breaking news
Visakhapatnam
-
సెలూన్ ముసుగులో వ్యభిచారం
విశాఖపట్నం: ఎన్ఏడీ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో మరో వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. సెలూన్ ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ చీకటి దందాపై బుధవారం సాయంత్రం ఎయిర్పోర్ట్ పోలీసులు ఆకస్మిక దాడి చేసి నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ సీఐ శంకరనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్ఏడీ జంక్షన్ నుంచి మర్రిపాలెం వెళ్లే మార్గంలోని రోబరి హౌస్ ఉన్న భవనంలో హెయిర్ పోర్ట్ సెలూన్ పేరిట ఓ దుకాణాన్ని ఏర్పాటు చేశారు. అయితే, అక్కడ హెయిర్ కటింగ్ లేదా మసాజ్ వంటి ఎలాంటి సేవలు అందించకుండా, ఆ గదులను కేవలం వ్యభిచారం కోసం విటులకు అద్దెకు ఇస్తున్నారు. బయటి వ్యక్తులకు అనుమానం రాకుండా ఉండేందుకు సెలూన్కు వస్తున్నట్లు కలరింగ్ ఇచ్చేవారు. ఈ దందా కోసం ప్రధాన నిర్వాహకుడు.. చంటి అనే సహాయకుడిని నియమించుకున్నాడు. అతడి ద్వారా అమ్మాయిల ఫొటోలను ముందుగానే విటులకు మొబైల్ ఫోన్లలో పంపించేవాడు. ఆ తర్వాత వారితో బేరం మాట్లాడుకుని సెలూన్కు రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసుల దాడుల్లో ముగ్గురు యువతులతో పాటు ఒక విటుడు, అలాగే ప్రధాన నిర్వాహకుడిని పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితులను ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్కు తరలించి తదుపరి విచారణ చేపట్టారు. కాగా.. ఎన్ఏడీ జంక్షన్ ప్రాంతం స్పా కేంద్రాల ముసుగులో వ్యభిచార కూపంగా మారుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటన వెలుగుచూడటం ఇది రెండోసారి. గతంలో విల్లా కాంప్లెక్స్లో ఉన్న ఎలైట్ వెల్నెస్ అండ్ స్పా సెంటర్పై కూడా టాస్క్ ఫోర్స్, ఎయిర్ పోర్ట్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి నిర్వాహకులను పట్టుకున్న విషయం తెలిసిందే. -
ఉగాది ఉషస్సు
లేలేత మామిడి ఆకుల తోరణాలు, వీనుల విందు చేసే కోకిలమ్మ కుహు కుహు రాగాలు, గాలితో పాటే వస్తున్న వేప పువ్వు సుగంధాలు.. వెరసిప్రకృతి కాంత పచ్చని పట్టుచీర కట్టి ముస్తాబైన వేళ.. తెలుగులోగిళ్లలోకి చిరునవ్వులతో అడుగుపెడుతున్న తొలి పండగ ఉగాది. తీపి, చేదు, పులుపు, వగరు, ఉప్పు, కారం... ఈ ఆరు రుచుల కలయికతో సిద్ధమయ్యే ఉగాది పచ్చడి.. జీవితం అంటే కేవలం ఆనందమే కాదు కష్టసుఖాల, భావోద్వేగాల సమ్మేళనం అనే గొప్ప జీవన సత్యాన్ని మనకు బోధిస్తుంది. గడిచిన కాలంలోని చేదు జ్ఞాపకాలను వదిలేసి, కొత్త ఆశలు, మధురమైన స్వప్నాలతో సరికొత్త అడుగులు వేస్తూ.. ఈ నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలుకుదాం. –ఫొటో: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
కూటమి వైఫల్యాలపై రాజీలేని పోరాటం చేద్దాం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. విశాఖ నగరాన్ని వేదికగా చేసుకుని కూటమి నేతలు సాగిస్తున్న భూఆక్రమణలపై రాజీలేని పోరాటం చేయాలని ఆయన స్పష్టం చేశారు. బుధవారం మద్దిలపాలెంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ల ఆత్మీయ సత్కారం’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జగనన్న మాట.. మీకే మా భరోసా! ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రా నున్న జీవీఎంసీ ఎన్ని కల్లో పార్టీ వెంటే ఉన్న కార్పొరేటర్లకు మళ్లీ పోటీ చేసే అవకాశం కల్పిస్తామని పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాటగా హామీ ఇచ్చారు. ‘మీరు ఎక్స్ కార్పొరేటర్లు కాదు.. నెక్ట్స్ కార్పొరేటర్లు‘ అని ఉత్సాహపరిచారు. విలువులు, విశ్వసనీయతతో పనిచేసేవారే మన నాయకుడికి ఇష్టమని, ఆ బాటలోనే నడుస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. విశాఖలో భూదోపిడీపై ఉద్యమించాలి: కేకే రాజు వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని, ప్రస్తు త కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న భూదోపిడీని ప్రజలకు వివరించాలని జిల్లా అధ్యక్షుడు కేకే రాజు కోరారు. ప్రతి ఒక్కరూ తమ ప్రాంతంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులపై ఒత్తిడి తేవాలని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా వైఎస్సార్సీపీ కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అభివృద్ధి శూన్యం: వరుదు కల్యాణి ఏడాది కాలంగా కూ టమి నేతలు కుట్రలు చేసి మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారే తప్ప, నగరాభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఎమ్మెల్సీ -
నేడు సింహగిరిపై పెళ్లిరాట ఉత్సవం
సింహాచలం: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి పెళ్లిరాట ఉత్సవం వైభవంగా జరగనుంది. ఈ మేరకు ఆలయ అర్చకులు, అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. శ్రీ పరాభవనామ సంవత్సర ప్రారంభం సందర్భంగా ఉదయం స్వామికి విశేష అర్చనలు నిర్వహించి, ఉగాది పచ్చడిని నివేదిస్తారు. అనంతరం భక్తులకు పచ్చడి ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఆలయ స్థానమండపంలో స్వామి వారి ఉత్సవమూర్తులను వేంజేపు చేసి, విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 నుంచి 3.30 గంటల వరకు ప్రధాన అర్చకులచే పంచాంగ శ్రవణం ఉంటుంది. అనంతరం 3.30 నుంచి 4.30 గంటల వరకు పెళ్లిరాట ఉత్సవం నిర్వహిస్తారు. ఈ నెల 29న (చైత్ర శుద్ధ ఏకాదశి) జరగనున్న స్వామి వారి వార్షిక కల్యాణోత్సవానికి చిహ్నంగా ఆలయ ఉత్తర ద్వారం, రాజగోపురం, కల్యాణ ప్రాంగణాల వద్ద పెళ్లిరాటలు వేస్తారు. ఈ సందర్భంగా పండితులకు సత్కారాలు, దాతలకు విశిష్ట సేవా పురస్కారాలు అందజేస్తారు. అనంతరం సింహగిరి మాడవీధుల్లో స్వామివారి తిరువీధి ఉత్సవం జరుగుతుంది. కాగా, ఏటా ఉగాది రోజు సాయంత్రం స్వామి వారి మూలవిరాట్ను సూర్యకిరణాలు తాకడం ఇక్కడి విశేషం. ఈ అద్భుత దృశ్యాన్ని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. భక్తులందరూ ఈ వేడుకల్లో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు కోరారు. సాయంత్రం స్వామిని తాకనున్న సూర్యకిరణాలు -
మత్స్యకారుల ప్రాణదాత ట్రాన్స్పాండర్
మహారాణిపేట: సముద్రంలో వేట సాగిస్తుండగా ప్రమాదంలో చిక్కుకున్న బోటును గుర్తించడంలో ట్రాన్స్పాండర్ పరికరం కీలక పాత్ర పోషించింది. ఈ పరికరం అందించిన సమాచారంతో ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది సకాలంలో స్పందించి, బోటుతో పాటు అందులోని ఆరుగురు మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వివరాలివి.. ఈ నెల 5న ఫిషింగ్ హార్బర్ నుంచి ఎం.ఎం.108 నంబర్ గల బోటు వేట కోసం సముద్రంలోకి వెళ్లింది. 12వ తేదీన తీరం నుంచి సుమారు 300 కిలోమీటర్ల దూరంలో వేట సాగిస్తుండగా, బోటు ఇంజిన్ అకస్మాత్తుగా పాడైపోయింది. నడి సముద్రంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో బోటులోని శ్రీలంకకు చెందిన నలుగురు, విశాఖకు చెందిన ఇద్దరు మత్స్యకారులు ఆందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో తమను కాపాడాలని బోటు యజమాని బి.రాజుకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన యజమాని.. మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావు ద్వారా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ను సహాయం కోరారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇండియన్ కోస్ట్ గార్డ్ రంగంలోకి దిగింది. అయితే, ఇటీవల ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా ఆ బోటుకు ట్రాన్స్పాండర్ పరికరాన్ని అమర్చారు. ఆ పరికరం పంపిన సిగ్నల్స్ ఆధారంగా మ త్స్యశాఖ అధికారులు బోటు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి కోస్ట్ గార్డ్కు సమాచారం ఇచ్చారు. దీంతో కోస్ట్ గార్డ్ నౌక గాలింపు చర్యలు చేపట్టి, బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు బోటును గుర్తించింది. సిబ్బందిని సురక్షితంగా రక్షించి ఫిషింగ్ హార్బర్కు తీసుకొచ్చి మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావుకు అప్పగించారు. ఈ సందర్భంగా బోటు యజమాని బి.రాజు మాట్లాడుతూ.. ట్రాన్స్పాండర్ ఉండటం వల్లే తన బోటు, సిబ్బంది ప్రాణాలతో తిరిగి రాగలిగారని హర్షం వ్యక్తం చేశారు. మత్స్యకారులందరూ తప్పనిసరిగా తమ బోట్లకు ఈ పరికరాన్ని అమర్చుకోవాలని కోరారు. తమను ఆదుకున్న కలెక్టర్, కోస్ట్ గార్డ్, మత్స్యశాఖ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
స్టార్టప్లే రేపటి ఉపాధి కేంద్రాలు
మద్దిలపాలెం: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా సరికొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తోందని, వీటిని అందుకోవడానికి విద్యార్థులకు నైపుణ్యం ఎంతో అవసరమని సైయంట్ వ్యవస్థాపక చైర్మన్, పద్మశ్రీ అవార్డు గ్రమీత బి.వి.ఆర్. మోహన్రెడ్డి అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా బీచ్రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఏయూ–ఏఐసీటీఈ–సైయంట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇన్స్టిట్యూట్–ఇండస్ట్రీ–ఇన్వెస్టర్స్ కాన్క్లేవ్ను బుధవారం ఆయన ప్రారంభించి, కీలకోపన్యాసం చేశారు. ప్రస్తుతం స్టార్టప్ సంస్థలు ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, 60 శాతానికి పైగా ఉద్యోగ అవకాశాలు వీటి ద్వారానే లభిస్తున్నాయని తెలిపారు. స్టార్టప్లు పరిమాణంలో చిన్నవిగా ఉన్నప్పటికీ, వాటిలో వినూత్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయన్నారు. విశాఖపట్నం సిటీ ఇన్నోవేషన్ క్లస్టర్ ద్వారా ఆలోచన దశ నుంచి ఉత్పత్తి దశ వరకు ఉన్న అంతరాన్ని తగ్గించడానికి ఈ వేదిక దోహదపడుతుందని ఆకాంక్షించారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో భాగస్వాములు కావడం ఇక్కడి విద్యార్థుల అదృష్టమని, రాబోయే వందేళ్లలో ఈ యూనివర్సిటీ దేశానికి, ప్రపంచానికి గొప్ప భవిష్యత్తును అందిస్తుందని కొనియాడారు. త్వరలో ఎఫ్డీపీ: ఏయూ వీసీ ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ.. సైయంట్ సంస్థతో కలిసి త్వరలో ఇన్నోవేషన్ రంగంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్(ఎఫ్డీపీ) నిర్వహిస్తామని ప్రకటించారు. రూసా నిధుల ద్వారా మౌలిక వసతుల కల్పన, స్టార్టప్ల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నామని, ఏయూలోని ఏ–హబ్తో కలిసి పనిచేయడానికి 30కి పైగా స్టార్టప్లు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ఏఐసీటీఈ ఇన్నోవేషన్ సెల్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ దీపన్ సాహు మాట్లాడుతూ.. గత ఆరు నెలల్లో విశాఖ సిటీ ఇన్నోవేషన్ క్లస్టర్ సాధించిన ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా అతిథుల చేతుల మీదుగా ప్రత్యేక నివేదికలను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు, స్టార్టప్ సంస్థలు ఏర్పాటు చేసిన సాంకేతిక ప్రదర్శనను అతిథులు తిలకించి, యువ ఆవిష్కర్తలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐఐసీ అధ్యక్షుడు ఆచార్య జి.ఎం.జె. రాజు, క్లస్టర్ కోఆర్డినేటర్ ఆచార్య కె. రమాసుధ, కన్వీనర్ ఆచార్య డి. లలిత భాస్కరి, సైయంట్ సంస్థ ఉన్నతాధికారి పి.ఎన్.ఎస్.వి.నరసింహం తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం ఉపకులపతి తన కార్యాలయంలో బి.వి.ఆర్.మోహన్ రెడ్డిని ఘనంగా సత్కరించి, ఏయూ జ్ఞాపికను అందజేశారు. -
ప్రతి ఇంట్లో సంతోషం వెల్లివిరియాలి
కలెక్టర్ హరేందిర ప్రసాద్ మహారాణిపేట: ప్రతి ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రతి కుటుంబం ఆనందంతో జీవించాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆకాంక్షించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆయన జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని, ఆర్థికంగా ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలన్నారు. జిల్లా పారిశ్రామికంగా, సామాజికంగా మరింత పురోగతి సాధించాలని, స్వర్ణాంధ్ర–2047 సాధనలో ముందంజలో ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో గురువారం జరిగే ఉగాది వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేశామని, జిల్లా ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
ముగిసిన ఎకై ్సజ్ పోలీసుల క్రీడలు
మధురవాడ: కొమ్మాదిలోని శాప్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ పోలీసులకు మూడు రోజుల పాటు నిర్వహించిన క్రీడా పోటీలు, ఎంపికలు బుధవారంతో ముగిశాయి. ఈ పోటీల్లో విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన సుమారు 150 మంది ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు. మహిళా, పురుష, వెటరన్ విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో గెలుపొందిన వారు వచ్చే నెలలో అమరావతిలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా విజేతలకు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ విశాఖ డివిజన్ డిప్యూటీ కమిషనర్ డి.శ్రీరామచంద్రమూర్తి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
దివ్యాంగ చిన్నారులకు కలెక్టర్ ఆత్మీయ విందు
మహారాణిపేట: జిల్లాలోని వివిధ వసతి గృహాలకు చెందిన దివ్యాంగ చిన్నారులతో కలిసి కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆత్మీయ విందు నిర్వహించారు. దివ్యాంగ శక్తి పథకం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఈ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ చిన్నారులతో కలిసి భోజనం చేస్తూ వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూనే.. చదువు, ఆరోగ్యం, భవిష్యత్తు లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ విందులో సాగర్ నగర్ అంధుల ఆశ్రమ పాఠశాలకు చెందిన అంధ విద్యార్థులు, పెదజాలారిపేట బీసీ వసతి గృహానికి చెందిన బధిర విద్యార్థులు పాల్గొన్నారు. వీరికి వివిధ రకాల వంటకాలతో భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా ఆశ్రమ పాఠశాల చిన్నారులు చేసిన గీతాలాపన అందరినీ ఆకట్టుకుంది. వారి ప్రతిభకు ముగ్ధులైన కలెక్టర్, ఇతర అధికారులు కరతాళ ధ్వనులతో చిన్నారులను అభినందించారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ కె. కవిత, వసతి గృహాల నిర్వాహకులు, కలెక్టరేట్ ఏవో బీవీ రాణి తదితరులు పాల్గొన్నారు. -
సెలూన్ ముసుగులో వ్యభిచారం
ముగ్గురు యువతులు, విటుడు, నిర్వాహకుడు అరెస్ట్ గోపాలపట్నం: ఎన్ఏడీ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో మరో వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. సెలూన్ ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ చీకటి దందాపై బుధవారం సాయంత్రం ఎయిర్పోర్ట్ పోలీసులు ఆకస్మిక దాడి చేసి నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ సీఐ శంకరనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్ఏడీ జంక్షన్ నుంచి మర్రిపాలెం వెళ్లే మార్గంలోని రోబరి హౌస్ ఉన్న భవనంలో హెయిర్ పోర్ట్ సెలూన్ పేరిట ఓ దుకాణాన్ని ఏర్పాటు చేశారు. అయితే, అక్కడ హెయిర్ కటింగ్ లేదా మసాజ్ వంటి ఎలాంటి సేవలు అందించకుండా, ఆ గదులను కేవలం వ్యభిచారం కోసం విటులకు అద్దెకు ఇస్తున్నారు. బయటి వ్యక్తులకు అనుమానం రాకుండా ఉండేందుకు సెలూన్కు వస్తున్నట్లు కలరింగ్ ఇచ్చేవారు. ఈ దందా కోసం ప్రధాన నిర్వాహకుడు.. చంటి అనే సహాయకుడిని నియమించుకున్నాడు. అతడి ద్వారా అమ్మాయిల ఫొటోలను ముందుగానే విటులకు మొబైల్ ఫోన్లలో పంపించేవాడు. ఆ తర్వాత వారితో బేరం మాట్లాడుకుని సెలూన్కు రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసుల దాడుల్లో ముగ్గురు యువతులతో పాటు ఒక విటుడు, అలాగే ప్రధాన నిర్వాహకుడిని పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితులను ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్కు తరలించి తదుపరి విచారణ చేపట్టారు. కాగా.. ఎన్ఏడీ జంక్షన్ ప్రాంతం స్పా కేంద్రాల ముసుగులో వ్యభిచార కూపంగా మారుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటన వెలుగుచూడటం ఇది రెండోసారి. గతంలో విల్లా కాంప్లెక్స్లో ఉన్న ఎలైట్ వెల్నెస్ అండ్ స్పా సెంటర్పై కూడా టాస్క్ ఫోర్స్, ఎయిర్ పోర్ట్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి నిర్వాహకులను పట్టుకున్న విషయం తెలిసిందే. -
ఫార్మసీ.. ౖపైరవీ!
11 ఫార్మసీ పోస్టులకు 583 దరఖాస్తులు పోస్టుల కోసం ఎమ్మెల్యేలు, మంత్రుల పీఏల ఒత్తిళ్లు తమను కలవమంటూ నిరుద్యోగ అభ్యర్థులకు ఫోన్లు పోస్టుకు రూ.3 నుంచి రూ.5 లక్షలు డిమాండ్ మహారాణిపేట: ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ఫార్మసీ పోస్టుల భర్తీ ప్రక్రియలోకి దళారులు ప్రవేశించారు. కేవలం 11 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉండటం, వాటికి వందల సంఖ్యలో నిరుద్యోగులు పోటీ పడుతుండటంతో అక్రమార్కులు దీన్ని తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. అధికార పార్టీ నేతల పేరుతో కొందరు, ప్రజాప్రతినిధుల పీఏల పేరుతో మరికొందరు సిఫార్సులు, బెదిరింపులకు దిగుతుండటంతో అధికారులకు తలనొప్పిగా మారింది. ఒక్కో పోస్టుకు లక్షల్లో డిమాండ్ చేస్తూ దళారులు బేరసారాలకు దిగుతున్న నేపథ్యంలో, ఈ నియామకాలు పూర్తిగా పారదర్శకంగా జరుగుతాయని, ఎవరినీ నమ్మి మోసపోవద్దని వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ సంచాలకురాలు డాక్టర్ రాధారాణి స్పష్టం చేశారు. అధికారులపై పీఏల ఒత్తిళ్లు తుది ఎంపిక జాబితా విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో దళారులు నేరుగా రంగంలోకి దిగారు. ‘హలో మేము వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాం. మీరు ఫార్మసీ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారా? మీకు ఆ పోస్టు కావాలంటే డబ్బులు ఇవ్వాలి’అంటూ దరఖాస్తుదారులకు ఫోన్లు చేసి, పోస్టింగ్ ఇప్పిస్తామని నమ్మిస్తున్నారు. ఇందుకు గాను ఒక్కో పోస్టుకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో కొందరు కూటమి నేతలు సైతం భారీగా బేరసారాలకు దిగి, ఈ పోస్టులను ఆదాయ వనరులుగా మార్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు కూడా తీవ్రమయ్యాయి. ఈ పోస్టులను తమ సిఫార్సు చేసిన వారికే కట్టబెట్టాలంటూ కొందరు ఎమ్మెల్యేలు, మంత్రుల వ్యక్తిగత సహాయకులు ఆర్డీకి వరుస ఫోన్లు చేస్తున్నట్లు సమాచారం. ఏకంగా సిఫార్సు లేఖలు పంపిస్తూ ఒత్తిడి తెస్తున్నారు. ఒక పక్క దరఖాస్తుల పరిశీలనలో బిజీగా ఉన్న అధికారులకు ఈ ఫోన్ కాల్స్, సిఫార్సుల తాకిడి ఇబ్బందిగా మారింది. దళారులను నమ్మి మోసపోవద్దు పోస్టుల భర్తీ ప్రక్రియ దాదాపు తుది దశకు చేరుకుంది. త్వరలోనే ఫైనల్ మెరిట్ జాబితాను విడుదల చేస్తాం. నియామకాలన్నీ కేవలం అర్హత ప్రమాణాలు, మెరిట్, రోస్టర్ విధానం ఆధారంగానే పారదర్శకంగా జరుగుతున్నాయి. దళారుల మాయమాటలు నమ్మి నిరుద్యోగులు ఎవరూ వారికి డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. పైరవీలకు ఇక్కడ ఎలాంటి తావులేదు. – డాక్టర్ రాధారాణి, ఆర్డీ, వైద్య ఆరోగ్యశాఖ పోస్టులు తక్కువ.. పోటీ ఎక్కువ! ఉమ్మడి ఉత్తరాంధ్ర పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలతో పాటు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 11 ఫార్మసీ గ్రేడ్–2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని ఏడాది కాల వ్యవధికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ డైరెక్టర్(ఆర్డీ) కార్యాలయం ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ 11 పోస్టుల కోసం ఏకంగా 583 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే మెరిట్ జాబితాను కూడా అధికారులు విడుదల చేశారు. అయితే, తీవ్రమైన పోటీ ఉండటంతో పోస్టింగ్ ఎలాగైనా సాధించాలనే అభ్యర్థుల ఆరాటాన్ని దళారులు, కొందరు రాజకీయ నేతలు క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. -
రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులుగా విశాఖ న్యాయవాదులు
విశాఖ లీగల్: ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో విశాఖకు చెందిన ఐదుగురు న్యాయవాదులు విజయం సాధించి కొత్త రికార్డు నెలకొల్పారు. బుధవారం ఎన్నికలు లెక్కింపు పూర్తయింది. నగరానికి చెందిన సీనియర్ న్యాయవాదులు కె.రామజోగేశ్వరరావు, బి.వి.ఆర్.మూర్తి (బాబు) ఎస్ కృష్ణమోహన్, మహిళా న్యాయవాదుల విభాగంలో డి.మంజులత, కె.నాగశ్రీలు విజయం సాధించారు. వీరికి విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎంకే శ్రీనివాస్, కార్యదర్శి లాలం పార్వతి నాయుడు సీనియర్ న్యాయవాదులు ఎస్.శ్రీనివాసు మూర్తి, నమ్మి సన్యాసిరావు యాదవ్ తదితరులు అభినందించారు. డి.మంజులత కె. నాగశ్రీ -
ఒకే రోజు రూ.10.1 కోట్ల ఆదాయం
మధురవాడ జోన్లో రికార్డు స్థాయిలో వసూలు మధురవాడ: జీవీఎంసీ మధురవాడ జోన్కు బుధవారం రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ఎన్సీసీ వైజాగ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి రెవెన్యూ అధికారులు రూ.10,01,88,000 వీఎల్టీ పన్నును వసూలు చేశారు. అసిస్టెంట్ కమిషనర్, రెవెన్యూ అధికారి నాగేంద్రకుమార్ ఆధ్వర్యంలో ఆర్ఐలు సుభానీ, ప్రదీప్రెడ్డి తదితరులు ఆ సంస్థ నుంచి పన్ను వసూలు చేసి, ఆ చెక్కును జోనల్ కార్యాలయంలో జెడ్సీ అయ్యప్పనాయుడికి అందజేశారు. ఈ సందర్భంగా పన్ను వసూలు చేసిన రెవెన్యూ అధికారులు, సిబ్బందిని జెడ్సీ అభినందించారు. -
పోర్టులో మౌలిక సదుపాయాలు బాగున్నాయి
సాక్షి, విశాఖపట్నం: నేషనల్ డిఫెన్స్ కాలేజీ(ఎన్డీసీ)కి చెందిన 16 మంది సభ్యులతో కూడిన ఫ్యాకల్టీ, కోర్సు సభ్యుల బృందం బుధవారం విశాఖపట్నం పోర్టు అథారిటీ (వీపీఏ)ని సందర్శించింది. ఈ బృందానికి పోర్టు డిప్యూటీ చైర్పర్సన్ రోష్ని అపరంజి కొరాటి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోర్టులోని మౌలిక సదుపాయాలు, కార్గో నిర్వహణ సామర్థ్యం, ఆధునికీకరణ, యాంత్రీకరణ పనులపై ఆమె పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అలాగే కవర్డ్ స్టోరేజీ సదుపాయాలు, సౌర శక్తి వినియోగం, పారిశ్రామిక అవసరాల కోసం నిర్వహిస్తున్న ఎస్టీపీ ప్లాంట్, క్రూయిజ్ టెర్మినల్ వంటి కీలక అంశాలను ఎన్డీసీ బృందానికి వివరించారు. పోర్టు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని డిఫెన్స్ కాలేజీ బృందం అభినందించింది. కార్యక్రమంలో పోర్టు కార్యదర్శి ఎం.శంకర బాబు, చీఫ్ ఇంజినీర్ శ్రీరామచంద్రమూర్తి, చీఫ్ మెకానికల్ ఇంజినీర్ రామ్ ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎన్డీసీ బృందం ప్రశంస -
విశాఖలో భూ ఆక్రమణలు: బొత్స సత్యనారాయణ
విశాఖ: కూటమి అవినీతిని ప్రజలకు తెలియజేయాలని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలో భూ ఆక్రమణలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. విశాఖను దోచుకు తింటున్నారని తెలిపారు. ఉద్యమ కార్యచరణ రూపొందించుకుని ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. పార్టీతో ఉన్న కార్పొరేటర్లకు సాధ్యమైనంత వరకు జీవీఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. జీవీఎంసీ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా అందుకు నాయకులు సిద్ధంగా ఉండాలని అన్నారు. -
ఆ నాలుగేళ్లు విశాఖకు వైభవం
డాబాగార్డెన్స్: విశాఖపట్నం మహా నగర పాలక సంస్థ(జీవీఎంసీ) పాలకవర్గం గడువు ముగియడంతో వైఎస్సార్ సీపీ హయాంలో విశాఖ సాధించిన ప్రగతి మరోసారి తెరపైకి వచ్చింది. 2021 ఏప్రిల్ నుంచి 2025 ఏప్రిల్ వరకు నాలుగేళ్ల పాటు మేయర్గా బాధ్యతలు నిర్వర్తించిన గొలగాని హరి వెంకటకుమారి హయాంలో నగరం అనేక రంగాల్లో అభివృద్ధిని సాధించింది. ఎలాంటి రాజకీయ పరిజ్ఞానం లేని విద్యావేత్త అయిన బీసీ సామాజికవర్గానికి చెందిన మహిళను, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నగర ప్రథమ పౌరురాలిగా ఎంపిక చేయడం విశాఖ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయానికి నాంది పలికింది. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో బాధ్యతలు చేపట్టిన పాలకవర్గం, ప్రజలకు అండగా నిలుస్తూనే నగరాన్ని ప్రగతి పథంలో నడిపించింది. ముఖ్యంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వ సహకారంతో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు. దశాబ్దాలుగా పాతనగరం వాసులను వేధిస్తున్న ఇరుకు రోడ్ల కష్టాలకు చెక్ పెడుతూ, జగదాంబ జంక్షన్ నుంచి పాత పోస్టాఫీసు వరకు రోడ్డు విస్తరణ పనులను విజయవంతంగా పూర్తి చేసి వారి చిరకాల స్వప్నాన్ని నెరవేర్చారు. అంతర్జాతీయ సదస్సులకు వేదికైన విశాఖను సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రధాన కూడళ్లను విద్యుత్ దీపాలు, వాటర్ ఫౌంటైన్లతో ఆకర్షణీయంగా మార్చారు. బీచ్లను సుందరంగా మార్చారు. రూ.2.3 కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో జగదాంబ జంక్షన్లో 20 మీటర్ల క్లాక్ టవర్ను నిర్మించారు. పచ్చదనంతో నగరానికి కొత్త అందాలు అద్దారు. మూలకు చేరిన శివాజీ పార్కును ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడం, స్వర్ణభారతి ఇండోర్ స్టేడియానికి రూ.16.90కోట్లతో నూతన హంగులు తీసుకురావడం పాలకవర్గ పనితీరుకు నిదర్శనంగా నిలిచాయి. సమగ్రాభివృద్ధే లక్ష్యంగా.. : కేవలం సుందరీకరణకే పరిమితం కాకుండా, ప్రజల కనీస అవసరాలను తీర్చడంలో జీవీఎంసీ వైఎస్సార్ సీపీ పాలకవర్గం విశేష కృషి చేసింది. మధురవాడ జోన్–2 భూగర్భ మురుగునీటి వ్యవస్థకు ఏకంగా రూ.553 కోట్లు, రోడ్ల నిర్వహణ, గుంతల పూడ్చివేతకు రూ.770 కోట్లు, సామాజిక భవనాల నిర్మాణం, నిర్వహణకు రూ.700 కోట్లు, మురుగునీటి కాలువల నిర్మాణానికి రూ.159 కోట్లు, 24 గంటల మంచినీటి పథకానికి రూ.140 కోట్లు కేటాయించి నగర మౌలిక రూపురేఖలను మార్చారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం నాడు–నేడు ద్వారా నగరంలోని ప్రభుత్వ పాఠశాలలు, పబ్లిక్ హెల్త్ సెంటర్లను కార్పొరేట్ స్థాయిలో ఆధునికీకరించి పేదలకు మెరుగైన విద్య, వైద్యాన్ని చేరువ చేశారు. సింహాచలం వచ్చే భక్తుల కోసం మౌలిక వసతుల కల్పనతో పాటు అడవివరం రోడ్డును విస్తరించారు. ఈ మేరకు భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి టీడీఆర్ బాండ్లు అందజేసి ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుకున్నారు. పార్టీలకతీతంగా ప్రగతి పరుగులు కుల, మత, పారీ్టలకతీతంగా అందరినీ కలుపుకుపోతూ.. పారిశుధ్య నిర్వహణలో ఎక్కడా రాజీ పడకుండా పగలు, రాత్రి అనే తేడా లేకుండా మేయర్ స్వయంగా పర్యవేక్షించడం నగర స్వచ్ఛతకు ఎంతో దోహదపడింది. నగర ప్రథమ పౌరురాలిగా ఇద్దరు రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులకు, ముఖ్యమంత్రికి ఆతిథ్యం ఇవ్వడంతో పాటు ఐదుగురు కమిషనర్లు, ఒక స్పెషలాఫీసర్తో సమన్వయం చేసుకుంటూ హుందాగా పరిపాలన సాగించారు. మొత్తంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్గనిర్దేశంలో, మేయర్ హరి వెంకటకుమారి నేతృత్వంలో నగరం ఆ నాలుగేళ్లలో ప్రశాంతంగా.. అభివృద్ధిలో దూసుకుపోయిందని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. -
కకావికలం
● కడలిపై కదన ప్రభావంసముద్ర వాణిజ్యంసాక్షి, విశాఖపట్నం: పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం ప్రపంచదేశాల సరఫరా గొలుసు (సప్లయ్ చైన్)ను ఛిన్నాభిన్నం చేస్తోంది. ముఖ్యంగా భారత్ నుంచి యూరప్, అమెరికా దేశాలకు వెళ్లే సరుకు రవాణాపై ఇది పెనుప్రభావం చూపుతోంది. భారత్ నుంచి యూరప్ దేశాల ఎగుమతులకు ట్రాన్షిప్మెంట్ హబ్గా వ్యవహరించే దుబాయ్లో యుద్ధప్రభావం తీవ్రంగా ఉండటంతో.. పదిరోజుల్లోనే వెయ్యికిపైగా రిఫ్రిజిరేటర్ కంటైనర్ల ఎగుమతులు నిలిచిపోయాయి. ఈస్ట్కోస్ట్ పోర్టుల నుంచి మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లిన కంటైనర్ షిప్లన్నీ తిరుగుముఖం పట్టాయి. వీటిలో ఎక్కువ షిప్లను కేరళలోని విజింజం అంతర్జాతీయ పోర్టుకు మళ్లించారు. ఇక్కడ నిండిపోయిన తర్వాత చైన్నెలోని కట్టుపల్లికి తరలించనున్నారు. తర్వాత విశాఖ కంటైనర్ టెర్మినల్ని ప్రత్యామ్నాయ స్థావరంగా ఎంపిక చేశారు. మరోవైపు యుద్ధప్రభావంతో పశ్చిమతీరం నుంచి కూడా సరుకు ఎగుమతులు మందకొడిగా సాగుతున్నాయి. భారత తూర్పుతీరానికి గేట్వేగా ఉన్న విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్ (వీసీటీపీఎల్) సాధారణంగా నెలకు 50 వేల నుంచి 60 వేల టీఈయూ (ట్వంటీ–ఫుట్ ఈక్వలెంట్ యూనిట్) సామర్థ్యం ఉన్న కంటైనర్ల హ్యాండ్లింగ్ జరుగుతుంటుంది. తాజా పరిస్థితుల కారణంగా యూరప్కు వెళ్లే సరుకు రవాణాలో 15 నుంచి 20 శాతం మేర మందగమనం కనిపిస్తోంది. డొమెస్టిక్ కంటైనర్ల హ్యాండ్లింగ్ దాదాపు నిలిచిపోయింది. భారత్ నుంచి యూఏఈలోని ఏడుదేశాలకు సరకు హ్యాండ్లింగ్ జరుగుతుంటుంది. విశాఖ నుంచి ఇప్పటికే బయలుదేరిన షిప్లు వెనక్కి వచ్చేస్తున్నాయి. విశాఖ నుంచి రోజుకు 600 చొప్పున 10 రోజుల్లో ఆరువేల కంటైనర్లతో కూడిన నౌకలు బయలుదేరాయి. ఇందులో 1,500కి పైగా కంటైనర్లు సీ ఫుడ్తో ఉన్నాయి. ఒడిశా నుంచి వచ్చిన మినరల్స్ ఫెర్రో, మాంగనీస్ లోడుతో వంద కంటైనర్లు, ఫార్మ కంటైనర్లు 50, ఫార్మా ట్యాంక్ కెమికల్ కంటైనర్లు 50 కూడా తిరుగుముఖం పట్టాయి. సముద్రజలాల్లో నిలిపివేత యుద్ధ ప్రభావం వల్ల భారత్ నుంచి బయలుదేరిన 37 కార్గో కంటైనర్షిప్లు ప్రస్తుతం హార్మూజ్ జలసంధి సమీపంలో సముద్రంలోనే నిలిచిపోయాయి. కొన్ని షిప్పింగ్లైన్లు తమ కంటైనర్లని యూఏఈలోని ఖోర్ఫక్కన్, ఫుజైరా పోర్టుల్లో దిగుమతి చేసుకుంటున్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గాన దుబాయ్లోని జెబెల్ అలీ పోర్టుకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు ముంబై పోర్టులో ఎగుమతికి సిద్ధంగా ఉన్న ఐదువేల కంటైనర్లు నిలిచిపోయాయి. ముంద్రా, కాండ్లా పోర్టుల్లో రెండువేలు, వైజాగ్లో వెయ్యి కంటైనర్లు నిలిచిపోయాయి. మన దేశంలోని వివిధ పోర్టుల నుంచి ప్రతినెల 3,500కు పైగా రిఫ్రిజిరేటర్ కంటైనర్లలో సముద్ర ఉత్పత్తులు, పండ్లు, ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి అయ్యేవి. ఇప్పుడు అవన్నీ నిలిచిపోయాయి. యుద్ధం భారతీయ పోర్టులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సముద్రదారులన్నీ కేరళ వైపు ఈస్ట్కోస్ట్ కంటైనర్లన్నీ విజింజం పోర్టులోనే నిలుపుదల భారత తూర్పుతీరం నుంచి తగ్గిపోయిన ఎగుమతులు పశ్చిమతీరం నుంచి మందకొడిగా నడుస్తున్న కంటైనర్ షిప్లు మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లే రిఫ్రిజిరేటర్ కంటైనర్ల నిలిపివేత పది రోజుల్లో ఆగిపోయిన వెయ్యి కంటైనర్లు హార్మూజ్ జలసంధి సమీపంలో నిలిచిపోయిన 37 కార్గో షిప్స్ భారత తూర్పుతీరం నుంచి దుబాయ్ మీదుగానే యూరప్కు ఎగుమతులు -
గ్యాస్ గోస
గ్యాస్ కొరత లేదు మహారాణిపేట: జిల్లాలో వంట గ్యాస్, వాణిజ్య గ్యాస్కు ఎలాంటి కొరత లేదని, నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి తెలిపారు. రోజుకు సుమారు 18 వేల గ్యాస్ సిలెండర్లు సరఫరా చేస్తున్నామని, రాబోయే రెండు నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్పారు. అనధికార గ్యాస్ విక్రయాలు లేదా గృహ వినియోగ గ్యాస్ను వాణిజ్య అవసరాలకు ఉపయోగించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్ సరఫరా, డిమాండ్పై నిరంతరం సమీక్ష చేస్తున్నామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం 50 వేల మంది వంట గ్యాస్ కోసం బుకింగ్లు చేసుకున్నారని, ఎక్కడ గ్యాస్ కొరత లేదని తెలిపారు. విద్యా సంస్థలు, ఆస్పత్రులు, ఔషధ పరిశ్రమకు చెందిన సంస్థలను మూడు కేటగిరీలుగా విభజించి వంట గ్యాస్ను సరఫరా చేస్తున్నామని వివరించారు. -
జీవీఎంసీలో ఇక ప్రత్యేకాధికారి పాలన
డాబాగార్డెన్స్: గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ప్రస్తుత పాలకవర్గ పదవీకాలం మంగళవారంతో ముగిసింది. బుధవారం నుంచి కార్పొరేషన్లో ప్రత్యేకాధికారి పాలన అమలులోకి వచ్చింది. తదుపరి ఎన్నికలు జరిగే వరకు ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి, కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ కంట్రోల్లోనే జీవీఎంసీ పరిపాలన కొనసాగనుంది. 2021లో మొదలైన ఈ పాలకవర్గ ప్రయాణం ఎన్నో రాజకీయ మలుపులకు వేదికై ంది. 2021 ఏప్రిల్ నుంచి 2025 ఏప్రిల్ వరకు వైఎస్సార్ సీపీకి చెందిన గొలగాని హరి వెంకటకుమారి మేయర్గా వ్యవహరించగా.. రాజకీయ కుట్రలు, కూటమి మద్దతుతో గతేడాది ఏప్రిల్ 28న టీడీపీకి చెందిన పీలా శ్రీనివాసరావు మేయర్గా బాధ్యతలు చేపట్టారు. అయితే, తన పదవీకాలం ముగుస్తుందనగా చివరి నెల రోజుల్లో జరిగిన సమావేశాల్లో పదుల సంఖ్యలో అంశాలను హడావుడిగా ఆమోదించుకోవడం విమర్శలకు దారితీసింది. ముఖ్యంగా చిట్టచివరి స్థాయీ సంఘం సమావేశంలో ఏకంగా 294 అంశాలను ఆమోదింపజేసుకున్నారు. మేయర్గా తన 11 నెలల పాలనలో కూటమి పార్టీలకు చెందిన పలువురు కార్పొరేటర్లు దోచుకుతిన్నారనే ఆరోపణలు ఉన్నాయి. సభ్యులు ఆమోదించకపోయినప్పటికీ.. అధికారుల సహకారంతో అజెండా అంశాలను మేయర్ ఆమోదించుకున్నారని సొంత పార్టీకి చెందిన కార్పొరేటర్లు బాహాటంగా చెప్పుకోవడం గమనార్హం. జీవీఎంసీ చరిత్రలో చీకటి రోజు జీవీఎంసీ చరిత్రలో 2026 జనవరి 30వ తేదీ చీకటి రోజుగా నిలిచిపోయింది. విశాఖ ఎంపీ శ్రీభరత్కు చెందిన గీతం విశ్వవిద్యాలయం ఆధీనంలో ఉన్న రూ.5వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని(ఎండాడ, రుషికొండ) క్రమబద్ధీకరిస్తూ కౌన్సిల్లో నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్ సీపీ, వామపక్షాల ఆందోళనలు, ప్రతిపక్షాల నిరసనలను బేఖాతరు చేస్తూ.. టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల మద్దతుతో మేయర్ ఏకపక్షంగా ఈ నిర్ణయాన్ని ఆమోదింపజేశారు. ఈ క్రమంలో మీడియాను అనుమతించకపోవడం, పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. -
ఆక్రమణదారులపై కఠిన చర్యలు
మహారాణిపేట: సమాజంలోని బలహీన వర్గాల పట్ల అధికారులు సానుకూల దృక్పథంతో వ్యవహరించి, వారికి అండగా నిలవాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం సూచించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో సుమారు 500 మంది నుంచి వినతులు స్వీకరించారు. వీటిని సంబంధిత అధికారులకు పంపించి, త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహ స్థలాలు, పట్టాలు, దళితులకు కేటాయించిన అసైన్డ్ భూములను ఇతరులు ఆక్రమించుకున్నారంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని, ఆక్రమణదారులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా భీమిలి, గాజువాక మండలాల్లో భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, అక్కడ రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నిడిగట్టు, కొత్తవలస, భీమిలి ప్రాంతాల్లో ఎస్సీలు నివసించే ప్రాంతాలకు దారి లేకుండా ముందుగా లేఅవుట్లు వేసి అడ్డుకున్న ఘటనలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. వీఎంఆర్డీఏ పరిధిలో నిర్మించే వాణిజ్య దుకాణాలను నిష్పత్తి ప్రాతిపదికన ఎస్సీ లబ్ధిదారులకు కేటాయించాలని సూచించారు. ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే చెల్లించాలని ఆదేశించారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలుతో పాటు జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, సాంఘిక సంక్షేమ శాఖల ద్వారా చేపట్టే ఇంజినీరింగ్ పనుల్లో దళిత కాంట్రాక్టర్లకు తగిన కోటా, అవకాశాలు కల్పించాలని స్పష్టం చేశారు. అనంతరం ఆయన శ్రీకృష్ణాపురం పాఠశాలను సందర్శించారు. అక్కడ ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు అందజేసి, వారు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. విశాఖ ఆర్డీవో సుధాసాగర్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ కె.రామారావు, డీఎంహెచ్వో జగదీశ్వరరావు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఐటీఐలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం
మహారాణిపేట : కంచరపాలెం ప్రభుత్వ బాలికల ఐటీఐ కళాశాలలో ఏర్పాటు చేసిన ఆధునిక కంప్యూటర్ ల్యాబ్ను కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ మంగళవారం ప్రారంభించారు. ఈ ల్యాబ్ ఏర్పాటుకు హెచ్డీఎఫ్సీ బ్యాంకు రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందించింది. ఈ నిధులతో కళాశాలలో 25 కంప్యూటర్లు, 25 కుర్చీలు ఏర్పాటు చేసి, విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా అన్ని సదుపాయాలతో ల్యాబ్ను అభివృద్ధి చేశారు. విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. అలాగే వేసవి శిక్షణా శిబిరాలను కూడా నిర్వహించాలని కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులకు సూచించారు. కార్యక్రమంలో హెచ్డీఎఫ్సీ రీజనల్ హెడ్ సీహెచ్ పవన్కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ జీవీ రమణారావు, అధ్యాపకులు, సామాజిక కార్యకర్తలు, బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు. -
జీవితంలో సంగీతం, నృత్యం అంతర్భాగం
