Visakhapatnam
-
యాదవ ఓట్లతో గెలిచి యాదవులకే వెన్నుపోటు
● ఆ ఇద్దరు యాదవ ఎమ్మెల్యేలు సొంత సామాజికవర్గంలో ముసలం సృష్టిస్తున్నారు ● యాదవ మేయర్ను దించేందుకుప్రయత్నిస్తే జీరోలుగా మిగులుతారు ● యాదవ ఐక్య వేదిక జాతీయ అధ్యక్షుడు ఆల్సి అప్పలనారాయణ యాదవ్ మహారాణిపేట : యాదవ కులంలో ముసలం సృష్టించి, యాదవ వర్గానికి చెందిన గొలగాని హరి వెంకట కుమారిని జీవీఎంసీ మేయర్ పీఠం నుంచి దించేందుకు యాదవ ఎమ్మెల్యేలే ప్రయత్నించడం దౌర్భాగ్యమని యాదవ ఐక్య వేదిక జాతీయ అధ్యక్షుడు, టీఎన్టీయూసీ నేత ఆల్సి అప్పలనారాయణ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు ఎన్నికల్లో గెలిచే వరకు కులం కావాల్సి వచ్చిందని, గెలిచాక అదే కులాన్ని దెబ్బతీస్తున్నారని సోమవారం విడుదల చేసిన ఓ వీడియోలో ఆక్షేపించారు. వీరి తీరును యాదవులు, విశాఖ ప్రజలు ఛీదరించుకుంటున్నారని పేర్కొన్నారు. మూడు సార్లు పోటీ చేసి ఓడిపోయి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, యాదవుల్లో చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. రాజకీయ స్థిరత్వం కోసం యాదవులను పావులుగా ఉపయోగించుకుంటున్న ఇద్దరు ఎమ్మెల్యేలు భవిష్యత్తులో ఎందుకూ పనికి రాకుండా పోతారని, యాదవ జాతి వీరిని క్షమించదన్నారు. యాదవ వర్గానికి చెందిన మేయర్ను దించేందుకు బెహరా భాస్కరరావు, ముత్తంశెట్టి పద్మ తదితరులను వాడుకుంటున్నారని, ఇలాంటి పనులు చేస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకునే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. కేవలం 8 నెలల పదవి కోసం రాజకీయం చేస్తున్న ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు యాదవ కులాన్ని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. యాదవ కులాన్ని దెబ్బతీసేలా రాజకీయం చేయడం తగదని హితవుపలికారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన మేయర్ను గద్దె దించితే.. ఆ స్థానంలో మరో యాదవ సామాజిక వర్గానికి చెందిన వారినే కూర్చోబెట్టాలని డిమాండ్ చేశారు. -
క్షణక్షణం.. భయం భయం
● అనకాపల్లి జిల్లాలో రెట్టింపు సంఖ్యలో గుర్తింపులేని ఫైర్ క్రాకర్స్ యూనిట్లు ● ఇప్పటికే ఫార్మా ప్రమాదాలతో ఉక్కిరిబిక్కిరి ● ఇప్పుడు బాణసంచా పేలుడుతో మరింత ఆందోళన సాక్షి, విశాఖపట్నం: మందుగుండు సామగ్రికి అనకాపల్లి జిల్లా ఎంతో ప్రసిద్ధి. పెళ్లిళ్లు, అమ్మవారి పండగలు, ఇతర ఉత్సవాలకు బ్రాండెడ్ సంస్థలు బాణసంచాను అందించలేవు. అందుకే.. లోకల్గా ఉన్న తయారీ కేంద్రాలపై ఆధారపడుతుంటారు. ఇక్కడ జనం కోరిన విధంగా బాణసంచా తయారుచేస్తారు. పేల్చినప్పుడు ఏ రంగు రావాలి, ఎలాంటి సౌండ్ రావాలి, ఎలా దూసుకెళ్లాలి.. ఇలాంటి స్పెషల్ క్రాకర్స్ రూపొందిస్తారు. ఒక దుకాణంలో పనిచెయ్యడం.. అక్కడ ఎలా తయారు చేస్తున్నారో అవగాహన పెంచుకొని.. వేరే చోట తయారీ కేంద్రం పెట్టడం.. ఇలా జిల్లాలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. ఉమ్మడి విశాఖతోపాటు తూర్పు గోదావరి, విజయనగరం జిల్లాలోని ప్రాంతాలవారికీ అనకాపల్లి నుంచే బాణసంచా సరఫరా చేస్తారు. జిల్లాలో అనేక ప్రాంతాల్లో బాణసంచా తయారీ కేంద్రాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. మొత్తం 40 కేంద్రాలున్నట్టు అంచనా. కానీ.. ఇందులో లైసెన్సులు తీసుకొని నడుపుతున్నవి మాత్రం 21 మాత్రమే. మిగిలిన 19 దుకాణాలకు లైసెన్స్ లేదని తెలిసినా.. జిల్లా అగ్నిమాపకశాఖ అధికారులు, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ విభాగం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కారణం.. నెలనెలా వసూళ్ల పర్వం నడుస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తం 40 దుకాణాలున్నాయని చెబుతున్నప్పటికీ.. మరో 20 వరకూ తయారీ కేంద్రాలను గుట్టుచప్పుడు కాకుండా నడుపుతున్నారని తెలుస్తోంది. వీటి విషయంలోనూ ఎలాంటి తనిఖీలు చేపట్టడం లేదు. కనీస పరిశీలనలు శూన్యం.! దరఖాస్తు వచ్చిందా.. లైసెన్స్ ఇచ్చేశామా.. వదిలేశామా.. అనే రీతిలోనే బాణసంచా తయారీ దుకాణాల విషయంలో జిల్లా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఆ దుకాణంలో ఏం తయారు చేస్తున్నారు.? మోతాదుకు మించిన నిల్వలున్నాయా.? గోదాముల పరిస్థితేంటి అనేది పట్టించుకున్న పాపానపోలేదు. అంతేకాదు.. లైసెన్స్లు మంజూరు చెయ్యాలని కొందరు దుకాణదారులు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ దరఖాస్తుల్ని పెండింగ్లో ఉంచారే తప్ప.. ఆ దుకాణాల దగ్గరకు వెళ్లి.. వాటిని పరిశీలించిన దాఖలాలూ కనిపించడం లేదు. ఇక్కడ తయారీ కేంద్రాల పరిస్థితేంటో? కై లాసపట్నంలో ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తత నటిస్తూ హడావిడి చెయ్యడం మొదలు పెట్టారు. జిల్లాలోని అన్ని తయారీ కేంద్రాల్ని పరిశీలించేందుకు బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తుహిన్ సిన్హా ప్రకటించారు. ఏవైనా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తుంటే వాటిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ప్రమాదం జరిగిన విషయం దావానలంలా వ్యాపించడంతో.. మిగిలిన ప్రాంతాల ప్రజలు కూడా బిక్కుబిక్కుమంటున్నారు. రాంబిల్లి, దేవరాపల్లి, సబ్బవరం, అనకాపల్లి మండలా ల్లో ఈ తరహా తయారీ కేంద్రాలు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి. ఆయా ప్రాంతాల ప్రజలు తమ వద్ద ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇప్పటికే ఫార్మా పరిశ్రమల్లో నెలకో ప్రమాదం సంభవిస్తుండటంతో పరిసర ప్రాంత ప్రజ లు ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. తాజాగా.. బాణసంచా ప్రమాదం మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. నిబంధనలు బేఖాతర్ బాణసంచా తయారీ కేంద్రాల నిర్వహణకు కాలు ష్య నియంత్రణ మండలి, రెవెన్యూ, ఫైర్, పోలీస్ శాఖల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. పేలుడు పదార్థాల చట్టం 1908 ఎక్స్ప్లోజివ్ చట్టం ప్రకారం నిర్దిష్ట ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. భారీ పేలుడు సంభవించేందుకు ఆస్కారము న్న పదార్థాలను ప్రత్యేకంగా నిల్వ ఉంచాలి. తయారీదారులు ఫైర్ ఫైటింగ్ విషయాల్లో శిక్షణ తీసుకోవాలి. బాణసంచా దుకాణం వద్ద తయారీ ప్రదేశాలలో ప్రథమ చికిత్స కిట్లు తప్పనిసరిగా ఉండాలి. నాలుగు ఫైర్ సిలిండర్లు, నాలుగు బకెట్లు, నిమిషానికి 450 లీటర్ల కెపాసిటీ గల ఒక డీజిల్ పంపు, 25 వేల లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంకు ఉండాలి. అనుమతులకు మించి బాణసంచా సరుకులను తయారు చేయకూడదు. పరికరాలను ఉపయోగించేందుకు నలుగురు ఆపరేటర్లు ఉండాలి. కేంద్రం చుట్టూ రక్షణను ఏర్పాటు చేయాలి. తయారీ కేంద్రం దృఢంగా సిమెంటుతో నిర్మించాలి. తయారీ కేంద్రాలు నిబంధనలకు విరుద్ధంగా లాభార్జనే ప్రధానంగా వ్యవహరించడం ఎక్కువ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. -
గతంలో చేసిన సర్వే ప్రకారం.. మెట్రో ప్రాజెక్టుకు అవసరమైన భూమి వివరాలు
నాలుగు కారిడార్లకు అవసరమైన భూమి 118.86ఎకరాలు ప్రభుత్వ భూమి 106.66 ఎకరాలుప్రైవేట్ భూమి 11.7 ఎకరాలు కారిడార్–1కి అవసరమైన ప్రభుత్వ భూమి 78.94ఎకరాలు ప్రైవేట్ భూమి 7.08 ఎకరాలు కారిడార్–2కి అవసరమైన ప్రభుత్వ భూమి 1.36 ఎకరాలు ప్రైవేట్ భూమి 2.97 ఎకరాలుకారిడార్–3కి అవసరమైన ప్రభుత్వ భూమి 7.41 ఎకరాలు ప్రైవేట్ భూమి 0.90 ఎకరాలు ప్రైవేట్ భూమి 0.75 ఎకరాలు కారిడార్–4కి అవసరమైన ప్రభుత్వ భూమి 18.95ఎకరాలు -
అంబేడ్కర్ ఆశయాలు కొనసాగిస్తాం
రాజ్యసభ సభ్యుడు గొల్లబాబూరావు ● పార్టీ కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి మద్దిలపాలెం: పేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ అని రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు అన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో లేకుండా చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు. మద్దిల పాలెంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో బోని శివరామకృష్ణ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ గొల్ల బాబూరావు, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, పండుల రవీంద్రబాబు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. అనంతరం గొల్ల బాబూరావు మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయాలను వైఎస్ జగన్మోహన్రెడ్డి కొనసాగిస్తున్నారని తెలిపారు. అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబు ఒక్క పథకం కూడా అమలు చేయలేదని విమర్శించారు. ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, పండుల రవీంద్రబాబు మాట్లాడుతూ భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉండటానికి కారణం అంబేడ్కర్ రాసిన రాజ్యాంగమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్కుమార్, చింతలపూడి వెంకటరామయ్య, కార్యాలయ పర్యవేక్షకుడు రవిరెడ్డి, పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు జాన్ వెస్లీ, పేర్ల విజయ్ చందర్, పార్టీ ముఖ్య నాయకులు కొండా రాజీవ్ గాంధీ, రవిరాజు, ఫరూఖి, జహీర్ అహ్మద్, నడింపల్లి కృష్ణంరాజు, మొల్లి అప్పారావు, అల్లంపల్లి రాజబాబు, జిల్లా అధికార ప్రతినిధులు మంచా మల్లేశ్వరి, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు పేడాడ రమణి కుమారి, మారుతి ప్రసాద్, రాంరెడ్డి, సేనాపతి అప్పారావు, దేవరకొండ మార్కండేయులు, కొండా రెడ్డి, పార్టీ నాయకుల మధుసంపతి, పత్తిపాడు వెంకటలక్ష్మి, పతివాడ కనకరాజు, వానపల్లి ఈశ్వరరావు, పెండ్ర అప్పన్న తదితరులు పాల్గొన్నారు. -
డబ్బులెక్కడ
మెట్రోపై మొద్దు నిద్ర ● రూపాయి విదల్చకుండా ప్రాజెక్టుపై మీనమేషాలు ● కనీసం సర్వేకి నిధులు అడిగినా స్పందించని ప్రభుత్వం ● సర్వే కోసం అదనపు సిబ్బందిని కేటాయించని వైనం సాక్షి, విశాఖపట్నం: ఆర్థిక రాజధాని చేస్తామంటూ విశాఖపై ప్రేమ ఒలకబోస్తున్న కూటమి ప్రభుత్వం, కీలకమైన మెట్రో ప్రాజెక్టుపై మాత్రం నిర్లక్ష్యం వహిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. బయటకు బాహాటంగా ప్రకటనలు చేస్తున్నా.. వైజాగ్ మెట్రో ప్రాజెక్టు విషయంలో సర్కారు మొద్దు నిద్ర నటిస్తోంది. ఓవైపు భూ సేకరణకు రంగం సిద్ధం చేసి.. సర్వే పనులు మొదలుపెట్టాలంటూ అధికారులను ఆదేశించిన ప్రభుత్వం.. అవసరమైన నిధులు, సిబ్బందిని అడిగితే మీనమేషాలు లెక్కిస్తోంది. భూసేకరణకు రూ.882 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేశారు. కానీ ఇప్పటివరకూ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. పేపర్పై పరుగులు పెడుతున్న మెట్రో భూ సర్వే.. ప్రభుత్వ వైఖరితో అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో సర్వే ఎలా చేయాలన్న దానిపై జిల్లా అధికార యంత్రాంగం తర్జనభర్జన పడుతోంది. మరోసారి సర్వేకు ఆదేశాలు.. కానీ..! గతంలో చేసిన సర్వేలో 4 కారిడార్లలో మెట్రో స్టేషన్లు, 22 ఎట్ గ్రేడ్ పార్కింగ్లు, మల్టీలెవల్ పార్కింగ్ భవనాలు, రన్నింగ్ స్టేషన్లు, హనుమంతువాకలో మెయింటెనెన్స్ డిపో, ఇతర అవసరాలకు, పోర్టు భూమిలో ఆక్సిలరీ డిపో ఏర్పాటుకు 35.96 ఎకరాలు కలిపి మొత్తం 118.86 ఎకరాలు అవసరమని గుర్తించారు. ఇందులో ప్రైవేట్ భూమి కేవలం 11.7 ఎకరాలు మాత్రమే సేకరించాల్సి వస్తుందని.. మిగిలిన 106.66 ఎకరాలు ప్రభుత్వ భూమిని వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. కానీ కూటమి ప్రభుత్వం మెట్రోని మరింత జాప్యం చేసేందుకు భూ సర్వే చేయాలంటూ జిల్లా అధికారులను ఆదేశించింది. తొలి విడతలో 46 కి.మీ మేర కారిడార్ నిర్మాణం చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం భూ సేకరణకు రూ.882 కోట్ల వరకూ ఖర్చవుతుందని అంచనా వేశారు. మెట్రో కోసం యూనిఫైడ్ మెట్రోపాలిటిన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (యూఎంటీఎ)ని కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసింది. దీని సహకారంతో సర్వే చేపట్టాలని ఆదేశించినా జిల్లా అధికారులు అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. స్పెషలిస్ట్ సర్వేయర్లు అవసరం లేదంట మెట్రో రైలు ప్రాజెక్టు సర్వేకు స్పెషలిస్ట్ సర్వేయర్లు, సిబ్బంది అవసరమని జిల్లా అధికారులు పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ దృష్టికి తీసుకెళ్లారు. కానీ ప్రభుత్వం మాత్రం జిల్లాలో ఉన్న సర్వేయర్లతోనే పనికానివ్వాలని ఆదేశించడం గమనార్హం. మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు కూడా ప్రభుత్వ వైఖరిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్పెషలిస్ట్ సిబ్బంది లేకుండా సర్వే సాధ్యం కాదని తెగేసి చెబుతున్నారు. దీంతో నెల రోజులుగా సర్వేకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అదేవిధంగా భూ సేకరణకు రూ.882 కోట్ల వరకూ ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా వేశారు. కానీ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో సేకరణ ఎలా సాధ్యమవుతుందంటూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కనీసం ప్రత్యేక సర్వేయర్లను నియమించుకునేందుకై నా నిధులు మంజూరు చేయాలని ఏపీఎంఆర్సీ కోరినా దానిపైనా స్పందన లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని వాపోతున్నారు. ప్రాజెక్టుపై ప్రభుత్వ వైఖరి చూస్తే అసలు వైజాగ్ మెట్రోపై ప్రభుత్వానికి ఆసక్తి లేదన్నది స్పష్టమవుతోంది. భూ సేకరణకు రూ.882 కోట్లు ఖర్చవుతుందని అంచనాగత ప్రభుత్వం హయాంలో కీలక అడుగులు విశాఖ మరింత అభివృద్ధి చెందేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తూ లైట్ మెట్రో ప్రాజెక్టు పట్టాలక్కెంచేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. 76 కిలోమీటర్ల మేర 4 కారిడార్లతో నిర్మించనున్న తొలి విడత ప్రాజెక్టుకు రూ.14,309 కోట్లు వ్యయం అవుతుందని స్పష్టం చేస్తూ.. 2023 డిసెంబర్ 29న ఉత్తర్వులు సైతం జారీ చేసింది. పీపీపీ విధానంలో చేపట్టబోయే ఈ ప్రాజెక్టులో ప్రభుత్వాల వాటా 40 శాతం కాగా, టెండరు దక్కించుకున్న సంస్థ 60 శాతం భరించనున్నట్లు ఉత్తర్వుల్లో పొందుపరిచారు. 2024 జనవరిలో కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్ని కూడా పంపించారు. అయితే ప్రభుత్వం మారిపోవడంతో చంద్రబాబు మెట్రో ప్రాజెక్టుకు మోకాలడ్డే ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. మరోసారి డీపీఆర్ తయారు చేస్తామంటూ పాత డీపీఆర్ని పక్కన పడేశారు. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. అయితే పాత డీపీఆర్కే స్వల్ప మార్పులు చేసి హడావుడి చేస్తూ ప్రాజెక్టుపై నిర్లక్ష్యంగానే కూటమి ప్రభుత్వ వ్యవహరిస్తోంది. -
ప్రేమించిన అమ్మాయి కోసం వైజాగ్ వచ్చేవాడిని
హిట్ 3 ట్రైలర్ రిలీజ్ వేడుకలో హీరో నాని సీతమ్మధార: పెళ్లికి ముందు ఓ అమ్మాయిని కలిసేందుకు వైజాగ్ వచ్చేవాడిని.. అంటూ నేచురల్ స్టార్ నాని తన పర్సనల్ సీక్రెట్ బయటపెట్టారు. ఆయన లీడ్ రోల్లో దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన హిట్– 3 సినిమా ట్రైలర్ను నగరంలోని సంగం థియేటర్లో సోమవారం రిలీజ్ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న నాని సినిమాతో పాటు పలు విషయాలు పంచుకున్నారు. ‘నా పెళ్లికి ముందు దాదాపు 15 ఏళ్ల క్రితం ఇక్కడికి ఓ అమ్మాయిని కలవడానికి వచ్చేవాడిని, తర్వాత ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను. నాకు వైజాగ్తో స్పెషల్ బాండ్ ఏర్పడింది. అప్పుడైనా, ఇప్పుడైనా వైజాగ్కు వచ్చింది ప్రేమ కోసమే. వేరే ఎక్కడికి వెళ్లినా నన్ను వాళ్లు అన్న లేదా తమ్ముడిలా చూస్తారు. కానీ వైజాగ్ వచ్చినప్పుడు మాత్రం అల్లుడిలాగే చూస్తారు’.. అంటూ నాని తన భార్య గురించి, వైజాగ్తో ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకున్నారు. ఇక ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హిట్– 3 అనేది కొత్త జానర్. ఇందులో మనకు అలవాటు లేని కొత్త టోన్ ఉంటుంది. కొత్త ప్రయత్నాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారనడానికి వంద ఉదాహరణలు ఉన్నాయని, మే 1న మనమంతా గెలుస్తామన్న నమ్మకం ఉందన్నారు. అనంతరం సినిమాలో డైలాగ్తో నాని అభిమానులను అలరించారు. -
కేంద్ర ఉక్కు సంయుక్త కార్యదర్శి బ్లాస్ట్ఫర్నేస్ సందర్శన
ఉక్కునగరం : కేంద్ర ఉక్కు సంయుక్త కార్యదర్శి డాక్టర్ సంజయ్ రాయ్ సోమవారం బ్లాస్ట్ఫర్నేస్–1ను సందర్శించారు. స్టీల్ప్లాంట్ పర్యటనలో భాగంగా వచ్చిన ఆయనకు విభాగం ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన బీఎఫ్–1లో జరుగుతున్న ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. విభాగంలో సాధిస్తున్న విజయాలను అధికారులు, విభాగం కార్మికులు ఆయనకు వివరించారు. కార్మిక నాయకులు బాబా (ఏఐటీయూసీ), పోలీసు నాయుడు (ఐఎన్టీయూసీ), కోటేశ్వరరావు, అలమండ శ్రీనివాసరావులు కార్మికుల సమస్యలను వివరించారు. ఆయన సానుకూలంగా స్పందిస్తూ ఉత్పత్తిపై దృష్టి సారించాలని, తద్వారా అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. పర్యటనలో ఆయనతో పాటు డైరెక్టర్లు సలీం వి పురుషోత్తమన్, గణేష్, జి.వి.ఎన్.ప్రసాద్ ఉన్నారు. -
అంబేడ్కర్ ఆశయం నవ సమాజ నిర్మాణం
విశాఖ లీగల్: విశాఖ న్యాయవాద సంఘం ఆధ్వర్యంలో జిల్లా కోర్టు గ్రంథాలయంలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అంబేడ్కర్ ఆశయం నవ సమాజ నిర్మాణమని ఆయన అన్నారు. కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎం.కె.శ్రీనివాస్, రాష్ట్ర బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు ఎస్.కృష్ణమోహన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్, జిల్లా మహిళా న్యాయవాదుల సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మి సునంద, న్యాయవాదులు పాకా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
నాన్నా..నేను చనిపోతున్నా..!
కొమ్మాది: బెట్టింగులకు అలవాటు పడి అప్పుల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఉద్యోగిని పోలీసులు కాపాడిన సంఘటన భీమిలి బీచ్రోడ్డులో చోటు చేసుకుంది. పీఎంపాలెం సీఐ జి.బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గాజువాక ప్రాంతానికి చెందిన కొండా సుందర్ (30), భార్య, కుమార్తెతో కలిసి పీఎంపాలెంలో నివాసం ఉంటున్నారు. రెండున్నరేళ్లుగా రుషికొండ ఐటీ సెజ్లోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఖాళీ సమయాల్లో బెట్టింగులకు పాల్పడుతూ, అది కాస్తా వ్యసనంగా మారింది. బెట్టింగ్ల కారణంగా సుమారు రూ. 21 లక్షల అప్పు చేశాడు. స్నేహితుల ఖాతాలో బ్యాంకుల నుంచి కూడా అప్పులు తీసుకున్నాడు. అప్పులు తీర్చాల్సిందిగా.. ఒత్తిడి పెరిగింది. దీంతో మానసికంగా ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం విధులకు వెళ్తున్నానని చెప్పి బయల్దేరాదు. కాసేపటి తర్వాత ‘నాన్నా నన్ను క్షమించు, నీకు ముఖం చూపించలేకపోతున్నా రూ. 21 లక్షలు అప్పు చేశాను. నేను ఎంత కష్టపడినా అప్పులు తీర్చలేని పరిస్థితి. నాభార్య, కుమార్తెను బాగా చూసుకోండి.. నేను చచ్చిపోతానంటూ..’ఓ సెల్ఫీ వీడియో తీసి తన తండ్రికి పంపించాడు. అది చూసిన తండ్రి వెంటనే 112కు కాల్ చేసి విషయం చెప్పి, ఆ వీడియోను పోలీసులకు పంపించారు. అతను పంపిన వీడియోలో.. తన కోసం వెతికితే బీచ్ రోడ్డులో ఫోన్ దొరుకుతుందని చెప్పడంతో.. ఆయన పంపిన వీడియోలో బ్యాక్గ్రౌండ్ ఆధారంగా పోలీసులు వెంటనే స్పందించి భీమిలి బీచ్ రోడ్డు రామానాయుడు ఫిల్మ్స్టూడియో సమీపంలో ఉన్న బీచ్కు చేరుకున్నారు. సుందర్ ఓ చెట్టు కింద కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు. పీఎంపాలెం బీచ్ మొబైల్ పోలీసులు ఆయనను పట్టుకుని స్టేషన్కు తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు పోలీసులు తెలుసుకుని సుందర్కు కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే దీనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదని, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి అతి తక్కువ సమయంలో సుందర్ను గుర్తించి ప్రాణాలు కాపాడిన సిబ్బందిని సీఐ బాలకృష్ణ అభినందించారు. అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో బెట్టింగ్లకు అలవాటు పడి రూ.21 లక్షలు అప్పులు కాపాడిన పోలీసులు -
వెళ్లొస్తాం.. పెరిగి మళ్లొస్తాం..
ఏయూక్యాంపస్ : విశాఖ సాగర తీరం.. అద్భుతమైన జీవవైవిధ్య ఘట్టానికి సాక్ష్యంగా నిలుస్తోంది. ఇక్కడి పుడమి తల్లి ఒడిలోనే అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లు జీవం పోసుకుని, ఆపై సముద్రంలో జీవనాన్ని కొనసాగిస్తాయి. వేల మైళ్లు ప్రయాణించి.. తిరిగి తాము పుట్టిన గడ్డకే వస్తాయి. తమ తర్వాతి తరానికి జీవం పోస్తాయి. మళ్లీ అనంత సాగరంలోకి సాగిపోయే ఆలివ్ రిడ్లే తాబేళ్ల ప్రస్థానం ప్రకృతిలోని ఓ అద్భుతం. అయితే ఈ ప్రయాణం పూలపాన్పు కాదు. గుడ్డు దశ నుంచి సముద్రంలో జీవనం సాగించే వరకు ప్రతి అడుగులోనూ వాటికి సవాళ్లు ఎదురవుతాయి. కాగా.. ఈ ఏడాది వందలాది తాబేళ్లు విశాఖ తీరంలో గుడ్లు పెడుతుండగా.. అటవీ శాఖ వాటిని సేకరించి సంరక్షిస్తోంది. పొదిగిన పిల్లలను సురక్షితంగా సముద్రంలోకి విడుదల చేస్తోంది. సాగరంలోకి పయనం ఆలివ్ రిడ్లే తాబేళ్లు పెట్టిన గుడ్లు పొదగడానికి 45 రోజుల పడుతుంది. ఈ కీలకమైన సమయంలో వాటి సంరక్షణ చాలా ముఖ్యం. తీర ప్రాంతాల్లో సంచరించే కుక్కల నుంచి ఈ గుడ్లకు ముప్పు ఉంటుంది. ఈ సమయంలో అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. గుడ్లు పెట్టే కాలంలో, అటవీశాఖ సిబ్బంది ప్రతిరోజూ తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల వరకు తీరం వెంబడి గస్తీ నిర్వహిస్తారు. వారు తాబేళ్లు గుడ్లు పెట్టిన ప్రదేశాలను గుర్తించి, వెంటనే ఆ గుడ్లను సేకరిస్తారు. అనంతరం, వాటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంరక్షణ కేంద్రాలకు తరలిస్తారు. అక్కడ దాదాపు అడుగున్నర లోతులో గుడ్లను పాతిపెట్టి, చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేస్తారు. కుక్కలు, ఇతర జంతువులు, మనుషుల నుంచి రక్షణ కల్పిస్తారు. సుమారు 45 రోజుల తర్వాత ఈ గుడ్ల నుంచి చిట్టి తాబేళ్లు బయటకు వస్తాయి. ఇలా వచ్చిన వందలాది తాబేలు పిల్లలను అటవీశాఖ సిబ్బంది ప్రతి రోజూ ఎంతో జాగ్రత్తగా సముద్రంలోకి వదులుతున్నారు. ఇటీవల పాండురంగాపురం వద్ద బీచ్లో 170 తాబేలు పిల్లలను ఇలాగే సముద్రంలోకి విడిచిపెట్టారు. జీవితం ఓ పోరాటం గుడ్డు దశలో ఉన్న ముప్పు తొలగిపోయినా.. సముద్రంలోకి చేరిన తర్వాత కూడా ఈ తాబేలు పిల్లల జీవనం సవాళ్లతో కూడుకున్నదే. ఆహారం సంపాదించుకోవడం, ఇతర సముద్ర జీవుల నుంచి తమను తాము రక్షించుకోవడం పెద్ద సవాలుగా మారుతుంది. పుట్టిన వాటిలో చాలా తక్కువ సంఖ్య మాత్రమే అన్ని అడ్డంకులను అధిగమించి పెద్దవై.. మళ్లీ గుడ్లు పెట్టడానికి ఎక్కడ పుట్టాయో అక్కడి తీరానికి తిరిగి వస్తాయి. పెద్దయ్యాక కూడా.. తీరానికి వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు మత్స్యకారుల వలలకు చిక్కి, పడవలకు తగిలి కొన్ని తాబేళ్లు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి.. తాబేళ్లు వలల్లో చిక్కుకున్నా సురక్షితంగా బయటపడేలా సెంట్రల్ మైరెన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎంఎఫ్ఆర్ఐ) ప్రత్యేకమైన వలలను రూపొందించింది. వీటి వినియోగం పూర్తిస్థాయిలో అమలైతే.. ఈ అరుదైన జీవుల సంరక్షణ పూర్తిస్థాయిలో సాధ్యపడుతుంది. పుడమి నుంచి కడలిలోకి ఆలివ్ రిడ్లే పిల్లలు రాత్రి వేళ రహస్యంగా.. ఆలివ్ రిడ్లే జాతికి చెందిన సముద్ర తాబేళ్లు గుడ్లు పెట్టేందుకు తెల్లవారుజామున 2 గంటల నుంచి 4 గంటల మధ్య తీరానికి చేరుకుంటాయి. తమ ముందు, వెనుక కాళ్లను ఉపయోగించి ఇసుకలో గుంతలు తవ్వి.. అందులో గుడ్లు పెడతాయి. ఒక్కో ఆడ తాబేలు సుమారు 60 నుంచి 120 గుడ్ల వరకు పెట్టి.. ఆ గుంతలను ఇసుకతో పూడ్చేస్తాయి. ఆ తర్వాత సూర్యోదయం కాకముందే అవి మళ్లీ సముద్రంలోకి వెళ్లిపోతాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ తాబేళ్లు చంద్రుడి కదలికను అనుసరించి సముద్ర తీరానికి వస్తాయి. సూర్యోదయం కాకముందే ఎవరి కంటా పడకుండా తిరిగి సముద్రంలోకి వెళ్లిపోతాయి. -
రైల్వే సిబ్బంది చొరవతో మహిళ సుఖ ప్రసవం
తాటిచెట్లపాలెం: ఈస్ట్కోస్ట్ రైల్వే, వాల్తేర్ డివిజన్లోని కమర్షియల్ కంట్రోల్ సిబ్బంది మానవత్వంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించిన ఘటన ఇది. ఆదివారం రాత్రి చర్లపల్లి నుంచి కిషన్గంజ్ వెళ్తున్న ప్రత్యేక ఎక్స్ప్రెస్ విశాఖలో బయలుదేరిన తర్వాత, సుమారు 11:30 గంటల సమయంలో ఎస్–4 కోచ్లో ప్రయాణిస్తున్న కె. జైనాబ్ అనే నిండు గర్భిణికి పురిటి నొప్పులు తీవ్రమయ్యాయి. దీంతో ఆమె రైల్లోనే ప్రసవించారు. వెంటనే స్పందించిన కమర్షియల్ సిబ్బంది, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సిబ్బంది సమన్వయంతో తక్షణ చర్యలు చేపట్టారు. కొత్తవలస స్టేషన్లో రైలును నిలిపివేసి, తల్లీబిడ్డను అత్యవసరంగా కిందికి దించారు. అనంతరం, వారికి మెరుగైన వైద్య సహాయం అందించేందుకు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ క్లిష్ట సమయంలో రైల్వే అధికారులు చూపిన తక్షణ స్పందనను ప్రయాణికులు, జైనాబ్ కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు. మానవతా దృక్పథంతో వ్యవహరించిన రైల్వే సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
అట్టహాసంగా అగ్నిమాపక వారోత్సవాలు
అల్లిపురం: జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లా అగ్నిమాపక అధికారి ఎస్.రేణుకయ్య ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది గౌరవ వందనం స్వీకరించిన ఆయన, అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేణుకయ్య మాట్లాడుతూ, వారోత్సవాల్లో ప్రజలకు అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. అనంతరం అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్, అవగాహన కరపత్రాలను ఆవిష్కరించారు. అగ్నిమాపక శకటాల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. డాబాగార్డెన్స్, అంబేడ్కర్ సర్కిల్, సంగం శరత్ జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్, ఆశీలమెట్ట, సౌత్ జైలురోడ్డు, జగదాంబ, టర్నల్ చౌల్ట్రీ మీదుగా సూర్యాబాగ్కు ర్యాలీ చేరుకుంది. వారోత్సవాల సందర్భంగా వారం రోజుల పాటు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఎఫ్ఓ పి.సింహాచలం, అగ్నిమాపక సిబ్బంది వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
గల్లంతైన యువకులు మృతి
సాక్షి,పాడేరు: అనంతగిరి మండలం మారుమూల జీనబాడు పంచాయతీలోని సరియా జలపాతంలో గల్లంతైన విశాఖకు చెందిన ఇద్దరు యువకులు మృతిచెందారు. యువకులు గల్లంతైనట్టు ఫిర్యాదు అందడంతో సోమవారం ఉదయం తహసీల్దార్ మాణిక్యం, అరకు సీఐ హిమగిరి ఎస్డీఆర్ఎఫ్ బృందంతో కలిసి సరియా జలపాతానికి చేరుకున్నారు. యువకుల ఆచూకీ కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందం గాలించింది. ఉదయం 10గంటల సమయంలో విశాఖపట్నంలోని పూర్ణామార్కెట్ వద్ద పండావీధికి చెందిన ఇళ్ల వాసు(21), రెల్లివీధిలోని ఏవీఎన్ కళాశాల ప్రాంతానికి చెందిన వడ్డాది సత్య నరసింహమూర్తి(24) మృతదేహాలను బయటకు తీశారు. ఆదివారం మధ్యాహ్నం ఆరుగురు యువకులు కారులో సరియా జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చారు. అయితే వీరిలో వాసు,నరసింహమూర్తి జలపాతంలో స్నానం చేస్తున్న సమయంలో దిగువున ఉన్న సేలయేరులోకి జారి పడి గల్లంతయ్యారు.ఈ సంఘటనపై అనంతగిరి పోలీసులు కేసు నమోదు చేశారు.యువకుల మృతదేహాలను శవ పరీక్షకు కేజీహెచ్కు పంపారు. సరియా జలపాతం నుంచి మృతదేహాలు వెలికితీత -
ఒలింపిక్ సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు
విశాఖ స్పోర్ట్స్: విశాఖ జిల్లా ఒలింపిక్ సంఘం (వీడీఏవో) నూతన కార్యవర్గాన్ని సోమవారం ప్రకటించారు. ఎన్నికల అధికారి పృధ్వీరాజ్ ఎన్నికల ప్రక్రియను వివరించారు. మార్చి 2న రిజల్యూషన్ ద్వారా రిటర్నింగ్ అధికారిని నియమించామని, ఓటర్ల జాబితా పరిశీలన, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ అనంతరం ఈ నెల 13న ఎన్నిక నిర్వహించామని తెలిపారు. నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా హర్షవర్దన్, కార్యదర్శిగా లలిత్కుమార్, కోశాధికారిగా కిషోర్కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే, నలుగురు ఉపాధ్యక్షులు, ముగ్గురు సంయుక్త కార్యదర్శులు, పది మంది ఈసీ సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు తెలిపారు. రాష్ట్ర ఒలింపిక్ సంఘం పరిశీలకుడు కేపీ రావు మాట్లాడుతూ, ఒక జిల్లా ఒకే సంఘం అనే నినాదంతో ఎన్నికల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. వచ్చే జూలైలో విశాఖలోనే రాష్ట్ర ఒలింపిక్ సంఘం ఎన్నికలు జరుగుతాయని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో చీఫ్ పాట్రన్ శివశంకర్ పాల్గొన్నారు. -
జీవీఎంసీ వాహనం ఢీకొని మహిళ మృతి
అల్లిపురం: జీవీఎంసీ గార్బేజ్ లారీ ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, టూటౌన్ ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కంచరపాలేనికి చెందిన లావణ్య ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర గల కంకటాల టెక్స్టైల్స్లో పనిచేస్తోంది. ఆమె విధులు ముగించుకుని తన తోటి ఉద్యోగి ఎల్లాజీ ద్విచక్రవాహనంపై జైలురోడ్డు నుంచి జగదాంబ జంక్షన్కు బస్సు కోసం వెళ్తుండగా, ఆ సమయంలో అటు నుంచి వస్తున్న జీవీఎంసీ గార్బేజ్ లారీ వారిని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనం వెనుక కూర్చున్న లావణ్య కుడివైపు పడిపోవడంతో ఆమె తలపై నుంచి లారీ చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఎల్లాజీ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
భరోసా దక్కని బతుకులు
మహారాణిపేట: మత్స్యకారులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి చేపల వేట నిషేధం అమలులోకి వస్తోంది. జూన్ 15 వరకు కొనసాగనుంది. మత్స్య సంపద ఉత్పత్తి అయ్యే సమయం కావడంతో ప్రతి ఏటా రెండు నెలలపాటు వేట నిషేధం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో సంపాదన లేక ఖాళీగా ఉండే గంగపుత్రుల జీవనానికి ప్రభుత్వం భృతి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాకముందు రూ.2 వేల చొప్పున పరిహారం అందజేసేవారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఎప్పుడో ఆరేడు నెలల తర్వాత భృతి మంజూరు చేసేది. అది కూడా స్థానికంగా పలుకుబడిన నాయకుల అనుచరులకు మాత్రమే ఇచ్చేవారు. పాదయాత్రలో గంగపుత్రుల సమస్యలు స్వయంగా తెలుసుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి వేట నిషేధ భృతిని రూ.10 వేలకు పెంచుతానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే వేట నిషేధ నష్టపరిహారం రూ.10 వేలకు పెంచడంతోపాటు ప్రతి ఏటా మే నెలాఖరుకు మత్స్యకారుల ఖాతాల్లో జమ చేశారు. ఇలా ఐదేళ్ల పాటు నిరాటంకంగా మత్స్యకార భరోసాను అమలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మత్స్యకార భృతిని రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచుతామని టీడీపీ, జనసేన పార్టీలు ప్రకటించాయి. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది ఇవ్వాల్సిన భరోసా ఇంతవరకు అమలు చేయలేదు. అసలు ఎప్పుడిస్తారో కూడా చెప్పలేదు. ఉమ్మడి విశాఖ జిల్లాలో సుమారు 34 తీరప్రాంతాల్ని ఆనుకుని మత్స్యకార గ్రామాలున్నాయి. వీటిలో లైసెన్స్ కలిగిన మెకనైజ్డ్ బోట్లు, ఇంజను బోట్లు, తెప్పలు, తెరచాపలతో సముద్రంలో వేట సాగించే మత్స్యకారులు సుమారు 26 వేల మంది ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఇస్తానన్న రూ.20 వేలు ఇవ్వకపోగా గత ప్రభుత్వం ఇచ్చే రూ.10 వేలు కూడా ఇవ్వడం మానేసిందంటూ గంగపుత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి గత ఏడాది నష్టపరిహారం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా.. వేటకు వెళ్లే మత్స్యకార కుటుంబాలకు పూర్వం రూ.2 వేలు, బియ్యం, ఇతర నిత్యావసరాలు ఇచ్చే వారు. ఆ తర్వాత నిత్యావసరాలకు ఫుల్స్టాప్ పెట్టి రూ.4 వేల చొప్పున భృతి ఇచ్చారు. అది కూడా వేట నిషేధం ముగిసిన తర్వాత ఆర్నెల్లకో ఏడాదికో ఎప్పుడిచ్చేది కూడా తెలిసేది కాదు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు నిషేధ భృతిని రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచి నిషేధ కాలంలోనే పార్టీలు, కులాలు, మతాలకతీతంగా అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇచ్చి వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా నిలిచింది. మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లకే కాకుండా.. తెప్పలు ఇతర సంప్రదాయ నావలపై వేట సాగించే వారికి సైతం ఈ సాయాన్ని వర్తింప జేసింది. అమల్లోకి వచ్చిన చేపల వేట నిషేధం 61 రోజులు విరామం ఒడ్డుకు చేరుకున్న 2,500 బోట్లు మత్స్యకార భరోసా హామీ నిలుపుకోని కూటమి ప్రభుత్వం ఆందోళనలో మత్స్యకార కుటుంబాలు మత్స్యకారులు సహకరించాలి ఈ నెల 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు తూర్పు సముద్ర తీర ప్రాంతంలో వేట నిషేధం అమల్లో ఉంటుంది. ఈ రోజుల్లో మత్స్య సంపద పరిరక్షణ, పునరుత్పత్తి, నిర్వహణ దృష్ట్యా సముద్రంలో వేట నిషేధం అమలు చేస్తున్నాం. మత్స్యకారులంతా ప్రభుత్వానికి సహకరించాలి. –చంద్రశేఖరరెడ్డి, ఇన్చార్జీ జాయింట్ డైరెక్టర్, మత్స్యశాఖతీరానికి బోట్లు జిల్లాలో 65 కిలోమీటర్ల తీర ప్రాంతం, 32 మత్స్యకార గ్రామాలు, 15 ఫిష్ లాండింగ్ కేంద్రాలు ఉన్నాయి. సుమారు 1.15 లక్షల మత్స్యకార కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. మత్స్య సంపద పరిరక్షణ, పునరుత్పత్తి కోసం ఈ నిషేధం విధిస్తున్నట్లు మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ పి.లక్ష్మణరావు తెలిపారు. ఇంజిన్, యాంత్రిక (మెకనైజ్డ్)బోట్లకు ఈ నిషేధం వర్తిస్తుందని, మత్స్యకారులు ప్రభుత్వానికి సహకరించాలని జేడీ చంద్రశేఖరరెడ్డి కోరారు. నిషేధం అమలులోకి రావడంతో దాదాపు 2,500 బోట్లు విశాఖ ఫిషింగ్ హార్బర్కు చేరుకున్నాయి. మంగళవారం నుంచి పూర్తిస్థాయిలో వేట నిషేధం అమల్లో ఉంటుంది. -
ప్రైవేట్ ఆస్పత్రికి ఇద్దరి తరలింపు
● కేజీహెచ్లో నలుగురికి వైద్య సేవలు ● నర్సీపట్నంలో కోలుకుంటున్న ఇద్దరుమహారాణిపేట /నర్సీపట్నం: కై లాసపట్నం ప్రమాదంలో గాయాలైన నలుగురు క్షతగాత్రులకు కేజీహెచ్లో వైద్య సేవలు కొనసాగిస్తున్నారు. ప్లాస్టిక్ సర్జరీ వార్డులో చికిత్స పొందుతున్న ఫైర్ వర్క్స్ మేనేజర్ మడగల జానకీరాం, సియ్యాద్రి గోవిందలను మెరుగైన వైద్య కోసం మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం మొత్తం ఆరుగురు క్షతగాత్రులను తీసుకొని వచ్చి కేజీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ వార్డులో చేర్పించారు. తీవ్రంగా గాయపడ్డ జల్లూరి నాగరాజుకు సీఎస్ఆర్ బ్లాక్లో వైద్య సేవలు అందిస్తున్నారు. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగరాతి శ్రీను, గుప్పెన సూరిబాబు కోలుకుంటున్నారు. -
‘తల్లి కావాల్సిన క్షణంలో’.. విశాఖలో నిండు గర్భిణి దారుణ హత్య
విశాఖపట్నం,సాక్షి: విశాఖలో (Visakhapatnam) దారుణం జరిగింది. మరో 24 గంటల్లో ప్రసవం కావాల్సిన భార్యను భర్తే గొంతు నులిమి చంపాడు. తప్పించుకునేందుకు పథకం వేశాడు. ఆపై దారుణానికి ఒడిగట్టింది తానేనని నిజం ఒప్పుకున్నాడు పోలీసుల సమాచారం మేరకు.. పీఎం పాలెం ఉడా కాలనీలో జ్ఞానేశ్వర్, అనూష దంపతులు నివాసం ఉంటున్నారు. వారిది ప్రేమ వివాహం. జ్ఞానేశ్వర్ ఫాస్ట్ఫుడ్ సెంటర్ను నిర్వహిస్తుండగా.. భార్య అనుష గర్భవతి. మంగళవారమే డెలివరీ కావాల్సి ఉంది. ఈ తరుణంలో సోమవారం ఉదయం అనూషకు ఆరోగ్యం బాగోలేదని జ్ఞానేశ్వర్ ఆమె కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు విగత జీవిగా ఉన్న అనూషను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అనూష మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. అనూష మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు. భర్త జ్ఞానేశ్వర్ తీరుపై పోలీసులు అనుమానం రావడంతో విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో తనకు, తన భార్య అనుషకు మధ్య వాగ్వాదం జరిగిందని, ఆ సమయంలో భార్య అనుషను గొంతు నులిమి హత్య చేసినట్లు భర్త జ్ఞానేశ్వర్ పీఎం పాలెం పోలీసులు ఎదుట ఒప్పుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
దర్శనానికి వచ్చి.. ఉంగరం దొంగిలిస్తారా..?
