Visakhapatnam
-
వేసవి తాపానికి కార్యాచరణ
డాబాగార్డెన్స్ : జీవీఎంసీ అన్ని జోన్ల పరిధిలో 198 చలివేంద్రాలు, 52 గ్రీన్ షెల్టర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని జీవీఎంసీ అదనపు కమిషనర్ పి.నల్లనయ్య తెలిపారు. బుధవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో హీట్ వేవ్స్ యాక్షన్ ప్లాన్పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి దృష్ట్యా జీవీఎంసీ పరిధిలో ఏర్పాటు చేయనున్న చలివేంద్రాల్లో తాగునీటితో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లను ప్రజలకు అందివ్వనున్నట్లు తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి జీవీఎంసీ యంత్రాంగాన్ని సంప్రదిస్తే చలివేంద్రం ఏర్పాటుకు సహకరిస్తామని, ఆ కేంద్రాల్లో మజ్జిగ పంపిణీ చేయాలని సూచించారు. పారిశుధ్య కార్మికులు ఉదయం 5.30 నుంచి 10.30 వరకు, తిరిగి సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టామని, భవన యజమానులు భవన నిర్మాణ కార్మికులకు వారు పనిచేసిన చోట చల్లని తాగునీరు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు. పక్షులు, పశువుల రక్షణ దిశగా నీటి తొట్లను ఏర్పాటు చేసేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రస్తుతం జలాశయాల్లో జూలై వరకు సరిపడినంత నీరు సమృద్ధిగా ఉందని పర్యవేక్షక ఇంజనీర్ ఏడుకొండలు తెలిపారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్లు, సహాయక వైద్యాధికారులు, నీటి సరఫరా విభాగం ఇంజనీర్లు, జేఆర్ నగర్ నివాసిత సంక్షేమ సంఘం ప్రతినిధి కేఎస్ఆర్ మూర్తి, స్వచ్ఛ విశాఖ అంబాసిడర్ డీఎస్ ఆనంద్, గ్రీన్ క్లైమేట ఆర్గనైజేషన్ ప్రతినిధి జేవీ రత్నం తదితరులు పాల్గొన్నారు. జీవీఎంసీ అదనపు కమిషనర్ నల్లనయ్య -
ప్రజల దృష్టిని మళ్లించేందుకే అనుచిత వ్యాఖ్యలు
ప్రస్తుతం మావిగన్ అంశంపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకే మహిళలపై అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకర రాతలకు పూనుకున్నారు. జర్నలిజం విలువలను పూర్తిగా కాలరాసిన రాధాకృష్ణ ప్రవర్తన పిచ్చి పరాకాష్టకు చేరుకుంది. కమిషన్ల కోసం కక్కుర్తి పడుతూ వ్యవస్థలను దుర్వినియోగం చేయడం ప్రజాస్వామ్యానికి క్షేమం కాదు. మీడియా వేదికల ద్వారా మహిళలను అవమానించడం సమాజానికి తప్పుడు సంకేతాలను ఇస్తుంది. రాధాకృష్ణ తన వ్యాఖ్యలపై వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. – వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు -
మహిళలకు క్షమాపణ చెప్పాల్సిందే
● ‘చెత్తపలుకు’పై జనాగ్రహంమహారాణిపేట: జర్నలిజం విలువలను తుంగలో తొక్కి, బ్రోకరిజమే వృత్తిగా మార్చుకున్న ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ తీరుపై వైఎస్సార్సీపీ శ్రేణులు కన్నెర్ర చేశాయి. ‘కొత్త పలుకులు’ పేరుతో ఆయన రాస్తున్న ‘చెత్త పలుకులు’ మహిళా లోకాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ నగరంలోని ఆంధ్ర జ్యోతి కార్యాలయాన్ని పార్టీ నేతలు బుధవారం ముట్టడించారు. పార్టీ విశాఖ, అనకాపల్లి జిల్లాల అధ్యక్షులు కె.కె.రాజు, బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో పోర్టు హాస్పిటల్ జంక్షన్ వద్ద భారీ ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్ కార్యాలయం వైపు దూసుకువెళ్తున్న పార్టీ శ్రేణులను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నప్పటికీ, నేతలు రహదారిపై బైఠాయించి రాధాకృష్ణ వైఖరిని ఎండగట్టారు. రాధాకృష్ణ తన రాతల ద్వారా మహిళలను కించపరిచారని, తక్షణమే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏబీఎన్, ఆంధ్రజ్యోతి పత్రికలు కేవలం చంద్రబాబు అజెండాను అమలు చేసే సాధనాలుగా మారాయని, బాబు నోటి నుంచి వచ్చే మాటలనే వీరు రాతలుగా రాస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో పీఎసీ సభ్యుడు తిప్పల నాగిరెడ్డి, మాజీ మంత్రి బాలరాజు, జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్కుమార్, కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర్గణేష్, తిప్పల దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు, మాజీ ఎమ్మెల్యేలు చింతలపూడి వెంకటరామయ్య, శోభా హైమవతి, మాజీ మేయర్ జి.హరివెంకటకుమారి, నియోజకవర్గ పరిశీలకులు కో లా గురువులు, జహీర్ అహ్మద్, చింతకాయల సన్యాసిపాత్రుడు, వీసం రామకృష్ణ, పేడాడ రమణికుమారి, పిన్నమరాజు సతీష్ వర్మ, కార్యాలయ పర్యవేక్షకులు రవిరెడ్డి, పార్టీ నాయకులు జియ్యాని శ్రీధర్, కె.సతీష్, రొంగలి జగన్నాథం, కొండా రాజీవ్గాంధీ, పోతిన హనుమంత రావు, పి.వి.నారాయణ, తాడి జగన్నాథ రెడ్డి, కిరణ్ రాజు, చెన్నదాస్, కోరుకొండ వెంకట రత్న స్వాతి, పల్లా దుర్గారావు, గుడ్ల వెంకట రమణి రెడ్డి, మంచా నాగ మల్లేశ్వరి, దుప్పలపూడి శ్రీనివాసరావు, గొండేశి మహేశ్వర రెడ్డి, పేర్ల విజయ్చంద్ర, ఉరుకూటి రామ చంద్రరావు, ద్రోణంరాజు శ్రీవాస్తవ, అనిల్కుమార్ రాజు, చెన్న జానకిరామ్, రవిరాజు, సేనాపతి అప్పారావు, పివి సురేష్, ముట్టి సునిల్ కుమార్, తుమ్మలూరు జగదేష్ రెడ్డి, సనపల రవీంద్ర భరత్, బోని శివ రామకృష్ణ, బర్కత్ అలీ, కర్రి రామారెడ్డి, పి.శ్రీదేవి వర్మ, మారుతీ ప్రసాద్, సకలభక్తుల ప్రసాదరావు, డి.మార్కండేయులు, బొండా ఉమామహేశ్వర రావు, కోడిగుడ్ల పూర్ణిమ, బిపిన్ కుమార్ జైన్, వావిలపల్లి ప్రసాద్, రెయ్యి వెంకట రమణ, కెవి శశికళ, బల్లా లక్ష్మణ్, మహమ్మద్ ఇమ్రాన్, ఎండీ షరీఫ్, శ్రీధర్, అల్లంపల్లి రాజబాబు పాల్గొన్నారు. నిరసన తెలుపుతున్న వైఎస్సార్ సీపీ నాయకులుఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తీరుపై వైఎస్సార్సీపీ నేతల ఆగ్రహంఅసత్య ప్రచారాలు ఆయన నైజం జర్నలిస్టుగా సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సిన వేమూరి రాధాకృష్ణ, తప్పుడు ఆరోపణలు, అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఈ తప్పుడు ప్రచారాలకు వ్యతిరేకంగా మేము శాంతియుత నిరసనలు కొనసాగిస్తాం. రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే ప్రాజెక్టులపై విషప్రచారం చేయడం దారుణం. దేశంలోనే అతిపెద్ద స్కామ్ అమరావతి ప్రాజెక్ట్ అయితే, మరోవైపు మావిగన్ ప్రాజెక్ట్ రాష్ట్రానికి అతిపెద్ద గ్రోత్ కారిడార్గా నిలుస్తుంది. అమరావతిలో కేవలం రూ. 4 వేలకే అయ్యే పనులకు రూ. 14 వేలు ఖర్చు చేస్తూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో రియల్ ఎస్టేట్ ప్రయోజనాలే కనిపిస్తే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేశారు. – మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్ -
ఆ రాతలు అత్యంతం నీచం
వేమూరి రాధాకృష్ణ ఇటీవల రాసిన కథనాలు అత్యంత నీచంగా ఉన్నాయి. మహిళలను అవమానించేలా రాయడం అసహ్యకరం. వారి గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్న ఈ రాతలపై రాధాకృష్ణ వెంటనే మహిళా లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. మీడియా వేదికలను ఉపయోగించుకుని సమాజంలో విభేదాలు సృష్టించడం సరికాదు. కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ల మెప్పు కోసమే రాధాకృష్ణ ఇలాంటి కథనాలు రాస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం జర్నలిజాన్ని దుర్వినియోగం చేయడం ప్రజాస్వామ్యానికి చేటు. మహిళల మనోభావాలను దెబ్బతీసినందుకు ఆంధ్రజ్యోతి పత్రికలోనే క్షమాపణ చెబుతూ స్పష్టమైన వివరణ ప్రచురించాలి. – మాజీ ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు -
మారథాన్ కాదు.. మోసగాళ్ల ప్లాన్
ఈ ఫేక్ మారథాన్ పోస్టర్పై ఉన్న వివరాలు చూస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. సాధారణంగా మారథాన్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్గా వ్యవహరిస్తుంటుంది. ఇదే అదనుగా తీసుకున్న సైబర్ నేరగాళ్లు.. వైజాగ్లో ఈ నెల 19న సన్ రైజ్ మారథాన్ నిర్వహిస్తున్నామంటూ ఏఐ సాయంతో ఒక పోస్టర్ను సృష్టించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్బీఐ స్పాన్సర్ చేస్తోందని, జిల్లా యంత్రాంగం పర్యవేక్షణలో జరుగుతోందని నమ్మబలికారు. ఇక ప్రైజ్ మనీ విషయంలోనూ భారీ ఆశలు రేకెత్తించారు. 21 కి.మీ.మారథాన్ గెలిస్తే రూ.5 లక్షల నగదు బహుమతి, 10 కి.మీ. పరుగులో రూ.3.51లక్షలు, 5 కి.మీ.పరుగులో రూ.2.51 లక్షలు బహుమతులుగా ప్రకటించారు. పాల్గొన్న వారందరికీ ఉచితంగా స్పోర్ట్స్ షూస్, టీషర్టులు, రిఫ్రెష్మెంట్స్, గుడీ బ్యాగ్స్, మెడల్స్, సర్టిఫికెట్లు ఇస్తామని ఊరించారు. రిజిస్ట్రేషన్ కోసం 87969 50441 అనే నంబర్ను పోస్టర్పై పొందుపరిచారు. సైబర్ కేటుగాళ్ల ప్లాన్ ఇది ఈ పోస్టర్లోని వివరాలను నమ్మి, అందులోని నంబర్కు ఎవరైనా కాల్ చేస్తే.. సైబర్ కేటుగాళ్లు వెంటనే ఒక లింక్ పంపిస్తున్నారు. ఆ లింక్ ఓపెన్ చేస్తే, అవతలి వ్యక్తి హిందీలో మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. వ్యక్తిగత వివరాలతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు పేరుతో రూ.500 నుంచి రూ.1000 వరకు చెల్లించాలని కోరుతున్నారు. ఒక్కసారి ఈ ఫీజు చెల్లించిన వెంటనే ఆ లింక్ పనిచేయడం ఆగిపోతుంది. విశాఖ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వందలాది మంది మారథాన్ ప్రియులు ఈ మోసానికి గురైనట్లు తెలుస్తోంది. హెచ్చరిక జారీ చేసిన ఎస్బీఐ ఈ నకిలీ మారథాన్ విషయం ఎస్బీఐ అధికారుల దృష్టికి వెళ్లడంతో డీజీఎం రాహుల్ సంక్రిత్య వెంటనే అప్రమత్తమయ్యారు. తాము ఎలాంటి మారథాన్ను నిర్వహించడం లేదని, సోషల్ మీడియాలో వస్తున్న ఆ పోస్టర్ పూర్తిగా నకిలీదని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి ఫేక్ లింక్లను క్లిక్ చేసి ఎవరూ మోసపోవద్దని హెచ్చరించారు. పోస్టర్లోని నంబర్కు కాల్ చేస్తే హిందీలో మాట్లాడి కాల్ కట్ చేస్తున్నారని లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎం.శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటికే ఈ మోసంపై సైబర్ సెల్కు ఫిర్యాదు చేశామని, ఎస్బీఐ కంట్రోలర్స్ కూడా ఈ విషయంపై నిఘా పెట్టారని ఆయన పేర్కొన్నారు. ఆకర్షణీయమైన పోస్టులను చూసి తొందరపడి డబ్బులు చెల్లించవద్దని అధికారులు ప్రజలకు సూచించారు. పరిగెత్తండి.. రూ.5 లక్షలు గెలవండి.. ఈ మాట వింటే ఎవరికై నా ఆశ కలగడం సహజం. అటు ఆరోగ్యానికి ఆరోగ్యం, ఇటు భారీ బహుమతి అని ఆశపడితే.. చివరకు పైసా వసూల్ అవ్వాల్సింది పోయి, పైసా పరేషాన్ అవుతుందని బాధితులు ఆలస్యంగా గుర్తిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఇప్పుడు సరికొత్త తరహా మోసానికి తెరలేపారు. విశాఖలో ‘సన్ రైజ్ మారథాన్–2026’ పేరుతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక పోస్టర్ ఇప్పుడు నగరంలో కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ పోస్ట్ చూసి మోసపోయిన వారు లబోదిబోమంటున్నారు. – సాక్షి, విశాఖపట్నం -
యుద్ధాలు ఆగాలి.. శాంతి వర్ధిల్లాలి
ఏయూక్యాంపస్: ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు ముగిసి, శాంతి పరిస్థితులు నెలకొనాలనే ఉద్దేశంతో ఇస్కాన్ విశాఖపట్నం ఆధ్వర్యంలో ఆర్కే బీచ్లో బుధవారం మహా హరినామ సంకీర్తన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి వచ్చిన 500 మందికి పైగా బ్రహ్మచారులు, సన్యాసులు పాల్గొని ఆధ్యాత్మికోత్సాహాన్ని నింపారు. ఇస్కాన్ మందిర దర్శనం అనంతరం ఆర్కే బీచ్ నుంచి ప్రారంభమైన ఈ సంకీర్తన యాత్ర పార్క్ హోటల్ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పాల్గొని హరినామ సంకీర్తన విశిష్టతను కొనియాడారు. సాయంత్రం ఎంజీఎం పార్క్లో నిర్వహించిన భజన క్లబ్బింగ్ భక్తుల హృదయాల్లో శాంతి, ఆనందాలను నింపింది. ప్రపంచం అశాంతి, అనిశ్చితి పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో.. యుద్ధాలకు ముగింపు పలకాలని, విశ్వ సౌభ్రాతృత్వం, శాశ్వత శాంతి కలగాలని కోరుతూ చేసిన వినమ్ర ప్రార్థనే ఈ మహా సంకీర్తన అని ఇస్కాన్ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో జయపతాక స్వామి మహారాజ్, ఇస్కాన్ విశాఖ అధ్యక్షుడు సాంబదాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఈఎస్ఐసీ జాయింట్ డైరెక్టర్గా రవికుమార్
సీతంపేట: కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) విశాఖపట్నం ఉప ప్రాంతీయ కార్యాలయం జాయింట్ డైరెక్టర్గా కె.ఆర్.రవికుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కోయంబత్తూరు ఉప ప్రాంతీయ కార్యాలయం నుంచి ఆయన విశాఖకు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖపట్నం ఉప ప్రాంతీయ కార్యాలయం పరిధిలో 2025 మార్చి 31 నాటికి 18,705 మంది యజమానుల వద్ద మొత్తం 15,03,306 మంది లబ్ధిదారులు ఈ పథకం కింద ఉన్నట్లు వెల్లడించారు. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలు ఈ విశాఖ ఉప ప్రాంతీయ కార్యాలయ పరిధిలోకి వస్తాయని వివరించారు. లబ్ధిదారులకు మెరుగైన సేవలే లక్ష్యంగా పని చేస్తామని పేర్కొన్నారు. -
రూ.కోట్లలో నకిలీ జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మోసం
సాక్షి, విశాఖపట్నం : ఎలాంటి వస్తువులు కొనుగోళ్లు, అమ్మకాలు జరపకుండానే నకిలీ బిల్లులు సృష్టించి ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ఇన్పుట్ ట్యాక్స్ కొట్టేసిన వ్యవహారాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) విశాఖ జోనల్ యూనిట్ అధికారులు వలపన్ని ఛేదించారు. అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన దావూద్ హార్డ్వేర్ సిమెంట్స్ సంస్థ నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి సుమారు రూ.19.79 కోట్ల మేర ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందిన కుంభకోణం బట్టబయలైంది.డీజీజీఐ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కంపెనీల పేరుతో.. ఎలాంటి వ్యాపారం జరగకపోయినా జరిగినట్లుగా రికార్డులు సృష్టించిన కేసులో ఎలియాజ్ బాషాను అరెస్ట్ చేశారు. తన సోదరుడికి చెందిన దావూద్ హార్డ్వేర్ సంస్థను అడ్డం పెట్టుకుని వివిధ సంస్థలకు నకిలీ రశీదులు జారీ చేయడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి కొట్టినట్లు దర్యాప్తులో తేలింది. నిందితులపై సీజీఎస్టీ చట్టం–2017 ప్రకారం అరెస్ట్ చేసి విశాఖ ఆర్థిక నేరాల కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని డీజీజీఐ అధికారులు వెల్లడించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో విశాఖపట్నం డీజీజీఐ అధికారులు ఇప్పటివరకు దాదాపు రూ.352 కోట్లకు పైగా జీఎస్టీ మోసాలను గుర్తించి, ఈ కుంభకోణాల వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులతో సహా మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. -
ఏబీఎన్ రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలి: గుడివాడ అమర్నాథ్
విశాఖ: ఏబీఎన్ రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. రాధాకృష్ణ తప్పుడు కూతలపై శాంతియుత నిరసన చేపట్టామని అన్నారు. విశాఖలో ఇవాళ ఆయన నిరసనలో పాల్గొని మాట్లాడారు.‘దేశంలో అతిపెద్ద స్కాం అమరావతి. మావిగన్ అతిపెద్ద గ్రోత్ కారిడార్. అమరావతిలో 4 వేల రూపాయల ఖర్చు అయ్యే భవనాల చదరపు అడుగు నిర్మాణానికిరూ.14 వేలు ఖర్చు చేస్తున్నారు. జగన్ ది స్టేట్ ఇంట్రెస్ట్ అయితే చంద్రబాబు ది రియల్ ఎస్టేట్. కొత్త పలుకు కాదు చెత్త పలుకు. మేము మీలాగా తప్పులు పనులు చేసి పదవులు పొందలేదు. నీ గురించి నీతోటి జర్నలిస్టులను అడిగితే చెబుతారు. జర్నలిస్ట్ స్థాయి నుంచి కంపెనీకి అధిపతివి ఎలా అయ్యావు? ఎన్టీఆర్కు చంద్రబాబు వెన్నుపోటు, నువ్వు పెన్నుపోటు పొడిచావు’ అని అన్నారు.ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ.. ‘రాధాకృష్ణవి నీచమైన రాతలు. రాధాకృష్ణ పాపం పండింది. అందుకే ఇలాంటి రాతలు రాశాడు. మహిళలకు రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి. బాబు, లోకేష్ మెప్పు కోసమే రాధాకృష్ణ ఇలాంటి రాతలు రాస్తున్నాడు. రాధాకృష్ణ రాతలు చూసి చంద్రబాబు రాక్షస ఆనందం పొందుతున్నారు. ఆంధ్రజ్యోతి పత్రికలో మహిళలకు క్షమాపణ చెబుతూ వార్త రాయాలి’ అని అన్నారు.మావిగన్పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని విశాఖ నగర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. దీని నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం మహిళలపై పిచ్చి రాతలు రాశారని చెప్పారు. రాధాకృష్ణ పిచ్చి పరాకాష్ఠకు చేరుకుందని తెలిపారు. జర్నలిజం విలువలను రాధాకృష కాలరాశారని అన్నారు. కమిషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారని తెలిపారు. రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
వీసీ కుర్చీలో ఎంపీ దర్జా
ప్రొటోకాల్కు పాతర, ఏయూ ప్రతిష్టకు దెబ్బవిశాఖ సిటీ : ఆంధ్ర విశ్వవిద్యాలయం మరోసారి వివాదాల కేంద్రమైంది. శతాబ్ది ఉత్సవాల నిర్వహణపై సమీక్ష సమావేశం సందర్భంగా గీతం యూనివర్సిటీ అధినేత, విశాఖ ఎంపీ శ్రీభరత్ ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీసింది. ప్రొటోకాల్ను తుంగలో తొక్కి ఏకంగా వైస్ చాన్సలర్ సీటులో కూర్చోవడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. సాక్షాత్తూ రాష్ట్ర గవర్నర్ నియమించే అత్యున్నత పదవికి ఇవ్వాల్సిన గౌరవాన్ని గాలికొదిలేసి, ఆ సీటులో తిష్టవేసి సమీక్ష నిర్వహించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. వర్సిటీ ప్రతిష్టను మంటగలిపేలా విశాఖ ఎంపీ శ్రీభరత్ వ్యవహరించిన తీరు ఇప్పుడు విద్యావేత్తలను, మేధావులను విస్మయానికి గురిచేస్తోంది. గతంలో స్టీల్ప్లాంట్ సీఎండీ కుర్చీ ఘటనను తలపించే ఈ తాజా చర్య.. ప్రజాస్వామ్య వ్యవస్థల గౌరవంపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది. అధికార దర్పంతో ఎంపీ ఏ విశ్వవిద్యాలయానికై నా వైస్ చాన్సలర్ పదవి అత్యున్నతమైనది. ఆ కుర్చీ కేవలం చాన్సలర్ హోదాలో ఉన్న గవర్నర్ లేదా నియమితులైన వీసీకి మాత్రమే పరిమితం. ఇది దశాబ్దాల సంప్రదాయం. కానీ, శతాబ్ది ఉత్సవాల సమీక్ష పేరుతో వర్సిటీలోకి అడుగుపెట్టిన ఎంపీ శ్రీభరత్.. ప్రొటోకాల్ను తుంగలో తొక్కి ఏకంగా వీసీ కుర్చీనే ఆక్రమించేశారు. సాక్షాత్తూ రాష్ట్ర గవర్నర్ నియమించే అత్యున్నత పదవికి ఇచ్చే గౌరవం ఇదేనా? అని విద్యావేత్తలు మండిపడుతున్నారు. వీసీ ప్రొఫెసర్ రాజశేఖర్ పక్కన సాధారణ కుర్చిలో అసహాయంగా కూర్చుని ఉండగా, ఎంపీ ఆ సీటులో తిష్టవేసి సమీక్ష నిర్వహించడం వర్సిటీ స్వయంప్రతిపత్తిని అపహాస్యం చేయడమే. గవర్నర్ హితవు గుర్తులేదా? ఏయూ శతాబ్ది ఉత్సవాల ప్రారంభానికి విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్.. ‘విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలకు తావులేకుండా పారదర్శక పాలన సాగాలి’ అని హితవు పలికారు. ఆ మాటల పచ్చబొట్టు ఇంకా చెరిగిపోకముందే, ఎంపీ తన రాజకీయ ప్రతాపాన్ని వీసీ గదిలో ప్రదర్శించడం విశేషం. సోషల్ మీడియాలో వైరల్.. విమర్శల వెల్లువ ప్రస్తుతం ఎంపీ శ్రీభరత్ వీసీ కుర్చీలో కూర్చున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. గత ఎంపీలు ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడలేదని విద్యావేత్తలు గుర్తుచేస్తున్నారు. గత ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ సీఎండీని కలిసినప్పుడు పక్కన కూర్చుని మాట్లాడిన ఫొటోలను, ఇప్పుడు శ్రీభరత్ అధికార కుర్చీని ఆక్రమించిన ఫొటోలను పోల్చుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక విశ్వవిద్యాలయానికి అధినేతగా ఉంటూ విద్యాబుద్ధులు నేర్పాల్సిన వ్యక్తి, ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారులకు ఇవ్వాల్సిన కనీస గౌరవాన్ని మర్చిపోవడం విచారకరం. అధికారులను తన అడుగులకు మడుగులు వత్తించుకునే స్థాయికి దిగజారడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. వీసీ సీట్లో కూర్చుని సమీక్షలు జరపడం ద్వారా ఏయూ ప్రతిష్టను దిగజార్చారని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార బలం ఉందన్న గర్వంతో వ్యవస్థలను కించపరిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. అలవాటుగా మారిన ’కుర్చీ’ లాట శ్రీభరత్కు ఇలాంటి ‘అధికార దర్పం’ కొత్తేమీ కాదు. గతంలో విశాఖ స్టీల్ప్లాంట్ సందర్శన సమయంలోనూ ఆయన ఇలాగే వ్యవహరించారు. దేశ రాష్ట్రపతి ద్వారా నియమితులయ్యే సీఎండీ స్థానానికి ఒక ప్రత్యేకమైన ప్రొటోకాల్ ఉంటుంది. కేంద్ర సంయుక్త కార్యదర్శి హోదాలో ఉండే సీఎండీ సీటులో ఎంపీ కూర్చుని రివ్యూ చేయడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. సీఎండీ అతుల్భట్ను పక్కన కూర్చోబెట్టుకుని ఆర్డర్లు వేయడం చూసి అక్కడి ఉన్నతాధికారులు ముక్కున వేలేసుకున్నారు. ఒక ప్రజాప్రతినిధిగా వ్యవస్థలను గౌరవించాల్సింది పోయి, వాటి ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నారని కార్మిక వర్గాలు మండిపడ్డాయి. శతాబ్ది ఉత్సవాల వేళ సమున్నత గౌరవంతో వెలగాల్సిన ఆంధ్ర విశ్వవిద్యాలయం.. ఇప్పుడు రాజకీయ అహంకారానికి వేదికై ంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఒక ప్రైవేట్ వర్సిటీ అధినేత, ప్రజాప్రతినిధి హోదాలో ఉన్న వ్యక్తి.. రాజ్యాంగబద్ధమైన పదవులకు ఇవ్వాల్సిన కనీస గౌరవాన్ని విస్మరించారు. ‘కుర్చీ’ కనిపిస్తే చాలు.. అది ఎవరిదన్న విజ్ఞత మరిచి ‘నేనే బాస్’ అన్నట్లు ప్రవర్తించడం ఇప్పుడు విశాఖలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. -
చట్టాలపై అవగాహనతోనే మహిళలకు రక్షణ
సబ్బవరం: న్యాయ పరిజ్ఞానం మహిళలకు ఆత్మవిశ్వాసాన్ని, శక్తిని ఇస్తుందని.. చట్టాలపై అవగాహన ఉంటే పని ప్రదేశాల్లో ఎదురయ్యే లైంగిక వేధింపులను అడ్డుకోవడం సులభమవుతుందని కేంద్ర సమాచార కమిషన్ కమిషనర్ సుధారాణి రేలంగి అన్నారు. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, నిషేధం, పరిష్కారానికి ఉద్దేశించిన ‘పోష్’చట్టం–2013 అమలుపై మంగళవారం దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో దక్షిణ ప్రాంతీయ న్యాయ సమీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కార్యాలయాల్లో అనుచిత వ్యాఖ్యలు, అసభ్య ప్రవర్తన మహిళల గౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా వారి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోష్ చట్టం.. నివారణ, నిషేధం, పరిష్కారం అనే మూడు ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తుందని ఆమె వివరించారు. అంతర్జాతీయ చట్టాల స్ఫూర్తితో రూపొందిన ఈ చట్టాన్ని మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు వర్సిటీ ఉపకులపతి ఆచార్య సూర్యప్రకాశరావు ప్రారంభోపన్యాసం చేస్తూ.. ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకు మహిళల స్థానంలో వచ్చిన మార్పులను, పోష్ చట్టం నేపథ్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమాన్ని రెండు విభాగాలుగా నిర్వహించారు. మొదటి సెషన్లో పోష్ చట్టంలోని నిబంధనలు, సంస్థాగత వ్యవస్థలపై చర్చించగా.. రెండో సెషన్లో చట్టం అమలులో ఎదురవుతున్న సవాళ్లు, కొత్త సమస్యలపై నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ముగింపు సమావేశంలో రాష్ట్ర న్యాయ విభాగం కార్యదర్శి డాక్టర్ ప్రతిభ రాణి వర్చువల్గా ప్రసంగించారు. మహిళలు ప్రతి చోటా భద్రత కోసం పోరాడాల్సి రావడం సమాజ దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో జాతీయ మహిళా కమిషన్ సభ్యులు, విశాఖ బార్ అసోసియేషన్ న్యాయవాదులు, ఆంధ్ర విశ్వవిద్యాలయం, డీఎస్ఎన్ఎల్యూ అధ్యాపకులు, పలువురు నిపుణులు పాల్గొన్నారు. కార్యక్రమ సమన్వయకర్తలుగా డాక్టర్ భాగ్యలక్ష్మి, డి.షెర్లీ హెప్సిభా వ్యవహరించారు. కేంద్ర సమాచార కమిషనర్ సుధారాణి రేలంగి -
నేడు కేంద్ర కార్యదర్శి రాక
మహారాణిపేట: భారత ప్రభుత్వ కేంద్ర గణాంక, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ సౌరభ్ గార్గ్ బుధవారం విశాఖపట్నం రానున్నారు. ఈ మేరకు జాతీయ గణాంక కార్యాలయ డిప్యూటీ డైరెక్టర్ జనరల్(డీడీజీ) డి.సతీష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తన పర్యటనలో భాగంగా కేంద్ర కార్యదర్శి విశాఖలోని జాతీయ గణాంక ఉప ప్రాంతీయ కార్యాలయాన్ని సందర్శిస్తారు. అనంతరం దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్న నేషనల్ హౌస్హోల్డ్ ఇన్కమ్ సర్వే ఫీల్డ్ వర్క్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఆయనతో పాటు జాయింట్ డైరెక్టర్ రజత్, అసిస్టెంట్ డైరెక్టర్ పి.రాజశేఖర్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారని డీడీజీ పేర్కొన్నారు. -
విశాఖ ఖ్యాతిని పెంచేలా కార్యాచరణ
మహారాణిపేట: విశాఖ జిల్లాకు ఉన్న కీర్తి ప్రతిష్టలకు తగ్గట్టుగా వినూత్న రీతిలో అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టాలని, ఇందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సేవల మెరుగుదల, వివిధ విభాగాల సమన్వయంపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ శాఖల అధికారులు తమ పరిధిలోని సమాచారం, సమస్యలు, పురోగతిని నేరుగా తనకే తెలియజేయా లని సూచించారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా కమ్యూనికేషన్ కొనసాగించాలని, అవసరమైతే ఎప్పుడైనా తనను సంప్రదించవచ్చని పేర్కొ న్నారు. అధికారుల పని సమయాల్లో 40 శాతం సాధారణ విధులకు, మిగిలిన 60 శాతం సమయాన్ని జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, వినూత్న ప్రాజెక్టుల కోసం వెచ్చించాలని సూచించారు. ప్రభు త్వ ప్రాధాన్యతలే మనందరి ప్రాధాన్యతలు కావాలని, ఆశించిన ఫలితాలను ముందుగానే అంచనా వేసి సిద్ధంగా ఉండాలన్నారు. క్షేత్రస్థాయి సమస్యలపై వేగంగా స్పందించాలని స్పష్టం చేశారు. వైద్య రంగంలో డీఎంహెచ్వో, ఎన్టీఆర్ వైద్య సేవ కోఆర్డినేటర్, డ్రగ్ ఇన్ స్పెక్టర్, ఫుడ్ సేఫ్టీ విభాగాల మధ్య సమన్వయం పెరగాలని ఆదేశించారు. ప్రజల నుంచి ప్రతికూల స్పందన రాకుండా ప్రతి ఫిర్యాదును నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని, లేని పక్షంలో తానే స్వయంగా రంగంలోకి దిగుతానని హెచ్చరించారు. బ్యాంక్ లింకేజీని పెంచాలని, పరిశ్రమలు, రాయితీలపై అవగాహన కల్పించాలని సూచించారు. భోగాపురం ఎయిర్పోర్టుకు కనెక్టివిటీ పెంచేలా విశాఖ నుంచి ఏసీ బస్సు సర్వీసులను నడపాలని, దీనిపై అధ్యయనం చేయాలని ఆర్టీసీ ఆర్ఎంను ఆదేశించారు. దక్షిణ నియోజకవర్గంలో రైతు బజార్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. అధికారులందరూ ఒక బృందంగా పనిచేసి విశాఖను రాష్ట్రానికి ఆదర్శంగా నిలపాలని పిలుపునిచ్చారు. జేసీ గొబ్బిళ్ల విద్యాధరి, డీఎఫ్వో రవీందర్ ధామ, డీఆర్వో ఎం.విశ్వేశ్వరనాయుడు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ -
కేజీహెచ్లో భోజనం కోసం ఇండో ఎంఐఎం వితరణ
మహారాణిపేట : కేజీహెచ్లో రోగులు, వారి సహాయకులకు భోజనం అందించడానికి ఇండో ఎంఐఎం సంస్థ ముందుకు వచ్చింది. తమ సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.40 లక్షల చెక్కును టచ్ స్టోన్ చారిటీస్, హరే కృష్ణ మూవ్మెంట్ అందజేశారు. సుభోజనం కింద కేజీహెచ్లో ఏడాది పాటు రోగులు, వారి సహాయకులకు రెండు పూటలా భోజనం, అల్పాహారం ఇవ్వడం కోసం సహాయం చేశారు. కార్యక్రమంలో ఇండో ఎంఐఎం ప్రతినిధి విజయ్ గోవింద్, టచ్స్టోన్ చారిటీస్ ప్రతినిధి గోపేశ్వర దాస పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ గోవింద్ టచ్స్టోన్ చారిటీస్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. -
యువ జోష్
ఉల్లాసంగా ఏయూ కల్చరల్ ఫెస్ట్ మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న కల్చరల్ ఫెస్ట్ రెండో రోజు మంగళవారం హుషారుగా సాగింది. విద్యార్థుల ఉత్సాహం, కళాకారుల ప్రతిభతో ఏయూ ప్రాంగణం సాంస్కృతిక వేదికగా మారింది. యువ గాయనీ గాయకులు సాయి దేవ హర్ష, వాగ్దేవి తమ గాత్రంతో యువతను ఉర్రూతలూగించారు. వారు పాడిన హిట్ గీతాలకు విద్యార్థులు స్టెప్పులేస్తూ కేరింతలు కొట్టారు. ఏయూ అనుబంధ కళాశాలల విద్యార్థులు ప్రదర్శించిన జానపద, సినీ నృత్యాలు ఆహూతులను మంత్రముగ్ధులను చేశాయి. సంప్రదాయబద్ధంగా సాగిన ప్రదర్శనలతో పాటు, యువతను ఆకట్టుకునేలా సాగిన వెస్ట్రన్ డ్యాన్స్లు జోష్ నింపాయి. ఈ సందర్భంగా సినీ నటుడు శివాజీ మాట్లాడుతూ.. తన తాత ఏయూ పూర్వ విద్యార్థి అని, ఈ విశ్వవిద్యాలయంతో తన కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు. ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే మేటి విశ్వవిద్యాలయంగా ఏయూ నిలవాలని, నూతన జ్ఞానాన్ని సృష్టించే కేంద్రాలుగా వర్సిటీలు మారాలని ఆకాంక్షించారు. యూత్ ఫెస్టివల్లో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొన్న ఎన్ఎస్ఎస్ వలంటీర్లను ఇదే వేదికపై ఘనంగా సత్కరించారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్, కల్చరల్ ఫెస్ట్ చైర్మన్ ఆచార్య ఎన్. విజయ్ మోహన్, వైస్ చైర్మన్ ఆచార్య ఎ.పల్లవి, కన్వీనర్ ఆచార్య ఎన్.ఎం. యుగంధర్, ఆశా ఇమ్మానియల్ రాజు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. -
ఏయూ చరిత్రను గ్రంథస్తం చేయాలి
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం వందేళ్ల చరిత్రను, విశిష్టతను భవిష్యత్ తరాలకు తెలియజేయాలంటే ఆ చరిత్రను గ్రంథస్తం చేయాలని రాజ్యసభ పూర్వ సభ్యుడు, విశ్వ హిందీ పరిషత్ చైర్మన్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ సూచించారు. ఏయూ తెలుగు శాఖ ఆధ్వర్యంలో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మంగళవారం శ్రీ రామినేని కోదండరామయ్య భవనంలో శతాబ్ది సాహితీ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయం ప్రతిష్ట, విశిష్టత, ముఖ్య ఘట్టాలను ప్రతిబింబించేలా ప్రత్యేక మ్యూజియంను ఏర్పాటు చేయా లని సూచించారు. దీని ద్వారా భవిష్యత్ తరాలకు విశ్వవిద్యాలయం స్థాపన, ప్రగతి, వికాసం గురించి సమగ్ర అవగాహన కలుగుతుందన్నారు. వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయం త్వరలోనే మరో శతాబ్దంలోకి అడుగుపెడుతుందని తెలిపారు. తెలుగు విభాగాధిపతి ఆచార్య జర్ర అప్పారావు తెలుగు శాఖ గొప్పదనాన్ని, భాషా, సాహిత్య రంగాలకు విభాగం అందించిన సేవలను వివరించారు. ప్రముఖ కవులు అట్టాడ అప్పల నాయుడు, తల్లావజ్జల పతంజలి శాస్త్రి, తెలుగు బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ ఆచార్య నల్లా సత్యనారాయణ తదితరులు ప్రసంగించారు. అనంతరం విభాగ విశ్రాంత ఆచార్యులు పర్వతనేని సుబ్బారావు, జి.యోహాన్ బాబు, వెలమల సిమ్మన్న, ఆచార్య కె.మలయవాసిని లను సత్కరించారు. తెలుగు సాహిత్య వికాసానికి విశిష్ట సేవలు అందిస్తున్న కవులు, రచయితలు, గాయనీ గాయకులను సన్మానించారు. -
విధులకు వెళ్తుండగా విషాదం
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణంబైక్ షోరూమ్ ఉద్యోగి మృతి పెందుర్తి: బీఆర్టీఎస్ రహదారిలోని పెందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలవగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలివి. సాలూరుకు చెందిన ఎం.పోలిరాజు (45) చినముషిడివాడలో తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆయన పెందుర్తిలోని ఒక బైక్ షోరూమ్లో ఆడిట్ విభాగంలో పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు తన ద్విచక్ర వాహనంపై చినముషిడివాడ నుంచి పెందుర్తి బయలుదేరారు. ప్రభుత్వ కళాశాల దాటిన తర్వాత చర్చి సమీపంలోకి వచ్చేసరికి బైక్ అదుపుతప్పి రోడ్డు దాటుతున్న లక్ష్మణ్ అనే వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పోలిరాజు వాహనంపై నుంచి కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లారు. స్థానికులు వెంటనే స్పందించి ఆయనను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలిరాజుకు భార్య కృష్ణవేణి, పిల్లలు ఉన్నారు. పెందుర్తి సీఐ కె.వి. సతీష్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విధి నిర్వహణ కోసం ఉత్సాహంగా ఇంటి నుంచి బయలుదేరిన వారిని మృత్యువు రోడ్డు ప్రమాద రూపంలో కబళించింది. మంగళవారం సబ్బవరం, పెందుర్తి మండలాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఒకరు పంచాయతీ స్వీపర్ కాగా, మరొకరు షోరూమ్ ఉద్యోగి. విధులకు వెళ్తూ మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోవడంతో ఆయా కుటుంబాల్లో పెను విషాదం నెలకొంది.పంచాయతీ స్వీపర్ మృతి సబ్బవరం: మండలంలోని గొల్లలపాలెం శివారు అమరపిన్నివానిపాలేనికి చెందిన కొమ్ము దుర్గాలు (65) బోలెరో వాహనం ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందారు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. దుర్గాలు గొల్లలపాలెం పంచాయతీలో స్వీపర్గా పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు ఆయన కాలినడకన బయలుదేరారు. అదే సమయంలో పెందుర్తి మండలం రాంపురం గ్రామానికి చెందిన చిట్టిబోయిన గణేష్ తన ద్విచక్ర వాహనంపై కూర్మన్నపాలెం వెళ్తుండగా.. దుర్గాలు లిఫ్ట్ అడగడంతో అతడిని బైక్పై ఎక్కించుకున్నాడు. మార్గమధ్యలో ఒక మలుపు వద్ద ఎదురుగా వేగంగా వచ్చిన బోలెరో వాహనం బైక్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ రోడ్డుపై పడిపోగా, దుర్గాలు తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ నడుపుతున్న గణేష్కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన బోలెరో వాహనం డ్రైవర్ ఆపకుండా అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు ఆ వాహనం నంబర్ను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జి.రామచంద్రరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లిలోని ఆస్పత్రికి తరలించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. దుర్గాలుకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. పోలిరాజు మృతదేహం, గాయపడ్డ లక్ష్మణ్ -
పేరు లేని ప్రశంస సంతకం లేని గౌరవం
విశాఖ సిటీ: వందేళ్ల ఉత్తరాంధ్ర విద్యా కుసుమ ఘన వైభవం పాలకుల చేతుల్లో అభాసుపాలవుతోంది. శతాబ్ది ఉత్సవాల వేళ దేదీప్యమానంగా వెలిగిపోవాల్సిన ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారుల నిర్లక్ష్యంతో వెలవెలబోతోంది. శత జయంతి పండగను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన పాలకులు.. తూతూ మంత్రం వ్యవహారంగా మార్చేశారు. శతాబ్ది ఉత్సవాల పేరుతో ఏడాది క్రితం నుంచి సమీక్షలు, సమావేశాల పేరుతో హడావుడి చేసిన అధికారులు.. ఇప్పుడు కార్యక్రమాల నిర్వహణలో ఘోరంగా విఫలమవుతున్నారు. మంగళవారం జరిగిన శతాబ్ది సాహితీ మహోత్సవం ఇందుకు నిదర్శనం. కవులను, కళాకారులను గౌరవించాల్సిన చోట వారికి అవమానం జరగడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. పేర్లు, సంతకాలు లేకుండా ప్రశంసాపత్రాలు శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఏయూలోని శ్రీ రామనేని కోదండ రామయ్య భవనంలో శతాబ్ది సాహితీ మహోత్సవాన్ని నిర్వహించారు. దీనికి అనేక మంది కవులు, అవధానులు తరలివచ్చారు. భాషాభిమానంతో వచ్చిన వారికి ఏయూ అధికారులు ఇచ్చిన బహుమతి చూసి అందరూ అవాక్కయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి అందజేసిన ప్రశంసా పత్రాలపై కనీసం గ్రహీత పేరు కూడా లేకపోవడం గమనార్హం. ఎవరి పేర్లు లేకుండా ఖాళీగా ‘ఫిల్ ఇన్ ద బ్లాంక్’ అన్నట్లు పత్రాలు అందజేయడంపై అందరూ విస్తుపోయారు. పేర్లు లేకపోగా.. అలాగే ఆ పత్రాలపై కనీసం వైస్ ఛాన్సలర్ సంతకం కానీ, ఇటు తెలుగు విభాగాధిపతి సంతకం కానీ లేకపోవడం మరింత విశేషం. ఖాళీ కాగితాలను చేతిలో పెట్టి పంపించడం పట్ల సాహితీవేత్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర అవమానంగా భావిస్తున్నారు. నిర్లక్ష్యానికి పరాకాష్ట ఈ శతాబ్ది ఉత్సవాల కోసం 2025 నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పాలకులు గొప్పలు చెప్పుకున్నారు. తీరా సమయం వచ్చేసరికి కనీసం ఒక సర్టిఫికెట్ కూడా సరిగ్గా సిద్ధం చేయలేని స్థితిలో ఉండడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం. అతిథులకు ఇచ్చే గౌరవ పత్రాలపై బాధ్యతాయుతమైన అధికారుల సంతకాలు లేకపోవడం ఏయూ చరిత్రలోనే ఒక మాయని మచ్చగా మిగిలిపోనుంది. ఏయూ వంటి మహోన్నత విద్యాసంస్థలో ఇలాంటి అపశ్రుతులు దొర్లడం అధికారుల అసమర్థతకు అద్దం పడుతోంది. కవుల కన్నెర్ర.. పాలకుల తీరుపై నిరసన తమను పిలిచి ఇలా అవమానించడంపై కవులు, సాహితీవేత్తలు మండిపడుతున్నారు. ఇది కేవలం తమకు జరిగిన అవమానం మాత్రమే కాదని, తెలుగు భాషకు, ఏయూ ప్రతిష్టకు జరిగిన భంగమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు యూనివర్సిటీలకు కొమ్ముకాస్తూ, ప్రభుత్వ రంగంలోని ఏయూ గౌరవాన్ని పాతాళానికి తొక్కుతున్నారని బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. దిగజారుతున్న ప్రతిష్ట ఏయూ శతాబ్ది ఉత్సవాలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పూర్వ విద్యార్థులు గర్వపడేలా ఉండాలి. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రతి కార్యక్రమంలోనూ ఏదో ఒక వివాదం తలెత్తుతూనే ఉంది. రాజకీయ జోక్యం ఒకవైపు, అధికారుల అలసత్వం మరోవైపు వర్సిటీని పట్టి పీడిస్తున్నాయి. శతాబ్ది ఉత్సవాల నిర్వహణలో ఇంతటి ఘోర తప్పిదాలు జరుగుతున్నా ఉన్నతాధికారులు స్పందించకపోవడం గమనార్హం. ఇప్పటికై నా పాలకులు మేల్కొని, మిగిలిన కార్యక్రమాలనైనా గౌరవప్రదంగా నిర్వహించాలని విద్యావేత్తలు కోరుతున్నారు. -
వైఎస్ జగన్తో వాసుపల్లి భేటీ
డాబాగార్డెన్స్: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని పార్టీ విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శ్రీవారి పంచలోహ విగ్రహాన్ని అందజేశారు. నియోజకవర్గంలో ఇటీవల నిర్వహించిన కేడర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఈ భేటీలో చర్చించారు. నియోజకవర్గంలో ఓటీపీ వెరిఫికేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోందని, ఆ డేటాను కూడా త్వరలోనే కేంద్ర కార్యాలయానికి అందజేస్తామని వాసుపల్లి అధినేతకు వివరించారు. -
విశాఖ చేరుకున్న జయపతాక స్వామీజీ
నేడు 550 మందితో అప్పన్న దర్శనం కొమ్మాది/ఏయూక్యాంపస్: అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం(ఇస్కాన్) ప్రసిద్ధ ఆధ్యాత్మి క గురువు, ప్రపంచవ్యాప్తంగా భక్తియోగం, శ్రీకృష్ణ తత్వాన్ని ప్రచారం చేస్తున్న పరమపూజ్య జయపతాక స్వామి మహారాజ్ మంగళవారం నగరానికి చేరుకున్నారు. బుధవారం ఉదయం జయపతాక స్వామీజీ 550 మంది సన్యాసులతో కలిసి శ్రీలక్ష్మీనృసింహ స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం లోక కల్యాణం, ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ఇస్కాన్ భక్తులతో కలిసి భారీ ఆధ్యాత్మిక ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీ ఆర్.కె.బీచ్ నుంచి ప్రారంభమై పార్క్ హోటల్ వరకు కొనసాగుతుంది. సాయంత్రం ఎంజీఎం పార్క్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సంగీత విభావరి, భజన, కీర్తన కార్యక్రమాల్లో స్వామీజీ పాల్గొంటారు. అలాగే ఇస్కాన్లో రెండు రోజుల పాటు శ్రీకృష్ణ లీలలపై ఆయన ఆధ్యాత్మిక ప్రవచనాలు చేయనున్నారు. ఈ కార్యక్రమాల్లో నగరవాసులు, భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని ఇస్కాన్ విశాఖపట్నం అధ్యక్షుడు సాంబాదాస్ ప్రభూజీ కోరారు. -
ఏయూకు ‘ఐసీటీపీఎల్’ సహకారం