మద్దిలపాలెం: సంగీతం మానసిక ప్రశాంతతకు దివ్యౌషధమని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా.. ఏయూ సంగీత, నృత్య విభాగం ఆధ్వర్యంలో బీచ్ రోడ్డులో కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన శతాబ్ది కళా ఉత్సవం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు సాధించే ప్రగతి, వారి ప్రవర్తనే విశ్వవిద్యాలయ గౌరవాన్ని పెంచుతాయని, ఏయూ విద్యార్థులు వర్సిటీకి బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రతి వ్యక్తి జీవితంలో సంగీతం, నృత్యం అంతర్భాగం కావాలని సూచించిన ఆయన, వర్సిటీ అభివృద్ధికి పునాదులు వేసిన మహనీయులను ఈ సందర్భంగా స్మరించుకోవాలన్నారు. ఏయూ మరో వెయ్యేళ్ల పాటు తన సేవలను దిగ్విజయంగా అందించేలా నేటి తరం బలమైన పునాదులు వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా విశిష్ట అతిథి, శతాధిక వృద్ధుడు, ప్రముఖ సంగీత విద్వాంసులు పద్మశ్రీ అవార్డు గ్రహీత అన్నవరపు రామస్వామిని, వర్సిటీ తరపున జ్ఞాపిక, సన్మాన పత్రంతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను, జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎన్నడూ మరువకూడదని హితవు పలికారు. తనకు జరిగిన ఈ సన్మానాన్ని సంగీత కళకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని, తన ఎదుగుదలకు గురువే కారణమన్నారు. మన ఆరోగ్యానికి సంగీతం ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్న ఆయన, ఏయూలో తనకు జరిగిన ఈ గౌరవం మరువలేనిదని ఆనందం వ్యక్తం చేశారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ, వర్సిటీ శతాబ్ది శోభను ప్రతిబింబించేలా ప్రతిభావంతులైన విద్యార్థులతో ఈ ప్రదర్శనలు ఏర్పాటు చేశామన్నారు. కళారంగంలో విశేష కృషి చేసిన దిగ్గజాలను సన్మానించుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ వేడుకలో భాగంగా ప్రముఖ కళాకారులు ఎ.బి.బాలకొండలరావు, మండ సుధారాణి, మండపాక శారద, హరిరామమూర్తి, జి.శారద సుబ్రహ్మణ్యం, వై.హనుమంతరావులను వర్సిటీ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సంగీత, నృత్య విభాగాధిపతి ఆచార్య సరస్వతీ విద్యార్థి, వివిధ విభాగాల ప్రిన్సిపాల్స్, డీన్లు, ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన శాసీ్త్రయ నృత్యాలు, గాన కచేరీలు ఆహూతులను అలరించాయి. కలెక్టర్ హరేందిర ప్రసాద్ పిలుపు -
దుబాయ్ ట్రాన్షిప్మెంట్కు దెబ్బ
యూరప్ దేశాలకు ఎగుమతులకు నేరుగా భారీ కార్గో షిప్స్ లేవు. మొదట్లో విశాఖ, కోల్కతా నుంచి చైన్నెకి పంపించి అక్కడి నుంచి యూరప్ దేశాలకు వెళ్లేవి. ఈ విధానంలో ఇబ్బందులను అధిగమించేందుకు దుబాయ్ని ట్రాన్షిప్మెంట్ హబ్గా అభివృద్ధి చేశారు. ఇటువైపు దేశాల నుంచి యురోపియన్ దేశాలకు సరకు పంపించాలంటే దుబాయ్ జెబెల్ అలీ పోర్టుకు పంపించేవారు. అక్కడి నుంచి ఆయా దేశాలకు ఎగుమతి అయ్యేవి. యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధిని మూసేయడంతో విశాఖ, చైన్నె పోర్టుల నుంచి దుబాయ్ మీదుగా జరిగే ట్రాన్షిప్మెంట్ నిలిచిపోయింది. దీంతో ఎగుమతిదారులు ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారు. మిడిల్ ఈస్ట్ దేశాలకు ముంబై, ముంద్రా, చైన్నె, వైజాగ్, కాండ్లా, కొచ్చి పోర్టులతో పాటు దేశంలోని ఇతర పోర్టుల నుంచి రోజూ 15 వేల నుంచి 20 వేల కంటైనర్లు వెళ్తుంటాయి. ప్రస్తుత సంక్షోభం వల్ల ఈ రవాణా 25 నుంచి 30 శాతానికి పడిపోయింది. -
తిరుమల పవిత్రతకు ముప్పు
అల్లిపురం: కోట్లాది మంది హిందువుల ఆరాధ్యదైవం కొలువైన తిరుమల పవిత్రత నేడు ప్రమాదంలో పడిందని, అనైతిక ఆరోపణలు ఎదుర్కొంటున్న టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడును తక్షణమే పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్ చేశారు. బీఆర్ నాయుడు అనైతిక వ్యవహారాలపై వచ్చిన ఆరోపణలకు వ్యతిరేకంగా తిరుపతిలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన మహిళలపై దాడులు చేయించడం, అనంతరం కేసులు పెట్టించి అరెస్టులు చేయించడం వంటి ఘటనలను ఖండిస్తూ మంగళవారం సాయంత్రం డాబాగార్డెన్స్లోని బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి భారీ నిరసన చేపట్టారు. ‘తిరుమలను కాపాడండిం బీఆర్ నాయుడిని తొలగించండి’ అంటూ నినాదాలతో ప్రాంతం మార్మోగింది. అనంతరం కేకే రాజు మాట్లాడుతూ వీడియోలు, ఫొటోల రూపంలో ఆరోపణలు వెలుగులోకి వచ్చినా బీఆర్ నాయుడు నిర్లజ్జగా పదవిలో కొనసాగడం ఆలయ పవిత్రతకు మచ్చ తెచ్చే చర్య అని తీవ్రంగా విమర్శించారు. మహిళలపై దాడులు చేయించడం అమానుషమని, ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని మండిపడ్డారు. ఈ ఘటనల వెనుక ప్రభుత్వ ప్రోత్సాహం ఉందని ఆరోపిస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందన్నారు. గతంలోనే ఒక మహిళ తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినా ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని గుర్తుచేశారు. ఇలాంటి వివాదాస్పద వ్యక్తికి టీటీడీ వంటి పవిత్ర సంస్థలో అత్యున్నత పదవి ఇవ్వడం పెద్ద తప్పిదమని, ఆయన పదవీకాలంలో తిరుమల–తిరుపతిలో అనేక అపచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నిరసన తెలిపిన మహిళలపై గూండాలతో దాడులు చేయించడం, కేసులు పెట్టించడం అత్యంత ఖండనీయమన్నారు. నైతిక విలువలు లేని వ్యక్తిని ఇంకా పదవిలో కొనసాగించడం ప్రభుత్వం వైఫల్యమని తేల్చిచెప్పారు. బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని, లేదంటే ప్రభుత్వం తక్షణమే ఆయనను తొలగించాలని లేకుంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఉందా..? ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ పదవి నుంచి బీఆర్ నాయుడును తొలగించాలని శాంతియుతంగా నిరసన చేస్తున్న మహిళలపై టీడీపీ గూండాలు దాడిని చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడికి పాల్పడిన ఘటనను చూస్తే కూటమి పాలనలో ప్రజాస్వామ్యం అనేది ఉందా..? చచ్చిపోయిందా..? అనే సందేహం కలుగుతుందన్నారు. మహిళలపై దాడి చేయడమే కాకుండా తిరిగి మహిళలపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయడాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. రాష్ట్రంలో మహిళలపై కూడా అంబేడ్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతుంటే .. సనాతనవాది అనే పవన్కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎప్పుడైతే పవిత్రమైన తిరుపతి లడ్డూలో జంతుకొవ్వు కలిసిందంటూ చంద్రబాబు, బీఆర్ నాయుడు అపహాస్యం చేశారో..ఆ నాటి నుంచే వారి పతనం ప్రారంభమైందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, రాష్ట్ర అనుబంధ విభాగం అధ్యక్షులు బొల్లవరపు జాన్వెస్లీ, పేర్ల విజయచందర్, పరిశీలకులు డాక్టర్ జహీర్ అహ్మద్, శోభ స్వాతిరాణి, పేడాడ రమణి కుమారి, రొంగలి జగన్నాథం, బాణాల శ్రీనివాసరావు, పిన్నమరాజు సతీష్ వర్మ, ముఖ్యనేతలు ఎండీ ఫరూఖీ, ద్రోణంరాజు శ్రీవాస్తవ, తాడి జగన్నాథ రెడ్డి, పల్లా దుర్గారావు, మంచ నాగ మల్లేశ్వరి, జీవీ రామచంద్రరావు, చెన్న జానకి రామ్, సేనాపతి అప్పారావు, అంబటి శైలేష్, పి.వి.సురేష్, సనపల రవీంద్ర భరత్, బోని శివరామకృష్ణ, కటికల కల్పన, మేడి ఆనందరావు బాజీ నాయుడు, రాయపురెడ్డి అనిల్ కుమార్, పీలా ప్రేమ కిరణ్ జగదీష్, సకలభక్తుల ప్రసాద్ రావు, దేవరకొండ మార్కెండేయులు, బోండా ఉమా మహేశ్వర రావు, కోడిగుడ్ల పూర్ణిమ, నీలి రవి, అల్లంపల్లి రాజబాబు, వేంపాడు శ్రీనివాస్ రెడ్డి, మువ్వల లక్ష్మి, సాడి పద్మారెడ్డి, రెయ్యి వెంకట రమణ, కెవి శశికళ, భూపతి రాజు సుజాత, ఎండి ఫరీఫ్, జీలకర నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు. -
డీఆర్వోగా విశ్వేశ్వర నాయుడు
మహారాణిపేట: జిల్లా రెవెన్యూ శాఖలో కీలకమైన జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) పోస్టుకు ప్రభుత్వం ఎట్టకేలకు నియామకం చేపట్టింది. గత ఏడాది అక్టోబర్ 21న డీఆర్వో బి.హెచ్.భవాని శంకర్ను బదిలీ చేసిన తరువాత ఈ పదవి ఇన్చార్జిలతో కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఇన్చార్జి డీఆర్వోగా ఉన్న గృహ నిర్మాణ సంస్థ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ) సత్తిబాబును ఇటీవల విజయనగరం జిల్లా రెవెన్యూ అధికారిగా నియమించారు. అనంతరం ఈ పోస్టు మళ్లీ ఖాళీ కావడంతో కలెక్టరేట్లో పనిచేస్తున్న కెఆర్సీ డిప్యూటీ కలెక్టర్ శేష శైలజను ఇన్చార్జి డీఆర్వోగా నియమించారు. ప్రస్తుతం ఆమెనే ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కడప జిల్లా రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న ఎం.విశ్వేశ్వర నాయుడును విశాఖ జిల్లా డీఆర్వోగా నియమిస్తూ మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ (ఎస్జీడీసీ)గా పనిచేసిన విశ్వేశ్వర నాయుడు గతంలో విశాఖ జిల్లాలో పలు పదవుల్లో పనిచేశారు. కలెక్టరేట్ పరిపాలనాధికారిగా (ఏవో), రూరల్ తహసీల్దార్గా సేవలందించిన ఆయనకు విశాఖ ప్రాంతంపై మంచి పరిచయం ఉంది. ఆర్డీవోకు బదిలీ ఇన్చార్జి విశాఖ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) సనపల సుధా సాగర్కు బదిలీ అయింది. గతంలో విశాఖ ఆర్డీవోగా పనిచేసిన పి.శ్రీలేఖను గత ఏడాది అక్టోబర్ 21న బదిలీ చేశారు. అనంతరం హెచ్పీసీఎల్ ఎస్డీసీ (భూసేకరణ అధికారి)గా ఉన్న సుధాసాగర్ను ఇన్చార్జి ఆర్డీవోగా నియమించారు. ఇప్పుడు ఆయన్ని విజయనగరం ఆర్డీవోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
వేటగాడే
● ఏ‘ఛీ’బీ బాగోతంమేతగాడైతే..తనిఖీల ముందే సమాచారం.. దర్జాగా దండుకుంటున్న వైనం కేసుల మాఫీ పేరిట అమాయకులపై ‘దందా’ పండు ముదుసలుల పెన్షన్ సొమ్మునూ వదలని వైనం పదే పదే అదే శాఖలో తిష్ట.. ఉన్నతాధికారులకే సవాల్! వ్యవస్థకే తూట్లు పొడుస్తున్న ‘కలెక్షన్’ వీరుడు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)లో మరోసారి అంతర్గత కలకలం రేగుతోంది. తనిఖీల సమాచారాన్ని ముందుగానే లీక్ చేస్తూ, అదే సమయంలో కక్షిదారుల నుంచే భారీగా వసూళ్లు చేస్తున్న ఓ అధికారి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో ఏసీబీలో పనిచేసి, మధ్యలో మరో విచారణ సంస్థకు బదిలీపై వెళ్లిం మళ్లీ అదే శాఖకు చేరిన ఈ వ్యక్తి ఇప్పుడు ‘లీకులు–కలెక్షన్లు’ ద్వంద్వ దందాతో చెలరేగుతున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనిఖీల వివరాలను ముందుగానే చేరవేసి అధికారులను అప్రమత్తం చేయడమే కాకుండా, గతంలో కేసులు ఎదుర్కొంటున్న వారిని టార్గెట్ చేస్తూ ‘సహాయం చేస్తాను’ పేరుతో వసూళ్లకు దిగుతున్నాడని సమాచారం. ఇటీవల జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంపై జరగబోయే తనిఖీల సమాచారాన్ని ముందుగానే లీక్ చేయడంతో, సంబంధిత అధికారులు అప్రమత్తమై తప్పించుకున్నారన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం ఏసీబీ ఉన్నతాధికారుల దృష్టికి చేరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే లీకుల వ్యవహారంలో పలువురిపై చర్యలు తీసుకున్న నేపథ్యంలోం ఈ కొత్త ‘లీక్ వీరుడు’ వ్యవహారం ఉన్నతాధికారులను మరింత ఆగ్రహానికి గురిచేస్తోందని సమాచారం. కఠిన వైఖరి కలిగిన ప్రస్తుత ఉన్నతాధికారి ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. అటు లీకులు.. ఇటు కలెక్షన్లు! ఒకవైపు కక్షిదారులను భయపెట్టి వసూళ్లు చేయడం.. మరోవైపు ఏసీబీ తనిఖీల విషయాలను బయటకు లీక్ చేస్తూ భారీగా దండుకోవడం సదరు వ్యక్తికి వెన్నతో పెట్టిన విద్యగా మారింది. ఇటీవల జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంపై దాడులు జరగబోతున్నాయనే అత్యంత రహస్య సమాచారాన్ని ఒక ఏసీపీ, డీసీపీకి ముందే చేరవేశాడన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దీంతో భారీ కలెక్షన్ రాయుళ్లుగా ముద్రపడిన ఆ ఇద్దరు అధికారులు ‘లీకు వీరుడి’ పుణ్యమా అని దర్జాగా తప్పించుకున్నారు. ఇప్పటికే ఏసీబీలో 9 మంది లీకు వీరులపై వేటు పడగా.. ఈ ‘పదో అవతారం’ వ్యవహారం ఇప్పుడు ఉన్నతాధికారులకు మింగుడుపడటం లేదు. చర్యలు లేకపోతే మచ్చ తప్పదు! విశాఖలో గత కొంతకాలంగా ఏసీబీపై ప్రజల్లో పెరిగిన గౌరవం ఈ ‘కలెక్షన్ కింగ్’ వల్ల మంటగలిసిపోయే ప్రమాదం ఉంది. ఈ ఇంటి దొంగను వెంటనే ఏరివేయనట్లయితే.. అవినీతి నిరోధక శాఖ తన లక్ష్యాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఈ లీకు వీరుడి ఆట కట్టించాలని బాధితులు కోరుతున్నారు. అవినీతిని వేటాడాల్సిన తుపాకీ.. ఇప్పుడు వసూళ్ల గొడ్డలిగా మారింది. నిఖార్సైన అధికారి సారథ్యంలో ఏసీబీ తన ప్రతిష్టను పెంచుకుంటుంటే, ఒకే ఒక్క ‘ఇంటి దొంగ’ ఆ శాఖ గౌరవాన్ని బజారున పడేస్తున్నాడు. తనిఖీల సమాచారాన్ని ముందస్తుగా ‘లీక్’ చేసి అవినీతి తిమింగలాలను కాపాడటమే కాదు.. కేసుల్లో ఇరుక్కున్న కక్షిదారుల నుంచే ‘సహాయం’ పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడుతున్న ఈ ‘కలెక్షన్ కింగ్’ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ముసలివాళ్ల నోటికాడ ముద్దకూ ఎసరు! ఈ లీకు వీరుడి అరాచకం అంతటితో ఆగలేదు. గతంలో ఏసీబీ కేసుల్లో చిక్కుకుని, ఇప్పుడు పదవీ విరమణ చేసి, పెన్షన్ రాక, రోగాలతో ఇబ్బంది పడుతున్న వృద్ధులను సైతం ఇతగాడు వదలడం లేదు. ‘మీ కేసు పరిష్కరిస్తా.. మీకు సహాయం చేస్తా‘ అంటూ నమ్మించి, వారి దగ్గర ఉన్న కొద్దిపాటి సొమ్మును కూడా మాయమాటలతో గుంజేస్తున్నాడు. వైద్య ఖర్చుల కోసం దాచుకున్న డబ్బును కూడా కనికరం లేకుండా వసూలు చేస్తున్న తీరుపై బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. మళ్లీ మళ్లీ ఏసీబీకే.. ఎందుకో? వసూళ్ల రుచి మరిగిన ఈ వ్యక్తి.. మధ్యలో వేరే విచారణ సంస్థకు వెళ్లినా, పక్కా పైరవీలతో మళ్లీ ఏసీబీకే రావడం వెనుక ఉన్న మతలబు ఏంటో అందరికీ అర్థమవుతూనే ఉంది. వసూళ్లకు అనువైన శాఖ కావడంతోనే మళ్లీ ఇక్కడే తిష్ట వేశాడన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారి ముక్కుసూటిగా వెళ్తున్నా, ఇతను మాత్రం తన పాత అలవాట్లను మానుకోకుండా సంస్థకు మచ్చ తెస్తున్నాడు. -
ఆ రెండు విభాగాల పనితీరు బాగోలేదు
డాబాగార్డెన్స్: తాను మేయర్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి (గత 11 నెలల కాలంలో) జీవీఎంసీలోని టౌన్ ప్లానింగ్, మెకానికల్ విభాగాల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని తాజా మాజీ మేయర్ పీలా శ్రీనివాసరావు బాహాటంగా అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం తన పదవీ కాలం ముగిసిన సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన 11 నెలల పాలనలో రూ. 760 కోట్లతో నగరాన్ని అభివృద్ధి చేశానని, వార్డుల వారీగా సమస్యలను పరిష్కరించడంలో సఫలమయ్యానని తెలిపారు. ముఖ్యంగా గుడ్ మార్నింగ్ కార్యక్రమం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు. కూటమిలో మేయర్ పదవికి ఎవరూ ముందుకు రాని సమయంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు తనను గుర్తించి అభ్యర్థిగా ప్రకటించడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. టౌన్ ప్లానింగ్, మెకానికల్ విభాగాల పనితీరుపై పీలా అసంతృప్తి -
సీనియర్ జర్నలిస్ట్ గంట్ల శ్రీనుబాబుకు ఉగాది పురస్కారం
మహారాణిపేట: సీనియర్ పాత్రికేయుడు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ నాయకుడు గంట్ల శ్రీనుబాబుకు ప్రతిష్టాత్మకమైన పరాభవనామ ఉగాది పురస్కారం లభించింది. జర్నలిజం, సేవా రంగంలో ఆయన చేస్తున్న విశేష సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉగాది పర్వదినం సందర్భంగా గురువారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి కందుల దుర్గేష్, ఇతర ప్రముఖులు చేతుల మీదుగా శ్రీనుబాబు ఈ అవార్డును స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా ఆయన్ని పలువురు జర్నలిస్టులు అభినందించారు. -
కలెక్టరేట్ పీజీఆర్ఎస్కు 278 వినతులు
మహారాణిపేట: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుంచి భారీగా వినతులు వచ్చాయి. కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలపై మొత్తం 278 అర్జీలు నమోదయ్యాయి. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, ఇన్చార్జి డీఆర్వో శేషశైలజ, ఏడీసీ సత్యవేణిలు వినతులు స్వీకరించారు. వినతుల్లో జీవీఎంసీకి సంబంధించి 94, పోలీస్ శాఖకు 26, ఇతర శాఖలకు సంబంధించి 158 ఉన్నాయి. ప్రధానంగా సంక్షేమ పథకాలు, ఇళ్ల స్థలాల మంజూరు, రైతు బజార్లలో దుకాణాల కేటాయింపు, లేఅవుట్ల క్రమబద్దీకరణ, ఇంటి పన్నులు, శాంతిభద్రతల సమస్యలపై ప్రజలు అధికారులకు విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు అందరూ పాల్గొన్నారు. -
కస్టమ్స్ అధికారుల బాధ్యతలకు దర్పణం ‘రైట్ టర్న్’
ఏయూక్యాంపస్: కస్టమ్స్ అధికారుల వృత్తిపరమైన సవాళ్లు, సామాజిక బాధ్యతలను ప్రతిబింబిస్తూ రూపొందించిన లఘు చిత్రం ‘రైట్ టర్న్– కర్మయోగి’ని సోమవారం నగరంలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కస్టమ్స్ సెంట్రల్ టాక్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సంజయ్ రథ్ మాట్లాడుతూ.. నిబంధనలకు లోబడి పనిచేసే అధికారులు తమ బాధ్యతల పట్ల ఎంతటి సామాజిక స్పృహతో ఉండాలో ఈ చిత్రం చక్కగా వివరించిందని పేర్కొన్నారు. 10వ ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రానికి ‘హానరబుల్ జ్యూరీ మెన్షన్’ లభించడం విశేషమన్నారు. ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్. శ్రీధర్ మాట్లాడుతూ కేవలం విమానాశ్రయాలకే పరిమితం కాకుండా కార్గో క్లియరెన్స్లోనూ కస్టమ్స్ కీలక పాత్ర పోషిస్తుందని, ఆ విధి నిర్వహణలోని భారాన్ని, బాధ్యతను ఈ చిత్రంలో స్పృశించామని తెలిపారు. కస్టమ్స్ సిబ్బందే ఇందులో నటించడం గమనార్హం. కార్యక్రమంలో విశాఖ పోర్ట్ అథారిటీ డిప్యూటీ చైర్పర్సన్ కె. రోషిణి అపరంజి, అడిషనల్ కమిషనర్ రజనీష్, ఇతర అధికారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
ఎగిరిన గ్రిల్స్
కూలిన గోడలు..పేలుడు జరిగిన భవనం ఇదే.. పేలుడు ధాటికి రెండంతస్తుల భవనం వెనుక వైపు గోడ పేకమేడలా కూలి పక్కనే ఉన్న రేకుల షెడ్డుపై పడింది. కిటికీ ఇనుప గ్రిల్స్ గాలిలో ఎగురుకుంటూ వెళ్లి రెండు వీధుల అవతల పడ్డాయంటే ఆ ధాటి ఎంత తీవ్రంగా ఉందో ఊహించుకోవచ్చు. ‘ఆ సమయంలో వీధిలో ఎవరైనా ఉంటే వారి ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. ఇంట్లో మనుషులుంటే ఆ గుర్తు పట్టలేని విధంగా ఛిద్రమైపోయేవారు’ అని ఘటనా స్థలాన్ని చూసిన వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణనష్టం జరగకపోవడం కేవలం అదృష్టంగా భావిస్తున్నారు. ఐదు కేసులున్నా ఆగని ‘వారసత్వ’ అరాచకం బాణసంచా సూత్రధారి స్థానికుడు దామోదర శివకృష్ణ కుమార్ (బాంబుల శివ). తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన బాంబుల వ్యాపారాన్ని ఏకంగా 40 ఏళ్లుగా యథేచ్ఛగా సాగిస్తున్నాడు. ఎక్కడో తక్కువ ధరకు బాంబులు కొనుగోలు చేయడం.. జనావాసాల మధ్య ఉన్న ఇంట్లో నిల్వ ఉంచి అమ్మడం ఇతనికి నిత్యకృత్యం. గతంలో ఇతనిపై 5 సార్లు కేసులు నమోదయ్యాయి. పోలీసులు సామగ్రిని స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేసినా, శివకృష్ణలో మార్పు రాలేదు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు గుట్టుచప్పుడు కాకుండా సాగే ఈ అక్రమ వ్యాపారం, ఈ పేలుడుతో ఇప్పుడు బహిర్గతమైంది. చట్టాలన్నా, పోలీసులన్నా ఇతనికి లెక్క లేదన్నది బహిరంగ రహస్యం. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే గణబాబు సోమవారం సందర్శించారు. నివాస ప్రాంతాల్లో పేలుడు పదార్థాలు నిల్వ ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రంగంలోకి యంత్రాంగం.. ఆధారాల సేకరణ క్లూస్ టీం సభ్యులు ఘటనా స్థలంలో సోదాలు నిర్వహించి పేలుడుకు సంబంధించిన కీలక ఆనవాళ్లను సేకరించారు. సీఐ సన్యాసినాయుడు, ఎస్ఐ రామారావు భవనాన్ని తమ ఆధీనంలోకి తీసుకోగా, తహసీల్దార్ రమేష్, వెస్ట్ జోనల్ కమిషనర్ హేమావతి, టౌన్ ప్లానింగ్ ఏసీపీ రామలింగేశ్వరరావు భవన పటిష్టతను పరిశీలించారు. ప్రస్తుతానికి ఆ భవనాన్ని పూర్తిగా ఖాళీ చేయించి సీజ్ చేశారు. ఐదు కేసులు ఉన్నా ఒక వ్యక్తి 40 ఏళ్లుగా ఇంత సాహసం ఎలా చేయగలుగుతున్నాడు? పర్యవేక్షించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వల్లే కదా సామాన్యుల ప్రాణాలు ఫణంగా మారుతున్నాయి? ఇప్పటికై నా యంత్రాంగం కళ్లు తెరవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రాణాలు దక్కడం అదృష్టం జనావాసాల మధ్య ఇలా బాంబులు నిల్వ చేయడం చాలా దారుణం. పేలుడు ధాటికి వెనుక వైపు గోడ ఎగిరి వచ్చి మా ఇంటిపై పడటంతో రేకుల షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది. ఆదివారం కావడంతో మేమంతా బయటకు వెళ్లాం, లేదంటే భారీ ప్రాణనష్టం జరిగి ఉండేది. బాంబుల తయారీ కేంద్రాలు, అక్రమ నిల్వలను పూర్తిగా నివారించాలి. ఈ ప్రమాదం వల్ల మేము భారీగా నష్టపోయాం. అధికారులు స్పందించి ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలి. –పి.కాశీనాథ్, ఆదర్శనగర్ చావు అంచుల దాకా.. మా ఇంటి సమీపంలోని ఉన్న భవనంలో బాంబులు తయారు చేస్తున్నారన్న విషయం తెలియదు. పేలుడు సంభవించిన ప్పుడు మేమెంతా బయట లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కానీ ఆ శబ్దానికి, భయంకరమైన అదురుకు తీవ్ర ఆందోళనకు గురయ్యాం. మా వదిన ఆ ధాటికి భయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యం అందించాం. కానీ ఆ భయం నుంచి తను ఇంకా కోలుకోలేదు. జనావాసాల మధ్య ఇలాంటి బాంబుల నిల్వలు లేకుండా అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. –హెప్సిబా, ఆదర్శనగర్ ఆదర్శనగర్లో బాణసంచా పేలుడు అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం బాంబుల శివ అరాచకం.. పోలీసు కౌన్సెలింగ్ పట్టించుకోని వైనం 40 ఏళ్లుగా వారసత్వ వ్యాపారం.. అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం అది కేవలం బాణసంచా పేలుడు కాదు.. జనావాసాల మధ్య పొంచి ఉన్న మృత్యువు విసిరిన పంజా..జీవీఎంసీ 89వ వార్డు ఆదర్శనగర్ శ్మశానవాటిక సమీపంలో ఆదివారం రాత్రి సంభవించిన బాణసంచా పేలుడు ఘటన సృష్టించిన బీభత్సం చూస్తుంటే స్థానికులు ఇప్పటికీ వణికిపోతున్నారు. చీకట్లో కేవలం మంటలు, పొగ మాత్రమే కనిపించినా.. సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చిన దృశ్యాలు ఆ ప్రాంతాన్ని రణరంగంగా తలపించాయి. – గోపాలపట్నంనిందితుడిని అదుపులోకి తీసుకున్నాం గతంలోనే బాంబుల శివపై 5 కేసులు నమోదు చేశాం. ఈ ప్రమాదకరమైన వృత్తిని మానుకుని, వేరే పని చూసుకోమని పలుమార్లు కౌన్సెలింగ్ ఇచ్చినా అతనిలో మార్పు రాలేదు. ఈ ఘటనను చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కఠినమైన సెక్షన్లతో కేసులు నమోదు చేస్తున్నాం. –సన్యాసినాయుడు, సీఐ, గోపాలపట్నం -
మొక్కుబడిగా ‘రెవెన్యూ క్లినిక్’
మహారాణిపేట: జిల్లా యంత్రాంగం చేపట్టిన ‘రెవెన్యూ క్లినిక్’ నిర్వహణకు సోమవారం గందరగోళం నెలకొంది. సాధారణంగా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జరిగే ఈ కార్యక్రమానికి, ఇతర సమావేశాల కారణంగా ఈసారి వేదిక కరువైంది. అటు కోర్టు హాలులోనూ స్థలం లేకపోవడంతో అధికారులు ఒక్కో మండలానికి ఒక్కో చోట మొక్కుబడిగా వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కంటే రెవెన్యూ క్లినిక్కే జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చినప్పటికీ, సరైన వసతి లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పూర్తిస్థాయిలో సమస్యలపై చర్చించే అవకాశం లేకపోవడంతో, తహసీల్దార్లు కేవలం వినతులు తీసుకుని బయట నుంచే సమాధానాలు చెప్పి పంపించేశారు. తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశతో వచ్చిన బాధితులు.. సరైన వేదిక, సమయం కేటాయించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. -
మరణించిన విద్యుత్ ఉద్యోగి కుటుంబానికి రూ.కోటి బీమా
తాటిచెట్లపాలెం : విధి నిర్వహణలో మరణించిన ఏపీఈపీడీసీఎల్ ఉద్యోగి కుటుంబానికి కార్పొరేట్ ప్రమాద బీమా కింద రూ. కోటి పరిహారాన్ని అందజేశారు. కాకినాడ సర్కిల్ పెద్దాపురం సెక్షన్లో జెఎల్ఎం గ్రేడ్–2గా పనిచేస్తూ గత ఆగస్టులో ప్రమాదవశాత్తు మరణించిన అరుమిల్లి రామకృష్ణ కుటుంబానికి ఈ ఆర్థిక భరోసా లభించింది. సోమవారం విశాఖలోని సంస్థ కార్యాలయంలో సీఎండీ పృధ్వీతేజ్ ఇమ్మడి చేతుల మీదుగా మృతుని తల్లి సూర్యకుమారికి ఈ చెక్కును అందజేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ శాలరీ సేవింగ్స్ ఖాతాకు అను బంధంగా ఉన్న బీమా పథకం ద్వారా ఈ మొత్తం సమకూరింది. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. క్లిష్ట సమయాల్లో ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవడంలో బ్యాంక్ బీమా పథకాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ ఫైనాన్స్ డైరెక్టర్ ఎస్. హరిబాబు, ఎస్బీఐ అమరావతి డీజీఎం అశోక్ వి సోనునే, విశాఖ ఏజీఎం ఎస్ శ్రీనివాసరావు, చీఫ్ మేనేజర్లు ఏ శ్రీనివాస్, ఎల్ అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో అమరజీవికి ఘన నివాళి
మహారాణిపేట: ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు కే.కే రాజు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్తలు తిప్పల దేవన్రెడ్డి, మొల్లి అప్పారావు, డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్, పార్టీ ముఖ్య నేతలు కొండా రాజీవ్ గాంధీ, మంచ నాగ మల్లేశ్వరి, పేర్ల విజయ్ చందర్, జీవీ రవి చంద్రరాజు, రవీంద్ర భరత్, పీలా ప్రేమ కిరణ్ జగదీష్ , వంకాయల మారుతీ ప్రసాద్, సకలభక్తుల ప్రసాద్ రావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు, కార్పొరేటర్ కేవీ శశికళ, బిపిన్ కుమార్ జైన్, పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రామ రాజు, సాగర, బొండా శ్రీను, పద్మ, శేఖర్ పాల్గొన్నారు. -
టౌన్ ప్లానింగ్కు అత్యధిక అర్జీలు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మేయర్ పీలా శ్రీనివాసరావు, అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, పి.నల్లనయ్యతో కలిసి మొత్తం 117 వినతులను స్వీకరించారు. మేయర్ హోదాలో పీలా శ్రీనివాసరావుకు ఇదే చివరి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కావడం గమనార్హం. అత్యధికంగా పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి 64 వినతులు రాగా, రెవెన్యూ విభాగానికి 21, ఇంజినీరింగ్ విభాగానికి 13, ప్రజారోగ్య విభాగానికి 9 వినతులు అందాయి. అలాగే పరిపాలన, అకౌంట్స్ విభాగానికి 5, యూసీడీకి 4, ఉద్యానవన విభాగానికి ఒక వినతి చొప్పున నమోదయ్యాయి. కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ (అమృత్) డి.విజయభారతి, ప్రధాన వైద్యాధికారి నరేష్ కుమార్, సీసీపీ ప్రభాకరరావు, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి, డీసీఆర్ శ్రీనివాసరావు, కార్యదర్శి బీవీ రమణ, ఏడీహెచ్ వాసుకి, స్పోర్ట్స్ డైరెక్టర్ అప్పలరాజుతో పాటు పలువురు డీసీపీలు, ఏసీపీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీకి 37 ఫిర్యాదులు
సాక్షి, విశాఖపట్నం : విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి ఏపీఈపీడీసీఎల్ నిర్వహించిన ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమానికి సోమవారం 37 ఫిర్యాదులు వచ్చినట్లు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీతేజ్ ఇమ్మడి తెలిపారు. కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం ఉదయం నిర్వహించిన డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యక్రమంలో 37 మంది వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలను నేరుగా సీఎండి దృష్టికి తీసుకువచ్చారు. ఇందులో ప్రధానంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరు, విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు, ట్రాన్స్ఫార్మర్ల మార్పిడిలో జాప్యం, విద్యుత్ బిల్లులు, విద్యుత్ లైన్లు, స్తంభాల మార్పిడి, తదితర సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ సందర్భంగా సీఎండీ పృథ్వీతేజ్ మాట్లాడుతూ ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమం ద్వారా వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు టీవీ సూర్యప్రకాష్, ఎస్ హరిబాబు, సీజీఎం లు వి విజయలలిత, ఎల్ దైవప్రసాద్, జీఎంలు వీవీఎస్ఎన్వీ ప్రసాద్, ఎం ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. -
విశాఖ ప్రగతికి సరికొత్త ప్రణాళిక
మహారాణిపేట: జిల్లాను అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలిపేందుకు స్వర్ణాంధ్ర–2047లో భాగంగా రూపొందించిన పది సూత్రాల అమలుపై కలెక్టర్ హరేందిర ప్రసాద్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల ముఖ్యమంత్రి నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో తీసుకున్న కీలక నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు సోమవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాన్ని పేదరికం లేని దిశగా తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేస్తూ, ప్రతి కుటుంబానికి కనీస అవసరాల కల్పనతో పాటు సామాజిక మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో రోడ్ల అనుసంధానం, డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ, వీధి దీపాల నిర్వహణపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. యువతకు ఉపాధి కల్పనలో భాగంగా నైపుణ్య శిక్షణను వేగవంతం చేస్తూ, లక్ష మందికి నిర్వహించిన స్కిల్ స్క్రీనింగ్లో అర్హత సాధించిన వారికి తగిన అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు. ఇకపై జిల్లా ఉపాధి కల్పనాధికారి ‘స్కిల్ ఆఫీసర్’గా కూడా వ్యవహరిస్తారని ఆయన వెల్లడించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, ఇన్చార్జి డీఆర్వో శేషశైలజ, సీపీవో శ్రీనివాసరావు, ఏడీసీ సత్యవేణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఏసీబీ!
● మళ్లీ లీకువీరులుహతవిధీఏసీపీ, డీసీపీ స్థాయి అధికారులపై అవినీతి ఆరోపణలు ఏసీబీ తనిఖీల సమయంలో అందుబాటులో లేని కీలక అధికారులు అంతర్గత లీకులే కారణమని విమర్శలుఅవినీతి తిమింగలాలను వేటాడాల్సిన ఏసీబీలో ’లీకు వీరుల’ హవా ఏమాత్రం తగ్గడం లేదు. నిఘా వ్యవస్థ కళ్లుగప్పి, అవినీతి అధికారులకు రక్షణ కవచంలా మారుతున్న కొందరు సిబ్బంది వ్యవహారం ఇప్పుడు శాఖలో హాట్ టాపిక్గా మారింది. తాజా సంఘటనలు చూస్తుంటే.. ఏసీబీ వ్యూహాల కంటే లీకు వీరుల నెట్వర్కే బలంగా ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీవీఎంసీ టౌన్ ప్లానింగ్లో ముందస్తు ‘హెచ్చరికల’ కలకలంసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అవినీతి అంతమే లక్ష్యంగా అడుగులు వేయాల్సిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కోటలో.. ‘లీకు వీరులు’ లంకంత రంధ్రం చేస్తున్నారు. అధికారుల వ్యూహాలు పక్కాగా ఉన్నా, దాడుల సమాచారం మాత్రం అంతకంటే వేగంగా నిందితులకు చేరిపోతోంది. గతంలో ఎనిమిది మందిపై వేటు పడినా, హెడ్ కానిస్టేబుళ్లు కటకటాల పాలైనా.. విశాఖ ఏసీబీలో ఈ ‘ఇన్ఫార్మర్’ వ్యవస్థ వేళ్లూనుకుపోవడం విస్మయానికి గురిచేస్తోంది. తాజాగా గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) టౌన్ ప్లానింగ్ విభాగంలో జరిగిన సోదాలే దీనికి సజీవ సాక్ష్యం. ఏసీబీ బృందం అడుగు పెట్టకముందే, ‘వసూళ్ల వీరులు’గా ముద్రపడ్డ ఏసీపీ, డీసీపీ స్థాయి అధికారులు చల్లగా జారిపోవడం వెనుక శాఖలోని ఒక ‘లీగల్’ మేధావి హస్తం ఉన్నట్లు వినిపిస్తున్న ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. వేటగాడి కంటే ముందే వేట పసిగట్టిన జంతువులా.. అవినీతి అధికారులు తప్పించుకుంటున్నారంటే.. ఏసీబీలోనే ‘డబుల్ ఏజెంట్లు’ రాజ్యమేలుతున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సదరు లీకువీరుడిపై ఉన్నతాధికారులు కూడా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. లీకుల ‘నెట్వర్క్’పై మళ్లీ చర్చ విశాఖ ఏసీబీ విభాగంలో లీకుల వ్యవహారం కొత్తది కాదు. గతంలో కూడా తనిఖీల సమాచారం ముందుగానే అవినీతి అధికారులకు చేరుతోందన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారి తీశాయి. ఫిర్యాదులు వచ్చిన అధికారులకే సమాచారం చేరడంతో భారీగా నెలవారీ మాముళ్లు వసూలవుతున్నాయన్న విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ ఉన్నతాధికారులు సీరియస్గా స్పందించి ఒకేసారి ఎనిమిది మంది సిబ్బందిపై బదిలీ వేటు వేశారు. అయినప్పటికీ లీకుల వ్యవహారం పూర్తిగా ఆగలేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో హెడ్ కానిస్టేబుల్పై వేటు గత ఏడాది జూన్లో జరిగిన మరో ఘటనలో ఒక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలకు వెళ్లిన ఏసీబీ అధికారులు అక్కడి ఫోన్లను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. ఆ సమయంలో ఒక హెడ్ కానిస్టేబుల్ ముందుగానే తనిఖీల సమాచారం సబ్ రిజిస్ట్రార్కు ఫోన్ ద్వారా అందించినట్టు బయటపడింది. సదరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతుండగానే ఏసీబీ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఫోన్ కాల్ వివరాల్లో నిజం బయటపడడంతో ఆ హెడ్ కానిస్టేబుల్పై చర్యలు తీసుకుని అతని నివాసంలో కూడా సోదాలు నిర్వహించినట్టు సమాచారం. టౌన్ ప్లానింగ్లో ‘సేఫ్’ గేమ్! తాజాగా జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో జరిగిన ఏసీబీ సోదాలు అభాసుపాలయ్యాయి. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులకు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అసలు సిబ్బంది దొరకకపోవడం గమనార్హం. ముఖ్యంగా వసూళ్ల వీరులుగా ముద్రపడ్డ ఒక ఏసీపీ, ఒక డీసీపీ స్థాయి అధికారులు తనిఖీలకు సరిగ్గా కొద్ది నిమిషాల ముందే మాయమవ్వడం వెనుక ‘ముందస్తు సమాచారం’ అందిందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. చట్టపరమైన ముసుగులో ’లీకు’ డ్రామా? గతంలో క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా సమాచారం బయటకు వెళ్లేది. కానీ, ఈసారి వ్యూహం మారింది. రెగ్యులర్ సిబ్బందిపై నిఘా ఉండటంతో, ఈ దఫా చట్టపరమైన వ్యవహారాలు చూసే (లీగల్ సెక్షన్) ఒక కీలక వ్యక్తి ద్వారా ఈ సమాచారం లీక్ అయినట్టు తెలుస్తోంది. సదరు ఏసీపీ, డీసీపీలకు ఆ ’అజ్ఞాత వ్యక్తి’ ముందస్తు హెచ్చరికలు పంపడంతో, ఏసీబీ బృందం వచ్చేసరికి వారు అలెర్ట్ అయిపోయారు. రికార్డులు చూస్తే అక్రమాలు కనిపిస్తున్నా.. అక్రమార్కులు మాత్రం దొరకకుండా దొడ్డిదారిన తప్పించుకున్నారు. తదుపరి వేటు ఎవరిపై? ప్రస్తుతం ఇన్చార్జిగా ఉన్న డీఎస్పీ అత్యంత కఠినంగా వ్యవహరిస్తారనే పేరుంది. ఆయన రాకతో లీకు వీరులు సర్దుకుంటారని భావించినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మారలేదు. జీవీఎంసీ అధికారుల ఎస్కేప్ ఎపిసోడ్ను ఏసీబీ ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకున్నారు. తనిఖీల సమాచారాన్ని బయటకు పంపిన ఆ ’లీగల్’ కింగ్పిన్ ఎవరనే దానిపై ఇప్పటికే ఒక స్పష్టతకు వచ్చినట్టు సమాచారం. త్వరలోనే శాఖలో మరోసారి ప్రక్షాళన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
గ్యాస్ట్రబుల్
నగర నడిబొడ్డున ఉన్న గురుద్వారా జంక్షన్ సాక్షిగా సామాన్యుడి గ్యాస్ కష్టాలు రోడ్డున పడ్డాయి. ఓ పక్క డిజిటల్ ఇండియా, డోర్ డెలివరీ అని గొప్పలు చెబుతున్నా..క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఆదివారం ఒక్క రోజు సెలవు వస్తే చాలు.. సోమవారం ఉదయానికే గ్యాస్ ఏజెన్సీల ముందు కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఖాళీ సిలిండర్లను భుజాన వేసుకుని.. పనులన్నీ మానుకుని గంటల తరబడి ఎండలో పడిగాపులు కాస్తున్నారు. సిలిండర్ ఇంటికి రాకపోవడమే కాకుండా, స్వయంగా వెళ్లి తెచ్చుకోవాలన్నా చుక్కలు కనిపిస్తున్నాయి. గ్యాస్ ఏజెన్సీల నిర్వహణ లోపమో.. సరఫరాలో వైఫల్యమో తెలియదు కానీ సామాన్యుడి పొయ్యి వెలగాలంటే మాత్రం గంటల తరబడి రోడ్ల మీద నిలబడక తప్పడం లేదు. గ్యాస్ ధరల భారంతో ఇప్పటికే సతమతమవుతున్న సామాన్యుడికి, ఈ నిరీక్షణ మరిన్ని కన్నీళ్లు మిగులుస్తోంది. అధికారులు, సంబంధిత కంపెనీలు ఇప్పటికై నా స్పందించి ఈ ‘గ్యాస్’ తిప్పలు తప్పించాలని జనం డిమాండ్ చేస్తున్నారు. –ఫొటోలు : సాక్షి, ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
త్వరలో న్యాయవాదుల సంఘానికి ఎన్నికలు
మహారాణిపేట: రాష్ట్ర బార్ కౌన్సిల్ ఆదేశాల ప్రకారం న్యాయవాదుల సంఘాలకు ఈనెల 27వ తేదీకి లేదా ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికలు జరపాలని నిర్ణయించబడింది. ఈ నేపథ్యంలో విశాఖ న్యాయవాదులు సంఘం జిల్లా కోర్టులో సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఎం.కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుత సంవత్సరానికి సంఘంలో ఉపాధ్యక్ష, గ్రంథాలయ కార్యదర్శి, జూనియర్ కార్యనిర్వాహక సభ్యుల స్థానాలు రిజర్వ్లో ఉన్నాయన్నారు. ఈ స్థానాలకు మహిళ న్యాయవాదులు పోటీ చేయవచ్చని చెప్పారు. ఎన్నికల అధికారిగా ప్రభాకరరెడ్డి సీనియర్ న్యాయవాది ఎ.ప్రభాకరరెడ్డిను ఎన్నికల నిర్వహణ అధికారిగా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మూడున్నర దశాబ్దాలుగా న్యాయ వృత్తిలో ఉన్న ప్రభాకరరెడ్డి పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు న్యాయసలహాదారుగా సేవలందిస్తున్నారు. గతంలో కూడా సంఘం ఎన్నికల్లో అధికారిగా పనిచేసిన ఆయన నియామకంపై బార్ కౌన్సిల్ సభ్యులు ఎస్. కృష్ణ మోహన్, పి.నరసింహరావు, కె.రామజోగేశ్వరరావు, బైపా అరుణ్కుమార్, ఇతర న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. -
పుట్టెడు దుఃఖంలోను పరీక్షకు హాజరు
గాజువాక: రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోయిన అనుపమ పదో తరగతి పరీక్షకు హాజరైంది. ఈనెల 15వ తేదీన బీహెచ్ పీవీ వద్ద టిప్పర్ సృష్టించిన బీభత్సంలో అనుపమ తండ్రి రామకృష్ణ దుర్మరణం పాలైన విష యం తెలిసిందే. కుటుంబమంతా విషాదంలో ఉన్నప్పటికీ అనుపమ ఆ దుఃఖాన్ని దిగమింగుకొని గాజువాక జిల్లా పరిషత్ హైస్కూల్లో తొలిరోజు పరీక్షకు హాజరైంది. ఈ సందర్భంగా ఆమెను పలకరించిన విలేకరులతో మాట్లాడుతూ ‘నాన్నకు చదువంటే ఇష్టం. ఎన్నికష్టాలు వచ్చినా చదువుకోమని చెప్పారు. తనకేం కష్టం వచ్చినా చదువుకు వెనుకాడవద్దని చెప్పారు. అందుకే ఎంత దుఃఖంలో ఉన్నా పరీక్షకు హాజరయ్యా’నని చెప్పింది. -
తొలిరోజు పదిలంగా..
