూడా చనిపోయాడని మృతుడి తల్లిదండ్రులు అప్పలనాయుడు, శాంతి గుండెలవిసేలా రోదిస్తూ చెప్పారు. తాము అండగా ఉంటామని, రూ.కోటి పరిహారం వచ్చేలా చూస్తామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. బాధితుల తరఫున గట్టిగా మాట్లాడతామని పేర్కొన్నారు. -
జగన్ వస్తున్నారని తెలిసి ప్రభుత్వంలో వణుకు
ఆరిలోవ/డాబాగార్డెన్స్: సింహాచలం ఘటన గురించి తెలిసిన వెంటనే వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖకు బయలుదేరారన్న సమాచారం అందుకున్న ప్రభుత్వం కలవరపాటుకు గురైంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతారని వణికిపోయింది. వైఎస్ జగన్ కేజీహెచ్ మార్చురీకి చేరుకునేలోపే మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి వారి బంధువులకు అప్పగించేందుకు రాష్ట్ర హోం మంత్రి అనిత పడరాని పాట్లు పడ్డారు. పోస్టుమార్టంకు అంగీకరిస్తూ సంతకాలు చేయాలంటూ బాధిత కుటుంబాల కాళ్లావేళ్లాపడ్డారు.శవపంచనామాకు సహకరించాలని, ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారంతోపాటు రూ.కోటి పరిహారం అందేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మొరపెట్టుకున్నారు. తమను నమ్మాలని ప్రాధేయపడ్డారు. అయినా మృతుల కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. వారం రోజుల్లోనే నాణ్యత లేకుండా గోడ నిర్మించి తమ కుటుంబీకుల మరణానికి కారణమైన ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదంటూ భీష్మించారు. రాతపూర్వకంగా ఇవ్వాలని, లేదా మీడియా ముందు స్పష్టంగా ప్రకటించాలని తేల్చిచెప్పారు. దీంతో ఏం చేయాలో పాలుపోని హోంమంత్రి అనిత వైఎస్ జగన్ వచ్చేలోపే పోస్టుమార్టం పూర్తిచేసి మృతదేహాలను బంధువులకు అప్పగించాలని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద్తోపాటు పోలీసు అధికారులను ఆదేశించారు. వారి చేత మృతుల కుటుంబాలపై తీవ్ర ఒత్తిడి చేయించారు. మృతులు భీమిలి నియోజకవర్గం వారు కావడంతో వారిని ఒప్పించాలని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుయాయులనూ బతిమిలాడారు. ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్రాజు కూడా మృతుల కుటుంబ సభ్యులకు నచ్చజెప్పేందుకు శతవిధాలా యత్నించారు. చివరకు సంతకాలు లేకుండానే మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తిచేయించారు. సింహాచలం ఘటన గురించి విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ పట్టించుకోలేదు. సింహాచలం దేవస్థానం వైపు కన్నెత్తి చూడలేదు. -
మృతదేహాల వెలికితీతలోనూ నిర్లక్ష్యమే
సాక్షి, విశాఖపట్నం: సింహగిరిపై ఊహకందని విషాదం సంభవించింది. గోడ కూలిన విషయం సింహగిరి మొత్తం దావానలంలా వ్యాపించింది. అదే సమయంలో ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు, మంత్రులు, ఎమ్మెల్యేలు దర్శనాల కోసం బారులుతీరారు. శిథిలాల కింద భక్తులు చిక్కుకున్న విషయం తెలిసినా.. తమకేమీ సంబంధం లేదన్నట్లు వ్యవహరించారు. తమ వారు రూ.300 టికెట్ తీసుకుని దర్శనం కోసం వెళ్లారని, వారి సమాచారం కావాలంటూ భక్తులు కోరుతున్నా సమాధానం చెప్పే వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. ఈ ఘటన బయటకు పొక్కనివ్వకుండా జాగ్రత్తపడేందుకు యత్నించారే తప్ప.. వీలైనంత త్వరగా సహాయక చర్యలు పూర్తి చేసి పరిస్థితి చక్కదిద్దుదామన్న ఆలోచన అధికారులు, ప్రజాప్రతినిధులకు రాలేదు. వీఐపీ దర్శన మార్గానికి 50 మీటర్ల దూరంలో గాలిగోపురానికి సమీపంలో దుర్ఘటన జరిగింది. ప్రజాప్రతినిధులు వెళ్తున్న సమయంలోనే పోలీసులు, వైద్య సిబ్బంది అటుగా పరుగులు తీశారు. దాన్ని చూసిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం జరిగిందని వాకబు చేశారు. విషయం తెలుసుకుని ఆగకుండా దర్శనానికి వెళ్లిపోయారు.కంట్రోల్ రూమ్ ఎక్కడ? ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బాధిత కుటుంబాల వారు సమాచారం కోసం ఎదురు చూస్తుంటారు. ఇందుకోసం వెంటనే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తుంటారు. కానీ.. ప్రమాదం సంభవించి ఏడుగురు మృత్యువాతపడినా అధికారుల్లో కనీస చలనం లేదు. తమ వారు ఎక్కడున్నారో.. ఏమైపోయారో తెలీక.. చాలామంది భక్తులు నానాఅవస్థలు పడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే రూ.300 టికెట్ క్యూలైన్లో ఉన్న వారంతా చెల్లాచెదురయ్యారు. కొండపై మొబైల్ సిగ్నల్ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యుల జాడ తెలియక ఆందోళన చెందారు. కొందరు భక్తులు కంట్రోల్ రూమ్ ఏమైనా ఏర్పాటు చేశారా? అని అడిగితే.. జిల్లా అధికారులు స్పందించలేదు. అక్కడున్న అధికారుల్ని తమ వారి జాడ గురించి అడిగితే.. తమకేమీ సంబంధం లేదన్నట్లు సమాధానమిచ్చారు. ఓ వలంటీర్ తన కుటుంబ సభ్యుల్ని 2 నిమిషాల ముందే ఆ లైన్లో చూశాననీ, ప్రమాదం జరిగిన తర్వాత వాళ్లు కనిపించడం లేదంటూ కన్నీటిపర్యంతమైనా.. తోటి వలంటీర్లు ఓదార్చి వారి జాడ కోసం ప్రత్యేక బృందంగా ఏర్పడి వెతకాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆంక్షలు.. ఆగ్రహావేశాలు చందనోత్సవ సమయంలో ఏర్పాట్ల విషయంలో విఫలమైన ప్రభుత్వం.. ఘోరం జరిగినా అంతే నిర్లక్ష్యంతో వ్యవహరించింది. అపశ్రుతి చోటుచేసుకుని ఏడుగురు మరణించారన్న విషయాన్ని బయటకు పొక్కనివ్వకుండా చేసేందుకు మంత్రులు, అధికారులు విశ్వ ప్రయత్నం చేశారు. హోం మంత్రి అనిత ఘటనాస్థలానికి వెళ్లే ప్రాంతంలో పహారా కాశారు. కనీసం మీడియా ప్రతినిధులు వెళ్లేందుకు కూడా వీల్లేదని హుకుం జారీ చేశారు. కొందరు వెళ్లేందుకు ప్రయత్నించినా హోంమంత్రి తన సిబ్బందితో కలిసి అడ్డుకున్నారు. అయినా ఈ విషయం అక్కడకు వచ్చిన భక్తులకు తెలిసిపోవడంతో హోంమంత్రి అసహనం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తర్వాత క్యూలైన్లలోనూ ఆంక్షలు విధించడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. బస్సులు లేక అగచాట్లు మరోవైపు ప్రమాదం సంభవించిన తర్వాత ఘాట్రోడ్డు నుంచి భక్తుల్ని అనుమతించడం నిలిపేశారు. వేకువజామున 4 గంటల నుంచి 7 గంటల వరకూ బస్సుల్ని పైకి పంపించకపోవడంతో కొండ దిగువనే భక్తులు నిలిచిపోయి అవస్థలు పడ్డారు. మరోవైపు.. అర్ధరాత్రి నుంచి స్వామి దర్శనం కోసం కొండపైకి వచ్చిన భక్తులు తిరిగి వెళ్లేందుకు కూడా బస్సులు లేకపోవడంతో అగచాట్లు ఎదుర్కొన్నారు. ఉదయం 7 గంటల తర్వాత బస్సుల రాకపోకలు ప్రారంభించడంతో వాటిని అందుకునేందుకు యుద్ధాలే చేయాల్సిన దుస్థితి దాపురించింది. గోడ ఎలా కట్టారో మాకెలా తెలుస్తుంది? మృతదేహాల్ని కేజీహెచ్కు తరలించిన తర్వాత ప్రమాద స్థలాన్ని హోం మంత్రి అనిత పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ..‘అక్కడ గోడ ఉంది. అది పిల్లర్తో కట్టారా... సిమెంట్తో కట్టారా... ఇటుకలతో కట్టారా... అనేది మేమెవరం చూసుకోం..’ అని వ్యాఖ్యానించారు. ‘మేమూ వర్షంలో తడుస్తూనే దర్శనం చేసుకున్నాం. అయినా.. ఘటనాస్థలాన్ని పరిశీలించేందుకు వచ్చాను’ అని హోం మంత్రి చెప్పడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గందరగోళ పరిస్థితులు ప్రమాదం తర్వాత రూ.300 క్యూలైన్లను పూర్తిగా నిలిపేశారు. దీంతో ఆ టికెట్లు తీసుకున్న వేలాది భక్తులు దర్శనానికి ఎటువెళ్లాలో తెలియక నిలిచిపోయారు. దీంతో ఆ ప్రాంతమంతా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకానొకదశలో అధికారులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్పటికప్పుడు రూ.1,000 టికెట్ క్యూలైన్లను రూ.300 టికెట్ క్యూలైన్లుగా మార్చేశారు. రూ.1,500 టికెట్, రూ.1,000 టికెట్ భక్తుల్ని ఒకే లైన్లో కలిపేశారు. గాలిగోపురం వద్ద ఆయా టికెట్ల వారిని వేరువేరుగా పంపించారు. దీంతో ఎవరు ఎటు వెళ్లాలో తెలీక లైన్లు కిక్కిరిసిపోవడంతో భక్తులు నరకయాతన అనుభవించారు. అనిత.. ఇదేనా మీ బాధ్యత! 27–04–2025 క్యూ లైన్లు, భక్తులకు ఇతర సౌకర్యాలపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా ఐదుగురు మంత్రులం ఏర్పాట్లపై సమీక్షించాం. ప్రతి చిన్న విషయాన్ని ఎంతో శ్రద్ధ పెట్టి పర్యవేక్షిస్తున్నాం. 30–04–2024 ఈ ఘటన ఎంతో దురదృష్టకరం. మేం రెండు రోజుల క్రితం ఏర్పాట్ల పరిశీలనకు వచ్చాం. అయితే ప్రమాదానికి గురైన గోడ ఎలా నిర్మించారో మేం చూడలేదు. ఆ గోడ ఇటుకతో కట్టారా? పిల్లర్తో కట్టారా? అనేది మేం చూడలేదు. – ఇవీ హోంమంత్రి అనిత వ్యాఖ్యలు -
దైవ సాక్షిగా.. 'మళ్లీ భక్తులే బలి'
‘మా పిల్లలు.. బంధువులను ప్రభుత్వమే చంపేసింది! చందనోత్సవం పుణ్యమా అంటూ ప్రభుత్వం మమ్మల్ని రోడ్డు పాల్జేసింది. మా కుటుంబాలలో విషాదం నింపింది...!’ ‘దగ్గరుండి బంధువులందరితో తెలుగుదేశంకు ఓటు వేయించాడు. ఆ ప్రభుత్వమే మా కొడుకు.. కోడలిని పొట్టనబెట్టుకుంది. ఇంటి దిక్కును కోల్పోయాం...!’‘చేతికి అందివచ్చిన కుమారుడికి త్వరలోనే పెళ్లి చేయాలనుకున్నా...!’ ‘నాకు పెద్ద దిక్కు అనుకున్న అన్నయ్య నన్ను వదిలి వెళ్లిపోయాడు..!’ కేజీహెచ్ మార్చురీ వద్ద మృతుల బంధువుల ఆక్రోశం ఇదీ!సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: టీడీపీ కూటమి సర్కారు పాపాలు భక్తులకు యమపాశాలుగా మారుతున్నాయి! తిరుపతిలో తొక్కిసలాట ఘటన మరువక ముందే.. సింహాచలంలో మరో విషాదం చోటు చేసుకుంది. నాడు వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం వచ్చిన ఆరుగురు భక్తులు తిరుపతిలో మృత్యువాత పడగా.. నేడు వరాహ లక్ష్మీ నృసింహస్వామి నిజరూప దర్శనం కోసం సింహాచలం వచ్చిన వారు నిర్జీవులుగా మారారు. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం ఏర్పాట్లలో సర్కారు నిర్లక్ష్యం ఏడు నిండు ప్రాణాలను బలి తీసుకుంది! అత్యంత నాసిరకంగా, కాలమ్స్ లేకుండా ఫ్లైయాష్తో కట్టిన గోడ గాలివానకు కూలిపోయి భక్తులను సజీవ సమాధి చేసింది. బుధవారం తెల్లవారుజామున ఈ విషాదం చోటు చేసుకుంది. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉండగా వీరిలో ఐటీ ఉద్యోగాలు చేస్తున్న యువ దంపతులున్నారు. చనిపోయిన వారిలో అంబాజీపేటకు చెందిన కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు(29), పత్తి దుర్గా స్వామినాయుడు (30), విశాఖ వాసులు ఎడ్ల వెంకటరావు(58), పిల్లా ఉమా మహేశ్వరరావు(30), పిల్లా శైలజ (27), గుజ్జారి మహాలక్ష్మి, పైలా వెంకట రత్నం(45) ఉన్నారు. తమవారి ప్రాణాలు తీసేందుకే నాణ్యత లేని గోడ కట్టారని బాధిత కుటుంబాలు ఆక్రోశిస్తున్నాయి. ఈ విషాదం అందరినీ కలచి వేస్తుండగా విశాఖ ఎంపీ శ్రీభరత్ ఏమాత్రం చలించకుండా చందనోత్సవ దర్శనం చేసుకుని చల్లగా జారుకోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. తనకేమీ పట్టనట్లుగా ఆయన ఢిల్లీ వెళ్లిపోయారు. ఇక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విశాఖ విడిచి పత్తా లేకుండా పోయారు. ప్రచారం ఘనం.. ఏర్పాట్లు శూన్యంఏడాదికోసారి జరిగే సింహాచలం చందనోత్సవం నిర్వహణ ఏర్పాట్లు ఈసారి భక్తులకు చుక్కలు చూపించాయి. కొండపైకి వెళ్లేందుకు బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక దర్శనానికి 5 నుంచి 8 గంటల పాటు క్యూలైన్లలో నరకయాతన అనుభవించారు. చందనోత్సవం వేడుకను తిలకించేందుకు దాదాపు రెండు లక్షల మంది భక్తులు తరలి వస్తారని అంచనా వేయగా నిర్వహణ ఏర్పాట్ల కోసం ఐదుగురు మంత్రులతో కమిటీని నియమించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చిన్న చిన్న అంశాలను సైతం పరిగణనలోకి తీసుకొని అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. అప్పన్న నిజరూప దర్శనం వేళ.. ఏర్పాట్లలో డొల్లతనం బయట పడింది. చందనోత్సవం నిర్వహణ ఏర్పాట్ల విషయంలో మంత్రుల కమిటీ నిర్లక్ష్యం భక్తుల ప్రాణాలను బలి తీసుకుంది. ఏటా చందనోత్సవం రోజు వర్షం పడడం సాధారణం అయినప్పటికీ అందుకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఫలితంగా వారం క్రితం నిర్మించిన నాసిరకం గోడ కూలి ఏడుగురి ప్రాణాలను బలి తీసుకుంది. అంత ఎత్తు గోడ కట్టినప్పుడు ఫ్లైయాష్ ఇటుక వాడవచ్చా? నీరు దిగేందుకు వీలుగా గోడకు పైపులు ఎందుకు అమర్చలేదు? ఇంజనీరింగ్ డిజైన్ ఇచ్చిందెవరు? అక్కడ ఉన్న షాపులు తొలగించమని ఎవరు చెప్పారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఘటనాస్థలంలో శిథిలాలను తొలగిస్తూ మృతుల కోసం వెదుకుతున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వీఐపీల దర్శనం, టికెట్ల అమ్మకాలపైనే దృష్టిపవిత్ర చందనోత్సవం సమయంలో సైతం సింహాచలం దేవాలయానికి ప్రభుత్వం ఈవోను నియమించకపోవడం గమనార్హం. కేవలం ఇన్చార్జి ఈవోతో ఇంత భారీ కార్యక్రమాన్ని ముగించేందుకు సిద్ధమైంది. ఇన్చార్జి ఈవోను డమ్మీగా మార్చి ప్రభుత్వ పెద్దలు ఇష్టారీతిలో వ్యవహరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాసుల జారీ మొదలుకుని.. టికెట్ల అమ్మకాలు, చందనోత్సవం కోసం చేపట్టిన వివిధ కాంట్రాక్టు పనులన్నింటిలోనూ అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకున్నారు. వీఐపీల దర్శనం, టికెట్ల అమ్మకాలపై దృష్టి సారించి సాధారణ భక్తుల భద్రతను గాలికొదిలేసినట్లు స్పష్టమవుతోంది.హడావుడిగా తాత్కాలిక గోడకేశ ఖండనం, గాలి గోపురానికి వెళ్లే భక్తులు నడిచేందుకు ఆలయం పక్కన దారి ఉంది. అక్కడి నుంచి కిందకు వెళ్లేందుకు ఉన్న మెట్ల మార్గం పక్కనే గోడ నిర్మాణం జరుగుతోంది. వాస్తవానికి ఈ గోడకు బదులుగా గతంలో రిటైనింగ్ వాల్ ఉంది. పై నుంచి మట్టి ఊడిపడితే కింద వెళ్లే భక్తులకు ఇబ్బంది లేకుండా ఈ రిటైనింగ్ వాల్ కాపాడేది. అయితే, ప్రసాద్ స్కీమ్లో భాగంగా పాత రిటైనింగ్ వాల్ స్థానంలో కొత్త రిటైనింగ్ వాల్ నిర్మించాల్సి ఉంది. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సమయం పడుతుందని చందనోత్సవం సందర్భంగా హడావుడిగా తాత్కాలిక గోడను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తాత్కాలిక గోడ నిర్మాణ పనులు నాలుగు రోజుల్లో పూర్తి చేశారు. పునాదులు, కాంక్రీట్, స్టీల్, రెయిన్ఫోర్స్మెంట్ స్ట్రక్చర్ లేకుండా కేవలం ఫ్లైయాష్ బ్రిక్స్తో భారీ గోడను నిర్మించేశారు. ఇటుకకు ఇటుకకు మధ్య కనీసం సిమెంటు లేకుండా ఇసుక ఎక్కువ పాలు వేసి అత్యంత నాసిరకంగా నిర్మించారనే విషయం చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. పాత రిటైనింగ్ వాల్ ఉండి ఉంటే ఈ ప్రమాదం తప్పేదని.. కనీసం గోడ నిర్మాణ సమయంలో ప్రభుత్వం నాణ్యతను పరిశీలించినా ఇంత పెను ప్రమాదం జరిగి ఉండేది కాదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగూ తాత్కాలిక గోడే కదా అనే నిర్లక్ష్యం.. పర్యవేక్షణ లోపంతో నాసిరకంగా నిర్మించడంతో చిన్నపాటి వర్షానికే కూలిపోయి భక్తులు ప్రాణాలు కోల్పోయారు.మృతుల ఫైల్ ఫొటోలు ముందస్తు జాగ్రత్తలేవి?లక్షల మంది భక్తులు తరలివచ్చే ఈ వేడుకల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రమాదం జరిగిన తరువాత కూడా సహాయక చర్యలు అందించడంలో తీవ్ర జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. కొత్తగా నిర్మించిన రిటైనింగ్ వాల్ వైపు రూ.300 టికెట్ల క్యూలైన్లు ఏర్పాటు చేశారు. కానీ అక్కడ ఒక్క సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచలేదు. ప్రమాదం జరిగిందన్న విషయం భక్తుల హాహాకారాలు చేస్తే గానీ అధికారుల దృష్టికి వెళ్లలేదు. భారీగా భక్తులు తరలివచ్చే కార్యక్రమాలకు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అంబులెన్సులు, పారా మెడికల్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి కనిపించలేదు. దుర్ఘటన తెల్లవారుజామున సుమారు 3.05 గంటలకు జరగగా అధికారులు 3.30 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తరువాత ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించారు. అప్పటికే దారుణం జరిగిపోయింది. ఇటుకల కింద ఏడుగురు భక్తులు సమాధి అయిపోయారు.మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకే పెద్దపీట!ఒకవైపు ఆలయ ఇన్చార్జి ఈవోను డమ్మీని చేసి అన్ని నిర్ణయాలను కలెక్టరేట్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఇంటి నుంచే ప్రభుత్వం అమలు చేసింది. ఎవరికి ఎన్ని వీఐపీ టికెట్లు ఇవ్వాలనే విషయాన్ని వారే నిర్ణయించారు. టీడీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలకు ఎన్ని కావాలంటే అన్ని పాస్లు కేటాయించారు. వారికి మాత్రమే కారు పాస్లు మంజూరు చేశారు. బీజేపీ నేతలకు సైతం వీఐపీ, రూ.1,500 టికెట్లు దక్కలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సాధారణ భక్తులు రూ.300, రూ.1,000 టికెట్లను కొనుగోలు చేసేందుకు బ్యాంకులు, కౌంటర్ల వద్దకు వెళితే లేవని తిప్పి పంపేశారు. అప్పటికే ఆ టికెట్లను తమ వారి కోసం టీడీపీ నేతలు తీసేసుకున్నారు. సాధారణ భక్తులు దేవస్థానం బస్సుల్లోనే కొండపైకి చేరుకోవాల్సి వచ్చింది. బస్సులు తగినంతగా లేకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. గంటల పాటు వేచి చూడలేక పలువురు నడక మార్గంలో ఘాట్ రోడ్డు ద్వారా కొండపైకి చేరుకున్నారు. ఘాట్ రోడ్లో నడక దారిలో కిలోమీటరు మేర బారులు తీరి కనిపించారు. ఇన్చార్జి ఈవోనే దిక్కు...!ఏటా చందననోత్సవంతోపాటు గిరి ప్రదక్షిణకు భక్తులు పోటెత్తుతారు. అప్పన్న నిజరూప దర్శన వేడుకను తిలకించేందుకు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఒడిశా నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఈవోదే ప్రధాన బాధ్యత. అయితే చందనోత్సవం వేళ రెగ్యులర్ ఈవోను ప్రభుత్వం నియమించలేదు. రెగ్యులర్ ఈవోగా ఉన్న వి.త్రినాథరావు 3 నెలలు సెలవులో వెళ్లారు. అప్పటి నుంచి ఇన్చార్జి ఈవోగా కె.సుబ్బారావు కొనసాగుతున్నారు. ఏప్రిల్ 30న చందనోత్సవం ఉందని తెలిసినా రెగ్యులర్ ఈవోను నియమించపోవడం ఇష్టారాజ్యంగా వ్యవహరించేందుకేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మృతుల వివరాలు..పవిత్ర క్షేత్రాల్లో వరుస అపచారాలుపవిత్ర పుణ్యక్షేత్రాల్లో 11 నెలలుగా వరుసగా చోటు చేసుకుంటున్న అపచారాలు, అనూహ్య ఘటనలు భక్తకోటిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతూ వారి భద్రత పట్ల సర్కారు తీవ్ర నిర్లక్ష్యాన్ని బట్ట బయలు చేస్తున్నాయి. తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో ప్రభుత్వమే ‘కల్తీ’ ప్రచారానికి తెర తీయడం మొదలు.. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లలో వైఫల్యం కారణంగా తిరుపతి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆరుగురు భక్తులు మరణించడం.. టీటీడీ గోశాలలో గోవుల మృతి ఘటనను కప్పిపుచ్చుతూ సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా బుకాయించడం.. దశాబ్దాలుగా హైందవ ధర్మం, దాతృత్వానికి ప్రతీకగా నిలిచిన కాశీ నాయన ఆశ్రమాన్ని ప్రభుత్వమే నేలమట్టం చేయడం.. శ్రీకూర్మం గుడిలో తాబేళ్లు చనిపోవడం లాంటి ఘటనలన్నీ భక్తుల మనోభావాలను కలచి వేస్తున్నాయి. గతంలోనూ చంద్రబాబు సర్కారు కృష్ణా పుష్కరాల పేరుతో విజయవాడలో పలు ఆలయాలను నేల కూల్చిందని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కనీసం ఓ గోడ కూడా కట్టలేక అప్పన్న సాక్షిగా భక్తుల ప్రాణాలను బలి తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతిమృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా, గాయపడిన వారికి రూ.50 వేలుసాక్షి, న్యూఢిల్లీ: సింహాచలం క్షేత్రం వద్ద చోటుచేసుకున్న దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ‘తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రధాని స్పందిస్తూ ‘విశాఖపట్నంలో గోడ కూలిన ఘటనలో జరిగిన ప్రాణనష్టం చాలా బాధాకరం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం. మృతుల బంధువులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా, గాయపడిన వారికి రూ.50వేలు అందజేస్తాం’ అని ప్రకటించారు.రాహుల్ విచారంఈ ఘటనపై కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. -
అడవివరంలో విషాదఛాయలు
సింహాచలం: సింహగిరిపై రిటైనింగ్ వాల్ కూలిన ఘటనలో స్టీల్ప్లాంట్ జనరల్ ఫోర్మెన్ ఎడ్ల వెంకటరావు(56) మృతితో అడవివరంలో విషాదం నెలకొంది. పాతికేళ్లుగా ఈయన ఇక్కడి బీసీ గురుకుల పాఠశాల సమీపంలో నివసిస్తున్నారు. ఆయన భార్య రామలక్ష్మి గురుకుల పాఠశాలలోనే స్టాఫ్ నర్సుగా విధులు నిర్వర్తిస్తున్నారు. పెద్ద కుమారుడు ప్రవీణ్కు నెల రోజుల క్రితం వివాహం కావడంతో భార్యతో కలిసి బెంగళూరులో, చిన్నకుమారుడు పృధ్వీ చైన్నెలో ఉంటున్నారు. చందనోత్సవం సందర్భంగా తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఇంటి నుంచి కొండపైకి వెళ్లారు. వెళ్లిన గంటలోగానే మరణించారు. కేజీహెచ్లో పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని ఆయన స్వగృహానికి తీసుకొచ్చి, పాత అడవివరం శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. స్టీల్ప్లాంట్ ఏఐటీయూసీ గుర్తింపు యూనియన్ నాయకుడు పాశర్ల పైడిరాజు, స్టీల్ప్లాంట్ సిటు నాయకుడు అప్పారావు, ట్రేడ్ యూనియన్ నాయకులు తరలివచ్చి వెంకటరావు మృతదేహానికి నివాళులు అర్పించారు. ఎప్పుడూ సరదాగా ఉండే వెంకటరావుతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. -
సాగర గర్భంలో భయో వ్యర్థాలు!
