breaking news
Visakhapatnam
-
‘అందుకే 30 ఏళ్లలో 58సార్లు సింగపూర్కు చంద్రబాబు’
చంద్రబాబు సింగపూర్ పర్యటనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు. అక్కడికి వెళ్లి సాధించింది ఏంటో కూడా చెప్పుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని అమర్నాథ్ అన్నారాయన. శనివారం ఉదయం విశాఖపట్నంలో అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. సాక్షి, విశాఖపట్నం: ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు. అక్కడికి వెళ్లి సాధించింది ఏంటో కూడా చెప్పుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని అన్నారాయన. శనివారం అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు 30 ఏళ్లలో 58 సార్లు సింగపూర్కు వెళ్లారు. అక్రమంగా సంపాదించిందంతా దాచుకోవడానికి ఆయన అక్కడికి వెళ్తున్నారు. అందుకే ఆయన అక్కడికి వెళ్లి సాధించింది ఏమిటో చెప్పుకోలేకపోతున్నారు.... ఈ 15 నెలల్లో కూటమి ప్రభుత్వం సాధించింది ఏమిటి?. సాధించింది ఏమీ లేకే వైఎస్ జగన్పై విమర్శలు చేస్తున్నారు. అదానీ డేటా సెంటర్ గురించి చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ అది ఏర్పాటైంది వైఎస్సార్సీపీ హయాం. సముద్ర జలాలు ఉపయోగించుకోవాలని చంద్రబాబు, లోకేష్లకు ఎప్పుడైనా అనిపించిందా?. లోకేష్ చెబుతున్న బ్లూ ఎకానమీకి అంకురార్పణ జరిగింది కూడా వైఎస్సార్సీపీ హయాంలోనే. కేవలం ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ ప్రధానమైన మూడు పోర్టులను పూర్తి చేశారు.... భూములను ఉద్యోగాలు కల్పించే నాణ్యమైన కంపెనీలకు అప్పగిస్తే ఫర్వాలేదు. కానీ, విశాఖలో విలువైన భూములను రియల్ ఎస్టేట్ కంపెనీలకు కట్టబెట్టారు. 99 పైసల చొప్పున.. రూ.1,350 కోట్ల విలువైన భూమిని అప్పన్నంగా అప్పగించారు. లులు సంస్థకు కారుచౌకగా భూములను, ఉర్సాకు 60 ఎకరాల భూమి ఇచ్చారు. ఎక్కడా పారదర్శకత లేకుండా భూములు కేటాయించారు. కంచె చేను మేసినట్లుగా ఉంది ఈ ప్రభుత్వ పరిస్థితి’’ అని అమర్నాథ్ మండిపడ్డారు. -
రియల్ ఎస్టేట్ సంస్థలకు.. భూ సమర్పయామి
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలోని ఖరీదైన భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు కట్టబెట్టడంపై అన్ని వర్గాల నుంచి పెద్దఎత్తున ఆందోళన వ్యక్తమైనా టీడీపీ కూటమి ప్రభుత్వం వాటిని ఖేఖాతరు చేస్తోంది. కొన్ని సంస్థలకు భూములు కేటాయిస్తూ శుక్రవారం ఉత్తర్వులను జారీచేసింది. ఐటీ కంపెనీల ముసుగులో విలువైన భూములను రియల్ ఎస్టేట్ కంపెనీలకు కట్టబెట్టింది.👉బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ సత్వా గ్రూపునకు మధురవాడ హిల్ నెంబర్–4లో 30 ఎకరాలను ఎకరా రూ.1.50 కోట్ల చొప్పున కేటాయిస్తూ రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఉత్తర్వులు జారీచేశారు. ఇందులో 50 శాతం ఐటీ అవసరాలకు వినియోగించుకుని మిగిలిన 50 శాతం రిటైల్, గృహ నిర్మాణం వంటి రియల్ ఎస్టేట్ అవసరాలకు వినియోగించుకో వచ్చని, ఇందుకు విశాఖపట్నం మెట్రోపా లిటన్ రీజినల్ డెవలప్మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్ రూపాందించాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.👉ఇదే విధంగా కపిల్ చిట్స్ గ్రూపునకు చెందిన బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్కు ఎండాడ వద్ద 10 ఎకరాల భూమిని ఎకరా రూ.1.5 కోట్ల చొప్పున కేటాయించింది. ఇందులో 40 శాతం భూమిని అసోసియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరిట రియల్ ఎస్టేట్ అవసరాలకు వినియోగించుకోవడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అంటే.. అసోసియేట్ ఇన్ఫ్రా పేరిట ఉద్యోగులకు గృహ సముదాయాలు, రిటైల్, వినోదం, మెడికల్, ఎడ్యుకేషన్ అవసరాలకు వినియోగించుకోవడానికి అనుమతించింది.ఏఎన్ఎస్ఆర్కు 99 పైసలకే 10.29 ఎకరాలు..👉ఇక బెంగళూరుకు చెందిన మరో సంస్థ ఏఎన్ఎస్ఆర్కు మధురవాడ హిల్ నెంబర్–3లో 2.5 ఎకరాలు, హిల్ నెంబర్–4లో 7.79 ఎకరాలు మొత్తం 10.29 ఎకరాలను కేవలం 99 పైసలకే కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అంతేకాక.. ఐటీ ఇన్ఫ్రా డెవలపర్ కేటగిరీ కింద పలు రాయి తీలు కల్పించనున్నట్లు అందులో పేర్కొన్నారు.👉సిఫీ ఇన్ఫినిటీ స్పేసెస్ లిమిటెడ్కు మధురవాడ హిల్ నెంబర్–3లో ఎకరా కోటి రూపాయల చొప్పున 3.6 ఎకరాలతో పాటు పరదేశీపాలం వద్ద ఎకరా రూ.50 లక్షల చొప్పున 25 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వును జారీచేసింది.👉అలాగే, ఫినోమ్ పీపుల్ ప్రైవేట్ లిమిటెడ్కు మధురవాడ ఐటీ హిల్ నెంబర్–2లో 0.45 ఎకరాలు, రుషికొండ హిల్ నెంబర్–4లో మరో నాలుగు ఎకరాలను ఎకరా రూ.4.05 కోట్లు చొప్పున కేటాయించింది. వీటితో పాటు ఏపీ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరింగ్ పాలసీని విడుదల చేస్తూ కాటంనేని భాస్కర్ మరో ఉత్తర్వు జారీ చేశారు. -
కరెంట్ షాక్తో సర్వీసింగ్ బాయ్ మృతి
వాటర్ సర్వీసింగ్ సెంటర్లో విషాదం మర్రిపాలెం: ఐటీఐ జంక్షన్లోని వాటర్ సర్వీసింగ్ సెంటర్లో కరెంటు షాక్తో సర్వీసింగ్ బాయ్ మృతి చెందాడు. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటనకు సంబంధించి కంచరపాలెం పోలీసులు తెలిపిన వివరాలివి. సిద్ధార్థనగర్లో నివాసం ఉంటున్న బి.రమణ (41) ఐటీఐ జంక్షన్ వద్ద కుంచమాంబ వాటర్ వాష్ సర్వీసింగ్ సెంటర్లో పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం సుమారు 8 గంటల ప్రాంతంలో రమణ సర్వీసింగ్ సెంటర్కు వచ్చాడు. అదే సమయంలో కారు సర్వీసింగ్కు వచ్చిన ఓ వ్యక్తి టీ తాగడానికి వెళ్లాడు. అతను తిరిగి వచ్చి చూసేసరికి కారు కింద నీళ్లు వస్తుండగా.. రమణ కింద పడి ఉన్నాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే కంచరపాలెం పోలీసులకు సమాచారం అందించారు. సీఐ రవికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. మృతుడు రమణకు భార్య సత్యవతి, కుమారులు జశ్వంత్, సుశ్చిత్ ఉన్నారు. జశ్వంత్ ఐటీఐ, సుశ్చిత్ ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. అతని బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వృద్ధుడి నేత్రదానం.. ఇద్దరికి చూపు
పెందుర్తి: దాదాపు సంపూర్ణ జీవితం గడిపిన ఒక వృద్ధుడు మరణం తర్వాత కూడా ఇద్దరికి కంటి చూపును ప్రసాదించారు. పెందుర్తి మండలం చింతలగ్రహారానికి చెందిన కోరుబిల్లి అప్పారావు(90) వృద్ధాప్యం కారణంగా శుక్రవారం ఉదయం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న పెందుర్తిలోని సాయి హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు దాడి శ్రీనివాస్ మృతుడి కుమారుడు కోరుబిల్లి శ్రీనివాస్ను సంప్రదించి నేత్రదానం గురించి వివరించారు. దీనికి అంగీకరించిన శ్రీనివాస్ తన తండ్రి కళ్లను దానం చేయడానికి అంగీకరించారు. అనంతరం ఎల్వీ ప్రసాద్ మోషిన్ ఐ బ్యాంక్ ప్రతినిధులు అప్పారావుకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని నిర్ధారించుకుని ఆయన నేత్రాలను సేకరించి ఐ బ్యాంక్కు తరలించారు. ఆరోగ్య సమస్యలు లేకపోతే.. ఏ వయసు వారి నేత్రాలైనా కనీసం ఇద్దరికి చూపును అందించగలవని సాయి ట్రస్ట్ ప్రతినిధి శ్రీనివాస్ తెలిపారు. -
మాతా,శిశు మరణాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలి
మహారాణిపేట: జిల్లాలో మాతా, శిశు మరణాలు సంభవించకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో మాతాశిశు సంక్షేమం, వ్యాధి నిరోధక టీకాలు, మలేరియా, డెంగ్యూ, ఎయిడ్స్ నియంత్రణ వంటి అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నూతన దంపతులు, గర్భిణులు, శిశువుల రిజిస్ట్రేషన్లను సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలకు తగిన శిక్షణ ఇవ్వాలని, నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్వో పి.జగదీశ్వరరావుకు సూచించారు. అబార్షన్లు అధికంగా చేస్తున్న ఆస్పత్రులపై నిఘా ఉంచి, వాటికి గల కారణాలపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. మలేరియా, డెంగ్యూ నివారణకు ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలన్నారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ ఐ.వాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిదే గెలుపు
ఎంవీపీకాలనీ: పులివెందుల స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల గెలుపు ఖాయమని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. ఎంవీపీ కాలనీలోని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో బీటెక్ రవి భార్య పోటీ చేస్తున్నారని తెలిపారు. ఆమె గెలుపు ఖాయమన్న ఆయన అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కూటమి పార్టీలన్నీ చాలెంజ్గా తీసుకున్నట్లు వెల్లడించారు. పరామర్శల పేరుతో జగన్మోహన్రెడ్డి కావాలనే ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు కృషి చేస్తుంటే.. దాన్ని జగన్ అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. పెద్దిరెడ్డికి చంద్రబాబుకు పోలికే లేదన్న ఆయన.. పెద్దిరెడ్డిపై కక్షసాధించాలంటే ఆ పని గతంలోనే చేసేవారన్నారు. ఎమ్మెల్యే గంటా మాట్లాడుతూ జగన్ పర్యటనల పేరుతో అవలంబిస్తున్న తీరు మంచిదికాదన్నారు. తీరు మార్చుకోకుంటే హౌస్ అరెస్ట్లు చేయడం కూటమి ప్రభుత్వానికి తెలియనిది కాదని పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు, కూటమి నేతలు పాల్గొన్నారు. -
వెల్లివిరిసిన శ్రావణ శోభ
శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా నగరం ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసింది. బురుజుపేట కనకమహాలక్ష్మి అమ్మవారు స్వర్ణాలంకరణలో, కురుపాం మార్కెట్లోని కన్యకాపరమేశ్వరి సువర్ణవస్త్ర శోభితయై భక్తులకు కనువిందు చేశారు. సింహగిరిపై సింహవల్లీ తాయారుకు లక్ష కుంకుమార్చన చేశారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ అమ్మవార్లకు క్షీరాభిషేకాలు, సామూహిక కుంకుమ పూజలు, ప్రత్యేక పూజలు జరిగాయి. స్వర్ణాలంకరణలో కనకమహాలక్ష్మి డాబాగార్డెన్స్: శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా బురుజుపేటలోని కనకమహాలక్ష్మి ఆలయం ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఈ సందర్భంగా అమ్మవారిని స్వర్ణాలంకరణతో అద్భుతంగా అలంకరించారు. వేద మంత్రాలు, నాదస్వర వాయిద్యాల మధ్య ఉదయం 8.10 గంటలకు శ్రావణలక్ష్మి పూజలు మొదలయ్యాయి. ఈ పూజలో 103 మంది ఉభయదాతలు ప్రత్యక్షంగా పాల్గొనగా, 25 మంది ఉభయదాతలు పరోక్షంగా పూజలు చేయించుకున్నారు. వారికి కుంకుమ, ప్రసాదం పంపించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు, పలువురు ప్రముఖులు తరలివచ్చారు. శ్రావణ శుక్రవారం కావడంతో అమ్మవారి మూలవిరాట్కు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో కె.శోభారాణి, ఏఈవో తిరుమలేశ్వరరావు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. సువర్ణవస్త్రాలంకరణలో కన్యకాపరమేశ్వరి పాతనగరం కురుపాం మార్కెట్ సమీపంలోని కన్యకాపరమేశ్వరి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారి మూలవిరాట్కు వేకువజామున 5 గంటలకు శుద్ధజలం, పాలు, పెరుగు, తేనె, గంధం, పసుపు, కుంకుమ, వివిధ పండ్ల రసాలతో సహా 108 రకాల ద్రవ్యాలతో ప్రత్యేక క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని సువర్ణవస్త్రంతో అలంకరించి, 108 బంగారు పుష్పాలతో పూజలు జరిపారు. తర్వాత భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు సామూహిక లలితా సహస్రనామ పారాయణం చేసిన తర్వాత, దేవస్థాన పురోహితుడు ఆర్బీబీ కుమార్శర్మ ఆధ్వర్యంలో సుమారు 250 మంది మహిళలు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ సంఘం అధ్యక్షుడు ఆరిశెట్టి దినకర్, కార్యదర్శి పెనుగొండ కామరాజు, శ్రావణమాస ఉత్సవ కార్యనిర్వాహక సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సింహగిరిపై లక్ష కుంకుమార్చన సింహాచలం: శ్రావణ శుక్రవారం సందర్భంగా సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో సింహవల్లీ తాయారు అమ్మవారికి లక్ష కుంకుమార్చనను వైభవంగా నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు సింహవల్లీ తాయారు, చతుర్బుజ తాయారు అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలోని వేదికపై ఉంచి శాస్త్రోక్తంగా ఈ పూజను చేపట్టారు. లక్ష నామాలతో అమ్మవార్లకు కుంకుమ పూజ నిర్వహించి.. విశేష హారతి ఇచ్చారు. ఈ పూజలో పాల్గొన్న భక్తులకు శేషవస్త్రాలు, కుంకుమ ప్రసాదం అందజేశారు. అలాగే.. సాయంత్రం అమ్మవారికి ఆలయ బేడామండపంలో తిరువీధిని ఘనంగా నిర్వహించారు. అనంతరం సహస్రనామార్చన పూజ కూడా వైభవంగా జరిగింది. శ్రావణ శుక్రవారం కావడంతో అమ్మవారి సన్నిధిని అందంగా అలంకరించారు.ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధాన అర్చకుడు గొవర్తి శ్రీనివాసాచార్యులు ఈ పూజలు నిర్వహించారు. ఆలయ ఏఈవో తిరుమలేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
వృక్షాబంధన్
138 ఏళ్ల మర్రిచెట్టుకు రాఖీ కట్టిన వీఎంఆర్డీఏ కమిషనర్తాటిచెట్లపాలెం: పర్యావరణ పరిరక్షణకు మహా వృక్షాలను కాపాడుకోవాలని, దీనికి గుర్తుగా వాటికి రాఖీ కట్టాలని వీఎంఆర్డీఏ కమిషనర్ కేఎస్ విశ్వనాథన్ పిలుపునిచ్చారు. రైల్వేస్టేషన్ రోడ్డులోని 138 ఏళ్ల మర్రిచెట్టుకు శుక్రవారం గ్రీన్ కై ్లమేట్ టీం ఆధ్వర్యంలో ఆయన రాఖీ కట్టి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జ్ఞానాపురం సెయింట్ జోసఫ్ కళాశాల, లిటిల్ ఏంజిల్స్ విద్యార్థినులు భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా విశ్వనాథన్ మాట్లాడుతూ.. ఈ మహా వృక్షానికి రాఖీ కట్టడం ద్వారా వృక్షాలను, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేసుకోవాలన్నారు. కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ మోహనలక్ష్మి మాట్లాడుతూ భూమిపై ఏ జీవి అంతరించినా దాని ప్రభావం మానవాళి మనుగడపై ఉంటుందని, సమస్త జీవరాశిని కాపాడాలని పిలుపునిచ్చారు. వృక్షాబంధన్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించి, ఎక్కువ మందిని భాగస్వాములను చేయాలని కోరారు. విశాఖపట్నం పోర్టు అథారిటీ ఉద్యానవన శాఖాధికారిణి రాధిక మాట్లాడుతూ తల్లి జన్మనిస్తే చెట్లు ప్రాణవాయువును ఇస్తున్నాయని, అందుకే చెట్లను కాపాడాలన్నారు. ఇందులో భాగంగా పోర్టు అథారిటీ 10 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. అనంతరం విద్యార్థులు మర్రిచెట్టు చుట్టూ వలయంగా ఏర్పడి వృక్షాలను కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. వనమాలి సీటీజీ గ్రూప్ విద్యార్థులకు మొక్కలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రీన్ కై ్లమేట్ ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం, ఇతర ప్రతినిధులు, వివిధ సంస్థల అధికారులు పాల్గొన్నారు. -
యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ
హెచ్పీసీఎల్–ఎస్డీఐతో ఎల్జీ ఇండియా ఒప్పందం మహారాణిపేట: యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి, ఉద్యోగావకాశాలు కల్పించడానికి ఎల్జీ ఇండియా సీఎస్సార్ ఫౌండేషన్, హెచ్పీసీఎల్–ఎస్డీఐ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ మేరకు ఆర్టీసీ కాంప్లెక్స్లోని హెచ్పీసీఎల్ కార్యాలయంలో శుక్రవారం ఇరు సంస్థల ప్రతినిధులు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా యువతలో నాయకత్వ లక్షణాలు, ఆవిష్కరణ సామర్థ్యం పెరుగుతాయని ఎల్జీ ఇండియా సీఎస్సార్ ఫౌండేషన్ చైర్మన్, మాజీ ఐఏఎస్ గిరిజా శంకర్ తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్నవారికి ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటు, స్వయం ఉపాధి శిక్షణ పొందిన మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించేందుకు ఇది తోడ్పడుతుందని వివరించారు. ఎల్జీ ఇండియా గ్లోబల్ హెడ్ పాల్ క్వాన్, ఎల్జీ గ్రూప్ డైరెక్టర్ సి.కె.జియాంగ్, హెచ్పీసీఎల్–ఎస్డీఐ సీఈవో ఇంతియాజ్ అర్షద్ పాల్గొన్నారు. -
దేవమాత మోక్షారోపణ మహోత్సవాలు ప్రారంభం
కంచరపాలెం: జ్ఞానాపురంలోని సెయింట్ పీటర్ పునీత పేతురు ప్రధాన దేవాలయంలో శతాబ్దకాలంగా నిర్వహిస్తున్న దేవమాత మోక్షారోపణ ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ జోన్నాడ జాన్ ప్రకాష్ దివ్యబలి పూజ, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మరియమాత ఏ విధంగా ఏసుక్రీస్తుకు చిత్తానుసారంగా జీవించి లోకానికి తల్లిగా మారిందో ఆయన వివరించారు. అనంతరం పారిస్ పాస్టోరల్ కౌన్సిల్ (పీపీసీ) ఆధ్వర్యంలో పీపీసీ అధ్యక్షుడు శ్రీముసురు రాజేష్బాబు దేవమాత పతాకాన్ని ఆవిష్కరించారు. సెబాస్టియన్ కాలనీ, బిషప్ మరియదాస్ కాలనీ, మదర్థెరిస్సా కాలనీ, రావులపల్లి, వడిచర్ల, నికోలస్, డయాస్, రాసా వీధుల్లో దేవమాత తేరును భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. కార్యక్రమంలో చర్చి ఫాదర్లు ఎస్.వియల్రాజ్, వై.ప్రేమ్కుమార్, పీపీసీ సభ్యులు, గురు మండలి సలహా సంఘం సభ్యులు, అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. -
వాల్తేర్ డివిజన్ రన్నింగ్ స్టాఫ్ నిరాహార దీక్ష
తాటిచెట్లపాలెం: ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేరు డివిజన్లో పనిచేస్తున్న రన్నింగ్ స్టాఫ్ తమ సమస్యల పరిష్కారం కోసం నిరాహారదీక్ష చేపట్టారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మర్రిపాలెం డివైడీ క్రూ లాబీ వద్ద శుక్రవారం జరిగిన ఈ నిరసనలో సిబ్బంది పలు డిమాండ్లను రైల్వే యాజమాన్యం ముందుంచారు. రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం రన్నింగ్ రూమ్లు ఏర్పాటు చేయాలని, రన్నింగ్ సిబ్బందికి కనీసం 120 కిలోమీటర్ల మైలేజీకి హామీ ఇవ్వాలని, ప్రస్తుతం 16 గంటల పాటు విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పనివేళలను సైన్ ఇన్ నుంచి సైన్ అవుట్ వరకు 9 గంటలకు పరిమితం చేయాలని, రాత్రి షిఫ్టులు రెండు రోజులకు మించి కొనసాగించకూడదని, 36 గంటల్లోగా హోం స్టేషన్కు తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ జోనల్ ప్రెసిడెంట్ జె.సంపత్కుమార్ మాట్లాడుతూ వాల్తేరు డివిజన్ సిబ్బంది భారతీయ రైల్వేల్లో అత్యధిక ఓవర్ టైం పనిచేస్తున్నారని, అత్యధిక లోడింగ్ రికార్డు సాధించడంలో వారి కృషి కీలకమన్నారు. ఈ నేపథ్యంలోనే వారి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. నిరాహార దీక్ష ఫలితంగా జీఎం కమిటీ వేశారని తెలిపారు. యూనియన్ ప్రతినిధులు, అధికారులతో కూడిన కమిటీ సమావేశం తర్వాత డిమాండ్లను 10 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సాయంత్రం దీక్ష విరమించారు. కార్యక్రమంలో డివిజనల్ కోఆర్డినేటర్ టి.వి.మౌళి, యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.నరసింగరావు, డిప్యూటీ డివిజినల్ కోఆర్డినేటర్ ఎ.వెంకటరావు, అడిషనల్ జాయింట్ జనరల్ సెక్రటరీ కె.నాగేశ్వరరావు, ఇతర నాయకులు, రైల్వే కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ఇన్స్టిట్యూషన్ లీగ్ విజేత సిటీ పోలీస్
విశాఖస్పోర్ట్స్/మద్దిలపాలెం: వీడీసీఏ ఆధ్వర్యంలో జరిగిన ఇన్స్టిట్యూషన్ లీగ్ ఫైనల్లో సిటీ పోలీస్ జట్టు విజయం సాధించింది. ఏపీఈపీడీసీఎల్ జట్టుపై 52 పరుగుల తేడాతో గెలిచి చాంపియన్గా నిలిచింది. పీఎంపాలెంలోని వైఎస్సార్ స్టేడియం బీ గ్రౌండ్లో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడిన సిటీ పోలీస్ జట్టు మొదట బ్యాటింగ్కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఎంవీపీ ట్రాఫిక్ కానిస్టేబుల్ తొల్లాడ రాజు 96 పరుగులు చేసి జట్టు భారీ స్కోరుకు దోహదపడ్డాడు. ఏపీఈపీడీసీఎల్ బౌలర్లలో కార్తీక్ 4 వికెట్లు తీశాడు. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఏపీఈపీడీసీఎల్ జట్టు 17.3 ఓవర్లలో కేవలం 156 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్ అభిషేక్ 40 పరుగులు మాత్రమే చేయగలిగాడు. సిటీ పోలీస్ జట్టు బౌలర్ సురేష్ 5 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సందర్భంగా రాజును మద్దిలపాలెంలోని ట్రాఫిక్ అవుట్పోస్టులో ఎంవీపీ ఎస్ఐ వి.కనకారావు సత్కరించారు. -
ఈ ‘యాప్’సోపాలు మాకొద్దు
పనిభారంతో ఆన్లైన్ సేవలు నిలిపివేసిన అంగన్వాడీ కార్యకర్తలు మర్రిపాలెం: యాప్ల ద్వారా పనిభారం పెరిగిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు శుక్రవారం నుంచి ఆన్లైన్ సేవలను నిలిపివేశారు. పోషణ ట్రాకర్, బాలసంజీవని యాప్లలో లబ్ధిదారుల నమోదును తాత్కాలికంగా ఆపేశారు. అదనంగా ఆరోగ్యశాఖకు చెందిన ‘ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన’ పథకం నమోదు కూడా తమకే అప్పగించడంపై వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సభ్యులు మాట్లాడుతూ ఇప్పటికే పోషణ ట్రాకర్, బాల సంజీవని యాప్లలో నమోదుతో పాటు అనేక రికార్డులను నిర్వహించాల్సి వస్తోందని తెలిపారు. దీనికి తోడు పాత ఫోన్లు, సర్వర్ సమస్యలతో లబ్ధిదారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తోందన్నారు. అధికారులు అప్పగించిన మాతృత్వ వందన యోజన పథకం నమోదును తిరిగి ఆరోగ్యశాఖకు అప్పగించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన యాప్లను ఒకే యాప్గా మార్చాలని, నాణ్యమైన స్మార్ట్ఫోన్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆగస్టు 4న తమ ఫోన్లను ఐసీడీఎస్ కార్యాలయాల్లో అప్పగిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం సీడీపీఓ నీలిమకు వినతిపత్రం అందజేశారు. -
కేంద్ర కారాగారంలో హెచ్ఐవీ పరీక్షలు తప్పనిసరి
మహారాణిపేట: జిల్లా కేంద్ర కారాగారంలో ఖైదీలందరికీ తప్పనిసరిగా హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నవారికి సకాలంలో మందులు అందజేయాలని సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో జరిగిన జిల్లా హెచ్ఐవీ, ఎయిడ్స్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. హెచ్ఐవీతో జీవిస్తున్నవారి హక్కులను కాపాడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. హెచ్ఐవీపై అవగాహన కోసం త్వరలో నిర్వహించనున్న మారథాన్ ‘రెడ్ రన్’ను విజయవంతం చేయాలని జిల్లా స్పోర్ట్స్ అధికారిని ఆదేశించారు. జిల్లాలో ఉన్న ట్రాన్స్జెండర్లందరికీ ప్రభుత్వ పథకాలను వర్తింపజేయాలని దివ్యాంగుల సంక్షేమ అధికారికి సూచించారు. హెచ్ఐవీ బాధితులకు ఎన్టీఆర్ పింఛన్లను సకాలంలో అందజేయాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జగదీశ్వర్ రావు, ఇతర ఉన్నతాధికారులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
10 రెస్టారెంట్లు, దాబాలకు నోటీసులు
బీచ్రోడ్డు: నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార భద్రత ప్రమాణాలను పరిశీలించడానికి ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారుల విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం జాయింట్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో మొత్తం 20 బృందాలు ఏకకాలంలో 40 హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలపై దాడులు చేశాయి. ఈ తనిఖీల్లో భాగంగా 42 ఆహార పదార్థాల నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపించారు. పరిశుభ్రత పాటించని 10 రెస్టారెంట్లు, దాబాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. రిఫ్రిజిరేటర్లలో నిల్వ ఉన్న పాడైపోయిన ఆహార పదార్థాలను గుర్తించి, 17 కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీలు నిరంతరంగా కొనసాగుతాయని పూర్ణచంద్రరావు స్పష్టం చేశారు. ఈ తనిఖీల కోసం ఇతర జిల్లాల నుంచి కూడా అధికారులను రప్పించినట్లు ఆయన పేర్కొన్నారు. -
సంక్షేమాన్ని విస్మరిస్తున్న కూటమి సర్కార్
మహారాణిపేట: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ హాస్టళ్లకు ప్రాధాన్యత లభించిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని పూర్తిగా విస్మరించిందని వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పి.కొండారెడ్డి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి పిలుపు మేరకు వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజుల పాటు నిర్వహించిన ‘సంక్షేమ హాస్టళ్ల బాట’ కార్యక్రమం ముగిసింది. ముందుగా జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పి.చైతన్యతో కలిసి కొండారెడ్డి తదితరులు జిల్లా రెవెన్యూ అధికారి భవాని శంకర్కు హాస్టళ్ల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ప్లకార్డులతో నిరసన ప్రదర్శన ‘బొద్దింకల భోజనం, నీళ్ల పప్పు, పులిసిపోయిన పెరుగు మాకొద్దు. దోమలకు ఆహారంగా ఉండలేం. నేల మీద పడుకోలేం’ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. హాస్టళ్లలో సరైన నిధులు లేకపోవడంతో పురుగుల బియ్యంతో వండిన అన్నం, కుళ్లిపోయిన కూరగాయలు పెడుతున్నారని ఆరోపించారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పి.కొండారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాస్మొటిక్ చార్జీలు, మెనూలో భాగంగా ఇవ్వాల్సిన గుడ్డు, చిక్కీ, చికెన్ వంటివి కూడా సక్రమంగా అందడం లేదన్నారు. హాస్టల్ వార్డెన్లను అడిగితే నిధులు లేవని చెబుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో స్టూడెంట్స్ యూనియన్ నాయకులు తులసి, పిలకా మోహన్, సందీప్, రవికాంత్, విష్ణువర్ధన్, సర్ఫరాజ్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. సంక్షోభంలో హాస్టళ్లు రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అవసరమైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఇళ్లను ముట్టడిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 3,878 ప్రభుత్వ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు సంక్షోభంలో ఉన్నాయని ఆరోపించారు. వాటిలో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 6,35,864 మంది విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
భూ సంబంధిత సమస్యల పరిష్కారమే లక్ష్యం
మహారాణిపేట : ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం కాకుండా కాపాడటం, భూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ అదనపు డైరెక్టర్ ఆర్.గోవిందరావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్తో కలిసి ఆయన వివిధ అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. భూముల రీ–సర్వేను వేగవంతం చేయాలని, ప్రభుత్వ, ప్రైవేటు భూముల నిర్ధారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని గోవిందరావు ఆదేశించారు. గ్రామ, మండల సర్వేయర్లు, రెవెన్యూ అధికారులు ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని తహసీల్దార్లకు సూచించారు. వివాదాలు లేని ప్రభుత్వ ఆక్రమిత భూములను క్రమబద్ధీకరించడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్వో కె. భవాని శంకర్, భీమిలి ఆర్డీవో సంగీత్ మహదుర్, ఏడీ సర్వే శాఖ కె. సూర్యారావు, మండల తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ అదనపు డైరెక్టర్ గోవిందరావు -
కేంద్రం ఉక్కు పంజా
స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ తథ్యంవెన్నుపోటు పొడవడంలో మనకంటే తోపు ఇంకెవరూ లేరురాజ్యసభలో సుబ్బారెడ్డి ఆరు ప్రశ్నలు స్టీల్ప్లాంట్పై రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఆరు ప్రశ్నలు వేశారు. ఆర్ఐఎన్ఎల్కు మూలధన పెట్టుబడి లేదా ఇతరత్రా అవసరాలకు నిధులు విడుదల చేశారా? చేస్తే ఇప్పటి వరకు ఎంత చేశారు? ఆలస్యానికి గల కారణం? పరిశ్రమలో వీఆర్ఎస్ స్కీమ్ అమలు చేయడం నిజమేనా? ఎంత మంది దానికి దరఖాస్తు చేసుకున్నారు? పరిశ్రమను ప్రైవేటీకరణ చేసే ఆలోచన ఉందా? ఉంటే ఎందుకు? సెయిల్లో విలీనం చేసే అంశం మాటేమిటి? అని ప్రశ్నించారు. దీనిపై కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ విస్తుపోయే సమాధానాలు ఇచ్చారు. ● తేల్చి చెప్పేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ● కూటమి ప్రభుత్వం బండారం బట్టబయలు ● స్టీల్ప్లాంట్పై రాజ్యసభలో ఆరు ప్రశ్నలు వేసిన రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ● వాటికిచ్చిన వివరణలో కేంద్రం వైఖరి వెల్లడి ● సెయిల్లో విలీనం చేసే ప్రతిపాదనే లేదని స్పష్టీకరణ ● 1,017 మంది ఉద్యోగుల ఉద్వాసనకు రంగం సిద్ధం ● మండిపడుతున్న కార్మిక వర్గాలువిశాఖ సిటీ : స్టీల్ప్లాంట్పై కూటమి ప్రభుత్వ గూడు పుఠాణి బట్టబయలైంది. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కేంద్రం కుండబద్దలు కొట్టింది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) నుంచి వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణ తథ్యం అని తేల్చేసింది. పెద్దల సభలో వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వేసిన ఆరు ప్రశ్నలకు కేంద్రం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. స్టీల్ప్లాంట్ ప్రైవేటుపరం కానివ్వబోమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ఇన్నాళ్లు చెప్పుకొచ్చిన బూటకపు మాటల బండారం బయటపడింది. నోటితో నవ్వి నొసటితో వెక్కిరించారన్న చందంగా కూటమి ప్రభుత్వం తీరు ఉంది. ఒకవైపు ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా చేసే బాధ్యత తమదని చెబుతూనే.. మరోవైపు ప్లాంట్లో వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నా చోద్యం చూస్తుండడమే దీనికి నిదర్శనం. వెయ్యి మందికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన స్టీల్ప్లాంట్ ఉద్యోగులకు మరోసారి ఉద్వాసన పలికేందుకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. వలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ (వీఆర్ఎస్) పేరుతో వేల మంది ఉద్యోగులను బయటకు పంపించాలని నిర్ణయించారు. ఇందుకోసం వీఆర్ఎస్ స్కీమ్ను ఇప్పటికే ప్రవేశపెట్టారు. జూన్ 15వ తేదీ వరకు వీఆర్ఎస్కు దరఖాస్తులను స్వీకరించారు. ఇందులో 1,017 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని కూడా కేంద్ర మంత్రి తన వివరణలో పేర్కొన్నారు. దీని ప్రకారం త్వరలోనే వీరిని ఇంటికి పంపించనున్నారు. సెయిల్లో విలీన ప్రతిపాదనే లేదు స్టీల్ప్లాంట్ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)లో విలీనం చేయాలని కార్మిక, ఉద్యోగ, ప్రజా సంఘాలు దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. దీని కోసం ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు చేపట్టాయి. కానీ అసలు ఆ ప్రతిపాదనే లేనట్లు కేంద్ర మంత్రి తేల్చేశారు. అలాగే మూలధన వ్యయం కింద కేంద్రం రూ.11,440 కోట్లు మంజూరు చేసింది. కానీ ఇప్పటి వరకు రూ.9,824 కోట్లు మాత్రమే విడుదల చేసింది. మిగిలిన మొత్తాన్ని ఎప్పుడు విడుదల చేస్తుందో? ఆలస్యానికి గల కారణాలను మాత్రం తెలపకపోవడం గమనార్హం. మండిపడుతున్న కార్మిక వర్గాలు స్టీల్ప్లాంట్పై కేంద్రం వైఖరిని మరోసారి స్పష్టం చేయడంతో కార్మిక వర్గాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. సీఎం, డీప్యూటీ సీఎం మాటలు నమ్మి స్టీల్ప్లాంట్పై ఆశలు పెట్టుకున్న కార్మికుల్లో ఈ సమాధానాలతో ఆందోళన మొదలైంది. స్టీల్ప్లాంట్ను సెయిల్లో విలీనం చేసే అవకాశాలు ఉన్నట్లు కూటమి ప్రభుత్వ పెద్దలు కార్మికులను నమ్మించారు. అయితే ఇపుడు ఆ అవకాశం కూడా లేనట్లు నిర్థారణైంది. దీనిపై త్వరలోనే ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. త్వరలోనే అఖిలపక్ష నాయకులను కలిసి దీనిపై ప్రణాళిక రూపొందించుకోవాలని భావిస్తున్నారు. ప్రైవేటీకరణపై స్పష్టీకరణ స్టీల్ప్లాంట్పై కూటమి ప్రభుత్వం ఎన్ని కల్లబొల్లి మాటలు చెప్పినా కేంద్రం వైఖరి మరోసారి స్పష్టమైంది. ఆర్ఐఎన్ఎల్లో వంద శాతం పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని 2021, జనవరి 27నే కేబినెట్ కమిటీ తీర్మానం చేసినట్లు కేంద్ర మంత్రి తేల్చిచెప్పారు. దీంతో ఇన్నాళ్లు కూటమి ప్రభుత్వం ప్రజలను మాయలో ఉంచి నాటకాలు ఆడినట్లు ఈ వివరణతో అర్థమవుతోంది. స్టీల్ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులు ఏళ్లుగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లను కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని అనేకసార్లు వేడుకున్నారు. పవన్ స్వయంగా స్టీల్ప్లాంట్ వద్ద సభలోనే పరిశ్రమ ప్రైవేటుపరం కాదంటూ ప్రగల్భాలు పలికారు. కానీ తాజాగా కేంద్రం తన వైఖరిని మరోసారి తేల్చి చెప్పడంతో సీఎం, డిప్యూటీ సీఎం ఇన్నాళ్లు చేసినవి డ్రామాలుగా తేలిపోయింది. -
అన్నదాత కు పంగనామం
● అర్హులకు దూరంగా ‘అన్నదాత సుఖీభవ’ ● రైతు సాయంపై కూటమి ప్రభుత్వం అడ్డంకులు ● వైఎస్సార్ సీపీ హయాంలో 25,072 మందికి రైతు భరోసా ● కూటమి ప్రభుత్వంలో 18,573 మందికే.. మహారాణిపేట: రాష్ట్ర ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద రైతులకు ఇచ్చే పెట్టుబడి సహాయంపై కోత విధించింది. గతంతో పోలిస్తే అర్హులైన రైతుల సంఖ్య గణనీయంగా తగ్గిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల హామీలో భాగంగా ఏడాదికి రూ.20,000 ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు కొత్త నిబంధనల పేరుతో వేలాది మందిని పథకం నుంచి తొలగించింది. గత ఏడాది ఈ పథకాన్ని అమలు చేయకుండా నిలిపివేసిన ప్రభుత్వం, ఈ ఏడాది విడుదల చేసిన లబ్ధిదారుల జాబితాలో పెద్ద సంఖ్యలో రైతుల పేర్లు గల్లంతయ్యాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. అర్హుల సంఖ్యలో భారీ కోత గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘రైతు భరోసా’ కింద 25,072 మంది రైతులకు నిధులు అందించగా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ’ కింద కేవలం 18,573 మందిని మాత్రమే అర్హులుగా ఎంపిక చేసింది. దీని ప్రకారం సుమారు 6,499 మంది రైతులు ఈ పథకం నుంచి తొలగించినట్టయింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ‘ప్రధాన మంత్రి కిసాన్’ పథకం కింద 18,100 మందిని అర్హులుగా ఎంపిక చేశారు. నిబంధనల పేరుతో ఇబ్బందులు కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనల కారణంగా కౌలు రైతులు, కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది ఉన్నవారు, 10 సెంట్ల కన్నా తక్కువ భూమి ఉన్నవారు పథకానికి దూరమయ్యారు. అలాగే ఆధార్, ఈ–కేవైసీ, బ్యాంకు ఖాతాల అనుసంధాన సమస్యలు, వేలిముద్ర, ఓటీపీ ప్రక్రియపై అవగాహన లేకపోవడం వల్ల కూడా చాలామంది లబ్ధి కోల్పోయారు. ప్రభుత్వం అవగాహన కల్పించడంలో విఫలమైందని రైతులు విమర్శిస్తున్నారు. రైతులకు పెట్టుబడి కష్టాలు పెట్టుబడి సహాయం అందక గిరిజన, ఇతర రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖరీఫ్ సీజన్లో దుక్కి పనులు, నాట్లు, కలుపుతీత వంటి ఖర్చుల కోసం అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. గత ఏడాది నుంచి వ్యవసాయం భారంగా మారడంతో కొంతమంది సాగుకు దూరమవుతున్నారని చెబుతున్నారు. -
జిల్లాలో 93.55 శాతం పింఛన్ల పంపిణీ
మహారాణిపేట: జిల్లాలో ‘ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్లు’ పంపిణీ చేశారు. కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ పర్యవేక్షణలో మొత్తం 1,60,778 పింఛన్లకు గాను రాత్రి 8 గంటల సమయానికి 1,50,410 మందికి (93.55శాతం) పింఛన్లు అందజేశారు. దీనికోసం ప్రభుత్వం రూ.70.36 కోట్లు విడుదల చేయగా, అందులో రూ.65.60 కోట్లు పంపిణీ చేశారు. ఈ నెలలో కొత్తగా 2,524 మంది వితంతువులకు, 19 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పింఛన్లు మంజూరయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్డీఏ, నగరంలో జీవీఎంసీ సిబ్బంది బయోమెట్రిక్ ద్వారా పింఛన్లు పంపిణీ చేశారు. మిగిలిన పింఛన్లను శనివారం సచివాలయాల్లో పంపిణీ చేస్తామని డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ లక్ష్మీపతి తెలిపారు. -
‘ మేం నిరూపిస్తే.. మీరు మంత్రి పదవికి రాజీనామా చేస్తారా?’
విశాఖ: తమ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన నెల్లూరు పర్యటన విజయవంతం కావడంతో కూటమి నేతలు అనిత, ప్రశాంత రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి విమర్శించారు. ‘జనాలు రాలేదని అనిత మాట్లాడుతున్నారు. జనాలు వచ్చినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి అనిత రాజీనామా చేస్తారా?, జగన్ కాలు గోటికి అనితా సరిపోదు. సంస్కారహీనురాలు, మానసిక రోగి అనిత. జగన్ పర్యటనకు జనాలు రాకుండా 3 వేల మంది పోలీసులను పెట్టారు. రోడ్లు మీద గుంతలు తవ్వి, ఇనుప కంచెలు పెట్టారు. అయినా జనాలను రాకుండా అడ్డుకోలేక పోయారు.అనితా తన పదవిని నిలబెట్టుకోవడం కోసం జగన్ పై విమర్శలు చేస్తున్నారు. అనితా మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు. అసమర్థ హోమ్ మంత్రి అనిత అని పవన్ కళ్యాణ్ చెప్పారు’ అని వరుదు కళ్యాణి కౌంటరిచ్చారు. -
కుళ్లిన చికెన్, గడ్డ కట్టిన చేపలు, మాగిపోయిన పీతలు!!
కుళ్లిన చికెన్, గట్టిన చేపలు, మాగిపోయిన పీతలు, ముద్దగా మారిన రొయ్యలు, 15 రోజులకు పైగా నిల్వ ఉంచిన మసాలా ముద్దలు.. చదువుతుంటే ఎలా ఉంది?. కానీ, ఈ వీటితో తయారు చేసిన వంటకాలనే విశాఖపట్నంలోని ప్రముఖ రెస్టారెంట్లలో వడ్డిస్తున్నారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.. విశాఖలో ఇవాళ ఏకకాలంలో 20 చోట్ల ఫుడ్ సేఫ్టీ లీగల్ మెట్రాలజీ అధికారులు తనిఖీలు చేశారు. అక్కడ విస్తుపోయే దృశ్యాలు బయటపడ్డాయి. ఫ్రీజర్లలో రోజుల తరబడి నిల్వ చేసిన మాంసాలను ఉపయోగిస్తున్నారు. పైగా వాటిల్లో వాడే మసాలాలు నిల్వతో బూజుపట్టి ఉండడం గమనించారు. ఈ క్రమంలో.. క్వాలిటీలేని ఫుడ్ను విక్రయిస్తున్న వాళ్లపై అధికారుల సీరియస్ అయినట్లు సమాచారం.జగదాంబ జంక్షన్ లోని ఆల్ఫా హోటల్ లో తనిఖీలు చేస్తున్న స్టేట్ ఫుడ్ సేఫ్టీ జాయింట్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు, సిబ్బంది సాక్షి టీవీతో మాట్లాడారు. ‘‘ఇవాళ 20 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులు, 20 మంది లీగల్ మెట్రాలజీ అధికారులతో తనిఖీలు చేస్తున్నాం. ఈ హోటల్లో ఫ్రీజ్ చేసిన ఫుడ్ని గుర్తించాం. వంటల్లో ఎక్కువగా కలర్స్ యూజ్ చేస్తున్నారు. కిచెన్లో పరిశుభ్రత పాటించడం లేదు. ఇక్కడి ఫుడ్ని టెస్టింగ్ కోసం ల్యాబ్ కు పంపిస్తున్నాం. రిజల్ట్ వచ్చిన తర్వాత కేసులు నమోదు చేస్తాం. ఈ తనిఖీలు కంటిన్యూ అవుతాయి. నిబంధనలు పాటించని వాళ్లపై చర్యలు తీసుకుంటాం. పాయిజన్ ఫుడ్తో ప్రజల ఆరోగ్యాలతో చెలాగాటమాడేవాళ్లను క్షమించేది లేదు’’ అని హెచ్చరించారాయన. -
కలెక్టర్ను కలిసిన డీఎస్డీవో వెంకటేశ్వరరావు
మహారాణిపేట: జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి (డీఎస్డీవో)గా ఎస్. వెంకటేశ్వరరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మర్యాదపూర్వకంగా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ను ఆయన చాంబర్లో కలిశారు. విజయనగరం నుంచి బదిలీపై విశాఖ వచ్చిన వెంకటేశ్వరరావు గతంలో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా క్రీడా అధికారిగా విధులు నిర్వహించారు. ఇక్కడ డీఎస్డీవోగా పనిచేసిన ఆర్. జూన్ గాలియట్ను ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ, విజయవాడకు స్పోర్ట్స్ ఆఫీసర్గా పదోన్నతిపై బదిలీ చేశారు. జూన్ గాలియట్తో పాటు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ శిక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలి
బీచ్రోడ్డు: బ్యాంకు ఉద్యోగుల పెన్షనర్లు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. సీబీపీఆర్వో (సెంట్రల్ బ్యాంక్ పెన్షనర్స్ అండ్ రిటైరీస్ ఆర్గనైజేషన్), ఎస్బీఐ పెన్షనర్ల ఫోరం సంయుక్తంగా ఈ ఆందోళనను నిర్వహించాయి. ఈ సందర్భంగా పెన్షనర్లు తమ ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం, బ్యాంకింగ్ యాజమాన్యాల ముందుంచారు. ముఖ్యంగా, పెన్షన్ నవీకరణ తక్షణమే చేపట్టాలని, పెన్షన్, గ్రాట్యుటీ లెక్కించేటప్పుడు ప్రత్యేక భత్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎస్బీఐ పెన్షనర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సీహెచ్. బాపయ్య పంతులు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ షాహజాద్ బాషాతో తదితరులు పాల్గొన్నారు. -
అతిథి అధ్యాపకుల ఇంటర్వ్యూలు ప్రారంభం
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం(ఏయూ) అతిథి అధ్యాపకుల ఇంటర్వ్యూల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తొలిరోజు ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్, కామర్స్, మేనేజ్మెంట్ స్టడీస్, హెచ్ఆర్ఎం, బయో టెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ విభాగాలకు సంబంధించి అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్, హెచ్ఆర్ఎం, కామర్స్ విభాగాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు విజయనగరం ప్యాలెస్లో జరిగాయి. బయోటెక్నాలజీ, మ్యాథ్స్, బయో కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ విభాగాల ఇంటర్వ్యూలు ఇంజినీరింగ్ క్యాంపస్లోని అంబేడ్కర్ ఆడిటోరియంలో నిర్వహించారు. హెచ్వోడీతోపాటు, ఫ్యాకల్టీ చైర్మన్, ఇద్దరు సబ్జెక్ట్ నిపుణులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. తొలిరోజు ఇంటర్వ్యూల ప్రక్రియ ప్రశాంతంగా జరిగినట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి. -
మహిళా ప్రొఫెసర్ల సంఖ్య పెరుగుతోంది
సీ్త్ర, పురుషులకు సమాన అవకాశాలు కల్పించడంలో ఐఐఎం విశాఖపట్నం ముందు వరసలో ఉంది. ఈ ఏడాది తొలిసారిగా పీజీపీ అభ్యర్థుల ప్రవేశాల కోసం ప్రతి ఇంటర్వ్యూ ప్యానెల్లో ప్రత్యేకంగా మహిళా ఫ్యాకల్టీని నియమించాం. మహిళలను ప్రోత్సహించేందుకు అన్ని ప్రోగ్రామ్స్లోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ఐఐఎం విశాఖపట్నంలో కోర్సులో చేరుతున్న అభ్యర్థులలోనే కాకుండా.. మహిళా ప్రొఫెసర్ల సంఖ్య కూడా పెరిగింది. గతేడాది మహిళా ఫ్యాకల్టీ 41 శాతం ఉండగా.. ఈసారి 50 శాతానికి చేరుకుంది. ఇది విద్యా విధానంలో శుభపరిణామం. – ప్రొ.ఎం చంద్రశేఖర్, ఐఐఎంవీ డైరెక్టర్ -
ఏయూలో తికమక పాలన
● మూడు విభాగాలకు నూతన హెచ్వోడీలు ● జర్నలిజం విభాగాధిపతిగా పొలిటికల్ సైన్స్ ఆచార్యుడు ● థియేటర్ ఆర్ట్స్ హెచ్వోడీగా ఫైన్ ఆర్ట్స్ ప్రొఫెసర్ ● ఇద్దరూ సంబంధం లేని విభాగాలకు అధిపతులు మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పాలన పక్కదారి పడుతోంది. సంబంధం లేని విభాగాలకు చెందిన ఆచార్యులను హెచ్వోడీలుగా నియమించడం చర్చనీయాంశమైంది. జర్నలిజంలో ఉన్న ముగ్గురు ప్రొఫెసర్లను కాదని ఇతర విభాగానికి చెందిన ఆచార్యుడిని విభాగాధిపతిగా చేయడం హాట్ టాపిక్గా మారింది. ఏయూలో తీసుకుంటున్న తికమక నిర్ణయాలు కారణంగా పాలన గాడి తప్పుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గురువారం ఏయూలో మూడు విభాగాలకు హెచ్వోడీలను నియమించారు. ఇందులో హిందీకి అదే విభాగానికి చెందిన ప్రొఫెసర్ను హెచ్వోడీగా పెట్టారు. మిగిలిన రెండు విభాగాలకు సంబంధం లేని వారిని హెచ్వోడీగా నియమించారు. జర్నలిజం విభాగాధిపతిగా పొలిటికల్ సైన్స్ ఆచార్యుడు పి.ప్రేమానందంకు అవకాశం కల్పించారు. వాస్తవానికి జర్నలిజం విభాగానికి ముగ్గురు సీనియర్ ఫ్యాకల్టీలు ఉన్నారు. వీరిలో ఒకరిని హెచ్వోడీగా నియమించే అవకాశముంది. కానీ వీరిని పక్కనపెట్టి పొలిటికల్ సైన్స్కు చెందిన హెచ్వోడీని నియమించడం గమనార్హం. అలాగే థియేటర్ ఆర్ట్స్ విభాగాధిపతిగా ఫైన్ ఆర్ట్స్ హెచ్వోడీ డి.సింహాచలంను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిద్దరూ తమ సొంత విభాగాలకు హెచ్వోడీలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక విభాగంలో విభాగాధిపతిగా పనిచేస్తున్న వారిని మరో విభాగానికి హెచ్వోడీగా నియమించడం కూడా వివాదాస్పదమవుతోంది. అతిథి అధ్యాపకుల నియామకాలకు ఇంటర్వ్యూలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో హడావుడిగా ఈ నియామకాలు జరగడం వెనుక ఆంతర్యం ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇది అనుచిత లబ్ధి చేయడానికా? లేదా అణిచివేయడానికా అని అతిథి అధ్యాపకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ప్రిన్సిపాల్ థియేటర్ ఆర్ట్స్, జర్నలిజానికి ఇన్చార్జ్ హెచ్వోడీగా వ్యవహరిస్తున్నారు. పనిభారం పెరిగిపోవడంతో పాటు వివిధ విభాగాలకు హెచ్వోడీలుగా బాధ్యతలు నిర్వహించడం ఆయనకు తలకు మించిన భారంగా మారింది. వర్సిటీ అధికారుల నుంచి కూడా సహకారం అంతంత మాత్రంగానే ఉండడంతో ప్రిన్సిపాల్ ఈ బాధ్యతల నుంచి తప్పుకోవాలనే ఉద్దేశంతో హెచ్వోడీల నియామకం జరిగిందని మరో వాదన వినిపిస్తోంది. -
అప్పన్న కొండపై రూ.10 వేలతో పెళ్లి
సింహాచలం: సింహాచలం దేవస్థానంలో వివాహాల నిమిత్తం డెకరేషన్ మండపాల నిర్వహణ బహిరంగవేలం ప్రక్రియను నిలుపుదల చేసినట్టు ఈవో వి.త్రినాథరావు ప్రకటించారు. ఎవరైనా ఆలయం పరిధిలో పెళ్లి చేసుకోవాలనుకుంటూ దేవస్థానానికి రూ.10 వేలు చెల్లించి, దేవస్థానం సూచించిన ప్రదేశాల్లో వివాహాలు చేసుకోవచ్చన్నారు. బయటి వ్యక్తులు/సంస్థల ద్వారా డెకరేషన్ మండపాలు, విద్యుద్దీపాలంకరణ జరిపించుకోవచ్చని పేర్కొన్నారు. వివాహ బృందాల నుంచి మండపాల కాంట్రాక్టర్ అధిక ధరలు వసూలు చేస్తుండటంతో భక్తులకు లబ్ధి చేకూర్చేందుకు డెకరేషన్ మండపాల లీజ్ విధానాన్ని నిలిపేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు ఉన్న డెకరేషన్ మండపాల నిర్వహణ కాంట్రాక్ట్ జూలై 31తో ముగిసిందన్నారు. కొండపై ఒకే సమ యంలో గజపతి సత్రంలో రెండు వివాహాలకు, పాదాలమ్మ–బంగారమ్మ ఆలయాల వద్ద ఉన్న పార్కింగ్ స్థలంలో మూడు, లోవ తోట వద్ద మూడు వివాహాలకు అనుమతి ఉంటుందన్నారు. భక్తులకు అసౌకర్యం లేకుండా ఈవో అనుమతితో ఆయన సూచించిన ప్రదేశాల్లో కూడా వివాహాలు చేసుకోవచ్చన్నారు. వివాహం ముగిసిన మూడు గంటల్లోపు ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుందన్నారు. దేవస్థానానికి చెల్లించే రూ.10 వేలుకు అదనంగా రూ.5 వేలు అడ్వాన్స్ కింద చెల్లించాలని పేర్కొన్నారు. శానిటేషన్ నిర్వహణకు రూ.2 వేలు, విద్యుత్ అదనపు లోడ్ ఆధారంగా కొంత మొత్తం మినహాయించుకుని మిగిలిన మొత్తం వాపసు చేయనున్నట్లు వెల్లడించారు. డెకరేషన్ మండపాల బహిరంగ వేలం నిలుపుదల -
వనితలదే!
