Visakhapatnam
-
స్కెచ్ ప్రకారమే దాడి.. వడ్డీతో చెల్లిస్తాం: ఉమాశంకర్
సాక్షి, విశాఖపట్నం: పక్కా స్కెచ్ ప్రకారమే తమపై దాడులు చేశారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్. ఉత్తరాంధ్రలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు కొత్త విష సంస్కృతిని తీసుకువచ్చారని మండిపడ్డారు. స్పీకర్గా అయ్యన్న అనర్హుడు.. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బలిగట్టంలోని వంద ఎకరాల దేవాదాయ భూమిపై అయ్యన్న కన్ను వేశారని ఆరోపణలు చేశారు.మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘యువ నాయకుడి పేరు చెప్పుకుని అయ్యన్న వందల కోట్లు దోచుకుంటున్నారు. చోడవరం నియోజకవర్గంలో అయ్యన్న పాత్రుడికి ఏం పని? అని ప్రశ్నించారు. స్పీకర్గా ఉన్నాననే అయ్యన్న వన్సైడ్గా వెళ్తున్నారు. చీఫ్ జస్టిస్ ఆర్డర్ను కూడా కూటమి పాలకులు పట్టించుకోవడం లేదు. దేవాదాయ భూములను కూడా అయ్యన్న వదలడం లేదు. బలిగట్టంలోని వంద ఎకరాల దేవాదాయ భూమిపై అయ్యన్న కన్ను వేశారు. తన కుమారుడిని ప్రమోట్ చేసుకోవడానికి వందల కోట్లు దోచుకుంటున్నారు.నాతవరంలో నల్లకొండమ్మ తల్లి దేవాలయం కట్టకుండా కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చారు. నల్లకొండమ్మ తల్లి దేవాలయం కట్టకుండా స్టే తెచ్చిన అయ్యన్న హిందువా?. రైతులకు అన్యాయం జరుగుతుంటే కోర్టుకు వెళ్తే నేను హిందూ వ్యతిరేకినా?. కోర్టుకు వ్యతిరేకంగా జరుగుతున్న పనులు పరిశీలించడానికి వెళ్తే మా పై దాడి చేశారు. ల్యాటిరైట్ మీద ఇప్పటి వరకు 400 కోట్లు సంపాదించారు. కొడుకుకు రాజ్యసభ సీటుకోసం అమరావతి నాయకుడుకు కోట్లాది రూపాయలు ఇస్తామని చెపుతున్నారు. రోలుగుంటలో క్వారీల దగ్గర అయ్యన్న పాత్రుడు ట్యాక్స్ వసూళ్లు చేస్తున్నారు. 100 ఎకరాల దేవాలయ భూములను కబ్జా చేయడానికి చూస్తున్నారు. కొడుకు ప్రమోషన్ కోసం ప్రభుత్వ చెరువులో సృష్టి క్షేత్రం కడుతున్నారు. దానికి నిధులు GMR నుంచి తీసుకున్నారు. మేము కంప్లైంట్ ఇచ్చినా.. సృష్టి క్షేత్రంలో పనులు జరుగుతున్నాయి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డీతో అయ్యన్నకు తిరిగి ఇస్తాము. అయ్యన్న, కలెక్టర్, పోలీసుల మీద కోర్టుకు వెళ్తాం’ అని హెచ్చరించారు.మరోవైపు.. నాయకులు కేకే రాజు మాట్లాడుతూ..‘స్పీకర్ అయ్యన్న పాత్రుడు విష సంస్కృతిని తీసుకువచ్చారు. కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించడానికి వెళ్తే చంపడానికి ప్రయత్నం చేశారు. రౌడీలు గుండాలతో భౌతిక దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. స్పీకర్ అయ్యన్నపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. పోలీసులు కూటమి నేతలకు బానిసల్లా పని చేయడం మానుకోవాలి. కేసు నమోదు చేయకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం’ అని తెలిపారు. -
భర్తను ఏమార్చి.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం!
సాక్షి, పల్నాడు: విశాఖ ఎక్స్ప్రెస్లో మహిళపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గుర్తుతెలియని వ్యక్తి మాయమాటల్ని నమ్మి బాధిత దంపతులు వెంట వెళ్లగా.. ఏసీ బోగీలోకి తీసుకెళ్లి మరీ వివాహితపై అఘాయిత్యం జరిపినట్లు తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా జరిగిన వివరాల్లోకి వెళ్తే.. పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన భార్యభర్తలు జీవనోపాధి కోసం విశాఖలో నివాసం ఉంటున్నారు. జెట్టిపాలెంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు విశాఖ ఎక్స్ప్రెస్ ఎక్కారు. ఈలోపు జనరల్ బోగీలో ఉన్న ఆ జంట వద్దకు ఓ వ్యక్తి వచ్చాడు. ఇక్కడ ఇబ్బంది ఎందుకు పడతారని?.. ఏసీ బోసీలో ఖాళీగా ఉందని చెప్పాడు. ఆ వ్యక్తి చెప్పిన మాటలు విని వాళ్లు వెంట వెళ్లారు. అయితే ఒక సీటే ఖాళీగా ఉందని చెప్పడంతో భర్త టాయ్లెట్ వద్ద కూర్చోనిపోయాడు. మహిళను హెచ్1ఏ బోగీలోకి తీసేకెళ్లి కూపే తలుపు మూసి దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు రెంటచింతల పీఎస్లో ఫిర్యాదు చేసింది. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఘటనపై విజయవాడ రైల్వే ఓలీసులు సమాచారం అందించారు. దీంతో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. -
భయపెడుతూ.. భయపడుతూ..
తర్లువాడలో అదానీ గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన నిరసన వ్యక్తం చేయకుండా ప్రజల్ని నిర్బంధించిన చంద్రబాబు ప్రభుత్వం పరిహారం చెల్లించకుండానే బలవంతపు భూ సేకరణ రైతుల సమస్యలు పరిష్కరించకుండా శంకుస్థాపన ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్న తర్లువాడ గ్రామస్తులు ఆనందపురం మండలం తర్లువాడలో మంగళవారం జరిగిన గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ భూమిపూజ కార్యక్రమం అధికారిక వేడుక కంటే, రాజకీయ ప్రదర్శనగా మిగిలిపోవడంతో పాటు అనేక వివాదాలకు కేంద్రబిందువైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వంటి అగ్రనేతల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక తర్లువాడ గ్రామస్తులకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. తమ భూములను ప్రాజెక్టు కోసం ఇచ్చిన రైతులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందజేయకుండానే భూమిపూజ చేపట్టడాన్ని నిరసిస్తూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతులలో ఉన్న ఈ అసంతృప్తిని దృష్టిలో ఉంచుకుని, పోలీసులు ముందస్తు చర్యల పేరుతో గ్రామస్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. కార్యక్రమం పూర్తయ్యే వరకు గ్రామస్తులను బయటకు రానీయకుండా నిర్బంధించడం, జాతీయ రహదారి నుంచి వ్యవసాయ భూముల వరకు ఎక్కడికక్కడ పికెటింగ్ నిర్వహించి కదలికలను ఆంక్షలకు గురిచేయడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం పరిపాలనాపరమైన ప్రోటోకాల్లను సైతం పక్కన పెట్టి, పూర్తిగా అధికార పార్టీ కార్యక్రమంలా సాగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత ప్రజాప్రతినిధులైన ఎంపీపీ మజ్జి శారదా ప్రియాంకను, జెడ్పీటీసీ సభ్యుడు కోరాడ వెంకటరావును కనీసం ఆహ్వానించకపోవడం ప్రోటోకాల్ నిబంధనల ఉల్లంఘనకు నిదర్శనంగా మారింది. టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్ బీఆర్బీ నాయుడు, పార్టీ మండల అధ్యక్షుడు తాట్రాజు అప్పారావును తప్ప చీమను కూడా గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ వైపు రానివ్వలేదు. వీరికి బదులుగా ఎలాంటి పదవుల్లో లేని మాజీ సర్పంచ్, మండల పార్టీ అధ్యక్షుడికి ప్రాధాన్యత ఇస్తూ పాస్లు జారీ చేయడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అటు కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు కూడా ఈ కార్యక్రమంలో సరైన గుర్తింపు దక్కలేదనే వాదన వినిపిస్తోంది. భీమిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కురిమిన రామస్వామినాయుడుకు ఆహ్వానం అందకపోవడంతో ఆయనతో పాటు వచ్చిన రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పంచకర్ల సందీప్ ఆ కార్యక్రమం నుంచి వెనుదిరిగారు. బయటపడ్డ గంటా.. భరత్ విభేదాలు అంతేకాకుండా ఈ కార్యక్రమం సందర్భంగా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎంపీ శ్రీభరత్ వర్గాల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. గంటా శ్రీనివాసరావు వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఎంపీ భరత్ ఫొటో లేకపోవడం, ఇరువురు నేతల మధ్య ఉన్న గ్యాప్ను స్పష్టం చేస్తోంది. మరోవైపు ఈ భారీ కార్యక్రమం కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు సైతం కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎండ తీవ్రతకు తాళలేక, కనీసం తాగునీరు కూడా అందక పోలీసులు అవస్థలు పడటం గమనార్హం. ప్రారంభంలో 30 వేల మందితో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావించిన ఈ భూమిపూజ కార్యక్రమం, ఇన్ని వివాదాల మధ్య, ఆశించిన స్థాయిలో కాకుండా చప్పగా ముగిసింది. రైతుల నిరసన సెగకు భయపడుతూ.. భయపెడుతూ.. ప్రజాస్వామ్యాన్ని పోలీసుల నిర్బంధంలో తొక్కిపెట్టి.. రైతుల కడుపు కొట్టి.. చంద్రబాబు ప్రభుత్వం తర్లువాడలో అదానీ గూగుల్ డేటా సెంటర్కు ‘బలవంతపు’ శంకుస్థాపన కార్యక్రమాన్ని మంగళవారం కానిచ్చేసింది. నమ్మిన ప్రజల్ని నట్టేట ముంచే చంద్రబాబు ప్రభుత్వ నైజం తర్లువాడ సాక్షిగా మరోసారి బయటపడింది. కనీసం పరిహారం చెల్లించకుండా, సాగు భూములను లాక్కొని అన్నదాతలను రోడ్డున పడేసిన సర్కారు.. వారు నిరసన తెలపకుండా గ్రామం చుట్టూ పోలీసులను మోహరించి అష్టదిగ్బంధనం చేసింది. రైతుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, వారి గొంతు నొక్కుతూ స్వ ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఇంతలా బరితెగించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఊరంతా పోలీసుల ఆంక్షలు, అరెస్టుల భయం నీడన.. ప్రజలను నిర్బంధించి చేసిన ఈ శంకుస్థాపన పాలకుల నైతిక ఓటమికి నిదర్శనంగా నిలిచింది. మరోవైపు.. శంకుస్థాపన కార్యక్రమం సాక్షిగా.. ‘కూటమి’లో విబేధాలు మరోసారి బట్టబయలయ్యాయి. జనసేన ప్రతినిధులకు ప్రాధాన్యమివ్వకపోవడంతో.. కార్యక్రమానికి హాజరుకాకుండానే వెనుదిరిగారు. –సాక్షి, విశాఖపట్నం/తగరపువలస/ఆనందపురం -
డిజిటల్ ప్రయాణంలో నూతన అధ్యాయం
‘భారత్ ఏఐ శక్తి’ కాంక్లేవ్లో లోకేష్ మహారాణిపేట: భారతదేశ డిజిటల్ ప్రయాణంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైందని, మన రాష్ట్రానికి ఇది కీలక మలుపు అని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ‘భారతదేశ ఏఐ కారిడార్ను ఉమ్మడిగా నిర్మించడం’అనే అంశంపై గూగుల్ ఆధ్వర్యంలో నోవాటెల్లో మంగళవారం జరిగిన ‘భారత్ ఏఐ శక్తి కాంక్లేవ్’లో ఆయన మాట్లాడారు. ‘విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ప్రారంభం కావడం కేవలం ఒక ఆరంభం మాత్రమే కాదు, దేశ డిజిటల్ ప్రయాణంలో ఇదొక చారిత్రక ఘట్టం. నేడు మనం విశాఖ పునాదులను ఏఐ విప్లవంపై నిర్మించబోతున్నాం. విశాఖ నగరం మన దేశ భవిష్యత్తును నిర్మించబోతోందని నేను బలంగా విశ్వసిస్తున్నాను’ అని తెలిపారు. 2047 నాటికి విశాఖ ఎకనమిక్ రీజియన్ను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనేదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ ప్రాంతం కృత్రిమ మేధ, క్లీన్ ఎనర్జీ, మెడికల్ తయారీ, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్కు కేంద్రంగా మారబోతోందని లోకేష్ అన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే తమ ధ్యేయమని, ఏపీతో పాటు వైజాగ్లో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. సమావేశంలో గూగుల్ క్లౌడ్, గూగుల్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ బికాష్ కోలే, 49 కంపెనీల ప్రతినిధులు, పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. -
కలెక్టర్ గారూ.. ఇదీ క్షేత్రస్థాయి తీరు...
మహారాణిపేట: నగరంలో కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ కోసం సామాన్యులు పడుతున్న అవస్థలు అక్షరాలా కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. తెల్లవారుజామునే నిద్రలేచి క్యూ కడితేనే కానీ చుక్క పెట్రోల్ దొరకని దయనీయ స్థితి నెలకొంది. మధురవాడ నుంచి నగరంలోని వివిధ ప్రాంతాల వరకు వాహనచోదకుల నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. గంటల తరబడి పడిగాపులు కాసినా, చివరకు వాహనంలోకి వచ్చేది కేవలం రూ.300 పెట్రోల్ మాత్రమే కావడంతో అసహనం, ఆందోళన వారిని వెంటాడుతున్నాయి. అధికారుల ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులకు మధ్య నెలకొన్న వైరుధ్యం ఇక్కడ ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. జిల్లాలో పెట్రోల్ కొరత లేదని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ స్పష్టం చేసినప్పటికీ, బంకుల వద్ద దర్శనమిస్తున్న ‘నో స్టాక్’ బోర్డులు ఆ ప్రకటనను అపహాస్యం చేస్తున్నాయి. అధికారులు చెబుతున్న మాటలకు, బంకుల్లో పడుతున్న క్యూలకు అస్సలు పొంతన లేకపోవడంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. అధికారుల ప్రకటనలు కేవలం కాగితాలకే పరిమితమా, లేక సరఫరా వ్యవస్థలో ఎక్కడో లోపం ఉందా అన్నది అర్థం కాక జనం అయోమయంలో ఉన్నారు. సిబ్బంది నిర్లక్ష్యం వాస్తవానికి పెట్రోల్ బంకుల నిర్వహణలో ఉన్న నిర్లక్ష్యం కూడా ప్రజల ఇబ్బందులను రెట్టింపు చేస్తోంది. ఫోర్త్టౌన్ పోలీస్స్టేషన్ సమీపంలోని బంకులో ఆరు పంపులు అందుబాటులో ఉన్నా, వాటిలో కేవలం రెండింటిని మాత్రమే వినియోగించడం అధికారుల పర్యవేక్షణ లోపాన్ని ఎత్తి చూపుతోంది. ఉన్న వనరులను కూడా పూర్తిస్థాయిలో వినియోగించుకోకుండా, వాహనదారులను క్యూలలో గంటల తరబడి నిలబెట్టడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాహనాల రద్దీని నియంత్రించాలని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు క్షేత్రస్థాయిలో ఎక్కడా కార్యరూపం దాల్చడం లేదు. ఒకవైపు గంటల తరబడి వేచి చూసే ఓపిక లేక, మరోవైపు లభిస్తున్న పెట్రోల్ కూడా తక్కువ పరిమాణంలో ఉండటంతో వాహనదారులు విసిగిపోతున్నారు. అసలు ఎప్పటికి పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందో, ఎప్పుడు పూర్తిస్థాయిలో పెట్రోల్ దొరుకుతుందో చెప్పేవారే కరువయ్యారు. అధికారుల ప్రకటనల కంటే, బంకుల వద్ద ఉన్న బోర్డులే వాస్తవమని ప్రజలు నమ్ముతున్న తరుణంలో, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి సరఫరా వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మాటలతో సరిపెట్టకుండా, బంకుల వద్ద పర్యవేక్షణ పెంచి ప్రజల ఇబ్బందులను తొలగించడమే ఇప్పుడు తక్షణ కర్తవ్యం. పెట్రోల్,డీజిల్ కొరత లేదు కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందనే ప్రచారంలో వాస్తవం లేదని, ప్రజలు భయాందోళనలకు గురికావద్దని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ స్పష్టం చేశారు. జిల్లాలోని మొత్తం 120 పెట్రోల్ బంకుల్లో ఇంధన సరఫరా సాధారణంగానే జరుగుతోందని ఆయన తెలిపారు. పుకార్ల కారణంగా కొందరు వినియోగదారులు అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేస్తుండటంతోనే కొన్ని చోట్ల తాత్కాలిక రద్దీ ఏర్పడుతోందని పేర్కొన్నారు. ఉదయం వేళల్లో నిల్వలు స్వల్పంగా తగ్గినప్పటికీ, అదే రోజున తగినంత సరఫరా అందుబాటులోకి వస్తోందని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ భరోసా ఇచ్చారు. పెదవాల్తేరు పెట్రోల్ బంక్ప్రస్తుత నిల్వలు కంపెనీ పేరు బంకుల పెట్రోల్ నిల్వలు డీజిల్ నిల్వలు సంఖ్య (కిలో లీటర్లలో) (కిలో లీటర్లలో) హెచ్పీసీఎల్ 42 981 903 బీపీసీఎల్ 39 647 980 ఐవోసీ 39 572 794 మొత్తం 120 2200 2677 -
పెళ్లి వేడుకకు వెళ్తూ.. అనంతలోకాలకు..
కశింకోట: మండలంలోని బయ్యవరం వద్ద సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన రోడ్డు ప్రమా దంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. బంధువుల పెళ్లికి అగనంపూడి నుంచి బైక్పై యానాం వెళుతుండగా వెనుక నుంచి లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన వారిని కేజీహెచ్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. సీఐ అల్లు స్వామినాయుడు అందించిన వివరాల ప్రకారం.. అగనంపూడికి చెందిన నంబారు అజయ్ (20), ఓడూరు అఖిల్ (25) సహా మరో నలుగురు యువకులతో కలిసి మూడు బైక్లపై కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో జరిగే బంధువుల వివాహానికి సోమవారం రాత్రి బయలుదేరారు. వారు మండలంలోని బయ్యవరం రైల్వే స్టేషన్ రోడ్డు వద్దకు చేరే సరికి.. వారిలో ఒకరి బైక్ను వెనుక నుంచి గుర్తు తెలియని లారీ వచ్చి ఢీకొని వెళ్లిపోయింది. దీంతో అజయ్, అఖిల్ తీవ్రంగా గాయపడగా వారికి అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం వాహనంలో వారిని కేజీహెచ్కు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందారు. మృతదేహాలకు కేజీహెచ్లో పోస్టుమార్టం జరిపించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అజయ్, అఖిల్ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదంలో బైక్ దెబ్బతింది. ప్రమాదానికి కారణమైన లారీని జాతీయ రహదారిపై సీసీ కెమెరాల ఫుటేజీల సహా యంతో గుర్తించి ఖమ్మం వద్ద పట్టుకొని స్వాధీనం చేసుకుననారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. ఎస్ఐ లక్ష్మణరావు కేసును దర్యాప్తు చేపడుతున్నారు. స్థానికంగా అజయ్, అఖిల్కు అంత్యక్రియలు నిర్వహించారు. చేతికి అందివస్తారనుకుంటే...అనంతలోకాలకు... ప్రమాదంలో మృతి చెందిన అఖిల్ అగనంపూడి కాలనీకి చెందిన వాడు. జీవీఎంసీలో శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఓడూరు అప్పారావు, వరలక్ష్మి దంపతుల ఏకైక మగ సంతానం. మరో నలుగురు కుమార్తెలున్నారు. వారికి వివాహం అయింది. అఖిల్కు ఇంకా వివాహం కాలేదు. కశింకోట పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లమో, ఐటీఐ చదివి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో తమ కుటుంబానికి చేదోడుగా ఉంటాడనుకున్న కుమారుడు అఖిల్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం కుటుంబాన్ని తీవ్రంగా కలచి వేసింది. మరో మృతుడు నంబారు అజయ్ కూడా అగనంపూడి బీసీ కాలనీకి చెందిన వాడు. తండ్రి అచ్చిబాబు తాపీ మేస్త్రిగా పని చేస్తున్నాడు. తల్లి లక్ష్మి గృహిణి. వీరికి ఒకే మగ సంతానం. ఆడపిల్లకు వివాహం అయింది. ఇంటర్మీడియట్ చదివి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా ప్రమాదంలో లోకాన్ని వీడి వెళ్లిపోవడంతో తమ కుటుంబానికి అండ లేకుండా పోయిందని వారు రోదిస్తుండటం చూపరులను కంట తడి పెట్టించింది. అఖిల్ (25)అజయ్ (20) -
ముచ్చటపడి రాలేదు.. మూటగట్టి తెచ్చారు..
విశాఖ సిటీ: కూటమి ప్రభుత్వం తన ప్రచార ఆర్భాటం కోసం విద్యార్థులను విడిచిపెట్టడం లేదు. ఆనందపురంలో మంగళవారం జరిగిన గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమం జనసమీకరణకు యూత్ కలరింగ్ ఇచ్చేందుకు కొత్త ఎత్తుగడ వేసింది. విద్యార్థులు, యువత స్వచ్ఛందంగా ‘గూగుల్’ శంకుస్థాపనకు వచ్చినట్లు ప్రచా రం చేసుకోడానికి సాక్షాత్తు ఆంధ్రా యూనివర్సిటీనే ‘జనసమీకరణ’ కేంద్రంగా మార్చేసింది. ఇందుకోసం ఏయూ అధికారులను పావులుగా వాడుకుంది. విద్యార్థులను బలవంతంగా తరలించే బాధ్యతలను అప్పగించింది. గీతం విద్యార్థులను తరలించారు. విద్యార్థులంటే ‘క్రౌడ్’ ఫిల్లింగ్ మెటీరియలా? ముఖ్యమంత్రి శంకుస్థాపన చూసేందుకు యువత విపరీతంగా ఆసక్తి చూపిస్తోందని ప్రజలను నమ్మించడం కోసం ప్రభుత్వం పక్కా వ్యూహం రచించింది. గూగుల్ వస్తోందన్న ఆనందంతో యువత, విద్యా ర్థులు తండోపతండాలుగా తరలివచ్చారని కలరింగ్ ఇవ్వడం కోసం ప్రయత్నించింది. ఈ బాధ్యతలను ఆంధ్రా యూనివర్సిటీ అధికారులకు అప్పగించినట్లు తెలుస్తోంది. దీంతో ఏయూ అధికారులు తమ విధేయతను చాటుకునే పనిలో పడ్డారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందడమే ఆలస్యం.. అధికారులు హడావుడిగా రంగంలోకి దిగారు. క్లాసులు పక్కనపెట్టేసి మూడు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసేశారు. ఏయూ కంప్యూటర్ సైన్స్ విద్యార్థులను ఆ బస్సుల్లో ఎక్కించి ఆనందపురానికి తీసుకువెళ్లారు. విద్యార్థులను బలవంతంగా బస్సుల్లో ఎక్కించి తరలించిన తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. కంప్యూటర్ల ముందు కోడింగ్ నేర్చుకోవాల్సిన విద్యార్థులు, ఈ ఎండలో రాజకీయ ఉపన్యాసాలు వినాల్సి రావడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. -
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జెట్రో బృందం
విద్యా మార్పిడి, ఉపాధిపై దృష్టి మద్దిలపాలెం: ప్రముఖ జపనీస్ కంపెనీల్లో విద్యార్థులకు నియామక అవకాశాలు కల్పించడంపై చర్చించేందుకు జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జెట్రో)కు చెందిన ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం మంగళవారం ఆంధ్ర విశ్వ విద్యాలయాన్ని సందర్శించింది. పరిశోధన, అధ్యాపకుల మార్పిడి, విద్యార్థుల రాకపోకలు వంటి అంశాల్లో పటిష్టమైన సహకారాన్ని పెంపొందించుకోవడంపై ఈ సందర్భంగా చర్చలు జరిగాయి. ఏయూ అధ్యాపకులు జపాన్లోని తోయామా ప్రిఫెక్చర్ను సందర్శించే అవకాశాలను కూడా జెట్రో ప్రతినిధులు ఈ సందర్భంగా వివరించారు. ద్వైపాక్షిక విద్యా సంబంధాలను బలోపేతం చేయడానికి ఉమ్మడి అంతర్జాతీయ సదస్సులను నిర్వహించడం, జపాన్ విద్యార్థులను ఉన్నత విద్య కోసం ఏయూలోకి ఆహ్వానించడం(సాధ్యమైతే ఫీజు మినహాయింపుతో), ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ పద్ధతుల్లో జపనీస్ భాషా తరగతులను ప్రారంభించడం వంటి అంశాల ఆవశ్యకతను వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ జి.పి.రాజశేఖర్ వారికి వివరించారు. పరస్పర విద్యా, వృత్తిపరమైన అభివృద్ధి కోసం జపాన్తో భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం సిద్ధంగా ఉందని వీసీ పేర్కొన్నారు. -
సముద్ర భద్రతలో నావికాదళ పాత్ర అభినందనీయం
సింథియా: భారత నౌకాదళ కార్యాచరణ సామర్థ్యాలను తెలుసుకునేందుకు నౌకాదళ యుద్ధ నౌకను, జలాంతర్గామిని నాగాలాండ్ ముఖ్యమంత్రి నైఫియు రియో సందర్శించారు. ఈ సందర్భంగా తూర్పు నావికాదళ కమాండ్ ఉన్నతాధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా, ఉపరితల, జలాంతర్గత వేదికల విధులు, లక్ష్యాలు, కార్యాచరణ సామర్థ్యాల గురించి అధికారులు ఆయనకు వివరించారు. అనంతరం, ఆయన ఆ నౌకలను పరిశీలించారు. నైఫియు రియో నౌకాదళ సిబ్బందితో సంభాషించి, దేశ సముద్ర ప్రయోజనాలను పరిరక్షించడంలో వారు ప్రదర్శిస్తున్న వృత్తి నైపుణ్యం, అంకితభావం, నిబద్ధతను ప్రశంసించారు. భారత నౌకాదళం పాటిస్తున్న ఉన్నత ప్రమాణాలను, సముద్ర భద్రతను నిర్ధారించడంలో నౌకల పాత్రను ఆయన కొనియాడారు. -
ఏయూ శతాబ్ది వేడుకల్లో దళిత ఎంపీకి అవమానం
వీసీపై ఏఎంఎస్, డీహెచ్పీఎస్ ఆగ్రహం సీతంపేట: ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది వేడుకల్లో రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావును ఆహ్వానించి, వేదిక మీదకు పిలవకుండా అవమానపరచడం దారుణమని అంబేడ్కర్ మెమోరియల్ సొసైటీ(ఏఎంఎస్) అధ్యక్షుడు బొడ్డు కల్యాణరావు ధ్వజమెత్తారు. రామటాకీస్ రోడ్డులోని అంబేడ్కర్ భవన్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గొల్ల బాబూరావు దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్లే కావాలని వివక్ష చూపి అవమానించారని ఆయన మండిపడ్డారు. ఆయన ఏయూ పూర్వ విద్యార్థి అని, ఆహ్వాన పత్రికలో పేరు ముద్రించినప్పటికీ వేదికపైకి ఆహ్వానించకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఈ ఘటనకు ఏయూ వీసీ ప్రొఫెసర్ రాజశేఖర్ బాధ్యత వహించాలని, ఆయనను వెంటనే పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. రాజకీయం చేయడం సబబు కాదు: డీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జె.వి.ప్రభాకర్ మాట్లాడుతూ.. ఘన చరిత్ర కలిగిన ఏయూ వందేళ్ల పండగ ఏ ఒక్కరికో సొంతం కాదని, ఇది కేవలం టీడీపీ కార్యక్రమంగా జరపడం సరికాదని విమర్శించారు. కట్టమంచి రామలింగారెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణ, హీరేన్ ముఖర్జీ వంటి మహనీయులతో అనుబంధం ఉన్న ఈ విద్యాలయం ఎందరో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రాజకీయ దిగ్గజాలను అందించిందన్నారు. సచిన్ టెండూల్కర్, సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి వారు వేదికను పంచుకున్నప్పుడు, అదే కోవకు చెందిన గొల్ల బాబూరావును ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు. రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన వేడుకలను రాజకీయం చేయడం పద్ధతి కాదని పేర్కొన్నారు. ఏయూ అభివృద్ధికి రూ.500 కోట్లు ప్రకటించాల్సిన అవసరం ఉందని, వర్సిటీకి సెంట్రల్ యూనివర్సిటీ హోదా కల్పించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఏఎంఎస్ కోశాధికారి గార సత్యనారాయణ, సహాయ కార్యదర్శి బత్తుల గౌతమ్ బాబు, బోని అప్పారావు, బొడ్డు రాజు తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు రాక... అప్పన్న భక్తులకు అవస్థలు
సింహాచలం (విశాఖ): శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి(సింహాద్రి అప్పన్న) దర్శనానికి మంగళవారం సీఎం చంద్రబాబు రావడంతో పోలీసులు అడ్డగోలు ఆంక్షలు విధించారు. దాదాపు మూడు గంటలు మండుటెండలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చంద్రబాబు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి సింహగిరికి వచ్చారు. ఆయన రావడానికి గంటన్నర ముందు నుంచే కొండపైకి వెళ్లే రెండు టోల్గేట్ల వద్ద భక్తులు, విధులకు హాజరుకావాల్సిన దేవస్థానం ఉద్యోగులను పోలీసులు నిలిపివేశారు.ఘాట్రోడ్డులో బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాలను కూడా అనుమతించకపోవడంతో దర్శనం చేసుకున్న భక్తులు సింహగిరిపై బస్టాండ్ ప్రాంగణంలోనే గంటల తరబడి వేచి ఉన్నారు. చంద్రబాబు తిరిగి వెళ్లే వరకు క్యూలైన్లలో ఉన్నవారితోపాటు ఎక్కడ వారిని అక్కడే నిలిపివేశారు. అయితే, చంద్రబాబు వెళ్లిపోయిన తర్వాత కూడా గంటల తరబడి వేచి ఉన్న భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలగలేదు. మధ్యాహ్నం పవళింపు సేవ కావడంతో దేవస్థానం అధికారులు దర్శనాన్ని నిలిపివేశారు. చివరికి మధ్యాహ్నం 3.30 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. -
చరమ‘గీతమే’ లక్ష్యంగా ఏయూ ఖజానాకు బాబు చిల్లు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఒకవైపు ప్రతి మంగళవారం వేలకు వేల కోట్ల రూపాయల అప్పులు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం... మరోవైపు విశ్వవిద్యాలయాల నిధులను కూడా దోచేస్తోంది. శతాబ్ది ఉత్సవాలు జరుపుకొంటున్న ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) ఖజానాకు ఎసరు పెట్టింది. ఏకంగా రూ.300 కోట్ల మేర ఏయూ నిధులను చంద్రబాబు ప్రభుత్వం కాజేసింది. ఏయూ నిధులు రూ.150 కోట్లు చొప్పున రెండు విడతల్లో రాష్ట్ర ఖజానాకు చంద్రబాబు ప్రభుత్వం జమ చేసుకున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి యూనివర్సిటీకి సంబంధించిన ఏ నిర్ణయాలనైనా పాలకవర్గం (ఈసీ) నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే గీతంలో పనిచేసి, గీతం వలన ఏయూ వీసీగా వచ్చిన రాజశేఖర్కు ఇవేవీ లెక్కలోలేవనే విమర్శలున్నాయి. ఈసీతో పనిలేకుండానే నేరుగా ఆయన ఏయూ నిధులను రాష్ట్ర ఖజానాకు మళ్లించినట్టు సమాచారం. ఇప్పటికే యూనివర్సిటీ ఉద్యోగులు, ప్రొఫెసర్ల వేతనాలను ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదు. దీంతో ఏయూ ఖజానా నుంచే వేతనాలను చెల్లిస్తున్నారు. ఈ విధంగా ఇప్పటికే రూ.200 కోట్లను వర్సిటీ వేతనాలకు వినియోగించింది. ఇక నూరేళ్ల చరిత్రను పూర్తిచేసుకున్న సందర్భంగా నిర్వహించిన శతాబ్ది ఉత్సవాలకు సైతం ప్రభుత్వం పైసా విదల్చలేదు. ఇందుకోసం కూడా సుమారు రూ.63.5 కోట్లను వర్సిటీ ఖజానా నుంచే వెచ్చించినట్లు సమాచారం. ఈ విధంగా వర్సిటీ ఖజానాను ఖాళీ చేయడం ద్వారా ఏయూలో అభివృద్ధి లేకుండా చూడాలనే పన్నాగం ఒకటి అమలవుతోందన్న ఆరోపణలున్నాయి. అంతిమంగా గీతం అనే ప్రైవేటు యూనివర్సిటీకి లబ్ధి చేకూర్చేందుకే చంద్రబాబు ప్రభుత్వం ఏయూను ఉద్దేశపూర్వకంగా నాశనం చేస్తోందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.శతాబ్ది ఉత్సవాలకు పైసా విదల్చని ప్రభుత్వం1926 నుంచి 2026కు నూరేళ్లు పూర్తిచేసుకున్న సందర్బంగా ఏయూలో శతాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని ఏడాది కాలంగా కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. అయితే ఇందుకోసం ప్రభుత్వం పైసా కూడా విదల్చలేదు. పైగా శతాబ్ది ఉత్సవాలకు వెచ్చించిన రూ.63.5 కోట్లను ఏయూ ఖజానా నుంచే ఖర్చు చేశారు. అంతేగాకుండా కొద్దిరోజుల కిందట మరో రూ.300 కోట్లను ప్రభుత్వం లాగేసుకుంది. మరోవైపు ఉద్యోగుల జీతాలను కూడా ప్రభుత్వం చెల్లించకపోవడంతో రూ.200 కోట్ల మేర ఏయూ ఖజానా నుంచే చెల్లించారు.వెరసి ఇప్పుడు ఏయూ ఖజానా డొల్లగా మారింది. ఒకవైపు ఏయూ ఖజానాను కొల్లగొడుతున్న చంద్రబాబు.. శతాబ్ది ఉత్సవాల్లో మాత్రం రూ.500 కోట్లు కేటాయిస్తానంటూ ప్రకటించారు. వాస్తవానికి 2016లో జరిగిన ఏయూ అలుమ్ని అసోసియేషన్ సమావేశంలో కూడా సీఎం హోదాలో ఏయూకి రూ.13.9 కోట్ల మేర మ్యాచింగ్ గ్రాంటు ఇస్తానంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. అలుమ్ని అసోసియేషన్ కార్పస్ఫండ్కు రూ.10 కోట్లు నేరుగా కేటాయిస్తామని చెప్పారు. అయినా ఆయన ఒక్కపైసా కూడా విదల్చలేదు. తాజాగా ఇప్పటికే ఏయూ ఖజానాను గుల్లచేసిన చంద్రబాబు.. ఇప్పుడు రూ. 500 కోట్లు కేటాయిస్తానని చెప్పడాన్ని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు.‘గీతా’లాపన కోసమే..!చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నంలో ఏ వ్యవహారం జరిగినా అంతిమంగా గీతంకి లబ్ధి చేకూర్చేందుకేనని తెలుస్తోంది. మొన్నటికి మొన్న గీతం ఆక్రమించుకున్న రూ.5 వేలకోట్ల విలువైన భూములను సక్రమం చేసేందుకుగాను దాడులు చేసి మరీ జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానం జరిగేలా చూశారు. ఏకంగా దేశంలో అగ్నివీర్లకు శిక్షణ ఇచ్చేందుకు ఎంపికైన మొదటి విశ్వవిద్యాలయంగా రికార్డు సృష్టించిన ఏయూలోని కేంద్రాన్ని పూర్తిస్థాయి స్కూలుగా మార్చాలని గతంలో నిర్ణయించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ శిక్షణ కేంద్రాన్ని మూసేశారు.దీంతో సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ నిరంజన్ తన పదవికి రాజీనామా చేయగా, సమన్వయకర్త ఉజ్వల్ వంటి నిపుణులు వర్సిటీని వీడాల్సి వచ్చింది. ఇక యూనివర్సిటీలో బాగా డిమాండ్ ఉన్న దూరవిద్యలో అందించే రక్షణరంగ కోర్సులను ఎత్తేశారు. తద్వారా ఆ అడ్మిషన్లన్నీ సహజంగానే గీతం వంటి ప్రైవేటు సంస్థలకు మళ్లించేలా చేశారనే ఆరోపణలున్నాయి. మరోవైపు ఏయూని వీడి వెళ్లిన నిపుణులు గీతంలో కన్సల్టెంట్లుగా చేరుతుండటం, రక్షణశాఖ ఏయూని భాగస్వామ్య జాబితా నుంచి తొలగించి ఇతర ప్రైవేటు సంస్థల వైపు చూస్తుండడాన్ని గమనిస్తే.. ఏయూలో వ్యవహారాలన్నీ గీతం కోసమే నడుస్తున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా గీతం కోసమే ఏయూను భ్రష్టుపట్టించే కార్యక్రమం జరుగుతోందని స్పష్టమవుతోంది. -
డేటా సెంటర్ సరే.. ఉద్యోగాల మాటేమిటి?