సింహాచలం: ‘శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి వచ్చి ఆయన ఉంగరాన్నే దొంగిలిస్తారా... మర్యాదగా దొంగిలించిన ఉంగరాన్ని ఇచ్చేయండి.. లేదంటే పోలీసులకు అప్పగిస్తాం’.. అని సింహగిరికి వచ్చిన పలువురు భక్తులను దేవస్థానం స్థానాచార్యులు ప్రశ్నించేసరికి వారంతా కంగుతిన్నారు. ‘మేం దొంగల్లా కనిపిస్తున్నామా... స్వామి దర్శనానికి వస్తే ఉంగరాన్ని దొంగతనం చేశారంటారేంటి? పైగా తాళ్లతో బంధించి తీసుకొస్తారా’.. అంటూ భక్తులు ఆవేశంతో స్థానాచార్యులపై గర్జించారు. ‘చూడండీ.. మీరు దొంగతనం చేసినట్లు మా దగ్గర ఆధారాలున్నాయి. సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. పోలీసులు తీసుకెళ్లకముందే దొంగిలించిన ఉంగరాన్ని మర్యాదగా ఇచ్చేయండి’.. అంటూ స్థానాచార్యులు మరింత గర్జించి అడగడంతో భక్తుల కళ్లంట నీళ్లు గిర్రున తిరిగాయి. తాము ఉంగరం తీయలేదని ఎంతచెబుతున్నా వినకుండా మీరే దొంగ అని పదే పదే ప్రశ్నించడంతో వారంతా కోపోద్రేకాలతో చిందులు వేశారు. పైగా చేతికున్న ఉంగరాలను చూపెట్టమని... దొంగిలించిన ఉంగరం ఇలాగే ఉంటుందంటూ స్థానాచార్యులు నిలదీయడంతో భక్తులు నోటి మాట రాలేదు. చివరికి ఇదంతా వినోదోత్సవంలోని ఘట్టమని తెలుసుకుని సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. తమకు మాత్రమే దక్కిన భాగ్యంగా భావించి ఆనందభరితులయ్యారు. ఇదీ.. సింహగిరిపై ఆదివారం సందడిగా జరిగిన స్వామి వినోదోత్సవం. సింహగిరిపై జరుగుతున్న స్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి జరిగిన మృగయోత్సవంలో పోయిన స్వామి ఉంగరాన్ని వెతికే ఘట్టాన్ని ఆదివారం ఉదయం వినోదోత్సవంగా నిర్వహించారు.ఉత్సవం సాగిందిలా...ఏడు పరదాల్లో దాగి ఉన్న స్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని రాజగోపురం వద్ద పల్లకీలో అధిష్టంపజేశారు. స్వామి దూతగా పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు కర్ర, తాడు పట్టుకుని దర్శనానికి వచ్చిన పలువురు భక్తులను ఉంగరం దొంగిలించారంటూ తాడుతో బంధించి రాజగోపురం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ దొంగిలించిన ఉంగరాన్ని ఇవ్వాలంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఉత్సవం గురించి తెలియని వాళ్లు కన్నీటిపర్యంతం చెందారు. ఉత్సవం గురించి తెలిసిన వాళ్లు నవ్వుతూ సమాధానం చెప్పారు. ఈ తరుణంలోనే స్వామిపై ఉన్న ఒక్కొక్క పరదాని తొలగించారు. చివరికి ఆయన చివరి పరదాలోనే ఉంగరం దొరికింది. విశాఖలోని గాయత్రి మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న లాస్య, తనుశ్రీ, సుమేధలను, కొత్తవలసకి చెందిన భార్గవి, మోహిత, శ్రావణ్ అనే విద్యార్థులను, విజయనగరానికి చెందిన ఎంబీఏ విద్యార్థినులు రూప, కుసుమ, పుష్ప, సౌమ్యలను, పలాసకి చెందిన ఫైనలియర్ లా విద్యార్థినులు శశిరేఖ, తమనశ్రీ, నరేణ్యలను, మర్రిపాలెంలోని ఓ గోల్డ్ షాపులో పనిచేస్తున్న వడ్డాదికి చెందిన వీర వెంకట సత్యనారాయణ అనే భక్తుడుని పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు తాళ్లతో బంధించి తీసుకురాగా వారిని స్థానాచార్యులు ప్రశ్నించారు. అలాగే ఛత్తీస్గఢ్కి చెందిన భక్తులను, ఎకై ్సజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న యలమంచిలికి చెందిన సత్యనారాయణమూర్తి కుటుంబాన్ని, పెళ్లి చేసుకొని స్వామి దర్శనానికి వచ్చిన నూతన జంటలను తాళ్లతో బంధించారు. వాళ్ల చేతికి ఉన్న ఉంగరం.. దొంగిలించిన ఉంగరంగానే ఉందని స్థానాచార్యులు, అర్చకులు అనుమానం వ్యక్తం చేయడంతో వారందతా వాదనకు దిగారు. ఆ తర్వాత నవ్వుతూ స్వామి ఆశీస్సులు తీసుకుని తిరుగుపయనం అయ్యారు. దేవస్థానం ఈవో కె.సుబ్బారావు దంపతులు, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరాజు, ఆలయ కొత్వాల్ నాయక్ లంక సూరిబాబు, ఆలయ ఎస్పీఎఫ్ కానిస్టేబుళ్లు దొంగలుగా పట్టుబడ్డారు. తొలుత స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ని, ఆఖరులో పురోహిత్ అలంకారి సీతారామాచార్యులను తాడుతో బంధించి తీసుకురావడం విశేషం. -
వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి
సీతమ్మధార(విశాఖ)/అనంతపురం కార్పొరేషన్: వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం విశాఖపట్నం, అనంతపురం నగరాల్లో ముస్లిం మైనారిటీలు భారీ ర్యాలీలు నిర్వహించారు. విశాఖ నగరంలోని డాబా గార్డెన్స్ ఎల్ఐసీ బిల్డింగ్ వద్ద గల డాక్టర్ అంబేడ్కర్ విగ్రహం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయవాది మహమ్మద్ గౌస్ ముద్దిన్ ఖాన్ మాట్లాడుతూ వక్ఫ్ చట్ట సవరణ ద్వారా ముస్లింల మత, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక గుర్తింపును బలహీనపరిచే అవకాశం ఉందని చెప్పారు. వక్ఫ్ సవరణ చట్టం అనేది రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే కాకుండా మైనారిటీల మతపరమైన హక్కులకు ముప్పు కలిగిస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. ముస్లిం నాయకులు హైదర్ అలీ సింకా, జహీర్ అహ్మద్, అహ్మదుల్లా ఖాన్, మునీర్, మహమ్మద్ ఇబ్రహీం, మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఫారూఖి తదితరులు పాల్గొన్నారు. అనంతపురంలో... వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దుచేయాలని అనంతపురంలో యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యాన నిర్వహించిన భారీ ర్యాలీలో వేలాది మంది ముస్లిం మైనారిటీలు పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. అనంతపురం నగర మేయర్ వసీం, వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్ఘర్ రిజ్వాన్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.అవకాశ లౌకికవాది చంద్రబాబు»ఆయనకు సిద్ధాంతాలు, విలువలు లేవు »2019 ఎన్నికల్లో ప్రధాని మోదీని ఉగ్రవాది »అన్న నోటితో ఇప్పుడు పొగుడుతున్నారు »బీజేపీతో ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు మరోలా లౌకిక వాదానికి అర్థం మారుస్తారు »వివాదాస్పద వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇస్తూ బీజేపీ వైపు దృఢంగా నిలబడ్డారు » ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ సాక్షి, అమరావతి:ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనాలు తప్ప సిద్ధాంతాలు, విలువలు లేవని ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ పేర్కొన్నారు. తన యూట్యూబ్ ఛానల్లో తాజాగా ఈ మేరకు వీడియో అప్లోడ్ చేశారు. ఆ వీడియోలో ఆయన ఏమన్నారంటే.. ‘2019 ఎన్నికల్లో బీజేపీపై ఆధారపడే అవసరం లేదని, మతతత్వ బీజేపీ నుంచి దేశాన్ని రక్షించాలని పిలుపునిచ్చిన చంద్రబాబు.. ఒకానొక సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉగ్రవాదిగా పేర్కొన్నారు. రాజకీయ మనుగడ మాత్రమే చంద్రబాబు ఏకైక ప్రాధాన్యత. లౌకిక వాదం విషయంలోనూ ఆయన అంతే. తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడానికి దానిని ఒక కళారూపంగా మార్చుకున్నారు. లౌకిక వాదానికి అర్థం చంద్రబాబు బీజేపీతో కలిసి ఉన్నప్పుడు ఒక రకంగా, లేనప్పుడు మరో రకంగా మారిపోతుంది. రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా.. వారి పదవులు కాపాడుకునే అంశంగా లౌకిక వాదాన్ని చంద్రబాబు మార్చేశారు.అవకాశ లౌకిక వాదిగా చంద్రబాబు చరిత్రలో మిగిలిపోతారు. లౌకిక వాదానికి, మత స్వేచ్ఛకు భంగం కలిగించే వివాదాస్పద వక్ఫ్ బిల్లును పార్లమెంట్లో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు బీజేపీకి దృఢమైన మద్దతుదారుగా చంద్రబాబు నిలబడ్డారు. బిల్లులో కొన్ని సవరణలు సూచించడం ద్వారా ముస్లిం సమాజానికి తాము మంచి చేశామని చంద్రబాబు, బిహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్ చెప్పుకున్నారు. చంద్రబాబుది ట్రికీ కేస్స్టడీ. రాజకీయాల్లో సుదీర్ఘంగా కొనసాగడానికి ఎన్ని రంగులు మార్చడానికైనా ఆయన వెనకాడరు. లౌకిక వాదం విషయంలో ఆయన విధానం ఎప్పుడూ ప్రశ్నార్థకమే. రాజకీయాల్లో నిబద్ధత స్థానంలో అవకాశ వాదం, అవసరం వచ్చి చేరాయి. రాజకీయ విధానాల్లో నిబద్ధత అత్యంత ముఖ్యమనే విషయాన్ని ఎప్పుడో మర్చిపోయారు. వారు అనుభవించే పదవులను బట్టి లౌకిక వాదానికి అర్థం మారిపోతుంది’ అని చంద్రబాబు తీరును ఎండగట్టారు. -
పనికెళ్లిన నాలుగు రోజులకే..
భీమునిపట్నం: భీమిలి సమీపంలోని రేఖవానిపాలెం పంచాయతీ మహాలక్ష్మీపురానికి చెందిన మెడిసి హేమంత్(24) ఇటీవల బాణసంచా తయారీ నేర్చుకున్నాడు. తెలిసిన వారి ద్వారా నాలుగు క్రితం కోటవురట్ల మండలం కై లాసపట్నంలోని బాణసంచా కేంద్రంలో పనికి వెళ్లాడు. బాణసంచా కేంద్రంలో ఆదివారం జరిగిన ప్రమాదంలో అశువులుబాశాడు. అతని తండ్రి మెడిసి సత్యనారాయణ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. తల్లి లేరు. అక్క స్వర్ణకల ఉన్నారు. తన కొడుకు ఇంటికి ఆధారంగా ఉంటాడని భావించామని.. త్వరలో వివాహం కూడా చేయాలని అనుకున్నామని.. ఇంతలో ఘోరం జరిగిపోయిందని తండ్రి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశాడు. అందరితో సరదాగా ఉండే హేమంత్ ఇకలేడన్న విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు విషాదం మునిగిపోయారు. -
అప్పన్నకు శ్రీ పుష్పయాగం
● ముగిసిన వార్షిక కల్యాణోత్సవాలు సింహాచలం: సింహగిరిపై గత వారం రోజులుగా జరుగుతున్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవాలు ఆదివారం రాత్రితో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా సాయంత్రం నుంచి స్వామికి శ్రీ పుష్పయాగాన్ని నిర్వహించారు. స్వామి కల్యాణ ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి,భూదేవి అమ్మవార్లకు పూల అలంకరణ చేసి ఆలయ కల్యాణమండపంలో శేషతల్పంపై ఆళ్వారులతో సహా వేంజేపచేసి విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం నిర్వహించారు. ద్వాదశి ఆరాధనలు, పలు రకాల పుష్పాలతో పుష్పాంజలి సేవ చేశారు. అనంతరం భోగమండపంలో ఉంజల్సేవ ఘనంగా నిర్వహించారు. చందనోత్సవంసీఎఫ్వోగా మూర్తి సీఎఫ్వోగా తప్పుకున్న భ్రమరాంబ సింహాచలం : ఈనెల 30న జరగనున్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవానికి రాష్ట్ర దేవదాయశాఖ తరపున చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్గా ఆ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్, ద్వారకా తిరుమల దేవస్థానం ఈవో ఎన్.వి.ఎస్.ఎన్.మూర్తిని దేవదాయశాఖ నియమించింది. కాగా చందనోత్సవం సీఎఫ్వోగా ఆ శాఖ అమరావతిలోని ప్రధాన కార్యాలయంలో ఆర్జేసీగా విధులు నిర్వర్తిస్తున్న డి.భ్రమరాంబని తొలుత నియమించారు. ఆమె ఇటీవల సింహగిరికి వచ్చి దేవస్థానం ఈవో, ఇంజనీరింగ్ అధికారులు, సెక్షన్ హెడ్లతో చందనోత్సవం నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో వ్యక్తిగత కారణాలు ఉన్నాయంటూ సీఎఫ్వో బాధ్యతలు తప్పించాలని దేవదాయశాఖకి ఆమె విన్నవించుకున్నారు. దీంతో మూర్తిని సీఎఫ్వోగా నియమిస్తూ ఆ శాఖ ఇన్చార్జి కమిషన్ కె.రామచంద్రమోహన్ ఉత్తర్వులు జారీచేశారు. -
పగిలిన గుండెలు
ఆదివారం మిట్ట మధ్యాహ్నం 12.30 గంటల సమయం..ఒకవైపు మండుతున్న సూర్యుడి భగభగలు.. మరోవైపు సెగలు కక్కుతున్న వాతావరణంలో పనిచేస్తున్న కార్మికులు.. ఊపిరి సలపని పని.. కడుపు ఆకలితో నకనకలాడుతోంది.. కాసేపట్లో పని చాలించిఓ ముద్ద తిని వద్దాం.. అనుకుంటుండగా.. ఒక్కసారిగా భూమి దద్దరిల్లిన శబ్దం. దిక్కులు పిక్కటిల్లేలా కార్మికుల హాహాకారాలు.. క్షణకాలంలో తునాతునకలైన దేహాలు.. పూర్తిగా కాలిపోయిన శరీరాలు.. కాలిన గాయాలతో బాధితుల పెడబొబ్బలు.. ఒక్కసారిగా భీతిగొలిపే దృశ్యాలతో ఆ ప్రాంతం రక్తకాసారంగా మారిపోయింది. ఏం జరిగిందోతెలిసేలోగానే ఎనిమిది మంది అక్కడికక్కడే బుగ్గయిపోయారు.. మరో ఎనిమిది మంది క్షతగాత్రులుగా మారిపోయారు.. కోటవురట్ల మండలం కై లాసపట్నం సమీపంలోని విజయలక్ష్మి ఫైర్ వర్క్స్లో సంభవించిన ఘోరప్రమాదం దృశ్యమిది.● మధ్యాహ్నం 12.30 గంటలకు భారీగా పేలుడు ● ఎనిమిది మంది దుర్మరణం, మరో ఎనిమిది మందికి గాయాలు ● ఇద్దరి పరిస్థితి విషమం ● ప్రమాద సమయంలో కేంద్రంలో 16 మంది కార్మికులు ● విశాఖపట్నం, నర్సీపట్నం ఆస్పత్రులకు క్షతగాత్రుల తరలింపు ● పదేళ్ల క్రితం గోకులపాడులో ఇదే పరిశ్రమలో ప్రమాదం ● ఆ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం ● మళ్లీ దశాబ్దం తరువాత అదే ఘోర కలి ● భద్రతా తనిఖీల్లో లోపం...కార్మికులకు శాపం కొంపముంచిన ఆర్డర్ గ్రామాల్లో వివిధ పండుగలు ఉన్నాయి. బాణసంచా సామగ్రి కావాలి అని ఆర్డర్ వచ్చింది. దీంతో రేయింబవళ్లు పనిచేస్తున్నారు. సెలవయినా ఆదివారం కూడా పనిచేశారు. పని ఒత్తిడిలో నిప్పు రవ్వలు వచ్చినా ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఈ రవ్వల వల్ల పేలుడు జరిగి ఉండవచ్చు. ఈ సంఘటనలో బాణసంచా కంపెనీ యాజమాని కూడా గాయపడ్డారు. – అప్పారావు, నాగరాజు మేనల్లుడు, కై లాసపట్నంప్రమాద స్థలంలో భీతావహ దృశ్యాలు... ఘటన సమయంలో మందుగుండు సామగ్రి దంచుతున్న మనోహర్ అనే వ్యక్తి తునాతునకలయ్యాడు. భారీ పేలుడుకు తల, కుడి చేయి ఎగిరిపోయినట్టు తెలుస్తోంది. మిగిలిన ఏడుగురు శరీరాలు పూర్తిగా కాలిపోయి విగతజీవులుగా కనిపించారు. ఇక గాయపడిన 8 మందిలో నాగరాజు (52)కు 90 శాతం కాలిన గాయాలతో, జానకీరాం (50)కు 60 శాతం కాలిన గాయాలతో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సాక్షి, అనకాపల్లి/కోటవురట్ల : పొట్టకూటి కోసం మందుగుండు సామగ్రి తయారు చేసేందుకు వెళ్లిన పలు వురు కార్మికులు ఆ మందుగుండుకే ఆహుతయ్యారు. బాణసంచా కేంద్రంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం పేద కార్మిక కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. మరికొందరు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కోటవురట్ల మండలం కై లాసపట్నంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం జరిగిన విస్ఫోటనం 8 మంది కార్మికుల ప్రాణాలను మింగేసింది. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. మిట్ట మధ్యాహ్నం కావడంతో గ్రామస్తులంతా ఇళ్లలో సేదతీరుతున్న సమయంలో ఒక్కసారిగా భూమి కంపించి అగ్ని ప్రకంపనలు సృష్టించినట్టుగా చుట్టూ పొగ, మంటలు కనిపించాయి. గ్రామానికి సుమారు కిలోమీటరు దూరంలో గల బాణసంచా కేంద్రంలో సంభవించిన పేలుడు ధాటికి గ్రామస్తులు భీతావహులయ్యారు. మంటలు ఎగిసిపడుతుంటే ఆవైపు వెళ్లాలంటే భయం..మరో వైపు క్షతగాత్రుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. దీంతో ఫైర్ ఇంజన్, 108కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిందిలా... కై లాసపట్నంనకు చెందిన మడగల జానకీరాం తన తోడల్లుడు అప్పికొండ తాతబ్బాయి పేరున ‘విజయలక్ష్మి ఫైర్వర్క్స్’ మందుగుండు తయారీకి లైసెన్సు తీసుకుని 20 ఏళ్లుగా కేంద్రాన్ని నడుపుతున్నాడు. లైసెన్స్కు వచ్చే ఏడాది 2026 వరకు గడువు ఉంది. దీపావళితో పాటు సమీప మండలాల్లో పల్లెల్లో జరిగే గ్రామ పండుగలకు వచ్చే ఆర్డర్లపై మందుగుండు సామగ్రిని తయారు చేస్తారు. కొత్త అమావాస్య నుంచి వరుసగా పల్లెల్లో పండగలు జరుగుతున్న నేపథ్యంలో ఆర్డర్లు ఎక్కువగా వచ్చాయి. వర్క్లోడ్ ఎక్కువగా ఉండడంతో కార్మికులు ఒత్తిడితో పనిచేస్తున్నారు. సరిగ్గా 12.30 గంటల సమయంలో ఓ కార్మికుడు మందును దంచుతుండగా ఒక్కసారిగా విస్ఫోటనం సంభవించింది. వారం రోజులుగా తయారు చేసిన మందుగుండు సామగ్రి మొత్తం అక్కడే ఉండడంతో ఒక్కొక్కటిగా క్షణాల్లో అంటుకుపోయాయి. పక్కనే ఉన్న పౌడర్పై అగ్గి రేణువులు తూలి ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పనిచేస్తున్న కార్మికులు తేరుకుని తప్పించుకునే అవకాశం కూడా లేకపోవడంతో తీవ్రంగా కాలిపోయి 8 మంది కార్మికులు అక్కడికక్కడే మాడి మసైపోయా రు. విస్ఫోటనం ధాటికి అక్కడ ఉన్న రేకుల షెడ్లు, రెండు చిన్న స్లాబ్ గదులు చెల్లా చెదురయ్యాయి. భూమి కంపించినట్టయి..పెద్దగా మంట రావడంతో గ్రామస్థులంతా అదిరిపడి ఒక్కసారిగా పరుగున వచ్చారు. వరహాలు అనే గ్రామస్తుడు ఫైర్ ఇంజిన్, 108కి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. నర్సీపట్నం, నక్కపల్లి, కోటవురట్ల, ప్రభుత్వ ఆస్పత్రి 108 వాహనాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. సమీప నక్కపల్లి, నర్సీపట్నం, యలమంచిలి నుంచి మూడు ఫైర్ ఇంజిన్లు వచ్చాయి. మంటలు అదుపు చేయడానికి సుమారు 4 గంటల పాటు సమయం పట్టింది. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు గాయపడ్డ బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషమంగా ఉన్న వారిని కేజీహెచ్కు తరలించారు. మైనర్ గాయాలతో ఉన్న వారికి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఏం చేయాలో ఆలోచించాలి క్రీడల ద్వారానే మనం గుర్తింపు పొందాం. ఉన్నత స్థితికి ఎదిగాం. ఒకప్పుడు మనకు క్రీడల్లో శిక్షణ ఇచ్చిన గురువులను ఇప్పటికీ గౌరవిస్తున్నాం. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. ఒకప్పుడు హాస్టల్స్ నుంచి కిట్లు, ఆర్థిక సహాయం పొందాం. ఇప్పుడు ఆ సహాయాన్ని ఈ తరం వారికి అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇందుకోసం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. –క్రీడల్లో డాక్టరేట్ అందుకున్న అనితఅథ్లెట్లు.. తీరప్రాంతాల వారే.. భారతదేశం గర్వించద గ్గ అంతర్జాతీయ స్థాయి అథ్లెట్లలో చాలా మంది తీర ప్రాంతాలకు చెందిన వారే కావడం గమనార్హం. 1980లో క్రీడా హాస్టల్స్ను స్థాపించడం వల్ల ఎంతో మంది ప్రతిభావంతులకు క్రీడాకారులుగా ఎదిగే అవకాశం లభించింది. క్రీడలను మరింతగా ప్రోత్సహించడానికి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడం అవసరం. – రామిరెడ్డి, అంతర్జాతీయ అథ్లెట్, విశాఖ సాక్షి, విశాఖపట్నం : నగరం నిప్పుల కొలిమిలా మారింది. రెండు రోజులుగా కాస్తున్న ఎండ నడివేసవిని తలపించింది. రోహిణి రాకముందే.. రోళ్లు పగిలిపోతున్నాయి. నగరంలో రెండు రోజులుగా 38 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతుంది. సెగలు కక్కిన భానుడి భగభగల ధాటికి నగరవాసుల నాలుక పిడచకట్టుకుపోతుంది. ఈ వేసవిలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో సాధారణం కంటే 3 డిగ్రీల వరకూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. అయితే మార్చి నెలాఖరు నుంచే నగరంలో సెగలు పెరిగాయి. ఏప్రిల్ రెండో వారానికి తారాస్థాయికి చేరుకుంది. గత రెండు రోజులుగా సాయంత్రం సమయంలో మేఽఘావృత వాతావరణంతో కాసింత ఊరట చెందుతున్నా.. ఉదయం కాస్తున్న ఎండకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉక్కపోత విపరీతంగా ఉంది. వేడిగాలులు వస్తుండటంతో.. వాహనదారులు, ప్రయాణికులు ఆపసోపాలు పడుతున్నారు. ఈసారి జీవీఎంసీ చలివేంద్రాల ఏర్పాటులో విఫలమైంది. చలివేంద్రాల కోసం టెంట్లు మాత్రమే వేశారు తప్ప నీటిని అందుబాటులో ఉంచలేదు. అకాల వర్షాల ప్రభావంతో.. వేసవి మొదలైన సమయంలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. శివారులో చుట్టుపక్కలా వర్షాలు కురవడం, నగర పరిధిలో వానలు ఆశించిన స్థాయిలో పడకపోవడం కూడా ఈ విపరీత వాతావరణానికి ఒక కారణమంటున్నారు. ఇటీవల పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో గాలిలో తేమ మొత్తం ఆవిరైపోయింది. దీంతో వాతావరణం పొడిబారిపోవడం వల్ల పరిస్థితి దారుణంగా మారింది. ఈ కారణంగానే ఉష్ణోగ్రతలు 37, 38 డిగ్రీలకు నమోదవుతున్నా.. ఉష్ణతాపం మాత్రం 45 నుంచి 50 డిగ్రీల వరకూ ఉంటోందని చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదవుతుండటం వల్ల.. ఈ ఎండ ధాటికి నీటి ఆవిరి మళ్లీ పెరగనుందనీ.. ఫలితంగా భవిష్యత్తులో వేడి వాతావరణం మరింత కలవరపెడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లొద్దని.. ఎండ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.విశాఖ స్పోర్ట్స్: అర్ధ శతాబ్దం కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన క్రీడా వసతి గృహాల్లో శిక్షణ పొంది.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన తెలుగు రాష్ట్రాల క్రీడాకారుల ఆత్మీయ కలయిక ఆదివారం ఘనంగా జరిగింది. ఏపీ స్పోర్ట్స్ హాస్టలర్స్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో బీచ్రోడ్డులోని ఓ హోటల్లో ‘రీయూనియన్’ పేరిట ఈ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణ పొందిన వారిలో కొంత మంది మరణించగా.. వారికి సంతాపం తెలిపారు. గత వైభవం.. నేటి వాస్తవాలు 1980లో ప్రారంభమై 2003 వరకు కొనసాగిన క్రీడా వసతి గృహాలు.. ఎందరో ప్రతిభావంతులను దేశానికి అందించాయి. కాలక్రమేణా ఇవి క్రీడా అకాడమీలు గా, ప్రస్తుతం ఖేలో ఇండియా, సెంటర్స్ ఆఫ్ ఎక్స్లెన్స్లుగా రూపాంతరం చెందాయి. వసతి గృహాల్లో శిక్షణ పొందిన చాలా మంది క్రీడాకారులు తమ పాత రోజులను గుర్తు చేసుకున్నారు. ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు సైతం సైకిల్పై వచ్చి తమకు శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దిన వైనాన్ని, గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన తమకు స్పోర్ట్స్ అథారిటీ కిట్లు అందించి ప్రోత్సహించడాన్ని గుర్తు చేసుకున్నారు. పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు షూల తో సాధన చేస్తే.. గ్రామీణ క్రీడాకారులు చెప్పులతో సాధన చేసి ఆత్మస్థైర్యం కోల్పోకుండా క్రీడల్లో రాణించినట్లు చెప్పారు. అయితే నాటి, నేటి పరిస్థితులకు చాలా తేడా ఉందని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత తరం క్రీడల కంటే చదువుకే ఎక్కువ ప్రాధాన్యమివ్వడం, సరైన వసతులు లేకపోవడం వంటి కారణాల వల్ల పతకాలు సాధించడం కష్టతరంగా మారిందని అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల నుంచి హాజరైన ఈ క్రీడాకారులు గతంలో హైదరాబాద్ వేదికగా మూడు సార్లు కలిసినప్పటికీ.. విశాఖలో కలవడం ఇదే తొలిసారి. తమ క్రీడా నైపుణ్యానికి మెరుగులు దిద్దుకున్న ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ప్రముఖుల సత్కారం ఈ కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ విప్ పి.వి.జి.ఆర్ నాయుడు మాట్లాడుతూ ఇలాంటి క్రీడాకారుల అనుభవాలు రాబోయే తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. ఒక పతకం సాధించడం వెనుక ఎంతో శ్రమ, గుర్తింపు ఉంటాయని, తాను కూడా జాతీయ శిబిరాల్లో క్రీడాకారులతో గడిపిన రోజులను గుర్తుచేసుకున్నారు. త్వరలో విశాఖ సాగర తీరంలోని బ్యాంక్డ్ రింక్లో ఆసియన్ స్కేటింగ్ చాంపియన్షిప్ జరగనుందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఒలింపిక్స్లో హాకీలో భారత్కు ప్రాతినిధ్యం వహించిన ఎడ్వర్డ్, ఎందరో అథ్లెట్లను తీర్చిదిద్దిన కోచ్ ఖాసీం, ఎస్ఏఎఫ్ క్రీడల్లో స్వర్ణం సాధించిన రామిరెడ్డి, డాక్టరేట్లు సాధించిన క్రీడాకారులను నిర్వాహకులు సత్కరించారు. 11 మంది పని చేస్తున్నారు ప్రతిరోజూ అక్కడ 20 నుంచి 30 మంది వరకు కార్మికులు పనిచేస్తారు. బాణసంచా కేంద్రంలో ప్రమాద ఘటన జరిగే సమయానికి 16 మంది మాత్రం ఉన్నారు. లేదంటే అపార ప్రాణ నష్టం జరిగి ఉండేదని అధికారులు చెబుతున్నారు. వచ్చే మంగళవారం కోటవురట్ల మండలంలో అన్నవరం, చౌడువాడ, పందూరు గ్రామాల్లో గ్రామ జాతర ఉత్సవాలు ఉండడంతో బాణసంచా ఆర్డర్లు ఎక్కువగా వచ్చాయి. దీంతో గత వారం రోజులుగా పని ఎక్కువగా చేస్తున్నారు. అయితే ఆదివారం కావడంతో అక్కడ పనిచేసే సామర్లకోటకు చెందిన ఒక కుటుంబం సంతకు వెళ్లేందుకు ఓనర్ నుంచి డబ్బులు తీసుకోవడానికి మాత్రమే వచ్చారు. దీంతో అక్కడ పనిచేసే 11 మందితో పాటు ఈ అయిదుగురూ ప్రమాదంలో గాయపడ్డారు. బాణసంచా కేంద్రంలో బతుకులు బుగ్గి కై లాసపట్నంలో ఘోర విషాదం ఆ రోజుల్లో.. సైకిళ్లపై గురువులొచ్చి శిక్షణనిచ్చేవారు చెప్పులతోనే సాధన చేసే వాళ్లం నాటి జ్ఞాపకాలను పంచుకున్నక్రీడా దిగ్గజాలు 1980–2003 ‘హాస్టల్’ క్రీడాకారులఅ‘పూర్వ’కలయిక క్రీడాకోటా అమలు చేయాలి క్రీడాకారులకు ఉద్యోగాల్లో రెండు శా తం రిజర్వేషన్ కచ్చితంగా అమలు చేయాలి. క్రీడల్లో రాణించిన వారి కి తగిన గుర్తింపు లభించాలి. మన క్రీడాకారులు జాతీయ పతాకాన్ని ప్రపంచ వేదికలపై రెపరెపలాడించేలా నాణ్యమైన శిక్షణ ఇవ్వాలి. ప్రాథమికస్థాయిలో క్రీడా వసతులు మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – కోటేశ్వరరావు, డీఎస్పీఆదివారం నమోదైనగరిష్ట ఉష్ణోగ్రతలు భీమిలి 39.0 డిగ్రీలు సింహాచలం 38.1 గాజువాక 37.4 మహారాణిపేట 37.0 షీలానగర్ 36.0 ఆరిలోవ 35.6 ద్వారకానగర్ 35.4మౌలిక సదుపాయాలు అవసరం ఆటల్లో శిక్షణ ఎంత ముఖ్యమో.. టోర్నీల్లో పాల్గొనడం కూడా అంతే అవసరం. నేను 1974లో ఫుట్బాల్లో అడుగుపెట్టాను. ఆ తర్వాత హాస్టల్లో మొదటి బ్యాచ్లోనే శిక్షణ ద్వారా ఆటలో మెరుగులు దిద్దుకున్నాను. అప్పట్లో ఒలింపియన్స్ కూడా ఉదయం ఐదు గంటలకే సైకిల్పై వచ్చి మరీ శిక్షణ ఇచ్చేవారు. నేడూ అలాంటి నిబద్ధత అవసరం. క్రీడా సదుపాయాలు మరింతగా అభివృద్ధి చెందాలి. అప్పుడే భవిష్యత్ తరాలు మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకోగలవు. – వెంకటేశ్వర రెడ్డి, తొలి బ్యాచ్ శిక్షణార్థి -
పేలుడు ఘటన దురదృష్టకరం : హోంమంత్రి
ఎంవీపీకాలనీ : కైలాసపట్నం బాణ సంచా తయారీ కేంద్రం పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరమని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలై కేజీహెచ్లో చికిత్స పొందుతున్న వారిని ఆదివారం రాత్రి ఆమె ఎంపీ సీఎం రమేష్తో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఘటనలో మృతి చెందిన వారంతా ఐదేళ్లుగా ఆ బాణసంచా కేంద్రంలో పనిచేస్తున్నారన్నారు. 2026 వరకు ఆ కేంద్రా నికి లైసెన్స్ ఉందన్నారు. బాంబుల తయారీకి వినియోగించే పేలుడు పదార్థం చేజారడంతోనే ఈ ప్రమాదం జరిగిందనే విషయం ప్రాథమిక విచారణ లో తేలిందన్నారు. లోపల ఉన్న 16 మందిలో 8 మంది మృతి చెందగా 8 మంది గాయపడ్డారన్నారు. గాయపడిన వారిలో ఐదుగురికి కేజీహెచ్లో, ముగ్గురికి నర్సీపట్నం ప్రభుత్వాస్పపత్రిలో వైద్యం అందిస్తున్నట్లు వెల్లడించారు. మృతులకు ప్రభుత్వం తరపున రూ.15 లక్షలు చొప్పున ఎక్స్గ్రేషియాను ప్రకటించినట్లు తెలిపారు. మరో రూ.2 లక్షలు కేంద్రం నుంచి కూడా మంజూరవుతుందన్నారు. క్షతగాత్రులకు రూ.4 లక్షలు ఆర్థికసాయం అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. -
వక్ఫ్ సవరణ చట్టం రద్దు చేయాల్సిందే..
డాబాగార్డెన్స్: వక్ఫ్ సవరణ చట్టం రద్దు చేయాలంటూ ముస్లింలు ఆదివారం ర్యాలీ నిర్వహించారు. డాబాగార్డెన్స్ అంబేడ్కర్ కూడలి నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు చేపట్టిన ఈ శాంతియుత ర్యాలీలో ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. తక్షణమే వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కితీసుకోకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయవాది మహమ్మద్ గౌస్ ముద్దిన్ ఖాన్, ముస్లిం నాయకులు హైదర్ అలీ సింకా, జహీర్ అహ్మద్, ఆల్ మాస్క్ ప్రెసిడెంట్ అహ్మదుల్లా ఖాన్, మక్కా మసీద్ ప్రెసిడెంట్ మున్నీర్, యాసిన్ మసీద్ అసిస్టెంట్ సెక్రటరీ మహమ్మద్ ఇబ్రహీం, మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఫరూఖీ, తదితరులు పాల్గొన్నారు. -
అగ్ని ప్రమాదం.. అప్రమత్తతే కీలకం
అల్లిపురం: రోజురోజుకూ ఎండలు తీవ్రమవుతున్నాయి. పెరుగుతున్న వేసవి తాపం అగ్ని ప్రమాదాలకు ఆజ్యం పోసేలా ఉంది. వేసవిలోనే అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగి, అపార నష్టాలను మిగుల్చుతున్నాయి. అసలు ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అప్రమత్తంగా ఉంటే నష్ట తీవ్రతను తగ్గించవచ్చు. దీనిపై జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యపరచడంతోపాటు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నారు. జాతీయ అగ్నిమాపక దినోత్సవం పురస్కరించుకుని ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అగ్నిమాపక అధికారి ఎస్.రమణయ్య తెలిపారు. అగ్ని ప్రమాదాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఏటా ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించడం పరిపాటి. 1944 ఏప్రిల్ 14న ముంబయిలోని విక్టోరియా డాక్యార్డ్లో జరిగిన అగ్నిప్రమాదంలో అధికారులు, సిబ్బంది, సామాన్య ప్రజలతో సహా 66 మంది మరణించగా, 87 మంది గాయపడ్డారు. ఈ అగ్నిప్రమాద ఘటనకు గుర్తుగా ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది నినాదం ‘అగ్ని సురక్షిత భారతదేశానికి ఐక్యమవ్వండి’. నగరంలోని సూర్యాబాగ్, మర్రిపాలెం, పెదగంట్యాడ, ఆటోనగర్, చిట్టివలస ప్రాంతాల్లోని అగ్నిమాపక కేంద్రాల్లో వారోత్సవాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాంగం అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు చేయాల్సిన ఫోన్ నంబర్లు డయల్ 101, 112 విశాఖపట్నం : 0891–2563582, 2787818, 99637 28301 పెదగంట్యాడ : 0891–2517780, 2515233, 99637 28664 మర్రిపాలెం : 0891–2558470, 99637 29367 చిట్టివలస : 08933–295101, 99637 28726 ఆటోనగర్ : 0891–2515101, 99637 28664 -
కేజీహెచ్లో రెండు పూటలా సూపర్ స్పెషాలిటీ ఓపీ సేవలు
మహారాణిపేట: కేజీహెచ్లో కొత్తగా రెండు పూటలా ప్రారంభించిన సూపర్ స్పెషాలిటీ విభాగాల సేవలను రోగులు వినియోగించుకోవాలని సూపరింటెండెంట్ డాక్టర్ కె.శివానంద పేర్కొన్నారు. ఆదివారం ఆసుపత్రిలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు వారానికి మూడు రోజులు నిర్వహించే ఓపీ సేవలు.. ఈనెల 5వ తేదీ నుంచి ఆదివారం మినహా మిగతా అన్ని రోజులు అందిస్తున్నామన్నారు. ప్రతిరోజు ఉదయం 9 నుంచి ఒంటి గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ఓసీ సేవలు అందుతాయన్నారు. కేజీహెచ్లోని అన్ని విభాగాలను కంప్యూటరీకరణ చేస్తున్నామన్నారు. వార్డుల్లో టాయిలెట్స్ను ఎప్పుటి కప్పుడు శుభ్రం చేసి రోగులు వారి బంధువులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. ఆసుపత్రిలో అన్ని మందులు అందుబాటులో ఉన్నాయని, సాధారణ రోగులకు వారానికి సరిపడే మందులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు సరిపడ మందులు ఇస్తున్నట్లు చెప్పారు. మందుల కొనుగోలుకు ప్రభుత్వం రూ.7.5 కోట్లు విడుదల చేసిందని పేర్కొన్నారు. సమావేశంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ వాసవిలత, ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ మోహర్ కుమార్ పాల్గొన్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద -
రాజ్యాంగ పరిరక్షణకు కలిసి పోరాడాలి
డాబాగార్డెన్స్: రాజ్యాంగ పరిరక్షణకు అందరూ కలిసి పోరాడాలని పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి పిలుపునిచ్చారు. ప్రజానాట్య మండలి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం రాజ్యాంగ పరిరక్షణ సమ్మేళనం పేరిట కళారూపాల శంఖారావం జరిగింది. బి.ఆర్.అంబేడ్కర్ 134వ జయంతి ఉత్సవాల్లో భాగంగా చేపట్టిన ర్యాలీని ఆర్.నారాయణమూర్తి జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుంచి డప్పులు, తీన్మార్, కోలాటాలు, నృత్యాలు, నాటికలు వేసే కళాకారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. డాబాగార్డెన్స్ లోని అల్లూరి విజ్ఞాన భవన్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ సాగింది. అనంతరం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరిగిన సభలో నారాయణమూర్తితో పాటు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం, ఆండ్రా మాల్యాద్రి, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి అరుణ్, వై.రాజు అంబేడ్కర్, జ్యోతిరావు పూలే, జగ్జీవన్రామ్ చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం దళితులు, మైనార్టీలపై దాడులకు పాల్పడుతోందని విమర్శించారు. ప్రశ్నించేవారి గొంతు నొక్కుతోందన్నారు. కార్మిక చట్టాలను మార్చి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ, చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తోందని దుయ్యబట్టారు. నారాయణమూర్తి మాట్లాడుతూ దేశంలోని కార్మికులు, పీడితులు, దళిత బడుగు బలహీన వర్గాల కోసం పోరాడేందుకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఆండ్రా మాల్యాద్రి మాట్లాడుతూ దళితుల అభివృద్ధి, ఉద్యోగ అవకాశాల కోసం కేవీపీఎస్ నిరంతరం పోరాడుతోందన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. థింసా నృత్యం, రాజ్యాంగ పరిరక్షణకు నాటిక, బాలబాలికల నృత్య ప్రదర్శనలు, మహిళల కోలాటాలు అలరించాయి. అంబేడ్కర్ వేషధారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమంలో జి.రమణ, టి.చిరంజీవి, ఎం.చంటి, సుబ్బన్న, వై.రాజు, కె.సత్యనారాయణ, జి.స్టాలిన్, ఎం.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సినీనటుడు ఆర్.నారాయణమూర్తి పిలుపు -
భారత కబడ్డీ జట్టుకు ఎండాడ మహిళ ఎంపిక
కొమ్మాది: జీవీఎంసీ 8వ వార్డు ఎండాడ ప్రాంతానికి చెందిన వివాహిత కొప్పాన గౌరి భారత కబడ్డీ జట్టుకు ఎంపికై ంది. వచ్చే జూన్లో బిహార్లో జరగనున్న రెండవ ప్రపంచ కప్ మహిళా కబడ్డీ పోటీలకు ప్రాతినిధ్యం వహించనుంది. ఆమె తాడేపల్లిగూడెంలోని పోస్టల్ కార్యాలయంలో ఉద్యోగం చేస్తోంది. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో జరిగిన కబడ్డీ పోటీల్లో పాల్గొని అనేక పతకాలు కై వసం చేసుకుంది. భారత కబడ్డీ జట్టులో రాష్ట్రం తరఫున ఆమెకు స్థానం దక్కడం అభినందనీయమని అథ్లెటిక్ శిక్షకుడు వైకుంఠరావు అన్నారు. ఎండాడ గ్రామపెద్దలు, క్రీడాకారులు ఆమెను అభినందించారు. -
జలపాతంలో ఇద్దరు యువకుల గల్లంతు
సాక్షి, పాడేరు/జగదాంబ: జీనబాడు పంచాయతీ సరియా జలపాతంలో ఇద్దరు యువకులు గల్లంత య్యారు. పూర్ణామార్కెట్కు చెందిన ఆరుగురు యువకులు సరియా జలపాతం సందర్శనకు ఆదివారం వెళ్లారు. జలపాతంలో స్నానం కోసం దిగిన సమయంలో ప్రమాదవశాత్తు పూర్ణామార్కెట్ పండావీధికి చెందిన ఇల్లా వాసు(22), నర్సింహం జారిపడి గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం మిగిలిన నలుగురు, స్థానికులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. చీకటి పడడంతో గాలింపు చర్యలు నిలిచిపోయాయి. నలుగురు యువకులు అనంతగిరి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటన స్థలానికి బయలుదేరారు. గల్లంతైన ఇద్దరూ ఫిషింగ్ హార్బర్లోని చేపల దుకాణాల్లో పనిచేస్తున్నారు. వాసు(ఫైల్) -
ప్రేక్షకులను నవ్వించే మాట నిలబెట్టుకున్నాం
డాబాగార్డెన్స్: ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’ చిత్రం మంచి విజయం సొంతం చేసుకుందని హీరో ప్రదీప్ మాచిరాజు తెలిపారు. నగరంలోని ఓ హోటల్లో ఆదివారం జరిగిన చిత్ర విజయోత్సవంలో ఆయన మాట్లాడారు. ఈ చిత్రం ప్రేక్షకులను ఆద్యంతం నవ్విస్తుందని తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామన్నారు. ఈ సినిమాకు మద్దతు తెలిపిన మహేష్బాబు, రాంచరణ్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఏప్రిల్ 11 తన జీవితంలో మరచిపోలేని రోజని, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. చాలా కాలం తర్వాత ఇలాంటి స్వచ్ఛమైన కామెడీ ఎంటర్టైనర్ చూశామని ప్రేక్షకులు చెబుతుంటే మరింత సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి కథను రాసి తమను భాగం చేసిన దర్శకులు నితిన్, భరత్లకు ధన్యవాదాలు తెలిపారు. హీరో నాని కూడా త్వరలో ఈ సినిమా చూడనున్నారని చెప్పారు. కమెడియన్ గెటప్ శ్రీను మాట్లాడుతూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే మంచి పాత్ర ఇచ్చినందుకు దర్శకులకు కృతజ్ఞతలు తెలిపారు. బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, సత్య వంటి నటులతో కలిసి నటించడం ఆనందంగా ఉందన్నారు. హీరోయిన్ దీపిక మాట్లాడుతూ ప్రేక్షకులు తమ చిత్రాన్ని ఇంతగా ఆదరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. హీరో ప్రదీప్ మాచిరాజు -
అనకాపల్లి అగ్ని ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
తాడేపల్లి,సాక్షి: అనకాపల్లి జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. కోటవురట్ల మండలం కైలాసపట్నం గ్రామ శివారులో బాణా సంచా తయారీ కేంద్రంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మరణించారు. ఈ విషాదంపై వైఎస్సార్సీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పలువురు మరణించడం, మరికొందరు తీవ్రంగా గాయపడడంపై విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.ఈ ప్రమాదంలో మరణించిన, గాయపడ్డ వారి కుటుంబాలకు తోడుగా నిలవాలని వైఎస్సార్సీపీ నాయకులను ఆదేశించారు. క్షతగాత్రులకు మంచి వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలు తిరిగి కోలుకునేలా అన్నిరకాలుగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహయక చర్యలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. 13-04-2025బాణసంచా తయారీ కేంద్రంలో ప్రమాదంపై మాజీ సీఎం @ysjagan దిగ్భ్రాంతి బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తివైయస్.జగన్ ఆదేశాల మేరకు ఘటనా స్థలానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనకాపల్లి జిల్లా కోటవురట్లలో ఒక బాణా సంచా తయారీ కేంద్రంలో ప్రమాద ఘటన పట్ల మాజీ…— YSR Congress Party (@YSRCParty) April 13, 2025 -
అనకాపల్లి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. 8కి చేరిన మృతుల సంఖ్య
విశాఖ,సాక్షి: అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు గాయపడ్డ బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్లతో మంటల్ని ఆర్పుతున్నారు.ప్రమాదంపై పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు.. కోటవురట్ల మండలం కైలాసపట్నం గ్రామ శివారులో బాణా సంచా తయారీ కేంద్రంలో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదలో మృతుల సంఖ్య అంతకంత పెరుగుతున్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ మిగిలిన క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఆదివారం కావడంతో బాణా సంచా కేంద్రంలో పని చేసేందుకు 15మంది మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. లేదంటే అపార ప్రాణ నష్టం జరిగి ఉండేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు, ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ విచారణకు ఆదేశించారు. బాణాసంచా పేలుడు ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు:1. దాడి రామలక్ష్మి (35),W/oవెంకటస్వామి, R/o రాజుపేట .2. పురం పాప (40),W/o అప్పారావు, R/o కైలాసపట్నం. 3. గుంపిన వేణుబాబు (34),S/o దేముళ్ళు,R/o కైలాసపట్నం.4. సంగరాతి గోవిందు (40),S/o సత్యనారాయణ, R/o కైలాసపట్నం.5. సేనాపతి బాబూరావు (55)S/o గెడ్డప్ప ,R/o చౌడువాడ.6. అప్పికొండ పల్లయ్య (50)S/o నూకరాజు ,R/o కైలాసపట్నం.7. దేవర నిర్మల (38)W/o వీర వెంకట సత్యనారాయణ, R/o వేట్లపాలెం.8. హేమంత్ (20)R/o భీమిలి. -
ఏపీకి వర్షసూచన.. ఈ జిల్లాల్లో రెండు రోజులు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో మిశ్రమ వాతావరణం కొనసాగుతోంది. ఓవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రాజస్థాన్ నుంచి కోస్తాంధ్ర వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. ఈ నేపథ్యంలో నేడు, రేపు.. కోస్తా, రాయలసీమలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.మరోవైపు.. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాల్పులు వీస్తున్నాయి. అత్యధికంగా అమరావతిలో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఇక, రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంటుందంటున్న వాతావరణ నిపుణులు చెబుతున్నారు.ఇదిలా ఉండగా.. తెలంగాణలో కూడా రెండు రోజులు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య మధ్యప్రదేశ్ సమీప ప్రాంతం నుంచి ఈశాన్య తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర ప్రాంత జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.కాగా, రాష్ట్రంలో రెండు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వివరించారు. శనివారం ఖమ్మంలో గరిష్టంగా 41.8 డిగ్రీల సెల్సియస్, మెదక్లో కనిష్టంగా 22.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.రానున్న రెండు రోజులు మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, నాగర్కర్నూల్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈమేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. -
నారాయణ విద్యార్థుల విజయదుందుభి
సీతమ్మధార: ఇంటర్ ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థలు మరోసారి విజయకేతనం ఎగురవేసినట్లు సంస్థ డీజీఎం డి.హనుమంతరావు తెలిపారు. ఫస్టియర్ ఎంపీసీలో 470 మార్కులకు గాను 465 పైన ఇద్దరు, 464 పైన ఆరుగురు, 460 పైన 24 మంది సాధించారు. ఇందులో ఈ. శ్రావణి 465, బి.జస్మిని 465, పి.విహాన్ 464 మార్కులు పొందారు. ఫస్టియర్ బైపీసీలో 440 మార్కులకు గాను 430 పైన నలుగురు, 420 పైన 14 మంది మార్కులు సాధించారు. ముక్క మైత్రి 433, పి.శశికళ 431 మార్కులు పొందారు. విద్యార్థుల మనస్తత్వాన్ని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా బోధిస్తూ.. విజయాలు సాధిస్తున్నట్లు డీజీఎం తెలిపారు. డీజీఎంతోపాటు కోర్ డీన్ పి.వరప్రసాద్, ఎం.జగదీష్రెడ్డి విద్యార్థులను, అధ్యాపకులను అభినందించారు. -
శ్రీ చైతన్య విద్యార్థుల విజయకేతనం
విశాఖ విద్య: ఇంటర్ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థల విద్యార్థులు సతా చాటారు. సెకండియర్ ఎంపీసీలో కురమదాసుపు శ్రీజ 992 మార్కులతో రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానం దక్కించుకున్నట్లు విద్యా సంస్థల ఉత్తరాంధ్ర ఎగ్జిక్యూటివ్ ఏజీఎం కె.వి.రమణ తెలిపారు. ఎంపీసీలో ఆకెళ్ల మేఘన శర్మ 991, సంబంగి మనస్విని 991, పి.మహేంద్ర 990, బైపీసీలో కాండ్రేగుల జ్వలిత 990 మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకులను కై వసం చేసుకున్నారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను శనివారం నగరంలోని ప్రధాన కార్యాలయంలో ఏజీఎం ప్రత్యేకంగా అభినందించారు. డీన్లు కె.బంగారుబాబు, ఎస్.రఘుకుమార్ తదితరులు పాల్గొన్నారు. గృహిణులకు స్పోకెన్ ఇంగ్లిష్లో ఉచిత శిక్షణ -
ఇంటర్లో బాలికలదే హవా
ఫస్టియర్ సెకండియర్ బాలురు 77 శాతం 75 శాతం బాలికలు 82 శాతం 85 శాతంవిశాఖ విద్య: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. అత్యుత్తమ మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకులను కైవసం చేసుకున్నారు. ఈ ఏడాది జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని 188 జూనియర్ కాలేజీల నుంచి ఫస్టియర్ (జనరల్) 40,098 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 31,866 మంది పాసయ్యారు. తద్వారా 79 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. సెకండియర్కు 36,479 మంది హాజరవ్వగా 31,761 మంది పాసయ్యారు. 87 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఫస్టియర్లో బాలురు 77 శాతం పాసవ్వగా బాలికలు 82 శాతం పాసయ్యారు. సెకండియర్లో బాలురు 86 శాతం పాసవ్వగా బాలికలు 89 శాతం ఉత్తీర్ణత పొందారు. ఒకేషనల్ ఫస్టియర్లో బాలురు 48 శాతం పాసవ్వగా బాలికలు 77 శాతం పాసయ్యారు. సెకండియర్లో బాలురు 75 శాతం పాసవ్వగా బాలికలు 85 శాతం ఉత్తీర్ణత పొందారు. మొత్తంగా గతేడాది కంటే జిల్లాలో ఉత్తీర్ణత శాతం కొద్దిగా పెరిగింది. ఫస్టియర్లో రాష్ట్ర సూచికలో 4వ స్థానం, సెకండియర్లో 6వ స్థానం దక్కింది. రీ వాల్యూయేషన్కు అవకాశం ఫలితాలపై విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే రీ వాల్యూయేషన్కు అవకాశం కల్పించారు. రీ వాల్యూయేషన్ కోరే విద్యార్థులు రూ.260 ఫీజు చెల్లించి ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అదే విధంగా రీ వెరిఫికేషన్ కోసం రూ.1,300లు ఫీజు చెల్లించాలి. మే 12 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు మే 12 నుంచి 20 వరకు జరగనున్నాయి. విద్యార్థులు నిర్ణీత ఫీజుతో ఈ నెల 15 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవాలి. కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ జిల్లాలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాలకు చెందిన విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. భీమిలి కేజీబీవీకి చెందిన ఎస్.ప్రణతి బైపీసీ ఫస్టియర్లో 440 మార్కులకు గాను 434 మార్కులతో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్లు సమగ్ర శిక్ష ఏపీసీ జోగ చంద్రశేఖర్ రావు తెలిపారు. కేజీబీవీ ఆనందపురానికి చెందిన నమ్మి వసంత ఇంటర్ సెకండియర్ ఎంపీసీలో 975 మార్కులు సాధించింది. కేబీవీబీ ఆనందపురంలో ఫస్టియర్ 67 శాతం, సెకండియర్ 85 శాతం, భీమునిపట్నంలో ఫస్టియర్ 78 శాతం, సెకండియర్ 97 శాతం, పద్మనాభం కేజీబీవీలో ఫస్టియర్ 41 శాతం, సెకండియర్ 88 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఫస్టియర్లో 79, సెకండియర్లో 87 శాతం ఉత్తీర్ణత -
వైజాగ్.. వద్దే వద్దు.!