పదో తరగతి పరీక్షలు ఆరిలోవ: జిల్లాలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పరీక్షలు సజావుగా జరిగాయి. ఈ పరీక్షలు ఏప్రిల్ 1 వరకు కొనసాగనున్న విషయం తెలిసిందే. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన పరీక్షలకు విద్యార్థులు సమయానికి ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. తమ పిల్లలను పరీక్షలకు తీసుకొచ్చిన తల్లిదండ్రులతో కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ముఖ్యంగా ప్రధాన రహదారుల పక్కన ఉన్న కొన్ని పాఠశాలల్లో పరీక్ష ప్రారంభం, ముగింపు సమయాల్లో విద్యార్థులు, తల్లిదండ్రుల రద్దీతో వాహన రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. ఆశీస్సుల కోలాహలం పరీక్షలకు వెళ్లే ముందు పలువురు విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఆలయాలు, చర్చిలను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నగరంలోని సంపత్ వినాయకుడి ఆలయం వద్ద విద్యార్థుల కోలాహలం కనిపించింది. ఎక్కువ మంది విద్యార్థులు తమ హాల్ టికెట్లను దేవుడి వద్ద ఉంచి పూజలు చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు బొట్టు పెట్టి ఆశీర్వదించి పరీక్షలకు పంపించారు. అధికారుల తనిఖీలు పరీక్షల సరళిని పర్యవేక్షించేందుకు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. పరీక్షల పరిశీలకుడు దేవానందరెడ్డి 5 కేంద్రాలను, ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు విజయభాస్కర్ 4 కేంద్రాలను తనిఖీ చేయగా, డీఈవో స్వయంగా 8 కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు సైతం 10 కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉత్తరాంధ్రలో 99.61 శాతం హాజరు మధురవాడ: ఉత్తరాంధ్రలో జరిగిన 10వ తరగతి పరీక్షలకు 1,23,214 మంది విద్యార్థులకు గాను 1,22,762 మంది హాజరయ్యారని విద్యాశాఖ ఆర్జేడీ విజయభాస్కర్ తెలిపారు. 639 పరీక్షా కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షలకు 652 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. తనిఖీ చేసి పంపిస్తున్న సిబ్బందిఓపెన్ టెన్త్ పరిస్థితి సార్వత్రిక విద్యా పీఠం ద్వారా పరీక్ష రాస్తున్న విద్యార్థుల హాజరు ఇలా ఉంది: కేటాయించిన కేంద్రాలు 11 పరీక్ష రాయాల్సిన వారు 578 హాజరైన వారు 480 హాజరు శాతం: 83.04%జిల్లాలో హాజరు వివరాలు మొదటి రోజు ప్రథమ భాష (తెలుగు, సంస్కృతం, ఉర్దూ, ఒరియా) పరీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించిన గణాంకాలను డీఈవో ఎన్.ప్రేమకుమార్ వెల్లడించారు: మొత్తం పరీక్షా కేంద్రాలు: 133 పరీక్ష రాయాల్సిన వారు : 29,042 హాజరైన విద్యార్థులు: 28,955 హాజరు శాతం: 99.70% -
విశాఖ పోర్టులో ఆధునిక విప్లవం!
సాక్షి, విశాఖపట్నం: ‘ఈస్ట్కోస్ట్ గేట్ వే ఆఫ్ ఇండియా’గా పేరుగాంచిన విశాఖపట్నం పోర్టు అంతర్జాతీయ నౌకాయాన పటంలో తన ముద్రను మరింత బలోపేతం చేసుకుంటోంది. దిగ్గజ పోర్టులతో పోటీపడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100 మిలియన్ టన్నుల సరకు రవాణా లక్ష్యాన్ని ఛేదించేందుకు సన్నద్ధమవుతోంది. అటు మౌలిక వసతులు, ఇటు సాంకేతికత.. రెండింటినీ జోడించి నిర్వహణ సామర్థ్యాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు ‘యాంత్రీకరణ’ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ‘ఓ అండ్ ఎం’.. పోర్టు సరికొత్త అస్త్రం! దేశంలోనే తొలిసారిగా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) పద్ధతిని అమలు చేసి సక్సెస్ అయిన విశాఖ పోర్టు, ఇప్పుడు అదే వ్యూహంతో మరిన్ని బెర్తులను ఆధునికీకరించనుంది. పోర్టు ఖజానాపై ఒక్క రూపాయి భారం పడకుండా, ప్రైవేట్ భాగస్వామ్యంతో రూ. 800 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అధికారులు అడుగులు వేస్తున్నారు. హెచ్ఎల్సీ క్రేన్లతో.. సూపర్ ఫాస్ట్ హ్యాండ్లింగ్! మల్టీ కార్గో హ్యాండ్లింగ్లో వేగాన్ని పెంచేందుకు అత్యాధునిక హెవీ లిఫ్ట్ క్రేన్లను (హెచ్ఎల్సీ) ఏర్పాటు చేయనున్నారు. ఈక్యూ–3 : మల్టీ పర్పస్ కార్గో కోసం కేటాయింపు. ఈక్యూ–4 : బల్క్ కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యం పెంపు. డబ్ల్యూక్యూ–1: బెర్తు పునర్నిర్మాణం, ఆధునికీకరణ. ఈ మూడు బెర్తుల నిర్వహణ బాధ్యతలను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించనున్నారు. తద్వారా అత్యాధునిక యంత్రాలతో సరకు రవాణా వేగం పెరగడమే కాకుండా, పోర్టు నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గుతుంది. రీటెండర్లతో పక్కా వ్యూహం ముందుగా పిలిచిన టెండర్లలో ఆశించిన మేర పెట్టుబడులు రాకపోవడంతో, పోర్టు ప్రయోజనాల దృష్ట్యా అధికారులు ఇప్పుడు రీటెండర్లకు వెళ్తున్నారు. పోర్టు చైర్మన్ డాక్టర్ అంగముత్తు, డిప్యూటీ చైర్పర్సన్ రోష్ని అపరాంజి దిశానిర్దేశంలో, చీఫ్ మెకానికల్ ఇంజనీర్ (సీఎంఈ) రామ్ ప్రసాద్ పర్యవేక్షణలో ఈ భారీ కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే రూ. 655 కోట్లతో ఈక్యూ–7, వెస్ట్ క్యూ–7, 8 బెర్తుల యాంత్రీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రపంచ వాణిజ్య కేంద్రంగా విశాఖ కేవలం సరకు రవాణాకే పరిమితం కాకుండా, కంటైనర్ టెర్మినల్ విస్తరణ, జెట్టీల ఆధునికీకరణ, లాజిస్టిక్ కనెక్టివిటీ ప్రాజెక్టులతో విశాఖ పోర్టు రూపురేఖలు మారుతున్నాయి. రాబోయే రోజుల్లో 100 శాతం మెకనైజేషన్ పూర్తి చేసుకుని, ప్రపంచ వాణిజ్య కేంద్రాలకు కేరాఫ్ అడ్రస్గా నిలవడమే లక్ష్యంగా ఈ ‘ఆధునిక’ విప్లవం సాగుతోంది. విశాఖ పోర్టు సాధిస్తున్న ఈ పురోగతి, అటు పారిశ్రామిక రంగానికి, ఇటు ప్రభుత్వానికి భారీ ఆదాయ వనరుగా మారబోతోంది. పెట్టుబడుల ప్రవాహం పెరిగితే స్థానికంగా మరిన్ని ఉపాధి అవకాశాలు లభించే వీలుంది. -
మహిళలపై దాడులు సిగ్గుచేటు
మహారాణిపేట: తిరుపతిలో మహిళా నిరసనకారులపై జరిగిన దాడిని నిరసిస్తూ మంగళవారం ఎల్ఐసీ జంక్షన్ వద్ద డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహం వద్ద భారీ నిరసన చేపట్టనున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ప్రకటించారు. సోమవారం మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహారశైలిపై శాంతియుతంగా నిరసన తెలిపిన మహిళలపై టీడీపీ శ్రేణులు దాడి చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు. బాధితులపైనే పోలీసులు అక్రమ కేసులు బనాయించి, పీడీ యాక్ట్ నమోదు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు నిరసనగా నిర్వహించే ఈ కార్యక్రమంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, అనుబంధ విభాగాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కేకే రాజు పిలుపునిచ్చారు. -
రెడ్ హ్యాండెడ్గా చిక్కిన ఎమ్మెల్యే వెలగపూడి అనుచరుడు
విశాఖపట్నం: విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అనుచరుడు, కరకచెట్టు పోలమాంబ ఆలయ కమిటీ చైర్మన్ మద్ది శ్రీనివాస్ వివాహేతర సంబంధంతో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడం కలకలం రేపింది. కొద్ది రోజులుగా టీడీపీ నాయకుల లైంగిక వేధింపుల ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తుండగా తాజాగా మద్ది శ్రీనివాస్ ఆ జాబితాలో చేరాడు. పోలీసులు, బాధిత మహిళ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి...! బుద్ధి చెప్పాల్సింది పోయి.. వెలగపూడి వత్తాసు.. మద్ది శ్రీనివాస్ కొన్నాళ్లుగా భార్య వసుంధరను వదిలించుకోవాలని చూస్తున్నాడు. తాను గర్భవతిగా ఉన్న సమయంలో శ్రీనివాస్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడంపై అతడి భార్య న్యాయ పోరాటానికి దిగారు. దీనిపై భీమిలి పోలీసు స్టేషన్తో పాటు విశాఖ త్రీటౌన్ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. అతడి వ్యవహారాన్ని పలు సందర్భాల్లో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు దృష్టికి తెచ్చారు. తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని ప్రాథేయపడ్డారు. అయితే శ్రీనివాస్కు బుద్ధి చెప్పాల్సింది పోయి వెలగపూడి అతడిని వెనకేసుకురావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. భార్యా బిడ్డలను పట్టించుకోని శ్రీనివాస్ను ప్రసిద్ధ గ్రామ దేవత పోలమాంబ అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్గా నియమించడం వివాదాస్పమైంది. ఈ వ్యవహారాన్ని శ్రీనివాస్ భార్య ప్రభుత్వం దృష్టికి కూడా తెచ్చినా పట్టించుకోలేదు. శ్రీనివాస్ అనైతిక సంబంధాలను రుజువు చేస్తే ఆలయ కమిటీ చైర్మన్గా తొలగిస్తామని ఎమ్మెల్యే వెలగపూడి గతంలో మీడియా సాక్షిగా ప్రకటించారు. అడ్డంగా చిక్కిన శ్రీనివాస్.. కేసులు నమోదైనప్పటికీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, స్థానిక టీడీపీ నాయకుడు పోతన్నరెడ్డి తదితరుల సహకారంతో శ్రీనివాస్ తప్పించుకుని తిరుగుతున్నాడు. తనకు విడాకులు ఇవ్వకుండా మరో మహిళను పెళ్లి చేసుకుని బరితెగించి తిరుగుతున్నట్లు భార్య పలు దఫాలు వాపోయారు. ఈ క్రమంలో శ్రీనివాస్ శనివారం అర్ధరాత్రి పెదవాల్తేర్లోని ఓ ఇంట్లో ఓ మహిళతో కలిసి ఉండగా భార్య వసుంధర రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వాళ్లిద్దరూ ఉన్న గదికి కుటుంబ సభ్యుల సహకారంతో తాళం వేసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో శ్రీనివాస్ గది బయట కాపుకాసిన తన భార్యతోపాటు ఆమె కుటుంబ సభ్యులపై తన అనుచరులతో దాడి చేయించాడు. తన అనుచరుల సాయంతో గది తాళం పగలగొట్టించి బయటపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ వారు రాకపోవడంతో శ్రీనివాస్ మరోసారి తప్పించుకున్నాడని, ఓ మహిళతో రెడ్ హ్యాండెడ్గా దొరికిన అతడిపై చర్యలు తీసుకోవాలని వసుంధరతోపాటు ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేయడంతో పోలీసులు అతడిని ఎంవీపీ స్టేషన్కు తరలించారు. అయితే ఎమ్మెల్యే వెలగపూడి ఒత్తిడితో పోలీసులు శ్రీనివాస్ను విడిచిపెట్టినట్లు తెలిసింది. తాజా ఘటనపై వసుంధర రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశమైంది. దీనిపై ఎంవీపీ సీఐని వివరణ కోరగా ఎలాంటి కేసు నమోదు చేయలేదని, ఫిర్యాదు అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. అక్రమ సంబంధం, రాసలీలల ఘటనలో నేరుగా దొరికినప్పటికీ పోలీసులు, టీడీపీ నాయకులు శ్రీనివాస్కు తొత్తులుగా వ్యవహరించారని వసుంధర ఆక్రోశించారు. తనకు న్యాయం జరిగే వరకు న్యాయపోరాటాన్ని ఆపబోనని స్పష్టం చేశారు. వెలగపూడీ.. ఆడబిడ్డ ఉసురు పోసుకోకు.. మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని రుజువుచేస్తే శ్రీనివాస్పై కచ్చితంగా చర్యలు తీసుకుంటానని చెప్పిన ఎమ్మెల్యే వెలగపూడి ఇప్పుడు అతడు రెడ్హ్యాండెడ్గా దొరికినా వత్తాసుగా నిలవడంపై వసుంధర మండిపడ్డారు. నీ పార్టీ కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఓ ఆడబిడ్డ ఉసురుపోసుకోవద్దంటూ వెలగపూడిపై దుమ్మెత్తిపోశారు. నీ ఇంట్లో ఆడబిడ్డకు ఇలాంటి పరిస్థితి వస్తే నిందితుడిని ఇలాగే వెనకేసుకొస్తావా..? అంటూ ఆక్రోశించారు. రాజకీయ ప్రయోజనాల కోసం మహిళల జీవితాలను నాశనం చేయవద్దంటూ హితవు పలికారు. సీఎం చంద్రబాబు ఈ వ్యవహారంపై కలగజేసుకుని తనకు, తన కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
కూటమిని ఓడిస్తాం..
సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం పాదయాత్ర సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంతో ముడిపడి ఉన్న పంచ గ్రామాల భూ సమస్యను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఓడిస్తామని సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం(పంచగ్రామాల భూముల కమిటీ) నాయకులు హెచ్చరించారు. ఈ సమస్య పరిష్కారం కోరి ఆదివారం సింహాచలంలోని తొలిపావంచా నుంచి ప్రహ్లాదపురం సమీపంలోని విరాట్నగర్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం కార్యదర్శి టి.వి.కృష్ణంరాజు మాట్లాడుతూ.. సమస్య మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆరు ప్రభుత్వాలు మారాయని, ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడమే తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో నగర ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. 1903 సర్వే సెటిల్మెంట్ గిల్మాన్ రికార్డుల ప్రకారం రైతులకు భూములపై హక్కులు ఉన్నాయని చెప్పారని, రికార్డులను పరిశీలించి సమస్యను పరిష్కరించాలని పేర్కొన్నారన్నారు. పంచగ్రామాల్లోని రైతులు, గృహ నిర్మాణదారులు, ఇంటి స్థలాల యజమానులు పాతికేళ్లుగా ఇదే విషయాన్ని మొరపెట్టుకుంటున్నారని తెలిపారు. 1903 రికార్డుల ప్రకారం రైతుల హక్కులను గుర్తించాలని, 1996–97లో దేవస్థానానికి ఇచ్చిన రైత్వారీ పట్టాలను రద్దు చేస్తూ శాసనసభలో చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పరిధిలోని 1,782 ఎకరాలను దేవస్థానం జాబితా నుంచి మినహాయించాలని, ఇళ్ల నిర్మాణాలకు, క్రయవిక్రయాలకు అనుమతులు ఇవ్వాలని కోరారు. ఎన్నికల లోపు పరిష్కారం చూపకపోతే కూటమి అభ్యర్థులకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు కె.ఆర్.కె. ప్రసాద్, నాయకులు సిహెచ్. సత్యనారాయణ, చిన్నబ్బాయి, ఎస్.సన్యాసిరావు, అఖిలేష్, అనురాధ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణాలు పోతున్నాయ్
గాజువాక : నగరంలోని జాతీయ రహదారులు నిత్యం రక్తమోడుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనల పట్ల అధికారుల ఉదాసీనత కారణంగా నగరం మృత్యుపాశంగా మారుతోంది. ముఖ్యంగా భారీ వాహనాల అతివేగం, నిబంధనలకు విరుద్ధంగా రద్దీ సమయాల్లోనూ నగరంలోకి ప్రవేశించడం ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతోంది. నిషేధాజ్ఞలు బేఖాతరు : నిజానికి ఉదయం 8 గంటల లోపు, రాత్రి 10 గంటల తర్వాతే భారీ వాహనాలకు నగరంలోకి అనుమతి ఉంటుంది. కానీ ఈ నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయి. గాజువాక వంటి రద్దీ ప్రాంతాల్లో పరిశ్రమల సాకుతో లారీలు, టిప్పర్లు ఇష్టానుసారంగా దూసుకువస్తున్నాయి. ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించినా.. చర్యలు తీసుకున్నా ఎక్కడా పరిస్థితి మారడం లేదు. ఆదివారం.. విషాదం ఆదివారం బీహెచ్పీవీ జంక్షన్ వద్ద జరిగిన ఘోర ప్రమాదం నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సోమవారం పదో తరగతి పరీక్షలకు ప్రారంభం కానున్న నేపథ్యంలో కుమార్తెను సింహాచలం దర్శనం నిమిత్తం తీసుకువెళ్లిన తండ్రిని, వచ్చే నెలలో వివాహం జరుపుకోవాల్సిన ఓ యువకుడిని టిప్పర్ చిదిమేసింది. ఈ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే విశాఖ డెయిరీ వద్ద జరిగిన మరో ప్రమాదంలో యువతి మృత్యువాత పడింది. ఇలా రోజుకో ప్రాణం గాలిలో కలుస్తున్నా, సంబంధిత అధికారులు మాత్రం మొక్కుబడి తనిఖీలతో సరిపెడుతున్నారు. ఇప్పటికై నా యంత్రాంగం నిద్రలేవాలని, భారీ వాహనాలపై కఠిన ఆంక్షలు అమలు చేయాలని విశాఖ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెలలో రోడ్డు ప్రమాదాలు–మృతుల వివరాలు 1న : ఆనందపురంలో వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో వల్లపు రాజు మృతి 2న: ఆరిలోవ బీఆర్టీఎస్ రహదారిపై రోడ్డు ప్రమాదంలో ఆర్ సాయికిరణ్ మృతి 6న: ఆనందపురం హైవేపై బొలెరో వాహనం ఢీకొని రైతు ఈశ్వరమ్మ మృతి 10న : కూర్మన్నపాలెం సమీపంలో బలిరెడ్డి కిశోర్ మృతి 12న: ఎంవీపీ కాలనీ వద్ద రోడ్డు దాటుతుండగా మహిళను ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, పోలమ్మ మృతి 13న : సంగివలస వద్ద స్కూల్ బస్సు ఢీకొని సూర్యనారాయణ దుర్మరణం 15న : బీహెచ్పీవీ జంక్షన్ వద్ద టిప్పర్ బీభత్సం, ఇద్దరు మృతి -
పట్టణాల అభివృద్ధికి మున్సిపల్ బాండ్లు
మూడేళ్లలో విశాఖ మెట్రో పూర్తి: మంత్రి నారాయణ మహారాణిపేట: పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి పెట్టుబడులను సమీకరించడం, స్థానిక సంస్థల సామర్థ్యాన్ని పెంపొందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. ఆదివారం నగరంలోని ఒక హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ‘యూ–విన్’ కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల ప్రతినిధులతో ప్రాంతీయ వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. పట్టణ మౌలిక వసతుల కోసం అవసరమైన నిధులను క్యాపిటల్ మార్కెట్ల ద్వారా సమీకరించడం, మున్సిపల్ బాండ్లు, ఇతర పెట్టుబడి అవకాశాలను వినియోగించుకోవడంపై ఈ వర్క్షాపులో చర్చిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా జూన్ నెలాఖరు నాటికి సుమారు 2.60 లక్షల గృహాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి వెల్లడించారు. పాలనను వేగవంతం చేసేందుకు అన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు జేసీలను ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు తెలిపారు. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టుపై రైట్స్ సంస్థ అధ్యయనం చేస్తోందని, మరో రెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. అనంతరం పనులను వేగవంతం చేసి, వచ్చే మూడు సంవత్సరాల్లో మెట్రో ప్రాజెక్టును పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నామన్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ తరహాలో విశాఖకు రాంబిల్లి నుంచి భోగాపురం వరకు సెమీ రింగ్ రోడ్ అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. వీఎంఆర్డీఏ పరిధిలోని మాస్టర్ ప్లాన్లో ప్రతిపాదించిన ఒక ప్రధాన రహదారి నిర్మాణానికి అటవీ భూమి అడ్డంకిగా మారిందని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించినట్లు మంత్రి వెల్లడించారు. -
మెడికల్ షాపులు
మహారాణిపేట: నగరంలో మత్తు మందుల వ్యాపారం నిబంధనలకు విరుద్ధంగా జోరుగా సాగుతోంది. అదనపు లాభాల కోసం కొన్ని మెడికల్ షాపుల నిర్వాహకులు, వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకపోయినా మత్తు ఇచ్చే ఇంజక్షన్లు, పెయిన్ కిల్లర్లు మరియు దగ్గు మందులను విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ఈ అమ్మకాలు మరింత అధికమవుతున్నాయి. ఈ అక్రమ వ్యాపారం రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. మెడికల్ పరిజ్ఞానం లేని వ్యక్తులతో.. ఈ విక్రయాల్లో ప్రధాన లోపం..అర్హత కలిగిన ఫార్మసిస్టులు లేకపోవడమే... మెడికల్ పరిజ్ఞానం లేని వ్యక్తులు షాపులను నడుపుతూ, నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. మందుల విక్రయాలకు సంబంధించిన బిల్లులు ఇవ్వకపోవడం, ప్రిస్క్రిప్షన్ రిజిస్టర్లను నిర్వహించకపోవడం, కంప్యూటరైజ్డ్ రికార్డులను పక్కన పెట్టేయడం వంటి అక్రమాలు సర్వసాధారణమయ్యాయి. గడువు ముగిసిన మందులను కూడా విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఔషధ నియంత్రణశాఖ పర్యవేక్షణ లేక ఔషధ నియంత్రణ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం ఈ పరిస్థితిని మరింత దారుణంగా మార్చింది. విశాఖ ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు 4,500 మెడికల్ షాపులు, ఏజెన్సీలు ఉన్నాయి. ఇందులో చిన్న చిన్న షాపుల్లో ఎటువంటి రిజిస్టర్లు, కంప్యూటర్లు లేకుండానే కార్యకలాపాలు సాగుతున్నాయి. గతంలో జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన విజయకుమార్ బదిలీ అయినప్పటి నుంచి, ఆ స్థానంలో రెగ్యులర్ అధికారిని నియమించలేదు. ప్రస్తుతం డిప్యూటీ డైరెక్టర్ రజిత ఇన్చార్జీ ఏడీగా అదనపు బాధ్యతలను చూస్తున్నారు. అయితే ఆమె ఇప్పటికే విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల ఏడీగా, ఉత్తరాంధ్ర డీడీగా కూడా పనిచేస్తుండటంతో, విశాఖపై పూర్తిస్థాయి దృష్టి సారించడం అసాధ్యంగా మారింది. ఈ నాయకత్వ లోపం కారణంగా, అక్కడ పనిచేస్తున్న డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బంది తనిఖీలను మొక్కుబడిగా చేస్తూ, నామమాత్రపు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. కేవలం వార్షిక లేదా నెలవారీ లక్ష్యాల కోసం, ఏదో ఒకటి రెండు కేసులు నమోదు చేసి నిబంధనలను పాటించామన్నట్టుగా వ్యవహరిస్తున్నారు తప్ప, క్షేత్రస్థాయిలో అక్రమాలను అరికట్టేలా సోదాలు జరగడం లేదు. నగరంలో జోరుగా నిషేధిత మందుల అమ్మకాలు వివిధ శాఖల అధికారుల పర్యవేక్షణ లోపం వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా దగ్గు మందులు, ఇంజక్షన్ల అమ్మకాలువెలుగు చూసిన వ్యవహారం ఇటీవల మర్రిపాలెంలో జరిగిన ఒక సంఘటన ఈ వ్యవస్థలోని లోతైన వైఫల్యాలను బయటపెట్టింది. ప్రభుత్వం నాలుగు సంవత్సరాల లోపు పిల్లలకు నిషేధించిన ఒక మందుల మిశ్రమాన్ని విక్రయిస్తున్న మెడికల్ ఏజెన్సీని గుర్తించారు. ఈ వ్యవహారం వెలుగుచూడటంతో, వైద్యుని ప్రిస్క్రిప్షన్ లేకుండా కోల్డ్/కాఫ్ సిరప్స్ విక్రయించవద్దని డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. ఈ దాడుల ద్వారా నిషేధిత మందుల అమ్మకాలు జరుగుతున్న విషయం వాస్తవమేనని నిరూపితమైనా, ఇప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితిలో మార్పు రావడం లేదు. ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న ఈ అంశంలో ఔషధ నియంత్రణ శాఖ మొద్దు నిద్ర వీడి, కఠినమైన ఆకస్మిక తనిఖీలను నిర్వహించాల్సిన తరుణం ఆసన్నమైంది. -
‘మన చేతుల్లోనే కిడ్నీ ఆరోగ్యం’
సీతంపేట: ప్రపంచ కిడ్నీ దినోత్సవరం పురస్కరించుకుని.. కిడ్నీ ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ భవనంలో రంగోలీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొని కిడ్నీ ఆరోగ్యం, ముందస్తు పరీక్షల ప్రాధాన్యత, ఆరోగ్యకరమైన జీవనశైలి వంటి సందేశాలను ప్రతిబింబించేలా ఆకర్షణీయమైన రంగవల్లులను తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా సీపీ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ.. ఇలాంటి సృజనాత్మక కార్యక్రమాల ద్వారా ఆరోగ్య అంశాలను ప్రజలకు సులభంగా చేరవేయవచ్చని కొనియాడారు. యూరో ఆంకాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ జి.రవీంద్ర వర్మ మాట్లాడుతూ.. కిడ్నీల ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, మంచి అలవాట్లతో వాటిని కాపాడుకోవచ్చని తెలిపారు. కన్సల్టెంట్ నెఫ్రాలజిస్టులు డాక్టర్ ఉదయ్ దీపక్రావ్ గాజారే, డాక్టర్ వైష్ణవి మాట్లాడుతూ.. కిడ్నీ సంబంధిత వ్యాధులు ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలు లేకుండానే వృద్ధి చెందుతాయని హెచ్చరించారు. అందుకే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, తగినంత నీరు తాగడం, పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా కిడ్నీల పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. పోటీల అనంతరం పోటీల్లో ప్రతిభ కనబరిచిన మహిళలకు బహుమతులు అందజేశారు. -
● నేటి నుంచి ఏప్రిల్ 1వరకూ... ● ఏర్పాట్లను పరిశీలించిన డీఈవో
ఆరిలోవ: జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఏప్రిల్ 1 వరకు కొనసాగుతాయి. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థుల హాల్టికెట్ నంబర్లతో కూడిన బోర్డులను, గదుల్లో బెంచీలపై నంబర్లను అధికారులు సిద్ధం చేశారు. ఆదివారం జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. ప్రేమకుమార్ పరీక్షా కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. కేంద్రాల్లో పోలీస్ బందోబస్తు, తాగునీరు, వైద్య సేవలు అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు. ఉదయం 9.30 గంటలకు పరీక్షలు ప్రారంభమవుతాయని, విద్యార్థులు సమయానికి కేంద్రాలకు చేరుకోవాలని డీఈవో సూచించారు. -
కేకే లైన్లో సీఆర్ఎస్ తనిఖీలు
తాటిచెట్లపాలెం: ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ కేకే లైన్ పరిధిలో నూతనంగా నిర్మించిన రెండో లైన్ పనులను ఆదివారం కమిషనర్ రైల్వే సేఫ్టీ(సీఆర్ఎస్) బ్రజేష్కుమార్ మిశ్రా తనిఖీ చేశారు. కేకే లైన్లో కరకవలస–సిమిలిగూడ మధ్య నూతనంగా నిర్మించి, విద్యుద్దీకరణ పూర్తిచేసిన 9 కిలోమీటర్ల లైన్ను, ఈ మార్గంలోని పెద్ద, చిన్న బ్రిడ్జిలు, వంతెనలు, మలుపులను ఆయన పరిశీలించారు. ఈ మార్గంలో స్పీడ్ ట్రయల్స్ కూడా విజయవంతంగా పూర్తి చేశారు. తనిఖీల్లో డీఆర్ఎం లలిత్ బోహ్రా, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(కన్స్ట్రక్షన్) అంకుశ్గుప్తా, చీఫ్ బ్రిడ్జి ఇంజినీర్ అశోక్కుమార్, చీఫ్ ఇంజినీర్ /కన్స్ట్రక్షన్ శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ సిగ్నల్ ఇంజినీర్, డిప్యూటీ సీఆర్ఎస్, అధికారులు పాల్గొన్నారు. -
రియల్ భవిష్యత్తు భోగాపురంలోనే...!
భోగాపురం పరిసర ప్రాంతాల్లో వెలిసిన వెంచర్లు జోరందుకుంటున్న రిజిస్ట్రేషన్లు విమానాశ్రయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ధరలు ఆకాశాన్ని తాకుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే.. ఇప్పుడున్న ధరలకే ప్లాట్లు సొంతం చేసుకునేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో భోగాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్లాట్లు అమ్మకాలు జోరందుకున్నాయి. ఉత్తరాంధ్రకు భోగాపురం ఒక కొత్త ఆర్థిక కేంద్రంగా మారబోతోందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తుండటంతో.. ప్రతి ఒక్కరూ ఇక్కడ సొంతింటి కలని సాకారం చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. గతంలో కేవలం స్థానిక పెట్టుబడిదారులే ఉండేవారు. కానీ, ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల నుంచి కూడా ఇన్వెస్టర్లు భోగాపురం వైపు చూస్తుండటం విశేషం. విశాఖ చుట్టు పక్కల ప్రాంతాల్లో ప్లాట్ల విక్రయాలు పెరుగుతుండటంతో.. రిజిస్ట్రేషన్లు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. సాక్షి, విశాఖపట్నం : వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపుతో చేపట్టిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం.. విశాఖ చుట్టు పక్కల ప్రాంతాల్లో రియల్ బూమ్కు కేంద్రంగా మారుతోంది. ఉత్తరాంధ్ర సిగలో మణిహారంలా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రూపుదిద్దుకుంటోంది. ఆకాశంలో విమానాల సందడి మొదలవ్వకముందే.. భూమిపై రియల్ ఎస్టేట్ వ్యాపారం రెక్కలు కట్టుకుని ఎగురుతోంది. అటు విశాఖ, ఇటు విజయనగరం నగరాలకు మధ్యలో ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు పెట్టుబడుల స్వర్గధామంగా మారింది. 2023 మే 3న జరిగిన శంకుస్థాపనతో ఈ ప్రాంతంపై రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ల దృష్టి పడగా, తాజాగా ఈ ఏడాది జనవరి 14న జరిగిన డొమెస్టిక్ విమాన ట్రయల్ రన్, ఇక్కడి స్థిరాస్థి రంగంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. విమాన సర్వీసులు ప్రారంభం కాకముందే, ఈ ప్రాజెక్టు భవిష్యత్తుపై ఉన్న నమ్మకంతో స్థిరాస్థి వ్యాపారం వేగంగా పుంజుకుంటోంది. రన్వేపై విమానం సురక్షితంగా దిగడం కేవలం సాంకేతిక విజయం మాత్రమే కాదు, ఆ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి బలమైన సంకేతంగా నిలిచింది. దీంతో ఇక్కడే సొంతింటి కలను నెరవేర్చుకోవాలన్న ఆశతో కొనుగోలుదారులు ఆసక్తి కనబరుస్తుండగా, కొత్త వెంచర్లు సైతం శరవేగంగా సిద్ధమవుతున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనతో, ఈ ప్రాంతం త్వరలోనే వాణిజ్య, నివాస కేంద్రంగా విరాజిల్లనుంది. అత్యాధునిక సౌకర్యాలతో వెంచర్లు : ఒకప్పుడు సాదాసీదా పొలాలుగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు విలాసవంతమైన లేఅవుట్లుగా మారుతున్నాయి. కేవలం భోగాపురం మాత్రమే కాకుండా.. ఆనందపురం, భీమిలి ప్రాంతాల నుంచి విమానాశ్రయం వరకూ సరికొత్త వెంచర్లు దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా ఎయిర్పోర్టుకు చేరువలో ఇళ్లు కట్టుకునేందుకు సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరూ ఆసక్తి చూపుతున్నారు. ఈ డిమాండ్ను అందిపుచ్చుకోవడంలో స్వాతి ప్రమోటర్స్ వంటి అగ్రగామి సంస్థలు ముందు వరుసలో నిలుస్తున్నాయి. కేవలం ప్లాట్లు అమ్మడమే కాకుండా.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, విశాలమైన రహదారులతో కనెక్టివిటీ, ఎలక్ట్రిసిటీ, గ్రీన్పార్కులు, క్లబ్ హౌస్లు వంటి అత్యాధునిక సౌకర్యాలను కల్పిస్తూ కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. ఎయిరో ట్రోపోలిస్గా భోగాపురం భోగాపురం ప్రాంతం కేవలం ప్రయాణాలకే పరిమితం కాకుండా..ఒక ‘ఎయిరోట్రోపోలిస్’ గా మారుతోంది. ఎయిర్పోర్టు చుట్టూ ఐటీ పార్కులు, 5స్టార్ హోటళ్లు, అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ సెంటర్లు రాబోతున్నాయి. దీనివల్ల వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఫలితంగా నివాస ప్రాంతాలకు డిమాండ్ నిరంతరం పెరుగుతూనే ఉంటుంది.విమానాశ్రయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చి, అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభమైతే, వచ్చే రెండేళ్లలో ఇక్కడి స్థిరాస్తి విలువ మరో 40 నుంచి 50 శాతం పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ సొంతింటి కల నెరవేర్చుకునేందుకు సిద్ధమవుతున్న వారికి కేవలం ప్లాట్లు ఇచ్చి వదిలేయకుండా ఒక నగరంలో ఉంటే ఏఏ సౌకర్యాలుంటాయో వాటన్నింటినీ కల్పిస్తున్నాం. ‘గేటెడ్ కమ్యూనిటీ’ కాన్సెప్ట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. 24/7 సెక్యూరిటీ, సోలార్ స్ట్రీట్ లైటింగ్, విస్తారమైన పచ్చదనం వంటి అంశాలతో సామాన్యులకు కూడా భరోసా కల్పిస్తున్నాం. – మేడపాటి రమేష్ రెడ్డి, స్వాతి ప్రమోటర్స్ ఎండీ -
ప్లాస్టిక్ రహిత సింహగిరి కోరుతూ ట్రెకింగ్
సింహాచలం: ప్లాస్టిక్ను అరికట్టి పర్యావరణాన్ని కాపాడాలనే సంకల్పంతో అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ), ఏయూ ఆర్ఎస్ఎస్ విభాగం, ఖే లో భారత్ సంస్థ సంయుక్తంగా ఆదివారం మాధవధార నుంచి సింహాచలం కొండపైకి ట్రెకింగ్ నిర్వహించాయి. సుమారు వంద మంది విద్యార్థులు ఈ ట్రెకింగ్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రకృతిని ప్రేమించా లనే ఉద్దేశంతో ప్లాస్టిక్ను నిషేధించాలి అనే నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ప్రతినిధులు తెలిపారు. ట్రెకింగ్ మార్గ మధ్యలో పడి ఉన్న ప్లాస్టిక్ బా టిళ్లు, కవర్లు, ఇతర వ్యర్థ పదార్థాలను సేకరించి పర్యావరణ స్పృహను చాటారు. అనంతరం సింహగిరికి చేరుకున్న విద్యార్థి బృందాన్ని దేవస్థానం ఈవో జె.వెంకటరావు అభినందించారు. ఖేలో భారత్ కన్వీనర్ విజయ్, సభ్యులు చందు తదితరులు పాల్గొన్నారు. -
ప్రస్తుతం అందుబాటు ధరల్లోనే..