వాణిజ్యంఐఐఎం విశాఖ ఎంబీఏ కోర్సులో రికార్డు స్థాయిలో మహిళలుదశాబ్ది కాలంలో ఇదే అత్యధికం 2015లో కోర్సులను ప్రారంభించిన తర్వాత ఐఐఎం విశాఖపట్నంలో పీజీపీ ఎంబీఏ కోర్సులో మహిళాధిక్యత పెరగడం ఇదే తొలిసారి. ఐఐఎంవీలో మిగిలిన అన్ని కోర్సుల్లో సీ్త్ర–పురుషుల అడ్మిషన్ బేధం 35 నుంచి 40 శాతం ఉండేది. 2015–16లో 10 నుంచి 15 శాతం మంది మహిళలు మాత్రమే కోర్సులో చేరారు. క్రమంగా ఈ అంతరం తగ్గుతూ వస్తోంది. మహిళల్ని ప్రోత్సహించేందుకు వుమెన్ స్టార్టప్స్, సూపర్ న్యూమరీ మొదలైన అవుట్ రీచ్ కార్యక్రమాలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తోంది. అందుకే 2025–26లో 52.16 శాతం మంది మహిళల ప్రవేశాల వెనుక ఐఐఎం అధికారుల శ్రమ ఎంతో ఉంది. ఐఐఎం కోజికోట్లో ఫుల్టైమ్ పీజీపీలో 51 శాతం మంది మహిళలు చేరారు. ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం లక్నోలో 30 శాతం మహిళలు అడ్మిషన్లు పొందారు. బాలికా విద్యకు కుటుంబాల్లో ప్రోత్సాహం పెరుగుతుండటం, రోల్మోడల్స్ను ఎంపిక చేసుకుని.. వారి లక్ష్యాలకు అనుగుణంగా అడుగులు వేయాలని మహిళల్లో సంకల్పం పెరగడం.. కార్పొరేట్ సెక్టార్లో పెరుగుతున్న డిమాండ్ వనితలను ఇటువైపుగా అడుగులు వేయిస్తోంది. సాక్షి, విశాఖపట్నం : ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్–విశాఖపట్నం(ఐఐఎంవీ) విభిన్న ఆలోచనలతో ముందుకెళ్తోంది. మహాత్మాగాంధీ నేషనల్ ఫెలోషిప్ పొందిన తర్వాత ఐఐఎంలో చేరేందుకు మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. 2015లో ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా ఐఐఎం విశాఖపట్నంలో ఫ్లాగ్షిప్ ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్లో నారీశక్తి పెరిగింది. 2025–27 విద్యా సంవత్సరంలో మహిళా విద్యార్థులు పైచేయి సాధించారు. ఇటీవలే కోర్సుకు సంబంధించి ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఎంబీఏలో మొత్తం 347 సీట్లుండగా 181 సీట్లు మహిళా అభ్యర్థులు పొందగా.. 166 సీట్లు పురుషులకు దక్కాయి. అంటే 52.16 శాతం సీట్లు వనితలకే దక్కినట్లయింది. ఇందులో 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన వారున్నారు. వాణిజ్య, మానవ వనరులు, మార్కెటింగ్, తదితర రంగాల్లో రాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. ● -
భూరాబంధులు
రాణి ఇచ్చిన స్థలంపై ● 1,500 గజాల స్థలం కబ్జాకు టీడీపీ కార్పొరేటర్ భర్త యత్నం ● షెడ్ల కూల్చివేతతో నిరాశ్రయులైన15 కుటుంబాలు ● అధికారుల ఎదుటే బాధితులపైటీడీపీ నేతల దౌర్జన్యం కంచరపాలెం: ‘అరవై ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం. మాకు రాణి గారు బతకమని ఇచ్చిన స్థలం ఇది. ఇప్పుడు ఉన్నట్టుండి వచ్చి.. మా పశువులను బయటకు గెంటేసి, షెడ్లను కూల్చేస్తే మేం ఎక్కడికి పోవాలి?’అంటూ జీవీఎంసీ 54వ వార్డు, బాపూజీనగర్కు చెందిన 15 కుటుంబాల ప్రజలు కన్నీరుమున్నీరయ్యారు. తరతరాలుగా తాము నివసిస్తున్న 1,500 గజాల స్థలాన్ని టీడీపీ కార్పొరేటర్ చల్లా రజినీ భర్త ఈశ్వరరావు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, తమకు న్యాయం చేయాలంటూ వారు మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జరిగిన జనవాణిలో ఫిర్యాదు చేశారు. పార్టీ ఆదేశాల మేరకు జనసేన ఉత్తర ఇన్చార్జి పి.ఉషాకిరణ్ గురువారం అధికారులతో ఇక్కడకు చేరుకుని బాధితులతో మాట్లాడారు. ‘మా పూర్వీకులకు సుమారు 60 ఏళ్ల కిందట బిల్లా చంద్రవతి అనే రాణి జీవనోపాధి కోసం సర్వే నంబర్ 60/1బిలో ఉన్న ఈ స్థలాన్ని రాసి ఇచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే చిన్న చిన్న షెడ్లు వేసుకుని, పశువులను పోషించుకుంటూ జీవిస్తున్నాం.’ అని బాధితులు తెలిపారు. అయితే కొన్నేళ్లుగా ఈ స్థలంపై కన్నేసిన చల్లా ఈశ్వరరావు, ఇతర రాజకీయ నాయకులు దీన్ని ఆక్రమించుకోవాలని చూడగా, ఐక్యంగా అడ్డుకున్నట్లు చెప్పారు. కాగా.. గత సోమవారం ఎన్.వి.నాగేశ్వరరావు అనే వ్యక్తితో పాటు, రెవెన్యూ, జీవీఎంసీ సిబ్బంది, పోలీసుల భారీ బందోబస్తుతో పాటు పలువురు బయటి వ్యక్తులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ‘కోర్టులో కేసు గెలిచాం. ఈ స్థలం 18 ఏళ్ల కిందటే కార్పొరేటర్ చల్లా రజినీ పేరు మీద రిజిస్టర్ అయింది’అని చెబుతూ, అక్కడున్న పశువులను బలవంతంగా బయటకు తరలించారు. వాళ్లు నివసిస్తున్న షెడ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు. దీంతో నిరాశ్రయులయ్యామని బాధితులు జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి రాము, పంచాయితీ పెద్దల వద్ద తమ గోడు వెళ్లబోసుకుంటుండగా.. కార్పొరేటర్ భర్త చల్లా ఈశ్వరరావు వారిపై దౌర్జన్యానికి దిగి, తీవ్ర వాగ్వాదం చేశారు. దీంతో బాధితులు భయాందోళనకు గురయ్యారు. ఈ సమస్యను విన్న జనసేన ఇన్చార్జి తహసీల్దార్తో మాట్లాడి.. పూర్తి నివేదిక తెప్పించుకుని, బాధితులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అయితే.. కూటమి ప్రభుత్వంలో భాగమైన టీడీపీ నేత దౌర్జన్యంపై.. మిత్రపక్షమైన జనసేన నాయకులు విచారణ జరిపి తీర్పు చెబుతామనడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అధికారుల అండతో రౌడీయిజం 18 ఏళ్ల కిందట రిజిస్ట్రేషన్ చేసుకున్నామని చెబుతూ.. 18 రోజులుగా 15 కుటుంబాలను అధికారులు, పోలీసుల అండతో రౌడీలను పెట్టి రోడ్డున పడేశారు. కూటమి ప్రభుత్వంలో రౌడీయిజం ఎంతగా పెరిగిపోతోందో మా కుటుంబాలు రోడ్డున పడటమే నిదర్శనం. గతంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్గా ఎన్నికై .. ఇప్పుడు టీడీపీలో చేరి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి మాకు న్యాయం చేయాలి. – బసవ అప్పలకొండ, బాధిత మహిళ 60 ఏళ్ల స్థలంపై టీడీపీ కన్ను టీడీపీ కార్పొరేటర్ భర్త చల్లా ఈశ్వరరావు రౌడీలతో దౌర్జన్యానికి పాల్పడ్డారు. 60 ఏళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న మా స్థలంపై టీడీపీ నాయకులు కన్నేశారు. ఈ స్థలాన్ని కోర్టులో గెలుచుకున్నామని చెబుతూ.. టీడీపీ నాయకుల పేరుతో రౌడీలను తీసుకొచ్చి, ఇక్కడ ఉన్న సామగ్రిని, పశువులను, మొక్కలను తొలగించి స్థలానికి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. పోలీసులను ఆశ్రయిస్తే కోర్టులో తేల్చుకోండి అంటూ రాజకీయ నాయకులకు మద్దతుగా వ్యవహరించారు. ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి గతంలో కూడా రౌడీలతో బెదిరించారు. – గుజ్జు పైడిరాజు, బాధితుడు, బాపూజీనగర్, 104 ఏరియా -
ఆ.. టీచర్లకు కూటమి ఝలక్!
ఆరిలోవ: మండల విద్యాశాఖాధికారుల(ఎంఈవో) నియామకాల విషయంలో కూటమి ప్రభుత్వం జిల్లా పరిషత్, మున్సిపల్, కేజీబీవీ ఉపాధ్యాయులకు ఝలక్ ఇచ్చింది. కేవలం ప్రభుత్వ యాజమాన్యంలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు(హెచ్ఎంలు), స్కూల్ అసిస్టెంట్లకు మాత్రమే ఎంఈవో–1 పోస్టులకు అవకాశం కల్పిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఉమ్మడి సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించడం, తమకు అన్యాయం చేయడమేనని జెడ్పీ, మున్సిపల్ హైస్కూళ్లు, కేజీబీవీ వంటి పాఠశాలల్లో పనిచేస్తున్న హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్కు గండి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతి మండలంలో ఎంఈవో–1, ఎంఈవో–2 పోస్టులను ఏర్పాటు చేసింది. దీని కింద ఉమ్మడి విశాఖ జిల్లాలోని 46 మండలాల్లో 92 మంది ఎంఈవోలు నియమితులయ్యారు. ప్రస్తుత విశాఖ జిల్లా పరిధిలోని 11 మండలాల్లో 22 మంది విధుల్లో ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న హెచ్ఎంలు, సీనియర్ స్కూల్ అసిస్టెంట్లకు మాత్రమే ఎంఈవో పోస్టులకు అవకాశం కల్పించారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసి, వివరాలు సేకరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయం వల్ల జెడ్పీ, మున్సిపల్, కేజీబీవీ వంటి ఇతర యాజమాన్యాల కింద పనిచేస్తున్న అర్హులైన ఉపాధ్యాయులు పదోన్నతి అవకాశాన్ని కోల్పోతారు. 2017లో అనుసరించిన విధంగానే కామన్ సీనియార్టీ ఆధారంగా ఎంఈవో పోస్టులను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం జెడ్పీ, మున్సిపల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ జిల్లా ఎంపిక కమిటీ(డీఎస్సీ) ద్వారా నియమితులైనవారే. వారందరిలో సీనియార్టీ ప్రకారం హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు ఎంఈవో పోస్టులకు అర్హులు. అయినప్పటికీ కామన్ రూల్స్ పాటించకుండా కేవలం ప్రభుత్వ పాఠశాలల వారికే అవకాశం ఇవ్వడం ద్వారా ప్రభుత్వం తమపై వివక్ష చూపుతోందని ఇతర యాజమాన్య ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. కాగా.. ప్రస్తుతం ఉమ్మడి విశాఖ జిల్లాలో పని చేస్తున్న ఎంఈవోలందరూ పూర్తిస్థాయి అదనపు బాధ్యతల(ఎఫ్ఏసీ) కిందనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో అన్ని యాజమాన్యాలకు చెందిన 297 ఉన్నత పాఠశాలలు ఉండగా, వాటిలో ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు కేవలం 31 మాత్రమే. ఈ 31 పాఠశాలల్లోని కొద్ది మందికి మాత్రమే ఎంఈవోలుగా అవకాశం కల్పిస్తూ.. మిగిలిన 266 పాఠశాలల్లో పని చేస్తున్న వేలాది మంది ఉపాధ్యాయులను విస్మరించడం సరికాదని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ యాజమాన్య హైస్కూల్ హెచ్ఎం, ఎస్ఏలకు మాత్రమే ఎంఈవోలుగా అవకాశం రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ మిగిలిన యాజమాన్య టీచర్లపై వివక్ష ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం అన్ని మేనేజ్మెంట్లకు అవకాశం కల్పించాలి అన్ని మేనేజ్మెంట్లకు చెందిన ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న హెచ్ఎంలకు, సీనియర్ స్కూల్ అసిస్టెంట్లకు ఎంఈవో–1గా అవకాశం కల్పించాలి. వారిని కూడా పూర్తిస్థాయి ఎంఈవోలుగా నియమించాలి. అలాంటప్పుడే మంచి విద్యా విధానం కొనసాగుతుంది. ఎఫ్ఏసీ బాధ్యతల వల్ల సక్రమంగా విధులు నిర్వహించక సరైన విద్యా ఫలితాలు రావడం లేదు. ప్రభుత్వం పునరాలోచించాలి. – గోపీనాథ్, పీఆర్టీయూ ఉమ్మడి విశాఖ జిల్లా కన్వీనర్ సీనియార్టీ ద్వారా భర్తీ చేయాలి ఎంఈవో–1 పోస్టులను ఉమ్మడి సీనియార్టీ ద్వారా మాత్రమే భర్తీ చేయాలి. ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తున్న హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్ల వివరాలు మాత్రమే సేకరించడం సరికాదు. ఉమ్మడి సర్వీస్ రూల్స్కు సంబంధించిన జీవో అమలు చేయాల్సి ఉండగా.. దాన్ని పక్కనపెట్టి ప్రభుత్వ అధికారులు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలి. –టి.ఆర్.అంబేడ్కర్, యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి, విశాఖ జిల్లా జెడ్పీ టీచర్లపై ఎందుకు వివక్ష? ప్రభుత్వ యాజమాన్యంలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు ఎంఈవో–1 బాధ్యతలు అప్పగించడం సరికాదు. ఇది జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులపై వివక్ష చూపడమే అవుతుంది. సర్వీస్ రూల్స్ సమస్య కారణంగా రెండు దశాబ్దాలుగా జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు వివక్షకు గురవుతున్నారు. ప్రస్తుతం గైడ్లైన్స్ ప్రకారం ప్రభుత్వ యాజమాన్యంలోని జూనియర్లు కూడా ఎంఈవోలు అవుతారు. సీనియర్లయిన జెడ్పీ హై స్కూల్ ఉపాధ్యాయులు మాత్రం పదోన్నతి కోల్పోతారు. – ఇమంది పైడిరాజు, ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి, విశాఖ -
స్టాళ్ల కేటాయింపులో పారదర్శకత
విశాఖ విద్య: జిల్లాలోని రైతుబజార్లలో డ్వాక్రా, దివ్యాంగులకు సంబంధించిన స్టాళ్ల కేటాయింపును నిబంధనల మేరకు పారదర్శకంగా నిర్వహిస్తామని మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జి.శ్రీనివాస కిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 28న ‘రైతు బజార్లపై కూటమి గద్దలు’అనే శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. జిల్లాలోని రైతుబజార్లలో డ్వాక్రా, దివ్యాంగుల కోసం కేటాయించిన 100 స్టాళ్ల గడువు ముగియడంతో.. వాటి నిర్వహణకు కొత్త లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్లు శ్రీనివాస కిరణ్ వివరించారు. ఈ స్టాళ్ల కోసం మొత్తం 580 దరఖాస్తులు అందినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం విశాఖ, అనకాపల్లి జిల్లాల పరిధిలోని డీఆర్డీఏ, జీవీఎంసీ యూసీడీ, వికలాంగుల శాఖ ఆధ్వర్యంలో దరఖాస్తుల పరిశీలన జరుగుతోందన్నారు. పరిశీలన పూర్తయిన తర్వాత, జిల్లా జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో కలెక్టర్ కార్యాలయంలో లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని శ్రీనివాస కిరణ్ స్పష్టం చేశారు. -
రూ.1.7 కోట్ల భూమికి ఎసరు!
మధురవాడ: విశాఖ రూరల్ మండలం మధురవాడ ప్రాంతంలో ఇప్పటివరకూ ప్రభుత్వ భూముల ఆక్రమణలు ఎక్కువగా విన్నాం. అయితే తాజాగా వుడా ఆమోదిత లేఅవుట్లో ఉన్న ఖాళీ స్థలాలను, గెడ్డలను సైతం నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కొట్టేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధురవాడ రెవెన్యూ గ్రామంలోని సర్వే నం. 281/పీ, 282/పీ, 284/పీ, 300/పీ, 302/పీ, 303/పీ, 305/పీ, 306/పీ, 610/పీ వంటి నంబర్లలో 1990 ప్రాంతంలో షిప్యార్డు ఉద్యోగుల కోసం బింద్రానగర్లో సుమారు 24.48 ఎకరాల్లో 268 ప్లాట్లతో ఒక లేఅవుట్ ఏర్పాటు చేశారు. ఇందులో రోడ్లు, పార్కులతో పాటు కాలువలు, గెడ్డలు వంటి బహిరంగ స్థలాలు కూడా ఉన్నాయి. కొందరు వ్యక్తులు ఈ ఖాళీ స్థలాలకు, గెడ్డలకు ప్లాట్ నంబర్లకు అదనంగా పీ చేర్చి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించినట్లు సమాచారం. 211పీ ప్లాట్ నంబరుతో సుమారు రూ.1.75 కోట్ల విలువైన 267 గజాల స్థలాన్ని కాజేశారు. కొందరు వ్యక్తులు ఒక వృద్ధుడిని ముందు పెట్టి ఈ నకిలీ డాక్యుమెంట్లను సృష్టించడమే కాకుండా, జీవీఎంసీ నుంచి అక్రమంగా ప్లాన్ పొంది కొద్ది రోజులుగా చకచకా నిర్మాణ పనులు కూడా మొదలుపెట్టారు. అయితే టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఈ పనులను నిలుపుదల చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అధికారుల పాత్ర : ఈ అక్రమాల్లో ఓ జీవీఎంసీ సర్వేయర్ సహకారం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అతని సహకారంతోనే తప్పుడు సర్వే రిపోర్టులు సృష్టించి, రిజిస్ట్రేషన్ చేయించడమే కాకుండా, ప్లాన్ను కూడా పొందారని సమాచారం. ఈ తప్పుల్లో భాగస్వాములైన జీవీఎంసీ అధికారులు తాము ఎక్కడ బయటపడతామోనని ఆచుతూచి వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఈ విషయం బయటకు రాకుండా వారు సామ, దాన, దండోపాయాలను ప్రయోగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు ఈ స్థలంలో ఇలాంటి మరికొన్ని నిర్మాణాలు కూడా ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. పనులు నిలుపుదల చేయించిన అధికారులు తప్పుడు పత్రాలతో గెడ్డ, ఖాళీ స్థలాల ఆక్రమణ బెదిరింపులకు దిగుతున్న ముఠా ఈ అక్రమాలకు పాల్పడిన వ్యక్తులు కొందరు ముఠాగా ఏర్పడి, ఈ వ్యవహారాన్ని ఎవరైనా బయటపెడితే అంతు చూస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. పోలీసు కేసులు పెడతామని, వారు ఎంతటివారైనా వదిలిపెట్టబోమని బెదిరింపులకు దిగుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగస్వాములైన అధికారులనూ బయటకు లాగుతామంటూ ప్రచారం చేస్తున్నట్లు కూడా సమాచారం. ఈ విషయంలో ఉన్నత స్థాయి అధికారులు తక్షణమే స్పందించి, తగు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
పరిశ్రమల నిర్వహణకు పూర్తి సహకారం
మహారాణిపేట: జిల్లాలో పరిశ్రమల నిర్వహణకు, కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం నుంచి పూర్తి సహకారం ఉంటుందని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ పారిశ్రామికవేత్తలకు హామీ ఇచ్చారు. గురువారం కలెక్టరేట్ మీటింగు హాలులో జరిగిన డీఐఈపీసీ (డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్పోర్టు అండ్ ప్రమోషన్ కమిటీ) సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీఐఐసీ ద్వారా కేటాయించిన భూముల్లో నిర్వాహకులు నిర్ణీత సమయంలోనే పరిశ్రమలు నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆటోనగర్, ఐటీ హిల్స్ ప్రాంతాల్లో ప్రత్యేక బస్ స్టాప్లు ఏర్పాటు చేయాలని, ఆటోనగర్లో దుమ్ము, ధూళి రేగకుండా యజమానులు, అధికారులు సంయుక్తంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఐలా ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు.. ఐలా పరిధిలో సోలార్ యూనిట్ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. వడ్లపూడి వద్ద ఆర్వోబీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వచ్చిన దరఖాస్తులకు వేగంగా పరిష్కారం చూపాలని, తూనికలు కొలతలు శాఖ అధికారులు వే బ్రిడ్జిలను తనిఖీ చేయాలని చెప్పారు. పీ–4 కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ హరేందిర ప్రసాద్ పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఆదిశేషు, ఫ్యాక్టరీల చీఫ్ ఇన్స్పెక్టర్ సురేశ్ కుమార్, ఏపీఐఐసీ జెడ్ఎం సింహాచలం, పీసీబీ ఈఈ ముకుందరావు, వివిధ విభాగాల అధికారులు, పాల్గొన్నారు. -
తొలి మ్యాచ్లో టైటాన్స్తో తలైవాస్ ఢీ
ఈ నెల 29 నుంచి ప్రో కబడ్డీ ప్రారంభం విశాఖ స్పోర్ట్స్: ప్రో కబడ్డీ 12వ సీజన్ ఈ నెల 29న పోర్ట్ స్టేడియంలో ప్రారంభం కానుంది. రాత్రి 8 గంటలకు జరిగే ఆరంభ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ జట్టు తమిళ తలైవాస్తో తలపడనుంది. ఏడేళ్ల విరామం తర్వాత విశాఖ మరోసారి ప్రో కబడ్డీ పోటీలకు ఆతిథ్యం ఇస్తోంది. ప్రస్తుత సీజన్లో తొలి విడత మ్యాచ్లు ఇక్కడే జరగనున్నాయి. తెలుగు టైటాన్స్ తమ రెండో మ్యాచ్ను ఈ నెల 30న యూపీ యోధాస్తో ఆడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 7న బెంగాల్ వారియర్స్తో, 10న యు ముంబాతో విశాఖ వేదికగానే తలపడనుంది. ప్రో కబడ్డీ ప్రారంభ సీజన్ను తెలుగు టైటాన్స్ విశాఖపట్నం నుంచే మొదలుపెట్టింది. ఆ తర్వాత తమ హోమ్ గ్రౌండ్ను హైదరాబాద్కు మార్చింది. మధ్యలో మూడో, ఎనిమిదో సీజన్లకు విశాఖ ఆతిథ్యం ఇచ్చింది. ఈ సీజన్లో మొత్తం 12 జట్లు రౌండ్ రాబిన్ పద్ధతిలో తలపడనున్నాయి. తొలి విడత పోటీలు విశాఖపట్నంలో జరగనుండగా, తదుపరి విడత పోటీలు జైపూర్, చైన్నె, ఢిల్లీల్లో నిర్వహించనున్నారు. లీగ్ దశ ముగిసిన తర్వాత ప్లేఆఫ్ మ్యాచ్లు జరుగుతాయి. -
అత్యుత్తమ ఫీచర్లతో వివో సరికొత్త ఫోన్లు
ఏయూక్యాంపస్: అత్యుత్తమ ఫీచర్లతో కూడిన సరికొత్త మొబైల్ ఫోన్లను వివో.. మార్కెట్లోకి విడుదల చేసింది. బీచ్రోడ్డులోని ఓ హోటల్లో గురువారం జరిగిన కార్యక్రమంలో వివో తమ కొత్త ఎక్స్ 200 ఎఫ్ఈ, ఎక్స్ ఫోల్డ్ 5 మోడళ్లను ఆవిష్కరించింది. సెల్ పాయింట్ ఎండీ మోహన్ ప్రసాద్ పాండే, డైరెక్టర్ బాలాజీ పాండేలతో కలిసి వివో ప్రతినిధి మీర్ మెహిద్ వీటిని లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి నటి సౌమ్య రావు, మోడల్ అంకిత ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివో ప్రతినిధి మీర్ మెహిద్ మాట్లాడుతూ వినియోగదారులే తమ సంస్థకు అత్యంత ప్రధానమన్నారు. సెల్ పాయింట్ తమకు కీలక భాగస్వామిగా నిలుస్తోందని వెల్లడించారు. సెల్ పాయింట్ ఎండీ మోహన్ ప్రసాద్ పాండే మాట్లాడుతూ దశాబ్ద కాలంగా వివోతో తమ అనుబంధం కొనసాగుతోందన్నారు. వివో అత్యుత్తమ సేవలతో వినియోగదారుల అభిమానాన్ని చూరగొంటుందని ప్రశంసించారు. ప్రారంభ ఆఫర్లో భాగంగా వివిధ క్రెడిట్ కార్డులపై డిస్కౌంట్లు, నో కాస్ట్ ఈఎంఐ, జీరో డౌన్ పేమెంట్ వంటి సదుపాయాలను కల్పిస్తున్నట్లు వెల్లడించారు. వి డ్రీమ్ డీజీఎం వసంత్ రెడ్డి మాట్లాడుతూ సెల్ పాయింట్తో బలమైన అనుబంధం ఉందన్నారు. సీనియర్ ఆర్ఎం ఈశ్వర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వివోకు 15 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారని తెలిపారు. అత్యుత్తమ కెమెరా ఫీచర్లతో ఫోన్లు అందుబాటులో ఉంచామని వివరించారు. కార్యక్రమంలో ఏజీఎం సతీష్, ఏపీ సేల్స్ హెడ్ షేక్ ఆజాద్, సెల్ పాయింట్ ఏఎస్ఎంలు గోవింద్, వెంకటేష్, దినేష్ పాండే తదితరులు పాల్గొన్నారు. -
ఐటీ డెవలప్మెంట్ పేరిట విశాఖలో దోపిడీ: బొత్స
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కొనసాగుతున్న అరాచక పాలనపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కూటమి పాలనలో జరుగుతున్న విశాఖ దోపిడీతో పాటు సమకాలీన రాజకీయ అంశాలపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇష్టానుసారం హత్యలు జరుగుతున్నాయి. గత ఐదేళ్లలో కన్నా.. ఈ ఒక్క ఏడాదిలో కాలంలోనే క్రైమ్ రేటు ఎంతో పెరిగింది. కూటమి నేతల్లో అసహనం పెరిగిపోతోంది. మంత్రులు అలా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. జగన్ నెల్లూరు పర్యటనకు వెళ్తే.. కార్యకర్లు రాకుండా రోడ్లు తవ్వారు అని అన్నారాయన.ఎన్నికల్లో ఇచ్చిన హామీలకే దక్కులేదు. కానీ.. కొత్తగా డేటా సెంటర్లు తెచ్చినట్లు చెప్పుకోవడం ఏంటి?. లులు సంస్థకు భూముల విషయంలో లాలూచీ పడ్డారు. రూ.1,500 కోట్ల విలువైన స్థలాన్ని ఆ కంపెనీకి 99 ఏళ్లకు అప్పగిస్తున్నారు. కానీ, అందులో సగం పెట్టుబడి కూడా రాదు. అసలు కూటమి ప్రభుత్వానికి ఏమైనా ఆలోచన ఉందా?. అలాగే టీసీఎస్కు అప్పన్నంగా భూములు కట్టబెడుతున్నారు. డేటా సెంటర్ మేం పెట్టలేదా?. వైజాగ్లో ఐటీ సెంటర్ను ప్రొత్సహించింది డాక్టర్ వైఎస్సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో విశాఖలో దోపిడీ జరుగుతోంది అని అన్నారాయన. చట్టానికి వ్యతిరేకంగా ఎవరిని మేం సమర్థించబోం. రోజా గురించి ఎలా మాట్లాడారో అంతా చూశారు. కానీ, కూటమి నుంచి తప్పని ఎవరైనా అన్నారా? అని బొత్స నిలదీశారు. -
'నకిలీ మద్యం' చెన్నై To విశాఖ!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : 1000 ఎంఎల్.. ఫుల్ బాటిల్.. అంటే మద్యం ప్రియులకు పండగే. అందులోనూ డిఫెన్స్ బాటిల్ అంటే ఎంత ధర అయినా కొనుగోలు చేద్దామనే ఆలోచన!. ఇంట్లో పార్టీ ఉన్నా.. పండగ ఉన్నా... ఇంటికి బంధువులు, స్నేహితులు వస్తే డిఫెన్స్ బాటిల్ ఇచ్చి ఖుషీ చేద్దామనుకుంటారు.. సరిగ్గా దీన్నే పక్కాగా క్యాష్ చేసుకుంటోంది విశాఖ నగరంలోని అక్కయ్యపాలెంకు చెందిన వెంకటేష్ పిళ్లై టీం. చెన్నైలోని బర్మాకాలనీకి చెందిన ఓ టీం ఖరీదైన బ్రాండ్ మద్యం ఖాళీ సీసాలను సేకరించి.. అందులో మాములు బ్రాండ్ మద్యాన్ని నింపి.. ఖరీదైన మద్యంగా సరఫరా చేస్తోంది. వీరితో సంబంధాలు నెరుపుకుంటూ అక్కడ నుంచి మద్యాన్ని దిగుమతి చేసుకుంటూ విశాఖలో డిఫెన్స్ మద్యం పేరుతో విక్రయించి భారీగా దండుకుంటోంది వెంకటేష్ పిళ్లై బృందం. చెన్నై నుంచి ట్రావెల్స్ ద్వారా ఈ మద్యాన్ని తరలిస్తుండడం విశేషం. లావాదేవీలన్నీ ఫోన్ పే, బ్యాంక్ అకౌంట్ల ద్వారా నిర్వహిస్తుండటం గమనార్హం. ఇందులో ఇప్పటికే చెన్నైకు చెందిన ముగ్గురిలో ఇద్దరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. వెంకటేష్ పిళ్లైను కూడా అరెస్టు చేసి జైలుకు తరలించారు. లోతుగా విచారించేందుకు నేటి నుంచి వెంకటేష్ పిళ్లైను ఎక్సైజ్ పోలీసులు కస్టడీలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. బాటిలింగ్ యూనిట్ను ఏర్పాటుచేసుకొని.. చెన్నైలోని బర్మా కాలనీకి చెందిన ముఠా సభ్యులు పలు ప్రాంతాల నుంచి ఖరీదైన బ్రాండ్ మద్యం ఖాళీ సీసాలను సేకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని దాదాపుగా అన్ని జిల్లాల నుంచి ప్రీమియం బ్రాండ్ ఖాళీ సీసాలను అక్కడకు తరలిస్తున్నారు. అనంతరం పాండిచ్చేరి నుంచి తక్కువ ధరకు లభించే మద్యాన్ని (సాధారణ ఇతర బ్రాండ్లు) తీసుకొచ్చి ఈ ఖాళీ సీసాల్లో నింపేస్తున్నారు. ఇందుకోసం బాటిలింగ్ యూనిట్ను అక్కడ ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది. అనంతరం ఆర్డర్లకు అనుగుణంగా ఆయా ప్రాంతాలకు వీటిని తరలిస్తున్నారు. తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన వెంకటేష్ పిళ్లై.. ఈ ముఠాతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి ఈ మద్యాన్ని ఇక్కడకు తరలిస్తున్నారు. అయితే వెంకటేష్ పిళ్లై గత 20 సంవత్సరాలుగా అక్కయ్యపాలెంలోనే నివాసం ఏర్పాటు చేసుకుని స్థిరపడ్డారు. అంతేకాకుండా అక్కడి నుంచి నకిలీ మద్యాన్ని తెచ్చిన తర్వాత.. కొన్నింటిలో నీటిని కూడా నింపి యథావిధిగా సీల్ వేసి విక్రయిస్తున్నట్టు విచారణలో తేలింది. ఫోన్ పే, బ్యాంక్ అకౌంట్ల ద్వారానే లావాదేవీలు కోయంబత్తూరు నుంచి విశాఖకు 20 ఏళ్ల క్రితం వచ్చిన వెంకటేష్ పిళ్లై మొదటి నుంచీ ఈ నకిలీ మద్యం సరఫరాలో ఆరితేరారు. గతంలోనూ ఇతనిపై పలుసార్లు కేసులు నమోదయ్యాయి. చెన్నైకు చెందిన ఇషాక్, మహమ్మద్ నిస్సార్ అహమ్మద్తో పాటు మహమ్మద్ సాధిక్ భాష ఒకే కుటుంబానికి చెందినవారు. వీరు ఏపీలోని దాదాపు అన్ని జిల్లాల నుంచి ఖరీదైన మద్యం ఖాళీ సీసాలను సేకరిస్తున్నారు. ఆయా జిల్లాల్లో ఈ వ్యాపారం చేసే వారితో సంబంధాలు పెట్టుకుని.. చెన్నైలోని బర్మా కాలనీకి చెందిన తమకే విక్రయించేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. అక్కడి నుంచి ఖరీదైన మద్యం పేరుతో నింపిన బాటిల్స్ను తమకు వచ్చే ఆర్డర్లకు అనుగుణంగా ట్రావెల్స్ ద్వారా తరలిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఆర్డర్లకు అనుగుణంగా తమకు రావాల్సిన మొత్తాన్ని ఫోన్ పే, బ్యాంక్ అకౌంట్ల ద్వారానే లావాదేవీలు నిర్వహిస్తున్నారు. రూ.వెయ్యి తగ్గించామని కలరింగ్ ఇస్తూ.. 1000 ఎంఎల్ బాటిల్ను రూ.500కే తయారుచేస్తున్న ఈ ముఠా రూ.4 వేలు చొప్పున విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. అంతిమంగా బయట మార్కెట్లో రూ.5 వేల విలువ చేసే బాటిల్ను రూ.4 వేలకే విక్రయిస్తున్నామంటూ నకిలీ మద్యాన్ని ఖరీదైన మద్యంగా అంటగడుతున్నారు. బయటి మార్కెట్ కంటే రూ.వెయ్యి ధర తగ్గడమే కాకుండా.. అంత సులువుగా దొరకని డిఫెన్స్ మద్యం తమకు వస్తోందని భావిస్తున్న కొందరు వెంకటేష్ పిళ్లై నుంచి ఆర్డర్లు పెట్టి మరీ తీసుకుంటుండటం గమనార్హం. తాజాగా అక్కయ్యపాలెంలో పట్టుబడిన ఈ మద్యాన్ని పరీక్షల కోసం ల్యాబ్కు పంపగా.. ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించే పదార్థాలు కూడా ఇందులో కలిసి ఉన్నట్టు ల్యాబ్ నివేదికలో తేలింది. ఇందులో పాండిచ్చేరి మద్యంతో పాటు ఇంకా ఏమైనా రసాయనాలు కలుపుతున్నారా? అనేది కూడా తేలాల్సి ఉంది. -
ఏషియన్ రోలర్ స్కేటింగ్లో దినేష్ సత్తా
తగరపువలస: దక్షిణ కొరియాలో ఈ నెల 29న జరిగిన 20వ ఏషియన్ రోలర్ స్కేటింగ్ పోటీల్లో ఆనందపురం మండలం వెల్లంకి గ్రామ పంచాయతీకి చెందిన గొలగాని దినేష్ రెండు రజత పతకాలు సాధించి తన సత్తా చాటాడు. ఆర్టిస్టిక్, వ్యక్తిగత విభాగాల్లో ఈ పతకాలు సాధించడం విశేషం. 2023లో చైనాలో జరిగిన 19వ ఏషియన్ రోలర్ స్కేటింగ్లో కూడా దినేష్ రజత పతకం సాధించాడు. ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో 6 బంగారు, రాష్ట్ర స్థాయిలో 15 బంగారు, జిల్లా స్థాయిలో 18 బంగారు పతకాలు సాధించి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. తల్లిదండ్రులు, కోచ్ల ప్రోత్సాహంతోనే ఈ స్థాయిలో చేరుకున్నానని దినేష్ తెలిపాడు. మధురవాడలో 10వ తరగతి చదువుతున్న దినేష్ భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించడం తన లక్ష్యమని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా దినేష్ను కోచ్లు సత్యం, చిట్టిబాబు అభినందించారు. క్షేత్రకు రజతం ఎంవీపీకాలనీ: సౌత్ కొరియాలో జరిగిన రోలర్ స్కేటింగ్ పోటీల్లో నగరానికి చెందిన శివకోటి క్షేత్ర ప్రతిభ చూపింది. ఎంవీపీ కాలనీలోని లిటిల్ ఏంజెల్స్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న క్షేత్ర ఈ పోటీల్లో రజతం సాధించింది. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం, కుటుంబ సభ్యులు క్షేత్రను అభినందించారు. ఇప్పటి వరకు క్షేత్ర 21 జాతీయ మెడల్స్తో సహా 70 పతకాలు సాధించింది. -
కొత్త కార్డులకు కొర్రీలు
● కార్డుల కోసం వేలల్లో దరఖాస్తులు ● సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు ● చుక్కలు చూపిస్తున్న నిబంధనలు ● కార్డుల్లో మార్పులు, చేర్పులకు నో ఆప్షన్మహారాణిపేట: ఎన్నికల ముందు అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు దరఖాస్తుదారులకు కఠిన నిబంధనలతో గట్టి షాక్ ఇస్తోంది. కొత్త కార్డులు వస్తాయన్న ఆశతో సచివాలయాలకు పరుగులు తీస్తున్న వేలాది మందికి అక్కడి నిబంధనలు చూసి నిరాశే ఎదురవుతోంది. దరఖాస్తు ప్రక్రియలో ఎదురవుతున్న అడ్డంకులు, సాఫ్ట్వేర్ సమస్యలతో అర్హులు సైతం అనర్హులుగా మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది తర్వాత కొత్త కార్డుల దరఖాస్తుకు అవకాశం కల్పించింది. అయితే ప్రభుత్వం విధించిన పలు నిబంధనలు దరఖాస్తుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒక కార్డులో తల్లిదండ్రులు, కుమారుడు ఉండి.. కుమారుడికి వివాహమైతే కొత్త కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి వీలు లేదు. కుమారుడిని ప్రస్తుత కార్డు నుంచి తొలగించడం లేదా కుమారుడు, కోడలి పేరిట కొత్త కార్డు ఇవ్వడానికి నిబంధనలు అడ్డుపడుతున్నాయి. తొలగింపు, చేర్పులకు సాఫ్ట్వేర్లో ఆప్షన్ లేదు. ఇదే పరిస్థితి వివాహమైన కుమార్తెల విషయంలోనూ ఉంది. దీంతో కొత్త జంటలు కార్డులు పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఒక కార్డులోని కుమారుడు లేదా కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగం వస్తే.. ఆ కుటుంబంలో ఎవరికీ ప్రభుత్వ పథకాలు వర్తించడం లేదు. తల్లిదండ్రులకు ప్రభుత్వ పింఛన్లు, ఇతర పథకాలు కూడా నిలిచిపోతున్నాయి. ఇది వారిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కొత్త రేషన్ కార్డు కోసం కరెంటు బిల్లు తప్పనిసరి చేశారు. ఎప్పుడైనా పొరపాటున అధిక బిల్లు వచ్చినా, వారి దరఖాస్తును తిరస్కరిస్తున్నారు. ఆ బిల్లును విద్యుత్ కార్యాలయంలో సరిచేయించుకుని వచ్చే వరకు దరఖాస్తుకు అవకాశం లేకుండా పోతోంది. భార్యాభర్తల ఆధార్ కార్డులలో వేర్వేరు చిరునామాలు ఉంటే, వారి దరఖాస్తు ముందుకు సాగడం లేదు. ఇద్దరి చిరునామాలను ఒకే ప్రాంతానికి మ్యాపింగ్ చేస్తేనే కార్డుకు దరఖాస్తు చేసుకునే వీలు కలుగుతోంది. ఈ కఠిన నిబంధనలకు తోడు, సర్వర్ సమస్యలు దరఖాస్తుదారులకు తలనొప్పిగా మారాయి. గంటల తరబడి వేచి ఉన్నా సర్వర్ డౌన్ లేదా ఈ ఆప్షన్ లేదు అనే సమాధానమే సచివాలయ సిబ్బంది నుంచి వస్తోంది. దీనిపై ఏమి చేయాలో తెలియని సిబ్బంది, దరఖాస్తుదారులను కలెక్టరేట్లోని సివిల్ సప్లైస్ కార్యాలయానికి పంపుతున్నారు. అక్కడికి వెళ్తే, తిరిగి సచివాలయంలోనే నమోదు చేసుకోవాలని చెప్పడంతో ప్రజలు అటూ ఇటూ తిరుగుతూ తీవ్ర అసహనానికి గురవుతున్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఆగస్టు 25 నుంచి కొత్త కార్డులు ఇస్తామని ప్రకటించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తే అది ఎంతవరకు సాధ్యమవుతుందనే దానిపై సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఈ అడ్డగోలు నిబంధనలను సడలించి, సాఫ్ట్వేర్లో అవసరమైన మార్పులు చేస్తేనే కొత్త కార్డుల జారీ సాధ్యమవుతుంది. లేకపోతే పేదల ఆశలు అడియాసలుగానే మిగిలిపోతాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వాల్తేర్ డివిజన్ తొలి క్వార్టర్లో 12.25 శాతం వృద్ధి
తాటిచెట్లపాలెం: వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం లలిత్ బోహ్ర బుధవారం దొండపర్తిలోని డీఆర్ఎం కార్యాలయం సమావేశ మందిరంలో సరకు రవాణా ఖాతాదారులు, వ్యాపార భాగస్వాములతో సమావేశమయ్యారు. నూతన వ్యాపార పద్ధతులు, పరస్పర సహకారం, సరైన సరకు రవాణాలో మెరుగైన పద్ధతులు, శక్తివంతమైన సమాచార వ్యవస్థ వంటి అంశాలపై చర్చించారు. వాల్తేర్ డివిజన్ ఈ సంవత్సరం ఇంతవరకు మొదటి క్వార్టర్లో 12.25 శాతం వృద్ధి సాధించినట్లు తెలిపారు. వైజాగ్ సీ పోర్ట్, గంగవరం పోర్టు, సెయిల్, వేదాంత, ఐటీఎల్, బోత్ర, హెచ్ఐక్యూ సర్విస్, కేఆర్ అండ్సన్స్, భూషణ్ పవర్, ఉత్కల అల్యూమినా, నాల్కో, కాంకోర్, కోరమాండల్ ఫెర్టిలైజర్స్, ఇండియా ఫాస్పేట్ లిమిటెడ్, ఆర్ిసీఎల్ కంపెనీల ప్రతినిధులతో పాటు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ తన్మయ్ ముఖోపాధ్యాయ్, సీనియర్ డీసీఎం సందీప్, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
జీతాలు మహాప్రభో!
జిల్లాలో ఇటీవల బదిలీ అయిన ప్రభుత్వ ఉపాధ్యాయులు, రెవెన్యూ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. బదిలీ ప్రక్రియ పూర్తి చేసుకుని కొత్త స్థానాల్లో విధుల్లో చేరినప్పటికీ.. జీతాలు చెల్లించకుండా అవస్థల పాల్జేస్తోంది. జూన్ నెల జీతం ఇప్పటికీ జమ కాకపోగా.. జూలై నెల జీతం కూడా అందడం కష్టమేనని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బదిలీలను సాకుగా చూపి ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, ఇది తమను తీవ్రంగా ఇబ్బంది పెట్టడమేనని ఉద్యోగులు వాపోతున్నారు. విద్యాశాఖ, ట్రెజరీ విభాగాల మధ్య సమన్వయ లోపం, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ దుస్థితి దాపురించిందని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. బదిలీల పేరుతో చుక్కలు సాధారణ బదిలీల్లో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లా స్థాయిలో తహసీల్దార్లు, ఉప తహసీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు, వీఆర్వోలు భారీ సంఖ్యలో బదిలీ అయ్యారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. బదిలీలపై నిషేధం అమల్లో ఉన్నప్పటికీ.. కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ రెవెన్యూలో బదిలీలను కొనసాగిస్తున్నారు. అయితే బదిలీ అయిన టీచర్లకు సంబంధించినంత వరకు.. గత నెల 15వ తేదీ నాటికే ప్రక్రియ పూర్తయింది. అయినప్పటికీ చాలా మంది ఉపాధ్యాయులకు నేటికీ కొత్త పొజిషన్ ఐడీలు కేటాయించలేదు. ఈ సాంకేతిక కారణంతోనే జూన్కు రావాల్సిన జీతం ఆగిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఆగస్టు మొదటి వారంలో అందాల్సిన జూలై జీతం కూడా వచ్చే అవకాశం లేదని స్పష్టమవుతోంది. ఒకవైపు ఉపాధ్యాయులంతా బోధనేతర కార్యక్రమాల వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ప్రభుత్వం ఒకటే యాప్లో విభిన్నమైన కార్యక్రమాలను చేయమని చెప్పి బోధన కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తోంది. మరోవైపు జీతాలు చెల్లించకుండా ఆర్థికంగా ఇబ్బందులు పెడుతోందని వాపోతున్నారు. ఉద్యోగుల గోడు పట్టదా? ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి జూన్, జూలై నెలల్లో అధికంగా ఖర్చులు ఉంటాయి. విద్యా సంవత్సరం ప్రారంభంలో పిల్లల స్కూలు ఫీజులు, పుస్తకాలు, ఇతర సామగ్రి కోసం వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి తోడు బదిలీ అయిన ప్రాంతానికి కుటుంబంతో సహా మారడానికి రవాణా ఖర్చులు, కొత్త ఇంటి అడ్వాన్సులు, నెలవారీ అద్దెలు అదనపు భారంగా మారాయి. వ్యవసాయ నేపథ్యం ఉన్న ఉద్యోగులకు విత్తనాలు, ఎరువులు, దుక్కుల వంటి ఖర్చులు కూడా ఉంటాయి. ఇలాంటి కీలక సమయంలో జీతాలు సకాలంలో అందకపోవడంతో నెలవారీ ఈఎంఐలు, వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలకు సంబంధించిన చెక్కులు బౌన్స్ అవుతున్నాయని ఉద్యోగులు వాపోతున్నారు. ఒకవైపు బదిలీల భారం, మరోవైపు జీతాలు ఆగిపోవడంతో తమ పరిస్థితి దయనీయంగా మారిందని ఉపాధ్యాయులు, రెవెన్యూ ఉద్యో గులు ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో యూ టీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఇటీవల డీఈవో కార్యాలయం ఎదుట మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, తమ జీతాలను విడుదల చేయాలని వారు కోరుతున్నారు. విద్యాశాఖ, ట్రెజరీ నిర్లక్ష్యం విద్యాశాఖ, ట్రెజరీ శాఖల వల్ల ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలే విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో పిల్లల చదువు, ఇతర అవసరాల కోసం ఎక్కువ ఖర్చులు ఉంటాయి. ఈ నేపథ్యంలో జీతాలు రాకపోవడంతో టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే పొజిషన్ ఐడీలను కేటాయించి, జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలి. – టి.ఆర్.అంబేడ్కర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్ బదిలీ అయిన ఉద్యోగులకు అందని జీతాలు టీచర్, రెవెన్యూ ఉద్యోగుల పరిస్థితి దారుణం టీచర్లకు ఐడీ కేటాయింపులో జాప్యం జీతాల కోసం 2వేల మంది ఎదురుచూపులు ‘ఓడెక్కే వరకు ఓడ మల్లన్న.. ఓడ దిగిన తర్వాత బోడి మల్లన్న’ అన్నట్టుగా ఉన్నది కూటమి ప్రభుత్వ తీరు. ఎన్నికలకు ముందు ఇష్టారాజ్యంగా హామీలు గుప్పించిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు ఉద్యోగుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. బదిలీల ప్రక్రియను అడ్డం పెట్టుకుని ప్రభుత్వ ఉపాధ్యాయులు, రెవెన్యూ సిబ్బందికి జీతాలు నిలిపివేసి వారిని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. సమన్వయ లోపం, పరిపాలనా వైఫల్యంతో సుమారు 2 వేల మంది ఉద్యోగులు జీతం కోసం ఎదురుచూడాల్సిన దయనీయ పరిస్థితిని కల్పించింది. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే వేతనాలు అందక.. ఉద్యోగ కుటుంబాలు పడుతున్న వేదన ప్రభుత్వ వైఖరికి అద్దం పడుతోంది. – మహారాణిపేట -
పంజా!
రైతుల భూములపైపూలింగ్మొత్తం 1941.19 ఎకరాల సమీకరణ ● రైతులకు ఇచ్చేది 900, 450 గజాలు మాత్రమే ● అసైన్డ్ భూముల హక్కులు కల్పించేలా చేసిన వైఎస్ జగన్ ● ఇప్పుడు పూలింగ్ పేరుతో కాజేస్తున్న ప్రభుత్వం ఏయే ప్రాంతాల్లో ఎంత భూమి అంటే...! గ్రామం పేరు మండలం సర్వే ప్రతిపాదిత నంబరు ల్యాండ్పూలింగ్ విశాఖపట్నం గిడిజాల ఆనందపురం 258 309.18 గోరింట ఆనందపురం 108 198.31 శొంఠ్యాం ఆనందపురం 347పి 251.55 బి.డి.పాలెం ఆనందపురం 1 122.53 కొవ్వాడ పద్మనాభం 237 250.52 మొత్తం విస్తీర్ణం 1,132.09 విజయనగరం జిల్లా మోదవలస డెంకాడ 241, 242, 243 20.41 రావాడ భోగాపురం 64–1 5.00 మొత్తం విస్తీర్ణం 25.41 అనకాపల్లి జిల్లా అంతకాపల్లి సబ్బవరం –– 175.42 బాటజంగాలపాలెం సబ్బవరం –– 141.01 ఎ.సిరసపల్లి సబ్బవరం –– 371.75 నల్లరేగుడుపాలెం సబ్బవరం –– 27.37 పైడివాడ అగ్రహారం సబ్బవరం –– 28.14 తగరంపూడి అనకాపల్లి –– 40.00 మొత్తం విస్తీర్ణం 783.69సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పేద రైతులకు భూమి దక్కాలనే ఉద్దేశంతో అసైన్డ్ భూములపై సర్వాధికారాలు కట్టబెడుతూ గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 20 ఏళ్లు దాటిన అసైన్దారులకే పూర్తి హక్కులు కల్పించేలా నిషేధిత జాబితా నుంచి ఎత్తివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఆదేశాలపై నిషేధాన్ని అమలుచేస్తోంది. గత ఏడాది కాలంగా ప్రతీ మూడు నెలలకు ఒకసారి నిషేధం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఈ నిషేధం మాటున రైతుల భూములపై పూలింగ్ పేరుతో పంజా విసిరేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకు అనుగుణంగా విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలతో పాటు విజయనగరం జిల్లాలను కలుపుకొని ఏకంగా 1,941.19 ఎకరాల భూమిని పూలింగ్ పేరుతో సమీకరించేందుకు విశాఖపట్నం మెట్రోపాలిటిన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకి(వీఎంఆర్డీఏ) అధికారాలను అప్పగించింది. తద్వారా రైతులకు కేవలం 450 గజాల నుంచి 900 గజాలు మాత్రమే ఇచ్చి.. మిగిలిన భూమితో వ్యాపారం చేసేందుకు తయారవుతోంది. అంతేకాకుండా ఇప్పటికే కొందరు కూటమి నేతలు పూలింగ్ పేరుతో సమీకరించనున్న కొన్ని ముఖ్యమైన సర్వే నెంబర్లలోని రైతులతో ముందస్తు బలవంతపు ఒప్పందాలు చేసుకొని.. నామమాత్రంగా పైసలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారనే విమర్శలున్నాయి. భూసమీకరణ పేరుతో భూకబ్జా..! వాస్తవానికి విశాఖపట్నం సమీప ప్రాంతాల్లో భూమి ధర ఎక్కువగా ఉంది. ఎకరా రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకూ పలుకుతోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో మరింతగా ధరలు పెరుగుతున్నాయి. ఇక్కడ పేద రైతులకు అనేక ప్రాంతాల్లో గతంలో అసైన్మెంటు కమిటీల ద్వారా పట్టాలు మంజూరు చేశారు. ఆయా భూముల్లో రైతులు సాగుచేసుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిషేధం ఎత్తివేయడంతో ఈ భూములను విక్రయించుకునేందుకు అవకాశం వస్తుందన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ల్యాండ్ పూలింగ్ పేరుతో పేద రైతుల భూములను కాజేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అసైన్ చేసిన రైతులకు దక్కేది 900 గజాలు మాత్రమేనని పేర్కొంటోంది. ఇక పదేళ్ల కంటే ఎక్కువ కాలంగా సాగు చేసుకుంటున్న రైతులకు 450 గజాల స్థలం ఇస్తామని చెబుతోంది. కన్నేసిన కూటమి నేతలు...! ల్యాండ్ పూలింగ్ వల్ల అసైన్దారులు నష్టపోనున్నారు. కేవలం 450, 900 గజాల స్థలంతో సరిపెట్టుకోవాల్సి రానుంది. ఇప్పటికే కూటమిలోని కీలక నేతలకు ఏయే ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ జరగనుందనే దానిపై పక్కా సమాచారం ఉంది. దీంతో బాగా విలువైన ప్రాంతాల్లోని సర్వే నెంబర్లలో గల రైతులతో ముందస్తుగా బెదిరింపులకు దిగి.. ఒప్పందాలు చేసుకున్నట్టు తెలుస్తోంది. ‘మీ పట్టా భూములు మాకు అప్పగించండి... మీకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ ఇస్తామంటూ’ కీలక ప్రాంతాల్లోని భూములకు సంబంధించి ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేతో పాటు ఒక కార్పొరేషన్ చైర్మన్, ఓ మంత్రి, ఎంపీ, చినబాబులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రైతుల నుంచి తక్కువ ధరకు తీసుకుని పూలింగ్ పేరుతో వచ్చే 900 గజాల స్థలాన్ని కూడా కూటమి నేతలే కాజేసేందుకు రంగం సిద్ధమైంది. రైతులకు హక్కు దక్కకుండా...! వాస్తవానికి 20 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న అసైన్దారులకు పూర్తి స్థాయిలో వారికే హక్కులు దక్కే విధంగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, అందులో ఏదో జరిగిపోయిందనే రీతిలో కూటమి ప్రభుత్వం ప్రచారం చేసింది. ఇప్పటికే రెండు దఫాలుగా పలువురు అధికారులతో విచారణ కూడా చేపట్టింది. ఎలాగైనా తప్పులు ఎత్తిచూపాలనే ఉద్దేశంతో ఒత్తిడి తెచ్చి మరీ విచారణ చేపట్టింది. అయినప్పటికీ ఒక్క చిన్న తప్పు కూడా జరగలేదని తేలింది. అయినప్పటికీ విశాఖలో భూములు దోచుకున్నారంటూ విషప్రచారం చేశారు. తీరా విచారణలో తేలకపోయినప్పటికీ నిషేధాన్ని మాత్రం కొనసాగిస్తూనే వస్తున్నారు. ఇప్పుడు భూసమీకరణ పేరుతో పేదల భూములను కాజేసేందుకు వీఎంఆర్డీఏ రూపంలో ప్రభుత్వం సిద్ధమైంది. ఒకవేళ గత ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేసి ఉంటే.. రైతులకు తమకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలను విక్రయించుకునేందుకూ అవకాశం దక్కేది. ఇప్పుడు కేవలం 900, 450 గజాల స్థలానికి మాత్రమే పరిమితం కావాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. -
లక్ష్యాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణాలు
మహారాణిపేట : వారాంతపు లక్ష్యాలకు అనుగుణంగా ఎన్టీఆర్ కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు జరగాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. 2026 మార్చి నాటికి అన్ని ఇళ్లు పూర్తి కావాలని నిర్దేశించారు. బుధవారం హౌసింగ్, స్పెషల్ ఆఫీసర్లు, ఇతర అధికారులతో కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై సమీక్షించారు. లక్ష్య సాధనలో విఫలమైన అధికారులు, సిబ్బందికీ మెమోలు జారీ చేయా లని హౌసింగ్ పీడీని ఆదేశించారు. ఎస్సీ, బీసీ వర్గాల వారికి రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75వేలు ప్రభుత్వం అందిస్తున్న అదనపు సాయంపై మరింత అవగాహన కల్పించాలని చెప్పారు. విద్యుత్, తాగునీరు, డ్రెయిన్లు, అప్రోచ్ రోడ్లు వంటి మౌలిక వసతుల కల్పనకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. ఫేస్ అథెంటికేషన్, స్టేజ్ అప్డేషన్ ప్రక్రియలను క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. వీజేపాలెం, మామిడిపాలెం లేఅవుట్లలో స్థానికుల నుంచి ఎదురవుతున్న సమస్యలను అధికారులు కలెక్టర్ దృష్టికి తీసు కొచ్చారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. గృహ నిర్మాణ శాఖ పీడీ సత్తిబాబు, ఈఈ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
కుళాయిల నుంచి కలుషిత నీరు
● చిన్న ములగాడలో మూడు రోజులుగా సరఫరా ● అనారోగ్యం పాలవుతున్న గ్రామస్తులు మల్కాపురం: జీవీఎంసీ 58వ వార్డులోని చిన్న ములగాడ గ్రామంలో మూడు రోజులుగా బురద రంగుతో కూడిన కలుషిత నీరు సరఫరా అవుతోందని గ్రామస్తులు ఆరోపించారు. మున్సిపల్ కుళాయిల ద్వారా వస్తున్న ఈ నీటిని తాగడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నామని, జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి వంటి సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గ్రామస్తులు ములగాడలోని పట్టణ ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వైద్య సేవలు పొందుతున్నారు. మంచినీటి పైప్లైన్ ఎక్కడో లీక్ అవ్వడం వల్లే ఈ కలుషిత నీరు వస్తోందని, ఈ సమస్యకు తక్షణమే పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు. ఈ విషయంపై మల్కాపురం వాటర్ సప్లై ఏఈ నాగేశ్వరరావును వివరణ కోరగా.. ఆ గ్రామంలో పైప్లైన్కు ఎలాంటి నష్టం జరగలేదన్నారు. భారీ వాటర్ ట్యాంకులు శుభ్రం చేసేటప్పుడు ఒకటి లేదా రెండు రోజులు తేలికపాటి బురద రంగు గల నీరు వచ్చే అవకాశం ఉందన్నారు. గురువారం ఆ ప్రాంతానికి వెళ్లి సమస్యను గుర్తించి, పరిష్కరిస్తామని తెలిపారు. -
గొయ్యిని తప్పించబోయి.. మృత్యు ఒడికి..
