breaking news
Visakhapatnam
-
విశాఖ కేజిహెచ్లో పవర్ కట్.. రోగుల అవస్థలు
విశాఖ: విశాఖ కేజిహెచ్లో పవర్ కట్ కావడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. వాటర్ పైప్ లైన్ ట్రెంచ్ తీస్తుండగా పవర్ లైన్ కట్ అయింది. మధ్యాహ్నం పవర్ లైన్ తెగిపోయినా సాయంత్రం పునరుద్దరణ పనులు వరకూ మొదలు కాలేదు.మరో గంట నుంచి రెండు గంటలు సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. పునరుద్దరణ పనులను సూపరింటెండెంట్ వాణి పరిశీలించింది.కింగ్ జార్జ్ ఆసుపత్రిలోని కీలక విభాగాల్లో అంధకారం. సహనం కోల్పోతున్న రోగులు. ఇబ్బందులు పడుతున్న రోగుల బంధువులు.సాక్షి టీవీతో కింగ్ జార్జ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ వాణికేజీహెచ్ లో విద్యుత్ సరఫరా పునరుద్దరణకు మరో రెండు గంటల సమయం పడుతుందిక్రిటికల్ కేర్ బ్లాక్ వద్ద పనులు చేస్తుండగా పవర్ కేబుల్ కట్ అయిందిజనరల్ వార్డుల్లో కరెంటు లేక రోగులు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమేఇలా జరగడం చాలా బాధాకరంఎమర్జెన్సీ వార్డులకు జనరేటర్ల ద్వారా పవర్ అందిస్తున్నాంపనులు పూర్తయ్యే వరకు ఇక్కడే ఉంటానేను ఇప్పుడే విజయవాడ నుంచి వచ్చాను పనులు పర్యవేక్షిస్తున్నాను -
‘అందుకే మా నేతలను ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది’
విశాఖ కూటమి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికే తమ నేతలను టార్గెట్ చేస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. ఏపీలో అసలు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వీల్లేదు అనేలా ఉందని మండిపడ్డారు. ‘రాష్ట్రంలో హత్యలు, దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయి. ఈ విషయంపై ప్రభుత్వ పెద్దలను అడిగితే మా చేతుల్లో లాటీ ఏమైనా ఉందా అని అడిగారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ నేతలను ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది.. కల్తీ మద్యం అంశంలో నకిలీ ఎవిడెన్స్తో అరెస్ట్ చేశారు. కక్ష సాధింపు ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను డైవర్ట్ చెయ్యడానికి మా నేతలను ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది. వైఎస్సార్సీపీ విద్యార్ధి సంఘం నాయకుడు కొండారెడ్డి ఏ తప్పు చెయ్యలేదని వారి తల్లితండ్రులు చెప్తున్నారు.. తప్పు చేస్తే ఏ శిక్షకైనా కొండారెడ్డి సిద్దమని.. ఏ టెస్టుకైనా సిద్దమని వారు చెప్తున్నారు.. కొండారెడ్డిని అదుపులోకి తీసుకున్న సమయంలో కొండారెడ్డిపై చెయ్యి చేసుకున్నారు. 2వ తేదీ ఉదయం 7:10 నిమిషాలకు కొండారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కొండా రెడ్డి అరెస్ట్ సమయంలో ఎందుకు వీడియో రికార్డ్ చేసి బయటకు ఇచ్చారు..?, రైల్వే స్టేషన్ వద్ద అరెస్ట్ చేసామని పోలీసులు ఎందుకు చెప్పారు..?, 2న సాయంత్రం పట్టుబడితే. ఉదయం 11 : 30 గంటలకు టీడీపీ ఆఫీషియల్ పేజ్ లో ఎలా పెట్టారు. టీడీపీ వాళ్ళ దగ్గర టైమ్ మిషన్ ఏమైనా ఉందా..?, టాస్క్ ఫోర్స్ పోలీసులు కొండారెడ్డిని అదుపులోకి తీసుకున్నది ఎంవీపీ పిఎస్ పరిధి.కొండారెడ్డి బైక్ 14 కిమీ అధికంగా తిరిగింది.. ఎందుకు తిప్పారు..?, పోలీసులు ప్లాన్ ప్రకారమే కొండారెడ్డిని అరెస్ట్ చేశారు. గడిచిన ఏడాది కాలంగా ఎపిలో ఎక్కువ మిస్సింగ్ కేసులు నమోదు అయ్యాయి. ఎన్సీఆర్బీ రికార్డ్స్ ఈ లెక్కలు చెప్తున్నాయి. గుడికి దర్శనం కోసం వెళ్లిన వారి ప్రాణాలకు కూడా పాయకరావుపేట శాసన సభ్యురాలు రక్షణ కల్పించలేకపోతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా లేదా అనే అనుమానం కలుగుతుంది. రాష్ట్రంలో గుడికి, బడికి వెళ్లిన వారు బ్రతుకుతారనే భరోసా లేదు. సొంత పొలానికి వెళ్లిన వారిని కూడా చంపేస్తున్నారు.ఊరు వెళదామని బస్సు ఎక్కినా ప్రాణానికి కూడా రక్షణ లేదు. చివరకు ఫ్లైట్ ఎక్కుదామన్నా భయమే. డ్రగ్స్ కేసులో తప్పుడు ఆరోపణలు సృష్టించి మా పార్టీకి అంటగట్టారు. గతంలో పట్టుబడిన డ్రగ్స్ కేసు మాట ఏమిటి?, కూటమి పెద్దలు వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయాలని చూస్తున్నారు’ అని విమర్శించారు. -
కూటమి నేతల అండ.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి
సాక్షి, విశాఖపట్నం: మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. రిజిస్ట్రేషన్లలో అవకతవకలకు పాల్పడినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. గతంలో మధురవాడ సబ్ రిజిస్ట్రార్పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఏడాది కాలంగా ఆయన చేసిన రిజిస్ట్రేషన్లపై అధికారులు ఆరా తీస్తున్నారు. మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బినామీలతో ఆర్థిక లావాదేవీలు జరిపినట్టు సమాచారం. కూటమి నేతల అండతో భారీగా అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ కీలక ఆధారాలు సేకరించింది. 296 జీవో పరిధిలో రిజిస్ట్రేషనున్ల, భారీ ల్యాండ్ డీల్స్ పెండింగులపై విచారణ చేపట్టింది. రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం వచ్చే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా మధురవాడ, సూపర్ బజార్, గంట్యాడ కాగా, మధురవాడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో 296 జీవో కింద చేయాల్సిన 260 డాక్యుమెంట్లు, 60 ప్రైవేట్ డాక్యుమెంట్ల పరిశీలించారు. విశాఖలో 9 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో 7 నెలల్లో దాదాపు 600 కోట్లు విలువైన ఆదాయం వచ్చింది.ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రెండోరోజు ఏసీబీ సోదాలు చేపట్టింది. మొదటిరోజు అర్ధరాత్రి వరకు సోదాలు నిర్వహించగా.. తిరిగి నేటి ఉదయం ఇబ్రహీంపట్నం కార్యాలయానికి చేరుకున్న ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. డబుల్ రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్ల ట్యాంపరింగ్, ప్రైవేట్ వ్యక్తుల పాత్రపై ఏసీబీ అధికారుల విచారణ చేపట్టారు. లెక్కల్లో చూపని నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు
విశాఖపట్నం: వీఐపీ రోడ్డు సమీపంలోని ఆర్చిడ్ వెల్నెస్ స్పా సెంటర్లో హైటెక్ వ్యభిచారం జరుగుతోందనే పక్కా సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు, 3వ పట్టణ పోలీసు స్టేషన్ సీఐ పైడయ్య తమ సిబ్బందితో కలిసి బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో స్పా సెంటర్ నిర్వాహకులు ప్రభుత్వ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ అసాంఘిక కార్యకలాపాలు(వ్యభిచారం) నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దాడి సమయంలో ఒక గదిలో ఓ విటుడు మహిళతో ఉండగా, మరో తొమ్మిది మంది మహిళలు పక్క గదిలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తేలింది. వీరందరినీ వ్యభిచార కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. సెంటర్లో పనిచేస్తున్న కల్లూరు పవన్ కుమార్, జానా పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా, వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సెంటర్కు కాసిరెడ్డి అరుణ్ కుమార్ పేరు మీద అనుమతులు ఉండగా, థాయ్ స్పా మసాజ్ ముసుగులో డబ్బు కోసం మహిళలను లైంగిక దోపిడీకి గురిచేస్తున్నట్లు వెల్లడైంది. స్పా సెంటర్పై కేసు నమోదు చేసి, యజమానులు ఏ1గా కాసిరెడ్డి అరుణ్ కుమార్ (పరారీలో), ఏ2గా రాహుల్ (పరారీలో), సిబ్బంది ఏ3గా కల్లూరు పవన్ కుమార్, ఏ4గా జానా శ్రీనివాస, విటుడు ఏ5గా చీలి రామచంద్ర ప్రసాద్లను పేర్కొన్నారు. నిందితుల నుంచి మూడు మొబైల్ ఫోన్లు, రూ. 7 వేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
అవకాశాలను సద్వినియోగం చేసుకోండి
కొమ్మాది: ప్రభుత్వం అందించే అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి విద్యార్థులకు సూచించారు. రుషికొండలోని బి.ఆర్.అంబేడ్కర్ స్టడీ సర్కిల్ భవన్ను బుధవారం ఆయన సందర్శించి, గ్రంథాలయం, కంప్యూటర్ గదులు, సెమినార్ హాళ్లను తనిఖీ చేశారు. శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడి.. ఏకాగ్రత పెంపొందించుకొని, ప్రతీ క్షణాన్ని వినియోగించుకోవాలన్నారు. వినతిపత్రం అందజేత ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం ఆర్భాటంగా జీవో విడుదల చేసి ఏడు నెలలు గడుస్తున్నా ఏ ఒక్కరికీ రుణం మంజూరు కాలేదని, వెంటనే రుణాలు విడుదల చేయాలని విదసం (విస్తృత దళిత సంఘాల) ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డా.బూసి వెంకటరావు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికి వినతి పత్రం అందజేశారు. పెను ముప్పుతో జరిగే అసహజ మరణాలకు ప్రభుత్వం ఇచ్చే నష్ట పరిహారంలో వివక్ష ఉందని అందులో పేర్కొన్నారు. -
సత్యదేవునికి భక్త నీరాజనం
పెద్ద ఎత్తున పౌర్ణమి పూజలు, వ్రతాలుడాబాగార్డెన్స్: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఇసుకకొండ(బాబాజీకొండ)పై వెలసిన రమా సహిత సత్యనారాయణస్వామి ఆలయానికి బుధవారం భక్తులు పోటెత్తారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఆలయం కిక్కిరిసింది. ధ్వజస్తంభం వద్ద మహిళలు దీపారాధన చేశారు. వేకువ జామున 2 గంటలకు ధ్వజస్తంభ పూజ నిర్వహించారు. వేకువజాము 2.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు, సాయంత్రం 4.30 నుంచి రాత్రి 10.30 గంటల వరకు స్వామి దర్శనం కల్పించారు. రూ.1,116 చెల్లించిన భక్తులతో అనివెట్టి మండపంలో ఉదయం 7 గంటలకు, 10.30 గంటలకు ప్రత్యేక వ్రతాలు చేయించారు. ఉదయం 4 గంటలకు, 6 గంటలకు, 9 గంటలకు సామూహిక వ్రతాలు జరిగాయి. భక్తుల తాకిడి దృష్ట్యా ఆలయ చుట్టూ ప్రదక్షిణలు చేసేందుకు అవకాశం కల్పించలేదని ఈవో రాజగోపాల్రెడ్డి తెలిపారు.భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. పూర్ణామార్కెట్ దరి దయారామ స్వీట్ షాప్ పక్క నుంచి ఆలయానికి ఏర్పాటు చేసిన ఘాట్ రోడ్డును భక్తులు సద్వినియోగం చేసుకున్నారు. -
17 నుంచి కుష్టు వ్యాధి గుర్తింపు సర్వే
మహారాణిపేట: జిల్లాలో ఈ నెల 17 నుంచి 30వ తేదీ వరకు కుష్టు వ్యాధిని గుర్తించే కార్యక్రమం(ఎల్సీడీసీ) పటిష్టంగా నిర్వహించాలని కలెక్టర్ ఎం. ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. కుష్టు వ్యాధి సర్వేకు సంబంధించి కలెక్టర్ చాంబర్లో బుధవారం జరిగిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని పట్టణ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ఆశ కార్యకర్తలు, పురుష వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పూర్తిస్థాయి సర్వే నిర్వహించాలని సూచించారు. ఎవరికై నా తమ శరీరంపై స్పర్శ లేని మచ్చలు ఉన్నట్లయితే ఇంటికి వచ్చే వైద్య సిబ్బందికి తెలియజేయాలన్నారు. ప్రాథమిక స్థాయిలోనే మచ్చలను గుర్తిస్తే అంగ వైకల్యం రాకుండా, ఇతరులకు వ్యాపించకుండా జాగ్రత్త పడవచ్చన్నారు. సర్వే సిబ్బందికి ప్రజలు సహకరించాలన్నారు. జిల్లా కుష్టు, క్షయ, ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ రమేష్, జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, సాంఘిక సంక్షేమ ఉప సంచాలకులు రామారావు, నోడల్ అధికారి డాక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. -
విశాఖను ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం
ఇన్చార్జి మంత్రి డోలా మహారాణిపేట: విశాఖపట్నం వేదికగా ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న ప్రపంచ స్థాయి భాగస్వామ్య సదస్సు రాష్ట్ర భవిష్యత్తుకు తలమానికం కానుందని, ఈ మహా కార్యాన్ని దిగ్విజయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవిరళ కృషి చేస్తోందని జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ముఖ్యమంత్రి, ఐటీ శాఖ మంత్రి, ఇతర క్యాబినెట్ మంత్రులు పలు దేశాల్లో పర్యటించి పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను ఆహ్వానించారని గుర్తు చేశారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో పలు అంశాలపై మాట్లాడారు. సుమారు 40పైగా దేశాల నుంచి వందల సంఖ్యలో అతిథులు, వివిధ కంపెనీల ప్రతినిధులు సదస్సుకు వస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని వెల్లడించారు. తద్వారా 7.5 లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా ఇప్పటికే 10 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించే ప్రక్రియలను పూర్తి చేశామని చెప్పారు. దేశ, విదేశాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలు, రాజకీయ, అధికార ప్రముఖుల సమక్షంలో 410 ఒప్పందాలు జరుగుతాయని, రూ.2.7 లక్షల కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టులకు శంకుస్థాపనలు కూడా జరుగుతాయని మంత్రి వివరించారు. విశాఖపట్నాన్ని ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఏయూలో జరుగుతున్న ఏర్పాట్లు, వేదికలు, ఇతర అంశాలను కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ మంత్రికి మ్యాప్ సహాయంతో వివరించారు. ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ బాబు, సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, మేయర్ పీలా శ్రీనివాసరావు, సీఐఐ ప్రతినిధి మాళి తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ బాక్సింగ్ పోటీల్లో విశాఖ విద్యార్థులకు పతకాలు
సాక్షి, అమరావతి : అరుణాచల్ప్రదేశ్లో బుధవారం జరిగిన 69వ జాతీయ స్థాయి అండర్–17 బాలుర, బాలికల బాక్సింగ్ ఛాంపియన్షిప్లో రాష్ట్రానికి చెందిన ముగ్గురు బాక్సర్లు 3 కాంస్య పతకాలను సాధించారని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి జి.భానుమూర్తి రాజు ఓ ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నంలోని మద్దిలపాలెం ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థి కొలుసు సాయి లోహిత్, ద్వారకానగర్లోని బీవీకే జూనియర్ కాలేజీ విద్యార్థి వేగి రాహుల్, వాల్తేరు కేంద్రీయ విద్యాలయానికి చెందిన బోస ఈశ్వర్ చరణ్ రెడ్డి ఈ ఘనత సాధించారన్నారు. ఈ సందర్భంగా విజేతలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు క్రీడాకారులను అభినందించారు. -
మనస్తాపంతో బాలుడి ఆత్మహత్య
పీఎంపాలెం: తల్లి మందలించిందని మనస్తాపం చెందిన ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ వివరాలను పీఎంపాలెం సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాలివి. జీవీఎంసీ 7వ వార్డులోని చంద్రంపాలేనికి చెందిన జి.మోజేస్ (16) 10వ తరగతి ఫెయిలయ్యాడు. స్నేహితులతో కలిసి అల్లరి చిల్లరగా తిరుగుతున్నాడు. దీంతో అతని తల్లి మంగళవారం రాత్రి బాలుడిని మందలించింది. చెడు తిరుగుళ్లు వద్దని, మంచి మార్గంలో ఉండాలని సూచించింది. దీనిని అవమానంగా భావించిన మోజేస్.. తీవ్ర మనస్తాపంతో తమ ఇంటి డాబాపై గల షెడ్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. మృతుడి తండ్రి గేదెల వెంకటరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
రాష్ట్ర స్థాయి పోటీలకు ‘స్మార్ట్ అగ్రికల్చర్’ ఎంపిక
ఆరిలోవ: డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, బెంగళూరుకు చెందిన విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నలాజికల్ మ్యూజియం సంయుక్త ఆధ్వర్యంలో దక్షిణ భారత సైన్స్ డ్రామా పోటీల్లో భాగంగా జిల్లా స్థాయి ఎంపికలు ఉత్సాహంగా సాగాయి. తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లాలోని 15 ఉన్నత పాఠశాలల నుంచి 120 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారు బృందాలుగా ఏర్పడి, నాటికలను ప్రదర్శించారు. డిప్యూటీ డీఈవో సోమేశ్వరరావు పర్యవేక్షణలో జరిగిన ఈ పోటీల్లో ‘స్మార్ట్ అగ్రికల్చర్’ అనే అంశంపై నాటిక ప్రదర్శించిన పెందుర్తి మండలం, శాంతినగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బృందం విజేతగా నిలిచింది. ఈ నెల 7న గుంటూరులో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఈ నాటికను ఎంపిక చేసినట్లు డీఈవో ఎన్.ప్రేమకుమార్ తెలిపారు. రైతులు ఆధునికీకరణ పద్ధతుల్లో వ్యవసాయం చేసి అధిక దిగుబడులు సాధించడం ఇతివృత్తంగా ఈ నాటిక సాగిందన్నారు. ఈ బృందానికి మరింతగా శిక్షణ ఇచ్చి, రాష్ట్ర స్థాయిలో విజేతగా నిలిచేలా కృషి చేయాలని గైడ్ టీచర్ సీతాలక్ష్మికి సూచించారు. ఈ పోటీల్లో ఉమెన్ ఇన్ సైన్స్, డిజిటల్ ఇండియా–ఎంపవరింగ్ లైవ్స్, హైజీన్ ఫర్ ఆల్, గ్రీన్ టెక్నాలజీ వంటి అంశాలపై విద్యార్థులు నాటికలు ప్రదర్శించారు. జిల్లా సైన్స్ అధికారి రాజారావు, జ్యూరీ సభ్యులు భౌతిక శాస్త్ర అధ్యాపకుడు బి.నాగేశ్వరరావు, నవరస ఆర్ట్స్ ఫౌండర్ పి.వి.రమణమూర్తి, పలు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉత్సాహంగా జిల్లా స్థాయి సైన్స్ డ్రామా పోటీలు -
సీఎస్సార్ నిధులతో కొత్త డయాలసిస్ యూనిట్లు
కేజీహెచ్లో ప్రారంభించిన జిల్లా ఇన్చార్జి మంత్రి మహారాణిపేట: ప్రజలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగానే వైద్య సేవలను డిజిటల్ విధానంలో ప్రజలకు చేరువ చేస్తున్నామని జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సీఎస్సార్ కింద ఎన్టీపీసీ సమకూర్చిన రూ.2 కోట్ల ఆర్థిక సహాయంతో కేజీహెచ్ నెఫ్రాలజీ విభాగంలో ఆధునికీకరించిన హీమో డయాలసిస్ యూనిట్ను బుధవారం ఆయన పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో కుప్పంలో సంజీవని పేరుతో పైలట్ ప్రాజెక్టు అమలు చేస్తున్నామని, దశల వారీగా రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ వైద్య సేవలను చేరువ చేస్తామని చెప్పారు. కేజీహెచ్ నెఫ్రాలజీ విభాగంలో ఇప్పటికే 13 సబ్ యూనిట్లతో సేవలు అందుతున్నాయని, అదనంగా ఎన్టీపీసీ సాయంతో మరో 10 కొత్త డయాలసిస్ సబ్ యూనిట్లను సిద్ధం చేసినట్లు చెప్పారు. మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పి.విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ, కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, ఏఎంసీ పూర్వ విద్యార్థుల సంఘం చైర్మన్ డాక్టర్ రవిరాజు, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి, ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీఎస్ సంధ్యాదేవి, కేజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ బీవీ రమణ, నెఫ్రాలజీ విభాగం ఇన్చార్జి హెచ్వోడీ డాక్టర్ రత్నప్రభ, కార్పొరేటర్ కొడూరు అప్పలరత్నం, ఎన్టీపీసీ ప్రతినిధులు పాత్రో, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
బైక్ ఢీకొని వృద్ధుడి మృతి
ఆరిలోవ: బీఆర్టీఎస్లో పైనాపిల్కాలనీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. రోడ్డు దాటుతున్న సమయంలో ఆయన్ని ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ఆరిలోవ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి.. నగరంలోని సీతంపేటకు చెందిన ఆలేటి సూర్యనారాయణ(65) బుధవారం సాయంత్రం పైనాపిల్కాలనీ వద్ద జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో బంధువులను కలవడానికి వచ్చారు. తిరిగి సాయంత్రం 6.30 గంటల సమయంలో ఇంటికి చేరుకోవడానికి బయలుదేరారు. ఈ క్రమంలో పైనాపిల్కాలనీ బస్టాప్ వద్దకు చేతికర్ర సహాయంతో నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే సమయంలో అడవివరం నుంచి హనుమంతవాక వైపు ముగ్గురితో వెళ్తున్న ద్విచక్రవాహనం అతన్ని ఢీకొంది. ఈ ఘటనలో సూర్యనారాయణ కిందపడటంతో తలకు తీవ్రగాయమైంది. అధిక రక్తస్రావం కావడంతో ఘటనా స్థలంలోనే ఆయన ప్రాణాలు విడిచారు. బైక్ నడిపిన వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న మరో వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఆరిలోవ ట్రాఫిక్, లా అండ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. వృద్ధుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. గాయాలైన ద్విచక్రవాహనచోదకులను చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న మృతుడి భార్య ఈశ్వరమ్మ, బంధువులు సంఘటన స్థలానికి చేరుకొని కన్నీటిపర్యంతమయ్యారు. సూర్యనారాయణ జగదాంబ జంక్షన్లో చిరు వ్యాపారి. అతనికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఎస్ఐ రాందాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
● పుష్కరిణీ నమోస్తుతే..
సింహాచలం: కార్తీక పౌర్ణమి సాయంసంధ్య.. పవిత్ర వరాహ పుష్కరిణి.. వేలాది దీపాల కాంతులతో, భక్తజన సంద్రంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శుభ ఘడియలలో.. పవిత్ర జలరాశికి పుణ్యనదీ హారతి(గంగా హారతి) సమర్పించే అపురూప ఘట్టానికి బుధవారం సింహగిరి క్షేత్రం సాక్ష్యంగా నిలిచింది. ముందుగా శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి చెందిన కొండదిగువ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి వెంకన్న ఉత్సవమూర్తులను శేషతల్పంపై ఆశీనులను చేశారు. మంగళ వాయిద్యాల నడుమ తిరువీధిగా పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. అక్కడ సిద్ధం చేసిన దివ్య వేదికపై స్వామి కొలువుదీరగా, ఆ ప్రాంతం భక్తుల నామస్మరణతో మార్మోగింది. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం నిర్వహించారు. అనంతరం స్వామికి ద్వయ, నక్షత్ర, కుంభ హారతులను సమర్పించగా, ఆ కర్పూర కాంతుల్లో స్వామి దివ్య రూపం మరింత దేదీప్యమానంగా ప్రకాశించింది. అనంతరం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు, ఇతర అర్చక బృందం.. పుష్కరిణి గట్టుపై ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికల నుంచి పుష్కరిణీ నమోస్తుతే.. అంటూ వరాహ పుష్కరిణికి దివ్య నీరాజనం సమర్పించారు. ఆ హారతి వెలుగులు పవిత్ర జలంలో ప్రతిబింబిస్తుండగా, ఆ దృశ్యాన్ని కనులారా వీక్షించిన భక్తజనం భక్తి పారవశ్యంతో పులకించిపోయింది. అదే సమయంలో.. పుష్కరిణి గట్టున వందలాది మంది మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. కోలాటాలు, భరత నాట్య ప్రదర్శనలు, హరినామ సంకీర్తనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో దేవస్థానం ఇన్చార్జి ఈవో ఎన్.సుజాత, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
దేవాలయ భూములపై కూటమి కన్ను..
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇప్పటివరకు ప్రైవేటు, ప్రభుత్వ భూములపై కన్నేసి కాజేస్తున్న కూటమి ప్రభుత్వం, నేతలు.. ఇప్పుడు దేవస్థానం భూములపై పడ్డారు. సింహాచలంతోపాటు ప్రేమ సమాజానికి చెందిన విలువైన భూములను ప్రాజెక్టుల పేరిట చేజిక్కించుకునే ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. సింహాచలం దేవస్థానానికి మధురవాడ, అడవివరంలో ఉన్న విలువైన భూములను తీసుకుని.. నగరానికి వెలుపల కాలుష్య ప్రభావిత భూములను దేవస్థానానికి అప్పగించేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా సింహాచలం దేవస్థానానికి చెందిన భూముల విలువను తక్కువగా లెక్కగట్టి.. అందుకు బదులుగా నగరానికి దూరంగా ఇచ్చే భూముల విలువను మాత్రం అధికంగా లెక్కకట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా చేస్తారంట...? వాస్తవానికి సింహాచలం దేవస్థానానికి మధురవాడలో 107 ఎకరాలు, అడవివరంలో 150 ఎకరాల భూమి ఉంది. ఇందులో మధురవాడలోని 107 ఎకరాల భూమిని గూగుల్ సంస్థకు, అడవివరంలోని 150 ఎకరాల భూమిని ఒక ప్రైవేటు హోటల్కు అప్పగించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకు బదులుగా ఎక్కడో దూరంగా గాజువాక వద్ద ఉన్న భూములను ప్రత్యామ్నాయంగా ఇచ్చేందుకు ఇప్పటికే రెవెన్యూ వ్యవహారాలు ప్రారంభమయ్యాయి. మరోవైపు సేవా సంస్థ అయిన ప్రేమ సమాజానికి చెందిన భూములను కూడా వివిధ టూరిజం ప్రాజెక్టుల పేరిట చేజిక్కించుకునేందుకు కూటమి ఎమ్మెల్యేలు ప్రయత్నాలు షురూ చేశారు. అలాగే ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ)కు 10 ఎకరాలు కావాలంటూ కూటమి నేతలు లేఖలతో అమరావతిలో కలియతిరుగుతున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా దేవస్థానం భూములను లీజుకు ఇవ్వొచ్చంటూ తాజాగా ప్రభుత్వం జారీచేసిన ఆదేశాల నేపథ్యంలో కూటమి నేతలు తమ ప్రయత్నాలను షురూ చేశారు. టూరిజం, గూగుల్ పేరుతో..! ఒకవైపు ప్రేమ సమాజం భూములను కూటమి నేతలు ప్రైవేటు వ్యక్తుల పేరుతో, టూరిజం ప్రాజెక్టుల పేరుతో చేజిక్కించుకునేందుకు యతి్నస్తుండగా.. సింహాచలానికి చెందిన అడవివరంలోని భూములను టూరిజం ప్రాజెక్టు పేరుతో ఓ హోటల్కు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుండటం గమనార్హం. సింహాచలం దేవస్థానానికి చెందిన అడవివరంలోని 150 ఎకరాల భూమిని ఒక ప్రైవేటు హోటల్కు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. దీనికి ప్రతిగా దూరంగా ఉన్న భూములను దేవస్థానానికి అప్పగించేందుకు ఫైల్స్ సిద్ధమవుతున్నాయి. మధురవాడలో విలువైన 107 ఎకరాల భూమిని గూగుల్ సంస్థకు అప్పగించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఒకవైపు డేటా సెంటర్ పేరుతో తర్లువాడలోని పేద దళిత భూములను కాజేసేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం.. వీటికి తోడు దేవస్థానం భూములను కూడా అప్పగించేందుకు సిద్ధమవుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రేమ సమాజం భూములపై ఎప్పటి నుంచో గురి..! ప్రేమ సమాజానికి దాతలు ఇచ్చిన 47.33 ఎకరాల భూమి రుషికొండలో ఉంది. ఇందులో 33 ఎకరాలకుపైగా గతంలోనే టీడీపీ నేతలు లీజుకు తీసుకున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రేమ సమాజం భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని వ్యతిరేకించింది. ఇందుకు అనుగుణంగా సదరు ప్రైవేటు వ్యక్తికి అప్పగించిన భూముల లీజును రద్దు చేయడంతోపాటు ప్రేమ సమాజం భూములను సంస్థకే అప్పగించింది. నగరాల్లో ఉండే దేవస్థానాలకు చెందిన భూములను దీర్ఘకాలిక లీజుకు ఇచ్చేందుకు కమిటీని నియమిస్తూ ప్రభుత్వం అక్టోబరు 31న ఆదేశాలు జారీచేసింది.ఇందుకు అనుగుణంగా మరోసారి విలువైన ప్రేమ సమాజం భూములను రిసార్టు, టూరిజం పేరుతో చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఏసీఏకు 10 ఎకరాలు కావాలంటూ కూటమికే చెందిన మరో ఎమ్మెల్యే ఒక వినతిపత్రాన్ని కూడా ప్రభుత్వానికి సమర్పించినట్టు సమాచారం. మొత్తంగా రుషికొండలోని విలువైన భూములను చేజిక్కించుకునేందుకు పలు ప్రతిపాదనలతో కూటమి నేతలు కుయుక్తులు పన్నుతున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పారిశ్రామికవేత్త?
మీలో ఎవరుచోటా నేతలు, కార్యకర్తలకు టీడీపీ బంపర్ ఆఫర్ పార్టనర్షిప్ సమ్మిట్లో ఒప్పందాల కోసం ఏర్పాట్లురండి బాబు.. రండి.. ఆలోచించిన ఆశాభంగం.. మంచితరుణం మించిన దొరకదు.. ఫైల్ పట్టుకుంటే.. పండగే.. ఒప్పందం కుదుర్చుకోండి.. భూములను దోచుకోండి.! కండువా పక్కన పెట్టు.. కొత్త పరిశ్రమ పెడుతున్నట్లు నటించు..! ఉన్న పరిశ్రమ చూపించి.. కొత్త రాయితీలు కొట్టెయ్యొచ్చు..! ఈ ఆఫర్ కేవలం రెండు రోజుల మాత్రమే.. అది కూడా ఈ నెల 14, 15 తేదీల్లోనే.! మీరు పచ్చనేత అయితే చాలు.. అర్హత పొందినట్లేనంటూ టీడీపీ నేతలు.. కొత్త సీసాలో పాత సారా పోసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆరేళ్ల క్రితం చేసిన హడావుడికి మరోసారి శ్రీకారం చుడుతున్నారు. టీడీపీ నేతలకు ఇస్తున్న సరికొత్త బంపర్ ఆఫర్ ఏంటంటే..? సాక్షి, విశాఖపట్నం: గత టీడీపీ ప్రభుత్వం 2016, 2018లో సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించింది. ఈ రెండు సదస్సుల్లోనూ లక్షల కోట్ల రూపాయిలు పెట్టుబడులు వచ్చేశాయంటూ ఊదరగొట్టారు. భారీ పరిశ్రమలు, వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి ప్రతినిధులు వచ్చి.. ఎంవోయూలు చేసుకున్నారంటూ ఒప్పందపత్రాలు మార్చుకుంటూ పత్రికల్లో ఫొటోలకు ఫోజులిచ్చారు. తీరా చూస్తే.. లెక్కల్లోనే లక్షల కోట్లు మిగిలాయి.. ఫొటోలకే ఎంవోయూలు పరిమితమయ్యాయి. తర్వాత ఆరా తీస్తే.. టీడీపీ ప్రభుత్వం అసలు బండారం బట్టబయలైంది. సదస్సులకు అనుకున్నంత స్పందన రాకపోవడంతో.. స్థానికంగా ఉన్న వారితో పాటు.. వివిధ రాష్ట్రాలకు చెందిన టీడీపీ నేతలకు సూటు, బూటు వేసి.. పారిశ్రామికవేత్తలుగా చిత్రీకరించారు. వారు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో వందల కోట్ల రూపాయిల పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు వచ్చినట్లుగా ప్రకటించేసి.. అడ్డంగా దొరికిపోయారు. చింత చచ్చినా.. పులుపు చావదన్నట్లుగా.. అబద్దాల పునాదులపై ప్రచారపటాటోపాలు నిర్వహిస్తూ.. ప్రజల సాక్షిగా అబాసుపాలవుతున్నా.. టీడీపీ మాత్రం తన వక్ర బుద్ధి వీడలేకపోతోంది. త్వరలో జరగబోయే సదస్సుకు కూడా ఇదే తరహాలో డమ్మీ పారిశ్రామికవేత్తల కోసం జాబితా తయారు చేస్తోంది. పరిశ్రమ ఉంటే చాలు.. పనైపోద్ది.! ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో ఉన్న టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలకు అధిష్టానం టాస్క్ అప్పగించింది. తమ పరిధిలో పార్టీకి చెందిన పారిశ్రామికవేత్తలు ఎవరెవరు ఉన్నారనే జాబితాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. చోటా నేతలు, కార్యకర్తల్లో ఎవరైనా రెస్టారెంట్స్, హోటల్స్, బ్రిక్స్, టైల్స్ ఇలా.. చిన్న కుటీర పరిశ్రమలు నడుపుతున్నా.. వారితో పార్టనర్ షిప్సమ్మిట్లో కొత్తగా ఒప్పందాలు చేసుకునేలా ఏర్పాట్లు నడుపుతున్నట్లు సమాచారం. ఆశించిన మేర పారిశ్రామికవేత్తలు రాకపోతే.. ఎంవోయూల సంఖ్య అధికంగా చూపించుకునేందుకు టీడీపీ తహతహలాడుతోంది. అయితే.. 2018లో ఎంవోయూలు చేసుకున్న వారికి మాత్రం ఇందులో మినహాయింపునిస్తున్నారు. మళ్లీ వారినే పిలిపిస్తే.. పరువు పోతుందన్న భయంతో కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నారు. స్టేజ్ పైకి పిలిచేంత పరిశ్రమ సామర్థ్యం ఉన్నవారికి మాత్రమే అవకాశం ఇవ్వాలని అధిష్టానం చెప్పడంతో.. ఆ తరహా పరిశ్రమలున్న వారి వివరాలు తయారుచేస్తున్నట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. భారీ ఏర్పాట్లు చేస్తున్న సదస్సుకు జనం రాకపోతే.. నవ్వులపాలవుతామన్న భయంతో మరోసారి అదే దొడ్డిదారిలో వెళ్లేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. భూ పందేరం కోసం టీడీపీ నేతల కొత్త ఎత్తుగడ సమ్మిట్ పేరుతో ఇదో యవ్వారం నడుస్తుండగా.. సందట్లో సడేమియాలా.. ఒప్పందాల పేరుతో భూ పందేరాలకు టీడీపీ నేతలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. భాగస్వామ్య సదస్సులో ఎంవోయూల పేరుతో ప్రాజెక్టులకు భూ కేటాయింపులు చేసి.. వాటిని అధికారికంగా కొట్టేసేందుకు కూడా కూటమి నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి విశాఖ పరిధిలో ఉన్న టూరిజం భూముల్లో పర్యాటక ప్రాజెక్టులు, ఏపీఐఐసీ భూముల్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నట్లుగా సదస్సులో ఎంవోయూలు మార్చుకుంటూ.. తమ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను కొల్లగొట్టేందుకు కూటమి నేతలు తమ అనుచరగణంతో ప్లాన్ చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో 241.92 ఎకరాల టూరిజం భూములను పర్యాటక ప్రాజెక్టులకు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా వందలాది ఎకరాలున్న ఏపీఐఐసీ భూములను వివిధ పరిశ్రమలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామనీ.. మంచి ప్రాజెక్టులతో వస్తే భూ కేటాయింపులు రాయితీలతో ఇస్తామంటూ ప్రభుత్వం ఊదరగొడుతోంది. ఇదే పేరుతో మొత్తం భూములను అధికార పార్టీ నేతలు కొల్లగొట్టేందుకు సమ్మిట్ పేరుతో స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా భాగస్వామ్య సదస్సు పేరుతో భారీ దోపిడీకి కూటమి ప్రభుత్వం తెరతీయబోతోందనే ఆరోపణలు కోడై కూస్తున్నాయి. -
‘సహకారం’ పక్కదారి
విశాఖ సిటీ: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ)కి అవినీతి మరకలు అంటుకున్నాయి. నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా ఇటీవల జరిగిన పదోన్నతుల వ్యవహారం బ్యాంకులో మంట పుట్టిస్తోంది. ఈ ప్రక్రియలో రూ. కోటి వరకు మామూళ్లు వసూలు చేశారన్న వార్తలు దుమారం రేపుతున్నాయి. బ్యాంకులో అవినీతి, అక్రమాలపై ఆప్కాబ్కు ఫిర్యాదులు అందుతున్నాయి. డీసీసీబీ నాన్ అఫీషియల్ పర్సన్ ఇన్చార్జ్పైనే అదే పార్టీకి చెందిన జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్గా మారింది. పదోన్నతులపై దుమారం గత నెలలో డీజీఎం నుంచి అసిస్టెంట్ మేనేజర్ వరకు పదోన్నతులు నిర్వహించారు. దీని కోసం పోస్టును బట్టి రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ పదోన్నతుల్లో రిజర్వేషన్లు కూడా పాటించలేదని బ్యాంకు ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. నాన్ ఆఫీషియల్ పర్సన్ ఇన్చార్జ్ బంధువు ఈ వసూళ్లలో కీలక పాత్ర పోషించినట్లు జనసేనకు చెందిన నేతలే ఫిర్యాదులు చేస్తుండడం గమనార్హం. నాన్ ఆఫీషియల్ పర్సన్ ఇన్చార్జ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత బ్యాంకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అవినీతి అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపణలు చేస్తుండడం విశేషం. రూ.30 లక్షలు దుర్వినియోగం? గతంలో ఈ బ్యాంకుకు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ పర్సనల్ ఇన్చార్జ్గా వ్యవహరించారు. ఆ సమయంలో ఖర్చు రూ.3 వేలు మాత్రమే. నాలుగు నెలల క్రితం నాన్ ఆఫీషియల్ పర్సన్ ఇన్చార్జ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రూ.30 లక్షలకు పైగా బ్యాంకు నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. కారు, దాని డీజిల్ పేరుతో రూ.లక్షలు తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. క్యాంప్ ఆఫీస్లో ఫర్నీచర్ పేరుతో రూ.3 లక్షలు, రూ.1.8 లక్షలతో యాపిల్ డెస్క్టాప్, రూ.80 వేలతో కొత్త ల్యాప్టాప్ బలవంతంగా బ్యాంకు నిధుల నుంచి కొనిపించినట్లు సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు. కేవలం లబ్ధిదారులు లంచాల వాటా ఇవ్వని కారణంగా డీసీసీబీ విశాఖ బ్రాంచ్లో ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ పథకాన్ని (పీఎంఈజీఎస్ )అమలు చేయడాన్ని నిలిపివేసినట్లు సమాచారం. అలాగే స్టార్ హోటల్స్ నుంచి భోజనం పార్సిల్స్ను రప్పిస్తూ బిల్లులు బ్యాంకుకు పెడుతున్నట్లు చెవులు కొరుక్కుంటున్నారు. బ్యాంకు పరిధిలోని సహకార సంఘాలు అన్నింటి నుంచి నెలకు రూ.లక్ష మామూలు ఇవ్వాలని ఒత్తిడి తీసుకువస్తుండడంతో పాటు తమ బినామీలకు రూ.కోట్లలో రుణాలు మంజూరు చేయాలని అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు ఆ పార్టీ నేతలే ఫిర్యాదులు చేస్తున్నారు. రుణం పునరుద్ధరించాలంటే ఒక శాతం కమీషన్ తక్కువ వ్యవధి రుణాలను(షార్ట్ టర్మ్ లోన్స్) తిరిగి పునరుద్ధరించే క్రమంలో రుణం మొత్తంలో ఒక శాతం కమీషన్గా తీసి పక్కన పెట్టాలని హుకుం జారీ చేశారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ ఆప్కాబ్ ఎండీకి ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. బ్యాంకులో అవినీతి ఆరోపణలు, పదోన్నతుల్లో మూమూళ్ల వసూళ్లు, నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్, సీబీసీఐడీలతో దర్యాప్తు జరిపించి అక్రమంగా వసూలు చేసిన నిధులను తిరిగి బ్యాంకుకు రికవరీ చేయాలని కోరారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు
ముమ్మరంగా రికార్డుల తనిఖీ మహారాణిపేట/మధురవాడ/పెదగంట్యాడ: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అవినీతి నిరోధక శాఖ దాడుల్లో భాగంగా.. నగరంలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు బుధవారం ఆకస్మిక సోదాలు నిర్వహించారు. మహారాణిపేట, మధురవాడ, పెదగంట్యాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు జరిగాయి. ఉదయం ప్రారంభమైన ఈ సోదాలు రాత్రి వరకు కొనసాగాయి. రికార్డుల పరిశీలన : సూపర్బజార్ ఆవరణలోని జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారులు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రికార్డులను ముమ్మరంగా తనిఖీ చేశారు. రిజిస్ట్రేషన్కు సంబంధించిన పత్రాలు, రిజిస్ట్రేషన్లలో ఉల్లంఘనలు, పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, నాన్ జ్యూడిషియల్ స్టాంప్ పేపర్ల అమ్మకాల వివరాలను, రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. మధురవాడలో.. మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏసీబీ ఇన్స్పెక్టర్ మహేశ్వరరావు ఆధ్వర్యంలోని బృందం విస్తృత తనిఖీలు చేపట్టింది. ఇక్కడ సబ్ రిజిస్టర్ చక్రపాణి, ఇతర సిబ్బందిని వేర్వేరుగా విచారించారు. ఈ సందర్భంగా కార్యాలయంతో ఎటువంటి సంబంధం లేని నలుగురు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. వారిని తదుపరి విచారణ కోసం విశాఖ కార్యాలయానికి తరలించారు. అయితే, అధికారులు ఈ వివరాలను గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏసీబీ సోదాల కారణంగా, రిజిస్ట్రేషన్ల కోసం ముందుగానే స్లాట్లు బుక్ చేసుకున్న వారితో సహా, వివిధ పనుల నిమిత్తం వచ్చిన కక్షిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు పనులు కాకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. డాక్యుమెంట్ రైటర్లు పరార్ పెదగంట్యాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ప్రవేశించిన ఏసీబీ అధికారులు, వెంటనే కార్యాలయంలో ఉన్న కక్షిదారులను బయటకు పంపించి, అన్ని డోర్లను మూసివేశారు. సిబ్బంది మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, వారిని ఒక గదిలో ఉంచి తనిఖీలు చేశారు. సబ్ రిజిస్టార్ రోహన్ కుమార్ కంచరాన చాంబర్తో పాటు, టేబుళ్లు, డెస్క్లను తెరిచి రికార్డులను, కంప్యూటర్లలోని హార్డ్ డిస్క్లను పరిశీలించారు. ఏసీబీ అధికారులు కార్యాలయంలోకి అడుగుపెట్టగానే, కార్యాలయం వెలుపల ఉన్న డాక్యుమెంట్ రైటర్లు తమ కార్యాలయాల షటర్లను దించేసి, తాళాలు వేసి అక్కడి నుంచి పరారయ్యారు. మూడు కార్యాలయాల్లోనూ ఏకకాలంలో జరిగిన ఈ దాడులు తీవ్ర కలకలం రేపాయి. పూర్తి స్థాయి తనిఖీల అనంతరం వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. -
జనగణనకు సిద్ధం కండి
రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ నివాస్ భీమునిపట్నం: జనగణన–2027కు సంబంధించిన ముందస్తు సన్నాహక కార్యక్రమాలు(ప్రీ టెస్ట్) ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా బుధవారం భీమిలిలో ఇళ్ల గణన కార్యక్రమంపై రాష్ట్ర జనగణన డైరెక్టర్ జె. నివాస్ అధ్యక్షతన శిక్షణ కార్యక్రమం జరిగింది. భీమిలి మండల ప్రజా పరిషత్ కార్యాలయం, జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి.రమణమూర్తి ఆధ్వర్యంలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ నివాస్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఇళ్ల గణన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 4 కేంద్రాల్లో ఈ ప్రీ–టెస్ట్ జరుగుతుండగా, అందులో విశాఖ జిల్లా ఒకటని పేర్కొన్నారు. భీమిలి జోన్ పరిధిలోని 2, 3 వార్డుల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. ఈ నెల 4 నుంచి 6 వరకు మూడు రోజుల పాటు ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ ఉంటుందన్నారు. మొదటి దశలో ఇళ్ల జాబితా తయారీ, ఇళ్లలో నివసించే వారి వివరాలు, గణన నిర్వహించాల్సిన విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కార్యక్రమ ప్రాముఖ్యంపై ఈ శిక్షణలో వివరిస్తున్నట్లు చెప్పారు. ప్రజల సౌకర్యార్థం ఈ నెల 1 నుంచి 7 వరకు సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అందుబాటులో ఉంటుందని, ప్రజలు స్వచ్ఛందంగా నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. ఈ నెల 10 నుంచి 30 వరకు ఎన్యూమరేటర్లు క్షేత్రస్థాయిలో ఇళ్ల గణన నిర్వహిస్తారని తెలిపారు. ఇంటికి వచ్చే సిబ్బందికి ప్రజలు పూర్తి సమాచారం అందించి, గణనకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సెన్సస్ డిప్యూటీ డైరెక్టర్ దయాసాగర్, భీమిలి జోనల్ కమిషనర్ అయ్యప్పనాయుడు పాల్గొన్నారు. -
స్కూల్ గేమ్స్ అండర్–19 క్రికెట్ విజేత విశాఖ
శ్రీకాకుళం న్యూకాలనీ: ఏపీ స్కూల్ గేమ్స్ అండర్–19 బాలుర క్రికెట్ టోర్నీ చాంపియన్గా విశాఖపట్నం నిలిచింది. ఉత్కంఠభరితమైన ఫైనల్ పోరులో ఆతిధ్య శ్రీకాకుళం జట్టును సూపర్ ఓవర్లో ఓడించి జయకేతనం ఎగురవేసింది. మూడో స్థానం కోసం జరిగిన మరో కీలక మ్యాచ్లో చిత్తూరును పశ్చిమ గోదావరి జట్టు ఓడించింది. శ్రీకాకుళంలో రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అండర్–19 బాలుర చాంపియన్షిప్ పోటీలు బుధవారం సాయంత్రంతో ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన ముగింపు, బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమలో జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు విజేతలకు బహుమతులు అందజేశారు. ఫైనల్ సాగిందిలా.. స్థానిక కోడి రామ్మూర్తి స్టేడియంలో బుధవారం శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల మధ్య ఫైనల్ జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విశాఖ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. 75 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కి దిగిన శ్రీకాకుళం జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేయడంతో స్కోర్ సమమైంది. ఫలితం తేల్చేందుకు మ్యాచ్ అంపైర్లు సూపర్ ఓవర్ నిర్వహించారు. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీకాకుళం జిల్లా జట్టు 7 పరుగులు చేసింది. 8 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేసిన విశాఖపట్నం జట్టు మూడు బంతుల్లో లక్ష్యాన్ని ఛేదించింది. ఏపీ రాష్ట్ర స్థాయి స్కూల్గేమ్స్ అండర్–19 బాలికల చాంపియన్షిప్–2025–26 పోటీలు గురువారం నుంచి మొదలుకానున్నాయి. -
ఏపీలో ఏసీబీ రైడ్స్.. వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఏసీబీ సోదాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డాక్యుమెంట్ రైటర్స్తో కుమ్మక్కై నెలవారీ మామూళ్లకు సబ్ రిజిస్ట్రార్లు తెరలేపారు. ఒంగోలులోని ఓ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నుంచి రూ.30వేల రూపాయల నోట్ల కట్టని సిబ్బంది బయటకి విసిరేశారు.గతంలో ఏసీబీ అధికారులు వలలో చిక్కిన అధికారులపై ఏసీబీ బృందం స్పెషల్ ఫోకస్ పెట్టింది. 120కి పైగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయలపై దాడులు చేపట్టింది. విశాఖలోని మధురవాడ, గాజువాకలో కొన్ని కీలకమైన విషయాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ అధికారులు దాడులతో పలు చోట్ల తమ కార్యాలయాలకు తాళాలు వేసి డాక్యుమెంట్ రైటర్లు పరారయ్యారు.లెక్కల్లో చూపని మొత్తం రూ.10,000 నుంచి 75,000 వరకు నగదుని వివిధ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు గుర్తించారు. విశాఖపట్నంలో జగదాంబ సెంటర్, పెద్ద గంట్యాడ, మధురవాడ.. విజయనగరంలో భోగాపురం, ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, పల్నాడులో నరసరావుపేట.. ప్రకాశంలో ఒంగోలు, చిత్తూరు రేణిగుంట, కడపలో రాజంపేట.. అనంతపురంలో చిలమత్తూరు, కర్నూలులో ఆళ్లగడ్డ.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దాడులు నిర్వహించారు. రిజిస్ట్రేషన్లో ఉల్లంఘనలు, రిజిస్ట్రేషన్ కోసం పెండింగ్లో ఉంచిన పత్రాలను అధికారులు గుర్తించారు. -
ఏపీ వ్యాప్తంగా ఏసీబీ దాడులు
సాక్షి, తిరుపతి: ఏపీ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వచ్చిన ఫిర్యాదులతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 120 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. విశాఖ, కోనసీమ, అన్నమయ్య, ఏలూరుతో పాటు పలు జిల్లాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు.రేణిగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతూ అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు గుర్తించారు. సబ్ రిజిస్ట్రార్ అవినీతిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఏసీబీ దాడులు చేపట్టింది. కొనుగోలుదారులను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా రాజం పేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. కార్యాలయం తలుపులు మూసివేసిన ఏసీబీ అధికారులు.. సిబ్బందిని అదుపులోకి ప్రశ్నిస్తున్నారు. గత కొంతకాలం నుండి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతికి పాల్పడుతున్నట్లు తీవ్ర ఆరోపణలు నేపథ్యంలో ఏసీబీ దాడులు చేపట్టింది. దీంతో అప్రమత్తమైన రైటర్లు వారి షాపులకు తాళం వేసుకొని పరారయ్యారు. -
చంద్రబాబు.. ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా?: బొత్స
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేల తీరుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు భరోసా కల్పించే ప్రకటన ప్రభుత్వం నుంచి లేదు. రైతుల ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టలేదా? అని ప్రశ్నించారు. కాశీబుగ్గ ఘటనపై ప్రభుత్వానికి బాధ్యత లేదా?. చంద్రబాబుకు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో ఎల్లో మీడియాను చూస్తుంటే నవ్వాలో ఏడాలో కూడా అర్ధం కావడం లేదంటూ కామెంట్స్ చేశారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వానికి బాధ్యత లేదు. ప్రకృతి విపత్తు జరిగినప్పుడు ప్రభుత్వ విధానం బాధాకరంగా ఉంది. తుపాను పంట నష్టంపై కూడా ప్రభుత్వానికి స్పష్టత లేదు. వైఎస్సార్సీపీ హయాంలో రైతులను అన్ని రకాలుగా ఆదుకున్నాం. గిట్టుబాట ధర, సబ్సిడీ ఇచ్చాం. అది మా ప్రభుత్వ విధానం. ఇప్పుడు పంట ఇన్సూరెన్స్ రైతే కట్టాలనే నిబంధన తీసుకొచ్చారు. అన్ని రకాల పంటల రైతులు నష్టపోయారు. సీఎం, మంత్రులు మాటలు చెప్తున్నారు.. చేతల్లో ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పటి వరకూ పంట నష్టంపై ప్రకటన చేయలేదు.రైతులకు భరోసా కల్పించే ప్రకటన ప్రభుత్వం నుంచి లేదు. రైతుల ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టలేదా?. రెండు లక్షల కోట్లకు పైగా అప్పులు తెచ్చారు కదా?. రైతులు కూటమి ప్రభుత్వానికి అవసరం లేదు. రైతులకు వైఎస్సార్, జగన్ హయాంలో మంచి జరిగింది. రైతులకు మంచి చేయడం మానేసి విమర్శలు చేస్తే ఎలా?. జగన్ రైతుల దగ్గరకు వెళ్లారు.. సమస్యలు తెలుసుకున్నారు. ఎల్లో మీడియాను చూస్తుంటే నవ్వాలో ఏడవాలో కూడా అర్ధం కావడం లేదు. ఈ 18 నెలల కాలంలో ఏ జిల్లాకు రైతులకు ఎంత మేలు చేశారో ప్రభుత్వం ప్రకటించాలి. ఇన్సూరెన్స్, ఇన్ పుట్ సబ్సిడీ వివరాలు వెల్లడించండి. ఈ ప్రభుత్వం రైతులపట్ల అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నా.. ఆక్షేపన చేస్తున్నా. రైతుల ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టాలనేది మా విధానం. కూటమి విధానం రైతులే ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. వ్యవసాయం, విద్య, వైద్యం మాకు ప్రధానం. ఏ వర్గానికి ఏమీ వద్దు అనేది కూటమి విధానం. వైద్య విద్యను అమ్మేస్తామనడం కరెక్ట్ కాదు. విద్య, వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత.కాశీబుగ్గపై బాధ్యత లేదా?కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట జరిగితే అది ప్రైవేట్ ఆలయం అంటున్నారు.. ఇవేం మాటలు. ఎక్కడైనా జనం ఎక్కువగా ఉంటే ప్రభుత్వానికి బాధ్యత లేదా?. ఎక్కువ మంది భక్తులు వస్తారని ప్రభుత్వానికి అంచనా.. బాధ్యత లేదా?. చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఇలాంటి ఘటనలు జరుగుతాయి. సీఎం అంటే అందరికీ ముఖ్యమంత్రే. తిరుపతి, సింహాచలం ఘటన నుంచి ప్రభుత్వం ఏం నేర్చుకుంది?. ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పండి. రైతులు, వైద్యం, విద్య, భక్తులు ఏ అంశంలో కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.కూటమి ప్రభుత్వ పాలన వలన ప్రజల జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. ప్రజల సమస్యలు తెలుసుకోడానికి పెద్ద జ్ఞానం అవసరం లేదు. కళ్లతో చూసి పని చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. ఏదైనా జరిగితే వైఎస్సార్సీపీ వాళ్లని ఎలా ఇరికించాలా అని ప్రభుత్వం పని చేస్తుంది. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కాశీబుగ్గ ఘటనకు కారణాలు ఏమిటి? ఎవరు బాధ్యులు ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. నకిలీ మద్యం కేసుపై..నకిలీ మద్యం కేసులో టీడీపీ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?. లేదా టీడీపీ నేత జయచంద్రా రెడ్డికి సంబంధం లేదని చెప్పండి. నన్ను అడిగితే జోగి రమేష్కు సంబంధం లేదని చెప్తా?. ఎప్పుడు ప్రజా సమస్యలు.. ప్రభుత్వ వైఫల్యం బయటపడినా ఏదో ఒక డైవర్షన్ తీసుకొస్తారు.. గతంలో డ్రగ్స్ కేసులో టీడీపీ వాళ్లను ఎందుకు వదిలేశారు. టీడీపీ ఎంపీ మనిషి డ్రగ్స్ కేసులో ఉంటే ఎందుకు వదిలేశారు?. డ్రగ్స్ అంశంలో గతంలో సీబీఐకి లేఖ రాశాను. భోగాపురం విమానాశ్రయానికి మేమే ల్యాండ్ పూలింగ్ చేసాం. శంకుస్థాపన చేసిన రోజే మొదటి ఫ్లైట్ రాక కోసం టార్గెట్ పెట్టుకున్నాం. కేంద్ర మంత్రి రామ్మోహన్ మాట్లాడితే భోగాపురం ఎయిర్పోర్టుకు వెళ్తున్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీకి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధం లేదు. మీరు చేయాల్సింది అది కాదు. ఎయిర్ పోర్టుకు అప్రోచ్ రోడ్స్ తేవాలి. చుట్టుపక్కల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి’ అని హితవు పలికారు. -
విశాఖలో భూప్రకంపనలు
ఆరిలోవ/డాబాగార్డెన్స్/మధురవాడ/మల్కాపురం/తగరపువలస/మురళీనగర్: నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం వేకువజాము 4.20 గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించింది. దీన్ని నిద్రలో ఉన్నవారు గుర్తించలేకపోయినా.. ఇళ్లలో సామాన్లు కిందపడిన వారు అకస్మాత్తుగా నిద్రలేచి, భయాందోళన చెందారు. ఆరిలోవ కాలనీ, టీఐసీ పాయింట్, బాలాజీనగర్, రవీంద్రనగర్, ఆదర్శనగర్, విశాలాక్షినగర్, హనుమంతవాక, మధురవాడ పరిధి శివశక్తినగర్, శారదానగర్, సాయిరాం కాలనీ, వికలాంగుల కాలనీ పరిసర కొండవాలు ప్రాంతాలు, తగరపువలస, భీమిలి, ఆనందపురం, మురళీనగర్, మాధవధార, విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధి మహారాణిపేట, డాబాగార్డెన్స్, ఓల్డ్సిటీ, బీచ్రోడ్డు, అల్లిపురం, జ్ఞానాపురం, మల్కాపురం పారిశ్రామిక ప్రాంతంలో గుర్తించగలిగే స్థాయిలో ఈ భూ ప్రకంపనలున్నట్లు అక్కడి ప్రజలు తెలిపారు. కార్తీకమాసం పూజలు, వాకింగ్, పాలప్యాకెట్ల కోసం అప్పటికే నిద్రలేచిన ప్రజలు ఏం జరుగుతుందో తెలియక తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలో మంచాలు, కబ్ బోర్డుల నుంచి వస్తువులు దొర్లిపడ్డ చోట మరింత ఆందోళన చెందారు. తమ వారిని నిద్రలేపి మరీ కొందరు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. 3 నుంచి 10 సెకన్ల పాటు ఆయా ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు ప్రజలు చెప్తున్నారు ఇద్దరు మహిళలకు గాయాలు భూ ప్రకంపనల సమయంలో జీవీఎంసీ రెండోవార్డు సంతపేటలో నందిక రమణ ఇంటి ప్రధాన ద్వారం వద్ద గేటు రోడ్డుపై పడిపోవడంతో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. నగరంలో పలు ప్రాంతాల్లో కంపించిన భూమి -
బీచ్రోడ్డులో డబుల్ డెక్కర్ ఓపెన్ టాప్ బస్
సాక్షి, విశాఖపట్నం: సాగర తీరంలో మరో డబుల్ డెక్కర్ బస్ చక్కర్లు కొట్టనుంది. ఇప్పటికే రెండు హిప్ హాప్ బస్సులు తీరంలో తిరుగుతుండగా... ఇప్పుడు మూడో బస్సును పర్యాటక శాఖ సిద్ధం చేసింది. మొదటి రెండు బస్సులతో పోలిస్తే ఇది ప్రత్యేకం. ఎందుకంటే ఇది ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ నిధులతో ఏపీటీడీసీ ఈ బస్సును సిద్ధం చేసింది. త్వరలోనే జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పర్యాటకుల కోసం ఈ సరికొత్త ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సును ప్రారంభిస్తామని ఏపీటీడీసీ డివిజనల్ మేనేజర్ జీవీబీ జగదీష్ తెలిపారు. -
జైలును సందర్శించిన డీఐజీ రవికిరణ్
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారాన్ని కోస్తాంధ్ర డీఐజీ ఎంఆర్ రవికిరణ్ మంగళవారం సందర్శించారు. ఇక్కడ జైల్ సూపరింటెండెంట్ ఎం.మహేష్బాబు, అధికారులతో కలసి జైల్లో ఖైదీలు ఉండే బేరక్లు, వంటశాల, ఆస్పత్రిని ఆయన పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడి మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా? వైద్య సేవలు సక్రమంగా అందు తున్నాయా? అని ఆరా తీశారు. ఖైదీలతో వారి బంధువులు మాట్లాడడానికి ఏర్పాటు చేసిన ములాఖత్ గదిని పరిశీలించారు. అనంతరం జైల్ రికార్డులు పరిశీలించి, సిబ్బంది పనితీరుపై ఆరా తీశా రు. ఖైదీల్లో మంచి మార్పు తీసుకురావడానికి కృషి చేయాలని సూచించారు. జైల్ అభివృద్ధి, విధి నిర్వహణలో సిబ్బందికి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జైల్లో డ్రగ్ డి–అడిక్షన్ సెంటర్లో తాత్కాలిక పోస్టుల కోసం జరిగిన ఇంటర్వ్యూలను పర్యవేక్షించారు. -
జైల్లో తాత్కాలిక ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారం డ్రగ్ డి–అడిక్షన్ సెంటర్లో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు ముగిశాయి. ఇటీవల ఇక్కడ ప్రాజెక్టు కోఆర్డినేటర్, ఆకౌంటెంట్ కం క్లర్క్, మనస్తత్వవేత్త/కౌన్సెలర్, సామాజిక కార్యకర్త, నర్సు(పురుష), వార్డ్ బాయ్, పీర్ ఎడ్యుకేటర్ ఖాళీలను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. 93 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి సోమ, మంగళవారాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు జైల్ పర్యవేక్షణాధికారి ఎం.మహేష్బాబు తెలిపారు. ఎంపిక జాబితా త్వరలో వెల్లడిస్తామన్నారు. ఈ నియామకాలకు జైల్ కోస్తాంధ్రా డీఐజీ ఎం.ఆర్.రవికిరణ్ చైర్మన్గా ప్రత్యేక కమిటీని నియమించినట్లు పేర్కొన్నారు. ఆయన పర్యవేక్షణలో ఇంటర్వ్యూలు జరిగాయన్నారు. ఇంట ర్వ్యూలో కమిటీ చైర్మన్తో పాటు సభ్యులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్ పర్యవేక్షణాధికారి ఎస్.రాహుల్, విశాఖ కేంద్ర కారాగారం పర్యవేక్షణాధికారి ఎం.మహేష్బాబు, విశాఖ ప్రభుత్వ మానసిక వైద్యశాల పర్యవేక్షణాధికారి డాక్టర్ కె.వి.రామిరెడ్డి, ఏఎంసీ ప్రొఫెసర్ డాక్టర్ జి.వాసవి లత, జిల్లా సబ్జైల్ అధికారి జి.వెంకటరమణ పాల్గొన్నారు. -
పదోన్నతుల ‘సహకారం’
విశాఖ సిటీ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో పదోన్నతుల వ్యవహారం అగ్గిరాజేస్తోంది. ఈ ప్రక్రియలో రూ.కోటి వరకు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్యాంకులో కీలక వ్యక్తి సన్నిహితుడే మామూళ్ల తతంగాన్ని నడిపించారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. పదోన్నతులకు ఒక్కొక్కరి నుంచి పోస్టును బట్టి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు వరకు వసూలు చేసినట్లు సిబ్బంది చెవులు కొరుక్కుంటున్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ)కి ప్రధాన కార్యాలయం కాకుండా మరో 33 బ్రాంచ్లు ఉన్నాయి. వీటిలో ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించారు. ఒక డీజీఎం, నాలుగు ఏజీఎం, నాలుగు చీఫ్ మేనేజర్, ఆరు మేనేజర్, 12 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించాలని భావించారు. ఇందుకోసం బ్యాంక్ పర్సన్ ఇన్చార్జి, సీఈవో, ఆప్కాబ్ నుంచి జనరల్ మేనేజర్, ఆప్కాబ్ నామినేట్ చేసిన సబ్జెక్ట్ నిపుణుడు ఒకరు ఉన్నారు. ఈ బోర్డు ఆధ్వర్యంలో గత నెల 23, 24 తేదీల్లో ఇంటర్వ్యూలు సైతం నిర్వహించారు. పోస్టుకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు ఈ పదోన్నతులకు నిర్వహించిన ఇంటర్వ్యూల్లో డీజీఎం పోస్టుకు ఒకరు, నాలుగు ఏజీఎం పోస్టులకు నలుగురు, నాలుగు చీఫ్ మేనేజర్ పోస్టులకు 18 మంది, ఆరు మేనేజర్ పోస్టులకు 20, 12 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 60 మంది పాల్గొన్నారు. ఉద్యోగి సర్వీస్కు 80, పనితీరుకు 10, ఇంటర్వ్యూలో మరో 10 మార్కులు కలిపి మొత్తంగా 100 మార్కులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. సర్వీసు మార్కులను పక్కనపెడితే, పనితీరుకు ఉద్యోగి పై అధికారి 10 మార్కులు, ఇంటర్వ్యూలో 10 మార్కులు దక్కించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడే మతలబులు జరిగినట్లు ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. 20 మార్కుల్లోనే మతలబు 20 మార్కులు బోర్డు చేతుల్లో ఉండడంతో ఇక్కడే బేరసారాలు జరిగినట్లు సిబ్బందిలో చర్చ జరుగుతోంది. అడిగిన మొత్తం ఇవ్వని పక్షంలో పదోన్నతికి అవకాశం లేదని పలువురికి తెగేసి చెప్పారన్న వాదనలు ఉన్నాయి. పోస్టును బట్టి రూ.3 నుంచి రూ.5 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇందుకోసం బ్యాంకులో కీలక వ్యక్తి సన్నిహితుడు రంగంలోకి దిగి తెరవెనుక తతంగాన్ని నడిపారన్న టాక్ ఉంది. చీఫ్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు భారీగా డిమాండ్ ఉండడంతో వాటి కోసం పలువురు అడిగిన మొత్తాన్ని సమర్పించుకున్నట్లు చర్చ జరుగుతోంది. వారికే పదోన్నతులు కల్పిస్తూ గత నెల 31వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై పలువురు ఉద్యోగులు ఆప్కాబ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే విచారణకు ఆదేశించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మెరిట్, రోస్టర్ ప్రకారమే పదోన్నతులు చేపట్టినట్లు బ్యాంకు ఉన్నతాధికారులు ఆరోపణలను కొట్టి పారేస్తున్నారు. -
సమన్వయంతో భాగస్వామ్య సదస్సుకు ఏర్పాట్లు
మహారాణిపేట : ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ నెల 14, 15వ తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు అధికారులంతా సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, డీసీపీలు మేరీ ప్రశాంతి, లతామాధురి ఇతర అధికారులతో కలిసి ఏర్పాట్లపై సమీక్షించారు. ఇప్పటివరకు ఆయా శాఖల పరిధిలో జరిగిన పనులు, తీసుకున్న చర్యలు, చేసిన ఏర్పాట్లపై ఆరా తీశారు. 9వ తేదీలోగా పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. స్పాట్ రిజిస్ట్రేషన్కు అవకాశం లేదని తెలిపారు. ముఖ్యమంత్రితోపాటు, గవర్నర్, ఉప రాష్ట్రపతి కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యే అవకాశం ఉందని, అన్ని రకాల భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. అన్ని రకాల సంస్కృతులను ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ దేశ, విదేశాల నుంచి ప్రముఖులు విచ్చేస్తున్న క్రమంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉందని, దీనికి అనుగుణంగా అధికార యంత్రాంగం, సీఐఐ నుంచి సహకారం కావాలని పేర్కొన్నారు. అన్ని ప్రధాన కూడళ్లు, వేదికల వద్ద సీసీ టీవీ కెమెరాలు పెట్టాలని, డ్రోన్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఫొటోతో కూడిన ఐడీ కార్డును ధరించాలని సూచించారు. కార్యక్రమానికి వచ్చే అతిథులు, ఇతర అధికారుల వివరాలను 10వ తేదీలోగా అందజేయాలని సీఐఐ ప్రతినిధులను కోరారు. భాగస్వామ్య సదస్సు ఏర్పాట్ల పరిశీలన ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ పరిశీలించారు. మంగళవారం ఉదయం జేసీ కె.మయూర్ అశోక్తో కలిసి వేదిక వద్దకు వెళ్లిన ఆయన అక్కడ పరిస్థితులను గమనించారు. ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించి తగిన సూచనలు చేశారు. గ్రౌండ్ లెవెలింగ్, జంగిల్ క్లియరెన్స్, మొబైల్ టాయిలెట్ల ఏర్పాటు, పార్కింగ్, ప్రవేశ ద్వారాలు, సుందరీకరణ, డ్రెయిన్ల నిర్వహణ తదితర ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
21 నుంచి మార్గశిర మాసోత్సవాలు
మహారాణిపేట: ఈ నెల 21 నుంచి డిసెంబర్ 19 వరకు కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో జరిగే మార్గశిర మాసోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో పలు అంశాలపై మార్గదర్శకాలు జారీ చేశారు. ఆయా రోజుల్లో ట్రాఫిక్ మళ్లింపు, బారికేడ్లు, సరిపడా క్యూలైన్లు, మంచినీటి సదుపాయం, వైద్య శిబిరాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆ సమయంలోనే దర్శనాలు.. మార్గశిర మాసోత్సవాల్లో నాలుగు గురువారాలు నవంబర్ 27, డిసెంబర్ 04, 11, 18వ తేదీల్లో వస్తున్నట్లు ఈవో కె.శోభారాణి వెల్లడించారు. ఈ దినాల్లో బుధవారం తెల్లవారుజాము 2.30 గంటల నుంచే దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. వీఐపీలకు ఉదయం 6 నుంచి 8 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు స్లాట్స్ కేటాయించినట్లు వెల్లడించారు. సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సీహెచ్వీ రమణ, ఏఈవో రాజేంద్ర, పోలీసు అధికారులు, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్వయం అభిషేకాలపై పునరాలోచించాలి ఆలయానికి వచ్చే భక్తులు స్వయంగా పాలు, పసుపు కుంకుమలు, పుష్పాలతో అమ్మవారికి అభిషేకాలు చేయడంపై వైదిక కమిటీ పునరాలోచన చేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. పూజా సామగ్రిని భక్తుల నుంచి పూజారులు/వలంటీర్లు తీసుకుని అమ్మవారికి సమర్పించేలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. దీనిపై పోలీసు అధికారులు కూడా ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఈవో శోభారాణి స్పందిస్తూ... వైదిక కమిటీ దృష్టిలో పెట్టి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. క్యూలైన్లలో చిన్న పిల్లలకు పాలు, బిస్కెట్లు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. వీఐపీ, వీవీఐపీల దర్శనాలు నిర్ణీత వేళల్లోనే జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అనంతరం ఉత్సవాల పోస్టర్ను కలెక్టర్, ఇతర అధికారుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. -
కన్ను!