● ప్లాస్టిక్ వేస్ట్తో సమానంగా మెడికల్ వ్యర్థాలు లభ్యం ● బయో వేస్ట్ వెలికితీస్తున్న స్కూబా డైవర్లు ● జాలరిపేట, రుషికొండ తీరాల్లో ఎక్కువగా లభ్యం ● జలచరాలకు హానికరమంటున్న పర్యావరణవేత్తలు సాక్షి, విశాఖపట్నం: సాగర తీరాన్ని బయో వ్యర్థాలు భయపెడుతున్నాయి. ప్రాణాంతకమైన మెడికల్ వేస్ట్ను అత్యంత భద్రంగా నిర్వహించాల్సి ఉండగా.. కొన్ని ఆస్పత్రులు సముద్రాన్నే డస్ట్బిన్గా మార్చేసుకున్నాయి. దీంతో ప్రమాదకరమైన వైద్య వ్యర్థాలు సముద్రాన్ని ముంచెత్తుతున్నాయి. పర్యావరణ నిపుణుల అంచనా ప్రకారం ఏటా విశాఖ సాగర తీరంలో 350 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు, సుమారు 10 టన్నుల వరకు మెడికల్ వ్యర్థాలు సముద్రగర్భంలో కలుస్తున్నాయి. సాగర గర్భంలోకి చొచ్చుకుపోతున్న ఈ వ్యర్థాలు.. జీవ వైవిధ్యానికి చేటు తెస్తున్నాయి.. ఫలితంగా జలచరాలు నిర్జీవంగా మారిపోతున్నాయి. ఇటీవల ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించేందుకు స్వచ్ఛందంగా నడుంబిగించిన కొంతమంది స్కూబా డైవర్లు.. సముద్రం నుంచి బయో వ్యర్థాలు బయటపడుతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెడీవేస్ట్ ‘సీ’గా మార్చేస్తున్నారు అందాల సముద్ర తీరాన్ని ఆస్వాదించేందుకు వస్తున్న పర్యాటకులకు మెడీ వేస్ట్ దర్శనమిస్తోంది. ఈ వ్యర్థాలను నిర్వహణ సంస్థలకు ఇవ్వాలంటే కొంత డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే బీచ్కు సమీపంలోని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు ఇంజిక్షన్లు, సిరంజీలు, కాలం చెల్లిన మందులు, ఇంజక్షన్ సీసాలు, సైలెన్ బాటిల్స్ సాగరంలో కలిపేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇలా బయో వ్యర్థాలను సముద్రంలో పారబోస్తున్నారు. కేవలం రూ.1000 నుంచి రూ.2 వేలకు కక్కుర్తి పడుతున్న చిన్న చిన్న ఆస్పత్రుల నిర్వాహకులు.. సముద్రాన్ని మెడీవేస్ట్ సీగా మార్చేస్తూ పర్యావరణానికి హానితలపెడుతున్నారు. -
మూడు రోజుల వ్యవధిలో టన్ను వరకు..
ప్లాస్టిక్ వ్యర్థాలతో సముద్రం కలుషితమవుతున్న నేపథ్యంలో సామాజిక బాధ్యతలో భాగంగా స్కూబా డైవర్లు.. సముద్ర పరిరక్షణకు పాటుపడుతున్నారు. వీరికి బయో వ్యర్థాలు కనిపిస్తుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సముద్ర లోతుల్లో పోగుపడ్డ ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే బాధ్యతను ఇటీవల కాలంలో ప్లాటిపస్ వంటి స్కూబా డైవింగ్ సంస్థలు స్వచ్ఛందంగా చేపడుతున్నాయి. సముద్ర గర్భంలో వ్యర్థాల ఏరివేత కోసం ఈ బృందాలు 3 కిలో మీటర్ల దూరం వరకూ వెళ్తున్నాయి. ఒడ్డు నుంచి ప్రారంభించి.. మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న వ్యర్థాల్ని తొలగిస్తున్నారు. ప్రతి రోజూ కనీసం 100 నుంచి 200 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రం నుంచి వెలికితీస్తున్నారు. ఇందులో కనీసం 10 నుంచి 20 కిలోల వరకూ బయో వ్యర్థాలు ఉంటున్నాయని వారు చెబుతున్నారు. మూడు రోజుల వ్యవధిలో టన్ను వరకూ స్కూబా డైవర్లు మెడీవేస్ట్ ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యర్థాలు సముద్ర జీవరాశులతో పాటు.. పర్యాటకులకు ప్రాణహానిని కలిగిస్తుందని, అధికారులు తక్షణమే బయో వ్యర్థాలు సముద్రంలో కలవకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
రోడ్లపైనే కాలం చెల్లిన మందులు
నగరంలో పలు చోట్ల రోడ్ల పక్కన చెత్తకుప్పల్లో కాలం చెల్లిన మందులు ఇబ్బడిముబ్బడిగా కనిపిస్తున్నాయి. వాస్తవంగా వీటిని ఇన్సినరేటర్లో వేసి బూడిద చేయాల్సి ఉంది. కానీ సుమారు టన్నుల కొద్ది వచ్చే ఈ వ్యర్థాలను సకాలంలో కాల్చకుండా .. ఇలా ఖాళీ ప్రదేశాల్లో ఇష్టానుసారంగా పారబోస్తున్నారు. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ఈ తరహా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. నిబంధనలను ఏమాత్రం లెక్కచేయక ఈ ఆస్పత్రులు, మెడికల్ షాపులు ఈ విధంగా వ్యవహరిస్తున్నాయి. బయో వ్యర్థాలను తరలించేందుకు సంబంధిత యాజమాన్యాలు కొంత మొత్తం ఏపీపీసీబీ సూచించే వ్యర్థాల నియంత్రణ సంస్థకు చెల్లించాల్సి ఉంది. ఆస్పత్రి స్థాయికి తగ్గట్టు డబ్బులు చెల్లించాలి. పలుచోట్ల ఆయా సంస్థలు సక్రమంగా వచ్చి వ్యర్థాలను తీసుకెళ్లడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్క నగరంలోనే దాదాపు 600కు పైగా ఆస్పత్రులు ఉన్నాయి. పూర్తిస్థాయిలో ప్రైవేటు ఆస్పత్రుల నుంచి వెలువడే వ్యర్థాలు దాదాపు బయట ప్రాంతాల్లో పోస్తున్నారు. నగరంలోని ఆస్పత్రుల్లో పది శాతానికి మించి నిబంధనలు పాటించడంలేదు. కాలం చెల్లిన మందులు, ఇతర వ్యర్థాల్ని ఇవ్వకుండా ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. నెలకు రూ.1,100 చెల్లిస్తే చాలు ప్రతీ ఆస్పత్రి వద్దకు వచ్చి నిర్వహణ సంస్థలు స్వయంగా తీసుకువెళ్తాయి. కానీ ఎవరూ దీనిని పట్టించుకోవడం లేదు. కాల పరిమితి ముగియడానికి 90 రోజులే గడువున్న మందులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్పత్రుల్లో పంపిణీ చేయకూడదని నిబంధనలున్నాయి. అలాంటి మందులను సరఫరా చేసిన కంపెనీలకే తిప్పి పంపాల్సిందే. ఎందుకంటే ఒక ఔషధం దాని కాలపరిమితి తేదీకి 3 నెలల ముందు నుంచి అందులోని మందు శక్తిని కోల్పోతూ ఉంటుందని, అలాంటి మందులు వాడినా ప్రభావశీలంగా పనిచేసే అవకాశాలు తక్కువని వైద్యులు చెబుతున్నారు. ఇన్ని నిబంధనలున్నా వాటిని పక్కనపెట్టేసి ఆస్పత్రులు ఇలా పడేస్తుండటంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు కళ్లు తెరవకపోతే.. నగరం బయోవ్యర్థాలమయంగా మారిపోయే ప్రమాదముందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. -
ఉద్యోగ విరమణ శేష జీవితానికి పునాది
అల్లిపురం: జీవీఎంసీలో సుదీర్ఘకాలం విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందడం ప్రతి ఉద్యోగికి తప్పనిసరని, ఇది శేష జీవితానికి పునాది లాంటిదని జీవీఎంసీ అదనపు కమిషనర్ బి.వి.రమణమూర్తి అన్నారు. జీవీఎంసీలో వివిధ హోదాల్లో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన ఏడుగురు ఉద్యోగులను అదనపు కమిషనర్ ఎస్.ఎస్.వర్మ, డీపీవో ఫణిరామ్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ పద్మజతో కలిసి ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ ఉద్యోగ విరమణ పొందిన ప్రతి ఉద్యోగి తమ శేష జీవితాన్ని ఆనందంగా గడపాలన్నారు. ఆరోగ్యం కోసం ఏదో పని కల్పించుకోవాలని సూచించారు. అనంతరం ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు రూ.65,47,310 ప్రావిడెంట్ ఫండ్ను అందజేశారు. ఏపీడబ్ల్యూఈఎంఎస్, జేమ్స్ జనరల్ సెక్రటరీ ఎ.అప్పలరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఓవరాల్ చాంప్ ఎలక్ట్రికల్ ఆపరేషన్స్ జట్టు
విశాఖ స్పోర్ట్స్: తూర్పు కోస్తా రైల్వే క్రీడా సంఘం(ఈకోర్సా) ఆధ్వర్యంలో నెల రోజుల పాటు జరిగిన వాల్తేర్ డివిజన్ అంతర విభాగాల క్రీడా పోటీలు బుధవారంతో ముగిశాయి. కార్మిక శక్తిలో క్రీడాస్ఫూర్తిని ప్రోత్సహించే నినాదంతో నిర్వహించిన ఈ పోటీల్లో 14 విభాగాల నుంచి పురుషులు, మహిళలు 12 క్రీడాంశాల్లో వేర్వేరుగా తలపడ్డారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ (ఆపరేషన్స్) జట్టు ఓవరాల్ టీమ్ చాంపియన్షిప్ను కై వసం చేసుకోగా, ఆర్పీఎఫ్ జట్టు రన్నరప్గా నిలిచింది. బాల్ బ్యాడ్మింటన్లో ఈఎల్ఈసీ జట్టు, క్యారమ్స్లో ఈఎల్ఎస్, చెస్లో ఎలక్ట్రికల్(ఓ), టీటీలో కమర్షియల్, వాలీబాల్, బ్యాడ్మింటన్లలో ఈఎల్ఈసీ, అథ్లెటిక్స్లో ఆర్పీఎఫ్, బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్లలో సీడబ్ల్యూ, ఫుట్బాల్లో ఆపరేటింగ్, క్రికెట్లో సంయుక్తంగా ఈఎల్ఈసీ–ఆర్పీఎఫ్ జట్లు, టెన్నిస్లో ఎస్అండ్టీ జట్లు విజేతలుగా నిలిచాయి. ఈ సందర్భంగా శ్రీనివాస కల్యాణ మండపంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి డీఆర్ఎం లలిత్ బోహ్రా హాజరై మాట్లాడారు. ఉద్యోగుల్లో స్నేహం, పరస్పర సహకారం పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు. అకౌంట్స్, మెడికల్, ఇంజినీరింగ్, కమర్షియల్, ఎలక్ట్రికల్(జనరల్), మెకానికల్, పర్సనల్, కన్స్ట్రక్షన్, సిగ్నల్ టెలికాం, మెకానికల్ (డీఎల్ఎస్), ఎలక్ట్రికల్(ఆపరేషన్స్), ఎలక్ట్రికల్(టీఆర్ఎస్), ఎలక్ట్రికల్(టీఆర్డి), ఆర్పీఎఫ్, సేఫ్టీ, స్పోర్ట్స్ విభాగాల జట్లు పోటీపడినట్లు తెలిపారు. అనంతరం డీఆర్ఎం విజేతలకు ట్రోఫీలు అందించగా, ఏడీఆర్ఎంలు మనోజ్కుమార్ సాహు, ఇ.శాంతారామ్, క్రీడాధికారి ఎం.హరనాథ్, సంయుక్త క్రీడాధికారి ఎ.అవినాష్, కోశాధికారి కబీర్ అన్సారి, సహాయ క్రీడాధికారి పాటిల్, కార్యదర్శి ఉష తదితర అధికారులు పాల్గొన్నారు. ముగిసిన రైల్వే అంతర విభాగాల స్పోర్ట్స్ మీట్ -
విమ్స్లో క్షతగాత్రుడికి పరామర్శ
ఆరిలోవ: సింహాచలం అప్పన్న చందనోత్సవంలో గోడ కూలిన ఘటనలో గాయపడిన ఆరిలోవ ప్రాంతం బాలాజీనగర్కు చెందిన పి.ప్రవీణ్కుమార్కు విమ్స్లో చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు, భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, పలువురు నాయకులతో కలసి బుధవారం పరామర్శించారు. ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రవీణ్కు మెరుగైన వైద్యం అందించాలని విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబును కోరారు. పరామర్శలో వైఎస్సార్సీపీ నాయకులు రవిరెడ్డి, శ్రీవాత్సవ్, కొండా రాజీవ్ తదితరులున్నారు. -
ప్రశాంతంగా పాలిసెట్
మురళీనగర్: జిల్లాలో బుధవారం నిర్వహించిన పాలిసెట్ ప్రశాంతంగా జరిగింది. కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్, పెందుర్తి పాలిటెక్నిక్, భీమిలి ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కో ఆర్డినేటింగ్ కేంద్రాల పరిధిలో ఏర్పాటుచేసిన 33 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరిగింది. జిల్లా వ్యాప్తంగా 13,188 మంది విద్యార్థులు పాలిసెట్కు దరఖాస్తు చేయగా.. 12,363 మంది పరీక్షకు హాజరైనట్లు విశాఖ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ డాక్టర్ కె.నారాయణరావు తెలిపారు. 94 శాతం మంది పరీక్ష రాయగా.. వీరిలో 7,422 మంది బాలురు, 4,941 మంది బాలికలు ఉన్నారు. విశాఖపట్నం కో–ఆర్డినేటింగ్ కేంద్రం పరిధిలో 9,405 మందికి 8,746 మంది, పెందుర్తి కేంద్రం పరిధిలో 2,635 మందికి 2,531 మంది, భీమిలి కేంద్రం పరిధిలో 1,148 మందికి 1,086 మంది పరీక్ష రాసినట్లు వివరించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. జిల్లా పరిశీలకుడు విజయభాస్కర్, నగర పరిశీలకుడు జి.దామోదరరావు, సహాయ కో–ఆర్డినేటింగ్ అధికారి కేడీవీ నరసింహారావు తదితరులు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. 94 శాతం మంది హాజరు -
బాధిత కుటుంబాలకు మేయర్ పరామర్శ
అల్లిపురం: సింహగిరిపై గోడ కూలిన ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను మేయర్ పీలా శ్రీనివాసరావు, కార్పొరేటర్ గంగారావు బుధవారం పరామర్శించారు. కేజీహెచ్ మార్చురీ వద్ద బాధిత కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ వెంటనే స్పందించి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులను అప్రమత్తం చేశారని మేయర్ తెలిపారు. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియాతో పాటు ఒకరికి ఉద్యో గం ప్రకటించారని పేర్కొన్నారు. ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తునకు కమిటీని ఏర్పాటు చేశారని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని తెలిపారు. -
స్టీల్ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్లో గ్యాస్ లీకేజీ
నలుగురు ఉద్యోగుల అస్వస్థతఉక్కునగరం: స్టీల్ప్లాంట్ బ్లాస్ట్ఫర్నేస్ విభాగంలో బుధవారం గ్యాస్ లీకేజీ ఘటన చోటుచేసుకుంది. నలుగురు ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. వివరాలు.. ఒకటో బ్లాస్ట్ఫర్నేస్ విభాగంలో ఉద్యోగులు విధి నిర్వహణలో ట్యూయర్ ప్లాట్ఫారంపై హోస్పైపు మార్చే క్రమంలో పైపు నుంచి గ్యాస్ లీకయింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న యాదవ్ (సీనియర్ మేనేజర్), ఎ.వెంకటేశ్వరరావు(ఫోర్మెన్), రామరాజు (ఫోర్మెన్), అప్పలరాజు (కాంట్రాక్ట్ కార్మికుడు) గ్యాస్ ఉధృతికి అస్వస్థతకు లోనయ్యారు. గమనించిన తోటి ఉద్యోగులు హుటాహుటిన ఉక్కు జనరల్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఎ.వెంకటేశ్వరరావును మెరుగైన చికిత్స నిమిత్తం నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ముగ్గురూ ఉక్కు జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం ప్లాంట్ ఉత్పత్తి పెంచే క్రమంలో యాజమాన్యం భద్రతను నిర్లక్ష్యం చేస్తోందని, దీని వల్లే ప్రమాదం జరిగిందని స్టీల్ సీఐటీయూ నాయకులు ఆరోపించారు. అస్వస్థతకు గురైన ఉద్యోగులను తరలించిన అంబులెన్స్లో ఆక్సిజన్ సదుపాయం కూడా లేదని ఆరోపించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉద్యోగులు -
భక్తులకు అష్టకష్టాలు
ఘాట్రోడ్డు వరకు బారులు తీరిన భక్తులుసింహచలం/పెందుర్తి: సింహాచలేశుడి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు అష్టకష్టాలు పడ్డారు. కూటమి ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడింది. సామాన్య భక్తులకు సరిపడా బస్సుల్ని నడపంలో నిర్లక్ష్యం చూపిన అధికార యంత్రాంగం, తమ వారికి మాత్రం విచ్చలవిడిగా కారు పాసులు మంజూరు చేసింది. పోలీసులు కూడా తమ బంధువుల్ని ఇష్టారీతిన నేరుగా దర్శనానికి తీసుకెళ్లి సామాన్య భక్తులకు నరకం చూపడంలో తమను మించినవారు లేరని నిరూపించుకున్నారు. అడుగు అడుగునా నరకం శ్రీవరాహ లక్ష్మీనృసింహ స్వామి నిజరూప దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా నుంచి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. కొండ దిగువ నుంచి సింహగిరికి చేరుకునే క్రమంలో వేలాది మంది భక్తులు నరకాన్ని చవిచూశారు. భక్తులకు సరిపడా బస్సులు నడపడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. సాధారణ సమయంలో కొండ దిగువ నుంచి 15–20 నిమిషాల్లో చేరుకోవచ్చు. కానీ చందనోత్సవాన భక్తులు కింద నుంచి సింహగిరికి చేరుకోవడానికి సగటున నాలుగైదు గంటల సుదీర్ఘ సమయం పట్టింది. కొండ దిగువన ఇటు గోశాల వద్ద, అటు అడవివరం కూడలి వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి. బస్ ఎక్కేందుకు దాదాపు 2 గంటలు, సింహగిరి పైకి చేరుకునేందుకు మరో రెండు మూడు గంటల సమయం పట్టిందని వేలాది భక్తులు వాపోయారు. కిక్కిరిసిన బస్సుల వెంట జనం పరుగులు పెట్టారు. కింద నుంచి కొండ మీద వరకు మహిళలు సైతం వేలాడుతూ ప్రయాణించారు. దర్శనం తర్వాత ఇంటి ముఖం పట్టేందుకూ ఇదే నరకాన్ని ప్రభుత్వం చూపింది. ఘాట్ రోడ్లో కిలోమీటర్ పైగా క్యూ ఉదయం 11 తరువాత భక్తుల తాకిడి అమాంతం పెరిగిపోయింది. అప్పటివరకు లోవతోట వైపు ఉన్న ఉచిత క్యూలో మాత్రమే భక్తులు ఉండగా.. ఒక్కసారిగా భక్తుల సంఖ్య పెరిగిపోవడంతో పోలీసులు క్యూను ఘాట్ రోడ్కు మళ్లించారు. దీంతో ఘాట్ రోడ్లో నిమిషాల్లో క్యూ కిలోమీటరు దాటిపోయింది. ఆర్టీసీ బస్సుల్లో వచ్చిన చాలామంది భక్తులు సింహగిరి బస్టాండ్ వద్ద దిగి, తిరిగి ఘాట్ రోడ్డు క్యూకి చేరుకోవడానికి కిలో మీటర్పైగా వెనక్కి నడవాల్సి వచ్చింది. క్యూ లైన్లో చేరిన నుంచి స్వామి దర్శనం చేసుకుని తిరుగుముఖం పట్టేందుకు 5 నుంచి 8 గంటల సమయం పట్టింది. బ్రహ్మోత్సవాల సమయంలో తిరుపతి వెంకన్న దర్శనానికి కూడా ఇంత సమయం పట్టింది లేదని కొందరు భక్తులు ఆవేదన వెళ్లగక్కారు. కూటమి నేతలు, అధికారులు, పోలీసుల కుటుంబాలు మాత్రం నిమిషాల వ్యవధిలోనే తమ కళ్లముందే దర్జాగా దర్శనం చేసుకుని వెళ్లిపోయారని ఆక్షేపించారు. కొండ పైకి వెళ్లే బస్సు ఎక్కేందుకే గంటల తరబడి పడిగాపులు దర్శనానికి 5 నుంచి 8 గంటల పాటు క్యూల్లో నరకయాతన కొండపైకి విచ్చలవిడిగా కారు పాసులు భక్తులను గాలికి వదిలేశారు బస్ ఎక్కడానికి క్యూ పద్ధతి పాటించాలన్నారు. దర్శనం అయ్యాక ఎవరూ పట్టించుకోలేదు. దీంతో తిరుగు ప్రయాణంలో బస్ ఎక్కడానికి దాదాపు 2 గంటలకు పైగా వేచి వుండాల్సి వచ్చింది. అధికారుల నిర్లక్ష్యం దారుణం. – కల్యాణి, సోంపేట, శ్రీకాకుళం తీవ్ర ఇబ్బందులకు గురయ్యాం కొండపైకి ప్రైవేటు వాహనాలు అనుమతించలేదు. దీంతో దేవస్థానం ఏర్పాటు చేసిన బస్సును ఆశ్రయించాం. గంటన్నర పాటు బస్సు కోసం ఉన్న తరువాత.. కొండపైకి చేరడానికి మరో మూడు గంటలు పట్టింది. – నారాయణరావు, నర్సారావుపేట -
బాధిత కుటుంబాలకు భరోసా
విశాఖ సిటీ: సింహాచలంలో గోడ కూలి మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి వస్తున్నారన్న వార్త కూటమి ప్రజా ప్రతినిధుల్లో వణుకు పుట్టించింది. జగన్ నేరుగా కేజీహెచ్కు వచ్చి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడతారని ముందు షెడ్యూల్ రావడంతో వెంటనే మంత్రులు, ఎమ్మెల్యేలు అలెర్ట్ అయిపోయారు. కేజీహెచ్ మార్చురీ వద్ద హడావుడి చేశారు. మృతదేహాలకు వెంటనే పోస్టుమార్టం నిర్వహించాలని వైద్యాధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. కుటుంబ సభ్యుల సంతకాలు లేకుండానే పోస్టుమార్టం చేసి తరువాత ఆ తతంగాన్ని పూర్తి చేశారు. మృతదేహాలను కేజీహెచ్ నుంచి వారి ఇళ్లకు పంపించే ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి సాయంత్రం 4.50 గంటలకు విశాఖకు వచ్చారు. ఎయిర్పోర్టు నుంచి నేరుగా చంద్రంపాలెంలో ఉన్న మృతులు పిల్లా ఉమామహేశ్వరరావు, పిల్లా శైలజ కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లారు. అక్కడ వారికి ఽధైర్యం చెప్పారు. వైఎస్సార్సీపీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పార్టీ తరఫున మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అక్కడి నుంచి విమానాశ్రయానికి చేరుకొని 7.15 గంటలకు విజయవాడకు తిరుగుపయనమయ్యారు. అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి విశాఖ విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. సాయంత్రం విశాఖకు వచ్చిన మాజీ సీఎం జగన్ నేరుగా చంద్రంపాలెంలో బాధిత కుటుంబం ఇంటికి పయనం ఆయనను విశాఖకు రానీయకుండా చేసేందుకు కూటమి విశ్వప్రయత్నాలు హడావుడిగా పోస్టుమార్టం నిర్వహణ అయినప్పటికీ బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పిన జగన్ -
సింహాచలం ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యమే..
● కుటుంబాలకు రూ.కోటి,ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి ● మాజీ మంత్రి అమర్నాథ్ డిమాండ్ డాబాగార్డెన్స్/ఆరిలోవ: సింహగిరిపై గోడ కూలిన ఘటనలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు రూ.కోటి నష్ట పరిహారంతో పాటు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని వైఎస్సార్ సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. కేజీహెచ్ వద్ద మృతుల కుటుంబ సభ్యులను విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు, సమన్వయకర్తలు మజ్జి శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్కుమార్, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్కుమార్, జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, పార్టీ నాయకులు కొండా రాజీవ్గాంధీ, పేడాడ రమణికుమారి, ద్రోణంరాజు శ్రీవత్సవ్, రవిరెడ్డి, జియ్యాని శ్రీధర్, పలువురు నాయకులతో కలిసి పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానానికి వైకుంఠ ఏకాదశి ఎంత పవిత్రమో.. సింహాచలానికి చందనోత్సవం అంత పవిత్రమని చెప్పారు. సుమారుగా 2 నుంచి 3 లక్షల వరకు భక్తులు వస్తారని తెలిసీ కూడా అవసరమైన ఏర్పాట్లు చేయకుండా నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. కొండవాలులో ఎంతో పటిష్టంగా నిర్మించాల్సిన రక్షణ గోడను ఫ్లైయాస్ ఇటుకలతో నిర్మించడమే గాక పెండాల్స్ను గోడకు కట్టడం.. ఫలితంగా ఏడుగురు భక్తుల ప్రాణాలు తీశారన్నారు. ఈ ఘటనతో ప్రభుత్వ నిర్లక్ష్యం.. చేతగానితనం తేటతెల్లమైందన్నారు. భక్తులకు చేసిన ఏర్పాట్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయన్నారు. మృతుల కుటుంబాల రోదన అంతా ఇంతా కాదన్నారు. ప్రభుత్వం ఈ ఘటనను కూడా రాజకీయం చేయడం దారుణమన్నారు. చనిపోయిన వారి కుటుంబానికి రూ.కోటి పరిహారం, శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది ‘కూటమి’ వైఫల్యమే.. చందనోత్సవంలో ఇంతటి ఘోరం జరగడం దిగ్భ్రాంతి కలిగించిందని మాజీ మేయర్ గొలగాని హరివెంకటకుమారి అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రస్తుత ఘటన నిస్సందేహంగా కూటమి ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు. -
హా.. నరహరీ
ఆర్తనాదాలతో మార్మోగిన సింహగిరి● పాలకుల నిర్లక్ష్యానికి ఏడు ప్రాణాలు బలి ● సింహాచలం చరిత్రలోనే తొలిసారి విషాదం ● మృత్యుఘోష వినకుండా.. దర్శనాలపైనే వీవీఐపీల దృష్టి ● వీఐపీ దర్శనాల కోసమే పనిచేసిన మంత్రుల కమిటీ చీకటిలో మృత్యు ఘోష బుధవారం వేకువజామున 2.22 గంటలకు ఈదురుగాలులు మొదలయ్యాయి. 2.25 గంటలకు గాలుల తీవ్రత పెరిగింది.. అప్పటికే వేలాది మంది భక్తులు క్యూల్లో దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. 2.30 గంటలకు వర్షం ప్రారంభమైంది. 2.45 గంటలకు ఈదురుగాలులతో భారీ వర్షంగా మారింది. క్యూల్లో వేల మంది భక్తులు తలదాచుకునేందుకు సరైన వసతి లేదు. రూ.300 టికెట్ క్యూల్లోని భక్తులు వర్షపు నీరు రాని చోట ఆగారు. మరికొందరు తడిసి ముద్దవుతూనే స్వామి దర్శనం కోసం ముందుకు కదిలారు. సరిగ్గా కొత్త షాపింగ్ కాంప్లెక్స్ పైభాగం నుంచి ఇంకో 100 మీటర్లు ముందుకు వెళ్తే స్వామి దర్శనం కలుగుతుంది. ఇంతలో ఊహించని విపత్తు.. సరిగ్గా 3.05 గంటలకు కొత్తగా నిర్మించిన గోడపైకి వరదనీరు వచ్చింది. దీంతో గోడ బీటలు వారింది. టెంట్ గోడపైనే ఏర్పాటు చేయడంతో ఈదురుగాలులకు కూలిపోయింది. అదే సమయంలో గోడ ఒక్కసారిగా కుప్పకూలి భక్తులపై పడింది. గోడ శిథిలాల కింద ఏడుగురు భక్తులు చిక్కుకొని మృత్యు ఒడికి చేరారు. సాక్షి, విశాఖపట్నం : నిత్యం నృసింహుని నామస్మరణతో పులకించే పవిత్ర సింహగిరి.. భక్తుల ఆర్తనాదాలతో కన్నీటి సంద్రమైంది. గోవిందా.. గోవిందా.. సింహాద్రి అప్పన్నా.. కాపాడు అని ఆ దేవ దేవుడిని వేడుకునే భక్తకోటి గొంతులే.. ప్రాణభయంతో రక్షించండి.. చచ్చిపోతున్నాం అంటూ హాహాకారాలు పెట్టాయి. సింహాద్రినాథుని నిజరూప దర్శనం కోసం వచ్చిన భక్తుల ఆశలు అక్కడికక్కడే సమాధి అయ్యాయి. స్వామి దర్శనానికి అడుగుల దూరంలో ఉండగానే.. కొందరు అనంతలోకాలకు చేరుకున్నారు. సింహాచలం దేవస్థానం చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని ఈ మహా విషాదం.. పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. కనులపండువగా జరగాల్సిన చందనోత్సవం.. ప్రభుత్వ ఘోర నిర్లక్ష్యం, మంత్రుల ప్రచార యావ, ప్రజాప్రతినిధుల సేవలో తరించిన అధికారుల చేతకానితనంతో తీరని దుఃఖాన్ని, అంతులేని వేదనను మిగిల్చింది. ఏడు నిండు ప్రాణాలను బలిగొన్న ఘోర వైఫల్యోత్సవంగా.. ఈ చందనోత్సవం చరిత్రలో నిలిచిపోతుంది. భక్తుల ప్రాణాలకు విలువేదీ? రెండు వారాలుగా ఐదుగురు మంత్రుల కమిటీ పేరుతో జరిగిన హడావుడి అంతా ఇంతా కాదు. సమీక్షల మీద సమీక్షలు, పకడ్బందీ ఏర్పాట్లంటూ ప్రగల్భాలు పలికారు. కానీ.. క్షేత్రస్థాయిలో జరిగింది శూన్యం. ఏటా చందనోత్సవం రోజు వర్షం కురవడం ఆనవాయితీ. ఈ చిన్నపాటి ముందుచూపు కూడా లేకుండా.. కనీస రక్షణ చర్యలు చేపట్టకుండా అధికారులు, మంత్రులు ఏం చేశారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. వారి దృష్టి అంతా వీఐపీ టికెట్ల పంపకాలు, ప్రచార ఆర్భాటంపైనే కేంద్రీకృతమైంది తప్ప.. సామాన్య భక్తుల సౌకర్యాలు, భద్రత పట్టలేదు. ఫలితం ఈ ఘోర విషాదం. -
బాబు ఏడాది పాలనలోనే ఇంతటి దారుణాలు చూడాల్సి వచ్చింది: వైఎస్ జగన్
విశాఖపట్నం, సాక్షి: చంద్రబాబు ఏడాది పాలనలోనే దారుణమైన పరిస్థితులు.. అదీ ఆలయాల్లో చూడాల్సి వస్తోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. బుధవారం సింహాచలం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.సింహాచలంలో గోడ కూలిపోయి ఏడుగురు చనిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. వైకుంఠ ఏకాదశి నాడు కూడా ఇలాగే చేశారు. నాడు తిరుపతిలో జరిగిన తోపులాటలో ఆరుగురు చనిపోయారు. చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో ఈ ప్రభుత్వానికి తెలీదా?. లక్షల మంది భక్తులు వస్తారని తెలిసి కూడా నిర్లక్ష్యం వహించారు. కనీస సౌకర్యాలు కూడా లేవని భక్తులు చెబుతున్నారు. ఆరు రోజుల కిందట గోడ కట్టడం మొదలుపెట్టారు. రెండు రోజుల కిందట పూర్తి చేశారు. పదడుగుల ఎత్తు.. డెబ్బై అడుగుల పొడవుతో గోడ కట్టారు. కనీసం ఎటువంటి టెండర్లు లేకుండా ఈ గోడ పని పూర్తి చేశారు. దాదాపుగా సంవత్సరం అయ్యింది చంద్రబాబు అధికారంలోకి వచ్చి. చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో చంద్రబాబుకి తెలియదా?. జరుగుతుందని తెలిసి కూడా ముందే గోడ కట్టే కార్యక్రమం చేపట్టలేకపోయారు?. ముందస్తు ఏర్పాట్లపై ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు. మంత్రుల కమిటీ ఏం చేసిందసలు?. కాంక్రీట్ గోడతో కట్టాల్సిన చోట.. ఫ్లైయాష్ ఇటుకలతో నిర్మించారు. కనీసం నాణ్యంగా ఆ గోడను ఎందుకు నిర్మించలేకపోయారు?. వర్షం పడిందని తెలుసు. చందనోత్సవం సందర్భంగా ప్రతీసారి వర్షం పడుతుందని తెలుసు. అయినా రెండు రోజుల కిందట కట్టిన ఆ గోడ పక్కనే క్యూ లైన్ పెట్టారు. చంద్రబాబు ఏడాది పాలనలో దారుణాలు చూడాల్సి వస్తోంది. రాజకీయాల కోసం తిరుమల లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేశారు. తొక్కిసలాట ఘటనలో ఏడుగురిని బలిగొన్నారు. తిరుమల గోశాలలో గోవులు కూడా చనిపోయాయి. కాశినాయన గుడిని బుల్డోజర్లతో కూల్చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం ఆలయంలో తాబేళ్లు మృతి చెందాయి. అంతకు ముందు గోదావరి పుష్కరాల్లో 29 మందిని బలిగొన్నారు. ఇన్ని జరుగుతున్నా చర్యలు లేవు. ఎందుకంటే అన్నింటిలోనూ చంద్రబాబే దోషి. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. ఈ ఘటనలోనూ నిందను మాపైకి నెట్టే యత్నం చేశారు. కానీ, వాళ్ల హయాంలో.. అదీ రెండు రోజుల కిందటే ఆ గోడ కట్టిందని తేలింది. అయినా చంద్రబాబులో ఎక్కడా పశ్చాత్తాపం కనిపించడం లేదు.ప్రభుత్వం అంటే ప్రజలకు భరోసా ఇచ్చేదిగా ఉండాలి. మొక్కుబడిగా రూ.25 లక్షల పరిహారం ప్రకటించారు. జగన్ వస్తున్నాడనే ఈ ప్రకటన చేశారు. ప్రభుత్వం తప్పిదం కాబట్టి పరిహారం పెంచి ఇవ్వాలి. మా ప్రభుత్వంలో ఇలాంటి ప్రమాదాలు జరిగితే.. బాధ్యతగా అధిక పరిహారం చెల్లించాం. ఈ బాధిత కుటుంబాలకు కూడా మా ప్రభుత్వం వచ్చాక ఆ పని తప్పకుండా చేస్తాం’’ అని వైఎస్ జగన్ ప్రకటించారు. కానీ, బాధ్యులపైనా కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటివి పునరావృతం కావని చంద్రబాబుకి వైఎస్ జగన్ హితవు పలికారు. -
ఉమామహేష్, శైలజకు నివాళి.. జగన్ భావోద్వేగం
విశాఖపట్నం, సాక్షి: సింహాచలం బాధిత కుటుంబాన్ని పరామర్శించే క్రమంలో వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) భావోద్వేగానికి లోనయ్యారు. ఆ కుటుంబ సభ్యులను ఓదారుస్తూ ధైర్యం చెప్పారు. సింహాచలంలో దైవదర్శనానికి వెళ్లిన పిల్లా ఉమామహేష్, అతని భార్య శైలజ గోడ కూలిన ఘటనలో మృతి చెందారు. వాళ్ల కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు వైఎస్ జగన్ మధురవాడలోని చంద్రంపాలెంకు వెళ్లారు. ఆయన్ని చూసి ఆ కుటుంబ సభ్యులు భావోద్వేగాన్ని లోనయ్యారు. దీంతో ఆయన వాళ్లను హత్తుకుని ఓదార్చారు. అనంతరం.. ఉమా మహేశ్వరరావు, శైలజ భౌతికకాయాలకు నివాళి అర్పించి మీడియాతో మాట్లాడారాయన. -
సింహాచలం ఘటన.. మూడు రోజుల క్రితం గోడ కట్టడమేంటి?: లక్ష్మీపార్వతి
సాక్షి,తాడేపల్లి: సింహాచలం ఘటన ఎంతో బాధాకరమని.. దేవుడి పేరుతో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే వీరి పాపాలు పరాకాష్టకు చేరుకున్నాయనిపిస్తోందంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నందమూరి లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేవుడి పేరుతో అక్రమాలు, అన్యాయాలు చేస్తున్నారని.. చంద్రబాబు ఎప్పుడు అడుగుపెట్టినా ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయని లక్ష్మీపార్వతి అన్నారు.‘‘తనను తాను నాస్తికుడిగా చంద్రబాబు ఎప్పుడో చెప్పాడు. ఇలాంటి వన్నీ చూసినప్పుడు ప్రత్యక్షంగా ప్రకృతి ప్రకోపిస్తోంది. 2014లో 40 ఆలయాలను కూలగొట్టించింది చంద్రబాబే.. అయినా చంద్రబాబు గొప్పవాడని బీజేపీ వెనకేసుకొస్తోంది. వైఎస్ జగన్ కులమతాలకు అతీతంగా పాలన అందించారు. అది నచ్చక జగన్పై బురద చల్లారు. తన మనుషులతో ఆలయాలపై దాడులు చేయించి జగన్పై నెట్టేశారు. తిరుపతి లడ్డూని రాజకీయాలకు వాడుకుని మహాపాపం చేశారు. లడ్డూని అపవిత్రం చేయాలని చంద్రబాబు, పవన్ ఎంతో ప్రయత్నం చేశారు’’ అని లక్ష్మీపార్వతి గుర్తు చేశారు‘‘దేవుడు ఇలాంటి వన్నీ చూస్తూ ఉంటాడు. ఇన్నేళ్ల చరిత్రలో తిరుపతిలో తొక్కిసలాట ఏనాడైనా జరిగిందా?. గోదావరి పుష్కరాల తొక్కిసలాట.. తిరుపతి తొక్కిసలాట.. గోవుల మృతి ఇవన్నీ చంద్రబాబు సమయంలోనే జరుగుతాయి. ఎవరు ఎలా పోయినా పర్వాలేదు.. మా దోపిడీ మాకు ముఖ్యం అనేలా ఈ ప్రభుత్వ తీరు ఉంది. మూడు రోజుల క్రితం గోడకట్టడమేంటి?. ముందే కట్టొచ్చుకదా. వీళ్లలాంటి అవినీతి పరులకే పనులు అప్పగించారు.. అందుకే ఇలా జరిగింది’’ అని లక్ష్మీపార్వతి ఆరోపించారు.‘‘అర్హత లేని వాళ్లు అందలం ఎక్కితే ఇలాంటివే జరుగుతాయి. బాధిత కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం అందించాలి. తిరుమతి తొక్కిసలాట విచారణ ఏమైంది?. చంద్రబాబు నీ జీవితం ఇంకెప్పుడూ మారదా?. నీ మార్గంలోనే నీ కొడుకును తీసుకెళ్లాలనుకుంటున్నావా?. ప్రజలు ఏమీ చేయలేనప్పుడు ప్రకృతి తిరగబడుతుంది. పవన్ సనాతన వేషాలు ఇప్పటికైనా మానుకో.. చంద్రబాబు అతని కొడుకు వంటి వాళ్లు అధికారంలో ఉంటే ప్రజలకు రక్షణ ఉండదు. ఎన్నికల ముందు చిన్న చిన్న రోడ్లలో మీటింగ్లు పెట్టి ప్రజల చావుకు కారణమయ్యారు. చంద్రబాబు అంటేనే మనుషులను చంపడమా?. ఈకుల, మత పిచ్చేంటి... చంద్రబాబు ఒక్కరోజైనా మనిషిగా బ్రతకండి. చంద్రబాబు,పవన్ అడుగుపెట్టిన నాటి నుంచి ఇలాంటి అపశ్రుతులే చోటుచేసుకుంటున్నాయి’’ అని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. -
సింహాచలం విషాదం.. ఏడుగురి ప్రాణం తీసిన గోడను నిర్మించింది అప్పుడే
విజయవాడ: సింహాచలం ఘటనపై మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అదే సమయంలో భక్తుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి ఎంత విశిష్టత ఉంటుందో. సింహాచలంలో చందనోత్సవానికి అంతే విశిష్టత ఉంటుంది. ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతకాని తనంతో ప్రమాదం జరిగింది. మూడు, నాలుగు రోజుల క్రితం గోడ నిర్మించారు. గోడ నిర్మాణంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. గోడ ప్లెక్సీ ఊగినట్లు ఊగిందని సాక్షులు చెప్పారు. కొండవాల్లో కాంక్రీట్ వాల్ నిర్మించాలి. ఇటుక బెడ్డలతో నిర్మాణం చేపట్టరాదు. ఒకే కుటుంబంలో నలుగురు చనిపోయారు.చనిపోయిన వారి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. సంఘటన తెలిసిన వెంటనే వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కేజీహెహెచ్లో బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగింది. కొండపై చాలా గోడలు ఉన్నాయి. అవి ఎందుకు పడుపోలేదు. నాణ్యాత లోపించింది కాబట్టే గోడ పడిపోయింది’ అని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుమల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. ‘ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది...అచేతనంగా మారిపోయింది . ప్రత్యర్ధుల్ని ఇబ్బంది పెట్టడానికి వారికి కావాల్సిన పోలీస్ శాఖ మాత్రమే పనిచేస్తుంది. తిరుపతి లడ్డూ అంశాన్ని తెరపైకి తెచ్చి వైఎస్ జగన్పై బురద చల్లాలని చూశారు. చందనోత్సవంలో అపశృతి పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే.మంత్రులు,ప్రభుత్వం చేతకాని తనంతోనే భక్తులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిని తిరిగి తీసుకురాగలరా. రాష్ట్ర పండుగగా జరుపుకునే ఉత్సవానికి లోపభూయిష్టంగా ఏర్పాట్లు చేయడమేంటి. ఇంతపెద్ద ఘటన జరిగితే తప్పించుకునే ధోరణితో మంత్రులు , అధికారులు వ్యవహరిస్తున్నారు.వరుస అపచారాలు జరుగుతున్నా మొద్ద నిద్ర వీడటం లేదు. ఎంక్వైరీల పేరుతో ట్వీట్లు , ప్రకటనలు చేస్తే సరిపోతుందా?.ఈ ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారు. ఈ ప్రభుత్వానికి హిందూ ఆలయాల పట్ల, దైవ దర్శనాలకు వచ్చే భక్తుల పట్ల చిత్త శుద్ధి లేదు. ఐదుగురు మంత్రులు రివ్యూలు చేశామన్నారు.మీ రివ్యూలు టిక్కెట్ల పంపకాలు ..ప్రోటోకాల్ దర్శనాల కోసమేనా. భక్తుల ప్రాణాలంటే మీకు లెక్కలేదా. వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు. మేం పదే పదే హెచ్చరిస్తున్నా .. ఈ ప్రభుత్వంలో చలనం రావడం లేదు. సనాతన ధర్మం అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు. వైకుంఠ ఏకాదశి రోజున తిరుపతిలో భక్తులు చనిపోయారు. కాశీనాయన క్షేత్రాన్ని కూలదోశారు. శ్రీకూర్మంలో నక్షత్ర తాబేళ్లు మృత్యువాత పడ్డాయి. ఇప్పడు సింహాచలం చందనోత్సవంలో భక్తులు చనిపోయారు. ఏపీలో దైవదర్శనానికి వచ్చిన భక్తులు తిరిగి క్షేమంగా వెళతారనే నమ్మకం లేకుండా పోయింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. -
విశాఖ: సింహాచలం బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మధురవాడ సమీపంలోని చంద్రంపాలెం గ్రామానికి చేరుకున్నారు. సింహాచలం ఘటనలో మృతిచెందిన బాధిత కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు. మృతిచెందిన ఉమామహేష్, శైలజ భౌతికాయాలకు నివాళులర్పించిన వైఎస్ జగన్.. మృతుల కుటుంబాలను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కుప్పకూలి భక్తులు మృతి చెందడంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందనోత్సవం సందర్భంగా రూ. 300 టికెట్ క్యూలైన్ పై గోడ కుప్పకూలి భక్తులు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మరణించిన భక్తుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ క్రమంలోనే మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు చంద్రంపాలెం బయల్దేరి వెళ్లారు,. తొలుత తాడేపల్లి నుంచి విశాఖకు చేరుకున్న వైఎస్ జగన్.. అక్కడ నుంచి చంద్రంపాలెం వెళ్లారు. -
సింహాచలం విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
సాక్షి, విశాఖపట్నం: సింహాచలం కొండపై తెల్లవారుజామున జరిగిన గోడ కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతులను విశాఖపట్నం మధురవాడ సమీపంలోని చంద్రంపాలెం గ్రామానికి చెందిన పిళ్లా ఉమామహేశ్వరరావు (30), ఆయన భార్య శైలజ (26)గా అధికారులు గుర్తించారు. వీరితో పాటు పిల్లా శైలజ తల్లి వెంకటరత్నం, మేనత్త గుజ్జురి మహాలక్ష్మి కూడా ఈ ఘటనలో మృతిచెందారు.అధికారులు అందించిన వివరాల ప్రకారం, ఉమామహేశ్వరరావు, శైలజ ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా హైదరాబాద్లోని వేర్వేరు సంస్థల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరూ ఇంటి నుంచే (వర్క్ ఫ్రమ్ హోం) విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజామున 2 గంటల సమయంలో రూ. 300 ప్రత్యేక దర్శనం క్యూలైన్లో వీరు వేచి ఉన్నారు. అదే సమయంలో అక్కడున్న ఒక గోడ ఒక్కసారిగా కూలి వారిపై పడటంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు.ఉమామహేశ్వరరావు, శైలజ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, అందరితో కలివిడిగా మెలిగేవారని స్థానికులు, బంధువులు చెబుతున్నారు. ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగాలు చేస్తూ స్థిరపడుతున్న సమయంలో ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం వారి కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. వారి స్వగ్రామమైన చంద్రంపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ దురదృష్టకర సంఘటనపై పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. -
సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ విచారం
ఢిల్లీ : విశాఖ జిల్లా సింహాచలం దేవస్థానంలో గోడ కూలిన ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. గోడకూలి భక్తులు చనిపోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన భక్తులు త్వరగా కోలుకోవాలి’అని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పీఎం సహాయ నిధి నుంచి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు PMNRF నుండి రూ. 2 లక్షల పరిహారం ,గాయపడిన వారికి రూ. 50,000 పరిహారం ఇస్తున్నట్లు పీఎంవో కార్యాలయం ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.Deeply saddened by the loss of lives due to the collapse of a wall in Visakhapatnam, Andhra Pradesh. Condolences to those who have lost their loved ones. May the injured recover soon.An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The…— PMO India (@PMOIndia) April 30, 2025 -
తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే..