కూర్మన్నపాలెం: ‘ఇంకొద్ది సేపట్లో ఇంటికి వస్తున్నా..’ అని చెప్పి కంపెనీ నుంచి బయలుదేరిన ఆ యువకుడి మాటలే చివరివయ్యాయి. విధులకు వెళ్లిన భర్త తిరిగి వస్తాడని ఎదురుచూస్తున్న ఆ నవ వధువుకు తీరని శోకం మిగిలింది. కళ్లెదుటే భవిష్యత్తు బంగారంగా కనిపిస్తుండగా.. రహదారిపై ఉన్న గొయ్యి ఆ కుటుంబాన్ని ఛిద్రం చేసింది. ఒక ఇంజినీర్ నూరేళ్ల జీవితాన్ని బలిగొంది. సినర్జీస్ సంస్థలో జూనియర్ ఇంజినీర్గా పనిచేస్తున్న రాహుల్కు ఈ ఏడాది మేలోనే వివాహం జరిగింది. భార్య, తండ్రితో కలిసి జీవీఎంసీ 87వ వార్డు కణితికాలనీలోని వైష్ణవి అపార్టమెంట్లో నివాసం ఉంటున్నాడు. రోజూ లాగే బుధవారం కూడా విధులను ముగించుకుని తన బైక్పై ఇంటికి బయలుదేరాడు. దువ్వాడ సమీపంలోని రాజీవ్నగర్ వద్ద రహదారిపై ఉన్న ఓ గొయ్యి రూపంలో మృత్యువు కాపు కాసింది. ఆ గొయ్యిని తప్పించే చిన్న ప్రయత్నంలో రాహుల్ అదుపుతప్పాడు. బైక్పై నుంచి కింద పడి.. వెనకనే వస్తున్న భారీ ట్రాలర్ చక్రాల కింద నలిగిపోయాడు. అక్కడికక్కడే కన్నుమూశాడు. కొద్ది నిమిషాల్లో ఇంట్లో ఉండాల్సిన రాహుల్.. రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉన్న దృశ్యం చూపరుల హృదయాలను కలచివేసింది. ఈ వార్త తెలియగానే ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తన కుమారుడు నేల మీద నిర్జీవంగా పడి ఉండటాన్ని చూసి ఆ తండ్రి గుండెలవిసేలా రోదించాడు. అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా ఉన్న ఆ గొయ్యి.. ఒక కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న దువ్వాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను సేకరించారు. రాహుల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. సీఐ మల్లేశ్వరరావు నేతృత్వంలో ఎస్ఐ శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. టాలర్ కింద పడి సినర్జీస్ ఉద్యోగి మృతి గత మే నెలలో వివాహం -
ఆగస్టు 31 నాటికి 50 శాతం ఆస్తిపన్ను వసూలే లక్ష్యం
జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ డాబాగార్డెన్స్: వచ్చే నెల 31 నాటికి 50 శాతం ఆస్తి పన్ను వసూలే లక్ష్యంగా రెవెన్యూ అధికారులు పనిచేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో అదనపు కమిషనర్ డి.వి.రమణమూర్తి, డీసీఆర్ శ్రీనివాసరావు, అన్ని జోన్ల రెవెన్యూ ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో పాటు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న వార్డు సచివాలయ అడ్మిన్ కార్యదర్శులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆగస్టు 31 నాటికి 50 శాతం ఆస్తిపన్ను వసూలు లక్ష్యంగా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. గత వారంతో పోల్చుకుంటే కొన్ని జోన్లలో వసూళ్ల శాతం పెరిగినప్పటికీ మరికొన్ని జోన్లలో మందకొడిగా వసూళ్లు జరుగుతున్నాయన్నారు. ప్రతి రెవెన్యూ అధికారి డిమాండ్లకు తగిన విధంగా ఆస్తిపన్ను వసూళ్లు పెంచాలని ఆదేశించారు. వార్డు సచివాలయ అడ్మిన్ కార్యదర్శులు డోర్ టు డోర్ సర్వే నిర్వహించి, కొత్త, పాత భవనాల కొలతలు సరి చూడాలని, తాగునీటి కనెక్షన్ ఉంటే వారు ఆస్తి పన్నుతో పాటు నీటి పన్ను చెల్లిస్తున్నదీ, లేనిదీ పరిశీలించాలన్నారు. ఈ ప్రక్రియ ఆగస్టు 5 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల ఆస్తిపన్ను బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించి రూల్ బుక్ ప్రకారం వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోర్టు కేసులను స్టడీ చేసి.. కౌంటర్ ఫైల్ చేయాలని ఆదేశించారు. కోర్టులో కేసు ఉందని ఆస్తిపన్ను వసూలుకు వెనుకాడవద్దన్నారు. ఆస్తి పన్ను వసూలు కేంద్రాలు పెంచేందుకు ప్రతి వార్డులో ప్రజలకు అందుబాటులో ఉన్న ఒక సచివాలయాన్ని ఎంపిక చేసుకుని అక్కడ అవసరమయ్యే మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఆస్తి పన్ను జీవీఎంసీ కమిషనర్ అకౌంట్లో జమయ్యేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం ఉన్న బిల్ డెస్క్ను ప్రమోట్ చేసి, జీరో సర్వీస్ చార్జీలతో పన్నులు వసూలు అయ్యేటట్టు చర్యలు చేపట్టాలని జీవీఎంసీ ఐటీ విభాగం అధికారులను ఆదేశించారు. -
తల్లిదండ్రులు, వృద్ధులను గౌరవిద్దాం
మహారాణిపేట: తల్లిదండ్రులు, వృద్ధులను ప్రేమతో, గౌరవంగా చూసుకోవాలని హెరిటేజ్ ఫౌండేషన్ ప్రతినిధులు, అధికారులు యువతకు పిలుపునిచ్చారు. వారి సంక్షేమం, సంరక్షణ కోసం రూపొందించిన 2007 తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల పోషణ– సంక్షేమ చట్టం గురించి అందరూ తెలుసుకోవాలని సూచించారు. విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో బుధవారం జరిగిన ఒకరోజు వర్క్షాప్లో హెరిటేజ్ ఫౌండేషన్ ప్రతినిధులు, పోలీసు, రెవెన్యూ, ఇతర జిల్లా స్థాయి అధికారులు ఈ చట్టం అమలు, అనుసరించాల్సిన విధానాలపై చర్చించారు. ఈ సందర్భంగా హెరిటేజ్ ప్రతినిధులు, సీనియర్ జర్నలిస్ట్ చదలవాడ ప్రసాద్, న్యాయవాది కొంగారపు గణపతి మాట్లాడుతూ వృద్ధులకు కార్యాలయాలు, ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్లలో సులభంగా సేవలు అందించాలన్నారు. ప్రత్యేక అవసరాల్లో వారికి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఈ చట్టం అమలులో ఆర్డీవోలు ట్రిబ్యునల్ అధికారిగా వ్యవహరిస్తారని, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ మెంబర్ కన్వీనర్గా ఉంటారన్నారు. 60 రోజుల్లో సమస్య పరిష్కారం కాని పక్షంలో కలెక్టర్ను అప్పీలేట్ ట్రిబ్యునల్గా సంప్రదించవచ్చని తెలిపారు. సివిల్ కోర్టు పరిధిలోని ఫిర్యాదుల్లో ట్రిబ్యునల్ జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద 80 ఏళ్లు పైబడిన వారికి రూ.5 లక్షల వరకు బీమా కల్పిస్తున్నట్లు తెలిపారు. గిఫ్ట్ డీడ్ విషయంలో సుప్రీం కోర్టు మార్గదర్శకాలను అనుసరించాలని పేర్కొన్నారు. వృద్ధుల కోసం కేజీహెచ్లో ప్రత్యేక ఓపీ కేజీహెచ్ ఆర్ఎంవో బంగారయ్య మాట్లాడుతూ వయో వృద్ధుల సౌకర్యార్థం ప్రతి రోజు సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ప్రత్యేక ఓపీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గుర్తు తెలియని వృద్ధులు, బిచ్చగాళ్లు అనారోగ్యంతో వస్తే వారికి ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. టైమ్ బ్యాంక్లో చేరాలి వయో వృద్ధులకు సహాయపడేందుకు విశాఖలో పైలట్ ప్రాజెక్ట్గా అమలవుతున్న టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్వచ్ఛందంగా చేరాలని నిర్వాహకులు కోరారు. 2019లో ప్రారంభమైన ఈ విధానం దేశంలోని పలు నగరాల్లో అమలవుతోందని, విశాఖలోని 12 పిన్కోడ్ లాగిన్ ఏరియాల్లో అందుబాటులో ఉందని వివరించారు. ఇందులో ఆర్థిక లావాదేవీలు ఉండవని, పరస్పర సహకారం మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. 18 ఏళ్లు నిండినవారెవరైనా ఇందులో చేరవచ్చని, వివరాలకు 94403 01311ను సంప్రదించవచ్చని సూచించారు. విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధులు, హిజ్రాలు, సీనియర్ సిటిజన్ల సంక్షేమ శాఖ ఏడీ కవిత, భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్, ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. 2007 తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల పోషణ– సంక్షేమ చట్టంపై అవగాహన -
‘దాట్ల’కు రావిశాస్త్రి సాహిత్య పురస్కార ప్రదానం
సీతంపేట: ప్రముఖ కవి, కథా రచయిత, దాట్ల దేవదానం రాజు(యానాం)కు రావిశాస్త్రి సాహితీ పురస్కారాన్ని ప్రధానం చేశారు. విశాఖ రసజ్ఞ వేదిక, రావిశాస్త్రి లిటరరీ ట్రస్టు సంయుక్త నిర్వహణలో ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో బుధవారం జరిగిన సభలో ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ టి.రవిరాజు, విశాఖ రసజ్ఞ వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ రఘురామారావు, రావిశాస్త్రి తనయుడు ఉమా కుమార శాస్త్రి చేతుల మీదుగా దాట్ల దేవదానం రాజును సత్కరించి, పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా రఘురామారావు మాట్లాడుతూ రావిశాస్త్రి 103వ జయంతి సందర్భంగా యానాంకు చెందిన కథా రచయిత దాట్ల దేవదానంరాజుకు పురస్కారం అందజేసినట్టు తెలిపారు. గత ఐదేళ్లుగా విశాఖరసజ్ఞ వేదిక ఆధ్వర్యంలో రావిశాస్త్రి పేరిట పురస్కారాలు అందజేస్తున్నట్టు తెలిపారు. ఆచార్య బేతవోలు రామబ్రహ్మం,డాక్టర్ రవిరాజు మాట్లాడుతూ దాట్ల సాహితీ ప్రతిభకు రావిశాస్త్రి పురస్కారం ఒక కొలమానంగా నిలుస్తుందన్నారు. దాట్ల రాసిన ఎండ్ల బండి, దీపం కింద నీడ వంటి రచనలు పాఠకుల ఆదరణ పొందాయని చె ప్పారు. కవిసంధ్య సాహితీ పత్రికను నిర్వహించడమే కాక, ఎందరో యువ కవులకు దాట్ల మార్గదర్శనం చేస్తున్నారని గుర్తుచేశారు. అనంతరం దాట్ల దేవదానం రచించిన ‘మనిషి లోపల నీడ’ పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. తొలి ప్రతిని ఆచార్య బేతవోలు స్వీకరించారు. డాక్టర్ డి.వి.సూర్యారావు, ప్రయాగ సుబ్రహ్మణ్యం, పలువురు సాహితీవేత్తలు, కథా రచయితలు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం ప్రారంభం
ఆరిలోవ: జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. డీఈవో కార్యాలయ సెల్లార్లో దివీస్ సంస్థ అందించిన రూ.22.60 లక్షల సీఎస్సార్ నిధులతో నిర్మించిన ఈ కేంద్రాన్ని తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్.. డీఈవో ఎన్.ప్రేమకుమార్, దివీస్ ప్రతినిధులతో కలసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎమెల్సీ మాట్లాడుతూ జిల్లాలో పాఠశాల విద్య అభివృద్ధికి ప్రైవేట్ కంపెనీలు సాయపడటం అభినందనీయమన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు కష్టపడి విద్యార్థుల ఉత్తీర్ణతను శతశాతానికి పెంచి జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని అభిలషించారు. దివీస్ జనరల్ మేనేజర్ కోటేశ్వరరావు, ఎస్ఎస్ఏ ఏపీసీ బి.చంద్రశేఖర్, డీఈవో కార్యాలయ సిబ్బంది, దివీస్ ప్రతినిధులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో శ్రీకారం వాస్తవానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2023లో దివీస్ సంస్థ ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం నిర్మాణానికి రూ.22.60 లక్షలు నిధులు కేటాయించింది. అప్పటి డీఈవో ఎల్.చంద్రకళ సూచనలతో కార్యాలయం సెల్లార్లో ఈ కేంద్రం ఏర్పాటుకు సిద్ధమై పనులు జరిపించారు. 2024 సాధారణ ఎన్నికలు రావడంతో కొన్నాళ్లు నిలిచిపోయాయి. రెండు నెలల కిందట దీని పనులు పూర్తయి ప్రారంభానికి సిద్ధమైంది. అప్పుడే అసలు ట్విస్ట్ డీఈవో ప్రేమకుమార్కు ఎదురైంది. దివీస్ సంస్థ ప్రతినిధులు రెండు వారాల క్రితం భీమిలి ఎమెల్యే గంటా శ్రీనివాసరావును ప్రారంభానికి పిలిచారు. దీని ప్రకారం ఇక్కడ శిలాఫలకంపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేరు ముఖ్యఅతిథిగా రాయించారు. విషయం తెలుసుకున్న తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి డీఈవో ప్రేమకుమార్పై శివాలెత్తినట్లు సమాచారం. నా నియోజకవర్గంలో వేరే ఎమ్మెల్యేని ప్రారంభానికి పిలుస్తారా అంటూ డీఈవోపై మండిపడినట్లు తెలిసింది. దీంతో అప్పట్లో జరగాల్సిన ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. కొత్త శిలాఫలకం తయారుచేయించి బుధవారం ప్రారంభోత్సవం చేసినట్లు విద్యాశాఖ సిబ్బంది గుసగుసలు వినిపించాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దివీస్ సంస్థ ముందుకు వచ్చి దీన్ని నిర్మిస్తే.. కూటమి నాయకులు తమ ఘనతగా చెప్పుకుని సీఎం కల సాకారమంటూ ఉపన్యాసం ఇవ్వడంపై విద్యాశాఖ అధికారులే నివ్వెరపోయారు. గత ప్రభుత్వంలో దివీస్ సీఎస్సార్ నిధులతో నిర్మాణానికి శ్రీకారం -
భర్తపై వేడినీళ్లు పోసిన భార్య
కొమ్మాది: ఓ మహిళ తన భర్తపై మరుగుతున్న నీళ్లు పోసిన సంఘటన బీచ్రోడ్డులో చోటు చేసుకుంది. వివరాలివి. జీవీఎంసీ 4వ వార్డు నిడిగట్టు పరిధి నేరెళ్లవలసకు చెందిన నంది కృష్ణ అదే ప్రాంతానికి చెందిన తన మేనమామ కుమార్తె గౌతమిని ఆరేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. కూలి పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే వారి మధ్య మనస్పర్థల కారణంగా మూడేళ్లు నుంచి విడిగా ఉంటున్నారు. తల్లిదండ్రులు ఇద్దరినీ కలపడంతో ఈ నెల 28 నుంచి ఒకే ఇంట్లో కలసి ఉంటున్నారు. ఇదిలా ఉండగా మంగళవారం రాత్రి వీరిరువురి మధ్య చిన్న తగాదా చోటు చేసుకుంది. అర్ధరాత్రి నిద్రలో ఉన్న భర్త కృష్ణపై గౌతమి మరుగుతున్న వేడి నీళ్లను పోసింది. దీంతో కృష్ణ ముఖం కాలిపోయింది. పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని కృష్ణను కేజీహెచ్కు తరలించారు. కృష్ణ కుటుంబ సభ్యులు బుధవారం భీమిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భూముల క్రమబద్ధీకరణ వేగవంతం
మహారాణిపేట: ఆక్రమిత భూముల క్రమబద్ధీకరణ వేగవంతం చేయాలని, అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారు క్రమబద్ధీకరణకు ముందుకు వచ్చే విధంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం నుంచి రెవెన్యూ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. శ్లాబ్ లేదా రేకులతో ఇల్లు నిర్మించుకున్న వారు జీవో ఎంఎస్ నంబర్ 30, 45, 27(యూఎల్సీ)లకు లోబడి ఈ ఏడాది డిసెంబరు 31లోగా రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 150 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పారు. దారిద్య్రరేఖకు దిగువన ఉండి 151 నుంచి 300 గజాలలోపు ఆక్రమణలకు బేసిక్ ధరలో 15 శాతం, రిజిస్ట్రేషన్ ఫీజులో 50 శాతం చెల్లించాలని చెప్పారు. దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న వారు పూర్తి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని స్పష్టం చేశారు. 450 గజాలకు మించి ఆక్రమించిన వారు, బేసిక్ ధరకు ఐదు రెట్లు, వందశాతం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి క్రమబద్ధీకరించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం(పీజీఆర్ఎస్)లో వచ్చిన అర్జీలు పునరావృతం కాకుండా చూడాలని కలెక్టరు ఆదేశించారు. జేసీ కె.మయూర్ అశోక్, ఆర్డీవోలు శ్రీలేఖ, సంగీత్ మాధుర్, డీఆర్వో బి.హెచ్.భవాని శంకర్, సర్వే శాఖ సహాయ సంచాలకుడు సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. -
నగరాన్ని 'గాలి'కొదిలేశారు.!
సాక్షి, విశాఖపట్నం: మనిషి మనుగడకు స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, ఆరోగ్యకరమైన ఆహారం అత్యవసరం. వీటిలో ఏది లోపించినా అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం ఇదే పరిస్థితి. మరి మన మహానగరం విశాఖపట్నం సురక్షితమేనా అంటే, కాదనే సమాధానం వినబడుతోంది. విశాఖలో కాలుష్యం గణనీయంగా పెరిగి, ప్రాణ వాయువు కొరవడుతోంది. కేంద్ర ప్రభుత్వ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎన్సీఏపీ)లో భాగంగా.. దేశవ్యాప్తంగా 130 నగరాల్లో కాలుష్య స్థాయిలు ఎలా పెరుగుతున్నాయనే అంశంపై అధ్యయనం చేసింది. 2024–25లో సంపూర్ణ డేటాని సేకరించి.. నివేదిక విడుదల చేసింది. మొత్తం 130 నగరాల్లో అత్యంత ఎక్కువగా కాలుష్యం పెరిగిన జాబితాలో ఔరంగాబాద్ మొదటి స్థానంలో ఉండగా.. విశాఖ రెండో స్థానంలో ఉంది. కాలుష్యం పెరిగిన నగరాల జాబితాలో విశాఖ రెండో స్థానానికి చేరడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా, నగర కాలుష్యంపై ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడమే ఈ దుస్థితికి కారణమని ప్రస్తుత గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2024–25 నుంచి 32.9 శాతం పెరుగుదల దేశంలో వాయు కాలుష్యం పెరిగిన నగరాల్లో విశాఖపట్నం రెండో స్థానంలో నిలిచిందని జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం (ఎన్సీఏపీ) అధ్యయనం వెల్లడించింది. 2019లో ప్రారంభించిన ఈ కార్యక్రమం, 2017–18 నాటి పీఎం 10 స్థాయిలను ప్రామాణికంగా తీసుకుని అంచనా వేసింది. ఎన్సీఏపీ గణాంకాల ప్రకారం, 2024–25లో విశాఖ నగరంలో కాలుష్యం 32.9 శాతం పెరిగింది. ఇది గతంలో ఎన్నడూ లేనంత దారుణమని నివేదిక పేర్కొంది. పీఎం 10 సాంద్రత 101 మైక్రోగ్రామ్స్పర్ క్యూబిక్ మీటర్కు చేరడం ఆందోళన కలిగించే అంశంగా హెచ్చరించింది. మొదటి స్థానంలో ఉన్న ఔరంగాబాద్లో 33.3 శాతం గాలి నాణ్యత క్షీణించింది. విశాఖతో పాటు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం సహా 13 నగరాల్లో వాయు కాలుష్యం గణనీయంగా పెరిగినట్లు ఈ అధ్యయనం తేల్చింది. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే.. 2019లో ప్రారంభమైన కాలుష్య నియంత్రణ ప్రాజెక్టులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖ, విజయవాడ, కర్నూలు, కడప, అనంతపురం సహా 13 నగరాలను ఎంపిక చేశారు. ఈ నగరాల్లో గాలిలో దుమ్ము, వాహన ఉద్గారాలు, పారిశ్రామిక కాలుష్యం నియంత్రణపై దృష్టి సారించాలని సూచించారు. విశాఖ నగరానికి ఇప్పటి వరకూ రూ.129.4 కోట్లు కేటాయించారు. ఇందులో గత వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్న సమయంలో విడుదలైన రూ.39.6 కోట్లు ఖర్చు చేసి.. కాలుష్యాన్ని నియంత్రించేందుకు తీవ్రంగా శ్రమించింది. విశాఖలో ఏప్రిల్ 2017 నుంచి మార్చి 2018 వరకూ పీఎం10 స్థాయిలు 159 నమోదు కాగా.. 2019 డిసెంబర్కి ఈ సంఖ్య 108కి చేరింది. 2020 జనవరి నుంచి సెపె్టంబర్ వరకూ 96కి తగ్గింది. 2021 నాటికి మరింత కాలుష్యం తగ్గి 90కి చేరుకుంది. కానీ కూటమి ప్రభుత్వంలో మాత్రం కాలుష్యం అమాంతం పెరిగిపోయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిధుల గురించి పట్టించుకోకుండా నగరంపై నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. గతేడాది సెప్టెంబర్ లో మరింత దారుణంగా... 2024–25 దేశవ్యాప్త అధ్యయనం ప్రకారం విశాఖలో వాయు నాణ్యత మరింత క్షీణించింది. ముఖ్యంగా గత ఏడాది సెప్టెంబర్లో పీఎం 2.5 సాంద్రత స్థాయిలు దారుణంగా నమోదయ్యాయి. దేశంలోని టాప్–10 అత్యంత కాలుష్య నగరాల రోజువారీ జాబితాలో విశాఖ పదిసార్లు చోటు దక్కించుకోవడం ఆందోళన కలిగిస్తోంది.పోర్టు నుంచి ఎన్టీపీసీ, ఫార్మాసిటీ వరకు అన్నింటి నుంచి కాలుష్యం నగరంలో విస్తరిస్తోంది. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ శాతం రోజురోజుకూ పెరుగుతోంది. కూటమి ప్రభుత్వం తక్షణమే కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టకపోతే గాలి నాణ్యత మరింత దిగజారి, ఢిల్లీ లాంటి దుర్భర పరిస్థితులు విశాఖలో కూడా తలెత్తుతాయని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
మహిళా హోంమంత్రిగా అనిత ఫెయిల్: వరుదు కళ్యాణి
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో కూటమి పార్టీల నేతలే కీచకులుగా మారి మహిళ మానప్రాణాలను, వారి ఆత్మగౌరవాన్ని హరిస్తున్నారని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర అనుచరుడి కుమారుడు ఒక యువతిని మోసం చేస్తే, సదరు యువతికి న్యాయం చేయకుండా ఆమె జీవితానికి వెలకట్టేందుకు మంత్రి సెటిల్ మెంట్ చేయడం దారుణమని మండిపడ్డారు.చివరికి తన కుమార్తెకు న్యాయం జరగడం లేదంటూ బాధిత యువతి తల్లి ఆత్మహత్యయత్నం చేసినా కూడా కూటమి నేతల మనస్సు కరగడం లేదని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. ఇంకా ఆమె ఎమన్నారంటే..మచిలీపట్నంలో టీడీపీ నాయకులు, మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుడు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి విలువలతో కూడిన విద్య నేర్పిస్తాను అంటూ హరేకృష్ణ పేరుతో ఒక స్కూల్ నడిపిస్తున్నారు. తన స్కూల్లో పనిచేస్తున్న యువతిని సుబ్రహ్మణ్యం కుమారుడు ప్రేమించానంటూ, పెళ్ళి చేసుకుంటానని తీసుకుని వెళ్ళి, నాలుగు రోజుల పాటు బయట తిప్పి, తరువాత తిరిగి ఇంటికి తెచ్చి వదిలేశాడు. తనకు న్యాయం చేయాలని బాధిత యువతి కోరితే దానిపై పంచాయతీ చేయాలని మంత్రి కొల్లు రవీంద్రను ఆశ్రయించాడు.చట్ట ప్రకారం వ్యవహరించాల్సిన మంత్రి కొల్లు రవీంద్ర బాధిత మహిళ జీవితానికి వెలకట్టే ప్రయత్నం చేశాడు. ఇదేనా మహిళల పట్ల సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి, మంత్రి కొల్లు రవీంద్రకు ఉన్న గౌరవం. తన కుమార్తెకు అన్యాయం చేస్తున్నారంటూ సదరు యువతి తల్లి పోలీస్ స్టేషన్ ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించడం వల్ల ఆమె ప్రాణాలతో ఉన్నారు. ఈ ప్రభుత్వంలో తమకు న్యాయం జరగదని భావించి ప్రాణం తీసుకునే పరిస్థితి కల్పించారు.కొల్లు రవీంద్ర ఒక మంత్రిగా ఉండి బాధితుల పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవహిరంచడం దారుణం. సదరు యువతకి న్యాయం చేయాల్సిన అవసరం లేదా..? మహిళలకు అన్యాయం జరిగితే బాదితులకు అండగా నిలబడాల్సిన స్థానంలో ఉండి, దోషులకు కొమ్ముకాయడం కూటమి ప్రభుత్వంలోనే కనిపిస్తోంది. ఈ వ్యవహారంలో బాధిత యువతికి న్యాయం చేయకపోతే వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు తప్పవు.హోంమంత్రి అనిత ఒక మహిళ అయి ఉండి, మహిళలపై జరిగే అరాచకాలను పట్టించుకోవడం లేదు. కూటమి అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని మహిళలు ప్రశాంతంగా నిద్రపోవచ్చని గొప్పగా ప్రకటించారు. నేడు నిత్యం రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాష్టికాలను చూస్తే ఏ మహిళ ప్రశాంతంగా నిద్రపోతోందో చెప్పాలి. తెలుగుదేశంకు చెందిన నాయకులు, కార్యకర్తలే కీచకులుగా మారి మహిళలను వేధిస్తున్నంటే హోంమంత్రిగా ఉండి కూడా అనిత స్పందించడం లేదు.మాజీ సీఎం వైఎస్ జగన్ను దూషించడానికే ఆమె పరిమితమయ్యారు. ప్రతిచోటా పోలీసుల నిర్లక్ష్యం, ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోంది. మహిళల మానప్రాణాలను కాపాడేందుకు ఎటువంటి చర్యలు లేవు. డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికే పరిమితమయ్యారు. దీనివల్ల తప్పుడు పనులు చేసే వారిలో ఎటువంటి భయం కనిపించడం లేదు. అందువల్లే ఈ రాష్ట్రంలో రోజుకు డెబ్బై నుంచి ఎనబై సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.ఎవరైనా మహిళలపై చేయి వేస్తే, అదే వారికి చివరి రోజు అంటూ సీఎం చంద్రబాబు, మహిళల జోలికి వస్తే తాట తీస్తాను అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో హెచ్చరించారు. అయితే వారి మాటలు ఎక్కడైనా కార్యరూపంలోకి వచ్చాయా అంటే ఒక్కటీ కనిపించడం లేదు. రాప్తాడు నియోజకవర్గంలో పద్నాలుగేళ్ళ దళిత బాలికపై పద్నాలుగు మంది టీడీపీ కార్యకర్తలు ఆరు నెలలుగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నా పోలీసులు కనీసం వారిపై కేసు కూడా నమోదు చేయలేదు. చివరికి వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో దీనిపై ఆందోళలు చేయడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. రెండు నెలల కిందట రాజమండ్రిలో ఫార్మసీ విద్యార్ధినిపై టీడీపీకి చెదిన నాయకుడి బంధువు దీపక్ అనే వ్యక్తి చేసిన వేధింపులకు తాళలేక సదరు విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ కుటుంబానికి నేటికీ ప్రభుత్వం న్యాయం చేయలేదు. అలాగే తిరువూరులో టీడీపీ నాయకుడు రమేష్ అనే వ్యక్తి ఒక గిరిజన మహిళను లోబరుచుకునేందుకు ప్రయత్నించిన ఆడియో కూడా వెలుగుచూసినా, అతడిపై ఎటువంటి చర్య లేదు. గుంటూరు జిల్లా తెనాలిలో ఒక దళిత యువతిని టీడీపీ రౌడీషీటర్ నవీన్ దారుణంగా కొట్టడంతో బ్రెయిన్ డెడ్ అయి చనిపోయింది. సీఎం నివాసం ఉంటున్న జిల్లాలో జరిగిన ఈ దుర్ఘటన చంద్రబాబు కనీసం స్పందించలేదు.తిరుపతిలో లక్ష్మీ అనే బాధితురాలిని జనసేన నాయకుడు కిరణ్రాయల్ ఎలా వేధింపులకు గురి చేశాడో మీడియా ద్వారా ప్రజలంతా చూశారు. దీనిపైనా ఎటువంటి చర్యలు లేవు. ఇక టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం తన దగ్గర పనిచేసే మహిళను లైంగికంగా వేధిస్తే, ఆమె హైదరాబాద్కు వెళ్ళి ప్రెస్మీట్ పెట్టి ఈ దారుణాన్ని వెల్లడించినా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ వేధింపుల వల్ల ఒక మహిళా వీఆర్ఓ ఆత్మహత్యాయత్నం చేసింది.కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే అనుచరులు మహిళా ఫీల్డ్ అసిస్టెంట్ను ముడుపులు ఇవ్వాలి, లేదా తమ కామవాంఛలు తీర్చాలంటూ వేధింపులకు గురి చేయడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేశారు. దీనిపై ప్రభుత్వం వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో దళిత సంఘాలు ఆదోళనలు చేశాయి. కర్నూలు జిల్లా ముచ్చిమర్రిలో ఒక తొమ్మిదేళ్ళ బాలికను గ్యాంగ్ రేప్ చేసి, ముక్కలుగా చేసి విసిరేశారు. ఆ బాలిక మృతదేహం నేటికీ లభించలేదు. హోంమంత్రి నివాసం ఉంటున్న విశాఖపట్నంలో ప్రేమోన్మోది నీరబ్ శర్మ ఒక యువతిపై హత్యాయత్నం చేశాడు. ఇతడి వల్ల తనకు హాని ఉందని యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల సదరు దుండగుడు ఆమెపై హత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలన్నీ ఈ ప్రభుత్వ వైఫల్యాలను చాటుతున్నాయి. -
ఉద్యోగాల కల్పనే లక్ష్యం
జేసీ మయూర్ అశోక్ బీచ్ రోడ్డు: రాష్ట్రంలో రాబోయే రోజుల్లో 20 వేల స్టార్టప్లను స్థాపించి, వాటి ద్వారా లక్ష ఉద్యోగాలను సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యమని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ అన్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనమందరం కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో మంగళవారం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల శిక్షణ కార్యక్రమ ప్రారంభోత్సవంలో జేసీ మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతిభావంతులైన జీఎస్డబ్ల్యూఎస్ సిబ్బందిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి.. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం విశేషమన్నారు. ‘ఇది కేవలం శిక్షణ కార్యక్రమం మాత్రమే కాదు, మీలో ప్రతి ఒక్కరిలో ఉన్న అద్భుతమైన సామర్థ్యాలను వెలికి తీయడానికి ఇది ఒక చక్కని అవకాశం’ అని అన్నారు. శిక్షణ పొందిన సిబ్బంది ద్వారా రాష్ట్రవ్యాప్తంగా స్టార్టప్లపై ఆసక్తి ఉన్న వారికి శిక్షణ ఇవ్వనున్నారని జేసీ వెల్లడించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవో సూర్య తేజ తదితరులు పాల్గొన్నారు. -
జనసేనలో ముసలం
విశాఖ సిటీ: జనసేన పార్టీలో ముసలం రాజుకుంది. ఆ పార్టీ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ భీశెట్టి వసంతలక్ష్మిపై వేటుకు రంగం సిద్ధమవుతోంది. కూటమిలో జనసేనకు విలువ లేదన్న వాస్తవాన్ని ఆమె భర్త చెప్పిన పాపానికి జనసేన పెద్దలు వారిపై కక్ష కట్టేశారు. బీసీ మహిళా నేతను పదవి నుంచి పక్కన పెట్టాలన్న నిర్ణయానికి వచ్చారు. కూటమిలో జనసేన ప్రాధాన్యత కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు పట్టుబడుతుంటే.. దాన్ని పార్టీ ధిక్కార స్వరంగా అధినాయకులు పరిగణిస్తుండడం శ్రేణులను షాక్కు గురి చేస్తోంది. పార్టీ నేతల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా నిర్ణయాలు తీసుకుంటుండడం తీవ్ర చర్చకు దారిస్తోంది.ప్రాధాన్యత లేదన్న పాపానికి..కూటమి ప్రభుత్వంలో జనసేన నేతలకు, కార్యకర్తలకు విలువ లేకుండా పోయింది. సాక్షాత్తు జనసేన ఎమ్మెల్యేలు సైతం నియోజకవర్గాల్లో పనులు జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు అనేకమున్నాయి. పోలీస్స్టేషన్లో సిఫార్సు చేసిన వారికి పోస్టింగ్లు ఇవ్వలేదన్న కోపంతో పెందుర్తి జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు గన్మెన్లను సరెండ్ చేసిన అంశం అప్పట్లో హట్ టాపిక్గా నిలిచింది. దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఇప్పటికీ నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జ్ సీతంరాజు సుధాకర్ పెత్తనానికి చెక్ పెట్టేందుకు కిందా మీదా పడుతూనే ఉన్నారు. ఎమ్మెల్యేల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక పార్టీ నేతలు, ద్వితీయ స్థాయి నాయకులు పరిిస్థితి మరింత అధ్వానంగా మారింది. ఏ ప్రభుత్వ కార్యాలయంలోని చిన్న పని కూడా జరగని పరిస్థితి నెలకొంది. కూటమిలో ఆత్మగౌరవం కోసం జనసేన నేతలు గత ఏడాది కాలంగా పట్టుబడుతూనే ఉన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే అనేక సార్లు పార్టీ అధినాయకుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయింది. తాజాగా సీతంపేట ప్రాంతంలోని పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు సమక్షంలో సమావేశం నిర్వహించారు. దీనికి జనసేన కార్పొరేటర్లతో పాటు నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఇందులో జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై కొందరు నేతలు గోడు చెప్పుకున్న పాపానికి నాగబాబు ఒంటి కాలిపై లేచారు. కూటమిలో తమకు విలువ ఇవ్వడం లేదని, తమ అభిప్రాయాలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన వారిపై వేటు వేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఎన్ని సమస్యలు వచ్చినా కూటమిలో సర్దుకొని పనిచేయాల్సిందే అని నాగబాబు తెగేసి చెప్పడంతో జనసేన నాయకులు, కార్యకర్తలు ఖంగుతిన్నారు.చేతికి మట్టి అంటకుండా..నాగబాబు సమావేశంలో జీవీఎంసీ జనసేన ఫ్లోర్ లీడర్ భీశెట్టి వసంతలక్ష్మి భర్త భీశెట్టి గోపీకృష్ణ పార్టీ పరిస్థితిపై మాట్లాడారు. కూటమిలో జనసేన పార్టీ నేతల అభిప్రాయాలకు విలువ ఇవ్వడం లేదని మాత్రమే చెప్పారు. ఇంతలో ఎమ్మెల్సీ నాగబాబు కల్పించుకుని గోపీకృష్ణపై ఫైర్ అయ్యారు. సమావేశం నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. వెంటనే అక్కడి నేతలు గోపీకృష్ణ చేతిలో ఉన్న మైక్ లాక్కున్నారు. అక్కడి నుంచి పంపించేశారు. దీంతో ఫ్లోర్లీడర్ భర్త అవమానభారంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. కూటమిలో జనసేన ప్రాధాన్యత కోసం మాట్లాడుతుంటే.. దానికి మద్దతుగా నిలవాల్సిన పార్టీ పెద్దలు.. వారిపైనే ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడున్న వారంతా విస్తుపోయారు. ఇదిలా ఉంటే.. వెంటనే ఫ్లోర్లీడర్ భీశెట్టి వసంతలక్ష్మిని ఆ పదవి నుంచి తప్పించేందుకు ఏర్పాట్లు జరిగిపోతుండడం గమనార్హం. నాగబాబు సమావేశంలో ఆమె భర్త మాట్లాడడాన్ని పార్టీ పెద్దలు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పార్టీ పెద్దల చేతికి మట్టి అంటకుండా తెలివిగా కార్పొరేటర్లను ముందు పెట్టి కథను నడిపిస్తున్నారు. దీనిపై పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్కు లేఖ అందజేయడం ఇప్పుడు జనసేనలో హాట్ టాపిక్గా మారింది.ఫ్లోర్ లీడర్పై ఆరోపణలతో లేఖ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ భీశెట్టి వసంతలక్ష్మిపై వేటుకు ప్లాన్ ఎమ్మెల్సీ నాగబాబు సమావేశంలో ఆమె భర్త ప్రశ్నించారనే అక్కసుతోనే..స్టాండింగ్ కమిటీలోనూ జనసేనకు నో చాన్స్ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల అంశం జనసేనలో అగ్గి రాజేస్తోంది. స్థాయీ సంఘంలో కూడా జనసేనకు ప్రాతినిథ్యం లేకుండా పోయింది. ఇందులో 10 స్థానాలు ఉండగా.. 9 టీడీపీ, ఒకటి బీజేపీ సర్దేసుకున్నాయి. జనసేనకు ఒక్క స్థానాన్ని కూడా కేటాయించకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల క్రితం స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు సమావేశం నిర్వహించి జనసేనకు మూడు స్థానాలను కేటాయిస్తున్నట్లు చెప్పారు. వీటిలో ఒకటి పెద్దిశెట్టి ఉషశ్రీ, మరొకటి మహమ్మద్ సాధిక్, మరొకరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉందని ఆశ పెట్టారు. దీంతో ఆ కార్పొరేటర్లు ఊహల్లో తేలారు. చివరికి జనసేనకు ఒక్క స్థానాన్ని కూడా కేటాయించకపోవడంతో అందరూ నోరెళ్లబెట్టారు. అయితే 11వ సభ్యుడిగా సాధిక్ నామినేషన్ దాఖలు చేశారు. 10 మందిలో ఎవరైనా విత్డ్రా అయితేనే సాధిక్కు అవకాశం ఉంటుంది. లేకుంటే స్టాండింగ్ కమిటీలో జనసేనకు ప్రాతినిథ్యం లేకుండా పోతుంది.జనసేన ఫ్లోర్లీడర్గా ఉషశ్రీ?ప్రస్తుత ఫ్లోర్లీడర్ భీశెట్టి వసంతలక్ష్మిని ఆ పదవి నుంచి తప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ స్థానంలో 43వ వార్డు కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉషశ్రీ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన ఆమె కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జనసేనలోకి జంప్ అయ్యారు. డిప్యూటీ ఫ్లోర్లీడర్ పదవిని ఆశించి భంగపడ్డారు. కనీసం స్టాండింగ్ కమిటీలో అయినా ఛాన్స్ వస్తుందని ఆశపడ్డారు. అందులో జనసేనకు ప్రాతినిథ్యమే లేకపోవడంతో ఇప్పుడు ఫ్లోర్లీడర్పై కన్నేశారు. జనసేన పార్టీ పెద్దలు కూడా ఉషశ్రీ వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.పార్టీ పెద్దల స్కెచ్ ప్రకారం జనసేన కార్పొరేటర్లు ఎమ్మెల్యే వంశీకృష్ణకు లేఖ అందజేశారు. ఇందులో ఫ్లోర్లీడర్ భీశెట్టి వసంతలక్ష్మిని మార్చాలని పేర్కొన్నారు. ఆమె స్వప్రయోజనాలు, వారి సమస్యల పరిష్కారం కోసమే దృష్టి పెట్టారని ఆరోపించారు. మిగిలిన జనసేన కార్పొరేటర్లను నిర్లక్ష్యం చేశారని తెలిపారు. అలాగే ఆమెకు ఫ్లోర్లీడర్కు అవసరమైన అనుభవం, నాయకత్వ లక్షణాలు లేవని విమర్శించారు. ఈ పదవికి అనుభవజ్ఞుడైన వ్యక్తి అవసరమన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం జీవీఎంసీలో జనసేనకు చెందిన 11 మందిలో ఒకరిని ఫ్లోర్ లీడర్గా నియమించాలని కోరారు. ఈ లేఖ వెనుక జనసేన పెద్దలు ఉన్నట్లు పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. అతడు పార్టీ నేతల తరఫున మాట్లాడిన పాపానికి వసంతలక్ష్మిపై వేటుకు రంగం సిద్ధం చేయడాన్ని తప్పుబడుతున్నారు. పార్టీ ఉనికి కోసం నేతలు పోరాటం చేస్తుంటే.. వారిపైనే వేటు వేస్తుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. -
నిబంధనలు అతిక్రమిస్తే సీజ్ చేస్తాం
సరోగసీ, ఐవీఎఫ్ సెంటర్లకు డీఎంహెచ్వో హెచ్చరిక మహారాణిపేట: సరోగసీ, ఐవీఎఫ్ సెంటర్లు నిబంధనల ప్రకారం మాత్రమే పనిచేయాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి. జగదీశ్వరరావు హెచ్చరించారు. మంగళవారం రేసవానిపాలెంలోని డీఎంహెచ్వో కార్యాలయ సమావేశ మందిరంలో సరోగసీ, ఐవీఎఫ్ సెంటర్ల నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సెంటర్లు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే సెంటర్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. అలాగే అనుమతి లేకుండా ఐవీఎఫ్, సరోగసీ నిర్వహించినా చర్యలు తప్పవని, అనుమా నం వచ్చిన వాటికి నోటీసులు జారీ చేస్తామన్నారు. లైసెన్స్ గడువు ముగిసినా సృష్టి సెంటర్ నడిపారని, విశాఖలోని సృష్టి సెంటర్లపై నిఘా పెట్టామని డీఎంహెచ్వో తెలిపారు. సమావేశంలో 53 ఐవీఎఫ్, సరోగసీ సెంటర్ల నిర్వాహకులు పాల్గొన్నారు. ఐవీఎఫ్, సరోగసీ సెంటర్లలో తనిఖీలునగరంలోని ఐవీఎఫ్, సరోగసీ సెంటర్లను డీఎంహెచ్వో డాక్టర్ పి.జగదీశ్వరరావు తన బృందంతో మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జాతీయ రహదారిపై ఉన్న పద్మశ్రీ ఐవీఎఫ్ సెంటర్, పీఎంపాలెంలోని ఓయాసిస్ ఐవీఎఫ్ సెంటర్లను పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. ప్రతి ఐవీఎఫ్ సెంటర్లో గైనకాలజిస్ట్లు, ఆండ్రాలజిస్ట్లు, ఎంబ్రియోలాజిస్ట్లు నిరంతరం అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఐవీఎఫ్, సరోగసీ సెంటర్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పని చేయాలని, ఎటువంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. అలాగే సకాలంలో రిజిస్ట్రేషన్, రెన్యువల్ చేసుకోవాలని స్పష్టం చేశారు. నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఉమావతి నగరంలోని సరోగసీ సెంటర్లు, సహాయక పునరుత్పత్తి సాంకేతిక (ఏఆర్టీ) బ్యాంక్ ఎల్1, ఎల్2లను పరిశీలించి.. అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. -
నగరాన్ని గాలికొదిలేశారు.!
● దేశంలోనే కాలుష్యం పెరిగిన నగరాల్లో రెండో స్థానంలో వైజాగ్ ● 2024–25లో నగరంలో 32.9 శాతం పెరిగిన వాయు కాలుష్య స్థాయిలు ● గత పదేళ్లలో కాలుష్య నియంత్రణకు రూ.129.4 కోట్లు మంజూరు చేసిన కేంద్రం ● ఇప్పటివరకు రూ.39 కోట్లు మాత్రమే ఖర్చు చేసిన రాష్ట్రం ● వైఎస్సార్ సీపీ హయాంలో కాలుష్య నియంత్రణకు అధిక మొత్తం వినియోగం ● కూటమి అధికారంలోకి వచ్చాక మహా నగరంపై నిర్లక్ష్యం సాక్షి, విశాఖపట్నం: మనిషి మనుగడకు స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, ఆరోగ్యకరమైన ఆహారం అత్యవసరం. వీటిలో ఏది లోపించినా అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం ఇదే పరిస్థితి. మరి మన మహానగరం విశాఖపట్నం సురక్షితమేనా అంటే, కాదనే సమాధానం వినబడుతోంది. విశాఖలో కాలుష్యం గణనీయంగా పెరిగి, ప్రాణ వాయువు కొరవడుతోంది. కేంద్ర ప్రభుత్వ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎన్సీఏపీ)లో భాగంగా.. దేశవ్యాప్తంగా 130 నగరాల్లో కాలుష్య స్థాయిలు ఎలా పెరుగుతున్నాయనే అంశంపై అధ్యయనం చేసింది. 2024–25లో సంపూర్ణ డేటాని సేకరించి.. నివేదిక విడుదల చేసింది. మొత్తం 130 నగరాల్లో అత్యంత ఎక్కువగా కాలుష్యం పెరిగిన జాబితాలో ఔరంగాబాద్ మొదటి స్థానంలో ఉండగా.. విశాఖ రెండో స్థానంలో ఉంది. కాలుష్యం పెరిగిన నగరాల జాబితాలో విశాఖ రెండో స్థానానికి చేరడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా, నగర కాలుష్యంపై ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడమే ఈ దుస్థితికి కారణమని ప్రస్తుత గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2024–25 నుంచి 32.9 శాతం పెరుగుదల దేశంలో వాయు కాలుష్యం పెరిగిన నగరాల్లో విశాఖపట్నం రెండో స్థానంలో నిలిచిందని జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం (ఎన్సీఏపీ) అధ్యయనం వెల్లడించింది. 2019లో ప్రారంభించిన ఈ కార్యక్రమం, 2017–18 నాటి పీఎం 10 స్థాయిలను ప్రామాణికంగా తీసుకుని అంచనా వేసింది. ఎన్సీఏపీ గణాంకాల ప్రకారం, 2024–25లో విశాఖ నగరంలో కాలుష్యం 32.9 శాతం పెరిగింది. ఇది గతంలో ఎన్నడూ లేనంత దారుణమని నివేదిక పేర్కొంది. పీఎం 10 సాంద్రత 101 మైక్రోగ్రామ్స్పర్ క్యూబిక్ మీటర్కు చేరడం ఆందోళన కలిగించే అంశంగా హెచ్చరించింది. మొదటి స్థానంలో ఉన్న ఔరంగాబాద్లో 33.3 శాతం గాలి నాణ్యత క్షీణించింది. విశాఖతో పాటు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం సహా 13 నగరాల్లో వాయు కాలుష్యం గణనీయంగా పెరిగినట్లు ఈ అధ్యయనం తేల్చింది. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే.. 2019లో ప్రారంభమైన కాలుష్య నియంత్రణ ప్రాజెక్టులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖ, విజయవాడ, కర్నూలు, కడప, అనంతపురం సహా 13 నగరాలను ఎంపిక చేశారు. ఈ నగరాల్లో గాలిలో దుమ్ము, వాహన ఉద్గారాలు, పారిశ్రామిక కాలుష్యం నియంత్రణపై దృష్టి సారించాలని సూచించారు. విశాఖ నగరానికి ఇప్పటి వరకూ రూ.129.4 కోట్లు కేటాయించారు. ఇందులో గత వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్న సమయంలో విడుదలైన రూ.39.6 కోట్లు ఖర్చు చేసి.. కాలుష్యాన్ని నియంత్రించేందుకు తీవ్రంగా శ్రమించింది. విశాఖలో ఏప్రిల్ 2017 నుంచి మార్చి 2018 వరకూ పీఎం10 స్థాయిలు 159 నమోదు కాగా.. 2019 డిసెంబర్కి ఈ సంఖ్య 108కి చేరింది. 2020 జనవరి నుంచి సెప్టెంబర్ వరకూ 96కి తగ్గింది. 2021 నాటికి మరింత కాలుష్యం తగ్గి 90కి చేరుకుంది. కానీ కూటమి ప్రభుత్వంలో మాత్రం కాలుష్యం అమాంతం పెరిగిపోయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిధుల గురించి పట్టించుకోకుండా నగరంపై నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. గతేడాది సెప్టెంబర్లో మరింత దారుణంగా... 2024–25 దేశవ్యాప్త అధ్యయనం ప్రకారం విశాఖలో వాయు నాణ్యత మరింత క్షీణించింది. ముఖ్యంగా గత ఏడాది సెప్టెంబర్లో పీఎం 2.5 సాంద్రత స్థాయిలు దారుణంగా నమోదయ్యాయి. దేశంలోని టాప్–10 అత్యంత కాలుష్య నగరాల రోజువారీ జాబితాలో విశాఖ పదిసార్లు చోటు దక్కించుకోవడం ఆందోళన కలిగిస్తోంది. పోర్టు నుంచి ఎన్టీపీసీ, ఫార్మాసిటీ వరకు అన్నింటి నుంచి కాలుష్యం నగరంలో విస్తరిస్తోంది. వాతావరణంలో కార్బన్ డయాకై ్సడ్ శాతం రోజురోజుకూ పెరుగుతోంది. కూటమి ప్రభుత్వం తక్షణమే కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టకపోతే గాలి నాణ్యత మరింత దిగజారి, ఢిల్లీ లాంటి దుర్భర పరిస్థితులు విశాఖలో కూడా తలెత్తుతాయని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. నగరంలో వాయు కాలుష్యం(మెక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్మీటర్) నగరంలో పీఎం 10 స్థాయిలు సంవత్సరం పీఎం10 2018 ఏప్రిల్ 159 2019 డిసెంబర్ 108 2020 సెప్టెంబర్ 96 2021 డిసెంబర్ 90 2024 సెప్టెంబర్ 101 -
మానవ అక్రమ రవాణా.. పెను సమస్య
జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్రబీచ్రోడ్డు: మానవ అక్రమ రవాణా ప్రపంచవ్యాప్తంగా పెను సమస్యగా మారుతోందని, ఇది చాలా విచారకరమని ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె. సుభద్ర అన్నారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ చైల్డ్ రైట్స్ అవేర్నెస్ ఫోరం, ఏటీఎస్ఏసీ ఇండియా సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, హెల్ప్ స్వచ్ఛంద సంస్థ, సీఐడీ, పలు సంస్థల సమన్వయంతో రూపొందించిన ‘మానవ అక్రమ రవాణా ఒక వ్యవస్థీకృత నేరం – ఈ దోపిడీని అంతం చేయండి’ పోస్టర్ను మంగళవారం సిరిపురంలోని జెడ్పీ చైర్మన్ క్యాంప్ ఆఫీసులో ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధానంగా అక్రమ రవాణాలో పిల్లలు, మహిళలు, పేదలు, నిరక్షరాస్యులు బాధితులుగా మారుతుండటం బాధాకరమన్నారు. చెల్డ్ రైట్స్ అవేర్నెస్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ గొండు సీతారాం మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాతో పాటు బాలికల అక్రమ రవాణా వ్యవస్థను రూపుమాపేందుకు తమ ఫోరం రాష్ట్రంలోని 16 ఎన్జీవోలతో కలిసి పనిచేస్తోందన్నారు.ఫోరం ప్రతినిధులు కె. ఎల్లయ్య, బి. లవకుశ, ఎం. ప్రవీణా త్రినాథ్, బి. లక్ష్మణరావు, బొడ్డేపల్లి సురేష్, ఎం. హరీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
స్థాయీ సంఘం ఎన్నికల్లో మొత్తం 21 నామినేషన్లుడాబాగార్డెన్స్: జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నిక నామినేషన్ల ఘట్టం మంగళవారంతో ముగిసింది. వైఎస్సార్ సీపీ నుంచి 10 మంది, కూటమిలోని టీడీపీ నుంచి 9 మంది, బీజేపీ నుంచి ఒకరు, జనసేన నుంచి ఒకరు నామినేషన్లు దాఖలు చేశారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లను పరిశీలిస్తారు. ఆగస్టు 2 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. 6వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు, అనంతరం ఫలితాలు వెల్లడిస్తారు. ● వైఎస్సార్ సీపీ నుంచి నిక్క లక్ష్మి(20వ వార్డు), సాడి పద్మారెడ్డి(24వ వార్డు), పల్లా అప్పలకొండ(28వ వార్డు), బిపిన్ కుమార్ జైన్(31వ వార్డు), గుండాపు నాగేశ్వరరావు(40వ వార్డు), కోడిగుడ్ల పూర్ణిమ(41వ వార్డు), రెయ్యి వెంకటరమణ(51వ వార్డు), కేవీఎన్ శశికళ(55వ వార్డు), మహ్మద్ ఇమ్రాన్(66వ వార్డు), ఉరుకూటి రామచంద్రరావు(70వ వార్డు) నామినేషన్లు దాఖలు చేశారు. ● టీడీపీ నుంచి మొల్లి హేమలత(5వ వార్డు), సేనాపతి వసంత(96వ వార్డు), రాపర్తి త్రివేణి వరప్రసాదరావు(92వ వార్డు), దాడి వెంకట రామేశ్వరరావు(88వ వార్డు) రమేష్, రౌతు శ్రీనివాస్(78వ వార్డు), మొల్లి ముత్యాలు(87వ వార్డు) మాదంశెట్టి చిన్నతల్లి(83వ వార్డు), వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలో చేరిన కొణతాల నీలిమ(79వ వార్డు), గేదెల లావణ్య(17వ వార్డు)లకు కూటమి అవకాశం కల్పించింది. అలాగే బీజేపీ కార్పొరేటర్ గంకల కవిత(47వ వార్డు) నామినేషన్ దాఖలు చేశారు. జనసేనలో చేరిన స్వతంత్ర కార్పొరేటర్ మహ్మద్ సాధిక్(39వ వార్డు) 11వ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
విద్యుత్ స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి
డాబాగార్డెన్స్: ప్రజలపై భారాలు మోపే అదాని విద్యుత్ స్మార్ట్ మీటర్లను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రజాసంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. కార్మిక, ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో డాబాగార్డెన్స్లోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో సిటు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వీ కుమార్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ మాట్లాడారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డును మూడు ముక్కలుగా చేసి ట్రాన్స్కో, జెన్కో, డిస్కం పేరిట విభజించారని, ఇప్పుడు మళ్లీ విద్యుత్ సంస్థలను మొత్తం కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు పూనుకుంటున్నారన్నారు. అందులో భాగంగానే స్మార్ట్ మీటర్లను తీసుకువచ్చారన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెడితే వాటిని బద్దలు కొట్టండి అన్న లోకేష్, అధికారంలోకి వచ్చాక విద్యుత్ సంస్కరణ పనులను రాష్ట్రంలో శరవేగంగా అమలు చేస్తున్నారన్నారు. ఈ సంస్కరణలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతులను చేసి, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని సూచించారు. విద్యుత్ స్మార్ట్మీటర్ల ఉపసంహరణ కోరుతూ ఆగస్ట్ 5న ఈపీడీసీఎల్ సీఎండీ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టనున్నట్లు చెప్పారు. ఏఐటీయూసీ జిల్లా నాయకుడు ఎస్కే రెహ్మాన్, పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు ఎం.లక్ష్మి, ఆర్కేఎస్వీ కుమార్ తదితరులు మాట్లాడుతూ విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రజలందరినీ భాగస్వాములు చేయాలని, ప్రజాసంఘాలన్నీ సిద్ధం కావాలని కోరారు. ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలని, లేకుంటే 2000 సంవత్సరంలో జరిగిన విద్యుత్ పోరాట స్ఫూర్తితో అలాంటి పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు ఎం.మన్మధరావు, కె.దేవ, తిరుపతిరావు, బేగం, ఎస్.గౌరీ, ప్రకాశరావు, యూఎస్ఎన్ రాజు, ఎల్జే నాయుడు, నాయనబాబు తదితరులు పాల్గొన్నారు. 5న సీఎండీ కార్యాలయం వద్ద మహాధర్నా -
‘స్థాయీ’కి రూ.5 లక్షలు..!