దేవాలయ భూములపైప్రేమ సమాజానికి గతంలో దాతలు ఇచ్చిన భూములు రుషికొండలో 47.33 ఎకరాలు కూటమివిలువైన సింహాచలం భూములు ప్రైవేటు కంపెనీల పరం నగర శివారు భూములను దేవస్థానానికి ఇచ్చేందుకు ప్రయత్నాలు ప్రేమ సమాజం భూములనూ కాజేసేందుకు యత్నాలు టూరిజం ప్రాజెక్టుల పేరిట కొట్టేసేందుకు కుట్ర ఏసీఏకు 10 ఎకరాలు ఇవ్వాలంటూ కూటమి నేతల కుయుక్తులు సింహాచలం దేవస్థానానికి చెందిన భూములు అడవివరంలో 150 ఎకరాలు మధురవాడలో 107 ఎకరాలు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ఇప్పటివరకు ప్రైవేటు, ప్రభుత్వ భూములపై కన్నేసి కాజేస్తున్న కూటమి ప్రభుత్వం, నేతలు.. ఇప్పుడు దేవస్థానం భూములపై పడ్డారు. సింహాచలంతోపాటు ప్రేమ సమాజానికి చెందిన విలువైన భూములను ప్రాజెక్టుల పేరిట చేజిక్కించుకునే ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. సింహాచలం దేవస్థానానికి మధురవాడ, అడవివరంలో ఉన్న విలువైన భూములను తీసుకుని.. నగరానికి వెలుపల కాలుష్య ప్రభావిత భూములను దేవస్థానానికి అప్పగించేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా సింహాచలం దేవస్థానానికి చెందిన భూముల విలువను తక్కువగా లెక్కగట్టి.. అందుకు బదులుగా నగరానికి దూరంగా ఇచ్చే భూముల విలువను మాత్రం అధికంగా లెక్కకట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా చేస్తారంట...? వాస్తవానికి సింహాచలం దేవస్థానానికి మధురవాడలో 107 ఎకరాలు, అడవివరంలో 150 ఎకరాల భూమి ఉంది. ఇందులో మధురవాడలోని 107 ఎకరాల భూమిని గూగుల్ సంస్థకు, అడవివరంలోని 150 ఎకరాల భూమిని ఒక ప్రైవేటు హోటల్కు అప్పగించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకు బదులుగా ఎక్కడో దూరంగా గాజువాక వద్ద ఉన్న భూములను ప్రత్యామ్నాయంగా ఇచ్చేందుకు ఇప్పటికే రెవెన్యూ వ్యవహారాలు ప్రారంభమయ్యాయి. ● మరోవైపు సేవా సంస్థ అయిన ప్రేమ సమాజానికి చెందిన భూములను కూడా వివిధ టూరిజం ప్రాజెక్టుల పేరిట చేజిక్కించుకునేందుకు కూటమి ఎమ్మెల్యేలు ప్రయత్నాలు షురూ చేశారు. అలాగే ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ)కు 10 ఎకరాలు కావాలంటూ కూటమి నేతలు లేఖలతో అమరావతిలో కలియతిరుగుతున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా దేవస్థానం భూములను లీజుకు ఇవ్వొచ్చంటూ తాజాగా ప్రభుత్వం జారీచేసిన ఆదేశాల నేపథ్యంలో కూటమి నేతలు తమ ప్రయత్నాలను షురూ చేశారు. ప్రేమ సమాజం భూములపై ఎప్పటి నుంచో గురి..! ప్రేమ సమాజానికి దాతలు ఇచ్చిన 47.33 ఎకరాల భూమి రుషికొండలో ఉంది. ఇందులో 33 ఎకరాలకుపైగా గతంలోనే టీడీపీ నేతలు లీజుకు తీసుకున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రేమ సమాజం భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని వ్యతిరేకించింది. ఇందుకు అనుగుణంగా సదరు ప్రైవేటు వ్యక్తికి అప్పగించిన భూముల లీజును రద్దు చేయడంతోపాటు ప్రేమ సమాజం భూములను సంస్థకే అప్పగించింది. నగరాల్లో ఉండే దేవస్థానాలకు చెందిన భూములను దీర్ఘకాలిక లీజుకు ఇచ్చేందుకు కమిటీని నియమిస్తూ ప్రభుత్వం అక్టోబరు 31న ఆదేశాలు జారీచేసింది. ఇందుకు అనుగుణంగా మరోసారి విలువైన ప్రేమ సమాజం భూములను రిసార్టు, టూరిజం పేరుతో చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఏసీఏకు 10 ఎకరాలు కావాలంటూ కూటమికే చెందిన మరో ఎమ్మెల్యే ఒక వినతిపత్రాన్ని కూడా ప్రభుత్వానికి సమర్పించినట్టు సమాచారం. మొత్తంగా రుషికొండలోని విలువైన భూములను చేజిక్కించుకునేందుకు పలు ప్రతిపాదనలతో కూటమి నేతలు కుయుక్తులు పన్నుతున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టూరిజం, గూగుల్ పేరుతో..! ఒకవైపు ప్రేమ సమాజం భూములను కూటమి నేతలు ప్రైవేటు వ్యక్తుల పేరుతో, టూరిజం ప్రాజెక్టుల పేరుతో చేజిక్కించుకునేందుకు యత్నిస్తుండగా.. సింహాచలానికి చెందిన అడవివరంలోని భూములను టూరిజం ప్రాజెక్టు పేరుతో ఓ హోటల్కు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుండటం గమనార్హం. సింహాచలం దేవస్థానానికి చెందిన అడవివరంలోని 150 ఎకరాల భూమిని ఒక ప్రైవేటు హోటల్కు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. దీనికి ప్రతిగా దూరంగా ఉన్న భూములను దేవస్థానానికి అప్పగించేందుకు ఫైల్స్ సిద్ధమవుతున్నాయి. మధురవాడలో విలువైన 107 ఎకరాల భూమిని గూగుల్ సంస్థకు అప్పగించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఒకవైపు డేటా సెంటర్ పేరుతో తర్లువాడలోని పేద దళిత భూములను కాజేసేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం.. వీటికి తోడు దేవస్థానం భూములను కూడా అప్పగించేందుకు సిద్ధమవుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం
మధురవాడ: నగరంలో చోటుచేసుక్ను సమతా కాలేజీ విద్యార్థి ఆత్మహత్య సంఘటన మరువక ముందే మధురవాడలో ఓ ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యం కారణంగా విద్యార్థి అదృశ్యమైన సంఘటన కలకలం రేపింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా భోగాపురం మండలం గారే నందిగాం ప్రాంతానికి చెందిన పోతిన సుమంత్(17)మారికవలస భగీరథ క్యాంపస్ చైత్య కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం ఉదయం తండ్రితో ఫోన్లో మాట్లాడిన సుమంత్ను సాయంత్రం చూడ్డానికి వచ్చిన తండ్రికి.. మీ కుమారుడు కనిపించట్లేదంటూ.. యాజమాన్యం చెప్పిన వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. వెంటనే విద్యార్థి బంధువులు పీఎం పాలెం పోలీసులను ఆశ్రయించారు. ఇదిలా ఉండగా కాలేజీ సమీంలోని మెట్రోమాల్ గోడపై దాగిఉన్న సుమంత్ను గుర్తించి, బంధువులు కాపాడి తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే.. కళాశాలలో ఉండాల్సిన విద్యార్థి బయటకు రాగలిగాడని, కాలేజీకి వెళ్లే వరకూ తమకు ఆ విషయం చెప్పకపోవడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి మిస్సింగ్ను గమనించని శ్రీచైతన్య యాజమాన్యం -
గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
పెదగంట్యాడ: మండలంలోని పాత గంగవరం తీరంలో ఈ నెల 2న గల్లంతైన యువకుడి మృతదేహం అప్పికొండ తీరంలో మంగళవారం లభ్యమైంది. ఈ సంఘటనకు సంబంధించి న్యూపోర్టు సీఐ కామేశ్వరరావు తెలిపిన వివరాలివి. ఒడిశాకు చెందిన బ్రహ్మానందం, తిరుపతి సాహు, భోళాశంకర్ సాహు, పెదగంట్యాడ మండలం సీతానగరానికి చెందిన రట్టి రూపక్ సాయి(22) గంగవరం పోర్టులో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ నెల 2న సాయంత్రం 5 గంటల సమయంలో పాత గంగవరం తీరానికి వెళ్లారు. అక్కడ మాధవస్వామి ఆలయం సమీపంలోని బీచ్ వ్యూ పాయింట్ రాళ్లపై ఎక్కి తీరంలోని అందాలను ఆస్వాదిస్తుండగా రూపక్సాయి అదుపుతప్పి సముద్రంలో పడిపోయాడు. మిగిలిన వారు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీనిపై సమాచారం అందుకున్న న్యూపోర్టు పోలీసులు రెండు రోజులుగా ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్ల సాయంతో జల్లెడ పట్టారు. మంగళవారం మధ్యాహ్నం అప్పికొండ తీరం సమీపంలో యువకుని మృతదేహాన్ని గుర్తించారు. పోస్టు మార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. సీఐ కామేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రైల్వే భవనాలను పునరుద్ధరించండి
మహారాణిపేట: బ్రిటిష్ కాలం నాటి రైల్వే భవనాలను అమృత్ భారత్ పథకం ద్వారా పునరుద్ధరించుకునే అవకాశం ఉందని, స్థానిక ఎంపీలను సమన్వయం చేసుకుంటూ వాల్తేర్ డివిజన్లో పనులు వేగవంతం చేయాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. విశాఖలోని నోవోటెల్ హోటల్లో మంగళవారం జరిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వే, వాల్తేర్ డివిజన్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. డివిజన్ పరిధిలోని పార్లమెంట్ సభ్యులు, రైల్వే అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ఇటీవల చేపట్టిన పనుల పురోగతి, పార్లమెంట్ సభ్యులు ఇదివరకే చెప్పిన సమస్యలు, వాటి ప్రస్తుత స్థితి గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ విశాఖపట్నం రైల్వే స్టేషన్ను ఐకానిక్ స్టేషన్గా తీర్చిదిద్దాలని.. ఇప్పటికే రూ.492.69 కోట్ల కేటాయింపులు జరిగినట్లు గుర్తు చేశారు. అతి త్వరలో భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కానున్న నేపథ్యంలో విజయనగరం రైల్వే స్టేషన్పై కూడా కనెక్టివిటీ రద్దీ పెరిగే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం నుంచి తిరుపతికి రైలు వేయాలి శ్రీకాకుళం నుంచి చర్లపల్లికి, శ్రీకాకుళం నుంచి తిరుపతికి నూతన ట్రైన్ సర్వీసుల ఆవశ్యకత ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ తెలిపారు. అరకు రైలుకు మరిన్ని కోచ్లను అనుసంధానం చేయాలని సూచించారు. ప్రస్తుత సందర్భాల్లో శబరిమల లాంటి ప్రాంతాలకు అధికంగా ప్రత్యేక రైళ్లను నడపాలని స్పష్టం చేశారు. అభివృద్ధి పనులపై అసంతృప్తి అమృత్ భారత్ స్టేషన్ల్లో అభివృద్ధి పనుల ఆలస్యం పట్ల రామ్మోహన్నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరితగతిన వాటిని పూర్తి చేయాలని సూచించారు. సబ్ వేల నిర్మాణంలో నాణ్యతపై పలు ఆరోపణలు వస్తున్నట్టు పేర్కొన్నారు. నీటి నిల్వలు ఉండిపోవడం, పై నుంచి వాటర్ లీకేజీ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని పేర్కొన్నారు. రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్తాం: గొల్ల బాబూరావు, తనూజారాణి సీనియర్ సిటిజన్లకు, స్పోర్ట్స్ పర్సన్లకు టికెట్ చార్జీలు తగ్గింపు కోసం ఇప్పటికే అనేక వినతులు అందాయని, ప్రత్యేక చొరవ తీసుకుని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్తానని రాజ్యసభ సభ్యుడు గొల్లబాబూరావు హామీ ఇచ్చారు. తన పార్లమెంట్ పరిధిలో పలు సమస్యలను అరకు ఎంపీ తనూజరాణి ప్రస్తావించారు. అరకుకు మరిన్ని రైళ్లు నడపాలని, ప్రస్తుతం అరకుకు ఉన్న రైళ్లకు కోచ్లు అదనంగా ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్, కలిశెట్టి అప్పలనాయుడు, రైల్వే అధికారులు సప్తగిరి శంకర్ ఉలక, మహేష్ కశ్యప్, స్థానిక అధికారులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా.. ఉల్లాసంగా..
డాబాగార్డెన్స్: రోజూ యూనిఫాంతో తరగతులకు హాజరయ్యే విద్యార్థినులు సీతాకోక చిలుకల్ని మరిపించారు. చదువులోనే కాదు.. ఆటపాటల్లోనూ అందెవేసిన చేయంటూ ఉత్సాహానికే ఊపుతెచ్చారు. నగరంలోని సౌత్ జైల్ రోడ్డులో ఉన్న విశాఖ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మంగళవారం జరిగిన ఫ్రెషర్స్ డే వేడుకలు ఆద్యంతం ఉత్సాహాన్ని నింపాయి. నూతన బ్యాచ్ విద్యార్థులను స్వాగతిస్తూ సీనియర్ విద్యార్థులు నిర్వహించిన ఈ వేడుక ఆనందంగా సాగింది. ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, రాజమండ్రి ప్రభుత్వ వైద్య కళాశాల మైక్రోబయాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ మజ్జి భారతి పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.మంజుల కళాశాల ప్రగతి, చరిత్రను వివరించారు. కార్యక్రమంలో భాగంగా ఫ్రెషర్స్ను స్వాగతించడానికి సీనియర్ విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఉల్లాసభరితంగా సాగాయి. -
కూటమి పాలనలో.. వినికిడి సమస్య!
శస్త్రచికిత్స కోసం నిరీక్షిస్తున్న చిన్నారులు హేమవర్షిత్, టి.కన్నారావు మహారాణిపేట: వినికిడి సమస్య ఉన్న రోగుల పాలిట గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వరంగా మారిన కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సను కూటమి ప్రభుత్వం మూలకు చేర్చింది. నాలుగు మాసాలుగా ఈ పరికరాల సరఫరా లేకపోవడంతో ఈఎన్టీ ఆస్పత్రిలో శస్త్ర చికిత్సలు నిలిచిపోయాయి. మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియక బాధిత చిన్నారులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఆలస్యమయ్యే కొద్దీ కొందరు అర్హత కొల్పొయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఘనం ఉత్తరాంధ్ర జిల్లాలకు కేంద్రంగా ఉన్న చెవి, ముక్కు, గొంతు(ఈఎన్టీ) ప్రభుత్వ ఇక్కడ ఆస్పత్రికి ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు చత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా రోగులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. 30–50 వరకు ఓపీ ఉంటుంది. ఇక్కడ డాక్టర్ హరికృష్ణ ఆధ్వర్యంలో గత ప్రభుత్వ హయాంలో అనేక శస్త్ర చికిత్సలు ఆరోగ్యశ్రీ పరిధిలో చేశారు. ఒక్కో రోగి కోసం రూ.10 లక్షలు ఖర్చయ్యే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలూ నిర్వహించారు. బాధిత చిన్నారులు పైసా ఖర్చు లేకుండానే వినికిడి సామర్థ్యం పొందారు. ఇప్పుడిదంతా గతం. నాలుగు నెలలుగా నిరీక్షణ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక అన్ని రకాల శస్త్ర చికిత్సలకు అంతరాయం కలుగుతోంది. నాలుగు నెలలుగా వినికిడి సమస్యతో బాధపడే చిన్నారులకు నిర్వహించే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు నిలిచిపోయాయి. ఈ పరికరాలు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రావడం, వాటిని అమర్చేందుకు వైద్యులు శస్త్ర చికిత్సలు నిర్వహించేవారు. ప్రస్తుతం ఆ పరికరాల కొనుగోలుకు అనుమతులు రాకపోవడంతో చికిత్సలు నిలిపేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 9 మంది చిన్నారులు ఈ శస్త్ర చికిత్సల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. చిన్నతనంలోనే చికిత్స చేయాలి పుట్టుకతోనే చెవిటి, మూగతో బాధపడుతున్న చిన్నారులకు ఆత్యాధునిక శస్త్ర చికిత్స విధానం ఇప్పుడు ఈఎన్టీ ఆస్పత్రిలో చేస్తున్నారు. ఈ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చిన్నతనంలో చేయాలి. మూడేళ్ల లోపు చిన్నారులకు ఈ శస్త్ర చికిత్స చేస్తే మంచి ఫలితం ఉంటుంది. నాలుగేళ్లు దాటాక కొందరు, ఐదేళ్ల తర్వాత మరికొందరు గుర్తించగలుతున్నారు. చిన్నారులకు వివిధ రకాల పరీక్షలు చేసి, వారు శస్త్రచికిత్సకు అర్హులు అని నిర్ధారించేందుకు కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. ఈలోగా వయస్సు ఐదేళ్లు దాటిపోతే ఒక్కోసారి ఈ చికిత్స విజయవంతం కాదని వైద్యులు చెప్తున్నారు. దీంతో చాలా మంది చిన్నారుల వయస్సు దాటి పోతోందని, దీనిపై ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేసి త్వరగా అనుమతులు ఇవ్వాలని తల్లిదండ్రులు, వైద్యులు కోరుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో పలు పథకాల పట్ల కూటమి ప్రభుత్వం సవతి ప్రేమ చూపిస్తోంది. పేద ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే ఆరోగ్యశ్రీతో ఇన్నాళ్లూ ఆటాడుకుంది. అంతకు ముందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యులు సమ్మె బాట పడితే తప్ప, వారిని పట్టించుకోలేదు. ఇప్పుడు పుట్టుక నుంచే వినికిడి సమస్యతో బాధపడుతున్న చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలను నిలిపేసి.. తమకు ప్రజల ఆకాంక్షలేవీ కనబడవు.. వినబడవని నిరూపించుకుంటోంది. -
ఉద్యోగాల పేరిట దంపతులకు టోకరా
గాజువాక : ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువ దంపతులను కొంతమంది మోసం చేశారు. వారి నుంచి రూ.91 లక్షలు వసూలు చేసి అదృశ్యమయ్యారు. తాము మోసపోయామని గుర్తించిన బాధితులు గాజువాక పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురు నిందితులను మంగళవారం అరెస్టు చేశారు. ఈ కేసులో మరో ఎనిమిది మంది నిందితులు పరారీలో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. గాజువాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక చట్టివానిపాలెం రోడ్లో నివాసముంటున్న సింగనం అలేఖ్య డయాలసిస్లో డిప్లొమా చేసి ప్రస్తుతం నర్సింగ్ చదువుతోంది. ఆమె భర్త వినాయకరావు బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం చూస్తున్నాడు. ఈ దంపతులకు మంచి ఉద్యోగం కావాలన్న ఆలోచన ఉంది. మల్కాపురం ప్రాంతానికి చెందిన వారి బంధువులు మచ్చ సజిని (గృహిణి), మచ్చ వెంకట నారాయణ (ట్రాన్స్పోర్టు సూపర్వైజర్) దంపతులు విశాఖ స్టీల్ప్లాంట్లో పర్మినెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికారు. తాను స్టీల్ప్లాంట్లో కాంట్రాక్టరుగా పనిచేస్తున్నానని, తనకు మంచి పరిచయాలు ఉన్నాయని నారాయణ చెప్పాడు. ఒక్కో వ్యక్తికి రూ.50 లక్షల చొప్పున ఇస్తే ఏడాది కాలంలో ఉద్యోగం వస్తుందని, ఉద్యోగం వచ్చేవరకు డబ్బు చాలా భద్రంగా ఉంటుందని, అంతవరకు వడ్డీ కూడా ఇస్తామని పేర్కొన్నారు. అనంతరం వారికి పెదగంట్యాడకు చెందిన సీరపు షణ్ముఖ ఆదిత్యకుమార్(విద్యార్థి), సీరపు రామ్ ప్రసాద్ (జొమాటో డెలివరీ బాయ్), సీరపు అనిత (గృహిణి)లను పరిచయం చేశారు. వారిని నమ్మిన అలేఖ్య దంపతులు తమ వద్ద ఉన్న డబ్బుతోపాటు తమ బంధువుల వద్ద అప్పుచేసిన డబ్బుతో కలిపి రూ.91,36,500ను వారికి ఇచ్చారు. 2023 ఏప్రిల్ నుంచి 2024 ఆగస్టు మధ్యకాలంలో ఈ డబ్బును నిందితులకు అందజేశారు, అందులో సజినికి రూ.19.80 లక్షలు, నారాయణకు రూ.6.02 లక్షలు, షణ్ముఖకు రూ.15.02 లక్షలు, రామ్ ప్రసాద్కు రూ.6,43,500, అనితకు రూ.6.96 లక్షలను నగదు, ఫోన్పే, బ్యాంక్ ట్రాన్స్ఫర్, సీడీఎం మెషీన్ డిపాజిట్ ద్వారా చెల్లించారు. డబ్బులు తీసుకున్న నిందితులు తొలుత బాధితులతో బాగానే మాట్లాడేవారు. ఎంతకీ ఉద్యోగాలు రాకపోవడంతో వారు ఒత్తిడి చేస్తుండటంతో ఏవో సాకులు చెప్పి వాయిదా వేస్తూ వచ్చారు. చివరకు 2024 ఆగస్టులో మరోసారి రూ.30 వేలు తీసుకున్న తర్వాత అందరూ తమ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేసి అదృశ్యమయ్యారు. దీంతో తాము మోసపోయామని భావించిన అలేఖ్య దంపతులు గాజువాక పోలీసులను ఆశ్రయించి గోడు వెల్లబోసుకున్నారు. సీఐ ఎ.పార్థసారధి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు ఈ ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బుతో సజిని పెదగంట్యాడలో రెండు ఇళ్లను, నారాయణ ఐదు లారీ ట్రాలర్లు కొనుగోలు చేసినట్టు, మిగిలినవారు ఆస్తులు కొనడంలో సహాయం చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇంకా ఈ కేసులో ఎనిమిది మంది నిందితులు పరారీలో ఉన్నారని, త్వరలోనే వారిని కూడా అరెస్టు చేస్తామని సీఐ పార్థసారధి ఈ సందర్భంగా తెలిపారు. తాము మోసం చేసినట్టు అరెస్టయిన నిందితులు ఒప్పుకున్నారని ఆయన పేర్కొన్నారు. -
ఇక్షక్.. నౌకాదళానికి రక్షక్!
భారత నౌకాదళంలో 150కిపైగా యుద్ధ నౌకలు, సబ్మెరైన్లున్నాయి. ఇప్పటి వరకు ఏ యుద్ధ నౌకలోనూ అతివలకంటూ ప్రత్యేక వసతులు లేవు. మొట్టమొదటి సారిగా మహిళా గౌరవానికి ప్రతీకగా నిలిచేలా సంధాయక్ క్లాస్ సర్వే నౌక ఐఎన్ఎస్ ఇక్షక్ని నిర్మించారు. ఒక నేవీ షిప్లో మహిళా అధికారులు, సిబ్బందికి ప్రత్యేక వసతులు కల్పించడం ఇదే తొలిసారి. ఇది నౌకాదళంలో పెరుగుతున్న నారీశక్తికి నిదర్శనం. 80 శాతం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఈ సంధాయక్ క్లాస్ మూడో షిప్ ఇక్షక్.. నవంబర్ 6వ తేదీన భారత నౌకాదళ అమ్ములపొదిలో చేరనుంది. – సాక్షి, విశాఖపట్నంఆత్మనిర్భర్ భారత్ దిశలో కీలక అడుగు...భారత నావికాదళంలో దేశీయంగా నిర్మించిన ఈ బిగ్ సర్వే వెసెల్ ఐఎన్ఎస్ ఇక్షక్.. ఆత్మనిర్భర్ భారత్లో మరో కీలక అడుగు. ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి ఇక్షక్ని కొచ్చి నావల్ బేస్లో జాతికి అంకితం చేయనున్నారు. స్వదేశీ హైడ్రోగ్రాఫిక్ సర్వే ఎక్స్లెన్స్లో కొత్త అధ్యాయాన్ని లిఖించేలా కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (జీఆర్ఎస్ఈ) దీన్ని నిర్మించింది. డైరెక్టరేట్ ఆఫ్ షిప్ ప్రొడక్షన్, వార్షిప్ ఓవర్సీయింగ్ టీమ్ (కోల్కతా) ఈ నౌకా నిర్మాణాన్ని పర్యవేక్షించాయి. హైడ్రోగ్రాఫిక్ సర్వే కార్యకలాపాలతోపాటు.. మానవతా సహాయం, విపత్తు సహాయకారిగానూ.. అత్యవసర సమయాల్లో హాస్పిటల్ షిప్గా కూడా వ్యవహరించనుంది. మహిళల కోసం ప్రత్యేక కంపార్ట్మెంట్.!భారత నౌకాదళ చరిత్రలో మహిళల కోసం ప్రత్యేక వసతి ఏర్పాటు చేసిన తొలి యుద్ధ నౌక ఇక్షక్. ఇప్పటి వరకూ ప్రతి యుద్ధ నౌకలో మహిళా అధికారులు, సెయిలర్స్కు పురుష సిబ్బందితో కలిసి పక్కపక్కనే విడిగా గదులు ఉండేవి. ఇక్షక్లో మాత్రం.. మహిళా సిబ్బంది కోసం ప్రత్యేక కంపార్ట్మెంట్ని ఏర్పాటు చేశారు.ఇక్షక్ అంటే...ఇక్షక్ అంటే ది గైడ్.. దిక్సూచీ అని అర్థం. తెలియని మార్గాల్ని అన్వేషించడం.. నౌకాదళాన్ని సరైన దారిలో నడిపించడం.. తమ లక్ష్యాల్ని సురక్షితంగా చేరుకునేలా నావికులకు మార్గాన్ని నిర్దేశించడం. భారత దేశ సముద్ర శక్తిని మరింత బలోపేతం చేసేలా ఇక్షక్ నిర్మాణం జరిగింది. ఓడరేవులు, నావిగేషనల్ చానెల్లు, ఎకనావిుక్ ఎక్స్క్లూజివ్ జోన్లో కోస్టల్, డీప్ వాటర్ హైడ్రో–గ్రాఫిక్ సర్వే నిర్వహించడం, రక్షణ కోసం ఓషనోగ్రాఫిక్ డేటాను సేకరించడంలో ఇక్షక్ కీలక పాత్ర పోషించనుంది.అడుగులు ఇలా...1968 నుంచి సంధాయక్ సర్వే వెసల్ భారత నౌకాదళంలో విశిష్ట సేవలందించి 2021లో సేవల నుంచి నిష్క్రమించింది. ఇండియన్ నేవీకి సర్వే నౌకలు అవసరమని భావించిన రక్షణ మంత్రిత్వ శాఖ.. 2017లో నాలుగు సంధాయక్ క్లాస్ సర్వే వెసల్స్ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది. రూ.2,435.15 కోట్లతో బిడ్ను జీఆర్ఎస్ఈ దక్కించుకుంది. అత్యాధునిక సాంకేతికతతో స్వదేశీ పరిజ్ఞానంతో ఈ నౌకల్ని నిర్మిస్తున్నారు. వీటిలో మొదటిది జే18 పేరుతో ఐఎన్ఎస్ సంధాయక్ని 75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు. జే 19 పేరుతో ఐఎన్ఎస్ నిర్దేశిక్ను, జే23 పేరుతో ఇక్షక్ని 80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో పూర్తి చేశారు. తర్వాత.. ఐఎన్ఎస్ సంశోధక్ షిప్ 2026 నాటికి భారత నౌకాదళంలో చేరాలన్నది ప్రణాళిక.ఇక్షక్ సత్తా ఇదీ..పొడవు: 110 మీటర్లుబరువు: 3,400 టన్నులువేగం: గంటకు 33 కిమీ (18 నాటికల్ మైళ్లు)సామర్థ్యం: 30 కిమీ వేగంతో ఏకధాటిగా 12 వేల కిమీ దూరం ప్రయాణించగలదుసంద్రంలో సత్తా: 25 రోజుల పాటు తీరానికి రాకుండా పహారా కాయగల సత్తాసిబ్బంది: 231 మందిఆయుధ సంపత్తి: సీఆర్ఎన్91 నేవల్ గన్, హాల్ ధృవ్ ఎంకే–3 హెలికాప్టర్ఇన్బుల్ట్ సెన్సార్ శక్తి: అటానమస్ అండర్ వాటర్ వెహికల్ సెన్సార్, హైడ్రోగ్రాఫిక్ సెన్సార్ పరికరాలు, సముద్ర కాలుష్యాన్ని గణించే మార్పల్ వ్యవస్థ, రిమోట్ ఆపరేటెడ్ వెహికల్స్(ఆర్వోవీ), సైడ్ స్కాన్ సోనార్ -
విశాఖలో భూ ప్రకంపనలు
సాక్షి, విశాఖపట్నం: నగరంలో పలు చోట్ల భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తెల్లవారుజామున 4:16 నుంచి 4:20 నిమిషాల మధ్య ప్రకంపనలు వచ్చాయని ప్రజలు అంటున్నాయి. తెల్లవారు జామున కావడంతో కొద్ది మంది మాత్రమే ప్రకంపనలను గుర్తించారు.మురళీనగర్, రాంనగర్, అక్కయ్య పాలెం, సీతమ్మధార, సహా పాలు ప్రాంతాల్లో భూమి కంపించింది. పలు కాలనీ వాసులు భయంతో బయటకు వచ్చారు. అల్లూరి జిల్లా జీ.మాడుగులలో భూకంప కేందాన్ని గుర్తించారు. భూమి లోపల 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉంది. -
పట్టణ ప్రణాళికా విభాగానికి అత్యధిక వినతులు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అత్యధికంగా పట్టణ ప్రణాళికా విభాగానికే ఫిర్యాదులు అందాయి. నగర మేయర్ పీలా శ్రీనివాసరావు జీవీఎంసీ అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తితో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు.137 వినతులు రాగా వీటిలో పట్టణ ప్రణాళికా విభాగానికి 58 వినతులు రావడం విశేషం. అలాగే జీవీఎంసీ అడ్మినిస్ట్రేషన్ అండ్ అకౌంట్స్ విభాగానికి 7, రెవెన్యూ సెక్షన్కు 13, ప్రజారోగ్య విభాగానికి 8, ఇంజినీరింగ్ విభాగానికి 26, మొక్కల విభాగానికి 7, యూసీడీ విభాగానికి 18 ఫిర్యాదులు వచ్చాయి. అందిన ఫిర్యాదులు పరిశీలించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని సంబందిత అధికారులను మేయర్ ఆదేశించారు. కార్యక్రమంలో ప్రధాన వైద్యాధికారి నరేష్కుమార్, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి, ఫైనాన్సర్ అడ్వైజర్ మల్లికాంబ, సీసీపీ ప్రభాకరరావు, పర్యవేక్షక ఇంజినీర్లు కె.శ్రీనివాసరావు, సంపత్కుమార్, ఏడుకొండలు, డీసీఆర్ శ్రీనివాసరావు, కార్యనిర్వాహక ఇంజినీర్లు, ఇతర అఽధికారులు పాల్గొన్నారు. -
పైసా విదిల్చలే..!
పార్టనర్షిప్ సమ్మిట్కు నిధుల వేట ప్రభుత్వం నుంచి పైసా రాకపోవడంతో తలలు పట్టుకుంటున్న అధికారులుసాక్షి, విశాఖపట్నం : ప్రజాధనాన్ని దుర్వినియోగం చెయ్యడం.. భారీ కార్యక్రమాన్ని నిర్వహించి.. రూ.లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని బాకాలు ఊదడం.. తర్వాత చూస్తే.. ఏ ఒక్క ప్రాజెక్టూ క్షేత్రస్థాయిలో కనిపించకపోవడం.. తెలుగుదేశం అధికారంలో ఉన్న ప్రతిసారీ జరిగే తంతే ఇది. పావలా కోడికి.. రూపాయి మసాలా అన్నట్లుగా.. భారీ ఏర్పాట్లతో ప్రచారార్భాటం కోసం.. జిల్లాలో ఉన్న ప్రభుత్వ నిధులన్నింటినీ ఊడ్చే కార్యక్రమాలు మళ్లీ కూటమి ప్రభుత్వం మొదలుపెట్టింది. మొన్న జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసమే అన్ని ప్రభుత్వ విభాగాలూ.. తమ ఖజానానికి ఖాళీ చేసెయ్యగా.. ఇప్పుడు మరోసారి నిధులు మీరు పెట్టండి.. మేం చూసుకుంటామంటూ ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 17 నెలల్లోనే రూ.100 కోట్లకు పైగా ఖర్చు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అండ్ కో తమ ప్రచారం కోసం ప్రజాధనాన్ని విచ్చలవిడిగా వినియోగిస్తుండటంతో జిల్లా ఖజానా రోజురోజుకీ ఖాళీ అయిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 17 నెలల్లోనే జిల్లాకు చెందిన రూ.100 కోట్లకు పైగా ప్రజాధనాన్ని తమ ప్రచార యావ కోసం ఖర్చు పెట్టించింది. దీంతో జిల్లాలో జరగాల్సిన అభివృద్ధి పనులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పుడు మరోసారి పార్టనర్షిప్ సమ్మిట్ పేరుతో ప్రచార బాకాలు ఊదరగొట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే పనులు ప్రారంభించాలంటూ అధికారులకు ఆదేశాలివ్వడం.. ప్రతి రెండు మూడు రోజులకోసారి సమీక్షలు నిర్వహించి.. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించడమే తప్ప.. దీనికి ఎంత ఖర్చు అవుతుంది..? నిధులు ఉన్నాయా లేవా.? నిధులు మంజూరు చేయాలా అనే విషయాలపై మాత్రం కూటమి సర్కార్ కనీసం మాట్లాడటం లేదు. దీంతో ఇదెక్కడి ప్రచార బాధరా భగవంతుడా అంటూ ఉన్నతాధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. రూ.100 కోట్ల వరకు బకాయిలు ఈ నెల 14,15 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదంతా ప్రభుత్వం మంజూరు చేయాల్సి ఉండగా.. ఆ ఊసే తేవడం లేదు. గతంలో జరిగిన వివిధ కార్యక్రమాలకు సంబంధించి రూ.100 కోట్ల వరకు ప్రభుత్వం వద్ద బకాయిలుండగా.. ఈ సమ్మిట్ విశాఖ జిల్లాకు గుదిబండగా మారుతోందని.. అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రతి కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించడం.. తర్వాత నిధులిచ్చేందుకు నిరాకరించడం కూటమి ప్రభుత్వానికి పరిపాటిగా మారిపోయింది. తలో చెయ్యి వేయాల్సిందే..! ఇటీవల మంత్రులు, ఉన్నతాధికారులు జిల్లా యంత్రాంగంతో పార్టనర్షిప్ సమ్మిట్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. నిధుల విషయం జిల్లా ఉన్నతాధికారులు ప్రస్తావించగా.. నిధుల గురించి ప్రస్తావన తీసుకురావద్దన్నట్లుగా తెలుస్తోంది. ఉన్న నిధుల్ని ఖర్చు చేసి ఏర్పాట్లు పక్కాగా చేయాలని ఆదేశించినట్లు సమాచారం. రెవెన్యూ విభాగంలో నిధులతో పాటు ఇతర విభాగాల్లో ఉన్న నిధులను కూడా వాడుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జీవీఎంసీ రూ.40 కోట్ల వరకూ ఖర్చు చేస్తుండగా.. వీఎంఆర్డీఏ, కమర్షియల్ ట్యాక్స్, టూరిజం, పౌరసరఫరాలు, పరిశ్రమల శాఖలతో పాటు.. ఇతర విభాగాల నుంచి కూడా నిధులు ఈ ఏర్పాట్ల కోసం అనధికారికంగా ఖర్చు చేయాలంటూ హుకుం జారీ చేసినట్లు అధికారిక వర్గాల సమాచారం. అయితే.. పర్యాటక శాఖ తమ ఖజానాలో రూ.లక్ష కూడా లేవని చెప్పడంతో సంబంధిత మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ముఖ్యమైన పరిశ్రమలు, సంస్థల నుంచి నిధులు సమీకరించాలంటూ పరిశ్రమలు, కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు సలహాలిచ్చారని సమాచారం. -
దారికి రాని ‘రెవెన్యూ’
మహారాణిపేట: ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రెవెన్యూ శాఖకు సంబంధించిన వినతులే అధికంగా వస్తున్నా, వాటి పరిష్కారం ఆలస్యం అవుతుండటంపై కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫిర్యాదులు తగ్గకపోవడం, ఆర్జీదారులు మళ్లీ మళ్లీ వస్తుండటంతో, కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు తహసీల్దార్లకు ఫోన్ చేసి ప్రశ్నిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు ప్రజల నుంచి వివిధ సమస్యలపై మొత్తం 413 వినతులు అందాయి. వీటిలో రెవెన్యూ శాఖకు చెందినవి 148 ఉండడం గమనార్హం. జీవీఎంసీకి 126, పోలీసు శాఖకు 32, ఇతర విభాగాలకు 107 వినతులు వచ్చాయి. సమస్యల పరిష్కారంలో భాగంగా, ఫిర్యాదుదారులతో సంబంధిత శాఖల జిల్లాస్థాయి అధికారులే నేరుగా మాట్లాడాలని, దిగువ స్థాయి సిబ్బంది మాట్లాడటానికి వీల్లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. తూతూమంత్రంగా కాకుండా, ప్రతీ ఫిర్యాదుదారుతో అధికారులు తప్పకుండా మాట్లాడాల్సిందేనని ఆయన ఆదేశాలు జారీ చేశారు. పనుల్లో నాణ్యతపై విచారణ జరపాలి జీవీఎంసీ పరిధిలోని 53వ వార్డులో జరుగుతున్న రోడ్లు, కాలువలు, డ్రైనేజీ తదితర అభివృద్ధి పనుల్లో తీవ్రమైన నాణ్యత లోపం ఉంది. దీనికి కొంత మంది అధికారుల నిర్లక్ష్యమే కారణం. ఈ విషయంపై ఆగస్టు 4, 11 తేదీల్లో పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశా..ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు. దీనివల్ల పీజీఆర్ఎస్పై ప్రజలకు నమ్మకం పోతోంది. నాణ్యత లోపంపై కలెక్టర్ చొరవ తీసుకొని విచారణ జరిపించాలి. –షేక్ బాబ్జీ, ఉత్తర నియోజకవర్గ సమాచార హక్కు చట్టం అధ్యక్షుడు నా ఇల్లు కబ్జా చేయాలని చూస్తున్నారు మధురవాడ శివశక్తి నగర్లో 30 ఏళ్లుగా ప్రభుత్వ స్థలంలో నివాసం ఉంటున్న నా ఇంటిని కబ్జా చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఇంటిని కూల్చివేసి, ఇసుక వేసి బయటకు రానివ్వకుండా చేస్తున్నారు. ఒంటరిగా ఉంటున్నందున భయంతో బతుకుతున్నాను. ఈ విషయంలో గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదు. వైఎస్సార్సిపి ఇంటెలెక్చువల్స్ ఫోరం జిల్లా అధ్యక్షుడు దేవరకొండ మార్కెండేయులు చొరవతో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ స్పందించి, న్యాయం చేయాలి. –షేక్ మదీనా బీబీ, శివశక్తి నగర్, మధురవాడ -
సేవతోనే మానవ జన్మసార్థకం
కొమ్మాది: సేవతోనే మనిషి జన్మకు సార్థకత చేకూరుతుందని.. అలాంటిది ఎన్నో సేవలు చేసిన లయన్స్ ఇంటర్నేషనల్ సేవలు ఎంతో గొప్పవని కేంద్ర ఉక్కు సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. సోమవారం సాగర్నగర్లో గల రాడిసన్బ్లూలో లయన్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఫోర్బ్స్ వి సర్వ్ ఇండియా సీజన్–2 పశ్చిమ, దక్షిణ జోన్ల అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 550 మంది కాళ్లు లేని వారికి కృత్రిమ కాళ్లను లయన్స్ ఇంటర్నేషనల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సామాజిక సేవలో లయన్స్ ఇంటర్నేషనల్ ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు. శక్తికి మించిన సేవలు అందిస్తుందని కొనియాడారు. లయన్స్ క్లబ్కు కేంద్ర ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు అందించనున్నట్లు తెలిపారు. తాను మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి నని, ఆర్ఎస్ఎస్లో చేరి ఈ దేశానికి మంచి జరుగుతుందనే నమ్మకంతో రాజకీయంలోకి వచ్చానని తెలిపారు. అనంతరం విద్య, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారిత, పర్యావరణం, హెల్త్కేర్ రంగాలకు చెందిన విజేతలకు అవార్డులను ఆయన ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ సుభాష్బాబు, విఘ్నేష్ విజయ్రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఎర్రమట్టి దిబ్బల విస్తీర్ణంపై సర్వే
భీమునిపట్నం : బీచ్రోడ్డులోని ఎర్రమట్టి దిబ్బల విస్తీర్ణం ఎంతవరకు ఉందన్న దానిపై సోమవారం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారితో కలిసి ఆర్డీవో సంగీత్ మాథూర్ పర్యవేక్షణలో అధికారులు సర్వే నిర్వహించారు. ఈ ప్రాంతంలో మొత్తం 1,400 ఎకరాల మేరకు ఎర్రమట్టి దిబ్బలు విస్తీర్ణం ఉండగా ఇప్పుడు ఏవిధంగా ఉన్నాయి.. వాటి సరిహద్దులను గుర్తించే కార్యక్రమం చేపట్టారు. ఈ సర్వే ద్వారా పూర్తి స్థాయిలో ఎర్రమట్టిదిబ్బల సరిహద్దులు గుర్తించడం వల్ల.. ఇకపై వీటిని కూల్చివేత జరగకుండా అధికారులు తగిన చర్యలను తీసుకోవడానికి వీలవుతుంది. ఇందులో తహసీల్దారు రామారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
10 నుంచి పోస్టల్ టేబుల్ టెన్నిస్ టోర్నీ
విశాఖ స్పోర్ట్స్: విశాఖ వేదికగా జరగనున్న 40వ అఖిల భారత అంతర సర్కిళ్ల పోస్టల్ టేబుల్ టెన్నిస్ టోర్నీ లోగో, టీజర్ను విశాఖ ప్రాంతీయ పోస్ట్మాస్టర్ జనరల్ వి.ఎస్.జయశంకర్ విడుదల చేశారు. ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకు ఎంవీపీ కాలనీలోని ఎస్–3 స్పోర్ట్స్ ఎరీనాలో ఈ పోటీలు జరగనున్నాయి. దేశంలోని 14 పోస్టల్ సర్కిళ్లకు చెందిన 121 మంది మెన్, వుమెన్తో పాటు వెటరన్స్ పోటీల్లో పాల్గొనున్నారు. మెన్, వుమెన్కు సింగిల్స్తో పాటు డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ పోటీలు నిర్వహించనుండగా వెటరన్స్ కోసం ప్రత్యేక కేటగిరిలో పోటీలు జరగనున్నాయి. గతేడాది గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్లో జరిగిన పోటీల్లో పశ్చిమ బెంగాల్ జట్లు ఓవరాల్ చాంపియన్షిప్ను సొంతం చేసుకున్నాయి. సోమవారం విశాఖలోని పోస్టల్ ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ సూపరింటెండెంట్ ఎన్.వి.ఎస్.ఎస్.రాజు, డిప్యూటీ సూపరింటెండెంట్ కోమల్కుమార్, ఆసిస్టెంట్ డైరెక్టర్ కెవిడి సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
గూగుల్ డేటాకు భూ కేటాయింపులు రద్దు చేయాలి
మహారాణిపేట: గూగుల్ డేటా సెంటర్కు 480 ఎకరాల భూమి కేటాయింపును సీపీఐ వ్యతిరేకించింది. ఈ మేరకు సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి పాత్రపల్లి చంద్రశేఖర్ సోమవారం కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. డేటా సెంటర్ల ఏర్పాటుతో పర్యావరణం దెబ్బతిని, నీరు, విద్యుత్ కొరత ఏర్పడుతుందని, అందువల్ల ప్రభుత్వం పునరాలోచించాలని ఆయన కోరారు. గతంలో ఖాళీగా ఉన్న 400 ఎకరాలను ఈ సంస్థకు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే పెదగంట్యాడ ఏరియాలో ఏర్పాటు చేయనున్న అదాని అంబుజా సిమెంట్ గ్రేడింగ్ ఫ్యాక్టరీ ప్రతిపాదనను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఫ్యాక్టరీ వల్ల ప్రాణాంతక వ్యాధులు వస్తాయని, ప్రజలు ప్రజాభిప్రాయ సేకరణలో దీనిని అడ్డుకున్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో సీపీఐ గాజువాక నియోజకవర్గం కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ ,పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.మన్మథరావు, ఆర్ శ్రీనివాసరావు, ఎండి బేగం, ఎన్. నాగభూషణరావు. వనజాక్షి తదితరులు పాల్గొన్నారు. -
డ్రగ్స్ కేసులో ముగ్గురు విద్యార్థుల అరెస్ట్
విశాఖ సిటీ : విశాఖలో టాస్క్ఫోర్స్ పోలీసులు డ్రగ్స్ పట్టుకుని, ముగ్గురు విద్యార్థులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 48 ఎల్ఎస్డీ బ్లాట్స్ను స్వాధీనం చేసుకున్నారు. విశాఖలో సోమవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో డీసీపీ (లా అండ్ ఆర్డర్) మేరీప్రశాంతి ఈ కేసు వివరాలు తెలిపారు. ఆమె తెలిపిన మేరకు.. మద్దిలపాలెం చైతన్యనగర్లో నివాసముంటున్న పులగం కొండారెడ్డి ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అతడికి అనకాపల్లిలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన మురాడ గీత్చరణ్, శ్రీకాకుళం జిల్లా బాలాజీ టెంపుల్ ప్రాంతానికి చెందిన తంగి హర్షవర్ధన్నాయుడు స్నేహితులు. వీరు ముగ్గురు మద్యం, మత్తు పదార్థాలకు అలవాటుపడ్డారు. బెంగళూరులోని హర్షవర్ధన్నాయుడి స్నేహితుడు సంథన్ నుంచి ఎల్ఎస్డీ బ్లాట్స్ను తీసుకురావాలని గీత్చరణ్కి సూచించిన కొండారెడ్డి ఇటునుంచి విమానం, అటునుంచి రైలు టికెట్లు సమకూర్చాడు. గీత్చరణ్ అక్టోబర్ 31న విశాఖ నుంచి విమానంలో బెంగళూరు వెళ్లాడు. ఈ నెల 1వ తేదీన కొండారెడ్డి తన స్నేహితుడు డొంక గణేష్ ఫోన్పే ద్వారా సంథన్కు రూ.25 వేలు పంపించాడు. ఈ డబ్బుతో సంథన్ 50 ఎల్ఎస్డీ బ్లాట్స్ను కొనుగోలు చేసి, వాటిలో 48 బ్లాట్స్ను గీత్చరణ్కు ఇచ్చాడు. ఆ బ్లాట్స్తో అదేరోజు బెంగళూరు నుంచి రైలులో బయలుదేరిన గీత్చరణ్ ఆదివారం విశాఖ చేరుకున్నాడు. ఈ డ్రగ్స్ రవాణా గురించి సమాచారం అందటంతో టాస్క్ఫోర్స్, ఈగల్ పోలీసులు రైల్వేస్టేషన్ వద్ద నిఘా పెట్టారు. కొండారెడ్డి.. హర్షవర్ధన్నాయుడుతో కలిసి గీత్చరణ్ వద్దకు వెళ్లి ఎల్ఎస్డీ బ్లాట్స్ను తీసుకుంటున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 48 ఎల్ఎస్డీ బ్లాట్స్తో పాటు మూడు మొబైల్స్, ఓలా ఎలక్ట్రిక్ స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. ఎల్ఎస్డీ బ్లాట్స్ ఇచ్చిన సంథన్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు చెప్పారు. ఇందులో ఎవరెవరిపాత్ర ఉందన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. -
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలి
మహారాణిపేట: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించి, సమాజ సేవకు అంకితం కావాలని కలెక్టర్ హరేందిర ప్రసాద్ ఆకాంక్షించారు. ఆంధ్రా మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో సోమవారం వైద్య విద్యార్థుల ‘ఫ్రెషర్స్ డే’ ఉల్లాసంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఫ్రెషర్స్ డే విద్యార్థులకు కొత్త విద్యా ప్రయాణానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. వైద్య విద్యార్థులు బాధ్యత, సేవ, సమగ్రతతో కూడిన విలువలను పాటిస్తూ ముందుకు సాగాలని సూచించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ వైద్య విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని చేరుకోవాలన్నారు. ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కేవీఎస్ఎం సంధ్యాదేవి మాట్లాడుతూ విద్యార్థులు తమ విద్యాభ్యాసంలో కరుణ, క్రమశిక్షణ, విద్యా నైపుణ్యం విలువలను తప్పక నిలబెట్టుకోవాలని కోరారు. ఈ వేడుక సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యేతో పాటు ఇతర ప్రముఖులను ఘనంగా సన్మానించారు. అలాగే అధ్యాపకులకు, కార్యనిర్వాహక కమిటీ సభ్యులకు జ్ఞాపికలను అందజేశారు. ప్రత్యేకంగా 25వ బ్యాచ్కు చెందిన 250 మంది కొత్త విద్యార్థులకు స్వాగతం పలికే విధంగా ప్రత్యేక బహుమతులు అందజేశారు. చివరగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణి, ఏఎంసీ వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ వి. మన్మథరరావు, డాక్టర్ వి. రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ ఎ. కృష్ణవేణి, సాంస్కృతిక ఉపాధ్యక్షురాలు డాక్టర్ శ్యామల తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ హరేందిర ప్రసాద్ -
వందేభారత్ రైళ్ల గందరగోళం
తాటిచెట్లపాలెం: వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల ఆలస్యం, గందరగోళం ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించింది. వేగంగా, సౌకర్యవంతంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆశించే ప్రయాణికులు ప్రస్తుతం రైళ్ల ఆలస్యం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ నుంచి సోమవారం ఉదయం బయల్దేరాల్సిన వందేభారత్ ఎక్స్ప్రెస్ తీవ్ర ఆలస్యంగా, మధ్యాహ్నం 2 గంటల తర్వాత బయల్దేరింది. అదే సమయంలో సికింద్రాబాద్ నుంచి వచ్చి, సికింద్రాబాద్కు తిరిగి వెళ్లే వందేభారత్ ఎక్స్ప్రెస్ కూడా స్టేషన్కు చేరుకోవడంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. రెండు వందేభారత్ ఎక్స్ప్రెస్లు ఒకేసారి ప్లాట్ఫాం నంబర్ 1 , 8 లపై ఉండడం వల్ల, ఉదయం బయల్దేరవలసిన రైలు ఏది, మధ్యాహ్నం బయల్దేరవలసిన రైలు ఏదో తెలియక ప్రయాణికులు తీవ్ర అయోమయానికి గురయ్యారు. ఆలస్యం గురించి సమాచారం ఉన్నప్పటికీ, రెండు రైళ్లు దాదాపు ఒకే సమయంలో బయల్దేరడంతో ప్రయాణికులు తికమకపడ్డారు. కొందరు ప్రయాణికులు ఉదయం వెళ్లాల్సిన రైలుకు బదులుగా మధ్యాహ్నం వెళ్లాల్సిన రైలు ఎక్కారు. తర్వాత పొరపాటు తెలుసుకుని పరుగు పరుగున 8వ నంబర్ ప్లాట్ఫాంకు చేరుకుని, రీ–షెడ్యూల్ చేసిన ఉదయం బయల్దేరవలసిన రైలు ఎక్కవలసి వచ్చింది. ముఖ్యంగా విశాఖ–సికింద్రాబాద్–విశాఖపట్నం (20833/20834) వందేభారత్ ఎక్స్ప్రెస్ తరచుగా ఆలస్యంగా నడవడంపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల ఇబ్బందులను నివారించడానికి, రైల్వే అధికారులు జోక్యం చేసుకుని, అవసరమైతే ఒక రోజు రైలును రద్దు చేసి అయినా సరే, మిగిలిన రోజులలో సరైన సమయానికి రైలు బయల్దేరేలా చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
వేర్వేరు సంఘటనల్లో 14 కేజీల గంజాయి స్వాధీనం
తాటిచెట్లపాలెం: గవర్నమెంట్ రైల్వే పోలీసులు, రైల్వే భద్రతా దళం సంయుక్తంగా రైల్వే స్టేషన్లో నిర్వహించిన తనిఖీలలో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 14 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఉదయం మర్రిపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో ఆర్పీఎఫ్ ఎస్ఐలు మమత, అనిల్కుమార్ సిబ్బందితో కలిసి ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రకు చెందిన వికాస్, ఒడిశాకు చెందిన జగన్ మాఝీల లగేజీలలో నాలుగు కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా గుర్తించి, వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గవర్నమెంట్ రైల్వే పోలీసులకు అప్పగించినట్లు ఆర్పీఎఫ్ సిబ్బంది తెలిపారు. మరో ఘటనలో విశాఖ రైల్వే స్టేషన్లో జీఆర్పీ ఇన్స్పెక్టర్ సీహెచ్ ధనుంజయ నాయుడు ఆధ్వర్యంలో జీఆర్పీ ఎస్సై కేటీఆర్ లక్ష్మి, ఆర్పీఎఫ్ ఎస్సై ఓ మిసీ్త్రలు తమ సిబ్బందితో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో పశ్చిమ బెంగాల్కు చెందిన రకుల్ ఎస్కే, ఒడిశాకు చెందిన కార్తీక్ కిల్లో..విశాఖ మీదుగా కేరళకు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. వీరి నుంచి 10కిలోల గంజాయి స్వాధీనం చేసుకొన్నారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్ పంపినట్టు జీఆర్పీ పోలీసులు తెలిపారు. -
18 చోరీల కేసుల్లో నిందితుడి అరెస్టు
గాజువాక : ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని గాజువాక క్రైం పోలీసులు సోమ వారం అరెస్టు చేశారు. అతడి నుంచి 500 గ్రాముల వెండి వస్తువులు, నేరానికి ఉపయోగించిన రెండు ఐరన్ రాడ్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. గాజువాకలోని కై లాసనగర్లో నివాసముంటున్న రాంబుద్ధి వేణు గాజువాక హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. గతనెల 24న ఒడిశాలో ఒక వివాహం నిమిత్తం కుటుంబంతో సహా వెళ్లారు. అయితే, వారి ఇంటి తాళాలు విరగ్గొట్టి ఉన్నాయని పక్కింటివారు 26వ తేదీన ఆయనకు ఫోన్ చేసి సమాచారమిచ్చారు. 27వ తేదీన తిరిగి వచ్చిన ఆయన ఇంటి మెయిన్ డోర్ తాళాలు పగులగొట్టి ఉండటం గుర్తించాడు. ఇంటి లోపల బీరువా, లాకరు తెరిచి ఉండగా..అందులోని 500 గ్రాముల వెండి వస్తువులు కనిపించడంలేదని గాజువాక క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు క్రైం డీసీపీ లతా మాధురి ఆధ్వర్యంలో సీఐ కె.శ్రీనివాసరావు,ఎస్ఐ రుక్మంగధరరావు కేసు దర్యాప్తు ప్రారంభించారు. పెదగంట్యాడ ప్రాంతానికి చెందిన గణేష్ అలియాస్ బొండాలోడు ఈ దొంగతనానికి పాల్పడినట్టు గుర్తించి సోమవారం రిమాండ్కు తరలించారు. కాగా, నిందితుడిపై గాజువాక, దువ్వాడ, న్యూపోర్టు, మల్కాపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటికే 18 కేసులున్నట్టు క్రైం సీఐ తెలిపారు. -
పుట్టినరోజు వేడుకకు వెళ్తూ..
యలమంచిలి రూరల్: మితిమీరిన వేగం, ఆపై లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో రాంగ్రూట్లోకి వచ్చిన మినీ వ్యాన్ ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా, మరో 16 మంది గాయపడ్డారు. ఈ సంఘటన యలమంచిలి సమీపంలో కొక్కిరాపల్లి ప్రేమ సమాజం దగ్గర 16వ నంబరు జాతీయ రహదారిపై సోమవారం ఉదయం 10.20 గంటలకు చోటు చేసుకుంది. బంధువుల ఇంట్లో పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడానికి ఆనందంగా వెళ్తున్న ఓ కుటుంబానికి ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. గాజువాకలోని శ్రీహరిపురానికి చెందిన 8 మంది (ఏపీ 39 జీఎక్స్ 3891) మినీ వ్యాన్(టాటా మేజిక్)లో కాకినాడ జిల్లా పిఠాపురంలో బంధువుల ఇంట్లో పుట్టిన రోజు వేడుకకు బయలుదేరి వెళ్తున్నారు. ఈ క్రమంలో యలమంచిలి మండలం కొక్కిరాపల్లి హైవే కూడలి వద్ద ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో మినీవ్యాన్ను ఎడమ పక్కగా రాంగ్రూట్లోకి డ్రైవర్ నడిపాడు. దాంతో అక్కడే రోడ్డు పక్క ఆగి ఉన్న ఆటోను బలంగా ఢీకొట్టాడు. ప్రమాద సమయంలో పెద్ద శబ్దం రావడం, ఆటో, మినీ వ్యాన్లో ప్రయాణికులు కేకలు వేయడంతో ఒక్కసారిగా ఘటనా స్థలంలో భయానక వాతావరణం నెలకొంది. మినీ వ్యాన్ ముందుభాగం నుజ్జయింది. ఆటో రోడ్డు పక్కగా బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణికులంతా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం కారణంగా అనకాపల్లి నుంచి తుని వైపు ప్రయాణించే వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. హైవే నిర్వహణ సంస్థ సిబ్బంది అక్కడకు చేరుకుని ప్రమాదానికి గురైన వాహనాలను క్రేన్తో పక్కకు తొలగించారు. మితిమీరిన వేగం వల్లే ప్రమాదంగా నిర్ధారణ ప్రమాదం జరిగిన వెంటనే యలమంచిలి సీఐ ధనుంజయరావు, యలమంచిలి రూరల్ ఎస్సై ఉపేంద్ర స్పందించి క్షతగాత్రులను హుటాహుటిన హైవే అంబులెన్సులు, ఇతర వాహనాల్లో ఆస్పత్రులకు తరలించారు. యలమంచిలి సీహెచ్సీ వైద్యాధికారి నిహారిక, వైద్య సిబ్బంది క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందించి మెరుగైన చికిత్స అవసరమైన వారిని అంబులెన్సుల్లో అనకాపల్లి, విశాఖ ఆస్పత్రులకు రిఫర్ చేశారు. మినీ వ్యాన్(టాటా మేజిక్) డ్రైవర్ మితిమీరిన వేగంతో నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదంపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన గొంది పెంటయ్య, బాదంపూడి లక్ష్మి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి ప్రమాద సమయంలో ఆటోలో పది మంది, మినీ వ్యాన్లో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు. వారిలో ఆటోలో ఉన్న కశింకోట మండలం తీడ గ్రాామానికి చెందిన గొంది పెంటయ్య(56), నర్సీపట్నంలో ధర్మిరెడ్డి వీధికి చెందిన బాదంపూడి లక్ష్మి(65) చికిత్స నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందారు. -
గంజాయి వ్యాపారాన్ని ఉగ్రవాదంగా భావిస్తాం
మధురవాడ: గంజాయి వ్యాపారాన్ని ఉగ్రవాదంగా భావిస్తామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. విశాఖ సమీపంలోని కాపులుప్పాడ జీవీఎంసీ డంపింగ్ యార్డులో సుమారు రూ 5.21 కోట్లు విలువచేసే పదివేల కిలోల గంజాయి, 19 లీటర్ల హాసిస్ ఆయిల్ను దహనం చేసే కార్యక్రమం ప్రారంభించి మాట్లాడారు. గంజాయిని అరికట్టడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామన్నారు. గంజాయి కేసుల్లో అరెస్టయినవారి ఆస్తులను కూడా జప్తు చేస్తున్నామని తెలిపారు. సీపీ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ.. గంజాయి కేసుల్లో 1,435 మందిని అరెస్ట్ చేశామని అందులో విశాఖకు చెందివారు 712 మంది కాగా 332 మంది పలు జిల్లాలకు చెందిన వారున్నారు. మిగిలిన వారు ఇతర రాష్ట్రాలకు చెందినవారని తెలిపారు. గంజాయిని అరికట్టేందుకు ఎనిమిది చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. 14వేల వరకు సీపీ కెమెరాలను పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. గంజాయిపై 1972 నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈగల్ ఐజీ రవికృష్ణ, జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ పాల్గొన్నారు. -
ఏపీటీయూ గౌరవాధ్యక్షుడిగా ఎంపీ గొల్ల బాబూరావు
సీతంపేట: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ యూనియన్(ఏపీటీయూ) రాష్ట్ర గౌరవాధ్యక్షుడిగా రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. ఏపీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు వై.దేముడు ఆధ్వర్యంలో ఆదివారం అక్కయ్యపాలెంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన్ని యూనియన్ కార్యవర్గ సభ్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ యూనియన్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. విద్యారంగం, సమాజం, ఉపాధ్యాయ సమస్యలపై పరిపూర్ణమైన అవగాహన ఉన్న గొల్ల బాబూరావు యూనియన్ గౌరవాధ్యక్షుడిగా నాయకత్వం వహించేందుకు అంగీకారం తెలపడం పట్ల కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపింది. రాష్ట్ర నాయకులు , జి.దత్తాత్రేయ శర్మ, కె.బ్రహ్మారెడ్డి, కె.జె.కృపానందం, గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
నేవీ ప్రాజెక్ట్స్ డీజీగా వైస్ అడ్మిరల్ శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ
సింధియా: నేవీ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ జనరల్గా వైస్ అడ్మిరల్ కె.శ్రీనివాస్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. 1990 జనవరి 1న భారత నావికాదళంలో ప్రవేశించిన ఆయన కోరుకొండ సైనిక్ స్కూల్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి. 35 ఏళ్లకుపైగా భారత నావికాదళంలో విస్తృత సేవలందించిన ఆయన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విరాట్లోనూ పనిచేశారు. రష్యాలోని సెవెరోడ్విన్స్య్లో యుద్ధనౌక తయారీకి సూపరింటెండెంట్గా కూడా వ్యవహరించారు. ఐఎన్ఎస్ విక్రమాదిత్య నౌక మరమ్మతులను పర్యవేక్షించే బాధ్యత చూశారు. న్యూఢిల్లీలోని నేవల్ హెడ్ క్వార్టర్స్లో ప్రీమియర్ కమాండ్గా బాధ్యతలు స్వీకరించే ముందు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్గా, ఫ్లీట్ మెయింటెనెన్స్ ప్రిన్సిపాల్ డైరెక్టర్గా కూడా పని చేశారు. -
సింహగిరిపై ఘనంగా చిలుకు ద్వాదశి
స్వామి సేవలో ఆడారి వంశీయులు సింహాచలం: సింహగిరిపై ఆదివారం చిలుకు ద్వాదశి (క్షీరాబ్ది ద్వాదశి) ఉత్సవం వైభవంగా జరిగింది. అనకాపల్లికి చెందిన ఆడారి నూకయ్య వంశీయులు తరలివచ్చి, తమ చేతుల మీదుగా శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామికి ఈ ఉత్సవాన్ని జరిపించారు. ఏటా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున ఆలయంలో చిలుకు ద్వాదశి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఉత్సవంలో పాల్గొనే అవకాశాన్ని తరతరాలుగా అనకాపల్లిలోని గవర సామాజికవర్గానికి చెందిన ఆడారి నూకయ్య వంశీయులకు దేవస్థానం కల్పిస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం ఆడారి నూకయ్య వంశీయులు కుటుంబ సమేతంగా వచ్చి చిలుకు ద్వాదశి ఉత్సవానికి సంబంధించిన పూజా ద్రవ్యాలన్నింటినీ తీసుకొచ్చారు. సాయంత్రం ఆలయ ఆస్థాన మండపంలో అర్చకులు శాస్త్రోక్తంగా ఉత్సవాన్ని నిర్వహించారు. స్వామి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలతో పాటు శయన పెరుమాళ్లు, ఆళ్వార్లకు విశేషంగా పూల అలంకరణ చేసి మండపంలో అధిష్టింపజేశారు. అనంతరం విష్వ క్సేన పూజ, పుణ్యాహవాచనం, షోడశోపచార పూజ లు నిర్వహించారు. స్వామి చెంతన నువ్వులు, బెల్లం, పాలను రోట్లో వేసి చెరకు గెడలతో శాస్త్రోక్తంగా దంచారు. తయారైన చిమ్మిడిని స్వామికి నైవేద్యంగా ఆరగింపు చేశారు. తదుపరి శయన పెరుమాళ్లకు బేడా తిరువీధిని కనులపండువగా నిర్వహించారు. మంగళాశాసనాన్ని విశేషంగా అందించారు. భక్తులకు చిమ్మిడి ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, అర్చకులు పవన్కుమార్ తదితరులు పూజలు నిర్వహించారు. -
ప్రజాభిప్రాయంతో కూటమికి కనువిప్పు
సీతంపేట: కూటమి ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూ.. అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు మండిపడ్డారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ కార్పొరేటర్ మువ్వల పోలారావు ఆధ్వర్యంలో జీవీఎంసీ 25వ వార్డు గురుద్వారా కూడలి సమీపంలో ‘రచ్చబండ– కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమం జరిగింది. కె.కె.రాజు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులు, యువత, మేధావుల నుంచి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి నాయ కులు ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తామని హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక ప్రజల ఆస్తులను, రాష్ట్ర సంపదను పప్పుబెల్లంలా చంద్రబాబు వెనుక ఉన్న కొంత మంది వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో వైద్య విద్యను పేద మధ్య తరగతి ప్రజలకు చేరువ చేసేలా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 మెడికల్ కళాశాలలకు అన్ని రకాల ఫైనాన్షియల్, అడ్మినిస్ట్రేటివ్ అనుమతులు తెచ్చారని గుర్తు చేశారు. ప్రతి మెడికల్ కళాశాలలో 500 పడకల ఆసుపత్రిని నిర్మించి పేదలకు ఉచిత వైద్యం అందుబాటులోకి తెచ్చేలా కృషి చేశారన్నారు. పేద పిల్లలను వైద్య విద్యకు, ప్రజలను ఉచిత వైద్యానికి దూరం చేసేలా కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తూ నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ప్రజల అభిప్రాయాలను కోటి సంతకాల రూపంలో సేకరించి గవర్నర్కు నివేదిస్తామన్నారు. ప్రజాభిప్రాయంతోనైనా కూటమి నాయకులకు కనువిప్పు కావాలన్నారు. విశాఖ జిల్లాలో కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన లభిస్తోందని, యువత, మేధావులు స్వచ్ఛందంగా సంతకాలు చేసి కూటమి ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకతను వెల్లడిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు మువ్వల సంతోష్ భోగవిల్లి గోవింద్, సానబోయిన సురేష్ సారిపిల్లి సంతోష్ నూకరాజు, గుదే రాజు, శ్రవణ్, అప్పలరాజు, సూరిబాబు, బొమ్మాళి రవి, బోర గోవింద్, అశోక్, జోరీగల గణేష్, బడే శ్రీను, అలమండ శంకర్, దిమిలి శ్రీను, బొట్టా నాగు, బొట్టా పైడిబాబు, నమ్మి మహేష్, బొట్టా శ్రీను, పరశురామ్, వీరమ్మ, ఉమ, ఉద్మ, సంధ్య కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. భక్తుల మృత్యువాత ప్రభుత్వ వైఫల్యమే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని కె.కె. రాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడానికి ప్రభుత్వ వైఫల్యం, నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. అడిగితే ప్రైవేట్ ఆలయం అని తప్పించుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తోందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరుగుతుందో ప్రభుత్వానికి తెలియదా, వ్యవస్థలపై పట్టులేదా అని ప్రశ్నించారు. సనాతన ధర్మం, హైందవ ధర్మం అంటూ మాట్లాడే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు ప్రజల భద్రత విషయంలో చిత్తశుద్ధి ఏమైందని ప్రశ్నించారు. శ్రీకాకుళం ఘటనలో చనిపోయిన భక్తుల ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. -
సిగ్గుంటే కూటమి నుంచి బీజేపీ, జనసేన బయటకు రావాలి
సాక్షి, విశాఖపట్నం : సింహాచలం అప్పన్న దేవాలయ భూములను ప్రభుత్వం అప్పనంగా విదేశీ సంస్థలకు కట్టబెట్టేందుకు అడ్డగోలు వ్యవహారాలు నడిపిస్తోందని హిందూ సంఘాల నాయకుడు తురగా శ్రీరామ్ వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వ భూ పందేరంపై ఆయన ఆదివారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ దీనికి వత్తాసు పలుకుతూ సింహాద్రి అప్పన్న స్వామికి పంగనామాలు పెడుతోందని విమర్శించారు. విలువైన సింహాచలం భూముల్ని తక్కువ ధరకు చూపిస్తూ కాకిలెక్కలతో ప్రజల్ని మోసం చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అదానీ, గూగుల్ కోసం రూ.9000 కోట్ల విలువైన సింహాచలం దేవస్థాన భూములను కట్టబెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతి హిందువూ వ్యతిరేకిస్తున్నాడన్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని భూముల్ని ఇష్టారాజ్యంగా దోచేయాలని చూస్తుంటే కూటమిలో ఉన్న బీజేపీ, జనసేన ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. ఇంత అన్యాయంగా దేవుడి భూములను కట్టబెడుతున్నప్పుడు పవన్ కల్యాణ్ ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. నిజంగా హిందుత్వంపై బీజేపీకి, జనసేనకు చిత్తశుద్ధి ఉంటే.. కూటమి నుంచి రెండు పార్టీలూ వెంటనే బయటకు రావాలని శ్రీరామ్ డిమాండ్ చేశారు. -
అవినీతి రహిత సమాజం కోసం కృషి చేద్దాం
సీతంపేట: విజిలెన్స్ అవగాహన వారోత్సవాల సందర్భంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ కార్యాలయం, రీజినల్ కార్యాలయం, విశాఖపట్నం సిబ్బంది ఆధ్వర్యంలో ద్వారకానగర్లో ఆదివారం విజిథాన్(వాక్థాన్) జరిగింది. జోనల్ హెడ్ శాలిని మెనన్, రీజినల్ హెడ్ జె.సింహాచలం, జోనల్ విజిలెన్స్ ఆఫీసర్ ఐ.వి.కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన వాక్థాన్లో పెద్ద సంఖ్యలో బ్యాంకు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోనల్ హెడ్ శాలిని మెనన్ మాట్లాడుతూ సిబ్బందితో పాటు ప్రజల్లో నిజాయతీ, పారదర్శకత, నైతిక విలువల పట్ల అవగాహన కల్పించడం ఈ విజిథాన్ ప్రధాన ఉద్దేశమన్నారు. వృత్తిపరమైన జీవితంలోనే కాకుండా.. వ్యక్తిగత జీవితంలో కూడా నిజాయతీ చాలా ముఖ్యమన్నారు. అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. -
స్టీల్ప్లాంట్లో ‘ఫ్లాగ్ ఆఫ్ ప్రైడ్’ ప్రారంభం
ఉక్కునగరం: స్టీల్ప్లాంట్ యాజమాన్యం ఉద్యోగుల్లో పోటీతత్వాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఆదివారం నుంచి ‘ఫ్లాగ్ ఆఫ్ ప్రైడ్’ అనే కొత్త విధానాన్ని ప్రారంభించింది. ఉత్పత్తి విభాగాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంచడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ విధానంలో భాగంగా ప్లాంట్లోని ఈడీ (వర్క్స్) బిల్డింగ్ ముందు తొమ్మిది జెండా స్తంభాలను ఏర్పాటు చేశారు. వీటిపై ప్రధాన విభాగాలుగా పరిగణించే ఆర్ఎంహెచ్పీ, కోక్ ఓవెన్స్, సింటర్ ప్లాంట్, బ్లాస్ట్ ఫర్నేస్, స్టీల్ మెల్ట్ షాప్–1, స్టీల్ మెల్ట్ షాప్–2, సీఆర్ఎంపీ, మిల్స్, ధర్మల్ పవర్ ప్లాంట్ పేరిట తొమ్మిది రంగుల పతాకాలను అమర్చారు. ప్రతీ రోజు యాజమాన్యం నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకున్న విభాగం పతాకం ఎత్తులో ఎగురుతుంది. లక్ష్య శాతం ఆధారంగా ఆ పతాకం ఎత్తు స్థాయిని నిర్ణయిస్తారు. అంటే లక్ష్యాన్ని ఎంత శాతం చేరుకుంటే, పతాకం అంత ఎత్తులో ఎగురుతుంది. శనివారం ఆయా విభాగాలు సాధించిన ఉత్పత్తి సాధన ఆధారంగా ఆదివారం తొలి రోజు పతాకాలను ఏర్పాటు చేశారు. యాజమాన్యం తీసుకున్న ఈ కొత్త నిర్ణయంపై ఉద్యోగుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు ఉద్యోగులు ఈ కొత్త పద్ధతి వల్ల విభాగాల మధ్య పోటీ కంటే, అనవసరమైన పరస్పర విమర్శలు పెరిగి, అది మొదటికే మోసం తీసుకువస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
గాయపడిన శ్వేతనాగుకు శస్త్ర చికిత్స
ప్రాణాలు కాపాడిన వైద్యుడు సింధియా: తీవ్రంగా గాయపడిన అరుదైన, సుమారు ఆరు అడుగుల శ్వేతనాగుకు శస్త్ర చికిత్స చేసి దాని ప్రాణాలను పశువైద్యుడు కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. సింధియా ప్రాంతంలో ఉన్న నేవీ క్యాంటీన్లో అరుదైన శ్వేతనాగు కనిపించడంతో అక్కడి సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం అందించడంతో.. ఆయన అక్కడికి వచ్చి పామును చాకచక్యంగా పట్టుకున్నారు. అయితే, పాము పడగ భాగంలో తీవ్రంగా గాయపడి ఉండటాన్ని నాగరాజు గమనించారు. వెంటనే ఆ పామును 40వ వార్డు పరిధి హిందూస్థాన్ షిప్యార్డ్ కాలనీలోని గాంధీగ్రామ్ పశువుల ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి పశువైద్యాధికారి డాక్టర్ సిహెచ్ సునీల్ కుమార్ పామును పరీక్షించి, మత్తుమందు ఇచ్చి శస్త్రచికిత్స చేశారు. గాయానికి మొత్తం ఎనిమిది కుట్లు వేశారు. పాము తలపై ఏదైనా వాహనం ఎక్కి ఉండవచ్చని డాక్టర్ సునీల్ కుమార్ తెలిపారు. గాయం పూర్తిగా తగ్గిన తర్వాత పామును సురక్షితంగా అడవిలో విడిచిపెడతామని నాగరాజు వివరించారు. గాయాలపాలైన శ్వేతనాగుకు శస్త్రచికిత్స చేస్తున్న పశువైధ్యాధికారి సునీల్కుమార్ -
డ్రెడ్జింగ్ కార్పొరేషన్కు కేంద్రం ఊరట
సాక్షి, విశాఖపట్నం: వరుసగా మూడేళ్లు లాభాల బాటపట్టిన డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(డీసీఐఎల్).. గతేడాది నుంచి నష్టాల బారినపడింది. దీంతోపాటు షేర్ ముఖ విలువ కూడా తగ్గుముఖం పట్టింది. వరుసగా నష్టాలు వాటిల్లడంతో ఉద్యోగులు, అధికారుల్లో కలవరం మొదలైంది. నష్టాల ఊబిలో కూరుకుపోతూ 100 శాతం జీతాల చెల్లింపులపైనా భారం పడుతుండటంతో ఓ దశలో ఈక్విటీలకు వెళ్లిపోవాలని సంస్థ భావించింది. అయితే అప్పట్లో విశాఖపట్నం పోర్టు రూ.400 కోట్లు ఇచ్చి ఆదుకుంది. ఇప్పుడు డీసీఐ బాధ్యతను భుజానికెత్తుకోవాలంటూ కన్సార్టియం పోర్టులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. సంస్థలో మౌలిక సదుపాయాలు, ఫ్లీట్ ఆధునికీకరణ, సామర్థ్య పెంపునకు అవసరమైన రూ.4 వేల కోట్లు ఇవ్వాలంటూ కేంద్రం స్పష్టం చేయడంతో.. డ్రెడ్జింగ్ కార్పొరేషన్కు ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఏడేళ్ల క్రితం డ్రెడ్జింగ్ కార్పొరేషన్ను ప్రైవేట్పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసినప్పుడు.. ఉద్యోగులంతా సంఘటితమై పోరాటం సాగించారు. వీరి పోరుకు మద్దతుగా విశాఖపట్నం పోర్టు అథారిటీ (వీపీఏ) నిలిచింది. మరో మూడు పోర్టులతో కలిసి డీసీఐ బాధ్యతను తన భుజస్కందాలకెత్తుకుంది. డీసీఐకు కన్సార్టియంగా విశాఖపట్నం పోర్టు అథారిటీ (వీపీఏ) 19.47 శాతం, జవహర్లాల్ నెహ్రూ పోర్టు ట్రస్ట్ 18 శాతం, పారాదీప్ పోర్టు ట్రస్ట్ 18 శాతం, దీన్దయాళ్ పోర్టు ట్రస్ట్ 18 శాతం వాటాలతో డీసీఐకి బాసటగా నిలిచాయి. దీంతో ప్రైవేటీకరణ నిర్ణయం ఆగిపోయింది. ఆ తర్వాత లాభాల బాటలో పయనించింది. మూడేళ్ల క్రితం ఎండీ,సీఈవో నియమాకంలో అవకతవకలు జరిగిన విషయం వెలుగులోకి రావడం.. విజిలెన్స్ విచారణ నిర్వహించి ఎండీని తొలగించడం, తర్వాత ఆయన స్థానంలో వచ్చిన కొత్త ఎండీ పదవీకాలం ముగియడం చకచకా జరిగిపోయింది. ఇక అక్కడ నుంచి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ పతనం మొదలైంది. కొత్త ఎండీ, సీఈవోని ఇంతవరకూ నియమించకుండా తాత్కాలిక బాధ్యతలు ఎండీలతోనే కాలం వెళ్లబుచ్చుతున్నారు. సరైన నాయకత్వం లేకపోవడం వల్లే.. డీసీఐ అప్పటి నుంచి వరుసగా నష్టాల బాట పడుతోంది. దీంతో.. సంస్థ ఆర్థిక భారం లోతుల్లో కూరుకుపోయింది. మరో ‘భారీ’ డ్రెడ్జర్ కోసం..! ఇటీవలే 12,000 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో ప్రపంచంలోనే అతి పెద్ద డ్రెడ్జర్ షిప్ని డీసీఐ కమిషనింగ్ చేసింది. బీగల్ సిరీస్ డ్రెడ్జర్గా ‘గోదావరి’ షిప్.. డ్రెడ్జింగ్ రంగంలో సరికొత్త చరిత్రని లిఖించింది. అంతర్జాతీయ డిజైన్, సాంకేతిక భాగస్వాములతో కలిసి కొచ్చిన్ షిప్యార్డులో అధునాతన ఆటోమేషన్ సిస్టమ్స్, అత్యంత సమర్థవంతమైన డ్రెడ్జింగ్ మెకానిజంలతో దీన్ని రూపొందించారు. ప్రస్తుతం డీసీఐ దేశ వ్యాప్తంగా సుమారు 120 మిలియన్ క్యూబిక్ మీటర్ల డ్రెడ్జింగ్ పనిలో 60 మిలియన్ క్యూబిక్ మీటర్లను నిర్వహిస్తోంది. ‘డ్రెడ్జ్ గోదావరి’ చేరికతో ఈ సామర్థ్యం 80 మిలియన్ క్యూబిక్ మీటర్లకు పెరిగింది. అయితే ప్రపంచ డ్రెడ్జింగ్సంస్థలతో పోటీ పడాలంటే సామర్థ్యం మరింత మెరుగుపడాలనే ఉద్దేశంతో మరో భారీ డ్రెడ్జర్ కోసం డీసీఐ ప్రణాళికలు సిద్ధం చేసింది. రాబోయే కొన్ని నెలల్లో మరో 12000 మిలియన్ క్యూబిక్ మీటర్ల డ్రెడ్జర్ షిప్ కోసం ఆర్డర్ ఇచ్చేందుకు సన్నద్దమవుతోంది. అంతే కాకుండా.. ఒక కట్టర్ సక్షన్ డ్రెడ్జర్, ఒక వాటర్ ఇంజెక్షన్ డ్రెడ్జర్, మరో టీఎస్హెచ్డీ, డ్రాఫ్ట్ డ్రెడ్జింగ్కు, లోతట్టు జలమార్గాలు, కాలువలు మొదలైన వాటిలో డ్రెడ్జింగ్ కోసం విభిన్న సామర్థ్యాలు కలిగిన ఆరు బీవర్స్ డ్రెడ్జర్లను కూడా కొనుగోలు చేయాలని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ యోచిస్తోంది. స్థిరమైన కార్యకలాపాల కొనసాగించేందుకు డిజిటల్, ఆటోమేషన్, గ్రీన్ డ్రెడ్జింగ్ టెక్నాలజీలను అందిపుచ్చుకొని ప్రపంచ డ్రెడ్జింగ్ సంస్థలతో పోటీ పడేందుకు డీసీఐ అడుగులు వేస్తోంది. కన్సార్టియంలే ఆదుకోవాలి.! డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(డీసీఐ) ఆధునికీకరణకు 4 ప్రధాన పోర్టుల కన్సార్టియం ద్వారా రూ.4,000 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆధునీకరణకు కేటాయించిన నిధులతో అధునాతన డ్రెడ్జర్ల కొనుగోలు, సాంకేతిక అప్గ్రేడేషన్, స్థిరమైన పద్ధతుల ద్వారా డ్రెడ్జింగ్ సామర్థ్యం పెంపొందించుకోవడం, ప్రపంచ డ్రెడ్జింగ్ సంస్థలతో పోటీ పడేలా కొత్త పద్ధతులు ఆకళింపు చేసుకోవడం.. ఇలా అన్ని విభాగాల్లోననూ డీసీఐని అభివృద్ధి చేసేందుకు ఈ నిధులు వినియోగించుకోవాలని కేంద్రం సూచించింది. అదేవిధంగా.. డ్రెడ్జింగ్ మౌలిక సదుపాయాలు బలోపేతం చేసుకోవడం, ఫ్లీట్ ఆధునికీకరణపైనా దృష్టిసారించాలని స్పష్టం చేసింది. -
ఉద్యోగుల ఐడీ కార్డులతో స్టీల్ప్లాంట్లోకి చొరబాటు
90 కిలోల ఇత్తడి, స్క్రాప్తో ఇద్దరు దొంగలు పట్టివేత ఉక్కునగరం: స్టీల్ప్లాంట్లో దొంగతనానికి పాల్పడిన ఇద్దరిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు. ఆ ఇద్దరు దొంగలు ఉద్యోగుల గుర్తింపు కార్డులతో లోపలికి ప్రవేశించడం గమనార్హం. సీఐఎస్ఎఫ్ సిబ్బంది అందించిన వివరాల ప్రకారం.. పెదగంట్యాడకు చెందిన తారకేశ్వరరావు, గోపి సాహూ అనే వ్యక్తులు ప్లాంట్లోని వివిధ విభాగాల నుంచి సుమారు 50 కిలోల ఇత్తడి వస్తువులు, 40 కిలోల ఇనుప స్క్రాప్ దొంగిలించి, బీసీ గేటు సమీపంలోని టవర్–3 వద్ద బయటకు విసిరేశారు. వారు దొంగలిస్తున్న పనిని అటుగా గస్తీ కాస్తున్న సీఐఎస్ఎఫ్ క్రైం బృందం గుర్తించింది. వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా ఛేజింగ్ జరిగింది. ఎట్టకేలకు వారిని పట్టుకుని దొంగిలించిన సాత్తును స్వాధీనం చేసుకున్నారు. వారిని సోదా చేయగా.. వారి వద్ద నుంచి ఆర్ఎంహెచ్పీ, ఎస్ఎంఎస్–2 విభాగాలకు చెందిన ఉద్యోగుల అసలు గుర్తింపు కార్డులు బయటపడటంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఆ ఇద్దరినీ స్టీల్ ప్లాంట్ క్రైం పోలీసులకు అప్పగించారు. క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వాల్తేర్ సెమిట్రీలో ఆత్మల పండగ
డాబాగార్డెన్స్: పరిశుద్ధ ఆత్మల దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని వాల్తేర్ సెమిట్రీలో ఆదివారం ఆల్ సోల్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చనిపోయిన వారి కుటుంబాలు, బంధువులు తమ సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. సమాధులను శుభ్రపరిచి, పువ్వులతో అలంకరించి, కొవ్వొత్తులు వెలిగించారు. ఈ సందర్భంగా వారు సమాధుల ఎదుట నిలబడి ‘డైస్ ఐరే’ అనే లాటిన్ పాటను పాడుతూ, చనిపోయిన వారిని స్మరించుకుంటూ, వారి ఆత్మలు క్షేమంగా ఉండాలని ప్రార్థనలు చేశారు. రోమన్ క్యాథలిక్ సంప్రదాయం ప్రకారం ప్రతి ఏటా నవంబర్ 2న ఈ సకల ఆత్మల దినాన్ని పాటిస్తారని, దీనినే సమాధుల పండగ అని కూడా అంటారని విశాఖ ఆర్చ్ బిషప్ ఉడుముల బాలశౌరి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ మృతుల సంస్కరణ కార్యక్రమంలో వేలాది మంది కథోలిక్ క్రైస్తవులు పాల్గొని, తమ బంధువుల జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారని ఆయన చెప్పారు. -
విశాఖలో యువ దంపతుల ఆత్మహత్య.. ఏం జరిగింది?
తాటిచెట్లపాలెం (విశాఖ): నగరంలోని అక్కయ్యపాలెంలో యువ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఫోర్త్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. భార్య అనిత, తల్లితో కలిసి సూరిశెట్టి వాసు అక్కయ్యపాలెం, దాలిరాజు సూపర్మార్కెట్ సమీపంలో ఉంటున్నారు. ఏడాది క్రితం వీరికి పెళ్లయింది. ప్రస్తుతం అనిత ఏడో నెల గర్భిణి. ఏం జరిగిందో తెలీదుగానీ ఆదివారం వీరిద్దరూ విగతజీవులయ్యారు.వాసు ఫ్యాన్ హుక్కు ఉరేసుకుని చనిపోగా, అనిత మంచం మీద చనిపోయి ఉంది. ఉదయం వాసు తల్లి ఫంక్షన్ నిమిత్తం బయటకెళ్లి సాయంత్రం తిరిగి వచ్చింది. తలుపు ఎంతసేపు కొట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి, కిటీకిలో నుంచి చూసి నిర్ఘాంతపోయింది. తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఇద్దరూ మరణించి కనిపించడంతో ఆమె స్పృహతప్పి పడిపోయింది. స్థానికంగా వాసు, అనితల ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. మరోవైపు.. అనిత ఏడు నెలలు గర్భిణి కావడంతో తీవ్ర విషాదం నెలకొంది. అనిత గర్భంలో ఉన్న బిడ్డను బతికించేందకు పోలీసులు మృతురాలిని ఆస్పత్రికి తరలించారు. కేజీహెచ్కు తీసుకెళ్లినప్పటికీ గర్భంలో ఉన్న ఆడ శిశువు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాలను కేజీహెచ్కు తరలించారు.పలు కోణాల్లో దర్యాప్తువాసు ఉరేసుకొని ఉండగా, అనిత కిందపడి ఉండటంతో ముందు భార్యను చంపి, అతను ఆత్మహత్య చేసుకున్నాడా, లేదా భార్యకు విషమిచ్చి అనంతరం ఉరేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి జరిగినప్పటి నుంచి వీరిద్దరూ అన్యోన్యంగా ఉన్నారు. వీరి మధ్య ఎటువంటి విభేదాలు లేవని, ఆనందంగా ఉండేవారని తల్లి, బంధువులు పోలీసులకు తెలియజేశారు. చుట్టు పక్కల నివాసితులను విచారణ చేస్తున్నారు. -
భక్తుల మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి
బీచ్రోడ్డు: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన సంఘటనలో మృతి చెందిన భక్తుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైఎస్సార్ సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆధ్వర్యంలో ఆదివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మృతి చెందిన భక్తుల ఆత్మకు శాంతి కోరుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల ప్రజలకే కాదు, భక్తులకు కూడా భద్రత కరువైందని కేకే రాజు, వరుదు కల్యాణి ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజల భద్రత, పాలనను గాలికి వదిలేసి, ప్రభుత్వం కేవలం వైఎస్సార్ సీపీ నాయకులను వేధించడానికే పనిచేస్తోందని మండిపడ్డారు. దేవాలయాల్లో భక్తులు మరణించినా లేదా రాష్ట్రంలో ఏదైనా పెద్ద సంఘటనలు జరిగినా, ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను మళ్లించేందుకు ప్రభుత్వం వైఎస్సార్ సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తోందని వారు తీవ్రంగా విమర్శించారు. కాశీబుగ్గ ఘటనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే తప్పుడు కేసులో జోగి రమేష్ను అరెస్టు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో భద్రత లేకుండా పోయిందని, అందుకే తిరుపతి, సింహాచలంలో, ఇప్పుడు కాశీబుగ్గలో భక్తులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల మరణాలకు కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, మృతుల కుటుంబాలకు భారీ నష్టపరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం మృతి చెందిన భక్తుల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాల పాటు నాయకులు మౌనం పాటించారు. కార్యక్రమంలో పార్టీ తూర్పు సమన్వయ కర్త మొల్లి అప్పారావు, గాజువాక సమన్వయ కర్త దేవన్రెడ్డి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బోణి శివరామకృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి పల్లా దుర్గారావు, వార్డు కార్పొరేటర్లు, అధ్యక్షులు పాల్గొన్నారు. -
తీరం చెంత సరదా లోకం
నగరంలో వుడా పార్కు అంటే పిల్లలు ఎగిరి గంతులేస్తారు. ఆర్కే బీచ్ పక్కన సముద్రం ఒడ్డున ఉన్న ఈ పార్కులో పిల్లల కోసం ప్రత్యేకమైన ఆట పరికరాలు, స్కేటింగ్ రింగ్, పచ్చని మైదానాలు, వాకింగ్ ట్రాక్లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ బోటింగ్, యోగా కేంద్రాలు కూడా ప్రత్యేక ఆకర్షణలు. వనభోజనాలకు వచ్చే వారు రోజంతా ఇక్కడ సరదాగా గడపవచ్చు. ఈ పార్కులో ప్రవేశానికి పెద్దలకు రూ. 20, పిల్లలకు రూ. 10 రుసుము చెల్లించాలి. ఆర్కే బీచ్ లేదా ఎంవీపీ కాలనీ మీదుగా బీచ్ రోడ్డు ద్వారా ఈ పార్కుకు చేరుకోవచ్చు.వుడా పార్కు -
యువ దంపతుల ఆత్మహత్య
తాటిచెట్లపాలెం: నగరంలోని అక్కయ్యపాలెంలో యువ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఫోర్త్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. భార్య అనిత, తల్లితో కలిసి సూరిశెట్టి వాసు అక్కయ్యపాలెం, దాలిరాజు సూపర్మార్కెట్ సమీపంలో ఉంటున్నారు. ఏడాది క్రితం వీరికి పెళ్లయింది. ప్రస్తుతం అనిత ఏడో నెల గర్భిణి. ఏం జరిగిందో తెలీదుగానీ ఆదివారం వీరిద్దరూ విగతజీవులయ్యారు. వాసు ఫ్యాన్ హుక్కు ఉరేసుకుని చనిపోగా, అనిత మంచం మీద చనిపోయి ఉంది. ఉదయం వాసు తల్లి ఫంక్షన్ నిమిత్తం బయటకెళ్లి సాయంత్రం తిరిగొచ్చింది. తలుపు ఎంతసేపు కొట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి, కిటీకిలో నుంచి చూసి నిర్ఘాంతపోయింది. తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఇద్దరూ మరణించి కనిపించడంతో ఆమె స్పృహతప్పి పడిపోయింది. స్థానికంగా వాసు, అనితల ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. మరోవైపు.. అనిత గర్భంలో ఉన్న బిడ్డను బతికించేందకు పోలీసులు మృతురాలిని ఆస్పత్రికి తరలించారు. ఫోర్త్టౌన్ సీఐ ఉమాకాంత్ వివరాలు సేకరిస్తున్నారు. -
ఐటీడీపీ సోషల్ మీడియా కనుసన్నల్లోనే పోలీసుల విధులు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర వ్యాప్తంగా ఐటీడీపీ సోషల్ మీడియా కనుసన్నల్లోనే పోలీసులు విధులు నిర్వహిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ పోలీసులు, ఐటీడీపీ కలిసి వైఎస్సార్సీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం మధ్యాహ్నం దురంతో ఎక్స్ప్రెస్ రైలులో ఒక ప్రయాణికుడి వద్ద పట్టుబడ్డ డ్రగ్స్ను ఈగల్ టీమ్, టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, ఈ కేసులో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకుడు కొండారెడ్డి ఉన్నాడంటూ ఐటీడీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయించిందని ఆయన ఆరోపించారు. టీడీపీ నేత పేరు ఎందుకు దాచారు? ఈ కేసులో పోలీసులు ప్రాథమిక సమాచారం ప్రకారం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోందని, వారిలో శ్రీకాకుళం జిల్లా టీడీపీ నాయకుడు మురళీధర్ రావు కుమారుడు సంగి హర్షవర్ధన్ నాయుడు, అలాగే మాడా చరణ్ అనే వ్యక్తులు ఉన్నారని కేకే రాజు పేర్కొన్నారు. అయితే టీడీపీ నాయకుడి కుమారుడు, మరో వ్యక్తి పేర్లను పోలీసులు ఎందుకు బయటపెట్టలేదని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో కేవలం వైఎస్సార్సీపీ జిల్లా విద్యార్థి విభాగం నాయకుడు కొండారెడ్డి ఉన్నట్లుగానే పోలీసులు ఐటీడీపీకి సమాచారం ఇచ్చి ప్రచారం చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. చట్టం ప్రకారమే చర్యలు తీసుకోవాలి చట్టాలకు ఎవరూ చుట్టాలు కాదు. వైఎస్సార్సీపీ ఎప్పుడూ ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కు పాల్పడేవారికి మద్దతివ్వదు. నిజంగా మాదకద్రవ్యాల కేసులో కొండారెడ్డి ఉండి ఉంటే, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని కేకే రాజు స్పష్టం చేశారు. అయితే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పోలీసులు ముందుగా కేసు నమోదు చేసి, వాస్తవాలను మీడియాకు చెప్పి, న్యాయస్థానంలో జడ్జి ముందు నిందితులను ప్రొడ్యూస్ చేసి, శిక్ష పడేలా చేయాలన్నారు. అలా కాకుండా చట్ట విరుద్ధంగా, టీడీపీ నాయకులు, కార్యకర్తల్లాగా పోలీసులు వ్యవహరించడం సరికాదని, పోలీసులు విచారణ చేయడం మానేసి టీడీపీ కోసం పనిచేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న అందరినీ బహిర్గతం చేసి, అందరికీ శిక్ష పడేలా చేయాలని కేకే రాజు డిమాండ్ చేశారు. -
పైరు పోయింది.. కన్నీరు మిగిలింది
మోంథా తుపాను ఆరుగాలం శ్రమించే రైతన్నకు గుండెకోతను మిగిల్చింది. ఖరీఫ్పైనే ఆశలు పెట్టుకున్న అన్నదాతకు వేదన మిగిల్చింది. వరద ముంపు ముప్పును అంచనా వేయడంలో ప్రభుత్వ వైఫల్యం.. రైతుల్ని నిలువునా ముంచేసింది. మోంథా వెళ్లి.. మూడు రోజులైనా.. ఇంకా పొలాలు చెరువులుగానే దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టి.. పంట కోసం ఎదురుచూస్తున్న రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. భరోసా ఇవ్వాల్సిన సర్కారు.. బూటకపు మాటలు మాట్లాడుతోంది. పంట నష్టం పక్కాగా అంచనా వెయ్యాల్సిన అధికారులు.. ౖపైపె లెక్కలతో మమా అనిపించేశారు. జిల్లాలో మొత్తం 5 మండలాలు తుపాను ప్రభావిత మండలాలుగా మారగా.. ఇందులో 350 ఎకరాలకు పైగా పంటలు వర్షార్పణం కాగా.. అధికారులు మాత్రం.. కేవలం 286 ఎకరాల పంటే నష్టం వాటిల్లిందని కాకి లెక్కలు చూపిస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: విశాఖ జిల్లాలో 11 మండలాలుండగా వ్యవసాయ సాగు మండలాలు నాలుగు ఉన్నాయి. భీమిలి నియోజకవర్గంలోని భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాలతో పాటు పెందుర్తి మండలంలోనూ తుపాను బీభత్సం సృష్టించింది. అధికారులు ఈ నాలుగు మండలాల్లో కేవలం 286.88 ఎకరాల్లో మాత్రమే వరిపంటకు నష్టం వాటిల్లిందని చూపిస్తున్నా.. వాస్తవానికి మాత్రం దాదాపు 350 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో రైతులను కలిసి.. ఊరికి సమీపంలో ఉన్న పొలాలు చూసి.. తూతూ మంత్రంగానే నష్ట అంచనాను నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఉద్యాన పంటలకు సంబంధించిన నష్టం అంచనా వేసేందుకు అధికారులు కనీసం గ్రామాల్లోకి రాలేదని పొడుగుపాలెంలో నీటమునిగిన వరిచేనుపెట్టుబడి అంతా గంగలో కలిసిపోయింది సప్టా నుంచి నీరు కొట్టుకురావడం వల్ల 2 ఎకరాల పొలం మొత్తం మునిగిపోయింది. ఎకరానికి సుమారు రూ.30 వేల వరకూ పెట్టుబడి పెట్టాం. ఇప్పు డు నీరు తప్ప పొలంలో ఏమీ కనిపించడం లేదు. ఇప్పుడేం చేయాలో అర్థం కావడంలేదు. ప్రభుత్వం కూడా ఇంతవరకూ ఎలాంటి హామీ ఇవ్వలేదు. –బంటుబిల్లి జోగినాయుడు, రైతు, పొడుగుపాలెంమూడెకరాలు మునిగిపోయాయి 3 ఎకరాల వరి పొలం వెన్ను దశకు చేరుకుంది. పంట బాగా వస్తుందని అనుకున్నాం. కానీ తుపాను మా ఆశలను చిదిమేసింది. మోకాలు లోతు నీళ్లలో పంట ఉండిపోయింది. మొత్తం చేనంతా కుళ్లిపోయింది. మళ్లీ ఎరువులు వేస్తే బతికే అవకాశం ఉన్నా.. నీరు పోయేందుకు మరో 5 రోజులు పడుతుంది. –పశురెడ్డి గురుమూర్తి, రైతు, ఏనుగుల పాలెం -
ఆలయాల్లో ఆగని మృత్యుఘోష
సాక్షి, విశాఖపట్నం: గుడికి వెళ్లి దండం పెట్టుకునేలోపే.. కొందరు దేవుడి దగ్గరికే వెళ్లి పోతున్నారు. భగవంతుడి దర్శనం, దీపదర్శనం చేసుకున్న రోజే.. వారి ఇంట చితి మంటలు వెలిగే రోజుగా మారుతోంది. దైవనామ స్మరణ వినిపించాల్సిన ఆలయాల్లో.. ఆర్తనాదాలు, హాహాకారాలు వినిపిస్తున్నాయి. భక్తుల రద్దీతో కళకళలాడాల్సిన ఆలయాలు.. తొక్కిసలాటలు, గోడ కూలిన ఘటనలతో భయాందోళన కలిగిస్తున్నాయి. మొన్న పవిత్ర తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం సమయంలో జరిగిన తొక్కిసలాట, నిన్న సింహాచలం చందనోత్సవ ఘటనలు కళ్లముందే మెదులుతుండగా.. తాజాగా మన పక్క జిల్లా శ్రీకాకుళంలో కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనతో భక్తజనం ఉలిక్కిపడింది. సింహగిరిపై గోడ కూలి... ఈ ఏడాది ఏప్రిల్ 30న సింహాచలం చందనోత్సవం వేళ.. నృసింహుని నామస్మరణతో మారుమోగాల్సిన సింహగిరిపై హాహాకారాలు మిన్నంటాయి. సింహాచలేశుని దర్శించుకుని తరించాలనుకున్న భక్తులు.. స్వామి నిజరూప దర్శనం కాకమునుపే ఆలయ ప్రహరీ కూలిన ఘటనలో ఏడుగురు నిర్జీవులుగా మారారు. ఈ ఘటన యావత్ రాష్ట్రాన్ని విషాదంలో నెట్టింది. భవిష్యత్తులో ఏ ఆలయంలోనూ ఇలాంటి ఘటనలు పునరావృతం కావంటూ అప్పుడు ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ, ఆ మాట చెప్పి ఏడు నెలలైనా గడవక ముందే.. మరో ఆలయం మృత్యు ద్వారాలు తెరిచింది. పవిత్రమైన కార్తీక ఏకాదశి రోజున శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని కలియుగ వేంకటేశ్వరుని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు.. తొక్కిసలాటలో చిక్కుకుని మృత్యుఒడికి చేరుకున్నారు. ఈ ఘోర దుర్ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రత్యేక రోజుల్లో భక్తుల భద్రత పట్టదా? ఇలాంటి శుభ దినాల్లో స్వామిని దర్శించుకునేందుకు ఆలయాలకు వెళ్లాలంటేనే భక్తులు భయపడాల్సిన దుస్థితి దాపురించింది. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం సమయంలో తొక్కిసలాట జరిగినప్పుడే ప్రభుత్వం మేల్కొని.. రాష్ట్రంలోని చిన్నా పెద్దా అన్ని ఆలయాల వద్ద ముఖ్యమైన పండగలు, శుభదినాల సమయంలో రద్దీని అంచనా వేసి, దానికి తగ్గట్టు ఏర్పాట్లు, భద్రతపై దృష్టిసారించాల్సింది. కానీ.. ఘటన జరిగిన కొద్ది రోజులకే కూటమి ప్రభుత్వం అంతా మరిచిపోయింది. ఆ తర్వాత కొద్ది కాలానికే ప్రభుత్వ నిర్లక్ష్యం మరోసారి బయటపడి.. సింహాచలం చందనోత్సవంలో ఏడుగురు భక్తులు మృతి చెందారు. ఆ ఘటన జరిగిన వారం రోజుల వరకు ఆలయాల్లో హడావుడి చేసిన యంత్రాంగం.. ఆ తర్వాత అంతా గాలికి వదిలేసింది. ఇప్పుడు మరోసారి అమాయక భక్తులు బలయ్యారు. ముందస్తు చర్యలు శూన్యం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. కాశీబుగ్గ ఘటన మూడో పెద్ద దుర్ఘటన. ముఖ్యమైన రోజుల్లో ఆలయాలకు భక్తులు ఊహించని రీతిలో వస్తుంటారు. దాని ప్రకారం ముందస్తు అంచనాలు వేసి, ఏర్పాట్లు చేయాల్సి ఉంది. కొన్ని ప్రైవేట్ ఆలయాలకూ భక్తుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ కూడా పోలీసు భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. కానీ.. ఇవేమీ పట్టనట్లుగా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా.. తరచూ విషాద ఘటనలకు ఆలయాలు కేంద్రాలుగా మారుతున్నాయి. దీంతో ఆలయాలకు వెళ్లాలంటేనే భక్తులు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరిచి.. కార్తీక మాసం, మార్గశిర మాసాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఆలయంలోనూ భద్రత, ఏర్పాట్లపై సమీక్ష చేయాలని భక్తులు కోరుతున్నారు. -
ఉత్సాహంగా కార్నివాల్
కొమ్మాది: బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా రుషికొండలోని గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ మిషన్ భవన్(టీసీఆర్టీఎం)లో శనివారం ఉత్సాహంగా కార్నివాల్ జరిగింది. ముందుగా గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎస్.భార్గవి, కలెక్టర్ హరేందిర ప్రసాద్ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. టీసీఆర్టీఎంలో గిరిజన స్వాతంత్య్ర పోరాటయోధుల చిత్ర పటాలకు పుష్పాంజలి ఘటించి, ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్నివాల్లో రాష్ట్రంలోని వివిధ ఐటీడీఏలకు చెందిన గిరిజన కళాకారులు ప్రదర్శించిన థింసా, మయూరి, కొమ్ము, కోయ, సవర వంటి సంప్రదాయ గిరిజన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ దేశ స్వాతంత్య్ర పోరాటంలో గిరిజన వీరుల త్యాగాలను స్మృరించుకోవడం అందరి బాధ్యత అన్నారు. ఇలాంటి ఉత్సవాల ద్వారా గిరిజన ప్రాంతాల సామాజిక–ఆర్థిక అభివృద్ధి, సాంస్కృతిక వారసత్వం, జాతీయ గౌరవాన్ని కాపాడటానికి రాబోయే తరాలను ప్రేరేపిస్తుందన్నారు. కార్యక్రమంలో ఈడీ డా.రాణిమందా, నాగరాజు చిక్కాల తదితరులు పాల్గొన్నారు. -
సముద్రంలో పదో తరగతి విద్యార్థి గల్లంతు
పరవాడ: ముత్యాలమ్మపాలెం తీరం వద్ద సముద్రంలో ఈతకు వెళ్లిన కశింకోట మండలం తోటకూరవానిపాలేనికి చెందిన సూరెడ్డి భాను ప్రసాద్(15) గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న సీఐ ఆర్.మల్లికార్జునరావు ఘటనా స్థలికి వెళ్లి ప్రమాదానికి గల కారణాలను తోటి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలివి.. భానుప్రసాద్ తానాం ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ తానాం జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. తన నలుగురు స్నేహితులైన ఎస్.రామచంద్ర(అనకాపల్లి మండలం వల్లూరు), మర్లపల్లి సిద్ధు(అచ్యుతాపురం మండలం మడుతూరు), ఆర్.దుర్గాప్రసాద్(పరవాడ మండలం తానాం), మొల్లి చందు(అనకాపల్లి మండలం కొత్తూరు)లతో కలిసి శనివారం ఉదయం హాస్టల్ నుంచి బయలుదేరాడు. 9.30 గంటలకు ముత్యాలమ్మపాలెం తీరానికి చేరుకొని అందరూ సముద్రంలో ఈతకు దిగారు. కొంత సేపటికి భాను ప్రసాద్ను బలమైన కెరటం లోపలకు లాక్కుపోయింది. తమ స్నేహితుడిని రక్షించడానికి మిగిలిన వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కెరటాల ఉధృతికి భానుప్రసాద్ లోపలికి కొట్టుకుపోయాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గాలించినా ప్రయోజనం లేకపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామని సీఐ మల్లికార్జునరావు చెప్పారు. -
వరుస విషాదాలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యం కారణంగానే వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయ ని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు విమర్శించారు. విశాఖలో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం, కాశీబుగ్గలో ఆలయంలో తొక్కిసలాట ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనాలని ఆయన మండిపడ్డారు. ఎంవీపీ కాలనీలోని సమత డిగ్రీ కళాశాల విద్యార్థి కోన సాయితేజ ఆత్మహత్య సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని రాజు విచా రం వ్యక్తం చేశారు. విద్యాసంస్థల్లో విద్యార్థులపై వేధింపులు, మానసిక ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతున్నా ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్నారు. సాయితేజ మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాశీబుగ్గ ఘటనపై దిగ్భ్రాంతి: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది భక్తులు మృతి చెందడం పట్ల కేకే రాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆలయాల వద్ద ఇలాంటి దురదృష్టకర సంఘటనలు పెరిగిపోయాయన్నారు. కార్తీక మాసంలో భక్తుల రద్దీని అంచనా వేయడంలో, తగిన భద్రతా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం, పోలీస్ ఇంటెలిజెన్స్ పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. తిరుపతి, సింహాచలం ఘటనల తర్వాత కూడా పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందన్నారు. ఈ రెండు ఘటనల్లోనూ మరణించిన వారి కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కేకే రాజు డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు -
వేటే!