మూడేళ్లలో భోగాపురం పరిసరాల్లో భూమి ధరలు ఊహించని రీతిలో పెరిగాయి. ఎయిర్పోర్టు శంకుస్థాపన సమయంలో గజం ధర సుమారు రూ.10,000 నుంచి రూ.15 వేల మధ్య ఉండగా, ఇప్పుడు ప్రధాన వెంచర్లలో రూ.25 వేల నుంచి రూ. 35,000 వరకు చేరుకుంది. ముఖ్యంగా నేషనల్ హైవే–16 కి ఆనుకుని ఉన్న వెంచర్లకు డిమాండ్ విపరీతంగా ఉంది. ప్రస్తుతానికై తే ధరలు అందబాటులో ఉన్నాయి. విమానాశ్రయ కార్యకలాపాలు ప్రారంభమైతే.. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని రియల్ విశ్లేషకులు చెబుతున్నారు. కేవలం ఎయిర్ పోర్టు మాత్రమే కాదు, విశాఖ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు భోగాపురం చుట్టూ ఉన్న ఇతర మౌలిక సదుపాయాలు రియల్ బూమ్కు వెన్నెముకగా మారాయి: గతంలో ప్రతిపాదించిన విశాఖ నుంచి భోగాపురం వరకు 6–లేన్ల రహదారి ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే.. ఈ ప్రాంత దశ దిశ మారిపోతుంది. -
జర్నలిస్టులు సమాజ ప్రగతి సాధకులు
ఘనంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ ఉగాది సంబరాలు డాబాగార్డెన్స్: జర్నలిస్టులు సమాజ ప్రగతి సాధకులని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, చలమాజీ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు మట్టపల్లి విశ్వేశ్వరరావు, మట్టపల్లి హనుమంతరావు, సత్యనారాయణ కొనియాడారు. పూర్ణామార్కెట్ సమీపంలోని ఒక ఫంక్షన్ హాల్లో ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, బ్రాడ్కాస్ట్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం పరాభవ నామ సంవత్సర ఉగాది సంబరాలు వేడుకగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశ్వేశ్వరరావు మాట్లాడుతూ.. రానున్న పరాభవ నామ సంవత్సరం జర్నలిస్టుల కుటుంబాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ.. ప్రతి ఏటా జర్నలిస్టుల కుటుంబాలతో కలిసి ఉగాది సంబరాలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, వెటరన్ జర్నలిస్టులకు పెన్షన్లు, హెల్త్కార్డులు, వృద్ధాప్యంలో ఉన్న జర్నలిస్టుల కోసం వృద్ధాశ్రమ ఏర్పాటు వంటి సమస్యల సాధన కోసం ఫెడరేషన్ అలుపెరగని పోరాటం చేస్తోందని వివరించారు. వేడుకల్లో భాగంగా పూడిపెద్ది కృష్ణశర్మ పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఫెడరేషన్ నగర అధ్యక్షుడు పి.నారాయణ, జి.శ్రీనివాసరావు, డి.రవికుమార్, పితాని సూర్యప్రసాద్, బి.శివప్రసాద్, ఎన్.రామకృష్ణ, కృష్ణపాత్రో, రవిశంకర్, ఆనంద్, రామునాయుడు, నగేష్బాబు, జర్నలిస్టుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
రెడ్ హ్యాండెడ్గా చిక్కిన ఎమ్మెల్యే వెలగపూడి అనుచరుడు
ఎంవీపీ కాలనీ: విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అనుచరుడు, కరకచెట్టు పోలమాంబ ఆలయ కమిటీ చైర్మన్ మద్ది శ్రీనివాస్ వివాహేతర సంబంధంతో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడం కలకలం రేపింది. కొద్ది రోజులుగా టీడీపీ నాయకుల లైంగిక వేధింపుల ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తుండగా తాజాగా మద్ది శ్రీనివాస్ ఆ జాబితాలో చేరాడు. పోలీసులు, బాధిత మహిళ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి...! బుద్ధి చెప్పాల్సింది పోయి.. వెలగపూడి వత్తాసు.. మద్ది శ్రీనివాస్ కొన్నాళ్లుగా భార్య వసుంధరను వదిలించుకోవాలని చూస్తున్నాడు. తాను గర్భవతిగా ఉన్న సమయంలో శ్రీనివాస్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడంపై అతడి భార్య న్యాయ పోరాటానికి దిగారు. దీనిపై భీమిలి పోలీసు స్టేషన్తో పాటు విశాఖ త్రీటౌన్ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. అతడి వ్యవహారాన్ని పలు సందర్భాల్లో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు దృష్టికి తెచ్చారు. తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని ప్రాథేయపడ్డారు. అయితే శ్రీనివాస్కు బుద్ధి చెప్పాల్సింది పోయి వెలగపూడి అతడిని వెనకేసుకురావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. భార్యా బిడ్డలను పట్టించుకోని శ్రీనివాస్ను ప్రసిద్ధ గ్రామ దేవత పోలమాంబ అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్గా నియమించడం వివాదాస్పమైంది. ఈ వ్యవహారాన్ని శ్రీనివాస్ భార్య ప్రభుత్వం దృష్టికి కూడా తెచ్చినా పట్టించుకోలేదు. శ్రీనివాస్ అనైతిక సంబంధాలను రుజువు చేస్తే ఆలయ కమిటీ చైర్మన్గా తొలగిస్తామని ఎమ్మెల్యే వెలగపూడి గతంలో మీడియా సాక్షిగా ప్రకటించారు. అడ్డంగా చిక్కిన శ్రీనివాస్.. కేసులు నమోదైనప్పటికీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, స్థానిక టీడీపీ నాయకుడు పోతన్నరెడ్డి తదితరుల సహకారంతో శ్రీనివాస్ తప్పించుకుని తిరుగుతున్నాడు. తనకు విడాకులు ఇవ్వకుండా మరో మహిళను పెళ్లి చేసుకుని బరితెగించి తిరుగుతున్నట్లు భార్య పలు దఫాలు వాపోయారు. ఈ క్రమంలో శ్రీనివాస్ శనివారం అర్ధరాత్రి పెదవాల్తేర్లోని ఓ ఇంట్లో ఓ మహిళతో కలిసి ఉండగా భార్య వసుంధర రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వాళ్లిద్దరూ ఉన్న గదికి కుటుంబ సభ్యుల సహకారంతో తాళం వేసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో శ్రీనివాస్ గది బయట కాపుకాసిన తన భార్యతోపాటు ఆమె కుటుంబ సభ్యులపై తన అనుచరులతో దాడి చేయించాడు. తన అనుచరుల సాయంతో గది తాళం పగలగొట్టించి బయటపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ వారు రాకపోవడంతో శ్రీనివాస్ మరోసారి తప్పించుకున్నాడని, ఓ మహిళతో రెడ్ హ్యాండెడ్గా దొరికిన అతడిపై చర్యలు తీసుకోవాలని వసుంధరతోపాటు ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేయడంతో పోలీసులు అతడిని ఎంవీపీ స్టేషన్కు తరలించారు. అయితే ఎమ్మెల్యే వెలగపూడి ఒత్తిడితో పోలీసులు శ్రీనివాస్ను విడిచిపెట్టినట్లు తెలిసింది. తాజా ఘటనపై వసుంధర రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశమైంది. దీనిపై ఎంవీపీ సీఐని వివరణ కోరగా ఎలాంటి కేసు నమోదు చేయలేదని, ఫిర్యాదు అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. అక్రమ సంబంధం, రాసలీలల ఘటనలో నేరుగా దొరికినప్పటికీ పోలీసులు, టీడీపీ నాయకులు శ్రీనివాస్కు తొత్తులుగా వ్యవహరించారని వసుంధర ఆక్రోశించారు. తనకు న్యాయం జరిగే వరకు న్యాయపోరాటాన్ని ఆపబోనని స్పష్టం చేశారు. వెలగపూడీ.. ఆడబిడ్డ ఉసురు పోసుకోకు.. మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని రుజువుచేస్తే శ్రీనివాస్పై కచ్చితంగా చర్యలు తీసుకుంటానని చెప్పిన ఎమ్మెల్యే వెలగపూడి ఇప్పుడు అతడు రెడ్హ్యాండెడ్గా దొరికినా వత్తాసుగా నిలవడంపై వసుంధర మండిపడ్డారు. నీ పార్టీ కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఓ ఆడబిడ్డ ఉసురుపోసుకోవద్దంటూ వెలగపూడిపై దుమ్మెత్తిపోశారు. నీ ఇంట్లో ఆడబిడ్డకు ఇలాంటి పరిస్థితి వస్తే నిందితుడిని ఇలాగే వెనకేసుకొస్తావా..? అంటూ ఆక్రోశించారు. రాజకీయ ప్రయోజనాల కోసం మహిళల జీవితాలను నాశనం చేయవద్దంటూ హితవు పలికారు. సీఎం చంద్రబాబు ఈ వ్యవహారంపై కలగజేసుకుని తనకు, తన కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
వాహనం అదుపు తప్పి యువతి మృతి
మరో యువతికి తీవ్ర గాయాలు గాజువాక : ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఒక యువతి మృతి చెందగా, మరో యువతి తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గాజువాక ట్రాఫిక్ పోలీసుల కథనం ప్రకారం..పార్వతీపురానికి చెందిన మహాలక్ష్మి, తునికి చెందిన అనుష్క స్థానిక బీహెచ్ఈఎల్లో ఇంటర్న్షిప్ చేస్తున్నారు. వారిద్దరూ ఆదివారం ఒకే ద్విచక్ర వాహనంపై కంపెనీవద్ద బయల్దేరి షీలానగర్ వైపు వెళ్తున్నారు. విశాఖ డెయిరీ జంక్షన్వద్దకు వచ్చేసరికి ఆ వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ అపస్మారక స్థితికి చేరుకొన్నారు. దీన్ని గమనించిన సమీపంలోని ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ శ్రీకాంత్ వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. కాగా, మహాలక్ష్మి మార్గమధ్యలోనే మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. అనుష్క తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నట్టు సీఐ షేక్ హుస్సేన్ తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. -
హక్కులపై అవగాహన పెరగాలి
సీపీ శంఖబ్రత బాగ్చి పిలుపు మహారాణిపేట: వినియోగదారులు తమ హక్కులపై పూర్తి అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరమని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి పిలుపునిచ్చారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వినియోగదారుల హక్కులపై తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహించిన షార్ట్ ఫిలిం, షార్ట్ రీల్ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. వినియోగదారుల హక్కుల పరిరక్షణలో ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మార్కెట్లో నాణ్యమైన ఉత్పత్తులు, సేవలు అందేలా పర్యవేక్షణ పెరగాలన్నారు. జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు జి.తనూజరెడ్డి మాట్లాడుతూ.. వినియోగదారుల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు కమిషన్ కట్టుబడి ఉందని తెలిపారు. సినీ నటుడు సుమన్ మాట్లాడుతూ.. సామాన్యుడికి హక్కులపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్య క్రమాలు, కళారూపాలు దోహదపడతాయన్నారు. ‘పవర్ ఆఫ్ ది సీఆర్సి’కి గుర్తింపు సనారా వంశీ రచన, దర్శకత్వంలో రూపొందించిన ‘పవర్ ఆఫ్ ది సీఆర్సీ’ షార్ట్ రీల్కు ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో ద్వితీయ బహుమతి లభించింది. సామాన్యుడు అనారోగ్యం పాలై కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తే ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను, వాటిని చాకచక్యంగా ఎలా ఎదుర్కోవచ్చనే అంశాన్ని ఈ రీల్లో చక్కగా చూపించారు. ఈ రీల్లో నటించిన నటులు డాక్టర్ కుమార్ నాయక్, బొబ్బది అప్పారావు, అనిల్ గుమ్మల.. అతిథుల చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. జిల్లా పౌర సరఫరాల అధికారి వి.భాస్కరరావు, లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ రవికుమార్, ఫుడ్ సేఫ్టీ ఏఎఫ్సీ కల్యాణ్ చక్రవర్తి, సీఆర్సీ జాతీయ అధ్యక్షుడు వికాస్ పాండే, ప్రధాన కార్యదర్శి దొడ్డి చంద్రశేఖర్, సినీ రచయిత సత్యాడ నరసింగరావు, జాతీయ ప్రతినిధి అవినాష్ బెంజిమన్ తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ కష్టాలతో కట్టెల పొయ్యిపై వంటలు
● మళ్లీ పాత రోజుల్లోకి..!ఉషోదయ జంక్షన్లోని ఒక హోటల్ వద్ద గ్యాస్ దొరక్కపోవడంతో, ఖాళీ స్థలంలో టెంట్ వేసి వంటలు చేస్తున్న సిబ్బంది నగరంలో వంట గ్యాస్ కష్టాలు సామాన్యుడిని భయపెడుతున్నా యి. ఒకవైపు గ్యాస్ కృత్రిమ కొరత వేధిస్తుంటే, మరోవైపు ఆన్లైన్ బుకింగ్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆదివారం సెలవు దినం కావడంతో గృహిణులు, ఉద్యోగులు గ్యాస్ సిలిండర్ల కోసం పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ ఏజెన్సీల వద్ద సిలిండర్ల కోసం జనం ద్విచక్ర వాహనాలపై ఖాళీ సిలిండర్లతో గాలిస్తున్నారు. ఇక గ్యాస్ కొరత ప్రభావం సామాన్యులపైనే కాకుండా వ్యాపార రంగంపైనా తీవ్రంగా పడింది. హోటళ్లు, రెస్టారెంట్లకు గ్యాస్ సరఫరా పరిమితంగా ఉండటంతో యజమానులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. గ్యాస్ లేక వంటలు ఆగిపోయే పరిస్థితి రావడంతో, పలు హోటళ్లలో ఖాళీ ప్రదేశాల్లో టెంట్లు వేసి మరీ కట్టెల పొయ్యిల ద్వారా వంటలు చేస్తున్నారు. మరికొన్ని హోటళ్లలో కొన్ని వంటకాలను పరిమితం చేశారు. గ్యాస్ సరఫరా పునరుద్ధరణ అయ్యే వరకు వ్యాపారం దెబ్బతినకుండా ఉండేందుకు ఈ తరహా పాత పద్ధతులను ఆశ్రయించక తప్పడం లేదని హోటల్ యజమానులు చెబుతున్నారు. – ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
జనం మధ్యే ‘మృత్యు’ నిలయాలు
గోపాలపట్నం : తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట బాణసంచా ప్రమాదం సృష్టించిన శోకం ఇంకా పచ్చిగానే ఉంది. అక్కడ పదుల సంఖ్యలో కార్మికులు ప్రాణాలు కోల్పోయిన విషాదం నుంచి ప్రజలు తేరుకోకముందే, విశాఖ నడిబొడ్డున ఆదివారం సాయంత్రం చోటుచేసుకున్న భారీ పేలుళ్లు నగరాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. నిబంధనలను తుంగలో తొక్కి నివాస ప్రాంతాల మధ్యే సాగుతున్న ప్రమాదకర కార్యకలాపాలు సామాన్యుడి ప్రాణాలకు గాలం వేస్తున్నాయి. ఆ అరగంట.. అల్లకల్లోలం ఆదివారం సాయంత్రం సరిగ్గా 5.30 గంటల నుంచి ఆరు గంటల మధ్య గోపాలపట్నం పరిధిలోని చంద్రనగర్, ఆదర్శనగర్ ప్రాంతంలో ఒక్కసారిగా ఆకాశం చిట్లిపోయిందా అన్నట్లుగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. వరుసగా వినిపించిన పేలుళ్ల ధాటికి భూమి కంపించినట్లు అనిపించడంతో స్థానికులు బయటకు పరుగులు తీశారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్ల కిటికీ అద్దాలు పగిలిపోవడం, గోడలకు పగుళ్లు రావడంతో ఆ తీవ్రత ఎంతటిదో అర్థమవుతోంది. ప్రాణనష్టం తప్పినా, అధికారుల కళ్లు గప్పి నివాస ప్రాంతాల్లో సాగుతున్న ప్రమాదకర కార్యకలాపాలు సామాన్యుడి ప్రాణాలకు గాలం వేస్తున్నాయి. -
విశాఖ నడిబొడ్డున బాణసంచా భారీ పేలుడు
గోపాలపట్నం(విశాఖ): విశాఖపట్నం నడి బొడ్డున ఆదివారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఓ భవనం పై అంతస్తులో బాణసంచా పేలిపోయి మంటలు ఎగసిపడ్డాయి. పేలుడి ధాటికి భవన శిథిలాలు ఎగిరి వీధుల్లో పడ్డాయి. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ప్రాణనష్టం తప్పింది. ఓ మహిళ మాత్రం అస్వస్థతకు గురయ్యారు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. విశాఖలోని గోపాలపట్నం ఆదర్శనగర్ ప్రాంతంలో రెండస్తుల భవనంలోని పై అంతస్తును బాంబుల కృష్ణ అనే వ్యక్తి అద్దెకు తీసుకుని అక్కడ బాణసంచా తయారు చేస్తున్నాడు. రోజూ ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఇక్కడ కార్యకలాపాలు జరిగేవి. అయితే ఆదివారం సాయంత్రం 5.30 గంటలు, ఆరు గంటల మధ్య సమయంలో ఇక్కడ పేలుడు సంభవించింది. మంటలు తీవ్రంగా ఎగసిపడ్డాయి. దీంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. భవన శిథిలాలు వీధుల్లో ఎగరి పడడంతో భవనం వెనుకవైపు ఉన్న రేకుల షెడ్డు తీవ్రంగా దెబ్బతింది. అక్కడే ఉన్న ఓ ద్విచక్రవాహనం నుజ్జునుజ్జయింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపకశాఖ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ప్రాణనష్టం లేకపోయినప్పటికీ పక్క భవనంలో ఉంటున్న దివ్య అనే మహిళ శబ్ద కాలుష్యం, వ్యాపించిన దట్టమైన పొగకు అస్వస్థతకు గురైంది. ఆమెను గోపాలపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. హెచ్చరించినా.. వినని నిర్వాహకుడు! ఇటీవల కాకినాడ జిల్లా సామర్లకోటలో బాణసంచా పేలుడు సంభవించి 20 మంది మరణించడంతో విశాఖ గోపాలపట్నం పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆదర్శనగర్లోని ఈ బాణసంచా తయారీ కేంద్రాన్నీ తనిఖీ చేశారు. అప్పట్లో కొంత మందుగుండు సామగ్రిని స్వాదీనం చేసుకుని తయారీ ఆపేయాలని హెచ్చరించారు. బాణసంచా తయారు చేస్తున్న బాంబుల కృష్ణ దుకాణాన్ని తనిఖీ చేశారు. అయినా నిర్వాహకుడు తయారీ ఆపలేదని, నిల్వ భారీగా చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు విమర్శిస్తున్నారు. సమాచారం అందుకున్న గోపాలపట్నం సీఐ సన్యాసి నాయుడు, ఎస్ఐ రామారావు సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని పరిశీలించారు. బాణసంచా తయారీదారుడు ‘బాంబుల కృష్ణ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
వేరే యువతితో ఉండగా ఇంటికి తాళం వేసిన భార్య
సాక్షి, విశాఖపట్నం: ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అనుచరుడు మద్ది శ్రీనివాస్ రాసలీలలు వెలుగులోకి వచ్చాయి.. విశాఖ జిల్లా కరక పాలమాంబ ఆలయ కమిటీ ఛైర్మన్గా ఉన్న మద్ధి శ్రీనివాస్.. భార్యను కాదని మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పెద్ద వాల్తేర్లోని కాగితాల వీధిలోని ఓ ఇంట్లో యువతితో మద్ధి శ్రీనివాస్ ఉండగా.. ఆయన భార్య గదికి తాళం వేసింది.గతంలోనూ టీడీపీ నేత మద్ధి శ్రీనివాస్ భార్య ఆందోళనకు దిగింది. మద్ధి శ్రీనివాస్పై ఆరోపణలు నిజమైతే చర్యలు తీసుకుంటామంటూ గతంలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు చెప్పారు. -
చిన్నారికి వైఎస్ జగన్ అండ
జగదాంబ (విశాఖ): నిరుపేద కుటుంబానికి చెందిన ఓ చిన్నారి చికిత్సకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్థిక సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఏడేళ్ల చిన్నారి జోయా మహ్మద్ చికిత్స కోసం రూ.2 లక్షల చెక్కును పంపించి ఆ కుటుంబానికి ఆశాకిరణంగా నిలిచారు. విశాఖపట్నం 39వ వార్డుకు చెందిన మహమ్మద్ ఆసీఫ్–ఆíÙత దంపతుల కుమార్తె జోయా కొంతకాలంగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఇటీవల దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ కుమారుడి వివాహ వేడుకకు వచి్చన సందర్భంగా చిన్నారి కుటుంబ సభ్యులు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఈ సమస్యలను వివరించారు.వెంటనే స్పందించిన వైఎస్ జగన్ చిన్నారి చికిత్స కోసం రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తానని హామీ ఇచ్చారు. చెక్కు రూపంలో ఆ మొత్తాన్ని వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్కు పంపించారు. శనివారం వారు ఆసీఫ్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు చెక్కు అందజేశారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న పార్టీ నాయకులు అవసరమైన వైద్య సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలోనూ సీఎంఆర్ఎఫ్ నుంచి సహాయం గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ కాలంలో సీఎంగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి చిన్నారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సుమారు రూ.18 లక్షలు మంజూరు చేశారు. మొదట రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించగా, మిగిలిన మొత్తం కూడా విడుదల చేయాలని ఆదేశించారు. అనంతరం ఎన్నికలు రావడంతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించాల్సిన మిగిలిన సహాయం నిలిచిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. పలుమార్లు అధికారులను సంప్రదించినా సహాయం అందలేదని చెప్పారు.అంతేకాక చిన్నారి తండ్రి చేస్తున్న ఎండీయూ (రేషన్ డిపో ఆపరేటర్) ఉద్యోగం, తల్లి చేస్తున్న వలంటీర్ ఉద్యోగం కూడా నిలిపివేయడంతో కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. దీంతో వైఎస్ జగన్ వారికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా కేకే రాజు, వాసుపల్లి గణేష్కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం పేదల ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో విశాఖ పశి్చమ పరిశీలకుడు జహీర్ అహ్మద్, డిప్యూటీ మేయర్ కట్టమూరు సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
వావ్ అథ్లెట్స్కు సీపీ సత్కారం
విశాఖ సిటీ: జాతీయ, అంతర్జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పతకాలు సాధించిన వెటరన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ విశాఖపట్నం(వావ్) అథ్లెట్లకు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఘనంగా సన్మానించారు. ఇటీవల జగల్పూర్, మధ్యప్రదేశ్లో జరిగిన నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లోను, థాయ్లాండ్లో జరిగిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్–2026లో వావ్ అథ్లెట్లు అత్యధిక పతకాలు సాధించారు. శనివారం నగరంలో ఒక హోటల్లో జరిగిన వీరి సన్మాన కార్యక్రమానికి సీపీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా అథ్లెట్లకు సీపీ శాలువాలు వేసి జ్ఞాపికలు అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెటరన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ను ప్రోత్సహించాలని సూచించారు. తద్వారా వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మరింత ఉత్సాహంతో జీవితాన్ని గడపగలరని తెలిపారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న వాట్ చైర్మన్, వావ్ చీఫ్ పేటర్న్ డా.కమల్ బయద్ మాట్లాడుతూ తాను ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా ఎందరో ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ట్రస్టీలు నండూరి రామకృష్ణ, సి.హెచ్.శ్రీనివాసరాజు, ఇండియా టీం మేనేజర్, ఇండియా మాస్టర్స్ సెక్రటరీ జనరల్ డా.మంగవరప్రసాద్, వావ్ కార్యదర్శి ఎల్.వి.సుధాకర్, కోశాధికారి కె.రామారావు పాల్గొన్నారు. -
ఆ‘లివ్’ రిడ్లే..
‘అల’సట ఎరుగని వలస జీవులకు విశాఖ అభయం కొమ్మాది: సముద్రం ఎన్నో అద్భుత జీవరాశులకు ఆవాసం. అందులో ఒక అరుదైన, అలసట ఎరుగని వలస జీవి ఆలివ్ రిడ్లే తాబేలు. ఏ సరిహద్దులూ లేని సాగరంలో.. అలుపెరగని అలల తోడుగా వేల కిలోమీటర్లు ఈదుకుంటూ.. కేవలం సంతానోత్పత్తి కోసమే ప్రతి ఏడాదీ తూర్పు తీరానికి చేరుకుంటాయి. ఒకవైపు పొంచి ఉన్న ముప్పు, మరోవైపు అటవీ శాఖ, స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న అభయం మధ్య వాటి పిల్లలు బుడిబుడి అడుగులు వేస్తూ సంద్రం ఒడికి చేరుకుంటున్నాయి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ జాబితాలో హానికి లోనయ్యే జాతులుగా వర్గీకరించబడిన ఈ తాబేళ్ల రక్షణకు తూర్పు తీరం కేరాఫ్ అడ్రస్గా మారింది. అలుపెరుగని ప్రయాణం ఆలివ్ రిడ్లే తాబేళ్లకు స్థిర నివాసం అంటూ ఉండదు. సుమారు రెండు అడుగుల పొడవు, 35 నుంచి 50 కిలోల బరువు ఉండే ఈ తాబేళ్లు ఆహార అన్వేషణ, సంతానోత్పత్తి కోసం మహా సముద్రాల్లో దాదాపు 20 వేల కిలోమీటర్ల మేర ప్రయాణిస్తాయి. వీటిల్లో ఏడు జాతులు ఉండగా 5 జాతులు జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల నుంచి ఏపీ, ఒడిశా తీరాలకు వలస వస్తుంటాయి. వీటి ప్రయాణాన్ని ట్రాక్ చేసేందుకు అటవీశాఖ శాటిలైట్ ట్యాగింగ్ విధానాన్ని కూడా వాడుతోంది. ఇటీవల ట్యాగ్ చేసిన ఒక తాబేలు కేవలం 51 రోజుల్లో 1000 కిలోమీటర్లు ప్రయాణించినట్లు గుర్తించింది. అర్ధరాత్రి తీరంలో సందడి నవంబర్ నుంచి మే వరకు వీటి సంతానోత్పత్తి కాలం. డిసెంబర్–ఫిబ్రవరి మధ్యలో ఇవి ఎక్కువగా వస్తుంటాయి. విశాఖ సాగరతీరం వీటికి ఇష్టమైన ప్రదేశం. అర్ధరాత్రి 2 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల మధ్య తీరానికి చేరుకుని, ఇసుకలో గోతులు తవ్వి 50 నుంచి 150 గుడ్ల వరకు పెడతాయి. గుడ్లపై ఇసుక కప్పి తల్లి తాబేళ్లు తిరిగి సముద్రంలోకి వెళ్లిపోతాయి. గుడ్లు పొదిగే ఇసుక ఉష్ణోగ్రత పిల్లల లింగాన్ని నిర్ణయిస్తుంది. 28 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో పొదిగితే మగ తాబేళ్లుగానూ, 30–32 డిగ్రీల ఉష్ణోగ్రతలో పొదిగితే ఆడ తాబేళ్లుగానూ ప్రాణం పోసుకుంటాయి. అయితే పిల్లలుగా మారిన వెంటనే వాటంతట అవే సముద్రంలోకి వెళ్లిపోవడం విశేషం. పొంచి ఉన్న ముప్పు తీరంలో తాబేళ్లు గుడ్లు పెట్టి వెళ్లిన తర్వాత వాటికి అనేక సవాళ్లు ఎదురవుతాయి. ఉదయం పూట పర్యాటకుల తాకిడి, కుక్కలు, నక్కలు వంటి జంతువుల దాడులు, అలాగే సముద్రంలో వేటగాళ్ల వలలకు చిక్కుకుని ఎన్నో గుడ్లు, తాబేళ్లు నశించిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆలివ్ రిడ్లే జాతి అంతరించిపోకుండా అటవీశాఖ ఆద్వర్యంలో సాగర్నగర్, జోడుగుళ్లపాలెం, చేపలుప్పాడ, పెదనాగమయ్యపాలెం ప్రాంతాల్లో ప్రత్యేక సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పార్ట్టైం ఉద్యోగులు, స్థానిక మత్స్యకారుల సహాయంతో తీరంలో అసురక్షిత ప్రాంతాల్లో ఉన్న గుడ్లను సేకరించి, ఈ కేంద్రాల్లో సురక్షితంగా సంరక్షించి.. పొదిగిస్తున్నారు. సంద్రం ఒడికి పయనం.. సంరక్షణ కేంద్రాల్లో సేకరించిన గుడ్లను సుమారు 40 నుంచి 45 రోజుల పాటు రక్షణ వలయంలో ఉంచుతారు. గుడ్లు పొదిగి పిల్లలుగా మారిన తర్వాత, అటవీశాఖ అధికారులు ఆ చిట్టి తాబేళ్లను విడతల వారీగా సముద్రంలోకి విడిచిపెడతారు. అవి బుడిబుడి అడుగులు వేస్తూ అలల మీద సముద్రంలోకి కలిసిపోతున్న దృశ్యం పర్యాటకులను కట్టిపడేస్తుంది. ఇప్పటికే ఈ తాబేలు పిల్లలను సముద్రంలోకి వదిలే కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. -
అప్పన్న ధ్వజస్తంభం పీఠానికి స్వర్ణతాపడం పనులకు శ్రీకారం
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలోని ధ్వజస్తంభం పీఠానికి స్వర్ణతాపడం పనులకు శనివారం శ్రీకారం చుట్టారు. దేవస్థానం ఈవో జె. వెంకటరావు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. దాదాపు నాలుగేళ్ల క్రితం ధ్వజస్తంభానికి సుమారు రూ.1.8 కోట్ల వ్యయంతో సీఎంఆర్ సంస్థ స్వర్ణతాపడం చేయించింది. ప్రస్తుతం అదే సంస్థ ధ్వజస్తంభం అడుగుభాగంలో ఉన్న పీఠానికి కూడా స్వర్ణతాపడం చేయడానికి ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా పీఠానికి ఎంత మేర బంగారు తాపడం అవసరమవుతుందో తెలుసుకునేందుకు అధికారులు కొలతలు తీసుకునే పనులను ప్రారంభించారు. పనులు పూర్తయిన తర్వాత ధ్వజస్తంభం పీఠం మరింత ఆకర్షణీయంగా మారనుంది. ఈ కార్యక్రమంలో దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఏప్రిల్ 6 మెగా కల్చరల్ ఫెస్టివల్
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏప్రిల్ 6 నుంచి 8వ తేదీ వరకు మెగా కల్చరల్ ఫెస్ట్–2026 నిర్వహించనున్నట్లు ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ తెలిపారు. శనివారం ఏయూ అకడమిక్ సెనేట్ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్, టీజర్లను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగే ఈ మెగా కల్చరల్ ఫెస్ట్లో మ్యూజికల్ నైట్, సైక్లింగ్, వాక్థాన్, డ్రోన్ షో, లేజర్ షో, డీజే నైట్, సాంస్కృతిక కార్యక్రమాలు, టాలెంట్ షో, ఫ్లవర్ షో వంటి అనేక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఏయూతో పాటు అనుబంధ కళాశాలల విద్యార్థులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. వచ్చే నెలలో జరగనున్న శతాబ్ది మహోత్సవాలకు ముందు నిర్వహించనున్న వివిధ కార్యక్రమాల వివరాలతో రూపొందించిన శతాబ్ది మహోత్సవ్ వెబ్సైట్ను ఆయన ప్రారంభించారు. ఈ వెబ్సైట్ను పూర్తిగా ఏయూ విద్యార్థులే రూపొందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ ఆచార్య ఎం.శశి, ఎం.వి.ఆర్. రాజు, కె.సీతామాణిక్యం, ఆచార్య ఎన్.విజయమోహన్, ఆచార్య ఎన్.ఎం.యుగంధర్, ఆచార్య సిహెచ్.ఆశా ఇమ్మానియల్ రాజు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమ వివరాలు ఏప్రిల్ 6న భీమిలి వరకు సైక్లింగ్, ట్రీ ప్లాంటేషన్, లైవ్ మ్యూజిక్ బ్యాండ్, సాంస్కృతిక కార్యక్రమాలు, లైవ్ కన్సర్ట్ నిర్వహిస్తారు. ఏప్రిల్ 7న రంగోలి పోటీలు, ఉత్తరాంధ్ర గాయకులతో ప్రత్యేక పాత పాటల కార్యక్రమం, థింసా నృత్యం, విద్యార్థుల ప్రదర్శనలు, శాసీ్త్రయ నృత్యాలు జరుగుతాయి. ఏప్రిల్ 8న వాక్థాన్, రక్తదాన శిబిరం, సాంస్కృతిక కార్యక్రమాలు, లేజర్ షో, డీజే నైట్ నిర్వహిస్తారు. -
కట్టెల పొయ్యిలపై వంటలు
గ్యాస్పై పూర్తిగా ఆధారపడే కమర్షియల్ రంగంపైనా ఈ ప్రభావం పడుతోంది. కొన్ని హోటళ్లు, టిఫిన్ సెంటర్లకు కమర్షియల్ సిలిండర్లు సకాలంలో అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కొందరు యజమానులు మళ్లీ కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. భారీ స్థాయిలో వంటలు చేసే క్యాటరింగ్ నిర్వాహకులు కూడా గ్యాస్ కోసం ఎదురుచూడకుండా కట్టెలు, బొగ్గు పొయ్యిలను సిద్ధం చేసుకుంటున్నారు. పనిభారం పెరిగినా ఆర్డర్లను పూర్తి చేయడానికి ఇదే మార్గమని చెబుతున్నారు. కర్రలు కొనుగోలు చేస్తున్న చిరు వ్యాపారిగ్యాస్ కొరత వస్తుందన్న ప్రచారంతో జిల్లాలో ఆందోళన ఏజెన్సీల వద్ద క్యూ కడుతున్న వినియోగదారులు ఇండక్షన్ స్టవ్లు, ఎలక్ట్రిక్ పొయ్యిల కొనుగోళ్లలో జోరు కమర్షియల్ సిలిండర్లు దొరక్క ఇబ్బందుల్లో రెస్టారెంట్లు సాక్షి, విశాఖపట్నం: హోటల్స్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (హెచ్ఆర్ఏఏపీ), ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ (ఏఎస్హెచ్ఏ) ప్రతినిధులు సంయుక్తంగా హోటల్ యజమానులు, ప్రమోటర్లు, జనరల్ మేనేజర్లతో శనివారం అత్యవసర సమావేశం నిర్వహించారు. కమర్షియల్ సిలిండర్ల సరఫరా పరిస్థితి, దాని ప్రభావం, వంటశాల నిర్వహణలో సమర్థవంతమైన విధానాలు, అవసరమైన చోట విద్యుత్ ఆధారిత వంట పరికరాల వినియోగం, మెనూలను సరళీకరించడం, ఎక్కువ సమయం తీసుకునే వంటకాలను తగ్గించడం వంటి అంశాలపై చర్చించారు. పరిస్థితి కొంతకాలం కొనసాగితే కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉండే అవకాశముందని సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా హెచ్ఆర్ఏఏపీ అధ్యక్షుడు పవన్ కార్తీక్ మాట్లాడుతూ విశాఖలోని స్టార్ హోటల్స్కు కమర్షియల్ సిలిండర్ల సరఫరాలో పెద్ద అంతరాయం లేదని, హోటల్ కార్యకలాపాలు సాధారణంగా కొనసాగుతున్నాయన్నారు. అందువల్ల హోటళ్లు ముందస్తు జాగ్రత్తగా ఎల్పీజీ వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించే చర్యలు పరిశీలిస్తున్నాయని తెలిపారు. సమావేశంలో ఏఎస్హెచ్ఏ ఉపాధ్యక్షుడు జి.వెంకటకృష్ణ, బీవీ నటరాజ్తోపాటు సభ్య హోటళ్ల యజమానులు, ప్రమోటర్లు, జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు. ప్రత్యామ్నాయాల వైపు పరుగులు గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందనే అనుమానంతో ప్రజలు ఇప్పటికే ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నారు. నగరంలోని ఎలక్ట్రానిక్ మార్కెట్లలో ఇండక్షన్ స్టవ్లు, ఎలక్ట్రిక్ పొయ్యిల విక్రయాలు ఒక్కసారిగా పెరిగాయి. గతంలో నెలకు 400–500 వరకు అమ్ముడయ్యే ఇండక్షన్ స్టవ్లుం ఇప్పుడు ఒక్కరోజులోనే వందల సంఖ్యలో విక్రయమవుతున్నాయి. ‘గ్యాస్ లేకపోతే వంట ఎలా?’ అన్న ఆలోచనతో చాలామంది ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ పొయ్యిలను కొనుగోలు చేస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: ఎక్కడో దూర దేశాల్లో రగులుతున్న యుద్ధం..ం దాని ప్రభావం నగర వంటగదుల్లో కనిపిస్తోంది. వంటగ్యాస్ సరఫరా నిలిచిపోతుందన్న వదంతులు ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ‘రేపు సిలిండర్ దొరకదేమో’ అన్న భయంతో వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూ కడుతున్నారు. శనివారం ఉదయం నుంచి ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేయకపోవడంతో చాలామంది సిలిండర్లు భుజాన వేసుకుని నేరుగా ఏజెన్సీలకు చేరుకున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో గ్యాస్ కార్యాలయాల వద్ద వినియోగదారుల రద్దీ కనిపించింది. ఒక సిలిండర్ దొరికితే చాలు అన్నట్టుగా ప్రజలు పడుతున్న ఆత్రుత వంటగ్యాస్పై నెలకొన్న భయాన్ని స్పష్టంగా చూపిస్తోంది. భరోసా ఉన్నా.. భయం తగ్గడం లేదు జిల్లాలో గృహావసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ల కొరత లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రధాన బాట్లింగ్ ప్లాంట్ల వద్ద ప్రస్తుతం 7 నుంచి 10 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయని చెబుతున్నారు. రోజుకు సగటున 25 వేల నుంచి 30 వేల వరకు సిలిండర్లు వినియోగదారులకు సరఫరా అవుతున్నాయని తెలిపారు. డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ప్లాంట్లలో అదనపు షిఫ్టులు ఏర్పాటు చేసి బాట్లింగ్ ప్రక్రియను వేగవంతం చేశామని అధికారులు చెబుతున్నారు. ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థను కూడా పటిష్టం చేసి ‘ఫస్ట్ కమ్–ఫస్ట్ సర్వ్’ పద్ధతిలో సరఫరా కొనసాగిస్తున్నామని తెలిపారు. అధికారుల భరోసా ఉన్నప్పటికీ ప్రజల్లో భయం మాత్రం తగ్గడం లేదు. వదంతులు వేగంగా వ్యాపించడం వల్ల ‘ముందే సిలిండర్ తెచ్చుకుందాం’ అనే ఆలోచనతో అనేక మంది ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు. మహారాణిపేట: వంటగ్యాస్ సరఫరాపై ఏర్పడిన అనిశ్చితి నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రులపై కూడా ప్రభావం చూపుతోంది. రోగులకు భోజనం అందించే డైట్ క్యాంటీన్లలో గ్యాస్ సిలెండర్ల సరఫరా ఆలస్యమవుతున్నట్లు సమాచారం. కేజీహెచ్తో పాటు విక్టోరియా ఆస్పత్రి, టీబీ ఆస్పత్రి, ప్రభుత్వ మానసిక ఆస్పత్రి, విమ్స్ ఆస్పత్రుల్లో ప్రతిరోజూ వేలాది మంది రోగులకు భోజనం తయారు చేయడానికి గ్యాస్ సిలిండర్లపై ఆధారపడుతున్నారు. కేజీహెచ్లో రోజుకు సుమారు 1,500–1,800 మంది రోగులకు భోజనం సిద్ధం చేయడానికి దాదాపు 12 సిలిండర్లు అవసరమవుతున్నాయి. అలాగే ప్రభుత్వ విక్టోరియా ఆస్పత్రిలో 5 సిలిండర్లు, టీబీ ఆస్పత్రి, ఆర్సీడీఈఎన్టీలో మూడు సిలిండర్లు, ప్రభుత్వ మానసిక ఆస్పత్రిలో మూడు సిలిండర్లు, విమ్స్లో 3 సిలిండర్లు, పీజీ హాస్టల్స్లో రెండు సిలిండర్లు అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆస్పత్రుల్లో గ్యాస్ సరఫరాపై జిల్లా జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రులకు అవసరమైన గ్యాస్ సిలిండర్లను నిరంతరంగా సరఫరా చేయాలని గ్యాస్ ఏజెన్సీలను ఆదేశించారు.ఎలక్ట్రికల్ స్టవ్ను కొనుగోలు చేస్తున్న మహిళగ్యాస్ కష్టాలపై ‘స్టార్’ హోటళ్ల భేటీ ఆస్పత్రులకు గ్యాస్ సెగ జిల్లా పరిషత్ వద్ద కర్రల పొయ్యిపై వండుతున్న వీధి వ్యాపారిగ్యాస్ ఏజెన్సీల వద్ద సిలిండర్లతో క్యూ కట్టిన జనం. సీతంపేట,గురుద్వార తదితర ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.గ్యాస్ సిలిండర్ విడిపించుకొని వెళ్తున్న మహిళ -
వైఎస్సార్సీపీలో నియామకాలు
భూపతిరాజు సుజాత ముదుండి రాజేశ్వరిపిళ్లా సూరిబాబుమధురవాడ/గాజువాక: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీల్లో విశాఖ జిల్లాకు చెందిన పలువురు నేతలకు కీలక పదవులు వరించాయి. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. జీవీఎంసీ 6వ వార్డుకు చెందిన ముదుండి రాజేశ్వరిని పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం ఉపాధ్యక్షురాలుగా నియమించారు. గతంలో ఈమె సింహాచలం దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా సేవలందించారు. జీవీఎంసీ 73వ వార్డు కార్పొరేటర్గా ఉన్న భూపతిరాజు సుజాత (గాజువాక)ను రాష్ట్ర మహి ళా విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమించారు. జీవీఎంసీ 7వ వార్డుకు చెందిన పిళ్లా సూరిబాబు (భీమిలి)ను విశాఖ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించారు. ప్రస్తుతం ఈయన జాతర గట్టు దుర్గాలమ్మ ఆలయ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. భీమిలి నియోజకవర్గానికి చెందిన ఎల్లపు వెంకటరావు (జగన్)ను భీమిలి నియోజకవర్గ ప్రచార విభాగం అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. -
పది పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
జిల్లాలో 28,983 మంది విద్యార్థులు హాజరు 133 పరీక్ష కేంద్రాల ఏర్పాటు డీఈవో ప్రేమకుమార్ వెల్లడి ఆరిలోవ: జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.ప్రేమకుమార్ ప్రకటించారు. శనివారం డీఈవో కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పరీక్షల షెడ్యూల్, నిబంధనలను వివరించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 456 పాఠశాలల నుంచి 28,983 మంది విద్యార్థులు హాజరవుతున్నారు.విభాగం విద్యార్థుల సంఖ్య మొత్తం విద్యార్థులు 28,983 బాలురు 15,292 బాలికలు 13,691 ప్రభుత్వ పాఠశాలలు 10,050 ప్రైవేట్ పాఠశాలలు 18,933 గతంలో తప్పినవారు 1,001 బెంచీలపై హాల్ టికెట్ నంబర్లు వేస్తున్న సిబ్బందిసీతంపేట మధురానగర్జీవీఎంసీ హైస్కూల్లో పరీక్ష కేంద్రంవిద్యార్థులకు సౌకర్యాలు ఉచిత బస్సు ప్రయాణం: హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. హాల్ టికెట్లు: ’లీప్’ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటిపై ఎవరి సంతకం అవసరం లేదు. స్క్రైబ్ సౌకర్యం: దివ్యాంగులైన 286 మంది పిల్లలకు, పరీక్షల సమయంలో ప్రమాదాలకు గురైన వారికి స్క్రైబ్ను ఏర్పాటు చేస్తారు. ఆరోగ్యం– భద్రత: అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. హెల్త్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. పకడ్బందీగా పర్యవేక్షణ పరీక్ష కేంద్రాలు : 133 సిబ్బంది : 1,634 మంది ఇన్విజిలేటర్లు, 133 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 133 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు. ప్రత్యేక నిఘా : 5 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 9 సిట్టింగ్ స్క్వాడ్లు. అదనపు భద్రత : 8 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి, అక్కడ సీసీ కెమెరాలు, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్య గమనిక : పరీక్ష కేంద్రంలోకి సెల్ ఫోన్లు అనుమతించబడవు. సీఎస్ కూడా గదుల్లోకి ఫోన్ తీసుకువెళ్లకూడదు. ఓపెన్ టెన్త్ పరీక్షలు కూడా.. సాధారణ పరీక్షలతో పాటు సార్వత్రిక విద్యా పీఠం (ఓపెన్ టెన్త్) పరీక్షలు కూడా ఈ నెల 16 నుంచి 28 వరకు జరుగుతాయి. సమయం: ఉదయం 9.30 నుంచి 12.30 వరకు. విద్యార్థులు: 995 మంది (11 కేంద్రాలు). సిబ్బంది: 80 మంది ఇన్విజిలేటర్లు, 11 సీఎస్లు, 11 డీవోలు. ప్రత్యేక నిఘా: 3 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 4 సిట్టింగ్ స్క్వాడ్లు. పరీక్షల షెడ్యూల్ తేదీలు: ఈనెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు. సమయం: ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు. మినహాయింపు: భౌతిక, జీవ శాస్త్రం పరీక్షలు మాత్రం ఉదయం 9.30 నుంచి 11.30 వరకు (50 మార్కులకు) జరుగుతాయి. -
రాజీ మార్గంతో బహుళ ప్రయోజనాలు
విశాఖ లీగల్: కక్షిదారులు తమ కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవడం వల్ల బహుళ ప్రయోజనాలు ఉంటాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు అన్నారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో నిర్వహించిన మెగా జాతీయ లోక్ అదాలత్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసుల రాజీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ లోక్ అదాలత్లో 345 సివిల్ కేసులు, 12,800 క్రిమినల్ కేసులు, ప్రీ లిటిగేషన్ ద్వారా 152 కేసులు రాజీ అయ్యాయి. వీటి ద్వారా మొత్తం రూ.38 కోట్ల నగదు సమకూరింది. కేసుల పరిష్కారంలో రాష్ట్రంలో విశాఖ 9వ స్థానంలో నిలిచిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వెల్లడించారు. కాగా, రాజీ మార్గంలో పరిష్కారమైన ఒక కేసులో అత్యధికంగా రూ.2.56 కోట్ల పరిహారాన్ని బాధితులకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు పాల్గొన్నారు. -
సిరులతల్లికి సారె సమర్పణ
డాబాగార్డెన్స్: బురుజుపేటలో కొలువైన కనకమహాలక్ష్మి అమ్మవారికి స్థానికులు శనివారం పెద్ద ఎత్తున సారె సమర్పించారు. కోలాటం, సన్నాయి వాయిద్యాలు, డప్పులు, సాముగరిడీ, పలు సాంస్కృతిక కార్యక్రమాల నడుమ.. ఊరేగింపుతో అమ్మవారి ఆలయానికి తీసుకొచ్చారు. వివిధ రకాల పిండి వంటలు, పళ్లు, పువ్వుల వంటి సామగ్రిని నైవేద్యంగా సమర్పించారు. కార్యక్రమంలో స్థానిక మహిళలు, దేవస్థాన వేద పండితులు, అర్చకులు, ఆలయ సిబ్బంది, బురుజుపేట రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్, పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
భారత్తో ఘనాకు బలమైన సంబంధాలు
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వర్సిటీల సరసన నిలుస్తుందని భారతదేశంలో ఘనా హైకమిషనర్ ప్రొఫెసర్ క్వాసి ఒబిరి డాన్సో కొనియాడారు. శనివారం ఏయూలో ఘనా విద్యార్థుల సమక్షంలో నిర్వహించిన ఆ దేశ స్వాతంత్య్ర దినోత్సవంలో ఆయన మాట్లాడారు. భారతదేశంతో ఘనాకు మెరుగైన ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయని, భవిష్యత్ నాయకత్వాన్ని, నైపుణ్యం కలిగిన వర్క్ఫోర్స్ను తీర్చిదిద్దడంలో ఏయూ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. పలువురు భారతీయులు శాశ్వత పౌరసత్వం పొంది ఘనాలో నివసిస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఏయూలో తమ దేశ విద్యార్థులకు అందుతున్న నాణ్యమైన విద్య పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తూ, శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న వర్సిటీ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఏయూ వీసీ ఆచా ర్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ.. ఘనా దేశంతోనూ, అక్కడి విద్యార్థులతోనూ ఏయూకు బలమైన విద్యా, సాంస్కృతిక అనుబంధం ఉందన్నారు. ఈ నెలలో విదేశీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సాంస్కృతిక సమ్మేళనం, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏయూలో చదువుకుని ఘనాలో ఉన్నత పదవుల్లో స్థిరపడిన వారిని శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సత్కరిస్తామని ప్రకటించారు. భారత్లో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులందరినీ ఏకం చేస్తూ ఏయూ వేదికగా ఒక భారీ సైన్స్ టెక్నాలజీ కాంక్లేవ్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో విదేశీ విద్యార్థి వ్యవహారాల డీన్ ఆచార్య పాల్ డగ్లస్, అసోసియేట్ డీన్లు డాక్టర్ ఎన్.ఎం. యుగంధర్, డాక్టర్ విజయశాంతి, ఘనా విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ఎ.అబ్రహం తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన ఘనా సంప్రదాయ నృత్యాలు అలరించాయి. ఈ సందర్భంగా ఏయూ తరఫున ఘనా హైకమిషనర్ను సత్కరించారు. -
రూ.700 కోట్లతో అభివృద్ధి ప్రణాళికలు
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా వర్సిటీ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి రూ.700 కోట్ల ప్రతిపాదనలు పంపినట్లు వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ తెలిపారు. ఇందులో హెరిటేజ్ యూనివర్సిటీగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి రూ.200 కోట్లు, విద్యార్థుల మౌలిక సదుపాయాల అభివృద్ధి, బ్యూటిఫికేషన్, పురాతన భవనాల ఆధునీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి రూ.500 కోట్ల ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. రాష్ట్రంలో శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న ఏకై క విశ్వవిద్యాలయం ఏయూ కావడం గర్వకారణమన్నారు. ఈ ప్రాజెక్టుల వివరాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు వివరించామని, నిధుల మంజూరుకు ఆయన కృషి చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల కోసం కార్పొరేట్ తరహాలో ఐకానిక్ స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ నిర్మాణం ప్రతిపాదనల్లో ప్రధానంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే వెయ్యి మందికి సరిపడే మెగా మెస్, హాస్టళ్లు, అకడమిక్ కాన్ఫరెన్స్ హాల్ విస్తరణ, లైబ్రరీ డిజిటలైజేషన్ వంటి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. అలాగే అధ్యాపకుల తరగతులను రికార్డు చేయడానికి ప్రత్యేక స్టూడియో ఏర్పాటు చేసి వాటిని ఏయూ అనుబంధ కళాశాలల విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ఇతర ప్రతిపాదనల్లో ప్రధాన ద్వారాల ఆధునీకరణ, రంజనీ గెస్ట్ హౌస్, వీసీ బంగ్లా పునరుద్ధరణ, భారీ కాంపౌండ్ వాల్ నిర్మాణం, ఫిజిక్స్ భవనం వద్ద సెంటీనరీ పార్క్ ఏర్పాటు, అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు ఉన్నాయి. అదేవిధంగా క్వాంటమ్ టెక్నాలజీ కోర్సులకు రూ.50 కోట్లతో ల్యాబ్, సెమీకండక్టర్ ల్యాబ్ను ఆధునిక స్థాయిలో ఏర్పాటు చేయడానికి మరో రూ.50 కోట్లు అవసరమని ప్రతిపాదించారు. ఆర్ట్స్, లా, కామర్స్ విద్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్ కంపిటెన్సీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు, ల్యాబ్లలో అత్యాధునిక పరికరాలు, మౌలిక సదుపాయాల కోసం రూ.100 కోట్లు, శతాబ్ది ఉత్సవాల నిర్వహణకు రూ.25 కోట్లు కోరినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలతో మెగా మెస్, ఒక బాలికల హాస్టల్, రెండు బాలుర హాస్టళ్లు నిర్మాణం, అలాగే వర్సిటీలోని కీలక విభాగాలకు చెందిన తొమ్మిది భవనాల ఆధునికీకరణ చేపట్టాలని ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. -
నాడు భరోసా
నేడు నిరాశ6,499 మంది రైతులకు ఎగనామం ఎన్నికలకు ముందు రైతులందరికీ ‘అన్నదాత సుఖీభవ’ హామీ అధికారంలోకి వచ్చాక కొందరికే కూటమి సాయం వైఎస్సార్ సీపీ హయాంలో 25,072 మందికి రైతు భరోసా చంద్రబాబు ప్రభుత్వంలో 18,573 మందికే నగదు జమ కౌలు రైతులకు మొండిచేయి మహారాణిపేట: ఎన్నికల ముందు ఆకాశమే హద్దుగా హామీలు గుప్పించి, అధికారంలోకి వచ్చాక అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లడం చంద్రబాబుకు పరిపాటిగా మారింది. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని ఉదరగొట్టిన కూటమి నేతలు, తీరా అమలు సమయానికి కోతల పర్వానికి తెరలేపారు. శుక్రవారం మూడో విడత నిధుల విడుదల సందర్భంగా ప్రభుత్వం అనుసరించిన వైఖరి చూస్తుంటే.. రైతులను ఆదుకోవడం కంటే వారిని పథకం నుంచి ఎలా తొలగించాలనే దానిపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు స్పష్టమవుతోంది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది పథకాన్ని పూర్తిగా ఎగ్గొట్టిన చంద్రబాబు ప్రభుత్వం.. రెండో ఏడాదిలోనూ అరకొర నిధులతోనే సరిపెట్టింది. మూడో విడత కింద పెద్ద సంఖ్యలో అర్హులైన రైతులకు పెట్టుబడి సాయాన్ని దూరం చేసింది. అలాగే.. కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ రూ.2 వేలకు, రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.4 వేలు జత చేసి మమ అనిపించింది. ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని నమ్మించి, నేడు హామీ ప్రకారం నిధులు ఇవ్వకుండా రైతులను వంచిస్తోందని కర్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌలు రైతులకు మొండిచేయి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతు భరోసా అమలు చేశారు. జిల్లాలో 25,072 మంది రైతులకు నేరుగా నగదు జమ చేశారు. కానీ, నేడు చంద్రబాబు ప్రభుత్వం కేవలం 18,573 మందికి మాత్రమే రూ.7.43 కోట్ల నిధులు జమ చేసింది. ఏకంగా 6,499 మంది రైతులకు మొండిచేయి చూపింది. 17,050 మంది రైతులకు కేంద్రం నుంచి రూ.3.41 కోట్లు రైతులకు జమ అయ్యాయి. కాగా.. గత ప్రభుత్వం 10 సెంట్ల భూమి ఉన్న చిన్న రైతులకు కూడా సాయం అందించింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఎక్కడా లేని నిబంధనలు అమలు చేస్తోంది. కుటుంబంలో ఒక్కరికే లబ్ధి అనే నిబంధన పెట్టింది. 10 సెంట్ల లోపు భూమి ఉన్నవారిని తొలగించింది. ఆధార్, ఈ–కేవైసీ, బ్యాంక్ అనుసంధానం వంటి సాంకేతిక సాకులు చెప్పి వేలాది మందిని అనర్హులుగా మార్చింది. ముఖ్యంగా, కౌలు రైతులకు ఈ విడతలోనూ మొండిచేయి ఎదురైంది. మూడో విడతలో న్యాయం జరుగుతుందని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. రైతులకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి వేలిముద్రలు వేయాలని, ఓటీపీలు చెప్పాలని నిబంధనలు పెట్టడం వల్ల వృద్ధులు, చదువుకోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొదటి ఏడాది నుంచే మోసం అన్నదాత సుఖీభవ నిధులు ఇవ్వకుండా మొదటి ఏడాది నుంచే మమ్మల్ని మోసం చేస్తున్నారు. నేను 1.90 ఎకరాల ఈనాం భూమిని సాగు చేసుకుంటున్నాను. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లూ రైతు భరోసా కింద లబ్ధి పొందాను. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఒక్క విడత కూడా డబ్బులు జమ కాలేదు. దీంతో సాగు పెట్టుబడి కోసం బయట వడ్డీకి అప్పులు తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ అప్పులు తీర్చలేక నానా ఇబ్బందులు పడుతున్నాను. ప్రభుత్వం స్పందించి నాకు న్యాయం చేయాలి. – కె.శ్రీనివాసరావు, రైతు, బొత్సపేట రెండు విడతలు మొండిచేయే.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు అందడం లేదు. మొదటి ఏడాది పథకం అమలు చేయలేదు. రెండో ఏడాదిలో రెండు విడతల్లో పైసా రాలేదు. గత ప్రభుత్వంలో ఏడాదికి రూ.13,500 చొప్పున ఐదేళ్ల పాటు క్రమం తప్పకుండా అందాయి. నా పేరిట 1.50 సెంట్లు, భార్య సిమ్మప్ప పేరిట 3 ఎకరాలు, కుమారుడు శివ పేరిట 30 సెంట్లు భూమి ఉన్నప్పటికీ, మా కుటుంబంలో ఒక్కరికి కూడా సాయం అందడం లేదు. మూడు విడతలు కలిపి ప్రభుత్వం రూ.20,000 ఇవ్వాల్సి ఉంది. పెట్టుబడి కోసం బ్యాంకు అప్పులు తెచ్చి సాగు చేస్తున్నాం. మూడో విడత అయినా వస్తుందో లేదో! – బి.సన్నిబాబు, రైతు, మద్ది గ్రామం -
4
ఆగమేఘాల మీద ఆమోదం ముగిసిన జీవీఎంసీ చివరిస్థాయీ సంఘ సమావేశం 293గంటలు.. అంశాలు డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రస్తుత పాలకవర్గ చిట్టచివరి స్థాయీ సంఘ సమావేశం శుక్రవారం జరిగింది. మేయర్, స్థాయీ సంఘం చైర్మన్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నిర్ణయాలు ఆగమేఘాల మీద జరిగిపోయాయి. కేవలం నాలుగు గంటల వ్యవధిలో 294 అంశాలపై చర్చించి, అందులో ఏకంగా 293 అంశాలకు సభ్యులు ఆమోదముద్ర వేయడం గమనార్హం. ఈ నెల 17వ తేదీతో ప్రస్తుత పాలకవర్గ పదవీకాలం ముగియనుండటంతో ఇదే వారి చివరి సమావేశం. ఉదయం 11.45కు ప్రారంభమైన సమావేశంలో మధ్యాహ్నం 1.30 వరకు 193 అంశాలను ఆమోదించారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు మరో 101 టేబుల్ అజెండా అంశాలను క్లియర్ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. తన పదవీ కాలంలో అందరి సహకారంతో నగరంలో మౌలిక వసతులు, రోడ్లు, డ్రైనేజీలు, ఫుట్పాత్ల అభివృద్ధికి విశేషంగా కృషి చేశానని తెలిపారు. వివాదాస్పద బిల్లులను ఆమోదించేశారు గతేడాది యోగా దినోత్సవం సందర్భంగా మొబైల్ టాయిలెట్ల ఏర్పాటు కోసం సుమారు రూ.1.62 కోట్ల చెల్లింపులకు అప్పట్లో అధికారులు ప్రతిపాదించారు. దీనిపై ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనంతో గత స్థాయీ సంఘ సమావేశంలో సభ్యులు భగ్గుమన్నారు. అప్పట్లో మేయర్ ఈ బిల్లులను వాయిదా వేశారు. అధికారులు వివరణ ఇచ్చారో లేదో తెలియదు కానీ, ఈ చివరి సమావేశంలో ఆ పాత బిల్లులను మళ్లీ అజెండాలో పెట్టి ఆమోదించడం చర్చనీయాంశమైంది. టాయిలెట్లలో ఏసీలు బిగించారా? మొబైల్ టాయిలెట్ల అద్దె బిల్లుల్లో ఉన్న భారీ వ్యత్యాసాలపై సభ్యులు అధికారులను తీవ్ర స్థాయిలో నిలదీశారు. సీఎం పర్యటనకు ఏర్పాటు చేసిన టాయి లెట్లకు రూ.8 వేలు, పీఎం యోగా డే కార్యక్రమానికి రూ.16 వేలు బిల్లు చూపించిన అధికారులు.. ఇటీవల జడ్జిల కార్యక్రమానికి ఏకంగా రూ.30 వేలు చూపించడంపై విస్మయం వ్యక్తం చేశారు. ‘ఒక్కో టాయిలెట్కు 30 వేలా? అందులో ఏమైనా ఏసీలు బిగించారా?’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ఆ అజెండాను సైతం ఆమోదించేయడం విశేషం. కారుణ్య నియామకాలకు ఇప్పుడా? జీవీఎంసీలో ముగ్గురికి జూనియర్ అసిస్టెంట్లుగా కారుణ్య నియామకాలు చేపట్టే అంశంపై విస్తృత చర్చ జరిగింది. వీరు 2024లోనే ఎంపికై నప్పటికీ, 2026 వరకు నియామక పత్రాలు ఎందుకు ఇవ్వలేదని సభ్యులు ప్రశ్నించారు. ఈ జాప్యం వెనుక భారీగా నగదు చేతులు మారినట్లు తమకు అనుమానాలున్నాయని ఆరోపించారు. దీనిపై అదనపు కమిషనర్ సత్యవేణి స్పందించి సభ్యులకు వివరణ ఇచ్చారు. ఒకే ఒక్క అంశం వాయిదా సమావేశంలో వాయిదా పడిన ఏకై క అంశం గాజువాకలోని క్లోజ్డ్ కాంపాక్షన్ సిస్టం మరమ్మతుల వ్యవహారం. దీని కోసం రూ.49 లక్షలు ఖర్చు చేయాలన్న ప్రతిపాదనను సభ్యుడు రాపర్తి కన్నా తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత చూసిన రాశా సంస్థే ఆ మరమ్మతులు చేయాల్సి ఉండగా, జీవీఎంసీ నిధులు ఎందుకు ఖర్చు చేస్తున్నారని నిలదీశారు. కాంట్రాక్టర్ నుంచే రికవరీ చేస్తామని అధికారులు చెప్పగా.. గత ఏడాదిన్నరగా ఇదే మాట చెబుతున్నారు, ఆచరణలో శూన్యం అని సభ్యులు పెదవి విరిచారు. రికవరీ అయిన తర్వాతే ఆమోదిద్దామంటూ ఈ ఒక్క అంశాన్ని వాయిదా వేశారు. సమావేశంలో సీఎంవోహెచ్ డాక్టర్ నరేష్ కుమార్, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి, కార్యదర్శి బి.వి.రమణ, డీసీ ఎస్. శ్రీనివాసరావు, జోనల్ కమిషనర్లు పాల్గొన్నారు. మంగళవారంతో పాలకవర్గ గడువు ముగుస్తుండటంతో, స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో కార్పొరేటర్లందరూ వీడ్కోలు విందు చేసుకోనున్నట్లు సమాచారం. -
24 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం
మహారాణిపేట : గృహ అవసరాలకు వినియోగించాల్సిన వంట గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్న వారిపై సివిల్ సప్లయిస్ అధికారులు శుక్రవారం కూడా నగరంలో మెరుపుదాడులు నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి ఆదేశాల మేరకు డీఎస్వో వి.భాస్కరరావు ఆధ్వర్యంలో నగరంలోని వివిధ హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. పలువురు హోటళ్లు, రెస్టారెంట్లు గృహ వినియోగానికి ఉద్దేశించిన గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న 24 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకొని సంబంధిత వ్యాపారులపై 6(ఏ) కేసులు నమోదు చేసినట్లు డీఎస్వో వి.భాస్కరరావు తెలిపారు. -
ఆస్తి పన్ను వసూళ్లలో జీవీఎంసీ జోరు
నెలవారీ పన్నుల ఆదాయం వివరాలివి.. నెల 2024–25 2025–26 (రూ. కోట్లలో) (రూ. కోట్లలో) ఏప్రిల్ 132.11 162.66 మే 18.84 25.47 జూన్ 25.66 32.05 జూలై 19.30 20.25 ఆగస్టు 16.90 20.30 సెప్టెంబర్ 18.96 25.41 అక్టోబర్ 15.08 18.55 నవంబర్ 28.21 29.12 డిసెంబర్ 40.55 73.12 జనవరి 18.02 18.05 ఫిబ్రవరి 32.31 35.99 మార్చి (12 వరకు) 17.45 19.56 ఈ నెల 12 నాటికి రూ. 481 కోట్ల ఆదాయం డాబాగార్డెన్స్: పన్నుల వసూళ్లలో జీవీఎంసీ ఈ ఆర్థిక సంవత్సరం(2025–26)లో దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ నెల 12వ తేదీ నాటికి రూ.481.43 కోట్ల ఆదాయం వసూలైంది. జీవీఎంసీ పరిధిలో 6 లక్షలకు పైగా ఆస్తి, ఖాళీ స్థలాల అసెస్మెంట్లు ఉన్నాయి. గతేడాది (2024–25) మార్చి 12 నాటికి రూ. 383.39 కోట్లు వసూలు కాగా, ఈ ఏడాది అదే సమయానికి రికార్డు స్థాయిలో రూ.481.43 కోట్లు వసూలవ్వడం విశేషం. గతేడాది వసూళ్లతో పోల్చుకుంటే, ఈ ఏడాది నిర్దేశించుకున్న లక్ష్యంలో ఇప్పటి వరకు 95.47 శాతం మేర వసూళ్లు పూర్తయ్యాయి. -
19న అప్పన్న పెళ్లి రాట
సింహాచలం : ఉగాదిని పురస్కరించుకుని ఈనెల 19న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి పెళ్లిరాట ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్టు దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ తెలిపారు. ఆరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ ఆస్థానమండపంలో వేంజేపచేసి పూజలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి పంచాంగశ్రవణం, విశిష్ట అతిథిలకు పురస్కారాలు అందిస్తామన్నారు. సాయంత్రం 4గంటల నుంచి ఆలయ ప్రాంగణంలోను, రాజగోపురం పక్కన, వార్షిక కల్యాణం నిర్వహించే ఉత్తర రాజగోపురం ఎదురుగా ఉన్న మైదానంలోను పెళ్లి రాటలు వేయడం జరుగుతుందన్నారు. ఆరోజు సాయంత్రం సూర్యకిరణాలు స్వామివారి మూలవిరాట్ని తాకే వీలు ఉంటుందని పేర్కొన్నారు. -
ఉగాది సంప్రదాయ వస్త్రాలకు సిల్క్ ఎక్స్పో
డాబాగార్డెన్స్ : ఉగాది పండగ సందర్భంగా సంప్రదాయ వస్త్రాల ప్రదర్శన సిల్క్ ఎక్స్పో ఈ నెల 15 వరకు వాల్తేర్ మెయిన్ రోడ్డులోని హోటల్ గ్రీన్ పార్క్లో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రదర్శనలో పట్టు చీరలు, కాటన్ వస్త్రాలు, సల్వార్లు, టాప్స్తో పాటు వివిధ రకాల డిజైనర్ దుస్తులు అందుబాటులో ఉన్నాయి. మహిళలను ఆకట్టుకునే పొచంపల్లి, కలంకారి, బెనారస్ పట్టు, లక్నో చికాన్ వర్క్, బంధిని, హ్యాండ్ బ్లాక్ ప్రింట్ చీరలు విక్రయానికి ఉంచినట్లు తెలిపారు. అలాగే మట్కా సిల్క్, మల్బరీ సిల్క్, చందేరి వంటి వివిధ రకాల చీరలు అందుబాటు ధరల్లో లభిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రదర్శన ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుందని, నగర ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరారు. -
స్కూల్ బస్సు ఢీకొని వృద్ధుడి దుర్మరణం
తగరపువలస: సంగివలసలోని ఒక కార్పొరేట్ విద్యాసంస్థకు చెందిన బస్సు ఢీకొని విజయనగరం జిల్లా డెంకాడ మండలం జొన్నాడకు చెందిన జి.సూర్యనారాయణ(65) దుర్మరణం చెందాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలివి.. భీమిలి మండలం శింగనబంధ పంచాయతీ కృష్ణంరాజుపేట ప్రాంతానికి చెందిన పడగల అప్పలస్వామి, అప్పయ్యమ్మతో పాటు సూర్యనారాయణ శుక్రవారం ద్విచక్రవాహనంపై జొన్నాడ వైపు సర్వీస్ రోడ్డులో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న స్కూల్ బస్సు బలంగా బైక్ను ఢీకొంది. ఆ సమయంలో ద్విచక్రవాహనంపై ఉన్న ముగ్గురు కింద పడిపోగా.. వృద్ధుడు తలకు బలమైన గాయాలతో అక్కడికక్కడే చనిపోయాడు. మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా చికిత్స కోసం ఆస్పత్రి కి తరలించారు. బస్సును డ్రైవర్కు బదులుగా క్లీనర్ నడుపుతున్నట్టు తెలిసింది. ఘటన జరిగిన ప్రాంతం విజయనగరం జిల్లా డెంకాడ, భోగాపురంతో పాటు భీమిలి మండల పరిధిలో ఉండటంతో ఈ మూడు పోలీస్ స్టేషన్ల సిబ్బంది తొలుత కొంత అయోమయానికి గురయ్యారు. చివరకు ఆ స్థలం భీమిలి రెవెన్యూ పరిధిలో ఉందని గుర్తించి.. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళలను ఇబ్బందులకు గురి చేస్తే సహించం
మహారాణిపేట : మహిళలను ఇబ్బందులకు గురి చేసే ఏ అంశాన్నీ సహించబోమని రాయపాటి శైలజ హెచ్చరించారు. శుక్రవారం విశాఖలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఉమ్మడి విశాఖ జిల్లాల నుంచి వచ్చిన మహిళల ఫిర్యాదుల విచారణతోపాటు కొత్త ఫిర్యాదులను స్వీకరించి విచారించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళా కమిషన్కు వచ్చిన ఫిర్యాదుల్లో సుమారు 70 శాతం సమస్యలను పరిష్కరించామని, మిగతావాటిని కూడా త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు స్కానర్ విధానాన్ని తీసుకొస్తున్నామని, విచారణ కోసం ఐసీసీ (ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ)లను ఏర్పాటు చేశామని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జాతీయ మహిళా కమిషన్ ఆదేశాల మేరకు మహిళా జన్ సున్వాయ్ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. నెల్లూరులో ప్రారంభమైన ఈ కార్యక్రమం విశాఖపట్నంతో మొదటి దశ పూర్తయిందన్నారు. ఇకపై ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. జన్ సున్వాయ్లో ఎక్కువగా గృహహింస, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, మోసపూరిత వివాహాలు వంటి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. బాధితులు విచారణ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తే అవసరమైతే ఆ అధికారిని మార్చేందుకు జిల్లా ఎస్పీలకు సూచిస్తామని చెప్పారు. న్యాయవాదులను నియమించుకోలేని మహిళలకు న్యాయ సహాయం కూడా అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. -
ఆయిల్ పామ్ సాగుతో అధిక ఆదాయం
పద్మనాభం: ఆయిల్ పామ్ పండిస్తే రైతులకు అధిక లాభాలు వస్తాయని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం కింద జిల్లాకు చెందిన 18,573 మందికి రూ.10.84 కోట్ల చెక్కును ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉద్యానవన పంటలను ప్రోత్సహించడానికి డ్రిప్ ఇరిగేషన్ పథకం కింద 90 శాతం రాయితీపై పరికరాలు అందిస్తున్నట్టు తెలిపారు. భీమునిపట్నం నియోజకవర్గంలో 810 మందికి ఇంకా అన్నదాత సుఖీభవ పథకం సాయం అందలేదని తమ దృష్టికి వచ్చిందని, వారికి కూడా త్వరలో అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
16 నుంచి ‘మెగా సంఝౌతా’ క్యాంపెయిన్
విశాఖ సిటీ: నిరర్థక ఆస్తుల రుణ ఖాతాల పరిష్కారం కోసం వన్ టైమ్ సెటిల్మెంట్ పథకం కింద బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నెల 16 నుంచి 20 వరకు మెగా సంఝౌతా క్యాంపెయిన్ను నిర్వహిస్తోంది. ఈ మేరకు బ్యాంక్ ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని శాఖలు, జోనల్ కార్యాలయాలు, ఎఫ్జీఎంవోలలో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. చిన్న, మధ్య తరహా ఎన్పీఏ ఖాతాల కోసం ఆకర్షణీయమైన రాయితీలు, డిస్కౌంట్లతో ప్రత్యేక ఓటీఎస్ పథకాలను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. వ్యాపార నష్టాలు, అనారోగ్యం లేదా ఇతర అనివార్య కారణాల వల్ల సకాలంలో రుణాలు చెల్లించలేక ఎన్పీఏగా మారిన రుణ గ్రహీతలు, తమ బకాయిలను సెటిల్ చేసుకునేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం సమీపంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖను సంప్రదించాలని కోరారు. -
వాల్తేర్ ఉద్యోగులకు ప్రతిభా పురస్కారాలు
తాటిచెట్లపాలెం: ఈస్ట్ కోస్ట్ రైల్వే, వాల్తేరు డివిజన్ ఆధ్వర్యంలో 70వ రైల్వే వీక్ అవార్డ్స్–రైల్ సేవా పురస్కార్ వేడుకలు శుక్రవారం రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్ క్లబ్లో ఘనంగా నిర్వహించారు. డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వేలోని ప్రతి విభాగంలో సిబ్బంది చూపిన ప్రతిభను గుర్తించి వారిని సత్కరించడం ఈ వేడుకల ఉద్దేశమన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాల్తేర్ డివిజన్ పలు కీలక కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా 24 రోజులు మిగిలి ఉండగానే సరుకు లోడింగ్ లక్ష్యాన్ని అధిగమించి రికార్డు సృష్టించినట్లు తెలిపారు. మొత్తం 84 మిలియన్ టన్నుల సరుకు రవాణా లక్ష్యాన్ని డివిజన్ చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన 72 మంది వాల్తేర్ డివిజన్ ఉద్యోగులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. అలాగే ఇటీవల భువనేశ్వర్లో జరిగిన రైల్ సేవా పురస్కార్–2025 వేడుకల్లో డివిజన్ ఓవరాల్ ఎఫిషియెన్సీ షీల్డ్తో పాటు మొత్తం 14 షీల్డ్లను అందుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ జుసుఫ్ కబీర్ అన్సారి, ఈకార్వో ప్రెసిడెంట్ జ్యోత్స్న బోహ్ర, అదనపు డీఆర్ఎంలు ఈ. శాంతారం (ఇన్ఫ్రా), కే. రామారావు (ఆపరేషన్స్), ఈకార్వో వైస్ ప్రెసిడెంట్ గాయత్రి శాంతారం, రైల్వే అధికారులు, యూనియన్ ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. -
ఒకేచోట ఆరు కొండచిలువలు
రెండు మృతి, నాలుగు సజీవం పరవాడ: పెదముషిడివాడలో ఒకేసారి ఆరు కొండచిలువలు కనిపించడం కలకలం రేపింది. స్థానిక కల్కి లేఅవుట్లో ఒకే చోట ఈ కొండచిలువలు ఉన్నట్లు శుక్రవారం తెల్లవారుజామున స్థానికులు గుర్తించి భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ పల్లా నాగమణి కుమారుడు, వైఎస్సార్ సీపీ నాయకుడు పల్లా అప్పారావు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఆయన స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న నాగరాజు.. ఆరు కొండచిలువలను పట్టుకున్నారు. అయితే, అప్పటికే వాటిలో రెండు కొండచిలువలు చనిపోగా, నాలుగు ప్రాణాలతో ఉన్నట్లు నాగరాజు తెలిపారు. పట్టుబడిన ఒక్కో కొండచిలువ సుమారు 6.5 నుంచి 7 అడుగుల పొడవు ఉంటుందని వెల్లడించారు. ఒకేసారి ఇన్ని కొండచిలువలు బయటపడటంతో, వాటిని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు. -
● గ్యాస్ కష్టాలు.. ఏజెన్సీల వద్ద బారులు
నగరంలో వంట గ్యాస్ కృత్రిమ కొరత ఏర్పడుతుందన్న ప్రచారంతో వినియోగదారులుఆందోళనకు గురవుతున్నారు. దీనికి తోడు ఆన్లైన్ బుకింగ్ సేవల్లో తరచూ అంతరాయం కలుగుతుండటం పరిస్థితిని మరింత జటిలం చేస్తోంది. ఇళ్లలో సిలిండర్లు ఖాళీ కావడంతో, బుకింగ్ కోసం వినియోగదారులు నేరుగా గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఎప్పుడు బుకింగ్ అవుతుందో, గ్యాస్ ఎప్పుడు వస్తుందో తెలియక బెంబేలెత్తుతున్నారు. చాలా మంది గృహిణులు ప్రత్యామ్నాయంగా కర్రల పొయ్యిలు, ఇండక్షన్ స్టవ్లను సిద్ధం చేసుకుంటున్నారు. – ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
నో టెన్షన్.. భూగర్బ రహస్య గుహల్లో చమురు నిల్వలు
పశ్చిమాసియా యుద్ధం భారతదేశ చమురు పరాధీనతను కళ్లకు కట్టింది. విదేశాల నుంచి ముడిచమురు, ద్రవరూప పెట్రోలియం గ్యాస్, ద్రవరూప సహజవాయువు దిగుమతులు హఠాత్తుగా ఆగిపోతే భారత్ కష్టాలకడలిలో పడిపోవడం ఖాయమని వార్తలు వినవస్తున్నాయి. ఈ పరిస్థితిని చాన్నాళ్ల క్రితమే ఊహించిన భారత్ ముందుజాగ్రత్తగా భారీ స్థాయిలో పెట్రో ఉత్పత్తులను నిల్వచేసుకునే రహస్య భూగర్భ నిల్వ కేంద్రాలను నిర్మించుకుంది. వీటిల్లో మిలియన్ల మెట్రిక్ టన్నుల కొద్దీ ముడిచమురు ఉత్పత్తులను దాచిపెడుతోంది.భారత్ తన 90 శాతం ముడిచమురు, 60 శాతం ఎల్పీజీ, 50 శాతం సీఎన్జీ (CNG) అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడుతున్న నేపథ్యంలో వీలైనంత ఎక్కువ సరకును నిల్వచేసుకోవడంపై దృష్టిసారించింది. ఈ కారణంగానే హార్మూజ్ జలసంధి వంటి కీలక చమురు సరఫరా మార్గాలు మూతబడినా వెంటనే కంగారుపడకుండా తన చమురు నిల్వలను ఉపయోగించుకునేందుకు సిద్ధమైంది. పాకిస్తాన్ వంటి దేశాలు ఏకంగా లాక్డౌన్ ప్రకటించి చేతులెత్తేసి చేష్టలుడిగి చూస్తున్నాయి.మూడు చోట్ల మహా గుహలు! చమురు ఉత్పత్తుల దిగుమతులు ఆగిపోయాయనే దిగులుతో భారత్ నిద్రలేని రాత్రులు గడపాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, కర్ణాటకలోని మంగళూరు, తమిళనాడులోని పాడూర్లో కేంద్రప్రభుత్వం మూడు భూగర్భ రహస్య నిల్వకేంద్రాలను నిర్వహిస్తోంది. ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో పదేళ్ల క్రితమే 4 కోట్ల బ్యారెళ్ల ముడిచమురును నిల్వచేసే భారీ భూగర్భ కేంద్రాన్ని నిర్మించారు.ఇందులోని ముడిచమురు (Crude Oil) పది రోజులపాటు యావత్ భారతదేశ అవసరాలను తీర్చగలదు. బాంబు, డ్రోన్ దాడులను తట్టుకునేలా అత్యంత లోతులో వీటిని నిర్మించారు. ప్రకృతి విపత్తులు, అగ్నిప్రమాదాలు, చమురు ఒలికిపోవడం వంటి లీకేజీ సమస్యలూ ఇక్కడ దాదాపు ఉండవు. గతంలోలాగా ఒకటి రెండు దేశాలపై ఆధారపడకుండా ఏకంగా 40 దేశాల నుంచి ముడిచమురును భారత్ దిగుమతి చేసుకుంటోంది. దీంతో ఏదో ఒకటి రెండు దేశాలు యుద్ధసంక్షోభంలో చిక్కుకున్నాసరే మిగతా దేశాల నుంచి నిరాటంకంగా దిగుమతులు కొనసాగే ఏర్పాట్లు భారత్ చేసుకుంది.అంతర్జాతీయ చమురు సంక్షోభం తలెత్తకూడదనే ఉద్దేశంతో తాత్కాలికంగా రష్యా చమురును కొనేందుకు భారత్కు అమెరికా అనుమతి ఇవ్వడంతో వేగంగా భారత్ పావులు కదిపింది. దక్షిణాసియాలో ఇప్పటికే నౌకల్లోకి ఎక్కించిన 30 మిలియన్ బ్యారెళ్ల చమురును భారత్ కొనుగోలుచేసింది. దీనికితోడు గత పది రోజుల్లోనే ఒక్క అంగోలా నుంచే 34 లక్షల బ్యారెళ్ల ముడిచమురును భారత్ కొనేసింది. రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుంచి మరో 19 లక్షల బ్యారెళ్ల చమురు కొనుగోలుచేసింది. ఇలా వచ్చిన సరకును వీలైనంత వరకు భూగర్భం కేంద్రాల్లో దాచేస్తోంది. ఎల్పీజీ స్టోరేజీ సైతం ఊపందుకుంది.అరకిలోమీటర్ లోతులో..కర్ణాటకలోని మంగళూరులో (Mangaluru) ఏర్పాటుచేసిన స్టోరేజీ సామర్థ్యం ఏకంగా 80,000 టన్నులు. ఇది అరకిలోమీటర్ లోతులో ఉంది. ఇదిగాక విశాఖపట్నంలో మరో ఎల్పీజీ నిల్వకేంద్రం ఉంది. దీని సామర్థ్యం 60,000 టన్నులు. ఇవిగాక మరికొన్ని రహస్య భూగర్భ రాతి గుహలను నిర్మించి మరింత ఎక్కువ చమురును నిల్వచేయాలని కొన్ని నెలల క్రితం పార్లమెంట్లో కేంద్రప్రభుత్వం ప్రకటించింది. వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను తమిళనాడులోని పాడూర్లోనూ దాచేస్తోంది. ఒడిశాలోని ఛందీఖోల్లో మరో దానిని నిర్మించనున్నారు.చదవండి: సిలిండర్లు దాచారో.. జైలుకే!భూగర్భ గుహలు అనేవి వ్యూహాత్మకంగా సురక్షితమైనవి. భూమి మీది నిల్వకేంద్రాల నుంచి ఎండాకాలంలో కొంతమేర పెట్రో ఉత్పత్తులు వేడికి ఆవిరవుతాయి. భూగర్భంలో ఆ నష్టభయం ఉండదు. యుద్ధకాలంలో తొలిసారిగా స్వీడన్లో ఈ ప్రణాళికను అమలుచేశారు. తర్వాత ఫిన్లాండ్, జపాన్, దక్షిణకొరియా తదితర దేశాలు ఇదే బాటలో పయనించాయి. 1990లో గల్ఫ్ యుద్ధం నుంచి నేర్చుకున్న గుణపాఠాలతో భారత్ ఈ అండర్గ్రౌండ్ స్టోరేజీలకు అంకురార్పణ చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కోతకు చెక్
బీచ్ కోత నివారణ పనులు ప్రారంభం రూ. 82.98 కోట్లతో మూడేళ్ల ప్రాజెక్టు రంగంలోకి దిగిన ‘డ్రెడ్జ్ 21’ నౌక విశాఖ సిటీ: విశాఖపట్నం అంటేనే నీలి సముద్రం.. అలల సవ్వడి.. పర్యాటకుల కోలాహలం. అయితే గత కొంతకాలంగా ప్రకృతి కన్నుకుట్టినట్లుగా సాగర తీరం కోతకు గురవుతోంది. అలల ఉధృతికి భూమి కరిగిపోతూ, ఆర్కే బీచ్ రోడ్డు మనుగడకే ముప్పు వాటిల్లుతోంది. ఈ తరుణంలో విశాఖపట్నం పోర్ట్ అథారిటీ (వీపీఏ) ఒక భగీరథ ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. సముద్రపు కోతను అడ్డుకుని, తీరాన్ని తిరిగి పూర్వ వైభవానికి తీసుకువచ్చేందుకు రూ. 82.98 కోట్ల భారీ వ్యయంతో ‘బీచ్ నరిష్మెంట్’ పనులను ప్రారంభించింది. ప్రకృతి వైపరీత్యాలకు విరుగుడుగా ’నరిష్మెంట్’ ఏటా వర్షాకాలం, తుపానుల సమయంలో విశాఖ తీరం భారీగా కోతకు గురవుతోంది. దీనిని అరికట్టేందుకు వీపీఏ శాసీ్త్రయ మార్గాన్ని ఎంచుకుంది. సముద్రపు లోపలి భాగంలో పేరుకుపోయిన ఇసుకను తిరిగి తీరానికి చేర్చడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. 2025–26 నుంచి 2027–28 వరకు మూడేళ్ల పాటు ఈ పనులు సాగనున్నాయి. కేవలం ఇసుకను పోయడమే కాకుండా, న్యూ సాండ్ ట్రాప్, అప్రోచెస్, ఓహెచ్టీబీ, ఓబీ–1, ఓబీ–2 వంటి కీలక ప్రాంతాల్లో వార్షిక నిర్వహణ డ్రెడ్జింగ్ను చేపట్టనున్నారు. దీనివల్ల నౌకల రాకపోకలకు మార్గం సుగమం కావడంతో పాటు, వెలికితీసిన ఇసుక తీరానికి రక్షణగా మారుతుంది. పర్యాటకానికి భరోసా విశాఖ బీచ్ పరిరక్షణ తమ ప్రథమ ప్రాధాన్యతని విశాఖపట్నం పోర్ట్ అథారిటీ, డీసీఐ చైర్పర్సన్ డాక్టర్ ఎం.అంగముత్తు స్పష్టం చేశారు. ఆర్కే బీచ్ వద్ద తీర క్షీణతను నియంత్రించేందుకు ఔటర్ హార్బర్లోని సాండ్ ట్రాప్లో లభించే ఇసుకను క్రమం తప్పకుండా తీరానికి తరలించే ‘బీచ్ నరిష్మెంట్’ కార్యక్రమాన్ని ఏటా చేపడుతున్నామని వివరించారు. ఈ పనులను రాష్ట్ర ప్రభుత్వంతో పూర్తి సమన్వయంతో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. విశాఖ అందాలను కాపాడటమే కాకుండా, సముద్రపు కోత వల్ల తీర ప్రాంత ప్రజలకు లేదా మౌలిక సదుపాయాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ చర్యలు దోహదపడతాయని పేర్కొన్నారు. పర్యాటకానికి ప్రాణం.. తీరానికి బలం విశాఖపట్నం తీరం గత కొంతకాలంగా సముద్రపు కోతకు గురవుతుండటం పట్ల పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, పోర్ట్ అథారిటీ చేపట్టిన ఈ చర్యలు అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈ డ్రెడ్జింగ్ పనుల ద్వారా తీరం వెంబడి ఇసుక మేటలు పెరగడం వల్ల బీచ్ మరింత విశాలంగా మారి పర్యాటకులకు అనుకూలంగా మారుతుంది. ఆధునిక సాంకేతికతతో కూడిన ‘డ్రెడ్జ్ 21’ నౌక వినియోగం వల్ల ఈ ప్రక్రియ వేగంగా, సమర్థవంతంగా సాగుతుందని అధికారులు భావిస్తున్నారు. -
రంగంలోకి ‘డ్రెడ్జ్ 21’
2025–26 సంవత్సరానికి సంబంధించిన డ్రెడ్జింగ్ పనులు ఈ నెల 10వ తేదీన అధికారికంగా ప్రారంభమయ్యాయి. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ)కు చెందిన అత్యాధునిక నౌక ‘డ్రెడ్జ్ 21’ ఇప్పుడు విశాఖ సముద్ర తీరంలో తన కార్యకలాపాలను ముమ్మరం చేసింది. ప్రతి సంవత్సరం సుమారు 2.50 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను సముద్రం నుంచి వెలికితీసి, పైపుల ద్వారా తీరానికి పంపింగ్ చేయనుంది. వాతావరణం అనుకూలించే 45 పనిదినాల్లోనే ఈ లక్ష్యాన్ని పూర్తి చేసేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇలా పంపింగ్ చేసిన ఇసుక తీరం వెంబడి ఒక రక్షణ కవచంలా ఏర్పడి, అలల తాకిడి నేరుగా భూమిపై పడకుండా అడ్డుకుంటుంది. -
పీఏసీ మెంబర్గా తిప్పల నాగిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ(పీఏసీ) సభ్యుడిగా తిప్పల నాగిరెడ్డిని నియమించారు. ఈ మేరకు గురువారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి ఆ పార్టీలో అనేక పదవులు వరించాయి. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, గాజువాక సమన్వయకర్తగా, డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేశారు. 2019లో గాజువాకలో పవన్ కల్యాణ్పై ఎమ్మెల్యేగా గెలిచారు. తన సేవలను గుర్తించి పీఏసీ మెంబర్గా అవకాశం కల్పించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి నాగిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
స్వచ్ఛ సర్వేక్షణ్లో ప్రతి మార్కు కీలకమే
జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ బీచ్రోడ్డు: దేశంలోనే విశాఖపట్నాన్ని ప్రథమ స్థానంలో నిలపడమే లక్ష్యంగా ‘స్వచ్ఛ సర్వేక్షణ్ 2025–26’లో ప్రతి అధికారి అంకితభావంతో పనిచేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. గురువారం సిరిపురంలోని వీఎంఆర్డీఏ చిల్డ్రన్ థియేటర్లో జీవీఎంసీ ఉన్నతాధికారులు, జోనల్ కమిషనర్లతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ సర్వేక్షణ్లో పాటించాల్సిన పారామీటర్లు, ప్రత్యేక కార్యాచరణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో అగ్రస్థానం సాధించాలంటే అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ స్పష్టం చేశారు. త్వరలో స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం విశాఖను సందర్శించనున్న నేపథ్యంలో, అన్ని స్థాయిల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంటింటికీ వెళ్లి వ్యర్థాల సేకరణ, తడి పొడి చెత్త విభజన, పౌరుల ఫీడ్బ్యాక్, ఎన్జీవోల సహకారం, సీఅండ్డీ వేస్ట్ మేనేజ్మెంట్పై దృష్టి సారించాలన్నారు. పింక్ టాయిలెట్స్, ప్రజా, పాఠశాల మరుగుదొడ్లు, గ్రీన్ బెల్ట్, ఆర్ఆర్ఆర్ సెంటర్ల నిర్వహణను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. బహిరంగ మల, మూత్ర విసర్జన లేని నగరంగా తీర్చిదిద్దే బాధ్యత సచివాలయ కార్యదర్శుల నుంచి ఉన్నతాధికారుల వరకు అందరిపై ఉందన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో మొత్తం 12,500 మార్కులు ఉంటాయని, చిన్న పొరపాటు జరిగినా మార్కులు తగ్గడమే కాకుండా నెగటివ్ మార్కులు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. నంబర్ 1 స్థానమే లక్ష్యం కావాలి విధుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించకూడదని స్పష్టం చేశారు. గతంలో విశాఖ నగరం సింగిల్ డిజిట్ ర్యాంకులతో రాణిస్తోందని, ఈసారి కచ్చితంగా ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకోవడమే మన ధ్యేయమని కమిషనర్ పునరుద్ఘాటించారు. సమావేశంలో జీవీఎంసీ అదనపు కమిషనర్లు డి.వి.రమణమూర్తి, ఎస్.ఎస్.వర్మ, పి.నల్లనయ్య, ప్రధాన ఇంజినీర్ సత్యనారాయణ, సీసీపీ ప్రభాకర్ రావు, ప్రధాన వైద్యాధికారి ఈఎన్వీ నరేష్కుమార్, ఇతర విభాగాల అధిపతులు, జోనల్ కమిషనర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
34 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం
మహారాణిపేట: గృహ అవసరాలకు వినియోగించే వంట గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నారనే సమాచారం మేరకు సివిల్ సప్లయిస్ అధికారులు గురువారం నగరంలో మెరుపు దాడులు నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి ఆదేశాల మేరకు డీఎస్వో వి.భాస్కరరావు ఆధ్వర్యంలో నగరంలోని వివిధ హోటళ్లు, రెస్టారెంట్లు, వాణిజ్య ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. వాణిజ్య అవసరాలకు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను ఉపయోగించడం నిబంధనలకు విరుద్ధమని అధికారులు తెలిపారు. తనిఖీలలో పలుచోట్ల హోటళ్లు, రెస్టారెంట్లు గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా పలువురు వ్యాపారుల వద్ద నుంచి మొత్తం 34 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని, సంబంధిత వ్యాపారులపై 6 అ కేసులు నమోదు చేసినట్లు డీఎస్వో భాస్కరరావు తెలిపారు. గృహ అవసరాలకు కేటాయించిన గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించడం చట్టవిరుద్ధమని ఆయన హెచ్చరించారు. తమ పరిధిలో ఎక్కడైనా వంట గ్యాస్ దుర్వినియోగం జరిగినట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అవసరమైతే మరిన్ని హోటళ్లు, వాణిజ్య సంస్థలపై కూడా దాడులు నిర్వహిస్తామని తెలిపారు. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, 1955 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హెల్ప్లైన్ నంబర్లు: హెచ్పీసీఎల్ (హెచ్పీ) హెల్ప్లైన్: 1800 233 3555 బీపీసీఎల్ (భారత్) హెల్ప్లైన్: 1800 224 344 ఐఓసీఎల్ (ఇండియన్) హెల్ప్లైన్: 1800 233 3555 కలెక్టర్ కార్యాలయం కంట్రోల్ రూమ్: 0891-2590102 -
పార్టీ పంథా
జన హితమేసాక్షి, విశాఖపట్నం: పార్టీ కోసం ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకూ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో గురువారం పార్టీ జిల్లా వలంటీర్ల విభాగం అధ్యక్షుడు పీలా ప్రేమ కిరణ్ జగదీష్ నిర్వహణలో వైఎస్సార్ సీపీ 16వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్సార్ సీపీ 15 వసంతాలు పూర్తి చేసుకుని 16వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా కేకే రాజు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సమన్వయకర్తలు మళ్ల విజయప్రసాద్, వాసుపల్లి గణేష్కుమార్, తిప్పల దేవన్రెడ్డి, మొల్లి అప్పారావు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు తదితరులతో కలిసి ఆయన వైఎస్సార్, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ 15 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో చారిత్రాత్మక విజయాలను సాధించిందని గుర్తుచేశారు. పార్టీ అభివృద్ధి కోసం శ్రమిస్తున్న నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజలకు సేవ చేయడంలో ప్రతి ఒక్కరూ అంకితభావంతో పని చేయాలని కోరారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అనేక అభివృద్ధి పనులు, ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పన, విద్యా సంస్థల నిర్మాణాలు నిలిచిపోయాయని విమర్శించారు. గత ప్రభుత్వం నిర్మించిన సచివాలయాలు, ఆర్బీకేలు నిర్వీర్యం అవుతున్నాయని, ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్పరం చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం బీచ్రోడ్లోని పార్క్ హోటల్ జంక్షన్ వద్ద తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న వైఎస్సార్ విగ్రహానికి గజమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, సీఈసీ సభ్యుడు కోలా గురువులు, పరిశీలకులు రొంగలి జగన్నాథం, బాణాల శ్రీనివాసరావు, ఎస్ఈసీ సభ్యులు డాక్టర్ జహీర్ అహ్మద్, పి.సతీష్ వర్మ, ఐ.హెచ్.ఫరూఖీ, పీలా వెంకట లక్ష్మి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, ముఖ్య నాయకులు బొల్లవరపు జాన్వెస్లీ, పేర్ల విజయ్ చంద్ర, జి.వి.రవిరాజు, పల్లా దుర్గారావు, గుడ్ల వెంకట రమణి రెడ్డి, దుప్పలపూడి శ్రీనివాసరావు, జి.వి.రామచంద్రరావు, ద్రోణంరాజు శ్రీవాస్తవ, సేనాపతి అప్పారావు, అంబటి నాగ శైలేష్, ముట్టి సునీల్ కుమార్, ఉరుకూటి చందు, దేవరకొండ మార్కండేయులు, సనపల రవీంద్ర భరత్, కె.కల్పన, కర్రి రామారెడ్డి, మారుతీ ప్రసాద్, బొండా ఉమా మహేశ్వరరావు, నీలి రవి, కొణతాల ఉమా మహేశ్వరరావు, ఎం.పట్నాయక్, సాయి, వేంపాడు శ్రీనివాస్ రెడ్డి, కటారి అనిల్ కుమార్, అల్లు శంకరరావు, నడింపల్లి కృష్ణ రాజు, అల్లంపల్లి రాజబాబు, ఆల్ఫా కృష్ణ, బాకీ శ్యాంకుమార్రెడ్డి, చిన్ని, రామ్ రాజు, బిపిన్ కుమార్ జైన్, వావిలపల్లి ప్రసాద్, రెయ్యి వెంకట రమణ, బర్కత్ అలీ, బల్లా శ్రీనివాస్, చొల్లంగి నాగేశ్వరరావు, యనమరెడ్డి కుమార్ రెడ్డి, మధుపాద రవి కుమార్, పి.గోవింద్, బి.రమణ రెడ్డి, బొడ్డేటి కిరణ్ కుమార్, డొప్ప శ్రీను, ఇంటి రవి కుమార్, లాలం వేణుగోపాల్, గోదేసి శ్రీనివాస్రెడ్డి, గుజ్జి ధీరజ్ కుమార్, బి.పద్మావతి, ఎస్.సుబ్బిరెడ్డి, కృపాజ్యోతి, రామన్న పాత్రుడు, చొక్కర శేఖర్, సత్తి మందారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
వంటింటికి యుద్ధ సెగ
సాక్షి, విశాఖపట్నం : సరిహద్దుల్లో యుద్ధ ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ.. ఆ ప్రభావం ఇప్పుడు సాధారణ ప్రజల వంటింటిపై పడుతోంది. జిల్లాలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల సరఫరా రోజురోజుకీ తగ్గుతూ ఉండటంతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. బుకింగ్ చేసిన 24 గంటల్లో రావాల్సిన సిలిండర్ కోసం ఇప్పుడు నాలుగు రోజుల నుంచి వారం రోజుల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజువారీ సరఫరాలో భారీ కోత విశాఖ జిల్లాలో మొత్తం 62 గ్యాస్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. వీటి పరిధిలో సుమారు 8.90 లక్షల గృహ కనెక్షన్లు ఉన్నాయి. సాధారణంగా రోజుకు 25 వేల నుంచి 28 వేల వరకు సిలిండర్లు వినియోగదారులకు డెలివరీ అవుతాయి. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సరఫరా తగ్గిపోవడంతో రోజుకు కేవలం 15 వేల నుంచి 18 వేల సిలిండర్లు మాత్రమే పంపిణీ అవుతున్నాయి. అంటే మొత్తం సరఫరాలో 30 నుంచి 40 శాతం వరకు కోత పడినట్లు తెలుస్తోంది. ముందస్తు బుకింగ్లతో పెరిగిన ఒత్తిడి అంతర్జాతీయంగా యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రమవుతాయనే భయంతో చాలామంది వినియోగదారులు ముందుగానే గ్యాస్ బుకింగ్లు చేస్తున్నారు. ఇదే సమయంలో బాట్లింగ్ ప్లాంట్ల వద్ద లోడింగ్ ప్రక్రియ నెమ్మదించడంతో ఏజెన్సీలకు సిలిండర్ స్టాక్ చేరడంలో ఆలస్యం అవుతోంది. దీంతో వెయిటింగ్ లిస్ట్ రోజురోజుకీ పెరుగుతూ, వినియోగదారులు సిలిండర్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. బ్లాక్ మార్కెట్ దందా? సంక్షోభ పరిస్థితిని కొన్ని గ్యాస్ ఏజెన్సీలు అవకాశంగా మార్చుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బుకింగ్ కోసం కాల్స్ చేస్తున్నా స్పందించడం లేదు. వినియోగదారులు నేరుగా ఏజెన్సీకి వస్తే అక్కడ సిబ్బంది స్టాక్ లేదనీ.. వచ్చినప్పుడు రావాలంటూ పంపించేస్తున్నారు. బ్లాక్లో అయినా ఇవ్వాలని అడిగితే.. పక్కకు పిలిచి రెట్టింపు ధరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. పౌర సరఫరాల శాఖ సిబ్బంది మాత్రం తమకేం సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. నిల్వలు ఇంకా ఎంతకాలం? అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం జిల్లాలోని బాట్లింగ్ ప్లాంట్లు, ఏజెన్సీల వద్ద ఉన్న గ్యాస్ నిల్వలు సుమారు 10 నుంచి 15 రోజుల వరకు సరిపోతాయి. యుద్ధ పరిస్థితులు మరింత కాలం కొనసాగితే మాత్రం సరఫరాలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కేంద్రం హామీ.. ప్రజల్లో మాత్రం భయం కేంద్ర ప్రభుత్వం గృహ అవసరాలకు సరిపడా గ్యాస్ సరఫరా జరుగుతుందని భరోసా ఇస్తున్నప్పటికీ ప్రజల్లో మాత్రం భయాందోళనలు తగ్గడం లేదు. పరిస్థితి త్వరగా సద్దుమణగకపోతే వంటింట్లో గ్యాస్ కొరత మరింత తీవ్రం అయ్యే అవకాశముందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మరణంలోనూ వీడని బంధం
గంట వ్యవధిలో కన్నుమూసిన దంపతులు మద్దిలపాలెం: భార్య మరణించిన గంట వ్యవధిలోనే భర్త కూడా కన్నుమూసిన హృదయవిదారక ఘటన శివాజీపాలెంలో చోటుచేసుకుంది. ఆంధ్ర యూనివర్సిటీలో హెడ్ కుక్గా రిటైర్ అయిన ఖాసీం, ఆయన భార్య తమ స్వగృహంలో గురువారం తుదిశ్వాస విడిచారు. స్థానికుల కథనం ప్రకారం.. ముందుగా ఖాసీం భార్య అనారోగ్యంతో కన్నుమూశారు. ప్రాణప్రదమైన భార్య ఇక లేదన్న వార్తను తట్టుకోలేక, తీవ్రమైన బెంగతో గంట వ్యవధిలోనే ఖాసీం కూడా మరణించారు. అందరితో ఎంతో ఆప్యాయంగా ఉండే ఈ దంపతుల మరణవార్త విని శివాజీపాలెం వాసులు కన్నీటిపర్యంతమయ్యారు. అనంతరం వీరిద్దరి అంత్యక్రియలు నిర్వహించారు. -
ఐటీ అభివృద్ధికి 60 రోజుల్లో మాస్టర్ ప్లాన్
ఐటీ కార్యదర్శి కాటమనేని భాస్కర్ మహారాణిపేట: విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్(వీఈఆర్) పరిధిలో ఐటీ పార్కుల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన కోసం ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందించాలని రాష్ట్ర ఐటీ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులు, నిప్పన్ కోయి కన్సల్టెంట్స్ ఏజెన్సీ ప్రతినిధులతో ఆయన సమావేశమై ఐటీ రంగ అభివృద్ధిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐటీ పార్కులు, డేటా సెంటర్లు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ఏర్పాటులో భాగంగా అంతర్జాతీయ ఐటీ కంపెనీలను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న ఐటీ క్లస్టర్లను విస్తరించడంతో పాటు, కొత్తగా అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలించాలన్నారు. పెట్టుబడులను ఆకర్షించడానికి అవసరమైన రోడ్డు కనెక్టివిటీ, కమర్షియల్ స్పేస్, ఎంటర్టైన్మెంట్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి సౌకర్యాలను మెరుగుపరచాలని చెప్పారు. వీఎంఆర్డీఏ, జీవీఎంసీ, నిప్పన్ కోయి ఏజెన్సీ ప్రతినిధులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పనిచేసి ప్రాక్టికల్ రిపోర్ట్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఈ ప్రాంతంలో భారీగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. అన్ని విభాగాలు సమన్వయంతో పని చేసి 60 రోజుల్లో ఐటీ అభివృద్ధికి సంబంధించిన పూర్తిస్థాయి మాస్టర్ప్లాన్ సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో జేసీ గొబ్బిళ్ల విద్యాధరి, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సింహాచలం, పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఆదిశేషు, జీవీఎంసీ ఏడీసీ వర్మ తదితరులు పాల్గొన్నారు. వీఈఆర్ పరిధిలోని ఇతర జిల్లాల జాయింట్ కలెక్టర్లు వర్చువల్ విధానంలో హాజరయ్యారు. -
ప్రైవేట్ బస్సు ఢీకొని మహిళ దుర్మరణం
ఎంవీపీకాలనీ: రవిరాజ్ ట్రావెల్స్కు చెందిన బస్సు ఢీకొని మారుపల్లి పోలమ్మ (52) అనే మహిళ మృతి చెందింది. ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలివి. జీవీఎంసీ 19వ వార్డు శివగణేష్ నగర్లో నివాసముంటున్న పోలమ్మ, లాసన్స్ బే కాలనీలో ఇళ్లలో పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో పని ముగించుకుని తిరిగి ఇంటికి వస్తోంది. అదే సమయంలో లాసన్స్ బే కాలనీ సచివాలయం వద్ద బస్సు డ్రైవర్ యర్రపత్తి రాంబాబు అజాగ్రత్తగా బస్సును రివర్స్ చేశాడు. ఈ క్రమంలో వెనుకనే ఉన్న పోలమ్మను గమనించకుండా ఢీకొట్టడంతో ఆమె కిందపడిపోయింది. బస్సు చక్రాలు ఆమైపె నుంచి వెళ్లడంతో పోలమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. మృతురాలి కుమారుడు మారుపల్లి ధనరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోజుకు పెరిగింది రూ.300లేనా?
మద్దిలపాలెం: ఏయూ అతిథి అధ్యాపకుల నిరసన దీక్షలు గురువారం నాటికి 26వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా అతిథి అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఎం.సురేష్ మీనన్ మాట్లాడుతూ.. అతిథి అధ్యాపకుల వేతనాలను రూ. 45 వేల నుంచి రూ. 54 వేల వరకు, అలాగే ప్రయోగశాల నిర్వహణకు రూ. 24,000 కు పెంచుతూ ఏయూ అధికారులు జారీ చేసిన ఉత్తర్వుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పెంపు వల్ల రోజుకు కేవలం రూ. 300 మాత్రమే అదనంగా వస్తుందని, ఇది చాలా అరకొర పెంపు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది కూడా మళ్లీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని అధికారులు పేర్కొనడం అతిథి అధ్యాపకులను భయభ్రాంతులకు గురిచేసేలా ఉందన్నారు. గతంలో ఫైన్మెన్ కమిటీ ఆధ్వర్యంలో వీడియో రికార్డింగ్తో ఎంపికై న తమకు, వచ్చే ఏడాది మళ్లీ ఇంటర్వ్యూలు నిర్వహించడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. కొత్త నోటిఫికేషన్ విడుదలను అతిథి అధ్యాపకుల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, కేవలం పనితీరు సమీక్షకు మాత్రమే అంగీకరిస్తామని ఆయన స్పష్టం చేశారు. తమకు క్రమం తప్పకుండా నెలవారీ వేతనాలు చెల్లించి, డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి.. ఇలాంటి అనాలోచిత ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. నిరసనలో డాక్టర్ శేషు ప్రసాద్, కోమలి, చందన, రజిని, ప్రియాంక, రమ్య, సునీత, త్రినాథ్ దాస్, శిరీష్, విక్రమ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
పన్ను పోటు.. లేదంటే వేటు!
మహారాణిపేట: ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో జిల్లాలోని సచివాలయ సిబ్బందిపై పన్నుల వసూళ్ల భారం అమాంతం పెరిగింది. అటు జీవీఎంసీ పరిధిలోనూ, ఇటు గ్రామ పంచాయతీల్లోనూ వంద శాతం పన్నుల వసూళ్లే లక్ష్యంగా ప్రభుత్వం సిబ్బందిని పరుగులు పెట్టిస్తోంది. మార్చి 31లోగా నిర్దేశించిన టార్గెట్లను పూర్తి చేయాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరిస్తుండటంతో సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా స్థానిక సంస్థల ఆదాయంపైనే చంద్రబాబు ప్రభుత్వం ఆధారపడుతోంది. ఇందులో భాగంగా ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను, నీటి పన్నులతో పాటు ఇతర బకాయిల వసూళ్లకు ప్రాధాన్యమిస్తోంది. పట్టణ, పురపాలన, పంచాయతీరాజ్ కమిషనర్ల నుంచి నిరంతరం ఒత్తిడి వస్తుండటంతో స్థానిక అధికారులు వార్డు/గ్రామ కార్యదర్శులకు తీరిక లేకుండా ఉరుకులు పెట్టిస్తున్నారు. పన్నులు చెల్లించని వారికి నోటీసులు జారీ చేయడం, అవసరమైతే ఇళ్లను సీజ్ చేయడం వంటి కఠిన చర్యలకు సిబ్బంది ఉపక్రమిస్తున్నారు. నిత్యం ఉదయం, సాయంత్రం సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ, గంట గంటకూ గూగుల్ షీట్లలో ప్రోగ్రెస్ అప్డేట్ చేయాలని ఆదేశిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 607 సచివాలయాలు (జీవీఎంసీలో 551, గ్రామీణంలో 56) ఉన్నాయి. వీటిలో 12 కేటగిరీలకు చెందిన 3,860 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులు, వార్డు పరిపాలన కార్యదర్శులపై పన్ను వసూళ్ల ఒత్తిడి ఎక్కువగా ఉంది. జాబ్ చార్ట్కు మించి పనిభారం కేవలం పన్నుల వసూళ్లే కాకుండా, తమ విధులకు సంబంధం లేని ఇతర పనుల వల్ల సచివాలయ సిబ్బంది మానసిక క్షోభకు గురవుతున్నారు. విజన్ 2047 సర్వే, 100 రోజుల హౌస్ హోల్డ్ సర్వే, జియో ట్యాగింగ్, ఓడీఎఫ్ సర్వే కింద బాత్రూమ్ ఫొటోలు తీయడం వంటి పనులతో సిబ్బంది సతమతమవుతున్నారు. నెల మొదట్లో తెల్లవారుజామున 5 గంటల నుంచే పెన్షన్ల పంపిణీ, రోజూ పారిశుధ్య పర్యవేక్షణతో ప్రారంభమయ్యే వీరి విధులు, రాత్రి పొద్దుపోయే వరకు పన్నుల వసూళ్ల సమీక్షలతో ముగుస్తున్నాయి. ‘ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయకపోతే మెమోలు ఇస్తున్నారు. పరుష పదజాలంతో దూషిస్తున్నారు. జాబ్ చార్ట్లో లేని పనులను కూడా మాపై రుద్దుతున్నారు’ అని పలువురు కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వెల్ఫేర్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకు కూడా బ్యాంకు ఖాతాల అనుసంధానం, స్కూల్ బాత్రూమ్ ఫొటోల అప్లోడింగ్ వంటి టార్గెట్లు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. పని ఒత్తిడితో ఆరోగ్యం దెబ్బతింటోందని, మానసిక వేదన అనుభవిస్తున్నామని సిబ్బంది వాపోతున్నారు. పన్నుల వసూళ్లలో సచివాలయ ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి స్థానిక సంస్థల ఖజానా నింపుకోవడానికి సిబ్బందిపై భారం టార్గెట్ చేరుకోకపోతే వేటు తప్పదని హెచ్చరికలు -
మహిళలకు ఆర్థిక స్వావలంబన అవసరం
మహారాణిపేట: విశాఖపట్నం పోర్ట్ అథారిటీ (వీపీఏ) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురువారం సాగర్మాల కన్వెన్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గిరిజన సహకార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.ఎస్.శోభిక ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పోర్ట్ చైర్మన్ ఎం.అంగముత్తు మాట్లాడుతూ మహిళా విభాగం చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు. సంస్థ అభివృద్ధిలో మహిళా ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని, సంస్థకు మరిన్ని విజయాలు అందించాలని కోరారు. డిప్యూటీ చైర్పర్సన్ కె.రోష్ని అపరంజి మాట్లాడుతూ మహిళలకు ఆర్థిక స్వావలంబన ఎంతో అవసరమని పేర్కొన్నారు. మహిళలు కేవలం సంపాదించడమే కాకుండా, తమ ఆదాయాన్ని పొదుపు చేస్తూ సరైన పద్ధతుల్లో పెట్టుబడి పెట్టే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పోర్ట్ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. వీపీఏ చీఫ్ మెడికల్ ఆఫీసర్, మహిళా విభాగం కన్వీనర్ డాక్టర్ ఉషా దేవి నేతృత్వంలో వివిధ శాఖల అధికారులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన పోర్ట్ కార్యదర్శి ఎం.శంకర్ బాబు బృందాన్ని డిప్యూటీ చైర్పర్సన్ అభినందించారు. పోర్ట్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ టి.అరుణ్ ప్రసాద్, కలెక్టర్ సతీమణి, ప్రముఖ న్యాయవాది దివ్య హరేందిరప్రసాద్, విద్యావేత్త లక్ష్మీ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. -
నకిలీ కరెన్సీ చెలామణి చేస్తున్న 10 మంది అరెస్ట్
అల్లిపురం: నగరంలోని ఓ హోటల్ తిష్ట వేసి నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న 10 మందిని మహారాణిపేట పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి రూ.37,32,000 నకిలీ రూ.2వేల నోట్లు, రూ.3 లక్షల 18 వేల ఒరిజినల్ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్ ఏసీపీ కె.లక్ష్మణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. మహారాణిపేట ఇన్స్పెక్టర్ జి.దివాకర్ యాదవ్కి అందిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్సు సిబ్బందితో కలిసి మంగళవారం రాత్రి జగదాంబ నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్లే రోడ్డులో వాహన తనిఖీలు చేపట్టారు. కారుతో పాటు ముగ్గురు వ్యక్తులను, రూ.37,32,000 విలువ గల రూ.2వేలు నకిలీ కరెన్సీ నోట్లు, రూ.3,18,000 విలువ కలిగిన ఒరిజినల్ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు సంఘం శరత్ థియేటర్ వెనుక ఉన్న ఓ లాడ్జిలో ఉన్న మిగతా ఏడుగురు సభ్యులతో పాటు రూ.38,000 విలువ గల రూ.500 నకిలీ కరెన్సీ నోట్లు, రూ.16,500 విలువ కలిగిన ఒరిజినల్ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై 180,318(4), 62, 3(5) బీఎన్ఎస్ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. రూ.37,32,000 నకిలీ కరెన్సీ, రూ.3,18,000 నగదు స్వాధీనం -
బ్లాక్ మార్కెట్ దందా
సిలిండర్ల కొరతను ఆసరాగా చేసుకుని కొన్ని చోట్ల గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారిక ధర కంటే వేల రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నా సివిల్ సప్లయ్ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. కొందరు సిబ్బంది ఈ అక్రమ దందాను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వ్యాపారం కొనసాగించడానికి తప్పని పరిస్థితుల్లో హోటల్ యజమానులు అధిక ధరలకు సిలిండర్లు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఫలితంగా హోటల్ ఖర్చులు పెరిగి ఆ భారం చివరికి వినియోగదారులపై పడుతోంది. ఇప్పటికే కొన్ని హోటళ్లలో తినుబండారాల ధరలు పెంచడం ప్రారంభించారు. -
నగరంలో 206 మంది ట్రాఫిక్ సోల్జర్స్
అల్లిపురం: నగరంలో ట్రాఫిక్ నియంత్రణతో పాటు రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీసు–ప్రజల సమన్వయంతో ‘ట్రాఫిక్ సోల్జర్స్’ అనే వినూత్న కార్యక్రమాన్ని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ప్రారంభించారు. బుధవారం పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో 206 మంది ట్రాఫిక్ సోల్జర్స్తో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని ప్రధాన జంక్షన్లు, పాఠశాలల సమీపం, మార్కెట్లు, ఆసుపత్రులు వంటి రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ సోల్జర్స్ ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులకు సహకరిస్తారని తెలిపారు. ముఖ్య కూడళ్ల వద్ద పాదచారులు, వృద్ధులు, మహిళలు, చిన్నారులు సురక్షితంగా రోడ్లు దాటేందుకు వీరు సహాయపడతారన్నారు. అదేవిధంగా వాహనదారులకు హెల్మెట్లు, సీట్బెల్ట్లు తప్పనిసరిగా వినియోగించాలనే విషయంపై అవగాహన కల్పించడం, వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ ఉపయోగించవద్దని సూచించడం వంటి బాధ్యతలను కూడా నిర్వర్తిస్తారని చెప్పారు. పండగలు, ర్యాలీలు, వీఐపీల రాక సందర్భంగా ట్రాఫిక్ను సమర్థవంతంగా నిర్వహించడంలో వీరు పోలీసులకు తోడ్పడతారన్నారు. సిగ్నల్ జంప్, రాంగ్ పార్కింగ్, రాష్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందించడంలో సహకరించడంతో పాటు అత్యవసర సేవల కోసం సంబంధిత ఎమర్జెన్సీ నంబర్లకు సమాచారం ఇవ్వడం కూడా వీరి బాధ్యతగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ అదనపు డీసీపీ ఓ.ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ ఏసీపీ వాసుదేవ్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
గ్యాస్ గండం
ఆరిపోతున్న పొయ్యిలు అల్లాడుతున్న హోటల్ పరిశ్రమ! గురువారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2026యుద్ధం వాతావరణంతో వాణిజ్య సిలిండర్ల కొరత జిల్లాలో నెలకు 70 వేల కమర్షియల్ సిలిండర్లు అవసరం ప్రస్తుతం 12 వేల సిలిండర్లే సరఫరా గ్యాస్ సిలిండర్ల కోసం హోటల్ యజమానుల తిప్పలు జంబ్లింగ్ పద్ధతిలో సిలిండర్లు సరఫరా చేయాలని అసోసియేషన్ విజ్ఞప్తి సాక్షి, విశాఖపట్నం : వేకువజామున నగర వీధుల్లో వినిపించే గరిటెల చప్పుళ్లు, హోటళ్ల నుంచి వచ్చే ఆ ఘుమఘుమల వాసనలు ఇక తగ్గిపోతాయేమో అన్న ఆందోళన నెలకొంది. దేశ సరిహద్దుల్లో కమ్ముకున్న యుద్ధ మేఘాల ప్రభావం ఇప్పుడు విశాఖ హోటల్ పరిశ్రమపై పడుతోంది. అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా సప్లయ్ చైన్ దెబ్బతినడంతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రమైంది. నిత్యం మంటలు ఎగిసే హోటల్ పొయ్యిలు ఇప్పుడు ఆరిపోతున్నాయి. ఇది కేవలం గ్యాస్ కొరత సమస్య మాత్రమే కాదు... వేలాది మంది ఉపాధి, లక్షలాది మంది ఆకలి సమస్యగా మారే పరిస్థితి కనిపిస్తోంది. పాత స్టాక్ పూర్తిగా అయిపోవడంతో గురువారం నుంచి కమర్షియల్ సిలిండర్లు సరఫరా చేయలేమని డిస్ట్రిబ్యూటర్లు ప్రకటించడంతో హోటల్ యజమానులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. డిమాండ్కు సరిపోని సరఫరా జిల్లా వ్యాప్తంగా హోటల్, రెస్టారెంట్ రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సాధారణ పరిస్థితుల్లో జిల్లాలోని హోటళ్లకు ప్రతి రోజు సుమారు 5 వేల సిలిండర్లు, నెలకు దాదాపు 1.5 లక్షల కమర్షియల్ సిలిండర్లు అవసరం. అయితే ప్రస్తుతం సరఫరా 20 శాతం కూడా లేని పరిస్థితి నెలకొంది. రెండు రోజుల క్రితం వరకు కొంతమేర సరఫరా జరిగినా, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఒక్క సిలిండర్ కూడా లేని పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ కోసం హోటల్ యజమానులు ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నా... పొయ్యి ముట్టించలేని పరిస్థితి నెలకొంది. ‘జంబ్లింగ్ పద్ధతి’ అమలు చేయాలి ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడేందుకు హోటల్ అసోసియేషన్ ప్రభుత్వం ముందుకు కీలక ప్రతిపాదన తీసుకువచ్చింది. అందరికీ సమానంగా గ్యాస్ అందేలా ‘జంబ్లింగ్ పద్ధతి’ అమలు చేయాలని కోరుతోంది. రోజు విడిచి రోజు హోటళ్లకు సిలిండర్లు సరఫరా చేస్తే చిన్న, మధ్య తరహా హోటళ్లు కనీసం మనుగడ సాగించగలవని అసోసియేషన్ ప్రతినిధులు జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యపై వెంటనే స్పందించకపోతే వందలాది హోటళ్లు మూతపడే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. కమర్షియల్ గ్యాస్ సరఫరా పునరుద్ధరించాలి గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా కమర్షియల్ గ్యాస్ సరఫరాపై ఆంక్షలు విధించడం హోటల్ పరిశ్రమకు తీవ్ర దెబ్బ. జిల్లాలోని వేలాది హోటళ్లు, ముఖ్యంగా రోడ్డు పక్కన ఉన్న చిన్న వ్యాపారులు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. గ్యాస్ సరఫరా నిలిచిపోతే వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతారు. అలాగే ఆహార పదార్థాల ధరలు పెరిగి సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి కమర్షియల్ గ్యాస్ సరఫరాను తక్షణం పునరుద్ధరించాలి లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. – జి.బాలకృష్ణ, విశాఖ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడుపర్యాటక నగరానికి పెద్ద దెబ్బ విశాఖపట్నం పర్యాటక నగరంగా దేశవ్యాప్తంగా పేరు పొందింది. ప్రతిరోజూ వేలాది మంది పర్యాటకులు, వ్యాపార అవసరాలతో వచ్చే ఇతర జిల్లాల ప్రజలతో నగరం కిటకిటలాడుతుంది. జిల్లాలో సుమారు 1000 నుంచి 1500 వరకు చిన్నా పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు పనిచేస్తూ వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం ఇప్పుడు ఈ రంగంపై పడుతోంది. భారతదేశం ఇంధన అవసరాల కోసం ప్రధానంగా మధ్యప్రాచ్య దేశాలపై ఆధారపడుతుంది. ఇరాన్ పరిసర ప్రాంతాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ముడి చమురు, సహజ వాయువు దిగుమతుల్లో ఆటంకాలు ఏర్పడ్డాయి. సముద్ర మార్గాల్లో నౌకల రాకపోకలు మందగించడం, ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెరగడం వంటి కారణాలతో గ్యాస్ సరఫరా తగ్గింది. విశాఖపట్నం పోర్టు ద్వారా జరిగే దిగుమతుల్లో జాప్యం ఏర్పడటంతో స్థానిక గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్లు పూర్తిస్థాయిలో పనిచేయలేకపోతున్నాయి. దీని ప్రభావం నేరుగా కమర్షియల్ సిలిండర్ల పంపిణీపై పడింది. మూతపడే దిశగా హోటళ్లు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల పంపిణీపై కేంద్రం ఆంక్షలు విధించడంతో అనేక ఏజెన్సీలు ‘నో స్టాక్’ బోర్డులు పెట్టాయి. గురువారం నుంచి కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిపివేయాల్సి వస్తుందని ప్రకటించాయి. దీంతో కేవలం హోటల్ వ్యాపారమే కాదు, ఈ రంగంపై ఆధారపడి జీవించే వేలాది మంది కార్మికుల ఉపాధి కూడా ప్రమాదంలో పడింది. ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరిగిన నేపథ్యంలో గ్యాస్ కొరత పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. కొన్ని హోటళ్ల వద్ద రెండు మూడు సిలిండర్లు మాత్రమే నిల్వ ఉండటంతో ఒకటి రెండు రోజులు మాత్రమే వ్యాపారం కొనసాగించగలమని యజమానులు చెబుతున్నారు. ఆ తర్వాత తామూ షట్టర్లు మూసివేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రూ.22.47 కోట్లు
సైబర్ బాధితులకు తిరిగి అందజేసిన నగదుఅల్లిపురం: సైబర్ నేరగాళ్ల బారిన పడి తమ కష్టార్జితాన్ని పోగొట్టుకున్న బాధితులకు నగర పోలీసులు భారీ ఊరటనిచ్చారు. చట్టపరమైన ప్రక్రియ ద్వారా రికార్డు స్థాయిలో నగదును రికవరీ చేసి, బాధితులకు తిరిగి అందజేశారు. బుధవారం పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఈ వివరాలను వెల్లడించారు. వివిధ సైబర్ మోసాలకు గురైన 1,240 మంది బాధితులకు సంబంధించి, నేరగాళ్ల ఖాతాల్లో హోల్డ్, ఫ్రీజ్ అయిన రూ.22,47,54,369 నగదును తిరిగి బాధితులకు అందజేసినట్లు సీపీ ప్రకటించారు. రాష్ట్రంలోనే ఇంత పెద్ద మొత్తంలో సైబర్ బాధితులకు నష్టపరిహారం అందించడం ఒక చారిత్రాత్మక మైలురాయి అని ఆయన పేర్కొన్నారు. సైబర్ నేరాలపై ఫిర్యాదు అందగానే తక్షణమే స్పందించడం, బ్యాంకులు, సంబంధిత ఆర్థిక సంస్థలతో నిరంతరం సమన్వయం సాధించడం వల్లనే ఈ నగదును తిరిగి రాబట్టడం సాధ్యమైందని వివరించారు. కేసుల దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు మొత్తం 558 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ కేసులకు సంబంధించి 470 మంది, సోషల్ మీడియా సంబంధిత కేసుల్లో 88 మంది ఉన్నట్లు సీపీ తెలిపారు. ముఖ్యంగా వేధింపులకు గురి చేస్తున్న ఇన్స్టెంట్ లోన్ యాప్లపై కఠిన చర్యలు తీసుకున్నామని, ఈ క్రమంలో సుమారు రూ.60 లక్షల విలువైన క్రిప్టో కరెన్సీని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు అందులోని రూ.57.24 లక్షల మొత్తాన్ని 126 మంది బాధితులకు చెక్కుల రూపంలో పంపిణీ చేసినట్లు వెల్లడించారు. -
గంగవరం పోర్టులో డిజిటల్ గేట్లు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: దేశంలోనే తొలిసారిగా కార్గో నిర్వహణ, ట్రక్కుల రాకపోకలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత డిజిటల్ స్మార్ట్ గేట్ల ద్వారా నిర్వహించే వ్యవస్థను అదానీ గంగవరం పోర్టు అమల్లోకి తీసుకొచ్చింది. పూర్తిగా ఆటోమేటెడ్ విధానంలో పనిచేసే ఈ డిజిటల్ గేట్ల ద్వారా పోర్టులోకి ట్రక్కుల రాకపోకలతో పాటు వే–బ్రిడ్జ్, పార్కింగ్ ప్రాంతాల నిర్వహణ కూడా మరింత సులభతరం కానుంది. విమానాశ్రయాల్లో అమలులో ఉన్న డిజి యాత్ర తరహాలోనే పోర్టులో ట్రక్కుల రాకపోకలను నిర్వహించే విధంగా ఈ సిస్టమ్ను రూపొందించినట్లు అదానీ గంగవరం పోర్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమిత్ మాలిక్ తెలిపారు. ఈ డిజిటల్ గేట్లను కస్టమ్స్ అండ్ సీజీఎస్టీ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్. శ్రీధర్ ప్రారంభించారు. సాధారణంగా విమానాశ్రయాల్లో ప్రయాణికులు ముందుగానే డిజి యాత్ర యాప్లో తమ వివరాలను నమోదు చేసుకుంటారు. అనంతరం విమానాశ్రయ ప్రవేశ ద్వారం వద్ద ముఖ గుర్తింపు (ఫేస్ రికగ్నిషన్) ద్వారా స్కాన్ చేసి క్యూలు లేకుండా వేగంగా లోనికి వెళ్లే అవకాశం కలుగుతుంది. ఇదే విధానాన్ని గంగవరం పోర్టులోనూ అమలు చేసినట్లు సీఈఓ వివరించారు. పోర్టులోకి వచ్చే ట్రక్కుల వివరాలను ముందుగానే యాప్లో నమోదు చేయడం ద్వారా వాహనాలు పోర్టు గేట్ల వద్ద నిలిచిపోకుండా నేరుగా ప్రవేశించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆటోమేటిక్ గేట్ క్లియరెన్స్, టైమ్ ట్రాకింగ్ వ్యవస్థల ద్వారా ట్రక్కుల రాకపోకలు సాఫీగా సాగుతాయని చెప్పారు. దీంతో పోర్టు పరిధిలో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు కార్గో నిర్వహణ వేగవంతం అవుతుందని పేర్కొన్నారు. ఐరన్ ఓర్ బ్లెండింగ్ యూనిట్ ఏర్పాటు గంగవరం పోర్టులో అత్యాధునిక ఐరన్ ఓర్ బ్లెండింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి పోర్టు యాజమాన్యం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఎన్ఎండీసీతో పాటు బ్రెజిల్కు చెందిన వాలె ఎస్.ఏ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు పోర్టు సీఈఓ అమిత్ మాలిక్ వెల్లడించారు. పోర్టు పరిసరాల్లో ఉన్న సుమారు 1,850 ఎకరాల ఖాళీ భూమిని ఈ ప్రాజెక్టు కోసం వినియోగించనున్నట్లు తెలిపారు. ఈ యూనిట్ ఏర్పాటు కోసం ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పెట్టుబడి మొత్తం, ప్రాజెక్టు విస్తీర్ణం వంటి పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) సిద్ధమైన తర్వాత 24 నుంచి 30 నెలల్లో యూనిట్ పూర్తవుతుందని ఆయన తెలిపారు. పోర్టు సామర్థ్యం పెంపు ప్రస్తుతం గంగవరం పోర్టు సామర్థ్యం 40 మిలియన్ మెట్రిక్ టన్నులు (ఎంఎంటీ)గా ఉండగా, దాన్ని 75 ఎంఎంటీలకు పెంచే ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు అమిత్ మాలిక్ చెప్పారు. రానున్న ఐదేళ్లలో ఈ లక్ష్యాన్ని సాధించాలని యాజమాన్యం భావిస్తోంది. ఐరన్ ఓర్ బ్లెండింగ్ యూనిట్ ఏర్పాటుతో పోర్టు పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకునే అవకాశం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. -
యుద్ధ ఉద్రిక్తతల వేళ క్షిపణి పరీక్ష!
సాక్షి, విశాఖపట్నం: ఓవైపు యుద్ధ వాతావరణంతో అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్ క్షిపణి ప్రయోగానికి సిద్ధమవుతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. క్షణక్షణం ఉత్కంఠతో అన్ని దేశాలు పరిస్థితులను అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు తమ వ్యూహాలకు పదునుపెడుతున్న తరుణంలో భారత్ నోటమ్ జారీ చేసింది. విశాఖపట్నం తీరంలో సముద్రంలో ప్రయోగించనున్న క్షిపణి పరీక్ష కోసం ప్రమాద ప్రాంతాన్ని విస్తరిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా మరోసారి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటీస్ టు ఎయిర్మెన్ (నోటమ్) ప్రకారం, ఈ మిసైల్ టెస్టింగ్ ఈ నెల 13 నుంచి 16 వరకూ జరగనుందని స్పష్టం చేసింది.నోటమ్ అంటే..ఇందుకోసం విశాఖపట్నం తీరానికి 500 కిలోమీటర్ల తర్వాత ఉన్న ప్రాంతాన్ని డేంజర్ జోన్గా డిక్లేర్ చేశారు. విమాన కార్యకలాపాలు, సముద్ర భద్రతను ప్రభావితం చేసేందుకు యుద్ధ నౌకలు, జలాంతర్గాములను అప్రమత్తం చేసేందుకు ఈ డేంజర్ జోన్ని ప్రకటించారు. దీని ఆధారంగా పైలెట్లు, విమానయాన సంస్థలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు నోటమ్ ద్వారా అధికారిక నోటిఫికేషన్ని అందజేయనున్నారు. విమాన ప్రయాణానికి ఆటంకం కలిగించే మార్పులు లేదా ప్రమాదాల గురించి పైలెట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, విమానయాన సిబ్బందికి ముందుగానే ఇచ్చే హెచ్చరిక ప్రకటననే ‘నోటమ్’ అని పిలుస్తారు. ఈ డేంజర్ జోన్ ప్రకటన ఉన్నంత వరకూ ఆ పరిధిలో పౌర, యుద్ధ విమానాలు ఎగరనీయకుండా దారి మళ్లిస్తారు. 13 నుంచి 16వ తేదీ మధ్యలో ఎప్పుడైనా ఈ క్షిపణి పరీక్ష ఉండే అవకాశం ఉందని భారత రక్షణ వర్గాలు సమాచారం. ఇటీవల కాలంలో విశాఖలో అత్యంత శక్తిమంతమైన అణ్వాయుధ సామర్థ్యం ఉన్న కే – 4 బాలిస్టిక్ మిసైల్ టెస్టింగ్ని ఐఎన్ఎస్ అరిఘాత్ సబ్మెరైన్ నుంచి భారత్ విజయవంతంగా పూర్తి చేసి ప్రపంచ దేశాలకు సవాల్ విసిరింది. ఈసారి ఏ క్షిపణిని పరీక్షిస్తారనేది రక్షణ వర్గాలు గోప్యంగా ఉంచాయి. యుద్ధ వాతావరణ సమయంలో భారత్ చేస్తున్న క్షిపణి ప్రయోగంపై అన్ని దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. -
’మూడో బిడ్డ’ ముచ్చట దేనికి? ఉన్నవారికే దిక్కులేదు!
అక్షరానికి అభయం ఎక్కడ? పేదోడి చదువుకు భరోసా ఏది? కూటమి సర్కార్ కొలువుదీరిన వేళ.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల సెగ విద్యార్థుల భవిష్యత్తును దహించివేస్తోంది. అటు పాలకుల నిర్లక్ష్యం.. ఇటు యాజమాన్యాల మొండివైఖరి మధ్య సామాన్యుడి కలలు కల్లలవుతున్నాయి. సొంత పార్టీ ఎంపీ కాలేజీలోనే విద్యార్థులను గెంటేస్తుంటే, ’మన ప్రభుత్వం’ అని నమ్మిన జనసేనాని అభిమానులే ఇప్పుడు సోషల్ మీడియా సాక్షిగా పాలకుల వైఫల్యాలను ఎండగడుతున్నారు. ’ముగ్గురు పిల్లల ముచ్చట పక్కన పెట్టండి.. ఉన్న ఇద్దరి చదువుల సంగతి చూడండి’ అంటూ ఒక తండ్రి వెళ్లగక్కిన ఆవేదన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా దావానలంలా మారుతోంది.విశాఖ సిటీ: చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తోంది. ఎన్నికల ముందు చదువుల తల్లికి అండగా ఉంటామని చెప్పిన పాలకులు, ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను గాలికి వదిలేయడంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులపై ప్రతాపం చూపుతున్నాయి. తాజాగా విశాఖలోని దువ్వాడలో ఉన్న విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. సొంత పార్టీ ఎంపీ కాలేజీలోనే వేధింపులా? నరసరావుపేట టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు చెందిన ఈ కాలేజీలో, ప్రభుత్వం నుంచి రావాల్సిన మొదటి ఏడాది ఫీజు బకాయిలు రాలేదన్న సాకుతో విద్యార్థులను తరగతి గదుల నుంచి బయటకు పంపిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తన బిడ్డను క్లాసులో నుంచి పంపించేశారని, ఇది ఎంతవరకు ధర్మమని పాయకరావుపేటకు చెందిన ఒక సామాన్య కాపు సామాజికవర్గ నాయకుడు, పవన్ కల్యాణ్ అభిమాని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ’మూడో బిడ్డ’ ముచ్చట దేనికి? ఉన్నవారికే దిక్కులేదు! ప్రభుత్వం ప్రకటించిన ’మూడో బిడ్డకు రూ. 25 వేల ప్రోత్సాహం’ పథకంపై సదరు తండ్రి ఎద్దేవా చేశారు. ‘మొదటి దానికి మొగుడు లేడు.. కొసదానికి కల్యాణం అన్నట్లుంది మీ తీరు‘ అంటూ ఘాటుగా విమర్శించారు. ఉన్న ఇద్దరు పిల్లల చదువులకే దిక్కులేదని, మీ మాటలు నమ్మి మూడో బిడ్డను కంటే రోడ్డున పడటం ఖాయమని మండిపడ్డారు. రూ. 1750 కోట్లతో విగ్రహాలు పెట్టడం కంటే, ఆ నిధులను విద్యార్థుల ఫీజుల కోసం ఖర్చు చేస్తే ఎందరో పేదల భవిష్యత్తు నిలబడుతుందని ఆయన హితవు పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రుల ఆందోళన ఈ ఒక్క కాలేజీలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రైవేట్ విద్యాసంస్థలు పరీక్షా హాల్ టికెట్లు ఇవ్వకుండా, అటెండెన్స్ వేయకుండా విద్యార్థులను వేధిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయిలు విడుదల చేయకపోతే, వేల సంఖ్యలో విద్యార్థులు చదువుకు దూరం కావాల్సి వస్తుందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒక అభిమానిగా ప్రారంభమైన ఈ పోస్ట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై ఒక ప్రజా నిరసనగా మారుతోంది. వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో వైరల్గా అవుతోంది.పవన్ కల్యాణ్కు సూటి ప్రశ్న జనసేనాని పవన్ కల్యాణ్ను ఉద్దేశించి సదరు తండ్రి చేసిన వ్యాఖ్యలు బాణాల్లా తగులుతున్నాయి. ‘అయ్యా పవన్ కల్యాణ్ గారూ.. రెండేళ్లుగా టీడీపీతో సావాసం చేస్తున్నారు, కానీ క్షేత్రస్థాయిలో సామాన్యుల కష్టాలు మీకు పట్టడం లేదు. ఎంపీలకు చెందిన కాలేజీలే ఇలా విద్యార్థులను గెంటేస్తుంటే, ఇక మా పిల్లల చదువులకు భరోసా ఎక్కడ?‘ అని ఆయన నిలదీశారు. గాలి మాటలు చెప్పడం మానేసి, విద్యార్థుల జీవితాలు నాశనం కాకుండా చూడండి’ అని డిమాండ్ చేశారు. -
మైలురాయిని ఢీకొని యువకుడి దుర్మరణం
కూర్మన్నపాలెం: అగనంపూడి సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. శనివాడ గ్రామానికి చెందిన బలిరెడ్డి కిశోర్(24) తన బైక్తో మైలురాయిని ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. దువ్వాడ పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. వ్యాన్ నడుపుతూ జీవనం సాగిస్తున్న కిశోర్, తన తల్లితో కలిసి శనివాడలో నివాసముంటున్నాడు. పని నిమిత్తం తన మోటార్ బైక్పై గాజువాక వెళ్లిన ఆయన, తిరిగి ఇంటికి వస్తుండగా టోల్గేట్ సమీపంలో చీకటి కారణంగా రహదారి పక్కనే ఉన్న మైలురాయిని బలంగా ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కిశోర్ అక్కడికక్కడే మరణించాడు. కిశోర్ తండ్రి పైడిరాజు కొన్నాళ్ల కిందట మరణించారు. అప్పటి నుంచి కిశోర్ తన తల్లికి తోడుగా ఉంటున్నాడు. ఇప్పుడు కిశోర్ కూడా మరణించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. సీఐ కె.మల్లేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్లో ఏఎంసీ సత్తా
మహారాణిపేట: రాష్ట్రస్థాయి వైద్య కళాశాలల అథ్లెటిక్స్ పోటీల్లో ఆంధ్ర మెడికల్ కాలేజీ(ఏఎంసీ) ప్రభంజనం సృష్టించింది. క్రీడా మైదానంలో తమ సత్తా చాటుతూ వరుసగా 16వ సారి ఓవరాల్ చాంపియన్షిప్ను కై వసం చేసుకుని రికార్డు నెలకొల్పింది. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో ఏపీ రాష్ట్రస్థాయి మెడికల్, డెంటల్ కాలేజీల అథ్లెటిక్స్ మీట్ 2025–26’ ఘనంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 40 జట్లు పాల్గొన్న ఈ టోర్నమెంట్లో ఏఎంసీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి అగ్రస్థానంలో నిలిచారు. పురుషుల జట్టు 66 పాయింట్లు సాధించి మెన్ ఓవరాల్ చాంపియన్షిప్ను సొంతం చేసుకుంది. మహిళల జట్టు 48 పాయింట్లు సాధించి వుమెన్ ఓవరాల్ చాంపియన్షిప్ను కై వసం చేసుకుంది. మొత్తం 114 పాయింట్లతో పురుషుల, మహిళల విభాగాల్లో ఉమ్మడిగా ఆంధ్ర మెడికల్ కాలేజీ విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవి మాట్లాడుతూ వరుసగా 16వ సారి ఓవరాల్ చాంపియన్షిప్ను గెలుచుకోవడం ఒక గొప్ప రికార్డు అని హర్షం వ్యక్తం చేశారు. పురుషుల జట్టు కెప్టెన్ జి. నేతాజీ, మహిళల జట్టు కెప్టెన్ వై. తోషిత, ఇతర జట్టు సభ్యుల కృషితోనే ఈ అద్భుత విజయం సాధ్యమైందని కొనియాడారు. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్తో పాటు, లేడీస్ హాస్టల్ డిప్యూటీ వార్డెన్ డాక్టర్ సూర్యప్రభ, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ఎం.ఎస్.ఎన్. పాత్రుడు తదితరులు అభినందించారు. వరుసగా 16వ సారి ఓవరాల్ చాంపియన్గా ఆంధ్ర మెడికల్ కాలేజీ -
బీవోఐ అవుట్రీచ్ కార్యక్రమం
విశాఖ సిటీ: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మత్స్య, ఆహార ప్రాసెసింగ్ పథకాలపై అవుట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్యాంక్ విశాఖ జోనల్ మేనేజర్ నికేష్ కుమార్ సిన్హా, డీజీఎం ఎన్.సీతారాం ప్రాతినిథ్యం వహించారు. ఈ సందర్భంగా పీఎంఎంఎస్వై కింద 19, పీఎంఎఫ్ఎంఈ కింద 36 మంజూరు లేఖలు, లబ్ధిదారులకు అందజేశారు. ఇందులో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ జోనల్ మేనేజర్ జనార్థన్, ఏపీ మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ లక్ష్మణ్రావు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జీఎం డాక్టర్ హెచ్టీ వాసప్ప, ఇతర బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. -
విద్యుత్ పొదుపుపై ఏపీఈపీడీసీఎల్ వెబినార్ రేపు
విశాఖ సిటీ: విద్యుత్ వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా తమ విద్యుత్ ఖర్చులను తగ్గించుకునే అవకాశాలపై వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు ఏపీఈపీడీసీఎల్ ప్రత్యేక వెబినార్ నిర్వహించనుంది. పరిశ్రమలు, వాణిజ్య వినియోగదారుల కోసం ‘ఎనర్జీ అండ్ కాస్ట్ సేవింగ్స్–డిమాండ్ రెస్పాన్స్’ అనే అంశంపై ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ వెబినార్ జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్ ఆదేశాల మేరకు మద్రాస్ ఐఐటీకి చెందిన ఎనర్జీ టెక్నాలజీ స్టార్టప్ సంస్థ ఎలిమెంట్స్ ఎనర్జీ భాగస్వామ్యంతో కమర్షియల్ విభాగం అధికారులు ఈ వెబినార్ నిర్వహించనున్నారు. ఇందులో డిమాండ్ రెస్పాన్స్ విధానం, టైమ్ ఆఫ్ డే టారిఫ్ విధానంపై వినియోగదారులకు అవగాహన కల్పించనున్నారు. ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని పరిశ్రమలు, వాణిజ్య వినియోగదారులు ఇందులో పాల్గొనాలని సంస్థ ఆహ్వానించింది. ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యుత్ వినియోగాన్ని మెరుగుపరిచి.. పరిశ్రమ, వాణిజ్య విభాగాల్లోని ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వినియోగదారులకు మొత్తంగా రూ.10 లక్షల ప్రోత్సాహకాలు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఏపీఈపీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ (కమర్షియల్) ఎస్.రాజబాబు, లేదా ఎలిమెంట్స్ ఎనర్జీ ఫౌండర్ ఆన్సన్ సాండో 9445613791 ఫోన్ నంబర్ లేదా support@elementsenergies. com ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చని సూచించారు. -
‘మధురవాడ’లో ఏసీబీ మెరుపు దాడులు
మధురవాడ: విశాఖలో అవినీతి నిరోధక శాఖ మెరుపు దాడులతో ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ఉలిక్కిపడ్డారు. ముఖ్యంగా జీవీఎంసీ టౌన్ప్లానింగ్ విభాగంపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో మధురవాడ జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ ఇన్స్పెక్టర్లు లక్ష్మణరావు, వెంకటరావుల ఆధ్వర్యంలో అధికారులు టౌన్ప్లానింగ్ విభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని ఫైళ్లు, పత్రాలు పరిశీలించారు. ఏసీపీ శబ్నాన్ శాస్త్రితో పాటు సిబ్బందిని విచారించారు. కొంతమంది ఉద్యోగుల మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మధురవాడ పరిసర ప్రాంతాల్లో ఇటీవల మంజూరైన భవన ప్లాన్లు, ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాలపై అధికారులు ఆరా తీశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయా అన్న కోణంలో పరిశీలించారు. ఈ సందర్భంగా పలు ఫైళ్లు, కంప్యూటర్ డేటాను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ దాడుల వార్త బయటకు రావడంతో జీవీఎంసీ అధికారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కొంతమంది అధికారులు కార్యాలయాలకు రాకుండా జాగ్రత్త పడుతున్నట్లు చర్చ జరుగుతోంది. -
జీవీఎంసీ ఇక కలెక్టర్ కంట్రోల్!
డాబాగార్డెన్స్: విశాఖ నగర పాలనలో ఒక అధ్యాయం ముగిసి, మరో కీలక ఘట్టం ఆరంభం కానుంది. ఈ నెల 17తో జీవీఎంసీ ప్రస్తుత పాలకవర్గ పదవీకాలం పూర్తి కానుండటంతో, నగరం మళ్లీ ప్రత్యేకాధికారి పాలనలోకి వెళ్తోంది. ప్రభుత్వం కలెక్టర్ ఎం.ఎన్.హరేందిరప్రసాద్ను జీవీఎంసీ ప్రత్యేకాధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కార్పొరేషన్లో ఇక కలెక్టర్ మార్క్ పాలన మొదలుకానుంది. తదుపరి ఎన్నికలు జరిగే వరకు కలెక్టర్ కంట్రోల్లోనే జీవీఎంసీ ఉండనుంది. రాజకీయ చదరంగం.. ముగిసిన అంకం 2021లో మొదలైన ఈ పాలకవర్గ ప్రయాణం ఎన్నో మలుపులు తిరిగింది. 2021 ఏప్రిల్ నుంచి 2025 ఏప్రిల్ వరకు వైఎస్సార్ సీపీకి చెందిన గొలగాని హరి వెంకటకుమారి మేయర్గా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో జియ్యాని శ్రీధర్, కటుమూరి సతీష్ డిప్యూటీ మేయర్లుగా వ్యవహరించారు. కుళ్లు, కుతంత్రాలు, అధికార దాహం, డబ్బులు వెదజల్లి బీసీ కులానికి చెందిన గొలగాని హరి వెంకటకుమారిని మేయర్గా, డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ను తప్పించారు. ఈ నేపథ్యంలో గతేడాది ఏప్రిల్ 28న మేయర్గా పీలా శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్గా దళ్లి గోవిందరెడ్డి బాధ్యతలు చేపట్టగా, కటుమూరి సతీష్ మరో డిప్యూటీ మేయర్గా కొనసాగుతున్నారు. వీరిందరి పదవీకాలం ఈ నెల 17తో పూర్తి కానుంది. పెండింగ్ పనుల చక్కబెట్టే పనిలో.. పాలకవర్గ గడువు ముగియడానికి కేవలం వారం రోజులే సమయం ఉండటంతో జీవీఎంసీలో రాజకీయ సందడి నెలకొంది. ఇప్పటికే చివరి కౌన్సిల్ సమావేశం కూడా ముగియడంతో, ప్రజాప్రతినిధులు తమ పరిధిలోని పెండింగ్ పనులను చక్కబెట్టే పనిలో నిమగ్నమయ్యారు. మళ్లీ పాతరోజులేనా? నగరవాసుల్లో ఇప్పుడు ఒకటే చర్చ.. మళ్లీ పాత రోజులే రాబోతున్నాయా? అని. గతంలో 2012 నుంచి 2021 వరకు జీవీఎంసీలో ఎన్నికలు జరగలేదు. అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో అధికారుల పాలనే సుదీర్ఘకాలం కొనసాగింది. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే గ్రేటర్ విశాఖకు ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఘన విజయం సాధించి, పాలన పగ్గాలు చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండటం, తక్షణమే ఎన్నికలు నిర్వహించే సూచనలు కనిపించకపోవడంతో, మరోసారి సుదీర్ఘ కాలం పాటు అధికారుల పాలనే కొనసాగే అవకాశం ఉందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేకాధికారిగా హరేందిర ప్రసాద్ నియామకంమేయర్ల ప్రస్థానం ఇదీ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్గా బీజేపీకి చెందిన ఎన్.ఎస్.ఎన్.రెడ్డి పీఠం అధిష్టించారు. ఆయన 1981 నుంచి 1986 వరకు నగర ప్రథమ పౌరుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత 1987లో జరిగిన ఎన్నికల్లో టీడీపీకి చెందిన డీవీ సుబ్బారావు మేయర్గా ఎన్నికై 1992 వరకు కొనసాగారు. అనంతరం 1995 నుంచి 2000 వరకు కాంగ్రెస్ నేత సబ్బం హరి నగర మేయర్గా పాలన సాగించారు. 2000లో కాంగ్రెస్కు చెందిన రాజాన రమణి మున్సిపల్ కార్పొరేషన్కు తొలి మహిళా మేయర్గా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఆమె 2005 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆ తరువాత 2005 నుంచి 2007 వరకు కార్పొరేషన్కు ఎన్నికలు జరగలేదు. అయితే, అప్పటి ముఖ్యమంత్రి దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ విశాఖ(జీవీఎంసీ)గా రూపాంతరం చెందింది. ఆ తర్వాత 2007లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పులుసు జనార్దన్ మేయర్గా, కె. దొరబాబు డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు. వీరు 2012 వరకు తమ బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత టీడీపీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా 2012 నుంచి 2021 వరకు జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించలేదు. సుదీర్ఘ విరామం తర్వాత 2021 ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయం సాధించింది. దీంతో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కు తొలి మహిళా మేయర్గా బీసీ సామాజిక వర్గానికి చెందిన గొలగాని హరి వెంకట కుమారి బాధ్యతలు చేపట్టారు. ఆమె నాలుగేళ్ల పాటు పాలన సాగించారు. కాగా, మార్పుల్లో భాగంగా గత ఏడాది ఏప్రిల్ 28వ తేదీ నుంచి పీలా శ్రీనివాసరావు మేయర్గా వ్యవహరిస్తున్నారు. -
భవిష్యత్ విశాఖకు నీటి భద్రతే కీలకం
మహారాణిపేట: వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ, వాతావరణ మార్పుల దృష్ట్యా నగరాలు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో నీటి భద్రత అత్యంత కీలకమైనదని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ స్పష్టం చేశారు. ప్రతి నీటి బొట్టును సంరక్షించుకునే బాధ్యత కేవలం ప్రభుత్వానిదే కాకుండా అందరిపై ఉందని ఆయన పిలుపునిచ్చారు. జీవీఎంసీ ఆధ్వర్యంలో మంగళవారం ‘క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఫర్ వాటర్ సెక్టార్’అనే అంశంపై జరిగిన వర్క్షాప్లో ఆయన మాట్లాడారు. సుస్థిర అభివృద్ధి కార్యక్రమాల్లో విశాఖపట్నం ముందంజలో ఉందని, అందరం కలిసి నీటి భద్రత కలిగిన నగరాన్ని నిర్మిద్దామని అన్నారు. రాష్ట్ర పారిశ్రామిక శాఖ కార్యదర్శి, విశాఖ ఎకనామిక్ రీజియన్ సీఈవో డాక్టర్ ఎన్.యువరాజ్ మాట్లాడుతూ.. విశాఖ ప్రాంతానికి దీర్ఘకాలిక నీటి భద్రత కోసం వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. వర్చువల్గా పాల్గొన్న పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ మాట్లాడుతూ.. నీటి రంగంలో మూలధన పెట్టుబడి ప్రణాళికల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన, ఆర్థికపరమైన పూర్తి మద్దతు అందిస్తుందని హామీ ఇచ్చారు. మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ డాక్టర్ పి. సంపత్ కుమార్ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక నీటి వనరుల నిర్వహణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. మేయర్ పీలా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా విశాఖ మెట్రోపాలిటన్ ప్రాంతంలో దీర్ఘకాలిక నీటి భద్రత సాధించేందుకు కట్టుబడి ఉన్నామని వివరించారు. కాగా.. వరల్డ్ బ్యాంక్ గ్రూప్నకు చెందిన ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, సింగపూర్ వాటర్ సెంటర్, యూరోపియన్ డెలిగేషన్ టు ఇండియా తదితర అంతర్జాతీయ సంస్థల సహకారంతో ఈ సదస్సు జరిగింది. విదేశీ ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు పాల్గొని పట్టణ నీటి వ్యవస్థలో సమగ్ర ప్రణాళిక, డేటా ఆధారిత పెట్టుబడి వ్యూహాలపై లోతైన చర్చలు జరిపారు. కార్యక్రమంలో శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండుకర్, విశాఖ జేసీ జి.విద్యాధరి, నీతి ఆయోగ్ రిటైర్డ్ అధికారి కిశోర్ సహా పలు జిల్లాల మున్సిపల్ కమిషనర్లు, జీవీఎంసీ అదనపు కమిషనర్లు ఎస్.ఎస్. వర్మ, డి.వి.రమణమూర్తి, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమం చివరలో విశాఖ నీటి రంగానికి సంబంధించి జీవీఎంసీ ప్రత్యేకంగా రూపొందించిన ‘క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్’ ఫ్లయ్యర్ను అతిథులు ఆవిష్కరించారు. -
పది పరీక్షలకు సన్నద్ధం
ఈ నెల 16 నుంచి పరీక్షలు ఆరిలోవ: జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ఉపాధ్యాయులు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లావ్యాప్తంగా ఇప్పటికే 133 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి పర్యవేక్షణ కోసం 133 మంది చీఫ్ సూపరింటెండెంట్లు (సీఎస్), మరో 133 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను(డీవో) విద్యాశాఖ నియమించింది. పరీక్ష పత్రాలను (సెట్ 1, 2) సంబంధిత కేంద్రాలకు సమీపంలోని పోలీస్ స్టేషన్లలో పటిష్ట భద్రత నడుమ భద్రపరిచారు. ప్రత్యేక శిక్షణ.. రాత్రి వేళ్లలో పర్యవేక్షణ విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు గతంలో మాదిరిగానే 100 రోజుల ప్రణాళికతో పాటు 30 రోజుల ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నారు. విద్యార్థులను వారి సామర్థ్యాన్ని బట్టి గ్రేడులుగా విభజించి, వెనుకబడిన విద్యార్థులను హాస్టళ్లలో వసతి కల్పించి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. రాత్రి వేళల్లో డీఈవో, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు ఆయా ప్రాంతాల్లోని విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారు చదువుకుంటున్న తీరును స్వయంగా పరిశీలిస్తున్నారు. స్టడీ మెటీరియల్ పంపిణీ : విద్యార్థులకు భరోసా ఇచ్చేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు, ఉపాధ్యాయులు రూపొందించిన స్టడీ మెటీరియల్స్ను అందజేశాయి. ‘సాక్షి’ యాజమాన్యం ప్రతి ఏటా మాదిరిగానే అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో రూపొందించిన మెటీరియల్ను జిల్లాలోని విద్యార్థులకు పంపిణీ చేసింది. ఉపాధ్యాయులు స్వయంగా తయారు చేసిన నోట్స్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. -
స్టీల్ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుడి మృతి
ఉక్కునగరం : స్టీల్ప్లాంట్ ఆర్ఎంహెచ్పీ విభాగం కాంట్రాక్ట్ కార్మికుడు మంగళవారం మృతి చెందాడు. వివరాలివి... పెదగంట్యాడ మండలం దిబ్బపాలెంకు చెందిన ఎన్. శ్రీకిరణ్ (25) ఆర్ఎంహెచ్పీ విభాగంలో సెమీ స్కిల్డ్ వర్కర్గా పని చేస్తున్నాడు. మంగళవారం యథావిధిగా విధులకు హాజరయ్యాడు. ఆగిపోయిన కన్వేయర్పై కూర్చుని విధులు నిర్వహిస్తున్నాడు. ఈలోగా కన్వేయర్ ప్రారంభం కావడంతో శ్రీకిరణ్ కింద ఉన్న చూట్లో పడిపోయాడు. ఈ సంఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఉక్కు జనరల్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కన్వేయర్ ఎలా ప్రారంభమైందన్న అంశం నిర్ధారణ కాలేదు. మృతదేహాన్ని ఉక్కు జనరల్ ఆస్పత్రిలో ఉంచారు. స్టీల్ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వందేళ్ల వైభవం.. ఉరిమిన ఉత్సాహం
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల వేళ.. విద్యార్థులు తమ కళా ప్రతిభతో మెరిశారు. తరగతి గదుల్లో పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు, వేదికపై అద్భుత ప్రతిభతో అదరగొట్టేశారు. విశ్వకళా పరిషత్ అన్న పేరును సార్థకం చేస్తూ బీచ్రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం నిర్వహించిన సాంస్కృతిక సంబరాలు అంబరాన్నంటాయి. ఏయూ యునైటెడ్ క్లబ్ ఆధ్వర్యంలో శాసీ్త్రయ నృత్యాల నుంచి వెస్ట్రన్ డ్యాన్స్ల వరకు, పౌరాణిక ఘట్టాల నుంచి మైమ్ ప్రదర్శనల వరకు.. విద్యార్థులు తమ అద్భుతమైన నృత్యాభినయాలతో అందరినీ మంత్రముగ్ధులను చేశారు. అదరగొట్టిన విద్యార్థులు కన్వెన్షన్ సెంటర్ ప్రాంగణమంతా పండగ వాతావరణం నెలకొంది. రామాయణ ఇతిహాసాన్ని విద్యార్థులు వేదికపై కళ్లకు కట్టినట్లు ఆవిష్కరించారు. శ్రీరామ జననం, సీతా కల్యాణం, వనవాసం, సీతాపహరణం, రావణ సంహారం, సీతాదేవి అగ్నిప్రవేశం.. ఇలా ప్రతి ఘట్టాన్ని సజీవంగా ప్రదర్శించి కరతాళ ధ్వనులు అందుకున్నారు. ఆ తర్వాత ప్రదర్శించిన నృసింహస్వామి అవతార ఘట్టం సైతం అందరినీ భక్తిభావంతో ముంచెత్తింది. యామిని ప్రియాంక శాసీ్త్రయ నృత్యంతో మొదలైన ఈ వేడుకల్లో.. శ్రీనిధి బృందం సెమీ క్లాసికల్ డ్యాన్స్, బీబీఏ విద్యార్థుల వెస్ట్రన్ డాన్స్ కుర్రకారుతో కేరింతలు కొట్టించాయి. జోకర్ మైమ్, పేరడీ పాటలు, వాయిస్ ఇమిటేషన్లు దేనికదే ప్రత్యేకంగా నిలిచాయి. ఈ సందర్భంగా ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్థుల అద్భుత ప్రదర్శనలు మనసును హత్తుకున్నాయన్నారు. ‘ఈ ప్రదర్శనల వెనుక విద్యార్థుల కష్టం, సాధన, సమన్వయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. త్వరలో జరగనున్న ఏయూ శతాబ్ది ఉత్సవాలకు ఇది చోదకశక్తిలా నిలుస్తుంది’అని ఆయన ప్రశంసించారు. అనంతరం ఈ నెల 17న కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్న ఏయూ కళా ఉత్సవాల పోస్టర్ను వీసీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య పి.కింగ్, రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, ప్రిన్సిపాళ్లు ఆచార్య జాలాది రవి, ఎం.వి.ఆర్.రాజు, కె.సీతామాణిక్యం, ఎం.శశి, మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఏయూలో ఆకట్టుకున్న కళా సంబరాలు -
యుక్తవయసు మార్పులపై దిశానిర్దేశం చేయండి
ఆర్జేడీ విజయభాస్కర్ ఆరిలోవ: జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో జీవశాస్త్రం బోధించే ఉపాధ్యాయులకు మంగళవారం డీఈవో కార్యాలయ సమావేశ మందిరంలో ‘స్కూల్ హెల్త్ ప్రోగ్రాం’పై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాం ద్వారా పాఠశాలల్లో ఆరోగ్య రక్షణ, విద్యార్థుల శారీరక మార్పులపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్జేడీ బి.విజయభాస్కర్ మాట్లాడుతూ.. పాఠశాలల్లో పిల్లలకు ఆరోగ్యం పట్ల కల్పించాల్సిన అవగాహన గురించి వివరించారు. ముఖ్యంగా విద్యార్థులు యుక్త వయసులోకి ప్రవేశించినప్పుడు వారిలో కలిగే శారీరక, మానసిక మార్పులను గుర్తించి, వాటిపై సరైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని సూచించారు. అప్పుడే విద్యార్థులు ఆందోళన చెందకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఈవో ఎన్.ప్రేమకుమార్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. -
స్టీల్ప్లాంట్ ఆపరేషన్స్ డైరెక్టర్గా సుభాషిస్ సేన్గుప్తా
ఉక్కునగరం: విశాఖ స్టీల్ప్లాంట్ డైరెక్టర్ (ఆపరేషన్స్)గా సెయిల్లోని దుర్గాపూర్ స్టీల్ప్లాంట్కు చెందిన చీఫ్ జనరల్ మేనేజర్స్ (ప్రాజెక్ట్స్) సుభాషిస్ సేన్గుప్తా నియమితులయ్యారు. ప్రస్తుత డైరెక్టర్ (ఆపరేషన్స్) సలీం జి పురుషోత్తమన్ మే నెలాఖరున పదవీ విరమణ చేయనుండటంతో ఆ పోస్టుకు మంగళవారం పీఈఎస్బీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. విశాఖ స్టీల్ప్లాంట్ నుంచి ఎనిమిది మంది, సెయిల్, ఎన్టీపీసీ, ఎన్ఎండీసీ, సీసీఐ నుంచి ఒక్కొక్కరు చొప్పున 12 మంది హాజరయ్యారు. అందులో సుభాషిస్ సేన్గుప్తాను ఎంపిక చేసినట్టు పీఈఎస్బీ వెబ్సైట్లో పేర్కొన్నారు. ఆయన జూన్ 1న బాధ్యతలు చేపట్టనున్నారు. -
పెందుర్తిలో రికార్డుల వేట.. నేరుగా భవనాల వద్దకే..
పెందుర్తి: జీవీఎంసీ పెందుర్తి జోన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినట్లు వచ్చిన ఫిర్యాదులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం విస్తృత తనిఖీలు చేపట్టారు. వేపగుంటలోని పెందుర్తి జోన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో దాదాపు 20 మంది సభ్యులతో కూడిన బృందం కార్యాలయంలోని టౌన్ప్లానింగ్ విభాగాన్ని పూర్తిగా తనిఖీ చేసింది. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు అనుమానం ఉన్న పలు భవనాల వద్దకు నేరుగా వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. జీవీఎంసీ ప్లానింగ్ అధికారులను వెంటబెట్టుకుని భవన యజమానులను కూడా ప్రశ్నించారు. అధికారిక, అనధికారిక లావాదేవీలపై విచారణ జరిపారు. అనంతరం కార్యాలయంలోని ఫైళ్లు, పత్రాలను రాత్రి వరకు పరిశీలించారు. బుధవారం కూడా సోదాలు కొనసాగనున్నట్లు సమాచారం. ఈ తనిఖీలతో ప్లానింగ్ యంత్రాంగంలో కలకలం రేగింది. -
అదనపు రెవెన్యూ ఇచ్చుకోవాల్సిందే..
అగనంపూడి : అగనంపూడి జోనల్ కార్యాలయంలో రెవెన్యూ విభాగం అవినీతి అక్రమాలకు అడ్డాగా మారుతోంది. ‘ఫైలు కదలాలన్నా.. పన్ను పడాలన్నా.. నా చేయి తడవాల్సిందే‘ అంటూ ఓ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాగిస్తున్న వసూళ్ల దందాపై వార్డు సచివాలయ అడ్మిన్లు ఒక్కసారిగా తిరుగుబాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పట్టణ ప్రణాళిక విభాగాలపై ఏసీబీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో, అగనంపూడి జోన్లో సాగుతున్న ఈ ‘పర్సంటేజీల’ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక్కో ఫైలుకు ఒక్కో రేటు! అగనంపూడి జోనల్ కార్యాలయ పరిధిలోని 4 వార్డులు, 16 వార్డు సచివాలయాల్లో కొత్త ఇళ్లకు పన్ను నిర్ణయించడం, ఆస్తి పన్ను సవరణలు, వీఎల్టీ విధింపు వంటి ప్రతి పనికి ఒక రేటు నిర్ణయించి వసూలు చేయాలని సదరు అధికారి సచివాలయ సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ‘గతంలో నేను పనిచేసిన చోట ఇదే ఆనవాయితీ.. ఇక్కడ కూడా అది కొనసాగాల్సిందే‘ అంటూ ఆయన మొండికేయడం విశేషం. తిరగబడ్డ సచివాలయ సిబ్బంది : ఈ ప్రాంతం ఎక్కువగా గ్రామీణ వాతావరణం కలిగి ఉంటుందని, ఇక్కడి ప్రజలు అడిగినంత ఇచ్చుకోలేరని సచివాలయ అడ్మిన్లు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా సదరు అధికారి వినకపోవడంతో వివాదం ముదిరింది. అవినీతి ఊబిలో తాము కూరుకుపోలేమని, ప్రజల నుంచి వసూళ్లు చేసి పెట్టడం తమ వల్ల కాదని 16 సచివాలయాల సిబ్బంది మూకుమ్మడిగా తెగేసి చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో తాము ఉద్యోగాలు చేయలేమంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏసీబీ దాడుల వేళ గుబులు : మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ అధికారులు పట్టణ విభాగాలపై మెరుపు దాడులు చేయడంతో అగనంపూడి జోనల్ కార్యాలయంలోని అక్రమాల పుట్ట కదిలింది. తాము బలిపశువులం కాకూడదనే ఉద్దేశంతో సచివాలయ సిబ్బంది ఈ వసూళ్ల భాగోతాన్ని బయటపెట్టారు. ప్రశాంతంగా ఉండే అగనంపూడి జోన్కు మొదటిసారిగా ఇలాంటి అవినీతి మరక అంటుకోవడంపై స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. -
గాజువాకలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు
గాజువాక: జీవీఎంసీ గాజువాక జోనల్ కార్యాలయంలోని టౌన్ప్లానింగ్ విభాగంలో ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. టౌన్ప్లానింగ్ విభాగంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టగా, అందులో భాగంగా గాజువాక కార్యాలయంలో కూడా సోదాలు జరిగాయి. ఏసీబీ సీఐ సుప్రియ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల బృందం కార్యాలయంలోకి అకస్మాత్తుగా ప్రవేశించి టౌన్ప్లానింగ్ విభాగానికి సంబంధించిన రికార్డులను పరిశీలించింది. ఈ సందర్భంగా టౌన్ప్లానింగ్ సహాయ కమిషనర్ (ఏసీపీ) వెంకటరావుతో పాటు ఇతర సిబ్బందిని అధికారులు విచారించారు. ఇప్పటివరకు జారీ చేసిన భవన ప్లాన్ అనుమతులకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించి పూర్తి వివరాలను సేకరించారు. అధికారులు విభాగంలోకి వచ్చిన వెంటనే ఏసీపీతో పాటు సిబ్బందికి చెందిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కాల్ డేటా, నగదు లావాదేవీలను కూడా పరిశీలించారు. ఉదయం ప్రారంభమైన ఈ తనిఖీలు సాయంత్రం వరకు కొనసాగాయి. -
గీతం ఆక్రమిత భూములను రెగ్యులర్ చేయవద్దు
కలక్టర్కు వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ప్రతినిధి పాకా వినతి అల్లిపురం: గీతం విశ్వవిద్యాలయం ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను రెగ్యులరైజ్ చేయవద్దని, ఆ భూములను స్వాధీనం చేసుకుని పరిరక్షించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ ప్రతినిధి పాకా సత్యనారాయణ సోమవారం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. భీమిలి మండలం రుషికొండ పరిధిలోని సర్వే నంబర్లు 15, 16, 19, 20లలో సుమారు 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం యాజమాన్యం ఆక్రమించిందని, దానిని రెగ్యులరైజ్ చేయాలని దరఖాస్తు చేసుకున్నట్లు తమకు తెలిసిందని ఆయన పేర్కొన్నారు. ఈ భూములను గతంలో భూమి లేని పేదల జీవనోపాధి కోసం ప్రభుత్వం కేటాయించిందని గుర్తు చేశారు. ఏపీ అసైన్డ్ ల్యాండ్ యాక్ట్–1977 ప్రకారం, కేటాయించిన భూములను కొనడం, అమ్మడం పూర్తిగా నిషేధమని, ఈ చట్టం విరుద్ధంగా జరిగిన లావాదేవీలు చెల్లవని ఆయన స్పష్టం చేశారు. గీతం యాజమాన్యం చేసుకున్న రెగ్యులరైజేషన్ దరఖాస్తును తిరస్కరించి, ఆ భూములను వెంటనే ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని ఆయన కలెక్టర్ను కోరారు. -
నిరుద్యోగ సమస్యలపై డీవైఎఫ్ఐ నిరసన
మహారాణిపేట: నిరుద్యోగ భృతి అమలు చేయాలని, ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయాలని కోరుతూ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి అందించాలని, 20 నెలలు దాటినా ఇప్పటికీ హామీ నెరవేరలేదని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు యు.ఎస్.ఎన్. రాజు విమర్శించారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, ప్రభుత్వ శాఖల్లో పెండింగ్లో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువత ఎంతో ఆశగా ఎదురుచూస్తోందని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కె. మహేష్ కోరారు. కార్యక్రమంలో ఉపాద్యక్షుడు ఎస్.శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. -
మాస్టర్స్ ఇంటర్నేషనల్లో మెరిసిన ‘వావ్’ అథ్లెట్స్
మురళీనగర్: థాయిలాండ్లో ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించిన 30వ థాయిలాండ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఇంటర్నేషనల్ మీట్లో విశాఖపట్నానికి చెందిన వెటరన్ అథ్లెటిక్స్ తమ ప్రతిభను చాటారు. ఈ పోటీల్లో పాల్గొన్న 13 మంది అథ్లెట్స్ మొత్తం 12 పతకాలు సాధించి సత్తా చాటారు. వీటిలో 3 బంగారు, 4 రజిత, 5 కాంస్య పతకాలు ఉన్నాయని వైజాగ్ వెటరన్ అథ్లెట్స్ అసోసియేషన్ సమన్వయకర్త సీహెచ్. శ్రీనివాసరాజు తెలిపారు. విజేతలు వీరే.. ● నగరానికి చెందిన మాజీ పోలీస్ అధికారి డి.వి.ఎస్.భాస్కర్రాజు (75+) విభాగంలో రజిత పతకం సాధించడంతో పాటు 4 ్ఠ400 మీటర్ల రిలేలో కూడా రజిత పతకం గెలుచుకున్నారు. ● జి.సీతారామ్ (50+) 4 ్ఠ100 మీటర్ల పరుగులో కాంస్య పతకం సాధించారు. ● జి.సందీప్ (35+) 1500 మీటర్ల పరుగులో బంగారు పతకం, 800 మీటర్ల పరుగులో కాంస్య పతకం, 4 ్ఠ400 మీటర్ల రిలేలో రజిత పతకం గెలుచుకున్నారు. ● ఆర్.మంజునాథ్ (40+) 1500 మీటర్ల పరుగులో కాంస్య పతకం, 4 ్ఠ400 మీటర్ల రిలేలో రజిత పతకం సాధించారు. ● పి.సి.సన్యాసిరావు (85+) 100 మీటర్ల పరుగులో బంగారు పతకం, 200 మీటర్ల పరుగులో బంగారు పతకం, లాంగ్ జంప్లో కాంస్య పతకం, ట్రిపుల్ జంప్లో కాంస్య పతకం గెలుచుకున్నారు. ● బి.వింధ్యరేఖ (65+) 4 ్ఠ400 మీటర్ల రిలేలో రజిత పతకం సాధించారు. ● ఇండియా మాస్టర్స్ అథ్లెటిక్స్ సెక్రటరీ జనరల్, ఇండియా టీమ్ మేనేజర్ డాక్టర్ మంగ వరప్రసాద్ ఆధ్వర్యంలో ఈ అథ్లెట్లు పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజేతలను వావ్ చీఫ్ పేట్రన్ డాక్టర్ కమల్ బయిద్, ట్రస్టీలు శుభోద్ కుమార్, నండూరి రామకృష్ణ, పీఆర్ఓ వంశీ చింతలపాటి, కార్యదర్శి ఎల్వీ సుధాకర్, కోశాధికారి కె.రామారావు అభినందించారు. -
జీవీఎంసీ పీజీఆర్ఎస్కు 128 వినతులు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 128 వినతులు అందాయి. మేయర్ పీలా శ్రీనివాసరావు, కమిషనర్ కేతన్ గార్గ్ ప్రజల నుంచి సమస్యలను స్వీకరించారు. ఫిర్యాదుల్లో అత్యధికంగా పట్టణ ప్రణాళికా విభాగానికి 58, ఇంజినీరింగ్ విభాగానికి 30, రెవెన్యూ విభాగానికి 19, అడ్మినిస్ట్రేషన్ విభాగానికి 10, ప్రజారోగ్య శాఖకు 6, మొక్కల విభాగానికి 3, యూసీడీ విభాగానికి 2 చొప్పున వినతులు అందాయి. అనంతరం కమిషనర్ కేతన్గార్గ్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులపై సంబంధిత శాఖాధిపతులు తక్షణమే స్పందించాలని ఆదేశించారు. ఫిర్యాదీదారులతో సంప్రదించి, నిర్ణీత గడువులోగా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, ఎస్ఎస్ వర్మ, పి.నల్లనయ్య, జాయింట్ డైరక్టర్ విజయభారతి, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు. -
అంగరంగ వైభవంగా శ్రీనివాస కల్యాణం
బీచ్రోడ్: సాగర తీరాన ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 12వ తరం వంశీకుల ఆధ్వర్యంలో నడిచే శ్రీ వెంకటన్నమాచార్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం గురజాడ కళాక్షేత్రంలో శ్రీనివాస కల్యాణం వైఖానస ఆగమ విధానంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అన్నమాచార్య సంకీర్తనల నడుమ, వేదఘోషల మధ్య జరిగిన ఈ కల్యాణోత్సవం భక్తులను ఆకట్టుకుంది. తాళ్లపాక వంశీకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం చూసిన భక్తులకు సాక్షాత్తు తిరుమలలో ఉన్నామనే భావన కలిగింది. అనంతరం అన్నమయ్య సేవా కార్యక్రమాల భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కూడా నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేష సేవలు అందిస్తున్న మహిళలను గుర్తిస్తూ ‘అన్నమయ్య ఆధ్యాత్మిక రథసారథులు’ పేరిట సత్కరించారు. ఈ సందర్భంగా విశాఖ నగరానికి చెందిన వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన ఐదుగురు మహిళలకు ‘అన్నమయ్య విశిష్ట మహిళా పురస్కారం’ అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు సాంప్రదాయ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. -
విశాఖ కో ఆపరేటివ్ బ్యాంక్ బ్రాంచ్ ప్రారంభం
కొమ్మాది: విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ 60వ బ్రాంచ్ను ఎండాడలో సోమ వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ జేవీ సత్యనారాయణమూర్తి మాట్లాడు తూ ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో 59 శాఖలను కలిగి ఉందని, ఎండాడ బ్రాంచ్తో 60కి చేరిందన్నారు. రూ.8,300 కోట్ల ఆర్థిక కార్యకలాపాలతో నడుస్తున్న బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సర లక్ష్యాన్ని రూ.8,600 కోట్లుగా పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు జి.జనార్దనరావు, సీహెచ్ ఆదినారాయణ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. -
108 సేవలకు సుస్తీ
మహారాణిపేట: పేద ప్రజలకు అత్యవసర సమయాల్లో ప్రాణదాతగా నిలిచే 108 వాహనాలకు సుస్తీ చేసింది. జిల్లాలో ఈ సేవలపై గత కొద్ది నెలలుగా ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఫోన్ చేసిన గంటల తరబడి వాహనాలు అందుబాటులోకి రావడం లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులకు గోల్డెన్ అవర్లో వైద్యం అందడం ప్రాణరక్షణకు కీలకం. కానీ, అంబులెన్సుల జాప్యం వల్ల ఎందరో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మరమ్మతుల సాకుతో మూలకే.. జిల్లాలో ప్రస్తుతం 15 అంబులెన్సులు అందుబాటులో ఉన్నాయి. అయితే, వీటిలో చాలా వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. వీటిని సకాలంలో బాగు చేసి రోడ్డుపైకి తీసుకురావడంలో సంబంధిత సంస్థలు విఫలమవుతున్నాయి. నగరంలోని ఒక ప్రైవేట్ షెడ్డులో ఈ వాహనాలను రిపేరు కోసం ఉంచుతున్నారు. వారు ఎప్పుడు బాగు చేసి ఇస్తే అప్పుడే ఆ వాహనం అందుబాటులోకి వస్తోంది. ఈ జాప్యాన్ని అరికట్టడంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తగిన పర్యవేక్షణ చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిర్వీర్యమవుతున్న అపర సంజీవని 2005లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఈ పథకాన్ని, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మరింత మెరుగుపరుస్తూ 1088 వాహనాలను ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సేవల నిర్వహణ గాలికి వదిలేశారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం భవ్య నిధి ఆధ్వర్యంలో ఈ సేవలు నడుస్తున్నాయి. విశాఖలో ఉన్న 16 అంబులెన్సుల్లో ఒకటి రిజర్వుగా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం సేవలు ఆశించిన స్థాయిలో అందడం లేదు. పేదల జేబులకు చిల్లులు 108 వాహనం సకాలంలో రాకపోవడంతో అత్యవసర స్థితిలో ఉన్న పేద రోగులు ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో ఆర్థికంగా లేని వారు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. కేవలం హై రిస్క్ కేసులను మాత్రమే తరలించాల్సిన అంబులెన్సులు, కొన్నిసార్లు సాధారణ రిఫరల్ కేసుల కోసం వినియోగించడం వల్ల కూడా అత్యవసర సేవలపై ప్రభావం పడుతోందని సిబ్బంది చెబుతున్నారు. మరమ్మతులకు గురైతే మూలకే అంబులెన్సులు సకాలంలో అందని అత్యవసర వైద్యం ప్రభుత్వ పర్యవేక్షణ లోపంతో పేదలకు తిప్పలు -
నిబంధనల ఉల్లంఘన పబ్, రిసార్ట్ సీజ్
కొమ్మాది: కోస్టల్ రెగ్యులేటరీ జోన్ నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టినందుకు గాను భీమిలి బీచ్ రోడ్డులోని ‘విరాగో పబ్’, తొట్లకొండ సమీపంలోని ‘శాంక్టమ్ బీచ్ రిసార్టు’లను జీవీఎంసీ అధికారులు సోమవారం సీజ్ చేశారు. హైకోర్టు ఆదేశాలు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సూచనల మేరకు డీసీపీలు హరిదాస్, వెంకటేశ్వరరావు, ఏసీపీలు రామకృష్ణ, శాస్త్రి నేతృత్వంలో ఈ ఆపరేషన్ చేపట్టారు. తీర ప్రాంతాల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టాలన్నా ఆంధ్రప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ నుంచి ముందుగా అనుమతులు పొందాలి. అయితే ఈ రెండు రిసార్టుల యాజమాన్యాలు ఎటువంటి ఎన్వోసీ, జీవీఎంసీ అనుమతులు లేకుండానే అక్రమ కట్టడాలను నిర్మించి, యథేచ్ఛగా వ్యాపారాలు కొనసాగిస్తున్నాయి. విరాగో పబ్కు అనుమతులిచ్చేందుకు అథారిటీ ఇప్పటికే నిరాకరించినప్పటికీ..నిర్మాణాలను కొనసాగించడం గమనార్హం. కోర్టు ఆదేశాలతో చర్యలు : ఈ అక్రమ నిర్మాణా లపై పలువురు హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేయడంతో.. కోర్టు విచారణ చేపట్టి నివేదిక కోరింది. నిబంధనల ఉల్లంఘన స్పష్టంగా తేలడంతో కోర్టు వీటిని సీజ్ చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగా విరాగో పబ్లోని 7 గదులు, స్విమ్మింగ్ పూల్, డైనింగ్ హాల్ను, అలాగే శాంక్టమ్ రిసార్టులోని గదులు, బార్ అండ్ రెస్టారెంట్, జనరేటర్ రూములను అధికారులు సీజ్ చేశారు. శాంక్టమ్ రిసార్టుకు టూరిజం శాఖ అనుమతులు ఉన్నాయని యాజమాన్యం అధికారులతో వాదనకు దిగింది. అయితే ఈ నిర్మాణాలకు అనుమతులు లేని కారణంగానే చర్యలు తీసుకుంటున్నామని అధికారులు స్పష్టం చేశారు. -
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
మహారాణిపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం జరిగిన పీజీఆర్ఎస్లో మొత్తం 425 వినతులు అందగా, అర్జీలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన స్పష్టం చేశారు. సమస్య పరిష్కారంలో అలసత్వం వహిస్తే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, ఇంచార్జ్ డీఆర్వో శేష శైలజ, ఏడీసీ సత్యవేణి, విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఆక్రమణలపై ఫిర్యాదు గాజువాక భానోజితోట కాకతీయలోవ గ్రామస్తులు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కాలనీలో ప్రభుత్వ గృహ సముదాయానికి వెళ్లే నడకదారిని ఓ మహిళ ఆక్రమించి రేకుల షెడ్డు వేయడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా మరణాలు సంభవించినప్పుడు శవాలను తరలించడం కూడా కష్టతరంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తహసీల్దార్, జోనల్ కమిషనర్లకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, ఆక్రమణలను తక్షణం తొలగించి రాకపోకలకు మార్గం సుగమం చేయాలని వారు కలెక్టర్ను కోరారు. -
కల్లు గీత కార్మికుల సమస్యలపై వినతి
పెదగంట్యాడ : కల్లు గీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా యాత సంఘం అధ్యక్షుడు అండిబోయిన అప్పారావు నేతృత్వంలో సోమవారం జాయింట్ కలెక్టర్ విద్యాధరికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీత వృత్తిలో ఉండి ప్రమాదవశాత్తూ చెట్టుపై నుంచి పడి మరణించిన కార్మికులకు ‘ఎన్టీఆర్ భరోసా’తో పాటు ఎక్స్గ్రేషియా అందజేయాలని కోరారు. తీవ్రంగా గాయపడిన వారికి కూడా నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఏడాదిలో కేవలం ఆరు నెలలు మాత్రమే ఉపాధి ఉండే ఈ వృత్తిలో ఉన్నవారిని మిగిలిన ఆరు నెలల కాలంలో ప్రభుత్వం ఆదుకోవాలని, తాటి ఉత్పత్తులతో పరిశ్రమను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కల్లు గీత వృత్తికి ఒక సమగ్ర చట్టం చేయాలని కోరారు. కార్యక్రమంలో యాత కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ అండిబోయిన లక్ష్మి, బాడితబోయిన రాములప్పడు తదితరులు పాల్గొన్నారు. -
ఆపాల్సిందే..
గీతం కబ్జా పనులుకలెక్టర్కు వైఎస్సార్సీపీ నేతలు, సామాన్య ప్రజలు విజ్ఞప్తి గ్రీవెన్స్లో ఫిర్యాదులు చేసేందుకు వచ్చిన వందలాది మందిని అడ్డుకున్న పోలీసులు 200 మందినే అనుమతించిన పోలీసులు అక్కడ కంప్యూటర్లు పనిచేయడం లేదంటూ హైడ్రామా గట్టిగా నిలదీసిన వైఎస్సార్ సీపీ నేతలు అయినా పరిమిత సంఖ్యలోనే ఫిర్యాదుల స్వీకరణగ్రీవెన్స్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్, సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, దేవన్రెడ్డి, పార్టీ నేతలు, కార్యకర్తలు సాక్షి, విశాఖపట్నం: గీతం యూనివర్సిటీ అక్రమంగా ఆక్రమించిన ప్రభుత్వ భూమిలో నిర్మాణ పనులు చేపడుతోందని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా నేతలు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మంత్రి నారా లోకేష్కు బంధువైన విశాఖ ఎంపీ భరత్కు చెందిన గీతం యూనివర్సిటీపై ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, ఆ భూమిలో జరుగుతున్న పనులను వెంటనే ఆపాలని వారు డిమాండ్ చేశారు. అక్రమ క్రమబద్ధీకరణపై ధ్వజం సుమారు రూ.5 వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం యూనివర్సిటీ ఆక్రమించిందని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. ఈ భూమిని జీవీఎంసీ సమావేశంలో వివాదాస్పదంగా క్రమబద్ధీకరించారని, ఆ సమయంలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను సమావేశానికి అనుమతించలేదని తెలిపారు. ప్రస్తుతం ఈ భూకబ్జా వ్యవహారం కోర్టు విచారణలో ఉన్నప్పటికీ, హెచ్చరిక బోర్డులను తొలగించి గీతం యాజమాన్యం భూమిని చదును చేస్తూ నిర్మాణ పనులు ప్రారంభించిందని పేర్కొన్నారు. పోరాటం కొనసాగిస్తాం.. ఈ సందర్భంగా కేకే రాజు మీడియాతో మాట్లాడుతూ, గీతం యూనివర్సిటీ భూకబ్జాపై వందలాది మంది ఫిర్యాదు చేయడానికి వచ్చినప్పటికీ పోలీసులతో అడ్డుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ భూములను కాపాడటానికి వైఎస్సార్సీపీ ఎలాంటి ఉద్యమానికై నా సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. అధికారులు ప్రభుత్వానికి వత్తాసు పలకకుండా చట్టబద్ధంగా వ్యవహరించాలని, వెంటనే గీతం యూనివర్సిటీ ఆక్రమించిన భూమిలో జరుగుతున్న పనులను ఆపాలని డిమాండ్ చేశారు. రూ.5 వేల కోట్ల విలువైన భూమిని కాపాడటానికి ప్రజా సంఘాలతో కలిసి పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు. పనులు ఆపకుంటే తర్వాత కూల్చేస్తాం.. మాజీ ఎమ్మెల్యే, విశాఖ దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్కుమార్ మాట్లాడుతూ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని గీతం యూనివర్సిటీ కబ్జా భూమిలో జరుగుతున్న పనులను నిలిపివేయాలని కోరారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని హెచ్చరించారు. కూటమిలో ఉన్న బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా ఈ విషయాన్ని పట్టించుకోకపోతే అది పెద్ద మచ్చగా మారుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్, ముఖ్య నాయకులు కోలా గురువులు, బాణాల శ్రీనివాస్, కొండా రాజీవ్గాంధీ, రొంగలి జగన్నాథం, జహీర్ అహ్మద్, పోతిన హనుమంతురావు, ఉమ్మడి స్వాతిదాస్, కోడిగుడ్ల పూర్ణిమ, పి.వి.నారాయణ, తాడి జగన్నాథ రెడ్డి, ఎం.నాగమల్లేశ్వరి, పల్లా దుర్గారావు, పేర్ల విజయచంద్ర, ద్రోణంరాజు శ్రీవత్సవ, రవిరాజు, కటారి అనిల్ కుమార్, కర్రి రామిరెడ్డి, బొండా ఉమామహేశ్వరరావు, సాహిక్ ఖాన్, మార్కండేయులు, శివరామకృష్ణ, కొణతాల ఉమామహేశ్వరరావు, శ్రీదేవి వర్మ, బర్కత్ అలీ, కోడూరి సత్యనారాయణ, సనపల రవీంద్ర భరత్, పళ్లా చిన్నతల్లి, అల్లంపల్లి రాజబాబు, ఆల్ఫా కృష్ణ, కె.బి.పి.ఎం.కుమార్ జైన్, సాడి పద్మావతి, శశికళ, గుడివాడ లతీష్, దొడ్డి కిరణ్, కె.రామన్నపాత్రుడు, కోడిగుడ్ల శ్రీధర్, బోగాది సన్యాసిరావు, ధర్మాల శ్రీనివాసరావు, పి.ఈశ్వరరావు, పీతల గోవింద్, రావళ్ల సత్యనారాయణ, బి.గోవింద్ రాజు, బొద్ద గోవింద్, గొండేసి శ్రీనివాస్ రెడ్డి, బోగావిల్లి గోవింద్, జి.వెంకట రెడ్డి, పైడి రామన్, ఆదారి శ్రీనివాస్, బల్ల శ్రీనివాస్, లాలం వేణుగోపాల స్వామి, దొప్ప శ్రీను, ఐ.రవి కిరణ్, కె.సుకుమార్, బి.గణేష్, యర్యంశెట్టి శ్రీనివాస్, బి.శ్యామ్కుమార్ రెడ్డి, మువ్వల సురేష్ పాల్గొన్నారు. పోలీసుల అడ్డగింత.. కలెక్టరేట్ వద్ద హైడ్రామా విశాఖ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కేకే రాజు నేతృత్వంలో సమన్వయకర్తలు తిప్పల దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావుతో పాటు వందలాది మంది కార్యకర్తలు, ప్రజలు కలెక్టర్ కార్యాలయంలోని గ్రీవెన్స్ సెల్కు ఫిర్యాదు చేయడానికి బయలుదేరారు. అయితే సుమారు వెయ్యి మంది వరకు వచ్చిన వారిని కలెక్టరేట్ వద్దే పోలీసులు అడ్డుకుని, కేవలం 200 మందికే లోపలికి అనుమతి ఇచ్చారు. లోపలికి వెళ్లిన తర్వాత కూడా అంతమంది నుంచి ఫిర్యాదులు స్వీకరించలేమని, కంప్యూటర్లు పనిచేయడం లేదని గ్రీవెన్స్ అధికారులు చెప్పడంతో వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరికి పరిమిత సంఖ్యలోనే జిల్లా అధికారులు ఫిర్యాదులను స్వీకరించారు. -
పైడిమాంబ పల్లకిలో భక్తి తరంగాలు
కంచరపాలెం: కంచరపాలెం పరిధిలోని రామ్మూర్తి పంతులుపేటలో వెలసిన పైడిమాంబ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ‘తొలేళ్ల సంబరం’ సోమవారం కన్నుల పండువగా సాగింది. గౌరీ సేవా సంఘం గ్రామాధ్యక్ష, కార్యదర్శులు మద్దాల అప్పారావు, శరకం మూర్తిల సారథ్యంలో జరిగిన ఈ వేడుకకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. అమ్మవారి ప్రతిమల ఊరేగింపు ప్రభుత్వ మహిళా కళాశాల ప్రాంగణం నుంచి ప్రారంభమై, జ్ఞానాపురం, డాబాగార్డెన్స్, జగదాంబ కూడలి, కాన్వెంట్ కూడలి మీదుగా సాగి తిరిగి అమ్మవారి మూలవిరాట్ సన్నిధికి చేరుకుంది. ఈ శోభాయాత్రలో సుమారు 315 ప్రత్యేక అమ్మవారి ప్రతిమలు కనువిందు చేశాయి. ఎమ్మెల్యే పి. గణబాబు, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఈ ఉత్సవాన్ని ప్రారంభించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఊరేగింపులో భక్తులు ప్రదర్శించిన వివిధ వేషధారణలు, నేలవేషాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉత్సవానికి ఎలాంటి ఆటంకం కలగకుండా కమిటీ సభ్యులు పర్యవేక్షించగా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మంగళవారం అమ్మవారి ప్రధాన ఉత్సవం అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో కాండ్రేగుల వెంకటరావు, చదరం భాను, సూరిశెట్టి కిషోర్, సదరం సురేష్, కాండ్రేగుల వెంకట సుకుమార్, పెంటకోట సత్యనారాయణ, బొడ్డేటి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి ఘటంతో సీపీ శంఖబ్రత బాగ్చి -
రాయగడలో షికారు
మహిళా సిబ్బందితో పట్టాలెక్కిన రాయగడ ఎక్స్ప్రెస్తాటిచెట్లపాలెం: వాల్తేర్ డివిజన్ పరిధిలో గత వారం రోజులుగా ఎంతో ఉత్సాహంగా జరుగుతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాలు సోమవారంతో ముగిశాయి. ఈ ముగింపు వేడుకల సందర్భంగా విశాఖ నుంచి బయలుదేరిన గుంటూరు–రాయగడ (17243) ఎక్స్ప్రెస్ రైలును మహిళా సిబ్బంది మాత్రమే నిర్వహించడం విశేషం. వాల్తేర్ డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బొహ్రా..ఈకోఆర్ డబ్ల్యూవో ప్రెసిడెంట్ జ్యోత్స్న బొహ్రాలు కలిసి ఈ ప్రత్యేక రైలును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం శ్రీనివాస కల్యాణ మండపంలో జరిగిన ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఆర్ఎం మాట్లాడుతూ వాల్తేర్ డివిజన్ మహిళా సాధికారతలో అగ్రగామిగా నిలుస్తోందని కొనియాడారు. ప్రస్తుతం ఈ డివిజన్ పరిధిలో సుమారు 1,600 మంది మహిళా సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని ఆయన తెలిపారు. ట్రాక్ మెయింటనెన్స్, ట్రైన్ ఆపరేషన్స్, లోకో ఆపరేషన్స్, టికెట్ తనిఖీలు, కార్యనిర్వాహక బాధ్యతల వంటి కీలక విభాగాల్లో మహిళలు అద్భుతమైన ప్రతిభను కనబరుస్తున్నారని, ముఖ్యంగా మహిళలతో కూడిన లోకోమోటివ్ షెడ్ను విజయవంతంగా నిర్వహిస్తున్నామని ఆయ న ప్రశంసించారు. ఈ క్రమంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే వుమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ (ఈకోఆర్ డబ్ల్యూవో) చేస్తున్న విశేష కృషిని ఆయన అభినందించారు. ఈ వేడుకల సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక సెమినార్లో నిపుణులు పలు అంశాలపై అవగాహన కల్పించారు. కేంద్ర విద్యాలయ అధ్యాపకురాలు ప్రగతి ప్రజాపతి ‘పిల్లల మనస్తత్వం–పనిచేసే మహిళల మార్గదర్శి’ అనే అంశంపై ప్రసంగించగా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి భాగ్యశ్రీ అనంత్ బార్బదికర్ సైకాలజీ, ఒత్తిడి నియంత్రణ పద్ధతులపై వివరించారు. అలాగే డివిజనల్ రైల్వే హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భాషిణి ప్రియంక మహిళల ఆరోగ్యం తీసుకోవాల్సిన పోషకాహారంపై విలువైన సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎంలు ఈ. శాంతారామ్ (ఇన్ఫ్రా), కె. రామారావు (ఆపరేషన్స్), ఈకోఆర్ డబ్ల్యూవో వైస్ ప్రెసిడెంట్ గాయత్రి శాంతారామ్, సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ జూసుఫ్ కబీర్ అన్సారి, ఇతర శాఖాధికారులు, మహిళా సిబ్బంది, క్రీడాకారులు, ఆర్పీఎఫ్, సివిల్ డిఫెన్స్ సభ్యులు పాల్గొన్నారు. -
అరలక్ష ఇచ్చుకో.. సర్కారు భూమి దోచుకో!
సాక్షి, విశాఖపట్నం : పేదలపై ప్రతాపం చూపిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. తమ నేతల కబ్జా కాండకు మాత్రం కొమ్ముకాస్తోంది. టీడీపీ ప్రభుత్వం అండతోనే భూ కబ్జాలు పెచ్చరిల్లుతున్నాయనడానికి పెందుర్తి మండలం చీమలాపల్లి ప్రాంతంలో ఆక్రమణల ఘటనే ప్రధాన ఉదాహరణ. చీమలాపల్లిలో ప్రభుత్వ భూమి ఆక్రమణల విషయంలో జరుగుతున్న వివక్షపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్వే నెంబర్ 24లోని 17.68 ఎకరాల బంజరు భూమిని దేవదాయ శాఖది కాదని రికార్డులు స్పష్టం చేస్తున్నా, అధికారులు పేదల పాకలను మాత్రం బుల్డోజర్లతో కూల్చివేసి వారిని రోడ్డున పడేశారు. అదే సమయంలో, అధికార పార్టీ నేతల అండతో వెలిసిన అక్రమ షెడ్లను మాత్రం అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టాన్ని అందరికీ సమానంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. భూములపై కన్నేసి.. కబ్జా చేసి.! చీమలాపల్లిలో ఎకరం భూమి మార్కెట్ ధర రూ.25 కోట్లకు పైమాటే ఉంటుంది. అంటే మొత్తం దాదాపు 18 ఎకరాల ప్రభుత్వ భూమి విలువ రూ.450 కోట్ల వరకూ ఉంటుంది. వేపగుంట జంక్షన్కు కూత వేటు దూరంలో ఉన్న ఈ విలువైన భూముల్లో పేదల గుడిసెలు చూసిన కూటమి నేతల కన్ను ఆ స్థలంపై పడింది. వెంటనే గుడిసెలు వేసిన పేదల్ని బెదిరింపులకు గురి చేశారు. దీనిపై రెవెన్యూ అధికారులకు జనసేన, టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ రెవెన్యూ అధికారులు నెల రోజుల క్రితం హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై పీవోడబ్ల్యూ నేతలు పోరాటం చేశారు. ఆర్డీవోకి అర్హులైన పేదలే అక్కడ నివసిస్తున్నారంటూ వారి జాబితా ఇవ్వడంతో.. రెవెన్యూ అధికారులు వాటి జోలికి వెళ్లలేదు. ఇదే అదనుగా జనసేన, టీడీపీ నేతలు అక్కడ కబ్జా పర్వాన్ని ప్రారంభించారు. రెండు సెంట్ల స్థలానికి రూ.60 వేలు పేదలు వేసిన పాకలకు ఎదురుగానే కూటమి నేతల కనుసన్నల్లో కబ్జా పర్వం మొదలైంది. పక్కనే ఉన్న గెడ్డను మూసేశారు. రూ.60 వేలు చెల్లిస్తే.. రెండు సెంట్ల భూమి మీ సొంతం అంటూ ప్రచారం మొదలు పెట్టి.. ఆక్రమణలకు తెర తీశారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే 200 మంది నుంచి వసూలు చేసేసి.. పేదల గుడిసెలకు ఎదురుగానే పాకలు వేయించారు. టీడీపీ, జనసేన నేతలతో పాటు ఓ రౌడీ షీటర్ కూడా ఈ ఆక్రమణల వ్యవహారంలో ఎంటర్ అయ్యారు. సదరు రౌడీ షీటర్ కూడా ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ.50 వేలు చొప్పున 50 మంది నుంచి వసూలు చేసి.. గుడిసెలు వేయించాడు. తర్వాత వీరంతా కలిసి ఒక వింగ్గా ఏర్పడి.. కబ్జా దందా కొనసాగించారు. దీనిపై పేదలంతా ఫిర్యాదు చేసినా.. రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. దీని వెనుక జిల్లాలో ఉన్న ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని, అక్కడ ఉన్న పేదల పాకలకే ప్రమాదం తప్ప.. వీరి గుడిసెలకు ఉండదంటూ రెవెన్యూ సిబ్బంది హెచ్చరించారు. పేదలపై ప్రతాపం.. కూటమి నేతలకు అభయహస్తం శనివారం సాయంత్రం.. పెందుర్తి తహసీల్దార్ వెంకట అప్పారావు.. రెవెన్యూ అధికారులు, పోలీసులతో గుడిసెల వద్దకు చేరుకున్నారు. పేదలు వేసిన గుడిసెల్ని జేసీబీల సాయంతో నేలమట్టం చేశారు. పేదలంతా ప్రభుత్వ దౌర్జన్యకాండను అడ్డుకోడానికి ప్రయత్నించారు. అడ్డుకోడానికి ప్రయత్నించిన ప్రజా సంఘాల ప్రతినిధులను పోలీసులు అరెస్ట్ చేసి.. బలవంతంగా అక్కడి నుంచి తరలించేశారు. అదే ప్రాంతంలో జనసేన, టీడీపీ నేతల కనుసన్నల్లో సాగుతున్న భూ దందా వైపు మాత్రం.. రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడలేదు. కూటమి నేతలు కబ్జా చేసిన వాటికి రెవెన్యూ అధికారులు అభయహస్తం ఇచ్చినట్లుగా.. వదిలేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం స్పందించి, కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని, నిరుపేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పేదల గుడిసెలను కూల్చివేయడం దారుణం అనేక కష్ట నష్టాలకోర్చి నిర్మించుకున్న పేదల గుడిసెలను పోలీసుల సహకారంతో రెవెన్యూ అధికారులు కూల్చడం దారుణం. కంపెనీల పేరుతో కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాలను ఎకరం రూపాయి చొప్పున చంద్రబాబు ప్రభుత్వం బడాబాబులకు కట్టబెడుతోంది. ఇదే సమయంలో పేదల విషయంలో ఇలా వ్యవహరించడం దారుణం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలను కోల్పోయిన ప్రతి కుటుంబానికి రెండు సెంట్లు భూమిని అందించి పునరావాసం కల్పించాల్సిందే. – జె.రవి, భారత నాస్తిక సమాజం జాతీయ సమన్వయకర్త ఇదెక్కడి అన్యాయం పేదలకు ప్రభుత్వం ఇళ్లు ఇవ్వదు. నిరుపేదల విషయంలో ప్రభుత్వం ఇలా వ్యవహరించడం తగదు. ఎన్నో రోజులుగా ఈ స్థలంలో సుమారు వందల కుటుంబాలు నివాసం ఏర్పరచుకొని జీవనం సాగిస్తున్నారు. అలాంటి పేదల నివాసాలను కూల్చడం అమానుషం. వెంటనే వారికి పునరావాసం కల్పించాలి. దీనిపై తహసీల్దార్తో చర్చించాం. ఆర్డీవోతో కూడా మాట్లాడాం. అయినా పట్టించుకోలేదు. బాధితులందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిందే. –ఎం.లక్ష్మి, ప్రగతి శీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు -
కబ్జాలకు చరమ‘గీతం’ పాడండి
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ ఎంపీ భరత్కు చెందిన గీతం యూనివర్సిటీ భూ ఆక్రమణలపై జనాగ్రహం కట్టలు తెంచుకుంది. దురాక్రమణకు తెగబడిన ప్రభుత్వం గీతం వర్సిటీ నుంచి భూములను వెనక్కి తీసుకోవాల్సిందేనంటూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రజలు విశాఖపట్నం కలెక్టరేట్కు భారీగా పోటెత్తారు. టీడీపీ ఎంపీ భరత్ దురాగతాలపై గళమెత్తారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి జీవో రాకముందే రూ.5 వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిలో లెవెలింగ్ పనులు చేపట్టిన వర్సిటీ యాజమాన్యంపై ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ అండతోనే ఎంపీ భరత్ చెలరేగిపోతున్నారని మండిపడ్డారు. తక్షణం భూములు వెనక్కి తీసుకోవాలని భారీగా గ్రీవెన్స్కు ఫిర్యాదులు తీసుకొచ్చారు. దీంతో కౌంటర్లు కిక్కిరిసిపోయాయి. ఏం చేయాలో పాలుపోని అధికారులు కంప్యూటర్లు పనిచేయడం లేదంటూ మీనమేషాలు లెక్కించారు. పోలీసులు ప్రజలపై జులుం ప్రదర్శించేందుకు యత్నించారు. దీంతో అధికారుల తీరుకు నిరసనగా ప్రజలు ఒక్కసారిగా నినాదాలు చేశారు. కలెక్టరేట్ ముందు వైఎస్సార్సీపీ నేతలతో కలిసి బైఠాయించారు. ఫలితంగా జన నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఒకానొక దశలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫిర్యాదులు తీసుకోవాల్సిందేనని వైఎస్సార్సీపీ నేతలు అధికారులను నిలదీశారు. దీంతో దిగొచ్చిన అధికారులు ఎట్టకేలకు 200 మంది నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. భరత్పై ల్యాండ్ గ్రాబింగ్ కేసు నమోదు చేయాలి : కేకే రాజు ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్ అండతోనే విశాఖ టీడీపీ ఎంపీ భరత్ భూ ఆక్రమణలకు పాల్పడుతున్నాడని విమర్శించారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి జీవో రాకముందే రూ.5 వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేసి లెవెలింగ్ పనులు చేపడుతున్న భరత్పై ల్యాండ్ గ్రాబింగ్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశాఖ జిల్లాలో జరిగిన భూ ఆక్రమణలపై చర్యలు తీసుకుని సుమారు 2 వేల ఎకరాల భూమిని సంరక్షించిందని గుర్తుచేశారు. ఇందులో భాగంగా గీతం ఆక్రమించిన రూ.5 వేల కోట్ల విలువైన 54.79 ఎకరాలకు పైగా భూమిని అప్పట్లో స్వాధీనం చేసుకుని అందులో ప్రభుత్వ భూమి అని బోర్డులు ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఇంకా 14 ఎకరాలకుపైగా భూమిపై కోర్టులో కేసు పెండింగ్లో ఉందని, తుది తీర్పు వచ్చే వరకు ఎలాంటి చర్యలూ చేపట్టవద్దని కోర్టు స్టేటస్ కో ఇచ్చిందని వివరించారు. అయినప్పటికీ అధికారుల అండతో బోర్డులు పీకేసీ గీతం యాజమాన్యం లెవెలింగ్ పనులు చేపట్టడం ఏమిటని కేకే రాజు మండిపడ్డారు. బోర్డులు తొలగించిన గీతం యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తప్పు తెలుసుకుని భూములను ప్రభుత్వానికి స్వాధీనం చేయాల్సిన ఎంపీ.. తమ తాతల కాలం నుంచి ఆక్రమించామని, తమకు ఇచ్చేయాలని మీడియా ముందే నిస్సిగ్గుగా చెప్పడం గర్హనీయమన్నారు. గీతం భూకబ్జాపై కలెక్టరేట్లో గ్రీవెన్స్కు ప్రజలు భారీగా తరలివస్తే అధికారులు ఫిర్యాదులను స్వీకరించకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. పోలీసుజులుం ద్వారా తమ పోరాటాన్ని అణిచివేయాలని యత్నిస్తున్నారని కేకే రాజు మండిపడ్డారు. గీతం భూకబ్జాపై ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. గీతం యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు టీడీపీ కూటమి నాయకులకు బానిసలు కాదని ఆయన ధ్వజమెత్తారు. భూములను పరిరక్షించాలి : వాసుపల్లి గణేశ్మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ... టీడీపీ నాయకుల అవినీతి కేంద్రానికి మాయని మచ్చగా మిగులుతుందని హెచ్చరించారు. తక్షణం ఎంపీ భరత్ను జైల్లో పెట్టి ప్రభుత్వ భూములను పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గాల సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, దేవాన్రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. -
ఆనంద గీతం
ఆనాటి ఆ స్నేహం..అల్లిపురం: ఆనాటి ఆ స్నేహం ఆనందగీతం.. ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం.. ఈ నాడు ఆ హాయి లేదేల నేస్తం.. ఆ రోజులు మునుముందిక రావేమిరా.. అంటూ పోర్టు హైస్కూల్ 1983–84 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం సందడి చేశారు. నాలుగు దశాబ్దాల కిందట విడిపోయిన స్నేహితులంతా ఒక్కచోట చేరడంతో ఆరు పదుల వయసులోనూ వారంతా 15 ఏళ్ల పిల్లల్లా మారిపోయారు. ఉదయం 9 గంటల నుంచి నగరంలోని ఓ హోటల్ ప్రాంగణం పాత స్నేహితుల పలకరింపులతో కోలాహలంగా మారింది. ‘ఏమే రమణమ్మ.. నువ్వు అలానే ఉన్నావే.. ఏమీ మారిపోలేదు!’, ‘ఆ నువ్వు పార్వతివేనా.. గుర్తు పట్టలేకున్నానే.. ఎలా ఉన్నావు?’, ‘బాగున్నావా.. పిల్లలు ఎంతమంది.. ఏం చేస్తున్నారు.. ఎక్కడ ఉంటున్నారు?’, ‘ఆగండే మీ సోదేనా.. నన్నూ పట్టించుకుంటారా?’, ‘అవును.. నువ్వు పూర్ణిమవే కదా.. మీకు ఎవ్వరూ కనిపించడం లేదు?...’ ఇలా ఆ హాలంతా ఉత్సాహభరితమైన మాటలతో నిండిపోయింది. ఇంతలో ‘రండమ్మా రండి.. మీ కోసమే చూస్తున్నాం.. నేనేనండీ లింగం శ్రీనివాస్ని..’ అంటూ పాత మిత్రుల పలకరింపులతో ఆ ప్రాంతమంతా ఆత్మీయతలు, అనురాగాలతో పండగ వాతావరణాన్ని తలపించింది. స్నేహితులంతా కబుర్లలో మునిగిపోయిన సమయంలో.. ‘అక్కడ భారతదేశానికి ఉత్తరాన ఏమిటున్నాయి?’ అంటూ ఓ సుపరిచితమైన స్వరం వినిపించింది. వారంతా ఒక్కసారిగా అటు తిరిగి చూసి, ‘అరె.. మా సోషల్ టీచర్.. నమస్కారం మేడమ్’ అంటూ గౌరవంగా చుట్టుముట్టారు. పోర్టు హైస్కూల్ పూర్వ విద్యార్థులు సత్యనారాయణ, లింగం శ్రీనివాస్, మరికొంత మంది కలసి అప్పటి విద్యార్థుల చిరునామాలు, ఫోన్ నంబర్లు సేకరించి అందరినీ ఒక్కటిగా చేర్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అప్పటి తమకు ఓనమాలు నేర్పిన ఉపాధ్యాయులు విజయకుమారి, పద్మావతి, వసుంధరాదేవిలతో పాటు మహిళా స్నేహితులను ఘనంగా సత్కరించుకున్నారు. ఆటలు, పాటలతో మొదలైన ఈ కలయికలో అందరూ తమ ప్రస్తుత వృత్తి, కుటుంబ నేపథ్యాలను పరిచయం చేసుకున్నారు. ఒకరి ఫోన్ నంబర్లు మరొకరు పంచుకున్నారు. మధ్యాహ్నం సహపంక్తి భోజనాలు చేసి సాయంత్రం 4 గంటల వరకు ఉత్సాహంగా గడిపారు. స్నాక్స్, టీలు తీసుకుంటూ ఎన్నో అపురూపమైన జ్ఞాపకాలను మూటగట్టుకుని.. మళ్లీ కలుద్దామన్న ఆశతో ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకున్నారు. మళ్లీ ఆ రోజులు గుర్తొచ్చాయి పదో తరగతి తర్వాత తలో దారి పట్టినా, మళ్లీ నాలుగు దశాబ్దాల తర్వాత ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా, ఈ ఆదివారం నాకు ఎన్నో మధుర స్మృతులను మిగిల్చింది. ప్రస్తుతం నేను జిల్లా కోర్టులో కాపీయింగ్ సెక్షన్ సూపరింటెండెంట్గా విధులు నిర్వర్తిస్తున్నాను. – ఐ.రమణమ్మ, సూపరింటెండెంట్, కాపీయింగ్ సెక్షన్, జిల్లా కోర్టు -
● మురిసి
మహిళా దినోత్సవం.. ఆపై టీ20 వరల్డ్ కప్ సమరం.. ఈ ఆదివారం క్రీడాభిమానులకు, మహిళలకు అద్భుతమైన అనుభూతిని మిగిల్చింది. ఉదయం నుంచి నగరవ్యాప్తంగా మహిళా శక్తిని కీర్తిస్తూ సత్కారాలతో సందడిగా గడిపిన విశాఖ.., సాయంత్రం కాగానే టీవీల ముందు నిశ్శబ్దంగా వేచిచూసింది. క్రీజులో భారత బ్యాటర్లు పరుగుల వరద పారించి, బౌండరీల మోత మోగిస్తుంటే సాగర తీరం ఉప్పొంగింది. ఏకంగా 255 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించి, ప్రత్యర్థిని కట్టడి చేసిన టీమిండియా చివరకు విశ్వవిజేతగా నిలిచింది. ఈ కప్పు విజయం కేవలం క్రీడా విజయం మాత్రమే కాదు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారతీయ మహిళా లోకానికి మన క్రికెటర్లు అందించిన అపురూపమైన కానుకగా నిలిచింది. నగరంలో పలు చోట్ల బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేసుకుని యువతరం మ్యాచ్ను వీక్షించింది. – ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
● మెరిషి
మద్దిలపాలెం: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఏయూ కన్వెన్షన్ సెంటర్లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ పాల్గొని మహిళా సాధికారతపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఆనందపురం మండలం గిడిజాల వద్ద 50 ఎకరాల్లో ప్రత్యేక ఆర్థిక మండలిని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. కలెక్టర్ హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి రంగంలోనూ మహిళల భాగస్వామ్యం 50 శాతానికి పెరగాలని ఆకాంక్షించారు. జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, జీసీసీ ఎండీ శోభిక, అంధ మహిళా క్రికెటర్ పి. కరుణ కుమారిని సత్కారించారు. ప్రత్యేక ఉప కలెక్టర్ శేషశైలజ, జిల్లా కోఆపరేటివ్ అధికారిణి ప్రవీణ, జూ క్యూరేటర్ మంగమ్మ, సచివాలయాల జిల్లా కోఆర్డినేటర్ ఉషారాణి, జీవీఎంసీ అదనపు కమిషనర్ సత్యవేణి, ఐసీడీఎస్ పీడీ రామలక్ష్మి తదితర అధికారులతో పాటు ఆయా రంగాల్లో ప్రతిభ చూపిన 59 మంది మహిళా అధికారులకు, సిబ్బందికి అవార్డులు అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ లక్ష్మీపతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సత్యపద్మ, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ కవిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను అతిథులు సందర్శించారు. కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, డీసీపీలు మేరీ ప్రశాంతి, మణికంఠ చందోలు, లతా మాధురి పాల్గొన్నారు. -
కలలో కూడా అనుకోలేదు
స్కూల్ డేస్లో విడిపోయిన మేం, మళ్లీ జీవితంలో ఇలా కలుసుకుంటామని అనుకోలేదు. పాత స్నేహితులను కలవడం మాటల్లో చెప్పలేని సంతోషాన్నిచ్చింది. ఈ ఆత్మీయ బంధం ఇలాగే కొనసాగాలని, మళ్లీ మళ్లీ కలవాలని కోరుకుంటున్నాను. – డి.పూర్ణిమ, విశాఖపట్నం రెక్కలు కట్టుకుని వాలిపోయాను నాటి నేస్తాలను కలుసుకునేందుకు సింగపూర్ నుంచి రెక్కలు కట్టుకుని వాలిపోయాను. 13 ఏళ్లుగా సింగపూర్లో యోగా టీచర్గా స్థిరపడినప్పటికీ, నా మనసంతా విశాఖలోని స్కూల్ జ్ఞాపకాల చుట్టూనే తిరుగుతుంటుంది. ఇవాళ నా స్నేహితులందరినీ ఒకేచోట చూసుకోవడం నా జీవితంలో మర్చిపోలేని రోజు. – ఎస్.విజయపార్వతి, యోగా టీచర్, సింగపూర్ -
ముందస్తు గుర్తింపుతోనే గ్లకోమాకు చెక్
ఏయూక్యాంపస్: ప్రపంచ గ్లకోమా వారోత్సవాలను పురస్కరించుకుని ఎల్.వి.ప్రసాద్ నేత్ర వైద్యశాల ఆధ్వర్యంలో ఆదివారం ఆర్.కె.బీచ్రోడ్డులో అవగాహన నడక నిర్వహించారు. కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు సాగిన ఈ ర్యాలీలో గ్లకోమా నిపుణులు డాక్టర్ శివాని కొడాలి మాట్లాడారు. కంటిలో ఒత్తిడి పెరగడం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యే గ్లకోమా అని వివరించారు. ఇది కంటిలోని ఆప్టిక్ నరాలను దెబ్బతీసి శాశ్వత అంధత్వానికి దారితీస్తుందని హెచ్చరించారు. వ్యాధిని గుర్తించడంలో జాప్యం జరగడం వల్ల చాలా మంది చూపు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కళ్లు పెద్దవిగా ఉండటం, చూపు మసకబారడం, కళ్లు ఎర్రబడటం, నీళ్లు కారడం, వెలుతురును చూడలేక కళ్లు మూసుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే నేత్ర వైద్యులను సంప్రదించాలని సూచించారు. సరైన అవగాహన లేకపోవడం వల్లే గ్లకోమా ప్రమాదకరంగా మారుతోందని, ఇది లక్షలాది మందిలో కోలుకోలేని దృష్టి లోపానికి దారితీస్తోందని పేర్కొన్నారు. వ్యాధిని ముందస్తుగా గుర్తించడం, నివారణ, సకాలంలో చికిత్స తీసుకోవడం అత్యంత కీలకమని చెప్పారు. మన దేశంలో సుమారు 12 మిలియన్ల మంది గ్లకోమాతో బాధపడుతున్నారని, 2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఈ రోగుల సంఖ్య 76 మిలియన్ల నుంచి 111.8 మిలియన్లకు పెరుగుతుందని అంచనాలు చెపుతున్నాయని వివరించారు. ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. -
జగన్ హయాంలోనే మహిళా సాధికారత
సాక్షి, విశాఖపట్నం: వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా పాలన సాగిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. ఆదివారం మద్దిలపాలెంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేకే రాజుతో పాటు సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్కుమార్, మొల్లి అప్పారావు, తిప్పల దేవన్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై, మహిళా నేతలతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మహిళా కార్పొరేటర్లను, నియోజకవర్గ, వార్డు స్థాయి మహిళా అధ్యక్షులను, సీనియర్ మహిళా నాయకులను ఘనంగా సన్మానించారు. అనంతరం మహిళలకు నిర్వహించిన ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రతి సంక్షేమ పథకం నిధులు నేరుగా మహిళల ఖాతాల్లోనే జమ అయ్యాయని, మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే దూరదృష్టితోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చా రన్నారు. రాజకీయంగానూ నామినేటెడ్ పదవుల్లో 50 శాతానికి పైగా మహిళలకే అవకాశం ఇచ్చి, చట్టసభలు, మంత్రి పదవుల్లో వారికి పెద్దపీట వేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరుతో మహిళలను మోసం చేసిందని, మహిళలు ఆగ్రహిస్తే ఏ ప్రభుత్వమైనా కూలిపోక తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వానికి మహిళలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్, సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, దేవన్రెడ్డి మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల కంటే అధికంగా మహిళలకు వైఎస్సార్సీపీ అవకాశాలు కల్పించిందన్నారు. తల్లికి వందనం, ఉచిత సిలిండర్ల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం అడ్డదారిలో అధికారంలోకి వచ్చి ఇప్పుడు మహిళలను వంచిస్తోందని విమర్శించారు. పేడాడ రమణికుమారి మాట్లాడుతూ.. దిశా చట్టం ద్వారా మహిళా భద్రతకు భరోసా కల్పించడంతో పాటు, ఇళ్ల పట్టాలను సైతం మహిళల పేరిటే అందించిన గొప్ప మనసు వైఎస్ జగన్మోహన్రెడ్డిదని కొనియాడారు. వేడుకల్లో మాజీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, ఎస్ఈసీ సభ్యుడు సతీష్ వర్మ, కార్పొరేటర్లు శశికళ, సాడి పద్మారెడ్డి, మువ్వల లక్ష్మీ సురేష్, మహిళా నేతలు మంచా నాగమల్లేశ్వరి, శ్రీదేవి వర్మ, పిల్లా సుజాత, పల్లా చినతల్లి, జి.వి.రమణి, శిరీష, బంగారమ్మ, ప్రశాంతి పట్నాయక్, రజని, సూరాడ వెంకటలక్ష్మి, ఎస్.వి.లక్ష్మి, పార్వతీ, రాధా, భాను, ఎస్.వి లక్ష్మి, సాగరిక, జోషీల, దమయంతి, ఈశ్వరి, జియ్యాని సత్య, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. -
బావామరదళ్ల ఎమోషన్..‘బ్యాండ్మేళం’
డాబాగార్డెన్స్: నగరంలో ‘బ్యాండ్ మేళం’ చిత్ర బృందం సందడి చేసింది. మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆదివారం చిత్ర యూనిట్ మీడియా మీట్ నిర్వహించింది. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ బావ–మరదళ్ల ప్రేమకథకు కోన వెంకట్ ప్రొడక్షన్, మ్యాంగో మాస్ మీడియా సంయుక్త సమర్పణలో నిర్మాణం జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత కోన వెంకట్ మాట్లాడుతూ, విశాఖ తనకు రెండో స్వగ్రామం అని, తన కుమార్తెలు కావ్య, శ్రావ్య ఈ చిత్రంతో నిర్మాతలుగా పరిచయమవుతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. సంగీతాన్ని ప్రేమించే ‘యాదగిరి’ అనే యువకుడి పాత్రలో హీరో హర్ష రోషన్, కుటుంబ భావోద్వేగాల నేపథ్యంలో హీరోయిన్ శ్రీదేవి ప్రేక్షకులను అలరించనున్నారని చిత్ర యూనిట్ పేర్కొంది. వినోదానికి, ఎమోషన్లకు ప్రాధాన్యతనిస్తూ దర్శకుడు సతీష్ జవ్వాది ఈ చిత్రాన్ని తెరకెక్కించారని, కై ్లమాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని వారు ధీమా వ్యక్తం చేశారు. -
సామాన్యుడిపై భారమా?
మద్దిలపాలెం: కేంద్రం పెంచిన వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.60, వాణిజ్య సిలిండర్ ధర రూ.114లను తక్షణమే రద్దు చేయాలని సీపీఎంజిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు, కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు డిమాండ్ చేశారు. గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్లతో నిరసన చేపట్టారు. పిఠాపురం కాలనీలోని సీపీఎం కార్యాలయం నుంచి మద్దిలపాలెం జంక్షన్ వరకు ఈ ప్రదర్శన కొనసాగింది. ఈ సందర్భంగా గంగారావు మాట్లాడుతూ.. అమెరికా, ఇజ్రాయెల్ కూటమి ఇరాన్పై యుద్ధానికి దిగడం వల్లే వంట గ్యాస్ ధరలు పెరిగాయన్నారు. రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంకేతాలివ్వడా న్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రష్యా నుంచి చమురు కొనుగోలుపై అమెరికా ఆంక్షలు విధించడం కూడా ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమన్నారు. పార్టీ జిల్లా నేతలు ఆర్.కె.ఎస్.వి. కుమార్, వి.కృష్ణారావు, ఎం.సుబ్బారావు, వి.నరేంద్ర కుమార్, వెంకటరావు, అప్పలరాజు పాల్గొన్నారు. గ్యాస్ ధరల పెంపుపై సీపీఎం నిరసన -
ఒమేగాలో ఘనంగా మహిళా దినోత్సవం
ఆరిలోవ: హెల్త్ సిటీలోని ఒమేగా ఆస్పత్రిలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఆస్పత్రి మహిళా వైద్యులతో కలిసి ఎండీ డాక్టర్ బి.రవిశంకర్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సంఘ సేవకురాలు శేషుమాంబతో పాటు కార్గిల్ యుద్ధంలో మృతి చెందిన వీర సైనికుల కుటుంబాలలో మహిళలను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు సామాజిక, రాజకీయంగా, ఆర్థిక, విద్యా రంగాల్లో బాగా అభివృద్ధి చెందుతున్నారన్నారు. మహిళలకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం శేషమాంబ మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో సీ్త్రలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నారు. వాటిని సీ్త్రలు సమర్ధవంతంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. మహిళలు ఆర్యోగం కాపాడుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ శుభకర్, డాక్టర్ నీలిమ పాల్గొన్నారు. -
నూతన ప్రాంగణంలోకి ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్
డాబాగార్డెన్స్: ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ విశాఖపట్నం ఏరియా కార్యాలయం నూతన ప్రాంగణంలో మారింది. ద్వారకానగర్ ఇస్నార్ ప్లాజా నుంచి తిక్కన రోడ్లో గల జీవన్ సమృద్ధి మొదటి అంతస్తులోకి మారిన ఈ కార్యాలయాన్ని సంస్థ సౌత్ ఈస్ట్రన్ రీజియన్ రీజనల్ మేనేజర్ పి.సూర్యనారాయణరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా రూ.530 కోట్ల లక్ష్యంతో ఈ శాఖ పనిచేస్తోందని తెలిపారు. దీనిని మరింతగా అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని సూచించారు. ఏరియా మేనేజర్ వినయ్ వైభవ్ మాట్లాడుతూ వ్యాపార బృందాలు నగరంలో పర్యటించి ఇళ్ల వద్దకే సేవలు అందించేలా కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎల్ఐసీ ఆఫ్ ఇండియా విశాఖ డివిజనల్ మేనేజర్ శారదప్రసాద్దాస్, మార్కెటింగ్ మేనేజర్ వి.దివాకరరావు, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ అసిస్టెంట్ రీజనల్ మేనేజర్ ఎం.దినేష్, విశాఖ క్లస్టర్ హెడ్ సి.అరుణ్, ఆపరేషన్స్ మేనేజర్ పి.హరినారాయణ పాల్గొన్నారు.