● స్టాండింగ్ కమిటీ ఎన్నికల బరిలో ఉన్న సభ్యుల నుంచి వసూలు ● కీలక నేత చేతికి 10 మంది నుంచి రూ.50 లక్షలు ● ఎన్నికకు ముందు సభ్యులకు పంచేందుకు ఈ డబ్బు? విశాఖ సిటీ: జీవీఎంసీ ‘స్థాయీ’ రేటు ఫిక్స్ అయింది. ఎన్నికల్లో సభ్యులకు పంపకాలకు ‘ప్రత్యేక’ నిధులను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకోసం స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో సీటు కొట్టిన వారి నుంచి రూ.5 లక్షల చొప్పున రూ. 50 లక్షలు వసూలు చేశారన్న టాక్ చక్కర్లు కొడుతోంది. జీవీఎంసీలో ఒక కీలక నేత రంగంలోకి దిగి స్వయంగా ఒక్కో సభ్యుడి నుంచి వసూలు చేశారన్న గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఎన్నికకు ముందు రోజు ఒక్కో సభ్యుడికి ఈ నిధుల నుంచే పంపకాలు చేపట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. జీవీఎంసీలో స్థాయీ సంఘం ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ నుంచి 9 మంది, బీజేపీ నుంచి ఒకరు నామినేషన్ వేశారు. 11వ సభ్యుడిగా జనసేన కార్పొరేటర్ మహమ్మద్ సాధిక్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే అతడికి అవకాశం లేనట్లు తెలుస్తోంది. మంగళవారంతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. ఆగస్టు 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకావం ఉంది. ఆగస్టు 6వ తేదీన స్థాయీ సంఘం ఎన్నికలు జరగనున్నాయి. స్థాయీ సంఘం సభ్యులుగా నామినేషన్లు వేసిన వారి నుంచి డబ్బు వసూలు అంశం ఇప్పుడు జీవీఎంసీలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నిక ముందు కార్పొరేటర్లకు కొంత మొత్తాన్ని ముట్టజెప్పి టీడీపీ, బీజేపీ అభ్యర్థుల విజయానికి అవసరమైన ఓట్లు సాధించే పనిలో నిమగ్నమయ్యారు. -
పైడితల్లి అమ్మవారి పూజారి లండ మృతి
సింహాచలం: రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలై నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అడవివరం గ్రామదేవత పైడితల్లి అమ్మవారి పూజారి, 98వ వార్డు వైఎస్సార్సీపీ నాయకుడు, అడవివరం కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ లండ వెంకటరమణ(45) మంగళవారం మృతిచెందారు. ఆయన.. భార్య దేవితో కలిసి ఈ నెల 27న సింహాచలం నుంచి ఆనందపురం మండలం గిడిజాలలో జరిగే ఓ పుట్టినరోజు ఫంక్షన్కు ద్విచక్రవాహనంపై బయల్దేరారు. గుడిలోవ సమీపంలో వీరి బైక్ను కారు ఢీకొనడంతో వెంకటరమణ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే నగరంలోని ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. ఆయన కొడుకు నితిన్ ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరం, కుమార్తె ప్రజ్ఞ 9వ తరగతి చదువుతున్నారు. ఆది నుంచి లండ వెంకటవమణ దివంగత మహానేత వైఎస్సార్, ఆ తర్వాత మాజీ సీఎం వైఎస్ జగన్కు పెద్ద అభిమానిగా ఉన్నారు. కొడుకు నితిన్కు చిన్నప్పుడు గుండె సమస్య రావడంతో ఆరోగ్యశ్రీలో చికిత్స జరిగింది. ఆయన మృతదేహానికి అడవివరం కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు కర్రి అప్పలస్వామి, 98వ వార్డు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కొలుసు ఈశ్వరరావు, 98వ వార్డు కార్పొరేటర్ పి.వి.నరసింహం నివాళులర్పించారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
వీసీబీ చైర్మన్గా జె.వి.సత్యనారాయణమూర్తి
సీతంపేట: విశాఖపట్నం కో–ఆపరేటివ్ బ్యాంక్ (వీసీబీ) చైర్మన్గా జె.వి.సత్యనారాయణమూర్తి, వైస్ చైర్మన్గా చలసాని రాఘవేంద్రరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటు సూర్పనేని నాగభూషణ చౌదరి, ఎ.జె. స్టాలిన్, వీరఘంట చంద్రశేఖర్, గుళ్లపల్లి జనార్ధనరావు, చెరువు ఆదినారాయణ శాస్త్రి, కండాపు ప్రసాదరావు, ఉప్పలపాటి పార్వతీదేవి, చిన్నం కోటేశ్వరరావు, మరో 11 మంది డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న 1,472 సహకార అర్బన్ బ్యాంకుల్లో.. విశాఖపట్నం కో–ఆపరేటివ్ బ్యాంక్ దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద అర్బన్ బ్యాంక్గా నిలిచింది. ఆర్థిక కార్యకలాపాల రీత్యా దేశంలోనే మొదటి 10–15 స్థానాల్లో ఈ బ్యాంక్ ఉంది. రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్లో కూడా శాఖలను కలిగి ఉండటంతో పాటు ఇది బహుళ రాష్ట్రాల సహకార సంఘంగా అభివృద్ధి చెందింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.12 లక్షల మంది షేర్ హోల్డర్లు, రూ. 400 కోట్ల షేరు ధనం కలిగి ఉన్న ఈ బ్యాంకులో.. ఎటువంటి వివాదాలకు అవకాశం లేకుండా మూడు దశాబ్దాలుగా పాలకవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా జరుగుతుండడం విశేషం. -
ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన
తగరపువలస: ఆనందపురం మండలం చందకలో కెనరా బ్యాంక్ స్థానిక బ్రాంచ్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ‘సురక్షజ్యోతి’ నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ విజయవాడ సర్కిల్ జనరల్ మేనేజర్ సీజే విజయలక్ష్మి.. సామాజిక భద్రతా పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు సైబర్ మోసాలలో సున్నితత్వం, ఈ కేవైసీ ప్రాముఖ్యత, ఖాతాలలో నామినేషన్ వివరాలు నవీకరించడం గురించి తెలియజేశారు. దేశంలోనే రెండో అతి పెద్ద ప్రభుత్వ యాజమాన్య సంస్థల్లో ఉన్న కెనరా బ్యాంకు పీఎంఎస్బీవై, పీఎంజేజేబీవై, ఏపీవై వంటి సామాజిక భద్రతా పథకాలను విస్తృతంగా అమలు చేస్తోందన్నారు. విశాఖ రీజనల్ హెడ్, ఏజీఎం ఎన్.మధుసూదనరెడ్డి మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యతకు ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. డివిజనల్ మేనేజర్ హెచ్.ప్రతాప్కుమార్, బంక సత్యం, సర్పంచ్ బంక శ్రీను, మాజీ సర్పంచ్ జీవీ రమణ, ఎంపీటీసీ సభ్యుడు ఎం.నాగేశ్వరరావు, రాజు, సోమినాయుడు, బ్యాంకు సిబ్బంది, వందల సంఖ్యలో పంచాయతీ ప్రజలు పాల్గొన్నారు. -
అతిథి ఎంపికలో అయోమయం
● ఏయూలో అతిథి అధ్యాపకుల భర్తీ ● రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేకుండా నోటిఫికేషన్ ● ఆగస్టు 1 నుంచి ఇంటర్వ్యూల నిర్వహణకు సన్నద్ధం ● తరగతులు జరగక విద్యార్థుల ఆందోళన మద్దిలపాలెం: వందేళ్ల ఘన చరిత్ర కలిగిన ఆంధ్రా యూనివర్సిటీలో అతిథి అధ్యాపకుల నియామక ప్రక్రియ గందరగోళంగా మారింది. అధికారుల సమన్వయ లోపం, అనాలోచిత నిర్ణయాలతో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా నోటిఫికేషన్ విడుదల చేయడం, ఇంటర్వ్యూల నిర్వహణలో జరుగుతున్న పరిణామాలు.. అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీని వల్ల విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా.. తరగతులు జరగక విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. నోటిఫికేషన్పై విమర్శలు ఏయూ అధికారులు అతిథి అధ్యాపకుల నియామకాలకు సంబంధించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ను విస్మరించి వెబ్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఏఏ విభాగంలో ఎన్ని పోస్టులున్నాయి? వాటిలో ఏయే రిజర్వేషన్లకు ఎన్ని కేటాయించారన్న వివరాలను పొందుపరచలేదు. ఇది నియమావళికి విరుద్ధమని, ప్రస్తుతం ఏయూలో అతిథి అధ్యాపకులుగా పనిచేస్తున్న సుమారు 400 మంది భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కొందరు అభ్యర్థులు ఉన్నత విద్యామండలికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. 1,100 దరఖాస్తుల స్వీకరణ ఆదరాబాదరగా విడుదల చేసిన ఈ వెబ్ నోటిఫికేషన్కు గడువు ముగిసే నాటికి సుమారు 1,100 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఏయూలో పనిచేస్తున్న వారితో పాటు కొత్త అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. సగటున ప్రతి డిపార్ట్మెంట్కు కనీసం 10 దరఖాస్తులు అందినట్లు తెలుస్తోంది. అయితే ఇంజనీరింగ్ కళాశాలకు చాలా తక్కువ దరఖాస్తులు రాగా.. కొన్ని విభాగాలకు అసలు దరఖాస్తులే రాలేదని సమాచారం. ఆరు నెలల (సెమిస్టర్) కాలానికి రూ.45,000 వేతనంగా చెల్లిస్తుండటంతో చాలామంది దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. అందుకేనా.. వేర్వేరు ప్రాంతాల్లో.? ఆగస్టు 1 నుంచి 4వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ, వాటి నిర్వహణపై పూర్తి గందరగోళం నెలకొంది. గతంలో ప్రిన్సిపాల్ కార్యాలయంలోనే అతిథి అధ్యాపకుల ఇంటర్వ్యూలు నిర్వహించేవారు. కానీ ఈ సారి వేర్వేరు ప్రాంగణాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మొదట ప్రిన్సిపాల్ కార్యాలయం, తర్వాత రిజిస్ట్రార్ కార్యాలయం అని ప్రచారం జరిగింది. అభ్యర్థులంతా ఒకే చోట చేరితే సమస్యలు తలెత్తవచ్చనే ఉద్దేశంతో వేర్వేరు ప్రాంతాల్లో ఇంటర్వ్యూలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సమన్వయలోపంతోనే.. ఏయూలో వీసీ, అధికారులు సమన్వయంతో పని చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి. అతిథి అధ్యాపకులందరికీ న్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకోవాలి. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని అతిథి అధ్యాపకుల నియామకం పారదర్శకంగా, ఏయూ నిబంధనల ప్రకారం చేపట్టాలి. – డాక్టర్ ఎం.సురేష్ మీనన్, అధ్యక్షుడు, ఏయూ అధ్యాపకుల సంఘం వందేళ్ల చరిత్రలో.. ఆంధ్ర యూనివర్సిటీలో కొత్త విద్యా సంవత్సరం జూలై ఒకటో తేదీ నుంచి ప్రారంభమైంది. దాదాపు నెల రోజులు కావస్తున్నా.. టైం టేబుల్ విడుదల కాలేదు. అధ్యాపకులు తరగతులకు వెళ్లడం లేదు. అతిథి అధ్యాపకుల నియామక ప్రక్రియ జాప్యం, ఒప్పంద అధ్యాపకులు అగ్రిమెంట్ పేరుతో తరగతులకు వెళ్లకపోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. వందేళ్ల చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నెల రోజులుగా తరగతులు నిర్వహించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొదటి సెమిస్టర్ సమయం ఆసన్నమవుతుండటంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రోజుకో మాట ఏయూ ఆర్ట్స్ కళాశాలలకు సంబంధించి విజయనగరం ప్యాలెస్, అంబేడ్కర్ ఆడిటోరియం, ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి జియోఫిజిక్స్, సైన్స్, లా, ఫార్మసీ కళాశాలలకు సంబంధించి అంబేడ్కర్ ఆడిటోరియంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు అభ్యర్థులకు ఈ మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చారు. అయితే ఎంపిక కమిటీ కూర్పుపై అధికారులు రోజుకో సమాచారం ఇస్తున్నారు. గతంలో వీసీ ఆధ్వర్యంలో సిక్స్ మెన్ కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించింది. ప్రస్తుతం ప్రిన్సిపాల్ చైర్మన్గా, హెచ్వోడీలు, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, ఎక్స్టర్నల్ సభ్యులుగా ఉంటారని ఒకసారి, ఫ్యాకల్టీ చైర్మన్, హెచ్వోడీ, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, ఎక్స్టర్నల్ సభ్యులుగా ఉంటారని మరోసారి, హెచ్వోడీ, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, ఫ్యాకల్టీతో పాటు ఎక్స్టర్నల్ ఉంటారని ఇంకోసారి ప్రచారం జరిగింది. అయితే సంబంధిత ప్రిన్సిపాల్, హెచ్వోడీలకు తెలియకుండానే కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రిన్సిపాల్ పేరుతోనే నోటిఫికేషన్ విడుదలైనందున.. ఆయన లేకుండా ఎంపిక కమిటీని ఏర్పాటు చేయడం చట్ట ప్రకారం సరైంది కాదని వర్సిటీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం
అగనంపూడి: ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రీపెయిడ్ ఆటోస్టాండ్ను ఏర్పాటు చేసినట్లు వాల్తేర్ డీఆర్ఎం లలిత్ బొహ్రా, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. దువ్వాడ రైల్వేస్టేషన్ నాలుగో నంబర్ ప్లాట్ఫాం వైపు ప్రీ పెయిడ్ ఆటో, ట్యాక్సీ స్టాండ్ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దువ్వాడ రైల్వేస్టేషన్ నుంచి నగరంలోని అన్ని ప్రాంతాలకు జీపీఎస్ ట్రాకింగ్ సౌకర్యంతో ఆటో, ట్యాక్సీలు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. అలాగే టారిఫ్లను ఖరారు చేశామని, ఆ మేరకు మాత్రమే ప్రయాణికులు చెల్లించాలని సూచించారు. డ్రైవర్లు అధిక చార్జీలు డిమాండ్ చేసినా లేదా ప్రయాణంలో ఇబ్బందులు ఎదురైనా రైల్వే అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. సుమారు 70 ఆటోలు ప్రీపెయిడ్ ఆటో స్టాండ్లో నమోదయ్యాయని.. వీటన్నింటికీ జీపీఎస్ ట్రాకింగ్ చేస్తామన్నారు. ఈ సందర్భంగా దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రైల్వేస్టేషన్ పరిధిలో కంట్రోల్ పాయింట్ ఏర్పాటు చేయాలని సీపీకి ఓ వినతిపత్రంలో కోరారు. వందే భారత్కు దువ్వాడలో హాల్ట్ ఇవ్వాలని, సౌకర్యాలు కల్పించాలని డీఆర్ఎంకు వినతిపత్రం అందించారు. డీసీపీ మేరీ ప్రశాంతి, ఏసీపీ వై.శ్రీనివాసరావు, సీనియర్ డీసీఎం కె.సందీప్, సీనియర్ డీఈఈ ఎం.ఎస్.ఎన్.మూర్తి, డీఈ సాయి అనూప్, తూర్పు కోస్తా రైల్వే జోనల్ కన్సల్టెన్సీ కమిటీ సభ్యుడు కంచుమూర్తి ఈశ్వర్, దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ ప్రతినిధులు జాషువా, మురళీధర్రెడ్డి, బి.కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దువ్వాడలో ప్రీ పెయిడ్ ఆటో, ట్యాక్సీ స్టాండ్ ప్రారంభం -
ఆటో మ్యుటేషన్తో అందరికీ మేలు
మధురవాడ: రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ప్రభుత్వం తీసుకువస్తున్న అర్బన్ ఆటో మ్యుటేషన్ పద్ధతి అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ బాలకృష్ణ అన్నారు. మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ‘అర్బన్ ఆటో మ్యుటేషన్’ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. డాక్యుమెంట్ రైటర్ పబ్లిక్ డేటా ఎంట్రీలో తీసుకోవల్సిన జాగ్రత్తలు, దీనివల్ల కక్షిదారులకు కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. అక్రమ రిజిస్ట్రేషన్లు అరికట్టేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలోకి తీసువచ్చినట్టు చెప్పారు. ప్రజలు తమ భూమి వివరాలను registration.ap.gov.in ద్వారా స్వయంగా తెలుసుకోవచ్చన్నారు. సబ్ రిజిస్ట్రార్ చక్రపాణి మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో ఆస్తిని కొనుగోలు చేసిన తర్వాత కక్షిదారుడు మ్యుటేషన్ కోసం జీవీఎంసీ చుట్టూ తిరిగే పని ఇక ఉండదని, ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ అన్నింటిలోనూ పేరు ఆటోమెటిక్గా మారిపోతుందని చెప్పారు. కార్యక్రమంలో పలువురు డాక్యుమెంట్ రైటర్లు, కక్షిదారులు పాల్గొన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ బాలకృష్ణ -
నిత్యావసర వస్తువుల విక్రయాలపై నిఘా
మహారాణిపేట: నిత్యావసర వస్తువుల విక్రయ ధరలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు లోబడి మాత్రమే స్టాక్ నిల్వలను ఉంచాలని, పరిమితికి మించి నిల్వ చేయవద్దని ఆయన స్పష్టం చేశారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో మంగళవారం సివిల్ సప్లై, మార్కెటింగ్ అధికారులు, వర్తకులతో బియ్యం, పంచదార, పప్పుదినుసులు, కూరగాయల ధరల నియంత్రణ, అదుపుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఇటీవల కాలంలో బియ్యం, పంచదార, పప్పు దినుసుల ధరలు క్రమంగా పెరుగుతున్నాయని, ఈ పరిణామం ప్రజలపై ఆర్థిక భారం మోపుతోందని పేర్కొన్నారు. ప్రజలకు సరసమైన ధరలకే సరకులు విక్రయించాలని స్పష్టం చేశారు. నగర పరిధిలోని 13 రైతుబజార్లలో బియ్యం, పంచదార, పప్పు దినుసులతో కూడిన ప్రత్యేక కౌంటర్లు కొనసాగించాలని డీఎస్వో వి.భాస్కరరావు, మార్కెటింగ్ శాఖ డీడీ శ్రీనివాస్ కిరణ్లను ఆదేశించారు. ఈ సందర్భంగా వర్తకులు తమ సమస్యలను జేసీ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకుంటామని, లాభాపేక్ష లేకుండా విక్రయాలు జరుపుతామని హామీ ఇచ్చారు. గ్యాస్ డెలివరీ చార్జీలు వసూలు చేస్తే చర్యలు దీపం పథకం అర్హతలు, నిధుల జమపై ప్రజలకు సవివరంగా చెప్పాలని జేసీ సూచించారు. గ్యాస్ డెలివరీ సమయంలో బాయ్స్ చార్జీలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, అలా చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. చెకింగ్ ఇన్స్పెక్టర్లు ఈ వ్యవహారంపై ప్రత్యేక నిఘా ఉంచి చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే గ్యాస్ ఏజెన్సీలకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. సివిల్ సప్లైస్ డీఎం ఎం.శ్రీలత, ఇతర అధికారులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, వర్తకుల సంఘం ప్రతినిధులు, ట్రేడర్లు, హోల్ సేలర్స్, రిటైలర్లు పాల్గొన్నారు. జేసీ మయూర్ అశోక్ -
బుసకొట్టి డిమాండ్ చేస్తున్నాం.. సమస్యలు పరిష్కరించమని...!
జీవీఎంసీ ఆఫీస్ ప్రాంగణం సాధారణంగా ఉండే బూజు వాసనలకు బదులుగా, మా స్నేహితుల బుసబుసలు, మొరుగుళ్లతో దద్దరిల్లింది. అధికారిక సమావేశాల బోరింగ్ మాటలకు బదులు, మా వాళ్లే స్టేజ్పైకి వచ్చారు. మొదటగా మా అన్న స్నేక్ క్యాచర్ రొక్కం కిరణ్కుమార్, మా పాములందరికీ నీళ్లిస్తూ నిరసన తెలిపాడు. ఆ వేడిలో కాస్త చల్లగా అనిపించినా, అన్న కష్టం మాకు అర్థమైంది. మమ్మల్ని పట్టుకుని, సురక్షితంగా మరో చోట వదిలేసే అన్నకు సరైన గుర్తింపు లేదని మాకు తెలుసు. ఆ తర్వాత వీధిలో మా జాగిలా బంధువులను పట్టి నగరాన్ని కాపాడుతున్నామని చెప్పే వెటర్నరీ కార్మికులు, వాళ్ళతోపాటు మా జాగిల స్నేహితులను కూడా తెచ్చారు. మేం చూస్తూ ఉండగానే, జీవీఎంసీ కార్యాలయం అక్షరాలా మా జంతువుల అడ్డాగా మారిపోయింది. ఎందుకీ వింత ప్రదర్శన? ఇదంతా మా వెటర్నరీ కార్మికుల దీర్ఘకాల డిమాండ్ వల్లనే. జీవీఎంసీ కౌన్సిల్ వాళ్ల కోసం ఏదో జీవో నంబరు 36 అని ఒక తీర్మానం చేసిందట. దాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, వాళ్లు జీవీఎంసీ ప్రధాన గేటు దగ్గర నిరసన తెలిపారు. తర్వాత జీవీఎంసీ సీపీఎం లీడర్ డాక్టర్ బి.గంగారావు, జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు పి.వెంకట్రెడ్డి, మేయర్కు వినతి పత్రాలు ఇచ్చారు. ఈ సోమవారం.. పీజీఆర్ఎస్ మనుషుల వినతులకే కాదు, మా జంతువుల ఉనికిని, మా మిత్రుల గోడును కూడా తెలియజేసింది. – డాబాగార్డెన్స్ -
ఎమ్మెల్సీ నాగబాబుకు జనసేన వీర మహిళ షాక్
సాక్షి, విశాఖపట్నం: ‘జనసేన నేతలకు, కార్యకర్తలకు ఏం పనులు జరగడం లేదు. మీ వెనుక మేమెందుకు నడవాలని పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. వారికి ఏం సమాధానం చెప్పాలి’ అని జనసేన 15వ వార్డు అధ్యక్షురాలు కళ ఆ పార్టీకీలక నేత, ఎమ్మెల్సీ కె.నాగబాబును నిలదీశారు. ఇదే విషయమై 33వ వార్డు జనసేన కార్పొరేటర్, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ భీశెట్టి వసంతలక్ష్మి భర్త భీశెట్టి గోపీకృష్ణ కూడా ఎమ్మెల్సీ నాగబాబును నిలదీయగా.. వీరిద్దరినీ తీవ్రంగా అవమానించడం కలకలం రేపింది.ఎమ్మెల్సీ కె.నాగబాబు విశాఖ సీతంపేటలోని పార్టీ కార్యాలయంలో సోమవారం నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జనసేన వీరమహిళ కళ మాట్లాడారు. తమ వెనుక ఉన్న వారికి ఒక్క పని కూడా చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తుండగా.. పార్టీ నాయకులు వెంటనే ఆమె మాట్లాడుతున్న మైక్ను కట్ చేశారు. మైక్ ఇవ్వాలని ఆమె అడిగినప్పటికీ.. మైక్ను వేరొకరికి ఇవ్వాలని వేదికపై ఉన్న నాయకులు ఆదేశించారు. దీనిపై ఎమ్మెల్సీ నాగబాబు స్పందిస్తూ.. ‘పార్టీ కార్యకర్తలు అసహనంతో పనిచేయొద్దు. వ్యక్తిగతమైన సమస్యల్ని వదిలేసి కూటమితో కలిసి పనిచేయాల్సిందే’ అని తెగేసి చెప్పడంతో సమావేశానికి హాజరైన నాయకులు షాక్కు గురయ్యారు.జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ భర్తకూ అవమానం ఇదే సమావేశంలో జనసేన నాయకులు, కార్యకర్తల గోడును విన్నవించుకునే ప్రయత్నం చేసిన 33వ వార్డు జనసేన కార్పొరేటర్, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ భీశెట్టి వసంతలక్ష్మి భర్త గోపీకృష్ణకు సైతం తీవ్ర అవమానం ఎదురైంది. కూటమి ప్రభుత్వం తమ మాటకు విలువ ఇవ్వడం లేదని గోపీకృష్ణ చెప్పే ప్రయత్నం చేయగా.. నాగబాబు సీరియస్ అయ్యారు. మైక్ కట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ మండిపడ్డారు. పవన్ను నమ్మి తన భార్యను కార్పొరేటర్గా గెలిపించుకుంటే.. ఇలా అవమానిస్తారా? అని గోపీకృష్ణ సన్నిహితుల వద్ద వాపోయినట్టు తెలిసింది. -
పాములు, కుక్కలతో వినూత్న నిరసన
సాక్షి, విశాఖపట్నం: ఓ వైపు పాములు.. మరో వైపు కుక్కలతో కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ కార్మికులు సోమవారం విశాఖ జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద వినూత్న నిరసన చేపట్టారు. జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో వెటర్నరీ కారి్మకులకు కౌన్సిల్ తీర్మానం 36 ప్రకారం పెంచిన వేతనాలు చెల్లించాలని కోరుతూ నిరసన ప్రదర్శన చేపట్టారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 53 మంది కార్మికులు ఏళ్ల తరబడి పాములు, కుక్కలను పట్టుకుంటున్నారని తెలిపారు. ప్రమాదకర పరిస్థితుల్లో కర్తవ్యాన్ని నిర్వహిస్తూ విశాఖ పౌరుల భద్రత కాపాడుతున్నారని, కానీ వారి జీతాలు అతి తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారని, 2024 డిసెంబర్ 11న కౌన్సిల్ సమావేశంలో వారికి ఆరోగ్య అలవెన్స్ రూ.6 వేలు పెంచుతూ తీర్మానించారని తెలిపారు. ఏడు నెలలైనా వారికి పెంచిన జీతాలు ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఏడు నెలల బకాయిలతోపాటు పెంచిన జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
రౌడీ షీటర్పై దాడి చేసిన నిందితులకు రిమాండ్
మరో ఆరుగురి కోసం గాలింపు ఉక్కునగరం: మూడు రోజుల క్రితం స్టీల్ప్లాంట్ బీసీ గేటు సమీపంలోని లారీ యార్డ్ వద్ద రౌడీ షీటర్పై జరిగిన దాడి కేసులో ఆరుగురు నిందితులను స్టీల్ప్లాంట్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం స్టీల్ప్లాంట్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సౌత్ ఏసీపీ వై. శ్రీనివాసరావు ఈ కేసు వివరాలను వెల్లడించారు. దేశపాత్రుని పాలెం సమీపంలోని స్నేహపురి కాలనీకి చెందిన రౌడీ షీటర్ మొల్లి సంతోష్కుమార్ (37) ఈ నెల 25న తన కుమార్తెను స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్లాడు. అక్కడ ఆలస్యం అవుతుండటంతో, స్టీల్ప్లాంట్ బీసీ గేటు సమీపంలోని లారీ యార్డ్ వద్ద తన సోదరుడు సతీష్, స్నేహితుడు గణేష్తో కలిసి మాట్లాడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పెదగంట్యాడకు చెందిన మొల్లి శివకృష్ణ, మొల్లి శ్రీను, బాక్సర్లు వాసు మీసాల రవి, వియ్యపు ప్రవీణ్ మరికొంతమందితో అక్కడికి చేరుకుని సంతోష్కుమార్పై దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు. సంతోష్కుమార్ అక్కడి నుంచి తప్పించుకుని సమీపంలోని పొదల్లో దాక్కున్నాడు. ఈ దాడిలో మొల్లి శివకృష్ణ, మొల్లి శ్రీను కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు అనుచరులని తెలుస్తోంది. దాడి అనంతరం సంతోష్కుమార్ ఎస్వీఎస్ పాలీ క్లినిక్లో ప్రాథమిక చికిత్స చేయించుకుని, ఆ తర్వాత అగనంపూడి ఆస్పత్రికి వెళ్లాడు. మరుసటి రోజు అతను స్టీల్ప్లాంట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టి, ఈ ఘటనలో పాల్గొన్న మొల్లి శివకృష్ణ, రవి, ప్రవీణ్, జి. మనోజ్ కుమార్, ముచ్చి తరుణ్ అలియాస్ తేజ, సిరసపల్లి జితేంద్ర కుమార్లను అరెస్ట్ చేయగా కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిందన్నారు. దాడిలో పాలుపంచుకున్న మరో ఆరుగురిని గుర్తించామని, వారి కోసం గాలిస్తున్నామని ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సమావేశంలో స్టేషన్ సీఐ ఈ. కేశవరావు కూడా పాల్గొన్నారు. -
16 ఏళ్ల కుర్రోడు.. సత్తాచాటాడు
● వాలీబాల్లో జాతీయస్థాయి ప్రతిభ ● భారత్జట్టుకు చరణ్ ఎంపికపై హర్షాతిరేకాలు కూర్మన్నపాలెం : ఆటల పట్ల ఎలాంటి అవగాహన లేని 16 ఏళ్ల అడ్డాడ చరణ్, అనతి కాలంలోనే అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారుడిగా ఎదిగి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వడ్లపూడిలోని కణితి కాలనీకి చెందిన చరణ్.. థాయిలాండ్లో జరిగిన అంతర్జాతీయ వాలీబాల్ పోటీల్లో భారతదేశానికి మూడో స్థానం సాధించి పెట్టాడు. కేవలం ఏడున్నర నెలల శిక్షణతో 16 దేశాలతో పోటీపడి ఈ ఘనత సాధించడం విశేషం. కణితి కాలనీలోని తన మేనమామల వద్ద పెరుగుతూ ఉక్కునగరం డీఏవీపీ స్కూల్లో చదువుతున్న చరణ్, ఈ నెల 12వ తేదీ నుంచి 19వ తేదీ వరకు థాయిలాండ్లో జరిగిన పోటీల్లో పాల్గొన్నాడు. ఆసియా వాలీబాల్ కాన్ఫెడరేషన్ ఈ క్రీడలకు సారథ్యం వహించింది. ఈ పోటీల్లో చరణ్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అందరిచేత శభాష్ అనిపించుకున్నాడు. అంతేకాకుండా ఈ పోటీలకు దక్షిణ భారతదేశం నుంచి ఆయనొక్కడే ఎంపిక కావడం విశేషం. అలాగే వచ్చే ఏడాది ఖతర్లో నిర్వహించే ప్రపంచ చాంపియన్ పోటీలకు కూడా చరణ్ను భారత జట్టుకు ఎంపిక చేశారు. కరోనా సమయంలో వాలీబాల్వైపు.. క్రీడల పట్ల ఏమాత్రం అవగాహన లేని చరణ్కు కరోనా మహమ్మారి విజృంభించిన సమయం కలిసొచ్చింది. ఆ సమయంలో పాఠశాలలన్నీ మూతబడటంతో, ఎటూ తోచక చాలా సమయం ఇంట్లోనే గడిపేవాడు. అయితే ఒకసారి ఇంట్లో విసుగు అనిపించి సమీపంలోని మైదానం వైపు వెళ్లాడు. అప్పటికే అక్కడ తన వయసు ఉన్న పిల్లలు వాలీబాల్ ఆడటం గమనించాడు. అలా వాలీబాల్పై మక్కువ పెరిగింది. ఆ తరువాత పాఠశాలలు తెరచుకున్న తరువాత చరణ్ ఆడుతున్న తీరును ఉపాధ్యాయులు గమనించి ప్రోత్సహించారు. డీఏవీపీ పాఠశాలల కేంద్ర కార్యాలయం ఢిల్లీ, జార్ఖండ్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన పోటీలకు చరణ్ను ఎంపిక చేశారు. ఆ పోటీల్లో చరణ్సత్తా చాటాడు. చరణ్ మేనమావ.. అక్కయ్య పాలెం స్టేడియంలో స్పోర్ట్స్ కోచ్ను సంప్రదించి ఆయన వద్దకు తీసుకెళ్లారు. కేవలం ఏడాదిన్నర కాలంలోనే ఆయన వద్ద చరణ్ అన్ని మెలకువలు తెలుసుకొని వాలీబాల్ ఆటలో ఆరితేరిపోయాడు. ఈ లోగా థాయిలాండ్లో జరిగే పోటీలకు ఎంపిక జరగడంతో ముందుగా చరణ్ను ఎంపిక చేసి భారత జట్టుతో పంపించారు. ఆయనకు జాతీయ స్థాయి పోటీలు కొత్త అయినప్పటికీ, ఏమాత్రం జంకకుండా తనదైన శైలిలో ప్రతిభ కనబరిచి భారత్కు తృతీయ బహుమతి సాధించి పెట్టాడు. అక్కడ వచ్చే ఏడాది ప్రపంచ స్థాయి పోటీలకు ఎంపిక జరగగా చరణ్ను ఎంపిక చేసినట్లు ప్రకటించారు. మేనమామ ప్రోత్సాహంతో.. చరణ్ శ్రీకాకుళం జిల్లా పలాసకు సమీపంలోని అంతరగుడ్డి గ్రామం అయినప్పటికీ, 87వ వార్డులోని కణితి కాలనీలోని తన మేనమామ దానప్పలు వద్ద పెరుగుతూ ఉక్కునగరంలో చదువుతున్నాడు. మేనమామ ప్రోత్సాహంతో వాలీబాల్లో రాణిస్తున్నాడు. ఇటీవలే పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించాడు. ఒకవైపు చదువుతూనే మరోవైపు క్రీడల పట్ల ఆసక్తి చూపుతూ అందులో కూడా మంచి ప్రతిభ చూపుతుండటం పట్ల పలువురు అభినందిస్తున్నారు. చరణ్ తల్లిదండ్రులు కమలనాభం, దేవీలు తమ సొంత ఊరిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. జంపింగ్ స్కిల్స్ సూపర్ మొదట్లో చరణ్కు శిక్షణ ఇవ్వడానికి కొంతమేర అంగీకారం తెలపలేదు. అయితే తల్లి దండ్రులు, మేనమామ ప్రొత్సాహాన్ని చూసి అంగీకరించాం. చరణ్లో జంపింగ్ స్కిల్స్ బాగా ఉన్నాయి. అవి గుర్తించిన తరువాత శిక్షణ మరింత పకడ్బందీగా ఇచ్చా. తాము అనుకున్నట్టుగానే బాగా రాణించాడు. జాతీయ స్థాయిలో రాణించాడు. – ఎం.సత్యనారాయణ, వాలీబాల్ కోచ్ -
దడ
ధరలురైతు బజార్లుండి ఏం ప్రయోజనం ఒక్క పూట ఇంట్లో అందరికీ కూరవండుకోవాలంటే రూ.100లు పెట్టి కూరగాయలు కొనాల్సి వస్తోంది. మొన్న ఉన్న రేటు, ఈ రోజు ఉండటం లేదు. పచ్చిమిర్చి, టమాటా అయితే మరీ దారుణం. పావుకిలో పచ్చిమిర్చి రూ.30లు పెట్టి కొనాల్సి వచ్చింది. ఇలా అయితే మాలాంటోళ్లం ఎలా బతకాలి. రైతుబజార్లు ఉండి, ఏం ప్రయోజనం. ప్రభుత్వం పట్టించుకోవాలి. – ఫాతిమా, లక్ష్మీనగర్ వ్యాపారుల నిర్ణయించిందే ధర హోల్సేల్ మార్కెట్లోనే ధరలు అధికంగా ఉంటున్నాయి. పెద్ద వ్యాపారస్తులు పెట్టిన రేటుకు కూరగాయలు కొనితెచ్చుకుంటున్నాం. పచ్చిమిర్చి దొరకటం లేదు. క్రేట్లలో వస్తున్న టమాటా కుళ్లిపోతోంది. దీని వల్ల మాకే నష్టం వస్తోంది. అందుకే రేటు పెంచి విక్రయిస్తేనే కానీ, మాకు గిట్టుబాటు కావటం లేదు. హోల్ సేల్ మార్కెట్లో ధరలకు నియంత్రం ఉండేలా అధికారులు చూడాలి. –ఆర్.మల్లికార్జున రావు, దుకాణదారుడు కూరగాయల ధరలు (సోమవారం ధరలు కిలో.రూ.లు) రైతు బయట బజార్ దుకాణాల్లో పచ్చి మిర్చి రూ.72 రూ.120 టమాటా రూ.45 రూ.60 ఉల్లిపాయలు రూ.21 రూ.40 దొండకాయలు రూ.28 రూ.80 బీరకాయలు రూ.32 రూ.70 వంకాయ రూ.38 రూ.80●సీతమ్మధార రైతుబజార్లో టమాటాలు కొనుగోలు చేస్తున్న వినియోగదారులువిశాఖ విద్య: కూరగాయల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. పది రోజుల క్రితం రూ. 60 ఉన్న పచ్చిమిర్చి ప్రస్తుతం రూ. 120కి చేరింది. వంకాయలు, దొండకాయలు, బీరకాయలు వంటి అన్ని రకాల కూరగాయల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వ్యాపారులు సిండికేట్గా మారి, కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని, దీంతో ధరలకు అదుపు లేకుండా పోతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘కూటమి ప్రభుత్వ పాలనలో ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదని’ ప్రజానీకం బెంబేలెత్తుతోంది. ధరలను నియంత్రించడంలో జిల్లా యంత్రాంగం విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఈ ధరల పెరుగుదల కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూటమి నాయకులే మధ్య దళారులుగా వ్యవహరిస్తున్నారని, అందుకే మార్కెట్లో జరుగుతున్న ఈ మాయాజాలాన్ని అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి. రైతు బజార్లకు నాణ్యత లేని సరుకులు నగర ప్రజలకు కూరగాయలు ఇతర నిత్యావసర సరుకులను నిర్ణీత ధరలకు అందించే లక్ష్యంతో జిల్లాలో 13 రైతు బజార్లను ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం ఇక్కడికి నాణ్యత లేని సరుకులు సరఫరా అవుతున్నాయి. దీంతో వినియోగదారులు వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. రైతు బజార్లలో విక్రయించే ఉల్లిపాయలు కుళ్లిపోయి, దుర్వాసన వస్తున్నాయని, ఇంటికి తెచ్చుకున్న రెండు రోజులకే పాడైపోతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు. దీంతో అధిక ధరలు చెల్లించి బయటి మార్కెట్లలోనే అన్ని రకాల కూరగాయలు కొనాల్సి వస్తోందని ప్రజలు చెబుతున్నారు. టమాటా సరఫరాలో ప్రభుత్వ వైఫల్యం చిత్తూరు జిల్లాలోని మదనపల్లె మార్కెట్ నుంచి నగరానికి టమాటా సరఫరా అవుతుంది. ప్రతిరోజూ సుమారు 200 టన్నుల టమాటా వస్తుంది. ఇందులో పాడైన టమాటాను రైతు బజార్ల దుకాణదారులకు అంటగట్టి, మంచివి బయటి మార్కెట్లో అధిక ధరకు విక్రయించేందుకు వ్యాపారులు పథకం వేస్తున్నారు. కుళ్లిన టమాటా సరఫరా అవుతుండటంతో తమకు నష్టం వస్తోందని రైతు బజార్ల దుకాణదారులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మార్కెటింగ్ శాఖ ద్వారా ప్రభుత్వం టమాటోను కొనుగోలు చేసి రైతు బజార్లకు సరఫరా చేసేది. కానీ ప్రస్తుతం వ్యాపారులే పెత్తనం చెలాయిస్తుండటంతో ప్రజలకు ధరల భారం తప్పడం లేదు. పర్యవేక్షణాధికారుల కొరత రైతు బజార్లపై పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. గతంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన యాసిన్ను బదిలీ చేసినా, ఆ స్థానంలో ఇంకా ఎవరూ విధుల్లో చేరలేదు. డిప్యూటీ డైరెక్టర్ ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ అదనపు బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. రైతు బజార్లలో ఏం జరుగుతుందో పర్యవేక్షించేవారు లేకపోవడంతో వినియోగదారులకు అవి ఉపయోగపడటం లేదు. ఫలితంగా, బయటి మార్కెట్లో ధరల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. కూర ‘గాయాలు’ ఘాటెక్కిన పచ్చిమిర్చి, కిలో రూ.120లు రైతు బజార్లకు కుళ్లిన టామాటో సరఫరా బయట మార్కెట్లో కేజీ రూ.60 కృత్రిమ కొరత సృష్టిస్తొన్న వ్యాపారులు ధరల అదుపుపై దృష్టి పెట్టని కూటమి ప్రభుత్వం -
రిజిస్ట్రేషన్ ప్రక్రియలోనే ఆస్తి పన్ను పేరు మార్పు
● ఆగస్టు 1 నుంచి ప్రక్రియ ప్రారంభం ● ఆస్తి పన్ను పేరు మార్పుకై జీవీఎంసీకి దరఖాస్తు చేయక్కర్లేదు ● అదనపు కమిషనర్ రమణమూర్తి డాబాగార్డెన్స్: రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్ జరిగే ప్రక్రియలోనే ఆస్తి పన్ను పేరు మార్చే విధానాన్ని ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం కల్పించిందని జీవీఎంసీ అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి వెల్లడించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే ఇక నుంచి ఆస్తి పన్ను పేరు మార్పు చేసేలా విధి విధానాలపై రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డీఐజీ జి.బాలకృష్ణ, జీవీఎంసీ డీసీఆర్ శ్రీనివాసరావుతో కలిసి సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవీఎంసీ పరిధిలో భూములు, భవనాలు, అపార్ట్మెంట్ల కొనుగోలు ప్రక్రియలో భాగంగా ఇక నుంచి సంబంధిత రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోని జీవీఎంసీ అసెస్మెంట్ కలిగిన ఆస్తులకు ఆస్తి పన్ను పేరు మార్పు ఆటోమేటిక్గా జరిపే అవకాశాన్ని కల్పించినట్లు పేర్కొన్నారు. ఇక మీదట సంబంధిత ఆస్తుల రిజిస్ట్రేషన్ అనంతరం జీవీఎంసీ కార్యాలయానికి రాకుండానే ఇంటి పన్ను పేరు మార్పు జరిగి పోతుందన్నారు. ఈ ప్రక్రియ ఆగస్టు 1 నుంచి జీవీఎంసీ పరిధిలో అమలుకానుందన్నారు. ఇందుకు ఆస్తుల కొనుగోలు సమయంలోనే సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆస్తి పన్ను పేరు మార్పునకు సంబంధించి జీవీఎంసీకి చెల్లించాల్సిన మ్యూటేషన్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే జీవీఎంసీ రికార్డుల్లో ఆటోమేటిక్గా ఆస్తి యజమాని పేరు, ఆస్తిపన్ను పేరు మారిపోతుందన్నారు. దీనిపై జీవీఎంసీ రెవెన్యూ విభాగం, రిజిస్ట్రేషన్ కార్యాలయాల అధికారులు, ఉద్యోగులకు అవగాహన కల్పించాలని తెలిపారు. -
ప్రతి సమస్యకు నాణ్యమైన పరిష్కారం
● రెవెన్యూ శాఖమంత్రి సత్యప్రసాద్ ● పీజీఆర్ఎస్కు 427 వినతులుమహారాణిపేట: ప్రజాసమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ప్రతి సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా అధికారులను రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. విశాఖ, తిరుపతి జిల్లాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక చాలా బాగా జరుగుతోందని, సమస్యల పరిష్కారంలో కూడా సానుకూలత ఉందని పేర్కొన్నారు. ఇక్కడ అవలంబిస్తున్న విధానాలను అధ్యయనం చేసి మిగిలిన చోట్ల అమలు చేసేందుకు స్వయంగా పీజీఆర్ఎస్లో పాల్గొంటున్నానని స్పష్టం చేశారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్లో స్వయంగా మంత్రి సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీజీఆర్ఎస్ నిర్వహణ, సమస్యల పరిష్కారంలో ప్రజల నుంచి సానుకూల అభిప్రాయం (పాజిటివ్ పర్సెప్షన్) నమోదవుతోందని గుర్తు చేశారు. యోగాంధ్ర నిర్వహణలో అధికార యంత్రాంగం అభినందనీయ పాత్ర పోషించి, గిన్నీస్ రికార్డుతో పాటు మరో 22 రికార్డులు సాధించిందని ఆయన కొనియాడారు. అనంతరం జిల్లాలో పీజీఆర్ఎస్ నిర్వహణ, అధికారుల పనితీరు, ఇతర అంశాలను కలెక్టర్ హేరందిర ప్రసాద్ వివరించారు. వారం వారం ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై నిర్ణీత సమయంలో ఎండార్స్మెంట్ ఇస్తూ పరిష్కరిస్తున్నామని, క్రమం తప్పకుండా ఆడిట్ నిర్వహిస్తూ నాణ్యమైన పరిష్కారం చూపుతున్నామని ఆయన తెలిపారు. 427 వినతుల స్వీకరణ వివిధ సమస్యలపై మొత్తం 427 వినతులు అందినట్లు అధికారులు తెలిపారు. వీటిలో అత్యధికంగా రెవెన్యూ విభాగానికి చెందినవి 180, జీవీఎంసీకి 54, పోలీసు శాఖకు 23, ఇతర విభాగాలకు చెందినవి 170 ఫిర్యాదులు ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి ప్రభుత్వ, ప్రైవేటు భూ ఆక్రమణలు, వ్యక్తిగత కార్యకలాపాలకు అడ్డంకిగా నిలుస్తున్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫిర్యాదులు సమర్పించారు. -
జీవీఎంసీ పీజీఆర్ఎస్కు 174 వినతులు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్తో కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమంలో మొత్తం 174 వినతులు స్వీకరించారు. మేయర్ పీలా తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఫిర్యాదుల్లో పట్టణ ప్రణాళికా విభాగానికి అత్యధికంగా 84 ఫిర్యాదులు అందాయి. జీవీఎంసీ అడ్మినిస్ట్రేషన్ అండ్ అకౌంట్స్ విభాగానికి 4, రెవెన్యూకు 17, ప్రజారోగ్యానికి 12, ఇంజనీరింగ్ విభాగానికి 47, హార్టికల్చర్కు 1,యూసీడీ విభాగానికి 9 అందాయి. ఈ సందర్భంగా కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పెండింగ్లో ఉన్న ఫిర్యాదులను మూడు రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వార్డు సచివాలయాల వారీగా అడ్మిన్ కార్యదర్శులు పరిష్కరించాల్సిన ఫిర్యాదులు 30 రోజుల నుంచి వారి లాగిన్లో ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఏ విభాగానికి సంబంధించిన ఫిర్యాదును ఆయా విభాగాధిపతులు తక్షణమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. -
మరింత పటిష్టంగా.. సీబీఎస్ఈ విద్య
● ఎన్ఈపీ–2020 నిబంధనలకు అనుగుణంగా బోధన ● సీబీఎస్ఈ పాఠశాలల్లో ప్రత్యేక భద్రతా చర్యలు ● 2026 నుంచి ఏటా రెండు సార్లు బోర్డు పబ్లిక్ పరీక్షలు ● జిల్లాలో 40 సీబీఎస్ఈ స్కూళ్లు, 39,517 మంది విద్యార్థులు ● నూతన మార్గదర్శకాలు జారీ చేసిన సీబీఎస్ఈ బోర్డు ఆరిలోవ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) విద్యను మరింత పటిష్టవంతం చేస్తున్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్ఈపీ)–2020 మేరకు సీబీఎస్ఈ పాఠశాలల్లో ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతున్నారు. దీనికి సంబంధించి నియమ నిబంధనలపై జిల్లాలోని సీబీఎస్సీ స్కూళ్ల యాజమాన్యాలకు బోర్డు సమాచారం అందించింది. ఈ నిబంధనల మేరకు విద్యార్థుల భద్రత కోసం ప్రతి పాఠశాలలో సీసీ కెమెరాలు తప్పనిసరి చేశారు. పాఠశాల ప్రధాన ద్వారం, క్రీడా మైదానం, కారిడార్లు, తరగతి గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. వాటిలో ఆడియో, వీడియో స్పష్టత ఉండాలి. ప్రతి తరగతి గదిలో 40 మంది విద్యార్థులు మాత్రమే ఉండాలి. మంచి గాలి, వెలుతురు వచ్చేలా తరగతి గదుల్లో సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. ఏటా రెండుసార్లు పరీక్షలు నూతన విధానం ప్రకారం సీబీఎస్ఈ బోర్డు ద్వారా 2026 నుంచి పదో తరగతి పరీక్షలు రెండుసార్లు నిర్వహించనున్నారు. ఇంతవరకు ఒకసారి మాత్రమే పబ్లిక్ పరీక్షలు జరిగేవి. ఇప్పుడు విద్యార్థులు మార్కులు మెరుగు పరచుకునేందు(బెటర్మెంట్)కు అవకాశం కల్పిస్తూ రెండుసార్లు పరీక్షలు నిర్వహించే విధానాన్ని తీసుకొచ్చారు. రెండోసారి పరీక్ష రాయాలనుకునే విద్యార్థి మొదటి సారి పరీక్ష తప్పనిసరిగా రాసి ఉండాలి. ఈ విధానం వల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. దీంతో పాటు పరీక్ష పేపర్లో కూడా మార్పులు తీసుకొచ్చారు. ప్రశ్నాపత్రంలో స్వల్ప, దీర్ఘ సమాధాన ప్రశ్నలను బోర్డు తగ్గించింది. ఆలోచన, నైపుణ్యం కలిగించే విశ్లేషణాత్మక, వివరణాత్మక ప్రశ్నలకు ప్రాధాన్యత ఇవ్వనుంది. దీనివల్ల భావాలను అర్ధంచేసుకునేలా విద్యార్థి తీర్చిదిద్దబడతాడని బోర్డు నమ్మకం. జిల్లాలో 40 సీబీఎస్ఈ స్కూళ్లు విశాఖ జిల్లాలో 40 సీబీఎస్ఈ పాఠశాలలున్నాయి. వాటిలో టింపనీ, విశాఖ వ్యాలీ, జవహర్ నవోదయ, ఓక్రిడ్జ్, ఎస్ఎఫ్ఎస్, సెయింట్ ఆన్స్, డిపాల్, శ్రీచైతన్య, నారాయణ, కేకేఆర్ గౌతం తదితర పాఠశాలలు ఉన్నాయి. వాటిలో రెండు ప్రైమరీ, ఒక అప్పర్ ప్రైమరీ పాఠశాలతో పాటు 37 ఉన్నత పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాలల్లో 39,517 మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లాలో ఆయా పాఠశాలలన్నీ తప్పనిసరిగా సీబీఎస్ఈ నూతన విధానాల మేరకు భద్రతా చర్యలు పాటించాలని బోర్డు స్పష్టం చేసింది. -
సమస్యలు పరిష్కరించకుంటే ఆత్మహత్యలే శరణ్యం
మంత్రి ఎదుట రోగి మిత్రల ఆవేదన మహారాణిపేట: కేజీహెచ్లో రోగి మిత్రలుగా విధులు నిర్వర్తించిన కొందరు, ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్సింగ్ (ఆప్కోస్) సర్వీసెస్లో చేర్చుతామని తమ వద్ద డబ్బులు వసూలు చేసి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తూ సోమవారం పీజీఆర్ఎస్లో రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్కు, కలెక్టర్ హరేందిర ప్రసాద్కు రోగిమిత్రలు వినతిపత్రాలు అందజేశారు. 2012 నుంచి కేజీహెచ్లో రోగి మిత్రలుగా పనిచేస్తున్నామని, నెలకు రూ.3,800 నుంచి రూ. 6,000 మధ్య వస్తున్న జీతం సరిపోవడం లేదని పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినట్లు వారు తెలిపారు. అయితే ఆరోగ్యశ్రీలో నిధులు లేవని చెప్పి తమను విధుల నుంచి తొలగించారని ఆరోపించారు. ఇదే సమయంలో కేజీహెచ్కు అధికారి సత్యనారాయణ.. ఆప్కోస్లో కలిపి జీతాలు పెంచుతామని చెప్పి తమ నుంచి రూ. 20 వేల నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేశారని రోగి మిత్రలు వాపోయారు. ఎంప్లాయిమెంట్ అధికారి సాంబిరెడ్డి, కేజీహెచ్ అధికారి సత్యనారాయణ డబ్బులు తీసుకుని నెలలు గడుస్తున్నా తమకు న్యాయం జరగలేదని వారు ఆవేదన చెందారు. ఈ విషయంపై గత నెల 20న పీజీఆర్ఎస్లో వినతిపత్రం సమర్పించగా, కలెక్టర్ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. అయితే విచారణ చేస్తున్న అధికారులతో సదరు అధికారికి మంచి సంబంధాలు ఉన్నాయని..విచారణపై తమకు నమ్మకం లేదని రోగి మిత్రలు స్పష్టం చేశారు. ఈ విచారణ వల్ల న్యాయం జరగదని, నిజాయతీ అధికారులను విచారణకు నియమిస్తేనే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉందని వారు కోరారు. కోవిడ్, హుద్హుద్ వంటి విపత్కర సమయాల్లో రోగి మిత్రలుగా ఎన్నో సేవలు అందించామని, నేడు ఉద్యోగాలు పోయి, డబ్బులు కట్టి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని రోగి మిత్రలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
విశాఖ!
చైన్నె8లోమంగళవారం శ్రీ 29 శ్రీ జూలై శ్రీ 2025మద్యం మాఫియారెండు రోజుల్లో పీ–4 మార్గదర్శుల మ్యాపింగ్ పూర్తి మహారాణిపేట : రెండు రోజుల్లో పీ–4 మార్గదర్శుల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి కావాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సేవకులు, ఇతర వ్యాపార కార్యకాలాపాలు నిర్వహించే వారిని గుర్తించి బంగారు కుటుంబాలకు మ్యాపింగ్ చేయాలని చెప్పారు. సోమవారం కలెక్టరేట్లో పీ–4పై అధికారులతో సమీక్షించారు. సమాజంలో ఎగువ స్థాయిలో ఉన్న వారంతా, దిగువ స్థాయిలో ఉన్నవారిని దత్తత తీసుకునేలా ప్రోత్సహించాలన్నారు. గతంలో ప్రజల నుంచి వచ్చిన వినతులు, పరిష్కారం తీరు గురించి ఆరా తీశారు. ప్రజలు సంతృప్తి చెందే విధంగా అధికారులు వ్యవహరించాలని, ఫిర్యాదులకు నాణ్యమైన రీతిలో పరిష్కారం చూపాలని ఆదేశించారు. రోజుకో గంట పీజీఆర్ఎస్ కోసం కేటాయించాలని, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో మనసు పెట్టి పనిచేయాలని హితవు పలికారు. ఆయనతో పాటు జేసీ కె. మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీ శంకర్, భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఫోన్ పే, బ్యాంక్ అకౌంట్ల ద్వారానే లావాదేవీలు కోయంబత్తూరు నుంచి విశాఖకు 20 ఏళ్ల క్రితం వచ్చిన వెంకటేష్ పిళ్లై మొదటి నుంచీ ఈ నకిలీ మద్యం సరఫరాలో ఆరితేరారు. గతంలోనూ ఇతనిపై పలుసార్లు కేసులు నమోదయ్యాయి. చైన్నెకు చెందిన ఇషాక్, మహమ్మద్ నిస్సార్ అహమ్మద్తో పాటు మహమ్మద్ సాధిక్ భాష ఒకే కుటుంబానికి చెందినవారు. వీరు ఏపీలోని దాదాపు అన్ని జిల్లాల నుంచి ఖరీదైన మద్యం ఖాళీ సీసాలను సేకరిస్తున్నారు. ఆయా జిల్లాల్లో ఈ వ్యాపారం చేసే వారితో సంబంధాలు పెట్టుకుని.. చైన్నెలోని బర్మా కాలనీకి చెందిన తమకే విక్రయించేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. అక్కడి నుంచి ఖరీదైన మద్యం పేరుతో నింపిన బాటిల్స్ను తమకు వచ్చే ఆర్డర్లకు అనుగుణంగా ట్రావెల్స్ ద్వారా తరలిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఆర్డర్లకు అనుగుణంగా తమకు రావాల్సిన మొత్తాన్ని ఫోన్ పే, బ్యాంక్ అకౌంట్ల ద్వారానే లావాదేవీలు నిర్వహిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : 1000 ఎంఎల్.. ఫుల్ బాటిల్.. అంటే మద్యం ప్రియులకు పండగే. అందులోనూ డిఫెన్స్ బాటిల్ అంటే ఎంత ధర అయినా కొనుగోలు చేద్దామనే ఆలోచన!. ఇంట్లో పార్టీ ఉన్నా.. పండగ ఉన్నా... ఇంటికి బంధువులు, స్నేహితులు వస్తే డిఫెన్స్ బాటిల్ ఇచ్చి ఖుషీ చేద్దామనుకుంటారు.. సరిగ్గా దీన్నే పక్కాగా క్యాష్ చేసుకుంటోంది అక్కయ్యపాలెంకు చెందిన వెంకటేష్ పిళ్లై టీం. చైన్నెలోని బర్మాకాలనీకి చెందిన ఓ టీం ఖరీదైన బ్రాండ్ మద్యం ఖాళీ సీసాలను సేకరించి.. అందులో మాములు బ్రాండ్ మద్యాన్ని నింపి.. ఖరీదైన మద్యంగా సరఫరా చేస్తోంది. వీరితో సంబంధాలు నెరుపుకుంటూ అక్కడ నుంచి మద్యాన్ని దిగుమతి చేసుకుంటూ విశాఖలో డిఫెన్స్ మద్యం పేరుతో విక్రయించి భారీగా దండుకుంటోంది వెంకటేష్ పిళ్లై బృందం. చైన్నె నుంచి ట్రావెల్స్ ద్వారా ఈ మద్యాన్ని తరలిస్తుండడం విశేషం. లావాదేవీలన్నీ ఫోన్ పే, బ్యాంక్ అకౌంట్ల ద్వారా నిర్వహిస్తుండటం గమనార్హం. ఇందులో ఇప్పటికే చైన్నెకు చెందిన ముగ్గురిలో ఇద్దరిని ఎకై ్సజ్ పోలీసులు అరెస్టు చేశారు. వెంకటేష్ పిళ్లైను కూడా అరెస్టు చేసి జైలుకు తరలించారు. లోతుగా విచారించేందుకు నేటి నుంచి వెంకటేష్ పిళ్లైను ఎకై ్సజ్ పోలీసులు కస్టడీలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. బాటిలింగ్ యూనిట్ను ఏర్పాటుచేసుకొని.. చైన్నెలోని బర్మా కాలనీకి చెందిన ముఠా సభ్యులు పలు ప్రాంతాల నుంచి ఖరీదైన బ్రాండ్ మద్యం ఖాళీ సీసాలను సేకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని దాదాపుగా అన్ని జిల్లాల నుంచి ప్రీమియం బ్రాండ్ ఖాళీ సీసాలను అక్కడకు తరలిస్తున్నారు. అనంతరం పాండిచ్చేరి నుంచి తక్కువ ధరకు లభించే మద్యాన్ని (సాధారణ ఇతర బ్రాండ్లు) తీసుకొచ్చి ఈ ఖాళీ సీసాల్లో నింపేస్తున్నారు. ఇందుకోసం బాటిలింగ్ యూనిట్ను అక్కడ ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది. అనంతరం ఆర్డర్లకు అనుగుణంగా ఆయా ప్రాంతాలకు వీటిని తరలిస్తున్నారు. తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన వెంకటేష్ పిళ్లై.. ఈ ముఠాతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి ఈ మద్యాన్ని ఇక్కడకు తరలిస్తున్నారు. అయితే వెంకటేష్ పిళ్లై గత 20 సంవత్సరాలుగా అక్కయ్యపాలెంలోనే నివాసం ఏర్పాటు చేసుకుని స్థిరపడ్డారు. అంతేకాకుండా అక్కడి నుంచి నకిలీ మద్యాన్ని తెచ్చిన తర్వాత.. కొన్నింటిలో నీటిని కూడా నింపి యథావిధిగా సీల్ వేసి విక్రయిస్తున్నట్టు విచారణలో తేలింది. న్యూస్రీల్Toసాధారణ మద్యాన్ని ఖరీదైన బ్రాండ్ మద్యం సీసాల్లో నింపి రవాణా నకిలీ మద్యం సరఫరాలో ఆరితేరిన వెంకటేష్ పిళ్లై బృందం ఖరీదైన ఖాళీ మద్యం సీసాల్లో పాండిచ్చేరి మద్యం నింపుతున్న చైన్నె ముఠా చైన్నె గ్యాంగ్తో అక్కయ్యపాలెంకు చెందిన పిళ్లై బృందం చెట్టాపట్టాల్ డిఫెన్స్ మద్యం పేరుతో విశాఖకు తరలిస్తూ అధిక ధరకు విక్రయం పోలీసులకు చిక్కిన వెంకటేష్ పిళ్లై చైన్నె ముఠాలోని మరో ఇద్దరు.. రూ.వెయ్యి తగ్గించామని కలరింగ్ ఇస్తూ.. 1000 ఎంఎల్ బాటిల్ను రూ.500కే తయారుచేస్తున్న ఈ ముఠా రూ.4 వేలు చొప్పున విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. అంతిమంగా బయట మార్కెట్లో రూ.5 వేల విలువ చేసే బాటిల్ను రూ.4 వేలకే విక్రయిస్తున్నామంటూ నకిలీ మద్యాన్ని ఖరీదైన మద్యంగా అంటగడుతున్నారు. బయటి మార్కెట్ కంటే రూ.వెయ్యి ధర తగ్గడమే కాకుండా.. అంత సులువుగా దొరకని డిఫెన్స్ మద్యం తమకు వస్తోందని భావిస్తున్న కొందరు వెంకటేష్ పిళ్లై నుంచి ఆర్డర్లు పెట్టి మరీ తీసుకుంటుండటం గమనార్హం. తాజాగా అక్కయ్యపాలెంలో పట్టుబడిన ఈ మద్యాన్ని పరీక్షల కోసం ల్యాబ్కు పంపగా.. ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించే పదార్థాలు కూడా ఇందులో కలిసి ఉన్నట్టు ల్యాబ్ నివేదికలో తేలింది. ఇందులో పాండిచ్చేరి మద్యంతో పాటు ఇంకా ఏమైనా రసాయనాలు కలుపుతున్నారా? అనేది కూడా తేలాల్సి ఉంది. -
ఆరోగ్య శ్రీపై నీలినీడలు
● ఆస్పత్రులకు బిల్లులు చెల్లించని కూటమి ప్రభుత్వం ● జిల్లాలో 106 ఆస్పత్రులకు రూ.260 కోట్ల మేర బకాయిలు ● పేదలకు అందని ‘ఆరోగ్యశ్రీ’ వైద్యం మహారాణిపేట: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం అమలుపై కూటమి ప్రభుత్వం ‘సవతి తల్లి ప్రేమ’ చూపుతోంది. ప్రైవేటు ఆసుపత్రులకు కోట్ల రూపాయల బకాయిలను పెండింగ్లో పెట్టడంతో, పేద రోగులకు వైద్య సేవలు సక్రమంగా అందడం లేదని ఆందోళన వ్యక్తం అవుతోంది. దీంతో ఆస్పత్రికి వచ్చే పేద రోగులకు వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డులు, వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ కార్డులకు వైద్యసేవలు అందించడంలో కార్పొరేట్ ఆస్పత్రులు ఆసక్తి చూపడం లేదు. పేదలపై కూటమి సర్కార్ కత్తి ఎన్నికలకు ముందు సంక్షేమ పథకాలపై హామీలిచ్చిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు ఉన్న పథకాలను ఎత్తేసే ప్రయత్నం చేస్తోంది. మద్యం విక్రయాలు, విద్యుత్ చార్జీల పెంపు ద్వారా ఖజానా నింపుకుంటున్న ప్రభుత్వం, దివంగత వై.ఎస్.రాజశేఖర్రెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకం నిర్వీర్యం చేసేందుకు దృష్టి సారించిందని ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో పరిస్థితి జిల్లాలో 106 ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ పరిధిలో ఉన్నాయి. ఈ నెట్వర్క్ ఆస్పత్రులకు సుమారు రూ. 260 కోట్ల బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే పేదల ఆరోగ్యశ్రీ వైద్య సేవల్లో అంతరాయం కలుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. గతంలో అద్భుతమైన సేవలు అందించిన కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు ఇప్పుడు కార్డుదారులకు సేవలు అందించడానికి వెనుకాడడంతో, లబ్ధిదారుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. కార్డుదారులందరికీ వైద్యం ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్న అందరికీ వైద్య సేవలు అందుతున్నాయని, ఎక్కడైనా సేవలు అందకపోతే తమను సంప్రదించాలని ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త డాక్టర్ అప్పారావు కోరారు. నెట్వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం ప్రతి నెలా నిధులు విడుదల చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. -
కాకి వర్సెస్ పల్లా..!