సర్వీసుల నుంచి ఒక్కొక్కటిగా తప్పుకుంటున్న ఎయిర్లైన్స్లుసాక్షి, విశాఖపట్నం: ‘దుబాయ్కు విమానం తీసుకొస్తాం.. వియత్నాంకు సర్వీసు తెస్తాం.. దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు డొమెస్టిక్ విమాన సర్వీసులు విశాఖ నుంచి నడిచేలా చేస్తాం.’ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కింజరాపు రామ్మోహన్నాయుడు బాహాటంగా చేసిన ప్రకటన ఇది. కట్ చేస్తే... ‘దుబాయ్ సర్వీసు విజయవాడ వెళ్లిపోయింది. వియత్నాం సర్వీసు హైదారాబాద్కు వెళ్లిపోయింది. కొత్త విమానాల మాట దేవుడెరుక.. ఇప్పుడు ఉన్న అంతర్జాతీయ సర్వీసులు కూడా గోవిందా.. గోవిందా.. నిత్యం రద్దీగా తిరిగే బ్యాంకాక్, కౌలాలంపూర్ సర్వీసులను వైజాగ్ నిలిపేస్తున్నట్లు ఎయిర్లైన్స్ ప్రకటించింది.’’ ● ఇదీ కూటమి సర్కారుకు విశాఖపై కురిపిస్తున్న కపట ప్రేమకు నిదర్శనం. జాతీయ, అంతర్జాతీయ సర్వీసులతో కళకళలాడుతున్న వైజాగ్ ఎయిర్పోర్టు.. మరికొద్ది రోజుల్లో కళావిహీనంగా మారిపోబోతోంది. కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం. కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు చేతకానితనం. తన చేతిలోనే పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ ఉన్నా.. ఏనాడు విశాఖ ఎయిర్పోర్టు అభివృద్ధి కోసం పట్టించుకున్న పాపాన పోలేదు. ఫలితంగా ఎయిర్లైన్స్ సంస్థలు వైజాగ్ వద్దే వద్దంటూ మూటాముళ్లు సర్దుకొని వెళ్లిపోతున్నాయి. బ్యాంకాక్, మలేషియాకు రాం రాం.! కరోనా తర్వాత అంతర్జాతీయ సర్వీసులు వైజాగ్ నుంచి అవసరమంటూ పట్టుబట్టి మరీ.. సింగపూర్ సర్వీసుని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టింది. 2023 ఏప్రిల్ 9న బ్యాంకాక్కు, 2024 ఫిబ్రవరిలో ప్రకటించిన తర్వాత అదే ఏడాది ఏప్రిల్ 26న కౌలాలంపూర్కు ఎయిర్ ఏసియా సంస్థ అంతర్జాతీయ సర్వీసులను విశాఖ నుంచి ప్రారంభించింది. మొన్నటి వరకూ దాదాపు ఫుల్ ప్యాక్తో సర్వీసులు నడిచాయి. బ్యాంకాక్ సర్వీసులో ప్రతిరోజూ దాదాపు 200 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. కౌలాలంపూర్ సర్వీసు ప్రతి రోజూ 150 నుంచి 200 మంది ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేరవేస్తోంది. అయినప్పటికీ ఈ సర్వీసుల్ని మే ఒకటి నుంచి నిలిపేస్తున్నట్లు ఎయిర్ఏసియా సంస్థ ప్రకటించింది. ఇకపై వైజాగ్ నుంచి ఒకే ఒక్క సింగపూర్ సర్వీస్ నడవనుంది. పది సర్వీసులు తీసుకొస్తానన్న కేంద్ర మంత్రి చివరికి ఒకే ఒక్క సర్వీసుకి పడిపోయేలా చేశారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. పోనీ కొత్త సర్వీసుల విషయంలోనైనా జాగ్రత్తగా ఉన్నారా అంటే అదీ లేదు. ప్రముఖ ఎయిర్లైన్స్ సంస్థ ఎమిరేట్స్ ఏపీ నుంచి దుబాయ్కు విమాన సర్వీసు నిర్వహించేందుకు సిద్ధమైన తరుణంలో.. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడంతో విజయవాడ నుంచి ప్రారంభించేసింది. ఇక వైజాగ్ నుంచి నుంచి వియత్నాంలోని ప్రధాన నగరం హొచిమిన్ సిటీకి ఈ ఏడాది సర్వీసు ప్రారంభిస్తామని వియట్జెట్ ఎయిర్లైన్స్ ప్రకటించింది. కానీ ప్రభుత్వం స్పందించకపోవడంతో హైదరాబాద్ నుంచి సర్వీసులు ప్రారంభించేసింది. ఇలా ఉన్నవీ పోయి.. కొత్తవీ తీసుకురాకపోవడం సిగ్గు చేటు అని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రికి విన్నవించుకున్నాం.. విశాఖ నుంచి విదేశాలకు వెళ్తున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. టైర్–2 నగరాల నుంచి కూడా విదేశీయానానికి అవకాశాలు పుష్కలమవ్వడంతో అవుట్ బౌండ్ టూరిజం గణనీయంగా వృద్ధి చెందుతోంది. దీనికి తోడు వీసా లేకుండా రావొచ్చంటూ వివిధ దేశాలు ప్రకటించడంతో కొత్త సర్వీసుల కోసం ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సమయంలో ఉన్న సర్వీసులు కూడా నిలిచిపోవడం బాధాకరం. ఈ తరహా సర్వీసుల రద్దు భవిష్యత్తులో విశాఖ ఎయిర్పోర్టుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ విషయంలో చొరవ చూపించాలని కేంద్ర మంత్రికి అసోసియేషన్ల తరఫున లేఖలు రాశాం. –విజయ్మోహన్, ఏపీ ట్రావెల్ అండ్ టూర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సోషల్ మీడియాలోనే అభివృద్ధి.! కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్నాయుడుని నియమించినప్పుడు వైజాగ్ ఎయిర్పోర్టుకు మంచిరోజులు వచ్చాయని అంతా భావించారు. ప్రస్తుతం ఉన్న రెండు మూడు విదేశీ సర్వీసులకు అదనంగా మరో 5 వరకూ సర్వీసులు రానున్నాయని అంతా ఆశించారు. ఆయన కొత్త సర్వీసులు తీసుకురాకపోగా ఉన్న సర్వీసులకు ఎసరెట్టేలో వ్యవహరిస్తున్నారన్నది జగమెరిన సత్యం. తాను అది చేస్తున్నాను.. ఇది చేస్తున్నానంటూ కేవలం సోషల్ మీడియాలోనే అభివృద్ధి చూపించేస్తున్న మంత్రి.. వైజాగ్ ఎయిర్పోర్టు విషయంలో మా త్రం తనకేమీ పట్టనట్లుగా ఉన్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమంగా విశాఖ ప్రతిష్ట మసకబారుతుండటంతో.. ఇక్కడ ల్యాండ్ అవుతున్న విమానాలు.. ఇక సెలవు అంటూ బైబై చెప్పేస్తున్నాయి. విశాఖకు బైబై.. విజయవాడకు రయ్ రయ్ డొమెస్టిక్ సర్వీసులూ విశాఖ నుంచి ఒక్కొక్కటిగా దూరమవ్వడం మొదలైంది. విశాఖ నుంచి విజయవాడకు ఉదయం సమయంలో ఉన్న సర్వీసుల్ని రద్దు చేసినట్లు ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ ప్రకటించింది. ఈ విమానాన్ని రాయ్పూర్ నుంచి రాజ్కోట్కు నడుపుతున్నట్లు స్పష్టం చేసింది. ఉన్న సర్వీసులు పోతున్న నేపథ్యంలో ప్రముఖ ఎయిర్లైన్స్ ఆకాశా సంస్థ వైజాగ్ నుంచి హైదరాబాద్తో పాటు దేశంలోని వివిధ నగరాలకు సర్వీసులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ విషయంపై కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో పాటు.. వైజాగ్ ఎయిర్పోర్టు అధికారులకు రెండు నెలల క్రితమే సమాచారం పంపించినా.. కేంద్ర మంత్రి నుంచి స్పందన లేకపోవడంతో ఆకాశా ఎయిర్లైన్స్ ప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాము కోరుండి సర్వీసులు నడుపుతామన్నా పట్టించుకోనప్పుడు.. వైజాగ్లో నడిపేందుకు ఎందుకు ఆసక్తి చూపించాలని ప్రశ్నిస్తున్నారు. ఇటీవలే విజయవాడ సర్వీసుని రద్దు చేసిన ఇండిగో ఇప్పుడు రెండు ఇంటర్నేషనల్ సర్వీసులను నిలిపేస్తున్నఎయిర్ ఏసియా ఇకపై వైజాగ్ నుంచి బ్యాంకాక్, మలేసియా విమానాలు ఉండవ్ -
నేత్రపర్వం.. వసంతోత్సవం
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా 6వ రోజు శనివారం ఉదయం చూర్ణోత్సవం, వసంతోత్సవం, చక్రస్నానం వైభవంగా జరిగాయి. స్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవి, చక్రపెరుమాళ్లు, ఆళ్వారులను కల్యాణ మండపంలో అధిష్టింపజేశారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం నిర్వహించారు. పసుపు కొమ్ములను దంచి కొట్నాలు సేవ చేశారు. వసంతాలను ఉత్సవమూర్తుల వద్ద ఉంచి పూజలు జరిపారు. ఆ వసంతాలతో అర్చకుల వేదమంత్రోచ్ఛరణలు, నాదస్వర వాయిద్యాల మధ్య ఆలయ బేడా ప్రదక్షిణ చేశారు. అంతరాలయంలోని స్వామివారి మూల విరాట్కు, ఆలయంలో కొలువుదీరిన దేవతా మూర్తులకు వసంతాలు సమర్పించారు. అక్కడి నుంచి వసంతాలను మళ్లీ కల్యాణ మండపానికి ప్రదక్షిణగా తీసుకొచ్చి ఉత్సవమూర్తులకు సమర్పించారు. అనంతరం ఆ వసంతాలను అర్చకులు భక్తులపై చల్లారు. తదుపరి అర్చకులు, సిబ్బంది, భక్తులు వసంతాలను ఒకరిపై ఒకరు జల్లుకుని సందడి చేశారు. తర్వాత ఉత్సవమూర్తులను ఒక పల్లకీలో, చక్రపెరుమాళ్లు, ఆళ్వారులను మరొక పల్లకీలో గంగధార వద్దకు తిరువీధిగా తీసుకెళ్లారు. అక్కడ గంగధార, పంచామృతాలతో పంచ కలశ స్నపనాన్ని విశేషంగా జరిపారు. చక్రస్నాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చక్రపెరుమాళ్లను గంగధార నీటి ప్రవాహం వద్ద ఉంచి ఆ నీటిని భక్తులపై పడేలా చేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్నానమాచరించారు. తదుపరి ఉత్సవమూర్తులకు విశేష అలంకరణ చేసి ఆలయంలోకి తిరువీధిగా తీసుకెళ్లారు. అంతకుముందు ఆలయ యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఇరగవరపు రమణాచార్యులు, పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు, అర్చకులు, వేద పండితులు, పారాయణదారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవస్థానం ఈవో కె.సుబ్బారావు సతీసమేతంగా ఉత్సవంలో పాల్గొన్నారు. ఏఈవో ఆనంద్కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. రంగులమయమైన సింహగిరి పరవశించిన భక్తజనం -
చతికిలబడి
సర్కారు కళాశాలలు ఇంటర్ ఫలితాల్లో జిల్లా ఆఖరి స్థానం ● ఫస్టియర్లో 34, సెకండియర్లో 55 శాతం ఉత్తీర్ణత హైస్కూల్ ప్లస్లో దారుణమైన ఫలితాలు ● ప్రభుత్వ జూనియర్ కాలేజీల నిర్వీర్యమే లక్ష్యమా..? విశాఖ విద్య: ఇంటర్ ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు డీలాపడ్డాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరంలోనూ రాష్ట్రంలోనే అట్టడుగు స్థానంలో విశాఖ జిల్లా నిలిచింది. ఫస్టియర్లో కేవలం 34 శాతం, సెకండియర్లో 55 శాతం ఉత్తీర్ణత నమోదైంది. జిల్లా ఆఖరి స్థానంలో నిలవడం చూస్తుంటే.. ఫలితాలు రాబట్టేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని అర్థమవుతుంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అధ్యాపకుల ఖాళీల భర్తీపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. రేషనలైజేషన్ పేరుతో ఉన్న పోస్టులను కుదించేసింది. కాలేజీల్లో చదువులు ఎలా సాగుతున్నాయనేది క్షేత్రస్థాయిలో సమీక్షలు కూడా లేవు. ప్రభుత్వ కాలేజీలను నిర్వీర్యం చేసి, తద్వారా ప్రైవేటు విద్యా సంస్థలకు మేలు చేకూర్చాలన్న కూటమి ప్రభుత్వ విధానాలకు ప్రతిరూపమే ప్రస్తుత ఇంటర్మీడియెట్ ఫలితాలు అని విద్యారంగ నిపుణులు అంటున్నారు. బోధన సిబ్బంది కొరత వల్ల తరగతులు సక్రమంగా నిర్వహించకపోవడంతో విద్యార్థులు పాస్ కాలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఘోరమైన ఫలితాలు ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో జిల్లాలోని అన్ని యాజమాన్యాలు కలుపుకొని 79 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్ర స్థాయిలో నాల్గో స్థానంలో నిలిచింది. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఫస్టియర్లో 34 శాతం ఉత్తీర్ణత మాత్రమే రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. డాక్టర్ వీఎస్ కృష్ణా కాలేజీలో అతి తక్కువగా 16 శాతం మంది విద్యార్థులే పాసవ్వడం గమనార్హం. మల్కాపురం, పెందుర్తి, మధురవాడ, ఇస్లాంపేట, భీమునిపట్నం కాలేజీల్లోనూ 34 శాతం కంటే తక్కువగా ఫలితాలు వచ్చాయి. సెకండియర్లో జిల్లాలోని అన్ని యాజమాన్యాల ఉత్తీర్ణత సగటు 87 శాతంతో రాష్ట్ర సూచికలో ఆరో స్థానంలో నిలిచింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 55 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. పెందుర్తి, డాక్టర్ వీఎస్ కృష్ణా కాలేజీ, మల్కాపురం, ఇస్లాంపేట, ఆనందపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 50 శాతంలోపు ఉత్తీర్ణత సాధించగా, ఆనందపురం కాలేజీలో అయితే అతి తక్కువగా 25 శాతం మంది విద్యార్థులే ఉత్తీర్ణత కావడం గమనార్హం. మొత్తంగా ప్రథమ, ద్వితీయ ఇంటర్లో జిల్లా అట్టడుగు స్థానంలో నిలిచింది. ఆ కాలేజీల్లో ప్రైవేటు వ్యాపారాలు జిల్లాలోని భీమునిపట్నం, ఆనందపురం, మధురవాడ వంటి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని కొంతమంది అధ్యాపకులు చదువులను పూర్తిగా గాలికొదిలేశారనే విమర్శలు మొదటనుంచీ ఉన్నాయి. ఇక్కడి అధ్యాపకులు రెగ్యులర్ విద్యార్థులకు చదువులు చెప్పటం మానేసి, ఓపెన్ స్కూళ్లలో టెన్త్, ఇంటర్ అడ్మిషన్లపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతూ.. ప్రైవేటు సంపాదన వైపు మొగ్గు చూపుతున్న కారణంగానే.. ఇక్కడ సరైన ఫలితాలు రావటం లేదనే ప్రచారం ఉంది. హైస్కూల్ ప్లస్లోనూ అంతంతమాత్రమే.. బాలికలకు ఉన్నత విద్యను చేరువలోకి తీసుకురావాలనే సంకల్పంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైస్కూల్ ప్లస్ ల్లోనూ ఫలితాలు ఆశాజనకంగా లేవు. జిల్లాలోని 6 హైస్కూల్ ప్లస్ ల్లో ఫస్టియర్లో 18.23 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గోపాలపట్నంలో 43 మందికి ముగ్గురు, గంగవరంలో 31 మందికి నలుగురు, ములగాడలో 21మందికి ముగ్గురు మాత్రమే పాసయ్యారు. సెకండియర్లో 34.43 శాతం మంది ఉత్తీర్ణత నమోదైంది. రాంపురంలో అతి తక్కువగా ఉత్తీర్ణత శాతం నమోదు కావడం గమనార్హం. హైస్కూల్ ప్లస్లను మూసివేయాలనే ఉద్దేశంతోనే వీటి గురించి కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదని.. అందుకనే ఇలాంటి ఫలితాలు వచ్చాయని విద్యారంగ నిపుణులు అంటున్నారు. -
కంప్యూటర్ ఇంజినీరునవుతా
తాళ్లవలసలోని తిరుమల కాలేజీలో ఇంటర్ చదివిన నేను 1000 మార్కులకు గాను 982 సాధించడం ఆనందంగా ఉంది. మొదటి ఫేజ్ జేఈఈ మెయిన్స్లో 96.57 పర్సంటైల్ సాధించాను. సెకండ్ ఫేజ్ పరీక్షలో 98 ప్లస్ పర్సంటైల్ వస్తుందనే నమ్మకం ఉంది. మా నాన్న ఇప్పిలి లక్ష్మీ త్రినాథ్ ప్రసాద్ ఓ ప్రయివేటు కంపెనీలో చిరు ఉద్యోగి. తల్లి దీప్తి గృహిణి. ప్రతి రోజూ 18 గంటల సాధన చేశాను. అడ్వాన్స్డ్లో మంచి పర్సంటైల్ సాధించి మద్రాస్ ఐఐటీలో కంప్యూటర్ ఇంజినీరింగ్ చేయాల్నదే నా లక్ష్యం. –ఇప్పిలి ధృతి, పట్టాభితోట -
15 నుంచి చేపల వేట నిషేధం
మహారాణిపేట: తూర్పు తీరంలో రెండు నెలల పాటు చేపల వేట నిలిచిపోనుంది. ఈ నెల 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు(61 రోజులు) మత్స్య సంపద వేటకు ప్రభుత్వం నిషేధం విధించింది. తిరిగి జూన్ 15 నుంచి వేట ప్రారంభమవుతుంది. జిల్లాలో 65 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఇక్కడ 32 మత్స్యకార గ్రామా లు, 15 ఫిష్ లాండింగ్ కేంద్రాలు ఉన్నాయి. 749 మర పడవలు, 1,310 మోటారు పడవలు, 488 సంప్రదాయ తెప్పలు ఉన్నాయి. సుమారు 1.15 లక్షల మత్స్యకార కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. వీరిలో దాదాపు 25 వేల మంది సముద్రంలో చేపలు వేటాడుతూ జీవనం సాగిస్తున్నారు. విశాఖ హార్బర్పై ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష కుటుంబాలు ఆధారపడి ఉన్నా యి. కాగా.. మత్స్య సంపద పరిరక్షణ, పునరుత్పత్తి కోసం చేపలవేట నిషేధం అమలు చేస్తున్నట్లు మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ పి.లక్ష్మణరావు తెలిపారు. ఈ నిషేధం మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లకు వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని మత్స్యకారులు గమనించి ప్రభుత్వానికి సహకరించాలని జేడీ కోరారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు రొయ్యలు, చేపలు సంతానోత్పత్తి చేసే కాలమని, ఈ రెండు నెలల పాటు వేటను నిలిపివేస్తే, తర్వాతి మత్స్యకారులకు సమృద్ధిగా చేపలు లభిస్తాయని జేడీ వివరించారు. -
అప్పన్న ఉంగరం చోరీ
● నేడు స్వామి ఉంగరం కోసం వెతుకులాట ● సింహగిరిపై వైభవంగా మృగయోత్సవం సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి సింహగిరి మాడ వీధిలో మృగయోత్సవం(దొంగలదోపు) కనులపండువగా జరిగింది. ఏడు రోజుల ఉత్సవాల్లో ఆరో రోజు రాత్రి నిర్వ హించిన ఈ వేడుక వెనుక ఓ కథ ఉంది. కల్యాణం తర్వాత స్వామివారు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో కలిసి అటవీ మార్గంలో విహారానికి వెళ్తారు. భాగవతోత్తములకు నిత్యం ఆరాధన చేస్తూ.. ఆస్తినంతటినీ పొగొట్టుకున్న నీలుడు అనే పండితోత్తముడు తదియారాధన ఆగకూడదని దారి దోపిడీలకు పాల్పడుతుంటాడు. ఈ క్రమంలో స్వామి, అమ్మవార్ల ఆభరణాలు దొంగిలిస్తాడు. చివరకు అమ్మవారి కాలిమెట్టును తీయడానికి ప్రయత్నించగా.. అది ఎంతకీ రాదు. ఈ క్రమంలో తాను దొంగలిస్తున్నది అమ్మవారి కాలిమెట్టని గ్రహించి.. మోక్షం పొందుతాడు. తన తప్పు తెలుసుకుని ఆభరణాలు తిరిగి ఇచ్చేస్తాడు. నీలుడి భక్తిని మెచ్చిన స్వామి తన సన్నిధిలో తిరుమంగై ఆళ్వార్గా స్థానం కల్పిస్తాడు. విహార యాత్ర ముగించుకుని స్వామి ఆలయానికి చేరుకోగానే ఆయన ఉంగరం కనపడకపోవడంతో అమ్మవారు లోపలికి రానివ్వదు. దీంతో ఉంగరం వెతుక్కునే వేటలో స్వామి పడతాడు. చివరికి ఆయన చివరి పరదాలోనే ఉంగరం ఉంటుంది. కల్యాణోత్సవాల్లో భాగంగా దారి దోపిడీ జరిగే ఘట్టాన్ని శనివారం రాత్రి విశేషంగా నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా గోవిందరాజస్వామి అశ్వవాహనంపై, అమ్మవార్లు పల్లకీలో, తిరుమంగై ఆళ్వార్ మరొక పల్లకీలో మాడ వీధిలో ఊరేగారు. అర్చకులు నీలుడుగా, స్వామివారి దూతగా వేషధారణ చేసి దారి దోపిడీ ఘట్టాన్ని రక్తికట్టించారు. ఆదివారం ఉదయం స్వామి ఉంగరం వెతికే ఘట్టమైన వినోదోత్సవం జరగనుంది. -
బండరాయితో ఒకరిపై దాడి
● పరిస్థితి ఆందోళనకరం.. కేజీహెచ్లో చికిత్స సీతమ్మధార: అబిద్నగర్ పార్కులో ఓ వ్యక్తిపై హత్యా యత్నం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలివి..అక్కయ్యపాలెం అబిద్నగర్ ప్రాంతంలో ఆవాల నరసింహారావు, లక్ష్మి నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. నరసింహారావుకు మద్యం అలవాటు ఉంది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగి.. భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. కాగా.. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత తర్వాత నరసింహారావు అబిద్నగర్ పార్కులో మద్యం సేవించి.. పక్కనే ఉన్న పార్కులో నిద్రపోయాడు. ఆ తర్వాత గుర్తు తెలియని వ్యక్తితో అతనికి గొడవ జరిగింది. దీంతో ఆయన బండరాయితో తలపై గట్టిగా దాడి చేశారు. దీంతో నరసింహారావు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఉదయం స్థానికులు ప్రాణాపాయస్థితిలో ఉన్న నరసింహారావును గుర్తించి..112కు సమాచారం అందించారు. సీఐ ఎ.సత్యనారాయణ, ఎస్ఐ వెంకటరావు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నరసింహారావును కేజీహెచ్కు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు సీసీ ఫుటేజ్, ఇతర ఆధారాల సేకరిస్తున్నారు. నిందితుడి కోసం నాలుగు బృందాలతో గాలిస్తున్నారు. కాగా.. ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న ఆటో డ్రైవర్ వెంకట్రావ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
శ్రీవిశ్వ విజయకేతనం
సీతంపేట: ఇంటర్ ఫలితాల్లో శ్రీ విశ్వ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి విజయకేతనం ఎగురవేశారు. ఫస్టియర్ ఎంపీసీలో లోపింటి తనుష్క, ఉమ్మెత్తల శ్రీలయ, చందక శరత్కుమార్, బండారు జాహ్నవి, గంటేడ కౌషిక్, సిహెచ్.ఎస్.సంయుక్త, జి.మీనాక్షి ఎ.భవ్యశ్రీ 465 మార్కులు సాధించారు. బైపీసీలో మేకా లక్ష్మీ ప్రసన్న 440 కి 435 మార్కులు, పి.డి.జ్యోతి మాన్విత, ఎస్.పూజా కృష్ణవేణి 434 మార్కులు, గొండు భార్గవి 433 మార్కులు పొందారు. సెకండియర్ ఎంపీసీ బొల్లా రోహిత్, కన్నం నవ్యశ్రీ, పాలవలస మేఘన వెయ్యికి 989 మార్కులు, మడసు హాసిని, మంగ భాను తేజ, దంగేటి పల్లవి 988, బైపీసీలో రెడ్డి రేష్మ 984 మార్కులు సాధించారు. వీరిని శ్రీవిశ్వ విద్యా సంస్థల చైర్మన్ కె.ఎస్.హెచ్.ఆర్.కె.ధర్మరాజు, డైరెక్టర్ పి.సూర్యనారాయణ అభినందించారు. -
డాక్టర్.. నా లక్ష్యం
ఇంటర్ బైపీసీలో 988 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి రెండో ర్యాంక్ సాధించడం సంతోషంగా ఉంది. ఫస్టియర్లో 434 మార్కులు సాధించాను. ఎంబీబీఎస్ చదివి, తర్వాత పీజీ చేయడమే నా లక్ష్యం. మా నాన్న కాళ్ల అప్పలరాజు రేషన్ డీలర్. అమ్మ పద్మ గృహిణి. నేను చదువులో రాణించడానికి వారు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. నేను ఉన్నత స్థాయికి చేరుకుని వారికి మంచి గుర్తింపు తీసుకొస్తా. అధ్యాపకుల గైడెన్స్తో మంచి మార్కులు సాధించగలిగాను. – కాళ్ల ఉమ, పాతవెంకోజీపాలెం -
తిరుమల విద్యార్థుల హవా
తగరపువలస: ఇంటర్ ఫలితాల్లో తాళ్లవలస తిరుమల విద్యార్థులు సత్తా చాటినట్లు సంస్థ చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. ఫస్టియర్ ఎంపీసీ నుంచి ఎం.విద్యాచరణ్, ఆర్.హేమచరణ్, ఎ.ఆర్.ప్రజ్వలిత, కె.లలిత్ ఆదిత్య, బి.సిద్ధార్థ్, ఎం.భగవతి, జె.శ్రీలక్ష్మి, వై.తనుశ్రీ, కె.దీపిక, కె.స్పందన 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించారు. బైపీసీలో 440 మార్కులకు గాను సీహెచ్ మేఘన 436 మార్కులు సాధించింది. ఫైనల్ ఇయర్ ఎంపీసీలో వై.స్నేహిత, కె.శృతిలయ, కె.తులసి 990 మార్కులు సాధించారు. బైపీసీలో వై.అశ్వినిశ్రీ 989 అత్యధిక మార్కులు సాధించింది. ఈ సందర్భంగా విద్యార్థులను రెసిడెంట్ డైరెక్టర్లు ఇ.మృత్యుంజయరావు, కె.ఎన్.వి.వి.సత్యనారాయణ, ఎం.సత్యనారాయణ, జి.సతీష్బాబు అభినందించారు. -
ఎసెంట్ విద్యార్థుల ప్రభంజనం
మద్దిలపాలెం: ఇంటర్ ఫలితాల్లో ఎసెంట్ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీ గ్రూప్లో 95.8 ఉత్తీర్ణత శాతం, సెకండియర్ ఎంపీసీ గ్రూప్లో 98.2 ఉత్తీర్ణత శాతం నమోదు చేశారు. ఫస్టియ ర్ ఎంపీసీ విద్యార్థి కె.నైనిషా 466, సెకండియర్ ఎంపీసీ విద్యార్థి కె.వాసవి 988 మార్కులు సాధించారు. 811 మంది ఫస్టియర్ ఎంపీసీ విద్యార్థులో ్ల655 మంది విద్యార్థులు ‘ఎ’గ్రేడ్ మార్కులను సాధించారు. 816 మంది సెకండియర్ ఎంపీసీ విద్యా ర్థుల్లో 661 మంది విద్యార్థులు ‘ఎ’గ్రేడ్ మార్కులను సాధించారు. విద్యార్థులు, అధ్యాపకులను ప్రిన్సిపాళ్లు బి.శ్రీనివాస్ రావు, ఎం.గౌరినాయుడు అభినందించారు. -
ఇంటర్ ఫలితాల్లో శశి విద్యార్థుల సత్తా
తగరపువలస: ఇంటర్ ఫలితాల్లో సంగివలస బ్రాంచ్కు చెందిన తమ విద్యార్థులు విశేష ప్రతిభ చూపారని శశి విద్యాసంస్థల చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఎంపీసీ సెకండియర్ లో 699 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 697 మంది పాసై 99.7 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వీరిలో బోని పూజత అత్యధికంగా 991 మార్కులు సాధించింది. బైపీసీలో 122 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా శత శాతం ఉత్తీర్ణత నమోదైంది. తెంటు యామిని 988 మార్కులు సాధించింది. ఎంపీసీ ఫస్టియర్లో 535 మంది పరీక్షలకు హాజరుకాగా 525 మంది పాసై 98.1 శాతం ఉత్తీర్ణత నమోదైంది. హెచ్.తేజస్విని, కె.నిరీక్షణ్, లంకా గౌతమ్, ఎం.లాస్య, చింతల కస్యప్, సలాది మోనిష 466 మార్కులు పొందారు. బైపీసీలో 137 మంది విద్యార్థులకు గాను శతశాతం ఉత్తీర్ణత నమోదైంది. కె.ప్రణయ్ 436 మార్కులు పొందాడు. వీరిని వైస్ చైర్మన్ మేకా నరేంద్రకృష్ణ, కరస్పాండెంట్ మేకా క్రాంతిసుధ తదితరులు అభినందించారు. -
సాక్షి విలేకరి వెంకటరమణకు ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు
విశాఖ సిటీ: విశాఖ సాక్షి విలేకరి చిటికిరెడ్డి వెంకటరమణకు ఉత్తమ జర్నలిస్టు అవార్డు లభించింది. తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాన్ని విజయవాడలోని తమ్ములపల్లి కళాక్షేత్రంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ చేతుల మీదుగా మానవీయ కోణాన్ని ఆవిష్కరించిన జర్నలిస్టుల విభాగంలో సాక్షి విలేకరి సిహెచ్.వెంకటరమణ అవార్డు అందుకున్నారు. అలాగే విశాఖలో పలువురు జర్నలిస్టులకు ఈ పలు విభాగాల్లో అవార్డులు వరించాయి. ఇందులో సామాజిక బాధ్యత భద్రతా విభాగంలో గంట్ల శ్రీనుబాబు, పి.బాలభాను, క్రైం జర్నలిజం విభాగంలో నందకుమార్, కిరణ్, బంగారు అశోక్కుమార్, ఫొటో, వీడియో విభాగంలో నీలాపు అశోక్, చిన్న పత్రిక, మీడియా ప్రోత్సాహం విభాగంలో పోలాకి రవికుమార్ అవార్డులు పొందారు. అలాగే సామాజిక స్పృహ, చైతన్యం విభాగంలో ఎం.ఎస్.ఆర్.ప్రసాద్, కృష్ణపాత్రో, కేబుల్టీవీ న్యూస్ రీడర్ విభాగంలో కొణతాల మీన, తరుణ్జ్యోతి, సీనియర్ జర్నలిస్టుల విభాగంలో ఎండీ అబ్ధుల్లా, మహిళా జర్నలిస్టుల విభాగంలో పి.వీరలత, ఎం.లత అవార్డులు స్వీకరించారు. -
వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యులుగా ఇద్దరికి చోటు
విశాఖ సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ(పీఏసీ)ని పునర్వ్యవస్థీకరించారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఎంపీ గొల్ల బాబూరావుతో పాటు మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడులకు సభ్యులుగా స్థానం లభించింది. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు కేంద్ర పార్టీ కార్యాలయం శనివారం ప్రకటించింది. అలాగే పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు పీఏసీ శాశ్వత ఆహ్వానితులుగా ఉండనున్నారు. రాష్ట్ర కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పీఏసీ కన్వీనర్గా వ్యవహరించనున్నారు. -
స్నేహంతో ‘వల’.. ఆపై వేధింపుల ‘సెగ’..!
