Visakhapatnam
-
రాష్ట్రాన్ని తాకిన నైరుతి
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ): నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. సోమవారం రాయలసీమలోని పలు ప్రాంతాలను రుతుపవనాలు తాకినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. వీటి వేగాన్ని బట్టి మూడు రోజుల్లో రాష్ట్రమంతా విస్తరించే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు 16 ఏళ్ల తర్వాత ముందస్తుగా భారత ఉపఖండంలోకి ప్రవేశించాయి. సాధారణంగా ఇవి జూన్ ఒకటో తేదీన కేరళను తాకి, ఆ తర్వాత మూడు రోజుల్లో (జూన్ 4) ఏపీలోకి ప్రవేశిస్తాయి.ఒక్కోసారి కేరళను తాకిన తర్వాత కూడా వాతావరణ పరిస్థితులు మారడంతో ఏపీకి రావడానికి ఆలస్యమైన సందర్భాలున్నాయి. కానీ, ఈసారి మాత్రం పది రోజులు ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించాయి. లానినో పరిస్థితుల నేపథ్యంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రుతుపవనాల గమనాన్ని బట్టి ఈ ఏడాది అధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కూల్ సమ్మర్ వాతావరణంలో అనూహ్య మార్పులు, రుతుపవనాలు ముందస్తుగా పలకరించడంతో ఈ ఏడాది వేసవి ప్రభావం రాష్ట్రంలో పెద్దగా కనిపించలేదు. మామూలుగా మే నెలలో ఎండ తీవ్రత విపరీతంగా ఉంటుంది. 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. రోహిణీ కార్తెలో ఎండతోపాటు ఉక్కపోతతో జనం అల్లాడిపోయేవారు. కానీ ఈ మే నెలలో అనిశి్చత వాతావరణం వల్ల ఎండతోపాటు వర్షాలు కురిశాయి. దీంతో ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. ఈ వేసవిలో ఎక్కడా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాలేదు. ఆదివారం నుంచి రోహిణీ కార్తె మొదలైనా, ఎండల తీవ్రత మాత్రం లేకుండాపోయింది. రోళ్లు పగిలే రోహిణీ కార్తెలో ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి.నేటి నుంచి వర్షాలు..ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశాలో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మంగళవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, ఇతర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం కృష్ణా, ఎనీ్టఆర్, గుంటూరు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వివరించింది. సోమవారం పలు ప్రాంతాల్లో వానలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం వర్షాలు కురిశాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా రాచపనుకులులో 56 మిల్లీమీటర్లు, విజయనగరంలో 42.7 మి.మీ, మారేడుమిల్లిలో 41.5 మి.మీ, గంపరాయిలో 34 మి.మీ, నెల్లిమర్లలో 33 మి.మీ, అన్నమయ్య జిల్లా ఎంగిలిబండ, కర్నూలు జిల్లా కామవరంలో 31.5 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. -
ఇంతేనా...!
అంతాభ్రాంతియేనా...అర్జీల గతి ● అర్జీ సమర్పించినా పరిష్కారం కాని సమస్యలు ● పరిష్కారం కాకుండానే పరిష్కరించినట్టు మెసేజ్లు ● కాళ్లరిగేలా తిరుగుతున్న అర్జీదారులు ● ప్రజలతో కూటమి ప్రభుత్వం ఆటలు ● పీజీఆర్ఎస్ అంతా డిజిటల్ మాయ అంటూ బాధితుల గగ్గోలు పీజీఆర్ఎస్: ‘పరిష్కారం’ అనే భ్రమ కలెక్టరేట్ మెట్లు : సమస్యల ‘తిరుగు ప్రయాణం’ మొదలయ్యే చోటు అర్జీ..: ‘క్లోజ్డ్’ అని కనిపించినా, సమస్య మాత్రం ‘ఓపెన్’లోనే.. ఆహా! ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) అద్భుతాలు ఇవి.. ప్రతి సోమవారం కలెక్టరేట్ మెట్లు ఎక్కే భాగ్యం సామాన్య ప్రజలకు కల్పిస్తూ, వారి సమస్యలకు ‘శాశ్వత పరిష్కారం’ చూపే అద్భుతమైన వేదిక ఇది. వినతులు ఇచ్చి, అవి పరిష్కారం కాకుండానే ‘పరిష్కారమైపోయినట్లు’ రికార్డుల్లో చూసి, కంగుతిని మళ్లీ మళ్లీ కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేసే అవకాశం కల్పించిన కూటమి ప్రభుత్వానికి హ్యాట్సాఫ్!. పీజీఆర్ఎస్ ఓ అంతులేని ప్రహసనం.. ప్రతి సోమవారం కలెక్టరేట్ గేటు దగ్గర ఒక పండగ వాతావరణం. జన సందోహం, ఆశలు చిగురించిన మొహాలు. పీజీఆర్ఎస్కు వచ్చామంటే సమస్య తీరినట్లే అనే భరోసా. కానీ లోపల జరిగే తతంగం మాత్రం వేరు. ఫిర్యాదు ఇచ్చామా, అది ఓపెన్ అయ్యిందా, అధికారులు చూశారా అనే కన్నా, ‘పరిష్కారమైపోయింది’ అని స్టేటస్ మారడం ముఖ్యమని అధికార యంత్రాంగం నిరూపిస్తోంది. సమస్య అలాగే ఉన్నా, కాగితాలపై మాత్రం క్లోజ్ ! ఇది కదా అసలైన ‘డిజిటల్ ఇండి యా’ అంటే!..‘గత సోమవారం ఇదే సమస్య ఇచ్చానండి, పరిష్కారం కాలేదు. మళ్లీ వచ్చాను’ అని చెప్పే నిస్సహాయుల మాటలు కలెక్టరేట్ గోడలు కూడా వింటున్నాయి. అయినా అధికారులకు మాత్రం వినిపించవు. ఎందుకంటే, వారికి కనిపించేది స్క్రీన్ మీద ‘క్లోజ్డ్’ అని. సమస్య తీరకపోయినా, అది తీరినట్లు నమోదు చేయడం అనేది ఒక వినూత్నమైన ఆవిష్కరణ. దీని వల్ల ప్రజల ఆత్మస్థైర్యం పెరుగుతుందేమో ! మళ్లీ మళ్లీ పోరాడాలనే స్ఫూర్తి వస్తుందేమో!.. సమస్య పరిష్కారం కాలేదని తెలిసి లబోదిబోమంటూ, ‘నా సమస్య ఎలా పరిష్కారం అయినట్లు?’ అని అడిగే ఫిర్యాదుదారులను చూస్తే, అధికారులు ఆశ్చర్యపోతారు. బహుశా వారికి తెలియదేమో, కాగితాలపై పరిష్కారం అయితే, నిజంగానే సమస్య తీరిపోతుందని! ఈ ‘షాక్ థెరపీ’తోనైనా ప్రజలు తమ సమస్యల గురించి ఆలోచించడం మానేస్తారేమో..!ఏదేమైనా, పీజీఆర్ఎస్ అనేది నిరంతరాయంగా కొనసాగే ఓ ప్రహసనం. ప్రజల ఓర్పుకు, అధికారుల ‘సామర్థ్యానికి’ అద్దం పడుతోంది. మళ్లీ వచ్చే సోమవారం కొత్త ఆశలతో, పాత సమస్యలతో ఎంతమంది కలెక్టరేట్ మెట్లెక్కుతారో చూడాలి. –మహారాణిపేట -
● మాస్టర్ప్లాన్ రహదారుల అభివృద్ధికి టెండర్లు ● రూ.154.60 కోట్లతో ఏడు రహదారుల విస్తరణ, నిర్మాణం ● ఏడాదిలో పూర్తి చేసేందుకు ప్రణాళికలు
విశాఖ సిటీ: విశాఖ నగరంలో కొత్త రహదారుల అభివృద్ధికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రూపొందించిన మాస్టర్ప్లాన్ రోడ్ల నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. రూ.154.60 కోట్ల అంచనా వ్యయంతో ఏడు ప్రాంతాల్లో 26.77 కిలోమీటర్ల మేర కొత్త రహదారుల అభివృద్ధి, విస్తరణ పనులకు విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించి టెండర్ల ప్రక్రియను ప్రారంభించారు. ఏడాదిలో ఈ రోడ్లను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రణాళికలు భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రారంభమైతే ఆ రహదారిలో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వీఎంఆర్డీఏ మాస్టర్ప్లాన్లో కొత్త రహదారుల అభివృద్ధికి చోటు కల్పించారు. అలాగే, ప్రస్తుతమున్న రోడ్ల విస్తరణ చేపట్టేందుకు ఆమోద ముద్ర వేశారు. ఇందులో భాగంగా 15 రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయగా, వాటిలో 8 రోడ్ల విస్తరణతో పాటు ఏడు రహదారులను కొత్తగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ 15 రహదారుల నిర్మాణాల్లో కొన్నింటిని జీవీఎంసీ, ఆర్అండ్బీ చేపట్టనున్నాయి. వీఎంఆర్డీఏ ఏడు రోడ్ల అభివృద్ధికి టెండర్ల ప్రక్రియను చేపట్టింది. ప్రాంతం కి.మీ. వ్యయం(రూ.కోట్లలో) దివీస్ రోడ్ (చిప్పాడ) 6.45 36,93 నేరెళ్లవలస 3.90 19,74 బోయపాలెం రోడ్ 3.10 8,92 గంభీరం రోడ్–1 1.46 5,69 గంభీరం రోడ్–2 2.18 14,73 శివశక్తినగర్ రోడ్ 1.67 7,77 అడవివరం శొంఠ్యాం రోడ్ 8.03 60,82 మొత్తం 26.77 రూ.154.60 కోట్లుఏడాదిలో పూర్తికి కసరత్తు ఈ మాస్టర్ప్లాన్ రహదారుల్లో భాగంగా చిప్పాడ–పోలిపల్లి (దివీస్ రోడ్డు), నేరెళ్లవలస–తాళ్లవలస, బోయపాలెం–మంగమారిపేట, పరదేశిపాలెం–గంభీరం, గంభీరం–గంభీరం హైవే, శివశక్తినగర్–హరిత ప్రాజెక్ట్స్, అడవివరం జంక్షన్–గండిగుండం రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. భోగాపురం విమానాశ్రయం పూర్తయ్యే సమయానికి వీటిని సిద్ధం చేయాలన్న లక్ష్యంతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విశాఖ నుంచి ఎయిర్పోర్టుకు ట్రాఫిక్ కష్టాలు లేకుండా సునాయాసంగా రాకపోకలు సాగించడానికి అనువుగా ప్రత్యామ్నాయ రోడ్లను తీర్చిదిద్దనున్నారు. వీటితో పాటు జీవీఎంసీ, ఆర్అండ్బీ కూడా ఇతర రహదారుల నిర్మాణాలకు సమాయత్తమవుతున్నాయి. -
వీఎంఆర్డీఏ ప్రాంగణాల్లో పనులు వేగవంతం
విశాఖ సిటీ: వీఎంఆర్డీఏ బాలల ప్రాంగణం, గురజాడ కళాక్షేత్రంలో జరుగుతున్న మరమ్మతులు, నిర్వహణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని మెట్రోపాలిటన్ కమిషనర్ కె.ఎస్. విశ్వనాథన్ అధికారులను ఆదేశించారు. సోమవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ఆయన ఆయా పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. అలాగే, నిర్వహణ గుత్తేదారుడికి పలు మార్పులు, చేర్పులు చేయాల్సిందిగా సూచించారు. ఈ పర్యటనలో కమిషనర్తో పాటు కార్యదర్శి మురళీకృష్ణ, ఎస్ఈ భవానీశంకర్, ఈఈలు రామరాజు, దుర్గా ప్రసాద్, పరిపాలనాధికారిహేమంత్, సిబ్బంది పాల్గొన్నారు. -
మావోయిస్టుల మృతదేహాలను అప్పగించాలి
8లోమంగళవారం శ్రీ 27 శ్రీ మే శ్రీ 2025పీజీఆర్ఎస్కు 237 వినతులు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు మొత్తం 237 వినతులు అందాయి. రెవెన్యూ శాఖకు చెందినవి 94 ఉండగా, పోలీసు శాఖకు సంబంధించి 21, జీవీఎంసీకి సంబంధించి 64 ఉన్నాయి. అలాగే ఇతర విభాగాలకు 58 వినతులు వచ్చాయి. కలెక్టర్ సమీక్ష ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రారంభానికి ముందుగా అధికారులతో కలెక్టర్ హరేందిర ప్రసాద్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రెవెన్యూ, ల్యాండ్ సర్వే, అటవీ, పోలీస్, జీవీఎంసీలకు సంబంధించి ఎక్కువగా అర్జీలు వస్తున్నాయన్నారు. రీ ఆర్జీలు నమోదు కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం అర్జీదారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడారు. జేసీ మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వర్మ పాల్గొన్నారు. -
ఎన్నిసార్లు ఫిర్యాదు చేయాలి
జీవీఎంసీ జోన్–2 పరిధిలోని మధురవాడలో ప్రభుత్వ పార్కు స్థలాలు కబ్జాకు గురై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఏడవ వార్డు బొట్టవానిపాలెం ఈడబ్ల్యూఎస్ లేఅవుట్, స్వతంత్ర నగర్లో సుమారు మూడు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన జీవీఎంసీ పార్కులో 150 గజాల స్థలాన్ని కొందరు ప్రైవేటు వ్యక్తులు ఆలయం పేరుతో కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. దీనిపై ఈ నెల 5న జీవీఎంసీ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఈ నెల 19న జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించగా, సమస్య పరిష్కారమైనట్లు మెసేజ్ వచ్చింది. కానీ వాస్తవంగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అదే విధంగా, ఏడో వార్డులోని కళానగర్, కృష్ణ నగర్ పార్కులు, స్వతంత్ర నగర్లోని బ్రహ్మంగారి గుడి ఎదురుగా ఉన్న మరో జీవీఎంసీ పార్కు స్థలాలు కూడా కబ్జాకు గురై, అనధికారికంగా కరెంటు మీటర్లు కూడా ఏర్పాటు చేశారు. జోనల్ కమిషనర్ ఆక్రమణదారులకు మద్దతు పలుకుతున్నారు. కబ్జాలను అరికట్టి, ప్రభుత్వ పార్కు స్థలాలను కాపాడాలి. –రజిని, సామాజిక కార్యకర్త -
కొత్త రేషన్ కార్డుల జారీకి దరఖాస్తుల స్వీకరణ: జేసీ
ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలి కేజీహెచ్లో ఏఎన్ఎంగా ఉద్యోగం కోల్పోయానని, తనకు న్యాయం చేయాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ను దివ్యాంగురాలు నాగమణి వేడుకున్నారు. దివ్యాంగురాలిని కావడంతో ఉద్యోగం ఎవరూ ఇవ్వడం లేదని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. ఏపీ పారామెడికల్ బోర్డు ద్వారా శిక్షణ పొంది, ఏఎన్ఎం పోస్టుకు తాను అర్హురాలినని నాగమణి తెలిపారు. కేజీహెచ్లో పనిచేసిన తనను నిధులు లేవని తొలగించారని వివరించారు. తన భర్త అనారోగ్యంతో మంచంపై ఉన్నారని, ఇద్దరు పిల్లలతో తన జీవితం భారంగా సాగుతోందని చెప్పారు. ప్రస్తుతం పింఛనుతోనే కుటుంబాన్ని పోషిస్తున్నానని, గతంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో దరఖాస్తు చేసినా స్పందన లేదని, ఇప్పుడు మళ్లీ దరఖాస్తు చేసుకున్నానని తెలిపారు. మహారాణిపేట: జిల్లాలో కొత్త రేషన్ కార్డుల జారీ కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతోందని, అర్హులైన ప్రజలు గ్రామ, వార్డు సచివాలయాలను సంప్రదించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ కోరారు. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు, రేషన్ కార్డుల విభజన, కొత్త సభ్యుల చేరిక, తప్పుగా నమోదైన ఆధార్ నంబర్ సవరణ, చిరునామా మార్పులు, ఇతర వివరాల సవరణ, మరణించిన వారి పేర్ల తొలగింపు, వలస వెళ్లిన వారి పేర్ల తొలగింపు, కార్డులు సరెండర్ చేయడం వంటి ఆరు రకాల సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. అనాథాశ్రమాల్లో ఉండే వృద్ధులు కూడా రేషన్ కార్డులు లేకపోతే దరఖాస్తు చేసుకోవచ్చని జేసీ మయూర్ అశోక్ స్పష్టం చేశారు. మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత జూన్ నెలలో క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారుల చిరునామాకు పంపడం జరుగుతుందని ఆయన వివరించారు. -
పార్టీ కోసం కష్టపడేవారికే కమిటీల్లో చోటు
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ బలోపేతానికి కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ మండల, వార్డు కమిటీల్లో అవకాశం కల్పిస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. సోమవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో మండల, వార్డు కమిటీలపై పార్టీ సీనియర్ నాయకులు, వార్డు అధ్యక్షులతో ఆయన సమావేశమయ్యారు. వార్డుల వారీగా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే యువతకు అవకాశం కల్పించేలా వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు. విశాఖ ఉత్తర, దక్షిణ, విశాఖ పశ్చిమ, విశాఖ తూర్పు, గాజువాక నియోజకవర్గాల నుంచి పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. నియోజకవర్గాల్లోని వార్డుల వారీగా ప్రతి ఒక్కరితో మాట్లాడి, పార్టీ కోసం పనిచేసి కూడా ఇప్పటివరకు పదవులు రాని కార్యకర్తల పేర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో పార్టీ కమిటీల నిర్మాణంపై చర్చించారు. కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి, పార్టీ కార్యాలయ పర్యవేక్షకులు రవిరెడ్డి, కార్పొరేటర్లు, పార్టీ నేతలు స్వాతి దాస్, పేడాడ రమణికుమారి, పీలా వెంకటలక్ష్మీ, సీహెచ్ లావణ్య, నీలి రవి, బి. పద్మావతి, మంచ నాగ మల్లేశ్వరి, జీలకర్ర నాగేంద్ర, గుండుపల్లి సతీష్, భీశెట్టి ప్రసాద్, చొక్కర శేఖర్, వరలక్ష్మీ, రాఘవులు, అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు. -
15సార్లు ఫిర్యాదు చేశా..
నేను కోట వీధిలో నివసిస్తున్నాను. ఇంటి కోసం నేను ఇప్పటికి 15 సార్లు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో దరఖాస్తు చేశా. భర్తతో విడాకులు అయ్యాయి. ఇద్దరు పిల్లలతో ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నాను. నాకు అనకాపల్లి, ఎన్.ఎన్.పురం వద్ద టిడ్కో ఇల్లు మంజూరైంది. దీనికి సంబంధించిన డబ్బులు కూడా కట్టాను, ఈకేవైసీ చేశారు, జియోట్యాగింగ్ కూడా పూర్తయ్యింది. అయితే ఇప్పుడు జాబితాలో నా పేరు లేదు. పేరును ఎందుకు తొలగించారని పీజీఆర్ఎస్లో దరఖాస్తు చేశా..ఎలాంటి సమాధానం రాలేదు. అసలు ఏం జరిగిందో నాకు తెలియడం లేదు. నా లాంటి మహిళలకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు? దయచేసి నాకు ఇల్లు ఇప్పించండి. –షేక్ రహీమ్ తున్నీ, కోటవీధి -
జీవీఎంసీకి 58 వినతులు
డాబాగార్డెన్స్: జీవీఎంసీలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) తూతూమంత్రంగా సాగింది. కార్యక్రమంలో మేయర్ పీలా శ్రీనివాసరావు పాల్గొనలేదు. అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి 58 వినతులు స్వీకరించారు. జీవీఎంసీ పరిపాలన, ఖాతాల విభాగానికి 7, రెవెన్యూ విభాగానికి 9, ప్రజారోగ్య విభాగానికి 6, పట్టణ ప్రణాళికా విభాగానికి 25, ఇంజినీరింగ్ విభాగానికి 9, మొక్కల విభాగం, యూసీడీ విభాగానికి ఒక్కో ఫిర్యాదు అందింది. కార్యక్రమంలో ప్రధాన వైద్యాధికారి నరేష్కుమార్, చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకరరావు, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి, డీసీఆర్ శ్రీనివాసరావు, ఫైనాన్స్ అడ్వైజర్ మల్లికాంబ, పర్యవేక్షక ఇంజినీర్లతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఫుట్పాత్ ఆక్రమణలపై చర్యలేవి? : జీవీఎంసీ 33, 34, 35 వార్డుల్లో ఫుట్పాత్ ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నాయని, దీని వల్ల పాదాచారులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోందని ఆయా వార్డులకు చెందిన పలువురు అదనపు కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఫుట్పాత్లను ఆక్రమించడమే కాకుండా రోడ్లపై ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేయనివ్వడం లేదని.. ఈ విషయాన్ని సచివాలయ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించడం లేదని వినతిపత్రంలో పేర్కొన్నారు. అధికారులు స్పందించి ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించాలని కోరారు. అపరిష్కృతంగా మంచినీటి సమస్య రైల్వే న్యూకాలనీలో నివాసం ఉంటున్న తనకు మంచినీటి కుళాయి కనెక్షన్ విషయంలో అన్యాయం జరిగిందని గుళ్ల కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. తనది నివాస ప్రాంతమైనప్పటికీ, కమర్షియల్ ట్యాక్స్ విధిస్తున్నారని, 2016–2017 నుంచి ఇప్పటి వరకు అధికారుల చుట్టూ తిరుగుతున్నానని తెలిపారు. కమర్షియల్ నుంచి డొమెస్టిక్గా మార్చినప్పటికీ, ఇప్పటివరకు పాత బిల్లును సరిచేయలేదని అదనపు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల పరిధిలో ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయని పలువురు ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. -
ఆర్టీసీ బస్సు బీభత్సం
గాయపడిన వ్యక్తి బంగారు ఉంగరాల చోరీ ఆరిలోవ: విజయనగరం నుంచి కూర్మన్నపాలెం వెళుతున్న ఓ ఆర్టీసీ బస్సు సోమవారం మధ్యాహ్నం హనుమంతవాక కూడలి వద్ద బీభత్సం సృష్టించింది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనాలను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో మూడు కార్లు, ఒక ద్విచక్ర వాహనం పాక్షికంగా దెబ్బతిన్నాయి. ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న ఆరిలోవ ట్రాఫిక్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సును, దెబ్బతిన్న ఇతర వాహనాలను రోడ్డు పక్కకు తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. బాధితుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు ఆర్టీసీ బస్సు డ్రైవర్ సబ్బి రాజుపై లా అండ్ ఆర్డర్ పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఇదిలా ఉండగా ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి సంబంధించిన రెండు బంగారు ఉంగరాలు చోరీకి గురయ్యాయి. ఘటనా స్థలంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఉపాధి శిక్షణ తరగతులు ప్రారంభం
డాబాగార్డెన్స్: యువతకు ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ, హైదరాబాద్) ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా సోమవారం ద్వారకా బస్టేషన్ కాంప్లెక్స్ సమీపంలోని స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ తరగతులు ప్రారంభించారు. మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి సాలిడ్ వర్క్స్లో 30 మందికి, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ విభాగంలో 30 మందికి శిక్షణ తరగతులు ప్రారంభించినట్టు ‘స్కిల్’ ఇన్స్టిట్యూట్ సీఈవో ఇంతియాజ్ అర్షద్, సీఐటీడీ డిప్యూటీ డైరెక్టర్ వెంకట కృష్ణ తెలిపారు. నెల రోజుల పాటు ఈ శిక్షణ ఉంటుందని, ఇంజినీరింగ్ డిప్లమో, బీటెక్/ఎంటెక్ చివరి సంవత్సరం విద్యార్థులకు ఇంటర్న్షిప్ అందిస్తామన్నారు. అలాగే స్పెషలైజేషన్లో ఇంజినీరింగ్ డిప్లమో, బీటెక్/ఎంటెక్ పూర్తి చేసిన విద్యార్థులకు స్వల్పకాలిక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ శిక్షణ(కోర్సును బట్టి) నెల, మూడు నెలలు, ఆరు నెలలు ఉంటుందని, ఇప్పటికే ఉపాధి పొందుతున్న వారు కూడా వారి నైపుణ్యాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు ఈ అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాన్ని అందించే వ్యక్తులకు తర్ఫీదు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 79950 14167లో లేదా www.sdivisakh.in వెబ్సైట్ను సంప్రదించవచ్చు. -
ప్రధానార్చకుడిగా సీతారామాచార్యులకు పదోన్నతి
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ప్రధానార్చకుడు–2గా కరి సీతారామాచార్యులు పదోన్నతి పొందారు. ప్రస్తుతం ఉప ప్రధానార్చకులుగా ఉన్న ఆయన పురోహిత్ అలంకారిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. స్వామి ఆర్జిత సేవలు, నిత్య సేవలు, ప్రముఖ ఉత్సవాల రోజుల్లో వైదికపరంగా సీతారామాచార్యులు సేవలు కీలకం. స్వామివారి ఉత్సవమూర్తుల వస్త్రాలంకరణలో ప్రముఖ పాత్ర పోషిస్తారు. పాంచరాత్ర ఆగమశాస్త్ర పండితుడిగా పేరుప్రఖ్యాతులు గడించారు. ఆయన ప్రధానార్చకుడిగా పదోన్నతి పొందడంతో ఖాళీ అయిన ఉప ప్రధానార్చకుడి పోస్టును త్వరలో భర్తీచేయనున్నారు. -
మొక్కలు నాటి సంరక్షించండి
కొమ్మాది: ప్రతి ఒక్కరూ ‘తల్లికి వందనం’పేరుతో మొక్కలు నాటి వాటిని జాగ్రత్తగా పెంచాలని ఎన్సీసీ 13 బెటాలియన్ ఎల్టీ కల్నల్, కమాండింగ్ అధికారి నీరజ్కుమార్ పిలుపునిచ్చారు. రుషికొండలోని గాయత్రి విద్యా పరిషత్ వద్ద సోమవారం నిర్వహించిన ఎన్సీసీ వార్షిక శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఇక్కడ గ్రీన్ క్లైమేట్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. పర్యావరణం దెబ్బతినడం వల్ల జరుగుతున్న అనర్థాలను క్యాడెట్లకు వివరించారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కొంతకాలానికి వర్షాలు లేక తాగడానికి నీరు దొరకని పరిస్థితులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ప్రతి ఒక్కరూ అవకాశం మేరకు మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని సూచించారు. శిక్షణ పొందుతున్న 600 మంది క్యాడెట్లు ఒక్కొక్కరు కనీసం పది మొక్కలు నాటాలని సూచించారు. నిషేధిత ప్లాస్టిక్ను వినియోగించవద్దని, ఈ విషయంపై అందరికీ అవగాహన కల్పించాలన్నారు. గ్రీన్ క్లైమేట్ టీమ్ వ్యవస్థాపక కార్యదర్శి జె.వి.రత్నం, ఎన్సీసీ డిప్యూటీ క్యాంప్ లెఫ్టినెంట్ కల్నల్ స్వర్నిం, సుబేదార్ మేజర్ శ్రీనివాస్, ఎన్సీసీ అధికారులు కెప్టెన్ అనంత్ భాస్కర్, కెప్టెన్ కల్యాణ్ అశోక్, కెప్టెన్ ఉమానాగేశ్వరి పాల్గొన్నారు. -
నేడు రాష్ట్రానికి ‘నైరుతి’ ఆగమనం
సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాలు సోమవారం రాష్ట్రాన్ని తాకనున్నాయి. కేరళ రాష్ట్రాన్ని శుక్రవారం రాత్రి తాకిన ఈ రుతుపవనాలు శని, ఆదివారాల్లో కర్ణాటక వ్యాప్తంగా విస్తరించాయి. అక్కడ నుంచి దాదాపు రాయలసీమకు అతిచేరువలోకి సమీపించగా, మన రాష్ట్రంలోకి సోమవారం ప్రవేశించనున్నాయి. దీంతో ఈ ఏడాది వారం రోజులు ముందే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి. వారంలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రేపు అల్పపీడనం..మరోవైపు.. తూర్పు మధ్య అరేబియా సముద్రం నుంచి∙ఉత్తర ఒడిశా వరకు, మధ్య మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా ఒక ద్రోణి సగటు సముద్ర మట్టానికి 1.5 నుంచి 4.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇది 27వ తేదీ నాటికి ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న రోజుల్లో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.అలాగే, సోమవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ఆ సంస్థ పేర్కొంది. -
పగడపు దిబ్బలకు ముప్పు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ తీరంలో ఎక్కడా లేని విభిన్న పగడపు దిబ్బలకు చిరునామాగా ఉన్న విశాఖ తీరంలో విధ్వంసకాండకు తెరతీసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రపన్నుతోంది. సంపద సృష్టి కోసం.. పర్యాటకం పేరుతో.. పర్యావరణంపై వేటు వేస్తున్నారు. జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు ప్లాటిపస్ ఎన్జీవో సంస్థ సముద్ర గర్భంలో పగడపు దీవుల్ని కాపాడుకుంటూ వస్తోంది. మరో పదేళ్ల పాటు వాటిని సంరక్షిస్తే.. మరింత విస్తరించి.. సాగరతీర స్వచ్ఛతతో పాటు.. కోతకు గురయ్యే ప్రమాదం నుంచి కాపాడవచ్చు. కానీ కూటమి ప్రభుత్వం ఇవేమీ పట్టనట్లుగా మంగమారిపేట తీరంలో వాటర్స్పోర్ట్స్కు టెండర్లు ఆహ్వానించి విధ్వంస రచనకు సంతకం చేస్తుండటంతో పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పగడపుదిబ్బల రక్షణ కోసం పోరాటం కొనసాగించేందుకు ప్లాటిపస్ సంస్థ ప్రతినిధులు నడుంబిగించారు. కోస్తా తీరంలో పగడపు దిబ్బలు అస్సలుండవని గతంలో అనేక సర్వేలు చెప్పినప్పటికీ, ఇటీవల జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధనలు ఆ వాదనను తప్పని నిరూపించాయి. విశాఖ సాగరతీరంలో విభిన్న రకాల కోరల్స్ (పగడపు దిబ్బలు) ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా మంగమారిపేట ప్రాంతంలో సాగరగర్భంలో విభిన్న పగడపు దిబ్బలు ఉన్నట్లు అన్వేషణలో తేలింది. దీని వెనుక ప్లాటిపస్ ఫౌండేషన్ కృషి ఎంతో ఉంది. తిమ్మాపురం, రుషికొండ, మంగమారిపేట మొదలైన ప్రాంతాల్లో నిరంతరం సాగరగర్భ స్వచ్ఛత కోసం ఈ సంస్థ ఏళ్ల తరబడి శ్రమిస్తోంది. సముద్రపు లోతుల్లో పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను ఇప్పటివరకు 2 లక్షల 60 వేల కిలోల వరకు తొలగించారు. అక్కడ ఉన్న పగడపు దిబ్బలను సంరక్షిస్తూ వాటి అభివృద్ధి కోసం స్కూబా డైవర్లతో కలిసి నిరంతరం కృషి చేయడంతో మంగమారిపేట, తిమ్మాపురం ప్రాంతాల్లో ఇవి విస్తరించాయి. స్కెలరాక్టినియా కోరల్స్, పవోనా ఎస్పీ, లిథోఫిలాన్ ఎస్పీ, మోంటీపోరా ఎస్పీ, పోరిటెస్ ఎస్పీ, హెక్సాకోరిలియా, ఆక్టోకోరలియా, డిస్కోసోమా, లోబాక్టిస్ వంటి అరుదైన పగడపు దిబ్బలు విస్తారంగా ఉన్నాయి. జీవవైవిధ్యానికి ప్రతిరూపాలుఈ కోరల్స్ ద్వారా సముద్ర జీవజాలాన్ని సంరక్షించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సముద్ర గర్భంలో పర్యావరణ పరిరక్షణ వ్యవస్థలుగా పగడపు దిబ్బలను పిలుస్తారు. పగడాల ద్వారా స్రవించే కాల్షియం కార్బోనేట్ నిర్మాణాల వల్ల ఇవి ఏర్పడతాయి. ఇవి అనేక పోషకాలను కలిగి ఉంటాయి. పగడపు దిబ్బలు సముద్రగర్భంలో అత్యంత వైవిధ్యమైన పర్యావరణ వ్యవస్థలను ఏర్పరుస్తాయి. ఇవి ఉంటే సముద్ర జీవరాశులు ఎక్కువగా వృద్ధి చెందడానికి ఉపయోగపడతాయి.సముద్రంలోని చేపలతో పాటు 25 శాతం జీవులకు సముద్ర వర్షారణ్యాలు అని పిలిచే పగడపు దిబ్బలే ఆవాసాలు. రంగురంగుల చేపల నుంచి గంభీరమైన సముద్ర తాబేళ్ల వరకు లెక్కలేనన్ని జాతులకు ఇవి కీలకమైన ఆశ్రయం, సంతానోత్పత్తి ప్రదేశాలుగా మారి ఆహార వనరులను అందిస్తాయి. చేపలు, మొలస్కా, ఇతర జీవజాతులు, క్రస్టేసియన్లు, స్పాంజ్లు మొదలైన సముద్ర జాతుల ఉత్పత్తి పెరిగేందుకు ఇవి అనువైన వాతావరణాన్ని అందిస్తాయి. ‘కూటమి’కాసుల కక్కుర్తికి బలి.! తీరప్రాంత నిర్మాణాలు పెరగడం, ఉష్ణోగ్రతలు పెరగడం కారణంగా ఇప్పటికే 33 శాతం పగడాలు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. వాతావరణ మార్పులు, విధ్వంసకర మానవ చర్యల వల్ల వీటి మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. తీరప్రాంతాన్ని రక్షించేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ప్లాటిపస్ సంస్థ ఈ పగడపు దిబ్బలను సంరక్షిస్తోంది. అయితే ఇలాంటి అరుదైన ప్రాంతంపై ఇప్పుడు కొందరు కూటమి నేతల కన్ను పడింది. సంపద సృష్టి పేరుతో తిమ్మాపురం నుంచి మంగమారిపేట వరకు ఆక్వా స్పోర్ట్స్ను అభివృద్ధి చేసేందుకు టెండర్లు ఆహ్వానించారు. వాస్తవానికి ఈ ప్రాంతం వాటర్స్పోర్ట్స్కు అనువుగా లేకపోయినా కేవలం కొన్ని సంస్థలకు భూములు కట్టబెట్టేందుకే పర్యాటక శాఖ ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. టూరిజం మంత్రి అండదండలున్న ఒక సంస్థ కోసం పగడపు దిబ్బలను నాశనం చేసేందుకు సిద్ధమవుతున్నారని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే పగడపు దిబ్బలను సంరక్షించేందుకు ప్లాటిపస్ ఫౌండేషన్ సంస్థ పోరాటానికి సిద్ధమైంది. ఈ ప్రాంతంలో వాటర్ స్పోర్ట్స్ వద్దని, వాటిని వేరే ప్రాంతానికి తరలించాలని వారు అధికారులను కోరుతున్నారు. పదేళ్లపాటు సంరక్షించుకోవాలి కొన్ని తీర ప్రాంతాలను ప్రభుత్వం గుర్తించి ఆక్వా స్పోర్ట్స్ అభివృద్ధి కోసం ప్రయత్నించడం మంచి పరిణామమే. కానీ అత్యంత అరుదైన, జీవవైవిధ్యానికి, పర్యావరణానికి ఎంతో మేలు చేసే పగడపు దిబ్బలు ఉన్న ప్రాంతంలో వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేయడం మాత్రం తగదు. గత కొన్నేళ్లుగా మంగమారిపేట ప్రాంతంలో కోరల్ రీఫ్స్ను పెంచుతూ వస్తున్నాం. వీటిని మరో పదేళ్లపాటు సంరక్షించుకుంటే ఈ ప్రాంత సముద్ర తీరం మరింత ఆహ్లాదకరంగా మారుతుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళుతున్నాం. – సుభాష్ చంద్రన్, ప్లాటిపస్ ఫౌండేషన్ ప్రతినిధి -
ప్రైవేటుకు ‘హరితా’ర్పణం
సాక్షి, విశాఖపట్నం: సంపద సృష్టి అంటూ.. ఉన్న ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ చేతుల్లో పెట్టేస్తోంది కూటమి సర్కారు. పర్యాటక శాఖకు ఆదాయం తెచ్చి పెట్టే ఆస్తులేవైనా ఉన్నాయంటే అవి కేవలం హరిత హోటళ్లు మాత్రమే. రాష్ట్రంలో ఏపీటీడీసీకి ప్రతి జిల్లాలోనూ హరిత హోటళ్లు ఉన్నాయి. వీటిల్లో 30 హోటళ్లను ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పేరుతో ప్రైవేటు సంస్థలకు అప్పగించేసి టూరిజం శాఖను నిర్వీర్యం చేసే దిశగా కుట్రలు పన్నుతోంది. విజయవాడలో సమావేశం హరిత హోటళ్లను ప్రైవేటు పరంచే సేందుకు ఈ నెల 23న కొంత మంది స్టేక్ హోల్డర్లకు ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానమందించింది. విజయవాడ బెరంపార్క్లో గుట్టుచప్పుడు కాకుండా ఏపీటీడీసీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసింది. ఎవరెవరు వస్తారో ఆన్లైన్ లింక్ ద్వారా సమాచారం ఇవ్వాలంటూ ఆదేశించింది. ముందుగా రిజిస్టర్ చేసుకున్న వారినే ఈ సమావేశానికి అనుమతిచ్చింది. సమావేశంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ హరిత హోటళ్ల గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఏయే హోటల్కు ఎంత ఆదాయం వస్తుంటుంది.. ఎక్కడెక్కడ ఎలాంటి వసతులు ఉన్నాయి.. మొదలైన అంశాల గురించి ఏపీటీడీసీ అధికారులు స్టేక్ హోల్డర్లకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పేరుతో హరిత హోటళ్లను ప్రైవేట్ పరం చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారుప్రధాన పర్యాటక ప్రాంతాలూ ప్రైవేటుకేనా? పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న హరిత హోటళ్లని తొలి విడతలో ప్రైవేట్కు అప్పగించే పని వేగవంతం చేస్తున్న సర్కారు తర్వాత టూరిజంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాలను కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు కుట్ర పన్నుతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఏయే ప్రాంతాల్ని ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెట్టాలనే దానిపై ఇప్పటికే నివేదిక సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రతి జిల్లా నుంచి ప్రధాన పర్యాటక ప్రాంతాలు.. వాటి ద్వారా వచ్చే ఆదాయానికి సంబంధించిన సమగ్ర వివరాలతో కూడిన నివేదికలను ప్రభుత్వం ఉన్నపళంగా అడిగి తెప్పించుకుంది. వీటిలో ఎంపిక చేసిన వాటిని నెల రోజుల వ్యవధిలోనే ప్రైవేట్కు అప్పగించాలంటూ ప్రభుత్వం హుకుం జారీ చేసింది. ఇలా ఆదాయాన్ని తెచ్చే హరిత హోటళ్లు, పర్యాటక ప్రాంతాల్ని మొత్తం ప్రైవేట్ పరం చేసేస్తే.. ఏపీటీడీసీ, ఏపీ టూరిజం అథారిటీకి ఆదాయం ఎలా వస్తుందంటూ జిల్లా స్థాయి అధికారులు, ఉద్యోగులు ప్రభుత్వానికి నివేదిస్తున్నా పట్టించుకోవడం లేదని సమాచారం. వీలైనంత త్వరగా.. తాము చెప్పిన సంస్థలకు పర్యాటక ఆస్తుల్ని కట్టబెట్టేందుకు చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇవన్నీ పూర్తయితే.. టూరిజం శాఖకు రాష్ట్రంలో ఒక్క హోటల్ కూడా లేకుండా పోతుంది. ఇన్నాళ్లూ తక్కువ ఖర్చుతో పర్యాటక ప్రాంతాలను సందర్శించిన ప్రజలపైనా భారం భారీగానే పడనుంది. ఉపాధికి గండి పర్యాటక శాఖకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ప్రతి జిల్లాలోనూ హరిత హోటళ్లు, రిసార్టులు ఉన్నాయి. ఒక్కో ప్రాజెక్టులో 50 నుంచి 60 మంది వరకూ ఉద్యోగులు, కార్మికులు ఉన్నారు. వీరిలో 50 శాతం మంది కాంట్రాక్టు ఉద్యోగులు కాగా, 40 శాతం అవుట్ సోర్సింగ్, 10 శాతం మంది రెగ్యులర్ ఉద్యోగులుంటారు. ఒక వేళ 30 హోటళ్లని ప్రైవేట్కు కట్టబెడితే.. దాదాపు 1000 మందికిపైగా ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదం ఉంది. ఈ విషయం తెలిసి కూడా కేవలం కాసులకు ఆశపడి.. ఉపాధిపొందుతున్న వారి కడుపు కొట్టేందుకు కూటమి ప్రభుత్వం వెనకాడటం లేదు. -
నాణెం.. చరిత్రకు సాక్ష్యం
తగరపువలస: జీవీఎంసీ ఒకటో వార్డు చిట్టివలసకు చెందిన రంగూరి గిరిధర్ ఇంట కాలచక్రంలో కరిగిపోని ఓ అపురూప నిధి ఉంది. అది బంగారం, వజ్రాలు కాదు.. వందలాది పాతకాలపు నాణేలు, పదుల సంఖ్యలో అప్పటి కరెన్సీ నోట్లు! అవును.. ఇవి చరిత్రకు సజీవ సాక్షాలు. గిరిధర్ వద్ద భద్రంగా ఉన్న ఈ నాణేలన్నీ ఒకప్పటి మన జీవన విధానానికి, ఆర్థిక వ్యవస్థకు అద్దం పడతాయి. వీటిలో అణా, ఒక పైసా, రెండు పైసలు, మూడు పైసలు, ఐదు పైసలు, ఇరవై, ఇరవై ఐదు, యాభై పైసల నాణేలున్నాయి. ఆనాటి అవసరాలకు అనుగుణంగా అల్యూమినియం, ఇత్తడి, కంచు వంటి లోహాలతో తయారైన ఈ నాణేలు చూడటానికి చిన్నవే అయినా.. అవి మోసుకొచ్చిన చరిత్ర ఆసక్తికరం. ఈ నాణేలు ఇప్పుడు చలామణిలో లేకపోవచ్చు. కానీ వాటి విలువ ఏమాత్రం తగ్గలేదని గిరిధర్ చెబుతున్నారు. నిజమే.. వీటి చారిత్రక, సాంస్కృతిక విలువ వెలకట్టలేనిది. పూర్వం చాలా మంది ఇలాంటి పాత నాణేలను ఇచ్చి వెండి వస్తువులు కొనుగోలు చేసేవారని, ఆ లెక్కన చూసుకున్నా ఇప్పటికీ ఈ లోహపు నాణేలకు విలువ ఉంటుందని కొందరు అంటుంటారు. కానీ గిరిధర్ కుటుంబానికి మాత్రం ఈ నాణేలను అలా మార్చుకోవడం ఇష్టం లేదు. వీటిని చూస్తూ మురిసిపోతుంటుంది. నాణేల వెనుక కథలు.. ఈ నాణేల వెనుక ఉన్న కథలను, అప్పటి వాటి కొనుగోలు శక్తిని తన తల్లిదండ్రులు అరుణకుమారి, ప్రసాదరావు వివరిస్తుండేవారని గిరిధర్ చెబుతున్నారు. ఒక అణాతో ఏమేమి కొనుగోల చేశాం? ఒక పైసా విలువ ఎలా ఉండేది? వంటి విషయాలు వారి మాటల్లో వింటుంటే ఆ కాలంలోకే వెళ్లినట్టు అనిపించేదని గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు గిరిధర్ కూడా తన తర్వాతి తరాలకు ఈ నాణేలను చూపిస్తూ.. వాటి గొప్పతనాన్ని, మన పూర్వీకుల జీవన విధానాన్ని వివరిస్తున్నారు. ఈ నాణేల చప్పుడులో ఒకప్పటి చరిత్ర ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. నాన్న జ్ఞాపకం ఈ నాణేలు మా నాన్న ప్రసాదరావు భీమిలి మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్. ఆయనకు స్వదేశీ, విదేశీ నాణేలు సేకరించడం హాబీగా ఉండేది. బ్రిటిష్ ప్రభుత్వం, రాజుల పాలనతో నాణేలు కూడా ఉండేవి. పదేళ్ల కిందట ఆయన మరణించడం, ఇల్లు మారడంలో చాలా వరకు నాణేలు కనిపించకుండా పోయాయి. ఇప్పుడు ఉన్న విలువైన వీటిని పదిలం చేసుకున్నాం. – రంగూరి గిరిధర్, చిట్టివలస -
సైనిక్ స్కూల్కు తగరపువలస విద్యార్థి ఎంపిక
తగరపువలస: కోరుకొండ సైనిక్ స్కూల్లో 9వ తరగతిలో ప్రవేశానికి ఇటీవల జరిగిన ప్రవేశ పరీక్షలో జోగావారి వీధికి చెందిన తెడ్లాపు దినేష్ ఎంపికయ్యాడు. ఈ పరీక్షలో 400 మార్కులకు గాను దినేష్ 370 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో 108వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం భీమిలి ఐఎన్ఎస్ కళింగలో దినేష్ 8వ తరగతి పూర్తి చేశాడు. తల్లిదండ్రులు నరేంద్రకుమార్, లక్ష్మీదేవి మాట్లాడుతూ చైన్నెలోని నేషనల్ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఆన్లైన్లో దినేష్కు కోచింగ్ ఇప్పించినట్టు తెలిపారు. -
67 మంది కళాకారులకు ఘన సత్కారం
మద్దిలపాలెం: ఆల్ ఇండియా రేడియో ద్వారా గుర్తింపు పొందిన 67 మంది బి–హైగ్రేడ్ కళాకారులను విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో సత్కరించారు. అకాడమీ అధ్యక్షుడు ఎం.ఎస్.ఎన్. రాజు, కార్యదర్శి డాక్టర్ గుమ్ములూరి రాంబాబు, కోశాధికారి పైడా కృష్ణప్రసాద్ల చేతుల మీదుగా ఈ సత్కారం జరిగింది. ఈ సందర్భంగా సంగీతం, సాహిత్యం, నృత్యం, నాటకం, హరికథ, బుర్రకథ, తోలుబొమ్మలాట, జానపద, సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తూ కళాకారులను విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ప్రోత్సహిస్తుందని తెలిపారు. త్వరలో సన్మానం పొందిన కళాకారులతో వంకాయల వెంకటరమణ మృదంగం గ్లోబల్ ఆర్టిస్ట్ ఆధ్వర్యంలో సన్నాయిలు, డోళ్లతో లయ విన్యాస కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రముఖ గాత్రవిద్వాంసులు డాక్టర్ ద్వారం త్యాగరాజు బృందం అద్భుతమైన గాత్రకచేరి నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పంతులు గోపాలరావు, శారదా సుబ్రహ్మణ్యం కూడా పాల్గొన్నారు. -
జర్నలిస్ట్లు సమాజ ప్రగతి సాధకులు
బీచ్రోడ్డు: జర్నలిస్టులు సమాజ ప్రగతి సాధకులని, వారి వల్లే ప్రజా సమస్యల పరిష్కారానికి అవకాశం లభిస్తోందని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు అన్నారు. వైజాగ్ మీడియా అవార్డ్స్, స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఆదివారం వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ జర్నలిస్టుల పిల్లలు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని, భవిష్యత్తులో అపారమైన ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నారు. ఏయూ రిజిస్ట్రార్ ఎన్.ధనుంజయరావు మాట్లాడుతూ నేటి విద్యార్థులు రేపటి ఆశాకిరణాలని, ఉన్నత విద్యతో వారు కోరుకున్న ఉపాధి అవకాశాలు పొందవచ్చని తెలిపారు. అవార్డు, ఉపకారవేతనాల నిర్వాహక కమిటీ చైర్మన్ గంట్ల శ్రీనుబాబు, చీఫ్ ఆర్గనైజర్ ఆర్.నాగరాజు పట్నాయక్ మాట్లాడుతూ ఎంబీఏ, ఎంబీబీఎస్, ఎంఎల్, బీఎల్, నర్సింగ్, ఇంజినీరింగ్ చదువుతున్న 33 మందికి, క్రీడలు, సంగీతం వంటి విభాగాల్లో 11 మందికి ప్రతిభా పురస్కారాలను అందజేసినట్లు తెలిపారు. ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు అత్యధిక మార్కులు సాధించిన 126 మంది జర్నలిస్టుల పిల్లలకు స్కాలర్షిప్లు పంపిణీ చేశామన్నారు. ప్రముఖ సంఘ సేవకుడు కమల్ బెయిద్, బెహరా భాస్కరరావు, స్థిత ప్రజ్ఞ ఫౌండేషన్ చైర్మన్ వై.వి.వి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
చేపల వేటకు వెళ్లి ఒకరు మృతి
తగరపువలస: ఆనందపురం మండలం గంభీరం రిజర్వాయర్లో ఆదివారం సాయంత్రం చేపల వేటకు వెళ్లిన సమీర్(26) నీటిలో మునిగి చనిపోయాడు. మారికవలసకు చెందిన సమీర్కు ఈత రాదు. అయితే ఐదుగురు వ్యక్తులతో కలిసి రిజర్వాయర్లో దిగిన సమీర్ ఈ ప్రమాదానికి గురయ్యాడు. ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటు తాళ్లవలస అగ్నిమాపక సిబ్బంది మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమీర్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన తండ్రి ఫిర్యాదు మేరకు ఆనందపురం సీఐ వాసునాయుడు ఆధ్వర్యంలో సిబ్బంది కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సేంద్రియ మామిడి మేళాకు స్పందన
ఆరిలోవ: విశాలాక్షినగర్లోని బీవీకే జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన రెండో విడత సేంద్రియ మామిడి పండ్ల మేళా విజయవంతంగా ముగిసింది. గత వారం రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ మేళాకు విశేషమైన స్పందన రావడంతో.. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ప్రతినిధులు రెండో విడతగా శని, ఆదివారాల్లో మళ్లీ మేళా ఏర్పాటు చేశారు. ఈ మేళాలో రసాయనాలు వాడకుండా సహజ పద్ధతుల్లో పండించిన వివిధ రకాల మామిడి పండ్లను ప్రదర్శించారు. విశాలాక్షినగర్తో పాటు నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి మామిడి పండ్లను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా సంఘం కార్యదర్శి చవ్వాకుల అశోక్ మాట్లాడుతూ సేంద్రియ పద్ధతిలో పండించిన మామిడి పండ్లను ఈ మేళాలో విక్రయించడానికి రైతులు మందుకు రావడం, వినియోగదారులు వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం సంతోషంగా ఉందన్నారు. ఈ మేళాలో పంచదార కలిశాలు, కొత్తపల్లి కొబ్బరి, పండూరి మామిడి, స్వాగతం, అమృతం, పాపారాజు గోవా, బంగినపల్లి, సువర్ణరేఖ, చిన్న రసాలు, కొబ్బరి అంటు, ముంత మామిడి, నాగులపల్లి రసాలు, హైదర్ సాయిబు, జహంగీర్ పెద్ద రసాలు, ఇమామ్ పసందు వంటి అనేక రకాల మామిడి పండ్లను రైతులు విక్రయించారు. -
డిగ్రీ కాలేజీల్లో తనిఖీలెప్పుడో.!