మద్దిలపాలెం: ఏయూ స్థలాల అభివృద్ధికి ‘ఇంటిగ్రేటెడ్ కార్గో టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ (ఐసీటీపీఎల్)’ సంస్థ ముందుకొచ్చింది. మూడెకరాల విస్తీర్ణంలో ఉన్న భూమిని శుభ్రపరిచే చర్యలు చేపట్టింది. మొక్కల రక్షణ కోసం ఆ ప్రాంతం చుట్టూ ముళ్ల కంచె ఏర్పాటు చేశారు. మియావాకి విధానాన్ని అనుసరించి వివిధ రకాల మొక్కలను నాటి, స్థిరమైన హరిత వాతావరణాన్ని సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ఏయూ వీసీ ప్రొఫెసర్ జి.పి. రాజశేఖర్, రెక్టార్లు, డీన్లు, ఆచార్యులు హాజరై ఐసీటీపీఎల్ చొరవను అభినందించారు. ఐసీటీపీఎల్ డిప్యూటీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జితిన్ సింగ్, ఓఎస్ఎల్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ జేకే నాయక్ పాల్గొని మాట్లాడారు. వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు చురుగ్గా పాల్గొని మొక్కలు నాటారు. మొక్కల సంరక్షణ కోసం ప్రత్యేక నీటి సరఫరా వ్యవస్థను కూడా ఐసీటీపీఎల్ ఏర్పాటు చేసింది. ‘వన్ మిలియన్ ప్లాంటేషన్ డ్రైవ్’లో భాగంగా విశాఖ పోర్టు సంస్థ కూడా గ్రీన్ బెల్ట్ అభివృద్ధి కోసం మొక్కలను అందజేసిందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో వీసీటీపీఎల్ టెర్మినల్ హెడ్ సుదీప్ బెనర్జీ, వైస్ ప్రెసిడెంట్ డి.నరేష్ కుమార్, బిజినెస్ హెడ్ కళ్యాణ్ చక్రవర్తి, ఐసీటీపీఎల్ డిప్యూటీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జితిన్ సింగ్ కంపానీ, వైస్ ప్రెసిడెంట్ జితేంద్ర కుమార్ నాయక్, డాక్టర్ ప్రకాష్, ఏయూ ఆచార్యులు, విదేశీ విద్యార్థులు పాల్గొన్నారు. -
నాణ్యతలో రాజీ వద్దు.. పనుల్లో వేగం పెంచండి
విశాఖ సిటీ: వీఎంఆర్డీఏ పరిధిలో చేపట్టిన ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని వీఎంఆర్డీఏ చైర్మన్ ఎం.వి.ప్రణవ్ గోపాల్ అధికారులకు సూచించారు. మంగళవారం వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్.తేజ్ భరత్తో కలిసి ఇంజనీరింగ్ విభాగం అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో అంకితభావంతో పని చేయాలని సూచించారు. విభాగంలో అర్హులైన వారికి పదోన్నతులు కల్పించామని, ఉద్యోగులందరూ తమ బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు. ప్రధానంగా పర్యాటక ప్రాంతాల్లోని ప్రాజెక్టులు, కన్వెన్షన్ సెంటర్లు, రహదారుల నిర్మాణం, కార్యాలయ నిర్వహణ వంటి అంశాలను నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు. మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్ భరత్ ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి, మౌలిక సదుపాయాల పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో సీఈ వినయ్ కుమార్, ఎస్ఈలు భవానీశంకర్, మధు, ఈఈలు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
‘నందనవనం సౌభాగ్య’ లేఅవుట్ ప్రారంభం
ఆనందపురం: ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సిరి వెంకటేశ్వర డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తన 24వ వెంచర్ను ఆనందపురం మండలం చందక పంచాయతీలోని జగన్నాథపురంలో ప్రారంభించింది. ‘నందనవనం సౌభాగ్య’పేరుతో రూపొందించిన ఈ నూతన లేఅవుట్కు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె.కె.రాజు మంగళవారం భూమి పూజ నిర్వహించి, బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కె.కె.రాజు మాట్లాడుతూ.. విశాఖ నగర శివారు ప్రాంతాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆనందపురం సమీపంలో ఈ వెంచర్ ఉండటం వల్ల పెట్టుబడిదారులకు భవిష్యత్తులో అద్భుతమైన లాభాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తర్లువాడలో రానున్న గూగుల్ సిటీకి, ఐటీబీపీ అకాడమీకి కేవలం ఒక కిలోమీటరు దూరంలోనూ.. ప్రభుత్వం ప్రతిపాదించిన ఆనందపురం ఐటీ సెజ్కు కేవలం 100 మీటర్ల చేరువలోనూ ఈ వెంచర్ ఉందని వివరించారు. ప్రస్తుతం ఉన్న 40 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డును 60 అడుగుల రోడ్డుగా విస్తరించి అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో త్వరలోనే ఇళ్ల స్థలాలకు భారీ గిరాకీ ఏర్పడే అవకాశం ఉందని, వినియోగదారులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు బంక సత్యం, కంపెనీ మార్కెటింగ్ సిబ్బంది, కస్టమర్లు పాల్గొన్నారు. -
రనౌట్ వివాదం : అంపైర్ను పొడిచి చంపేశాడు
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో క్రికెట్ మ్యాచ్లో రనౌట్ నిర్ణయం అంపైర్ ప్రాణం తీసింది. స్థానిక మ్యాచ్లో 21 ఏళ్ల క్రికెట్ అంపైర్ను కత్తితో పొడిచి చంపిన వైనం దిగ్భ్రాంతి రేపింది. ఎన్డీటీవీ కథనం ప్రకారం బాధితుడు, డోల అజిత్ బాబు, తన తోటి అంపైర్ బుదుమూరి చిరంజీవితో కలిసి స్థానిక మైదానంలో ఆదివారం క్రికెట్ ఆడారు. మూడు జట్లు పాల్గొంటున్న ఈ మ్యాచ్కు అంపైర్గా వ్యవహరించాడు అజిత్. ఇందులో భాగంగా అఇత్ రనౌట్ నిర్ణయంపై రెండు ప్రాంతాలకు చెందిన ఆటగాళ్ల మధ్య వాగ్వాదం చెలరేగగా, ఇద్దరు అంపైర్లు దానిని మైదానంలోనే పరిష్కరించారు. అయితే, అంతా సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో 26 ఏళ్ల కాంతా కిషోర్ (ప్రేక్షకుడు) ఆగ్రహానికి గురై అంపైర్లను, ఆటగాళ్లను దూషించడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. మ్యాచ్ ముగిసిన తర్వాత, మాట్లాడుదాం రమ్మంటూ కిషోర్ సమీపంలోని ఒక ప్రదేశానికి అంపైర్లను పిలిపించాడు, అతని అభ్యర్థన మేరకు అజిత్ బాబు, చిరంజీవి, మరికొందరు స్నేహితులు అక్కడికి వెళ్లారు. వారు అక్కడికి వెళ్లగానే మరో సారి వాగ్వాదం చెలరేగింది.దీంతో కిషోర్ అకస్మాత్తుగా కత్తి తీసి ఇద్దరు అంపైర్లపై దాడి చేశాడు,సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు తెలిపారు. ఈ దాడిలో అజిత్ బాబు ఛాతీపై కత్తిపోటుకు గురై అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. పారిపోయే ప్రయత్నంలో చిరంజీవికి తీవ్ర రక్తస్రావ గాయాలయ్యాయని, జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించిన మరో వ్యక్తి కూడా గాయపడ్డాడని పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: ఇద్దరు చిన్నారులను మింగేసిన రెడీ మేడ్ దోస పిండిగాయపడిన అజిత్ బాబును VIMS ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అక్కడ డాక్టర్లు అందుబాటులో లేక పోవడంతో, అపోలో ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ వైద్యులు ఆయన మరణించినట్లు ప్రకటించారు. మ్యాచ్లో ఆటగాడు కూడా కాని వ్యక్తి పథకం ప్రకారమే ఈ దాడి చేశాడని బాధితుడి సోదరుడు ఆరోపించాడు. పొరుగు కాలనీలోని వినాయక్ నగర్ నివాసి అయిన కిషోర్, ఈ వివాదంలోకి చొరబడి, దుర్భాషలాడి, ఆ తర్వాత మద్యం మత్తులో తిరిగి వచ్చి హత్య చేశాడని అతను చెప్పాడు. ఆ రోజు ఉదయం గ్రామ పెద్దలు ఒకే ఒక్క పరుగు విషయంలో తలెత్తిన విభేదాన్ని ఇప్పటికే పరిష్కరించినా ఈ హత్యకు పూనుకున్నాడని అజిత్ సోదరుడు వాపోయాడు. కిషోర్ను పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ తప్పించు కొని పారిపోయాడని అజిత్ సోదరుడు ఆరోపించాడు. మృతుడి తండ్రి డోలా అప్పల రాజు దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు కిషోర్పై హత్య కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. -
న్యూజిలాండ్లో ఉద్యోగాల పేరిట మోసం
అల్లిపురం : న్యూజిలాండ్లో వెల్డర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి గాజువాకకు చెందిన ఒక కుటుంబం తొమ్మిది మందిని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుల నుంచి మొత్తం సుమారు రూ.70 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై బాధితులు సోమవారం నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చిని పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలిసి ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే..ం గాజువాక చినగంట్యాడకు చెందిన కర్రి శివశంకర్ గతంలో న్యూజిలాండ్లో వెల్డర్గా పనిచేశాడు. ఈ క్రమంలో ఒకసారి విశాఖపట్నానికి వచ్చినప్పుడు, అతని కుటుంబ సభ్యులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని నిరుద్యోగులకు న్యూజిలాండ్లో ఉద్యోగాలు ఉన్నాయని నమ్మించారు. శివశంకర్ తల్లిదండ్రులు రామునాయుడు, బొజ్జలమ్మ, బావ డి.శ్రీహరి (ఫైనాన్సర్)తో పాటు కుటుంబ సభ్యులు చిన్ని, మణి కలిసి పలువురిని సంప్రదించి ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేశారు. దీంతో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఒమ్మి త్రిమూర్తులు, గెంజి గంగాధర్, కర్రి గౌరీశంకర్, పైల రాము, రోగలు శివప్రసాద్, బండి సురేష్కుమార్, షేక్ అమీర్, సిరసపల్లి అశోక్, సమ్మిడి మహేష్ తదితరులు ఒక్కొక్కరు రూ.7 లక్షలు చొప్పున చెల్లించారు. డబ్బులు తీసుకున్నప్పటి నుంచి ఉద్యోగాలు కల్పించకపోవడంతో పాటు డబ్బులు కూడా తిరిగి ఇవ్వడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బాధితులు పోలీస్ కమిషనర్ను ఆశ్రయించగా, ఆయన ఆదేశాల మేరకు గాజువాక పోలీసులను సంప్రదించారు. అయితే గాజువాకకు చెందిన మరో వ్యక్తి ‘సమస్యను పరిష్కరిస్తాను’ అంటూ నిందితుల నుంచి పత్రాలు తీసుకుని, అతడూ మోసం చేసినట్లు బాధితులు తెలిపారు. డీసీపీ, సౌత్ ఏసీపీ, గాజువాక సీఐలను పలుమార్లు ఆశ్రయించినప్పటికీ నిందితులు పట్టుబడకుండా తిరుగుతున్నారని బాధితులు వాపోయారు. ఫోన్లో సంప్రదించినా ‘మాకు పోలీసులు కొత్తేమీ కాదు, డబ్బులు ఇవ్వాలనుకుంటే ఇస్తాం, లేదంటే లేదు’ అంటూ నిర్లక్ష్యంగా స్పందిస్తున్నారని ఆరోపించారు. న్యూజిలాండ్లో ఉన్న కర్రి శివశంకర్పై లుక్అవుట్ నోటీసులు జారీ చేయడంతో పాటు, అతని కుటుంబ సభ్యులపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీస్ కమిషనర్ను కోరారు. -
నైట్ ఫుడ్ కోర్టు తెరిపించాలి
మహారాణిపేట : సెంట్రల్ పార్క్ సమీపంలో ఏడు నెలల క్రితం తొలగించిన నైట్ ఫుడ్ కోర్టును వెంటనే పునఃప్రారంభించాలని విశాఖ తోపుడు బండ్లు చిల్లర వర్తకుల కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు పి.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి ఎ.సింహాచలం కోరారు. సోమవారం పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్కు వారు వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ సుమారు 150 మంది వీధి విక్రయదారులు ఈ ఫుడ్ కోర్ట్పై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని చెప్పారు. గత ఏడాది సెప్టెంబర్ 19న ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఫుడ్ కోర్ట్ను అకస్మాత్తుగా తొలగించడం వల్ల వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. జోన్–4 జోనల్ కమిషనర్ పది రోజుల్లో అర్హులను గుర్తించి ఫుడ్ కోర్ట్ను తిరిగి ఏర్పాటు చేస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చారని గుర్తుచేశారు. జోనల్ వెండింగ్ కమిటీ ఆధ్వర్యంలో 97 మంది అర్హుల జాబితా విడుదలైనప్పటికీ, ఇంకా 31 మంది అర్హులు జాబితాలో చేరలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం రికార్డుల్లో గతంలో అక్కడ నైట్ ఫుడ్ కోర్ట్ ఉన్నట్టు నమోదు లేకపోవడం ఆశ్చర్యకరమన్నారు. అలాగే, గతంలో ఏసీబీ కేసులో పట్టుబడిన ఉద్యోగిని కలెక్టరేట్లో నియమించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏడు రోజుల్లో ఫుడ్ కోర్ట్ను తిరిగి ప్రారంభించకపోతే.. తోపుడు బండ్లు, దుకాణాలు ఏర్పాటు చేసి వ్యాపారం ప్రారంభిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకుడు కె.చంద్రశేఖర్, అసోసియేషన్ అధ్యక్షుడు కె.శ్రీకాంత్, ఎం.ప్రసాద్, కార్యదర్శి ఎం.లలిత కుమారి, సభ్యులు, ఫుడ్ కోర్ట్ వ్యాపారులు పాల్గొన్నారు. -
‘టౌన్ ప్లానింగ్’పై ఫిర్యాదుల వెల్లువ
జీవీఎంసీ పీజీఆర్ఎస్కు 95 వినతులు డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)కు 95 వినతులు అందాయి. జీవీఎంసీ అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, ఎస్ఎస్ వర్మ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 95 వినతుల్లో అత్యధికంగా టౌన్ప్లానింగ్ విభాగానికి సంబంధించిన ఫిర్యాదులే ఉన్నాయి. విభాగాల వారీగా చూస్తే టౌన్ ప్లానింగ్కు 52, రెవెన్యూ సెక్షన్కు 13, ఇంజినీరింగ్ విభాగానికి 11, అడ్మినిస్ట్రేషన్ అండ్ అకౌంట్స్కు 6, హార్టికల్చర్ 1, ఇతర ఫిర్యాదులు 12 వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కమిషనర్ పి.నల్లనయ్య, జాయింట్ డైరెక్టర్(అమృత్) డి.విజయభారతి, ప్రధాన వైద్యాధికారి నరేష్ కుమార్, సీసీపీ ప్రభాకరరావు, సెక్రటరీ బీవీ రమణ, ఏడీహెచ్ వాసుకి, స్పోర్ట్స్ డైరెక్టర్ ఇ.ఎ.రాజు, ఆర్ఎఫ్వో కృపావరం, యూసీడీ పీవో పి.ప్రసన్నవాణి తదితరులు పాల్గొన్నారు. -
కేజీహెచ్లో ఏఆర్టీ సరోగసీ బృందం తనిఖీ
మహారాణిపేట : జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి(డీఎంహెచ్వో) డాక్టర్ పి.జగదీశ్వరరావు ఆధ్వర్యంలో ఏఆర్టీ, సరోగసీ బృందం సోమవారం కేజీహెచ్లో గైనిక్ విభాగాన్ని తనిఖీ చేశారు. ఏఆర్టీ లెవెల్–1 కేంద్రం నిర్వహణకు వైద్యులు, స్టాఫ్ విద్యార్హతలు, ల్యాబ్ పరికరాలు పరిశీలించి తగు సూచనలు చేశారు. త్వరలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న ప్రభుత్వ సంతాన సాఫల్య కేంద్రం రాబోతోంది. దాని కోసం డీఎంహెచ్వో పర్యవేక్షణలో ఏడుగురు సభ్యుల బృందం తనిఖీ చేశారు. కలెక్టర్ అనుమతులు పొందిన తర్వాత ఉచితంగా సేవలు అందిస్తారు. దీనికి అవసరమైన పరికరాలను ఏఎంసీ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ (అంకోశా) సమకూర్చారని కేజీహెచ్ గైనిక్ విభాగాధిపతి(హెచ్వోడీ) డాక్టర్ సౌమిని తెలిపారు. ఈ తనిఖీ బృందంలో డాక్టర్ విద్యారమ(గైనకాలజిస్ట్) డాక్టర్ వందన శశికిరణ్ (రేడియోలజిస్ట్), డాక్టర్ టి.కిషోర్(పెథాలజిస్ట్) డాక్టర్ శోభశ్రీ (సోషియాలజిస్ట్, ఆంధ్రా యూనివర్సిటీ), శ్రీమతి ఎల్.వి.రమణి(ఎన్జీవో, గాయత్రి వెల్ఫేర్) నోడల్ అధికారి డాక్టర్ బి.ఉమావతి, జిల్లా మీడియా విస్తరణాధికారి(డీమో) బి.నాగేశ్వరరావు, మానటరింగ్ కన్సెల్టెంట్ కె.శివాజీ పాల్గొన్నారు. -
గీతం ఆక్రమిత భూములపై చర్యలు తీసుకోవాలి
మహారాణిపేట: గీతం విశ్వవిద్యాలయ యాజమాన్యం ఆక్రమించిన అసైన్డ్ ప్రభుత్వ భూములపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ ఇంటెలెక్చువల్ ఫోరం విశాఖ జిల్లా అధ్యక్షుడు దేవరకొండ మార్కండేయులు, వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పాకా సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో వారు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. రుషికొండలో ప్రభుత్వ భూముల వినియోగంపై కూడా సమగ్ర విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. గీతం విశ్వవిద్యాలయం యాజమాన్యం ఆక్రమించిన 54.79 ఎకరాల ప్రభుత్వ భూములు ఎండాడ, భీమిలి మండలాల పరిధిలోని రుషికొండ ప్రాంతంలో సర్వే నంబర్లు 15, 16, 19, 20లలో ఉన్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ ల్యాండ్స్ యాక్ట్ 1977 ప్రకారం ప్రభుత్వం కేటాయించిన భూములను కొనడం లేదా అమ్మడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. రుషికొండ ప్రాంతంలో పర్యాటక శాఖకు చెందిన భూమిలో గతంలో ప్రభుత్వ అవసరాల కోసం గెస్ట్ హౌస్ నిర్మాణం జరిగితే, అప్పట్లో కూటమి నాయకులు తీవ్ర విమర్శలు చేసి, దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం ఆ భవనాలు కూటమి ప్రభుత్వ హయాంలోనే ఉన్నప్పటికీ, వాటిని ప్రజల అవసరాలకు వినియోగించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని పాకా విమర్శించారు. ఆ భవనాలను కొందరు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది ప్రభుత్వ ఆస్తుల దుర్వినియోగానికి దారితీస్తుందని మార్కండేయులు హెచ్చరించారు. గిన్ని రాధాకృష్ణ, విజయ్ భాస్కర్, సుగుణ కుమార్, హరి పట్నాయక్, రామకృష్ణారెడ్డి, మద్ది లక్ష్మణరావు, వెంకటరమణ, పిల్లా అప్పారావు, పైడిరాజు, బీసీ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లు అప్పలస్వామి, చుక్కా అప్పారావు, బోరా రామిరెడ్డి, వీర రాఘవులు, రాజా చంద్రశేఖర్, మహమ్మద్ సలీమ్, వన్టౌన్ దాసరి విజయ భాస్కరరెడ్డి, ఎం.డి.జాఫర్ అలీ, జిల్లా ప్రధాన కార్యదర్శి పేరం రామకృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పీజీఆర్ఎస్లో వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు -
వినతుల పరిష్కారంలో జాప్యం వద్దు
మహారాణిపేట: పీజీఆర్ఎస్(ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక) ద్వారా ప్రజల నుంచి వచ్చిన వినతుల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. ఎటువంటి జాప్యం లేకుండా, నాణ్యమైన రీతిలో ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని స్పష్టం చేశారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో డీఆర్వో ఎం.విశ్వేశ్వర నాయుడు, ఏడీసీ సత్యవేణిలతో కలిసి ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుల పరిష్కారంలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు ఆయన స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. అధికారులు పిటిషనర్లతో నేరుగా మాట్లాడాలని, పదే పదే వచ్చే ఫిర్యాదుల విషయంలో సునిశిత పరిశీలన చేయాలని సూచించారు. నిర్దేశించిన గడువు దాటక ముందే సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాగా.. సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 334 వినతులు నమోదయ్యాయి. రెవెన్యూ శాఖకు 59, జీవీఎంసీకి 83, పోలీస్ శాఖకు 23, ఇతర శాఖలకు సంబంధించి 169 దరఖాస్తులు వచ్చాయి. రెవెన్యూ క్లినిక్లో ఆర్డీవోలు, తహసీల్దార్లు అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
పన్నుల వసూళ్ల్లలో విశాఖ టాప్
ఆరిలోవ: వాణిజ్య పన్నుల శాఖ విశాఖపట్నం డివిజన్–1 మార్చి నెలలో అన్ని రకాల పన్నుల వసూళ్లు రాష్ట్రంలోనే అత్యధికంగా జరిగినట్లు ఆ శాఖ సంయుక్త కమిషనర్ పి.బి.వల్లి తెలిపారు. విశాఖ డివిజన్–1 పరిధిలో భీమిలి, చినవాల్తేరు, డాబాగార్డెన్స్, ద్వారకానగర్, కురుపాం మార్కెట్, సిరిపురం, సూర్యాబాగ్ సర్కిళ్లతో పాటు ఒక ప్రత్యేక సర్కిల్ ఉన్నాయన్నారు. జీఎస్టీ, నెలవారీ రిటర్న్ ఫైలింగ్, ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్ ప్లాన్, పాత బకాయిల వసూళ్లు ద్వారా ఈ ఏడాది మార్చి నెలలో రూ.158.59 కోట్లు ఆదాయం లభించిందన్నారు. ఇది రాష్ట్రంలోనే అత్యధికమని తెలిపారు. గత ఏడాది మార్చి(2025)లో రూ.150.71 కోట్లు లభించిందన్నారు. డివిజన్లో 2024–25 ఆర్థిక సంవత్సరంలో వార్షిక ఆదాయం రూ.1,733.59 కోట్లు కాగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.1,845.39 కోట్లు ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు. -
స్కూటీని ఢీకొన్న బస్సు
ఆరిలోవ: జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. ఆరిలోవ ఎస్ఐ కృష్ణ తెలిపిన వివరాలివి.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్పూర్కు చెందిన షాతక్షి రావు (23), ఆమె స్నేహితుడు చంద్రశేఖర్ మిశ్రా భువనేశ్వర్లోని కళింగ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నారు. కళాశాలకు సెలవులు కావడంతో వారిద్దరూ కలిసి సోమవారం విశాఖ పర్యటనకు వచ్చారు. నగరంలో ఒక స్కూటీని అద్దెకు తీసుకుని, పీఎంపాలెం వైపు నుంచి జాతీయ రహదారిపై వస్తుండగా.. ఎండాడ – జూ పార్క్ మధ్యలో వెనుకనే వస్తున్న ఓ బస్సు వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీ వెనుక కూర్చున్న షాతక్షి రావు తలకు తీవ్ర గాయాలై, అధిక రక్తస్రావం కావడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న ఆరిలోవ ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై ఆరిలోవ లా అండ్ ఆర్డర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన బస్సును స్టేషన్కు తరలించి, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
రూ.3.86 కోట్లు
‘దక్షిణ కోస్తా జోన్’కుసాక్షి, విశాఖపట్నం: గత రెండు బడ్జెట్లతో పోలిస్తే, ఈ సారి ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం రైల్వే కేటాయింపులు చేపట్టింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రైల్వే బోర్డు తాజాగా కన్సాలిడేటెడ్ బడ్జెట్ వివరాలను విడుదల చేసింది. విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్తో పాటు, వాల్తేరు డివిజన్ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని కేంద్రం కీలక కేటాయింపులు చేసింది. ప్రధానంగా విశాఖపట్నం రైల్వే స్టేషన్ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దడంతో పాటు, రద్దీగా ఉండే మార్గాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిచ్చింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. వాల్తేరు డివిజన్ పరిధిలో పెండింగ్లో ఉన్న పలు ప్రాజెక్టులు ఇక పట్టాలెక్కనున్నాయి. దక్షిణ కోస్తా రైల్వే ప్రధాన కార్యాలయ నిర్మాణానికి రూ.3.86 కోట్లు కేటాయించించింది. కేటాయింపుల వివరాలివీ.. విజయనగరం–కొత్తవలస మూడో లైన్: వాల్తేరు డివిజన్లో అత్యంత రద్దీగా ఉండే విజయనగరం–కొత్తవలస సెక్షన్లో 34.7 కిలోమీటర్ల మేర మూడో రైల్వే లైన్ నిర్మాణానికి ఈ బడ్జెట్లో రూ.299.83 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం కూడా ఇదే కావడం విశేషం. ఈ లైన్ అందుబాటులోకి వస్తే సరకు రవాణా రైళ్ల వేగం పెరగడమే కాకుండా, ప్రయాణికుల రైళ్ల ఆలస్యానికి చెక్ పడనుంది. విశాఖ స్టేషన్ ఆధునికీకరణ, భద్రత: విశాఖపట్నం రైల్వే స్టేషన్ పరిధిలో భద్రతను మెరుగుపరచడానికి, రైళ్ల వేగాన్ని పెంచడానికి ‘ఆటోమేటిక్ సిగ్నలింగ్’వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రూ.49.24 కోట్లు కేటాయించారు. దీని వల్ల స్టేషన్ పరిధిలో రైళ్ల రాకపోకల సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. ఎలక్ట్రిక్ లోకో షెడ్ విస్తరణ: దక్షిణ కోస్తా రైల్వే జోన్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో, విశాఖ నుంచి నడిచే రైళ్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ప్రస్తుతం 200 ఇంజిన్ల సామర్థ్యం ఉన్న విశాఖ ఎలక్ట్రిక్ లోకో షెడ్ను 225కు పెంచనున్నారు. ఈ పనుల కోసం రూ.20.82 కోట్లు కేటాయించారు. దీనివల్ల ఇంజిన్ల నిర్వహణ మరింత సులభతరం కానుంది. జోన్ ప్రధాన కార్యాలయానికి నిధులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి బడ్జెట్లో చేయూత లభించింది. జోనల్ కార్యాలయ భవన నిర్మాణం, ప్రహరీ వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాల కోసం రూ.3.86 కోట్లు కేటాయించారు. మరికొన్ని కేటాయింపులు పలాస–విశాఖపట్నం–దువ్వాడ సెక్షన్లో సుమారు 72 కిలోమీటర్ల మేర ట్రాక్ ఆధునికీకరణ పనులకు రూ.87.93 కోట్లు కేటాయించారు. ఇది రైళ్ల ప్రయాణ వేగాన్ని పెంచడానికి దోహదపడుతుంది. వాల్తేరు డివిజన్ పరిధిలోని వివిధ స్టేషన్లలో పాత సిగ్నలింగ్ వ్యవస్థ మార్పునకు రూ.31.26 కోట్లు, ఎఫ్అండ్ జీ క్యాబిన్ల ఆధునికీకరణకు రూ.27.41 కోట్లు కేటాయించారు. విశాఖ కోచింగ్ డిపోలో రన్నింగ్ రూమ్, క్రూ లాబీ అప్గ్రెడేషన్ కోసం రూ.4.90 కోట్లు కేటాయించారు. విశాఖపట్నం న్యూ గూడ్స్ కాంప్లెక్స్ వద్ద సౌకర్యాల మెరుగుదలకు రూ.21.84 కోట్లు కేటాయించారు. ఇది సరకు రవాణా ఆదాయాన్ని పెంచేందుకు దోహదపడనుంది. -
రైతులతో ఏపీఐఐసీ చెలగాటం
నక్కపల్లి : ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లుంది. మండలంలో పలువురు రైతుల పరిస్థితి. బల్క్ డ్రగ్పార్క్, స్టీల్ప్లాంట్ కోసం భూసేకరణ రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తోంది. తమ సమస్య పరిష్కరించాలంటూ సోమవారం రైతులు ఇచ్చిన అర్జీలను ఏపీఐఐసీ అధికారులు తీసుకోవడానికి నిరాకరించారంటూ రాజయ్యపేట రైతులు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తోందంంటూ ఆరోపిస్తున్నారు. కంపెనీల కోసం గుర్తించిన భూముల క్రయ విక్రయాలపై కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ భూములు ఏపీఐఐసీ వారు తీసుకుని నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ వాపోతున్నారు. తమ భూములపై ఉన్న ఆంక్షలు తొలగిస్తే వేరొకరికి విక్రయిస్తామని లేదా ప్రభుత్వానికే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, తమకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. వివరాల్లోకి వెళ్తే రాజయ్యపేట సర్వేనెంబరు270,270/1ఈ,270/1డీ,271,272, 243/14,15లలో సుమారు10 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని 2017లో ప్రభుత్వం ఎకరా రూ.18 లక్షల చొప్పున సేకరించడానికి నిర్ణయించింది. ఈ భూములు ప్రభుత్వానికి ఇచ్చేందుకు రైతులు సిద్ధపడ్డారు. అధికారులు మాత్రం భూములు తీసుకోకుండా వాటిపై క్రయ విక్రయాలు జరగకుండా సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఆంక్షలు విధించారు. మా భూములు సేకరించి నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని, రైతులు మైలపల్లి మహేష్, మైలపల్లి బైరాగి రాజు, బి.అప్పలరాజు, డి. వీర్రాజు, వాసుపల్లి రాము తదితరులు చెబుతున్నారు. నక్కపల్లిలో ఏర్పాటు చేసిన ఏపీఐఐసీ జోనల్ కార్యాలయానికి వెళ్లి అర్జీ పెట్టుకుంటే జోనల్ మేనేజర్ నుంచి అనుమతి వస్తేనే తీసుకుంటామని చెబుతున్నారని రైతులు తెలిపారు. భూములు ఎప్పటిలోగా తీసుకుంటారో లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని, లేదా అవసరం లేని పక్షంలో భూముల క్రయవిక్రయాలపై ఆంక్షలు తొలగిస్తూ జీవో విడుదల చేయాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. ఆంక్షలు తొలగిస్తే మా భూములు వేరొకరికి అమ్ముకుంటామంటూ వారు ప్రాధేయపడుతున్నారు. ఇదే విషయంపై సోమవారం రాజయ్యపేట వచ్చిన ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నర్సింహరావు, డిప్యూటీ జోనల్ మేనేజర్ రాజశేఖర్లకు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా వారు తీసుకోవడానికి నిరాకరించారని రైతులు తెలిపారు. కూటమి ప్రభుత్వం రాజయ్యపేటలో రైతులను ఇబ్బందులకు గురిచేయడం తగదని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. -
చందనోత్సవానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు
మహారాణిపేట: గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి సమస్యలు తలెత్తకుండా శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి చందనోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో కీలక శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, ఉత్సవంలో నిర్వహించే సంప్రదాయ కార్యక్రమాలపై దేవస్థానం ఈవో జె.వెంకటరావు, ఆలయ పండితులు వివరించారు. అనంతరం అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన కలెక్టర్ శాఖల వారీగా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. భద్రతా ఏర్పాట్లను పోలీస్ శాఖ పర్యవేక్షించగా, రవాణా సౌకర్యాల విషయంలో ఏపీఎస్ ఆర్టీసీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రూ.1500, రూ.1000 టికెట్లపై పికప్, డ్రాప్ పాయింట్ల వివరాలు స్పష్టంగా ముద్రించాలని పేర్కొన్నారు. వాహనాల కోసం పరిమిత సంఖ్యలో మాత్రమే పాసులు జారీ చేయాలని ఆదేశించారు. భక్తులకు తాగునీరు, పారిశుధ్యం, మరుగుదొడ్లు, వైద్య సేవలు వంటి మౌలిక సదుపాయాలను మెరుగ్గా కల్పించాలని చెప్పారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మద్యం దుకాణాలను తాత్కాలికంగా మూసివేయడంపై గతంలో అమలు చేసిన నిబంధనలను పాటించాలని తెలిపారు. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, ఇతర అవసరమైన వసతుల ఏర్పాటు విషయంలో సంబంధిత శాఖలు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. దాతలు నిర్వహించే అన్నదాన కేంద్రాలను ఫుడ్ సేఫ్టీ అధికారులతో తనిఖీ చేసి ఆహార నాణ్యతను నిర్ధారించాలని ఆదేశించారు. అన్ని ఏర్పాట్లు 17వ తేదీ నాటికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. డీఆర్వో ఎం.విశ్వేశ్వరనాయుడు, భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్, జీవీఎంసీ సిఎం నరేశ్, ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు, ఈపీడీసీఎల్ ఎస్ఈ శ్యాంబాబు, డీఎంహెచ్వో పి.జగదీశ్వరరావు పాల్గొన్నారు. కీలక శాఖలతో కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ సమీక్ష -
భర్త కళ్లెదుటే.. భార్య దుర్మరణం
లారీ ఢీకొని వివాహిత మృతి పెదగంట్యాడ : భర్త కళ్లెదుటే భార్య దుర్మరణం పాలైన హృదయ విదారకమైన సంఘటన గాజువాక దరి శ్రీనగర్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. గాజువాక ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాలివి. శ్రీహరిపురం ప్రాంతానికి చెందిన గురిబిల్లి జోగిరెడ్డి, గురిబిల్లి శాంతమ్మ (43) భార్యాభర్తలు. వీరిద్దరూ సోమవారం వ్యక్తిగత పనులపై ద్విచక్ర వాహనంపై శ్రీనగర్ వస్తుండగా.. గాజువాక పోలీస్స్టేషన్ సిగ్నిల్ పాయింట్ దాటిన తర్వాత వెనుక నుంచి వస్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొంది. దీంతో శాంతమ్మ వాహనంపై నుంచి కిందపడిపోయింది. లారీ ఆమె తలపై నుంచి వెళ్లిపోవడంతో తల భాగం నుజ్జునుజ్జయింది. తన కళ్లెదుటే భార్య దుర్మరణం చెందడంతో భర్త కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు అక్కడి వారిని కలచివేసింది. సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్న గాజువాక పోలీసులు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. గాజువాక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బార్ అసోసియేషన్ ఎన్నికల సందడి
విశాఖ లీగల్ : జిల్లా కోర్టులో ఈనెల 10న జరగనున్న న్యాయవాదుల సంఘం (బార్ అసోసియేషన్) ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి, సంయుక్త కార్యదర్శి పదవులకు పోటీచేస్తున్న అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రధాన పదవులకు పోటీ చేస్తున్న సీనియర్ న్యాయవాదులు తమ మేనిఫెస్టోను ప్రకటిస్తూ ఓటు కోసం అభ్యర్థిస్తున్నారు. న్యాయవాదులు సాంకేతికతను అందిపుచ్చుకునే విధంగా తమ వంతు చేయూతనిస్తామని, జూనియర్ న్యాయవాదులకు శిక్షణ, చట్టాలు, కోర్టు నియమావళి వంటి అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ప్రధానంగా అధ్యక్ష పదవికి నమ్మి సన్యాసిరావు, శిష్టల శ్రీనివాసమూర్తి, ఎంఎస్ మాధవ్, కార్యదర్శి పదవికి వి.గోవిందరావు, విఎస్ఎ రవీంద్రనాథ్, ఎ.వెంకట సోమేశ్వరరావు, వి.వెంకట సుధాకర్ పోటీలో ఉన్నారు. -
ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు దోహదం
ఆరిలోవ : పోలీసులకు పని ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు, వ్యాయామం ఎంతగానో దోహదపడతాయని విశాఖ రేంజ్ ఐజీ గోపినాఽథ్ జట్టి తెలిపారు. అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విశాలాక్షినగర్ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు మైదానంలో మూడు రోజుల పాటు జరిగిన పోలీస్ వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ సంబరాలు సోమవారం ముగిశాయి. ఈ ముగింపు ఉత్సవాల్లో ఐజీ పాల్గొని విజేతలను అభినందించారు. అనకాపల్లి, పరవాడ, నర్సీపట్నం, సబ్ డివిజన్లతో పాటు ఆర్మడ్ రిజర్వ్ విభాగానికి చెందిన పోలీస్ అధికారులు, సిబ్బంది ఈ మీట్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాతో కలిసి బహుమతులు అందజేశారు. అనంతరం ఐజీ గోపినాథ్ మాట్లాడుతూ పోలీసులు పని ఒత్తిడిని అధిగమించి మానసిక ఉల్లాసం పొందేందుకు యోగా, వ్యాయామం, క్రీడలను తమ దైనందని జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. అనకాపల్లి ఎస్పీ తుమిన్ సిన్హా మాట్లాడుతూ పోలీసులు మరింత ఉత్సాహంతో పనిచేసి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. అదనపు ఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఏయూకు రావడమే నాకు పెద్ద అవార్డు
మద్దిలపాలెం: ‘ఆంధ్ర విశ్వవిద్యాలయంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి నా భావోద్వేగాలను ఆపుకోలేకపోతున్నాను. మా నాన్న చదువుకున్న ఈ మహోన్నత విశ్వవిద్యాలయ వందేళ్ల వేడుకల్లో పాల్గొనడం నాకు లభించిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాను’ అని సినీ నటుడు రాజీవ్ కనకాల అన్నారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో మెగా కల్చరల్ ఫెస్ట్ సోమవారం ప్రారంభమైంది. మొదటి రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజీవ్ కనకాల మాట్లాడుతూ వందేళ్ల ఘన చరిత్ర కలిగిన ఏయూకు రావడం, ఈ వేడుకల్లో భాగస్వామిని కావడం తనకు లభించిన అతి పెద్ద పురస్కారమని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఎంతో గ్రేస్తో, హుషారుగా ఉన్నాయని అభినందించారు. కళలకు, సంస్కృతికి, సాహిత్యానికి విశాఖ నగరం పుట్టినిల్లని.. అటువంటి చోట విశ్వవిద్యాలయం కళలకు ఇస్తున్న ప్రాధాన్యత ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్ మాట్లాడుతూ.. విద్యార్థుల నిబద్ధత, సమష్టి కృషికి ఈ సాంస్కృతిక ప్రదర్శనలే నిదర్శనమని కొనియాడారు. యూనివర్సిటీ చరిత్రలో ఇదొక అపూర్వ ఘట్టమని, యువతలోని ఉత్సాహం ఉత్సవాలకు కొత్త కళను తీసుకువచ్చిందన్నారు. కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు ఆచార్య సాంబిరెడ్డి, ప్రిన్సిపాల్స్ ఆచార్య జాలాది రవి, ఆచార్య జి.గిరిజా శంకర్, ఆచార్య సీతామాణిక్యం, ఆచార్య ఎం.శశి, ఆచార్య పద్మశ్రీ, ఆచార్య ఎం.వి.ఆర్.రాజు, నిర్వాహకులు ఆచార్య ఎన్.ఎం.యుగంధర్, ఆచార్య సి.హెచ్.ఆశా ఇమ్మాన్యుయేల్ రాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏయూ విద్యార్థులు, అనుబంధ కళాశాలల విద్యార్థులు ప్రదర్శించిన శాసీ్త్రయ, పాశ్చాత్య నృత్యాలు, యోగా విన్యాసాలు, జానపద కళారూపాలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
‘డయల్ యువర్ సీఎండీ’కి 44 వినతులు
మహారాణిపేట: విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం ఏపీఈపీడీసీఎల్ సోమవారం నిర్వహించిన ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమానికి వినియోగదారుల నుంచి 44 వినతులు అందాయి. సీతమ్మధారలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యుత్ సరఫరాలో లో–వోల్టేజ్ సమస్యలు, విద్యుత్ లైన్ల మార్పు, కొత్త కనెక్షన్ల మంజూరులో జాప్యం, విద్యుత్ బిల్లుల సవరణ, పాత ట్రాన్స్ఫార్మర్ల మార్పిడి, రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటుకు సంబంధించిన సాంకేతిక ఇబ్బందులు తదితర సమస్యలపై అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ వినతులను క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. వినియోగదారులు తమ సమస్యలను విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1912కు కాల్ చేయడం ద్వారా గానీ, లేదా వాట్సాప్ నంబర్ 9493681912కు మేసేజ్ పంపడం ద్వారా తెలియజేయవచ్చని సూచించారు. -
రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థిని మృతి
విశాఖపట్నం: జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. ఆరిలోవ ఎస్ఐ కృష్ణ తెలిపిన వివరాలివి.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్పూర్కు చెందిన షాతక్షి రావు (23), ఆమె స్నేహితుడు చంద్రశేఖర్ మిశ్రా భువనేశ్వర్లోని కళింగ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నారు. కళాశాలకు సెలవులు కావడంతో వారిద్దరూ కలిసి సోమవారం విశాఖ పర్యటనకు వచ్చారు. నగరంలో ఒక స్కూటీని అద్దెకు తీసుకుని, పీఎంపాలెం వైపు నుంచి జాతీయ రహదారిపై వస్తుండగా.. ఎండాడ – జూ పార్క్ మధ్యలో వెనుకనే వస్తున్న ఓ బస్సు వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీ వెనుక కూర్చున్న షాతక్షి రావు తలకు తీవ్ర గాయాలై, అధిక రక్తస్రావం కావడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న ఆరిలోవ ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై ఆరిలోవ లా అండ్ ఆర్డర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన బస్సును స్టేషన్కు తరలించి, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
రాష్ట్రానికి చీడలా రాధాకృష్ణ
సాక్షి, విశాఖపట్నం: ఏబీఎన్ రాధాకృష్ణ, ఆయన పత్రిక, టీవీ చానల్ రాష్ట్రానికి పట్టిన చీడలా తయారయ్యాయని వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించిన ‘మావిగన్’ అభివృద్ధి మోడల్పై ప్రజల్లో మంచి స్పందన రావడంతో తట్టుకోలేక తమ పార్టీ నాయకుల కుటుంబ సభ్యులను దూషిస్తూ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మావిగన్’తో తమ అవినీతి ఆశలు కూలిపోతాయనే భయంతో వ్యక్తిత్వ హననానికి దిగుతున్నారని ధ్వజమెత్తారు. సోమవారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబుతో కలసి కన్నబాబు మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ వెంకటరామయ్య తదితరులు ఇందులో పాల్గొన్నారు. అవినీతిపై ఎక్కుపెట్టిన గన్: కన్నబాబు ‘మావిగన్’ ప్రాంతాన్ని రాజధాని కారిడార్గా అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్గా మారుతుందని వైఎస్ జగన్ ప్లాన్–బీ సూచించగానే అధికార పార్టీ ఉలిక్కిపడింది. వారం రోజులుగా పరిపాలనను పూర్తిగా పక్కన పెట్టి ట్రోల్ చేయడంలో నిమగ్నమైంది. ‘మావిగన్’ అనేది అమరావతిలో రూ.వేల కోట్ల అవినీతిపై ఎక్కుపెట్టిన గన్లా కనిపించింది. రూ.20 వేల కోట్లతో అభివృద్ధి చేయవచ్చని సూచిస్తుంటే కూటమి నాయకులు ఎందుకు భయపడుతున్నారు? అమరావతిని పూర్తి చేయడానికి తరాలు పడుతుందని మీరే చెబుతున్నప్పుడు త్వరితగతిన పూర్తయ్యే ‘మావిగన్’ ఆలోచన మంచిదే కదా! ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలు కడుపుమంటకి పరాకాష్ట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉందంటూనే అమరావతిలో రోడ్లు, మౌలిక వసతులకు రూ.2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? రాజ్యసభలో రేణుకా చౌదరి వ్యాఖ్యలను కూటమి నాయకులు ఎందుకు ఖండించలేదు? అమరావతి గేటెడ్ కమ్యూనిటీలా మారిందని టీడీపీ నేతలే చెబుతున్నారు. టెండర్లు, డిజైన్లు, అడ్వాన్సుల పేరుతో రూ.వేల కోట్లు దోపిడీ జరుగుతోంది. ఈ కారణాల వల్లే సంబంధిత బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. అవినీతికే చట్టబద్ధత తెచ్చారు: గుడివాడ అమర్నాథ్ సీఎం చంద్రబాబు ‘మావిగన్’ పేరుకు వ్యతిరేకమా? లేక మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో రాజధాని ఏర్పాటుకు వ్యతిరేకమా? సమాధానం చెప్పాలి. వైఎస్ జగన్ సూచించిన మావిగన్ మోడల్లో పోర్టు, ఎయిర్పోర్టు, నేషనల్ హైవేలు.. అన్నీ ఉన్నాయి. అమరావతిలో ఇవన్నీ రూ.వేల కోట్లు ఖర్చు చేసి కొత్తగా నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి. చంద్రబాబు తెచి్చన చట్టబద్ధత రాజధానికి కాదు.. అమరావతి ముసుగులో చేస్తున్న అవినీతికి. -
ఏపీకి అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షం
సాక్షి, విజయవాడ: ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ఎండ, మరోవైపు వర్షం అన్నట్టుగా వాతావరణం మారిపోయింది. దక్షిణ కోస్తాంధ్ర-పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా.. రాయలసీమ పరిసర ప్రాంతాలపై మరో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు మేఘావృతమైన వాతావరణంతో పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.ఈ క్రమంలో ఏలూరు జిల్లాకు రెడ్ అలర్ట్ విధించింది. రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే, 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఏపీ విపత్తుల శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.మరోవైపు.. సోమవారం పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో వడగాలుల ప్రభావం ఉండనుంది. ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం, నెల్లూరు జిల్లా నెల్లూరుపాలెంలో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలుచోట్ల 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు అధికారులు తెలిపారు. -
కల్లబొల్లి కబుర్లతో నమ్మించి.. శారీరకంగా లొంగదీసుకున్నాడు!