విశాఖ సిటీ: ‘నేను చేస్తున్నట్లే... నాకూ న్యూడ్ కాల్ చెయ్యాలంటే ఎంత కావాలో చెప్పు.. నమ్మకం లేకపోతే అకౌంట్ నంబర్ పెట్టు.. వెంటనే డబ్బులు పంపిస్తా’.. అంటూ ఓ గృహిణిని వేధింపులకు గురి చేసిన అనంతపురం కీచక జైలర్ సుబ్బారెడ్డి వ్యవహారం సంచలనంగా మారింది. అరెస్టుకు ప్రయత్నిస్తే, అప్పటికే నిందితుడు ముందస్తు బెయిల్ పొందాడు. ఈ ఉదంతంపై పోలీసుల వివరాల ప్రకారం, పార్వతీపురం మన్యం జిల్లాలో నివాసముంటున్న గృహిణి ఫేస్బుక్ అకౌంట్కు కొన్నాళ్ల క్రితం జైలర్ సుబ్బారెడ్డి నుంచి ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. తాను జైలర్గా పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాడు. ఫ్రెండ్ రిక్వెస్ట్కు అంగీకరించడంతో, స్నేహం పేరుతో చాటింగ్ ప్రారంభించాడు. కొద్ది రోజులకు అసలు రంగును బయటపెట్టాడు. న్యూడ్ కాల్స్, అసభ్య మెసేజ్లతో వేధించసాగాడు. మొదట ‘సారీ’.. ఆ తరువాత ‘కుక్క’ బుద్ధి..!మహిళ భర్త, మరో బంధువు పోలీస్ శాఖలోనే విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మెసేజ్లు, వేధింపుల వ్యవహారాన్ని మహిళ బంధువైన ఏసీపీకి, ఎస్ఐగా పనిచేస్తున్న భర్తకు చెప్పింది. దీంతో వారు జైలర్కు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు. దీనిపై సదరు వ్యక్తి కేవలం ఫ్రెండ్షిప్ కోసమే మెస్సేజ్లు పంపించానని, సారీ చెప్పాడు. కొన్నాళ్లు మెస్సేజ్లు పంపించడం మానేశాడు. మళ్లీ గత నెల 25వ తేదీ నుంచి మెస్సేజ్లు, కాల్స్ చేయడం ప్రారంభించాడు. వేధింపులను భరించలేక సదరు మహిళ విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. సీపీ వెంటనే కేసును సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి, జైలర్ను అరెస్టు చేయడానికి అనంతపురం వెళ్లగా.. అప్పటికే పరారయ్యాడు. విశాఖకు వచ్చి 5వ ఏడీజే (ఫ్యామిలీ) కోర్టులో ముందస్తు బెయిల్ తీసుకున్నాడు. రెండు రోజుల క్రితం విశాఖ పోలీసులను కలిసి ఆ ముందస్తు బెయిల్ పత్రాలను అందజేశాడు. శాఖాపరమైన చర్యలు..కాగా, జైలర్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జైళ్ల శాఖ డీజీకి నగర పోలీస్ కమిషనర్ బాగ్చి లేఖ రాశారు. అలాగే ముందస్తు బెయిల్ రద్దుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. -
‘భెల్’ ప్రశ్నాపత్రం లీక్
పెందుర్తి: విశాఖలోని పెందుర్తి సమీపంలోని జియోన్ టెక్నాలజీస్ కేంద్రంలో డబ్బులు తీసుకుని పరీక్ష జవాబు పత్రాలను లీక్ చేస్తోన్న బాగోతం శుక్రవారం వెలుగుచూసింది. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్)లో సూపర్వైజర్ ట్రైనీ ఇంజినీర్ పోస్టుల కోసం శుక్రవారం చినముషిడివాడలోని జియోన్ టెక్నాలజీస్ ఆన్లైన్ పరీక్ష నిర్వహించింది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు జరిగిన ఈ పరీక్షకు ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి 500 మంది హాజరయ్యారు. పరీక్ష కేంద్రంలో ప్రశ్నాపత్రంతోపాటు జవాబుపత్రాన్ని ముందే కొంత మంది అభ్యర్థులకు లీక్ చేశారు. ముగ్గురు (ప్రాథమికంగా తెలిసింది) అభ్యర్థులు 2 గంటలపాటు ఆన్లైన్లో రాయాల్సిన పరీక్షను 20 నిమిషాల్లో ముగించడంపై అనుమానం వచ్చిన తోటి అభ్యర్థులు వారిని నిలదీశారు. దీంతో వారి వద్ద అడ్మిట్ కార్డు వెనుక మైక్రో జెరాక్స్ ద్వారా తీసిన జవాబులు కనిపించడంతో మిగిలిన అభ్యర్థుల్లో ఆగ్రహం పెల్లుబికింది. పరీక్ష జరుగుతుండగానే నిర్వాహకులను నిలదీశారు. కాపీకి పాల్పడిన అభ్యర్థుల వద్ద జవాబు పత్రాన్ని లాక్కుని వారిని ప్రశ్నించారు. అనంతరం కేంద్రం ఎదుట నిరసనకు దిగారు. పరీక్షను తక్షణమే రద్దు చేయాలని నినాదాలు చేశారు. కాగా, ఈ కేంద్రంలో జరుగుతోన్న వ్యవహారాలపై ఇది వరకే పోలీసులకు పలు ఫిర్యాదులు అందాయి. మార్చి 25న ఇదే కేంద్రంలో జరిగిన ఏపీపీసీబీ ఏఈఈ పరీక్షలో నిర్వాహకులు అవినీతికి పాల్పడి కొందరు అభ్యర్థులకు పూర్తి సహకారం అందించారని రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్కు కొందరు ఫిర్యాదు చేశారు. తాజాగా మరోసారి అలాంటి ఘటనే పునరావృతం అయ్యింది. ఈ వ్యవహారంపై రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థులకు బెదిరింపులు.. కాపీ వ్యవహారం బయటపడడంతో పరీక్ష నిర్వాహకులు నష్ట నివారణ చర్యలకు దిగారు. సాయంత్రం పరీక్ష ముగించుకుని బయటకు వస్తున్న అభ్యర్థులను 40 నిమిషాలు కేంద్రంలోనే నిర్బంధించారు. లోపల ఏమీ జరగలేదని చెప్పాలని బెదిరించారు. బాధిత అభ్యర్థుల నుంచి ప్రతిఘటన ఎదురవడంతో తప్పనిసరి పరిస్థితిలో బయటకు పంపారు. లోపల జరిగిన విషయం బయటకు చెబితే పోలీసులతో కేసులు నమోదు చేయించి ఉద్యోగాలు రాకుండా చేస్తామని వారు బెదిరించినట్లు బాధిత అభ్యర్థులు చెబుతున్నారు. -
ప్రజల ఆకాంక్ష నెరవేర్చేలా ‘స్వర్ణాంధ్ర 2047 విజన్’
బీచ్రోడ్డు: క్షేత్రస్థాయి పరిస్థితులు, అవసరాలను పరిగణలోకి తీసుకుని.. నియోజకవర్గ స్థాయి స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మే 15 నాటికి అన్ని పనులను పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాల అధికారులకు వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో నిర్వహించిన రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో శుక్రవారం ఆయన పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయి అంశాలను అవగతం చేసుకుంటూ.. ప్రజల ఆకాంక్షలకు ప్రాధా న్యం ఇస్తూ ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల పరిధిలో పనిచేయాల్సిన అధికారుల బృందాలను ప్రకటించారు. జిల్లాకు కలెక్టర్ చైర్మన్గా, నియోజకవర్గానికి డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి ఇన్చార్జిగా, ఆయా జోనల్ లేదా మండల స్థాయిలో జోనల్ కమిషనర్, ఎంపీడీవోలు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారని, ఒక్కో కమిటీలో ఐదుగురు సచివాలయ సిబ్బంది ఉంటారని వెల్లడించారు. వీరంతా కలిసి స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళికకు అనుగుణంగా తాత్కాలిక వార్షిక ప్రణాళికలను తయారు చేయాలని సూచించారు. ఆయా నియోజకవర్గాల్లోని ప్రజల అవసరాలను ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాలని, భవిష్యత్ రూపురేఖలు మార్చే విధంగా ప్రణాళికలు ఉండాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నోడల్ అధికారి, మూడు జిల్లాల ఉన్నత స్థాయి అధికారులు, ఆర్డీవోలు, డిప్యూటీ కలెక్టర్లు, ప్రణాళిక విభాగం అధికారులు, సీపీవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ హరేందిర ప్రసాద్ ఆదేశం -
ప్రకృతిక హైడ్రోజన్పై ముగిసిన అంతర్జాతీయ సదస్సు
విశాఖ విద్య: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) విశాఖపట్నం ఆధ్వర్యంలో ‘ప్రకృతిక హైడ్రోజన్ యొక్క సమర్థవంతమైన వినియోగం– ఒక స్థిరమైన శక్తి’ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు శుక్రవారం ముగిసింది. ఈ కార్యక్రమాన్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఇంజనీరింగ్, ఎర్త్ సైన్సెస్ విభాగం నిర్వహించింది. ఐఐపీఈ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అధ్యక్షులు ప్రొఫెసర్ పి. కె. బానిక్, భూ శాస్త్ర మంత్రిత్వ శాఖకు చెందిన శాస్త్రవేత్త డా. నిలోయ్ ఖారే సదస్సుకు చీఫ్ ప్యాట్రాన్లుగా వ్యవహరించారు. సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ కె. విజయ్ కుమార్ ఇలాంటి కార్యక్రమాలతో కలిగే ఉపయోగాలను వివరించారు. ఐఐపీఈ డైరెక్టర్ శాలివాహన్ , కో–కన్వీనర్ ప్రొఫెసర్ రోషన్ కె. సింగ్, డా. ప్రభాకర్ ఠాకూర్ ప్రసంగించారు. -
ఫేక్ ఇన్వాయిస్లపై ఉక్కుపాదం
రెట్టింపు శాతంలో రికవరీ చేశాం జీఎస్టీ శాతాలు తగ్గింపు, రేషనలైజేషన్పై జీఎస్టీ కౌన్సిల్ చర్చలు జరుపుతోంది. త్వరలోనే జీఎస్టీ తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఏపీలోని 5 సర్కిల్ పరిధిలోని 25 సీజీఎస్టీ ఆడిట్ గ్రూప్ల నుంచి గతేడాదితో పోలిస్తే ఆదాయం రెట్టింపైంది. ఫేక్ ఇన్వాయిస్లకు సంబంధించిన వారి నుంచి 2023–24లో రూ.71.92 కోట్లు రికవరీ చేయగా.. 2024–25లో రూ.158.58 కోట్లు వసూలు చేశాం. 2023–24 కాలంలో తప్పుడు ఇన్వాయిస్లు పొందుపరిచిన వారు 714 మంది ఉండగా.. 2024–25లో ఈ సంఖ్య తగ్గి 600కి తగ్గింది. అదేవిధంగా.. జీఎస్టీ ఎగవేత మోసాలు 2023–24లో రూ.2,682.11 కోట్లు ఉండగా.. 24–25లో ఇది కూడా తగ్గి కేవలం రూ.1505.38 కోట్లకు పరిమితమైంది. 2025–26లో రికవరీ టార్గెట్ రూ.300 కోట్లుగా నిర్దేశించుకున్నాం. సాక్షి, విశాఖపట్నం : తప్పుడు ఇన్వాయిస్లతో జీఎస్టీ ఎగ్గొట్టేందుకు ప్రయత్నించే అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్నామని సీజీఎస్టీ ఆడిట్ కమిషనరేట్ కమిషనర్ పి.ఆనంద్కుమార్ స్పష్టం చేశారు. కమిషనరేట్ ఏర్పాటు చేసి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సీజీఎస్టీ భవన్లో ఆయన మీడియా సమావేశాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు. పన్ను ఎగవేతదారుల్ని పట్టుకొని..వారి నుంచి రికవరీ చేస్తున్న మొత్తం గణనీయంగా పెరుగుతోందని స్పష్టం చేశారు. ఫలితంగా పన్ను ఎగవేతదారుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోందనీ.. జీఎస్టీ ఆడిట్ అంటే భయం పెరుగుతోందన్నారు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనంతరం వచ్చే ప్రతి ఇన్వాయిస్ని కమిషనరేట్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్తో పాటు డేటా ఇంటిలిజెన్స్ వినియోగిస్తూ.. తప్పుడు ఇన్వాయిస్లను పొందుపరిచిన వారి గుర్తించి నోటీసులు జారీ చేస్తున్నామన్నారు. నోటీసులు అందుకున్న 15 రోజుల్లోగా ఎగ్గొట్టిన జీఎస్టీని చెల్లించకపోతే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆనంద్కుమార్ స్పష్టం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ఇక బిల్డర్లకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవకాశం లేదు బిల్డర్లు తమ రియల్ వ్యాపార సమయంలో బిల్డింగ్ మెటీరియల్ కొనుగోలు పేరుతో తప్పుడు ఇన్వాయిస్లు సృష్టించిన కేసులు వస్తున్నట్లు గుర్తించాం. ఈమధ్య కాలంలో ఆడిట్ విభాగం విశాఖ సర్కిల్ పరిధిలో 651 కేసులు గుర్తిస్తే.. అందులో 25 శాతం వరకూ బిల్డర్ల కేసులే ఉన్నాయి. ప్రతిచోటా ఈ తరహా కేసులు పెరుగుతుండటంతో.. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందే అవకాశాన్ని బిల్డర్లకు కేంద్రం రద్దు చేసింది. పోలవరం, అమరావతి నిర్మాణానికి జీఎస్టీ కారణం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడంలో ప్రభుత్వానికి జీఎస్టీ ప్రధాన వనరుగా మారింది. 2025–26లో జాతీయ రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు. సామాజిక మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ.11 లక్షల కోట్లలో సింహభాగం జీఎస్టీ నుంచి వచ్చిందే. ఏపీ విషయానికి వస్తే.. అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మించడానికీ జీఎస్టీ ద్వారా వచ్చిన నిధుల్నే వినియోగిస్తున్నారు. చిన్న పరిశ్రమల ఆడిటింగ్ 2023–24లో 414 యూనిట్లుండగా.. 2024–25లో 118కి తగ్గాయి. మధ్యతరహా పరిశ్రమల ఆడిటింగ్ 101 నుంచి 196కి, భారీ పరిశ్రమలు 224 నుంచి 286కి పెరిగాయి. పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ నుంచి వచ్చే ఆదాయాన్ని కోల్పోయేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. అందుకే ఈ తరహా ఇంధనాలు జీఎస్టీ పరిధిలోకి రావడం ఆలస్యమవుతోంది. ఈ అంశంపై చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక కమిటీ త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం. పన్ను ఎగవేతదారుల నుంచి ప్రతిపైసా వసూలు 2024–25లో రూ.158 కోట్ల రికవరీ చేశాం 2023–24లో రూ.71 కోట్ల రికవరీ పన్ను ఎగవేతదారుల సంఖ్య తగ్గుతోంది ఏఐ సహకారంతో ప్రతి ఇన్వాయిస్ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం సీజీఎస్టీ ఆడిట్ కమిషనర్ ఆనంద్కుమార్ -
రికార్డులనే మార్చేశారు...!
● పాత గెజిట్లో ఒక పేరు.. తాజాగా మరో పేరుతో ఆదేశాలు ● నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ నిర్ణయం ● రూ. 200 కోట్ల విలువైన భూమిలో చక్రం తిప్పిన కూటమి నేత ● ప్రతిఫలంగా ఆయన చేతికి ఎకరంన్నర భూమి ● భారీగా నగదు చేతులు మారినట్టు ఆరోపణలు ● ఎండాడలోని 14–1 సర్వే నంబరులోని 5.10 ఎకరాల్లో చిత్ర విచిత్రాలు ఈ ఫొటోలో ఉన్నది అదే ఎండాడలోని అదే సర్వే నంబరు...14–1లోని 5.10 ఎకరాల భూమిని వై. బాలిరెడ్డికి అసైన్ చేశారని.. దీనిని నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నామని, అందువల్ల రిజిస్ట్రేషన్లు చేయాలంటూ తాజాగా కలెక్టర్ జిల్లా రిజిస్ట్రార్కు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఫొటోలో ఉన్నది కలెక్టర్ గెజిట్ నోటిఫికేషన్. ఇందులో ఎండాడలోని 14/1 సర్వే నంబరులో 5.10 ఎకరాల బూమి చెట్టిపల్లి సీతారామయ్య అసైనీగా ఉన్నారు. అయితే ఇది ప్రభుత్వ భూమి కావడం వల్ల నిషేధిత జాబితాలో ఉందని... అందువల్ల రిజిస్ట్రేషన్లు చేయవద్దంటూ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి గతంలో కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అదేంటి చెట్టిపల్లి సీతారామయ్య పేరు కాస్తా బాలిరెడ్డిగా ఎలా మారిందనే అనుమానం వచ్చిందా? అనుమానాలేమీ అక్కర్లేదని... బాలిరెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్లను కూడా అనుమతించాలని కొద్దిరోజుల క్రితం జిల్లా ఉన్నతాధికారులు తేల్చిచెప్పారు. మొత్తం రికార్డుల్లోని పేరు ఎలా మారిపోయిందనే సందేహం మీకు అక్కరలేదు. ఎందుకంటే ఈ వ్యవహారంలో విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత ఒకరు చక్రం తిప్పడమే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు ప్రతిఫలంగా సదరు నేతకు ఎకరంన్నర పొలం దక్కనుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ వ్యవహారంలో భారీగా నగదు చేతులు మారిందనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. అంతేకాకుండా మొదట్లో అసైనీగా పేర్కొన్న చెట్టిపల్లి సీతారామయ్య కుటుంబ సభ్యులు ఏమీ మాట్లాడకుండా.. న్యాయపరంగా ముందుకెళ్లకుండా వాటాలు కూడా మాట్లాడేసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా రూ. 200 కోట్ల విలువైన ఈ భూమి వ్యవహారంపై లోతైన విచారణ చేస్తే మొత్తం వ్యవహారం బయటపడనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
దోపిడీకి పాల్పడిన బాలుడి అరెస్ట్
● ర్యాపిడో డ్రైవర్పై దాడి ఘటన ఉక్కునగరం: ర్యాపిడో డ్రైవర్పై దాడి చేసి దోపిడీకి పాల్పడిన బాలుడిని అరెస్ట్ చేసినట్లు నగర క్రైం డీసీపీ కె.లతా మాధురి తెలిపారు. ఈ నెల 10న స్టీల్ప్లాంట్ పోలీస్ స్టేషన్ రహదారిలో ర్యాపిడో డ్రైవర్పై మైనర్ దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. గాజువాక సౌత్ ఏసీపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ కేసు వివరాలు వెల్లడించారు. పార్ట్టైం ర్యాపిడో డ్రైవర్గా పనిచేస్తున్న కిశోర్ ఆ రోజు రాత్రి పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా శ్రీనగర్ పెట్రోల్ బంక్ వద్ద బాలుడు స్టీల్ప్లాంట్ లోపలికి రైడ్ మాట్లాడుకున్నాడు. స్టీల్ప్లాంట్ పోలీస్ స్టేషన్ సమీపంలోని శ్మశానం వద్ద బైక్ ఆపమని చెప్పి, ఆ బాలుడు కిశోర్పై దాడి చేసి ఫోన్ లాక్కున్నాడు. ఆ ఫోన్ ద్వారా ముగ్గురికి రూ.48,100 ఫోన్పే ద్వారా పంపాడు. ఈ ఘటనపై అందిన ఫిర్యాదుతో క్రైం సిబ్బంది వెంటనే అప్రమత్తమై దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానంతో పెదగంట్యాడ సమతా నగర్లోని సాయిబాబా గుడి దగ్గరలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నేరాన్ని అంగీకరించిన బాలుడి నుంచి రూ.48,100 నగదు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. చెడు అలవాట్లకు బానిసై.. సులభంగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో బాలుడు దోపిడీకి పాల్పడినట్లు డీసీపీ తెలిపారు. డెలివరీ బాయ్స్, ర్యాపిడో, ఓలా తదితర డ్రైవర్లు రా త్రి సమయాల్లో అపరిచితులను నమ్మి లిఫ్ట్ ఇవ్వొద్దని సూచించారు. ఈ సందర్భంగా బాలుడిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి ఈ నెల 24 వరకు రిమాండ్ విధించారు. అనంతరం అతన్ని జువనైల్ హోమ్కు తరలించినట్లు క్రైం ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు తెలిపారు. సమావేశంలో ఏడీసీపీ క్రైం మోహనరావు, ఏసీపీ జోన్–2 క్రైం డి.లక్ష్మణరావు పాల్గొన్నారు. -
ఆస్తి పన్ను వసూళ్లలో స్టేట్ రికార్డ్
సూర్యప్రభ వాహనంపై సింహాచలేశుడు 10లో● రూ.510 కోట్లు వసూలు చేసిన అధికారులు ● జీవీఎంసీకి ఉత్తమ అవార్డు మహారాణిపేట: గత (2024–25) ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ (జీవీఎంసీ) ఆస్తి, ఖాళీ జాగా పన్నుల వసూళ్లలో రూ.510 కోట్లు వసూలు చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్.సురేష్ కుమార్ గురువారం ఈ అవార్డును జీవీఎంసీ అదనపు కమిషనర్ ఎస్.ఎస్.వర్మకు అందించారు. శుక్రవారం షీల్డ్ను కలెక్టర్/జీవీఎంసీ కమిషనర్ హరేందిర ప్రసాద్కు అదనపు కమిషనర్ సోమన్నారాయణ అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ నగరప్రజలు ఆస్తిపన్ను సకాలంలో చెల్లించి సహకరించడంతోనే ఈ అవార్డు లభించిందన్నారు. పన్ను వసూళ్లలో జీవీఎంసీ అదనపు కమిషనర్ ఆర్.సోమన్నారాయణ, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ), రెవెన్యూ అధికారులు, సిబ్బంది కృషి ఎంతో ఉందని తెలిపారు. -
రోడ్డు మూసి... చదును చేస్తున్నారు...!
ఎండాడ ప్రధాన రహదారికి కూతవేటు దూరంలోని ఈ విలువైన భూమికి వెళ్లేందుకు ఉన్న రహదారిని భవనాల నుంచి వచ్చిన డెబ్రిస్తో మూసేశారు. ఇక్కడ గజం భూమి విలువ లక్ష రూపాయలకుపైగానే పలుకుతోంది. అంత విలువైన ఈ భూమికి వెళ్లే దారిని మూసివేసి... లోపల మాత్రం చదును చేసేస్తున్నారు. పనోరమ హిల్స్ అపార్టుమెంట్లకు వెనుకవైపు ఉన్న ఈ విలువైన భూమిలో ఇప్పుడు చదును చేసే కార్యక్రమాలు చురుకుగా సాగుతున్నాయి. ఇక్కడ భారీగా అపార్టుమెంట్లను నిర్మించేందుకు డెవెలప్మెంట్ అగ్రిమెంట్ కూడా సదరు కూటమి నేతనే కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా గతంలో అసైనీగా రికార్డుల్లో పేరుండి... తాజాగా తొలగించబడిన కుటుంబ సభ్యులకు 2 వేల చదరపు గజాల స్థలాన్ని ఇచ్చేందుకు కూడా ఒత్తిడి తెచ్చి మరీ ఒప్పించారనే ఆరోపణలున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో రికార్డుల ట్యాంపరింగ్ జరిగిందా? మొత్తం రికార్డులను మాయం చేశారా అనేది లోతుగా విచారిస్తే అసలు వ్యవహారం బయటకు వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
కాంట్రాక్టు కార్మికుడి అనుమానాస్పద మృతి
పరవాడ: జేఎన్ ఫార్మాసిటీలోని గ్లాండ్ ఫార్మా పరిశ్రమలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. కార్మికుడు గుండెపోటుతో మృతి చెందాడని పరిశ్రమ యాజమాన్యం చెబుతుండగా, విష వాయువులు పీల్చడం వల్లే మృతి చెందాడని మృతుడి కుటుంబ సభ్యులు పరవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు తెలిపారు. వివరాలివి. అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామానికి చెందిన బావురిశెట్టి నాగేశ్వరరావు(55) గ్లాండ్ ఫార్మా పరిశ్రమలో మూడేళ్లుగా క్లీనింగ్ పనులు చేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం క్లీనింగ్ పనులు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోయాడు. తోటి కార్మికులు ఈ విషయాన్ని పరిశ్రమ యాజమాన్యానికి తెలియజేయగా, నాగేశ్వరరావును వైద్య పరీక్షల నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే నాగేశ్వరరావు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నాగేశ్వరరావుకు భార్య, నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. ఒక అమ్మాయికి వివాహం అయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద కేసు కింద నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కాగా.. కాంట్రాక్టు కార్మికుడి మృతిపై సమగ్ర విచారణ జరిపి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. -
నిలకడలేని సేన
● మలేషియాకు చెక్కేసిన జనసేన కార్పొరేటర్లు ● మాట నిలుపుకోని వైనం ● క్యాంప్ రాజకీయాలు చేయబోమని చెప్పిన మంత్రి నాదెండ్ల ● చెప్పిన నాలుగు రోజుల్లోనే విమానమెక్కిన ఏడుగురు జనసేన కార్పొరేటర్లు ● టీడీపీ కార్పొరేటర్లతో కలిసి ప్రయాణం ● ఆదివారం మరికొంత మంది పయనం విశాఖ సిటీ: యథారాజా తథా ప్రజా అన్న నానుడి జనసేన నేతలకు సరిగ్గా సరిపోతుంది. నిలకడలేని మాటలు, రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఏ జిల్లాకు వెళితే ఆ జిల్లాలోనే పుట్టానని.. ఒక్కో సభలో ఒక్కో చదువు చదివానని చెప్పిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో మీమర్లకు ఫుల్మీల్స్గా మారితే.. ఆ పార్టీ నంబర్–2 నాలుక కూడా నాలుగు రోజుల్లో మడతపెట్టేశారు. విశాఖ మేయర్పై అవిశ్వాస ఓటింగ్ వ్యవహారంలో జనసేన క్యాంప్ రాజకీయాలు చేయదని చెప్పిన కొన్ని గంటల్లోనే ఆ పార్టీ కార్పొరేటర్లు విమానమెక్కి చెక్కేయడం గమనార్హం. కార్పొరేటర్లు చేజారిపోతారన్న భయంతో టీడీపీ నేతలే దగ్గరుండి మరీ విమాన టికెట్లు తీయించి మలేషియా విమానం ఎక్కించారు. నిలకడ లేని మాటలు.. జనసేన పార్టీకి ఓ విధానం, నేతల మాటలకు ఓ నిలకడ లేనట్లు మరోసారి రుజువైంది. అధ్యక్షుడి బాటలోనే కార్పొరేటర్లు నడుస్తూ జిల్లాలో మేయర్ పీఠాన్ని టీడీపీ చేతుల్లో పెట్టేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితమే జనసేన కార్పొరేటర్లు విజయవాడలో పవన్ కల్యాణ్ను కలిశారు. అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేయాలని హామీ తీసుకున్నారు. తాము క్యాంపు రాజకీయాలు చేయబోమని, తమ కార్పొరేటర్లపై పూర్తి నమ్మకముందని గొప్పలు చెప్పుకొచ్చారు. అది జరిగిన కొద్ది రోజుల్లోనే మంత్రి నాదెండ్ల మనోహర్ విశాఖకు వచ్చి జనసేన కార్పొరేటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈయన కూడా క్యాంప్ రాజకీయాలకు జనసేన దూరమని పునరుద్ఘాటించారు. చెప్పిన కొద్ది గంటలకే మాట మార్చారు. అందరినీ విదేశాలకు పంపించాలని నిర్ణయించారు. ఓటమి భయం జీవీఎంసీ మేయర్ పీఠాన్ని దక్కించుకోడానికి కూటమి నేతలు కుట్ర రాజకీయాలు తెరతీస్తున్నారు. కౌన్సిల్లో బలం పెంచుకోడానికి వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు ఎర వేస్తున్నారు. లొంగని వారిపై బెదిరింపులకు దిగుతున్నారు. అయినప్పటికీ.. అవిశ్వాసానికి మద్దతుగా 58 కార్పొరేటర్ల మద్దతు ఉందని కూటమి నేతలు జీవీఎంసీ ఇంచార్జ్ కమిషనర్, జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్కు నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఈ నెల 19వ తేదీన అవిశ్వాస ఓటింగ్కు ప్రత్యేక కౌన్సిల్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కార్పొరేటర్లకు నోటీసులు పంపించారు. ఇదిలా ఉంటే.. కొంత మంది కార్పొరేటర్లు కూటమిలో ఇమడలేక బయటకు వచ్చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ నేతలు ఇప్పటికే కొంత మంది కార్పొరేటర్లను మలేషియా పంపించారు. జనసేన కార్పొరేటర్లు కూడా మనసు మార్చుకోకముందే విదేశాలకు పంపించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే ఏడుగురు జనసేన కార్పొరేటర్లకు మలేషియా టికెట్ బుక్ చేసి శుక్రవారం సాయంత్రం దగ్గరుండి మరీ విశాఖ ఎయిర్పోర్టులో విమానం ఎక్కించారు. ఆదివారం టీడీపీ కార్పొరేటర్లతో కలిపి మిగిలిన జనసేన కార్పొరేటర్లను కూడా మలేషియా పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. బాంబు పేల్చిన కూటమి కార్పొరేటర్ ఒకవైపు అవిశ్వాస ఓటింగ్కు కార్పొరేటర్లు చేజారి పోకూడదని కూటమి నేతలు క్యాంప్ రాజకీయాలు చేస్తుంటే.. మరోవైపు అదే కూటమికి చెందిన 22వ వార్డు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ బాంబు పేల్చారు. మేయర్ గొలగాని హరివెంకటకుమారిపై అవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నట్లు 58 మంది సంతకాలు చేసినట్లు కలెక్టర్ నోటీసులో పేర్కొని, ఆ తీర్మానం కాపీని సభ్యులకు అందించలేదన్న విషయాన్ని ప్రస్తావించారు. కలెక్టర్ కార్పొరేటర్లకు ఇచ్చిన ఫారం–2 నోటీసులో 58 మంది సభ్యులు సంతకం చేసిన ప్రతిపాదిత అవిశ్వాస తీర్మానం కాపీని జత చేసినట్లు చెప్పారని, కానీ అటువంటి మోషన్ కాపీ జత చేయలేదని అభ్యంతరం తెలిపారు. అవిశ్వాస తీర్మానానికి సంతకం చేసిన 58 మంది సభ్యుల సంతకాల ఆధారాలు సమర్పించని పక్షంలో ఆ నోటీసు 1955 మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ప్రకారం ఎవరైనా ప్రశ్నిస్తే కోర్టు ముందు నిలబడకపోవచ్చన్న విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలో పేర్కొన్న విధానాన్ని అనుసరించి పునఃపరిశీలించాలని కోరారు. అవిశ్వాస ఓటింగ్ ప్రక్రియలో చట్టపరమైన సమస్యలకు అవకాశం ఇవ్వకుండా ప్రత్యేక సమావేశాన్ని సరైన పద్ధతిలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
రాజకీయ నాయకులే ప్రజలకు పెద్ద సమస్య
సీతమ్మధార: ఉత్తరాంధ్రలో రాజకీయ నాయకులే ప్రజలకు పెద్ద సమస్యగా మారారని, వారు తమ కులాలకే నాయకులుగా పనిచేసే పరిస్థితి నెలకొందని మాజీ డీజీపీ పూర్ణ చంద్రరావు ఆక్షేపించారు. బీఎస్పీ, బీసీ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ధ శుక్రవారం నిర్వహించిన బీసీ సమరభేరీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రెండు కుటుంబాల్లోని మహిళల గురించే చర్చలు జరుగుతున్నాయని, మిగిలిన వారు మహిళలు కాదా అని ప్రశ్నించారు. ప్రజల దృష్టిని వాళ్ల వైపే మళ్లిస్తున్నారన్నారు. ఉత్తరాంధ్రలో అత్యధిక శాతం బీసీలు ఉన్నారని, అయినా కమ్మ నాయకుల మాటే ఉత్తరాంధ్రలో చెల్లుతుందని ఆరోపించారు. షేక్లకు అమ్మాయిలను అమ్ముతున్నట్లు అదానీకి విశాఖ స్టీల్ ప్లాంటును అమ్ముతున్నారని కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కమ్మరాజు ఎంపీ భరత్ దీని గురించి ఏమీ పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ కాబట్టే ఆయన మాట చెల్లుబాటు కావడం లేదన్నారు. కామ్మ, రెడ్డిల ఉత్తరాంధ్ర అయిపోయిందని, కమ్మ వ్యక్తి శ్రీకాకుళంలో ఎమ్మెల్యే ఎట్లా అయ్యాడని ప్రశ్నించారు. రాష్ట్రంలో 35 మంది కమ్మ ఎమ్మెల్యేలు, 32 మంది రెడ్డిలు ఉన్నట్లు పేర్కొన్నారు. పార్లమెంటులో వక్ఫ్ బిల్ వచ్చిన తర్వాత చర్చ కూడా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి పి.శివప్రసాద్, జిల్లా అధ్యక్షుడు బి.విశ్వనాఽథ్, ఉపాధ్యక్షుడు ధనుంజయ్, జిల్లా కోశాధికారి రామచంద్రరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి అన్వేష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు పెద్దాడ కనకమహాలక్ష్మి, శరత్, అన్నవరం చిన్నారావు, రమేష్, పలు ప్రజాసంఘాల నాయకులు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మాజీ డీజీపీ పూర్ణ చంద్రరావు -
మూర్తి యాదవ్ నోరు అదుపులో పెట్టుకో..
మహారాణి పేట: జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆల్ఫా కృష్ణ హెచ్చరించారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కార్పొరేటర్ మూర్తి యాదవ్ తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడే మూర్తి యాదవ్కు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ మూర్తి యాదవ్ను తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ ఐదేళ్ల పాలన, 11 నెల ల కూటమి పాలన గురించి ప్రజలను అడిగితే చెబుతారని, బావిలో కప్పలా మా పాలన బాగుందని కూటమి నేతలు, నాయకులు అంటే సరిపోదన్నారు. కూటమి పాలనలో మోసాలు, దౌర్జన్యాలు, మహిళలపై దాడులను ప్రజలు చూస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. గత ఐదేళ్లలో వైఎస్ జగన్ పాలనలో విశాఖలో జరిగిన అభివృద్ధి, చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేసిన 15 ఏళ్ల పాలనలో విశాఖలో జరిగిన అభివృద్ధి గురించి చర్చిద్దామా అని ఆల్ఫా కృష్ణ సవాల్ విసిరారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆల్ఫా కృష్ణ హెచ్చరిక -
సాక్షిపై కేసుల్ని ఖండించిన పాత్రికేయులు
సీతమ్మధార: సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి మీద పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని కోరుతూ విశాఖలోని జీవీఎంసీ గాంధీ పార్కులో సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సాక్షి దినపత్రిక బ్యూరోచీఫ్ కేజీ రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ సాక్షి దినపత్రిక నిరంతరం ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. సాక్షి అనకాపల్లి, అల్లూరి జిల్లాల డెస్క్ ఇన్చార్జి బీబీ సాగర్ మాట్లాడుతూ సాక్షి ఎడిటర్తో సహా ఆరుగురు పాత్రికేయులపై కేసులు పెట్టడం పత్రికా స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య విలువలకు విఘాతమన్నారు. ఒక హత్యకేసులో బాధితుల పక్షాన నిలిచి వాస్తవాలు వెలికితీయడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. వార్తలో పేర్కొన్న విషయాల్లో నిజానిజాలను ఖరారు చేసుకుని నిందితులపై చర్యలు తీసుకోవడం మాని, పాత్రికేయులపై కేసులు పెట్టడం అన్యాయమన్నారు. జర్నలిస్టులంతా ముక్తకంఠంతో ఖండించాలని కోరారు. ఏపీయూడబ్ల్యూజే విశాఖ జిల్లా ఉపాధ్యక్షుడు ఏటీ రామునాయుడు మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో జరిగిన హత్యోదంతంలో దోషులను శిక్షించాల్సింది పోయి, వార్త కవర్చేసిన సాక్షి జర్నలిస్టులపైనా, మీడియాపైనా కేసులు నమోదుచేయడం సరికాదన్నారు. సాక్షి ఎడిటర్తో పాటు జర్నలిస్టులపై నమోదైన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకుడు డి.ఆనంద్కుమార్ మాట్లాడుతూ వార్త కవర్ చేసిన సాక్షి మీడియా జర్నలిస్టులపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. సీనియర్ జర్నలిస్టు పిల్లా విజయకుమార్ మాట్లాడుతూ యాజమాన్యాల మీద ఉన్న కోపాన్ని వృత్తి ధర్మం నిర్వహిస్తున్న పాత్రికేయులపై ప్రదర్శించడం సరికాదని హితవు పలికారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే అనుబంధ ఎలక్ట్రానిక్ మీడియా విశాఖ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎల్.అనేష్కుమార్, ఏపీడబ్ల్యూజే అనుబంధ సామ్నా జిల్లా కార్యదర్శి ఎం.కృష్ణకిశోర్, భీమిలి ప్రెస్క్లబ్ అధ్యక్షుడు రమణప్రసాద్, పలు ప్రెస్క్లబ్ల కార్యవర్గసభ్యులు, అధిక సంఖ్యలో పలు మీడియాలకు చెందిన పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు. -
పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన ప్రారంభం
ఎంవీపీకాలనీ: వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో వినియోగించే ఇంజినీరింగ్ ఉత్పత్తుల ప్రదర్శన శుక్రవారం ఎంవీపీ కాలనీలోని గాదిరాజు ప్యాలెస్ వేదికగా ప్రారంభమైంది. ఇండోర్ ఇన్ఫో లైన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ నెల 13 వరకు ఈ ప్రదర్శన నిర్వహించనున్నారు. ఇండోర్ ఇన్ఫో లైన్ ఎండీ ఆర్కే అగర్వాల్తో పాటు పలు పరిశ్రమల ప్రతినిధులు పాల్గొని ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఏపీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్తో పాటు వీఏఎస్ఎస్ఐడబ్ల్యూఏ తదితర అసోసియేషన్లు ఈ ప్రదర్శనకు మద్దతుగా నిలిచినట్లు అగర్వాల్ తెలిపారు. ప్రదర్శనలో ఉంచిన ఉత్పత్తులను ఆయా సంస్థలు రాయితీపై విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నగర వినియోగదారులు ఈ ఉత్పత్తులను తిలకించవచ్చన్నారు. పలు పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయం
● కలెక్టర్ హరేందిర ప్రసాద్ మహారాణిపేట: అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు బలహీనవర్గాల అభ్యున్నతికి, మహిళోద్ధరణకు కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతి రావు పూలే అని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పూలే జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పూలే జాతికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. సమాజంలో అంటరానితనం నిర్మూలనకు కృషి చేసిన డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ వంటి మహోన్నత వ్యక్తి సైతం పూలేను ఆదర్శంగా తీసుకున్నారన్నారు. అనంతరం బీసీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, ఇతర కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కింద 50 శాతం బ్యాంకు రుణం, 50 శాతం ప్రభుత్వ రాయితీతో 400 యూనిట్లకు గాను రూ.10.45 కోట్ల విలువైన చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వివిధ బ్యాంకుల అధికారులను కలెక్టర్ సన్మానించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు మధుసూదనరావు, రామ్మోహన్ నాయుడు, ఎ.కృష్ణ, ఎం.రవికుమార్, జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. గొప్ప సామాజికవేత్త పూలే మహారాణిపేట: గొప్ప సామాజిక వేత్త మహాత్మా జ్యోతిరావు పూలే అని రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు అన్నారు. వైఎస్సార్ సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్ ఆధ్వర్యంలో మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం పూలే జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి ఎంపీ గొల్ల బాబూరావు పూలమా ల వేసి నివాళి అర్పించారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ పూలే ఆశయాలను వైఎస్ జగన్ కొనసాగించారని, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించారని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, సమన్వయకర్త తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి, పార్టీ కార్యాలయ పర్యవేక్షకుడు రవిరెడ్డి, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు జాన్ వెస్లీ, పేర్ల విజయ్ చంద్ర, పార్టీ ముఖ్య నాయకులు కొండా రాజీవ్గాంధీ, జహీర్ అహ్మద్, జిల్లా అధికార ప్రతినిధులు అహ్మద్, మొల్లి అప్పారావు, జిల్లా కమిటీ సభ్యులు మంచా మల్లేశ్వరి, పతివాడ కనకరాజు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు పేడాడ రమణికుమారి, మారుతీ ప్రసాద్, కె.రాంరెడ్డి, సేనాపతి అప్పారావు, దేవరకొండ మార్కండేయులు, ఎండీ షరీఫ్, పార్టీ నాయకులు బొండా శీను, పత్తిపాడు వెంకటలక్ష్మి, సత్యవతి, భాను తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయిలో ఏయూ విద్యార్థిని ప్రతిభ
విశాఖ విద్య: జాతీయ స్థాయి వ్యాసరచన పోటీలో ఆంధ్ర విశ్వవిద్యాలయం తత్వశాస్త్ర విభాగానికి చెందిన మొదటి సంవత్సరం విద్యార్థిని కోన మహాలక్ష్మి జాతీయ స్థాయిలో రెండో బహుమతిని గెలుచుకున్నారు. భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖకు అనుబంధంగా పనిచేస్తున్న కర్ణాటక రాష్ట్రం ధార్వాడకు చెందిన సెంటర్ ఫర్ మల్టీ డిసిప్లినరీ డెవెలప్మెంట్ రీసెర్చ్ ఈ పోటీలు నిర్వహించింది. ధార్వాడలోని సంస్థ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డైరెక్టర్ ఆచార్య బసవప్రభు జిర్లి చేతుల మీదుగా విద్యార్థిని మహాలక్ష్మికి రూ.7 వేలు బహుమతితో పాటు ప్రశంసాపత్రం అందజేశారు. మహాలక్ష్మి రాసిన వ్యాసం ‘భారతీయ పురాతన విజ్ఞానం ప్రాతిపదికన ప్రాచీన సంప్రదాయాలు సమకాలీన సమస్యల’ అనే అంశంపై ఆమె జాతీయ స్థాయిలో రెండో బహుమతిని పొందింది. ఆంధ్ర విశ్వవిద్యాలయ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎ. నరసింహారావు.. మహాలక్ష్మిని అభినందించారు. -
సూర్యప్రభ వాహనంపై సింహాచలేశుడు
సింహాచలం: సింహగిరిపై జరుగుతున్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా 5వరోజు శుక్రవారం స్వామి వారిని సూర్యప్రభ వాహనంపై ఊరేగించారు. స్వామి కల్యాణ ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను శోభాయమానంగా అలంకరించి సూర్యప్రభ వాహనంపై అధిష్టింపజేశారు. అనంతరం సింహగిరి మాడ వీధిలో తిరువీధి నిర్వహించారు. భక్తులు స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మహిళల కోలాటం విశేషంగా ఆకట్టుకుంది. ఆలయ పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు, అర్చకులు రాజీవ్లోచన్ తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కల్యాణోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం చూర్ణోత్సవం, వసంతోత్సవం, చక్రస్నానం, రాత్రి మృగయోత్సవం నిర్వహించనున్నారు. -
ఏపీకి చల్లని కబురు.. వారం రోజుల పాటు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో ఎండలు మండిపోతున్నాయి.. ఈ సమయంలో విశాఖ వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రంలో వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాజస్థాన్-కోస్తాంధ్ర మధ్య ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.హిమాలయ ప్రాంతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు మరో ద్రోణి విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో రాగల వారం రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.కాగా, గురువారం కురిసిన వర్షాలకు ప్రకాశం జిల్లా కురిచేడు, మర్రిపూడి, గిద్దలూరు, పామూరు, దర్శి, పొదిలి మండలాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దర్శి మండలం చందలూరు, వెంకటచలంపల్లి, మారెడ్డిపల్లి, బసిరెడ్డిపల్లి, అబ్బాయిపాలెం, మల్లవరం, చిదంబరంపల్లి, గొల్లపల్లి, కుంచేపల్లి పాములపాడు గ్రామాల్లో బొప్పాయి తోటలకు తీవ్రనష్టం వాటిల్లింది. మిరప, పొగాకు పంటలు దెబ్బతిన్నాయి. తిరుపతి రూరల్, చంద్రగిరి, రామచంద్రాపురం మండలాల్లో భారీ వర్షం కురిసింది. -
AP: ‘మీ జైలర్ తప్పు చేశారు.. ఆచూకీ ఇవ్వండి’
విశాఖ,సాక్షి: ‘మీ జైలర్ తప్పు చేశారు.. ఆచూకీ ఇవ్వండి’ అంటూ జైళ్ల శాఖ డీజీపీకి విశాఖ నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చి లేఖ రాశారు. ఆ లేఖ ప్రస్తుతం పోలీసు, జైళ్ల శాఖలో చర్చనీయాంశంగా మారింది.పోలీసుల సమాచారం మేరకు..గతంలో విశాఖకు చెందిన ఓ గృహిణికి అనంతపురం జైలర్ సుబ్బారెడ్డి అసభ్య సందేశాలు పంపించారు. దీనిపై బాధితురాలు పోలీసులు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదైన నాటి నుంచి జైలర్ సుబ్బారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు.ఈ నేపథ్యంలో జైళ్ల శాఖ డీజీపీకి విశాఖ నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చి లేఖ రాశారు. ఆ లేఖలో విచారణ నిమిత్తం జైలర్ సుబ్బారెడ్డి ఆచూకీ చెప్పాలని కోరారు. -
పళ్లు రాలుతాయ్ రాస్కెల్!