సాక్షి, విశాఖపట్నం: తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే.. సింహాచలంలో మరో ఘోర విషాదం జరిగింది. సింహాచలం అప్పన చందనోత్సవంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ఫలితంగా.. గోడకూలి ఏడుగురు మృతిచెందారు. ఘటన జరిగిన సమయంలో ఒక్క పోలీసు కూడా కనిపించలేదు.. భక్తులను ఆదుకోవడానికి ఒక్క ఎండోమెంట్ ఉద్యోగి కూడా అక్కడ లేరు. అందుబాటులో ఉన్న వాలంటీర్లు, భక్తులు మాత్రమే సహాయక చర్యలు చేపట్టారు. కటిక చీకటిలో భక్తుల కోసం క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో అంతా అంధకారం అలుముకుంది. గోడ కూలిపోవడంతో భక్తుల అరుపులు, రోదనలు మిన్నంటాయి. అప్పటికే భక్తుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.ఈ ఘటనపై సమగ్ర విచారణ చేసి.. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. అన్యాయంగా ఏడుగురు చనిపోయారు. ఘటనపై పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకుంటున్నాం. సరైన చర్యలు చేపట్టకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని వరుదు కల్యాణి అన్నారు. కటిక చీకట్లో భక్తుల కోసం క్యూలైన్లా?. తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే. ఈ ఘటన ప్రభుత్వ వైఫల్యాన్ని బయటపెడుతోందని ఆమె అన్నారు.మరోవైపు, సింహాచలం ఘటనపై వీహెచ్పీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సింహాచలం సరైన రీతిలో ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని.. నిర్మాణ లోపం వల్లే ప్రమాదం జరిగిందని మండిపడింది.సింహాచలంలో పాలన కాదు.. లాబీయింగ్ నడుస్తోంది. ఎండోమెంట్ వ్యవస్థ ఓ చెత్త.. భగవంతుడికి భక్తులకు దూరం చేయడమే వారిపని.. హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.. పాలకుల కబంధ హస్తాల నుంచి ఎండోమెంట్ వ్యవస్థ బయటకు వస్తేనే భక్తులకు మంచి జరుగుతోంది.. చందనోత్సవంలో ఒక ప్రణాళిక లేదు.. ఓ ప్లాన్ లేదు’’ అంటూ వీహెచ్పీ ఆగ్రహం వ్యక్తం చేసింది. -
సింహాచలంలో ఘోర విషాదం.. చంద్రబాబు సర్కారుపై వీహెచ్పీ ఆగ్రహం
విశాఖ,సాక్షి: విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు మృతి చెందారు. ఈ దుర్ఘటనలో చంద్రబాబు సర్కారుపై విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ)ఆగ్రహం వ్యక్తం చేసింది.‘సింహాచలంలో సరైన రీతిలో ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. నిర్మాణం లోపం వల్లే ఈ ప్రమాదం జరిగింది. సింహాచలంలో పాలన కాదు. లాబీయింగ్ నడుస్తోంది. ఎండోమెంట్ వ్యవస్థ ఓ చెత్త. భగవంతుడికి భక్తులను దూరం చేయడమే వారి పని. హిందూ మనోభావాలను తీవ్రంగా దెబ్బతిన్నాయి. పాలకుల కంబంధ హస్తాల నుంచి ఎండోమెంట్ వ్యవస్థ బయటకు వస్తే భక్తులకు మంచి జరుగుతోంది.చందనోత్సవంలో ఓ ప్రణాళిక లేదు. ప్లానింగ్ లేదు. సింహాచలంలో హిందూ భక్తులకు గౌరవమే లేదు. హుండీలో వేసే డబ్బు తోటే ఎండో మెంట్ వ్యవస్థ నడుస్తోంది. కానీ ఆ భక్తులను పట్టించుకోవడం లేదు. వీఐపీలకు ఇచ్చే ప్రాధాన్యత సామాన్య భక్తులకు లేదు. హిందూ సాంప్రదాయాలు, సంస్కృతి తెలిసిన వాళ్లకు మాత్రమే ఎండోమెంట్లో ఉండాలి’ అని డిమాండ్ చేస్తోంది. Eight Devotees Killed, Several Injured in Wall Collapse During Chandanotsavam at Simhachalam TempleTragedy struck the sacred hill shrine of Simhachalam in the early hours of Wednesday when a newly constructed wall at the Rs. 300 ticket queue line collapsed, leaving at least… pic.twitter.com/z2Gk8OR8Qp— Sudhakar Udumula (@sudhakarudumula) April 29, 2025 -
Vishakha: సింహాచలం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
విశాఖ,సాక్షి : విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. గోడ కుప్పకూలి ఏడుగురు భక్తులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఈ విషాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చందనోత్సవం సందర్భంగా రూ. 300 టికెట్ క్యూలైన్ పై గోడ కుప్పకూలి భక్తులు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మరణించిన భక్తుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. -
సింహాచలం అప్పన్న సన్నిధిలో అపశ్రుతి.. ఏడుగురు భక్తులు మృతి
సాక్షి, విశాఖపట్నం: సింహాచలం చందనోత్సవంలో ఘోర అపశ్రుతి చోటుచేసుకుంది. గోడ కుప్పకూలి ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. రూ.300 టికెట్ కౌంటర్ వద్ధ ఈ ప్రమాదం జరిగింది. ఇటీవలే అక్కడ గోడ నిర్మించారు. గోడ నాసిరకంగా నిర్మించడం వలనే కూలిపోయిందని అధికారులు భావిస్తున్నారు. తెల్లవారుజామున 2-3 గంటల మధ్య రూ.300 క్యూ లైన్లో ప్రమాదం జరిగింది. మృతులను యడ్ల వెంకటరావు(48),దుర్గా స్వామినాయుడు(32), మణికంఠ(28)గా గుర్తించారు.ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతులను విశాఖపట్నం మధురవాడ సమీపంలోని చంద్రంపాలెం గ్రామానికి చెందిన పిళ్లా ఉమామహేశ్వరరావు (30), ఆయన భార్య శైలజ (26)గా అధికారులు గుర్తించారు. వీరితో పాటు పిల్లా శైలజ తల్లి వెంకటరత్నం, మేనత్త గుజ్జురి మహాలక్ష్మి కూడా ఈ ఘటనలో మృతిచెందారు. మృతదేహాలను కేజీహెచ్కు తరలించారు.👉ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం.. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్తిరుపతిలో వైకుంఠ ఏకాదశి ఎంత విశిష్టత ఉంటుందోసింహాచలంలో చందనోత్సవానికి అంతే విశిష్టత ఉంటుందిప్రభుత్వ నిర్లక్ష్యం చేతకాని తనంతో ప్రమాదం జరిగిందిమూడు నాలుగు రోజుల క్రితం గోడ నిర్మించారుగోడ నిర్మాణంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదుగోడ ప్లెక్సీ ఊగినట్లు ఊగిందని సాక్షులు చెప్పారుకొండవాలులో కాంక్రీట్ వాల్ నిర్మించాలిఇటుక బెడ్డలతో నిర్మాణం చేపట్టరాదుఒకే కుటుంబంలో నలుగురు చనిపోయారుచనిపోయిన వారి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలిప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలిసంఘటన తెలిసిన వెంటనే వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారుకేజీహెచ్ లో బాధిత కుటుంబాలను పరామర్శిస్తారుప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందికొండపై చాలా గోడలు ఉన్నాయి.. అవి ఎందుకు పడుపోలేదునాణ్యాత లోపించింది కాబట్టే గోడ పడిపోయింది👉సింహాచలం దుర్ఘటన.. భక్తుల మృతిపై విచారణ కమిటీ ముగ్గురు అధికారులతో కమిటి వేసిన ప్రభుత్వం 👉సింహాచలం ఘటన.. ప్రభుత్వ వైఫల్యంపై మల్లాది విష్ణు ఫైర్ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది...అచేతనంగా మారిపోయిందిప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టడానికి మాత్రమే పోలీస్ శాఖ మాత్రమే పనిచేస్తుందితిరుపతి లడ్డూ అంశాన్ని తెరపైకి తెచ్చి వైఎస్ జగన్ పై బురద చల్లాలని చూశారుచందనోత్సవంలో అపశ్రుతి పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేమంత్రులు, ప్రభుత్వం చేతకాని తనంతోనే భక్తులు ప్రాణాలు కోల్పోయారుచనిపోయిన వారిని తిరిగి తీసుకురాగలరా?రాష్ట్ర పండుగగా జరుపుకునే ఉత్సవానికి లోపభూయిష్టంగా ఏర్పాట్లు చేయడమేంటి?ఇంతపెద్ద ఘటన జరిగితే తప్పించుకునే ధోరణితో మంత్రులు, అధికారులు వ్యవహరిస్తున్నారువరుస అపచారాలు జరుగుతున్నా మొద్ద నిద్ర వీడటం లేదు 👉మరణించిన వారికి పోస్టుమార్టం చేయడానికి ఒప్పుకోని బంధువులుకోటి రూపాయల పరిహారం ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్తమ డిమాండ్లను ఒప్పుకున్న తర్వాతే పోస్టుమార్టం చేయాలంటున్న బంధువులుపోస్టుమార్టానికి సహకరించాలని బంధువులపై పోలీసులు ఒత్తిడిపోలీసులతో వాగ్వాదానికి దిగిన బంధువులుఎల్జీ పాలిమర్ ప్రమాదంలో చనిపోయిన వారికి కోటి రూపాయల పరిహారం చెల్లించారుఅదే తరహాలో నేడు కూడా పరిహారం చెల్లించాలని డిమాండ్..👉కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యమే: కొట్టు సత్యనారాయణతిరుపతి ఘటన మరవకముందే సింహాచలంలో ఏడుగురు భక్తులు మృతి దారుణంకూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందిలక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేయలేదుసింహాచలం ఘటన బాధాకరంఘటన జరిగి కొన్ని గంటలు అవుతున్నా పవన్ కల్యాణ్ ఎక్కడ ఉన్నారు?క్యూలైన్ల దగ్గర ఎండోమెంట్,రెవెన్యూ అధికారులు ఎందుకు లేరు?గోదావరి పుష్కరాల్లో కూడా పదుల సంఖ్యలో భక్తులు చనిపోయారు.👉విశాఖకు మాజీ సీఎం వైఎస్ జగన్మధ్యాహ్నం 3 గంటలకు విశాఖకు చేరుకోనున్న వైఎస్ జగన్బాధిత కుటుంబాలను పరామర్శించనున్న వైఎస్ జగన్👉 సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ విచారంవిశాఖ జిల్లా సింహాచలం దేవస్థానంలో గోడ కూలిన ఘటనపై ప్రధాని మోదీ విచారం గోడకూలి భక్తులు చనిపోవడం బాధాకరంమృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిగాయపడిన భక్తులు త్వరగా కోలుకోవాలి పీఎం సహాయ నిధి నుంచి ఎక్స్గ్రేషియా మృతుల కుటుంబాలకు PMNRF నుండి రూ. 2 లక్షల పరిహారం గాయపడిన వారికి రూ. 50,000 పరిహారం ఇస్తున్నట్లు పీఎంవో కార్యాలయం ఎక్స్ వేదికగా ట్వీట్ Deeply saddened by the loss of lives due to the collapse of a wall in Visakhapatnam, Andhra Pradesh. Condolences to those who have lost their loved ones. May the injured recover soon.An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The…— PMO India (@PMOIndia) April 30, 2025 👉కేజీహెచ్ మార్చురి వద్ద విషాద ఛాయలుకేజీహెచ్ మార్చురి వద్దకు చేరుకుంటున్న మృతుల కుటుంబ సభ్యులుకన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు...దైవదర్శనానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారంటూ ఆవేదన👉సింహాచలం ఘటనపై వీహెచ్పీ ఆగ్రహంసింహాచలం సరైన రీతిలో ప్రభుత్వం చర్యలు చేపట్టలేదునిర్మాణ లోపం వల్లే ప్రమాదం జరిగిందిసింహాచలంలో పాలన కాదు.. లాబీయింగ్ నడుస్తోందిఎండోమెంట్ వ్యవస్థ ఓ చెత్తభగవంతుడికి భక్తులకు దూరం చేయడమే వారిపనిహిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయిపాలకుల కబంధ హస్తాల నుంచి ఎండోమెంట్ వ్యవస్థ బయటకు వస్తేనే భక్తులకు మంచి జరుగుతోందిచందనోత్సవంలో ఒక ప్రణాళిక లేదు.. ఓ ప్లాన్ లేదు👉తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే..ఘటనపై సమగ్ర విచారణ చేసి.. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే సింహాచలంలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని ఆమె అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి. అన్యాయంగా ఏడుగురు చనిపోయారు. ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని వరుదు కల్యాణి అన్నారు.👉వైఎస్ జగన్ దిగ్భ్రాంతివిశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కుప్పకూలి భక్తులు మృతి చెందడంపై మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందనోత్సవం సందర్భంగా రూ. 300 టికెట్ క్యూలైన్ పై గోడ కుప్పకూలి భక్తులు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మరణించిన భక్తుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.👉సింహాచలం ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి తీవ్ర విచారంగోడ కూలి భక్తులు మరణించిన ఘటన తీవ్ర ఆవేదనను కలిగించిందివారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి ఆంధ్ర ప్రదేశ్ లోని సింహాచలం ఆలయం వద్ద గోడ కూలి భక్తులు మరణించిన ఘటనతీవ్ర ఆవేదనను కలిగించింది. వారి కుటుంబ సభ్యులకునా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ…మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని…భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.— Revanth Reddy (@revanth_anumula) April 30, 2025 -
సింహాచలం చందనోత్సవంలో ఘోర అపశ్రుతి
విశాఖ: సింహాచలం చందనోత్సవంలో ఘోర అపశ్రుతి చోటుచేసుకుంది. భారీగా కురిసిన వానకు గోడ కుప్పకూలి ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. రూ.300 టికెట్ కౌంటర్ వద్ధ ఈ ప్రమాదం జరిగింది. ఇటీవలే అక్కడ గోడ నిర్మించారు. గోడ నాసిరకంగా నిర్మించడం వలనే కూలిపోయిందని అధికారులు భావిస్తున్నారు. తెల్లవారుజామున 2-3 గంటల మధ్య రూ.300 క్యూ లైన్లో ప్రమాదం జరిగింది. -
భక్తుల సౌకర్యార్థం జీవీఎంసీ ఏర్పాట్లు
డాబాగార్డెన్స్: శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవం సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా జీవీఎంసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. నగర మేయర్ పీలా శ్రీనివాస్ మంగళశారం అధికారులతో కలిసి కొండపై జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. పారిశుధ్యం, తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణపై ఆదేశాలు జారీ చేశారు. లక్షలాది మంది భక్తుల కోసం మంగళ, బుధ, గురువారాల్లో ఆరు షిఫ్టుల్లో 1,350 మంది పారిశుధ్య కార్మికులు సేవలు అందిస్తున్నట్లు మేయర్ తెలిపారు. దేవస్థానం పరిసర ప్రాంతాలన్నింటిలో పారిశుధ్య పనులు జరుగుతున్నాయని, శానిటరీ అధికారులు వీటిని పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. భక్తుల తాగునీటి కోసం 193 పాయింట్లలో వాటర్ క్యాన్లు, వాటర్ బాటిల్స్ సిద్ధం చేశామన్నారు. ఎండల దృష్ట్యా అదనంగా ఆరు నీటి ట్యాంకర్లను సిద్ధంగా ఉంచామని, తాగునీటి సరఫరాను పర్యవేక్షించడానికి సిబ్బందిని నియమించామన్నారు. 21 ప్రాంతాల్లో 401 తాత్కాలిక మరుగుదొడ్లు, ఐదు మొబైల్ టాయిలెట్లు, చెత్త సేకరణకు డంపర్, కంపాక్టర్ బిన్లు సిద్ధం చేసినట్లు తెలిపారు. జీవీఎంసీ ప్రధాన ఇంజినీర్ శివప్రసాద్రాజు, ప్రధాన వైద్యాధికారి నరేష్కుమార్, జోనల్ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, సీపీ
సింహాచలం: చందనోత్సవం ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్ హరేందిర ప్రసాద్ పరిశీలించారు. డ్రై రన్ నిర్వహించారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. కొండదిగువ కొత్త ఘాట్రోడ్డు, న్యూ గోశాలరోడ్డు, పాత గోశాల రోడ్డులో ఏర్పాట్లను పరిశీలించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కొండదిగువ హోల్డింగ్ పాయింట్లలో వేచి ఉండేందుకు అనువుగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచి కొండైపెకి వెళ్లి క్యూలు, బారికేడ్లు, తాగునీరు, వైద్యశిబిరాలు, బయో మరుగుదొడ్లు ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో జేసి మయూర్ అశోక్, భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్, సింహాచలం దేవస్థానం ఇన్చార్జి ఈవొ కె.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సింహగిరిపైన, కొండదిగువన, తొలిపావంచా వద్ద, గోశాల జంక్షన్, అడవివరం జంక్షన్, ఇతర ప్రాంతాల వద్ద భద్రతా ఏర్పాట్లను సీపీ శంఖబ్రత బాగ్చి పరిశీలించారు. పార్కింగ్ ప్రాంతాలు, సైన్ బోర్డులు, క్యూలు ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. -
వైఎస్సార్ సీపీ విశాఖ పార్లమెంట్ పరిశీలకుడిగా కదిరి బాబూరావు
ఏయూక్యాంపస్: వైఎస్సార్ సీపీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడిగా మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకురాలిగా మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి, అరకు పార్లమెంట్ పరిశీలకుడిగా బొడ్డేడ ప్రసాద్ నియమితులయ్యారు. వీరు పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లకు అనుసంధానంగా పనిచేస్తారు. అలాగే అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్తగా కరణం ధర్మశ్రీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
అధికార పార్టీ నేతలకే అంతరాలయ దర్శనం!
సామాన్య భక్తులకు అల్లంతదూరం● రూ.1,000 టికెట్లు కొనుగోలు చేసిన వారి పరిస్థితీ అంతే.. ● రూ.1,500 టికెట్లన్నీ కూటమి పార్టీల నేతలకే.. ● టికెట్ల జారీలో దేవాలయ ఈవోకి దక్కని స్థానం ● కలెక్టరేట్, అధికార పార్టీ నేతల ఆదేశాల మేరకే వ్యవహారం డమ్మీగా మారిన ఈవో..! ప్రస్తుత సింహాచలం దేవస్థానం ఈవో సెలవులో ఉండడంతో ఇన్చార్జిగా ఈవోగా కె.సుబ్బారావును ప్రభుత్వం నియమించింది. అయితే, సదరు దేవాలయ ఈవోను చందనోత్సవ వ్యవహరాల్లో నామమాత్రం చేశారనే విమర్శలున్నాయి. పాసుల జారీలో కానీ.. నిర్ణయాల్లో కానీ దేవాలయ ఈవోను డమ్మీ చేశారనే ఆరోపణలున్నాయి. పెత్తనమంతా రెవెన్యూ యంత్రాంగానిదే ఉంటోందని దేవదాయ అధికారులు, సిబ్బంది వాపోతున్నారు. దేవాలయంలో నిరంతరంగా సేవలందించే వ్యక్తులు, సంస్థలతో పాటు ఎన్జీవోలకు కూడా టికెట్లను మంజూరు చేయాలంటే కలెక్టరేట్ నుంచి ఆదేశాలు రావాల్సిందేనని దేవాలయ అధికారులు చేతులెత్తేసినట్టు తెలుస్తోంది. కనీసం వీరికి కూడా పాసులు ఇచ్చేందుకు తమ చేతుల్లో ఏమీ లేదని దేవాలయ అధికారులు పేర్కొంటున్నట్టు సమాచారం. కలెక్టరేట్కు వెళితే కనీసం ఎవరూ తమను పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. ఇన్చార్జిగా ఉన్న ఈవో మరో వారం, పది రోజుల్లో వెళ్లిపోయే భావనలో ఉండటంతో.. ఆయన్ని పూర్తిగా విస్మరించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా దేవాలయ అధికారులను, సిబ్బందిని నామమాత్రం చేసి అంతా కలెక్టరేట్ నుంచి, అధికార పార్టీ నేతల నుంచి వచ్చే ఆదేశాలే అమలవుతున్నాయనే విమర్శలు సింహాచలం కొండల చుట్టూ ప్రతిధ్వనిస్తుండటం గమనార్హం. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం సాధారణ భక్తులకే అప్పన్న చందనోత్సవంలో పెద్ద పీట వేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన జిల్లా యంత్రాంగం.. కేవలం వీఐపీ భక్తుల సేవలోనే తరిస్తోంది. అధికార పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు వారి అనుచరులకు మాత్రమే అంతరాలయ దర్శనం కల్పించేందుకు సిద్ధమైంది. సాధారణ భక్తులు, ఆన్లైన్లో రూ.1,000 టికెట్లను కొనుగోలు చేసిన వారికి మాత్రం అంతరాలయ దర్శనం లభించడం లేదు. కేవలం సిఫార్సులకే పెద్ద పీట వేయడం, సాధారణ భక్తులకు అంతరాలయ దర్శనం లేకపోవడం వంటి వ్యవహారాలన్నీ.. దేవాలయ ఇన్చార్జి ఈవోని డమ్మీని చేసి కలెక్టరేట్ నుంచి నడిచాయని విమర్శలు వినిపిస్తున్నాయి. టికెట్ల జారీలో కానీ, ఏర్పాట్లలో కానీ ఈవోతో సంబంధం లేకుండా వ్యవహారాలు సాగాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. మొత్తంగా ఎన్నడూ లేని విధంగా వీఐపీ భక్తులకే అంతరాలయం ద్వారా నిజరూప అప్పన్న దర్శనం లభించనుండగా.. సాధారణ భక్తులు మాత్రం దూరం నుంచే హడావుడిగా దర్శనం చేసుకుని ముందుకు సాగాల్సిన పరిస్థితులు ఉన్నాయనే అభిప్రాయం భక్తుల్లో వ్యక్తమవుతోంది. సిఫార్సులకే పెద్ద పీట ఏడాదిలో ఒక్కరోజే లభించే అప్పన్న నిజరూప దర్శనం కోసం ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. ఈసారి 2 లక్షల మందికిపైగా భక్తులు వస్తారని అంచనా వేశారు. అయితే టికెట్లు మాత్రం సాధారణ భక్తులకు అందుబాటులో లేకుండా పోయాయనే విమర్శలున్నాయి. ఆన్లైన్ టికెట్లను కూడా ముందుగానే అధికార పార్టీ నేతలకు అప్పగించారనే ఆరోపణలున్నాయి. ఇక వీఐపీ టికెట్లతో పాటు రూ.2,500, రూ.1,500, రూ.1000 టికెట్ల జారీలోనూ కేవలం అధికార పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలకే పెద్ద పీట వేశారనే ఆరోపణలున్నాయి. అధికార పార్టీ నేతలు కోరినన్ని టికెట్లు జారీ చేసిన జిల్లా యంత్రాంగం.. దేవాలయంలో నిరంతరంగా సేవలందించే వ్యక్తులు, సంస్థలు పది టికెట్లు అడిగితే కేవలం ఒకటి మాత్రమే ఇచ్చేందుకు అంగీకరించారు. తీరా ఈ టికెట్లను తీసుకునేందుకు సదరు బ్యాంకు వద్దకు వెళితే.. తమకు ఇంకా దేవస్థానం నుంచి లేఖ రాలేదనే సమాధానం వస్తోంది. ఈ నేపథ్యంలో దేవస్థాన అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించిన వ్యక్తులు, సంస్థలకు కూడా కనీస గౌరవ లేకుండా చేశారని వాపోతున్నారు. మొత్తంగా గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారుల వ్యవహారం ఉందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. -
ఉత్తరాంధ్ర గ్రామీణ వైద్యుల జోనల్ కమిటీ ఎన్నిక