కేసు పెడితే కూటమి నేతలు మద్యం సేవించి వాహనాలు నడిపినా కేసులు పెట్టవద్దా? తాగి తందనాలాడినా అటువైపు చూడొద్దా? ఒక వేళ కేసు నమోదు చేసినా కూటమి నేత అని తెలిసిన వెంటనే.. కేసు వెనక్కి తీసుకోవాలా? వాహనాన్ని ఇచ్చేసి తూచ్ అనేయాలా? లేకుంటే వెంటనే బదిలీ వేటు వేసేస్తారా? తాజాగా స్టీల్ ప్లాంట్ ట్రాఫిక్ ఎస్ఐ సురేష్ బదిలీ వ్యవహారాన్ని గమనిస్తే ఇదే అర్థమవుతోంది. ● డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు తీసేయడం కుదరదన్న స్టీల్ప్లాంట్ ట్రాఫిక్ ఎస్ఐ సురేష్ ● 2 గంటలపాటు ఎస్ఐతో పరవాడ మండల టీడీపీ అధ్యక్షుడు వాగ్వాదం ● రంగంలోకి దిగిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే అనధికారి ఓఎస్డీ.. ఎస్ఐ బదిలీ ● అవినీతి ఆరోపణలతోనే ఎస్ఐ బదిలీ అంటున్న పోలీస్ కమిషనర్ సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసినందుకు ట్రాఫిక్ ఎస్ఐపై సరెండర్ వేటు వ్యవహారం ఇప్పుడు పోలీసు వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. స్టీల్ ప్లాంట్ ట్రాఫిక్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేసే ఎస్.సురేష్ విధుల్లో భాగంగా శుక్రవారం రాత్రి దేశపాత్రునిపాలెం సమీపంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. టీడీపీ పరవాడ మండల అధ్యక్షుడు చిన్న మద్యం సేవించి వాహనాన్ని నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో అడ్డంగా దొరికిపోయారు. అయితే కేసు నమోదు చేయవద్దంటూ ఎస్ఐతో ఆయన వాదనకు దిగినట్టు తెలుస్తోంది. అప్పటికే పరీక్ష చేయడంతో నేరుగా సమాచారం పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళుతుందని.. కేసు పెట్టకుండా చేయడం సాధ్యం కాదని వివరించినట్టు సమాచారం. అధికార పార్టీకి చెందిన తనపైనే కేసు ఎలా నమోదు చేస్తారంటూ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. సుమారు రెండు గంటలపాటు వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది. అదే సామాజికవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే అనధికారి ఓఎస్డీగా ఉన్న బంధువు రంగంలోకి దిగి సదరు ఎస్ఐను బదిలీ చేయాలంటూ ఒత్తిళ్లు చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సదరు ఎస్ఐను విశాఖపట్నం రేంజ్కు బదిలీ చేసినట్టు తెలుస్తోంది. కనీస విచారణ చేయకుండా..! ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల సందర్భంగా ఏదైనా సమస్య ఉంటే.. ఎస్ఐ ప్రవర్తన వ్యవహారంలో ఫిర్యాదులు వస్తే విచారణ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఎస్ఐ సురేష్ వ్యవహారంలో అటువంటి విచారణ ఏదీ జరగలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తప్పతాగి వాహనం నడిపిన అధికారపార్టీ నేత ఫిర్యాదుతో ఏకంగా ఎస్ఐపై బదిలీ వేటు వేయడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే తాగిన మైకంలో అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. పలువురి జీవితాలను బలి తీసుకుంటున్నాయి. కర్నూలు జిల్లాలో 19 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయిన ఘటన కళ్ల ముందు ఇంకా కదలాడుతున్నప్పటికీ.. తాగి నడిపిన వ్యక్తిపై కేసు నమోదు చేసినందుకు ఎస్ఐపై చర్యలు తీసుకోవడం ద్వారా పోలీసింగ్పై ప్రభావం పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అవినీతి ఆరోపణలతోనే సదరు ఎస్ఐపై చర్యలు తీసుకుని.. విశాఖ రేంజ్ డీఐజీకి సరెండర్ చేశామని నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చి ‘సాక్షి’కి తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టినందుకు ఎస్ఐపై రివెంజ్ సీనియర్ ఎమ్మెల్యే అనధికారి ఓఎస్డీ ఒత్తిడితో గంటలోపే రేంజ్కు బదిలీ గంటలోనే వేటు..! డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో అడ్డంగా దొరికిపోయిన టీడీపీ పరవాడ మండల అధ్యక్షుడు చిన్న పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగడంతోపాటు అధికార పార్టీకి చెందిన నేతనే అడ్డుకుంటావా అని చిందులు వేసినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేస్తే నీ అంతుచూస్తానని బెదిరించినట్లు సమాచారం. సదరు ఎస్ఐ కేసు తీసేయడం కుదరదని ఖరాఖండిగా తేల్చిచెప్పడంతో తమ సామాజికవర్గానికే చెందిన ఎమ్మెల్యే అనధికారి ఓఎస్డీగా వ్యవహరిస్తున్న బంధువుకు విషయం చేరవేసినట్టు సమాచారం. సదరు అనధికార ఓఎస్డీ రంగంలోకి దిగి గంటలోనే ఎస్ఐను విశాఖపట్నం రేంజ్కు బదిలీ చేయించినట్టు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన నేతలపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైతే బదిలీ బహుమానంగా ఇస్తారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి కొద్దిరోజుల క్రితం సదరు సీనియర్ ఎమ్మెల్యే కుటుంబ కార్యక్రమానికి అనధికార ఓఎస్డీ భారీగా దండుకున్నారనే ఆరోపణలపై దూరంగా ఉంటున్నారనే ప్ర చారం జరుగుతోంది. తాజా వ్యవహారంతో ఇప్పటికీ సదరు అనధికార ఓఎస్డీ చక్రం తిప్పుతున్నట్టు అర్థమవుతోంది. -
హత్య చేసి.. స్వామి అవతారమెత్తి..
అల్లిపురం: ఒక హత్య కేసులో నిందితుడు.. చట్టం కళ్లుగప్పి నాలుగేళ్లుగా పరారీలో ఉన్నాడు. పోలీసులకు దొరకకుండా ఏకంగా హిమాలయాలకు వెళ్లి.. భైరవ స్వామిగా అవతారమెత్తాడు. కాశీ, కేదార్నాథ్లో నాగసాధువులతో కలిసి తిరుగుతూ.. తన గతాన్ని పూర్తిగా చెరిపేశాననుకున్నాడు. కానీ టూటౌన్ పోలీసులు పక్కా వ్యూహంతో, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి.. ఈ దొంగ స్వామి గుట్టును రట్టు చేశారు. శనివారం నగరంలో అడుగుపెట్టిన అతడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. టూటౌన్ పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి ఈ ఆపరేషన్ వివరాలను వెల్లడించారు. గుర్తు తెలియని వ్యక్తిని చాకుతో హత్య చేసి.. నగరంలోని కల్లుపాకలో నివసిస్తున్న ఇసుకతోటకు చెందిన పిచ్చేటి యుగంధర్ (39) అలియాస్ రాఘవపై 2021లో ఒక హత్య కేసు నమోదైంది. గుర్తు తెలియని వ్యక్తిని చాకుతో యుగంధర్ హత్య చేశాడు. ఈ కేసులో అరెస్టయిన అతను కొన్నాళ్లకు బెయిల్పై బయటకు వచ్చాడు. అప్పటి నుంచి కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతనిపై టూటౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ కూడా ఉంది. నగరంలో రెండవ అదనపు చీఫ్ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ అతనిపై నాన్–బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో.. సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు ఈ కేసుపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆపరేషన్ భైరవ స్వామి: డీసీపీ మేరీ ప్రశాంతి పర్యవేక్షణలో, ఏసీపీ లక్ష్మణమూర్తి, టూటౌన్ సీఐ వీవీసీఎం ఎర్రంనాయుడు, ఎస్ఐలతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయుధంగా చేసుకుని యుగంధర్ ఆచూకీ కోసం గాలించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. యుగంధర్ తన రూపురేఖలు మార్చుకుని.. ఏకంగా హిమాలయాలకు మకాం మార్చినట్లు తేలింది. కాశీ, కేదార్ నాథ్, బద్రీనాథ్ వంటి పుణ్యక్షేత్రాల్లో భైరవ స్వామి పేరుతో నాగసాధువులతో కలిసి తిరుగుతున్నట్లు నిర్ధారించుకున్నారు. తరచూ తన నివాసాన్ని మారుస్తూ పోలీసులకు దొరక్కుండా తప్పించుకున్నాడు. పక్కా స్కెచ్తో అరెస్ట్ : అయినా పోలీసులు తమ నిఘాను మరింత పటిష్టం చేశారు. యుగంధర్ సన్నిహితుల కదలికలపై సాంకేతిక నిఘా కొనసాగించారు. ఈ క్రమంలో యుగంధర్ శనివారం నగరానికి వస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన స్పెషల్ టీమ్.. రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే క్వార్టర్స్ వద్ద మాటు వేసింది. భైరవ స్వామి అవతారంలో, మారువేషంలో సంచరిస్తున్న యుగంధర్ను గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నాలుగేళ్లుగా చట్టానికి దొరక్కుండా.. స్వామీజీ వేషంలో తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న టూటౌన్ సీఐ ఎర్రంనాయుడు, అతని సిబ్బందిని సీపీ ప్రత్యేకంగా అభినందించారు. యుగంధర్ అసలు రూపం భైరవ స్వామిగా యుగంధర్ -
పార్కులు ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి
కలెక్టర్ హరేందిర ప్రసాద్ మహారాణిపేట: నగరంలోని పార్కులు, పర్యాటక ప్రాంతాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఎం. ఎన్. హరేందిర ప్రసాద్ ఆదేశించారు. ఈ నెల 14, 15వ తేదీల్లో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు దేశ, విదేశాల నుంచి ప్రముఖులు వస్తున్నారని.. వారు పర్యాటక ప్రాంతాలను వీక్షించే అవకాశం ఉందన్నారు. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించారు. గాలా డిన్నర్ ఏర్పాటుకు తగిన ప్రదేశాన్ని గుర్తించడంలో భాగంగా శనివారం ఆయన వివిధ పార్కులను సందర్శించారు. వీఎంఆర్డీఏ పార్కు, ఎంజీఎం పార్కు, సీ–హారియర్స్, టీయూ–142, సబ్ మైరెన్, తెన్నేటి పార్కులను పరిశీలించి.. అధికారులతో చర్చించారు. పార్కింగ్, భోజన వసతి, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు అనువుగా ఉండే ప్రాంతాలపై ఆరా తీశారు. పార్కుల్లో అవసరమైన మేరకు అభివృద్ధి పనులు చేపట్టాలని, మరమ్మతులు చేయించాలని, మొక్కలు నాటాలని సూచించారు. ఆయన వెంట వీఎంఆర్డీఏ సీఈ వినయ్ కుమార్, ఎస్ఈ భవానీ శంకర్, కార్యదర్శి మురళీకృష్ణ, డీఎఫ్వో శివాని ఇతర అధికారులు ఉన్నారు. -
పైరు పోయింది.. కన్నీరు మిగిలింది
రైతులు చెబుతున్నారు. నీట ముంపునకు గురైన వరి మొదళ్లు కుళ్లిపోయాయనీ.. మళ్లీ పంటని నిలబెట్టుకోవాలంటే.. నీరు మొత్తం ఇంకిపోయిన తర్వాతే సాధ్యమవుతుందని రైతులు చెబుతున్నారు. అయితే వరద నీరు మొత్తం పోయేందుకు మరో 15 రోజుల సమయం పడుతుందని ఈలోగా.. పంట మొత్తం కుళ్లిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నీరు ఎండిపోయే దశలో ఉన్నా.. పంట బతికించుకోవాలంటే ఎరువులు అవసరమనీ.. అయితే ఎరువులు సక్రమంగా దొరికే పరిస్థితి లేకపోవడంతో.. వాటిపైనా ఆశలు వదిలేసుకున్నామంటూ రైతులు వాపోతున్నారు. ఉద్యానవన శాఖ ఎక్కడ.? ఉద్యానవన శాఖ అధికారుల తీరైతే మరీ దారుణం. ఇంతవరకూ ఏ ఒక్క హార్టికల్చర్ అధికారీ.. ముంపు ప్రాంతాల్లో పర్యటించలేదని కొందరు గ్రామస్తులు చెబుతున్నారు. చాలా ప్రాంతాల్లో మిరప, బొప్పాయి పంటలు ధ్వంసమయ్యాయి. అయినా. హార్టికల్చర్ అధికారులు మాత్రం ఉద్యాన పంటలు ఎక్కడా నష్టం వాటిల్లలేదని నివేదికలు ఇవ్వడం గమనార్హం. -
విశాఖ: బిల్డింగ్పై నుంచి దూకేస్తాం.. సమతా కాలేజీ వద్ద ఉద్రిక్తత
సాక్షి, విశాఖపట్నం: నగరంలోని సమతా కాలేజీ వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. మహిళా లెక్చరర్ లైంగిక వేధింపులకు గురిచేశారనే కారణంతో విశాఖ సమతా కాలేజీలో డిగ్రీ ఫైనలియర్ విద్యార్థి సాయితేజ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. న్యాయం చేయాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. భవనంపై నుంచి దూకేస్తామని విద్యార్థులు హెచ్చరించారు.సాయితేజ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని విద్యార్థులు చెబుతున్నారు. యాజమాన్యం న్యాయం చేయకపోతే బిల్డింగ్పై నుంచి దూకేస్తానంటూ సాయితేజ సోదరుడు హెచ్చరించారు. న్యాయం జరిగేవరకు ఆందోళన విరమించేది లేదని విద్యార్థులు తేల్చి చెప్పారు.విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని సమత డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థి కోన సాయితేజ బలవన్మరణం కలకలం రేపింది. ఇద్దరు మహిళా అధ్యాపకుల వేధింపులతోనే సాయితేజ ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు, అతడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సహచర విద్యార్థులు, తల్లిదండ్రులు పోలీసులకు తెలిపిన మేరకు.. తోటి విద్యార్థులతో సరదాగా ఉండే సాయితేజ కొంతకాలంగా తరగతులకు హాజరుకావడంలేదు. ఈ క్రమంలో ఇద్దరు మహిళా అధ్యాపకులు వేధిస్తున్నట్లు తల్లిదండ్రులు, తమ్ముడి వద్ద పలుమార్లు వాపోయాడు.ఐదో సెమిస్టర్లో భాగంగా స్టాటిస్టిక్స్ రికార్డ్ పూర్తిచేసి ఇటీవల అధ్యాపకురాలికి సబ్మిట్ చేశాడు. అందులో కరెక్షన్స్ ఉన్నాయంటూ ఆమె రికార్డ్ను రిజెక్ట్ చేస్తూ వచ్చారు. దీంతో కొన్ని రోజులుగా సాయితేజ మరింత మనస్తాపానికి గురయ్యాడు. చాలాసార్లు కరెక్షన్లు చేసినా అధ్యాపకురాలు రికార్డ్ తీసుకోలేదు. దీంతో మరోసారి కరెక్షన్స్ చేసి సబ్మిట్ చేసేందుకు గురువారం తల్లిదండ్రులతో కలిసి కాలేజీకి వెళ్లాడు. సాయంత్రం వరకు ఆ అధ్యాపకురాలు కళాశాలకు రాకపోవడంతో తిరిగి వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం కళాశాలకు వెళదామని తల్లిదండ్రులు చెప్పారు.ముందు మీరు వెళ్లండి, నేను తరువాత వస్తా.. అని సాయితేజ తల్లిదండ్రులకు, తమ్ముడికి చెప్పాడు. వారు కళాశాలకు వెళ్లి ఎంతసేపు చూసినా.. సాయితేజ రాలేదు. ఫోన్ కూడా తీయలేదు. దీంతో ఇసుకతోటలోని ఇంటికి వెళ్లిన వారికి సాయితేజ ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించి, అతడిని మెడికవర్ హాస్పటల్కు తరలించారు. అప్పటికే సాయితేజ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం ఎంవీపీ పోలీసులు అక్కడికు చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్కి తరలించారు.ఏడాది కాలంగా సాయితేజ ఇద్దరు మహిళా అధ్యాపకుల వేధింపులకు గురవుతున్నట్లు సహచర విద్యార్థులు, కుటుంబసభ్యులు ఆరోపించారు. సహచర విద్యార్థులతో పాటు తమ్ముడికి కూడా సాయితేజ చాలాసార్లు ఈ విషయాన్ని చెప్పినట్లు వెల్లడించారు. ఒక అధ్యాపకురాలు ‘ఉదయాన్నే నన్ను ఎందుకు విష్ చేయడంలేదు.. నిన్ను కలవాలని ఉంది.. శివాజీపార్క్కి వస్తావా?.. నాగురించి ఒకసారైనా ఆలోచించవా..’ వంటి మెసేజ్లు పంపటంతో పాటు తరచు వాట్సాప్ కాల్స్ చేస్తూ లైంగికంగా వేధిస్తున్నట్లు సాయితేజ చెప్పాడని స్నేహితులు తెలిపారు. మరో అధ్యాపకురాలు సబ్జెక్ట్ పరంగా వేధిస్తున్నట్లు ఆరోపించారు. -
నిన్ను కలవాలని ఉంది.. శివాజీపార్క్కి వస్తావా?
ఎంవీపీకాలనీ: విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని సమత డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థి కోన సాయితేజ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్న అతడి బలవన్మరణం కలకలం రేపింది. ఇద్దరు మహిళా అధ్యాపకుల వేధింపులతోనే సాయితేజ ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు, అతడి తల్లిదండ్రులు ఆరోపించారు. కళాశాల విద్యార్థులు ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. సహచర విద్యార్థులు, తల్లిదండ్రులు పోలీసులకు తెలిపిన మేరకు.. తోటి విద్యార్థులతో సరదాగా ఉండే సాయితేజ కొంతకాలంగా తరగతులకు హాజరుకావడంలేదు. ఈ క్రమంలో ఇద్దరు మహిళా అధ్యాపకులు వేధిస్తున్నట్లు తల్లిదండ్రులు, తమ్ముడి వద్ద పలుమార్లు వాపోయాడు. ఐదో సెమిస్టర్లో భాగంగా స్టాటిస్టిక్స్ రికార్డ్ పూర్తిచేసి ఇటీవల అధ్యాపకురాలికి సబి్మట్ చేశాడు. అందులో కరెక్షన్స్ ఉన్నాయంటూ ఆమె రికార్డ్ను రిజెక్ట్ చేస్తూ వచ్చారు. దీంతో కొన్ని రోజులుగా సాయితేజ మరింత మనస్తాపానికి గురయ్యాడు. చాలాసార్లు కరెక్షన్లు చేసినా అధ్యాపకురాలు రికార్డ్ తీసుకోలేదు. దీంతో మరోసారి కరెక్షన్స్ చేసి సబి్మట్ చేసేందుకు గురువారం తల్లిదండ్రులతో కలిసి కాలేజీకి వెళ్లాడు. సాయంత్రం వరకు ఆ అధ్యాపకురాలు కళాశాలకు రాకపోవడంతో తిరిగి వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం కళాశాలకు వెళదామని తల్లిదండ్రులు చెప్పారు. ముందు మీరు వెళ్లండి, నేను తరువాత వస్తా.. అని సాయితేజ తల్లిదండ్రులకు, తమ్ముడికి చెప్పాడు. వారు కళాశాలకు వెళ్లి ఎంతసేపు చూసినా.. సాయితేజ రాలేదు. ఫోన్ కూడా తీయలేదు. దీంతో ఇసుకతోటలోని ఇంటికి వెళ్లిన వారికి సాయితేజ ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించి, అతడిని మెడికవర్ హాస్పటల్కు తరలించారు. అప్పటికే సాయితేజ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం ఎంవీపీ పోలీసులు అక్కడికు చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్కి తరలించారు. ఏడాదిగా లైంగిక వేధింపులు ఏడాది కాలంగా సాయితేజ ఇద్దరు మహిళా అధ్యాపకుల వేధింపులకు గురవుతున్నట్లు సహచర విద్యార్థులు, కుటుంబసభ్యులు ఆరోపించారు. సహచర విద్యార్థులతో పాటు తమ్ముడికి కూడా సాయితేజ చాలాసార్లు ఈ విషయాన్ని చెప్పినట్లు వెల్లడించారు. ఒక అధ్యాపకురాలు ‘ఉదయాన్నే నన్ను ఎందుకు విష్ చేయడంలేదు.. నిన్ను కలవాలని ఉంది.. శివాజీపార్క్కి వస్తావా?.. నాగురించి ఒకసారైనా ఆలోచించవా..’ వంటి మెసేజ్లు పంపటంతోపాటు తరచు వాట్సాప్ కాల్స్ చేస్తూ లైంగికంగా వేధిస్తున్నట్లు సాయితేజ చెప్పాడని స్నేహితులు తెలిపారు. మరో అధ్యాపకురాలు సబ్జెక్ట్ పరంగా వేధిస్తున్నట్లు ఆరోపించారు. సాయితేజ ఆత్మహత్యకు కారణమైన ఆ ఇద్దరు మహిళా అధ్యాపకులపై చర్యలు తీసుకోవాలంటూ కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అనంతరం లైంగిక వేధింపులకు సంబంధించిన వాట్సాప్ సందేశాల జిరాక్స్లను ఏబీవీపీ ప్రతినిధి నితిన్తో కలిసి కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావుకు అందజేశారు. సాయితేజ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎంవీపీ పోలీసులు తెలిపారు. ఫిర్యాదుతో పాటు వాట్సాప్ సందేశాల ప్రతులను కూడా పోలీసులకు అందించారు. దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. -
అందని సాయంపై ఆగ్రహజ్వాల
మర్రిపాలెం(విశాఖ జిల్లా)పూసపాటిరేగ(విజయనగరం జిల్లా)/కాకినాడ రూరల్: మోంథా తుపాను బాధితులకు నష్టపరిహారం అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. దొడ్డిదారిన పచ్చచొక్కాలకు పరిహారాన్ని పరిమితం చేసింది. అసలైన బాధితులను మోసగించింది. పునరావాస కేంద్రాల్లో నిద్రించిన వారికే పరిహారం అంటూ సాకులు వెతికింది. వాస్తవానికి తుపాను సమయంలో బంధువుల ఇళ్లలో తలదాచుకోవాలని అధికారులు, సిబ్బందే సూచించి.. ఇప్పుడు పరిహారానికి ఎగనామం పెట్టడంపై బాధితులు భగ్గుమంటున్నారు. ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. కూటమి ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. దీంతో బాధితులకు సమాధానం చెప్పలేక ఎమ్మెల్యేలు మెల్లిగా జారుకుంటున్నారు. వాంబేకాలనీవాసుల ఆగ్రహం మోంథా తుపాను ప్రభావంతో విశాఖపట్నం 51వ వార్డు మాధవధార వాంబే కాలనీలో ఇళ్లు పెచ్చులూడిపోయాయి. తుపాను సమయంలో కలెక్టర్ హరేందిర ప్రసాద్, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్రాజు కాలనీలో ఇళ్లను పరిశీలించి బాధితులను మాధవధార మాధవస్వామి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి వెళ్లాలని సూచించారు. అయితే సిబ్బంది మాత్రం అవకాశం ఉన్నవారు బంధువుల ఇళ్లకు వెళ్లాలని చెప్పారు. ఆ సమయంలో అందరి కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు తీసుకుని వారి పేర్లు కూడా నమోదు చేసుకున్నారు. పునరావాస కేంద్రానికి 60 కుటుంబాలు వెళ్లగా, మరికొందరు బంధువుల ఇళ్ల వద్ద తలదాచుకున్నారు. తీరా నష్టపరిహారం విషయానికి వచ్చేసరికి అధికారులు చాలామందికి ఎగనామం పెట్టారు. వాంబేకాలనీలో 80 కుటుంబాలు ఉండగా, శుక్రవారం మాధవధార ఆర్టీవో కార్యాలయం సమీపంలోని కార్యాచరణ ప్రణాళిక కార్యాలయం(పీ–4)లో జరిగిన పరిహారం పంపిణీ కార్యక్రమంలో 30 కుటుంబాలకు మాత్రమే నిత్యావసరాలతోపాటు రూ.3వేల నగదు అందించారు. దీంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజును నిలదీశారు. ఎమ్మెల్యే వారికి నచ్చజెప్పే యత్నం చేయగా.. వారు వినలేదు. దీంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు లక్ష్మి, పైడిపల్లి సత్యవతి, నాగమణి తదితరులు మాట్లాడుతూ తమకు తక్షణం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జనసేన ఎమ్మెల్యే నాగమాధవిపై బాధితుల ఆగ్రహం విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవికి శుక్రవారం చేదు అనుభవం ఎదురయింది. మోంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు బియ్యం పంపిణీకి వచి్చన ఆమెను కోనాడ గ్రామ బాధితులు నిలదీశారు. గ్రామంలో 590 మత్స్యకార కుటుంబాలు ఉంటే కేవలం మత్స్యకార భరోసా అందిన 27 కుటుంబాలకే బియ్యం ఇవ్వడంపై ధ్వజ మెత్తారు. ఎమ్మెల్యేను నిలదీశారు. అందరికీ బియ్యం అందించాలని డిమాండ్ చేశారు. దీంతో ఎమ్మెల్యే బియ్యం పంపిణీ చేయకుండానే పోలీసుల సాయంతో గ్రామం నుంచి వెళ్లిపోయారు. అనంతరం కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డిని కలిసిన మత్స్యకార నాయకులు అందరికీ బియ్యం అందించాలని వినతిపత్రం అందించారు. గత ప్రభుత్వంలో వివక్ష లేకుండా సాయం పంపిణీ చేశారని వివరించారు. కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యేకూ నిరసన సెగ కాకినాడ రూరల్ మండలం పోలవరం, సూర్యారావు పేట గ్రామాలలోని మత్స్యకారులకు శుక్రవారం బియ్యం పంపిణీ చేయడానికి వచ్చిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీని తుపాను బాధితులు నిలదీశారు. నేమాం గ్రామ పరిధిలోని సూర్యారావుపేటలో సుమారు 245 మత్స్యకార కుటుంబాలు ఉంటే కేవలం 48 కుటుంబాలనే నష్టపరిహారానికి ఎంపిక చేయడం తగదని నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనకారుల్లో ఎక్కువ మంది టీడీపీ సానుభూతిపరులు ఉండడం గమనార్హం. దీంతో ఎమ్మెల్యే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అనంతరం తమ్మవరం గ్రామ పరిధిలోని పోలవరంలోనూ ఎమ్మెల్యేకు నిరసన సెగ తగిలింది. గ్రామంలో 250 కుటుంబాలు ఉంటే 77 కుటుంబాలను ఎంపిక చేయడమేమిటని ప్రశ్నించారు. అందరికీ ఇస్తేనే తీసుకుంటామని సరుకులు తీసుకునేందుకు నిరాకరించారు. అలాగే సూర్యారావుపేటలో సులభ్ కాంప్లెక్స్ నిర్మించకపోవడంతో స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. -
అరకుకు ప్రత్యేక రైళ్లు
తాటిచెట్లపాలెం: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం కె.పవన్కుమార్ తెలిపారు. ● అరకు–యళ్లహంక(08551) స్పెషల్ ఎక్స్ప్రెస్ నవంబరు 13, 23వ తేదీల్లో మధ్యాహ్నం 12 గంటలకు అరకులో బయల్దేరి అదే రోజు మధ్యాహ్నం 3.28 గంటలకు దువ్వాడకు, మరుసటి రోజు ఉదయం 10.15 గంటలకు యళ్లహంక చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో యళ్లహంక–అరకు(08552) స్పెషల్ ఎక్స్ప్రెస్ నవబంరు 14, 24వ తేదీల్లో మధ్యాహ్నం 1.30 గంటకు యళ్లహంకలో బయల్దేరి, మరుసటిరోజు ఉదయం 10 గంటలకు దువ్వాడకు, మధ్యాహ్నం 2.30 గంటలకు అరకు చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైళ్లు ఇరువైపులా బొర్రాగుహలు, ఎస్.కోట, కొత్తవలస, దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నంద్యాల, గుత్తి, ధర్మవరం, సత్యసాయిప్రశాంతి నిలయం స్టేషన్లలో ఆగుతాయి. ● అరకు–యళ్లహంక(08555) స్పెషల్ ఎక్స్ప్రెస్ నవంబరు 17, 24వ తేదీల్లో మధ్యాహ్నం 12 గంటలకు అరకులో బయల్దేరి అదేరోజు మధ్యాహ్నం 3.28 గంటలకు దువ్వాడకు, మరుసటి రోజు ఉదయం 10.15 గంటలకు యళ్లహంక చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో యళ్లహంక–అరకు(08556) స్పెషల్ రైలు నవబంరు 18, 25వ తేదీల్లో మధ్యాహ్నం 2గంటలకు బయల్దేరి యళ్లహంకలో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 10 గంటలకు దువ్వాడకు, మధ్యాహ్నం 2.30 గంటలకు అరకు చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైళ్లు ఇరువైపులా బొర్రాగుహలు, ఎస్.కోట, కొత్తవలస, దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నంద్యాల, గుత్తి, ధర్మవరం, సత్యసాయిప్రశాంతి నిలయం స్టేషన్లలో ఆగుతాయి. ● శ్రీకాకుళం రోడ్–బెంగళూరు కంటోన్మెంట్ (08553) స్పెషల్ ఎక్స్ప్రెస్ నవంబరు 21న మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీకాకుళం రోడ్లో బయల్దేరి అదేరోజు సాయంత్రం 5.05 గంటలకు విశాఖపట్నం, మరుసటిరోజు మధ్యాహ్నం 2.45 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బెంగళూరు కంటోన్మెంట్–శ్రీకాకుళం రోడ్ (08554) స్పెషల్ రైలు నవంబరు 24వ తేదీన మధ్యాహ్నం 2గంటలకు బెంగళూరు కంటోన్మెంట్లో బయల్దేరి, మరుసటిరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు విశాఖపట్నం, అదేరోజు సాయంత్రం 5 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. ● భువనేశ్వర్–బెంగళూరు కంటోన్మెంట్ (08463) స్పెషల్ ఎక్స్ప్రెస్ నవంబరు 16వ తేదీ ఉదయం 6.15 గంటలకు భువనేశ్వర్లో బయల్దేరి అదేరోజు మధ్యాహ్నం 3.28 గంటలకు దువ్వాడకు, మరుసటి రోజు మధ్యాహ్నం 11.55 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బెంగళూరు కంటోన్మెంట్–భువనేశ్వర్ (08464) స్పెషల్ రైలు నవంబరు 20వ తేదీ ఉదయం 5.30 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్లో బయల్దేరి, మరుసటిరోజు తెల్లవారు 2గంటలకు దువ్వాడకు, అదేరోజు ఉదయం 10.15గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. -
నేడు ఈఎన్సీ చీఫ్ పదవీ విరమణ
సాక్షి, విశాఖపట్నం : ఈస్ట్రన్ నేవల్ కమాండ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ నేడు పదవీ విరమణ చేయనున్నారు. 2023 ఆగస్ట్ 1న తూర్పు నౌకాదళాధిపతిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. 1987లో భారత నౌకాదళంలో ప్రవేశించిన ఆయన యాంటీ సబ్మైరెన్ వార్ఫేర్ స్పెషలిస్ట్గా తక్కువ కాలంలోనే పేరు సంపాదించారు. పలు యుద్ధ నౌకల కెప్టెన్గా విధులు నిర్వర్తించి.. మహారాష్ట్ర నేవల్ ఏరియా ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్గా పదోన్నతి పొందారు. అనంతరం నేషనల్ డిఫెన్స్ అకాడెమీ ఇన్స్ట్రక్టర్గా వ్యవహరించారు. కమాండర్ హోదాలో స్టాఫ్ రిక్రూట్మెంట్ డైరెక్టర్గానూ, నెట్సెంట్రిక్ ఆపరేషన్స్లో ప్రిన్సిపల్ కమాండర్గా, నేవల్ డైరెక్టరేట్(పర్సనల్)లో ప్రిన్సిపల్ డైరెక్టర్గా విధులు నిర్వర్తించారు. 2016లో రియర్ అడ్మిరల్ హోదాలో డిఫెన్స్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీలో అసిస్టెంట్ చీఫ్గా బాధ్యతలు చేపట్టారు. పశ్చిమ నౌకాదళం చీఫ్ స్టాఫ్ ఆఫీసర్గా, ఫ్లాగ్ ఆఫీసర్గా, ఇండియన్ కోస్ట్గార్డ్, నేవీలో సీ ట్రైనింగ్ అధికారిగా విధులు నిర్వర్తించారు. ఈఎన్సీ చీఫ్గా రాకముందు.. నేవల్ హెడ్క్వార్టర్స్లో డైరెక్టర్ జనరల్ నేవల్ ఆపరేషన్స్(డీజీఎన్వో)గా బాధ్యతలు చేపట్టారు. మిలాన్–2024తో పాటు మలబార్, టైగర్ ట్రయాంఫ్.. ఇలా ఎన్నో కీలక నౌకాదళ విన్యాసాలు వైస్ అడ్మిరల్ పెంధార్కర్ సారథ్యంలో విశాఖలో విజయవంతంగా నిర్వహించారు. పెంధార్కర్కు వీడ్కోలు కార్యక్రమం శుక్రవారం నిర్వహించేందుకు తూర్పు నౌకాదళంలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. -
విపత్తు వచ్చే కంటే ముందు సన్నద్ధత, విపత్తు తీవ్రతను నివారించేందుకు తీసుకునే చర్యలు అత్యంత కీలకం. జిల్లా యంత్రాంగం ప్రదర్శించిన నిర్లక్ష్య ధోరణితో వేలాది ఎకరాల పంట నేలపాలవ్వడమే కాక అనేక గ్రామాలు నీటమునిగాయి. రాంబిల్లి, ఎస్.రాయవరం సరిహద్దుల్లో ఏర్పాటవుతున్
● ప్రమాదాన్ని అంచనా వేయలేకపోయిన అధికారులు ● కొరవడిన అప్రమత్తత, సన్నద్ధత వైఫల్యానికి మూల్యం.. వరద బీభత్సం రాంబిల్లి (అచ్యుతాపురం): రాంబిల్లి మండలంలో మేజర్, మైనర్ శారదా నదులకు బుధవారం అర్ధరాత్రి గండిపడింది. బుధవారం తుపాను తీవ్రత తగ్గడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు ముందున్న గండాన్ని అంచనా వేయలేకపోయారు. వారి అలసత్వానికి భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. రైవాడ జలాశయం నుంచి భారీ ఎత్తున నీటిని విడుదల చేసిన అధికారులు.. అందుకు తగ్గట్టుగా ప్రభావిత ప్రాంతాలను అప్రమత్తం చేయలేకపోయారు. సముద్రతీరానికి ఆనుకొని ఉన్న రాంబిల్లితోపాటు, యలమంచిలి, అచ్యుతాపురం, మునగపాక, కశింకోట మండలాలకు ఆనుకొని ఉన్న శారదా నదీ ప్రవాహ ప్రాంతాల్లో పరిస్థితి చేజారుతుందని గతంలో అప్రమత్తం అయ్యేవారు. కానీ ఇప్పుడు రాంబిల్లి, మునగపాక మండలాల్లో మారుతున్న పరిస్థితిని అధికారులు అంచనా వేయలేకపోయారు. తదనుగుణంగానే మునగపాక మండలంలోని యాదగిరిపాలెం వరద ముంపులోకి వెళ్లిపోయింది. రాంబిల్లి మండలంలోని నారాయణపురం వద్ద మైనర్ శారదా నదికి గండిపడటంతో ఆ ప్రాంత పరిసరాలన్నీ నీటి దిగ్బంధంలోకి వెళ్లిపోయాయి. మేజర్ శారదా నదికి రజాల అగ్రహారం, కొప్పుగొండుపాలెం పరిసరాల్లో గండి పడటంతో సుమారు రెండు వేల ఎకరాలకు పైగా పంట భూములు ,చేపల చెరువులు వరదమయం అయ్యాయి. శారదా నదికి గండి పడిన వైపు ఉన్న మర్రిపాలెం, కట్టబోలు, మురకాడ, తెరువుపల్లి, దిమిలి, నారాయణపురం గ్రామాల పరిధిలోని పంటంతా నీటి పాలవ్వడంతో గురువారం రాత్రి ఎలా గడుస్తుందోనన్న ఆందోళన నెలకొంది. అప్రమత్తమై ఉంటే.. మైనర్ శారదా నది గట్లు బలహీనంగా ఉన్నాయని అప్పటికే రైతులు ఇసుక బస్తాలు వేసుకొని గట్లను పటిష్టం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో అధికార గణం అప్రమత్తమై ఉంటే కాస్త నష్ట తీవ్రత తగ్గి ఉండేది. నారాయణపురం కెనరా బ్యాంక్ వద్ద పడిన గండి, రజాల అగ్రహారం పరిధిలోని మేజర్ శారదా నదికి పడిన గండితో అధికారుల్లో కలవరం మొదలయ్యింది. సహాయక చర్యలు చేపట్టాల్సిన కొందరు సిబ్బంది దిమిలి పరిసరాల్లో వాహనాల్లో సేద తీరినట్లు కొందరు గుర్తించారు. కొత్తూరు వద్ద నిమ్మతోటలో చిక్కుకుపోయిన ఒక వ్యక్తిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. అష్ట దిగ్భంధనంలో వై.లోవ శారదా నదికి రెండో వైపున్న కలవలాపల్లి, వై.లోవ గ్రామాల్లోకి శారదా నది నుంచి వచ్చిన వరద నీటితో తమ పుట్టీలు, వలలు కొట్టుకుపోయాయని స్థానికులు చేసిన ఫిర్యాదుకు స్పందన లేకపోయింది. భవిష్యత్ అవసరాల కోసం నేవల్ బేస్ తీసుకున్న కొండల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించడం వై.లోవ ముంపు తీవ్రత పెరిగేందుకు కారణం అయ్యింది. వై.లోవ పరిధిలో నిరాశ్రయులైన 30 కుటుంబాలను రాంబిల్లి పునరావాసానికి గురువారం తరలించారు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన వైఎస్సార్సీపీ నేతలు కరణం ధర్మశ్రీ, బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ.. కాంట్రాక్టర్కు సహకరిస్తున్న అఽధికారులు గ్రామాల తరలింపు, పునరావాసం, నదుల గట్ల పటిష్టత, అప్రమత్తతపై శ్రద్ధ చూపలేదని ఆరోపించారు. వరద వల్ల ఐదు వేల ఎకరాలు నీట మునగగా..1056 ఎకరాలు మాత్రమే ముంపునకు గురయ్యాయని జిల్లా స్థాయి అధికారి సెలవివ్వడం గమనార్హం. వరద ఉధృతికి నీట మునిగిన వై.లోవ గ్రామం -
వరదనీటిలో స్వయంభూ లింగం
●ముంపునకు గురైన వామలింగేశ్వర ఆలయం వరదనీటితో నిండిన వామలింగేశ్వర ఆలయం, (ఇన్సెట్) వరద నీటి మధ్యలో దర్శనమిస్తున్న స్వయంభూ లింగం మాకవరపాలెం: పెద్దమిల్లు జంక్షన్లో ఉన్న వామలింగేశ్వరాలయం వరద నీటిలో చిక్కుకుంది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి ఆలయంలో లోపలకు భారీగా నీరు చేరింది. ఆలయ ఆవరణే కాకుండా గర్భగుడిలో ఉన్న స్వయంభూ లింగం సైతం నీట మునిగింది. దీంతో కార్తీక మాసంలో జరిగే నిత్య పూజలకు అవకాశం లేకుండా పోయింది. భారీ వర్షాలు కురిసినపుడల్లా ఆలయం పక్కనే ఉన్న జంగం గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తుంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత వర్షాలకు ఈ గెడ్డ నుంచి వెళ్లే వరదనీటి కారణంగా ఈ ఆలయం ముంపునకు గురైంది. చాలాకాలంగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని భక్తులు ఆవేదన చెందుతున్నారు. శాశ్వత నివారణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
తునిపొలంలో తీవ్ర విషాదం
గెడ్డలో విద్యార్థిని గల్లంతు పద్మనాభం : స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు గెడ్డలో పడి విద్యార్థిని గల్లంతవడంతో తునిపొలం గ్రామంలో విషాదం నెలకొంది. మద్ది పంచాయతీ తునిపొలం గ్రామానికి చెందిన కాళ్ల ధనుశ్రీ (12) గురువారం మధ్యాహ్నం మరో ముగ్గురితో కలిసి గ్రామ సమీపంలోని పల్లె గెడ్డ వద్దకు వెళ్లింది. అక్కడ కాలు జారి పడిపోయింది. విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గెడ్డ వద్దకు చేరుకునేసరికే ధనుశ్రీ గల్లంతైంది. కాళ్ల శ్రీను, గౌరి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో ధనుశ్రీ చిన్నది. పెద్ద కుమార్తె పద్మనాభం మండలం కృష్ణాపురంలోని కస్తూర్బా విద్యాలయంలో చదువుతోంది. ధనుశ్రీ మద్ది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ధనుశ్రీ గల్లంతు విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ భీమునిపట్నం నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), జెడ్పీ వైస్ చైర్మన్ సుంకర గిరిబాబు, ఎంపీపీ కంటుబోతు రాంబాబు సంఘటన స్థలాన్ని సందర్శించారు. ధనుశ్రీ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. భీమునిపట్నం ఆర్డీవో సంగీత్ మాధుర్ సంఘటన ప్రాంతాన్ని సందర్శించారు. -
రూ.30 లక్షల నష్టపరిహారం చెల్లించాలి
మహారాణిపేట: విశాఖ ఫిషింగ్ హార్బర్ సెంట్రల్ డాక్ ప్రాంతంలో మత్స్యకారుడు మేరుగ ధనరాజుకు చెందిన బోటు తుపాను అలల తాకిడికి మునిగిపోయింది. బాధిత మత్స్యకారుడికి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రూ.30 లక్షల నష్టపరిహారం చెల్లించాలని వైఎస్సార్ సీపీ దక్షిణ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మునిగిపోయిన బోటును పరిశీలించి, బాధిత మత్స్యకారుడిని పరామర్శించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ పాలనలో ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా.. అప్పటి ప్రభుత్వం ముందుండి తక్షణ సహాయక చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు. గతంలో ఇక్కడ ఒక బోటు కాలిపోతే.. అప్పటికప్పుడే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆ మత్స్యకారుడికి రూ.36 లక్షలను అందించిందన్నారు. నేటి కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. మునిగిపోయిన బోటుకు తక్షణమే ప్రభుత్వం రూ.30 లక్షల నష్టపరిహారం చెల్లించి, మత్స్యకారుడిని ఆదుకోవాలని కోరారు. ఆయన వెంట పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, స్థానిక మత్స్యకారులు ఉన్నారు. -
ఎక్మోపై 500 కి.మీ. ప్రయాణం
మహారాణిపేట: ఒకటి కాదు, రెండు కాదు.. మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయం.. ఇలా శరీరంలోని కీలక అవయవాలన్నీ ఒక్కసారిగా విఫలమయ్యాయి. 25 ఏళ్ల యువ ఇంజినీర్ ప్రాణాలు కోల్పోయే స్థితికి చేరుకున్నాడు. ఒడిశాలోని భువనేశ్వర్లో ఆశలు వదులుకున్న తరుణంలో.. విశాఖపట్నం కిమ్స్ ఐకాన్ ఆస్పత్రి వైద్యులు ముందడుగు వేశారు. అత్యాధునిక పోర్టబుల్ ఎక్మో సపోర్ట్తో 500 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణించి.. అరుదైన క్యాన్సర్కు సైతం చికిత్స అందించి ఆ యువకుడికి పునర్జన్మ ఇచ్చారు. ఈ సంక్లిష్టమైన కేసుకు సంబంధించిన వివరాలను కిమ్స్ ఐకాన్ క్రిటికల్ కేర్, ఎక్మో విభాగాధిపతి డాక్టర్ రవికృష్ణ గురువారం మీడియాకు వివరించారు. భువనేశ్వర్ నుంచి విశాఖకు.. భువనేశ్వర్లోని ఓ ఆస్పత్రిలో చేరిన యువకుడు, బహుళ అవయవాల వైఫల్యంతో ‘కార్డియోజెనిక్ షాక్’లోకి వెళ్లాడు. పరిస్థితి చేయిదాటిపోవడంతో అక్కడి వైద్యులు కిమ్స్ ఐకాన్ను సంప్రదించారు. తక్షణమే డాక్టర్ రవి కృష్ణ నేతృత్వంలోని ప్రత్యేక ‘ఎక్మో రిట్రీవల్ బృందం’ భువనేశ్వర్ బయల్దేరింది. ‘మేము అక్కడికి చేరుకునేసరికే రోగి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. వెంటనే అక్కడే అతనికి పోర్టబుల్ ఎక్మో అమర్చాము. ఊపిరితిత్తులు, గుండె పనిని ఆ యంత్రమే చూసుకుంటుండగా, 500 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణాన్ని అంబులెన్స్లో ప్రారంభించాం. మధ్యలో రక్త పరీక్షల కోసం కేవలం ఒక్కసారి మినహా, ఎక్కడా ఆగకుండా విశాఖకు తీసుకొచ్చాం’అని డాక్టర్ రవికృష్ణ తెలిపారు. ఇక్కడికి తీసుకువచ్చాక, యువకుడికి ఊపిరితిత్తులు పూర్తిగా పనిచేయకపోవడం, మెదడులో రక్తస్రావం, కాలేయం, మూత్రపిండాల వైఫల్యం ఉన్నట్లు నిర్ధారించారు. ఎక్మోపైనే ఉంచి నైట్రిక్ ఆకై ్సడ్ వంటి అత్యాధునిక చికిత్సలు అందించారు. ఈ చికిత్సలకు రోగి శరీరం వేగంగా స్పందించింది. అవయవాలు తిరిగి కోలుకోవడం ప్రారంభించాయి. కేవలం ఐదు రోజుల్లోనే ఎక్మో సహా అన్ని సపోర్ట్ సిస్టమ్స్ను తొలగించి, యువకుడిని ప్రాణాపాయం నుంచి బయటపడేశారు. బయటపడిన అరుదైన క్యాన్సర్ రోగి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాక, అసలు ఈ పరిస్థితికి కారణమేంటని వైద్యులు లోతుగా పరిశీలించారు. రెండేళ్లుగా అతనికి తీవ్రమైన ఆందోళన, చెమటలు పట్టడం వంటి లక్షణాలు ఉన్నట్లు తెలిసింది. పరీక్షల్లో ఫియోక్రోమోసైటోమా అనే అత్యంత అరుదైన, ప్రాణాంతక సమస్య ఉన్నట్లు తేలింది. అడ్రినల్ గ్రంథిపై ఏర్పడిన క్యాన్సర్ కణితి కారణంగా, అడ్రినలిన్ హార్మోన్ నియంత్రణ లేకుండా అధికంగా స్రవించడమే ఈ అవయవాల వైఫల్యానికి అసలు కారణమని గుర్తించారు. 9 రోజుల చికిత్స అనంతరం రోగిని డిశ్చార్జ్ చేసి, నాలుగు వారాల తర్వాత తదుపరి శస్త్రచికిత్స కోసం పిలిపించారు. సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీనారాయణ, ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ శ్రావణి పర్యవేక్షణలో, సీనియర్ అనస్థటిస్టులు డాక్టర్ సోమరాజు, డాక్టర్ అప్పలరాజుల సహకారంతో లాప్రోస్కోపిక్ పద్ధతిలో ఆ కణితిని విజయవంతంగా తొలగించారు. అది మొదటి దశ క్యాన్సర్గానే ఉందని, ఇతర భాగాలకు విస్తరించలేదని నిర్ధారించారు. ప్రస్తుతం ఆ యువ ఇంజినీర్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నాడని డాక్టర్ రవికృష్ణ వెల్లడించారు. -
మార్గశిర మాసోత్సవాల పందిరి రాటకు ఆహ్వానం
మహారాణిపేట : మార్గశిర మాసోత్సవాల నేపథ్యంలో శనివారం జరగనున్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి పందిరి రాట మహోత్సవానికి కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ను ఆలయ అధికారులు సాదరంగా ఆహ్వానించారు. ఆలయ ఈవో కె.శోభారాణి, ఇతర అధికారులు, అర్చకులు కలెక్టర్ను గురువారం తన చాంబర్లో కలిసి ఆహ్వాన పత్రికను, అమ్మవారి ప్రసాదాన్ని అందజేసి ఆహ్వానం పలికారు. అమ్మవారి ఆలయంలో శనివారం మార్గశిర మాసోత్సవాలకు అంకురార్పణ జరగనుండగా.. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
తప్పుల్లో స్మార్ట్
మహారాణిపేట: ఎంతో ఆర్భాటంగా కూటమి ప్రభుత్వం పంపిణీ చేస్తున్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు లబ్ధిదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. పాత బియ్యం కార్డుల స్థానంలో వచ్చిన ఈ స్మార్ట్ కార్డులు అందుకున్నామని సంతోషించే లోపే, వాటిలోని అంతులేని తప్పులు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. పేర్లు తారుమారు కావడం, వయసులు తప్పుగా పడటం, చిరునామాలు మారిపోవడంతో.. ఇవి ప్రయోజనం చేకూర్చకపోగా, భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలకు ఎక్కడ దూరం చేస్తాయోనని కార్డుదారులు లబోదిబోమంటున్నారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా 642 రేషన్ డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో 5,17,155 రేషన్ కార్డులున్నాయి. గతంలో కార్డుదారులకు మాన్యువల్గా తయారుచేసిన రేషన్ కార్డులను పంపిణీ చేసేవారు. ఇలా కాదని.. తాము వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టామని, స్మార్ట్ కార్డులు ఇస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. అనుకున్నదే తడవుగా ఎలాంటి పరిశీలన లేకుండానే ఇష్టమొచ్చినట్లు కార్డులు ముద్రించేసింది. పంపిణీ బాధ్యతను గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందికి, రేషన్ డీలర్లకు అప్పజెప్పింది. ఇలా జిల్లాకు చేరిన మొత్తం 5,17,155 స్మార్ట్ కార్డులను సెప్టెంబర్ 26 నుంచి పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకు 4,58,759 కార్డులు అంటే 89 శాతం పంపిణీ చేసినట్లు డీఎస్వో వి.భాస్కరరావు తెలిపారు. ఇంకా 58,396 కార్డులు పంపిణీ కావాల్సి ఉంది. అయితే కార్డుల కోసం చాలా మంది లబ్ధిదారులు రేషన్ డిపోలు, వార్డు సచివాలయాలు, ఏఎస్వో, డీఎస్వో కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ‘మా దగ్గర లేవు’ అనే సమాధానమే వస్తోందని వాపోతున్నారు. చిరునామాలు గల్లంతయ్యాయ్.. కొత్తగా ముద్రించిన స్మార్ట్ కార్డుల్లో తప్పులకు కొదవే లేదు. భార్య స్థానంలో కూతురి పేరు, ఒక ప్రాంతంలో నివసించే వారికి మరో ప్రాంతం చిరునామా(ఉదాహరణకు కంచరపాలెంలో ఉన్నవారికి వేపగుంట, పెందుర్తి అని ముద్రించడం), పిల్లల పేర్లు పూర్తిగా గల్లంతు కావడం, వయసుల్లో భారీ తేడాలు, పేర్లలో అక్షరదోషాలు, చివరకు జిల్లాలు కూడా తప్పుగా ముద్రించి ఉన్నాయని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. ఈ రేషన్ కార్డు కేవలం నిత్యావసర సరుకులకే కాకుండా, పలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, ఆరోగ్య ప్రయోజనాలకు అత్యంత కీలకం. ఆధార్, మొబైల్ నంబర్తో అనుసంధానించే ఈ కీలక పత్రంలో వివరాలు తప్పుగా ఉంటే, భవిష్యత్తులో అధికారులు పథకాలను తిరస్కరించే ప్రమాదం ఉందని ప్రజలు భయపడుతున్నారు. అయితే, ఈ తప్పులను ఎలా సవరించుకోవాలో తెలియక ప్రజలు పూర్తి అయోమయంలో ఉన్నారు. సచివాలయాలకు వెళితే ‘ఇంకా సవరణకు ఆప్షన్ రాలేదు’ అని సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. తప్పులతో కార్డులు ముద్రించి, ఇప్పుడు సవరణకు అవకాశం ఇవ్వకపోవడంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి.. తప్పుల సవరణకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. కార్డుల ముద్రణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇలాంటి పరిస్థితి తలెత్తి ఉండేది కాదని అభిప్రాయపడుతున్నారు. ప్రజల నుంచి ఛీత్కారాలు అనుకున్నదొకటి..అయ్యిందొకటి.. అన్న చందంగా ఉంది కూటమి సర్కారు తీరు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపట్టిన మంచి కార్యక్రమాల ముద్రను చెరిపేసేందుకు కూటమి సర్కారు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే అమ్మ ఒడి, రైతు భరోసా, పెన్షన్ కానుక,ఆరోగ్యశ్రీ వంటి వాటి పేర్లు మార్చేసింది. తాజాగా రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా స్మార్ట్ కార్డులు అందిస్తోంది. అయితే ఈ ప్రక్రియ హడావుడిగా చేపట్టడంతో స్మార్ట్ కార్డులు తప్పుల తడకలుగా ఉన్నాయని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. స్మార్ట్ కార్డుల పేరిట హడావుడి చేసి.. క్రెడిట్ కొట్టేద్దామనుకున్న ప్రభుత్వానికి చివరకు ప్రజల నుంచి ఛీత్కారాలే ఎదురవుతున్నాయి. -
కై లాసగిరి ఘాట్లో విరిగిపడిన కొండచరియలు
ఆరిలోవ: మోంథా తుపాను ప్రభావం ప్రముఖ పర్యాటక కేంద్రమైన కై లాసగిరిని కూడా తాకింది. నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు కై లాసగిరి ఘాట్ రోడ్డుపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటన వాహనాల రాకపోకలు లేని తెల్లవారుజామున జరగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వరుస వర్షాలకు ఘాట్ రోడ్డు అంచులు బాగా నానిపోయాయి. గురువారం వేకువజామున కురిసిన వర్షానికి కొండ అంచుల్లోని మట్టి, రాళ్లు విరిగి రోడ్డుపై పడ్డాయి. కొన్ని చోట్ల మట్టి గుట్టలుగా జారిపడగా.. మరికొన్ని చోట్ల పెద్ద పెద్ద బండరాళ్లు సైతం రోడ్డు మధ్యలోకి దొర్లాయి. గురువారం ఉదయం విధులకు వెళ్లిన సిబ్బంది వెంటనే స్పందించి.. అడ్డుగా పడిన బండరాళ్లను, మట్టిని తొలగించి రోడ్డును కొంతవరకు శుభ్రం చేశారు. రాళ్లను రోడ్డు అంచున కుప్పలుగా వేశారు. ప్రస్తుతం ఘాట్ రోడ్డులోని మలుపుల వద్ద కొండ అంచులు ఇంకా బలహీనంగా, ఊగుతున్నట్లుగా కనిపించడం పర్యాటకులను, సిబ్బందిని కలవరపరుస్తోంది. అధికారులు తక్షణమే ఘాట్ రోడ్డులో భద్రతా చర్యలు చేపట్టాలని సందర్శకులు కోరుతున్నారు. బీచ్రోడ్డులో.. అలాగే బీచ్రోడ్డులోని సీతకొండ మలుపు, తెన్నేటి పార్కు, కై లాసగిరి కొండ మలుపు వద్ద మట్టితో రాళ్లు జారిపడ్డాయి. సీతకొండ మలుపు వద్ద సుమారు 20 మీటర్ల వరకు పెద్ద బండలు ఫుట్పాత్ నుంచి రోడ్డు మధ్య వరకు చేరాయి. వాటిని జీవీఎంసీ సిబ్బంది తొలగించి కొండ అంచున కుప్పగా వేశారు. మలుపు వద్ద కొంత ఎత్తులో రక్షణ గోడ నిర్మించాలని వాహనచోదకులు, స్థానికులు కోరారు. -
హెచ్ఆర్ఏ పునరుద్ధరణ ఎప్పుడు?