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో అదానీ – గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటును వైఎస్సార్సీపీ స్వాగతిస్తోందని, కానీ ఆ డేటా సెంటర్ ఏర్పాటు ద్వారా ఎన్ని ఉద్యోగాలొస్తాయో చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదని ఆ పార్టీ పశ్చి మ గోదావరి జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. మంగళవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. అదానీ – గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో చంద్రబాబు, లోకేశ్ సహా కూటమి నాయకులు ఉద్దేశపూర్వకంగానే ఉద్యోగాల కల్పన అంశాన్ని ప్రస్తావించకుండా యువతను మోసం చేస్తున్నారని ఆరోపించారు.ఈ సెంటర్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం 600 ఎకరాల భూమితోపాటు రూ.22 వేల కోట్లు రాయితీలు ఇస్తోందని, ఇవేకాకుండా భారీ ఎత్తున నీరు, విద్యుత్ సరఫరా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇంత భారీ స్థాయిలో రాయితీలు ప్రకటిస్తున్నా, ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తున్నారనే దానిపై మాట్లాడకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అక్టోబర్ నెలలో ఢిల్లీలో ఒప్పందం జరిగిన సందర్భంలో డేటా సెంటర్ ద్వారా 1.80 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చంద్రబాబు సహా మంత్రులు, కూటమి నాయకులు ప్రచారం చేశారని... అయితే ఒప్పందంలో మాత్రం 200 ఉద్యోగాలు మాత్రమే వస్తాయనే అంశాన్ని గుర్తించి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని నిలదీసినా.. కనీసం ఈ రోజు శంకుస్థాపన సందర్భంగానైనా సరే ఉద్యోగాల కల్పనపై ఏ ఒక్కరూ మాట్లాడకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. 25 వేల ఉద్యోగాలు వచ్చేలా నాడు ప్రణాళిక ‘‘గత వైఎస్సార్సీపీ హయాంలోనే విశాఖలో అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు 130 ఎకరాల స్థలాన్ని కేటాయించడంతోపాటు ఉద్యోగాల కల్పనకు వారి నుంచి ప్రభుత్వం హామీ తీసుకుంది. డేటా సెంటర్కు డేటా రావాలంటే సింగపూర్ నుంచి 3,900 కి.మీ. పొడవున సబ్సీ (సముద్ర గర్భం)లో కేబుళ్లు వేయాలని నాడే(2021 మార్చి 9న) సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాశాం.డేటా సెంటర్తోపాటు ఐటీ పార్కు, రీక్రియేషన్ సెంటర్, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేలా అదానీతో ఒప్పందం చేసుకున్నాం. ఆ మేరకు 25 వేల మందికి ఉద్యోగాల కల్పనకు ఆ సంస్థను ఒప్పించాం. ఈ నేపథ్యంలోనే విశాఖలో 300 మెగావాట్ల అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు 2023 మే 3న శంకుస్థాపన చేశాం’ అని చెప్పారు. ‘‘డేటా సెంటర్ శంకుస్థాపన వేదిక మీద కూడా మంత్రి నారా లోకేశ్ రాజకీయాలు మాట్లాడటం ఆయన అల్పబుద్ధిని సూచిస్తోంది. అంతర్జాతీయ వేదికలపై గొడ్డలి, లడ్డూ అంటూ లోకేశ్ చేసిన ప్రసంగం ఆయన అవివేకానికి నిదర్శనం’ అన్నారు. -
● ‘ఈము’పై ఏయూ
ఏయూ శతాబ్ది ఉత్సవాల వేళ.. విశాఖకు చెందిన అంతర్జాతీయ ఎగ్ స్కల్ప్చర్ ఆర్టిస్ట్ శిలపరశెట్టి దుర్గా శంకర్ తన సృజనాత్మకతతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎటువంటి పెయింటింగ్స్ ఉపయోగించకుండా కేవలం ఎచ్చింగ్ పద్ధతి ద్వారా ఈము పక్షి గుడ్డుపై ఏయూ లోగోతో పాటు సింహాద్రి అప్పన్న రూపాన్ని అత్యంత సునిశితంగా చెక్కారు. ఈ అరుదైన కళాఖండాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి లోకేష్లకు బహుకరించనున్నట్టు శంకర్ చెప్పాడు.. రాష్ట్రంలో ‘ఎగ్ ఆర్ట్ మ్యూజియం’ ఏర్పాటు చేయాలనే తన చిరకాల కోరికను వారి ముందు ఉంచనున్నట్లు దుర్గా శంకర్ పేర్కొన్నాడు. – సీతంపేట -
ఏబీఎన్ రాధాకృష్ణను అరెస్టు చేయాలి
సాక్షి, విశాఖపట్నం: తమ పార్టీ నేతలను, మహిళలను ఉద్దేశించి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ..అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ నేతలు సోమవారం పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చికి ఫిర్యాదు చేశారు. ఈ నెల 9న రాధాకృష్ణ ప్రచురించిన కథనాలపై తక్షణమే కేసు నమోదు చేసి, ఆయన్ని అరెస్ట్ చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు నేతృత్వంలో పార్టీ శ్రేణులు సీపీని కోరారు. అనంతరం కేకే రాజు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనుమరుగై రాచరిక వ్యవస్థ నడుస్తోందని విమర్శించారు. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని, అందులో భాగంగానే చంద్రబాబు తనకు అనుకూలమైన మీడియాను రంగంలోకి దించుతున్నారని మండిపడ్డారు. ‘మావిగన్’ ద్వారా తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మించవచ్చని వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన సూచనను పక్కదారి పట్టించేందుకే రాధాకృష్ణ ద్వారా తప్పుడు కథనాలు రాయించారని ఆరోపించారు. ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడం అధికార పార్టీ ఒత్తిడికి నిదర్శనమన్నారు. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ మాట్లాడుతూ రాధాకృష్ణ తీరును తీవ్రంగా ఖండించారు. ప్రజాదరణ పొందుతున్న ‘మావిగన్’ అక్కసుతోనే ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇలాంటి అసంబద్ధ రాతలు రాస్తున్నారని విమర్శించారు. రాధాకృష్ణను వెంటనే అరెస్ట్ చేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ప్రజా పోరాటం చేపడతామ స్పష్టం చేశారు. కార్యక్రమంలో సమన్వయకర్తలు తిప్పల దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు, సీఈసీ మెంబర్ కోలా గురువులు, పార్టీ ముఖ్యనేతలు కె. సతీష్, రవి రెడ్డి, రొంగలి జగన్నాథం, కొండా రాజీవ్ గాంధీ, సతీష్ వర్మ, పేడాడ రమణి కుమారి, మంచా నాగ మలేశ్వరి, పేర్ల విజయ్ చందర్, అనిల్కుమార్ రాజు, పళ్లా దుర్గారావు, తాడి జగన్నాథరెడ్డి, జీవీ రామచంద్రరాజు, కిరణ్ రాజు, పోతిన శ్రీనివాస్, అల్లంపల్లి రాజుబాబు, ిపీవీ సురేష్, బిపిన్ కుమార్ జైన్, బోని శివరామకృష్ణ, సనపల రవీంద్ర భరత్, కె.రామిరెడ్డి, మనోజ్, బొండా ఉమామహేశ్వరరావు , రాయపురెడ్డి అనిల్ కుమార్, దేవరకొండ మార్కేండేయులు, రామన్నపాత్రుడు, రెయ్యి వెంకటరమణ, ఈశ్వర్రావు, జీలకర్ర నాగేంద్ర, బెవర జగదీష్ తదితరులు పాల్గొన్నారు. -
చమురు మంట
బంకుల వద్ద ’నో స్టాక్’.. వాహనదారుల షాక్ మహానగరంలో మంట పుట్టిస్తున్న చమురు కొరతవిశాఖ సిటీ: మహా నగరం విశాఖకూ చమురు సెగ తగిలింది. సోమవారం ఉదయం నుంచి ఇంధనం దొరకడం గగనమైంది. పెట్రోల్, డీజిల్ దొరకక వాహనాలపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. నగరంతోపాటు శివారు ప్రాంతాల్లోని బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడం వాహనదారుల్లో కలవరం రేపింది. స్టాకు ఉన్న బంకులకు అందరూ పోటెత్తడంతో రహదారుల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. గంటల తరబడి వేచి చూసినా పెట్రోల్ దొరకడం కష్టమైపోయింది. పెట్రోల్ బంకుల్లోనే అధిక సమయం వేచి ఉండడంతో నిర్ణీత సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేక, ఆఫీసులకు వెళ్లలేక జనం నడిరోడ్డుపై నానా యాతన పడాల్సిన వచ్చింది. ఒకవైపు జిల్లా యంత్రాంగం, చమురు కంపెనీలు నిల్వలు ఉన్నాయని ప్రకటిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం ‘చుక్క’ దొరకడం గగనమైపోయింది. ఈ డిమాండ్ నేపథ్యంలో కొన్ని బంకులు కోటా విధానాన్ని అమలు చేయడం గమనార్హం. స్తంభించిన నగరం.. బంకుల వద్ద బారులు జిల్లాలో సుమారు 120 బంకులు ఉన్నాయి. జిల్లా అవసరాలకు రోజుకు 1.5 లక్షల లీటర్ల పెట్రోల్, లక్ష లీటర్ల డీజిల్ సరఫరా కావాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం సరఫరా గణనీయంగా తగ్గినట్లు బంకుల నిర్వాహకులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చమురు కష్టాలు మొదలయ్యాయన్న వార్తలతో సోమవారం విశాఖ వాహనదారులు ఒక్కసారిగా బంకుల వద్దకు క్యూ కట్టారు. ఉదయం 9 గంటలకే చాలా బంకుల్లో నిల్వలు ఖాళీ అయిపోవడంతో ‘నో స్టాక్’ బోర్డులు వెలిశాయి. సిరిపురం జంక్షన్, జగదాంబ, సీతమ్మధార వంటి కీలక ప్రాంతాల్లో వందల మీటర్ల మేర క్యూలైన్లు కనిపించాయి. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఎండ తీవ్రతకు తోడు పెట్రోల్ దొరకకపోవడంతో ఆగ్రహించిన వాహనదారులు బంకు సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని చోట్ల కోటా విధింపు ఇంధనం త్వరగా అయిపోతుందన్న భయంతో చాలామంది అవసరానికి మించి కొనుగోలు (ప్యానిక్ బయింగ్) చేయడంతో నిల్వలు వేగంగా నిండుకుంటున్నాయి. దీన్ని అరికట్టేందుకు బంకుల నిర్వాహకులు కోటా విధానాన్ని ప్రకటించారు. బైక్లకు 2 లీటర్లు, కార్లకు 15 లీటర్లు, లారీలకు 50 లీటర్లు, భారీ వాహనాలకు 100 లీటర్లు మాత్రమే పోస్తామంటూ పోస్టర్లు అతికించారు. ఈ నిబంధన వల్ల ఆఫీసులకు వెళ్లేవారు, ఆన్లైన్ డెలివరీ బాయ్స్, ఆటో డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతింటోంది. డీజిల్ కొరతతో రవాణా అస్తవ్యస్తం డీజిల్ దొరకక లారీలు, బస్సులు బంకుల వద్దే నిలిచిపోవడంతో సరుకు రవాణాపై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా ఆక్వా రంగం, వ్యవసాయ పనులకు డీజిల్ అత్యవసరం కావడంతో రైతులు, డ్రైవర్లు ప్లాస్టిక్ డబ్బాలతో పడిగాపులు కాస్తున్నారు. డీజిల్ లేక జనరేటర్లు నడవని పక్షంలో ఐస్ ప్లాంట్లు, కోల్డ్ స్టోరేజీల్లోని నిల్వలు పాడైపోయే ప్రమాదం ఉందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంకెల్లో ‘మాయాజాలం’.. క్షేత్రస్థాయిలో శూన్యం : అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 1,860 కేఎల్ పెట్రోల్, 2,118 కేఎల్ డీజిల్ నిల్వలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. సోమవారం ఒక్కరోజే హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్ కంపెనీలు 823 కిలోలీటర్ల పెట్రోల్, 1,121 కిలో లీటర్ల డీజిల్ బంకులకు సరఫరా చేసినట్లు చెబుతున్నాయి. కానీ, ఆ నిల్వలు ఎక్కడికి వెళ్తున్నాయో సామాన్యులకు అర్థం కావడం లేదు. సోమవారం 424 కేఎల్ పెట్రోల్, 401 కేఎల్ డీజిల్ అమ్మకాలు జరిగినట్లు లెక్కలు చూపిస్తుండడం గమనార్హం. ఇంకా 1436 కేఎల్ పెట్రోల్, 1717 కేఎల్ డీజిల్ నిల్వలు ఉన్నట్లు చూపిస్తున్నారు. అధికారులు చెబుతున్న అంకెలు కాగితాలకే పరిమితమయ్యాయని వాహనదారులు మండిపడుతున్నారు. లోడింగ్ పాయింట్ల వద్ద జాప్యం వల్ల ట్యాంకర్లు సకాలంలో చేరడం లేదని నిర్వాహకులు పేర్కొంటున్నారు. మంగళవారం నాటికి నిల్వ లు పూర్తిగా అయిపోతాయనే ప్రచారం ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ప్రజల్లో నెలకొన్న భయం వల్ల డిమాండ్ 40 శాతం అదనంగా పెరగడం ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రం చేసింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఇంధన సరఫరాను పునరుద్ధరించకపోతే నగరం పూర్తిస్థాయిలో స్తంభించిపోయే ప్రమాదం ఉంది. -
హామీలు గాల్లో.. ఆపరేటర్లు రోడ్డున
మహారాణిపేట: పేదల ఇంటి వద్దకే రేషన్ సరుకులు చేరవేసే లక్ష్యంతో ప్రారంభమైన మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (ఎండీయూ) వ్యవస్థ ప్రస్తుతం ఉనికిని కోల్పోయింది. ప్రభుత్వం మారిన కొద్ది నెలల్లోనే ఈ పథకం నిలిచిపోవడంతో, దీనిపై ఆధారపడి జీవిస్తున్న 311 మంది ఆపరేటర్ల కుటుంబాలు తీవ్ర ఉపాధి సంక్షోభంలో కూరుకుపోయాయి. ఒకప్పుడు కాలనీలు, గ్రామాలు తిరుగుతూ బియ్యం పంపిణీ చేసిన వాహనాలు ఇప్పుడు నిరుపయోగంగా మూలన పడ్డాయి. వాటిని అమ్ముకోలేక, నడపలేక ఆపరేటర్లు ఆర్థికంగా, మానసికంగా కుంగుబాటుకు లోనవుతున్నారు. ఇంటి వద్ద రేషన్.. ఇక జ్ఞాపకమే! గతంలో ప్రతి రేషన్ కార్డుదారుడి ఇంటి ముంగిటకే వెళ్లి సరుకులు అందించే విధానం వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు ఎంతో వెసులుబాటుగా ఉండేది. ప్రస్తుతం ఆ విధానాన్ని రద్దు చేసి, మళ్లీ పాత పద్ధతిలోనే చౌకధరల దుకాణాల (రేషన్ షాపుల) వద్దే పంపిణీని పరిమితం చేయడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. పలుచోట్ల సరుకుల కొలతల్లో మోసాలు జరుగుతున్నాయని, సమయానికి పంపిణీ కావడం లేదని కార్డుదారులు ఫిర్యాదు చేస్తున్నారు. పర్యవేక్షణ లోపం.. పక్కదారి పడుతున్న సరుకులు వ్యవస్థలో పర్యవేక్షణ కొరవడటంతో మధ్యవర్తుల హస్తం పెరిగింది. చెకింగ్ ఇన్స్పెక్టర్, సహాయ సరఫరా అధికారులు సరైన తనిఖీలు చేపట్టకపోవడం వల్ల పీడీఎస్ సరుకులు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 5.12 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులు ఉండగా, కేవలం 625 రేషన్ డిపోలు మాత్రమే ఉండటంతో పంపిణీ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. హామీలు ఎక్కడ? ఆపరేటర్ల ఆవేదన ఎండీయూ వాహనాలను రద్దు చేసిన సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహన రుణాలు క్లియర్ చేస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదు. క్లియరెన్స్ లెటర్లు ఇవ్వకపోవడంతో వాహనాలు సొంతం కావడం లేదు. వాహనాలను ఇతర పనులకు వినియోగించుకునే అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా బ్యాంకు రుణాలు పెండింగ్లోనే ఉండి, పెనాల్టీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీమా గడువు ముగిసింది.. ఆపరేటర్లకు కొత్త కష్టం ఎండీయూ వాహనాల బీమా గడువు కూడా ముగియడంతో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. బీమా రెన్యూవల్ చేయడానికి అవసరమైన డబ్బు లేక వాహనాలను రోడ్డుపైకి తీసుకురాలేకపోతున్నారు. ఉపాధి పోయింది.. వాహనం భారమైంది ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వాహన రుణాలపై క్లియరెన్స్ ఇవ్వాలి. రేషన్ పంపిణీ నుంచి తప్పించడంతో ఉపాధి కోల్పోయాం. ప్రస్తుతం బీమా గడువు కూడా ముగియడంతో, ప్రీమియం చెల్లించే స్థోమత లేక వాహనాలను నడపలేకపోతున్నాం. మరోవైపు వాహనాలను అమ్ముకునే అవకాశమూ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. – నల్లబోతుల సతీష్, ఎండీయూ ఆపరేటర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు -
గాల్లో ప్రాణాలు.. క్రేన్లపై కసరత్తులు!
విశాఖ సిటీ : అభివృద్ధి పనుల వేళ అప్రమత్తంగా ఉండాల్సిన అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ రోడ్డు పనుల్లో భాగంగా అడవివరం–శొంఠ్యాం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే విద్యుత్ పనుల్లో కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా విద్యుత్ లైన్ల పనులు చేసేటప్పుడు నిచ్చెనలు, బెల్టులు, సేఫ్టీ హెల్మెట్లు వాడాలి. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్లో ఉంది. క్రేన్ చివరున సిబ్బంద్తిని కూర్చోబెట్టి ఏకంగా గాల్లోకి లేపుతున్నారు. సదరు సిబ్బంది ఎటువంటి రక్షణ కవచాలు లేకుండా, కేవలం ఆ క్రేన్ హుక్కును పట్టుకుని ప్రమాదకర స్థితిలో పనులు చేస్తున్నారు. ఏమాత్రం పట్టు తప్పినా ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ఇదే ప్రధాన రహదారి కావడంతో వాహనాల రాకపోకలు భారీగా సాగుతున్నాయి. ఒకవైపు వాహనాలు వెళ్తుండగానే, మరోవైపు ఇంత సాహసోపేతంగా పనులు చేయడం చూసి వాహనదారులు విస్తుపోతున్నారు. ‘ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులెవరు?’ అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి ఇప్పటికై నా భద్రతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
వేర్వేరు ఘటనలో ఇద్దరు ఆత్మహత్య
ఆనందపురం: మండల పరిధిలో సోమవారం చోటుచేసుకున్న రెండు వేర్వేరు ఆత్మహత్యల ఘటనలు స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపాయి. అనారోగ్య బాధలు భరించలేక ఒకరు, ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై మరొకరు ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఎగువ పాలవలస గ్రామానికి చెందిన కోరాడ శ్రీను(37) గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో పాటు తీవ్రమైన శారీరక నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో సోమవారం తెల్లవారుజామున తన నివాసంలోనే ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య కోరాడ సంతోషి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆనందపురం సీఐ వాసునాయుడు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం జిల్లా జామి మండలానికి చెందిన సారిపిల్లి వినోద్ (27) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని తర్లువాడ వద్ద నిర్మిస్తున్న గూగుల్ డేటా సెంటర్ పనుల కోసం వినోద్ ఇక్కడికి వచ్చారు. అయితే తీవ్రమైన అప్పుల బాధతో సతమతమవుతున్న అతను, మనస్తాపానికి గురై తర్లువాడ సమీపంలోని ఒక మామిడి తోటలో చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మరణించే ముందు తన తమ్ముడికి ఫోన్ చేసి, తన భార్యాపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా కోరి ఫోన్ కట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసిన ఆనందపురం పోలీసులు, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
తెలుగు భాషా రక్షణలో మాట తప్పిన ప్రభుత్వం
మద్దిలపాలెం: తెలుగు భాషా రక్షణలో చంద్రబాబు ప్రభుత్వం మాట తప్పిందని, అరచేతిలో అమరావతిని చూపిస్తోందని ఆరోపిస్తూ తెలుగుదండు ఆధ్వర్యంలో సోమవారం నిరసన దీక్ష చేపట్టారు. మద్దిలపాలెం కూడలిలోని తెలుగుతల్లి విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు కవులు, కళాకారులు, మాతృభాషాభిమానులు పాల్గొని తెలుగుతల్లి ‘ఎర్రబుక్కు’లో చిక్కుకుందని నినదించారు. నిరసనలో కవులు, కళాకారులు, మాతృభాషాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రికి ఉద్దేశించి ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. తెలుగుదండు అధ్యక్షుడు పరవస్తు సూరి మాట్లాడుతూ పాతికేళ్లుగా మాతృభాషా ద్రోహుల చేతుల్లోనే రాష్ట్ర పాలన కొనసాగుతోందని, దీనివల్ల తెలుగుజాతి నిత్యం మోసపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మాతృభాషాభివృద్ధి ప్రాధికార సంస్థను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలని, అలాగే తెలుగు మాధ్యమం కేసును సుప్రీంకోర్టు నుంచి వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుండే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రాథమిక విద్యాబోధన తెలుగులోనే జరగాలని, విద్యాహక్కు చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాల నిర్వహణపై కూడా నిరసనకారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వర్సిటీ ఉత్సవాల్లో భాగంగా విద్యార్థులతో నృత్యాలు చేయిస్తున్న పాలకులు, నగరం నడిబొడ్డున ఉన్న తెలుగుతల్లి విగ్రహానికి కనీసం నివాళులర్పించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మజ్జి దేవిశ్రీ, డప్పు శ్రీనివాస్, డాక్టర్ కేవీఎస్ మూర్తి, డాక్టర్ విజయగోపాల్, భాగవతుల సత్యనారాయణ, చేబియ్యం రవిమోహన్, నరహరిశెట్టి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంధన కొరత ప్రభుత్వ వైఫల్యమే..
సాక్షి, విశాఖపట్నం: దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే పెట్రోల్, డీజిల్ కొరత నెలకొనడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు విమర్శించారు. సోమవారం సిరిపురంలోని పెట్రోల్ బంకును ఆయన సందర్శించి, ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేకే రాజు మీడియాతో మాట్లాడుతూ మూడు రోజులుగా నగరంలో ఇంధన సమస్య తీవ్రంగా ఉన్నా ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంధన కొరత లేదని కేంద్ర మంత్రులు స్పష్టం చేస్తున్నా, రాష్ట్రంలో కొరత ఉండటం వెనుక కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. పక్కనే ఉన్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఇంధన సమస్య లేనప్పుడు, కేవలం ఏపీలోనే ఎందుకు కొరత ఏర్పడిందని ఆయన నిలదీశారు. కూటమి నేతల అండతోనే డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో సమన్వయకర్తలు తిప్పల దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు, సీఈసీ మెంబర్ కోలా గురువులు, ముఖ్యనేతలు కె. సతీష్, కొండా రాజీవ్ గాంధీ, రొంగలి జగన్నాథం, పేడాడ రమణికుమారి, పేర్ల విజయ్ చందర్, తాడి జగన్నాఽథ్ రెడ్డి, పళ్లా దుర్గారావు, జీవీ రామచంద్రరాజు, కిరణ్ రాజు, పోతిన శ్రీనివాస్, అల్లంపల్లి రాజుబాబు, పీవీ సురేష్, అనిల్ కుమార్ రాజు, బిపిఎన్ కుమార్ జైన్, శివ రామ కృష్ణ, మనోజ్, కర్రి రామిరెడ్డి, బొండా ఉమామహేశ్వరరావు, ఆర్. అనిల్ కుమార్, సనపల రవింద్ర భరత్, దేవరకొండ మార్కేండేయులు, ఈశ్వరరావు, మెరవ గణేష్, రామన్న పాత్రుడు, మువ్వల సురేష్, సూర్యనారాయణ, విక్టర్, జీలకర్ర నాగేంద్ర పాల్గొన్నారు. -
భళా.. కర్ర సాము కళ
పునర్వైభవం దిశగా ప్రాచీన యుద్ధకళ కర్ర సాముతగరపువలస: కర్రసాము.. భళా అనిపించే విన్యాసాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రాచీన యుద్ధకళ. ఒకప్పుడు ఆత్మరక్షణ కోసం ఈ విద్య ఎంతో ప్రాచుర్యం పొందింది. దొంగలు, క్రూర జంతువుల నుంచి రక్షణ కోసం దీనిని వినియోగించేవారు. అయితే కాలక్రమేణా ఈ కళ అంతరించే దశకు చేరుకుంది. ప్రస్తుతం అమ్మవారి జాతరలు, పెళ్లి ఊరేగింపులు వంటి వేడుకల్లో మాత్రమే ఈ కళ ప్రదర్శితమవుతోంది. ప్రదర్శన క్లిష్టం ఈ కళలో అనుభవజ్ఞులు ఒక చేతిలో కర్ర, మరో చేతిలో కత్తితో లేదా ఢాలు, పట్టా కత్తితో ప్రత్యర్థి దాడులను ఎదుర్కొంటూ వేగంగా శరీరాన్ని కదిలిస్తారు. ఈ విన్యాసాల్లో కాస్తా ఏమరపాటు జరిగితే ప్రాణాపాయం తప్పదు. అందువల్ల అత్యంత అప్రమత్తత అవసరం. ప్రస్తుతం కర్రసాము దాదాపు కనుమరుగవుతున్నా, ఇది ఆరోగ్యానికి, దేహదారుఢ్యానికి ఎంతో మేలు చేస్తుందని శిక్షకులు చెబుతున్నారు. చిప్పాడలో పునర్వైభవానికి కృషి భీమిలి మండలం చిప్పాడ గ్రామానికి చెందిన కొయ్య రమణారెడ్డి కర్రసాము కళకు పునర్వైభవం తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. గ్రామంలోని సుమారు 40 మంది బాలబాలికలకు ఈ విద్యలో శిక్షణ ఇస్తున్నారు. వారు వివిధ విన్యాసాలతో ప్రతిభ చాటుతున్నారు. రోజూ సుమారు ఏడు గంటల పాటు సాధన చేస్తూ నైపుణ్యాన్ని పెంపొందిస్తున్నారు. సమీప గ్రామాల్లో వీరు ప్రదర్శనతో సుమారు రూ.30వేల వరకు సంపాదన పొందుతున్నారు. కఠినమైన వ్యాయామం కర్ర సాము కఠినమైన వ్యాయామం. శరీర దారుఢ్యానికి ఇది ఎంతో ఉపయోగకరం. ప్రస్తుతం ఈ విద్య ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రదర్శనలో అప్రమత్తత తప్పనిసరి. – కొయ్య రమణారెడ్డి, శిక్షకుడు మహిళల భద్రత నేటి కాలంలో అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యలు చాలా అవసరం. కర్ర సాము నేర్చుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇలాంటి ఆత్మరక్షణ విద్యలు చిన్న వయసులోనే నేర్చుకుంటే బాగా అలవడతాయి. వయస్సు పెరిగే కొద్దీ నేర్చుకోవడం కష్టమవుతుంది. – లిఖిత, విద్యార్థిని ఆత్మరక్షణకు దోహదం మనకు ప్రత్యేకమైన కళ ఉంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కర్రసాము ఆత్మరక్షణకు ఎంతో దోహదపడుతుంది. కర్రసాము ఆరోగ్య పరిరక్షణకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఆత్మరక్షణకు కూడా ఎంతగానో దోహదం చేస్తుంది, – జాహ్నవి, విద్యార్థిని -
గూగుల్కు సర్కార్ దాసోహం
కూటమి ప్రభుత్వం తీరుపై సీపీఎం విమర్శలు మద్దిలపాలెం: రాష్ట్రంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం గూగుల్కు దాసోహమైందని సీపీఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గు నాయుడు విమర్శించారు. జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డాక్టర్ బి.గంగారావు, వి.కృష్ణారావులతో కలిసి పిఠాపురం కాలనీలోని పార్టీ జిల్లా కార్యాలయం ఏచూరి భవన్లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల ఆరోగ్యం, వ్యవసాయం, పర్యావరణం, అడవులు, వన్యప్రాణులను పణంగా పెట్టి 601.40 ఎకరాల భూమి, రూ.22 వేల కోట్ల ప్రజాధనాన్ని గూగుల్ డేటా సెంటర్కు కేటాయించారని ఆరోపించారు. పర్యావరణ, అటవీ చట్టాలను ఉల్లంఘిస్తూ అదానీ భాగస్వామ్యంతో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపనకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమవుతున్నారని విమర్శించారు. ఈ డేటా సెంటర్ వల్ల ప్రత్యక్ష, పరోక్షంగా 1,88,220 ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం ప్రకటించిందని, అయితే ఈఐఏ (పర్యావరణ ప్రభావ అంచనా) నివేదికలో నిర్మాణ దశలో 240, కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత 1,375 ఉద్యోగాలు మాత్రమే వస్తాయని పేర్కొన్నారని చెప్పారు. ప్రభుత్వ ప్రకటనలోని అంకెల గారడీని ఈ నివేదిక బహిర్గతం చేస్తోందని అన్నారు. డేటా సెంటర్కు సుమారు 1000 మెగావాట్ల విద్యుత్ వినియోగం ఉంటుందని, అంతే స్థాయిలో వేడి వాతావరణంలోకి విడుదలవుతుందని తెలిపారు. డాక్టర్ బి.గంగారావు మాట్లాడుతూ డేటా సెంటర్కు అవసరమైన విద్యుత్ను ఏపీ డిస్కంల నుంచి కాకుండా ఏపీ ట్రాన్స్కో నుంచి తీసుకునేలా ప్రణాళిక ఉన్నట్లు ఈఐఏ నివేదికలో ఉందని చెప్పారు. గూగుల్ ప్రాజెక్ట్ కారణంగా తమ వ్యవసాయం, ఉపాధిని కోల్పోతున్న తర్లువాడ ప్రాంతానికి చెందిన 520 మంది రైతులకు నష్టపరిహారం, ప్రతి కుటుంబానికి 3 సెంట్ల భూమి శంకుస్థాపన తర్వాత వారం రోజుల్లో ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతుల తరఫున సీపీఎం పోరాటం చేస్తుందని హెచ్చరించారు. -
రాజకీయ డబ్బా!
శతాబ్ది వేడుకల్లోదళితుడిననే పిలిచి అవమానించారా చంద్రబాబూ?విశాఖ సిటీ : ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ముగిశాయి. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో సోమవారం జరిగిన తుది వేడుకల్లోను స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా వినిపించాయి. ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రసంగాలు మినహా, మిగిలిన వారి మాటలన్నీ రాజకీయ వేదికను తలపించాయి. విద్యాలయాల పవిత్రతను కాపాడాల్సిన సభలో అకడమిక్ అంశాల కంటే రాజకీయ ప్రశంసల హోరు పెరగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో విశాఖను పాలనా రాజధానిగా వ్యతిరేకిస్తూ నగరంపై విమర్శలు చేసిన వారే, నేడు ఏయూ ఘనతను ఆకాశానికెత్తడం పలువురిని విస్మయానికి గురిచేసింది. ఆకట్టుకున్న సాంస్కృతిక, ఫొటో ప్రదర్శనలు మధ్యాహ్నం 2 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. శాసీ్త్రయ నృత్యాలు, అన్నమాచార్య కీర్తనాలు అందరినీ అలరించాయి. విద్యార్థులు చేసిన ప్రదర్శనలు వేడుకలకు వన్నె తెచ్చాయి. అలాగే విశ్వవిద్యాలయ చరిత్ర, చారిత్రక సంఘటనలను తెలిపే విధంగా ప్రధాన వేదికకు వెనుక భాగంలో ఉన్న ఈ ప్రత్యేక ఎగ్జిబిషన్ ప్రత్యేకంగా నిలిచింది. ఎగ్జిబిషన్ ప్రత్యేకతలను ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ ప్రత్యేకంగా ఉపరాష్ట్రపతి ఇతర ప్రముఖులను వివరించారు. ఏయూ చిత్రకళా విభాగం విద్యార్థులు తయారు చేసిన అనేక శిల్పాలను ప్రదర్శనలో ఉంచారు. మూడు అవగాహన ఒప్పందాలు ఈ వేడుకల్లో మూడు అవగాహన ఒప్పందాలను చేసుకున్నారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాతో ఎంవోయూ జరిగింది. ఓ.ఎక్స్.ఎం.ఐ.క్యూ తో ఏయూ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఇన్ ఏఐ సిస్టమ్ నెలకొల్పే విధంగా మరో ఒప్పందం జరిగింది. దీనిలో దాదాపు 400 కోట్లతో అభివృద్ధి చేస్తారు. అదే విధంగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెట్రాలజీ(ఐఐటీఎం)తో అవగాహన కుదుర్చుకున్నారు. రూ.180 కోట్లతో మెటీరియాలజీకి సంబంధించిన పరికరాలు, మౌలిక వసతుల కల్పన చేస్తారు. విశిష్ట పూర్వవిద్యార్థులకు సన్మానం శతాబ్ధి ఉత్సవాలలో భాగంగా ఏయూ పూర్వ విద్యార్థులు పూర్వ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, ఒడిశా గవర్నర్ కె.హరిబాబు, జీఎంఆర్ గ్రూప్ అధినేత జి.ఎం.రావు, సైయిట్ చైర్మన్ డాక్టర్ బి.వి.ఆర్.మోహన రెడ్డి, లారస్ ల్యాబ్స్ సీఈఓ డాక్టర్ చావ సత్యనారాయణ, ఐఐటీ కాన్పూర్ పూర్వ ఆచార్యుడు ఎం.ఆర్ మాధవ్, సినీ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్లను సత్కరించి, జ్ఞాపికలు ప్రధానం చేశారు. భారీగా విద్యార్థుల సమీకరణ ముగింపు వేడుకలకు భారీగా విద్యార్థులను సమీ కరించారు. ఏయూ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ఆచార్యులు, నాన్టీచింగ్ స్టాఫ్తో పాటు ఏయూ గుర్తింపు కాలేజీల విద్యార్థులను తరలించారు. నగరం నుంచి మాత్రమే కాకుండా అనకాపల్లి జిల్లా నుంచి కూడా విద్యార్థులు ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా తీసుకురావడం గమనార్హం. తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని విద్యార్థులను తీసుకురావాలని పలు ఏయూ గుర్తింపు కాలేజీల నిర్వాహకులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అయినప్పటికీ.. సభా ప్రాంగణం నిండలేదు. విద్యార్థులు వెళ్లిపోకుండా నిర్బంధం వేడుకల్లో సచిన్ ప్రసంగం తర్వాత విద్యార్థులు ప్రాంగణం నుంచి వెళ్లిపోడానికి సిద్ధమయ్యారు. అప్పటికే అంతంత మాత్రంగా ఉన్న ప్రాంగణం వారు వెళ్లిపోతే ఖాళీ అయిపోతుందని అధికారులు గుర్తించారు. వెంటనే విద్యార్థులు వెళ్లిపోకుండా కట్టడి చేశారు. అందరి ప్రసంగాలు ముగిసేంత వరకు విద్యార్థులు బయటకు రాకుండా దారులను మూసివేశారు. అప్పటికీ కొందరు వాటిని దాటుకొని వెళ్లడానికి ప్రయత్నించగా పోలీస్ సిబ్బంది, వలంటీర్లతో అడ్డగించడం గమనార్హం. భవిష్యత్తుపై దృష్టి.. ఏయూ శతాబ్దపు ప్రయాణం కేవలం గడిచిన కాలానికి పరిమితం కాకుండా, భవిష్యత్తు దిశగా దూసుకెళ్లే సంకల్పానికి ప్రతీకగా కనిపిస్తోంది. పరిశోధన, అంతర్జాతీయ భాగస్వామ్యాలు, ఆధునిక మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టడం ద్వారా ఏయూను ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యం. ముఖ్యంగా ఏఐ, క్వాంటం టెక్నాలజీ వంటి ఆధునిక రంగాల్లో ముందడుగు వేయాలన్న ఆలోచన బలంగా ఉంది. –జీపీ రాజశేఖర్, ఏయూ వీసీ ఏయూ..ఆత్మగౌరవానికి ప్రతీక ఏయూ ప్రయాణం కేవలం శతాబ్ద కాల చరిత్ర కాదు, అది విద్య, సంస్కృతి, ఆత్మగౌరవం కలిసిన ఓ గొప్ప గాథ. దేశవ్యాప్త ర్యాంకింగ్స్లో మూడో స్థానాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం ద్వారా, ఈ విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే ప్రభుత్వ సంకల్పం స్పష్టమవుతోంది. ఈ లక్ష్య సాధనకు కేవలం మాటలు కాకుండా, మౌలిక సదుపాయాలు, పరిశోధన అవకాశాలు, అధ్యాపక బలం వంటి అంశాల్లో దృఢమైన చర్యలు అవసరం. –నారా లోకేష్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శతాబ్ది ఉత్సవాల్లో అవమానంపై ఎంపీ గొల్ల బాబూరావు ఆగ్రహం విశాఖసిటీ: దళితుల పట్ల చంద్రబాబు మరోసారి నీచమైన బుద్ధిని ప్రదర్శించారని రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు వ్యాఖ్యానించారు. శతాబ్ది ఉత్సవాలకు ఆహ్వానం అందడంతో వేడుకలకు హాజరైతే తనని వేదికపైకి ఆహ్వానించకుండా అవమానించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలక కార్యక్రమంలో అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడటం బాధాకరమన్నారు. ఒక రాజ్యసభ సభ్యునికి ఇచ్చే మర్యాద ఇదేనా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు మొదటి నుంచి దళితులంటే చిన్నచూపనీ.. ఇది కేవలం గొల్ల బాబూరావుకి జరిగిన అవమానం కాదనీ.. యావత్ దళిత జాతికి జరిగిన అవమానమని దుయ్యబట్టారు. ఏ అర్హత ఉందని డైరెక్టర్ త్రివిక్రమ్ని వేదిక పైకి ఆహ్వానించారని ప్రశ్నించారు. నాకు జరిగిన అవమానం పై రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు. సచిన్ ప్రత్యేక ఆకర్షణ మద్దిలపాలెం: శతాబ్ది ఉత్సవాల్లో సచిన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన ముగింపు సభకు రావడం విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. సచిన్ సభా వేదిక వద్దకు రాగానే విద్యార్థులు పెద్ద ఎత్తున కేరింతలు కొట్టారు. సచిన్ స్కెచ్లు వేసిన పోస్టర్లను ప్రదర్శించారు. సచిన్ ప్రసంగిస్తున్న సమయంలో కూడా సచిన్ సచిన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆయన చేసిన ఉత్తేజపూరిత ప్రసంగానికి మంత్రముగ్ధులయ్యారు. అలాగే ఏయూలో ఫిజిక్స్ చదువుకోవడానికి వచ్చి తెలుగు సాహిత్యం వైపు ఎలా మళ్లారో సినీ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తనదైన శైలిలో వివరిస్తూ విద్యార్థులను అలరించారు. -
సర్వే నంబర్ల మాయాజాలం
విశాఖ సిటీ : సాగర తీర ప్రాంతంలోని అత్యంత విలువైన పాండురంగాపురంలో భూ మాఫియా కోరలు చాచింది. అధికారుల అండదండలతో సర్వే నంబర్లను తారుమారు చేస్తూ, ఒక వృద్ధుడి వారసత్వ ఆస్తిని కబ్జా చేసేందుకు బడా బాబులు తెగబడుతున్నారు. హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ అక్రమ నిర్మాణాలు చేపట్టడం స్థానికంగా సంచలనం రేపుతోంది. దశాబ్దాల నాటి వారసత్వం.. నేడు వివాదం బాధితుడు పెంటకోట సీతారామాంజనేయులు కథనం ప్రకారం.. 1959లో ఆయన తాత పెంటకోట శ్రీరాములు నాయుడు, రాణి రుక్మిణి దేవి వద్ద నుంచి సర్వే నంబర్ 1008లో 7.58 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు (డాక్యుమెంట్ నం. 2116/1959). ఈ స్థలంలో ‘మైత్రేయి నగర్’ పేరుతో లేఅవుట్ వేసి ప్లాట్లు విక్రయించారు. అయితే అప్పట్లో ప్లాట్లకు, దక్షిణాన ఉన్న గెడ్డకు మధ్య సుమారు 1500 గజాల ఖాళీ స్థలాన్ని మిగులు భూమిగా వదిలివేశారు. తదనంతరం ఈ భూమి తన మనవడైన సీతారామాంజనేయులుకు వీలునామా ద్వారా సంక్రమించింది. 2020లో ఈ భూమి డీ–నోటిఫై అయినప్పటి నుంచి అక్రమార్కుల కన్ను దీనిపై పడింది. నంబర్ల మార్పిడితో ‘స్వీట్’ కబ్జా కబ్జాదారులు అత్యంత చాకచక్యంగా సర్వే నంబర్ల మాయాజాలానికి తెరలేపారు. సర్వే నంబర్ 1011కి సంబంధించిన పత్రాలను చూపిస్తూ, సర్వే నంబర్ 1008లోని ఖాళీ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్లాన్ చేశారు. విచిత్రమేమిటంటే, నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు, కబ్జాదారులకు వత్తాసు పలుకుతూ అక్రమంగా నిర్మాణ అనుమతులు మంజూరు చేశారు. ప్రస్తుతం అక్కడ ఐదంస్తుల భవన నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. వాస్తవానికి 1011/1ఏ/1ఏ/3ఏ సర్వే నంబర్లో స్థలాన్ని కొనుగోలు చేసిన వారు, సంబంధం లేని 1008 సర్వే నంబర్ స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారని బాధితుడు ఆరోపిస్తున్నారు. కోర్టు ఆదేశాలూ బేఖాతరు బాధితుడు సీతా రామాంజనేయులు తన వయోభారం దృష్ట్యా తిరగలేక, జీపీఏ హోల్డర్ ద్వారా జీవీఎంసీ, కలెక్టర్ కార్యాలయం, పీజీఆర్ఎస్కు పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేశారు. 2020లో ఈ భూమి డీ–నోటిఫై అయినట్లు తెలిసినప్పటి నుంచి సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని మొరపెట్టుకున్నా అధికారులు స్పందించలేదు. దీంతో బాధితుడు అక్రమ నిర్మాణాలు ఆపాలని, జాయింట్ సర్వే నిర్వహించాలని హైకోర్టులో కేసు వేశాడు. దీనిపై హైకోర్టు నాలుగు వారాల్లోగా జాయింట్ సర్వే పూర్తి చేసి నివేదిక సమర్పించాలని గత నెల 18న రెవెన్యూ, జీవీఎంసీ, ఇతర సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై సదరు నిర్మాణదారులు సర్వేను ఆపాలని డివిజన్ బెంచ్కు వెళ్లినప్పటికీ.. సర్వే చేపట్టాలని కోర్టు వారి పిటిషన్ను కొట్టివేసింది. ఈ నెల 18వ తేదీతో హైకోర్టు ఇచ్చిన నాలుగు వారాల గడువు ముగిసినప్పటికీ.. అధికారులు ఇప్పటి వరకు సర్వే చేపట్టకపోవడం గమనార్హం. అధికారుల అండతోనే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. -
ఏయూ.. విద్యావ్యవస్థకు లైట్హౌస్