● అభివృద్ధి కార్యక్రమాలు జరగనీయకుండా అడ్డుకట్ట ● 69వ వార్డులో నిలిచిన అభివృద్ధి పనులు ● పనులు మొదలుపెట్టాలంటూ స్థానికుల నుంచి వినతులు ● గ్రీవెన్స్లో కమిషనర్కు ఒకే రోజు 30 మంది ఫిర్యాదుల అందజేత ● తాను హాజరుకాకుండా పనులు మొదలుపెట్టకూడదని పల్లా ఆదేశం? విశాఖ సిటీ : సొంత పార్టీ కార్పొరేటర్ వార్డులో ఒక్క అభివృద్ధి పని కూడా జరగనీయకుండా ఏకంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అడ్డుకుంటున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఏకంగా రూ.7 కోట్ల విలువ చేసే వివిధ పనులకు శంకుస్థాపన జరగనీయకుండా పల్లా అడ్డుకుంటున్నారనే విమర్శలున్నాయి. 69వ వార్డులో ఇప్పటికే వర్క్ ఆర్డర్లు ఇచ్చిన పనులు కూడా ప్రారంభం కాని దుస్థితి నెలకొంది. సోమవారం వార్డుకు చెందిన 30 మంది తమ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదంటూ జీవీఎంసీలో జరిగిన పీజీఆర్ఎస్లో నేరుగా కమిషనర్ కేతన్ గార్గ్ను కలిసి ఫిర్యాదు చేశారు. తమ వార్డులో రోడ్డు వేయడం లేదని ఒకరు.. డ్రైనేజీ నిర్మించడం లేదని మరొకరు ఇలా పలు సమస్యలపై తుంగలాం రెడ్డి వేమన సంక్షేమ సేవా సంఘం, ఉప్పాడ రామచంద్రరావు, గ్రామాభివృద్ధి యువజన సేవా సంఘం, కొల్లి కంచురావు ఇలా ఏకంగా 30 మంది వ్యక్తులు, సంఘాలు వచ్చి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమవుతోంది. శంకుస్థాపనలకు ససేమిరా...! వాస్తవానికి 69వ వార్డు కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డికి పల్లాకు మధ్య మొదటి నుంచి వివాదాలు నడుస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో కాకి గోవిందరెడ్డి సహకరించలేదంటూ పల్లా ఇప్పటికే పార్టీకి ఫిర్యాదులు కూడా చేశారు. మొన్న జరిగిన మేయర్ ఎన్నికల్లో మాత్రం పార్టీ తరపునే ఉండాలంటూ కాకి గోవిందరెడ్డిని పల్లా స్వయంగా బతిమాలాడారు. అంతేకాకుండా కలిసి పనిచేద్దామని కూడా చెప్పినట్టు తెలుస్తోంది. తీరా మేయర్ ఎన్నిక ముగిసిన తర్వాత కాకి గోవిందరెడ్డి వార్డులో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టాలన్నా స్థానిక ఎమ్మెల్యే తనకు తెలియజేయాలంటూ జీవీఎంసీ అధికారులకు పల్లా హుకుం జారీచేసినట్టు ప్రచారం జరుగుతోంది. తాను హాజరుకాకుండా ఎటువంటి పనులు ప్రారంభించకూడదని గట్టిగానే చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో 69వ వార్డులో ఇప్పటివరకు పలు పనుల కోసం టెండర్లను పిలిచి.. వర్క్ ఆర్డర్లు కూడా కాంట్రాక్టర్లకు ఇచ్చినప్పటికీ పనులు మాత్రం ప్రారంభం కావడం లేదు. ఎందుకంటే ఈ పనుల శంకుస్థాపనలకు హాజరయ్యేందుకు ఏ తేదీ కూడా పల్లా ఇవ్వడం లేదు. దీంతో పనులన్నీ ప్రారంభం కాకుండానే నిలిచిపోయాయి. అధికారపార్టీ నేతలు ఇద్దరు గొడవపడుతూ.. తమను ఎందుకు ఇబ్బందులు పెడతారంటూ స్థానిక వార్డుకు చెందిన ప్రజలు వాపోతున్నారు. -
కిరండూల్ రైళ్లు గమ్యం కుదింపు
తాటిచెట్లపాలెం: కోరాపుట్–మల్లిగుడ–జరాటి స్టేషన్ పరిధిలో జరగుతున్న భద్రతా పనుల నిమిత్తం ఈ మార్గంలో నడిచే రైళ్లు గమ్యం కుదిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ అధికారులు తెలిపారు. విశాఖలో మంగళవారం రాత్రి బయల్దేరే విశాఖపట్నం–కిరండూల్(18515) నైట్ ఎక్స్ప్రెస్ కోరాపుట్ వరకు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో మంగళ, బుధవారాల్లో కిరండూల్–విశాఖపట్నం(18516) నైట్ ఎక్స్ప్రెస్ కిరండూల్ నుంచి కాకుండా కోరాపుట్ నుంచి బయల్దేరుతుంది. విశాఖలో మంగళ, బుధవారాల్లో బయల్దేరే విశాఖపట్నం–కిరండూల్ (58501) పాసింజర్ కోరాపుట్ వరకు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో మంగళ, బుధవారాల్లో కిరండూల్–విశాఖపట్నం(58502) పాసింజర్ కిరండూల్ నుంచి కాకుండా కోరాపుట్ నుంచి బయల్దేరుతుంది. -
సంకల్పమే శ్వాసగా..
జిల్లా పారా అఽఽథ్లెట్స్ జట్ల ఎంపికలో స్ఫూర్తి చాటుకున్న దివ్యాంగులు విశాఖ స్పోర్ట్స్ : ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో ఆదివారం జరిగిన అంతర జిల్లాల పారా అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా జట్ల ఎంపిక క్రీడా స్ఫూర్తికి వేదికై ంది. జూనియర్ (19 ఏళ్ల లోపు), సబ్–జూనియర్ (17 ఏళ్ల లోపు) విభాగాల్లో దాదాపు 70 మంది దివ్యాంగ బాలబాలికలు తమ అసాధారణ ప్రతిభను ప్రదర్శించారు. ముఖ్యంగా 11–13 అంశాల పరుగు విభాగంలో సహాయకుల తోడుతో ట్రాక్లో పరుగెత్తుతూ ‘తగ్గేదేలే’ అంటూ వారు చూపిన సంకల్పం అందరినీ ఆకట్టుకుంది. ఫీల్డ్ ఈవెంట్లలో, ముఖ్యంగా త్రోస్ అంశాల్లో కూడా అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. బధిరులు, మేధో వైకల్యం గల బాలబాలికలు సైతం ఎంతో ఉత్సాహంగా ఈ పోటీలలో పాలుపంచుకున్నారు. వారి ముఖాల్లో కనిపించిన ఆనందం, విజయకాంక్ష, క్రీడలపై వారికున్న నిబద్ధత నిజంగా స్ఫూర్తిదాయకం. ఈ ఎంపిక పోటీలు కేవలం ఆటలకే పరిమితం కాలేదు, తమ కలలను సాకారం చేసుకోవడానికి ప్రత్యేక అవసరాలు గల వ్యక్తులు ఎంతటి కృషి చేయగలరో నిరూపించాయి. -
సక్రమంగా జీతాలు ఇవ్వకపోతే ఎలా?
కేజీహెచ్ అధికారులు కాంట్రాక్టర్కు బిల్లులు మంజూరు చేస్తూ జేబులు నింపుతున్నారు. 275 మంది శానిటేషన్ సిబ్బంది ఉండాలి. కానీ 240 మంది మాత్రమే ఉన్నారని రాతపూర్వకంగా కలెక్టర్కు ఫిర్యాదు చేసి రెండు నెలలు కావస్తున్నా కనీసం విచారణ చేయలేదు. శానిటేషన్ కాంట్రాక్టర్ కాల పరిధి ముగిసినా, అదే కాంట్రాక్టర్ని మరలా కొనసాగించడంలో అర్ధమేంటో అధికారులే చెప్పాలి. ఓ పక్క కాంట్రాక్టర్ కార్మికుల శ్రమను దోచుకుంటూ ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ప్రజాధనం లూఠీ చేస్తుంటే అధికారులు కళ్లప్పగించి చూడడం అన్యాయం. – కె.చంద్రశేఖర్, జగదాంబ జోన్ సీపీఎం నాయకుడు -
చికెన్ వ్యర్థాల వాహనాల పట్టివేత
అనకాపల్లి : స్థానిక జాతీయ రహదారి డైట్ కళాశాల వద్ద పట్టణ పోలీసులు ఆదివారం వాహనాలు తనిఖీ చేస్తుండగా విశాఖ ఉమ్మడి జిల్లా నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు 5 బోలేరో వాహనాలలో చేపల మేత, చికెన్ వ్యర్థాలు రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. విశాఖలో ఎన్ఎడీ, అక్కయ్యపాలెం, ఇతర ప్రాంతాల నుంచి వ్యర్థాలను సేకరించి తీసుకువెళుతున్నారని పోలీసులు తెలిపారు. వాహన డ్రైవర్లు బడపాటి నాగబాబు, జయమంగళ సత్యనారాయణ, బుడుమూరు బాలాసుబ్రహ్మణ్యం, మేడిశెట్టి నూకరాజు, బద్ది నాగ సత్యనారాయణలను అదుపులోనికి తీసుకుని అనకాపల్లి జోనల్ కమిషనర్ చక్రధర్కు అప్పగించారు. పట్టుకున్న వ్యర్థాలను విశాఖ కాపులుప్పాడలో డంపింగ్యార్డులో పూడ్చి, ప్రధాన కమిషనర్ ఆదేశాల మేరకు కేసులు నమోదు చేయడం జరుగుతుందని జోనల్ కమిషనర్ తెలిపారు. -
మతోన్మాద, కార్పొరేట్ శక్తుల దాడిపై పోరాటం
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు కంచరపాలెం: దేశంలో మతోన్మాద, కార్పొరేట్ శక్తుల దాడిని కార్మిక వర్గం ఐక్యంగా ఎదుర్కోవాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు పిలుపునిచ్చారు. కంచరపాలెంలోని ఓ కమ్యూనిటీ హాల్లో రెండు రోజుల పాటు జరిగిన సీఐటీయూ జిల్లా 13వ మహాసభలు ఆదివారం ముగిశాయి. ముఖ్య అతిథిగా హాజరైన నర్సింగరావు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటే, గత 1600 రోజులుగా కార్మిక వర్గం పోరాడి అడ్డుకోగలిగిందని గుర్తు చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యుత్ స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని, ప్రజలపై భారం మోపే సర్దుబాటు, ట్రూ అఫ్ చార్జీలను రద్దు చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు. డిసెంబర్ 31 నుంచి వచ్చే ఏడాది జనవరి 4 వరకు అఖిల భారత సీఐటీయూ 18వ మహాసభలు జరగనున్నట్లు నర్సింగరావు తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలిసి ప్రచారం చేపట్టాలని సీఐటీయూ నాయకులను, కార్యకర్తలను ఆయన కోరారు. కార్యక్రమంలో కె. లోకనాథం, ఆర్. శంకరరావు, ఎం. శ్రీనివాస్, పి. మణి, పి. వెంకటరెడ్డి, ఎం. సుబ్బారావు, ఎల్.జె. నాయుడు, ఒమ్మి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
న్యాయవాది పరిషత్ రాష్ట్ర అధ్యక్షునిగా అశ్విని కుమార్
విశాఖ లీగల్ : న్యాయవాది పరిషత్ రాష్ట్ర అధ్యక్షునిగా నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది ద్రోణంరాజు అశ్విని కుమార్ ఎన్నికయ్యారు. ఆదివారం తిరుపతిలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అశ్విని కుమార్ని రాష్ట్ర అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అశ్విని కుమార్ నియామకం పట్ల విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎంకే శ్రీనివాస్, కార్యదర్శి పార్వతీశ్వర నాయుడు అభినందనలు తెలిపారు. గత 22 ఏళ్లుగా అశ్విని కుమార్ విశాఖ న్యాయవాద సంఘం సభ్యుడిగా కొనసాగుతున్నారు. సీనియర్ న్యాయవాది హోదాలో పలు సంస్థలకు న్యాయ సలహాదారులుగా ఉన్నారు. -
కష్టపడినా..
కడుపు నిండట్లేదు● దీనావస్థలో ఆస్పత్రుల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు ● చాలీచాలని జీతంతో నిత్యం వెతలే.. ● నెలకు రూ.16 వేలు వేతనమని చెప్పి.. రూ.12 వేలే ఇస్తున్న కాంట్రాక్టర్ ● నష్టపోతున్న సుమారు 600 మంది కార్మికులు డాబాగార్డెన్స్ : ఇంట్లో ఎవరికై నా అనారోగ్యం సోకి మంచాన పడితే సొంత మనుషులే సేవ చేయలేని రోజులివి. అన్నీ మంచం మీదే చేయాల్సి వస్తే మరింత యాతన. అలాంటి రోగులను కూడా సొంత మనుషుల కంటే మిన్నగా చూసుకునే బడుగుజీవులు వారు. బతుకుతెరువు కోసం దుర్భరమైన.. క్లిష్టమైన వృత్తిలో కొనసాగుతున్నారు. వారికిచ్చే వేతనాలు అంతంతమాత్రమే. ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులు, రోగుల సంరక్షకుల దుస్థితి ఇది. విధులకు తగ్గ వేతనం ఏదీ? రోగులకు అమ్మలా అన్నం తినిపిస్తారు. వేళకు మందులిస్తారు. దగ్గరుండి బాత్రూమ్కు తీసుకెళ్తారు. రోగులు వాంతులు.. మల మూత్రాదులు చేస్తే శుభ్రం చేస్తారు. ఆస్పత్రిని పరిశుభ్రంగా ఉంచుతారు. వాడి పడేసిన సిరంజిలు, ఇంజక్షన్లు తదితర ప్రమాదకరమైన బయో వ్యర్థాలు బయటికి తరలిస్తారు. ఇలా నెలలో 30 రోజులూ గైర్హాజరీ లేకుండా పనిచేస్తే.. వారికిచ్చే వేతనం కోతలు పోనూ కేవలం రూ.12 వేలు. ఇలా కేజీహెచ్, ప్రభుత్వ విక్టోరియా ఆస్పత్రి, ఈఎన్టీ, ప్రభుత్వ ఛాతీ, ప్రభుత్వ మానసిక, రీజినల్ ఐ ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్/ఒప్పంద కార్మికులు పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్నా వారిలో సగం జీతం కూడా అందడం లేదు. గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీ ఇలా.. ఆస్పత్రుల్లో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బందికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 2021లో టెండర్లు పిలిచినప్పుడు నెలకు రూ.16 వేలు (ఈఎస్ఐ, పీఎఫ్ పోను) ఇచ్చేందుకు కాంట్రాక్టర్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. కొన్నాళ్లు రూ.11 వేలు మాత్రమే ఇవ్వగా.. ఆరు నెలల క్రితం సిబ్బంది పెద్ద ఎత్తున ఉద్యమ బాట పట్టడంతో మరో వెయ్యి పెంచాడు. ప్రస్తుతం వారికి రూ.12 వేలు మాత్రమే జీతం ఇస్తున్నాడు. మిగిలిన రూ.4 వేలు కాంట్రాక్టర్ జేబులోకి వెళ్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాన్ని కార్మిక సంఘాలు కలెక్టర్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా స్పందన లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఈఎస్ఐ, పీఎఫ్ విషయానికొస్తే 12 శాతం సిబ్బంది జీతానికి యజమాని 12 శాతం కలిపి పీఎఫ్కు జమ చేయాలి. కానీ మొత్తం 24 శాతం సిబ్బంది నుంచే కలెక్ట్ చేసినా.. పీఎఫ్కి సక్రమంగా కట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేజీహెచ్, ప్రభుత్వ విక్టోరియా, ఈఎన్టీ, ప్రభుత్వ ఛాతీ, ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో సుమారు 600 మంది శానిటేషన్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. కేజీహెచ్లో 275 మంది ఉండగా.. మిగిలిన అన్ని ఆస్పత్రుల్లో 300కు పైబడి సిబ్బంది పనిచేస్తున్నారు. -
తిలా పాపం.. తలా పిడికెడు
గాజువాక : పెదగంట్యాడలోని విశాఖ విమల విద్యాలయం (వీవీవీ) క్యాంపస్లో ఇంగ్లిష్ టీచర్ మల్లాది రవి మోహన్ నిమోనియాతో మరణించడం ఆ పాఠశాల ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన రేపింది. ఆరు నెలలుగా జీతాలు లేకపోవడంతో రవి మోహన్ సకాలంలో సరైన వైద్యం చేయించుకోలేకపోయారని ఆయన సహోద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య ఖర్చులు భరించలేక చివరికి కేజీహెచ్లో చేరి..అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. పెదగంట్యాడలో వీవీవీ నడుస్తున్పటికీ అక్కడ జీతాలు ఇవ్వడం లేదు..ప్రధాన క్యాంపస్ ఉక్కునగరంలో ఉంది. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ నేపథ్యంలో ఈ పాఠశాలను మాజమాన్యం మూసివేసింది. దీని ఫలితంగా దశాబ్దాల కాలంగా పని చేస్తున్న ఉపాధ్యాయులకు జీతాలు నిలిపివేశారని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. పాఠశాల కొనసాగింపు, జీతాల చెల్లింపు కోసం ఉపాధ్యాయులు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలను ఇటీవల ఉపాధ్యాయులు కలిశారు. అయితే పాఠశాల కొనసాగింపుపై స్పందించని ఆ ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులకు వీఆర్ఎస్ (స్వచ్ఛంద పదవీ విరమణ) ఇచ్చి పంపించేయాలని సిఫార్సు చేస్తూ లేఖలు ఇవ్వడం ఉపాధ్యాయులను నివ్వెరపరిచింది. ఈ లేఖలు రవి మోహన్లాంటి ఉపాధ్యాయులకు అశనిపాతంగా మారాయని పాఠశాల వర్గాలు పేర్కొన్నాయి. ఇదీ పాఠశాల చరిత్ర : సుమారు నాలుగు దశాబ్దాల క్రితం విశాఖ విమల విద్యాలయం ప్రారంభమైంది. స్టీల్ప్లాంట్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికుల పిల్లల విద్యావసరాలను తీర్చడానికి ఈ తెలుగు మీడియం పాఠశాలను స్టీల్ప్లాంట్ యాజమాన్యం స్థాపించింది. దీని నిర్వహణ బాధ్యతలను నగరంలోని డయాసిస్ సంస్థకు అప్పగించారు. ఈ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు గతంలో రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా వేతనాలు చెల్లించేవారు. ప్రతి సంవత్సరం సుమారు రెండు వేల మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. ప్రస్తుతం, పాఠశాలలో 28 మంది శాశ్వత ఉపాధ్యాయులు, అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు, మరియు 60 మంది ఇతర సిబ్బంది పనిచేస్తున్నారు. పాఠశాల నిర్వహణకు ఏటా దాదాపు రూ. 5 కోట్లు ఖర్చవుతుంది. ఇందులో రూ. 2 కోట్లు ఫీజుల రూపంలో వసూలవుతాయి, మిగిలిన మొత్తాన్ని ఉక్కు యాజమాన్యం అందిస్తుంది. జరుగుతున్న కథ ఇది.. : ఉక్కునగరంలోని విశాఖ విమల విద్యాలయం సంక్షోభంలో కూరుకుపోయింది. జీతాలు లేక ఇంగ్లీష్ టీచర్ మల్లాది రవి మోహన్ నిమోనియాతో మృతి చెందడం పరిస్థితిని మరింత దిగజార్చింది. స్టీల్ప్లాంట్ యాజమాన్యం పాఠశాల నిర్వహణకు నిరాకరించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. పాఠశాలను తిరిగి తెరవాలని కోరుతూ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్నా, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు వీఆర్ఎస్ సిఫార్సు లేఖలు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రవి మోహన్ మృతికి జీతాల బకాయిలే కారణమని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీవీవీ ఉపాధ్యాయుడి మృతికి బాధ్యులెవరు? ఆరు నెలలుగా జీతాల్లేక.. సకాలంలో వైద్యం చేయించుకోలేని ఉపాధ్యాయుడు మల్లాది రవిమోహన్ మృతితో ఉపాధ్యాయుల్లో ఆందోళన -
కవి ప్రధాన లక్ష్యం సమాజ శ్రేయస్సు
తాటిచెట్లపాలెం: తెలుగు సాహిత్య అభిమానులకు, కవితా ప్రకటనకు శ్రీశ్రీ కళావేదిక ఒక గొప్ప వేదికగా నిలుస్తోందని శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ కట్టిమండ ప్రతాప్ అన్నారు. సంస్థ జిల్లా అధ్యక్షుడు కొలిచిన రామ జగన్నాథ్ ఆధ్వర్యంలో ఆదివారం రైల్వేస్టేషన్ సమీపంలోని శుభం ఫంక్షన్ హాల్లో సంస్థ 150వ సాహిత్య కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ ప్రతాప్ మాట్లాడుతూ కవి ప్రధాన లక్ష్యం సమాజ శ్రేయస్సు కోరుకోవడమేనన్నారు. ఈ కాలంలో కవిత్వం ప్రజల మనోభావాలకు ప్రతినిధిగా నిలవాలని, సమాజంలో మార్పుకు దారితీసే శక్తిగా సాహిత్యం ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్వభారత్ డైరెక్టర్ బలివాడ రమేష్ మాట్లాడుతూ వచ్చే సంక్రాంతికి విజయనగరం జిల్లా గరివిడిలో శ్రీశ్రీ కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు బహుభాషా కవి సమ్మేళనం ఏర్పాటు చేస్తామని తెలిపారు. సమ్మేళనంలో విశాఖ నగరంతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 150 మంది కవులను ప్రశంసాపత్రం, శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. సమకాలీన రాజకీయాలు, మానవతా విలువలు, ప్రకృతి సంరక్షణ, మహిళా సాధికారత వంటి విభిన్న అంశాలపై కవులు తమ కవితలు వినిపించారు. -
శివయ్యకు కావిళ్లతో గంగ కాలినడకన ప్రయాణం
మర్రిపాలెం: హిందువులకు అత్యంత పవిత్రమైన శ్రావణమాసం. శివభక్తులు పరమశివుడి ఆశీర్వాదం కోసం ‘కన్వర్ యాత్ర’ (కావడి యాత్ర)ను ఆదివారం మార్వాడీలు విశాఖలో నిర్వహించారు. కన్వర్ అనేది వెదురుతో చేసిన ఒక కావడి, దీనికి ఇరువైపులా కుండలు కట్టి గంగా జలాన్ని మోసుకెళ్తారు. ఈ యాత్రలో పాల్గొనే భక్తులను కన్వరియాలు అంటారు. వీరు కాషాయ వస్త్రాలు ధరించి మాధవధారలోని జలధార నుంచి పవిత్ర జలాలను సేకరించి.. శివాలయాల్లోని శివలింగాలకు అభిషేకం చేశారు. పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన శ్రావణమాసంలో గంగాజలంతో అభిషేకం చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఆదివారం మాధవధారలోని ‘దార’ వద్ద మార్వాడీల కావడి యాత్ర ఘనంగా ప్రారంభమైంది. మాధవధారలోని ‘జలధార’ నుంచి నీటిని సేకరించి, వాటిని కావడిలో మోసుకుంటూ శివుడిని స్తుతిస్తూ యాత్రగా బయలుదేరారు. మాధవధార, మురళీనగర్, బిర్లా జంక్షన్ మీదుగా వందలాది మంది మార్వాడీలు ఈ యాత్రలో పాల్గొన్నారు. చివరగా, వారు బీచ్లోని శివాలయం చేరుకొని, సేకరించిన జలాలతో శివుడికి అభిషేకం చేస్తారు. ఈ యాత్ర భక్తి పారవశ్యంతో సాగింది. -
విప్లవోద్యమానికి తొలి గొంతుక చలసాని
సీతంపేట : కామ్రేడ్ చలసాని ప్రసాద్ మనుషుల పట్ల అచంచలమైన ప్రేమ, ఆప్యాయత చూపేవారని, ఆయన జీవితం మొత్తం విప్లవ పంథాలోనే ముగించారని పలువురు వక్తలు కొనియాడారు. విరసం వ్యవస్థాపకుడు చలసాని ప్రసాద్ పదో వర్ధంతి సభ ఆదివారం ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. చలసాని చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎస్సార్ ప్రసాద్ మాట్లాడుతూ మనసు ఫౌండేషన్ డిజిటలైజేషన్కు పాఠకులు ఎవరైనా వెళ్లి తమకు నచ్చిన పుస్తకం చదవొచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. విరసం అధ్యక్షుడు అరసవిల్లి కృష్ణ మాట్లాడుతూ చలసాని సేకరించిన సుమారు 8,500 పుస్తకాలను మనసు ఫౌండేషన్ స్కాన్చేసి డిజిటలైజేషన్ చేయడం సిపిబుక్స్.ఓఆర్జి వెబ్సైట్లో పొందుపర్చడం, ఆ వెబ్సైట్ను నా చేతుల మీదుగా ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా శాంతి చర్చలు, విప్లవ పంథా పేరిట సదస్సు నిర్వహించారు. చలసాని జీవితం తాత్వికతపై ప్రజాస్వామ్య రచయితల వేదిక నాయకురాలు మల్లీశ్వరి ప్రసంగించారు. కవి బాలసుధాకర్ రాజకీయార్థిక సంక్షోభం నేపథ్యంలో యాభై ఏళ్ల కళింగాంధ్ర కవితపై ప్రసంగించారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి, పీవోడబ్ల్యూ లక్ష్మి, మధు, వేణుమాస్టర్, టి.శ్రీరామమూర్తి, ప్రసాదవర్మ, మానం ఆంజనేయులు, లలిత, చందు సుబ్బారావు, కత్తి పద్మ, ఇప్టూ ప్రసాద్ మాట్లాడారు. -
బ్లాక్ చేసేశారు..!
ఉక్కు కార్మికుల్నిమూడు దశాబ్దాలుగా ఆ పరిశ్రమనే నమ్ముకున్నారు. ఉక్కుతోనే జీవితం అని భావించారు. అర్థాంతరంగా వారిని జీవన కర్మాగారం నుంచి దూరం చేసేశారు. దీంతో నాలుగు వేల మంది కార్మికులు కుటుంబాలతో రోడ్డున పడ్డారు. దేశంలో ఏ పరిశ్రమలోనూ లేని విధంగా మరోసారి ప్లాంట్లో అడుగుపెట్టనీయకుండా కార్మికులకు ‘ఆధార’ం దొరక్కుండా ‘బ్లాక్’ చేసేశారు. ప్లాంట్ మనుగడ కోసమే కార్మికులను తొలగించామని చెబుతున్న యాజమాన్యం.. వారి స్థానంలో ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొచ్చి నియమించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. సాక్షి, విశాఖపట్నం : ఓవైపు ఉక్కు పరిశ్రమను ఉద్ధరిస్తామంటూ చంద్రబాబు సర్కారు ఊదరగొడుతూ.. మరోవైపు సంస్థను మరింత కుంగదీసేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి కుయుక్తులు పన్నుతోంది. ఇప్పటికే నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న స్టీల్ప్లాంట్.. ఉద్యోగులకు జీతాలు సక్రమంగా చెల్లించలేని దుస్థితికి చేరుకుంది. ఏకంగా 305 శాతం జీతాలు బకాయిలుగా ఉంచేసి.. ఉద్యోగుల ఆర్థిక స్థితిని అగమ్యగోచరంగా మార్చేసింది. ఇప్పటికీ సీనియర్లకు 75 శాతం, మధ్యస్థ ఉద్యోగులకు 80 శాతం వేతనం మాత్రమే చెల్లిస్తోంది. ఓవైపు కేంద్ర గనుల శాఖ మంత్రి స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో జరగదని బాహాటంగా చెబుతుంటే.. మరోవైపు ప్లాంట్ను నిర్వీర్యం చేసే పనులను కూటమి ప్రభుత్వం చాపకింద నీరులా చేసుకుంటూ పోతోంది. ఇటు ప్రజలు.. అటు ఉద్యోగుల ఆందోళనలు.. ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నిరసనలను ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ఎన్ని కుయుక్తులు పన్నుతున్నా.. వెరవకుండా ఏళ్లతరబడి ఉద్యమాలు చేసి.. స్టీల్ప్లాంట్ని కాపాడుకునేందుకు శ్రమిస్తున్న ఉద్యోగులు, కార్మికుల ఆర్థిక మూలాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దెబ్బకొడుతున్నాయి. పోరాటం చేస్తున్న వారి ఆత్మస్థైర్యాన్ని, ఆర్థిక ఆసరాని ఛిద్రం చేస్తే.. ఉద్యమాన్ని నీరుగార్చొచ్చన్న కుతంత్రంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న విషయం.. జీతాల చెల్లింపులతో బట్టబయలవుతోంది. దీనికి తోడు కాంట్రాక్టు కార్మికులపైనా వేటు వేసింది. కొద్ది నెలల క్రితం ఏకంగా 4 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను అర్థాంతరంగా తొలగించేసి నడిరోడ్డున పడేసింది. 30 శాతం కాంట్రాక్టు కార్మికులను తక్షణం విధుల నుంచి వెనక్కి పంపుతూ వారి గేట్పాస్లను వెనక్కి తీసుకుంది. దీనిపై కాంట్రాక్టు కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టినా యాజమాన్యం మరింత కఠినంగా వ్యవహరించింది. ఇతర రాష్ట్రాల కార్మికులెందుకో.? కాస్ట్ కటింగ్ పేరుతో కార్మికుల తొలగింపు చేపట్టిన ప్లాంట్.. ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను దిగుమతి చేసుకోవడంపై సర్వత్రా మండిపడుతున్నారు. తొలగించిన వారి స్థానంలో స్కిల్డ్ కార్మికులు లేక.. ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతుండటంతో ఏం చేయాలో పాలుపోక.. ఒడిశా, చత్తీస్గడ్ నుంచి కాంట్రాక్టు కార్మికుల్ని నియమించుకోవాలంటూ ఏజెన్సీల్ని ప్లాంట్ ఆదేశించింది. ఇప్పటి వరకూ 1000 మందికి పైగా కార్మికుల్ని ఈ రెండు రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి.. ప్లాంట్లో ఉపాధి కల్పించారు. దీనిపైనా ఉద్యోగ, కార్మిక సంఘాలు యాజమాన్యంతో పోరాటం సాగిస్తున్నా.. పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్లాంట్ యాజమాన్య వ్యవహార శైలిపై కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు చివరికి సీఎం, డిప్యూటీ సీఎంకి మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు దశాబ్దాలుగా ప్లాంట్నే నమ్ముకొని.. కుటుంబాలను నడిపించిన వారంతా.. వేరే పని తెలియక.. కుటుంబాల్ని పోషించుకోలేక అల్లాడిపోతున్నారు. వీరికి న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రాకపోవడంపై కార్మిక సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ప్లాంట్లో అడుగు పెట్టనీయకుండా కుట్ర దేశంలో ఎక్కడా లేని విధంగా ఆధార్ కార్డ్ బ్లాక్ ఏ ఏజెన్సీలోనూ పనిచేయనీయకుండా ఆంక్షలు 4 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను రోడ్డున పడేసిన యాజమాన్యం కొత్తగా ఒడిశా, జార్ఖండ్కు చెందిన వెయ్యి మందికిపైగా ఉపాధి కల్పన మండిపడుతున్న ఉద్యోగ, కార్మిక సంఘాలుఆధార్ కార్డూ బ్లాక్లో పెట్టేశారు.! అన్ఫిట్గా లేరని కొందర్ని.. పనిరాదంటూ మరికొందర్ని తొలగించడంతో 4 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పైగా కార్మిక, ఉద్యోగుల సంఘాల నాయకులు ఆందోళన చేస్తుండటంతో ప్లాంట్ యాజమాన్యం మొండి వైఖరి ప్రదర్శించింది. స్టీల్ప్లాంట్లో గల దాదాపు 600 ఏజెన్సీల్లో కొంతమంది చొప్పున వేటు వేసింది. బయోమెట్రిక్లో పేరు తొలగించేసింది. పైగా వీరందరి ఆధార్ కార్డులను బ్లాక్ చేయాలంటూ ప్లాంట్ యాజమాన్యం ఏజెన్సీలను ఆదేశించింది. దీంతో వారు మరో ఏజెన్సీలో చేరి ప్లాంట్లోకి ప్రవేశించడానికి వీలు లేకుండా చేసేసింది. అంటే ఈ 4 వేల మందికీ ప్లాంట్లో పని దొరికే అవకాశం లేదు. దేశంలో ఏ పరిశ్రమలోనూ ఈ తరహా నిరంకుశ వైఖరి లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. -
రైతు బజార్లపై ‘కూటమి గద్దలు’!
● 100 డ్వాక్రా, దివ్యాంగుల స్టాళ్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం ● విశాఖ, అనకాపల్లి జిల్లాల నుంచి 350 దరఖాస్తులు ● కూటమి నేతల వసూళ్ల పర్వం ● చక్రం తిప్పుతున్న ఓ ఎమ్మెల్యే పీఏ ● సిఫార్సులతో అధికారుల మల్లగుల్లాలు విశాఖ విద్య : రైతు బజార్లపై కూటమి నేతలు గద్దల్లా వాలిపోతున్నారు. నగరంలోని రైతుబజార్లలో త్వరలో కేటాయించబోయే స్టాళ్లను చేజిక్కించుకునేలా తమ అనుచరులను రంగంలోకి దింపారు. వీటిని తమ వ్యాపార కేంద్రాలుగా మార్చేందుకు కూటమి నేతలు రాజకీయం చేస్తుండటం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో 13 రైతు బజార్లు ఉన్నాయి. వీటిలో 1,350 వరకు స్టాళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో డ్వాక్రా, దివ్యాంగులకు 220 స్టాళ్లు కేటాయించారు. ఇక్కడ దుకాణాల నిర్వహణకు విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని రైతులు, డ్వాక్రా సంఘాల సభ్యులకు గుర్తింపు కార్డులు ఇస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 2 వేలు కార్డులు జారీ చేశారు. మరో ఏడు వందల మందికి పైగా తమకు దుకాణాలు కేటాయించాలని దరఖాస్తు చేసుకున్నారు. రైతు కార్డులకు శాశ్వత గుర్తింపు ఉండగా, డ్వాక్రా, దివ్యాంగులకు మూడేళ్ల కాలవ్యవధితో దుకాణాల నిర్వహణకు అవకాశం కల్పిస్తారు. 100 స్టాళ్లకు నోటిఫికేషన్ జిల్లాలో అన్ని రైతుబజార్లలో డ్వాక్రా, దివ్యాంగులకు సంబంధించి 98 స్టాళ్లు, కొత్తగా ఏర్పాటు చేసిన చిట్టివలస రైతు బజారులోని 2 స్టాళ్లు కలుపుకొని మొత్తంగా 100 స్టాళ్లు(డ్వాక్రా–71, దివ్యాంగులు–29) నిర్వహణకు (మూడేళ్లు వ్యవధితో కార్డుల జారీ) ఈ నెల 2న నోటిఫికేషన్ జారీ చేశారు. గడువు ఈ నెల 31తో ముగియనుండగా ఇప్పటివరకు 350 మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో లాటరీ ద్వారా అర్హులైన వారిని ఎంపిక చేయాల్సి ఉంది. భారీగా చేతులు మారుతున్న డబ్బులు రైతు బజారులో దుకాణాల నిర్వహణ లాభసాటిగా ఉంటుంది. సీతమ్మధార, ఎంవీపీ కాలనీ, కంచరపాలెం వంటి చోట్ల ఒక్కో స్టాల్లో రోజుకు రూ.30 వేలు పైనే అమ్మకాలు సాగుతాయి. గోపాలపట్నం, గాజువాక, పెదవాల్తేరు, స్టీల్ప్లాంట్, పెందుర్తి, మధురవాడ వంటి రైతుబజార్లలో తాము చెప్పిన వారికి స్టాల్ దక్కేలా కూటమి నేతలు స్కెచ్ వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. విశాఖ జిల్లాలోని ఓ ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు(పీఏ) గోపాలపట్నంలోని మార్కెటింగ్ శాఖ కార్యాలయంలోనే తిష్టవేసి.. ఈ తతంగాన్ని నడిపిస్తున్నానే ప్రచారం సాగుతోంది. ఇందుకు భారీగా డబ్బులు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తమలాంటి వారికి అవకాశం దక్కకుండా కూటమి నాయకులు కుయుక్తులు పన్నుతుండటంపై దరఖాస్తుదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగేలా ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలని కోరుతున్నారు. సిఫార్సుల వడపోత లాటరీ ప్రక్రియకు ముందే దరఖాస్తుదారుల్లో అర్హులెవరెనేది నిశిత పరిశీలన చేయాల్సి ఉంది. బైలా ప్రకారం మనుగడలో ఉన్న డ్వాక్రా సంఘాలనే పరిగణలోకి తీసుకోవాలి. పరిశీలన నిమిత్తం మార్కెటింగ్ శాఖ అధికారులు, అనకాపల్లి డీఆర్డీఏ అధికారులకు 143, విశాఖ డీఆర్డీఏ అధికారులకు 40, జీవీఎంసీలోని యూసీడీ విభాగానికి 167 దరఖాస్తులను పంపించారు. ఇక్కడ నుంచే పైరవీల జాతర మొదలైందనే ప్రచారం సాగుతోంది. తమ అనుచరుల పేర్లు మాత్రమే లాటరీలో ఉండేలా వడపోత సాగాలని కూటమి నేతలు సిఫార్సు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. -
మాట వినకుంటే వేటే..!
● అంచనాలు లేకుండా పోల్స్, ట్రాన్స్ఫార్మర్లు మార్చాలంటూ ఎమ్మెల్యే హుకుం ● ఉన్నతాధికారుల నుంచి అనుమతి రాగానే చేసేస్తామన్న ఏఈ, ఏడీఈ ● వారిని వెంటనే బదిలీ చేయించి.. తనకు అనుకూలంగా ఉన్న వారికి పోస్టింగ్ ఈపీడీసీఎల్ చిరుద్యోగులపై టీడీపీ ఎమ్మెల్యే ప్రతాపం ఆగమేఘాలపై ఏఈ, ఏడీఈల బదిలీ సాక్షి, విశాఖపట్నం : ‘ఇది నా నియోజకవర్గం.. నేను చెప్పిందే అంచనా.. నేను చెప్పిందే పని.. అడ్డొస్తే.. ఇక్కడ ఉండరు. జాగ్రత్త..’ ఈపీడీసీఎల్ ఉద్యోగులపై ఓ కూటమి సీనియర్ ఎమ్మెల్యే రుబాబిది. హెచ్చరించినట్లుగానే.. చిరుద్యోగులపై తన ప్రతాపాన్ని చూపించారు. తాను చెప్పినట్లు వినలేదని ఇద్దరు ఉద్యోగులను ఆగమేఘాల మీద బదిలీ చేయించి.. తనకు నచ్చిన వారికి పోస్టింగ్లు ఇప్పించేసుకున్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన తన దగ్గర నిబంధనలు పనిచేయవన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సదరు ఎమ్మెల్యే వ్యవహారశైలితో ఆ ప్రాంతంలో పనిచేసేందుకు ఈపీడీసీఎల్ ఉద్యోగులు జంకుతున్నారు. ఎమ్మెల్యే ఆగ్రహానికి ఏఈ, ఏడీఈ బలి..! ఇటీవల తన నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే ట్రాన్స్ఫార్మర్తో పాటు విద్యుత్ లైన్ వెంటనే మార్చాలని ఈపీడీసీఎల్ ఏఈ, ఏడీఈలను ఆదేశించారు. ఎస్టిమేషన్స్ సిద్ధం చేస్తామని వారు చెప్పారు. కానీ ఎమ్మెల్యే వినిపించుకోకుండా ప్రజల ముందరే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత రోజు ఒక వీధిలో పోల్స్ సాయంత్రానికల్లా మార్చాలని ఆదేశించారు. ఇది కూడా వెంటనే చేయడం సాధ్యం కాదనీ.. అంచనాలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపిస్తామని.. అక్కడి నుంచి అనుమతి రాగానే మార్చేస్తామని సమాధానమిచ్చారు. దీంతో ఎమ్మెల్యే ఈగో హర్ట్ అయ్యింది. నేను చెప్పినా.. అంచనాలు గించనాలు అని సమాధానమిస్తారా అంటూ సదరు ఏఈ, ఏడీఈపై చిందులేశారు. నా మాట లెక్క చెయ్యని మీరు.. ఇక్కడెలా ఉంటారో చూస్తానంటూ హెచ్చరించారు. అక్కడి నుంచే ఈపీడీసీఎల్ ఉన్నతాధికారితో ఫోన్లో మాట్లాడి.. ఏఈ, ఏడీఈల్ని సాయంత్రానికల్లా ట్రాన్స్ఫర్ చేయాలని ఆర్డర్ వేశారు. నేను ఏం చెబితే.. అది చేసే ఏఈ, ఏడీఈ పేర్లు మీకు మెసేజ్ చేస్తున్నా.. వారికి పోస్టింగ్ కూడా ఇవ్వాలని హుకుం జారీ చేశారు. ఇంకేముంది అక్కడ ఎవరిది తప్పో కనీసం విచారణ చేపట్టకుండా.. ఏఈ, ఏడీఈ వెర్షన్ తెలుసుకోకుండా.. విద్యుత్ శాఖ ఉన్నతాధికారి.. బదిలీ ఆర్డర్ వారి చేతిలో పెట్టేశారు. ఎమ్మెల్యే చెప్పిన వారిని అక్కడికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసేశారు. వామ్మో.. ఆ ఎమ్మెల్యే నియోజకవర్గంలోనా.? సదరు ఎమ్మెల్యే నియోజకవర్గంలో పనిచేయాలంటే విద్యుత్ ఉద్యోగులు భయపడుతున్నారు. లైన్మెన్ దగ్గర నుంచి.. పై స్థాయి ఉద్యోగి వరకూ ఎవరైనా.. ఆయన ఏ పని చెబుతారోనంటూ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేయడం తమ వల్ల కాదని చెప్పేవాళ్లకు బదిలీ ఆర్డర్ని చేతిలో పెడుతున్నారు. అయితే.. కొత్తగా విధుల్లో చేరిన ఇద్దరు ఉద్యోగులూ ఎమ్మెల్యేకు వీర విధేయులే అయినా.. అడ్డగోలుగా పనులు ఎలా చేసేస్తారో చూస్తామని తోటి ఉద్యోగులే వ్యాఖ్యానించడం కొసమెరుపు. -
సృష్టి రహస్యాలెన్నో...!
మహారాణిపేట: పిల్లలు లేని దంపతులను లక్ష్యంగా చేసుకుని, సరోగసీ (అద్దె గర్భం), ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) కేంద్రాలు భారీగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాయి. మాతృత్వపు ఆనందాన్ని అందిస్తున్న ఈ పద్ధతులను కొన్ని సంస్థలు సొమ్ము చేసుకునే మార్గంగా చూస్తూ మహిళల నుంచి అడ్డగోలుగా డబ్బు దోచుకుంటున్నాయి. గతంలో ఐవీఎఫ్ కేంద్రాలు ఇష్టానుసారం సరోగసీని ఉపయోగించుకుని డబ్బులు దండుకున్నాయని అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. నగరంలోని ‘సృష్టి ఐవీఎఫ్’ సెంటర్ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. సరోగసీ, ఐవీఎఫ్ సేవలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలు రూపొందించి నియంత్రిస్తున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నుంచి అనుమతులు పొంది మాత్రమే ఈ కేంద్రాలను నడపాలి. జిల్లాలో 41 ఐవీఎఫ్, 9 సరోగసీ కేంద్రాలు సహా మొత్తం 50 కేంద్రాలు పనిచేస్తున్నట్లు సమాచారం. టెస్ట్ ట్యూబ్ బేబీ సహజ పద్ధతిలో గర్భధారణ కానివారికి లేదా పురుషులలో వీర్య కణాల నాణ్యత తక్కువగా ఉన్నప్పుడు వైద్యులు ఐవీఎఫ్ పద్ధతిని సూచిస్తారు. సరోగసీ, ఐవీఎఫ్ కేంద్రాల్లో ఏఆర్టీ (అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ) బ్యాంక్, ఎల్–1, ఎల్–2 విభాగాలు ఉంటాయి. వీటి కోసం వరుసగా రూ. 50వేలు, రూ.50వేలు, రూ. 2 లక్షలు డిపాజిట్/డీడీ సమర్పించాలి. దరఖాస్తుతో పాటు సదుపాయాలు, వైద్యుల వివరాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి సమర్పించాలి. కలెక్టర్ అధ్యక్షతన కమిటీలు కలెక్టర్ అధ్యక్షతన సరోగసీ, ఐవీఎఫ్ పర్యవేక్షణ కోసం కమిటీలు ఏర్పాటు చేశారు. వీటిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ప్రసూతి, పిల్లల వైద్య విభాగాల అధిపతులు, పోలీసు కమిషనర్, సెషన్స్ జడ్జి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రముఖ గైనకాలజిస్టులు సభ్యులుగా ఉంటారు. సరోగసీకి కలెక్టర్, ఐవీఎఫ్కు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ‘సృష్టి’ అక్రమాలు, నిబంధనల ఉల్లంఘన జిల్లా పరిషత్ సమీపంలోని ‘సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్’ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ కేంద్రం 2018 నుంచి 2023 వరకు డీఎంహెచ్వో కార్యాలయంలో నమోదైంది. ఆ తర్వాత ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే అనధికారికంగా నడుస్తోంది. డాక్టర్ నమ్రత ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కేంద్రంపై విశాఖ, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్లలో కేసులు నమోదయ్యాయి. మేనేజర్ కల్యాణికి ఇందులో కీలక పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఢిల్లీ నుంచి తీసుకొచ్చి విశాఖలో డెలివరీ గత నెలలో ఈ కేంద్రంలో డెలివరీ అయిన మగబిడ్డ విషయంలో అక్రమాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. వేరే మహిళకు పుట్టిన బిడ్డను తీసుకువచ్చి సరోగసీ ద్వారా పుట్టినట్లు దంపతులను నమ్మించారు. ఢిల్లీకి చెందిన గర్భిణిని విమానంలో విశాఖకు తీసుకొచ్చి డెలివరీ చేయించారని పోలీసులు అనుమానిస్తున్నారు. డాక్టర్ నమ్రత గతంలో కోట్లాది రూపాయల దందా చేసి, ఒక బిడ్డను రూ.30 లక్షలకు విక్రయించారని పోలీసులు చెబుతున్నారు. అక్రమ వసూళ్లు, పర్యవేక్షణ లోపం నగరంలో ఐవీఎఫ్, సరోగసీ కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ కేంద్రాలు పనిచేస్తున్నాయి. కొందరు అధికారులకు లంచాలు ఇచ్చి యథేచ్ఛగా నడుపుతున్నా పట్టించుకునేవారు లేరు. ఒక కేసు నుంచి రూ. 20 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. డబ్బులు ఎక్కువగా ఉన్నవారి నుంచి వివిధ రకాల ఫీజుల పేరుతో దోచుకుంటున్నారు. వివాహం జరిగి చాలా ఏళ్లు పిల్లలు లేని తల్లుల నుంచి పెద్ద మొత్తంలో అక్రమ వసూళ్లు చేస్తున్నారు. దీనికి ఎలాంటి బిల్లులు, లెక్కలు ఉండటం లేదు. ఈ కేంద్రాలపై వైద్య ఆరోగ్యశాఖ పర్యవేక్షణ కొరవడుతోందని స్పష్టమవుతోంది. ఐవీఎఫ్లో కలకలం పిల్లలు లేని దంపతులే లక్ష్యం భారీగా వసూళ్ల పర్వం లోపించిన వైద్య ఆరోగ్యశాఖ పర్యవేక్షణ వివాదాలకు కేంద్రబిందువుగా మారిన ఐవీఎఫ్ సెంటర్లు నమోదు తప్పనిసరి సరోగసీ, ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) సేవలందించే కేంద్రాలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అలాగే నమోదు కోసం నిర్దేశించిన రుసుములను సకాలంలో చెల్లించాలి. రుసుము చెల్లింపులో జాప్యం చేసే దరఖాస్తులను తిరస్కరిస్తాం. అనుమతులు పొందిన తర్వాత మాత్రమే సరోగసీ, ఐవీఎఫ్ ప్రక్రియలను ప్రారంభించాలి. ప్రస్తుతం దరఖాస్తు చేసుకోని ఏఆర్టీ సెంటర్లను కూడా సీజ్ చేస్తాం. అటువంటి సెంటర్లకు నోటీసులు జారీ చేసి, వారి సేవలను నిలుపుదల చేసి, ప్రీ–కాన్సెప్షన్ అండ్ ప్రీ–నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్ 1994 కింద కఠిన చర్యలు తీసుకుంటాం –డాక్టర్ పి.జగదీశ్వరరావు, డీఎంహెచ్వో -
‘అవినీతి సొమ్మును దాచేందుకే బాబు సింగపూర్ వెళ్తున్నారు’
విశాఖ: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతీ సందర్భంలోనూ సింగపూర్ పర్యటనే ఉంటుందని, అవినీతి సొమ్మును దాచేందుకే ఆయన అక్కడకు తరచు వెళ్తుంటారని మాజీ మంత్రి, వైఎస్సార్సీసీ నేత గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఈ రోజు( ఆదివారం, జూలై 27) విశాఖ నుంచి ప్రెస్మీట్లో మాట్లాడిన అమర్నాథ్.. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయల భూములను అప్పనంగా కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ మధ్య కాలంలో రూ. 3 వేల కోట్ల భూములను వాళ్లకు కావాల్సిన వారికి అప్పగించే పనిలో ఉన్నారని మండిపడ్డారు. ‘ ఊరు పేరు లేని ఊర్సా కంపెనీకి వేల కోట్ల రూపాయల విలువ గల 60 ఎకరాల భూమి కేటాయించారు. ఆ సంఘటన మరుకముందే మరో 60 ఎకరాల భూమి రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇచ్చారు. సత్వ, కపిల్ వంటి వేల కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలకు కారు చౌకగా భూములు అప్పగించారు.. ఈ భూ కేటాయింపులో క్రీడ్ ప్రో కో ఉంది. ఐటీ కంపెనీలకు కాకుండా రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎందుకు తక్కువ రేటుకు భూములు ఇస్తున్నారు. చీకటి ఒప్పందంలో భాగంగానే భూ కేటాయింపులు జరుగుతున్నాయి. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చిన సింగపూర్ వెళ్తున్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బును సింగపూర్ లో దాస్తున్నారు. చంద్రబాబు అవినీతి గురించి కోలా కృష్ణ మోహన్ చెప్పారు. చంద్రబాబు ఫ్రెండ్ ఈశ్వరన్ అవినీతి కేసులో జైలకు వెళ్లారు. చంద్రబాబు సింగపూర్ ఈశ్వరన్ కవల పిల్లలులా తిరిగేవారు. ప్రపంచంలో అత్యంత అవినీతి దేశాల్లో సింగపూర్ ఒకటి. అటువంటి అవినీతి దేశంలో చంద్రబాబు వ్యాపారం చేస్తున్నారు. సంపాదించిన అవినీతి డబ్బు దాచేందుకు చంద్రబాబు సింగపూర్ వెళ్లారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రూపాయి పెట్టుబడి తెచ్చారా?, దుబాయ్ శ్రీనులా, సింగపూర్ చంద్రబాబులా పేరును ఆయన సంపాదించుకున్నారు’ అని విమర్శించారు. -
వేతనాలు చెల్లించండి మహాప్రభో.!