ఉక్కునగరం: స్టీల్ప్లాంట్ ఉద్యోగులు కోల్పోయిన ఇంటి అద్దె భత్యం(హెచ్ఆర్ఏ) పునరుద్ధరణ కోసం నిరీక్షిస్తున్నారు. ప్రతి నెలా కనీసం రూ.12 వేల నుంచి రూ.18 వేల వరకు ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ కీలక అంశానికి సంబంధించి యాజమాన్యంపై ఉక్కు అధికారుల సంఘం, కార్మిక సంఘాలు గట్టిగా ఒత్తిడి తీసుకురాకపోవడం పట్ల ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది స్టీల్ప్లాంట్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టినప్పుడు.. యాజమాన్యం అనేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా కొన్ని ఆర్థిక ప్రయోజనాలకు కోత విధించింది. మొదట్లో 50 శాతం జీతం మాత్రమే చెల్లించడం ప్రారంభించారు. ఆ తర్వాత క్రమంగా 65 శాతం, ఒక్కోసారి 75 శాతం జీతం చెల్లిస్తూ.. మిగిలిన మొత్తాన్ని బకాయిలుగా చూపించారు. ఆ సమయంలో కార్మికులకు బేసిక్, డీఏ తర్వాత అతిపెద్ద కాంపొనెంట్గా ఉన్న హెచ్ఆర్ఏను పూర్తిగా నిలిపివేశారు. దాని ఫలితంగా, సగటు కార్మికుడు నెలకు రూ.12 వేల నుంచి రూ.18 వేలు చొప్పున, వెరసి సంవత్సరానికి సుమారు రూ.లక్షన్నర నుంచి రూ.రెండు లక్షల వరకు నష్టపోయారు. ఆ సమయంలో కార్మిక సంఘాలు అనేక ఆందోళనలు నిర్వహించాయి. ఈ క్రమంలో రీజినల్ లేబర్ కమిషనర్ (ఆర్ఎల్సీ) సమక్షంలో జరిగిన చర్చల్లో, ప్లాంట్ పరిస్థితి మెరుగుపడినప్పుడు హెచ్ఆర్ఏను పునరుద్ధరిస్తామని, బకాయిలు కూడా చెల్లిస్తామని యాజమాన్యం అంగీకరించింది. లాభాల బాట పట్టినా... స్టీల్ప్లాంట్ ఉద్యోగుల కష్ట ఫలితంగా, మూడు బ్లాస్ట్ఫర్నేస్లు ప్రారంభమై ప్రస్తుతం 90 శాతం ఉత్పత్తి సామర్థ్యంతో ముందుకు సాగుతున్నాయి. రెండు ఫర్నేస్లు ప్రారంభించిన నాటి నుంచి వెనుదిరిగి చూడకుండా కొన్ని నెలలు లాభాలు కూడా వచ్చాయి. మూడవ ఫర్నేస్ కూడా విజయవంతంగా కొనసాగుతుండటంతో, ఈ నెల నుంచి మరింత లాభాలు సాధించగలమని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఉద్యోగుల ఆర్థిక సమస్యలు మాత్రం అలాగే ఉండిపోయాయి. 13 నెలల తర్వాత ఉద్యోగులు నూరు శాతం జీతం అందుకున్నప్పటికీ.. వారి వేతన బకాయిలు మాత్రం 355 శాతానికి చేరుకున్నాయి. ఇదిలా ఉండగా ప్లాంట్ పరిస్థితి మెరుగుపడితే హెచ్ఆర్ఏను పునరుద్ధరిస్తామని ఇచ్చిన హామీని యాజమాన్యం నిలబెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. సెయిల్తో సమానంగా 2017 నుంచి జరగాల్సిన వేతన ఒప్పందం జరగకపోవడంతో ఇప్పటికే వేల రూపాయలు ఆర్థికంగా నష్టపోతున్న కార్మికులు.. ఇప్పుడు హెచ్ఆర్ఏను కూడా పొందలేకపోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంఘాల వైఫల్యంపై ఉద్యోగుల ఆగ్రహం ఈ ముఖ్యమైన విషయంలో యాజమాన్యంతో నిరంతరం చర్చించి ఒప్పించాల్సిన అధికారుల అసోసియేషన్, కార్మిక సంఘాలు విఫలమయ్యాయని చెప్పాలి. ముఖ్యంగా గుర్తింపు సంఘం నుంచి ఎటువంటి స్పందన రావడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. గుర్తింపు సంఘం ఇతర కార్మిక సంఘాలను కలుపుకుని యాజమాన్యంతో చర్చించి, తక్షణమే హెచ్ఆర్ఏ పునరుద్ధరణకు కృషి చేయాలని కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
తగ్గని గోస్తనీ ఉధృతి
ముంపులోనే టి.నగరపాలెంతగరపువలస: గోస్తనీ నది గురువారం కూడా ఉధృతంగా ప్రవహించింది. తాటిపూడి రిజర్వాయర్ నుంచి మంగళవారం 9,114 క్యూసెక్కులు, గురువారం 5 వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. మరో రెండు రోజుల పాటు 5వేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయనున్నారు. దీంతో గోస్తనీ నది పరీవాహక ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. గోస్తనీ నది ప్రవాహానికి టి.నగరపాలెంలోకి భారీ వరద నీరు చేరింది. పంచాయతీలో గొల్లలపాలెం వెళ్లే రహదారితో పాటు శివాలయం ముంపునకు గురయ్యాయి. దీంతో భీమిలి తహసీల్దార్ పైల రామారావు పర్యవేక్షణలో సిబ్బంది పొక్లెయిన్తో తాత్కాలిక కాలువలు తవ్వి నీటిని గోస్తనీ నదిలోకి పంపించారు. తాటితూరు ఆంజనేయస్వామి కూడలిలో బుధవారం నాటి ప్రవాహానికి అప్రోచ్ రోడ్డు కోతకు గురైంది. పంచాయతీలో చాలా వరకు గింజ పట్టిన వరి పంట నేలపాలైంది. తాటితూరు నుంచి బయటకు వెళ్లే రహదారులు, కల్వర్టులు బలహీనంగా ఉండటంతో ఆర్అండ్బీ అధికారులు పలు చోట్ల హెచ్చరికల బోర్డులు పెట్టారు. కొయ్యవారి కల్లాలకు చెందిన కాకర వెంకట అప్పారావు ఇల్లు తుపానుకు కూలిపోయింది. జీవీఎంసీ భీమిలి జోన్ సబ్బివానిపేట సర్వీస్రోడ్డులో వరద నీరు ప్రవహిస్తుండటంతో సిటీ బస్సులను తగరపువలస అంబేడ్కర్ కూడలి మీదుగా కాకుండా వెంకటేశ్వరమెట్ట వద్ద జాతీయ రహదారి మీదుగా మళ్లించారు. ఆనందపురం మండలం శిర్లపాలెం, పేకేరు పంచాయతీల మధ్య 33 ఏళ్ల నాటి కల్వర్టు తుపానుకు కొట్టుకుపోవడంతో రూ.2 లక్షలతో తాత్కాలికంగా పునరుద్ధరిస్తున్నారు. రూ.8 లక్షలతో శాశ్వత ప్రాతిపదికన దీని పునర్నిర్మాణం చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. -
ఎక్మోపై భువనేశ్వర్ నుంచి విశాఖ కిమ్స్
విశాఖపట్నం: ఎక్కడో ఒరిస్సాలోని భువనేశ్వర్లో ఉన్న యువకుడికి ఉన్నట్టుండి పలు అవయవాల వైఫల్యం సమస్య వచ్చింది. అక్కడి వైద్యులు ఏమీ చేయలేని పరిస్థితుల్లో కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి విషయం తెలిపారు. దాంతో డాక్టర్ ఎం. రవికృష్ణ నేతృత్వంలోని క్రిటికల్ కేర్ బృందం అక్కడకు వెళ్లి, ఆ 25 ఏళ్ల యువకుడికి ఎక్మో పెట్టి, రోడ్డు మార్గంలో అక్కడి నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖకు తీసుకొచ్చారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను క్రిటికల్ కేర్, ఎక్మో విభాగం అధిపతి డాక్టర్ రవికృష్ణ ఇలా తెలిపారు. ‘‘ఈ రోగి ఒక ఇంజినీర్. అతడికి ఉన్నట్టుండి మెదడు, ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలు, కాలేయం.. ఇలా అన్ని అవయవాలూ విఫలం అయ్యాయి. భువనేశ్వర్లోని ఓ ఆస్పత్రి నుంచి కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి కబురు రావడంతో వెంటనే ఇక్కడినుంచి ప్రత్యేక ఎక్మో రిట్రీవల్ బృందం అక్కడకు బయల్దేరింది. వెళ్లగానే ఆ ఆస్పత్రిలోనే ఆ యువకుడికి ఎక్మో పెట్టాం. పోర్టబుల్ ఎక్మో కావడంతో అక్కడినుంచి ఆ మిషన్ ఉంచే 500 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో తీసుకొచ్చాం. మధ్యలో ఒక్కసారి మాత్రం రక్తపరీక్షల కోసం తప్ప, మరెక్కడా ఆగలేదు.ఇక్కడకు రాగానే పరీక్షిస్తే.. ఆ యువకుడికి ఊపిరితిత్తులు గాయపడ్డాయని, కార్డియోజెనిక్ షాక్ వచ్చిందని, మెదడులో రక్తస్రావం అయ్యిందని, కాలేయం.. మూత్రపిండాలు విఫలమయ్యాయని తెలిసింది. ఇంత దూరం పాటు తీసుకొచ్చి రోగిని కాపాడడం చాలా పెద్ద సమస్య. ముందుగానే ఎక్మో పెట్టి తీసుకురావడం అతడి ప్రాణాలను కాపాడడంలో మొదటి ముందడుగు అయ్యింది. దానివల్ల అతడికి అవయవాలు ఇంకా విఫలం కాకుండా ఆగాయి. ఇక్కడకు వచ్చిన తర్వాతే అసలు చికిత్స మొదలైంది. ముందుగా అతడికి నైట్రిక్ ఆక్సైడ్ ఇచ్చాం. అది మెదడులోకి వెళ్లకుండానే పనిచేస్తుంది. దీంతోపాటు అతడికి మెదడులో రక్తస్రావం కాకుండా ఉండేందుకు తగిన చికిత్స చేశాం. ఫలితంగా రోగి వెంటనే కోలుకోవడం మొదలైంది. ఐదు రోజులకల్లా రోగికి ఎక్మో సహా అన్నిరకాల పరికరాలూ తీసేశాం. ప్రాణాపాయం నుంచి అతడు బయటపడ్డాడు. ప్రధాన సమస్యలన్నీ తీరిన తర్వాత అప్పుడు పూర్తిస్థాయి పరీక్షలు చేస్తే.. రెండేళ్ల నుంచి అతడికి తీవ్రమైన ఆందోళన, చెమటలు పట్టడం లాంటి లక్షణాలున్నట్లు తెలిసింది. దాంతో.. అతడు ఫియోక్రోమోసైటోమా (పీఎంసీ) అనే అత్యంత అరుదైన, ప్రాణాంతకమైన సమస్య ఉన్నట్లు తెలిసింది. దానికి కారణం.. అడ్రినల్ గ్రంధిమీద ఏర్పడిన క్యాన్సర్ కణితి. ఈ కణితి వల్ల అతడికి చాలా ఎక్కువగా, నియంత్రణ లేకుండా అడ్రినలిన్ స్రవించడం మొదలైంది. అదికూడా అప్పుడప్పుడు మాత్రమే స్రవించడంతో ముందుగా దీనికి పరీక్షలు చేసినా నెగెటివ్ వచ్చింది. లక్షణాలు మాత్రం ఉన్నట్టుండి చాలా తీవ్రంగా వచ్చాయి. ముందుగా 9 రోజుల చికిత్స తర్వాత డిశ్చార్జి చేశాం. అతడిని సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీనారాయణ, ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ శ్రావణి తన్నా పరీక్షించారు. నాలుగు వారాల తర్వాత అతడికి లాప్రోస్కొపిక్ పద్ధతిలో కణితిని తొలగించారు. సీనియర్ ఎనస్థెటిస్టులు డాక్టర్ సోమరాజు, డాక్టర్ అప్పలరాజుల పర్యవేక్షణలో ఈ శస్త్రచికిత్స జరిగింది. అనంతరం పరీక్ష చేసినప్పుడు అది మొదటి దశ క్యాన్సర్ అని తేలింది. దాంతో ఇతర భాగాలకు అది విస్తరించలేదు. ఎలాంటి కారణం లేకుండానే ఇలా బహుళ అవయవాల వైఫల్యం వస్తే ఎలాంటి అరుదైన సమస్యలు కారణం అవుతాయనడానికి ఈ కేసు నిదర్శనం. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్మో పెట్టి చికిత్స చేయడానికి చాలా నైపుణ్యం కావాలి. ఒక రకంగా ఇందులో మెడికల్ డిటెక్టివ్ పని చేయాలి. ఎక్మో పెట్టిన తర్వాత రోగి వేగంగా కోలుకోవడం, కొన్ని మందులు అస్సలు పడకపోవడం లాంటివి ఇందులో కీలకంగా మారాయి. అందువల్ల అతడికి సాధారణ సెప్సిస్ కాకుండా అరుదైన ఎండోక్రైన్ అత్యవసర పరిస్థితి అయ్యి ఉంటుందని ఆలోచించాం. అప్పుడు అందించిన చికిత్సతో అతడు బాగా కోలుకున్నాడు’’ అని డాక్టర్ రవికృష్ణ వివరించారు. -
బీచ్లో కలిశారు.. ‘గ్రీన్ వెడ్డింగ్’తో ఒక్కటయ్యారు
2018.. ముంబయిలో బీచ్ క్లీనింగ్ జరుగుతోంది. చాలామంది యువత కార్యక్రమంలో పాల్గొని ఫొటోలు తీసుకుంటున్నారు. కానీ.. ఓ యువకుడు, యువతి మాత్రం.. నిజాయతీగా బీచ్లో చెత్తను పోగేస్తూ.. మొదటి సారి కలుసుకున్నారు. ‘నా పేరు అశ్విన్ మాల్వాడే.. మర్చంట్ నేవీలో ఫస్ట్ ఆఫీసర్’ అని యువకుడు, ‘నా పేరు నుపూర్ అగర్వాల్.. మార్కెట్ రీసెర్చర్’ అని యువతి ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. మాటలు కలిశాయి.. మనసులు దగ్గరయ్యాయి. పర్యావరణంపై ఉన్న ప్రేమ వారిని మరింత దగ్గర చేసింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాక, ఓ స్నేహితుడి వివాహంలో ప్లాస్టిక్ వ్యర్థాలు, ఆహార వృథా చూసి చలించిపోయారు. తమ పెళ్లిని పర్యావరణ హితంగా.. ‘గ్రీన్ వెడ్డింగ్’ కాన్సెప్ట్ లో చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అప్పుడే ‘గ్రీన్మైనా’స్వచ్ఛంద సంస్థ రెక్కలు తొడిగింది. తమ పెళ్లి నుంచి మొదలుపెట్టిన గ్రీన్ వెడ్డింగ్ కాన్సెప్ట్ ను ముంబయితో పాటు ఇతర రాష్ట్రాలకు విస్తరించారు. ఇప్పుడు క్రికెట్ మైదానాల్లో చెత్తపై సమరం ప్రారంభించారీ పర్యావరణ జంట. సాక్షి, విశాఖపట్నం: 2019 డిసెంబర్లో అశ్విన్, నుపూర్ పెళ్లి పూర్తిగా ప్లాస్టిక్ రహితంగా జరిగింది. తమ పెళ్లి వేడుకలు సున్నా కర్బన ఉద్గారాలుగా ఉండాలని వెడ్డింగ్ ప్లానర్లని కోరితే ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. దీంతో వీరే వెడ్డింగ్ ప్లానర్లుగా మారి.. సమాజానికి సరికొత్త వివాహాన్ని పరిచయం చేశారు. ఆ పెళ్లిలో వాడిన ప్రతి వస్తువూ పర్యావరణ హితమైనదే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. చేతితో నేసిన కాటన్ దుస్తుల్నే పెళ్లిలో ధరించారు. నుపూర్ తన వెడ్డింగ్ లెహెంగాపై ‘బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్.. సేవ్ ది ప్లానెట్’అని.. అశ్విన్ ‘క్లైమేట్ క్రైసిస్.. బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్’అని నినాదాలు రాసి ధరించారు. అలంకరణకు తాజా పువ్వులు, గాజు సీసాలు, పునర్వినియోగం కాగితాలు వాడారు. మట్టి కప్పులు, వెదురు స్పూన్లు ఉపయోగించారు. పెళ్లి పత్రికను సైతం నాటితే మొక్కలు మొలిచేలా విత్తనాలతో తయారుచేశారు. ఊరేగింపునకు ఎలక్ట్రిక్ కారు వాడారు. పెళ్లికి ప్లాస్టిక్ వస్తువులు బహుమతిగా తేవద్దని కార్డులోనే ముద్రించారు. ఇలా జరిగిన అశ్విన్, నుపూర్ వివాహం అందరినీ ఆకట్టుకుంది. ‘గ్రీన్మైనా’ఆవిర్భావం తమ ఇంట్లో పెళ్లి కూడా ఇలాగే చేయాలంటూ చాలా మంది అశ్విన్, నూపూర్ జంటను సంప్రదించారు. తమ పెళ్లి స్ఫూర్తితో, పర్యావరణ హిత వివాహాలను ప్రోత్సహించడానికి వారు ‘గ్రీన్మైనా’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి 2020లో గ్రీన్ వెడ్డింగ్ కాన్సెప్ట్ని ముంబయికి పరిచయం చేశారు. తర్వాత కోవిడ్ వచ్చినా.. క్రమంగా దేశ వ్యాప్తంగా గ్రీన్ వెడ్డింగ్ కార్యకలాపాలు విస్తరింపజేశారు. ఈ కాన్సెప్ట్తో ఇప్పటివరకు ముంబయి, ఢిల్లీ, రాయ్పూర్, జైపూర్, బెంగళూరు వంటి నగరాల్లో 50కి పైగా వివాహాలు జరిపించారు. 2022లో రాయ్పూర్లో జరిగిన ఓ పెళ్లిలో 1,225 కిలోల తడి చెత్తను, 800 కిలోల ప్లాస్టిక్ను భూమిపైకి రాకుండా కాపాడారు. మిగిలిన ఆహారాన్ని 1,200 మందికి పంచారు. నూతన దంపతులతో 50 చెట్లు నాటించారు. ప్రస్తుతం ఈ సంస్థలో 10 మంది ప్రధాన సభ్యులు ఉండగా.. పదుల సంఖ్యలో వలంటీర్లు చేరారు. మైదాన్ సాఫ్.. క్రికెట్ స్టేడియంలే లక్ష్యంగా.. క్రికెట్ అభిమానులైన ఈ జంట.. ఓ రోజు ముంబయిలో జరిగిన ఒక క్రికెట్ మ్యాచ్ను చూసేందుకు వెళ్లారు. అక్కడ మ్యాచ్ల తర్వాత పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను గమనించారు. పారిశుధ్య కార్మికులకు చెత్త విభజనపై అవగాహన లేకపోవడంతో ‘మైదాన్ సాఫ్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక మున్సిపాలిటీలు, రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లతో మాట్లాడి మైదాన్ సాఫ్ అమలుకు మార్గం సుగుమం చేసుకున్నారు. 2023 ఐసీసీ ప్రపంచ కప్ సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఐసీసీ, బీసీసీఐ మద్దతుతో.. కోకా–కోలా ఇండియాతో కలిసి ఇప్పుడు 2025 ఐసీసీ మహిళల ప్రపంచ కప్ మ్యాచ్ల్లోనూ వ్యర్థాల నిర్వహణ చేస్తున్నారు. నవీ ముంబయి, గౌహతి, ఇండోర్, విశాఖపట్నంలోని స్టేడియాల్లోనే తడి, పొడి చెత్తను వేరు చేసి, పొడి చెత్తను రీసైక్లింగ్కు, తడి చెత్తను కంపోస్టింగ్కు పంపారు. పంపుతు న్నారు. 2030 నాటికి దేశంలో జరిగే పెద్ద కార్యక్రమాలన్నిటినీ వ్యర్థ రహితంగా మార్చడమే తమ లక్ష్యమని గ్రీన్ దంపతులు చెబుతున్నారు.గ్రీన్మైనా ఇంపాక్ట్ ఇదీ గ్రీన్మైనా సంస్థ ద్వారా గ్రీన్ వెడ్గింగ్స్, మైదాన్ సాఫ్ వంటి కార్యక్రమాలతో పర్యావరణంపై అశి్వన్, నుపూర్ దంపతులు గణనీయమైన ప్రభావాన్ని చూపారు. ఆ ఫలితాలను పరిశీలిస్తే.. కర్బన ఉద్గారాల నియంత్రణ 2,39,000 కిలోలు నాటిన మొక్కల సంఖ్య 5,860 ఆహార పంపిణీ(మిగిలిన ఆహారం) 12,000 మందికి పొడి చెత్త రీసైక్లింగ్ 30,750 కిలోలు తడి చెత్త కంపోస్టింగ్ 41,155 కిలోలు -
ముడసర్లోవకు జలకళ
మోంథా తుపానుతో పెరిగిన నీటి మట్టం ఆరిలోవ: ముడసర్లోవ రిజర్వాయర్లో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. మోంథా తుపాను ప్రభావంతో మూడు రోజుల పాటు కురిసిన వర్షాలకు ఈ రిజర్వాయర్కు జలకళ వచ్చింది. రిజర్వాయర్ చుట్టూ కంబాలకొండలు, సింహాచలం కొండలు ఉన్నాయి. మోంథా తుపాను వర్షాల వల్ల ఈ కొండల నుంచి రిజర్వాయర్లోకి 7.1 అడుగుల వరకు కొత్త నీరు చేరిందని ముడసర్లోవ నీటి సరఫరా విభాగం అధికారులు తెలిపారు. తుపానుకు ముందు రిజర్వాయర్లో 157.5 అడుగుల నీరు ఉండేది. వరద నీటితో కలిసి ప్రస్తుతం నీటి మట్టం 164.6కు చేరింది. సాధారణంగా ఈ రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 170 అడుగులు. దీనిని ఓవర్ఫ్లో చేయడానికి మరో 5.4 అడుగుల నీరు మాత్రమే అవసరం. తుపాను ప్రభావంతో ఎక్కువ మొత్తంలో కొత్త నీరు చేరడంతో, ప్రస్తుతం ఆరిలోవ ప్రాంతంలో భూగర్భ జలమట్టం పెరుగుతుందని స్థానికులు భావిస్తున్నారు. -
గ్రీన్మైనా ఇంపాక్ట్ ఇదీ
బీచ్లో కలిశారు.. ‘గ్రీన్ వెడ్డింగ్’తో ఒక్కటయ్యారు ● పర్యావరణ స్వచ్ఛంద సంస్థ ‘గ్రీన్మైనా’ ఏర్పాటు ● మైదాన్ సాఫ్ పేరుతో క్రికెట్ స్టేడియాల్లో పరిశుభ్రత 2018.. ముంబయిలో బీచ్ క్లీనింగ్ జరుగుతోంది. చాలామంది యువత కార్యక్రమంలో పాల్గొని ఫొటోలు తీసుకుంటున్నారు. కానీ.. ఓ యువకుడు, యువతి మాత్రం.. నిజాయతీగా బీచ్లో చెత్తను పోగేస్తూ.. మొదటి సారి కలుసుకున్నారు. ‘నా పేరు అశ్విన్ మాల్వాడే.. మర్చంట్ నేవీలో ఫస్ట్ ఆఫీసర్’ అని యువకుడు, ‘నా పేరు నుపూర్ అగర్వాల్.. మార్కెట్ రీసెర్చర్’ అని యువతి ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. మాటలు కలిశాయి.. మనసులు దగ్గరయ్యాయి. పర్యావరణంపై ఉన్న ప్రేమ వారిని మరింత దగ్గర చేసింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాక, ఓ స్నేహితుడి వివాహంలో ప్లాస్టిక్ వ్యర్థాలు, ఆహార వృథా చూసి చలించిపోయారు. తమ పెళ్లిని పర్యావరణ హితంగా.. ‘గ్రీన్ వెడ్డింగ్’ కాన్సెప్ట్లో చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అప్పుడే ‘గ్రీన్మైనా’స్వచ్ఛంద సంస్థ రెక్కలు తొడిగింది. తమ పెళ్లి నుంచి మొదలుపెట్టిన గ్రీన్ వెడ్డింగ్ కాన్సెప్ట్ను ముంబయితో పాటు ఇతర రాష్ట్రాలకు విస్తరించారు. ఇప్పుడు క్రికెట్ మైదానాల్లో చెత్తపై సమరం ప్రారంభించారీ పర్యావరణ జంట. – సాక్షి, విశాఖపట్నం వివాహ సమయంలో అశ్విన్, నుపూర్2019 డిసెంబర్లో అశ్విన్, నుపూర్ పెళ్లి పూర్తిగా ప్లాస్టిక్ రహితంగా జరిగింది. తమ పెళ్లి వేడుకలు సున్నా కర్బన ఉద్గారాలుగా ఉండాలని వెడ్డింగ్ ప్లానర్లని కోరితే ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. దీంతో వీరే వెడ్డింగ్ ప్లానర్లుగా మారి.. సమాజానికి సరికొత్త వివాహాన్ని పరిచయం చేశారు. ఆ పెళ్లిలో వాడిన ప్రతి వస్తువూ పర్యావరణ హితమైనదే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. చేతితో నేసిన కాటన్ దుస్తుల్నే పెళ్లిలో ధరించారు. నుపూర్ తన వెడ్డింగ్ లెహెంగాపై ‘బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్.. సేవ్ ది ప్లానెట్’అని.. అశ్విన్ ‘క్లైమేట్ క్రైసిస్.. బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్’అని నినాదాలు రాసి ధరించారు. అలంకరణకు తాజా పువ్వులు, గాజు సీసాలు, పునర్వినియోగ కాగితాలు వాడారు. మట్టి కప్పులు, వెదురు స్పూన్లు ఉపయోగించారు. పెళ్లి పత్రికను సైతం నాటితే మొక్కలు మొలిచేలా విత్తనాలతో తయారుచేశారు. ఊరేగింపునకు ఎలక్ట్రిక్ కారు వాడారు. పెళ్లికి ప్లాస్టిక్ వస్తువులు బహుమతిగా తేవద్దని కార్డులోనే ముద్రించారు. ఇలా జరిగిన అశ్విన్, నుపూర్ వివాహం అందరినీ ఆకట్టుకుంది. ‘గ్రీన్మైనా’ఆవిర్భావం తమ ఇంట్లో పెళ్లి కూడా ఇలాగే చేయాలంటూ చాలా మంది అశ్విన్, నూపూర్ జంటను సంప్రదించారు. తమ పెళ్లి స్ఫూర్తితో, పర్యావరణ హిత వివాహాలను ప్రోత్సహించడానికి వారు ‘గ్రీన్మైనా’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి 2020లో గ్రీన్ వెడ్డింగ్ కాన్సెప్ట్ని ముంబయికి పరిచయం చేశారు. తర్వాత కోవిడ్ వచ్చినా.. క్రమంగా దేశ వ్యాప్తంగా గ్రీన్ వెడ్డింగ్ కార్యకలాపాలు విస్తరింపజేశారు. ఈ కాన్సెప్ట్తో ఇప్పటివరకు ముంబయి, ఢిల్లీ, రాయ్పూర్, జైపూర్, బెంగళూరు వంటి నగరాల్లో 50కి పైగా వివాహాలు జరిపించారు. 2022లో రాయ్పూర్లో జరిగిన ఓ పెళ్లిలో 1,225 కిలోల తడి చెత్తను, 800 కిలోల ప్లాస్టిక్ను భూమిపైకి రాకుండా కాపాడారు. మిగిలిన ఆహారాన్ని 1,200 మందికి పంచారు. నూతన దంపతులతో 50 చెట్లు నాటించారు. ప్రస్తుతం ఈ సంస్థలో 10 మంది ప్రధాన సభ్యులు ఉండగా.. పదుల సంఖ్యలో వలంటీర్లు చేరారు. గ్రీన్మైనా సంస్థ ద్వారా గ్రీన్ వెడ్గింగ్స్, మైదాన్ సాఫ్ వంటి కార్యక్రమాలతో పర్యావరణంపై అశ్విన్, నుపూర్ దంపతులు గణనీయమైన ప్రభావాన్ని చూపారు. ఆ ఫలితాలను పరిశీలిస్తే.. కర్బన ఉద్గారాల నియంత్రణ 2,39,000 కిలోలు నాటిన మొక్కల సంఖ్య 5,860 ఆహార పంపిణీ(మిగిలిన ఆహారం) 12,000 మందికి పొడి చెత్త రీసైక్లింగ్ 30,750 కిలోలు తడి చెత్త కంపోస్టింగ్ 41,155 కిలోలు -
తుపాను బాధితులకు పరిహారం అందించాలి
సాక్షి, విశాఖపట్నం: మోంథా తుపాను ప్రభావంతో విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసి విధ్వంసం సృష్టించాయని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. పంట నష్టపోయి, ఇళ్లు ధ్వంసమై కష్టాల్లో ఉన్న బాధితులకు ప్రభుత్వం తక్షణం నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. బుధవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల అధ్యక్షులు కేకే రాజు, గుడివాడ అమర్నాథ్, మజ్జి శ్రీనివాసరావు, సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్కుమార్, మొల్లి అప్పారావు, తిప్పల దేవన్రెడ్డి, ధర్మశ్రీతో పాటు పలువురు ముఖ్యనాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మోంథా తుపాను వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితి, పార్టీ కమిటీల నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ.. తుపాను బాధితులను పరామర్శించి, సహాయక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలందరినీ అభినందించారు. ప్రజలు ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు వైఎస్సార్ సీపీ శ్రేణులు ఎల్లప్పుడూ అండగా నిలుస్తాయని మరోసారి నిరూపించాయంటూ ప్రశంసించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ కె.సతీష్, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, ఎస్ఈసీ సభ్యులు ఐహెచ్ ఫరూఖీ, సతీష్ వర్మ, పీలా వెంకటలక్ష్మి, రాష్ట్ర, జోనల్ అనుబంధ విభాగాల అధ్యక్షులు పేర్ల విజయ్ చందర్, ద్రోణంరాజు శ్రీవత్సవ్, చెన్న జానకిరామ్, కార్పొరేటర్లు బర్కత్ అలీ, శశికళ, మహమ్మద్ ఇమ్రాన్, బిపిన్ కుమార్, జోనల్ యువజన జోనల్ ఇన్చార్జి అంబటి శైలేష్, జిల్లా పార్టీ కమిటీ అధికార ప్రతినిధులు ఆల్ఫా కృష్ణ, పల్లా దుర్గ, మంచ నాగమల్లేశ్వరి, హరి కిరణ్ రెడ్డి, జిల్లా అనుబంధ కమిటీ అధ్యక్షులు బోని శివరామకృష్ణ, నీలి రవి, సనపల రవీంద్ర భరత్, శ్రీదేవి వర్మ, శంకర్ బత్తుల ప్రసాద్, మార్కండేయులు, బొండా ఉమామహేశ్వరరావు, సకలబత్తుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ పునరుద్ధరణ కార్యక్రమాల్లో ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ
విశాఖ సిటీ : మోంథా తుపాను ప్రభావంతో దెబ్బతిన్న విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చర్యల్లో భాగంగా తిరుపతి నుంచి ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ లోతేటి శివశంకర్ బుధవారం ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయానికి వచ్చారు. ఇప్పటికే ఏపీఎస్పీడీసీఎల్ నుంచి సుమారు 1,500 మంది అధికారులు, సిబ్బంది తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమయ్యారు. సీఎండీ శివశంకర్, ఏపీఈపీడీసీఎల్ డైరెక్టర్లు డి.చంద్రం, టి.వనజ, సీజీఎం వి.విజయలలిత, ఎస్ఈ సురేఖ తదితరులతో సమావేశమై క్షేత్రస్థాయి సిబ్బందికి అవసరమైన మెటీరియల్ సరఫరా, మద్దతు చర్యలపై సమీక్షించారు. -
గోస్తనీ ఉగ్రరూపం
తగరపువలస: తాటిపూడి రిజర్వాయర్ నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో గోస్తనీ నది ఉగ్రరూపం దాల్చింది. భీమిలి డివిజన్లోని తగరపువలస, పరిసర ప్రాంతాలు బుధవారం జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా భీమిలి మండలం పెదనాగమయ్యపాలేనికి మూడు అడుగుల మేర వరద నీరు పోటెత్తడంతో అతలాకుతలమైంది. తీరంలో ఉంచిన బోట్లు, వలలు నీట మునిగాయి. పెదనాగమయ్యపాలెంలోని 0327044 నంబరు రేషన్ డిపో గొడౌన్లోకి నీరు చేరింది. గొడౌన్లోని మొత్తం 400 బియ్యం బస్తాలకు గాను 120 బస్తాలు పూర్తిగా తడిచిపోయాయి. నీరు చేరిన సమయంలో అక్కడ 400 పంచదార ప్యాకెట్లు కూడా ఉన్నట్లు తెలిసింది. బియ్యం బస్తాలు నీట మునగడంతో నిరుపేదలకు రేషన్ పంపిణీకి ఆటంకం కలిగింది. వరద ప్రభావంతో తగరపువలస నుంచి పలు ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. మహరాజుపేట–పద్మనాభం రహదారిపై మూడు అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. తాటితూరులోని తాటాకు ఇళ్లలోకి వరదనీరు చేరడంతో నివాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్నవరం వెళ్లే మార్గంలో ఉప్పుటేరు నీరు భారీగా చేరింది. దీంతో దివీస్ పరిశ్రమ ఉద్యోగులతో పాటు చిప్పాడ, తూడెం, గుడివాడ వంటి గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతీయరహదారి నుంచి భీమిలి, పద్మనాభం, ఆనందపురం మండలాలను కలిపే మార్గంలోని శివాలయం వద్ద చప్టా పూర్తిగా మునిగిపోయింది. ఈ ప్రవాహంలో ఒక పాడి ఆవు కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. టి.నగరపాలెంలో స్నానాల ఘాట్ పూర్తిగా నీట మునిగింది. -
తుపాను తదుపరి చర్యలపై దృష్టి సారించండి
కలెక్టర్ హరేందిర ప్రసాద్ మహారాణిపేట : మోంథా తుపాను నష్టాలను జాగ్రత్తగా అంచనా వేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా తుపాను అనంతరం తీసుకోవలసిన చర్యలపై జిల్లా అధికారులు, ప్రత్యేక అధికారులు, జోనల్ అధికారులు, రెవెన్యూ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పారిశుధ్యం, నీటి వనరుల క్లోరినేషన్, దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణపై జోనల్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. పూర్తిగా, పాక్షికంగా దెబ్బతిన్న గృహాలను నమోదు చేయాలని, పంట, పశు నష్టం, బోట్ల నష్టం అంచనాలను తయారు చేయాలన్నారు. దెబ్బతిన్న పంచాయతీరాజ్ రోడ్లు, భవనాలు, మైనర్ ఇరిగేషన్, పాఠశాలల భవనాలు అంచనాలు తయారు చేయాలని, నిరాశ్రయులైన వారికి, తుపాను వల్ల ఉపాధి కోల్పోయిన మత్స్యకారులను గుర్తించి పరిహారం అందించడానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. నష్టం అంచనాలను గురువారం సాయంత్రానికి పూర్తి చేయాలని ఆదేశించారు. తుపాను వల్ల నిరాశ్రయులైన వారికి 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, లీటర్ ఆయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళ దుంపలు, కేజీ పంచదార ఇవ్వాలని, మత్స్యకారుల కుటుంబాలకు 50 కిలోల బియ్యం అందించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు. నిరాశ్రయులై రిలీఫ్ కేంద్రాలకు వచ్చిన వారికి ఒక్కరికి వెయ్యి రూపాయలు, ఒక కుటుంబంలో గరిష్టంగా రూ.3 వేలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. -
ఉపాధి కూలీలకు ఈకేవైసీ కష్టాలు
మహారాణిపేట: జిల్లాలో ఉపాధి హామీ పథకం కూలీల ఈకేవైసీ(ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. నవంబర్ 1వ తేదీ నుంచి ఈకేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే పనులు కల్పించి, మస్టర్ వేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే గడువు ముగియడానికి కేవలం రెండు రోజులే మిగిలి ఉన్నా.. జిల్లాలో ఇప్పటివరకు కేవలం 80 శాతం మాత్రమే ఈకేవైసీ పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించి మొత్తం 3.65 లక్షల మందికి జాబ్ కార్డులు ఉన్నాయి. అయితే వారిలో 2.89 లక్షల మంది మాత్రమే ఈకేవైసీ పూర్తి చేసుకున్నారు. ఇంకా సుమారు 76 వేల మంది కూలీల ప్రక్రియ పెండింగ్లో ఉంది. మిగిలిన రెండు రోజుల్లో 100 శాతం లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యంగా కనిపిస్తోంది. నవంబర్ ఒకటో తేదీ నుంచి ఈకేవైసీ పూర్తి అయిన వారికే మస్టర్ వేస్తారు. వాస్తవంగా హాజరైన కూలీల వేలిముద్ర లేదా కంటి పాపలు(ఐరిష్) ఆధారంగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఇంత ప్రాధాన్యత కలిగిన ఈకేవైసీ జిల్లాలో లక్ష్యానికి ఇంకా చేరుకోలేదు. ఈ జాప్యానికి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్డీఏ) అధికారుల అలసత్వమే కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బంది కూడా ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అవినీతికి అడ్డుకట్ట వేసేందుకే.. ఉపాధి హామీ పథకంలో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్నాయి. చాలా చోట్ల కూలీలు పనులకు రాకపోయినా వచ్చినట్టు చూపుతున్నారు. కొన్ని చోట్ల చనిపోయిన వారి పేర్లు, దేశంలో ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల్లో ఉద్యోగ, వ్యాపారాలు చేసుకుంటున్న వారి పేర్లతో మస్టర్లు వేస్తున్నారు. ఇలా క్షేత్ర స్థాయిలోనే సిబ్బంది, అధికార పార్టీ నాయకులు ఆయా మొత్తాలను స్వాహా చేస్తున్నారు. స్థానిక నాయకులు చెప్పినట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు నకిలీ ఫొటోలు అప్లోడ్ చేసి వేతనాలు పొందుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అవినీతికి అడ్డుకట్ట వేసేందుకే కేంద్రం ఈకేవైసీని తప్పనిసరి చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, ఆధార్తో అనుసంధానమైన ఈకేవైసీ పూర్తి చేసి, ప్రతిరోజూ రెండు పూటలా పని ప్రదేశంలో ముఖ గుర్తింపు (ఫొటో) ద్వారా హాజరు నమోదు చేసుకోవాలి. అయితే, అధికారుల నిర్లక్ష్యం కారణంగా గడువులోగా ఈకేవైసీ పూర్తికాని వేలాది మంది నిజమైన కూలీలు, నవంబర్ 1 నుంచి ఉపాధి కోల్పోతామేమోనని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
జీవీఎంసీ పరిధిలో..
డాబాగార్డెన్స్: మోంథా తుపాను నేపథ్యంలో జీవీఎంసీ పలు సహాయక చర్యలు చేపట్టింది. ఆయా జోనల్ కార్యాలయాల్లో ఏర్పాటుచేసిన 13 పునరావాస కేంద్రాలకు మొత్తం 138 మందిని నిర్వాసితులను తరలించింది. వివిధ ప్రాంతాల్లో 161 చెట్లు కూలిపోగా అధికారులు వెంటనే 157 చెట్లను క్లియర్ చేయించారు. పడిపోయిన 10 విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించారు. ప్రజల నుంచి యూజీడీకి సంబంధించి 20 ఫిర్యాదులు రాగా 19 పరిష్కరించారు. వర్షం నీరు నిలిచిపోయిన 30 ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడంతో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. కూలిపోయిన 8 ప్రహరీలను క్లియర్ చేశారు. తుపాను కారణంగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని జోనల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ల ద్వారా 229 ఫిర్యాదులు అందగా 224 పరిష్కరించారు. -
నష్టాన్ని మిగిల్చి..
మోంథా మోగించి.. భారీ వర్షాలు, గాలులతో అపార నష్టంమోంథా తుపాను వల్ల జిల్లాకు అపార నష్టం సంభవించింది. ఈదురుగాలులు, కుండపోత వర్షంతో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. ప్రహరీలు నేలమట్టమయ్యాయి. చెట్లు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలు విలవిల్లాడాయి. రూరల్ ప్రాంతాల్లో పంటలు, తీరంలో మత్స్యకారులు భద్రపరిచిన పడవలు, వలలు నీట మునిగాయి. రోడ్లు ఛిద్రమయ్యాయి. స్తంభాల మీద చెట్లు పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగ్గా.. యుద్ధప్రాతిపాదన మరమ్మతులు పూర్తి చేశారు. రిజర్వాయర్లు పూర్తి సామర్థ్యంతో కళకళలాడుతున్నాయి. – మహారాణిపేట -
● జిల్లాలో 83 పునరావాస కేంద్రాల ఏర్పాటు ● విద్యుత్, మౌలిక సదుపాయాలు లేకుండానే హడావుడి ● ఈ కేంద్రాలకు 1,516 మందిని తరలించినట్లు లెక్కలు ● అనేక చోట్ల భోజనాలు కూడా ఏర్పాటు చేయని అధికారులు
జిల్లాలో పునరావాస కేంద్రాలు మండలం మొత్తం తెరిచిన నిర్వాసితులు కేంద్రాలు కేంద్రాలు పద్మనాభం 05 01 25 భీమిలి 11 02 44 సీతమ్మధార 08 03 62 విశాఖ రూరల్ 07 03 48 ఆనందపురం 01 00 00 గాజువాక 13 01 24 పెదగంట్యాడ 05 00 00 ములగాడ 08 01 782 పెందుర్తి 09 00 00 గోపాలపట్నం 09 01 11 మహారాణిపేట 07 04 520 -
శ్రీవారి పుష్పయాగానికి పువ్వుల తరలింపు
ఎంవీపీ కాలనీ: శ్రీ వేంకటేశ్వరస్వామి పుష్పయాగానికి విశా ఖ నుంచి పువ్వులు తరలివెళ్లాయి. ఆధ్యాత్మికవేత్త హిమాన్షు ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సేకరించిన పూలను యాగానికి పంపించారు. బుధవారం ఎంవీపీ కాలనీలోని టీటీడీ ఈ–దర్శనం కౌంటర్ వద్దనున్న హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తొలుత టీటీడీ సలహా కమిటీ చైర్మన్ పట్టాభిరామ్ దంపతులు, మహిళా భక్తులు పూలకు సంకల్పం చేశారు. 3 వేల కలువలు, 2 వేల తామరలతోపాటు వివిధ రకాల పూలను తిరుమలకు తరలించారు. -
హార్బర్లో మునిగిన మరబోటు
మహారాణిపేట: విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లోని సెంట్రల్ డాక్ ఏరియాలో నిలిపి ఉంచిన ఒక మరబోటు మోంథా తుపాను ప్రభావం కారణంగా నీటిలో మునిగిపోయింది. మరమ్మతుల కోసం హార్బర్లో ఉంచిన ఈ బోటు పూర్తిగా దెబ్బతినడంతో రాష్ట్ర మరపడవల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.లక్ష్మయ్య స్పందించారు. మునిగిపోయిన ఐఎన్డీ ఏపీ వీ5 ఎంఎం–90 నంబరు గల మరబోటు యాజమాని మేరుగు ధనరాజుకు రూ.30 లక్షల నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణకు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మునిగిపోయిన బోటును పరిశీలించడంతో పాటు, బాధిత బోటు యజమానిని పరామర్శించారు. ఈ సంఘటన తమ దృష్టికి కూడా వచ్చిందని మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ పి.లక్ష్మణరావు తెలిపారు. -
విశాఖ–బొబ్బిలి సెక్షన్లో భద్రతా ఆడిట్
తాటిచెట్లపాలెం: వాల్తేర్ డివిజన్ పరిధిలోని విశాఖపట్నం–బొబ్బిలి రైల్వే సెక్షన్లో బుధవారం సేఫ్టీ ఆడిట్ జరిగింది. నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వేకు చెందిన భద్రతా ఆడిట్ బృందం ఈ తనిఖీలను చేపట్టింది. ప్రిన్సిపల్ చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ ఉత్తమ్ ప్రకాష్ నేతృత్వంలో ఈ బృందం సెక్షన్ పరిధిలోని పలు స్టేషన్లలో పాటిస్తున్న భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించింది. పెందుర్తి–కొత్తవలస మధ్య గల మలుపులు, కొత్తవలస స్టేషన్లో పాయింట్లు, యార్డులు, క్రాసింగ్లు, అలమండ–కోరుకొండ మధ్య నిర్మించిన ప్రధాన బ్రిడ్జిలు, బొబ్బిలి స్టేషన్లోని రిలేరూం, కోమటిపల్లి యార్డ్, ట్రాక్షన్ సబ్స్టేషన్, లెవెల్ క్రాసింగ్ గేట్, కోచింగ్ క్రూ లాబీ, విశాఖపట్నం యార్డులో యాక్సిడెంట్ రిలీఫ్ మెడికల్ ఎక్విప్మెంట్ వ్యాన్, యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్, న్యూ కోచింగ్ కాంప్లెక్స్, రన్నింగ్ రూంలు, రూట్ రిలే ఇంటర్లాకింగ్ కేబిన్లను పరిశీలించింది. సీనియర్ రైల్వే అధికారుల పర్యవేక్షణలో వివిధ రైల్వే జోన్ల మధ్య ఇటువంటి ఇంటర్ జోన్ సేఫ్టీ ఆడిట్లు తరచూ జరుగుతుంటాయని వాల్తేర్ డివిజన్ అధికారులు తెలిపారు. ఆడిట్ ప్రారంభానికి ముందు డీఆర్ఎం లలిత్ బోహ్రా డివిజన్ భద్రతా అంశాలను ఆడిట్ బృందానికి వివరించారు. తనిఖీల్లో వాల్తేర్ డివిజన్ ఏడీఆర్ఎం(ఆపరేషన్స్) కె.రామారావు, సీనియర్ డివిజనల్ సేఫ్టీ ఆఫీసర్ ఆనంద్కుమార్ ముటట్కర్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. రైల్వే సేఫ్టీ ప్రమాణాలను పరిశీలించిన నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే బృందం -
జీవీఎంసీలోకి నాలుగు మండలాలు!