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయం కేవలం ఒక విద్యాసంస్థ మాత్రమే కాదని, అది భారతదేశపు ‘నాలెడ్జ్ పవర్ హౌస్’గా, విద్యావ్యవస్థకు లైట్హౌస్గా ఉందని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అభివరి్ణంచారు. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమం ఏయూ ఇంజినీరింగ్ మైదానంలో సోమవారం నిర్వహించారు. ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, భారతరత్న, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. 1926లో సర్ సీఆర్రెడ్డి నాటిన విత్తనం నేడు మహా వృక్షమై సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి మహానుభావుల మార్గదర్శకత్వంలో ప్రపంచ స్థాయికి ఎదిగిందని ప్రశంసించారు. నూతన జాతీయ విద్యా విధానం విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచనా ధోరణిని పెంపొందించాలని ఆకాంక్షించారు. ఏయూ వంటి సంస్థలు పరిశోధన, అభివృద్ధి రంగంలో గ్లోబల్ సెంటర్లుగా అవతరించాలన్నారు. యువత ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. గ్లోబల్ ర్యాంకింగ్స్లో ఏయూ అగ్రస్థానంలో నిలవాలని రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. స్పోర్ట్స్మెన్ స్పిరిట్.. ఒక ఆయుధం: సచిన్ సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ.. తన 24 ఏళ్ల క్రికెట్ ప్రస్థానంలోని కీలక ఘట్టాలను వివరిస్తూ, ఒత్తిడిని జయించేందుకు ‘ప్రిపరేషన్’ ఒక్కటే మార్గమన్నారు. విద్యార్థులు శ్రమను నమ్ముకోవాలని సూచించారు. తాను గత మ్యాచ్లలో ఎన్ని సెంచరీలు చేశాననేది ఎప్పుడూ ఆలోచించలేదని.. రేపటి బంతిని ఎలా ఎదుర్కోవాలన్నదే తన తపనని చెప్పారు. స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అనేది జీవితంలోని కష్టాలను ఎదుర్కోవడానికి ఒక ఆయుధంలా పనిచేస్తుందన్నారు. విద్యాలయాల్లో రాజకీయ ప్రమేయం ఉండకూడదు: గవర్నర్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయ ప్రాంగణాలను రాజకీయాలకు అతీతంగా ఉంచాలని, ఇక్కడ కేవలం విజ్ఞాన చర్చలు, పరిశోధనలు మాత్రమే జరగాలని హితవు పలికారు. ఏయూ వంటి ప్రతిష్టాత్మక సంస్థ వందేళ్ల పండగను జరుపుకోవడం రాష్ట్రానికే గర్వకారణమని చెప్పారు. నైతిక విలువలతో కూడిన విద్యా వ్యవస్థే దేశానికి వెన్నెముక అని గవర్నర్ స్పష్టంచేశారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏయూని ‘గ్లోబల్ నాలెడ్జ్ హబ్’గా తీర్చిదిద్దుతామని, అత్యాధునిక సౌకర్యాలకు పునాది వేస్తామని చెప్పారు. ఏయూ స్టాంప్, నాణెం ఆవిష్కరణ.. ఏయూ శతాబ్ది వేడుకలకు గుర్తుగా కేంద్రం విడుదల చేసిన రూ.100 స్మారక నాణెం, పోస్టల్ స్టాంప్లతో పాటు కాఫీబుక్ని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, సచిన్, గవర్నర్, చంద్రబాబు ఆవిష్కరించారు. అదేవిధంగా.. విద్యార్థుల హాస్టల్స్ సహా తొమ్మిది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. పలు సంస్థలతో ఒప్పందాలు జరిగాయి. వివిధ రంగాల్లో రాణిస్తున్న 10 మంది పూర్వ విద్యార్థులకు ఎక్స్లెన్స్ అవార్డుల్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, సినీ దర్శకుడు, మాటల రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్, ఏయూ వీసీ ప్రొ.రాజశేఖర్ పాల్గొన్నారు. మరోవైపు.. కార్యక్రమం మొత్తం పూర్తయ్యే వరకూ విద్యార్థులను బయటకు పంపకపోవడంతో వారు అసహనం వ్యక్తంచేశారు. ఆదిత్యుని సన్నిధిలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అరసవిల్లి: శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామిని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ సోమవారం ఉదయం దర్శించుకున్నారు. అంతకుమ ఉందు ఆయన శ్రీకూర్మంలోని శ్రీకూర్మనాథస్వామి దర్శనం కూడా చేసుకున్నారు. ఆదిత్యుని ఆలయాన్ని దర్శించుకున్న తొలి ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ గుర్తింపు పొందారు.తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి తిరుమల: భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ సోమవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి విశ్రాంతి గృహానికి చేరుకున్న ఆయనకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్.వెంకయ్యచౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ తదితరులు స్వాగతం పలికారు. ఉప రాష్ట్రపతి మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. జీవితాన్ని ఆనందంగా గడపడమే నిజమైన విద్య ఏయూ ప్రాంగణం విశాలమైతే.. అక్కడ పుట్టే ఆలోచనలు ఇంకా విశాలంగా ఉంటాయి. వర్సిటీ అనేది విభిన్న ఆలోచనల సంగమం. పదిమందితో చర్చించుకున్నప్పుడే గెలుపు దిశగా తీసుకెళ్లే ఆలోచనలు పుడతాయి. అలవాటైనదే గొప్పదని భావించకుండా కొత్త దారులను అన్వేíÙంచాలి. ముఖ్యంగా ‘ఫిజిక్స్’ కంటే ‘సాహిత్యం’ నన్ను నేను అర్థం చేసుకోవడానికి ఎక్కువ సాయపడింది. మార్కులు, ర్యాంకులనే లక్ష్యంగా పెట్టుకుని ఒత్తిడిలో బతుకుతున్న విద్యార్థులు.. జీవితాన్ని ఆనందంగా గడపడం నేర్చుకోవాలి. – త్రివిక్రమ్ శ్రీనివాస్,ప్రముఖ దర్శకుడు, మాటల రచయిత -
ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయం కావాలి
విశ్వవిద్యాలయ ఏర్పాటు కోసం తమ అమూల్యమైన భూములను దానంగా ఇచ్చిన దాతల విగ్రహాలను ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేయాలి. వర్సిటీ ఉద్యోగులకు రెండు నెలల బోనస్, విద్యార్థులకు మూడు నెలల మెస్ బిల్లు మాఫీ ప్రకటించాలి. కొద్దిమందికే ఈ ఉత్సవాలు పరిమితం కావడం దారుణం. ఇప్పటికై నా విద్యార్థి సంఘాలు బలోపేతమై, ఏకతాటిపైకి రావాలి. వర్సిటీలో జరుగుతున్న దారుణాలపై గళమెత్తి ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – జి.ఎ.నారాయణరావు, రాష్ట్ర ఎడ్యుకేషన్ కౌన్సిల్ పూర్వ సభ్యుడు -
ప్రముఖ రచయిత్రి శారదాపూర్ణ కన్నుమూత
సీతంపేట: ప్రముఖ రచయిత్రి, గాయని, అమెరికాలో తెలుగు భాషా సంస్కృతులకు అపారమైన సేవలందిస్తున్న డాక్టర్ శొంఠి శారదాపూర్ణ శనివారం సాయంత్రం అమెరికాలో కన్నుమూశారు. విశాఖపట్నానికి చెందిన ఆమె కళాభారతి శంకర శాస్త్రి మనుమరాలు. శారదాపూర్ణ ఏయూలో తెలుగులో పీహెచ్డీ, సంస్కృతంలో ఎం.ఎ, పీహెచ్డీ పట్టాలు పొందారు. అన్నమాచార్య కీర్తనలపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందిన ఆమె.. చికాగో నగరంలో సప్న అనే సంస్థను స్థాపించి అన్నమయ్య కీర్తనలకు విదేశాల్లో బహుళ ప్రాచుర్యం కల్పించారు. అలాగే చికాగో వేద విద్యా పరిషత్తును కూడా స్థాపించారు. భాషారత్న, మహతి పురస్కారం, రాయప్రోలు సుబ్బారావు సాహితీ అవార్డు, తానా పురస్కారం వంటి మరెన్నో గౌరవాలను ఆమె అందుకున్నారు. ఆమె ప్రతీచి, శరద్ధృతి, శరన్నిక్వాణం, శరఝరి, మేఘదూతం, నీతి సాహస్రి వంటి గ్రంథాలను రచించడమే కాక, బ్రాహ్మి అనే పత్రికను కూడా నడిపారు. శారదాపూర్ణ మృతి పట్ల నగరానికి చెందిన ప్రముఖ రచయిత డాక్టర్ డి.వి.సూర్యారావు, పలువురు సాహితీవేత్తలు తమ గాఢ సంతాపం ప్రకటించారు. ఆమె మరణం సాహితీ, సంగీత లోకానికి తీరని లోటని వారు పేర్కొన్నారు. -
1950 మందితో బందోబస్తు : సీపీ
అల్లిపురం: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు, గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమాల కోసం నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో 1,950 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా ఎయిర్పోర్ట్ నుంచి వేదికల వరకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. వీఐపీ ప్రాంతాల్లో బాంబు, స్నిఫర్ డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు నిర్వహిస్తూ, ప్రతి విభాగానికి ఒక ఉన్నతాధికారిని పర్యవేక్షకులుగా నియమించి ఈ కార్యక్రమాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. -
మొక్కుబడి తంతుగా శతాబ్ది ఉత్సవాలు
ఏయూలో చదువుకున్న మేధావులను, పూర్వ విద్యార్థులను విస్మరించి, ప్రైవేటు వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం సరైన పద్ధతి కాదు. శతాబ్ది ఉత్సవాలను మొక్కుబడి తంతుగా నిర్వహించడం బాధాకరం. ఇది స్థానిక ప్రజల ఆత్మగౌరవంపై జరుగుతున్న వివక్షే. భవిష్యత్ తరాలను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే ప్రగతిశీల ఆలోచనలు లోపించాయి. జరగకూడని రీతిలో ఈ ఉత్సవాలు జరుగుతుండటం బాధాకరం. – డాక్టర్ బి. గంగారావు, సీపీఎం మాజీ ఫ్లోర్ లీడర్ -
సింహగిరిపై రెండో విడత చందనం అరగదీత ప్రారంభం
సింహాచలం : సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఆదివారం నుంచి రెండో విడత చందనం అరగదీత కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. వచ్చే నెల 1న వైశాఖ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి సమర్పించే మూడు మణుగుల (సుమారు 125 కిలోలు) చందనాన్ని సిద్ధం చేసేందుకు ఈ ప్రక్రియను చేపట్టారు. ఉదయం అర్చకులు చందనం చెక్కలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం, సిబ్బంది అరగదీతను ప్రారంభించారు. మొదటి రోజు 48 కిలోల చందనాన్ని అరగదీశారు. మరో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. రేపటి నుంచి చందనం విక్రయాలు మంగళవారం నుంచి సింహగిరిపై భక్తులకు చందనం విక్రయించనున్నట్లు సింహాచలం దేవస్థానం ఈఓ జె. వెంకటరావు తెలిపారు. ఆలయ ప్రసాదాల విక్రయశాలలో ఉదయం 8 గంటల నుంచి ఇవి అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. చందనం కొనుగోలు చేయాలనుకునే భక్తులు తమ అధార్కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. ఒక్కొక్కరికి ఒక ప్యాకెట్ చొప్పున రూ.10కి విక్రయించడం జరుగుతుందన్నారు. -
మహనీయులను మరిచారు
విశాఖ సిటీ: విశ్వకళలకు నిలయమై, విశ్వవ్యాప్త ఖ్యాతిని గడించిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో శతజయంతి ఉత్సవాల వేళ చోటుచేసుకున్న పరిణామాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. వర్సిటీ 100వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అధికార యంత్రాంగం ప్రదర్శించిన నిర్లక్ష్య ధోరణి ఆచార్యులు, ఉద్యోగులు, విద్యార్థులలో తీవ్ర అసంతృప్తిని నింపింది. అసలే ఉత్సవ వేడుకను 26 నుంచి 27కు మార్చడంపై ఉన్న అశాంతికి తోడు, దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీని తుంగలో తొక్కడం విమర్శలకు తావిస్తోంది. మహనీయులను గౌరవించుకోరా? ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆవిర్భావానికి, అభివృద్ధికి బాటలు వేసిన మహనీయులను గౌరవించుకోవడం ఈ ప్రాంగణంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయం. వ్యవస్థాపకుడు డాక్టర్ సీఆర్ రెడ్డి నుంచి మొదలుకొని, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ, డాక్టర్ వీఎస్ కృష్ణ, రాజా విక్రమ్ దేవ్ వర్మ వంటి ప్రముఖుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించడం ద్వారా వర్సిటీ గతాన్ని స్మరించుకునేవారు. గతంలో వీసీలు, ఉన్నతాధికారులు అందరూ కలిసి ఈ నివాళులర్పించే కార్యక్రమాన్ని అత్యంత గౌరవప్రదంగా నిర్వహించేవారు. అయితే, ప్రస్తుత వీసీ ఆచార్య రాజశేఖర్, రెక్టార్, రిజిస్ట్రార్లు ఈ సంప్రదాయానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం అధికారుల చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తోంది. వారి ఖ్యాతి మరిచారా..? ఏయూ మనుగడకు కారణమైన ఆ మహనీయుల త్యాగాలను, సేవలని ప్రస్తుత పాలకవర్గం విస్మరించింది. వర్సిటీ కోసం వందల ఎకరాల భూమిని దానం చేసిన రాజా విక్రమ్ దేవ్ వర్మ, ప్రత్యేక వర్సిటీ కోసం పోరాడిన సర్ సీఆర్ రెడ్డి, విశ్వవిద్యాలయ ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన రెండో వీసీ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ వంటి వారి విగ్రహాలు వ్యవస్థాపక దినోత్సవం నాడు వెలవెలబోవడం నగర వాసులను సైతం ఆశ్చర్యపరిచింది. కేవలం వర్సిటీ వ్యవస్థాపకులే కాకుండా, ఆవిర్భావంలో కీలకంగా వ్యవహరించిన డాక్టర్ పరశురామ్ పాత్రో, డాక్టర్ సచ్చిదానందమూర్తి వంటి మహనీయులతో పాటు మహాత్మా జ్యోతిరావు పూలే, మహాత్మా గాంధీ, బాబూ జగ్జీవన్రామ్, సర్ ఆర్థర్ కాటన్ వంటి గొప్ప వ్యక్తుల విగ్రహాల వద్ద కూడా కనీస నివాళులు అర్పించకపోవడం పట్ల వర్సిటీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి కీలక సమయంలో ఉన్నతాధికారుల బాధ్యతారహితమైన ప్రవర్తన ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రతిష్టను, సంస్కృతిని మంటగలుపుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆర్ట్స్ కళాశాల ఎదుట వెలవెలబోతున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహంవెలవెలబోతున్న ఏయూ స్నాతకోత్సవ భవనం ఎదుట వున్న సీఆర్ రెడ్డి విగ్రహం -
స్థిరమైన విద్యావిధానం అవసరం
ప్రభుత్వాలు విద్యా, వైద్య రంగాలను పూర్తిగా ప్రైవేటీకరిస్తూ వ్యాపార కేంద్రాలుగా మార్చేస్తున్నాయి. ఈ విధానాల వల్ల రాష్ట్రం తిరోగమనం వైపు పయనిస్తోంది. విశ్వవిద్యాలయాల్లో జరిగే పరిశోధనలు కేవలం పట్టాలకే పరిమితం కాకుండా సమాజానికి, ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడేలా ఉండాలి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విద్యా విధానాలను మార్చేయడం సరికాదు. ఒక స్థిరమైన విద్యా విధానం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – ఎస్.సుధాకర్, ఏయూ ఆర్ట్స్ అండ్ లా కాలేజీ విద్యార్థి సంఘం పూర్వ అధ్యక్షుడు -
సామాజిక, మేధో ప్రగతికి వేదిక ఏయూ
మద్దిలపాలెం: సామాజిక, మేధో ప్రగతికి ఆంధ్ర విశ్వవిద్యాలయం వేదికగా నిలిచిందని రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ అన్నారు. ఎన్నో తరాలను తీర్చిదిద్దిన ఘనత ఈ విశ్వవిద్యాలయానికే సొంతమని, దేశంలోనే నంబర్ 1 వర్సిటీగా ఏయూ ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఏయూ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని బీచ్రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం నిర్వహించిన కార్య క్రమంలో ఆయన మాట్లాడారు. విశాఖతోనూ, ఏయూతోనూ తనకు ఎంతో భావోద్వేగ అనుబంధం ఉందన్నారు. అంతకుముందు వర్సిటీ వ్యవస్థాపక ఉపకులపతి సీఆర్రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ.. వర్సిటీ ఫస్ట్ అనే నినాదంతో అందరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఏయూ అలుమ్ని అసోసియేషన్ అధ్యక్షుడు కె.వి.వి.రావు మాట్లాడిన కార్యక్రమంలో జైపూర్ రాజవంశీయులు మయూఖ కుమారి దేవి, పాలకమండలి సభ్యులను ఘనంగా సత్కరించారు. ప్రతిభ కనబరిచిన ఆచార్యులకు ఫ్యాకల్టీ ఎక్సలెన్స్ అవార్డులు, అలుమ్ని అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులకు జ్ఞాపికలను అందజేసి సత్కరించారు. హెచ్ఆర్డీ కార్యదర్శి కోన శశిధర్ -
వందేళ్ల ఘనతకు అవమానం
మహారాణిపేట: వందేళ్ల సుదీర్ఘ చరిత్ర, దేశానికే గర్వకారణమైన ఎంతోమంది మేధావులను తీర్చిదిద్దిన ఘనత ఆంధ్ర విశ్వవిద్యాలయానిది. కానీ, ఇప్పుడు జరుగుతున్న శతాబ్ది ఉత్సవాలు వర్సిటీ వైభవాన్ని చాటేలా కాకుండా, ప్రైవేటు వ్యక్తుల ప్రయోజనాలకు పెద్దపీట వేసేలా జరుగుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏయూలో చదివి, ప్రస్తుతం అత్యున్నత పదవుల్లో ఉన్న వారిని కనీసం పట్టించుకోకుండా, అధికారులు, ప్రభుత్వ పెద్దలు తమకు ఇష్టమొచ్చిన వారికి మాత్రమే రెడ్ కార్పెట్ వేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ‘ఇలాంటి అవమానకరమైన ఉత్సవాలు దేశంలో ఏ వర్సిటీలోనూ జరిగి ఉండవు’అంటూ మేధావులు, పూర్వ విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం డాబాగార్డెన్స్లోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ‘వందేళ్ల ఆంధ్ర యూనివర్సిటీ భవిష్యత్–బాధ్యత’అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముందు విద్యార్థులు, మేధావులు అంబేడ్కర్ విగ్రహం నుంచి అల్లూరి భవనం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు ఏయూ ఉత్సవాల నిర్వహణ తీరును ఎండగట్టారు. అనారోగ్యం కారణంగా ఈ సదస్సుకు రాలేకపోయిన కేంద్ర ప్రభుత్వ పూర్వ కార్యదర్శి, విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈ.ఎ.ఎస్. శర్మ ఒక సందేశాన్ని పంపారు. వందేళ్లు పూర్తి చేసుకున్న ఏయూ సాధించిన అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉందన్నారు. యూనివర్సిటీలకు విద్యతో పాటు సామాజిక బాధ్యత అవసరమని, సమాజ ప్రగతికి ఉపకరించే అత్యుత్తమ పరిశోధనలు ఏయూ నుంచి రావాలని ఆకాంక్షించారు. అయితే, శతాబ్ది వేడుకల నిర్వహణ తీరు ఏమాత్రం సక్రమంగా లేదని ఆయన తన సందేశంలో స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మేధావుల సంఘం నాయకుడు మార్కండేయులు, ఎస్ఎఫ్ఐ పూర్వ రాష్ట్ర నాయకుడు డాక్టర్ పొన్నాడ శ్రీనివాస్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి.వెంకటరమణ, ఏఐఎస్ఎఫ్ నాయకుడు వి.నాగరాజు, పీడీఎస్వో జిల్లా అధ్యక్షుడు విశ్వనాధ్ అభిలాష్, పలువురు పూర్వ విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష
ఏయూ శతాబ్ది ముగింపు వేడుకల ఏర్పాట్లపై కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్, వీసీ జీపీ రాజశేఖర్తో కలిసి కమాండ్ కంట్రోల్ రూమ్లో సమీక్షించారు. కార్యక్రమ షెడ్యూల్ను నిమిషాల వారీగా అమలు చేయాలని, సాంస్కృతిక కార్యక్రమాలు ఆటంకం లేకుండా జరగాలని ఆదేశించారు. అతిథులు, విద్యార్థులకు తాగునీరు, స్నాక్స్, పారిశుధ్యం, పార్కింగ్ సదుపాయాలు పక్కాగా ఉండాలని సూచించారు. వీవీఐపీల భద్రతకు అంబులెన్సులు, హెల్ప్ డెస్క్లు సిద్ధం చేయాలని ఆదేశించిన కలెక్టర్, అంతకుముందు ఏయూ ప్రాంగణం, తర్లువాడలోని ఏర్పాట్లను సీపీ శంఖబ్రత బాగ్చి, సీఎం కార్యక్రమాల నిర్వహణ సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి పరిశీలించారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి
అల్లిపురం: ఆర్టీసీ కాంప్లెక్స్లో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పప్పల అమ్మన్నమ్మ (72) అనే వృద్ధురాలు మృతి చెందింది. శ్రీకాకుళం జిల్లా సరిబుజ్జిలి మండలం బదలాయిపేటకు చెందిన అమ్మన్నమ్మ, తన కుమార్తె భానుతో కలిసి నగరంలో ఉంటున్న కుమారుడి ఇంటికి వచ్చింది. కాంప్లెక్స్లో బస్సు దిగిన తర్వాత, కుమార్తె ఆటో కోసం ప్రయత్నిస్తుండగా, అమ్మన్నమ్మ వాష్రూమ్ కోసం వెళ్తుండగా ఇచ్ఛాపురం నుంచి వచ్చిన బస్సు ఆమెను ఢీకొట్టింది. బస్సు చక్రాలు ఆమైపె నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న టూటౌన్ ట్రాఫిక్ ఎస్.ఐ. సింహాచలం ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి దర్యాప్తు చేపట్టారు. -
పోస్టల్ ఉద్యోగిని బలవన్మరణం
ప్రేమ వైఫల్యమే కారణం? ఆరిలోవ/కొమ్మాది: పోస్టల్ ఉద్యోగిని ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివి. శ్రీకాకుళం జిల్లా దాసవరపు గ్రామానికి చెందిన పుత్రకాండ భాస్కరరావు కుటుంబం కొన్నాళ్ల కిందట విశాఖకు వలస వచ్చి ఎండాడ రాజీవ్నగర్లో నివాసముంటోంది. భాస్కర్ ఎంవీపీ సూపర్మార్కెట్లో కలాసీగా పనిచేస్తుండగా, ఆయన భార్య నీలవేణి కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. వీరి చిన్న కుమార్తె సంధ్యారాణి (22) పీఎంపాలెం పోస్టాఫీసులో పోస్ట్మన్గా విధులు నిర్వర్తిస్తోంది. గతంలో శ్రీకాకుళంలో పనిచేసిన సమయంలో ఓ యువకుడితో ప్రేమలో పడిన సంధ్యారాణి.. ఆ ప్రేమ విఫలం కావడంతో కొంతకాలంగా తీవ్ర మనస్తాపంతో ఉంటోంది. కాగా.. శనివారం సాయంత్రం యథావిధిగా విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్న ఆమె, ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుంది. బయటకు వెళ్లిన తల్లి నీలవేణి తిరిగి వచ్చేసరికి కుమార్తె ఫ్యాన్కు వేలాడుతూ కనిపించడంతో కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే స్థానికుల సహాయంతో కిందకు దించి గీతం ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తండ్రి భాస్కరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కృష్ణ తెలిపారు. ఆదివారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఆయన వెల్లడించారు. -
ఎల్.ఆర్.స్వామికి కడసారి నివాళులు
ఆరిలోవ: ప్రముఖ రచయిత, అనువాదకుడు ఎల్.ఆర్.స్వామి మృతి పట్ల పలువురు సాహితీవేత్తలు, ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం తుదిశ్వాస విడిచిన ఆయన భౌతికకాయాన్ని ఆదివారం విశాలాక్షినగర్ వెటర్నరీ కాలనీలోని ఆయన రెండో కుమార్తె నివాసంలో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి, మార్క్సిస్ట్ అధ్యయన కేంద్రం కన్వీనర్ వై.విజయకుమార్, నాగార్జున విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యుడు ఎన్.అంజయ్య, సీపీఐ జిల్లా నాయకుడు ఎం.పైడిరాజు తదితరులు స్వామి పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా జె.వి.సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, విశాలాంధ్ర ముద్రణాలయం ద్వారా స్వామి అనువదించిన పుస్తకాలను ప్రచురించామని గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా అర్ధనారీశ్వరుడు గ్రంథ అనువాదం కోసం ఆయన ఎంతగానో శ్రమించారని కొనియాడారు. అలాంటి గొప్ప వ్యక్తి మరణం తెలుగు సాహితీ లోకానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. -
షిప్పింగ్ రంగంలో బీమా సంక్షోభం
సాక్షి, విశాఖపట్నం : పశ్చిమ ఆసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు.. అంతర్జాతీయ వాణి జ్యానికి ప్రాణాధారమైన సముద్ర మార్గాలను అస్థిరపరుస్తున్నాయి. ముఖ్యంగా ఎర్ర సముద్రం, పర్షియన్ గల్ఫ్ వంటి కీలక జలసంధుల్లో యుద్ధ మేఘా లు కమ్ముకోవడంతో, కార్గో షిప్స్ ప్రయాణం గాలిలో దీపంలా మారింది. ఈ అనిశ్చితి వల్ల నౌకలకు రక్షణ కల్పించాల్సిన అంతర్జాతీయ బీమా సంస్థలు వెనకడుగు వేయడం.. ఇప్పుడు ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో ప్రయాణించే నౌకలకు బీమా రద్దు చేస్తున్నట్లు కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రకటించగా.. మరికొన్ని సంస్థలు.. ఏకంగా ప్రస్తుత ప్రీమియం కంటే 100 రెట్ల వరకూ అదనంగా చెల్లిస్తేనే బీమా సౌకర్యం అందిస్తామని చెప్పడంతో సరకు రవాణా భారంగా మారిపోయింది. సాధారణ సమయాల్లో నౌక విలువలో అతి స్వల్పంగా ఉండే బీమా ప్రీమియం, ప్రస్తుత యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇన్సూరెన్స్ సంస్థలు భారీ గా పెంచేశాయి. ఇప్పటికే ప్రమాదకర ప్రాంతాలుగా ప్రకటించిన జలమార్గాల్లో ప్రయాణించే నౌకలకు బీమా సంస్థలు ఏడు రోజుల ముందస్తు నోటీసుతో పాత ఒప్పందాలను రద్దు చేస్తున్నాయి. నౌకల బీమా పై పడుతున్న ఈ ప్రభావం కేవలం ఓడరేవులకే పరిమితం కాకుండా, సామాన్య ప్రజల ఇంట్లోనూ కుంపటి రగుల్చుతోంది. రవాణా ఖర్చులు పెరగడంతో ముడి చమురు, వంట నూనెలు, ఎలక్ట్రానిక్ వస్తు వులు, నిత్యావసర సరుకుల ధరలకు రెక్కలు వస్తున్నాయి. బీమా సంస్థలు రిస్క్ తీసుకోవడానికి నిరాకరించడం వల్ల ఎగుమతులు, దిగుమతులు నిలిచిపో యి పారిశ్రామిక ఉత్పత్తి కుంటుపడుతోంది. ఇది పరోక్షంగా దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. వార్ రిస్క్ ప్రీమియం పేరుతో.! సాధారణంగా ఓడ విలువలో 0.01 నుంచి 0.05 శాతం వరకూ బీమా ప్రీమియం ఉండేది. యుద్ధం కారణంగా.. ఈ ప్రీమియం చెల్లిస్తామని చెబుతున్నా.. ఇన్సూరెన్స్ కంపెనీలు రద్దు చేస్తున్నాయి. పైగా.. ఇప్పటికే ప్రీమియం చెల్లించినా.. వాటిని రద్దు చేస్తోంది. కొన్ని సంస్థలు మాత్రం.. కార్గో షిప్ ధరలో 3 నుంచి 7.5 శాతం వరకూ అంటే 100 నుంచి 150 రెట్లు అదనంగా ప్రీమియం చెల్లిస్తేనే బీమా ఇస్తామని తెగేసి చెబుతున్నాయి. అంటే.. 20 వేల కంటైనర్లని తీసుకెళ్లే కార్గో షిప్ ధర రూ.1250 కోట్లు వరకూ ఉంటే.. గతంలో బీమా ఒక ప్రయాణానికి తీసుకుంటే రూ.55 లక్షల వరకూ ఉండేది. ఇప్పుడు దాని విలువ దాదాపు రూ.75 నుంచి రూ.80 కోట్లు వరకూ చెల్లించాల్సి వస్తోంది. దీంతో.. ఈ భారం మోయలేక.. చాలా కార్గోషిప్ కంపెనీలు. ప్రయాణాల్ని రద్దు చేసుకుంటున్నాయి. భారత నౌకలపై బీమా ప్రభావం ఎంత.? భారత్లో సుమారు 7,500 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతాన్ని కలిగి ఉండి, అంతర్జాతీయ వాణిజ్యంలో కీలక పాత్ర పోషిస్తోంది. మన దేశంలోని 12 ప్రధాన ఓడరేవుల ద్వారా ప్రతిరోజూ సుమారు 80 నుంచి 100 వరకు భారీ కార్గో నౌకలు రాకపోకలు సాగిస్తుంటాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో మన మేజర్ పోర్టులు రికార్డు స్థాయిలో 915 మిలియన్ టన్నుల సరుకును హ్యాండిల్ చేశాయి. మన మొత్తం ఎగుమతి, దిగుమతుల్లో (ఎగ్జిమ్ కార్గో) కేవలం 5 నుంచి 7 శాతం మాత్రమే భారతీయ నౌకల ద్వారా జరుగుతోంది. మిగిలిన 93 శాతం పైగా రవాణా విదేశీ నౌకలపైనే ఆధారపడుతున్నాం. ప్రస్తుతం మన దేశంలో కోస్టల్, ఇంటర్నేషనల్ షిప్స్ కలిపి సుమారు 1,500 కిపైగా వాణిజ్య నౌకలున్నాయి. యుద్ధం కారణంగా విదేశీ కంపెనీలు బీమా దొరకక వెనక్కి తగ్గితే, మన దేశ వాణిజ్యం పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఉంది. సొంత బీమా నిధి ఏర్పాటు చేసినా..! ఈ గడ్డు కాలాన్ని ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం తన సొంత బీమా నిధిని ఏర్పాటు చేయడం వంటి సాహసోపేతమైన అడుగులు వేస్తోంది. విదేశీ బీమా సంస్థలపై ఆధారపడకుండా, స్వదేశీ రక్షణ కవచాన్ని నిర్మించడం ద్వారా వాణిజ్య నౌకలకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తోంది. రూ.12,980 కోట్లతో ‘భారత్ మైరెన్ ఇన్సూరెన్స్పూల్’ ఏర్పాటు చేసి, మన నౌకలకు భరోసా కల్పిస్తోంది. అయినప్పటికీ, అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణం సద్దుమణిగితే తప్ప సముద్ర వాణిజ్యం తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకోలేదు. అప్పటి వరకు ఈ బీమా భారం భారంగానే కొనసాగేలా కనిపిస్తోంది. -
మన ఉనికిని కాపాడుకోవాలి
స్థానికత అనేది మన ఆత్మాభిమానం. మన ఉనికిని కాపాడుకోవాల్సిన అస్తిత్వ పోరాటం ఇది. ఈ ప్రాంతాన్ని కళింగసీమగా గుర్తిస్తూ వెంటనే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలి. అన్ని రాజకీయ పార్టీలు స్థానికుల పట్ల సానుకూల చొరవ చూపాలి. వందేళ్ల ఘన చరిత్ర కలిగిన ఏయూ ప్రతిష్ట దిగజారేలా కార్యక్రమాలు చేయడం మానుకోవాలి. మన గౌరవానికి ప్రతీకై న విద్యా సంస్థల పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – డాక్టర్ జీవితేశ్వరరావు, ప్రముఖ వైద్యులు కేంద్ర వర్సిటీ హోదా కల్పించాలి విశ్వవిద్యాలయాలకు కేవలం విద్యను అందించడమే కాకుండా, పటిష్టమైన సామాజిక బాధ్యత కూడా ఉండాలి. వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏయూను తక్షణమే కేంద్ర విశ్వవిద్యాలయంగా ప్రకటించాలి. పరిశోధనలు ప్రజల అభివృద్ధి కోసం జరగాలి. అప్పుడే విద్యాసంస్థల ఉనికికి సార్థకత లభిస్తుంది. – డాక్టర్ మాటూరి శ్రీనివాస్, సమతా సాహితీ అధ్యక్షుడు పేలవంగా శతాబ్ది ఉత్సవాలు ఏయూలో బోధన, పరిశోధనలు దారుణంగా పడిపోయాయి. 1,200 మంది అధ్యాపకులు ఉండాల్సిన చోట కేవలం 130 మందితో నెట్టుకొస్తున్నారు. నిబంధనల ప్రకారం 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలి. 90 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా కలిగిన ఈ ప్రాంత ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. వందేళ్ల ప్రగతిని ప్రపంచానికి చాటాల్సిన తరుణంలో అత్యంత పేలవంగా ఉత్సవాలు నిర్వహించడం విచారకరం. – వెంకటరావు, ఎస్ఎఫ్ఐ నాయకుడు -
అప్పన్న భూములకు శఠగోపం
మహారాణిపేట: సింహాచలం దేవస్థానానికి చెందిన సుమారు 160 ఎకరాల భూమిని గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం ప్రభుత్వం లీజుకు ఇవ్వడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అడవివరం సర్వే నంబర్ 275లో 153 ఎకరాలు, ముడసర్లోవలోని సర్వే నంబర్ 26లో మరో 7 ఎకరాలను 11 ఏళ్ల కాలానికి లీజుకు ఇస్తూ దేవదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ లీజు ద్వారా ఏటా రూ.26 కోట్ల ఆదాయం సమకూరుతుందని, ప్రతి ఐదేళ్లకు ఒకసారి లీజు మొత్తం 5 శాతం పెరుగుతుందని ప్రభుత్వం పేర్కొంటోంది. అయితే ఈ నిర్ణయాన్ని విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అభివృద్ధి పేరుతో ఆలయ భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం సరికాదని, ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని కోరుతూ వీహెచ్పీ అధ్యక్షుడు ఆచార్య కందర్ప విశ్వనాథ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు లేఖ రాశారు. దేవాలయాల ఆస్తులను దేవాలయ అభివృద్ధికి తప్ప, ఇతర అవసరాలకు వాడకూడదని సుప్రీంకోర్టు సహా పలు ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ భూ వివాదాల మూలాలు దశాబ్దాల నాటి పంచగ్రామాల సమస్యలో ఉన్నాయి. భీమిలి, పెందుర్తి, విశాఖ పశ్చిమ నియోజకవర్గాల్లోని అడవివరం, వేపగుంట, పురుషోత్తపురం, చీమలాపల్లి, వెంకటాపురం గ్రామాలను పంచగ్రామాలుగా పిలుస్తారు. 1901 గిల్ మెన్ రికార్డుల ప్రకారం ఈ ప్రాంతాల్లో దేవస్థానానికి 9069 ఎకరాల భూమి ఉంది. 1996లో అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ భూములపై దేవస్థానానికి రైత్వారీ పట్టాలు దక్కాయి. దీంతో ఏళ్లుగా అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నవారు, సాగు చేసుకుంటున్న రైతులు ఆక్రమణదారులుగా మారారు. సుమారు 12 వేల మందికి పైగా ప్రభావితమవుతున్న ఈ అంశం ప్రస్తుతం జిల్లా, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పెండింగ్లో ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, పెండింగ్లో ఉన్న పంచగ్రామాల సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతుండగా, ప్రభుత్వం మాత్రం అదే భూముల్లో మరోవైపు వాణిజ్య లీజులకు ప్రాధాన్యత ఇస్తుండటం తీవ్ర వివాదానికి దారితీస్తోంది. జీవోను తక్షణం రద్దు చేయాలి ఆలయాల భూములను వాణిజ్య అవసరాలకు కేటాయించడం సరికాదు. అప్పన్న దేవస్థానానికి చెందిన 160 ఎకరాల భూమిని గూగుల్ డేటా సెంటర్ కోసం కేటాయించిన జీవోను తక్షణమే రద్దు చేయాలి. అభివృద్ధి పేరుతో ఎవరికి పడితే వారికి ఆలయ ఆస్తులను ధారదత్తం చేయడం అప్రజాస్వామికం. ఆలయ భూముల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. – ఆచార్య కందర్ప విశ్వనాఽథ్, అధ్యక్షుడు, విశ్వహిందూ పరిషత్ విశాఖ మహానగర్ -
భవిష్యత్ తరాల కోసం ‘కాల స్మృతి గుళిక’
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా భవిష్యత్ తరాలకు నేటి చరిత్రను అందించే లక్ష్యంతో.. పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ‘కాల స్మృతి గుళిక’ను ఏర్పాటు చేశారు. వందేళ్ల వేడుకల సందర్భంగా విశ్వవిద్యాలయానికి సంబంధించిన అనేక చారిత్రక అంశాలను దీనిలో భద్రపరిచామని, వీటిని 50 ఏళ్ల తర్వాత తెరిచి చూసేలా ప్రణాళిక రూపొందించామని ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్, ఏయూ అలుమ్ని అసోసియేషన్ అధ్యక్షులు కె.వి.వి.రావు తెలిపారు. ఈ కాల స్మృతి గుళికను శతాబ్ది ఉద్యానవనంలో ప్రత్యేకంగా భద్రపరుస్తున్నట్లు వారు పేర్కొన్నారు. అనంతరం పరిపాలన భవనం ఎదురుగా ఏర్పాటు చేసిన చారిత్రక చాయాచిత్రాల ప్రాంగణాన్ని వారు సందర్శించారు. కార్యక్రమంలో ఏయూ రెక్టర్ ఆచార్య పి.కింగ్, రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, క్యాంపస్ కళాశాలల ప్రిన్సిపాల్స్, డీన్లు, తదితరులు పాల్గొన్నారు. -
విశాఖ పోర్టు మరో అరుదైన రికార్డు
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం పోర్టు అథారిటీ(వీపీఏ) మరో అరుదైన రికార్డు నమోదు చేసింది. అత్యంత భారీ పరిమాణం కలిగిన ‘ఎంవీ రెజీనా ఓల్డెన్డార్ఫ్’ అనే కార్గో నౌకను ఆదివారం విజయవంతంగా హ్యాండ్లింగ్ చేసింది. 260 మీటర్ల పొడవు, 43 మీటర్ల వెడల్పు, 14.70 మీటర్ల డ్రాఫ్ట్ కలిగిన ఈ భారీ నౌక.. ఇప్పటివరకు ఇన్నర్ హార్బర్కు వచ్చిన నౌకలన్నింటిలోనూ అతి పెద్దదిగా నిలిచింది. ఇది దక్షిణాఫ్రికాలోని రిచర్డ్స్ బే పోర్టు నుంచి స్టీమ్ కోల్తో చేరుకుంది. ఈస్ట్ క్వే–1 బెర్త్లో 1,15, 873 టన్నుల స్టీమ్ కోల్ని పోర్టు సిబ్బంది హ్యాండ్లింగ్ చేశారు. సముద్రయాన రంగంలో తనదైన ముద్ర వేస్తూ, అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పడంలో వీపీఏ మరో మెట్టు ఎదిగిందని పోర్టు చైర్మన్ డా.అంగముత్తు అన్నారు. -
న్యాయదేవత విగ్రహ ఆవిష్కరణ
మద్దిలపాలెం: డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ న్యాయ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన న్యాయదేవత విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఏయూ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. న్యాయ ప్రక్రియలో జాప్యం జరిగితే ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజలకు ఉన్న విశ్వాసం దెబ్బతింటుందని హెచ్చరించారు. కోర్టుల్లో భారీగా పేరుకుపోయిన కేసుల సంఖ్యను తగ్గించాలని, వేగవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగాలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.సీతా మాణిక్యం మాట్లాడుతూ.. తక్షణ న్యాయం కొన్ని సందర్భాల్లో సాధ్యం కానప్పటికీ, విచారణలో సుదీర్ఘ జాప్యాలు ఉండకూడదని అభిప్రాయపడ్డారు. న్యాయపరమైన భాష సంక్లిష్టంగా ఉండకూడదని, సామాన్యులకు కూడా సులభంగా అర్థమయ్యేలా సరళంగా ఉండాలని వక్తలు పేర్కొన్నారు. ప్రొఫెసర్ కేశవరావు, ప్రొఫెసర్ ఎ.రాజేంద్ర ప్రసాద్, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
వందే
ఏయూమద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రత్యేక అతిథిగా హాజరుకానుండటంతో వేడుకలకు విశేష ప్రాధాన్యత ఏర్పడింది. వేదిక ప్రాంగణంలో సుమారు 25 వేల మంది కూర్చునేందుకు వీలుగా మూడు భారీ జర్మన్ టెంట్లతో పాటు ప్రత్యేక గ్యాలరీలను సిద్ధం చేశారు. విద్యార్థుల కోసం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాంస్కృతిక ప్రదర్శనలు ప్రారంభం కానుండగా, సాయంత్రం 4 గంటల నుంచి జరిగే ప్రధాన సభలో ఉపరాష్ట్రపతి, సచిన్ టెండూల్కర్, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తారు. అనంతరం ఏయూ భవిష్యత్ ప్రగతికి సంబంధించిన అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరుగుతాయి. సభకు హాజరయ్యే విద్యార్థులు, అతిథుల సౌకర్యార్థం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ప్రతి గ్యాలరీ వద్ద మంచినీటి సదుపాయంతో పాటు భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. భద్రతా తనిఖీలలో భాగంగా మెటల్ డిటెక్టర్లను వినియోగిస్తున్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన పాస్ ఉన్నవారికే లోపలికి అనుమతి ఉంటుంది. విద్యార్థులందరూ మధ్యాహ్నం 2 గంటల కల్లా ప్రాంగణానికి చేరుకోవాలని ఏయూ వీసీ ఆచార్య జీపీ. రాజశేఖర్ ఆదేశించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు వచ్చేందుకు వీలుగా కూర్మన్నపాలెం, పెందుర్తి, సింహాచలం, తగరపువలస, భీమిలి మార్గాల నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక ఉచిత ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. సంబంధిత పాస్లను చూపించి ఈ బస్సు సదుపాయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఏయూ యాజమాన్యం సూచించింది. నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలుఅల్లిపురం: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల నేపథ్యంలో సోమవారం నగరంలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా మూడో పట్టణ పోలీస్ స్టేషన్ జంక్షన్ నుంచి మద్దిలపాలెం ఆర్చ్ వరకు రాత్రి 10 గంటల వరకు సాధారణ వాహనాలకు అనుమతి ఉండదు. శ్రీకాకుళం, విజయనగరం నుంచి అనకాపల్లి వైపు వెళ్లే భారీ వాహనాలు ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మార్గాల ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. వీవీఐపీల పర్యటనల సమయంలో జంక్షన్ల వద్ద ట్రాఫిక్ నిలుపుదల చేసే అవకాశం ఉన్నందున, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని కోరారు. సభకు వచ్చే విద్యార్థులు, అతిథుల వాహనాల కోసం ఏయూ ప్రాంగణంలో పది ప్రత్యేక పార్కింగ్ స్థలాలను కేటాయించారు. విద్యార్థులు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు ధరించాలని, మొబైల్ ఫోన్లు తప్ప ఇతర వస్తువులను తీసుకురావద్దని పోలీసులు సూచించారు. వేడుకలు ముగిసిన తర్వాత కూడా వచ్చిన మార్గాల్లోనే తిరుగు ప్రయాణం చేయాలని, ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులకు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. నేడు శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు -
చారిత్రక వారసత్వాన్ని కాపాడుకుందాం
ఈ ప్రాంత అస్తిత్వం, అభివృద్ధిని కాంక్షించి ఏయూ ఆవిర్భవించింది. సంస్థానాధీశులు తమ భూములను దానం చేసి, ఆర్థికంగా అండగా నిలిచి ఈ విద్యాలయాన్ని నిర్మించారు. ఎంతోమంది మేధావులను, న్యాయమూర్తులను, రాజ్యాంగపరమైన ఉన్నత పదవులను అధిష్టించిన మహనీయులను అందించిన ఘనత ఏయూది. అయితే, నేడు అటువంటి వారెందరికో తగిన గుర్తింపు లభించకపోవడం విచారకరం. వర్సిటీపై రాజకీయ ప్రభావం పెరగడం సంస్థ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. చారిత్రక వారసత్వాన్ని కాపాడుకుందాం. – విశ్వ, పీడీఎస్యూ నాయకుడు -
ఏయూపై టీడీపీ ఎంపీ పెత్తనమా!
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయానికి భూములిచ్చిన దాతల్ని శతాబ్ది ఉత్సవాల్లో విస్మరించడం దుర్మార్గమని మేధావుల వర్గం, ఏయూ పూర్వ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల విద్యా ప్రదాయిని, చారిత్రక ఆంధ్ర విశ్వవిద్యాలయం వందేళ్ల వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా.. ‘ఆంధ్ర యూనివర్సిటీ భవిష్యత్తు బాధ్యత’ పేరుతో విశాఖలో ఆదివారం మేధావుల సదస్సు నిర్వహించారు. వర్సిటీలో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించిన మేధావులను విస్మరించి, చంద్రబాబు ప్రభుత్వం మొక్కుబడిగా ఉత్సవాలు నిర్వహించడం వారి ఆత్మగౌరవంపై జరుగుతున్న దాడిగా అభివర్ణించారు.\గీతం ప్రైవేట్ వర్సిటీ అధ్యక్షుడు, టీడీపీ ఎంపీ భరత్ ఏయూని ఎలా సమీక్షిస్తారని నిలదీశారు. వర్సిటీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ఉత్తరాంధ్ర మేధావులను, న్యాయమూర్తులను, ఉన్నతాధికారులను ఆహ్వనించకపోవడం వారిని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్సవాల నిర్వహణలో వర్సిటీ అధికారులు, టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్ని ముక్తకంఠంతో తప్పుబట్టారు. ఏయూ ప్రతిష్టను దిగజార్చి.. ప్రైవేటు వర్సిటీ విలువ పెంచాలని కుట్ర ఈ సదస్సులో ఉత్తరాంధ్ర రక్షణ వేదిక అధ్యక్షుడు శివశంకర్ మాట్లాడుతూ.. గీతం ప్రైవేట్ వర్సిటీ అధ్యక్షుడు భరత్ ఏయూ ఉత్సవాలను సమీక్షించడం దారుణమని మండిపడ్డారు. ఇది వందేళ్ల ఏయూ ప్రతిష్టను దిగజార్చి, ప్రైవేటు వర్సిటీ విలువ పెంచాలనే కుట్రలో భాగమేనని దుయ్యబట్టారు. వర్సిటీ అభివృద్ధి ఈ ప్రాంత ప్రగతికి తోడ్పడాలే తప్ప, బయటి వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల కోసం కాదని యూపీఎస్సీ పూర్వ మెంబర్ ప్రొ.కేఎస్ చలం పెదవి విరిచారు. వర్సిటీ ఏర్పాటుకు వందల ఎకరాలు ఇచ్చిన వారి కుటుంబాలకూ ఆహ్వనం లేకపోవడం అత్యంత హేయమని తెలిపారు.ఏయూ నుంచి దేశవ్యాప్తంగా అనేక మంది మేధావులు, జడ్జిలు రాజ్యాంగపరమైన పదవులు చేపట్టిన వారిని కూడా చంద్రబాబు ప్రభుత్వం, ఏయూ అధికారులు గుర్తించలేదని నన్నయ యూనివర్సిటీ పూర్వ వైస్ చాన్స్లర్ ప్రొ.ముత్యాలనాయుడు దుయ్యబట్టారు. వందేళ్ల వర్సిటీ ప్రగతిని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన తరుణంలో ఉత్సవాల్ని పేలవంగా నిర్వహించడం టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. డా.అంబేడ్కర్ వర్సిటీ పూర్వ వైస్ చాన్స్లర్ ప్రొ.నిమ్మ వెంకటరావుతో పాటు కళింగసీమ విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నేతలు పాల్గొన్నారు. -
పరిహారం అడిగితే.. ఊరు దిగ్బంధం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అభివృద్ధి ముసుగులో చంద్రబాబు ప్రభుత్వం రైతులపై దమనకాండను కొనసాగిస్తోంది. అన్నదాతల నోట్లో మట్టి కొడుతోంది. న్యాయం కోసం అర్థించిన నోళ్లను అధికారంతో నొక్కేయాలని ప్రయత్నిస్తోంది. తమ భూములు తీసుకున్నందుకు పరిహారం కావాలని అడిగితే, తమ ఊరినే దిగ్బంధించారని విశాఖజిల్లా ఆనందపురం మండలం తర్లువాడ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి భూమినే నమ్ముకుని బతుకుతున్న వందలాదిమంది తర్లువాడ డీ–పట్టా, జిరాయితీ రైతుల ఉసురు పోసుకుంటూ మంగళవారం ‘గూగుల్ డేటా సెంటర్’ శంకుస్థాపనకు ప్రభుత్వం సిద్ధమవుతోందని కన్నీరు పెట్టుకున్నారు. మెరుగైన పరిహారం ఇస్తామని హామీ ఇచ్చిన సర్కారు.. నమ్మిన రైతుల్ని నట్టేట ముంచేస్తూ.. ఒక్కపైసా కూడా ఇవ్వకుండా వారి భూములను బలవంతంగా లాక్కుంది. కనీస నష్టపరిహారం ఊసే ఎత్తకుండా, పోలీసుల పహారాలో భూసేకరణ చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే అరెస్టులతో ప్రభుత్వం నిర్బంధ కాండను కొనసాగిస్తోంది. శంకుస్థాపనకు చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో.. తర్లువాడని ఖాకీలు నిర్బంధిస్తూ.. 144 సెక్షన్ విధించారు. రైతులకు అండగా నిలబడేందుకు వస్తున్న ప్రజా సంఘాల నేతలను ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్టులు చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఏళ్ల తరబడి రెక్కలు ముక్కలు చేసుకుని సాగు చేసుకుంటున్న భూమిని అప్పనంగా లాక్కోవడమే కాకుండా, పరిహారం అడిగితే అక్రమ కేసులు బనాయించడంపై నిరసన వ్యక్తమవుతోంది. కప్పదాటు హామీలుఆనందపురం మండలం తర్లువాడలో కొందరు రైతులకు నామమాత్రపు పరిహారం ఇచ్చిన సర్కార్, దశాబ్దాలుగా డీ పట్టా భూముల్ని సాగు చేసుకుంటున్న 520 మంది రైతులకు మాత్రం పైసా పరిహారం ఇవ్వకుండా భూములను లాక్కుంది. అలాగే 12 ఎకరాల జిరాయితీ భూములను సాగుచేసుకుంటున్న మరో 6 కుటుంబాలకు కూడా మొండిచేయి చూపింది. గూగుల్ వచ్చిన తొలి నాళ్లలో రైతులందరికీ తగిన పరిహారం ఇస్తామంటూ చంద్రబాబు తరఫున భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, అధికారులు ప్రజలకు నమ్మబలికారు. ఇప్పుడు ఆ మాటను గాలికి వదిలేశారు. 2013 భూ సేకరణ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. జిరాయితీ భూములు ఉన్న వారికి నిబంధనల ప్రకారం రెండున్నర రెట్లు పరిహారం ఇవ్వాలి. అదేవిధంగా.. ఒక్కొక్క ఎకరం డీ పట్టా భూములున్న 520 మంది రైతులకు 5 సెంట్లు భూమి, రూ.5 లక్షలు ఇస్తామని స్థానిక ఎమ్మెల్యే గంటా హామీ ఇచ్చారు. ఆ తర్వాత లేదు లేదు... 3 సెంట్లు ఇస్తామని ప్రభుత్వం మరో హామీ ఇచ్చింది. ఆ రెండింటినీ చంద్రబాబు ప్రభుత్వం తుంగలో తొక్కేసి... ఇప్పుడు బలవంతపు భూ సేకరణకు ఉపక్రమించింది. పరిహారం అడిగితే బెదిరిస్తున్నారుమా కుటుంబంలోని ముగ్గురికి 60 ఏళ్ల క్రితమే తర్లువాడలో 4.64 ఎకరాల పట్టా భూమి ఉంది. దాని చుట్టూ 1.61 ఎకరాల బంజరు భూమి మా ఆధీనంలోనే ఉంది. ఇటీవల బంజరు భూమిలో చెట్లను తొలగించి రోడ్డు వేశారు. బంజరు భూములకు పరిహారం అడుగుతున్నాం. జిరాయితీ భూములను కూడా డి. పట్టా భూముల తరహాలోనే ప్రభుత్వానికి ఇచ్చేయమని తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారు. లేదంటే న్యాయస్థానం ద్వారా స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిస్తూ బెదిరింపులకు గురిచేస్తున్నారు. మేము జిరాయితీ భూములకు అదే విలువ గల భూమి అడుగుతున్నాం. ఎప్పుడేం జరుగుతుందోనని ఆందోళనగా ఉంది.– బి.వెంకటేశ్వరరావు, తర్లువాడ రైతుభూమి పూజ చేసినా.. ఆందోళన కొనసాగిస్తాంబంజరు భూములు అభివృద్ధి ప«థకంలో భాగంగా 2001 లో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ బలహీన వర్గాల మహిళలకు ఎకరం వంతున భూమి ఇస్తే అందులో మొక్కలు వేసుకున్నాం. సాగు ఫలాలు దశాబ్దాలుగా అనుభవిస్తున్నాం. ఈ భూములు కావాలని ప్రభుత్వం అడిగింది. తొలుత..భూములకు ప్రతిఫలంగా 3 సెంట్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించి ఇప్పుడు ఇవ్వడం లేదు. మాకు పరిహారం కావాలని ఆందోళన చేస్తుంటే.. నిరసనలు తెలపకూడదంటూ మా ఊరిని నిర్భంధంలోకి తీసుకున్నారు. గూగుల్కు భూమి పూజ జరిగిన తర్వాత కూడా.. రైతులందరం కలిసి ఆందోళనలను కొనసాగిస్తాం.– బాలి సూరమ్మ, తర్లువాడ -
రైల్వే బ్రిడ్జి డకింగ్ కుప్పకూలి.. ఏడుగురికి గాయాలు
విశాఖ: గాజువాకలో కన్స్ట్రక్షన్లో ఉన్న రైల్వే బ్రిడ్జి డకింగ్ కుప్పకూలింది. పిల్లర్లకు మధ్య కాంక్రీట్ వేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఏడుగురికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. గాయపడ్డవారికి చికిత్స అందుతోంది. -
భారత్ సముద్ర జలాలు ఇక శత్రుదుర్భేద్యం
సాక్షి, విశాఖపట్నం: భారత రక్షణ రంగం ప్రత్యేకించి దేశ సముద్ర భద్రత మరింత పటిష్టవంతంగా మారింది. ఆత్మనిర్భర్ భారత్ (స్వయం సమృద్ధి) కార్యక్రమంలో భాగంగా దేశం అత్యాధునిక ‘వైర్–గైడెడ్ హెవీ వెయిట్ టార్పెడో’ (డబ్ల్యూజీహెచ్డబ్ల్యూటీ)ను విజయవంతంగా అభివృద్ధి చేసింది. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) సంస్థ.. విశాఖపట్నంలోని తన యూనిట్లో 95 శాతం స్వదేశీ సాంకేతికతతో ఈ టార్పెడోను అభివృద్ధి చేసింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) ప్రయోగశాల నేవల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ ల్యాబోరేటరీ (ఎన్ఎస్టీఎల్)కి శనివారం అధికారికంగా అందజేసింది. ఈ కార్యక్రమానికి డీఆర్డీవో డైరెక్టర్ జనరల్ ఆర్వీ హరప్రసాద్, బీడీఎల్ సీఎండీ కమొడోర్ మాధవరావు, ఎన్ఎస్టీఎల్ డైరెక్టర్ డా.అబ్రహం వర్గీస్తో పాటు నౌకాదళాధికారులు హాజరయ్యారు. ఈ అత్యాధునిక టార్పెడోతో భారత నౌకాదళ సామర్ధ్యం మరింత పటిష్టం కావడమే కాకుండా, రక్షణ రంగ స్వయం సమృద్ధి సాధన దిశలో భారత్ మరో కీలక మైలురాయిని అధిగమించినట్లయ్యింది. 100 శాతం లక్ష్యాన్ని ఛేదించగల సత్తా సాధారణ టార్పెడోల కంటే ఈ ‘వైర్ గైడెడ్ హెవీ వెయిట్ టార్పెడో’ భిన్నంగా పనిచేస్తుంది. ప్రయోగించిన తర్వాత కూడా సన్నని వైర్ ద్వారా సబ్మెరైన్ లేదా యుద్ధ నౌకతో అనుసంధానమై ఉంటుంది. దీనివల్ల శత్రువుల కదలికలకు అనుగుణంగా వీటి దిశను ఎప్పటికప్పుడు మార్చవచ్చు. లక్ష్యాన్ని 100 శాతం ఛేదించగల సత్తా దీని సొంతం. శత్రువుల జలాంతర్గాములు, ఉపరితలనౌకల టార్పెడోలను అలాగే జలాంతర్గాములను నాశనం చేయడానికి ఈ టార్పెడో దోహదపడుతుంది. కొన్ని ముఖ్యాంశాలు.. ⇒ ఎన్ఎస్టీఎల్ సమన్వయంతో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఈ అత్యాధునిక ఆయుధాన్ని అభివృద్ధి చేసింది. ⇒ అటు శిక్షణలోనూ, ఇటు యుద్ధరంగంలోనూ రెండు రకాలుగా వినియోగించేలా దీనిని రూపొందించారు. ⇒ ఈ అధునాతన ఆయుధ వ్యవస్థ ద్వారా శత్రునౌకలను గుర్తించవచ్చు. లక్ష్యం తప్పకుండా దాడి చేయవచ్చు. ⇒ తాజా ఆవిష్కరణ వల్ల విదేశీ సాంకేతికతపై ఆధారపడటం తగ్గడమే కాకుండా.. నిర్వహణ వ్యయం కూడా గణనీయంగా తగ్గనుంది. ⇒ ఈ వైర్ గైడెడ్ హెవీ వెయిట్ టార్పెడోను ఎన్ఎస్టీఎల్ రూపొందించిన ‘వరుణాస్త్ర’ ప్రాజెక్టులో ఒక కీలక పరిణామంగా పరిగణిస్తున్నారు. ఇందులో భాగంగానే వరుణాస్త్రతో దీనిని అనుసంధానించనున్నారు. వైర్ గైడెడ్ హెవీ వెయిట్ టార్పెడో విశేషాలివీ.. బరువు: సుమారు 1,500 కిలోలుపొడవు: 7 నుంచి 8 మీటర్లుతయారీ ఖర్చు: యూనిట్ ధర సుమారు రూ.12 కోట్లు వార్హెడ్: సుమారు 250 కిలోల పేలుడు పదార్థంరేంజ్: సుమారు 40 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదువేగం: నీటి అడుగున గంటకు 74 కి.మీలోతు: సముద్ర మట్టానికి సుమారు 400 మీటర్ల లోతు వరకు వెళ్లి దాడి చేయగలదుగైడెన్స్ వ్యవస్థ : అత్యాధునిక హోమింగ్, ప్రొపల్షన్ వ్యవస్థలున్నాయి -
చమురు సెగ
సాక్షి, విశాఖపట్నం/మధురవాడ: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో తలెత్తిన ఆటంకాలు ఇప్పుడు ’సిటీ ఆఫ్ డెస్టినీ’ని కలవరపెడుతున్నాయి. గత కొద్ది రోజులుగా జిల్లాలో పెట్రోల్, డీజిల్ లభ్యత తగ్గుముఖం పట్టడం సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ముఖ్యంగా ప్రైవేట్ పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారుల్లో ఆందోళన నెలకొంది. ప్రైవేట్ బంకుల్లో ‘నో స్టాక్’ కలకలం నగరంలోని ప్రైవేట్ పెట్రోల్ బంకుల వద్ద ఒక్కసారిగా ‘నో స్టాక్’ బోర్డులు ప్రత్యక్షమవ్వడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మధురవాడ పరిసర ప్రాంతాల్లోని ప్రైవేట్ బంకులు మూతపడటంతో వాహనదారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అంతర్జాతీయంగా చమురు ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో, ప్రైవేట్ సంస్థలు కొత్త నిల్వలు కొనుగోలు చేసేందుకు వెనుకంజ వేస్తుండటమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఒక్కసారిగా పెరిగిన ఒత్తిడి ఉమ్మడి విశాఖ జిల్లాలో సుమారు 300 వరకూ పెట్రోల్ బంకులుండగా.. విశాఖ జిల్లాలో 120 బంకులు ఉన్నాయి. వీటిలో 10 ప్రైవేట్ బంకులు ఉన్నాయి. ఎప్పుడైతే ప్రైవేట్ బంకుల్లో ఇంధనం నిలిచిపోయిందో, ఆ ప్రభావం ప్రభుత్వ రంగ సంస్థల బంకులపై పడింది. ప్రైవేట్ బంకులకు వెళ్లాల్సిన వాహనదారులు ప్రభుత్వ బంకుల వైపు మళ్లడం.. పరిమిత నిల్వలు ఉన్న బంకుల వద్ద భారీ క్యూ లైన్లు.. ముందు జాగ్రత్తగా ట్యాంకులు ఫుల్ చేయించుకోవాలనే తొందరలో వాహనదారుల వల్ల ఒక్కసారిగా ఒత్తిడి పెరిగింది. డిమాండ్–సరఫరా మధ్య అంతరం జిల్లాలోని రోజువారీ అవసరాలకు, ప్రస్తుత సరఫరాకు మధ్య గణనీయమైన వ్యత్యాసం కనిపిస్తోంది. పెట్రోల్ సాధారణంగా రోజుకు 1.5 లక్షల లీటర్ల సరఫరా జరగాల్సి ఉండగా, ప్రస్తుతం అది 90 వేల నుంచి లక్ష లీటర్లకు పడిపోయింది. డీజిల్ రోజువారీ విక్రయాలు లక్ష లీటర్ల వరకు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం 80 వేల లీటర్ల సరఫరా మాత్రమే జరుగుతోంది. వాహనదారుల ఆందోళన పగటిపూట ఇంధనం అందుబాటులో ఉన్నా, సాయంత్రం, రాత్రి సమయానికి వచ్చేసరికి ‘స్టాక్ అయిపోయింది’ అనే సమాధానం వినిపిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ పరిస్థితి వదంతులకు మరింత ఆజ్యం పోస్తోంది. అసోసియేషన్, అధికారుల భరోసా జిల్లా పెట్రోల్ బంకుల అసోసియేషన్ ప్రతినిధి నారాయణ మాట్లాడుతూ వాహనదారులు ఎలాంటి అపోహలకు గురికావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ‘ప్రస్తుతం కేవలం ప్రైవేట్ బంకుల్లో మాత్రమే ఇంధన కొరత కారణంగా ’నో స్టాక్’ బోర్డులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ బంకుల్లో సరిపడా నిల్వలు ఉన్నాయి. వచ్చే 10 రోజుల్లో సరఫరా వ్యవస్థ పూర్తిగా గాడిలో పడి, అన్ని బంకుల్లోనూ 100 శాతం స్టాక్ అందుబాటులోకి వస్తుంది,’ అని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఈ తాత్కాలిక ఇబ్బందులను గమనించి, వదంతులను నమ్మవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాలో 25న బంకుల్లో ఉన్న పెట్రోల్, డీజిల్ స్టాక్ వివరాలు (కిలో లీటర్లు) కంపెనీ పెట్రోల్ డీజిల్ హెచ్పీసీఎల్ 716 684 బీపీసీ 442 665 ఐఓసీఎల్ 424 338 మొత్తం 1582 1687 -
విద్యార్థుల వేదనలా?
శతాబ్ది వేడుకలా? ఏయూ శతాబ్ది ఉత్సవాల రిజిస్ట్రేషన్ కోసం ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో ఎండలో వేచి ఉన్న విద్యార్థులు విశాఖ సిటీ: వంద ఏళ్ల చరిత్ర.. వేల మంది మేధావుల పురిటిగడ్డ.. దేశ విదేశాల్లో వెలుగులీనిన ఆంధ్ర విశ్వవిద్యాలయ కీర్తి కిరీటం ఇప్పుడు అధికారుల బాధ్యతారాహిత్యంతో వెలవెలబోతోంది. ఈ నెల 27న జరగనున్న శతాబ్ది ఉత్సవాల వేళ, వ్యవస్థీకృత లోపాలు వర్సిటీ ప్రతిష్టను గంగలో కలుపుతున్నాయి. మేధావుల ఇలాకాలో ’రాతియుగపు’ పోకడలు అటు విద్యార్థులను, ఇటు సిబ్బందిని విస్మయానికి గురిచేస్తున్నాయి. సొంత బిడ్డలకే ‘రిజిస్ట్రేషన్’ కష్టాలు! విశ్వవిద్యాలయంలో చదివే విద్యార్థులు, బోధించే ప్రొఫెసర్లు, విధులు నిర్వర్తించే సిబ్బందికి ఇప్పటికే అధికారిక గుర్తింపు కార్డులు ఉన్నాయి. అయితే, ఉత్సవాల్లో పాల్గొనాలంటే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు హుకుం జారీ చేయడం విడ్డూరంగా ఉంది. దశాబ్దాల కాలంగా వర్సిటీకి సేవ చేస్తున్న ప్రొఫెసర్లను సైతం సాధారణ రిజిస్ట్రేషన్ కోసం క్యూలో నిలబెట్టడం వారిని అవమానించడమేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘సొంత ఇంటి పండగకు వెళ్లడానికి అనుమతి కోసం ఎండలో నిలబడాలా?’ అంటూ మేధావులు మండిపడుతున్నారు. డిజిటల్ యుగంలో.. ఆఫ్లైన్ రిజిస్ట్రేషనా? దేశం డిజిటల్ మార్గంలో దూసుకుపోతుంటే... అదే మార్పుకు దారితీసే విద్యాసంస్థలో మాత్రం పాత పద్ధతులే కొనసాగుతున్నాయి. ఆన్లైన్ వ్యవస్థలు అందుబాటులో ఉన్నప్పటికీ, రిజిస్ట్రేషన్ను పూర్తిగా ఆఫ్లైన్లో నిర్వహించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో నిర్వహించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పరిస్థితి దారుణంగా మారింది. మండుటెండలో విద్యార్థులు గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చింది. తాగునీరు, నీడ వంటి కనీస సదుపాయాలు కూడా లేవు. భారీ రద్దీకి సరిపడా కౌంటర్లు ఏర్పాటు చేయలేదు. ఇది నిర్వహణలో ఉన్న లోపాలను బట్టబయలు చేసింది. ప్రముఖుల రాక వేళ.. ఇదేనా ఏర్పాట్ల తీరు? ఈ వేడుకలకు ఉప రాష్ట్రపతి, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటి అతిరథ మహారథులు హాజరవుతున్నారు. ఇంతటి కీలక సమయంలో క్షేత్రస్థాయి ఏర్పాట్లు ఇంత అధ్వాన్నంగా ఉండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రణాళికా లోపం.. ప్రతిష్టపై మచ్చ హడావుడి, హంగామా తప్ప క్షేత్రస్థాయిలో ప్రణాళిక కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వందేళ్ల ఘన చరిత్ర కలిగిన విశ్వవిద్యాలయం ప్రతిష్టకు ఇది మచ్చగా మారుతోందని విద్యార్థులు, ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే ఈ శతాబ్ది వేడుకలు సంబరంగా కాకుండా ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోవడం ఖాయం అనే అభిప్రాయం వినిపిస్తోంది. వందేళ్ల గౌరవాన్ని నిలబెట్టాల్సిన వేడుకలు, నిర్వాహకుల నిర్లక్ష్యంతో విద్యార్థుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఏయూ పరువు తీస్తున్న అధికారుల ’అజ్ఞానం’! సొంత విద్యార్థులు, ఉద్యోగులకు రిజిస్ట్రేషన్ కష్టాలు మండుటెండలో విద్యార్థుల ఇబ్బందులు డిజిటల్ యుగంలో.. రాతియుగపు పద్ధతులు -
సాగర తీరాన భక్తి కెరటం
ఏయూ క్యాంపస్ : సాగరతీరం భక్తిరసంతో మునిగిపోయింది. ‘జై శ్రీరామ్’ నినాదాలతో బీచ్రోడ్ మార్మోగిపోగా.. నగరం నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులు కాషాయ జెండాలతో శోభాయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సంప్రదాయం, ఆధ్యాత్మికత, ఐక్యత కలిసిన ఈ మహోత్సవం శనివారం సాయంత్రం కనులపండువగా సాగింది. ఈ సందర్భంగా పూర్వ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు మాట్లాడుతూ లోకానికి మార్గదర్శకుడు శ్రీరామచంద్రుడు ఆదర్శ రాజ్యాన్ని స్థాపించిన మహానుభావుడని కొనియాడారు. శ్రీరాముని పాలన ప్రజలకు న్యాయం, ధర్మం, సమానత్వం కలిగించిన ఆదర్శమని పేర్కొన్నారు. హనుమంతుని నిస్వార్థ సేవ, అంకితభావం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని సూచించారు. ఈ శోభాయాత్రలో రామనామ స్మరణ, హనుమ జపాలతో నగరం అంతా ఆధ్యాత్మిక వాతావరణంలో తేలిందన్నారు. యువతపై దృష్టి సారిస్తూ, దేశ అభివృద్ధిలో వారి పాత్రను హైలైట్ చేశారు. ‘‘యువతలో అపారమైన శక్తి దాగి ఉంది. దాన్ని గుర్తించి వెలికితీయడం గురువుల బాధ్యత. యువతతోనే వికసిత భారత్ లక్ష్యం సాకారం అవుతుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కనులపండువగా శ్రీరామ శోభాయాత్ర -
చందమామ రావే.. చిట్టి కూనలను చూసి పోవే..
ల్యూటినో పారకిట్లుఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కులో పండగ వాతావరణం నెలకొంది. జూ వాతావరణం వన్యప్రాణుల పునరుత్పత్తికిఎంతో అనుకూలంగా మారడంతో గత ఏడాదిగా పలు అరుదైన జాతులు తమ సంతతిని విజయవంతంగా వృద్ధి చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కేవలం నెల రోజుల వ్యవధిలో తొమ్మిది విభిన్న జాతులకు చెందిన ఏకంగా 35 జంతువులు, పక్షుల పిల్లలు జన్మించడం విశేషం. వీటిలో అత్యధికంగా 10 ఆసియాటిక్ వైల్డ్ డాగ్(అడవి కుక్క) పిల్లలు సందడి చేస్తుండగా, ఎనిమిది స్పాటెడ్ డీర్ పిల్లలు కనువిందు చేస్తున్నాయి. వీటితో పాటు ఏడు ఆకర్షణీయమైన ల్యూటినో పారకిట్ పక్షులు, మూడు ఇండియన్ గ్రే వోల్ఫ్(తోడేలు) పిల్లలు జన్మించాయి. అలాగే రెండు గ్రే ఫెలికాన్లు, రెండు రెయింబో లోరికిట్లు, ఒక మార్మోసెట్, ఒక స్ట్రైప్ట్ హైనా, ఒక బార్కింగ్ డీర్ పిల్లలు పుట్టి జూ కుటుంబ పరిమాణాన్ని మరింత పెంచాయి. ఇలా ఒకేసారి ఇన్ని జాతులు తమ సంతతిని వృద్ధి చేసుకోవడాన్ని జూ చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ 35 పిల్లలన్నీ సంపూర్ణ ఆరోగ్యంతో, చురుగ్గా ఉన్నాయని జూ క్యూరేటర్ జి.మంగమ్మ తెలిపారు. జూ వెటర్నరీ వైద్య బృందం వీటిని ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచుకుని కంటికి రెప్పలా చూసుకుంటోందని వెల్లడించారు. కొద్ది రోజుల్లోనే వీటిని ఆయా ఎన్క్లోజర్లలోకి విడిచి పెట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇవి త్వరలోనే సందర్శకులను అలరించనున్నాయి. -
నేటి నుంచి రెండో విడత చందనం అరగదీత
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో ఆదివారం నుంచి రెండో విడత చందనం అరగదీత ప్రక్రియ ప్రారంభం కానుంది. వచ్చే నెల 1వ తేదీన వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని, ఆ రోజు స్వామికి సమర్పించేందుకు మూడు మణుగుల పచ్చి చందనాన్ని(సుమారు 125 కిలోలు) సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు శనివారం చందనం చెక్కలను అరగదీతకు వీలుగా ముక్కలుగా కోశారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో జె.వెంకటరావు, ప్రధానార్చకుడు కరి సీతారామాచార్యులు, ఇన్చార్జి డీఈ హరి, సిబ్బంది సాంబ తదితరులు పాల్గొన్నారు. కాగా.. ఏడాదిలో స్వామి వారికి చందనోత్సవం రోజు రాత్రి, వైశాఖ పౌర్ణమి, జ్యేష్ట పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో ఉదయం వేళల్లో మూడు మణుగుల చందనాన్ని సమర్పిస్తామని అర్చకులు తెలిపారు. ఇప్పటికే చందనోత్సవం సందర్భంగా తొలి విడత చందన సమర్పణ పూర్తయిందని, రెండో విడతగా వచ్చే నెల 1న స్వామికి చందనం అలంకరిస్తామని వారు వివరించారు. ఉప రాష్ట్రపతి, సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన మహారాణిపేట: ఈ నెల 27న జిల్లాలో జరగనున్న ఉప రాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ శనివారం పరిశీలించారు. వైస్ ప్రెసిడెంట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, ప్రోటోకాల్ ఆఫీసర్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, ఇతర అధికారులతో కలిసి ఆయన ఐఎన్ఎస్ డేగా వద్ద పర్యటించారు. అక్కడ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఏయూ శతాబ్ది వేడుకల వేదిక వద్దకు చేరుకొని అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను చూశారు. సాయంత్రం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ వద్ద జరుగుతున్న శంకుస్థాపన ఏర్పాట్ల పనులను పరిశీలించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
నడకపై పన్ను అవాస్తవమైతే.. ఆ ఫ్లెక్సీలు ఎవరివి?
మహారాణిపేట: విశాఖలో నడకపై పన్ను విధిస్తూ.. ప్రజలను నిలువు దోపిడీ చేసేందుకు సిద్ధమైన చంద్రబాబు ప్రభుత్వం, ఇప్పుడు జీవీఎంసీ కమిషనర్తో సత్యదూరమైన మాటలు మాట్లాడిస్తోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో నడిచినా పన్ను కట్టాలన్న ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర ప్రజాగ్రహం వ్యక్తమవుతోందన్నారు. దీంతో ప్రభుత్వం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్తో వివరణ ఇప్పించిందని పేర్కొన్నారు. నడకపై పన్ను అనేది అవాస్తవమని, అది కేవలం దుష్ప్రచారమేనని, ఎవరైనా పన్ను అడిగితే ఫిర్యాదు చేయాలని కమిషనర్ చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. ‘ఒక వేళ కమిషనర్ చెప్పింది నిజమే అయితే, పార్కులు, స్టేడియంల వద్ద నోటీసులు, ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారు? ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడం కాదా?’ అని ప్రశ్నించారు. తక్షణమే పార్కులు, స్టేడియంల వద్ద ఏర్పాటు చేసిన నోటీసులను, ఫ్లెక్సీలను తొలగించాలన్నారు. కమిషనర్ అనుమతి లేకుండా, ఆయన పేరు మీద నోటీసులు పెట్టిన వారిపై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అబద్ధాలు చెప్పిస్తున్నారు అధికార ప్రతినిధి రాజీవ్ గాంధీ -
ప్రశాంతంగా ముగిసిన పాలిసెట్
మురళీనగర్: జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన పాలిసెట్–2026 ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని 44 కేంద్రాల్లో 14,759 మంది విద్యార్థులకు గాను 14,118 మంది హాజరయ్యారు. దీంతో జిల్లాలో 95.66 శాతం హాజరు నమోదైంది. జిల్లా కో–ఆర్డినేటర్ కేవీ రమణ, అసిస్టెంట్ కో–ఆర్డినేటర్ పీఎం భాషా ఏర్పాట్లను పర్యవేక్షించారు. నగరం పరిధిలోని 18 కేంద్రాలకు 6,330 మంది విద్యార్థులను కేటాయించగా, 6,019 మంది హాజరయ్యారు. 95.09 శాతం హాజరు నమోదైంది. పెందుర్తిలో 96.07 శాతం, గాజువాకలో 96.05 శాతం, మధురవాడలో 95.84 శాతం, తగరపువలసలో 95.78 శాతం మేర నమోదైంది. అత్యధికంగా భీమునిపట్నంలో 97.68 శాతం హాజరు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. ఎండ తీవ్రత కారణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు. ఉదయం 11 గంటలకు బదులు.. 9 గంటలకు పరీక్ష ప్రారంభించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. జిల్లాలో 95.66 శాతం హాజరు -
న్యాయవాదుల అభ్యున్నతే లక్ష్యం
విశాఖ లీగల్: విశాఖ న్యాయవాదుల సంఘం నూతన అధ్యక్షుడిగా నమ్మి సన్యాసిరావు యాదవ్ ఘన విజయం సాధించారు. శుక్రవారం సాగిన ఈ ఎన్నికల్లో ఆయన తన సమీప అభ్యర్థిపై 201 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. న్యాయవాదుల సంక్షేమం, అభ్యున్నతే ధ్యేయంగా తన సేవలు అందిస్తానని స్పష్టం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎదురయ్యే సవాళ్లను న్యాయవాదులు ధీటుగా ఎదుర్కోవాలని, వృత్తిపరమైన పరిజ్ఞానాన్ని నిరంతరం పెంచుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇందుకు అవసరమైన అన్ని వసతులను బార్ కౌన్సిల్లో కల్పిస్తామని, ముఖ్యంగా గ్రంథాలయాన్ని ఆధునికీకరించి కంప్యూటర్లు, ఇంటర్నెట్ సౌకర్యాలను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. అంచెలంచెలుగా ఎదిగి అధ్యక్ష స్థానానికి.. నమ్మి సన్యాసిరావు 2003లో నగరంలోని సెయింట్ ఆన్స్ లా కళాశాల నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. ప్రముఖ న్యాయవాది అందాల శ్రీనివాసరావు వద్ద జూనియర్గా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆయన, తన నైపుణ్యంతో అంచెలంచెలుగా ఎదిగారు. గతంలో విశాఖ న్యాయవాదుల సంఘం కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన, ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికై తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. నూతన అధ్యక్షుడు సన్యాసిరావుకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ఎస్.కృష్ణమోహన్, నర్సింగరావు, బి.వి.ఆర్.మూర్తి, మంజులత, కె. రామ జోగేశ్వరరావు తదితరులు అభినందనలు తెలిపారు. నూతన కార్యవర్గ ఎన్నిక ఈ ఎన్నికల్లో అధ్యక్షుడితో పాటు ఇతర కీలక పదవులకు ఎన్నికై న వారు సోమవారం పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నూతన కార్యదర్శిగా ఒమ్మి వెంకట సుధాకర్ యాదవ్, ఉపాధ్యక్షురాలిగా పీలా మీనాక్షి, సంయుక్త కార్యదర్శిగా గాలి రామిరెడ్డి, కోశాధికారిగా సనపల బాలకృష్ణ, మహిళా ప్రతినిధిగా వై.కవిత ఎన్నికయ్యారు. విశాఖ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు సన్యాసిరావు -
నేడు గవర్నర్ రాక
మహారాణిపేట: రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం విశాఖపట్నం రానున్నారు. ఆదివారం రాత్రి 8.35 గంటలకు విజయవాడ నుంచి విమానంలో విశాఖ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా నోవాటెల్ హోటల్కు చేరుకుని బస చేస్తారు. 27న ఉదయం 9.45 గంటలకు హోటల్ నుంచి బయలుదేరి ఐఎన్ఎస్ డేగాకు చేరుకుంటారు. అక్కడ భారత ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికి, అనంతరం తిరిగి హోటల్కు చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్నం 3.20 గంటలకు ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానానికి చేరుకుని, అక్కడ నిర్వహించే ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. 28న సాయంత్రం విశాఖ విమానాశ్రయం నుంచి విమానంలో విజయవాడకు బయలుదేరుతారు. -
కారు ఢీకొని హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం
సబ్బవరం: విధి నిర్వహణ కోసం బయలుదేరిన హెడ్ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. సబ్బవరం మండలంలో జరిగిన ఈ ఘటన అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖలో విషాదాన్ని నింపింది. వివరాలివి.. అనకాపల్లి జిల్లా స్పెషల్ బ్రాంచ్లో పని చేస్తూ, పరవాడ పోలీస్స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ కె.పి.ఆర్.వి.ఎన్. ప్రసాద్ శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే వారాంతపు నివేదికల సమర్పణ కోసం ఆయన సుజాతనగర్ నుంచి అనకాపల్లికి తన ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. సబ్బవరం మండలం ఇరువాడ వద్ద ఆనందపురం–అనకాపల్లి జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా, వెనుకనే అతి వేగంగా వచ్చిన ఒక కారు ఆయన వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందారు. 2000 బ్యాచ్కు చెందిన ప్రసాద్ తన వృత్తి జీవితాన్ని విశాఖపట్నం సిటీ పరిధిలో కానిస్టేబుల్గా ప్రారంభించారు. ఆ తర్వాత 2 టౌన్, 4 టౌన్ శాంతి భద్రతల విభాగాలతో పాటు హార్బర్, స్టీల్ ప్లాంట్, పెందుర్తి ట్రాఫిక్ విభాగాల్లో పనిచేశారు. ఎంవీపీ కాలనీ క్రైమ్ విభాగంలో, సిటీ స్పెషల్ బ్రాంచ్లోనూ ఆయన సేవలు అందించారు. జిల్లాల పునర్విభజన అనంతరం అనకాపల్లి జిల్లాకు కేటాయించడంతో.. ఆయన పరవాడ పరిధిలో సమర్థవంతంగా పనిచేస్తున్నారని సహచర సిబ్బంది తెలిపారు. క్షేత్రస్థాయిలో ముందస్తు సమాచారాన్ని సేకరించడంలో ఆయనకు ఉన్న నేర్పును ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. పోలీస్ శాఖ దిగ్భ్రాంతి హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ మృతి పట్ల అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, పోలీస్ శాఖ తరపున ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇటీవల ప్రసాద్ కుమారుడు చదువులో ప్రతిభ కనబరిచినందుకు ఎస్పీ చేతుల మీదుగానే పురస్కారం అందుకోవడం ఆ కుటుంబంలో ఎంతో ఆనందాన్ని నింపింది. అయితే ఆ సంతోషం మరువక ముందే ఇలాంటి విషాదం చోటుచేసుకోవడం పోలీస్ వర్గాల్లో తీవ్ర వేదనను మిగిల్చింది. సబ్బవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖలో విషాదం -
సాహితీ శిఖరం ఎల్.ఆర్.స్వామి అస్తమయం
ఆరిలోవ/సీతంపేట: ప్రముఖ కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత ఎల్.ఆర్.స్వామి శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యంలో ఉన్న ఆయన కన్నుమూశారు. ఆయన మృతితో విశాఖలోని సాహితీ వర్గాల్లో విషాదం నెలకొంది. జన్మతహా మలయాళీ అయినప్పటికీ, ఆయన మాతృభాష తమిళం. ఉద్యోగ రీత్యా విశాఖపట్నంలో స్థిరపడిన ఆయన, తెలుగు భాషపై ఉన్న మక్కువతో అందులో అసాధారణ ప్రావీణ్యం సంపాదించి పలు రచనలు చేశారు. మలయాళంలోని అనేక విశిష్ట రచనలను తెలుగులోకి, తెలుగులోకి ప్రసిద్ధ రచనలను మలయాళంలోకి అనువదించి, రెండు భాషల మధ్య వారధిగా నిలిచారు. ముఖ్యంగా ఆయన అనువదించిన ‘సూఫీ చెప్పిన కథ’ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది. స్వామి భౌతికకాయాన్ని సందర్శనార్థం విశాలాక్షినగర్ వెటర్నరీ కాలనీలో ఉన్న ఆయన రెండో కుమార్తె నివాసంలో ఉంచారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సాహితీవేత్తలు, అభిమానుల సందర్శనార్థం భౌతికకాయాన్ని అక్కడే ఉంచుతామని కుటుంబ సభ్యులు తెలిపారు. సాహితీ లోకం సంతాపం ఎల్.ఆర్.స్వామి మృతి పట్ల సహృదయ సాహితీ, విశాఖ సాహితీ, అరసం, సమతా సాహితీ, సాహిత్య సురభి, అరసం, మేడా బుజ్జమ్మ ట్రస్ట్, తెలుగు దండు, విసా–1971, హిందీ సాహిత్య భారతి, గరిమ, విశ్వనాథ సాహిత్య పీఠం, వంటి సంస్థల ప్రతినిధులు సంతాపం ప్రకటించారు. శేఖరమంత్రి ప్రభాకర్, ఆచార్య కోలవెన్ను మలయవాసిని, మల్లా ప్రగడ రామారావు, వి.కల్యాణ రామారావు, డాక్టర్ డి.వి.సుబ్బారావు, ద్విభాష్యం రాజేశ్వరరావు, డాక్టర్ కె.జి.వేణు, ఆచార్య వి.బాలమోహనదాసు, మేడా మస్తాన్రెడ్డి, అట్టాడ అప్పలనాయుడు, శిఖామణి, బులుసు వెంకటేశ్వర్లు, తదితర ప్రముఖులు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బహుభాషా కోవిదుడైన స్వామి మరణం తెలుగు సాహిత్యానికి, ముఖ్యంగా అనువాద రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
కానిస్టేబుల్ మృతికి సంతాపం
అల్లిపురం: విధి నిర్వహణలో ఉండగా మరణించిన సీతమ్మధార ఎకై ్సజ్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఎల్.ఎస్.నాయుడు మృతి పట్ల రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. శుక్రవారం వీఎంఆర్డీఏ కాంప్లెక్స్లో గల జిల్లా సూపరింటెండెంట్ కార్యాలయంలో ఉత్తరాంధ్ర జిల్లాల ఎకై ్సజ్ అధికారులతో ఎకై ్సజ్ కమిషనర్ శ్రీధర్ చామకూరి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభానికి ముందు అధికారులు రెండు నిమిషాలు మౌనం పాటించి నాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సీఐ స్థాయి నుంచి డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులతో స్టేషన్ల వారీగా పనితీరుపై చర్చించారు. భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కమిషనర్ కేజీహెచ్కు వెళ్లి మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు ప్రభుత్వం, శాఖ తరఫున సాయం మంత్రి కొల్లు రవీంద్ర ఒక ప్రకటన విడుదల చేస్తూ.. మృతుని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి తక్షణ సహాయంగా ఎకై ్సజ్ శాఖ నుంచి రూ. 10 లక్షలు, ఎస్బీఐ ఇన్సూరెన్స్ విభాగం నుంచి రూ. 1.10 కోట్లు అందుతాయని పేర్కొన్నారు. కుటుంబంలో అర్హులైన వారికి కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. -
పదోన్నతి పొందిన పోలీసు సిబ్బందికి సత్కారం
అల్లిపురం: నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో పదోన్నతి పొందిన పలువురు సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి సత్కరించారు. శుక్రవారం సిరిపురంలోని వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో జరిగిన కార్యక్రమంలో ఆయన 8 మంది సిబ్బందికి పదోన్నతి ఉత్తర్వులను అందజేసి అభినందించారు. ఒకరు సీనియర్ అసిస్టెంట్ నుంచి సూపరింటెండెంట్గా, ఒకరు జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్గా, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లుగా, మరో ముగ్గురు కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందారు. వీరికి సంబంధించిన నూతన ర్యాంకులను, పోస్టింగ్ ఆర్డర్లను సీపీ అందజేశారు. ఈ సందర్భంగా సీపీ ఇతర ఉన్నతాధికారులతో కలిసి సిబ్బందిని, వారి కుటుంబ సభ్యులను అభినందించారు. పదోన్నతి పొందిన వారు మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి, పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. -
విధి నిర్వహణలో పారదర్శకత అవసరం
అల్లిపురం: నగర పోలీస్ అధికారులు, సిబ్బంది విధులను పారదర్శకంగా నిర్వహించాలని పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి సూచించారు. విధుల్లో చట్టవ్యతిరేక చర్యలు, అధికార దుర్వినియోగం లేదా అవినీతి చోటుచేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శుక్రవారం పోలీస్ కమిషనరేట్లో నిర్వహించిన క్రైమ్ రివ్యూ సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు. ప్రతి స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లపై నిఘా చర్యలను పరిశీలించారు. ఇటీవల నమోదు చేసిన ఎన్డీపీఎస్ కేసులను సమీక్షిస్తూ, నగరం గుండా గంజాయి రవాణా పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించారు. స్టేషన్లలో పెండింగ్లో ఉన్న కేసుల వివరాలు, ఆలస్యానికి కారణాలు తెలుసుకుని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. కోర్టు తీర్పులు వచ్చిన కేసులపై కూడా సమీక్ష నిర్వహించారు. ప్రతి స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, నిర్మానుష్య, సమస్యాత్మక ప్రాంతాల్లో విజిబుల్ పోలీసింగ్, పికెటింగ్, అవసరమైతే డికాయ్ టీంలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈవ్ టీజింగ్, ట్రిపుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్ వంటి సమస్యలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైన వాహనాలు, సిబ్బంది గురించి తెలియజేయాలని సూచించారు. పొక్సో కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. నగరంలో నేరాల రేటు తగ్గేందుకు రాత్రిపూట నిఘాను మరింత బలోపేతం చేయాలని సూచించారు. సైబర్ క్రైమ్పై అవగాహన కార్యక్రమాలు పెంచాలని, ఆధునిక సాఫ్ట్వేర్ వినియోగాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, వేధింపులు లేదా మిస్సింగ్ కేసులలో ఆలస్యం లేకుండా స్పందించాలని సూచించారు. కోర్టుల్లో కేసులు ఆలస్యం కాకుండా చూసి, కన్విక్షన్ రేటు పెరగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. లోక్ అదాలత్లో మరిన్ని కేసులు పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. సమావేశంలో డీసీపీలు వి.ఎన్.మణికంఠ చందోలు, డి.మేరీ ప్రశాంతి, డీసీపీ (క్రైమ్స్) లతా మాధురి, ఏడీసీపీలు, ఏసీపీలు, ఎస్హెచ్ఓలు తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదు
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలకు విద్యార్థులంతా సులభంగా, నిర్ణీత సమయానికి చేరుకునేలా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ సూచించారు. కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ భరత్ గుప్తాతో కలిసి శుక్రవారం ఏయూ సమీపంలోని ఎస్బీఐ కోదండరామ మీటింగ్ హాలులో శతాబ్ది వేడుకల ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల రవాణా, పార్కింగ్ సదుపాయం, బస్సుల రూట్ మ్యాప్, ప్రవేశ పాసుల జారీ వంటి కీలక అంశాలపై చర్చించారు. ఏయూ వసతి గృహాల్లో ఉండేవారు, డే స్కాలర్లు, అనుబంధ కళాశాలల విద్యార్థులు వేదిక వద్దకు చేరుకోవడానికి అనుసరించాల్సిన విధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. బస్సులు ఎటువైపు నుంచి రావాలి, వాహనాలను ఎక్కడ పార్క్ చేయాలి, విద్యార్థులు గ్యాలరీల్లో ఎక్కడ కూర్చోవాలి అనే విషయాలపై స్పష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేడుకలకు హాజరయ్యే ప్రతి ఒక్కరికీ రిజిస్ట్రేషన్ పూర్తి చేసి పాసులు జారీ చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. వేడుకల నిర్వహణలో ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకుండా ఏయూ అధికారులు, పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమీక్షలో జేసీ గొబ్బిళ్ల విద్యాధరి, ట్రాఫిక్ ఏడీసీపీ ప్రవీణ్ కుమార్, డీఆర్డీఏ పీడీ లక్ష్మీపతి, ఏయూ అధికారులు పాల్గొన్నారు. ఏయూ శతాబ్ది ఉత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష -
బైక్ ఢీకొని ఎకై ్సజ్ హెడ్ కానిస్టేబుల్ మృతి
మర్రిపాలెం: ఒక ద్విచక్ర వాహనాన్ని మరో బైక్ బలంగా ఢీకొన్న ప్రమాదంలో ఎకై ్సజ్ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందగా, మరో ఇద్దరు యువకులు గాయపడ్డారు. ఈ ఘటన కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాలివి.. గురువారం అర్ధరాత్రి సుమారు 12.30 గంటల సమయంలో సీతమ్మధారలోని ఎకై ్సజ్ కార్యాలయంలో విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ లగుడు సింహాచలం నాయుడు.. పని నిమిత్తం తాటిచెట్లపాలెం నుంచి ఊర్వశి జంక్షన్ వైపు తన బైక్పై వెళ్తున్నారు. జాతీయ రహదారిపై వెళ్తున్న క్రమంలో, వెనుకనే అతివేగంగా వచ్చిన మరో బైక్ ఆయన వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సింహాచలం నాయుడు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్లో ఆయన్ని కేజీహెచ్కు తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆయన కొద్దిసేపటికే మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన మరో బైక్పై ఉన్న దేవుపల్లి కార్తీక్, బొట్ట శ్రీకాంత్ కూడా గాయపడటంతో వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కంచరపాలెం ట్రాఫిక్ సీఐ పి.రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మే నెలాఖరుకు రహదారులు పూర్తి కావాలి
విశాఖ సిటీ: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కనెక్టివిటీని పెంచే బృహత్తర ప్రణాళిక రహదారుల నిర్మాణాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్.తేజ్ భరత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో రహదారి పనుల పురోగతిపై ఆయన అంశాల వారీగా సమీక్షించారు. బీటీ కొరత ఉంటే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించి అనుకున్న సమయానికే రహదారులను పూర్తి చేయాలని చెప్పారు. అడవివరం–శొంఠ్యాం, నేరేళ్లవలస–కొత్తవలస రహదారుల్లో అర్హులైన మిగిలిన యజమానులందరికీ జీవీఎంసీ సమన్వయంతో మే 1వ తేదీ నాటికి టీడీఆర్ పంపిణీలు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అలాగే మే 15 నాటికి అడవివరం–శొంఠ్యాం రహదారిలో అసంపూర్తిగా ఉన్న కల్వర్టుల నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు. బోయపాలెం–కాపులుప్పాడ రహదారి చివరి బిటుమినస్ కాంక్రీట్ లేయర్ పనులను మే మొదటి వారంలో, అడవివరం–శొంఠ్యాం రహదారి చివరి బిటుమినస్ కాంక్రీట్ లేయర్ పనులను మే రెండో వారంలో ప్రారంభించాలని సూచించారు. వేపగుంట–పినగాడి రహదారి నిర్మాణంలో భాగంగా మిగిలి ఉన్న కట్టడాలకు పరిహారాన్ని పంపిణీ పూర్తి చేయాలన్నారు. ప్రార్థన మందిరాలు, ఆలయ సంబంధ సమస్యలను రెవెన్యూ శాఖ సహాయంతో పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో సీఈ వినయ్కుమార్, సీయూపీ శిల్పా, ఎస్ఈ మధుసూదనరావు, ఈఈలు పాల్గొన్నారు. -
నారీ శక్తి.. ప్రగతికి స్ఫూర్తి
ఔషధాలకు సెగతుపాకీ గుళ్లు అక్కడ పేలుతుంటే.. ఇక్కడ మధ్యతరగతి రోగి గుండె గుభేల్ మంటోంది. సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులు కదులుతుంటే.. ఇళ్లలో మందుల డబ్బాలు ఖాళీ అవుతున్నాయి. ఎర్ర సముద్రంలో నౌకల రాకపోకలకు పడిన బ్రేక్.. ఇప్పుడు దేశీయ ఔషధ రంగానికి ‘ప్రాణసంకటం’గా మారింది. జ్వరం వస్తే వేసుకునే పారాసిటమాల్ నుంచి ప్రాణం నిలిపే యాంటీబయాటిక్స్ వరకు.. ముడి పదార్థాల ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో సామాన్యుడి మందుల చిట్టీ ‘మందుపాతర’లా మారుతోంది. యుద్ధం దేశాల మధ్య జరుగుతుంటే.. ఆరోగ్య రక్షణ కోసం పేదవాడు తన జేబుతో యుద్ధం చేయాల్సిన దుస్థితి దాపురించింది. నేడు పాలిసెట్మందుల పెట్టె.. ‘మందు’పాతర -
అక్కను వేధిస్తున్నాడని.. హతమార్చాడు
తాటిచెట్లపాలెం: తన సోదరిని వేధిస్తున్నాడనే కోపంతో ఓ తమ్ముడు దారుణానికి ఒడిగట్టాడు. తన అక్కతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని కిరాతకంగా చంపిన ఘటన ఫోర్త్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలివి.. కంచరపాలెం ప్రాంతానికి చెందిన రాతు శ్రీను తన సోదరితో కలిసి నివసిస్తున్నాడు. శ్రీను సోదరికి గతంలోనే తుని ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. అయితే భర్తతో మనస్పర్థలు కారణంగా విడిపోయింది. వారికి ఒక పాప కూడా ఉంది. ఈ క్రమంలో తుని ప్రాంతానికి చెందిన ప్రశాంత్(32)తో పరిచయం ఏర్పడింది. ఐదేళ్ల కిందట వీరు జీవనోపాధి కోసం విశాఖ వచ్చేశారు. ప్రశాంత్ ఆటో డ్రైవర్గా పనిచేస్తూ.. శ్రీను సోదరితో సహజీవనం చేస్తున్నాడు. అయితే, ప్రశాంత్ తరచూ మద్యం సేవించి తన సోదరిని వేధిస్తున్నాడని శ్రీను, అతడిపై కక్ష పెంచుకున్నాడు. ఈ విషయమై వీరిద్దరి మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. అయితే ఎలాగైనా అతడిని వదిలించుకోవాలని శ్రీను పథకం రచించాడు. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం.. శుక్రవారం సాయంత్రం మద్యం సేవించడానికి రావాలని ప్రశాంత్ను కై లాసపురం పాత పోస్టాఫీస్ ప్రాంతానికి శ్రీను పిలిచాడు. అక్కడ ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. అనంతరం, సమయం చూసి శ్రీను తన వెంట తెచ్చుకున్న కత్తితో ప్రశాంత్పై దాడి చేశాడు. అంతటితో ఆగకుండా, పక్కనే ఉన్న బండరాళ్లతో కొట్టి ప్రశాంత్ను హతమార్చాడు. అనంతరం నిందితుడు ఫోర్త్టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గ్రామాలే దేశాభివృద్ధికి పునాది
మహారాణిపేట: స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా గ్రామీణ నాయకత్వంలో వారి పాత్ర గణనీయంగా పెరిగిందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె. సుభద్ర అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 33వ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకు బలమైన చట్టబద్ధత లభించిందని, 1993 నుంచి గ్రామీణ స్వపరిపాలన బలోపేతం అవుతోందన్నారు. గ్రామాలే దేశాభివృద్ధికి పునాది అని, నిర్ణయాధికారాల్లో మహిళల పాత్ర మరింత పెరగాలని ఆకాంక్షించారు. సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ స్థాయిలో సేవలు ప్రజలకు మరింత చేరువయ్యాయని ఆమె ఉద్ఘాటించారు. జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి మాట్లాడుతూ.. పంచాయతీలకు 29 అంశాలపై అధికారాలు కల్పిస్తూ అధికార వికేంద్రీకరణకు ప్రాధాన్యమిచ్చారని తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని, 16వ ఆర్థిక సంఘం ద్వారా గ్రామ పంచాయతీలకు మరిన్ని నిధులు అందనున్నాయని వివరించారు. ‘స్వర్ణ పంచాయత్’పోర్టల్ ద్వారా పన్నుల వసూళ్లను ఆన్లైన్ చేయడం చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. డీపీవో శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థల్లో పంచాయతీరాజ్ ఒకటని, వికసిత భారత్ లక్ష్య సాధనలో ఇది కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. డిప్యూటీ సీఈవో రాజ్కుమార్ మాట్లాడుతూ పారదర్శకతతో గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 50 మంది ఉద్యోగులకు జెడ్పీ చైర్పర్సన్ ప్రశంసా పత్రాలను అందజేసి సత్కరించారు. -
ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
మహారాణిపేట: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 28న తర్లువాడ పర్యటనను విజయవంతం చేయడానికి పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో సీఎం పర్యటనపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గూగుల్ డేటా సెంటర్–ఏఐ హబ్కు శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరుకానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని సూచించారు. గూగుల్ ప్రతినిధులు, అధికార యంత్రాంగం సమన్వయంతో పని చేసి కార్యక్రమం సాఫీగా జరిగేలా చూడాలన్నారు. నిర్ణీత గడువులో హెలిప్యాడ్ నిర్మాణం పూర్తి చేయడంతో పాటు తాత్కాలిక రహదారుల పనులు ముగించాలని ఆదేశించారు. దుమ్ము ఎగరకుండా నీటి పిచికారీ చేయాలని, తాగునీరు, పారిశుధ్యం, ఫైర్, ఎలక్ట్రికల్ భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా హాజరయ్యే అవకాశం ఉన్నందున గ్రీన్ రూమ్ల ఏర్పాట్లపై జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. 27న వీఈఆర్ సమావేశం ఈ నెల 27న నోవాటెల్ వేదికగా నిర్వహించనున్న విశాఖ ఎకనామిక్ రీజియన్ (వీఈఆర్) ద్వితీయ సమావేశానికి కూడా తగిన ఏర్పాట్లు చేయాలని జీవీఎంసీ, వీఎంఆర్డీఏ కమిషనర్లను ఆదేశించారు. సంబంధిత ప్రాజెక్టులు, ఇతర అంశాలపై సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేసుకోవాలని, వివిధ కంపెనీల ప్రతినిధులు, ప్రముఖులతో జరిగే విందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, జేసీ గొబ్బిళ్ల విద్యాధరి, డీసీపీ విజయ్ మణికంఠ, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, ఆర్డీవోలు పాల్గొన్నారు. -
ప్రస్తుతానికి ఇబ్బంది లేదు.. కానీ..