కొమ్మాది (విశాఖ): శానిటరీ ఇన్స్పెక్టర్పై టీడీపీ భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చిందులు తొక్కారు. పళ్లు రాలుతాయ్ రాస్కెల్.. గాడిదలు కాస్తున్నారా అంటూ విరుచుకుపడ్డారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) 8వ వార్డు అయిన ఎండాడలో గురువారం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పర్యటించారు. ముందుగా రాజీవ్నగర్కు చేరుకున్నారు. స్థానిక మహిళలు కుళాయిలు రావట్లేదని, డ్రైనేజీలు శుభ్రం చేయడంలేదని, వీధి దీపాలు వెలగడంలేదంటూ సమస్యల్ని ఏకరువు పెట్టారు. దీంతో సహనం కోల్పోయిన గంటా అధికారులపై తన నోటికి పనిచెప్పారు. శానిటరీ ఇన్స్పెక్టర్ రవిని పారిశుధ్య నిర్వహణ లోపం ఎందుకు వచ్చిందని, మరోసారి పునరావృతమైతే క్షమించేది లేదని.. ఉద్యోగం చేస్తున్నారా, గాడిదలు కాస్తున్నారా, పళ్లు రాల్తాయ్.. రాస్కెల్ అంటూ నోరుపారేసుకున్నారు. ఇప్పటికే టీడీపీ కూటమి ప్రభుత్వం ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలుచేయకపోవడంతో..ఎక్కడికెళ్లినా స్థానికులు ప్రశ్నిస్తుండటంతో గంటా సహనాన్ని కోల్పోతున్నారని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. ఇక గంటా తీరుతో శానిటరీ ఇన్స్పెక్టర్ మనస్తాపం చెంది కన్నీటి పర్యంతమయ్యారు. -
నేడు, రేపు వానలు
సాక్షి, విశాఖపట్నం/తిరుపతి రూరల్/: పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది గురువారం అర్ధరాత్రి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వైపుగా కదిలే అవకాశం ఉంది. మరోవైపు.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం దక్షిణ తమిళనాడు వరకూ విస్తరించింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మరో 2 రోజులపాటు వర్షాల ప్రభావం అక్కడక్కడా ఉంటుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అల్పపీడనం కారణంగా.. నేడు, రేపు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల వర్షాలుపడే సూచనలున్నాయని తెలిపారు. గంటకు 40–50 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, కోస్తాంధ్ర మత్స్యకారులు శుక్రవారం వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ప్రకాశం జిల్లాలో బొప్పాయి తోటలకు తీవ్ర నష్టం గురువారం కురిసిన వర్షాలకు ప్రకాశం జిల్లా కురిచేడు, మర్రిపూడి, గిద్దలూరు, పామూరు, దర్శి, పొదిలి మండలాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దర్శి మండలం చందలూరు, వెంకటచలంపల్లి, మారెడ్డిపల్లి, బసిరెడ్డిపల్లి, అబ్బాయిపాలెం, మల్లవరం, చిదంబరంపల్లి, గొల్లపల్లి, కుంచేపల్లి పాములపాడు గ్రామాల్లో బొప్పాయి తోటలకు తీవ్రనష్టం వాటిల్లింది. మిరప, పొగాకు పంటలు దెబ్బతిన్నాయి. తిరుపతి రూరల్, చంద్రగిరి, రామచంద్రాపురం మండలాల్లో భారీ వర్షం కురిసింది. -
ఎంఎస్ఎంఈలకు ఊతమిచ్చేలా ఇండస్ట్రీయల్ ఎక్స్పో
డాబాగార్డెన్స్: బీచ్రోడ్డులోని గాదిరాజు ప్యాలస్లో ఇండస్ట్రీయల్ అండ్ ఇంజినీరింగ్ ఎక్స్పో ప్రారంభించినట్టు ఇండోర్ ఇన్ఫోలైన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.కె.అగర్వాల్ తెలిపారు. వీజేఎఫ్ ప్రెస్క్లబ్లో గురువారం ఈ వివరాలు వెల్లడించారు. ఈ నెల 13వ తేదీ వరకు ఎక్స్పో ఉంటుందని, ఇక్కడ దాదాపు 500 యూనిట్ల వివిధ పారిశ్రామిక ఉత్పత్తులు కొలువుదీరినట్లు చెప్పారు. లేజర్ కటింగ్ మిషన్లు, చేతి పనిముట్లు, మిషన్ టూల్స్, స్టీల్ ఉత్పత్తులు, ఆటోమేషన్, వెల్డింగ్ పరికరాలు, బేరింగ్లు, సైంటిఫిక్ పరికరాలు, ల్యాబ్ పరికరాలు, మెటీరియల్ హ్యాండ్లింగ్ ఉత్పత్తులు, భద్రతాపరమైన ఉత్పత్తులు, నిర్వహణకు సంబంధించిన ఉత్పత్తులు ప్రదర్శనలో ఉంచినట్లు తెలిపారు. ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్, వీఏఎస్ఎస్డబ్ల్యూఏ, ఫెడరేషన్ ఆఫ్ ఏపీ స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ అసోసియేషన్స్ మద్దతుతో నిర్వహిస్తున్న ఈ ఎక్స్పోను దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 10 వేల మందికి పైగా సందర్శించే అవకాశం ఉందన్నారు. ఈ ఎక్స్పో ఎంఎస్ఎంఈ రంగం అభివృద్ధికి తోడ్పాటు అందించడమే కాకుండా, సందర్శకులకు కూడా వ్యాపార అవకాశాలను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందన్నారు. ప్రతి రోజూ ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ ఎక్స్పో ఉంటుందని వివరించారు. -
న్యాయవాదుల సమాఖ్య అధ్యక్షురాలిగా లక్ష్మీ సునంద
విశాఖ లీగల్ : జాతీయ మహిళా న్యాయవాదుల సమాఖ్య జిల్లా అధ్యక్షురాలుగా నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది లక్ష్మీ సునంద ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు సమాఖ్య సభ్యురాలు అనురాధ ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె నియామకం పట్ల సీనియర్ న్యాయవాదులు లక్ష్మీ రాంబాబు, మంజులత, అరుణ్ కుమారి, విశాఖ జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎం.కె.శ్రీనివాస్, కార్యదర్శి ఎల్.పార్వతీనాయుడు, రాష్ట్ర బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు ఎస్.కృష్ణమోహన్, సభ్యులు బైపా అరుణ్ కుమార్, పి.నర్సింగరావు, కె.రామజోగేశ్వరరావు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. మహిళా న్యాయవాదుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని లక్ష్మీ సునంద తెలిపారు. -
బాలికపై వీధి కుక్కల దాడి
సింథియా: జీవీఎంసీ 62వ వార్డు పరిధిలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ అధికమవుతోంది. తాజాగా పదేళ్ల బాలికను కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. వార్డు పరిధి ప్రకాష్నగర్, హైస్కూల్కు ఎదురుగా ఉన్న వీధిలో పూజశ్రీ తన తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటోంది. స్థానిక జీవీఎంసీ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. గురువారం ఉదయం తన ఇంటి వద్ద ఆడుకుంటున్న సమయంలో మూడు వీధి కుక్కలు బాలికను చూసి పెద్దగా అరిచాయి. దీంతో భయాందోళన చెందిన జయశ్రీ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించగా.. వీధికుక్కలు ఆమెను వెంబడించి దాడి చేశాయి. ఆ చిన్నారి పెద్దగా కేకలు పెట్టడంతో.. ఇరుగుపొరుగు వారు వచ్చి ఆ కుక్కలను అక్కడి నుంచి తరిమివేశారు. కుక్కల దాడిలో ఆమె శరీరంపై పలు చోట్ల గాయాలవ్వగా, తల్లిదండ్రులు చికిత్స కోసం కేజీహెచ్కు తీసుకువెళ్లారు. అక్కడ వైద్యులు ఆ చిన్నారికి చికిత్స అందించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా వీధి కుక్కలను నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు. -
రామచంద్రా.. నిబంధనలు వర్తించవా..
సింహాచలం: దేవదాయశాఖ పరిధిలోని ఆలయాల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు సంప్రదాయ వస్త్రాలు ధరించి ఉద్యోగం చేయాలన్న నిబంధనలు ఉన్నాయి. కానీ రాష్ట్ర దేవదాయశాఖ ఇన్చార్జి కమిషనర్గా ఉన్న కె.రామచంద్రమోహనే నిబంధనలు పాటించకపోవడం చర్చనీయాంశమైంది. గత నెల 26న సింహగిరికి వచ్చిన ఆయన సంప్రదాయ వస్త్రాలు ధరించకుండా స్వామిని దర్శించుకునేందుకు ఆలయంలోకి ప్రవేశించారు. సంబంధిత వీడియా సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. గతంలో రెండు దఫాలుగా ఏడేళ్లపాటు సింహాచలం దేవస్థానం ఈవోగా పనిచేసిన ఆయన ఇలా చేయడంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
బీచ్ల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ
కొమ్మాది: రుషికొండ, సాగర్నగర్ బీచ్ల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, అమలు చేయాలని అధికారులను కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. రుషికొండ బీచ్లో గురువారం జరిగిన బీచ్ మేనేజ్మెంట్ కమిటీ(బీఎంసీ) సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. రుషికొండ బీచ్లో మరిన్ని వసతులు కల్పించాలన్నా రు. టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్, ఎక్కడికక్కడ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. బ్లూ ఫ్లాగ్ బీచ్లో పని చేస్తున్న సిబ్బందికి ప్రత్యేక శిక్షణ నిర్వహించాలన్నారు. సాగర్నగర్ బీచ్ను బ్లూ ఫ్లాగ్ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. రుషికొండ బీచ్లో మైరెన్ టవర్ పునరుద్ధరణ, మెట్ల నిర్మాణం, లైటింగ్ ఏర్పాటు, చిల్డ్రన్స్ పార్కు పునరుద్ధరణ, ఆక్రమణల తొలగింపు వంటి పనులు పూర్తి చేయాలన్నారు. మొక్కల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, గ్రే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. టూరిజం ఆర్డీ జగదీష్, డీటీవో సుధాసాగర్ పాల్గొన్నారు. -
సర్వజన మనోరంజనిపై అప్పన్న తిరువీధి
సింహాచలం: సింహగిరిపై జరుగుతున్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా నాల్గవరోజు గురువారం స్వామికి సర్వజన మనోరంజని వాహనంపై విశేషంగా తిరువీధి నిర్వహించారు. స్వామివారి కల్యాణ ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని వేణుగోపాలస్వామిగా అలంకరించి శ్రీదేవి, భూదేవి సమేతంగా సర్వజన మనోరంజనిపై వేంజేపచేశారు. సింహగిరి మాడ వీధుల్లో తిరువీధి జరిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మహిళల కోలాటం ఆకట్టుకుంది. అంతకుముందు ఉదయం విశేషంగా హోమాలు నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ పాల్గొన్నారు. -
చందనోత్సవం విజయవంతానికి ప్రణాళిక
మహారాణిపేట: శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి చందనోత్సవం ఈ నెల 30న జరగనుందని, ఈ వేడుకను సజావుగా, శోభాయమానంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. చందనోత్సవం ఏర్పాట్లపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం వివిధ విభాగాల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని, టికెట్ల విక్రయం నుంచి వాహనాల నిర్వహణ వరకు ప్రతీ అంశాన్ని ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని సూచించారు. 29వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి సాధారణ దర్శనాలు నిలిపివేయనున్నారని పేర్కొన్నారు. అందరికీ అనువైన ప్రాంతాల్లో రూ.1,000, రూ.300 టికెట్ల విక్రయించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు పాసులు జారీ చేయాలని, కొండపైకి, దిగువన భక్తుల రవాణా కోసం తగిన సంఖ్యలో ఆర్టీసీ బస్సులు సిద్ధం చేయాలన్నారు. తాగునీరు, మజ్జిగ కేంద్రాలు, వైద్య శిబిరాలు, మరుగుదొడ్లు విస్తృతంగా ఏర్పాటు చేయాలని సూచించారు. కంట్రోల్ రూమ్, సైన్ బోర్డులు, శాశ్వత పోలీస్ అవుట్ పోస్ట్ల ఏర్పాటు, పార్కింగ్ సమస్య పరిష్కారానికి అదనపు స్థలాలు అభివృద్ధి తదితర చర్యలు చేపట్టాలన్నారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ సింహగిరిపై, దిగువ ప్రాంతంలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. పార్కింగ్ కోసం అదనపు స్థలాలు కేటాయించాలని సూచించారు. ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్రాజు, జేసీ మయూర్ అశోక్, డీఆర్వో భవానీశంకర్, డీసీపీ అనిత వేజెండ్ల, సింహాచలం ఈవో కె. సుబ్బారావు, రెవెన్యూ, వైద్య, రవాణా, ఆర్టీసీ, జీవీఎంసీ, విద్యుత్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఏర్పాట్లపై కలెక్టర్ హరేందిర ప్రసాద్ సమీక్ష -
విద్యుత్ రంగ ప్రైవేటీకరణ తగదు
డాబాగార్డెన్స్: విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించొద్దని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న ఏపీఈపీడీసీఎల్ పరిధి ఐదు జిల్లాల కార్మికులతో విశాఖలో సదస్సు నిర్వహించనున్నట్లు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఆర్కేఎస్వీ కుమార్ తెలిపారు. డాబాగార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రం వేదికగా జరగనున్న సదస్సు పోస్టర్ను జగదాంబ జంక్షన్ దరి సిటు కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ విద్యుత్ రంగంలో ప్రైవేట్, కాంట్రాక్ట్, పీస్రేట్ కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పీఆర్సీలో జరిగిన అన్యాయాన్ని సవరించి, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నారని, వారికి ప్రత్యామ్నాయం చూపాలన్నారు. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేపాడ సత్యనారాయణ మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్డ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సదస్సుకు విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న పర్మినెంట్, కాంట్రాక్ట్ పీస్ రేట్ ఉద్యోగస్తులైన షిఫ్ట్ ఆపరేటర్లు, సెక్షన్ ఆపరేటర్లు, మీటర్ రీడర్లు, వాచ్మెన్లు, స్టోర్ హమాలీలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఎలకి్ట్రసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సదస్సు రేపు -
సింహగిరిపై ఘనంగా పండిత సదస్సు
సింహాచలం: సింహగిరిపై జరుగుతున్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణ మహోత్సవాల్లో భాగంగా నాల్గవరోజు గురువారం పండిత సదస్సు ఘనంగా జరిగింది. స్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని వేణుగోపాలస్వామిగా అలంకరించి శ్రీదేవి, భూదేవి సమేతంగా కల్యాణమండపంలో వేదికపై కొలువుంచారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం జరిపారు. అనంతరం రాష్ట్రంలోని పలు దేవస్థానాల నుంచి వచ్చిన సుమారు 120 మంది వేద పండితులు తమ పాండిత్యంతో స్వామిని కీర్తించారు. నాలుగు వేదాల్లోని స్లోకాలతో స్వామిని కొలిచారు. స్వామి వైభవాన్ని వివరించారు. అనంతరం దేవస్థానం తరఫున పండితులను సత్కరించారు. వేద పండితులు శ్యావాస మహర్షి ఘనాపాటి(విజయవాడ దేవస్థానం) పృధ్వి ఘనాపాటి(శ్రీశైలం), అన్నపూర్ణయ్య ఘనాపాటి(కాణిపాకం), యనమండ్ర సూర్యనారాయణ ఘనాపాటి(అన్నవరం), వెంకటేశ్వర ఘనాపాటి(కనకమహాలక్ష్మి దేవస్థానం), సింహాచలం దేవస్థానం వేదపండితులు సురేష్ ఘనాపాటి, జగన్మోహన్శర్మ తదితరులు పాల్గొన్నారు. దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ఉదయం 7.30 నుంచి కల్యాణ ఉత్సవమూర్తుల చెంతన వైదిక సదస్యాన్ని నిర్వహించారు. సూపరింటెండెంట్లు జీవీవీఎస్కే ప్రసాద్, త్రిమూర్తులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. స్వర్ణ కవచ ధారునిగా అప్పన్న కల్యాణోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి స్వర్ణ కవచ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చాడు. ప్రతి గురువారం మాత్రమే లభించే స్వర్ణ కవచ అలంకారాన్ని ఏటా వార్షిక కల్యాణోత్సవాల్లో పండిత సదస్యం రోజు కూడా చేయడం పరిపాటి. ఈసారి గురువారం రోజే పండిత సదస్సు రావడం విశేషం. అప్పన్న వైభవాన్ని కీర్తించిన పలు దేవస్థానాల వేద పండితులు -
వాల్తేరు డివిజన్లో ఆదాయ వనరులపై సమీక్ష
తాటిచెట్లపాలెం: విశాఖపట్నం రైల్వేస్టేషన్లో రైల్వే బోర్డు అదనపు సభ్యులు(రెవెన్యూ) డాక్టర్ నవాల్ కె. శ్రీవాస్తవ గురువారం పర్యటించారు. రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. నాన్ఫేర్ రెవెన్యూ ద్వారా నెలకొల్పిన వివిధ యూనిట్లను పరిశీలించారు. వన్ స్టేషన్–వన్ ప్రొడక్ట్ స్టాల్ను సందర్శించారు. అనంతరం దొండపర్తిలోని డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయంలో డీఆర్ఎం లలిత్ బోరా, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వాల్తేర్ డివిజన్ పరిధిలో చేపట్టిన, చేపడుతున్న అభివృద్ధి పనులు, నాన్ ఫేర్ రెవెన్యూ సంబంధిత యూనిట్లు, రెవెన్యూ పెంపొందించే కార్యక్రమాల గురించి అధికారులు ఆయనకు వివరించారు. ఈస్ట్కోస్ట్ రైల్వే ఫైనాన్స్ సలహాదారు, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్(ట్రాఫిక్) పి.రామచంద్రరావు, ఏడీఆర్ఎంలు మనోజ్కుమార్ సాహూ(ఆపరేషన్స్), ఈ.శాంతారాం(ఇన్ఫ్రా), ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఇసుకకు డిమాండ్ కరువు
ధర ఎక్కువగా ఉండటమే కారణం ఆరిలోవ: ముడసర్లోవ వద్ద ప్రభుత్వ ఇసుక స్టాక్ పాయింట్కు డిమాండ్ కరువైంది. ఈ స్టాక్ పాయింట్కు సమీపంలో ఆరిలోవ, పైనాపిల్కాలనీ, అడవివరం, ఎంవీపీకాలనీ, ఆదర్శనగర్, విశాలాక్షినగర్, రవీంద్రనగర్ తదితర ప్రాంతాల్లో వందలకొద్ది భవన నిర్మాణాలు జరుగుతున్నా.. ఇసుక కొనుగోలు చేయడానికి ఇక్కడకు వినియోగదారులు రావడం లేదు. దీంతో నాలుగు నెలల కిందట తీసుకొచ్చిన ఇసుక ఇంకా మిగలే ఉంది. ప్రైవేట్ వ్యాపారులు బయట విక్రయించే ధర కంటే ఈ స్టాక్ పాయింట్లో టన్ను ఇసుక ధర ఎక్కువగా ఉంది. ఇక్కడ ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం టన్ను ఇసుక రూ.700కు విక్రయిస్తున్నారు. బయట టన్ను ఇసుక రూ.650కే లభిస్తోంది. దీంతో టన్ను వద్ద రూ.50 వ్యత్యాసం ఉండటంతో ప్రైవేట్ వ్యాపారుల వద్దే వినియోగదారులు ఇసుక కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. 2024 డిసెంబరు 12న ఇక్కడ ప్రభుత్వ ఇసుక స్టాక్ పాయింట్ ప్రారంభించింది. అప్పట్లో శ్రీకాకుళం జిల్లాలో గార ఇసుక రీచ్ నుంచి లారీలతో ఇక్కడకు 3,480 టన్నుల ఇసుక తీసుకువచ్చి నిల్వ చేశారు. ఇప్పటికి నాలుగు నెలలు గడిచినా ఇంకా ఈ స్టాక్ పాయింట్లో 1,200 టన్నుల ఇసుక మిగిలి ఉంది. ఈ లెక్క ప్రకారం నెలకు 552 టన్నుల చొప్పున ఇసుక విక్రయాలు జరిగినట్లు లెక్క. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఇదే ప్రాంతంలో ఏర్పాటు చేసిన స్టాక్ పాయింట్లో రోజుకు 200 టన్నులకు పైగా ఇసుక విక్రయాలు జరిగేవి. ఇప్పుడు మాత్రం ఇక్కడ ఇసుక కొనడానికి వినియోగదారులు ఆసక్తి చూపడం లేదు. -
దుర్వినియోగం
రూ.6 కోట్ల నిధులు నలుగురు వరుణ్ బజాజ్ ఉద్యోగుల అరెస్ట్ అక్కిరెడ్డిపాలెం: ఆర్థిక మోసం కేసులో ప్రమేయం ఉన్న వరుణ్ గ్రూప్ బజాజ్ విభాగంలో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులను గాజువాక పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సీఐ ఎ.పార్ధసారథి తెలిపిన వివరాలు.. కస్టమర్ల ఆడిట్ విభాగం, అంతర్గత విజిలెన్స్ నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ప్రారంభించిన దర్యాప్తులో నిందితులు ఎక్స్చేంజ్ వాహనాలకు సంబంధించి రూ.6 కోట్ల నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలిందన్నారు. కొన్ని సంవత్సరాలుగా కంపెనీకి రావాల్సిన నిధులు స్వాహా చేసినట్లు పేర్కొన్నారు. అరెస్ట్ అయిన వ్యక్తుల్లో గాజువాక బ్రాంచ్ ఏరియా సేల్స్ మేనేజర్ బి.చంద్రశేఖర్, గాజువాక రూరల్ డీలర్ షిప్ ఏరియా జనరల్ మేనేజర్ వడ్డాది అప్పారావు, చోడవరం ఏరియా సేల్స్ మేనేజర్ పి.నారాయణమూర్తి, మాకవరపాలెం బ్రాంచ్ మేనేజర్ కె.రాజా ఉన్నట్లు తెలిపారు. వీరిని అరెస్ట్ చేసి జ్యూడీషియల్ రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. అదనపు చర్యలు, మోసం తీవ్రత నిర్ణయించేందుకు దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు. -
ఐటీడీపీ కార్యకర్తపై పోలీసులకు ఫిర్యాదు
గాజువాక: మాజీ ముఖ్యమంత్రి సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్పై వైఎస్సార్సీపీ నాయకులు గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పార్టీ నాయకులు ధర్మాల శ్రీనివాసరావు, బొడ్డ గోవింద్ ఆధ్వర్యంలో సౌత్ ఏసీపీ త్రినాథ్కు ఫిర్యాదు అందజేశారు. కిరణ్ ఉద్దేశపూర్వకంగానే భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని, తమ నాయకులు జగన్ మోహన్రెడ్డి, అవినాష్రెడ్డిల వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అతడిపై కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. వినతి పత్రం సమర్పించినవారిలో నాయకులు చిత్రాడ వెంకట రమణ, పిన్నింటి సంతోష్, బొడ్డ వెంకటసూరి తదితరులున్నారు. -
రేపటి నుంచి రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలు
మద్దిలపాలెం: విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ, కళాభారతి ఆధ్వర్యంలో ఏటా జరిపే రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలను ఈ నెల 12 నుంచి 16 వరకు నిర్వహించనున్నట్లు వీఎండీఏ ట్రస్ట్ అధ్యక్ష, కార్యదర్శులు ఎంఎస్ఎన్ రాజు, డాక్టర్ గుమ్మూలూరి రాంబాబులు తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ను కళాభారతి ఆడిటోరియంలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈసారి పైడి కౌశిక్ నాటకోత్సవాలు పేరిట ఐదు రోజులపాటు ప్రదర్శనలు ఉంటాయన్నారు. 28 ఎంట్రీల్లో 9 నాటకాలను ఎంపిక చేశామన్నారు. పైడా కృష్ణ్ణప్రసాద్ మాట్లాడుతూ ఈ నాటకోత్సవాలకు మహారాజపోషకులుగా ఉండటం ఆనందంగా ఉందన్నారు. నాటకోత్సవాలకు ప్రవేశం ఉచితమన్నారు. కార్యక్రమంలో న్యాయనిర్ణేత బాబీవర్ధన్, నాటకోత్సవాల ఎగ్జిక్యూటివ్ కన్వీనర్స్ బొడ్డేటి జగత్ రావు, నాంచారయ్యలతో పాటు ఇతర కార్యవర్గసభ్యులు పాల్గొన్నారు. -
కుళ్లిన టమాటా ఉంటే ఇచ్చేయండి
జిల్లా మార్కెటింగ్ శాఖాధికారి యాసిన్ విశాఖ విద్య: రైతు బజార్లకు చిత్తూరు నుంచి వచ్చే టమాటాల్లో పాడైనవి ఉంటే స్టాళ్ల నిర్వాహకులు వాటిని తిరిగి ఇచ్చేయాలని జిల్లా మార్కెటింగ్ శాఖాధికారి షేక్ యాసిన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రద్దు టమాటాను ఎస్టేట్ అధికారుల దృష్టికి వెంటనే తీసుకొచ్చినట్లైతే రైతులు, స్టాళ్లను నిర్వహించే డ్వాక్రా వారికి ఎటువంటి నష్టం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ టమాటా అమ్మకాల్లో కిలోకు రూ.3 లాభం వచ్చేలా ధర నిర్ణయిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని 13 రైతు బజార్లలో రోజూ 30–40 టన్నుల టమాటా విక్రయాలు జరుగుతాయన్నారు. ప్రస్తుతం విశాఖ, అనకాపల్లి జిల్లాల నుంచి 10 నుంచి 15 టన్నులు మాత్రమే వస్తోందన్నారు. చిత్తూరు జిల్లాలో అధిక టమాటా పండుతున్నందున, అక్కడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం కొనుగోలు చేస్తూ, దాన్ని జిల్లాకు సరఫరా చేస్తోందన్నారు. -
జూలో ఒంటరి జంతువులకు తోడు
చర్యలు చేపడుతున్నట్లు క్యూరేటర్ ప్రకటన ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కులో ఒంటరిగా ఉంటున్న జంతువులకు తోడు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు క్యూరేటర్ జి.మంగమ్మ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8న ‘కెమెరామెన్ జీబ్రాతో ఆస్ట్రిచ్’అనే శీర్షికన జూ పార్కులో సిబ్బంది, వైద్యుల కొరత, ఒంటరి జంతువుల వేదన, నిర్వహణ సరిగా లేకపోవడం తదితర అంశాలను ప్రస్తావిస్తూ ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన క్యూరేటర్ ఓ ప్రకటన విడుదల చేస్తూ.. జూలో ఒంటరిగా ఉన్న చింపాంజీ, రైనో, జీబ్రా, ఆస్ట్రిచ్ తదితర వాటికి తోడు తీసుకురావడానికి పలు జూల అధికారులతో సంప్రదిస్తున్నట్లు పేర్కొన్నారు. జూ పూర్తిస్థాయి వైద్యుడు వి.శ్రీనివాసరావు 4 సంవత్సరాల 11 నెలల పాటు సెలవు పెట్టి విదేశాలకు వెళ్లారని, ఆయన స్థానంలో ఇటీవల సీనియర్ వెటర్నరీ వైద్యుడు డాక్టర్ పి.భానుబాబును నియమించినట్లు చెప్పారు. అవుట్ సోర్సింగ్లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు జూనియర్ వైద్యులను గత నెల 25న తొలగించామన్నారు. ఆ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పేర్కొన్నారు. జూలో 88 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది ద్వారా సేవలందిస్తున్నట్లు వివరించారు. -
మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడి మృతికి నివాళి
తగరపువలస: భీమిలి వ్యవసాయ మార్కె ట్ కమిటీ మాజీ చైర్మన్ కోరాడ నాగభూషణరావు మృతికి పలువురు సంతాపం తెలిపారు. ఆనందపురం మండలం వేములవలసకు చెందిన ఆయన గురువారం ఆరిలోవలోని ఓ ఆస్పత్రిలో అనుమా నాస్పదంగా మృతి చెందారు. కొంతకాలంగా మానసిక వేదనతో బాధ పడుతున్న ఆయన ఇటీవల ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. టీడీపీ ఆనందపురం మండల అధ్యక్షుడిగా, వేములవలస సర్పంచ్గా పని చేసిన నాగ భూషణరావు పార్టీ అభివృద్ధి కోసం ఎన లేని కృషి చేశారు. ఆయన భౌతిక కాయానికి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు బడ్డుకొండ అప్పల నాయుడు, కర్రి సీతారాం తదితరులు నివాళులర్పించారు. -
అనిత.. ఫెయిల్యూర్ హోంమంత్రి
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర హోంమంత్రిగా వంగలపూడి అనిత విఫలమయ్యారని, ఉమ్మడి విశాఖలో మహిళలు, బాలికలపై లైంగిక దాడులు, అఘాయిత్యాలు జరిగితే నియంత్రించలేని అసమర్థురాలిగా మిగిలిపోయారని వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ నాగ మల్లీశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నేను చెబుతున్న మాట కాదు.. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్ స్వయంగా చెప్పిన మాట అని గుర్తు చేశారు. హోంమంత్రిగా ఒక దళిత ఐపీఎస్ను వేధిస్తున్న పరిస్థితులు చూస్తున్నామన్నారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మంత్రి అనిత రాష్ట్రంలో శాంతి భద్రతలపై దృష్టి సారించకుండా.. తమ నాయకుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుందంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో 16,800 మంది మహిళలపై అఘాయి త్యాలు, లైంగిక వేధింపులు జరిగినట్లు అనిత శాసనసభలో చెప్పారని, అంటే సగటున గంటకు ముగ్గురిపై అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాల్లో వరసగా మహిళలపై లైంగిక దాడులు, హత్యలు జరుగుతుంటే.. కనీసం బాధితులను పరామర్శించే పరిస్థితులు లేవన్నారు. రాష్ట్రంలో బాధిత మహిళలను పరామర్శించి ధైర్యం చెప్పలేని ఫెయిల్యూర్ హోంమంత్రి అనిత అని, ఆమె షాపింగ్మాల్స్ ప్రారంభోత్సవాలకే పరిమితమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల రక్షణ కోసం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్ను శక్తి యాప్గా పేరు మార్చి.. ఏదో సాధించినట్టు గొప్పలకు పోతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికై నా రాష్ట్రంలో శాంతిభద్రలపై దృష్టి సారించాలని హితవు పలికారు. కూటమి ప్రభుత్వ 10 నెలల పాలనలో కార్మికులు, కూలీలు, విద్యార్థులు, రైతులు ఇలా అన్ని వర్గాల ప్రజలు న్యాయం కోసం రోడ్డెక్కుతున్నారని, ముందు వారి సమస్యలను పరిష్కరించాలని కూటమి ప్రభుత్వానికి సూచించారు. -
పంట పొలంలోని ఆధార్ కార్డుల పరిశీలన
● పోస్టల్ సిబ్బందిపై అనుమానం ● కలెక్టర్కు నివేదిక: పెందుర్తి తహసీల్దార్ గోపాలపట్నం: నరవ వెళ్లే రహదారిలోని కంపరపాలెం పంట పొలంలో గుట్టలుగా ఉన్న ఆధార్, ఓటర్ ఐడీ కార్డులను గురువారం పెందుర్తి తహసీల్దార్ ఆనంద్ కుమార్ పరిశీలించారు. ‘పంట పొలంలో వందలాది ఆధార్ కార్డులు’ శీర్షికతో గురువారం ‘సాక్షి’లో వచ్చిన వార్తకు ఆయన స్పందించారు. స్థానిక వీఆర్వో, వీఆర్ఏలతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. కవర్లు తెరవని ఆధార్, ఓటర్ కార్డులతో పాటు పలు బ్యాంకులకు చెందిన లెటర్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కలెక్టర్కు నివేదిక అందిస్తున్నట్లు తహసీల్దార్ ఆనంద్కుమార్ తెలిపారు. పెందుర్తి పోలీసులు కూడా ఇక్కడకు చేరుకుని, వివరాలు సేకరించారు. దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న ఆధార్, ఓటరు కార్డులు, బ్యాంక్ లెటర్లను రెవెన్యూ సిబ్బంది పోలీసులకు అప్పగించారు. కాగా.. పోస్టల్ సిబ్బంది వీటిని పారవేసి ఉంటారని అనుమానిస్తున్నారు. -
రైతుల ఆకలి కేకలు వినిపించడం లేదా?
● చోడవరం షుగర్ ఫ్యాక్టరీ రైతులకు పేమెంట్లు లేవు ● ఉపాధి కూలీలకు 75 రోజులుగావేతనాలు చెల్లించడం లేదు ● శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ ధ్వజం సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతులన్నా.. పేదలన్నా చులకన భావమని శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పది నెలల పాలనలో రైతుల ఆకలి కేకలు వినిపించడంలేదా? అని చంద్రబాబును ప్రశ్నించారు. చోడవరం షుగర్స్ రైతుల సమస్యలు, ఉపాధి కూలీల వేతనాల సమస్యలను గాలికొదిలేసి.. వైఎస్సార్ సీపీ నేతలపై దూషణలకు, వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించడమే పనిగా పాలన సాగిస్తున్నారంటూ మండిపడ్డారు. లాసన్స్బేకాలనీలోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పది నెలల పాలనలో రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదన్నారు. చోడవరం షుగర్ ఫ్యాక్టరీలో లక్ష టన్నులకు పైగా క్రషింగ్ నిలిచిపోయిందని, రైతులకు నేటికీ డబ్బు చెల్లించలేదన్నారు. రైతులకు డబ్బులు ఇవ్వకపోగా.. క్రషింగ్ను కూడా నిలిపివేస్తుంటే కూటమి ప్రభుత్వం నిద్రపోతుందా అంటూ మండిపడ్డారు. తక్షణమే కార్మికులకు, ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 75 రోజులుగా ఉపాధి కూలీలకు వేతనాలు చెల్లించకుండా ఈ ప్రభుత్వం బకాయి పెట్టిందని మండిపడ్డారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా 75 రోజుల ఉపాధి వేతనాలను ఆపిన సందర్భాలు లేవన్నారు. కష్టపడ్డ వారికి కూలి డబ్బులు ఇవ్వకుండా నిలిపివేస్తే.. రాష్ట్రంలో పేదలు ఎలా బతకాలని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి కూలీలకు రూ.700 కోట్లు ఇవ్వాల్సి ఉందని, వేతనాలు ఇవ్వాలని ఉపాధి కూలీలు కూడా నిరసనలు తెలియజేస్తున్నారన్నారు. తక్షణమే వారి వేతనాల విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చేస్తే సరిపోదని, ఏ హామీలైతే ఇచ్చారో అవన్నీ నెరవేర్చాలని బొత్స డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. -
మా వాటా ఎంత?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : జీవీఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్లపై కూటమి ప్రభుత్వం పెట్టిన అవిశ్వాసం కాస్తా ఆ పార్టీ నేతలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఇప్పటికే టీడీపీ నుంచి మేయర్ అభ్యర్థిగా ఒకరు, డిప్యూటీ మేయర్ పోస్టుల కోసం ఇద్దరు బరిలో ఉండగా.. జనసేన నుంచి మేయర్ పోస్టును ఒకరు, డిప్యూటీ మేయర్ పోస్టులను ఆరుగురు కార్పొరేటర్లు ఆశిస్తున్నారు. జనసేనకు చెందిన ఓ కార్పొరేటర్ ఏకంగా తనకు మేయర్ పదవి ఇస్తే రూ.5 కోట్ల వరకూ ఖర్చు చేసేందుకు సిద్ధమని గురువారం జరిగిన జనసేన కార్పొరేటర్ల సమావేశంలో ప్రకటించడం గమనార్హం. అంతేకాకుండా మరో ఆరుగురు కార్పొరేటర్లు తమకు డిప్యూటీ మేయర్ పదవి కావాలని కోరారు. ఈ నేపథ్యంలో పదవులు ఆశిస్తున్న కార్పొరేటర్లకు పదవులు దక్కకపోతే అసలుకే ఎసరు వస్తుందని గ్రహించిన జనసేన నేతలు కూడా క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. మొన్నటికి మొన్న తాము క్యాంపు రాజకీయాలకు దూరంగా ఉంటామన్న జనసేన పార్టీ కూడా... తన వైఖరిని మార్చుకుని కార్పొరేటర్లను క్యాంపునకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండటం గమనార్హం. సరదాగా షికారు చేసి రండి అని పేర్కొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ.. ఎవరెవరు వెళ్తారో జాబితా ఇవ్వాలని కోరినట్లు సమాచారం. మొత్తంగా మేయర్, డిప్యూటీ మేయర్లపై పెట్టిన అవిశ్వాసం కాస్తా కూటమి పార్టీల్లో కొత్త సమస్యలను ముందుకు తెస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మాకు డిప్యూటీ మేయరు కావాల్సిందే..! ఒకవైపు తనకు మేయర్ సీటు ఇస్తే రూ.5 కోట్ల మేర ఖర్చు చేస్తానని విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన ఓ కార్పొరేటర్ ముందుకు వచ్చారు. ప్రస్తుతం కూటమి నుంచి మేయర్ సీటు ఆశిస్తున్న వ్యక్తి తమకు ఇప్పటివరకు నయాపైసా ఇవ్వలేదని.. కనీసం తమతో సంప్రదించే ప్రయత్నం చేయలేదని కొందరు కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జనసేన నుంచి మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తే... తాను బరిలో ఉండటమే కాకుండా మొదటగా మన పార్టీకి చెందిన కార్పొరేటరు అభ్యర్థులకే ఎంత మొత్తం ఇవ్వాలనేది నిర్ణయిస్తామని కూడా సదరు కార్పొరేటరు స్పష్టంగా ప్రకటించారు. ఒకవేళ మేయర్ కాదంటే రెండు డిప్యూటీ మేయర్లు కచ్చితంగా జనసేనకు ఇవ్వాల్సిందేనని కార్పొరేటర్లు ముక్త కంఠంతో డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే, రెండు డిప్యూటీ మేయర్లు ఇవ్వాలంటూ పార్టీ అధిష్టానాన్ని కోరానని.. ఇప్పటికే ఒకటి ఇచ్చేందుకు అంగీకరించారని వంశీకృష్ణ చెప్పినట్టు తెలుస్తోంది. అయితే డిప్యూటీ మేయరు పదవులను కందుల నాగరాజు, సాధిక్, ఉషశ్రీతో పాటు మరో ముగ్గురు ఆశిస్తున్నట్టు స్పష్టం చేశారు. పార్టీ సింబల్ మీద గెలిచిన వారినే బరిలో నిలపాలని డిమాండ్ను కొందరు కార్పొరేటర్లు తెరమీదకు తీసుకొచ్చారు. దీనిపై పార్టీ మారిన, స్వతంత్య్ర అభ్యర్థులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చివరకు ఎవరు ఏ స్టాండు తీసుకున్నా.. అసలుకే ఎసరు వస్తుందని గ్రహించిన జనసేన పార్టీ కూడా క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. ఎవరెవరు క్యాంపునకు వెళతారనే జాబితాను తయారుచేసి పంపేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.మాకూ వాటా ముట్టాల్సిందే...!తమ అధినేత పవన్ కల్యాణ్ చెప్పిన మాటకు కట్టుబడి ఉంటామని, క్యాంపు రాజకీయాలకు దూరమని జనసేన నేతలు ప్రకటించారు. తీరా కార్పొరేటర్ల సమావేశాన్ని నిర్వహించిన సందర్భంలో ఇందుకు భిన్నమైన వాతావరణం కనిపించినట్టు తెలుస్తోంది. మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక సందర్భంగా తమకు ఎంత ఇస్తారని నేరుగా వంశీని కొందరు కార్పొరేటర్లు అడిగినట్టు సమాచారం. అయితే, నిర్దిష్టంగా ఇంత మొత్తం ఇస్తామనే హామీ రాకపోవడంతో సదరు కార్పొరేటర్లు కాస్తా అసంతృప్తిని వెలిబుచ్చారు. తమ వాటా తేలిన తర్వాతే నిర్ణయం చెబుతామని కొందరు కార్పొరేటర్లు కుండబద్దలు కొట్టినట్టు సమాచారం. గత స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూడా నయాపైసా ఇవ్వకపోవడంతో పాటు స్టాండింగ్ కమిటీలో ఒక్క పోస్టు కూడా ఇవ్వని విషయాన్ని ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే టీడీపీ నుంచి డిప్యూటీ మేయర్ పోస్టులను మొల్లి హేమలత, గొలగాని మంగవేణి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా ఉన్న పల్లా శ్రీను, గంధం శ్రీనులు ఆశిస్తున్నారు. దీంతో పాటు చిన్నలక్ష్మీ కూడా డిప్యూటీ మేయర్ పదవి ఆశిస్తున్నారు. ఒకవైపు టీడీపీలోనే డిప్యూటీ మేయర్ పోస్టుల కోసం పోటీ ఉండగా.. జనసేన నుంచి అదే స్థాయిలో పోటీ ఉండటం కూడా కూటమి పార్టీలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. -
పళ్లు రాలగొడతా రాస్కెల్.. టీడీపీ ఎమ్మెల్యే గంటా తిట్ల పురాణం
సాక్షి, విశాఖపట్నం: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సహనం కోల్పోయారు. శానిటరీ ఇన్స్పెక్టర్ రవిపై నోటి దురుసు ప్రదర్శించారు. పళ్లు రాలగొడతా రాస్కెల్ అంటూ తిట్లు లంకించుకున్నారు. గాడిదలను కాస్తున్నారా? కళ్లు కనిపించడం లేదా అంటూ తిట్ల దండకం అందుకున్నారు. గురువారం ఆయన ఎండాడలో పర్యటించారు. తాగేందుకు నీరు, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదంటూ స్థానికులు ఫిర్యాదు చేశారు. తాగడానికి మంచినీళ్లు కూడా లేవంటూ ఎమ్మెల్యేను నిలదీశారు.వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఒక వైపు.. సంక్షేమ పథకాలను అందించడం లేదు. మరో వైపు.. అభివృద్ధి కూడా జరగడం లేదు. దీంతో ప్రజలకు సమాధానం చెప్పలేక.. ఆ అధికారిపై గంటా నోరు పారేసుకున్నారు. గంటా తీరు పట్ల ప్రభుత్వ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాగా, మంగళవారం.. మున్సిపల్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరుతూ స్థానికంగా నివాసం ఉంటున్న భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇంటి ఎదుట సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో కార్మికులు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే గంటాకు ఈ అంశంపై వినతిపత్రం ఇచ్చేందుకు ఎంవీపీ కాలనీ సెక్టార్– 4లోని ఆయన ఇంటికి వెళ్లారు.ఆయన ఇంట్లోనే ఉన్నప్పటికీ వినతిపత్రం స్వీకరించేందుకు బయటకు రాలేదు. గంటన్నర పాటు నిరీక్షించినా.. స్పందించకపోవడంతో ఆగ్రహానికి గురైన కార్మికులు గంటాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన తీవ్రం చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం గంటా పీఏలు అక్కడికి వచ్చి వినతిపత్రం తమకు ఇవ్వాలని కోరినా కార్మికులు అంగీకరించలేదు.ఓ ప్రజాప్రతినిధి అయివుండీ కార్మికుల సమస్యలు వినడానికి ముందుకు రాకపోవడం దురదృష్టకరమని ఆక్షేపించారు. -
సమస్యలపై వ్యూహాత్మకంగా వ్యవహరించాలి
మహారాణిపేట : రెవెన్యూ సమస్యల పరిష్కారంలో అధికారులు, సిబ్బంది వ్యూహాత్మకంగా వ్యవహరించాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ సూచించారు. కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి రెవెన్యూ వర్క్ షాప్లో ఆయన వివిధ అంశాలపై మాట్లాడారు. రెవెన్యూ పరమైన అన్ని అంశాలపై, నిబంధనలపై, ప్రభుత్వం జారీ చేసే జీవోలపై పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు అందరూ అవగాహన కలిగి ఉండాలని, సవరణలు, మార్పులపై అప్డేట్ అవుతూ ఉండాలన్నారు. భూముల క్రమబద్ధీకరణ, భూముల బదలాయింపు, సర్వే, మ్యూటేషన్, రిజిస్ట్రేషన్, గిఫ్ట్ డీడ్, కన్వెయన్స్ డీడ్, 22ఏ జాబితా, ప్రభుత్వ భూముల ఆక్రమణ చర్యలు, 27, 30, 296, 388 వంటి జీవోల అమల్లో అనుసరించాల్సిన విధానాలపై దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న వివిధ సమస్యలను తహసీల్దార్లు, డీటీలు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇనాం, దేవదాయ శాఖ పరిధిలోని భూముల విషయంలో వివరాలు సరిపోలడం లేదని, జీవో 30, 296, 388 అమల్లో ఎదురవుతున్న సమస్యలను వివరించారు. 22ఏ జాబితాలను వెబ్ ల్యాండ్లో పొందుపరిచే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని సూచించగా ప్రభుత్వానికి నివేదించి తదుపరి చర్యలు చేపడతామని కలెక్టర్ బదులిచ్చారు. జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, డీఆర్వో భవానీ శంకర్ పలు అంశాలపై మాట్లాడారు. కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ బాలకృష్ణ, ఆర్డీవోలు సంగీత్ మాధుర్, పి.శ్రీలేఖ, సర్వే శాఖ ఏడీ సూర్యారావు, కలెక్టరేట్ ఏవో ఈశ్వరరావు, ల్యాండ్ సెక్షన్ అధికారులు, తహసీల్దార్లు, డీటీలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి రెవెన్యూ వర్క్ షాప్లో కలెక్టర్ హరేందిర ప్రసాద్ -