ఎంవీపీకాలనీ: ఉత్తరాంధ్ర గ్రామీణ వైద్యుల జోనల్ కమిటీ ఎన్నిక ఎంవీపీ కాలనీ మెడికవర్ హాస్పటల్లోగా జరిగింది. మంగళవారం జరిగిన వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు అనంతరం సభ్యులు ఈ కమిటీని ఎన్నుకున్నారు. ఇందులో భాగంగా జోనల్ కమిటీ అధ్యక్షుడిగా జంగం జోషి, ప్రధాన కార్యదర్శిగా గెద్ద చిరంజీవి, ఉపాధ్యక్షులుగా అల్లాడ త్రినాథరావు, ఏలేటి రోజా, ఎస్.శ్రీకాంత్, సంయుక్త కార్యదర్శలుగా శ్రీనివాసరావు, సూర్యకళ, నారాయణరావు, కోశాధికారిగా పి.కనకారావు ఎన్నికయ్యారు. దీంతోపాటు ఈసీ సభ్యులను కూడా ఎన్నుకున్నారు ఉత్తరాంధ్ర నుంచి సుమారు 150 మంది గ్రామీణ వైద్యులు పాల్గొని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘం నాయకులు, సీనియర్, విశ్రాంత వైద్యులు పాల్గొన్నారు. -
ఉర్సా కంపెనీకి భూ కేటాయింపు రద్దు చేయాలి
ఆరిలోవ: ఉర్సా కంపెనీకి కూటమి ప్రభుత్వం చేసిన భూ కేటాయింపుల్ని వెంటనే రద్దు చేయాలని సీపీఎం విశాఖ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్కేఎస్వీ కుమార్ డిమాండ్ చేశారు. ఉర్సా కంపెనీకి కూటమి ప్రభుత్వం ఎకరా 99 పైసలు చొప్పున 59.6 ఎకరాలు భూమిని కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎం మద్దిలపాలెం జోన్ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా చేపట్టారు. ఆ భూ కేటాయింపు రద్దు చేయాలని కోరుతూ డిప్యూటీ తహసీల్దారు రాజేష్కు వినతి పత్రం అందించారు. అనంతరం కుమార్ మీడియాతో మాట్లాడుతూ..ఉర్సా అనేది కూటమి నాయకులకు బినామీ కంపెనీ అని తెలిపారు. విశాఖలో ఉన్న నిరు పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడానికి భూములు లేవని చెబుతున్న కూటమి ప్రభుత్వం ఇలాంటి బోగస్ కంపెనీకి కాపులుప్పాడ ప్రాంతంలో రూ.వేల కోట్లు విలువచేసే 59.6 ఎకరాల భూమి కేటాయించడం ఆక్షేపణీయమన్నారు. ఆ భూములను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మద్దిలపాలెం జోన్ కార్యదర్శి వి.కృష్ణారావు, నాయకులు డి.అప్పలరాజు, వి.నరేంద్రకుమార్, పి.శంకరరావు, కె.కుమారి, నాయుడు, రాజ్కుమార్, లక్ష్మి, రమణ పాల్గొన్నారు. -
అపురూప సౌందర్యం.. అపార నిర్లక్ష్యం
కనుమరుగవుతున్న పర్యాటక వైభవంసౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలం పర్యాటకులకు నిరాశ మిగుల్చుతున్న ఎర్రమట్టి దిబ్బలు భీమునిపట్నం: విశాఖకు సమీపంలో.. భీమిలి బీచ్ రోడ్డులో ఉన్న ఎర్రమట్టి దిబ్బలు భారతదేశంలోనే ఓ విశిష్టమైన సహజ నిర్మాణం. ఇవి సుమారు 4 కిలోమీటర్ల పొడవు, 2 కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించి ఉన్నాయి. ఈ అరుదైన భౌగోళిక ప్రదేశం పర్యాటకులను ఆకర్షిస్తున్నప్పటికీ.. పూర్తిస్థాయిలో వాటి అందాలను ఆస్వాదించే అవకాశం లేకపోవడం విచారకరం. సముద్ర మట్టం అనేకసార్లు పెరిగి, తగ్గడం వల్ల తీరం ఇసుక, బంకమట్టితో కప్పబడింది. వాతావరణ మార్పుల ప్రభావంతో ఇసుక ఎండకు గట్టిపడి దిబ్బలుగా మారింది. ఆ తర్వాత గాలి, నీటి కోత వల్ల ప్రస్తుత రూపాన్ని సంతరించుకుందని చరిత్రకారులు చెబుతున్నారు. ఎర్రటి మట్టితో నిండి ఉండటం వల్ల వీటికి ఎర్రమట్టి దిబ్బలు అనే పేరు వచ్చింది. సుమారు 10 నుంచి 20 అడుగుల ఎత్తుతో.. దిబ్బల మధ్య నడవడానికి వీలుగా దారితో ఇవి విస్తరించి ఉన్నాయి. పాండిచ్చేరి, ముంబయి సమీపంలోని ఇలాంటి నిర్మాణాలు ఉన్నా.. అవి కేవలం ఐదు అడుగుల ఎత్తుకే పరిమితం. ఇంతటి ఎత్తైన, విస్తారమైన ఎర్రమట్టి దిబ్బలు దేశంలో ఇక్కడ మాత్రమే ఉండటం విశేషం. ఈ దిబ్బల ప్రత్యేకత కారణంగా రాష్ట్రంతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు ఇక్కడకు నిత్యం వస్తుంటారు. అంతేకాకుండా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలకు చెందిన ఎన్నో చిత్రాల షూటింగ్లు ఇక్కడ జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. శిథిలావస్థలో సౌకర్యాలు గతంలో సందర్శకుల కోసం దిబ్బలకు వెళ్లే మార్గంలో కొన్ని వ్యూ పాయింట్లు, సేద తీరడానికి గుడిసెలు వంటివి ఏర్పాటు చేశారు. కనీసం వీటి వద్దనైనా పర్యాటకులు కాసేపు గడిపేవారు. అలాగే ఈ దిబ్బల ప్రాముఖ్యతను, చరిత్రను తెలిపే ఓ పెద్ద సమాచార బోర్డును కూడా ఏర్పాటు చేశారు. అయితే కాలక్రమేణా ఈ వ్యూ పాయింట్లు, గుడిసెలు పూర్తిగా పాడైపోయి నిరుపయోగంగా మారాయి. సమాచార బోర్డు కూడా కనుమరుగైపోయింది. ఒకప్పుడు దిబ్బలలోకి వెళ్లే ముందు భాగం విశాలంగా ఉండటంతో పర్యాటకులు అక్కడే ఫొటోలు, వీడియోలు తీసుకుని ఆనందించేవారు. కానీ ఇప్పుడు ఆ ప్రదేశమంతా తుప్పలు, పిచ్చి మొక్కలతో నిండిపోయి.. కేవలం ఇరుకై న కాలిబాట మాత్రమే మిగిలింది. దీనికి తోడు పరిసర ప్రాంతాల్లో మద్యం సేవించే వారి వల్ల పగిలిన సీసాలు, ఇతర చెత్త పేరుకుపోయి పర్యావరణం దెబ్బతింటోంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు, ప్రభుత్వం స్పందించి.. ఎర్రమట్టి దిబ్బల పూర్తి అందాలను ఆస్వాదించేందుకు చర్యలు చేపట్టాలని స్థానికులు, పర్యాటకులు కోరుతున్నారు. నిరాశతో వెనక్కి వచ్చేశాం పలు సినిమాల్లో ఎర్రమట్టి దిబ్బలను చూశాను. ఎంతో అద్భుతంగా కనిపించాయి. వా టిని నేరుగా చూడాలన్న ఆశతో కుటుంబం సహా ఇక్కడకు వచ్చాను. కానీ లోపల వరకు వెళ్లడానికి ఇబ్బందికరంగా ఉంది. కొద్ది దూరం వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చేశాం. ఎర్రమట్టి దిబ్బల పర్యటన నిరాశ కలిగించింది. –బి.వేణుగోపాల్, బెంగళూరు నిర్లక్ష్యం చేయవద్దు ఎర్రమట్టి దిబ్బల ప్రాంతాన్ని సందర్శించడంలో పర్యాటకు లు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని చెప్పిన అధికారు లు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరం. ఇంతటి సహజ సంపదను, పర్యాటక ఆకర్షణను అభివృద్ధి చేసే అవకాశాన్ని వదులుకోవద్దు. –కె.చంద్రశేఖర్, హైదరాబాద్ సౌకర్యాలు కల్పించాలి సందర్శకులు లోపలకు వెళ్లి రావడానికి వాహనాలు ఏర్పాటు చేయడంతో పాటు, రెస్టారెంట్లు తదితర సౌకర్యాలు కల్పించడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ మేరకు ఆలోచించి తగిన చర్యలు తీసుకోవాలి. – వేదుల సాయిరాం, చిత్తూరు పర్యాటకుల నిరాశ ఎంతో ఆసక్తితో ఎర్రమట్టి దిబ్బలను చూడటానికి వచ్చే పర్యాటకులకు నిరాశే ఎదురవుతోంది. బీచ్రోడ్డును ఆనుకుని ఉన్న ఈ దిబ్బల అందాలను పూర్తిగా చూడాలంటే.. లోపలికి సుమారు రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. కానీ తీవ్రమైన ఎండ వేడి, కాలుతున్న ఇసుకలో అంత దూరం నడవడం కష్టతరంగా మారుతోంది. దీంతో చాలా మంది సందర్శకులు కొద్ది దూరం మాత్రమే వెళ్లి.. అలసిపోయి వెనుదిరుగుతున్నారు. పర్యాటకుల ఇబ్బందులను పరిష్కరించేందుకు గత ప్రభుత్వాలు కొన్ని ప్రకటనలు చేశాయి. సుమారు 15 ఏళ్ల కిందట నాటి పర్యాటక శాఖ ‘డిజర్ట్ విలేజ్’ పేరుతో ఒంటెల సఫారీ, రెస్టారెంట్ వంటి సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటించింది. గత ప్రభుత్వ హయాంలో శాండ్ స్కూటర్లు లేదా ఇతర వాహనాల ద్వారా సందర్శకులను లోపలికి తీసుకువెళ్లాలని భావించారు. కానీ ఈ ప్రణాళికలేవీ కార్యరూపం దాల్చలేదు. -
నేడు పాలిసెట్
● 33 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి ● జిల్లాలో హాజరుకానున్న 13,157 మంది విద్యార్థులుమురళీనగర్: జిల్లాలో బుధవారం జరిగే పాలిసెట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 33 కేంద్రాల్లో 13,157 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. విశాఖపట్నం ప్రభుత్వ పాలిటెక్నిక్, పెందుర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్, భీమిలి మహిళా పాలిటెక్నిక్ కాలేజీలను కో–ఆర్డినేటింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. విశాఖ కేంద్రం పరిధిలో 22, పెందుర్తి పరిధిలో 5, భీమిలి పరిధిలో 6 కేంద్రాలు ఉన్నాయి. విశాఖ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ కో–ఆర్డినేటింగ్ ఆఫీసరుగా కె.నారాయణరావు, పెందుర్తి కోఆర్డినేటర్గా ప్రిన్సిపాల్ ఎన్.చంద్రశేఖర్, భీమిలి కోఆర్డినేటర్గా ప్రిన్సిపాల్ జి.మురళీకృష్ణ వ్యవహరిస్తారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థుల కోసం తాగునీరు, వైద్య సౌకర్యాలు, ఫ్యాన్లు వంటి కనీస ఏర్పాట్లు చేశారు. నిరంతర వి ద్యుత్ సరఫరా, అవసరమైతే బస్సు సౌకర్యం కోసం సంబంధిత శాఖలకు సమాచారం అందించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు విద్యార్థులు ఉదయం 9.30 గంటలకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. ఉదయం 11 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుంది. విద్యార్థులు హాల్టికెట్తో పాటు బ్లూ/బ్లాక్ బాల్పాయింట్ పెన్, రబ్బరు, పెన్సిల్, షార్ప్నర్ మాత్రమే తీసుకురావాలి. ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ఫోన్లు, స్మార్ట్వాచ్లు, కాలిక్యులేటర్లు వంటివి పూర్తిగా నిషేధం. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. హాల్టికెట్ రాని వారు సంబంధిత కో–ఆర్డినేటింగ్ కేంద్రాన్ని సంప్రదించాలని డాక్టర్ కె.నారాయణరావు సూచించారు. జిల్లా పరిశీలకుడు, టెక్నికల ఎడ్యుకేషన్ అకడమిక్ డిప్యూటీ డైరెక్టర్ కె.విజయభాస్కర్, విశాఖ కోఆర్డినేటింగ్ సెంటర్ పరిశీలకుడు జి.దామోదరరావు మంగళవారం ఎన్ఏడీ భాష్యం, ఎంవీపీ కాలనీ ఏఎస్ రాజా మహిళా డిగ్రీ కాలేజీ, వీఎంఆర్డీఏ పార్కు గాయత్రి విద్యాపరిషత్–ఎంఎల్బీటీ పాఠశాల తదితర కేంద్రాలను పరిశీలించారు. ఆయా కేంద్రాల ఇన్విజిలేటర్లకు పలు సూచనలిచ్చారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి చందనోత్సవం ఉన్నందున దూర ప్రాంతాల విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. -
క్రికెట్ బెట్టింగ్కి యువకుడి బలి
సీతమ్మధార: క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్న ఓ యువకుడు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివి.. జీవీఎంసీ 24వ వార్డు గాంధీనగర్కు చెందిన చెక్కల పవన్ (25) ఎంవీపీ కాలనీలోని ఓ లాడ్జిలో పనిచేస్తున్నాడు. అతనికి క్రికెట్ బెట్టింగ్ అలవాటు ఉంది. ఐపీఎల్లో బెట్టింగ్ ఆడేందుకు గతంలో లాడ్జి యజమాని వద్ద రూ.30 వేలు తీసుకుని పోగొట్టుకున్నాడు. ఇటీవల అతని వద్ద మళ్లీ రూ.20 వేలు తీసుకున్నాడు. ఈ మొత్తాన్ని కూడా కోల్పోయాడు. ఈ కారణంగా తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. మంగళవారం సాయంత్రం తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే పవన్ ఓ యువతితో ప్రేమ విఫలమైనట్లు కూడా తెలుస్తోంది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ద్వారకా పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. -
‘ఓమ్ని’లో పిల్లల క్యాన్సర్ విభాగం ప్రారంభం
బీచ్రోడ్డు: ఇటీవల కాలంలో పిల్లల్లో క్యాన్సర్ పెరుగుతోందని ప్రముఖ పీడియాట్రిక్ వైద్యుడు రాధాకృష్ణ తెలిపారు. ప్రముఖ క్యాన్సర్ కేర్ నెట్వర్క్ సయాన్ క్యాన్సర్ క్లినిక్స్, ఓమ్ని హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఆస్పత్రిలో అత్యాధునిక పిల్లల క్యాన్సర్ విభాగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బారిన పడుతున్న పిల్లల సంఖ్య పెరుగుతోందని, మనదేశంలో కూడా ఈ సంఖ్య ఆందోళనకర రీతిలో ఉందన్నారు. సరైన సమయంలో వ్యాధి నిర్ధారణ, త్వరగా చికిత్స తీసుకోవడం ద్వారానే క్యాన్సర్ నుంచి వారిని కాపాడుకోగలమన్నారు. సయాన్ క్యాన్సర్ క్లినిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ శశి సుంకర్ మాట్లాడుతూ క్రిటికల్ కేర్ నుంచి క్యాన్సర్ చికిత్స వరకు పిల్లల కోసం అవసరమైన అన్ని సేవలు ఇప్పుడు ఓమ్నిలో అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రత్యేకించి పిల్లల కోసం రూపొందించిన మల్టీ–డిసిప్లినరీ క్యాన్సర్ చికిత్స కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. క్యాన్సర్ చికిత్సతో పాటు మానసిక ఆరోగ్యం, పోషకాహారం, జన్యు సలహా తదితర సమగ్ర సేవలు అందిస్తామన్నారు. సయాన్ క్యాన్సర్ క్లినిక్స్ ప్రతినిధులు డాక్టర్ భారతీదేవి, డాక్టర్ రాఘవేంద్ర నాయక్, డాక్టర్ వెంకట సుష్మ, డాక్టర్ గౌరి నాయుడు, డాక్టర్ శ్రీనివాసులు రెడ్డి, సుభాష్, ఓమ్ని ఆర్కే వైద్య నిపుణుడు డాక్టర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
జూలో వన్యప్రాణుల ఆరోగ్యంపై దృష్టి
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కును మంగళవారం జూ ఆరోగ్య కమిటీ సందర్శించింది. జూ క్యూరేటర్ జి.మంగమ్మ, అసిస్టెంట్ క్యూరేటర్లతో కలిసి కమిటీ సభ్యులు హైదరాబాద్లో నెహ్రూ జూ పార్కు విశ్రాంతి వైద్యుడు ఎం.నవీన్ కుమార్, ఆర్ఏడీడీఎల్(పశు సంవర్ధక శాఖ) డీడీ డాక్టర్ పి.మోహిని కుమారి, వీపీసీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్.మహేష్ తదితరులు జూలో వన్యప్రాణులు, వాటి ఎన్క్లోజర్లను పరిశీలించారు. ఇక్కడ జంతువులు ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. అనంతరం జూ క్యూరేటర్ చాంబర్లో సమావేశం నిర్వహించారు. జంతువుల సంరక్షణ, వాటి సంక్షేమం, వాటికి అందించాల్సిన పోషక విలువలతో కూడిన ఆహారం గురించి చర్చించారు. ప్రస్తుతం వేసవి ఎండలు తీవ్రతను బట్టి చేపట్టదలచిన నిర్వహణ చర్యలు, వాటికి అందించాల్సిన వైద్య సేవల గురించి చర్చించారు. మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న 19 ఏళ్ల చిరుత(హర్ష)కు అందించాల్సిన వైద్యం గురించి ప్రత్యేక దృష్టిపెట్టాలని జూ వైద్య సిబ్బందికి సూచించారు. జూలో మార్మోసెట్ కోతులు, స్కివరెల్ కోతులు, మీర్కాట్, జిరాఫీ, రాయల్ బెంగాల్ టైగర్స్, తెల్ల పులులు, సింహాలు, హైనాలు, స్లాత్ బేర్, వాటర్ మానిటర్ బల్లులు, ఆఫ్రికన్ చిలుకలు సంతానోత్పత్తికి సంబంధించిన పలు సూచనలు, సలహాలు చేశారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
సబ్బవరం: మండలంలోని గొర్లివానిపాలెం జక్షన్ వద్ద ఆర్టీసీ బస్సు సత్యవరపు శ్రీనివాసరావు(53) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు. శ్రీనివాసరావు సబ్బవరం హైస్కూల్ సమీపంలో జనరల్ స్టోర్ నడుపుతున్నాడు. మంగళవారం ఉదయం తన స్కూటీపై గోడివాడ వెళ్తుండగా, గొర్లివానిపాలెం సమీపంలో సబ్బవరం నుంచి చోడవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. బస్ టైర్ కింద ఇరుక్కుపోయి, సంఘటనా స్థలిలోనే మరణించాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ దివ్య తెలిపారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్ను సీజ్ చేసి, మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి పోస్ట్మార్టం నిమిత్తం తరలించామన్నారు. -
వేటకు వెళ్లిన మత్స్యకారుడి మృతి
తగరపువలస: భీమిలి పట్టణ నదీ సాగర సంగమ తీరంలో చేపల వేటకు వెళ్లిన బోయవీధికి చెందిన మత్స్యకారుడు చింతపల్లి తాతారావు(65) ప్రమాదవశాత్తూ మునిగి మృతి చెందాడు. ప్రతిరోజూ భీమిలి జోనల్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో వేటకు వెళ్లడం అతనికి అలవాటు. అందులో భాగంగానే సోమవారం సాయంత్రం 4.30 సమయంలో వేటకు వెళ్లాడు. అయితే అలల తాకిడికి అతను మునిగి చనిపోయినట్టు భావిస్తున్నారు. అతని మృతదేహం మంగళవారం ఉదయం భీమిలి మండలం అన్నవరం పంచాయతీ ఎర్రయ్యపాలెం తీరానికి చేరింది. తాతారావుకు భార్య పైడమ్మ, కుమారులు పోలిరాజు, అప్పన్న, నూకరాజు, కుమార్తె నందిని ఉన్నారు. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు భీమిలి ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. తాతారావు మృతితో బోయవీధిలో విషాదచాయలు అలముకున్నాయి. -
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
● నిరసనలతో హోరెత్తిన ప్రాంగణం ● తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు బీచ్రోడ్డు: వివిధ సమస్యలపై బాధితులు, రాజకీయ పక్షాలు చేపట్టిన ఆందోళనలతో సోమవారం కలెక్టరేట్ దద్దరిల్లింది. ఆ పరిసరాలు నిరసనల హోరుతో మార్మోగాయి. సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదనే ఆవేదనతో వివిధ వర్గాల ప్రజలు కలెక్టరేట్ ఎదుట ధర్నాలకు దిగారు. తమ డిమాండ్లను ప్రభుత్వం, అధికారులు ఆలకించి తక్షణమే పరిష్కరించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ‘మోసగాడి అరెస్ట్లో పోలీసుల నిర్లక్ష్యం’ తమ సొమ్మును కాజేసిన మోసగాడిపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ బాధితులు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. పాల అప్పలరాజు అనే వ్యక్తి ఇళ్లు కట్టించి ఇస్తానని నమ్మించి దాదాపు 20 కుటుంబాల నుంచి కోటిన్నరకు పైగా వసూలు చేసి మోసగించాడని ఆరోపించారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసినా మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగర పోలీసు కమిషనర్ బాగ్చి ఆదేశాలు జారీ చేసినా స్థానిక పోలీసులు పట్టించుకోవడం లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాల అప్పలరాజును తక్షణమే అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని నినదించారు. అందరికీ గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి ఉచితంగా అందిస్తున్న మూడు గ్యాస్ సిలిండర్ల పథకాన్ని రేషన్ కార్డు ఉన్న ప్రతి పేద కుటుంబానికి వర్తింపజేయాలని సీపీఎం ఆధ్వర్యంలో మహిళలు ఆందోళన చేశారు. ప్రభుత్వం విధించిన నిబంధనల వల్ల అనేక మంది పేదలు లబ్ధి పొందలేకపోతున్నారన్నారు. తెలుపు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ‘టెక్నికల్ చానల్ ద్వారానే పదోన్నతులు’ గ్రామ సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న తమకు టెక్నికల్ చానల్ ద్వారానే పదోన్నతులు కల్పించాలని పెందుర్తి, ఆనందపురం, భీమునిపట్నం మండలాల పరిధిలోని డిజిటల్ అసిస్టెంట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ను కోరారు. ఈ మేరకు వారు కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తమను డిజిటల్ అసిస్టెంట్ల నుంచి గ్రేడ్–5 పంచాయతీ సెక్రటరీగా పదోన్నతులు కల్పించడం సరికాదని వారు పేర్కొన్నారు. తమకు టెక్నికల్ చానల్ ద్వారానే పదోన్నతులుకల్పించాలని విజ్ఞప్తి చేశారు. జీవనోపాధి కోల్పోయాం ఆనందపురం మండలం తర్లువాడలో 303 ఎకరాల డీ పట్టా భూములను సర్వే నంబర్లు సరి చేస్తామని చెప్పి అధికారులు బలవంతంగా లాక్కున్నారని, ఆ భూములను తిరిగి తమకు ఇవ్వాలని ఆ గ్రామ దళితులు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఐటీ కంపెనీల కోసం తమకు తెలియకుండా ఆ భూములను కేటాయించారని, తద్వారా జీవనోపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ 303 ఎకరాలను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దివ్యాంగుడి పింఛన్ నిలిపివేతకలెక్టరేట్ చుట్టూ తల్లీకొడుకుల ప్రదక్షిణలు ఈ చిత్రంలో కనిపిస్తున్న దివ్యాంగుడి పేరు ఎ.శ్రీనివాస్. అతనిది మంగాపురం కాలనీ. గతంలో రూ.3 వేల పింఛన్ అందేది. ఇటీవల పింఛన్ నిలిపివేశారు. పింఛన్ పునరుద్ధరించా లని అతని తల్లి జయలక్ష్మి కొడుకును పట్టుకుని కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. అయినప్పటికీ అధికారులు కరుణించడం లేదు. ఎన్నిసార్లు అధికారులకు అర్జీ పెట్టుకు న్నా ఫలితం ఉండడం లేదని ఆమె వాపోయింది. -
రేపే అప్పన్న చందనోత్సవం