ప్రస్తుత నిల్వలను పాత ధరలకే విక్రయిస్తున్నప్పటికీ, సమీప భవిష్యత్తులో జనరిక్, అత్యవసర మందుల ధరలు పెరిగే అవకాశం ఉంది. దుబాయ్ వంటి పశ్చిమాసియా కేంద్రాల నుంచి దిగుమతి చేసుకునే ముడిసరుకు ధరలు విపరీతంగా పెరగడంతో తయారీ సంస్థలు ధరల నిర్మాణాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతానికి మందుల నిల్వలు సరిపడా ఉన్నప్పటికీ, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు ఇబ్బందులు తప్పవు. మందుల తయారీకి అవసరమైన పెట్రో రసాయనాలపై దిగుమతి సుంకాలను కేంద్ర ప్రభుత్వం జూన్ చివరి వరకు రద్దు చేసినా, యుద్ధం ఆగితే తప్ప పరిస్థితులు చక్కబడవు. ప్రస్తుతానికై తే సరఫరా సంక్షోభం తలెత్తకుండా హోల్సేల్ వ్యాపారులంతా తగినంత స్టాక్ నిర్వహిస్తున్నారు. – గ్రంథి వీరవెంకట నాగ సుమన్, కార్యదర్శి, వైజాగ్ మెడికల్ హోల్సేల్ అసోసియేషన్ -
వెయిట్లిఫ్టింగ్లో
చైన్నె పోర్టు సత్తావిశాఖ స్పోర్ట్స్: విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 44వ ఆల్ ఇండియా మేజర్ పోర్ట్స్ బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్షిప్స్ 2025–26 శుక్రవారం ఘనంగా ముగిశాయి. నగరంలోని సాగరమాల కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ముగింపు కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ముగింపు వేడుకలకు పోర్ట్ అథారిటీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ అరుణ్ ప్రసాద్ (ఐఈఎస్) ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు పతకాలు అందజేశారు. పోటీలో పాల్గొన్న క్రీడాకారులు క్రమశిక్షణ, నైపుణ్యం, క్రీడాస్ఫూర్తిని ప్రతిబింబించారని అభినందించారు. దేశవ్యాప్తంగా ఆరు ప్రధాన పోర్ట్ అథారిటీలకు చెందిన జట్లు ఈ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచాయి. వెయిట్ లిఫ్టింగ్ ఫలితాలు 100 కేజీల విభాగంలో చైన్నె పోర్ట్ బంగారు పతకం, విశాఖ పోర్ట్ వెండి, కాంస్య పతకం సాధించాయి. 100 కేజీలకు పైబడిన విభాగంలో చైన్నె పోర్ట్, ముంబై పోర్ట్, విశాఖ పోర్ట్, 56 కేజీల విభాగంలో చైన్నె పోర్ట్, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్, దీన్దయాల్ పోర్ట్, 67.5 కేజీల విభాగంలో ముంబై పోర్ట్, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్, చైన్నె పోర్ట్, 82.5 కేజీల విభాగంలో చైన్నె పోర్ట్, విశాఖ పోర్ట్ అథారిటీ, ముంబై పోర్ట్ వరుసగా బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించినట్లు అధికారులు తెలిపారు. -
ఐఐఏఎంలో వీసీల సదస్సు
ఎంవీపీ కాలనీ: ఎంవీపీ కాలనీలో ఇంటిగ్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ (ఐఐఏఎం) వేదికగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ –2020పై ఉపకులపతుల సదస్సు శుక్రవారం నిర్వహించారు. సమావేశంలో ఉన్నత విద్యా సంస్థల్లో అవసరమైన మార్పులపై ప్రసంగించారు. ఈ సందర్భంగా సెంచూరియన్ యూనివర్సిటీ కులపతి ఆచార్య జీఎస్ఎన్ రాజు మాట్లాడుతూ దేశ విద్యా వ్యవస్థ డిగ్రీల ఆధారిత విధానం నుంచి నైపుణ్యాల ఆధారిత విధానంగా రూపాంతరం చెందిందన్నారు. విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టులను ఎంచుకొని, ఉత్తమ నైపుణ్యత పొందడమే ఈ విధానం ప్రధాన లక్ష్యమన్నారు. అనంతరం ఐఐఏఎం గ్రూప్ చైర్మన్ డాక్టర్ సుంకరి రవీంద్ర, మాజీ వీసీలు, ప్రొఫెసర్లు కేఎస్ చలం, బాలమోహన్దాస్, నాగేశ్వరరావు, లజపతిరాయ్, జార్జివిక్టర్, సుధాకర్, ప్రసాద్ , ఐఐఏఎం డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ కృష్ణమోహన్ పాల్గొన్నారు. -
కన్ను!
ఖాళీ స్థలాలపైజీవీఎంసీ ఖాళీ స్థలాలను ప్రైవేట్ వారికి విక్రయించేందుకే ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు స్పష్టం చేస్తున్న టెండర్ డాక్యుమెంట్ జీవీఎంసీ ఖాళీ స్థలాలు, భవనాల విక్రయానికి రంగం సిద్ధం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ముసుగులో బినామీలకు దోచిపెట్టే పన్నాగం ఆదాయార్జన పేరుతో విలువైన భూములను కారుచౌకగా కాజేసే స్కెచ్ అడ్డగోలు నిబంధనలతో డ్రామా.. అంతా బాబు మార్క్ మాయాజాలం ‘కంచె కాపాడాల్సినవాడే పంట మేసినట్టు’.. అభివృద్ధి పేరిట విశాఖ ప్రజా ఆస్తులపై కన్నేసిన ప్రభుత్వం.. జీవీఎంసీకి చెందిన విలువైన ఖాళీ స్థలాలు, భవనాలను ప్రైవేటుకు అప్పగించే యత్నానికి తెరలేపింది. ‘ఇంటి దొంగను ఈశ్వరుడూ పట్టలేడు’ అన్నట్టుగా.. స్మార్ట్ సిటీ కార్పొరేషన్ పేరుతో ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులు ఆహ్వానిస్తూ.. తక్కువ ధరకే అనుయాయులు, బినామీలకు కట్టబెట్టే పన్నాగం నడుస్తోందన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం విశాఖ నగరాభివృద్ధికి పైసా విదిల్చని చంద్రబాబు ప్రభుత్వం.. ఇక్కడి ప్రభుత్వ ఆస్తులను మాత్రం హారతి కర్పూరంలా కరిగించేందుకు సిద్ధమైంది. అడ్డగోలుగా రోడ్లు, పార్కులు, స్టేడియాలను ప్రైవేటుపరం చేస్తూ ఇప్పటికే నగరవాసుల గొంతు కోస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా జీవీఎంసీ పరిధిలోని ఖాళీ స్థలాలు, విలువైన భవనాలపై పడింది. పీపీపీ విధానం, దీర్ఘకాలిక లీజుల పేరుతో నాటకమాడుతూ.. లోపాయకారీగా తన అనుయాయులకు, బినామీలకు కారుచౌకగా విశాఖ భూములను కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా జీవీఎంసీకి చెందిన ఖాళీ స్థలాలు, భవనాల ద్వారా ఆదాయాన్ని రాబట్టేందుకు వీలుగా సలహాలు, సూచనలు చేసేందుకు ముందుకు రావాలంటూ ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తుల (ఆర్ఎఫ్పీ)ను ఆహ్వానించింది. ఈ ప్రక్రియను గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ (జీవీఎస్సీసీఎల్)కు అప్పగించింది. ప్రస్తుతం సాంకేతిక బిడ్లను పరిశీలించే పని కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. నియంత పోకడలు.. ప్రశ్నిస్తే ‘అవుట్’ ఈ టెండర్ ప్రక్రియలో పొందుపరిచిన నిబంధనలు చూస్తుంటే ఇది పారదర్శకమైన వేలం లాగా కాకుండా, ‘ఎంపిక చేసిన’ వారికే అప్పగించే ప్రక్రియలా కనిపిస్తోంది. ఎటువంటి కారణం చూపకుండానే ఏ బిడ్నైనా తిరస్కరించే సర్వాధికారాలు జీవీఎస్సీసీఎల్కు ఉంటాయి. దీనిపై ఏ సంస్థా కోర్టుకు వెళ్లేందుకు గానీ, ఫిర్యాదు చేసేందుకు గానీ వీల్లేదు. అంటే, ప్రభుత్వం ముందుగానే నిర్ణయించుకున్న సంస్థకు ఈ ఆస్తులు కట్టబెట్టేందుకు వీలుగా ఇతర పోటీదారులను అడ్డగోలుగా తప్పించేందుకే ఈ నిబంధనలు పెట్టినట్లు విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.అయోమయంలో ‘స్మార్ట్’ వ్యవహారం ఈ భూ దందాను నేరుగా జీవీఎంసీ ద్వారా కాకుండా.. ‘గ్రేటర్ విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్’ ద్వారా నడిపిస్తుండటం గమనార్హం. దీనికి సరైన యంత్రాంగం లేని ఈ సంస్థ ద్వారా ఒక ప్రైవేటు కన్సల్టెన్సీని మధ్యలోకి తెచ్చారు. దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం.. జీవీఎంసీ ఆస్తుల పూర్తి వివరాలను, వాటి మార్కెట్ విలువను ముందే తమ బినామీలకు చేరవేసి, టెండర్లలో వారికే ప్రయోజనం చేకూరేలా చేయడం. ఆదాయార్జన కోసం సలహాలు అనే పేరుతో.. విశాఖ భూములను ఎవరికి ఏ మేరకు దోచిపెట్టాలనే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఇందుకు టెండర్లో పేర్కొన్న కొన్ని నిబంధనలు కూడా ఆరోపణలకు మరింత ఊతమిస్తున్నాయి. గీతంతో మొదలై.. గ్రేటర్ను మింగేలా.. వాస్తవానికి నగరంలోని ప్రభుత్వ స్థలాలను తక్కువ ధరకు కొల్లగొట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ప్రక్రియ ‘గీతం’ సంస్థ నుంచే ప్రారంభించింది. గతంలో గీతం ఆక్రమించుకున్న రూ. 5 వేల కోట్ల విలువైన భూములను అతి తక్కువ ధరకే క్రమబద్ధీకరించేందుకు జీవీఎంసీలో తీర్మానం చేయించడం ద్వారా ప్రభుత్వం తన ఉద్దేశాన్ని చాటుకుంది. చివరకు దత్తపుత్రిక ‘ఆంధ్రజ్యోతి’కి భూమి అప్పగించే విషయంలో కౌన్సిల్ అంగీకరించకపోయినా.. రికార్డులను ఫోర్జరీ చేయడానికి కూడా వెనుకాడలేదు. ఇప్పుడు అదే బాటలో జీవీఎంసీ ఆస్తుల వేలానికి ‘ఆర్ఎఫ్పీ’ పేరుతో కొత్త నాటకానికి తెరలేపింది. -
న్యాయమూర్తులకు బదిలీ, పదోన్నతులు
విశాఖ లీగల్ : రాష్ట్ర వ్యాప్తంగా పలువురు అదనపు జిల్లా న్యాయమూర్తులకు బదిలీ కాగా పలువురు సీనియర్ సివిల్ జడ్జిలకు పదోన్నతి లభించింది. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు రిజిస్టర్ జనరల్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి సీఎన్ మూర్తికి బదిలీ అయింది. ఆయన స్థానంలో గుంటూరు అదనపు జిల్లా న్యాయమూర్తి చక్రపాణి నియమితులయ్యారు. సీఎన్ మూర్తి గుంటూరు ఫోక్స్ కోర్టు న్యాయమూర్తిగా బదిలీపై వెళ్తున్నారు. విశాఖలోని అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి యు.యు.ప్రసాద్ బదిలీపై విజయవాడ వాణిజ్య న్యాయస్థానం న్యాయమూర్తిగా బదిలీపై వెళ్తున్నారు. విజయవాడ 13వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి డి.శేషయ్య విశాఖలోని ఏసీబీ కోర్టు న్యాయమూర్తిగా బదిలీపై వస్తున్నారు. గాజువాక 12వ అదనపు జిల్లా జడ్జి జి.షణ్ముఖురావు విశాఖలోని నూతనంగా ఏర్పాటు చేసిన మూడో అదనపు కుటుంబ న్యాయస్థానం న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. గాజువాకలోని 13 అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తిగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం సీనియర్ సివిల్ జడ్జి కె.వెంకటేశ్వరరావు పదోన్నతిపై వస్తున్నారు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తిగా విజయవాడ వాణిజ్య కోర్టు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట సీనియర్ సివిల్ జడ్జి జె.శ్రీనివాసరావు కుటుంబాన్ని న్యాయస్థానం న్యాయమూర్తిగా పదోన్నతిపై వస్తున్నారు. కొత్తగా ఏర్పాటుచేసిన 15వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తిగా నగరంలోని నాలుగో అదనపు జిల్లా జడ్జి ఎం.శ్రీహరి బదిలీ అయ్యారు. విశాఖలోని ప్రధాన కుటుంబ న్యాయస్థానం న్యాయమూర్తి జయ రాధారత్నం గుంటూరు బదిలీ కాగా, ఆమె స్థానంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ ఎం.రాధాకృష్ణరాజు వస్తున్నారు. నగరంలోని ఆరో అదనపు జిల్లా కోర్టు కం మహిళా కోర్టు న్యాయమూర్తి వి.శ్రీనివాసరావు బదిలీ కాగా ఆయన స్థానంలో పార్వతీపురం అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్.దామోదర్ రావు బదిలీపై వస్తున్నారు. -
పాలిసెట్కు ఏర్పాట్ల పూర్తి
మురళీనగర్ : జిల్లాలో పాలిసెట్–2026 నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 44 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తంగా 14,689 మంది పరీక్షలు రాయనున్నారు. ఈసారి గాజువాక, మధురవాడ, తగరపువలస ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులను ఉదయం 10 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని జిల్లా కోఆర్డినేటర్ కేవీ రమణ, అసిస్టెంట్ కోఆర్డినేటర్ పీఎం బాషా తెలిపారు. పరీక్షకు ఒక నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదన్నారు. అనివార్య కారణాల వల్ల ఎన్ఏడీలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని రద్దు చేసి.. దీని స్థానంలో ఎన్ఏడీలోని నారాయణ ఈఎం హైస్కూలు, శ్రీచైతన్య ఈఎం స్కూల్లో కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. -
● హార్బర్ వెలవెల
ఎప్పుడూ కళకళలాడే హార్బర్ నేడు వెలవెలబోతోంది. తూర్పు తీరంలో చేపల వేటపై ఈ నెల 14 అర్ధరాత్రి నుంచి నిషేధం అమలులోకి రావడంతో సముద్ర తీరం నిశ్శబ్దంగా మారిపోయింది. హార్బర్లోని జెట్టీకి దాదాపు 2,500 బోట్లు ఒకదాని పక్కన ఒకటి క్రమ పద్ధతిలోకట్టి ఉంచారు. గత 10 నెలలుగా సముద్రపు అలలతో పోరాడుతూ, అవిశ్రాంతంగా వేట సాగించిన మత్స్యకారులకు ఇప్పుడు ప్రభుత్వం విధించిన నిషేధంతో రెండు నెలల పాటు విరామం లభించింది. బోట్లకు రంగులు వేయడం, ఇంజిన్లు చెక్ చేయడం, చిరిగిపోయిన వలలను కుట్టడం వంటి పనుల్లో మత్స్యకారులు నిమగ్నమై ఉన్నారు. మళ్లీ జూన్ 15న వేట మొదలయ్యే నాటికి తమ నౌకలను సిద్ధం చేసే పనిలో మత్స్యకారులు నిమగ్నమయ్యారు. – మహారాణిపేట -
నడకపై పన్ను ‘కూటమి’ పిచ్చికి పరాకాష్ట
అల్లిపురం: విశాఖలో వాకింగ్ చేసే పౌరులపై పన్ను విధించడం అత్యంత హేయమైన చర్య అని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ మండిపడ్డారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన జీవనం కోసం వాకింగ్ను ప్రోత్సహిస్తుంటే, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం రూ.720 పన్ను విధిస్తూ ప్రజల నడకపై ఉక్కుపాదం మోపుతోందని విమర్శించారు. గత రెండేళ్లలో విశాఖకు ఒక్క అభివృద్ధి పనిచేయని చంద్రబాబు ప్రభుత్వం.. వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన పార్కులు, స్టేడియాలపై పన్నులు వసూలు చేయడం సిగ్గుచేటని అన్నారు. లోకేష్ తోడల్లుడు, ఎంపీ భరత్కు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అప్పగించిన ప్రభుత్వం, సామాన్య పౌరుడు పార్కులోకి వెళ్తే మాత్రం పన్ను విధించడం వారి అహంకారానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఈ ‘వాకింగ్ టాక్స్’ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. సామాన్యుడి శ్వాసపై కూడా పన్ను వేసే స్థాయికి ప్రభుత్వం దిగజారిందని, దీనికి ప్రజలే తగిన సమాధానం ఇస్తారని అన్నారు. అభివృద్ధి శూన్యం.. దోపిడీ అపారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా విశాఖలో కనీసం ఒక ప్రాజెక్టు గానీ, ఒక్క భవనం గానీ పూర్తి చేయలేదన్నారు. ప్రస్తుతం పన్నులు విధిస్తున్న ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం, శివాజీ పార్క్ వంటి వసతులు వైఎస్ జగన్ హయాంలో అభివృద్ధి చేసినవేనని తెలిపారు. వాటిపై ఇప్పుడు పన్నులు విధించడం అనుచితమని విమర్శించారు. విశాఖ నిధుల తరలింపు విశాఖ వాసులు జీవీఎంసీకి చెల్లించిన పన్ను నిధులను అమరావతికి తరలిస్తున్నారనే సమాచారం ఉందని, దీనిపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో ‘ఆపరేషన్ లంగ్స్’ పేరుతో చిరువ్యాపారులను ఇబ్బందులకు గురి చేసిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు వాకింగ్ టాక్స్ పేరుతో మధ్యతరగతి ప్రజలను వేధిస్తోందని విమర్శించారు. తక్షణమే విశాఖలో వాకింగ్ పన్నును రద్దు చేయాలని, లేకపోతే న్యాయపోరాటంతో పాటు ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. సామాన్యుడి నడకపై పన్ను వేసిన ఈ ప్రభుత్వానికి ప్రజలు రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. -
జీవితంలో విలువలూ, సంస్కారమే ప్రధానం
మద్దిలపాలెం: విద్యతో పాటు జీవితంలో విలువలు, సంస్కారం ఎంతో ప్రధానమని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా, న్యాయ కళాశాల ఆధ్వర్యంలో బీచ్రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా మానవీయ స్పర్శను మరువరాదని హితవు పలికారు. పెరిగిపోతున్న సైబర్ నేరాలు, మహిళలపై దాడులను అరికట్టడంలోనూ, ప్రకృతి పర్యావరణ పరిరక్షణలోనూ న్యాయవాదులు బాసటగా నిలవాలన్నారు. సమాజంతో న్యాయవాదులకు నేరుగా సంబంధం ఉంటుందని గుర్తుచేశారు. మహిళా రిజర్వేషన్లు ఎవరు అడ్డుకున్నా ఆగవని, జనాభాలో సగం ఉన్న వారికి తగిన న్యాయం జరగాలని ఆకాంక్షించారు. ఏయూ న్యాయ కళాశాల తన గమ్యాన్ని మార్చిందని, ఎదుగుదలకు మొదటి మెట్టు ఇక్కడే పడిందని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. తెన్నేటి విశ్వనాథం వంటి మహనీయులతో గడిపిన క్షణాలు తనలో మార్పుకు కారణమయ్యాయని గుర్తు చేసుకున్నారు. భారతీయులు ఎప్పుడూ సర్వజన హితాన్ని, ప్రపంచ శాంతిని కోరుకుంటారని, ప్రస్తుత యుద్ధాలకు సామ్రాజ్య కాంక్షే కారణమని విశ్లేషించారు. ఆధునిక సాంకేతికతతో పాటు అంతర్జాతీయ న్యాయ పరిణామాలను యువత అందిపుచ్చుకోవాలని సూచించారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ.. కళాశాల నుంచి ఉన్నతంగా ఎదిగిన వ్యక్తులు నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తారన్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసఫ్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం దేశ వికాసానికి మూలమని, విభిన్న భాషలు, సంస్కృతులు ఉన్న ప్రజలను ఏకం చేస్తున్నది రాజ్యాంగమేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా న్యాయ కళాశాల శతాబ్ది సంచికను ఆవిష్కరించారు. నల్సార్తో పాటు పలు సంస్థలతో అవగాహన ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. తొలుత ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్, చిత్రకళా ప్రదర్శనను వెంకయ్య నాయుడు ప్రారంభించి తిలకించారు. అనంతరం వర్సిటీ తరపున ఆయన్ని ఘనంగా సత్కరించారు. అతిథులు, విశ్రాంత ప్రిన్సిపాళ్లు, ఆచార్యులను సత్కరించి శతాబ్ది జ్ఞాపికలను అందించారు. కార్యక్రమంలో న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.సీతామాణిక్యం, ఐఐయూఎల్ఈఆర్ (గోవా) వీసీ ఆచార్య ఆర్.వెంకటరావు, నల్సార్ వీసీ ఆచార్య పి.కృష్ణదేవరావు, డీఎస్ఏఎల్యూ వీసీ ఆచార్య డి.సూర్యప్రకాశరావు, రెక్టార్ ఆచార్య పి.కింగ్, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. -
ఈ–కేవైసీ వేగవంతం
కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ ఆదేశం మహారాణిపేట: రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో పట్టాదారు పాసుపుస్తకాల జారీకి సంబంధించి ఈ–కేవైసీ ప్రక్రియను వేగవంతం చేయాలని, తద్వారా మెరుగైన ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఆయన, జిల్లాలో జరుగుతున్న ప్రగతిని వివరించారు. ప్రస్తుత విధానాన్ని సమీక్షించి, అవసరమైన మార్పులు చేస్తూ లోపాలను సవరించి కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు. దీనికోసం ఒక స్పష్టమైన టైమ్ షెడ్యూల్ను రూపొందించి, పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తామని చెప్పారు. ఈ–కేవైసీ ప్రక్రియలో తలెత్తే సాంకేతిక తప్పులను ఎప్పటికప్పుడు సవరించి ప్రక్రియను వేగవంతం చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. వివిధ అంశాలపై సీనియర్ ఐఏఎస్ అధికారులు జయలక్ష్మి, సురేశ్ కుమార్, ప్రశాంతి, హరి జవహర్ లాల్ తదితరులు మాట్లాడుతూ.. రీసర్వే, పట్టాదారు పాసుపుస్తకాలు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ల ఏర్పాటు, జలధార వంటి అంశాలపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, జీవీఎంసీ, రెవెన్యూ, సర్వే, డ్వామా తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
75 వేల మంది సామర్థ్యంతో..
ప్రస్తుతం విశాఖ నుంచి నిత్యం 110 నుంచి 130 రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా, అందులో దాదాపు 40 రైళ్లు ఇక్కడి నుంచే బయలుదేరుతున్నాయి. భవిష్యత్తులో ఈ సంఖ్య 50 నుంచి 75 శాతం మేర పెరిగే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా ప్లాట్ఫాంలను టెర్మినల్ తరహాలో 650 నుంచి 1000 మీటర్ల పొడవుతో నిర్మిస్తున్నారు. దీని వల్ల 24 కోచ్లకు పైగా ఉన్న సుదీర్ఘ రైళ్లను కూడా సులభంగా నిలిపే వీలుంటుంది. ప్రస్తుతం రోజుకు 45 వేల నుంచి 50 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండగా, ఆధునికీకరణ పనులు పూర్తయితే ఆ సామర్థ్యం 75 వేల నుంచి 90 వేల వరకు పెరగనుంది. -
అంతర్జాతీయ క్రికెటర్లకు ఘన సత్కారం
విశాఖ స్పోర్ట్స్: అంతర్జాతీయ క్రికెట్లో రాణిస్తున్న మహ్మద్ షబ్నం, అంధుల ప్రపంచ క్రికెట్లో సత్తా చాటిన కరుణకుమారిలను ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు ఘనంగా సత్కరించారు. ఆర్వీవీకే 80వ జయంతి సందర్భంగా గురువారం స్థానికంగా నిర్వహించిన కార్యక్రమంలో వీరిద్దరికీ చెరో రూ.10 వేల నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఆర్వీవీకే స్మారక క్రికెట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వీడీసీఏ ప్రతినిధులు పార్థసారథి, సుధాకర్, డి.ఎస్.వర్మ తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారిణులు మరిన్ని విజయాలు సాధించి నగరానికి, దేశానికి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. -
భిక్షాటన రహిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
అల్లిపురం: దేశంలోనే అత్యున్నత నగరంగా ఎదుగుతున్న విశాఖపట్నాన్ని భిక్షాటన రహిత నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఇందుకోసం ఒక వినూత్నమైన ప్రణాళికను రూపొందించామని చెప్పారు. ‘జ్యోతిర్గమయ’పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఇప్పటివరకు 491 మందికి ఆశ్రయం కల్పించామని వివరించారు. గురువారం సాయంత్రం నగర పోలీస్ కమిషనరేట్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జ్యోతిర్గమయ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 123 మందిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. మానసిక స్థితి సరిగా లేని 59 మందిని ప్రభుత్వ మానసిక చికిత్సాలయంలో, మరో 49 మందిని మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్లో చేర్పించినట్లు తెలిపారు. ఈ ప్రణాళిక అమలు బాధ్యతను పోలీస్ కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్, వైజాగ్ వలంటీర్స్ సంస్థ వ్యవస్థాపకుడు సతీష్తో పాటు స్థానిక ఎస్హెచ్వోలకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ట్రాన్స్జెండర్ల వివరాలను సేకరించి, వారి విద్యార్హతలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని సీపీ వివరించారు. సొంతంగా వ్యాపారం చేసుకోవాలనుకునే వారికి బ్యాంకుల ద్వారా రుణాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే 20 మంది ట్రాన్స్జెండర్లకు జీవీఎంసీలో ఉపాధి కల్పించామని, మరో 10 మందికి ఉపాధి లభించేలా మహిళా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో టీ–టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేయించామన్నారు. పాత నేరస్తుల్లో పరివర్తన తెచ్చి వారికి స్వయం ఉపాధి కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా నిరాశ్రయులకు ఆటో రిక్షాలు, బ్యాంకు రుణాలు పంపిణీ చేశారు. -
● చింపాంజీ చిల్..
భానుడి భగభగలకు జూలోని వన్యప్రాణులు అల్లాడిపోతున్నాయి. ఎండ తీవ్రత నుంచి వాటికి ఉపశమనం కల్పించేందుకు జూఅధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా, వన్యప్రాణులకు నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, ఆహారాన్ని అందిస్తున్నారు. చిత్రంలో కనిపిస్తున్న చింపాంజీ, యానిమల్ కీపర్ వేసిన పుచ్చకాయ ముక్కలను తింటూ ఎన్క్లోజర్లో ఎంతో ఉత్సాహంగా తిరుగుతోంది.ఆ ముక్కలను నోటితో పట్టుకుని సందర్శకులకు రకరకాల ఫోజులిస్తూ అలరిస్తోంది. – ఫొటో: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
శరీర సౌష్టవ పోటీలు ప్రారంభం
విశాఖ స్పోర్ట్స్: అఖిల భారత మేజర్ పోర్టుల బాడీ బిల్డింగ్, వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్ పోటీలు సాలిగ్రామపురంలోని సాగరమాల కన్వెన్షన్ సెంటర్లో గురువారం ప్రారంభమయ్యాయి. విశాఖపట్నం పోర్టు అథారిటీ(వీపీఏ) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలను డిప్యూటీ చైర్పర్సన్ రోష్ని అపరంజి కొరాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో రాణించాలని పిలుపునిచ్చారు. ఈ పోటీల్లో విశాఖపట్నంతో పాటు చైన్నె, ముంబయి, జవహర్లాల్ నెహ్రూ, దీన్దయాల్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్టుల జట్లు పాల్గొంటున్నాయి. జట్ల మార్చ్ఫాస్ట్, పతాకావిష్కరణ, క్రీడాకారుల ప్రమాణ స్వీకారాలు జరిగాయి. కార్యక్రమంలో విభాగాధిపతులు, క్రీడా విభాగ సభ్యులు పాల్గొన్నారు. -
నేడు న్యాయవాదుల సంఘం ఎన్నికలు
విశాఖ లీగల్ : విశాఖ న్యాయవాదుల సంఘం ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. మొత్తం 2,174 మంది న్యాయవాదులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని ఎన్నికల అధికారి సీనియర్ న్యాయవాది ఎ.ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఇందుకు ఆరు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. సాయంత్రం 6 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో తుది ఫలితాలు విడుదల చేస్తామని చెప్పారు. సీనియర్ న్యాయవాదులకు అసౌకర్యం లేకుండా వేదిక వద్ద రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కీలకమైన అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి పోస్టులకు నలుగురు చొప్పున పోటీలో ఉన్నారు. అభ్యర్థుల ప్రచారంతో కోర్టు ప్రాంగణం కోలాహాలంగా మారింది. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు న్యాయవాదుల సంఘం కార్యదర్శి ఎల్.పార్వతీశ్వర నాయుడు తెలిపారు. -
వేసవిలో ప్రత్యేక రైళ్లు
తాటిచెట్లపాలెం: వేసవి రద్దీ దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్ధం పలు మార్గాలలో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్, అధికారులు తెలిపారు. ● ముజఫర్పూర్–మైసూరు (06244) సమ్మర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ నెల 25వ తేదీ శనివారం రాత్రి 10.45 గంటలకు ముజఫర్పూర్లో బయల్దేరి సోమవారం ఉదయం 6.43 గంటలకు కొత్తవలసకు, మంగళవారం ఉదయం 7.45గంటలకు మైసూరు చేరుకుంటుంది. ● మచిలీపట్నం– ఖరగ్పూర్(07691) సమ్మర్ స్పెషల్ ఈ నెల 24వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు చర్లపల్లిలో బయల్దేరి అదేరోజు రాత్రి 7.50 గంటలకు దువ్వాడకు, మరుసటిరోజు శనివారం ఉదయం 11 గంటలకు ఖరగ్పూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఖరగ్పూర్–మచిలీపట్నం (07692) సమ్మర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఖరగ్పూర్లో ఈ నెల 25వ తేదీ శనివారం మధ్యాహ్నం 1 గంటకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 5.30 గంటలకు దువ్వాడకు, అదే రోజు సాయంత్రం 3 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. ● చర్లపల్లి–ఖరగ్పూర్(07693) సమ్మర్ స్పెషల్ ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 6.25 గంటలకు చర్లపల్లిలో బయల్దేరి అదేరోజు రాత్రి 7.33గంటలకు దువ్వాడకు, మరుసటిరోజు సోమవారం ఉదయం 10 గంటలకు ఖరగ్పూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఖరగ్పూర్–చర్లపల్లి (07694) సమ్మర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఖరగ్పూర్లో ఈ నెల 27వ తేదీ సోమవారం సాయంత్రం 4.30గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 5.35గంటలకు దువ్వాడకు, అదే రోజు రాత్రి 6.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. -
‘గూగుల్’ బాధితులను పరామర్శించనివ్వరా?