తీర ప్రాంతాల్లో ‘సాగర్ కవచ్’
కొమ్మాది: సాగర తీర ప్రాంతాల్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న సాగర్ కవచ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం భీమిలి, మంగమారిపేట, రుషికొండ, సాగర్నగర్ బీచ్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రుషికొండ బీచ్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్ఐ పి.మనోజ్ కుమార్ తీర ప్రాంతాల అప్రమత్తతపై మత్స్యకారులకు, పర్యాటకులకు వివరించారు. తీర ప్రాంతాల వెంబడి ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తే ఎలా ఎదుర్కొని పోలీసులకు సమాచారం ఇవ్వాలి, ఎలా అప్రమత్తంగా ఉండాలి, గూఢచారి వ్యవస్థలను ఎలా కనుగొనాలి తదితర అంశాలపై అవగాహన కల్పించారు. డీఐజీ పర్యటన: సాగర్కవచ్లో భాగంగా రుషికొండ బీచ్లో బుధవారం రాత్రి మైరెన్ డీఐజీ గోపినాథ్ జెట్టీ పర్యటించారు. ఇక్కడ బీచ్లోని పర్యాటకులతో కాసేపు మాట్లాడి, మత్స్యకారులతో సమావేశమయ్యారు. ఆయన వెంట మైరెన్ సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐలు మురళీకృష్ణ, పి. మనోజ్కుమార్ తదితరులు ఉన్నారు. స్టీల్ప్లాంట్లో ఉత్కంఠగా.. ఉక్కునగరం: స్టీల్ప్లాంట్లో సాగర్ కవచ్ ఆపరేషన్ మొదటి రోజు ఉత్కంఠగా సాగింది. సీఐఎస్ఎఫ్ క్రైం అండ్ ఇంటిలిజెన్స్ వింగ్ (సీఐడబ్ల్యూ) సిబ్బంది నలుగురు అగంతకులను పట్టుకున్నారు. ముంబై దాడులు అనంతరం దేశంలోని అన్ని సెక్యూరిటీ దళాలు కలిసి ఏటా రెండుసార్లు సాగర్ కవచ్ నిర్వహిస్తుంటాయి. పరిశ్రమలు, సంస్థల్లో సెక్యూరిటీను పరిశీలించడానికి ఏర్పా టు చేసిన కార్యక్రమంలో కొంత మంది వ్యక్తులు సముద్ర జలాలు, రహదారుల మీ దుగా పరిశ్రమల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తారు. వారిని ఆయా పరిశ్రమల సెక్యూ రిటీ సిబ్బంది పట్టుకోవాల్సి ఉంటుంది. బుధవారం సీఐఎస్ఎఫ్ సిబ్బంది, సీఐడబ్ల్యూ సిబ్బంది తనిఖీల్లో భాగంగా ఇద్దరిని ప్లాంట్ ప్లాజా గేటు వద్ద, ఇద్దరిని వాచ్ టవర్ 30 గోడ వద్ద పట్టుకున్నారు. -
షిప్యార్డ్లో నిచ్చెన పైనుంచి పడి కార్మికుడి మృతి
మల్కాపురం: షిప్యార్డ్లో నిచ్చెనపై నుంచి కింద పడిన సొసైటీ కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సీఐ విద్యాసాగర్ తెలిపిన వివరాలివి.. గాజువాక ఆర్టీసీ డిపో సమీపంలోని పాత చెక్పోస్ట్ ఏరియాలో పిలక అప్పారావు(56) అలియాస్ అప్పారావు రెడ్డి తన భార్య, కుమారుడు, కుమార్తెతో నివాసం ఉంటున్నాడు. పిలక అప్పారావు షిప్యార్డ్లో మాజీ సొసైటీ కార్మికుడిగా 30 ఏళ్ల నుంచి పని చేస్తున్నాడు. షిప్యార్డ్ హాల్షాప్ డిపార్ట్మెంట్ వద్ద బుధవారం ఉదయం 8.30గంటల సమయంలో ఈవోటీ క్రేన్పైకి వెళ్లేందుకు నిచ్చెన ఎక్కుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అక్కడి నుంచి అదుపు తప్పి కిందకు పడిపోయాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతన్ని తోటి కార్మికులు సంస్థ ఆవరణలోని ఆసుపత్రి వద్దకు తొలుత తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా మారడంతో నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అప్పారావు మృతి చెందాడు. కాగా.. తమకు న్యాయం చేయాలని మృతుడి బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. పోలీసులు, యూనియన్ ప్రతినిధులు కలగజేసుకుని న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్కు తరలించారు. -
● నిలిచిన డ్రెడ్జింగ్
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో మంగళవారం సముద్రం అల్లకల్లోలంగా మారింది. కెరటాలు సాధారణ స్థాయికి మించి ఎగసిపడ్డాయి. ఈ ప్రభావం సబ్మైరెన్ మ్యూజియం వెనుక భాగంలో జరుగుతున్న డ్రెజ్జింగ్ పనులపై పడింది. ఉవ్వెత్తున ఎగిసిపడిన కెరటాల ధాటికి డ్రెడ్జర్ నుంచి తీరానికి ఇసుకను తరలించడానికి ఉపయోగించే భారీ రబ్బరు ట్యూబ్ ఒడ్డుకు కొట్టుకువచ్చింది. దీంతో డ్రెజ్జింగ్ పనులు నిలిచిపోయాయి. ఈ రబ్బరు ట్యూబ్ను తిరిగి డ్రెజ్జర్కు అనుసంధానించి పనులను ప్రారంభించేందుకు డీసీఐ చర్యలు తీసుకుంటోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
శేష వాహనంపై అప్పన్న తిరువీధి
సింహాచలం: సింహగిరిపై జరుగుతున్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా మూడవరోజు బుధవారం స్వామికి శేషవాహనంపై తిరువీధి నిర్వహించారు. స్వామివారి కల్యాణ ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను విశేషంగా అలంకరించి శేషవవాహనంపై కొలువుంచారు. సింహగిరి మాడ వీధుల్లో నిర్వహించిన తిరువీధిలో భక్తులు స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మహిళల కోలాటం ఆకట్టుకుంది. నేడు వైదిక సదస్యం, పండిత సదస్సు కల్యాణోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం 7.30 నుంచి వైదిక సదస్యం, మధ్యాహ్నం 3 నుంచి పండిత సదస్సు నిర్వహించనున్నారు. సాయంత్రం 6 నుంచి సర్వజన మనోరంజని వాహనంపై స్వామికి తిరువీధి నిర్వహిస్తారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయని ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ తెలిపారు. -
కాలానుగుణ మార్పుల అధ్యయనంతోనే రాణింపు
సబ్బవరం: న్యాయ విద్యార్థులు కాలానుగుణంగా వస్తున్న మార్పులను అధ్యయనం చేస్తూ, విశ్వవిద్యాలయ వనరులను వినియోగించుకుని వృత్తిలో రాణించాలని హైకోర్టు న్యాయమూర్తి వీఆర్కే కృపాసాగర్ అన్నారు. స్థానిక దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం(డీఎస్ఎన్ఎల్యూ)లో బుధవారం నిర్వహించిన ‘న్యాయ విద్య–న్యాయవాద వృత్తి’సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు. వర్సిటీలో విద్యాభ్యాసం పూర్తిచేసుకుని బయట ప్రపంచంలో అడుగుపెట్టిన తరువాత పట్టించుకునేవారెవరూ ఉండరని, మనకు మనమే ఎదగాలన్నారు. అందుకే విశ్వవిద్యాలయంలోని వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుని కాలాన్ని వృథా చేసుకోకుండా అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. మిత్రులతో సబ్జెక్టు అంశాలపై చర్చిస్తూ, అధ్యాపకులతో సందేహ నివృత్తి చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. మన దగ్గరకు వచ్చే ప్రతి కేసును అంగీకరించి, వాదించే నైపుణ్యం కలిగి ఉండాలని సూచించారు. వర్సిటీలో బోధిస్తున్న సబ్జెక్టులతో పాటు దేశంలోని అన్ని హైకోర్టులు, సుప్రీం కోర్టుల్లో వెలువడే తీర్పులను అధ్యయనం చేస్తూ, అవగాహన పెంచుకున్నప్పుడే వృత్తిలో రాణించగలరన్నారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి.సూర్యప్రకాశరావు, రిజిస్ట్రార్ డాక్టర్ విశ్వచంద్రనాఽథ్ మదాసు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. డీఎస్ఎన్ఎల్యూ విద్యార్థులతో హైకోర్టు న్యాయమూర్తి వీఆర్కే కృపాసాగర్ -
కాలుష్య కాసా(గ)రం
ఏయూక్యాంపస్: విశాఖ సాగరతీరం కాలుష్య కాసారంగా మారుతోంది. నగరంలోని మురుగునీరు నేరుగా సముద్రంలోకి చేరుతోంది. వర్షం కురిసిన ప్రతీ సారి పరిస్థితి మరింత దిగజారుతోంది. కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలు మురుగునీటితో కలిసి నేరుగా సముద్రంలోకి చేరుతున్నాయి. సాధారణంగా మురుగునీటిని శుద్ధి చేసిన తర్వాతే సముద్రంలోకి వదలాలి. కానీ పాండురంగాపురం, విక్టరీ ఎట్ సీ, సాగర్నగర్ వంటి ప్రాంతాల్లో మురుగునీరు నేరుగా సముద్రంలో కలుస్తుండటంతో ఆ ప్రాంతమంతా దుర్గంధంతో నిండిపోతోంది. దీంతో స్థానికులే కాదు.. పర్యాటకులు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి పట్ల పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యకు తక్షణమే పరిష్కారం చూపాలని, మురుగునీటిని శుద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. –ఫొటో: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నంసముద్రంలోకివెళ్తున్న మురుగునీరు -
ఒక్కో వ్యక్తికి ఒక్కో పోలీసును పెట్టాలా.. హోం మంత్రి అనిత అసహనం
● జగన్ భద్రతా వైఫల్యంపై మీడియా ప్రతినిధుల ప్రశ్నలు ● సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలిన హోం మంత్రి విశాఖ సిటీ : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రతా వైఫల్యంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలారు. వారు అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేక చిందులు తొక్కారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రామగిరి పర్యటనలో భద్రతా వైఫల్యంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత బుధవారం విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో మీడియా ప్రతినిధులు జగన్ పర్యటనకు భద్రత కల్పించలేక ప్రభుత్వం చేతులెత్తేసిన అంశంపై హోం మంత్రికి ప్రశ్నలు సంధించారు. జగన్ పర్యటనకు భారీగా జనాలు వస్తారని గుర్తించలేకపోవడం ఇంటెలిజెన్స్ వైఫల్యమా? డ్రోన్, సీసీ కెమెరాల సర్వైలెన్సు ఉన్నప్పటికీ మాజీ ముఖ్యమంత్రి పర్యటనలో భద్రతా వలయం బలహీనంగా ఉందా? అని విలేకరులు ప్రశ్నించారు. దీనిపై మంత్రి అనిత ముందు సమాధానం చెప్పలేక తడబడ్డారు. కొద్ది క్షణాల తర్వాత 1100 మందితో భద్రత కల్పించామని, అందరూ తోసుకెళ్లడంతో హెలికాఫ్టర్కు లైట్ క్రాక్ మాత్రమే అయిందని చాలా తేలికగా మాట్లాడారు. అంత మందితో భద్రత కల్పించినా జనాలు తోసుకుంటూ రావడం పోలీసుల వైఫల్యం కాదా? అని మీడియా అడిగితే.. ఒక్కో మనిషికి ఒక్కో పోలీస్ను పెట్టాలా? అని తిరిగి మంత్రి విచిత్రంగా ప్రశ్నించారు. ఇంతలో మరో ప్రశ్న వేస్తున్న సమయంలో అనిత మీడియాపై రుసరుసలాడుతూ మధ్యలోనే లేచి వెళ్లిపోయారు. -
రైతుబజార్లకు కుళ్లిన టమాటా
● ‘చిత్తూరు’ టమాటాను అంటగడుతున్న అధికారులు ● వాటిని కొనేందుకు ఇష్టపడని వినియోగదారులు ● చేతి డబ్బులు కట్టాల్సి వస్తోందని స్టాళ్ల నిర్వాహకుల ఆవేదన విశాఖ విద్య: జిల్లాలోని రైతు బజార్లలో వ్యాపారాలు నిర్వహిస్తున్న రైతులకు, స్టాళ్ల నిర్వాహకులకు టమాటా విక్రయాలు భారంగా మారుతున్నాయి. చిత్తూరు నుంచి వచ్చిన టమాటాలు రైతు బజార్లకు చేరేటప్పటికే కుళ్లి కంపుకొడుతున్నాయి. ఈ కుళ్లిన టమాటాలు అమ్ముడయ్యే పరిస్థితి లేక, చేతి డబ్బులు కట్టాల్సి వస్తోందని స్టాళ్లు నిర్వహిస్తున్న రైతులు, డ్వాక్రా సంఘాల సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు వచ్చిన టమాటా మొత్తం విక్రయించాల్సిందేనని మార్కెటింగ్ శాఖ అధికారులు టార్గెట్లు పెడుతున్నారు. ఒక్కో స్టాల్లో రోజుకు రెండు లేదా మూడు క్రేట్ల టమాటాలను విక్రయించాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో రోజంతా సరకులు విక్రయించగా వచ్చే లాభాన్ని టమాటా అమ్మకాల రూపంలో తిరిగి ప్రభుత్వమే దోచుకుంటోందని రైతులు వాపోతున్నారు. రైతులపైనే రవాణా భారం చిత్తూరు మార్కెట్ నుంచి టమాటాను లారీ ద్వారా జిల్లాకు తెచ్చి, నగరంలోని మర్రిపాలెం రైతుబజారు వద్ద వదిలేస్తున్నారు. ఇక్కడ నుంచి జిల్లాలోని 13 రైతు బజార్లకు మార్కెటింగ్ శాఖ అధికారులు టమాటాను సరఫరా చేస్తున్నారు. అయితే రవాణా చార్జీల రూపంలో ఒక్కో క్రేట్కు రైతుల నుంచి రూ.30 వరకు వసూలు చేస్తున్నారు. కుళ్లిన టమాటాతో నష్టపోతున్న తమకు రవాణా భారం వేయడమేంటని స్టాళ్ల నిర్వాహకులు వాపోతున్నారు. దీనిపై ప్రశ్నిస్తే కార్డు తొలగిస్తామంటూ అధికారులు బెదిరిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. క్రేట్లలోని టమాటా మాయం? టమాటా నిల్వ చేసే క్రేట్ బరువు(సుమారు కిలో)తో కలిపి 26 కేజీల టమాటాగా మార్కెటింగ్ శాఖాధికారులు లెక్క చెబుతున్నారు. దీని ప్రకారమే ఏ రోజుకారోజు నిర్ణయించిన ధర మొత్తాన్ని రైతులు చెల్లించాలి. అయితే ఆ క్రేట్లో వస్తున్న వాస్తవ టమాటా బరువెంతనే తూకం వేసే పరిస్థితి లేదు. లారీలో నుంచి నేరుగా ఆటో/మినీ వ్యాన్ల ద్వారా రైతు బజార్లకు తెచ్చి, కళాసీల సాయంతో స్టాళ్లకు చేరవేస్తారు. ఇలావచ్చే ఒక్కో క్రేట్లో రెండు కిలోల వరకు టమాటా మాయమవుతోందని రైతులు బాహాటంగానే చెబుతున్నారు. మరోవైపు క్రేట్లో మూడు నుంచి నాలుగు కేజీలు పాడైన టమాటాలు ఉంటున్నాయి. ఈ పరిణామాలు తమకు మరింత నష్టాన్ని కలిగిస్తున్నాయని వాపోతున్నారు. ఆకస్మిక తనిఖీలు చేస్తే, టమాటా మాయం వెనుక సూత్రధారులు ఎవరనేది తేటతెల్లమవుతుందని రైతులు చెప్తున్నారు. కుళ్లిన టమాటా ఏం చేసుకుంటాం! రైతు బజారులో సరసమైన ధరలకు నాణ్యమైన సరకులు విక్రయిస్తున్నట్లు కూటమి పెద్దలు చెబుతున్నారు. విశాఖలోని రైతుబజార్లలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. చిత్తూరు టమాటా అంటగడుతుండటంతో జిల్లాకు చెందిన రైతులు తమ పంటను రైతుబజారుకు తీసుకురాకుండా, బయట మార్కెట్లో విక్రయిస్తున్నారు. దీంతో రైతు బజార్లలో కుళ్లిన టమాటాను వినియోగదారులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. రేటు తక్కువన్న మాటేకానీ, కుళ్లిన వాటిని ఇంటికి తీసుకెళ్లి ఏంచేసుకోవాలని వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి
పద్మనాభం : రోడ్డు ప్రమాదంలో గాయపడిన పద్మనాభం గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు వానపల్లి వెంకటరమణ(60) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఈయన ఎస్.రాయవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోషల్ స్కూల్ అసిస్టెంటుగా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం విశాఖపట్నంలో పదో తరగతి మూల్యాంకనానికి వెళ్లి సాయంత్రం పద్మనాభంలోని తన ఇంటికి వచ్చాడు. అనంతరం సొంత పని మీద ద్విచక్ర వాహనంపై విజయనగరం వెళ్లిన ఆయన తిరిగి ఇంటికి వస్తుండగా మార్గంమధ్యలో రామనారాయణపురం సమీపంలో వెనుక నుంచి వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటరమణకు తీవ్ర గాయాలు కాగా విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. వెంకటరమణకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు ఎంబీఏ, కుమార్తె పీజీ పూర్తి చేశారు. వెంకటరమణ మృతిపై ఉపాధ్యాయ సంఘాల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
గిఫ్ట్ డీడ్ భూముల్లో గోల్మాల్
● మధురవాడలో కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాల ఆక్రమణ ● అందుల్లో దుకాణాలు నిర్మించి రూ.లక్షల్లో అద్దె వసూళ్లు ● వాటికి ట్యాక్స్లు వేస్తున్న జీవీఎంసీ అధికారులు మధురవాడ: అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుంది మధురవాడ పరిసర ప్రాంతాల్లోని గిఫ్ట్ డీడ్ ఇచ్చిన కోట్ల విలువ చేసే స్థలాల పరిస్థితి. మధురవాడ జోన్లో మిథిలాపురి వుడా కాలనీ, నగరంపాలెం రోడ్డు తదితర వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణం కోసం జీవీఎంసీ కోట్ల విలువైన భూమిని సేకరించింది. హైవే, మాస్టర్ ప్లాన్ రోడ్లను ఆనుకుని ఉన్న ఈ స్థలాలు.. ఇప్పుడు ప్రైవేటు, అనధికార వ్యక్తుల వశమైపోతున్నాయి. ఇందుకు మధురవాడ మిథిలాపురి వుడా కాలనీ– హైవే జంక్షన్ కార్నర్లో ఉన్న సర్వే నంబర్ 248/10లోని 672 గజాల స్థలమే ఉదాహరణ. దీని మార్కెట్ విలువ సుమారు 4 కోట్ల రూపాయలు ఉండగా, బహిరంగ మార్కెట్లో 7 కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని అంచనా. ఇక్కడ పిళ్లా ముకుందయ్య–అప్పలస్వామి వారసులు 2008 మేలో 1080 గజాల్లో అపార్ట్మెంట్ నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోగా 420 గజాల్లో అపార్ట్మెంట్ నిర్మాణానికి జీవీఎంసీ అనుమతి ఇచ్చింది. మిగిలిన 672 గజాల భూమిని జీవీఎంసీ స్వాధీనం చేసుకుంది. తర్వాత ఇక్కడ జీవీఎంసీకి స్థలం ఇచ్చిన వ్యక్తులు, రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తులు పాగా వేసేశారు. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా హోటల్తో పాటు ఐదు వాణిజ్య దుకా ణాలు నిర్మించి, వాటి ద్వారా నెలకు లక్షల్లో అద్దె వసూలు చేస్తున్నారు. విశేషం ఏమిటంటే ప్రభుత్వ అవసరాల కోసం గిఫ్ట్ డీడ్ ద్వారా పొందిన భూమిలో వెలిసిన ఈ అనధికార దుకాణాలకు జీవీఎంసీ రెవెన్యూ విభాగం అధికారులే పన్నులు విధించడం. ఇది అత్యంత విలువైన కార్నర్ బిట్ కావడంతో.. అప్పటి నుంచి సదరు వ్యక్తులే వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ భూమికి సంబంధించిన వారసుల్లో వివాదాలు తలెత్తడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొందరు వారసులు ఈ భూమిని స్వాధీనం చేసుకోవాలని జీవీఎంసీ ఉన్నతాధికారులతో పాటు పీజీఆర్ఎస్లో కూడా ఫిర్యాదు చేశారు. ఏడాది కాలంగా ఫిర్యాదులు ఇస్తున్నప్పటికీ.. జీవీఎంసీ అధికారులు మాత్రం పరిశీలన పేరుతో కాలయాపన చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతేనా.. ● మిథిలాపురి వుడా కాలనీ రోడ్డు నుంచి ఐటీ సెజ్కు వెళ్లే మార్గంలో యమహా షోరూమ్ సమీపంలో కూడా ఇదే తరహాలో ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైందని సమాచారం. గతంలో ఇక్కడ హాకర్స్ జోన్ ఏర్పాటుకు టౌన్ ప్లానింగ్ అధికారులు గుర్తించినప్పటికీ.. టీడీపీ నాయకుల ఒత్తిడి కారణంగా ఆ ప్రయత్నం విఫలమైంది. ఈ స్థలం విలువ కూడా కోట్లలో ఉంటుందని అంచనా. ఇక్కడ కొందరు కూటమి నాయకులు దుకాణాలు ఏర్పాటు చేసి లక్షల్లో అద్దెలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ● హైవే నుంచి నగరంపాలెం వెళ్లే మార్గంలో రోడ్డు విస్తరణ కోసం ఓ భవన యజమాని టీడీఆర్ తీసుకున్నప్పటికీ.. తొలగింపునకు సహకరించకపోవడంతో రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఈ విష యం జీవీఎంసీ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో భవనాన్ని తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో నెలలు గడుస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడానికి సాహసించడం లేదు. ఇక్కడ ఒక ప్రైవేట్ బ్యాంకు కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ భూముల ఆక్రమణల కారణంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. తరచూ ట్రాఫిక్ జామ్ అవుతున్నప్పటికీ.. అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
కేజీహెచ్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
మహారాణిపేట: కేజీహెచ్లో కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుధవారం ఉదయం తన కార్యాలయానికి వచ్చే క్రమంలో ఆసుపత్రిని సందర్శించి అక్కడ ఓపీ కౌంటర్ల ద్వారా అందుతున్న సేవలను పరిశీలించారు. హెల్ప్ డెస్కు పనితీరు, కౌంటర్ల వద్ద సదుపాయాల స్థితిగతులను గమనించారు. అభ యాప్ ద్వారా ఓపీ టికెట్ తీసుకునే విధానం, రోగులకు వైద్యులు, సిబ్బంది నుంచి అందుతున్న సహకారంపై ఆరా తీశారు. వైద్య సేవల నిమిత్తం ఆసుపత్రికి వచ్చిన పలువురు రోగులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఓపీ తీసుకునేందుకు ఎంత సేపు నిరీక్షిస్తున్నారు.. హెల్ప్ డెస్కులో ఉన్నవారు పూర్తి సహకారం అందిస్తున్నారా? వైద్య సేవల గురించి ఆరా తీశారు. సిబ్బంది వ్యవహార శైలి, సదుపాయాలు, ఇతర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కె.శివానంద, ఆర్ఎంవో డాక్టర్ మెహర్కుమార్ ఉన్నారు. -
విశాఖ మహిళా కళాశాలకు హెచ్పీసీఎల్ విరాళం
మహారాణిపేట: విశాఖ మహిళా కళాశాల అభివృద్ధి కోసం కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద హెచ్పీసీఎల్ రూ.50 లక్షల విరాళం అందించింది. ఆ సంస్థ సీజీఎం జి.కిరణ్ కుమార్, విశాఖ రిఫైనరీ ఈడీ ఆర్.రామకృష్ణన్, అధికారి శ్రీనివాసరావు బుధవారం కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ను తన చాంబర్లో కలిసి చెక్కును అందజేశారు. విశాఖ మహిళా కళాశాలలో టాయిలెట్ బ్లాక్ ఆధునికీకరణ, ఇతర అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఉపయోగించాలని కళాశాల అధికారులకు కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో మహిళా కళాశాల ప్రిన్సిపాల్ మంజుల, సీపీఓ శ్రీనివాసరావు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
చెరువు కాదు.. ఏయూ మైదానం
విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల క్రీడా మైదానం చెరువును తలపిస్తోంది. మంగళవారం రాత్రి నగరంలో కురిసిన వర్షానికి ఏయూ గ్రౌండ్లో భారీగా నీరు చేరింది. దీంతో బుధవారం క్రీడాకారులు అటువైపు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ఒక్కో చోట మోకాళ్ల లోతు వర్షపు నీరు నిల్వ ఉండిపోగా.. మైదానం మొత్తం చిత్తడిగా తయారైంది. ఈ మైదానాన్ని ఇటీవలే అభివృద్ధి చేశారు. ఇక్కడే ఈ ఏడాది జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ నిర్వహించారు. ఇందుకోసం గ్రౌండ్ మొత్తాన్ని ఇష్టానుసారంగా తవ్వేశారు. గ్రౌండ్కు ఆనుకుని ఉన్న కాలువలను సైతం మట్టితో కప్పేశారు. వర్షపు నీరు బయటకు పోయేందుకు మార్గం లేకపోవడంతోనే ఇప్పుడు మైదానం మధ్యలోనే నీరు నిలిచిపోయింది. చిన్నపాటి వర్షానికే మైదానం ఇలా తయారైతే.. భారీగా వర్షం కురిస్తే పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని క్రీడాకారులు, ఆచార్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు మళ్లీ చోటు చేసుకోకుండా.. వర్సిటీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
పంట పొలంలో వందలాది ఆధార్ కార్డులు
గోపాలపట్నం: నరవ వెళ్లే రహదారిలోని కంపరపాలెం పంట పొలంలో వందలాది ఆధార్, ఓటరు గుర్తింపు కార్డులు గుట్టలుగా పడి ఉండటం స్థానికంగా చర్చనీయాంశమైంది. బుధవారం స్థానికులు వీటిని గుర్తించారు. ఈ కార్డులన్నీ మాధవధార, మురళీనగర్ ప్రాంతాలకు చెందిన వారివి కావడం గమనార్హం. పొలంలో గుర్తింపు కార్డులతో పాటు మద్యం సీసాలు, లైటర్లు కూడా లభ్యమయ్యాయి. ఈ సంఘటనతో స్థానికుల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ కార్డులు అసలైనవా లేదా నకిలీవా.? ఇంత పెద్ద సంఖ్యలో గుర్తింపు కార్డులు పొలాల్లో ఎలా ప్రత్యక్షమయ్యాయి? అనే ప్రశ్నలు వెంటాడుతున్నాయి. ఈ ప్రాంతంలో కొంత మంది ఆకతాయిలు మద్యం తాగుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. వారే ఈ కార్డులను పడేసి ఉంటారా? లేదా ఆధార్ కేంద్రాలు నిర్వహించే వారు ఈ పని చేసి ఉంటారా? సైబర్ నేరగాళ్ల పనా? ఇలా ఎన్నో ప్రశ్నలు వేధిస్తున్నాయి. ఈ విషయంపై అధికారులు స్పందించి, ఇన్ని కార్డులు ఇక్కడకు ఎలా వచ్చాయో విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
వేసవి క్రికెట్ శిక్షణకు ఎంపికలు
విశాఖ స్పోర్ట్స్: వేసవిలో క్రికెట్ శిక్షణకు ఎంపికలు జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 19 నుంచి ప్రారంభం కానున్నాయి. అండర్ 10, 12, 14, 16 ఏళ్ల గ్రూప్ల్లో వార్షిక శిక్షణా శిబిరాలు మే 3వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ బి గ్రౌండ్లో అండర్–10 ఎంపికలు ఈనెల 19, 20వ తేదీల్లోనూ, అండర్–12 ఎంపికలు 21, 22వ తేదీల్లోనూ జరగనున్నాయి. అండర్–16 ఎంపికలు 23, 24వ తేదీల్లోనూ, అండర్–16 ఎంపికలు ఈనెల 25, 26వ తేదీల్లోనూ నిర్వహించి శిక్షణకు అర్హత కల్పించనున్నారు. ఆసక్తి గల వారు మున్సిపల్ స్టేడియంలోని వీడీసీఏ కార్యాలయంలో ఈనెల 14వ తేదీ నుంచి పేర్లు నమోదు చేసుకోవచ్చని వీడీసీఏ కార్యదర్శి పార్ధసారథి తెలిపారు. 2015 సెప్టెంబర్ ఒకటో తేదీన గాని తర్వాత గాని జన్మించిన వారు అండర్–10లో ఎంపికలకు అర్హులన్నారు. -
రహదారిపై కూలిన భారీ వృక్షం
ఏయూక్యాంపస్: నిత్యం రద్దీగా ఉండే ఆ రహదారిలో రెప్పపాటు కాలంలో ఓ భారీ వృక్షం కూలింది. పక్కనే పలు ద్విచక్ర వాహనాలు పార్క్చేసి ఉన్నాయి. అదృష్టం కొద్దీ ఆ సమయంలో ప్రయాణికులు ఎవ్వరూ రోడ్డుపై లేకపోవడంతో భారీ నష్టం, ప్రమాదం తప్పింది. వివరాలిలా.. వాతావరణ కేంద్రం నుంచి సిరిపురం వెళ్లే ప్రధాన రహదారిలో ఏయూ దూరవిద్య కేంద్రం దాటాక జీవీఎంసీ నీటి సరఫరా ట్యాంక్ ఉంది. దీని గేట్ వద్ద ఉన్న ఒక భారీ వృక్షం బుధవారం సాయంత్రం అకస్మాత్తుగా గాలికి కూలిపోయింది. చిన్నపాటి గాలికే వృక్షం వేళ్లతో సహా నేలకొరిగింది. భారీ శబ్ధంతో రోడ్డుపై కూలడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. పొక్లెయిన్ సాయంతో కూలిన చెట్టును తొలగించారు. చెట్టు కూలే సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
అరకు వరకే కిరండూల్ పాసింజర్
తాటిచెట్లపాలెం: విశాఖపట్నం–కిరండూల్–విశాఖపట్నం మధ్య నడిచే పాసింజర్ రైళ్లు ఆయా తేదీల్లో అరకు వరకు మాత్రమే రాకపోకలు సాగిస్తాయని వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. విశాఖపట్నం–కిరండూల్–విశాఖపట్నం (58501/58502) పాసింజర్ ఈ నెల 14 నుంచి 22వ తేదీ వరకు అరకు స్టేషన్ వరకు మాత్రమే రాకపోకలు సాగిస్తుందన్నారు. అలాగే విశాఖపట్నం–కిరండూల్–విశాఖపట్నం (18515/18516) నైట్ ఎక్స్ప్రెస్ ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు అరకు స్టేషన్ వరకు మాత్రమే రాకపోకలు సాగిస్తుందన్నారు. దార్లిపుట్–పాడువా స్టేషన్ల మధ్య జరుగుతున్న రెండో లైన్ సంబంధిత పనుల వల్ల ఆయా తేదీల్లో అరకు–కిరండూల్ మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగించవని పేర్కొన్నారు. -
శబ్దం వస్తే ఫ్యాన్
మీ ఇంట్లో టీవీ లేకున్నా పాట వినిపించిందంటే ఉన్నట్లే.. మీ ఇంట్లో మూడు రూమ్లు ఉన్నాయా అయితే మూడు ఫ్యాన్లు ఉన్నట్లే.. మీరు రోజూ దుస్తులు ఉతుకుతున్నారా.. అయితే వాషింగ్ మెషీన్ ఉన్నట్లే.. మీ ఇంటి ముందు బైక్ పార్కింగ్ చేశారా.. అయితే వాహనం ఉన్నట్లే.. మీ ఇంట్లో డిగ్రీ చదివిన వాళ్లు ఉన్నారా? అయితే అందరూ సంపాదించినట్లే.. ఎండలు మండిపోతున్నాయని అప్పో సప్పో చేసి, నెలవారీ వాయిదాల్లో ఏసీలు కొనుక్కున్నారో మీరు ధనవంతుల కిందే లెక్క.. అద్దె ఆదాయం పొందేవారు, పింఛనుదారులు కూడా సంపాదనాపరులే.. ఇదీ పీ–4 సర్వే జరిగిన తీరు. -
బాలికల విద్యకు బాసట
● కేజీబీవీల్లో 6 నుంచి ఇంటర్ వరకు ఉచిత విద్య ● ప్రవేశాలకు ఈ నెల 11 తుది గడువు విశాఖ విద్య: బాలికా విద్యను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)లు మెరుగైన ఫలితాలిస్తున్నాయి. కార్పొరేట్కు దీటుగా అత్యుత్తమ విద్యా బోధన అందిస్తూ బాలికల భవితకు భరోసా కల్పిస్తున్నాయి. 11 నుంచి 17 ఏళ్ల వయస్సున్న బాలికలకు ఇక్కడ 6 నుంచి ఇంటర్ వరకు ఉచిత విద్య అందిస్తున్నారు. అనాథ బాలికలు, దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు చెందిన బాలికలకు కేజీబీవీ ప్రవేశాల్లో ప్రాధాన్యత ఇస్తారు. నాడు–నేడుతో సకల హంగులు అనాథలు, నిరుపేద వర్గాలకు చెందిన బాలికల కోసం ప్రత్యేకంగా కేజీబీవీలను ఏర్పాటు చేశారు. వీటి ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా కేజీబీవీల్లో సకల హంగులు కల్పించారు. టోఫెల్ కంటెంట్తో డిజిటిల్ విద్యాబోధన, ట్యాబుల వినియోగంతో ఇక్కడి విద్యార్థినులు చదువులతో పాటు, వివిధ పోటీ పరీక్షల్లో సత్తా చాటేలా గత ప్రభుత్వం అవకాశాలు కల్పించింది. బోధనలో ‘స్మార్ట్’ వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యారంగానికి ఇచ్చిన ప్రాధాన్యత నేపథ్యంలో పాఠశాల స్థాయిలోనే సాంకేతిక విప్లవం మొదలైంది. స్మార్ట్ పాఠాల బోధనతో కేజీబీవీల్లో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సైన్స్ ప్రాజెక్టుల రూపకల్పనలో కేజీబీవీ విద్యార్థినులు కార్పొరేట్ విద్యార్థులతో పోటీ పడుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 42 కేజీబీవీలు విశాఖ జిల్లాలో 3, అనకాపల్లి జిల్లాలో 20, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 19 కేజీబీవీలు ఉన్నాయి. వీటిలో 2025–26 విద్యా సంవత్సరానికి 6వ తరగతి, ఇంటర్ ప్రవేశాల దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఆసక్తిగల బాలికలు ఈ నెల 11లోగా http:/apkgbv.apcfss.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో విద్యాలయంలో 6వ తరగతిలో 40 సీట్లు, ఇంటర్లో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 7, 8, 9 తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లలో కూడా ప్రవేశం పొందవచ్చు. సద్వినియోగం చేసుకోవాలి కేజీబీవీల్లో ప్రవేశాలపై దృష్టి సారించాం. విద్యార్థినుల బంగారు భవిష్యత్ కోసం శతథా కృషి చేస్తున్నాం. అర్హులైన విద్యార్థినులు వీటిని సద్వినియోగం చేసుకోవాలి. పూర్తి వివరాలకు వెబ్సైట్ లేదా కేజీబీవీల ప్రిన్సిపాళ్లను సంపద్రించవచ్చు. – డాక్టర్ జోగ చంద్రశేఖర్రావు, ఏపీసీ, సమగ్ర శిక్ష, విశాఖ జిల్లా -
జగన్ భద్రతా వైఫల్యంపై రిపోర్టర్ల ప్రశ్నలు.. నీళ్లు నమిలిన హోంమంత్రి
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రత వైఫల్యంపై రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి వంగలపూడి అనిత నీళ్లు నమిలారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్న అడిగితే ఎలా అంటూ చిందులు తొక్కారు. ప్రశ్న అడిగే రిపోర్టర్లతో ఆగు ఆగు అంటూ వాగ్వాదానికి దిగారు.1100 మందితో భారీ భద్రత కల్పిస్తే హెలికాప్టర్ దగ్గరకు ప్రజలు ఎలా దూసుకు వెళ్లారంటూ రిపోర్టర్ ప్రశ్నించారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పోలీసులు కాపలా పెట్టాలా అంటూ హోంమంత్రి అసహనం వ్యక్తం చేశారు. జనాలు ఎక్కువగా వస్తారని మీ దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదా?. లేదా మీ ఇంటిలిజెన్స్ బలహీనంగా ఉందా..?. డ్రోన్ సీసీ కెమెరా వ్యవస్థ అంతా మీ చేతుల్లోనే ఉంది కదా?’’ అంటూ రిపోర్టర్ల ప్రశ్నలు అడుగుతుండగానే సమాధానం చెప్పలేక మధ్యలోనే హోం మంత్రి వెళ్లిపోయారు.కాగా, శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా పోలీసుల భద్రతా వైఫల్యం మరోసారి బహిర్గతమైన సంగతి తెలిసిందే. ఓ మాజీ సీఎం వచ్చినప్పుడు పోలీసులు కనీస భద్రత చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మంగళవారం వైఎస్ జగన్ పర్యటనలో అడుగడుగునా భద్రతా లోపాలు కనిపించాయి.పాపిరెడ్డిపల్లికి వచ్చే రహదారుల్లో వైఎస్సార్సీపీ శ్రేణులను అడ్డుకునేందుకు ఇచ్చిన ప్రాధాన్యతను పోలీసులు.. జగన్ భద్రత విషయంలో చూపకపోవడం గమనార్హం. హెలిప్యాడ్ వద్ద చోటు చేసుకున్న ఘటనే దీనికి నిదర్శనం. తమ అభిమాన నేతను చూసేందుకు వేలాదిమంది హెలిప్యాడ్ వద్దకు పోటెత్తారు. జగన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అక్కడికి చేరుకోగానే జనం తాకిడి అంతకంతకు ఎక్కువైంది. అక్కడ నామమాత్రంగా ఉన్న పోలీసులు వారిని అదుపు చేయలేక చేతులెత్తేశారు.హెలికాప్టర్ చుట్టూ జన సందోహం గుమిగూడటంతో చాలాసేపు జగన్ బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అభిమానుల తాకిడితో హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతింది. దీంతో వీఐపీ భద్రతా కారణాల రీత్యా తిరుగు ప్రయాణంలో ఆయన్ను తీసుకెళ్లలేమని పైలెట్లు స్పష్టం చేశారు. కొద్దిసేపటికి హెలికాప్టర్ తిరిగి వెళ్లిపోయింది. జగన్ రోడ్డు మార్గంలో బయలుదేరి వెళ్లారు. జగన్ పర్యటనల సమయంలో అరకొర పోలీసు భద్రతపై పార్టీ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూరితంగానే ఇలా వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు. -
విశాఖలో బోర్డు తిప్పేసిన సాఫ్ట్వేర్ కంపెనీ
సాక్షి, విశాఖపట్నం: నగరంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీ నిరుద్యోగులను నిండా ముంచేసింది. ఎల్టీడబ్ల్యూ ఐటీ బీపీఓ సర్వీస్ లిమిటెడ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. దీంతో సుమారు 150 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. గత పది నెలలు నుంచి ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా యాజమాన్యం ముప్పు తిప్పలు పెడుతోంది. జీతాలు అడిగితే దుర్భాషలాడుతున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నిబంధనలు పాటించకుండా పీఎఫ్లు కూడా చెల్లించని సాప్ట్ వేర్ కంపెనీ.. ఫేక్ ఇన్వాయిస్లు ఆఫర్ లెటర్స్తో మోసానికి పాల్పడింది. యాజమాన్యం ఆఫీస్ వదిలి వెళ్లిపోతున్నారని తెలుసుకున్న ఉద్యోగులు కార్యాలయాన్ని ముట్టడించారు. తక్షణమే పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఏపీకి రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సుస్పష్ట అల్పపీడనం కొనసాగుతోంది. రాగల రెండు రోజుల పాటు కోస్తా జిల్లాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. రెండు రోజుల తర్వాత అల్పపీడనం బలహీన పడనుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. వర్షాలు లేని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని.. తీరం వెంబడి ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.శుక్రవారం.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం, ఏలూరు జిల్లా పోలవరం, వేలేరుపాడు మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే మంగళవారం నంద్యాల జిల్లా దొర్నిపాడు, వైఎస్సార్ జిల్లా మద్దూరులో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 25 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
‘కిరణ్ రాయల్పై చర్యలేవి’
సాక్షి,విశాఖ: పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసుల బట్టలు ఊడదీస్తానంటే హోంమంత్రి అనిత ఉలిక్కిపడుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రశ్నించారు.విశాఖలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణీ మీడియాతో మాట్లాడారు.వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని తట్టడానికి అనితకు హోంమంత్రి పదవి ఇచ్చారు. వైఎస్ జగన్పై విమర్శలు చేయడానికి సమయం ఉంటుంది. కానీ కామాంధులు చేతిలో బలైన బాధితులను పరామర్శించేందుకు సమయం ఉండదు.సొంతం నియోజకవర్గంలో మహిళపై దాడులు జరిగితే హోం మంత్రి అరికట్ట లేకపోయారు.పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసుల బట్టలు ఊడదీస్తానంటే అనితకు ఉలికెందుకు. వైఎస్ జగన్కు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. క్రిమినల్ అని ఎన్టీఆర్ ఎవరిని అన్నారో రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు.ఐఏఎస్ అధికారులను పేరు పెట్టి తిట్టిన ఘనత చంద్రబాబు, లోకేష్, టీడీపీ నాయకులది. ఐపీఎస్ అధికారుల మీద తప్పుడు కేసులు పెట్టిన చరిత్ర టీడీపీ నేతలది. దళిత ఐఏఎస్ అధికారులను కూటమి ప్రభుత్వం వేధిస్తోంది.మహిళల రక్షణ గురించి మాట్లాడే అర్హత టీడీపీ నేతలకు లేదు. ఎమ్మెల్యే ఆదిమూలం, కిరణ్ రాయల్ మహిళలను వేధిస్తే మీరు ఏం చర్యలు తీసుకున్నారు’ అని కూటమి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. -
గంటా ఇంటి ముందు జీవీఎంసీ కార్మికుల నిరసన
ఎంవీపీ కాలనీ: మున్సిపల్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరుతూ స్థానికంగా నివాసం ఉంటున్న భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇంటి ఎదుట సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో కార్మికులు నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే గంటాకు ఈ అంశంపై వినతిపత్రం ఇచ్చేందుకు ఎంవీపీ కాలనీ సెక్టార్– 4లోని ఆయన ఇంటికి మంగళవారం వెళ్లారు.ఆయన ఇంట్లోనే ఉన్నప్పటికీ వినతిపత్రం స్వీకరించేందుకు బయటకు రాలేదు. గంటన్నర పాటు నిరీక్షించినా.. స్పందించకపోవడంతో ఆగ్రహానికి గురైన కార్మికులు గంటాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన తీవ్రం చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం గంటా పీఏలు అక్కడికి వచ్చి వినతిపత్రం తమకు ఇవ్వాలని కోరినా కార్మికులు అంగీకరించలేదు.ఓ ప్రజాప్రతినిధి అయివుండీ కార్మికుల సమస్యలు వినడానికి ముందుకు రాకపోవడం దురదృష్టకరమని ఆక్షేపించారు. అంతకు ముందు వారంతా ఎమ్మెల్యే వెలగపూడికి వినతిపత్రం అందించి, సమస్యలను వివరించారు. సీఐటీయూ ఆర్గనైజింగ్ సెక్రటరీ వి.కృష్ణారావు, సహాయ కార్యదర్శి జేఆర్ నాయుడు, మున్సిపల్ యూనియన్ నాయకులు ఆర్.శ్రీను, కె.కుమారి, ఇ.ఆదినారాయణ, శేషుబాబు, కొండమ్మ, శ్రీదేవి, విజయ, చెల్లయ్యమ్మ, రాజు, గోపి, వెంకట్రావు పాల్గొన్నారు. -
ఒకరి వెంట మరొకరు
డాబాగార్డెన్స్ : ప్రేమ ఎంత బలమైనదో.. కొన్ని సార్లు అంతే విషాదకరమైన ముగింపునిస్తుంది. అందుకు నిదర్శనమే ఈ ఘటన. ఆరిలోవకు చెందిన ప్రశాంత్ కుమార్ (23), శ్రీకాకుళానికి చెందిన గేదెల సుజాత (27) ప్రేమించుకున్నారు. కేజీహెచ్లో ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లో అసిస్టెంట్గా పనిచేస్తున్న ప్రశాంత్ శనివారం రాత్రి డ్యూటీకి వెళ్లాడు. ఆదివారం ఉదయం అతను విగతజీవుడై కనిపించాడు. మృతదేహం పక్కనే రెండు సిరంజీలు ఉండటం అనుమానాలకు తావిచ్చింది.అయితే అతని మరణానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రశాంత్ మరణ వార్త సుజాతను తీవ్రంగా కలచివేసింది. గోపాలపట్నంలో తన సోదరుడితో కలిసి ఉంటున్న సుజాత, తన ప్రియుడు ఇక లేడన్న విషయాన్ని తట్టుకోలేకపోయింది. అతని మరణించిన 24 గంటల్లోపే సోమవారం ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం ప్రశాంత్ మరణించగా, సోమవారం ఉదయం అతని పోస్టుమార్టం జరిగింది. అదే సమయంలో సుజాత తన ప్రాణా లు తీసుకుంది.మంగళవారం ఉదయం సుజాత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. సుజాత గతంలో కేజీహెచ్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన సమయంలోనే చిగురించిన ప్రేమ.. చివరకు విషాదంగా మిగిలింది. ఈ ఘటనలపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. ప్రేమ విఫలమైందా? కుటుంబ సభ్యులు అంగీకరించలేదా, లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
పచ్చ డ్యూటీ!