అల్లిపురం: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) త్వరలో రాష్ట్రంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా అవతరించనుంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా విభజన అనంతరం మిగిలిపోయిన నాలుగు మండలాలైన భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తిలను జీవీఎంసీలో విలీనం చేసే ప్రక్రియ వేగవంతమైంది. ప్రస్తుతం 98 వార్డులతో ఉన్న జీవీఎంసీ ఈ నాలుగు మండలాల విలీనంతో 120 వార్డులకు విస్తరించనుంది. ఈ విస్తరణతో విశాఖపట్నం భారతదేశంలో 18వ అతిపెద్ద నగరంగా కూడా గుర్తింపు పొందనుంది. భీమిలి నియోజకవర్గ పరిధిలోని మూడు మండలాలను(భీమిలి, పద్మనాభం, ఆనందపురం) జీవీఎంసీలో కలపాలని అక్కడి ఎమ్మెల్యే విజ్ఞప్తి చేయగా.. మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు అధికారులు పనులను వేగవంతం చేసినట్లు సమాచారం. ఈ ప్రక్రియలో భాగంగా జీవీఎంసీ అధికారులు విలీనం కానున్న నాలుగు మండలాల పరిధిలోని రెవెన్యూ, గ్రామ పంచాయతీ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. విలీన ప్రక్రియలో ప్రభుత్వం జీవీఎంసీకి పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. విలీనమయ్యే ప్రాంతాల్లోని పంట పొలాల విస్తీర్ణంపై అధికారులు ప్రత్యేకంగా సర్వే చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవసాయ భూములకు జీవీఎంసీ పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. సర్పంచుల పదవీకాలం ముగిసే నాటికి, తదుపరి జీవీఎంసీ ఎన్నికల లోపు... భూ సర్వే, గృహాలు, పంట పొలాలు, దేవాలయాలు వంటి అన్ని అంశాలపై సమగ్ర జాబితాలను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ గ్రామ పంచాయతీల్లో గత 14 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్యాలయ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, వాటర్ సప్లై, విద్యుత్ సిబ్బంది, గుర్ఖాలను జీవీఎంసీలోకి తీసుకునేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. -
జలంలో జనం.. పడవపై గంటా
పెదనాగమయ్యపాలెంలో ఎమ్మెల్యే చుట్టపుచూపు పెదనాగమయ్యపాలెం గ్రామం వరద నీటితో చిక్కుకోగా.. బుధవారం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వారి గోడు వినడానికి వచ్చారు. అయితే ప్రజలు నీటితో ఇబ్బందులు పడుతుంటే.. ఆయన మాత్రం పడవ ఎక్కారు. గ్రామం ఎంత మేర నీటిలో తేలుతుందో పరిశీలించినట్లుగా సాగింది ఆయన పర్యటన! కనీసం ఆదుకుంటాం అనే ఒక్క హామీ మాట అయినా చెప్తారేమో అని ఆశగా ఎదురుచూసిన మత్స్యకారులకు నిరాశే మిగిలింది. బంధువుల ఇంటికి వచ్చిన చుట్టపులా.. కాసేపు పడవపై షికారు చేసి ఆయన వెళ్లిపోయారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. బహుశా వరద సమయంలో బోటింగ్ అనుభూతిని పరిశీలించడానికి, ఆపై ఫొటోలకు ఫోజులివ్వడానికి మాత్రమే ఆయన ఈ పర్యటన చేపట్టారేమో అని ప్రజలు గుసగుసలాడారు. -
హైదరాబాద్-విశాఖ విమానం ‘యూటర్న్’
సాక్షి, విశాఖ: మోంథా తుపాను(Cyclone Montha) ప్రభావంతో ఏపీ అతలాకుతలం అవుతోంది. ఎడతెరిపిలేని భారీ వర్షాల కారణంగా జనజీవనం స్థంభించిపోయింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం రవాణా వ్యవస్థపైన కూడా ప్రభావం చూపింది. ప్రతికూల వాతావరణం కారణంగా ఇప్పటికే పలు విమాన సర్వీసులు నిలిచిపోగా.. తాజాగా హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లిన ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్ కాకుండానే తిరిగి వచ్చేసింది.వివరాల ప్రకారం.. ఎయిర్ ఇండియా విమానం బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి విశాఖ బయలుదేరింది. ఈ క్రమంలో విశాఖలో ల్యాండింగ్ కావాల్సి ఉండగా.. ప్రతికూల వాతావరణం కారణంగా ల్యాండింగ్ కాలేదు. దీంతో, ఎయిర్పోర్టు అధికారులు విమానాన్ని తిరిగి హైదరాబాద్కు పంపారు. అనంతరం, హైదరాబాద్ విమానం సేఫ్గా ల్యాండింగ్ అయ్యింది. ఈ క్రమంలో ప్రయాణీకులు ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు.. విజయవాడ నుంచి విశాఖ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం రద్దు చేసినట్టు అధికారులు వెల్లడించారు.ఇదిలా ఉండగా.. మోంథా తుపాను (Cyclone Montha) ప్రభావం నేపథ్యంలో శంషాబాద్ నుంచి ఏపీకి వెళ్లాల్సిన 18 విమాన సర్వీసులు రద్దయ్యాయి. వాతావరణం అనుకూలించని కారణంగా హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, రాజమహేంద్రవరానికి వెళ్లాల్సిన విమానాలను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. విజయవాడ, విశాఖ, రాజమహేంద్రవరం నుంచి శంషాబాద్ రావాల్సిన 17 విమాన సర్వీసులను కూడా రద్దు చేసినట్లు చెప్పారు. రద్దయిన వాటిలో విశాఖపట్నం నుంచి 9, రాజమహేంద్రవరం నుంచి 5, విజయవాడ నుంచి 3 విమానాలు ఉన్నాయి. -
ముందస్తు చర్యలు ఫలితాలనిచ్చాయి
తుపాను ప్రత్యేకాధికారి అజయ్ జైన్ మహారాణిపేట: మోంథా తుపాను దృష్ట్యా ఇప్పటివరకు జిల్లా అధికార యంత్రాంగం తీసుకున్న ముందస్తు చర్యలు మంచి ఫలితాలనిచ్చాయని, ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా నివారించగలిగామని ప్రత్యేక అధికారి అజయ్ జైన్, కలెక్టర్ ఎం. ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. అయితే, రాబోయే 12 గంటలు అత్యంత కీలకం కాబట్టి ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని వారు పిలుపునిచ్చారు. కలెక్టరేట్ వీసీ హాలులో ఎంపీ శ్రీ భరత్, కలెక్టర్ హరేందిర ప్రసాద్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించిన అజయ్ జైన్.. మోంథా తుపాను తాజా పరిస్థితిని వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జీవీఎంసీ పరిధిలోని 10 జోన్లలో ఒక్కో జోన్కు రెండేసి చొప్పున క్యూఆర్టీ బృందాలు పని చేస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం 8 పునరావాస శిబిరాల్లో 144 మంది ప్రజలు ఆశ్రయం పొందుతున్నట్లు తెలిపారు. చెట్ల కొమ్మలు, డ్రెయిన్లలో పూడికలు ఎప్పటికప్పుడు తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. ములగాడ, సీతకొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడగా, ఇతర చోట్ల రాళ్లు జారినట్లు గుర్తించామన్నారు. జిల్లాలోని 14 చెరువులు ప్రమాదకర స్థితిలో ఉన్నందున, ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలించినట్లు వివరించారు. 119 చెట్లు కూలిపోగా 60 తొలగించామని, 9 విద్యుత్ స్తంభాలు పడిపోగా ఏడింటిని పునరుద్ధరించినట్లు తెలిపారు.8 గోడలు కూలిపోగా 4 చోట్ల చర్యలు చేపట్టామన్నారు. తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా 35 ట్యాంకులను అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ వెల్లడించారు. అత్యవసరమైతే 0891–2590100, 96669 09192, 180042 500009 హెల్ప్లైన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
అప్పన్న భక్తుల రక్షణకు చర్యలు
సింహాచలం: తుపాను నేపథ్యంలో ిసింహాచలం దేవస్థానంలోని అన్ని విభాగాలను ఈవో ఎన్.సుజాత అప్రమత్తం చేశారు. కొండపైన, కొండ దిగువ ఉన్న విభాగాలను సందర్శించి, తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై సూచనలు చేశారు. ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలపై పర్యవేక్షించాలని, వర్షం నీరు నిల్వ ఉండకుండా వెంటనే తొలగించాలని ఆదేశించారు. తాగునీటి ట్యాంకులు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా ఉండేలా నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. తుపాను ప్రభావం తగ్గేవరకు ఉద్యోగులంతా అధికారుల మార్గదర్శకాలను పాటించాలని స్పష్టం చేశారు. ప్రజలు అత్యవసరమైతే దేవస్థానం హెల్ప్లైన్ నంబర్ల(93987 34612, 0891–2954944)ను సంప్రదించాలన్నారు. ఆమె వెంట ఏఈవో తిరుమలేశ్వరరావు, సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు ఉన్నారు. -
మళ్లీ పోటీలా..
ఆరిలోవ : అండర్–17 స్కూల్ గేమ్స్లో భాగంగా బాలికలకు మరోసారి జిల్లా స్థాయి వాలీబాల్ ఎంపికలు నిర్వహించనున్నారు. బుధవారం ఈ పోటీలు నిర్వహించనున్నట్లు డీఈవో ఎన్.ప్రేమకుమార్ ప్రకటించడంతో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వాహకులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఇటీవల జిల్లా స్థాయి అండర్–14, అండర్–17 స్కూల్ గేమ్స్ జరిగాయి. ఈ పోటీల్లో పలు విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఇందులో భాగంగా అండర్–17 బాలికలకు వాలీబాల్ పోటీలు నిర్వహించి విజేతలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. వారి ఎంపిక సరిగా జరగలేదని కొందరు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అండర్–17 వాలీబాల్ బాలికల విభాగం ఎంపికను రద్దుచేసి.. బుధవారం ఉదయం 9 గంటలకు గోపాలపట్నం ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో మళ్లీ పోటీలు నిర్వహించడానికి డీఈవో ఎన్.ప్రేమకుమార్ మంగళవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వాహకులను ఆదేశించారు. ముందు నిర్వహించిన ఎంపిక కమిటీని రద్దుచేసి కొత్త కమిటీ ద్వారా విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు డీఈవో తెలిపారు. కూటమి ఎమ్మెల్యే ఒత్తిడితోనేనా పోటీలు మళ్లీ వాలీబాల్ పోటీలు జరిపించి తమకు అనుకూలమైనవారిని ఎంపిక చేయాలని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, విద్యాశాఖ అధికారులపై కూటమి పార్టీలకు చెందిన నగరంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఒత్తిడి చేసినట్లు సమాచారం. వారి ఒత్తిడితోనే అండర్–17 వాలీబాల్ బాలికల విభాగం ఎంపిక రద్దు చేసినట్లు తెలిసింది. ఇప్పటికే జరిగిన పోటీని రద్దు చేశారంటే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సక్రమంగా ఎంపికలు నిర్వహించలేదనే విమర్శలు కూడా సర్వత్రా వినిపిస్తున్నాయి. సెలవు లేదా..? ఓ పక్క స్కూల్ గేమ్స్ షెడరేషన్ నిర్వాహకులు విద్యార్థులకు పోటీలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. మరో పక్క మోంథా తుఫాన్ ప్రభావంతో అన్ని పాఠశాలలకు బుధవారం కూడా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిరప్రసాద్ సెలవు ప్రకటించారు. అయినా కలెక్టర్ ఆదేశాలు ఈ క్రీడా పోటీల ఎంపికకు వర్తించవన్నట్లు అధికారులు వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. -
కమ్యూనికేషన్ రిపీటర్ పరిశీలన
తగరపువలస: ఆనందపురం కొండపై ఉన్న పోలీస్ కమ్యూనికేషన్ రిపీటర్ను మంగళవారం నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి పరిశీలించారు. ఒకటిన్నర కిలోమీటరు దూరం కాలినడకన కొండపైకి వెళ్లి.. అక్కడ ఉన్న కమ్యూనికేషన్ రిపీటర్ను సీపీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మొబైల్ నెట్వర్క్ పనిచేయని అత్యవసర పరిస్థితుల్లో రిపీటర్ సేవలకు పవర్ బ్యాకప్ అందుబాటులో ఉందా లేదా అని ఆరా తీశారు. తుపాను కారణంగా కమ్యూనికేషన్కు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని, ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం సీపీ ఆనందపురం పోలీస్ స్టేషన్ను సందర్శించారు. స్టేషన్లోని రికార్డులను పరిశీలించి, స్టేషన్ పరిసరాలు, నిర్వహణలో చేయాల్సిన మార్పులను సిబ్బందికి సూచించారు. -
పునరావాస కేంద్రంలో చిమ్మచీకట్లు
కొమ్మాది: జీవీఎంసీ 4వ వార్డు మంగమారిపేట వద్ద ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో విద్యుత్ సౌకర్యం లేక చిమ్మచీకట్లు అలముకున్నాయి. గతంలో మంగమారిపేటలో తుపాను రక్షిత భవనం ఉండేది. అయితే అది పూర్తిస్థాయిలో శిథిలావస్థకు చేరుకోవడంతో.. జిల్లా పరిషత్ హైస్కూల్ను సోమవారం తాత్కాలిక పునరావాస కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఈ హైస్కూల్ భవనంలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో పాటు ప్రధానంగా చీకట్లు అలుముకోవడంతో.. తీరప్రాంత మత్స్యకారులు అక్కడి నుంచి వెనుతిరిగారు. అధికారుల తీరుపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాగా.. పునరావాస కేంద్రం కోసం జనరేటర్ను ఏర్పాటు చేసినప్పటికీ అధికారులు దానిని ఉపయోగించడం లేదు. దీనిపై అధికారులను ప్రశ్నించగా.. ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తే జనరేటర్ ఆన్ చేస్తామని చెప్పడం గమనార్హం. -
విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సిద్ధం
విశాఖ సిటీ: మోంథా తుపాను ప్రభావంతో విద్యుత్ సరఫరా వ్యవస్థలో ఏర్పడే అంతరాయాలను అత్యంత వేగంగా పునరుద్ధరించేందుకు ఏపీఈపీడీసీఎల్ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి తెలిపారు. సంస్థ పరిధిలోని 11 జిల్లాల అధికారులను ముందుగానే అప్రమత్తం చేశామని చెప్పారు. ఇందు కోసం సుమారు 15 వేల విద్యుత్ స్తంభాలు, 950 ట్రాన్స్ఫార్మర్లు, 115 క్రేన్లు, 80 జేసీబీలు, 144 వైర్లెస్ హ్యాండ్సెట్లు, 285 పవర్సాలు, 254 పోల్ డ్రిల్లింగ్ యంత్రాలు, మొబైల్ డీటీఆర్ రిపేర్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. తుపాను పునరుద్ధరణ చర్యలు పూర్తయ్యే వరకు ఉద్యోగుల సెలవులను రద్దు చేసినట్లు చెప్పారు. సంస్థ పరిధిలోని ఇతర జిల్లాల నుంచి సుమారు 7 వేల మంది సిబ్బంది, అవసరమైన సామగ్రిని పెద్ద ఎత్తున తుపాను ప్రభావిత ప్రాంతాలకు తరలించామన్నారు. రాష్ట్రంలోని ఇతర విద్యుత్ సంస్థల నుంచి కూడా సుమారు 2 వేల మంది సిబ్బంది సహాయక చర్యల కోసం చేరుకున్నారన్నారు. అత్యవసర సేవలైన తుపాను సహాయక కేంద్రాలు, హాస్పిటళ్లు, మొబైల్ టవర్లు, సబ్ స్టేషన్లు వంటి వాటికి నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగించేందుకు జనరేటర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విద్యుత్ అంతరాయాలకు సంబంధించిన సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1912 లేదా స్థానిక కంట్రోల్ రూమ్ నంబర్లకు సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. కంట్రోల్ రూమ్ నంబర్లు విశాఖపట్నం కార్పొరేట్ కార్యాలయం – 8331018762 విశాఖ జోన్–1 – 9490610018 జోన్–2 – 9490610020 జోన్–3 – 9491030721 -
రైతు ఆశలపై ‘మోంథా’ నీళ్లు
మహారాణిపేట: ‘మోంథా’తుపాను జిల్లా రైతాంగంపై పెను ప్రభావం చూపుతోంది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, తీవ్రమైన ఈదురు గాలులతో అన్నదాతలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో వేలాది ఎకరాల పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. జిల్లాలోని భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి, విశాఖ రూరల్ మండలాల పరిధిలో ఈ సీజన్లో రైతులు 4,602 హెక్టార్లలో వరి, 10 హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేశారు. ఎకరాకు రూ. 25,000 నుంచి రూ.35,000 వరకు పెట్టుబడి పెట్టి, ఈసారి మంచి దిగుబడి వస్తుందని ఆశించారు. నవంబర్ రెండు, మూడు వారాల్లో పంటలు కోతకు సిద్ధమవుతున్న కీలక తరుణంలో తుపాను విరుచుకుపడటం వారి ఆశలపై నీళ్లు చల్లింది. తుపాను ధాటికి ఇప్పటికే 29 హెక్టార్లలో వరి పంట, 10 హెక్టార్లలో మొక్కజొన్న పంట పూర్తిగా నీట మునిగినట్లు ప్రాథమిక సమాచారం. భారీ ఈదురు గాలులకు ఏపుగా పెరిగిన వరి చేలు అక్కడక్కడ నేలకొరిగాయి. చెరువులు, జలాశయాలు నిండిపోవడంతో, పొలాల్లో చేరిన వర్షపు నీటిని బయటకు తీయలేని నిస్సహాయ స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. పొలాల్లో నీరు ఇలాగే నిలిచిపోతే ధాన్యం నాణ్యత పూర్తిగా దెబ్బతింటుందని, దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో రైతులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. వర్షాలు తగ్గిన తర్వాత గానీ నష్టం పూర్తిస్థాయిలో అంచనా వేయలేమని వ్యవసాయ అధికారులు తెలుపుతున్నారు. ప్రతి ఏటా అక్టోబర్, నవంబర్లో వచ్చే తుపాన్లు తమను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు. -
కొండచిలువ కలకలం
ఆరిలోవ: జీవీఎంసీ 12వ వార్డు పరిధి టి.ఐ.సి పాయింట్ సమీపం క్రాంతినగర్లో మంగళవారం ఉదయం ఒక కొండచిలువ కలకలం రేపింది. కంబాలకొండ వెనుక భాగాన్ని ఆనుకొని ఈ కాలనీ ఉంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండ ప్రాంతం నుంచి కొండచిలువ ఈ కాలనీలోకి ప్రవేశించింది. రోడ్డు పక్కన చిన్న కాలువలో చేరిన సుమారు 12 అడుగుల ఈ పామును స్థానికులు గమనించి ఆందోళనకు గురయ్యారు. కొందరు భయంతో ఇళ్ల తలుపులు మూసుకున్నారు. స్థానిక యువకులు ధైర్యం చేసి ఆ పామును చాకచక్యంగా పట్టుకుని ఖాళీ డ్రమ్ములో వేశారు. అనంతరం అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చి అప్పగించారు. కొండ ప్రాంతం నుంచి పాములు రాకుండా నివాసాలను ఆనకుని ఇనుప మెస్ ఏర్పాటు చేయాలని స్థానికులు జీవీఎంసీ అధికారులను కోరుతున్నారు. -
సమయం
చేజారనీయొద్దు! మహారాణిపేట: మెదడుకు రక్తప్రసరణ ఒక్కసారిగా ఆగిపోవడం లేదా తగ్గిపోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. మెదడు కణాలకు ఆక్సిజన్, పోషకాలు అందకపోవడంతో నరాల సంబంధిత వ్యాధులు సోకుతాయి. అందులో కీలకమైనది బ్రెయిన్ స్ట్రోక్. రక్తనాళాలు పగలడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. ఇలాంటి వారికి వీలైనంత వేగంగా అత్యవసర వైద్య సేవలు అందించాలి. లేకుంటే ప్రాణం మీదకు వస్తుంది. కేజీహెచ్లోనే నెలకు 160 కేసులు కేజీహెచ్లో సగటున నెలకు సుమారు 160 స్ట్రోక్ కేసులు నమోదవుతున్నాయి. వీరిలో సుమారు 70 శాతం మంది పురుషులు, మిగిలిన వారు సీ్త్రలు. మొత్తం స్ట్రోక్లలో 17% హెమరైజ్డ్ స్ట్రోక్లు కాగా, మిగతా 83% ఇస్కిమిక్ స్ట్రోక్లేనని వైద్యులు చెప్తున్నారు. 2024 ఆగస్టు నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 14 నెలల్లో 54 మందికి థ్రాంబోలైసిస్ చేశారు. గత ఆరు మాసాల్లో ఈ రకమైన చికిత్స అవసరమైన కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మధ్య వయసు, వృద్ధ పురుషుల్లో స్ట్రోక్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరే కేసుల్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య పదింతలున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలవాట్లే ప్రధాన కారణం పలు ఆహారపు అలవాట్ల వల్లే ఇలాంటి వ్యాధులు వస్తున్నట్లు ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ప్రధాన ప్రమాద కారకాలు రక్తపోటు, మధుమేహం, అధిక కొవ్వు, పొగ త్రాగడం, మద్యపానం, ఊబకాయం, వ్యాయామం లేకపోవడం వల్ల ఎక్కువ మందికి ఈ స్ట్రోక్ వస్తోంది. నిద్రలో శ్వాస ఆగడం, దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి, దంత దోషాలు, గాలిలో కాలుష్యం, పండ్లు, కూరగాయలు తక్కువగా తినడం కూడా కారణాలే. ఈ లక్షణాలుంటే.. ముఖం వంకరగా మారడం, చేతులు బలహీనమవడం, మాటలు స్పష్టంగా రాకపోవడం, ఎదుటివారి మాటల్ని అర్థం చేసుకోలేకపోవడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, ఒక్కసారిగా చూపు తగ్గిపోవడం తదితర లక్షణాలు కనిపిస్తే దాన్ని స్ట్రోక్గానే భావించొచ్చు. ఇలాంటి సమయంలో నాలుగున్నర గంటల్లోపు ఆస్పత్రికి చేరుకుని, సత్వర వైద్య సేవలు పొందితే ముప్పు తప్పించుకోవచ్చు. ఒకప్పుడు 50–60 ఏళ్లు దాటిన వారిలో మాత్రమే బ్రెయిన్ స్ట్రోక్ మాట వినేవాళ్లం. ప్రస్తుత దురలవాట్ల కారణంగా పిల్లల్లో కూడా ఈ సమస్య చూస్తున్నాం. ఇటీవల తరచూ 20–35 ఏళ్ల మధ్య వయస్కులు ఎక్కువగా ఈ సమస్యతో ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నట్లు వైద్యులు చెప్తున్నారు. వీటిలో 80–90 శాతం మంది సత్వర చికిత్సతో కోలుకుంటున్నా.. కొందరు స్ట్రోక్ కారణంగా పక్షవాతానికి గురై కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. అక్టోబర్ 29 వరల్డ్ స్ట్రోక్ డే. ఈ ఏడాది ప్రతి నిముషం లెక్కలోకి(ఎవ్విరీ మినిట్ కౌంట్స్) థీమ్తో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ముందు జాగ్రత్తలే మేలు స్ట్రోక్ నివారణకు రక్తపోటు, షుగర్, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచడం, పొగ త్రాగకపోవడం, మద్యపానం తగ్గించడం, వ్యాయా మం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, మానసిక ఒత్తిడిని తగ్గించడం, మంచి నిద్ర అలవాటు చేసుకోవడం, గాలి కాలుష్యాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలి. అలవాట్లలో మార్పు తప్పనిసరి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వారికి వైద్యం అందిస్తున్నాం. ఎవరూ భయపడాల్సిన పనిలేదు. అన్ని రకాల స్ట్రోక్లకు వైద్యం అందించాం. చాలా మందికి తగ్గింది. కొంత మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. ఒక సారి స్ట్రోక్ వచ్చిన వారు అలవాట్లలో మార్పు చేసుకోవాలి. – డాక్టర్ ఎస్.గోపి, న్యూరాలజీ విభాగాధిపతి, ఏఎంసీ/కేజీహెచ్ సత్వర వైద్యంతో మేలు పక్షవాతాన్ని త్వరితగతిన గుర్తించి వైద్యం అందిస్తే కాపాడే వీలుంటుంది. ఆలస్యం జరిగితే ప్రాణాలకే ముప్పు. నూతన చికిత్సా విధానాలైన థ్రాంబోలైసిస్ లేదా థ్రాంబెక్టమీ ద్వారా మనిషి పూర్తిగా కొలుకునే అవకాశం ఉంటుంది. ఎంత వేగంగా చికిత్స అందిస్తే అంత మంచిది. – డాక్టర్ సీహెచ్ విజయ్, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, కిమ్స్ ఐకాన్ -
విశాఖపై పంజా
● జీవీఎంసీ 12వ వార్డు పరిధిలోని బీసీకాలనీ కొండవాలు ప్రాంతంలో రక్షణ గోడ, రహదారి కూలిపోయింది. ● 13వ వార్డు శ్రీకృష్ణాపురంలో ఖాళీ స్థలం చుట్టూ ఉన్న రక్షణ గోడ కూలిపోయింది. చెట్టు నెలకొరిగింది. ● 34వ వార్డు కొబ్బరితోట, తారకరామ కాలనీల్లో రెండు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ● 40వ వార్డు రాజీవ్కాలనీ సుమారు 3 అడుగుల మేర నీట మునిగింది. నౌసేనాభాగ్, మల్కాపురం, మల్కాపురం మరిడిమాంబ కల్యాణమండపం, పల్లివీధి, సులభ్ కాంప్లెక్స్ ఏరియా, ఎంఈఎస్ క్వార్టర్స్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. ● యారాడ ఘాట్ మార్గంలో తొలి మలుపు వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ● గురుద్వారా సమీపంలోని దీపక్ పంజాబీ ధాబా వద్ద పెద్ద చెట్టు కూలిపోవడంతో ట్రాఫిక్కు స్వల్ప అంతరాయం కలిగింది. ● గురుద్వారా కూడలి సమీపంలో గెడ్డపై ఉన్న రహదారి, కల్వర్టు, రిటైనింగ్ వాల్ కుంగిపోయాయి. రహదారి దెబ్బతిని పెద్ద గొయ్యి ఏర్పడింది. ● 51వ వార్డులోని మాధవస్వామి ఆలయంలో జలధార ఉప్పొంగింది. మాధవస్వామి ఆలయం, శివాలయం ప్రాంగణాలు పూర్తిగా నీట మునిగాయి. ● 4వ వార్డులో హైవే నుంచి పరదేశిపాలెం మీదుగా కాపులుప్పాడకు వెళ్లే మార్గమధ్యలో గెడ్డపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ● పరదేశిపాలెం నుంచి డంపింగ్ యార్డుకు వెళ్లే మార్గంలో వరద నీరుతో రాకపోకలు నిలిచిపోయాయి. ● సాగర్నగర్, రుషికొండ, మంగమారిపేట, భీమిలి బీచ్ పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకుల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ● గోస్తనీ నదిలోకి గెడ్డలు, వాగుల ద్వారా భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో నది నిండుగా కనిపిస్తోంది. ● 5వ వార్డు బోయిపాలెం సమీపంలోని జేఎన్ఎన్యూఆర్ఎం పీపీ 2 కాలనీలో 4 బ్లాకుల్లో ఉన్న సుమారు 100 ఇళ్లు వరద నీటిలో చిక్కుకున్నాయి. పక్కనే ఉన్న గెడ్డ పొంగడంతో నీరు నివాసాల్లోకి చేరింది. ● తుమ్మిరిగెడ్డ మినీ రిజర్వాయర్ నిండుగా కనిపిస్తోంది. ● అనంతవరం సమీపంలో గెడ్డ పక్కన ఉండే అప్రోచ్ రోడ్డు వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోయింది. గంథవరం ప్రజలు కొత్తకొవ్వాడ, పెంట, అనంతవరం రోడ్డు మీదుగా పద్మనాభం చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ● గాజువాకలోని 70వ వార్డులో దశమికొండ కాలనీ, చిట్టినాయుడు కాలనీ, డ్రైవర్స్ కాలనీ కొండవాలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. ● కృష్ణానగర్ ప్రాంతంలో రెండు ఇళ్లపైన, పెంటయ్యనగర్ కొండపై మూడు ఇళ్లపైన మట్టి పెళ్లలు విరిగిపడ్డాయి. ● 87వ వార్డులోని సిద్ధార్థనగర్, టిజిఆర్ నగర్ల మధ్య గల రహదారిలో నిలువెత్తు నీరు చేరడంతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ● 77వ వార్డు అప్పికొండ సమీపంలోని వెలమపేట నీట మునిగింది. ● 64వ వార్డు పరిధిలోని గంగవరం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై వర్షపు నీరు ప్రవహిస్తోంది. ● గుల్లేపల్లి–సబ్బవరం రోడ్డులో ఆదిరెడ్డిపాలెం వద్ద ఉన్న కాజ్వే పైనుంచి భారీగా నీరు ప్రవహిస్తోంది. పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ● ఎంవీపీ కాలనీ సెక్టార్–9 అప్పుఘర్ గొల్లవీధి రహదారిలో చెట్టు విరిగిపడటంతో ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. లాసన్స్ బే కాలనీలో కారు తీవ్రంగా దెబ్బతింది. ● జీవీఎంసీ 16వ వార్డు హెచ్బీ కాలనీ జంక్షన్లో హౌసింగ్ బోర్డు నిర్మిస్తున్న దుకాణ సముదాయం కోసం తవ్విన గోతిలో.. దానికి ఆనుకుని ఉన్న ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ స్తంభాలు జారి పడిపోయాయి. మరో రెండు విద్యుత్ స్తంభాలు కూడా విరిగిపోయాయి. ● దువ్వాడలోని వీఎస్ఈజెడ్ సబ్స్టేషన్కు అనుసంధానం చేసే 33కేవీ కండక్టర్ తెగిపడటంతో జంపర్లు ఊడిపోయాయి. ● భీమిలి మండలం టి.నగరపాలెం వద్ద హైవేతో పాటు సర్వీస్ రోడ్లపై మూడు అడుగుల మేర వరద నీరు చేరడంతో వాహనాలకు తీవ్ర అంతరాయం కలిగింది. ● ఆనందపురం మండలం శొంఠ్యాం పంచాయతీ మిందివానిపాలెం, వెల్లంకి పంచాయతీల్లో వరద నీరు హైవేతో పాటు సర్వీస్ రోడ్ల మీదుగా ప్రవహిస్తోంది. ● గాజువాక–సింథియా ప్రధాన రహదారి పూర్తిగా జలమయమైంది. ● గొట్టిపల్లి అంగన్వాడీ కేంద్రంలోకి నీరు ప్రవేశించింది. సరుకులు, రికార్డులు, ఫర్నిచర్ నీటిలో తడిచిపోయాయి. ● తాటితూరు, దత్తప్ప చెరువులు నిండిపోవడంతో ఉద్యానవన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ● గొరపల్లి, పురుషోత్తపురం, చీమలాపల్లి, రాంపురం, అక్కిరెడ్డిపాలెం ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. ● పెందుర్తి, సబ్బవరం ప్రాంతాల్లో వందలాది ఎకరాల పంట భూమిలోకి నీరు చేరింది. -
బస్సులకు డిమాండ్
డాబాగార్డెన్స్: తుఫాన్ నేపథ్యంలో రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు ద్వారకా బస్ స్టేషన్కు క్యూ కట్టారు. కొంతమేర ఆర్టీసీ బస్సుల వద్ద (ఇచ్ఛాపురం, పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం వరకు వెళ్లేందుకు) రద్దీగా ఉండగా.. ఓఎస్ఆర్టీసీ బస్సులకు పెద్ద సంఖ్యలో ప్రయాణికుల తాకిడి కనిపించింది. ద్వారకా బస్ స్టేషన్లో నిత్యం ఖాళీగా కనిపించే ఓఎస్ఆర్టీసీ టికెట్ బుకింగ్ కౌంటర్ రైళ్ల రద్దు కారణంగా మంగళవారం కిటకిటలాడింది. తుఫాన్ కారణంగా చాలా మంది ప్రయాణికులు రద్దు చేసుకోవడంతో నిత్యం రద్దీగా కనిపించే ఆర్టీసీ బుకింగ్ కౌంటర్లు మంగళవారం ఖాళీగా దర్శనమిచ్చాయి. -
గరిష్ట స్థాయికి మేహాద్రి నీటిమట్టం
రికార్డు స్థాయిలో 9,200 క్యూసెక్కుల నీరు విడుదలపెందుర్తి : మేహాద్రిగెడ్డ జలాశయం నీటిమట్టం రికార్డు స్థాయికి చేరుకుంది. రిజర్వాయర్కు వస్తున్న అన్ని కాలువలు ఉధృతంగా ప్రవహించడంతో మంగళవారం రికార్డు స్థాయిలో 8 వేల క్యూసెక్కుల వరదనీరు చేరింది. దీంతో రిజర్వాయర్ నీటిమట్టం గరిష్ట(60/61)స్థాయి రెండు రోజులుగా నిలకడగా ఉంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం నుంచి నాలుగు గేట్ల ద్వారా 9,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 2021 (నవంబర్లో 7 వేల క్యూసెక్కులు విడుదల చేశారు) తరువాత ఈ స్థాయిలో నీటిని విడుదల చేయడం ఇదే ప్రథమం. మంగళవారం అర్ధరాత్రి నుంచి వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో రిజర్వాయర్ గేట్లు అన్నీ ఎత్తే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ముందుగా మేహాద్రిని సందర్శించిన జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ పరిస్థితిని ఆరా తీశారు. ఇన్ఫ్లో, అవుట్ ఫ్లోపై సమీక్షించారు. రిజర్వాయర్ పరివాహక ప్రాంతాల్లో ఉన్న కాలనీల వాసులను అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. నీటిపారుదలశాఖ ఎస్ఈ పి.అప్పలనాయుడు, డీఈ జె.స్వామినాయుడు, పెందుర్తి తహసీల్దార్ ఐ.వెంకటఅప్పారావు, ఏఈ పి.నళిని పాల్గొన్నారు. -
బోసిపోయిన రైల్వేస్టేషన్
తాటిచెట్లపాలెం: తుపాను దృష్ట్యా రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. వీటిలో ఇక్కడ నుంచి బయల్దేరాల్సిన, విశాఖపట్నం చేరుకోవలసిన పలు రైళ్లు ఉన్నాయి. మరికొన్ని రైళ్లు దారిమళ్లించారు. తుఫాన్ తీవ్రత దృష్ట్యా ఈ సమాచారాన్ని ముందుగానే ప్రయాణికులకు చేరవేయడంతో ప్రయాణికులు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. దీంతో విశాఖ రైల్వేస్టేషన్ మంగళవారం నిర్మానుష్యంగా మారింది. సమాచారం తెలియక గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకున్నారు. మంగళవారం మొత్తంగా 19 రైళ్లను రద్దు చేయగా 11 రైళ్లు ఆలస్యంగా బయలుదేరాయి. మరో రెండు రైళ్లను దారి మళ్లించారు. బుధవారం కిరండూల్–విశాఖపట్నం(18516)నైట్ ఎక్స్ప్రెస్, విశాఖపట్నం–మచిలీపట్నం(17220) ఎక్స్ప్రెస్, రాయగడ–గుంటూరు(17244)ఎక్స్ప్రెస్, భువనేశ్వర్–హైదరాబాద్(07166) స్పెషల్ ఎక్స్ప్రెస్, ప్రశాంతి ఎక్స్ప్రెస్లను రద్దు చేశారు. 30వ తేదీన లోకమాన్యతిలక్ టెర్మినస్–విశాఖపట్నం(18520) ఎల్టీటీ ఎక్స్ప్రెస్, ముంబయి–భువనేశ్వర్(11019)కోణార్క్ ఎక్స్ప్రెస్, పూరీ–తిరుపతి(17479)ఎక్స్ప్రెస్లు రద్దయ్యాయి. నిర్మానుష్యంగా ఒకటో నంబర్ ప్లాట్ఫాం -
AP: తుపాను నష్టంపై అధికారుల ప్రాథమిక నివేదిక
AP Cyclone Montha Live News Updates Telugu: ఆంధ్రప్రదేశ్ తీరం సైక్లోన్ మోంథా ధాటికి తల్లడిల్లిపోయింది. భారీ నష్టాన్ని కలగజేసి తీరం దాటిన తీవ్ర తుపాన్ కాస్త తుపానుగా మారిపోయి తన ప్రభావం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో దిశ మార్చుకుని తెలంగాణ వైపు దూసుకొస్తోంది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలతో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. తుపాన్ నష్టంపై అధికారుల ప్రాథమిక నివేదికవిజయవాడ:రాష్ట్రంలోని 304 మండలాల్లోని 1,825 గ్రామాల్లో 87 వేలహెక్టార్లలో పంటకు నష్టం.59 వేలకు పైగా హెక్టార్లలో నీట మునిగిన వరి పంట, పత్తి, మొక్కజొన్న, మినుము పంటలకు నష్టం.భారీ వర్షాలతో నష్టపోయిన 78,796 మంది రైతులు.రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన 42 పశువులు.రాష్ట్రంలో దెబ్బతిన్న పంచాయతీరాజ్ రోడ్లు, 14 బ్రిడ్జిలు, కల్వర్టులుదెబ్బతిన్న 2,294 కి.మీ. పొడవున ఆర్ అండ్ బీ రహదారులు... రూ.1,424 కోట్ల నష్టం.రూరల్ వాటర్ సప్లయ్కు సంబంధించి రూ.36 కోట్లు వరకు, ఇరిగేషన్ పనుల్లో రూ.16.45 కోట్ల మేర నష్టం.సురక్షిత ప్రాంతాలకు 3,175 మంది గర్భిణీల తరలింపు... 2,130 మెడికల్ క్యాంపుల నిర్వహణ.297 రహదారులపై వరద నీరు పొంగి ప్రవహిస్తుండగా, వాటిని దారి మళ్లించేలా చర్యలు.రాష్ట్రంలో మొత్తం 380 చెట్లు రహదారులపై విరిగిపడగా, అన్నింటినీ తొలిగించామని చెప్పిన యంత్రాంగం.బాపట్ల:రేపల్లె నియోజకవర్గంలో ఇంకా పునరుద్ధరణ కానీ విద్యుత్ సరఫరాఅంధకారంలో ఇంకా నియోజకవర్గంలోని చాలా గ్రామాలు24 గంటల నుంచి కరెంట్ లేక ఇబ్బంది పడుతున్న ప్రజలుఅల్లూరి జిల్లా :మోంథా తుఫాన్ ఎఫెక్ట్..రేపు కేకే లైన్ లో రైళ్ళ రాకపోకలు బంద్కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో రైల్వే అధికారుల నిర్ణయం..కిరండూల్ ప్యాసింజర్ రైలు రద్దు.. వరంగల్- ఖమ్మం ప్రధాన రహదారిపై భారీగా వరదనీరురేపు (గురువారం) వరంగల్ జిల్లాలో పాఠశాలలకు సెలవునీట మునిగిన వరంగల్ రైల్వే స్టేషన్ ఆలస్యంగా నడుస్తున్న రైళ్లుప్రయాణికుల ఇక్కట్లుశ్రీశైలం - హైదరాబాద్ రాకపోకలకు అంతరాయంనాగర్ కర్నూల్ జిల్లా, ఉప్పునుంతల మండలం, లత్తిపూర్ సమీపంలో వరదకు కోతకు గురైన బ్రిడ్జి. డిండి వాగుపై నిర్మించిన బ్రిడ్జిపై శ్రీశైలం-హైదరాబాద్ మధ్య నిలిచిన రాకపోకలు.వరంగల్లో కుండపోత వర్షంపలు కాలనీల్లో ఇళ్లల్లోకి చేరిన వర్షపు నీరుహన్మకొండ బస్టాండ్ ఆవరణలోకి భారీగా వరదవరంగల్ అండర్ రైల్వే గేట్తో పాటు హన్మకొండ, భవానీ నగర్లో భారీగా వరదఅంబేద్కర్ భవన్ రహదారి జలమయంఅంబేద్కర్ భవన్లో చిక్కుకున్న పెళ్లి బృందంచెరువులను తలపిస్తున్న రైలు పట్టాలుమహబూబాబాద్ జిల్లాలో ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లుడోర్నకల్ రైల్వే ట్రాక్పైకి భారీగా వరద, నిలిచిన రైళ్లువరంగల్, హన్మకొండలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటుకలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్లు: 18004253424, 9154225936 తెలంగాణలో ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్మహబూబ్నగర్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్9 జిల్లాలకు ఆరెంజ్, మరో 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ వరంగల్ జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతంపర్వతగిరిలో 34 సెం.మీ వర్షపాతంనెక్కొండలో 24 సెం.మీ వర్షపాతం నమోదుసంగెం మండలంలో 25 సెం.మీ వర్షపాతంఖిలావరంగల్లో 23, ాపాలకుర్తిలో 23 సెం.మీ వర్షపాతంతూ.గో.జిల్లా:నల్లజర్ల లో ముందా తుఫాన్ వలన నేలకొరిగిన పంటలను పరిశీలించిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ , నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ హోం మంత్రి తానేటి వనితపంట పాలు పోసుకునే దశలో నేలకి ఒరిగి పోయాయిగడచిన ప్రభుత్వం రైతుల పక్షాన ఏ విధంగా చేసిందో ప్రజలు ఆలోచించాలిరైతుకు జరిగిన నష్టాన్ని ఈ ప్రభుత్వం ఏ విధంగా పూడ్చాలో ఆలోచించాలిగత ప్రభుత్వం పంట వేసే ముందు పెట్టుబడి సహాయం ఇచ్చేదిఅన్నదాత సుఖీభవ పేరుమీద ప్రతి రైతుకు ఎకరానికి రూ. 20,000 రూపాయలు ఇస్తానన్నారు18 నెలల కాలం గడిచిన కేవలం రూ.5000 రూపాయలు మాత్రమే ఇచ్చారుపంట పెట్టుబడి సహాయం లేదు కానీ ఒక పంటకు నష్టపోయిన రైతు అధిక వడ్డీలకు రుణాలు పొందుతున్నారు రైతులకు పంటలకు ఇన్సూరెన్స్ చెల్లించిన ఘనత జగన్ ప్రభుత్వానిదేపంట నష్టం వస్తే సబ్సిడీ కూడా చెల్లించిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఖమ్మం:మధిర రైల్వే స్టేషన్ లో నిలిచిపోయిన సాయి నగర్ శిరిడి ఎక్స్ ప్రెస్..డోర్నకల్ రైల్వేస్టేషన్లో పట్టాలపై వరద నీరు చేరటంతో మధిర స్టేషన్ లో నిలిపివేసిన రైల్వే అధికారులు..మోంథా తుపాను నేపథ్యంలో ఖమ్మం రైల్వే స్టేషన్ లో నిలిచిపోయిన వందే భారత్ ట్రైన్...డోర్నకల్ జంక్షన్ వద్ద రైలు పట్టాలపై నీరు ప్రవహించడంతో వందే భారత రైలును ఖమ్మం రైల్వే స్టేషన్ లో నిలుపు వేశారు...భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -జిల్లా కలెక్టర్ అనుదీప్...అత్యంత భారీ వర్షాల నేపథ్యంలో జనం ఏదైనా అత్యవసరం అవుతేనే ఇంట్లో నుంచి బయటికి వెళ్లాలి - జిల్లా కలెక్టర్ఖమ్మం:మోoథా తుపాను ఎఫెక్ట్ తో జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు...స్తంభించిన జన జీవనంజన్నారం వద్ద నిమ్మవాగు లో కొట్టుకుపోయిన డీసీఎం వ్యాన్.వరంగల్ నుంచి ఎన్కుర్ వస్తు ఉండగా జన్నారం వద్ద నిమ్మ వాగు ఉధృతిని అంచనా వేయలేక ముందుకు వెళ్లిన వ్యాన్ డ్రైవర్...అందరు చూస్తుండగానే వరదలో కొట్టుకుపోయిన వ్యాన్...గల్లంతయిన డ్రైవర్ కోసం గాలిస్తున్న ఎన్డీఆర్ ఆప్ సిబ్బంది...మళ్లీ భారీ వర్షం కురుస్తుండడంతో రెస్క్ ఆపరేషన్ కు అంతరాయం...జూలూరుపాడు మండలం పెద్ద వాగు పొంగి కాజ్ వే పైకి ప్రవహిస్తున్న వరద నీరు...పడమటి నర్సాపురం, భేతాళుడు వైపు వెళ్లే 20 గ్రామాలకు నిలిచిన రాకపోకలు...చింతకాని మండలం నాగులవంచ -పాతర్లపాడు మధ్య రహదారిపై ప్రవహిస్తున్న బండి రేవు వాగు వరద.. జగ్గంపేట(కాకినాడ జిల్లా ):కిర్లంపూడి మండలం పాలెం గ్రామంలో మోంథా తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలకు కూలిన పెంకుటిల్లుబాధితులను పరామర్శించి రూ.5,000 రూపాయలు నగదు, బియ్యం బస్తా అందజేసిన జగ్గంపేట వైఎస్సార్సీపీ ఇంచార్జ్ తోట నరసింహం.హైదరాబాద్ : 135 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు.మరో 31 రైలను దారి మళ్ళించాం: దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్మోంథా తుపాను ప్రభావం తగ్గిన తర్వాతనే రైళ్లను పునరుద్ధరిస్తాం.మోంథా ప్రభావంతో డోర్నకల్ రైల్వే స్టేషన్ దగ్గర ట్రాకులు పాక్షికంగా దెబ్బతిన్నాయి.ప్రకాశం: సంతనూతలపాడు నియోజకవర్గంలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మాజీ మంత్రి మేరుగు నాగార్జునమోంథా తుపాను కారణంగా నాగులుప్పలపాడు మండలం మట్టిగుంట, ఈదుముడి మద్దిరాల ముప్పాళ గ్రామాలలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన మాజీ మంత్రివర్యులు డాక్టర్ మేరుగు నాగార్జున ,ప్రభుత్వం వెంటనే స్పందించి తుపాను కారణంగా నీట మునిగిన పంట పొలాలను అధికారులు పరిశీలించి రైతులకు తగిన సహాయం అందించి వారికి కొంత ఉపశమనం కలిగించేల చర్యలు చేపట్టాలని కోరిన మాజీ మంత్రివర్యులు డాక్టర్ మేరుగు నాగార్జునప్రకాశం జిల్లా: ఒంగోలులో ముంపు ప్రాంతాలను పరిశీలించిన వైఎస్సార్సీపీ ఇంఛార్జి చుండూరి రవిబాబుపునరావాస కేంద్రాల్లో సౌకర్యాలు సరిగా లేవుముంపు బాధితులకు భోజనాలు సరిగా ఏర్పాటు చేయకపోవడం దారుణం కలెక్టర్ తక్షణమే స్పందించి ముంపు బాధితులకు భోజన వసతి చూడాలి..; చుండూరి రవిబాబుకాకినాడఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తీరుకు నిరసనగా కొత్తపట్నం మత్స్యకారుల ఆందోళనఉప్పాడలో పర్యటించిన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్తమ సమస్యలు చెప్పుకునేందుకు కారు వద్దకు వచ్చిన మత్స్యకారులుకారు ఆపకుండా వెళ్ళిపోవడం పై గంగపుత్రుల ఆగ్రహంఓట్లు అవసరం ఐనప్పుడు మాత్రమే మేము కావాలా అంటూ అసహనంవిజయనగరం జిల్లా.మోంథా ప్రభావంతో 50 గ్రామాల రాకపోకలు అంతరాయం.సంతకవిటి మండలం సిరిపురం వద్ద పొంగిపొర్లుతున్న రెల్లిగెడ్డ.సిరిపురం నుండి పొందూరు, మండవకురిటి నుండి జి.సిగడాం రహదారులపై ఉప్పొంగుతున్న వరద నీరు.రాకపోకలను నిలిపివేయాలని ఆదేశించిన ఆర్డీవో. పోలీసుల పర్యవేక్షణలో రహదారులకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు.పశ్చిమగోదావరి జిల్లా.ఆకివీడు మండలం దుంపగడప గ్రామంలో మోంథా తుపాను ప్రభావంతో 250 ఎకరాల వరిచేలు మునక.ఎకరాకు 25 వేల రూపాయలు పెట్టుబడి పెట్టామంటూ రైతుల ఆవేదన.అధికారులు కన్నెత్తి చూడలేదంటూ రైతుల అసహనం తుపానుపశ్చిమగోదావరి జిల్లా:మోంథా తుపాను ప్రభావంతో పాలకొల్లు, యలమంచిలి,పోడూరు మండలాల్లోని పలు గ్రామాలు దొడ్డిపట్ల, అబ్బురాజు పాలెం,లంక గ్రామాల్లో అరటి, తమలపాకు తోటలకు తీవ్ర పంట నష్టంరైతులు తీవ్ర ఆందోళనతుపాను తో నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం తక్షణమే ఆదుకునీ నష్టపరహం చెల్లించాలని కోరుతున్న రైతులుఏలూరు జిల్లా: మోంథా తుపాను ప్రభావంతో ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం, భీమడోలు మండలాల్లో పలు చోట్ల నెలకొరిగిన వరి క్షేత్రాలు,స్వర్ణరకం వరి వంగడం వేసిన రైతులు పంట నెలకొరిగి తీవ్రనష్టం,ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్న రైతులుతూర్పుగోదావరి జిల్లా:నిడదవోలు మండలం సమిశ్రగూడెంలో మోంథా ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి చెల్లు బోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడుపంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్నల్లగొండ జిల్లా:గుర్రంపోడు మండల కేంద్రంలో ఇళ్లలోకి చేరిన వరద నీరువర్షపు నీరు వెళ్లడానికి సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో జనాల అవస్థలుకృష్ణా జిల్లాకంకిపాడు మండలం ఉప్పులూరులో తుపాను ప్రభావంతో పల్లపు తిరుపతమ్మ ఇల్లు నేలమట్టం.విషయం తెలుసుకున్న YSRCP పెనమలూరు నియోజకవర్గం ఇంచార్జ్ దేవభక్తుని చక్రవర్తి.స్వయంగా వెళ్లి బాధిత కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సాయం అందించిన దేవభక్తుని చక్రవర్తి.కాకినాడతాళ్ళరేపు మండలం పిల్లిలంకలో తుపాను భాధితులకు బిర్యాణీ ప్యాకెట్లు అందజేసిన వైఎస్ఆర్ సిపి రాష్ట్ర కార్యదర్శి చింతలపాటి శ్రీనివాసరాజు అనకాపల్లి :శారాధ నదికి పెరుగుతున్న వరద ఉదృతి..ప్రమాద స్థాయికి చేరుకున్న నీటిమట్టం..రహదారుల మీద నుంచి ప్రవహిస్తున్న వరద నీరు..పలు గ్రామాలు ముంపుకు గురయ్యే ప్రమాదం..అప్రమత్తమైన అధికారులు..యలమంచిలి - గాజువాక రహదారిలో రాకపోకలు నిలిపేసిన పోలీసులు..తెలంగాణకు మోంథా ముప్పు!తెలంగాణ వైపు కదులుతున్న మోంథాఇప్పటికే ఏపీలో తీరని నష్టంఇంకా కురుస్తున్న వానలుమరో గంటలో ఖమ్మంను తాకనున్న మోంథాహనుమకొండ, వరంగల్, మహబూబాద్ జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం.. ఆరెంజ్ హెచ్చరికలుసిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం.. ఆరెంజ్ హెచ్చరికలుహైదరాబాద్ వర్షాలపై.. అధికారుల్ని అప్రమత్తం చేసిన జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నంరైళ్లపై మోంథా ప్రభావంతెలంగాణపై మోంథా తుపాను ఎఫెక్ట్మోంథా ప్రభావంతో దక్షిణ మద్య రైల్వే పరిధిలో రైళ్ల రాకపోకలకు అంతరాయంమహబూబాబాద్లో ఆగిపోయిన కృష్ణా ఎక్స్ప్రెస్నీట మునిగిన డోర్నకల్ రైల్వే స్టేషన్డోర్నకల్లో ఆగిపోయిన గోల్కొండ ఎక్స్ప్రెస్వరంగల్లోనే ఆగిపోయిన ఇంటర్ సిటీమధిర స్టేషన్లో ఆగిన షిరిడి ఎక్స్ప్రెస్ఆలస్యంగా నడుస్తున్న రైళ్లుసంబంధిత కథనం: మోంథా ఎఫెక్ట్.. రద్దైన రైళ్ల వివరాలు ఇవిగో ఖమ్మం జిల్లాలో మోంథా తుపాను బీభత్సంకొణిజర్ల మండలం జన్నారం వద్ద నిమ్మవాగులో బ్రిడ్జి పైనుంచి పడిపోయిన డీసీఎంనిమ్మవాగులో డ్రైవర్ గల్లంతు, గాలింపు చర్యలు చేపట్టిన అధికారులుమోంథా తుపాను.. తెలంగాణ సర్కార్ హైఅలెర్ట్ మోంథా ప్రభావంతో తెలంగాణకు భారీ వర్షాలు ఆర్ అండ్ బీ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిఫీల్డ్ లెవెల్ లో హై అలెర్ట్ గా ఉండాలని సూచనఅత్యవసరం ఐతే తప్పా.. ఎవరూ సెలవు పై వెళ్లొద్దని ఆదేశంమాన్సూన్ సీజన్ లో చేపట్టిన జాగ్రత్త చర్యలు.. అదే స్పూర్తితో కొనసాగించాలి: మంత్రి కోమటి రెడ్డిప్రజలను అప్రమత్తం చేయడానికి పోలీసు,రెవెన్యూ,విద్యుత్,ఇరిగేషన్,పిఆర్ శాఖలతో సమన్వయం చేసుకోవాలి: మంత్రి కోమటి రెడ్డిలో కాజ్ వే లు,కల్వర్టులు వద్ద ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలి: మంత్రి కోమటి రెడ్డిఆర్ అండ్ బి ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ సెంటర్ అన్ని జిల్లాలతో అనుసంధానం చేయాలి: మంత్రి కోమటి రెడ్డిఅత్యవసరమైతేనే ప్రజలు రోడ్ల పైకి రావాలి,అధికారులు సూచించే జాగ్రత్తలు పాటించాలి: మంత్రి కోమటి రెడ్డికరీంనగర్ జిల్లాలో.. నిండుకుండలా లోయర్ మానేరు డ్యామ్మోంథా తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలు2 గేట్ల ద్వారా నీటిని విడుదల చేసిన అధికారులుఇన్ ఫ్లో: 1277 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో: 4 వేల క్యూసెక్కులుప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం: 24.034 టీఎంసీలుప్రస్తుత నిల్వ 24.034 టీఎంసీలుదిగువ నది పరిసర ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచన పశువుల కాపర్లు,మత్స్య కారులు,రైతులు నది దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరికలుతెలంగాణ భారీ వర్షాలపై మంత్రి పొంగులేటి అప్రమత్తంభారీ వర్షాల వల్ల ప్రజా జీవనానికి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలురెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్షరాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై సమీక్ష నిర్వహించిన మంత్రిఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశాలురాగల 24 గంటల్లో అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, సిద్దిపేట, వరంగల్, యాదాద్రి, మెదక్, మేడ్చల్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలువాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలిలోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలుపోలీసులతో కలసి వాగులు, కాల్వలు, చెరువుల దగ్గర పర్యవేక్షణ చేయాలని ఆదేశాలుఅత్యవసర సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని మంత్రి ఆదేశాలువిద్యుత్, పంచాయతీ రాజ్, ఆర్ & బి శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచనలుప్రాణనష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి సూచనలుప్రజల భద్రతే ప్రభుత్వానికి ప్రాధాన్యం – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డినాగర్ కర్నూలు జిల్లాలో.. ఉప్పునుంతల మండలం మొల్గర గ్రామం వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న దుందుభి వాగు, ఉప్పునంతల వంగూరు మండలాలకు రాకపోకలు బంద్తాడూరు మండలంలో భారీ వర్షంపొంగిపొర్లుతున్న వాగులు వంకలుఐతోలు, గోవిందాయపల్లి మధ్య రోడ్డుపై పారుతున్న వాగు నిలిచిపోయిన రాకపోకలునల్లగొండ జిల్లాలో..తిరుమలగిరి (సాగర్)లో పొంగిపొర్లుతున్న బర్ల బంధంరోడ్డుపై ప్రవహిస్తున్న వరద నీరుబడాయిగడ్డ గ్రామ సమీపంలో కల్వర్టు పైనుంచి ప్రవహిస్తోన్న వరద నీరుతిరుమలగిరి- రాజవరం మధ్య రాకపోకలు నిలిపివేతమండల వ్యాప్తంగా నీట మునిగిన పత్తి, వరి పొలాలుబలహీనపడి తెలంగాణ వైపు దూసుకొస్తున్న మోంథాతీరం దాటాక దిశ మార్చుకున్న మోంథాతెలంగాణ వైపు దూసుకొస్తున్న తుపానుభద్రాచలానికి 50కి.మీ. ఖమ్మంకు 110కి.మీ. దూరంలో కేంద్రీకృతంభారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖఇప్పటికే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో భారీ వర్షాలుహైదరాబాద్లోనూ దంచికొడుతున్న వర్షంతెలంగాణలో 14 జిల్లాలకు ఫ్లాష్ఫ్లడ్ అలర్ట్ జారీవాయవ్య దిశగా ప్రయాణించి రాబోయే ఆరుగంటల్లో బలహీనపడే అవకాశంఒంగోలు జలమయం..మోంతా తుపాను దాడికి ఒంగోలులోని లోతట్టు కాలనీలు జలమయంఒంగోలు నగరంలోని వెంకటేస్వరా కాలనీ, నేతాజీ కాలనీ,నెహ్రూ కాలనీ ,బిలాల్ నగర్,పాపకాలని ,బలరాం కాలనీ ,మథర్ తెరిశా కాలనీలు జలమయంసముద్రాన్ని తలపిస్తున్న రోడ్లునేతాజీ కాలనీ,వెంకటేస్వరా కాలనీల ప్రజల జలదిగ్బంధంకోనసీమ.. ఇళ్లలోకి పాములు!కోనసీమ అంబాజి పేటను ముంచెత్తిన వర్షపు నీరుఇళ్లలోకి చేరుకున్న వర్షపు నీరురోడ్ల పై మోకాలు లోతు నీరు చేరుకోవడంతో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలుసరైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేక పోవడంతో చిన్న చినుకు పడితే రోడ్లు అన్ని జలమయం అవుతాయి అంటున్న గ్రామస్థులునాగబాత్తుల వారి పాలెం లో వర్షపు నీరు ఇంట్లోకి చేరుకోవడంతో ఇళ్లలోకి వస్తున్న పాములు.. ఆందోళనలో ప్రజలు మోంథా ధాటికి భారీగా పంట నష్టం మోంథా ప్రభావంతో శ్రీకాకుళం నుంచి తిరుపతి దాకా అన్నిచోట్లా దెబ్బ తిన్న పంటలుతుపాను ప్రబావంతో చేతికందిన పంట నీటిపాలుకోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో వేల ఎకరాలల్లో భారీగా పంట నష్టంకృష్ణా జిల్లాలో నేలకొరిగిన అరటి బొప్పాయి తోటలు శ్రీకాకుళంలో 350 హెక్టార్లలో పంట నష్టంగాలులకు అరటి, కంద, బొప్పాయి తోటలు నష్టంవిజయనగరంలో 7 వేల ఎకరాలు నేలవాలిన వరిప్రకాశం జిల్లాలో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టంగుంటూరు, బాపట్ల, పల్నాడులో తడిసి ముద్దైన పత్తికన్నీరు పెడుతున్న ఏపీ రైతాంగంపిఠాపురం, కొత్తపల్లి మండలాల్లో నీట మునిగిన వరి పంటతెలంగాణ ఖమ్మంలో.. మోంథా తుపాను కారణంగా ఉమ్మడి ఖమ్మంలో కురుస్తున్న భారీ వర్షాలుస్తంభించిన జనజీవనంబోనకల్ లో అత్యధికంగా 9.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుతల్లాడ లో 9 సెం.మీ, వైరా లో 8 సెం. మీ, పెనుబల్లి లో 7 సెం. మీ, మధిర 7 సెం. మీ, కల్లూరు 7 సెం.మీ వర్షపాతం నమోదు....భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్ అనుదీప్...అత్యంత భారీ వర్షాల నేపథ్యంలో జనం ఏదైనా అత్యవసరం అవుతేనే ఇంట్లో నుంచి బయటికి వెళ్లాలని సూచనఅనకాపల్లి జిల్లాలో..విజయరామరాజు పేట దగ్గర ఉధృతంగా తాచేరు నదితాత్కాలిక కాజ్ వే మునిగిపోయే ప్రమాదంఅల్లూరి - అనకాపల్లి జిల్లాల మధ్య వాహనాలు రాకపోకలకు విఘాతంప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు నంద్యాల జిల్లాలో..ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రభావం చూపిన మోంథా తుపానుసిరివెళ్ల నుండి రుద్రవరం వెళ్లే రోడ్డు మార్గం జలమయం, నిలిపివేసిన ఏపీఎస్ఆర్టీసీ సేవలు.ఆళ్లగడ్డ నియోజకవర్గ వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాల వల్ల ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు వంకలు...