● ఉన్నత చదువులపై పర్యవేక్షణ కరువు ● నిబంధనలకు విరుద్ధంగా కళాశాలల నిర్వహణ ● ఎఫిలియేషన్ పేరిట ప్రైవేట్ కాలేజీల నుంచి వసూళ్లు? విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల ఆధ్వర్యంలో 196 డిగ్రీ, పీజీ కళాశాలలున్నాయి. వీటి పరిధిలో ఏటా సుమారు 25 వేలకు పైగా విద్యార్థులు వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందుతున్నారు. 2025–26 విద్యా సంవత్సరానికి కళాశాలల నిర్వహణకు అనుమతులు ఇచ్చేందుకు ఉన్నత విద్యామండలి సిద్ధమవుతోంది. విశ్వవిద్యాలయంలోని కాలేజీ డెవలప్మెంట్ కమిటీ (సీడీసీ) ఈ మొత్తం వ్యవహారాలను చూస్తోంది. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్లు, రిజిస్ట్రార్లతో ఈ నెల 28న ఉన్నత విద్యామండలి పెద్దలు సమావేశం ఏర్పాటు చేసినందున.. వచ్చే విద్యా సంవత్సరం ప్రవేశాలపై దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏయూ అధికారులు విశ్వవిద్యాలయ క్యాంపస్ కళాశాలలతో పాటు అనుబంధ కళాశాలలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నారు. కళాశాలల నిర్వహణకు ఇవి ఉండాల్సిందే.. డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఆరు వేలు, పట్టణ ప్రాంతాల్లో ఎనిమిది వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన పక్కా భవనాలు ఉండాలి. విద్యార్థుల సంఖ్య, నిర్వహించే కోర్సులకు అనుగుణంగా తరగతి గదులు, గ్రంథాలయం, కార్యాలయ గది, స్టాఫ్ రూం, బాలికలకు వెయింటింగ్ రూం, సరిపడా మరుగుదొడ్లు, సైన్సు ప్రయోగాలకు అనువైన ప్రయోగశాలలు ఉండాలి. విద్యార్థులు ఆడుకునేందుకు మైదానం, పార్కింగ్ ప్రదేశం, అర్హత గల అధ్యాపకులు ఉండాలి. కళాశాలల నిర్వాహకులు వీటన్నింటికీ సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను ప్రవేశాల నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే ఉన్నత విద్యామండలి రూపొందించిన పోర్టల్లో అప్లోడ్ చేయాలి. పరిశీలనకు నిజ నిర్ధారణ కమిటీలు కళాశాల యాజమాన్యాలు పొందుపరిచిన వివరాల మేరకు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి నియమించిన నిజ నిర్ధారణ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి ఇచ్చిన నివేదిక మేరకు రిజిస్ట్రార్ ధ్రువీకరించి, దానిని వైస్ చాన్సలర్కు నివేదిస్తారు. అన్నీ సక్రమంగా ఉన్న కళాశాలల జాబితాను ప్రవేశాల వెబ్సైట్లో పెట్టేందుకు ఉన్నత విద్యామండలికి పంపిస్తారు. ప్రైవేటు కళాశాలలను కట్టడిచేసే క్రమంలో గత ప్రభుత్వం ప్రవేశాలలో ఆన్లైన్ విధానం తీసుకొచ్చింది. ఇదే రీతిలో 2025–26 విద్యా సంవత్సరం ప్రవేశాల ప్రక్రియకు ఉన్నత విద్యామండలి ఏర్పాట్లు చేస్తోంది. ప్రైవేటు కళాశాలల లాబీయింగ్? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ప్రైవేటు కళాశాలల నిర్వాహకులకు రెక్కలొచ్చాయి. మౌలిక వసతులు, అర్హత గల అధ్యాపకులు లేకున్నా విశ్వవిద్యాలయం నుంచి అనుమతులు పొందేందుకు అప్పుడే లాబీయింగ్ బృందం సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది. అడిగినంత ఇస్తే, విశ్వవిద్యాలయం నుంచి అఫిలియేషన్ వచ్చేలా తాము చూసుకుంటామని కూటమి నేతలతో అంటకాగే విశ్వవిద్యాలయంలోని ఓ వర్గం వసూళ్లకు తెరలేపినట్లు తెలుస్తోంది. విశాఖ నగరంలోని ద్వారకానగర్లో బీబీఏ, బీసీఏ కోర్సుల పేరుతో కళాశాల నిర్వహిస్తున్నప్పటికీ, ఇక్కడి విద్యార్థులకు వేరే కళాశాలలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండానే, అకాడమీల పేరుతో దర్జాగా కళాశాలలను నిర్వహిస్తూ విద్యార్థుల నుంచి లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా పరవాడలోని ఓ కళాశాలలో ఒడిశాకు చెందిన విద్యార్థులను ఎక్కువగా చేర్పించుకుంటున్నారు. కేవలం పరీక్షలప్పుడే ఈ కళాశాల విద్యార్థులతో కళకళలాడుతోంది. ఇక్కడ విజిటింగ్ అధ్యాపకులతోనే కళాశాల నిర్వహిస్తున్నారనే ప్రచారం ఉంది. ఇవే కాదు.. ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిధిలోని అనుబంధ కళాశాలల్లో సగానికి పైగా డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కోర్సులు నిర్వహించే కళాశాలలు ఇదే తీరుగా కొనసాగుతున్నాయి. విశాఖ జిల్లా ఎన్ఏడీ సెంటర్లోని ఓ డిగ్రీ కళాశాల పైఅంతస్తులో రేకుల షెడ్డు వేసి తరగతులు నిర్వహిస్తున్నారు. గాలి, వెలుతురు సరిగా లేవు. కళాశాలలో సరైన వసతులు లేవు. ఇరుకు గదుల్లో పాఠాలు బోధిస్తున్నారు. సైన్సు గ్రూప్ విద్యార్థులు ప్రయోగాలు చేసేందుకు సరైన ప్రయోగశాలలు కూడా లేవు. కానీ ఆంధ్ర విశ్వవిద్యాలయ అధికారులు ఇవేమీ పట్టించుకోవడం లేదు. -
నేడు ‘ఉక్కు’ చర్చలు
ఉక్కునగరం: కేంద్ర కార్మిక శాఖ రీజనల్ లేబర్ కమిషనర్(ఆర్ఎల్సీ) సోమవారం స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు, ఉక్కు యాజమాన్యం, కాంట్రాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 16న జరిగిన చర్చలు విఫలం కావడంతో సమావేశాన్ని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 20 నుంచి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు నిరవధిక సమ్మె చేస్తుండటంతో ఈ చర్చలు కీలకంగా మారనున్నాయి. ఈ సమావేశంలో యాజమాన్యం తీసుకునే నిర్ణయంపై అంతటా ఆసక్తి నెలకొంది. గ్రాస్ రూట్స్ ఫుట్బాల్ డే విజేత శ్రీకాకుళం తగరపువలస: మధురవాడలోని శాప్ గ్రౌండ్లో ఈ నెల 23న గ్రాస్ రూట్స్ డే సందర్భంగా నిర్వహించిన ఫుట్బాల్ టోర్నమెంట్–2025లో శ్రీకాకుళం ఫుట్బాల్ క్లబ్ జట్టు విజేతగా నిలిచింది. అండర్ బాయ్స్ జట్టు రన్నరప్ సాధించింది. ఉత్తరాంధ్ర జోనల్ అండర్–14 బాయ్స్ అండ్ గర్ల్స్ టోర్నమెంట్లో మొత్తం 16 జట్లు పాల్గొన్నాయి. విజేతలకు ఆదివారం ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్డీవో జూన్ గాలియట్, లోసో సుష్మిత, రాకేష్ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ నరసింహారెడ్డి, జిల్లా ఒలింపిక్స్ ఎగ్జిక్యూటివ్ శరత్, వీడీఎఫ్ కార్యదర్శి అక్కరమాని చినబాబు, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు ఎస్జీ రామకృష్ణ, స్టార్ ఫెక్స్ సన్నిబాబు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
నేత.. మేత
వ్యర్థాల● రూ.కోట్లు కొల్లగొడుతున్న ఓ చోటానేత ● అనధికారికంగా సేకరిస్తున్న ఓ జనసేన ఎమ్మెల్యే అనుచరుడు ● ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోని జీవీఎంసీ అధికారులు ● నెలవారీ మామూళ్లతో చెట్టాపట్టాలు ● పట్టుకున్న వాహనాలను వదిలేస్తున్న సిబ్బంది బెదిరిస్తూ.... బలవంతంగా! చికెన్ వ్యర్థాలతో చెడుగుడు అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు ఈ వ్యవహారంపై ఇప్పటికే పలు ఫిర్యాదులు ఉన్నప్పటికీ, జనసేన ఎమ్మెల్యే పేరు చెప్పి బెదిరిస్తుండటంతో అధికారులు మామూళ్లు తీసుకుని వదిలేస్తున్నారనే విమర్శలున్నాయి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ, ఈ వ్యర్థాలతో పెంచిన రొయ్యలు, చేపలను ప్రజలు తినడం ద్వారా అనేక రోగాల బారిన పడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. అయినప్పటికీ, జీవీఎంసీలోని ప్రజారోగ్య విభాగ అధికారులు ఈ చికెన్ వ్యర్థాల అక్రమ తరలింపును చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. విశాఖపట్నంలో చికెన్, మటన్ వ్యర్థాల అక్రమ తరలింపు వివాదాస్పదంగా మారింది. జీవీఎంసీ 8 జోన్లకు వ్యర్థాల సేకరణకు టెండర్లు కేటాయించినా, కూటమి నేతల పేరుతో కొందరు వ్యక్తులు అక్రమంగా వ్యర్థాలను సేకరిస్తున్నారు. జీవీఎంసీ పరిధిలోని షాపుల నుంచి వ్యర్థాలను సేకరించి కాపులుప్పాడకు తరలించాల్సి ఉండగా, వీరు తూర్పుగోదావరితో పాటు అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట, యలమంచిలి, మాడుగుల నియోజకవర్గాల్లోని చేపలు, రొయ్యల చెరువులకు తరలిస్తున్నారు. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం, ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు. పది మంది యువకులతో మూడు బొలెరో వాహనాల్లో బెదిరింపులకు పాల్పడుతూ వ్యర్థాలను సేకరిస్తున్నారని ఆరోపణలున్నాయి. జీవీఎంసీ ప్రజారోగ్య విభాగ అధికారులకు ఫిర్యాదులు అందినప్పటికీ, జనసేన, టీడీపీ ఎమ్మెల్యేల పేర్లు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నారని సమాచారం. జీవీఎంసీలోని ఓ అధికారికి నెలవారీగా భారీగా ముట్టచెబుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. చికెన్ వ్యర్థాలతో పెంచిన రొయ్యలు, చేపలు తినడం వల్ల అనేక రోగాలు వస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అయినప్పటికీ, ప్రజారోగ్య విభాగ అధికారులు ఈ అక్రమ తరలింపును చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం విశాఖ చికెన్, మటన్ వ్యర్థాల అక్రమ తరలింపు జోరుగా సాగుతోంది. అక్రమంగా, అనుమతి లేకుండా జీవీఎంసీ పరిధిలో ఈ వ్యర్థాలను తరలిస్తున్నారంటూ ఫిర్యాదులు రావడంతో జీవీఎంసీ అధికారులు కొన్ని వాహనాలను పట్టుకున్నారు. అయితే, ఆశ్చర్యకరంగా ఈ వాహనాలను సీజ్ చేయకుండా, కేసు నమోదు చేయకుండా వదిలేసినట్లు తెలుస్తోంది. దీనికి కూటమి ఎమ్మెల్యే అండదండలే కారణమనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కోరాడ సాయి సుదర్శన్పై ఆరోపణలు విశాఖ సిటీలోని ఓ జనసేన ఎమ్మెల్యే అనుచరుడని చెప్పుకుంటున్న కోరాడ సాయి సుదర్శన్ ఈ వ్యవహారం వెనుక ఉన్నట్లు ఆరోపణలున్నాయి. లాసన్స్ బే కాలనీలో నివసించే సదరు వ్యక్తి, తన వెంట పది మంది యువకులను పెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతూ షాపుల నుంచి అనధికారికంగా చికెన్ వ్యర్థాలను సేకరిస్తున్నాడు. మూడు బొలెరో వాహనాల ద్వారా ఈ వ్యర్థాలను తూర్పు గోదావరి జిల్లాలోని రొయ్యల చెరువులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ విధంగా కోళ్ల వ్యర్థాలతో కోట్లు గడిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం...! జీవీఎంసీ పరిధిలో చికెన్ వ్యర్థాల అక్రమ తరలింపు దందా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతోంది. ఈ వ్యర్థాలను సేకరిస్తున్న ముఠా వాటిని అధిక ధరలకు చేపలు, రొయ్యల చెరువులకు తరలిస్తోంది. ఈ వ్యర్థాలను మేతగా వేయడం వల్ల చేపలు, రొయ్యలు త్వరగా బరువు పెరుగుతాయని, మేత ఖర్చు కూడా తగ్గుతుందని చెరువుల యజమానులు వీటివైపు మొగ్గు చూపుతున్నారు. జీవీఎంసీ కేంద్రంగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని అక్కడికక్కడే తొక్కేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ దందా జరుగుతున్నప్పటికీ, జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం, మత్స్యశాఖ, పోలీసుశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. కాపులుప్పాడలో నిర్ణీత మొత్తంలో చికెన్ వ్యర్థాలు వస్తున్నాయా లేదా అని పరిశీలించాల్సిన అధికారులు కూడా ఇందులో భాగస్వామ్యమై తప్పుడు నివేదికలు సమర్పిస్తున్నారని తెలుస్తోంది. చికెన్ వ్యర్థాలను తిన్న చేపలు, రొయ్యలను మనం తీసుకుంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అధ్యయనాల ప్రకారం, ఇటువంటి వ్యర్థాలను తిన్న రొయ్యలు, చేపలను తినడం వల్ల కాలేయ, జీర్ణకోశ సమస్యలు, న్యూరో సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా, పేగులో పుండ్లు, మలబద్ధకం, పైల్స్ వంటి వ్యాధులు, ముఖ్యంగా మహిళల్లో నెలసరి సమస్యలతో పాటు క్యాన్సర్ వంటి రోగాలకు కూడా ఇది కారణమవుతుందని తేలింది. ఈ వ్యర్థాలను నిల్వ ఉంచే ప్రాంతంలో గాలిలో వైరస్ వ్యాపించి, ఆ గాలి పీల్చితే శ్వాసకోశ సంబంధ వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజల ఆరోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లే ఈ వ్యవహారంపై ఇప్పటికై నా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యర్థాల -
ఆన్లైన్ చిక్కులు.. గురువులకు తిప్పలు
విశాఖ విద్య: టీచర్ల బదిలీల్లో ఆన్లైన్ దరఖాస్తులు ఓ ప్రహసనంగా మారాయి. సర్వీసు పరమైన వివరాలు సవ్యంగా నమోదుకాక తీవ్రంగా నష్టపోతున్నారు. దరఖాస్తు సమయంలో వెబ్సైట్లో చూపిస్తున్న వివరాలకు భిన్నంగా ఫైనల్ జాబితాలో చూపిస్తుండటంతో ఏ మారుమూలకు కొట్టుకుపోతామోనని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఖాళీలపై స్పష్టతేదీ? బదిలీల నేపథ్యంలో క్లియర్ వేకెన్సీ, 5/8 లాంగ్స్టాండింగ్ వేకెన్సీల ప్రకటనలో జిల్లా విద్యాశాఖ నుంచి ఇప్పటికీ స్పష్టత లేదు. తొలుత 4,788 ఖాళీలు ప్రకటించారు. ఆ తర్వాత 4,811గా బయటకు లీకులిచ్చారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో మళ్లీ దీనిపై కసరత్తు చేశారు. ఇదంతా తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది యూపీ స్కూళ్లలో పోస్టులు మాయం ప్రాథమికోన్నత(యూపీ) పాఠశాలల్లో పోస్టుల కోతను ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజల కోరిక మేరకు, డిమాండ్ ఉన్న చోట యూపీ స్కూళ్లను కొనసాగిస్తున్నట్లు చెప్పిన కూటమి ప్రభుత్వం, లోపాయికారీగా వాటిని నిర్వీర్యం చేస్తోంది. కొత్తగా జిల్లా విద్యాశాఖ చేపట్టిన రేషనలైజేషన్ ప్రక్రియ ఈ అనుమానాలకు బలం చేకూర్చుతోంది. మోడల్ స్కూల్ హెచ్ఎంలు ఎవరో..? ఉమ్మడి విశాఖ జిల్లాలో 565 మోడల్ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నారు. రేషనలైజేషన్లో భాగంగా మిగిలిన 277 మంది స్కూల్ అసిస్టెంట్లను వీటికి హెచ్ఎంలుగా నియమిస్తామని తొలుత ప్రకటించారు. కానీ, బదిలీల సమయంలో దీనిపై స్పష్టత లేకపోవటంతో అంతా అయోమయానికి గురవుతున్నారు. ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ల బదిలీ దరఖాస్తుకు ఆదివారంతో గడువు ముగిసింది. త్వరలోనే వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలి. దీనిపై ఇప్పటి వరకు స్పష్టత లేకపోవటంతో సర్ప్లస్ స్కూల్ అసిస్టెంట్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాబితాల తయారీకి తలనొప్పులు బదిలీల నేపథ్యంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు వెబెక్స్ సమీక్షల పేరుతో రోజుకో ఆదేశం ఇస్తున్నారు. ఆ మేరకు సీనియార్టీ జాబితాలను తయారు చేసేందుకు జిల్లా విద్యాశాఖ సిబ్బంది తర్జనభర్జనలు పడుతున్నారు. క్షణానికో ఉత్తర్వుతో కేడర్ల వారీగా జాబితాల నమోదులో జాప్యం నెలకొంటోంది. దీంతో సాంకేతిక సమస్యల పరిష్కారం పేరిట నగరంలోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశారు. దీని వల్లనైనా తమ ఇబ్బందులు పరిష్కరిస్తే చాలని గురువులు కోరుకుంటున్నారు. కొనసాగుతున్న బదిలీల గందరగోళం సర్వీస్ పాయింట్ల లెక్కతేలక అయోమయం సాంకేతిక సమస్యలతో దరఖాస్తుకు ఇబ్బందులు -
బీసీ బాలుర హాస్టల్ ప్రారంభం
పెదగంట్యాడ: విద్యా రంగ అభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు సహకారం అందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ అన్నారు. జీవీఎంసీ 77వ వార్డు పరిధిలోని ఇస్లాంపేటలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు రూ. 97 లక్షలతో నిర్మించిన బీసీ బాలుర వసతి గృహాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. అలాగే విద్యా రంగంలో మరింత రాణించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైజాగ్ స్టీల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.రవీంద్రనాథ్, బీసీ వెల్ఫేర్ అధికారి శ్రీదేవి, డీఎస్ వర్మ తదితరులు పాల్గొన్నారు. -
● ఏనుగమ్మా.. ఏనుగు
పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకర్షించే ఏనుగు ఊరేగింపుగా వెళ్తోంది. అయితే ఇది నిజమైన ఏనుగు కాదు.! కళాకారుల నైపుణ్యానికి అద్దం పట్టేలా వెదురుతో చేసిన ఏనుగు! నగరంలోని ఓ గ్రామ దేవత పండగ కోసం సిద్ధం చేసిన ఈ వెదురు ఏనుగును ‘ఏనుగమ్మా.. ఏనుగు..’ అంటూ ఆదివారం పండగ కమిటీ సభ్యులు తీసుకువెళ్లారు. ఈ దృశ్యం చూపరుల మనసు దోచుకుంది. వెదురు బద్దలు ఉపయోగించి.. ఎంతో ఓర్పుతో.. కళాత్మక దృష్టితో ఈ ఏనుగు నమూనాను రూపొందించడం విశేషం. ఇదికళాకారుల సృజనాత్మకతకు, వారి అంకిత భావానికి నిదర్శనం. –ఫొటో: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
ఉత్సాహంగా యోగాంధ్ర
ఏయూక్యాంపస్: అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహకంలో భాగంగా నిర్వహిస్తున్న నెలరోజుల కార్యక్రమాలు ఆదివారం కూడా కొనసాగాయి. బీచ్రోడ్డులోని విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఎదురుగా పతంజలి సంస్థ ఆధ్వర్యంలో యోగా సాధన కార్యక్రమం జరిగింది. వేదికపై నుంచి శిక్షకుల పర్యవేక్షణలో నగరవాసులు యోగాసనాలు వేశారు. జూన్ 21న విశాఖ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. -
ప్రశాంతంగా యూపీఎస్సీ పరీక్షలు
మహారాణిపేట: జిల్లాలో ఆదివారం నిర్వహించిన యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ (యూపీఎస్సీ)సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ప్రశాంతంగా నిర్వహించారు. ఈ పరీక్షల కోసం జిల్లా యంత్రాంగం పలు ఏర్పాట్లు చేసింది. మొత్తం 8,422 మంది విద్యార్థులకు కోసం 19 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటి సెషన్ పరీక్షకు 8,422 మందిలో 4,523 మంది పరీక్షకు హాజరయ్యారు. రెండో సెషన్ పరీక్షకు(మధ్యాహ్నం) 8,422 మందికి 4.496 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ పరీక్ష నిర్వహణ కోసం ఇద్దరు పరిశీలకులను నియమించారు. యూపీపీఎస్ నుంచి ఒక పరిశీలకుడుగా డైరెక్టర్ పట్నాయక్ను, రాష్ట్ర పరిశీలకులుగా సీనియర్ ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబు, జిల్లా కో ఆర్డినేటర్ మయూర్ అశోక్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షల నేపథ్యంలో కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ స్థానికంగా ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను సందర్శించి, ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా దువ్వాడ విజ్ఞాన్ ఇంజినీరింగ్ కాలేజీ, అక్కయ్యపాలెం కేంద్రీయ విశ్వవిద్యాలయం కేంద్రాలను ఆయన సందర్శించారు. ఆయన వెంట రెవెన్యూ, పోలీస్, విద్యా శాఖల అధికారులున్నారు. -
కంటి క్యాన్సర్పై అవగాహన అవసరం
ఏయూక్యాంపస్: కంటి క్యాన్సర్పై అవగాహనకల్పిస్తూ ఎల్.వి ప్రసాద్ నేత్ర వైద్య శాల ఆధ్వర్యంలో బీచ్రోడ్డులో ఆదివారం వైటాథాన్ కార్యక్రమం జరిగింది. ముందుగా ఆర్.కె బీచ్ నుంచి వైఎంసీఏ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎంఆర్ వరలక్ష్మి క్యాంపస్ ముఖ్య వైద్యుడు డాక్టర్ వీరేంద్ర సచ్దేవ రెటినోబ్లాస్టోమా(కంటి క్యాన్సర్) లక్షణాలను వివరించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా సమాచారం పొందిన వ్యక్తులు.. ఆ వివరాలను ఇతరులతో పంచుకోవాలని సూచించారు. తద్వారా కంటి దృష్టిని, ప్రాణాన్ని కాపాడటం సాధ్యపడుతుందన్నారు. పిల్లల కంటిలో తెల్లని ప్రతిబింబం కనిపించిన వెంటనే నిపుణులను సంప్రదించాలని సూచించారు. వైటాథాన్ ద్వారా సేకరించిన నిధులను ఆర్థికంగా వెనుకబడిన పిల్లల్లో రెటినోబ్లాస్టోమా చికిత్సను ఉపయోగిస్తామని తెలిపారు. మూడేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న చిన్నారులను ఎక్కువగా ప్రభావితం చేసే కంటి వ్యాధి రెటినోబ్లాస్టోమా అని అన్నారు. మెల్లకన్ను, ఎరుపెక్కిన కళ్లు, వాచిన కనురెప్పలు, ఉబ్బిన కళ్లు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కంటి వైద్య నిపుణులను సంప్రదించాలని సూచించారు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, నగరవాసులు పాల్గొన్నారు. ముందుగా కాళీమాత ఆలయం వద్ద కంటి క్యాన్సర్కు సంబంధించిన వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. -
రాజకీయ కుట్రతోనే రేషన్ వెహికల్స్ రద్దు
బీచ్రోడ్డు: కూటమి ప్రభుత్వం రాజకీయ కుట్రకోణంతోనే రేషన్ వాహనాల జీవోను రద్దు చేసిందని వైస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు ఆరోపించారు. ఎండీయూ వాహనాలను కొనసాగించి, తమకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎండీయూ డ్రైవర్స్, హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్, ఎల్ఐసీ బిల్డింగ్ మీదుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ఆదివారం శాంతియుతంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. వీరికి మద్దతుగా పాల్గొన్న కేకే రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో రేషన్ డిపోల వద్ద గంటల తరబడి క్యూలో నిల్చుని, నానా ఇబ్బందులు పడుతున్న పేదల దుస్థితిని చూసే.. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంటి వద్దకే రేషన్ అందించాలని సరికొత్త వ్యవస్థను రూపొందించారని పేర్కొన్నారు. తద్వారా 20 వేల కుటుంబాలకు ఉపాధి కూడా చేకూరిందన్నారు. ఈ వ్యవస్థ ఎంత సమర్థవంతంగా పని చేసిందంటే.. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా దీన్ని అమలు చేసేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. ఈ సమయంలో, జగన్మోహన్రెడ్డికి మంచి పేరు వస్తుందనే దుగ్ధతో, కేవలం రాజకీయ కుట్ర కోణంలో ఈ వ్యవస్థను రద్దు చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారని ఆరోపించారు. ప్రస్తుతం ప్రజలు కూటమి ప్రభుత్వంను అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ రేషన్ వెహికల్స్ ప్రజల్లో తిరిగితే గత వైఎస్సార్సీపీ సుపరిపాలన ప్రజలకు గుర్తుకు వస్తుందనే రద్దు చేశారన్నారు. ఈ వ్యవస్థ రద్దు ద్వారా సుమారు 20 వేల ఎండీయూ ఆపరేటర్స్, హెల్పర్ల కుటుంబాలతో పాటు కోటీ 50 లక్షల లబ్ధిదారులు ఇబ్బందులకు గురవడాన్ని వైఎస్సార్సీపీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబువన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అని, ఎవరు మంచి చేసినా ఆయనకు నచ్చదన్నారు. ప్రధాని మోదీ పాకిస్తాన్ ఉగ్రవాదులపై చేసిన ‘ఆపరేషన్ సిందూర్’ మాదిరిగానే, ఆంధ్రప్రదేశ్లో మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్న చంద్రబాబు పాలనపై ‘ఆపరేషన్ సిందూర్’ ప్రారంభించాలని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇంటింటికీ రేషన్ అందించడం ద్వారా 1.5 కోట్ల మందికి ప్రయోజనం చేకూర్చారని, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడారని తెలిపారు. చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే ఈ పథకాలను రద్దు చేయడానికి ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. పవన్ కల్యాణ్ ఆధీనంలో ఉన్నప్పటికీ ఈ శాఖపై నోరు మెదపకపోవడం సిగ్గుచేటన్నారు. హామీలు అమలు చేయడంలో విఫలమైన చంద్రబాబు, పవన్ కల్యాణ్లు జగన్ చేసిన మంచి పనులను తొలగించడం అవివేకమన్నారు. అధికారం చేపట్టిన ఏడాదిలోనే ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ నిరసన ర్యాలీలో తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బోని శివరామకృష్ణ, కార్పొరేటర్ బిపిన్ జైన్, నాయకులు మార్కండేయులు, బి.పద్మావతి, ఆపరేటర్స్ అసోసియేషన్ నాయకులు ఎన్.బి.సతీష్, స్వామి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబువన్నీ డైవర్షన్ పాలిటిక్సే.. ‘ఎండీయూ’ నిరసన ర్యాలీలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు -
అంబులెన్స్ డ్రైవర్ అమానుషం
మహారాణిపేట (విశాఖ) : విశాఖపట్నం కేజీహెచ్లో ఇదో అమానుష ఘటన. టీడీపీ కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వాస్పత్రుల పనితీరుకు అద్దంపట్టిన దారుణం. అనారోగ్యంతో మృతిచెందిన రెండు నెలల పసికందును, ఆ చిన్నారి తల్లిదండ్రులను కేజీహెచ్ అంబులెన్స్ డ్రైవర్ నిర్దాక్షిణ్యంగా నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయిన ఘోర ఉదంతమిది. దిక్కుతోచని, నిస్సహాయ స్థితిలో ఆ తల్లిదండ్రులు రాత్రిపూట విగత జీవితో ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ ఇంటికెళ్లారు. అందరినీ కదిలించే ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం పెద్దకోట పంచాయతీ మడ్రేబు గ్రామానికి చెందిన సేదరి శైలు, అర్జున్ దంపతులకు రెండు నెలల కిందట చిన్నారి జన్మించింది.పాపకు శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో ఈనెల 8న విశాఖ కేజీహెచ్లో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం పసికందు మృతిచెందింది. పాప మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళ్లడానికి కేజీహెచ్ అంబులెన్స్లో బయల్దేరారు. కొంతదూరం వెళ్లాక కొత్తవలస జంక్షన్లో అంబులెన్స్ డ్రైవర్ వీరిని దించేశాడు. తమ వద్ద డబ్బుల్లేవని, స్వస్థలానికి తీసుకెళ్లమని తల్లిదండ్రులు ప్రాథేయపడ్డా కనికరించలేదు. దీంతో వారు తెలిసిన వారి ద్వారా డబ్బులు తెప్పించుకుని, ఆటోలో రూ.6 వేలకు సరియా వరకు వెళ్లారు. అక్కడి నుంచి రాత్రి సమయంలో పాప మృతదేహాన్ని మోసుకుంటూ ఇంటికి చేరుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.వేడుకున్నా కనికరించలేదు..ఇక ఈ దారుణంపై బాధితులు శైలు, అర్జున్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. కేజీహెచ్ అంబులెన్స్ డ్రైవర్ చాలా నిర్దయగా ప్రవర్తించాడని ఆవేదన వ్యక్తంచేశారు. డబ్బుల్లేవని చెప్పినా వినకుండా పాప మృతదేహంతో ఉన్న తమను కొత్తవలస జంక్షన్లో బాధ్యతారహితంగా వదిలేశాడని ఆరోపించారు. దీంతో రాత్రి 7 గంటల నుంచి 11 గంటల వరకు ఐదు కిలోమీటర్ల మేర పాప మృతదేహాన్ని మోసుకుంటూ ఇంటికి చేరుకున్నామని వారిరువురూ విలపిస్తూ చెప్పారు. అంబులెన్స్ డ్రైవర్పై చర్య తీసుకోవాలని, సరియా నుంచి మాడ్రేబు వరకు రోడ్డు సౌకర్యం కల్పించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె.గోవిందరావు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. -
కేరళను తాకిన నైరుతి
సాక్షి, విశాఖపట్నం: మే చివరి వారంలో భానుడు భగ్గుమనలేదు... రోహిణి కార్తెలో రోళ్లు పగలనివ్వలేదు. ఎనిమిది రోజుల ముందుగానే రుతుపవనాలు పలకరిస్తూ.. వేసవి ప్రతాపానికి మే నెలలోనే తెర వేశాయి. 2009 తర్వాత తొలిసారిగా నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందుగానే కేరళని తాకాయి. శనివారం మధ్యాహ్నం రుతుపవనాలు కేరళలో ప్రవేశించినట్లు భారత వాతావరణ సంస్థ(ఐఎండీ) ప్రకటించింది. సాధారణంగా జూన్ 1 నాటికి కేరళకు వస్తాయని, కానీ ఈసారి 8 రోజుల ముందుగానే ప్రవేశించాయని ఐఎండీ తెలిపింది.ఈ నెల 26 నాటికి రాయలసీమలో ప్రవేశించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించింది. ఈ నెల 29 నాటికల్లా రాష్ట్రమంతటా వ్యాపించనున్నాయి. మరోవైపు ఈ నెల 27న ఉత్తర బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, ఇది మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.నైరుతి గాలుల ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు పడనున్నాయి. నేడు, రేపు కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా తేలికపాటి వానలు, అక్కడక్కడా మోస్తరు వర్షాలు, ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉంది. గంటకు 40 నుంచి 50 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, అక్కడక్కడా పిడుగులు పడే ప్రమాదముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. -
మిస్సింగ్ మిస్టరీ
ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తి తియ్యని మాటలకు ప్రే‘మాయ’లో పడిపోయి ఒకరు..వివాహేతర సంబంధంతో పిల్లలను తీసుకొని మరొకరు.. తల్లిదండ్రులు మందలించారని ఇంకొకరు.. ఇలా విశాఖలో వరుసగా మహిళల అదృశ్య సంఘటనలు కలవరం రేపుతున్నాయి.దాదాపుగా ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట మహిళలు మాయమవుతూనే ఉన్నారు. బాలికలనుంచి వివాహితుల వరకు వయోభేదాలు లేకుండా కనిపించకుండా పోతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు.. తిరిగి ఇంటికి చేరకపోవడం ఆందోళన కలిగిస్తోంది.వీరి కోసం కుటుంబ సభ్యులు.. సమీప బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో మిస్సింగ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గత ఐదేళ్లలో ఎప్పుడూ లేని విధంగా కేవలం నాలుగు నెలల్లోనే 175 మంది మహిళలు అదృశ్యమైనట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. విశాఖ సిటీ: విశాఖ నగరంలో మహిళల అదృశ్యాలకు ప్రధానంగా ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాలే కారణమని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కనిపించకుండా పోయిన యువతుల్లో ఎక్కువ మంది ప్రేమించుకోవడం, ప్రేమికుడిని దక్కించుకోవడం కోసమే ఇంటి నుంచి వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. అలాగే మధ్య వయసు్కలైన మహిళలు కూడా వివాహేతర సంబంధాల కారణంగా కుటుంబాన్ని వదిలి వెళ్తున్నారు. మిస్సింగ్ కేసుల్లో సుమారు 75 శాతం వరకు ఈ రెండు కారణాలే ఉన్నాయని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఇది నగరంలో పెరుగుతున్న ఆందోళనకరమైన ధోరణిగా మారింది. 175 మంది మాయం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మిస్సింగ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. గత ఐదేళ్లలో ప్రతి ఏటా 50 నుంచి 186 కేసులు వరకు రాగా.. ఈ ఏడాది నాలుగు నెలల్లోనే 175 కేసులు నమోదవడం విశాఖ పరిస్థితికి అద్దం పడుతోంది. జనవరిలో 37, ఫిబ్రవరిలో 49, మార్చిలో 43, ఏప్రిల్లో 46 మంది అదృశ్యమయ్యారు.వీరిలో 133 మంది ఆచూకీని పోలీసులు గుర్తించారు. వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇంకా 42 మంది ఆచూకీ తెలియరాలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. వీరు ప్రేమ, ఇతర కారణాలతో కావాలనే వెళ్లిపోయారా? లేదా ఏదైనా దురదృష్ట సంఘటన జరిగిందా? అన్నది తెలియాల్సి ఉంది. మిస్సింగ్ కేసుల పరిష్కారం కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. పోలీసులకు సవాల్ వీరిని పట్టుకోవడం పోలీసులకు సైతం సవాలుగా మారుతోంది. కొంతమంది ఆచూకీ తెలుసుకున్నప్పటికీ.. మేజర్లు, చట్టాలు, హక్కులు పేరుతో పోలీసులకు కూడా చుక్కులు చూపించిన సంఘటనలు ఉన్నాయి. ఇటువంటి కేసుల్లో అదృశ్యమైన వారి ఆచూకీని పోలీసులు గుర్తించడం మినహా వారిని కుటుంబ సభ్యులకు అప్పగించడం కూడా ఒక పెద్ద సమస్యగా మారుతోంది. -
విజయవాడ రైల్వే స్టేషన్కు బాంబు బూచి
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఏపీని వరుస బాంబు బెదిరింపులు హడలెత్తించాయి. విజయవాడ రైల్వే స్టేషన్కు శనివారం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల లగేజీలను, ప్లాట్ఫారమ్లను క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఎలాంటి బాంబు లేదని నిర్ధారించుకున్నారు.విజయవాడ రైల్వే స్టేషన్లో(Vijayawada Railway Station) బాంబు పెట్టామని కంట్రోల్ రూమ్ కి కాల్ చేసిన అగంతకుడు.. తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నట్లు అధికారులు వెల్డించారు. ఆ కాల్ మహారాష్ట్ర లాతూర్ నుంచి వచ్చిందని, ఆగంతకుడు హిందీలో మాట్లాడాడని తెలిపారు. జీఆర్పీ, సీఎస్డబ్ల్యూ, బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీలు జరిపారు. ఎల్టీటీ రైలు నుంచి కాల్ వచ్చినట్లు గుర్తించాం. ఎవరు కాల్ చేశారో విచారణ చేస్తున్నాం అని ఆర్పీఎఫ్ ఏఎస్పీ వెల్లడించారు. అంతకు ముందు.. నగరంలోని బీసెంట్ రోడ్కు (Besant Road) బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది. కంట్రోల్ రూంకు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి బాంబ్ ఉన్నట్లు బెదిరించాడు. దీంతో వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు, బాంబు స్క్వాడ్ బీసెంట్ రోడ్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. బీసెంట్ రోడ్లోని షాపులు, తోపుడు బండ్లను బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేసింది. అయితే ఎక్కడా బాంబ్ ఉన్న ఆనవాళ్లు లేక పోవడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.విశాఖపట్నం: ఇటు వైజాగ్ రైల్వే స్టేషన్లోనూ ‘బాంబు’ అలజడి రేగింది. ఎల్టీఐ ఎక్స్ప్రెస్(లోకమాన్య తిలక్ టెర్మినస్-విశాఖ)లో బాంబు పెట్టినట్లు ఓ ఆగంతకుడు కాల్చేయడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. రైలు స్టేషన్కు చేరుకోగానే బాంబు స్క్వాడ్ తనిఖీలు జరిపింది. ఎస్ 2 కోచ్లో అనుమానాస్పద బ్యాగ్ గుర్తించింది. అయితే అందులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
విశాఖలో మరో ఇద్దరికి కరోనా
సాక్షి, అమరావతి/కడప అర్బన్: విశాఖపట్నంలో కరోనా సోకిన వ్యక్తి కుటుంబంలోనే మరొకరితోపాటు చికిత్స అందించిన ప్రభుత్వ వైద్యుడికి కరోనా సోకినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో శుక్రవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. కోవిడ్పై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సలహాలు, సూచనలు చేయలేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ఆధునిక సాంకేతికతను వినియోగించి దోమల నియంత్రణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, కార్యదర్శి డాక్టర్ మంజుల, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్, సెకండరీ హెల్త్ డైరెక్టర్ సిరి తదితరులు పాల్గొన్నారు. కడప రిమ్స్లో మరో కేసు కడప నగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్) లో దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతూ నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన షేక్ చాంద్ గౌస్ బీబీ(75) అనే వృద్ధురాలు రెండురోజుల కిందట చేరింది. ఆమె కోవిడ్తో బాధ పడుతోందని ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. ఆమెను రిమ్స్లోనే ఎంఐసీయూ వార్డు నుంచి కోవిడ్ ఎంఐసీయూ వార్డుకు మార్చి వైద్యసేవలను అందిస్తున్నారు. వృద్ధురాలికి కోవిడ్ నిర్ధారణ జరిగిందని, తగు జాగ్రత్తలతో వైద్య పరీక్షలు చేయిస్తున్నామని రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ రమాదేవి తెలిపారు. కానీ, కడప రిమ్స్లో కోవిడ్ కేసు నమోదు కాలేదని కడప జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి నాగరాజు తెలిపారు. బెంగళూరులో 9 నెలల చిన్నారికి కోవిడ్శివాజీనగర: బెంగళూరుకు చెందిన తొమ్మిది నెలల బాలుడికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. బెంగళూరు రూరల్ జిల్లాలోని హొసకోటకు చెందిన బాలుడికి జ్వరం రావడంతో తల్లిదండ్రులు కలశపాళ్యలోని ప్రభుత్వ వాణి విలాస్ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు అనుమానంతో ఈ నెల 22న ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ (ఆర్ఏటీ) చేయగా, చిన్నారికి కరోనా సోకినట్లు తేలిందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హర్‡్ష గుప్తా వెల్లడించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. -
విమ్స్లో కోవిడ్ ప్రత్యేక వార్డు
ఆరిలోవ/మహారాణిపేట: నగరంలో కోవిడ్ కలకలం రేపుతుండటంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా, విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)లో శుక్రవారం 20 పడకలతో కూడిన ప్రత్యేక కోవిడ్ వార్డును సిద్ధం చేశారు.విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె. రాంబాబు వార్డును పరిశీలించి, పడకలు, ఆక్సిజన్ యంత్రాలను తనిఖీ చేశారు. కొత్త కోవిడ్ వేరియంట్లైన జేఎన్–1, ఎల్ఎఫ్7, ఎన్బీ 1.8 పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోవిడ్ పరీక్షల కోసం రాపిడ్ కిట్లు అందుబాటులో ఉన్నాయని, పాజిటివ్ వస్తే వెంటనే ఆర్టీపీసీఆర్ పరీక్షలకు పంపిస్తామని తెలిపారు. కేజీహెచ్లో 20 పడకలతో కోవిడ్ వార్డును సిద్ధం చేసినట్టు సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద్ తెలిపారు. ఈ వార్డుకు అవసరమైన పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్లు అందుబాటులో ఉంచామన్నారు. -
పోలీస్ శాఖకు దివీస్ డ్రోన్లు
విశాఖ సిటీ: దివీస్ ల్యాబ్స్ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా విశాఖ నగర పోలీస్ శాఖకు రెండు అత్యాధునిక డ్రోన్లను అందజేసింది. ఈ డ్రోన్లను సీపీ శంఖబ్రత బాగ్చికి అందజేశారు. ఈ డ్రోన్లలో హెచ్చరికలు, సూచనలు చేసే లౌడ్స్పీకర్, డే అండ్ నైట్ విజన్ కెమెరా, 5 కిలోమీటర్ల పరిధి, 45 నిమిషాలకు పైగా ఎగిరే సమయం, డిటెక్షన్, రికగ్నిషన్, ఐడెంటిఫికేషన్, లైవ్ స్ట్రీమింగ్ కనెక్టివిటీ, సెర్చ్లైట్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులతో పాటు దివీస్ జీఎం వై.ఎస్.కోటేశ్వరరావు, లైజన్ కన్సల్టెంట్ ఎం.ఎన్.వరహాలరెడ్డి, సీఎస్ఆర్ మేనేజర్ డి.సురేష్కుమార్ పాల్గొన్నారు. -
అనాథ బాలలకుఆధార్ కార్డులు
● జడ్జి సన్యాసినాయుడు విశాఖ లీగల్ : అనాథలు, వృద్ధులు, వితంతువులకు ఆధార్ కార్డులు అందించాలని విశాఖ జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఆర్. సన్యాసినాయుడు అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా ప్రాధికార సంస్థ కార్యాలయంలో అంగన్వాడీ, ఐసీడీఎస్ తదితర సంస్థలతో నిర్వహించిన అవగాహన శిబిరంలో ఆయన మాట్లాడారు. ఐసీడీఎస్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు వీరికి తక్షణమే ఆధార్ కార్డులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమగ్ర శిశు సంక్షేమ శాఖ, జిల్లా విద్యాశాఖ, జిల్లా బాలల అభివృద్ధి ప్రాజెక్టు, స్థానిక తహసీల్దార్ కార్యాలయాల్లో ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేసి అర్హులకు వెంటనే ఆధార్ కార్డులు మంజూరు చేయాలని న్యాయమూర్తి వివరించారు. -
మిస్సింగ్
ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తి తియ్యని మాటలకు ప్రే‘మాయ’లో పడిపోయి ఒకరు.. వివాహేతర సంబంధంతో పిల్లలను తీసుకొని మరొకరు.. తల్లిదండ్రులు మందలించారని ఇంకొకరు.. ఇలా విశాఖలో వరుసగా మహిళల అదృశ్య సంఘటనలు కలవరం రేపుతున్నాయి. దాదాపుగా ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట మహిళలు మాయమవుతూనే ఉన్నారు. బాలికల నుంచి వివాహితుల వరకు వయోభేదాలు లేకుండా కనిపించకుండా పోతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు.. తిరిగి ఇంటికి చేరకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వీరి కోసం కుటుంబసభ్యులు.. సమీప బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో మిస్సింగ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గత ఐదేళ్లలో ఎప్పుడూ లేని విధంగా కేవలం నాలుగు నెలల్లోనే 175 మంది మహిళలు అదృశ్యమైనట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. విశాఖ సిటీ: విశాఖ నగరంలో మహిళల అదృశ్యాలకు ప్రధానంగా ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాలే కారణమని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కనిపించకుండా పోయిన యువతుల్లో ఎక్కువ మంది ప్రేమించుకోవడం, ప్రేమికుడిని దక్కించుకోవడం కోసమే ఇంటి నుంచి వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. అలాగే మధ్య వయస్కులైన మహిళలు కూడా వివాహేతర సంబంధాల కారణంగా కుటుంబాన్ని వదిలి వెళ్తున్నారు. మిస్సింగ్ కేసుల్లో సుమారు 75 శాతం వరకు ఈ రెండు కారణాలే ఉన్నాయని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఇది నగరంలో పెరుగుతున్న ఆందోళనకరమైన ధోరణిగా మారింది. 175 మంది మాయం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మిస్సింగ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. గత ఐదేళ్లలో ప్రతి ఏటా 50 నుంచి 186 కేసులు వరకు రాగా.. ఈ ఏడాది నాలుగు నెలల్లోనే 175 కేసులు నమోదవడం విశాఖ పరిస్థితికి అద్దం పడుతోంది. జనవరిలో 37, ఫిబ్రవరిలో 49, మార్చిలో 43, ఏప్రిల్లో 46 మంది అదృశ్యమయ్యారు. వీరిలో 133 మంది ఆచూకీని పోలీసులు గుర్తించారు. వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇంకా 42 మంది ఆచూకీ తెలియరాలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. వీరు ప్రేమ, ఇతర కారణాలతో కావాలనే వెళ్లిపోయారా? లేదా ఏదైనా దురదృష్ట సంఘటన జరిగిందా? అన్నది తెలియాల్సి ఉంది. మిస్సింగ్ కేసుల పరిష్కారం కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. పోలీసులకు సవాల్ వీరిని పట్టుకోవడం పోలీసులకు సైతం సవాలుగా మారుతోంది. కొంతమంది ఆచూకీ తెలుసుకున్నప్పటికీ.. మేజర్లు, చట్టాలు, హక్కులు పేరుతో పోలీసులకు కూడా చుక్కులు చూపించిన సంఘటనలు ఉన్నాయి. ఇటువంటి కేసుల్లో అదృశ్యమైన వారి ఆచూకీని పోలీసులు గుర్తించడం మినహా వారిని కుటుంబ సభ్యులకు అప్పగించడం కూడా ఒక పెద్ద సమస్యగా మారుతోంది. విశాఖలో పెరుగుతున్న మహిళల అదృశ్యం కేసులు 4 నెలల్లో 175 మంది మాయం ఇప్పటి వరకు 133 మంది ఆచూకీ లభ్యం మిస్టరీగానే 42 మంది మహిళల అదృశ్యం ప్రేమ, వివాహేతర సంబంధాలు, కుటుంబ కలహాలే కారణం -
సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు సర్వం సిద్ధం
విశాఖ విద్య: ఈ నెల 25న జరగనున్న సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఆదేశించారు. నగరంలోని 19 పరీక్షా కేంద్రాల్లో 8,424 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల్లో జామర్లు, తాగునీరు, టాయిలెట్లు వంటి కనీస వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు. యూపీఎస్సీ పరీక్ష నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని, ఏమైనా సమస్యలుంటే తెలియజేయడానికి కంట్రోల్ రూమ్ (నం. 0891–2590100, 0891–2590102) ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్ష ఉదయం 9.30 నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు రెండు సెషన్లలో జరుగుతుంది. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, డీఆర్వో బీహెచ్ భవానీ శంకర్, యూపీఎస్సీ డైరెక్టర్ పట్నాయక్ సమావేశంలో పాల్గొన్నారు. -
బదిలీలతో ఎంటీఎస్ టీచర్లు బలి..!