● తెల్లవారుజామున 3.30 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభం ● సాయంత్రం 6 గంటల తర్వాత సింహగిరిపైకి అనుమతి లేదు ● రాత్రి 7 గంటలకు సింహగిరిపై క్యూల ప్రవేశ గేట్లు మూసివేత ● ప్రోటోకాల్ వీఐపీలకు ఉదయం 6 గంటలతో అంతరాలయ దర్శనాలు పూర్తి ● ఆ తర్వాత అందరికీ నీలాద్రిగుమ్మం నుంచే లఘు దర్శనం ● 2 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా సింహాచలం : వరాహ, నారసింహ రూపాలను ఒక్కటిగా చేసుకుని సంవత్సరమంతా చందనం మణుగుల్లో నిత్యరూపంలో దర్శనమిచ్చే సింహాద్రినాథుడి నిజరూప దర్శనం లభించే సమయం ఆసన్నమైంది. సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం బుధవారం జరగనుంది. ఏడాదిలో కేవలం ఒక్క రోజులోని కొన్ని గంటలు మాత్రమే లభించే ఈ అరుదైన దర్శనాన్ని చేసుకునేందుకు భక్తులు తరలిరానున్నారు. ఈసారి 2 లక్షల మంది భక్తులు స్వామి నిజరూప దర్శనం చేసుకుంటారని అంచనా వేశారు. సాధారణ భక్తులకు పెద్ద పీట వేస్తూ.. వారికి దర్శనాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర మంత్రుల కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ హరేందిర ప్రసాద్, సింహాచలం దేవస్థానం ఈవో కె.సుబ్బారావు నేతృత్వంలో జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. వెండిబొరుగులతో చందనం ఒలుపు చందనోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజామున ఒంటి గంట నుంచి పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ అర్చకులు వైదిక కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సుప్రభాతసేవ, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, కలశారాధన చేస్తారు. అనంతరం వెండిబొరుగులతో స్వామిపై ఉన్న చందనాన్ని తీసి నిజరూపభరితుడిని చేస్తారు. తెల్లవారుజామున 3 గంటలకు దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్గజపతిరాజుకి తొలిదర్శనం కల్పిస్తారు. 3.30 గంటల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించే రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించేవారికి, ఇతర ప్రముఖులకు దర్శనం కల్పిస్తారు. ఉదయం 6 గంటలతో అంతరాలయ దర్శనాలు పూర్తిచేస్తారు. ఉదయం 3.30 గంటల నుంచి సర్వదర్శనం ఉదయం 3.30 గంటల నుంచి సర్వదర్శనాలు ప్రారంభిస్తారు. ఉచిత దర్శనం, రూ.300, రూ.1000 టికెట్లు క్యూల్లో ఉన్న వారందరికీ దర్శనాలు ప్రారంభిస్తారు. సాయంత్రం 6 గంటలలోపే సింహగిరిపై దర్శనాల క్యూల్లోకి భక్తులను అనుమతిస్తారు. రాత్రి 7 గంటలకు క్యూల ప్రవేశ ద్వారాలు మూసివేసి అప్పటి వరకు క్యూల్లో ఉన్న భక్తులకు స్వామి దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే సింహగిరిపైకి బస్సుల్లో భక్తులను అనుమతిస్తారు. ఆ తర్వాత ఖాళీ బస్సులను కొండపైకి పంపించి కొండపై ఉన్న భక్తులను కొండదిగువకి చేరుస్తారు. 29వ తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటల తర్వాత కూడా భక్తులను కొండపైకి అనుమతించరు. భక్తులతో మర్యాదగా మెలగండి చందనోత్సవంలో విధులు నిర్వర్తించే పోలీసులు సామాన్య భక్తులతో మర్యాద కలిగి, అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి సూచించారు. సోమవారం సింహాచలంలో ఆయన పోలీసులకు పలు సూచనలు చేశారు. క్యూల వద్ద దేవస్థానం అధికారులు సూచించిన విధంగా నడు చుకోవాలన్నారు. రాంగ్ పార్కింగ్ వాహనాలను టోయింగ్ చేసి తరలించాలని సూచించారు. డ్రోన్ సాంకేతికతను పూర్తిగా వినియోగిస్తామన్నారు. సామాన్య భక్తులకే పెద్దపీట బీచ్రోడ్డు: చందనోత్సంలో సాధారణ భక్తుల దర్శనానికి తొలి ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. చందనోత్సవ ఏర్పాట్లపై కలెక్టరేట్లో ఆయన జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొండపైన, కింద నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని, పూర్తి ఫిట్నెస్తో ఉన్న ఆర్టీసీ బస్సులను మాత్రమే నడపాలని ఆదేశించారు. ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా విక్రయించే టికెట్లపై సీరియల్ నంబర్, స్కానింగ్, క్యూలను సూచించే బోర్డులను స్పష్టంగా ఏర్పాటు చేయాలని సూచించారు. సింహాచలం ప్రాంతంలోని మద్యం షాపులను మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు మూసివేయాలని అధికారులను ఆదేశించారు. -
ట్రాఫిక్ పోలీసులకు కూల్ జాకెట్లు
విశాఖ సిటీ : ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి వేసవి తాపం నుంచి కొంత ఉపశమనం కలిగేలా కూల్ జాకెట్లు అందిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. సోమవారం పోలీస్ కమిషనరేట్ సమావేశంలో మందిరంలో ఆయన మాట్లాడుతూ వేసవిలో ఎండ వేడికి గురికాకుండా సిబ్బందికి తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచన చేసినట్లు చెప్పారు. ఇందుకోసం గతేడాది అక్టోబర్లో ఢిల్లీలో జరిగిన ‘ట్రాఫిక్ ఎక్స్ పో’కు విశాఖ ట్రాఫిక్ విభాగం నుంచి ఒక ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్లను పంపించామన్నారు. అక్కడ హర్యానాలోని గురుగ్రామ్కు చెందిన 98ఎఫ్ అనే కంపెనీ వారు ‘కూల్ జాకెట్లను‘ ప్రదర్శించినట్లు చెప్పారు. నగరంలో కొందరు దాతల సహాయంతో రూ.5 లక్షలు విలువైన 200 కూల్ జాకెట్లను గురుగ్రామ్ నుంచి తెప్పించినట్లు వెల్లడించారు. ఈ జాకెట్లను సాధారణ ఉష్ణోగ్రత కలిగిన నీటిలో ముంచి తీస్తే వాటి ఉష్ణోగ్రత 8 డిగ్రీలకు పడిపోతుందని వివరించారు. అవి ధరించిన సిబ్బంది ఎండ వేడి నుంచి ఉపశమనం పొంది ట్రాఫిక్ విధులు సమర్థవంతంగా నిర్వర్తించడానికి వీలవుతుందన్నారు. అలాగే వీటిని శీతాకాలంలో సాధారణంగా వాడుకోవచ్చన్నారు. వీటికి రేడియం స్టిక్కరింగ్ ఉండడంతో రాత్రిపూట కూడా ధరించి విధులు నిర్వహించవచ్చని తెలిపారు. అనంతరం ఈ కూల్ జాకెట్లను ట్రాఫిక్ సిబ్బందికి అందజేశారు. -
కేజీహెచ్లో విజయవంతంగా కిడ్నీ మార్పిడి
డాబాగార్డెన్స్: కేజీహెచ్లో 16 ఏళ్ల బాలుడికి విజయవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన వైద్యులను సోమవారం కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వివరాలు వెల్లడించారు. నగరంలోని ఏవీఎన్ కళాశాల డౌన్ రోడ్డులో నివాసముంటున్న యశ్వంత్ రెండేళ్లుగా దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో అతని తల్లి సంతోషి కేజీహెచ్ వైద్యులను ఆశ్రయించారు. అతని ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు జీవన్దాన్ ద్వారా కిడ్నీ మార్పిడికి సిఫార్సు చేశారు. ఈ మేరకు కేజీహెచ్లో ఆ బాలుడికి ఈ నెల 7న కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. శస్త్రచికిత్స అనంతరం ఆ బాలుడు పూర్తిగా కోలుకోవడంతో సోమవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ శస్త్రచికిత్సకు ప్రైవేటు ఆసుపత్రుల్లో దాదాపు రూ.15 లక్షల వరకు ఖర్చవుతుందని, కేజీహెచ్లో దీన్ని ఉచితంగా నిర్వహించినట్లు డాక్టర్ శివానంద్ తెలిపారు. అలాగే రోగికి రెండేళ్ల కాలానికి రూ.2 లక్షల విలువైన మందులు కూడా ఉచితంగా అందజేస్తామన్నారు. నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ జి.ప్రసాద్, యురాలజీ విభాగాధిపతి డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ రాంబాబు, అనస్థీసియా డాక్టర్లు శ్రీలక్ష్మి, డాక్టర్ ప్రీతి, డాక్టర్ రమేష్, నర్సింగ్ సిబ్బంది సూర్యప్రభ, చంద్రకళ, ఇతర సహాయక సిబ్బంది ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించినట్లు సూపరింటెండెంట్ వివరించారు. -
అధికారులు వార్డుల్లో పర్యటించాలి
మేయర్ పీలా శ్రీనివాస్ ఆదేశండాబాగార్డెన్స్: నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన మేయర్ పీలా శ్రీనివాస్ సోమవారం జీవీఎంసీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పారిశుధ్యం, ప్రజారోగ్యం, వీధిలైట్లు, తాగునీరు వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు నిత్యం వార్డుల్లో పర్యటించి, పారిశుధ్య మెరుగుకు కృషి చేయాలన్నారు. వేసవి దృష్ట్యా తాగునీరు పూర్తి స్థాయిలో అందించాలన్నారు. జీవీఎంసీలో అనవసరపు ఖర్చులు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారులు గీతలు, హద్దులు దాటి విధులు నిర్వహించరాదన్నారు. జీవీఎంసీ డాష్ బోర్డ్, సిటీ ఆపరేషన్ సెంటర్ సమాచారం నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. తాను ప్రతి రోజూ వార్డుల్లో పర్యటిస్తానని తెలిపారు. ఇంతవరకు టెండర్లు తీసుకొని పనులు చేపట్టలేని వారిపై దృష్టి సారించి సకాలంలో పనులు జరిగేలా చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా తాగునీటి విభాగానికి రూ.8 కోట్లు మంజూరయ్యాయని జీవీఎంసీ ప్రధాన ఇంజనీర్ పి.శివప్రసాదరాజు మేయర్కు వివరించారు. చలివేంద్రాలు పటిష్టంగా, పరిశుభ్రతతో నిర్విహించాలని ప్రధాన ఇంజనీర్కు మేయర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, ఎస్ఎస్ వర్మ, చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకరరావు, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి, డీసీఆర్ శ్రీనివాసరావు, యూసీడీ పీడీ పీఎం సత్యవేణి పలువురు అధికారులు పాల్గొన్నారు. -
అదే అర్జీ మళ్లీ వస్తే.. అధికారులదే బాధ్యత
బీచ్రోడ్డు: ప్రజల నుంచి అందే ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి, అవి పునరావృతం కాకుండా శాశ్వతమైన, నాణ్యమైన పరిష్కారాలు చూపాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’(పీజీఆర్ఎస్) కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పూర్తిస్థాయి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వారికి భరోసా ఇచ్చా రు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అర్జీలపై సమగ్ర విచారణ జరిపి, ఫిర్యాదుదారు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపాలన్నారు. ఒక అర్జీని పరిష్కరించామని నివేదించే ముందు సంబంధిత అధికారి తప్పనిసరిగా అర్జీదారుడితో మాట్లాడాలని స్పష్టం చేశారు. రెవెన్యూ, జీవీఎంసీ శాఖలకు సంబంధించిన అర్జీలు ఎక్కువగా వస్తున్నందున.. వాటిపై ప్రత్యేక దృష్టి సారించి శాశ్వత పరిష్కార మార్గాలు కనుగొనాలని ఆదేశించారు. అధికారులు తమ శాఖల్లో ప్రతి రోజూ పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కార పురోగతిపై సమీక్ష నిర్వహించాలన్నారు. ఒకే సమస్యపై అర్జీ మళ్లీ వస్తే సంబంధిత జిల్లా అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని కలెక్టర్ హెచ్చరించారు. పరిష్కరించిన అర్జీలపై లబ్ధిదారుల స్పందన సేకరించి, మొబైల్ యాప్లో నమోదు చేయాలని, ‘ఎన్రోల్మెంట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ హౌస్హోల్డ్ సర్వే’కు సంబంధించిన పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. 252 అర్జీల స్వీకరణ సోమవారం జరిగిన ప్రజావేదికకు మొత్తం 252 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 122, జీవీఎంసీ 57, పోలీసు శాఖ 11, ఇతర విభాగాలకు చెందిన 62 వినతులు ఉన్నాయి. కలెక్టర్తో పాటు డీఆర్వో భవానీశంకర్, భీమిలి ఆర్డీవో సంగీత్ మాథూర్, జీవీఎంసీ సిటీ ప్లానింగ్ అధికారి ధనుంజయరెడ్డి తదితరులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. మత్స్యకార భృతి రాలేదు నా భర్త 25 ఏళ్లుగా చేపల వేట చేస్తూ కుటుంబాన్ని పోషిస్తు న్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అందించిన వేట నిషేధ భృతి నా భర్తకు రాలేదు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఏటా చేపల వేట నిషేధ కాలంలో ప్రభుత్వ సాయం అందేది. ఈ ఏడాది మాత్రం ఇప్పటి వరకు రాలేదు. దీనిపై విచారించి, భృతి అందేలా చూడాలి. – కె.కొర్లమ్మ, ఏగువ పేట, భీమిలి సర్టిఫికెట్ ఇప్పించండి నాకు 2023లో వెన్నుపూస ఆపరేషన్ జరిగింది. అయినా ఇంకా నడవలేకపోతున్నాను. మూత్ర విసర్జన, మాల విసర్జన కూడా సరిగ్గా అవ్వడం లేదు. దీంతో కేజీహెచ్ వైద్యులను సంప్రదించగా.. శస్త్రచికిత్స ఆలస్యం కావడమే ఇందుకు కారణమని చెప్పారు. అయితే ఆ విషయాన్ని సర్టిఫై చేసి ఓ లేఖపై రాసి ఇవ్వాలని కోరినా ఇవ్వడం లేదు. శస్త్రచికిత్స జరిగినట్లు సర్టిఫికెట్ ఇప్పించగలరు. – కె.రమణ, వేములవలస, ఆనందపురం కలెక్టర్ హరేందిర ప్రసాద్ స్పష్టీకరణ -
పట్టని ప్రజల గోడు.. అధికారుల తీరు చూడు
బీచ్రోడ్డు: క్షేత్ర స్థాయిలో తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే న్యాయం జరుగుతుందనే ఆశతో సోమవారం కలెక్టరేట్కు చేరుకున్న ప్రజలకు అక్కడ ఎదురైన దృశ్యాలు నిరాశకు గురిచేశాయి. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో కొందరు ఉన్నతాధికారులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. కలెక్టర్ స్వయంగా కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలు వింటుండగా.. హాలులో కూర్చున్న కొందరు ఉన్నతాధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించారు. సెల్ఫోన్లలో షార్ట్స్, రీల్స్, చివరకు సినిమాలు చూస్తూ కాలక్షేపం చేశారు. తమ గోడు చెప్పుకోవడానికి ఎంతో ఆశతో వచ్చిన ప్రజలు.. అధికారుల తీరును చూసి నివ్వెరపోయారు. ప్రజా సమస్యలను ఆలకించి, వాటి పరిష్కారానికి మార్గాలు సూచించాల్సిన ఉన్నతాధికారులు.. ప్రజల సమక్షంలోనే సెల్ఫోన్లకు అతుక్కుపోవడం వారి బాధ్యతారాహిత్యానికి అద్దం పట్టింది. సెల్ఫోన్లలో రీల్స్, సినిమాలు చూస్తూ కాలక్షేపం -
జాబితాలో ప్రజాకవుల పేర్లు లేకపోవడం దారుణం
డాబాగార్డెన్స్: తెలుగునాట మహానీయుల జయంతులు, వర్ధంతులు నిర్వహించేందుకు ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక జాబితాలో గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం పంతులు, గుర్రం జాషువా వంటి ప్రముఖుల పేర్లు లేకపోవడంపై సాహితీ స్రవంతి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి ఆవేదన వ్యక్తం చేశారు. డాబాగార్డెన్స్లోని అల్లూరి విజ్ఞానకేంద్రంలో సోమవారం నిర్వహించిన ఉత్తరాంధ్ర సాహిత్యవేత్తలు, రచయితల ఇష్టాగోష్టి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా? లేదా కావాలనే చేశారా? అన్నది బేరీజు వేసుకోవాలన్నారు. నిజంగా కావాలని చేసి ఉంటే విచారకరమన్నారు. మతపరమైన కోణంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, వాస్తవిక చరిత్రను కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తోందని, అందుకు నిదర్శనమే ఈ అధికారిక జాబితా అని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని, కేంద్రంలోని ప్రధాన మీడియా ఛానల్స్, పత్రికలను బీజేపీ ప్రభుత్వం నియంత్రిస్తూ వాస్తవాలు ప్రజలకు తెలియజేయకుండా చేస్తోందని మండిపడ్డారు. దీనిపై ప్రభుత్వం పునఃపరిశీలన చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ, సాహితీ స్రవంతి సభ్యులు చలపతి, రామారావు పాల్గొన్నారు. -
జ్యూస్షాపులకు చేపల నిల్వకు వాడే ఐస్
ఎంవీపీకాలనీ: విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం జరిపిన దాడుల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. జెట్టీల్లో చేపల నిల్వకు వాడే ఐస్ ముక్కలను కొన్ని ఫ్యాక్టరీలు నగరంలోని ఫ్రూట్ జ్యూస్ దుకాణాలకు సరఫరా చేస్తుండటం వారిని అవాక్కయ్యేలా చే సింది. కొంతకాలంగా ఈ తరహా వ్యాపా రం యథేచ్ఛగా జరుగుతున్నట్లు అధికా రులు గుర్తించారు. రీజినల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ జిల్లా అధికారి కింజరాపు ప్రభాకర్కు వచ్చిన విశ్వసనీయ సమాచారంతో సోమవారం సంస్థ డీఎస్పీ మురళీకృష్ణ, సీఐ సంతోష్కుమార్, జిల్లా లీగల్ మెట్రాలజీ, శానిటేషన్, ఫుడ్ సేఫ్టీ సిబ్బందితో కూడిన బృందం గాజువాక, మధురవాడ, పెదగంట్యాడ ప్రాంతాల్లోని ఐస్ తయారీ ఫ్యాక్టరీల్లో దాడులు చేసింది. ఆయా ఫ్యాక్టరీల్లో కలుషిత నీటితో తయారు చేస్తున్న ఐస్ను జ్యూస్ షాపులకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించింది. ఆహార భద్రత నియమాల ప్రకారం ఆ ఐస్కు నాణ్యత లేకపోవడంతో.. దాన్ని ఆహార పదార్థాల్లో ఉపయోగించకూడదని తేల్చింది. ఆయా ఫ్యాక్టరీల్లో ఐస్ ముక్కలను అధికారులను స్వాధీనం చేసుకుని.. కొన్ని శాంపిల్స్ ల్యాబ్ పరీక్షలకు పంపించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఆయా ఫ్యాక్టరీలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు రూ.30 వేల చొప్పున ఫైన్ విధించారు. ల్యాబ్లో పరీక్షించిన అనంతరం, ఆ రిపోర్ట్ ఆధారంగా ఆయా ఫ్యాక్టరీలపై అవసరమైన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు. విజిలెన్స్ దాడుల్లో వెలుగు చూసిన వైనం మూడు ఐస్ ఫ్యాక్టరీలకు రూ.30వేల చొప్పున జరిమానా -
మేయర్గా పీలా ఏకగ్రీవం
డాబాగార్డెన్స్ : జీవీఎంసీ మేయర్గా కూటమి కార్పొరేటర్ పీలా శ్రీనివాస్ను కూటమి కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషీయో సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన మేయర్ ఎన్నికకు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించారు. పీలా శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రతిపాదించారు. పీలా శ్రీనివాస్ ఎన్నికై నట్టు ఎన్నికల అధికారి ప్రకటించి నియామక పత్రం అందజేశారు. అనంతరం పలువురు అధికారులు పీలాచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కార్పొరేటర్లు పీలాను అభినందించారు. నిస్వార్థంగా పనిచేస్తా.. మేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన పీలా శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ మంచి నాయకత్వం నడుపుతానని, నాయకత్వానికి విలువ చూపుతానన్నారు. నిస్వార్థంగా విశాఖ ప్రజలకు సేవలందిస్తానన్నారు. అంతా పావు గంటలోనే.. ఉదయం 10.55 గంటలకు సభ్యులందరూ(కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషీయో సభ్యులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ) సభలో ఆశీనులయ్యారు. 11 గంటలకు ఎన్నికల అధికారి మయూర్ అశోక్ సమావేశ మందిరానికి చేరుకున్నారు. 5 నిమిషాల్లో ఎన్నికకు సంబంధించి నియమ నిబంధనలు సూచించారు. మరో 5 నిమిషాల్లో మేయర్ ఎన్నిక తంతు పూర్తి చేశారు. రెచ్చిపోయిన టీడీపీ గ్యాంగ్ మేయర్గా పీలా శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది నిమిషాలకే టీడీపీ తమ్ముళ్లు రెచ్చిపోయారు. వాహన చోదకులను ఇబ్బందులకు గురి చేశారు. ట్రాఫిక్ నియంత్రిస్తున్న ట్రాఫిక్ పోలీసులపై రెచ్చిపోయారు. వీరంగం సృష్టించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఒకింత విసిగించారు. సంబరాలు చేసుకోవచ్చు.. కానీ పౌరులను ఇబ్బంది పెట్టి చేసుకోవడం సమంజసం కాదని పలువురు నగర పౌరులు బాహాటంగానే చెప్పుకున్నారు. ఇదిలా ఉండగా.. జీవీఎంసీ గాంధీ పార్కు నుంచి జీవీఎంసీ ప్రధాన ద్వారానికి వచ్చే మార్గాన్ని ట్రాఫిక్ పోలీసులు క్లోజ్ చేశారు. టీడీపీకి చెందిన కాళ్ల శంకర్ నువ్వు ఎవరంటూ అక్కడున్న మహిళా ట్రాఫిక్ పోలీసుపై చిందులేశారు. నువ్వు నన్ను ఆపుతావా.. అంటూ కారును స్పీడ్గా దూసుకుపోవడంపై పలువురు మండిపడ్డారు. గ్రేటర్ 3వ మేయర్గా.. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కు 7వ మేయర్గా, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కు 3వ మేయర్గా పీలా శ్రీనివాస్ ఎన్నికయ్యారు. విశాఖ తొలి మేయర్గా ఎన్ఎస్ఎన్ రెడ్డి, రెండో మేయర్గా డి.వి.సుబ్బారావు, మూడో మేయర్గా సబ్బం హరి, నాల్గో మేయర్గా రాజాన రమణి కొనసాగగా, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్గా అవతరించిన తర్వాత పులుసు జనార్దనరావు తొలి మేయర్గా, రెండో మేయర్గా గొలగాని హరి వెంకటకుమారి కొనసాగారు. మూడో మేయర్గా పీలా శ్రీనివాస్ ఇప్పుడు ఎన్నికయ్యారు. -
ఆర్థిక ఇబ్బందులతో విశాఖ రియల్టర్ ఆత్మహత్య
● మామిడిపల్లి రిసార్ట్లో ఘటన ● సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు దేవరాపల్లి: విశాఖపట్నానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నడింపల్లి సత్యనారాయణరాజు(70) దేవరాపల్లి మండలం మామిడిపల్లిలోని రిసార్ట్లోని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన రాసిన సూసైడ్ నోట్ను సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడు భార్య విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్చార్జి ఎస్ఐ ఆర్.ధనుంజయ్ తెలిపారు. ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. విశాఖకు చెందిన సత్యనారాయణరాజు 40 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారంలో భాగంగా కొంత మంది నుంచి తనకు రావలసిన బకాయిలు రూ.కోట్లలో ఉండిపోయాయి. దీంతో ఆయన తీవ్రంగా నష్టపోయారు. దేవరాపల్లి మండలం మామిడిపల్లి రిసార్ట్కు సత్యనారాయణరాజు అప్పుడప్పుడు వచ్చి ఒక్కరోజు ఉండి వెళ్లిపోయేవారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 10.30 గంటలకు రిసార్ట్కు వచ్చిన ఆయన రాత్రి ఇక్కడే ఉన్నారు. సోమవారం ఉదయం రిసార్టు మేనేజర్ రాయిశివ చూసేసరికి గది బయట ఉన్న ఊయల కొక్కానికి సత్యనారాయణరాజు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించారు. వెంటనే ఆయన ఈ విషయాన్ని దేవరాపల్లి పోలీసులతో పాటు మృతుని బంధువులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చనిపోయే ముందు తనకు రావలసిన బకాయిల గురించి, ఆరుగురికి విడివిడిగా రాసిన ఉత్తరాలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సత్యనారాయణరాజు రిసార్ట్కు వచ్చినప్పుడల్లా తీవ్రంగా మదనపడుతూ ఏడ్చేవారని రిసార్టులో పని చేస్తున్న సిబ్బంది పోలీసులకు తెలిపారు. మృతుడు భార్య, కుమారుడు సాయి చైతన్యవర్మ అందించిన సమాచారం మేరకు లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఇన్చార్జి ఎస్ఐ ధనుంజయ్ తెలిపారు. -
పోలీస్ ఎస్కార్ట్ ఇవ్వండి!