రోడ్డుపై ఆరబెట్టిన మొక్కజొన్న మొత్తం నీటిమయం ఆదుకోవాలని కోరుతున్న రైతులుప్రమాద ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి న రెవెన్యూ అధికారులు పోలీసులు రెవెన్యూ అధికారులు పోలీసులునంద్యాల టౌన్ను ముంచెత్తిన తుపానులోతట్టు కాలనీలు జలమయం,ఇళ్లల్లోకి చేరిన వర్షపునీరుతీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలుతుపాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలుఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద నీరుఉదృతంగా ప్రవహిస్తున్న కుందు నది , వెక్కిలేరు , పాలేరు వాగులువరద హెచ్చరికలు జారీ చేసిన రెవెన్యూ , మున్సిపల్ అధికారులుమహానంది - నంద్యాల మధ్య , మహానంది - గాజులపల్లి మధ్య వరద కారణంగా నిలిచిన రాకపోకలుశ్రీశైలంలో..శ్రీశైలం మండలంలో అల్లకల్లోలం చేసిన మోంథా తుపానుశ్రీశైలంలో అర్ధరాత్రి నుంచి భీభత్సం సృష్టించిన కుండపోత వర్షంశ్రీశైలంలోని పలు కాలనీలోకి మోకాళ్ళ లోతుకు చేరిన వరద నీరుశ్రీశైలం డ్యాం వద్ద విరిగిపడిన భారీ కొండ చరియలు,కొండచరియలు రోడ్డుకు అడ్డంగా పడడంతో వాహన రాకపోకలకు తీవ్ర ఆటంకం,లింగాలగట్టులో మత్స్యకారుల ఇళ్లల్లోకి చేరిన వరద నీరు,లింగాలగట్టులో వర్షం భీభత్సం ధాటికి కొట్టుకుపోయిన మత్స్యకారుల ఇల్లులుఅర్థరాత్రి నుంచి నిద్ర లేకుండా బిక్కుబిక్కుమంటూ గడిపిన మత్స్యకారులుఅనకాపల్లి జిల్లాలో..ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ఉడేరు నదికి పెరిగిన వరద నీరు వరద నీరు తాకిడి కారణంగా ఉడేరు నదికి పడిన గండిఉడేరు నదికి గండి పడడంతో పంట పొలాల్లోకి వస్తున్న వరద నీరుఆందోళన చెందుతున్న భోగాపురం చాకిపల్లి రైతులువరద నీరు మరింతగా బయటకు వస్తే గ్రామాలు ముంపుకు గురయ్యే అవకాశంపల్నాడు జిల్లాలో..చిలకలూరిపేట నియోజకవర్గం అర్ధరాత్రి నుంచి భారీ వర్షంపసుమర్రు సబ్ స్టేషన్ లోకి భారీ స్థాయిలో వచ్చిన వర్షపునీరుతెలంగాణలో దంచి కొడుతున్న వానలుమోంథా ప్రభావంతో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వానలుశ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారి బ్రాహ్మణపల్లి వద్ద బ్రిడ్జిపైనుంచి పొంగిపొర్లుతున్న చంద్రవాగురంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం సుద్ధపల్లి గ్రామవాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో నిలిచిపోయిన రాకపోకలునాగర్ కర్నూల్-- బల్మూరు మండలం మైలారం గ్రామంలో అలుగుపారుతున్న చెరువు నిలిచిపోయిన రాకపోకలుహనుమకొండ జిల్లా ఎల్కతుర్తి,భీమదేవరపల్లి,కమలాపూర్ మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వానహన్మకొండ జిల్లా పరకాల డివిజన్ వ్యాప్తంగా ఉరుములు. మెరుపు ల తో కురుస్తున్న మోస్తారు వర్షంసూర్యాపేట జిల్లాలో మోంథా ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలుకలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. కంట్రోల్ రూమ్ నెంబర్: 6281492368హుజూర్నగర్ మండలం వేపల సింగారం వద్ద ఈదురుగాలుల ప్రభావంతో రోడ్డుపై కూలిన భారీ వృక్షంవనపర్తి జిల్లా మదనాపురం మండలం సరళ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరదరావడంతో ఆటో మేటిక్ గా తెరుచుకున్న రెండు సైపన్స్బాపట్ల జిల్లాలో.. కొల్లూరు మండలం లో రాత్రి నుంచి ఈదురుగాయలతో కురిసిన భారీ వర్షంఈదురు గాలులు దెబ్బకు భారీగా పంట నష్టంనేలకొరిగిన తమలపాకు అరటి పంట పొలాలుకంద పొలాల్లోకి భారీగా వర్షపు నీరు రావడంతో రైతులకు తీవ్ర నష్టంప్రకాశం జిల్లాలో.. చీమకుర్తి నుండి కొండేపి వెళ్లే రోడ్డు మార్గం నిలిపివేసిన సచివాలయ సిబ్బందికేవీ పాలెం గ్రామంలో చెరువు నిండి రోడ్డుపైకి బారీగా నీరు రావడంతో చిల్లకంప వేసి రాకపోకలు ఆపివేసిన సచివాలయ సిబ్బందిఏడు గ్రామాలకు రాకపోకలు నిలిపివేతగూడు ఏమైందో?కాకినాడ పునరావాస కేంద్రాల వద్ద దయనీయమైన పరిస్థితులుచలికి వణికిపోతున్న పిల్లలు, వృద్ధులుబిక్కుబిక్కుమంటూ గడుపుతున్న తుపాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలుఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందో అని గుబులు పడుతున్న వైనంమోంథా ప్రభావం..తీరం దాటినా గట్టి ప్రభావం చూపుతున్న మోంథానేడు ఆరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశంమరో ఆరు జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ఈదురు గాలుల తీవ్రత నేడంతా ఉండే అవకాశంఇప్పటికీ అంధకారంలోనే కోస్తాంధ్ర జిల్లాలుకరెంటు స్తంభాల పునరుద్ధరణ పనులు ఆలస్యంకొనసాగుతున్న విరిగి పడిన చెట్ల తొలగింపుక్షేత్రస్థాయిలో పని చేస్తున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలుఎన్టీఆర్ జిల్లా..చందాపురం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న నల్లవాగుచందర్లపాడు నందిగామ మండలాల మధ్య రాకపోకలకు బంద్కృష్ణా జిల్లాలో..రైతులను నిండా ముంచేసిన తుపానుఅవనిగడ్డ నియోజకవర్గంలో బీభత్సం సృష్టించిన ఈదురుగాలులు,వర్షంరైతుల పాలిట శాపంగా మారిన మోంథా తుపానుఈదురు గాలుల ధాటికి నేలకొరిగిన వరి పైరుపూర్తిగా దెబ్బతిన వాణిజ్య పంటలుతీవ్రంగా నష్టపోయిన వరి, అరటి, కంద, కూరగాయ పంటలుఆందోళనలో రైతులు తెలంగాణ నాగర్ కర్నూలు జిల్లాలో.. ఉప్పునుంతల మండలంలో అచ్చంపేట వెళ్లే దారులు నాలుగు వైపులా జల దిగ్బంధం బృందంకొల్లాపూర్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించిన అధికారులుఅచ్చంపేట శ్రీశైలం ఉత్తర ద్వారం ఉమామహేశ్వర ఆలయం మూసివేత నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా భారీగా కురుస్తున్న వర్షం కొండలపై నుండి జలపాతం ఎక్కువ రావడంతో ముందుజాగ్రత్తగా ఆలయం మూసివేతప్రకాశం జిల్లాలో.. పొదిలి మండలం బట్టువారి పల్లె దగ్గర ఒంగోలు శ్రీశైలం జాతీయ రహదారిపై ఉధృతంగా ప్రవహిస్తున్న వాగురాకపోకలు బంద్ ఇబ్బందులు పడుతున్న వాహనదారులుఖాళీగా విజయవాడ బస్టాండ్ప్రజా రవాణా వ్యవస్థపై మోంథా ప్రభావందూరప్రాంతాలకు వెళ్లాల్సిన 161 ఏసి,సూపర్ లగ్జరీ, అల్ట్రాడీలక్స్,ఎక్స్ ప్రెస్,నాన్ స్టాప్ బస్సులు రద్దువెలవెలబోతున్న విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్శ్రీకాకుళం,విజయనగరం,విశాఖ,కాకినాడ,కోనసీమ,పశ్చిమగోదావరి,బాపట్ల,ప్రకాశం,నెల్లూరు జిల్లాలకు నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులుతుపాను ప్రభావం తగ్గే వరకూ డిపోలకే ఆర్టీసీ బస్సులు పరిమితంరైతులకు కన్నీళ్లు మిగిల్చిన మోంథాఏపీలో పంటలపై మోంథా తుపాను ప్రభావంనేలకొరిగిన వరి, మినుము, వేరుశనగ, మొక్కజొన్న పంటలుకృష్ణా జిల్లాల్లో అత్యధికంగా నీట మునిగిన పంట! శ్రీశైలం పాతాళ గంగ వద్ద తప్పిన ప్రమాదంశ్రీశైలంలో తప్పిన ఘోర ప్రమాదంపాతాళ గంగ విరిగిపడ్డ కొండచరియలుమూడు తాత్కాలిక దుకాణాలు ధ్వంసంభక్తులెవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం మరో 24 గంటలు వర్షాలే!మోంథాపై భారత వాతావరణ శాఖ(IMD) తాజా ప్రకటనఛత్తీస్గడ్ దిశగా పయనించి ఈ మధ్యాహ్నానికి బలహీనపడిపోతుందిమోంథా ప్రభావంతో గంటకు 85-95 కిలోమీటర్ల వేగంతో గాలులుఏపీ, తెలంగాణ తోపాటు దక్షిణ ఒడిషా తీర ప్రాంతాలకు మరో 24 గంటలు వర్షాలేవాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన అధికార యంత్రాంగంపూర్తిగా నిండిన ఆసియా లోనే రెండో పెద్దది అయిన కంభం చెరువు, కాసేపట్లో కంభం చెరువు నుండి భారీగా కిందకు పారనున్న అలుగు. చెరువు దగ్గరకి ఎవరు వెళ్లకూడదని పోలీసులు కాపలా.కంభం చెరువు కి రికార్డు స్థాయి లో 20 వేల క్యూసెక్కుల వరద https://t.co/tHpVDoQGfq pic.twitter.com/LeLKJWTW4x— Telugu_Weatherman (@Weather_AP) October 29, 2025క్రమంగా బలహీనపడుతున్న మోంథాక్రమంగా బలహీనపడుతున్న సైక్లోన్ మోంథాఇప్పటికే ఈ తీవ్ర తుపాను.. తుపానుగా బలహీనపడిందిరానున్న 4 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశంఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలుఇటు తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశంవిమాన సర్వీసుల పునరుద్ధరణమోంథా కారణంగా నిన్న నిలిచిపోయిన 56 సర్వీసులుఇవాళ విశాఖ-విజయవాడ ఇండిగో సర్వీసు మాత్రమే రద్దుమిగతావి యధాతథంఇంకా భయం గుప్పిట యానాంయానాంలో తుపాను ప్రభావం24 గంటలుగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరాఉదృతంగా ప్రవహిస్తున్న గౌతమి గోదావరిభారీ ఈదురుగాలులు ప్రవాహంతో కుప్పకూలిన 20 వృక్షాలుసముద్రపు అలలు తలిపించేలా ప్రవహిస్తున్న గౌతమి గోదావరినిన్న మధ్యాహ్నం నుంచే వ్యాపార సముదాయాలు మూసివేతఈదురు గాలులు ప్రభావంతో బయటకి రాని యానాం ప్రజలుఅనకాపల్లి జిల్లాలో.. మాడుగుల. పెద్దేరు రైవాడ జలాశయాలకు వరద ఉధృతి.ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు జలాశయాలకు చేరిక.పెద్దేరు జలాశయం నుంచి 750 న్యూ సెక్యుల నీరు విడుదల.తమతబ్బ వంతెనపై నుంచి కొనసాగుతున్న ప్రవాహం.తమతబ్బ చింతలపూడి పంచాయతీల్లో 12 గ్రామాల రాకపోకలకు అంతరాయం.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశం.తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లాల్లో.. మోంథా తుపాను కారణంగా జిల్లాలో విస్తారంగా కురస్తున్న వర్షాలుకాకినాడలో.. మోంథా తుపాను ఎఫెక్ట్తో తొండంగి, ఉప్పాడ మండలాల పరిధిలో పలు గ్రామాలకు నిలిచిన విద్యుత్ సరఫరానిన్న ఉదయం నుండి కరెంటు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలుకొనసాగుతున్న పునరుద్దరణ పనులుతెలంగాణ మహబూబాబాద్ జిల్లాలో.. మహబూబాబాద్, ఇనుగుర్తి కేసముద్రం మండలాల్లో కురుస్తున్న భారీ వర్షండోర్నకల్ నియోజక వర్గ వ్యాప్తంగా కురుస్తున్న మోస్తరు వర్షంప్రకాశం జిల్లాలో.. ఒంగోలు నవోదయ స్కూల్ లోకి భారీగా చేరిన నీరుక్యాంటీన్ లోకి సైతం వర్షపు నీరు రావడంతో వంట కు ఇబ్బందిగా మారింది సిబ్బందివిద్యార్థులు కు ఆహారం ఇవ్వాలా వండడం కష్టం అంటున్న సిబ్బందిఎన్టీఆర్ జిల్లాలో.. కొనసాగుతున్న మోంథా తుపాను ప్రభావంతిరువూరులో భారీ వర్షంభారీ వర్షం కారణంగా చెరువును తలపిస్తున్న ఆర్టీసీ బస్టాండ్, రోడ్లుఇబ్రహీంపట్నంలో భారీగా వీస్తున్న ఈదురుగాలులువిజయవాడ సిటీలో ఈదురు గాలులతో కురుస్తున్న మోస్తరు వర్షంనందిగామలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంనందిగామ పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయంరోడ్ల పై భారీగా నిలిచిన వర్షపు నీరుపార్వతీపురం మన్యం జిల్లాలో.. తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల పూరి ఇల్లు పాక్షికంగా ధ్వంసం.గడిచిన 24 గంటలుగా కురుస్తున్న వానలకు 118.70 హెక్టార్ల లో వ్యవసాయ పంటలకు నష్టం.జిల్లా కలెక్టర్ కార్యాలయం నివేదికనెల్లూరు జిల్లాలో..సంగం పెన్నా వారధి వద్ద తప్పిన పెను ప్రమాదంపెన్నా నది నుండి ఇసుక తరలించేందుకు నిల్వ ఉంచిన మూడు పడవలుభారీగా నీరు రావడంతో తాళ్ళు తెంచుకొని పెన్నా నది గట్టున నిలిచిన బోట్లుపెన్నా వారధి గేట్లకు కు తగలకపోవడంతో ఊపిరిపించుకున్న అధికారులుకృష్ణా జిల్లాలో..మోంథా తుపాను ప్రభావంతో గన్నవరం నియోజకవర్గం వ్యాప్తంగా కురుస్తున్న వర్షంభారీ ఈదురు గాలులకు బాపులపాడు, ఉంగుటూరు మండలాల్లో నేలకొరిగిన వరి పంటనల్లగొండ జిల్లాలో..వర్షం నేపథ్యంలో నల్లగొండ జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించిన అధికారులువిశాఖపట్నంలో.. తుపాను తీరం దాటిన విశాఖలో కొనసాగుతున్న ఈదురు గాలులు.ఇంకా అల్లకల్లోలంగా సముద్రం.మత్స్యకారులు మరో మూడు రోజులు వేటకు వెళ్లొద్దని ఆదేశాలు.ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా ఈరోజు ప్రభుత్వ ప్రైవేటు స్కూలుకు సెలవు.భారీ గాలులకు అనకాపల్లి నేషనల్ హైవే పై కూలిని చెట్టు.ఈదురు గాలులకు శంకరమఠం రోడ్ లో ఇంటిపై పడ్డ చెట్టు.అనకాపల్లి జిల్లాలో పంట మునిగిన పొలాలు..ఈరోజు భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచన.ఈరోజు బీచ్, పర్యాటక ప్రాంతాలకు అనుమతి నిరాకరణ నెల్లూరు జిల్లాలో..ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సోమశిల జలాశయంకు వరద ప్రవాహం.జలాశయం ఇన్ ఫ్లో 40,784 క్యూసిక్కులు..జలాశయం అవుట్ ఫ్లో 33,460 క్యూసిక్కులు..జలాశయం ప్రస్తుతం నీటి సామర్థ్యం 67.647 టీఎంసీలు..జలాశయం పూర్తి నీటి సామర్థ్యం 78 టీఎంసీలు అనకాపల్లిలో..గాలులకు అనకాపల్లి హైవే కూలిన భారీ వృక్షంతొలగించిన ఫైర్ సిబ్బందితిరుపతిలో తెరుచుకోనున్న విద్యాసంస్థలు!తిరుపతి జిల్లాలో ఇవాళ తెరుచుకోనున్న విద్యాసంస్థలు అన్ని యాజమాన్యాల పాఠశాలలు ఈరోజు నుండి యథావిధిగా పనిచేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాలుమోంథా ప్రభావంతో తిరుపతిలో వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖప్రకాశం జిల్లాలో.. మోంతా తుపాను ప్రభావంతో జిల్లా అతలాకుతలంభారీ వర్షాల ఈదురు గాలులతో చిగురుటాకుల వణికిన ఉమ్మడి ప్రకాశం జిల్లాపొంగిపొల్లిన వాగు లు, వంకలునిండు కుండాలా తయారైన పలు చెరువులుపలుచోట్ల రాకపోకలకు అంతరాయంరహదారులపై వాగులు పొంగిన చోట పోలీస్ పికెటింగ్కందుకూరులో ఎర్రవాగు ఉగ్రరూపం.రాళ్లపాడు ప్రాజెక్టుకు పోటెత్తిన వరద నీరుసింగరాయకొండ పోలీస్ స్టేషన్ నీటిమనకకూచిపూడి చెరువుకు గండి భారీగా గ్రామం మీద పడ్డ వరదనీరుకొండేపి వద్ద పొంగిపొర్లను అట్లేరుకొండేపి ఒంగోలు మధ్య రాకపోకలకు అంతరాయంఒంగోలు ఎర్రజర్ల మధ్య పొంగిపొర్లిన నల్లవాగుఒంగోలు ఎర్రజర్ల మధ్య నిలిచిన రాకపోకలుఅదే ప్రాంతంలో నిన్న కొట్టుకుపోయినఒక కారు కనిగిరిలో సరిగా వర్షంపోటెత్తిన భైరవకోన జలపాతం Bhairavakona Watefalls after heavy rain from cyclone 🌀 #Montha. This is in Seetharamapuram region of Prakasam district, Coastal AP close Kadapa, Nellore and Prakasam districts border. Prakasam, Nellore and Adjoining Badvel Taluk in Kadapa district received heavy to very heavy… pic.twitter.com/XqyQ22ZvV1— Naveen Reddy (@navin_ankampali) October 28, 2025 ఒంగోలు పొదిలి మధ్య వర్షం దాటికి దెబ్బతిన్న రహదారితీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులుఒంగోలులో పల్చోట్ల కాలనీలు జలమయంఒంగోలు నగరంలోని కర్నూల్ రోడ్డు, ట్రంక్ రోడ్లో సైతం భారీగా నిలిచిన వర్షపు నీరుశివారు కాలనీలో ఇళ్లలోకి చేరిన నీరుతీర ప్రాంత మండలాల్లో భారీ వర్షం ఈదురు గాలులుపునరావాస కేంద్రాలకు పలువురు తరలింపుమార్కాపురం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గుండ్లకమ్మ నదిమార్కాపురం నియోజకవర్గంలో మార్కాపురం- కొండేపల్లి మార్కాపురం -నాగులవరం గ్రామాల మధ్య రాకపోకలకు బంద్జిల్లాలో భారీగా నష్టపోయిన మిర్చి మొక్కజొన్న కంది మినుము సజ పంట రైతులుపుల్లలచెరువు మండలం చౌటపచర్ల చెరువుకు గండి వంద ఎకరాలలో ఉరి మొక్కజొన్న పంట నష్టందర్శి మండలం వెంకటాచలపల్లి వద్ద పొంగిపొర్లుతున్న పులి వాగుకొట్టుకుపోయిన రోడ్లుగ్రామ శివారులో ఉన్న గుడిలో రోడ్డు కొట్టుకుపోవడంతో అక్కడ ఇరుక్కుపోయిన 30 మంది స్వాములుచీరాలలో భారీ వర్షాలతో రోడ్లు జలమయం అర్ధవీడు మండలం నల్లమల అటవీ ప్రాంతంలో భారీ వర్షాలుఉప్పొంగిన జంపలేరు వాగుబొల్లు పల్లె అచ్చంపేటకు రాకపోకలు బంద్భారీ వర్షాల కారణంగా నిన్నటి నుంచి దోర్నాల శ్రీశైలం మధ్య నిలిచిన రాకపోకలుగుండ్లకమ్మ రిజర్వాయర్కు భారీగా వరద నీరు ఏపీని నిండా ముంచిన మోంథామోంథా తుపానుతో ఏపీకి తీవ్ర నష్టంఓవైపు భీకరగాలులు.. మరోవైపు భారీ వర్షాలువిరిగిన స్థంభాలు, నేలకొరిగిన వృక్షాలుపొంగిపొర్లుతున్న వాగులురోడ్లు, రైల్వే ట్రాక్లు దెబ్బతినడంతో రవాణా వ్యవస్థకూ అంతరాయంలోతట్టు ప్రాంతాల జలమయంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు20 గంటలుగా అంధకారంలోనే పలు ప్రాంతాలుసెల్ టవర్లు దెబ్బ తినడంతో పని చేయని సెల్ఫోన్ సేవలుతీవ్రంగా దెబ్బ తిన్న పంటలుఐదు రోజులుగా వేటకు దూరమైన మత్య్సకారులుమోంథా ప్రభావంతో ఈ నెల 31 దాకా విద్యాసంస్థలకు సెలవులు పొడిగించిన పలు జిల్లా కలెక్టర్లుA new waterfall has formed in Poolikuntla village, Velgandla Mandal, Kanigiri Taluk of Prakasam district, following the impact of #CycloneMontha. Nellore and Prakasam districts, along with Nandyal, are among the worst affected areas so far. Now it’s Telangana time, by morning… pic.twitter.com/LlEfh2A1sD— Naveen Reddy (@navin_ankampali) October 28, 2025క్రమంగా బలహీనపడుతున్న మోంథాతీవ్ర తుపాను ప్రస్తుతం తుపానుగా బలహీనపడ్డ మోంథారానున్న 6 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీన పడే అవకాశందీని ప్రభావంతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుకోస్తాంధ్రలో ఈదురుగాలులుఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశంఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలుకాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశంనెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశంతెలంగాణకు వాతావరణశాఖ అలర్ట్మెంథా ఎఫెక్ట్తో తెలంగాణలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ఆరు జిల్లాలకు ఆరెంజ్, 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్భద్రాద్రి, ఖమ్మం, నాగర్కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్హైదరాబాద్, జనగాం, గద్వాల, మేడ్చల్, మహబూబ్నగర్, మంచిర్యాల, నారాయణపేట, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, యాదాద్రి.. ఆరెంజ్ అలర్ట్కృష్ణా జిల్లా..దివి సీమలో మోంథా తుపాను ప్రభావంతో కొనసాగుతున్న ఈదురు గాలులునిన్న మధ్యాహ్నం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇబ్బంది పడుతున్న ప్రజలుఅవనిగడ్డ నియోజకవర్గం వ్యాప్తంగా ఈదురుగాలుల కారణంగా విద్యుత్ పునఃరుద్ధరణకు అంతరాయంగాలుల తీవ్రత తగ్గిన తర్వాత విద్యుత్ను పునఃరుద్ధరించే అవకాశంతెలంగాణ ఖమ్మం జిల్లాలో.. తెలంగాణపై మోంథా ప్రభావంపలు జిల్లాలకు వర్ష సూచనమొoథా తూఫాను దృష్ట్యా (బుధవారం) జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రకటనప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరిన కలెక్టర్తెలంగాణ వికారాబాద్ జిల్లాలో.. మోంథా ఎఫెక్ట్ జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షంపూడూరు లో 6.1 cmమోమిన్ పేట లో 6 cmధారూర్ లో 4.6cmపరిగిలో 4.5cmకిరండోల్ రైల్వే లైన్ ధ్వంసంమోంథా తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు వాల్తేరు రైల్వే డివిజన్లో కొత్తవలస-కిరండోల్ సింగిల్ రైల్వే లైన్ ధ్వంసం అరకు రైల్వే టన్నెల్ నెంబర్ 32, చిమిడిపల్లి, బొర్రా గుహల మధ్య రైల్వే ట్రాక్ పూర్తిగా ధ్వంసం ట్రాక్పై చేరిన మట్టి, బండరాళ్లు వరద నీరు నిలవకుండా ఏర్పాట్లు చేసిన సిబ్బందిఎన్టీఆర్ జిల్లాలో..తిరువూరు నియోజకవర్గ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షంనీట మునిగిన ఆర్టీసీ బస్టాండ్, ప్రధాన రహదారిపలు లోతట్టు ప్రాంతాలు జలమయంకృష్ణా జిల్లాలో.. ఉయ్యూరు మండలం గండిగుంట పంచాయతీ కాకాని నగర్ లో మూడు రేకుల షెడ్లు ఇళ్ల పై పడిన చెట్లు.పూర్తిగా ధ్వంసం అయిన ఒక ఇల్లు,పాక్షికంగా మరో రెండు ఇల్లు ధ్వంసం.సహాయ చర్యలు చేపట్టిన అధికారులునంద్యాల జిల్లాలో..మోంథా తుపాను కారణంగా ఆత్మకూరు రెవిన్యూ డివిజన్ లోని పాములపాడు, కొత్తపల్లి, వెలుగోడు మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంనల్లమలలో కురుస్తున్న భారీ వర్షానికి ఎగువ నుంచి భవనాసివాగు కు చేరుతున్న వరద నీరు.ఉప్పొంగిన వక్కిలేరు, భవనాసి వాగులు..ఆత్మకూరు పట్టణ శివారులోని భవనాసి వాగుపొంగి పొర్లుతుండడంతో సుమారు 22గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలుజలదిగ్బంధంలో ఆత్మకూరు పట్టణం.కర్నూలు -గుంటూరు జాతీయ రహదారిపై మోకాలికి పైగా పారుతున్న వర్షపు నీరు..వెలుగోడు మండలంలోని మాధవరం వద్ద పొంగిపొర్లుతున్న గాలేరు వాగు, సుమారు 8 గ్రామాలకు నిలిచిపోయిన ప్రజా రవాణా సంబంధాలులోతట్టు కాలనీలు జలమయం, నిద్రాహారాలు మాని అవస్థలు పడుతున్న ప్రజలు..విశాఖపట్నంలో..విశాఖ నగరం పై కొనసాగుతున్న తుపాను ప్రభావం. .నిన్న రాత్రి విశాఖలో భారీగా ఈదురు గాలులుగాలులకు శంకరమఠం రోడ్ లో ఇంటిపై కూలిన భారీ వృక్షం.తూటిలో తప్పిన ప్రమాదంపాక్షికంగా ఇల్లు ద్వసం.చెట్టును తొలగిస్తున్న ఫైర్ సిబ్బంది.జోన్ 3 లో ఇప్పటివరకు పడిన 72 నుండి చెట్లును తొలగించిన అధికారులువిజయవాడలో.. మోంథా తుపాను ఎఫెక్ట్తో విజయవాడలో అర్ధరాత్రి నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షంగుంటూరులో.. గుంటూరు జిల్లాలో భారీ వర్షంఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంగుంటూరులో బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షంనగరంలోని అన్ని ప్రధాన రహదారులు జలమయంపొంగిపొర్లుతున్న ట్రైన్లుబ్రాడీపేట ,అరండల్ పేట, మహిళా కాలేజ్, గుజ్జునుకుంట్ల, ఏటి అగ్రహారంతో పాటు ప్రధాన రోడ్లన్నీ జలమయంRUB తోపాటు 3 వంతెన కిందకు భారీ స్థాయిలో వర్షపునీరుభారీ వర్షాలు ఎక్కడంటే..శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశంకాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశంకోనసీమ జిల్లా..అంతర్వేది పాలెం వద్ద తీరం దాటిన మోంథా తుపానుతీరం దాటే సమయంలో 70 నుంచి 80 కిలోమీటర్ల మేర ఈదురు గాలులుకోనసీమలో భారీగా కూలిన చెట్లుపలుచోట్ల ధ్వంసమైన విద్యుత్ లైన్లురోడ్డుకు అడ్డంగా భారీ వృక్షాలు కోవడంతో నిలిచిపోతున్న రాకపోకలుపలు ప్రాంతాల్లో కురుస్తున్న చిరుజల్లులుజిల్లా వ్యాప్తంగా 50 వేల ఎకరాల్లో దెబ్బతిన్న వరి పంటపెద్ద సంఖ్యలో కూలిన కొబ్బరి చెట్లుతీర ప్రాంతంలో కొనసాగుతున్న ఈదురు గాలులుఅంతర్వేది, ఉప్పలగుప్తం ఓడలరేవు ప్రాంతాల్లో అలకల్లోలంగా ఉన్న సముద్రంఎగసిపడుతున్న అలలువిజయవాడ..ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి దంచికొడుతోన్న భారీ వర్షంపలుచోట్ల అర్ధరాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేతవిజయవాడలో భారీ వర్షం కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయంఆర్టీసీ బస్టాండ్ వద్ద సబ్ వేలోకి చేరిన వర్షపు నీరుసబ్ వే వైపు వాహనాలు వెళ్లకుండా బారికేడ్లు పెట్టిన పోలీసులుకనకదుర్గ ఫ్లై ఓవర్ వైపు వాహనాల రాకపోకలు నిలిపివేతవిజయవాడ..ప్రకాశం బ్యారేజ్ కు పెరుగుతున్న వరదఇన్ ఫ్లో , అవుట్ ఫ్లో 82,675 క్యూసెక్కులువచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదలకాలువలకు పూర్తిగా నీటి విడుదలను నిలిపివేసిన అధికారులు మోంథా ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కావలిలో అత్యధికంగా 22 సెం.మీ. వర్షం కురిసింది. With 207 mm of rain recorded today, Ongole city has witnessed one of its heaviest single-day downpours in recent years. The situation across Prakasam district is equally severe.🎥Rekha pic.twitter.com/jqKkqQosKA— Naveen Reddy (@navin_ankampali) October 29, 2025మోంథా తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. పలు చోట్ల విద్యుత్ స్థంబాలు, చెట్లు నేలకొరిగాయి. జాతీయ రహదారిపై రాత్రంతా వాహనాలను ఎక్కడిక్కడే నిలిపేశారు. మచిలీపట్నంలో.. తుపాను ధాటికి మచిలీపట్నంలో విద్యుత్ వ్యవస్థ ధ్వంసమైంది. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.నెల్లూరు, బోగూరులో తుపాను ధాటికి గుడిసెలు కుప్పకూఇపోయి ప్రజలు గజగజ వణికిపోయారుప్రకాశంలో.. 10 అడుగుల మేర అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయిందిపలు జిల్లాలోనూ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగి రాత్రంతా ప్రజలు అంధకారంలోనే ఉండిపోయారు. పలు జిల్లాల్లో రోడ్లు జలమయమయ్యాయి. తీవ్ర తుపాన్గా తీరం దాటే కోనసీమలో సముద్రం ఉప్పొంగింది. సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో సముద్రం ముందుకొచ్చింది. మామిడికుదురు మండలం కరవాక, గొగన్నమఠం దగ్గరా ముందుకు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీంతో మత్స్యకార కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాన్ ప్రభావంతో.. ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, అనకాపల్లి, విశాఖ.. ఇలా 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాల ఉంటాయంది. -
శాంతించిన మోంథా!
సాక్షి, విశాఖపట్నం: మూడు రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేసింది.. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలతో జన జీవనాన్ని స్తంభింపజేసింది.. తుపాను సముద్రంలో ఉంటేనే ఇంత అలజడి సృష్టించిందే.. ఇక తీరం దాటే సమయంలో ఉప్పెనలా విరుచుకు పడుతుందంటూ వాతావరణ నివేదికలు హెచ్చరించాయి... తీరం సమీపిస్తున్న కొద్దీ అందర్లోనూ ఉత్కంఠ.. ఆందోళన.. రాకాసి మోంథా ఎలా ముంచేస్తుందో.. ఎక్కడ విరుచుకుపడుతుందోనని తీర ప్రాంత జనం బిక్కుబిక్కుమంటూ గడిపారు.. పాములు పట్టేవాడు పాముకాటుకే బలయ్యారనే నానుడిలా... గాలులన్నింటినీ తనలో కలిపేసుకుంటూ బలంగా దూసుకొచ్చిన మోంథా.. చివరికి ఆ గాలుల కోత వల్లే బలహీన పడింది. తీరం దాటుతున్నా ప్రశాంత వాతావరణం.. కొద్దిపాటి బలమైన గాలులు.. మోస్తరు నుంచి భారీ వర్షాలతో సముద్రాన్ని వదిలి నేలమీదకి వచ్చింది. ముంచేస్తుందనుకున్న మోంథా.. మౌనంగా వెళ్లిపోవడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. అధికార యంత్రాంగం ప్రభుత్వ హడావుడి నుంచి తేరుకున్నారు. అయితే వాయు, రైలు రవాణా స్తంభించిపోయింది. మొత్తంగా భయాందోళనలు సృష్టించిన తీవ్ర తుపాను మోంథా.. రాష్ట్రంపై మోస్తరు ప్రభావంతో వీడ్కోలు చెప్పేసింది. మోంథా ఎందుకు శాంతించిందంటే.. వాస్తవానికి మోంథా తుపాను వేగం, గమనం చూస్తే 2023లో బాపట్లలో తీరం తాకిన మిచాంగ్ తుపానును తలపించింది. సముద్రంలో తీవ్ర తుపానుగా బలపడటంతో గాలులన్నింటినీ తనలో చేర్చుకొని మరింత బలంగా మారింది. దీంతో మోంథా తుపాను.. రాష్ట్రంలోని అనేక తీర ప్రాంతాల్ని తుడిచి పెట్టుకుపోతుందని అంతా ఆందోళనకు గురయ్యారు. అయితే.. తీరానికి 70 నుంచి 100 కి.మీ. దూరంలో ఉన్న సమయంలో విండ్ షీర్ (గాలుల కోత) మొదలైంది. తుపాన్లో కీలకమైన సైక్లోన్ ఐ పై విండ్ షీర్ పంజా విసిరింది. దీంతో తుపాను గాలులు చీల్చుకుపోతూ కకావికలమైపోయాయి. దీంతో మోంథా తీరం దాటకముందే బలహీనపడిపోయింది. విండ్ షీర్ ప్రభావంతో తుపాను∙ప్రధాన కేంద్రం నుంచి చెల్లాచెదురైన గాలులు, మేఘాల ప్రభావం తీరం దాటే ప్రాంతంలో కాకుండా చుట్టుపక్కల జిల్లాలపై చూపించింది. దీంతో.. మోంథా తన శక్తిని కోల్పోయి.. తీరం దాటేందుకు సిద్ధమై.. కడలిని వదిలి భూమిని తాకింది. తీరం దాటే సమయంలో గరిష్టంగా 110 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులతో కూడిన అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నివేదికలు అంచనా వేసినా.. వాస్తవ స్థితిలో మాత్రం 70 నుంచి 80 కి.మీ. వేగంతో మోస్తరు వర్షాలకే పరిమితమవ్వడంతో తీర ప్రాంతమంతా ఊపిరి పీల్చుకుంది. కొన్ని ప్రాంతాల్లోనే ప్రభావం మోంథా తీవ్ర తుపాను తీరం తాకనంత వరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను వణికించింది. కానీ తీరానికి చేరుకోగానే పూర్తి నిశ్శబ్ధ వాతావరణాన్ని తలపించింది. ఉదయం 10 గంటల నుంచి మొదలైన గాలులు సాయంత్రం ఏడు గంటల వరకు జిల్లా వాసులను భయాందోళనలకు గురి చేశాయి. తీరానికి సమీపిస్తే తుపాను విరుచుకుపడుతుందనే ఆందోళన అందరి కంటి మీద కునుకులేకుండా చేసింది. భారీగా వీచిన ఈదురు గాలులకు పెద్ద సంఖ్యలో కొబ్బరి చెట్లు నేల కూలాయి. భారీ వృక్షాలు సైతం కూకటి వేళ్లతో సహా పడిపోయాయి. విద్యుత్ తీగలు తెగి పడడంతోపాటు పదుల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఉదయం 10 గంటల నుంచి జిల్లాలో పలు మండలాలకు విద్యుత్ లేకుండా పోయింది. సముద్ర అలలు మూడు మీటర్ల ఎత్తున ఎగిసిపడగా, 300 మీటర్లు ముందుకు చొచ్చుకు వచ్చాయి. తీరం భారీగా కోతకు గురైంది. తీరానికి చేరువయ్యే సమయంలో ప్రశాంతమే రాత్రి 8 గంటల తర్వాత మోంథా తుపాను ప్రభావం పూర్తిగా కనిపించలేదు. అసలు నిజంగా తుపాను∙ఇక్కడ తీరం దాటుతోందా.. లేదా దిశ మార్చుకుందా? అనే సందేహమే అందరిలోనూ మొదలైంది. అలజడి సృష్టించిన ఈదురు గాలులు నిలిచిపోయాయి. భారీ వర్షం సైతం తగ్గుముఖం పట్టింది. సముద్రంలో అలజడి కొనసాగుతున్నా భారీ వర్షం.. ఈదురు గాలులు లేకపోవడం జనాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. తుపాను అర్ధరాత్రి ఒంటి గంటకు నరసాపురం సమీపంలో తీరం దాటింది. ఈ సమయంలో 110 కి.మీ.ల వేగంతో గాలులు వీస్తాయని, భారీ వర్షం కురుస్తుందని కోనసీమ వాసులు ఆందోళన చెందారు. కళ్ల ముందు 1996 పెను తుపాను విషాదం కదలాడింది. కాని అందుకు విరుద్ధంగా గాలులు నిలిచి పోవడంతో పాటు భారీ వర్షం తగ్గి కేవలం చినుకులు పడుతుండడంతో మోంథా తుపాను గమనం ఎవరికీ అంతుచిక్కలేదు. దీంతో తీర ప్రాంతవాసులు బతుకుజీవుడా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో... తొలుత కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేసినా.. విండ్ షీర్ కారణంగా స్వల్పంగా దిశ మార్చుకొని అంతర్వేది పల్లిపాలెం వైపు వెళ్తుందన్న వాతావరణ శాఖ ప్రకటనతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం గంటకు 18 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన తుపాను వేగం మంగళవారం నాటికి 12 కిలోమీటర్లకు తగ్గిపోయింది. ఫలితంగా దీని దిశ మారిపోయి, జిల్లాకు ముప్పు తప్పింది. అయితే పెనుగాలులు, జోరు వానలతో ఈ తుపాను జిల్లాను అతలాకుతలం చేసింది. జిల్లావ్యాప్తంగా మంగళవారం ఉదయం నుంచీ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కాకినాడ తీరంలో బలమైన ఈదురు గాలులకు వర్షాలు కూడా తోడవ్వడంతో ప్రజలు భయకంపితులయ్యారు. పిఠాపురంలో 22.6 మిల్లీమీటర్లు, కాజులూరు మండలంలో అత్యల్పంగా 2.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో అక్కడక్కడ చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లోని కర్నూలు రోడ్డు, ఊరచెరువు రోడ్డులో నిలిచిపోయిన వర్షపునీరు ఉప్పాడ తీరానికి తప్పని ముప్పు తీరానికి మాత్రం ముప్పు తప్పలేదు. ఉప్పాడ, కోనపాపపేట గ్రామాల్లోని పలు ఇళ్లు సముద్ర కోతకు గురయ్యాయి. విద్యుత్ స్తంభాలు, వృక్షాలు సముద్రంలో కలసిపోయాయి. బీచ్ రోడ్డు ధ్వంసమైంది. సముద్రంపై వేటను నిషేధించడంతో మత్స్యకారులు ఇళ్ల వద్దనే ఉండిపోయారు. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న రాకాసి అలలు కాకినాడ – ఉప్పాడ బీచ్ రోడ్డును ముంచెత్తాయి. ముందు జాగ్రత్తగా బీచ్ రోడ్డుపై రాకపోకలను పోలీసులు నియంత్రించారు. సాధారణ ప్రయాణికులతో పాటు స్థానికులను సైతం ఆ రోడ్డు పైకి వెళ్లకుండా కట్టడి చేశారు. కోతకు గురి కాకుండా రక్షణగా వేసిన బండరాళ్లు సముద్ర అలల తాకిడికి రోడ్డు పైకి వచ్చిపడుతూ ప్రమాదకరంగా మారాయి. ముందుస్తు చర్యల్లో బాగంగా ఉప్పాడ, కోనపాపపేట, మూలపేట, ఉప్పాడ తీర ప్రాంత గ్రామాలైన మాయాపట్నం, సూరాడపేట, జగ్గరాజుపేట, అమీనాబాద్, కొత్తపట్నం, గంగూలిపేట, పాత మార్కెట్ ప్రాంతాల్లోని సుమారు 8,200 మందిని ఇతర ప్రాంతాలకు తరలించారు. కాకినాడ నగరంతో పాటు రూరల్, తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి, పిఠాపురం, గొల్లప్రోలు, తాళ్లరేవు తదితర మండలాల్లో మత్స్యకారులతో పాటు ఇతర నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. విశాఖపట్నంలో జలమయమైన వెలంపేటలోని రహదారి స్తంభించిన పోర్టు తుపాను ప్రభావంతో కాకినాడ డీప్ వాటర్, యాంకరేజ్ పోర్టుల్లో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. బియ్యం, పంచదార, పామాయిల్, యూరియా తదితర ఎరువులు ఎగుమతి, దిగుమతులను నిలిపివేశారు. కాకినాడ పోర్టులో 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక ప్రకటించారు. గడచిన రెండు దశాబ్దాల్లో కాకినాడ పోర్టులో ఈ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం ఇదే తొలిసారి. జిల్లా వ్యాప్తంగా 12 మండలాల పరిధిలో దాని ప్రభావం ఉందని చెబుతున్నా వాస్తవానికి కాకినాడ తీరంలోని తొండంగి, యు.కొత్తపల్లి.. కాకినాడ రూరల్ కాకినాడ సిటీ తాళ్ళరేవు మండలాలపైనే ప్రభావం కనిపించింది. ముందు జాగ్రత్త చర్యగా కాకినాడ, పిఠాపురం, తాళ్లరేవు ప్రాంతాల్లో హెలిప్యాడ్లు కూడా సిద్ధం చేశారు కానీ ఇంత వరకు వాటి అవసరం రాలేదు పంటలకు నష్టం విస్తారంగా కురుస్తున్న వర్షాలు, పెను గాలులకు అనేక ప్రాంతాల్లో పంటలు దెబ్బ తిన్నాయి. కరప, కాకినాడ రూరల్, పెద్దాపురం, సామర్లకోట, యు.కొత్తపల్లి, పిఠాపురం, గొల్లప్రోలు, కాజులూరు తదితర మండలాల్లో వరి పంట నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గొల్లప్రోలు మండలం దుర్గాడ, చేబ్రోలు, వన్నెపూడి తదితర ప్రాంతాల్లో మిరప, అరటి వంటి వాణిజ్య పంటలు దెబ్బ తిన్నాయి. ఏలేరు, పిఠాపురం బ్రాంచి కెనాల్ (పీబీసీ), సుద్దగెడ్డ పొంగి ప్రవహిస్తున్నాయి. ఏలేరు జలాశయానికి ఎగువ నుండి వరద నీరు పోటెత్తడంతో దిగువ ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏలేరు, పంపా, తాండవ రిజర్వాయర్లు పొంగి ప్రవహిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో.. మోంథా తుపాను పెద్దగా ప్రభావం చూపకపోవడం పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు ఊరటనిచ్చింది. నరసాపురం, భీమవరం, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల్లో అక్కడక్కడ జల్లులు మాత్రమే పడగా గాలుల తీవ్రత లేకపోవడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. తీవ్ర తుపానుగా బలపడిన తర్వాత ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల సమయానికి జిల్లాలో 154 మి.మీ వర్షం కురవగా, సగటు వర్షపాతం 7.7 మి.మీ మాత్రమే నమోదైంది. ఆచంటలో 24 మి.మీ అత్యధిక వర్షపాతం నమోదు కాగా, 20 మండలాలకు గాను 15 మండలాల్లో 10 మి.మీ లోపు వర్షం మాత్రమే కురిసింది. జిల్లా వ్యాప్తంగా 3,581 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్టు అధికారులు గుర్తించారు. తుపాన్ను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం ఆర్అండ్బీ పరిధిలో 29, ట్రాన్స్పోర్ట్ పరిధిలో 40, మొత్తంగా 69 జేసీబీలు, 79 పవర్ సాలను, 96 డీజిల్ జనరేటర్లను అందుబాటులో ఉంచారు. నరసాపురంలో 34 మంది సభ్యులతో ఒక ఎన్డీఆర్ఎఫ్ టీమ్ను, ఏపీఎస్పీ ప్లటూన్ ఒకటి భీమవరంలో మరొకటి నరసాపురంలో సిద్దంగా ఉంచారు. 60 మంది గ్రేహౌండ్ సిబ్బందిని ఉండిలో మోహరించారు. 150 వరకు వైర్లెస్ సెట్లను ఒక శాటిలైట్ ఫోన్ను, ఒక డ్రోన్ను అందుబాటులో ఉంచారు. జిల్లాలోని 37 పునరావాస కేంద్రాలకు 4,150 మందిని తరలించారు. ఏలూరు జిల్లాలో.. ఏలూరు జిల్లాలో ఉదయం 9.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు 310 మి.మీ. వర్షపాతం నమోదైంది. ద్వారకా తిరుమలలో 29.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లాలోని మెజార్టీ మండలాల్లో 10 మి.మీ. లోపు వర్షపాతం మాత్రమే నమోదైంది. తుపాను తీరం దాటాకా జిల్లాలోని ఏలూరు, కైకలూరు, దెందులూరు, ఉంగుటూరు తదితర నియోజకవర్గాల్లో చెదురు మదురు జల్లులు మినహా భారీ వర్షాలు లేకపోవడం ఊరటనిచ్చింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లావ్యాప్తంగా 2,239 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. వరి పంట కోత దశకు చేరుకోగా, గాలుల తీవ్రత లేకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలోని 20 మండలాల పరిధిలో ముంపు ప్రభావిత ప్రాంతాల నుంచి 45 పునరావాస కేంద్రాలకు 1,203 మందిని తరలించారు. 2,000 విద్యుత్ స్తంభాలను సిద్ధం చేశారు. 59 జేసీబీలు, 37 పవర్సా, 10 బ్లేడ్ ట్రాక్టర్లు, 100 పోలీస్ వైర్లెస్ సెట్లను సిద్ధం చేశారు. 105 మంది స్విమ్మర్స్ను గుర్తించారు. 295 మంది గర్భిణులను ఆస్పత్రులకు తరలించారు. కేకే లైన్లో జారిపడిన కొండచరియలు అల్లూరి జిల్లాలో గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కొత్తవలస–కిరండూల్ రైల్వే లైన్లో చిమిడిపల్లి సమీపంలోని టన్నెల్ వద్ద కొండచరియలు ట్రాక్పై జారి పడ్డాయి. వరదనీరు ట్రాక్పై పొంగి ప్రవహించింది. ట్రాక్పై బండరాళ్లు, మట్టి తొలగించే పనుల్లో రైల్వే వర్గాలు నిమగ్నమయ్యాయి. ఈ మార్గంలో సోమవారం రాత్రి నుంచి అన్ని రైళ్ల రాకపోకలను నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. అరకులోయ–అనంతగిరి ఘాట్లో సుంకరమెట్ట, బీసుపురం సమీప ప్రాంతాల్లో రోడ్డుపై వరదనీరు పొంగి ప్రవహించింది. ఘాట్ మార్గాల్లో రాత్రి పూట ప్రయాణాలను నిలిపివేశారు. బలిమెల జలాశయ నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది.అల్లూరి సీతారామరాజు జిల్లా కొత్తవలస–కిరండూల్ మార్గంలో చిమిడిపల్లి సమీపంలోని టన్నెల్ వద్ద రైల్వే ట్రాక్పై కూలిన కొండచరియలు నేడు పలు జిల్లాల్లో వర్షాలు.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో బుధవారం పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాకినాడ సహా విశాఖపట్నం, గంగవరం, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో పదో నంబర్ భారీ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రజలకు వైఎస్సార్సీపీ శ్రేణులు తోడుగా నిలవాలి మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు సాక్షి, అమరావతి: మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమతంగా ఉండాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. తుపాను ముప్పు తగ్గే వరకు ప్రతి ఒక్కరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరారు. తుపాను సహాయ, పునరావాస చర్యల్లో ప్రజలకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తోడుగా నిలవాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లాలో కుంభవృష్టితుపాను ప్రభావం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాపై తీవ్రంగా పడింది. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు జిల్లా అంతటా కుండపోత వర్షం కురిసింది. కావలిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటీవల కాలంలో ఈ స్థాయి వర్షపాతం నమోదవ్వడం ఇదే ప్రథమం. దగదర్తి, ఉలవపాడు, కందుకూరు, జలదంకి, కొడవలూరు, కలిగిరి, లింగసముద్రం, అల్లూరు ప్రాంతాల్లో 15 నుంచి 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెల్లూరు తర్వాత ప్రకాశం జిల్లా సింగరాయకొండ, సంతనూతలపాడు, చీమకుర్తి, ఒంగోలు పట్టణంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. తుపాను తీరం దాటే అవకాశం ఉందనుకున్న కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం ఉంటుందని వాతావరణ శాఖ అంచిన వేసినా, అనూహ్యంగా తుపాను తీరం దాటే సమయంలో నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురవడం గమనార్హం బాపట్ల, ఒంగోలు జిల్లాల్లో భారీ వర్షం బాపట్ల జిల్లా నగరం, చిన గంజాం మండలాల్లో భారీ వర్షం పడింది. తీర ప్రాంతంలో పలుచోట్ల చెట్లు పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. బాపట్ల పట్టణంలో ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. తెనాలి రేపల్లె మార్గంలో చెట్లు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. గుంటూరు నగరంలో రాత్రి 10 గంటల తర్వాత వీచిన గాలులకు పలుచోట్ల చెట్లు పడిపోయాయి. కార్పొరేషన్ సిబ్బంది వాటిని తొలగించే పనుల్లో నిమగ్నం అయ్యారు. ఒంగోలు, కొండపి, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో కుండపోత వర్షం కురిసింది. ఒంగోలు నగరంతో పాటు కొండపి, టంగుటూరు, సింగరాయకొండ, కొత్తపట్నం, నాగులుప్పలపాడు, పొన్నలూరు, చీమకుర్తి మండలాల్లో పది సెంటీమీటర్లు కంటే ఎక్కువగా వర్షపాతం నమోదైంది. రాత్రి 10 గంటలకు అందిన వివరాల ప్రకారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఒంగోలు నగరంలో 15.50 సెంటీమీటర్ల వర్షం కురిసింది. టంగుటూరులో 15.74, కొత్తపట్నంలో 14.36, నాగులుప్పలపాడులో 14.58, పొన్నలూరులో 14.68, చీమకుర్తిలో 13, పామూరులో 11.6 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. అర్ధరాత్రి కూడా భారీ వర్షం కురుస్తూనే ఉంది. తుపాన్లు.. ప్రభావాలు ⇒ 2014 అక్టోబర్లో అత్యంత భారీ తీవ్ర తుపాను ‘హుద్ హుద్’ విశాఖలో తీరం దాటింది. ఈ సూపర్ సైక్లోన్ తీరం దాటే సమయంలో 185 నుంచి 260 కి.మీ. వేగంతో రికార్డు స్థాయిలో గాలులు వీచాయి. ⇒ 2018లో తిత్లీ అత్యంత తీవ్ర తుపానుగా బలడుతూ శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలో తీరం దాటింది. ఈ సమయంలో గంటకు 140 నుంచి 150 కిలో మీటర్ల వరకు గాలులు బీభత్సం సృష్టించాయి. ⇒ 2021లో జవాద్ తుపానుగా మారి తీరం దాటకుండానే సముద్రంలోనే బలహీన పడిపోయింది. ఈ కారణంగా గంటకు 45 కి.మీ.. గరిష్టంగా 65 కి.మీ. వేగంతో గాలులు వీచాయి.⇒ 2022 మే నెలలో ఏర్పడిన అసని తీవ్ర తుపాను కూడా తీరం వైపు వచ్చినట్లే వచ్చి దిశ మార్చుకొని తిరిగి సముద్రంలోకి వెళ్లిపోయి బలహీనపడింది. గాలుల తీవ్రత 75 నుంచి 85 కి.మీ.గా నమోదైంది. ⇒ 2023లో ఏర్పడిన మిచాంగ్ తీవ్ర తుపాన్ బాపట్ల వద్ద తీరం దాటింది. మిచాంగ్ తీరం దాటే సమయంలో 90 నుంచి 100 కి.మీ. వేగంతో గాలులు వీచి విధ్వంసం సృష్టించింది. ⇒ తాజాగా మోంథా తీవ్ర తుపాను కూడా తీరం దాటే సమయంలో 90 నుంచి గరిష్టంగా 110 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని అంచనా వేశారు. కానీ ప్రతికూల వాతావరణం కారణంగా ఈ గాలుల వేగం 75 నుంచి 80 కి.మీ.కు పరిమితమైపోయింది. -
Cyclone Montha: తల్లడిల్లిన తీరం
సాక్షి, అమరావతి, సాక్షి, విశాఖపట్నం, నెట్వర్క్: ఏపీని వణికించిన పెను తుపాను మోంథా మంగళవారం రాత్రి కోనసీమ జిల్లా అంతర్వేదిపాలెం వద్ద తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో పెను గాలులు వీయగా కోస్తా జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. కాకినాడ, అమలాపురం, రాజోలు ప్రాంతాల్లో గాలుల తీవ్రత భారీగా పెరిగింది. సముద్రం పోటెత్తి విరుచుకుపడుతోంది. అలల తీవ్రతకు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ పలు చోట్ల తీరం కోతకు గురైంది. పెను గాలుల ధాటికి విశాఖలో ఎనిమిది ప్రాంతాల్లో గోడలు కూలిపోయాయి. తుపాను పూర్తిగా తీరం దాటిన తర్వాత ఐదు జిల్లాలపై భారీగా ప్రభావం ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఉగ్రరూపంతో దూసుకొచ్చిన మోంథా ఆగుతూ.. దిశ మార్చుకుంటూ తీరం వైపు ప్రయాణించింది. మధ్యాహ్నం సమయంలో సముద్రంలో గాలుల తీవ్రత కాస్త తగ్గినా.. సాయంత్రం మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. కొన్ని ప్రాంతాల్లో ఎండ రావడంతో తుపాను ప్రభావం తగ్గుముఖం పట్టిందని భావించారు. అంతలోనే మళ్లీ భారీ వర్షాలతో విరుచుకుపడింది. మోంథా ప్రభావం తెలంగాణలోనూ ఉంటుందని వాతావరణ శాఖ చెప్పింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరో 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. చెట్టు కూలి మహిళ మృతి.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడటంతో జనజీవనం స్తంభించింది. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాలోనూ పలుచోట్ల జోరు వానలు పడడంతో ప్రజలు బయటకు రావడానికి ఇబ్బందులు పడ్డారు. ఎడతెగని వర్షం, ఈదురు గాలులకు విశాఖ నగరంతోపాటు పరిసర ప్రాంతాలన్నీ స్తంభించాయి. పలు అండర్పాస్ల గుండా నీళ్లు ప్రవహించడం, జాతీయ రహదారిపైకి నీరు చేరుకోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈదురు గాలులకు పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగి రోడ్లపై పడడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. విశాఖలోని గాజువాక నుంచి యారాడ వెళ్లే మార్గంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఆనందపురం మండలంలోని గంభీరం రిజర్వాయర్ ఉధృతి పెరిగింది. అరకులోయ, విశాఖపట్నం ఘాట్ రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు ఆగిపోయాయి. అనకాపల్లి జిల్లాలో భారీ వర్షాలకు శారద, వరాహ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మాకనపాలెంలో చెట్టు కూలి వీరవేణి అనే మహిళ మృతి చెందింది. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం గొట్లపాళానికి చెందిన కృష్ణమనేని జయమ్మ (65) గేదెలను మేపేందుకు వెళ్లి పొట్టేళ్ల కాలువలో గల్లంతయింది. ఈత గాళ్లను రంగంలోకి దించి గాలిస్తున్నారు. రాత్రి వరకు ఆమె జాడ తెలియరాలేదు. గుండ్లకమ్మ నది పోటెత్తడంతో ప్రకాశం జిల్లా కురిచేడు మండలం ముష్ట గంగవద్ద చప్టా కోతకు గురైంది. దీంతో పదుల సంఖ్యలో గ్రామాల మధ్య రాకపోకలు తెగిపోయాయి. తుపాను ప్రభావంతో తిరుమలలో ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. శ్రీవారిని దర్శించుకుని బయటకు వస్తున్న భక్తులు వర్షం, పొగమంచుతో ఇబ్బందిపడ్డారు. ఆకస్మిక వరదలు వస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జాతీయ రహదారులు, పలు ప్రధాన రహదారులపై మంగళవారం రాత్రి నుంచి రాకపోకలను నిలిపివేశారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లోని కర్నూలు రోడ్డు, ఊరచెరువు రోడు జలమయం విరుచుకుపడి.. తీరం దాటి.. మోంథా తుపాను మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో కోనసీమ జిల్లాలోని అంతర్వేదిపాలెం వద్ద తీరాన్ని తాకింది. ఆ తర్వాత నాలుగైదు గంటలపాటు పెను గాలులు వీయగా భారీ వర్షాలు కురిశాయి. మచిలీపట్నం తీరానికి అత్యంత చేరువగా వచ్చిన తుపాను 17 కిలోమీటర్ల వేగంతో కాకినాడ వైపు కదులుతూ అంతర్వేదిపాలెం వద్ద తీరాన్ని దాటింది. రాత్రి సమయానికి మచిలీపట్నానికి 110 కిలోమీటర్లు, కాకినాడకు 100, విశాఖపట్నానికి 220 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. కదులుతున్న దిశ, వేగం ప్రకారం బుధవారం తెల్లవారు జామున తీరం దాటే ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. కొద్ది గంటల్లో క్రమేపీ తుపానుగా ఆ తర్వాత వాయుగుండంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో మచిలీపట్నం పరిసరాల్లో గంటకు 77 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు పలు జిల్లాల్లో వర్షాలు.. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో బుధవారం పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాకినాడ సహా విశాఖపట్నం, గంగవరం, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో పదో నంబర్ భారీ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. పల్నాడు జిల్లాలో భారీ వర్షాలతో పత్తి, వరికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. బాపట్ల జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వేమూరు నియోజకవర్గంలో వందల ఎకరాల్లో వరి నేలకొరిగింది. రేపల్లె, బాపట్ల నియోజకవర్గాల్లోనూ వరి దెబ్బతిందని రైతులు వాపోతున్నారు. బాపట్ల, చీరాల, రేపల్లెతోపాటు జిల్లావ్యాప్తంగా పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచి పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కేకేలైన్లో జారిపడిన కొండచరియలు అల్లూరి జిల్లాలో గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కొత్తవలస–కిరండూల్ రైల్వే లైన్లో చిమిడిపల్లి సమీపంలోని టన్నెల్ వద్ద కొండచరియలు ట్రాక్పై జారి పడ్డాయి. వరదనీరు ట్రాక్పై పొంగి ప్రవహించింది. ట్రాక్పై బండరాళ్లు, మట్టి తొలగించే పనుల్లో రైల్వే వర్గాలు నిమగ్నమయ్యాయి. ఈ మార్గంలో సోమవారం రాత్రి నుంచి అన్ని రైళ్ల రాకపోకలను నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. అరకులోయ–అనంతగిరి ఘాట్లో సుంకరమెట్ట, బీసుపురం సమీప ప్రాంతాల్లో రోడ్డుపై వరదనీరు పొంగి ప్రవహించింది. ఘాట్ మార్గాల్లో రాత్రి పూట ప్రయాణాలను నిలిపివేశారు. బలిమెల జలాశయ నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. -
● కార్తీక శోభ
ఎంవీపీ కాలనీ శివాలయంలో ప్రత్యేక పూజలు కార్తీక మాసం ఆరంభమైంది... పరమేశ్వరునికి ప్రీతిపాత్రమైన ఈ మాసంలో తొలి సోమవారం నగరంలోని శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మార్మోగాయి. తెల్లవారు జాము నుంచే భక్తుల రాకతో ఆలయాలు కిటకిటలాడాయి. ఉపవాస దీక్షతో పుణ్యస్నానాలు ఆచరించి, క్యూలైన్లలో నిలబడి శివనాథుడ్ని దర్శించుకున్నారు. శివలింగానికి పాలధారతో అభిషేకం చేస్తూ, బిల్వదళాలతో పూజలు చేసి, తమ భక్తిని చాటుకున్నారు. పలు ఆలయాల్లో భక్తులు దీపాలు వెలిగించారు. హరహర మహాదేవ, శంభో శంకర నామస్మరణతో, భక్తుల జయజయధ్వానాలతో నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కార్తీక సోమవారం సందర్భంగా నగరమంతా శివతత్వంతో నిండిపోయింది. – ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా పాత రేసపువానిపాలెం శివాలయంలో ప్రత్యేక పూజలు -
మత్స్యకారుల వలల భద్రతకు చోటేది?