సీపీఎం నాయకులు తగరపువలస: ఆనందపురం మండలం తర్లువాడలోని గూగుల్ డేటా సెంటర్ భూ బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన సీపీఎం నాయకులను గురువారం సాయంత్రం పోలీసులు అడ్డుకున్నారు. వారిని బలవంతంగా అదుపులోకి తీసుకుని ఆనందపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టయిన వారిలో జీవీఎంసీ 78వ వార్డు మాజీ కార్పొరేటర్ గంగారావు, సీపీఎం భీమిలి డివిజన్ కార్యదర్శి ఆర్ఎస్ఎన్ మూర్తి ఉన్నారు. గూగుల్ డేటా సెంటర్ కోసం భూములు కోల్పోయిన 520 మంది రైతులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించిన తర్వాతే పనులు ప్రారంభించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం అక్కడ భారీ పోలీసు పహారా మధ్య పనులు జరుగుతుండటంతో, అక్కడి పరిస్థితిని సమీక్షించేందుకు వెళ్లిన నాయకులను సుమారు వంద మంది పోలీసులు గ్రామ పొలిమేరలోనే అడ్డుకున్నారు. వారిని చుట్టుముట్టి పోలీసు వాహనంలో స్టేషన్కు తరలించడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ.. గూగుల్ డేటా సెంటర్కు వ్యతిరేకంగా తాము నోరు మెదపకుండా సుమారు 400 మంది పోలీసులు గ్రామంలో 24 గంటలూ మోహరించి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత పది రోజులుగా రైతులను అనుమానిస్తూ అక్రమ కేసులు పెడతామని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. గతంలో పూర్వ కలెక్టర్ హరేందిర ప్రసాద్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇచ్చిన హామీ మేరకు 520 మంది రైతులకు తలా మూడు సెంట్ల భూమి కేటాయించలేదని వాపోయారు. తమకు రావాల్సిన భూములను బినామీల పేరుతో కొందరు నేతలు కాజేసి కోట్లు గడిస్తున్నారని విమర్శించారు. కాగా.. పోలీసుల తీరుపై మాజీ కార్పొరేటర్ గంగారావు, ఆర్ఎస్ఎన్ మూర్తి మండిపడ్డారు. బాధితులను కలవనీయకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన అని పేర్కొన్నారు. అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని నిరసన వ్యక్తం చేశారు -
భారీ ఎయిర్ కాన్కోర్స్ ప్రత్యేక ఆకర్షణ
ఈ పునర్నిర్మాణ ప్రాజెక్టులో ప్రధాన ఆకర్షణగా భారీ ఎయిర్ కాన్కోర్స్ నిలవనుంది. 72 మీటర్ల వెడల్పు, 220 మీటర్ల పొడవుతో దీనిని నిర్మిస్తున్నారు. స్టేషన్ ప్లాట్ఫాంల పైభాగంలో, సహజ సిద్ధమైన కాంతి ప్రసరించేలా దీనిని తీర్చిదిద్దుతున్నారు. ఇది స్టేషన్కు రెండు వైపులా ఉన్న ప్లాట్ఫాంలను అనుసంధానిస్తుంది. ఇక్కడ 600 మంది ప్రయాణికులు కూర్చునే వీలుండటంతో పాటు 20 వాణిజ్య దుకాణాలు కూడా రాబోతున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం మొత్తం 60 లిఫ్ట్లు, 50 ఎస్కలేటర్లు, 28 ర్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోనే అత్యంత రద్దీగా ఉండే విశాఖపట్నం రైల్వేస్టేషన్ రూపురేఖలు మారిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్టేషన్ పునర్నిర్మాణ ప్రాజెక్టు ఊపందుకుంది. తూర్పు, పశ్చిమ ప్రాంతాల వైపు 60 ఎకరాల విస్తీర్ణంలో, సుమారు రూ.1,000 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులు ప్రయాణికులకు విమానాశ్రయ స్థాయి అనుభూతిని అందించడమే లక్ష్యంగా సాగుతున్నాయి. ప్రస్తుతం స్టేషన్ ఉత్తర, దక్షిణ దిశలైన జ్ఞానాపురం వైపు, అలాగే ప్రధాన ప్రవేశ ద్వారం భారీ ఎత్తున నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గతంలో ప్రధాన కార్యాలయం, రిజర్వేషన్ కౌంటర్లు, వెయిటింగ్ హాళ్లు ఉన్న భవనాల స్థానంలో బహుళ అంతస్తుల అత్యాధునిక నిర్మాణాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఒక్కోటి 5 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంతో రెండు ప్రధాన భవనాలను నిర్మిస్తున్నారు. ప్రారంభంలో పనులు కొంత ఆలస్యమైనప్పటికీ.. ప్రస్తుతం మాత్రం వేగంగా పుంజుకున్నాయి. అసలు ఎటువైపు ఏం అభివృద్ధి జరుగుతోందో ఓసారి పరిశీలిద్దాం.. చురుగ్గా విశాఖపట్నం రైల్వే స్టేషన్ విస్తరణ ప్రస్తుతం ఉన్న 8 ప్లాట్ఫాంలను 14కు పెంచుతూ పనులు టెర్మినల్స్ మాదిరిగా ఫ్లాట్ఫాంల నిర్మాణం ఎర్రి గెడ్డ మురుగు కాలువ దారి మళ్లింపు.. 1.50లక్షల చదరపు అడుగుల పార్కింగ్ 60కి పైగా లిఫ్ట్లు, 50 వరకు ఎస్కలేటర్ల ఏర్పాటు -
50 ఏళ్ల భవిష్యత్తు ప్రణాళిక
రాబోయే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు చేపడుతున్నాం. ఈ స్టేషన్ను కేవలం రైళ్లు వచ్చి వెళ్లే ప్రాంతంగానే కాకుండా, నగరానికే తలమానికంగా నిలిచే ఒక భారీ వాణిజ్య, రవాణా కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనాల్లో రైల్వే కార్యాలయాలతో పాటు.. అత్యాధునిక వెయిటింగ్ హాల్స్, విశ్రాంతి గదులు, విశాలమైన వాణిజ్య సముదాయాలను ఏర్పాటు చేస్తున్నాం. ఈ పనులన్నీ పూర్తయితే, విశాఖపట్నం రైల్వే స్టేషన్ దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రధాన రవాణా కేంద్రంగా అవతరించి, నగర కీర్తిని దశదిశలా చాటుతుంది. – లలిత్ బోహ్రా, వాల్తేరు డీఆర్ఎం -
6 కొత్త ప్లాట్ఫాంలతో..
ప్రస్తుతం రైల్వే స్టేషన్లో 8 ప్లాట్ఫాంలు ఉండగా, తొలుత మరో రెండింటిని మాత్రమే ఏర్పాటు చేయాలని భావించారు. అయితే, పెరుగుతున్న రైళ్ల రద్దీతో పాటు విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఏర్పాటు కానున్న నేపథ్యంలో, అదనపు ప్లాట్ఫాంల ఆవశ్యకతను గుర్తించిన అధికారులు వీటి సంఖ్యను 14కు పెంచారు. ఈ ప్లాట్ఫాంలు అందుబాటులోకి వస్తే.. అవుటర్లో ప్లాట్ఫాం కోసం రైళ్లు నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. అలాగే, బైపాస్ మీదుగా రైళ్లను దారి మళ్లించే ఇబ్బందులు కూడా తప్పుతాయి. -
జీవీఎంసీకి ప్రతిష్టాత్మక అవార్డు
మహారాణిపేట: ఆస్తి పన్ను వసూళ్లలో రికార్డు స్థాయి ప్రగతి సాధించినందుకు జీవీఎంసీకు రాష్ట్ర స్థాయి ప్రతిష్టాత్మక అవార్డు లభించిందని కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. గురువారం విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి కమిషనర్ల వర్క్షాప్లో 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్, కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ పి.సంపత్ కుమార్ చేతుల మీదుగా అవార్డును, ప్రశంసా పత్రాన్ని స్వీకరించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విశాఖ నగరం ఆస్తి పన్ను చెల్లింపుల్లో అగ్రగామిగా నిలవడానికి పన్ను చెల్లింపుదారులు, ప్రజల సహకారం కీలకమని అన్నారు. 2025–26లో సుమారు రూ.510 కోట్ల వసూళ్లు నమోదై, అదనంగా రూ.60 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. రెవెన్యూ విభాగం, ఫీల్డ్ సిబ్బంది సమిష్టి కృషితో ఈ విజయాన్ని సాధించామని, భవిష్యత్తులో కూడా వసూళ్లను మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
‘దేవస్థానం భూములను పరిశ్రమలకు వాడటం దారుణం’
విశాఖ: దేవస్థానం భూములను పరిశ్రమలకు వాడటం దారుణమని విశాఖ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కేకే రాజు మండిపడ్డారు. దేవస్థానం భూమునుల ధార్మిక కార్యక్రమాలకే వాడాలని, గూగుల్ సంస్థకు 106 ఎకరాల సింహాచలం భూమి ఇవ్వడం దారుణమన్నారు. పంచగ్రమాల సమస్య పరిధిలో ఉన్న భూమిని ఏవిధంగా గూగుల్కు కేటాయిస్తారు. పంచ గ్రామాల సమస్యను పరిష్కరించాలని ప్రజలు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. అప్పన్న స్వామి 106 ఎకరాలకు బదులు వేరే చోట గూగుల్కు భూములు ఇవ్వాలి. భక్తుల మనోభావాలతో చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారు. చంద్రబాబు పెద్ద అపచారానికి పాల్పడుతున్నారు. అప్పన్న స్వామి భూములకు చంద్రబాబు శఠగోపురం పెడుతున్నారు.సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఏమి చేస్తున్నారు. అప్పన్న స్వామికి జరిగే అన్యాయం పవన్ కళ్యాణ్కు కనిపించలేదా?, నేడు చంద్రబాబు శంకుస్థాపన చేసిన రెన్యూ పవర్ ప్రాజెక్ట్ వైఎస్ జగన్ కృషి. 2023 సంవత్సరంలో రెన్యూ పవర్ ప్రాజెక్ట్ కు ఒప్పందం కుదిరింది. 4700 మెగావాట్ల ప్రాజెక్ట్ కు వైఎస్ జగన్ హయాంలో ఎంవోయూ కుదిరింది. చంద్రబాబు అబద్ధాలు చెపితే నమ్మడానికి పాతకాలం పేపర్ల యుగం కాదు. సోషల్ మీడియా యుగం’ అని స్పష్టం చేశారు. -
ఇనుప వ్యర్థాలతో భారతదేశ చిత్రపటం
గాజువాక : స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా జీవీఎంసీ ప్రకటించిన వేస్ట్ టు వండర్ చాంపియన్షిప్ పోటీల కోసం గాజువాకకు చెందిన మహాత్మా, మదర్ థెరిసా చారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడు జాగరపు శ్రీను ఇనుప వ్యర్థాలతో భారతదేశ చిత్రపటాన్ని రూపొందించారు. బ్రాండ్ వైజాగ్లో అందరూ భాగస్వాములు కావడంలో భాగంగా ఇనుప స్క్రాప్తో అందమైన శిల్పాలను తయారు చేయాలని జీవీఎంసీ పోటీలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఫ్యాబ్రికేషన్ యూనిట్ను నిర్వహిస్తున్న శ్రీను సైకిల్ ఛైన్లు, స్క్వేర్ పైపులు, జీఐ షీట్లు, సైకిల్ క్రాంక్లు, రిమ్లు, 6ఎంఎం, 8 ఎంఎం వేస్ట్ రాడ్లు, బైక్ చైన్లు, చైన్ స్పాకెట్లు, ఆటో గేర్ బాక్స్ వ్యర్థాలను ఉపయోగించి ఈ చిత్రాన్ని తయారు చేశారు. అందులో జాతీయ జెండాతోపాటు ఎద్దు, రైతు, ఆర్మీ సోల్జర్ వంటి చిత్రాలను కూడా దానికి అనుసంధానం చేశారు. ఈ చిత్రాన్ని చూసినవారు భలే ఉందే అంటూ శ్రీనును అభినందిస్తున్నారు. -
హాజరు ఇక్కడ.. వైద్యం అక్కడ!
విక్టోరియా ఆస్పత్రి వైద్యుల కాసుల వేటమహారాణిపేట: ఉత్తరాంధ్రలో ఏకై క ప్రసూతి ఆస్పత్రిగా పేరొందిన ప్రభుత్వ విక్టోరియా(ఘోషా) ఆస్పత్రిలో పనిచేస్తున్న కొందరు వైద్యులు కాసుల వేటలో పడ్డారు. ఆస్పత్రిలో డ్యూటీలకు డుమ్మా కొడుతూ, నగరంలోని కార్పొరేట్, ఇతర ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్లలో ప్రత్యక్షమవుతున్నారు. విధులకు హాజరైనట్టు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్(ఎఫ్ఆర్ఎస్)లో తప్పుడు నమోదులు చూపిస్తూ, ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రైవేటు ప్రాక్టీస్లో బిజీగా గడుపుతున్నారు. ఆస్పత్రిలో పర్యవేక్షణ లోపం కారణంగా కొందరు వైద్యులు మొక్కుబడిగా సేవలు అందిస్తున్నారంటూ ఇటీవల ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. సీనియర్ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో గర్భిణులు, బాలింతలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మసకబారుతున్న ఆస్పత్రి ప్రతిష్ట పేద మహిళలకు మెరుగైన ప్రసూతి వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఘోషాస్పత్రిని ఏర్పాటు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి సైతం ప్రసూతి కోసం రోగులు ఇక్కడికి వస్తుంటారు. ఒకప్పుడు ఇక్కడ వైద్యం బాగా అందుతుందనే నమ్మకం ఉండేది. కానీ, ప్రస్తుత వైద్యుల తీరుతో ఆ పేరు ప్రఖ్యాతులు క్రమేపీ మసకబారుతున్నాయి. ఈ ఆస్పత్రిలో అధికారికంగా 177 పడకలు ఉండాలి. కానీ, డెలివరీల సంఖ్య పెరగడంతో అదనంగా 73 పడకలు వేసి, మొత్తం 250 పడకలతో నడుపుతున్నారు. రద్దీ దృష్ట్యా మరో 20 పడకల నిర్మాణం కూడా చేపట్టారు. ఆస్పత్రిలోని నాలుగు గైనకాలజీ యూనిట్లకు నలుగురు ప్రొఫెసర్లు ఉన్నారు. ఒక్కో ప్రొఫెసర్కు ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, వారితో పాటు పీజీ, ఎంబీబీఎస్ వైద్య విద్యార్థులు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ప్రతి రోజూ ఓపీ విభాగానికి 125 నుంచి 150 మంది వరకు గర్భిణులు, బాలింతలు వివిధ చికిత్సల కోసం వస్తుంటారు. కాసుల వేటలో ప్రభుత్వ వైద్యులు ఇంతటి పేరున్న ఆస్పత్రిలో సీనియర్ వైద్యులు రోగులకు అందుబాటులో ఉండటం లేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఆన్–డ్యూటీ సమయంలోనే వారు ఇతర ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం అందిస్తుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉదయం ఆస్పత్రికి వచ్చి ఎఫ్ఆర్ఎస్ ద్వారా హాజరు వేసి, వెంటనే కార్పొరేట్ లేదా ప్రైవేట్ క్లినిక్లకు వెళ్లిపోతున్నారు. మళ్లీ మధ్యాహ్నం, సాయంత్రం తిరిగి వచ్చి బయోమెట్రిక్ వేసి యథావిధిగా ప్రైవేట్ ప్రాక్టీస్కు చెక్కేస్తున్నారు. నిత్యం ఎంతో మంది గర్భిణులు ప్రసవం కోసం వస్తుండగా, పీజీలు, ఎంబీబీఎస్ విద్యార్థులే వారికి వైద్యం అందిస్తున్నారు. అరకొర వైద్యంతో మొక్కుబడిగా మమ అనిపిస్తున్నారు. అంతేకాకుండా, ‘ఇక్కడ అన్ని సదుపాయాలు లేవు, బయట ఆస్పత్రుల్లో ఆపరేషన్ చేయించుకుంటే బాగుంటుంది’అంటూ కొందరు వైద్యులే ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఆర్థిక స్థోమత లేక, ప్రైవేటుకు వెళ్లలేక పేద మహిళలు ఆస్పత్రిలోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. పర్యవేక్షణ కరువు: ఆస్పత్రిలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో వైద్యులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. డ్యూటీ సమయంలో వైద్యులు విధుల్లో ఉండకపోవడంతో, ఓపీ నిర్వహణ, డెలివరీలు, బాలింతల చికిత్స అంతా వైద్య విద్యార్థులే చూసుకోవాల్సి వస్తోంది. సీనియర్ వైద్యుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఆకస్మిక ఆరోగ్య సమస్యలు తలెత్తితే గర్భిణులు ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. పేద ప్రజలు అరకొర వైద్యంతోనే సరిపెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ ప్రాక్టీస్ నగరంలో ప్రసూతి వైద్యులకు మంచి డిమాండ్ ఉంది. దీన్ని ఆసరాగా చేసుకొని విక్టోరియా ఆస్పత్రి వైద్యులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, నాన్–ప్రాక్టీసింగ్ అలవెన్స్ తీసుకునే వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకూడదు. ఒకవేళ ఆ అలవెన్స్ తీసుకోకపోయినా, ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధిగా ప్రభుత్వ ఆస్పత్రిలోనే రోగులకు సేవలు అందించాలి. ఆ తర్వాతే ప్రైవేట్ క్లినిక్లు నిర్వహించుకోవాలి. కానీ, డ్యూటీ వేళల్లోనే ఆస్పత్రిలో ఉండకుండా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆస్పత్రిలో వైద్యుల తీరు, గైర్హాజరు, రోగుల అవస్థలపై ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సహా ఉన్నతాధికారులకు ఇప్పటికే పలు ఫిర్యాదులు అందాయి. -
రైల్వే ‘నారీ శక్తి’కి అపురూప కానుక
విశ్రాంతి తీసుకుంటున్న రైల్వే మహిళా ఉద్యోగులు సాక్షి, విశాఖపట్నం : భారతీయ రైల్వేలో పురుషులతో సమానంగా, ఒక్కోసారి వారిని మించి విధుల్లో నిమగ్నమవుతున్న మహిళా ఉద్యోగుల ఆత్మగౌరవానికి వాల్తేరు డివిజన్ పట్టం కట్టింది. క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి, వారికంటూ ఒక ’సొంత గూడు’ను ఏర్పాటు చేస్తూ డీఆర్ఎం లలిత్ బోహ్రా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. సమస్యే పరిష్కారానికి నాంది ఇటీవల నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో, మహిళా సిబ్బంది తమ గోప్యత, విశ్రాంతి కోసం పడుతున్న ఇబ్బందులను డీఆర్ఎం స్వయంగా తెలుసుకున్నారు. స్టేషన్లలో నిరంతరం విధుల్లో ఉండే మహిళలకు సరైన విశ్రాంతి గదులు లేకపోవడం వారి ఆరోగ్యంపై, పనితీరుపై ప్రభావం చూపుతోందని గుర్తించిన ఆయన, తక్షణమే అధికారులతో సమావేశమై ‘వుమెన్ రెస్ట్ రూమ్స్‘ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. తొలి విడతలో 5 స్టేషన్లలో.. తొలి విడతలో భాగంగా ఐదు కీలక స్టేషన్లలో విశ్రాంతి గదుల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, సింహాచలం, పార్వతీపురం స్టేషన్లలో అత్యాధునిక వసతులతో కూడిన ఈ గదులను బుధవారం ప్రారంభించారు. కేవలం గదులను కేటాయించడమే కాకుండా, విధుల్లో అలసిపోయిన మహిళా ఉద్యోగులకు పూర్తిస్థాయి విశ్రాంతి లభించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ గదులలో కూర్చునేందుకు కుర్చీలు, విశ్రాంతి తీసుకోవడానికి మంచాలు, అత్యవసరమైన మరుగుదొడ్లు, స్నానపు గదులను ఏర్పాటు చేశారు. పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ నిర్మించిన ఈ కేంద్రాలు మహిళా సిబ్బందికి పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా, ఒక సురక్షితమైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. మా కష్టాన్ని గుర్తించారు సింహాచలం రైల్వే స్టేషన్లో పనిచేస్తున్న మహిళా సిబ్బంది ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘క్షేత్రస్థాయిలో మా సమస్యలను గుర్తించి, తక్షణమే స్పందించడం మాకు మరింత ఉత్సాహాన్నిస్తోంది. ఈ విశ్రాంతి గదులు మాకు ఒక వరం లాంటివి‘ అని వారు సంతోషంగా చెబుతున్నారు. అన్ని స్టేషన్లలోనూ ఏర్పాటు చేస్తాం రైల్వే అభివృద్ధిలో మహిళల పాత్ర వెలకట్టలేనిది. వారికి గౌరవప్రదమైన వాతావరణాన్ని కల్పించడం మా బాధ్యత. ప్రస్తుతం ఐదు స్టేషన్లలో ప్రారంభించాం, భవిష్యత్తులో డివిజన్లోని మిగిలిన స్టేషన్లకు కూడా ఈ సౌకర్యాన్ని విస్తరిస్తాం. – లలిత్ బోహ్రా, వాల్తేరు డీఆర్ఎం ప్రత్యేక విశ్రాంతి గది -
ఆదాయ వనరుగా ‘స్కిల్’ భవనం
ఆరిలోవ: ముడసర్లోవ వద్ద ఉన్న జీవీఎంసీ పాత స్కిల్ డెవలప్మెంట్ భవనాన్ని మరమ్మతులు చేసి, దాని ద్వారా ఆదాయ మార్గాలను అన్వేషించాలని కమిషనర్ కేతన్గార్గ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన అధికారులతో కలిసి ఈ భవనాన్ని పరిశీలించారు. కోట్లాది రూపాయల నిధులతో నిర్మించిన భవనం నిరుపయోగంగా, శిథిలావస్థకు చేరడంపై కమిషనర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భవన లోపల, బయట అస్తవ్యస్తంగా ఉన్న పరిసరాలను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. భవనానికి తక్షణమే మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ఆవరణలో దట్టంగా పెరిగిన పిచ్చి మొక్కలు, ముళ్ల తుప్పలను వెంటనే తొలగించాలని తూర్పు జోనల్ కమిషనర్ కె.శివప్రసాద్కు సూచించారు. ఈ భవనాన్ని ఐటీ, పరిశ్రమలు లేదా కార్పొరేట్ సంస్థలకు అద్దెకు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ఆసక్తి గల సంస్థల నుంచి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఆహ్వానించాలని అదనపు కమిషనర్ వర్మను ఆదేశించారు. పర్యవేక్షక ఇంజనీర్ శాంతిరాజ్, కార్యనిర్వాహక ఇంజనీర్ గంగాధర్, రెవెన్యూ అధికారి అప్పలరాజు, తదితరులు పాల్గొన్నారు. మరమ్మతులు చేపట్టాలని జీవీఎంసీ కమిషనర్ ఆదేశం -
ఉపాధి బకాయిలు రూ.5.69 కోట్లు
మహారాణిపేట: ఉమ్మడి విశాఖ జిల్లాలో అమలవుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో 1 నుంచి 7వ స్థాయీ సంఘాల సమావేశాలు ఆమె అధ్యక్షతన జరిగాయి. అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం, మందుల కొరతపై సభ్యులు భీశెట్టి వరహ సత్యవతి, సోము శివ సత్యనారాయణ, కో–ఆప్షన్ సభ్యుడు పొలమరశెట్టి శివ సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల తల్లి, శిశువు మృతి చెందిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రసవాల సమయంలో మగబిడ్డ పుడితే రూ.1000, ఆడబిడ్డ పుడితే రూ.500 వసూలు చేస్తున్నారని, మార్చురీ వద్ద మహిళా ఉద్యోగి డబ్బుల కోసం వేధిస్తున్నారని సభ్యులు ఆరోపించారు. కె.కోటపాడు హైస్కూల్లో అనధికారికంగా నిర్మించిన ప్రహరీపై సభ్యురాలు ఈర్లె అనురాధ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన సీఈవో నారాయణమూర్తి.. ఇప్పటికే కలెక్టర్కు, పోలీసులకు ఫిర్యాదు చేశామని వివరించారు. జిల్లాలోని 349 పాఠశాలల ఆస్తులను సంరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చైర్పర్సన్ స్పష్టం చేశారు. వేసవి దృష్ట్యా ఉపాధి హామీ కూలీలకు తాగునీరు, ఓఆర్ఎస్, నీడ వంటి వసతులు కల్పించాలని సభ్యులు కోరారు. ఫేషియల్ అటెండెన్స్ యాప్లో సాంకేతిక సమస్యలు ఉన్నాయని అనంతగిరి జెడ్పీటీసీ సభ్యుడు గంగరాజు సభ దృష్టికి తీసుకురాగా, వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అనకాపల్లి జిల్లాలో రూ.4.56 కోట్లు, విశాఖపట్నం జిల్లాలో రూ.5.69 కోట్లు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో రూ.2.75 కోట్లు ఉపాధి కూలీలకు చెల్లించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఫేషియల్ క్యాప్చర్ ప్రక్రియలో సమయం వృథా కాకుండా చూసేందుకు, కొత్త మొబైల్ పరికరాలను అందజేయడంతో పాటు కూలీల వేతనంలో రూ.25 పెంపుదల చేయనున్నట్లు వెల్లడించారు. రేషన్ సరుకుల నాణ్యత లోపం, తక్కువ పరిమాణంలో పంపిణీ జరగడంపై పలువురు సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాలకు 10 రోజుల్లోగా సరఫరా పూర్తి చేయాలని, అదనంగా పంచదార, రాగి పిండి అందించాలని సూచించారు. సామాజిక సంక్షేమ పథకాల కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అందాల్సిన సబ్సిడీల విడుదలపై ఉన్న జాప్యాన్ని నివారించాలని, హాస్టళ్లలో వసతులు మెరుగుపరచాలని సభ్యులు కోరారు. ఉపాధి హామీ, నర్సరీల అభివృద్ధిలో జిల్లాలు సాధించిన ప్రగతిని అధికారులు వివరించారు. పెండింగ్ పనులను గడువులోగా పూర్తి చేసేందుకు శాఖల మధ్య సమన్వయం ఉండాలని చైర్పర్సన్ జె. సుభద్ర ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని పీహెచ్సీ కేంద్రాల్లో రోగులకు తగిన సౌకర్యాలు కల్పించాలన్నారు. సమావేశంలో సీఈవో పి.నారాయణమూర్తి, డిప్యూటీ సీఈవో కె. రాజ్ కుమార్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సమన్వయంతో శతాబ్ది ఉత్సవాలు విజయవంతం
మహారాణిపేట: ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అందరి సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 27న జరగనున్న వేడుకల ఏర్పాట్లపై బుధవారం కలెక్టరేట్లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వీవీఐపీ, వీఐపీల పర్యటనల దృష్ట్యా ప్రోటోకాల్ అంశాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఉపరాష్ట్రపతి రాకను బట్టి గార్డ్ ఆఫ్ హానర్, ముఖ్యమంత్రి పర్యటన కోసం కోస్టల్ బ్యాటరీ వద్ద హెలిప్యాడ్ను సిద్ధం చేయాలని ఆదేశించారు. ‘అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తూ లైజన్ అధికారులను నియమించాలి. వేదిక అలంకరణ, సాంస్కృతిక కార్యక్రమాలు, గ్రీన్ రూములు, తాగునీరు, అల్పాహారం వంటి వసతులు సమకూర్చాలి. విద్యార్థులు మధ్యాహ్నం 2 గంటలకే గ్యాలరీల్లో ఆసీనులయ్యేలా చూడాలి. ప్రధాన కార్యక్రమాన్ని ఆన్లైన్లో ప్రసారం చేయడంతో పాటు, ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ప్రజల కోసం ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలి. నిరంతర విద్యుత్ సరఫరా కోసం జనరేటర్లు, ఫైర్ ఇంజన్లు, మెడికల్ క్యాంపులు, అంబులెన్స్లు అందుబాటులో ఉంచాలి. ఎయిర్పోర్టులో రిసెప్షన్ డెస్క్ ఏర్పాటు చేయాలి.’అని కలెక్టర్ ఆదేశించారు. కాఫీ టేబుల్ బుక్ విడుదల, ఎంవోయూలపై సంతకాలు, ప్రముఖుల సన్మాన కార్యక్రమాలను ప్రణాళికాయుతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. యూనివర్సిటీ అధికారులు, జిల్లా యంత్రాంగం బాధ్యతాయుతంగా వ్యవహరించి ఈ చారిత్రాత్మక వేడుకను విజయవంతం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. జేసీ గొబ్బిళ్ల విద్యాధరి, డీసీపీ విజయ్ మణికంఠ, ఇన్చార్జి డీఆర్వో టి.గోవింద్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ -
విజ్ఞాన గని..అక్షర నిధి
ఏయూ వీఎస్ కృష్ణా లైబ్రరీ మద్దిలపాలెం: అక్షర లక్షల పుస్తకాలకు నిలయం.. అరుదైన హస్త్రపతులకు ఆలయం ఏయూలోని డాక్టర్ వీఎస్.కృష్ణ గ్రంథాలయం. 1927లో ప్రారంభమైన ఈ లైబ్రరీ నేడు ఐదు లక్షలకు పైగా పుస్తకాలతో విజ్ఞాన గనిలా విరాజిల్లుతోంది. సుమారు 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ భవనానికి 1957లో నాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ గ్రంథాలయంలో ఉన్న అత్యంత అరుదైన సంపద ‘భారత రాజ్యాంగ అసలు ప్రతి’.. నాటి పార్లమెంట్ సభ్యులు స్వయంగా సంతకాలు చేసిన రాజ్యాంగ ప్రతి ఇక్కడ భద్రంగా ఉంది. వీటితో పాటు 2,663 అరుదైన తాళపత్రాలు, హస్త్రపతులు పరిశోధకులకు వరంగా మారాయి. ఇప్పటికే ఈ తాళపత్రాల డిజిటలైజేషన్ తొలి దశ పూర్తయ్యింది. ఒకేసారి 500 మంది కూర్చుని చదువుకునే సామర్థ్యం ఉన్న ఈ లైబ్రరీకి అనుబంధంగా ఇంజనీరింగ్, లా కళాశాల గ్రంథాలయాలు కూడా సేవలు అందిస్తున్నాయి. -
ఈపీడీసీఎల్లో ముగిసిన నీతి ఆయోగ్ వర్క్షాప్
విశాఖ సిటీ: ఏపీఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో నీతి ఆయోగ్ ప్రతినిధులతో కలిసి బుధవారం విశాఖలోని ఐటీ బిల్డింగ్ కాన్ఫరెన్స్ హాల్లో నీతి ఆయోగ్ వర్క్షాప్ నిర్వహించారు. రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ రంగాన్ని మరింత సమర్థవంతంగా, వినియోగదారులకు అనుకూలంగా, ఆర్థికంగా, స్థిరంగా మార్చే చర్యలపై విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి, నీతి ఆయోగ్ సభ్యులు రోని ఖన్నా, సుష్రూత్ హెల్వాత్కర్, వివేక్ థక్కర్, పి.అభిరామ్, డైరెక్టర్లు టి.వి.సూర్యప్రకాష్, టి.వనజ, ఎస్.హరిబాబు, సీఎజీఎంలు, ట్రాన్స్కో అధికారులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యుత్ పంపిణీ సంస్థల్లో అమలు చేయాల్సిన ప్రాజెక్టులు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలు, మెరుగైన ఫలితాల కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. విద్యుత్ సరఫరా నాణ్యత మెరుగుదలతో పాటు రుణ పునర్వ్యవస్థీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణపై కూడా చర్చించారు. అన్ని విభాగాల మధ్య సమన్వయం పెంపొందిస్తూ, కార్యక్రమాల అమలుకు వర్క్స్ట్రీమ్ బాధ్యతలను ఖరారు చేసి, మానిటరింగ్ విధానం, రోడ్మ్యాప్ సిద్ధం చేయాలని, దీని అమలుకు ప్రత్యేక వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్కో ఎస్ఈలు శివరామకృష్ణ, నరసింహారావు, సీజీఎంలు వి.విజయలలిత, డి.సుమన్ కల్యాణి, బి.అశోక్ కుమార్, ఎల్.మహేంద్రనాథ్, ఎస్.రాజబాబు, ఎస్.విజయ్ప్రతాప్, ఎల్.దైవప్రసాద్, వి.జనార్ధనరావు, వి.వి.ఎస్.ఎన్.వి. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
పన్నుల దరువు
● ప్రతి ఇంటికీ వడ్డింపు ● సింహాచలం సమీపంలోని గణేష్నగర్లోని 2023–24లో ఏడాదికి రూ. 4,890 ఉన్న ఇంటి పన్ను 2026–27 నాటికి ఏకంగా రూ. 7,438కు చేరింది. అంటే ఏకంగా రూ. 2,548 పెరిగిందన్నమాట. ● ఇది కూర్మనపాలెంలోని ఒక ఫ్లాట్ ప్రాపర్టీ ట్యాక్స్. చంద్రబాబు ప్రభుత్వం రాకముందు 2024–25లో సదరు ఫ్లాట్ యజమాని ఏడాదికి రెండు విడతలుగా (రూ.1083 చొప్పున) మొత్తం రూ.2,166 చెల్లించేవారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి ఇది కాస్తా రూ. 2,862కు పెరిగింది. అంటే రెండేళ్లల్లో ఏకంగా 30 శాతం మేర పెరిగింది. నడవాలన్నా చార్జీ.. ఇంట్లో ఉండాలన్నా పన్ను.. నగర జీవితం రోజురోజుకూ భారంగా మారుతోంది. ఇప్పటికే వాకర్స్పై ఏడాదికి రూ.720 యూజర్ చార్జీ విధించిన ప్రభుత్వం.. ఇప్పుడు ఇంటి పన్నును వరుసగా రెండేళ్లు ప్రతి సంవ త్సరం 15 శాతం చొప్పున పెంచుతూ నగర ప్రజలకు మరో భారీ షాక్ ఇచ్చింది. ఇదే సమయంలో రోడ్లు, పార్కులు, స్టేడియాలను ప్రైవేటుకు అప్పగించే నిర్ణయాలతో.. రాబోయే రోజుల్లో ప్రతి సేవకూ చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందేమోనని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పేద, ధనిక అనే తేడా లేకుండా చిన్న ఇళ్ల నుంచి భారీ విల్లాల వరకు ప్రతి ఏటా 15 శాతం పన్ను పెంచుకుంటూ పోవడం ప్రభుత్వం అనుసరిస్తున్న ’మార్క్’ అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: నగర ప్రజలపై పన్నుల భారం రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే వాకింగ్ చేసే వారికి ఏడాదికి రూ.720 యూజర్ ఛార్జీ విధించిన ప్రభుత్వం.. ఇప్పుడు ఇంటి పన్నులను కూడా గణనీయంగా పెంచింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గత ఏడాదితో పోలిస్తే మరో 15 శాతం మేర ప్రాపర్టీ ట్యాక్స్ పెంచుతూ నోటీసులు జారీ చేస్తోంది. ఒక వైపు బడా కంపెనీలకు ఎకరాల కొద్దీ భూములను నామమాత్రపు ధరలకే కట్టబెడుతున్న ప్రభుత్వం.. మరోవైపు సాధారణ ప్రజల చిన్న ఇళ్లపైనే అధిక పన్నులు విధించడం విమర్శలకు దారి తీస్తోంది. ప్రతి ఏడాది 15 శాతం పెంపు గత రెండేళ్లుగా ప్రభుత్వం వరుసగా ప్రతి సంవత్సరం 15 శాతం చొప్పున ఇంటి పన్నులను పెంచుతోంది. చిన్న ఇళ్ల నుంచి పెద్ద విల్లాల వరకూం పేద, ధనిక తేడా లేకుండా ఈ పెంపు అమలు అవుతోంది. ఇక వాకర్స్పై కూడా ఏడాదికి రూ.720 యూజర్ ఛార్జీ విధించడం ప్రజల్లో అసంతృప్తిని పెంచుతోంది. నడిచినా.. ఆడినా డబ్బే.. ప్రజల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన పార్కులు, స్టేడియాలను సైతం ప్రభుత్వం ఆదాయ వనరులుగా మార్చేసింది. వాకర్స్ నుంచి ఏడాదికి రూ. 720 వసూలు చేయాలని నిర్ణయించడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నగరంలోని కళ్యాణ మండపాలు, క్రీడా మైదానాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి, సామాన్యుడికి ఆహ్లాదాన్ని కూడా ఖరీదైన వస్తువుగా మార్చేస్తున్నారు. రోడ్ల ప్రైవేటీకరణ.. టోల్ భయం ఉన్న రోడ్లను నిర్వహణ పేరుతో పీపీపీ పద్ధతిలో పదేళ్ల పాటు ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సదరు సంస్థలకు రుణాలు ఇప్పించడమే కాకుండా, ఆ వడ్డీ భారాన్ని కూడా ప్రభుత్వమే భరించనుంది. అంతేకాకుండా రోడ్ల పక్కన ప్రకటనల ఆదాయాన్ని కూడా ఆ సంస్థలకే కట్టబెట్టారు. ఈ క్రమంలో భవిష్యత్తులో నగరంలోని రోడ్లపై ప్రయాణించే వాహనదారుల నుంచి ’టోల్’ లేదా ’యూజర్ చార్జీలు’ వసూలు చేస్తారేమోనన్న భయం ప్రజల్లో నెలకొంది. సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం ప్రభుత్వం పన్నులు పెంచుతున్నా, నగర ప్రజలకు కొత్తగా ఒక్క సౌకర్యాన్ని కూడా కల్పించలేదనే విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన స్టేడియాలు, పార్కుల వంటి అభివృద్ధి పనులకే ప్రారంభోత్సవాలు చేస్తూ తమ ఘనతగా చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. వాస్తవానికి ఈ రెండేళ్లలో జీవీఎంసీ పరిధిలో ఎక్కడా కొత్తగా రోడ్లను నిర్మించింది లేదు. కేవలం గుంతలను పూడ్చి అదే అభివృద్ధిగా ప్రచారం చేసుకుంటున్నారు. జీవీఎంసీ ఖజానాకు కూడా అదనంగా ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. కేవలం ప్రజల నుంచి వసూలు చేసే పన్నులతోనే ఉన్న సౌకర్యాలకు ౖపైపెన మెరుగులు దిద్దుతున్నారు. -
ఏయూ నిర్వీర్యం
ప్రభుత్వ భూమిని కబ్జాలో ఉంచుకుని, ఇప్పుడు ఆ భూ మిని మాకే రాసివ్వండి అని కోరడం నిస్సిగ్గు చర్య. ఏయూను నిర్వీ ర్యం చేస్తూ, అక్కడ కోర్సులు, నియామకాలను అడ్డుకుంటూ గీతం సంస్థను ప్రమోట్ చేసే పనిలో ఎంపీ భరత్ ఉన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ అవసరాల కోసం శ్వేతసౌధం లాంటి భవనం నిర్మిస్తే దాన్ని స్వార్థం అని ప్రచారం చేసిన వారు, నేడు చేస్తున్న భూదోపిడీని ఏమనాలి? – ద్రోణంరాజు శ్రీవత్సవ్, రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యనిర్వాహక అధ్యక్షుడు -
పౌర సేవలను వ్యాపార సరుకులుగా మార్చొద్దు
బీచ్రోడ్డు: వాకర్స్, క్రీడాకారులపై యూజర్ చార్జీలను తక్షణమే రద్దు చేయాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన ధర్నాలో సీపీఐ జిల్లా కార్యదర్శి రెహమాన్ మాట్లాడుతూ పార్కులు, స్టేడియాల్లో వాకింగ్ చేసే వారిపై సంవత్సరానికి రూ.720 వసూలు చేయడం పూర్తిగా ప్రజా వ్యతిరేక నిర్ణయమన్నారు. వేల కోట్ల బడ్జెట్ ఉన్న కార్పొరేషన్, ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు ఉచితంగా కల్పించకుండా వ్యాపార ధోరణితో వ్యవహరించడం విచారకరమని పేర్కొన్నారు. ఈ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే నిరసనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం జీవీఎంసీ అదనపు కమిషనర్ వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సి.ఎన్.క్షేత్ర పాల్, ఎం.మన్మధరావు, ఆర్.శ్రీనివాసరావు, బి.నాగభూషణం, కె.వనజాక్షి, కె.అచ్యుతరావు, సిహెచ్.కాసుబాబు, పడాల గోవిందు, కాసుల్ రెడ్డి, జి.రాంబాబు, పి.పద్మ, తదితరులు పాల్గొన్నారు. -
గీతం కబ్జాలపై మౌనమేల?
విశాఖ ఎంపీ భరత్కు రూ.5 వేల కోట్ల విలువైన భూములను కట్టబెట్టడమే కాకుండా, ఆ భూముల బదలాయింపు కోసం రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా జీవీఎంసీలో తీర్మానం చేశారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను తొలగించారంటే వారి అహంకారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. విద్యాసంస్థలకు ప్రభుత్వ భూములను కేటాయించినప్పుడు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 25 శాతం సీట్లు కేటాయించాలనే నిబంధన ఉంది. కానీ గీతం ఆ నిబంధనను పూర్తిగా తుంగలో తొక్కుతోంది. దీనికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు చేపట్టిన నిరసనకు వైఎస్సార్ సీపీ సంఘీభావం తెలుపుతుంది. అమరావతే సర్వస్వం అన్నట్లుగా మాట్లాడుతున్న కుహనా మేధావులు, విశాఖకు జరుగుతున్న ఈ అన్యాయంపై ఎందుకు నోరు విప్పడం లేదు? – కేకే రాజు, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ -
నడకపై పన్ను తుగ్లక్ పాలనకే నిదర్శనం
సీతంపేట: వాకర్స్పై పన్ను విధించడం తుగ్లక్ పాలనను మించిందని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.కె.ఎస్.వి.కుమార్ విమర్శించారు. బుధవారం స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం ఎదుట సీపీఎం నాయకులు నిరసన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్ సిటీ పేరిట నడకపై పన్నులు వేయడం విధించడం అన్యాయమన్నారు. పార్కులు, స్టేడియంలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం ప్రజా వ్యతిరేక చర్యగా పేర్కొన్నారు. వెంటనే యూజర్ చార్జీలను రద్దు చేయకపోతే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ిసీపీఎం జోన్ కార్యదర్శి వి.కృష్ణారావు, నాయకులు కె.కుమార్, ఎల్.జె.నాయుడు, జె.ఆర్.నాయుడు, చంద్రమౌళి, ఎన్.వి.రమణ, ఆర్ శ్రీను, హైమ, చలపతి, దండు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
తోడల్లుడికి కోట్ల భూములా?
ప్రభుత్వ భూములను దోచుకోవడానికి లైసెన్స్ ఇచ్చినట్లుగా గీతం వ్యవహరిస్తోంది. జీవీఎంసీలో కార్పొరేటర్లు, మీడియా గొంతునొక్కి అక్రమంగా తీర్మానం చేయించుకున్నారు. అసలు ఏ అనుమతులు ఉన్నాయని ఆ భూముల్లో నిర్మాణాలు చేపడుతున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. లోకేష్కు తోడల్లుడు అనే ధీమాతోనే ఈ అక్రమాలకు పాల్పడుతున్నారా? రాష్ట్రంలో ఇన్ని అక్రమాలు జరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఒకవైపు భూదోపిడీ, మరోవైపు విద్య పేరుతో ఫీజుల దోపిడీ సాగుతున్నాయి. స్టీల్ ప్లాంట్, ఏయూ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యమైనా పర్వాలేదు కానీ, తమ ప్రైవేటు సంస్థలు మాత్రం దోపిడీ చేస్తూ వర్ధిల్లాలని వీరంతా కోరుకుంటున్నారు. – గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి -
ప్రైవేట్పై ఎందుకంత ప్రేమ?
కూటమి ప్రభుత్వం విశాఖలోని భూములను ఎకరం కేవలం 99 పైసలకే కట్టబెడుతోంది. మేయర్ను మార్చింది కూడా ఇలాంటి అక్రమ కార్యకలాపాల కోసమేనని అర్థమవుతోంది. క్రీడా ప్రాంగణాల వద్ద బ్యానర్లు ఏర్పాటు చేసి వాకర్ల దగ్గర వసూళ్లకు పాల్పడుతోంది. బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ తప్పులను సహించలేదు. వేలాది మంది కార్మికుల జీవితాలతో ముడిపడిన స్టీల్ ప్లాంట్ నిర్వీర్యమవుతుంటే మొద్దు నిద్రపోతున్న చంద్రబాబు ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలకు భూములు అప్పగించేందుకు మాత్రం తాపత్రయపడుతోంది. – తిప్పల దేవన్ రెడ్డి, గాజువాక సమన్వయకర్త -
ఉచిత సీట్లు ఎందుకు ఇవ్వరు?