● కొత్త మేయర్ కొంగొత్త కోరికలు ● ఆనవాయితీ లేదన్న కార్పొరేషన్ అధికారులు ● పోలీస్ కమిషనర్తో మాట్లాడుకోవాలని సూచన సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై కూర్చున్న తొలి రోజే.. కొత్త మేయర్ పీలా శ్రీనివాసరావు కొంగొత్త కోరికల చిట్టా తెరమీదకు వచ్చినట్టు తెలుస్తోంది. తనకు నగర ప్రథమ పౌరుడి హోదాలో 2 ప్లస్ 2 గన్మెన్లను కేటాయించాలని జీవీఎంసీ ఉన్నతాధికారులను అడిగినట్టు సమాచారం. అయితే జీవీఎంసీ కౌన్సిల్ బుక్ను అమాంతం తిరగేసిన అధికారులు కాస్తా... అటువంటి సౌకర్యం లేదని తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఏదైనా ప్రాణాపాయం ఉంటే నేరుగా పోలీస్ కమిషనర్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసినట్టు సమాచారం. అయితే ఇందుకయ్యే వ్యయాన్ని కూడా జీవీఎంసీ నిధుల నుంచి ఇవ్వలేమని కూడా కుండబద్దలు కొట్టినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ నేప థ్యంలో తన కోరికను నెరవేర్చుకునేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేస్తారనేది చూడాల్సి ఉంది. కూటమి గెలిచినప్పటి నుంచీ..! వాస్తవానికి సాధారణ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కాబోయే మేయర్ తానేనంటూ పీలా శ్రీనివాసరావు ప్రచారం చేసుకున్నారు. అనధికారికంగా అధికారులతో సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు. స్టాండింగ్ కమిటీలతో సంబంధం లేకపోయినప్పటికీ సమావేశంలో ఏయే అంశాలను అంగీకరించాలి? వేటిని వ్యతిరేకించాలనే విషయంలోనూ జోక్యం చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విషయంలో స్టాండింగ్ కమిటీ సభ్యులే పార్టీలోని పెద్దలకు ఫిర్యాదు కూడా చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అమరావతి నుంచి పిలుపురావడం.. క్లాస్ పీకడం కూడా జరిగిందని సొంత పార్టీ నేతలే అప్పట్లో పేర్కొన్నారు. అయినప్పటికీ పెద్దగా మార్పురాలేదని, ఆయన తరుపున మరో ఇద్దరు వ్యక్తులు మొత్తం వ్యవహారాల్లో చక్రం తిప్పుతున్నారని సొంత పార్టీ కార్పొరేటర్లే విమర్శలు గుప్పిస్తున్నారు. అన్ని కాంట్రాక్టు వ్యవహారాలతో పాటు ప్రాజెక్టుల విషయంలోనూ ఇద్దరు శ్రీనులు జోక్యం చేసుకుంటూ కలెక్షన్ కింగులుగా మారారనే ఆరోపలున్నాయి. ఇప్పుడు ఏకంగా మేయర్ పీఠంపై కూర్చోవడంతో తమకు ఎదురులేదనే రీతిలో వ్యవహరించే ప్రమాదం ఉందని కూటమి నేతలే అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నారు. అంతా ఆ ఇద్దరి హవానే...! సాధారణ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రాగానే... మేయర్ పీఠాన్ని అధిష్టించాలని తన కోరికను ఆయన అధిష్టానం ముందు ఉంచారు. అయితే, నిబంధనల మేరకు నాలుగేళ్ల వరకూ అవిశ్వాసం పెట్టేందుకు అవకాశం లేకపోవడంతో మిన్నకుండిపోయారు. నాలుగేళ్ల కాలపరిమితి ముగిసిన వెంటనే తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ వ్యవహారాల్లో ఆయన అనుచరులుగా ఉన్న ఇద్దరు శ్రీనుల ప్రమేయం ప్రధానంగా ఉందని తెలుస్తోంది. మేయర్గా పీలా శ్రీనివాసరావు కుర్చీలో కూర్చున్నప్పటికీ... వ్యవహారాలన్నీ ఆ ఇద్దరు శ్రీనులే నడిపించనున్నారు. ఇప్పటికే అనేక వార్డుల్లో తమను పక్కనపెట్టి... వీరి పెత్తనం ఏమిటంటూ సొంత పార్టీ కార్పొరేటర్లే మండిపడుతున్నారు. ఇద్దరు శ్రీనుల వ్యవహారాలను పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జి మంత్రి నేరుగా లోకేష్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు సమాచారం. అయినప్పటికీ వారి వైఖరిలో ఎలాంటి మార్పులేకపోగా... తాజాగా మరింత దూకుడు పెరిగినట్టు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం ఇద్దరు శ్రీనుల్లో ఒక శ్రీను ఫోన్ చేయగా... ఒక అధికారి ఫోన్ ఎత్తలేదని ఆయనను బదిలీ చేయాల్సిందేనంటూ పట్టుబట్టినట్టు సమాచారం. తనకు ఆయన ఫోన్ నెంబరు తెలియకపోవడంతో బదులివ్వలేదని సదరు అధికారి బతిమలాడుకోవాల్సి వచ్చిందని జీవీఎంసీలో చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఇక ఏకంగా మేయర్ పీఠంపై తమ నేత కూర్చోవడంతో ఆ ఇద్దరు శ్రీనులను కట్టడి చేయడం సాధ్యం కాదనే వాదన వినిపిస్తోంది. రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి పరిణామాలను జీవీఎంసీలో చూడాల్సి వస్తుందోననే ఆందోళన కూటమి నేతల్లోనే వ్యక్తమవుతోంది. -
పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
తాటిచెట్లపాలెం: సికింద్రాబాద్ డివిజన్ పరిధి మహబూబాబాద్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న 3వ లైన్ నిర్మాణం, పలు ఆధునికీకరణ పనుల నిమిత్తం ఆయా తేదీల్లో పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు, మరికొన్ని దారి మళ్లిస్తున్నట్లు, మరికొన్ని రీ షెడ్యూల్ చేసినట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు. రద్దయిన రైళ్లు ● విశాఖపట్నం–న్యూఢిల్లీ–విశాఖపట్నం(20805/06) ఏపీ ఎక్స్ప్రెస్ మే 27, 28, జూన్ 18, 19వ తేదీల్లోను, విశాఖపట్నం–హజరత్ నిజాముద్దీన్(12803) స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ మే 23, 26, జూన్ 16వ తేదీల్లోను, హజరత్ నిజాముద్దీన్–విశాఖపట్నం(12804) స్వర్ణజయంతి ఎక్స్ప్రెస్ మే 25, 28, జూన్ 18వ తేదీల్లో రద్దు చేశారు. దారి మళ్లించిన రైళ్లు ● మే 22 నుంచి 28వ తేదీ వరకు విశాఖపట్నం–లోకమాన్యతిలక్ టెర్మినస్–విశాఖపట్నం (18519/20) ఎల్టీటీ ఎక్స్ప్రెస్లు, మే 27, 28వ తేదీల్లో షాలిమర్–హైదరాబాద్(18045)ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్, మే 28, 29వ తేదీల్లో హైదరాబాద్–షాలిమర్(18046)ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్, మే 27, 28వ తేదీల్లో చత్రపతి శివాజి టెర్మినస్ ముంబయి–భువనేశ్వర్–చత్రపతి శివాజి టెర్మినస్ ముంబయి (11019/20) కోణార్క్ ఎక్స్ప్రెస్లు, మే 28న షాలిమర్–సికింద్రాబాద్(22849) ఎక్స్ప్రెస్లు వయా విజయవాడ–గుంటూరు–నల్గొండ–పగిడిపల్లి మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ● మే 22, జూన్ 19వ తేదీల్లో విశాఖపట్నం–గాంధీదాం(20803) వీక్లీ ఎక్స్ప్రెస్, మే 25, జూన్ 22వ తేదీల్లో గాంధీదాం–విశాఖపట్నం(20804) వీక్లీ ఎక్స్ప్రెస్, మే 25, జూన్ 15వ తేదీల్లో పూరీ–ఓఖా(20819) ఎక్స్ప్రెస్, మే 28, జూన్ 18వ తేదీల్లో ఓఖా–పూరీ(20820) ఎక్స్ప్రెస్లు వయా లఖోలి–రాయ్పూర్–నాగ్పూర్–బద్నెరా మీదుగా రాకపోకలు సాగిస్తాయి మహబూబాబాద్లో తాత్కాలికంగా హాల్ట్ తొలగింపు : ఆధునీకీకరణ పనుల నిమిత్తం మహబూబాబాద్ స్టేషన్లో కింది రైళ్లకు ఆయా తేదీల్లో తాత్కాలికంగా హాల్ట్ను రద్దు చేశారు. ● మే 24 నుంచి 28వ తేదీ వరకు విశాఖపట్నం–హైదరాబాద్ (12727) గోదావరి ఎక్స్ప్రెస్, మే 24 నుంచి 28వ తేదీ వరకు విశాఖపట్నం–మహబూబ్నగర్(12861) ఎక్స్ప్రెస్, మే 24, 25, 26వ తేదీల్లో భువనేశ్వర్–చత్రపతి శివాజి టెర్మినస్ ముంబయి (11020) కోణార్క్ ఎక్స్ప్రెస్, మే 24, 25, 26వ తేదీల్లో షాలిమర్–హైదరాబాద్(18045) ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్లు ఆయా తేదీల్లో మహబూబాబాద్లో ఆగవు.అదనపు కోచ్ల ఏర్పాటుతాటిచెట్లపాలెం: ప్రయాణికుల సౌక ర్యార్థం పలు రైళ్లకు అదనంగా జనరల్, స్లీపర్ క్లాస్ కోచ్లను తాత్కాలికంగా జతచేస్తున్నారు. విశాఖపట్నం–బ్రహ్మపూర్–విశాఖపట్నం (18526/18525) ఎక్స్ప్రెస్కు మే ఒకటో తేదీ నుంచి 31వ తేదీ వరకు రెండు జనరల్ సెకండ్ సిట్టింగ్ కోచ్లను, విశాఖపట్నం–రాయ్పూర్–విశాఖపట్నం (58528/58527)పాసింజర్కు మే ఒకటో తేదీ నుంచి 31వ తేదీ వరకు ఒక జనరల్ సెకండ్ సిట్టింగ్ కోచ్ను జతచేస్తున్నారు. అలాగే విశాఖపట్నం–కోరాపుట్–విశాఖపట్నం (58538/58537)పాసింజర్కు మే ఒకటో తేదీ నుంచి 31వ తేదీ వరకు ఒక జనరల్ సెకండ్ సిట్టింగ్ కోచ్ను, విశాఖపట్నం–బ్రహ్మపూర్–విశాఖపట్నం (58532/58531)పాసింజర్కు మే ఒకటో తేదీ నుంచి 31వ తేదీ వరకు ఒక జనరల్ సెకండ్ సిట్టింగ్ కోచ్ను జతచేస్తున్నారు. విశాఖపట్నం–భువనేశ్వర్–విశాఖపట్నం (22820/22819) ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్కు మే ఒకటో తేదీ నుంచి 31వ తేదీ వరకు రెండు జనరల్ సెకండ్ సిట్టింగ్ కోచ్లను, విశాఖపట్నం–కోరాపుట్–విశాఖపట్నం(18512/18511) ఎక్స్ప్రెస్కు ఒకటో తేదీ నుంచి 31వ తేదీ వరకు రెండు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లను జతచేస్తున్నారు. -
ఏపీకి వర్షం అలర్ట్.. ఈ జిల్లాల్లో మూడు రోజులు వర్షసూచన
సాక్షి, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. కాగా, ఏపీలో రాబోయే మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసింది.ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ మాట్లాడుతూ.. సోమవారం.. కాకినాడ, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఇక, మంగళవారం.. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.ఇదిలా ఉండగా.. కొన్ని జిల్లాలో ఎండ ప్రభావం ఎక్కువగా ఉంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఆదివారం అనకాపల్లి జిల్లా రావికమతం, వైఎస్సార్ జిల్లా వేంపల్లిలో 41.4, విజయనగరం జిల్లా గుర్లలో 41.2, తూర్పుగోదావరి జిల్లా మురమండ, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఇక, తెలంగాణలో గత కొద్ది రోజులుగా పలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఆదివారం హైదరాబాద్ సహా అనేక జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై.. మోస్తరు వర్షం కురసింది. దీంతో, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నల్లగొండ జిల్లాలో వర్షం కారణంగా కల్లాల్లో పోసిన ధాన్యం వర్షం తడిసిపోయింది. ఈ నేపథ్యంలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.Gadwal right now. As expected, dangerous storms smashing the district 😱Zaheerabad - Vikarabad too on ALERTVC :- @chaitanyak19142 pic.twitter.com/S3cmnQ4UMy— Telangana Weatherman (@balaji25_t) April 27, 2025 -
సింహగిరికి పోటెత్తిన భక్తజనం
సింహాచలం: గంధం అమావాస్య పురస్కరించుకుని సింహగిరికి ఆదివారం భక్తులు పోటెత్తారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఇలవేల్పుగా పూజించే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మత్స్యకారులు, గ్రామీణ ప్రాంత భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. శనివారం రాత్రికే సింహాచలం చేరుకున్న వీరంతా ఆదివారం తెల్లవారుజాము మూడు గంటల నుంచే కొండదిగువ వరాహ పుష్కరిణిలో స్నానాలు ఆచరించారు. స్వామి ప్రతిరూపాలుగా వెంట తీసుకొచ్చిన కోలలను పుష్కరిణి గట్టుపై ఉంచి పూజలు నిర్వహించారు. వంటలు వండి, కోలలకు ఆరగింపు చేశారు. అమృత కలశాలను, పళ్లను సమర్పించారు. కుటుంబ సమేతంగా సహపంక్తి భోజనాలు చేశారు. మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. కోలలతో నృత్యాలు చేస్తూ స్వామిని కీర్తించారు. స్నానమాచరించేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో వరాహ పుష్కరిణి ప్రాంగణం అంతా కిటకిలాడింది. పుష్కరిణి నుంచి అడవివరం మార్కెట్ కూడలి వరకు ఉన్న మార్గం భక్తజన సంద్రంగా మారింది. సింహగిరిపై దర్శనక్యూలు, కేశఖండనశాల, ప్రసాద విక్రయశాల, గంగధార మార్గం భక్తులతో కిటకిటలాడాయి. సింహగిరికి చేరుకున్న భక్తులు సింహగిరిపై కూడా కోలలకు పూజలు నిర్వహించారు. గరిడి నృత్యాలు చేశారు. దేవస్థానం ఇన్చార్జి ఈవో కె.సుబ్బారావు ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. పుష్కరిణి వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా గోపాలపట్నం పోలీసులు, దేవస్థానం గార్డులు బందోబస్తు నిర్వహించారు. -
చందనోత్సవంలో సామాన్యులకే పెద్ద పీట
● హోంమంత్రి వంగలపూడి అనితసింహాచలం: ఈనెల 30న జరిగే చందనోత్సవంలో సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అప్పన్న స్వామి నిజరూపదర్శనం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తోందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. సింహగిరిపై జరుగుతున్న చందనోత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హరేందిరప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చిలతో కలిసి ఆదివారం పరిశీలించారు. భక్తులకు కల్పించిన సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అంతరాలయ దర్శనాలు ఉదయం 3 గంటల నుంచి 6 గంటలలోపు మాత్రమే ఉంటాయన్నారు. ఉదయం 6 తర్వాత అంతరాలయ దర్శనాలు ఉండవని స్పష్టం చేశారు. ఈ తరుణంలో అంతరాలయ తలుపులు మూసివేసి తాళాలు వేసుకుని దగ్గర ఉంచుకోవాలని ఆలయ వైదికులు, అధికారులకు సూచించారు. దివ్యాంగులు, వృద్ధులకు, ఏడాదిలోపు వయసున్న పిల్లలు ఉన్నవారికి లిఫ్టు ద్వారా తీసుకెళ్లి, దర్శనం కల్పిస్తామన్నారు. చందనోత్సవం రోజు ఏటా లక్షా 30 వేల వరకు భక్తుల సంఖ్య ఉంటోందని, ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక శ్రీశైలం, కోటప్పకొండ, శ్రీకాళహస్తి, విజయవాడ, తిరుపతి తదితర ప్రముఖ క్షేత్రాల్లో భక్తుల సంఖ్య దాదాపు 30 శాతం పెరిగిందన్నారు. దీంతో సింహాచలంలో ఈసారి చందనోత్సవానికి సుమారు రెండు లక్షల మంది వస్తారని అంచనా వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జేసీ మయూర్ అశోక్, దేవదాయశాఖ ఇన్చార్జి కమిషనర్ కె.రామచంద్రమోహన్, దేవస్థానం ఈవో కె.సుబ్బారావు పాల్గొన్నారు. 2 వేల మందితో బందోబస్తు చందనోత్సవానికి 2 వేల మందితో బందోబస్తు కల్పిస్తున్నట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనాలు కల్పించడం జరుగుతుందన్నారు. -
జిల్లాకు చేరుకున్న పాఠ్య పుస్తకాలు
ఆరిలోవ: 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందజేసేందుకు మొదటి విడత పాఠ్య పుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన స్టాక్ పాయింట్లో వీటిని భద్రపరిచారు. ఈ కేంద్రాన్ని డీఈవో ఎన్. ప్రేమ్కుమార్ ఆదివారం సందర్శించి, పుస్తకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చినగదిలి మండలంలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్ మొదటి విడతగా 31,560 పుస్తకాలు చేరినట్లు తెలిపారు. రెండో విడతలో మరో 34 వేల పుస్తకాలు వస్తాయన్నారు. సీఎంవో దేముడు బాబు, చినగదిలి ఎంఈవోలు సీహెచ్.రవీంద్రబాబు, పి.అనురాధ, సీఆర్పీలు పాల్గొన్నారు. -
పెండింగ్ చలాన్ల వసూళ్ల డ్రైవ్
నగరంలో పోలీసుల విస్తృత తనిఖీలు ఏయూక్యాంపస్: నగరంలో పోలీసులు విస్తృతంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. గతంలో విధించిన చలాన్లు చెల్లించని వాహనదారులను గుర్తిస్తున్నారు. వారి నుంచి బకాయిలను వసూలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా ఆదివారం బీచ్రోడ్డులో పలు వాహనాలను తనిఖీ చేశారు. వాహన పత్రాలు సక్రమంగా లేని, హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్న వారికి జరిమానా విధించారు. భారీగా చలాన్లు పేరుకుపోయిన వాహనచోదకుల నుంచి ఆ రుసుం చెల్లించే విధంగా చర్యలు చేపట్టారు. -
మధ్యాహ్నం నిర్మానుష్యం.. సాయంత్రం కిటకిట
మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో.. సాయంత్రం 5 గంటల సమయంలో.. ఏయూక్యాంపస్: నగరంలో ఎండ తీవ్రత బాగా పెరిగింది. ఎండ మంటతో పాటు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మధ్యాహ్న సమయంలో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఆ సమయంలో సాగర తీరం ఖాళీగానే కనిపిస్తోంది. అయితే సాయంత్రం పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఆ సమయానికి వాతావరణం కాస్త చల్లబడటంతో బీచ్లకు క్యూ కడుతున్నారు. ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో నగరవాసులు కుటుంబ సభ్యులతో కలిసి బీచ్కు చేరుకున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో అలల హోరు వింటూ.. ఇసుకలో సేదతీరారు. దీంతో బీచ్ జనాలతో కిటకిటలాడింది. ఆర్.కె.బీచ్తో పాటు సాగర్నగర్, రుషికొండ, భీమిలి, యారాడ తదితర బీచ్లు కూడా సందడిగా కనిపించాయి. –ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
‘మహా బోధి విహార్ను బౌద్ధులకే అప్పగించండి’
సీతమ్మధార: బిహార్లోని మహా బోధి విహార్ నిర్వహణ బాధ్యతలను పూర్తిగా బౌద్ధులకే అప్పగించాలని ఉత్తరాంధ్ర బౌద్ధ సంఘాల ఐక్య వేదిక నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఎల్ఐసీ బిల్డింగ్ అంబేడ్కర్ విగ్రహం నుంచి జీవీఎంసీ కార్యాలయం వరకు మహా శాంతి యాత్ర నిర్వహించారు. అనంతరం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వారంతా నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ మహా బోధి విహార్ను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిందన్నారు. అటువంటి ఈ విహార్ నిర్వహణ బాధ్యతలను పూర్తిగా బౌద్ధులకే ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కానీ అక్కడి రాష్ట్ర ప్రభుత్వం బి.టి.ఎం.సి.యాక్ట్ 1949 ప్రకారం చట్టం చేసి.. అందులో నలుగురు హిందూ మహంతులు, నలుగురు బౌద్ధ భిక్షువులతో పాటు కలెక్టర్ను చైర్మన్గా కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. మొత్తం 9 మంది సభ్యుల్లో ఐదుగురు హిందువులే ఉండేలా చేసి.. ఆలయ అభివృద్ధి, విధానపరమైన నిర్ణయాల్లో బౌద్ధులకు ఎటువంటి ప్రాధాన్యత లేకుండా చేసిందని మండిపడ్డారు. మహా విహార విముక్తి ఆందోళనలో ఉత్తరాంధ్ర జిల్లాల జేఏసీ కన్వీనర్ వి.వి.దుర్గారావు, కో కన్వీనర్ బి.వి.జి.గౌతమ్, జేఏసీ చీఫ్ అడ్వైజర్ డాక్టర్ మాటూరు శ్రీనివాస్, భీమ్ సేన్ వార్ జనరల్ సెక్రటరీ డాక్టర్ వసంత రాజేంద్రప్రసాద్, మాటూరి శ్రీనివాసరావు, పేకేటి రామారావు, ఎం.మల్లయ్య రాజు, తదితరులు పాల్గొన్నారు. -
తెలిసిన వారి పనేనా?