ఆరిలోవ: ‘మోంథా’ తుఫాను ప్రభావంతో జోడుగుళ్లుపాలెం తీరం వద్ద వలలు భద్రపరుచుకోవడానికి వీలులేని పరిస్థితి నెలకొందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుఫాను కారణంగా వేటకు వెళ్లని మత్స్యకారులు తమ వలలను అమ్మవారి గుడి ప్రాంగణంలో, చిన్న రేకుల షెడ్లలో తాత్కాలికంగా దాచుకున్నారు. వలల భద్రత కోసం పక్కా భవనం నిర్మించాలని చాలాసార్లు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును కోరామన్నారు. అయితే అటవీశాఖ అడ్డుపడుతోందని ప్రజాప్రతినిధులు తప్పించుకుంటున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇదే ప్రాంతంలో శివాలయం పేరుతో పక్కా నిర్మాణాలు చేపడితే అధికారులు అడ్డుచెప్పడం లేదని, తమ అవసరాల కోసం మాత్రం నిబంధనలు అడ్డుపెట్టడం సరికాదని మత్స్యకారులు వాపోతున్నారు. అధికారులు స్పందించి వలలు భద్రపరుచుకోవడానికి భవన నిర్మాణం చేపట్టాలని వారు కోరుతున్నారు. -
దొంగనోట్ల కేసులో మరో ముగ్గురి అరెస్ట్
ఎంవీపీకాలనీ: నగరంలో దొంగనోట్లు ముద్రిస్తున్న ముఠా గుట్టును ఇటీవల రట్టు చేసిన కేసులో ఎంవీపీ పోలీసులు మరో ముగ్గురు నిందితులను సోమవారం రిమాండ్కు పంపారు. ద్వారకా ఏసీపీ అన్నెపు నరసింహామూర్తి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీరామ్ అలియాస్ గుప్తాను ముందుగా అరెస్టు చేశారు. తాజాగా పాల వరప్రసాద్, కొత్త ఆనంద్, కొప్పల గంగాధర్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీరిలో ఇద్దరిపై రౌడీషీట్లు ఉన్నాయని, గతంలోనూ వీరు పలు నేరాలకు పాల్పడ్డారని ఏసీపీ తెలిపారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఎంవీపీ, సిటీ టాస్క్ఫోర్స్ పోలీసులను ఆయన అభినందించారు కార్యక్రమంలో ఎంవీపీ సీఐ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
వాసుపల్లి దాతృత్వం
జగదాంబ : ఆయనకు కష్టం విలువ.. పేదవాళ్ల సాదక బాధకాలు తెలుసు. తన పుట్టినిల్లు అయిన వన్టౌన్లో ఎవరికి కష్టం వచ్చినా ముందుంటారు. ఆయనే మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్కుమార్. సోమవారం జీవీఎంసీ 35వ వార్డు అధ్యక్షుడు అలపన కనకరెడ్డి ఆధ్వర్యంలో వార్డులోని లక్ష్మీనగర్ లోతట్టు ప్రాంతంలో నివసించే సుమారు 250 కుటుంబాలకు రూ.1.25 లక్షలు విలువ చేసే నిత్యావసర వస్తువులు అందజేశారు. వర్షం కురుస్తున్నప్పటికీ ఆయన ఈ సహాయ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ తుఫాన్ సమయంలో పేదలు నిత్యావసర వస్తువుల కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో 3 కేజీల బియ్యం, ఆయిల్ ప్యాకెట్, కూరగాయలు, చికెన్ వంటివి అందజేశామన్నారు. రాజకీయాలు చేసే ఉద్దేశం తమకు లేదని, తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులు సాయం అందించడంలో ముందుంటారన్నారు. ప్రభుత్వం తీర ప్రాంత మత్స్యకారులందరికీ 50 కేజీల బియ్యంతో పాటు రేషన్ ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ చెన్నా జానకీరామ్, జిల్లా సెక్రటరీ ఆదివిష్ణురెడ్డి, మాజీ కార్పొరేటర్ పచ్చిరపల్లి రాము, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్, సౌత్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సువార్తరాజు, సౌత్ పబ్లిక్ వింగ్ అధ్యక్షుడు బీరు సూర్యనారాయణ, మల్ల విజయ్, పీతలవాసు, రాజారెడ్డి, మాదాబత్తుల రమేష్, లండా రమణ, లింగం శ్రీను, వినోద్, రామరాజు, బెవర మహేష్, అప్పారావు, నాగిరెడ్డి, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
పూర్వ డీఎంహెచ్వో రామారావు మృతి
మద్దిలపాలెం: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పూర్వపు అధికారి డాక్టర్ పెంటకోట రామారావు (79) కన్నుమూశారు. ఆదివారం రాత్రి గుండెపోటుతో సీతమ్మధార డాక్టర్స్ కాలనీలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. డాక్టర్ రామారావు కేజీహెచ్లో చాలాకాలం వైద్యుడిగా సేవలు అందించారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ సీనియర్ ఉద్యమనేతగా, విశాఖ కన్జ్యూమర్ కౌన్సిల్ కార్యదర్శిగా కూడా డాక్టర్ రామారావు పనిచేశారు. ఆయన మరణవార్త తెలియగానే, సీతమ్మధారలోని డాక్టర్ రామారావు నివాసానికి ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కార్యదర్శి ఎ.అజశర్మ, సీపీఎం విశాఖ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.కె.ఎస్.వి. కుమార్, పి.మణి, వి.కృష్ణారావు, ప్రజారోగ్య వేదిక నాయకులు డాక్టర్ వై.ఎల్. నర్సింగరావు, కేవీపీ చంద్రమౌళి, వార్వా నాయకులు జి.వి. రమణ, పి. లచ్చిరాజు, సీఐటీయూ మద్దిలపాలెం జోన్ కార్యదర్శి పి.వెంకటరావు తదితరులు వెళ్లి డాక్టర్ రామారావు పార్థివ దేహానికి నివాళులర్పించారు. -
నవంబర్ 30న వైజాగ్ మారథాన్
ఏయూక్యాంపస్: ఆరోగ్యం, ఐక్యతను ప్రోత్సహించే సంధ్యామైరెన్ వైజాగ్ మారథాన్–4 ను నవంబర్ 30న నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన టీ షర్ట్, మెడల్స్ను బీచ్ రోడ్డులో ఆవిష్కరించారు. ఈ సంవత్సరం 5 కి.మీ., 10 కి.మీ., 21 కి.మీ. పరుగులతో పాటు కొత్తగా 32 కిలోమీటర్ల విభాగాన్ని కూడా ప్రవేశపెడుతున్నట్లు సంధ్యా మైరెన్ ప్రతినిధి కె. ఆనంద్ తెలిపారు. వైజాగ్ రన్నర్స్ సొసైటీ కార్యదర్శి కె. శ్రీనివాస్ మాట్లాడుతూ పర్యావరణ అనుకూల, మాదకద్రవ్య రహిత విశాఖను ప్రోత్సహించడమే ఈ మారథాన్ ఉద్దేశమని తెలిపారు. ఈ ఏడాది టీ–షర్ట్ను భూమి నుంచి స్ఫూర్తి పొంది ఆకుపచ్చ రంగులో రూపొందించారు. కార్యక్రమంలో అపోలో హాస్పిటల్స్ సీవోవో డాక్టర్ కృష్ణ ప్రసాద్, లక్ష్మి, ప్రద్యుమ్న, రవి కట్టా, టి.వి.ఎన్ సత్యమూర్తి, డాక్టర్ ఎస్.రాజు, వైజాగ్ వలంటీర్స్ సతీష్ తదితరలు పాల్గొన్నారు. -
దివ్యాంగుల పింఛన్లపై వేటు
మహారాణిపేట : దివ్యాంగుల పింఛన్లపై కూటమి ప్రభుత్వం వేటు వేసింది. వీరిపై కనికరం లేకుండా వివిధ పరీక్షల పేరుతో అష్టకష్టాలు పెడుతోంది. జిల్లాలో ఇప్పటికే 1,178 మంది దివ్యాంగుల పెన్షన్లు తొలగించాలని జాబితాను సిద్ధం చేసింది. దీనిపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమైంది. దివ్యాంగులు అపీల్ చేసుకోవడంతో వారికి గత నెల పింఛన్లు మంజూరు చేసింది. తాజాగా అపీల్ చేసుకోలేదని కారణంగా 101 మంది దివ్యాంగుల పింఛన్లను రద్దు చేసింది. ఆందోళనలో దివ్యాంగులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తమ పింఛన్లకు ఎప్పుడు ఎసరు వస్తుందోనన్న భయాందోళనతో దివ్యాంగులు కాలం వెళ్లదీస్తున్నారు. రీవెరిఫికేషన్ పేరుతో ప్రభుత్వం తమ జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పునఃపరిశీలనలో తమ వైకల్య శాతాన్ని తగ్గిస్తారో.. లేదా సర్టిఫికెట్ను పూర్తిగా రద్దు చేస్తారేమోనని మదనపడుతున్నారు. అనారోగ్యం లేదా ఇతర కారణాలతో వెరిఫికేషన్కు హాజరు కాలేకపోతే పూర్తిగా పింఛన్ రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక వారికి పింఛన్ లేనట్లే.. జిల్లాలో 1,178 మంది పింఛన్లను తొలగించేందుకు జాబితా సిద్ధం చేసింది. వ్యతిరేకత రావడంతో గత నెల పింఛన్లు విడుదల చేసినప్పటికీ, ఇప్పుడు మళ్లీ పరీక్షల పేరుతో వారిని వేధిస్తున్నారు. వైద్యుల ప్యానెల్ను ఏర్పాటు చేసి, బుధ, గురు, శుక్రవారాల్లో నగరంలోని నిర్దేశిత ఆస్పత్రుల్లో సర్టిఫికెట్లను రీ వెరిఫికేషన్ చేస్తున్నారు. అయితే రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోలేదని కారణంతో జిల్లాలో 101 మంది దివ్యాంగులు పింఛన్లు రద్దు చేశారు. వీరికి నవంబర్ నెల నుంచి పింఛన్ అందదు. పుట్టుకతోనే వైకల్యంతో బాధపడుతూ, మరొకరి సాయం లేనిదే కదలలేని తమపై ప్రభుత్వం ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం అమానవీయమని, ఈ రీవెరిఫికేషన్ నిబంధనలు తమకు శాపంగా మారాయని దివ్యాంగులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
ఏ సంస్థ పురోగతికై నా నైతిక విలువలే పునాది
విశాఖ సిటీ: ఏ సంస్థ పురోగతికై నా నైతిక విలువలే పునాది అని విశాఖ పోర్ట్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ అరుణ్ ప్రసాద్ పేర్కొన్నారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను విశాఖ పోర్ట్ అథారిటీలో సోమవారం ఘనంగా నిర్వహించారు. సోమవారం నుంచి నవంబర్ 2వ తేదీ జరిగే ఈ వారోత్సవాలను పోర్ట్ పరిపాలనా భవనంలోని సాంబమూర్తి ఆడిటోరియంలో ప్రారంభించారు. ముందుగా పోర్ట్ విభాగాధిపతులతో కలిసి అధికారులు, సిబ్బందితో విజిలెన్స్ ప్రమాణం చేయించారు. అనంతరం చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ అరుణ్ ప్రసాద్ అవినీతి నిరోధకతపై అవగాహన కల్పించారు. విజిలెనన్స్ అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి కర్తవ్యనిష్టతో పనిచేయాలని సూచించారు. వారోత్సవాల్లో భాగంగా ఉద్యోగుల కోసం వివిధ పోటీలతో పాటు నగరంలోని పలు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. -
మేహాద్రి రిజర్వాయర్ గేటు ఎత్తివేత
రెండో గేటు నుంచి 1,050 క్యూసెక్కుల నీరు విడుదలపెందుర్తి : తుఫాన్ కారణంగా మేహాద్రిగెడ్డ రిజర్వాయర్కు సోమవారం ఒక్కసారిగా నీటి ఉధృతి పెరిగింది. మేహాద్రి ప్రధాన కాలువతో పాటు ఇతర గెడ్డల నుంచి కూడా రిజర్వాయర్కు నీరు పోటెత్తడంతో సోమవారం సాయంత్రానికి నీటిమట్టం 60/61 అడుగులకు చేరుకుంది. దీంతో రెండో గేటును అడుగున్నర మేర ఎత్తి 1050 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నీటిపారుదలశాల ఏఈ పి.నళిని, తహసీల్దార్ వెంకటఅప్పారావు, ఆర్ఐ హరిప్రసూన, వర్క్ ఇన్స్పెక్టర్ ఎస్.సుబ్బరాజు ముందుగా రిజర్వాయర్ నీటిమట్టాన్ని సమీక్షించారు. -
వాల్తేర్ డివిజన్ ప్రత్యేక చర్యలు
పలు రైళ్లు రద్దు.. కొన్ని దారి మళ్లింపు తాటిచెట్లపాలెం : తుఫాన్ నేపథ్యంలో విశాఖ నుంచి బయల్దేరే, విశాఖ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే రద్దు చేసింది. కొన్ని రైళ్లను దారి మళ్లించగా.. మరికొన్ని రైళ్లను గమ్యం కుదించింది. అలాగే వాల్తేర్ డివిజన్ పరిధిలోని స్టేషన్లలో హెల్ప్ డెస్క్లను ఏర్పాటుచేసింది. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని డీఆర్ఎం లలిత్బోహ్ర ఆయా విభాగాల అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అయితే ముందుగా సుమారు 43 రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించినా, సాయంత్రానికి కొన్ని రైళ్లు యథావిథిగా బయల్దేరాయి. 28న రద్దు చేసిన రైళ్లు ● కిరండూల్–విశాఖ(18516)నైట్ ఎక్స్ప్రెస్ ● విశాఖపట్నం–కిరండూల్(58501)పాసింజర్ ● కిరండూల్–విశాఖపట్నం(58502) పాసింజర్ ● విశాఖపట్నం–కోరాపుట్(58538)పాసింజర్ ● కోరాపుట్–విశాఖపట్నం(58537)పాసింజర్ ● కోరాపుట్–విశాఖపట్నం(18511)ఎక్స్ప్రెస్ ● రాజమండ్రి–విశాఖపట్నం(67285)మెము ● విశాఖపట్నం–రాజమండ్రి(67286)మెము ● విశాఖపట్నం–కాకినాడ(17268) ఎక్స్ప్రెస్ ● కాకినాడ–విశాఖపట్నం(17267) ఎక్స్ప్రెస్ ● విశాఖపట్నం–గుంటూరు(22875) డబుల్ డెక్కర్ఎక్స్ప్రెస్ ● గుంటూరు–విశాఖపట్నం(22876) డబుల్డెక్కర్ఎక్స్ప్రెస్ ● బ్రహ్మపూర్–విశాఖపట్నం(18525)ఎక్స్ప్రెస్ ● విశాఖపట్నం–పలాస(67289)మెము ● పలాస–విశాఖపట్నం(67290)మెము ● విజయనగరం–విశాఖపట్నం(67288) మెము ● బ్రహ్మపూర్–విశాఖపట్నం(58531)పాసింజర్ ● విశాఖపట్నం–బ్రహ్మపూర్(58532)పాసింజర్ ● విశాఖపట్నం–గుణుపూర్(58506) పాసింజర్ ● గుణుపూర్–విశాఖపట్నం(58505) పాసింజర్ ● భువనేశ్వర్–కేఎస్ఆర్ బెంగళూరు(18463) ప్రశాంతి ఎక్స్ప్రెస్ ● భువనేశ్వర్–సికింద్రాబాద్(17015)విశాఖ ఎక్స్ప్రెస్ ● భువనేశ్వర్–పుదుచ్చేరి(20851) వీక్లీ ఎక్స్ప్రెస్ వాల్తేర్ డివిజన్ పరిధిలో హెల్ప్లైన్ డెస్క్లు ● విశాఖపట్నం–0891–2746330 / 2744619 ● దువ్వాడ– 0891–2883456 ● అరకు–08936–249832 -
సిటీ ఆపరేషన్ సెంటర్ పరిశీలన
డాబాగార్డెన్స్: తుఫాన్ నేపథ్యంలో నగరంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తక్షణమే చేపట్టాలని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు జీవీఎంసీ ఉన్నతాధికారులను ఆదేశించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సిటీ ఆపరేషన్ సెంటర్ను, పునరావాస కేంద్రాన్ని సందర్శించిన అనంతరం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. చెట్లు, హోర్డింగ్లు కూల కుండా చర్యలు తీసుకోవాన్నారు. శిథిలావస్థ భవనాల్లో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. విద్యుత్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది అందుబాటులో ఉండాలని, లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి, అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. సిటీ ఆపరేషన్ సెంటర్లో 24 గంటల కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి, అన్ని జోన్ల కార్యాలయాలకు టోల్ ఫ్రీ నంబర్, ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచామన్నారు. -
పేదలే లక్ష్యంగా కూటమి అరాచక పాలన
గాజువాక/ మల్కాపురం : కూటమి ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా అరాచక పాలన సాగిస్తోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు విద్య, వైద్య రంగాలను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని వైఎస్సార్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పి. గౌతమ్రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా వైఎస్సార్సీపీ చేపట్టిన ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమం సోమవారం గాజువాక, 60వ వార్డు గుల్లలపాలెంలో జోరు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కొనసాగింది. ఇప్పటికే 50 లక్షల సంతకాలు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలో భాగంగా వీఆర్ఎస్ ద్వారా 1,600 మంది ఉద్యోగులను, 5,500 మంది కాంట్రాక్టు కార్మికులను చట్ట వ్యతిరేకంగా తొలగించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గౌతమ్రెడ్డి ఆరోపించారు. పెదగంట్యాడను ఆనుకుని అదానీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జిందాల్ స్టీల్ప్లాంట్ రాష్ట్రం నుంచి మహారాష్ట్రకు వెళ్లిపోవడం, ఎమ్మెల్యేల ఇష్టారాజ్య వ్యవహారాలు, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వంటి చర్యల వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు మాట్లాడుతూ, స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని హామీ ఇచ్చిన టీడీపీ, అధికారంలోకి వచ్చాక ప్లాంట్ కార్మికులపై ఎదురుదాడి చేస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పశ్చిమ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్,, గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్రెడ్డి పాల్గొన్నారు. -
కార్పొరేటర్ బొండాపై అట్రాసిటీ కేసు
కూర్మన్నపాలెం: జీవీఎంసీ 87వ వార్డు కార్పొరేటర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నాథంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద దువ్వాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వార్డులోని సిద్ధార్థనగర్లో నివసించే తాడిగిరి ప్రకాశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జగన్నాథంపై కేసు నమోదు చేసి, ఎస్.ఐ. డెంకాడ శ్రీనివాసరావు దర్యాప్తు చేస్తున్నారు. బీహెచ్పీవీలో ఉద్యోగ విరమణ చేసిన ప్రకాశ్.. సిద్ధార్థనగర్లో కుటుంబ సభ్యులతో నివసిస్తున్నారు. ఆయన మొదటి భార్య 1997లో మరణించడంతో, రెండో వివాహం చేసుకున్నారు. రెండో భార్యకు కూడా ఒక కుమార్తె జన్మించగా, అందరూ కలిసి జీవిస్తున్నారు. అయితే కొంతకాలంగా భార్యాభర్తల మధ్య ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. తనకున్న అప్పులు తీర్చిన తర్వాతే అందరికీ ఆస్తులు పంచుతానని ప్రకాశ్ తన భార్యకు చెబుతూ వచ్చారు. ఈ సమయంలో అదే కాలనీలో నివసించే జాన్ రమేష్ అనే వ్యక్తి ఈ కుటుంబ వివాదంలో జోక్యం చేసుకుని, సమస్యను వీధిలోకి తెచ్చాడు. అంతటితో ఆగకుండా, వార్డు కార్పొరేటర్ బొండా జగన్నాథం దగ్గరకు తీసుకువెళ్లి పంచాయితీ పెట్టించాడు. అనంతరం భార్యకు రూ. 30 లక్షలు, తమకు కమీషన్ కింద మరో రూ.3 లక్షలు ఇవ్వాలని జాన్ రమేష్, జగన్నాథం తనపై ఒత్తిడి తెచ్చారని బాధితుడు ప్రకాశ్ తెలిపారు. అంతేకాకుండా తాము చెప్పినట్లు వినకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని జాన్ రమేష్ బెదిరించినట్లు ప్రకాశ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఏడాది మే నుంచి తరచూ ఫోన్ చేసి బెదిరించడం, దుర్భాషలాడడం వల్ల మనశ్శాంతి లేకుండా పోయిందని ఆయన వివరించారు. ప్రకాశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు జాన్ రమేష్ను ఏ–1గా, కార్పొరేటర్ బొండా జగన్నాథంను ఏ–2గా నిర్థారిస్తూ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. -
వర్ష బీభత్సం
అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దుమంగళవారం శ్రీ 28 శ్రీ అక్టోబర్ శ్రీ 2025వేట సామగ్రిని సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళుతున్న మత్స్యకారులులోతట్టు ప్రాంతాలు జలమయం పలు చోట్ల నేలకొరిగిన చెట్లు 58 పునరావాస కేంద్రాల ఏర్పాటుమహారాణిపేట : మోంథా తుఫాన్ ప్రభావంతో సోమవారం విశాఖలో వర్షం దంచికొట్టింది. రోజంతా ఏకధాటిగా కురిసి అలజడి సృష్టించింది. జనజీవనం స్తంభించింది. రోడ్లన్నీ జలమయంగా మారాయి. వీఎంఆర్డీఏ పార్కు, పెదజాలారిపేట, పెదవాల్తేరు, ఎంవీపీకాలనీ తదితర ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు, చెట్లు విరిగిపడ్డాయి. కొన్ని చోట్ల స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. గోపాలపట్నంలో ఒక ఇల్లు గోడ కూలింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతుండటంతో తీరప్రాంతమంతటా అల్లకల్లోలంగా మారింది. చాలా వరకు తీరం కోతకు గురైంది. తీర ప్రాంత ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఉద్యోగులంతా తుపాన్ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. నేడు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో మంగళవారం కూడా జిల్లాలోని అన్ని పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, ఏయూకు సెలవులు ప్రకటించారు. కాగా మోంథా తుఫాన్ ప్రస్తుతం కాకినాడకు 450 కిలోమీటర్ల దూరంలోను విశాఖకు 500 కిలోమీటర్ల దూరంలో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొస్తోంది. మంగళవారం ఉదయం మోంథా తీవ్ర తుఫాన్గా బలపడనుంది. కాకినాడ– అమలాపురం మధ్యలో బుధవారం తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో 110 కిలోమీటర్లకు పైగా వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు ప్రాంతాలు జలమయం వర్షానికి పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. పూర్ణామార్కెట్, వెలంపేట, రామకృష్ణ థియేటర్ ఏరియా, న్యూకాలనీ, వాల్తేరు, చావులమదుం, జ్ఞానాపురం, అల్లిపురం, జాలారిపేట, బీచ్రోడ్డు తదితర ప్రాంతాల్లో నీరు చెరువులను తలపిస్తోంది. చావులమదుం–కాన్వెంట్ జంక్షన్ రోడ్డులో వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. బీచ్రోడ్డులో కూడా నీరు చేరడంతో వాహనచోదకులు ఇబ్బందిపడ్డారు. అనేక ప్రాంతాల్లో మ్యాన్హోల్స్ నుంచి నీరు పొంగి ప్రవహించింది. పునరావాస కేంద్రాల ఏర్పాటు కొండవాలు, పల్లపు ప్రాంతాల ప్రజల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. జీవీఎంసీ, జిల్లాలో మొత్తం 58 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. జీవీఎంసీ పరిధిలో 38, గ్రామీణ ప్రాంతాల్లో 20 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. పునరావాస కేంద్రాలకు వచ్చే వారికి తాగునీరు, ఆహారం, మందులు, పిల్లలకు పాలు, జనరేటర్, తదితర అన్ని వసతులు కల్పిస్తున్నారు. సోమవారం నమోదైన వర్షపాతం మండలం మొత్తం (మి.మీ) సీతమ్మధార 89.2 గాజువాక 77.4 పెదగంట్యాడ 85.2 విశాఖ (రూరల్) 86.0 భీమునిపట్నం 74.6 పద్మనాభం 30.6 ఆనందపురం 62.4 పెందుర్తి 79.9 మహారాణిపేట 86.4 గోపాలపట్నం 71,0 ములగాడ 84.6 -
ఏసీబీ వలలో ఆర్ఐ, సచివాలయ సెక్ర టరీ
తగరపువలస: జీవీఎంసీ భీమిలి జోన్ బొగ్గురోడ్డు–2 సచివాలయ పరిధిలో చిట్టివలసకు చెందిన ఒక వ్యక్తి ఇంటిపన్ను పేరు మార్చడానికి రూ.30 వేలు లంచం తీసుకుంటూ సచివాలయ అడ్మిన్ సెక్రటరీ వై.స్వామినాయుడును ఏసీబీ అధికారులు సోమవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. లంచం డిమాండ్ చేసి స్వామినాయుడును ప్రోత్సహించిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ ముగడ రాజును అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. తాత పేరు మీదు ఉన్న ఇంటి పన్ను తన పేరిట మార్చాలని సెప్టెంబరులో బాధితుడు సచివాలయాన్ని సందర్శించారు. తరువాత అడ్మిన్, భీమిలి జోనల్ కార్యాలయంలో ఉన్న ఆర్ఐ వద్దకు తీసుకెళ్లగా రూ.60 వేలు డిమాండ్ చేశారు. రెండు నెలలుగా జరుగుతున్న బేరసారాల అనంతరం రూ.30 వేలు ఇచ్చేందుకు బాధితుడు అంగీకరించి, విశాఖలోని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో డీఎస్పీతో సహా సీఐలు శ్రీనివాసరావు, లక్ష్మణరావు, సుప్రియ మాటు వేసి తాతా థియేటర్ డౌన్లోకి మార్చిన సచివాలయంలో బాధితుడు డబ్బులు ఇస్తుండగా పట్టుకున్నారు. తరువాత ఆర్ఐ రాజును చిట్టివలసలో అదుపులోకి తీసుకున్నారు. వీరిని మంగళవారం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నంబర్లో ఫిర్యాదు చేయాలని డీఎస్పీ సూచించారు. -
రుషికొండలో డీఐజీ పర్యటన
కొమ్మాది: తుఫాన్ నేపథ్యంలో రుషికొండ బీచ్ను డీఐజీ గోపినాథ్ జెట్టీ, అడిషనల్ ఎస్పీ మధుసూదన్తో కలిసి సోమవారం సాయంత్రం పర్యటించారు. పర్యాటకులు బీచ్కు రాకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. మత్స్యకారులను మైరెన్ పోలీసులు అప్రమత్తం చేయాలని, సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. పర్యటక ప్రాంతాల్లోని దుకాణాలు మూసివేయాలని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులకు తుఫాన్ గురించి అవగాహన కలిగించాలన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూసుకోవాలని, తీర ప్రాంతాలకు ఆనుకొని నివాసాల్లో ఉన్న మత్స్సకారులను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులతో మైరెన్ పోలీసులు సమన్వయంగా పనిచేసి ఎటువంటి నష్టం జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. -
చిన్నపాటి దుర్ఘటనా జరగకూడదు
మహారాణిపేట: మోంథా తుపాను దృష్ట్యా అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, చిన్నపాటి దుర్ఘటన కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా సైక్లోన్ ప్రత్యేకాధికారి, స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్లతో సహా జిల్లా స్థాయి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లా యంత్రాంగం సన్నద్ధత కలెక్టర్ హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ... తుపానును ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు. కొండవాలు ప్రాంతాల్లో సుమారు 12,755 ఇళ్లు ఉన్నాయని, వాటిల్లో 96 ప్రమాదకర పరిస్థితుల్లో ఉండగా, సంబంధిత నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని వివరించారు. 20 సైక్లోన్ షెల్టర్లు, 23 పునరావాస కేంద్రాలలో 9,290 మందిని ఉంచడానికి ఏర్పాట్లు చేశామన్నారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో 430 బృందాలు, నేవీ, కోస్ట్ గార్డు సహకారంతో ఆరు మెకనైజ్డ్ బోట్లు, హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. జీవీఎంసీ పరిధిలో అదనంగా 38 పునరావాస కేంద్రాలు, 20 క్విక్ రెస్పాన్స్ టీమ్స్ (క్యూఆర్టీ) నియమించినట్లు కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. ప్రతి బృందం జేసీబీ, ట్రిప్పర్, ట్రీ కట్టర్ వంటి పరికరాలతో సిద్ధంగా ఉందని తెలిపారు. ఇలా చేయాల్సిందే.. ● తుపాను తీరం దాటే దిశ మారవచ్చని, మంగళవారం ఉదయం నుంచి గాలుల తీవ్రత పెరుగుతుందని అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా సైక్లోన్ ప్రత్యేకాధికారి, స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ ఆదేశించారు. ● మ్యాన్ హోల్స్ను సరిచేయాలి. ప్రమాద ప్రాంత ప్రజలను రక్షిత భవనాలకు తరలించాలి. ● రక్షిత కేంద్రాలలో తాగునీరు, ఆహారం, పాలు, మందులు అందుబాటులో ఉంచాలి. ● నష్టం వాటిల్లిన ప్రాంత ప్రజలకు, ప్రయాణికులకు అందించేందుకు 29న టిఫిన్, భోజనం ప్యాకెట్లను సిద్ధం చేయాలి. ● దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, డ్రైన్లను డ్రోన్ల సహాయంతో గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలి. -
‘మోంథా’ పెను ముప్పు!
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఉగ్రరూపం దాల్చుతూ.. సాగరాన్ని చీల్చుకుంటూ.. రాష్ట్రంపై విరుచుకుపడేందుకు మోంథా తుపాను పెను ఉప్పెనలా దూసుకొస్తోంది. ఓవైపు బలమైన ఈదురు గాలులు కకావికలం చేస్తుండగా.. జడివానలు జడిపిస్తున్నాయి. రోడ్డు మార్గాలు జలమయమయ్యాయి.. రైలు మార్గాలను ముంపు ముప్పు భయపెడుతోంది. భీకర గాలులు వాయుమార్గాన్ని సైతం స్తంభింపజేస్తున్నాయి. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాల నుంచి విజయవాడ, విశాఖ, తిరుపతికి వచ్చే పలు విమానాలను పెను తుపాను కారణంగా రద్దు చేశారు. దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే జోన్ల పరిధిలో 97 రైళ్లను రద్దు చేశారు. సముద్రం అల్ల కల్లోలం కావడంతో జల రవాణా స్తంభించిపోయింది. పోర్టుల్లో సరుకు రవాణా కార్గో షిప్పులకు లంగరు వేశారు. నౌకాదళానికి చెందిన నౌకలు ప్రధాన కేంద్రాలకు చేరుకున్నాయి. కాకినాడ తీరంలో రాకాసి అలల హోరు.. తీరం వైపు దూసుకొస్తున్న మోంథా తుపాను ధాటికి రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ జిల్లా తడిసి ముద్దవగా కాకినాడ తీరంలో రాకాసి అలలు విరుచుకుపడుతున్నాయి. తీవ్ర వాయుగుండం నుంచి సోమవారం ఉదయానికి తుపానుగా మారింది. ఆగ్నేయ, పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తుపాను గంటకు 13 నుంచి 18 కిలోమీటర్ల వేగంతో ఉత్తర, వాయవ్య దిశగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి సమయానికి విశాఖకు 460 కిలోమీటర్లు, కాకినాడకు 410, చెన్నైకి 400 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. మంగళవారం ఉదయానికి ఇది తీవ్ర తుపానుగా మారి ముందుకు కదలనుంది. బుధవారం తెల్లవారు జామున కాకినాడ– అమలాపురం మధ్యలో తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రచండ వేగంతో.. తుపాను తీరాన్ని సమీపిస్తున్న కొద్దీ వేగం పెరుగుతోంది. తుపాను తీరాన్ని దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్లు, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. విశాఖపట్నం జిల్లాలో ఎడతెగని వర్షం.. మోంథా తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర అంతటా ఎడతెగని వర్షాలు కురవగా మిగిలిన చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. విశాఖ నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురవడంతో పలుచోట్ల చెట్లు విరిగి రోడ్డుపై కూలిపోయాయి. విశాఖ రూరల్ పరిధిలోని జాతర ప్రాంగణం వద్ద 9.2 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. మధురవాడ, కాపులుప్పాడ, పెందుర్తి, సీతమ్మధార, ఎండాడ, సాగర్ నగర్, మహారాణిపేట, గోపాలపట్నం, గాజువాక, సబ్బవరం ప్రాంతాల్లో 6 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. అనకాపల్లి జిల్లా గంధవరంలో 5.8, శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం విజయరాంపురంలో 5.7 సెంటీమీటర్ల వర్షం పడింది. అంబేడ్కర్ కోనసీమ, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అన్నమయ్య జిల్లాల్లోనూ పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. కాకినాడ సముద్ర తీరంలో రెండు మీటర్లపైగా ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి. విశాఖ బీచ్లో కోస్టల్ బ్యాటరీ వద్ద ఎగసిపడుతున్న అలలు నేడు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. తుపాను ప్రభావంతో మంగళవారం ప్రకాశం, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు (20 సెంటీ మీటర్లకుపైగా), కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు (15 నుంచి 20 సెంటీ మీటర్లు) కురిసే అవకాశం ఉంది. తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ కడప, చిత్తూరు, నెల్లూరు, నంద్యాల, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు కూడా కుండపోతే..! ఈ నెల 29వ తేదీన బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నంద్యాల, ప్రకాశం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీనివల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు, కమ్యూనికేషన్ వ్యవస్థకు ఆటంకం, వరదలు, పిడుగులు, నేల కోతకు గురి కావడం, రోడ్లు దెబ్బతినడం, బలహీనమైన నిర్మాణాలు, గుడిసెలు నేలమట్టమయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. భారీ వర్షాలకు పలుచోట్ల వాగులు ఉప్పొంగి ఆకస్మిక వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని అప్రమత్తం చేసింది. అందుకనుగుణంగా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ నెల 30వ తేదీ వరకు మత్స్యకారులు వేట కోసం సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించింది. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సరఫరాను పునరుద్ధరించేందుకు సంసిద్ధంగా ఉండాలని విద్యుత్ సంస్థలతో నిర్వహించిన సమీక్షలో సీఎస్ కె.విజయానంద్ ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా కంచిలిలో కురుస్తున్న వర్షం ప్రాణనష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు సహాయక చర్యలపై ఉత్తరాంధ్ర జిల్లాల జోనల్ ఇన్చార్జి అజయ్జైన్ మీడియాకు తెలిపారు. ఇప్పటికే 32,400 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని.. ఐదు ఎన్డీఆర్ఎఫ్, ఆరు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో 2,914 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 233 మండలాల్లోని 1,419 గ్రామాలు, 44 మున్సిపాలిటీల్లో తుపాను ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్నదాతల్లో ఆందోళన.. అన్నదాత చివరి ఆశలపై మోంథా తుపాను నీళ్లు జల్లింది. డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లావ్యాప్తంగా 1.63 లక్షల ఎకరాల్లో ఖరీఫ్లో వరి సాగు చేపట్టగా ప్రస్తుతం గింజ గట్టి పడుతున్న దశలో ఉంది. గత వారం అల్పపీడన ప్రభావంతో మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు వరి చేలల్లో ముంపు నీరు చేరింది. కొబ్బరి రైతుల్లోనూ తుపాను తీవ్ర కలవరం రేపుతోంది. 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని హెచ్చరిస్తుండటంతో 1996 తుపాను గుర్తు చేసుకుని ఆందోళన చెందుతున్నారు. నేడు, రేపు 17 జిల్లాల్లో రెడ్ అలెర్ట్..ముంచుకొస్తున్న తుపాను ముప్పుతో అంతటా అప్రమత్తత నెలకొంది. మంగళ, బుధవారం 17 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశాలుండటంతో రెడ్ అలెర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో ముందస్తు చర్యలు చేపట్టాలంటూ కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో హై అలెర్ట్ ప్రకటించారు. పలు జిల్లాల్లో నాలుగు రోజులపాటు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఉద్యోగులకు మూడు రోజుల పాటు సెలవులు రద్దు చేసి సహాయక చర్యల్లో నిమగ్నం చేశారు. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలుతుపాను నేపథ్యంలో కాకినాడ పోర్టులో 7వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విశాఖ, గంగవరం పోర్టుల్లో 6వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేయగా మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో 5వ నంబర్ ప్రమాద హెచ్చరికలు వెలువడ్డాయి. కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవు పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికలు ఎగుర వేశారు. తీర ప్రాంతాలకు సందర్శకులు రాకుండా నిషేధాజ్ఞలు జారీ చేశారు. ప్రధాన బీచ్లలో పోలీసులు, మెరైన్ సిబ్బంది పహారా కాస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. కాగా రెడ్ అలెర్ట్ జారీ చేసిన జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు... ఆరెంజ్ అలెర్ట్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.తుపాను కారణంగా అలల తాకిడి పెరగడంతో విశాఖ బీచ్ రోడ్డులో కృష్ణ మందిర్ వద్ద కోతకు గురైన తీరం కోనసీమకు పెను గండం..!సాక్షి, అమలాపురం: పెను తుపాను గండం కోనసీమను వణికిస్తోంది. సముద్రం ముందుకు చొచ్చుకు రావడంతో రాకాసి అలలు రెండు, మూడు మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్నాయి. ఓడలరేవు వద్ద ఓఎన్జీసీ వశిష్ట టెర్మినల్ ప్రధాన గోడను అలలు తాకుతున్నాయి. సరుగుడు తోటలు సముద్రంలో కలసిపోతున్నాయి. కాట్రేనికోన మండలం నదీపాయల మధ్య ఉన్న మగసానితిప్ప గ్రామంలోని మత్స్యకారులను బలుసుతిప్పకు తరలించి పునరావాసం కల్పించారు. లంక గ్రామాల రైతులు పాడి పశువులను మైదాన ప్రాంతాలకు తరలించారు. జిల్లాలో 120 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. భయం గుప్పెట్లో కాకినాడసాక్షి ప్రతినిధి, కాకినాడ: మోంథా తుపాను కాకినాడ సమీపంలో తీరం దాటనుందనే భారత వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లాలోని తీర ప్రాంత మండలాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. జిల్లాలోని 12 మండలాలపై ఈ తుపాను తీవ్ర ప్రభావం చూపించనుంది. ఈ నేపథ్యంలో కాకినాడ డీప్ వాటర్ పోర్టు, యాంకరేజ్ పోర్టుల్లో కార్యకలాపాలను నిలిపివేశారు. కాకినాడ–ఉప్పాడ బీచ్ రోడ్డు, బీచ్ పార్కులలో రాకపోకలను ఆపేశారు. కాకినాడ జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు ఈ నెల 29వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా 269 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. సోమవారం కాకినాడ రూరల్లోని పర్ర కాలువ వంతెనపై ప్రవహిస్తున్న నీటిలో పడి 12 ఏళ్ల బాలుడు గల్లంతయ్యాడు. రెడ్ అలెర్ట్ జిల్లాలివే..శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం.ఆరెంజ్ అలెర్ట్ జిల్లాలుశ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ కడప, నంద్యాలఎల్లో అలెర్ట్ జిల్లాలుచిత్తూరు, కర్నూలు, శ్రీసత్యసాయి, అనంతపురంతెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు మొంథా తుఫాను ప్రభావం తెలంగాణపైనా ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. రానున్న రెండు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లోని కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ, అత్యంత భారీ వర్షాలు కూడా నమోదు కావొచ్చని హెచ్చరించింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు నమోదు కావొచ్చని వివరించింది. తీవ్ర తుపాను కారణంగా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈమేరకు జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. 8 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ తెలంగాణలోని ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, నిర్మల్, మహబూబాబాద్... భద్రాద్రి కొత్తగూడెం,ఈ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ, అత్యంత భారీ వర్షాలు కూడా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. విమానాల రద్దు మోంథా తుపాను ప్రభావంలో విజయవాడ, విశాఖపట్నం నుంచి హైదరాబాద్, తిరుపతితోపాటు దేశంలోని వివిధ గమ్యస్థానాలకు రాకపోకలు సాగించే విమానాలను కొన్ని ఎయిర్లైన్స్ సంస్థలు ఇప్పటికే రద్దు చేశాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 30కి పైగా విమానాల రాకపోకలపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉందని ఎయిర్పోర్టు వర్గాలు తెలిపాయి. అలాగే, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మంగళవారం, బుధవారం ప్రయాణించాల్సిన 54 రైళ్లను రద్దు చేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో 43 రైళ్లను రద్దు చేశారు. మొత్తం 97 రైళ్లను రద్దు చేసినట్లు ఆయా డివిజన్ల అధికారులు ప్రకటించారు. విజయవాడ డివిజన్ పరిధిలోని విజయవాడ, భీమవరం, నిడదవోలు, గుంటూరు, కాకినాడ, తెనాలి, రేపల్లె, మార్కాపురం, మచిలీపట్నం, నరసాపూర్, ఒంగోలు, రాజమహేంద్రవరం నుంచి బయలుదేరే రైళ్లను రద్దు చేసినట్లు డివిజనల్ అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులకు ఎంఎస్ఎస్ ద్వారా సమాచారం పంపామని, టికెట్ల డబ్బును వారి ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. కాగా, కాకినాడ, మచిలీపట్నం పోర్టుల్లో లోకల్ వార్నింగ్ సిగ్నల్–4 ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తమిళనాడు, ఒడిశాలో.. తమిళనాడు, ఒడిశాలోనూ మోంథా ప్రభావం చూపుతోంది. చెన్నైతోపాటు ఉత్తర తమిళనాడులోని నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసనట్లు ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. మోంథా నేపథ్యంలో ఒడిశా కూడా అప్రమత్తమైంది. దక్షిణ ఒడిశాలో 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీచేశారు. మూడువేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
అమెరికాలో విశాఖ వైద్యుడికి అరుదైన గౌరవం
డాక్టర్ కల్యాణ్కు రెండు పురస్కారాలు మహారాణిపేట: విశాఖపట్నానికి చెందిన ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ కె.కల్యాణ్ రెండు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు. ఆదివారం అమెరికాలో జరిగిన ఒక కార్యక్రమంలో.. మానసిక వైద్య విద్యారంగంలో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ అవార్డులను ప్రకటించారు. 2015లో అమెరికా వెళ్లడానికి ముందు డాక్టర్ కల్యాణ్ విశాఖలోని ఒక ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన వైద్య ప్రస్థానం భారత్లోనే ప్రారంభమైందని, ఈ పురస్కారాలు కేవలం వ్యక్తిగత మైలురాయి మాత్రమే కావని పేర్కొన్నారు. విశాఖకు చెందిన వ్యక్తిగా ఈ గౌరవం దక్కడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. -
పోలియో రహిత సమాజమే మన లక్ష్యం
ఏయూక్యాంపస్: పోలియో రహిత సమాజం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పిలుపునిచ్చారు. విశాఖపట్నం రోటరీ క్లబ్స్ ఆధ్వర్యంలో పోలియో నిర్మూలనపై వైఎంసీఏ వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వ్యాక్సిన్ ద్వారా పోలియోను పూర్తిగా నిర్మూలించడం సాధ్యమవుతుందన్నారు. గతంలో వ్యాక్సినేషన్ ద్వారా మశూచిని నిర్మూలించగలిగామని గుర్తు చేస్తూ.. అదే విధంగా పోలియో నిర్మూలనకు కూడా కృషి చేయాలని సూచించారు. రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ 3020 గవర్నర్ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా పోలియో కేసులు కొద్ది సంఖ్యలో ఉన్నప్పటికీ.. వాటిని పూర్తిగా రూపుమాపేందుకు నిరంతర పర్యవేక్షణ, వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగించాలని కోరారు. పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమాల కోసం రోటరీ సభ్యులు ఉదారంగా విరాళాలు అందించాలని, ముఖ్యంగా పేద దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేయడం అత్యవసరమని సూచించారు. డీజీఎన్డీ శోభన్ ప్రకాష్, సామ్ మెవ్వ, పీజీడీ పార్థసారథి, డిస్ట్రిక్ట్ పోలియో చైర్ రాంబాబు, రీజినల్ పోలియో చైర్ కాళీప్రసాద్ సహా నగరంలోని 15 రోటరీ క్లబ్లకు చెందిన సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్లాష్మాబ్ అందరినీ ఆకట్టుకుంది. సీపీ శంఖబ్రత బాగ్చి -
గల్లంతైన మత్స్యకారుడు క్షేమం
ఆదుకున్న ఉప్పాడ జాలర్లు మహారాణిపేట: పెదజాలరిపేట గ్రామానికి చెందిన మత్స్యకారుడు రామోలు ఎల్లాజీ ఆచూకీ లభ్యమైంది. సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన ఎల్లాజీ క్షేమంగా ఉన్నట్టు మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ పి.లక్ష్మణరావు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 24న ఎల్లాజీ చేపల వేటకు వెళ్లగా.. ఆయన ఆచూకీ తెలియకుండా పోయింది. అయితే 25న కాకినాడ జిల్లా, తొండంగి మండలం, హూకుంపేట సమీపంలోని ఉప్పాడ సముద్ర తీరంలో ఎల్లాజీ ఆచూకీ లభించినట్టు జాయింట్ డైరెక్టర్ వివరించారు. సముద్రంలో కొట్టుకు వచ్చిన ఎల్లాజీని ఉప్పాడకు చెందిన మత్స్యకారులు గమనించి, ఒడ్డుకు తీసుకువచ్చి ఆదరించారు. పెదజాలరిపేటకు చెందిన పెద్దలు తెడ్డు రాజు, పర్సన్న ఆదివారం ఉప్పాడ వెళ్లి.. ఎల్లాజీని విశాఖపట్నం తీసుకొచ్చారు. ఎల్లాజీ క్షేమంగా తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు, తోటి మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు. -
క్రికెట్ లైవ్.. ఆర్ట్ క్రియేటివ్
విశాఖ స్పోర్ట్స్: సాధారణంగా అంతర్జాతీయ క్రీడా మ్యాచ్ల్లోని ముఖ్య సంఘటనలను సజీవంగా కాన్వా స్పై చిత్రించే సంస్కృతి విదేశాల్లో అధికంగా కనిపిస్తుంది. ఆ సంప్రదాయాన్ని అనుసరిస్తూ.. విశాఖ వేదికగా జరిగిన ఐసీసీ మహిళల వరల్డ్ కప్ చివరి రోజు మ్యాచ్ సందర్భంగా ఓ కళాత్మక కార్యక్రమం జరిగింది. స్థానిక ఇంజినీరింగ్ విద్యార్థులు కలిసి ‘కళాకృతి క్రియేటివ్ ఆర్ట్స్ క్లబ్’గా ఏర్పడి ఆదివారం ఈ లైవ్ పెయింటింగ్కు శ్రీకారం చుట్టారు. ఈ క్లబ్లోని 16 మంది ఔత్సాహిక విద్యా ర్థులు మ్యాచ్ జరుగుతున్న తీరును, క్రీడాకారుల ఉత్సాహాన్ని, స్టేడియం వాతావరణాన్ని ప్రత్యక్షంగా చిత్రీకరించేందుకు సన్నద్ధమయ్యారు. ఈ బృందం మొత్తంగా ఏడు లైవ్ పెయింటింగ్స్ను రూపొందించింది. స్టేడియంలోని మీడియా బాక్స్ నుంచి ఐదుగురు ఔత్సాహిక చిత్రకారులు మ్యాచ్ను వీక్షిస్తూ పెయింటింగ్స్ వేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా విద్యార్థిని శోభిత మాట్లాడుతూ.. ‘మేము గ్రూపులుగా ఏర్పడి ఏడు పెయింటింగ్స్ను కాన్వాస్పై రూపొందించాం. ఈ మ్యాచ్లోని ప్రత్యేక సందర్భాలను, వైజాగ్కు ఉన్న ప్రత్యేక గుర్తింపును ఈ కళాఖండాలు ప్రతిబింబిస్తాయి.’అని వివరించారు. -
20 ఐరన్ టాబ్లెట్లు మింగిన చిన్నారికి పునర్జన్మ
7 వారాల పాటు చికిత్స అందించిన వైద్యులు మహారాణిపేట: 20 ఐరన్ టాబ్లెట్లు మింగి ప్రాణాపాయ స్థితికి చేరిన రెండేళ్ల చిన్నారికి జగదాంబ జంక్షన్లోని మెడికవర్ హాస్పిటల్ వైద్యు లు విజయవంతంగా చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. చిన్నారి ఆసుపత్రికి వచ్చే సరికే శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ సాయి సునీల్ కిశోర్ నేతృత్వంలోని బృందం.. వెంటనే చికిత్స ప్రారంభించింది. ముందుగా ‘కీలేషన్ థెరపీ’ద్వారా శరీరంలోని అధిక ఐరన్ను తొలగించారు. అయితే చికిత్స సమయంలో చిన్నారికి అనేక కొత్త సమస్యలు తలెత్తాయి. మొదటి వారంలో కాలేయం దెబ్బతిన్నా, వైద్యుల సకాల స్పందనతో అది తిరిగి కోలుకుంది. అనంతరం రెండు ఊపిరితిత్తుల్లో గాలి లీక్ (బైలాటరల్ న్యుమోథోరాక్స్) కావడం, తీవ్రమైన సెప్సిస్ సోకడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేశాయి. వైద్య బృందం వెంటిలేటర్ సాయంతో పాటు పునరావృతమయ్యే గాలి లీక్ సమస్యకు ‘బ్లడ్ ప్యాచ్ ప్లూరోడెసిస్’ అనే నూతన చికిత్సను, సెప్సిస్ కోసం ఐవీఐజీ థెరపీని అందించింది. ఏడు వారాల పాటు ఐసీయూలో నిరంతర పర్యవేక్షణ, అధునాతన చికిత్సల అనంతరం చిన్నారి కాలేయం, ఊపిరితిత్తులు పూర్తిగా కోలుకున్నాయి. ప్రస్తుతం చిన్నారి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయినట్లు డాక్టర్ సాయి సునీల్ తెలిపారు.