తిరుపతి అర్బన్, పార్వతీపురం టౌన్, ఆరిలోవ(విశాఖ): తమకు జీతాలు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారంటూ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. శనివారం ఆయా కలెక్టరేట్, డీఈఓ కార్యాలయాల వద్ద ధర్నా చేశారు. బదిలీ అయిన ఉపాధ్యాయుల జీతాల విషయంలో కేడర్ స్ట్రెంగ్త్ వివరాలు, పొజిషన్ ఐడీలు లేకపోవడంతో జూన్, జూలై జీతాలకు ఆటంకం ఏర్పడిందని ఆవేదన చెందారు.యుద్ధ ప్రాతిపదికన బదిలీలు చేసిన ప్రభుత్వానికి జీతాన్ని చెల్లించడం కష్టమేమీ కాదన్నారు. ఈ నెలాఖరులోగా సమస్యను పరిష్కరించాలని, లేదంటే ఉపాధ్యాయులు న్యాయపోరాటం చేయాల్సి వస్తుందని, డీఈఓ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం ఆయా కలెక్టరేట్లు, డీఈఓ కార్యాలయాల్లో వినతి పత్రాలను సమర్పించారు. యూటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు. -
మేయర్ ఇంటి సమీపంలో బెల్ట్ దుకాణం
50 మద్యం క్వార్టర్ బాటిళ్ల స్వాధీనం పెందుర్తి: కూటమి ప్రభుత్వ హయాంలో మద్యం బెల్ట్ దుకాణాలు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు నివాసానికి కూత వేటు దూరంలో శుక్రవారం అర్ధరాత్రి ఓ మద్యం బెల్ట్ దుకాణం బాగోతం బయటపడింది. వివరాలివి..ఆనందపురం మండలం శొంఠ్యాం గ్రామానికి చెందిన ఎర్ర మాధవ్ పెందుర్తి కూడలి సమీపంలోని డీఆర్సీ షాపింగ్ మాల్ ఎదురుగా మద్యం బెల్ట్ దుకాణం నిర్వహిస్తున్నాడు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న పెందుర్తి పోలీసులు సీఐ కేవీ సతీష్కుమార్ ఆధ్వర్యంలో దుకాణంపై మెరుపుదాడి చేశారు. దుకాణంలో ఉన్న 50 మద్యం క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేసిన నిందితుడు మాధవ్ను హెచ్సీ జి.అప్పారావు, పీసీ చంద్రశేఖర్ చాకచక్యంగా పట్టుకుని అదుపులోనికి తీసుకున్నారు. సీఐ సతీస్కుమార్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సమష్టి కృషితోనే జీవీఎంసీకి గుర్తింపు
మహారాణిపేట: పారిశుధ్య కార్మికుల సమష్టి కృషితోనే సఫాయి మిత్ర సురక్షిత్ షహర్ ప్రత్యేక కేటగిరీలో జీవీఎంసీకి ప్రథమ స్థానం దక్కిందని మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఏయూ కన్వెన్షన్లో జీవీఎంసీ నిర్వహించిన స్వచ్ఛ అవార్డుల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విశాఖ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దిన పారిశుధ్య కార్మికులకే ఈ అవార్డు దక్కుతుందన్నారు. జీవీఎంసీ పరిధిలో పారిశుధ్య కార్మికులను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఎంపీ ఎం.శ్రీభరత్ మాట్లాడుతూ మంచి టెక్నాలజీని అందిపుచ్చుకొని విశాఖ నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు అందరూ కృషి చేయాలన్నారు. కలెక్టర్ ఎం.ఎన్ హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ అందరూ కలిసి పని చేస్తే మరిన్ని అవార్డులు జీవీఎంసీకి దక్కుతాయని పేర్కొన్నారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ కష్టపడి పనిచేయడం వల్ల జీవీఎంసీకి స్వచ్ఛతలో మొదట ర్యాంకు వచ్చిందన్నారు. పారిశుధ్య కార్మికులు, కార్యదర్శులు, యూసీడీ సిబ్బంది, పలు ఎన్జీవోలు, శానిటరీ ఇన్స్పెక్టర్లను సత్కరించి స్వచ్ఛ అవార్డులను, ప్రశంసా పత్రాలను జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, డిప్యూటీ మేయర్ దల్లి గోవింద రాజు, ఏపీ ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జి, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, వీఎంఆర్డీఏ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్, జీవీఎంసీ అదనపు కమిషనర్లు డి.వి.రమణమూర్తి, ఎస్ఎస్ వర్మ, జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి నరేష్ కుమార్, యూసీడీ పీడీ సత్యవేణి, జోనల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. మేయర్ పీలా శ్రీనివాసరావు -
● ప్రభుత్వ వసతి గృహాల్లో దుర్భర పరిస్థితులు ● కటిక నేలపై నిద్ర.. గుక్కెడు నీటి కోసం ఆరాటం.. ● నాణ్యత లేని భోజనంతో విద్యార్థుల అవస్థలు ● సగానికి పైగా అద్దె భవనాల్లోనే.. ● ఇరుకు గదుల్లోనేస్టూడెంట్స్ సావాసం
పెదగంట్యాడ మండలం నెల్లిముక్కు బీసీ బాలుర హాస్టల్లో నేలపైనే నిద్రిస్తున్న విద్యార్థులు జిల్లాలో మొత్తం 55 ప్రభుత్వ వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో బీసీ సంక్షేమ శాఖ ద్వారా 30 వసతి గృహాలు, సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా 22, మరో మూడు ఎస్టీ వసతిగృహాలు నడుస్తున్నాయి. 30 బీసీ వసతిగృహాల్లో 12 ప్రీ–మెట్రిక్, 18 పోస్ట్–మెట్రిక్గా సేవలు అందిస్తున్నాయి. 22 ఎస్సీ వసతి గృహాల్లో 8 ప్రీ–మెట్రిక్ (4 బాలుర, 4 బాలికల), 14 పోస్ట్–మెట్రిక్ (6 బాలుర, 8 బాలికల) వసతి గృహాలు ఉన్నాయి. మరో మూడు గిరిజన వసతి గృహాలు (1 బాలికల, 2 బాలుర) విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. -
అపరిశుభ్రత, అసౌకర్యాలు
జిల్లాలోని మొత్తం 55 ప్రభుత్వ వసతి గృహాల్లో సగానికి పైగా అసౌకర్యాలతో నిండి ఉన్నాయని ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. 30 బీసీ వసతి గృహాలలో సగానికి పైగా అద్దె భవనాలలో కొనసాగుతున్నాయి. ఈ భవనాలకు దశాబ్దాలుగా మరమ్మతులు చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సురక్షితమైన తాగునీరు అందుబాటులో లేకపోవడం ప్రధాన సమస్యగా ఉంది. కొన్ని చోట్ల నీరు బ్లీచింగ్ వాసన వస్తోందని విద్యార్థులు పేర్కొన్నారు. విద్యార్థులు కటిక నేలపై, కొన్ని చోట్ల దుప్పట్లు/ప్లెక్సీలు పరచుకుని నిద్రపోతున్నారు. కొన్ని చోట్ల మంచాలు, దుప్పట్లు వంటివి అందుబాటులో లేవు. ఆహారంలో నాణ్యత లోపించడం, సమయానికి ఆహారం సిద్ధం కాకపోవడం వల్ల విద్యార్థులు అర్ధాకలితోనే చదువులు కొనసాగిస్తున్నారు. అవసరమైన వైద్య వసతులు, బాలికలకు అవసరమైన కిట్లు కూడా ప్రభుత్వం అందించడం లేదు. ఇక వసతి గృహాల పరిసరాలు కూడా అధ్వానంగా ఉన్నాయి. విద్యార్థులు తమ దైనందిన కార్యకలాపాలు సాగిస్తున్న గదుల్లో ఫ్లోరింగ్ మరమ్మతులకు గురైంది. విద్యార్థులు తమ వస్తువులను భద్రపరచుకునే పెట్టెలను ఈ పగిలిన ఫ్లోరింగ్ పక్కనే ఉంచుకుంటున్నారు. తోటగరువులోని హాస్టల్లో 122 మంది విద్యార్థులు కేవలం 120 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న రెండు గదుల్లో వసతి పొందుతున్నారు. ఫిబ్రవరి నుంచి విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలు అందడం లేదు. ఇలా విద్యార్థులు ఉన్న సౌకర్యాలతోనే దయనీయంగా చదువులు కొనసాగిస్తున్నారు. -
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే అన్ని స్థానాలు వైఎస్సార్ సీపీవే..
డాబాగార్డెన్స్: ప్రజాస్వామ్యబద్ధంగా జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికలు నిర్వహిస్తే పదికి పది స్థానాలు వైఎస్సార్ సీపీవేనని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తెలిపారు. స్థాయీ సంఘ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు శనివారం జీవీఎంసీ అదనపు కమిషనర్ ఎస్ఎస్ వర్మకు నామినేషన్లు దాఖలు చేశారు. అనంతరం కేకే రాజు మాట్లాడుతూ స్థాయీ సంఘం ఎన్నికకు సంబంధించి 97 మందిని ఓటర్లుగా గుర్తిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. ఏప్రిల్లో జరిగిన మేయర్ అవిశ్వాస తీర్మానంలో వైఎస్సార్ సీపీ జెండాపై గెలిచిన 27 మంది పార్టీ విప్ను ధిక్కరించి ఓటు వేయగా.. వారిపై అనర్హత వేటు వేయాలని ప్రిసైడింగ్ అధికారి, కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. అంతేగాక హైకోర్టులో 27 మంది అనర్హత కేసు నడుస్తుండగా స్టాండింగ్ కమిటీ నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. టెక్నికల్గా 27 మందికి ఓటు హక్కు ఉంటే వైఎస్సార్ సీపీ బలం 59గా ఉన్నట్టేనని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం.. అధికార దుర్వినియోగం చేస్తేనే తప్పా.. వారు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవలేరన్నారు. యాక్ట్ ప్రకారం విప్ జారీ చేయడం జరిగిందని, కోర్టును కూడా ఆశ్రయించామని, చట్ట ప్రకారం వారు (పార్టీ ఫిరాయించిన 27 మంది) అనర్హులని చెప్పారు. న్యాయ స్థానంలో కేసు పెండింగ్లో ఉందని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ విప్ తైనాల విజయ్కుమార్, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, పార్టీ కార్యాలయ పర్యవేక్షకుడు రవిరెడ్డి, వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, మాజీ రాష్ట్ర కార్యదర్శి గొలగాని శ్రీనివాస్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు, కార్పొరేటర్లు అక్కరమాని పద్మ, రామునాయుడు, దౌలపల్లి ఏడుకొండరాలు, కోరుకొండ వెంకట రత్న స్వాతి దాస్, కటారి అనిల్కుమార్, భూపతిరాజు సుజాత, జిల్లా ప్రధాన కార్యదర్శి మువ్వల సురేష్, జిల్లా అధికార ప్రతినిధి పల్లా దుర్గ, జిల్లా కార్యదర్శి ఉమ్మడి దాస్, 41వ వార్డు అద్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. స్థాయీ సంఘ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు -
వసూళ్లపై శ్రద్ధ.. దేవుడిపై అశ్రద్ధ
8లోపలు వసతిగృహాల్లో ఇదీ పరిస్థితి కంచరపాలెం ఊర్వశి కూడలి సమీపంలోని గిరిజన బాలుర పోస్ట్మెట్రిక్ వసతిగృహంలో విద్యార్థులు నేలపై నిద్రపోతున్నారు. వర్షం పడినప్పుడు గదుల్లోకి నీరు చేరి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ● సీతమ్మధార ఎస్సీ వసతి గృహంలో వాటర్ప్లాంట్ మూలకు చేరింది. పరిసరాలు అధ్వానంగా ఉన్నా యి. దుప్పట్లు, మంచాలు వంటి సౌకర్యాలు లేవు. ట్యాప్లు సరిగా లేక నీరు వృథా అవుతోంది. ● ఎంవీపీ కాలనీ సెక్టార్–4లోని బీసీ బాలికల వసతి గృహం దశాబ్దాలుగా అద్దె భవనంలో నడుస్తోంది. సురక్షిత తాగునీరు లేదు. ఇరుకు గదుల్లో నేలపై నిద్రపోతున్నారు. ● మాధవధారలోని గిరిజన వసతి గృహంలో విద్యార్థుల కష్టాలు వర్ణనాతీతం. ఇక్కడ 300 మంది వరకు విద్యార్థులకు వసతి కల్పించారు. వీరంతా నగరంలోని వివిధ కళాశాలల్లో చదువుకుంటున్నారు. ఉదయం కళాశాలకు వెళ్లే సమయానికి వంట పూర్తికాక.. కేవలం అన్నంతోనే భోజనం తీసుకెళ్తున్నారు. ఉదయం 2 గంటలు మాత్రమే నీరు రావడంతో నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. తాగునీరు బ్లీచింగ్ వాసన వస్తోంది. ● తోటగరువు గాంధీనగర్లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాసీయ విద్యాలయ బాలుర హాస్టల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. 122 మంది విద్యార్థులు 120 చదరపు గజాల విస్తీర్ణంలోని రెండు గదుల్లో వసతి పొందుతున్నారు. తాగునీటి కష్టాలు, నేలపై నిద్ర, వైద్య సదుపాయాల కొరత వేధిస్తోంది. ● పెదగంట్యాడ మండలం నెల్లిముక్కులో సోషల్ వెల్ఫేర్ ఎస్సీ, ఎస్టీ బాలికల హాస్టల్తో పాటు బీసీ కాలేజ్ బాయ్స్ హాస్టల్ ఉన్నాయి. బాయ్స్ హాస్టల్లో మొత్తం 89 మంది ఉండగా, నాలుగు గదులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఒక గదిని కార్యాలయంగా వినియోగిస్తున్నారు. ఆయా గదుల్లో మంచాలు లేకపోవడంతో నేలపైనే విద్యార్థులు నిద్రపోతున్నారు. ఎస్సీ, ఎస్టీ బాలికల హాస్టల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ● 74వ వార్డు పరిధిలోని సిద్ధేశ్వరంలో బాలికల హాస్టల్ ఉంది. ఇందులో ఇంటర్ నుంచి బి.టెక్ చదువుతున్న 50 మంది విద్యార్థినులు ఉన్నారు. అద్దె భవనంలోనే ఈ హాస్టల్ను నిర్వహిస్తున్నారు. ● సింహాచలం మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో డార్మిటరీ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుని ప్రమాదకరంగా మారింది. ● పరవాడ బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు దుప్పట్లు, రగ్గులు సరఫరా చేయలేదు. ● కప్పరాడ గిరిజన బాలుర పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో లైట్లు, ఫ్యాన్లు సక్రమంగా పనిచేయడం లేదు. ● భీమిలిలోని బీసీ బాలుర కళాశాల వసతి గృహంలో పూర్తి స్థాయిలో మరుగుదొడ్లు లేకపోవడంతో.. విద్యార్థులు ఆరుబయటకు వెళ్తున్నారు. -
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సకల హంగులు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాలను సకల సౌకర్యాలతో ఆధునికీకరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం సీఎస్సార్ నిధులను భారీగా సేకరించి.. హాస్టళ్లలో సౌకర్యాల కల్పనకు వినియోగించింది. దివీస్ ల్యాబ్స్, కోరమండల్ వంటి సంస్థలు, ఎంపీ లాడ్స్ నిధులతో జిల్లాలోని 10 వసతి గృహాల్లో మొత్తం రూ.3.66 కోట్లతో ఆధునిక సౌకర్యాలు కల్పించారు. నడుపూరు సోషల్ వెల్ఫేర్ బాలికల వసతి గృహాన్ని రూ.70 లక్షలతో, పెదగంట్యాడ బాలికల వసతి గృహాన్ని రూ.23 లక్షలతో, భీమిలి ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ హాస్టల్ను రూ.55 లక్షలతో, భీమిలి బీసీ కాలేజ్ హాస్టల్ను రూ.41.62 లక్షలతో, పరదేశిపాలెం సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ను రూ.22.67 లక్షలతో, భీమిలి బీసీ బాలికల హాస్టల్ను రూ.34.79 లక్షలతో, ఇసుకతోట బీసీ బాలుర హాస్టల్ను రూ.34 లక్షలతో, ఆనందపురం బీసీ బాలుర హాస్టల్ను రూ.30 లక్షలతో, పెందుర్తి ఎస్సీ బాలుర హాస్టల్ను రూ.28.60 లక్షలతో, గోపాలపట్నం ఎస్సీ బాలుర హాస్టల్ను రూ.27.10 లక్షలతో ఆధునికీకరించారు. దీంతో అక్కడి విద్యార్థులకు సకల సౌకర్యాలతో కూడిన వసతి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. -
దుర్గానగర్ వద్ద రోడ్డు మూసివేత
● ఉక్కు యాజమాన్యం తీరుపై ప్రజల ఆందోళన ● కలెక్టర్ హరేందిరప్రసాద్ ఆగ్రహం ● గంటల వ్యవధిలో కంచె తొలగింపు గాజువాక : గంగవరం పోర్టు వై జంక్షన్ నుంచి విశాఖ స్టీల్ప్లాంట్ వరకు గల ప్రధాన రహదారిని దుర్గానగర్ జంక్షన్ వద్ద స్టీల్ప్లాంట్ యాజమాన్యం మూసివేసింది. అక్కడ ఒక రైతుతో ఏర్పడిన భూవివాదంలో కోర్టు నుంచి రైతుకు అనుకూలంగా ఉత్తర్వులు వెలువడటంతో స్టీల్ప్లాంట్ ఈ చర్యలకు దిగింది. విషయం తెలుసుకున్న కలెక్టర్ హరేందిర ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. దశాబ్దాల తరబడి మనుగడలో ఉన్న రోడ్డును మూసివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గాజువాక తహసీల్దార్ బి.శ్రీనివాసరావు ఆ కంచెను గంటల వ్యవధిలో తొలగించారు. వివరాల్లోకి వెళ్తే.. పాతకర్ణవానిపాలెం నుంచి స్టీల్ప్లాంట్కు వెళ్లే రహదారిలో దుర్గానగర్ వద్ద సర్వే నంబర్ 215లోని వివిధ సబ్ డివిజన్లలో కొంత భూమిని అప్పట్లో స్టీల్ప్లాంట్ తీసుకోలేదు. ఇప్పటికీ అది జిరాయితీగానే ఉంది. అయినప్పటికీ అందులో స్టీల్ప్లాంట్ రోడ్డు నిర్మించింది. ఆ భూమి తనదని, తనకు నష్టపరిహారం ఇవ్వకుండా రోడ్డు వేయడం సరికాదంటూ వెంకట రమణ అనే వ్యక్తి హైకోర్టును 2021లో ఆశ్రయించాడు. నిబంధనల ప్రకారం ఈ సమస్యను పరిష్కరించాలని సూచిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయినా ఆ సమస్య అలాగే ఉండటంతో ఆ వ్యక్తి మరోసారి కోర్టును ఆశ్రయించాడు. స్టీల్ప్లాంట్ సీఎండీపై కోర్టు ధిక్కరణ కేసు వేశాడు. దీంతో ఆ రోడ్డు తమకు అవసరం లేదని పేర్కొంటూ స్టీల్ప్లాంట్ యాజమాన్యం దుర్గానగర్ వద్ద రోడ్డును మూసివేసింది. పరవాడ, అచ్యుతాపురం, యలమంచిలి, ఫార్మాసిటీ వంటి ప్రాంతాలకు ఇది దగ్గర మార్గం కావడంతో ప్రజలు వేల సంఖ్యలో ఈ రోడ్డులోనే రాకపోకలు సాగిస్తారు. స్టీల్ప్లాంట్ కార్మికులతోపాటు ఆ సంస్థకు వచ్చే భారీ వాహనాలు కూడా ఆ రోడ్డే ఉపయోగపడుతోంది. దుర్గానగర్ సమీపంలోని వివిధ అపార్ట్మెంట్వాసులకు, వివిధ లాజిస్టిక్ కంపెనీలు ఈ రోడ్ను ఉపయోగిస్తాయి. ఎంతో ఉపయోగకరమైన ఈ రోడ్డును మూసివేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దార్ పరిశీలన స్టీల్ప్లాంట్ రోడ్డును మూసివేయడంతో కలెక్టర్ హరేందిరప్రసాద్ స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు గాజువాక తహసీల్దార్ బి.శ్రీనివాస్ ఆ రోడ్డును పరిశీలించారు. పూర్తి వివరాలను స్థల యజమానిని అడిగి తెలుసుకొని కలెక్టర్కు నివేదించారు. రోడ్డును అందుబాటులోకి తేవాలని కలెక్టర్ ఆదేశించడంతో అడ్డంగా వేసిన కంచెను శనివారం రాత్రి తొలగించారు. అధ్యయనం చేసి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తహసీల్దార్ తెలిపారు. -
ఎస్సీ, ఎస్టీ కోర్టు ఇన్చార్జి ఏపీపీగా రాజశేఖర్
విశాఖ లీగల్: నగరంలోని షెడ్యూల్ కులాలు, తెగల ప్రత్యేక న్యాయస్థానం ఇన్చార్జి అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సీనియర్ న్యాయవాది భత్తి రాజశేఖర్ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ న్యాయ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రాజశేఖర్ నగరంలోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానం పబ్లిక్ ప్రాసిక్యుటర్గా పని చేస్తున్నారు. ఈ కోర్టుతోపాటు ఎస్సీ, ఎస్టీ కోర్టులోని అన్ని క్రిమినల్ కేసులను ప్రాసిక్యూషన్ తరపున వాదిస్తారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన ఎస్సీ, ఎస్టీ కోర్టు ఏపీపీగా కొనసాగుతారు. -
రూ.3,000 కోట్ల దోపిడీ
ఏ రంగమైనా సరే.. ఏ ప్రాజెక్టు అయినా సరే.. ‘నీకింత–నాకింత’ సిద్ధాంతాన్ని కూటమి ప్రభుత్వ పెద్దలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. రాజధానిలో భూ పందేరాలు, అమరావతి నిర్మాణ ప్రాజెక్టులు కట్టబెట్టడంలో చోటుచేసుకున్న అక్రమాలపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతుండగానే పెద్దల దృష్టి విశాఖపై పడింది. ఐటీ ముసుగులో రియల్ ఎస్టేట్ కంపెనీలను రంగంలోకి దించింది. ఐటీ పార్కులంటూ ప్రజల కళ్లకు గంతలు కట్టి పక్కా కమర్షియల్ సంస్థలకు అత్యంత విలువైన భూములను కారుచౌకగా కట్టబెట్టడంపై అధికార వర్గాలు నివ్వెర పోతున్నాయి. ఈ 60 ఎకరాల మీదే ఆయా సంస్థలకు ఏటా రూ.1,000 కోట్ల మేర అద్దెలు వస్తాయంటే ఎవరి వాటా ఎంతుంటుందోనని చర్చించుకుంటున్నారు. సాక్షి, అమరావతి: సత్వా, కపిల్ గ్రూపు, ఏఎన్ఎస్ఆర్.. ఎంత ఖరీదైన భూములనైనా కొనడానికి వెనుకాడని రియల్ ఎస్టేట్ సంస్థలు. బెంగళూరు, పూణే, హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ కంపెనీలు భారీగా లగ్జరీ గృహ, వాణిజ్య సముదాయాలు నిర్మించి కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తున్నాయి. వేలం పాటలో అధిక ధరలకు భూములు కొనుగోలు చేసి వెంచర్లు వేస్తూ లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. ఇలాంటి పక్కా రియల్ ఎస్టేట్ సంస్థలకు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ముసుగులో ఖరీదైన భూములను కారు చౌకగా కట్టబెడుతూ విశాఖలో అసలుసిసలైన ‘రియల్’ దందాకు తెరలేపింది. బహిరంగ మార్కెట్లో రూ.3 వేల కోట్లకు పైగా విలువైన భూములను ఆ సంస్థలకు కట్టబెట్టడం వెనుక భారీగా ముడుపులు చేతులు మారినట్లు తెలుస్తోంది. అందుకే ఎటువంటి వేలం లేకుండానే వేల కోట్లు విలువ చేసే భూములను పరిశ్రమల ఆకర్షణ పేరుతో ప్రభుత్వం ధారాదత్తం చేసింది. బెంగళూరుకు చెందిన సత్వా గ్రూపు, తెలుగు రాష్ట్రాలో చిట్ ఫండ్ వ్యాపారంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించే కపిల్ గ్రూపు, ఏఎన్ఎస్ఆర్ వంటి సంస్థలకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల విలువైన భూమిని పప్పు బెల్లాల్లా అతి తక్కువ ధరకే పంచి పెట్టింది. ఈ ప్రాజెక్టుల్లో ఎటువంటి ప్రభుత్వ వాటా లేకుండా భూములను కట్టబెట్టడం విస్మయపరుస్తోంది. సత్వా, కపిల్ రియల్ ఎస్టేట్ సంస్థలు 60 ఎకరాల్లో 2 కోట్ల చదరపు అడుగుల నిర్మాణాల ద్వారా ప్రతి నెలా అద్దెల రూపంలో రూ.80 కోట్లు.. ఏటా దాదాపు రూ.1,000 కోట్ల ఆదాయం పొందుతాయని అంచనా. ఇప్పటికే ఉర్సా వంటి అనామక కంపెనీలకు భూములు కట్టబెట్టి విమర్శల పాలైనప్పటికీ భూ కేటాయింపుల విషయంలో మాత్రం ప్రభుత్వం వెనక్కు తగ్గడం లేదు. భవనాలు నిర్మించి కోట్లల్లో అద్దెలు ముక్కుపిండి వసూలు చేసే రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రభుత్వం ఇలా కారుచౌకగా భూములు కేటాయించడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఐటీ సంస్థకు మాత్రం అధిక ధర⇒ ఇదే కొండపై ఫీనమ్ పీపుల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఐటీ కంపెనీకి ఎకరా రూ.4.5 కోట్లు చొప్పున కేటాయించడం గమనార్హం. ఐటీ కంపెనీకి అధిక ధరకు కేటాయించి,రియల్ ఎస్టేట్ సంస్థకు చౌకగా కేటాయించడం భూ కేటాయింపుల్లో ‘రియల్’ మోసాలను బహిర్గతం చేస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. ⇒ సత్వా గ్రూపునకు ప్రభుత్వం సబ్సిడీ ధరతో భూమిని కేటాయించడమే కాకుండా ఏపీ ఐటీ, జీసీసీ పాలసీ 4.0 కింద పెట్టుబడి రాయితీ, విద్యుత్ సబ్సిడీ, ఎస్జీఎస్టీ మినహాయింపు తదితర అనేక అదనపు రాయితీలను కూడా ఇవ్వనుంది. సత్వా డెవలపర్స్ ఎటువంటి ఐటీ కంపెనీలను పెట్టదని.. కేవలం ఐటీ పార్కును అభివృద్ధి చేసి ఇతర ఐటీ కంపెనీలకు లీజుకు ఇస్తుందని, అలాంటప్పుడు ఐటీ పాలసీ, జీసీసీ పాలసీ కింద రాయితీలను ఎలా ఇస్తారని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ⇒ సత్వా డెవలపర్స్ రూ.1,500 కోట్ల పెట్టుబడి పెట్టడం ద్వారా 25,000 మందికి ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారని, వాస్తవానికి ఇక్కడ సత్వా డెవలపర్స్ ఎవరికీ నేరుగా ఉపాధి కల్పించదని, ఈ వెంచర్లో ఏర్పాటు చేసే ఇతర ఐటీ కంపెనీలు మాత్రమే ఉపాధి కల్పిస్తాయని స్పష్టం చేస్తున్నారు. ⇒ ఈ నేపథ్యంలో ఉపాధి కల్పన పేరుతో భారీగా రాయితీలను సత్వాకు దోచి పెట్టారని ఇట్టే తెలుస్తోంది. సత్వాకు రాయితీలు ఇచ్చి, ఇప్పుడు అందులో పెట్టే ఐటీ కంపెనీలకు కూడా రాయితీలు ఇస్తే ఒకే ప్రాజెక్టుపై రెండుసార్లు రాయితీలు ఏ విధంగా ఇస్తారని అధికారులు ప్రశ్నిస్తున్నారు.అప్పనంగా విలువైన భూములు⇒ తెలుగు రాష్ట్రాల్లో చిట్ఫండ్, రియల్ ఎస్టేట్, మీడియా రంగాల్లో విస్తరించి ఉన్న కపిల్ గ్రూపునకు చెందిన బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్కు రాష్ట్ర ప్రభుత్వం విశాఖలోని పనోరమ హిల్స్ వెనుక ఎండాడ వద్ద ఎకరా రూ.1.5 కోట్లు చొప్పున 30 ఎకరాలు కేటాయించింది. ఎండాడ వద్ద బహిరంగ మార్కెట్లో ఎకరా రూ.100 కోట్లు పెట్టినా భూమి దొరకని పరిస్థితి. అంటే సుమారు రూ.3,000 కోట్ల విలువైన భూమిని హెచ్ఎంటీవీ వంటి మీడియా సంస్థలు కలిగిన కపిల్ గ్రూపునకు కేవలం రూ.45 కోట్లకే 30 ఎకరాలను కేటాయించింది. కపిల్ గ్రూపు విశాఖలో రూ.1,250 కోట్ల పెట్టుబడితో 15,000 మందికి ఉపాధి కల్పించే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. ⇒ అలాగే వెంచర్ ఫండ్స్ నుంచి నిధులు సేకరించి ఐటీ పార్కులు.. ముఖ్యంగా గ్లోబల్ క్యాపబుల్టీ సెంటర్స్ (జీసీసీ)ను ఆకర్షించే బెంగళూరుకు చెందిన ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్కు మధురవాడ ఐటి హిల్ నెంబర్ 3పై ప్లాట్ నంబర్ 6 వద్ద 2.5 ఎకరాలు.. హిల్ నంబర్ 4పై ప్లాట్ నంబర్ యూడీఎల్ 6 వద్ద 7.79 ఎకరాల (మొత్తం 10.29 ఎకరాలు) భూమిని కారుచౌకగా కేటాయించింది. ఏఎన్ఎస్ఆర్ రూ.1,000 కోట్ల పెట్టుబడితో 10,000 మందికి ఉపాధి కల్పించనుంది. ⇒ ఐటీ పార్క్ల అభివృద్ధికి ఏపీఐఐసీ ఉండగా, రియల్ ఎస్టేట్ కంపెనీలకు అప్పగించడం ఏమిటని అధికార వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రభుత్వం ఐటీ ముసుగులో రియల్ కంపెనీలకు కారు చౌకగా భూములను ఎలా ఇస్తుందని, అదీ వేలం వేయకుండా ఇవ్వడం దారుణం అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై కేంద్రానికి ఫిర్యాదు చేయడానికి విశ్రాంత ఐఏఎస్ అధికారులు సిద్ధమవుతున్నారు. రూ.1,500 కోట్ల భూమి సత్వాకు రూ.45 కోట్లకే ⇒ సత్వా గ్రూపు.. రెండు దశాబ్ధాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉంది. పుణే, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో భారీ లగ్జరీ రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసింది. బ్లాక్ స్టోన్ వంటి పీఈ, వెంచర్ క్యాపిటల్ సంస్థల నుంచి నిధులు సేకరించి వ్యాపారం చేస్తోంది. 2017లో సత్వా గ్రూపు హైటెక్ సిటీ వద్ద 10 ఎకరాల స్థలాన్ని భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇప్పుడు తాజాగా కోకాపేట వద్ద 25 ఎకరాల భూమిని రూ.వేల కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ⇒ ఇలా ప్రైవేటుగా స్థలాలు కొనుగోలు చేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే సంస్థను జూలైలో బెంగళూరు పర్యటనలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కలిశారు. గంటల వ్యవధిలో విశాఖలో పెట్టుబడుల ఒప్పందానికి సత్వాను ఒప్పించినట్లు సోషల్ మీడియా ద్వారా విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. జూలై 8న నారా లోకేశ్ కలవడం.. గంటలోనే విశాఖలో పెట్టుబడి పెట్టడానికి ఒప్పించినట్లు ప్రకటించుకోవడం.. జూలై 23న ఎస్ఐపీబీ (స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్)లో ఆమోదం పొందడం, ఆ మర్నాడే (జూలై 24) విశాఖలో 30 ఎకరాల భూమిని కేటాయిస్తూ మంత్రి మండలిలో ఆమోదం తెలపడం చకచకా జరిగిపోయింది. పారిశ్రామిక అవసరాల కోసం ఏపీఐఐసీ సేకరించిన భూమిని రియల్ ఎస్టేట్ సంస్థ సత్వా డెవలపర్స్కు ఇలా అప్పగించేశారు. ⇒ విశాఖ గ్రామీణ మండలం మధురవాడ ఐటీ హిల్ నంబర్ 4 పై ప్లాట్ నంబర్లు యూడీఎల్ 1, యూడీఎల్ 2, యూడీఎల్ 3 వద్ద 30 ఎకరాల భూమిని సబ్సిడీ ధరగా ఎకరా రూ.1.5 కోట్లకే కేటాయిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. ప్రస్తుతం మధురవాడ ఐటీ హిల్స్లో ఎకరా రూ.50 కోట్లపైనే పలుకుతోంది. అంటే రూ.1,500 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.45 కోట్లకే ఈ రియల్ ఎస్టేట్ కంపెనీకి అప్పగించడంపై అధికారులు నివ్వెరపోతున్నారు. -
విశాఖ అయోధ్య రామయ్య సెట్ మూసివేత
సాక్షి, విశాఖపట్నం: దేవుడి పేరిట జరిగిన వ్యాపారానికి చెక్ పడింది. వివాదాల నేపథ్యంలో నగరంలో ఏర్పాటు అయిన అయోధ్య రామయ్య సెట్ మూతపడింది. నిర్వాహకులు ఇచ్చిన స్టేటమెంట్ తప్పు అని గుర్తించిన పోలీసులు.. వాళ్లకు నోటీసులు సైతం జారీ చేశారు. విశాఖపట్నంలో అయోధ్య ఆలయాన్ని తలపించే సెటప్ మొదటి నుంచి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భక్తి ముసుగులో టికెట్ల పేరుతో భారీ మోసానికి దిగారనే విమర్శలు వచ్చాయి. అదే సమయంలో కల్యాణం పేరిట ప్రచారంతో భారీ దోపిడీకి స్కెచ్ వేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో.. భద్రాచలం ఆలయ పండితులు పాల్గొంటారని చెప్పి అనుమతులు లేకుండా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో నిర్వాహకుడు దుర్గా ప్రసాద్ భారీగా వసూళ్లు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో అలాంటిదేం లేదంటూ నిర్వాహకులు మీడియా ముఖంగా ఓ ప్రకటన చేశారు. మరోవైపు.. సాక్షి సహా పలు మీడియా సంస్థలు అయోధ్య సెట్ నిర్వాహకుల కమర్షియల్ బాగోతాలను వరుస కథనాలతో బయటపెట్టింది. అదే సమయంలో.. ఫ్లెక్స్ యజమానితో మాట్లాడిన ఆడియో కాల్ వైరల్ కావడంతో మొత్తం నిర్వాకం బయటపడింది. మీడియా కథనాలు, తీవ్ర విమర్శల నేపథ్యంలో అధికార యంత్రాంగం కదిలింది. జిల్లా కలెక్టర్, భద్రాచలం ఆలయ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కదిలారు. కేవలం.. ఉద్దేశపూర్వకంగా ప్రచారం కోసమే భద్రాచలం పేరును నిర్వాహకులు వాడినట్లు పోలీసులు గుర్తించారు. బీఎన్ఎస్ సెక్షన్ 35 కింద విశాఖ త్రీ టౌన్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో నిర్వాహకులు సెట్ను మూసేసి.. సర్దుకుంటున్నారు. -
డిసెంబర్ 26 నుంచి విశాఖ ఉత్సవ్
మహారాణిపేట: పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరగనున్న ట్రావెల్ మార్ట్ (సెప్టెంబర్ 17–19), భీమిలి ఉత్సవ్ (నవంబర్ 30), విశాఖ ఉత్సవ్ (డిసెంబర్ 26–28), ఉగాది ఉత్సవాలను (మార్చి 19, 2026) ప్రజల్లోకి తీసుకెళ్లాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను కోరారు. శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్టోబర్ నుంచి పర్యాటకుల రాక పెరుగుతుందని, కాబట్టి ఇప్పటి నుంచే జిల్లాలోని పర్యాటక, సాంస్కృతిక ప్రాంతాలను హైలైట్ చేయాలని సూచించారు. విశాఖ పర్యాటకాన్ని డిజిటల్ మీడియా ద్వారా దేశ విదేశాలకు ప్రచారం చేయాలని కలెక్టర్ కోరారు. పర్యాటకులను ఆకర్షించడంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు క్రియాశీలకంగా పనిచేయాలని, ఇతర రాష్ట్రాలు, దేశాల ప్రజలు విశాఖ గురించి తెలుసుకుని వచ్చేలా చూడాలన్నారు. పర్యాటకంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న పీ4 వంటి కార్యక్రమాలు ప్రజలకు అందే ప్రయోజనాలను కూడా తెలియజేయాలని సూచించారు. హెరిటేజ్ స్థలాలు, దేవాలయాలు, సాహస ప్రదేశాలు, ఇప్పటివరకు వెలుగులోకి రాని ప్రాంతాలపై రాబోయే 3–4 వారాల్లో ఫోటో, వీడియో పోటీలు నిర్వహించి నగదు బహుమతులు అందిస్తామని కలెక్టర్ ప్రకటించారు. విశాఖ పర్యాటక ప్రాంతాల సమగ్ర సమాచారం అందించే ‘డిస్కవర్ వైజాగ్’ వెబ్ పేజీని కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా టూరిజం అధికారి మాధవి, హోటల్స్ యాజమాన్యం తరఫున పవన్ కార్తీక్, ఈవెంట్ మేనేజర్ వీరు మామ, పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పోస్టర్ను విడుదల చేశారు. -
డీపీఆర్ ఆమోదం లేకుండా టెండర్లు.. నిధుల్లేకుండా హడావుడి
వైజాగ్ మెట్రోకి టెండర్లు ● ఫేజ్–1లో 46.23 కిమీకు టెండర్లు పిలిచిన ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ● డీపీఆర్కు కేంద్రం ఆమోదం తెలపకుండానే టెండర్లు పిలవడంపై విమర్శలు ● కేంద్రం నిధులు ఇస్తుందా లేదా అనేదానిపైనా నీలినీడలు ● గొప్పల కోసమే కూటమి ప్రభుత్వం టెండర్ల హడావుడి ● వీఎంఆర్డీఏ నిధులు మెట్రోకి మళ్లించే ప్రయత్నం ● ఇప్పటికే ఆదాయం లేక కునారిల్లుతున్న వీఎంఆర్డీఏ సాక్షి, విశాఖపట్నం: డీపీఆర్కు ఆమోదం చెప్పలేదు.. కేంద్రం నుంచి ఒక్క రూపాయి విదిల్చలేదు.. భూ సేకరణకు కూడా అడుగు పడలేదు.. కనీసం మా వంతు సహకారం అందిస్తామన్న హామీ కూడా రాలేదు. కానీ.. కూటమి ప్రభుత్వం ప్రచారం కోసం హడావిడి ప్రారంభించేసింది. రూపాయి లేదు.. డీపీఆర్ లేదు.. కొడుకు పేరు వైజాగ్ మెట్రో అన్నట్లుగా.. ప్రజల్ని మభ్య పెట్టేందుకు వైజాగ్ మెట్రో నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది. ఫేజ్–1లో 46.23 కిమీ నిర్మించేందుకు టెండర్లు పిలిచిన ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్(ఏఎంఆర్సీ) దాదాపు రూ.6500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఒక ఫ్లైఓవర్ నిర్మాణానికే రెండేళ్లకు పైగా సమయం పడుతుంది. కానీ.. 42 ఎలివేటెడ్ మెట్రో స్టేషన్లతో కూడిన 46.23 కిమీ మెట్రో ప్రాజెక్టు అగ్రిమెంట్ అయిన 30 నెలల్లో పూర్తి చేసెయ్యాలంటూ నిబంధనలు విధించింది. ఈ ప్రాజెక్టు కోసం వీఎంఆర్డీఏని ఆర్థికంగా బలి చేసేందుకు చంద్రబాబు సర్కారు నిర్ణయించింది. విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. మొదటి దశలో 46.23 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ.6250 కోట్లు(జీఎస్టీ అదనం)తో టెండర్లుకు శుక్రవారం ఆహ్వానించింది. ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.11,498 కోట్లు కాగా..మూడు కారిడార్లలో ఫేజ్ –1 పనుల కోసం ఈపీసీ ప్రాతిపదికన ఏఎంఆర్సీ టెండర్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ పనుల్ని మూడేళ్ల కాలపరిమితితో పూర్తి చేయాలని టెండర్ షెడ్యూలులో పేర్కొన్నారు. టెండర్ సమర్పించిన 180 రోజుల వరకూ బిడ్ వ్యాలిడిటీ ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టును మొత్తం 140.13 కి.మీ లో చేపట్టనున్నారు. తొలి దశలో 46.23 కిలోమీటర్ల మేర చేపట్టనుండగా.. ఇందులో మొత్తం 42 ఎలివేటెడ్ మెట్రో స్టేషన్లు రానున్నాయి. ఇందులో 20.16 కి.మీ డబుల్ డెక్కర్ తరహాలో ఫ్లైఓవర్లు నిర్మిస్తారు. మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం, గాజువాక నుంచి స్టీల్ప్లాంట్ వరకూ పై వంతెనలు నిర్మిస్తారు. కొమ్మాది– స్టీల్ప్లాంట్, గురుద్వారా–పాతపోస్టాఫీసు, తాటిచెట్లపాలెం–చినవాల్తేరు కారిడార్లలో తొలి దశ కింద మెట్రోకు ప్రణాళిక చేశారు. కొమ్మాది–స్టీల్ప్లాంట్ మధ్య ఏర్పాటు చేసే 34.40 కిలోమీటర్ల కారిడార్లో డబుల్ డెక్కర్ ట్రాక్ నిర్మించనున్నారు. అలాగే మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం వరకు 15.06 కిమీ మేర రెండో కారిడార్ను నిర్మిస్తారు. గాజువాక నుంచి స్టీల్ప్లాంటు మధ్య మరొక కారిడార్ ఏర్పాటు చేయనున్నారు. 30 నెలల్లో పూర్తి చెయ్యాలంట.. ఈ నెల 28న ఏపీ ఈప్రొక్యూర్మెంట్లో టెండర్లు పెట్టనున్నారు. సెప్టెంబర్ 12న టెండర్లు ఓపెన్ చెయ్యనున్నారు. అనంతరం వడపోత తర్వాత.. టెండర్ దక్కించుకున్న సంస్థతో అగ్రిమెంట్ కుదుర్చుకుంటారు. ఆ తర్వాత 30 నెలల్లో మొత్తం ప్రాజెక్టు పూర్తి చెయ్యాలని షరతు విధించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక కిలోమీటర్ ఫ్లైఓవర్ పూర్తి చేసేందుకు రెండేళ్లకు పైగా సమయం పడుతుంది. కానీ.. కూటమి ప్రభుత్వం మాత్రం 46 కిమీ మెట్రో ప్రాజెక్టు రెండున్నరేళ్లలోనే పూర్తి చేసెయ్యాలని చెప్పడం చూస్తే.. ఇదంతా ప్రజల్ని మభ్యపెట్టి.. ప్రచారం కోసమేనన్నట్లుగా అర్థమవుతోంది. అదేవిధంగా.. డబుల్ డెక్కర్ నాలుగు లైన్ల ఫ్లై ఓవర్ని కూడా 24 నెలల్లో పూర్తి చేసేస్తారని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఒక్క అడుగు కూడా పడకుండానే..! ఒక ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ని కేంద్రం ఆమోదించాలి.. నిధులు చూపించిన తర్వాతే.. టెండర్లకు వెళ్తుంటారు. కానీ.. వైజాగ్ మెట్రో విషయంలో మాత్రం తిమ్మిని బమ్మి చేసేస్తున్నారు. రాష్ట్ర కేబినెట్ డీపీఆర్ని ఆమోదించి.. కేంద్రానికి పంపించింది. నెల రోజుల క్రితం కూటమి ఎంపీలు కేంద్ర మంత్రిని కలిసి.. డీపీఆర్ అమోదించాలని కోరారు. కానీ.. ఇంతవరకూ డీపీఆర్ని ఆమోదించలేదు. అంతే కాదు.. విభజన చట్టంలో భాగంగా.. మెట్రోకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి. కానీ.. ఇంతవరకూ మెట్రో కోసం నిధులు మంజూరు చేస్తామని కేంద్రం ప్రకటించలేదు. రెండు ఫేజ్లలో మెట్రో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు 99.75 ఎకరాల భూసేకరణ చేపట్టాలి. ఇది కూడా సర్వే జరిగింది. ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోంది. భూసేకరణ ప్రక్రియ మాత్రం జరగలేదు. ఇన్ని అడ్డంకులు ఉన్నా.. టెండర్లు పిలిచి.. రెండున్నరేళ్లలో పూర్తి చేసేస్తామంటూ కూటమి ప్రభుత్వం నిస్సిగ్గుగా ప్రకటించడం హాస్యాస్పదం. వీఎంఆర్డీఏపై ‘ఆర్థిక’ భారం.! సంపద సృష్టించే పార్టీ తెలుగుదేశం పార్టీ అంటూ బాకాలు ఊదిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో అప్పుల మూటని రాష్ట్రం నెత్తిన పెట్టేశారు. ఇప్పుడు.. తన ప్రచారయావ కోసం మరోసారి వీఎంఆర్డీఏని బలి చేసేందుకు కుట్రపన్నుతున్నారు. ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న సమయంలో వీఎంఆర్డీఏ(అప్పటి వుడా) ఆస్తుల్ని విక్రయించి.. హైదరాబాద్ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టి.. విశాఖకు రిక్త హస్తాలు చూపించారు. ఇప్పుడు.. మరోసారి వీఎంఆర్డీఏపై ‘ఆర్థిక’ భారం మోపేందుకు కూటమి సర్కారు సిద్ధమైంది. అంతంత మాత్రం ఆదాయంతో కొట్టుమిట్టాడుతున్న వీఎంఆర్డీఏ నుంచి రూ.4,101 కోట్లు తీసుకోవాలని నిర్ణయించింది. వాస్తవానికి వీఎంఆర్డీఏ వార్షిక బడ్జెట్ కేవలం రూ.1000 కోట్లు మాత్రమే. ఆదాయం లేక.. తమ ప్రాజెక్టులు పూర్తి చేయడానికే నానా యాతన పడుతున్న సమయంలో.. మొత్తం ఆస్తులు అమ్మేసి.. మెట్రోకి పెట్టాలని కూటమి సర్కారు హుకుం జారీ చేసేసింది. దీంతో.. భారీ మొత్తాన్ని ఎలా భరించాలో తెలీక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేకపోయినా.. టెండర్ల పేరుతో అరచేతిలో మెట్రో చూపించేందుకు కూటమి సర్కారు సిద్ధమవడం సిగ్గు చేటని పలువురు విమర్శిస్తున్నారు. -
మరణించి.. మరో నలుగురికి వెలుగునిచ్చి..