కూర్మన్నపాలెం (విశాఖ) : కల్లబొల్లి కబుర్లుతో ఓ మహిళను నమ్మించి, ఆమెను శారీరకంగా లొంగదీసుకోవడమే కాకుండా, ఏకంగా ఆమెను అంతం చేయాలనే క్రూర ఆలోచనతో ఇంటికి నిప్పు పెట్టిన అమానుష ఘటన వడ్లపూడి అప్పికొండ కాలనీలో కలకలం రేపింది. దువ్వాడ సీఐ కె.మల్లేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. భర్త మరణించిన ఓ మహిళ తన కుమారుడితో కలిసి వడ్లపూడిలో నివాసముంటోంది. ఈ క్రమంలో రాంబిల్లి మండలం రాజుపాలేనికి చెందిన సాయికృష్ణ అనే వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో సహజీవనం చేసిన సాయికృష్ణ, ఆ తర్వాత ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్ట్ చేయగా, ఐదు నెలలుగా జైల్లో ఉన్న సాయికృష్ణ ఇటీవలే విడుదలయ్యాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా సాయికృష్ణ బుద్ధి మార్చుకోకుండా, శుక్రవారం రాత్రి పుష్ప ఇంటికి వెళ్లి ఆమెను బ్లాక్మెయిల్ చేసి శారీరకంగా అనుభవించాడు. శనివారం రాత్రి కూడా ఆమెతో ఘర్షణకు దిగి అక్కడి నుండి వెళ్లిపోయాడు. అయితే ఆమెపై కక్ష పెంచుకున్న నిందితుడు ఆదివారం తెల్లవారుజామున మళ్లీ వచ్చి ఇంటి బయట ఉన్న ఎలక్ట్రిక్ స్కూటీపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ఒక్కసారిగా మంటలు వ్యాపించి స్కూటీతో పాటు ఇంట్లోని సామగ్రి కూడా తగులబడింది. మంటలను గమనించిన ఇరుగుపొరుగు వారు వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు సకాలంలో చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. అదృష్టవశాత్తూ స్థానికుల చొరవతో పుష్ప, ఆమె కుమారుడు పెను ప్రమాదం నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. లేనిపోతే సజీవ దహనం అయ్యేవారని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు సాయికృష్ణకు అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నట్లు విచారణలో తేలింది. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించగా, ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఈ కిరాతక ఘటనపై కేసు నమోదు చేసిన సీఐ మల్లేశ్వరరావు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
ఓటీపీ మాయ
గ్యాస్ సరఫరాలోమహారాణిపేట: విశాఖ నగరంలో వంట గ్యాస్ బుకింగ్లో ఓటీపీ మాయాజాలం నడుస్తోంది. ఆన్లైన్ బుకింగ్ ప్రక్రియ అక్రమాలకు నిలయంగా మారింది. ఓటీపీ వచ్చి వారం రోజుల తర్వాత గ్యాస్ వస్తోందని ఏజెన్సీలు చెబుతున్నాయి. పది పదిహేను రోజులైనా రాకపోవడంతో సిలిండర్ పట్టుకుని వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూ కడుతున్నారు. అక్కడకు వెళ్లినా ఇంకా మీ గ్యాస్ రాలేదని ఏజెన్సీల నుంచి సమాధానం వస్తోంది. దీంతో గ్యాస్ బుక్ చేసిన వినియోగదారులకు సరఫరా ఎగ్గొట్టి సిలిండర్లను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొరత లేదని చెప్తున్నా.. నగరంలో హెచ్పీసీఎల్, భారత్, ఐవోసీ గ్యాస్ కంపెనీలు వంట గ్యాస్, కమర్షియల్ గ్యాస్ సరఫరా చేస్తున్నాయి. కమర్షియల్ గ్యాస్ సరఫరాపై ఆంక్షలు విధించడంతో ఆచూతూచి సరఫరా చేస్తున్నారు. దీంతో విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. విశాఖలో మొత్తం 62 గ్యాస్ ఏజెన్సీల్లో 8 లక్షల 90 వేల డొమెస్టిక్ కనెక్షన్లు ఉన్నాయి. నేటికి లక్షా 65 వేల మందికి పైగా గ్యాస్ బుక్ చేశారు. వీరికి గతంలో ఓటీపీ నెంబర్ వచ్చాక ఒకట్రెండు రోజుల్లోనే సిలిండర్ వచ్చేదని, ఇప్పుడు ఓటీపీ వచ్చి 10–15 రోజులవుతున్నా.. సిలిండర్ డెలివరీ కావట్లేదని వినియోగదారులు వాపోతున్నారు. వంట గ్యాస్కు ఎలాంటి కొరత లేదని జిల్లా అధికారులు చెబుతున్నా.. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఏజెన్సీలపై తీవ్ర ఒత్తిడి వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ మీద ప్రభుత్వం ఇప్పటికే పలు అంక్షలు విధించింది. 40 శాతం మేర సరఫరా తగ్గించారు. ఇప్పుడు డొమెస్టిక్ గ్యాస్పై కూడా ఆంక్షలు వస్తాయన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బుకింగ్కు బుకింగ్కు మధ్య కనీసం 25 రోజుల వ్యవధి ఉండాలి. దీంతో ఖాళీ సిలిండర్లున్నవారు, ఒకట్రెండు వారాల్లో సిలిండర్ ఖాళీ అవుతుందనుకునేవాళ్లు తమ గడువు తీరిన వెంటనే బుకింగ్ చేస్తున్నారు. దీంతో ఏజెన్సీలపై ఒత్తిడి పెరుగుతోంది. పెరుగుతోన్న బుకింగ్ జాబితా వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా పలు ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్ల నుంచి జిల్లాకు సాధారణ స్థాయిలోనే సిలిండర్లు సరఫరా అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మూడు నెలల గణాంకాలను పరిశీలిస్తే రోజుకు 18 వేలు చొప్పున సిలిండర్లు వస్తున్నాయి. యుద్దం నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులతో ప్రస్తుతం రోజుకు 25 వేల వరకు అందిస్తున్నారు. ఇప్పటికే లక్షా 65 వేల సిలిండర్లకు బుకింగ్ ఉంది. ఈ జాబితా రోజు రోజుకూ పెరుగుతోంది. డొమెస్టిక్ సిలిండర్ పక్కదారి? మరోవైపు డొమెస్టిక్ సిలిండర్లు టీ, టిఫిన్ దుకాణాలు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, హోటళ్ల బాట పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల అధికారుల దాడుల్లో దొరికిన సిలిండర్లు ఈ ఆరోపణలను నిజం చేస్తున్నాయి. గ్యాస్ ఏజెన్సీలు, డెలివరీ బాయ్స్ కుమ్మకై ్క.. డొమెస్టిక్ సిలిండర్ల బుకింగ్లు తామే జరిపి, సిలిండర్లను బహిరంగ మార్కెట్లో వాణిజ్య వినియోగదారులకు రెండింతలు, మూడింతల ధరకు విక్రయిస్తున్నారన్న విమర్శలున్నాయి. కొందరు వినియోగదారులు తాము బుక్ చేయకుండానే తమ మొబైళ్లకు ఓటీపీలు వస్తున్నాయని, తమ సిలిండర్లను హోటళ్లు, రెస్టారెంట్లకు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు. -
చంద్రబాబు పాలనలో రాజ్యాంగం అపహాస్యం
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు పాలనలో రాజ్యాంగం అపహాస్యం అవుతోందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు దళితులపై దాడులు చేసి, అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు వారం రోజుల క్రితం నర్సీపట్నంలో జరిగిన ఓ జాతరలో ఒక దళిత డప్పు కళాకారుడిని చెంపపై కొట్టారని, ఆయన మీద ఎందుకు కేసు నమోదు లేదని ప్రశ్నించారు. అంతకుముందు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు దళి తులపై తప్పుడు కేసులు పెట్టి 57 మంది దళితులను అక్రమంగా జైలుకు పంపించారని పేర్కొన్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరూ అధికార బలంతో దళితుల్ని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని, రాష్ట్రంలో ఉన్న దళితులమంతా ఆగ్రహిస్తే బంగాళాఖాతంలో కొట్టుకుపోతారంటూ హెచ్చరించారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, విశాఖ తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావుతో కలిసి ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రజాప్రతినిధులు చట్టాలను తుంగలో తొక్కుతున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబుకు దళితులు అంటే వ్యతిరేకత, అయిష్టం ఇప్పుడే కాదు.. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి నేటి వరకూ దళితులపై దాడులు చేయించడం, వారిపై అక్రమ కేసులు పెట్టించడం పరిపాటిగా మారిందన్నారు. గత ఎన్నికల్లో జనసేన అధినేత, బీజేపీతో కలిసి దొంగ హామీలు ఇచ్చి దళితుల ఓట్లుతో గద్దెనెక్కారని, అధికారం చేపట్టాక దళితులపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. జనసేన, టీడీపీ ప్రజాప్రతినిధుల వేధింపులు భరించలేక దళితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలోని గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో దళిత మహిళపై జనసేన నాయకుల దాడిని గుర్తు చేశారు. అదే నియోజకవర్గంలో గతంలో మల్లం గ్రామంలో దళిత సామాజిక వర్గానికి చెందినవారిని బహిష్కరణ చేశారన్నారు. ఆ గ్రామంలో వారికి టీ, టిఫిన్, నిత్యావసర సరకులు ఏ షాపుల్లో కూడా ఇవ్వకుండా వివక్ష చూపించారని పేర్కొన్నారు. యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలంలో పంచదార్ల గ్రామంలో 50 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం ఇచ్చిన డి–పట్టా భూములను జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్, ఆయన అనుచరులు రెవెన్యూ అధికారులతో కుమ్మకై ్క ఆక్రమించుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. రాజమండ్రిలో దళితులను బట్టలు విప్పి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ..రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంలో దళితులు, మహిళలపై తరుచూ దాడులు, అత్యాచారాలు పెరుగుతున్నాయన్నారు. అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వంటి ఉన్నత స్థానాల్లో ఉన్నవారు దళితులపై దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వ్యవహార శైలి ప్రజాస్వామ్యానికి అవమానకరమని, వారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. దళితుల పట్ల ఈ ప్రభుత్వ వైఖరి దారుణంగా ఉందని, తక్షణం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ కార్యాలయ పర్యవేక్షకుడు రవిరెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు పేడాడ రమణి కుమారి, మాజీ డిప్యూటీ మేయర్ కె.సతీష్ , రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, విశాఖ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు బోని శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
చేజారుతున్న ‘బంగారు బాతు’
వివాదమంతా కొత్తవలస – కిరండూల్ (కేకే లైన్) చుట్టూనే తిరుగుతోంది. ఛత్తీస్గఢ్లోని గనుల నుంచి ఇనుప ఖనిజాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్, పోర్టుకు తరలించే ఈ మార్గం భారత రైల్వేలోనే అత్యధిక ఆదాయం ఇచ్చే సెక్షన్లలో ఒకటి. ఈ ఒక్క లైన్ ద్వారానే ఏడాదికి సుమారు రూ. 9 వేల కోట్ల ఆదాయం వస్తుంది. ప్రస్తుతం ఈ ఆదాయం ఒడిశా కేంద్రంగా ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వేకు వెళ్తోంది. కొత్త జోన్ వస్తే ఈ ఆదాయం ఏపీకి చెందుతుందన్న భయంతో, ఒడిశా ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఈ లైన్ను రాయగడ డివిజన్లో కలిపించుకుంది. రైల్వే బోర్డు కూడా ఒడిశా ఒత్తిళ్లకు తలొగ్గి, లాభసాటి మార్గాలను అక్కడ ఉంచి.. కేవలం ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండి, నిర్వహణ ఖర్చులు భారమయ్యే స్టేషన్లను మాత్రమే ఆంధ్రాకు కేటాయిస్తోంది. -
కై లాసగిరికి వాహన టికెట్ ధరల తగ్గింపు
ఆరిలోవ: ప్రముఖ పర్యాటక కేంద్రం కై లాసగిరి సందర్శన కోసం వెళ్లే వాహనాలకు వీఎంఆర్డీఏ అధికారులు వాహనాల టికెట్ ధరలను తగ్గించారు. ఈ నెల 2న ఏర్పాటు చేసిన విస్టా యాప్ పేరిట టోల్ప్లాజా వద్ద సిబ్బంది వాహనాల టిక్కెట్లతో పాటు, వాహనాల్లో ఉండే సందర్శకుల నుంచి తలో రూ.10 చొప్పున వసూలు చేశారు. దీనిపై ఈ నెల 3న ‘కైలాసగిరి పర్యాటకులకు వీఎంఆర్డీఏ షాక్’శీర్షికతో సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. వాహనాల టికెట్ల ధరలు తగ్గిస్తున్నట్లు వీఎంఆర్డీఏ కమిషనర్ ఎన్.తేజ్భరత్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వాహనాల టికెట్ ధరలు తగ్గించి వాహనాల్లో ప్రయాణించే పర్యాటకులకు తలో రూ.10 చొప్పున టికెట్ తీయాలన్నారు. ఇంతవరకు ద్విచక్రవాహనానికి చెల్లించే రూ.20 టికెట్ ధర రూ.10కి, ఐదుగురు కూర్చొనే నాలుగు చక్రాల వాహనానికి రూ.50 నుంచి రూ.30కి, ఐదుగురు కంటే ఎక్కువ మంది కూర్చునే నాలుగు చక్రాల వాహనానికి రూ.70 నుంచి రూ.50కి, మినీ బస్కు రూ.150 నుంచి రూ.100కు, పెద్ద బస్కు రూ.300 నుంచి రూ.150కి తగ్గించినట్లు కమిషనర్ పేర్కొన్నారు. ఆ ధరలతో పాటు ఆయా వాహనాల్లో ఎంతమంది పర్యాటకులు ఉంటే అందరూ రూ.10 చొప్పున చెల్లించాలన్నారు. విస్టా యాప్ పర్యాటకులకు సౌకర్యవంతం, ఉపయుక్తంగా ఉంటుందన్నారు. అయితే వాహనాల ధరలు తగ్గించామంటూనే.. విస్టా యాప్ పేరిట వాహనాల్లో ఉండేవారి నుంచి అదనంగా రూ.10 చొప్పున వసూలు చేయడంపై పర్యాటకుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. వీఎంఆర్డీఏ కమిషనర్ ఎన్.తేజ్భరత్ -
చందనోత్సవానికి ఆర్టీసీ 70 ప్రత్యేక సర్వీసులు
డాబాగార్డెన్స్ : ఈ నెల 20న జరిగే శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా భక్తుల కోసం 70 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు జిల్లా ప్రజారవాణా అధికారి బి.అప్పలనాయుడు తెలిపారు. ఆదివారం ఆయన సింహాచలం డిపోలో ఏర్పాట్లను తనిఖీ చేశారు. కొండపైకి వెళ్లే బస్సులకు ప్రత్యేక మెకానికల్ టీమ్స్ ద్వారా ముందస్తు తనిఖీలు నిర్వహించి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. చందనోత్సవం రోజున తెల్లవారుజాము నుంచే ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
ప్రజా సమస్యలపై యువజన విభాగం పోరాడాలి
మహారాణిపేట : రాష్ట్రంలోని నిరుద్యోగులు, విద్యార్థులకు ప్రస్తుత ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించాలని, వారి సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ సీపీ యువజన విభాగం సమరోత్సాహంతో పోరాడాలని శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం లాసన్స్బే కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో ఉత్తరాంధ్ర యువజన విభాగం నాయకులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. పార్టీలో యువజన విభాగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని జిల్లాల్లో జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిల్లో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించుకుని పార్టీ పటిష్టతకు కృషి చేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని, ఆ మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులను కోరారు. కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా రీజినల్ కో–ఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్, రాష్ట్ర యువజన విభాగం వైస్ ప్రెసిడెంట్ మెంటాడ స్వరూప్, ఉత్తరాంధ్ర జోనల్ అధ్యక్షులు అంబటి శైలేష్, విశాఖ జిల్లా అధ్యక్షుడు ఉరుకూటి చందు పాల్గొన్నారు. వీరితో పాటు అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల యువజన విభాగం అధ్యక్షులు పుల్లేటి వెంకటేష్, అల్లు అవినాష్, పృధ్వీ, వివిధ జిల్లాల కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ అధ్యక్షులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉత్తరాంధ్ర యువజన విభాగం నాయకులతో శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ భేటీ -
ఆంధ్రాకు!
ఒడిశాకు..కొసరుదక్షిణ కోస్తా రైల్వే జోన్ సరిహద్దుల విభజనలో బోర్డు ‘తొండాట’ కేవలం 7 స్టేషన్లను మాత్రమే విశాఖ డివిజన్లో కలిపినట్లు ప్రకటన రూ.వేల కోట్ల ఆదాయం ఇచ్చే కేకే లైన్పై పట్టు విడవని ఒడిశా కేంద్రంపై ఒత్తిడి తేవడంలో కూటమి ఎంపీల మౌనం రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్సార్సీపీ ఎంపీల పోరాటంసాక్షి, విశాఖపట్నం : దశాబ్దాల కాలంగా ఉత్తరాంధ్ర ప్రజలు కంటున్న కల ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’. ఈ కల నెరవేరే సమయం ఆసన్నమైనా, ఆ సంతోషం ఉత్తరాంధ్ర ప్రజల్లో కనిపించడం లేదు. రైల్వే బోర్డు అనుసరిస్తున్న ‘సరిహద్దుల విభజన’ విధానమే ఇందుకు ప్రధాన కారణం. విశాఖపట్నం కేంద్రంగా కొత్త జోన్ వస్తుందని సంబరపడే లోపే, ఆ జోన్కు గుండెకాయ లాంటి ‘వాల్తేరు డివిజన్’ను ముక్కలు చేసి, అత్యంత కీలకమైన ప్రాంతాలను ఒడిశాలోని రాయగడ డివిజన్కు కట్టబెట్టే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. తాజాగా కేవలం ఏడు స్టేషన్లను మాత్రమే విశాఖ డివిజన్లో కలుపుతూ రైల్వే బోర్డు జారీ చేసిన ఉత్తర్వులు, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనన్న విమర్శలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. విభజన రాజకీయం.. వాల్తేరుపై వేటు 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం.. 2019 ఫిబ్రవరిలో విశాఖపట్నం కేంద్రంగా ’దక్షిణ కోస్తా రైల్వే జోన్’ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఈ ప్రకటనతో పాటే శతాబ్ద కాలపు చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్ను విభజిస్తున్నట్లు వెల్లడించడంతో అప్పట్లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. వాల్తేరు డివిజన్ను యథాతథంగా కొనసాగించాలని వైఎస్సార్సీపీ ఎంపీలు రైల్వే మంత్రికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కేంద్రం, 2019 ఆగస్టులో వాల్తేరు డివిజన్ పేరును ‘విశాఖపట్నం డివిజన్’గా మారుస్తామని హామీ ఇచ్చి అమలు చేసింది. కానీ ఆ తర్వాత కూడా కీలకమైన కేకే లైన్ను రాయగడ డివిజన్లోనే చేర్చింది. దీనిని మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న వైఎస్సార్సీపీ.. కేంద్రానికి, రైల్వే బోర్డుకు విన్నవిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో డివిజన్ విభజన అంశాన్ని కేంద్రం కొంతకాలం వాయిదా వేసింది. అనంతరం 2025 జనవరి 8న విశాఖలోని ముడసర్లోవలో జోన్ ప్రధాన కార్యాలయానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ప్రతిపాదిత దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో వాల్తేరు డివిజన్ను విడగొడుతూ అధికార పరిధిని ఖరారు చేశారు. ఏడు స్టేషన్ల ‘బిచ్చం’.. కూటమి ఎంపీల మౌనం తాజాగా రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామేశ్వర్ మీనా ఉత్తర్వుల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాలోని పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు ఉన్న పలాస, సుమ్మాదేవి, మందస రోడ్డు, బారువ, సోంపేట, జాడుపూడి, ఇచ్ఛాపురం స్టేషన్లను మాత్రమే విశాఖ డివిజన్లో కలుపుతున్నారు. మరోవైపు కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన ఎంపీల మౌనం విస్మయానికి గురిచేస్తోంది. రాష్ట్ర ఆదాయానికి మూలాధారమైన కేకే లైన్ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవడంలో వీరు పూర్తిగా విఫలమవుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సైతం ఈ విషయంలో మిన్నకుండిపోయారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇకనైనా కళ్లు తెరవకుంటే.. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ ఇప్పుడు తుది దశకు చేరుకుంది. సరిహద్దుల నిర్ణయంలో గనుక ఇప్పుడు వెనక్కి తగ్గితే, భవిష్యత్తులో విశాఖ జోన్ ఆర్థికంగా నిలదొక్కుకోవడం అసాధ్యం. కేవలం ఏడు స్టేషన్ల బదిలీతో సంతృప్తి చెందితే, వేల కోట్ల ఆదాయాన్ని పొరుగు రాష్ట్రానికి ధారపోసినట్లే అవుతుంది. ఈ అంశంలో వైఎస్సార్సీపీ ఎంపీలు నిరంతరం పోరాటం చేస్తున్నప్పటికీ, అధికార కూటమి ఎంపీల నుంచి స్పందన లేకపోవడం రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారింది.రాయగడ డివిజన్ పరిధి వాల్తేరులోని అత్యంత కీలకమైన కొత్తవలస–బచెలి (కేకే లైన్), కూనేరు–తేరువలి జంక్షన్, సింగాపూర్–కోరాపుట్ జంక్షన్, పర్లాకిమిడి–గుణుపూర్ స్టేషన్ల మధ్య ఉన్న సుమారు 680 కిలోమీటర్ల సెక్షన్. విశాఖపట్నం డివిజన్ పరిధి పలాస–విశాఖపట్నం–దువ్వాడ, కూనేరు–విజయనగరం, నౌపడ జంక్షన్–పర్లాకిమిడి, బొబ్బిలి జంక్షన్–సాలూరు, సింహాచలం నార్త్–దువ్వాడ బైపాస్, వడ్లపూడి–దువ్వాడ, విశాఖ స్టీల్ ప్లాంట్–జగ్గయ్యపాలెం స్టేషన్ల మధ్య ఉన్న సుమారు 410 కిలోమీటర్ల సెక్షన్. -
బాబూ జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం
ఏయూక్యాంపస్: భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ 119 జయంతి వేడుకలు సోమవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీచ్ రోడ్డులోని ఆయన విగ్రహం వద్ద నిర్వహించిన ప్రధాన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, విష్ణుకుమార్ రాజు, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ తదితరులు పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేసీ విద్యాధరి మాట్లాడుతూ.. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్గా దేశాభివృద్ధికి జగ్జీవన్ రామ్ చేసిన సేవలు అనన్యసామాన్యమని కొనియాడారు. ఆయన జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో యువత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతికతపై అవగాహన పెంచుకోవాలని, నైపుణ్యాలను మెరుగుపరుచుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. జిల్లాలోని కమ్యూనిటీ హాళ్లు, పాఠశాలలు, వసతి గృహాల్లోనూ వేడుకలు నిర్వహించి విద్యార్థులకు ఆయన జీవిత విశేషాలను వివరించారు. కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సతీష్, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామారావు, జీవీఎంసీ ఏడీసీ సత్యవేణి, వివిధ దళిత సంఘాల ప్రతినిధులు మరియు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ప్లైవుడ్ వ్యాపారి మృతి
కూర్మన్నపాలెం: వడ్లపూడి సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుజరాత్కు చెందిన ప్లైవుడ్ వ్యాపారి అశోక్ పటేల్ (32) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజువాక అంబేడ్కర్ కాలనీలో నివాసముంటున్న అశోక్ పటేల్ తన ద్విచక్ర వాహనంపై వడ్లపూడి కూడలి వద్ద మలుపు తిరుగుతుండగా, వెనుక నుంచి వచ్చిన టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన లారీ చక్రాల కింద పడి ప్రాణాలు కోల్పోయారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దువ్వాడ సీఐ మల్లేశ్వరరావు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆరోగ్యానికి ప్రాధాన్యం.. పాటలతో ఉల్లాసం
శిల్పారామం వేదికగా ప్రతిరోజూ ఉదయం ఒక గంట సమయాన్ని మా ఆరోగ్యం కోసం కేటాయిస్తాం. మాలో చాలామంది వాకింగ్కే తొలి ప్రాధాన్యత ఇస్తారు. శారీరక వ్యాయామం పూర్తయిన తర్వాత, మానసిక ప్రశాంతత కోసం అందరం కలిసి ‘పాటల పందిరి’లో సేదతీరుతాం. ఇక్కడి వాతావరణం మాకు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది. – కృష్ణయ్య, వాకర్స్ సభ్యులు , పీఎంపాలెం మధురానుభూతి ఇస్తోంది శిల్పారామం (జాతర) ప్రశాంత వాతావరణం వల్లే 75 ఏళ్ల వయసులోనూ నేను ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాను. మా ఇల్లు దూరమైనా సరే, ఇక్కడికి రావడం నాకు ఇష్టం. ముఖ్యంగా తోటి సభ్యులందరి మధ్య పుట్టినరోజు జరుపుకోవడం, అందరూ కలిసి శుభాకాంక్షలు చెప్పడం నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. అందరి నడుమ జరిగే ఈ వేడుక నాకు ఒక మధురానుభూతి. –అంజలి, వాకర్స్ సభ్యురాలు ఎండాడ. అందరికీ సమాన ప్రాధాన్యం మా అసోసియేషన్లో సభ్యులందరినీ సమానంగా గౌరవిస్తూ, 2012 నుంచి సామూహిక పుట్టినరోజు వేడుకలను నిరాటంకంగా నిర్వహిస్తున్నాం. ప్రతి నెలా మొదటి ఆదివారం జరిగే ఈ వేడుకకు సభ్యులందరూ ఉత్సాహంగా హాజరవుతారు. సమష్టి వేడుకలతో పాటు, ఆసక్తి ఉన్న వారికి వ్యక్తిగత పుట్టినరోజు వేడుకలను కూడా ప్రత్యేకంగా జరిపిస్తుంటాం. – పీవీ రామారావు, జాతర వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు. -
ఆరోగ్యశ్రీ సేవలకు బకాయిల సెగ
జిల్లాలో ఎన్టీఆర్ వైద్య సేవలు ఐదో రోజూ స్తంభించిపోయాయి. ప్రభుత్వం నుంచి సుమారు రూ. 400 కోట్ల బకాయిలు రాకపోవడంతో, నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు సేవల పట్ల ఆసక్తి చూపలేదు. ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ (ఆషా) పిలుపు మేరకు బుధవారం నుంచి ఓపీ, ఐపీ సేవలతో పాటు శస్త్రచికిత్సలకు కూడా అంతరాయం నెలకొంది. బకాయిలు చెల్లించకపోతే ఆస్పత్రుల నిర్వహణ సాధ్యం కాదని యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే పేద రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా యంత్రాంగం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినప్పటికీ, రోగుల అవస్థలు మాత్రం తప్పడం లేదు. ఆదివారం చాలా ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవల కేబిన్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. – మహారాణిపేట -
అనుమానాస్పదంగా మహిళ మృతి
బీచ్రోడ్డు: మూడో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు.. హైదరాబాద్కు చెందిన అల్లూరి మణికుమారి(58) సిరిపురంలో నివాసం ఉంటున్న తన కుమార్తె ఇంటికి శనివారం వచ్చింది. రాత్రి స్నానం చేసి నిద్రపోయింది. ఆదివారం ఉదయం నిద్రలేపేందుకు ప్రయత్నిస్తే చనిపోయి ఉంది. దీంతో పోలీసులకు కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. ఆమెకు ఆర్థిక సమస్యలున్నట్లు పోలీసులకు తెలిపారు. అయితే ఆత్మహత్య చేసుకున్నారనేందుకు ఎలాంటి ఆధారాల్లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ఎస్ఐ చిన్నంనాయుడు కేసు దర్యాప్తు చేపట్టారు. -
కొత్త ఉత్సాహం
నాకు 80 ఏళ్లు నిండాయి. కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నా, మేం మర్చిపోయిన పుట్టినరోజులను తోటి వాకర్స్ గుర్తుచేసి మరీ వేడుకగా నిర్వహించడం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోంది. పదుల సంఖ్యలో స్నేహితుల మధ్య పుట్టినరోజు జరుపుకోవడం, ఇతరుల వేడుకల్లో పాల్గొనడం వల్ల మలిసంధ్యలోనూ ఎంతో ఆనందంగా ఉంది. – నారాయణ స్వామి నాయుడు, జాతర వాక్స్ సభ్యుడు. కొండంత బలం పిల్లలు దూరంగా స్థిరపడటంతో ఇంట్లోనే ఒంటరిగా మిగిలిపోయిన మా లాంటి వారికి, ఈ సామూహిక పుట్టినరోజులు కొండంత బలాన్నిస్తున్నాయి. బయటకు చెప్పుకోలేని ఆవేదనను మరిపించి, జీవిత చరమాంకంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. అందరి నడుమ ఆనందంగా గడపడం వల్ల మరికొన్నాళ్లు ఆరోగ్యంగా, హాయిగా జీవించగలమనే ధీమా కలుగుతోంది. – నాగేశ్వరరావు, వాకర్స్ అసోసియేషన్ సభ్యుడు, జీవితానికి భరోసానిస్తున్నాయి జీవితం ముగిసిపోతోంది.. ఎలాగోలా కాలాన్ని నెట్టుకురావాలనే నైరాశ్యంలో ఉన్న మాకు, ఈ పుట్టినరోజు వేడుకలు కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. మరికొన్ని ఏళ్లు హాయిగా, ఆనందంగా గడపగలమనే గట్టి భరోసాను ఈ వేడుకలు మాకు ఇస్తున్నాయి. – గోవింద్, జాతర వాకర్స్ అసోసియేషన్ సభ్యుడు -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
ఆరిలోవ: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పోలీసులకు లభ్యమైంది. ఎస్ఐ కృష్ణ తెలిపిన వివరాలు.. జీవీఎంసీ ఎనిమిదో వార్డు పరిధి ఎండాడ పెట్రోల్ బంక్ సమీపంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఆరిలోవ పోలీసులకు స్థానికుల ద్వారా సమాచారం అందింది. దీంతో సిబ్బంది అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఎలాంటి ఆధారాలు లభ్యంకాలేదు. దీంతో గుర్తు తెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేశారు. మృతుడి వయసు 50 నుంచి 55 ఏళ్ల మధ్య ఉంటుందని ఎస్ఐ తెలిపారు. వివరాలు తెలిసినవారు ఆరిలోవ పోలీసులను సంప్రదించాలని సూచించారు. -
మరణంపై విజయం.. క్రీస్తు పునరుత్థానం
డాబాగార్డెన్స్: ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవులు పెద్ద ఎత్తున ఆదివారం ప్రార్థనలు జరిపారు. నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని వాల్తేర్ సెమెట్రీలో తమ పూర్వీకుల సమాధుల వద్ద కుటుంబ సభ్యులు వేకువ జామున 3 గంటల నుంచే ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సమాధులను పూలతో అలంకరించి, కొవ్వొత్తులు వెలిగించి తమ వారిని స్మరించుకుని, నివాళులర్పించారు. వివిధ సంఘాలకు చెందిన మత పెద్దలు, పాస్టర్లు, బిషప్స్ ఆత్మీయుల సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, చనిపోయిన వారి కుటుంబాలకు ఆదరణ కల్గించారు. వాల్తేర్ సెమెట్రీ అధ్యక్షుడు జార్జ్ చీడి, కార్యదర్శి మ్యాథ్యూ పీటర్, కోశాధికారి జార్జ్ పుల్లెట్ ప్రార్థనలతో ఉదయకాల ఆరాధన ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రైస్తవ భక్తి గీతాలు మధురంగా ఆలపించారు. చర్చిల్లో ఈస్టర్ వేడుకలు నగర పరిధిలోని సెయింట్ ఆంథోనీ, ట్రినిటీ లూథరన్, లండన్ మిషన్, బాప్టిస్ట్, సెయింట్ అలోసిస్, సెయింట్ జాన్ ప్యారీస్, కల్వరి బాప్టిస్ట్ తదితర చర్చిలలో ఈస్టర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలు, గీతాలు ఆలపించారు. చర్చి ఫాదర్లు ఈస్టర్ సందేశాన్నిచ్చారు. పలు ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. బీచ్రోడ్డు: నగరంలో ఈస్టర్ వేడుకలు ఘనంగా జరిగాయి. గురజాడ కళాక్షేత్రంలో పీజే స్టీఫెన్పాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఈస్టర్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం నుంచే విశ్వాసులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ స్టీఫెన్పాల్, శైలపాల్ మాట్లాడుతూ ఈస్టర్ గొప్పతనాన్ని వివరించారు. క్రీస్తు పునరుత్థానం మానవాళికి ఆశ, విశ్వాసం, నూతన జీవితం ప్రసాదించిందన్నారు. ప్రేమ, క్షమ, త్యాగం ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆచరించాలనే సందేశాన్ని ఇచ్చారు. ద్వేషాలను దూరం చేసుకుని సోదరభావంతో జీవించడం ద్వారా సమాజంలో శాంతి నెలకొంటుందని పేర్కొన్నారు. భక్తిగీతాలు ఆలపిస్తూ విశ్వాసులు దేవుని స్తుతించారు. గీతాలు, నాటికల ద్వారా ఈస్టర్ సందేశాన్ని ప్రతిబింబించారు. -
నేడు ‘డయల్ యువర్ ఈపీడీసీఎల్ సీఎండీ’
సాక్షి, విశాఖపట్నం: డిస్కమ్ పరిధిలోని విద్యుత్ సంబంధిత సమస్యలను మరింత వేగవంతంగా పరిష్కరించే లక్ష్యంతో ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’కార్యక్రమాన్ని నేడు నిర్వహిస్తున్నట్లు సంస్థ సీఎండీ పృధ్వీతేజ్ ఇమ్మడి ప్రకటించారు. ప్రతి సోమవారం నిర్వహించనున్న డయల్ యువర్ సీఎండీ కార్యక్రమానికి సంస్థ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏఎస్ఆర్ పాడేరు, రాజమహేంద్రవరం, కాకినాడ, డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన విద్యుత్ వినియోగదారులు 86884 00499 ఫోన్ నంబర్ ద్వారా విద్యుత్ సంబంధిత సమస్యలను తెలియజేయవచ్చని వెల్లడించారు. విశాఖపట్నం ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు, హెచ్చుతగ్గులు, కొత్త సర్వీసుల జారీలో జాప్యం, విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో జాప్యం, ట్రానన్స్ఫార్మర్ల మార్పిడి తదితర విద్యుత్ సంబంధిత సమస్యలపై ఫిర్యాదులను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని సంస్థ పరిధిలోని 11 జిల్లాల వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సీఎండీ విజ్ఞప్తి చేశారు. -
మమతల జాతర
మలిసంధ్యలోజాతర వాకర్స్ అసోసియేషన్ ఈ సామూహిక పుట్టినరోజు వేడుకలకు దశాబ్దం కిందటే శ్రీకారం చుట్టి సమాజానికి ఆదర్శంగా నిలిచింది. అసోసియేషన్లో సభ్యత్వం తీసుకున్న వారు జనవరిలో కొంత నగదును డిపాజిట్ చేస్తారు. ప్రతి నెలా వచ్చే మొదటి ఆదివారం ఆ నెలలో పుట్టిన సభ్యులందరికీ సామూహికంగా వేడుకలు నిర్వహిస్తారు. అందరి సమక్షంలో కేక్ కట్ చేయించడం, బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలపడం వంటి కార్యక్రమాలతో ఆ ప్రాంతమంతా పండగ వాతావరణం నెలకొంటుంది. అత్యంత క్రమశిక్షణతో, ఆరోగ్యకరమైన వాతావరణంలో జరిగే ఈ విందు వినోదాలు సీనియర్ సిటిజన్ల బాధ్యతాయుత ప్రవర్తనకు అద్దం పడతాయి. అనుబంధాలకు నెలవుగా వాకర్స్ వేదిక ఇక్కడ ప్రతిరోజూ పండగే. సామూహిక వేడుకలే కాకుండా కొందరు సభ్యులు తమ పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలను కూడా ఈ వేదికపైనే జరుపుకుంటారు. ఇంట్లో జరిగే శుభకార్యాలను సైతం తోటి వాకర్స్ మధ్య జరుపుకోవడం ఇక్కడి ప్రత్యేకత. జాతీయ పర్వదినాలు, పండుగలను కూడా తమదైన శైలిలో నిర్వహిస్తూ ఈ అసోసియేషన్ ఒక కుటుంబంలా విరాజిల్లుతోంది. కేవలం వేడుకలే కాదు, ఆరోగ్యం పట్ల కూడా వీరు అంతే శ్రద్ధ చూపుతారు. ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకే శిల్పారామం చేరుకుని గంటపాటు వాకింగ్, వ్యాయామం, యోగా చేసిన తర్వాతే ఈ ఆనంద కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. ఆత్మీయతే ఆయువుపట్టు ‘రెక్కలు వచ్చిన పిల్లలు విదేశాల్లోనో, ఇతర నగరాల్లోనో స్థిరపడటంతో చాలామంది వృద్ధులు ఇళ్లకు పరిమితమై ఒంటరితనంతో బాధపడుతుంటారు. అలాంటి వారికి ఈ వేడుకలు కొండంత బలాన్ని ఇస్తున్నాయి’ అని సభ్యులు ఆనందంగా చెబుతున్నారు. 80 ఏళ్ల వయసులో కూడా మర్చిపోయిన పుట్టినరోజును గుర్తుచేసి వేడుక చేయడం, తోటి సభ్యుల నడుమ కేక్ కట్ చేయడం మాటల్లో చెప్పలేని మధురానుభూతిని కలిగిస్తోంది. ‘ఇక జీవితం అయిపోయింది’ అనే నైరాశ్యంలో ఉన్నవారికి, ఈ వేడుకలు మరికొన్ని ఏళ్లు ఆరోగ్యంగా, ఉత్సాహంగా జీవించగలమనే భరోసానిస్తున్నాయి. ఆరోగ్యం, ఆహ్లాదం, ఆనందం ఒకే చోట దొరికే ఈ ‘జాతర’ మలిసంధ్య జీవితాలకు సరికొత్త కాంతిని ఇస్తోంది. నేటి ఆధునిక కాలంలో పుట్టినరోజు అంటే కేవలం యువతకో, లేదా అప్పుడే ఏడాది నిండిన చిన్నారులకో పరిమితమైన పండగలా మారిపోయింది. యువత విందు వినోదాల కోసం తహతహలాడితే, తల్లిదండ్రులు తమ పిల్లల వేడుకను ఘనంగా చేసేందుకు ఉబలాటపడుతుంటారు. కానీ అరవై–డైబ్బె ఏళ్లు దాటిన మలిసంధ్య వయసు వారికి పుట్టినరోజు అంటే ఓ జ్ఞాపకం. అసలు తమ పుట్టిన తేదీ ఏదో కూడా స్పష్టంగా తెలియని పరిస్థితి వారిది. పదో తరగతి మార్కుల జాబితాలో నమోదైన తేదీనే ఆధారంగా చేసుకుని బతుకుతున్న ఆ తరం వారికి, విశాఖలోని శిల్పారామం (జాతర) వేదికగా జరుగుతున్న పుట్టినరోజు వేడుకలు కొత్త ఉత్సాహాన్ని, జీవితేచ్ఛను ప్రసాదిస్తున్నాయి. ఇక్కడ తోటి స్నేహితులే బంధువులై, ఆత్మీయతే కానుకగా సామూహిక వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. – పీఎం పాలెం -
మద్యం మత్తులో కారు నడిపి యువకుడు బీభత్సం
పీఎం పాలెం: మద్యం మత్తులో కారు నడుపుతూ ఓ యువకుడు ఆదివారం రాత్రి బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో ఓ బాలిక తీవ్రంగా గాయపడింది. ఇందుకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు.. ఆదివారం రాత్రి ఐటీ సెజ్ రోడ్డు నుంచి వైఎస్సార్ కాలనీ మీదుగా మద్యం మత్తులో ఉన్న యువకుడు కారు అడ్డదిడ్డంగా నడుపుతూ ముందుకు దూసుకు పోసాగాడు. ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీ కొడుతూ రోడ్డుపై పార్కుచేసి ఉన్న వాహనాలపైకి ఎక్కించేశాడు. ఈ ఘటనలో ఓ బాలికకు తీవ్ర గాయలు అయ్యాయి. స్థానిక యువత కారును వెంబడించి కొమ్మాది కూడలి వద్ద అడ్డుకున్నారు. అప్పటికే మత్తులో ఉన్న ఆ యువకుడు కారుదిగి రోడ్డుపై కూర్చుండి పోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడి గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. వైఎస్సార్ నగర్ కాలనీలో జరగిన నష్టంపై స్థానిక ఎస్ఐ ఆరా తీస్తున్నారు. -
విశ్రాంత విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
డాబాగార్డెన్స్: విశ్రాంత విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఏపీ విశ్రాంత విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎన్వీ రామారావు తెలిపారు. వీజేఎఫ్ ప్రెస్క్లబ్లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ద్వారా తమ సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకుంటామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విశ్రాంత విద్యుత్ ఉద్యోగులు ఉన్నారని, వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తమ కార్యవర్గం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుందన్నారు. గత నెల 30న తిరుపతిలో రాష్ట్ర సర్వసభ్య సమావేశం జరిగిందని, అనంతరం నిర్వహించిన సంఘ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎం.కృష్ణారెడ్డిని, జనరల్ సెక్రటరీగా తనను, వర్కింగ్ ప్రెసిడెంట్గా డీఆర్ఎస్వీ ప్రసాద్, ఉపాధ్యక్షులుగా మసిలామణి, పోలినాయుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కృష్ణమోహన్, రాయుడు తదితర బాడీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వెల్లడించారు. అనంతరం ఉత్తమ జర్నలిస్ట్గా ఉగాది పురస్కారం అందుకున్న గంట్ల శ్రీనుబాబు, సీనియర్ పాత్రికేయడు నాగరాజు పట్నాయక్లను సత్కరించారు. కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు పీవీవీ సత్యనారాయణ, జే శ్రీరామ్మూర్తి, బి.గురునాథరావు, ఎస్.వరహాలు, జి.సత్యనారాయణ, ఎన్వీ రమణ, బి.అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
మహిళను మోసగించి, సజీవ దహనానికి యత్నం
ఇంటికి నిప్పుపెట్టిన వైనం కూర్మన్నపాలెం (విశాఖ) : కల్లబొల్లి కబుర్లతో ఓ మహిళను నమ్మించి, ఆమెను శారీరకంగా లొంగదీసుకోవడమే కాకుండా, ఏకంగా ఆమెను అంతం చేయాలనే క్రూర ఆలోచనతో ఇంటికి నిప్పు పెట్టిన అమానుష ఘటన వడ్లపూడి అప్పికొండ కాలనీలో కలకలం రేపింది. దువ్వాడ సీఐ కె.మల్లేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. భర్త మరణించిన ఓ మహిళ తన కుమారుడితో కలిసి వడ్లపూడిలో నివాసముంటోంది. ఈ క్రమంలో రాంబిల్లి మండలం రాజుపాలేనికి చెందిన సాయికృష్ణ అనే వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో సహజీవనం చేసిన సాయికృష్ణ, ఆ తర్వాత ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్ట్ చేయగా, ఐదు నెలలుగా జైల్లో ఉన్న సాయికృష్ణ ఇటీవలే విడుదలయ్యాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా సాయికృష్ణ బుద్ధి మార్చుకోకుండా, శుక్రవారం రాత్రి పుష్ప ఇంటికి వెళ్లి ఆమెను బ్లాక్మెయిల్ చేసి శారీరకంగా అనుభవించాడు. శనివారం రాత్రి కూడా ఆమెతో ఘర్షణకు దిగి అక్కడి నుండి వెళ్లిపోయాడు. అయితే ఆమైపె కక్ష పెంచుకున్న నిందితుడు ఆదివారం తెల్లవారుజామున మళ్లీ వచ్చి ఇంటి బయట ఉన్న ఎలక్ట్రిక్ స్కూటీపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ఒక్కసారిగా మంటలు వ్యాపించి స్కూటీతో పాటు ఇంట్లోని సామగ్రి కూడా తగులబడింది. మంటలను గమనించిన ఇరుగుపొరుగు వారు వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు సకాలంలో చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. అదృష్టవశాత్తూ స్థానికుల చొరవతో పుష్ప, ఆమె కుమారుడు పెను ప్రమాదం నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. లేనిపోతే సజీవ దహనం అయ్యేవారని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు సాయికృష్ణకు అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నట్లు విచారణలో తేలింది. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించగా, ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఈ కిరాతక ఘటనపై కేసు నమోదు చేసిన సీఐ మల్లేశ్వరరావు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
బాబూ జగ్జీవన్ రామ్ ఆశయ సాధనే ధ్యేయం
మహారాణిపేట: స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని మద్దిలపాలెంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి మాజీ మంత్రి మేరుగ నాగార్జున, పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, తిప్పల దేవాన్రెడ్డి, మొల్లి అప్పారావు, మాజీ మంత్రి బాలరాజు పూలమాలలు వేసి ఘన నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహోన్నత వ్యక్తి బాబూ జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయం జగ్జీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా సాగాయని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ ఆయన స్ఫూర్తితో సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ కార్యాలయం పర్యవేక్షకుడు రవిరెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, నియోజకవర్గ పరిశీలకులు పేడాడ రమణికుమారి, సతీష్వర్మ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు కిరణ్ రాజు, తాడి జగన్నాథరెడ్డి, వెంకట రమణి, రాష్ట్ర పార్టీ అనుబందం విభాగలు అధ్యక్షుడు పేర్ల విజయ్ చందర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ద్రోణంరాజు శ్రీవాస్తవ్, జోనల్ , జిల్లా పార్టీ అనుబందం విభాగాల అధ్యక్షులు అంబటి శైలేష్, పీవీ సురేష్, ఎం. సునీల్ కుమార్, తుమ్మలూరు జగదేష్ రెడ్డి, సనపల రవీంద్ర భరత్, శ్రీ దేవి వర్మ, బోని శివ రామకృష్ణ, కర్రి రామారెడ్డి, వంకాయల మారుతీ ప్రసాద్, జీలకర్ర నాగేంద్ర, దేవరకొండ మార్కెండేయులు, మాజీ కార్పొరేటర్లు సాడి పద్మారెడ్డి, బిపిన్ కుమార్ జైన్, వావిలపల్లి ప్రసాద్, రెయ్యి వెంకట రమణ, కేవీఎన్ శశికళ, మాజీ చైర్మన్లు అలంపల్లి రాజబాబు, పార్టీ నాయుకులు రామన్నపాత్రుడు, తుళ్లి చంద్ర శేఖర్, ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో నివాళులర్పించిన వైఎస్సార్సీపీ నేతలు -
సంద్రాన సమరాంగణం సాగర గర్భంలో సొరంగం
సాక్షి, విశాఖపట్నం: నౌకా దళ రక్షణ రంగంలో సరికొత్త విప్లవానికి విశాఖ నగరం మరోసారి వేదికగా మారనుంది. నౌకా నిర్మాణ రంగంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా.. భారత్ అడుగులు వేస్తున్న నేపథ్యంలో ‘లార్జ్ కావిటేషన్ టన్నెల్(ఎల్సీటీ)’ నిర్మాణానికి శంకుస్థాపనతో నేవల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ ల్యాబొరేటరీ(ఎన్ఎస్టీఎల్) సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచంలోని అత్యుత్తమ టన్నెళ్లలో ఒకటిగా ఇది నిలవనుంది. సముద్ర గర్భంలోనే యుద్ధ నౌకలు, సబ్మెరైన్ల సామర్థ్యాన్ని పరీక్షించేలా ఈ సొరంగాన్ని నిర్మించనున్నారు. ఎల్సీటీ పూర్తయితే.. కాన్సెప్ట్ డిజైన్ నుంచి ఫైనల్ టెస్టింగ్ వరకూ ఒకే చోట జరిగే వేదికగా విశాఖ చరిత్రపుటలకెక్కనుంది. రెండు రోజుల క్రితం విశాఖలో పర్యటించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏమిటీ లార్జ్ కావిటేషన్ టన్నెల్.. సాధారణంగా నౌకలు లేదా జలాంతర్గాములు నీటిలో వేగంగా ప్రయాణించేటప్పుడు వాటి ప్రొపెల్లర్ల దగ్గర నీటి ఒత్తిడి తగ్గి, చిన్న చిన్న గాలి బుడగలు ఏర్పడతాయి. ఈ ప్రక్రియనే శాస్త్రీయంగా ‘కావిటేషన్’ అంటారు. ఈ బుడగలు పేలినప్పుడు విపరీతమైన శబ్దం రావడమే కాకుండా, ప్రొపెల్లర్లను దెబ్బతీస్తాయి. దీనివల్ల.. పరిశోధనలకు విఘాతం కలుగుతుంటుంది. ఈ సమస్యను లోతుగా అధ్యయనం చేసేందుకు, కృత్రిమంగా సముద్ర వాతావరణాన్ని సృష్టించే ఒక భారీ నీటి సొరంగాన్ని ఏర్పాటు చేస్తారు. దీన్నే ‘లార్జ్ కావిటేషన్ టన్నెల్’ అని పిలుస్తారు. విశాఖలో సుమారు 230 మీటర్ల పొడవు ఉండే టన్నెల్ని నిర్మించనున్నారు. ఈ టన్నెల్లో నీటి ప్రవాహ వేగాన్ని, ఒత్తిడిని నియంత్రిస్తూ నౌకల నమూనాలను పరీక్షించుకునే అవకాశం ఉంటుంది. ఎల్సీటీ ప్రయోజనాలేంటి.? » యుద్ధ సమయంలో శత్రువుల రాడార్లకు చిక్కకుండా ఉండాలంటే నౌకలు శబ్దం చేయకూడదు. ఈ టన్నెల్ ద్వారా ప్రొపెల్లర్ల శబ్దాన్ని కనిష్ట స్థాయికి ఎలా తగ్గించాలో శాస్త్రవేత్తలు పరిశోధించవచ్చు. » భారీ నౌకలను సముద్రంలోకి దించిన తర్వాత లోపాలు గుర్తిస్తే సరిదిద్దడం కష్టం. కానీ ఎల్సీటీలో నమూనా నౌకలను ఉంచి, వివిధ వేగాల వద్ద అవి ఎలా పనిచేస్తాయో ముందే తెలుసుకోవచ్చు. ఫలితంగా.. లోపాల్ని సులువుగా సరిదిద్దే అవకాశం ఉంటుంది. » ప్రొపెల్లర్ల రూపకల్పనను మెరుగుపరచడం ద్వారా నీటి ఘర్షణను తగ్గించి, ఇంధన వినియోగాన్ని ఆదా చేయవచ్చు. » కేవలం నౌకలే కాదు.. నీటిలోపల ప్రయోగించే క్షిపణులైన టార్పెడోల్ని కూడా ఇక్కడ పరీక్షిస్తారు. టార్పెడో నీటిలో ప్రయాణించేటప్పుడు దాని స్థిరత్వం ఎలా ఉంది, ప్రయాణ మార్గంలో నీటి ఒత్తిడికి అది ఎలా స్పందిస్తోంది అనేది ఇక్కడ కచ్చితంగా లెక్కించవచ్చు. అభివృద్ధి చెందిన దేశాల సరసన ఈ ఎల్సీటీ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతికొద్ది అత్యాధునిక టన్నెళ్లలో ఒకటి. దీని నిర్మాణంతో అమెరికా, రష్యా, జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాల సరసన ఇప్పుడు భారత్ నిలవనుంది. ఇది కేవలం మన దేశ అవసరాలకే కాకుండా, భవిష్యత్తులో మిత్ర దేశాల నౌకా నమూనాల పరీక్షలకూ వేదికవుతుంది. నౌకాదళానికి, ఎన్ఎస్టీఎల్కు లాభమేంటంటే.? నగరంలో ఉన్న రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అనుబంధ సంస్థ ఎన్ఎస్టీఎల్ ఆధ్వర్యంలో ఈ ఎల్సీటీ సదుపాయం అందుబాటులోకి రావడం వల్ల భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. గతంలో ఈ తరహా పరీక్షల కోసం రష్యా లేదా యూరప్ దేశాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు మన దేశంలోనే, స్వదేశీ పరిజ్ఞానంతో ఈ పరీక్షలు నిర్వహించుకునే అవకాశం కలుగుతుంది. దీనివల్ల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. అదేవిధంగా.. మన యుద్ధ నౌకల డిజైన్లు, రహస్యాలు ఇతర దేశాలకు తెలియకుండా మన దగ్గరే భద్రంగా ఉంటాయి. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా అత్యాధునిక సబ్మెరైన్లు, టార్పెడోలు, యుద్ధ నౌకల తయారీలో ఎన్ఎస్టీఎల్ శాస్త్రవేత్తలకు ఇది ఒక శక్తివంతమైన ఆయుధంగా మారనుంది. దీని నిర్మాణం పూర్తయితే.. విశాఖ, ఎన్ఎస్టీల్లో నౌకా నిర్మాణానికి సంబంధించి ‘కాన్సెప్ట్ డిజైన్ నుంచి ఫైనల్ టెస్టింగ్ వరకూ అన్నీ ఒకే చోట జరగనున్నాయి. ఇది మన రక్షణ పరిశోధన సంస్థ డీఆర్డీవో శాస్త్రవేత్తల మేధస్సుకు, భారత ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఒక నిలువెత్తు నిదర్శనమని రక్షణ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. -
యువకుడి ప్రాణం తీసిన క్రికెట్
సాక్షి,విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా పెద్దగదిలిలో క్రికెట్ ఆట విషాదంగా మారింది. రెండు జట్ల మధ్య జరిగిన ఘర్షణలో అజిత్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆటలో తలెత్తిన చిన్నపాటి వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో కిషోర్ అనే వ్యక్తి అజిత్ను మాట్లాడుకుందామని పిలిచి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అజిత్ను స్థానికులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అజిత్ మృతి చెందాడు. జరిగిన ఘటనపై అరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా స్థానికంగా ఈ సంఘటన కలకలం రేపింది. -
స్పీకర్, డిప్యూటీ స్పీకర్ దళితులపై దాడులా?: మేరుగ నాగార్జున
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు పాలనలో రాజ్యాంగం అపహాస్యం అవుతుందని మండిపడ్డారు మాజీ మంత్రి మేరుగ నాగార్జున. కూటమి నాయకుల వేధింపులు భరించలేక దళితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. చంద్రబాబుకు దళితులు అంటే వ్యతిరేకత అంటూ వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి మేరుగ నాగార్జున తాజాగా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు పాలనలో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారు చట్టాలను తుంగలో తొక్కుతున్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ దళితులపై దాడులు చేస్తున్నారు. ఒక దళితుడిని అయ్యన్నపాత్రుడు చెంప మీద కొట్టారు. దళితుడిని కొట్టిన ఆయన మీద ఎందుకు కేసు నమోదు లేదు?. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు తప్పుడు కేసులు పెట్టి దళితులను జైలుకు పంపిస్తున్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తులు ఇలా చేస్తారా?.ఎలమంచిలి జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ దళితులకు చెందిన 200 కోట్లు విలువైన భూములను ఆక్రమించుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో దళితులను వెలివేశారు. రాజమండ్రిలో దళితులను బట్టలు విప్పి పోలీస్ స్టేషన్లో కూర్చొబెట్టరు. కూటమి నాయకుల వేధింపులు భరించకలేక దళితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చంద్రబాబు దళిత వ్యతిరేకి అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. -
అధికారం అండతో ఎంపీ భరత్ అక్రమాల ‘గీతా’లాపన!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సొంత కుటుంబం అధికారం అండతో విశాఖ ఎంపీ భరత్ ఆధ్వర్యంలోని గీతం యూనివర్శిటీ అక్రమాలను మరింత జోరుగా సాగిస్తోంది. అడుగడుగునా అక్రమాలకు పాల్పడుతోంది. ఇప్పటికే ఎకరాలకు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి దర్జాగా క్రమబద్ధీకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్న గీతం యూనివర్శిటీ.... లోపల ఏకంగా సొంత సామ్రాజ్యాన్నే నిర్మించుకుంటోంది. ప్రభుత్వం నుంచి తీసుకున్న భూములతోపాటు అదనంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి మరీ ఇప్పటికే అక్రమ నిర్మాణాలు చేపట్టింది. ఈ ఆక్రమిత భూమిని గమనించి గత ప్రభుత్వం వెనక్కి తీసుకుని కంచె వేయడంతోపాటు బోర్డులను కూడా పాతింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ బోర్డులను పీకేయడంతోపాటు ఆక్రమిత ప్రభుత్వ భూముల్లో నిర్మాణాల కోసం చదును చేసే పనులు చేపట్టింది. అంతేకాకుండా ఆక్రమిత ప్రభుత్వ భూములను పార్కింగ్ ప్రదేశాలుగా వినియోగించుకుంటోంది. ఇంత జరుగుతున్నా సీఎం చంద్రబాబు బంధువు, బాలకృష్ణ అల్లుడు, మంత్రి లోకేశ్ తోడల్లుడుతోపాటు విశాఖకు ఎంపీ కూడా కావడంతో భరత్కు చెందిన గీతం సంస్థ అక్రమాల వైపు చూసేందుకు అధికారులెవ్వరూ సాహసించడం లేదు. ఆక్రమిత భూముల్లో అనుమతుల్లేకుండానే నిర్మాణాలు గీతం ఆక్రమించిన భూములను గత ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పటికీ... చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన వెంటనే తిరిగి తమ స్వాధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నాలను గీతం చేసింది. ఇందులో భాగంగా ఆక్రమించిన ప్రభుత్వ భూములను గీతం యాజమాన్యానికి తిరిగి కట్టబెట్టేందుకు జీవీఎంసీలో దౌర్జన్యం చేసి, దాడులు చేసి.. పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసుకుని... మీడియాను కౌన్సిల్ సమావేశ హాలులోకి రానివ్వకుండా దాడులు చేసి మరీ తీర్మానాన్ని ఆమోదింపచేసుకున్నారు. జీవీఎంసీ కౌన్సిల్లో దౌర్జన్యంగా తీర్మానం చేసిన తర్వాత... ఆక్రమిత భూముల్లో నిర్మాణాల కోసం చదును చేసే కార్యక్రమాలను చేపట్టింది. అదేవిధంగా తిరిగి పార్కింగ్ కోసం స్థలాన్ని వినియోగించుకుంటోంది. మరో 70 ఎకరాల భూమిని 22ఏ జాబితా నుంచి తొలగించుకోవడంతోపాటు అక్కడ జీవీఎంసీ నుంచి అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. అనుమతులు ఉన్నాయా? లేవా..? అని జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులను అడిగితే అధికారుల నుంచి స్పందన కరువయ్యింది. ఒక వేళ అనుమతి తీసుకుని ఉంటే... నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో జీవీఎంసీ ఇచ్చిన ప్లాన్ను బోర్డుపై ప్రదర్శించాల్సి ఉంటుంది. అటువంటిదేమీ అక్కడ కనిపించలేదు. అంటే జీవీఎంసీ నుంచి అనుమతి లేకుండానే వ్యవహారం సాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ హాస్టల్ బిల్డింగ్ను భారీ స్థాయిలో గీతం యాజమాన్యం నిర్మిస్తోంది. మొత్తంగా తమ కుటుంబ ప్రభుత్వం.... తామేం చేసినా అడ్డుకునే వారు లేరనే రీతిలో గీతం యాజమాన్యం వ్యవహరిస్తోందని విశాఖవాసులు, మేధావులు విమర్శిస్తున్నా వెనక్కు తగ్గడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం రాగానే బోర్డులు పీకేసి..ప్రభుత్వం కేటాయించిన భూములకు అదనంగా 54.79 ఎకరాల భూమిని గీతం యాజమాన్యం దర్జాగా ఆక్రమించుకుంది. వీటి విలువ రూ.5 వేల కోట్ల మేర ఉంటుంది. ఈ ఆక్రమిత భూముల చుట్టూ గోడ నిర్మించుకోవడంతోపాటు సొంత స్థలం అన్నట్టుగా ఏళ్లకు ఏళ్లు నమ్మబలికింది. ఈ ఆక్రమిత భూములను పార్కింగ్తోపాటు ఇతర అవసరాలకు వినియోగించుకుంది. అయితే, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వానికి చెందిన భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేయ డంతో గీతం అక్రమాల వ్యవహారం వెలుగుచూసింది. ఆక్రమించిన భూమిని స్వాధీనం చేసుకోవడంతోపాటు అధికారులు కంచెను నిర్మించారు. అదేవిధంగా అక్కడ ప్రభుత్వానికి చెందిన భూములంటూ బోర్డులను కూడా పాతారు. అయితే, 2024లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ భూములను తిరిగి పార్కింగ్కు వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా బోర్డులను కూడా పీకేశారు. అంటే ఎండాడ ప్రాంతంలో ప్రభుత్వ భూముల్లోనూ గీతం సామ్రాజ్యమే హవా చెలాయిస్తుందన్నమాట. మేధావులు, విశాఖవాసులు వ్యతిరేకిస్తున్నా ఆగని ఆక్రమణలపర్వం ఆక్రమిత ప్రభుత్వ భూముల్లో షెడ్లు నిర్మించి పార్కింగ్కు వినియోగం ప్రభుత్వం వచ్చాక స్వాధీనం చేసుకున్న భూముల్లోనూ నిర్మాణాలు జీవీఎంసీ నుంచి తీసుకున్న నిర్మాణ అనుమతులపై దోబూచులాట నిర్మాణ స్థలం వద్ద కనిపించని జీవీఎంసీ అనుమతి బోర్డు కనీసం స్పందించేందుకు బెదురుతున్న అధికారులు గతంలో మెడికల్ కాలేజీ, మెయిన్ క్యాంపస్ను అనుసంధానిస్తూ అండర్ వే బ్రిడ్జి నిర్మాణం ఎండాడ – రుషికొండ ప్రధాన రహదారి కింద ఇష్టారాజ్యంగా నిర్మాణం -
కలియుగ వైకుంఠానికి కళంకం
సాక్షి, విశాఖపట్నం: టీటీడీ చైర్మన్ పదవి నుంచి బీఆర్ నాయుడును తొలగించాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు నిరసనలు చేపట్టారు. జిల్లాలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ నాయుడు చేసిన అపవిత్ర కార్యక్రమాలు బయటికి వచ్చినా.. ఇంకా ఆయన్ని టీటీడీ చైర్మన్ గా కొనసాగించడం సిగ్గుచేటని వైఎస్సార్సీపీ నేతలు ఆక్షేపించారు. అలాంటి వ్యక్తిపై కనీస చర్యలు కూడా తీసుకోలేని అసమర్ధ సీఎం చంద్రబాబునాయుడు అని విమర్శించారు. బీఆర్ నాయుడు పదవిని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నాడని దుయ్యబట్టారు. ప్రపంచవ్యాప్తంగా హిందూ భక్తులు, నెటిజన్ల విమర్శలను కూడా సీఎం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. మురళీనగర్లో గల శ్రీ వైభవ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద, పద్మనాభం మండల పరిధిలో ఉన్న శ్రీ అనంతపద్మనాభ స్వామి దేవాలయం వద్ద, తూర్పు నియోజకవర్గంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద, దక్షిణ నియోజకవర్గంలోని అన్ని వార్డుల్లోని దేవాలయాల వద్ద, పశ్చిమ నియోజకవర్గంలోని విమాననగర్ పరిధిలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద, వడ్లపూడి పరిధిలో ఉన్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. -
ఆక్రమిత భూముల్లో సొంత సామ్రాజ్యం
వాస్తవానికి గీతం యూనివర్శిటీని నిర్మించిన భూములన్నీ ప్రభుత్వానివే. ప్రభుత్వం నుంచి తీసుకున్న భూముల్లో సొంత సామ్రాజ్యాన్ని గీతం యాజమాన్యం నిర్మించుకుంది. అంతటితో ఆగకుండా ప్రభుత్వానికి చెందిన ఇతర భూముల్లోకి కూడా చొరబడింది. యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలకు పూనుకుంది. అంతేకాకుండా ఎండాడ నుంచి రుషికొండకు వెళ్లే ప్రధాన రహదారి కింద అండర్ వే బ్రిడ్జి పేరుతో నిర్మాణాలను చేపట్టింది. ఈ అండర్ వే బ్రిడ్జి వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ఏంటనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం ఎటువంటి అనుమతులూ తీసుకోలేదని తెలుస్తోంది. వాస్తవానికి రోడ్డుకు అటూ ఇటూ ప్రైవేటు సంస్థలకు చెందిన భూములుంటే... వాటిని అనుసంధానించేందుకు అండర్ వే బ్రిడ్జిని నిర్మించేందుకు అనుమతి ఉండదు. సాధారణంగా జాతీయ రహదారులతోపాటు రైల్వే లైన్ల కింద అండర్ వే బ్రిడ్జిలకు అనుమతిస్తారు. అది కూడా ఆయా ప్రభుత్వరంగ సంస్థలే నిర్మాణాన్ని చేపడుతుంటాయి. ఇందుకు భిన్నంగా ఏకంగా గీతం మెయిన్ క్యాంపస్కు... మెడికల్ కాలేజీని అనుసంధానిస్తూ అండర్ వే బ్రిడ్జిని గీతం నిర్మించుకోవడం గమనార్హం. ఒకవేళ అవసరాల రీత్యా ఒక ప్రైవేటు సంస్థ అండర్ వే బ్రిడ్జిని నిర్మించుకోవాలంటే... జాతీయ రహదారుల సంస్థతోపాటు స్థానికంగా వీఎంఆర్డీఏ, జీవీఎంసీ, రెవెన్యూ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే గీతం యాజమాన్యం అటువంటి అనుమతులేవీ లేకుండానే ఇష్టారాజ్యంగా వ్యవహారం సాగించినట్టు స్పష్టమవుతోంది. -
అత్యున్నత త్యాగానికి సెల్యూట్
సింథియా: తోటి మనిషి ప్రాణాన్ని కాపాడటం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన తూర్పు నావికాదళ పెట్టీ ఆఫీసర్, దివంగత దీపక్ కుమార్ వీరోచిత త్యాగానికి భారతావని అత్యున్నత పురస్కారంతో నివాళులర్పించింది. మానవత్వంతో ఆయన చూపిన అసాధారణ ధైర్యసాహసాలకు గుర్తింపుగా భారత రాష్ట్రపతి ప్రకటించిన ‘సర్వోత్తమ జీవన్ రక్షా పతకాన్ని’ ఏప్రిల్ 1న ముంబైలో జరిగిన నావికా దళ పురస్కార వేడుకలో ప్రదానం చేశారు. భారత నావికాదళ అధిపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును దీపక్ కుమార్ సతీమణి రౌషానీ కుమారి కన్నీటి పర్యంతమవుతూ అందుకున్నారు. ఆ వేదికపై ఉన్న ప్రతి ఒక్కరూ దీపక్ కుమార్ చేసిన త్యాగాన్ని తలచుకుని నిశ్శబ్దంగా నివాళులర్పించారు. ఏం జరిగిందంటే? : 2024, సెప్టెంబర్ 14న అనకాపల్లి జిల్లా దేవరాపల్లి సమీపంలో గల సరియా జలపాతం వద్ద ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. జలపాతంలో ఒక్కసారిగా పెరిగిన నీటి ఉధృతికి ఒక వ్యక్తి కొట్టుకుపోతుండగా, ఏమాత్రం ఆలోచించకుండా దీపక్ కుమార్ నీటిలోకి దూకారు. ప్రాణాలకు తెగించి ఆ వ్యక్తిని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయితే, వరద ఉధృతి అత్యంత బలంగా ఉండటంతో ఇద్దరూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి వీరమరణం పొందారు. దీపక్కుమార్ చేసిన ఈ మహోన్నత త్యాగం భారత నావికాదళం అత్యున్నత సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని అధికారులు పేర్కొన్నారు. దివంగత దీపక్కుమార్కు ‘సర్వోత్తమ జీవన్ రక్షా పదక్’ ప్రదానం -
జెండా తొలగించాల్సిందే..
మేము కొన్ని దశాబ్దాలుగా జోడుగుళ్లుపాలెంలో ఆటో స్టాండ్ ఏర్పాటు చేసుకుని, ఇక్కడ ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాం. మా పొట్టకూటి కోసం కేటాయించుకున్న ఈ స్థలంలోనే ఇప్పుడు బీజేపీ నాయకులు జెండాను ఆవిష్కరించడం మాకు తీరని అన్యాయం. మిగిలిన స్థలంలో వాజ్పేయి విగ్రహం కూడా ఏర్పాటు చేస్తామంటున్నారని తెలిసింది.. అదే జరిగితే మా ఆటోలు ఎక్కడ నిలుపుకోవాలి? మా జీవనోపాధిని దెబ్బతీసే ఇలాంటి చర్యలను అస్సలు సహించం. ఇక్కడ ఏర్పాటు చేసిన బీజేపీ జెండాను వెంటనే తొలగించాలి. మాకు న్యాయం జరిగే వరకు ఆటో డ్రైవర్లమంతా ఏకమై పోరాటం చేస్తాం. –దాస్, ఆటో యూనియన్ అధ్యక్షుడు, జోడుగుళ్లుపాలెం -
అక్రమాలకు పరాకాష్ట.. అండర్ వే బ్రిడ్జి
ఇది గీతం యూనివర్శిటీ నుంచి గీతం మెడికల్ కాలేజీకి వెళ్లేందుకు నిర్మించిన అండర్ వే బ్రిడ్జి. దీనిని ఎండాడ నుంచి రుషికొండకు వెళ్లే ప్రధాన రహదారి కింద గీతం యాజమాన్యం అక్రమంగా నిర్మించుకుంది. ప్రభుత్వం నుంచి తీసుకున్న భూములతోపాటు అదనంగా భూములను ఆక్రమించుకుని అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపట్టింది. కబ్జా చేసిన రూ.5 వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను తిరిగి తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు దౌర్జన్యానికి దిగుతున్న గీతం యాజమాన్యం... ఇప్పటికే భూముల్లో పార్కింగ్ కోసం చదును చేసి నిర్మాణాలు చేపట్టేందుకూ సిద్ధమవుతుండటం గమనార్హం. -
ఉత్సాహంగా వాల్తేరు రైల్వే క్రీడా మేళా ప్రారంభం
విశాఖ స్పోర్ట్స్: వాల్తేరు ఈస్ట్కోస్ట్ రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాల్తేరు డివిజన్ అంతర్ విభాగ క్రీడా మేళా శనివారం ఘనంగా ప్రారంభమైంది. వాల్తేరు రైల్వే క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ క్రీడా వేడుకలు నెల రోజుల పాటు కొనసాగనున్నాయి. డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా, ఎకో ఆర్డబ్ల్యూడబ్ల్యూవో అధ్యక్షురాలు జ్యోత్స్న బోహ్రా కలిసి ఒలింపిక్ జ్యోతిని వెలిగించి ఈ క్రీడా మేళాను ఉత్సాహంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ క్రీడాకారుల బృందం క్రీడా జ్యోతిని ప్రాంగణమంతా ప్రదర్శిస్తూ క్రీడా స్ఫూర్తిని చాటారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం ఇ. సంతారామ్, క్రీడా అధికారి హరినాథ్ మోపురి, సహాయ క్రీడా అధికారి కేతన్ పాటిల్ తో పాటు వివిధ విభాగాల బ్రాంచ్ అధికారులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నెల రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో రైల్వేలోని వివిధ విభాగాలకు చెందిన క్రీడాకారులు తమ ప్రతిభను చాటనున్నారు. -
‘రెడ్బుక్’ రాజ్యాంగమా?
జోడుగుళ్లుపాలెంలో పదేళ్లుగా ఉన్న వైఎస్సార్ విగ్రహం ముందు, కావాలనే వివాదాలు సృష్టించేందుకు బీజేపీ నాయకులు పార్టీ జెండా ఏర్పాటు చేయడం దుర్మార్గం. ఇతర ప్రాంతాల్లో స్థలం ఉన్నప్పటికీ, రౌడీషీటర్ల కాపలా మధ్య ఇక్కడ దిమ్మ నిర్మించడం వారి కుట్రపూరిత రాజకీయాలకు అద్దం పడుతోంది. వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించి వాజ్పేయి విగ్రహాన్ని పెడతామనడం వారి అహంకారానికి నిదర్శనం. నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టినా జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కన్నెత్తి చూడకపోవడం దారుణం. ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినా స్పందించని తీరు చూస్తుంటే నగరంలో అధికార పక్షం కనుసన్నల్లోనే ‘రెడ్బుక్’ రాజ్యాంగం నడుస్తోందని అర్థమవుతోంది. జెండా తొలగించే వరకు మా పోరాటం ఆగదు. –కోరుకొండ వెంకటరత్న స్వాతి,మాజీ కార్పొరేటర్ -
పలు ప్రత్యేక రైళ్లు
తాటిచెట్లపాలెం: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దువ్వాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ అధికారులు తెలిపారు. ● ఎర్నాకుళం జంక్షన్–ముజఫర్పూర్ (06085) వీక్లీ స్పెషల్ ఈ నెల 10, 17, 24 తేదీల్లో (ప్రతి శుక్రవారం) రాత్రి 9.30 గంటలకు ఎర్నాకుళం జంక్షన్లో బయల్దేరి మరుసటిరోజు రాత్రి 11.05 గంటలకు దువ్వాడ చేరుకొని అక్కడి నుంచి రాత్రి 11.07 గంటలకు బయల్దేరి నాల్గో రోజు ఉదయం 7.30 గంటలకు ముజఫర్పూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ముజఫర్పూర్–ఎర్నాకుళం జంక్షన్(06086) వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈనెల 13, 20, 27 తేదీల్లో (ప్రతి సోమవారం) రాత్రి 9.15 గంంటలకు ముజఫర్పూర్లో బయల్దేరి బుధవారం తెల్లవారు 2.40 గంటలకు దువ్వాడ చేరుకొని, అక్కడి నుంచి 2.42 గంటలకు బయల్దేరి గురువారం ఉదయం 10.45 గంటలకు ఎర్నాకుళం జంక్షన్ చేరుకుంటుంది. ● ఎంజీఆర్ చైన్నె సెంట్రల్–బరౌని (06039) వీక్లీ స్పెషల్ ఎంజీఆర్ చైన్నె సెంట్రల్లో ఈ నెల 12,19,26 తేదీల్లో (ప్రతి ఆదివారం) రాత్రి 11.50 గంటలకు బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2.50 గంటలకు దువ్వాడ చేరుకొని, అక్కడి నుంచి 2.52 గంటలకు బయల్దేరి మంగళవారం రాత్రి 8 గంటలకు బరౌని చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బరౌని–ఎంజీఆర్ చైన్నె సెంట్రల్ (06040) వీక్లీ స్పెషల్ ఈ నెల 15, 22, 29 తేదీల్లో (బుధవారం) రాత్రి 9 గంటలకు బయల్దేరి శుక్రవారాల్లో తెల్లవారు 2.32 గంటలకు దువ్వాడ చేరుకొని, అక్కడి నుంచి 2.35 గంటలకు బయల్దేరి అదే రోజు సాయంత్రం 6 గంటలకు ఎంజీఆర్ చైన్నె సెంట్రల్ చేరుకుంటుంది. -
వివాదాలు మానుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం
జోడుగుళ్లుపాలెంలో పదేళ్ల క్రితమే ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ముందు, కావాలనే బీజేపీ నాయకులు పార్టీ జెండాను ప్రతిష్టించడం కేవలం గొడవలు సృష్టించడానికే. వేరే చోట స్థలం ఉన్నప్పటికీ ఇక్కడే జెండా పాతి వైఎస్సార్సీపీ శ్రేణులతో పాటు స్థానిక ఆటో డ్రైవర్లను కూడా ఇబ్బందులకు గురిచేయడం సరికాదు. గొడవలతో ఏదో సాధిస్తామనుకోవడం బీజేపీ నేతల భ్రమ. తమ మొండి నిర్ణయాన్ని మార్చుకోకపోతే, ఆటో డ్రైవర్లను కలుపుకొని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతాం. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలను అడ్డుకుంటాం. –మొల్లి అప్పారావు, వైఎస్సార్సీపీ సమన్వయకర్త, తూర్పు నియోజవర్గం -
రేపటి నుంచి ఏయూలో మెగా కల్చరల్ ఫెస్ట్
మద్దిలపాలెం: ఏయూ శతాబ్ది మహోత్సవాల్లో భాగంగా ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు మెగా కల్చరల్ ఫెస్ట్–2026 నిర్వహించనున్నట్లు ఏయూ వీసీ ఆచార్య రాజశేఖర్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ మూ డు రోజుల పాటు ఏయూ క్యాంపస్ విద్యార్థులు, అనుబంధ కళాశాలల విద్యార్థులు పాల్గొనేలా ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో భారీ స్థాయిలో సాంస్కృతిక ఉత్సవంగా దీనిని నిర్వహిస్తామని చెప్పారు. కల్చరల్ ఫెస్ట్ చైర్మన్ ఆచార్య ఎన్.విజయ్మోహన్ మాట్లాడుతూ 6వ తేదీ ఉదయం 7 గంటలకు ఏయూ కన్వెన్షన్ సెంటర్ నుంచి రుషికొండ వరకు సైక్లింగ్తో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలిపారు. సాయంత్రం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ప్రధాన వేదికపై లైవ్ బ్యాండ్, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. 7వ తేదీ సాయంత్రం ప్రధాన వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రముఖ గాయని వాగ్దేవి సంగీత విభావరి, విదేశీ విద్యార్థుల నృత్యాలు ప్రదర్శిస్తారు. 8వ తేదీ ఉదయం 7 గంటలకు ఏయూ కన్వెన్షన్ సెంటర్ నుంచి వాక్థాన్ నిర్వహిస్తారు. విజేతలకు బహుమతులను ముఖ్య అతిథి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందజేస్తారు. -
జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు సందీప్
సబ్బవరం: మండలంలోని రావలమ్మపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి కర్రి సందీప్ జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకున్నాడు. ఈ నెల 9, 10 తేదీల్లో ఒడిశా రాజధాని భువనేశ్వర్లో నిర్వహించనున్న జాతీయ స్థాయి అండర్–14 రగ్బీ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు సందీప్ ఎంపికయ్యాడు. గ్రామీణ ప్రాంత పాఠశాల నుంచి జాతీయ స్థాయికి ఎంపికవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి. అరుణ కుమారి, వ్యాయామ ఉపాధ్యాయుడు కె. గోవిందరావు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సబ్బవరపు కృష్ణ, గ్రామ సర్పంచ్ సబ్బవరపు నారాయణమూర్తి, ఎంపీటీసీ సభ్యుడు చొక్కాకుల గోవింద్ సందీప్ను అభినందించారు. క్రీడల్లో క్రమశిక్షణతో రాణించి భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు ఈ సందర్భంగా ఆకాంక్షించారు. -
జైలు గోడల మధ్య లాభాల పంట
వీవింగ్ యూనిట్ బీరువాలు తయారుచేస్తున్న ఖైదీలు 200 మంది ఖైదీలు కార్మికులుగా.. సుమారు 200 మంది ఖైదీలు ఈ పరిశ్రమల్లో నిత్యం శ్రమిస్తున్నారు. వీరికి జైలు అధికారులు నిర్ణీత వేతనాలు చెల్లిస్తారు. వారు శిక్షా కాలం ముగిసి విడుదలయ్యే సమయంలో ఆ మొత్తాన్ని వారికి అందజేస్తారు, తద్వారా వారు బయటి ప్రపంచంలో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఈ నగదు ఎంతో తోడ్పడుతుంది. కారాగారంలోని క్రమశిక్షణతో కూడిన వాతావరణంలో అందరూ కలసిమెలసి పనిచేస్తూ ఆదాయం గడించడమే కాకుండా, వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంపొందించుకుంటున్నారు. జైలు అధికారులు తీసుకుంటున్న ఈ సంస్కరణలు ఖైదీల పరివర్తనకు, జైళ్ల శాఖ ఆర్థిక బలానికి ఎంతగానో దోహదపడుతున్నాయి. ఖైదీ కార్మికుల ‘నైపుణ్య’జైత్రయాత్రరూ.1.54 కోట్ల ఉత్పత్తులు రికార్డు స్థాయిలో స్టీల్ యూనిట్రూ. 95 లక్షల మేర ఉత్పత్తులు ఆరిలోవ: కేంద్ర కారాగారం కేవలం శిక్షా స్మృతిగానే కాకుండా, ఖైదీల జీవితాల్లో కొత్త వెలుగులు నింపే పారిశ్రామిక కేంద్రంగా మారుతోంది. ఇక్కడ నిర్వహిస్తున్న వివిధ రకాల పరిశ్రమలు ప్రస్తుతం లాభాల బాటలో పయనిస్తూ, కారాగార సంక్షేమ నిధికి భారీగా ఆదాయాన్ని సమకూర్చిపెడుతున్నాయి. శిక్ష అనుభవిస్తున్న ఖైదీలే ఇక్కడ కార్మికులుగా మారి, తమ నైపుణ్యంతో నాణ్యమైన వస్తువులను తయారు చేస్తున్నారు. జైళ్ల శాఖ వీరికి చేతినిండా పని కల్పించడమే కాకుండా, వారి ద్వారా వస్తున్న ఆదాయాన్ని తిరిగి వారి సంక్షేమం కోసమే వినియోగిస్తోంది. ఇక్కడి ఉత్పత్తులు బయట మార్కెట్లోని వస్తువులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండటం విశేషం. మొదటి స్థానంలో స్టీల్ యూనిట్ ఈ కారాగారంలో స్టీల్ పరికరాల తయారీ, బేకరీ, చేనేత (వీవింగ్), పాడి పరిశ్రమ, వ్యవసాయం వంటి విభిన్న యూనిట్లు విజయవంతంగా నడుస్తున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఈ పరిశ్రమల ద్వారా మొత్తం రూ. 1.54 కోట్ల విలువైన వస్తువులు ఉత్పత్తయ్యాయి. వీటిలో స్టీల్ యూనిట్ అత్యధికంగా రూ. 95 లక్షల విలువైన ఉత్పత్తులతో ప్రథమ స్థానంలో నిలిచింది. దీని ద్వారా జైలుకు రూ. 13 లక్షల నికర ఆదాయం లభించింది. అలాగే వీవింగ్ యూనిట్ ద్వారా రూ. 17 లక్షలు, డెయిరీ ద్వారా రూ. 22 లక్షలు, బేకరీ ద్వారా రూ. 14 లక్షలు, వ్యవసాయం ద్వారా రూ. 6.50 లక్షల విలువైన ఉత్పత్తులు వచ్చాయి. అయితే, గత ఏడాదితో (రూ. 1.71 కోట్లు) పోలిస్తే ఈసారి ఉత్పత్తిలో కొంత తగ్గుదల కనిపించినప్పటికీ, ప్రధాన పరిశ్రమలు మాత్రం నిలకడగా రాణిస్తున్నాయి. ఇక్కడ తయారయ్యే వస్తువులకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మంచి గిరాకీ ఉంది. స్టీల్ యూనిట్లో తయారయ్యే బీరువాలు, ఎస్–టైపు కుర్చీలు, ఆసుపత్రి పడకలు, పాఠశాల బెంచీలను వివిధ కార్యాలయాలు ముందుగానే బుక్ చేసుకుంటున్నాయి. అలాగే బుక్ బైండింగ్ యూనిట్కు కోర్టుల నుండి భారీగా ఆర్డర్లు వస్తున్నాయి. వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ పద్ధతిలో పండించే కూరగాయలు, మామిడి, కొబ్బరి ఉత్పత్తులను జైలు అవసరాలకు పోను మిగిలిన వాటిని ’సుధార్ కేంద్రం’ ద్వారా ప్రజలకు విక్రయిస్తున్నారు. పాడి పరిశ్రమలో మేలుజాతి ఆవులు, గేదెల ద్వారా వచ్చే పాలను ఖైదీల అవసరాలకు మరియు బేకరీ యూనిట్కు ఉపయోగిస్తున్నారు. బేకరీలో తయారయ్యే రొట్టెలు, బిస్కెట్లు, కేకులు ఖైదీల బంధువులతో పాటు నగరవాసులను కూడా ఆకట్టుకుంటున్నాయి. నిరంతరం ఉత్పత్తులు జరుగుతాయి విశాఖ కేంద్ర కారాగారంలోని పరిశ్రమల్లో నిరంతరాయంగా ఉత్పత్తులు జరుగుతున్నాయి. ఇక్కడ స్టీల్ యూనిట్తో పాటు పాడి, వ్యవసాయం, బేకరీ పరిశ్రమలు గణనీయమైన ఫలితాలను ఇస్తున్నాయి. వీటి ద్వారా ఖైదీలకు ఉపాధి కల్పించడమే కాకుండా, వారు పొందే వేతనాలు వారి కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయి. ఖైదీల నైపుణ్యాన్ని పెంపొందిస్తూ, వారిని సామాజిక బాధ్యతాయుతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దడమే మా ప్రధాన ఉద్దేశం. –ఎం.మహేష్బాబు, పర్యవేక్షణాధికారి, విశాఖ కేంద్ర కారాగారం -
ఉరితాళ్లతో వినూత్న నిరసన
11వ రోజుకు చేరుకున్న నైట్ ఫుడ్ కోర్ట్ వ్యాపారుల నిరసన బీచ్రోడ్డు: నగరంలోని సెంట్రల్ పార్క్ సమీపంలో ఉన్న నైట్ ఫుడ్ కోర్టును పునఃప్రారంభించాలంటూ వ్యాపారులు చేస్తున్న పోరాటం ఉధృతమవుతోంది. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట గాంధీ విగ్రహం వద్ద వారు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శనివారానికి 11వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఫుడ్ కోర్టు మహిళా వ్యాపారులు మెడకు ఉరితాళ్లు వేసుకుని తమ గోడును వెళ్లబోసుకుంటూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్లో వ్యాపారులు గత ఏడు నెలలుగా ఫుడ్ కోర్టు మూతపడటంతో తమ జీవనోపాధి దెబ్బతిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ముద్రా లోన్లు, పీఎం స్వానిధి పథకం కింద తీసుకున్న రుణాలను కట్టలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రస్తుతం ఆత్మహత్యలే శరణ్యమనే పరిస్థితికి చేరుకున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. దక్షిణ నియోజకవర్గంలో ఎంతో ఆదరణ పొందిన ఈ నైట్ ఫుడ్ కోర్టును తొలగించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించాలి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని సెంట్రల్ పార్క్ ఫుడ్ ట్రక్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. గతంలో మాదిరిగానే సెంట్రల్ పార్క్ వద్ద నైట్ ఫుడ్ కోర్టును నిర్వహించుకునేలా జీవీఎంసీ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు కె. శ్రీకాంత్, ఎం. ప్రసాద్, కార్యదర్శి ఎం. లలిత కుమారి, సభ్యులు దుంగ శ్రీను, బొగ్గు శ్యామ్, లక్ష్మి మరియు పెద్ద సంఖ్యలో బాధితులు పాల్గొన్నారు. నిరసన వ్యక్తం చేస్తున్న చిరు వ్యాపారులు -
కమలం కిరికిరి
ఆరిలోవ: నగరంలోని తొమ్మిదో వార్డు జోడుగుళ్లు పాలెం జంక్షన్ శనివారం సాయంత్రం రాజకీయ రణరంగాన్ని తలపించింది. కొద్ది రోజుల్లో జరగనున్న బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సుమారు పదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ముందే బీజేపీ నాయకులు పార్టీ జెండా దిమ్మను నిర్మించి, జెండాను ఆవిష్కరించడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఆటో స్టాండ్ స్థలంలో.. వైఎస్సార్ విగ్రహానికి అడ్డుగా ఈ నిర్మాణం చేపట్టడాన్ని వైఎస్సార్సీపీ శ్రేణులతో పాటు స్థానిక ఆటో డ్రైవర్లు అడ్డుకున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు జీవీఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే బీజేపీ నాయకులు ఆగమేఘాల మీద ఈ నిర్మాణం పూర్తి చేశారని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. సామాన్యులు చిన్న ఇల్లు కట్టుకుంటేనే హడావుడి చేసే టౌన్ ప్లానింగ్ అధికారులు, ఇంత బహిరంగంగా నిబంధనలు ఉల్లంఘిస్తుంటే కన్నెత్తి కూడా చూడకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేసినా ఏసీపీ స్థాయి అధికారులు కూడా స్పందించలేదని వారు మండిపడుతున్నారు. పోలీసుల భారీ మోహరింపు పరిస్థితి విషమించడంతో ద్వారకా, నార్త్ ఏసీపీలతో పాటు సుమారు వంద మందికి పైగా పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాల నాయకులను పోలీస్ స్టేషన్కు తరలించి చర్చలు జరిపినప్పటికీ, జెండాను తొలగించే ప్రసక్తే లేదని బీజేపీ నేతలు భీష్మించుకోవడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. జెండాను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు నేతృత్వంలో భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు ధర్నాకు దిగడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన స్థానికుల్లో నెలకొంది. -
అమరావతిలో ఈ రెండేళ్లు ఏమి చేశారు?: బొత్స సత్యనారాయణ
విశాఖపట్నం: ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే రాష్ట్రం ఎప్పుడో అభివృద్ధి చెందేదని శాననమండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రత్యేక హోదా గురించి ప్రశ్నిస్తే అది ముగిసిన అధ్యాయమని చెబుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని చంద్రబాబు కేంద్రాన్ని ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు.విశాఖపట్నంలో బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేకహోదా హామీ ఏమైంది? రెండేళ్లలో అమరావతిలో ఎంత అభివృద్ధి చేశారో చంద్రబాబు చెప్పాలి. అమరావతిలో అగ్నిప్రమాదం జరిగితే వైఎస్సార్సీపీకి ఏం సంబంధం? ఆ అగ్ని ప్రమాదం విషయం ఏమైంది? కూటమి అధికారంలోకి వచ్చాక అమరావతిలో ఏం చేశారో చెప్పాలి.రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం చేయాల్సిన పని చెయ్యడం లేదు. గిట్టుబాటు ధరలేక రైతులు, ఫీజు రీయింబర్స్మెంట్లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అమరావతి విషయంలో కాంక్రీట్ వేశామని ఫీలింగ్ ఇవ్వడానికి చంద్రబాబు తాపత్రయ పడ్డారు’ అని చెప్పారు.విభజన హామీలు ఏమయ్యాయి? మీడియా కూడా జరుగుతున్న అఘాయిత్యాలను పట్టించుకోకుండా అమరావతి అంశాన్నే చూపిస్తోందని బొత్స సత్యనారాయణ అన్నారు. ‘రాష్ట్రంలో మామిడి పండ్లను కూడా కల్తీ చేసే దుస్థితి నెలకొంది. ఆరోగ్య శ్రీని పూర్తిగా అటక ఎక్కించారు. తీర్మానం చేసి అమరావతి పర్మినెంట్ అనుకుంటున్నారు. నిర్మాణం పూర్తి చేస్తే అది పర్మినెంట్ అవుతుంది. రాష్ట్ర విభజన హామీల విషయంలో ఎందుకు మాట్లాడటం లేదు? ప్రత్యేక హోదా వస్తే 10 అమరావతిలు వస్తాయి. ముంబై వంటి నగరాలు కూడా వస్తాయి. ప్రత్యేక హోదా కోసం ఎందుకు మాట్లాడటం లేదు? మావిగన్ ప్రతిపాదనలో తప్పేముంది? మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇచ్చే క్వార్టర్స్ అయినా పూర్తి చేశారా? కరకట్ట రోడ్డు కూడా వెయ్యలేకపోయారు. అమరావతిలో ఈ రెండేళ్లు ఏమి చేశారు? అమరావతి నిర్మాణంలో ఎస్ఎఫ్టీకి రూ.14 వేలు ఎందుకు? ఎవ్వరికైనా ఇదే అనుమానం వస్తుంది.. జగన్ కూడా అదే అడిగారు. ఈ రెండేళ్లలో అమరావతిపై ఎంత ఖర్చు చేశారు? ఎంత పని చేశారు? ఎంత పేమెంట్ ఇచ్చారు? బకాయిలు ఎంత పెట్టారు? ఆ వివరాలను బట్టి ఎన్ని సంవత్సరాల్లో అమరావతి పూర్తి అవుతుందో చెప్తాం. గిరి గీసుకొని అమరావతి మాత్రమే అభివృద్ధి చెయ్యాలని అనుకోని చేస్తున్నారు. మళ్లీ జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా బిల్లు పెట్టించాలి. ప్రభుత్వం మీదే కదా? ప్రత్యేక హోదా బిల్లు పెట్టిస్తే.. చంద్రబాబుని మెచ్చుకుంటాం’ అని బొత్స సత్యనారాయణ అన్నారు. -
మర్యాదగా ఇచ్చేయండి.. లేదంటే పోలీసులకు అప్పగిస్తాం..!
విశాఖపట్టణం: ‘మీరు స్వామివారి దర్శనానికి వచ్చి ఆయన ఉంగరాన్నే దొంగిలిస్తారా? మర్యాదగా ఇచ్చేయండి.. లేదంటే పోలీసులకు అప్పగిస్తాం’ అంటూ అర్చకులు గద్దిస్తుంటే, భక్తులు బిత్తరపోయారు. నిష్కల్మషమైన భక్తితో కొండెక్కిన తమను ‘దొంగలు’ అనడమేమిటి? పైగా చేతులకు తాళ్లు కట్టి బంధించడమేమిటి? అని ఆవేదనతో కన్నీటి పర్యంతమయ్యారు. కానీ, అదంతా ’దొంగ–పోలీస్’ ఆటలా సాగే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఘట్టమని తెలిసి చివరకు ఆనంద డోలికల్లో మునిగిపోయారు. View this post on Instagram A post shared by Shyam Cherry (@simhachalamupdates)అసలేం జరిగింది? సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం ‘వినోదోత్సవం’ కనువిందుగా జరిగింది. గురువారం రాత్రి జరిగిన మృగయోత్సవంలో (వేట ఉత్సవం) స్వామివారి ఉంగరం పోయిందని, అది భక్తులే తీశారని అర్చకులు సరదాగా నిలదీసే ఘట్టమే ఈ ఉత్సవ విశేషం. బంధీలుగా వీఐపీలు.. సామాన్యులు రాజగోపురం వద్ద స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామి ఏడు పరదాల చాటున వేంజేసి ఉండగా.. ప్రధానార్చకులు కరి సీతారామాచార్యులు స్వామివారి దూతగా మారి.. చేతిలో కర్ర, తాడు పట్టుకుని భక్తులను బంధించి తీసుకువచ్చారు. గాజువాకకు చెందిన వ్యాపారవేత్త సాగర్, ఇంజనీరింగ్ విద్యార్ధి ప్రణతి, విశాఖకు చెందిన ఫిజియోథెరపిస్టు రేషి్మ, విజయనగరానికి చెందిన ఆమె సోదరి భార్గవి, ఒడిశాలోని జాజ్పూర్కి చెందిన ప్రభుత్వ వైద్య విద్యార్థులు, శ్రీహరిపురానికి చెందిన భరత్, హేమ, తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు కుమారుడు సిద్ధార్థ, కోడలు నిత్య, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, జర్నలిస్టుల సంఘం జాతీయ కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, పలువురు నూతన దంపతులతోపాటు దేవస్థానం ఈవో జె.వెంకటరావు దంపతులను కూడా వదలకుండా తాళ్లతో బంధించి స్థానాచార్యుల ముందు ప్రవేశపెట్టారు. సీసీ కెమెరా సాక్ష్యం ఉంది.. ఇచ్చేయండి స్థానాచార్యులు రాజగోపాల్ భక్తులను ప్రశ్నించిన తీరు అత్యంత సహజంగా సాగింది. ‘మీరు దొంగతనం చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో ఉన్నాయి’ అని ఆయన గర్జించడంతో భక్తులు హడలిపోయారు. భక్తుల చేతికి ఉన్న ఉంగరాలు చూపిస్తూ.. ‘ఇదే స్వామివారి ఉంగరం’ అని అర్చకులు నిలదీయడంతో చాలామంది భక్తులు ఆవేశంతో, మరికొందరు బాధతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ట్విస్ట్ ఏమిటంటే: అందరినీ బంధించిన ప్రధానార్చకుడిని, అందరినీ ప్రశ్నించిన స్థానాచార్యుడిని, ఏఈవోలను కూడా చివర్లో తాళ్లతో బంధించడం ఈ ఉత్సవంలో హైలైట్గా నిలిచింది. పరదా వెనుక దొరికిన ‘నిజమైన’ దొంగ భక్తుల విచారణ ముగిసిన తర్వాత, స్వామివారి పల్లకీకి ఉన్న ఏడు పరదాలను ఒక్కొక్కటిగా తొలగించారు. ఆశ్చర్యంగా ఆఖరి పరదా చాటునే స్వామివారి ఉంగరం లభ్యమైంది. అంటే దొంగ మరెవరో కాదు.. ఆ స్వామివారే అని తేలడంతో భక్తులంతా ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయారు. తమను దొంగలుగా పట్టుకోవడం కూడా ఆ నృసింహుడి లీలగా భావించి భక్తులు పులకించిపోయారు. -
సంక్షోభంలోనూ సడలని ఉక్కు సంకల్పం
● పడిలేచిన కెరటంలా.. విశాఖ సిటీ : సవాళ్లు ఎదురైనప్పుడే అసలైన సత్తా బయటపడుతుంది. విశాఖ స్టీల్ప్లాంట్ విషయంలో ఇది అక్షరాలా నిజమైంది. ఒకవైపు ప్రైవేటీకరణ నీడలు, మరోవైపు నిధుల కొరత, ఇంకోవైపు ఉద్యోగులపై వీఆర్ఎస్ ఒత్తిళ్లు.. ఇన్ని ప్రతికూలతల మధ్య విశాఖ స్టీల్ ప్లాంట్ ‘పడిలేచిన కెరటం’లా విస్మయకర రీతిలో పుంజుకుంది. నష్టాల సాకుతో పరిశ్రమను ప్రైవేటుకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్న వేళ, తన సామర్థ్యాన్ని గణాంకాలతో సహా నిరూపించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి నుంచి విక్రయాల వరకు ఉహకందని వృద్ధిని నమోదు చేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను సంస్థ ఆదాయం, ఉత్పత్తి గణాంకాలు సరికొత్త మైలురాళ్లను అధిగమించాయి. కష్టాలు చుట్టుముట్టినా.. గత కొన్నేళ్లుగా విశాఖ స్టీల్ ప్లాంట్ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. నిధుల కొరత వల్ల ముడిసరుకు సేకరణ భారంగా మారింది. దీనికి తోడు ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఉద్యోగుల్లో మానసిక ఆందోళన కలిగించింది. నష్టాల పేరుతో ప్లాంట్ సామర్థ్యాన్ని తగ్గించే ప్రయత్నాలు జరిగినా, అక్కడి కార్మికులు మాత్రం తమ సంకల్పాన్ని వదలలేదు. తక్కువ వనరులతోనే ఎక్కువ ఉత్పత్తిని సాధిస్తూ సత్తా చాటుకుంటున్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకుని అమ్మకాల్లో దూసుకుపోయారు. ఉత్పత్తిలో అజేయమైన వృద్ధి విశాఖ స్టీల్ ప్లాంట్ మునుపెన్నడూ లేని విధంగా ఉత్పత్తిలో గణనీయమైన వృద్దిని నమోదు చేసింది. ఒకవైపు వనరుల లేమితో సతమవుతున్నప్పటికీ.. 52 శాతం వృద్ధిని సాధించింది. గతేడాది హాట్ మెటల్ ఉత్పత్తి 3.91 మిలియన్ టన్నుల నుంచి 5.95 మిలియన్ టన్నులకు పెరిగింది. అలాగే లిక్విడ్ స్టీల్ ఉత్పత్తిలో కూడా భారీ పురోగతి కనిపిస్తోంది. గత ఏడాది 3.75 మిలియన్ టన్నుల ఉత్పత్తి కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో అది 5.69 మిలియన్ టన్నులకు చేరుకుంది. క్రూడ్ స్టీల్ ఉత్పత్తి కూడా 51 శాతం వృద్ధిని నమోదు చేయడం ప్లాంట్ పనితీరుకు నిదర్శనం. ఆదాయ ప్రవాహం.. పెరిగిన అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో విశాఖ స్టీల్ ప్లాంట్ టర్నోవర్ రూ.22,311 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఏడాది రూ.18,288 కోట్లుగా ఉంది. అంటే కేవలం ఏడాది కాలంలోనే ఆదాయం 22 శాతం మేర పెరగడం విశేషం. కేవలం ఆదాయం మాత్రమే కాకుండా, అమ్మకాల పరిమాణంలో కూడా 27 శాతం వృద్ధి కనిపించింది. గత ఏడాది 3.49 మిలియన్ టన్నుల అమ్మకాలు జరగ్గా.. ఈసారి అది 4.42 మిలియన్ టన్నులకు పెరిగింది. ఇది సంస్థ మార్కెట్ విస్తరణను స్పష్టం చేస్తోంది. ప్రైవేటీకరణ వాదనకు ఇదే సమాధానం విశాఖ స్టీల్ తన ఉత్పత్తుల నాణ్యతను పెంచడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. దేశీయంగా మౌలిక సదుపాయాల కల్పన పెరగడం వల్ల ఉక్కుకు డిమాండ్ పెరిగింది. ఈ అవకాశాన్ని విశాఖ స్టీల్ అందిపుచ్చుకుని సరఫరాను వేగవంతం చేసింది. దీనివల్ల సంస్థ లాభదాయకత కూడా మెరుగుపడింది. ఈ రికార్డు వెనుక ప్లాంట్ వ్యూహాత్మక నిర్వహణ కీలక పాత్ర పోషించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాలను సాధించాలని ఆర్ఐఎన్ఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత రికార్డులు స్టీల్ప్లాంట్ ప్రాముఖ్యతను మరోసారి చాటిచెప్పాయి. నష్టాల పేరుతో ప్రైవేటీకరణ నిర్ణయం తప్పని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి. ప్లాంట్కు సొంత గనులు కేటాయిస్తే.. ఇది దేశంలోనే అత్యంత లాభదాయకమైన సంస్థగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ నమోదు చేసిన వృద్ధి వివరాలు విభాగం గత ఏడాది ప్రస్తుత ఏడాది వృద్ధి శాతం వార్షిక టర్నోవర్ రూ.18,288 కోట్లు రూ.22,311 కోట్లు 22 శాతం హాట్మెటల్ ఉత్పత్తి 3.91 మి.ట 5.95 మి.ట 52 శాతం లిక్విడ్ స్టీల్ ఉత్పత్తి 3.75 మి.ట 5.69 మి.ట 51.7 శాతం అమ్మకాల పరిమాణం 3.49 మి.ట 4.42 మి.ట 27 శాతం -
విశాఖ వేదికగా నౌకాదళ గర్జన
ఐఎన్ఎస్ తారాగిరి, అరిధామన్లను జాతికి అంకితం చేసిన రక్షణ మంత్రి మహారాణిపేట: విశాఖలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన సందర్భంగా భారత నౌకాదళానికి చెందిన కీలక ప్రాజెక్టులు ముందుకు సాగాయి. ప్రాజెక్ట్–17ఏలో భాగమైన అత్యాధునిక యుద్ధనౌక ఐఎన్ఎస్ తారాగిరిని జాతికి అంకితం చేశారు. 75 శాతం పైగా స్వదేశీ సాంకేతికతతో నిర్మితమైన ఈ నౌక దేశ సముద్ర భద్రతను బలోపేతం చేయడంలో కీలకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. అదే సమయంలో అత్యంత రహస్యంగా విశాఖ షిప్బిల్డింగ్ సెంటర్లో అణు శక్తితో నడిచే జలాంతర్గామి అరిధామన్ను కూడా నౌకాదళానికి సమర్పించారు. అరిహంత్ శ్రేణిలో మూడో ఈ సబ్మైరెన్ సుమారు 7,000 టన్నుల సామర్థ్యంతో, 80 శాతం స్వదేశీ సాంకేతికతతో నిర్మితమై, కే–4 క్షిపణులను మోసుకెళ్లగలదు. దీని ద్వారా భారతదేశం తన ‘న్యూక్లియర్ ట్రయాడ్’ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది. పర్యటనలో భాగంగా ఐఎన్ఎస్ డేగా వద్ద కేంద్ర మంత్రికి కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిషోర్, సీపీ శంఖబ్రత బాగ్చి, కోస్ట్గార్డ్, నేవీ అధికారులు స్వాగతం పలికారు. -
నగరాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యం
అల్లిపురం: విశాఖ నగరాన్ని ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్, జీవీఎంసీ ప్రత్యేక అధికారి అభిషిక్త్ కిషోర్ అన్నారు. శుక్రవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ కేతన్ గార్గ్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం, మొదటిసారి జీవీఎంసీ ప్రత్యేక అధికారి హోదాలో విచ్చేసిన ఆయనకు కమిషనర్, అదనపు కమిషనర్లు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తు తం అంతర్జాతీయ స్థాయిలో విశాఖ నగరంపై చర్చ జరుగుతోందని, అందరి దృష్టి ఈ నగరంపైనే కేంద్రీకృతమై ఉందని పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా యంత్రాంగం ప్రణాళికలతో పనిచేయాలని సూచించారు. రోడ్లు, కాలువలు, భూగర్భ మురుగునీటి వ్యవ స్థ, పార్కులు, గ్రీన్ బెల్టులు, అన్న క్యాంటీన్ల నిర్వహణ వంటి అంశాలను అధికారులు వివరించారు. వార్డు సిబ్బంది తీరుపై హెచ్చరిక జీవీఎంసీ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టేలా సిబ్బంది పనితీరు ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వార్డు సెక్రటేరియట్ సిబ్బందిపై వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని, బాధ్యతారాహిత్యంగా ఉండేవారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. నగరాభివృద్ధికి అవసరమైన ఆదాయ పరిపుష్టిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అనంతరం కమిషనర్ కేతన్ గార్గ్.. జీవీఎంసీలోని వివిధ విభాగాల ఉన్నతాధికారులను, వారి విధులను ప్రత్యేక అధికారికి పరిచయం చేశారు. కలెక్టర్ అందించిన కీలక సూచనలు ● స్వచ్ఛ సర్వేక్షణ్లో నగరాన్ని మొదటి ర్యాంకుకు, 7–స్టార్ రేటింగ్కు తీసుకెళ్లేలా కృషి చేయాలి. ● జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీ ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేసి, ప్రజల ఇంటి వద్దకే సేవలు అందేలా చూడాలి. ● వేసవి దృష్ట్యా సీఎస్ఆర్ నిధులతో చలివేంద్రాలు ఏర్పాటు చేసి, తాగునీటితో పాటు మజ్జిగ, ఓఆర్ఎస్ అందించాలి. ● భోగాపురం విమానాశ్రయం ప్రారంభమయ్యే నాటికి సంబంధిత రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలి. భూ సమస్యలు ఉంటే జేసీతో చర్చించి పరిష్కరించుకోవాలి. ● నగరంలో మురుగు నిల్వ లేకుండా చూడాలి. క్లాప్ వాహనాల నిర్వహణ, కాపులుప్పాడ డంపింగ్ యార్డ్లో కంపోస్ట్ తయారీ, ’స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమాలపై శ్రద్ధ వహించాలి. సమావేశంలో జీవీఎంసీ అదనపు కమిషనర్లు డి.వి.రమణమూర్తి, ఎస్.ఎస్.వర్మ, పి.నల్లనయ్య, జాయింట్ డైరెక్టర్ అమృత్ విజయభారతి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
బాబు మెప్పుకోసమే గంటా అనుచిత వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, చంద్రబాబు మెప్పు కోసం, వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసమే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తీవ్రంగా విమర్శించారు. అమరావతిని రాజధానిగా చేయడాన్ని వైఎస్సార్సీపీ వ్యతిరేకించడం లేదని, అయితే అమరావతి పేరిట జరుగుతున్న అవినీతికి మాత్రమే వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తానని ప్రకటించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గంటా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇక్కడి ప్రజల ఓట్లతో రాజకీయంగా ఎదిగిన గంటా శ్రీనివాసరావు, అదే విశాఖను రాజధానిగా సమర్థించకుండా అమరావతి వైపు మొగ్గు చూపడం ప్రజల విశ్వాసానికి మోసం చేసినట్టేనని విమర్శించారు. ఇది ప్రజల ప్రయోజనాల కోసం కాకుండా, కేవలం చంద్రబాబు, లోకేష్ మెప్పుకోసం చేసిన వ్యాఖ్యలేనని ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖను రాజధానిగా ప్రకటించినప్పుడు స్వాగతిస్తున్నామని చెప్పి, ఇప్పుడు అమరావతిని సమర్థించడం ఆయన రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. ప్రజాధనాన్ని కాపాడుతూ రాష్ట్రాన్ని సమానంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా వికేంద్రీకరణకు ప్రాధాన్యం ఇచ్చారన్నారు. అలాంటి నాయకుడిపై విమర్శలు చేయడం అంటే ప్రజల అభివృద్ధి ఆశయాలపై దాడి చేసినట్టేనని మండిపడ్డారు. గంటా శ్రీనివాసరావు వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని విశాఖ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేకే రాజు డిమాండ్ చేశారు. -
రూ.12 కోట్ల విలువైన గెడ్డవాగులో మళ్లీ పనులు
తగరపువలస : మండలంలోని గొల్లల తాళ్లవలస సర్వే నంబర్ 162లో గల గెడ్డవాగు భూములపై ఆక్రమణదారుల కన్ను పడింది. సుమారు రూ.12 కోట్ల విలువైన 1.20 ఎకరాల వాగు భూమిలో శుక్రవారం గుడ్ ఫ్రైడే సెలవు దినాన్ని అదనుగా చేసుకుని ఆక్రమణదారులు మళ్లీ నిర్మాణ పనులు ప్రారంభించడం స్థానికంగా కలకలం రేపింది. ‘గెడ్డవాగులో.. ఆక్రమణల గెద్దలు’ శీర్షికతో గత నెల 30న సాక్షిలో కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రెవెన్యూ అధికారులు స్పందించి పనులను నిలిపివేసినప్పటికీ, ఇప్పుడు మళ్లీ సెలవు రోజుల్లో దొంగచాటుగా పనులు కొనసాగిస్తున్నారు. వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ రోడ్డు విస్తరణలో ఇళ్లు, పాఠశాల కోల్పోయిన లబ్ధిదారులకు ప్రత్యామ్నాయంగా ఈ గెడ్డవాగులో తాత్కాలిక నిర్మాణాలకు రెవెన్యూ అధికారులు అనుమతులు ఇవ్వడం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమైంది. తాత్కాలికం పేరుతో ఇక్కడ ఏకంగా భారీ భవనాలు నిర్మిస్తుండటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జలవనరుల భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని గతంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చినప్పటికీ, రెవెన్యూ అధికారులు స్థానిక టీడీపీ నాయకులతో కుమ్మకై ్క పదేపదే ఈ అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితుల నుంచి కొందరు నాయకులు లక్షలాది రూపాయలు వసూలు చేశారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. గత ఎన్నికల సమయంలోనూ ఈ స్థలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి పోలీసులు పలువురిని అరెస్ట్ చేసిన సంఘటనలు ఉన్నాయి. పంచాయతీలో ఇతర బంజరు భూములు అందుబాటులో ఉన్నప్పటికీ, కావాలని వాగు భూములను కేటాయించడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని స్థానికులు భావిస్తున్నారు. తక్షణమే కలెక్టర్ స్పందించి గెడ్డవాగులో ఆక్రమణలను అడ్డుకోవాలని, అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి బాధితులకు ఇతర ప్రాంతాల్లో శాశ్వత స్థలాలు కేటాయించాలని తాళ్లవలస వాసులు డిమాండ్ చేస్తున్నారు. ‘గెడ్డవాగులో.. మళ్లీ వాలిపోయిన ఆక్రమణల గెద్దలు’ -
కలెక్షన్ల కలకలం
హెడ్ నర్సుల పోస్టింగ్ల్లోసీఎంవోకు ఫిర్యాదు 13న కమిటీ విచారణ మహారాణిపేట: వైద్య ఆరోగ్యశాఖలో ఇటీవల జరిగిన హెడ్ నర్సుల పదోన్నతులు, పోస్టింగ్ల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ప్రక్రియలో భారీగా అక్రమాలు జరిగాయని, పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ రాధారాణి ఆధ్వర్యంలో ఇటీవల హెడ్ నర్సులకు పదోన్నతులు కల్పించి, పలు ఆస్పత్రుల్లో పోస్టింగ్లు జారీ చేశారు. అయితే ఈ పదోన్నతులు, పోస్టింగ్ల వెనుక లక్షలాది రూపాయల అవినీతి జరిగిందని విశాఖ సిటిజెన్ ఫోరం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బీవీకే బాబ్జీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పదోన్నతులు పొందిన పలువురు నర్సుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారని ఆయన తన లేఖలో ఆరోపించారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి అందిన ఈ ఫిర్యాదుపై స్పందించిన ఉన్నతాధికారులు, దీనిపై సమగ్ర విచారణ జరపాల్సిందిగా కలెక్టర్ను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ ఆ ఫిర్యాదును కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణికి పంపించారు. అయితే హెడ్ నర్సుల పదోన్నతుల వ్యవహారం తన పరిధిలోకి రాకపోవడంతో.. సూపరింటెండెంట్ ఆ లేఖను తిరిగి వైద్య ఆరోగ్యశాఖ రీజినల్ డైరెక్టర్కు బదిలీ చేశారు. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు.. వైద్య ఆరోగ్యశాఖ రీజినల్ ట్రైనింగ్ సెంటర్ (మేల్) ప్రిన్సిపాల్ డాక్టర్ మీనాక్షిని విచారణ అధికారిగా నియమించారు. ఈ నెల 13న ఈ వ్యవహారంపై డాక్టర్ మీనాక్షి పూర్తి స్థాయిలో విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. ఆ ముగ్గురే కీలకం.. ముఖ్యమంత్రికి అందిన ఫిర్యాదులో ఏపీ ప్రభుత్వ నర్సుల సంఘం నాయకులపై తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. నర్సుల సంఘం జిల్లా అధ్యక్షురాలు గంగాభవాని, కార్యదర్శి వరలక్ష్మి, ఈసీ సభ్యురాలు గౌరి.. పదోన్నతి పొందిన మొత్తం 30 మంది నర్సుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సదరు 30 మంది నర్సులతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ముగ్గురు నాయకురాళ్లను కూడా విచారణ అధికారి ప్రత్యేకంగా ప్రశ్నించనున్నారు. అంతేకాకుండా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు తమ రోజువారీ విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదని కూడా ఫిర్యాదులో ఆరోపించారు. వీరికి కేటాయించిన వార్డుల్లో డ్యూటీలు చేయకుండా, నిత్యం క్లాక్ రూమ్లోనే ఉంటూ అక్కడి నుంచే సెటిల్మెంట్లు చేస్తున్నారని విమర్శించారు. నర్సింగ్ సూపరింటెండెంట్ అండదండలతోనే.. మిగతా నర్సులందరికీ ఎప్పటికప్పుడు డ్యూటీలు మారుస్తున్నప్పటికీ, వీరు మాత్రం ఏళ్ల తరబడి ఒకే వార్డులో తిష్టవేశారని ఫిర్యాదులో ఆక్షేపించారు. నర్సింగ్ సూపరింటెండెంట్ పద్మావతి అండదండలతోనే వీరు ఇలా రెచ్చిపోతున్నారని, ఎవరికై నా తమకు అనుకూలమైన డ్యూటీలు లేదా మంచి పోస్టింగ్లు కావాలంటే వీరిని కలిసి అడిగినంత ఇచ్చుకుంటే.. పద్మావతిని మేనేజ్ చేసి డ్యూటీలు వేయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కాగా ఈ ఆరోపణలపై ఏపీ ప్రభుత్వ నర్సుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గంగాభవాని, వరలక్ష్మి స్పందిస్తూ.. తమకు సంబంధిత అధికారుల నుంచి ఇంకా ఎలాంటి నోటీసులు రాలేదని, విచారణ అధికారి కోరితే అన్ని వివరాలు అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. -
పట్టుదలకు ప్రతిరూపం లలిత శ్రీ.. ప్రతిభకు నిదర్శనం బిందు
పెదగంట్యాడ: గాజువాక ప్రాంతానికి చెందిన ఇద్దరు మహిళా న్యాయవాదులు జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికై సరికొత్త చరిత్ర సృష్టించారు. పట్టుదల ఉంటే ఏ వయసులోనైనా విజయం సాధించవచ్చని ధర్మాల లలిత శ్రీ నిరూపించగా, యువ న్యాయవాది కొట్టాన బిందు తొలి అడుగుల్లోనే అత్యున్నత శిఖరాన్ని అధిరోహించారు. వివాహమైన 15 ఏళ్ల తర్వాత జడ్జిగా లలిత శ్రీ ధర్మాల లలిత శ్రీ ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం. వివాహమైన 15 ఏళ్ల తర్వాత ఆమె ఉన్నత చదువులపై దృష్టి సారించారు. ముందుగా పీజీ పూర్తి చేసి, ఆపై ఎల్ఎల్బీ పట్టా పొందారు. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే సివిల్ జడ్జి పరీక్షలకు సిద్ధమయ్యారు. కేవలం రెండో ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై తన కలని సాకారం చేసుకున్నారు. తొలి అడుగులోనే విజయం సాధించిన బిందు : జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ సీనియర్ న్యాయవాది ఎం. శాంతి కుమార్తె కొట్టాన బిందు కూడా జడ్జిగా ఎంపికయ్యారు. సబ్బవరంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ పూర్తి చేసిన ఈమె, సీనియర్ న్యాయవాది వెన్నెల ఈశ్వరరావు వద్ద జూనియర్ లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. వృత్తిలో రాణిస్తూనే జూనియర్ సివిల్ జడ్జిగా విజయం సాధించారు. గాజువాక బార్ అసోసియేషన్ నుంచి ఒకేసారి ఇద్దరు మహిళలు న్యాయమూర్తులుగా ఎంపిక కావడంపై బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు యశోధర వేదమణి హర్షం వ్యక్తం చేశారు. జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపిక -
‘గురుకులం’ ఇలా ఉండటం నాకే సిగ్గుచేటు
ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సింహాచలం : అడవివరంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాల దుస్థితిపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, విద్యార్థులను ఎలుకలు కరిచిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాఠశాలలోని డార్మెటరీలు, టాయిలెట్లు దారుణంగా ఉన్నాయని, కనీసం వ్యాక్సిన్లు భద్రపరుచుకోవడానికి ఫ్రిజ్ కూడా లేకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఎన్టీఆర్ ప్రారంభించిన ఈ ప్రతిష్టాత్మక సంస్థలో అసంపూర్తి భవనాలు, అపరిశుభ్రత ఉండటం తన నియోజకవర్గానికే అవమానకరమన్నారు. ఈ సమస్యలను ఇప్పటికే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లానని, త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఆయన, వసతులు మెరుగుపరిచి ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పి.వి. నరసింహం, ప్రిన్సిపాల్ పురుషోది తదితరులు పాల్గొన్నారు. -
వంగవీటి రంగ స్ఫూర్తితోనే ముందుకు..
గోపాలపట్నం: స్థానిక కుమారి కల్యాణ మండపంలో శుక్రవారం రాధా రంగ మిత్ర మండలి ఆత్మీయ సమావేశం అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నాయకులు తొలుత వంగవీటి మోహన రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వంగవీటి రంగ కేవలం ఒక వ్యక్తి కాదని, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అని కొనియాడారు. కష్టాల్లో ఉన్నవారికి కొండంత అండగా నిలిచి, వారి సమస్యలను పరిష్కరించడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారని గుర్తు చేసుకున్నారు. అటువంటి గొప్ప నాయకుడితో కలిసి పనిచేయడం, ఆయన అడుగుజాడల్లో నడవటం తమకు దక్కిన అదృష్టంగా అభివర్ణించారు. రంగ నేటికీ ప్రతి ఒక్కరి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ప్రశంసించారు. అనంతరం రాధా రంగ మిత్ర మండలి నూతన కమిటీని అధికారికంగా ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా గేదెల మురళీ కృష్ణ నియామకం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ఇది జిల్లాలో సంస్థ బలోపేతానికి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి దవళ మోహన్తో పాటు ఇతర కమిటీ సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు.కార్యక్రమంలో ఉత్తరాంధ్ర కన్వీనర్ కుంచె దత్తాత్రేయ, బెహరా భాస్కరరావు, వివిధ జిల్లాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రంగా అభిమానులు పాల్గొన్నారు. -
మౌనిక హత్య కేసుపై జ్యూడిషియల్ విచారణ జరపాలి
కంచరపాలెం: గాజువాకలో గత నెల 29న దారుణ హత్యకు గురైన దళిత మహిళ పోలిపల్లి మౌనిక ఘటనపై ఉన్నత స్థాయి జ్యూడిషియల్ విచారణ జరపాలని పలు ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం తాటిచెట్లపాలెం సంజీవయ్య కాలనీ–1లో మహిళా, దళిత సంఘాలు, స్థానిక కాలనీ యూత్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మి మాట్లాడుతూ.. మౌనికను అత్యంత కర్కశంగా హతమార్చిన నేవీ ఉద్యోగి రవీంద్ర పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోందని మండిపడ్డారు. నిందితుడికి నేర చరిత్ర లేదని, మృతదేహాన్ని ఏం చేయాలో పాలుపోక లొంగిపోయాడని పోలీసులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఒకవైపు నిందితుడు కిటికీలోంచి వెళ్లి తలుపు తీశాడని చెబుతూనే, మరోవైపు పరస్పర విరుద్ధమైన స్టేట్మెంట్లు ఇవ్వడం వెనుక అసలు నిజాన్ని దాచే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. మృతురాలు దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడమే ఈ నిర్లక్ష్యానికి కారణమని నేతలు ధ్వజమెత్తారు. పోలీసుల దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, వాస్తవాలు వెలుగులోకి రావాలంటే తక్షణమే జ్యూడిషియల్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా నాయకురాలు అనురాధ, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ప్రతినిధి బేగం, సీఎమ్మెస్ నేత లలిత, చింతాడ సూర్యం, న్యాయవాదులు గిరిధర్, పద్మ, దళిత సంఘాల నాయకులు కొత్తపల్లి వెంకటరమణ, పీవోడబ్ల్యూ ప్రతినిధులు, స్థానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.మహిళ, దళిత ప్రజాసంఘాల నేతల డిమాండ్ -
ఐఐఎం విశాఖకు అంతర్జాతీయ గుర్తింపు
తగరపువలస: ఆనందపురం మండలం గంభీరం గల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్–విశాఖపట్నం(ఐఐఎంవీ)కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. యునైటెడ్ కింగ్డమ్ కేంద్రంగా పనిచేసే బిజినెస్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ నుంచి ఐదేళ్ల కాలానికి గాను ఐఐఎంవీ అక్రిడిటేషన్ను దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాపార విద్యలో నాణ్యత, సామాజిక ప్రభావాన్ని గుర్తించే ఈ అక్రిడిటేషన్ను పొందిన దేశంలోని అతికొద్ది సంస్థల్లో ఐఐఎంవీ ఒకటిగా నిలవడం విశేషం. ఈ సందర్భంగా ఐఐఎంవీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం.చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఈ గుర్తింపు అంతర్జాతీయ ప్రమాణాల పట్ల తమకున్న నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. నాణ్యమైన విద్య, బాధ్యతాయుతమైన నిర్వహణ, నిరంతర అభివృద్ధి అనేవి తమ సంస్థ మూల విలువలని, ఈ అక్రిడిటేషన్ వాటిని మరింత ప్రతిబింబిస్తోందన్నారు. ఈ గుర్తింపుతో గ్లోబల్ స్థాయిలో ఐఐఎంవీ ప్రతిష్ట మరింత పెరుగుతుందని, తద్వారా విదేశీ భాగస్వామ్యాలు, విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలు, అంతర్జాతీయ పరిశోధనలకు కొత్త అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఏయూలో దోపిడే
మా బిడ్డల భ విష్యత్ ?విశాఖ సిటీ : ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయం నిలువు దోపిడీకి నిలయంగా మారుతోంది. చదువుల తల్లి ఒడిలో క్రమశిక్షణ నేర్పాల్సిన గురువులే.. వసూళ్ల బాట పట్టారు. కంప్యూటర్ సైన్స్ విభాగం వేదికగా సాగుతున్న ఈ ‘వసూళ్ల పర్వం’ ఇప్పుడు యూనివర్సిటీ ప్రతిష్టను బజారున పడేస్తోంది. ‘డిపార్ట్మెంట్ డే’ పేరుతో విద్యార్థుల జేబులకు చిల్లు పెడుతున్న వైనం అటు అకాడమిక్ వర్గాల్లో, ఇటు తల్లిదండ్రుల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ‘డిపార్ట్మెంట్ డే’ పేరుతో వడ్డన! ఈ నెల 4వ తేదీన డిపార్ట్మెంట్ డే నిర్వహించాలని ఏయూ సైన్స్ విభాగం ప్రొఫెసర్లు నిర్ణయించారు. ఈ కార్యక్రమం నిర్వహణకు మొదటి సంవత్సరం విద్యార్థులకు రూ.1600, రెండో సంవత్సరం విద్యార్థులకు రూ.1400, మూడో సంవత్సరం చదువుతున్న వారికి రూ.1300 చొప్పున టారిఫ్ ఖరారు చేసినట్లు సమాచారం. సుమారు 2800 మంది విద్యార్థులు ఉన్న ఈ విభాగంలో ఈ ఒక్క కార్యక్రమం ద్వారానే రూ.20 లక్షలకు పైగా సేకరించినట్లు తెలుస్తోంది. నెల రోజుల కిందే రూ.9.5 లక్షలు వసూలు నిజానికి ఇలాంటి వసూళ్లు ఈ విభాగానికి కొత్తేమీ కాదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా నెల రోజుల క్రితమే ‘ఎథ్నిక్ డే’ పేరుతో ప్రతి విద్యార్థి నుంచి రూ.1000 చొప్పున వసూలు చేశారు. అలా సేకరించిన సుమారు రూ.9.5 లక్షల మొత్తానికి ఇప్పటివరకు సరైన లెక్కలు చూపలేదని సమాచారం. విశ్వవిద్యాలయ నిబంధనల ప్రకారం ఎలాంటి వసూళ్లు చేసినా అధికారిక రసీదులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అవేవీ లేకుండానే రూ.లక్షలు చేతులు మారుతుండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. బెదిరింపులతో బలవంతపు వసూళ్లు డబ్బులు చెల్లించలేమని మొరపెట్టుకుంటున్న పేద విద్యార్థులపై కొందరు అధ్యాపకులు కర్కశంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ‘డబ్బులు కట్టకపోతే ఇంటర్నల్ మార్కుల్లో ఫెయిల్ చేస్తాం’ అంటూ బహిరంగంగానే హెచ్చరిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. గత ఐదు రోజులుగా క్లాసుల వద్ద నిలబడి, డబ్బులు కట్టని వారి జాబితాలు పట్టుకుని ఒత్తిడి తెస్తున్నారనే అంశం యూనివర్సిటీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రొఫెసర్ స్థాయి వారు ఇలా వసూళ్లకు దిగడం ఇంజనీరింగ్ కళాశాల చరిత్రలో ఇదే తొలిసారి అని చర్చించుకుంటున్నారు. తల్లిదండ్రుల ఆందోళన ఈ పరిణామాలు విద్యా ప్రమాణాలపై ప్రభావం చూపుతాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పగలు తరగతులు సక్రమంగా జరగడం లేదని, రాత్రివేళల్లో ఈవెంట్ల పేరుతో ఆలస్యంగా విద్యార్థులను ఇళ్లకు పంపుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. దీనివల్ల విద్యార్థుల భద్రతతో పాటు క్రమశిక్షణ కూడా దెబ్బతింటోందని వాపోతున్నారు. చదువుకోవాల్సిన సమయంలో విద్యార్థులను ఇలాంటి ఈవెంట్ల నిర్వహణకు, వసూళ్లకు వాడుకోవడం విచారకరమని మేధావులు అభిప్రాయపడుతున్నారు. వీసీ గారూ.. చర్యలేవి? వర్సిటీ గౌరవాన్ని గంగలో కలుపుతున్న ఇలాంటి చర్యలపై వీసీ తక్షణమే దృష్టి సారించాలి. కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ వి.వల్లికుమారి ఈ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఉన్నత స్థాయి విచారణ జరిపించి, విద్యార్థుల నుంచి వసూలు చేసిన సొమ్మును తిరిగి ఇప్పించాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోతే, భవిష్యత్తులో ఈ సంస్కృతి ఇతర విభాగాలకు కూడా పాకే ప్రమాదం ఉంది. కొండా రాజీవ్గాంధీ, రాష్ట్ర అధికార ప్రతినిధి, వైఎస్సార్సీపీ పరిశోధకులపైనా పంజా కేవలం యూజీ, పీజీ విద్యార్థులే కాకుండా, పీహెచ్డీ చేస్తున్న పరిశోధక విద్యార్థులు కూడా ఈ వసూళ్ల బాధితులుగా మారారు. ప్రీ–టాక్ పరీక్షల సమయంలో ‘స్నాక్స్ ఏర్పాట్లు’ చేయాలంటూ ఒక్కో పరిశోధకుని నుంచి రూ.10 వేలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన పీహెచ్డీ వైవా వోస్ పరీక్షల్లోనూ ఇదే పద్ధతిని అనుసరించినట్లు సమాచారం. గైడ్ల ఒత్తిడికి తలొగ్గి, తమ డిగ్రీల కోసం అప్పులు చేసి మరీ ఈ మొత్తాలను ముట్టజెబుతున్నామని పరిశోధకులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
సమస్యలకు త్వరితగతిన పరిష్కారం
మహారాణిపేట: జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఎం.అభిషిక్త్ కిశోర్ గురువారం కలెక్టరేట్లోని పలు విభాగాలను సందర్శించారు. ప్రతి సెక్షన్కు వెళ్లి రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరును పరిశీలించారు. 24/7 కంట్రోల్ రూమ్ను సందర్శించి, ప్రజల నుంచి వచ్చే ఫోన్ల వివరాలు, ఫిర్యాదుల నమోదు ప్రక్రియపై ఆరా తీశారు. ఆర్డీవో కార్యాలయాన్ని సందర్శించిన ఆయన, ప్రజలకు సులభంగా కనిపించేలా బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం డీఎస్వో కార్యాలయం, కొత్తగా నిర్మిస్తున్న హడ్కో భవనాన్ని, స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్కు వచ్చిన వృద్ధులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీదారులను ఎక్కువ సేపు నిరీక్షించకుండా, త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అందరూ బాధ్యతగా వ్యవహరించి, ఉత్తమ పనితీరు కనబరచాలని సూచించారు. ఆయన వెంట జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, ఇన్చార్జి ఆర్డీవో శేషశైలజ, కలెక్టరేట్ ఏవో బీవీ రాణి తదితరులు ఉన్నారు. కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ -
గీతం ఎంటెక్ విద్యార్థి ఆత్మహత్య
ప్రాజెక్టు విఫలమైందని మనస్తాపం బీచ్రోడ్డు: తాను రూపొందించిన ప్రాజెక్టు విఫలమైందన్న మనస్తాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మూడో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నగరంలోని సీబీఎం కాంపౌండ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న తరుణ్ శ్రీసాయి కిరణ్ రెడ్డి (23) గీతం డీమ్డ్ విశ్వ విద్యాలయంలో ఎంటెక్ చదువుతున్నాడు. తాను ఎంతో కష్టపడి రూపొందించిన ప్రాజెక్ట్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో కిరణ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంట్లోని ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెరుగైన భవిష్యత్తు ఉన్న విద్యార్థి ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
ఏడు నెలలైనా పట్టించుకోరా..
బీచ్రోడ్డు : ప్రభుత్వ చర్యలతో ఏడు నెలల క్రితం రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తూ ఫుడ్ కోర్ట్ వ్యాపారులు గురువారం ‘వంటా–వార్పు’ నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి నిరసనలో పాల్గొని నడిరోడ్డుపై కూర్చొని భోజనం చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సెంట్రల్ పార్క్ ఫుడ్ ట్రక్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన చిరు వ్యాపారుల రిలే నిరాహార దీక్షలు గురువారానికి తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కె.శ్రీకాంత్ మాట్లాడుతూ గత ఏడాది సెప్టెంబర్ 19న మహిళా కళాశాల ఎదురుగా ఉన్న నైట్ ఫుడ్ కోర్టును జీవీఎంసీ అధికారులు తొలగించడంతో తమతో పాటు అనేక మంది స్ట్రీట్ వెండర్ల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఇప్పటికే ముగ్గురు ఫుడ్ కోర్ట్ వ్యాపారులు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవీఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు జోనల్ కమిషనర్ ఫుడ్ కోర్టును తిరిగి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా, నెలలు గడిచినా అమలు కాలేదని విమర్శించారు. తొలగించిన షాపులను యథాస్థానంలోనే తిరిగి ఏర్పాటు చేసి తమకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో అసోసియేషన్ మరో అధ్యక్షుడు ఎం. ప్రసాద్, కార్యదర్శి ఎం. లలిత కుమారి, సభ్యులు దుంగ శ్రీను, బొగ్గు శ్యామ్, లక్ష్మి తదితరులు, పెద్ద సంఖ్యలో ఫుడ్ కోర్ట్ వ్యాపారులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. -
రైల్వే స్టేషన్లో భద్రత కట్టుదిట్టం
అల్లిపురం: విశాఖ రైల్వే స్టేషన్ ద్వారా జరుగుతున్న గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టడంతో పాటు స్టేషన్ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశించారు. గురువారం తన చాంబర్లో ఆర్పీఎఫ్, జీఆర్పీ, నగర పోలీస్ ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. నగరంలోని రైల్వే ఆస్తుల వద్ద భద్రతా చర్యలు, గంజాయి అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. స్టేషన్ పరిసరాల్లో దొంగతనాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా పోలీసు గస్తీని పటిష్టం చేయాలని సూచించారు. స్టేషన్ ప్రవేశ మార్గాల వద్ద అత్యాధునిక స్కానింగ్ మిషన్ల ఏర్పాటు, సీసీ టీవీ కెమెరాల పెంపు, తగినంత వెలుతురు ఉండేలా లైటింగ్ వ్యవస్థను మెరుగుపరచడం వంటి అంశాలపై కార్యాచరణ రూపొందించారు. అలాగే స్టేషన్ పరిసరాల్లో అపరిశుభ్రంగా ఉన్న పొదలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీసీపీలు, ఆర్పీఎఫ్, జీఆర్పీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆర్పీఎఫ్, జీఆర్పీ అధికారులతో సీపీ సమీక్ష -
కై లాసగిరి పర్యాటకులకు వీఎంఆర్డీఏ షాక్
ఆరిలోవ: ప్రముఖ పర్యాటక కేంద్రమైన కై లాసగిరిని సందర్శించే పర్యాటకులకు వీఎంఆర్డీఏ ఊహించని షాక్ ఇచ్చింది. ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా, కనీస సమాచారం ఇవ్వకుండానే పర్యాటకులపై చంద్రబాబు ప్రభుత్వం అదనపు టికెట్ల భారాన్ని మోపింది. గురువారం నుంచే ఈ కొత్త నిబంధనలు అమలులోకి రావడంతో సందర్శకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. ఇప్పటివరకు కై లాసగిరి టోల్ ప్లాజా వద్ద కేవలం వాహనాలకు మాత్రమే నిర్ణీత రుసుం వసూలు చేసేవారు. నడిచి వెళ్లే వారికి మాత్రమే రూ.10 టికెట్ ఉండేది. కానీ, గురువారం నుంచి వాహనాల టికెట్తో పాటు అందులో ప్రయాణించే ప్రతి ఒక్కరూ తలా రూ.10 అదనంగా చెల్లించాలని సిబ్బంది పట్టుబట్టారు. ఈ మార్పు తెలియని పర్యాటకులు పాత పద్ధతిలోనే వాహనం టికెట్ తీసి వెళ్లబోగా, లోపల ఉన్న ప్రయాణికులకు కూడా విడివిడిగా టికెట్లు తీసుకోవాలని సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో టోల్ ప్లాజా వద్ద పర్యాటకులు, సిబ్బంది మధ్య వాగ్వాదం చోటుచేసుకుని, గందరగోళం నెలకొంది. అదనపు భారం ఇలా.. : నిన్నటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం.. ద్విచక్ర వాహనాలకు రూ.20, నాలుగు సీట్ల కార్లకు రూ.50, ఏడు సీట్ల కార్లకు రూ.70 చొప్పున టోల్ రుసుం ఉండేది. అలాగే టాటా మ్యాజిక్ వాహనాలకు రూ.70, మినీ బస్సులకు రూ.150, పెద్ద బస్సులకు రూ.300 వసూలు చేసేవారు. అయితే కొత్త విధానం ప్రకారం ఈ వాహన ధరలతో సంబంధం లేకుండా, అందులో ఎంతమంది ప్రయాణిస్తే అంతమందికీ తలా రూ.10 చొప్పున అదనంగా టికెట్ తీసుకోవాల్సిందే. ఉదాహరణకు, బైక్పై ఇద్దరు వెళ్తే బైక్ టికెట్ రూ.20తో పాటు మరో రూ.20 అదనంగా చెల్లించాలి. అలాగే 40 మంది ప్రయాణికులతో వచ్చే బస్సు గతంలో రూ.300 చెల్లిస్తే సరిపోయేది, కానీ ఇప్పుడు బస్సు టికెట్తో పాటు మరో రూ.400 కలిపి మొత్తం రూ.700 చెల్లించాల్సి వస్తోంది. ముందస్తు ప్రకటనలు లేకుండా ఇలా అదనపు వసూళ్లకు దిగడం దారుణమని, వెంటనే ఈ విధానాన్ని రద్దు చేయాలని పర్యాటకులు డిమాండ్ చేస్తున్నారు. కొందరు వాహనదారులు ఆగ్రహంతో సిబ్బందిని తోసుకుంటూ పైకి వెళ్లిపోగా, మరికొందరు నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. వీఎంఆర్డీఏ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. -
ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్
మహారాణిపేట: రాష్ట్రంలో నిరుపేదల ప్రాణాలకు రక్షణగా నిలిచే ఆరోగ్యశ్రీ సేవలకు గురువారం కూడా తీవ్ర అంతరాయం కలిగింది. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి రావాల్సిన వందల కోట్ల రూపాయల బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో, బుధవారం నుంచే పలు నెట్వర్కు ఆస్పత్రులు వైద్య సేవలను నిలిపివేశాయి. ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ (ఆషా) పిలుపు మేరకు కార్పొరేట్, నెట్వర్కు ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. పేదల ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటం చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకంపై మొదటి నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రులకు చెల్లించాల్సిన భారీ బకాయిలను పెండింగ్లో పెట్టడంతోనే ఈ దుస్థితి దాపురించింది. ఎన్నికల ముందు సంక్షేమ పథకాలను అద్భుతంగా అమలు చేస్తామని హామీలిచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు నిధుల కొరత సాకుతో ఉన్న పథకాలను నీరుగారుస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్.. ఆరోగ్యశ్రీ.. ఆరోగ్యశ్రీ అనగానే పేదలకు గుర్తుకు వచ్చే పేరు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి. ఈ పథకం లక్షలాది మందికి కార్పొరేట్ స్థాయి చికిత్సను అందించింది. అనంతరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ పథకాన్ని మరింత విస్తరించి 3,257 వ్యాధులకు చికిత్సను అందుబాటులోకి తెచ్చారు. క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు కూడా ఉచిత వైద్యం అందిస్తూ, ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకు బీమా వర్తించేలా చేశారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఆ సేవలు నీలి నీడల కింద చిక్కుకున్నాయి. విశాఖలో నిలిచిన సేవలు.. జిల్లావ్యాప్తంగా పలు నెట్వర్క్ ఆస్పత్రుల్లో సమ్మె రెండో రోజుకు చేరుకుంది. విశాఖలోని కేర్ ఆస్పత్రి, వీఆర్ఐడీఏ, ఇండస్, జీజే ఆస్పత్రుల్లో వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఓపీ, ఐపీ సేవలతో పాటు ముందుగా నిర్ణయించిన శస్త్రచికిత్సలను కూడా ఆపేయడంతో పేద రోగులు దిక్కుతోచని స్థితిలో ఇంటి ముఖం పడుతున్నారు. కేవలం ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి మాత్రమే అత్యవసర సేవలు అందిస్తున్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం, జర్నలిస్టుల ఆరోగ్య సేవలకు కూడా బకాయిల సెగ తగిలింది. దీనిపై జిల్లా ఆరోగ్య సమన్వయకర్త డాక్టర్ అప్పారావు మాట్లాడుతూ.. నెట్వర్కు ఆస్పత్రుల సమ్మె దృష్ట్యా రోగులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రోగులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తమను సంప్రదించాలని ఆయన కోరారు. -
ప్పం ట్టాల్సిందే..!
తట్టెడు మట్టికీ సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : తట్టెడు మట్టికీ తలవంచాల్సిందే.. పిక్కెడు రాయికీ పిండుకోవాల్సిందే.. ఉమ్మడి విశాఖ జిల్లాలో ’రాయల్టీ’ పేరిట ఏఎంఆర్ సంస్థ సాగిస్తున్న అక్రమ వసూళ్లు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. సొంత పొలంలో మట్టి తీసినా, సొంత ఇంటికి రాయి తెచ్చినా.. ఎక్కడ చిన్న ఇసుక కుప్ప కనిపించినా.. ప్రైవేటు సంస్థ ప్రతినిధులు స్కానర్లు పట్టుకుని వాలిపోతున్నారు. లోడును బట్టి వందల రూపాయల నుంచి వేల రూపాయల వరకూ వసూలు చేస్తున్నారు. మైనింగ్ శాఖ అండతో గ్రామగ్రామాన చెక్పోస్టులు పెట్టి సాగిస్తున్న ఈ ’దోపిడీ’ పర్వంపై జనాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. చెక్పోస్టులు.. ఫ్లైయింగ్ స్క్వాడ్ల దందా వాస్తవానికి గతంలో రాయల్టీ వసూలు బాధ్యతను మైనింగ్ శాఖే నిర్వహించేది. అయితే, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బాధ్యతను జిల్లాల వారీగా ప్రైవేట్ కంపెనీలకు అప్పగించారు. ఇందుకోసం మైనింగ్ శాఖ టెండర్లను ఆహ్వానించగా.. విశాఖ జిల్లాలో ఈ టెండర్ను ఏఎంఆర్ సంస్థ దక్కించుకుంది. టెండర్ పొందినప్పటి నుంచి సంస్థ ఎక్కడికక్కడ చెక్పోస్టులను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక వాహనాలతో ఫ్లైయింగ్ స్క్వాడ్ పేరుతో గ్రామాల్లో తిరుగుతోంది. ఎక్కడైనా చిన్న ట్రాక్టర్లో మట్టి కనిపించినా, ఎర్రపిక్క కనిపించినా రాయల్టీ చెల్లించాల్సిందేనంటూ ఒత్తిడి తెస్తోంది. తమ సొంత పొలంలో నుంచి మట్టిని తీసుకెళుతున్నా ఎందుకు డబ్బులు ఇవ్వాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇక వసూలు చేసే మొత్తాన్ని స్కానర్ ద్వారా సేకరిస్తున్నప్పటికీ, ఆ వివరాలను మైనింగ్ శాఖకు క్రమం తప్పకుండా సమర్పిస్తున్నారా లేదా అన్నది స్పష్టంగా తెలియడం లేదనే విమర్శలు ఉన్నాయి. వసూలైన డబ్బులు కంపెనీ ఖాతాలోకే వెళుతున్నాయా, లేక సొంత ఖాతాలకు మళ్లుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా, వసూలు చేస్తున్న రాయల్టీకి సరైన బిల్లులు ఇస్తున్నారా అనే అంశాన్ని కూడా మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మీద మైనింగ్ శాఖ మౌనంతో ఏఎంఆర్ సంస్థ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాయల్టీ పేరుతో ఏఎంఆర్ రుబాబు ఇంటి నిర్మాణం కోసం పిక్కకు రొక్కం లెక్క ఉమ్మడి జిల్లాలో ఇష్టారాజ్యంగా చెక్పోస్టుల ఏర్పాటు ఫ్లైయింగ్ స్క్వాడ్లతో గ్రామాల్లో వేట ట్రాక్టర్ కనిపిస్తే స్కానర్ ఓపెన్ రూ.వందల నుంచి రూ.వేల వరకూ వసూళ్లు సొంత పొలం మట్టికీ రాయల్టీ తప్పదా..? మైనింగ్శాఖ మౌనంతో విమర్శలకు తావు రాయల్టీ వసూలు పేరుతో.. రాయల్టీ వసూలు బాధ్యతను దక్కించుకున్న ఏఎంఆర్ సంస్థ ఎక్కడికక్కడ చెక్పోస్టులను ఏర్పాటు చేసుకుంది. చెక్పోస్టుల వద్ద ప్రత్యేకంగా సిబ్బందిని నియమించింది. అక్కడ పనిచేసే సిబ్బంది క్వారీల నుంచి వచ్చే వాహనాల లోడ్ను గమనిస్తూ, అదనపు లోడు ఉంటే అదనపు రాయల్టీని ముక్కుపిండి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ‘ఫ్లైయింగ్ స్క్వాడ్’ పేరుతో జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ, ఎక్కడైనా ఇంటి అవసరాల కోసం మట్టిని తరలిస్తున్నా రాయల్టీ చెల్లించాల్సిందేనంటూ వాలిపోతున్నారు. ఇంటి నిర్మాణం కోసం కొద్దిపాటి పిక్క తీసుకున్నా వందల్లో రాయల్టీ చెల్లించాలంటూ ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక రైతులు తమ సొంత పొలంలో నుంచి మట్టిని తవ్వుకుని ఇంటి నిర్మాణం కోసం తరలిస్తున్నా అక్కడికక్కడే సిబ్బంది చేరుతున్నారు. రాయల్టీ కట్టాల్సిందేనంటూ చెబుతూ, ఎంత మొత్తం చెల్లించాలనే విషయాన్ని స్కానర్ ద్వారా చూపించి వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ ‘మాకు సంబంధం లేదు’ అంటూ తప్పుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
సముద్ర తీరాన సరికొత్త చరిత్ర
విశాఖ సిటీ : విశాఖ పోర్టు అథారిటీ సరికొత్త రికార్డు లిఖించింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణాలో చరిత్ర సృష్టించింది. 91.17 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీ) సరుకును చేరవేసి, దేశంలోని ప్రధాన ఓడరేవుల్లో తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. 2024–25లో 82.62 ఎంఎంటీ సరుకు రవాణా నమోదు కాగా.. ఈసారి ఏకంగా 10.35 శాతం వృద్ధిని సాధించడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా రవాణా రంగంలో సవాళ్లు ఎదురవుతున్నా.. విశాఖ పోర్టు తన పట్టును మరోసారి చాటుకుంది. ముఖ్యంగా చమురు, ఇనుప ఖనిజం, ఎరువుల రవాణాలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. పెట్రోలియం ఉత్పత్తుల రవాణాలో 13 శాతం, ఇనుప ఖనిజంలో 15 శాతం వృద్ధిని సాధించింది. ఎరువుల దిగుమతులు ఏకంగా 42 శాతం పెరగడం ఈ అద్భుత విజయానికి ప్రధాన కారణమైంది. సమర్థతే విజయరహస్యం ఈ ఘనత వెనుక పోర్టు యంత్రాంగం అనుసరించిన ఆధునిక పద్ధతులు ఉన్నాయి. నౌకలు ఓడరేవుకు వచ్చినప్పుడు అవి వేచి ఉండే సమయాన్ని గణనీయంగా తగ్గించారు. బెర్త్ల నిర్వహణలో వేగం పెరగడం వల్ల నౌకల కదలికలు సులభతరం అయ్యాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే 24 నౌకల కదలికలను విజయవంతంగా నిర్వహించి పోర్టు తన ఆపరేషనల్ సామర్థ్యాన్ని నిరూపించుకుంది. ఒకే రోజులో 5,50,198 మెట్రిక్ టన్నుల సరుకును హ్యాండిల్ చేసి సరికొత్త రికార్డును సృష్టించింది. పోర్టులోని 32 బెర్త్లలో 28 బెర్త్లను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం వల్ల ఆదాయం కూడా మెరుగుపడింది. అత్యాధునిక మౌలిక వసతులు విశాఖ పోర్టు కేవలం సముద్ర మార్గంలోనే కాకుండా, భూమార్గంలో కూడా పటిష్టమైన అనుసంధానాన్ని కలిగి ఉంది. 176 కిలోమీటర్ల మేర విస్తరించిన సొంత రైల్వే నెట్వర్క్, 40కి పైగా సైడింగ్లు సరుకును వేగంగా తరలించేందుకు దోహదపడుతున్నాయి. 2 లక్షల టన్నుల బరువున్న కేప్సైజ్ నౌకలు కూడా సులభంగా బెర్త్లకు వచ్చేలా 16 నుండి 21 మీటర్ల లోతును నిర్వహించడం విశాఖ పోర్టు ప్రత్యేకం. అడ్వాన్స్డ్ నావిగేషన్ వ్యవస్థలైన వీటీఎంఎస్, ఏఐఎస్ ద్వారా నౌకల భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మూలపేటపై వీపీఏ ఆసక్తి మూలపేట పోర్టును నిర్వహించేందుకు విశాఖ పోర్ట్ అథారిటీ ఆసక్తిగా ఉంది. ముఖ్యంగా విశాఖ నగరంలో కాలుష్యాన్ని తగ్గించే క్రమంలో, ధూళి వెలువడే బొగ్గు వంటి సరుకు రవాణాను భవిష్యత్తులో మూలపేట పోర్టుకు మళ్లించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనికి తోడు దుగ్గరాజపట్నం పోర్టు, షిప్బిల్డింగ్ యూనిట్ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రయోజన సంస్థ (ఎస్పీవీ)ను ఏర్పాటు చేయడం ఒక కీలక పరిణామం. అత్యాధునిక ‘జెమినీ ఆపరేషన్స్’ ద్వారా భారీ యంత్రాలను సైతం సునాయాసంగా రవాణా చేసే వెసులుబాటు ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఎస్పీఎం ద్వారా తొలిసారి క్రూడ్ ఆయిల్ లోడింగ్ చేపట్టడం పోర్ట్ సాంకేతిక ప్రగతికి అద్దం పడుతోంది. 100 ఎంఎంటీ భవిష్యత్ లక్ష్యం పోర్టు చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు ఈ విజయాన్ని సిబ్బంది, స్టేక్హోల్డర్ల సమిష్టి కృషిగా అభివర్ణించారు. గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్ లక్ష్యం 100 ఎంఎంటీలను అధిగమించడమేనని స్పష్టం చేశారు. కేవలం పరిమాణం మాత్రమే కాకుండా, పర్యావరణ హితమైన రవాణాకు పెద్దపీట వేస్తున్నట్లు ప్రకటించారు. -
పల్లెల్లో ‘ప్రత్యేక’ పాలన
మహారాణిపేట: జిల్లాలోని గ్రామ పంచాయతీల పాలకవర్గాల గడువు గురువారంతో ముగిసింది. దీంతో గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. ఈ నెల 2వ తేదీతో సర్పంచుల పదవీ కాలం పూర్తి కావడంతో, గురువారం రోజే పంచాయతీల్లో ప్రత్యేక అధికారులు బాధ్యతలు స్వీకరించారు. రేఖవానిపాలెం మినహా.. జిల్లాలో మొత్తం 79 గ్రామ పంచాయతీలు ఉండగా, అందులో భీమిలి మండలం రేఖవానిపాలెం మినహా మిగిలిన 78 పంచాయతీల గడువు ముగిసింది. రేఖవానిపాలెం పాలకవర్గానికి ఇంకా ఏడాది కాలం గడువు ఉండటంతో అక్కడ పాత పాలనే కొనసాగనుంది. గడువు ముగిసిన వాటిలో ఆనందపురం మండలంలో 26, పద్మనాభంలో 22, పెందుర్తిలో 15, భీమిలిలో 16 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే 78 పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. బాధ్యతల్లో గెజిటెడ్ అధికారులు తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంఈవోలు, పీఆర్ఈడీలు ఇతర శాఖల గెజిటెడ్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ గత కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం నుంచి ఈ ప్రత్యేక అధికారుల పాలన పూర్తిస్థాయిలో అమలులోకి రానుంది. కాగా.. పదవీ కాలం ముగియడంతో జిల్లాలోని 78 మంది సర్పంచులు గురువారం నుంచి మాజీలయ్యారు. అప్పటివరకు గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన సర్పంచులు, వార్డు సభ్యులు తమ పదవుల నుంచి తప్పుకున్నారు. ఇకపై పంచాయతీల నిర్వహణ, అభివృద్ధి పనుల పర్యవేక్షణ అంతా ప్రత్యేక అధికారుల చేతుల్లోనే ఉండనుంది. -
సింహగిరిపై రంగుల కేళి
సింహాచలం: సింహగిరి గురువారం రంగులమయమైంది. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా 6వ రోజైన గురువారం ఉదయం చూర్ణోత్సవం, వసంతోత్సవం, చక్రస్నానం వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. తొలుత స్వామివారి ఉత్సవమూర్తులైన గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలతో పాటు చక్రపెరుమాళ్లు, ఆళ్వారులను కల్యాణ మండపానికి వేంచేపు చేశారు. అనంతరం విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం నిర్వహించి, పసుపు కొమ్ములను దంచుతూ కొట్నాల సేవను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. వసంతాలను ఉత్సవమూర్తుల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఆ వసంతాలతో అర్చకులు వేదమంత్రోచ్చారణలు, నాదస్వర వాయిద్యాల మధ్య ఆలయ బేడ ప్రదక్షిణ చేశారు. అంతరాలయంలోని స్వామివారి మూలవిరాట్టుకు, ఆలయంలో కొలువుదీరిన ఇతర దేవతా మూర్తులకు వసంతాలను సమర్పించారు.అనంతరం ఆ వసంతాలను అర్చకులు భక్తులపై చల్లగా.. సిబ్బంది, భక్తులు ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ సందడి చేశారు. తర్వాత ఉత్సవమూర్తులను ఒక పల్లకీ లో, చక్రపెరుమాళ్లు, ఆళ్వారులను మరొక పల్లకీలో ఉంచి గంగధార వద్దకు తిరువీధిగా తీసుకెళ్లారు. అక్కడ గంగధార జలాలు, పంచామృతాలతో పంచ కలశ స్నపనాన్ని విశేషంగా నిర్వహించారు. అనంతరం చక్రస్నాన కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. చక్రపెరుమాళ్లను గంగధార నీటి ప్రవాహం వద్ద ఉంచి, ఆ జలాలు భక్తులపై పడేలా చేశారు. ఈ సందర్భంగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం ఉత్సవమూర్తులను అలంకరించి ఆలయంలోకి తీసుకెళ్లారు. అంతకుముందు యాగశాలలో పూర్ణా హుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈవో జె.వెంకటరావు దంపతులు ఉత్సవంలో పాల్గొనగా, ఏఈవో తిరుమలేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అప్పన్న ఉంగరం చోరీ: గురువారం రాత్రి మృగయోత్సవం(దొంగలదోపు) వేడుకను వైభవంగా నిర్వహించారు. పురాణ గాథ ప్రకారం.. భాగవతోత్తములకు తదియారాధన చేయడం కోసం దొంగగా మారిన నీలుడు(తిరుమంగై ఆళ్వార్), అటవీ మార్గంలో విహారయాత్రకు వెళ్తున్న స్వామి వారిని, అమ్మవార్లను అడ్డగించి దోచుకునే ఘట్టాన్ని అర్చకులు రక్తికట్టించారు. అనంతరం నీలుడి భక్తికి మెచ్చిన స్వామి వారు, అతనికి ఆళ్వారుగా మోక్షం ప్రసాదించారు. ఈ ఉత్సవంలో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని అశ్వవాహనంపై, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను పల్లకీలో ఉంచి మాడ వీధుల్లో తిరువీధి నిర్వహించారు. ఈ దారి దోపిడీ క్రమంలో స్వామి ఉంగరం పోవడంతో, ఆగ్రహించిన అమ్మవారు ఆయనను ఆలయంలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. పోయిన ఉంగరాన్ని వెతుక్కునే వినోదోత్సవం వేడుకను ఏడో రోజైన శుక్రవారం ఉదయం ఆసక్తికరంగా నిర్వహించనున్నారు. -
సమస్యల తిష్ట
గురుకులంలోసింహాచలం: ఒకప్పుడు ఆ పాఠశాల రాష్ట్రానికే తలమానికం. అక్కడ చదివిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు కొట్టారు.. ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కానీ నేడు అదే అడవివరంలోని మహాత్మా జ్యోతీబాపూలే ఏపీ బీసీ బాలుర సంక్షేమ గురుకుల పాఠశాల సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. 1200 మంది విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు శిథిలావస్థకు చేరిన భవనాలు, భయం నీడన కొట్టుమిట్టాడుతోంది. డార్మెటరీల ‘దుస్థితి’ పాఠశాలలో వసతి సౌకర్యాలు అధ్వానంగా మారాయి. 5, 7 తరగతుల విద్యార్థులు ఉండాల్సిన ‘గోదావరి’ డార్మెటరీ నాలుగేళ్ల క్రితమే ప్రమాదకరంగా మారి మూతపడింది. దీనికి ప్రత్యామ్నాయం చూపకపోవడంతో, చిన్నారులు తాము చదువుకునే క్లాస్ రూముల్లోనే బెంచీల మధ్యే నిద్రించాల్సిన దయనీయ స్థితి నెలకొంది. మరోవైపు, 8, 9 తరగతుల విద్యార్థులు ఉంటున్న ‘కృష్ణా’ డార్మెటరీ పరిస్థితి వర్ణనాతీతం. పైకప్పు పెచ్చులు ఊడి తలల మీద పడుతున్నాయి. ఎప్పుడు కూలుతుందో తెలియని భవనంలో విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. వణుకు పుట్టిస్తున్న ఎలుకల బెడద చదువుకోవాల్సిన విద్యార్థులు ఇప్పుడు ఎలుకలతో ‘యుద్ధం’ చేస్తున్నారు. కృష్ణా డార్మెటరీలో ఎలుకల బెడద ఎంతలా ఉందంటే.. గత నెలలో పది మందిని, ఈ నెల ఒకటో తేదీన మరికొంతమంది విద్యార్థులను కరిచాయి. రక్తం ఓడుతున్న గాయాలతో చిన్నారులు ఆస్పత్రులకు పరుగులు తీయడం చూస్తుంటే ఇక్కడ పర్యవేక్షణ ఎంత ‘ఘనం’గా ఉందో అర్థమవుతోంది. రాత్రి వేళల్లో విద్యార్థులు భయంతో నిద్రపోలేని పరిస్థితి నెలకొంది. మధ్యలోనే ఆగిపోయిన నిర్మాణాలు పాఠశాల ఆవరణలో కొత్తగా నిర్మిస్తున్న భారీ డార్మెటరీ భవనం, ఉపాధ్యాయుల క్వార్టర్స్ పనులు కూడా మధ్యలోనే ఆగిపోయాయి. ఈ నిర్మాణాలు పూర్తయితే సమస్యలు కొంతవరకు తగ్గే అవకాశం ఉన్నాం పనులు నిలిచిపోవడంతో విద్యార్థుల కష్టాలు మరింత పెరిగాయి. ఆహారంపై కూడా అసంతృప్తి ఈ ఏడాది జనవరి 5న రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ చింతా విజయప్రతాపరెడ్డి పాఠశాలను సందర్శించినప్పుడు విద్యార్థులు తమ గోడును స్వయంగా వెల్లడించారు. మాంసాహారం సరిపడా ఇవ్వడం లేదని, వంటలు రుచికరంగా లేవని వారు ఫిర్యాదు చేశారు. వైద్య సదుపాయాల్లో లోపాలు పాఠశాలలో డాక్టర్, స్టాఫ్ నర్స్ ఉన్నప్పటికీ, అవసరమైన మందులు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. ఫ్రిజ్ పాడవడంతో మందులు నిల్వ చేయలేకపోతున్నారు. దీంతో విద్యార్థులను ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించాల్సి వస్తోంది. స్పందించకుంటే భవిష్యత్తు ప్రశ్నార్థకం ప్రభుత్వం తక్షణమే స్పందించి కొత్త డార్మెటరీల నిర్మాణాన్ని పూర్తి చేయడం, శిథిల భవనాలను తొలగించడం, పరిశుభ్రత, ఆహార నాణ్యత మెరుగుపరచడం, వైద్య సదుపాయాలను బలోపేతం చేయడం వంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతేం ఈ గురుకులంలో చదువుతున్న వందలాది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. కిటికీ, తలుపు పరిస్థితి ఇదీ -
ట్రాన్స్జెండర్ల ఉపాధికి పోలీసుల అండ
రాష్ట్రంలోనే తొలి ట్రాన్స్జెండర్స్ క్యాంటీన్ ప్రారంభం పీఎంపాలెం: సమాజంలో ట్రాన్స్జెండర్ల పట్ల వివక్ష చూపడం తగదని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి అన్నారు. గురువారం ఆయన ఎండాడలోని మహిళా పోలీస్ స్టేషన్ ఆవరణలో ట్రాన్స్జెండర్ల నిర్వహించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన క్యాంటీన్ను ప్రారంభించి, వారి ఉపాధికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. నగరవ్యాప్తంగా సుమారు 400 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారని, వారు సమాజంలో గౌరవప్రదంగా జీవించేలా అందరూ సహకరించాలని కోరారు. అదే సమయంలో ట్రాన్స్జెండర్లు కూడా సమాజం పట్ల బాధ్యతగా, మర్యాదపూర్వకంగా మెలగాలని సూచించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ట్రాన్స్జెండర్ల ఉపాధి కోసం నగర పోలీస్ విభాగం ఆధ్వర్యంలో ఈ క్యాంటీన్ను నెలకొల్పినట్లు తెలిపారు. కమిషనర్ స్వయంగా క్యాంటీన్ ప్రారంభించడం పట్ల ట్రాన్స్జెండర్లు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సీపీ క్యాంటీన్లో టిఫిన్ చేసి రుచిని ఆస్వాదించారు. విశాఖ నార్త్ సబ్ డివిజన్ ఏసీపీ ఎస్.అప్పలరాజు, మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ అంబేడ్కర్, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
విశాఖ చేరుకున్న మరో భారీ ఎల్పీజీ నౌక..
సాక్షి, విశాఖపట్నం: గ్యాస్ కష్టాల నుంచి స్వల్ప ఊరట లభించింది. మరో భారీ ఎల్పీజీ నౌక.. విశాఖ పోర్టుకు చేరుకుంది. పర్షియన్ గల్ఫ్ నుంచి విశాఖకు వచ్చిన 'పైన్ గ్యాస్' ఎల్పీజీ నౌక.. 47 వేల టన్నుల గ్యాస్ మోసుకొచ్చింది. ఒడిశాలోని దమ్రా పోర్టుకు వెళ్లాల్సిన గ్యాస్ నౌకను విశాఖకు మళ్లించారు. తెలుగు రాష్ట్రాలలో గ్యాస్ డిమాండ్, నిల్వలను దృష్టిలో పెట్టుకుని నౌకను విశాఖకు మళ్లించినట్టు సమాచారం.కాగా, వరుసగా క్రూడాయిల్, వంట గ్యాస్ వెసల్స్ రాకతో విశాఖ పోర్టు కళకళలాడుతోంది. ఐదు రోజుల క్రితం(శుక్రవారం) కూడా భారీ స్థాయిలో ముడిచమురు, ఎల్పీజీ నౌకలు విశాఖ పోర్టుకు చేరుకున్నాయి. రష్యా నుంచి ‘ఎమ్టీ జంబో’ భారీ నౌక 1,36,728 మెట్రిక్ టన్నుల ముడిచమురుతో వచ్చింది. మరోవైపు, దేశీయ అవసరాల నిమిత్తం నెదర్లాండ్స్ నుంచి బీడబ్ల్యూ బిర్చ్ వెసల్ 24,000 మెట్రిక్ టన్నుల భారీ ఎల్పీజీ నౌక వచ్చిన సంగతి తెలిసిందే. ‘ఎమ్టీ సెంచూరియన్–1 వెసల్లో ఉన్న లక్ష టన్నుల ముడి చమురును అన్లోడ్ చేశారు. కాగా, అమెరికా నుంచి మరిన్ని గ్యాస్ నౌకలు విశాఖపట్నం రానున్నట్లు పోర్టు అధికారులు వెల్లడించారు.యుద్ధ సంక్షోభం తరువాత నాలుగు ఎల్పీజీ నౌకలు విశాఖ వచ్చాయని విశాఖపట్నం పోర్ట్ చైర్మన్ అంగముత్తు తెలిపారు. లక్ష టన్నుల గ్యాస్ దిగుమతి చేసుకున్నామని.. మరో 3 గ్యాస్ నౌకలు రానున్నాయని తెలిపారు. 13 క్రూడ్ ఆయిల్ నౌకలు వచ్చాయని.. మరో 4-5 క్రూడ్ ఆయిల్ నౌకలు రానున్నాయని పేర్కొన్నారు. విశాఖ పోర్టు.. ముంబై పోర్టుతో సమానంగా కార్గో హ్యాండిలింగ్ చేస్తుందన్నారు. -
యువకుల బీభత్సం
గంజాయి మత్తులో పెందుర్తి: విచ్చలవిడిగా లభిస్తున్న గంజాయి కారణంగా ప్రజలకు రక్షణ లేకుండా పోతుంది. పూటుగా గంజాయిని సేవించిన ఇద్దరు యువకులు పెందుర్తి మండలం రాంపురం వద్ద జాతీయ రహదారిపై బీభత్సం సృష్టించారు. ఆటోలో వచ్చి ఓ లారీ డ్రైవర్(ఓనర్)పై దారి దోపిడీకి పాల్పడ్డారు. డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించిన అతడిపై నిర్ధాక్షిణ్యంగా దాడికి తెగబడ్డారు. రాళ్లు, చాకుతో ఇష్టానుసారం దాడి చేసి అతడ్ని తీవ్రంగా గాయపరిచారు. అదే ఊపులో ఆటోలో వెళ్లి రాంపురం వంతెన వద్ద ఓ ఆర్టీసీ బస్ను ఢీకొన్నారు. డ్రైవర్, కండక్టర్తో వాగ్వాదానికి దిగి ఆటో పాడైంది డబ్బులు ఇవ్వాలని తీవ్రస్థాయిలో గొడవపడ్డారు. మొత్తానికి గంజాయి మత్తులో ఇద్దరు యువకులు భీతవహ వాతావరణాన్ని సృష్టించారు. వివరాలివి.. చినముషిడివాడకు చెందిన బంటు త్రినాథరావు సొంత లారీ నడుపుకుంటున్నాడు. మంగళవారం రాజాం నుంచి మొక్కజొన్న లోడుతో అనకాపల్లి వద్ద ఉన్న కోడూరుకు తరలించాడు. అనంతరం తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో డీజీల్ అయిపోవడంతో రాంపురం సమీపంలోని ఆనందపురం–అనకాపల్లి బైపాస్ పక్కన లారీ నిలుపుదల చేశాడు. డబ్బాలో డీజిల్ తెచ్చుకునేందుకు సమీపంలోని బంక్కు వెళ్లాడు. తిరిగి వస్తున్న క్రమంలో గంజాయి మత్తులో ఉన్న ఇద్దరు యువకులు ఆటోలో వచ్చి అతడ్ని ఆపారు. రూ.50 ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో డబ్బులు ఇస్తున్న క్రమంలో త్రినాథరావు వద్ద ఉన్న కొంత నగదుతో పాటు సెల్ఫోన్, ఏటీఎం కార్డు లాక్కున్నారు. ఈ క్రమంలో ఏటీఎం పిన్ చెప్పాలని అడిగారు. దానికి బాధితుడు నిరాకరించడంతో నడిరోడ్డుపైనే రాళ్లు, కత్తితో అతడిపై తీవ్రస్థాయిలో దాడికి తెగబడ్డారు. ఏదోలా వారి నుంచి తప్పించుకున్న త్రినాథరావు తీవ్ర గాయాలతోనే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ సమీపంలోని బంక్లోకి వెళ్లాడు. అయితే బంక్ సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోవాలని బాధితుడ్ని పంపేశారు. అలా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సమీపంలోని దాబాలోకి వెళ్లడంతో దాబా నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం బాధితుడ్ని పెందుర్తిలో ఆసుపత్రికి తరలించారు. అయినా ఆగలేదు.. తీవ్ర గాయాలపాలైన బాధితుడు త్రినాథరావు బంక్లోకి వెళ్లినప్పుడు వెంబడించిన దుండగులు కాసేపు అతడి కోసం అక్కడే మాటు వేశారు. అయితే బాధితుడు చాకచక్యంగా తప్పించుకుని దాబాలోకి వెళ్లిపోవడంతో వారు రాంగ్ రూట్లో పెందుర్తి వైపు వెళ్లి రాంపురం కూడలి వద్ద ఆర్టీసీ బస్ను ఢీకొన్నారు. అయితే అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పింది. కానీ ఆటో పాడైంది రూ.25 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆ ఇద్దరు యువకులు ఆర్టీసీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ లోపు పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి మత్తులో దారి దోపిడీకి పాల్పడ్డ ఇద్దరు యువకులు పెందుర్తిలోని నల్లక్వారి ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. పెందుర్తి క్రైం విభాగం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దారి దోపిడీ జరిగిన రాంపురం సమీపంలోని ప్రాంతం, (ఇన్సెట్) గాయపడిన బంటు త్రినాథరావు -
మా కష్టానికి తగిన ఫలితం దక్కడం లేదు
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న తమకు కష్టానికి తగిన ప్రతిఫలం వేతనం రూపంలో లభించడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం ఏయూ పరిపాలన భవనం వద్ద వారు తమ సమస్యలను వెల్లడించారు. యూనివర్సిటీలో 10 సంవత్సరాలకుపైగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ, తమకు చాలా తక్కువ వేతనాలు ఇస్తున్నారని తెలిపారు. వెంటనే వేతనాలను పెంచాలని, అలాగే మినిమం టైమ్ స్కేల్ వర్తింపజేయాలని అధికారులను కోరారు. విశాఖపట్నంలో జీవన వ్యయాలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ, తమ వేతనాలు మాత్రం పెరగడం లేదని వారు వాపోయారు. ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు పెరుగుతుండటంతో, తక్కువ జీతాలతో కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారిందని పేర్కొన్నారు. తమ పిల్లలకు మంచి విద్య అందించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా వేతనాల్లో ఎటువంటి పెంపు జరగలేదని తెలిపారు. 10 నుంచి 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న తమకు 28 రోజుల విధానం, టైమ్ స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు తమ సమస్యలను గుర్తించి న్యాయం చేయాలని ఉద్యోగులు కోరారు. ఈ కార్యక్రమంలో డి.కిరణ్ ప్రభు, ఏ.వి.ఎస్.ప్రసాద్, ఎం.పోలినాయుడు, ఎస్.తేజ, ఓ.ఆర్.రాజి, మదీనా వల్లి తదితరులు పాల్గొన్నారు. -
మధుర కలయిక
మురళీనగర్ : నావల్ డాక్యార్డు అప్రెంటీస్ స్కూల్ పూర్వ విద్యార్థులు తమ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను మురళీనగర్ వైశాఖి స్పోర్ట్సు పార్కులో బుధవారం నిర్వహించారు. 1976 బ్యాచ్కి చెందిన 100 మంది పూర్వ విద్యార్థులు ఒక చోట చేరి పాఠశాలలో గడిపిన క్షణాలను, మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. వివిధ హోదాల్లో రిటైర్ అయిన వీరు పకలరింపులతో పులకించిపోయారు. కమాండర్ తరుణయ్య, ఎన్ఎస్ ప్రకాశరావు, మెడికల్ ఆఫీసరుగా సేవలందించిన రవిబాబు పాల్గొన్నారు. వీరిని పూర్వ విద్యార్థులందరూ ఘనంగా సత్కరించారు. గోల్డెన్ జూబ్లీ మెమోంటోలను అందరికి అందించారు. మల్ల రామకృష్ణ ముఖ్య సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు అలరించాయి. ఏవీఎన్ పట్నాయక్, జి.పండయ్య, బ్రూస్లీ ప్రసాద్ పాల్గొని కార్యక్రమం నిర్వహణకు సహకరించారు. -
మహనీయులను తలచుకోవడం జన్మ రుణం తీర్చుకోవడమే..
విశాఖ సిటీ : దేశాన్ని అంటరానితనం, అమానవీయతల నుంచి బయటపడేసి మనుషులంతా ఒకటేనని చాటి చెప్పిన మహనీయులను తలచుకోవడం జన్మ రుణం తీర్చుకోవటం లాంటిదేనని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు, మాజీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కె.వి.చలం పేర్కొన్నారు. బుధవారం జిల్లా కోర్టు ప్రాంతంలో మహాత్మా జ్యోతిబాపూలే గౌతు లచ్చన్నల విగ్రహాల వద్ద ‘బడుగు యోధుల మహనీయుల మాసం‘ గోడ పత్రికను తెలంగాణ సాహిత్య అకాడమి మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ ఫెడరేషన్ సభ్యుడు నరసింహ చారితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోతులూరి వీరబ్రహ్మం, జ్యోతిబాపూలే, అంబేడ్కర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, పి.శివశంకర్, గౌతు లచ్చన్న వంటి బహుజన యోధుల శోభాయాత్రలు ప్రతీ పట్టణంలో నిర్వహించాలని సూచించారు. ఇంతవరకు బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వలేదని, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లలో బీసీ మహిళల వాటా తేల్చాలన్నారు. దీనికోసం బీసీలు ఏకమై పోరాడాలన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, బహుజన ఉద్యమ కవి జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ ఉన్నత మానవీయ సమాజం కోసం తపించి జాతిని జాగృతం చేసిన యోధులు జన్మించిన ఏప్రిల్ మాసాన్ని బడుగు యోధుల మహనీయుల మాసంగా జరుపుకోవడం స్ఫూర్తిదాయకమైందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ ఫెడరేషన్ సభ్యులు నరసింహాచారి మాట్లాడుతూ విశాఖ నగరంలో భారీగా పోతులూరి వీరబ్రహ్మం శోభాయాత్ర జరుపుతామని తెలిపారు. కార్యక్రమంలో విశాఖ అంబేడ్కర్ భవన్ అధ్యక్షుడు వి.కల్యాణరావ్, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జె.వి.ప్రభాకర్ పాల్గొన్నారు. -
ద్రోణంరాజు ఇంట్లో ఆత్మీయ కలయిక
ద్రోణంరాజు కుటుంబ సభ్యులతో మాజీ మంత్రి అంబటి, పార్టీ నేతలు బీచ్రోడ్డు: వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ద్రోణంరాజు శ్రీవత్సవ ఇంటికి మాజీ మంత్రి అంబటి రాంబాబు బుధవారం విచ్చేసి, ఆయన కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పలకరించారు. అనంతరం మాజీ మంత్రి, పశ్చిమ గోదావరి రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు మళ్ల విజయప్రసాద్, వాసుపల్లి గణేష్ కుమార్, అన్నంరెడ్డి అదీప్ రాజ్, చింతలపూడి వెంకటరామయ్య, మాజీ మేయర్ గొలగాని హరి వెంకటకుమారి శ్రీనివాస్, విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు, గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్రెడ్డి తదితరులతో కలసి అల్పాహార విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. దివంగత నేతలు ద్రోణంరాజు సత్యనారాయణ, ద్రోణంరాజు శ్రీనివాసరావుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. శ్రీవత్సవ కూడా ఎల్లవేళలా ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వాళ్ల తాత, నాన్న రాజకీయ వారసత్వాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశంసించారు. రాబోయే రోజుల్లో ఆయన మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. శ్రీవత్సవ మాట్లాడుతూ.. పార్టీ పెద్దలు తనను ఒక కుటుంబ సభ్యుడిలా ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. అందరితో కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు, ద్రోణంరాజు అభిమానులు పాల్గొన్నారు. -
ఆరోగ్యశ్రీకి కూటమి ఉరి
గీతంకు రెడ్ కార్పెట్.. ఏయూకి ఉరితాడు ఏయూలో రక్షణ కోర్సులను రద్దు చేయడం వెనుక గీతం యూనివర్సిటీకి మేలు చేకూర్చాలనే ఉద్దేశం ఉందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఏయూ వంటి ప్రతిష్టాత్మక ప్రభుత్వ సంస్థ ఈ కోర్సులను నిలిపివేస్తే, ఆ అడ్మిషన్లన్నీ సహజంగానే గీతం వంటి ప్రైవేటు సంస్థలకు మళ్లుతాయని పాలకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏయూని వీడి వెళ్లిన నిపుణులు గీతంలో కన్సల్టెంట్లుగా చేరుతుండటం, రక్షణ శాఖలు ఏయూని తమ భాగస్వామ్య జాబితా నుంచి తొలగించి ఇతర ప్రైవేటు సంస్థల వైపు చూడటం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. విద్యార్థుల భవిష్యత్తు కంటే ఒక ప్రైవేటు సంస్థ లాభాలే ముఖ్యమన్నట్టుగా వర్సిటీ నిర్ణయాలు ఉండటం శోచనీయం. మహారాణిపేట: నిరుపేదల ప్రాణ సంజీవని అయిన ఆరోగ్యశ్రీ పథకం నెట్వర్క్ ఆస్పత్రుల్లో నిలిచిపోయింది. రెండు దశాబ్దాలుగా పేద రోగులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ ఉచితంగా అందుతున్న ఆధునాతన వైద్య సేవలకు బకాయిల గ్రహణం పట్టింది. ఎన్నిసార్లు విన్నవించుకున్నా కోట్లాది రూపాయల మేర పేరుకుపోయిన బకాయిలను చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో.. జిల్లాలోని నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు నిలిపివేయాలని ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ (ఆషా) పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా బుధవారం ప్రధానంగా ఆస్పత్రుల్లో సేవలు బంద్ చేశారు. కేర్, వీఆర్ఐడీఏ, ఇండస్, జి.జె. తదితర ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. కేవలం అత్యవసర సేవలు మాత్రమే కొనసాగుతున్నాయి. జిల్లాలోని 65 నెట్వర్క్ ఆస్పత్రులకు ఎన్టీఆర్ వైద్య సేవల(ఆరోగ్యశ్రీ) కోసం ప్రతి రోజూ వెయ్యి మందికి పైగా అవుట్ పేషెంట్లు వస్తుంటారని అంచనా. ఒక్కో ఆస్పత్రిలో రోజుకు మూడు, నాలుగు సర్జరీలు జరుగుతుంటాయి. సమ్మె మొదటి రోజైన బుధవారం జిల్లావ్యాప్తంగా ఓపీ, ఐపీ సేవలు నిలిచిపోయాయి. అత్యవసర శస్త్రచికిత్సలు మినహా మిగిలిన సర్జరీలు కూడా ఆగిపోయాయి. ఉచిత వైద్య సేవలు నిలిపివేయడంతో పేద, మధ్యతరగతి ప్రజలు నిరాశగా వెనుదిరిగారు. సేవల్లో తీవ్ర అంతరాయం ఆషా పిలుపు మేరకు బుధవారం ఆరోగ్యశ్రీ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి బకాయిలు రాకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. దీని ప్రభావం కేవలం పేద రోగుల పైనే కాకుండా.. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్) కింద చికిత్స పొందే ప్రభుత్వ, రిటైర్డ్ ఉద్యోగులు, వర్కింగ్ జర్నలిస్టులపైనా పడింది. బకాయిలు విడుదల చేసి సేవలు పునరుద్ధరించాలని రోగులు కోరుతున్నారు. వర్సిటీలో పరిణామాలు ఆందోళనకరం వర్సిటీలో జరుగుతున్న ఈ పరిణామాలు కేవలం విద్యాపరమైనవే కాకుండా, పరిపాలనాపరంగా కూడా వివాదాస్పదమవుతున్నాయి. ఇటీవల జరిగిన 91, 92వ కాన్వకేషన్ కార్యక్రమంలో గీతం యూనివర్సిటీ మాజీ వీసీ కోనేరు రామకృష్ణారావు అల్లుడు పూర్ణచంద్రరావును ముఖ్య అతిథిగా ఆహ్వానించడం పెద్ద దుమారం రేపింది. కనీసం పాలక మండలి దృష్టికి తీసుకువెళ్లకుండా, వారి అనుమతి లేకుండా వీసీ ఏకపక్షంగా వ్యవహరించడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వ వర్సిటీని ప్రైవేటు వ్యక్తుల ఇలాకాగా మార్చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ.15 కోట్ల ఆదాయాన్ని ఇచ్చే సెంటర్ను మూసివేసి, వర్సిటీని ఆర్థికంగా దెబ్బతీయడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో పాలకులు చెప్పాల్సిన అవసరం ఉందని వర్సిటీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏయూ ఉనికికే ముప్పు మేధావుల ఆవేదన.. విశాఖకు గర్వకారణంగా ఉన్న ఆంధ్ర విశ్వవిద్యాలయం తన ఉనికిని, గౌరవాన్ని కాపాడుకోవాలంటే ప్రస్తుత ధోరణి మారాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. రక్షణ రంగ నిపుణులను దూరం చేసుకోవడం వల్ల వర్సిటీ జాతీయ స్థాయి ర్యాంకింగ్ల్లో వెనుకబడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. కేవలం ఒక ప్రైవేటు యూనివర్సిటీకి లబ్ధి చేకూర్చేందుకు ఏయూ మూలాలను దెబ్బతీయడం సరికాదని మేధావులు హెచ్చరిస్తున్నారు. తక్షణమే రక్షణ అధ్యయన కేంద్రాన్ని పునరుద్ధరించి, వర్సిటీ ప్రతిష్టను కాపాడాలని ఉత్తరాంధ్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
కోసం వలన చేత
విద్యా కుసుమాల నిలయం, దేశానికే గర్వకారణమైన ఆంధ్ర విశ్వవిద్యాలయం నేడు ప్రైవేటు శక్తుల చేతిలో పతనం.. రాష్ట్రపతి ప్రారంభించిన రక్షణ కేంద్రానికి గ్రహణం.. ఆదాయం ఇచ్చే అక్షయ పాత్రను.. అప్పనంగా చిత్తుకాగితం చేసిన వైనం.. ’చేతికొచ్చిన బంగారాన్ని చెరువులో పారేసినట్టు’.. సొంత ప్రతిష్టను బలిపీఠం ఎక్కిస్తున్న పాలకులు.. ప్రశ్న ఒకటే.. ఏయూ భవితవ్యం.. ప్రైవేటు శక్తుల బతుకుదెరువా? ● ఏయూ డిఫెన్స్ స్టడీస్ సెంటర్కు మంగళం ● ప్రైవేటు వర్సిటికీ లబ్ధి చేకూర్చడమే పాలకవర్గం లక్ష్యం? ● ఏకపక్ష నిర్ణయాలతో అభాసుపాలుఇదీ ఏయూలో పాలన ప్రైవేటు హితం కోసం.. వర్సిటీకి రిక్తంసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : విశాఖ గడ్డపై విద్యా వినీలాకాశంలో ధ్రువతారగా వెలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం.. నేడు ప్రైవేటు శక్తుల కబంధ హస్తాల్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది. ‘గీతం వలన.. గీతం కోసం.. గీతం చేత..’ అన్న చందంగా సాగుతున్న ప్రస్తుత పాలన, వర్సిటీ గౌరవాన్ని గంగలో కలిపేస్తోంది. సాక్షాత్తూ భారత రాష్ట్రపతి ప్రారంభించిన రక్షణ అధ్యయన కేంద్రానికే మంగళం పాడి, రూ.15 కోట్ల ఆదాయాన్ని ఇచ్చే అక్షయపాత్రను చిత్తుకాగితంలా పారేసిన వైనంపై మేధావుల నుంచి ఆగ్రహం పెల్లుబుకుతోంది. అగ్నివీరులకు మార్గదర్శిగా, దేశ రక్షణ దళాలకు విద్యా గనిగా పేరుగాంచిన ఏయూని కుప్పకూల్చి.. ఆ శిథిలాల మీద ప్రైవేటు సామ్రాజ్యానికి రెడ్ కార్పెట్ వేస్తున్న పాలకుల తీరుపై నిరసన వ్యక్తమవుతోంది. రాష్ట్రపతి ప్రారంభించిన కేంద్రానికి గ్రహణం ఏయూ రక్షణ అధ్యయన కేంద్రాన్ని 2018లో అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సెంటర్ అతి తక్కువ కాలంలోనే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. దేశ సరిహద్దుల్లో కాపలా కాసే సైనికులు, అధికారులు తమ విధుల్లో ఉంటూనే.. ఉన్నత చదువులు అభ్యసించడానికి, రిటైర్మెంట్ తర్వాత మెరుగైన ఉపాధి పొందేందుకు ఈ కేంద్రం వారధిలా నిలిచింది. భారత వైమానిక, నౌకా, భూసేనలతో పాటు ఐఎన్ఎస్ సంస్థలు, కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ ఫేర్ వంటి అత్యున్నత రక్షణ విభాగాలతో ఏయూ బలమైన ఒప్పందాలు చేసుకుంది. దీనివల్ల వేలాది మంది రక్షణ సిబ్బంది పీహెచ్డీలు, డిగ్రీలు పూర్తి చేసి వర్సిటీ ప్రతిష్టను పెంచడమే కాకుండా, వర్సిటీ ఖజానాకు సుమారు రూ.15 కోట్ల ఆదాయాన్ని కూడా సమకూర్చారు. అగ్నివీర్లకు మార్గదర్శి.. నేడు అగమ్యగోచరం దేశంలో అగ్నివీర్లకు శిక్షణ ఇచ్చేందుకు ఎంపికై న మొదటి విశ్వవిద్యాలయంగా ఏయూ రికార్డు సృష్టించింది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా 7 వేల మందికి పైగా సైనికులు ఇక్కడ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. న్యాక్ గుర్తింపులో ఈ కేంద్రం ప్రదర్శించిన ‘బెస్ట్ ప్రాక్టీసెస్’కు 400 కి 400 మార్కులు రావడం విశేషం. ఇంతటి అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉన్న కేంద్రాన్ని, 2023లో సెనేట్ ఆమోదంతో పూర్తిస్థాయి స్కూల్గా మార్చాలని నిర్ణయించారు. అయితే, కొత్త పాలన వచ్చిన తర్వాత పరిస్థితి తలకిందులైంది. ఏయే కారణాలతో ఈ కేంద్రాన్ని మూసివేశారో అర్థం కాక విద్యార్థులు, నిపుణులు తలలు పట్టుకుంటున్నారు. ఈ పరిణామాల వల్లే సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ నిరంజన్ తన పదవికి రాజీనామా చేయగా, సమన్వయకర్తగా ఉన్న ఉజ్వల్ వంటి నిపుణులు వర్సిటీని వీడాల్సి వచ్చింది. -
వాల్తేరులో సరికొత్త మైలు రాళ్లు
సాక్షి, విశాఖపట్నం : భారతీయ రైల్వేలో వాల్తేరు విభాగం మునుపెన్నడూ లేని విధంగా చరిత్రాత్మక విజయాలను నమోదు చేస్తూ ప్రగతి పథంలో దూసుకుపోతోందని డీఆర్ఎం లలిత్ బోహ్రా తెలిపారు. వాల్తేరు డీఆర్ఎం కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో వాల్తేరు ప్రగతి వివరాలను వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అద్భుతమైన పనితీరును కనబరిచిన ఈ విభాగం, దేశవ్యాప్తంగా అత్యధిక ఆదాయం గడించిన విభాగాల్లో ఐదో స్థానాన్ని కై వసం చేసుకుని తన ప్రత్యేకతను చాటుకుందని తెలిపారు. ప్రధానంగా సరుకు రవాణాలో 85.1 మిలియన్ టన్నుల రికార్డు స్థాయి లక్ష్యాన్ని చేరుకోవడమే కాకుండా, మునుపటి ఏడాదితో పోలిస్తే 17.25 శాతం వృద్ధిని నమోదు చేసి సరికొత్త అధ్యాయాన్ని లిఖించామన్నారు. వాల్తేరు డీఆర్ఎం ఇంకా ఏం చెప్పారంటే.. ఆర్థిక రికార్డులు.. కార్యకలాపాల జోరు వాల్తేరు విభాగం ఈ ఏడాది మొత్తం రూ.11,598 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇది గతేడాదితో పోలిస్తే 17 శాతం అధికం. ముఖ్యంగా సరుకు రవాణా, రవాణా నిర్వహణలో 150 మిలియన్ టన్నుల మైలురాయిని దాటి అగ్రగామిగా నిలిచింది. ప్రయాణికుల రాకపోకలు కూడా గణనీయంగా పెరిగాయి. సుమారు 3.34 కోట్ల మంది ప్రయాణికులు వాల్తేరు రైల్వే సేవలను వినియోగించుకోగా, గత 21 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ప్రయాణికుల విభాగం ద్వారా రూ.881.37 కోట్ల ఆదాయం సమకూరింది. క్యాటరింగ్, పార్కింగ్, ప్రకటనలు, టికెట్ తనిఖీల ద్వారా కూడా భారీగా ఆదాయం ఆర్జించాం. శరవేగంగా స్టేషన్ల నవీకరణ పనులు వాల్తేరు డివిజన్ పరిధిలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 15 రైల్వే స్టేషన్లను ఆధునీకరించేందుకు ఎంపిక చేశాం. విశాఖపట్నం ప్రాంతంలో రైలు ఫ్లైఓవర్లు, అదనపు లైన్ల నిర్మాణం, స్టేషన్ల నవీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రయాణికుల సౌకర్యం కోసం విశాఖపట్నం స్టేషన్లో స్లీపింగ్ పాడ్స్, విశాఖలో 220, విజయనగరంలో 24 డిజిటల్ స్క్రీన్లు, అత్యాధునిక వెయిటింగ్ హాల్స్ ఏర్పాటు చేశాం. పండగలు, సెలవుల రద్దీని తట్టుకునేందుకు 300కు పైగా ప్రత్యేక రైళ్లు, 400 అదనపు కోచ్లను నడిపాం. విశాఖపట్నం నుంచి తిరుపతి, చర్లపల్లి వెళ్లే ప్రత్యేక రైళ్లను క్రమబద్ధీకరించారు. అరకు, కొరాపుట్ కాఫీ బ్రాండ్లను ప్రోత్సహించడానికి ఆయా స్టేషన్లలో ప్రత్యేక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ప్లాటినం రేటింగ్ కలిగిన హరిత రైల్వే స్టేషన్గా విశాఖపట్నం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. భద్రతలో రాజీపడే ప్రసక్తే లేదు వాల్తేరు విభాగం సాంకేతికత వినియోగంలోనూ ముందుంది. భద్రత, నిఘా కోసం విశాఖ స్టేషన్లో ‘ఆర్క్ అర్జున్’ అనే కృత్రిమ మేధస్సుతో పనిచేసే రోబోను ప్రవేశపెట్టాం. ఇది నేరస్తులను గుర్తించడంలో, ప్రయాణికులకు మార్గనిర్దేశం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. భద్రతా పరంగా అప్రమత్తంగా వ్యవహరించిన సిబ్బందికి ప్రత్యేక అవార్డులు అందజేయడమే కాకుండా, సిబ్బంది నైపుణ్యాన్ని పెంచేందుకు శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. మౌలిక వసతుల విస్తరణ రైలు ప్రయాణాన్ని మరింత వేగవంతం చేసేందుకు మౌలిక సదుపాయాల విస్తరణపై విభాగం దృష్టి సారించాం. ఈ ఏడాది జనవరి నాటికి 380 కిలోమీటర్లకు పైగా డబుల్ లైన్ పనులను పూర్తి చేసి ప్రారంభించడం ఒక పెద్ద విజయం. దీనివల్ల రైళ్ల రాకపోకల్లో జాప్యం తగ్గడమే కాకుండా, సరుకు రవాణా సామర్థ్యం కూడా పెరుగుతుంది. పార్లమెంట్లో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించినట్లుగా.. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ త్వరలో రాబోతుందని డీఆర్ఎం స్పష్టం చేశారు. -
టాప్గేర్లో విశాఖ ఉక్కు
ఉక్కునగరం: విశాఖ స్టీల్ప్లాంట్ 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి, అమ్మకాల్లో గణనీయమైన వృద్ధిని సాధించింది. 2024–25లో హాట్ మెటల్ 3.91 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయగా.. 2025–26లో 52 శాతం వృద్ధితో 5.95 మిలియన్ టన్నులు ఉత్పత్తి సాధించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో 3.75 మి.ట ద్రవపు ఉక్కు ఉత్పత్తి చేయగా గత ఆర్థిక సంవత్సరంలో 5.69 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసి 52 శాతం వృద్ధి నమోదు చేసింది. క్రూడ్ స్టీల్ కూడా 51 శాతం వృద్ధితో 5.43 మిలియన్టన్నులకు చేరింది. అమ్మకాలు విషయానికి వస్తే 2024–25లో 3.49 మిలియన్ టన్నులతో రూ.18,288 కోట్లు చేయగా 2025–26లో 4.42 మి.టన్నులతో రూ. 22,311 కోట్లు అమ్మకాలు చేసి పరిణామంలో 27 శాతం, అమ్మకాల్లో 22 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఉత్పత్తి, అమ్మకాల వృద్ధిలో ఉద్యోగుల నిరంతర కృషి ప్రతిబింబింస్తుందని యాజమాన్యం తెలిపింది. ఉత్పాదకత, వ్యయ నియంత్రణ, వినియోగదారుల సంతృప్తిపై సంస్థ దృష్టి పెట్టిందని పేర్కొంది. హాట్మెటల్ ఉత్పత్తిలో రికార్డు విశాఖ స్టీల్ప్లాంట్ 2025–26 ఆర్థిక సంవత్సరంలో హాట్ మెటల్ ఉత్పత్తిలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. స్టీల్ప్లాంట్ ప్రారంభం నుంచి మూడు బ్లాస్ట్ఫర్నేస్లు కలిపి 2021–22లో ఉత్పత్తి చేసిన 57,73,6500 టన్నుల హాట్ మెటల్ ఇప్పటి వరకూ రికార్డుగా ఉంది. ఈ ఏడాది మార్చి 31 నాటికి 59,55,156 టన్నులు ఉత్పత్తి చేసి సరి కొత్త రికార్డు సాధించింది.విభాగం ఉన్నతాధికారులు ఉద్యోగులను అభినందించారు. -
వైజాగ్ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేస్తా
మహారాణిపేట: విశాఖ జిల్లా పాలనా పగ్గాలను ఎం.అభిషిక్త్ కిషోర్ బుధవారం అధికారికంగా చేపట్టారు. కలెక్టరేట్ కార్యాలయంలోని తన చాంబర్లో మధ్యాహ్నం ఆయన బాధ్యతలు స్వీకరించారు. జిల్లా అభివృద్ధిపై తనకున్న విజన్ను ఈ సందర్భంగా మీడియాతో పంచుకున్నారు. విశాఖపట్నం కేవలం ఆంధ్రప్రదేశ్కే కాదు, దేశానికే కీలకమైన ఆర్థిక, పారిశ్రామిక కేంద్రం అని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ నగరాన్ని ఐటీ, డేటా సెంటర్లు, టూరిజం రంగాల్లో అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే తన ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ముఖ్యంగా భోగాపురం విమానాశ్రయం ప్రారంభం, పోర్టు ఆధారిత అభివృద్ధి, పరిశ్రమల విస్తరణ ద్వారా జిల్లా రూపురేఖలు మార్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఉద్ఘాటించారు. మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి అవకాశాల సృష్టి, పట్టణ, గ్రామీణ ప్రాంతాల సమతుల్య అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. ప్రజల వద్దకే పాలన ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరాలన్నదే తన ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. ‘నేను క్షేత్రస్థాయిలో పర్యటిస్తాను. ప్రజల సమస్యలను నేరుగా విని, అక్కడికక్కడే పరిష్కార మార్గాలను వెతుకుతాను’ అని హామీ ఇచ్చారు. పారదర్శకతతో కూడిన పరిపాలనను అందిస్తూ, జిల్లా యంత్రాంగాన్ని సమర్థంగా నడిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. విశాఖను రాష్ట్రానికే మార్గదర్శకంగా తీర్చిదిద్దే ఈ ప్రయాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ పిలుపునిచ్చారు. సొంత గడ్డపై సేవ తన నేపథ్యాన్ని గురించి మాట్లాడుతూ.. ‘నేను ఆంధ్రావాడినే. నెల్లూరు నా స్వస్థలం. నా తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. ఆ క్రమశిక్షణే నన్ను ఇక్కడి వరకు తెచ్చింది’ అని గర్వంగా చెప్పుకొచ్చారు. గతంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్గా, తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాల్లో సబ్ కలెక్టర్గా, ఐటీడీఏ పీవో, మున్సిపల్ కమిషనర్, ఫైనాన్స్, కమర్షియల్ ట్యాక్స్ వంటి రంగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన అనుభవం విశాఖ అభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు. నూతన కలెక్టర్కు జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ తదితరులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి సాదరంగా ఆహ్వానించారు. అప్పన్న సేవలో కొత్త కలెక్టర్ సింహాచలం: విశాఖ జిల్లా కలెక్టర్గా పనిచేయడం ప్రతి ఐఏఎస్ అధికారికి ఒక సువర్ణావకాశమని నూతన కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ తెలిపారు. బుధవారం ఉదయం ఆయన తన సతీమణితో కలిసి శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని మొక్కులు తీర్చుకున్న అనంతరం, బేడా మండపంలో ప్రదక్షిణలు చేశారు. అంతరాలయంలో కలెక్టర్ దంపతుల పేరిట అర్చకులు అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించి, వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి ప్రసాదం, శేషవస్త్రం, చిత్రపటాన్ని దేవస్థానం ఈవో జె.వెంకటరావు వారికి బహూకరించారు. -
కలెక్టర్ హరేందిర ప్రసాద్ సేవలు మరువలేనివి
మహారాణిపేట: విశాఖ జిల్లా కలెక్టర్గా ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అందించిన సేవలు ప్రశంసనీయమని జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి కొనియాడారు. కలెక్టర్ బదిలీ నేపథ్యంలో మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో మంత్రి, ఎమ్మెల్యేలు ఆయనను దుశ్శాలువాతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత 20 నెలల కాలంలో కలెక్టర్ హరేందిర ప్రసాద్ ప్రజలకు విశేష సేవలందించారని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, ఎమ్మెల్యేలు గణబాబు, వెలగపూడి రామకృష్ణ బాబు, పి.విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ.. విశాఖలో జరిగిన జాతీయ, అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలను కలెక్టర్ సమన్వయంతో విజయవంతం చేశారని కితాబిచ్చారు. కలెక్టర్ హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ.. తన విధి నిర్వహణలో ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది అందించిన సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, సీపీ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ, వీఎంఆర్డీఏ కమిషనర్లు కేతన్ గార్గ్, తేజ్ భరత్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు పాల్గొన్నారు. ఇన్చార్జి మంత్రి డోలా -
రూ.3 కోట్ల ప్రభుత్వ భూమికి స్కెచ్?
మధురవాడ: ప్రభుత్వ భూముల ఆక్రమణలకు అక్రమార్కులు తెగబడుతున్నారు. మధురవాడ పరిధిలో కోట్లాది రూపాయల విలువైన భూమిని కొట్టేయడానికి నియోజకవర్గ ముఖ్య నేత పేరును వాడుకుంటూ దర్జాగా పనులు సాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కబ్జాదారులకు అధికార పార్టీ అండదండలు ఉండటంతోనే రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. రూ.3 కోట్లు విలువ చేసే భూమి విశాఖ రూరల్ మండలం, మధురవాడ రెవెన్యూ గ్రామం సర్వే నంబర్ 388 పరిసరాల్లో ఈ దందా సాగుతోంది. మధురవాడ హైవే నుంచి ఐటీ సెజ్కు వెళ్లే మార్గంలో, వికలాంగుల కాలనీ వద్ద అదానీ డేటా సెంటర్ రోడ్డును ఆనుకుని ఉన్న సుమారు 500 గజాల ప్రభుత్వ భూమిపై అక్రమార్కుల కన్ను పడింది. ఇక్కడ గజం ధర బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.60 వేల వరకు పలుకుతోంది. అంటే సుమారు రూ.3 కోట్ల విలువైన ఈ భూమిని హస్తగతం చేసుకునేందుకు పక్కా పథకం రచించారు. గతంలో అక్రమంగా నిర్మించిన షెడ్లకు ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలోని తుప్పలను తొలగించి, కొండ భూమిని చదును చేసే పనులు మొదలుపెట్టారు. ఇంత దర్జాగా ప్రభుత్వ భూమిని ఆక్రమణకు తెరలేపడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణ పనుల్లో జీవీఎంసీ వాహనం ఈ కబ్జా పర్వంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భూ ఆక్రమణను అడ్డుకునేందుకు వచ్చిన గ్రేడ్–2 వీఆర్వో, అక్కడ జరుగుతున్న పనులను నిలిపివేయించారు. భూమిని చదును చేస్తున్న పొక్లెయిన్ను సీజ్ చేసి తహసీల్దార్ కార్యాలయానికి తరలించేందుకు ప్రయత్నించగా.. అది జీవీఎంసీ శానిటేషన్ విభాగానికి చెందిన వాహనమని తేలడంతో విస్తుపోయారు. అదే సమయంలో అధికార పార్టీకి చెందిన ఒక ప్రముఖ నేత నుంచి ‘సదరు వ్యక్తులు మనవారే.. వదిలేయండి’అంటూ హుకుం జారీ కావడంతో అధికారి వెనక్కి తగ్గినట్లు సమాచారం. ప్రభుత్వ భూమిని ఆక్రమించడానికి ఏకంగా ప్రభుత్వ వాహనాన్నే వాడటం చూస్తుంటే, ఈ వ్యవహారం ఎంతటి స్థాయి వ్యక్తుల కనుసన్నల్లో జరుగుతుందో అర్థమవుతోంది. అసలు సూత్రధారులు ఎవరు? అసలు అక్రమార్కుల పనులకు జీవీఎంసీ వాహనాన్ని పంపిన అధికారులు ఎవరు? ఈ కబ్జా వెనుక జీవీఎంసీలోని ఉన్నతాధికారుల ప్రమేయం ఉందా.. లేక ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకే ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ వాహనాన్ని ఉపయోగించారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. -
షాడో
పశ్చిమలోరాజ్యంఅక్కడ చట్టం చుట్టమైపోయింది.. నిబంధనలు నీరుగారిపోయాయి. అక్కడ వినిపించేది ప్రజా ప్రతినిధి గొంతు కాదు.. ఆయన వెనకాల ఉండే ‘షాడో’ ఎమ్మెల్యేల హుకుం. ఐదుగురు పీఏలు.. ఐదు విభాగాలు.. వెరసి విశాఖ పశ్చిమ నియోజక వర్గం అక్రమ వసూళ్ల అడ్డాగా మారిపోయింది. సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే ప్లాన్ కంటే ముందు పీఏల ‘పర్మిషన్’ ఉండాల్సిందే. గెడ్డల ఆక్రమణలకు పచ్చజెండా ఊపే ఈ ‘కలెక్షన్ కిం గ్స్’.. పేదవాడి సెట్బ్యాక్ దగ్గర మాత్రం సింహాల్లా గర్జిస్తున్నారు. అంతస్తుకో రేటు.. సంతకానికో నోటు.. ఇదీ ప్రస్తుతం విశాఖ పశ్చిమలో సాగు తున్న నగ్న సత్యం. అధికారులను పావులుగా వాడుకుంటూ, నిబంధనలను అస్త్రంగా చేసుకుని సాగుతున్న ఈ ‘వసూళ్ల పర్వం’పై గ్రౌండ్ రిపోర్ట్. విశాఖ సిటీ: ఆ నియోజకవర్గంలో ఐదుగురు ఎమ్మెల్యేలు. రెవెన్యూ, జీవీఎంసీ, పోలీస్.. ఇలా ఒక్కో విభాగాన్ని ఒక్కొక్కరుగా పంచేసుకున్నారు. ఆయా విభాగాల్లో ఎవరికి ఎటువంటి పనులు జరగాలన్నా ముందుగా వీరిని ప్రసన్నం చేసుకోవాల్సిందే. బదిలీల నుంచి పోస్టింగ్ల వరకు.. అన్నింటికీ మామూళ్లు ముట్టజెప్పాల్సిందే. ఇక నియోజకవర్గంలో చిన్న ఇంటి నుంచి భారీ భవనాల నిర్మాణం వరకు వీరి కనుసన్నల్లో జరగాల్సిందే. వారికి ముందుగా తాంబూలం సమర్పించాల్సిందే. లేదంటే నిబంధనల పేరుతో నోటీసులు.. వెనువెంటనే కూల్చివేతలు జరిగిపోతాయి. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో జరుగుతున్న తంతు ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ అవుతోంది. ఎమ్మెల్యే పేరుతో పీఏలు వసూళ్ల పర్వానికి తెరపారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో విభాగంలో ఒక్కొక్కరు పెత్తనం చెలాయిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గంలో పీఏల పేరుతో ఐదుగురు షాడో ఎమ్మెల్యేలుగా చలామని అవుతున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఏ చిన్న పని కోసం ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లినా ముందుగా వీరిని సంతృప్తి పరచాల్సిందే అన్నది బహిరంగ రహస్యం. చివరకు ఒక సామాన్యుడు తన సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవాలన్నా సదరు పీఏల ‘కృపాకటాక్షాలు’ ఉండాల్సిందేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే పేరుతో చలామణి అవుతున్న ఈ ‘షాడో’ ఎమ్మెల్యేలు నియోజకవర్గాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకుని అక్రమ వసూళ్లకు తెరలేపారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అంతస్తుకో రేటు.. అక్రమాలకు పచ్చజెండా నియోజకవర్గంలో అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అయితే ఇవి కేవలం పీఏల సిఫార్సు ఉంటేనే సాధ్యమవుతున్నాయి. బీపీఎస్ నిబంధనలను తుంగలో తొక్కి, అదనపు అంతస్తులు వేసుకోవడానికి పీఏ వర్గం ఒక ‘రేట్ కార్డు’నే సిద్ధం చేసింది. ఒక్కో అంతస్తుకు కనిష్టంగా రూ.3 లక్షల నుంచి గరిష్టంగా రూ.20 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు ఇస్తే అక్రమ నిర్మాణం సక్రమమైపోతుంటే.. ఇవ్వలేని వారి నిర్మాణాలకు మాత్రం నిబంధనల పేరుతో నోటీసులు, వెనువెంటనే కూల్చివేతలు జరిగిపోతుండడం నిత్యకృత్యమైంది. జీవీఎంసీ పరిధిలోని పశ్చిమ ప్రాంతంలో గెడ్డల ఆక్రమణలు, రోడ్ల ఆక్రమణలు జరుగుతున్నా కన్నెత్తి చూడని అధికారులు.. చిన్న చిన్న ఇళ్ల నిర్మాణాలకు సెట్బ్యాక్ల పేరుతో బెదిరింపులకు దిగుతుండడంపై స్థానికులు మండిపడుతున్నారు. నిబంధనల అస్త్రం.. నోటీసుల పర్వం ఎవరైనా ఇల్లు కడుతున్నారని తెలియగానే, సచివాలయ ఉద్యోగులు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది అక్కడ ప్రత్యక్షమవుతున్నారు. ప్లాన్లో ఏ చిన్నపాటి తేడా ఉన్నా వెంటనే కొలతలు వేసి నోటీసులు జారీ చేస్తున్నారు. చిన్న చిన్న నిర్మాణాల విషయంలోను నిబంధనల పేరుతో వేధింపులకు గురి చేస్తుండడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే.. ‘మాకేం సంబంధం లేదు, ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఫిర్యాదు వచ్చింది.. వెళ్లి అక్కడ మాట్లాడుకోండి‘ అంటూ ఉచిత సలహాలు ఇస్తుండటం గమనార్హం. వసూళ్ల దందా కోసం అధికారులను సైతం పావులుగా వాడుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యే పీఏల వసూళ్ల పర్వం? ఒక్కో విభాగానికి ఒక్కో పీఏ సామాన్యుడి సొంతింటి కలపై ‘పీఏ’ల ఉచ్చు నిబంధనల పేరుతో బెదిరింపులు రూ.లక్షల్లో వసూళ్లు.. మాట వినకపోతే కూల్చివేతలు అధికారులను పావులుగా వాడుకుంటూ దర్జాగా అక్రమ దందా అధికారుల పోస్టింగ్లోనూ హస్తంకేవలం నిర్మాణ రంగమే కాకుండా, నియోజకవర్గంలోని వివిధ శాఖల అధికారుల బదిలీలు, పోస్టింగ్ల్లో కూడా పీఏల జోక్యం మితిమీరిపోయినట్లు తెలుస్తోంది. బదిలీ, పోస్టింగ్, శాఖ, విభాగాన్ని బట్టి రేట్ ఫిక్స్ చేసి సిఫార్సు లేఖలు తయారు చేసే బాధ్యతలు తీసుకుంటున్నారన్న టాక్ ఉంది. ఉన్నతాధికారులకు సైతం ఫోన్లు చేస్తూ.. వారి పనులు చేయాలంటూ హుకుం జారీ చేస్తూ షాడో ఎమ్మెల్యేలుగా నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్నారన్న వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. -
సురక్షిత విశాఖే లక్ష్యంగా పనిచేద్దాం
అల్లిపురం: నగర ప్రజల భద్రతను మెరుగుపరచడం, సామాజిక అంశాలపై అవగాహన కల్పించడం, సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడంలో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు భాగస్వాములు కావాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి కోరారు. పోలీస్ కమిషనర్ కార్యాలయ సమావేశ మందిరంలో నగరానికి చెందిన సుమారు 35 మంది ఇన్ఫ్లూయెన్సర్లతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖ, సోషల్ మీడియా ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే సమాజంలో గణనీయమైన మార్పు తీసుకురావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. నిరుత్సాహంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో ధైర్యం నింపడం, ఆన్లైన్ గ్యాంబ్లింగ్, చిట్ఫండ్ మోసాలు, ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయడం, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై యువతకు అవగాహన కల్పించడం, హెల్మెట్ ధారణ ఆవశ్యకత, రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకోవడం, పోలీస్ శాఖ ప్రవేశపెట్టిన స్పీడ్ లేజర్ గన్స్ పనితీరుపై సమాచారం అందించడం తదితర అంశాలపై వీడియోలు, సందేశాల రూపంలో విస్తృత ప్రచారం కల్పించాలని సీపీ కోరారు. అనంతరం ఇన్ఫ్లూయెన్సర్ల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఇన్ఫ్లూయెన్సర్లకు సీపీ శంఖబ్రత బాగ్చి పిలుపు -
నైట్ ఫుడ్ కోర్టును తక్షణమే పునరుద్ధరించాలి
న్యాయం చేయకుంటే జీవీఎంసీ ముట్టడి ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజుసాక్షి, విశాఖపట్నం: నగరంలో నైట్ ఫుడ్ కోర్టును తక్షణమే పునరుద్ధరించి, బాధితులకు న్యాయం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్ చేశారు. సెంట్రల్ పార్క్ వద్ద నైట్ ఫుడ్ కోర్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షకు మంగళవారం ఆయన సంఘీభావం తెలిపారు. చిరు వ్యాపారులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ.. విశాఖకు వచ్చే పర్యాటకులను ఆకర్షించడంతో పాటు, స్థానిక సంప్రదాయ ఆహార సంస్కృతిని ప్రోత్సహించడంలో నైట్ ఫుడ్ కోర్టు కీలకంగా ఉండేదన్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన చిరు వ్యాపారులకు ఇది జీవనాధారంగా మారిందని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా నైట్ ఫుడ్కోర్టును ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వ్యాపారులకు ఎటువంటి ప్రత్యామ్నాయం చూపకుండా ఫుడ్ కోర్టులోని దుకాణాలను తొలగించడం దుర్మార్గమని విమర్శించారు. గత ఆరు నెలలుగా వందలాది మంది సిబ్బంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డా ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయమని, తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలన్నారు. లేని పక్షంలో కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్లను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. అప్పటికీ స్పందన రాకపోతే జీవీఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామ ని కేకేరాజు హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు, నియోజకవర్గ పరిశీలకులు బాణాల శ్రీనివాసరావు, పేడాడ రమణికుమారి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పల్లా దుర్గారావు, నా యకులు చెన్నా సునీల్, ఎం.సునీల్, బొండా ఉమామహేశ్వరరావు, పీలా ప్రేమ కిరణ్, దేవరకొండ మార్కండేయులు, గోవింద్, చొల్లింగ్ నాగేశ్వర రావు, రమణ్ రెడ్డి, డోప్ప శ్రీను, మువ్వల సంతోష్, హరికృష్ణ, కొట్యాడ సూర్య, పోలిరెడ్డి, అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
నిందితుడు రవీంద్రను ఉరి తీయాలి
మౌనిక తండ్రి వేణుగోపాల్ మహారాణిపేట: ‘నా బిడ్డను అత్యంత క్రూరంగా హత్య చేశాడు. ఈ కష్టం పగవారికి కూడా రాకూడదు’ అంటూ మౌనిక తండ్రి పొలిపల్లి వేణుగోపాల్ కన్నీటిపర్యంతమయ్యారు. మంగళవారం కేజీహెచ్ మార్చురీ వద్ద తన కుమార్తె మృతదేహాన్ని చూసి ఆయన బోరున విలపించారు. తన కుమార్తెను హత్య చేసిన చింతాడ రవీంద్రను ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. హత్య జరిగిన సమయంలో మౌనిక ఒంటిపై ఉన్న సుమారు రెండు తులాల బంగారు ఆభరణాలు మాయమయ్యాయని వేణుగోపాల్ తెలిపారు. ఈ కేసుపై ప్రభుత్వం, పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించి, తమ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని వేడుకున్నారు. -
కందిపప్పు కలేనా.. రాగులు గతమేనా?
మహారాణిపేట: పేదల ఆహార భద్రతకు అండగా ఉండాల్సిన రేషన్ దుకాణాలు ఇప్పుడు అరకొర సరఫరాలతోనే సరిపెట్టుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 22 నెలలు దాటినా, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పూర్తి స్థాయిలో నిత్యావసరాలు అందకపోవడం కార్డుదారుల్లో అసంతృప్తిని పెంచుతోంది. ఎన్నికల ముందు రేషన్ ద్వారా విభిన్న నిత్యావసరాలు అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ప్రస్తుతం బియ్యం, పంచదారకే పరిమితమవుతోందని ప్రజలు విమర్శిస్తున్నారు. అప్పుడప్పుడు మాత్రమే కందిపప్పు, రాగులు పంపిణీ చేస్తూ ‘మూన్నాళ్ల ముచ్చట’గా మార్చేసిందనే ఆవేదన వ్యక్తమవుతోంది. పిండితో సరిపెడుతున్న సర్కార్ బియ్యం, పంచదార తప్ప మరేమీ ఇవ్వకుండానే కాలం గడిపేస్తున్న చంద్రబాబు సర్కార్, తాజాగా పట్టణ ప్రాంతాల్లో రూ. 20లకే గోధుమ పిండి ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటోంది. అయితే, గ్రామీణ ప్రజలకు ఈ సౌకర్యం లేకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పోషకాహారం పేరిట చేస్తున్న ఈ హడావుడి, క్షేత్రస్థాయిలో కేవలం కొందరికి మాత్రమే అందుతోంది. జిల్లాలో పరిస్థితి ఇలా... డీఎస్ఓ పరిధిలో మధురవాడ, ఆనందపురం, భీమిలి, పద్మనాభం, పెందుర్తి ప్రాంతాలు ఉండగా, జిల్లాలో 5.12 లక్షల తెలుపు కార్డులు, 600కు పైగా చౌకధరల దుకాణాలు ఉన్నాయి. అయినప్పటికీ సరఫరా లోపాలు సరిచేయడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేదల ఆశలు... ఇంకా నిరీక్షణలోనే.. గడప గడపకు రేషన్ అని చెప్పిన పాలకులు, ఇప్పుడు రేషన్ షాపుల్లో సరుకులకే కత్తెర వేస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ధరల నేపథ్యంలో, రేషన్ దుకాణాలపై ఆధారపడే కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కందిపప్పు, రాగులు వంటి అవసరమైన వస్తువులు అందకపోవడంతో పేదల భోజనంలో పోషకాహారం తగ్గిపోతోంది. ఇప్పటికై నా అధికారులు, పాలకులు స్పందించి కందిపప్పు, వంటనూనె వంటి నిత్యావసరాలను పునరుద్ధరించాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.రాగులకు ఇండెంట్ లేదు రాగులు మూడు కిలోలు ఇస్తామని చెప్పి చివరకు ఒక కిలోకే పరిమితం చేయడం కార్డుదారుల్లో అసంతృప్తిని పెంచింది. అంతేకాకుండా రాగులు ఇచ్చినప్పుడు బియ్యం కోటాలో కోత విధించడం మరో సమస్యగా మారింది. అది కూడా జనవరి నెల వరకే ఇచ్చారు. ఈనెల రాగులకు ఇండెంట్ పెట్టలేదు. అంటే ఈ నెల ఒక్క కిలో పంపిణీ చేసే అవకాశం లేదు.రేషన్ దుకాణాల్లో నిత్యావసరాల కోసం ఎదురు చూసే కార్డుదారులకు నిరాశే మిగులుతోంది. ఎన్నికల హామీల్లో చెప్పిన కందిపప్పు, రాగులు ఇప్పుడు మూన్నాళ్ల ముచ్చటగా మిగిలిపోగా, నెలల తరబడి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లో అమాంతం పెరిగిన ధరల మధ్య రేషన్పై ఆధారపడే పేదలు కందిపప్పు, రాగుల కోసం కళ్లప్పగించి ఎదురుచూస్తుండటం పరిస్థితి తీవ్రతను చూపుతోంది. కందిపప్పు కోసం కళ్లప్పగింత గత ప్రభుత్వ హయాంలో ప్రతి కార్డుదారుడికి నెలకు ఒక కిలో కందిపప్పు అందించేవారు. ప్రస్తుతం అది గతస్మృతిగా మారింది. ఏప్రిల్లో కూడా కందిపప్పు పంపిణీ చేసే సూచనలు కనిపించడం లేదు. ఇందుకు సంబంధించి ఇండెంట్ కూడా పెట్టకపోవడం గమనార్హం. మార్కెట్లో కందిపప్పు ధరలు రూ.150 నుంచి రూ.180 వరకు పెరగడంతో, సాధారణ ప్రజలకు కొనుగోలు భారంగా మారింది. దీంతో రేషన్ ద్వారా తక్కువ ధరకు లభించే కందిపప్పుపైనే అనేక కుటుంబాలు ఆధారపడుతున్నాయి. -
స్టీల్ప్లాంట్ తల్లీ.. ఇక సెలవు
ఓ కార్మికుడి వీడ్కోలుఉక్కునగరం: విశాఖ ఉక్కు కర్మాగారం రుణం తీర్చుకోలేనిదని స్టీల్ప్లాంట్ కార్మికుడు గొందేశి అప్పలరాజు అన్నారు. స్టీల్ప్లాంట్ రోల్షాప్ అండ్ రిపేర్ షాప్ విభాగానికి చెందిన జనరల్ ఫోర్మెన్ అప్పలరాజు వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ద్వారా మంగళవారం పదవీ విరమణ చేశారు. విభాగంలో సహోద్యోగుల మధ్య జరిగిన కార్యక్రమాల అనంతరం ఆయన ఇంటికి బయల్దేరారు. స్టీల్ప్లాంట్ నుంచి బయటకు వచ్చిన అప్పలరాజు ఉద్వేగానికి లోనయ్యారు. స్టీల్ప్లాంట్ మెయిన్ గేటుకు నమస్కారం చేసి కన్నీటి పర్యంతమయ్యారు. 35 ఏళ్ల తన సేవలను పూర్తి చేసుకుని వెళ్లడం బాధగా ఉందన్నారు. తన కన్న తల్లి తర్వాత తల్లి లాంటి స్టీల్ప్లాంట్ తనకు మంచి జీవితం, కుటుంబాన్ని ఇచ్చిందన్నారు. స్టీల్ప్లాంట్ రుణం తీరుకోలేనిదంటూ భావోద్వేగానికి లోనయ్యారు. సహోద్యోగులు ఆయనను ఓదార్చి ఇంటికి పంపించారు. -
విశాఖ అభివృద్ధికి పెద్దపీట
మహారాణిపేట: రాష్ట్ర బడ్జెట్ విశేషాలు, రంగాల వారీ కేటాయింపులను ప్రజలకు క్షుణ్ణంగా వివరించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి నియోజకవర్గానికి ఒక ఐఏఎస్ అధికారిని నియమించి, వారి ద్వారా బడ్జెట్పై అవగాహన శిబిరాలు ఏర్పాటు చే యాలని మంత్రి సూచించారు. నియోజకవర్గాల వారీ కేటాయింపులపై ప్రత్యేక పీపీటీలు, బుక్లెట్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. 2024–25, 2025–26 ఆర్థిక సంవత్సరాల్లో జీవీఎంసీ, వీఎంఆర్డీఏ పరిధిలో చేపట్టిన ప్రాజెక్టులు, నిధుల వివరాలను ప్రజలకు చెప్పాలన్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్(వీఈఆర్) అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి.. ఇటీవల ఆర్సెల్లార్ మిట్టల్ సంస్థకు శంకుస్థాపన జరిగిందని, త్వరలోనే గూగుల్ సంస్థకు కూడా శంకుస్థాపన జరుగుతుందని వెల్లడించారు. కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో విశాఖ జిల్లాకు విశిష్ట స్థానం ఉందని పేర్కొన్నారు. వీఈఆర్ రీజియన్ కోసం రూపొందించిన 49 ప్రాజెక్టుల్లో 17 ప్రాజెక్టులు విశాఖలోనే రాబోతున్నాయని తెలిపారు. సాస్కి నిధులతో జిల్లాలో మూ డు వర్కింగ్ వుమెన్ హాస్టళ్లను నిర్మిస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, ఎమ్మెల్యేలు గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, పి.విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ తమ అభిప్రాయాలను వెల్లడించారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబత్ర బాగ్చి, జీవీఎంసీ, వీఎంఆర్డీఏ కమిషనర్లు కేతన్ గార్గ్, తేజ్ భరత్, డీఆర్వో ఎం.విశ్వేశ్వరనాయుడు, ఆర్డీవో సంగీత్ మాధుర్, తదితరులు పాల్గొన్నారు. -
మంచి మనసు.. విలువలకు చిరునామా
మహారాణిపేట: తన మృదు స్వభావంతో, అద్భుతమైన పనితీరుతో జిల్లా ప్రజల మనసు గెలుచుకున్న కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ విలువలకి, సేవా భావానికి చిరునామా అని అధికారులు కొనియాడారు. జిల్లా కలెక్టర్గా దాదాపు 20 నెలల పాటు సేవలందించి, బదిలీపై వెళ్తున్న ఆయనకు మంగళవారం నగరంలోని ఒక హోటల్లో అధికారులు ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. కలెక్టర్ దంపతులను ఘనంగా సత్కరించి, జ్ఞాపికలు బహూకరించారు. విశాఖతో మరిచిపోలేని బంధం: ఈ సందర్భంగా కలెక్టర్ హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘విశాఖ జిల్లాలో పని చేసిన ఈ 20 నెలల కాలం నా జీవితంలో మరిచిపోలేనిది. ఇక్కడి ప్రజలతో, అధికారులతో విడదీయరాని అనుబంధం ఏర్పడింది. భయపెట్టి పని చేయించడం నా నైజం కాదు.. అందరి మద్దతు, సహకారంతోనే లక్ష్యాలను సాధించవచ్చని నేను నమ్ముతాను. జిల్లాలో చేపట్టిన ప్రతి కార్యక్రమం మీ అందరి కృషి వల్లే విజయవంతమైంది. యోగాంధ్ర నిర్వహణలో అధికారుల సహకారం మరువలేనిది.’అని అన్నారు. పరిపాలనాపరంగా తనకు సహకరించిన ఆర్డీవోలు, డిప్యూటీ కలెక్టర్లు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ మాట్లాడుతూ.. కలెక్టర్ హరేందిర ప్రసాద్ నుంచి తాము ఎన్నో విషయాలు నేర్చుకున్నామని, ఆయన పరిపాలనా దక్షత తమకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఏయూ వీసీ ప్రొఫెసర్ జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ.. యోగాంధ్ర వంటి కార్యక్రమాల్లో కలెక్టర్ చూపిన చొరవ, నాయకత్వ పటిమ అద్భుతమని కొనియాడారు. కలెక్టర్ సతీమణి దివ్య ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఆయన ఎప్పు డూ చిరాకు పడరు. ఎవరిపై కోప్పడరు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఓపిగ్గా వింటారు. మీరందరూ ఇచ్చి న మద్దతు వల్లే ఆయన ఇంతటి ఉత్తమ పనితీరును ప్రదర్శించగలిగారు’ అని అన్నారు. అంతకుముందు సింహాచలం దేవస్థానం వేద పండితులు కలెక్టర్ దంపతులకు ఆశీర్వచనాలు అందజేశారు. అధికారులు, రెవెన్యూ, ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు కలెక్టర్ దంపతులను ఘనంగా సన్మానించారు. కలెక్టర్ వీడ్కోలు సభలో జిల్లా అధికారులు -
పరుగు పోటీల్లో కండక్టర్ సత్తా
పద్మనాభం: గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈ నెల 30, 31 తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి శాప్ లీగ్ మాస్టర్స్ అథ్లెటిక్ పోటీల్లో అనంతవరం గ్రామానికి చెందిన కొండిమాని రాంబాబు అద్భుత ప్రతిభ కనబరిచారు. సింహాచలం ఆర్టీసీ డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఆయన, ఈ క్రీడల్లో రెండు బంగారు పతకాలు సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. విశాఖ జిల్లా తరపున 35, 45 సంవత్సరాల పురుషుల విభాగాల్లో రాంబాబు పాల్గొన్నారు. 100 మీటర్ల పరుగు పందెం, 4x100 మీటర్ల రిలే పరుగు పందెంలో బంగారు పతకాలను సాధించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వం, ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మరిన్ని జాతీయ స్థాయి పతకాలు సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. కండక్టర్గా విధి నిర్వహణలో ఉంటూనే క్రీడల పట్ల ఆయన చూపుతున్న ఆసక్తిని పలువురు అభినందించారు. -
వైభవంగా పండిత సదస్సు
సింహాచలం: సింహగిరిపై జరుగుతున్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణ మహోత్సవాలు నాలుగో రోజైన మంగళవారం వైభవంగా సాగాయి. ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం వేళ నిర్వహించిన పండిత సదస్సు ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చింది. ఈ సందర్భంగా అప్పన్న ఉత్సవమూర్తి అయిన గోవిందరాజ స్వామిని వేణుగోపాల స్వామి అలంకారంలో ముస్తాబు చేశారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామిని కల్యాణ మండప వేదికపై వేంచేపు చేసి విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం నిర్వహించారు. వేద పండితుల పాండిత్య గోష్టి రాష్ట్రంలోని వివిధ దేవస్థానాల నుంచి వచ్చిన వేద పండితులు తమ పాండిత్యంతో స్వామి వైభవాన్ని కీర్తించారు. చతుర్వేద పారాయణంతో కొలిచారు. అనంతరం దేవస్థానం తరపున ఈవో జె. వెంకటరావు పండితులను ఘనంగా సత్కరించారు. ఈ సదస్సులో తిరుపతి వేదిక్ యూనివర్సిటీకి చెందిన దువ్వూరు ఫణియజ్ఞేశ్వర యాజులుతో పాటు ముష్టి వెంకటేశ్వర ఘనాపాటి, గొల్లపల్లి దత్తాత్రేయ ఘనాపాటి, హనుమజ్ఞుల అమరేశ్వర అవధాని, రతనగంటి కృష్ణమూర్తి, చావలి లక్ష్మీనారాయణ, శివ సుబ్రహ్మణ్య ఘనాపాటి పాల్గొన్నారు. విజయవాడ దేవస్థానం రుగ్వేద పండితులు శ్యావాస మహర్షి ఘనాపాటి, సింహాచలం దేవస్థానం పండితులు సురేష్ ఘనాపాటి, జగన్మోహన్ శర్మ తదితరులు తమ పాండిత్యాన్ని ప్రదర్శించారు. అంతకుముందు ఉదయం 7 గంటలకు కల్యాణ మండపంలో వైదిక సదస్సును నిర్వహించారు. స్వర్ణకవచ అలంకారంలో అప్పన్న కల్యాణోత్సవాల సందర్భంగా మంగళవారం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి స్వర్ణకవచ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సాధారణంగా ప్రతి గురువారం మాత్రమే లభించే ఈ స్వర్ణకవచ దర్శనాన్ని, వార్షిక కల్యాణోత్సవాల్లో పండిత సదస్సు రోజున కూడా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ అద్భుత రూపాన్ని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమాలను దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు పర్యవేక్షించారు. -
భారత్ను సైబర్ నిపుణుల కేంద్రంగా మారుద్దాం
బీచ్రోడ్డు: జాతీయ స్థాయిలో సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించేందుకు సిటిజన్ ఫోర్స్, టెమా, సీఎంఏఐ, సీఎస్ఏఐ సంస్థల మధ్య కీలకమైన ఎంవోయూ కుదిరింది. దేశవ్యాప్తంగా సైబర్ భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడం, యువతకు శిక్షణ, భవిష్యత్తు డిజిటల్ సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా మంగళవారం నగరంలోని ఒక హోటల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఎన్.కె. గోయల్ మాట్లాడుతూ.. ‘భారత్ వేగంగా డిజిటల్ శక్తిగా ఎదుగుతోంది. అయితే డిజిటల్ సేవలు విస్తరించడంతో పాటు సైబర్ ముప్పులు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎక్కువగా మోసపోతున్నారు. ఈ పరిస్థితుల్లో గ్రామ స్థాయి వరకు సైబర్ అవగాహనను తీసుకెళ్లడమే మా లక్ష్యం. ఈ ఎంవోయూ ద్వారా లక్షకు పైగా యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో శిక్షణ ఇస్తాం. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక కోర్సులు రూపొందిస్తాం. తద్వారా భారత్ను ప్రపంచానికి సైబర్ నిపుణులను అందించే కేంద్రంగా తీర్చిదిద్దుతాం’ అని వివరించారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ.. డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు నిత్యకృత్యమవుతున్నాయని, వీటిని అరికట్టేందుకు ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. యువత సోషల్ మీడియా వినియోగంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. సైబర్ భద్రతపై చేపట్టే శిక్షణ కార్యక్రమాలకు పోలీసు శాఖ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. సిటిజన్ ఫోర్స్ ఫౌండేషన్ సీఎండీ పి.రమేష్ బాబు మాట్లాడుతూ.. ఈ ఒప్పందం ద్వారా పాఠశాలలు, కళాశాలలు, కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ విభాగాల్లో విస్తృతంగా సైబర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో నేషనల్ లా యూనివర్సిటీ పూర్వ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ వై.సత్యనారాయణ, సిటిజెన్ ఫోర్స్ ఫౌండర్ డైరెక్టర్ పి.ఉమామహేశ్వరి, శ్రీ విశ్వ విద్యా సంస్థల చైర్మన్ కె.ధర్మరాజు, లెండి ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ పి.మధుసూదనరావు, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కె.శివరామకృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ ఎన్.కె. గోయల్ -
● ఈపీడీసీఎల్లో వినూత్న కార్యక్రమం ● డయల్ యువర్ సీఎండీకి వినతులు ● ఫోన్ కాల్స్ ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్న అధికారులు
సాక్షి, విశాఖపట్నం: ఒక ఫోన్ నంబర్.. 8 వారాలు.. 11 జిల్లాలు.. 11 సర్కిళ్లు.. 345 ఫిర్యాదులు.. వచ్చిన ప్రతి ఫిర్యాదు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు.. మొత్తంగా వినూత్నంగా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ప్రారంభించిన ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమానికి స్పందన వస్తోంది. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి స్వయంగా ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 9 నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి సోమవారం ఫిర్యాదులు తీసుకొని వాటిని పరిష్కరించేందుకు సంబంధిత విభాగాధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. 345 ఫిర్యాదులు.. 35 పెండింగ్ ఇప్పటివరకు 8 వారాల పాటు డయల్యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటివరకు 345 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 310 ఫిర్యాదులను ఈపీడీసీఎల్ అధికారులు పరిష్కరించారు. ఫోన్లో ఫిర్యాదు చేసిన కొద్ది రోజులకే విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది ఆ గ్రామానికి రావడంతో ఈ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెరుగుతూ వస్తోంది. ఎక్కువగా లోవోల్టేజీ సమస్యపై ఫిర్యాదులు అందుతున్నాయి. ఇప్పటివరకు 76 వరకూ లోవోల్టేజీ ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులను ఆపరేషన్స్ డైరెక్టర్ సూర్యప్రకాష్ పర్యవేక్షిస్తూ.. పరిష్కరిస్తున్నారు. 76 ఫిర్యాదుల్లో 62 పరిష్కరించారు. లోవోల్టేజీని అధిగమించేందుకు... 43 ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు మార్చారు. లోవోల్టేజ్ ఉన్న ప్రాంతంలో 7.5 కి.మీ మేర పాత కండక్టర్లు మార్చడం విశేషం. మిస్డ్ కాల్స్పైనా దృష్టి పెడుతున్నాం.. ఈ కార్యక్రమానికి వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకూ ఫిర్యాదులు తీసుకుంటున్నాం. ఒక ఫిర్యాదు తీసుకున్న సమయంలో ఏవైనా మిస్డ్ కాల్స్ ఉంటే.. 11.30 గంటల తర్వాత ఆ నంబర్లకు ఫోన్ చేసి.. ఫిర్యాదులు స్వీకరిస్తున్నాం. ప్రతి సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించాం. విద్యుత్ అంతరాయాలు, వోల్టేజ్ సమస్యలు, కొత్త సర్వీస్ కనెక్షన్ జాప్యం, విద్యుత్ పునరుద్ధరణ, ట్రాన్స్ఫార్మర్ల మార్పిడి వంటి అంశాలను నేరుగా నా దృష్టికి తీసుకురావొచ్చు. –పృథ్వీతేజ్ ఇమ్మడి, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ -
అందుకే చంపేశా.. రూమ్ 102లో ఏం జరిగింది..?