విశాఖ విద్య: దశాబ్దాల పోరాటంతో కొలువు దక్కించుకున్నామనే ఆనందం మినిమమ్ టైం స్కేల్(ఎంటీఎస్)తో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఎన్నో రోజులు మిగల్లేదు. కొన్నాళ్లు ఏజెన్సీలో పనిచేస్తే ఆ తర్వాత స్వగ్రామాలకు సమీపంలో పోస్టింగ్ ఇస్తామని చెబితే ఉద్యోగాల్లో చేరారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చారనే ఏకై క కారణంతో కూటమి ప్రభుత్వం విషం కక్కుతోంది. టీచర్ల బదిలీలకు తెరలేపిన ప్రభుత్వం, ఎంటీఎస్ టీచర్లను గాల్లోపెట్టి, వారు పనిచేస్తున్న స్థానాలను ఖాళీలుగా చూపించారు. దీంతో మళ్లీ ఎక్కడికి పోవాలో తెలియక సతమతమవుతున్నారు. న్యాయ చిక్కుల్ని పరిష్కరించి.. న్యాయపరమైన సమస్యల్ని పరిష్కరించి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో డీఎస్సీ–98 సెలక్టెడ్ అభ్యర్థులు 324 మంది, డీఎస్సీ–2008 అభ్యర్థులు 296 మందికి ఎంటీఎస్ ప్రాతిపదికన ఉద్యోగాలిచ్చారు. డీఎస్సీ–2008 వారికి మైదాన ప్రాంతంలోనే పోస్టింగ్లు ఇచ్చారు. డీఎస్సీ–98కి చెందిన 93 మందిని మైదాన ప్రాంతంలో, మిగిలిన 231 మందిని అల్లూరి జిల్లాలోని ఏజెన్సీ మండలాలకు కేటాయించారు. 98 డీస్సీకి చెందిన వారిలో కొందరు ఇప్పటికే రిటైర్ కూడా అయ్యారు. జీతం మినిమం.. పని మాగ్జిమం రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా ఎంటీఎస్ ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. వీరికి నెలకు రూ.32,470లు వేతనం చెల్లిస్తున్నారు. దీంతో సొంత మండలాలు, లేదా సమీప మండలాల్లోని స్కూళ్లలోనే పోస్టింగ్లు ఇవ్వాలని నాటి ప్రభుత్వం ఆదేశించింది. కానీ మైదాన ప్రాంతంలో అన్ని ఖాళీలు లేనందున చాలా మందిని ఏజెన్సీలో నియమించారు. దశల వారీగా వారిని మైదాన ప్రాంతానికి తీసుకురావాలని అప్పటి ప్రభుత్వం విద్యాశాఖాధికారులకు దిశా నిర్దేశం చేసింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో.. డీఎస్సీ–98 ఎంటీఎస్ టీచర్లను 2023లో కౌన్సిలింగ్ ద్వారా స్కూళ్లు కేటాయించారు. 2024లో ఎక్కడివారినక్కడే రెన్యువల్ చేశారు. ప్రస్తుతం టీచర్ల బదిలీల నేపథ్యంలో 620 ఎంటీఎస్ స్థానాలను ఖాళీలుగా చూపారు. దీంతో రెగ్యులర్ టీచర్లు కోరుకోగా మిగిలిన ఖాళీలు మాత్రమే వీరికి దక్కనున్నాయి. ఈ నేపథ్యంలో బడులు తెరిచాక.. ఎక్కడికి వెళ్లాల్సి వస్తుందో తెలియని అయోమయంలో ఎంటీఎస్ టీచర్లున్నారు. ఖాళీల జాబితాలో వారు పనిచేస్తున్న స్కూళ్లు మళ్లీ ఏజెన్సీ బాట తప్పదని ఆందోళన భద్రత, కనీస అలవెన్సులకు నోచుకోని వైనం ఉమ్మడి విశాఖలో 620 మంది ఎంటీఎస్ టీచర్లు పోస్టింగ్ ఎక్కడిస్తారో.. మా కుటుంబం ఉండేది విశాఖలోని ఎన్ఏడీ. ప్రస్తుతం అల్లూరి జిల్లాలోని డుంబ్రిగుడ మండలం పరిడి గిరిజన ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్నా. లా చదివినా, ఉపాధ్యాయ వృత్తిపై ఇష్టంతో ఇందులో చేరా. కానీ.. తీసుకొచ్చి ఏజెన్సీలో పడేశారు. ఈ ఏడాదైనా మా జిల్లాలో పోస్టింగ్ ఇస్తారని ఆశగా ఎదురుచూస్తున్నా. – దాట్ల లక్ష్మీదేవి రిటైరయ్యే ముందైనా.. మాది విశాఖ జిల్లా అగనంపూడి. ఆగస్టులో రిటైర్ అయిపోతా. ముంచంగిపుట్ మండలం కెండుగుడ మండల ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నా. ఈ ఏడాది పోస్టింగ్ ఎక్కడిస్తారో కూడా తెలియట్లేదు. రెండు నెలల కోసం మళ్లీ మకాం మార్చాల్సిందేనా. కనీసం.. రిటైరయ్యే ముందైనా విశాఖ జిల్లాలో పనిచేసే అవకాశం ఇవ్వాలి. – ఎం.అనిత -
చందనోత్సవం ఘటనకు మంత్రుల కమిటీదే బాధ్యత
సింహాచలం: చందనోత్సవం రోజున సింహాచలం కొండపై ఏడుగురు భక్తులు మృతి చెందిన ఘటనకు కూటమి ప్రభుత్వ మంత్రుల కమిటీ బాధ్యత వహించాలని మాజీ దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏర్పాట్లపై మైక్రో లెవెల్లో జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పుకున్న మంత్రులు, భక్తుల మృతికి కూడా బాధ్యత తీసుకోవాలని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు రెండు చందనోత్సవాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించామని, 1.60 లక్షల మంది భక్తులకు నిజరూప దర్శనం కల్పించామని గుర్తు చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయడం లేదని, పాలనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. అమరావతి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, తమ వారికి లాభాలు చేకూర్చే విధంగానే కూటమి ప్రభుత్వ పాలన ఉందని విమర్శించారు. -
మహారాజా బ్యాంకుకు అవార్డులు
విశాఖసిటీ: ది మహారాజా కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంకుకు జాతీయ స్థాయిలో రెండు అవార్డులు లభించాయి. ‘బెస్ట్ చైర్పర్సన్ ఆఫ్ ది ఇయర్’ , ‘బెస్ట్ అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంక్ – ఆంధ్రప్రదేశ్ స్టేట్’ అవార్డులను శుక్రవారం ముంబైలో జరిగిన ‘భారత్ రత్న సహకారిత సమ్మాన్ 2025’ కార్యక్రమంలో అందుకున్నారు. బ్యాంకు 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ అవార్డులు రావడం సంతోషంగా ఉందని వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.రామకృష్ణంరాజు తెలిపారు. ఈ సందర్భంగా 999 రోజులకు 9 శాతం వడ్డీతో ‘మహారాజా స్పెషల్ డిపాజిట్ స్కీం’ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు మొత్తం వ్యాపారం రూ.492 కోట్లుగా, నికర లాభం రూ.3.24 కోట్లుగా వెల్లడించారు. త్వ రలో విజయవాడ, రాజమండ్రి, రామచంద్రాపురంల లో కొత్త శాఖలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. -
మరికొంతకాలంప్రత్యేక రైళ్ల పొడిగింపు
తాటిచెట్లపాలెం: విశాఖపట్నం–ఎస్ఎంవీ బెంగళూరు, విశాఖపట్నం–షాలిమర్ మధ్య నడుస్తున్న స్పెషల్ రైళ్లను మరికొంత కాలం పొడిగించినట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. విశాఖపట్నం–ఎస్ఎంవీ బెంగళూరు(08581) వీక్లీ స్పెషల్ ప్రతి ఆదివారం విశాఖలో మధ్యాహ్నం 3.20 గంటలకు బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12.45 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైలు జూన్ 29 వరకు పొడిగించారు. ఎస్ఎంవీ బెంగళూరు–విశాఖపట్నం (08581) వీక్లీ స్పెషల్ ప్రతి సోమవారం మధ్యాహ్నం బెంగళూరులో 3.50 గంటలకు బయలుదేరి.. మరుసటిరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైలు జూన్ 30 వరకు పొడిగించారు. ● విశాఖపట్నం–షాలిమర్(08508) స్పెషల్ ప్రతి మంగళవారం విశాఖపట్నంలో ఉదయం 11.20 గంటలకు బయలుదేరి మరుసటిరోజు తెల్లవారుజాము 3 గంటలకు షాలిమర్ చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైలు జూన్ 24 వరకు పొడిగించారు. షాలిమర్–విశాఖపట్నం (08507) స్పెషల్ ప్రతి బుధవారం షాలిమర్లో తెల్లవారు 5 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 8.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ స్పెషల్ జూన్ 25 వరకు పొడిగించారు. -
కౌంటీ సీసీ కెప్టెన్ హరీష్ వీరవిహారం
విశాఖ స్పోర్ట్స్: వీడీసీఏ ఒకటో డివిజన్ క్రికెట్ లీగ్లో కౌంటీ సీసీ కెప్టెన్ హరీష్కుమార్ ఆకాశమే హద్దుగా చెలరేగి అజేయ డబుల్ సెంచరీతో (202) కదంతొక్కాడు. పీఎంపాలెంలోని వైఎస్సార్ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్లో రాయల్ సీసీ జట్టుపై 307 పరుగుల భారీ తేడాతో కౌంటీ సీసీ విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కౌంటీ సీసీ నిర్ణీత 40 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 367 పరుగులు చేసింది. ఓపెనర్ దేవాశిష్ 75 పరుగులు చేయగా చరణ్ 61 పరుగులతో రాణించాడు.కెప్టెన్ హరీష్ 15 ఫోర్లు, 12 సిక్సర్లతో చెలరేగాడు. నవవసంత్ రెండు వికెట్లను తీశాడు. ప్రతిగా రాయల్ సీసీ 21.5 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 60 పరుగులే చేసింది. శివ మూడు, ఆదిత్య రెండు వికెట్లు తీశారు. -
‘అమృత్ భారత్’ పనులు వేగవంతం
అధికారులకు వాల్తేర్ డీఆర్ఎం ఆదేశంఅగనంపూడి: దువ్వాడ రైల్వే స్టేషన్లో అమృత భారత్ పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను శుక్రవారం వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బొహ్రా, సీనియర్ డీసీఎం సందీప్లతో కూడిన బృందం పరిశీలించింది. ముందుగా డీఆర్ఎం ఒకటో నంబర్ ప్లాట్ఫాం వైపు నిర్మిస్తున్న ప్రధాన పరిపాలన భవన నిర్మాణాన్ని తనిఖీ చేశారు. అనంతరం ఒకటి, నాలుగు ప్లాట్ఫాంలను కలుపుతూ నిర్మిస్తున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించి, వాటి పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. తర్వాత ప్లాట్ఫాం నంబర్ నాలుగు వైపు జరుగుతున్న సుందరీకరణ, రహదారి విస్తరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఆర్ఎం అధికారులతో మాట్లాడుతూ నాణ్యతలో ఎటువంటి రాజీ లేకుండా పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. తూర్పు కోస్తా రైల్వే జోనల్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు కంచుమూర్తి ఈశ్వర్, దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ ప్రతినిధులు డీఆర్ఎంను కలిసి ఇక్కడి సమస్యలపై వినతపత్రం సమర్పించారు. విశాఖ–తిరుపతి డబుల్ డెక్కర్ రైలులో శాశ్వత ప్రాతిపదికన థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ కోచ్లు ఏర్పాటు చేయాలని, కోచ్లకు నీటి సరఫరా సౌకర్యం కల్పించి సిబ్బందిని నియమించాలని, ఎస్కలేటర్లు, లిఫ్ట్లను ఏర్పాటు చేయాలని వారు కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో జాషువా, కామేశ్వరరావు ఉన్నారు. -
అదృశ్యం కాదు.. హత్య!
అల్లిపురం: మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక మిస్సింగ్ కేసు మిస్టరీ వీడింది. దాదాపు మూడున్నరేళ్ల కిందట అదృశ్యమైన వివాహిత పల్లా గీత(45) హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి అలుగు దివాకర్ను అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని తరలించిన కారును స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. మరో నిందితుడు వరప్రసాద్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో సీపీ ఈ వివరాలు వెల్లడించారు. ఇదీ కేసు మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న పల్లా గీత 2021 డిసెంబర్ 21న అదృశ్యమైనట్లు ఆమె కుమార్తె ఆబోతు సునీత 2022 జనవరిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ‘వుమెన్ మిస్సింగ్’కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఆమె ఆచూకీ లభించకపోవడంతో 2022 అక్టోబర్లో కేసును ‘అన్డిటెక్టెడ్’గా మూసివేశారు. తన తల్లి ఆచూకీ దాదాపు మూడున్నరేళ్లుగా తెలియకపోవడం.. తనకు న్యాయం జరగలేదని ఆవేదన చెందిన సునీత ఈ ఏడాది మే మొదటి వారంలో పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చిని కలిసి అభ్యర్థించారు. దీంతో కమిషనర్ ఆదేశాల మేరకు పీసీఆర్ ఇన్స్పెక్టర్ షేక్ హుస్సేన్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి, కేసును పునఃవిచారణ చేపట్టారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన నిజాలు ప్రత్యేక బృందం పది రోజుల్లోనే కేసు మిస్టరీని ఛేదించింది. పలు ప్రదేశాలను సందర్శించి, అనేక మంది సాక్షులను విచారించి, సాంకేతిక ఆధారాలను విశ్లేషించి, గీత హత్యకు గురైందని తేల్చారు. గీతతో సన్నిహితంగా ఉన్న అలుగు దివాకర్ ఆమెను పాశవికంగా హత్య చేసి.. ఏమీ తెలియనట్లు సమాజంలో తిరుగుతున్నాడని పక్కా ఆధారాలు సేకరించి అరెస్ట్ చేశారు. ఘోరంగా హత్య.. మృతదేహం మాయం 2021 డిసెంబర్ 26న గీత మరోసారి ద్విచక్ర వాహనంపై దివాకర్ ఇంటికి వెళ్లి పెళ్లి విషయమై గొడవపడింది. సాయంత్రం వరకు ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దివాకర్ పెళ్లికి అంగీకరించకపోవడంతో గీత ప్రతిఘటించింది. ఈ ఘర్షణలో గీత గోళ్లతో రక్కడంతో దివాకర్ ముఖం, చేతులపై గాయాలయ్యాయి. దీంతో ఆమె తనను జీవితాంతం వేధిస్తుందని భావించిన దివాకర్.. ఆమెను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంట్లో ఎవరు లేని సమయాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. గీతను బలంగా గోడకు గుద్ది, ప్రాణం పోయే వరకు కొట్టి చంపాడు. అదే సమయానికి హైదరాబాద్కు చెందిన రియల్ ఎస్టేట్ స్నేహితుడు వరప్రసాద్ రావడంతో, అతని సహాయంతో మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి, తన ఫోర్డ్ ఐకాన్ కారు వెనుక సీట్లో ఉంచాడు. తూర్పుగోదావరి జిల్లా ఎర్రవరం వద్ద పారుతున్న ఎర్ర కాలువలో అర్ధరాత్రి ఆ మృతదేహాన్ని పడేశారు. నేరాన్ని కప్పిపుచ్చే యత్నం హత్య అనంతరం దివాకర్ హైదరాబాద్ వెళ్లి కొన్ని రోజులు అక్కడే ఉండి, తర్వాత నగరానికి తిరిగి వచ్చాడు. గీత తన స్నేహితులతో కలిసి అదే రోజు తిరుపతి వెళ్లిందని ఒక కథ అల్లి.. బంధువులను, కుమార్తెను నమ్మించాడు. ఆమె సెల్ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి, చైన్నె తీసుకెళ్లి ఆన్ చేసి కాలువలో పడేశాడు. కొన్ని రోజుల తర్వాత గీత ద్విచక్ర వాహనాన్ని ఆమె కుమార్తెకు అప్పగించి, సహాయం చేస్తున్నట్లు ఎంతో తెలివిగా నటిస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు. తాజాగా సునీత ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఈ కేసులో దివాకర్ పాత్రపై అనుమానం వ్యక్తం చేశారు. గీత బైక్ను ఆమె కుమార్తెకు అప్పగించడం, తిరుపతి వెళ్లిందని నమ్మించడం, తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని నిందితుడిని విచారించారు. తానే హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో తగిన సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని రవాణా కొరకు ఉపయోగించిన ఫోర్డ్ ఐకాన్ కారును స్వాధీనం చేసుకున్నారు. మూసివేసిన కేసును పది రోజుల్లోనే ఛేదించిన ఇన్స్పెక్టర్ షేక్ హుస్సేన్ను పోలీస్ కమిషనర్ ప్రశంసాపత్రంతో సత్కరించారు. అలాగే ఈ కేసు దర్యాప్తులో ప్రతిభ చూపిన సీసీఎస్ ఏఎస్ఐ పి.చంద్రశేఖర్, మహారాణిపేట క్రైం కానిస్టేబుల్ ఎన్.ఎ.రాజు, టూటౌన్ కానిస్టేబుల్ ఎ.వినోద్, త్రీటౌన్ కానిస్టేబుల్ వి.రామరాజులను సీపీ అభినందించారు. వివాహిత మిస్సింగ్ కేసు మిస్టరీ వీడింది మూడున్నరేళ్ల తర్వాత వెలుగులోకి వచ్చిన ఘోరం కుమార్తె పోరాటంతో కదిలిన డొంక రియల్ ఎస్టేట్ వ్యాపారి దివాకర్ అరెస్ట్ హత్యకు దారితీసిన పరిస్థితులివీ.. భర్తతో విబేధాల కారణంగా పిల్లలను అతని వద్దే విడిచిపెట్టి.. మెలోడీ థియేటర్ ఎదురుగా తన తల్లిదండ్రుల ద్వారా వచ్చిన ఫ్లాట్లో గీత ఒంటరిగా నివసిస్తూ రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పనిచేసేది. ఫ్లాట్ నిర్మాణ సమయంలో బిల్డర్తో వచ్చిన సమస్యలను పరిష్కరించడంలో దివాకర్ సహాయం చేయడంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కృతజ్ఞతతో గీత తన ప్లాట్లోని ఒక గదిని దివాకర్కు రియల్ ఎస్టేట్ ఆఫీస్ కోసం ఇచ్చింది. ఆమె దివాకర్ను నమ్మి అతను చెప్పిన కొంత మందికి లక్షల్లో అప్పు ఇచ్చింది. ఈ క్రమంలో వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. దీంతో పెళ్లి చేసుకోవాలని దివాకర్ను గీత ఒత్తిడి చేయడం ప్రారంభించింది. అయితే దివాకర్కు ఆమెను వివాహం చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో క్రమంగా దూరం పెట్టడం మొదలుపెట్టాడు. ఇది గ్రహించిన గీత బుచ్చిరాజుపాలెంలో నివసిస్తున్న దివాకర్ ఇంటికి వెళ్లి వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసింది. 2021 నవంబర్ 20న అతని ఇంటికి వెళ్లి.. అతని ఆఫీస్ సిబ్బంది ముందే పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చింది. దీంతో దివాకర్ తన సిబ్బందితో కలిసి ఇంటికి తాళం వేయకుండానే అక్కడి నుంచి కారులో వెళ్లిపోయాడు. -
విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant)లో శుక్రవారం వేకువ జామున భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్టీల్ మెల్టింగ్ స్టేషన్(SMS)-2 మిషన్లో షార్ట్ సర్క్యూట్తో హైడ్రాలిక్ ఆయిల్ లీక్ అయ్యి మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ టీం అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది. అయితే నష్టం తాలుకా వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. -
కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు.. ఉన్నవి ఊస్టింగా?
తిరుపతి మంగళం/తణుకు అర్బన్/బీచ్రోడ్డు (విశాఖ): టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్కళ్యాణ్ ప్రగల్భాలు పలికారని.. అధికారంలోకి వచ్చాక కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలనే తీసేసేందుకు కుట్రలు చేస్తున్నారని మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (ఎండీయూ) ఆపరేటర్లు మండిపడ్డారు.ఈ ఎండీయూ వాహనాల ద్వారా కాకుండా రేషన్ షాపుల ద్వారా రేషన్ సరుకులను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని పలుచోట్ల ఎండీయూ ఆపరేటర్లు ఉద్యమబాట పట్టారు. తిరుపతిలో అర్ధనగ్న ప్రదర్శన చేయగా.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. విశాఖలో పెద్దఎత్తున ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రతి పేదవాడి ముంగిటకు సంక్షేమ పథకాలు అందించాలన్న లక్ష్యంతోగత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎండీయూ విధానాన్ని తీసుకొస్తే ఇప్పుడు చంద్రబాబు ఆపరేటర్లను తొలగించేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. విశాఖలో ఎండీయూ ఆపరేటర్లు జేసీకి, తణుకులో తహసీల్దార్ డి. అశోక్వర్మకు వినతిపత్రం అందించారు. -
పదహారేళ్ల తర్వాత ముందస్తు పలకరింపు..!
సాక్షి, విశాఖపట్నం: పదహారేళ్ల తర్వాత.. నైరుతి రుతుపవనాలు ముందస్తుగా రాష్ట్రాన్ని పలకరిస్తున్నాయి. భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అంచనాలకు అనుగుణంగానే వారం ముందుగా.. ఈ నెల 26 నాటికి రాయలసీమలోకి ప్రవేశించనున్నాయి. 29 నాటికి రాష్ట్రమంతటా విస్తరించే సూచనలున్నాయి. మే నెలాఖరులో రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకడం 2009 తర్వాత ఇదే మొదటిసారని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వాతావరణంలో మార్పులు, ఎల్నినో ప్రభావం లేకపోవడం రుతుపవనాల ముందస్తు రాకకు కారణమని పేర్కొంటున్నారు. వారు అందించిన వివరాల ప్రకారం.. » తూర్పు–పశ్చిమ షీర్ జోన్ ఒక చోదక శక్తిగా నైరుతిని ముందుండి నడిపిస్తోంది. » ఈ ఏడాది మే మధ్యలో ఏర్పడిన షీర్ జోన్, అరేబియా సముద్రం, బంగాళాఖాతం రెండింటిలోనూ అల్పపీడన వ్యవస్థలను ప్రేరేపించడంతో.. రుతుపవనాలు చురుగ్గా కదిలేందుకు అవకాశం కలిగింది. » ఈనెల 24 నాటికి రుతు పవనాలు కేరళను తాకే సూచనలు కనిపిస్తున్నాయి. 26 నాటికి రాయలసీమ అంతటా.. దక్షిణ కోస్తా జిల్లాల్లోని సీమ సరిహద్దు ప్రాంతాల్లోనూ విస్తరించనున్నాయి. 28 నాటికి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల మొత్తం, 29 నాటికి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్రమంతటా విస్తరించేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. » ఈసారి వర్షపాతం దీర్ఘకాలిక సాధారణ సగటు 104 శాతం కంటే 5 శాతం అదనంగా పడే సూచనలున్నాయి.27న అల్పపీడనం!ఓవైపు నైరుతి చురుగ్గా కదులుతున్న తరుణంలో.. మరింత అనుకూల వాతావరణాన్ని కల్పించేలా అల్పపీడనం ఏర్పడుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉత్తర బంగాళాఖాతంలో ఈ నెల 27న అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఇది రానున్న రోజుల్లో మరింత బలపడవచ్చని పేర్కొంది. దీని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురిసే సూచనలున్నాయని తెలిపింది. గంటకు 50 నుంచి 60 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీయవచ్చని పేర్కొంది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాగా, ఈ నెల్లో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి వర్షాలు కురిశాయని ఏపీ వాతావరణ శాఖ అధికారి స్టెల్లా వెల్లడించారు. ఈనెల 1 నుంచి 21 వరకూ ఆంధ్రప్రదేశ్లో సాధారణ సగటు వర్షపాతం 39.2 మిమీ కాగా, 126 శాతం అధికంగా 88.5 మిమీ వర్షపాతం నమోదైందని తెలిపారు. -
జనం లేక వెలవెల.. తుస్సుమన్న టీడీపీ మినీమహానాడు
సాక్షి,పాయకరావుపేట: టీడీపీ మినీ మహానాడు అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అనకాపల్లి జిల్లా పాయకరావు పేట నియోజకవర్గంలో టీడీపీ తలపెట్టిన మిని మహానాడు పాయకరావు పేట నియోజకవర్గంలో జనం లేక వెలవెలబోయింది.గురువారం పాయకరావుపేటలో టీడీపీ మినీ మహానాడును నిర్వహించింది. ఇందుకోసం భారీ ఎత్తున జనసమీకరణ చేపట్టింది. నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు ఇతర ముఖ్యనేతలు సైతం హాజరయ్యారు.అయితే, మినీమహానాడు ప్రారంభమైన అరగంటకే సభకు వచ్చిన శ్రేణులు మధ్యలోనే వెళ్లిపోవడంతో టీడీపీకి పెద్ద షాక్ తగిలింది. టీడీపీ నేతలు మాట్లాడుతుండగా.. కార్యకర్తలు ఖాళీ చేసి వెళ్లిపోయారు. సభను వదిలి వెళుతున్న జనాలకు నచ్చచెప్పి కూర్చేబెట్టేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ సాధ్యం కాలేదు. పోలీసుల మాటల్ని పట్టించుకోకుండా టీడీపీ కార్యకర్తలు వెళ్లిపోవడంతో అక్కడున్న నేతలు కంగుతిన్నారు. -
రెయిన్ అలెర్ట్.. ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు
సాక్షి,విశాఖ: ఏపీలో రెండు రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు వాతవరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.దక్షిణ కొంకణ్, గోవా ఆనుకుని ఈస్ట్ అరేబియా సముద్రంపై అల్పపిడనం ఏర్పడింది. ఈ అల్పపీడన ద్రోణి తెలంగాణ వరకు వ్యాపించింది. దాని ప్రభావంతో దాని ప్రభావంతో కోస్తాలో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు.. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.అల్పపీడన ప్రభావంతో ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు పలు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురవనున్నాయి. ఉరుములతో కూడిన జల్లులు పడే ప్రాంతంలో 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండగా..ఇవాళ, రేపు ఈ రెండు రోజుల పాటు వాతవరణ పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశం ఉంది.గడచిన 24 గంటల్లో.. అమరావతి 9, పొదిలి 7, మాచర్ల 6, విశాఖ, మచిలీపట్నం, జంగ మహేశ్వరపురం 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
విశాఖలో టూరిజం సర్క్యూట్
విశాఖ సిటీ: విశాఖను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు టూరిజం సర్క్యూట్కు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో బుధవా రం ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధిపై ప్రజాప్రతినిధు లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను ఏకరవు పెట్టారు. జీవీఎంసీ వాటర్ పైప్లైన్ పనులు పూర్తి చేయాలని, నీటి ట్యాంకులు ఏర్పాటు చేయాలని, పుష్ కార్ట్లు లేకపోవడంతో పారిశుధ్య పనులకు ఇబ్బందులు, 2014లో పేదల ఇళ్ల స్థలాలకు ప్రభుత్వం డీడీలు కట్టించుకున్న వారికి ఇళ్ల స్థలాల మంజూరు, సదుపాయాలు కల్పించాలని కోరారు. ఏకపక్ష నిర్ణయాలు వద్దు : ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి, ప్రాజెక్టుల విషయంలో అధికారులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతితో పాటు విశాఖపై కూడా దృష్టి పెట్టాలని చెప్పారు. దీనిపై మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. కోస్టల్ కారిడార్ నుంచి భీమిలి వరకు బీచ్ కారిడార్ అభివృద్ధిపై కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం వీకేపీసీపీఐఆర్, మాస్టర్ప్లాన్–2041, ఎంఐజీ లేఅవుట్లు, ప్రతిపాదిత లేఅవుట్లు, మాస్టర్ప్లాన్ రహదారుల నిర్మాణాలు, తీర ప్రాంత కోత ప్రాజెక్టు, కై లాసగిరి, రుషికొండ సమగ్రాభివృద్ధి, భోగాపురం నుంచి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్డు, సింహాచలం స్థలాలకు సంబంధించిన సమస్యలు, అనకాపల్లి ల్యాండ్ పూలింగ్ వంటి అంశాలపై చర్చించారు. ఇకపై ప్రతి నెలా సమావేశం నిర్వహించి ఉత్తరాంధ్ర అభివృద్ధి పనులపై సమీక్షిస్తామన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ సంపత్ కుమార్, విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు హరేందిర ప్రసాద్, విజయకృష్ణన్, అంబేడ్కర్, మెట్రోపాలిటన్ కమిషనర్ విశ్వనాథన్, ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీ తేజ్ పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధిపై మంత్రి నారాయణ సమీక్ష అమరావతిపైనే కాదు.. విశాఖపై కూడా దృష్టి పెట్టాలని ఎమ్మెల్యేల విజ్ఞప్తి -
ఉపాధ్యాయుల బదిలీలు షురూ
విశాఖ విద్య: విద్యాశాఖలో బదిలీల కోలాహలం మొదలైంది. బుధవారం నుంచి బదిలీలకు దరఖాస్తు చేసుకునేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో, ఇందుకనుగుణంగా విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు చేశారు. తొలుత గ్రేడ్–2 హెచ్ఎంలుగా పనిచేస్తున్న వారు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా వెబ్సైట్లో వివరాలు పొందుపరిచారు. గ్రేడ్–2 హెచ్ఎం పోస్టులు 93 ఖాళీగా ఉన్నట్లు ఉమ్మడి విశాఖ జిల్లా నోడల్ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ తెలిపారు. క్లియర్ వేకెన్సీ 46 పోస్టులు ఉండగా, రేషనలైజేషన్లో భాగంగా 24 పోస్టులు ఖాళీ చూపించారు. ఫారిన్ సర్వీసుపై వెళ్లిన వారి ఖాళీలు రెండు ఉన్నాయి. ఐదేళ్లు ఒకే చోట పనిచేసిన వారు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంది. కంపల్సరీ ట్రాన్స్ఫర్ అయ్యే జాబితాలో 15 మంది లెక్క తేలారు. వీరు గురువారం సాయంత్రం 5 గంటల్లోగా బదిలీ కోసమని దరఖాస్తు చేసుకోవాలి. కంపల్సరీ ట్రాన్స్ఫర్ జాబితాలో ఉన్న వారెవరైనా బదిలీ చేయనట్లయితే, వారికి చివరిగా మిగిలిన ఖాళీల్లో పోస్టింగ్ కేటాయించనున్నారు. ఇదిలా ఉండగా, బాలికల పాఠశాలలో 50 ఏళ్ల లోపు ఉన్న వారిని కూడా బదిలీ చేస్తున్నారు. ఇలా ఆరుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నట్లు గుర్తించి, వారి జాబితాను వెబ్సైట్లో పొందుపరిచారు. వీరు కూడా తప్పనిసరిగా బదిలీ కోసమని దరఖాస్తు చేసుకోవాలని డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. బదిలీల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఉపాధ్యాయులకు ఎదురయ్యే సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని డీఈవో వెల్లడించారు. విశాఖలోని సీతమ్మధారలోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని స్కూళ్లలో పనిచేస్తున్న అన్ని క్యాడర్ల వారీగా ఖాళీల జాబితాలను సిద్ధం చేస్తున్నామన్నారు. తొలుత గ్రేడ్–2 హెచ్ఎంలకు బదిలీ ఉమ్మడి విశాఖ జిల్లాలో 93 ఖాళీలు మొదలైన దరఖాస్తుల ప్రక్రియ బాలికల పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయులకే చోటు ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో హెల్ప్ డెస్క్ -
సీఎస్ఆర్ఎంవోగాడాక్టర్ శ్రీహరి
మహారాణిపేట: కేజీహెచ్లో ఎట్టకేలకు సివిల్ సర్జన్ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్(సీఎస్ఆర్ఎంవో) పోస్టు భర్తీ అయింది. ఎన్నో ఏళ్లుగా ఈ పోస్టు భర్తీ కాలేదు. ఇన్చార్జిలతో ఈ పోస్టు నడుస్తోంది. ఈ నేపథ్యంలో తిరుపతి వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సీహెచ్ శ్రీహరిని కేజిహెచ్ సీఎస్ఆర్ఎంవోగా నియమించారు. ఈ మేరకు బుధవారం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఇన్చార్జిగా డీఎస్ఆర్ఎంవో డాక్టర్ మోహర్ కుమార్ పనిచేస్తున్నారు. తొలుత కేజీహెచ్కు చేరుకున్న డాక్టర్ సీహెచ్ శ్రీహరి సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద్ను మర్యాద పూర్వకంగా కలిశారు. పలువురు వైద్యులు, సిబ్బంది ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
రాదండి!
ఇంటింటికీరేషన్ బండి.. మహారాణిపేట: కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలకు భారాలు, కష్టాలు మొదలయ్యాయి. ఒకవైపు అన్నింటిపైనా భారం మోపుతూ.. మరోవైపు ఉన్న సౌకర్యాలను దూరం చేస్తోంది. తాజాగా ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్)లో నెలా నెలా ఠంచనుగా ఇంటి వద్దకే వచ్చే రేషన్(మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్–ఎండీయూ) బండికి కూటమి ప్రభుత్వం మంగళం పాడింది. నిత్యావసరాల కోసం ప్రజలు ఇబ్బంది పడరాదన్న ఆశయంతో గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమానికి స్వస్తి పలికింది. ఇప్పటికే కార్డుదారులకు అరకొర సరుకులను అందిస్తున్న ప్రభుత్వం.. జూన్ 1 నుంచి ఎండీయూ వాహనాలతో రేషన్ సరఫరాను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంపై ఎండీయూ ఆపరేటర్లు భగ్గుమంటున్నారు. ప్రజల ఇబ్బందులు తీర్చాలనే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాక ముందు రేషన్ సరకులు తీసుకోవడం ఓ ప్రహసనం. రోజంతా పనులు మానుకుని మరీ రేషన్ డీపోల దగ్గర పడిగాపులు కాసేవారు. బియ్యానికి ఒక రోజు, పంచదారకు ఓ రోజు.. ఇలా ఒక్కో సరకుకు ఒక్కో రోజున వెళ్లాల్సి వచ్చేది. చాంతాడంత లైన్లలో గంటల తరబడి నిరీక్షించేవారు. ఇక సర్వర్లు మొరాయిస్తే ఉస్సూరుమంటూ తిరుగుముఖం పట్టాల్సిందే. ఈ కష్టాలను తెలుసుకున్న గత సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం జనవరి 2021లో ఇంటింటికీ రేషన్ పంపిణీ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ఫిబ్రవరి నుంచి ఇంటి ముందుకే వ్యాన్ల ద్వారా సరకులు అందించడం మొదలెట్టారు. దీంతో రేషన్ కోసం తిప్పలు పడాల్సిన పని తప్పింది. ఆరేళ్లకు అగ్రిమెంట్ నిరుద్యోగ యువతకు స్థానికంగా ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఎండీయూ వాహనాలను బ్యాంకు రుణాల ద్వారా ఇప్పించి, ఆరేళ్ల(72 నెలలు)కు అగ్రిమెంటు చేశారు. జనవరి 2027 వరకు ఆ గడువు ఉంది. అప్పటికి వాహనాల బ్యాంకు రుణాలు కూడా దాదాపు ముగిసి, వాహనం నిరుద్యోగ యువత సొంతమవుతుంది. అయితే 20 నెలల ముందుగానే దీనికి ముగింపు పలకడంతో ఎండీయూ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డున పడ్డ సిబ్బంది ఈ పథకం ద్వారా జిల్లాలో 351 మంది ప్రత్యక్షంగా, మరికొంత మంది పరోక్షంగా బతుకున్నారు. నెలకు కుటుంబానికి సరిపడా వచ్చే సొమ్ముతో ప్రణాళిక రూపొందించి అమలు చేశారు. ఇప్పుడు అర్ధంతరంగా ఈ పథకానికి మంగళం పలకడంతో ఆపరేటర్లు, ఇతర సిబ్బంది రోడ్డున పడ్డారు. దశల వారీ ఆందోళన కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. దీనిపై రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించి, భవిష్యత్తు ప్రణాళికను రూపొందించనున్నారు.కష్టం తెలియకుండా ఇంటి వద్దే రేషన్ తీసుకోవడం ఇక గత చరిత్రే. టీడీపీ ప్రభుత్వ నిత్యకృత్యాలైన నిత్యావసరాల కోసం కిలోమీటర్ల మేర కాలినడక, నెత్తిన బరువుల మోత, గంటల తరబడి నిరీక్షణ మళ్లీ ప్రజలు అనుభవించాల్సిందే. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదల సౌకర్యార్థం అమల్లోకి తెచ్చిన ఒక్కో పథకాన్ని నీరుగార్చే ప్రక్రియలో కూటమి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. తాజా నిర్ణయంతో జిల్లాలోని 351 ఎండీయూ వాహనాల డీలర్లు, సహాయకుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎండీయూ వాహనాలకు మంగళం జిల్లాలో 351 ఎండీయూ వాహనాలు రోడ్డున పడ్డ 702 కుటుంబాలు జూన్ 1 నుంచి రేషన్ డిపోల ద్వారానే సరకులు ఎండీయూ వాహనాలు 351 ఆధారపడ్డ సిబ్బంది 702 జిల్లాలో వివరాలు తెలుపు రేషన్ కార్డులు 5,12,619 చౌక ధరల డిపోలు 625 ప్రభుత్వమే ఆదుకోవాలి ఈ వాహనాల మీదే ఆధారపడి బతుకుతున్నాం. ఎండీయూ ఆపరేటర్లకు న్యాయం చేయాలి. వీటిపై వచ్చే ఆదాయంతో కుటుంబాలను పోషించుకుంటున్నాం. ఇప్పుడు ఆకస్మాత్తుగా నిలుపుదల చేయడంతో రోడ్డున పడ్డాం. ఈ వయస్సులో ఎక్కడకై నా వెళ్లి పనిచేయలేం. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి. మాలాంటి చిన్నస్థాయి బతుకులకు రాజకీయాలు అంటగట్టడం సరికాదు. – నీరు కొండ సతీష్, ఎండీయూ ఆపరేటర్అగ్రిమెంట్ గడువు ఇంకా ఉంది 2027 జనవరి వరకు అగ్రిమెంటు ఉంది. ఇంతలోనే తొలగించడం అన్యాయం. ఒక వేళ తొలగిస్తే రానున్న 20 నెలల జీతాలు చెల్లించాలి. కరోనా సమయంలో ఎండీయూ డీలర్లు ఎన్నో సేవలు అందించారు. వైరస్కు భయపడకుండా పనిచేశారు. రాజకీయ కారణాలతో తీసుకున్న నిర్ణయాల వల్ల మేమంతా రోడ్డున పడతాం. మా కుటుంబాలకు అన్యాయం చేయొద్దు. – ఎన్.సతీష్ కుమార్, అధ్యక్షుడు, ఎండీయూ ఆపరేటర్స్ యూనియన్ -
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు
మహారాణిపేట (విశాఖ)/సాక్షి నెట్వర్క్: ఉపరితల ఆవర్తనం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. తాజాగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడ ద్రోణి వల్ల రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ఉపరితల ఆవర్తనం వల్ల ఇప్పటికే నైరుతి రుతుపవనాల కదలిక జోరుగా ఉంది.రానున్న మూడు రోజుల్లో కేరళలో రుతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిప్రాంతాల్లో గంటకు 40 –50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వివరించింది. ఉమ్మడి కృష్ణాజిల్లాను 2 రోజులుగా వర్షాలు వీడటం లేదుమచిలీపట్నంతోపాటు కృష్ణాజిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం వర్షం కురిసింది. ఉదయం 8.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7.2 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. తాజాగా రాత్రి 8 గంటల సమయంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో జోరు వాన కురిసింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. » గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు గుంటూరు నగరంతోపాటు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గుంటూరులో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మే నెల 21 వరకు జిల్లా సాధారణ వర్షపాతం 42.8 మిల్లీ మీటర్లు కాగా, ఇప్పటి వరకు 106.2 మి.మీ వర్షపాతం నమోదైంది. » ప్రకాశం జిల్లాలో బుధవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. గిద్దలూరు, మార్కాపురం, వైపాలెం, కనిగిరి నియోజకవర్గాల్లో ఉరుము లు, మెరుపులతో కూడిన జల్లులు పడ్డాయి. అత్యధికంగా దోర్నాల మండలంలో 10.2 మి.మీ వర్షపాతం నమోదైంది. తీగలేరు పొంగిపొర్లడంతో మార్కాపురం–దోర్నాల మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. » శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంతోపాటు పలు మండలాల్లో బుధవారం జోరు వాన కురిసింది. నెల్లూరులోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. -
గంటా రవితేజ నోట.. జోహార్ చంద్రబాబు.. జోహార్ లోకేశ్బాబు!
మధురవాడ(విశాఖపట్నం): భీమిలి నియోజకవర్గ టీడీపీ మినీ మహానాడులో పార్టీ నేతల మధ్య అసమ్మతి సెగ బయటపడింది. పీఎంపాలెంలోని వి కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం జరిగిన ఈ సభకు కోరాడ రాజబాబు వర్గం డుమ్మా కొట్టింది. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు కె.బాలాజీ, టీడీపీ నేతలు తొలుత దివంగత సీఎం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభాధ్యక్షత వహించిన 6వ వార్డు టీడీపీ అధ్యక్షుడు దాసరి శ్రీనివాసరావు ముందుగా గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజను నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్గా ప్రకటించారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ ఇక్కడ ఏర్పాటవుతున్న ఐటీ పరిశ్రమల్లో స్థానిక యువతకు రిజర్వేషన్ ఇవ్వాలని కోరారు. రాజబాబు వర్గం డుమ్మా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ముందుండి నడిపించిన భీమిలి టీడీపీ ఇన్చార్జ్ కోరాడ రాజబాబు, అతని వర్గం ఈ సభకు డుమ్మా కొట్టింది. ఆనందపురం ప్రాంత నాయకులు కూడా అరకొరగానే వచ్చారు. కొంత కాలంగా గంటా, కోరాడ మధ్య దూరం పెరిగిందన్న వార్తలకు ఈ సభ స్పష్టతనిచ్చింది. సభలో ఏర్పాటు చేసిన బ్యానర్లపై కూడా రాజబాబు ఫొటో ఎక్కడా కనిపించలేదు. రాజబాబును నియోజకవర్గ ఇన్చార్జిగా అనధికారికంగా ఇప్పటికే తప్పించినట్లు తమ్ముళ్లు గుసగుసలుపోతున్నారు. ఇప్పుడు సభలోనే గంటా రవితేజను ఇన్చార్జిగా ప్రకటించేశారు. స్థానిక కమిటీలపై అసంతృప్తి పార్టీ అభ్యున్నతికి కృషి చేసిన సీనియర్లకు గంటా వచ్చాక తగిన ప్రా«ధాన్యత దక్కట్లేదన్న విమర్శలున్నాయి. పదవులు, స్థానిక కమిటీల్లో కూడా వారికి చోటు దక్కలేదు. మధురవాడలో వార్డు కమిటీల ఏర్పాటు విషయంలో సీనియర్ నాయకులు అసమ్మతి ర్యాలీగా మహానాడుకు తరలి రావడం విశేషం. తమకు ప్రాధాన్యత ఇవ్వకపోతే తిరుగుబాటు తప్పదంటూ సంకేతాలు ఇస్తున్నారు.జోహార్ సీఎం సర్! గంటా రవితేజ తన ప్రసంగంలో జోహార్ ఎన్టీఆర్.. జోహార్ సీఎం సర్.. జోహార్ లోకేశ్బాబు అంటూ నినాదాలతో హోరెత్తించారు. వేదికపై ఉన్నవారితోపాటు, సభకు హాజరైన వారు అవాక్కయ్యారు. చనిపోయిన వారికి కదా జోహార్లు అరి్పంచేది అంటూ.. పక్కనే ఉన్న నాయకులు చెప్పడంతో.. పొరపాటున అలా అనేశానంటూ.. వివరణ ఇచ్చుకున్నారు. -
ఖైదీల సమస్యలు తెలుసుకున్న డీఎల్ఎస్ఏ కార్యదర్శి
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారాన్ని మంగళవారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు సందర్శించారు. జైలు అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. సన్యాసినాయుడు ఖైదీలు ఉండే బ్యారక్లు, పరిసరాలను పరిశీలించి, వారికి కల్పించిన సౌకర్యాలు, వైద్యం, భోజన వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం జైలు సమావేశ మందిరంలో ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలను విన్నారు. ఏ కేసుల్లో జైలుకు వచ్చారు, ఎప్పటి నుంచి రిమాండ్లో ఉన్నారు అనే వివరాలను తెలుసుకొని, వారికి అవసరమైన న్యాయ సహాయం గురించి వివరించారు. ఖైదీలు మంచి నడవడికతో ఉండాలని, విడుదలయ్యాక బాహ్య ప్రపంచంలో మంచి ప్రవర్తన కలిగి ఉండాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో జైలు పర్యవేక్షణాధికారి ఎం.మహేష్ బాబు, ఉప పర్యవేక్షణాధికారులు ఎన్.సాయిప్రవీణ్, సీహెచ్.సూర్యకుమార్, జైలర్లు, డీఎల్ఎస్ఏసిబ్బంది పాల్గొన్నారు. -
రాజకీయ అండదండలతో..
నగరంలో పలువురు రౌడీషీటర్లకు కూటమి నేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. సాధారణంగా యాక్టివ్గా ఉండే రౌడీషీటర్లు ప్రతిరోజు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్కు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే, కొంతమంది రౌడీషీటర్లు తమకు సన్నిహితంగా ఉండే రాజకీయ నేతలతో పోలీసులపై ఒత్తిడి చేయించి రోజువారీ హాజరు నుంచి మినహాయింపు పొందుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.రాజకీయ నేతలే స్వయంగా ఫోన్ చేసి ఆదేశించడంతో పోలీసులు రౌడీషీటర్ల జోలికి వెళ్లడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఫలితంగా పోలీసులు వీరిని పూర్తిస్థాయిలో కట్టడి చేయలేకపోతున్నారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితి నగరంలో శాంతిభద్రతలకు సవాలుగా మారింది -
ఉప మేయర్గా దల్లి ఏకగ్రీవం
● మేయర్ చాంబర్లో దాచిపెట్టి మరీ.. సభ్యుల్ని తీసుకొచ్చారు! ● సోమవారంనాటి పరాభవంతో ముందుజాగ్రత్త ● పనిచేసిన బుజ్జగింపులు, తాయిళాలు? డాబాగార్డెన్స్: జీవీఎంసీ ఉప మేయర్గా కూటమి తరఫున జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రక్రియకు ప్రిసైడింగ్ అధికారిగా జేసీ మయూర్ అశోక్ వ్యవహరించారు. బీ ఫారం అందుకున్న గోవిందరెడ్డికి పోటీగా మరెవరైనా ఉన్నారా? అని అడుగుతూ, ఎన్నికల నియమ నిబంధనలను వివరించారు. ఎవరూ పోటీ లేకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. గోవిందరెడ్డిని ఉప మేయర్గా టీడీపీ నుంచి పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, బీజేపీ నుంచి ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు ప్రతిపాదించారు. పోటీ లేకపోవడంతో ఎన్నికల అధికారి గోవిందరెడ్డికి నియామక పత్రం అందించారు. అనంతరం ప్రమాణస్వీకారం చేయించారు. అంతా.. పావుగంట లోపే.. ఉదయం 10.55 గంటలకు నలుగురు ఎమ్మెల్యేలు(జనసేన నుంచి పంచకర్ల రమేష్బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, బీజేపీ నుంచి విష్ణుకుమార్రాజు, టీడీపీ నుంచి గణబాబు), వివిధ పార్టీలకు చెందిన 41 మంది కౌన్సిల్ సభ్యులు సభకు హాజరయ్యారు. 11 గంటలకు ఎన్నికల అధికారి మయూర్ ఆశోక్ చేరుకున్నారు. ఆ సమయంలోనే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు(కొణతాల రామకృష్ణ, వెలగపూడి రామకృష్ణబాబు) వచ్చారు. తర్వాత 5 నిమిషాలకు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో ఇంకో 11 మంది కార్పొరేటర్లు కౌన్సిల్ హాల్కు చేరుకున్నారు. దీంతో సభ్యుల సంఖ్య 59కి చేరింది. ఈలోగా ఎన్నికకు సంబంధించి నియమ నిబంధనలు వివరించారు. మరో 8 నిమిషాల్లో ఉప మేయర్ ఎన్నిక తంతు పూర్తి చేశారు. ముందు జాగ్రత్త! ఉప మేయర్ ఎన్నికలో సోమవారం నాటి సీన్ రిపీట్ కారాదని జాగ్రత్త పడ్డారు. అసంతృప్త సభ్యుల్ని ముందుగానే రప్పించి మేయర్ చాంబర్లో కూర్చోబెట్టారు. మేయర్ పీలా శ్రీనివాసరావు తన చాంబర్ నుంచి లిస్ట్ ప్రకారం టిక్ పెట్టి మరీ సభ్యుల్ని కౌన్సిల్ హాల్లోకి పంపారు. ముందు రోజు డుమ్మాకొట్టిన వారికి బుజ్జగింపులు, తాయిళాలు అందినట్లు సమాచారం. యాదవ, కాపులకు వెన్నుపోటు జీవీఎంసీ మేయర్, ఉప మేయర్ ఎన్నికల్లో యాదవ, కాపు సామాజిక వర్గాలకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని ఆ సామాజిక వర్గ కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మేయర్గా గొలగాని హరివెంకట కుమారి(యాదవ), ఉప మేయర్గా జియ్యాని శ్రీధర్(కాపు)లకు అవకాశం ఇచ్చారు. కౌన్సిల్లో బలం లేకపోయినా దొడ్డిదారిన వారిని దించేసిన కూటమి నేతలు, విశాఖలో కూటమి మనుగడకు కారణమైన ఈ రెండు వర్గాలను విస్మరించడంపై ఆయా సామాజిక వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయి. -
ల్యాండ్ సెటిల్మెంట్ల దందా
● మొన్న మంగమారిపేటలో వాచ్మన్ను కిడ్నాప్ చేసి భూకబ్జాకు ప్రయత్నం ● నిన్న లాసెన్స్ బే కాలనీలో ఆశ్రమాన్ని ఖాళీ చేయాలని నిర్వాహకులకు బెదిరింపులు ● కొంతమందికి రాజకీయ నేతల అండదండలు ● సంఘటన జరిగినప్పుడే పోలీసుల హడావుడి ● వరుస ఘటనలతో హడలిపోతున్న ప్రజలు విశాఖ సిటీ: ప్రశాంత విశాఖలో సుపారీ గ్యాంగ్లు అలజడి సృష్టిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం మినహా వీరిని పూర్తిస్థాయిలో కట్టడి చేయడంలో పోలీసులు విఫలమవుతున్నా రన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విశాఖపట్నంలో సుపారీ గ్యాంగ్ల ఆగడాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నెలలోనే జరిగిన రెండు ఘటనలు జిల్లాలో పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. -
చరిత్ర సృష్టించేలా యోగా దినోత్సవం
మహారాణిపేట: విశాఖలో జూన్ 21న జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ రికార్డు స్థాయిలో నిర్వహించాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నందున, దీనిని చారిత్రక కార్యక్రమంగా నిలపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందన్నారు.అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణపై మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, బుధవారం నుంచి జూన్ 21 వరకు ‘యోగా మాసం’ పాటించాలని సూచించారు. ఈ నెల రోజులు జిల్లాలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో యోగా ప్రాక్టీస్ జరగాలన్నారు. బుధవారం ఉదయం 6:30 నుంచి 8 గంటల మధ్య ఆర్కే బీచ్ రోడ్లో 1,000 మందితో ప్రాథమిక వేడుకలు ప్రారంభించడానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అలాగే మండల, గ్రామ స్థాయిల్లో అవగాహన కార్యక్రమాలు, శిక్షణలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో డీసీపీలు మేరీ ప్రశాంతి, అజిత వేజెండ్ల, రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీ శంకర్తో పాటు జిల్లా అధికారులు, యోగా టీచర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఐసెట్లో మెరిసిన మనోళ్లు
● విశాఖ జిల్లాకే నంబర్వన్ ర్యాంక్ ● టాప్టెన్లో ఉమ్మడి జిల్లాలో ముగ్గురికి చోటు ● రాష్ట్రంలో విశాఖ నుంచే అత్యధిక మంది హాజరు విశాఖ విద్య: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశ పరీక్ష ఐసెట్–2025 ఫలితాల్లో ఉమ్మడి విశాఖ జిల్లా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ ఏడాది మొత్తం 32,719 మంది ఐసెట్లో ఉత్తీర్ణత సాధించగా, విశాఖ జిల్లాకు చెందిన మేక మనోజ్ రాష్ట్రంలోనే నంబర్ వన్ ర్యాంకు సాధించి, రెండు తెలుగు రాష్ట్రాల్లో విశాఖ ఖ్యాతిని ఇనుమడింపజేశాడు. టాప్–10లో ముగ్గురు విశాఖ వాసులే.. టాప్–10 ర్యాంకుల్లో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ముగ్గురు విద్యార్థులు చోటు దక్కించుకోవడం విశేషం. అనకాపల్లి జిల్లాకు చెందిన షేక్ బషీరున్నీషా 6వ ర్యాంకు సాధించగా, పెదగంట్యాడ మండలంలోని శరగడ గణేష్ రెడ్డి 9వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. అధిక సంఖ్యలో బాలికల ఉత్తీర్ణత ఐసెట్ పరీక్షకు అనకాపల్లి జిల్లా నుంచి 169 మంది హాజరుకాగా, వారిలో 167 మంది అర్హత సాధించారు. ఉత్తీర్ణులైన వారిలో 120 మంది బాలికలు ఉన్నారు. అదే విధంగా, విశాఖపట్నం జిల్లా నుంచి 4,397 మంది పరీక్ష రాయగా, వీరిలో 4,303 మంది క్వాలిఫై అయ్యారు. విశేషమేమిటంటే, ఉత్తీర్ణులైన వారిలో 2,377 మంది బాలికలు ఉండటం గమనార్హం. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల పట్ల బాలికలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని దీని ద్వారా తెలుస్తోంది. అత్యధిక హాజరు విశాఖ నుంచే రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి ఐసెట్కు హాజరైన విద్యార్థుల్లో విశాఖ నుంచే అత్యధిక సంఖ్యలో విద్యార్థులు పరీక్షకు హాజరుకావడం మరో విశేషం. ఇది జిల్లాలో విద్యాభ్యాసం పట్ల ఉన్న ఆసక్తిని, ఉన్నత విద్యపై విద్యార్థులకున్న ఆకాంక్షను స్పష్టం చేస్తోంది. శభాష్ గణేష్రెడ్డి పెదగంట్యాడ: ఆంధ్ర యూనివర్సిటీలో నిర్వహించిన ఏపీ ఐసెట్–2025 ఫలితాల్లో మండలంలోని పెదకోరాడ గ్రామానికి చెందిన విద్యార్థి శరగడ గణేష్రెడ్డి 9వర్యాంకు సాధించి సత్తాచాటాడు. పెదకోరాడకు చెందిన శరగడ ఎల్లయ్యరెడ్డి, వెంకటలక్ష్మి దంపతుల కుమారుడు గణేష్రెడ్డి ఈ ఘనత సాధించాడు. ఈ సందర్భంగా గణేష్రెడ్డి మాట్లాడుతూ, ఎంబీఏ పూర్తి చేసి మార్కెటింగ్ రంగంలో స్థిరపడతానని తన లక్ష్యాన్ని వెల్లడించాడు. అతని ప్రతిభకు గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు అభినందనలు తెలిపారు. -
ట్రాన్స్ఫర్మేటివ్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్పై సమీక్ష
డాబాగార్డెన్స్: నగరంలో విపత్తులు సంభవించినప్పుడు ప్రాణ, ఆస్తి నష్ట నివారణకు చేపట్టే చర్యలపై యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ(యూఎన్యూ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్(ఎన్ఐయూఏ), ది ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్(టీఈఆర్ఐ) ప్రతినిధులు నగర మేయర్ పీలా శ్రీనివాస్ను మంగళవారం కలిసి వివరించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని మేయర్ చాంబర్లో ఆయా సంస్థల ప్రతినిధులు ట్రాన్స్ఫర్మేటివ్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్ ఆవశ్యకతను తెలిపారు. వాతావరణంలో వచ్చిన మార్పులతో కలిగే విపత్తులు, వడగాల్పులు, వరదలు తదితర వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజల సహకారంతో నష్ట నివారణ ఎలా తగ్గించుకోవచ్చో వివరించారు. -
● తల్లీబిడ్డ అవస్థలు
అమ్మైన ఆ సంతోషం కళ్లల్లో నిండాలి. పసిబిడ్డను అక్కున చేర్చుకొని, ప్రభుత్వ వాహనంలో సురక్షితంగా ఇంటికి చేరుకోవాలి. కానీ తల్లీ బిడ్డ ఎక్స్ప్రెస్ ఉద్యోగుల సమ్మె ఆ ఆశలపై నీళ్లు చల్లింది. వాహనాలు నిలిచిపోవడంతో బాలింతలు అవస్థలు పడ్డారు. మంగళవారం కేజీహెచ్లో డిశ్చార్జ్ అయిన చోడవరం ఎడ్లవీధికి చెందిన సౌందర్య జ్యోతికి కూడా అదే పరిస్థితి ఎదురైంది. బిడ్డతో ఆటోలో ఇంటికి వెళుతున్న ఈ దృశ్యం, సమ్మె కారణంగా సాధారణ పౌరులు ఎదుర్కొంటున్న కష్టాలకు అద్దం పట్టింది. సౌందర్య జ్యోతి ఒక్కరే కాదు, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లాల్సిన ఎంతో మంది తల్లులు, పసిబిడ్డలతో కలిసి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారి ఆశలకు భంగం కలిగి, ప్రభుత్వ సేవలు అందక, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. –మహారాణిపేట/ –ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
స్టీల్ప్లాంట్లో కార్మిక సమ్మె ప్రశాంతం
● బైక్ ర్యాలీకి యత్నం ● పోలీసుల అదుపులో కార్మిక నాయకులు ఉక్కునగరం: స్టీల్ప్లాంట్లో మంగళవారం జరిగిన కార్మిక సమ్మెలో ఆరుగురు కార్మిక సంఘ నాయకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం మినహా ప్రశాంతంగా జరిగింది. స్టీల్ప్లాంట్ కార్మికులకు సక్రమంగా జీతాల చెల్లింపు, హెచ్ఆర్ఏ పునరుద్ధరణ, కరెంట్ చార్జీల తగ్గింపు, సొంత గనుల కేటాయింపు తదితర డిమాండ్లపై శాశ్వత కార్మికులు ఒక రోజు సమ్మె చేశారు. ఇక కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపులు ఆపాలని, తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, పాత పద్ధతిలో అందరికీ ఎస్ఎంఏ, ఏఎస్ఎంఏలను చెల్లించాలని తదితర డిమాండ్లపై కాంట్రాక్ట్ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. కాంట్రాక్ట్ కార్మికుల షిఫ్ట్ వేళల్లో ప్లాంట్ లోపలికి వెళ్లినప్పటికీ, గేట్ల వద్ద బయోమెట్రిక్ నమోదు చేయించుకోలేదు. షిఫ్ట్–ఎలో కొంత మంది విధులకు హాజరైనప్పటికీ ఆ తర్వాత కొంత మంది కార్మికులు వారికి నచ్చచెప్పి విధుల నుంచి బయటకు తీసుకు వెళ్లిపోయారు. పోలీసుల అదుపులో కార్మిక నాయకులు సెంట్రల్ స్టోర్స్ నుంచి కూర్మన్నపాలెం టెంట్ వరకు బైక్ ర్యాలీగా వెళ్లేందుకు కార్మికులు ప్రయత్నించగా పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు నమ్మి రమణ, యు.సోమేష్, అప్పలరాజు, వంశీ, బి.అప్పారావు, ఉరుకూటి అప్పారావులను జీపులో ఎక్కించి స్టీల్ప్లాంట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదు చేయనున్నట్లు సీఐ కేశవరావు తెలిపారు. అధిక శాతం విధులకు హాజరు ఇదిలా ఉండగా శాశ్వత ఉద్యోగులు రెండు షిఫ్ట్లలో 85–90 శాతం వరకు విధులకు హాజరు కాగా, కాంట్రాక్ట్ కార్మికులు 60–70 శాతం హాజరయ్యారు. సర్వీసు విభాగాలకు చెందిన కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కువగా విధులకు హాజరు కాగా, కొన్ని ఉత్పత్తి విభాగాలకు చెందిన కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో గైర్హాజరయ్యారు. ఉత్పత్తికి అంతరాయం కలగకుండా యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. పెద్ద ఎత్తున పోలీసుల మోహరింపు కార్మికుల సమ్మె సందర్భంగా పోలీసులను పెద్ద ఎత్తున మోహరించారు. సౌత్ ఏసీపీ టి.త్రినాథ్ నేతృత్వంలో ఇద్దరు ఏసీపీలు, తొమ్మిది మంది సీఐలు, 19 మంది ఎస్ఐలతో పాటు సుమారు 500 మంది సిబ్బందిని ఆయా గేట్ల వద్ద, ఈడీ(వర్క్స్) బిల్డింగ్, అడ్మిన్ బిల్డింగ్, సెంట్రల్ స్టోర్స్ కూడలితో పాటు అన్ని ముఖ్య విభాగాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. విధులకు వెళ్లే కార్మికులను సమ్మె చేస్తున్నవారు అడ్డుకోకుండా చర్యలు చేపట్టారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్టీల్ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు అన్నారు. ఇప్పటికే వందలాది మందిని తొలగించడంతో వారు రోడ్డున పడ్డారన్నారు. వారి కుటుంబాలను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. -
కిరాణాషాపులో ఫ్రిడ్జ్ షాక్ కొట్టి విద్యార్థి మృతి
తగరపువలస: ఆనందపురం మండలం చందకలో మంగళవారం కిరాణా షాపులో పనిచేస్తున్న 6వ తరగతి విద్యార్థి రెడ్డి దశ్వంత్(13) ఫ్రిడ్జ్ డోర్ తీయడానికి ప్రయత్నించగా విద్యుదాఘాతానికి గురై దుర్మరణం చెందాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆనందపురం పంచాయతీ దండువారి కళ్లాలలకు చెందిన లారీ డ్రైవర్ అయిన రెడ్డి శివ, కుమారి దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిద్దరూ ఆనందపురం ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నారు. వేసవి సెలవుల కారణంగా పెద్ద కుమారుడు చందకలో మహేష్ అనే వ్యక్తికి చెందిన కిరాణా షాపులో పని చేస్తున్నాడు. మంగళవారం కురిసిన వర్షానికి తడిసిన ఫ్రిడ్జ్ను తాకడంతో షాక్కు గురై పడిపోయాడు. అందుబాటులో ఉన్న గ్రామీణ వైద్యుని వద్దకు తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో, మధురవాడలోని గాయత్రి ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరిశీలించి అప్పటికే చనిపోయినట్టు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వాస్పత్రికి తరలించి, ఆనందపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
దంచి కొట్టిన వర్షం
మహారాణిపేట: పగలంతా భానుడి తీవ్రతకు తోడు.. గాలిలో తేమ కారణంగా ఉక్కబోత. సాయంత్రానికి కాస్త మబ్బులు పట్టిన ఆకాశం. అర్ధరాత్రి దాటాక దంచికొట్టిన వాన. ఇదీ సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు నగరంలో వాతావరణ పరిస్థితి. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దాదాపు రెండు గంటలపాటు ఉరుములు మెరుపులతో కూడిన హోరు వాన నగరాన్ని ముంచెత్తింది. కాసేపు విరామమిచ్చి మళ్లీ కురిసింది. మంగళవారం ఉదయం కూడా ఇదే పరిస్థితి. వర్షం తగ్గాక.. ఉదయం 9 గంటల నుంచి మళ్లీ ఎండలు షరామామూలే. ఉక్కబోత వాతావరణం గత కొద్ది రోజులుగా ఉదయం పూట ఎండ తీవ్రత వల్ల విశాఖ వాసులు తీవ్ర ఉక్కపోతకు గురవుతున్నారు. వర్షం కురిసిన తర్వాత కూడా ఎండ వచ్చాక, అదే పరిస్థితి. బంగాళాఖాతంలో రుతుపవనాలు, అల్పపీడనం, పశ్చిమ, నైరుతి నుంచి వీస్తున్న గాలుల వల్ల వర్షాలు పడుతున్నట్లు వాతావరణ అధికారులు చెబుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం భారీ వర్షంతో నగరంలో చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. జ్ఞానాపురం రైల్వే వంతెన వర్షపు నీటితో నిండిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పూర్ణామార్కెట్ ఏరియాలో పలు ప్రాంతాల్లో గంటల తరబడి నీరు నిలిచిపోయింది. ఇక్కడే ఓ రోడ్డు కుంగిపోయింది. రైల్వే స్టేషన్ రోడ్డు, డాబాగార్డెన్స్, రైల్వే న్యూకాలనీ, దొండపర్తి, చావులమదుం అక్కయ్యపాలెం, వెలంపేట, పూర్ణామార్కెట్, ఆశీలమెట్ట, కంచరపాలెం, ఎన్ఏడీ కొత్తరోడ్డు, పాతపోస్టాఫీసు, సీతమ్మధార, కేఆర్ఎం కాలనీ, మద్లిపాలెం తదితర ప్రాంతాల్లో చాలా వీధులు జలమయమయ్యాయి. ఆర్టీసీ కాంప్లెక్స్, వైఎస్సార్ సెంట్రల్ పార్కు వద్దనున్న నైట్ ఫుడ్ కోర్టులో వర్షపు నీరు భారీగా చేరింది. వర్షం తగ్గాక చుర్రుమన్న ఎండలు నగరంలో కురిసిన వర్షపాతం ప్రాంతం వర్షపాతం (మి.మీ.) విశాఖ రూరల్ 72.4 సీతమ్మధార 65.0 మహారాణిపేట 38.2 గోపాలపట్నం 29.4 భీమునిపట్నం 26.2 ఆనందపురం 24.6 పెదగంట్యాడ 18.6 గాజువాక 18.6 పద్మనాభం 10.4 పెందుర్తి 4.8 -
వైఎస్సార్సీపీ తూర్పు సమన్వయకర్తగా మొల్లి
ఆరిలోవ: విఽశాఖ తూర్పు నియోజకవర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు మొల్లి అప్పారావు నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అధిష్టానం ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నియోజకవర్గ పరిధి మద్దిలపాలేనికి చెందిన ఆయన పార్టీలో ప్రారంభం నుంచి సేవలు అందిస్తున్నారు. ఆయన భార్య మొల్లి లక్ష్మి 16వ వార్డు నుంచి వైఎస్సార్సీపీ కార్పొరేటర్గా ఉన్నారు. ఆయన్ని సమన్వయకర్తగా నియమించడంపై పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ మరింత అభివృద్ధి సాధించేందుకు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన పార్టీ అధినేత జగన్కు, స్థానిక నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. -
భగ్గుమన్న కార్మిక సంఘాలు
బీచ్రోడ్డు: స్టీల్ప్లాంట్లోని కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపులను తక్షణమే నిలిపివేయాలని, రాష్ట్ర ప్రభుత్వం తమ వైఖరిని స్పష్టం చేయాలని విశాఖ స్టీల్ప్లాంట్ పరిరక్షణ పోరాట జేఏసీ చైర్మన్ ఎం.జగ్గునాయుడు డిమాండ్ చేశారు. ప్లాంట్ నుంచి పోలీసులను వెనక్కి రప్పించాలని కూడా ఆయన కోరారు. సీఐటీయూ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి.కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, జూలై 9కి వాయిదా పడిన అఖిల భారత సమ్మెకు మద్దతుగా కాంట్రాక్ట్ కార్మికులు నేటి నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. అక్రమ తొలగింపులు, పెండింగ్ జీతాలు, హెచ్ఆర్ఏ అమలు, నాయకులపై సస్పెన్షన్ల రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష కార్మిక, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్రదర్శన, సభ జరిగింది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేపట్టిన స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను తీవ్రంగా ఖండించిన జేఏసీ నాయకులు, సొంత గనులు కేటాయించాలని గత నాలుగేళ్లుగా పోరాడుతున్నామన్నారు. ఎన్నికల ముందు స్టీల్ప్లాంట్ను రక్షిస్తామని చెప్పిన రాష్ట్ర కూటమి నాయకులు, ఇప్పుడు 5,400 మంది కాంట్రాక్ట్ కార్మికులను అక్రమంగా తొలగిస్తుంటే ఎక్కడున్నారని ప్రశ్నించారు. కార్మికులను భయభ్రాంతులకు గురిచేయడం, ప్లాంట్లో పోలీసులను మోహరించడం దుర్మార్గమన్నారు. స్టీల్ప్లాంట్ను ప్రభుత్వరంగంలో కొనసాగించడానికి, కార్మికుల ఉపాధిని రక్షించడానికి దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్టీల్ప్లాంట్, తల్లీబిడ్డల ఎక్స్ప్రెస్ కార్మికుల సమ్మెలకు సంఘీభావంగా భారీ ర్యాలీ నిర్వహించారు. జూలై 9న జరిగే అఖిల భారత సమ్మెను విజయవంతం చేయాలని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26,000 చెల్లించాలని, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని, ఆశా, అంగన్వాడీ వంటి వివిధ ప్రభుత్వ పథకాల కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఆటో, ముఠా కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, ఈపీఎస్ పెన్షన్ దారులకు కనీస పెన్షన్ 9,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. జేఏసీ చెర్మన్ ఎం.జగ్గునాయుడు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎం.మన్మథరావు, ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు, సీఎఫ్టీయూఐ అఖిలభారత అధ్యక్షుడు కనకారావు ఇతర కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. స్టీల్ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపులపై ఆందోళన -
36 గంటల్లో హత్య కేసు నిందితుల అరెస్ట్
పరవాడ: ముత్యాలమ్మపాలెంలో ఈ నెల 18న మైలపల్లి బంగార్రాజుపై కత్తులు, రాళ్లతో దాడి చేసి, హతమార్చిన నిందితులను 36 గంటల వ్యవధిలో అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పరవాడ డీఎస్పీ విష్ణుస్వరూప్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అదే గ్రామానికి చెందిన ముద్దాయి చింతకాయల ఎర్రయ్య, మృతుడు బంగార్రాజు వద్ద గతంలో రూ.63 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఆ మొత్తం నుంచి రూ.45 వేలు చెల్లించి, ఇంకా రూ.18 వేలు బాకీ ఉన్నాడు. ఈ విషయమై ఎర్రయ్యను పలుమార్లు బంగార్రాజు అడిగాడు. అంతే కాకుండా అందరికీ చెప్తూ తనను అబాసుపాల్జేస్తున్నాడని ముద్దాయి కోపంతో మృతుడిపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 18న రాత్రి 9.30 సమయంలో పథకం ప్రకారం ప్రథమ మద్దాయి కొవిరి కామేష్, కొవిరి శివాజీ, కొవిరి ముత్యా లు(ఆర్మీ), చింతకాయల ఎర్రయ్య, కొవిరి ముత్యాలు, వాసుపల్లి ప్రవీణ్కుమార్, కొవిరి ముత్యాలమ్మలు కలసి కత్తులు, రాళ్లు, ఐరన్ రాడ్తో బంగార్రాజుపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ బంగార్రాజును వైద్యం కోసం గాజువాకలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనలో మృతుడి సోదరుడు మైలపల్లి పోలరాజు గాయపడినట్లు డీఎస్పీ చెప్పారు. మృతుడి భార్య మైలపల్లి బంగారం ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు నిందితులను పట్టుకోవడానికి ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. వీరిని మడుతూరు జంక్షన్లో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుల్ని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు, అచ్యుతాపురం సీఐ గణేష్, రాంబిల్లి ఎస్ఐ నరసింగరావు, పరవాడ ఎస్ఐలు బి.కృష్ణారావు, వి.సత్యనారాయణ, సిబ్బందిని అభినందించారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, ఒక ఐరన్ రాడ్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. వ్యక్తిగత కారణాలతో జరిగిన ఈ ఘటనను ఆసరాగా తీసుకుని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో సీఐ ఆర్.మల్లికార్జునరావు, ఎస్ఐలు బి.కృష్ణారావు, సత్యనారాయణ, ఏఎస్ఐ బి.ఎర్రునాయుడు పాల్గొన్నారు. ఏడుగురు నిందితులకు రిమాండ్ -
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి మృతి
కశింకోట: మండలంలోని బయ్యవరం పాల డెయిరీ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఎస్ఐ లక్ష్మణరావు అందించిన వివరాల ప్రకారం...విశాఖపట్నం నుంచి నరసాపురం వెళుతున్న కారు, బయ్యవరం పాల డెయిరీ వద్ద అవతలి రోడ్డులోకి అకస్మాత్తుగా మలుపు తిరుగుతున్న లారీని వేగంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న బుంగా వెంకట నరసమ్మ (72) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. కుమారుడు నరేష్, మేనకోడలు సువర్ణ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం విశాఖ కేజిహెచ్కు వైద్యులు సిఫారసు చేశారు. విశాఖలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న నరేష్, తమ తల్లి నరసమ్మ, కుటుంబ సభ్యులు సువర్ణ, ముగ్గురు పిల్లలతో కలిసి కారులో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో బంధువుల ఇంటికి పెళ్లికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. నరసమ్మ మృతదేహానికి అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జయి దెబ్బతింది. తన కళ్లముందే తల్లి నరసమ్మ మృతి చెందడంతో నరేష్, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
ఏపీ ఐసెట్-2025 ఫలితాలు విడుదల.. ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి!
సాక్షి,విశాఖ: ఏపీలో ఎంబీఏ,ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఐసెట్- 2025 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఆంధ్రా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ విడుదల చేశారు. ఏపీ ఐసెట్ పరీక్షా ఫలితాల్లో 95.86శాతం విద్యార్థులు అర్హత సాధించారు. ఈ ఫలితాల్లో విశాఖకు చెందిన మేక మనోజ్ మొదటి ర్యాంక్ సాధించగా.. వైఎస్సార్ జిల్లాకు చెందిన సందీప్రెడ్డి రెండో ర్యాంక్ను సాధించారు. 👉 ఏపీ ఐసెట్-2025 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
చురుగ్గా నైరుతి రుతుపవనాలు.. ముందుగానే తొలకరి!