కూర్మన్నపాలెం: రాజీవ్నగర్లో జరిగిన దంపతుల హత్య కేసు ఇంకా కొలిక్కి రాలేదు. తొలుత ఈ హత్యలను దోపిడీ దొంగలే చేసి ఉంటారని పోలీసులు, స్థానికులు భావించారు. ఆ కోణంలోనే పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే విదేశాల నుంచి వచ్చిన మృతుల కుమార్తె, కుమారుడు ఇంట్లోని బీరువాలను తెరిచి పరిశీలించగా.. అందులో నగదు, బంగారు నగలు చెక్కు చెదరకుండా ఉన్నట్లు గుర్తించారు. పోలీసుల సమక్షంలోనే బీరువాలను పరిశీలించగా 30 తులాల బంగారం, రూ. 10 వేల నగదు సురక్షితంగా ఉన్నట్లు తేలింది. దీంతో ఈ హత్యలు డబ్బు లేదా ఆభరణాల కోసంజరగలేదని స్పష్టమైంది. ఈ కీలక పరిణామంతో హత్యలపై పోలీసుల దర్యాప్తు కోణం మరో మలుపు తిరిగింది. ఘటనా స్థలంలోని పరిస్థితులు, హత్యకు ఉపయోగించిన ఆయుధాలను పరిశీలిస్తే.. వారికి బాగా తెలిసిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వంట గదిలో కూరగాయలు కోసేందుకు ఉపయోగించే రెండు కత్తులతోనే ఈ హత్యలు జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇంటితో బాగా పరిచయం ఉన్న వారికే వస్తువులు ఎక్కడ ఉంటాయో తెలుస్తుందని భావిస్తున్న పోలీసులు.. ఇప్పుడు దర్యాప్తును ఆ దిశగా మళ్లించారు. దీంతో మృతుల కుటుంబంతో సన్నిహిత పరిచయాలున్న వారిని, ఇంటికి తరచుగా వచ్చిపోయే వారిని, ఆ కుటుంబ సభ్యులకు చనువుగా ఉండేవారి వివరాలను సేకరించి.. వారిని ప్రశ్నిస్తున్నారు. ఈ దారుణ ఘటనపై నగర పోలీసు ఉన్నతాధికారులు ఇక్కడే ఉండి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. క్రైం పోలీసులు, అధికారులు మఫ్టీలో ఆ ప్రాంతమంతా జల్లెడ పడుతున్నారు. ఇప్పటివరకు స్పష్టమైన ఆధారాలు దొరక్కపోవడంతో.. కేసును ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియక ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. కొలిక్కిరాని దంపతుల హత్య కేసు -
ఉత్సాహంగా రైల్వే వేసవి క్రీడా శిబిరాలు
విశాఖ స్పోర్ట్స్: యువ ప్రతిభను పెంపొందించడం, క్రీడాస్ఫూర్తిని చిరుప్రాయం నుంచే అలవరిచే లక్ష్యంతో రైల్వేలో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఈస్ట్ కోస్ట్ రైల్వే క్రీడా సంఘం(ఈకోర్సా) వాల్తేర్ ఆధ్వర్యంలో ఈనెల 22న ప్రారంభమైన క్రీడా శిబిరాలు నెలాఖరు వరకూ సాగనున్నాయి. 5 నుంచి 15 ఏళ్ల చిన్నారులు సుమారు 200 మంది ఈ శిబిరాల్లో తర్ఫీదు పొందుతున్నారు. ఇదిలా వుండగా ఆదివారం ఈకోర్సా డబ్ల్యూడబ్ల్యూవో అధ్యక్షురాలు జ్యోత్న్స బోహ్రా మార్గదర్శకంలో యోగా శిబిరంలో మరింత ఉత్సాహంగా సాగింది. యువతలో ఆరోగ్యకరమైన అలవాట్లు, మానసిక శ్రేయస్సును పెంపొందించడం లక్ష్యంగా యోగాతో పాటు స్విమ్మింగ్లోనూ శిక్షణ కొనసాగుతుంది. ఉదయం 6 నుంచి 8 వరకు, సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు రెండు సెషన్స్లో ఈ శిబిరం ప్రతీ రోజూ జరుగుతుంది. బాలురకు క్రికెట్, బాల్ బ్యాడ్మింటన్, ఫుట్బాల్, వాలీబాల్లో శిక్షణ ఇస్తుండగా బాక్సింగ్, బాస్కెట్బాల్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, బ్యాడ్మింటన్, యోగాలో బాలబాలికలు శిక్షణ నిర్వహిస్తున్నారు. -
ఆప్తాల్మిక్ అధికారులకు పదోన్నతులు కల్పించాలి
అల్లిపురం: రాష్ట్రంలోని ఆప్తాల్మిక్ అధికారులు గత 39 ఏళ్లుగా ఎటువంటి పదోన్నతులకు నోచుకోకుండానే.. పదవీ విరమణ చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ ఆప్తాల్మిక్ అధికారుల అసోసియేషన్ జోన్–1 అధ్యక్షుడు డి.వెంకటరమణ అన్నారు. కలెక్టరేట్ ఆవరణలోని ఎన్జీవో హోం ఆవరణలో ఆదివారం జరిగిన అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తమ పదోన్నతులపై తక్షణమే స్పందించాలన్నారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి ఒక్క ఉద్యోగికి కనీసం రెండు పదోన్నతులు కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పారా మెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.జె.రఘురామరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎస్.వసంతరావు, ఎం.ఆర్.కె.దాస్, జోనల్ అధ్యక్షుడు డి.వెంకటరావు, జిల్లా ఎన్జీవో సంఘం అధ్యక్షుడు కె.ఈశ్వరరావు పాల్గొని.. ఈ నెల పదవీ విరమణ చేయనున్న బీవీఎం ప్రసాద్ను సన్మానించారు. -
వక్ఫ్బోర్డు సవరణ చట్టాన్ని రద్దు చేయాలి
తాటిచెట్లపాలెం: ఇటీవల కశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారికి సున్నీ ఫెడరేషన్ ఆఫ్ ఆల్ మసీద్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. టీఎస్ఎన్ కాలనీలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆదివారం వీరు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఉగ్రదాడిలో మృతులకు సంఘీభావంగా చిన్నారులు, పెద్దలు, మహిళలు జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. అనంతరం జరిగిన సమావేశంలో సున్నీ ఫెడరేషన్ సభ్యులు మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణ యాక్ట్–2025ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పూర్వీకులు 4, 5 శతాబ్దాల కిందట ఆస్తులను అల్లా పేరున వక్ఫ్(దానం) చేశారని, వాటిని పేదలకు, వితంతువులకు ఉపయోగపడే చూడాలని వారు కోరారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు అహ్మదుల్లా ఖాన్, జనరల్ సెక్రటరీ ఎస్.కె.నూర్ అహ్మద్, హైదర్ ఆలీ సింకా, ఎస్.కె.అహ్మద్ వల్లీ, రహ్మతుల్లా బేగ్, మీర్ అబ్బాస్ హుస్సేన్, మునీర్ఖాన్, రహమతుల్లా, సయ్యద్ అమీర్ఖాన్, మహబూబ్ షరీఫ్, హమ్మద్ హబీబ్, లుక్మాన్ పాల్గొన్నారు. -
మే 20న జాతీయ సమ్మె
డాబాగార్డెన్స్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ల రద్దు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల, కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాలు మే 20న జాతీయ సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం డాబాగార్డెన్స్లోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సిటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు, ఏఐటీయూసీ నాయకుడు డి.ఆదినారాయణ, ఐఎన్టీయూసీ నాయకుడు మంత్రి రాజశేఖర్, సీఎఫ్టీయూఐ అధ్యక్షుడు ఎన్.కనకారావు, హెచ్ఎంఎస్ నాయకుడు గణపతిరెడ్డి, ఏపీఎఫ్టీయూ నాయకుడు దేవా మాట్లాడారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని, దీని వల్ల నిరుద్యోగం పెరిగి, ఉద్యోగ భద్రత తగ్గిందని విమర్శించారు. కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ, 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్స్గా మార్చడం ద్వారా కార్మికుల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. ఈ కోడ్స్ అమలైతే పని గంటలు 8 నుంచి 15కి పెరిగే ప్రమాదం ఉందని, కార్మికులు సంఘం నెలకొల్పడం, సమ్మె చేయడం, వేతనాల కోసం పోరాడే హక్కులు కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే, పోర్టులు, విమానాశ్రయాలు, బ్యాంకులు మొదలైనవాటిని ప్రైవేటీకరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, ప్రైవేటీకరణ ఆపాలని, కనీస వేతనం నెలకు రూ.26,000 ఇవ్వాలని, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్, అగ్నిపథ్ రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ రంగంలో ఖాళీలను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. మే 3 లోపు పరిశ్రమల వారీగా సమ్మె నోటీసులు ఇవ్వాలని, 10 లోపు జిల్లా, మండల, పట్టణ స్థాయి సదస్సులు నిర్వహించాలని, 16 నుంచి 19 వరకు ప్రచార యాత్రలు చేపట్టాలని, మే 20న భారీ ప్రదర్శనలు, సభలు నిర్వహించాలని కార్యాచరణను ప్రకటించారు. ఈ సమ్మెకు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలోని రైతు సంఘాలు కూడా గ్రామీణ హర్తాళ్కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. సమ్మెలో అన్ని రంగాల కార్మికులు, ఉద్యోగులు, వ్యాపారులు స్వచ్ఛందంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఆర్కేఎస్వీ కుమార్, బి.నాగభూషణం, మన్మధరావు, ఆయా యూనియన్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. లేబర్ కోడ్స్, ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల పిలుపు -
సృజనాత్మకత.. నృత్య ఘనత
వైవిధ్యం కోసం నేర్చుకుంటున్నాను డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్లో బంగ్లాదేశ్, నేపాల్, పశ్చి మబెంగాల్ ప్రాంతాలకు చెందిన డ్యాన్స్లు నేర్చుకున్నాను. దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రదర్శనలిచ్చాను. టర్కీలో జరిగిన పోటీల్లో విజయం సాధించడం మరిచిపోలేను. క్రియేటివ్ డ్యాన్స్లకు ఆదరణ ఎక్కువ. అమ్మానాన్నల ప్రోత్సాహంతో పన్నెండేళ్లుగా శిక్షణ పొందుతున్నాను. – గోక డింపుల్, ఏయూ ఇంజినీరింగ్ విద్యార్థిని సీతమ్మధార: నగరంలోని ‘స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్’ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేస్తోంది. బాలబాలికలకు వివిధ రకాల నృత్య రీతుల్లో శిక్షణ ఇస్తూ.. వారి సృజనాత్మకతను వెలికితీస్తోంది. భారతీయ శాసీ్త్రయ నృత్యాలైన కథక్, మోహినియాట్టం, ఒడిస్సీ, మణిపురితో పాటు సంబల్పూరి, కోలాటం, రాజస్థానీ, కర్ణాటక, బిహు, పంజాబీ, తెలుగు జానపద, శాసీ్త్రయ నృత్యాల్లో ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. అంతేకాకుండా నేపాలి, ఇండోనేషియా, శ్రీలంక వంటి దేశాల నృత్యరీతులను కూడా నేర్పిస్తున్నారు. అనకాపల్లి, పెందుర్తి, భీమునిపట్నం, సింహాచలం తదితర ప్రాంతాల నుంచి ప్రతి ఆదివారం సీతమ్మధార ఏపీఎస్ఈబీ కాలనీలోని నృత్యాలయానికి విద్యార్థులు వచ్చి మూడు గంటల పాటు ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. శ్రీకాకుళం, రాజాం, చీపురుపల్లి ప్రాంతాలకు చెందిన బాల కళాకారులు రెండు, మూడు రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక సదస్సుల్లో పాల్గొని సృజనాత్మక నృత్యాంశాలు నేర్చుకుంటున్నారు. ఈ సంస్థకు అనుబంధంగా ఉన్న శ్రీలంక, ఒడిశా, బంగ్లాదేశ్, నేపాల్, కర్ణాటక, కేరళ, కోల్కతా వంటి ప్రాంతాల నుంచి శిక్షకులు వచ్చి బాలలకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు ప్రశంసా పత్రాలు అందిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందుతున్న విద్యార్థులు టర్కీ లోని ఇస్తాంబుల్, బల్గేరియా, సుబంగ్ (ఇండోనేషియా)లలో ప్రతి ఏటా జరిగే అంతర్జాతీయ ఆన్లైన్ నృత్య పోటీల్లో పాల్గొని బహుమతులు సాధిస్తున్నారు. థాయిలాండ్,శ్రీలంక, ఇండోనేషియా వంటి దేశాల్లో నిర్వహించే అంతర్జాతీయ ఆహ్వాన నృత్య ప్రదర్శన పోటీలకు హాజరై.. భారతీయ జానపద, శాసీ్త్రయ నృత్యాల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్నారు. బహుభాషా నృత్యాలు బాగుంటాయి ఒడిస్సీ, కథక్, మణిపురి, కర్ణాటక జానపద నృత్యాలను ప్రదర్శిస్తాను. బహుభాషా నృత్యాలు బాగుంటాయి. అందుకే ఆసక్తిగా నేర్చుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీలో నిర్వహించిన జాతీయ బాలల సాంస్కృతిక ఉత్సవాల్లో పూజిత చందన (విశాఖ), ఎన్.జోషిత (సింహాచలం)లతో కలసి నృత్య ప్రదర్శనలిచ్చాను. కళాభిమానులు, నిర్వాహకుల అభినందనలు అందుకున్నాం. మన జానపద నృత్యాలకు విదేశాల్లో చూపుతున్న ఆదరణ.. నాలో ఆసక్తిని మరింత పెంచుతోంది. –డి.లక్ష్మీస్నేహిత, ఇంటర్ విద్యార్థిని, అనకాపల్లి వైవిధ్య నృత్యాలకు వేదిక‘స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్’ దేశ విదేశీ నృత్యాల్లో బాల కళాకారులకు శిక్షణ అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలు, ప్రశంసలు అంతర్జాతీయ ప్రశంసలే ప్రోత్సాహం విదేశాల్లో భారత దేశ నృత్యాంశాలు ప్రదర్శించేటప్పుడు లభించే ప్రశంసలే నాకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి. టర్కీ, ఇండోనేషియా, సింగపూర్, థాయ్లాండ్లలో ప్రదర్శించే అవకాశాలు లభించడం మరువలేనది. విదేశీ కళాకారులు సైతం భారతీయ శాసీ్త్రయ, జానపద నృత్యాలకు ముగ్ధులవుతున్నారు. – ఆర్.హర్షిత టీనా,తగరపువలస -
నేడే మేయర్ ఎన్నిక
● కూటమి అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావు ● ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం డాబాగార్డెన్స్: జీవీఎంసీ మేయర్ ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం సోమవారం ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ను ప్రభుత్వం నియమించింది. కాగా కూటమి తరపున మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావును ప్రకటించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ ఆదివారం పార్టీ కార్యాలయంలో ఆయనకు బీ–ఫారం అందజేశారు. మరోవైపు మేయర్ ఎన్నిక ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కౌన్సిల్ సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఉదయం 10.30 గంటలకు గుర్తింపు కార్డులతో రావాలని సూచించారు. -
రెడ్ సిగ్నల్
గ్రీన్ షెల్టర్లకు● మొక్కుబడిగా చలివేంద్రాల నిర్వహణ ● పట్టించుకునే అధికారి లేకపోవడంతో ఎండల బారిన ప్రజలు ● మౌలిక సదుపాయాల కల్పనలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం డాబాగార్డెన్స్: ఎండలు మండుతున్నాయి. నానాటికీ ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఉదయం 9 గంటలకు మొదలైన భానుడి ప్రతాపం సాయంత్రం 6 గంటలకు గాని తగ్గట్లేదు. ఉక్కపోత, వడగాడ్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏప్రిల్లోనే ఇలా ఉంటే.. ఇక మే నెలలో ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో, దైనందిన విధుల్లో భాగంగా రోడ్లపైకి వచ్చే ప్రజలకు అవసరమైన కనీస వసతుల కల్పనలో కూటమి పాలకులు విఫలమయ్యారనే చెప్పొచ్చు. గాడి తప్పిన జీవీఎంసీ పాలన జీవీఎంసీకి పూర్తిస్థాయి కమిషనర్ లేరు. మూడు నెలలుగా ఇన్చార్జ్ కమిషనర్ పాలనలోనే జీవీఎంసీ ఈదుతోంది. దీంతో జీవీఎంసీ అధికారుల్లో జవాబుదారీ తనం కరువైంది. 35 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా, నగరవాసులకు కనీస వసతుల కల్పనలో కూటమి ప్రభుత్వం ఫెయిలైందని ప్రజలు ఆక్షేపిస్తున్నారు. ఆస్తి పన్నులు చెల్లించకపోతే జప్తు చేస్తామని బెదిరిస్తున్న అధికారులు, మండుతున్న ఎండల నేపథ్యంలో గ్రీన్షెల్టర్లు, చలివేంద్రాలపై దృష్టి సారించకపోవడంపై మండిపడతున్నారు. గతంలో జీవీఎంసీ ఆధ్వర్యంలో 98 వార్డుల్లోని ప్రధాన కూడళ్లు, ఐలాండ్లు, జాతీయ రహదారుల వెంబడి, ట్రాపిక్ సిగ్నల్ పాయింట్ల వద్ద చలివేంద్రాలు, గ్రీన్షెల్టర్లను విరివిగా ఏర్పాటు చేసేవారు. గతంలో ఇలా.. గత ప్రభుత్వ హయాంలో జీవీఎంసీ పరిధిలో చలివేంద్రాలతో పాటు 63 గ్రీన్ షెల్టర్స్ ఏర్పాటు చేశారు. జోన్–1 పరిధిలో 10 చలివేంద్రాలు, 4 గ్రీన్ షెల్టర్స్, జోన్–2లో 13 చలివేంద్రాలు, 7 గ్రీన్ షెల్టర్స్, జోన్–3లో 26 చలివేంద్రాలు, 4 గ్రీన్ షెల్టర్స్, జోన్–4లో 25 చలివేంద్రాలు, 6 గ్రీన్షెల్టర్స్, జోన్–5ఏ పరిధిలో 29 చలివేంద్రాలు, 5 గ్రీన్షెల్టర్స్, జోన్–5బీ పరిధిలో 13 చలివేంద్రాలు, 3 గ్రీన్షెల్టర్స్, జోన్–6 పరిధిలో 31 చలివేంద్రాలు, 16 గ్రీన్షెల్టర్స్, జోన్–7 పరిధిలో 12 చలివేంద్రాలు, 12 గ్రీన్షెల్టర్స్, జోన్–8 పరిధిలో 18 చలివేంద్రాలు, 6 గ్రీన్షెల్టర్స్ ఏర్పాటు చేసి పాదచారుల దాహార్తి, వాహనచోదకులకు ఉపశమనం కల్పించారు. మొక్కుబడిగా హరితాశ్రయాలు నగరంలో పలు ప్రాంతాల్లో జీవీఎంసీ ఏర్పాటు చేసిన హరితాశ్రయాలు లక్ష్యానికి దూరంగా ఉంటున్నాయి. నిర్వహణ లోపాలు, పర్యవేక్షణ కొరవడటంతో లక్ష్యం నెరవేరడం లేదు. కొన్ని ప్రాంతాల్లో వీటి చుట్టూ ఆకుపచ్చని తెరను సరిగా ఏర్పాటు చేయలేదు. దీంతో ఎండ సమయంలో దీనిలో కూర్చునే అవకాశం ఉండడం లేదు. కొన్ని చోట్ల శునకాలు వీటిలో తిష్టవేస్తున్నాయి. అధికారులు హరితాశ్రయాలలో తాగునీరు సైతం ఏర్పాటు చేస్తే నగరవాసులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. నగర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా.. నగర ప్రజల శ్రేయ స్సు దృష్ట్యా రూ.కోటితో 177 చలివేంద్రాలు, 63 గ్రీన్ షెల్టర్స్ను గతంలో ఏర్పాటు చేశాం. ముఖ్యంగా ఐలాండ్లు, హైవే, ముఖ్య కూడళ్ల వద్ద జీవీఎంసీ ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేశాం. అధికార యంత్రాంగం వీటిని సక్రమంగా నిర్వహించాలి. – గొలగాని హరి వెంకటకుమారి, మాజీ మేయర్ -
ముక్కలు
రెక్కలు..గణనీయంగా పడిపోయిన వైజాగ్ ఎయిర్పోర్ట్ వృద్ధి రేటువిశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం భవిష్యత్తును కూటమి ప్రభుత్వం కాలరాస్తోంది. గత ప్రభుత్వం చూపించిన శ్రద్ధతో ఎయిర్పోర్టు కొత్త రెక్కలు తొడుక్కుంది. నవ్య రూపం సంతరించుకుని అంతర్జాతీయ సర్వీసులను ఆకర్షించింది. కూటమి ప్రభుత్వం దీనికి రివర్స్లో విమానం రెక్కలు విరిచేసింది. దీంతో ఎయిర్పోర్టు వృద్ధి రేటులో తిరోగమనం దిశగా పయనిస్తోంది. సాక్షి, విశాఖపట్నం : ఏడాది క్రితంతో పోలిస్తే విశాఖ విమానాశ్రయంలో విమాన సర్వీసులు, ప్రయాణికుల వృద్ధి క్రమంగా క్షీణిస్తోంది. కోవిడ్ తర్వాత మొదటిసారిగా ప్రయాణికుల రాకపోకల వృద్ధి రేటు 20 శాతం దిగువకు పడిపోవడమే దీనికి నిదర్శనం. గతంలో కనీసం 50 నుంచి 100 శాతానికి పైగా వృద్ధి నమోదయ్యేది. కానీ ఈ ఏడాది మార్చిలో కేవలం 17 శాతానికే పరిమితమైంది. ప్రభుత్వ నిర్లక్ష్యం, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు చేతకానితనం వల్ల ప్రయాణికుల రాకపోకల వృద్ధి రికార్డు స్థాయిలో తగ్గిపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు ఉత్తరాంధ్రకు చెందిన వారైనా.. విమాన సర్వీసులు రద్దవుతున్నా పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొన్ని సర్వీసులు ఇతర ప్రాంతాలకు తరలించేయడం.. కొత్త సర్వీసులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోవడంతో ఈ పరిస్థితి దాపురించింది. మార్చిలో 17 శాతం వృద్ధి మాత్రమే.! ప్రతి నెలా దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో విశాఖ ఎయిర్పోర్టు నుంచి ప్రయాణిస్తున్న ప్రయాణికుల సంఖ్యను గణిస్తుంటారు. గతేడాది అదే నెలలో జరిగిన రాకపోకలతో పోల్చి వృద్ధి రేటు నమోదు చేస్తారు. ఈ వృద్ధి రేటు ఆధారంగా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు కనిపిస్తే ఎయిర్లైన్స్ సంస్థలు.. కొత్త సర్వీసులు నడిపేందుకు పోటీ పడుతుంటాయి. 2024 నవంబర్ వరకూ వైజాగ్ ఎయిర్పోర్టు గణనీయంగా వృద్ధి నమోదు చేసింది. దేశీయ విమాన సర్వీసుల్లో 80 నుంచి 100 శాతం వరకూ, అంతర్జాతీయ సర్వీసుల్లో 90 నుంచి 150 శాతం వరకూ వృద్ధి కనిపించింది. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం విశాఖను విస్మరించిందో అప్పటి నుంచి సర్వీసులు తగ్గిపోయాయి. ఫలితంగా ప్రయాణికుల వృద్ధి కూడా దారుణంగా పడిపోయింది. ఈ ఏడాది మార్చిలో 2,55,835 మంది ప్రయాణికులు డొమెస్టిక్, ఇంటర్నేషనల్ సర్వీసుల్లో ప్రయాణించారు. 2024 మార్చిలో 2,17,243 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ప్రయాణికుల సంఖ్య అంతగా పెరగకపోవడంతో వృద్ధి కేవలం 17.8 శాతం మాత్రమే నమోదైంది. గత ఐదేళ్ల కాలంలో కోవిడ్ మినహాయిస్తే.. ఇదే అత్యల్పం కావడం దురదృష్టకరం. ఈ ఏడాది మార్చిలో 2,55,835 మంది రాకపోకలు గతేడాది మార్చిలో 2,17,243 మంది ప్రయాణం గత మార్చితో పోలిస్తే కేవలం 17.8 శాతం మాత్రమే వృద్ధి కూటమి సర్కారు నిర్వాకంతో పలు విమాన సర్వీసుల రద్దు పట్టించుకోని కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు ఏప్రిల్ నెలలో మరింత దిగజారనున్న వృద్ధి రేటు వచ్చిన విమానాలు వచ్చినట్లే మాయం మార్చిలో 20 శాతం దిగువన నమోదైతే.. ఏప్రిల్లో మరింత దిగువకు పడిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఏప్రిల్లో విజయవాడ సర్వీసులతో పాటు మరికొన్ని సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణించే వారి సంఖ్య కూడా తగ్గిపోతోంది. ఇటీవల దుబాయ్ విమానం వైజాగ్ రాకుండా కూటమి సర్కారు అడ్డుకొని విజయవాడకు తరలించేసింది. అదే నిర్లక్ష్యంతో వియత్నాం విమాన సర్వీసు హైదరాబాద్లో ల్యాండ్ అయిపోయింది. ఇటీవలే బ్యాంకాక్, కౌలాలంపూర్ విమాన సర్వీసులు కూడా నిలిపేస్తున్నామని ప్రకటించాయి. విజయవాడ సర్వీసు ఆగిపోయింది. మిగిలిన డొమెస్టిక్ సర్వీసుల విషయంలోనూ అదే నిర్లిప్తంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దీంతో వైజాగ్ వచ్చేందుకు ఎయిర్లైన్స్ ఆసక్తి చూపిస్తున్నా కూటమి ప్రభుత్వం మాత్రం రాకుండా మోకాలడ్డుతోంది. ఇలాగే కొనసాగితే వైజాగ్ ఎయిర్పోర్టు నుంచి కొత్త సర్వీసులు వచ్చేందుకు అవకాశాలు దాదాపు సన్నగిల్లిపోతాయని ప్రజలు, అసోసియేషన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
Visakha: జంట హత్యల కేసులో ఏం జరిగింది..?
విశాఖ: నగరంలోని చోటు చేసుకున్న జంట హత్యల కేసు పోలీసులకు కాస్త తలనొప్పిగా మారింది. దోపీడీ దొంగలు పనై ఉంటుందని తొలుత భావించిన పోలీసులకు ఆ అనావాళ్లు ఏవీ కనిపించడం లేదు. హత్యకు గురైన యోగేంద్ర(66), లక్ష్మీ(58) ఇంట్లో ఎటువంటి చోరీ జరగలేదని గుర్తించారు పోలీసులు. వారికి సంబంధించిన బంగారం ఆభరణాల్లో కొన్నింటిని ఇంట్లోనే గుర్తించారు. అయితే పాత కక్ష్యల కారణంగానే హత్య చేశారని భావిస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి నలుగురు అనుమానితులను పోలీసులు గుర్తించారు.ఆనవాళ్లు లేకుండా జాగ్రత్త పడ్డారు..ఈ జంట హత్యల కేసులో దుండగులు ఎక్కడా ఎలాంటి ఆనవాళ్లు వదలకుండా.. అత్యంత పకడ్బందీగా నేరానికి పాల్పడటంతో కేసు ఛేదన పోలీసులకు సవాల్గా మారింది. ఉన్నతాధికారులు సైతం రంగంలోకి దిగి కేసు దర్యాప్తును అన్ని కోణాల్లోనూ నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. హత్యకు గురైన యోగేంద్రబాబు, ఆయన భార్య లక్ష్మి సుమారు 40 ఏళ్లుగా గాజువాకకు సమీపంలోని రాజీవ్నగర్ ప్రాంతంలోనే నివాసం ఉంటున్నారుయోగేంద్రబాబు నావల్ డాక్యార్డ్లో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు. స్థానిక గ్లోరియా(ఎయిడెడ్) పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలిగా పనిచేసి రిటైర్ అయిన లక్ష్మి స్థానికంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. వారికి ఎవరితోనూ ఎలాంటి శత్రుత్వం లేదని స్థానికులు చెబుతున్నారు. వారి ఇద్దరు పిల్లలు శృతి, సుజన్ వివాహాలు చేసుకుని అమెరికాలో స్థిరపడటంతో.. ఇంట్లో వీరిద్దరు మాత్రమే ఉంటున్నారు. ఎవరితోనూ గొడవలు లేని వీరిని ఇంత దారుణంగా ఎవరు, ఎందుకు హత్య చేశారన్నది అంతుపట్టని ప్రశ్నగా మారింది.హత్య కోసం అదను చూసుకున్నారా?హత్యకు గురైన దంపతులు గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చారు. అక్కడ గ్లోరియా పాఠశాల అడ్మిన్కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని వచ్చినట్లు సమాచారం. పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్న దాని ప్రకారం గురువారం రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో ఈ హత్య జరిగి ఉండవచ్చు. అదే సమయంలో రాజీవ్నగర్లో గ్రామదేవత పండగ జరుగుతుండటంతో ఆ పరిసరాలు కాస్త సందడిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దుండగులు తమ పని కానిచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. పాత కక్ష్యల నేపథ్యంలో అదను చూసుకుని కాపు కాసి హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇంటికి బంధువులు వస్తే కానీ తెలియలేదు..శుక్రవారం రాత్రి వరకు ఈ దారుణం వెలుగులోకి రాలేదు. మృతుల బంధువుల కుమార్తె వారిని కలవడానికి ఇంటికి వచ్చినప్పుడు, ఇంటికి తాళం వేసి ఉండటం, లోపల ఫోన్ మోగుతుండటంతో ఆమెకు అనుమానం వచ్చింది. దీంతో ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు వచ్చి తలుపులు తెరవగా ఈ ఘోరం వెలుగుచూసింది. ఘటన జరిగిన సమయంలో పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పని చేయకపోవడం, వీధి లైట్లు వెలగకపోవడం వంటివి దర్యాప్తునకు ఆటంకాలు కలిగిస్తున్నాయి. వారి పిల్లలు అమెరికా నుంచి వచ్చిన తర్వాతే ఇంట్లో ఏయే వస్తువులు, ఎంత నగదు, బంగారం పోయిందనే వివరాలు కచ్చితంగా తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.