విశాఖపట్నం: రిలేషన్షిప్ పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తూ వేధిస్తుండడంవల్లే మౌనికను నిందితుడు చింతాడ రవీంద్ర హత్యచేసినట్లు సౌత్ ఏసీపీ వై. శ్రీనివాసరావు, గాజువాక సీఐ ఎ. పార్థసారధి వెల్లడించారు. విశాఖలో ఆదివారం తీవ్ర కలకలం రేపిన ఈ సంఘటన వివరాలను సోమవారం వారు మీడియాకు వెల్లడించారు. వారి కథనం ప్రకారం.. విజయనగరం జిల్లా రాజాం ప్రాంతానికి చెందిన చింతాడ రవీంద్ర (29) విశాఖలోని ఇండియన్ నేవీలోని ఐఎన్ఎస్ డేగాలో పెట్టీ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తూ పాత గాజువాక ఎల్వీనగర్లోని కీర్తి ఎన్క్లేవ్లో ఉంటున్నాడు. రవీంద్రకు విజయనగరం జిల్లాకు చెందిన శ్రీలక్ష్మితో ఏడాది క్రితమే వివాహమైంది. మరోవైపు.. తాటిచెట్లపాలెంలోని సంజీవయ్య కాలనీ–1కు చెందిన పోలిపల్లి మౌనిక (31) ఒక ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తూ ఈవెంట్ల నిర్వహణకు వెళ్తుంది. ఆమె తండ్రి వేణుగోపాల్ ప్రైవేట్ ఉద్యోగి. మౌనిక, రవీంద్ర మధ్య మింగిల్ డేటింగ్ యాప్ ద్వారా 2021లో పరిచయం ఏర్పడింది. ఇది రిలేషన్షిప్కు దారితీసింది. పెళ్లి తరువాత కూడా నిందితుడు మౌనికతో రిలేషన్షిప్ కొనసాగిస్తున్నాడు. రవీంద్రకు పెళ్లైన విషయం తెలిసిన తరువాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో.. డబ్బు కోసం రిలేషన్షిప్ విషయాన్ని నిందితుడి భార్యకు చెబుతానంటూ మౌనిక వేధించడం మొదలుపెట్టింది. మౌనికకు రవీంద్ర నగదు ఇస్తున్నా ఇంకా కావాలని ఆమె డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇద్దరికీ సంబంధించిన వీడియోలను రవీంద్ర భార్య శ్రీలక్ష్మికి షేర్ చేయడంతోపాటు ఇంకా రకరకాలుగా ఒత్తిడి పెంచింది. దీంతో మౌనికను హత్యచేయాలని రవీంద్ర నిర్ణయించుకున్నాడు. పక్కా ప్లాన్తో పాశవిక హత్య.. ఈ నేపథ్యంలో.. భార్య పుట్టింటికి వెళ్లడంతో మౌనికను అడ్డు తొలగించుకునేందుకు రవీంద్ర స్కెచ్ వేశాడు. ఇన్స్టామార్ట్ ద్వారా కత్తి కొనుగోలు చేశాడు. స్థానికంగా కొన్ని కవర్లు కొన్నాడు. ఇక ఆదివారం మధ్యాహ్నం మౌనికను తన ఇంటికి పిలిచాడు. 12.30 గంటల సమయంలో ముక్కు, నోరు మూసి ఆమెను హత్యచేశాడు. ఆ తరువాత ఆమె తల, చేతులు, కాళ్లు ముక్కలు ముక్కలుగా కోశాడు. రక్తపు మరకలు లేకుండా శరీర భాగాలను బాత్రూమ్లో శుభ్రంగా కడిగి కవర్లో ప్యాక్ చేశాడు. తల, చేతి భాగాలను ఒక గోనె సంచిలో, ఇతర భాగాలను క్లాత్ సూట్కేసులోను పెట్టాడు. కొన్నింటిని ఫ్రిజ్లో పెట్టాడు. అనంతరం అడవివరం రోడ్లోని ధారపాలెం వద్ద నిర్జన ప్రదేశానికి కారులో వెళ్లి తల, చేతి భాగాలను పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఆ తర్వాత తన స్నేహితుడికి ఫోన్చేసి మౌనికను హత్యచేసినట్లు చెప్పాడు. అతని సూచన మేరకు పోలీస్స్టేషన్కు వెళ్లి రవీంద్ర లొంగిపోయాడు. తల, చేతి భాగాలను కాల్చేసిన స్థలానికి నిందితుడు రవీంద్రను పోలీసులు తీసుకెళ్లి శాంపిల్స్ సేకరించారు. కవర్లో పెట్టి ఇంట్లో ఫ్రిజ్లో ఉంచిన శరీర భాగాలను కేజీహెచ్కు తరలించారు. -
అనంత జ్ఞాన వాహిని ఆంధ్ర విశ్వవిద్యాలయం
మద్దిలపాలెం: ఆంధ్రవిశ్వవిద్యాలయం అనంత జ్ఞాన వాహిని అని, ఈ వర్సిటీ శతాబ్ది ప్రస్థానం ఒక జ్ఞాన ప్రవాహమని పలువురు ఉపకులపతులు కొనియాడారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా బీచ్రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో వీసీల ప్యానల్ డిస్కషన్(మేధోమథనం) నిర్వహించారు. గడిచిన వందేళ్లలో ఏయూ నుంచి వివిధ విశ్వవిద్యాలయాలకు వీసీలుగా సేవలందించిన వారిని ఒకే వేదికపైకి ఆహ్వానించారు. ‘ఏయూ ఎట్ 100–ఫ్రం లెగసీ టు గ్లోబల్ ఇంపాక్ట్’థీమ్తో ఈ సదస్సును నిర్వహించారు. తొలి ప్యానెల్లో ‘యూనివర్సిటీస్ ఇన్ ద గ్లోబల్ నాలెడ్జ్ ఎకోసిస్టమ్–ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ ఇండస్ట్రీ కొలాబరేషన్’అంశంపై జరిగిన చర్చకు ఏయూ మాజీ వీసీ ఆచార్య జీఎస్ఎన్ రాజు మోడరేటర్గా వ్యవహరించారు. ఆచార్య వీఎస్ఆర్కే ప్రసాద్, జీవీఆర్ శ్రీనివాసరావు, ఎస్.రామకృష్ణారావు, జి.నాగేశ్వరరావు, వై.సత్యనారాయణ, వి.కేశవరావు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. రెండో ప్యానెల్లో ‘స్టేట్ పబ్లిక్ వర్సిటీస్–కీ చాలెంజెస్ అండ్ ద వే ఫార్వర్డ్’అంశంపై జరిగిన చర్చకు ఆచార్య నాగార్జున వర్సిటీ మాజీ వీసీ ఆచార్య వి.బాలమోహన్దాస్ మోడరేటర్గా వ్యవహరించారు. ఇందులో ఆచార్య ఎ.రాజేంద్రప్రసాద్, సి.వి.రాఘవులు, ఎ.వి.ప్రసాదరావు, ఎస్.వి.సుధాకర్, ఎం.జగన్నాథరావు, కె.ఆర్.రజని, కె.నిరుపమ రాణి, ఆర్.సుదర్శనరావు పాల్గొన్నారు. ఇది ప్రపంచ రికార్డు : ఈ సందర్భంగా ఏయూ వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ మాట్లాడుతూ ఏయూలో పనిచేసిన 50 మంది ఆచార్యులు విభిన్న వర్సిటీలకు వీసీలుగా సేవలందించడం గర్వకారణమన్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి, ప్రపంచ వేదికపై సత్తా చాటాల్సిన అవసరం ఉందన్నారు. ఏయూ మాజీ వీసీ, సెంచూరియన్ వర్సిటీ చాన్సలర్ ఆచార్య జీఎస్ఎన్ రాజు మాట్లాడుతూ సర్ సి.ఆర్.రెడ్డి దార్శనికత, సర్వేపల్లి రాధాకృష్ణన్ మార్గదర్శనంలో ఏయూ విరాజిల్లిందన్నారు. అత్యుత్తమ బోధన, విశిష్ట పరిశోధనలు, నవ్య ఆవిష్కరణలతో పాటు పరిశ్రమల అనుసంధానంతో ఉత్పత్తుల రూపకల్పన జరగాలని సూచించారు. ఆచార్య నాగార్జున వర్సిటీ మాజీ వీసీ ఆచార్య వి.బాలమోహన్ దాస్ మాట్లాడుతూ ఒకే విశ్వవిద్యాలయం నుంచి 50 మంది ఆచార్యులు వీసీలుగా ఎదగడం ప్రపంచ రికార్డు అని అన్నారు. ఏయూ తొలి ముగ్గురు వీసీలు 30 ఏళ్లకు పైగా పరిపాలన చేశారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా పూర్వ వీసీలు రచించిన 100 పుస్తకాలను ఏయూకు బహూకరించారు. వివిధ విశ్వవిద్యాలయాలకు వీసీలుగా సేవలందించిన ఆచార్యులు ఆర్.మాధవి, ఎల్.వేణుగోపాలరెడ్డి, బీల సత్యనారాయణ, జె.వి.ప్రభాకరరావు, డి.సూర్యప్రకాశరావు, పి.జార్జి విక్టర్, ఎ.రామారావు, జి.సుబ్రహ్మణ్యం, నిమ్మ వెంకటరావు, జి.జ్ఞానమణి తదితరులను ఈ సందర్భంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. రెక్టార్ ఆచార్య పి.కింగ్, డీన్లు ఆచార్య కె.రమాసుధ, పి.శ్యామల, సాలమన్ బెన్నీ, నాగ హనుమాన్ పాల్గొన్నారు. ప్యానెల్ చర్చల ముఖ్యాంశాలతో కూడిన నివేదికను వర్సిటీకి సమర్పించనున్నారు. -
సరదా కోసం వెళ్తే.. ప్రాణం పోయింది
రిజర్వాయర్లో పడి ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం ఆనందపురం: గంభీరం రిజర్వాయర్లో ఆదివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఒక ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాలివి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం కాగిత గ్రామానికి చెందిన మలిరెడ్డి నితిన్ (20), తగరపువలసలోని అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్డీ మూడ వ సంవత్సరం చదువుతున్నాడు. మధురవాడలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉంటున్న నితిన్.. ఆదివారం మధ్యాహ్నం హాస్టల్ అధికారులకు సమాచారం ఇవ్వకుండా తన స్నేహితులతో కలిసి ఆటోలో గంభీరం రిజర్వాయర్ సందర్శనకు వెళ్లాడు. రిజర్వాయర్లో స్నేహితులు ఈతకు దిగగా, నితిన్ ఒడ్డున ఉన్న సిమెంట్ గోడపై కూర్చున్నాడు. ఈ క్రమంలో అదుపు తప్పి నీటిలో పడిపోయాడు. గమనించిన స్నేహితులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అపస్మారక స్థితిలో ఉన్న నితిన్ను బయటకు తీసి, 108కు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని నితిన్ను పరీక్షించి.. అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. మృతుడి సోదరుడు మలిరెడ్డి దీక్షిత్ ఫిర్యాదు మేరకు ఆనందపురం పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం కేజీహెచ్లో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. చేతికి అందొచ్చిన కుమారుడు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆ కుటుంబంలో విషాద చాయలు అలముకున్నాయి. ఎస్ఐ పి.శివ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వద్దు
మహారాణిపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా ప్రజల నుంచి వచ్చే వినతులకు సకాలంలో, నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులను జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో ఆమె పాల్గొని అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా.. ప్రజల నుంచి మొత్తం 294 వినతులు అందాయి. ఇందులో అత్యధికంగా జీవీఎంసీకి సంబంధించి 69, రెవెన్యూ విభాగానికి 50, పోలీస్ శాఖకు 30 వినతులు రాగా, ఇతర అన్ని శాఖలకు కలిపి మరో 145 దరఖాస్తులు వచ్చాయి. జాయింట్ కలెక్టర్తో పాటు డీఆర్వో ఎం.విశ్వేశ్వరనాయుడు వినతులు స్వీకరించి, సంబంధిత అధికారులకు బదలాయించారు. -
మూలపేట పోర్టు పనులు వేగవంతం చేయాలి
మహారాణిపేట: శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమవారం చలో మూలపేట’ కార్యక్రమం భారీ ఎత్తున జరిగింది. మద్దిలపాలెం కృష్ణ కాలేజ్ రోడ్డులోని పార్టీ కార్యాలయం వద్ద పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు కే.కే.రాజు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించగా, పార్టీ శ్రేణులు భారీ కాన్వాయ్తో మూలపేటకు తరలివెళ్లాయి. ఈ సందర్భంగా కె.కె.రాజు మాట్లాడుతూ తీర ప్రాంత అభివృద్ధికి మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పునాదులు వేశారని, భోగాపురం ఎయిర్పోర్టు వంటి ప్రాజెక్టుల విషయంలో ప్రస్తుత ప్రభుత్వం ‘క్రెడిట్ చోరీ’కి పాల్పడుతోందని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి లక్ష్యంగా రూ.4,361.91 కోట్లతో 2023లో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేశారని రాజు గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ హయాంలోనే 70 శాతం పనులు పూర్తయ్యాయని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధిని విస్మరించి, ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందడం చంద్రబాబుకు ఇష్టం లేదని ఆరోపించారు. మూలపేట పోర్టు జగనన్న సంకల్పమని, మిగిలిన 30 శాతం పనులు పూర్తి చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. నౌపడ మూడు రోడ్ల జంక్షన్ సమీపంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సమన్వయకర్తలు మళ్ల విజయ ప్రసాద్, మొల్లి అప్పారావు, తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, శోభా హైమవతి, ముఖ్యనేతలు కట్టమూరి సతీష్, కోలా గురువులు, పేడాడ రమణి కుమారి, కొండా రాజీవ్ గాంధీ, తాడి జగన్నాథ రెడ్డి తదితర భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, అనుబంధ విభాగాల నేతలు పాల్గొన్నారు. చలో మూలపేటతో వైఎస్సార్సీపీ గర్జన -
గ్యాస్ మంట
ఆదర్శనగర్లో హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ వద్ద ఖాళీ సిలిండర్లతో వినియోగదారుల క్యూ బొగ్గుల పొయ్యే దిక్కు నేను ఇండేన్ గ్యాస్ కోసం రెండు వారాల కిందట బుక్ చేశాను. ఇంకా రాలేదు. ఏజెన్సీకి వెళ్తే 30వ తేదీన రమ్మని స్లిప్ ఇచ్చారు. దీంతో ఈ రోజు ఉదయమే ఇక్కడికి వచ్చాను. ఇంట్లో గ్యాస్ అయిపోవడంతో గత కొన్ని రోజులుగా బొగ్గుల పొయ్యిపైనే వంట చేసుకుంటున్నాం. – అప్పన్న, వినియోగదారుడు, ఆరిలోవ -
సర్పంచులకు చెక్
మహారాణిపేట: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల సర్పంచుల పదవీకాలం ముగియడానికి ముందే కూటమి ప్రభుత్వం వారి అధికారాలపై ఆంక్షలు విధించడం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఏప్రిల్ 2వ తేదీతో సర్పంచుల గడువు ముగియనుండగా, నిధుల వినియోగంపై ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలులోకి తెచ్చింది. ఇప్పటివరకు స్వేచ్ఛగా చెక్కులు జారీ చేసిన సర్పంచులు, ఇప్పుడు వాటిని నేరుగా వినియోగించలేని పరిస్థితి ఏర్పడింది. చెక్కుల మంజూరు అధికారాన్ని డివిజన్ లెవల్ డెవలప్మెంట్ ఆఫీసర్ల (డీఎల్డీవో) చేతుల్లోకి మార్చింది. డీఎల్డీవోల చేతుల్లోకి ఆర్థిక పగ్గాలు : ఇప్పటివరకు గ్రామ అవసరాల కోసం సర్పంచులు స్వేచ్ఛగా చెక్కులు జారీ చేసే అవకాశం ఉండేది. అయితే నిధుల దుర్వినియోగం జరుగుతుందనే అనుమానంతో ప్రభుత్వం ఈ అధికారాలను పరిమితం చేసింది. ఇకపై సర్పంచులు జారీ చేసే ప్రతి చెక్కును డీఎల్డీవో ఆమోదించడం తప్పనిసరి. పంచాయతీ కార్యదర్శులు నేరుగా చెక్కులను ప్రాసెస్ చేయకుండా, డీఎల్డీవోల అనుమతి పొందిన తర్వాతే నిధులు విడుదలయ్యేలా నిబంధనలు మార్చారు. దీంతో క్షేత్రస్థాయిలో సర్పంచుల పాత్ర కేవలం నామమాత్రంగా మారిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ కక్షసాధింపేనా? : జిల్లాలోని 79 గ్రామ పంచాయతీల్లో అత్యధిక శాతం సర్పంచులు వైఎస్సార్సీపీ మద్దతుదారులే ఉండడంతో.. వారిని ఇబ్బంది పెట్టేందుకే ప్రభుత్వం కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పదవీకాలం ముగిసే చివరి నిమిషంలో ఇలాంటి ఆంక్షలు విధించడం సర్పంచులను అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 3 నుంచి ‘స్పెషల్’ పాలన : జిల్లాలోని పంచాయతీల రూపురేఖలు ఏప్రిల్ 3 నుంచి మారనున్నాయి. భీమిలి మండలం రేఖవానిపాలెం మినహా (దీనికి ఇంకా ఏడాది గడువు ఉంది), మిగిలిన 78 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగనుంది. ఏప్రిల్ 2వ తేదీ అర్ధరాత్రితో సర్పంచుల పదవీ కాలం ముగియనుండటంతో, మరుసటి రోజు నుంచే పగ్గాలు చేపట్టేందుకు 78 మంది స్పెషల్ ఆఫీసర్ల నియామక ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. -
గ్యాస్ మంట
శ్రీకాంత్నగర్ రోడ్డులో ఇండేన్ గ్యాస్ కోసం మండుటెండలో బారులుదీరిన వినియోగదారులు, ఆదర్శనగర్లో ఎదురుచూపులుఆరిలోవ: నగరంలో వంట గ్యాస్ కోసం సామాన్యుల ఇబ్బందులు వర్ణనాతీతంగా మారుతున్నాయి. గత నెల రోజులుగా గ్యాస్ సిలిండర్ల సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో వినియోగదారులు ఏజెన్సీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఆదర్శనగర్లోని హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సిలిండర్ల కోసం ఎన్ని రోజులు నిరీక్షించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన వినియోగదారులు ఏజెన్సీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఎండలో గంటల తరబడి నిరీక్షణ నగరంలోని ఆరిలోవ, ఆదర్శనగర్, రవీంద్రనగర్, విశాలాక్షినగర్ తదితర ప్రాంతాల్లో నెల రోజులుగా గ్యాస్ కొరత వేధిస్తోంది. హెచ్పీ, ఇండేన్, భారత్ గ్యాస్ ఏజెన్సీల్లో బుకింగ్ చేసుకుని 15 రోజులు గడుస్తున్నా డెలివరీ కావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో విసిగిపోయిన జనం ఖాళీ సిలిండర్లతో నేరుగా ఏజెన్సీల వద్దకు చేరుకుని క్యూ కడుతున్నారు. మండుటెండలో గంటల తరబడి వేచి చూస్తే తప్ప గ్యాస్ లభించని పరిస్థితి నెలకొంది. ఏజెన్సీ కార్యాలయాల వద్దకు వెళ్తే.. సిబ్బంది బుకింగ్ మెసేజ్లను చూసి, ఒక నిర్దిష్ట తేదీతో కూడిన స్లిప్పులను ఇస్తున్నారు. ఆ తేదీన స్టాక్ పాయింట్ వద్దకు ఖాళీ సిలిండర్లతో వెళ్తేనే గ్యాస్ ఇస్తామని చెబుతుండటంతో వినియోగదారులకు తిప్పలు తప్పడం లేదు. గ్యాస్ కోసం కొందరు తమ ఉద్యోగాలకు సైతం సెలవు పెట్టాల్సి వస్తోందని వాపోతున్నారు. సిబ్బందితో వాగ్వాదం : సోమవారం ఆదర్శనగర్లోని హెచ్పీ, ఇండేన్ ఏజెన్సీల వద్ద పరిస్థితి గందరగోళంగా మారింది. బుక్ చేసి పక్షం రోజులు దాటినా సిలిండర్లు ఎందుకు పంపడం లేదని వినియోగదారులు సిబ్బందిని నిలదీశారు. వాగ్వాదం పెరగడంతో విషయం తెలుసుకున్న ఆరిలోవ పోలీసులు అక్కడికి చేరుకుని వినియోగదారులకు సర్దిచెప్పడంతో శాంతించారు. కట్టెల పొయ్యే దిక్కు గ్యాస్ కష్టాలతో వ్యాపారాలు విలవిల జిల్లాలో గత కొద్ది రోజులుగా నెలకొన్న కమర్షియల్ గ్యాస్ కొరత వ్యాపార రంగంపై, ముఖ్యంగా ఆహార పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. హోటళ్లు, రెస్టారెంట్లు నడపడం యజమానులకు పెనుభారంగా మారింది. సిలిండర్లు సకాలంలో అందుబాటులో లేకపోవడంతో అనేక మంది వ్యాపారులు తమ హోటళ్లను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆధునిక కాలంలో గ్యాస్ పొయ్యిలపై వేగంగా వంటలు చేయాల్సిన చోట, గత్యంతరం లేక మళ్లీ కట్టెల పొయ్యిలను ఆశ్రయించాల్సి వస్తోంది. పొగ సెగలను భరిస్తూ, వంటలు సిద్ధం చేయడం హోటల్ కార్మికులకు కష్టతరంగా మారుతోంది. ఒకవైపు పెరుగుతున్న ఖర్చులు, మరోవైపు గ్యాస్ దొరకని కారణంతో హోటల్ యజమానులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ కొరత ఇలాగే కొనసాగితే జిల్లాలో మరిన్ని హోటళ్లు మూతపడే ప్రమాదం ఉందని, తక్షణమే అధికారులు స్పందించి గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని వ్యాపార వర్గాలు కోరుతున్నాయి. -
ఉగాదులు వెళ్లినా.. ఉషస్సులేవీ?
సాక్షి, విశాఖపట్నం: పీ–4 విధానంతో సమాజంలో అట్టడుగున ఉన్న పేద కుటుంబాలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చి.. బంగారు కుటుంబాలుగా మారుస్తామంటూ బీరాలు పలుకుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. వారి జీవితాల్లో వెలుగులు నింపకుండానే సంబరాలు చేసుకుంటోంది. ఇప్పటికే పలు దఫాలుగా సర్వేలు నిర్వహించి 2 లక్షలకు పైగా కుటుంబాలను గుర్తించిన ప్రభుత్వం.. మళ్లీ అందులో వడపోత కోసం రీ–సర్వే పేరుతో పేదోడి ఇంటిపై బంగారు కత్తి వేలాడదీసింది. ఫలితంగా ఆ సంఖ్యను లక్షకు కుదించేసింది. 2024 అక్టోబర్లో పీ–4 ప్రారంభించినప్పుడు.. ‘వచ్చే ఉగాది నాటికి పేద కుటుంబాల్లో వెలుగులు నింపుతాం’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలు గుప్పించారు. ఇప్పటికి రెండు ఉగాదులు గడిచిపోయినా ఆ కుటుంబాల్లో నేటికీ మార్పు కనిపించడం లేదు. పేదలను ఆదుకునేందుకు మార్గదర్శులు ముందుకు రావాలని ప్రభుత్వం పిలుపునిస్తున్నా.. సర్కారుపై నమ్మకం లేని సంపన్న వర్గాలు మొహం చాటేస్తున్నాయి. దీంతో కనీసం అధికారులు, ప్రజాప్రతినిధులైనా మార్గదర్శులుగా మారి పేదలను దత్తత తీసుకోవాలని ప్రభుత్వం హుకుం జారీ చేసింది. దీంతో జిల్లా యంత్రాంగం మల్లగుల్లాలు పడుతూ మార్గదర్శులను ఎంపిక చేసినా.. ఈ పథకం క్షేత్రస్థాయిలో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం ఇప్పుడు విజయోత్సవ సంబరాల పేరిట హడావుడి చేస్తుండటం కొసమెరుపు. పేదలను ఆదుకునేందుకే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్షిప్(పీ–4) విధానాన్ని తీసుకొచ్చామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం.. అమల్లో మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. సమాజంలో అట్టడుగున ఉన్న 20 శాతం కుటుంబాలకు, మొదటి 20 శాతం ఉన్న సంపన్న కుటుంబాల ద్వారా సాయమందించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ప్రకటించారు. దీనిపై మంత్రులు, అధికారులు సమీక్షల పేరిట మొదట్లో చేసిన హడావుడి అంతా ఇంత కాదు. ఇప్పటికే సచివాలయాల వారీగా సర్వేలు నిర్వహించి, జిల్లాలో లక్షకు పైగా బంగారు కుటుంబాలను గుర్తించారు. వీరికి సంపన్నుల నుంచి ఆర్థిక తోడ్పాటు అందిస్తామంటూ 2024 ఆగస్టులోనే మంత్రులు, అధికారులు ప్రకటనలు చేశారు. అయితే, నెలలు గడుస్తున్నా నేటికీ ఏ ఒక్క పేద కుటుంబానికి కూడా భరోసా దక్కలేదు. ప్రచార ఆర్భాటం తప్ప క్షేత్రస్థాయిలో లబ్ధి చేకూరకపోవడంతో పేద వర్గాల్లో నిరాశ వ్యక్తమవుతోంది. స్క్రిప్ట్డ్ సక్సెస్ స్టోరీలు విఫలమైన పథకాన్ని విజయవంతమైనట్లు చూపడానికి ప్రభుత్వం ప్రతి జిల్లాలోనూ విజయోత్సవాలు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో జిల్లా అధికారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. చివరికి దత్తత తీసుకున్నట్లు ప్రకటించిన కొన్ని కుటుంబాలకు.. వేదికపై ఎలా మాట్లాడాలి? ఏం చెప్పాలి? అనే అంశాలపై ముందుగానే శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 7 వేల మంది మార్గదర్శులు ఉంటే, కేవలం 20 మందికి మాత్రమే అవార్డులు ఇస్తుండటం చూస్తుంటే.. అసలు ఆ కుటుంబాలకు ఎంతమేర సాయం అందుతుందో అర్థమవుతోంది. ఏ కోణంలో చూసినా పీ–4 విఫలమైందని స్పష్టమవుతున్నా, సంబరాలు చేసుకోవడంపై జిల్లా అధికారులే విస్తుపోతున్నారు. ప్రభుత్వం ఏదో మేలు చేస్తుందని భావించిన నిరుపేదలకు నిరాశే మిగులుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో వేడుకలు నిర్వహిస్తే ప్రజల ముందు అభాసుపాలవుతామని కొందరు అధికారులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. వడపోతలతో పేదల సంఖ్య తగ్గింపు2024 అక్టోబర్ 2న పీ–4ను ప్రారంభిస్తూ, 2025 ఉగాది నాటికి బంగారు కుటుంబాలకు సాయం అందిస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. అయితే, క్షేత్రస్థాయిలో ఆశించిన స్పందన రాకపోవడంతో.. ప్రభుత్వం పునఃసర్వే పేరుతో పదే పదే వడపోతలు చేస్తూ లబి్ధదారుల సంఖ్యను క్రమంగా తగ్గించింది. ఫలితంగా మొదట గుర్తించిన భారీ సంఖ్య కాస్త ప్రస్తుతం 1,05,126 కుటుంబాలకు పడిపోయింది. ఈ కుటుంబాలను ఆదుకునేందుకు మార్గదర్శులుగా సంపన్నులను గుర్తించే బాధ్యతను ప్రభుత్వం జిల్లా అధికారులపై నెట్టింది. అయితే, ఇప్పటివరకు జిల్లాలో కేవలం 7 వేల మంది మార్గదర్శులను మాత్రమే గుర్తించగలిగారు. వీరిలో పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు ఉన్నప్పటికీ, సాయం చేసే విషయంలో వారు పెద్దగా ఆసక్తి చూపడం లేదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివరికి సంపన్నుల నుంచి స్పందన లేకపోవడంతో.. కనీసం ప్రజాప్రతినిధులైనా కుటుంబాలను దత్తత తీసుకోవాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. విఫల పథకానికి విజయోత్సవాలా? పీ–4 పథకం ప్రారంభించి ఏడాదిన్నర గడిచినా, కాగితాలపై కనిపిస్తున్న హడావుడి క్షేత్రస్థాయిలో ఎక్కడా సక్సెస్ కాలేదు. అధికారులే ఇది అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్టు అని చేతులెత్తేసినా, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఏదో విధంగా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూనే ఉంది. జిల్లాలో గుర్తించిన 1,05,126 కుటుంబాల్లో కేవలం 66 వేల కుటుంబాలనే దత్తత తీసుకోవడం పథకం డొల్లతనాన్ని చాటుతోంది. పోనీ వారి జీవితాల్లో అయినా.. మార్పులు తీసుకొచ్చారా అంటే అదీ లేదు. లక్షకు పైగా కుటుంబాలకు కేవలం 7 వేల మంది మార్గదర్శులు మాత్రమే ముందుకు రావడం గమనార్హం. ఇందులోనూ కొందరు వ్యాపారవేత్తలను బలవంతంగా మార్గదర్శులుగా చేర్పించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
డ్రగ్స్ ఫ్రీ విశాఖ లక్ష్యంగా పని చేయాలి
ఏయూక్యాంపస్: మాదక ద్రవ్యాల రహిత విశాఖను నిర్మించడమే లక్ష్యంగా డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం బీచ్ రోడ్డులో 5కే రన్ నిర్వహించారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఈ ర్యాలీని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్, నేవీ అధికారి సంజీవ్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ మాఫియాకు బలైన డీవైఎఫ్ఐ నాయకుడు పెంచలయ్య స్ఫూర్తితో ఈ చైతన్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువతే లక్ష్యంగా సాగుతున్న ఈ మాఫియా వల్ల అనేకమంది తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, ముఖ్యంగా యువతులకు రక్షణ కరువవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు సరైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పుడే ఇటువంటి సామాజిక రుగ్మతలకు అడ్డుకట్ట వేయగలమని ఆయన అభిప్రాయపడ్డారు. ‘గంజాయి లేని విశాఖను నిర్మించుకుందాం.. యువతరాన్ని కాపాడుకుందాం’ అన్న నినాదంతో మున్ముందు కూడా పోరాటాలు సాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అజయ్, వెంకటరమణ, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజు, మహేష్తో పాటు కుసుమాంజలి, కౌశిక్, మౌనిక, నరేష్, సంజయ్, ప్రసాద్, రాజా, శ్రీను తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
‘తమ్ముళ్ల’ తన్నులాట
తగరపువలస: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం వేళ భీమిలి నియోజకవర్గంలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. లక్ష్మీపురం పంచాయతీకి చెందిన రెండు వర్గాల కార్యకర్తలు రక్తమోడేలా రాళ్లతో కొట్టుకున్నారు. ఆదివారం మజ్జివలస కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మొదటి నుంచి టీడీపీలో ఉన్న చెందిన కనకల సూరిబాబు వర్గం, గత ఎన్నికల ముందు టీడీపీలో చేరిన గాడు తాతినాయుడు, జెడ్పీటీసీ సభ్యుడు గాడు వెంకటప్పడు వర్గం ఒకేసారి విగ్రహం వద్దకు చేరుకున్నాయి. పార్టీ మండల అధ్యక్షుడు సరగడ అప్పారావుతో ముందుగా దండ వేయించాలని తాతినాయుడు వర్గం వేచి ఉండగా, సూరిబాబు వర్గం పూలమాలలు వేసేందుకు ముందుకు వచ్చింది. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం పెరిగి భౌతిక దాడికి దారితీసింది. సుమారు అరగంట పాటు సాగిన ఈ ఘర్షణలో రాళ్లు రువ్వుకోవడంతో కనకల సూరిబాబుకు తల పగిలి తీవ్ర రక్తస్రావమైంది. అలాగే తాతినాయుడు వర్గానికి చెందిన మొకర శంకరరావుకు పన్ను విరిగిపోయింది. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల మధ్య ఘర్షణ కనకల సూరిబాబు వర్గం ఎంపీ శ్రీభరత్, మండల మాజీ అధ్యక్షుడు డీఏఎన్ రాజు అనుచరులుగా ఉండగా.. తాతినాయుడు వర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుచరులుగా చలామణి అవుతున్నారు. ఏడాది కిందట పార్టీ మండల అధ్యక్షుడి నియామకం సందర్భంగా పార్టీ నిలువుగా చీలిపోయింది. గత ఐదేళ్లూ పార్టీలో లేని వారు ఇప్పుడు వచ్చి తమను అడ్డుకోవడంపై సూరిబాబు వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాగా, ఎంపీ, ఎమ్మెల్యేలు ఈ గొడవలను సర్దుబాటు చేయకుండా విద్వేషాలు పెంచి పోషిస్తున్నారని మిగిలిన టీడీపీ నాయకులు వాపోతున్నారు. పార్టీ అధిష్టానం కల్పించుకోకపోతే తమ దారి తాము చూసుకుంటామని సూరిబాబు వర్గం హెచ్చరిస్తోంది. -
నేడు టిడ్కో గృహప్రవేశాలు
మహారాణిపేట: జిల్లాలో ఆంధ్రప్రదేశ్ పట్టణ నివాస సముదాయాల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(ఏపీ టిడ్కో) ఆధ్వర్యంలో సోమవారం గృహాల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా రూ.323 కోట్ల వ్యయంతో నిర్మించిన 3,600 పైగా గృహాలను ప్రారంభించి, అర్హులైన లబ్ధిదారులకు అప్పగిస్తామని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. కొమ్మాది వద్ద రూ.30.55 కోట్లతో నిర్మించిన 336 ఇళ్లు, మంత్రిపాలెం వద్ద రూ.33.60 కోట్లతో నిర్మించిన 336 ఇళ్లు, తలారివానిపాలెం, దువ్వాడ, పెదగంట్యాడ ప్రాంతాల్లో రూ.253.88 కోట్ల వ్యయంతో నిర్మించిన 2,928 ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తామని టిడ్కో ఈఈ సుధాకర్ తెలిపారు. -
మరికొంతకాలం ప్రత్యేక రైళ్లు
తాటిచెట్లపాలెం: వేసవి సీజన్ ప్రారంభమైన వేళ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను మరో మూడు నెలల పాటు పొడిగిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ● ప్రతి మంగళవారం బయలుదేరే విశాఖపట్నం–షాలిమర్(08508) స్పెషల్ రైలును జూన్ 30 వరకు, షాలిమర్–విశాఖపట్నం (08507) స్పెషల్ను జూలై 1వ తేదీ వరకు పొడిగించారు. ● దువ్వాడ మీదుగా ప్రయాణించే సంబల్పూర్–ఈరోడ్(08311) వీక్లీ స్పెషల్ను మే 27వ తేదీ వరకు, ఈరోడ్–సంబల్పూర్ (08312) వీక్లీ స్పెషల్ను మే 29వ తేదీ వరకు పొడిగించారు. ● దువ్వాడ మీదుగా ప్రయాణించే భువనేశ్వర్–యశ్వంత్పూర్(02811) వీక్లీ ఏసీ స్పెషల్ను జూన్ 27వ తేదీ వరకు, యశ్వంత్పూర్–భువనేశ్వర్ (02812) వీక్లీ ఏసీ స్పెషల్ను జూన్ 29వ తేదీ వరకు పొడిగించారు. ● విజయనగరం మీదుగా ప్రయాణించే యశ్వంత్పూర్–కతిహార్(06571) వీక్లీ ఏసీ స్పెషల్ను జూలై 14వ తేదీ వరకు, కతిహార్–యశ్వంత్పూర్ (06572) వీక్లీ ఏసీ స్పెషల్ను జూలై 17వ తేదీ వరకు పొడిగించారు. ● దువ్వాడ మీదుగా ప్రయాణించే ఎస్ఎంవీ బెంగళూరు–మాల్డా టౌన్(06565) స్పెషల్ రైలును జూలై 12వతేదీ వరకు,మాల్డా టౌన్– ఎస్ఎంవీ బెంగళూరు(06566) స్పెషల్ను జూలై 15వ తేదీ వరకు పొడిగించారు. -
మధ్యవర్తిత్వ పోటీల్లో ముంబై లా వర్సిటీ విజయం
సబ్బవరం: దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో మూడు రోజుల పాటు జరిగిన డీవీ సుబ్బారావు రెండో జాతీయ మధ్యవర్తిత్వ పోటీలు శనివారం ఘనంగా ముగిశాయి. దేశవ్యాప్తంగా వివిధ న్యాయ విశ్వవిద్యాలయాల నుంచి 23 జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్లో ముంబైకి చెందిన మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ జట్టు ప్రథమ స్థానంలో నిలిచి విజేతగా ఆవిర్భవించగా, ఒడిశా నేషనల్ లా యూనివర్సిటీ జట్టు ద్వితీయ స్థానాన్ని కై వసం చేసుకుంది. ఈ ముగింపు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ న్యాయపతి విజయ్, జస్టిస్ చల్లా గుణరంజన్, ప్రొఫెసర్ ఆర్. వెంకటరావు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జస్టిస్ చల్లా గుణరంజన్ మాట్లాడుతూ తమ విద్యార్థి దశలో ఇలాంటి ప్రాక్టికల్ పోటీలు లేవని, ప్రస్తుతం లభిస్తున్న ఇటువంటి అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకుని నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. జస్టిస్ న్యాయపతి విజయ్ మాట్లాడుతూ ఈ తరహా పోటీలు న్యాయ విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు. ప్రొఫెసర్ ఆర్. వెంకటరావు మాట్లాడు తూ, ప్రముఖ న్యాయవాది, మాజీ బార్ కౌన్సిల్ ఛైర్మన్ డీవీ సుబ్బారావు పేరుతో ఈ పోటీలు నిర్వహించడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో వర్సిటీ ఉపకులపతి ఆచార్య డి. సూర్యప్రకాశరావు, రిజిస్ట్రార్ డాక్టర్ విశ్వచంద్రనాథ్ మదాసు, ఫ్యాకల్టీ కన్వీనర్ డాక్టర్ సుధా తదితరులు పాల్గొన్నారు. -
నూతన కలెక్టర్గా అభిషిక్త్ కిషోర్
ప్రస్తుత కలెక్టర్ హరేందిర ప్రసాద్ కాకినాడ జిల్లాకు బదిలీ మహారాణిపేట: జిల్లా కలెక్టర్గా సీనియర్ ఐఏఎస్ అధికారి ముత్తంబకు అభిషిక్త్ కిషోర్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఆయనను విశాఖ కలెక్టర్గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ను కాకినాడ జిల్లాకు బదిలీ చేశారు. నూతన కలెక్టర్ కిషోర్ త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. హరేందిర ప్రసాద్ సేవలు 22 నెలల పాటు కలెక్టర్గా హరేందిర ప్రసాద్ విశేష సేవలు అందించారు. 2024 జూలై 23న బాధ్యతలు చేపట్టిన ఆయన, తన పదవీ కాలంలో ఐఎఫ్ఆర్, మిలాన్ వంటి అంతర్జాతీయ వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. అలాగే నీతి ఆయోగ్ జాతీయ సదస్సు, ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు, వీవీఐపీల పర్యటనలను సమర్థవంతంగా పర్యవేక్షించారు. సుమారు మూడు రోజుల పాటు జరిగిన భాగస్వామ్య సదస్సును కూడా ఆయన విజయవంతం చేశారు. అభిషిక్త్ కిషోర్ ప్రస్థానం నూతన కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ నెల్లూరు జిల్లాకు చెందిన వారు. 2015 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఆయన, తన కెరీర్ను వెస్ట్ గోదావరి అసిస్టెంట్ కలెక్టర్గా ప్రారంభించారు. ఆ తర్వాత చింతూరు ఐటీడీఏ పీడీగా, కర్నూలు, రాజమహేంద్రవరం మునిసిపల్ కమిషనర్గా, ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. అలాగే ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శిగా, అన్నమయ్య జిల్లా కలెక్టర్గా, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా, ఏపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్గా వివిధ కీలక బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఆయనకు ఉంది. హరేందిర ప్రసాద్ అభిషిక్త్ కిషోర్ -
పోర్ట్ రికార్డు
సాక్షి, విశాఖపట్నం: మేజర్ పోర్టులతో పోటీపడుతూ సరుకు రవాణాలో విశాఖపట్నం పోర్ట్ అథారిటీ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. 92 ఏళ్ల వీపీఏ సుదీర్ఘ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా 90.29 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక సరుకు రవాణాను నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను.. గతేడాది సాధించిన 82.62 ఎంఎంటీ రికార్డును అధిగమించడమే కాకుండా, నిర్దేశిత గడువు కంటే ముందే (362 రోజుల్లోనే) ఈ ఘనతను సాధించింది. ఈ చారిత్రాత్మక విజయంపై పోర్ట్ చైర్మన్ డాక్టర్ ఎం. అంగముత్తు హర్షం వ్యక్తం చేశారు. అధికారుల సమర్థవంతమైన నిర్వహణ, ఉద్యోగుల సమిష్టి కషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఇదే ఉత్సాహంతో రానున్న 2026–27 ఆర్థిక సంవత్సరంలో 100 ఎంఎంటీ సరుకు రవాణా లక్ష్యాన్ని చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు పోర్టు డిప్యూటీ చైర్పర్సన్ రోష్ని అపరంజి భాగస్వామ్య సంస్థలను అభినందించినట్లు పోర్ట్ కార్యదర్శి శంకర్ బాబు వెల్లడించారు.