గీతం సంస్థ తన రాజకీయ పలుకుబడిని వాడుకుంటూ విద్యను వ్యాపారంగా మార్చి దోచుకుంటోంది. విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజులు కడుతున్నా, ఈ సంస్థ ఎప్పుడూ స్థానికులకు ఉచిత సీట్లు కేటాయించలేదు. వైఎస్సార్ సీపీ హయాంలో ఆక్రమిత భూములను రక్షించే ప్రయత్నం చేస్తే కోర్టుల నుంచి స్టే తెచ్చుకుని కాలక్షేపం చేశారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం రాగానే జీవీఎంసీలో అక్రమంగా తీర్మానాలు చేయించుకుని నిర్మాణాలకు తెరదీశారు. – ఉరుకూటి చందు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు -
ఇదేనా సంపద సృష్టి?
రాష్ట్రంలో సంపద సృష్టిస్తామని వాగ్దానాలు చేసిన వారు, నేడు ఉన్న సంపదను హారతి కర్పూరంలా హరించివేస్తున్నారు. గీతం దోపిడీ కొన్నేళ్లుగా నిరాటంకంగా కొనసాగుతోంది. ఫీజుల వసూళ్లలో గానీ, విద్యార్థుల విషయంలో గానీ, భూముల ఆక్రమణలో గానీ ఎటు చూసినా దోపిడీయే కనిపిస్తోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సర్వే చేయించి వీరి కబ్జాలను అడ్డుకుంటే, నేడు అధికార అండతో వాటిని క్రమబద్ధీకరించుకుంటున్నారు. గతంలో వైఎస్ జగన్ విశాఖ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్లు సిద్ధం చేస్తే, వాటిని వక్రీకరించి కుట్రలు చేశారు. గీతం భూదోపిడీపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. – మళ్ల విజయ ప్రసాద్, పశ్చిమ సమన్వయకర్త -
అడ్డగోలుగా కొట్టేస్తారా?
54.79 ఎకరాల భూదోపిడీని క్రమబద్ధీకరించుకోవడానికి కార్పొరేటర్లను సంతలో పశువుల్లా కొనుగోలు చేశారు. గీతం సంస్థ ఏమైనా పేదలకు ఉచితంగా విద్యను అందిస్తోందా? వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆ సంస్థకు ఎందుకు అప్పనంగా కట్టబెడుతున్నారు? స్వయంగా ఎంపీ భరత్ ఇది రూ.5 వేల కోట్ల భూమి కాదు, వెయ్యి కోట్ల భూమి అని ఒప్పుకున్నారు. అంటే వెయ్యి కోట్ల విలువైన ప్రజా ఆస్తిని అడ్డగోలుగా కొట్టేస్తారా? – మొల్లి అప్పారావు, తూర్పు సమన్వయకర్త -
గీతంకి గిఫ్ట్
ప్రభుత్వ భూమి షిఫ్ట్సాక్షి, విశాఖపట్నం: గీతం యూనివర్సిటీ వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని, నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపడుతోందని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాలు బుధవారం కదం తొక్కాయి. భూబదలాయింపు ప్రక్రియ పూర్తి కాకుండానే జీవీఎంసీలో అక్రమంగా తీర్మానాలు చేశారని నాయకులు మండిపడ్డారు. రుషికొండలోని టీటీడీ ఆలయం నుంచి గీతం వరకు పాదయాత్ర నిర్వహించిన వైఎస్సార్ సీపీ శ్రేణులు.. చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు కొమ్ముకాస్తోందని తీవ్రస్థాయిలో విమర్శించాయి. విద్యాసంస్థలకు ప్రభుత్వ భూములు ఇస్తే నిబంధనల ప్రకారం పేదలకు, ఎస్సీ, ఎస్టీలకు 25 శాతం ఉచిత సీట్లు ఎందుకు ఇవ్వడం లేదని నేతలు సూటిగా ప్రశ్నించారు. ముఖ్యనేతలు గొలగాని హరి వెంకట కుమారి, కె.సతీష్, జియ్యాని శ్రీధర్, కొండా రాజీవ్ గాంధీ, జాన్ వెస్లీ, రొంగలి జగన్నాథం, సతీష్ వర్మ, పేడాడ రమణి కుమారి, పేర్ల విజయచందర్, అల్లు శంకరరావు, అనిల్కుమార్ రాజు, సాడి పద్మారెడ్డి, పోతిన హనుమంత్, తాడి జగనాధరెడ్డి, పల్లా దుర్గ, వి.ప్రసాద్, లింగం శ్రీను, రామిరెడ్డి, అల్లంపల్లి రాజబాబు, విద్యార్థి విభాగం నాయకులు హరీష్ వర్మ, బాణాల తరుణ్, గరికిన వెంకటేష్, జగ్గ శ్రవణ్ కుమార్, రెడ్డిపల్లి అవినాష్, పీలాక తరుణ్ రెడ్డి, చెన్న నితీష్, వాక తులసి కృష్ణ, లెంకా కార్తీక్, రౌతు శ్రీను, యువజన నాయకులు మహ్మద్ ఇమ్రాన్, దొడ్డి కిరణ్, కనకల ఈశ్వరరావు, రవికుమార్ రెడ్డి, ధీరజ్ కుమార్, జగ్గుపిల్ల నరేష్, పాల రమణ, ఎం. సంతోష్ కుమార్, తాడి రవితేజ, కాగితాల రవికిరణ్ పాల్గొన్నారు. -
యూజర్ చార్జీలు రద్దు చేయకుంటే ఉద్యమిస్తాం..
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ఆధీనంలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం, రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం వంటి క్రీడా వేదికల్లో యూజర్ చార్జీల వసూళ్లను తక్షణమే ఉపసంహరించాలని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియాన్ని పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా శిక్షణ పొందే విద్యార్థులు, క్రీడాకారులపై యూజర్ చార్జీలు విధించడం ప్రజా వ్యతిరేక చర్య అని విమర్శించారు. క్రీడా మైదానాలు ప్రజల ఆస్తి కావాలని, వాటిని ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లడం సరైంది కాదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో క్రీడాకారులకు ఉచిత సేవలు అందించామని గుర్తుచేశారు. వెంటనే ఈ చార్జీలను రద్దు చేయకపోతే ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో 35వ వార్డు అధ్యక్షుడు అలపున కనకారెడ్డి, పార్టీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు సనపల రవీంద్రభరత్, స్టేట్ సాంస్కృతిక విభాగం కార్యదర్శి కె.సాగర్, 38వ వార్డు యూత్ ప్రెసిడెంట్ చేపల నూకరాజు తదితరులు పాల్గొన్నారు. -
‘గీతం’ భూదోపిడీకి చెక్ పెడతాం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విశాఖలో రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను సీఎం చంద్రబాబు తన బినామీలకు, కుటుంబ సభ్యులకు అడ్డగోలుగా ధారాదత్తం చేస్తున్నారని.. వైఎస్సార్సీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శించారు. అందులో భాగంగానే మంత్రి లోకేశ్ తోడల్లుడు, విశాఖ టీడీపీ ఎంపీ భరత్కు చెందిన గీతం యూనివర్శిటీకు రూ.5 వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూములను అప్పనంగా కట్టబెట్టారని ఆరోపించారు. ఈ భూదోపిడీని అడ్డుకుని చెక్ పెడతామని వారు హెచ్చరించారు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాన్ని అజెండాగా పెట్టి ఆ సంస్థకు వాటిని క్రమబద్దీకరించడమే కాక ఆ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న గీతం యాజమాన్యం తీరును నిరసిస్తూ బుధవారం వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రీజినల్ కోఆర్డినేటర్, మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ హాజరయ్యారు. రుషికొండలో టీటీడీ ఆలయం నుంచి గీతం కాలేజి వద్దకు పార్టీ శ్రేణులతో కలిసి వైఎస్సార్సీపీ నేతలు ర్యాలీగా వెళ్లారు. రెండున్నర గంటలపాటు బైఠాయించి ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకోవాలని నినదించారు. పైగా.. గతంలో 70 ఎకరాల ప్రభుత్వ భూమిని, ఇప్పుడు 54.79 ఎకరాలు తీసుకున్న గీతం, 25 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ కోటా విద్యార్థులకు ఉచిత సీట్లు ఇవ్వడంలేదంటూ గుడివాడ అమర్నా«థ్, కేకే రాజు మండిపడ్డారు. ఈ సందర్భంగా వారిరువురూ ఏమన్నారంటే.. గీతం భూకబ్జాపై పోరాటం ఆగదు.. గీతం యూనివర్శిటీ భూదోపిడీని వైఎస్సార్సీపీ అడ్డుకుంటుంది. 30 ఏళ్లుగా గీతం దోపిడి చేస్తోంది. ఇప్పటివరకూ అక్కడ ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థి కూడా ఉచితంగా చదవలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.5 వేల కోట్ల విలువైన గీతం ఆక్రమిత 54.79 ప్రభుత్వ భూమిని కాపాడితే.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మళ్ళీ కబ్జాకు తెగబడ్డారు. ప్రభుత్వ భూములను క్రమబద్దీకరణ చేసుకున్నందున ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 25 శాతం ఫ్రీ సీట్లు కేటాయించాలి. కానీ ఆ పరిస్థితిలేదు. గీతం భూకబ్జాపై పెద్దఎత్తున పోరాటం చేస్తాం.విశాఖ ప్రజలు ఎంపీ భరత్కు ఐదు లక్షల మెజారిటీ ఇస్తే ఆయన రూ.5 వేల కోట్లు భూమి కబ్జా చేశారు. 2004లో నాటి సీఎం చంద్రబాబు 70 ఎకరాల భూమి క్రమబద్ధీకరించారు. ఇప్పుడు మళ్లీ 55 ఎకరాలు క్రమబద్దీకరించారు. మొత్తంగా గీతంకు రూ.12 వేల కోట్ల భూమి కట్టబెట్టారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రూ.35 వేల కోట్ల అవినీతి జరిగింది. ప్రభుత్వం తన తీరు మార్చుకోకుంటే మా నాయకుడే మా పోరాటంలో భాగస్వామ్యులవుతారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, సమన్వయకర్తలు తిప్పల దేవన్రెడ్డి, మొల్లి అప్పారావు, విద్యార్థి విభాగం జోనల్ అధ్యక్షుడు ద్రోణంరాజు శ్రీవాత్సవ్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉరుకూటి చందు, యువజన విభాగం జోనల్ అధ్యక్షుడు అంబటి శైలేష్, రాష్ట్ర అధికారప్రతినిధి కొండా రాజీవ్, మాజీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తదితరులు పాల్గొన్నారు. -
గీతం యూనివర్శిటీ ఎదుట వైఎస్సార్సీపీ నిరసన
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చలో గీతం యూనివర్సిటీకి పిలుపునిచ్చింది. రుషికొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి గీతం యూనివర్సిటీ వరకు వైఎస్సార్సీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గీతం యూనివర్సిటీ ముందు వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. ర్యాలీలో వైఎస్సార్సీపీ నేతలు గుడివాడ అమర్నాథ్, కేకే రాజు, మోల్లి అప్పారావు, దేవన్ రెడ్డి, మళ్ల విజయప్రసాద్ పాల్గొన్నారు.గీతం యూనివర్సిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 25 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. గీతం యూనివర్శిటీకి ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ పోరాటానికి దిగింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నేతలు నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ నిరసన నేపథ్యంలో గీతం యూనివర్సిటీ ముందు పోలీసులు భారీగా మోహరించారు. -
శతాబ్ది సంబరం.. అబద్ధాల ఆడంబరం!
విశాఖ సిటీ: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్స వాలు అబద్ధాల పునాదులపై ఆడంబరంగా సాగుతున్నాయి. వందేళ్ల అక్షర ప్రస్థానంలో సాధించిన ఘనతను మరుగున పెట్టేసి.. కేవలం రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా ఈ వేడుకలను మార్చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏయూ కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చెందితే.. నేడు ఆ ప్రగతి ఛాయలు కూడా కనిపించకుండా ప్రస్తుత పాలకులు ‘పచ్చ’ కుట్రలకు తెరలేపారు. విద్యార్థుల భవిష్యత్తు ను తీర్చిదిద్దిన ప్రాజెక్టులను స్మరించుకోవాల్సిన వేళ.. వాటి ఉనికినే తుడిచిపెట్టేలా వ్యవహరిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వర్సిటీని అభివృద్ధి చేసిన జగన్ పేరు వినిపించకూడదనే కుత్సిత బుద్ధితో, వర్సిటీ గౌరవాన్ని పెంచిన కీలక ప్రాజెక్టులను, అంతర్జాతీయ గుర్తింపులను పక్కనబెట్టి.. పచ్చ కండువాల కనుసన్నల్లోనే ఈ వేడుకలు సాగుతుండటంపై విద్యావేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏయూ ప్రగతిపై ‘కూటమి’ ముసుగు దేశానికి ఎందరినో మహానుభావులను ఏయూ అందిస్తే.. ఇపుడు శతాబ్ది ఉత్సవాల వేళ వారిలో ఒక్కరిని కూడా ఏయూకు ఆహ్వానించకపోవడం గమనార్హం. ప్రతి కార్యక్రమాన్ని కూటమి నేతలు, ప్రజాప్రతినిధులే ముఖ్య అతిథులుగా కార్యక్రమాన్ని కానిచ్చేస్తున్నారు. ఈ తరుణంలో ఏయూ ప్రగతిపై కూటమి ముసుగు వేసేశారు. 2019–2024 మధ్య ఏయూ గ్లోబల్ స్టార్టప్ హబ్గా రూపాంతరం చెందింది. వైఎస్ జగన్ ప్రభు త్వం ఏయూ అభివృద్ధి కోసం రూ. కోట్లు వెచ్చించడమే కాకుండా, విద్యార్థుల భవిష్యత్తును మార్చేలా విప్లవాత్మక మౌలిక సదుపాయాలు కల్పించింది. కానీ, నేటి శతాబ్ది ఉత్సవాల్లో ఆ ప్రగతి ఛాయలు ఎక్కడా కనిపించకుండా ముసుగు వేసేశారు. వందేళ్ల వేడుక అంటే గతాన్ని గౌరవించడం, వర్తమానాన్ని చాటడం.. కానీ ఇక్కడ జరుగుతున్నది మాత్రం వేరు. ఆ ఆవిష్కరణల ఊసేది?: నగరాన్ని ఐటీ, టెక్నాలజీ హబ్గా మార్చాలనే లక్ష్యంతో ఏయూలో అద్భుతమైన ఇంక్యుబేషన్ సెంటర్లను జగన్ ప్రభుత్వం నిర్మించింది. రాష్ట్రంలోనే అతిపెద్ద స్టార్టప్ వేదికగా నిలిచిన ‘ఏ–హబ్’ ద్వారా ఎందరో యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు. అలాగే ఫార్మా, పరిశోధన రంగాల్లో విప్లవం తెచ్చిన ‘ఎలిమెంట్’, డేటా సైన్స్, ఐటీ రంగాలకు ఊపిరిపోసిన ‘ఆల్గోరిథమ్’ వంటి భవనాలు నేడు ఏయూ ప్రతిష్టకు నిలువుటద్దాలు. రక్షణ రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు వేదికైన ‘ఏయూసిబ్’ గురించి నేడు పాలకులు కనీసం మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదు. ఈ ప్రాజెక్టుల పేర్లు చెబితే జగన్ అభివృద్ధి కనిపిస్తుందన్న భయంతో, ఉత్సవాల బ్రోచర్లలో సైతం వీటి ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడ్డారు. నాక్ ఏ++ ప్రస్తావనపై ఉద్దేశపూర్వక మౌనం ఏయూ చరిత్రలో అత్యున్నత ఘట్టం ఏదైనా ఉందంటే అది ‘నాక్’ నుంచి ఏ++ గ్రేడ్ అంతే అతిశయోక్తి కాదు. దేశంలోని అతి కొద్ది వర్సిటీలకు మాత్రమే దక్కే ఈ గౌరవం గత ప్రభుత్వ హయాంలో ఏయూకి దక్కింది. పరిపాలనలో పారదర్శకత, మౌలిక సదుపాయాల కల్పన, రీసెర్చ్ పేపర్ల పబ్లికేషన్ వంటి అంశాల్లో జగన్ ప్రభుత్వం తీసుకున్న చొరవ వల్లే ఈ అరుదైన గుర్తింపు సాధ్యమైంది. ఈ మైలురాయిని కూడా ప్రస్థావిస్తే ఎక్క డ గత ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందోనని కూట మి నేతలు వణికిపోతున్నారు. అందుకే నాక్ గ్రేడింగ్ గురించి కానీ, వర్సిటీ సాధించిన ర్యాంకుల గురించి కానీ నోరు మెదపడం లేదు. సరస్వతీ నిలయంగా ఉండాల్సిన వర్సిటీని చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ అడ్డాగా మార్చేసింది. శతాబ్ది ఉత్సవాల నిర్వహణ మొత్తం కూటమి నేతల కనుసన్నల్లోనే జరుగుతోంది. క్యాంపస్లో విద్యార్థుల కేరింతల కంటే రాజకీయ నినాదాల హోరే ఎక్కువగా వినిపిస్తోంది. వందేళ్ల పండగను ఒక పవిత్ర కార్యంగా కాకుండా, పచ్చ పార్టీ ప్రచార వేదికగా మార్చేయడంపై పూర్వ విద్యార్థులు, మేధావులు మండిపడుతున్నారు. -
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతాం
బీచ్రోడ్డు: మున్సిపల్ కార్మికుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్త సమ్మెకు సిద్ధమవుతామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మార్చికి సంబంధించిన జీతాలను నేటికీ చెల్లించకపోవడంపై కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జీవీఎంసీలోని అన్ని శాఖల కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం క్లాప్ డ్రైవర్లు, లోడర్లు, శానిటరీ, యూజీడీ వర్కర్లు విధులను బహిష్కరించారు. అనంతరం జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. మార్చి జీతాలు అందకపోవడంతో కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందని, అందుకే ఆందోళన బాట పట్టామని కార్మిక సంఘాలు తెలిపాయి. ఈ సందర్భంగా జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు పి.వెంకటరెడ్డి మాట్లాడుతూ.. పారిశుధ్య కార్మికుల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ చేసిన, మరణించిన లేదా అనారోగ్యం పాలైన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఆప్కోస్ ద్వారా ఉపాధి కల్పించాలని విన్నవించారు. గతంలో కమిషనర్ సమక్షంలో జరిగిన ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులు -
30 శాతం ఐఆర్ ప్రకటించాలి
ధర్నాలో పాల్గొన్న ఉపాధ్యాయులుబీచ్రోడ్డు: ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయడంతో పాటు, పీఆర్సీ కమిటీని నియమించి 30 శాతం ఐఆర్ ప్రకటించాలని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్(పీఆర్టీయూ) జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రీనివాసరావు డిమాండ్ చేశా రు. యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం తక్షణమే సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. మెమో నంబర్ 7 ప్రకారం 2003 డీఎస్సీ అభ్యర్థులకు పాత పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయాలని సూచించారు. జెడ్పీ పరిధిలోని ఉపాధ్యాయుల కారుణ్య నియామక ప్రక్రియ కలెక్టర్ పరిధిలోనే జరగాలని కోరారు. జీవీఎంసీ ఉపాధ్యాయులకు జీపీఎఫ్ ఖాతాలు ఏర్పాటు చేసి, పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలను విడుదల చేయాలన్నారు. ఇన్–సర్వీస్ టీచర్లకు టెట్ నిబంధనను రద్దు చేయాలని, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలను గ్రేడ్–1 హెచ్ఎంలుగా గుర్తించాలని కోరారు. ఉద్యోగ విరమణ చేసిన రోజే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజేయాలని, రేషనలైజేషన్ ప్రక్రియను ఏటా కాకుండా ఐదేళ్లకోసారి చేపట్టేలా నిబంధనలు మార్చాలని డిమాండ్ చేశారు. ధర్నాలో యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.నాగేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గారావు, గూనూరు శ్రీను, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
గీతం భూకబ్జాపై వైఎస్సార్సీపీ నిరసన నేడు
డాబాగార్డెన్స్: గీతం యూనివర్సిటీకి ప్రభుత్వ భూములను బదలాయించడం వెనుక బంధుప్రీతి ఉందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్కుమార్ ఆరోపించారు. మంగళవారం ఆశీల్మెట్టలో నిర్వహించిన స్టేట్, సౌత్ యూత్ వింగ్ల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడా రు. రుషికొండ, ఎండాడ గ్రామాల్లో గీతం యూ నివర్సిటీ ఆధీనంలో ఉన్న సుమారు 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆ సంస్థకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం జీవీఎంసీ వేదికగా కుట్రలు పన్నిందని విమర్శించారు. సుమారు రూ.5 వేల కోట్లకు పైగా విలువైన భూములను ధారాదత్తం చేయాలని నిర్ణయించడం అన్యాయమన్నారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆక్రమణల నుంచి భూములను రక్షించగా, ఇప్పుడు వాటిని బంధువులకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఈ నెల 22న మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల మంది విద్యార్థులతో కలిసి గీతం వర్సిటీ ఎదుట శాంతియుత నిరసన చేపడతామని ప్రకటించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్గాంధీతో పాటు పలువురు మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా ఈ నిరసనలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఉన్న వైఎస్సార్ సీపీ యువజన, విద్యార్థి విభాగాల నాయకులతో పాటు శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు నిరసనలో పాల్గొనున్నారు. -
ఎన్క్లోజర్లోకి నల్ల చిరుత
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులో ఇకపై బ్లాక్ పాంథర్(నల్ల చిరుత) సందర్శకులను అలరించనుంది. జూ చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన ఈ నల్ల చిరుత ఎన్క్లోజర్ను మంగళవారం రాష్ట్ర అటవీ శాఖ పీసీసీఎఫ్ డాక్టర్ పి.వి.చలపతిరావు ప్రారంభించారు. జంతు మార్పిడి విధానంలో భాగంగా గత నెలలో దీనిని అసోం రాష్ట్రంలోని జూ పార్కు నుంచి ఇక్కడికి తీసుకువచ్చారు. ఈ బ్లాక్ పాంథర్ను దత్తత తీసుకోవడానికి ఒక చిన్నారి ముందుకు రావడం విశేషం. నిహిరా మలినేని అనే 21 నెలల చిన్నారి, తన తల్లిదండ్రుల సహకారంతో ఈ నల్ల చిరుతను ఏడాది కాలానికి దత్తత తీసుకుంది. ఇందుకోసం రూ. 1,25,000 చెక్కును పీసీసీఎఫ్కు అందజేసింది. ఇంత చిన్న వయసులో జంతువుల పట్ల మక్కువ చూపి దత్తతకు ముందుకు వచ్చిన నిహిరాను, ఆమె కుటుంబ సభ్యులను పీసీసీఎఫ్ ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా, సాలిడ్ ఇన్సులేషన్ అనే సంస్థ జూలోని ఖడ్గమృగాన్ని ఏడాది కాలానికి దత్తత తీసుకుంది. ఆ సంస్థ ప్రతినిధులు రూ.3లక్షల చెక్కును అధికారులకు అందజేశారు. దాతలు ఇరువురికీ పీసీసీఎఫ్ దత్తత అంగీకార పత్రాలను అందజేస్తూ.. వన్యప్రాణుల సంరక్షణకు మరిన్ని సంస్థలు, వ్యక్తులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం, జూలో కొత్తగా అభివృద్ధి చేసిన స్లాత్ బేర్(ఎలుగుబంటి), తోడేలు, నక్కలు, రెడ్ వాలబీ ఎన్క్లోజర్లను కూడా ఆయన ప్రారంభించారు. సీఎఫ్ బి.మహ్మద్ దివాన్ మైదీన్, జూ క్యూరేటర్ జి.మంగమ్మ, అసిస్టెంట్ క్యూరేటర్లు పాల్గొన్నారు. బ్లాక్ పాంథర్ను దత్తత తీసుకున్న 21 నెలల చిన్నారి -
ఆక్సిజన్ ప్లాంట్లు పనిచేయడం లేదు
ఉన్నతాధికారులకు నివేదించాం: కేజీహెచ్ సూపరింటెండెంట్ మహారాణిపేట: కేజీహెచ్లో ఆక్సిజన్ కొరత ఉందన్న మాట వాస్తవమేనని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి స్పష్టం చేశారు. ఆసుపత్రిలోని నాలుగు ఆక్సిజన్ ప్లాంట్లు పనిచేయడం లేదని, వాటికి మరమ్మతులు చేపట్టాలని ఉన్నతాధికారులకు నివేదించామని ఆమె తెలిపారు. ఈ నెల 20న ‘సాక్షి’దినపత్రికలో ప్రచురితమైన ‘ఐసీయూలో ప్రాణవాయువు’కథనంపై మంగళవారం ఆమె వివరణ ఇచ్చారు. కంప్రెషర్ లోపాలు, ఇతర సాంకేతిక సమస్యల కారణంగా నాలుగు ప్లాంట్లు ప్రస్తుతం అందుబాటులో లేవని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన రెండు పీఎస్ఏ యూనిట్లు మాత్రం అందుబాటులో ఉన్నాయని, వాటి ద్వారా సూపర్ స్పెషాలిటీ బ్లాక్కు ఆక్సిజన్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. 2021–22 కాలంలో గాలి ద్వారా ఆక్సిజన్ తయారు చేసేందుకు కేజీహెచ్ ఆవరణలో మొత్తం ఆరు యూనిట్లను ఏర్పాటు చేశారు. వీటిలో నాలుగు యూనిట్లను అప్పటి ముఖ్యమంత్రి నిధుల ద్వారా, మిగిలిన రెండు యూనిట్లను ప్రధాన మంత్రి నిధుల ద్వారా ఏర్పాటు చేసినట్లు ఆమె ఒక ప్రకటనలో వివరించారు. -
జీవీఎంసీ కమిషనర్ ఫొటోతో ఫేక్ వాట్సాప్ మెసేజ్లు
డాబాగార్డెన్స్: సైబర్ కేటుగాళ్లు ఇంటర్నెట్, డిజిటల్ పరికరాలను అస్త్రంగా చేసుకుని సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు. సామాన్యులే కాకుండా ఉన్నతాధికారులను సైతం వదలకుండా వారి పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించి ఆర్థిక నేరాలకు తెగబడుతున్నారు. తాజాగా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఫొటోను ప్రొఫైల్ పిక్చర్గా, పేరు పెట్టుకుని ఇండోనేషియాకు చెందిన నంబర్తో కొందరు వాట్సాప్లో హల్చల్ చేస్తున్నారు. కమిషనర్ ఫొటోతో ఉన్న +62 831–7219–6516 అనే ఇండోనేషియా నంబర్ నుంచి పలువురికి మెసేజ్లు వెళ్తున్నాయి. ఆ చాటింగ్లో తొలుత ‘హలో, ఎలా ఉన్నారు? ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు?’ అని పలకరిస్తూ అవతలి వారిని నమ్మిస్తున్నారు. ఎదుటి వ్యక్తి స్పందించగానే.. ‘చాలా సంతోషం, నాకోసం అత్యవసరంగా ఒక పని చేయాలి’ అంటూ బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి ఫేక్ మెసేజ్ల పట్ల ప్రజలు, జీవీఎంసీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే అభ్యర్థనలను నమ్మవద్దని అధికారులు సూచించారు. -
జేఈఈ మెయిన్స్లో శ్రీవిశ్వ విజయభేరి
సీతంపేట: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో శ్రీవిశ్వ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయభేరి మోగించారు. వివిధ కేటగిరిల్లో కప్పల జాహ్నవి 97వ ర్యాంకు, శిర్ల జస్వంత్ 133, గోరు కుష్వంత్ 608, వి.మోహన్వంశీ 611, మేడిశెట్టి తాతాజీ 863, జల్లు చరణ్తేజ 873, మూల ఇంద్రకార్తీక్ 1000 ర్యాంకులు సాధించారు. వెయ్యిలోపు ఏడుగురు, 5వేల లోపు 31 మంది, 10వేల లోపు 43 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారు. 165 మందికి పైగా ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో సీట్లు పొందే ర్యాంకులు సాధించడం విశేషం. అలాగే 362 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారు. మంగళవారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపక బృందాన్ని సంస్థ చైర్మన్ కె.ధర్మరాజు, డైరెక్టర్ పి.సూర్యనారాయణ అభినందించారు. -
భక్తులకు అష్టకష్టాలు
పెందుర్తి/ఆరిలోవ: చందనోత్సవ ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వ పెద్దల మితిమీరిన జోక్యం.. అధికార యంత్రాంగం సమన్వయలోపం వెరసి వేలాది భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. రద్దీ లేని సమయంలో తీరుబడిగా ఉన్న అధికారులు.. అసలు సమయం వచ్చేసరికి ఓ దశలో పూర్తిగా చేతులెత్తేశారు. దీంతో భక్తులు సోమవారం సాయంత్రం పడరాని పాట్లు పడ్డారు. రవాణా వ్యవస్థ పూర్తిగా అదుపు తప్పడంతో వేలాది మంది భక్తులు ఇబ్బందుల పాలయ్యారు. మెట్ల మార్గం.. ఘాట్ రోడ్లు మీదుగా కిలో మీటర్ల మేర కొండ ఎక్కి అంత్యంత గందరగోళ పరిస్థితుల్లో స్వామి దర్శనం చేసుకున్నారు. ఉదయం ప్రశాంతం.. సాయంత్రం గందరగోళం దాదాపు 2 లక్షల మంది భక్తులు చందనోత్సవం సందర్భంగా స్వామి నిజరూప దర్శనానికి వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే సోమవారం వేకువజాము నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రద్దీ ఓ మాదిరిగా ఉండడంతో ఏర్పాట్ల లోపాలు అంతగా కనిపించలేదు. కానీ సాయంత్రం 3 గంటల తరువాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రెండు మూడు గంటల వ్యవధిలో వేలాది భక్తులు కొండ దిగువకు చేరుకోవడంతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోయాయి. దీంతో బస్సులు మందకోడిగా కదిలాయి. ఈ క్రమంలో పోలీసులను, ఆర్టీసీ అధికారులను పలు చోట్ల భక్తులు తీవ్రస్థాయిలో నిలదీశారు. చాలామంది భక్తులు పరిస్థితిని గమనించి మెట్ల మార్గం, ఘాట్ రోడ్లు వెంబడి ఆపసోపాలు పడుతూ నడుస్తూ క్యూలైన్లకు చేరుకున్నారు. పోలీసులందరూ వీఐపీలే.. చందనోత్సవం వేళ మరోసారి పోలీసుల తీరు విమర్శలపాలైంది. కిందిస్థాయి నుంచి అధికారుల వరకు వందలాది మంది పోలీసులు తమ కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులతో రూ.1500 క్యూలైన్ వద్దకు చేరుకున్నారు. వారి వద్ద పాస్లు లేకపోయినా సమయం చూసుకుని పోలీస్ అధికారులు వారిని క్యూలైన్లలోకి పంపడం గమనార్హం. ఓ రకంగా చెప్పాలంటే టికెట్లు లేకపోయినా పోలీసులంతా సపరివార కుటుంబ సమేతంగా వీఐపీ హోదాలో దర్శనం చేసుకున్నారు. కాళ్లు కాలి అవస్థలు : స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులు చెప్పులు విడిచిపెట్టడంతో ఎండ తీవ్రతకు తీవ్ర అవస్థలు పడ్డారు. కేవలం కొన్నిచోట్ల మాత్రమే మ్యాట్ వేయడంతో మిగిలిన చోట్ల నడిచిన భక్తులంతా పాదాలు మంటలు పుట్టి ఇబ్బందులు పడ్డారు. అయితే భక్తుల అవస్థలు చూసి కంటితుపుడు చర్యగా జీవీఎంసీ అధికారులు ట్యాంకర్లతో నీటిని రోడ్లుపై వేసినా అవి కొన్ని నిమిషాల్లోనే ఎండకు ఆవిరైపోయాయి. మూసిన మెట్ల దారి: అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల వరకు మెట్ల మార్గాన్ని మూసివేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ బస్సుల కొరత కొండపైకి వెళ్లేందుకు కేవలం ఆర్టీసీ బస్సులే దిక్కు కావడంతో భక్తులు ఫుట్బోర్డులపై వేలాడుతూ ప్రయాణించారు. బస్సుల కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది. భయంతో వెనుదిరిగాం.. సాయంత్రం అయితే దర్శనం చేసుకోవచ్చని వచ్చాం. కానీ బస్లు కదలకపోవడంతో పరిస్థితి బాలేదని గమనించాం. భయంతో ఇంటికి వెనుదిరిగాం. రవాణా వ్యవస్థ సరిగా నడపలేదు. – దొరబాబు, భక్తుడు తొలిసారి వచ్చాను.. దర్శన భాగ్యం లేదు.. తొలిసారి అప్పన్నస్వామి నిజరూప దర్శనం చేసుకుందామని వచ్చాను. కానీ బస్ ఎక్కే పరిస్థితి లేదు. బస్టాండ్లో భక్తుల నియంత్రణ కూడా లేదు. బస్లో ప్రయాణం చేసేందుకు మూడు గంటలు వేచి ఉన్నాను. కానీ కుదరకపోవడంతో స్వామి దర్శనం లేకుండానే ఇంటికి వెళ్లిపోతున్నాను. – కల్యాణి, భక్తురాలు, కూర్మన్నపాలెం -
పకడ్బందీగా పాలిసెట్ నిర్వహణ
మురళీనగర్: జిల్లాలో ఈ నెల 25న నిర్వహించనున్న పాలిసెట్–2026కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కో ఆర్డినేటర్ కేవీ రమణ తెలిపారు. సోమవారం పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా పరిధిలోని 18 కేంద్రాల్లో 6,308 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణలో కొత్తగా ప్రవేశపెట్టిన మొబైల్ యాప్ వినియోగంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జిల్లా పరిశీలకుడు డాక్టర్ బెహరా శ్రీనివాస్ ఆన్లైన్ ద్వారా పాల్గొని పలు సూచనలు చేయగా, సహాయ సమన్వయకర్త పి.ఎం. బాషా పరీక్షల నిర్వహణ వివరాలను వివరించారు. అనివార్య కారణాల వల్ల ఎన్ఏడీలోని ఎస్ఆర్ జూనియర్ కాలేజీ కేంద్రాన్ని రద్దు చేసి, దానికి బదులుగా ఎన్ఏడీలోని నారాయణ ఇంగ్లీషు మీడియం హైస్కూల్ (హాల్ టికెట్ నంబర్లు 1801001 నుంచి 1801300 వరకు), శ్రీ చైతన్య ఇంగ్లీషు మీడియం స్కూల్ (హాల్ టికెట్ నంబర్లు 1801301 నుంచి 1801400 వరకు) పరీక్ష కేంద్రాలను కేటాయించినట్లు రమణ చెప్పారు. గతంలో ఎస్ఆర్ కాలేజీకి కేటాయించిన 400 మంది విద్యార్థులు తమ హాల్ టికెట్లను తిరిగి డౌన్లోడ్ చేసుకోవాలని, మారిన వివరాలను అభ్యర్థులకు ఫోన్ ద్వారా కూడా సమాచారం అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఎన్ఏడీ పరీక్ష కేంద్రంలో స్వల్పమార్పు -
సీ ఫేరర్ల సంక్షేమానికే ప్రఽథమ ప్రాధాన్యం
సాక్షి, విశాఖపట్నం : సంస్థ అభివృద్ధికి నిత్యం కాంక్షిస్తూ.. పనిచేస్తున్న సీ ఫేరర్ల సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యమిస్తున్నామని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(డీసీఐ) ఎండీ, సీఈవో కెప్టెన్ ఎస్.దివాకర్ స్పష్టం చేశారు. విశాఖ సముద్ర జలాల్లో ఉన్న డ్రెడ్జ్–21 నౌకను ఆయన సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా నౌకలోని కెప్టెన్లు, మాస్టర్లు, చీఫ్ ఇంజినీర్లు, ఇతర సిబ్బందితో సుదీర్ఘంగా మాట్లాడారు. సముద్రంలో డ్రెడ్జింగ్ పనులు నిర్వహిస్తున్నప్పుడు ఎదుర్కొంటున్న సవాళ్లు, క్లిష్ట పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. డ్రెడ్జింగ్ విధులు నిర్వహిస్తున్నప్పుడు ఇంకా ఎలాంటి మౌలిక వసతులు కల్పించాలనే అంశంపై ఎండీ ఆరా తీశారు. ఈ సందర్భంగా కెప్టెన్ దివాకర్ మాట్లాడుతూ సంస్థకు వెన్నెముకలా నిలుస్తున్న సిబ్బందితో నేరుగా మమేకమవ్వాలనే సంకల్పంతో ఈ పర్యటన చేపట్టినట్లు తెలిపారు. సంస్థ పురోగతిలో కీలక పాత్ర పోషిస్తున్న సీఫేరర్ల సంక్షేమం, వారి సాధికారతకు తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఐ అధికారులు పాల్గొన్నారు. డీసీఐ ఎండీ కెప్టెన్ దివాకర్ -
ముగిసిన రక్తదాన శిబిరాలు
తాటిచెట్లపాలెం: పద్మపూజిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాలు దిగ్విజయంగా ముగిశాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని మొత్తం 13 కేంద్రాల్లో నిర్వహించిన ఈ శిబిరాల్లో 560 మంది స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. అత్యధికంగా శ్రీకాకుళంలో 80 మంది రక్తదానం చేయగా.. విశాఖ, గణపవరం, కై కలూరు ప్రాంతాల నుంచి కూడా విశేష స్పందన లభించింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ, వందేభారత్, న్యూ విజన్ బ్లడ్ బ్యాంకుల సహకారంతో పూర్తి భద్రతా ప్రమాణాల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మపూజిత గ్రూప్ చైర్మన్ బసవరాజు మాట్లాడుతూ.. రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఒక యూనిట్ రక్తం ముగ్గురు నలుగురి ప్రాణాలను కాపాడగలదని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. శిబిరాన్ని విజయవంతం చేసిన దాతలకు, వలంటీర్లకు ఫౌండేషన్ కృతజ్ఞతలు తెలిపింది. -
నడకపై యూజర్ చార్జీలా?
డాబాగార్డెన్స్: జీవీఎంసీ మైదానాల్లో వాకర్స్, క్రీడాకారులపై విధించిన యూజర్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం మాజీ కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు డిమాండ్ చేశారు. సోమవారం జీవీఎంసీ ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరా ప్రియదర్శిని, స్వర్ణభారతి వంటి స్టేడియాల్లో నడక సాగించే వారిపై రూ.720, క్రీడాకారుల శిక్షణ నిమిత్తం (ప్రైవేటు నిర్వాహకులు) రూ.12 నుంచి రూ.15 వేల వరకు చార్జీలు వసూలు చేయాలని చూడటం దారుణమన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత జీవీఎంసీపై ఉందని, వేల కోట్ల బడ్జెట్ ఉండి కూడా పౌర సేవలను వ్యాపార సరుకులుగా మార్చడం సరికాదని హితవు పలికారు. ప్రజల నుంచి రకరకాల పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వం, క్రీడా మైదానాల్లో మౌలిక సదుపాయాలు ఉచితంగా కల్పించాలని ఆయన కోరారు. -
జేఈఈ మెయిన్స్లో మెరుపులు
డాబాగార్డెన్స్: జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో విశాఖ జిల్లా విద్యార్థులు మంచి ప్రతిభ చూపారు. ఈ ఏడాది జనవరి, ఏప్రిల్ తొలి వారంలో రెండుసార్లు నిర్వహించిన పరీక్షల్లో వచ్చిన పర్సంటైల్ మేరకు ర్యాంకులు ఖరారు చేసి విడుదల చేశారు. వాటి ప్రకారం విశాఖలో కార్పొరేట్ కళాశాలలు శ్రీచైతన్య, నారాయణ, ఎసెంట్, శ్రీవిశ్వ, శశి, తిరుమల ఇతర విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు. ఓపెన్ కేటగిరీలో కె.హిమకర్ (46), గోవింద్ పాండే (56), పి.భార్గవ్ నాయుడు (58), ఎం.నాగ సహస్త్ర(85), కొండల కనిష్క (113), బొడ్డి ధీరజ్ (185), వెచ్చ వెంకట సాయి లోకేష్ (323), అల్లు రోహిత్ (444), బంకూరు ప్రవీన్ (559), రెడ్డి సాయి సాహితి (572), సీరపు వెంకట వైశాలి (646), తండ్యాల పవన్ సాయి (853), తమటపు హారిక శ్రీ మోదా (897), బి.సాయి చరణ్ (921) ర్యాంకులు సాధించారు. -
దివ్య దర్శనం
భవ్య రూపంఅప్పన్న నిజరూప దర్శనంతో పరవశించిన భక్తులు తెల్లవారుజాము 3.20 నుంచి ఉచిత, రూ.300 దర్శనం ప్రారంభంసింహాచలం : వైశాఖ శుద్ధ తదియ సందర్భంగా సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. సంవత్సరంలో ఒక్కరోజే కలిగే స్వామివారి నిజరూప దర్శనం కోసం భక్తులు తెల్లవారుజాము నుంచే తరలివచ్చి భక్తిరసంలో మునిగిపోయారు. చందనపు పొరల నుంచి వెలుగుచూసిన స్వామివారిని కళ్లారా చూసిన భక్తులు ఆధ్యాత్మికానందంలో తేలిపోయారు. శాస్త్రోక్తంగా చందనం విసర్జన పాంచరాత్ర ఆగమశాస్త్ర విధానాలను అనుసరించి ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఆలయంలో వైదిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సుప్రభాతసేవ, విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రుత్విగ్వరణం, పంచకలశారాధన వంటి విశిష్ట పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం వెండి బొరుగులతో స్వామివారిపై ఉన్న పన్నెండు మణుగుల చందనాన్ని శ్రద్ధగా తొలగించి, నిజరూపంలో స్వామివారిని దర్శనమిచ్చేలా తీర్చిదిద్దారు. తొలిదర్శనం అనంతరం భక్తులకు దర్శనాలు తెల్లవారుజాము 2.20 గంటలకు దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్గజపతిరాజు స్వామివారిని తొలిగా దర్శించుకున్నారు. తెల్లవారుజాము 3.20 గంటల నుంచి ఉచిత దర్శనం, రూ.300 ప్రత్యేక దర్శనం భక్తులకు కల్పించారు. రాత్రి 7 గంటలకు క్యూల ప్రవేశ ద్వారాలు మూసివేశారు. అప్పటివరకు క్యూల్లో వేచి ఉన్న భక్తులకు దర్శనాలు కల్పించారు. విశేషంగా సహస్ర ఘటాభిషేకం రాత్రి జరిగిన సహస్ర ఘటాభిషేకం ఆధ్యాత్మికోత్సాహాన్ని మరింత పెంచింది. త్రిదండి చిన జీయర్ స్వామి పర్యవేక్షణలో గంగధార నుంచి తీసుకు వచ్చిన వెయ్యి కలశాల పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకం చేశారు. అదేవిధంగా 108 వెండి కలశాలతో పంచామృతాలు, ఔషధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి విశేష పూజలు చేశారు. అనంతరం తొలివిడతగా మూడు మణుగులు(సుమారు 125 కిలోలు) పచ్చి చందనాన్ని సమర్పించి స్వామి వారిని మళ్లీ నిత్యరూపంలో అలంకరించారు. అహోబిల రామానుజజీయర్, దేవనాఽఽథ్ జీయర్ స్వామి పాల్గొన్నారు. దర్శించుకున్న ప్రముఖులు: స్వామి నిజరూప దర్శనాన్ని పలువురు ప్రముఖులు చేసుకున్నారు. రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీలు శ్రీభరత్, సి.ఎం.రమేష్, కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్, విశాఖ కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, కాకినాడ కలెక్టర్ హరేందిరప్రసాద్, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్భరత్, జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్, జేసీ విద్యాధరి, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ తదితరులు స్వామిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. నీలాద్రిగుమ్మం వద్ద హడావుడిసమయం దాటినా అంతరాలయ దర్శనాలుసింహాచలం: చందనోత్సవం వేళ శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయ నీలాద్రిగుమ్మం వద్ద సోమవారం తెల్లవారుజామున హడావుడి చోటుచేసుకుంది. తెల్లవారుజాము 2.20 గంటల సమయంలో తొలిదర్శనం చేసుకునేందుకు అశోక్గజపతిరాజు వచ్చేసరికే చాలామంది ఆలయ ధ్వజస్తంభం ప్రాంగణంలో ఉన్నారు. ఆయన దర్శనం చేసుకోగానే హోంమంత్రి అనిత దర్శనం చేసుకున్నారు. అప్పటికే రూ.1500 టికెట్ కల్గిన ప్రముఖులకు అంతరాలయ దర్శనం ప్రారంభించారు. ఈ తరుణంలోనే నీలాద్రిగుమ్మం వద్ద పెద్ద ఎత్తున తోపులాటలు చోటుచేసుకున్నాయి. ఎంతకీ క్యూ ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. రూ.1500 టికెట్పై వచ్చే ప్రముఖులకు తెల్లవారుజాము 3.30 నుంచి 5 గంటల వరకు మాత్రమే అంతరాలయ దర్శనం ఉంటుందని అధికారులు ముందుగా ప్రకటించినా.. ఆ సమయం దాటినా కూడా కొందరు ప్రముఖులు రావడంతో వారికి అంతరాలయ దర్శనం కల్పించారు. విశాఖ ఎంపీ భరత్ ఉదయం 5.13 గంటల సమయంలో అంతరాలయ దర్శనానికి వెళ్లడం విశేషం. ఆ తర్వాత మరికొందరు ప్రముఖలు దర్శనం చేసుకున్న తర్వాత ఉదయం 5.40 గంటల సమయంలో అంతరాలయం దర్శనాలు నిలుపుచేశారు. నీలాద్రిగుమ్మం వద్ద నెలకొన్న హడావుడితో అప్పటికే ప్రారంభమైన ఉచిత దర్శనం, రూ.300 దర్శనం భక్తులు కొంతమేర ఇబ్బందులు పడ్డారు. నీలాద్రిగుమ్మం వద్దే ఎక్కువ మంది పోలీసులు కూడా విధులు నిర్వర్తించడంతో దేవస్థానం ఉద్యోగులు తమ ఉద్యోగ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించలేకపోయారు. మరోపక్క నీలాద్రిగుమ్మం వద్దే ఉన్న రాష్ట్ర మంత్రి ఒకరు తమవాళ్లను ఇష్టానుసారంగా దర్శనానికి పంపించడం విశేషం. పోలీసుల దర్శనాలు కూడా అధికంగా చోటుచేసుకున్నాయి. పట్టు వస్త్రాల సమర్పణ చందనోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున హోంమంత్రి వంగలపూడి అనిత స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం తరపున డిప్యూటీ ఈవో వెంకయ్య చౌదరి కూడా పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ ఆనవాయితీ ప్రతి సంవత్సరం కొనసాగుతూ వస్తోంది. కూటమి నేతలకే ప్రోటోకాల్ దర్శనం సైడ్ లైట్స్ ఉచిత దర్శనం, రూ.300 దర్శనంల క్యూల్లోకి భక్తులు ఆదివారం రాత్రి నుంచే చేరుకున్నారు. ఉచిత దర్శనం రెండు క్యూలుగా ఏర్పాటు చేసినా నిరంతరం రెండు లైన్లు భక్తులతో రద్దీగానే ఉన్నాయి. దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ సీసీ మోనిటర్లో ఎప్పటికప్పుడు క్యూల రద్దీని గమనిస్తూ సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. మధ్యాహ్నం నుంచి క్యూల్లో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో క్యూలు పలుమార్లు ముందుకు కదల్లేదు. దేవస్థానం ప్రధానార్చకుడు కరి సీతారామాచార్యులు వాహనాన్ని టోల్గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొంతమేర వాగ్వాదం చోటుచేసుకుంది. సాయంత్రానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ముందుగా ప్రకటించిన విధంగా సాయంత్రం 6 గంటల నుంచే కొండపైకి బస్సులను నిలుపుదల చేశారు. రాత్రి 7 గంటలకే క్యూల ప్రవేశ ద్వారాలు మూసివేశారు. ఈసారి 1.25 లక్ష మంది స్వామిని దర్శించుకున్నట్లు అంచనా. తెల్లవారు 2.12 గంటలకు కేశఖండనశాల వద్ద 30 ఏళ్ల మహిళ స్పృహ తిరిగి పడిపోయారు. రూ.300 క్యూలైన్లో మధ్యాహ్నం 1.10 సమయంలో ఎండ తీవ్రతకు పలువురు స్పృహ కోల్పోయారు. సాక్షి, విశాఖపట్నం: వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం వేళ యంత్రాంగం వైఫల్యం భక్తులకు శాపంగా మారింది. ఏడాదికి ఒక్కసారి లభించే నిజరూప దర్శనం కోసం వచ్చిన వేలాది మంది సామాన్య భక్తులు అధికారుల అతి జాగ్రత్త, సమన్వయ లోపం కారణంగా అల్లాడిపోయారు. ఉదయం 3 నుంచి 6 గంటల వరకే ప్రోటోకాల్ దర్శనమని ప్రకటించినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. సాయంత్రం వరకు కూటమి ప్రజాప్రతినిధులు, వారి బంధుమిత్రులు, అధికారుల కుటుంబ సభ్యులే ప్రోటోకాల్ పేరుతో దర్శనాలు చేసుకున్నారు. దీనివల్ల రూ.1000, రూ.1500 టికెట్లు కొన్న భక్తులు కూడా 4 నుంచి 5 గంటల పాటు క్యూలైన్లలో వేచి చూడాల్సి వచ్చింది. -
భక్తుల సేవలో స్వచ్ఛంద సంస్థలు
సింహగిరిపై చందనోత్సవం సందర్భంగా వివిధ స్వచ్ఛంద సంస్థలు భక్తులకు విశేష సేవలు అందించాయి. అందులో భాగంగా ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ విశాఖపట్నం శాఖ ఆధ్వర్యంలో సుమారు 6000 మంది భక్తులకు పుచ్చకాయ ముక్కలను పంపిణీ చేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా భక్తుల దాహార్తిని తీర్చేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం ఎస్. పార్థసారధి, ప్రమోద్ భరద్వాజ్, పీవీవీఎస్ మూర్తిల నేతృత్వంలో జరిగింది. సుమారు 30 మంది వలంటీర్లు పాల్గొని భక్తులకు సేవలందించారు. ఈ సేవా కార్యక్రమాల పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు. -
రాజసం ఉట్టిపడే అక్షర సాక్ష్యం
1933 డిసెంబర్ 8వ తేదీన ప్రారంభించిన ఏయూ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ భవనం, జైపూర్ మహారాజు విక్రం దేవ్ వర్మ విగ్రహంమద్దిలపాలెం: శాస్త్ర విజ్ఞానానికి, పరిశోధనాత్మక వికాసానికి బలమైన పునాదిగా నిలిచిన ఆంధ్ర విశ్వవిద్యాలయ సైన్స్ కళాశాల భవనం, విశాఖ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. ఏయూ చారిత్రక వారసత్వానికి చిహ్నంగా వెలుగొందుతున్న ఈ భవనం వెనుక ఎంతో గొప్ప నేపథ్యం దాగి ఉంది. 1931 డిసెంబర్ 1వ తేదీన అప్పటి చాన్సలర్ లెఫ్టినెంట్ కల్నల్ సర్ జార్జ్ ఫ్రెడరిక్ స్టాన్లీ ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, జైపూర్ మహారాజు విక్రమ్ దేవ్ వర్మ అందించిన సహకారంతో కేవలం రెండేళ్ల కాలంలోనే ఈ అద్భుత నిర్మాణం పూర్తి చేసుకుంది. 1933 డిసెంబర్ 8న ప్రారంభమైన ఈ భవనం, నేటికీ తన నిర్మాణ శైలితో ఆశ్చర్యపరుస్తోంది. రాజుల కోట తలపించేలా.. రాజుల కోటలను తలపించేలా భారీ ఎత్తులో..శిల్పకళా చాతుర్యంతో నిర్మితమైన ఈ భవనం, నాడు విద్యా రంగానికి రాజులు ఇచ్చిన ప్రాధాన్యతను చాటి చెబుతుంది. కళాశాల ప్రాంగణంలో భక్తులకు, సందర్శకులకు నేటికీ ‘జైపూర్ విక్రమ్ దేవ్ వర్మ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల’ అనే అక్షరాలు చెక్కిన శిలాఫలకాలు దర్శనమిస్తాయి. భవనం ముందు భాగంలో ఉన్న జైపూర్ మహారాజు విగ్రహం, 1937లో ప్రముఖ శిల్పి డీపీ రాయ్ చౌదరి చేతుల మీదుగా రూపొందగా, అది నేటికీ ఎంతో గౌరవంగా నిలిచి ఉంది. 92 ఏళ్లు గడిచినా చెక్కుచెదరని ఈ రాతి కట్టడం విశ్వవిద్యాలయానికే తలమానికం. ఒకప్పుడు ఈ భవనంపై ఏర్పాటు చేసిన భారీ గడియారం, విశాఖలోని సుదూర ప్రాంతాల వారికి కూడా సమయాన్ని తెలియజేస్తూ ఒక మైలురాయిలా ఉండేది. కాలం మారుతున్నా, తన అద్భుతమైన నిర్మాణ శైలి కారణంగా ఈ భవనం నేటికీ అనేక చలనచిత్రాల చిత్రీకరణకు వేదికగా నిలుస్తోంది. ఆంధ్ర విశ్వవిద్యాలయ సాంకేతిక వికాసానికి, శాస్త్ర విజ్ఞానాభివృద్ధికి నిలువెత్తు సాక్ష్యంగా, చారిత్రక వారసత్వ సంపదగా ఈ సైన్స్ కళాశాల భవనం నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. -
వైఎస్సార్ సీపీలో చేరిన బీజేపీ నాయకులు
మహారాణిపేట: బీజేపీ నాయకులు వైఎస్సార్ సీపీలో చేరారు. వీరికి పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పార్టీ కండువాలువేసి ఆహ్వానించారు. గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ క్రిస్టియన్ మైనార్టీ స్టేట్ సెక్రటరీ శ్రీరత్నం లింగంతో పాటు డా. సురేష్ పిట్ట, మోహన్ బాబు, రమణి, అరుణ తదితరులు వైఎస్సార్ సీపీలో చేరారు. కూటమి విధానాలు నచ్చకే వైఎస్సార్ సీపీలో చేరినట్టు వీరు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పసుపలేటి బాలరాజు, మాజీ డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్, రాష్ట్ర అధికార ప్రతినిధి మంచ నాగమల్లీశ్వరి, రాష్ట్ర క్రిష్టియన్ మైనార్టీ విభాగం అధ్యక్షుడు జాన్ వెస్లీ , జిల్లా పార్టీ కోశాధికారి అనిల్ కుమార్ రాజు, పార్టీ నాయకులు ఎండి షరీఫ్ , జీలకర్ర నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. కండువా కప్పి ఆహ్వానించిన కేకే రాజు -
న్యాయ వ్యవస్థలో ‘మధ్యవర్తిత్వం’ కీలకం
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబ్బారెడ్డి సత్తి సబ్బవరం: కేసుల వేగవంతమైన పరిష్కారానికి మీడియేషన్ ఒక సమర్థవంతమైన మార్గమని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబ్బారెడ్డి సత్తి పేర్కొన్నారు. దీనిని కేవలం ప్రత్యామ్నాయ విధానంగానే కాకుండా, న్యాయవ్యవస్థలో అంతర్భాగంగా చూడాలని సూచించారు. దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో ఐదు రోజుల మధ్యవర్తిత్వ శిక్షణ కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. సుప్రీంకోర్టు మీడియేషన్ అండ్ కాన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ ఆధ్వర్యంలో వర్సిటీ వీసీ ఆచార్య డి. సూర్యప్రకాశరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబ్బారెడ్డి సత్తి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వీసీ సూర్యప్రకాశరావు తదితరులు వివిధ అంశాలపై మాట్లాడారు. -
సింహాచలం చందనోత్సవం.. భక్తులకు తప్పని అవస్థలు
విశాఖ: సింహాచలం చందనోత్సవంలో భక్తుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. సింహాచలం అప్పన్నస్వామి చందనోత్సవానికి భక్తులు భారీగా తరలిరావడంతో కనీస ఏర్పాట్లు చేయడంలో యంత్రాంగం విఫలమైంది. దాంతో భక్తులు గంటల తరబడి సింహాచలం బస్టాండ్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. బస్టాండ్లో సైతం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో పోలీసులు వారిని కంట్రోల్ చేయలేకపోతున్నారు. బస్టాండ్కు నుంచి సింహాచలం కొండపైకి వెళ్లే బస్సుల్లో భక్తులు తోసుకుంటూ ఎక్కుతున్నారు. బస్సులు ఎక్కడానికి ఎగబడిపోతున్నారు. సరైన ఏర్పాట్లు చేయకపోవడంత భక్తుల అవస్థలు తప్పడం లేదు. తాగునీరు, వైద్య సదుపాయాలు కూడా లేకపోవడంతో భక్తులు నరకం చూస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్లలోనే ఉంటున్నామని, కనీస సౌకర్యాలు కూడా ఏర్పాట్లు చేయలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
గాజువాకలో అగ్నిప్రమాదం
విశాఖ: గాజువాకలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకన్య థియేటర్ దగ్గర ఎలక్ట్రానిక్ షోరూమ్లో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ఎలక్ట్రానిక్ షోరూమ్ పై అంతస్తులో మంటలు ఎగిసి పడుతున్నాయి. దీనిపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మరొకవైపు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. -
జీవో నెం.60ని రద్దు చేయాలి
జోన్–1 పంచాయతీ అభివృద్ధి అధికారుల డిమాండ్ ఆనందపురం: స్థానిక మండల పరిషత్ కార్యాలయం వేదికగా ఆదివారం జోన్–1 పరిధిలోని పంచాయతీ అభివృద్ధి అధికారుల(పీడీవో) ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అధికారుల వృత్తిపరమైన సమస్యలు, పదోన్నతులు, భవిష్యత్తు కార్యాచరణపై లోతుగా చర్చించారు. జోన్–1 అధికారుల సాధికారత కోసం ఒక కోర్ కమిటీని సభ్యులు ఏకగ్రీవంగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ప్రభుత్వ ఉత్తర్వుల అంశంపై సుదీర్ఘ చర్చ సాగింది. ప్రస్తుతం అమల్లో ఉన్న జీవో నెం.60 వల్ల పీడీవోలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ జీవోను వెంటనే రద్దు చేసి, గతంలో ఉన్న జీవో నెం.91ని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. గతంలో జోన్–1 పరిధిలో పీఆర్, ఎస్జీఎస్డబ్ల్యూ డిప్యూటీ ఎంపీడీవోల పదోన్నతుల్లో సీనియర్ అసిస్టెంట్లకు అధిక ప్రాధాన్యత లభించిందని వారు గుర్తు చేశారు. సమావేశంలో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల నుంచి అధికారులు హాజరయ్యారు. -
దొంగల ఆటకట్టు
ఆనందపురం: మండలంలోని తర్లువాడలో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గ్రామానికి చెందిన కోరాడ రమణమ్మ కుటుంబ సభ్యులు వేసవి తాపం తట్టుకోలేక ఇంటికి తాళం వేసి, నిద్రించడానికి మేడ మీదకు వెళ్లారు. అదే సమయంలో బైక్పై వచ్చిన ఇద్దరు దొంగలు ఆమె ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న సుమారు నాలుగు తులాల బంగారు నగలు, 50 తులాల వెండి ఆభరణాలను దొంగలించారు. ఇది గమనించిన గ్రామస్తులు చాకచక్యంగా వ్యవహరించి, నిందితులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించి వారిని అప్పగించారు. పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో నిందితులను మధురవాడ ప్రాంతానికి చెందిన కోలా నవీన్, తోట దుర్గాప్రసాద్లుగా గుర్తించి, దొంగలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ పాత నేరస్తులని పోలీసులు తెలిపారు. బాధితురాలు కోరాడ రమణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఐసీయూలో ‘ప్రాణవాయువు’
మహారాణిపేట: ఉత్తరాంధ్ర ప్రజల ఆరోగ్య ప్రదాయిని కేజీహెచ్లో కీలకమైన ఆక్సిజన్ ప్లాంట్లు నిధులు లేక, నిర్వహణ కరువై దిష్టిబొమ్మల్లా మారాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కోవిడ్ కష్టకాలంలో ఎందరో ప్రాణాలు కాపాడేందుకు కోట్లాది రూపాయల వ్యయంతో ఆరు ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వీటి నిర్వహణను గాలికి వదిలేయడంతో, నేడు ఆరు ప్లాంట్లలో నాలుగు పూర్తిగా మూలనపడ్డాయి. కేవలం రెండు ప్లాంట్లు మాత్రమే అరకొరగా పని చేస్తుండటంతో రోగులకు ప్రాణవాయువు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నచిన్న మరమ్మతులకూ వెనకడుగు ఈ ప్లాంట్లలో ప్రెషర్ గేజ్, డ్రయ్యర్, కంప్రెషర్ వంటి చిన్నపాటి సాంకేతిక సమస్యలు మాత్రమే ఉన్నాయి. కేవలం రూ. 15 లక్షలు ఖర్చు చేస్తే నాలుగు ప్లాంట్లు పునరుద్ధరణకు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. సొంతంగా ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉన్నా, దానిని పక్కనపెట్టి ప్రైవేటు సంస్థల నుంచి నెలకు రూ. 40 లక్షలు వెచ్చించి ఆక్సిజన్ను కొనుగోలు చేస్తున్నారు. అంటే ఏడాదికి కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని ప్రైవేటు వ్యక్తుల పాలు చేస్తున్నారు. రోగుల ప్రాణాలతో చెలగాటం రోజూ 2,000 మందికి పైగా ఓపీ, వందలాది మంది ఇన్పేషెంట్లు వచ్చే కేజీహెచ్లో 26 విభాగాలకు ఆక్సిజన్ అత్యవసరం. ప్రైవేటు ఆస్పత్రుల్లో రోజుకు వేలల్లో వసూలు చేసే ఆక్సిజన్ బిల్లులు భరించలేక పేదలు కేజీహెచ్కు వస్తుంటే, ఇక్కడ ప్లాంట్లు పాడైపోవడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి, మొక్కుబడి మరమ్మతులు కాకుండా శాశ్వత పరిష్కారం చూపి ప్లాంట్లను అందుబాటులోకి తీసుకురావాలని రోగుల కుటుంబాలు కోరుతున్నాయి. -
అపురూప చిత్రాలు.. అందమైన బొమ్మలు
మద్దిలపాలెం: బీచ్రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా.. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ‘కళా సెంటినియల్ సాగా’ప్రదర్శన ప్రారంభమైంది. ఏయూ చిత్రకళా విభాగం విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ఆచార్యుల సృజనాత్మకతకు ఈ వేదిక ప్రతిరూపంగా నిలిచింది. ప్రముఖ చిత్రకారుడు ఆచార్య జి.రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ ప్రదర్శనను ప్రారంభించారు. కార్యక్రమంలో ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్, విశ్రాంత ఆచార్యులు వి.రమేష్, మయూఖ కుమారి దేవి, విభాగాధిపతి డి.సింహాచలం, ఆచార్యులు శిష్ట్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అతిథులు ప్రదర్శనను తిలకించి విద్యార్థుల ప్రతిభను అభినందించారు. ముఖ్యంగా ఆయిల్ పెయింటింగ్స్, ప్రింట్స్, దారు శిల్పాలు, పీవోపీ, ఇత్తడి, మోల్డింగ్లో తయారు చేసిన శిల్పాలు ప్రకృతిని, సామాజిక పరిస్థితులను, మానవ ఆలోచనలను ప్రతిబింబిస్తూ కనువిందు చేశాయి. ప్రతి కళాఖండం వెనుక ఉన్న అంతరార్థాన్ని విద్యార్థులు వివరించిన తీరు కళాభిమానులను మంత్రముగ్ధులను చేసింది. ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగే ఈ ప్రదర్శనను నగరవాసులు, కళాకారులు తిలకించాలని ఆచార్య సింహాచలం కోరారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య పి.కింగ్, రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, ఎల్జీ ఇండియా సీఎస్సార్ ప్రతినిధి సంగ్ యున్ కిమ్ తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకుంటున్న ఆర్ట్ ఎగ్జిబిషన్ -
● కుంచె సాక్షిగా... శతాబ్ది కావ్యం
ఘన చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం తన నూరేళ్ల వైభవాన్ని రంగుల హరివిల్లుగా తీర్చిదిద్దింది. బీచ్రోడ్డులోని కన్వెన్షన్ సెంటర్ వేదికగా సాగుతున్న ‘కళా సెంటినియల్ సాగా’ చిత్రకళా ప్రదర్శన.. సృజనకూ, శిల్పానికీ ప్రాణం పోసింది. ప్రముఖ చిత్రకారుడు ఆచార్య జి. రవీందర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ప్రదర్శనలో.. దారు శిల్పాలు ప్రకృతి పరవశాన్ని చాటుతుంటే, ఆయిల్ పెయింటింగ్స్ సామాజిక చిత్రాలను కళ్లకు కడుతున్నాయి. – ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
ఐదున్నరేళ్ల పోరాటం స్ఫూర్తిదాయకం
డాబాగార్డెన్స్: విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జేఏసీ, అఖిల పక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ పార్కు వేదికగా జరుగుతున్న దీక్షకు వైఎస్సార్ టీయూసీ ఆదివారం సంఘీభావం తెలిపింది. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్రెడ్డి హాజరై తమ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు ఐదున్నరేళ్లుగా కార్మికులు చేస్తున్న పోరాటం అభినందనీయమన్నారు. వైఎస్సార్ సీపీ ఎల్లప్పుడూ కార్మికుల పక్షాన నిలుస్తుందని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ జోనల్ అధ్యక్షుడు పీవీ సురేష్, వైఎస్సార్ టీయూసీ జిల్లా అధ్యక్షుడు రాయపూర్ అనీల్ కుమార్, స్టీల్ ప్లాంట్ ప్రధాన కార్యదర్శి డీవీ రమణ, ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు దాలినాయుడు, పేర్ల నూకరాజు, నమ్మి ప్రసాద్, చిత్రాడ బాలకృష్ణ, ఎన్నేటి రమణ, బొడ్డ గోవింద్, గొందేసి శ్రీనివాస రెడ్డి, కారి ఆనంద్, మహేష్, అప్పారావు, అప్పలరెడ్డి, నందిబాబు, వెంపడ వెంకటరమణతో పాటు కాంట్రాక్టు కార్మిక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు -
వారసత్వానికి చిహ్నం... ఆధునికతకు దర్పణం
నగరం నడిబొడ్డున, సాగర గాలుల సాక్షిగా తలఎత్తుకుని నిలబడిన విద్యా భాండాగారం పేరు వింటే తెలుగు వారి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. అదే ఆంధ్ర విశ్వవిద్యాలయం. వందేళ్ల కిందట నిర్మితమైన ఇక్కడి చారిత్రక భవనాలు నేటికీ చెక్కుచెదరని దృఢత్వంతో, అద్భుతమైన నిర్మాణ శైలితో మనల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. ముఖ్యంగా పరిపాలన(సీఏవో) భవనం విశ్వవిద్యాలయానికే గుండెకాయ వంటిది. కాల చక్రం వేగంగా తిరిగింది. సీఏవో భవనం చుట్టూ ఉన్న పరిసరాలు నేడు అభివృద్ధి చెందాయి. భవనం తన గాంభీర్యాన్ని అలాగే కాపాడుకుంటూనే, తన చుట్టూ ఆధునికతను అలంకరించుకుంది. ఆ రాతి గోడల్లో దాగి ఉన్న విజ్ఞానం తరాలు మారుతున్నా నేటికీ దిశానిర్దేశం చేస్తూనే ఉంది. – మద్దిలపాలెం నేడునాడు -
గౌతు లచ్చన్న స్మారక భవనం నిర్మించాలి
డాబాగార్డెన్స్: స్వాతంత్య్ర సమరయోధుడు, బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న జ్ఞాపకార్థం విశాఖపట్నంలో స్మారక భవనాన్ని నిర్మించాలని జిల్లా శ్రీశయన సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడు తోట వాసుదేవరావు కోరారు. గౌతు లచ్చన్న వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం జడ్జి కోర్టు సమీపంలోని ఆయన విగ్రహానికి పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తోట వాసుదేవరావు మాట్లాడుతూ.. బలహీన వర్గాల అభ్యున్నతికి లచ్చన్న చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. లచ్చన్న ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వం కార్యరూపంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. షీలానగర్ నుంచి సబ్బవరం వెళ్లే రహదారిలో లచ్చన్న స్మారక భవనాన్ని నిర్మించి, అక్కడ ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు బీసీ నాయకులు కూడా పాల్గొన్నారు. -
టీ20 చాంపియన్ ‘గెలాక్సీ సీసీ’
విశాఖ స్పోర్ట్స్: విశాఖ జిల్లా క్రికెట్ అసోసియేషన్(వీడీసీఏ) ఆధ్వర్యంలో జరిగిన టీ20 టోర్నమెంట్ విజేతగా గెలాక్సీ సీసీ నిలిచింది. ఆదివారం వైఎస్సార్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో కావలీర్స్ సీసీపై గెలాక్సీ సీసీ 74 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన గెలాక్సీ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. బ్యాటర్ మునిమ్ 52 పరుగులతో రాణించగా, కావలీర్స్ బౌలర్ భువనేశ్వర్ మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కావలీర్స్ సీసీ.. గెలాక్సీ బౌలర్ల ధాటికి 17.3 ఓవర్లలో కేవలం 124 పరుగులకే కుప్పకూలింది. గెలాక్సీ బౌలర్లలో వాసు నాలుగు వికెట్లు, హేమంత్ మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. టోర్నీ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మునిమ్ బెస్ట్ బ్యాటర్గా, ఆశిష్ బెస్ట్ బౌలర్గా, మోహిత్ బెస్ట్ ఆల్రౌండర్గా నిలిచారు. విజేతగా నిలిచిన గెలాక్సీ జట్టుకు రూ.25 వేలు, రన్నరప్ కావలీర్స్కు రూ.15 వేలు, మూడో స్థానంలో నిలిచిన మెట్రో జట్టుకు రూ.10 వేల నగదు బహుమతులను వీడీసీఏ వర్కింగ్ ప్రెసిడెంట్ విష్ణుకుమార్ రాజు చేతుల మీదుగా అందజేశారు. -
పీఏలే బాస్లు
● భీమిలిలో ప్రైవేట్ లిమిటెడ్ పాలనఎమ్మెల్యే గంటా ఇలాకాలో ముగ్గురు పీఏల మధ్య కుదిరిన ‘వాటాల’ ఒప్పందం ఒకరికి భూములు.. మరొకరికి వసూళ్లు.. ఇంకొకరికి పోస్టింగ్ బాధ్యతలు ఫోన్లు ఎత్తరు.. పనులు చేయరు.. ‘సొంత’ నేతల మధ్యే రగులుతున్న ఆగ్రహం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎమ్మెల్యే గంటా గంటా శ్రీనివాసరావు ఇలాకాలో అసలు కథ వేరే ఉంది. అక్కడ ప్రజాప్రతినిధి మాట కంటే.. పీఏలకే పవర్ ఎక్కువ. ముగ్గురు పీఏలు.. మూడు రాజ్యాలుగా భీమిలిని విభజించుకుని, అధికారమే అండగా దండుకోవడమే అజెండాగా చెలరేగిపోతున్నారు. భూములు ఒకరికి.. వసూళ్లు మరొకరికి.. పోస్టింగులు ఇంకొకరికి అన్నట్లుగా సాగుతున్న ఈ ’పీఏల ప్రైవేట్ లిమిటెడ్’ దందాతో ప్రజలు నట్టేట మునుగుతున్నారు. సొంత పార్టీ క్యాడర్కే ముల్లోకాలు చూపిస్తున్న ఈ ముగ్గురు మొనగాళ్ల తీరు ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. అప్పనంగా వాటాలు.. నిలువునా దోపిడీ భీమిలిలో ఈ ముగ్గురు పీఏల మధ్య పని విభజన భలేగా జరిగింది. ‘కంచే చేను మేసిన చందంగా’.. ఎవరికి కేటాయించిన విభాగాల్లో వారు యథేచ్ఛగా దండుకుంటున్నారు. ఒకరు పూర్తిస్థాయిలో భూ వ్యవహారాలు, మున్సిపాలిటీ పనులను చక్కబెడుతుంటే.. మరొకరు సింహాచలం దేవస్థానం భూములు, టీడీఆర్లు, కాంట్రాక్టుల మీద కన్నేశారు. ఇక మూడో వ్యక్తి ప్రభుత్వ అధికారుల పోస్టింగులు, బదిలీల వ్యవహారాలను డీల్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ‘ఒక్కొక్కరికి ఒక్కో రాజ్యం’ అన్నట్టు, ముగ్గురు కలిసి నియోజకవర్గాన్ని విభజించుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీళ్లలో ఒకరైతే ఏకంగా ఒక ఎంపీకి చెందిన ప్రైవేట్ జెట్లో ప్రయాణిస్తూ, ఎమ్మెల్యేను మించిన స్థాయిలో ఆస్తులు కూడబెట్టారనే టాక్ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. నిజానికి ఈ ముగ్గురు పీఏల మధ్య మొదట్లో అస్సలు పడేది కాదు. ఎవరికి వారు పైచేయి సాధించడానికి సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు బురద చల్లుకున్నారు. అయితే, వీరి గొడవ బజారున పడటంతో పెద్దలు రంగప్రవేశం చేసి రాజీ కుదిర్చారట. ‘అందరం కలిసి ముంచేద్దాం’ అన్నట్లుగా ఇప్పుడు ఎవరి ఏరియా ఏమిటో విభజించుకున్నారు. ● మరొకరు పోస్టింగులు, భూ లావాదేవీలు, వసూళ్లలో జోక్యం చేసుకుంటూ అధికారులకు నేరుగా ఫోన్లు చేసి ఒత్తిడి తెస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ‘కోడి గుడ్డు పెట్టక ముందే పిల్లల్ని లెక్కపెట్టినట్టు’ ముందుగానే లావాదేవీలు ఫిక్స్ చేస్తున్నారనే చర్చ ఉంది. ఈయన తీరుతో అధికారులే తల పట్టుకుంటున్నారు. ● ప్రధానంగా అనధికారికంగా పీఏగా వ్యవహరించే వ్యక్తి భూముల వ్యవహారాల్లో ‘మొత్తం మింగేస్తున్నాడు’ అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో భూసమీకరణ జరుగుతున్న ప్రాంతాల్లో రైతుల నుంచి కొద్ది మొత్తం డిమాండ్లు చేస్తున్నట్టు సమాచారం. ప్రతి పనికీ ధర కట్టేశారన్న అసహనం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. ● సింహాచలం దేవస్థాన భూములు, ఆక్రమణలు, బీఆర్టీఎస్ కారణంగా భూములు కోల్పోయిన వారికి టీడీఆర్లు.. దేవస్థాన పోస్టింగుల నుంచి కాంట్రాక్టుల వరకు వ్యవహారాలన్నీ ఒకే వ్యక్తి చేతుల్లో ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీఏ కమ్ పీఆర్వోగా వ్యవహరించే సదరు వ్యక్తి ‘ఒకే దెబ్బకు రెండు పిట్టలు’ అన్నట్లుగా అధికారాన్ని, ఆదాయాన్ని పిండేస్తున్నారు. కోల్డ్ వార్ నుంచి.. ‘కాసుల’ ఒప్పందం వరకు.. కార్యకర్తలకు చుక్కలు పీఏలు హాయిగా వాటాలు పంచుకుంటుంటే.. కష్టపడి పార్టీని గెలిపించిన కార్యకర్తలు మాత్రం ‘నోట్లో వెలక్కాయ పడ్డట్టు’ అయోమయంలో పడిపోయారు. తమ సమస్యలు ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదని, పనులు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పద్మనాభం మండలంలో జరిగిన సమావేశంలో ఇదే అంశంపై నేతలు గట్టిగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ముగ్గురు పీఏలు కలిసి తమకు ‘ముల్లోకాలు చూపిస్తున్నారు’ అంటూ తీవ్రంగా ధ్వజమెత్తినట్టు సమాచారం. ‘ముందు వెనక చూసుకోకుండా చెలరేగిపోతున్న’ ఈ పీఏల వైఖరి వల్ల ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గ్రాఫ్ పడిపోతోందని, క్యాడర్ చెల్లాచెదురయ్యే ప్రమాదం ఉందని సీనియర్ నేతలు హెచ్చరిస్తున్నారు. -
జువ్వలదిన్నె హార్బర్ ప్రైవేటీకరణలో భారీ కుంభకోణం
● రూ.10 కోట్ల విలువ లేని సంస్థకు వందల కోట్ల విలువైన పోర్టు ధారాదత్తం ● మత్స్యకారులను చంద్రబాబు ఓటు బ్యాంకుగానే చూస్తాడు ● కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ధ్వజం సాక్షి, విశాఖపట్నం : జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణ పేరుతో వందల కోట్ల రూపాయలు చేతులు మారాయని, కేవలం రూ. 10 కోట్ల నికర విలువ కూడా లేని సంస్థకు వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కట్టబెట్టడం తీవ్ర అనుమానాలకు తావిస్తోందని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆరోపించారు. ఆదివారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మత్స్యకారులంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎప్పుడూ చిన్నచూపేనని, ప్రతి ఎన్నికల మేనిఫెస్టోలో మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని, 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని హామీలు ఇవ్వడం తప్ప, ఆ వర్గాల సంక్షేమం గురించి ఆయన ఎన్నడూ పట్టించుకోలేదని వాసుపల్లి విమర్శించారు. గతంలో తాను టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ విషయాలను అసెంబ్లీలో, టీడీఎల్పీ సమావేశాల్లో పలుమార్లు నిలదీసినా ఫలితం లేకపోయిందని గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో మత్స్యకారులకు చేసింది శూన్యమని, బోట్లు మునిగిపోయినప్పుడు బీమా రెన్యువల్ చేయలేదనే సాకుతో నష్టపరిహారం ఎగ్గొట్టిన చరిత్ర ఆయనదని ఆరోపించారు. అదే సమయంలో అచ్చెన్నాయుడు ఈఎస్ఐ కుంభకోణంలో దోచుకున్న రూ. 150 కోట్లతో ఒక ఫిషింగ్ హార్బర్ను నిర్మించవచ్చని ఆయన ఎద్దేవా చేశారు. దీనికి భిన్నంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపారని వాసుపల్లి కొనియాడారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ అభివృద్ధికి రూ. 155 కోట్లు కేటాయించడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. జువ్వలదిన్నెలో రూ. 300 కోట్లతో 79 ఎకరాల్లో 1250 బోట్ల సామర్థ్యంతో నిర్మించిన హార్బర్ను ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మూసివేసి, రూ. 40 కోట్ల పెట్టుబడి పెట్టే ‘సాగర్ డిఫెన్స్’ సంస్థకు రూ. 200 కోట్ల విలువైన ఆస్తులను అప్పగించడం వెనుక భారీగా కమీషన్లు చేతులు మారాయని ఆరోపించారు. 2029లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఈ భూములను వెనక్కి తీసుకుని మత్స్యకారులకే అప్పగిస్తామని జగన్ ఇప్పటికే స్పష్టం చేశారని గుర్తు చేశారు. సింహాచలం అప్పన్న చందనోత్సవ నిర్వహణలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వాసుపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవదాయ శాఖ పరిధిలో ఉండాల్సిన ఉత్సవాలను రెవెన్యూ శాఖకు అప్పగించి, కార్పొరేట్ తరహాలో మార్చి భక్తులకు కనీస దర్శన సౌకర్యాలు కల్పించలేదని విమర్శించారు. ఈ సమావేశంలో ఫిషింగ్ హార్బర్ మాజీ ప్రెసిడెంట్ వాసుపల్లి జానకి రామ్, మాజీ కార్పొరేటర్ దౌలపల్లి ఏడుకొండల రావు, పార్టీ నాయకులు గనగళ్ల రామరాజు, ఈశ్వర్, సాగర్, బొడ్డు ఆనంద్, అప్పారావు, చోడిపల్లి శివ, వాసుపల్లి బంగారమ్మ, చింతపల్లి లీల కృష్ణ, సూరిని రాము, వేణు, చేపల రాజు, అచ్యుత్, గనగాళ్ల కామేష్ తదితరులు పాల్గొన్నారు. -
చందన స్వామి నిజరూప దర్శనానికి వేళాయె
సింహాచలం: సింహగిరిపై అవతరించిన ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవ వేళయింది. వైశాఖ శుద్ధ తదియని పురస్కరించుకుని స్వామివారు సోమవారం తన నిజరూప దర్శన భాగ్యాన్ని భక్తులకు కల్పించనున్నారు. ఏడాదంతా చందన రూపుడి(నిత్యరూపం)గా కనిపించే స్వామి మణుగుల చందనం నుంచి బయటకు వచ్చి, నిజరూపంతో దర్శనమివ్వనున్నాడు. అర్ధరాత్రి దాటాక ఒంటి గంట నుంచి ఆలయ అర్చకులు వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించి, స్వామివారిపై ఉన్న చందనాన్ని ఒలిచి నిజరూప భరితుడిని చేస్తారు. వేకువజాము 3 గంటలకు అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్గజపతిరాజుకు తొలి దర్శనం కల్పిస్తారు. 3.30 గంటల నుంచి భక్తులకు ఉచిత, రూ.300 దర్శనాలు ప్రారంభిస్తారు. రాత్రి 8 గంటల నుంచి సహస్రఘటాభిషేకం నిర్వహిస్తారు. సింహగిరిపై గంగధార నుంచి శ్రీవైష్ణవస్వాములు కలశాలతో తీసుకొచ్చిన నీటితో స్వామివారి నిజరూపానికి అభిషేకం నిర్వహిస్తారు. 108 వెండి కలశాలతో పంచామృతాభిషేకం, విశేష పూజల అనంతరం తొలి విడతగా మూడు మణుగుల చందనాన్ని స్వామికి సమర్పించి మరల నిత్యరూపభరితున్ని చేస్తారు. నిజరూప స్వామికి ధరింపజేసే శిరోచందనం, హృదయచందనాన్ని వైదికులు ఇప్పటికే సిద్ధం చేశారు. పటిష్ట ఏర్పాట్లు : ఈసారి చందనోత్సవానికి సుమారు రెండు లక్షల మంది భక్తులు వస్తారని జిల్లా యంత్రాంగం అంచనా. ఉచిత దర్శనంతో పాటు రూ.300, రూ.1,000ఽ, రూ.1,500ల దర్శనం టికెట్ల క్యూలను పకడ్బందీగా ఏర్పాటు చేశారు. టికెట్లపై పొందుపరిచిన సమయాల(స్లాట్ల) ప్రకారం దర్శనాలకు అనుమతిస్తారు. రాత్రి 7 గంటలలోపు మాత్రమే క్యూల్లోకి భక్తులను అనుమతిస్తారు. అనంతరం క్యూల ప్రవేశ ద్వారాలు మూసివేసి అప్పటి వరకు క్యూల్లో ఉన్న భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 6 గంటల వరకు సింహగిరి పైకి బస్సుల్లో భక్తులను అనుమతిస్తారు. దర్శనానంతరం దక్షిణ రాజగోపురం ద్వారా బయటకు వచ్చే భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం అందిస్తారు. ఈ మేరకు 40 గ్రాముల లడ్డూలను లక్షా 50 వేలు సిద్ధం చేశారు. చందనోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, సింహాచలం దేవస్థానం ఈవో జె.వెంకటరావు ఆధ్వర్యంలో అన్ని శాఖల సమన్వయంతో జిల్లాయంత్రాంగం ఏర్పాట్లు చేసింది. నగర పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాగ్చి ఆధ్వర్యంలో 2,300 మందితో పోలీస్ బందోబస్తు, సింహగిరిపై కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. డ్రోన్ సాంకేతికను వినియోగిస్తున్నారు. భక్తులందరికీ అన్నప్రసాదం : చందనోత్సవానికి వచ్చే భక్తులందరికీ అన్నప్రసాద భవనంలో అన్నప్రసాదం అందించనున్నారు. కొండ దిగువ శ్రీకృష్ణాపురంలోని గోశాల, అడవివరం జంక్షన్, తొలిపావంచా, సింహపురికాలనీ, శ్రీనివాసనగర్లోని దేవస్థానం కల్యాణమండపాల వద్ద కేవలం లడ్డూ ప్రసాదాలు మాత్రమే విక్రయిస్తారు. ఈ మేరకు 80 గ్రాముల లడ్డూలు సుమారు లక్ష సిద్ధం చేశారు. ఏర్పాట్లు పరిశీలించిన హోంమంత్రి అనిత చందనోత్సవం ఏర్పాట్లను ఆదివారం హోంమంత్రి అనిత పరిశీలించారు. దర్శనాల క్యూలను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు సాఫీగా జరిగేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత చందనోత్సవ అనుభవాల నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఆలయం వద్ద సిద్ధంగా ఉండాలని సూచించారు. భద్రతా ఏర్పాట్లలో ఏఐ టెక్నాలజీని వినియోగిస్తున్నామని పోలీస్ అధికారులు హోంమత్రికి తెలియజేశారు. మంత్రి వెంట దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్, ఈవో జె.వెంకటరావు, డీసీపీ–2 మేరీ ప్రశాంతి తదితరులు ఉన్నారు. 300 బస్సులు డాబాగార్డెన్స్: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ 300 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు రీజినల్ మేనేజర్ బి.అప్పలనాయుడు తెలిపారు. ప్రధానంగా ద్వారకా బస్టేషన్, గాజువాక నుంచి 60 చొప్పున, విజయనగరం, చోడవరం, కొత్తవలస నుంచి 50 చొప్పున, అనకాపల్లి నుంచి 40 ప్రత్యేక సర్వీసులను అందుబాటులో ఉంచారు. వీటితో పాటు కొండపైన, గోశాల, అడవివరం వంటి ప్రాంతాల మధ్య ప్రత్యేక షటిల్ సర్వీసులను నడుపుతామని తెలిపారు.