నేత్రదానంతో మానవత్వాన్ని చాటుకున్న రమేష్ కుటుంబం పెందుర్తి: పొట్ట చేత పట్టుకుని వలస వచ్చిన ఓ ఎలక్ట్రీషియన్ను మృత్యువు కబళించినా, అతడు మరణానంతరం నలుగురికి చూపునిచ్చి వెలుగునింపాడు. గుండెపోటుతో మరణించిన ఆ వ్యక్తి నేత్రాలను దానం చేసి, అతని కుటుంబం గొప్ప మానవత్వాన్ని చాటుకుంది. ఏలూరుకు చెందిన 34 ఏళ్ల మీరపురెడ్డి రమేష్ వృత్తి రీత్యా ఎలక్ట్రీషియన్. నెల రోజుల కిందట పెందుర్తి మండలం అక్కిరెడ్డిపాలెంలోని ఒక కంపెనీలో పనికి కుదిరాడు. గురువారం రాత్రి విధులు ముగించుకుని తన గదికి వచ్చిన రమేష్కు తీవ్రమైన గుండెపోటు రావడంతో పాటు ఫిట్స్ వచ్చి అక్కడికక్కడే మరణించాడు. ఈ క్రమంలో రమేష్ మృతదేహాన్ని తరలించేందుకు ఫ్రీజర్ బాక్స్ కోసం పెందుర్తిలోని సాయి హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధి దాడి శ్రీనివాస్ను కుటుంబ సభ్యులు సంప్రదించారు. శ్రీనివాస్ చొరవ తీసుకుని, రమేష్ కళ్లు దానం చేస్తే మరో నలుగురికి కంటి చూపు వస్తుందని కుటుంబ సభ్యులను ఒప్పించారు. రమేష్ తల్లి చంటమ్మ, సోదరుడు మహేష్ అంగీకరించడంతో.. వెంటనే అక్కడికి చేరుకున్న ఎల్.వి.ప్రసాద్ సారథ్యంలోని మోషన్ ఐ బ్యాంక్ ప్రతినిధులు నగేష్ నేత్రాలను సేకరించి, సురక్షితంగా ఆసుపత్రికి తరలించారు. పుట్టెడు దుఃఖంలోనూ రమేష్ కుటుంబ సభ్యులు చూపిన మానవత్వంపై స్థానికంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. -
ఏయూ పరువు తీస్తున్నారు
డాబాగార్డెన్స్: ఏయూ ప్రొఫెసర్ వేధింపుల కారణంగా విద్యా సంవత్సరం నష్టపోయి ఆత్మహత్యాయతాంనికి పాల్పడి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి అభిషేక్ను వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు, పలువురు పార్టీ ముఖ్యనేతలు శుక్రవారం పరామర్శించారు. అభిషేక్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అనంతరం అభిషేక్ తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు సేకరించారు. అభిషేక్కు జరిగిన అన్యాయా న్ని ఏయూ వీసీ దృష్టికి తీసుకెళ్తామని కేకే రాజు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, గత కొద్ది రోజులుగా విశ్వవిద్యాలయం హాస్టల్లో నాణ్యత లేని భోజనం, పురుగులు కలిసిన అన్నం వల్ల విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, దీనిపై విద్యార్థులు ప్రధాన గేటు వద్ద ధర్నా చేసి రాత్రంతా అక్కడే గడిపిన విషయాన్ని గుర్తు చేశారు. అభిషేక్ వంటి 95 శాతం మార్కులతో బాగా చదివే విద్యార్థికి పూర్తి అటెండెన్స్ ఉన్నప్పటికీ, అతను చేయని తప్పుకి ప్రొఫెసర్ వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేయడం విశ్వవిద్యాలయానికే చెడ్డ పేరు తెచ్చిందని రాజు ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోనే ఎంతో పేరెన్నికగన్న ఆంధ్రా విశ్వవిద్యాలయం ప్రతిష్ట గత ఏడాదిగా దిగజారిందని ఆయన విమర్శించారు. ఏయూలో గత ఏడాదిగా జరుగుతున్న ఘటనలను పచ్చ మీడియానే ప్రచురించిందంటే విద్యా శాఖ మంత్రి లోకేష్, సీఎం చంద్రబాబు పాలనా తీరు ఏ స్థాయిలో ఉందో తెలుస్తోందన్నారు. జగన్మోహన్రెడ్డి పాలనలో విద్యా వ్యవస్థ మెరుగ్గా ఉండేదని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తోందని కేకే రాజు ఆరోపించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, జీవీఎంసీ వైఎస్సార్ సీపీ ఫ్లోర్లీడర్ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు, కార్పొరేటర్లు చెన్నా జానకీరామ్, పీవీ సురేష్, బిపిన్కుమార్ జైన్, మహ్మద్ ఇమ్రాన్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీవత్సవ్, అనుబంధ విభాగాల అధ్యక్షులు అంబటి శైలేష్, పేడాడ రమణికుమారి, బోని అప్పలనాయుడు, సనపల రవీంద్రభరత్, బోని శివరామకృష్ణ, పులగం కొండారెడ్డి, సేనాపతి అప్పారావు, కర్రి రామారెడ్డి, రాయపురెడ్డి అనీల్కుమార్, వడ్డాది దిలీప్కుమార్, వంకాయల మారుతీప్రసాద్, జీలకర్ర నాగేంద్ర, నీలి రవి, దేవరకొండ మార్కండేయలు, పల్లా దుర్గారావు, మనలత జోబ్దాస్, ఇమంది సత్యనారాయణ, పులగం శ్రీనివాసరెడ్డి, శ్రీదేవి వర్మ, కంచుమూర్తి పద్మ శేఖర్, సంపంగి సురేష్, పులగం సూర్యనారాయణరెడ్డి, సూర్య, మహేష్, కొయ్య చిన్ని పాల్గొన్నారు. ఆస్పత్రిలో అభిషేక్ను పరామర్శించిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఏయూ విశిష్టతను కాపాడండి మద్దిలపాలెం: ఏయూలో ఇటీవల జరుగుతున్న వరుస సంఘటనలు విశ్వవిద్యాలయం ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని, ఇలాంటివి పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్ను వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు కోరారు. ఏయూ విద్యార్థి ఆత్మహత్యాయత్నం, భోజనంలో పురుగులు రావడంతో విద్యార్థులు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో, శుక్రవారం వైఎస్సార్సీపీ నాయకుల బృందం ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థిని కేజీహెచ్లో పరామర్శించింది. అనంతరం ఏయూ వీసీని కలిసి విశ్వవిద్యాలయంలో నెలకొన్న సమస్యలపై వినతి పత్రం అందజేశారు. వీసీ చాంబర్లోకి వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను, సీనియర్ నాయకులను అనుమతించకపోవడంపై కేకే రాజు వీసీ తీరును తప్పుపట్టారు. ప్రజా ప్రతినిధులను అనుమతించకపోవడం దారుణమైన చర్య అని పేర్కొన్నారు. దీనికి వీసీ, అలాంటిదేమీ లేదు, అందరూ రావచ్చని బదులిచ్చారు. -
● కీలక కేసుల్లో ప్రధాన నిందితుల అరెస్టులో జాప్యం ● క్రికెట్ బెట్టింగ్, శాంతి ఆశ్రమం, డ్రగ్స్ కేసులన్నింటిదీ అదే తీరు.. ● బెయిల్ వచ్చేంత వరకూ అరెస్టు చేయకుండా తాత్సారం ● ఆశ్రమం కేసులో అసలు దోషులపై సా...గుతున్న వేట ● తిమ్మాపురం వద్ద తెల్లవారుజామున దర్జా
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: నగరంలో ట్రాఫిక్ నియంత్రించేందుకు అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ఉపయోగిస్తున్నాం! డ్రోన్లను ఎగురవేసి నగరంలో అసాంఘిక కార్యకలాపాల కట్టడికి ప్రయత్నిస్తున్నాం!! ఇవీ ఉదయం లేచినప్పటి నుంచి విశాఖ నగర పోలీసులు పలుకుతున్న సాంకేతిక బీరాలు. అయితే, కీలక కేసుల్లో మాత్రం అసలు సూత్రధారులు దర్జాగా తప్పించుకు తిరుగుతున్నారు. ఏకంగా బెయిల్ వచ్చే వరకూ అరెస్టు చేయకుండా విశాఖ పోలీసులు తాత్సారం చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఇక తిమ్మాపురం వద్ద వివాదాస్పద భూమిలో అర్ధరాత్రి ముసుగులు వేసుకుని నంబరు ప్లేట్లు లేని వాహనాల్లో హల్చల్ చేసి ఉన్న రూంను నేలమట్టం చేసిన వ్యవహారంలో అసలు దోషులెవరో ఇప్పటికీ విశాఖ పోలీసులు ముసుగుతీయకపోవడం గమనార్హం. ఇక శాంతి ఆశ్రమం వద్ద జరిగిన దాడి వ్యవహారంలో అసలు దోషుల దరిదాపుల్లోకి కూడా విశాఖ పోలీసులు వెళ్లేందుకు కూటమి నేతల సంకెళ్లు అడ్డుపడుతున్నాయనే విమర్శలున్నాయి. ఇక 25 గ్రాముల కొకై న్ కేసులోనూ కీలక సూత్రధారులైన వారి నిగ్గు తేల్చకపోవడం విశాఖ పోలీసు శాఖ తీరును ప్రశ్నిస్తున్నాయి. కీలక కేసులన్నింటిలోనూ అదే తీరు! వాస్తవానికి విశాఖ నగరంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రోజురోజుకూ భూదందాలు, బెట్టింగ్లు, గంజాయి అమ్మకాలు, రౌడీషీటర్ల హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. మహిళలపై అఘాయిత్యాలకు అంతులేకుండా పోతోంది. అయినప్పటికీ సంఘటన జరిగిన సమయంలో హడావుడి తప్ప, అసలు వ్యవహారం వచ్చేసరికి పోలీసులు కీలక నిందితుల జోలికి వెళ్లడం లేదనే విమర్శలు బలంగా ఉన్నాయి. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం మొదలుకొని, రామానాయుడు స్టూడియో వద్ద ముసుగు వీరుల విధ్వంసం, శాంతి ఆశ్రమంలో రౌడీషీటర్ల హల్చల్ వంటి అనేక కీలక కేసులలో పోలీసులు కీలక సమయాల్లో వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాన నిందితులు బెయిల్ వచ్చే వరకు దొరకకుండా తప్పించుకోవడం అసలైన కిటుకు. ఈ వ్యవహారాలలో కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల అండదండలతో పోలీసులు కూడా అసలైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పట్టుకోవడం లేదని తెలుస్తోంది. శాంతి ఆశ్రమంలో ఇంకా అశాంతే...! శాంతి ఆశ్రమాన్ని ఆక్రమించి, సొంతంగా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకుని టీడీపీ ఎమ్మెల్యే అండదండలతో కొన్నేళ్లుగా సిద్ధార్థ, గౌతం అనే వ్యక్తులు అధికారం చెలాయిస్తున్నారు. దీనిపై కోర్టులో కేసులు నడిచి, చివరకు ఆశ్రమానికి స్థలాన్ని అప్పగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు రావడంతో రౌడీలు రంగంలోకి దిగారు. ఈ వ్యవహారంలో కేవలం అక్కడికి వెళ్లి గొడవకు దిగిన రౌడీషీటర్లను మాత్రమే పోలీసులు అరెస్టు చేశారు. అయితే, అసలు మొత్తం వ్యవహారాన్ని నడిపిన, శాంతి ఆశ్రమం స్థలాన్ని కబ్జా చేసి తమ ఆధీనంలో ఉంచుకున్న అసలు నిందితులకు టీడీపీ ఎమ్మెల్యే బలంగా మద్దతు ఇస్తుండటంతో వారిని అరెస్టు చేయలేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. బెయిల్ వచ్చే వరకు జోలికి వెళ్లలేదనే విమర్శలున్నాయి. దీనితో పాటు శాంతి ఆశ్రమం స్థలంలో నడుస్తున్న పెట్రోల్ బంకు నుంచి పోలీసు జీపులకు ఉచితంగా ప్రతీ నెలా పెట్రోల్ నింపుతుండటం మరో కారణమనే విమర్శలూ ఉన్నాయి. బెట్టింగ్లోనూ బెయిల్ వచ్చే దాకా...! క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో జనవరి 6వ తేదీన ఇసుకతోట, శివాజీ పాలెం, పెద్దవాల్తేరులోని గాయత్రీ టవర్స్లో టాస్క్ఫోర్స్ పోలీసులు లగుడు రవిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, సదరు లగుడు రవితో పాటు మరో ఇద్దరు కూటమి ఎమ్మెల్యే అనుచరులు కూడా బెట్టింగ్లో ఉన్నట్టు తేలింది. వీరితో పాటు ఈ వ్యవహారాన్ని నడిపిస్తూ, నెలవారీ మామూళ్లను కూటమి ఎమ్మెల్యేకు చేరవేయడంలో కీలకంగా ఉన్న ఒక స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ పాత్ర కూడా ఉంది. అయితే, సదరు కానిస్టేబుల్ జోలికి వెళ్లకుండా ఏకంగా ఇద్దరు కూటమి ఎమ్మెల్యేలు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. నెలవారీగా భారీగా మామూళ్లు దండుకుంటున్న ఓ కూటమి ఎమ్మెల్యే అనుచరులే లక్షల్లో బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. వీరి ముఠా విశాఖ నుంచి కాకినాడ మీదుగా హైదరాబాద్ వరకు పాకినట్టు తెలుస్తోంది. ఈ ముఠా జోలికి వెళ్లకుండా ఉండాలని ఏకంగా పోలీసులకే ఫోన్లు చేసినట్టు ఆరోపణలున్నాయి. అంతేకాకుండా, ఈ బెట్టింగ్లో ఉన్న కూటమి ఎమ్మెల్యే అనుచరుడు బొబ్బిలి రవికి బెయిల్ వచ్చే వరకు విశాఖ పోలీసులు అరెస్టు చేయలేదంటే, పోలీసులపై ఏ స్థాయిలో ఒత్తిళ్లు పనిచేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. డ్రగ్స్ కేసులో దొరకని దొంగలు ఢిల్లీ నుంచి విమానంలో దక్షిణాఫ్రికాకు చెందిన థామస్ అనే వ్యక్తి డ్రగ్స్ తీసుకొస్తున్నాడని నగర పోలీసులకు సెంట్రల్ ఏజెన్సీల నుంచి సమాచారం అందింది. సదరు వ్యక్తి కస్టమ్స్కు చిక్కకుండా 25 గ్రాముల కొకై న్ను పుస్తకాల మధ్యలో పెట్టి తీసుకొచ్చాడు. ఎయిర్పోర్టు నుంచి సదరు విదేశీయుడిని అనుసరించి, ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ దగ్గరికి వచ్చిన తర్వాత రంగంలోకి దిగారు. అక్కడ అక్షయ్కుమార్ అలియాస్ మున్నా విదేశీయుడిని కలిసేందుకు వచ్చి డ్రగ్స్ ఇస్తుండగా, పోలీసులు వారిని వలపన్ని పట్టుకున్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన వ్యక్తి ఫోన్తో పాటు మున్నా ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. మున్నాను విచారించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఒకరు వైద్యుడు కాగా, మరొకరు కూటమి నాయకుడి కుమారుడు, మరొకరు ఉత్తరాంధ్ర కూటమి నేతల ఆర్థిక లావాదేవీలు చూసే బడా నేత కుమారుడని తెలుస్తోంది. ఈ ముగ్గురిని పట్టుకోగానే కూటమికి చెందిన ఎమ్మెల్యే, ఎంపీలు నేరుగా పోలీసులకు ఫోన్ చేసి ముగ్గురిని విడిచిపెట్టాలని ఒత్తిళ్లు చేశారనే ఆరోపణలున్నాయి. పోలీసులపై తీవ్ర ఒత్తిడి రావడంతో కేవలం ఇద్దరిని మాత్రమే అరెస్ట్ చేశామంటూ తొలిరోజు ప్రెస్ మీట్లో సీపీ వెల్లడించారు. మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకొని ఇద్దరిని మాత్రమే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని మీడియా ప్రశ్నించగా, మిగిలిన ముగ్గురు అనుమానితులు మాత్రమేనని, నిందితులు కాదని సమాధానమిచ్చారు. అదేవిధంగా ఢిల్లీకి వెళ్లిన విచారణ బృందం కూడా కింగ్ పిన్ ప్రిన్స్ను పట్టుకోలేకపోయారనే విమర్శలున్నాయి. ఇక విశాఖలోని రెండు పబ్లలో వ్యవహారం నడుస్తుందని తెలిసినప్పటికీ, వాటిపై కూడా లోతైన విచారణ జరగకుండా ఎవరో అడ్డుపడుతున్నారనే ఆరోపణలున్నాయి. భూకబ్జాలో తొలగని ముసుగులు విశాఖ నగరంలో బీచ్కు ఆనుకుని రామానాయుడు స్టూడియోకు సమీపంలోని ప్రైవేటు స్థలంలో 20 మంది దుండగులు ముఖానికి ముసుగులు ధరించి, అక్కడున్న సీసీ కెమెరాలను ధ్వంసం చేసి, కరెంటు వైర్లు కత్తిరించారు. నంబర్ ప్లేట్లపై తెల్లకాగితం అంటించిన వాహనాలలో 20 మంది వచ్చి చిన్నపాటి దమనకాండ సృష్టించారు. రాత్రికి రాత్రే గెస్ట్ హౌస్, కాంపౌండ్ వాల్ను కూల్చివేసి, డెబ్రిస్ను కూడా లారీలల్లో మే 8వ తేదీన తరలించారు. ఈ వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే హస్తం ఉందనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు ముసుగు ధరించిన అసలు దొంగలను మాత్రం పోలీసులు గుర్తించలేకపోయారు. అసలు విచారణ జరగకుండా సదరు టీడీపీ ఎమ్మెల్యేనే అడ్డుకున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. ఇంత యథేచ్ఛగా భూకబ్జాలకు పాల్పడుతున్నప్పటికీ పోలీసులు మాత్రం మిన్నకుండిపోవడంలో అసలు ఆంతర్యం కూటమి నేతల ఒత్తిడేనని స్పష్టమవుతోంది. -
ఉద్యోగే దొంగ
● భారీ చోరీ కేసును ఛేదించిన ద్వారకా పోలీసులు ● రూ.1,29,48,154 విలువైన చోరీ సొత్తు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన సీపీ శంఖబ్రత బాగ్చి తాటిచెట్లపాలెం: ఒక డైమండ్స్ షోరూంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పని చేస్తున్న ఉద్యోగి.. యజమాని నమ్మకాన్ని దుర్వినియోగం చేసి ఆభరణాలను దొంగిలించాడు. ద్వారకా పోలీసులు ఈ భారీ చోరీ కేసును ఛేదించి.. ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి రూ.1,29,48,154 విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి శుక్రవారం తన కార్యాలయంలో మీడియాకు వెల్లడించిన వివరాలివి. హైదరాబాద్కు చెందిన బొంగు వంశీ.. అక్కడి క్రిష్ డైమండ్స్ షోరూంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. ఇదే షోరూంలో ఆరు నెలల కిందట హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ముదపాక జేజి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా చేరాడు. షోరూంలో తయారైన వివిధ రకాల డైమండ్ మోడళ్లను విశాఖ తీసుకొచ్చి.. ఇక్కడి దుకాణ యజమానులకు వాటిని చూపించి ఆర్డర్లు తీసుకువెళ్తుంటారు. ఈ క్రమంలో ఈ నెల 2న క్రిష్ డైమండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ అనూప్ అగర్వాల్ 883.814 గ్రాముల 18 క్యారెట్స్ బంగారం, డైమండ్ ఆభరణాలు, 22.881 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం, డైమండ్స్ ఆభరణాలు(మొత్తం 906.695 గ్రాములు.. వీటి విలువ రూ.1,29,48,154.62) ఇచ్చి.. బొంగు వంశీని, ముదపాక జేజిని విశాఖ పంపించారు. వీరు ఈ నెల 2న హైదరాబాద్లో బయలుదేరి 3న విశాఖ చేరుకున్నారు. ఎప్పటిలాగే లలితా జ్యువెలరీ ఎదురుగా ఉన్న సాయి శ్రీనివాస రెసిడెన్సీలో దిగారు. అక్కడి నుంచి నగరంలోని పలు షోరూంలలో మోడల్స్ చూపించి 3వ తేదీ రాత్రి 8.50 గంటలకు హోటల్కు చేరుకున్నారు. ఆభరణాలతో ఉన్న బ్యాగ్ను కబోర్డులో పెట్టి నిద్రించారు. 4వ తేదీ తెల్లవారుజాము 4.30 సమయంలో వంశీని లేపి వాకింగ్కు వెళ్తున్నట్లు జేజి చెప్పగా.. బయట నుంచి గదికి తాళం వేసి వెళ్లి రమ్మని వంశీ అన్నాడు. తర్వాత నిద్రలేచి చూసేసరికి జేజి కనిపించలేదు. ఫోన్ స్విచాఫ్ వచ్చింది. కబోర్డు పరిశీలించగా అందులో ఉన్న ఆభరణాల బ్యాగు, జేజి వెంట తెచ్చుకున్న లగేజీ బ్యాగు కూడా కనిపించలేదు. ఈ విషయాన్ని వెంటనే హైదరాబాద్లోని షోరూం హెచ్ఆర్ సూరజ్కుమార్కు తెలిపాడు. హోటల్ సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా ఉదయం 4.30కు వాకింగ్కు వెళ్లిన జేజి మళ్లీ 5.47కు తిరిగి వచ్చి.. రెండు బ్యాగులను తీసుకెళ్లినట్లు తేలింది. ఈ ఘటనపై ద్వారకా పోలీస్స్టేషన్లో వంశీ ఫిర్యాదు చేశాడు. మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా.. అప్పటి నుంచి కేసు దర్యాప్తు చేస్తున్న ద్వారకా పోలీసులు.. మొబైల్ సిగ్నల్స్ ద్వారా శుక్రవారం రైల్వేస్టేషన్ పరిసరాల్లో జేజి ఉన్నట్లు గుర్తించారు. అక్కడ అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను అనుసరించారు. పోలీసులను చూసిన వారు పారిపోయేందుకు ప్రయత్నించగా.. వెంబండించి అదుపులోకి తీసుకున్నారు. మధ్యవర్తుల సమక్షంలో వారి బ్యాగును పరిశీలించి, విచారించగా.. వారు ముదపాక జేజి, ఆకుల సత్యనారాయణగా తేలింది. బ్యాగ్లో జేజి దొంగలించిన ఆభరణాలు ఉన్నట్లు గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు. ఆకుల సత్యానారయణ జేజికి పార్టనర్. జేజి దొంగలించిన ఆభరణాలను ఆయన వద్దే ఉంచాడు. దీనిపై ఇంకా విచారణ జరుగుతున్నట్లు సీపీ తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించిన ద్వారకా సీఐ(ఇన్చార్జి) సీహెచ్ ఉమాకాంత్, సీఐ డీవీ రమణ, సబ్ ఇన్స్పెక్టర్లు జె.ధర్మేంద్ర, అసిరి తాత, హెడ్ కానిస్టేబుళ్లు వెంకటరమణ, కె.టి.వి.రమే్ష్, కానిస్టేబుళ్లు ఎం.నాగరాజు, ఎస్.రమేష్లను కమిషనర్ అభినందించారు. -
దేవుడి పేరిట దోపిడీ
● అయోధ్య మందిరం సెట్ పేరుతో మోసం ● సిబ్బందికి బిల్లులు ఎగ్గొట్టడంతో వాయిస్ రికార్డులతో వెలుగులోకి వాస్తవాలు ఏయూక్యాంపస్: హిందువుల ఆధ్యాత్మికతను, ట్రెండింగ్లో ఉన్న అయోధ్య రాముడిని ఆధారంగా చేసుకొని బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన గరుడ అయోధ్య రామాలయం నమూనా నిర్వాహకులు భారీ మోసానికి పాల్పడినట్లు వెల్లడైంది. దేవుడి పేరుతో వ్యాపారం చేస్తూ, ఆలయాలను, దేవుడిని వ్యాపార వస్తువులుగా మార్చుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. రెండు నెలలపాటు ఈ వ్యాపారం ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించిన వీరు, ఆశతో రామకల్యాణం పేరుతో ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేయాలని ప్రణాళిక రచించారు. సింహాచలం గిరి ప్రదక్షిణను సైతం తమ ప్రచారానికి వాడుకున్నారు. సోషల్ మీడియాలో లీకై న వాయిస్ రికార్డులు లక్షలాది మంది ప్రజలు పొరుగు జిల్లాల నుంచి గిరి ప్రదక్షిణకు వస్తారని గుర్తించిన నిర్వాహకులు.. దాదాపు 250 ఫ్లెక్సీలు, 5 వేల పోస్టర్లతో రామకల్యాణంపై విస్తృత ప్రచారం చేశారు. అయితే తమ ప్రచారానికి ఉపయోగపడిన సోషల్ మీడియానే తమ తప్పులను సైతం బయటపెడుతుందని నిర్వాహకులు ఊహించలేదు. ఆలయం వద్ద సిబ్బందికి, నిర్వాహకుడికి మధ్య జరిగిన సంభాషణలు తాజాగా బయటకు రావడంతో వారి పన్నాగం బట్టబయలైంది. తన వద్ద పనిచేస్తున్న సిబ్బందికి, సేవలు అందించిన వారికి బిల్లులు ఇవ్వకుండా నిర్వాహకులు ఎగ్గొట్టారు. దీంతో నిర్వాహకుడికి, వ్యాపారస్తుడికి మధ్య జరిగిన సంభాషణ వెలుగులోకి వచ్చింది. ఈ సంభాషణలో స్వయంగా పోస్టర్లు తామే ముద్రించి ప్రచారం చేశామని నిర్వాహకుడు అంగీకరించాడు. నగరవ్యాప్తంగా 250 ఫ్లెక్సీలు, 5 వేల పోస్టర్లు అతికించామని నిర్వాహకుడు చెప్పడం విశేషం. నగరంలోని రామాలయాల వద్ద కూడా ప్రచారం చేయాలని, రామభక్తులను తమ గుడికి ఆహ్వానించాలని వీరు మాట్లాడుకున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ. 2,999 కల్యాణం రుసుము రూపంలో వసూలు చేసి, వేలాది మందితో దీనిని నిర్వహించి లక్షలాది రూపాయలు ఒక్క రోజులో సంపాదించాలని పక్కాగా ప్లాన్ చేశారు. నిస్సిగ్గుగా అబద్ధాలు, వెలుగులోకి వాస్తవాలు భద్రాచలం దేవస్థానం ఈవో విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిర్వాహకులు తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. వెంటనే ఒక హోటల్లో విలేకరుల సమావేశం పెట్టి పోస్టర్లు తాము ముద్రించలేదని, ఎవరో గిట్టని వారు చేసిన పని అని చెప్పారు. దీనిపై తాము పోలీసులను ఆశ్రయిస్తామన్నారు. సాధు పరిషత్ సభ్యులు సైతం ఆలయాన్ని సందర్శించినప్పుడు నిర్వాహకులు, వారి అనునాయులు పోస్టర్లు తాము ముద్రించలేదని చెప్పారు. అయితే తాజాగా బయటపడిన వాయిస్ రికార్డులను బట్టి నిర్వాహకుడే ఉద్దేశపూర్వకంగా భక్తి పేరుతో వ్యాపారం చేసినట్లు స్పష్టమవుతోంది. జూలై 9న జరిగిన గిరి ప్రదక్షిణలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, పోస్టర్లు తమవి కావని చెబుతున్న నిర్వాహకులు వెంటనే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అలాగే పోస్టర్లలో ముద్రించిన ఫోన్ నంబర్లు ఎవరివి, ఆ నంబర్లు ఎవరి పేరుమీదుగా రిజిస్టర్ అయ్యాయనే దిశగా విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు బయటపడే అవకాశం ఉంది. అధికారుల ఉదాసీనతపై విమర్శలు గరుడ అయోధ్య రామమందిరం నమూనా ఏర్పాటు జరిగిన నాటి నుంచి వివిధ విభాగాల అధికారుల ఉదాసీనత బయటపడుతోంది. జీవీఎంసీ, ఫైర్ సేఫ్టీ, దేవదాయ శాఖ, పోలీసులు, జీఎస్టీ అధికారులు ఈ విషయంపై దృష్టి సారించారా లేదా అనే విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది. నిర్వాహకులు తాత్కాలిక జీఎస్టీ నంబరు తీసుకున్నారా, టికెట్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఎంతవరకు చూపించారు, నగదు రూపంలో అమ్మిన టికెట్లను లెక్కల్లో చూపించారా, జీఎస్టీ ఎంతవరకు చెల్లించారు అనే విషయాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి
విశాఖ లీగల్: విశాఖలో హైకోర్టు బెంచ్ను తక్షణమే ఏర్పాటు చేయాలని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేష్కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాల వెలుపల అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. విశాఖలో జరిగిన ధర్నాలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు కె.ఎస్.ఎస్. సురేష్కుమార్ మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయవాదుల రక్షణ చట్టంలో మార్పులు, నూతన న్యాయస్థానాల నిర్మాణం, ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. మహిళా న్యాయవాదులకు విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలని, న్యాయవాదుల మరణానంతరం ప్రయోజనాలను రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. అలాగే జూనియర్ న్యాయవాదులకు రూ.10వేల గౌరవ భృతిని కల్పించాలని, విశాఖపట్నంలో రైల్వే ట్రిబ్యునల్ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం న్యాయవాదుల బృందం డీఆర్వో భవానీశంకర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు ఎం.ఎన్. భగవతి, అజయ్ కుమార్, ఇందిర, శైలజ, పి.మాధురి, వేణు సుబ్రహ్మణ్యం, జి.సుశీల, వి.ఆర్.ఝాన్సీ, అధిక సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో అరాచకపాలన
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ విశాఖ జిల్లా అధ్యక్షుడు బాజి నాయుడు మండిపడ్డారు. కూటమి ఏడాది పాలనలో ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడుస్తూ ‘రెడ్ బుక్’ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందన్నారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రశ్నించే గొంతులను నొక్కేందుకు వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధులు, మాజీ మంత్రులపై అరెస్టులు, దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. లిక్కర్ స్కామ్ పూర్తిగా కల్పితమని, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును ఖండిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక విశాఖలో మాదకద్రవ్యాల వినియోగం, హత్యలు, మహిళలపై అఘాయిత్యాలు, దోపిడీలు పెరిగి శాంతిభద్రతలు లోపించాయని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతిభద్రతలపై దృష్టి సారించేలా పోలీసులకు ప్రత్యేక అధికారాలు ఇవ్వాలని గవర్నర్ను కోరారు. లీగల్ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి పాకా సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్నికల హామీలు అమలు కాలేదని, వైఎస్సార్ సీపీ నేతలపై కక్షపూరిత దాడులు, కేసులను ఖండించారు. లీగల్ సెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు కరణం కృష్ణ మాట్లాడుతూ కూటమి పాలనలో మద్యం విక్రయాలు విచ్చలవిడిగా పెరిగాయని, పచ్చ పత్రికల్లో రాసిన కథనాల ఆధారంగా సిట్ దర్యాప్తు సాగుతోందని ఆరోపించారు. లా నేస్తం కింద జూనియర్ లాయర్లకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నెలకు రూ.5,000 స్టైఫండ్ ఇచ్చిందని, కూటమి ప్రభుత్వం రూ 10,000 ఇస్తామని చెప్పి ఏడాదైనా ఇవ్వలేదన్నారు. లీగల్ సెల్ రాష్ట్ర సెక్రటరీ వుడా శ్రీనివాసరావు మాట్లాడుతూ లిక్కర్ స్కాం 2014–19 మధ్య జరిగిందని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ ఆధీనంలో మద్యం విక్రయించి ఆదాయాన్ని పెంచుతూ, వినియోగాన్ని నియంత్రించారని తెలిపారు. సమావేశంలో లీగల్ సెల్ నాయకులు వాగుపల్లి చిన్నారావు, దాసరి గణేష్, సీఐ సత్యనారాయణ, మొల్లి రామారావు, ఆర్ఎస్ రవి, మొల్లి సింహాద్రి, సూరిశెట్టి అనిల్, సియాద్రి రవి, సూరిశెట్టి శ్రీనివాసరావు, ఆకెళ్ల వెంకటరమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ నాయకుల ధ్వజం -
శ్రావణం.. శుభకరం
జిల్లాలో వెల్లివిరిసిన శ్రావణ శోభ శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా విశాఖ.. ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసింది. నగరంలోని ప్రముఖ ఆలయాలన్నీ తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడాయి. కనకమహాలక్ష్మి ఆలయంలో.. డాబాగార్డెన్స్: కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రావణలక్ష్మి పూజలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పూజలను ప్రారంభించారు. ముందుగా గణపతి పూజ నిర్వహించి, అనంతరం అమ్మవారికి విశేష పూజలు జరిపారు. వేదమంత్రాల మధ్య, నాదస్వర సుస్వరాలతో ఉదయం 8.20 గంటలకు శ్రావణలక్ష్మి పూజలు ప్రారంభమయ్యాయి. ఈ పూజలో ఉభయదాతలు రెండు బ్యాచ్లుగా పాల్గొన్నారు. దేవస్థానం ఈవో కె. శోభారాణి మాట్లాడుతూ శ్రావణ మాసం సందర్భంగా నెలరోజులు జరిగే పూజలకు అవసరమైన పూజా సామగ్రిని దేవస్థానమే సమకూరుస్తుందన్నారు. ప్రత్యేక పూజలో పాల్గొనదలచిన భక్తులు రూ.400 చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ముత్యాల చీరలో కన్యకాపరమేశ్వరి డాబాగార్డెన్స్: కురుపాం మార్కెట్ సమీపంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో శుక్రవారం శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారు ముత్యాల చీర అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామున 5 గంటలకు అమ్మవారి మూలవిరాట్కు శుద్ధజలం, పాలు, పెరుగు, తేనె, గంధం, పసుపు, కుంకుమ, వివిధ రకాల పండ్ల రసాలు, అలాగే 108 ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారికి ముత్యాల చీరతో అలంకరించి, 108 బంగారు పుష్పాలతో ప్రత్యేక నివేదన సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు సామూహిక లలితా సహస్రనామ పారాయణం నిర్వహించారు. ఆస్థాన పురోహితులు ఆర్బీబీ కుమారశర్మ నేతృత్వంలో 250 మంది మహిళలతో సామూహిక కుంకుమ పూజలు జరిగాయి. కార్యక్రమంలో ఆలయ సంఘ అధ్యక్షుడు ఆరిశెట్టి దినకర్, కార్యదర్శి పెనుగొండ కామరాజు, శ్రావణమాస ఉత్సవ కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు. సింహవల్లీ తాయారుకు లక్ష కుంకుమార్చన సింహాచలం: శ్రావణ శుక్రవారం సందర్భంగా సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలోని సింహవల్లీ తాయారు అమ్మవారికి లక్ష కుంకుమార్చన పూజను వైభవంగా నిర్వహించారు. సింహవల్లీ తాయారు, చతుర్బుజ తాయారు అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై అధిష్టింపజేసి, ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు లక్ష నామాలతో అమ్మవార్లకు కుంకుమ పూజ చేశారు. ఈ పూజలో పాల్గొన్న భక్తులకు శేషవస్త్రాలు, కుంకుమ ప్రసాదంగా అందజేశారు. అలాగే, సాయంత్రం అమ్మవారికి ఆలయ బేడా మండపంలో తిరువీధి సేవను వైభవంగా నిర్వహించారు. అనంతరం సహస్రనామార్చన పూజ చేపట్టారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు కరి సీతారామాచార్యులు, ఇతర అర్చకులు, పారాయణదారులు ఈ పూజలను నిర్వహించారు. ఆలయ ఏఈవో తిరుమలేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
కదంతొక్కిన పెన్షనర్లు
బీచ్రోడ్డు: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లు 2025లో భాగంగా సీసీఎస్ పెన్షన్ రూల్స్కు చేసిన చట్ట సవరణలకు వ్యతిరేకంగా పెన్షనర్లు ఆందోళన చేపట్టారు. శుక్రవారం ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద మానవహారం నిర్వహించి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చైర్మన్ రెడ్డి వెంకటరావు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ బీజేపీ ప్రభుత్వం పెన్షనర్లకు పెన్షన్ పెంచకుండా ఎగ్గొట్టాలని చూస్తోందని ఆరోపించారు. ఇందులో భాగంగానే పెన్షన్ చట్టానికి సవరణలు చేసిందని, ఇది పెన్షనర్లను కొత్త, పాత అని విభజిస్తోందని, ప్రస్తుత పెన్షనర్లకు నష్టం కలిగిస్తుందని అన్నారు. ఏఐబీడీపీఎస్ జిల్లా కార్యదర్శి, ఫోరం చైర్మన్ కె.రామాంజనేయులు మాట్లాడుతూ ఈ చట్టం చెల్లుబాటుకు వ్యతిరేకంగా ‘ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్స్’ సుప్రీంకోర్టులో కేసు వేస్తోందని తెలిపారు. న్యాయపరమైన చర్యలతో పాటు, వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేయాలని, అందులో భాగంగానే మొదటి చర్యగా మానవహారం నిర్వహించామని అన్నారు. బీఎస్ఎన్ఎల్, పోస్టల్, ఆర్ఎంఎస్, సెంట్రల్ పెన్షనర్స్, ఎన్ఎస్టీఎల్, ఈఎన్సీపీడబ్ల్యూఏ, ఇన్కమ్ టాక్స్, సెంట్రల్ ఎకై ్సజ్, కస్టమ్స్, సీపీడబ్ల్యూడీ, జీఐసీ, ఏఐపీఆర్పీఏ, కేంద్రీయ విద్యాలయాలతో సహా వివిధ పెన్షనర్ల సంఘాల నుండి సుమారు 200 మంది పెన్షనర్లతోపాటు ఎం. చంద్రశేఖరరావు, ఎస్.ఎం. మౌలాలి, పి. గోపాలకృష్ణ, కె.వి. రామకృష్ణ, సంజీవరెడ్డి, అప్రాఫ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మరో మూడు రోజులు వర్షాలు
సాక్షి, అమరావతి/సాక్షి విశాఖపట్నం: బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం బంగ్లాదేశ్ సమీపంలో తీరం దాటింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి.. వాయవ్య బంగాళాఖాతం వైపుగా కదులుతూ శుక్రవారం మధ్యాహ్నం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటింది. అనంతరం ఈ వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ జార్ఖండ్, ఉత్తర ఒడిశా వైపు వెళ్లనుంది. దీని ప్రభావం రాష్ట్రంపై దాదాపు తగ్గిపోయింది. శనివారం రాత్రితో వర్షాలు తగ్గుముఖం పట్టే సూచనలున్నాయి. నేడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. నేడు, రేపు కోస్తా రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులకు హెచ్చరిక తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం అలజడిగా ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తీరాల్లో 2.9 నుంచి 3.6 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళకూడదు. అత్యవసర సహాయక చర్యల కోసం కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 1800 425 0101 ను సంప్రదించాలి. వర్షపాతం తీరిది 24 గంటల వ్యవధిలో (గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు) ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం నవగంలో 6.6 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం కరిముక్కిపుట్టిలో, పార్వతీపురం మన్యం జిల్లా గొయిడిలో 5.8, అల్లూరి జిల్లా చింతపల్లి మండలం అన్నవరంలో 4.6, శ్రీకాకుళం జిల్లా బుర్జ మండలం మదనపురంలో 4.4, అల్లూరి జిల్లా జి.మాడుగులలో 4.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. -
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. సాగర్ ఐలాండ్కు 80 కి.మీ, కలకత్తాకు వంద కి.మీ దూరంలో వాయుగుండం తీరం దాటింది. దీని ప్రభావంతో వారం రోజులపాటు ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. 40-50 కిమీ వేగంతో ఈదుగు గాలులు వీస్తాయని పేర్కొంది.ఉత్తర కోస్తా తీరం వెంబడి ఉన్న కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక, దక్షిణ కోస్తాలో మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పార్టీలకు మొదటి ప్రమాద హెచ్చరికను విశాఖ వాతావరణ కేంద్రం జారీ చేసింది. మత్స్యకారుల వేటకు వెళ్లరాదని తెలిపింది. -
ఇన్స్టామార్ట్.. ప్రతి 10 ఆర్డర్లలో 7 పెరుగు కోసమే..!
సాక్షి, విశాఖపట్నం: టీ పెట్టాలి.. పాలు లేవా? అయితే ఆర్డర్ పెట్టేద్దాం. ఐస్క్రీమ్ తినాలనిపిస్తోందా? ఆర్డర్ చేసేద్దాం. వర్షం పడుతోంది.. వేడివేడి స్నాక్స్ కావాలి? ఆర్డర్.! ఎక్కడ చూసినా ఇప్పుడు ‘క్లిక్.. ఆర్డర్’ ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు చిన్న షాంపూ కావాలన్నా వీధి చివర దుకాణానికి వెళ్లేవాళ్లం. పెరుగు కోసం డెయిరీకి, స్వీట్స్ కోసం మిఠాయి షాపుకి.. ఇలా ఏం కావాలంటే అక్కడికి వెళ్లి తెచ్చుకునేవాళ్లం. కానీ.. ఇప్పుడు ఫాస్ట్ డెలివరీ యాప్స్ వచ్చాక.. మనకు కావాల్సిన వస్తువు పది నిమిషాల్లోనే మన ఇంటికి వచ్చేస్తోంది. అందుకే ఆన్లైన్ ఆర్డర్లకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. వైజాగ్లో కూడా క్విక్ డెలివరీ యాప్స్కు ఆదరణ బాగా పెరిగిందని ‘ఇన్స్టామార్ట్’ సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది. ఇంతకీ వైజాగ్ వాసులు ఫాస్టెస్ట్ డెలివరీ యాప్స్లో ఎక్కువగా ఏం ఆర్డర్ చేస్తున్నారో తెలుసా? అదేనండి.. పెరుగు. ఇంకా ఏయే విషయాల్లో వైజాగ్ వాసులు ‘ఫాస్ట్’గా ఉన్నారో తెలుసుకుందామా? ఉరుకుల పరుగుల జీవనంలో ఇప్పుడు అంతా అరచేతిలోనే జరిగిపోతోంది. నచ్చింది తినాలన్నా, కొనాలన్నా ఒక్క క్లిక్తో ఇంటికే తెప్పించుకుంటున్నారు. ఆర్డర్ పెట్టి 10 నుంచి 15 రోజులు వేచి చూసే రోజులు పోయాయి. ఆర్డర్ పెట్టిన 15 నిమిషాల్లో డెలివరీ చేస్తాం అని ఒకరంటే, లేదు లేదు.. 10 నిమిషాల్లోనే మీ ఇంటికి తెస్తాం అని మరొకరు పోటీపడి మరీ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. పైగా, షాప్లలో కూడా లభించని ఆఫర్లతో నిమిషాల్లోనే వస్తువులు ఇంటికి వస్తుండటంతో.. శ్రమ తప్పుతోందని భావించి అంతా ‘క్విక్ కామర్స్’పైనే ఆధారపడుతున్నారు. మధ్యాహ్నం, రాత్రి వేళల్లోనే అధికం ఉదయం పూటతో పోలిస్తే, మధ్యాహ్నం భోజన సమయంలో, అలాగే అర్ధరాత్రి వేళల్లో నగరంలో క్విక్ ఆర్డర్లు అత్యధికంగా ఉంటున్నాయి. హైపర్–ఎఫెక్టివ్ డెలివరీ నెట్వర్క్ మద్దతుతో ఆన్లైన్ గ్రోసరీ డెలివరీ సంస్థల మధ్య పోటీ తీవ్రమవుతోంది. వీలైనంత త్వరగా వినియోగదారుడికి చేరుకోవాలనే పోటీతో, తక్కువ సమయంలో అందించేందుకు ప్రయత్నింస్తున్నాయి. ఈ ప్లాట్ఫాంలో సగటున 10.4 నిమిషాల్లోనే ఆర్డర్లు డెలివరీ అవుతున్నాయి. ఈ జూన్లో ఇన్స్టామార్ట్ ఒక ఆర్డర్ను కేవలం 2.18 నిమిషాల్లో అందజేసి రికార్డు సృష్టించింది. 2024 జూన్ నుంచి 2025 జూన్ మధ్య నగరానికి చెందిన ఒక వినియోగదారుడు ఏకంగా 337 ఆర్డర్లు చేశాడంటే.. ఈ యాప్స్ మనల్ని ఎంతలా ప్రభావితం చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. స్థానిక ఉత్పత్తుల నుంచి ప్రీమియం వస్తువుల వరకు విస్తృత శ్రేణిలో అందించేందుకు ఈ–కామర్స్ ప్లాట్ఫాంలు పోటీపడుతున్నాయి. అందుకే విశాఖ వాసి ఇల్లు కదలకుండా, తనకు నచ్చిన వస్తువును కొనుగోలు చేస్తూ ‘స్మార్ట్’గా మార్ట్ను ఇంటికి తెప్పించుకుంటున్నాడు. వినియోగదారుడి ఆసక్తికి అనుగుణంగా ఆఫర్లతో ఆకట్టుకుంటూ, ఆన్లైన్ గ్రోసరీ డెలివరీ యాప్స్ తమ ఆర్డర్లను గణనీయంగా పెంచుకుంటున్నాయి.ఏమేం ఆర్డర్ చేస్తున్నారంటే... ఇన్స్టామార్ట్ క్విక్ కామర్స్ యాప్.. ఏడాది పాటు విశాఖ నగరంలో చేసిన సర్వేలో పలు ఆసక్తికరమైన అంశాలువెల్లడయ్యాయి. వైజాగ్ ప్రజలు చేసే ప్రతి 10 ఆర్డర్లలో 7 పెరుగు కోసమే ఉంటున్నాయి. ఫుల్ క్రీమ్, టోన్డ్ మిల్్క, పన్నీర్ కూడా బాగా కొనుగోలు చేస్తున్నారు. తర్వాతి స్థానంలో ఐస్క్రీమ్లు, స్వీట్స్ ఉన్నాయి. వీటి ఆర్డర్లలో ఏడాది కాలంలో 112 శాతం వృద్ధి కనిపించింది. టమాటాలు, రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, ఉల్లిపాయలు, గుడ్లు, బంగాళాదుంపలు వంటి కూరగాయలనూ ఆన్లైన్లోనే కొంటున్నారు.ఉదయం లంచ్ బాక్స్ కోసం ఏ కూర వండాలో నిర్ణయించుకుని ఆన్లైన్లో తాజా కూరగాయలకు ఆర్డర్ పెడుతున్నారు. తాలింపు సిద్ధం చేసుకునేలోపే.. కూరగాయలు ఇంటికి చేరుతున్నాయి. వీటితో పాటు వేరుశనగ, కొబ్బరి, లేత కొబ్బరి, ఇడ్లీ రవ్వ వంటి ఉత్పత్తులకు కూడా అధిక డిమాండ్ ఉంది. వివాహ సీజన్లో సౌందర్య, వస్త్రధారణ ఉత్పత్తుల ఆర్డర్లు పెరుగుతున్నాయి. వర్షాకాలంలో సాయంత్రం వేళల్లో బంగాళాదుంప చిప్స్, ఆలూ భుజియా, పాప్కార్న్ వంటి స్నాక్స్ ఎక్కువగా కొంటున్నారు. పండగల సమయంలో పండ్లు, కూరగాయలు, పూజా నిత్యావసరాలను ఆర్డర్ చేస్తున్నారు. -
మా బిడ్డను చంపేశాడు
విశాఖపట్నం: వివాహం చేసుకుంటానని తమ కుమార్తెను వంచించి వేరే వ్యక్తితో సంబంధం ఉందంటూ యశ్వంత్ అనే యువకుడు చంపేశాడని ప్రభుత్వ విక్టోరియా ఆస్పత్రి ప్రాంతానికి చెందిన కార్తీక రామారావు, కార్తీక రామలక్ష్మి కన్నీరు మున్నీరయ్యారు. కార్తీక నవ్యశ్రీ (25)ని ప్రేమికుడు యశ్వంత్ తామెవరం ఇంట్లో లేని సమయంలో ఈ నెల 2వ తేదీన చంపేశాడని తెలిపారు. వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలు కార్తీక నవ్యశ్రీ తల్లిదండ్రులు రామారావు, రామలక్ష్మి తెలిపిన వివరాలివి. 35 ఏళ్ల కిందట బతుకు తెరువు కోసం శ్రీకాకుళం జిల్లా కొత్తూరు నుంచి ఇక్కడికి వచ్చి కూలి పనులు చేసుకుంటున్నామని వారు చెప్పారు. తమ కుమార్తె కార్తీక నవ్యశ్రీ, యశ్వంత్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారని తెలిపారు. వారి పెళ్లికి రెండు కుటుంబాలు సమ్మతించాయన్నారు. ఈ నేపథ్యంలో కావ్యశ్రీకి హైదరాబద్లో ఉద్యోగం దొరకడంతో వెళ్లి ఉద్యోగం చేసుకోమని యశ్వంత్ ఆమెతో చెప్పాడని పేర్కొన్నారు. అక్కడి నుంచే వేధింపులు ప్రారంభం.. కావ్యశ్రీ హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటుండగా అనుమానం పెంచుకున్న యశ్వంత్ నీవు ఎవరితోనో తిరుగుతున్నావని తరచూ వేధించేవాడని, కావ్యశ్రీని వైజాగ్ వచ్చేయమని చెప్పడంతో ఆమె మూడు నెలల కిందట వచ్చి వర్క్ ఫ్రం హోం చేస్తుందని తెలిపారు. మేము లేనప్పుడు.. గత నెల 29న ఇంటి పని కోసం కొత్తూరు వెళ్లామని, కావ్యశ్రీ నుంచి ఫోన్ వచ్చిందని, యశ్వంత్ తనను వేధిస్తున్నాడని చెప్పిందన్నారు. మూడు రోజుల పాటు యశ్వంత్ కావ్యశ్రీతోనే ఉన్నట్లు స్థానికుల ద్వారా తెలుసుకున్నట్టు చెప్పారు. ఈ నెల 1వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత (2వ తేదీ వేకువ జాము) యశ్వంత్ నుంచి తమకు ఫోన్ వచ్చిందని, కావ్యశ్రీ ఉరి పోసుకున్నట్టు తెలిపాడన్నారు. ఉదయం వచ్చి చూసే సరికి తమ కుమార్తె చనిపోయి ఉందన్నారు. ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఇంట్లో ఉన్న హుక్ కూడా ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకునేంతగా ఉండదని, యశ్వంతే తమ కుమార్తెను చంపేసి ఉండాడని అనుమానం వ్యక్తం చేశారు. స్థానికులు, కావ్యశ్రీ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి యశ్వంత్ను అరెస్టు చేశారు. ప్రస్తుతం అతను రిమాండ్లో ఉన్నాడు. -
విశాఖ రైల్వేజోన్ డీపీఆర్కు పచ్చజెండా!
సాక్షి, విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)కు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. దీనికి సంబంధించి గతంలో పంపిన నివేదికలో రైల్వే బోర్డు స్వల్ప మార్పులు చేసినట్లు రైల్వే ఉన్నతాధికారుల సామాజిక మాధ్యమాల గ్రూపుల్లో ఓ పోస్టు చక్కర్లు కొడుతోంది. జోన్ ఏర్పాటుకు అవసరమైన నిధులు, అధికారుల నియామకం, మౌలిక వసతులు, తాత్కాలిక భవనాల అంశాలపై కఠిన షరతులు విధించిందని తద్వారా తెలుస్తోంది. దీంతో.. డీపీఅర్ అంతా డొల్లేనంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మరో వైపు.. స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే ఆర్ఆర్బీ ఏర్పాటుపైనా కేంద్రం స్పందించ లేదు. పైగా.. జోన్కు సంబంధించి ఇప్పటి వరకు గెజిట్ విడుదల చెయ్యక పోవడం.. ఈ ఆంక్షలు చూస్తే జోన్కు ఇచ్చిన వరాల కంటే ఆంక్షలపైనే రైల్వే బోర్డు అధికారులు దృష్టి సారించారేమో అన్నట్లుగా ఆ పోస్టు ఉంది. ఇందులో ఆస్తులు, ఆమోదిత పోస్టులు, సిబ్బంది బదలాయింపునకు పచ్చజెండా మాత్రమే ఊరట కలిగించే అంశాలు. మిగిలిన అనేక విషయాల్లో నిరాశే మిగిలింది. కాగా, డీపీఆర్ను ఆమోదించినట్లు తమకెలాంటి అధికారిక ధృవీకరణ లేఖ అందలేదని వాల్తేరు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. జీఎం పోస్టు తప్ప ఇంకేం వద్దు జోన్ ప్రధాన కార్యాలయానికి 170 మంది అధికారులు, సిబ్బంది నియామకం అవసరమని డీపీఆర్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే రైల్వే బోర్డు ఇవేమీ పరిగణనలోకి తీసుకోలేదు. కొత్తగా జీఎం పోస్టు తప్ప మరే గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టులు సృష్టించకూడదని స్పష్టం చేసింది. ఎక్కడ పని చేస్తున్న వారు అక్కడే అన్న విధానంలో సిబ్బందిని విభజించాలని సూచించింది. జోన్ ప్రధాన కార్యాలయంతో పాటు సివిల్ పనులకు తొలుత చెప్పిన రూ.180 కోట్లు కాకుండా అదనంగా మరో రూ.200 కోట్లు కావాలన్న ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించ లేదు. వైద్యానికి సంబంధించి ఇప్పటికే వాల్తేరులో ఉన్న డివిజనల్ ఆసుపత్రిని వినియోగించుకోవాలని, కొత్త యూనిట్ అవసరం లేదని తేల్చి చెప్పింది.సాక్షి, విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)కు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. దీనికి సంబంధించి గతంలో పంపిన నివేదికలో రైల్వే బోర్డు స్వల్ప మార్పులు చేసినట్లు రైల్వే ఉన్నతాధికారుల సామాజిక మాధ్యమాల గ్రూపుల్లో ఓ పోస్టు చక్కర్లు కొడుతోంది. జోన్ ఏర్పాటుకు అవసరమైన నిధులు, అధికారుల నియామకం, మౌలిక వసతులు, తాత్కాలిక భవనాల అంశాలపై కఠిన షరతులు విధించిందని తద్వారా తెలుస్తోంది. దీంతో.. డీపీఅర్ అంతా డొల్లేనంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మరో వైపు.. స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే ఆర్ఆర్బీ ఏర్పాటుపైనా కేంద్రం స్పందించ లేదు. పైగా.. జోన్కు సంబంధించి ఇప్పటి వరకు గెజిట్ విడుదల చెయ్యక పోవడం.. ఈ ఆంక్షలు చూస్తే జోన్కు ఇచ్చిన వరాల కంటే ఆంక్షలపైనే రైల్వే బోర్డు అధికారులు దృష్టి సారించారేమో అన్నట్లుగా ఆ పోస్టు ఉంది. ఇందులో ఆస్తులు, ఆమోదిత పోస్టులు, సిబ్బంది బదలాయింపునకు పచ్చజెండా మాత్రమే ఊరట కలిగించే అంశాలు. మిగిలిన అనేక విషయాల్లో నిరాశే మిగిలింది. కాగా, డీపీఆర్ను ఆమోదించినట్లు తమకెలాంటి అధికారిక ధృవీకరణ లేఖ అందలేదని వాల్తేరు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. జీఎం పోస్టు తప్ప ఇంకేం వద్దు జోన్ ప్రధాన కార్యాలయానికి 170 మంది అధికారులు, సిబ్బంది నియామకం అవసరమని డీపీఆర్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే రైల్వే బోర్డు ఇవేమీ పరిగణనలోకి తీసుకోలేదు. కొత్తగా జీఎం పోస్టు తప్ప మరే గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టులు సృష్టించకూడదని స్పష్టం చేసింది. ఎక్కడ పని చేస్తున్న వారు అక్కడే అన్న విధానంలో సిబ్బందిని విభజించాలని సూచించింది. జోన్ ప్రధాన కార్యాలయంతో పాటు సివిల్ పనులకు తొలుత చెప్పిన రూ.180 కోట్లు కాకుండా అదనంగా మరో రూ.200 కోట్లు కావాలన్న ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించ లేదు. వైద్యానికి సంబంధించి ఇప్పటికే వాల్తేరులో ఉన్న డివిజనల్ ఆసుపత్రిని వినియోగించుకోవాలని, కొత్త యూనిట్ అవసరం లేదని తేల్చి చెప్పింది.సరిహద్దుల విషయంలోనూ బోర్డు కఠినంగా వ్యవహరించింది. జోన్తో పాటు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) వస్తే.. రైల్వే ఉద్యోగాల్లో స్థానిక యువతకి అవకాశాలు మెరుగుపడతాయని అంతా భావించారు. అయితే, డీపీఆర్లో ఎక్కడా ఆర్ఆర్బీ ఊసే లేకపోవడంతో యువతకు నిరాశ ఎదురైంది. తాత్కాలిక కార్యకలాపాల కోసం అద్దె భవనాల్ని ప్రభుత్వ రంగ సంస్థల నుంచే తీసుకోవాలని బోర్డు స్పష్టం చేసింది. మరోవైపు.. జోన్కి సంబంధించిన గెజిట్ జారీలోనూ కేంద్రం ఇదే నిర్లక్ష్యం కొనసాగిస్తోంది. జమ్మూ తావి ప్రధాన కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఈ ఏడాది మొదట్లో ప్రకటించారు. మే 29న గెజిట్ విడుదల చేశారు. కానీ, విశాఖ జోన్ విషయంలో మాత్రం ఈ వేగం కనిపించడం లేదు. సరిహద్దుల విషయంలోనూ బోర్డు కఠినంగా వ్యవహరించింది. జోన్తో పాటు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) వస్తే.. రైల్వే ఉద్యోగాల్లో స్థానిక యువతకి అవకాశాలు మెరుగుపడతాయని అంతా భావించారు. అయితే, డీపీఆర్లో ఎక్కడా ఆర్ఆర్బీ ఊసే లేకపోవడంతో యువతకు నిరాశ ఎదురైంది. తాత్కాలిక కార్యకలాపాల కోసం అద్దె భవనాల్ని ప్రభుత్వ రంగ సంస్థల నుంచే తీసుకోవాలని బోర్డు స్పష్టం చేసింది. మరోవైపు.. జోన్కి సంబంధించిన గెజిట్ జారీలోనూ కేంద్రం ఇదే నిర్లక్ష్యం కొనసాగిస్తోంది. జమ్మూ తావి ప్రధాన కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఈ ఏడాది మొదట్లో ప్రకటించారు. మే 29న గెజిట్ విడుదల చేశారు. కానీ, విశాఖ జోన్ విషయంలో మాత్రం ఈ వేగం కనిపించడం లేదు. -
బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం : ఉత్తర బంగాళాఖాతంలో గురువారం సాయంత్రం అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తరాంధ్రకు సమీపంలో కొనసాగుతూ శుక్రవారం సాయంత్రానికి బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనుంది. అనంతరం నెమ్మదిగా పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తూ ఆదివారం నాటికి పశ్చిమబెంగాల్, దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా తీరాలవైపు వెళ్లనుంది. అక్కడే తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పుంజుకోనున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో నేడు అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రానున్న మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రతో పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీచే ప్రమాదమున్న నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. గడిచిన 24 గంటల్లో పాలకొండలో 69 మి.మీ, సీతంపేటలో 60, ముంచంగిపుట్టులో 53, చింతపల్లిలో 49, బూర్జలో 46 మి.మీ వర్షపాతం నమోదైంది. -
నేటి నుంచి శ్రావణమాస పూజలు
డాబాగార్డెన్స్: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం నుంచి వచ్చే నెల 23 వరకు శ్రావణమాసాన్ని పురస్కరించుకుని శ్రావణలక్ష్మి ప్రత్యేక కుంకుమ పూజలు జరపనున్నారు. ఈ ప్రత్యేక పూజలో సంకల్పం, లక్ష్మీ సహస్ర నామాలు, లక్ష్మీ హోమం, అమ్మవారి దర్శనం, వేద ఆశీర్వచనం చేపట్టనున్నారు. విశిష్ట సామూహిక కుంకుమ పూజలో పాల్గొనదలిచే భక్తులు (దంపతులు) రూ.400 టికెట్ రుసుం చెల్లించాలి. పూజ అనంతరం భక్తులకు శేషవస్త్రంగా కండువా, జాకెట్టు ముక్క, పావుకేజీ పులిహోర, పావుకేజీ చక్కెర పొంగలి, శ్రీచక్రయంత్రం (రాగి)ని మహాప్రసాదంగా అందజేస్తారు. శ్రావణమాసంలో వచ్చే మూడో శుక్రవారం (ఆగస్టు 8) వరలక్ష్మీవ్రతం, 9న శ్రావణ పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అలాగే శ్రావణమాసంలో వచ్చే ఐదు శుక్రవారాలు (ఈ నెల 25, ఆగస్టు 1, 8, 15, 22) ప్రత్యేక పూజలు జరపనున్నారు. -
నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించండి
ప్రొబేషనరీ ఎస్ఐలతో సీపీ విశాఖ సిటీ : క్షేత్ర స్థాయిలో విధి నిర్వహణ, పోలీస్ స్టేషన్లో రికార్డుల నిర్వహణ, కేసుల దర్యాప్తుపై అవగాహన పెంచుకోవాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ప్రొబేషనరీ ఎస్ఐలకు దిశా నిర్దేశం చేశారు. నగరానికి కేటాయించిన 34 ప్రొబేషనరీ ఎస్ఐలు గురువారం సీపీని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారితో సీపీ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, సేవాతత్పరతతో పనిచేయాలని సూచించారు. కష్టపడి పనిచేస్తూ పోలీస్ శాఖకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులతో వినయంగా ప్రవర్తిస్తూ వారికీ న్యాయం చేయాలని చెప్పారు. విధి నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. దర్యాప్తులో సాంకేతికతను వినియోగించుకోవాలన్నారు. సమావేశంలో డీసీపీ–1 అజితా వేజెండ్ల, డీసీపీ–2 డి.మేరి ప్రశాంతి, డీసీపీ(అడ్మిన్) కృష్ణ కాంత్ పటేల్, డీసీపీ(క్రైమ్స్) కె.లతా మాధురి ఇతర అధికారులు పాల్గొన్నారు. -
సాష్టాంగం
వీరమల్లుకునిబంధనలకు పాతరేసిన ఏయూ అధికారులు విశాఖ సిటీ: ‘హరి హర వీరమల్లు’కు ఆంధ్రా యూనివర్సిటీ ఉన్నతాధికారులు సాష్టాంగపడ్డారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినిమా ఫంక్షన్ కోసం నిబంధనలకు పాతరేశారు. ప్రభుత్వ విద్యా సంస్థల మైదానాలు, ప్రాంగణాలు ప్రైవేటు సభలు, సమావేశాలకు కేటాయించకూడదన్న ప్రభుత్వ ఉత్తర్వులను బుట్టదాఖలు చేశారు. నెల కిందట బుక్ చేసుకున్న ఒక విద్యా సంస్థ వేడుకలను సైతం రద్దు చేసి మరీ ఉప ముఖ్యమంత్రి సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు అనుమతులిచ్చేశారు. ఇపుడు ఈ విషయం బయటకు పొక్కితే ఇబ్బందులు వస్తాయని వర్సిటీ ఉపకులపతి జి.పి.రాజశేఖర్ విభాగాధిపతులతో రహస్య సమావేశం నిర్వహించడం కొసమెరుపు. ఒకవైపు హాస్టళ్లలో పురుగుల అన్నం తినలేక, సౌకర్యాలు లేక విద్యార్థులు ఆందోళన బాట పడితే, వాటిని పరిష్కరించని ఏయూ పాలకులు.. రాజకీయ, సినీ పెద్దల సేవలో తరించడం వివాదాస్పదమవుతోంది. ఏయూలో రాజకీయ క్రీనీడ ఆంధ్ర విశ్వవిద్యాలయం కూటమి రాజకీయ క్రీనీడకు వేదికగా మారిపోయింది. కూటమి ప్రజాప్రతినిధుల జన్మదిన వేడుకలకు, ఆ పార్టీల కార్యక్రమాలకు కేంద్రంగా మార్చేశారు. ఎప్పటికప్పుడు కూటమి నేతల కటౌట్లు, బ్యానర్లతో యూనివర్సిటీని కప్పేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏయూలో తీసుకున్న నిర్ణయాలపై బురద జల్లే ప్రయత్నం చేశారు. వాటిపై లోతైన విచారణ చేపట్టాలని నిర్ణయిస్తూ ప్రత్యేక కమిటీని సైతం ఏర్పాటు చేశారు. నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు ఒక్క తప్పును కూడా నిరూపించలేకపోయారు. దీంతో ఆ కమిటీ నివేదికను పక్కనపెట్టేశారు. తాజాగా కూటమి పెద్దల సూచనలతో అధికారులు వివాదాస్పద నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అతిథి ఉపాధ్యాయుల విషయంలో గతంలో ఎన్నడూ లేని విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఏళ్ల తరబడి గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న వారిని రోడ్డున పడేయాలని చూస్తున్నారు. వారి స్థానంలో కొత్త వారిని నియమించేందుకు ఏయూ అధికారులపై కూటమి నేతలు ఒత్తిడి చేస్తున్నట్లు వర్సిటీలో చర్చ జరుగుతోంది. ఆదిత్య కాలేజ్ వేడుకను రద్దు చేసి మరీ.. వాస్తవానికి ఆదిత్య కాలేజ్ 1,500 మంది ఉత్తరాంధ్ర విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో అచీవర్స్ డే నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం నెల రోజుల కిందటే ఏయూ కన్వెన్షన్ సెంటర్ను బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ‘హరి హర వీరమల్లు’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్కు అదే వేదికను అడగడంతో, ఏయూ అధికారులు వెంటనే ఆదిత్య కాలేజ్ బుకింగ్ను రద్దు చేసేశారు. కేవలం రెండు రోజుల ముందే వారికి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఆదిత్య కాలేజ్ తమ వేడుకలను రద్దు చేసుకోవాల్సి వచ్చినట్లు సమాచారం. ఒక కాలేజీ కార్యక్రమాన్ని రద్దు చేసి మరీ సినిమా వేడుకకు ఏయూ కన్వెన్షన్ సెంటర్ను కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ జీవోను కాదని సినిమా ఈవెంట్కు అనుమతి బయటకు పొక్కకూడదనివీసీ రహస్య సమావేశం కూటమి ప్రభుత్వంలో దిగజారుతున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రతిష్టనిబంధనలకు విరుద్ధంగా.. ప్రభుత్వ విద్యా సంస్థల ఆట స్థలాలు, ప్రాంగణాలను అకడమిక్ కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 29వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ప్రభుత్వ విద్యా సంస్థల ప్రాంగణాల్లో రాజకీయ, సినిమా, ఇతర సభలు, సమావేశాల నిర్వహణకు లీజుకిచ్చే అవకాశం లేదు. కానీ ఏయూ ఉన్నతాధికారులు మాత్రం ఈ ఉత్తర్వులను తుంగలో తొక్కారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహణకు నిబంధనలకు విరుద్ధంగా ఏయూ కన్వెన్షన్ సెంటర్ను కేటాయించారు. ఏయూ వీసీ రహస్య సమావేశం? ఏయూ హాస్టళ్లలో అధ్వాన పరిస్థితులపై విద్యార్థులు రెండు రోజుల పాటు ఆందోళన చేశారు. పురుగుల అన్నం పెడుతున్నారని, హాస్టళ్లలో కనీస సౌకర్యాలు కల్పించడం లేదని నిరసన తెలిపారు. ఫీజుల కోసం ఒత్తిడి చేస్తున్నారని, ఏయూ అధికారులు అనుసరిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా వీసీ కార్యాలయాన్ని ముట్టడించారు. విద్యార్థుల సమస్యలను పట్టించుకోని ఏయూ అధికారులు.. సినిమా ఫంక్షన్ వ్యవహారంపై ప్రత్యేకంగా భేటీ అవడం చర్చనీయాంశమవుతోంది. ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా సినిమా వేడుకకు కేటాయించిన విషయం బయటకు వస్తే.. తలనొప్పులు తప్పవన్న ఆందోళన వారిలో మొదలైంది. దీనిపై ఏయూ వీసీ రాజశేఖర్ విభాగాధిపతులతో రహస్యంగా సమావేశం నిర్వహించినట్లు సమాచారం. సినిమా ఫంక్షన్కు కన్వెన్షన్ సెంటర్ను కేటాయించడంపై కోర్టుకు వెళితే ఇబ్బందులు తప్పవని ఆ సమావేశంలో ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. ఈ నిబంధనల విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తగా ఉండాలని, సినిమా ఫంక్షన్ వ్యవహారంపై ఎవరూ బయట చర్చించవద్దని సూచించినట్లు ఏయూలో గుసగుసలు వినిపిస్తున్నాయి. -
పెరుగుదే అగ్రస్థానం
స్మార్ట్ షాపింగ్.. ● ఆన్లైన్ ఆర్డర్లలో సరికొత్త ట్రెండ్ ● ఇన్స్టంట్ డెలివరీలో వైజాగ్ వాసులే ట్రెండింగ్ ● ఏడాది కాలంలో 337 ఆర్డర్లు చేసిన విశాఖ వాసి ● మధ్యాహ్నం, అర్ధరాత్రి సమయంలో అత్యధిక ఆర్డర్లు ● ఇన్స్టామార్ట్ సర్వేలో వెల్లడి ఏమేం ఆర్డర్ చేస్తున్నారంటే... ఇన్స్టామార్ట్ క్విక్ కామర్స్ యాప్.. ఏడాది పాటు విశాఖ నగరంలో చేసిన సర్వేలో పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ● వైజాగ్ ప్రజలు చేసే ప్రతి 10 ఆర్డర్లలో 7 పెరుగు కోసమే ఉంటున్నాయి. ఫుల్ క్రీమ్, టోన్డ్ మిల్క్, పన్నీర్ కూడా బాగా కొనుగోలు చేస్తున్నారు. ● తర్వాతి స్థానంలో ఐస్క్రీమ్లు, స్వీట్స్ ఉన్నాయి. వీటి ఆర్డర్లలో ఏడాది కాలంలో 112 శాతం వృద్ధి కనిపించింది. ● టమాటాలు, రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, ఉల్లిపాయలు, గుడ్లు, బంగాళాదుంపలు వంటి కూరగాయలనూ ఆన్లైన్లోనే కొంటున్నారు. ఉదయం లంచ్ బాక్స్ కోసం ఏ కూర వండాలో నిర్ణయించుకుని ఆన్లైన్లో తాజా కూరగాయలకు ఆర్డర్ పెడుతున్నారు. తాలింపు సిద్ధం చేసుకునేలోపే.. కూరగాయలు ఇంటికి చేరుతున్నాయి. ● వీటితో పాటు వేరుశనగ, కొబ్బరి, లేత కొబ్బరి, ఇడ్లీ రవ్వ వంటి ఉత్పత్తులకు కూడా అధిక డిమాండ్ ఉంది. ● వివాహ సీజన్లో సౌందర్య, వస్త్రధారణ ఉత్పత్తుల ఆర్డర్లు పెరుగుతున్నాయి. ● వర్షాకాలంలో సాయంత్రం వేళల్లో బంగాళాదుంప చిప్స్, ఆలూ భుజియా, పాప్కార్న్ వంటి స్నాక్స్ ఎక్కువగా కొంటున్నారు. ● పండగల సమయంలో పండ్లు, కూరగాయలు, పూజా నిత్యావసరాలను ఆర్డర్ చేస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: టీ పెట్టాలి.. పాలు లేవా? అయితే ఆర్డర్ పెట్టేద్దాం. ఐస్క్రీమ్ తినాలనిపిస్తోందా? ఆర్డర్ చేసేద్దాం. వర్షం పడుతోంది.. వేడివేడి స్నాక్స్ కావాలి? ఆర్డర్.! ఎక్కడ చూసినా ఇప్పుడు ‘క్లిక్.. ఆర్డర్’ ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు చిన్న షాంపూ కావాలన్నా వీధి చివర దుకాణానికి వెళ్లేవాళ్లం. పెరుగు కోసం డెయిరీకి, స్వీట్స్ కోసం మిఠాయి షాపుకి.. ఇలా ఏం కావాలంటే అక్కడికి వెళ్లి తెచ్చుకునేవాళ్లం. కానీ.. ఇప్పుడు ఫాస్ట్ డెలివరీ యాప్స్ వచ్చాక.. మనకు కావాల్సిన వస్తువు పది నిమిషాల్లోనే మన ఇంటికి వచ్చేస్తోంది. అందుకే ఆన్లైన్ ఆర్డర్లకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. వైజాగ్లో కూడా క్విక్ డెలివరీ యాప్స్కు ఆదరణ బాగా పెరిగిందని ‘ఇన్స్టామార్ట్’ సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది. ఇంతకీ వైజాగ్ వాసులు ఫాస్టెస్ట్ డెలివరీ యాప్స్లో ఎక్కువగా ఏం ఆర్డర్ చేస్తున్నారో తెలుసా? అదేనండి.. పెరుగు. ఇంకా ఏయే విషయాల్లో వైజాగ్ వాసులు ‘ఫాస్ట్’గా ఉన్నారో తెలుసుకుందామా? ఉరుకుల పరుగుల జీవనంలో ఇప్పుడు అంతా అరచేతిలోనే జరిగిపోతోంది. నచ్చింది తినాలన్నా, కొనాలన్నా ఒక్క క్లిక్తో ఇంటికే తెప్పించుకుంటున్నారు. ఆర్డర్ పెట్టి 10 నుంచి 15 రోజులు వేచి చూసే రోజులు పోయాయి. ఆర్డర్ పెట్టిన 15 నిమిషాల్లో డెలివరీ చేస్తాం అని ఒకరంటే, లేదు లేదు.. 10 నిమిషాల్లోనే మీ ఇంటికి తెస్తాం అని మరొకరు పోటీపడి మరీ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. పైగా, షాప్లలో కూడా లభించని ఆఫర్లతో నిమిషాల్లోనే వస్తువులు ఇంటికి వస్తుండటంతో.. శ్రమ తప్పుతోందని భావించి అంతా ‘క్విక్ కామర్స్’పైనే ఆధారపడుతున్నారు. మధ్యాహ్నం, రాత్రి వేళల్లోనే అధికం ఉదయం పూటతో పోలిస్తే, మధ్యాహ్నం భోజన సమయంలో, అలాగే అర్ధరాత్రి వేళల్లో నగరంలో క్విక్ ఆర్డర్లు అత్యధికంగా ఉంటున్నాయి. హైపర్–ఎఫెక్టివ్ డెలివరీ నెట్వర్క్ మద్దతుతో ఆన్లైన్ గ్రోసరీ డెలివరీ సంస్థల మధ్య పోటీ తీవ్రమవుతోంది. వీలైనంత త్వరగా వినియోగదారుడికి చేరుకోవాలనే పోటీతో, తక్కువ సమయంలో అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్లాట్ఫాంలో సగటున 10.4 నిమిషాల్లోనే ఆర్డర్లు డెలివరీ అవుతున్నాయి. ఈ జూన్లో ఇన్స్టామార్ట్ ఒక ఆర్డర్ను కేవలం 2.18 నిమిషాల్లో అందజేసి రికార్డు సృష్టించింది. 2024 జూన్ నుంచి 2025 జూన్ మధ్య నగరానికి చెందిన ఒక వినియోగదారుడు ఏకంగా 337 ఆర్డర్లు చేశాడంటే.. ఈ యాప్స్ మనల్ని ఎంతలా ప్రభావితం చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. స్థానిక ఉత్పత్తుల నుంచి ప్రీమియం వస్తువుల వరకు విస్తృత శ్రేణిలో అందించేందుకు ఈ–కామర్స్ ప్లాట్ఫాంలు పోటీపడుతున్నాయి. అందుకే విశాఖ వాసి ఇల్లు కదలకుండా, తనకు నచ్చిన వస్తువును కొనుగోలు చేస్తూ ‘స్మార్ట్’గా మార్ట్ను ఇంటికి తెప్పించుకుంటున్నాడు. వినియోగదారుడి ఆసక్తికి అనుగుణంగా ఆఫర్లతో ఆకట్టుకుంటూ, ఆన్లైన్ గ్రోసరీ డెలివరీ యాప్స్ తమ ఆర్డర్లను గణనీయంగా పెంచుకుంటున్నాయి. -
ఫిరాయింపు కార్పొరేటర్లపై చర్యలు తీసుకోండి
జీవీఎంసీ కమిషనర్ను కోరిన వైఎస్సార్ సీపీ డాబాగార్డెన్స్: పార్టీ ఫిరాయించిన కార్పొరేటర్లపై చర్యలు తీసుకున్న తర్వాతే జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నిక నిర్వహించాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తైనాల విజయ్కుమార్, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బానాల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గురువారం వారు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. స్థాయీ సంఘం ఎన్నిక నోటిఫికేషన్కు అనుగుణంగా ఎన్నిక నిర్వహించాలంటే.. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ప్రకారం అర్హత గల వార్డు సభ్యులు నామినేషన్ అందజేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ఏప్రిల్లో నిర్వహించిన మేయర్ అవిశ్వాస తీర్మానం(ఎన్నిక)లో వైఎస్సార్ సీపీ జెండాపై గెలిచిన 27 మంది కార్పొరేటర్లు.. పార్టీ విప్ను ధిక్కరించి ఓటు వేశారని గుర్తుచేశారు. ఈ కారణంగా వారిని వార్డు సభ్యులుగా అనర్హులుగా ప్రకటించాలని ప్రిసైడింగ్ అధికారి, కలెక్టర్ను పార్టీ విప్ కోరారని తెలిపారు. అప్పటి ప్రిసైడింగ్ అధికారి, పార్టీ విప్ అందజేసిన దరఖాస్తు సహేతుకమైనదని భావించి.. పార్టీ విప్ను ధిక్కరించిన కార్పొ రేటర్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు ఈ నెల 14న నోటీసులు పంపినట్లు పేర్కొన్నారు. సంబంధిత కార్పొరేటర్లు ఇచ్చిన వివరణపై తుది నిర్ణయం తీసుకోవాలని ప్రిసైడింగ్ అధికారికి హైకో ర్టు ఆదేశించిందని, పార్టీ విప్ను ధిక్కరించిన వారందరూ కార్పొరేటర్లుగా చట్టప్రకారం అనర్హులని వారు పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు సంబంధిత అభ్యర్థులకు ఇచ్చిన నోటీసుపై తుది నిర్ణయం తీసు కునే వరకు, జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నిక నోటిఫికేషన్ను నిలుపుదల చేయాలని కమిషనర్ను కోరారు. -
59 చోరీ కేసుల్లో 73 మంది అరెస్ట్
● రూ.1.06 కోట్లు చోరీ సొత్తు స్వాధీనం ● రికవరీ మేళాలో బాధితులకు అందజేసిన సీపీ విశాఖ సిటీ : నగరంలో నేర నియంత్రణకు, నింది తుల పట్టివేతకు చేపడుతున్న చర్యలు సత్ఫలితాన్నిస్తున్నాయని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పేర్కొన్నారు. గురువారం పోలీస్ సమావేశ మందిరంలో రికవరీ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జూన్ లో నగరంలో 84 చోరీ కేసులు నమోదైనట్లు తెలిపారు. వీటిలో 59 కేసులను ఛేదించి, 73 మంది నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. వారి నుంచి రూ.1,06,03,665 చోరీ చొత్తును రికవరీ చేసినట్లు వెల్లడించారు. ఇందులో 1.2 కేజీల బంగారం, 427.8 గ్రాముల వెండి, రూ.5,67,300 నగదు, 3 బైక్లు, 6 ఆటోలు, 3 ల్యాప్టాప్లు, 2 యాపిల్ ఐప్యాడ్స్, రూ.93 వేలు విలువ చేసే కాపర్ వైర్ కేబుల్స్, 430 మొబైల్ ఫోన్లు ఉన్నట్లు వివరించారు. నేర నియంత్రణతో పాటు నేరస్తులను గుర్తించేందుకు నగరంలో విస్తృతంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జూన్ నెలలో 440 కెమెరాలు పెట్టామన్నారు. నేరాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక పెట్రోలింగ్ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రామ మందిరం వివాదంలో ముగ్గురిపై కేసు బీచ్ రోడ్డులో రామ మందిరం సెట్ వివాదంలో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. సీతారాముల కల్యాణానికి భద్రాచలం దేవస్థానం నుంచి పూజారులను తీసుకువస్తామని తప్పుడు ప్రకటనలు చేశారన్న విషయంపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. నిర్వాహకులు మాత్రం తాము దేవస్థానం నుంచి పూజారులను తెస్తున్నట్లు చెప్పలేదని, భద్రాచలం నుంచి పూజారులను మాత్రమే తీసుకొస్తామని చెప్పినట్లు వివరించారు. దీనిపై విచారణ చేయగా భద్రాచలం దేవస్థానం నుంచి తీసుకొస్తామనే ప్రకటించిన విషయం గుర్తించినట్లు వెల్లడించారు. దీంతో వారిపై కేసులు నమోదు చేశామన్నారు. ఇతరత్రా విషయాలపై కూడా దర్యాప్తు జరుగుతోందన్నారు. అనంతరం సీపీ చేతుల మీదుగా బాధితులకు రికవరీ చేసిన సొత్తును అందజేశారు. డీసీపీ(క్రైమ్) లతా మాధురి పాల్గొన్నారు. -
మోసం చంద్రబాబు జన్మహక్కు
పెందుర్తి: ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం సీఎం చంద్రబాబు తన జన్మహక్కులా భావిస్తారని మాజీ ఎమ్మెల్యే, అనకాపల్లి జిల్లా వైఎస్సార్సీపీ పరిశీలకురాలు శోభా హైమావతి విమర్శించారు. ఎన్నికల సమయంలో తప్పుడు హామీలు ఇవ్వడం, గెలిచాక ప్రజలను వంచన చేయడంలో చంద్రబాబును మించిన ఘనుడు వేరెవరూ లేరని ఎద్దేవా చేశారు. సుజాతనగర్లో పెందుర్తి గ్రామీణ, పట్టణ స్థాయి ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ’కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండో ఏడాది నడుస్తున్నా ఒకటి రెండు పథకాలు కూడా ప్రజలకు పూర్తిస్థాయిలో అందలేదన్నారు. రాష్ట్రంలో పేదలకు తగిన సహకారం అందాలన్న సంకల్పంతో గతంలో సీఎంగా వైఎస్ జగన్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశారని గుర్తు చేశారు. ఏడాది తిరగకముందే చంద్రబాబు తత్వం ప్రజలకు బోధపడిందన్నారు. ఆడబిడ్డ నిధి ఎగ్గొట్టాలన్న దురుద్దేశంతోనే మంత్రి అచ్చెన్నాయుడు ఆ పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలన్న వాఖ్యలు చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అరాచక పాలనను క్షేత్రస్థాయిలో ఎండగట్టేందుకు వైఎస్సార్సీపీ కేడర్ నడుం బిగించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే, పెందుర్తి సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్రాజ్ మాట్లాడుతూ నమ్మకం పేరు చేబితే వైఎస్ జగన్ గుర్తుకు వస్తారని.. మోసం పేరు చెబితే చంద్రబాబు గుర్తుకు వస్తారని విమర్శించారు. కేవలం అధికారం కోసమే చంద్రబాబు, పవన్కల్యాణ్ ఎన్నికల్లో సూపర్సిక్స్తో పాటు 143 హామీలతో మేనిఫెస్టో విడుదల చేశారని.. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే దాన్ని బుట్టదాఖలు చేశారని మండిపడ్డారు. నియోజకవర్గంలో కూటమి నాయకులకు అవినీతి, అక్రమాలు, కబ్జాలు చేయడం తప్ప ప్రజా సంక్షేమం పట్టడంలేదన్నారు. త్వరలో పార్టీలో పూర్తిస్థాయి కమిటీలు వేస్తామని ప్రకటించారు. ముందుగా మహానేత డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులఅర్పించారు. వైఎస్సార్సీపీ నేతలు బయిలపూడి భగవాన్ జయరామ్, శరగడం చినఅప్పలనాయుడు, ఉప్పిలి కనకరాజు, గండ్రెడ్డి మహాలక్ష్మినాయుడు, ఉగ్గిన గోవింద్, యతిరాజుల నాగేశ్వరరావు, గొరపల్లి శ్రీను, గొర్లె రామునాయుడు, చొప్పా నాగరాజు, గొరపల్లి సాంబ, మెంటి మహేష్, దాసరి సత్తిబాబు, బండి సత్తిబాబు, రాపర్తి మాధవరావు, కోరాడ చందుయాదవ్, కొయిలాడ శ్రీను, బొడ్డు సూర్యప్రకాష్, కిల్లి అప్పారావు, పాలిశెట్టి సురేష్రాజ్, బల్ల రాంబాబు, సూరిశెట్టి సూరిబాబు, దాడి అర్జున్, అవగడ్డ శ్రీనివాస్, కాళ్ల గంగాధర్, ఎస్జేడీ శ్రీను, మీసాల విజయ, విజయలక్ష్మి, నక్కా మహేష్, కోన శ్రీను, దిలీప్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి వంచన చేయడం బాబుకు అలవాటే కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత కేడర్దే పెందుర్తిలో ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ’ సభలో మాజీ ఎమ్మెల్యే శోభా హెమావతి -
రిజిస్ట్రార్ను నిలదీసిన అభిషేక్ తల్లిదండ్రులు
సాక్షి, విశాఖపట్నం: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఏయూ స్టూడెంట్ అభిషేక్ను పరామర్శించడానికి ఏయూ రిజిస్ట్రార్కు షాక్ తగిలింది. రిజిస్ట్రార్ను అభిషేక్ తల్లి నిలదీశారు. రిజిస్ట్రార్ కారుకి అడ్డంగా కూర్చుని అభిషేక్ తల్లిదండ్రులు నిరసన తెలిపారు. అభిషేక్ చావును చూసేందుకు వచ్చారా అంటూ అధికారులను అభిషేక్ కుటుంబ సభ్యులు కడిగి పారేశారు.‘‘ఏయూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వేధింపులు భరించలేకే ఆత్మహత్యకు యత్నించాడు. అభిషేక్ను ప్రొఫెసర్ తీవ్రంగా వేధించాడు. వేధింపులకు పాల్పడిన వారిని విధుల నుంచి తొలగించాలి’’ అని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. అభిషేక్ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇస్తేనే కదలనిస్తామంటూ అభిషేక్ తల్లిదండ్రులు తేల్చి చెప్పారు. దీంతో అభిషేక్ తల్లిదండ్రులపై ఆర్ట్స్ కాలేజీ హెచ్వోడీ జాలాది రవి బెదిరింపులకు దిగారు.పరీక్ష కేంద్రంలోకి సెల్ఫోన్ తీసుకెళ్లినందుకు ఓ ప్రొఫెసర్ కక్షగట్టి, తన విద్యా సంవత్సరాన్ని నష్టపరిచారని ఆరోపిస్తూ.. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ విద్యార్థి బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం కేజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన ఏయూ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.బాధితుడి కథనం ప్రకారం.. ఏయూలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న అభిõÙక్ (22).. ఈ ఏడాది ఏప్రిల్లో మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలు రాశాడు. అప్పటికే మ్యాథ్స్–2, డీఎల్డీ, డీఎస్సీ పరీక్షలను బాగా రాశానని విద్యార్థి తెలిపాడు. నాల్గోదైన ఫిజిక్స్ పరీక్ష రాస్తుండగా.. తన జేబులోని స్మార్ట్ఫోన్ కింద పడిపోయింది. అది గమనించిన ఇన్విజిలేటర్ ప్రొఫెసర్ పాల్.. తాను కాపీ కొడుతున్నానని భావించి, ఫోన్ లాక్కుని తనను బయటకు పంపించారని అభిషేక్ తెలిపాడు. ‘తెలియక చేసిన తప్పు సార్, క్షమించండి.’ అని ఎంత వేడుకున్నా ప్రొఫెసర్ కనికరించలేదన్నాడు.పరీక్ష అయిన తర్వాత సెల్ఫోన్ ఇచ్చేసి.. ‘నేనేంటో నీకు చూపిస్తా’ అంటూ బెదిరించారని వాపోయాడు. ఇటీవల విడుదలైన పరీక్ష ఫలితాల్లో అభిõÙక్ రాసిన అన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అయినట్లు చూపించారు. అంతేకాకుండా, ‘ఈ ఏడాదికి నీకింతే.. వచ్చే ఏడాది పరీక్షలు రాసుకో’ అంటూ ఇంటికి లేఖ పంపారని అభిషేక్ కన్నీటిపర్యంతమయ్యాడు.తాను బాగా రాసిన మూడు పరీక్షలను కూడా ఉద్దేశపూర్వకంగా రద్దు చేసి ఫెయిల్ చేయించారని, ప్రొఫెసర్ వేధింపుల వల్లే తాను విద్యా సంవత్సరం నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించినట్లు అభిషేక్ తెలిపాడు. -
విశాఖ పోలీసుల థర్డ్ డిగ్రీ.. మేజిస్ట్రేట్ ఆగ్రహం
సాక్షి, విశాఖపట్నం: పొక్సో కేసులో ఏసీపీ చేతివాటం బయటపడింది. ఇంటర్ చదువుతున్న బాలికపై రామకృష్ణ అనే యువకుడు వేధింపులకు పాల్పడుతున్నాడు. తాను చెప్పినట్టు చేయకపోతే చంపేస్తానంటూ బాలిక ఇంటికి వచ్చి మరి.. బెదిరింపులకు దిగాడు. దీంతో తమ కూతురికి ప్రాణహాని ఉందని.. వేధింపులు భరించలేక పోతుందని హార్బర్ ఏసీపీ కాళిదాసును బాలిక తల్లిదండ్రులు ఆశ్రయించారు.పోక్సో కేసులో సెటిల్మెంట్ చేసుకోవాలంటూ బాధితులపై ఏసీపీ కాళిదాసు తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. కాగా, ఏసీపీ అండతో పోలీస్ స్టేషన్లోనే బాధితురాలు తండ్రిపై నిందితుడు రామకృష్ణ దాడి చేశాడు. దాడి చేసినా కానీ బాధితులు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఏసీపీ కాళిదాసు తీరుపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ హార్బర్ పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది.ఇదిలా ఉండగా.. ఈ కేసులో పోలీసులు డబుల్ గేమ్ ఆడారు. పోలీస్ స్టేషన్లో గొడవ బయటకి రావటంతో నిందితుడికి పోలీసులు థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చారు. నిందితుడి ప్రైవేట్ పార్ట్స్పై వేడి మైనపు చుక్కల్ని వేశారు. వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. నిందితుడు రామకృష్ణ.. రిమాండ్ సమయంలో మేజిస్ట్రేట్ ఎదుట థర్డ్ డిగ్రీ విషయం బయట పెట్టాడు. పోలీసులపై మేజిస్ట్రేట్ సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలంటూ సీపీ శంఖబ్రతబాగ్చికి మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. -
దక్షిణాదిలో ఉత్తమ సంస్థగా ప్రభుత్వ పాత ఐటీఐ
కంచరపాలెం: కంచరపాలెం ప్రభుత్వ పాత ఐటీఐ కళాశాల ‘భారత్ స్కిల్ ఎన్ఎక్స్టీ–2025’అవార్డును అందుకుని, దక్షిణ భారతదేశంలోనే ఉత్తమ పారిశ్రామిక శిక్షణ సంస్థగా నిలిచిందని ఆ కళాశాల ప్రిన్సిపాల్ జె. శ్రీకాంత్ తెలిపారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో కేంద్ర మంత్రులు జయంత్ చౌదరి, సుకాంత మజుందార్ చేతుల మీదుగా ఉపాధి, పారిశ్రామిక శిక్షణ శాఖ డైరెక్టర్ జి.గణేష్ కుమార్, అడిషనల్ డైరెక్టర్ జి.సుబ్రహ్మణ్యం, ప్రిన్సిపాల్ జె. శ్రీకాంత్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఈ విజయానికి కృషి చేసిన శాఖ ఉన్నతాధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. -
ఏయూ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
ప్రొఫెసర్ వేధింపులతో మనస్తాపం డాబాగార్డెన్స్: పరీక్ష కేంద్రంలోకి సెల్ఫోన్ తీసుకెళ్లినందుకు ఓ ప్రొఫెసర్ కక్షగట్టి, తన విద్యా సంవత్సరాన్ని నష్టపరిచారని ఆరోపిస్తూ.. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ విద్యార్థి బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం కేజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన ఏయూ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. బాధితుడి కథనం ప్రకారం.. ఏయూలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న అభిషేక్ (22).. ఈ ఏడాది ఏప్రిల్లో మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలు రాశాడు. అప్పటికే మ్యాథ్స్–2, డీఎల్డీ, డీఎస్సీ పరీక్షలను బాగా రాశానని విద్యార్థి తెలిపాడు. నాల్గోదైన ఫిజిక్స్ పరీక్ష రాస్తుండగా.. తన జేబులోని స్మార్ట్ఫోన్ కింద పడిపోయింది. అది గమనించిన ఇన్విజిలేటర్ ప్రొఫెసర్ పాల్.. తాను కాపీ కొడుతున్నానని భావించి, ఫోన్ లాక్కుని తనను బయటకు పంపించారని అభిషేక్ తెలిపాడు. ‘తెలియక చేసిన తప్పు సార్, క్షమించండి.’ అని ఎంత వేడుకున్నా ప్రొఫెసర్ కనికరించలేదన్నాడు. పరీక్ష అయిన తర్వాత సెల్ఫోన్ ఇచ్చేసి.. ‘నేనేంటో నీకు చూపిస్తా’ అంటూ బెదిరించారని వాపోయాడు. ఇటీవల విడుదలైన పరీక్ష ఫలితాల్లో అభిషేక్ రాసిన అన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అయినట్లు చూపించారు. అంతేకాకుండా, ‘ఈ ఏడాదికి నీకింతే.. వచ్చే ఏడాది పరీక్షలు రాసుకో’ అంటూ ఇంటికి లేఖ పంపారని అభిషేక్ కన్నీటిపర్యంతమయ్యాడు. తాను బాగా రాసిన మూడు పరీక్షలను కూడా ఉద్దేశపూర్వకంగా రద్దు చేసి ఫెయిల్ చేయించారని, ప్రొఫెసర్ వేధింపుల వల్లే తాను విద్యా సంవత్సరం నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించినట్లు అభిషేక్ తెలిపాడు. తనకు న్యాయం చేసి, విద్యా సంవత్సరం నష్టపోకుండా చూడాలని వర్సిటీ అధికారులను వేడుకుంటున్నాడు. -
పోర్టులో ట్రైనీ ఐపీఎస్ల బృందం
సాక్షి, విశాఖపట్నం : వివిధ రాష్ట్రాలకు చెందిన 28 మంది ట్రెయినీ ఐపీఎస్ అధికారుల బృందం విశాఖపట్నం పోర్ట్ అథారిటీ(వీపీఏ)ని బుధవారం సందర్శించారు. సముద్ర భద్రత, వాణిజ్య రంగంలో ఎదురయ్యే ఆధునిక సవాళ్ల గురించి అవగాహన ఏర్పరచుకునేందుకు ఈ సందర్శన సాగించారు. పోర్టు అధికారులు బృందానికి స్వాగతం పలికారు. పోర్టులో జరుగుతున్న వివిధ కార్యకలాపాలు, అభివృద్ధి పనుల గురించి పోర్టు అధికారులు వివరించారు. అనంతరం మౌలిక సదుపాయాలు, కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యం, ఆధునికీకరణ, యాంత్రీకరణ, కవర్డ్ గోదాములు, సోలార్ పవర్ ఉత్పత్తి, పరిశ్రమల కోసం ఎస్టీపీ నీటి పునర్వినియోగం, పెట్టుబడుల అవకాశాలు ఎగుమతి దిగుమతులు మొదలైన విభాగాలను ట్రైనీ ఐపీఎస్ అధికారులు సందర్శించి.. సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ఈ బృందం మంగమారిపేట తీరంలో పర్యటించి మైరెన్ అడిషనల్ ఎస్పీ మధుసూదనరావు ఆధ్వర్యంలో మత్స్యకారులతో సమావేశమయ్యారు. మత్స్యకారుల జీవన విధి విధానాలు, తుఫాన్ సమయంలో వారు ఎదుర్కొనే సమస్యలపై అధ్యయనం చేశారు. -
దుకాణాల నుంచి ఫ్లెక్సీల వరకు..
ప్రవేశం నుంచి ఆలయం నమూనా వరకు మధ్యలో ఉన్న ప్రదేశంలో పదుల సంఖ్యలో దుకాణాలు నిర్మించేశారు. వీటిని లక్షలాది రూపాయలకు అద్దెలకు ఇచ్చారు. ప్రారంభంలో ఒక్కో దుకాణానికి రూ.2.5 లక్షలు అద్దె చెల్లించాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఆశించిన స్థాయిలో వ్యాపారులు ముందుకు రాకపోవడంతో కొంత తగ్గించి ఇచ్చినట్లు సమాచారం. అదే విధంగా ప్రత్యేకంగా చెప్పుల స్టాండ్ ఏర్పాటు చేసి ఒక్కో జతకు రూ.5 చొప్పున వసూలు చేశారు. ప్రవేశ రుసుం, చెప్పుల స్టాండ్లు వంటివి ఏర్పాటు చేసే సమయంలో సంబంధిత శాఖల అనుమతులు తప్పనిసరి. దుకాణాలతో పాటు దారి పొడవుడా వివిధ వ్యాపార సంస్థలకు సంబంధించిన ఫ్లెక్సీలను ప్రచారం కోసం ఏర్పాటు చేసుకున్నారు. దీనికోసం సదరు సంస్థల నుంచి లక్షలాది రూపాయలు అద్దె రూపంలో వసూలు చేశారని తెలిసింది. టికెట్ కౌంటర్ కలెక్షన్లు రోజుకి రూ.5 నుంచి రూ.10 లక్షల వరకు జరిగేవని తెలిసింది. వీటికి తగిన పన్నులు చెల్లిస్తున్నారా అనే విషయం ఎక్కడా బయటకు రావడం లేదు. చివరకు ప్రసాదం కూడా విక్రయాలు జరిపారని తెలసింది. ఇక్కడ ఏర్పాటు చేసిన దుకాణాల్లో ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేయలేదు. -
అంతా యాపారమే..
ఆధ్యాత్మికత ముసుగులో వసూళ్లు ● ప్రవేశాల నుంచి చెప్పులు స్టాండ్ వరకు రుసుములే.. ● దుకాణాల అద్దెలతో వ్యాపారం ● హోర్డింగ్ కోసం రూ.లక్షల చెల్లించాల్సిందే.. ● బీచ్ రోడ్లోని రామాలయం సెట్పై విమర్శలు వెల్లువ ● తాజాగా కల్యాణం పేరుతో రూ.2,999 వసూలు అయోధ్య మందిరం సెట్ఏయూక్యాంపస్ : దేవుడిని దర్శించుకోవాలంటే టికెట్ కొనాలి. చెప్పులు పెట్టడానికి టికెట్ కొనాలి. దాహం వేసి మంచినీళ్ల కావాలంటే అక్కటే పెట్టిన దుకాణాలలో కొనుగోలు చేయాలి. ఇలా అడుగడుగునా ఆధ్యాత్మికత పేరుతో ప్రజలను దోచుకుంటున్నారు. బీచ్రోడ్డులో ఏర్పాటు చేసిన గరుడ అయోధ్య రామ మందిరం నమూన చుట్టూ ఆర్థిక లావాదేవీలే కనిపిస్తున్నాయి. గత రెండు నెలలుగా బీచ్రోడ్డులో నిర్వహిస్తున్న ఈ ఆధ్యాత్మిక వ్యాపారం వెనుక ఉన్న అనేక అంశాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. దేవుడి పేరుతో దండుకొంటున్నారు దేవుడి పేరు చెప్పి గత రెండు నెలలుగా కోట్లాది రూపాయలు దండుకున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక్కడి పరిస్థితులు సైతం దీనికి అద్దం పడుతున్నాయి. అయోధ్య రామ మందిరం నమూనాను రెండు నెలల క్రితం బీచ్రోడ్డులోని ఒక ప్రైవేటు విల్లాకు సంబంధించిన స్థలంలో నిర్మించారు. ప్రవేశ రుసుముగా రూ.50, చెప్పులు భద్రపరచడానికి రూ.5 చొప్పున వసూలు చేస్తున్నారు. సాధారణ రోజుల్లో వెయ్యి నుంచి నాలుగు వేల మంది, శని, ఆది వారాలలో 5 నుంచి 10 వేల మంది దీనిని దర్శించుకుంటున్నారని తెలుస్తోంది. దీంతో గత రెండు నెలల కాలంలో నిర్వాహకులు భారీగానే సంపాదించారని స్థానికులు చెబుతున్నారు. వీరు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభాలను పొందారనే విషయం స్పష్టం అవుతోంది. అదే విధంగా ఇక్కడ సందర్శకులకు కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వడం లేదు. అక్కడే ఏర్పాటు చేసిన దుకాణాల్లో కొనుక్కోవాల్సిందే. రాముని కల్యాణంతో బయటకు పొక్కింది ఆయోధ్య రాముని కల్యాణోత్సవాలు పేరుతో గత కొన్ని రోజులుగా నగరంలో పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. ఈ నెల 29న నిర్వహించే కల్యాణంలో భద్రాచలం ఆస్థాన పండితులు పాల్గొంటారని పేర్కొన్నారు. రూ.2,999 ధర గల కల్యాణం టికెట్ల కోసం తమను సంప్రదించాలని కోరుతూ ఫోన్ నంబర్లను సైతం ప్రకటించారు. రాముని కల్యాణాన్ని సైతం ఒక వ్యాపార కార్యక్రమంగా మార్చేశారు. దీనిపై భద్రాచలం ఆలయ అధికారులు విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇక్కడ అనధికారికంగా జరుగుతున్న తంతు బయటకు వచ్చింది. నిర్వాహకులు మాత్రం తాము భద్రాచలం ఆస్థాన పండితులు వస్తారని చెప్పలేదని, భద్రాచలం నుంచి పండితులు వస్తారని మాత్రమే చెప్పామని వివరణ ఇచ్చేసి చేతులు దులిపేసుకున్నారు. బాధితులు బయటకు వస్తున్నారు అయోధ్య రామ మందిరం సెట్ వేసిన నిర్వాహకుడు దుర్గాప్రసాద్ చేతిలో నష్టపోయిన కాకినాడకు చెందిన దుర్గ గణేష్ తాజాగా ఒక వీడియో విడుదల చేశాడు. అయోధ్య రామ మందిరం సెట్ పేరుతో రూ.32 లక్షలు ఖర్చుచేయించి, డబ్బులు తిరిగి ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడని ఆరోపించారు. కూరగాయల వ్యాపారం చేసే తనను నమ్మించి కుంభమేళాలో రామ మందిరం సెట్ వేస్తున్నానని, దానిలో పెట్టుబడిగా రూ.30 లక్షలు ఇస్తే రూ.50 లక్షలు ఇస్తానని నమ్మించి మోసం చేశాడని వీడియోలో ఆరోపించాడు. ఇప్పటికే తాను కాకినాడ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిపాడు. -
స్టాండింగ్ కమిటీ ఎన్నికపై వైఎస్సార్ సీపీ సమీక్ష
సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికపై వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లతో సమీక్షా సమావేశం జరిగింది. బుధవారం మద్దిలపాలెం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా ఆధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్పొరేటర్ల సమావేశానికి ముఖ్యఅతిథులుగా శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, పార్లమెంట్ పరిశీలకుడు కదిరి బాబూరావు హాజరయ్యారు. ఇటీవల జీవీఎంసీ మేయర్పై అవిశ్వాస తీర్మానంలో వైఎస్సార్ సీపీ విధించిన విప్ను ధిక్కరించిన 27 మంది కార్పొరేటర్లకు హైకోర్డు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పోటీ చేసే అంశంపై ఆ పార్టీ కార్పొరేటర్లు, ముఖ్యనాయకులతో ఈ సమావేశంలో చర్చించారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్యనాయకుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కుంబా రవిబాబు, సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్కుమార్, మొల్లి అప్పారావు, తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ కుమార్, తిప్పల గురుమూర్తి రెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, డిప్యూటీ మేయర్ కటమురి సతీష్, పార్టీ కార్యాలయం పర్యవేక్షుడు రవిరెడ్డి, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావు, మాజీ రాష్ట్ర కార్యదర్శి గొలగాని శ్రీనివాస్, కార్పొరేటర్లు అక్కరమాని పద్మ, దౌలపల్లి ఏడుకొండలరావు, కోరుకొండ వెంకట రత్న స్వాతి దాస్, కటారి అనిల్ కుమార్, నక్కిల లక్ష్మి, సాడి పద్మారెడ్డి, బిపిన్ కుమార్ జైన్, తోట పద్మావతి, చెన్న జానకిరామ్, గుండాపు నాగేశ్వరరావు, కోడిగుడ్ల పూర్ణిమ, వావిలపల్లి ప్రసాద్, భర్కత్ అలీ, కె.వి.శశికళ, జి.లావణ్య, పి.వి.సురేష్, బల్లా లక్ష్మణ్, మహమ్మద్ ఇమ్రాన్, గుడివాడ సాయి అనూష, ఉరుకూటి రామచంద్రరావు, భూపతి రాజు సుజాత, కో ఆప్షన్ సభ్యులు ఎండీ షరీఫ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మువ్వల సురేష్ , జిల్లా అధికార ప్రతినిధి పల్లా దుర్గ తదితరులు పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అధ్యక్షతన కార్పొరేటర్లతో సమావేశం పాల్గొన్న శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, పార్లమెంట్ పరిశీలకుడు కదిరి బాబూరావు -
కోహినూర్ వజ్రం కథతో ‘వీరమల్లు’
మద్దిలపాలెం: ‘హరి హర వీరమల్లు’ చిత్రం ఆలస్యంగా వచ్చినా ఒక అద్భుతం సృష్టిస్తుందని, ప్రేక్షకుల అంచనాలకు మించి విజయం సాధిస్తుందని ఉప ముఖ్యమంత్రి, చిత్ర కథానాయకుడు పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. బీచ్రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్లో బుధవారం జరిగిన చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన నటన గురువు సత్యానంద్ను, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణిని శాలువాలతో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన పేరే పవన్ అని.. తాను అంతా ఉంటానని అన్నారు. విశాఖతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, తన నటనకు పునాది పడింది ఉత్తరాంధ్రలోనే అని పవన్ అన్నారు. తనకు ఉత్తరాంధ్ర, ఇక్కడి ఆటాపాట చాలా ఇష్టమన్నారు. తనకు నటన నేర్పిన ప్రదేశం విశాఖ అని, అందుకే ఈ నగరంలో ప్రచార కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. ‘నా సినిమా చూడండి అని అడగడం నాకు మోహమాటం. నాకు ఇవ్వడమే తెలుసు.. తీసుకోవడం రాదు’ అని అన్నారు. తన మొదటి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్ర షూటింగ్ వైజాగ్ స్టీల్ప్లాంట్లో జరిగిందని గుర్తు చేసుకున్నారు. ప్రజా కంటకుడైన ఔరంగజేబు తీసుకెళ్లిపోయిన కోహినూర్ వజ్రాన్ని తీసుకురావడం అనే కథాంశంతో, ఈ చిత్రం ఒక అద్భుతమైన హిస్టారికల్ సోషియో ఫాంటసీగా అలరిస్తుందన్నారు. దర్శకులు క్రిష్, జ్యోతికృష్ణ, హీరోయిన్ నిధి అగర్వాల్, నిర్మాత ఎ.ఎం రత్నంల కృషిని అభినందించారు. కీరవాణి సంగీతం, ముఖ్యంగా కై ్లమాక్స్ సన్నివేశాలకు అందించిన నేపథ్య సంగీతం రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుందని కొనియాడారు. సినిమా ఎంటర్టైన్ చేస్తే చాలని చాలా మంది అనుకుంటారని.. నా సినిమాలు ఎంటర్టైన్తో పాటు ఎడ్యుకేట్ చేయాలని కోరుకుంటానని తెలిపారు. ఈ సందర్భంగా పవన్ బైబైయ్యే బంగారు రమణమ్మా.. లబో లబో లబరి గాజులు పాటలు పాడి అలరించారు. హీరోయిన్ నిధి అగర్వాల్, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, నటులు రఘుబాబు, డ్యానియల్ తదితరులు చిత్ర అనుభవనాలను పంచుకున్నారు. గాయనీగాయకులు చిత్రంలోని పాటలు ఆలపించారు. సన్నీ బృందం చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. జనసేన ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ -
బాంబు పేలుళ్లు.. గన్ ఫైరింగ్లు
విశాఖ సిటీ : ఒక్కసారిగా ఢామ్మని బాంబు పేలింది. ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందోనని తేరుకునేలోగా గన్ఫైరింగ్ వినిపించింది.. బాంబుల పొగల నుంచి అధునాతన రైఫిల్స్ పట్టుకుని బ్లాక్ కమాండోలు దూకారు. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. అక్కడున్న ప్రజలు, అటువైపుగా వెళుతున్న వాహనదారుల్లో ఏం జరుగుతోందోన్న ఆందోళన మొదలైంది. చివరకు అది కౌంటర్ టెర్రరిస్ట్ విన్యాసాలని తెలుసుకుని అంతా ఊపిరిపీల్చుకున్నారు. నగరంలో పారిశ్రామిక ప్రాంతాల్లో ఈ నెల 21వ తేదీ నుంచి కౌంటర్ టెర్రరిస్ట్ వ్యాయామాన్ని నిర్వహిస్తున్నారు. గత మూడు రోజులుగా విశాఖ పోర్టు, ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వంటి కీలకమైన ప్రాంతాల్లో టెర్రరిస్ట్ల దాడులను తిప్పికొట్టేలా మాక్ డ్రిల్ చేపట్టారు. ఈ నెల 25వ తేదీ వరకు ఈ డ్రిల్ జరగనుంది. రాష్ట్ర పోలీసులు, అక్టోపస్, అగ్నిమాపక, ఇతర సంబంధిత శాఖల అధికారులు, కేంద్ర బలగాలైన ఎన్ఎస్జీ బృందం సమన్వయంతో ఉగ్రవాద కార్యకలాపాలను చిత్తు చేసే వ్యూహాలను పదును పెట్టేందుకు ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఒకవైపు టెర్రరిస్టులపై విరుచుకుపడుతూనే.. మరోవైపు గాయపడిన తోటి సైనికులకు వైద్య సహకారం అందించేందుకు ఏ విధమైన కార్యచరణ సంసిద్ధం చేయాలన్న దానిపైనా ప్రదర్శన చేశారు. అలాగే ఇందులో ఉద్రవాగుల దాడులను సమర్ధవంతంగా తిప్పికొట్టడంతో పాటు బందీలను రక్షించడం, ఐఈడీ ఆపరేషన్స్ విన్యాసాలు చేశారు. పారిశ్రామిక నగరంలో యుద్ధ వాతావరణం పోర్టు, ఐఎస్పీఆర్ఎల్, బీడీఎల్లో మాక్డ్రిల్ -
ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం చూపండి
జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశం డాబాగార్డెన్స్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో వస్తున్న ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. బుధవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి, డీసీఆర్ ఎస్.శ్రీనివాసరావుతో కలిసి అన్ని విభాగాల ఉన్నతాధికారులు, జోనల్ కమిషనర్లు, వార్డు అడ్మిన్ కార్యదర్శులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో పెండింగ్లో ఉన్న ఫిర్యాదులను మూడు రోజుల్లో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గత 30 రోజులుగా వార్డు సచివాలయాల వారీగా అడ్మిన్ కార్యదర్శుల లాగిన్లలో ఉన్న ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలన్నారు. ఏ విభాగానికి సంబంధించిన ఫిర్యాదునైనా ఆ విభాగాధిపతులు వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ప్రధాన ఇంజనీరు పల్లంరాజు, ప్రధాన వైద్యాధికారి నరేష్ కుమార్, చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకరరావు, యూసీడీ పీడీ సత్యవేణి, డీసీఆర్ శ్రీనివాసరావులను ఆదేశించారు. సచివాలయాల్లో అడ్మిన్ కార్యదర్శులు, ఇతర కార్యదర్శులు క్షేత్రస్థాయికి వెళ్లడం లేదని.. సచివాలయాల్లో కూడా ఉండటం లేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఫీల్డ్ విజిట్కు వెళ్లినప్పుడు మూవ్మెంట్ రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేసి వెళ్లాలని సూచించారు. వార్డు కార్యదర్శులందరూ సచివాలయాల్లో తప్పనిసరిగా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధుల్లో నిమగ్నమై.. ప్రజలకు సేవలు అందించాలని కమిషనర్ ఆదేశించారు. అడ్మిన్ కార్యదర్శులు అనుమతి/సెలవుపై వెళ్లాల్సి వస్తే జోనల్ కమిషనర్కు తెలియజేయాలన్నారు. సచివాలయాల వారీగా రోజుకు ఒకటి లేదా రెండు ప్రజా వినతులు మాత్రమే వస్తాయని, కార్యదర్శులు క్రమశిక్షణతో పనిచేస్తే అసలు వినతులే పెండింగ్లో ఉండవని ఆయన స్పష్టం చేశారు. చాలా మంది ప్లానింగ్ కార్యదర్శులు తమ సంబంధిత విధులను నిర్వహించకుండా ఇతర చోట్ల పని చేస్తున్నారని, అందువల్ల ప్లానింగ్ సమస్యల పరిష్కారానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని జోనల్ కమిషనర్లు తెలపగా.. అటువంటి వారి జాబితాను అందజేయాలని కమిషనర్ ఆదేశించారు. పురమిత్ర యాప్ను ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకుని వినియోగించుకోవాలని కమిషనర్ కోరారు. ఈ యాప్పై ప్రజలకు అవగాహన కల్పించాలని సచివాలయ కార్యదర్శులను కమిషనర్ ఆదేశించారు. -
విశాఖ ఉక్కు ఉద్యోగి ఆత్మహత్య
కూర్మన్నపాలెం: జీవీఎంసీ 87వ వార్డు తిరుమలనగర్లో విశాఖ ఉక్కు ఉద్యోగి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కోక్ ఓవెన్ విభాగంలో పనిచేస్తున్న బొడ్డ శ్రీనివాస్ (32) తన ఇంట్లోని గదిలో సీలింగ్కు ఉరివేసుకొని మృతి చెందాడు. శ్రీనివాస్ విధులకు సక్రమంగా విధుల కు హాజరుకాకపోవడంతో ఉక్కు యాజమాన్యం అతన్ని సస్పెండ్ చేసింది. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. దువ్వా డ పోలీసులు అందించిన వివరాలివి.. శ్రీనివాస్ కొంతకాలంగా మౌనంగా ఉంటూ ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం గదిలోకి వెళ్లి సీలింగ్కు తాడు కట్టి ఉరి వేసుకున్నాడు. కొంతసేపటి తరువాత అతని తండ్రి అప్పలరాజు గది తలుపులు కొట్టగా.. ఎటువంటి స్పందన రాలేదు. స్థానికుల సహాయంతో తలుపులు పగలగొట్టి చూశా రు. అప్పటికే శ్రీనివాస్ మరణించినట్లు గుర్తించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అక్కడికి చేరుకుని శ్రీనివాస్ మృతిపై వివరాలు సేకరించారు. కాగా.. శ్రీనివాస్కు 2016లో ఉక్కు కర్మాగారంలో ఉ ద్యోగం వచ్చింది. కొన్నేళ్ల కిందట తల్లి మంగమ్మ మరణించింది. అతనికి సోద రుడు ఉన్నాడు. ఈ ఘటనపై సీఐ మల్లేశ్వరరావు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. -
కిడ్నీ మహమ్మారి
కబళిస్తున్నభద్రయ్యపేట గ్రామం15 ఏళ్లుగా మృత్యువుతో పోరాడుతున్నాడు కృష్ణ. అతనికి కాళ్లు విరిగినప్పుడు కాదు.. కిడ్నీలు పాడయ్యాయని తెలిసినప్పుడు జీవితం అగమ్యగోచరంలా మారింది. కేవలం కృష్ణ ఒక్కడే కాదు, అతని తల్లి, తమ్ముడు, భార్య.. ఇలా అతని కుటుంబంలో నలుగురు ఇదే మహమ్మారితో యుద్ధం చేస్తున్నారు. ఇది కేవలం కృష్ణ కుటుంబ కథ కాదు. పద్మనాభం మండలం భద్రయ్యపేట అనే చిన్న గ్రామంలోని బాధితుల వ్యధ. ఏడేళ్లలో 20 మందిని బలిగొని, మరో 50 మందిని మంచాన పడేసిన ఈ కిడ్నీ వ్యాధి ఇప్పుడు ఆ ఊరిని నిశ్శబ్దంగా మింగేస్తోంది. డీఎంహెచ్వో పర్యటన డీఎంహెచ్వో పి. జగదీశ్వరరావు తన బృందంతో కలిసి బుధవారం భద్రయ్యపేటను సందర్శించారు. బాధితులతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు. రేవిడి పీహెచ్సీ వైద్యాధికారులు, సిబ్బంది భద్రయ్యపేటలోనే అందుబాటులో ఉండి వైద్యం అందించాలని ఆదేశించారు. నడుము నొప్పి, నీరసం, ఒంటి నొప్పులు వంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే ఆరోగ్య కేంద్రానికి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఏఎంసీ వైద్య బృందాన్ని గ్రామానికి పంపిస్తామని హామీ ఇచ్చారు. అయితే గ్రామంలో నీరు కలుషితం కాలేదని ఆయన స్పష్టం చేశారు. ఎంపీడీవో ఎం. విజయ్కుమార్, కార్యదర్శి నూర్జహాన్, డాక్టర్ బి. ఉమావతి, ఇతర అధికారులు పాల్గొన్నారు. పద్మనాభం: మండలం రెడ్డిపల్లి పంచాయతీలోని భద్రయ్యపేట గ్రామస్తులను కిడ్నీ వ్యాధి తీవ్రంగా పట్టిపీడిస్తోంది. గ్రామంలోని మూడు వందల జనాభాలో ఇప్పటికే 50 మంది ఈ వ్యాధి బారిన పడ్డారని ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. గడిచిన ఏడేళ్లలో సుమారు 20 మంది కిడ్నీ వ్యాధితోనే మృతి చెందడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ క్రమంలో తమకు రక్తపరీక్షలు నిర్వహించాలని గ్రామస్తులు రేవిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) వైద్యులకు వినతిపత్రం అందించారు. వారి అభ్యర్థన మేరకు పీహెచ్సీ వైద్య సిబ్బంది మేలో 138 మంది నుంచి రక్త నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 50 మంది రక్తంలో క్రియేటినిన్ స్థాయిలు ఉండాల్సిన దాని కంటే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వారికి కిడ్నీ వ్యాధి సోకినట్లు మూడు రోజుల కిందట పీహెచ్సీ సిబ్బంది నిర్ధారించడంతో గ్రామస్తుల్లో ఆందోళన మరింత పెరిగింది. వీరికి మళ్లీ పరీక్షలు జరిపేందుకు మంగళవారం కొంతమందిని, బుధవారం మరికొంతమందిని కేజీహెచ్కు తరలించారు. ఒకే కుటుంబంపై తీవ్ర ప్రభావం ఈ వ్యాధి ఆల్తి గోపాల్ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఇప్పటికే ఆయన ఇంట్లో బుచ్చిబాబు, సన్యాసమ్మ, అప్పలనరసమ్మ కిడ్నీ వ్యాధితో మృతి చెందారు. ఆయనతో కలిపి ఆ ఇంట్లో మొత్తం నలుగురు మరణించారు. జూన్లోనే అప్పలనరసమ్మ కన్నుమూశారు. మరోవైపు వృద్ధురాలు కొరాడ రాములమ్మతో పాటు ఆమె కుమారులు కృష్ణ (54), శ్రీను (30), కోడలు చినతల్లి (49) కూడా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. కారణాలపై అనుమానాలు గ్రామంలో రక్షిత మంచినీటి పథకం ద్వారా శుద్ధి చేసిన నీరు అందుబాటులో ఉన్నప్పటికీ, ఆ నీటిని రాత్రిపూట పట్టి ఉంచితే తెల్లవారేసరికి సున్నం రంగులోకి మారిపోతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి సమీపంలో మూడు క్వారీలు ఉన్నాయి. క్వారీల్లో రాయిని పగలగొట్టడానికి ఉపయోగించే పేలుడు పదార్థాల రసాయనాలు విషతుల్యమై, భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నాయని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. భద్రయ్యపేటలో ఏడేళ్లలో 20 మంది మృతి 138 మందికి పరీక్షలు చేస్తే 50 మందికి వ్యాధి నిర్ధారణ ఇందుకు కారణం క్వారీలా? కలుషిత నీరా? -
మౌలిక వసతులపై దృష్టిసారించండి
బీచ్రోడ్డు: ఎన్టీఆర్ కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలతో పాటు మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. 2026 మార్చి నాటికి అన్ని ఇళ్లు పూర్తి కావాలని నిర్దేశించారు. రోజువారీ లక్ష్యాలు పెట్టుకొని పనిచేయాలని సూచించారు. బుధవారం హౌసింగ్, స్పెషల్ ఆఫీసర్లు, ఇతర అధికారులతో కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై లేఅవుట్ వారీగా సమీక్షించారు. నాణ్యత విషయంలో రాజీ లేకుండా ఇళ్ల నిర్మాణాల పనులు చేయించాలని పేర్కొన్నారు. లక్ష్య సాధనలో విఫలమైన అధికారులు, సిబ్బందికీ మూడు దఫాలు మెమోలు, షోకాజ్ నోటీసులు ఇవ్వాలని, అప్పటికీ పురోగతి లేకపోతే సస్పెండ్కు రిఫర్ చేయాలని హౌసింగ్ పీడీని ఆదేశించారు. మంజూరైన ప్రతి ఒక్కరితో ఇల్లు కట్టించి తీరాల్సిందేనని.. అప్పటికీ ఇల్లు నిర్మాణానికి ఆసక్తి చూపకపోతే సంబంధిత లబ్ధిదారుల పట్టాను, ఇల్లును రద్దు చేస్తామని చెప్పాలని అధికారులకు సూచించారు. అలాగే విద్యుత్, తాగునీరు, డ్రెయిన్లు, అప్రోచ్ రోడ్లు వంటి మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని వివిధ విభాగాల అధికారులను ఆదేశించారు. పాపాయి సంతపాలెం, విజయపాలెం లేఅవుట్లలో అప్రోచ్ రోడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న ఇళ్ల వివరాలను తెలుపుతూ నివేదిక పంపించాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో గృహ నిర్మాణ శాఖ పీడీ సత్తిబాబు, ఈఈ శ్రీనివాసరావు, డీఈలు, ఏఈలు, లేఅవుట్ ఇన్చార్జి అధికారులు, ప్రత్యేక అధికారులు, వర్చ్వుల్గా ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వార్డు ఎమెనిటీస్ సెక్రటరీలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ కాలనీల్లో ఇళ్ల నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ సమీక్ష -
గడువు దాటిన ఎనర్జీ డ్రింక్స్ పంపిణీ
పట్టించుకోని జీవీఎంసీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు మధురవాడ: గడువు దాటిన తర్వాత ఏ వస్తువునైనా వాడితే అది విషతుల్యంగా మారుతుందన్నది జగమెరిగిన సత్యం. అయినప్పటికీ మధురవాడ, మిథిలాపురి, వుడా కాలనీల పరిసర ప్రాంతాల్లో, ముఖ్యంగా పేదలు అధికంగా నివసించే చోట ప్రముఖ సంస్థకు చెందిన ఎనర్జీ డ్రింక్స్ను ఆటోల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ డ్రింక్స్కు గడువు తేదీ ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండటం, కొన్ని గడువు దాటిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ డ్రింక్స్ విషపూరితమని తెలియని పేద ప్రజలు, చిన్నా పెద్దా తేడా లేకుండా, ఎగబడి వీటిని తీసుకుని ఇళ్లల్లో నిల్వ చేసుకుంటున్నారు. కొందరు వాటిని వెంటనే తాగుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన డాక్టర్ ఆదిత్య మాట్లాడుతూ గడువు దాటిన తర్వాత ఈ డ్రింక్స్ను వాడితే ఆరోగ్యానికి ప్రమాదమని హెచ్చరించారు. అంతేకాకుండా వీటిలో కెఫీన్ ఉండటం వల్ల గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, ముఖ్యంగా పిల్లలకు ఇది మరింత హానికరమన్నారు. ఇటువంటి సంఘటనలు నిత్యం అనేక ప్రాంతాల్లో జరుగుతున్నప్పటికీ.. వీటిని నియంత్రించాల్సిన జీవీఎంసీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై మధురవాడ జోన్ ఫుడ్ సేఫ్టీ అధికారి ఆనందరావును వివరణ కోరగా.. ఇలాంటి డ్రింక్స్ను పంచుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆటో, పంపిణీ చేస్తున్న వ్యక్తుల వివరాల కోసం విచారణ జరుపుతున్నామని తెలిపారు.