విశాఖ: దేశవ్యాప్తంగా ఈ ఏడాది వర్షాలు ముందుగానే పలకరించనున్నాయి. ఐదు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) స్పష్టం చేసింది. దక్షిణ, మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలో విస్తరించిన రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు ఐఎండీ తెలిపింది. మే 25వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది.ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో వచ్చే వారం రోజులు వర్షాలు ఉధృతి కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, వైఎస్సార్, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వచ్చే 24 గంటట్లో భారీ వర్షాలకు అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 55 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. నిన్న(సోమవారం) రేపల్లెలో 9 సెం.మీ వర్షపాతం నమోదైంది. -
దక్షిణ కోస్తా, సీమ మీదుగా ఉపరితల ద్రోణి
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రస్తుతం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా ఆవరించి ఉంది. దీని ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని వెల్లడించారు. కోస్తాంధ్ర జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. కాగా, పగటి ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలు దాటే సూచనలున్నాయని కూడా పేర్కొన్నారు. -
పరవాడలో యువకుడి హత్య
పరవాడ: పరవాడ మండలం ముత్యాలమ్మపాలెంలో ఆదివారం రాత్రి చీటి డబ్బుల విషయంలో జరిగిన ఘర్షణలో మైలపల్లి బంగార్రాజు (35) అనే యువకుడు కత్తిపోట్లకు గురై మృతి చెందాడు. ఎన్టీపీసీలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్న బంగార్రాజు చీటిల వ్యాపారం చేస్తుండగా, అదే గ్రామానికి చెందిన చింతకాయల ఎర్రయ్య అతనికి రూ.18 వేలు బాకీ ఉన్నాడు. ఈ విషయంపై ఫోన్లో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఇద్దరూ ఘర్షణ పడ్డారు. అక్కడే ఉన్న ఎర్రయ్య మేనల్లుడు కొవిరి కామేష్ కత్తితో బంగార్రాజును పొడవడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు, పరవాడ డీఎస్పీ విష్ణు స్వరూప్, క్లూస్ టీం ఘటన స్థలాన్ని పరిశీలించి ఆధారాలను సేకరించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. కామేష్తో పాటు మరో ఆరుగురు దాడిలో పాల్గొన్నట్లు గుర్తించారు. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. భర్తను హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బంగార్రాజు భార్య బంగారమ్మ, కుటుంబ సభ్యులు సోమవారం పరవాడ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చీటి డబ్బుల వివాదమే కారణం -
కృత్రిమ ఆవాసాలు, సీ వీడ్కు మంచి గిరాకీ
మంత్రి అచ్చెన్నాయుడుమహారాణిపేట: ఉత్తరాంధ్ర సముద్ర జలాల్లో మత్స్య సంపద వృద్ధి కోసం మొదటి విడతగా 22 కృత్రిమ ఆవాసాల యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర మత్స్య, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. జాలారి ఎండాడ సముద్రంలో కృత్రిమ ఆవాసాలను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫిషింగ్ హార్బర్లో మరపడవల బోట్లకు ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద 634 ట్రాన్స్పాండర్లను 100 శాతం సబ్సిడీపై అందజేసినట్లు తెలిపారు. ట్రాన్స్పాండర్ల వాడకం వల్ల సముద్రంలో బోటు స్థానాన్ని తెలుసుకోవడం, తుఫానులు, ప్రమాదాల సమయంలో ఉపయోగపడుతుందని చెప్పారు. మత్స్యకారులకు జీపీఎస్, బోట్లు, ఇంజన్లు, వలలు వంటి పరికరాలను సబ్సిడీపై సరఫరా చేస్తామని మంత్రి తెలిపారు. ఫిషింగ్ హార్బర్లో క్రేన్, క్రెడిల్స్ ఏర్పాటుకు పోర్టు చైర్మన్తో మాట్లాడతానని చెప్పారు. ఆర్కే బీచ్ ఎదురుగా ఏర్పాటు చేసిన కేజ్ కల్చర్, సీ వీడ్ కల్చర్ యూనిట్ను మంత్రి సందర్శించారు. వసీవీడ్కు విదేశాల్లో మంచి గిరాకీ ఉందని, రాష్ట్రవ్యాప్తంగా 22 సీవీడ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని, వీటి ద్వారా 45 రోజుల్లోనే ఆదాయం వస్తుందని మంత్రి తెలిపారు. కేజ్ కల్చర్ ద్వారా మత్స్య సంపదను అభివృద్ధి చేసుకోవచ్చని, సీవీడ్ను ఆధారం చేసుకుని చిన్న పరిశ్రమగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్, మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్, విశాఖ మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు పి.లక్ష్మణరావు, సీఎంఎఫ్ఆర్ఐ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జోయ్ కిజాకుద్దీన్, మరపడవల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.లక్ష్మణరావు, మాజీ అధ్యక్షుడు పీసీ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. సీ కేజ్ అమ్మకాలు ద్వారా వచ్చిన రూ.3.25 లక్షల చెక్కును లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. -
నాణ్యతే ప్రామాణికం..అవగాహనే కీలకం
● వస్తువులు కొనుగోలు చేసేటప్పడు జాగ్రత్తలు పాటించాలి ● కొలతల్లో మోసాలు జరిగితే అధికారులను సంప్రదించాలి ● నేడు ప్రపంచ లీగల్ మెట్రాలజీ దినోత్సవం తాటిచెట్లపాలెం: వినియోగదారులు నాణ్యమైన ఉత్పత్తులు పొందడం ఎంత ముఖ్యమో, వాటి గురించి సరైన అవగాహన కలిగి ఉండటం కూడా అంతే కీలకం. కొనుగోలు చేసే ప్రతి వస్తువు నాణ్యతను పరిశీలించడంతో పాటు, వాటి తయారీ, కొలతలు, ధర వంటి వివరాలపై అవగాహన పెంచుకుంటే మోసాల నుంచి బయటపడొచ్చు. ప్రజలు కొనుగోలు చేసే ప్రతి వస్తువులోనూ తూనికలు, కొలతల విషయంలో జాగ్రత్త వహించాలని లీగల్ మెట్రాలజీ ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ కే థామస్ రవికుమార్ సూచించారు. మంగళవారం ప్రపంచ లీగల్ మెట్రాలజీ దినోత్సవం సందర్భంగా ఆయన ఈ విషయమై మాట్లాడారు. ప్రతి సంవత్సరం మే 20న ప్రపంచ లీగల్ మెట్రాలజీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1875లో పారిస్లో జరిగిన మీటర్ కన్వెన్షన్కు గుర్తుగా ఈ దినోత్సవం జరుగుతుంది. ఈ సంవత్సరం లీగల్ మెట్రాలజీ 150వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. 2025 లీగల్ మెట్రాలజీ డే ‘కొలతలు అన్ని కాలాలకు – అందరు ప్రజలకు’ నినాదంతో సాగుతుంది. ఈ సందర్భంగా ఉమ్మడి విశాఖ జిల్లా లీగల్ మెట్రాలజీ విభాగం ఈ నెల 8 నుంచి 19 వరకు వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో అవగాహన శిబిరాలు, తనిఖీలు నిర్వహించింది. ఆయా ప్రాంతాలలో వస్తువులను కొనుగోలు చేసేటపుడు ప్రజలు ఎలా మోసపోతారో, ప్రజలను వ్యాపరులు ఎలా మోసగిస్తారో వివరించారు. తూనికలు, కొలతలు, ప్యాకేజీ వస్తువుల విషయంలో వినియోగదారులు తీసుకోవలసిన జాగ్రత్తలను తెలిపారు. బంగారు ఆభరణాల విషయంలో... బంగారు ఆభరణాలు కొనేటప్పుడు రాళ్లు, బంగారం వేర్వేరుగా తూకం వేస్తున్నారో లేదో చూడాలి. బిల్లులో నికర బరువు, ధర, స్వచ్ఛత వివరాలు పరిశీలించాలి. కొనుగోలు సమయంలో మిల్లీగ్రాము వరకు ఖచ్చితత్వమున్న ఎలక్ట్రానిక్ తూకపు యంత్రాలను, వాటికి లీగల్ మెట్రాలజీ సీల్ ఉందో లేదో గమనించాలి. పెట్రోలు బంకుల్లోనూ.. పెట్రోల్, డీజిల్ కొనే ముందు పంప్ మీటర్ 0 తో మొదలయ్యేలా చూడాలి. సరైన ధర చెల్లిస్తున్నారో లేదో గమనించాలి. అనుమానం ఉంటే, పెట్రోల్ బంకుల్లో ఉండే లీగల్ మెట్రాలజీ సీల్ ఉన్న ఐదు లీటర్ల కొలత పాత్రతో పరిమాణం సరిచూసుకోవాలి. ప్యాకేజీ వస్తువుల విషయంలో.. ప్యాకేజీ వస్తువులు కొనే ముందు బరువు, కొలత, తయారీ తేదీ, గరిష్ట అమ్మకపు ధర, కస్టమర్ కేర్ వివరాలు చూడాలి. ఎంఆర్పీ కంటే ఎక్కువ చెల్లించకూడదు. ఎవరైనా ఎక్కువ ధర డిమాండ్ చేస్తే లీగల్ మెట్రాలజీ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, సినిమా థియేటర్లు, హోటళ్లు, మార్కెట్లు, కిరాణా, సూపర్ మార్కెట్లలో ఎంఆర్పీ కంటే ఎక్కువ చెల్లించకూడదు. 2024–25 సంవత్సరంలో లీగల్ మెట్రాలజీ గణాంకాలు... జిల్లాలో నమోదు చేసిన కేసులు – 1500 స్టాంపింగ్ ఫీజు – రూ.2,34,88,983 కాంపౌండింగ్ ఫీజు (అపరాధరుసుము/ జరిమానాలు)– రూ.1,16,75,710 -
పల్లా శ్రీనివాసరావుపై న్యాయపోరాటం
● అన్ని పార్టీల మద్దతు కోరతా ● ఎమ్మెల్యే పదవి నుంచి గాజువాక ఎమ్మెల్యేను బర్తరఫ్ చేయాలి ● తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ తాటిచెట్లపాలెం: గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుపై అన్ని పార్టీల మద్దతుతో న్యాయపోరాటం చేస్తానని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ తెలిపారు. తాను వ్యక్తిగతంగానే పోరాడుతున్నానని, ఈ పోరాటానికి కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ, సీపీఎం, సీపీఐ, లోక్సత్తా తదితర పార్టీల మద్దతు కోరుతున్నట్లు ఆయన చెప్పారు. సోమవారం హోటల్ సింకా గ్రాండ్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుల సమావేశంలో పాల్గొన్న పీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీకి ఈ విషయమై వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తే చంపేస్తారా? అని రామ్ ప్రశ్నించారు. పల్లా శ్రీనివాస్ తనపై హత్యాయత్నం చేశారని, గాజువాకలో భూకబ్జాల మాఫియాకు మారుపేరుగా పల్లా శ్రీనివాస్ నిలిచారని ఆరోపించారు. ఇటువంటి వ్యక్తిని వెంటనే పార్టీ నుంచి బహిష్కరించి, చర్యలు తీసుకోవాలని కోరారు. తనపై జరిగిన దాడి విషయమై గాజువాక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయలేదని, పోలీస్ కమిషనర్ను కూడా కలిశానని, ఆయనపై నమ్మకం ఉందన్నారు. పల్లా శ్రీనివాసరావుపై సీబీఐ, కేంద్ర హోం శాఖకు కూడా ఫిర్యాదు చేశానని రామ్ తెలిపారు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం అని భావించానని, కానీ టీడీపీ నాయకులు అరాచకాలకు పాల్పడుతున్నారన్నారని మండిపడ్డారు. పల్లా శ్రీనివాసరావు దగ్గర ఉండే మురళీ అతని వ్యవహారాలన్నీ చూస్తూ సెటిల్మెంట్లు, కలెక్షన్స్ చేస్తుంటాడని ఆరోపించారు. అన్ని పార్టీలతో కలిసి న్యాయపోరాటం చేస్తానని, ఈ విషయమై ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజును కలిశానని, కాంగ్రెస్ నాయకులను కలిశానని, త్వరలోనే వైఎస్సార్ సీపీ, కమ్యూనిస్టులు, లోక్సత్తా నాయకులను కలుస్తానని రామ్ తెలిపారు. ప్రాణ రక్షణ కోసం తనకు గన్ లైసెన్స్ ఇప్పించాలని పోలీస్ కమిషనర్ను కోరనున్నట్లు బీవీ రామ్ తెలిపారు. -
అర్జీల రీ ఓపెన్పై కలెక్టర్ అసంతృప్తి
● వచ్చే వారం అర్జీదారులతోస్వయంగా నేనే మాట్లాడతా ● అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు ● కలెక్టరేట్ పీజీఆర్ఎస్కు 225 వినతులు మహారాణిపేట: జిల్లాలో గ్రామ సభల్లోని సమర్పించిన అర్జీలు రీ–ఓపెన్ అవుతుండడంపై కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పెండిం గ్ అర్జీలపై సమీక్షించి, అర్జీదారులతో స్వయంగా మాట్లాడి, కచ్చితమైన సమాచారంతో పొరపాట్లు లేకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికతో పాటు, అర్జీదారులు మీకోసం.ఏపీ.జీవోవి.ఇన్ వెబ్సైట్లో లేదా 1100 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ తెలిపారు. వచ్చే సోమవారం పీజీఆర్ఎస్ సందర్భంగా అధికారుల సమక్షంలో అర్జీదారులతో ఫోన్లో మాట్లాడతానని, అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను 24 గంటల్లో తెరిచి, పూర్తిగా విచారణ చేసి, మళ్లీ రాకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో ఆయన అర్జీదారుల సమస్యలు వింటూ, వాటిని సంబంధిత అధికారులకు పంపి, శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, జీవీఎంసీ సిటీ ప్లానర్ ధనుంజయ రెడ్డి కూడా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సోమవారం మొత్తం 225 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ శాఖకు చెందినవి 91 ఉండగా, పోలీసు శాఖకు సంబంధించి 18, జీవీఎంసీ సంబంధించి 51 ఉన్నాయి. అలాగే ఇతర విభాగాలకు సంబంధించి 65 వినతులు వచ్చాయి. -
షర్మిలతో కాంగ్రెస్ పూర్తి నిర్వీర్యం
తాటిచెట్లపాలెం: పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యమైపోయిందని వివిధ జిల్లాల కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ ఆధ్వర్యంలో సోమవారం విశాఖలో జరిగిన ప్రత్యేక సమావేశంలో వీరు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి విచ్చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి షర్మిలకు, ఆమె తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా మెమోరాండంలు కిల్లి కృపారాణికి అందజేశారు. నాయకులు మాట్లాడుతూ గత ఎన్నికల్లో గెలిచే వారికి కాకుండా.. అధినాయకత్వం ప్రకటించిన వారిని కాదని షర్మిల కొత్త వారికి టికెట్లిచ్చి కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమయ్యారని మండిపడ్డారు. మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి కూడా ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికార పక్షంతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కలిసిపోయిందని.. ప్రభుత్వంపై పోరాడాల్సింది పోయి, గత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని విమర్శిస్తూ, దూషిస్తూ పచ్చ మీడియాలో పతాక శీర్షికలో నిలిచేందుకు తప్ప మరేమి చేయడంలేదని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఊపిరి పోసుకోవాలంటే రాష్ట్ర నాయకత్వ మార్పు అత్యవసరమని నేతలంతా కుండబద్దలు కొట్టారు. కిల్లి కృపారాణి మాట్లాడుతూ ఇక్కడి విషయాలను సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీలకు తెలియజేసి, వినతులను పార్టీ అధిష్టానానికి అందజేస్తానన్నారు. -
ప్రభుత్వ స్థలాల ఆక్రమణ
జీవీఎంసీ జోన్–2, మధురవాడలోని ప్రభుత్వ పార్కు స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. బొట్టవానిపాలెంలోని ఈడబ్ల్యూఎస్ లేఔట్, స్వతంత్ర నగర్లోని కోట్ల రూపాయల విలువైన జీవీఎంసీ పార్కులో 150 గజాల స్థలాన్ని కొందరు ఆలయం పేరుతో ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు. ఈ నెల 5న జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదు చేసినా చర్యలు లేవు. కళానగర్లోని కృష్ణ నగర్ పార్కు, బ్రహ్మంగారి గుడి ఎదురుగా ఉన్న మరో పార్కు స్థలం కూడా కబ్జాకు గురయ్యాయి. ఆక్రమణదారులకు జోనల్ కమిషనర్ మద్దతు ఇస్తున్నారు. కలెక్టర్, జీవీఎంసీ అధికారులు స్పందించి పార్కులను కాపాడాలి. –చేకూరి రజని, సామాజిక కార్యకర్త, మధురవాడ -
కూటమిలోడిప్యూటీ చిచ్చు
● జనసేనకు డిప్యూటీ మేయర్ కేటాయింపుపై ససేమిరా అంటున్న టీడీపీ నేతలు ● 22 రోజుల క్రితం ఉన్న ఐక్యతా రాగం ‘కౌన్సిల్ సాక్షిగా’ విచ్ఛిన్నం ● కూటమి పార్టీల్లో బయటపడ్డ లుకలుకలు మంగళవారం శ్రీ 20 శ్రీ మే శ్రీ 2025ముగ్గురు సీఐలకు స్థానచలనంవిశాఖ సిటీ: నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు సీఐలకు స్థానచలనం కలిగింది. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గోపాలపట్నం లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్ జి.అప్పారావును మల్కాపురం లా అండ్ ఆర్డర్కు బదిలీ చేశారు. ఇక్కడ సీఐగా విధులు నిర్వర్తించిన విద్యాసాగర్పై ఒక మహిళ ఫిర్యాదు చేయడంతో ఆయనపై వేటు పడింది. ఒక ఫిర్యాదు చేయడానికి ఆమె స్టేషన్కు వస్తే.. సీఐ ఫోన్లు, మెసేజ్లతో వేధింపులకు గురిచేస్తున్నారని సీపీ దృష్టికి వెళ్లడంతో ఆయన ఆ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. విచారణ అనంతరం విద్యాసాగర్ను రేంజ్కు సరెండర్ చేశారు. దీంతో ఆ స్థానంలో అప్పారావును నియమించారు. అలాగే సీఎస్బీ–3లో ఉన్న ఎన్.వి.ప్రభాకరరావును గోపాలపట్నం లా అండ్ ఆర్డర్కు, వీఆర్–1లో ఉన్న జి.గోవిందరావును సీఎస్బీ–3కు బదిలీ చేశారు. హాజరైన ఎమ్మెల్యేలు పల్లా, వెలగపూడి, ఎమ్మెల్సీ వేపాడ డాబాగార్డెన్స్ : ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవనేది నానుడి. దీనికి తగ్గట్టుగానే జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పదవి టీడీపీ, జనసేన మధ్య చిచ్చురేపింది. మొన్నటి మేయర్ ఎన్నిక వరకు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఇరుపార్టీల నేతల్లో అసహనం వ్యక్తమైంది. ఇన్నాళ్లు కూటమి పార్టీలంతా ఒక్కటేనని బయటకు చెబుతున్నా.. ఈ ఎన్నిక సందర్భంగా లుకలుకలు బయటపడ్డాయి. సంఖ్యాబలం ఉండి కూడా కోరం లేక సమావేశం వాయిదా పడిందంటే.. పదవుల కోసం తప్ప ప్రజలకు మేలు చేయాలని వారు కలవలేదని తేలిపోయింది. డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రత్యేక సమావేశం సోమవారం జరిగింది. ఈ పదవిని జనసేనకు కేటాయించగా టీడీపీ ఆశావహులు సమావేశానికి డుమ్మా కొట్టారు. ఎలాగైనా తమకే ఈ పదవి దక్కాలని భీష్మించారు. దీంతో కోరం లేక సమావేశం మంగళవారం నాటికి వాయిదా పడింది. జనసేన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తితో అలిగి అక్కడ నుంచి వెళ్లిపోయారు. చివరి వరకు ఆశావహుల ప్రయత్నాలు మేయర్గా పీలా శ్రీనివాసరావును కూటమి సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. టీడీపీ ఆశావాహులు మాత్రం గత వారం రోజులుగా ఈ పదవి కోసం చాలా ప్రయత్నాలు చేశారు. ఎవరికి వారు ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులతో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ తనకే పదవి వచ్చేలా చూడాలంటూ శతవిధాలా ప్రయత్నాలు చేశారు. అయితే జనసేన పార్టీకే డిప్యూటీ మేయర్ పదవి కేటాయించారు. ఆ పార్టీకి చెందిన 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డికి ఆ పార్టీ నేతలు బీ ఫారం అందజేశారు. కారాలు మిరియాలు జనసేనకు చెందిన దల్లి గోవిందరెడ్డికి బీ ఫారం ఇవ్వడంతో టీడీపీ కార్పొరేటర్లు జీర్ణించుకోలేకపోయారు. ఎన్నికకు వెళ్లే ప్రసక్తే లేదని భీష్మించారు. మంగళవారం ఉదయం నగరంలోని ఓ హోటల్లో భేటీ అయిన టీడీపీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా చీలిపోయారు. హోటల్ నుంచి ఓ వర్గం టీడీపీ కార్పొరేటర్లు వేరే చోటికి వెళ్లిపోయారు. ఓ వర్గం టీడీపీ కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశానికి హాజరైనా.. కోరానికి సరిపడా సభ్యులు లేకపోవడంతో జనసేన ఆశలు ఆవిరైనట్టయింది. దీంతో ఇరు పార్టీల నేతలు కారాలు మిరియాలు నూరుకున్నారు. న్యూస్రీల్జంప్ జిలానీలు తెల్లముఖంస్వార్థ రాజకీయాలు, డబ్బులకు అమ్ముడుపోయి వైఎస్సార్ సీపీ నుంచి జనసేనలో చేరిన కార్పొరేటర్లు, ఇద్దరు స్వతంత్ర కార్పొరేటర్లు వారు ఆశించినట్టు సాగకపోవడంతో తెల్లముఖం వేసినట్టయింది. ఎందుకు పార్టీని వీడామని మధనపడుతున్నట్లు తెలుస్తోంది. ఇంతలోనే అంత.. దల్లిపై ఎన్ని ఫిర్యాదులో.. డిప్యూటీ మేయర్ పదవి కోసం ఇటీవలే వైఎస్సార్ సీపీ నుంచి జనసేనలో చేరిన పలువురు కార్పొరేటర్లు.. తొలి నుంచి జనసేన పార్టీలో ఉన్న దల్లి గోవిందరెడ్డిపై అధిష్టానానికి పలు ఫిర్యాదులు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దల్లి గోవిందరెడ్డి గుట్కా వ్యాపారితో అడ్డగోలు వ్యాపారం చేస్తున్నారంటూ ఫిర్యాదులు చేసినట్టు సమాచారం. అవి అవాస్తవమని నమ్మిన పార్టీ అధిష్టానం దల్లి గోవిందరెడ్డికే డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చేందుకు మొగ్గు చూపింది. బీ ఫారం అందజేయడంతో ఆ పార్టీలో చేరిన వారంతా ఖంగుతిన్నట్టయింది. టీడీపీలో ముసలానికి కారణంవీరే.. డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయంలో మేయర్ పీలా శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గంటా శ్రీనివాసరావు ముసలం పెట్టారని ఆ పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లు బాహాటంగా అంటున్నారు. మేయర్ పీలా శ్రీనివాస్ గాజవాక నియోజకవర్గానికి చెందిన గంధం శ్రీనివాస్కు, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆ నియోజకవర్గ యాదవ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్ మంగవేణికి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆ నియోజకవర్గం యాదవ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్ మొల్లి హేమలతకు హామీ ఇచ్చి వారిలో ఆశలు రెక్కిత్తించారనే ఆరోపణలు భగ్గుమంటున్నాయి. ఏది ఏమైనా కూటమిలో చిచ్చుకు కారకులు వీరేనంటూ పలువురు కార్పొరేటర్లు విమర్శిస్తున్నారు. గత నెల 28న మేయర్ ఎన్నిక నిర్వహించారు. కుట్రలు, కుతంత్రాలతో నిర్వహించిన ఎన్నికలో పీలా శ్రీనివాస్ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 22 రోజుల తర్వాత నిర్వహించిన డిప్యూటీ మేయర్ ఎన్నికలో కూటమి పార్టీల్లో లుకలుకలు బయటపడ్డాయి. కేవలం అధికారం కోసం ఏర్పడిన పొత్తు కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు అంటున్నారు. చరిత్రలోనే లేదు.. కోరం లేక సమావేశం వాయిదా పడడం జీవీఎంసీ చరిత్రలోనే లేదని వైఎస్సార్ సీపీ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల సత్య శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కూటమిలో సఖ్యత లేదనడానికి సోమవారం జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికే నిదర్శనమని పేర్కొన్నారు. 63 మంది కార్పొరేటర్లలో 20 మంది వరకు డిప్యూటీ మేయర్ ఎన్నికకు డుమ్మా కొట్టారంటే కూటమిలో లుకలుకలు తేటతెల్లమయ్యాయన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోపిడీ చేసే ఆలోచనే తప్ప.. ప్రజాసమస్యలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. -
ఈపీడీసీఎల్ సీఎండీ పేరుతో ఫేక్ వాట్సాప్!
సాక్షి, విశాఖపట్నం: ‘నేను ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఫృథ్వీతేజ్ ఇమ్మడి. మీ విద్యుత్ కనెక్షన్ల విషయంలో గందరగోళం ఉంది. కాబట్టి.. మీపై యాక్షన్ తీసుకుంటాను..’ అంటూ ఓ ఫేక్ నంబర్తో కొందరు వినియోగదారులకు వాట్సాప్ల్లో మెసేజ్లు వెళ్లాయి. మరికొందరికి తొలుత హాయ్.. అని మెసేజ్పెట్టిన తర్వాత రిప్లయ్ ఇస్తుంటే.. అర్జెంట్గా లక్ష రూపాయిలు కావాలంటూ మెసేజ్లు చేస్తున్నారు. వాట్సాప్ డిస్ప్లే పిక్చర్(డీపీ)లో సీఎండీ ఫృథ్వీతేజ్ ఇమ్మడి ఫొటో ఉండటంతో.. కొందరు అధికారులకు అనుమానం వచ్చి స్వయంగా సీఎండీకి కాల్ చేసి చెప్పారు. వెంటనే ఆయన అప్రమత్తమయ్యారు. 9702068556 అనే నంబర్ నుంచి పలువురికి వాట్సాప్ ద్వారా మెసేజ్లు చేస్తున్నట్లు గుర్తించారు. ఇది స్పామ్ నంబర్ అనీ.. ఈ నంబర్తో వచ్చే మెసేజ్లకు ఎవరూ స్పందించొద్దంటూ సీఎండీ ఫృథ్వీతేజ్ అందరికీ విజ్ఞప్తి చేశారు. తన పేరుతో మెసేజ్లు చేస్తున్న సైబర్ నేరగాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సీఎండీ తెలిపారు. -
స్టీల్ప్లాంట్ సమ్మెకు వైఎస్సార్ సీపీ మద్దతు
పెదగంట్యాడ: అఖిల పక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 20న చేపట్టనున్న స్టీల్ప్లాంట్ పర్మినెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు వైఎస్సార్ సీపీ మద్దతు ఉంటుందని మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తెలిపారు. స్థానిక బీసీ రోడ్డులోని టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఎన్నో పోరాటాలు, ఎంతో మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న స్టీల్ప్లాంట్ను ప్రైవేటుపరం కాకుండా అడ్డుకుంటామన్నారు. నిర్వాసితుల నుంచి 26 వేల ఎకరాల భూమిని తీసుకుని కేవలం 16,500 మందికి ఆర్ కార్డులు ఇచ్చి అందులో కేవలం 8 వేల మందికి ఉపాధి కల్పించారని గుర్తు చేశారు. నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే వరకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కూటమి నాయకులు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరిపి స్టీల్ప్లాంట్ను ప్రైవేటుపరం కాకుండా కాపాడాలని కోరారు. నిర్వాసిత కాంట్రాక్ట్ కార్మికులను విధుల నుంచి తొలగిస్తున్నారని.. ఉద్యోగులను వీఆర్ఎస్ పేరుతో ఇంటికి పంపేస్తున్నారని.. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్రెడ్డి, నాయకులు మార్టుపూడి పరదేశి, పల్లా చినతల్లి, ధర్మాల శ్రీను, కోమటి శ్రీనివాసరావు, మంత్రి శంకర్నారాయణ, బొడ్డ గోవింద్, సిరట్ల శ్రీనివాస్ గౌడ్, చిత్రాడ వెంకటరమణ, మద్దాల అప్పారావు, డీవీ రమణారెడ్డి, లోకనాథం తదితరులు పాల్గొన్నారు. -
జనసేనకు టీడీపీ జెల్ల
● పొత్తు ధర్మం విస్మరించి డిప్యూటీ మేయర్ ఎన్నిక సమావేశానికి డుమ్మా కొట్టిన పలువురు టీడీపీ కార్పొరేటర్లు ● ఇద్దరు ఎంపీలు, ఒక ఎమ్మెల్యే కూడా గైర్హాజరు ● కోరంకు 56 మంది అవసరం కాగా 54 మంది హాజరు ● నేటికి ఎన్నిక వాయిదా వేస్తూ ఎన్నికల అధికారి ప్రకటన డాబాగార్డెన్స్: జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నికలో జనసేనకు మిత్రపక్షమైన టీడీపీ జెల్ల కొట్టింది. పొత్తు ధర్మం మరిచి డిప్యూటీ మేయర్ కుర్చీ కోసం కుయుక్తులు పన్నింది. డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు కేటాయించగా.. సోమవారం జరిగిన కౌన్సిల్ ప్రత్యేక సమావేశానికి పలువురు టీడీపీ ఆశావహులు డుమ్మా కొట్టారు. దీంతో కోరం లేకపోవడంతో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి మయూర్ అశోక్ మంగళవారం నాటికి సమావేశం వాయిదా వేశారు. ముందస్తు సమాచారం మేరకు డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రత్యేక సమావేశం సోమవారం ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రారంభం కావాల్సి ఉంది. ఆ సమయానికి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు, ఆ పార్టీ కార్పొరేటర్ కవితతోపాటు సీపీఎం కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు, సీపీఐ కార్పొరేటర్ ఏజే స్టాలిన్ హాజరయ్యారు. 11.10 గంటలకు జనసేన ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్బాబు కౌన్సిల్కు వచ్చారు. 11.15 గంటలకు జనసేనకు చెందిన 14 మంది కార్పొరేటర్లు సమావేశ మందిరానికి చేరుకున్నారు. 11.20 గంటలకు టీడీపీ ఎమ్మెల్యే గణబాబు వచ్చారు. 11.30 గంటలకు టీడీపీ కార్పొరేటర్లు(కాకి గోవిందరెడ్డి తప్ప) ఎవరూ హాజరు కాలేదు. మరో అరగంట మాత్రమే సమావేశం నిర్వహించేందుకు సమయం ఉంది. ఇంతలో ఒకరినొకరు చెవులు కొరుక్కునే పనిలో పడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాస్ 11.40 గంటలకు కౌన్సిల్ హాల్లోకి అడుగుపెట్టారు. అప్పటికే మేయర్ పీలా శ్రీనివాస్తో పాటు జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు మళ్లగుల్లాలు పడుతున్నారు. 11.53 గంటలకు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి రాక ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి మయూర్ అశోక్ 11.53 గంటలకు సమావేశానికి హాజరయ్యారు. (వాస్తవానికి సభ్యులకు ఇచ్చిన సమయానికే రావాలి). వచ్చిన వెంటనే ఎంత మంది సభ్యులు వచ్చారో లెక్కించాలని అధికారులను ఆదేశించారు. కోరం సరిపడా సభ్యులు లేకపోయినా ఇద్దరు అధికారులు (ఏడీసీ డి.వి.రమణమూర్తి, కార్యదర్శి బి.వెంకటరమణ) అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇంకా వస్తారా.. సార్ అంటూ ఎమ్మెల్యేల చుట్టూ తిరిగారు. 12.10 గంటలైనా అధికారులిద్దరూ లెక్కపెడుతూనే ఉన్నారు. అప్పటికే సమయం మించిపోవడంతో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి మయూర్ అశోక్ నేరుగా సభ్యులను లెక్కించారు. ఎన్నికకు 56 మంది అవసరం కాగా 54 మందే హాజరయ్యారని.. కోరం తగ్గట్టు సభ్యులు లేరని గుర్తించారు. దీంతో సమావేశాన్ని మంగళవారం నాటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో జనసేన ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. -
బుద్ధిస్ట్ సర్క్యూట్స్ కోసం డీఎంవో
సాక్షి, విశాఖపట్నం: బౌద్ధారామాల్ని పర్యాటక ప్రాంతాలుగా మరింత అభివృద్ధి చేసేందుకు ఏపీ టూరిజం అథారిటీ(ఏపీటీఏ) కొత్త ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బౌద్ధారామాల్ని గుర్తిస్తూ.. ఆయా ప్రాంతాల్లో ఉన్నవాటిని బుద్ధిస్ట్ సర్క్యూట్స్గా అభివృద్ధి చేయాలని సంక ల్పించింది. గత ప్రభుత్వ హయాంలోనే దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు. దానికనుగుణంగా విశాఖలోనూ బుద్ధిస్ట్ సర్క్యూట్ ఏర్పాటు కోసం రెండు సర్క్యూట్స్ను ప్రతిపాదించారు. కంప్లీట్ బుద్ధిస్ట్ సర్క్యూట్గా విశాఖలోని బౌద్ధారామాలు, అమరావతిలోని బౌద్ధారామాల్ని గుర్తించారు. అదేవిధంగా విశాఖపట్నం సర్క్యూట్గా శ్రీకాకుళంలోని శాలిహుండం, విశాఖలోని బావికొండ, తొట్లకొండ, అనకాపల్లిలోని బొజ్జనకొండ, తూర్పుగోదావరి జిల్లాలోని అదుర్రు బౌద్ధారామాల్ని గుర్తించారు. ఈ సర్క్యూట్స్ అభివృద్ధి, నిర్వహణ, మార్కెటింగ్, ప్రమోషన్ కోసం రాష్ట్ర స్థాయి కమిటీతో పాటు డెస్టినేషన్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్స్(డీఎంవో)ను ఏర్పాటు చేస్తూ టూరిజం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్జైన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ డీఎంవోకు విశాఖ జిల్లా కలెక్టర్ చైర్మన్గానూ, అనకాపల్లి జిల్లా కలెక్టర్ కో–చైర్మన్గా వ్యవహరిస్తారు. వీఎంఆర్డీఏ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్, ఏయూ ప్రొఫెసర్, కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖల ప్రతినిధులు, టూరిజం శాఖ విశాఖ ఆర్డీ, విశాఖ, అనకాపల్లి జిల్లా టూరిజం అధికారులు, ఏపీటీడీసీ విశాఖ డివిజనల్ మేనేజర్, ఈఈలు మెంబర్లుగా వ్యవహరించనున్నారు. బుద్ధిస్ట్ సర్క్యూట్స్ వద్ద మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడం, స్థానిక సంస్థలు, అర్బన్ డెవలప్మెంట్ ఏజెన్సీలు, స్పాన్సర్షిప్ల సహాయంతో బౌద్ధారామాల వద్ద పర్యాటకులకు సౌకర్యాలు కల్పించడం మొదలైనవన్నీ డీఎంవోలు చూస్తాయని పేర్కొన్నారు. -
రేపు డీఈవో కార్యాలయం ముట్టడిస్తాం..
● ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక అల్టిమేటం ● కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం ● డీఈవోకు నోటీస్ అందజేసిన నాయకులు విశాఖ విద్య: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల్లో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిపై ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమయ్యాయి. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. సోమవారం ఉమ్మడి జిల్లా నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్న విశాఖ డీఈవో ఎన్.ప్రేమ్కుమార్కు ముందస్తు నోటీస్ అందజేశారు. తమ సమస్యలకు పరిష్కారం లభించేంత వరకు దశలవారీగా పోరాటాలకు సిద్ధమన్నారు. అంతకుముందు డీఈవో కార్యాలయం వద్ద సమావేశమైన ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడు గోపీనాథ్, ఎస్టీయూ జిల్లా కార్యదర్శి ఇమంది పైడిరాజు మాట్లాడుతూ 117 జీవో రద్దు చేసి, ప్రత్యామ్నాయంగా కూటమి ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు విద్యారంగానికి తీవ్ర నష్టం చేకూర్చేలా ఉన్నాయన్నారు. తొమ్మిది రకాల బడులు విద్యారంగాన్ని మరింత ప్రమాదంలో నెట్టే అవకాశం ఉందన్నారు. బదిలీలు, పదోన్నతులకు సంబంధించి అసంబద్ధమైన నిర్ణయాలతో ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. రాష్ట్ర ఐక్యవేదిక పిలుపులో భాగంగా చేపట్టే డీఈవో కార్యాలయ ముట్టడికి ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు అంతా తరలిరావాలన్నారు. ప్రభుత్వానికి ఉపాధ్యాయుల గళాన్ని వినిపించేలా ముట్టడిని విజయవంతం చేయాలన్నారు. ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక జిల్లా స్టీరింగ్ కమిటీ చొక్కాకుల సూర్యనారాయణ(వైఎస్సార్టీఏ), వేణుగోపాల్ (ఏపీహెచ్ఎంఏ), టి.రామకృష్ణ (ఏపీటీఎఫ్–257) జి.చిన్నబ్బాయి (యూటీఎఫ్), అరుణ్ కుమార్ (ఏపీయూఎస్) ఎన్.ధనుంజయరావు (ఏపీటీఎఫ్–1938)బి.చిన్నారావు, పీఆర్టీయూ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
సమ్మెతో చావో రేవో తేల్చుకుందాం..
ఉక్కునగరం: స్టీల్ప్లాంట్ యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ మంగళవారం జరగనున్న సమ్మెతో చావో రేవో తేల్చుకుందామని సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్సేన్ పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం స్మృత్యంజలి పార్కు వద్ద జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేటీకరణ నుంచి కాపాడుకోవడం కార్మికుల జీవన్మరణ సమస్యగా ఉందన్నారు. ప్లాంట్ ఉద్యమం ఒంటరి కాదని దీనికి దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాలు మద్దతు ఇస్తున్నాయన్నారు. కార్మికవర్గం మరింత ఐక్యంగా ప్రభుత్వ, యాజమాన్యాల నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా మరింత పోరాటాలు చేయాల్సి ఉందన్నారు. స్టీల్ ఇంటక్ ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వం, యాజమాన్యం నిర్భందాలకు వ్యతిరేకంగా జరిగే సమ్మె విజయవంతం చేయాలన్నారు. స్టీల్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి డి.ఆదినారాయణ మాట్లాడుతూ యాజమాన్యం అనుసరిస్తున్న నిర్లక్ష్య విధానాలకు స్వస్తి పలకాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.నర్సింగరావు, కార్పొరేటర్ గంగారావు, జిల్లా సీఐటీయూ నాయకులు జగ్గునాయుడు, ఆర్.ఎస్.వి.కుమార్, కె.ఎం.శ్రీనివాస్, నాయకులు వై.టి.దాస్, గణపతిరెడ్డి, కె.ఎస్.ఎన్.రావు, కె.సత్యనారాయణ, నమ్మి రమణ తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్సేన్ నేడు స్టీల్ప్లాంట్ పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె -
‘మహిళలకు ఫ్రీ బస్సు పథకానికి ముహూర్తం ఏంటి?’
విశాఖ : ఏపీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటివరకూ ఆ పథకం ప్రస్తావన తీసుకురాకపోవడంపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ అమలు చేయడానికి ముహూర్తం ఏమిటని ప్రశ్నించారు. మహిళలకు హామీ ఇచ్చిన మేరకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చెయ్యాలని వైఎస్సార్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నామని బొత్స తెలిపారు.ఈరోజు( సోమవారం) విశాఖ నుంచి ప్రెస్ మీట్ లో మాట్లాడిన బొత్స.. ‘ తల్లికి వందనం ఇస్తారో ఇవ్వరో తెలియదు. ఆడబిడ్డ నిధి పథకం అమలుకు p4కి సంబంధం ఏమిటి?, p4 కి పథకాలకు లింక్ పెట్టడం ఏమిటి..? , లబ్ధిదారులను కూటమి ప్రభుత్వం మోసం చేసింది. ఈ పథకం అమలు చేయనట్టేనా.. ఆడ బిడ్డ నిధి పథకంపై కూటమి నేతలు స్పందించాలి. ఇస్తారో ఇవ్వరో కూటమి ప్రభుత్వం చెప్పాలి. రాష్ట్రంలో మహిళలు అందరూ ఆలోచించాలి. ప్రభుత్వ డొంక తిరుగుడు వ్యవహారాన్ని గమనించాలి. ఆడ బిడ్డ నిధి పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలి. లేదంటే మహిళలను మోసం చేసిన వారు అవుతారు. విశాఖ ప్రజలు అభివృద్ధికి దూరంగా ఉన్నారు. 6 నెలలుగా జీవీఎంసీ కమిషనర్ లేరు.కీలకమైన జీవీఎంసీ కమిషనర్ స్థానాన్ని భర్తీ చేయకపోవడం దురదృష్టం. కూటమి ప్రభుత్వానికి అధికారం, దోచుకోవడం మాత్రమే అవసరం. కూటమి పార్టీల మధ్య సంఖ్యత లేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని దోపిడీ చేసే ఆలోచనే తప్ప ప్రజా సమస్యలు ఈ ప్రభుత్వానికి పట్టవు. పోలీసులను అడ్డం పెట్టుకొని అధికార దుర్వినియోగం చేస్తుంది. కూటమి ప్రభుత్వం ప్రజా స్వామ్యాన్ని అబాసూపాలు చేస్తుంది. ఏడాది పాలనలో వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయి. అన్ని వ్యవస్థలను ప్రభుత్వం చేతిలో పెట్టుకుని చట్టాన్ని చుట్టంగా చేసుకున్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మహిళలు నష్టపోతారు. ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం తరువాత మోసం చెయ్యడం బాబుకి అలవాటే’ అని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. -
Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన
విశాఖ : రానున్న వారం రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణం కేంద్ర స్పష్టం చేసింది. ప్రధానంగా దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. రాగల 24 గంట్లలో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ఇక బాపల్ల, నంద్యాల, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం, వైఎస్సార్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో గంటలకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. -
జనసేనకు కీలక పదవి.. టీడీపీ నేతలు ఆగ్రహం
సాక్షి, విశాఖ: విశాఖ డిప్యూటీ మేయర్ ఎంపిక విషయమై కూటమిలో ట్విస్ట్ చోటుచేసుకుంది. డిప్యూటీ మేయర్ ఎంపిక కూటమిలో చిచ్చు రాజేసింది. జనసేనకు డిప్యూటీ మేయర్ కేటాయింపుపై టీడీపీ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీంతో, పలువురు టీడీపీ నేతలు ఎన్నికకు హాజరు కాకపోవడంతో డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది.వివరాల ప్రకారం.. విశాఖ డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు కేటాయించడంపై పచ్చ పార్టీ నేతలు మండిపడుతున్నారు. జనసేనకు చెందిన డల్లి గోవింద రెడ్డికి డిప్యూటీ మేయర్ అవకాశం ఇవ్వడంపై టీడీపీ నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ఈరోజు జరిగిన సమన్వయ సమావేశం నుంచి కాపు, యాదవ సామాజిక వర్గాలకు చెందిన కార్పొరేటర్లు అలిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు.డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఈ వర్గానికి చెందిన కార్పొరేటర్లు హాజరుకాలేదు. కోరం సరిపడకపోవడంతో ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. డిప్యూటీ మేయర్ ఎన్నికకు కావలసిన సంఖ్యాబలం 56 కావాల్సి ఉండగా.. 54 మంది హాజరయ్యారు. దీంతో, ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో అలకబూనిన కౌన్సిలర్లతో టీడీపీ హైకమాండ్ చర్చించే అవకాశం ఉంది. మరోవైపు.. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ సతీష్ మాట్లాడుతూ..‘అధికార దాహంతో జీవీఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ను పదవి నుంచి దింపేశారు. నగర అభివృద్ధిపై కూటమికి చిత్తశుద్ధి లేదు. కూటమి నేతల మధ్య సమన్వయ లోపం ఉంది. డిప్యూటీ మేయర్ ఎన్నికకు కోరం సభ్యులు కూడా లేరు. మేము చేసిన అభివృద్ధిని కూటమి ఖాతాలో వేసుకుంటుంది. రేపు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. సామాజిక వర్గాల వారీగా జీవీఎంసీ కార్పొరేటర్లు విడిపోయారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు అంతా ఒకే మాట మీద ఉన్నాం’ అని అన్నారు. -
చిట్టి తల్లి.. బుజ్జి కన్నా.!
విశాఖపట్నం: విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూ పార్కులో వన్యప్రాణుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటీవల జూలో ఇండియన్ తోడేలు, బెంగాల్ నక్క, మడగాస్కర్ ప్రాంతానికి చెందిన లెమూర్ ఒక్కో పిల్లకు జన్మనిచ్చాయి. ఈ మూడు పిల్లలు జూ వైద్యులు, సిబ్బంది సంరక్షణలో ఆరోగ్యంగా ఉన్నాయని జూ క్యూరేటర్ జి.మంగమ్మ వెల్లడించారు.అంతరించిపోతున్న జాబితాలో ఉన్న తోడేళ్లు జూలో సంతానోత్పత్తి చేయడం శుభసూచికమని క్యూరేటర్ పేర్కొన్నారు. కాగా, ఇక్కడ సంతానోత్పత్తి చేసిన తోడేళ్లను 2019లో మైసూరు జూ పార్కు నుంచి, బెంగాల్ నక్కలను 2021లో ఢిల్లీ జూ నుంచి తీసుకువచ్చినట్లు ఆమె తెలిపారు. ఇక లెమూర్లను సుమారు పదేళ్ల కిందట ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చామని వివరించారు. ప్రస్తుతం జూలో ఈ కొత్త పిల్లలతో కలిపి మొత్తం 8 ఇండియన్ తోడేళ్లు, 15 రింగ్టైల్డ్ లెమూర్స్, 4 బెంగాల్ నక్కలు ఉన్నాయని క్యూరేటర్ తెలిపారు. -
ఉత్తరాంధ్ర తీరంలో ఉపరితల ఆవర్తనం
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ప్రస్తుతం దక్షిణ అరేబియా సముద్రం, కొమొరిన్, మాల్దీవులు, తూర్పు బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి విస్తరించింది. దక్షిణ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నాలుగైదు రోజుల్లో విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఉంది. మరోవైపు పశి్చమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 1.5 కిమీ ఎత్తులో కొనసాగుతోంది.ఈ ఉపరితల ఆవర్తనంలో దక్షిణ కోస్తా నుంచి యానాం వరకూ విస్తరించిన ద్రోణి విలీనమైంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు మూడు రోజుల పాటు భిన్న వాతావరణం కొనసాగనుంది. వడగాలులు, రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదుతో పాటు ఈదురుగాలులు, వర్షాలు కూడా కురిసే సూచనలున్నాయి. ఆది, సోమవారాల్లో కోస్తా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా గంటకు 30 నుంచి 40 కిమీ వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో మాత్రం ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వెల్లడించారు. ఈనెలాఖరుకు వేసవి ముగింపు ఈనెల నాలుగో వారం నాటికి రాష్ట్రంలో ఎండాకాలం దాదాపు ముగిసి పోయినట్లేనని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రుతుపవనాలు సమీపిస్తున్న నేపథ్యంలో.. ఈ నెల 26 నుంచి రాయలసీమ అంతటా, 29 తర్వాత రాష్ట్రమంతటా చల్లని వాతావరణం ఏర్పడుతుందని భావిస్తున్నారు. రాష్ట్రమంతటా జల్లులతో కూడిన వర్షాలు మొదలవుతాయని అధికారులు చెబుతున్నారు. నేడు పలు ప్రాంతాలకు వర్ష సూచన రాష్ట్రంలో ఆదివారం అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం చిత్తూరు జిల్లా దామోదర మహారాజపురంలో 4.9 సెంటీమీటర్లు, ప్రకాశం జిల్లా డిజిపేటలో 4.7, కర్నూలులో 4.6, చిత్తూరు జిల్లా ముత్తుకూరు 4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 41.3 డిగ్రీలు, ప్రకాశం జిల్లా కొనకనమిట్ల, పల్నాడు జిల్లా రావిపాడులో 40.3, ఏలూరు జిల్లా ఎస్.రాఘవపురంలో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
శ్రీశైలం డ్యామ్ విపత్తుతో అమరావతికీ ముప్పు.!
సాక్షి, విశాఖపట్నం: శ్రీశైలం డ్యామ్ ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) హెచ్చరించినా ఇంతవరకు ఎందుకు మరమ్మతులు చేపట్టలేదని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ఘాటుగా ప్రశ్నించారు. ఈ అంశంపై తక్షణమే స్పందించాలని కోరుతూ ఈ ఏడాది మార్చి 7న ఓ లేఖ రాసినా.. ఎందుకు స్పందించలేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి శనివారం మరోసారి శర్మ బహిరంగ లేఖాస్త్రం సంధించారు. 2012లో కనీవినీ ఎరుగని రీతిలో వచ్చిన వరద వల్ల డ్యామ్ క్రమక్రమంగా ప్రమాద స్థితికి చేరుకుందని ఆయన లేఖలో పేర్కొన్నారు.చంద్రబాబుకు రాసిన లేఖలో శర్మ ఏం చెప్పారంటే... ‘2014లోనూ అప్పటి టీడీపీ ప్రభుత్వం డ్యామ్ ప్రమాదకర స్థితిలో ఉన్న విషయాన్ని పట్టించుకోలేదు. ఏడాది క్రితం ఎన్డీఎస్ఏ మరోసారి హెచ్చరించినా.. ఎందుకు స్పందించలేదు.? తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిని పట్టించుకోవడం లేదు. శ్రీశైలం డ్యామ్ కింద వైపున.. పునాదికి దగ్గరలో పెద్ద ఎత్తున కోతకు గురైంది. దీని వల్ల డ్యామ్ కట్టడానికి ముప్పు ఉందని, 2025 వర్షా కాలంలోగా తాము సూచించిన తాత్కాలిక మరమ్మతులు తక్షణమే చేపట్టాలంటూ ఎన్డీఎస్ఏ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. ఇంత వరకూ మీ ప్రభుత్వం అలాంటి మరమ్మతులేవీ చేపట్టలేదు. దీనిపై ఎన్డీఎస్ఏ కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది.తాత్కాలిక మరమ్మతులతోపాటు దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలని, పునాది కింద ఏర్పడిన భౌగోళిక మార్పులపై నిపుణుల సహాయంతో అధ్యయనం చేసి త్వరగా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కూడా ఎన్డీఎస్ఏ చెప్పింది. అయినా ఏమాత్రం స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో గనుక విపత్తు సంభవిస్తే.. కృష్ణానది కింద ఉన్న ప్రాంతాలు అంటే నాగార్జున సాగర్ డ్యామ్కు, గుంటూరు, నల్గొండ, కృష్ణా జిల్లాలకు ముంపు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. వందలాది గ్రామాలు నీటమునిగిపోతాయి. విజయవాడ, గుంటూరు నగరాలే కాకుండా.. కొత్తగా నిర్మిస్తున్న అమరావతి కట్టడాలకూ ముంపు ముప్పు వాటిల్లక తప్పదు.వాతావరణ మార్పుల వల్ల రాష్ట్రంలోని అన్ని నదుల్లోనూ వర్షాకాలంలో ప్రమాద స్థాయిలో వరద వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా శ్రీశైలం డ్యామ్కి మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టండి. ఎన్డీఎస్ఏ హెచ్చరికలకు అనుగుణంగా.. డ్యామ్ పనుల్ని సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ) నిపుణుల పర్యవేక్షణలో చేపట్టాలి. అని ఈఏఎస్ శర్మ బాబుకు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. -
స్టీల్ప్లాంట్ సమ్మెకు జేఏసీ మద్దతు
● కేంద్రం ఆర్థిక ప్యాకేజీ ఇచ్చి.. బకాయిలకు జమ చేసుకుంది ● జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశంలో కీలక నిర్ణయాలు డాబాగార్డెన్స్: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు, నిర్వాసితుల సమస్యలపై అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జేఏసీ గళమెత్తింది. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. స్టీల్ ప్లాంట్ను పరిరక్షించుకోవడం కోసం ఈ నెల 20న శాశ్వత కార్మికులు, 20 నుంచి కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు నగరంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో శనివారం జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం స్టీల్ప్లాంట్లోని వేలాది మంది కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తోందని.. పర్మినెంట్ ఉద్యోగులను వీఆర్ఎస్ పేరుతో ఇళ్లకు పంపిస్తోందని మండిపడ్డారు. రూ. 11,440 కోట్లు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినప్పటికీ, ఆ నిధులను కార్మికుల జీతభత్యాలకు, ప్లాంట్ అభివృద్ధికి వినియోగించకుండా ఆంక్షలు పెట్టిందన్నారు. రూ.9,654 కోట్లను కేంద్ర జీఎస్టీకి, బ్యాంకు బకాయిలకు జమ చేసుకుందని ఆరోపించారు. స్టీల్ప్లాంట్ను రక్షిస్తామని హామీలిచ్చి అత్యధిక మెజార్టీతో గెలిచిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ శ్రీ భరత్ ఇప్పుడు నోరు మెదపడంలేదని మండిపడ్డారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడం కోసం కాంట్రాక్టు కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిర్ణయించిందన్నారు. ఈ సమ్మెకు జేఏసీ సంపూర్ణ మద్దతు తెలుపుతోందన్నారు. ఈ నెల 18న నిర్వాసిత గ్రామాల్లో పాదయాత్రలు, బైక్ యాత్రలు, 19న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల వద్ద నిరసనలు, 20న ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ప్రదర్శన, సభ నిర్వహించాలని జేఏసీ పిలుపునిచ్చింది. జేఏసీ చైర్మన్ ఎం.జగ్గునాయుడు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎం.మన్మధరావు, ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.నాగభూషణం, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి.కుమార్, సీఎఫ్టీయూ జాతీయ అధ్యక్షుడు ఎ.కనకారావు, వైఎస్సార్టీయూసీ జిల్లా అధ్యక్షుడు ఆర్.అనిల్కుమార్, ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
సీపీఆర్తో ఏపీఈపీడీసీఎల్ ఒప్పందం
విశాఖ సిటీ: ఏపీఈపీడీసీఎల్ డేటా ఆధారిత నిర్ణయాలను బలోపేతం చేసుకునేందుకు సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్(సీపీఆర్)తో అవగాహన ఒప్పందం చేసుకుంది. శనివారం సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి ఆధ్వర్యంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం సీజీఎం పి.శ్రీనివాస్, సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ అధ్యక్షుడు చొక్కాకుల శ్రీనివాస్ ఎంవోయూపై సంతకాలు చేశారు. ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ సంస్థ ఆంధ్రప్రదేశ్లోని కమర్షియల్ ట్యాక్స్, ఎకై ్సజ్, మున్సిపల్ శాఖ వంటి అనేక శాఖలతో కలిసి పనిచేసిన అనుభవంతో ఇకపై ఏపీఈపీడీసీఎల్తో పనిచేయనుంది. విద్యుత్ పంపిణీ సామర్థ్యం, ఆదాయ వృద్ధే లక్ష్యంగా సీపీఆర్ సంస్థ ఏపీఈపీడీసీఎల్కు డేటా ఆధారిత విశ్లేషణలు చేయడంతో పాటు సంస్థ సిబ్బందికి అధ్యయనాలు, సూచనలు చేయనుంది. ఈపీడీసీఎల్లో ఏర్పాటు చేసిన డేటా అనలిటిక్ యూనిట్ (డీఏయూ)ను అభివృద్ధి పరచడం ద్వారా సంస్థ అంతర్గత వ్యవస్థ సామర్థ్యాలను పెంచడం, ఏపీఈపీడీసీఎల్ బిల్లింగ్ వ్యవస్థలోని రెవెన్యూ నష్టాలను తగ్గించడం, క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి డేటా విశ్లేషణలు, డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంలో సీపీఆర్ సహకరిస్తుంది. -
మెట్రో భూసేకరణ ప్రక్రియపై సమీక్ష
మహారాణిపేట: మెట్రోతోపాటు జిల్లాలో చేపట్టనున్న రైల్వే, హెచ్పీసీఎల్, ఇరిగేషన్, విద్యుత్, ఐవోసీఎల్, జాతీయ రహదారులు, అంతర్గత రోడ్ల విస్తరణ తదితర ప్రాజెక్టులపై కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ సమీక్షించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ మీటింగ్ హాలులో జేసీ మయూర్ అశోక్, డీఆర్వో భవానీ శంకర్తో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన.. భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. డీపీఆర్కు అనుగుణంగా మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి తుది చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇతర ప్రాజెక్టుల కోసం నిర్దేశించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. విశాఖ, భీమిలి ఆర్డీవోలు పి.శ్రీలేఖ, సంగీత్ మాథుర్, ఎస్డీసీ సుధాసాగర్ పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల పోరుబాట
విశాఖ విద్య: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులలో అసంబద్ధమైన ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక పోరుబాటకు సిద్ధమైంది. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ నెల 21న జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ మేరకు డాబాగార్డెన్స్ ఆర్బీఎం ప్రాథమికోన్నత పాఠశాల ప్రాంగణంలో శనివారం సమావేశమైన ఉపాధ్యాయ సంఘాల నాయకులు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ అధ్యక్షుడు గోపీనాథ్, ఎస్టీయూ జిల్లా కార్యదర్శి ఇమంది పైడిరాజు మాట్లాడుతూ 117 జీవో రద్దు పేరుతో ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిన తొమ్మిది రకాల బడులు విద్యారంగాన్ని మరింత ప్రమాదంలో నెట్టే అవకాశం ఉందన్నారు. బదిలీలు, పదోన్నతులకు సంబంధించి అసంబద్ధమైన నిర్ణయాలతో ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. సంఘాల నాయకుల అభిప్రాయాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఏకపక్ష ధోరణితో వ్యవహరించడం సరైందికాదన్నారు. బదిలీలు, పదోన్నతులు, రేషనలైజేషన్కు సంబంధించిన 16 రకాల డిమాండ్లతో పోరాటానికి పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఈనెల 21న డీఈవో కార్యాలయం ముట్టడికి ఉపాధ్యాయులు తరలిరావాలని పిలుపునిచ్చారు. దీనిని పెద్ద ఎత్తున విజయవంతం చేసేలా జిల్లా స్థాయిలో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. సభ్యులుగా వి.ఎస్.వేణుగోపాల్ (ఏపీహెచ్ఎంఏ), గోపీనాథ్ (పీఆర్టీయూ), ఇమంది పైడిరాజు (ఎస్టీయూ) టి.రామకృష్ణ (ఏపీటీఎఫ్ –257), జి.చిన్నబ్బాయి (యూటీఎఫ్), ఎ.అరుణ్ కుమార్ (ఏపీయూఎస్) ఎన్. ధనుంజయరావు (ఏపీటీఎఫ్–1938), బి.చిన్నారావు (ఏపీపీటీఏ) చొక్కాకుల సూర్యనారాయణ (వైఎస్సార్టీఏ) లను ఎన్నుకున్నారు. సోమవారం సాయంత్రం స్టీరింగ్ కమిటీ సమావేశమై డీఈవో కార్యాలయ ముట్టడికి సంబంధించిన కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. 21న డీఈవో కార్యాలయం ముట్టడి ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక సన్నద్ధత సమావేశం 9 రకాల బడులపై తీవ్ర వ్యతిరేకత -
ఒక్కో పోస్టుకు 43 మంది పోటీ
ఆదివారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2025భారీగా దరఖాస్తులుఉమ్మడి విశాఖ జిల్లా ప్రాతిపదికన ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరగనుంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా ఉన్న ఖాళీలు, రోస్టర్ వారీగా అందిన దరఖాస్తులు ఇలా ఉన్నాయి. 19న డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఏర్పాట్లు డాబాగార్డెన్స్: జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్, ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి మయూర్ అశోక్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 19న నిర్వహించే డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి ఎటువంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు.. ఆ రోజు ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించి, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. కౌన్సిల్ సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఉదయం 11 గంటలకు తమ గుర్తింపు కార్డులతో సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని జేసీ సూచించారు.విశాఖ విద్య: మెగా డీఎస్సీకి దరఖాస్తు గడువు ముగిసింది. చాలా కాలం తర్వాత వెలువడిన నోటిఫికేషన్ కావడంతో ఉపాధ్యాయ పోస్టు సాధించేందుకు శిక్షణార్థులు భారీగా పోటీపడుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని అన్ని మేనేజ్మెంట్లలో 1,139 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 29,779 మంది అభ్యర్థులు 49,658 దరఖాస్తులు చేసుకున్నారు. ఈ సారి డీఎస్సీకి పోటీ తీవ్రంగానే ఉండనుంది. అంటే ఒక్కో పోస్టుకు 43 మంది పోటీపడుతున్నారు. ఎలాగైనా కొలువు సాధించాలనే లక్ష్యంతో ప్రిపరేషన్లో ఉన్న అభ్యర్థులు అర్హతలను బట్టి ఆయా సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకున్నారు. సమయం తక్కువ.. ఒత్తిడి ఎక్కువ డీఎస్సీ పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 6 వరకు జరగనున్నాయి. మరో 20 రోజుల్లో పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదే ఇప్పుడు డీఎస్సీ ప్రిపరేషన్లో ఉన్న అభ్యర్థులకు టెన్షన్ కలిగిస్తోంది. సమయం పెంచి, అందరికీ ఒకే రోజు పరీక్ష నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నా.. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో రేయింబవళ్లు పుస్తకాలతో అభ్యర్థులు కుస్తీ పడుతున్నారు. భర్తీ కానున్న పోస్టులు ఇవే.. ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ మేనేజ్మెంట్ పరిధిలోని పాఠశాలల్లో 734(ఓపెన్ 290 + ఇతర కేటగిరీల మొత్తం 444) పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అదే విధంగా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ్రమ పాఠశాలల్లో 400 పోస్టులు ప్రకటించారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని జువనైల్ హోమ్లో 5 ఖాళీలు కలుపుకుని మొత్తంగా ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో 1,139 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇవి కాకుండా జోనల్ స్థాయిలో ఏపీ రెసిడెన్షియల్/మోడల్ స్కూల్స్/సోషల్ వెల్ఫేర్/బీసీ వెల్ఫేర్/ట్రైబల్ వెల్ఫేర్(గురుకులాలు) పరిధిలోని విద్యాలయాల్లో జోనల్ ప్రాతిపదికన 400 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. బీసీ–ఈ 423 ఎస్సీ–1 479 ఎస్సీ–2 876 ఎస్సీ–3 2,821 ఎస్టీ 10,523 ఈడబ్ల్యూఎస్ 890 కేటగిరీ వచ్చిన దరఖాస్తులు ఓసీ 1,626 బీసీ–ఏ 1,940 బీసీ–బీ 2,563 బీసీ–సీ 198 బీసీ–డీ 8,330 వీటితో పాటు దివ్యాంగ కేటగిరీకి దరఖాస్తులు వచ్చాయిన్యూస్రీల్ఉపాధ్యాయ కొలువుకు దరఖాస్తుల వెల్లువ 1,139 పోస్టులకు 49,658 పైగా దరఖాస్తులు కొలువు కొట్టాలంటే కష్టపడాల్సిందే..దరఖాస్తులు ఇలా.. మొత్తం అభ్యర్థులు 29,779 సబ్జెక్టుల వారీగా దరఖాస్తులు 49,658 పురుషులు 11,773 మహిళలు 18,006 -
సాంకేతిక ఆవిష్కరణలతోనే సుస్థిర భవిష్యత్తు
● హిందుస్థాన్ జింక్ సీఈవో అరుణ్ మిశ్రా ● ఘనంగా ఐఐపీఈ స్నాతకోత్సవం విశాఖ విద్య: విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగాలని హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ సీఈవో అరుణ్ మిశ్రా పిలుపునిచ్చారు. నగరంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) 5వ వార్షిక స్నాతకోత్సవం శనివారం నోవాటెల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అరుణ్ మిశ్రా మాట్లాడుతూ విద్యార్థులు భిన్నంగా ఆలోచించాలన్నారు. చదువుకునే రోజుల్లోనే దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటి సాధనకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని సూచించారు. హిందుస్థాన్ జింక్ ఇన్నోవేషన్ జర్నీలోని ఉదాహరణలను వివరిస్తూ.. సుస్థిర ఇంధన భవిష్యత్తును రూపొందించడంలో కృత్రిమ మేధ, హైడ్రోజన్ వంటి సాంకేతిక పరిజ్ఞానాల పాత్రను తెలియజేశారు. ఐఐపీఈ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ పరితోష్ కె.బానిక్ మాట్లాడుతూ గ్రీన్ ఎనర్జీ పరివర్తన భారతదేశానికి అత్యంత ఆవశ్యకమని, ఈ దిశగా సుస్థిర ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో ఐఐపీఈ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. క్లిష్టమైన ఇంధన సవాళ్లను పరిష్కరించడానికి పరిశ్రమలు, ఇతర భాగస్వాములతో కలిసి పనిచేయాలని గ్రాడ్యుయేట్లకు సూచించారు. రూ.150 కోట్లతో రీసెర్చ్ పార్కు సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ శాలివాహన్ మాట్లాడుతూ రూ.150 కోట్లతో ఐఐపీఈ–మాగ్నివియా బిజినెస్ అండ్ ఎనర్జీ రీసెర్చ్ పార్క్ను సబ్బవరంలోని సొంత క్యాంపస్లో త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇది ఐఐపీఈ చరిత్రలో ఒక మైలురాయి అని పేర్కొన్నారు. సహజ హైడ్రోజన్పై భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ సదస్సును విజయవంతంగా నిర్వహించామని గుర్తు చేశారు. కెమ్ టెక్ ఫౌండేషన్ నుంచి ఎనర్జీ ఎక్సలెన్స్ అవార్డు–2025ను అందుకోవడంతో సంస్థ ప్రతిష్ట పెరిగిందన్నారు. 15 శాతం అంతర్జాతీయ ప్రాజెక్టులు, గ్లోబల్ ఎలెక్టివ్లతో అంతర్జాతీయ స్థాయిలో ఐఐపీఈ ముందంజలో ఉందన్నారు. 51 మందికి డిగ్రీలు ప్రదానంస్నాతకోత్సవంలో మొత్తం 51 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. ఇందులో ఇద్దరికి పీహెచ్డీ, ఎమ్మెస్సీ అప్లైడ్ జియాలజీలో 15 మందికి, బీటెక్లో 34 మందికి(పెట్రోలియం ఇంజినీరింగ్–8, కెమికల్ ఇంజినీరింగ్–26) డిగ్రీలు అందించారు. ఈ సందర్భంగా పలువురు ప్రతిభావంతులైన విద్యార్థులకు బంగారు, వెండి పతకాలను ప్రదా నం చేశారు. ఆల్బర్ట్ ఇజాక్ మొహంతి (బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్) అకడమిక్ ఎక్సలెన్స్, ఆల్ రౌండ్ ప్రతిభకు గాను ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ అందుకున్నారు. బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్లో అహోల్జియా నందీష్ అమిత్కుమార్ (గోల్డ్), ఆయుష్ గుప్తా (వెండి), బీటెక్ పెట్రోలియం ఇంజినీరింగ్లో బిశ్వజిత్ పాటి (గోల్డ్), బోకం శ్రీరామ మణికంఠ గణేష్ (వెండి), ఎమ్మెస్సీ అప్లైడ్ జియాలజీలో డెబాసిస్ సాహు (గోల్డ్), సుజాత మాఝీ (వెండి) ప్రతిభ చూపా రు. బాలికలను ప్రోత్సహించే ఉద్దేశంతో అందించే బెస్ట్ అవుట్ గోయింగ్ గర్ల్ స్టూడెంట్ మెడల్ను ఎమ్మెస్సీ అప్లైడ్ జియాలజీ విద్యార్థిని సుజాత మాఝీకి ప్రదానం చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రామ్ ఫాల్ ద్వివేది, సెనేట్ సభ్యులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
పచ్చదనం పెంపుపై దృష్టి
నగర ప్రజలకు మేయర్ పిలుపు ఎంవీపీకాలనీ: నగర ప్రజలు పచ్చదనం పెంపుపై దృష్టిసారించాలని మేయర్ పీలా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. శివాజీ పార్కులోని యోగా సాధన సెంటర్ వేదికగా శనివారం ‘బీట్ ద హీట్’నినాదంతో స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలో పర్యావరణ పరిరక్షణకు అన్ని వార్డుల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వార్డుల్లోని ఖాళీ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, టెర్రస్ గార్డెన్లు అభివృద్ధి చేయాలని సూచించారు. నీటి వృథాను అరికట్టడంతో పాటు ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు ఉండాలని స్పష్టం చేశారు. కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ వేసవి ఉపశమనం కోసం నగరంలో గ్రీన్ షేడ్స్, 106 చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గ్లోబల్ వార్మింగ్ తగ్గించేందుకు భవనాలపై సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, విశాఖ జిల్లా ప్రత్యేక అధికారి ఎస్.ఢిల్లీరావు, కార్పొరేటర్లతో కలిసి మేయర్, కలెక్టర్ బీట్ ద హీట్ పోస్టర్ను ఆవిష్కరించారు. పార్కులో మొక్కలు నాటారు. తొలుత కేంద్ర సబ్సిడీ నిధులు రూ.1.5 కోట్లతో కొనుగోలు చేసిన ఆరు వాహనాలను మేయర్, కలెక్టర్ ప్రారంభించారు. ఎన్జీవోల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టెర్రస్ గార్డెన్ నమూనా, వరి కంకులు, వాటర్ బౌల్స్, చిరుధాన్యాల స్టాళ్లను పరిశీలించి.. నిర్వాహకులను అభినందించారు. జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి.రమణమూర్తి, ప్రధాన ఇంజినీర్ శివప్రసాద్ రాజు, ప్రధాన వైద్యాధికారి నరేష్కుమార్, జోనల్ కమిషనర్లు శివప్రసాద్, కనకమహాలక్ష్మి పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వంపై ఇక పోరాటమే..
తీర్మానాలు ● ఈ నెలాఖరులోగా పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, డివిజన్ కమిటీలు ఏర్పాటుకావాలి. ● జూన్, జూలై నెలాఖరు నాటికి గ్రామ కమిటీలు పూర్తిచేయాలి. ● ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నాటికి బూత్ కమిటీలు ఏర్పాటు చేయాలి. ● 20 రోజులకు ఒకసారి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలి. ● వార్డు, జిల్లా స్థాయి ప్రజా సమస్యలపై పార్టీ తరపున పోరాడాలి. ● 19న జరిగే డిప్యూటీ మేయర్ ఎన్నిక వైఎస్సార్ సీపీ బహిష్కరణ. సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల హామీలను విస్మరించిన కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు. శనివారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముందుగా విశాఖ జిల్లా నూతన అధ్యక్షుడిగా కె.కె.రాజు, విశాఖ పార్లమెంట్ పరిశీలకుడిగా కదిరి బాబూరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రాష్ట్రంలో సంక్షేమం లేదు.. అభివృద్ధి లేదు అంతా శూన్యమే.. ఉన్నదల్లా రూ.1.5 లక్షల కోట్లు అప్పులు మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని, గిట్టుబాటు ధర లేక, ధాన్యం కొనుగోలు జరగక కళ్లాల్లోనే నిలిచిపోయిన పరిస్థితులు చూస్తున్నామన్నారు. మెట్ట ప్రాంతాల్లో గిట్టుబాటు ధర లేకపోవడంతో పొగాకు రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం దాహంతో విర్రవీగుతున్న కూటమి ప్రభుత్వం బోల్తా పడకతప్పదని జోస్యం చెప్పారు. గతంలో రుషికొండ బోడిగుండు అంటూ పచ్చ పత్రికలు అదేపనిగా కథనాలు రాశాయి.. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని అడ్డంగా దోచుకుంటుంటే ఎందుకు వార్తలు రాయడం లేదని ప్రశ్నించారు. న్యాయస్థానాలు మెట్టికాయలు వేసినా కూటమి ప్రభుత్వం తీరు మారడం లేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో హ్యూమన్ ట్రాకింగ్ జరిగిందని హడావుడి చేశారు.. మరి ఇప్పుడు ఎందుకు దృష్టి సారించలేదని ప్రశ్నించారు. జీవీఎంసీ కమిషనర్ లేకపోవడంతో నగర వీధుల్లో ఎక్కడిపడితే అక్కడ చెత్త పేరుకుపోతుందన్నారు. కమిషనర్ను నియమించుకోలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. పార్టీ నేతలు తమ ప్రాంతంలో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ జగనన్న 2.ఓలో కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. 20 రోజులకు ఒకసారి నియోజకవర్గ స్థాయి సమావేశం, ఆరు నెలలకు ఒకసారి జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించుకుందామన్నారు. రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ఏడాది అరాచక పాలన నా రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడలేదన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అక్రమంగా కేసులు నమోదు పెడుతున్నారన్నారు. దేశంలో పరిస్థితులు చూస్తే ముందుగానే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు కదిరి బాబూరావు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతీ ఒక్కరూ కష్టపడి పనిచేయాలన్నారు. అబద్ధపు హామీలతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, సమన్వయకర్తలు మజ్జి శ్రీనివాసరావు, దేవన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, తైనాల విజయకుమార్, తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, డిప్యూటీ మేయర్ కె.సతీష్, ముఖ్యనేతలు రవిరెడ్డి, పార్టీ అనుబంధ విభాగ రాష్ట్ర అధ్యక్షులు బొల్లవరపు జాన్ వెస్లీ, పోతిన శ్రీనివాసరావు, పార్టీ నాయకులు కొండా రాజీవ్గాంధీ, రొంగళి జగన్నాథం, ఉడారవి, ఫరూఖీ, రవిరాజు, మొల్లి అప్పారావు, బా ణాల శ్రీనివాసరావు, ఉరుకూటి అప్పారావు, గొలగాని శ్రీనివాస్, నడింపల్లి కృష్ణంరాజు, ద్రోణంరాజు శ్రీవాస్తవ, పి.వి.నారాయణ్, జియ్యాని శ్రీధర్, కార్పొరేటర్లు అనిల్కుమార్రాజు, అల్లు శంకర్రావు, అక్కరమాని పద్మ, దౌలపల్లి ఏడుకొండలు, కోరుకొండ వెంకటరత్న స్వాతి, నక్కిల లక్ష్మి, సాడి పద్మారెడ్డి, బిపిన్ కుమార్ జైన్, చెన్నా జానకిరామ్, గుండపు నాగేశ్వరరావు, వావి లపల్లి ప్రసాద్, రెయ్యి వెంకటరమణ, శశికళ, పి.వి.సురేష్, బల్లా లక్ష్మణ్, గులివిందల లావణ్య, మహమ్మద్ ఇమ్రాన్, గుడివాడ సాయి అనుషా, ఊరుకూటి రామచంద్రరావు, కె.భూపతిరాజు సుజాత, జిల్లా అధికార ప్రతినిధి బింగి హరికిరణ్రెడ్డి, పల్లా దుర్గారావు, దొడ్డి రామనాథ్, డా.మంచా నాగమల్లీశ్వరి, ఆల్ఫా కృష్ణ, షేక్ మహ్మద్ గౌస్, తదితరులు పాల్గొన్నారు. జగన్ 2.ఓలో కార్యకర్తలకే ప్రాధాన్యం ప్రజా సమస్యలపై పోరాటలకు సిద్ధంకండి కూటమి నేతల దోపిడీకి విశాఖ అడ్డాగా మారింది జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ విశాఖ జిల్లా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కేకే రాజు -
కిడ్నాప్కు గురైన నాలుగేళ్ల చిన్నారి క్షేమం
విశాఖ: అనకాపల్లిలో కిడ్నాప్ కు గురైన నాలుగేళ్ల చిన్నారి క్షేమంగా బయటపడింది. ఆ చిన్నారిని గాజువాకలో గుర్తించారు పోలీసులు. ఆ చిన్నారిని కిడ్నాప్ చేసి, విక్రయించేందుకు జరిగిన యత్నంలో నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కిడ్నాప్ కు పాల్పడిన వారికి లక్ష్మీ, అప్పలస్వామిలుగా గుర్తించారు.ఉమ్మడి విశాఖ జిల్లాలో చిన్నపిల్లల కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. అనకాపల్లి టౌన్కి చెందిన నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్కు గురైంది. అనకాపల్లి లోకావారి వీధి ఇంటి నుంచి నాలుగేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేశారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న అనకాపల్లి పోలీసులు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా చిన్నారిని ఎత్తుకెళ్లింది మహిళగా గుర్తించారు. అనంతరం గాలింపు ముమ్మరం చేయడంతో ఆ చిన్నారి కథ సుఖాంతమైంది. ఆ చిన్నారిని గాజువాకలో విక్రయానికి పెట్టే క్రమంలో పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో ఈ కేసును తక్కువ సమయంలోనే ఛేదించారు పోలీసులు. 48 గంటల వ్యవధిలోనే కేసును ఛేదించారు పోలీసులు. -
‘పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అక్రమ అరెస్ట్లు’
సాక్షి, విశాఖపట్నం: సీఎం చంద్రబాబుకి పాలన చేతకాక, హామీలు అమల్లో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. విశాఖలో మీడియాకు విడుదల చేసిన వీడియోలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా గత ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డిల అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.హామీల అమలు విషయంలో అన్నివర్గాల ప్రజల నుంచి ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా నాయకులు వైఎస్ జగన్ను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా అవినీతికి ఆస్కారం లేకపోయినా మద్యం స్కామ్ జరిగినట్టు తప్పుడు వాంగ్మూలాలు సృష్టించి ఆయనకు సన్నిహితంగా ఉన్న వారిని అరెస్టు చేస్తున్నారని అన్నారు.వైఎస్సార్సీపీ హయాంలో బెల్ట్ షాపులు పూర్తిగా రద్దు చేసి, మద్యం షాపులు తగ్గించి, అమ్మకాలు తగ్గిస్తే స్కాం జరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న దాదాపు అన్ని డిస్టిలరీలకు చంద్రబాబే అనుమతులిచ్చాడని, గత వైఎస్సార్సీపీ పాలనలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతివ్వలేదని స్పష్టం చేశారు. గత మా వైఎస్సార్సీపీ పాలనలో మద్యం అమ్మకాలను ప్రభుత్వమే నిర్వహిస్తే, కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టిందని గుర్తు చేశారు.రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. వీధివీధినా బెల్ట్ షాపులు తెరిచి 24 గంటలూ ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకి దమ్ముంటే తన మీద నమోదైన ఇన్నర్ రింగ్రోడ్డు స్కాం, లిక్కర్ కుంభకోణం, ఏపీ ఫైబర్నెట్ స్కాం, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణాలపై విచారణకు సిద్దం కావాలని డిమాండ్ చేశారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తోందని, ఐఏఎస్, ఐపీఎస్లనే కాకుండా పారిశ్రామికవేత్తలను కూడా బెదిరిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వ వేధింపులతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని, అరాచక పాలనతో ఎంతోకాలం ప్రజాచైతన్యాన్ని అడ్డుకోలేరని అన్నారు. రాబోయే రోజుల్లో వైయస్సార్సీపీ నేతృత్వంలో ప్రజా ఉద్యమాలతో కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. -
ఉమ్మడి విశాఖ జిల్లాలో కిడ్నాప్ కలకలం
సాక్షి, విశాఖపట్నం: ఉమ్మడి విశాఖ జిల్లాలో చిన్నపిల్లల కిడ్నాప్ కలకలం రేపుతోంది. అనకాపల్లి టౌన్కి చెందిన నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్కు గురైంది. అనకాపల్లి లోకావారి వీధి ఇంటి నుంచి అదృశ్యం అయినట్టు బాధితులు ఫిర్యాదు చేశారు.సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసిన అనకాపల్లి పోలీసులు షాక్కు గురయ్యారు. ఓ మహిళ చాకచక్యంగా చిన్నారిని కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. గుర్తు తెలియని మహిళ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పాత కిడ్నాప్ గ్యాంగ్గా పోలీసులు అనుమానిస్తున్నారు. -
స్టీల్ప్లాంట్ మాజీ ఉద్యోగికి అంతర్జాతీయ టైటిల్
ఉక్కునగరం: అంతర్జాతీయ బ్యాడ్మింటన్ పోటీల్లో స్టీల్ప్లాంట్ మాజీ ఉద్యోగి బి.వి.ఎస్.కె.లింగేశ్వరరావు జంట విజేతగా నిలిచింది. ఈ నెల 10 నుంచి 14 వరకు తైపీలో తైవాన్ ఓపెన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో 12 దేశాలకు చెందిన 2,500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 55+ కేటగిరీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సుజానే వెంగిలెట్తో లింగేశ్వరరావు పాల్గొన్నారు. సెమీఫైనల్స్లో మలేషి యాతో పోటీపడి గెలిచిన లింగేశ్వరరావు జంట.. ఫైనల్స్లో జపాన్ను ఓడించి విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా ఆయన్ని స్టీల్ప్లాంట్ అధికారులు, పలువురు క్రీడాకారులు అభినందించారు. -
వాల్తేర్ డిపో కండక్టర్, డ్రైవర్ నిజాయితీ
ఎంవీపీకాలనీ: బంగారు ఆభరణాలతో కూడిన బ్యాగును బస్సులో మర్చిపోయిన ఓ ప్రయాణికురాలికి ఆర్టీసీ సిబ్బంది తిరిగి అప్పగించారు. గురువారం రాత్రి 999 నంబర్ గల బస్సులో ప్రయాణించిన ఓ మహిళ ఐదు తులాల బంగారంతో పాటు దుస్తులున్న బ్యాగును బస్సులోనే మరిచిపోయి దిగిపోయింది. కొద్దిసేపటి తర్వాత బ్యాగును గమనించిన ఆ బస్సు కండక్టర్ జి.గిరిబాబు, డ్రైవర్ డి.ఎ.బాబు దానిని వాల్తేరు డిపో సూపరింటెండెంట్కు సెక్యూరిటీ సమక్షంలో అప్ప గించారు. తమ బ్యాగు పోగొట్టుకున్నట్లు గుర్తించిన ప్రయా ణికురాలి కుటుంబ సభ్యులు శుక్రవారం డిపోను సంప్రదించగా.. అధికారులు ఆ బ్యాగును వారికి అందజేశారు. దీంతో ఆనందం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు.. కండక్టర్, డ్రైవర్ల వివరాలు తెలుసుకుని వారు విధుల్లో ఉన్న బస్సు వద్దకు వెళ్లారు. అక్కడ వారికి ఘనంగా సన్మానించారు. అనంతరం సిబ్బంది చేతులమీదుగా తమ ఆభరణాలను తిరిగి తీసుకుని సంతోషించారు. ఆర్టీసీ ప్రతిష్టను పెంచిన కండక్టర్, డ్రైవర్ను డిపో యాజమాన్యంతో పాటు ఉద్యోగులు అభినందించారు. -
అయ్యవార్లకు తిప్పలు
● మెడికల్ సర్టిఫికెట్ల జారీలో జాప్యం ● ‘అపస్’ ఫిర్యాదుతో తేరుకున్న కేజీహెచ్ వైద్యులు ● హడావుడిగా డీఈవో కార్యాలయానికిఅందజేత ● ఉమ్మడి విశాఖ జిల్లాలో1,200 మంది పీహెచ్ టీచర్లు ● వీరిలో 442 మంది వైకల్యంపై నిశిత పరిశీలన విశాఖ విద్య: జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలకు తీవ్ర కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వం జారీ చేసిన బదిలీల చట్టం మేరకు ఖాళీల గుర్తింపు ఒక కొలిక్కి వచ్చింది. పాఠశాలల పునర్నిర్మాణంపై ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఆందోళనలకు పిలుపునిచ్చినా.. బదిలీలు చేపట్టేలా విద్యాశాఖాధికారులు అంతా సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రాధాన్యతల పాయింట్లు కేటాయింపునకు సంబంధిత ఉపాధ్యాయులు నమోదు చేసుకోవాలని డీఈవో కార్యాలయ అధికారులు ప్రత్యేక గూగుల్ ఫాంను విడుదల చేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, దివ్యాంగ ఉపాధ్యాయులు వెంటనే ఈ ఫాం పూర్తి చేయాలని ఆదేశించారు. అయితే జిల్లా స్థాయి ప్రత్యేక శిబిరానికి హాజరైనా.. నేటికి కూడా మెడికల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా గూగుల్ ఫాం పూర్తి చేయాలని ఆదేశించడంతో అయ్యవార్లకు తిప్పలు తప్పడం లేదు. వైకల్యం నిజమేనా? బదిలీల సందర్భంగా ప్రాధాన్యత కోరుతున్న ఉపాధ్యాయులు గతంలో సమర్పించిన మెడికల్ సర్టిఫికెట్లు చెల్లవని ప్రభుత్వం స్పష్టం చేసింది. వాటి కోసం మళ్లీ వైద్యుల ముందు హాజరుకావాల్సిందేనని ఆదేశించింది. ఉమ్మడి జిల్లాలో 1,200 మంది వరకు ప్రాధాన్యత పాయింట్లు పొందే ఉపాధ్యాయులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 56 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నట్లు గతంలో సమర్పించిన సర్టిఫికెట్లలో వాస్తవమెంత అనేది తేల్చాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లా మెడికల్ బోర్డు ముందు 442 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఇదిలా ఉండగా.. సర్టిఫికెట్ల జారీ కోసం కొంతమంది ఉపాధ్యాయులు వైద్యులను మేనేజ్ చేశారని ప్రచారం సాగుతోంది. 20 రోజులు గడిచినా అందని సర్టిఫికెట్లు జిల్లా స్థాయి మెడికల్ బోర్డు ముందు హాజరై 20 రోజులు గడుస్తున్నా.. వైకల్య ధ్రువీకరణ పత్రాలు(మెడికల్ సర్టిఫికెట్లు) అందకపోవడంపై కొంతమంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇదే విషయమై అపస్ సంఘం జిల్లా నాయకులు శుక్రవారం కేజీహెచ్ సూపరింటెండెంట్కు వినతి పత్రం అందజేశారు. దీంతో తేరుకున్న కేజీహెచ్ పాలనాధికారులు ఆయా విభాగాల్లో ఉన్న సర్టిఫికెట్లు సేకరించి, హుటాహుటిన డీఈవో కార్యాలయానికి పంపించారు. ఎంఈవోలకు పంపించాం కేజీహెచ్ నుంచి శుక్రవారం మెడికల్ సర్టిఫికెట్లు అందాయి. వాటిని అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా డీఈవోలకు వెంటనే పంపించాం. విశాఖ జిల్లాకు సంబంధించి ఎంఈవోల ద్వారా సంబంధిత ఉపాధ్యాయులకు అందించాలని ఆదేశించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బదిలీలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశాం. – ఎన్.ప్రేమ్ కుమార్, నోడల్ అధికారి, ఉమ్మడి విశాఖ జిల్లా దివ్యాంగులకు న్యాయం చేయాలి దివ్యాంగుల చట్టాన్ని ప్రభుత్వం విస్మరించింది. దీనిపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో అనుకూలంగా తీర్పు వచ్చింది. కోర్టు తీర్పుకు అనుగుణంగా బదిలీల్లో ప్రాధాన్యం కల్పించి దివ్యాంగ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి. –ఎ.శ్రీనివాసరావు, వికలాంగుల ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి, విశాఖపట్నం -
మధురవాడలో 87.8 ఎకరాల అభివృద్ధికి ప్రణాళికలు
విశాఖ సిటీ: మధురవాడలోని 87.80 ఎకరాల వీఎంఆర్డీఏ భూమిని పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు చైర్మన్ ప్రణవ్గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ తెలిపారు. వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో క్రెడాయ్, నేరెడ్కో, అప్రెడా ప్రతినిధులతో శుక్రవారం సమావేశమై ఈ ప్రాజెక్టుకు గల అవకాశాలను వివరించారు. ఈ భూమికి బీచ్ కారిడార్, డబుల్ డెక్కర్ మోడల్లో మెట్రో రైలు ప్రాజెక్టు, ఐటీ సిటీ, కన్వెన్షన్ సెంటర్లతో పాటు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువలో ఉండడం అదనపు ఆకర్షణ అని వివరించారు. ఈ నెల 23న హైదరాబాద్లో, 30న బెంగళూరులో ఈ భూమికి సంబంధించి రోడ్ షో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జాయింట్ కమిషనర్ రమేష్, చీఫ్ అర్బన్ ప్లానర్ శిల్ప, కార్యదర్శి మురళీకృష్ణ, ప్రధాన ఇంజినీర్ వినయ్ కుమార్, పర్యవేక్షక ఇంజినీర్లు భవానీ శంకర్, బలరామరాజు, ప్రణాళికాధికారులు వెంకటేశ్వరరావు, అరుణవల్లి, చామంతి, మౌనిక తదితరులు పాల్గొన్నారు. 23న హైదరాబాద్, 30న బెంగళూరులో రోడ్ షో -
ఇద్దరు యువకులను రక్షించిన బీచ్గార్డ్స్
బీచ్రోడ్డు: ప్రమాదకరమైన అలల్లో చిక్కుకుపోయిన ఇద్దరు యువకులను బీచ్గార్డ్స్ అతికష్టం మీద రక్షించారు. వివరాలివి. తాడేపల్లిగూడెంకు చెందిన యువకులైన సాయి, కృష్ణ శుక్రవారం మధ్యాహ్నం 2.45 గంటలకు ఆర్కేబీచ్ను సందర్శించారు. ఆ తర్వాత స్నానం కోసం సముద్రంలోకి వెళ్లిన వారిని ఓ పెద్ద కెరటం ఒక్కసారిగా లోపలకు లాగేసింది. ఈ విషయాన్ని గమనించిన పర్యాటకులు వెంటనే మైరెన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన పోలీసులు బీచ్గార్డ్స్ రాకేష్, సాగర్ను ఘటన స్థలానికి పంపారు. బీచ్గార్డ్స్ అతికష్టం మీద సంద్రంలో చిక్కుకుపోయిన వారిద్దరినీ రక్షించారు. ప్రథమ చికిత్స అనంతరం వారిని బంధువులకు అప్పగించారు. -
ఏపీఎస్పీ బెటాలియన్లో సేవా పతకాల ప్రదానం
పీఎంపాలెం: బక్కన్నపాలెం సమీపంలోని ఏపీఎస్పీ పోలీస్ బెటాలియన్లో విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి 16వ బెటాలియన్ కమాండెంట్ మురళీకృష్ణ సేవా పతకాలు అందజేశారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఐదు ఉత్కృష్ట, రెండు అతి ఉత్కృష్ట, నాలుగు 75 సంవత్సరాల సేవా పతకాలను అందించారు. అలాగే 8వ ఎన్డీఆర్ఎఫ్ స్థాయి సీఎస్ఎస్ఆర్ పోటీల్లో మూడవ స్థానంలో నిలిచి రూ.50 వేలు నగదు బహుమతి సాధించిన బెటాలియన్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి శాలువాలు కప్పి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీవ్రవాదుల ప్రాబల్యం ఉండే ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ఇన్చార్జ్ అడిషనల్ కమాండెంట్ పి.సత్యం, అసిస్టెంట్ కమాండెట్లు వి. నారాయణరావు, జి.ఇలయా సాగర్, బి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
చదువులు తిరోగమనం
● అప్పర్ ప్రైమరీ స్కూళ్లకు మంగళం ● ఉమ్మడి విశాఖ జిల్లాలో 82 స్కూళ్లు రద్దు ● ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ● అనకాపల్లి జిల్లాలో అత్యధికంగా 52 స్కూళ్ల మూత ● దూరం కానున్న హైస్కూల్ చదువులు ● గ్రామాల్లో డ్రాపౌట్ కానున్న విద్యార్థులు గ్రామీణ విద్యకు విఘాతం కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగించనుంది. అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులంతా నిరుపేద కుటుంబాలకు చెందినవారు. గతంలో దూరం ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది ఐదో తరగతి తర్వాత చదువు మానేసేవారు. అందుకే గత ప్రభుత్వాలు ప్రాథమికోన్నత పాఠశాలలను అందుబాటులోకి తెచ్చాయి. కానీ, ప్రస్తుత నిర్ణయంతో గ్రామీణ విద్యార్థులకు హైస్కూల్ చదువులు మళ్లీ దూరమయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో డ్రాపౌట్లు పెరిగే అవకాశం ఉందని విద్యారంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో అప్పర్ ప్రైమరీ స్కూళ్లకు కూటమి ప్రభుత్వం మంగళం పాడుతోంది. తాజాగా 82 యూపీఎస్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయా పాఠశాలల్లోని విద్యార్థులను సమీప హైస్కూళ్లకు తరలించనున్నారు. అనకాపల్లి జిల్లాలో అత్యధి కంగా 52 స్కూళ్లను మూసివేయనుండటంతో, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు హైస్కూల్చదువులు దూరం కానున్నాయి. ఈ చర్యల వల్ల గ్రామాల్లో డ్రాపౌట్లు పెరిగే ప్రమాదం ఉందని విద్యావర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విశాఖ జిల్లా లోనూ డ్రాపౌట్లుపెరిగే అవకాశం ఉంది. విశాఖ విద్య: జిల్లాలో పద్మనాభం మండలం కొత్తకొవ్వాడ ప్రాథమికోన్నత పాఠశాలను రద్దు చేయడంతో ఇక్కడ 6, 7, 8 తరగతులు చదువుతున్న 14 మంది విద్యార్థులు 4 కిలోమీటర్ల దూరంలోని అనంతవరం జెడ్పీహెచ్ఎస్కు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే భీమునిపట్నం మండలం రెండో వార్డు మున్సిపల్ యూపీఎస్ను రద్దు చేసి 17వ వార్డులోని నెహ్రూ మున్సిపల్ హైస్కూల్కు మ్యాప్ చేశారు. ఇక్కడ 6, 7, 8 తరగతుల్లో 40 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ పాఠశాలను రద్దు చేయడం గమనార్హం. జిల్లాలో ఇలా మూడు యూపీఎస్లను రద్దు చేశారు. ఈ నిర్ణయాల వల్ల విద్యార్థులు హైస్కూల్ చదువు కోసం ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం విద్యారంగంపై ప్రయోగాల పేరుతో పాఠశాలలను మూసివేసేందుకు సిద్ధమవుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొమ్మిది రకాల పాఠశాలల పేరుతో పాఠశాల విద్య పునర్నిర్మాణం చేపట్టడం గ్రామీణ ప్రాంత విద్యార్థులను చదువుకు దూరం చేసే చర్యగా ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పాఠశాలలను అప్గ్రేడ్ చేయడం సాధారణంగా జరిగే ప్రక్రియ కాగా, ప్రస్తుత ప్రభుత్వం పాఠశాలలను డీగ్రేడ్ చేస్తోందని వారు ఆందోళన వ్యక్తం మిగతా IIవ పేజీలో -
పర్యాటక ప్రాజెక్టులపై సీఎస్ సమీక్ష
మహారాణిపేట: జిల్లాలోని పర్యాటక ప్రాజెక్టుల స్థితిగతులు, ఔత్సాహిక కంపెనీలకు భూ కేటాయింపులు, ప్రభుత్వ సహకారం వంటి అంశాలపై రాష్ట్ర పర్యాటక, గృహనిర్మాణ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ జిల్లా అధికారులతో చర్చించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూ కేటాయింపులు చేయాలని ఆదేశించారు. అలాగే పర్యాటక శాఖకు అశోక్ లేల్యాండ్, పోర్ట్లు అందిస్తున్న డబుల్ డెక్కర్ బస్సుల కోసం చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం, జిల్లాలో చేపడుతున్న గృహ నిర్మాణాల పురోగతిని సమీక్షించి, నిర్మాణాలను త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో కలెక్టర్ ఎం. ఎన్. హరేందిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, పర్యాటక శాఖ రీజినల్ డైరెక్టర్ జగదీష్, జిల్లా పర్యాటక శాఖ అధికారిణి జె. మాధవి, గృహనిర్మాణ శాఖ జిల్లా ప్రాజెక్టు అధికారి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. -
మాయాజాలం
ఇంజినీరింగ్● తమ వారికే టెండర్లు దక్కేలా ప్రణాళికలు ● టెండర్లలో పాల్గొనొద్దంటూ కాంట్రాక్టర్లకు బెదిరింపులు ● ‘ది డెక్’ నిర్వహణకు సింగిల్ టెండర్.. అయినా అప్పగించేందుకు ప్లాన్ ● ఇప్పటికే జనసేన మహిళా నేతకు కీలక కాంట్రాక్టులు అప్పగింత ● సీ హారియర్ నిర్వహణలో తక్కువకు టెండర్ వేసిన వారిని తప్పుకోవాలంటూ ఫోన్లు విశాఖ సిటీ: విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) ఇంజినీరింగ్ అధికారుల వ్యవహారశైలి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. తమ వారికి కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు ఫోన్లు చేసి మరీ కాంట్రాక్టర్ల ను బెదిరించారన్న వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. టెండర్లో పాల్గొనవద్దని ఒకరికి, టెండర్ దక్కించుకున్నా కూడా వర్క్ ఆర్డర్ ఇవ్వకుండా మరొకరికి ఇబ్బందులు కలిగిస్తున్నారనే చర్చ జరుగుతోంది. అలాగే మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అండ్ కమర్షియల్ భవన నిర్వహణకు సంబంధించి సింగిల్ టెండర్ వచ్చేలా ప్రయత్నాలు చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా సదరు టెండర్దారునికే పనులు అప్పగించేందుకు ప్రణాళిక చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఫోన్లు చేసి బెదిరింపులు వీఎంఆర్డీఏ ఇటీవల సీ హారియర్, ది డెక్ (మల్టీ లెవెల్ కార్ పార్కింగ్) వార్షిక నిర్వహణకు టెండర్లు పిలిచింది. ఈ టెండర్లలో ఒక ఇంజినీరింగ్ అధికారి రింగ్ మాస్టర్గా మారినట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ టెండర్లను దక్కించుకోవడానికి కాంట్రాక్టర్ల మధ్య పోటీ నెలకొన్నప్పటికీ, సదరు అధికారులు తమ వారికి ఈ కాంట్రాక్టులను కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తూ కాంట్రాక్టర్లను బెదిరించినట్లు విభాగంలోని సిబ్బంది అంతర్గతంగా చర్చించుకుం టున్నారు. బీచ్ రోడ్డులో ఉన్న సీ హారియర్ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం నిర్వహణకు 11 నెలలకు గాను రూ.35.05 లక్షల అంచనా వ్యయంతో వీఎంఆర్డీఏ అధికారులు ఈ ఏడాది ఏప్రిల్లో టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. గత నెల 17వ తేదీతో టెండర్ల సమర్పణకు గడువు ముగిసింది. అయితే ఈ టెండర్లో పాల్గొనవద్దని ఒక కాంట్రాక్టర్కు ఫోన్ వచ్చిందట. అయినప్పటికీ ఆ కాంట్రాక్టర్ వేరే సంస్థ పేరుతో టెండర్ వేశారు. మొత్తంగా ఈ పనుల కోసం నలుగురు కాంట్రాక్టర్లు టెండర్లో పాల్గొన్నారు. ఇందులో అత్యల్పంగా 15 శాతం తక్కువకు రూ. 29,48,036కు ఒకరు టెండర్ వేయగా, ఆ తరువాత 9.09 శాతం తక్కువకు రూ.31,86,753కు మరో కాంట్రాక్టు సంస్థ దాఖలు చేసింది. తక్కువకు టెండర్ వేసిన సంస్థకు కాకుండా రెండో స్థానంలో ఉన్న సంస్థకు టెండర్ పనులను అప్పగించేందుకు ఇంజనీరింగ్ అధికారి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ టెండర్ను వదులుకోవాలని తక్కువ బిడ్ చేసిన కాంట్రాక్టర్కు చెప్పినట్లు సమాచారం. అందుకు ఆయన అంగీకరించకపోవడంతో అప్పటి నుంచి వర్క్ ఆర్డర్ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. వీఎంఆర్డీఏలో బరితెగిస్తున్న అధికారులుసింగిల్ టెండర్.. అయినా ఓకే..! సిరిపురం జంక్షన్లో వీఎంఆర్డీఏ నిర్మించిన మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అండ్ కమర్షియల్ బిల్డింగ్ నిర్వహణకు 11 నెలలకు గాను రూ.1,33,48,537కు టెండర్లు ఆహ్వానించింది. ఈ టెండర్లో పాల్గొనేందుకు పలువురు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపారు. అయితే, ఈ ఇంజినీరింగ్ అధికారులు తమ పలుకుబడిని ఉపయోగించి, జనసేనకు చెందిన ఒక మహిళా నేతకు ఈ పనులు అప్పగించేందుకు ఒక కాంట్రాక్టర్కు ఫోన్ చేసి టెండర్లో పాల్గొనవద్దని చెప్పినట్లు సమాచారం. ఆ కాంట్రాక్టర్కు ఇప్పటికే వీఎంఆర్డీఏలో రూ. కోటి వరకు బిల్లు పెండింగ్లో ఉండగా, ఆ బిల్లు కావాలంటే ఈ టెండర్కు దూరంగా ఉండాలని బెదిరించినట్లు సిబ్బంది అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారు. దీంతో సదరు కాంట్రాక్టర్ టెండర్ దాఖలు చేయలేదు. ఈ నెల 8వ తేదీతో టెండర్ సమర్పణకు గడువు ముగిసింది. ఆశ్చర్యకరంగా, కేవలం ఒకరు మాత్రమే బిడ్ వేశారు. నిబంధనల ప్రకారం సింగిల్ టెండర్ను తిరస్కరించాల్సి ఉండగా, సదరు ఇంజనీరింగ్ అధికారి మాత్రం ఆ సింగిల్ టెండర్దారునికే పనులు అప్పగించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఉన్నతాధికారులను సైతం తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. -
మూడుముక్కలాట
● జీవీఎంసీలో తారాస్థాయికి కూటమి రాజకీయం ● టీడీపీ, జనసేన అధిష్టానం దృష్టికి పంచాయితీ ● తమకే ఇవ్వాలంటూపట్టుబడుతున్న జనసేన ● ససేమిరా అంటున్న టీడీపీ ● ఇరు పార్టీల మధ్య అగ్గిరాజేస్తున్న డిప్యూటీ మేయర్ పదవిడాబాగార్డెన్స్: జీవీఎంసీలో కూటమి రాజకీయం తారాస్థాయికి చేరింది. అవిశ్వాసం ద్వారా గత మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్లను పదవుల నుంచి తొలగించడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఆ తర్వాత మేయర్ను తొలగించి, తెలుగుదేశం పార్టీకి చెందిన పీలా శ్రీనివాస్ను కూటమి సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తాజాగా డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయానికి వస్తే, కూటమిలో విభేదాలు మొదలయ్యా యి. మేయర్ పదవిని తీసుకున్నందున, డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు కేటాయించాలని ఆ పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. ఈ వివాదం తెలుగుదేశం పార్టీ అధిష్టానం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ల దృష్టికి చేరింది. తమకంటే తమకు కావాలంటూ.. మేయర్ పదవిని తెలుగుదేశం పార్టీ తీసుకున్నందున, పొత్తులో భాగంగా డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు కేటాయించాలని ఆ పార్టీ కార్పొరేటర్లు, పెద్దలు పట్టుబడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి డిప్యూటీ మేయర్ పదవి ఇస్తే తాను రాజీనామా చేస్తానని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పార్టీ అధినేతకు బహిరంగంగా లేఖ పంపారు. దీంతో కూటమి రాజకీయం వేడెక్కింది. పొత్తు ధర్మంలో భాగంగా డిప్యూటీ మేయర్ పదవి తమకు కావాలని జనసేన పార్టీ ఎప్పటి నుంచో ఆశిస్తోంది. ఇదిలా ఉండగా, జనసేన పార్టీ నుంచి డిప్యూటీ మేయర్ పదవి కోసం ఇటీవలే వైఎస్సార్సీపీ నుంచి జనసేనలో చేరిన పెద్దిరెడ్డి ఉష, వంశీరెడ్డి, మాసిపోగు మేరీజోన్స్, ఇండిపెండెంట్గా గెలిచి ఆ పార్టీలో చేరిన మహ్మద్ సాదిక్, కందుల నాగరాజుతో పాటు ఆ పార్టీ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ భీశెట్టి వసంతలక్ష్మి కూడా పోటీలో ఉన్నారు. తాడోపేడో.. డిప్యూటీ మేయర్ ఒక్క పోస్టు కోసం రెండు పార్టీలు పట్టువిడవకుండా ఉన్నాయి. ఈ విషయంలో తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నాయి. డిప్యూటీ మేయర్ తమకే ఇవ్వాలని జనసేన గట్టిగా పట్టుబడుతుండగా, తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ పోస్టును వదులుకోవడానికి సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఈ పోస్టు కోసం ఈ నెల 19న ఎన్నిక జరగనుంది. మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకోవడంతో, డిప్యూటీ మేయర్ తమకు కేటాయించాలని జనసేన కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. లేనిచో రాజీనామా చేస్తామని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ శుక్రవారం పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు లేఖ పంపడంపై కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. అంత సీన్ లేదు.. తెలుగుదేశం పార్టీకి చెందిన కార్పొరేటర్కే డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వాలంటూ సాక్షాత్తు నూతనంగా ఎన్నికై న మేయరే అధిష్టానానికి లేఖ పంపినట్టు భోగట్టా. వీరిద్దరి మధ్య నేను అర్హురాలినేనంటూ బీజేపీ కార్పొరేటర్ కూడా రేస్లో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కూటమిలో అంతర్గత తగాదాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి ఈ కుమ్ములాటలే నిదర్శనం. నువ్వా..నేనా? డిప్యూటీ మేయర్ పదవిపై పార్టీల అధినాయకులు తేల్చకపోవడంతో ఇరు పార్టీల్లోనూ ఆశావాహుల సంఖ్య పెరిగింది. టీడీపీలో 10 మంది వరకు ఈ పదవి కోసం పోటీ పడతుండగా, జనసేనలో ఉన్న వారంతా (ఒక్క మూర్తి యాదవ్ తప్ప..ఎందుకంటే మూర్తి యాదవే తనను మినహాయించి ఎవరికై నా ఇవ్వాలని పవన్ కల్యాణ్కు పంపిన లేఖలో పేర్కొన్నారు) రేసులో ఉన్నట్టు తెలిసింది. ఎవరి స్థాయిలో వారు సీనియర్ల ద్వారా అధినాయకుడి ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా ఇరు పార్టీల నుంచి ఇద్దరు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. టీడీపీ నుంచి 76వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావుకు డిప్యూటీ మేయర్ కట్టబెట్టాలని ఆ పార్టీలో పలువురు కార్పొరేటర్లు భావిస్తూ..ఆ పేరు ప్రతిపాదించినట్టు సమాచారం. ఇక జనసేన విషయానికొస్తే..ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల రమేష్బాబు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మేయర్గా టీడీపీ నేత ఉండడంతో డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ ఈ పదవిని జనసేన వదులుకునే ప్రసక్తే లేదంటూ తెగేసి చెబుతున్నారు. జనసేన నుంచి ఎందరో ఆశావాహులున్నా..ఎమ్మెల్యేలు మాత్రం ఉషశ్రీ పేరు పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఏది ఏమైనా కూటమిలో డిప్యూటీ మేయర్ పదవి పెద్ద రాద్ధాంతం చేస్తోంది. -
అంతర్జాతీయ యోగా దినోత్సవ వేదికగా విశాఖ
సాక్షి, విశాఖపట్నం: ప్రధాని నరేంద్రమోదీ వచ్చే నెలలో విశాఖలో పర్యటించనున్నారు. జూన్ 21న విశాఖ వేదికగా ‘యోగా ఫర్ వన్ ఎర్త్.. వన్ హెల్త్’థీమ్తో నిర్వహించనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 6 నుంచి 8 గంటల మధ్యలో సుమారు 45 నిమిషాల పాటు జరగనున్న యోగాసనాల కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. జిల్లా వ్యాప్తంగా గుర్తించిన ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, యోగా అభ్యాసకులు, ఉద్యోగులు, సాధారణ పౌరులు, డిఫెన్స్ స్టాఫ్, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, క్రీడాకారులు, ఇతర సంస్థల కార్యకర్తలు సహా సుమారు 2.5 లక్షల మంది భాగస్వామ్యం కానున్నారు.ఇందుకోసం జిల్లా యంత్రాంగం 24 చదరపు అడుగులకు ఒకరు చొప్పున కూర్చునేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి చోటా 3 నుంచి 4 వేల మంది యోగాసనాలు వేసేలా అనువైన మైదానాలను గుర్తిస్తున్నారు. ప్రధానితో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రముఖులు స్థానిక ఆర్కే బీచ్ రోడ్ లేదా ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరిగే ప్రధాన వేడుకలో భాగస్వామ్యం కానున్నారు. ఈ నెల 29 నుంచి నాలుగు వారాల పాటు యోగా దినోత్సవంపై ప్రచారం చేస్తారు. జూన్ 5 నుంచి వారం రోజుల పాటు ప్రతి నియోజకవర్గంలోనూ, 17 నుంచి విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రతి ఒక్కరినీ ప్రధాని కార్యక్రమంలో భాగస్వామ్యం చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. -
లారీని ఢీకొని ఆటోడ్రైవర్ దుర్మరణం
పీఎంపాలెం: జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కూరగాయలు రవాణా చేస్తున్న ఆటో డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సీఐ బాలకృష్ణ వెల్లడించిన వివరాలివి. ఆనందపురం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన బంగారు రమణ(41) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ప్రతి రోజూ మాదిరిగానే గురువారం తెల్లవారుజామున ఆనందపురం కూరగాయల మార్కెట్ నుంచి కూరగాయలను తన ఆటోలో వేసుకుని నగరంలోని పెదవాల్తేరుకు బయలుదేరాడు. తెల్లవారుజామున సుమారు 4.30 గంటల సమయంలో ఎండాడ కూడలికి సమీపంలోని వరాహగిరి కాలనీ ఎదురుగా జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రమణ నడుపుతున్న ఆటో ముందు అతివేగంగా వెళుతున్న లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేశాడు. ఊహించని ఈ పరిణామానికి రమణ తన ఆటోను అదుపు చేయలేక లారీని బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన రమణ అక్కడికక్కడే మృతి చెందాడు. అదే ఆటోలో ప్రయాణిస్తున్న నరసింగరావు అనే వ్యక్తి స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. మృతుడి భార్య సత్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు. -
నైపుణ్యతకు మెరుగు!