● పోలీసుల ఎదుటే దాడులకు తెగబడుతున్న టీడీపీ నేతలు ● గాజువాక పోలీస్స్టేషన్లోనే ఒక వ్యక్తిని చెప్పుతో కొట్టిన తెలుగు మహిళా అధ్యక్షురాలు ● అయినా కేసు పెట్టకుండా తటపటాయించిన అధికారులు ● వీడియో వైరల్ అవడంతో సీపీ ఆదేశాలతో చివరికి కేసు నమోదు ● అన్ని పోలీస్ స్టేషన్లలో ఇదే తంతుచీర కట్టులో విద్యార్థినుల సందడిపోలీస్ స్టేషన్కు వెళ్లి ఎవరిని చెప్పుతో కొట్టినా కేసు పెట్టరు.. ఆస్పత్రిలో బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడినా పట్టించుకోరు.. ఓ హోటల్లో ఎన్ఆర్ఐ మహిళ విగత జీవిగా పడి ఉన్నా.. అబ్బే అలాంటిదేమీ లేదని బుకాయించేస్తారు.. కూటమి పార్టీతో చేతుల కలపలేదని ప్రత్యర్థి పార్టీ కార్పొరేటర్ ఇంటికి వెళ్లి మహిళలు, పిల్లలపై బెదిరింపులకు దిగుతారు. ఇదీ విశాఖ పోలీసుల పనితీరు. విశాఖ సిటీ: నగరంలో కొందరు సీఐలు, ఏసీపీలు పచ్చ రంగు పులుముకుని విధులు నిర్వర్తిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అధికార మదంతో కూటమి నేతలు పోలీసుల కళ్ల ముందే ఎన్ని అకృత్యాలు చేసినా వీరికి కనిపించవు. వినిపించవు. బాధితులు స్టేషన్ల చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేసినా.. సీఐ, ఏసీపీలను కలిసినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి దృష్టికి వెళ్లలేనంత వరకు ఎటువంటి కేసులు నమోదు కావు. అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ వారి సేవలో తరిస్తున్నారనడానికి ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలే ఇందుకు నిదర్శనం. స్టేషన్లోనే చెప్పుతో కొట్టిన తెలుగు మహిళ గాజువాక పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. స్టేషన్లో నరేంద్ర అనే వ్యక్తి ఎస్ఐ ముందు మాట్లాడుతున్న సమయంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి లోపలకు వచ్చారు. వచ్చి రావడంతోనే కాలి చెప్పు తీసి నరేంద్ర ముఖంపై కొట్టారు. దీంతో నరేంద్రతో పాటు ఎస్ఐ కూడా నిర్ఘాంతపోయారు. ఆ తరువాత కూడా అతడి మీదకు వెళుతున్నా ఆమెను ఆపే సాహసం చేయలేకపోయారు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. అయితే స్టేషన్లోని సీసీ కెమెరాలో రికార్డయిన ఆమె దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయినప్పటికీ కేసు పెట్టకుండా ఈ వ్యవహారంలో రాజీ కుదర్చాలని చివరి వరకు పోలీసులు ఆపసోపాలు పడ్డారు. ఈ విషయం సీపీ శంఖబ్రత బాగ్చి దృష్టికి వెళ్లడంతో ఆయన ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితుల్లో తెలుగు మహిళా అధ్యక్షురాలిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. ఆ కేసు పెట్టే సమయంలో కూడా సదరు మహిళా నేత గాజువాక సీఐ పార్థసారధిపై చిందులు తొక్కారు. స్టేషన్ నుంచి బదిలీ చేయిస్తానని శపథం చేశారు. అయినప్పటికీ పోలీసులు మారు మాటలేకుండా ఆమెకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. వైఎస్సార్ సీపీ ఫిర్యాదు చేస్తే నో కేస్ ఆరేడేళ్ల క్రితం వైఎస్సార్ సీపీ నాయకులు, సానుభూతిపరులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న కారణంతో అరెస్టులు చేస్తున్న పోలీసులు.. ఇప్పుడు కూటమి నేతల దాష్టీకాలను మాత్రం చూసీచూడనట్లు వదిలేస్తుండడం గమనార్హం. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. టీడీపీ నేతల అసభ్య పోస్టులపై ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నప్పటికీ.. ఇప్పటివరకు కనీసం కేసు కూడా నమోదు చేయకపోవడం వీరి పనితనానికి నిదర్శనం. అదే టీడీపీ నుంచి ఒక వార్డు స్థాయి నాయకుడు గానీ, అభిమాని గానీ ఫిర్యాదు చేస్తే మాత్రం క్షణాల్లోనే అరెస్టులు, రిమాండ్లు జరిగిపోతున్నాయి. టీడీపీ నేతల అడుగులకు మడుగులొత్తుతున్న పోలీసులు సీపీ చెబితేనే కేసులు.. లేకుంటే రాజీలు.. వినకపోతే బెదిరింపులుపచ్చరంగు పులుముకుని.. విశాఖ పోలీసులు ప్రతిపక్ష పార్టీ నేతలు, అభిమానులపై ప్రవర్తిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. కూటమి నేతలకు పూర్తిగా సాగిలా పడుతున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి కూటమి నేతలు చేస్తున్న కుటిల ప్రయత్నాలకు పోలీసులు శాయశక్తుల సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం కొందరు సీఐలు మితిమీరి ప్రవర్తిస్తున్న విషయం ఇటీవల దుమారం రేపింది. మేయర్ సీటుకు అవసరమయ్యే బలం లేకపోవడంతో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు వల వేసి తాయిళాల ఎరచూపి కొంత మందిని లాక్కుంది. అయినప్పటికీ పూర్తిస్థాయి బలం లేకపోవడంతో మిగిలిన వారిని తమ వైపునకు తిప్పుకోవడానికి ఖాకీ అస్త్రాన్ని ప్రయోగించింది. కూటమి నేతల ఆదేశాల మేరకు ఒక సీఐ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న వైఎస్సార్ సీపీకి చెందిన కార్పొరేటర్ ఇంటికి వెళ్లి అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. కార్పొరేటర్ ఎక్కడ ఉన్నాడో చెప్పకపోతే.. ఇంట్లో ఉన్న మహిళలను, పిల్లలను స్టేషన్కు తీసుకువెళ్లాల్సి వస్తుందని బెదిరింపులకు దిగారు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. కేసులు మాయం..! విశాఖలో వరుస హత్యలు, మహిళలపై అఘాయిత్యాలు గుబులు పుట్టిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన పది నెలల్లోనే నగరంలో క్రైమ్ రేట్ గణనీయంగా పెరిగిపోయింది. వరుస ఘటనలు కూటమి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నేర నియంత్రణకు చర్యలు చేపట్టలేని ప్రభుత్వం.. కేసులను గోప్యంగా ఉంచాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫలితంగానే విశాఖలో జరుగుతున్న హత్యలు, మహిళలపై అఘాయిత్యాలను పోలీసులు గోప్యంగా ఉంచడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. భీమిలి పోలీస్స్టేషన్ పరిధిలో ఏఎన్హెచ్లో బాలికపై వార్డు బాయ్ అఘాయిత్య ప్రయత్నం చేశాడు. ఈ విషయం బయటకు రాకుండా ఉంచేందుకు పోలీసులు అష్టకష్టాలు పడ్డారు. అలాగే ఓ హోటల్లో ఎన్ఆర్ఐ మహిళ మృతి కేసును మాయం చేయడానికి చివరి వరకు ప్రయత్నించారు. మూడు రోజుల తరువాత ఈ విషయం బయటకు పొక్కడంతో అది ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు. ఇలా నగరంలో హత్యల నుంచి చోరీల వరకు అన్ని కేసులను గోప్యంగా ఉంచడానికి అపసోపాలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఉండేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. -
నేత్రపర్వంగాఅప్పన్న కల్యాణోత్సవం
● సందడిగా ఎదురు సన్నాహోత్సవం ● హరినామస్మరణతో మార్మోగిన సింహగిరి ● ఉత్సాహంగా రథోత్సవం.. పరవశించిన భక్తజనం ● భక్తులకు ముత్యాల తలంబ్రాల పంపిణీసింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవం మంగళవారం రాత్రి కనులపండువగా జరిగింది. భూదేవి, శ్రీదేవి సమేత అప్పన్న స్వామి కల్యాణాన్ని తిలకించేందుకు తరలివచ్చిన భక్తుల హరి నామస్మరణలతో సింహగిరి మార్మోగింది. పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి కల్యాణోత్సవ ఘట్టాలను ఆలయ అర్చకులు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించారు. తొలుత ఆలయ నీలాద్రిగుమ్మం వద్ద అర్చకులు, ముత్తయిదువులు పసుపుకొమ్ములను దంచి కొట్నాల ఉత్సవాన్ని నిర్వహించారు. తదుపరి ముక్కోటి దేవతలకు కల్యాణోత్సవ ఆహ్వానాన్ని పలుకుతూ అలయ ధ్వజస్తంభం వద్ద అర్చకులు గరుడాళ్వార్ చిత్రపటాన్ని ఎగురవేసి ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాద సంవాదాలతో ఎదురు సన్నాహం ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని బంగారురంగు పల్లకీలో, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ముత్యాల పల్లకీలో వేంజేపచేశారు. అమ్మవార్ల పల్లకీని, అయ్యవారి పల్లకీని సింహగిరి మాడవీధిలో చెరొకవైపు తీసుకెళ్లి పశ్చిమ మాడ వీధిలో జోడుభద్రాల వద్ద ఎదురెదురుగా ఏర్పాటు చేసిన వేదికపై ఉంచారు. అక్కడ ఎదురు సన్నాహోత్సవం వాద, సంవాదాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తుల ఆనందోత్సాహాల మధ్య వేడుకగా నిర్వహించారు. ఆలయ అర్చకులు పూలదండలతో నృత్యాలు చేస్తూ ఎదురు సన్నాహోత్సవాన్ని రక్తి కట్టించారు. వ్యాఖ్యాతలుగా తిరుమల తిరుపతి దేవస్థానం పరిచారకుడు కె.ఇ.లక్ష్మీనరసింహన్, నరసాపురానికి చెందిన ఆధ్యాత్మికవేత్త వంగల వెంకటాచార్యస్వామి వ్యవహరించారు. పెద్ద ఎత్తున రథోత్సవం సింహగిరి మాడ వీధిలో పెద్ద ఎత్తున రథోత్సవం నిర్వహించారు. స్వామి ఉత్సవమూర్తులను రథంలో వేంజేపచేశారు. జాలరి పెద్ద కదిరి లక్ష్మణరావు రథసారధిగా నిలిచి రథ కదలికలను సూచిస్తుండగా, లక్ష్మీదేవి అమ్మవారి బంధువులుగా విశాఖ నగరం నలుమూలల నుంచి వచ్చిన జాలర్లు రథం నడిపే బాధ్యతలు చేపట్టారు. అశేష భక్తజనం స్వామి రథాన్ని తాళ్లతో లాగి పరవశించారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు రథోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. తాడేపల్లిగూడెంకి చెందిన రాజరాజేశ్వరి కాళీమాత ట్రూప్ బృందంచే కాంతారా డ్యాన్స్, గోపాలపట్నంకి చెందిన శ్రీమన్నారాయణ కోలాటం బృందం ప్రదర్శన, ఎస్.కోటకి చెందిన పార్వతీపరమేశ్వర ట్రూప్చే చెక్కభజన తదితర కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కమనీయంగా కల్యాణం సింహగిరిపై ఉత్తరరాజగోపురం ఎదురుగా ఉన్న ప్రాంగణంలో రాత్రి 10.30 గంటల నుంచి వార్షిక కల్యాణోత్సవం నిర్వహించారు. స్వామిని, అమ్మవార్లను కల్యాణ ప్రాంగణంలోకి తీసుకొచ్చి భారీ ఎత్తున ఏర్పాటు చేసిన కల్యాణ వేదికపై వేంజేపచేశారు. విష్వక్సేణ పూజ, పుణ్యాహవచనం, సంకల్పం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తదుపరి భక్తులకు ముత్యాల తలంబ్రాలు, ప్రసాదం అందజేశారు. దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఇరగవరపు రమణాచార్యులు, పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు, అర్చకులు, వేదపండితులు కార్యక్రమాన్ని నిర్వహించారు. రథోత్సవం, కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని సింహాచలం దేవస్థానం ఈవో కె.సుబ్బారావు ఆధ్వర్యంలో విశేషంగా ఏర్పాట్లు చేశారు. గోపాలపట్నం లా అండ్ ఆర్డర్ సీఐ గొలగాని అప్పారావు బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
గంటా ఇంటి ముందు జీవీఎంసీ కార్మికుల నిరసన
ఎంవీపీ కాలనీ: మున్సిపల్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరుతూ స్థానికంగా నివాసం ఉంటున్న భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇంటి ఎదుట సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో కార్మికులు నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే గంటాకు ఈ అంశంపై వినతిపత్రం ఇచ్చేందుకు ఎంవీపీ కాలనీ సెక్టార్– 4లోని ఆయన ఇంటికి మంగళవారం వెళ్లారు. ఆయన ఇంట్లోనే ఉన్నప్పటికీ వినతిపత్రం స్వీకరించేందుకు బయటకు రాలేదు. గంటన్నర పాటు నిరీక్షించినా.. స్పందించకపోవడంతో ఆగ్రహానికి గురైన కార్మికులు గంటాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన తీవ్రం చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం గంటా పీఏలు అక్కడికి వచ్చి వినతిపత్రం తమకు ఇవ్వాలని కోరినా కార్మికులు అంగీకరించలేదు. ఓ ప్రజాప్రతినిధి అయివుండీ కార్మికుల సమస్యలు వినడానికి ముందుకు రాకపోవడం దురదృష్టకరమని ఆక్షేపించారు. అంతకు ముందు వారంతా ఎమ్మెల్యే వెలగపూడికి వినతిపత్రం అందించి, సమస్యలను వివరించారు. సీఐటీయూ ఆర్గనైజింగ్ సెక్రటరీ వి.కృష్ణారావు, సహాయ కార్యదర్శి జేఆర్ నాయుడు, మున్సిపల్ యూనియన్ నాయకులు ఆర్.శ్రీను, కె.కుమారి, ఇ.ఆదినారాయణ, శేషుబాబు, కొండమ్మ, శ్రీదేవి, విజయ, చెల్లయ్యమ్మ, రాజు, గోపి, వెంకట్రావు పాల్గొన్నారు. గంటన్నర పడిగాపులు కాసినా.. పట్టించుకోని భీమిలి ఎమ్మెల్యే -
బాలుడి మృతిపై సమగ్ర విచారణ
నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి సీతమ్మధార: విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్లో బాలుడి మృతిపై సమగ్ర విచారణ జరుగుతోందని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. పోర్ట్ స్టేడియంలోని విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ వాటర్ వరల్డ్లో సోమవారం రాత్రి రుషి అనే బాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీపీ మంగళవారం సంఘటన స్థలాన్ని పరిశీలించి మీడియాతో మాట్లాడారు. బాలుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రాథమికంగా ఇది ప్రమాదవశాత్తు జరిగినట్లుగా భావిస్తున్నప్పటికీ, ఈ ఘటనపై సమగ్ర విచారణ చేస్తున్నట్లు కమిషనర్ వెల్లడించారు. స్పోర్ట్స్ క్లబ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. రిషి బంధువులను ఉత్తర ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు పరామర్శించారు. అనంతరం స్పోర్ట్ క్లబ్ను సందర్శించారు. స్విమ్మింగ్పూల్లో దిగి లోతును పరిశీలించారు. ఈ ఘటనపై పోర్ట్ చైర్మన్, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. కలెక్టర్ వెంటనే స్పందించి విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ను మూసివేయాలని కోరారు. -
ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా నరేష్
విశాఖ లీగల్: ఇండియన్ లాయర్స్ అసోసియేషన్(ఐఎల్ఏ) విశాఖ జిల్లా అధ్యక్షుడిగా యడ్ల నరేష్(వై.వి.ఎల్.ఎన్.రావు) నియమితులయ్యారు. విజయవాడలో జరిగిన సమావేశంలో ఐఏఎల్ రాష్ట్ర అధ్యక్షుడు జి.శాంతకుమార్ నియామక పత్రాన్ని నరేష్కు అందజేశారు. ఐఏఎల్కు దేశ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడానికి, మహిళా న్యాయవాదులకు సంస్థలో తగిన ప్రాధాన్యత కల్పించడానికి కృషి చేస్తానని నరేష్ తెలిపారు. న్యాయవాదులకు ఇస్తున్న డెత్ బెనిఫిట్స్ను కనీసం రూ.10 లక్షలకు పెంచే విధంగా పోరాటం చేస్తానన్నారు. -
ఈకోర్సా అంతర విభాగాల క్రీడా మేళా ప్రారంభం
విశాఖ స్పోర్ట్స్: వాల్తేర్ డివిజన్ అంతర విభాగాల క్రీడా మేళాను రైల్వే క్రికెట్ స్టేడియంలో డీఆర్ఎం లలిత్ బోహ్రా మంగళవారం క్రీడాజ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ధ్యాన్చంద్ అవార్డీ ఎన్.ఉషతో సహా అంతర్జాతీయ క్రీడాకారులు జ్యోతిని వెలిగించి డీఆర్ఎంకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృత్తిపరమైన పనితో పాటు క్రీడాస్ఫూర్తి మేళవింపుగా ఉత్సాహాన్ని నింపేందుకే నెల రోజుల పాటు ఈ క్రీడామేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీఆర్ఎం సతీమణి లలిత్బోహ్రా, ఏడీఆర్ఎంలు మనోజ్కుమార్, ఇ.శాంతారామ్, క్రీడాధికారి ప్రవీణ్బాటి, సంయుక్త క్రీడాధికారి అవినాష్, బ్రాంచ్ అధికారులు, కార్యనిర్వాహక సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వాల్తేర్ తూర్పు కోస్తా రైల్వే స్పోర్ట్స్ సంఘం(ఈకోర్సా) ఆధ్వర్యంలో 13 విభాగాల ఉద్యోగుల జట్లు మెన్, వుమెన్ కేటగిరీల్లో పోటీపడనున్నాయి. ఆర్పీఎఫ్–కమర్షియల్ విభాగాల మధ్య క్రికెట్ మ్యాచ్ను డీఆర్ఎం టాస్ వేసి ప్రారంభించారు. ఈ మ్యాచ్లో కమర్షియల్ జట్టు 50 పరుగుల తేడాతో విజయం సాధించగా, మరో మ్యాచ్లో ఎలక్ట్రికల్ ఈఎల్ఎస్ జట్టు ఆరు వికెట్ల తేడాతో ఎలక్ట్రికల్ ఆపరేషన్స్ జట్టుపై గెలుపొందింది. మహిళల క్యారమ్స్ పోటీల్లో ఈఎల్ఎస్, ఈఎల్ఈ(జనరల్) జట్లు ఎ–పూల్లోనూ, డీఎల్ఎస్, స్టోర్స్, అకౌంట్స్, ఆపరేషన్స్ జట్లు బి–పూల్లోనూ తొలిరోజు పోటీల్లో విజయం సాధించాయి. -
‘కృష్ణ’ను కుంకీ శిక్షణకు పంపించండి
ఆరిలోవ: ఇందిరా గాంధీ జూ పార్కులో కృష్ణ అనే మగ ఏనుగును కుంకీ శిక్షణకు పంపించేందుకు చర్యలు చేపట్టాలని జూ క్యూరేటర్ జి.మంగమ్మను ఏపీ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(పీసీసీఎఫ్) అజయ్ కుమార్ నాయక్ ఆదేశించారు. జూ పార్కులో కృష్ణ కొన్ని దశాబ్దాలుగా సందర్శకులకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎం కె.పవన్ కల్యాణ్ జూ పర్యటన నేపథ్యంలో అదనపు పీసీసీఎఫ్లు శాంతిప్రియ పాండే, రాహుల్ పాండేలతో కలసి మంగళవారం ఇక్కడకు చేరుకున్నారు. అయితే పవన్ కల్యాణ్ పర్యటన రద్దవడంతో, ఆయన జూ పార్కు ఎదురుగా ఉన్న ఎకో టూరిజం పార్కు కంబాలకొండను సందర్శించారు. అలాగే జూలో వన్యప్రాణులు, వాటి ఎన్క్లోజర్లు, ఆస్పత్రి, అభివృద్ధి పనులు, సిద్ధమైన పలు ఎన్క్లోజర్లు, సందర్శకులకు కల్పిస్తున్న సౌకర్యాలు పరిశీలించారు. వన్యప్రాణులకు అందు తున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరు గురించి ఆరా తీశారు. జూలో అడవి కుక్కల పునరుత్పత్తి కేంద్రం అభివృద్ధిని పరిశీలించి జూ అధికారులను అభినందించారు. వన్యప్రాణుల ఎన్క్లోజర్ల వద్ద ఫొటోలు దిగా రు. కంబాలకొండలో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించి, వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం జూ లవర్స్ డే పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ నాయక్ మాట్లాడుతూ వన్యప్రాణులకు అందించే వైద్య సేవలపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. కృష్ణను ఏనుగుల క్యాంప్లో కుంకీ శిక్షణకు పంపించే ఏర్పాట్లు చేయాలన్నా రు. అడవుల నుంచి జనావాసాలు, పొలాల్లోకి చొరబ డి పంటలు నాశనం చేస్తున్న ఏనుగుల గుంపులను తిరిగి అడవుల్లో తరలించే విధంగా దీనికి శిక్షణ ఇస్తారన్నారు. విశాఖ సీఎఫ్ బి.ఎం.మైదీన్, పలువురు డీఎఫ్వోలు పాల్గొన్నారు. జూ క్యూరేటర్కు పీసీసీఎఫ్ ఆదేశం అదనపు పీసీసీఎఫ్లతో జూ పరిశీలన -
ఇంటెలిజెచర్స్తో నియంత్రణ సోల్సెన్స్తో బాడీ ట్రాకింగ్
విశాఖ విద్య: ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే ఎలాంటి అసాధ్యాలనైనా సుసాధ్యం చేయవచ్చునని నిరూపిస్తున్నారు ఆంధ్రా యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం విద్యార్థినులు. సరికొత్త ఆలోచనలతో నూతన ఆవిష్కరణలవైపు దూసుకెళుతున్నారు. తమ మేథథస్సుకు పదునుపెట్టి, సమాజానికి ఉపయోగకరమైన ప్రాజెక్టులను రూపొందిస్తున్నారు.ఇంటెలిజెచర్స్ అంటే... సులభమైన చేతి సంజ్ఞలతో బల్బులు, ఫ్యాన్లు వంటి విద్యుత్ పరికరాలను నియంత్రించగల గృహ ఆటోమేషన్ వ్యవస్థ. దీనికి వాయిస్ కమాండ్లు, స్విచ్ల అవసరం ఉండదు. మీడియా పైప్ ద్వారా సంజ్ఞలను గుర్తించి, ఆర్డుయినో, రిలే బోర్డు ద్వారా పరికరాలను నియంత్రిస్తుంది. ఎవరికి ఉపయోగం? ఈ వ్యవస్థ వల్ల ముఖ్యంగా వృద్ధులకు, కదలికల్లో ఇబ్బందులున్న వారికి ఉపయోగం. ఈ ప్రాజెక్టును ప్రదీప్తి, నవ్య, కృపారాణి, చందన కేవలం రూ.3వేల లోపే పూర్తి చేశారు. ఇవీ ప్రాజెక్టులు.. యూనివర్సిటీ మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ (ఏయూసీఈడబ్ల్యూ) కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన నాలుగో సంవత్సరం విద్యార్థులు ‘ఇంటెలిజెచర్స్...సోల్సైన్స్’ అనే రెండు కొత్త ప్రాజెక్టులను రూపొందించారు. ఏయూసీఈడబ్ల్యూ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆర్.పద్మశ్రీ ప్రోత్సాహంతో విభాగాధిపతులు డాక్టర్ బి.ప్రజ్ఞ, డాక్టర్ బి.ఎస్తేర్ సునంద మార్గదర్శకత్వంలో ఈ ప్రాజెక్టులను రూపొందించారు. సైగలతో నియంత్రణకు వినియోగించే పరికరం● ఏయూసీఈడబ్ల్యూ విద్యార్థినుల కొత్త ఆవిష్కరణలు మరిన్ని ప్రయోగాలవైపు అడుగులు ఆంధ్ర వర్సిటీ ఆచార్యుల తోడ్పాటు -
112 కిలోల గంజాయి స్వాధీనం
కూర్మన్నపాలెం: అగనంపూడి టోల్గేటు వద్ద సోమవారం రాత్రి దువ్వాడ పోలీసుల తనిఖీల్లో 112 కిలోల గంజాయి పట్టుబడింది. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సౌత్ ఏసీపీ టి.త్రినాథ్, దువ్వాడ సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలను వెల్లడించారు. మాడుగుల ప్రాంతం నుంచి బెంగళూరుకు తరలించడానికి ఆటోలో గంజాయి తీసుకొస్తుండగా.. ముందస్తు సమాచారం మేరకు అగనంపూడి టోల్గేటు వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ కేసులో కిముడు అనుమాన్, బురరిపాల్ దినకర్, ఒక బాలికను అరెస్ట్ చేశారు. ఆటో, బైక్, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా.. మాడుగులలో అఖిల్ అనే వ్యక్తి వద్ద ఈ గంజాయిని కొనుగోలు చేశారు. 100 ప్యాకెట్లుగా తయారు చేసి బెంగళూరుకు తరలించడానికి విశాఖ తీసుకొస్తున్నారు. ఒక వ్యక్తి బైక్పై పైలట్గా వస్తుండగా, వెనుక ఆటోలో గంజాయిని తీసుకువస్తున్న వారిని వల పన్ని పట్టుకున్నట్లు ఏసీపీ తెలిపారు. అఖిల్ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
అవును పవన్ సర్.. మీ కాన్వాయ్ కారణంగానే పరీక్షకు వెళ్లలేకపోయారు
విశాఖపట్నం, సాక్షి: తన కాన్వాయ్ కారణంగానే విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారని ఆరా తీసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు నగర పోలీసులు సైతం విద్యార్థులదే తప్పిదమన్నట్లు ప్రకటన ఇచ్చేశారు. అయితే పవన్ కాన్వాయ్ కారణంగానే విద్యార్థులకు ఆలస్యమైందని.. ఇందుకు ఆధారాలతో సహా పక్కగా జనసేన ఎమ్మెల్యే దొరికిపోయారు.జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అత్యుత్సాహం వల్లే 30 మంది ఎమ్మెల్యేలు పరీక్ష రాయలేకపోయారు. పవన్కు గజమాల స్వాగతం ఏర్పాటు చేసిన ఆయన.. సుమారు రెండు గంటలపాటు ట్రాఫిక్ను నిలిపివేయించారు. దీంతో సకాలంలో విద్యార్థులు చేరుకోలేకపోయారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సీసీ టీవీ ఫుటేజీల ద్వారా బయటపడింది. -
విశాఖలో విషాదం.. బాలుడి మృతిని దాచి పెట్టే ప్రయత్నంలో
విశాఖ,సాక్షి: విశాఖలో దారుణం జరిగింది. విశ్వనాధ్ స్పోర్ట్స్ క్లబ్ వాటర్ వరల్డ్లో బాలుడు మృతి చెందాడు. మృతి చెందిన బాలుడిని రిషి(7)గా పోలీసులు గుర్తించారు.విశ్వనాధ్ స్పోర్ట్స్ క్లబ్ వాటర్ వరల్డ్లో రిషి నీట మునిగి మృతి చెందాడు. దీంతో రిషిని విశ్వనాధ్ స్పోర్ట్స్ క్లబ్ సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా బైక్పై ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న బాలుడి తల్లిదండ్రులు సైతం ఆస్పత్రికి వచ్చారు.అయితే రిషి అప్పటికే మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్ట నిమిత్తం జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. విశ్వనాధ్ స్పోర్ట్స్ క్లబ్ వాటర్ వరల్డ్ యాజమాన్యం తీరుపై బాలుడు మృతిపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలుడి మృతిపై తమకు న్యాయం చేయాలని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
ఆంధ్రా సిగలో ‘అణు’ ఖ్యాతి
ఆంధ్రప్రదేశ్ కీర్తికిరీటంలో మరో కలికితురాయి. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా దూకుడు శ్రుతి మించుతున్న తరుణంలో డ్రాగన్ జోరుకు అడ్డుకట్ట వేయడానికి భారత్ నడుం బిగిస్తోంది. తూర్పు నౌకాదళ కేంద్రమైన విశాఖపట్టణానికి దక్షిణంగా సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రాంబిల్లి గ్రామం. అక్కడ మన అణు జలాంతర్గాములు, యుద్దనౌకల కోసం వచ్చే ఏడాది కల్లా నూతన నౌకా స్థావరాన్ని ఉపయోగంలోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పిస్తోంది. మరోవైపు కర్ణాటకలో కార్వార్ నౌకా స్థావరం విస్తరణ పనులు కూడా ఊపందుకున్నాయి.తద్వారా అటు తూర్పు తీరం, ఇటు పశ్చిమ తీరాల్లో ప్రాంతీయంగా పెరుగుతున్న భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కోవడానికి భారత్ సన్నద్ధమవుతోంది. దాడులు జరిపే అణు జలాంతర్గాములు (ఎస్ఎస్ఎన్), బాలిస్టిక్ క్షిపణులను మోసుకెళ్లే న్యూక్లియర్ సబ్మెరైన్లు (ఎస్ఎస్బీఎన్) సహా మన అణు జలాంతర్గాముల సంఖ్య క్రమేపీ పెరుగుతున్న నేపథ్యంలో వాటికి ఓ భద్రమైన నెలవు ఏర్పాటు చేసేందుకు ‘ప్రాజెక్టు వర్ష’లో భాగంగా అండర్ గ్రౌండ్ పెన్స్, సొరంగాల నెట్వర్క్ ఫీచర్లతో రాంబిల్లి స్థావరాన్ని అభివృద్ధి చేస్తున్నారు.బంగాళాఖాతంలో అణు జలాంతర్గాములు గస్తీ తదితర రహస్య కార్యకలాపాలను నిర్వహించేందుకు పై ఫీచర్స్ ఉపకరిస్తాయి. హైనన్ దీవిలో చైనా అణు జలాంతర్గాముల స్థావరం మాదిరిగా రాంబిల్లి నౌకా స్థావరం కూడా... ఉపగ్రహాల కంటపడకుండా జలాంతర్గాములు లోతైన జలాల్లో రాకపోకలు సాగించడానికి అనువుగా ఉంటుంది. బాలిస్టిక్ క్షిపణులను న్యూక్లియర్ సబ్మెరైన్లు గుట్టుగా మోసుకెళ్లడానికి ఇది తప్పనిసరి. 2014 నుంచి మొదలైన ‘ప్రాజెక్టు వర్ష’ తొలి దశ పూర్తి కావస్తోంది. ఇది 2026లో వినియోగంలోకి (కమిషన్) రావచ్చని భావిస్తున్నారు.ఇన్నర్ హార్బర్ ఇప్పటికే సిద్ధమైందని, ఔటర్ హార్బర్ పనులు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. ఏడు వేల టన్నుల అరిహంత్ క్లాస్ అణు జలాంతర్గామి (ఎస్ఎస్బీఎన్- షిప్, సబ్మెర్సిబుల్, బాలిస్టిక్, న్యూక్లియర్) ‘ఐఎన్ఎస్ అరిధమన్’ ఈ ఏడాది జలప్రవేశం చేయనుంది. తన ముందు అణు జలాంతర్గాములైన ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిఘాత్ కంటే ఐఎన్ఎస్ అరిధమన్ కొంచెం పెద్దది. ఇది మరిన్ని కె-4 మధ్య శ్రేణి అణు క్షిపణులను మోసుకెళ్లగలదు. ఈ క్షిపణులు 3,500 కిలోమీటర్ల రేంజిలోని లక్ష్యాలను ఛేదించగలవు. రూ.90 వేల కోట్ల అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెసల్ (ఏటీవీ) ప్రాజెక్టులో భాగంగా ఈ మూడు మాత్రమే కాకుండా నాలుగో ఎస్ఎస్బీఎన్ నిర్మాణం కూడా త్వరలో మొదలు కావచ్చని అంటున్నారు.-జమ్ముల శ్రీకాంత్(Source: The Times of India, Business Standard, idrw.org) -
ఆక్వా వాటర్ వరల్డ్లో మునిగి బాలుడి మృతి
సీతమ్మధార: పోర్టు స్డేడియంలోిని విశ్వనాథ్ ఆక్వావరల్డ్ వాటర్ పార్కు స్విమ్మింగ్ పూల్లో మునిగి బాలుడు మృతి చెందాడు. ఫోర్త్టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మురళీనగర్కు చెందిన గంగాధర్, కల్పన దంపతులు కుమారుడు రుషి (8) రెండో తరగతి చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం తల్లి కల్పన, మేనత్త పిల్లలతో కలిసి విశ్వనాఽథ్ పోర్టు స్డేడియంలోని ఆక్వావరల్డ్ పార్కులోకి ఆడుకునేందుకు వెళ్లారు. పెద్దలకు లోపలకు ప్రవేశం లేకపోవడంతో బయట ఉన్నారు. స్విమ్మింగ్పూల్లో ఆడుకుంటూ రుషి స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో రుషితోపాటు ఉన్న మేనత్త పిల్లలు కల్పనకు సమాచారమిచ్చారు. నిర్వాహకులు బాలుడ్ని ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించగా..అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్థారించారు. ఫోర్తుటౌన్ సీఐ ఎ.సత్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. అలరించిన భారత్, యూఎస్ దళాల విన్యాసాలు -
వినతులు పుల్ పరిష్కారం నిల్
● ప్రజా సమస్యల పరిష్కార వేదికకు భారీగా అర్జీలు ● పరిష్కారం అంతంత మాత్రం ● ప్రతివారం పెండింగ్ అర్జీలపై కలెక్టర్ దిశానిర్దేశం మహారాణిపేట: జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) సోమవారం భారీ సంఖ్యలో అర్జీలతో నిండిపోయింది. కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ స్వయంగా ఫిర్యాదుదారుల నుంచి వినతులు స్వీకరించి, వాటిని అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వర్మ కూడా పాల్గొన్నారు. కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను నేరుగా కలెక్టర్కు విన్నవించుకున్నారు. పింఛన్లు, భూ వివాదాలు, అక్రమ కట్టడాలు, విద్య, ఇతర వ్యక్తిగత సమస్యలపై వారు అర్జీలు సమర్పించారు. సోమవారం మొత్తం 447 వినతులు రావడం సమస్యల తీవ్రతను తెలియజేస్తోంది. ఇందులో రెవెన్యూ శాఖకు 235, పోలీసు శాఖకు 28, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)కు 107 అర్జీలు రాగా, ఇతర శాఖలకు సంబంధించి 77 వినతులు అందాయి. పీజీఆర్ఎస్ పై కలెక్టర్ సమీక్ష అంతకుముందు, కలెక్టర్ పీజీఆర్ఎస్ పై కలెక్టర్ హరేందిర ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. అధికారులు రోజూ కనీసం ఒక గంట సమయం శాఖాపరమైన సమీక్షకు కేటాయించి, వచ్చిన అర్జీలకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని సూచించారు. అధిక సంఖ్యలో అర్జీలు వస్తున్న శాఖల్లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసుకోవాలని ఆయన ఆదేశించారు. జిల్లాలోని వివిధ శాఖల్లో పెండింగ్లో ఉన్న అర్జీలపై సమీక్షించి, వాటిని త్వరగా పరిష్కరించేందుకు అధికారులకు పలు సూచనలు చేశారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల వివరాలు తెలుసుకుని, వాటి పరిష్కారానికి దిశా నిర్దేశం చేశారు. సమస్యలు విన్న అధికారులు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, జేసీ మయూర్ అశోక్, ఇతర అధికారులు ఫిర్యాదుదారుల సమస్యలను ఓపికగా విన్నారు. తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. అర్జీల పరిష్కారానికి నిర్దిష్ట సమయం నిర్దేశించాలని, జాప్యం జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
భూ సమస్యలపై నిశిత పరిశీలన అవసరం
విశాఖ సిటీ: ప్రజాదర్బార్కు వచ్చే భూ సంబంధిత సమస్యలపై నిశిత పరిశీలన అవసరమని, న్యాయబద్ధంగా ఉన్న వాటిని వెంటనే పరిష్కరించాలని వీఎంఆర్డీఏ చైర్పర్సన్ ఎంవీ ప్రణవ్గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ అధికారులను ఆదేశించారు. సోమవారం వీఎంఆర్డీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్కు 22 ఫిర్యాదులు వచ్చాయి. బాధితుల సమస్యలు స్వయంగా తెలుసుకొని ఆయా అంశాలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల నుంచి వస్తున్న వినతులను సాధ్యమైనంత వేగంగా పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఒక సమస్యపై ఫిర్యాదుదారుడు కార్యాలయం చుట్టూ తిరగకూడదని తేల్చి చెప్పారు. వినతుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చాలా కాలం క్రితం నాటి భూసేకరణకు సంబంధించిన ఫిర్యాదులు ప్రస్తుతం వస్తున్నాయని, వాటికి సంబంధించిన అన్ని అంశాలు లోతుగా పరిశీలించి పారదర్శకంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ కె.రమేష్, కార్యదర్శి మురళీకృష్ణ, ప్రధాన ఇంజనీర్ వినయ్ కుమార్, ఎస్టేట్ అధికారి దయానిధి, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
కెమెరామెన్ జీబ్రాతో ఆస్ట్రిచ్
చూడప్పా సిద్దప్పా ‘నేను సింహం లాంటోడిని...అది గడ్డం గీసుకోదు...నేను గడ్డం గీసుకుంటాను...మిగతాదంతా సేమ్ టు సేమ్’ అన్న మీ డైలాగ్ విని ఎంతో మురిసిపోయాం. మాపై మీకున్న ప్రేమకు ఫిదా అయ్యాం. మీ పంజా సినిమా టైటిల్ చూసి పులులంతా సంబరాలు చేసుకున్నాయి. సింహం పడుకుంది కదా అని చెప్పి జూలుతో జడ వేయకూడదురోయ్... అలాగే పులి పలకరించింది కదా అని పక్కన నిలబడి ఫొటో తీయించకూడదు రోయ్. అంటూ అత్తారింటికి దారేది చిత్రంలో చెప్పిన డైలాగ్కు జూలో చప్పట్ల మోత మోగించాం. మా గురించి మీ సినిమాల్లో వాడుకుని రికార్డులు సృష్టించిన మీరు డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి హోదాలో తొలిసారి జూకి వస్తున్నారు. చాలా సంతోషం..అయితే మీరొస్తున్నారని తెలిసి గుండెనిండా ఆవేదనతో సమస్యలు నివేదించడానికి సిద్ధంగా ఉన్నాం. జూలో ఉంటున్నాం కానీ తీరని ఆవేదన అనుభవిస్తున్నాం. మా వేదన తీరుస్తారని, మా కన్నీళ్లు తుడుస్తారని ఆశగా ఎదురుచూస్తున్నాం. మాట నిలుపుకుంటారా? సినిమా డైలాగ్స్తో సరిపెడతారో మీ చేతుల్లోనే ఉంది... సపర్యలు చేసేవారు లేక మానవ తప్పిదాల వల్ల మేము ఇక్కడ బందీలుగా బతుకుతున్నాం. కనీసం మాకు సరైన సపర్యలు చేసేవారు కూడా లేకపోతే ఎలా? కొందరు యానిమల్ కీపర్లు ఉన్నా, వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంతో మాకు సరైన సమయంలో ఆహారం పెట్టేవారు లేరు. మా ఆవాసాలను శుభ్రం చేసేవారు కరువయ్యారు. అనారోగ్యంతో బాధపడుతున్నా పట్టించుకునే నాథుడు లేడు. తోడు లేక ఒంటరిగా జీవిస్తున్నాం. మా భవిష్యత్తు ఏంటి నాయకా ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ జూ పార్కులో మా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి పరిస్థితులు కొనసాగితే మేము అంతరించిపోవడం ఖాయం. మా జాతులను కాపాడాల్సిన బాధ్యత మీపై లేదా? మమ్మల్ని ఈ దుర్భరమైన పరిస్థితుల నుంచి విముక్తి కలిగించే మార్గం లేదా? మృత్యువాత పడుతున్నా.. ఒక్కరే డాక్టర్ మాకు వైద్యం చేస్తున్నారు. ఆయన తరుచూ విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఇప్పుడు కూడా ఐదేళ్లు సెలవు పెట్టి అమెరికా పోయారు. ఇప్పుడు మమ్మల్ని ఇద్దరు అనుభవంలేని అవుట్సోర్సింగ్ వెటర్నరీ వైద్యుల చేతిలో పెట్టేశారు. రెండేళ్లుగా విదేశాల నుంచి తీసుకువచ్చిన అరుదైన మా సంతతి కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. మలేసియా, సింగపూర్ తదితర దేశాల నుంచి తీసుకువచ్చిన ఒక జత జిరాఫీలు, ఒక జీబ్రా మృతి చెందాయి. రెండు జిరాఫీ పిల్లలు మృత్యువాత పడ్డాయి. నెల క్రితం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ జూలో పుట్టిన రెండు సింహం పిల్లల్ని ఇక్కడ అనుభవం లేని యానిమల్ కీపర్లు, వెటర్నరీ వైద్యులు కలసికట్టుగా పొట్టన పెట్టుకొన్నారు. ఆవాసాలు నరకంగా ... ఒకప్పుడు విశాలమైన మా ఆవాసాలు నేడు సంకుచితంగా మారాయి. సరైన నిర్వహణ లేక అవి అపరిశుభ్రంగా తయారయ్యాయి. తాగడానికి స్వచ్ఛమైన నీరు లేదు. ఉండటానికి నీడ లేదు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ నరకయాతన అనుభవిస్తున్నాం. తోడు లేక దిగాలు ప్రస్తుతం ఇక్కడ మాకున్న సంఖ్య(850), మా ఎన్క్లోజర్లు సంఖ్య(80)ను బట్టి కనీసం 100కు పైగా పరి్మనెంట్ యానిమల్ కీపర్లు, ఆరుగురు పరి్మనెంట్ వెటర్నరీ వైద్యులు ఉంటే మేమంతా ఆరోగ్యంగా ఉండి జూకి వచ్చే సందర్శకులన హుషారుగా పలకరించగలం. మమ్మల్ని కాపాడడానికి జూలో పరి్మనెంట్ యానిమల్ కీపర్లు, పరి్మనెంట్ వెటర్నరీ వైద్యులను నియమిస్తే సంరక్షణ కలుగుతుందని మా నమ్మకం. 2011 నుంచి తోడుకోసం ఎదురు చూస్తున్న ఖడ్గ మృగం, రెండేళ్ల క్రితం జతగాడిని కోల్పోయిన చింపాంజీ, జీబ్రా, ఏడాదిన్నరగా ఒంటరిగా మిగిలిన ఆ్రస్టిచ్ తదితర మా జాతి జీవాలు తోడు కోసం ఎదురు చూస్తున్నాయి. -
అప్పన్న కల్యాణం చూతము రారండి
రాత్రి 8.15 నుంచి రథోత్సవం.. 10.30 నుంచి కల్యాణమహోత్సవం సింహాచలం: చైత్ర శుద్ధ ఏకాదశి పురస్కరించుకుని సింహగిరిపై వేంజేసిన శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణమహోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా జరగనుంది. సోమవారం రాత్రి నుంచే కల్యాణ వేడుకలు ప్రారంభమయ్యాయి. తొలుత ఆలయ నీలాద్రిగుమ్మం వద్ద అర్చకులంతా రుత్విగ్వరణం, ఉత్సవాంగీకారం జరిపి, చక్రపెరుమాళ్లను పల్లకీలో ఉంచి మాడవీధిలో తిరువీధి నిర్వహించారు. తదుపరి పుట్టబంగారు మండపంలో చక్రపెరుమాళ్లను వేంజేపచేశారు. పుట్టమన్ను ఉంచి మృత్సంగ్రహణాన్ని జరిపారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ పుట్టమన్నుని శిరస్సుపై పెట్టుకుని వేదమంత్రోశ్చరణలు, నాదస్వర వాయిద్యాల మద్య ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకెళ్లారు. తదుపరి కల్యాణమండపంలో ఏర్పాటుచేసిన పాలికల్లో పుట్టమన్నుని వేసి అంకురార్పణను విశేషంగా నిర్వహించారు. నేటి మధ్యాహ్నం నుంచి కల్యాణ ఘట్టాలు స్వామివారి కల్యాణోత్సవ ఘట్టాలను మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే కొట్నాలు ఉత్సవంతో ప్రారంభిస్తారు. సాయంత్రం 6.30 నుంచి ఎదురుసన్నాహోత్సవం జరుపుతారు. అనంతరం స్వామిని, అమ్మవార్లను రథంపై వేంజేపచేసి రాత్రి 8.15గంటల నుంచి సింహగిరి మాడ వీధుల్లో రథోత్సవాన్ని నిర్వహిస్తారు. 10.30 నుంచి ఆలయ ఉత్తరరాజగోపురం ఎదురుగా ఏర్పాటుచేసిన భారీ వేదికపై వార్షిక కల్యాణోత్సవం నిర్వహిస్తారు. రథోత్సవానికి సన్నద్ధం రథోత్సవానికి సంబంధించి సోమవారం రథాన్ని సిద్ధం చేశారు. తొలుత జాలారి పెద్ద, రథసారథి కదిరి లక్ష్మణరావు, దేవస్థానం వైదికులు రథానికి పూజలు నిర్వహించారు. అనంతంం ఎస్బీటీ గేటు దగ్గర నుంచి రాజగోపురం వద్దకు రథాన్ని తెచ్చారు. దర్శనాలపై ఆంక్షలు వార్షిక కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల వరకు మాత్రమే అప్పన్న మూలవిరాట్ దర్శనాలు లభిస్తాయి. తిరిగి రాత్రి 8.30 నుంచి 10 వరకు దర్శనాలకు అనుమతిస్తారు. కార్యక్రమాల్లో దేవస్థానం ఈవో కె.సుబ్బారావు దంపతులు, ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఇరగవరపు రమణాచార్యులు, పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు, ఈఈ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ త్రిమూర్తులు, మాజీ ట్రస్ట్బోర్డు సభ్యుడు గంట్ల శ్రీనుబాబు, పలువురు మత్స్యకారులు, భక్తులు పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో అవినీతి చేపలు
కంచరపాలెం: ఏసీబీ అధికారుల వలలో అవినీతి చేపలు చిక్కాయి. జ్ఞానాపురం జోన్–5 జీవీఎంసీ కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పబ్లిక్ హెల్త్ విభాగం జనన, మరణ ధ్రువీకరణ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్న ఉద్యోగి దండి సత్యసూర్య నాగపూర్ణ చంద్రశేఖర్, ఔట్సోర్సింగ్ సూపర్వైజర్ బరకాల వెంకటరమణలు రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ నాగేశ్వరరావు మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లా బలిజపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన భాను ప్రకాష్ తండ్రి మర్రిపాలెం రైల్వే ట్రాక్ వద్ద జనవరిలో మృతి చెందాడు. అతని మరణ ధ్రువీకరణ పత్రం కోసం జ్ఞానాపురం జోన్–5 పబ్లిక్ హెల్త్ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్న ఉద్యోగి చంద్రశేఖర్, ఔట్సోర్సింగ్ సూపర్వైజర్ వెంకటరమణలు రూ.40 వేలు డిమాండ్ చేశారు. చివరకు రూ.20వేలుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే బాధితుడు భానుప్రకాష్కు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకపోవడంతో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడని తెలిపారు. ఇద్దరు పొరుగు సేవల ఉద్యోగులు లంచం డబ్బులను బాధితుని వద్ద నుంచి తీసుకుంటుండగా జోనల్ కార్యాలయంలో అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. అవినీతి నిరోధక (సవరణ) చట్టం–2018 సెక్షన్ 7 కింద కేసు నమోదు చేసి మంగళవారం ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరుస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు లంచం ఇవ్వాలని వేధించినట్లయితే సంబంధిత ఏసీబీ అధికారులకు, టోల్ ఫ్రీ నంబర్ 1064 లేదా 9440440057కు తెలియజేయాలని ఆయన కోరారు. దాడుల్లో ఏలూరు రేంజ్ డీఎస్పీ రమ్య, ఇన్స్పెక్టర్లు కృష్ణకిషోర్, వెంకట్రావ్, లక్ష్మణరావు, శ్రీనివాసరావు, సుప్రియ పాల్గొన్నారు. రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జోన్–5 ఉద్యోగులు -
మరణించి.. ఐదుగురి జీవితాల్లో వెలుగునిచ్చి..