ఆర్ట్ శిక్షణ పొందుతున్న మహిళలుక్రాఫ్ట్ శిక్షణ పొందుతున్న మహిళలుఉపాధి కోసం.. నా డిగ్రీ చదువు అనివార్య కారణాలతో మధ్యలోనే ఆగిపోయింది. నాకు ముగ్గురు పిల్లలు. క్రాఫ్ట్లో ఇప్పటికే లోయర్, హయ్యర్ కంప్లీట్ చేశాను. టీటీసీ పూర్తి చేస్తే ప్రైవేటు స్కూళ్లలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నేను నేర్చుకున్న విద్యలో మరింత నైపుణ్యత పొందుతూ.. ఇంటి వద్ద మరి కొంతమందికి శిక్షణ ఇస్తున్నాను. – కర్రి చంద్రిక, గవరపాలెం, అనకాపల్లి జిల్లా విశాఖ విద్య: నిరుద్యోగ యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తోంది. ఉన్నత విద్యను అభ్యసిస్తూనే.. సత్వర ఉపాధి లక్ష్యంగా నైపుణ్యతతో కూడిన స్వల్పకాలిక టెక్నికల్ కోర్సుల వైపు ఆసక్తి కనబరుస్తోంది. ఇటువంటివారి కోసం విద్యాశాఖ ఏటా వేసవిలో ‘టీచర్ ట్రైనింగ్ సర్టిఫికెట్’(టీటీసీ) కోర్సులను ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. 42 రోజుల వ్యవధి గల ఈ కోర్సుల్లో ప్రవేశానికి పదో తరగతి ఉత్తీర్ణులై, 18 నుంచి 42 ఏళ్ల వరకు వయస్సు గల వారు అర్హులు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ కోర్సులను అభ్యసించేందుకు 180 మంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. వీరి కోసం నగరంలోని ప్రభుత్వ క్వీన్ మేరీ హైస్కూల్లో ప్రత్యేక క్యాంప్ను ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు. ఎన్ఈపీ అమలుతో టీటీసీకి డిమాండ్ విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏటా వేసవిలో టీచర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ కోర్సు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు అడ్మిషన్లు అంతంత మాత్రంగానే ఉండేవి. జాతీయ విద్యావిధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో తప్పనిసరిగా ఆర్ట్, క్రాఫ్ట్ సబ్జెక్టు టీచర్లను నియమించాలనే నిబంధన పెట్టారు. టీటీసీ కోర్సు చేసిన వారు మాత్రమే ఆయా పోస్టులకు అర్హులు కావటంతో డిమాండ్ పెరిగింది. మానసిక, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే అంశాలతో కూడిన సబ్జెక్టులు కావటంతో వచ్చే ఏడాది నుంచి కోర్సు వ్యవధి 42 రోజులకు బదులుగా 6 నెలలు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఉత్తమశిక్షణ ఈనెల ఒకటో తేదీన ప్రారంభమైన శిక్షణ తరగతులు జూన్ 11వ తేదీ వరకు జరగనున్నాయి. ప్రతీ రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరగతులను నిర్వహిస్తున్నారు. ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్లో శిక్షణ ఇచ్చేందుకు ఆరుగురు టీచర్లు.. సైకాలజీ, స్కూల్ అడ్మిస్ట్రేషన్ అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు మరో ఇద్దరు టీచర్లను నియమించారు. వీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నైపుణ్యతతో కూడిన శిక్షణ అందిస్తున్నారు. స్వయం ఉపాధి వైపు అడుగు టీటీసీ కోర్సుపై ఆసక్తి చూపుతున్న యువత ఆర్ట్, క్రాఫ్ట్ శిక్షణతో ఉద్యోగ అవకాశాలు వేసవిలో 42 రోజుల పాటు శిక్షణా తరగతులు బొమ్మలు వేయడం ఇష్టం నేను బీటెక్ కంప్యూటర్ సైన్సు పూర్తి చేశాను. ఎంటెక్లో చేరేందుకు ఎంట్రన్స్ రాస్తున్నాను. చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం అంటే ఇష్టం. నాన్న ప్రోత్సాహంతో ఆర్ట్లో శిక్షణ పొందుతున్నాను. ఆర్ట్ కోర్సులో లోయర్, హయ్యర్ ఇప్పటికే పూర్తి చేశాను. మరింత నైపుణ్యత పొందేందుకు టీటీసీ శిక్షణ ఉపయోగపడుతుంది. –ఎం.పీ.శ్లేఘన, సుజాతనగర్, విశాఖ జిల్లా -
జీవీఎంసీ ఆర్పీ ఆత్మహత్య
అల్లిపురం: భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. టూటౌన్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి. జీవీఎంసీ 34వ వార్డులో ఆర్పీగా పని చేస్తున్న సాయి(29), గండిబోయిన సతీష్ తొమ్మిదేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఆరేళ్ల బాబు ఉన్నాడు. సతీష్ పూర్ణామార్కెట్లో ఒక దుకాణంలో పని చేస్తున్నాడు. అతను జనసేన కార్యకర్త. వారం రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో సాయికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్లో మాట్లాడిన ఆమె గదిలోకి వెళ్లి ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల ఫిర్యాదు మేరకు టూటౌన్ సీఐ వీవీసీఎం ఎర్రంనాయుడు తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలే కారణమా? భర్త జనసేన కార్యకర్త -
నిరంతర విద్యుత్ సరఫరాయే లక్ష్యం
సాక్షి, విశాఖపట్నం: ఈపీడీసీఎల్ పరిధిలోని అన్ని సర్కిళ్లలో నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామని ఈపీడీసీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్ టీవీ సూర్యప్రకాష్ అన్నారు. ఇటీవల డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. డిస్కమ్ పరిధిలోని వివిధ సర్కిళ్లలో సుడిగాలి పర్యటనలు చేశారు. ప్రాజెక్టుల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ’సాక్షి’తో మాట్లాడుతూ విద్యుత్ శాఖలో వివిధ హోదాల్లో 35 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉందన్నారు. 2021లో పదవీ విరమణ చేసినప్పటికీ, ప్రస్తుతం డైరెక్టర్గా తిరిగి బాధ్యతలు చేపట్టినట్లు సూర్యప్రకాష్ తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టినట్లు వెల్లడించారు. సర్కిళ్ల వారీగా వినియోగదారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, సరఫరాలో లోపాలపై నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఈ నివేదికల ఆధారంగా అవసరమైన మార్పులు చేసి, నిరంతరాయ విద్యుత్ సరఫరాకు చర్యలు చేపడతామన్నారు. రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ను అందించేందుకు కృషి చేస్తామని, గ్రామీణ ప్రాంతాలకు 24 గంటలూ మూడు ఫేజుల విద్యుత్ సరఫరా అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల తరచూ జరుగుతున్న విద్యుత్ ప్రమాదాలను అరికట్టేందుకు, ఉన్నతాధికారుల సూచనల మేరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో విద్యుత్ కోటా కంటే డిమాండ్ ఎక్కువగా ఉందని, రోజూ 18 నుంచి 19 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోందన్నారు. గాలి, వర్షాల కారణంగా వైర్లు తెగిపడటం, స్తంభాలు కూలిపోవడం వంటి అత్యవసర పరిస్థితులు మినహా, మిగతా సమయాల్లో ఈపీడీసీఎల్ పరిధిలో అంతరాయాలు లేకుండా సరఫరా చేస్తున్నట్లు వివరించారు. నైరుతి రుతుపవనాలు త్వరగా ప్రవేశించే అవకాశం ఉన్నందున.. వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు ఇప్పటికే ప్రారంభించామన్నారు. ప్రతి లైన్ను క్షుణ్ణంగా పరిశీలించి, లోపాలను సరిదిద్దుతున్నామని.. వర్షాకాలంలో సరఫరాలో ఎలాంటి సమస్యలు లేకుండా ప్రణాళికలు అమలు చేస్తామని సూర్యప్రకాష్ వివరించారు. ఈపీడీసీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్ సూర్యప్రకాష్ -
కూటమి మాస్టర్ ప్లాన్
● ఈ నెల 22 నుంచి జూన్ 21 వరకు మళ్లీ అభ్యంతరాల స్వీకరణ ● ఇందులో ప్రజాప్రతినిధులప్రయోజనాలకు పెద్దపీట ● వారి స్థిరాస్తి వ్యాపారాలకు అనుగుణంగా సవరణలకు ప్లాన్ ● నేతలు చెప్పినట్లే మార్పులు చేయాలని అధికారులకు మౌఖిక ఆదేశాలు? ప్రజాప్రతినిధులకు లబ్ధి చేకూరేలా? ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులకు లబ్ధి చేకూర్చాలన్న ఆలోచనతోనే వీఎంఆర్డీఏ బృహత్తర ప్రణాళిక–2041 పునః పరిశీలనకు సిద్ధమవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాల పేరుతో కూటమి నాయకులు సూచించిన మార్పులు, చేర్పులకే పెద్ద పీట వేయాలన్న నిర్ణయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా వారు సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకోవడానికి ఈ ప్రక్రియను చేపడుతున్నట్లు సమాచారం. వీరి స్థిరాస్తి వ్యాపారాలు, వ్యక్తిగత ఆస్తుల విలువ పెంచుకునేందుకు మాస్టర్ ప్లాన్ రహదారుల ప్రణాళికలను మార్పులు చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు కూటమిలో చర్చ జరుగుతోంది. ప్రధానంగా మధురవాడ నుంచి ఆనందపురం మధ్యలోను, అలాగే అనకాపల్లిలో పలు చోట్ల మార్పులు, చేర్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే మాస్టర్ ప్లాన్ మొత్తంగా మార్పు చేసే అవకాశం లేదని అధికారులు తేల్చి చెబుతున్నారు. కేవలం వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి శాసీ్త్రయంగా ఉన్న వాటిని మాత్రమే మార్పులు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. విశాఖ సిటీ: కూటమి ‘మాస్టర్’ ప్లాన్ వేస్తోంది. తమ వారికి లబ్ధి చేకూరేలా బృహత్తర ప్రణాళికలో సవరణలకు సిద్ధమైంది. ప్రజాప్రతినిధుల ప్రయోజనాలకు పెద్ద పీట వేసేందుకు అడుగులు వేస్తోంది. చెల్లికి పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ.. అన్నట్లు.. 2021లో పూర్తయిన విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(వీఎంఆర్డీఏ) బృహత్తర ప్రణాళిక–2041 పునఃపరిశీలన చేపట్టాలని నిర్ణయించింది. గతంలో అశాసీ్త్రయంగా మాస్టర్ప్లాన్ రూపొందించారన్న నెపంతో అయిపోయిన పెళ్లికి మళ్లీ బాజాలు వాయించడానికి పూనుకుంది. కేవలం కూటమి నేతల స్థిరాస్తి వ్యాపారాలకు మేలు జరిగేలా మార్పులు, చేర్పులకు ఈ నెల 22 నుంచి మళ్లీ మాస్టర్ ప్లాన్పై అభ్యంతరాల స్వీకరణ ప్రారంభించనుంది. 2021లోనే మాస్టర్ ప్లాన్ పూర్తి వీఎంఆర్డీఏ పరిధిలో ప్రజల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో బృహత్తర ప్రణాళిక–2041కు ఆమోద ముద్ర వేసింది. వాస్తవానికి 2011లో ఈ ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. ఏళ్లు గడిచినా అది పూర్తి కాకపోవడంతో 2016లో ప్రైవేట్ కన్సల్టెంట్ సంస్థ లీ అసోసియేట్స్కు రూ.10 కోట్లకు ఆ బాధ్యతను అప్పగించారు. అయినప్పటికీ 2019కి కూడా అది పూర్తి కాలేదు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాస్టర్ప్లాన్పై దృష్టి సారించింది. మాస్టర్ ప్లాన్ రూపకల్పన సమయంలో వీఎంఆర్డీఏ పరిధిలో 46 మండలాలు, 1,312 గ్రామాలున్నాయి. ప్రణాళికను రూపొందించేందుకు విశాఖపట్నంలోని 5 వర్గాలు, 45 రెవెన్యూ, 55 మత్స్యకార గ్రామాలు, 13 వార్డులను పరిగణనలోకి తీసుకొని.. సలహాలు, సూచనలు ఆయా ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా వివరాలు సేకరించారు. అలాగే విజయనగరం జిల్లాలోని 48 రెవెన్యూ, 19 మత్స్యకార గ్రామాలు, 5 వార్డులు, రెండు వర్గాల ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇందుకోసం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ, అభ్యంతరాల స్వీకరణలో మొత్తంగా 17,460 అభ్యంతరాలు, సలహాలు వచ్చాయి. వీఎంఆర్డీఏ, రెవెన్యూ, ఇతర సంబంధిత విభాగాల అధికారులతో సంయుక్త తనిఖీలు, సందర్శనలు నిర్వహించి వాటిన్నింటినీ పరిశీలించారు. మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా.. ఆ ప్రాంత భౌగోళిక స్థితిగతులను అనుసరించి విభిన్న కోణాల్లో ఆలోచన చేసి ముసాయిదా మాస్టర్ప్లాన్ను సిద్ధం చేశారు. దానికి ఎటువంటి అభ్యంతరాలు రాకపోవడంతో 2021 నవంబర్ 8న వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్–2041కు అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. వీఎంఆర్డీఏ బృహత్తర ప్రణాళిక–2041 పునఃపరిశీలన షురూ.. మళ్లీ అభ్యంతరాల స్వీకరణ వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్పై ప్రతిపక్షంలో ఉన్న సమయంలో టీడీపీ నాయకులు ఆరోపణలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్లాన్లో మార్పులు చేస్తామని అప్పుడే ప్రకటించారు. అన్నట్లుగానే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మాస్టర్ ప్లాన్–2041ను సమగ్రంగా సమీక్షించాలని నిర్ణయించింది. నాలుగు నెలల్లో కొత్త మాస్టర్ప్లాన్ను తీసుకువస్తామని అమాత్యులు సైతం ప్రకటించారు. ఇందుకు అనుగుణంగానే బృహత్తర ప్రణాళికను పునః పరిశీలనకు తేదీని ఖరారు చేశారు. ఈ నెల 22 నుంచి జూన్ 21వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించాలని నిర్ణయించారు. వీఎంఆర్డీఏ పరిధిలో ఉన్న ప్రజలు, భాగస్వాములు, సంబంధిత ప్రభుత్వ శాఖల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించనున్నారు. మాస్టర్ ప్లాన్– 2041లో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే స్వయంగా గానీ, పోస్టు లేదా ఆన్లైన్ ద్వారా కూడా తెలపవచ్చని వీఎంఆర్డీఏ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ ప్రకటించారు. ప్రజలందరూ మొబైల్ ద్వారా కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు. -
రెగ్యులర్ vs ఎయిడెడ్
విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీలో ఆధిపత్య పోరు మళ్లీ రాజుకుంటోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వర్సిటీలోని కొంతమంది ఆచార్యులు విద్యార్థులకు పాఠాలు చెప్పడం మానేసి, పాలనలో పెత్తనం కోసం ఆరాటపడుతున్నారు. రాష్ట్రంలోని వేర్వేరు ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల నుంచి ఫారిన్ సర్వీసుపై ఏయూకు వచ్చిన అధ్యాపకుల పట్ల వర్సిటీలోని ఓ వర్గం వ్యవహరిస్తున్న తీరు ఇందుకు నిదర్శనం. 1000 మందికి పైగా అధ్యాపకులు ఉండాల్సిన ఏయూలో ప్రస్తుతం 140 మంది మాత్రమే రెగ్యులర్ ప్రాతిపదికన పని చేస్తున్నారు. దీంతో కాంట్రాక్టు, అతిథి అధ్యాపకులతోనే కాలేజీల్లో పాఠాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ సేవలను వినియోగించుకోవాల్సింది పోయి.. తామేదో పరాయి దేశం నుంచి వచ్చినట్లుగా, వెళ్లిపోండంటూ కొంతమంది కావాలని రాద్ధాంతం చేస్తున్నారని ఎయిడెడ్ అధ్యాపకులు ఆవేదన చెందుతున్నారు. క్యాంపస్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, డీన్లతో మంగళవారం జరిగిన వైస్ చాన్సలర్ సమీక్షలోనూ ఓ వర్గం ఇదే అంశంపై పట్టుబట్టడం.. ఇప్పుడు వర్సిటీలో హాట్ టాపిక్గా మారింది. రెగ్యులర్ అధ్యాపకుల కొరతతో మల్లగుల్లాలు ఏయూలో రెగ్యులర్ అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో 2023 జూన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎయిడెడ్ కాలేజీల నుంచి ఫారిన్ సర్వీసు కింద 80 మంది అధ్యాపకులను తీసుకున్నారు. వర్సిటీ పాలక మండలి ఆమోదంతో నిర్ణయం తీసుకున్నందున ఉన్నత విద్యామండలి అధికారులు సైతం ఇందుకు అనుమతించారు. కాగా.. ఎయిడెడ్ అధ్యాపకుల రాకను ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది నచ్చక దాదాపు 40 మంది వెనక్కి వెళ్లిపోయారు. మిగిలిన వారిలో ఒకరు మృతి చెందగా, మరొకరు ఇటీవలే మాతృ సంస్థకు వెళ్లారు. ప్రస్తుతం 38 మంది ఎయిడెడ్ నుంచి వచ్చిన అధ్యాపకులు పనిచేస్తున్నారు. క్యాంపస్ కాలేజీల్లోని ఆయా విభాగాల్లో తరగతుల నిర్వహణలో వీరంతా కీలకంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఆధిపత్య పోరు ఎయిడెడ్ అధ్యాపకులను వెనక్కి పంపించేయాలని ఓ వర్గం పట్టు వైస్ చాన్సలర్ సమీక్షలోనూ ఇదే చర్చ పాఠాలు పక్కన పెట్టి.. పెత్తనంపై ఆరాటం ఏయూలో అధ్యాపకుల తీరుపై విమర్శలు తెరపైకి హయ్యర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ లేఖ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎయిడెడ్ అధ్యాపకులను వెనక్కి పంపించేలా ఓ వర్గం ఒత్తిడిచేస్తూనే ఉంది. కానీ ఫారిన్ సర్వీసుపై వచ్చినందున 2026 జూన్ వరకు వారికి ఇక్కడ పనిచేసే అవకాశం ఉంది. వర్సిటీనే వేతనాలు చెల్లిస్తున్నందున, వారి సేవలను కొనసాగించాలనుకుంటున్నారా? లేదా? అంటూ మార్చిలో హయ్యర్ ఎడ్యుకేషన్ డైరక్టర్ ఇక్కడి అధికారులకు లేఖ రాశారు. వందేళ్ల ఉత్సవాలు నిర్వహిస్తున్న తరుణంలో వారి విషయంలో నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం కావాలని వర్సిటీ అధికారులు ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలిసింది. ఇదే అదునుగా భావించిన వర్సిటీలోని ఓ వర్గం ఎయిడెడ్ అధ్యాపకులను వెనక్కి పంపించేయాల్సిందేనని ప్రస్తుత వైస్ చాన్సలర్పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. వారి వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని సామాజిక మాధ్యమాల వేదికగా నిరసన గళం వినిపిస్తున్నారు. ఖాళీల భర్తీ ఇప్పట్లో లేనట్లేనా? రాష్ట్రంలోని ఆంధ్ర కేసరి యూనివర్సిటీలో టీచింగ్ 10 మంది, నాన్ టీచింగ్ 20 మంది అవసరం ఉందని, ఆన్ డ్యూటీ బేసిస్/ఫారిన్ సర్వీసు కింద పనిచేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని కాలేజీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నారాయణ భరత్ గుప్తా ఈ నెల 8న సర్క్యులర్ జారీ చేశారు. ఇది తమకు కొంత ఊరటనిచ్చే విషయమేనని ఏయూలో ఫారిన్ సర్వీసు కింద పనిచేస్తున్న ఎయిడెడ్ అధ్యాపకులు అంటున్నారు. అయితే ఆయా యూనివర్సిటీలు 2025–26 విద్యా సంవత్సరానికి తమ అవసరాల మేరకు తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలని సూచించడం బట్టి, ఇప్పట్లో ప్రభుత్వం రెగ్యులర్ ఖాళీల భర్తీపై దృష్టి సారించే ఆలోచనలో లేదని అర్థమవుతోంది. -
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు
అధికారులతో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ సమీక్ష మహారాణిపేట: జూన్ 21న విశాఖ వేదికగా జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టరేట్ మీటింగ్ హాల్లో అధికారులతో గురువారం ఆయన సమీక్షించారు. జూన్ 21న ఉదయం 6 నుంచి 8 మధ్య 45 నిమిషాలు పాటు కార్యక్రమం జరగనుందన్నారు. జిల్లా వ్యాప్తంగా గుర్తించిన ప్రాంతాల్లో సుమారు 2.5 లక్షల మంది భాగస్వామ్యమయ్యేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రముఖులు ఆర్కే బీచ్ రోడ్ లేదా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే ప్రధాన వేడుకల్లో భాగస్వామ్యం అవుతారని, దానికి సంబంధించిన ఏర్పాట్లు పక్కాగా చేయాలని నిర్దేశించారు. ప్రత్యామ్నాయ వేదికలుగా ఏయూ కన్వెన్షన్ హాలు, మద్దిలపాలెం కాకతీయ ఫంక్షన్ హాల్ లేదా స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలను గుర్తించి తగు ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు, క్రీడాకారులకు, ప్రధాన వేదికల వద్ద భాగస్వామ్యం అయ్యే వారికి ముందస్తు శిక్షణ అందించాలన్నారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, డీసీపీ మేరీ ప్రశాంతి, జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీశంకర్, ఏడీసీపీ రాజ్ కమల్, ప్రత్యేకాధికారులు సత్తిబాబు, సుధాసాగర్, శేషశైలజ, మధుసూదన్ రావు, డీఈవో ప్రేమకుమార్, ఆర్ఐవో, ఇతర విభాగాల జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
జిల్లాలో 10 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం
మహారాణిపేట: గ్రీన్ విశాఖ మిషన్లో భాగంగా జిల్లాలో పది లక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్ తెలిపారు. గురువారం పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖలకు ఇచ్చిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. వీఎంఆర్డీఏ ద్వారా లక్ష మొక్కలు, జీవీఎంసీ 2.50 లక్షలు, అటవీ శాఖ 84 వేలు, డూమా 60 వేలు, పరిశ్రమల శాఖ 50 వేలు, విశాఖ పోర్టు 25 వేలు, విద్యాశాఖ 12 వేలు, ఇతర శాఖల ద్వారా 4.28 లక్షల మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 6 నుంచి వివిధ దశల్లో ఈ మొక్కల్ని నాటేలా ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో డూమా పీడీ ఆర్.పూర్ణిమాదేవి, డీఎఫ్వో మంగమ్మ, జీవీఎంసి హార్టికల్చర్ డీడీ దామోదర్, వీఎంఆర్డీఏ డీఎఫ్వో శివాని, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఆదిశేషు, పోర్టు హార్టికల్చర్ అధికారి రాధిక, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ప్రాజెక్టుల వేగవంతంపై ప్రత్యేక దృష్టి
సాక్షి, విశాఖపట్నం: తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) పరిధిలో ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, వినియోగదారులకు నాణ్యమైన, మెరుగైన విద్యుత్ సేవలందిస్తామని సంస్థ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ టి.వనజ అన్నారు. ఇటీవలే డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఆమె.. డిస్కమ్ పరిధిలోని పలు సర్కిళ్లలో పర్యటించి, ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ’సాక్షి’తో మాట్లాడుతూ విద్యుత్ సంస్థల్లోని అన్ని విభాగాల్లో 37 ఏళ్ల పాటు సేవలందించిన అనుభవం తనకుందన్నారు. ప్రస్తుతం ఈపీడీసీఎల్లో జరుగుతున్న పనులపై సమగ్రంగా అధ్యయనం చేస్తున్నానని, చేపట్టిన పనులన్నీ చురుగ్గా సాగుతున్నాయని వెల్లడించారు. నగర పరిధిలో రెండో దశలో భాగంగా రూ.909 కోట్ల వ్యయంతో 1,876 కిలోమీటర్ల మేర భూగర్భ విద్యుత్ వ్యవస్థ పనులు జరుగుతున్నాయని, ఇప్పటివరకు 120 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఆర్ఎంఈఎస్, డీటీఆర్స్ మొదలైన వాటిపై కసరత్తు జరుగుతోందని, ఆగస్ట్ 15 నాటికి పనులు పూర్తి చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అయితే తవ్వకాల కోసం జీవీఎంసీ నుంచి అనుమతులు, ఫారెస్ట్ క్లియరెన్స్ల కారణంగా కొంత జాప్యం జరుగుతోందన్నారు. సమయం తక్కువగా ఉన్నందున పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల విభజన పనులపై సమీక్ష నిర్వహించామని, ఫీడర్ బైఫరకేషన్ పనుల్లో ప్యాకేజీ–1 గత నెలాఖరు చివరి నాటికి 27 శాతం పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన పనులను పూర్తి చేసేందుకు సర్కిళ్ల వారీగా లక్ష్యాలను నిర్దేశించామన్నారు. ఇండోర్, అవుట్డోర్ సబ్స్టేషన్ల ఏర్పాటుపైనా ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. రాబోయే వర్షాకాలంలో పనులకు ఆటంకం కలిగే అవకాశం ఉన్నందున.. ముందుగానే పనుల వేగాన్ని పెంచాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘పీఎం జుగా’(ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్) పథకం కింద ఎస్టీ గ్రామాలకు విద్యుత్ వెలుగులు అందించేందుకు కృషి చేస్తున్నామని డైరెక్టర్ వనజ వివరించారు. ఆగస్ట్ 15 నాటికి రెండో దశ భూగర్భ విద్యుత్ వ్యవస్థ పూర్తి చేస్తాం ఈపీడీసీఎల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ వనజ -
జూలై 5న జాతీయ లోక్ అదాలత్
విశాఖ లీగల్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలోని అన్ని న్యాయస్థానాల్లో జూలై 5వ తేదీన జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు తెలిపారు. ఈనెల 10న జరగాల్సిన ఈ అదాలత్ వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. న్యాయ స్థానాల్లో ఉన్న పెండింగ్ కేసులు, సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటార్ ప్రమాదాల నష్ట పరిహారాల కేసులు, సెక్షన్ 138 నిరాధరణకు గురైన చెక్కులు కేసులు, బ్యాంకు, మనీ రికవరీ కేసులు, ల్యాండ్ అక్విజిషన్ కేసులు, కార్మిక, కుటుంబ తగాదాలు (విడాకులు కేసులు కాకుండా), పారిశ్రామిక వివాదాలు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు విశాఖలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, న్యాయ సేవా సదన్లో లేదా 0891–2560414, 2575046 ఫోన్ నెంబర్లలో, మండల న్యాయ సేవా సంఘాల్లో సంప్రదించాలన్నారు. -
ఏపీకి బిగ్ అలర్ట్.. ఐదు రోజుల పాటు భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రానున్న ఐదు రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని పేర్కొంది. నేడు అల్లూరి, మన్యం, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కేంద్రకృతమైంది. నిన్న శ్రీకాకుళం, ఏలూరు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది.కాగా, తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఇక, గురువారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్లో వర్షం కురుస్తోంది. మరో రెండు గంటల పాటు పలుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఏపీలో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఓవైపు ఎండలు.. మరోవైపు వానలు దంచికొడుతున్నాయి. మరో ఐదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక, నిన్న శ్రీకాకుళం జిల్లాల్లో 5.3 సెంమీ వర్షపాతం నమోదైంది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి పలు చోట్ల భారీ వర్షం కురిసింది. రాప్తాడు, కందుకూరు, ఆకుతోటపల్లి వద్ద కాలనీలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను పోలీసులు, ఫైర్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
చేయి విరిగిందని వెళితే.. ప్రాణం పోయింది
తగరపువలస(విశాఖపట్నం): వాష్రూమ్లో జారిపడి చేయి విరిగిన ఓ మహిళ తొలుత సంగివలసలోని అనిల్ నీరుకొండ(ఎన్ఆర్ఐ) ఆసుపత్రిలో చికిత్స పొంది. అక్కడ పరిస్థితి విషమించడంతో నగరంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. తన భార్య మృతికి అనిల్ నీరుకొండ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆమె భర్త జనార్థన్ ఆరోపించారు. కుటుంబసభ్యులతో ఆసుపత్రి ముందు బైఠాయించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వివరాలివి. భీమిలి మండలం చిప్పాడలో నివాసముంటున్న దివీస్ ఉద్యోగి జనార్థన్ భార్య యర్రంశెట్టి రేవతి ఈ నెల 10న ప్రమాదానికి గురైంది. వెంటనే ఆమెను ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చేర్పించగా.. అక్కడ వైద్యం వికటించి అపస్మారక స్థితికి చేరుకుంది. మెరుగైన వైద్యం కోసం జనార్థన్ ఆమెను నగరంలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి అత్యవసరంగా తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె బుధవారం మృతి చెందింది. దీంతో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. రేవతి మృతదేహంతో ఎన్ఆర్ఐ ఆసుపత్రి ఎదుట ఆందోళన జరిగే అవకాశం ఉందని ముందే ఊహించిన సిబ్బంది.. మృతదేహాన్ని హుటాహుటిన కేజీహెచ్కు తరలించారు. అక్కడ పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం ఆమె స్వగ్రామమైన అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొవ్వూరుకు మృతదేహాన్ని పంపే ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో కేజీహెచ్ వద్ద ఆమె భర్త ఆందోళనకు సన్నద్ధమయ్యారు. తన భార్య అపస్మారక స్థితికి చేరుకోవడానికి కారణమైన వైద్యురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రిని తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. జనార్థన్కు సంఘీభావంగా ఆయన స్వగ్రామానికి చెందిన బంధువులు, దివీస్ ఉద్యోగులు, పలు ప్రజా సంఘాల నాయకులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సాయంత్రం 8 గంటల తర్వాత వారంతా కలిసి సంగివలసలోని ఆసుపత్రి ఎదుట పెద్ద ఎత్తున బైఠాయించి ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆసుపత్రి యాజమాన్యం ఆందోళనకారులు, బాధితుల తరపున వచ్చిన ప్రజా సంఘాల ప్రతినిధులతో చర్చలు ప్రారంభించింది. భీమిలి పోలీసులు ఆసుపత్రి వద్ద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
అంకితభావంతో ‘స్వచ్ఛాంధ్ర’ నిర్వహించాలి
మహారాణిపేట: ప్రతి నెల మూడో శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను అంకితభావంతో నిర్వహించాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల నిర్వహణపై బుధవారం తన చాంబర్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలు, దేవాలయాలు, చర్చిలు, మసీదులు, పార్కులు, బస్, రైల్వే స్టేషన్లు, వసతి గృహాలు, ఆసుపత్రులు తదితర ప్రాంతాల్లో ఈ నెల మూడో శనివారం స్వచ్ఛందంగా పరిశుభ్రతా చర్యలు చేపట్టాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు. వేసవిలో వడగాలుల నుంచి ప్రజలు ఉపశమనం పొందేలా, పచ్చదనం పెంపొందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కార్మికులు, వీధి వ్యాపారులు, చిన్న పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పర్యాటక ప్రాంతాల్లో అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచాలని పేర్కొన్నారు. టెర్రస్ గార్డెనింగ్, తడిపొడి చెత్త నిర్వహణ, పబ్లిక్ టాయిలెట్ల వినియోగం, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కాన్ఫరెన్స్లో సీఎంవో నరేష్కుమార్, డిపివో శ్రీనివాసరావు, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
మశకం వేటకుహైటెక్ ప్లాన్
డాబాగార్డెన్స్: దోమ చిన్నదే.. అది కుడితే ప్రాణాలే పోతున్నాయి. దోమ కాటుతో మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా వంటి విషజ్వరాలు ప్రబలుతున్నాయి. గతంలో వర్షాలు మొదలు కాగానే దోమలు విజృంభించేవి. కానీ ఇప్పుడు ఏడాదంతా దాడి చేస్తున్నాయి. రాత్రయితే దోమల మోత మోగుతోంది. నగరంలో దోమల బెడద తీవ్రం కావడంతో పౌరులు సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో దోమల నియంత్రణకు సంప్రదాయ పద్ధతులతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని జీవీఎంసీ భావిస్తోంది. ఇందులో భాగంగా అమెరికా ఆధారిత ‘మస్కి టో’ అనే సంస్థ అభివృద్ధి చేసిన మస్కిటో ట్రాప్ మెషీన్లను నగరంలో ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. ఈ యంత్రాల పనితీరును అధ్యయనం చేసేందుకు జీవీఎంసీ అధికారుల బృందం తిరువనంతపురం, హైదరాబాద్లలో పర్యటించనుంది. అక్కడి అనుభవాలను, యంత్రాల పనితీరును విశ్లేషించి సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనుంది. జోన్–4, జోన్–5లో పైలట్ ప్రాజెక్టు? తిరువనంతపురం, హైదరాబాద్లలో ఈ యంత్రాల పనితీరు సంతృప్తికరంగా ఉన్నట్లయితే విశాఖలోను ఏర్పాటు చేయనున్నారు. తొలి దశలో పైలట్ ప్రాజెక్టుగా జోన్–4, జోన్–5లలో సుమారు 120 మస్కిటో ట్రాప్ మెషీన్లను ఏర్పాటు చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తంగా కోటిన్నర రూపాయలు ఖర్చు అవుతుందని సంబంధిత సంస్థ నివేదికలో పేర్కొంది. మరోవైపు దోమల నియంత్రణలో భాగంగా జీవీఎంసీ, వైద్య ఆరోగ్యశాఖ సంయుక్తంగా జూన్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నాయి. ఈ డ్రైవ్ కోసం కాంట్రాక్టు పద్ధతిలో 400 మంది సిబ్బందిని నియమించి.. వారికి రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. దోమల వ్యాప్తి నివారణకు చేపట్టాల్సిన చర్యలపై వీరు ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. సాంకేతికతతో నియంత్రణ సాంకేతికత సాయంతో దోమల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. మస్కిటో ట్రాప్ మెషీన్ల ద్వారా దోమల నివారణతో పాటు ఏ ప్రాంతాల్లో ఎటువంటి వ్యాధికారక దోమలు ఉన్నాయో గుర్తించడం సులభతరం అవుతుంది. దీని వల్ల ఆయా ప్రాంతాల్లో దోమల నివారణకు మరింత సమర్థవంతంగా చర్యలు చేపట్టవచ్చు. అధికారుల అధ్యయనం అనంతరం ఈ ప్రాజెక్టుపై కమిషనర్ తుది నిర్ణయం తీసుకుంటారు. –డాక్టర్ నరేష్కుమార్, ప్రధాన వైద్యాధికారి, జీవీఎంసీ సాంకేతిక పరిజ్ఞానంతో దోమల నియంత్రణకు చర్యలు సన్నద్ధమవుతున్న జీవీఎంసీ ‘మస్కిటో’ కంపెనీతో ఒప్పందానికి ఆలోచన ఎలా పనిచేస్తుందంటే.? దోమలు మనుషుల శ్వాస, వాసనలు పసిగట్టి కుడతాయి. ఇదే సిద్ధాంతంతో ఈ ట్రాపర్ మిషన్ పనిచేస్తుంది. ఈ అత్యాధునిక యంత్రాలు మనుషుల శ్వాస, శరీర ఉష్ణోగ్రత, వాసనలను అనుకరించడం ద్వారా దోమలను ఆకర్షిస్తాయి. యూవీ కిరణాలు, కార్బన్ డయాకై ్సడ్ విడుదల, 39–40 డిగ్రీల ఉష్ణోగ్రతతో సుమారు 500 మీటర్ల దూరం వరకు దోమలను వలలోకి రప్పిస్తాయి. అలా యంత్రంలో చిక్కిన దోమలు లోపల ఉన్న ఫ్యాన్ గాలికి ఎయిర్బ్యాగ్లోకి వెళ్లి చనిపోతాయి. ఫలితంగా నగరంలో ఏయే ప్రాంతాల్లో దోమలు అధికంగా ఉన్నాయి? ఏ రకం దోమల వల్ల ఎలాంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది? అనే వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. ఇవి ‘క్యాచ్(పట్టుకోవడం), కౌంట్(లెక్కించడం), క్లాసిఫై(వర్గీకరించడం)’అనే మూడు ప్రధాన పనులు చేస్తాయి. యంత్రాల్లో ఉపయోగించే సువాసనతో కూడిన ద్రవాలు, సెన్సర్ల సాయంతో దోమలను ఆకర్షించి, వాటిని వర్గీకరించి వ్యాధి కారక దోమల వ్యాప్తి ఉన్న ప్రాంతాలను గుర్తించడానికి సహాయపడతాయి. -
విశాఖ గడ్డ
దోపిడీదారుల అడ్డా.. కూటమి ప్రభుత్వంలో క్రైమ్ క్యాపిటల్గా మారిన జిల్లా ● నగరంలో వరుస దారి దోపిడీ ఘటనలు ● పట్టపగలే ప్రజలు,పర్యాటకులపై కర్రలు, కత్తులతో దాడులు ● ఐదు నెలల్లో ఆరు ఘటనలతో భయాందోళనలో ప్రజలు ● అడ్డూ అదుపు లేకుండా దొంగతనాలతో బెంబేలు విశాఖ సిటీ: ● బీచ్ రోడ్డులో దోపిడీ దొంగలు ఇద్దరు పర్యాటకులపై బీరు సీసాలతో దాడి చేశారు. వారి నుంచి నగదు, సెల్ఫోన్లు ఎత్తుపోయారు. ● పెందుర్తిలో జీవీఎంసీ పంప్ ఆపరేటర్పై కత్తులతో తెగబడ్డారు. రెండు చేతులు కోసి రూ.10 వేలు అపహరించుకుపోయారు. ● కంచరపాలెంలో ఆటోలో కూర్చున్న వ్యక్తిని బెదిరించి డబ్బు కాజేసి పరారయ్యారు. ఇలా.. దోపిడీదారులకు విశాఖ అడ్డాగా మారిపోయింది. ప్రశాంత నగరం కాస్తా.. క్రైమ్ క్యాపిటల్గా తయారవుతోంది. విజిబుల్ పోలీసింగ్ అట్టర్ ఫ్లాప్ అవుతోంది. సిటీ ఆఫ్ డెస్టినీ నేరాలకు కేంద్రంగా రూపాంతరం చెందుతోంది. నగరంలో వరుస దోపిడీ ఘటనలే ఇందుకు నిదర్శనం. గత ఐదు నెలల కాలంలో ఆరు దోపిడీ ఘటనలు చోటుచేసుకున్నాయి. రాత్రి సమయాల్లోనే కాకుండా పట్టపగలు.. నగర నడిబొడ్డున కూడా దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. కత్తులు, కర్రలతో బెదిరిస్తూ ప్రజలతో పాటు పర్యటకులను సైతం నిలువు దోపిడీ చేస్తున్నారు. నగరంలోనూ దోపిడీలు నగరంలో చోరీలు, రోడ్డు ప్రమాదాలు, అత్యల్పంగా హత్యా ఘటనలు సాధారణంగా జరిగేవి. కానీ దోపిడీ ఘటనలు ఏడాదికి ఒకటి, రెండు మాత్రమే చోటుచేసుకునేవి. అదీ కూడా శివారు నిర్మానుష్య ప్రాంతాల్లో మాత్రమే జరిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు దోపిడీ దొంగలు చేలరేగిపోతున్నారు. శివారు ప్రాంతాల్లోనే కాదు.. నగరంలో కూడా పెట్రేగిపోతున్నారు. పోలీసులకు సవాల్ విసురుతున్నారు. తాజాగా కంచరపాలెంలో జరిగిన ఘటన నగరంలో పరిస్థితికి అద్దం పడుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు కంచరపాలెంలో పద్మశ్రీ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద వి.జీవన్కుమార్ ఆటోలో కూర్చొని ఉండగా.. ఇద్దరు అగంతకులు వచ్చి దాడికి పాల్పడ్డారు. ఒకరు సెల్ఫోన్ ఇవ్వమని బెదిరించగా.. మరొకరు జీవన్కుమార్ జేబులో ఉన్న రూ.1,700 బలవంతంగా లాక్కొని పరారయ్యారు. ఆ తర్వాత బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు సాంకేతికత ఆధారంగా దోపిడీకి పాల్పడిన కంచరపాలెంకు చెందిన రౌడీషీటర్ అయిన దమరసింగ్ మోహన్ కన్నాను అరెస్టు చేశారు. మరో వ్యక్తి జాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. మిట్ట మధ్యాహ్నం నగరంలో జరిగిన ఈ దోపిడీ ఘటన పోలీసుల పనితీరును ప్రశ్నిస్తోంది. దొంగతనాలకు అయితే అడ్డూ అదుపు లేకుండా పోయింది. కనిపించని విజిబుల్ పోలీసింగ్ శివారు, నిర్మానుష్య ప్రాంతాల్లో 24/7 నిఘా, విజిబుల్ పోలీసింగ్ కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితమైనట్లు ఈ ఘటనలు రుజువు చేస్తున్నాయి. నగరంలో నేరాలు పెరిగిపోతున్నా.. పోలీసులు మాత్రం కేవలం ట్రాఫిక్ చలానాలు వేయడంలో బిజీగా ఉంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఘటన జరిగిన తర్వాత హడావుడిగా బృందాలు వేసి దర్యాప్తు చేయడం మినహా నేరాల నియంత్రణలో విఫలమవుతున్నారన్న అపవాదును మూటగట్టుకుంటున్నారు. ప్రధానంగా కేసులను గోప్యంగా ఉంచుతుండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దర్యాప్తు పేరుతో ఘటన జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ కేసు వివరాలను బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ కేసును ఛేదించిన తర్వాతే మాత్రమే మీడియా సమావేశాలు పెట్టి ఊదరగొట్టడం పరిపాటిగా మారింది. కేసు పరిష్కారం కాని పక్షంలో నేరం జరిగిందన్న విషయం కూడా తెలియకుండా చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెలకో దోపిడీ ఘటన స్టీల్ప్లాంట్లో 17 ఏళ్ల బాలుడు కూడా దారి దోపిడీకి పాల్పడడం గమనార్హం. గత నెల 10న స్టీల్ప్లాంట్ పరిధిలో ర్యాపిడో బుక్ చేసిన బైక్ ఎక్కిన మైనర్.. మార్గంమధ్యలో రైడర్ కిషోర్ను కొట్టి రూ.48,100 లాక్కొని పరారయ్యాడు. పెందుర్తిలో ఫిబ్రవరి, మరో నెల వ్యవధిలో రెండు దారి దోపిడీలు జరిగాయి. 16వ తేదీన ఒక బాధితుడి నుంచి భారీగా నగదు, నగలు దోచుకున్నారు. అలాగే అంతకుముందు తెల్లవారుజామున 4.30 గంటలకు జీవీఎంసీ పంప్ ఆపరేటర్పై కత్తులతో దాడి చేసి, చేతులు కోసేసి రూ.10 వేలు కాజేశారు. గతేడాది చివరలో బీచ్ రోడ్డులో పర్యాటకులపై దోపిడీదారులు బీరు సీసాలతో దాడి చేసి నగదు, సెల్ఫోన్ను లాక్కున్నారు. అంతకుముందే పాత డైరీ ఫారంలో జాతీయ రహదారిపైన రెండు దోపిడీ ఘటనలు చోటుచేసుకున్నాయి. -
సవతి ప్రేమ!
విశాఖ జోన్పై కన్సాలిడేట్ బడ్జెట్లో అరకొర కేటాయింపులు డబ్లింగ్ పనులు.. కొత్త లైన్లకు నిధులు ● జోన్కు అన్యాయం చేస్తున్న రైల్వే మంత్రిత్వ శాఖ మిగిలిన విషయాల్లో కొంతమేర కేటాయింపులు చేయడం ఉపశమనం కలిగించే అంశం. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న పనులకు ఈ బడ్జెట్లో కొంత మేర నిధులు కేటాయించడం శుభపరిణామం. కన్సాలిడేటెడ్ బడ్జెట్లో ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో కేటాయింపులిలా ఉన్నాయి. ● ఓర్ ఎక్స్ఛేంజ్ కాంప్లెక్స్(ఓఈసీ) నుంచి ఉత్తర సింహాచలం వరకు 5.22 కి.మీ మేర డబ్లింగ్ పనులకు రూ.81.22 కోట్లు. ● పెందుర్తి నుంచి ఉత్తర సింహాచలం మధ్యలో సింహాచలం వద్ద సర్ఫేస్ క్రాసింగ్ లేకుండా చేసేందుకు ఫ్లైఓవర్ నిర్మాణం కోసం రూ.183.65 కోట్లు ● దువ్వాడ నుంచి ఉత్తర సింహాచలం వరకు 20.543 కిలోమీటర్ల మేర 3, 4వ లైన్ల నిర్మాణం కోసం రూ.302.25 కోట్లు. ● వడ్లపూడి జంక్షన్ను అనుసంధానిస్తూ గంగవరం పోర్టు నుంచి విశాఖపట్నం స్టీల్ప్లాంట్ వరకూ టై లైన్ మాదిరిగా 12.04 కి.మీ మేర 3, 4వ లైన్ల నిర్మాణానికి రూ.154.28 కోట్లు. ● విశాఖపట్నం నుంచి గోపాలపట్నం వరకు 15.31 కి.మీ మేర థర్డ్, ఫోర్త్ లైన్ల నిర్మాణానికి రూ.159.47 కోట్లు. ● ఉత్తర సింహాచలం నుంచి గోపాలపట్నం వరకు 2.64 కి.మీ మేర థర్డ్, ఫోర్త్ లైన్ల నిర్మాణానికి రూ.129.45 కోట్లు. ● పలాస–విశాఖపట్నం–దువ్వాడ(బీ రూట్)లో ట్రాక్ పునరుద్ధరణ పనుల కోసం రూ.15 కోట్లు. ● ఉత్తర సింహాచలం నుంచి గోపాలపట్నం వరకు 2.07 కి.మీ మేర బైపాస్ డబ్లింగ్ పనులకు రూ.25.93 కోట్లు. ● విశాఖపట్నం కాంప్లెక్స్ ఏరియాలో ఆటో సిగ్నలింగ్ వ్యవస్థ కోసం రూ.43.07 కోట్లు. సాక్షి, విశాఖపట్నం : కొబ్బరికాయ కొట్టేశాం.. కార్యాలయాలు కట్టేయండి అన్నట్లుగా మారింది విశాఖ రైల్వే జోన్పై ప్రభుత్వ వైఖరి. ప్రచార ఆర్భాటం.. ఆపై శంకుస్థాపన.. భూమి చదును.. ప్రజెంటేషన్లు.. గ్రాఫిక్స్లోనే హడావుడి కనిపిస్తుందే తప్ప.. క్షేత్రస్థాయిలో మాత్రం అడుగు కూడా కదలడం లేదన్న విషయం నిధుల కేటాయింపులోనే స్పష్టమవుతోంది. 2025–26 బడ్జెట్కు అనుబంధంగా రైల్వే కేటాయింపులకు సంబంధించిన కన్సాలిడేటెడ్ బడ్జెట్లో దక్షిణ కోస్తా రైల్వే జోన్పై సవతి ప్రేమ మాత్రమే కనిపిస్తోంది. విశాఖ రైల్వే జోన్తో పాటు దానికి అనుబంధంగా ఏర్పాటవుతున్న రాయగడ డివిజన్ అంబ్రెల్లా వర్క్స్కు కలిపి కేవలం రూ.170 కోట్లు మాత్రమే కేటాయింపులు చేయడం సర్వత్రా విస్మయానికి గురిచేస్తోంది. రాయగడ డివిజన్ పనులకు మాత్రం ప్రత్యేకంగా మరో రూ.110 కోట్లు కేటాయించడం మరింత బలాన్ని చేకూర్చుతోంది. కీలకమైన జోన్కు పప్పుబెల్లాలు ఇచ్చి.. రాయగడ డివిజన్కు మాత్రం భారీగా నిధులు అందించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కూటమిప్రభుత్వ నిర్లక్ష్యంతోనే..! జోన్కు శంకుస్థాపన చేసేశామంటూ పచ్చపత్రికల్లోనూ, సోషల్ మీడియాల్లోనూ భారీగా ప్రచారం చేసుకున్న కూటమి ప్రభుత్వం.. జోన్ ప్రధాన కార్యాలయాల నిర్మాణం మాత్రం తమకు అవసరం లేదన్నట్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం కూడా వైజాగ్ జోన్ కార్యకలాపాలు ఇప్పట్లో ప్రారంభించకపోయినా ఫర్వాలేదన్నట్లుగా భావిస్తోంది. అందుకే దక్షిణ కోస్తా రైల్వే జోన్ను పక్కనపెట్టి రాయగడ డివిజన్ నిర్మాణానికే పెద్దపీట వేస్తూ ఉత్తరాంధ్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తోంది. అయినా కూటమి ఎంపీలు నోరు మెదపకపోవడం దురదృష్టకరం. భూమి చదును పనులకే పరిమితం విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్కు శంకుస్థాపన జరిగి నాలుగు నెలలు.. టెండర్లు ఖరారు చేసి ఐదు నెలలు పూర్తయినా.. ఇంకా భూమి చదును పనులకే పరిమితమైంది. నిధుల మంజూరులో జాప్యం జరుగుతుండటం వల్లనే పనుల ప్రక్రియ అంతంతమాత్రంగానే సాగుతోంది. 2025–26 బడ్జెట్లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు ఒక్క రూపాయి విదిలించని రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా రైల్వే కన్సాలిడేటెడ్ బడ్జెట్లోనూ మొండి చెయ్యి చూపించింది. -
సాహితీ కృషీవలుడు ‘కొమర్రాజు’
విశాఖ విద్య : తెలుగు జాతి గర్వించదగ్గ నవయుగ వైతాళికుడు కొమర్రాజు లక్ష్మణరావు అని కేంద్ర ప్రభుత్వ హిందీ సలహా మండలి సభ్యుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. సాహితీ కృషీవలుడని కొనియాడారు. కొమర్రాజు జీవిత సాహిత్య కృషిపై ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు ఆచార్య వెలమల సిమ్మన్న, విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాల విశ్రాంత తెలుగు ఉపన్యాసకులు డా.గుమ్మా సాంబశివరావు రచించిన ‘విజ్ఞాన సర్వస్వ రూపశిల్పి కొమర్రాజు లక్ష్మణరావు’ గ్రంథాన్ని యార్లగడ్డ ఆవిష్కరించారు. ఏయూలోని హిందీ భవన్లో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలుగు వారికి అపూర్వమైన కానుకలను అందించిన ఆ మహనీయుడి ఘనత ఈ తరానికి తెలియజేసేందుకు సిమ్మన్న, సాంబశివరావు అమూల్యమైన గ్రంథం రచించారని కొనియాడారు. -
వేలి ముద్రలే పట్టించాయి..
విశాల విశాఖపట్నం.. పేరుకు తగినట్లుగానే సుందర దృశ్యాల సమాహారం. ఒకవైపు అనంతమైన సాగరతీరం.. మరో వైపు గంభీరమైన పర్వత శ్రేణులు. వీటి నడుమ సువిశాలంగా విస్తరించిన మహా నగరం విశాఖ. ప్రపంచంలోనే ఇలాంటి అపురూప భౌగోళిక స్వరూపం కలిగిన నగరాలు చాలా తక్కువ. అందుకే ఇక్కడ జీవించడానికి ఎంతో మంది మక్కువ చూపుతారు. ఒకప్పుడు చిన్న మత్స్యకార గ్రామంగా ఉన్న విశాఖ.. నేడు బహుముఖాభివృద్ధి సాధించి మహా నగరంగా రూపాంతరం చెందింది. వివిధ రంగాల్లో దూసుకుపోతూ నగరం తన పరిధిని విస్తరించుకుంటూ పోతోంది. పర్యాటకులకు ఇది స్వర్గధామం అనడంలో అతిశయోక్తి లేదు. అటువంటి విశాఖ నగరాన్ని ఆకాశం నుంచి వీక్షిస్తే ఆ అనుభూతే వేరు. మబ్బుల పొరల మాటు నుంచి నగరాన్ని చూస్తే దాని సౌందర్యాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. యారాడ కొండలు, పోర్టు ప్రాంతం, పాత నగరాలను ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం ఎంవీపీకాలనీ: ద్వారకానగర్ రాధామాధవ్ టవర్స్లో ఈ ఏడాది మార్చి ఒకటో తేదీన దొంగతనానికి పాల్పడిన పాత నేరస్తుడు తిప్పరాజు రామకృష్ణ (26)ను ఎంవీపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంవీపీకాలనీ పోలీస్స్టేషన్లో బుధవారం క్రైం ఏడీసీపీ మోహనరావు ఈ కేసు వివరాలు వెల్లడించారు. మార్చి ఒకటో తేదీ ఉదయం రాధా మాధవ్ టవర్స్ ఫ్లాట్ నంబర్ 2లో నివాసం ఉంటున్న మరకాని రామకృష్ణ తన అమ్మమ్మ వర్ధంతి కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో కలిసి కాకినాడ వెళ్లారు. ఆ మరుసటి రోజు ఉదయం అదే అపార్ట్మెంట్లో ఉంటున్న శ్రావణి అతనికి ఫోన్ చేసి.. మీ ఇంటి తాళం పగలగొట్టి ఉంది అని సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన ఆయన విశాఖ వచ్చి ఇంటిని పరిశీలించగా.. 23 తులాల బంగారం, రూ.లక్ష నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఇంట్లోని బీరువాను దొంగ బెడ్పై పడుకోబెట్టి తాళాలు పగలగొట్టి నగదు, బంగారం చోరీ చేశాడు. వెంటనే రామకృష్ణ ద్వారకా క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ద్వారకా క్రైం సీఐ చక్రధర్రావు బృందం ఘటన ప్రాంతాన్ని పరిశీలించింది. ఫింగర్ ప్రింట్స్ విభాగం ద్వారా వేలిముద్రలను సేకరించి పరిశీలనకు పంపించగా.. తెలంగాణకు చెందిన పాత నేరస్తుడు తిప్పరాజు రామకృష్ణ వేలిముద్రలతో సరిపోయినట్లు ఫింగర్ ప్రింట్స్ బ్యూరో సమాచారం అందించింది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ద్వారకా క్రైం ఎస్ఐ రాజు, ఏఎస్ఐ కిశోర్బాబు ఇతర సిబ్బంది బృందాలుగా విడిపోయి హైదరాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లోని అతని నివాస ప్రాంతాల్లో దర్యాప్తు చేసి రామకృష్ణ ప్రస్తుతం వాడుతున్న ఫోన్ నంబర్లు, వివరాలు సేకరించారు. దీంతో నిందితుడు విశాఖలోనే ఉన్నట్లు గుర్తించారు. ద్వారకా క్రైం పోలీసులు, ఆరిలోవ క్రైం ఎస్ఐ రామకృష్ణ బృందం నిందితుడు రామకృష్ణను మద్దిలపాలెం వద్ద మంగళవారం అరెస్ట్ చేసింది. విశాఖలో తొలిసారి దొంగతనంకాగా.. రామకృష్ణ మేనల్లుడు అశోక్, అక్క భాగ్యమ్మలను హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీసులు ఈ నెల 6న వేరే కేసులో అరెస్ట్ చేసి వారి ఇంట్లో తనిఖీలు చేయగా రూ.3,40,000, 77 గ్రాముల బంగారు వస్తువులు లభించాయి. అశోక్ను విచారించగాా.. తన మేనమామ రామకృష్ణ విశాఖలో చేసిన దొంగతనానికి సంబంధించినవిగా వెల్లడించాడు. ఇదిలా ఉండగా మరికొన్ని బంగారు నగలను పలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టినట్లు ద్వారకా క్రైం పోలీసుల విచారణలో రామకృష్ణ తెలిపాడు. రామకృష్ణను పట్టుకున్న సమయంలో అతని వద్ద నుంచి రూ.10 వేలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఆర్ నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ.3.40 లక్షలు, 77 గ్రాముల బంగారంతో పాటు రామకృష్ణ వద్ద దొరికిన రూ.10 వేలను కలిపి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగతా నగదు, బంగారాన్ని రికవరీ చేయాల్సి ఉందని ఏడీసీపీ తెలిపారు. రామకృష్ణపై 90 వరకు పాత కేసులు ఉన్నా యి. అందులో 77 దొంగతనం కేసులున్నట్లు ఏడీసీపీ వివరించారు. విశాఖలో తొలిసారి దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన ద్వారకా క్రైం ఎస్ఐ రాజు, ఏఎస్ఐ డి.కిశోర్బాబు, కానిస్టేబుల్ అప్పలనాయుడు, రాజు, అప్పలరాజు, అగస్టీన్, జగత్ కిరణ్లను ఏడీసీపీ మోహనరావు, ఏసీపీ లక్ష్మణరావు, సీఐ చక్రధర్రావు అభినందించారు. గ‘ఘన’ విశాఖ ఘరానా దొంగ అరెస్ట్ నిందితుడు తెలంగాణకు చెందిన పాత నేరస్తుడు 90 వరకు కేసుల నమోదు అందులో 77 దొంగతనం కేసులే.. ద్వారకానగర్ రాధామాధవ్ టవర్స్ కేసును ఛేదించిన పోలీసులు -
ఒకే రోజు.. ఒకే ప్రశ్నాపత్రం
సీతంపేట: రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ(ఉపాధ్యాయ నియామక పరీక్ష)ను ఒకే రోజు ఆఫ్లైన్లో నిర్వహించాలని ఉపాధ్యాయ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. నెల రోజుల పాటు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయం తమను తీవ్రంగా నష్టపరుస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా డీఎస్సీలో ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలు, విధానాలు తమ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయని వాపోతున్నారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీతో లక్షలాది మంది నిరుద్యోగ యువత ఆశలు పెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది జూన్లో సీఎం చంద్రబాబు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసినప్పటికీ.. 10 నెలల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం కేవలం 16,347 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయడం అభ్యర్థులను తీవ్ర నిరాశకు గురిచేసింది. 50 వేలకు పైగా పోస్టులతో మెగా డీఎస్సీ వస్తుందని ఆశించిన వారికి ఇది శరాఘాతంగా మారింది. సమాన అవకాశాలకు విఘాతం ప్రభుత్వం తాజాగా డీఎస్సీ పరీక్షలను జూన్ 6 నుంచి జూలై 6 వరకు నెల రోజుల పాటు ఆన్లైన్లో నిర్వహిస్తామని ప్రకటించడం అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ విధానం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయని వారు పేర్కొంటున్నారు. నెల రోజుల పాటు జరిగే పరీక్షల్లో ప్రతి రోజూ వేర్వేరు ప్రశ్నాపత్రాలు ఉంటాయని.. దీని వల్ల ఏ రోజు పేపర్ కష్టంగా వస్తుందో.. ఏ రోజు సులువుగా వస్తుందో తెలియని అనిశ్చితి నెలకొంటుందని ఆవేదన చెందుతున్నారు. కష్టమైన ప్రశ్నాపత్రం వచ్చిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా మొదటి రోజుల్లో పరీక్ష రాసే అభ్యర్థులు తదుపరి రోజుల్లో ప్రిపరేషన్కు సమయం కోల్పోతారని, ఇది సమాన అవకాశాలకు విఘాతమని వాపోతున్నారు. గతంలో మాదిరిగా రాష్ట్రమంతటా ఒకే రోజు.. ఒకే ప్రశ్నాపత్రంతో ఆఫ్లైన్లో పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రమంతా ఒకే రోజు డీఎస్సీ నిర్వహించాలని అభ్యర్థుల డిమాండ్ నెల రోజులు నిర్వహిస్తే ప్రిపరేషన్సమయాన్ని కోల్పోతామని ఆవేదన స్పెషల్ డీఎస్సీ పోస్టులు కూడా భర్తీ చేయాలని డిమాండ్ వయో పరిమితి పెంచాలి గత ఏడేళ్లుగా డీఎస్సీ నియామకాలు లేకపోవడంతో వయోపరిమితి దాటిపోయిన అభ్యర్థులు చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో డీఎస్సీ అభ్యర్థుల వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని కోరుతున్నారు. అలాగే ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా చెవిటి, మూగ, అంధ విద్యార్థులకు బోధించే 2,600 ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులను ఈ డీఎస్సీ నోటిఫికేషన్లో చేర్చకపోవడంపై స్పెషల్ బీఈడీ, డైట్ చదివిన లక్షలాది మంది నిరుద్యోగులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ప్రభుత్వ నూతన డీఎస్సీ విధానాలు, నిబంధనలు తమ ఆశలపై నీళ్లు చల్లడమే కాకుండా, తమ భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నాయని నిరుద్యోగ యువత మండిపడుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిగణలోకి తీసుకుని.. ఒకే రోజు పరీక్ష నిర్వహించాలని, వయోపరిమితిని పెంచాలని, ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
కూటమి నేతల అండతో యథేచ్ఛగా ఇసుక దందా!
తగరపువలస: అధిక లోడుతో ఇసుక రవాణా చేస్తున్న నాలుగు లారీలను బుధవారం జిల్లా క్వారీ, లారీ యజమానుల సంఘంతో పాటు స్థానిక లారీ సంఘాల యజమానులు చెరకుపల్లి వద్ద జాతీయ రహదారిపై అడ్డుకున్నారు. శ్రీకాకుళం జిల్లా నారాయణపురం ఇసుక రీచ్ నుంచి 35 టన్నుల సామర్థ్యం కలిగిన లారీలపై 70 నుంచి 80 టన్నుల ఇసుకను రవాణా చేస్తున్నట్టు గుర్తించిన జిల్లా క్వారీ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు మద్దిల వెంకటరమణ, మిగిలిన యజమానులతో కలిసి ఉదయం 4 గంటల నుంచి కాపు కాశారు. ఉదయం 6 గంటల సమయంలో విశాఖ వైపు వెళ్తున్న మూడు లారీలను అడ్డుకున్నారు. వాటి సిబ్బంది మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర పేర్లు చెప్పి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా కదలనీయలేదు. తగరపువలస ఫ్లై ఓవర్ వద్ద మరొక లారీని కూడా నిలిపివేశారు. సుమారు 10 గంటల సమయంలో భీమిలి పోలీసులు వచ్చి బేషరతుగా లారీలను అక్కడి నుంచి పంపించేశారు. ఈ సందర్భంగా విజయవాడకు చెందిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తి మద్దిల వెంకటరమణను బెదిరించినట్టు తెలిసింది. తన ఇసుక లారీలను అడ్డుకుంటే ఎఫ్ఐఆర్ వేయిస్తామని హెచ్చరించినట్టు సమాచారం. అనంతరం స్థానిక లారీ యజమానులు మాట్లాడుతూ రెట్టింపు లోడుతో ఇసుకను రవాణా చేస్తున్నా.. రవాణా శాఖ చూసీ చూడనట్టు వ్యవహరిస్తోందని ఆరోపించారు. రెట్టింపు లోడుతో వాహనాలకు ప్రమాదాలు జరిగితే ఇరు పార్టీలకు బీమా పరిహారం ఇవ్వడానికి ఇన్సూరెన్స్ సంస్థలు అంగీకరించవని చెప్పారు. లారీపై ఇసుకను పూర్తిగా కప్పివేయకుండా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారని పేర్కొన్నారు. అదనపు లోడు కారణంగా తరచూ టైర్లు ఒత్తిడికి గురై రన్నింగ్లో పేలిపోతుండటంతో వెనుక వచ్చే వాహనాలు కూడా ప్రమాదాల బారిన పడుతున్నాయన్నారు. అధిక లోడును పట్టించుకోకుండా ఉండేందుకు మూడు జిల్లాల్లో రవాణాశాఖ అధికారులు నెలకు రూ.22 వేలు వంతున ఒక్కో లారీ యజమాని నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నట్టు ఆరోపించారు. ఇప్పుడు దౌర్జన్యంగా కూటమి నాయకుల అండతో ఇసుకను అధిక లోడుతో రవాణా చేస్తూ.. తమను నిలువునా ముంచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో మిగిలిన లారీ యజమానులతో సమావేశమై అధిక లోడుతో వచ్చే వాహనాలను ఇకపై కూడా అడ్డుకుంటామని లారీ యజమానులు బొట్ట సురేష్, కొయ్య శ్రీనివాసరెడ్డి, కర్రి రమణ, తుపాకుల సురేష్, వీడీఎం గిరి, మద్దిల శ్రీను హెచ్చరించారు. అధిక లోడుతో లారీల్లో దర్జాగా ఇసుక రవాణా మంత్రులు లోకేష్, రవీంద్ర పేర్లు చెప్పి వెళ్లేందుకు ప్రయత్నం రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యం, మామూళ్ల వసూళ్లపై ఆరోపణలు -
ఆహా.. ఆవకాయ
విశాఖపట్నం: వేడివేడి అన్నం ..ఆ తర్వాత స్వచ్ఛమైన నెయ్యి ..అందులో కాస్త ఆవకాయ ముక్కను కలుపుకొని తింటే... ఆహా! ఆ రుచిని వర్ణించలేం. మొదటి ముద్దతోనే నోరంతా పులకరించిపోతుంది. వేడి అన్నం, కమ్మటి నెయ్యి, ఘాటైన ఆవకాయ... ఈ మూడు రుచులు ఒకదానితో ఒకటి పోటీపడుతూ, నాలుకపై ఒక మాయాజాలాన్ని సృష్టిస్తాయి. ఒక్కో ముద్ద తింటుంటే కడుపు నిండిపోతున్నా, ఆ రుచి మాత్రం వదలాలనిపించదు. కళ్లల్లో ఒక విధమైన మెరుపు, పెదాలపై చిరునవ్వు అదే వస్తుంది. వేసవికాలం వచ్చిందంటే ఆవకాయ సీజన్ ఆరంభం అవుతుంది. మహిళలు ఏడాది అంతా తినడానికి సరిపోయే విధంగా ఆవకాయ పెడతారు. ఆవకాయ పెట్టడానికి ఎంతో అనుభవం, నైపుణ్యం అవసరం. ఇటువంటి ఆవకాయ తయారీపై నగరంలో పోటీలు నిర్వహించారు. బీచ్ రోడ్డులోని ఓ హోటల్లో రెడ్ ఎఫ్ఎం, త్రీ మేంగోస్ స్పైసెస్ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వందమందికిపైగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆవపొడి, కారం, ఉప్పు, నూనె సమపాళ్లలో కలిపి నోరూరించే ఆవకాయను క్షణాలలో సిద్ధం చేశారు. యువతుల నుంచి వృద్ధుల వరకు ఉత్సాహంగా పాల్గొని, ఆవకాయ ఘాటును రుచిచూపించారు. ఆవకాయ తయారు చేసిన మహిళలకు బహుమతులను అందించారు. కార్యక్రమంలో ఆర్జేలు ప్రదీప్, కృష్ణ, షర్మిల, భావన, మధు కార్తీక్లతో పాటు ప్రోగ్రామింగ్ హెడ్ సుష్మ తదితరులు పాల్గొన్నారు. -
విశాఖలో మాయా లోకం
విశాఖ సిటీ: ఊహకందని అద్భుత ప్రపంచం కళ్ల ముందు సాక్షాత్కరించనుంది. కనివినీ ఎరుగని మాయాలోకం అందరినీ మంత్రముగ్ధులను చేయనుంది. రాష్ట్రంలోనే ఎక్కడా లేనటువంటి మిథ్యా ప్రపంచం విశాఖ వాసులకు సరికొత్త అనుభూతిని పంచనుంది. ఇందుకోసం విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) ప్రణాళికలు సిద్ధం చేసింది.మధురవాడ ప్రాంతంలో రెండు ఐకానిక్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. వర్చువల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ను అందించడానికి ‘వైజాగ్ ఎక్స్పీరియన్స్ అండ్ వర్చువల్ రియాలిటీ ఎరీనా అండ్ త్రీ స్టార్ హోటల్’తో పాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఈస్ట్ కోస్ట్ హేబిటేట్ సెంటర్ ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో చేపట్టే ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఆసక్తి వ్యక్తీకరణకు దరఖాస్తులు ఆహ్వానించింది.రూ.470 కోట్లతో హేబిటేట్ సెంటర్ఆధునిక వాతావరణంలో సంపన్న వర్గాల అభిరుచులకు తగ్గట్టుగా ‘ఈస్ట్ కోస్ట్ హేబిటేట్ సెంటర్’ను నిర్మించాలని వీఎంఆర్డీఏ అధికారులు నిర్ణయించారు. ఐటీ సంస్థలకు సమీపంలో ఎండాడ లా కాలేజీ నుంచి రుషికొండ రోడ్డులో 8.82 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. పీపీపీ విధానంలో రూ.470 కోట్లతో ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.ఇందులో ఐటీ స్పేస్, బిజినెస్ సెంటర్, రిటైల్ స్పేస్, ఆడిటోరియం, సెమినార్ హాల్, పార్టీ ఈవెంట్స్ లాన్లతో పాటు ట్రేడ్ ఫెయిర్లు, ఆర్ట్, కల్చర్ షో, ఎగ్జిబిషన్లకు అనువుగా సౌకర్యాలు కల్పించనున్నారు. అలాగే క్లబ్ హౌస్, అంతర్జాతీయ రుచులతో వంటలు అందించే రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తారు. అలాగే ఇండోర్ యాంఫీ థియేటర్, 400 మంది పట్టేలా కేఫ్టేరియా, 600 మంది సౌకర్యంగా కూర్చునే ఫైన్ డ్రైన్ రెస్టారెంట్లు ఉండనున్నాయి. 60 రూములు కలిగిన హోటల్, 250 మందికి సరిపడా ఈవెంట్ లాన్, సూపర్ మార్కెట్, మెడికల్, స్పోర్ట్స్ సెంటర్లు కూడా రానున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఆర్ఎఫ్పీలు ఆహ్వానించారు. ఈ నెల 20వ తేదీలోగా ఆసక్తి ఉన్న సంస్థలు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకున్న సంస్థల అర్హతలు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోనున్నారు. వీలైనంత వేగంగా ఈ ప్రాజెక్టులను పట్టాలెక్కించాలని అధికారులు భావిస్తున్నారు.2.82 ఎకరాల్లో వర్చువల్ ఎరీనావిశాఖ వాసులకే కాకుండా ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునే విధంగా విశాఖలో వర్చువల్ రియాలిటీ అనుభవాన్ని అందించేందుకు వీఎంఆర్డీఏ అధికారులు సరికొత్త ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఇప్పటి వరకు పార్కులు, మ్యూజియాలు, కన్వెన్షన్ సెంటర్లపైనే దృష్టి పెట్టినవారు.. ఇప్పుడు భవిష్యత్తు తరాలకు ఆసక్తికరమైన, ఆకట్టుకునేలా వైజాగ్ ఎక్స్పీరియన్స్ అండ్ వర్చువల్ రియాల్టీ ఎరీనా అండ్ 3 స్టార్ హోటల్ నిర్మాణానికి సిద్ధమవుతున్నారు. ఎండాడ లా కాలేజ్ మార్గంలో 2.82 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నారు.గేమింగ్, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటి సాంకేతికత అంశాలతో తీర్చిదిద్దనున్నారు. ఇందులో వర్చువల్ రియాలిటీ అనుభవాన్ని పొందేలా 360 డిగ్రీల థియేటర్, మిక్స్డ్ రియాల్టీ ఎస్కేప్ రూమ్, చారిత్రక యుగాల అనుభవంలోకి తీసుకెళ్లేలా వర్చువల్ టైమ్ ట్రావెల్, వీఆర్ గేమింగ్ జోన్, 350 చదరపు మీటర్ల భారీ అక్వేరియం, 20 మల్టీక్యూజన్ రెస్టారెంట్ అవుట్లెట్లు, 10 శాతం కమర్షియల్ అవుట్లెట్లతో పాటు 100 రూమ్లు, 1000 మంది పట్టేలా ఫంక్షన్ హాల్తో త్రీ స్టార్ హోటల్ను నిర్మించనున్నారు.ఆర్థిక, పర్యాటకానికి అనుగుణంగా..పర్యాటకాభివృద్ధి కోసమే కాకుండా ఆర్థిక పరిపుష్టికి అనుగుణంగా రెండు కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నాం. ఐటీ సంస్థలకు సమీపంలో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో వర్చువల్ రియాలిటీ ఎరీనాతో పాటు అర్బన్ హేబిటేట్ సెంటర్ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. ఇందుకోసం ఆర్ఎఫ్పీలు ఆహ్వానించాం. ఇవి ఏర్పాటైతే ప్రపంచ పర్యాటకులకు మంచి అనుభూతిని పంచడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాల నిర్వహణకు వేదికలుగా నిలుస్తాయి. –కె.ఎస్.విశ్వనాథన్, మెట్రోపాలిటన్ కమిషనర్ -
థియేటర్లలో నవ్వులే నవ్వులు
● సింగిల్.. అలరించే కామెడీ ఎంటర్టైనర్ ● విశాఖలో సందడి చేసిన చిత్ర యూనిట్ డాబాగార్డెన్స్ : యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం సింగిల్. ఈ నెల 9న విడుదలై మంచి స్పందన అందుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మంగళవారం విశాఖపట్నంలోని ఓ హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహించింది. హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ సింగిల్ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు. చిత్రంలోని సన్నివేశాలు ప్రతి ఒక్కరినీ నవ్విస్తున్నాయని చెప్పారు. దర్శకుడు కార్తీక్ రాజు చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారని, నిర్మాతలు విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి సహకారం అందించారన్నారు. కథ సాధారణంగా ఉన్నప్పటికీ, ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే, అద్భుతమైన సంభాషణలతో సినిమా ప్రేక్షకులను కట్టిపడేస్తోందని ఆయన పేర్కొన్నారు. చిత్రంలో నటించిన కేతిక శర్మ, ఇవానా, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, విటివి గణేష్, ప్రభాస్ శ్రీను, సత్య, కల్పలత తమ పాత్రలకు ప్రాణం పోశారని శ్రీవిష్ణు అన్నారు. శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ సూపర్ నటుడు వెన్నెల కిషోర్ మాట్లాడుతూ, సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన శ్రీవిష్ణు తన నటనతో సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడన్నారు. కామెడీ సన్నివేశాల్లో శ్రీవిష్ణు అద్భుతంగా నటించాడని తెలిపారు. సినిమాలో అనేక ఆసక్తికరమైన పాత్రలు, మలుపులు పెట్టి దర్శకుడు కార్తీక్రాజు ప్రేక్షకులను నవ్వించారని, ముఖ్యంగా సెకండాఫ్లోని ప్రేమ సన్నివేశాలు చాలా సరదాగా ఉంటాయని ఆయన తెలిపారు. విశాఖ అంటే చాలా ఇష్టం హీరోయిన్లు కేతిక శర్మ, ఇవానా మాట్లాడుతూ విశాఖ అంటే తమకు చాలా ఇష్టమని, ఈ సినిమాలో నటించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్తో కలిసి నటించిన సన్నివేశాలు చాలా వినోదాత్మకంగా ఉన్నాయని వారు తెలిపారు. విటివి గణేష్, ప్రభాస్ శ్రీను, సత్య తమ కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారని వారు కొనియాడారు. -
భారీగా గంజాయి స్వాధీనం
అల్లిపురం: గంజాయి అక్రమంగా తరలిస్తున్న నలుగురు వ్యక్తులను ఆనందపురం పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి 200 కేజీల గంజాయి, ఒక బొలేరో వాహనం, ఒక ద్విచక్ర వాహనం, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ–1 అజిత వేజెండ్ల తెలిపారు. నగర పోలీస్ కమిషనరేట్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. గంజాయి రవాణా జరుగుతోందన్న సమాచారం మేరకు ఆనందపురం పోలీసులు, సిటీ టాస్క్ఫోర్స్ పోలీసులు కలిసి బోయపాలెం, పైడా కాలేజీ వద్ద వాహనాలు తనిఖీ చేశారు. ఈ విషయాన్ని పసిగట్టిన గంజాయి స్మగ్లర్లు బొలేరో వాహనాన్ని వెనక్కు తిప్పేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని వాహనాన్ని తనిఖీ చేయగా 4 బస్తాల్లో 40 బ్రౌన్ కలర్ ప్యాకెట్లలో 200 కేజీల గంజాయి లభ్యమైంది. ఎక్కువ డబ్బు సంపాదించాలని.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వీరంతా గంజాయి స్మగ్లింగ్కు పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని డీసీపీ–1 అజిత వేజెండ్ల తెలిపారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా పాడువ పంచాయతీ జమ్ముగూడ గ్రామం నుంచి గంజాయి సేకరించి విశాఖలో విక్రయించడానికి ప్రయత్నిస్తున్న రఘు హంతల్, నరేంద్ర పాంగీ, బినాయ్ మండల్ , రబీంద్ర కిలాను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు. నలుగురి అరెస్టు -
మధ్యతరగతి వారి కోసం..
మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో ఎంఐజీ అపార్ట్మెంట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నాం. ప్రస్తుతం నివాస ప్రాంతాలుగా మంచి డిమాండ్ ఉన్న మధురవాడ, వేపగుంటలో ఉన్న వీఎంఆర్డీఏ స్థలాల్లోనే ఈ అపార్ట్మెంట్లను నిర్మించాలని భావిస్తున్నాం. ఇందుకోసం ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నాం. ప్రజల సూచనలు, సలహాలతోపాటు వారి అభిరుచులకు తగ్గట్లుగా ప్రాజెక్టును అభివృద్ధి చేస్తాం. మార్కెట్ ధర కంటే తక్కువకే ఫ్లాట్లను అందించాలన్న సంకల్పంతో ఉన్నాం. – కె.ఎస్.విశ్వనాథన్, మెట్రోపాలిటన్ కమిషనర్ ● -
షిప్యార్డ్ పురోగతిపై ప్రశంసలు
సింథియా : హిందుస్థాన్ షిప్యార్డ్ చేపట్టిన ‘గ్రీన్ అండ్ గ్రోత్ ఫోకస్డ్ ఇనిషియేటివ్స్’ను కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాలు మంత్రిత్వ శాఖ కార్యదర్శి టీకే రామచంద్రన్ అభినందించారు. షిప్యార్డ్ అభివృద్ధిని ఆయన సమీక్షించారు. కొత్త ఆవిష్కరణలు, దేశాభివృద్ధికి సంస్థ చేస్తున్న కృషిని మెచ్చుకున్నారు. షిప్యార్డ్ 84 ఏళ్ల చరిత్రను, వాణిజ్య నౌకల నిర్మాణంలో సంస్థ సహకారాన్ని చైర్మన్ హేమంత్ ఖత్రి కార్యదర్శికి వివరించారు. గ్రీన్ టగ్లు, హైడ్రోజన్ నౌకల అభివృద్ధి ప్రణాళికలు తెలిపారు. గ్రీన్ టెక్నాలజీకి మద్దతుగా బ్యాటరీ టగ్ల వ్యయం అంచనా వేయాలని రామచంద్రన్ సూచించారు. పెట్రోలియం శాఖ అవసరమైన నౌకల నిర్మాణానికి షిప్యార్డ్ సిద్ధంగా ఉందని ఖత్రి పేర్కొన్నారు. కొత్త డ్రై డాక్లు, స్లిప్వేలతో షిప్యార్డ్ సామర్థ్యం పెరుగుతుందని ఆయన అన్నారు. -
చందనం విక్రయాల ప్రారంభం
సింహాచలం: చందనోత్సవం నాడు శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిపై ఽనుంచి ఒలిచిన నిర్మాల్య చందన విక్రయాలను మంగళవారం నుంచి ప్రారంభించారు. ఉచిత దర్శనం క్యూలో 400 మందికి, రూ.100 క్యూలో 300 మందికి, రూ. 300 క్యూలో 300 మందికి ఒక్కో ప్యాకెట్ రూ.10 చొప్పున విక్రయించారు. దేవస్థానం ఏఈవో ఎన్.ఆనంద్కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 11 మంది కార్మిక నాయకులకు షోకాజ్ నోటీసులు సాక్షి, విశాఖపట్నం : స్టీల్ప్లాంట్ యాజమాన్యం 11 మంది కార్మిక నాయకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 20న దేశవ్యాప్త సమ్మె నేపథ్యంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు మంగళవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో బ్లాస్ట్ఫర్నేస్–1 విభాగంలో సమ్మె ప్రచారం నిర్వహించారు. దీనిపై ఆగ్రహించిన యాజమాన్యం కంపెనీ నిబంధనలకు వ్యతిరేకంగా పనిప్రదేశం వదిలి వెళ్లడాన్ని తప్పు పడుతూ 11 మంది కార్మిక నాయకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మరి కొందరికి బుధవారం నోటీసులు జారీ చేయనున్నట్టు సమాచారం. కార్మిక నాయకులకు షోకాజ్ నోటీసు జారీ చేయడం పట్ల కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. యాజమాన్యం వైఖరికి నిరసనగా బుధవారం ఉదయం ఉక్కు అడ్మిన్ భవనం కూడలి వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు కార్మిక నాయకులు ప్రకటించారు.