మహారాణిపేట: మరణించి కూడా ఆ యువకుడు ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపాడు. చేతికి అంది వస్తాడనుకున్న బిడ్డ బ్రెయిన్ డెడ్ అవడంతో పుట్టెడు దుఃఖంలో కూడా ఆ కుటుంబం వేరే కుటుంబాల్లో ఆనందం నింపేందుకు నిర్ణయించింది. వివరాలివి.. ఒడిశాలోని సోనాబేడలో ఉంటున్న ఆశిష్ చౌల్ సింగ్(22) ఈ నెల 2న బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు ఎంతగా ప్రయత్నించినా.. రోజురోజుకీ ఆరోగ్యం క్షీణించింది. దీంతో సోమవారం బ్రెయిన్ డెడ్గా వైద్య బృందం ప్రకటించింది. ఆ తర్వాత అవయవదానంపై వైద్య బృందం యువకుడి కుటుంబ సభ్యులు, బంధువులకు అవగాహన కల్పించడంతో వారు అంగీకారించారు. దీంతో విషయాన్ని జీవన్ దాన్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ కె.రాంబాబు దృష్టికి తీసుకెళ్లారు. యువకుడి నుంచి అవయవాలు సేకరించేందుకు ఆయన అనుమతులు జారీ చేశారు. దీంతో 2 కిడ్నీలు, లివర్, పాంక్రియాస్, స్మాల్ బౌల్ తీశారు. వాటిని జీవన్ దాన్ ప్రొటోకాల్ ప్రకారం సీనియార్టీ ఆధారంగా అర్హులకు కేటాయించారు. అవయవ దానంపై అవగాహన కల్పించిన వైద్య బృందానికి, అంగీకరించిన కుటుంబ సభ్యులను రాంబాబు అభినందించారు. -
సీనియార్టీ ప్రకారమే జాబితా
● ఏపీఈపీడీసీఎల్ లైన్మెన్పదోన్నతుల్లో తప్పుల దిద్దుబాటు ● పుట్టిన తేదీ ప్రకారం పదోన్నతుల జాబితాపై ‘సాక్షి’ కథనం ● సర్వీస్ను పరిగణనలోకి తీసుకోవాలని సీఎండీ ఆదేశాలు విశాఖ సిటీ: ఏపీఈపీడీసీఎల్లో లైన్మెన్ పదోన్నతుల జాబితా రూపకల్పనలో జరిగిన తప్పిదాల దిద్దుబాటుకు అధికారులు ఉపక్రమించారు. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పుట్టిన తేదీ ప్రకారం సీనియార్టీ జాబితాను సిద్ధం చేయడంపై ‘సాక్షి’ కథనంతో ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారించారు. సర్వీస్ను పరిగణనలోకి తీసుకుని సీనియార్టీ జాబితా సిద్ధం చేయాలని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ పంపిణీ సంస్థల్లో 1,354 జూనియన్ లైన్మెన్ పదోన్నతులు కల్పించాలని నిర్ణయించారు. ఇందుకోసం అధికారులు లైన్మెన్ సీనియార్టీ జాబితాను సిద్ధం చేశారు. సాధారణంగా సర్వీస్ను ఆధారంగా చేసుకొని సీనియార్టీని నిర్ణయిస్తారు. కానీ ఇక్కడ సిబ్బంది పుట్టిన తేదీ ఆధారంగా సీనియార్టీ జాబితాను రూపొందించారు. కొంత మంది 15, 20 ఏళ్లు సర్వీస్ ఉన్నప్పటికీ.. వయసులో చిన్నవారైతే జాబితాలో స్థానం కల్పించలేదు. అలాగే సర్వీస్ ఐదేళ్లే ఉన్నా.. పెద్ద వయస్సు అయితే వారికి జాబితాలో చోటిచ్చారు. దీనిపై కొందరు 2008లో హైకోర్టుకు వెళ్లగా సర్వీస్ ప్రకారం పదోన్నతులు కల్పించాలని తీర్పునిచ్చింది. అయినా కొందరు అధికారులు అందుకు విరుద్ధంగా లిస్టును తయారు చేశారు. దీనిపై సాక్షి ‘కోర్టు ఆదేశించినా.. సర్కారు కినుక’ శీర్షికను కథనం ప్రచురించింది. దీంతో ఈ విషయంపై ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ దృష్టి పెట్టారు. సర్వీస్ ప్రకారం సీనియార్టీ జాబితాను సర్కిళ్ల వారీగా రూపొందించాలని అధికారులకు తేల్చి చెప్పారు. దీనిపై సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా చిన్నంశెట్టి రాజు
పలువురు అదనపు జిల్లా న్యాయమూర్తులకు బదిలీ విశాఖ లీగల్: విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా మచిలీపట్నం ఒకటో అదనపు జిల్లా జడ్జి చిన్నంశెట్టి రాజు నియమితులయ్యారు. ప్రస్తుతం విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఆలపాటి గిరిధర్.. నగరంలోని వ్యాట్ ట్రిబ్యునల్ చైర్మన్గా బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పలువురు అదనపు జిల్లా జడ్జిలకు బదిలీ జరిగింది. విశాఖ పదో అదనపు జిల్లా జడ్జి ఎన్.శ్రీవిద్య కర్నూలు ఏసీబీ కోర్టు న్యాయమూర్తిగా వెళుతున్నారు. అమలాపురం రెండో అదనపు జిల్లా జడ్జి వి.నరేష్ విశాఖ జిల్లా పదో అదనపు జిల్లా జడ్జిగా బదిలీపై వస్తున్నారు. నగరంలోని వ్యాట్ ట్రిబునల్ చైర్మన్ జి.గోపి మచిలీపట్నం ఒకటో అదనపు జిల్లా జడ్జిగా బదిలీ అయ్యారు. రెండో అదనపు జిల్లా కుటుంబ న్యాయస్థానం న్యాయమూర్తి వి.వాణి ఏలూరు పోక్సో కోర్టు న్యాయమూర్తిగా బదిలీపై వెళుతున్నారు. విశాఖలోని 12వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి పి.గోవర్ధన్ కాకినాడలోని ఆరో అదనపు జిల్లా న్యాయమూర్తిగా బదిలీపై వెళుతున్నారు. నగరంలోని పోక్సో కేసుల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జి.ఆనంది కాకినాడ రెండో అదనపు జిల్లా న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో ఏలూరు పోక్సో కోర్టు న్యాయమూర్తి పి.మంగాకుమారి వస్తున్నారు. -
ఘనంగా జగదభిరాముని పట్టాభిషేకం
డాబాగార్డెన్స్: నగరంలోని అంబికాబాగ్ శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరాముడి పట్టాభిషేకం సోమవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ముందుగా లక్ష్మణ సమేత సీతారాముల ఉత్సవమూర్తులకు చక్రస్నానం చేశారు. పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించారు. వేదపండితులు ఎం.భీమశంకరశాస్త్రి, సీహెచ్ఎల్ఎన్ అవధానులు, కె.పంచముఖి శర్మ, అంబికాబాగ్ దేవాలయ అర్చకుడు పి.వి.బాలసుబ్రహ్మణ్యచార్యులు ఆధ్వర్యంలో పట్టాభిషేక ఘట్టాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. కార్యక్రమంలో ఈవో శోభారాణి, ఏఈవో తిరుమలేశ్వరరావు పాల్గొన్నారు. -
ఈ పాపం.. ఎవరిది పవన్?
పెందుర్తి: వారంతా తన కలను సాకారం చేసుకునేందుకు నిద్రాహారాలు మాని తపించారు. జీవిత లక్ష్యం నెరవేరే రోజు వచ్చింది.. కానీ ఎన్నో ఆశలతో పరీక్షకు సిద్ధమైన ఆ విద్యార్థులకు సోమవారం విశాఖలో డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ పర్యటన శాపంగా మారింది. ఉదయం నుంచే కూటమి నేతల కోలాహలం.. కఠినమైన ఆంక్షల కారణంగా ట్రాఫిక్లో చిక్కుకుని 23 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్ పరీక్షకు దూరమయ్యారు.పవన్కళ్యాణ్ కాన్వాయ్ కోసం ఎన్ఏడీ నుంచి పెందుర్తి వరకు వాహనాలను నిలిపివేయడంతో జేఈఈ మెయిన్ పరీక్ష రాసేందుకు వెళుతున్న విద్యార్థులంతా చిక్కుకుపోయారు. రెండు నిమిషాలు ఆలస్యం కావడంతో నిర్వాహకులు వారిని పరీక్షకు అనుమతించలేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే పవన్కళ్యాణ్ రాక సందర్భంగా ట్రాఫిక్ను ఆపలేదని.. బీఆర్టీఎస్ మధ్య రోడ్డులో ఆయన వెళ్లారని.. మిగిలిన సర్విస్ రోడ్లపై ఇతర వాహనాలు యథావిధిగా ముందుకు సాగాయని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.అసలేం జరిగింది..! అల్లూరి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో ఎన్ఏడీ కొత్త రోడ్డు నుంచి పెందుర్తి వరకు ఉదయం నుంచి పోలీసులు ట్రాఫిక్ను పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్నారు. పవన్ ప్రత్యేక విమానంలో ఉదయం 8.15 గంటలకు ఎయిర్పోర్టుకు చేరుకోగా 6.30 నుంచే ట్రాఫిక్ను నియంత్రిస్తూ వచ్చారు. పవన్ కాన్వాయ్కు కేటాయించిన బీఆర్టీఎస్ మధ్య రోడ్డులో ఇతర వాహనాలను పూర్తిగా నిలిపివేయగా.. ఎడమ, కుడి మార్గాల్లోనూ ఆంక్షలు విధించడంతో ట్రాఫిక్ మందకొడిగా సాగింది. ఈ రోడ్డులో 7.30 నుంచి ట్రాఫిక్ను పూర్తిగా నియంత్రించారు.దీంతో పరీక్షకు హాజరు కావాల్సిన విద్యార్థులు అందులో చిక్కుకుపోయారు. దాదాపు 2 గంటల పాటు ట్రాఫిక్ను కఠినంగా నియంత్రించడం.. జనసేన కార్యకర్తలు ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేయడంతో బీఆర్టీఎస్ సర్విస్ రోడ్డుపై రద్దీ పెరిగిపోయి విద్యార్థులు జేఈఈ పరీక్షకు ఆలస్యమైనట్లు స్పష్టమవుతోంది. మరోపక్క పవన్ ఎయిర్పోర్టులో ఉదయం 8.21 గంటలకు బయల్దేరగా వేపగుంట నుంచి పెందుర్తి మార్గంలో అన్ని వైపులా ఉదయం 8.10 గంటలకే ట్రాఫిక్ను నిలిపివేసేలా జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.దీనివల్ల పవన్వెళ్లే వరకు ఆ మార్గంలో వాహనాలు కదల్లేదు. దీంతో వేపగుంట నుంచి చినముషిడివాడ కేంద్రానికి కేవలం 10 నిమిషాల లోపు చేరుకోవాల్సిన విద్యార్థులు ఆలస్యమయ్యారు. మరోవైపు జనసేన పార్టీ నిబంధనల ప్రకారం గజమాలతో అధినేతను గానీ ఇతర నాయకులను గానీ సత్కరించడం నిషిధ్ధం. కానీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గజమాలతో పవన్ను (షెడ్యూల్ ప్రకారం పవన్కళ్యాణ్ ఎక్కడా ఆగే వీలు లేదు) సత్కరించేందుకే ఇంత హడావిడి చేసి విద్యార్థులు పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయేలా చేశారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.పవన్ వెళుతున్న రోడ్డులోనే ఉన్న చినముషిడివాడలోని అయాన్ డిజిటల్ కేంద్రంలో 1,350 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్ పరీక్షకు హజరవుతున్నారని తెలిసి కూడా అధికారులు దానిపై ప్రత్యేక దృష్టి సారించకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవన్కళ్యాణ్ పర్యటన కారణంగా ట్రాఫిక్ నిలిపివేయడంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. చినముషిడివాడ కేంద్రంలో జేఈఈ పరీక్షకు సగటున 50 నుంచి 70 మంది గైర్హాజరు అవుతున్నట్లు సీపీతో పాటు వెస్ట్ జోన్ ఏసీపీ పృధ్వితేజ పేర్కొన్నారు.అలా ఎలా సార్!!సాధారణంగా ఎన్ఏడీ కొత్త రోడ్డు నుంచి బీఆర్టీఎస్ మీదుగా చినముషిడివాడ చేరుకోవడానికి వాహనం / ట్రాఫిక్ పరిస్థితిని బట్టి 10 నుంచి 20 నిమిషాలు పడుతుంది. డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ కాన్వాయ్ చినముషిడివాడ అయాన్ డిజిటల్ కేంద్రాన్ని ఉదయం 8.41 గంటలకు (ఎయిర్పోర్టులో బయలుదేరిన సమయం ఉదయం 8.21 గంటలు అని చెబుతున్నారు) దాటిందని చెబుతున్నారు. ఒక వీవీఐపీ వస్తున్నారంటే కనీసం గంట ముందు నుంచే ఇటు పోలీసులు అటు పార్టీ అభిమానులు, నాయకుల హడావుడి ఉంటుంది. అంటే ఉదయం 7 నుంచే రోడ్లపై వారి హంగామా మొదలైంది.బీఆర్టీఎస్ మధ్య మార్గంలో ఇతర వాహనాలపై నిషేధం విధించడం.. వాటిని సర్విసు రోడ్డులోకి మళ్లించడం.. జనసేనతో పాటు ఇతర కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తల ఓవరాక్షన్ కారణంగా ట్రాఫిక్కు అంతరాయం కలిగిందని జేఈఈ పరీక్ష రాసే అవకాశం కోల్పోయిన విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే పోలీసులు తప్పుడు వివరణలు ఇవ్వడం విడ్డూరంగా ఉంది. ఎయిర్పోర్టు నుంచి చినముషిడివాడకు డిప్యూటీ సీఎం కాన్వాయ్ రావడానికి 20 నిమిషాల సుదీర్ఘ సమయం (వీవీఐపీల ప్రయాణ సమయం సుమారుగా 10 నిమిషాలు) పట్టడం మరో ఆశ్చర్యకరమైన విషయం.నా కల చెదిరింది..జేఈఈ రాసి ఉన్నతస్థాయిలో నిలవాలన్నది నా కల. దీని కోసం చాలా కష్టపడ్డా. మా ఇంటి (కంచరపాలెం) నుంచి చినముషిడివాడకు ఎంత ట్రాఫిక్ ఉన్నా 30–40 నిమిషాల్లో వెళ్లిపోవచ్చు. ఎన్ఏడీ కొత్త రోడ్డుకు వచ్చేసరికి చాలా ట్రాఫిక్ ఉంది. అక్కడి నుంచి చినముషిడివాడ చేరుకోవడానికి 45–50 నిమిషాలు పట్టింది. 2 నిమిషాల ఆలస్యంతో పరీక్ష రాసే అవకాశం కోల్పోయా. నా కల చెదిరిపోయింది. – బొడ్డు జశ్వంత్, జేఈఈ అభ్యర్థి, కంచరపాలెంవిచారణ చేపట్టండి: పవన్కళ్యాణ్సాక్షి, అమరావతి: పెందుర్తి ప్రాంతంలో జేఈఈకి కొందరు విద్యార్థులు హాజరుకాలేకపోవడానికి ఉప ముఖ్యమంత్రి కాన్వాయి కారణమని వచ్చిన వార్తా కథనాలను పరిగణనలోకి తీసుకుని వాస్తవాలపై విచారణ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ ఆదేశించారు. తన కాన్వాయి కోసం ఎంతసేపు ట్రాఫిక్ని ఆపేశారు, పరీక్ష కేంద్రం దగ్గరకు విద్యార్థులు చేరుకోవలసిన మార్గాల్లో ఆ సమయంలో ట్రాఫిక్ పరిస్థితి, సర్వీసు రోడ్లలో ట్రాఫిక్ను నియంత్రించారా? వంటి అంశాలపై విచారించాలని సూచించారు. రేయింబవళ్లు కష్టపడి.. జేఈఈ పరీక్ష కోసం మా అబ్బాయి రేయింబవళ్లు కష్టపడి చదివాడు. చినముషిడివాడ కేంద్రం వద్దకు వెళ్లేందుకు ఉదయం 6.30కే ఇంటి నుంచి బయలుదేరాం. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిపేయడంతో చిక్కుకుపోయాం. రెండు నిమిషాలు ఆలస్యం కావడంతో లోపలికి అనుమతించలేదు. మా అబ్బాయి మళ్లీ పరీక్ష రాసేలా పవన్కళ్యాణ్, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – సత్యవతి, కంచరపాలెం, విద్యార్థి తల్లిఏం చేయాలో.. మాది సాధారణ కుటుంబం. జేఈఈపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా. తుని నుంచి వేకువజామున బయలుదేరి వచ్చా. ఎన్ఏడీ వచ్చేసరికి వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పరీక్షా కేంద్రానికి మరో 10 నిమిషాల్లో చేరుకుంటాననగా ట్రాఫిక్ను ఆపేశారు. రెండు నిమిషాలు ఆలస్యం కావడంతో అనుమతించలేదు. ఇప్పుడు నా భవిష్యత్ ఏమిటో.. ఏం చేయాలో పాలుపోవడం లేదు. – ఆళ్ల హేమంత్, తునిమరో అవకాశం ఇవ్వాలి.. బాబు, పవన్ స్పందించాలి ముమ్మాటికి పవన్కళ్యాణ్ పర్యటన కారణంగా ట్రాఫిక్ జామ్ వల్లే మా పిల్లలు పరీక్షకు ఆలస్యం అయ్యారు. లేదంటే నిర్దేశిత సమయానికి చాలా ముందే కేంద్రానికి చేరుకునేవాళ్లు. పరీక్షకు అనుమతించకపోవడంతో పిల్లల భవిష్యత్ పాడవుతుంది. మంగళవారం వరకు పరీక్షలు ఉంటాయి కాబట్టి పిల్లలందరికీ మరో అవకాశం ఇవ్వాలి. దీనిపై పవన్, చంద్రబాబు ఉన్నత స్థాయిలో మాట్లాడాలి. – అనిల్, విద్యార్థి తండ్రిట్రాఫిక్ వల్లే.. ఎన్ఏడీ నుంచి ట్రాఫిక్లో ఇరుక్కుపోయా. చాలా దూరం ట్రాఫిక్ నిలిచిపోయింది. అయినా ఏదోలా కేంద్రానికి చేరుకున్నా రెండు నిమిషాలు ఆలస్యం అయ్యానని పరీక్షకు అనుమతించలేదు. కేవలం ట్రాఫిక్ వల్లే పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయా. – ఆర్యన్రాజ్ -
‘ఆదాయం లేకుండా జీడీపీ ఎలా పెరిగింది చంద్రబాబు?
విశాఖ: ఏపీ రాష్ట్ర వృద్ధిరేటు 8.2 శాతం ఉందని సీఎం చంద్రబాబు అబద్ధాలు చెప్పడం, దాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు కథనాలు రాయడంపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ రోజు(సోమవారం) మీడియా సమావేశంలో బొత్స మాట్లాడుతూ.. ‘ ప్రజలను మభ్య పెట్టే విధంగా వార్తలు రాయడం ఏమిటి?. వార్తలు రాయడంలో వాస్తవికత ఉండాలి. కూటమి పాలనలో రాష్ట్ర ఆదాయం 32 శాతం తగ్గింది. 10 నెలల కాలంలో లక్ష 40 వేల కోట్లకు పైగా అప్పు చేశారు. అప్పులు చేసిన రాష్ట్రానికి వృద్ధి రేటు ఎలా పెరుగుతుంది. ఆదాయం లేకుండా జీడీపీ ఎలా పెరుగుతుంది.తప్పుడు రాతలు వలన ప్రజలకు ఉపయోగం ఏమిటి?, నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా?, అధికారంలోకి రాకముందు సూపర్ సిక్స్ అన్నారు.. ఇప్పుడు సిక్స్ లేదు సెవెన్ లేదు.ప్రతి సారి చెవిలో పూలు పెడితే ఎవరు నమ్ముతారు. చెత్త పన్ను తీయడం కాదు. వీధుల్లో టన్నుల్లో ఉన్న చెత్త తీయంచాలి. వచ్చిన ప్రతి పేదవాడికి వైద్యం అందించాలి. ఆరోగ్యశ్రీకి నిధులు ఇవ్వలేని రాష్ట్రం వృద్ధిరేటులో రెండో స్థానంలో ఉందట. ప్రతి పేదవాడికి వైద్యం అందించాలన్నది వైఎస్సార్సీపీ విధానం. జగన్ పాలనలో 2.78 కోట్లు ప్రజలకు ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్తలు జిల్లా పేపర్ లో వేస్తున్నారు.చంద్రబాబు తప్పుడు వార్తలను మెయిన్ పేజీలో వేస్తున్నారు. డిప్యూటీ సీఎంపై వివక్ష ఎందుకు చంద్రబాబు? అని ప్రశ్నించారు. -
ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తానన్న పవన్ ఎక్కడ?
విశాఖ,సాక్షి: మధురవాడ ప్రేమోన్మాది కేసులో బాధితులను చూస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? అన్న అనుమానం కలుగుతుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణీ అన్నారు. విశాఖ మధురవాడ స్వయంకృషినగర్లో ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలి వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించారు.అనంతరం,ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడారు. మధురవాడ ప్రేమోన్మాది కేసులో బాధితులనీ చూస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. నిందితుడుకి ఉరి శిక్ష వేయాలని ఒక మహిళ గా డిమాండ్ చేస్తున్నా.కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు. మహిళల్ని రక్షించడంలో ప్రభుత్వం కూడా విఫలమైంది. అఘాయిత్యాలు జరిగితే డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి నెలకొంది. హోంమంత్రి అనిత ఎక్కడున్నారు. రుషికొండ కోసం గంటలు క్యాబినెట్లో సమీక్షలు చేస్తారు. ఆడపిల్లల మాన, ప్రాణాల రక్షణ కోసం చర్చించే సమయం లేదా. ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తాం అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఇక్కడే పర్యటిస్తున్న ఇటువైపు ఎందుకు చూడలేదు.100రోజుల్లో గంజాయి నిర్మూలన అన్నారు. గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది. బాధితురాలికి వైఎస్సార్సీపీ ఆర్థిక సహాయం అందిస్తుంది. బాధితురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం’ అని అన్నారు. -
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
విశాఖ జిల్లా,సాక్షి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కారణంగా జేఈఈ మెయిన్స్ పరీక్షలను విద్యార్థులు రాయలేకపోయారు. పెందుర్తి అయాన్ డిజిటల్ జేఈ విద్యార్థులకు పవన్ కాన్వాయ్ అడ్డుగా వచ్చింది. దీంతో పరీక్షా కేంద్రానికి విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వెళ్లారు. పరీక్ష రాయకుండానే ముప్పై మంది విద్యార్థులు వెనుదిరిగారు. పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.పెందుర్తిలో జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ ఉదయం 8.30 జరగనుండగా.. పవన్ కాన్వాయ్ కారణంగా పరీక్షా కేంద్రానికి 8.32కి వచ్చారు. ఆ రెండు నిమిషాలు కూడా పవన్ వస్తున్నారని పోలీస్ అధికారులు ట్రాఫిక్ నిలిపివేశారని, లేదంటే పరీక్షా కేంద్రానికి సమయానికి చేరుకునే వారమని విద్యార్థులు మీడియాకు తెలిపారు.పవన్ కళ్యాణ్ వస్తున్న మార్గంలోనే ఎగ్జామ్ సెంటర్ ఉంది. పవన్ వస్తున్నారనే కారణంతో ప్రొటోకాల్ దృష్ట్యా పోలీసులు ట్రాఫిక్ నిలిపివేశారు. కాబట్టే రెండు నిమిషాల ఆలస్యంతో పరీక్షా కేంద్రానికి వచ్చామని, ఆలస్యమైందని అధికారులు తమని పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వలేదని విలపిస్తున్నారు. ఈ విషయంలో పవన్ జోక్యం చేసుకుని ఆ 30 మంది విద్యార్థులకు జేఈఈ మెయిన్స్ పరీక్ష నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. -
యూఎస్.. డబుల్ ఇస్మార్ట్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: శత్రువు కనిపిస్తే చాలు.. తేరుకునేలోగా మెరుపుదాడి చేసే వార్షిప్ ఒకటైతే.. దొంగచాటుగా దెబ్బతీయాలనుకున్న వారిపై దాడి చేసి మట్టుబెట్టే యుద్ధ నౌక ఇంకోటి. వైరి దేశాలపై బరిలో దిగితే వార్ వన్సైడ్ అని డిసైడ్ చేసే అగ్రరాజ్యం అమెరికాకు చెందిన రెండు యుద్ధ నౌకలు వైజాగ్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ వద్ద మోహరించాయి. కదన రంగంలో ఎంతటి భయంకరంగా శత్రువును భయపెడతాయో.. విపత్తుల సమయంలో సహాయ సహకారాలు అందించడంలోనూ అంతే గంభీరంగా వ్యవహరిస్తాయి ఈ వార్షిప్స్.వీటిలో ఒకటి అమెరికా నౌకాదళంలో తొలిసారిగా పురుషులు, మహిళా నావికులతో కూడిన యుద్ధ నౌక యూఎస్ఎస్ కామ్స్టాక్ (ఎల్ఎస్డీ–45) కాగా.. మరోటి మెరుపు వేగంతో దాడి చేసి మృత్యువును పరిచయం చేసే (స్విఫ్ట్ సైలెంట్ డెడ్లీ) యుద్ధనౌకగా పేరున్న యూఎస్ఎస్ రాల్ఫ్ జాన్సన్ (డీడీజీ–114). ఒక యుద్ధ నౌకలో రాత్రిళ్లు కూడా గ్రెనేడ్లతో దాడి చేసేఅవకాశం ఉన్న లాంచర్లు.. ఏకంగా 8,200 అడుగుల దూరంలోని శత్రువును కూడా మట్టుబెట్టగలిగే సామర్థ్యం ఉన్న రైఫిల్ ఉన్నాయి. మరోదానికి శత్రువుపై 2 సీ హాక్ హెలికాప్టర్ల ద్వారా దాడి చేసే సామర్థ్యం ఉంది. చాటుగా దెబ్బతీసేందుకు శత్రు దేశాలు అమర్చిన మైన్లను గుర్తించి నాశనం చేసే సాంకేతిక పరిజ్ఞానమూ ఉంది. ఇవి భారత్–అమెరికా దేశాల త్రివిధ దళాలతో టైగర్ ట్రయాంఫ్–25 నాలుగో ఎడిషన్ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. ఈ నౌకల విశేషాలను యూఎస్ఎస్ రాల్ఫ్ జాన్సన్ కమాండింగ్ ఆఫీసర్ జాక్ సీజర్, కామ్స్టాక్ కమాండింగ్ ఆఫీసర్ బి.స్టాక్స్ వివరించారు. యూఎస్ఎస్ కామ్స్టాక్ (ఎల్ఎస్డీ–45)» జల ప్రవేశం – 1990, ఫిబ్రవరి 3 »తరగతి, రకం – విడ్బీ ఐల్యాండ్–క్లాస్ డాక్ ల్యాండింగ్ షిప్ » బరువు – 16,190 టన్నులు » పొడవు – 609 అడుగులు(186 మీటర్లు) » వెడల్పు – 84 అడుగులు (26 మీటర్లు) »వేగం – 20 నాట్స్ (37 కిమీ/గం) » సిబ్బంది సామర్థ్యం– 450 ఆయుధ సామర్థ్యం 2‘‘25 ఎంఎం, ఎంకే 38 కెనాన్స్, 2‘‘20 ఎంఎం ఫాలాన్కస్ సీఐడబ్ల్యూస్ మౌంట్స్, 6‘‘50 కాలిబర్ ఎంఈహెచ్బీ మెషిన్ గన్స్, 2 రామ్స్ » యూఎస్ఎస్ కామ్స్టాక్ యూఎస్ నేవీలో ఒక డాక్ ల్యాండింగ్షిప్ » జలమార్గంలో నిర్దేశిత ప్రాంతాలకు రక్షణ దళాలు, యుద్ధ సామగ్రి తరలింపులో కీలక పాత్ర పోషిస్తోంది. » ఉభయచర కార్యకలాపాల సమయంలో శత్రువులపై గగనతలం నుంచి విరుచుకుపడేందుకు వీలుగా ఈ నౌకపై హెలికాప్టర్ లాంచింగ్ సౌకర్యముంది. » ఈ నౌకలో నాలుగు ఎయిర్క్రాఫ్ట్ ల్యాండింగ్ సదుపాయాలతో పాటు మూడు రకాల మెషిన్ గన్లు, రెండు రోలింగ్ ఎయిర్ఫ్రేమ్ మిస్సైల్స్ మౌంట్స్ ఉన్నాయి. » పూర్తి స్థాయిలో వైద్య సౌకర్యాలతో పాటు అధునాతన సాంకేతికతతో ఈ నౌక యుద్ధ సమయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. » 1992లో సోమాలియాలో ‘ఆపరేషన్ రిస్టోర్ హోప్’ పేరుతో ఐక్యరాజ్య సమితి చేపట్టిన సహాయ కార్యక్రమంలో పాలుపంచుకుంది. యూఎస్ఎస్ రాల్ఫ్ జాన్సన్ (డీడీజీ–114)» జల ప్రవేశం: 2018, మార్చి 24 » తరగతి, రకం: ఆర్లీగ్ బర్కీ–క్లాస్ డిస్ట్రాయర్ » బరువు–9217 టన్నులు » పొడవు– 513 అడుగులు (156 మీటర్లు) » వెడల్పు– 66 అడుగులు (20 మీటర్లు) » వేగం– 30 నాట్స్ (56 కిమీ/గం) » సిబ్బంది సామర్థ్యం– 300 ఆయుధ సామర్థ్యం » 8 రకాల లైట్, మెషిన్, కాలిబర్ గన్నులు ఉన్నాయి. » ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించేందుకు 96 సెల్స్తో క్షిపణులు, నాలుగు రకాల టార్పిడోలు, 2 సీహాక్ హెలికాప్టర్లు, డబుల్ హ్యాంగర్, హెలీప్యాడ్ సౌకర్యాలు ఉన్నాయి. » యూఎస్ఎస్ రాల్ఫ్ జాన్సన్ నౌక యుద్ధ క్షేత్రంలో 9 రకాల పోరాట వ్యవస్థలను కలిగి ఉంది. » ఈ నౌకను అమెరికా 7వ నౌకాదళానికి చెందిన డిస్ట్రాయర్ స్క్వాడ్రన్ 15కు కేటాయించారు. » ఇందులో సమీకృత వాయు, క్షిపణి రక్షణ వ్యవస్థ (ఐఎంఎండీ)తో పాటు బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. » వెర్టికల్ లాంచింగ్ సిస్టం ద్వారా 96 సెల్స్ నుంచి క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం దీని సొంతం. » అంతర్జాతీయ జలాల్లో యూఎస్ నౌకాదళ శక్తి సామర్థ్యాలు చాటిచెప్పేలా కార్యకలాపాలను కొనసాగిస్తోంది. » దాడి కోసం శత్రుదేశాలు వ్యూహాత్మకంగా మోహరించిన మైన్లను కనుగొని నాశనం చేసే సాంకేతిక పరిజ్ఞానం ఈ యుద్ధ నౌక సొంతం. » ఏ మాత్రం రాజీలేని, వెనుదిరగని యుద్ధ నౌకగా దీనికి పేరుంది. ఎం–320 గ్రెనైడ్ లాంచర్ యూఎస్ఎస్ కామ్స్టాక్ (ఎల్ఎస్డీ–45) యుద్ధ నౌకలో ఉండే ఎం–320 గ్రెనైడ్ లాంచర్ అన్ని సమయాల్లో శత్రువులపై గ్రెనైడ్లతో దాడికి ఉపయోగిస్తారు. పగటి వేళలోనే కాక తక్కువ కాంతి ఉన్న సమయాలు, రాత్రిళ్లు కూడా ఇది గ్రెనైడ్లతో దాడి చేస్తుంది. ఏకంగా 36.. 40 ఎంఎం గ్రెనైడ్లను ఈ లాంచర్తో తీసుకెళ్లే వీలుంది. ప్రధానంగా రాత్రిళ్లు శత్రువులపై దాడికి దీనిని ఉపయోగిస్తారు. కార్ల్ గుస్తఫ్ రైఫిల్ యూఎస్ఎస్ కామ్స్టాక్ (ఎల్ఎస్డీ–45) యుద్ధ నౌకలో ఉన్న మరో ముఖ్య ఆయుధం. స్వీడన్ తయారుచేసిన ఈ రైఫిల్ను పట్టుకునేందుకు రెండు గ్రిప్ పాయింట్లు ఉన్నాయి. కదులుతున్న వాహనం నుంచి 350–400 మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించవచ్చు. నిలబడిన సమయంలో మాత్రం 500 మీటర్ల దూరంలోని లక్ష్యంపై కూడా దాడి చేసే వీలుంటుంది. 8,200 అడుగుల దూరంలోని శత్రువుపై కూడా ఈ రైఫిల్లో లేజర్ గైడెడ్ మందుగుండును ఉపయోగించి మట్టుబెట్టొచ్చు. ఒకే వ్యక్తి ఉపయోగించేందుకు వీలుగా కూడా తయారుచేశారు. ఫైర్ చేసే సమయంలో భుజంపై వెనక్కి తన్నే ఒత్తిడి తక్కువగా ఉండడం దీని ప్రత్యేకత. -
ఆన్లైన్ పేమెంట్స్లో.. అతివల హవా!
సాక్షి, విశాఖపట్నం: ప్రస్తుతం దేశంలో డిజిటల్ పేమెంట్స్ అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. చిన్నచిన్న చెల్లింపులకు సైతం ఫోన్ ద్వారానే చెల్లించేస్తున్నారు. ఈ విషయంలో భారత్ ఎంతో పురోగతి సాధిస్తోంది. పెద్ద దేశాలైన అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్లు 2022 డిసెంబరులో చేసిన డిజిటల్ పేమెంట్స్ మొత్తాన్ని కూడినా.. భారత్ చేసిన డిజిటల్ పేమెంట్స్ను అందుకోలేకపోయాయి. ఈ క్రమంలో మన దేశంలో అతివలూ సాంకేతికంగా ఎంతో అప్డేట్ అయ్యారు. డిజీ చెల్లింపుల్లో తామేమీ తీసిపోలేదని నిరూపిస్తున్నారు.నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అందుబాటులోకి తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సౌకర్యంతో ఈ సేవలు మరింత సులభమైపోవడమే ఇందుకు కారణం. దీంతో.. చిల్లర కొట్టు, షాపింగ్, బ్యూటీ పార్లర్, కిరాణా సామాన్లు.. ఇలా ఎక్కడికెళ్లినా వారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తూ డబ్బు చెల్లింపులు చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఏటా దేశంలో డిజిటల్ చెల్లింపులు 200 మిలియన్ డాలర్లు దాటుతున్నాయంటూ క్రిసిల్ ఇటీవల తన నివేదికలో వెల్లడించింది. ఇందులో మహిళల వాటా తక్కువేమీ కాదు. ఈ విషయంలో ఏటా వీరి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మరోవైపు.. బ్యాంకింగ్ సేవల వినియోగంలోనూ మహిళలే మహరాణులంటూ భారతీయ రిజర్వ్ బ్యాంకు చెబుతోంది. నిజానికి.. డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ఎప్పటికప్పుడు కొత్త వృద్ధి రేటుని నమోదు చేస్తోంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.8,839 కోట్లు డిజిటల్ చెల్లింపులు దేశంలో జరగ్గా.. 2023–24లో 111.9 శాతం పెరిగి అది రూ.18,737 కోట్లకు చేరుకుంది. ఇదే సమయంలో డిజిటల్ చెల్లింపులు వినియోగిస్తున్న వారిలో మహిళల సంఖ్య కూడా గణనీయంగా పెరగడం గమనార్హం. క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (క్రిసిల్) ఇటీవల విడుదల చేసిన నివేదికలో డిజీ చెల్లింపుల్లో ఆడ, మగ మధ్య ఉన్న అంతరం వేగంగా తగ్గుతూ వస్తోందని వెల్లడించింది.ఏడేళ్లలో చెల్లింపులు రెట్టింపు.. 2014 నాటికి మహిళల డిజిటల్ చెల్లింపులు కేవలం 14 శాతం మాత్రమే ఉండేవి. కానీ, 2021 నాటికి 200 శాతం పెరిగి 28 శాతానికి చేరుకున్నట్లు క్రిసిల్ వెల్లడించింది. 2023 నాటికి అది 37 శాతానికి పెరిగింది. ఇక పురుషుల విషయానికి వస్తే.. 2014లో 30 శాతం వరకూ ఉండగా.. 2021 నాటికి 41 శాతానికి, 2023 నాటికి 52 శాతానికి పెరిగింది. సాంకేతికతపై పెరుగుతున్న అవగాహనే దీనికి ప్రధాన కారణమని క్రిసిల్ ఆ నివేదికలో అభిప్రాయపడింది.వ్యాపారంలోనూ డీజీ సేవలే.. మహిళలు స్వయం ఉపాధితో పాటు కుటీర పరిశ్రమలు, చిన్నచిన్న దుకాణాలు నడుపుతున్నారు. వీరు కూడా అత్యధిక శాతం మంది డిజిటల్ పేమెంట్స్ సేవలు తమ వ్యాపారాల్లోకి తీసుకొచ్చారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో 11.08 మిలియన్ యూఎస్ డాలర్ల యూపీఐ చెల్లింపులు భారత్లో జరగ్గా.. 2022–23లో ఏకంగా 1.01 బిలియన్ యూఎస్ డాలర్లకు చేరుకుంది.విభిన్న వ్యాపార వినియోగంలో మహిళలు 22 శాతం మంది యూపీఐ వినియోగిస్తుండగా.. పురుషులు 40 శాతం లావాదేవీలు సాగిస్తున్నారు. సొంత వ్యాపారంలో 55 శాతం మంది పురుషులు యూపీఐ వాడుతుండగా.. మహిళలు 36 శాతం వినియోగిస్తున్నారు. స్మార్ట్ఫోన్ వినియోగంలోనూ మహిళలు, పురుషుల మధ్య అంతరం చాలావరకూ తగ్గింది. సొంత అవసరాల కోసం 79% మంది పురుషులు స్మార్ట్ఫోన్ వినియోగిస్తుండగా.. మహిళలు 75% వాడుతున్నారు.ఏటా 20 కోట్ల మంది డిజీ పేమెంట్స్.. ఇక దేశంలో 15 ఏళ్లు పైబడిన వారు 53.60 కోట్ల మంది మహిళలుండగా.. వీరిలో 37 శాతం మంది మొబైల్లో ఇంటర్నెట్ని వివిధ అవసరాల కోసం వినియోగిస్తున్నారు. అలాగే, 20 కోట్ల మందికి పైగా మహిళలు ఏటా యూపీఐ లావాదేవీల్లో భాగమవుతున్నారు. ఇందులో 7.4 కోట్ల మంది మహిళలు ఉపాధి రంగంలో ఉండగా.. 12.6 కోట్ల మంది ఇతర రంగాల్లో ఉన్నారని క్రిసిల్ నివేదిక చెబుతోంది. స్వయం ఉపాధి రంగంలో ఉంటూ డిజీ చెల్లింపులు వాడుతున్న వారు 4.8 కోట్ల మంది కాగా.. వేతనం మీద ఆధారపడిన మహిళలు 1.1 కోట్ల మంది, ఇతర ఉపాధిలో ఉన్నవారు 1.5 కోట్ల మంది యూపీఐ చెల్లింపులు చేస్తున్నారు.బ్యాంకింగ్ సేవల్లోనూ అదే జోరు.. కేవలం డిజిటల్ లావాదేవీల విషయంలోనే కాకుండా.. బ్యాంకింగ్ సేవల వినియోగంలోనూ మహిళలు వృద్ధి సాధిస్తున్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఆర్థిక సూచీ ప్రకారం.. 2017లో బ్యాంకింగ్ సేవలు వినియోగించుకుంటున్న మహిళలు 43.4 శాతం ఉండగా.. 2024 మార్చి నాటికి 64.2 శాతానికి పెరిగినట్లు ఆర్బీఐ వెల్లడించింది. దీనికి కారణం ప్రధానమంత్రి జనధన్ యోజన (పీఎంజేడీవై) బ్యాంకు ఖాతాలేనని ఆర్బీఐ స్పష్టంచేసింది. పీఎంజేడీవై కింద ఇప్పటివరకూ 53.13 కోట్ల ఖాతాలుండగా.. వీటిలో సింహభాగం అంటే 29.56 కోట్ల ఖాతాలు మహిళల పేరుతో ఉండడం కొసమెరుపు. -
వడదెబ్బ.. జాగ్రత్త
మహారాణిపేట: జిల్లాలో భానుడి భగభగలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. వడగాడ్పుల తాకిడి కూడా పెరుగుతోంది. దీంతో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్ ఆదేశాలతో వైద్య ఆరోగ్యశాఖ, కేజీహెచ్ వైద్యులు అప్రమత్తమయ్యారు. కేజీహెచ్తోపాటు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రా(పీహెచ్సీ)లు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రా(యూపీహెచ్సీ)ల్లో ప్రత్యేక పడకలు సిద్ధం చేశారు. డీఎంహెచ్వో డాక్టర్ పి.జగదీశ్వరరావు పర్యవేక్షణలో వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. జీవీఎంసీ, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ, కార్మికశాఖ, డీఆర్డీఏ, డూమా తదితర శాఖల్ని తమ పరిధిలో వడదెబ్బ బాధితులకు సత్వర వైద్య సేవలు అందించేలా సన్నద్ధం చేశారు. వడదెబ్బ అంటే.. బయట ఉష్ణోగ్రతలు పెరిగితే.. శరీరంపై ఒత్తిడి పెరిగి రక్తనాళాలు ఎక్కువగా తెరుచుకుంటాయి. దీంతో బీపీ తగ్గుతుంది. గుండైపె ఒత్తిడితోపాటు, వేగం పెరుగుతుంది. చెమట ఎక్కువగా పట్టి శరీరం నుంచి ద్రవాలు లవణాలు బయటకు పోతాయి. శరీర సమతుల్యత దెబ్బతింటుంది. దీంతో బీపీ బాగా పడిపోయి వడదెబ్బకు గురవుతాం. వడదెబ్బ తగిలితే ఏం చేయాలి? తొలుత వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే నీడలోకి లేదా చల్లని ప్రదేశానికి తరలించాలి. పడుకోబెట్టి కాళ్లు కాస్త పైకి ఉండేలా చూడాలి. నీరు, చల్లని పానీయాలు తాగించాలి. శరీరాన్ని చల్లబరిచేందుకు తడివస్త్రంతో పదేపదే తుడవాలి. శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు మెడ కింద, చంకల్లో ఐసు ముక్కలు పెడితే మంచిది. వడదెబ్బ తగిలిన వ్యక్తులు అరగంటలోపు తేరుకుని, కూర్చోగలిగితే ప్రమాదం తప్పినట్లే. లేకుంటే అలాంటి వ్యక్తులకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. ముందు జాగ్రత్తలే మేలు వడదెబ్బకు గురయ్యాక చికిత్స పొందేకంటే.. చిన్నచిన్న ముందు జాగ్రత్తలే మేలని వైద్యులు చెప్తున్నారు. సాధ్యమైనంత వరకు నీడ పట్టునే ఉండాలి. బయటకు వెళ్లడం తప్పనిసరైనపుడు గొడుగు, స్కార్ఫ్, వాటర్ బాటిల్ తదితర ఏర్పాట్లు తప్పనిసరి. సాధ్యమైనంత వరకు వదులుగా ఉంటే కాటన్ దుస్తులు ధరించడం మేలు. వేసవిలో కొన్ని అలవాట్లను కూడా మార్చుకోవాలి. బాగా నీరు, ఉప్పు కలిపిన మజ్జిగ తదితర పానీయాలు సేవించాలి. పాలు, టీ, కాఫీ తాగొచ్చు కానీ.. ఆల్కహాల్ బాగా తగ్గించాలి. మద్యం శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. మాంసాహారం, ఫాస్ట్ ఫుడ్కు దూరంగా ఉంటే మంచిది. జిల్లాలో ముందస్తు చర్యలు కేజీహెచ్లో ప్రత్యేక పడకలు యూపీహెచ్సీల్లో రెండేసి బెడ్లు ప్రజలకు వైద్యుల ప్రత్యేక సూచనలు కేజీహెచ్లో ప్రత్యేక వార్డు కేజీహెచ్తోపాటు అన్ని పీహెచ్సీలు, యూపీహెచ్సీల్లో వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేక పడకలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి పీహెచ్సీ, యూపీహెచ్సీలో రెండేసి పడకలు సిద్ధం చేశారు. కేజీహెచ్లో సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద్ పర్యవేక్షణలో వడదెబ్బకు గురైన వారికి ఏసీ సౌకర్యంతో నాలుగు పడకలున్న ప్రత్యేక వార్డును సిద్ధం చేశారు. ఆస్పత్రిలో చేరే బాధితులకు అవసరమైన ఫ్లూయిడ్స్, మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. వడదెబ్బ లక్షణాలు మగత నిద్ర, మూర్చ, ఫిట్స్, కలవరింతలు, కండరాలు తిమ్మిరెక్కడం, తలనొప్పి, విపరీతమైన చెమట, అలసట, నీరసం ఎక్కువగా ఉంటాయి. వడదెబ్బ తగిలిన వారికి ఒక్కోసారి చెమటలు పట్టకపోవచ్చు. శరీరం మరీ వేడెక్కితే ఈ పరిస్థితి వస్తుంది. అలాంటపుడే మూర్చ లేదా స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది.