breaking news
Technology
-
ఇన్స్టాగ్రామ్లో ‘మ్యాప్’ ఫీచర్
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వాడే ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ ఈరోజు నుంచి భారత మార్కెట్లో “మ్యాప్” ఫీచర్ను ప్రారంభించింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ చుట్టుపక్కల ఉన్న రెస్టారెంట్లు, కేఫేలు, టూరిస్టు ప్రదేశాలు, షాపింగ్ సెంటర్లు, ఈవెంట్లు మొదలైనవాటిని ప్రత్యక్షంగా మ్యాప్లో వీక్షించవచ్చు.ఈ ఫీచర్తో స్థానిక వ్యాపారాలకు పెద్ద ఎత్తున ప్రాచుర్యం లభించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యూజర్లు తమ పోస్టులు లేదా స్టోరీల్లో లొకేషన్ ట్యాగ్ చేస్తే — ఆ కంటెంట్ ఆ ప్రాంతానికి సంబంధించిన మ్యాప్ వ్యూలో కూడా ప్రత్యక్షమవుతుంది. దీని ద్వారా సమీప ప్రాంతాల్లో ఉన్న ఇతర యూజర్లు ఆ ప్రదేశాన్ని సులభంగా గుర్తించే అవకాశాలుంటాయి.ఈ ఫీచర్లో యూజర్లు లొకేషన్ ట్యాగ్లను పూర్తి నియంత్రణలో ఉంచవచ్చు. లొకేషన్ను పబ్లిక్గా, ఫ్రెండ్స్కి మాత్రమే లేదా ప్రైవేట్గా ఉంచే ఆప్షన్లు ఉంటాయి. 18 ఏళ్ల లోపు వయసున్న యూజర్ల ఖాతాల్లో లొకేషన్ డిఫాల్ట్గా ఆఫ్లో ఉంటుంది.భారతీయ యూజర్లలో లొకేషన్ ఆధారిత కంటెంట్ వినియోగం వేగంగా పెరుగుతోందని, అందుకే ఈ ఫీచర్ను ప్రత్యేకంగా ప్రారంభించినట్లు ఇన్స్టా వర్గాలు చెబుతున్నాయి. -
తెలంగాణ టి-ఫైబర్కు జాతీయ గుర్తింపు..
తెలంగాణ టి-ఫైబర్కు (Telangana T-Fiber ) జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2025లో టి-ఫైబర్ పైలట్ విలేజెస్ డిజిటల్ ఇన్క్లూజన్ విజయానికి ప్రశంసలు పొందాయి. కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ చొరవను "ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్" గా అభివర్ణించారు. గ్రామీణ బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీకి వినూత్న విధానాన్ని అవలంభిస్తున్నందుకు తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబును అభినందించారు.ఈ సందర్బంగా కేంద్ర సమాచార శాఖ మంత్రి అధ్యక్షతన జరిగిన ఐటీ మంత్రుల రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. భారత్ నెట్ అమలును వేగవంతం చేయడానికి, రైట్ ఆఫ్ వే (ఆర్ఓడబ్ల్యూ) సవాళ్లను పరిష్కరించడానికి, జాతీయ, రాష్ట్ర డిజిటల్ ఆస్తులను రక్షించడానికి సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్ వర్క్ లను బలోపేతం చేయడానికి కేంద్రంతో భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి తెలంగాణ నిబద్ధతను పునరుద్ఘాటించారు.ప్రతి ఇల్లు, సంస్థ, వ్యాపారాలకు హై-స్పీడ్ కనెక్టివిటీని అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రధాన బ్రాడ్ బ్యాండ్ చొరవ అయిన టి-ఫైబర్ కింద సాధించిన పురోగతిని ఆయన వివరింంచారు. మంత్రితో పాటు టి-ఫైబర్ మేనేజింగ్ డైరెక్టర్ వేణు ప్రసాద్ పన్నీరు కూడా ఉన్నారు. పైలట్ గ్రామాల నుంచి రాష్ట్ర విజయగాథలు, డేటా-ఆధారిత ఫలితాలను ఆయన వివరించారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 (India Mobile Congress- IMC) అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 11 వరకు నాలుగు రోజులపాటు జరగనుంది. డిజిటల్ టెక్నాలజీ, టెలికాం ఆవిష్కరణలకు భారతదేశ ప్రధాన వేదికగా విధాన రూపకర్తలు, పరిశ్రమ నాయకులు, ప్రపంచ నిపుణులను ఒకచోట చేర్చింది. -
TCS: వాళ్లందరికీ కనీసం ఆర్నెళ్ల జీతం..
దేశీయ ఐటీ సంస్థ టీసీఎస్ (TCS) ఇటీవల భారీ లేఆఫ్ ప్రణాళికను (TCS Layoff)ప్రకటించింది. సుమారు 12,000 మందిని తొలగిస్తున్నట్లు తెలిపింది. ఈ తొలగింపులతో ప్రభావితమవుతున్న ఉద్యోగులకు వివిధ స్థాయిల సెవెరెన్స్ ప్యాకేజీని అమలు చేస్తోంది. ఏఐ, డేటా, సైబర్ సెక్యూరిటీలో కంపెనీ పెట్టుబడులను పెంచుతున్న నేపథ్యంలో సిబ్బంది పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. ఈ నిర్ణయం సోషల్ మీడియాలో కలకలం రేపింది.సంస్థలో ఎవరి నైపుణ్యాలైతే పనికిరావో లేదా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం పొందడానికి అవకాశం లేదో అలాంటి వారిని టీసీఎస్ తొలగిస్తోంది. వీరందరికీ మూడు నెలల నోటీసు వ్యవధి చెల్లింపుతో పాటు ఆరు నెలల నుండి ఒక సంవత్సరం జీతాన్ని సెవెరెన్స్ ప్యాకేజీ కింద అందిస్తోంది. ఇది సంస్థలో వారి సర్వీస్ కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అయితే అందరికీ కనీసం ఆరు నెలల వేతనాన్ని ఇవ్వాలని నిర్ణయించారు.ప్రభావిత ఉద్యోగులు మరో ఉద్యోగం వెతుక్కోవడంలో సహాయపడటానికి, టీసీఎస్ మూడు నెలల వరకు అవుట్ ప్లేస్ మెంట్ ఏజెన్సీ ఫీజులను అందిస్తోంది. అదే జూనియర్ అసోసియేట్లకు అయితే ఇంకొన్ని నెలలు ఈ సహాయాన్ని అందించనుందని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. ఇక అలాగే ఉద్యోగులకు అందించే మానసిక ఆరోగ్య సాయం టీసీఎస్ కేర్స్ను కూడా కొన్నాళ్ల పాటు వారికి కొనసాగించనుంది.బెంచ్లో ఉన్నవారికి మూణ్నెళ్ల జీతమే..బెంచ్లో ఉండి లేదా ఎనిమిది నెలలకు పైగా వర్క్ కేటాయించని ఉద్యోగులు తొలగింపునకు గురైతే వారు ప్రామాణిక మూడు నెలల నోటీసు వ్యవధి వేతనాన్ని మాత్రమే పొందుతారు. రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నవారికి, పదవీ విరమణ ప్రయోజనాలు, బీమాకు పూర్తి ప్రాప్యతతో ముందస్తు రిటైర్మెంట్ ఎంపికను టీసీఎస్ అందించింది. అలాంటి వారు మిగిలిఉన్న సర్వీస్ కాలాన్ని బట్టి ఆరు నెలల నుండి రెండేళ్ల వరకు జీతాన్ని సెవెరెన్స్ ప్యాకేజీగా అందుకుంటారు.ఇదీ చదవండి: దీపావళి ధమాకా.. ఐఫోన్పై రూ.55 వేల డిస్కౌంట్! -
ఏఐ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలి
ముంబై: ప్రజలను మోసగించేందుకు నేరగాళ్లు కృత్రిమ మేధను (ఏఐ) ఉపయోగించి క్లోనింగ్, ఫేక్ వీడియోల్లాంటివి సృష్టిస్తున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ దుర్వినియోగం కాకుండా అడ్డుకట్ట వేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని, రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థలను పటిష్టం చేసుకోవాలని ఫిన్టెక్ సంస్థలకు సూచించారు. 6వ గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2025లో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు చెప్పారు. వివిధ రకాల ఏఐ ఉత్పత్తులు, సరీ్వసులను రూపొందించే విషయంలో గ్లోబల్ హబ్గా ఎదిగే సత్తా భారత్కి ఉందని మంత్రి చెప్పారు.ప్రపంచవ్యాప్తంగా పలు రకాల అవసరాలకు ఉపయోగపడే ఏఐ ఉత్పత్తులను సృష్టించగలదని, ఏఐ ఐడియాలను అభివృద్ధి చేసేందుకు, ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు ప్రయోగశాలగా కూడా ఉండగలదని ఆమె పేర్కొన్నారు. ఏఐ చీకటి కోణం..: ఏఐతో ఆర్థిక రంగం, గవర్నెన్స్లో సానుకూల మార్పులు వచి్చనప్పటికీ, ఈ టెక్నాలజీలో చీకటి కోణం కూడా ఉందని ఆమె చెప్పారు. ‘ఏఐతో అసాధారణ అవకాశాలు లభిస్తాయి. అదే సమయంలో అది దుర్వినియోగం కాకుండా కూడా మనం కట్టడి చేయాలి.కొత్త ఆవిష్కరణలకు దన్నుగా నిల్చే సాధనాలే మోసాలు చేసేందుకు ఆయుధాలుగా కూడా మారే అవకాశాలు ఉన్నాయి. ప్రజలను తప్పుదారి పట్టించేలా, వాస్తవాలను కప్పిపుచ్చేలా తయారు చేసిన నా డీప్ఫేక్ వీడియోలు ఎన్నో ఆన్లైన్లో సర్క్యులేట్ అవుతుండటాన్ని నేను స్వయంగా చూశాను. ఇలాంటి వాటిని తక్షణం ఎదుర్కొనేందుకు మన వ్యవస్థలను తక్షణం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది‘ అని చెప్పారు. ఆర్థిక సాధికారతకు ఫిన్టెక్ దన్ను.. ఫిన్టెక్ అనేది ఏదో పట్టణ ప్రాంతాలకు పరిమితమైన సౌకర్యం కాదని, దేశవ్యాప్తంగా ఆర్థిక సాధికారతకు ఉపయోగపడే సాంకేతికతని మంత్రి చెప్పారు. యూపీఐ, డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలతో రోజువారీ జరిపే చెల్లింపుల తీరుతెన్నులను ఇది మార్చేసిందని పేర్కొన్నారు. ప్రపంచంలో దాదాపు సగభాగం రియల్ టైమ్ డిజిటల్ లావాదేవీలు భారత్లో జరుగుతున్నాయని తెలిపారు. ‘మనం ఆర్థికంగా ఎలాంటి భవిష్యత్తును కోరుకుంటున్నాం, దాన్ని ఎలా సాధించదల్చుకుంటున్నాం అనేది ఆలోచించుకునేందుకు ఇది సరైన తరుణం. ఆదాయ వృద్ధి, కొత్త ఆవిష్కరణలు, లాభదాయకత, రిస్క్ సామర్థ్యాలు మొదలైన ప్రాథమికాంశాలపై ఫిన్టెక్లు తప్పకుండా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది‘ అని వివరించారు.బయోమెట్రిక్తో యూపీఐ చెల్లింపులు..ఏకీకృత చెల్లింపు విధానం (యూపీఐ)కి సంబంధించిన పలు సొల్యూషన్స్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఆవిష్కరించింది. ప్రస్తుతం డివైజ్లో యూపీఐ లావాదేవీ ధ్రువీకరణ కోసం ఉపయోగిస్తున్న పిన్ నంబరు స్థానంలో, బయోమెట్రిక్ విధానాన్ని (వేలి ముద్ర, ఫేస్ అన్లాక్) వాడేందుకు ఉపయోగపడే టెక్నాలజీని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు ప్రవేశపెట్టారు.ఏటీఎంలలో నగదు విత్డ్రాయల్తో పాటు యూపీఐ పిన్ను సెట్ చేసేందుకు లేదా రీసెట్ చేసేందుకు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. కొత్త యూజర్లు, సీనియర్ సిటిజన్లను కూడా యూపీఐ చెల్లింపుల పరిధిలోకి చేర్చేందుకు ఇది తోడ్పడుతుందని ఎన్పీసీఐ వివరించింది. అలాగే యూపీఐ క్యాష్ పాయింట్లలో యూపీఐని ఉపయోగించి నగదును విత్డ్రా చేసుకునే సదుపాయాన్ని కూడా ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. యూపీఐ లైట్ ద్వారా వేరబుల్ స్మార్ట్గ్లాసెస్తో కూడా చెల్లింపులు జరిపే సొల్యూషన్ని రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ టి. రవి శంకర్ ఆవిష్కరించారు. ఫోన్తో పని లేకుండా, పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా క్యూఆర్ని స్మార్ట్ కళ్లద్దాలతో స్కాన్ చేసి, వాయిస్ కమాండ్తో పేమెంట్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. చిన్న మొత్తాల్లో చెల్లింపులు అవసరమయ్యే రోజువారీ కొనుగోళ్లకు ఇది ఉపయోగకరం. ఇక జాయింట్ అకౌంట్ హోల్డర్లు కూడా చెల్లింపుల కోసం యూపీఐని ఉపయోగించే సదుపాయాన్ని ఆవిష్కరించింది. అటు ఎన్పీసీఐ ఇంటర్నేషనల్తో జట్టు కట్టినట్లు పేపాల్ ప్రకటించింది. -
6జీ అభివృద్ధిలో భారత్ పాత్ర కీలకం
భారతదేశం 6జీ టెక్నాలజీ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో, ప్రపంచవ్యాప్త భాగస్వామ్యాలను ఏర్పాటు చేయడంలో చురుకుగా ముందుకు సాగుతోంది. విశ్వసనీయ భాగస్వామిగా భారత్కు ఉన్న అంతర్జాతీయ గుర్తింపు 6జీ వ్యవస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు గట్టిగా నమ్ముతున్నారు. ఈ నెల 8 నుంచి 11 వరకు న్యూఢిల్లీలో నిర్వహించే ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2025లో ఈమేరకు చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో 6జీ టెక్నాలజీ, దాని స్పెక్ట్రమ్ పరిమితులు, భారత్పై ప్రభావం, ప్రపంచవ్యాప్త అభివృద్ధి గురించి వివరంగా తెలుసుకుందాం.6జీ టెక్నాలజీ అంటే ఏమిటి?6జీ అనేది వైర్లెస్ కమ్యూనికేషన్ ఆరో తరం సాంకేతికత. ఇది ప్రస్తుతం ఉన్న 5జీ నెట్వర్క్ల సామర్థ్యాన్ని, వేగాన్ని, విశ్వసనీయతను గణనీయంగా పెంచుతుంది. 6జీ సాంకేతికత ప్రధాన లక్ష్యం అల్ట్రా-హైస్పీడ్, అల్ట్రా-లో లేటెన్సీ (చాలా తక్కువ జాప్యం), భారీ కనెక్టివిటీతో కూడిన కమ్యునికేషన్ను సృష్టించడం.6జీ ముఖ్య లక్షణాలుఅత్యధిక వేగం (Ultra-High Speed)6జీ నెట్వర్క్లు సెకనుకు 1 టెరాబిట్ (Tbps) లేదా అంతకంటే ఎక్కువ గరిష్ట డేటా ట్రాన్స్ఫర్ రేటును అందించగలవని అంచనా. ఇది 5జీ కంటే 100 రెట్లు ఎక్కువగా ఉంటుందని కొందరు చెబుతున్నారు.చాలా తక్కువ జాప్యం (Ultra-Low Latency)డేటా బదిలీకి పట్టే సమయం 100 మైక్రోసెకన్ల కంటే తక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ అతి తక్కువ జాప్యం వల్ల రియల్-టైమ్ ఆపరేషన్స్, క్లిష్టమైన అప్లికేషన్లు మరింత సులభతరం అవుతాయి.విస్తృత కనెక్టివిటీ (Massive Connectivity)ఒక చదరపు కిలోమీటరుకు కోట్లాది డివైజ్లను కనెక్ట్ చేసే సామర్థ్యం 6జీకి ఉంటుంది. ఇది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), స్మార్ట్ సిటీస్ విస్తరణకు ఎంతో తోడ్పడుతుంది.ఏఐ ఏకీకరణ (AI Integration)ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML) నెట్వర్క్తో పూర్తిగా కలిసిపోయి ఆటోమేటెడ్, సమర్థవంతమైన నెట్వర్క్ నిర్వహణను అందిస్తుంది.హోలోగ్రాఫిక్ కమ్యూనికేషన్6జీ ద్వారా త్రీ-డైమెన్షనల్ (3D) హోలోగ్రాఫిక్ కమ్యూనికేషన్, వర్చువల్ రియాలిటీ (VR), ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) వంటి ఇమ్మర్సివ్ అనుభవాలు సాధ్యమవుతాయి.6జీకి కావాల్సిన స్పెక్ట్రమ్ పరిమితులు6జీ నెట్వర్క్లకు కావాల్సిన అత్యంత వేగం, సామర్థ్యం కోసం ప్రస్తుతం వాడుకలో ఉన్న ఫ్రీక్వెన్సీ బ్యాండ్లతో పాటు కొత్త, విశాలమైన స్పెక్ట్రమ్ బ్యాండ్లు అవసరం. 6జీ కోసం దృష్టి సారిస్తున్న ప్రధాన స్పెక్ట్రమ్ పరిమితులు కింది విధంగా ఉంటాయి.సబ్-టెరాహెర్ట్జ్ (Sub-Terahertz - Sub-THz) బ్యాండ్ఇది 90 GHz (గిగాహెర్ట్జ్) నుంచి 3 THz (టెరాహెర్ట్జ్) మధ్య ఉండే ఫ్రీక్వెన్సీ పరిధి. ఈ బ్యాండ్ చాలా విశాలమైన బ్యాండ్విడ్త్ను అందిస్తుంది. దీని ద్వారానే 1 Tbps వేగం సాధ్యమవుతుందని అంచనా. అయితే ఈ ఫ్రీక్వెన్సీల్లో సిగ్నల్స్ పరిధి తక్కువగా ఉండి భవనాలు వంటి అడ్డంకులను దాటడం కష్టం. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.సెంటీమీటర్ వేవ్ (cmWave) బ్యాండ్ప్రస్తుతం 5జీకి వాడుతున్న మిడ్-బ్యాండ్ ఫ్రీక్వెన్సీలకు దగ్గరగా ఉండే 7 GHz నుంచి 15 GHz మధ్య ఉన్న ఈ బ్యాండ్ను ‘6జీ గోల్డెన్ బ్యాండ్’గా పరిగణిస్తున్నారు. ఇది మంచి కవరేజ్, సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 6జీ కోసం 1.5-2 GHz మిడ్-బ్యాండ్ స్పెక్ట్రమ్ అవసరమని పరిశోధకులు భావిస్తున్నారు.ఇండియాలో 6జీ వస్తే చోటు చేసుకోనున్న పరిణామాలుఇండియాలో ‘భారత్ 6జీ విజన్’ కింద 6జీ సాంకేతికతను 2030 నాటికి అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత్ వంటి అతిపెద్ద జనాభా గల దేశంలో 6జీ రాక వల్ల భారీ పరివర్తనలు సంభవిస్తాయి.డిజిటల్ విప్లవం: 6జీ గ్రామీణ, సరైన కనెక్టివిటీలేని ప్రాంతాలకు సైతం మెరుగైన కమ్యునికేషన్ అందిస్తుంది.ఆరోగ్య సంరక్షణ (Healthcare): రియల్-టైమ్ టెలిసర్జరీలు, రిమోట్ పేషెంట్ మానిటరింగ్, ఏఐ-ఆధారిత డయాగ్నోస్టిక్స్ వంటివి విస్తృతం అవుతాయి. అంబులెన్స్లు, ఆసుపత్రులు సహా అన్ని వైద్య మౌలిక సదుపాయాలు ఏఐ ఆధారితంగా అనుసంధానమవుతాయి.విద్య (Education): విద్యార్థులు వర్చువల్ టీచర్లతో, క్లాస్మేట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, ఎక్కడైనా, ఎప్పుడైనా నాణ్యమైన విద్యా వనరులను పొందేందుకు 6జీ ఉపయోగపడుతుంది.పరిశ్రమల ఆటోమేషన్ (Industrial Automation): స్మార్ట్ ఫ్యాక్టరీల్లో యంత్రాల రియల్-టైమ్ రిమోట్ కంట్రోల్, ఏఐ-ఆధారిత ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్, రోబోటిక్స్ వంటివి ఉత్పత్తి సామర్థ్యాన్ని, నాణ్యతను అసాధారణంగా పెంచుతాయి.రవాణా (Transportation): అర్బన్ ఎయిర్ మొబిలిటీ (UAM), అటానమస్ వాహనాల (Self-Driving Cars) కోసం 6జీ కమ్యూనికేషన్ అత్యంత అవసరం. ట్రాఫిక్ నిర్వహణ, లాజిస్టిక్స్లో డ్రోన్ ఫ్లీట్ల వాడకం పెరుగుతుంది.రక్షణ రంగం (Defence): కమాండర్లకు వేగవంతమైన, రియల్-టైమ్ క్షేత్ర సమాచారం అందించేందుకు వీలవుతుంది. సురక్షితమైన కమ్యూనికేషన్, డ్రోన్లు, హైపర్సోనిక్ ఆయుధాలకు కమ్యూనికేషన్ లింక్లు అందించడం ద్వారా రక్షణ సామర్థ్యం పెరుగుతుంది.ఈ టెక్నాలజీ వివిధ దేశాల పరిశోధనలుప్రస్తుతానికి ప్రపంచంలో ఏ దేశంలోనూ పూర్తిగా వాణిజ్యపరమైన (Commercial) 6జీ నెట్వర్క్ వాడుకలో లేదు. 6జీ సాంకేతికతను 2030 నాటికి వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుని అభివృద్ధి, పరిశోధన (R&D)లో వివిధ దేశాలు, టెక్ కంపెనీలు చురుగ్గా పోటీ పడుతున్నాయి.6జీ అభివృద్ధిలో ముందున్న దేశాలుచైనా: 6జీ పరిశోధన, అభివృద్ధిలో ముందంజలో ఉంది. చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది. టెరాహెర్ట్జ్ సిగ్నల్ ప్రసారాన్ని పరీక్షించేందుకు ఇప్పటికే ప్రయోగాత్మక ఉపగ్రహాన్ని (Experimental Satellite) ప్రయోగించింది. 6జీ పేటెంట్ ఫైలింగ్స్లో చైనా అగ్రస్థానంలో ఉంది.దక్షిణ కొరియా: 5జీని వేగంగా అమలు చేసిన దక్షిణ కొరియా 6జీలో కూడా బలమైన పోటీదారుగా ఉంది. శాంసంగ్, ఎల్జీ వంటి దిగ్గజ సంస్థలు 6జీ R&D కేంద్రాలను ఏర్పాటు చేశాయి. 2028 నాటికి 6జీని వాణిజ్యపరంగా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.జపాన్: టెక్నాలజీ అభివృద్ధిలో తన నైపుణ్యాన్ని కొనసాగిస్తూ 2030 నాటికి 6జీని ఆవిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.యునైటెడ్ స్టేట్స్, యూరప్: యూఎస్ ‘నెక్స్ట్ G అలయన్స్’ ద్వారా ఈయూ ఆధ్వర్యంలో ‘హెక్సా-ఎక్స్’ (Hexa-X) వంటి చొరవలతో 6జీ పరిశోధనలో చురుకుగా పాల్గొంటున్నాయి.ప్రస్తుత డిజిటల్ అభివృద్ధిపైన తెలిపిన దేశాలు ఇంకా 6జీని వాడకపోయినా 5జీని వేగంగా, విస్తృతంగా అమలు చేస్తున్నాయి. ఉదాహరణకు దక్షిణ కొరియా వంటి దేశాలు ప్రపంచంలోనే అత్యధిక 5జీ కవరేజ్, వేగాన్ని కలిగి ఉన్నాయి. ఇది ఇప్పటికే రిమోట్ సర్జరీ, ఏఐ-ఆధారిత స్మార్ట్ ఫ్యాక్టరీలు వంటి డిజిటల్ ఆవిష్కరణలకు మార్గం సుగమం చేస్తోంది. 6జీ రాకతో ఈ డిజిటల్ అభివృద్ధి మరింత వేగవంతమై ఊహించని పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.చివరగా..6జీ టెక్నాలజీ అనేది కేవలం మొబైల్ స్పీడ్ను పెంచేది మాత్రమే కాదు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ, హోలోగ్రాఫిక్స్, అటానమస్ సిస్టమ్స్ వంటి వాటిని అనుసంధానించే ఒక కొత్త డిజిటల్ ఫ్రేమ్వర్క్. భారత్ తన ‘భారత్ 6జీ విజన్’తో ఈ రేసులో దూసుకుపోతోంది. విశ్వసనీయ భాగస్వామిగా ఉన్న భారత్ అంతర్జాతీయ సహకారంతో 6జీ సాంకేతికతను అభివృద్ధి చేయడంలో విజయం సాధిస్తే అది దేశ సామాజిక-ఆర్థిక పురోగతిని, ప్రపంచ టెక్నాలజీ రంగంలో దాని నాయకత్వాన్ని బలోపేతం చేస్తుంది. ఈ ఆవిష్కరణతో ప్రజల జీవన నాణ్యత మెరుగుపడటంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు వస్తుందని చెప్పవచ్చు.ఇదీ చదవండి: సోషల్ మీడియాలో మోసపూరిత కంటెంట్ తొలగింపు -
కొత్త మొబైల్ యూజర్లలో టాప్ కంపెనీ
కొత్త మొబైల్ యూజర్లకు సంబంధించి ఆగస్టులో రిలయన్స్ జియో జోరు కొనసాగగా, ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ దాదాపు ఏడాది తర్వాత భారతి ఎయిర్టెల్ను అధిగమించింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ గణాంకాల ప్రకారం మొబైల్ సెగ్మెంట్లో ఆగస్టులో నికరంగా 35.19 లక్షల కొత్త కనెక్షన్లు నమోదయ్యాయి. జియో కస్టమర్లు అత్యధికంగా 19 లక్షల మేర పెరగ్గా బీఎస్ఎన్ఎల్ (13.85 లక్షలు), ఎయిర్టెల్ (4.96 లక్షలు) తర్వాత స్థానాల్లో నిల్చాయి.చివరిసారిగా 2024 సెప్టెంబర్లో అన్ని ప్రైవేట్ సంస్థలను మించి బీఎస్ఎన్ఎల్ అత్యధికంగా యూజర్లను దక్కించుకుంది. అప్పట్లో కంపెనీ 3జీ సేవలను మాత్రమే అందించేది. అయితే, ప్రైవేట్ టెల్కోలు టారిఫ్లను పెంచేయడం బీఎస్ఎన్ఎల్కి కలిసొచ్చింది. కంపెనీ ఇటీవలే దేశవ్యాప్తంగా 4జీ సర్వీసులు ప్రారంభించింది. ఇక, తాజాగా జూలైలో 122 కోట్లుగా ఉన్న మొత్తం టెలిఫోన్ సబ్ర్స్కయిబర్స్ సంఖ్య ఆగస్టులో 122.45 కోట్లకు చేరింది. వొడాఫోన్ ఐడియా అత్యధికంగా 3.08 లక్షల యూజర్లను కోల్పోయింది. బ్రాడ్బ్యాండ్ సెగ్మెంట్లో (మొబైల్, ఫిక్సిడ్ లైన్ కలిపి) 50 కోట్ల కస్టమర్లతో జియో అగ్రస్థానంలో ఉండగా, తర్వాత స్థానాల్లో 30.9 కోట్ల కనెక్షన్లతో భారతి ఎయిర్టెల్, 12.7 కోట్లతో వొడాఫోన్ ఐడియా, 3.43 కోట్ల కనెక్షన్లతో బీఎస్ఎన్ఎల్, 23.5 లక్షల బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లతో ఏట్రియా కన్వర్జెన్స్ ఉన్నాయి.ఇదీ చదవండి: సోషల్ మీడియాలో మోసపూరిత కంటెంట్ తొలగింపు -
ఉద్యోగం కోసం డిగ్రీ సరిపోదు!: లింక్డ్ఇన్ సీఈఓ కీలక వ్యాఖ్యలు
చదువుకుని ఒక డిగ్రీ తెచ్చుకుంటే.. వెంటనే ఉద్యోగంలో చేరిపోవచ్చని చాలామంది అనుకుంటారు. కానీ డిగ్రీ ఉంటేనే ఉద్యోగాలు త్వరగా లభిస్తాయని చెప్పలేమని లింక్డ్ఇన్ సీఈఓ 'ర్యాన్ రోస్లాన్స్కీ' (Ryan Roslansky) పేర్కొన్నారు.పరుగులు పెడుతున్న పోటీ ప్రపంచంలో కేవలం ఒక కాలేజీ డిగ్రీ సరిపోదు. నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి. ముఖ్యంగా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) గురించి చాలా నేర్చుకోవాల్సి ఉందని.. గత వారం కంపెనీ శాన్ ఫ్రాన్సిస్కో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ర్యాన్ రోస్లాన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు.మార్పు అనేది చాలా ఉత్తేజకరమైన విషయం అని భావిస్తున్నాను. ఎందుకంటే ఉద్యోగ భవిష్యత్తు ఇకపై ఫ్యాన్సీ డిగ్రీలు ఉన్నవారికి లేదా మంచి కాలేజీలో చదువుకున్న వారికి మాత్రమే చెందదు. మారుతున్న కాలానికి అనుగుణంగా అలోచించి కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నవారికి ఉద్యోగాలు లభిస్తాయని నా అంచనా అని అన్నారు.ఏఐ మనుషుల స్థానాన్ని భర్తీ చేస్తుందనే విషయాన్ని నేను నమ్మనని ర్యాన్ రోస్లాన్స్కీ అన్నారు. అయితే కమ్యునికేషన్, ఎవరితో అయినా మాట్లాడగలగడం వంటివి నేర్చుకోవాలి. స్కిల్స్ ఎప్పుడూ పెంచుకుంటూ ఉండాలి. మీరు ముందుకు సాగడానికి ప్రయత్నిస్తున్న ఏ పనిలోనైనా విజయం సాధించడానికి అవి చాలా కీలకం అని ఆయన అన్నారు.ఇదీ చదవండి: ముకేశ్ అంబానీ పర్సులో ఎంత డబ్బు ఉంటుందో తెలుసా?ఏఐ గురించి తెలుసుకోవడం లేదా నేర్చుకోవడం చాలా అవసరం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఏఐ నైపుణ్యాలు ఉన్న వ్యక్తికే పరిశ్రమల్లో ఉద్యోగాలు లభిస్తాయి. అంటే ఉద్యోగం కోసం ఏఐ ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. ఉద్యోగ మార్కెట్ వేగంగా మారుతోంది. నిపుణులు నిరంతరం తమను తాము అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉందని చెబుతూనే ఉన్నారని ర్యాన్ రోస్లాన్స్కీ చెప్పారు. -
వాట్సప్కు పోటీగా అరట్టై.. 75 లక్షల డౌన్లోడ్స్!
భారతదేశపు ఐటీ కంపెనీ జోహో అభివృద్ధి చెందిన మెసేజింగ్ ప్లాట్ఫామ్ 'అరట్టై'కు ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. ఈ యాప్ శుక్రవారం నాటికి మొత్తం 75 లక్షల డౌన్లోడ్లను అధిగమించింది. అంటే అంతమంది దీనిని డౌన్లోడ్ చేసుకున్నారన్నమాట. దీన్ని బట్టి చూస్తే ఇది ఇటీవలి కాలంలో.. అతి తక్కువ కాలంలో ఎక్కువ డౌన్లోడ్స్ పొందిన యాప్లలో ఒకటిగా నిలిచింది.ఇప్పటి వరకు చాలామంది భారతీయులు.. మెటా యాజమాన్యంలోని వాట్సప్ను వినియోగిస్తున్నారు. అయితే ఇక దేశీయ యాప్ అరట్టైను ఉపయోగించాలని పలువురు మంత్రులు, వ్యవస్థాపకులు, సీఈఓలు పిలుపునిచ్చారు. దీంతో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకునేవారు సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ & ఆపిల్ యాప్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది.అరట్టై అంటే.. తమిళంలో సరదాగా ముచ్చటించుకోవడం అని అర్థం. దీనిని జోహో సంస్థ.. వాట్సప్కు పోటీగా అభివృద్ధి చేసింది. ఇది వాట్సప్ కంటే ఎక్కువ ఫీచర్స్ కలిగి ఉంది. దీనికి అశ్వినీ వైష్ణవ్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్ వంటి కేంద్రమంత్రులు కూడా మద్దతు ప్రకటించారు. దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా కూడా నేను అరట్టై డౌన్లోడ్ చేసుకున్నా అంటూ ట్వీట్ చేశారు.అరట్టై.. వాట్సప్ మధ్య తేడాలు➤అరట్టై.. వాట్సాప్ రెండూ మెసేజింగ్ యాప్స్ అయినప్పటికీ, అరట్టైలో కొన్ని అదనపు ఫీచర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యాప్ గురించి జోహో సీఈఓ శ్రీధర్ వెంబు గత కొన్ని రోజులుగా తన ఎక్స్ ఖాతాలో చెబుతూనే ఉన్నారు.➤అరట్టై ఆండ్రాయిడ్ టీవీలతో సహా విస్తృత శ్రేణి పరికరాలకు యాక్సెస్ను అందిస్తుంది. అయితే వాట్సాప్ ప్రస్తుతం వీటికి మద్దతు ఇవ్వదు. వినియోగదారులు తమ అరట్టై ఖాతాను ఒకేసారి ఐదు పరికరాల్లో ఉపయోగించవచ్చు.➤అరట్టైలో పాకెట్ ఫీచర్ ఉంది. ఇది వినియోగదారులు ఫోటోలు, వీడియోలు, నోట్స్, రిమైండర్లు, ఇతర ఫైల్లను స్టోర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వాట్సాప్లో ఈ ఫీచర్ లేదు. అయితే, వాట్సాప్ 'యు' చాట్ విండోను అందిస్తుంది, ఇక్కడ వినియోగదారులు తమతో తాము చాట్ చేసుకోవచ్చు, కావలసినవి సేవ్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: మస్క్ ట్వీట్: నెట్ఫ్లిక్స్కు రూ.2 లక్షల కోట్ల నష్టం!➤అరట్టై యాప్.. తక్కువ మెమరీ ఉన్న స్మార్ట్ఫోన్లు & పాత 2G/3G నెట్వర్క్లలో కూడా సజావుగా పనిచేసేలా రూపొందించబడింది. ఇది గ్రామీణ వినియోగదారులకు, బడ్జెట్ పరికరాలను కలిగిన వారికి అందుబాటులో ఉంటుంది. అంతే కాకుండా అరట్టైలో యూపీఐ చేయడానికి కూడా జోహో సిద్ధమవుతోంది. దీనికోసం ఐస్పిరిట్ గ్రూప్తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. -
ఆనంద్ మహీంద్రా ఫోన్లో కొత్త యాప్ డౌన్లోడ్
వాట్సాప్ మాదిరి దేశీయ కంపెనీ జోహో తయారు చేసిన ఆన్లైన్ కమ్యునికేషన్ యాప్ ‘అరట్టై’(Arattai)ని గర్వంగా డౌన్లోడ్ చేసినట్లు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో తెలిపారు. ఈ యాప్ మొదటిసారిగా 2021లో యాప్ స్టోర్లోకి ప్రవేశించింది. అయితే భారత ప్రభుత్వం ఆమోదం పొందిన తరువాత సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ మేడ్ ఇన్ ఇండియా యాప్ ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది.మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా దేశీయ టెక్నాలజీ ఉత్పత్తులకు మద్దతు ఇవ్వడంలో తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. జోహో సంస్థ కొత్తగా రూపొందించిన చాట్, కాలింగ్ యాప్ అరట్టైకి ఆయన ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా మద్దతు ప్రకటించారు. ‘గర్వంగా అరట్టైను డౌన్లోడ్ చేశా’ అని ఆనంద్ మహీంద్రా ప్రకటించారు. దీనికి యాప్ అధికారిక హ్యాండిల్ తక్షణమే స్పందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ అరట్టై ప్లాట్ఫామ్లోకి ఆయనను ఆహ్వానించింది.దీనిపై కంపెనీ చీఫ్ శ్రీధర్ వెంబు స్పందిస్తూ.. ‘నేను మా తెన్కాసి కార్యాలయంలో అరట్టై ఇంజినీర్లతో సమావేశంలో ఉన్నాను. యాప్కు మెరుగుదలలు చేస్తున్నాం. మా టీమ్లో ఒక సభ్యుడు ఈ ట్వీట్ను చూపించాడు. ధన్యవాదాలు @anandmahindra. మీ మద్దతు మాకు మరింత స్ఫూర్తినిచ్చింది’ అని ఎక్స్లో పేర్కొన్నారు. దీనికి ప్రతిస్పందనగా ఆనంద్ మహీంద్రా ‘మీ జట్టు విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ ప్రోత్సహించారు.ఇదీ చదవండి: దేశం విడిచిన కుబేరులు.. కారణాలు.. -
దీపావళి ధమాకా.. ఐఫోన్పై రూ.55 వేల డిస్కౌంట్!
దీపావళి పండుగ సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్కార్ట్ రెండూ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్వాచ్లు, ల్యాప్టాప్లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై అద్భుతమైన డిస్కౌంట్ డీల్స్ అందిస్తున్నాయి. పాత స్మార్ట్ ఫోన్ నుంచి ఐఫోన్కు అప్గ్రేడ్ కావాలనుకుంటున్నవారికి, ఆండ్రాయిడ్ నుంచి ఐఓఎస్కు మారాలనుకుంటున్నవారికి ఇంతకంటే మంచి సమయం లేదు.ఐఫోన్ 16 ప్రో మాక్స్పై భారీ తగ్గింపుప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో ఉన్న స్టాండ్ అవుట్ ఆఫర్లలో ఐఫోన్ 16 ప్రో మాక్స్ డీల్ ఒకటి. ఇది ఇప్పటివరకు సంవత్సరంలో అతిపెద్ద తగ్గింపు. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ (256 జీబీ వేరియంట్) వాస్తవ ధర రూ .1,34,999 కాగా ఫ్లిప్కార్ట్ రూ .1,09,999 కు లిస్ట్ చేసింది. కస్టమర్లు హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తే రూ .5,000 వరకు తగ్గింపు పొందవచ్చు.అదే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు ద్వారా ఈఎంఐ కొనుగోళ్లపై రూ .4,000 వరకు తగ్గింపును అందుకోవచ్చు. అంతేకాదు.. కొనుగోలుదారులు తమ పాత స్మార్ట్ఫోన్లను ఎక్స్చేంజ్కి ఇచ్చి ఫోన్ కండీషన్ను బట్టి రూ.55,790 వరకు పొందవచ్చు. ఇలా అన్ని డిస్కౌంట్లను కలిపితే ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ కొనుగోలుపై రూ.35,000 నుంచి రూ.55,000 ఆదా చేయవచ్చు. ఈ ఆఫర్లు పరిమితమైనవి, లభ్యతకు లోబడి ఉంటాయని గమనించాలి.ఐఫోన్ 16 ప్రో మాక్స్ ఫీచర్లుడిజైన్: ప్రీమియం టైటానియం నలుపు, తెలుపు, నేచురల్, డిసెర్ట్ ఫినిషింగ్.డిస్ప్లే: 6.9-అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్ డీఆర్ ఓఎల్ఈడీ, 120 హెర్ట్జ్ ప్రోమోషన్, హెచ్డీఆర్, ఆల్వేస్-ఆన్.పనితీరు: అధునాతన యాపిల్ ఇంటెలిజెన్స్, న్యూరల్ ఇంజిన్ తో A18 ప్రో చిప్.కెమెరా: 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్, అల్ట్రా వైడ్, 5ఎక్స్ టెలిఫోటో, నైట్ మోడ్, మాక్రో, 4కే డాల్బీ విజన్.ఇతర స్పెసిఫికేషన్లు: ఫేస్ ఐడీ, యాపిల్ పే, ఐపీ 68 రేటింగ్, 5జీ, వైఫై 7, స్పేషియల్ ఆడియో, శాటిలైట్ ద్వారా ఎమర్జెన్సీ ఎస్ఓఎస్. -
ఏడాదిలో బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్వర్క్
న్యూఢిల్లీ: భారత్ సొంతంగా అభివృద్ధి చేసిన బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్వర్క్ని ఏడాదిలోగా 5జీకి అప్గ్రేడ్ చేయనున్నట్లు టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింథియా తెలిపారు. భారత దేశం కూడా సొంతంగా 4జీ టెక్నాలజీ రంగంలోకి అడుగుపెట్టిందని ప్రపంచవ్యాప్తంగా స్వీడన్, ఫిన్లాండ్, దక్షిణ కొరియా, చైనాకు చెందిన హువావే, జడ్టీఈ, శాంసంగ్, నోకియా, ఎరిక్సన్ తదితర ఐదు కంపెనీలు 4జీ టెక్నాలజీలో ఆధిపత్యం వహిస్తున్నాయని, భారత్ కూడా ఇప్పుడు 4జీ ప్రపంచ క్లబ్లో ప్రవేశించిందన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భరూచ్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు 92564 టవర్లను ప్రారంభించినట్లు సింధియా తెలిపారు. ఈ వేగం ఇక్కడితో ఆగదని వచ్చే ఏడాదిలోగా ఈ 4జీ టవర్లను 5జీ నెట్వర్క్కు అప్గ్రేడ్ చేసి దేశమంతా 5జీ సేవలు అందిస్తామని సింథియా వెల్లడించారు. -
వికీపీడియాకు పోటీగా గ్రోకీపీడియా!: మస్క్
టెస్లా అధినేత.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) వికీపీడియాకు పోటీగా.. గ్రోకీపీడియా (Grokipedia) లాంచ్ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం దీని బీటా వెర్షన్ రెండు వారాల్లో ప్రారంభమవుతుందని ఆయన తన ఎక్స్ ఖాతాలో తెలిపారు.గ్రోకీపీడియాను.. మస్క్ ఏఐ కంపెనీ ఎక్స్ఏఐ (xAI) రూపొందిస్తోంది. ''గ్రోకిపీడియా ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఖచ్చితమైన జ్ఞాన వనరుగా మారబోతోంది'' అని ఒక ఎక్స్ యూజర్ చేసిన పోస్టుకు.. మస్క్ రిప్లై ఇచ్చారు. అయితే ఈ గ్రోకీపీడియాకు సంబంధించిన ఫీచర్లను గురించి అధికారికంగా వెల్లడించలేదు. నిజాలను వెల్లడించానికే ఈ ఫ్లాట్ఫామ్ను రూపొందిస్తున్నట్లు సమాచారం.Version 0.1 early beta of Grokipedia will be published in 2 weeks https://t.co/M6VrGv8zp5— Elon Musk (@elonmusk) October 5, 2025Exactly https://t.co/Ia38jMbJoj— Elon Musk (@elonmusk) October 5, 2025 -
చిన్న బిజినెస్.. పెద్ద మ్యాజిక్!
నేటి రోజుల్లో చిన్న చిన్న వ్యాపార యజమానులందరూ సులభంగా, వేగంగా, సురక్షితంగా పని చేయాలనుకుంటే, ఒక్కసారి ఈ స్మార్ట్ టూల్స్ ప్రయత్నించాల్సిందే!పేపర్ ప్లస్ డిజిటల్ మ్యాజిక్ఒకప్పుడు నోట్స్ రాస్తే కేవలం కాగితాలకే పరిమితం అయ్యేది. ఒక్క కాగితం మిస్ అయినా, రాసిన మాట, గీసిన డ్రాయింగ్ అంతా మాయం అవుతుంది. ఇప్పుడు ‘హుయిన్ డిజిటల్ నోట్బుక్’తో ఆ భయం పూర్తిగా తొలగింది. ఇది కేవలం ఒక నోట్బుక్ కాదు, పేపర్ ప్లస్ డిజిటల్ టాబ్లెట్. ఇందులో రాసిన ప్రతి అక్షరం, గీసిన ప్రతి లైన్ వెంటనే మీ డివైస్లో స్టోర్ అవుతుంది. ఆడియో రికార్డ్ ఫీచర్తో, మీ వాయిస్ కూడా నోట్స్తో కలిసి రికార్డ్ అవుతుంది. ఒక్క క్లిక్తో షేర్ చేసుకోవచ్చు కూడా. పేజీలను మిళితం చేయడం, విడగొట్టడం చాలా సులభం. ముఖ్యమైన విషయాలను హైలైట్ చేయడానికి సులభమైన టూల్స్ కూడా ఉన్నాయి. ధర రూ. 7,105 ల ప్యాక్లో ఒక హుయిన్ నోట్, ఏ ఐ నోట్ ప్యాడ్, యూఎస్బీ కేబుల్, మాగ్నెటిక్ పెన్ స్లీవ్, రీఫిల్స్, ప్లాస్టిక్ పెన్ నిబ్స్, మార్గదర్శక పుస్తకంతో వస్తుంది.ఒక్క కార్డు చాలు! ఒకప్పుడు పాత పేపర్ విజిటింగ్ కార్డ్ అంటే స్టేటస్ సింబల్. ‘ఇదిగో నా కార్డ్’ అంటూ ఇచ్చేసి స్టయిల్ కొట్టేవాళ్లు. కాని, నిజం చెప్పాలంటే ఆ కార్డుల ఫ్యూచర్ బాగుండేది కాదు. రోజుల తరబడి జేబులో మురిగి, కాఫీ కప్పుల కింద నలిగి, చివరికి ఏ డస్ట్బిన్లోనో ఎండ్ అయ్యేది. అలాంటప్పుడు వాటికోసం అనవసరంగా ఖర్చు ఎందుకు చేయటం. కేవలం, ఒక్క టాప్తోనే మీ పేరు, నంబర్, వెబ్సైట్, సోషల్ మీడియా అన్నీ ఎదుటివారి మొబైల్లో బజ్ అయ్యే మాయ చేస్తుంది ఈ ‘టాప్మో స్మార్ట్ బిజినెస్ కార్డ్’. ఇందులో చిన్న లోగో, క్యూ ఆర్ కోడ్, లైఫ్టైమ్ వాలిడిటీ అన్నీ రెడీ! యాప్ డౌన్లోడ్ అనే తలనొప్పి లేదు, ‘కార్డులు అయిపోయాయి’ అనే టెన్షన్ లేదు. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు కూడా. ధర కేవలం రూ. 599 మాత్రమే!పోర్టబుల్ సర్వర్స్మాల్ బిజినెస్ ఓనర్స్కు కస్టమర్ డేటా, ఫైనాన్స్ రికార్డులు, ప్రాజెక్ట్ ఫైల్స్ అన్నీ రక్షించుకోవాలంటే పెద్ద సర్వర్ అవసరమా? లేనే లేదు! బిజినెస్ డీటైల్స్ అన్నీ ఒకే చోట, సురక్షితంగా ఉంచాలంటే ‘అప్రికార్న్ ఏజిస్ ప్యాడ్లాక్’ బెస్ట్ ఆప్షన్. 480 జీబీ స్టోరేజ్, 256–బిట్ ఎన్క్రిప్షన్, రగ్డ్ బాడీ, టూ స్టెప్ వెరిఫికేషన్తో ఏ ఫైల్ అయినా సేఫ్గా స్టోర్ చేస్తుంది. ఇది కేవలం స్టోరేజ్ సర్వర్ మాత్రమే కాదు, చిన్న బిజినెస్కి నమ్మకమైన డేటా గార్డు. ఆఫీస్లోనైనా, ఇంట్లోనైనా, ట్రావెల్లోనైనా సులభంగా ఉపయోగించవచ్చు. చిన్న, పోర్టబుల్ బాడీతో జేబులోనైనా పెట్టుకుని క్యారీ చేయవచ్చు. ఏకకాలంలో డేటా యాక్సెస్, బ్యాకప్, షేర్ అన్నీ సులభం. ధర రూ. 49,325. -
ఇక ఫోకస్ అంతా 6జీపైనే.. 8 నుంచి ఇండియా మొబైల్ కాంగ్రెస్
ఈ నెల 8 నుంచి 11 వరకు న్యూఢిల్లీలో నిర్వహించే ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2025 సదస్సులో ప్రధానంగా 6జీ వ్యవస్థను అభివృద్ధి చేయడం, భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి పెట్టనున్నారు. విశ్వసనీయ భాగస్వామిగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన భారత్, 6జీ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించగలదని డిజిటల్ టెక్నాలజీ ప్లాట్ఫాం ఐఎంసీ సీఈవో పి. రామకృష్ణ తెలిపారు.’6జీ వ్యవస్థకు ప్రధానమైన అంశాలను అనుసంధానం చేయగలిగే కీలక ప్లాట్ఫాంగా ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఎదుగుతోంది. ఇందులో భారత్తో పాటు యూరప్, బ్రిటన్, అమెరికా, జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాల నుంచి పరిశ్రమకు చెందిన సీనియర్ నేతలు, నిపుణులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు’ అని ఆయన పేర్కొన్నారు. 6జీ సిపోజియంలో టెక్నాలజీ దిగ్గజాలతో పాటు ఐఐటీ, అంతర్జాతీయ యూనివర్సిటీల్లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల నుంచి విద్యావేత్తలు పాల్గోనున్నారు.6జీకి సంబంధించిన టెక్నాలజీలు, కృత్రిమ మేథ నెట్వర్క్లు, స్పెక్ట్రం క్రమబద్ధీకరణ తదితర అంశాలపై అత్యున్నత స్థాయిలో చర్చలు జరపనున్నట్లు రామకృష్ణ చెప్పారు. 7,000 మంది పైగా గ్లోబల్ ప్రతినిధులు, 800 మంది వక్తలు, 150 దేశాల నుంచి 400 మంది ఎగ్జిబిటర్లు ఇందులో పాల్గొంటారని అంచనా. 6జీ గ్లోబల్ రేసుకు భారత్ సారథ్యం వహించనుందని సెల్యులార్ ఆపరేటర్స్ సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచ్చర్ తెలిపారు.ఏఐ, జెన్ఏఐ టెక్నాలజీల్లో భారతీయ డిజిటల్ ఆవిష్కరణలు, దేశీయంగా టెలికం రంగాన్ని సరికొత్తగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. 5జీ విస్తరణ, 6జీ సన్నద్ధతకు 6 గిగాహెట్జ్ బ్యాండ్ను సమర్ధవంతంగా కేటాయించడం కీలకంగా ఉంటుందని వివరించారు. -
మస్క్ కంపెనీలో జాబ్స్: జీతం ఎంతో తెలుసా?
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ఏఐ కంపెనీ అయిన ఎక్స్ఏఐ (xAI) దాని చాట్బాట్ 'గ్రోక్' కోసం ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమైంది. వీడియో గేమ్ల కోసం.. వీడియో గేమ్స్ ట్యూటర్లను నియమించుకోనుంది. వీరు గ్రోక్కు గేమ్లను రూపొందించడం, కథలు చెప్పడం, యూజర్ ఆలోచనలకు సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వనున్నారు.గ్రోక్ టెక్స్ట్ ఆధారిత సంభాషణలకు పరిమితం చేయకుండా.. మరింత సృజనాత్మకంగా ఉండేలా ట్యూటర్స్ శిక్షణ ఇవ్వాల్సి ఉంది. కాబట్టి వీరు ఎక్స్ఏఐ సాఫ్ట్వేర్తో పని చేస్తారు. గేమ్ డిజైన్, కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత రంగాలలో అనుభవం ఉన్న అభ్యర్థుల కోసం కంపెనీ అన్వేషిస్తోంది. అయితే ఎన్ని ఉద్యోగాలు, ఎంతమందిని నియమించుకుంటారనే విషయం వెల్లడించలేదు.ఎంపికైన ఉద్యోగులు కాలిఫోర్నియాలోని ఆఫీసులో పనిచేయాల్సి ఉంటుంది. కానీ రిమోట్గా కూడా ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంది. రిమోట్గా వర్క్ చేయాలనుకునే అభ్యర్థులకు సెల్ఫ్ డిసిప్లైన్, స్ట్రాంగ్ మోటివేషన్ వంటివి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు మొదటి రెండు వారాలు ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుంది. ఆ తరువాత అనుకూలమైన టైమ్ ఎంచుకోవచ్చు.ఇదీ చదవండి: నాలుగు నిమిషాల మీటింగ్: ఉద్యోగం నుంచి తీసేశారు!జీతం & ప్రయోజనాలుఎంపికైన ఉద్యోగులకు జీతం గంటకు 45 డాలర్ల నుంచి 100 డాలర్ల వరకు ఉంటుంది. ప్రయోజనాలు దరఖాస్తుదారు నివసించే దేశంపై ఆధారపడి ఉంటాయి. ఫుల్ టైమ్ జాబ్ చేసే ఉద్యోగులకు మెడికల్ కవరేజ్ లభిస్తాయి. అయితే, పార్ట్-టైమ్ ఉద్యోగులకు ఇలాంటి ప్రయోజనాలు ఉండవు. -
సంద్రంలో వ్యక్తి ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్
టెక్నాలజీ అనేది చాలామంది పనులను వేగవంతం చేస్తుంది. దాంతోపాటు కొందరి ప్రాణాలు కోల్పోకుండా కాపాడుతుంది. అదెలాగని అనుకుంటున్నారా.. ఇటీవల బంగాళాఖాతంలో జరిగిన ఓ సంఘటన గురించి తెలియాల్సిందే. ఆ ఘటనలో ధరించగలిగే సాంకేతిక పరిజ్ఞానం (wearable technology) మరోసారి ప్రాణాలను రక్షించే సామర్థ్యాన్ని రుజువు చేసింది. పుదుచ్చేరి తీరంలో సంభవించిన స్కూబా డైవింగ్ ప్రమాదంలో యాపిల్ వాచ్ అల్ట్రా ముంబైకి చెందిన 26 ఏళ్ల టెక్కీని ఊహించని విధంగా కాపాడింది.ఈ-కామర్స్ రంగంలో పనిచేస్తున్న, స్కూబా డైవింగ్పై ఆసక్తి ఉన్న క్షితిజ్(26) అనే వ్యక్తి ఇటీవల బంగాళాఖాతంలో డైవింగ్ కోసం వెళ్లాడు. తన కోచ్తో కలిసి సముద్రంలో సుమారు 36 మీటర్ల లోతుకు చేరుకున్నాడు. ఒక్కసారిగా సంద్రంలో పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. అది గమనించిన క్షితిజ్ పైకి రావాలని నిర్ణయించుకున్నాడు. కానీ డైవింగ్ కిట్లో ముఖ్యమైన భాగంగా ఉన్న అతని వెయిట్ బెల్ట్ (Weight Belt) వదులైంది. దాంతో కంగారుపడి మరింత వేగంగా పైకి రావడానికి ప్రయత్నించాడు.నీటి అడుగున ఒత్తిడి మార్పుల కారణంగా డైవర్లు వేగంగా ఆరోహణ (Rapid Ascent) దిశగా లోతు నుంచి పైకి వచ్చే క్రమంలో ఒక్కోసారి ప్రాణాలు కోల్పోవచ్చు. ఇది ఊపిరితిత్తుల ఓవర్ ఎక్స్పాన్షన్ ఇంజురీలకు దారితీస్తుంది. అదేమీ లెక్క చేయకుండా వేగంగా పైకి రావడానికి క్షితిజ్ ప్రయత్నించాడు. అప్పటికే అతడు సాహసోపేత క్రీడల కోసం రూపొందించిన యాపిల్ వాచ్ అల్ట్రాను ధరించాడు. అతను వేగంగా పైకి వెళ్తుండగా వాచ్లోని సెన్సార్లు ఉపరితలం నుంచి లోతు, తన వేగాన్ని పరిగణించి అసాధారణ మార్పును గుర్తించాయి. వాచ్ స్క్రీన్పై తక్షణమే ఒక హెచ్చరిక కనిపించింది. ‘నెమ్మదిగా ఉండండి. మీరు చాలా వేగంగా వెళ్తున్నారు’ అని మేసేజ్ రూపంలో వచ్చింది.అయినప్పటికీ క్షితిజ్ పట్టించుకోకుండా వేగంగా వెళ్తున్నాడు. ఈ కీలక సమయంలో అత్యవసర పరిస్థితుల కోసం రూపొందించిన వాచ్ అల్ట్రా ఆటోమేటిక్ ఎమర్జెన్సీ సైరన్ మోగించింది. దాని శబ్దం సముద్రంలో గందరగోళ వాతావరణంలో కూడా స్పష్టంగా వినిపించేలా ఉండడంతో ముందు వెళ్తున్న కోచ్ ఆ శబ్దం విని తన వద్దకు వచ్చాడు. కోచ్ జోక్యం చేసుకుని క్షితిజ్ పరిస్థితిని నియంత్రించాడు. సురక్షితంగా పైకి వచ్చేందుకు తోడ్పాటు అందించాడు. ‘ఆ వాచ్లో సైరన్ ఫీచర్ ఉందని కూడా నాకు తెలియదు’ అని క్షితిజ్ అంగీకరించాడు. ‘ఇది నా ప్రాణాలను కాపాడింది’ అని చెప్పుకొచ్చాడు.ఇదీ చదవండి: తయారీ రంగంలో వృద్ధికి వ్యూహాలు -
అనుబంధ కంపెనీని అమ్మేస్తున్న గూగుల్!
టెక్నాలజీ దిగ్గజం గూగుల్ (Google) మాతృ సంస్థ ఆల్ఫాబెట్ (Alphabet Inc.) తన లైఫ్ సైన్సెస్ యూనిట్ ‘వెరిలీ’ని వదిలించుకోవడానికి సిద్ధమైంది. వెరిలీని సాంకేతికంగా విడదీయడానికి ఆల్ఫాబెట్ గత రెండేళ్లుగా పనిచేస్తోందని, ఇందులో భాగంగా దాన్ని విక్రయించడమో లేదా విడిపడి వేరే సంస్థగా ఏర్పాటు చేయడమో జరుగుతుందని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు.గూగుల్ చట్టవిరుద్ధంగా ప్రకటనల సాంకేతికతను గుత్తాధిపత్యం చేసిందన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో ప్రతివాది సాక్షిగా హాజరైన గూగుల్ సెక్యూరిటీ ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్ హీథర్ అడ్కిన్స్ వెరిలీ ప్రణాళికలను వివరించారు.వర్జీనియాలోని ఫెడరల్ కోర్టులో అడ్కిన్స్ మాట్లాడుతూ.. ఆల్ఫాబెట్ గొడుగు కింద గూగుల్కు సోదరి సంస్థగా ఉన్న వెరిలీ గత రెండున్నర సంవత్సరాలుగా గూగుల్ సొంత మౌలిక సదుపాయాల నుండి బయటపడటానికి, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్లోకి వెళ్లడానికి కృషి చేస్తోందన్నారు."మేము వారిని (వెరిలీ) స్వతంత్ర సంస్థగా మార్చడానికి సహాయపడే ప్రక్రియలో ఉన్నాము" అని ఆమె యూనిట్ గురించి చెప్పారు. అది అమ్మకం లేదా స్పిన్ ఆఫ్ ద్వారా కావచ్చు అన్నారు. "ఇది (వెరిలీ) ఇకపై ఆల్ఫాబెట్ సంస్థగా ఉండకూడదన్నదే ఆలోచన" అని పేర్కొన్నారు.వెరిలీ గురించి..వెరిలీ అనేది గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్కి చెందిన ఒక లైఫ్ సైన్సెస్ విభాగం. ఇది ఆరోగ్య పరిశోధన, ప్రెసిషన్ మెడిసిన్, డేటా ఆధారిత హెల్త్కేర్ పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో నిమగ్నమై ఉంది. వెరిలీ (మునుపటి పేరు గూగుల్ లైఫ్ సైన్స్ సర్వీస్) 2015 డిసెంబర్లో ఏర్పాటైంది. ఆల్ఫాబెట్ ఏర్పాటైన తర్వాత, గూగుల్ లైఫ్ సైన్సెస్ నుంచి వెరిలీ పేరుతో విడిపోయింది. -
టీసీఎస్లో తొలగించినవాళ్లకు రెండేళ్లు జీతం!
దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) భారీగా తొలగింపులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తొలగింపు కారణంగా ప్రభావితమైన ఉద్యోగుల కోసం కంపెనీ ఆకర్షణీయమైన సెవెరన్స్ ప్యాకేజీలను ప్రకటించినట్లు మీడియా నివేదికలు తెలిపాయి.మారుతున్న టెక్నాలజీ, కంపెనీ అవసరాలకు సరిపోలని ఉద్యోగులకు ఆరు నెలల నుండి గరిష్టంగా రెండేళ్ల వరకు జీతం ప్యాకేజీని అందిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. తొలగింపునకు గురైన ఉద్యోగులకు టీసీఎస్ ఇంకా ఏమేమి ఆఫర్ చేస్తోందో ఈ కథనంలో చూద్దాం.12,000 మందికి ఉద్వాసనమనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. టీసీఎస్ తన ఉద్యోగులలో సుమారు 2 శాతం లేదా సుమారు 12,000 మందిని వచ్చే సంవత్సరంలో తొలగించాలని నిర్ణయించింది. టెక్నాలజీ మార్పు, ఆటోమేషన్ యుగంలో చురుకైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండటానికి ఈ దశ అవసరమని కంపెనీ నమ్ముతోంది.మీడియా నివేదికలు ఉటంకించిన కంపెనీ వర్గాల ప్రకారం.. ఈ తొలగింపులు ప్రధానంగా ఎవరి నైపుణ్యాలు అవసరాలకు తగినట్లు లేవో, ఎవరైతే తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోలేదో అలాంటి ఉద్యోగులను ప్రభావితం చేస్తున్నాయి.కంపెనీ ఇస్తున్న ఆఫర్లు..ఉద్యోగులకు వారి సేవా వ్యవధిని బట్టి మూడు నెలల నోటీసు వ్యవధి, ఆరు నెలల నుండి 24 నెలల వరకు సెవెరన్స్ ప్యాకేజీని అందిస్తున్నారు. పదవీ విరమణ వయస్సుకు దగ్గరగా ఉన్న ఉద్యోగులకు కూడా కంపెనీ ముందస్తు పదవీ విరమణ ఎంపికలను విస్తరిస్తోందని మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఈ పథకం కింద, వారు బీమా వంటి పూర్తి పదవీ విరమణ ప్రయోజనాలతో పాటు వారికి ఇంకా మిగిలి ఉన్న సర్వీస్ కాలాన్ని బట్టి ఆరు నెలల నుండి రెండు సంవత్సరాల జీతానికి సమానమైన అదనపు సెవెరన్స్ ప్యాకేజీని పొందుతారు.సెవెరన్స్ ప్యాకేజీలు ఇలా..స్టాండర్డ్ ఆఫర్: 3 నెలల నోటీసు పీరియడ్ పే.10–15 సంవత్సరాల సర్వీసు: 1.5 సంవత్సరాల జీతం.15 ఏళ్ల కంటే ఎక్కువ సర్వీసు: 2 సంవత్సరాల వరకు జీతంబెంచ్ ఉద్యోగులు (8 నెలలకుపైగా వర్క్ అసైన్ కానివారు): 3 నెలల నోటీసు వేతనం మాత్రమే.కెరీర్ అవుట్ ప్లేస్ మెంట్: రెజుమ్ తయారీ, జాబ్ సెర్చ్లో సహాయం, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ (3 నెలలపాటు ఏజెన్సీ ఫీజులు).మానసిక ఆరోగ్య మద్దతు: "టీసీఎస్ కేర్స్" ప్రోగ్రామ్ ద్వారా సహాయం. -
జియో 3 నెలల ప్లాన్: చౌకగా డైలీ 2జీబీ.. అన్లిమిటెడ్
రిలయన్స్ జియో తన 9వ వార్షికోత్సవాన్ని ఇటీవలె జరుపుకొంది. అప్పటి నుండి, కంపెనీ తన వినియోగదారుల కోసం అనేక రీఛార్జ్ ప్లాన్లపై ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. అందులో ఒకటే రూ.899 ప్లాన్. దీంతో హై స్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్తో పాటు ఇతర ఆకట్టుకునే ప్రయోజనాలను అందిస్తోంది.జియో రూ.899 ప్లాన్.. ప్రయోజనాలుజియో నుండి వచ్చిన ఈ ఆకట్టుకునే ప్లాన్ ధర రూ.899. పూర్తి 90 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. రోజుకు 2జీబీ హై-స్పీడ్ డేటాతో పాటు 20జీబీ అదనపు డేటాను కూడా అందిస్తోంది. అంటే మొత్తం డేటా 200GB అవుతుంది.ఇంకా ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్ ను కూడా అందిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉచితంగా పంపించుకోవచ్చు. జియో 5జీ నెట్ వర్క్ ఉన్న ప్రాంతంలో నివసిస్తుంటే ఈ ప్లాన్ తో అపరిమిత 5జీ డేటాను ఆనందించవచ్చు.డేటా, కాలింగ్ మాత్రమే కాదు, ఈ ప్లాన్ జియో టీవీ, జియో ఐ క్లౌడ్, జియో హాట్ స్టార్ కు ఉచిత సబ్ స్క్రిప్షన్ లతో సహా ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్లో 3నెలల జియో హాట్ స్టార్ మొబైల్, టీవీ సబ్ స్క్రిప్షన్ కూడా చేర్చారు.అదనంగా, ఈ ప్లాన్ లో 3 నెలల పాటు జియోసావ్ ప్రోకు 1 నెల జొమాటో గోల్డ్ సబ్ స్క్రిప్షన్, ఉచితంగా 6 నెలల నెట్ మెడ్స్ ఫస్ట్ సభ్యత్వం ఉన్నాయి. ఇంకా ఈజీ మై ట్రిప్ పై రూ .2220 వరకు డిస్కౌంట్, హోటల్ బుకింగ్ లపై 15% వరకు తగ్గింపును అందిస్తుంది. అజియోపై రూ.200 తగ్గింపు, రిలయన్స్ డిజిటల్పై రూ.399 వరకు తగ్గింపును కూడా పొందుతారు. -
దేశపు తొలి ఏఐ కాల్ అసిస్టెంట్..
గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్కి సమాధానమిచ్చేలా భారతదేశపు తొలి ఏఐ కాల్ అసిస్టెంట్ను రూపొందించినట్లు హైదరాబాదీ అంకుర సంస్థ ఈక్వల్ వ్యవస్థాపకుడు, పారిశ్రామిక దిగ్గజం జీవీకే వారసుడు కేశవ రెడ్డి తెలిపారు.ఈక్వల్ ఏఐ అక్టోబర్ 2 నుంచి ఢిల్లీ–ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్)లో అందుబాటులోకి వస్తుందని, దశలవారీగా దేశవ్యాప్తంగా ప్రవేశపెడతామని యన తెలిపారు. 2026 మధ్య నాటికి రోజుకు 10 లక్షల యాక్టివ్ యూజర్లను లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.గుర్తు తెలియని నంబర్లు, టెలీమార్కెటింగ్, డెలివరీ ఏజెంట్ల కాల్స్ మొదలైన వాటికి ఇది ఇంగ్లీష్, హిందీ, హింగ్లీష్ భాషల్లో సమాధానమివ్వగలదు. అవసరమైతే యూజర్ మధ్యలో కాల్ను టేకోవర్ చేయొచ్చు. -
సైబర్ నేరాలకు చెక్ పెట్టేలా ఆర్బీఐ చర్యలు
సైబర్ నేరాలు భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాలకు తీవ్రమైన ముప్పు కలిగిస్తున్న నేపథ్యంలో దేశంలో ఆన్లైన్ బ్యాంకింగ్ భద్రతను పటిష్టం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా భారతదేశంలోని టాప్ 200 బ్యాంకులు తమ ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలను కొత్త, సురక్షితమైన, ప్రత్యేకమైన డొమైన్ ‘.bank.in’కు మార్చాలని తెలిపింది. అక్టోబర్ 31, 2025 నాటికి దీని అమలును పూర్తి చేయాలని అన్ని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది.సైబర్ సెక్యూరిటీ పెంచడమే లక్ష్యంపెరుగుతున్న సైబర్ సెక్యూరిటీ సమస్యలను పరిష్కరించడానికి ఆర్బీఐ ఈమేరకు వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం, బ్యాంకులు .com, .in, .co.in వంటి సాధారణ డొమైన్ల కింద కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ డొమైన్లను సైబర్ నేరగాళ్లు సులభంగా దుర్వినియోగం చేస్తున్నారు. ఫిషింగ్, స్పూఫింగ్ దాడుల ద్వారా వినియోగదారులను మోసం చేసి వారి సున్నితమైన సమాచారాన్ని దొంగిలిస్తున్నారు.ఈ వ్యవహారంపై ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (IDRBT) డైరెక్టర్ దీపక్ కుమార్ స్పందిస్తూ..‘కొత్తగా ఆర్బీఐ ప్రతిపాదించిన .bank.in డొమైన్తో వినియోగదారులు చట్టబద్ధమైన బ్యాంకింగ్ వెబ్సైట్లను మాత్రమే యాక్సెస్ చేస్తున్నారని నమ్మకంగా ఉండవచ్చు. రిజిస్టర్డ్ భారతీయ బ్యాంకులు మాత్రమే వెబ్సైట్లను హోస్ట్ చేయగల సర్వీసులను అందించడం ద్వారా ఫిషింగ్ దాడులను గణనీయంగా తగ్గించవచ్చు. ఇది ప్రజల విశ్వాసాన్ని పెంచుతుంది. దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థలో 95% ఇప్పటికే ఈమేరకు చర్యలు పూర్తయ్యాయి. ముఖ్యంగా 12 ప్రభుత్వం ప్రధాన ప్రైవేట్ రంగ సంస్థలతోపాటు కొన్ని ప్రైవేట్ బ్యాంకులు .bank.in యూఆర్ఎల్ను పొందాయి’ అని చెప్పారు.ఇదీ చదవండి: అమెరికా షట్డౌన్తో భారత వాణిజ్యంపై ప్రభావం ఎంత? -
వాట్సాప్కు పోటీగా స్వదేశీ యాప్: అరట్టై గురించి తెలుసా?
స్మార్ట్ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరికీ.. వాట్సాప్ గురించి తెలిసే ఉంటుంది. కానీ ఇలాంటి తరహా ఇండియన్ యాప్ 'అరట్టై' (Arattai) గురించి తెలుసా?. ఈ పేరును ఎప్పుడైనా విన్నారా?. బహుశా ఈ పేరు కొత్తగా అనిపించినప్పటికీ.. ఈ యాప్ మొదటిసారిగా 2021లో యాప్ స్టోర్లలోకి ప్రవేశించింది. అయితే భారత ప్రభుత్వం ఆమోదం పొందిన తరువాత.. సోషల్ మీడియా వైరల్ అవ్వడంతో ఈ మేడ్ ఇన్ ఇండియా యాప్ ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది.అరట్టై యాప్ జోహో కంపెనీ రూపొందించింది. ప్రస్తుతం ఇది గూగుల్ ప్లే స్టోర్ & యాపిల్ యాప్ స్టోర్లలో అందుబాటులో ఉంది. దీనికి మెల్లగా ఆదరణ పెరుగుతోంది. దీన్నిబట్టి చూస్తే.. రానున్న రోజుల్లో మెటా మెసేజింగ్ యాప్ వాట్సాప్కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.➤అరట్టై.. వాట్సాప్ రెండూ మెసేజింగ్ యాప్స్ అయినప్పటికీ, అరట్టైలో కొన్ని అదనపు ఫీచర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యాప్ గురించి జోహో సీఈఓ శ్రీధర్ వెంబు గత కొన్ని రోజులుగా తన ఎక్స్ ఖాతాలో చెబుతూనే ఉన్నారు.➤అరట్టై ఆండ్రాయిడ్ టీవీలతో సహా విస్తృత శ్రేణి పరికరాలకు యాక్సెస్ను అందిస్తుంది. అయితే వాట్సాప్ ప్రస్తుతం వీటికి మద్దతు ఇవ్వదు. వినియోగదారులు తమ అరట్టై ఖాతాను ఒకేసారి ఐదు పరికరాల్లో ఉపయోగించవచ్చు.➤అరట్టైలో పాకెట్ ఫీచర్ ఉంది. ఇది వినియోగదారులు ఫోటోలు, వీడియోలు, నోట్స్, రిమైండర్లు, ఇతర ఫైల్లను స్టోర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వాట్సాప్లో ఈ ఫీచర్ లేదు. అయితే, వాట్సాప్ 'యు' చాట్ విండోను అందిస్తుంది, ఇక్కడ వినియోగదారులు తమతో తాము చాట్ చేసుకోవచ్చు, కావలసినవి సేవ్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: చాట్జీపీటీతో కొత్త భాష.. కేవలం 30 రోజుల్లో!➤అరట్టై యాప్.. తక్కువ మెమరీ ఉన్న స్మార్ట్ఫోన్లు & పాత 2G/3G నెట్వర్క్లలో కూడా సజావుగా పనిచేసేలా రూపొందించబడింది. ఇది గ్రామీణ వినియోగదారులకు, బడ్జెట్ పరికరాలను కలిగిన వారికి అందుబాటులో ఉంటుంది. అంతే కాకుండా అరట్టైలో యూపీఐ చేయడానికి కూడా జోహో సిద్ధమవుతోంది. దీనికోసం ఐస్పిరిట్ గ్రూప్తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.On Arattai, we have initiated discussions with Sharad Sharma of iSpirt, the group that did the technical work to make UPI happen, to standardize and publish the messaging protocols. I am a huge fan of UPI and hugely respect the work the team did. Sharad is a good friend and he…— Sridhar Vembu (@svembu) September 30, 2025 -
దేశంలోనే తొలి ఏఐ కాల్ అసిస్టెంట్.. త్వరలో ప్రారంభం
ఏదో ముఖ్యమైన పనిలో బిజీగా ఉన్న సమయంలో వచ్చే స్పామ్ కాల్స్ చిరాకు తెప్పిస్తుంటాయి. ఇకపై అలాంటి కాల్స్తోపాటు ఫోన్లోని కాంటాక్ట్ లిస్ట్లో లేని కాల్స్కు సమాధానం ఇచ్చేలా హైదరాబాద్కు చెందిన స్టార్టప్ ‘ఈక్వల్ఏఐ’ కొత్తగా ఇంటెలిజెంట్ కాల్ అసిస్టెంట్ను రూపొందించింది. ఇది ఆయా కాల్స్ను గుర్తించి ఎదుటి వ్యక్తితో వాస్తవికంగా మాట్లాడి బ్రీఫ్గా అందులోని సారాంశాన్ని సందేశం రూపంలో యూజర్ ముందుంచుతుంది. దీన్ని అక్టోబర్ 2న న్యూదిల్లీలో ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది.భారతదేశంలో దాదాపు 100 కోట్ల స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఉన్నారు. 60% మంది భారతీయులు రోజుకు 3 కంటే ఎక్కువ స్పామ్ కాల్స్తో ఇబ్బంది పడుతున్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఇప్పటికే డునాట్ డిస్టర్బ్(DND) రిజిస్ట్రీలు, కాలర్ ఐడీ యాప్లు ఉన్నప్పటికీ స్పామ్ కాల్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో యూజర్లకు వీటి నుంచి ఉపశమనం కలిగించేలా ఈక్వల్ ఏఐ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా కొత్తగా ఏఐ అసిస్టెంట్ను ప్రారంభించనుంది.ట్రయల్ సక్సెస్ఈక్వల్ ఏఐ టూల్ ట్రయల్స్ సమయంలో 87% అంతరాయాలను సమర్థంగా నిర్వహించినట్లు కంపెనీ తెలిపింది. పార్సిల్ డెలివరీలను సమన్వయం చేసుకోవడంలో యూజర్లు గడిపే సమయాన్ని 73% తగ్గించినట్లు పేర్కొంది. 94% స్పామ్ కాల్స్ను గుర్తించి అందుకు అనుగుణంగా స్పందించినట్లు తెలిపింది. అయితే కాంటాక్ట్ లిస్ట్లో సేవ్ అయిన నంబర్ల నుంచి వచ్చే కాల్స్కు ఇది సమాధానం ఇవ్వదని గమనించాలి.డెలివరీ ఏజెంట్లతో మాట్లాడే క్రమంలో చిరునామాలు లేదా సూచనలు ఇస్తుంది.లైవ్ కాల్ ట్రాన్స్క్రిప్ట్ అందిస్తుంది.యూజర్ ఎప్పుడైనా నేరుగా కాల్కు సమాధానం ఇవ్వొచ్చు.భారతీయ భాషలు, కాలర్ నమూనాలపై శిక్షణ పొందింది.ప్రాథమికంగా ఢిల్లీ ఎన్సీఆర్లో ఆండ్రాయిడ్ వినియోగదారులకు అక్టోబర్ 2, 2025 నుంచి ఈ సేవలు ప్రారంభం అవుతాయని కంపెనీ తెలిపింది. 2025 నాలుగో త్రైమాసికం నాటికి ముంబై, బెంగళూరు, హైదరాబాద్లకు ఈ సర్వీసులు విస్తరిస్తాయని పేర్కొంది.ఇదీ చదవండి: యూఎస్ బెదిరించినా తగ్గేదేలే -
చాట్జీపీటీతో కొత్త భాష.. కేవలం 30 రోజుల్లో!
ఏ ప్రశ్నకైనా సమాధానం ఇచ్చే చాట్జీపీటీ (ChatGPT).. ఇప్పుడు కొత్త భాషలు (New Language) నేర్చుకోవడానికి కూడా సహకరిస్తోంది. నెల రోజుల వ్యవధిలోనే.. పదజాలం, వ్యాకరణం, మాట్లాడటం వంటివి సులభంగా నేర్చుకోవచ్చు!. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సులభంగా కొత్త భాషను 30 రోజుల్లో నేర్చుకోవడానికి 8 ప్రాంప్ట్లను ఉపయోగించాల్సి ఉంటుందని మార్కెటింగ్, గ్రోత్ నిపుణుడైన 'చిదానంద్ త్రిపాఠి' పేర్కొన్నారు. అవి ''30 రోజులలో భాషా అభ్యాస ప్రణాళిక, రోజువారీ పదజాలం, అభ్యాస అనుకరణ, సాధారణ పదాలలో వ్యాకరణ వివరణ, వినడం, నిజ జీవిత సంభాషణకు సంబంధించిన ఉదాహరణలను క్రియేట్ చేయడం, తప్పుల దిద్దుబాటు, మోటివేషనల్ చెక్''.పైన చెప్పిన 8 ప్రాంప్ట్లను ఉపయోగించడం ద్వారా.. నెల రోజుల్లో కొత్త భాషను సులభంగా నేర్చుకోవచ్చని.. చిదానంద్ త్రిపాఠి పేర్కొన్నారు. ప్రాక్టీస్ చేయడానికి, పదాలను తెలుసుకోవడానికి చాట్జీపీటీ ఉపయోగపడుతుందని ఆయన వివరించారు.CHATGPT CAN TEACH YOU A NEW LANGUAGE - MASTER IT IN 30 DAYSUse these 8 prompts to accelerate language acquisition:— Chidanand Tripathi (@thetripathi58) September 28, 2025 -
ఏఐతో సరిగమలు పలికించేలా రెహమాన్ వినూత్న ప్రాజెక్ట్
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ‘మొజార్ట్ ఆఫ్ మద్రాస్ సీక్రెట్ మౌంటైన్’ అనే వినూత్న సంగీత ప్రాజెక్టును ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. ఇది మెటావర్స్లో వర్చువల్ ఏఐ ఆధారిత బ్యాండ్. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ ప్రాజెక్ట్కులో భాగంగా ప్రత్యేకమైన డిజిటల్ సింఫనీ ద్వారా ప్రపంచ సంస్కృతులను ఏకం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రెహమన్ ఓ కార్యక్రమంలో చెప్పారు.సీక్రెట్ మౌంటైన్ అంటే ఏమిటి?ఇది ఆరుగురు సభ్యులున్న వర్చువల్ బ్యాండ్. ఇందులో ప్రముఖ సంగీత కళాకారులు కారా, బ్లెసింగ్, ఎకామ్, జెంటమ్, డేవిడ్, ఆఫియా ఉన్నారు. ఈ బ్యాండ్ పూర్తిగా మెటావర్స్లో ఉంటుంది. మెటావర్స్ అనేది ఒక సామూహిక వర్చువల్ స్పేస్. ఇందులో డిజిటల్ అవతార్లు వర్చువల్గా సాంకేతికతలను ఉపయోగించి పరస్పరం సంభాషించవచ్చు. కలిసి పాడవచ్చు. వర్చువల్ రియాలిటీ (VR), ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) కలయికతో ఇది పని చేస్తుంది. వీటిని ఉపయోగించి రెహమాన్ సంగీతాన్ని సృష్టించనున్నారు.ఏఐ, క్రియేటివిటీఏఐ సృజనాత్మకతను పెంపొందించడానికి ఈ ప్రాజెక్ట్ ఉపయోగించబడుతుందని, అదే సమయంలో మానవ కళాత్మకతను ఇది భర్తీ చేయదని రెహమాన్ నొక్కి చెప్పారు. ఇందులో అవతార్లు ఉపయోగించినా సంగీతం, సాహిత్యం, స్వరాలు రియలిస్టిక్గా ఉంటాయన్నారు. ఏఐ మ్యూజిక్ ప్రోడక్షన్ను వేగవంతం చేస్తుందని చెప్పారు. ఇటీవల యూఎస్లో రెహమాన్ ఓపెన్ ఎఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్, పెర్ప్లెక్సిటీకి చెందిన అరవింద్ శ్రీనివాస్తో సమావేశమయ్యారు. ఈ వినూత్న ప్రాజెక్ట్కు సారథ్యం వహిస్తున్న రేడియంట్ సోల్స్ అనే సంస్థ సిలికాన్ వ్యాలీలోని ఏఐ కంపెనీలతో భాగస్వామ్యం కలిగి ఉంది.ఇదీ చదవండి: ఎన్నికల వేళ రాష్ట్ర ఖజానాకు కాసుల గలగల -
రోజుకు 2.5జీబీ డేటా.. అన్లిమిటెడ్ కాల్స్: రూ.225 ప్లాన్
భారత ప్రభుత్వం యాజమాన్యంలోని టెలికాం ఆపరేటర్ 'భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్' (BSNL), జియో & ఎయిర్టెల్ వంటి ప్రైవేట్ టెలికాం దిగ్గజాలకు సవాలు విసురుతూ కేవలం రూ.225 ధరకే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ను ప్రారంభించింది. రూ.250 కంటే తక్కువ ధరకే అత్యుత్తమ ప్రయోజనాలను అందించడం ద్వారా ఎక్కువమంది వినియోగదారులను ఆకట్టుకునే చర్యలో భాగంగానే బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ తీసుకొచ్చింది.బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టిన రూ. 225 ప్లాన్.. 30 రోజులు చెల్లుబాటు అవుతుంది. అంటే రోజువారీ ఖర్చు రూ.7.50 అన్నమాట. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా వినియోగదారుడు రోజుకు 2.5 జీబీ హైస్పీడ్ డేటా, ఏ నెట్వర్క్కు అయినా.. అపరిమిత లోకల్ & ఎస్టీడీ కాలింగ్ లభిస్తుంది. రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు లభిస్తాయి. ఇన్ని ప్రయోజనాలను అందించే ఈ ప్లాన్.. ఇతర ప్రైవేట్ ఆపరేటర్స్ ప్లాన్స్ కంటే చౌక.బీఎస్ఎన్ఎల్ ఇతర రీఛార్జ్ ప్లాన్స్రూ.199 ప్లాన్: ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు. రోజుకు 2 జీబీ హై-స్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, వీటన్నింటితో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లను కూడా అందిస్తుంది. దేశంలోని ఇతర టెలికాం సర్వీస్ ప్రొవైడర్లతో పోలిస్తే రూ .199 ప్లాన్ ఆర్థిక ప్రయోజనాలు, అధిక ప్రయోజనాలను కలిగి ఉందని పేర్కొంటూ బీఎస్ఎన్ఎల్ ఈ రీఛార్జ్ ప్యాక్ను ప్రవేశపెట్టింది.బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్వర్క్ప్రధానమంత్రి నరేంద్ర మోదీ "స్వదేశీ" 4G స్టాక్ను ప్రారంభించారు. ఇది 'ఆత్మనిర్భర్ భారత్' దార్శనికత వైపు ఒక పెద్ద ముందడుగును సూచిస్తుంది. ఈ 4G టెక్నాలజీని పూర్తిగా దేశీయ సాఫ్ట్వేర్ & హార్డ్వేర్పై నిర్మించారు. దీనిని భారతీయ కన్సార్టియం అభివృద్ధి చేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 98,000 సైట్లలో 4G సేవను విస్తరించాలనే లక్ష్యంతో దీనిని ప్రారంభించారు. -
ఒక్క క్లిక్ చాలు.. వెంటనే చేతిలో ఫొటో
మునుపటి రోజుల్లో ఫొటో అంటే ఒక్క క్లిక్ చాలు. వెంటనే ఆ ఫొటో చేతిలోనే ఉండేది. వేలకొద్దీ బ్లర్లు, సెల్ఫీ డిలీట్స్, ఎడిట్స్ ఏమీ ఉండేవి కాదు. ఆ మ్యాజిక్ను మళ్లీ మన చేతిలో తేవడానికి వచ్చింది – ఇన్టాక్స్ మినీ ఇవో ప్రీమియం ఎడిషన్! ఇది కేవలం కెమెరా మాత్రమే కాదు, ప్రింటర్ కూడా. ఒక్క క్లిక్తో ఫొటో తీయవచ్చు, అదే క్షణంలో ప్రింట్ చేసుకోవచ్చు. పది లెన్స్ ప్రభావాలు, పది ఫిల్మ్ ప్రభావాలు – మొత్తం వంద రకాల మూడ్లలో మీ ఫోటోలు తీర్చిదిద్దుకోవచ్చు. రెట్రో లుక్ డిజైన్, డయల్స్తో పాత కెమెరా ఫీల్కు కొత్త స్పర్శ ఇస్తుంది. అంతేకాదు, డైరెక్ట్ ప్రింట్ ఫీచర్తో మొబైల్ నుంచి ఫోటోలు నేరుగా ప్రింట్ చేయవచ్చు. ధర రూ. 19,999.చిన్ననాటి జాదూ బాక్స్!చిన్నప్పటి రోజుల్లో స్కూల్ నుంచి వచ్చి బ్యాగ్ మూలన పడేసి, భోజనం కూడా మరచిపోయి గేమ్ కన్సోల్ ఆన్ చేసిన క్షణాలు గుర్తున్నాయా? మారియోలో ప్రిన్సెస్ కోసం పరిగెత్తిన ఆ ఉత్సాహం, కాంట్రాలో లైఫ్ పోయినప్పుడు మనసులో పడిన ఆ బాధ– ఇవన్నీ మళ్లీ నిజం కానున్నాయి. ‘బెలోక్సీ ఎ5 హ్యాండ్హెల్డ్ గేమ్ కన్సోల్’ అంటే కేవలం ఒక గాడ్జెట్ కాదు, అది 90ల నాటి బాల్యపు మజాను తిరిగి మన చేతిలో పెట్టే జాదూ బాక్స్. ఇందులో ఏకంగా 500 క్లాసిక్ గేమ్స్. చేతిలో పట్టుకుని ఆడినా సరే, టీవీకి కనెక్ట్ చేసి పెద్ద స్క్రీన్పై ఆడినా సరే, ఆ పాత రెట్రో ఫీల్ కచ్చితంగా వస్తుంది. రాత్రిళ్లు దుప్పట్లో దాక్కుని, లైట్ ఆఫ్ చేసి ఆడిన ఆ సీక్రెట్ మజాను కూడా ఇది మళ్లీ జ్ఞాపకం చేస్తుంది. ధర కేవలం రూ.758 మాత్రమే!అప్పటి రోబో పెట్!ప్రస్తుత పిల్లలు ఆడుతున్న ఆర్టిఫిషియల్ రోబో ఫ్రెండ్స్, డిజిటల్ టాయ్స్ కంటే బెటర్గా అప్పట్లో ఒక నిజమైన డిజిటల్ ఫ్రెండ్ ఉండేది. అది అప్పటి అందరి ఫేవరెట్ పెట్– టమాగొచ్చి! అప్పట్లో అది కేవలం ఒక గేమ్ కాదు, నిజంగా మనకున్న డిజిటల్ పెట్ ఫ్రెండ్. దానికి తిండి పెట్టాలి, స్నానం చేయించాలి, బయటికి తీసుకెళ్లాలి, ఆటలు ఆడించాలి– ఇవన్నీ మన బాధ్యతే! ఇప్పుడా పెట్ కొత్త కలర్ స్క్రీన్, టచ్ బటన్స్, కెమెరా, గేమ్స్ అన్నీ కలిపి మరింత అప్డేట్ అయి మన చేతిలోకి వచ్చేసింది– బాండై అమెరికా టమాగొచ్చి పిక్స్ – స్కై పర్పుల్ ఎడిషన్! ఇందులో మీరు మీ పెట్తో సెల్ఫీలు తీయొచ్చు, వంటలు చేయించవచ్చు, ఫ్రెండ్స్ టమాగొచ్చిలతో కలసి ప్లే డేట్స్కి వెళ్లొచ్చు, గిఫ్ట్లు మార్చుకోవచ్చు. పదిహేడుకు పైగా గేమ్స్లో ఆడి పాయింట్స్ సంపాదించి, మీ పెట్కి కావలసిన ఫర్నిచర్, ఫుడ్, యాక్సెసరీస్ కొనిపెట్టొచ్చు. ధర రూ.9,831. -
హెచ్-1బి వీసా రాని టెకీలకు కెనడా గాలం!
అమెరికాలో పనిచేస్తూ కొత్త ఫీజు, నిబంధనల కారణంగా హెచ్-1బి వీసా (H-1B Visa) పొందలేకపోయిన టెక్నాలజీ రంగ నిపుణలకు కెనడా దేశం గాలం వేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కొత్త వీసా ఛార్జీలకు ముందు యూఎస్లో పనిచేసిన టెక్ ఉద్యోగులను తమ దేశానికి ఆకర్షించాలనుకుంటున్నారు కెనడా ప్రధాని మార్క్ కార్నీ.తాజాగా లండన్లో విలేకరులతో మార్క్ కార్నీ మాట్లాడుతూ తమ ఆలోచనను బయటపెట్టారు. గతంలో హెచ్ -1బీ వీసాలు ఉన్న వారిని ఆకర్షించే అవకాశం స్పష్టంగా ఉందని కార్నీ వెల్లడించారు. అలాంటి వారిలో టెక్ రంగ ఉద్యోగులు చాలా మంది ఉన్నారని, వారంతా వేరే ప్రాంతానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.కొత్త హెచ్ -1బి వీసాలపై లక్ష డాలర్ల ఫీజు విధిస్తూ ట్రంప్ గత వారం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. ఇది కంప్యూటర్ ప్రోగ్రామింగ్, ఇంజనీరింగ్, ఇతర ఉద్యోగాల్లో ప్రపంచ ప్రతిభను తీసుకురావడానికి కొత్త హెచ్ -1బి ప్రోగ్రామ్పై ఆధారపడే కంపెనీలకు గందరగోళం, నిరాశను సృష్టించింది.కెనడా (Canada) ప్రభుత్వం తన ఇమ్మిగ్రేషన్ వ్యూహాన్ని సమీక్షిస్తున్నప్పుడు, ఈ రకమైన ప్రతిభావంతులైన నిపుణులను ఆకర్షించే అంశాన్ని గ్రహించడాన్ని పరిగణనలోకి తీసుకుంటుందని, దానిపై "స్పష్టమైన సమర్పణ" ఉంటుందని కార్నీ చెప్పారు.హెచ్-1బి వీసాలు చేజారి, అమెరికాలో పని చేసేందుకు అవకాశాలు కోల్పోయినవారిని పలు ఇతర దేశాలు కూడా ఆకర్షిస్తున్నాయి. జర్మనీ, యూకే వంటి దేశాలు నైపుణ్యం కలిగిన కార్మికులకు ప్రత్యామ్నాయ గమ్యస్థానంగా తమను తాము పేర్కొంటున్నాయి. -
ఊహకందని చరిత్ర: గూగుల్కు ఆ పేరు వచ్చిందిలా..
ప్రపంచం టెక్నాలజీ వైపు పరుగులు పెడుతున్న సమయంలో 'గూగుల్' (Google) గురించి తెలియని వారు దాదాపు ఉండరనేది అక్షర సత్యం. ఆవకాయ వండాలన్న.. అమలాపురం గురించి తెలుసుకోవాలన్నా.. అన్నింటికీ ఒకటే సులభమైన మార్గం గూగుల్. ఈ రోజు నభూతో నభవిష్యతిగా ఎదిగిన 'గూగుల్' రెండు దశాబ్దాల క్రితం ఓ సాదాసీదా సెర్చ్ ఇంజన్ మాత్రమే. ఇప్పుడు ఏ ప్రశ్నకైనా సమాధానం అందించే జగద్గురుగా మారింది. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు గూగుల్ ప్రస్థానం గురించి మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం..చరిత్ర గురించి చదువుకునేటప్పుడు క్రీస్తు పూర్వం.. క్రీస్తు శకం అని చదువుకున్నాం. ఇప్పుడు మాత్రం గూగుల్ పూర్వం యుగం, గూగుల్ తర్వాత యుగం అని చదువుకోవాల్సిన రోజులు వచ్చేసాయి. దీన్ని బట్టి చూస్తే.. గూగుల్ ఎంతలా వ్యాపించిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.గూగుల్ ప్రారంభం..90వ దశకం చివరిలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటిలో కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్లో ప్రావిణ్యం కలిగిన ఇద్దరు PhD స్టూడెంట్స్ ''సెర్గీ బ్రిన్, లారీ పేజ్''లు గూగుల్ ప్రారంభించాలని నిర్విరామంగా శ్రమించి మెరుగైన సర్చ్ ఇంజిన్ కోసం ఒక నమూనాను అభివృద్ధి చేశారు. 1997 సెప్టెంబర్ 15న ‘గూగుల్ డాట్ కామ్’ డొమైన్ పేరును నమోదు చేసుకున్నారు. ఆ తరువాత 1998 సెప్టెంబర్ 4న గూగుల్ కంపెనీని ఏర్పాటు చేసుకుని.. తోటి పీహెచ్డీ స్టూడెంట్ 'క్రెయిగ్ సిల్వర్స్టీన్'ను తొలి ఉద్యోగిగా చేర్చుకుని సంస్థను అధికారికంగా ప్రారంభించారు.గూగుల్ అనే పదం ఎలా వచ్చిందంటే..'గూగుల్' అనే పేరు 'గూగోల్' అనే పదం నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. గూగోల్ అనే పదానికి అర్థం ఒకటి తర్వాత వంద సున్నాలు లేదా సరైన శోధన ఫలితాలను అందించేది. ఈ పదాన్ని జేమ్స్ న్యూమాన్ అండ్ ఎడ్వర్డ్ కాస్నర్ రాసిన 'మ్యాథమెటిక్స్ అండ్ ది ఇమాజినేషన్' అనే పుస్తకం నుంచి తీసుకున్నట్లు తెలుస్తోంది.గూగుల్ ప్రస్థానం ఇలా..1998లో అధికారికంగా ప్రారంభమైన గూగుల్ అంచెలంచేలా ఎదుగుతూ కేవలం సెర్చ్ ఇంజన్గా మాత్రమే కాకుండా.. గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్, గూగుల్ స్టోర్స్, గూగుల్ క్రోమ్, యూట్యూబ్ మొదలైనవి ప్రారంభించి ప్రపంచాన్ని అరచేతిలో పెట్టేసింది.●1997 - గూగుల్.కామ్ డొమైన్ రిజిస్ట్రేషన్●1998 - గూగుల్ అధికారికంగా ప్రారంభమైంది●1999 - గూగుల్ పేజీ ర్యాంక్ డెవెలప్●2000 - యాహూ భాగస్వామ్యంతో.. పెద్ద యూజర్ 'ఆర్గానిక్ సెర్చ్'గా అవతరించింది. గూగుల్ టూల్ బార్ లాంచ్. కొత్తగా 10 భాషలను జోడించింది (ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, స్వీడిష్, ఫిన్నిష్, స్పానిష్, పోర్చుగీస్, డచ్, నార్వేజియన్, జపనీస్, చైనీస్, కొరియన్, డానిష్).●2001 - గూగుల్ తన మొదటి ఛైర్మన్ 'ఎరిక్ ష్మిత్'ను స్వాగతించింది. గూగుల్ ఫొటోస్ ప్రారంభమైంది.●2002 - Google AdWords పరిచయం, గూగుల్ న్యూస్ మొదలైంది. గూగుల్ చరిత్రలో ఇది పెద్ద మైలురాయి.●2003 - గూగుల్ AdSense ప్రారంభమైంది, దీనికి మొదట కంటెంట్ టార్గెటింగ్ అడ్వర్టైజింగ్ అని పేరు పెట్టారు.●2004 - జీమెయిల్ ప్రారంభం●2005 - గూగుల్ మ్యాప్స్●2006 - Google YouTubeని కొనుగోలు చేస్తుంది●2007 - ఆన్లైన్ అడ్వర్టైజింగ్ కంపెనీ అయిన డబుల్ క్లిక్ను గూగుల్ కొనుగోలు చేసింది●2008 - గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ప్రారంభించింది●2009 - ఫోర్బ్స్ మ్యాగజైన్ సెర్గీ బ్రిన్, లారీ పేజ్లను ప్రపంచంలోని ఐదవ అత్యంత శక్తివంతమైన వ్యక్తులుగా పేర్కొంది●2010 - గూగుల్ తన మొట్టమొదటి బ్రాండ్ స్మార్ట్ఫోన్ నెక్సస్ వన్ను విడుదల చేసింది.●2011 - సీఈఓగా లారీ పేజ్ నియామకం, ఎరిక్ ష్మిత్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయ్యారు. ●2012 - గూగుల్ మోటరోలా మొబిలిటీని కొనుగోలు చేసింది●2013 - గూగుల్ రీడర్ మూసివేసి.. Chromecast ప్రారంభం●2014 - హమ్మింగ్ బర్డ్ ఆల్గారిథం●2015 - సీఈఓగా సుందర్ పిచాయ్●2016 - గూగుల్ తయారు చేసిన మొదటి ఫోన్.. గూగుల్ పిక్సెల్ లాంచ్●2017 - HTCలో కొంత భాగాన్ని కొనుగోలు చేసింది●2018 - మొబైల్ స్పీడ్ అల్గారిథం అప్డేట్, 20 సంవత్సరాల చరిత్రలో 100 బిలియన్ డాలర్లను అధిగమించింది●2019 - బ్రాడ్ కోర్ అల్గారిథం, గూగుల్ SERPs స్టార్ట్●2020 - నియామకాలను నెమ్మదించడం, మెషీన్లు మరియు డేటాపై ఎక్కువ దృష్టి పెట్టడం (కోవిడ్-19)●2021 - ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ కంటెంట్ను ఉపయోగించుకునే హక్కు కోసం మీడియా కంపెనీలకు Google చెల్లించాల్సిన చట్టాన్ని ప్రతిపాదించింది.●2022 - క్రోమ్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ●2023 - గూగుల్ పిక్సెల్ 8, 8ప్రో లాంచ్, గూగుల్ జెమిని ఏఐ●2024 - 2024 మార్చిలో గూగుల్ కోర్ అప్డేట్లో దాని ప్రధాన ర్యాంకింగ్ సిస్టమ్లకు అల్గారిథమిక్ మెరుగుదలలను చేసింది. ఈ అప్డేట్ స్పామ్, లో-వాల్యూ కంటెంట్ వంటి వాటిని పరిష్కరించడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగం.●2025: 2025లో గూగుల్ జెమిని 2.5 ఫ్లాష్ & ప్రో లాంచ్ చేసింది. బననా ఏఐ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.గూగుల్ కంపెనీ ఎన్ని దేశాల్లో ఉంది1998లో ఒక చిన్న సంస్థగా ప్రారంభమైన గూగుల్.. నేడు 50 కంటే ఎక్కువ దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా 1.80 లక్షల కంటే ఎక్కువ మంది గూగుల్ సంస్థలో పనిచేస్తున్నట్లు సమాచారం.గూగుల్ ఉపయోగాలుప్రతి ప్రశ్నకు మల్టిపుల్ సమాధానాలు అందిస్తున్న గూగుల్.. ఎన్నెన్నో రకాలుగా ఉపయోగపడుతోంది. ప్రత్యేకంగా విద్యారంగంలో గూగుల్ పాత్ర అనన్య సామాన్యమనే చెప్పాలి.🡆బ్లాగర్, యూట్యూబ్, గూగుల్ అందిస్తున్న సేవలు.. సమాచార విప్లవంలో కొత్త శకానికి నాంది పలికాయి. ఒక్క మాటలో చెప్పాలంటే గూగుల్ దెబ్బకు ఇంటర్నెట్ ఒక అనధికారిక ఓపెన్ యూనివర్సిటీలా మారిపోయింది.🡆వినోదం కోసం యూట్యూబ్ వినియోగించుకునే వారి సంగతి పక్కన పెడితే.. 10వ తరగతి చదివే ఒక విద్యార్ధి నుంచి.. IAS చదివే వ్యక్తి వరకు యూట్యూబ్ ఎలా ఉపయోగపడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.🡆భౌతిక, రసాయనిక శాస్త్రాలు మాత్రమే కాకుండా శస్త్రచికిత్సకు సంబంధించిన ఎన్నో విషయాలను కూడా గూగుల్ ద్వారా తెలుసుకోవచ్చు. మొత్తం మీద పాఠాలు నేర్చుకునే విద్యార్థులకు మాత్రమే కాకుండా.. పాఠాలు నేర్పే గురువులకు సైతం గురువుగా మారిన గూగుల్ ఉపయోగాల గురించి ఎంత చెప్పినా తక్కువే అని నిస్సందేహంగా చెప్పవచ్చు.గూగుల్ లేకపోతే పరిస్థితి ఎలా ఉండేదిగూగుల్ లేకపోతే ప్రపంచంలో జరిగే విషయాలు అందరికీ చేరటం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ప్రజల సమూహాలుగా చేరినప్పుడు మాత్రమే ఇతర విషయాలను చర్చించుకోవాల్సి వచ్చేది. గూగుల్ లేకుంటే.. స్మార్ట్ఫోన్ వినియోగం కూడా ఇంతలా ఉండేది కాదనే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు స్మార్ట్ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరూ గూగుల్ ఉపయోగించాల్సిందే.గూగుల్ లేకపోతే చదువుకునే వారికి కూడా.. అన్ని అంశాలు అందుబాటులో ఉండేవి కాదు. ఎందుకంటే గూగుల్ ప్రమేయం లేకుండా ఏదైనా తెలుసుకోవాలంటే తప్పకుండా ఉద్గ్రంధాలను (పుస్తకాలు) తిరగేయాల్సిందే. అంటే మనకు కావలసిన విషయం తెలుసుకోవడానికి కనీసం రోజుల సమయం పట్టేది. మొత్తం మీద గూగుల్ లేని ప్రపంచంలో జీవించడం ఇప్పుడు దాదాపు అసాధ్యమనే చెప్పాలి. -
రూ.40,000 లోపు ల్యాప్టాప్ల లిస్ట్ ఇదే..
జీఎస్టీ(Goods and Services Tax) క్రమబద్ధీకరణలో కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గినా ల్యాప్టాప్ల ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం గతంలో ఉన్న 18 శాతం జీఎస్టీ శ్లాబులో ఎలాంటి మార్పులు చేయకపోవడమే ఇందుకు కారణం. అయితే పండుగవేళ బ్యాంకులు, రిటైలర్లు ఆఫర్ ఇస్తున్నాయి. మార్కెట్లో రూ.40,000 లోపు ల్యాప్టాప్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ బడ్జెట్లో మంచి ఫీచర్లతో కూడిన కొన్ని ల్యాప్టాప్ల వివరాలు తెలుసుకుందాం.మోడల్ప్రాసెసర్ ర్యామ్/స్టోరేజ్ధర(అంచనా)ASUS Vivobook Go 15Intel Core i3 (13th Gen)8GB / 512GB SSDరూ.34,200 – రూ.44,999Lenovo IdeaPad Slim 3AMD Ryzen 3 7320U8GB / 512GB SSDరూ.36,000 – రూ.41,000HP 15sRyzen 3 7320U / i3 (12/13 Gen)8GB / 512GB SSDరూ.38,000 – రూ.45,000Acer Aspire LiteAMD Ryzen 5 5625U16GB / 512GB SSDరూ.39,000 – రూ.43,000Samsung Galaxy Book4Intel Core i3 (13th Gen)8GB / 512GB SSDరూ.42,000 – రూ.47,000 (గమనిక: పైన తెలిపిన ల్యాప్టాప్ల ధరలు, ప్రత్యేకతలు ఈకామర్స్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్ల కారణంగా ఎప్పటికప్పుడు మారవచ్చు. కొనుగోలుకు ముందు వెబ్సైట్లో తుది ధరను ధ్రువీకరించుకోవాలి)కొనుగోలు చేసేముందు చూడాల్సినవి..వినియోగం, ఉద్దేశం (Usage and Purpose)రోజువారీ/విద్యార్థుల కోసం: వెబ్ బ్రౌజింగ్, ఆన్లైన్ క్లాసులు, డాక్యుమెంట్లు వంటి సాధారణ పనులకు కనీసం Intel Core i3 (12th Gen లేదా అంతకంటే ఎక్కువ) లేదా AMD Ryzen 3 ప్రాసెసర్ ఉండాల్సిందే.మల్టీ టాస్కింగ్/ ప్రొఫెషనల్: ఎక్కువ సాఫ్ట్వేర్లను ఏకకాలంలో ఉపయోగించాలనుకుంటే కనీసం Core i5 లేదా Ryzen 5 ప్రాసెసర్ను ఎంచుకోవడం మంచిది. పైన తెలిపిన బడ్జెట్లో i5 లేదా R5 పాతతరం ల్యాప్టాప్లు దొరికే అవకాశం ఉంది.ప్రాసెసర్ (CPU)ల్యాప్టాప్ వేగం, పనితీరును ప్రాసెసర్ నిర్ణయిస్తుంది.Intel Core i3/i5: Intel ప్రాసెసర్ల్లో 11వ తరం (11th Gen) లేదా 12వ, 13వ తరం (12th/13th Gen) లేదా కొత్త వెర్షన్లను ఎంచుకోవాలి.AMD Ryzen 3/Ryzen 5: AMD ప్రాసెసర్ల్లో 5000 సిరీస్, 7000 సిరీస్ లేదా కొత్త వెర్షన్లను పరిగణించాలి.ర్యామ్ (RAM)ర్యామ్ అనేది మల్టీ టాస్కింగ్కు కీలకం. మీరు ఒకేసారి ఎన్ని ప్రోగ్రామ్లను రన్ చేయగలరనేది దీనిపై ఆధారపడి ఉంటుంది. రోజువారీ పనులు, సాధారణ బ్రౌజింగ్, ఆఫీస్ వర్క్ కోసం కనీసం 8GB RAM ప్రామాణికం. పైన తెలిపిన బడ్జెట్లో 16GB RAMను పొందగలిగితే అది అత్యుత్తమ ఎంపిక.స్టోరేజ్ (Storage)ల్యాప్టాప్ త్వరగా బూట్ కావడానికి, అప్లికేషన్లు వేగంగా లోడ్ కావడానికి SSD (Solid State Drive) తప్పనిసరి. పాత HDD (Hard Disk Drive) ఉన్న ల్యాప్టాప్లను కొనుగోలు చేయకండి. చాలా మంది వినియోగదారులకు కనీసం 512GB SSD సరిపోతుంది.డిస్ప్లేచూడటానికి సౌకర్యంగా ఉండే డిస్ప్లేను ఎంచుకోవాలి. కనీసం ఫుల్హెచ్డీ (1920 x 1080) తప్పనిసరి. హెచ్డీ (1366x768) స్క్రీన్లు పాతవి. ఇవి నాణ్యత తక్కువగా ఉంటాయి. యాంటీ-గ్లేర్ (Anti-Glare) ఫీచర్ ఉంటే బెటర్. ఇది లైటింగ్ ఉన్న పరిస్థితుల్లో కంటిపై ఒత్తిడిని తగ్గిస్తుంది.బ్యాటరీ లైఫ్ల్యాప్టాప్ను ఎక్కువగా ప్రయాణంలో లేదా బయట ఉపయోగించాలనుకుంటే బ్యాటరీ లైఫ్ కనీసం 6-8 గంటలు లేదా అంతకంటే ఎక్కువ బ్యాకప్ ఇచ్చే ల్యాప్టాప్ను ఎంచుకోవాలి.ఇదీ చదవండి: అమెరికా ఆంక్షలపై ద్వంద్వ వైఖరి -
బీఎస్ఎన్ఎల్ ‘స్వదేశీ’ 4జీ నెట్వర్క్
పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్వర్క్ను ప్రధాని నరేంద్ర మోదీ నేడు (శనివారం) ప్రారంభించనున్నారు. దీనితో టెలికం పరికరాలను పూర్తిగా దేశీయంగానే ఉత్పత్తి చేసుకుంటున్న చైనా, డెన్మార్క్, స్వీడన్, దక్షిణ కొరియా సరసన అయిదో దేశంగా భారత్ కూడా చేరనుంది.బీఎస్ఎన్ఎల్కి చెందిన 97,500 మొబైల్ 4జీ టవర్లను ఒరిస్సాలోని ఝర్సుగూడలో ప్రధాని ప్రారంభిస్తారని, ఇది భారతీయ టెలికం రంగానికి ఒక కొత్త శకంలాంటిదని కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఇందులో 92,600 మొబైల్ సైట్లు పూర్తిగా స్వదేశీ 4జీ టెక్నాలజీతో రూపొందినవని, వీటిని 5జీకి అప్గ్రేడ్ చేయొచ్చని ఆయన పేర్కొన్నారు.కోర్ నెట్వర్క్ సిస్టమ్ను సీ–డాట్, రేడియో యాక్సెస్ నెట్వర్క్ (ర్యాన్) సిస్టమ్ను తేజస్ నెట్వర్క్ రూపొందించగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) వీటిని అనుసంధానం చేసింది. మరోవైపు, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, భారతీ ఎయిర్టెల్ కలిసి 4,700 మొబైల్ 4జీ టవర్లను ఇన్స్టాల్ చేశాయి. ఈ టవర్లతో మారుమూల, సరిహద్దు ప్రాంతాల్లోని 26,700 గ్రామాలకు కవరేజీ లభిస్తుంది. తద్వారా ఇరవై లక్షల మంది పైగా సబ్స్క్రైబర్స్కు సర్వీసులు అందుతాయి.ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి! -
చూపున్న యాప్
దృష్టి లోపం ఉన్న వ్యక్తులు పరిసరాలను నావిగేట్ చేయడానికి ప్రత్యూష, ఐశ్వర్య ‘స్పేస్ఫెల్ట్’ అనే పేరుతో అప్లికేషన్ను రూపొందించారు. దృష్టి లోపం సమస్యతో బాధపడిన ప్రత్యూష, ఐశ్వర్యలు కలిసి ఈ అప్లికేషన్ను రూపొందించారు. హైదరాబాద్లో గ్రెయల్ మేకర్ ఇన్నోవేషన్ ద్వారా వీరు తమ సేవలను నాలుగేళ్లుగా అందిస్తున్నారు. పిల్లలు ఇంట్లోనే ఉండి చూపును పెంచుకునేందుకు, వారి తల్లిదండ్రులకు ‘విజన్ నానీ డిజిటల్ యాప్’ ద్వారా పనులను సులభతరం చేస్తున్నారు.దృష్టి లోపం ఉన్న చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు సాంకేతికంగా ఉపయోగపడేలా తమ జీవన ప్రయాణాన్ని మార్చుకున్నారు స్పేస్ఫెల్ట్, విజన్ నానీ యాప్ ఫౌండర్స్ ప్రత్యూష, ఐశ్వర్య. పిల్లల మెరుగైన భవిష్యత్తుకుతమ వర్క్ గురించి ప్రత్యూష మాట్లాడుతూ – ‘‘కార్టికల్ విజువల్ ఇంపెయిర్మెంట్ ఉన్న పిల్లలు, ఏదైనా కారణాల వల్ల మెదడు పనితీరులో లోపాలు ఉన్నా వారు చూసింది త్వరగా అర్థం చేసుకోలేరు. చదువుతో పాటు జీవనంలో వెనకబడి పోతుంటారు. ఇలాంటప్పుడు వారి తల్లితండ్రులు స్పెషల్ సెంటర్స్ కోసం వెతుకుతుంటారు. హైదరాబాద్తో పాటు కొన్ని ప్రధాన పట్టణాలలోనే ఈ సెంటర్లు, అవీ చాలా తక్కువ శాతంలో ఉంటాయి. అలాంటి తల్లితండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం ఉన్న చోటును వదులుకొని నగరాలకు వలస వెళ్లాల్సి ఉంటుంది. దీనివల్ల వారి కుటుంబం మొత్తం ఇబ్బందులు పడుతుంటుంది. అందుకని, ‘విజన్ నానీ’ పేరుతో దృష్టి లోపం ఉన్న పిల్లల కోసం డిజిటల్ ప్రోడక్ట్ను రూపొందించాం. తమ ఇంటినుంచే బాల్య అంధత్వానికి కారణమేంటో తెలుసుకునేలా, వారికి సరైన మార్గదర్శకం చూపేలా దీనిని తయారుచేశాం.దీనిని తమ స్మార్ట్ ఫోన్ ద్వారా ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయవచ్చు. కమ్యూనిటీ సెంటర్లలో కూడా వీటిని ఉపయోగిస్తున్నాం. తల్లిదండ్రులకు, సంరక్షకులకు, స్పెషల్ టీచర్స్కు అనుకూలమైన విజన్ థెరపీ యాక్సెస్ను కూడా ఈ యాప్ అందిస్తుంది.స్వయంగా అర్థం చేసుకొని...చిన్నప్పుడు నేను చూపు సమస్యలను ఎదుర్కొన్నాను. దీంతో చదువులో వెనకబడేదాన్ని. మా అమ్మ నా సమస్యను నివారించడానికి చాలా ప్రయత్నాలు చేసింది. పెద్దయ్యాక నాలాంటి వారికోసం ఉపయోగపడే పనిచేయాలని అనుకునేదాన్ని. అందుకే ఎంతో కష్టపడి పట్టుదలతో ఐఐటీ హైదరాబాద్లో బయోటెక్నాలజీ డిగ్రీ చేశాను. విజన్ సమస్య ఉన్నవారు టెక్నాలజీ ఉపయోగించడంతో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలుసుకోవాలని, ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో వాలెంటీర్గా చేరాను. అక్కడ దృష్టి లోపంతో వచ్చే పిల్లల సమస్యలను స్వయంగా చూస్తూ అర్థం చేసుకునేదాన్ని. వాస్తవానికి విజన్ థెరపీకి 3–5 ఏళ్ల వరకు క్రమం తప్పకుండా రావాలి. కానీ, తల్లిదండ్రులకు కుదరక మిస్ చేసేవారు. దీంతో వారి సమస్య అలాగే ఉండేది. ఇంటి నుంచే వారి సమస్యను పరిష్కరించే విధానం ఉంటే బాగుంటుందనుకున్నాం. ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లోనే ఐశ్వర్య పరిచయం అయ్యింది. తను 18 ఏళ్ల వయసులో బ్రెయిన్ ట్యూమర్ వల్ల చూపు కోల్పోయింది. కోలుకున్నాక చూపు లేని వారికి సాయం చేయాలనుకుంది. తను ఎదుర్కొన్న సంఘటనలను, తనకు ఎదురైన అనుభవాలను తెలుసుకొని, ఈ డిజిటల్ ప్రోడక్ట్ని డెవలప్ చేశాం. ఇప్పటి వరకు 7000 మంది పిల్లలు ఈ యాప్ను ఉపయోగిస్తున్నారు. దేశంలోని అన్నిప్రాంతాల నుంచి, విదేశాల నుంచి కూడా ఈ యాప్కి యూజర్స్ ఉన్నారు.పబ్లిక్ ప్లేసులో క్యూఆర్ చూపులేని వారిని బయటకు తీసుకెళ్లినప్పుడు, అక్కడ పబ్లిక్ వాష్రూమ్ వరకు ఒకరు తోడుగా వెళ్లినా, ఆ డోర్ వరకు తీసుకెళ్లి వదిలేస్తారు. కానీ, వారు వాష్ రూమ్లో చాలా ఇబ్బంది పడతారు. ఇలాంటప్పుడు యాప్లోని క్యూఆర్ కోడ్ (మనీ పే యాప్స్ ఏ విధంగా వాడతారో అలా)ని ఉపయోగించి, లోపల వాష్రూమ్లో ఏ వస్తువులు ఎక్కడ, ఏ డైరెక్షన్లో ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇదేవిధంగా పబ్లిక్ ప్లేస్లో ఉన్న లొకేషన్స్, ఆడియో విని, ఎవరి సాయం లేకుండానే వాటిని ఉపయోగించవచ్చు. మ్యూజియంకు వెళితే చూపులేనివారికి అక్కడ ఏమీ తెలియదు. యాప్ క్యూఆర్ కోడ్ ను ఉపయోగిస్తే ఆడియో విని అక్కడి స్టోరీ తెలుసుకోవచ్చు. దీనిని లాంచ్ చేసింది చూపులేనివారికోసమే అయినా ఇప్పుడు ఈ యాప్ మిగతావారికీ ఉపయోగపడుతోంది. హైదరాబాద్లో ఉన్న అభయ స్వచ్ఛంద సంస్థ, ఎల్.వి.ప్రసాద్ వారితో కలిసి వర్క్ చేస్తున్నాం’’ అని వివరించారు ఈ యాప్ డెవలపర్. సమస్యకు పరిష్కారంనాకు సమస్య ఉన్నప్పుడు మా అమ్మ నాకు చాలా సాయంగా ఉన్నారు. అందరికీ ఆ స పోర్ట్ ఉండక పోవచ్చు. వాలెంటీర్గా చేసినప్పుడు అక్కడికి వచ్చిన పిల్లలను చూసి చాలా బాధనిపించేది. టెక్నాలజీ పరంగా మనం ఎంతో ప్రగతి సాధిస్తున్నాం. కానీ, మన పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యను తీర్చలేక పోతున్నాం అనిపించింది. టెక్నాలజీని ఉపయోగించే దృష్టి లోపంతో బాధపడుతున్నవారికి పరిష్కారం కనుక్కోవాలని ఈ యాప్ను తీసుకువచ్చాం. – ప్రత్యూషపనులు సులువయ్యాయిదృష్టిలోపంతో జీవిస్తున్న వ్యక్తిగా నేను ఎదుర్కొన్న సమస్యలు ఏంటో నాకు బాగా తెలుసు. నాలాంటి వారు ఆ సమస్యలను ఎదుర్కోకూడదు అనే ఆలోచన నుంచి ఈ యాప్ని డిజైన్ చేశాం. పబ్లిక్ టాయిలెట్లు, మ్యూజియం.. మొదలైన ప్రదేశాలకు వెళ్లినప్పుడు వారు ‘క్యూఆర్’ కోడ్ సాయంతో ఇబ్బందులు లేకుండా సందర్శించవచ్చు. పిల్లల్లో కంటి సమస్య ఉన్నవారి పేరెంట్స్కి ఇప్పుడు వర్క్ సులువుగా మారింది. అదే విషయాన్ని రివ్యూస్ ద్వారా తల్లిదండ్రులు తెలియజేస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. – ఐశ్వర్య – నిర్మలారెడ్డి -
3 నెలల్లో 11 వేల ఉద్యోగాలు తొలగించిన ఐటీ కంపెనీ
ప్రముఖ మల్టీనేషనల్ ఐటీ కంపెనీ యాక్సెంచర్ (Accenture) గత మూడు నెలల్లో 11,000 మందికిపైగా ఉద్యోగులను తగ్గించింది. రానున్న రోజుల్లో మరిన్న కోతలు ఉంటాయని సంకేతాలు ఇచ్చింది. ఏఐ కార్యాచరణకు సరిపోయేలా ఉద్యోగులకు నైపుణ్యాలు పెంచడం సాధ్యపడకపోతే తొలగించడమే ( layoffs) మార్గమని త్రైమాసిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీ స్పష్టం చేసింది.సీఈవో ఏమన్నారంటే..తాజాగా జరిగిన ఎర్నింగ్ కాల్ సందర్భంగా యాక్సెంచర్ సీఈవో జూలీ స్వీట్ మాట్లాడుతూ.. కార్యాచరణ అవసరాలను ఏఐ సమూలంగా మార్చేస్తున్న తరుణంలో రీస్కిల్లింగ్ సాధ్యంకాని ఉద్యోగాలను కంపెనీ తొలగిస్తుందన్నారు. అయితే ఖచ్చితంగా సంఖ్య ఎంతన్నది ఆమె స్పష్టం చేయలేదు. యాక్సెంచర్లో మూడు నెలల క్రితం మొత్తం 791,000 మంది ఉద్యోగులు ఉండగా ఈ ఆగస్టు చివరి నాటికి ఆ సంఖ్య 779,000 మందికి తగ్గింది.యాక్సెంచర్ ఆదాయం జూన్-ఆగస్టు 2025 త్రైమాసికంలో 17.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. సంవత్సరానికి 7 శాతం పెరుగుదలను నమోదు చేసింది. సెప్టెంబర్-ఆగస్టు ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 2.5 శాతం విదేశీ మారక ద్రవ్య ప్రభావంతో దాని ఆదాయాలను ప్రభావితం చేసిందని తెలిపింది. కొనసాగుతున్న పోర్ట్ ఫోలియో ఆప్టిమైజేషన్ లో భాగంగా, యాక్సెంచర్ కొన్ని నాన్-కోర్ వ్యాపారాల నుండి నిష్క్రమించనున్నట్లు, 865 మిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను ఉపసంహరించుకునే ప్రణాళికలను కూడా ప్రకటించింది.(అమెరికాలో భారతీయ టెకీలు సంపాదిస్తున్నదెంత?) -
రూ.500 లోపు రీచార్జ్.. 72 రోజులు అన్లిమిటెడ్!
ప్రైవేట్ టెలికం సంస్థలు టారిఫ్లు పెంచిన క్రమంలో వినియోగదారులు చౌక రీచార్జ్ ప్లాన్ల కోసం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) తక్కువ ఖర్చుతో దీర్ఘకాలిక వ్యాలిడిటీని ఇచ్చే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను ప్రవేశపెట్టింది.బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ ధర రూ .485. ఈ ప్లాన్ లో రోజూ హై-స్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్ ఇటీవల ఇలాంటి ప్రయోజనాలతోనే రూ .199 రీఛార్జ్ ప్లాన్ ను ప్రకటించింది. ఇది మంత్లీ ప్లాన్ కాగా తాజా రూ.485 ప్లాన్ (Recharge plan) దాదాపు రెండున్నర నెలల వ్యాలిడిటీతో వస్తుందిరూ.485 ప్లాన్ ప్రయోజనాలుబీఎస్ఎన్ఎల్ రూ.485 ప్లాన్లో 2 జీబీ రోజువారీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు, 72 రోజుల వాలిడిటీతో లభిస్తాయి. అంటే యూజర్లు మొత్తం 144 జీబీ డేటాను పొందుతారు. ఇది బ్రౌజింగ్, సోషల్ మీడియా, వీడియో కాల్స్ లేదా లైట్ స్ట్రీమింగ్ కు సరిపోతుంది. వర్క్ లేదా ఎంటర్టైన్మెంట్ కోసం మొబైల్ డేటాపై ఆధారపడే వారికి, రూ .500 కంటే తక్కువ ధర పరిధిలో ఇది ఉత్తమ ప్లాన్. అంతే కాకుండా బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్ సైట్ లేదా బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా రీఛార్జ్ చేస్తే 2 శాతం తగ్గింపు కూడా లభిస్తుంది.ఇదీ చదవండి: రూ.200 లోపు రీచార్జ్.. రోజుకు 2 జీబీ డేటా -
ఏఐ సొల్యూషన్స్, సర్వీసులపై లెనొవొ దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ ఏఐ (కృత్రిమ మేధ) ప్రయోజనాలను అందరికీ మరింతగా అందుబాటులోకి తేవాలని టెక్ దిగ్గజం లెనొవొ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా కేవలం పీసీలు మొబైల్స్లాంటి ఉత్పత్తులే కాకుండా ఏఐ ఆధారిత మౌలిక సర్విసులు, సొల్యూషన్స్ను విస్తృతంగా అందిస్తున్నట్లు లెనొవొ ఇండియా ఎండీ అమిత్ లూథ్రా, ఈడీ రోహిత్ వెల్లడించారు. ఇతర ఆసియా పసిఫిక్ దేశాల్లోని సంస్థలు బ్యాక్–ఆఫీస్ అవసరాల కోసమే ఏఐని ఉపయోగిస్తుండగా, దేశీయంగా సేల్స్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్లు గణనీయంగా కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నాయని చెప్పారు.భారత్లో ఇప్పటికే 53 శాతం సంస్థలు ఏఐ ఆధారిత పీసీలను వినియోగిస్తున్నట్లు చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్పై (సీఐవో) నిర్వహించిన తమ అధ్యయనంలో వెల్లడైందని హైదరాబాద్లో తమ ఏఐ పోర్ట్ఫోలియోను డిస్ప్లే చేసిన సందర్భంగా వివరించారు. ప్రస్తుతం దేశీయంగా పర్సనల్ కంప్యూటింగ్ ఉత్పత్తుల విభాగంలో రెండో స్థానంలో, ఇన్ఫ్రా సొల్యూషన్స్ విభాగంలో మూడో స్థానంలో ఉన్నట్లు రోహిత్ చెప్పారు. భారత్లో 5 తయారీ ప్లాంట్లు, సుమారు 1,700 మంది సిబ్బంది ఉండగా, గత ఆర్థిక సంవత్సరం 3.4 బిలియన్ డాలర్ల ఆదాయం నమోదైందని ఆయన వివరించారు. -
నానో బనానా క్రేజ్: ఒక్క నెలలో 500 కోట్ల చిత్రాలు
గూగుల్ ఇటీవల జెమిని యాప్లో నానో బనానా అనే కొత్త ఇమేజ్ జనరేషన్ ఫీచర్ను ప్రారంభించింది. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన నెల రోజుల్లో ఏకంగా 500 కోట్ల ఏఐ ఫోటోలను క్రియేట్ చేసింది. దీనిపై కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ స్పందించారు.500 కోట్ల చిత్రాలు పూర్తయ్యాయి. ఆ తరువాత ఫోటో నాదే అంటూ 'సుందర్ పిచాయ్' నానో బననా ఫోటో షేర్ చేశారు. ఒక్క నెలలో 500 కోట్ల ఫోటోలు అంటే.. దీనికున్న ఆదరణ అంతాఇంతా కాదు.నానో బనానా ఫీచర్ ద్వారా.. యూజర్లు రెట్రో చిత్రాలు, నవరాత్రి లుక్స్ వంటివాటిని సృష్టిస్తున్నారు. నానో బనానా రూపొందించే ఏఐ 3డీ చిత్రాలు నిజమైనవి కాదు. ఇవి కేవలం డిజిటల్ ఇమేజస్ మాత్రమే. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటం వల్ల.. ఎవరైనా తమ ఫ్యూతోను కూడా 3డీగా చేసుకోవాలని ఆశపడతారు. ఈ కారణంగానే.. ఎక్కువమంది దీనిని ఉపయోగించారు.Make that 5 billion and 1 😂 https://t.co/3HDKDY3T0F pic.twitter.com/EQin9fpZuE— Sundar Pichai (@sundarpichai) September 24, 2025 -
శామ్సంగ్ ఏఐ హోమ్: ఇంట్లో పనులు ఇట్టే అయిపోతాయ్!
భారతదేశంలో లార్జెస్ట్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన శామ్సంగ్.. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని జియో వరల్డ్ ప్లాజాలోని దాని ఫ్లాగ్షిప్ స్టోర్లో "ఏఐ హోమ్: ఫ్యూచర్ లివింగ్, నౌ" కోసం తన విజన్ను ఆవిష్కరించింది. టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో సంస్థ దీనిని పరిచయం చేసింది.ఒకసారి ఊహించుకోండి.. మీరు ఇంటికి వచ్చేసరికి లైట్లు ఆన్ అవుతాయి. వీ మీకు ఇష్టమైన షోను క్యూలో ఉంచుతుంది. ఏసీ మీ నిద్రకు కావలసిన టెంపరేచర్ అందిస్తుంది. ఇలా ఇంటిపనులన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతే ఎంతబాగుంటుంది. ఇవన్నీ సాధ్యం చేయడానికే.. శామ్సంగ్ ఏఐ హోమ్: ఫ్యూచర్ లివింగ్, నౌ తీసుకొస్తోంది.శామ్సంగ్ గెలాక్సీ ఏఐ, విజన్ ఏఐ, బెస్పోక్ ఏఐ వంటి వాటి ద్వారా.. ప్రజల దైనందిన జీవితాల్లోకి టెక్నాలజీని అనువదించాలనుకుంటున్నాము. ఇది రోజువారీ జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా, సమర్థవంతంగా, ఆరోగ్యంగా, సురక్షితంగా మారుస్తుంది. భారతదేశం ఈ ప్రయాణంలో కేంద్రంగా ఉంది. ఇక్కడ నుంచే ప్రపంచానికి పరిచయం చేస్తామని.. శామ్సంగ్ సౌత్వెస్ట్ ఆసియా అధ్యక్షుడు, సీఈఓ జేబీ పార్క్ అన్నారు. -
టాప్ 10 బెస్ట్ స్మార్ట్ఫోన్స్: రూ. 20వేల కంటే తక్కువే..
అసలే పండుగ సీజన్.. ఈ సమయంలో అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ దిగ్గజాలు ఆఫర్స్ ప్రకటిస్తాయని, ఓ మంచి స్మార్ట్ఫోన్ కొనాలని చాలామంది ఎదురుచూస్తూ ఉంటారు. ఆ టైమ్ ఇప్పుడు వచ్చేసింది. ఈ కథనంలో రూ. 20వేలకంటే తక్కువ ధరలో లభించే బెస్ట్ స్మార్ట్ఫోన్స్ గురించి తెలుసుకుందాం.రెడ్మీ ఏ4 5జీ: రెడ్మీ ఏ4 5జీ స్మార్ట్ఫోన్ ధర అమెజాన్లో రూ.7,499 మాత్రమే. ఇది మార్కెట్లోని అత్యంత సరసమైన 5జీ-రెడీ స్మార్ట్ఫోన్లలో ఒకటి. ఇది మంచి డిజైన్ కలిగి ఉండటమే కాకుండా.. బ్యాటరీ లైఫ్ కూడా బాగుంటుంది.రియల్మి నార్జో 80 లైట్: అమెజాన్లో రూ. 8,999 ధరకు లభించే ఈ ఫోన్ మంచి పనితీరును అందిస్తుంది. విద్యార్థులకు, సాధారణ వినియోగదారులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.లావా స్టార్మ్ ప్లే 5జీ: అమెజాన్లో రూ.8,999 ధర వద్ద అందుబాటులో ఉన్న ఈ ఫోన్.. ఈ విభాగంలోని ఇతర ఫోన్లతో పోలిస్తే వేగవంతమైన పనితీరును అందిస్తుంది. ఇది మంచి స్టోరేజ్ కూడా పొందుతుంది.ఐకూ జెడ్10 లైట్ 5జీ: అమెజాన్లో రూ. 8,999 ధరకు లభించే ఐకూ జెడ్10 లైట్ 5జీ.. లేటెస్ట్ డిజైన్ పొందుతుంది. గేమింగ్, మల్టీ టాస్కింగ్ వంటి వాటికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఒప్పో కే13ఎక్స్: ఫ్లిప్కార్ట్లో రూ. 9,499 ధరకు లభించే.. ఒప్పో కే13ఎక్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్. ఇది మంచి కెమెరా, బ్యాటరీ లైఫ్ కలిగి ఉండటమే కాకుండా.. స్టైలిష్ డిజైన్ పొందుతుంది.పోకో ఎం7 ప్లస్: ఫ్లిప్కార్ట్లో రూ.10,999 ధరకు లభించే పోకో ఎం7 ప్లస్.. స్మూత్ పెర్ఫార్మెన్స్ అందిస్తూ పెద్ద బ్యాటరీని కలిగి ఉంటుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ అయిన ఈ ఫోన్ గేమింగ్ వంటి వాటికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది.ఒప్పో కే13: ఫ్లిప్కార్ట్లో రూ.14,999 వద్ద ఉన్న.. ఒప్పో కే13 అనేది ఒక స్టైలిష్ మిడ్-రేంజ్ ఫోన్. ఇది మంచి పనితీరును అందిస్తుంది. కెమెరా ఫీచర్ బాగుంటుంది. బ్యాటరీ లైఫ్ కూడా అద్భుతంగా ఉంటుంది.వివో టీ4ఎక్స్: ఫ్లిప్కార్ట్లో రూ. 12,249 కు లభించే వివో టీ4ఎక్స్ కూడా తక్కువ ధరలో లభించే ఓ బెస్ట్ మొబైల్. ఇది మల్టీ టాస్కింగ్ ఫోన్. మంచి పర్ఫామెన్స్ కూడా అందిస్తుంది.ఐక్యూఓ జెడ్10ఎక్స్: అమెజాన్లో రూ.11,999 ధరకు లభించే ఈ ఫోన్ గేమింగ్, మల్టీ టాస్కింగ్ వంటి వాటికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రూ. 15వేలు కంటే తక్కువ ధరలో లభించే స్మార్ట్ఫోన్ల జాబితాలో ఇది ఒకటి.రియల్మి పీ4 & సీఎమ్ఎఫ్ ఫోన్ 2 ప్రో: వీటి ధరలు ఫ్లిప్కార్ట్లో రూ. 14,999. రియల్మే పీ4 లేటెస్ట్ డిజైన్ కలిగి.. మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. కాగా సీఎమ్ఎఫ్ ఫోన్ 2 ప్రో మంచి హార్డ్వేర్తో మినిమలిస్టిక్ స్టైలింగ్ పొందుతుంది. కాబట్టి వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. -
అమెరికాలో అందమైన నగరం: ఇన్స్టాలో ఇదే టాప్..
స్మార్ట్ఫోన్ వచ్చిన తరువాత.. అందమైన ప్రదేశం కనిపించగానే ఫోటో తీసేస్తారు. అంతటితో ఊరుకుంటారా?, సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. లైక్స్, కామెంట్స్, షేర్స్ కోసం చూస్తారు. అయితే ఇన్స్టాగ్రామ్లో ఫోటో తీసి పోస్ట్ చేయడానికి అనువైన ఆకర్షణీయమైన నగరాల జాబితాను ఆర్ట్ అండ్ డిజైన్ ఇంప్రెంట్ అయిన రివర్స్ వాల్ ఆర్ట్ ఒక నివేదికలో విడుదల చేసింది.రివర్స్ వాల్ ఆర్ట్ డేటా ప్రకారం.. అమెరికాలో అత్యంత అందమైన నగరంగా న్యూయార్క్ నిలిచింది. అమెరికాలోని 25 అతిపెద్ద నగరాల్లో 895 మిలియన్లకు పైగా హ్యాష్ట్యాగ్లను విశ్లేషించిన తరువాత నిపుణులు నివేదిక విడుదల చేసారు. న్యూయార్క్ ఒక సాంస్కృతిక చిహ్నం. అంతే కాకుండా ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ నగరాల్లో ఒకటి. యాన్యువల్ రాక్ఫెల్లర్ సెంటర్ క్రిస్మస్ ట్రీ నుంచి ఎంపైర్ స్టేట్ భవనం వరకు.. ఈ నగరంలో చూడచక్కని ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు.అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాష్ట్యాగ్లలో #NYC (145.3 మిలియన్), #NewYorkCity (35.9 మిలియన్స్) ఉన్నాయి. మొత్తం మీద న్యూయార్క్ హ్యాష్ట్యాగ్లతో 183,869,262 పోస్టులు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇది అత్యంత అందమైన నగరం మాత్రమే కాదు.. అత్యధిక జనాభా కలిగిన నగరం కూడా.ఇన్స్టాగ్రామ్లో అధికంగా పోస్ట్ చేసిన అమెరికాలోని నగరాలు●న్యూయార్క్: 18,38,69,262 పోస్ట్లు●లాస్ ఏంజిల్స్: 141,271,982 పోస్ట్లు●చికాగో: 60,196,138 పోస్ట్లు●లాస్ వెగాస్: 54,038,732 పోస్ట్లు●శాన్ ఫ్రాన్సిస్కో: 45,895,134 పోస్ట్లు●వాషింగ్టన్: 45,470,821 పోస్ట్లు●శాన్ డియాగో: 39,451,127 పోస్ట్లు●సియాటిల్: 37,597,785 పోస్ట్లు●ఆస్టిన్: 34,022,105 పోస్ట్లు●హూస్టన్: 33,942,790 పోస్ట్లుఇదీ చదవండి: అమెరికా పొమ్మంటే.. ఆ 25 ఐటీ హబ్స్ రమ్మంటాయ్ -
ట్రంప్ ఓ ‘ఇడియట్’: గూగుల్ ఇమేజెస్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తోపాటు ఆయన పేరు కూడా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ట్రంప్ పేరుతో గూగుల్లో సెర్చ్(Google search) చేస్తే ఆయనకు సంబంధించి తాజా వార్తావిశేషాలు, తాను తీసుకున్న నిర్ణయాలు, తన పర్యటనలు... ఇలా విభిన్న సమాచారం ప్రత్యక్షం అవుతుంది. అయితే గూగుల్ ఇమేజెస్లో ఇటీవల ‘ఇడియట్’ అని సెర్చ్ చేస్తున్న వ్యూయర్లకు కూడా ట్రంప్ ఫొటోనే దర్శనమివ్వడం పట్ల తీవ్ర దుమారం రేగింది. దాంతో అమెరికా ప్రభుత్వం స్పందించి ఈ వ్యవహారంపై జ్యుడీషియరీ కమిటీ ఏర్పాటు చేసింది. ఇటీవల ఆ కమిటీ ముందు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్(Sundar Pichai) అలా జరగడానికి కారణాలేంటో వివరించారు.ఇటీవల యూఎస్ హౌస్ జ్యుడీషియరీ కమిటీ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ను గూగుల్ ఇమేజెస్లో ‘ఇడియట్’ అనే పదాన్ని సెర్చ్ చేసినప్పుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చిత్రాలను ఎందుకు చూపించారని ప్రశ్నించింది. ఈ సందర్భంగా గూగుల్ సెర్చ్ అల్గారిథమ్ ఎలా పనిచేస్తుందో వివరించారు. ‘మేము కీవర్డ్ తీసుకుంటాం. మా ఇండెక్స్లోని బిలియన్లలో ఉన్న పేజీలతో సరిపోలుస్తాం. ఆ సమయంలో ఆ కీవర్డ్కు సంబంధించిన, తాజాగా ఉన్న, ప్రజాదరణ పొందిన సమాచారాన్ని యూజర్లకు అందిస్తాం. ఇది పూర్తిగా ఇతర వ్యక్తులు సెర్చ్ చేస్తున్నదానిపై ఆధారపడి ఉంటుంది. దాని ఆధారంగా వాటిని ర్యాంక్ చేస్తాం’ అన్నారు.గూగుల్ బాంబింగ్‘ఈ విధానాన్ని ‘గూగుల్ బాంబింగ్’ అని పిలుస్తారు. ఇది ఒక నిర్దిష్ట పదాన్ని నిర్దిష్ట పేజీకి లింక్ చేయడం వంటి ఆన్లైన్ సమన్వయ సెర్చ్ ఫలితాలను ప్రభావితం చేస్తుంది. గూగుల్ మాన్యువల్గా ఫలితాలను తారుమారు చేయదు. రాజకీయ పక్షపాతం వహించదు. ఈ అల్గోరిథమ్లు వినియోగదారుల ప్రవర్తన, ఇంటర్నెట్ ట్రెండ్స్ను ప్రతిబింబిస్తాయి’ అని పిచాయ్ నొక్కి చెప్పారు. ‘ఇది కొన్నిసార్లు ఊహించని లేదా వివాదాస్పద ఫలితాలను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: చెప్పులు ధరించి డ్రైవింగ్ చేస్తే చలానా!? -
లైక్స్, కామెంట్స్ కోసం ఆరాటపడితే అంతే..
ప్రస్తుతం టెక్నాలజీని ఓ రేంజ్లో వాడుతున్నాం. అది మితిమీరితే ఎలాంటి ప్రమాదాలు వస్తాయన్న విషయాన్ని కూడా మర్చిపోయి దాన్ని అంతగా ఉపయోగిస్తున్నాం. ఇటీవల కాలంలో జిబ్లీ ఆర్ట్, జెమినీ ఏఐ(GeminiAI)..వంటివి చూశాం. తాజాగా నానో బనానా(Nano Banana) ఉపయోగిస్తున్నాం. మన ఫొటోస్ను అప్లోడ్ చేస్తే ఎడిట్ చేసి ఇతర ఫార్మాట్లో ఇది మన ముందుంచుతుంది. అసలు ఒరిజినల్గా అప్లోడ్ చేసిన ఫోటోలు అన్నీ ఏమవుతున్నాయి.. ఇటీవల జరుగుతున్న సైబర్ అటాక్స్కు ఈ కొత్త టెక్నాలజీలకు ఎదైనా సంబంధం ఉండే అవకాశం ఉందా.. అనే విషయాలను సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ సందీప్ ముదాల్కర్ తెలిపారు.టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఏఐకి ఆదరణ అధికం అవుతోంది. అయితే దీంతో ఎంత ప్రయోజనం ఉందో అంతే నష్టాలున్నాయి. కొన్నేళ్ల కిందట క్రైమ్స్ను గమనిస్తే.. సోషల్ క్రైమ్స్ ఎక్కువగా జరిగేవి. అంటే వ్యక్తుల వద్దకు వెళ్లి సమాచారం తెలుసుకుని దాన్ని క్రైమ్ కోసం ఉపయోగించుకునేవారు. కానీ ఇప్పుడు క్రైమ్ తీరు మారింది. అంతా సైబర్ క్రైమ్. ఫిజికల్గా వ్యక్తుల ప్రమేయం లేకుండా క్రైమ్ జరుగుతుంది. ఇప్పుడు వస్తున్న టెక్నాలజీల్లో కొన్ని అందుకు తోడ్పడుతున్నాయి.ఆర్గనైజ్డ్ ఇంటెలిజెన్స్మనిషి చనిపోయినా తన ఆలోచనలు, తెలివితేటలు ఎల్లకాలం ఉండేలా ‘ఆర్గనైజ్డ్ ఇంటెలిజెన్స్’ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ఆలోచనలున్న పరిస్థితుల్లో టెక్నాలజీ పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి. సైబర్ నేరాలు(cyber attack) చేసేవారు చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కనిపెడుతున్నారు. కానీ సాధారణ యూజర్లకు ఆ విషయాలు తెలిసే అవకాశం ఉండదు. సైబర్ క్రైమ్కు సంబంధించి ఒక కేసు ఇన్వెస్టిగేట్ చేయాలన్నా, ఒక డివైజ్ నుంచి కొంత డేటా కలెక్ట్ చేయాలన్నా సరైన టూల్స్ లేవు. కానీ సైబర్ క్రిమినల్స్ మాత్రం నేరం చేసేందుకు కొత్త టూల్స్ కనుగొంటున్నారు. అందుకు ఎక్కువ రీసెర్చ్ చేస్తున్నారు. ప్రజలు కూడా మార్కెట్లో ఏదైనా టూల్ ఉచితంగా వచ్చిందంటే దానిపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దానికితోడు ఈ సోషల్మీడియా ప్రభావం కూడా ఎక్కువైంది.డేటా సేకరిస్తున్నారు.. జాగ్రత్త!ఇప్పుడు వస్తున్న టెక్నాలజీలు యూజర్లను వదులుకోవాలని అనుకోవడం లేదు. ఉదాహరణకు Facebookను తీసుకుందాం. దీని ఖాతాను డిలీట్ చేయాలనుకుంటే వెంటనే డిలీట్ అవ్వదు. అందుకు కొంత టైమ్ ఇస్తున్నారు. ఒకవేళ ఈ గ్యాప్లో మళ్లీ లాగిన్ చేస్తే రికవరీ అవుతుంది. ఎందుకంటే Facebook మన ఖాతాను డిలీట్ చేయాలని అనుకోవడంలేదు. ఇప్పటికే దాదాపు అన్ని టెక్ కంపెనీలు యూజర్ల ఇంట్రెస్ట్ ఏంటీ.. వారికి ఎలాంటి డేటా ముఖ్యం.. వారి అభిరుచులు ఏమిటి.. ఎలా కమ్యునికేట్ చేస్తున్నారు.. ఏం కొంటున్నారు.. ఏ ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు..వంటివి గమనిస్తున్నాయి. ఈ సమాచారం స్టోర్ అవ్వడంతో భవిష్యత్తులో ఇది దుర్వినియోగం అయ్యే అవకాశం కూడా ఉంది.అనైతికంగా వాడుతారు..ప్రస్తుతం నానో బనానా టూల్ ద్వారా ఫొటోలు అప్లోడ్ చేస్తున్నారు. ఆ సర్వర్లో నుంచి డేటాని హ్యాకర్స్ గానీ, సైబర్ క్రిమినల్స్ గానీ దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. యూజర్లకు ఎలాంటి సమాచారాన్ని తెలపకుండా వారి ఫొటోలను సైబర్ నేరగాళ్లు కార్టూన్ వీడియోస్కు, యనిమేషన్స్ చేయడానికి, పొర్నోగ్రఫీ కంటెంట్లో వాడుకోవడానికి, యడ్స్ ప్రమోట్ చేసుకోవడానికి, ఏదైనా డేటింగ్ సైట్స్లో అప్లోడ్ చేసేందుకు..వాడే అవకాశం ఉంది.కొత్త ఛాలెంజ్లతో..శారీ ఛాలెంజ్ అనే కొత్తరకం టూల్స్ పుట్టుకొస్తున్నాయి. ఇందులో తాజా ఫోటోను అప్లోడ్ చేస్తే 1990ల్లో శారీ లుక్లో మనం ఎలా ఉండేవాళ్లమో తిరిగి చూపుతుంది. ఇలాంటి టెక్నాలజీలను కొన్నిసార్లు హ్యాకర్లు, సైబర్ నేరగాళ్లు ఉపయోగించే అవకాశం ఉంది. హ్యాకర్లకు కొత్త డేటా కావాలనుకుంటే కొత్త ఛాలెంజెస్ రిలీజ్ చేస్తారు. ఉదాహరణకు.. గ్రీన్ సారీ ఛాలెంజ్ అనగానే మహిళలు గ్రీన్ సారీ వేసుకొని ఫొటోలు దిగి అప్లోడ్(uploading photos) చేస్తారు. హాష్టాగ్ పెట్టేస్తారు. ఆ డేటాని హ్యాకర్స్ కలెక్ట్ చేసుకుంటారు. అదే విధంగా చికెన్ బిర్యానీ ఛాలెంజ్ అని పెడతారు. అప్పుడు లేడీస్ చికెన్ బిర్యానీ చేస్తూ వీడియోలు చేసి ఫొటోలని అప్లోడ్ చేస్తారు. దీన్ని సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేస్తారు. లైక్స్, కామెంట్స్ కోసం చేసే పనులు కొన్నిసార్లు విపరీత పరిస్థితులకు దారితీస్తాయని గుర్తుంచుకోవాలి.ఇప్పుడేం చేయాలి?కొన్ని సంస్థలకు చెందిన ఏఐ టూల్స్ మన అనుమతి లేకుండా మన ఇమేజెస్ను వెబ్సైట్ల్లో అప్లోడ్ చేసి, దాన్ని మనం గ్రహించి తొలగించమంటే కూడా తొలగించే అవకాశం ఉండదు. ఎందుకంటే వాటిలో అంతర్జాతీయ కంపెనీలు ఉంటాయి. అవి వాటి దేశ చట్టాలను అనుసరిస్తున్నట్లు చెబుతాయి. ఒకవేళ తమ దేశంలోని యూజర్ల కంటెంట్ను దుర్వినియోగం చేసినా డిపార్ట్మెంట్ రైట్స్కు వెళుతాయి. కాబట్టి వారు ఆ కంటెంట్ను డిలీట్ చేయడం చాలా కష్టం. ఇతర దేశాల వారు తమపై లీగల్ యాక్షన్ తీసుకోవాలన్న కూడా వీలుండదు. కాబట్టి టెక్నాలజీ వాడే ముందు అప్రమత్తంగా ఉండాలి. అలా అని అసలే వాడకూడదని కాదు. అధికారిక వెబ్సైట్లను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలి. నిబంధనల ప్రకారం అత్యవసరం అయితే తప్పా ఏ సమాచారాన్ని పంచుకోవద్దు. మనం మితిమీరిన ఆలోచనలతో చేసే పనులే సైబర్ నేరగాళ్లకు తోడ్పడుతున్నాయని గుర్తుంచుకోవాలి.ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి! -
5జీ సేవల పటిష్టతపై ఫోకస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా దేశీయంగా 5జీ సేవలను పటిష్టం చేసుకోవడంపై మరింతగా దృష్టి పెడుతోంది. తమకు స్పెక్ట్రం ఉన్న 17 ప్రాధాన్య సర్కిల్స్పై ఫోకస్ చేస్తున్నామని, ఏపీ సర్కిల్కి సంబంధించి ఇప్పటికే విశాఖ, తిరుమలలో 5జీ సేవలను ప్రవేశపెట్టామని సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీవో) జగ్బీర్ సింగ్ తెలిపారు. త్వరలోనే జాతీయ స్థాయిలో మరో నగరంలోనూ ప్రారంభిస్తున్నామని వివరించారు. 5జీ సర్వీసులను అందిస్తున్న ప్రాంతాల్లో తమ నెట్వర్క్కి సంబంధించి డేటా వినియోగం 25–30 శాతం వరకు పెరిగిందని ఆయన చెప్పారు. సగటున డేటా వినియోగం నెలకు 22–23 జీబీ నుంచి 26–27 జీబీకి పెరిగిందని చెప్పారు. దేశవ్యాప్తంగా 83 శాతం మందికి, ప్రాధాన్యతా సర్కిళ్లలో 88 శాతం మందికి తమ 4జీ సేవలు అందుబాటులో ఉంటున్నాయని సింగ్ చెప్పారు. పుణెలోని సూపర్ నెట్వర్క్ ఆపరేషన్స్ సెంటర్ (ఎస్ఎన్వోసీ) సందర్శన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. ఈ ఏడాది జూన్ వరకు సుమారు 15 నెలల వ్యవధిలో 5జీ, 4జీ నెట్వర్క్ను బలోపేతం చేసుకునేందుకు ప్రస్తుత సైట్లలో మరింత స్పెక్ట్రంను వినియోగంలోకి తేవడంతో పాటు కొత్తగా 1,000 సైట్లను సంస్థ ఏర్పాటు చేసింది. కార్యకలాపాల్లో కృత్రిమ మేథ (ఏఐ) ఆటోమేషన్ను వినియోగించుకోవడంపై ఇన్వెస్ట్ చేస్తున్నట్లు జగ్బీర్ సింగ్ తెలిపారు. ఫిక్స్డ్ వైర్లెస్ యోచన లేదు.. ఫిక్సిడ్ వైర్లెస్ యాక్సెస్ (ఎఫ్డబ్ల్యూఏ) విభాగంలో పోటీపడే యోచనేదీ ప్రస్తుతానికి లేదని సింగ్ చెప్పారు. ఇప్పటికైతే తాము ప్రధానంగా మొబిలిటీ విభాగంపైనే దృష్టి పెడుతున్నామని వివరించారు. అటు, శాటిలైట్ కమ్యూనికేషన్స్ సర్వీసులు వచ్చే ఏడాదిలో అందుబాటులోకి రావొచ్చని పేర్కొన్నారు. ఈ సర్వీసులకు సంబంధించి ఏఎస్టీ స్పేస్మొబైల్తో వొడాఫోన్ ఐడియా జట్టు కట్టింది. మరోవైపు, ఇప్పటికే యాంటీ–స్పామ్ మెసేజీ అలర్టులను అందుబాటులోకి తెచ్చామని, యాంటీ–స్పామ్ కాల్ అలర్టు సేవలను కూడా త్వరలో ప్రవేశపెడుతున్నామని చెప్పారు. పుణెలోని వొడాఫోన్ ఐడియా ఎస్ఎన్వోసీ 2012లో ఏర్పాటైంది. హైదరాబాద్లోని మరో యూనిట్తో కలిసి ఇది దేశవ్యాప్తంగా కంపెనీ మొత్తం నెట్వర్క్ను పర్యవేక్షిస్తుంది. 22 సర్కిళ్లలోని విస్తృతమైన నెట్వర్క్లో స్థూల స్థాయి నుంచి సూక్ష్మ స్థాయి దాకా సమస్యలను ఇరవై నాలుగ్గంటలూ, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, పరిష్కరించేందుకు కృషి చేస్తుంటుంది. ప్రతి రోజు 85 లక్షల అలర్టులను ప్రాసెస్ చేస్తుంది. 5 లక్షల పైగా డివైజ్ హెల్త్ చెక్లను నిర్వహిస్తుంటుంది. -
ఖతార్లోనూ ‘క్యూఆర్’
న్యూఢిల్లీ: భారత్లో రూపొందిన క్యూఆర్ ఆధారిత చెల్లింపుల విధానం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లోకి కూడా విస్తరిస్తోంది. తాజాగా ఖతార్లో దీన్ని ప్రవేశపెట్టారు. ఇందుకోసం ఖతార్ నేషనల్ బ్యాంకుతో (క్యూఎన్బీ) ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ (ఎన్ఐపీఎల్) ఒప్పందం కుదుర్చుకుంది. దీనితో యూపీఐ అందుబాటులోకి వచ్చిన ఎనిమిదో దేశంగా ఖతార్ నిల్చింది. ఇప్పటిదాకా భూటాన్, నేపాల్, శ్రీలంక, మారిషస్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్లో యూపీఐ సేవలను ప్రవేశపెట్టారు. దీనితో ఆయా దేశాలను సందర్శించే భారతీయులు విదేశీ కరెన్సీ కోసం చూసుకోవాల్సిన అవసరం లేకుండా తక్షణం రూపాయి మారకంలోనే చెల్లింపులు జరిపేందుకు వీలవుతుంది. డిజిటల్ చెల్లింపులను సులభతరంగా చేసిన యూపీఐ లావాదేవీలు దేశీయంగా కొత్త రికార్డులను తాకుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో సుమారు రూ. 25 లక్షల కోట్ల విలువ చేసే 2,000 కోట్ల లావాదేవీలను యూపీఐ ప్రాసెస్ చేసింది. రెండేళ్లలోనే రోజువారీ లావాదేవీల పరిమాణం రెట్టింపయ్యింది. ఏడాది వ్యవధిలోగా రోజుకు 100 కోట్ల యూపీఐ లావాదేవీల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. -
పోయిందనున్న ఫోన్.. యూపీఐ సాయంతో దొరికిందిలా..
ఎక్కడైనా ఒకసారి మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నామంటే.. దాన్ని తిరిగి పొందటం దాదాపు అసాధ్యం. అయితే ఓ జంట మాత్రం యూపీఐ సాయంతోనే పోయిన ఫోన్ పొందగలిగింది. ఇది వినడటానికి వింతగా అనిపించినా.. అసలు విషయం తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవడం మీ వంతు అవుతుంది.నా భార్య ఫోన్ తిరిగి పొందడంలో యూపీఐ సహాయపడింది అనే శీర్షికతో.. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. ఇందులో ఈ రోజు నేను, నా భార్య ఆటోలో షాపింగ్కి వెళ్ళాము, గమ్యం చేరుకున్న తరువాత.. ఆటోకు యూపీఐ ద్వారా డబ్బులు పంపించాను. ఆటో వెళ్లిపోయింది. ఆ తరువాత చూస్తే నా భార్య ఫోన్ కనిపించలేదు. ఆ ఫోన్కు కాల్ చేద్దామంటే.. అప్పటికి అందులో సిమ్ కార్డు వేయలేదు.మొదట్లో ఫోన్ ఎవరో దొంగలించి ఉంటారనుకున్నాము, తరువాత ఆలోచిస్తే ఆటోలో మారిపోయినట్లు గుర్తొచ్చింది. ఆటో డ్రైవర్ వివరాలు తెలుసుకుందామంటే.. స్కాన్ చేసి డబ్బు పంపించడం వల్ల అది సాధ్యం కాలేదు. మొత్తానికి ఫోన్ పోయింది అనుకున్నాము. ఇంతలో నా బ్యాంక్ ఖాతాకు ఒక్కరూపాయి యూపీఐ నుంచి వచ్చింది. అంతే కాకుండా పోయిందనుకుంటున్న ఫోన్ నా దగ్గర ఉంది అని.. ఒక నెంబర్ పంపి, దానికి కాల్ చేయమని మెసేజ్ వచ్చింది. మేము ఆ నెంబరుకు కాల్ చేసి.. ఎక్కడ ఉన్నారు అని కనుక్కున్నాం. కానీ ఆ ఆటో డ్రైవర్ మా దగ్గరకు వచ్చి ఫోన్ ఇచ్చాడు. మా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆటో డ్రైవరుకు కొంత డబ్బు కూడా ఇచ్చి పంపాను అని రెడ్డిట్ పోస్టులో వెల్లడించారు.ఇదీ చదవండి: జీఎస్టీ 2.0 ఎఫెక్ట్: మొదటి రోజే భారీగా అమ్ముడైన కార్లు -
ఫోన్లపై రూ.63 వేల వరకు డిస్కౌంట్.. లిస్ట్ ఇదే..
జీఎస్టీ శ్లాబులను క్రమబద్ధీకరించడంతో ఎలక్ట్రానిక్ ఉపకరణాలతోపాటు ఇతర చాలా వస్తువుల ధరలు దిగొస్తున్నాయి. దాంతోపాటు ఈ-కామర్స్ వెబ్సైట్లు చాలానే ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. దీనికితోడు పండుగ సీజన్ కావడంతో కంపెనీలు మరిన్ని ఆఫర్లు అందిస్తున్నాయి. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్లలో కొన్ని ఫోన్లపై ఏకంగా రూ.63,000 వరకు డిస్కౌంట్ వస్తున్నట్లు తెలుస్తుంది. ఫోన్లకు సంబంధించి భారీగా రాయితీలు వచ్చే మోడళ్ల వివరాలు కింది విధంగా ఉన్నాయి.మోడల్ఓరిజినల్ ధరఆఫర్ ధరడిస్కౌంట్ప్లాట్ఫామ్ శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రారూ.1,34,999రూ.71,999రూ.63,000అమెజాన్ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్రూ.1,44,900రూ.89,900రూ.55,000ఫ్లిప్కార్ట్గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్రూ.1,72,999రూ.99,999రూ.73,000ఫ్లిప్కార్ట్నథింగ్ ఫోన్ (3)రూ.84,999రూ.34,999రూ.50,000ఫ్లిప్కార్ట్షావోమి 14 సీవీరూ.54,999రూ.26,499రూ.28,500అమెజాన్ ఇదీ చదవండి: రూ.15 వేలులోపు 5జీ స్మార్ట్ఫోన్లు -
రూ.15 వేలలోపు 5జీ స్మార్ట్ఫోన్లు
మొబైల్ యూజర్లు వాటి పనితీరు మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకు అనుగుణంగా టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ స్మార్ట్ఫోన్(Smart Phone) ఫీచర్లలో మార్పులు వస్తున్నాయి. మొబైల్ తయారీ కంపెనీలు వినియోగదారుల అభిరుచుల మేరకు వినూత్న మోడళ్లను నిత్యం ఆవిష్కరిస్తున్నారు. జీఎస్టీ(GST) తగ్గిన నేపథ్యంలో చాలామంది స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేయాలని ఆసక్తి చూపుతున్నారు. కొంతమంది రిటైలర్లు ప్రకటించిన ధరలమేరకు(జీఎస్టీ మార్పుల వల్ల రిటైలర్లను అనుసరించి ధరల్లోనూ మార్పులు ఉంటాయని గమనించాలి) రూ.15,000 లోపు 5జీ మొబైళ్ల(Mobiles) వివరాలు కింద తెలుసుకుందాం.మోడల్బ్రాండ్కీలక స్పెసిఫికేషన్లుధరiQOO Z10xiQOO6.72 అంగుళాల ఎల్సీడీ 120 హెర్ట్జ్ డిస్ప్లే, 50 ఎంపీ+2 ఎంపీ కెమెరా, 6500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 15 ఓఎస్రూ.13,499పోకో ఎం7 ప్రో 5జీపోకో6.67 అమోలెడ్ 120 హెర్ట్జ్ డిస్ప్లే, 50 ఎంపీ+2ఎంపీ కెమెరా, 5110 ఎంఏహెచ్ బ్యాటరీరూ.12,984రియల్ మీ 13+ 5జీరియల్ మి6.72 ఎల్సీడీ 120హెర్ట్జ్ డిస్ప్లే, 50ఎంపీ+2ఎంపీ కెమెరా, 6000ఎంఏహెచ్ బ్యాటరీరూ.13,499వివో టీ4ఎక్స్ 5జీవివో6.72 ఎల్సీడీ 120 హెర్ట్జ్ డిస్ప్లే, 50 ఎమ్ పి+2 ఎంపీ కెమెరా, 6500 ఎంఏహెచ్ బ్యాటరీరూ.13,999ఒప్పో కె13ఎక్స్ 5జీOPPO6.67 ఎల్సీడీ 120 హెర్ట్జ్ డిస్ప్లే, 50 ఎంపీ+2 ఎంపీ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీరూ.11,030మోటరోలా జీ86 పవర్ 5జీమోటరోలా6.7 పీ-ఓలెడ్ 120హెర్ట్జ్ డిస్ప్లే, 50ఎంపీ+8ఎంపీ కెమెరా, 6720ఎంఏహెచ్ బ్యాటరీరూ.15,999పోకో ఎం7 ప్లస్ 5జీపోకో6.9 అంగుళాల ఎల్సీడీ 144 హెర్ట్జ్ డిస్ప్లే, 50 ఎంపీ కెమెరా, 7000 ఎంఏహెచ్ బ్యాటరీరూ.13,499రెడ్ మీ నోట్ 14 ఎస్ ఈ 5జీరెడ్మీ6.67 అమోలెడ్ 120హెర్ట్జ్ డిస్ప్లే, 50ఎంపీ+8ఎంపీ+2ఎంపీ కెమెరా, 5110ఎంఏహెచ్ బ్యాటరీరూ.13,999శాంసంగ్ గెలాక్సీ ఎఫ్17 5జీశామ్ సంగ్6.7 అంగుళాల సూపర్ అమోలెడ్ 90 హెర్ట్జ్ డిస్ప్లే, 50 ఎంపీ+5ఎంపీ+2ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీరూ.13,999లావా ప్లే ఆల్ట్రా 5Gలావా6.67 అమోలెడ్ 120 హెర్ట్జ్ డిస్ప్లే, 64 ఎంపీ+5ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీరూ.14,999నోట్: పైన తెలిపిన ఫోన్లతో పాటు విడుదలై ప్రజాదరణ పొందిన మరిన్ని మెరుగైన ఉత్పత్తులు మార్కెట్లో ఉన్నాయని గుర్తుంచుకోవాలి.ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్లే ఇప్పుడు దిక్కు -
రూ.200 లోపు రీచార్జ్.. రోజుకు 2 జీబీ డేటా
ప్రభుత్వ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త కొత్త, చౌకౌన ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెడుతూనే ఉంది. ఇటీవల అపరిమిత కాలింగ్, రోజువారీ డేటా, ఇతర ప్రయోజనాలతో రూ .199 రీఛార్జ్ ప్లాన్ను ప్రకటించింది.రూ .199 రీఛార్జ్ ప్లాన్ ప్రయోజనాలురూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ (Recharge plan) లో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 2 జీబీ హై స్పీడ్ డేటా, 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. అదనంగా టెలికాం ఆపరేటర్ రీఛార్జ్ పై 2% తగ్గింపును కూడా అందిస్తోంది. ఆసక్తి ఉన్న వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ వెబ్సైట్, సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా మాత్రమే రీఛార్జ్ చేసుకోవచ్చు.ఇవి కాకుండా, బీఎస్ఎన్ఎల్ బడ్జెట్ ఫ్రెండ్లీ వినియోగదారుల కోసం కేవలం రూ .107 నుండి ప్రారంభమయ్యే ప్రీపెయిడ్ ప్లాన్లను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ 35 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఇందులో 3 జీబీ హైస్పీడ్ డేటా, 200 ఫ్రీ వాయిస్ మినిట్స్ (లోకల్, ఎస్టీడీ, రోమింగ్) లభిస్తాయి. అదనంగా, రూ .141 ప్యాక్ కూడా ఉంది. ఇది 30 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 200 ఎస్ఎంఎస్ లను అందిస్తుంది.ఇదీ చదవండి: జియో చౌక ప్లాన్.. ఎక్కువ వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాలింగ్ -
ప్రమాదంలో మహిళా ఉద్యోగాలు!: ఐక్యరాజ్యసమితి హెచ్చరిక
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా.. చాలామంది ఉద్యోగాలు కోల్పోతారని పలువురు నిపుణులు చాలా రోజుల నుంచి చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయేవారిలో మహిళలే ఎక్కువ ఉన్నారని ఐక్యరాజ్యసమితి 'జెండర్ స్నాప్షాట్ 2025' నివేదికలో వెల్లడించింది.ఏఐ కారణంగా.. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 28 శాతం మహిళలు ఉద్యోగాలు కోల్పోతారు. ఈ ప్రమాదంలో పడే పురుష ఉద్యోగులు 21 శాతం మాత్రమే అని ఐక్యరాజ్యసమితి నివేదించింది.తప్పుల నుంచి నేర్చుకోకపోతే..ఐక్యరాజ్యసమితి 'జెండర్ స్నాప్షాట్ 2025' (Gender Snapshot 2025) నివేదిక.. ప్రస్తుత అసమానతలను కూడా హైలైట్ చేసింది. ప్రపంచ టెక్ వర్క్ఫోర్స్లో మహిళలు 29%, టెక్ లీడర్లలో కేవలం 14% మాత్రమే ఉన్నారని వెల్లడించింది. ప్రపంచం కొత్త అంతరాయాన్ని ఎదుర్కొంటోంది. మనం గతంలో జరిగిన తప్పుల నుంచి నేర్చుకోకపోతే.. భవిష్యత్తులో అసమానత మరింత ఎక్కువవుతాయని హెచ్చరించింది.జెండర్ అంతరాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. ''ఇది 343 మిలియన్ల మహిళలకు, బాలికలకు ప్రయోజనం చేకూరుస్తుంది. 30 మిలియన్ల మందిని తీవ్ర పేదరికం నుంచి బయటపడేస్తుంది, 42 మిలియన్లకు ఆహార భద్రతను మెరుగుపరుస్తుంది. 2030 నాటికి ప్రపంచ వృద్ధిలో 1.5 ట్రిలియన్ డాలర్లకు దారితీస్తుందని నివేదికలో హైలైట్ చేసింది''.మహిళలు శ్రామిక శక్తిలో చేరడానికి.. విద్య, కెరీర్స్, కుటుంబ జీవితాన్ని సమతుల్యం చేసుకోవడానికి సహాయం చేయడంలో అనేక దేశాలు నిజమైన పురోగతి సాధించాయి. సౌదీ అరేబియా శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి.. సంరక్షణ సంబంధిత అడ్డంకులను తగ్గించడానికి చట్టపరమైన & విధాన సంస్కరణలను ప్రవేశపెట్టింది. ఫలితంగా, మహిళల భాగస్వామ్యం రెండింతలు పెరిగి, 2017లో 17 శాతం నుంచి 2024 మూడవ త్రైమాసికం నాటికి 35.4 శాతానికి పెరిగింది.ఇదీ చదవండి: తిరిగి వచ్చేయండి.. భయంతో జీవించవద్దు: శ్రీధర్ వెంబు -
ఏఐ నిఘాను అందిపుచ్చుకుంటున్న స్మార్ట్ నగరాలు
భారతీయ నగరాలు మరింత పట్టణీకరణతో మరింత రద్దీగా మారుతున్నాయి. వీటిలో మాల్స్, పార్కులు, రైల్వేస్టేషన్లు, రద్దీ రోడ్లు.. ఇలా అన్నిచోట్లా ట్రాఫిక్ పెరిగి భద్రతా సమస్యలు వస్తున్నాయి. అధిక రద్దీ వల్ల తొక్కిసలాటలు, లగేజి పోవడంతో ఖంగారు పడడం, చిన్నచిన్న దొంగతనాలు జరుగుతాయి. అందువల్ల మరింతగా భద్రతాచర్యలు చేపట్టడం చాలా అవసరం అవుతోంది. అందుకే నగరాలకు భద్రత కల్పించేందుకు ప్రాక్టికల్ పరిష్కారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత నిఘా వ్యవస్థ గణనీయంగా ఉపయోగపడుతోంది.ఏఐ నిఘా: ఏమిటిది?ఒకప్పుడు సీసీటీవీ కెమెరాల స్క్రీన్ల ముందు భద్రతా సిబ్బంది గంటల తరబడి కూర్చుని ఏదైనా అసాధారణంగా కనిపిస్తుందా అని చూసేవారు. కానీ ప్రస్తుతం ఏఐ నిఘా వ్యవస్థవల్ల కంప్యూటర్ విజన్, డీప్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్, న్యూరల్ నెట్వర్క్లు ఉండి.. మరింత స్పష్టంగా చూస్తూ, మనుషులు చేయగలిగినదానికంటే ఇంకా వేగంగా స్పందిస్తున్నాయి.కంప్యూటర్ విజన్ కెమెరాలు కేవలం వీడియో తీయడమే కాదు దాన్ని రియల్-టైంలో విశ్లేషిస్తాయి. నిషేధిత ప్రాంతంలో ఎవరైనా మూత్రవిసర్జన చేస్తున్నా, ఏదైనా జాతరలో ఎక్కువమంది జనాన్ని గమనించాలన్నా, రద్దీ మార్కెట్లో ఏదైనా వస్తువు పోయినా గుర్తిస్తాయి. ఇవి చాలా వేగంగా స్పందించి, సెకండ్లలోనే కంట్రోల్ సెంటర్లను అప్రమత్తం చేస్తాయి.నగరాల్లోని నిఘా వ్యవస్థలలో ఏఐ కెమెరాలను ఉపయోగించడం ద్వారా కేవలం ఘటనలను గుర్తించడమే కాకుండా, ఒకే తరహాలో ఏఐనా జరుగుతున్నా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు తెలుస్తుంది. ముఖాలను, అసాధారణ ప్రవర్తనను గుర్తించి, నేరచరిత్ర ఉన్నవారిని రియల్-టైంలో ఇట్టే పట్టేస్తాయి. తద్వారా వివిధ ప్రాంతాల్లో పదేపదే మోసాలు, నేరాలకు పాల్పడేవారిని గుర్తించడంలో పోలీసులకు సాయపడతాయి.ఏఐ గుర్తిస్తే.. వెంటనే స్పందిస్తుందిఏఐ నిఘాకు ఉన్న పరిమితులేంటని ఒకసారి చూసుకుంటే, అది ఎక్కువమంది ప్రజలు గుమిగూడేచోట (అంటే రాజకీయ ర్యాలీలు, కచేరీలు, మతపరమైన కార్యక్రమాలు) కూడా స్పష్టంగా గుర్తిస్తుంది. రియల్ టైంలో రద్దీ నిర్వహణ, రద్దీప్రాంతాలలో పరిశీలనకు ఏఐ మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ టెక్నాలజీలో ప్రెడిక్టివ్ ఎనాలసిస్, ప్యాటర్న్ ఎనాలసిస్ ఉపయోగించి ఎలాంటి ముప్పునైనా ముందుగానే అరికడుతుంది.మనుషులను ఎక్కడ కావాలో అక్కడ పెట్టడం, సహాయాన్ని సరైన సమయంలో అందించడం కూడా దీనివల్ల సాధ్యమవుతుంది. రద్దీ నియంత్రణ కోసం పుణెలో ఒక పైలట్ స్మార్ట్ సిటీలో ఏఐని ఉపయోగించి, బహిరంగ కార్యక్రమాల్లో అత్యవసర పరిస్థితులను 42% తగ్గించారు. విమానాశ్రయాలు, బస్టాండ్లలో పిల్లలు తప్పిపోయినా, చట్టవిరుద్ధ కార్యకలాపాలున్నా, లగేజి పోయినా ఏఐ కెమెరాలు గుర్తిస్తాయి. ఇవి కదలికలను, వస్తువులను, ఆడియోను కూడా గుర్తిస్తాయి. (ఉదా: రద్దీ ప్రాంతంలో అద్దం పగిలినా పట్టేస్తాయి) దీనివల్ల రాబోయే ప్రమాదాన్ని వెంటనే గుర్తుపట్టగలరు.నేరాలు గుర్తించడమే కాదు.. ఆపుతాయి కూడా!నేరాల రేటును తగ్గించడం ఏఐ నిఘా వ్యవస్థల ప్రాథమిక పనుల్లో ఒకటి. హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలు బహిరంగ స్థలాల్లో ఏఐ నిఘావ్యవస్థను ఏర్పాటుచేసి.. చైన్ స్నాచింగ్, ఆస్తినష్టం, ఏటీఎంల చోరీల్లాంటి ఘటనలను 30% తగ్గించగలిగాయి. ఇవి కేవలం నేరాలకు వెంటనే స్పందించడమే కాక.. గతంలో జరిగిన ఘటనల్లో పాల్గొన్నవారిని గుర్తించి ఏదైనా జరగడానికి ముందే భద్రతా దళాలను అప్రమత్తం చేస్తాయి.ఏఐ కెమెరాలు ముఖాలను, నంబర్ ప్లేట్లను, చొరబాట్లను గుర్తించి ఏవైనా తేడా ఉంటే వెంటనే చెబుతాయి. అర్ధరాత్రి ఎవరైనా ప్రహరీ ఎక్కుతున్నా, స్కూలు గేట్లు దాటుతున్నా ఏదో తేడా ఉందని ఏఐ గమనించి, వెనువెంటనే చెప్పేస్తుంది.అంచనాతో కాకుండా డేటాతో నగరప్రణాళికలుఏఐ నిఘా అనేది కేవలం అత్యవసర పరిస్థితుల్లోనే కాదు.. నగర ప్రణాళికల కోసం ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో సమగ్ర డేటా ఇవ్వడానికీ ఉపయుక్తంగా ఉంటుంది. ఉదాహరణకు రాత్రిపూట పార్కులు నిర్మానుష్యంగా ఉంటే అక్కడ మెరుగైన లైటింగ్, నిఘాను ఏర్పాటుచేసుకోవచ్చు. శనివారం సాయంత్రం బస్టాపులో రద్దీ ఎక్కువగా ఉంటే అక్కడ సదుపాయాలు మెరుగుపరచడంపై దృష్టిపెట్టచ్చు. స్మార్ట్ సిటీ ఇనీషియేటివ్లను డిజైన్ చేయడంలో ఈ సమాచారం బాగా ఉపయోగపడుతుంది. కేవలం అంచనాల మీద ఆధారపడి నగర ప్రణాళికలు వేసేకంటే ఇలా చేయడం మంచిది.గోప్యత, న్యాయ విషయాల సంగతేంటిఇన్నిరకాల ప్రయోజనాలు ఉన్నా, ఏఐ నిఘా వ్యవస్థ వల్ల గోప్యత విషయంలో కొన్ని సమస్యలున్నాయి. భద్రతకోసమైనా తమమీద నిఘా ఉందంటే వ్యక్తులు ఆందోళనకు గురవుతారు. ఆధునిక ఏఐ నిఘా వ్యవస్థలు చట్టసంస్థలు చెబితే తప్ప వ్యక్తుల మీద అనవసర పరిశీలన లేకుండా వాళ్ల పనులు మాత్రమే గుర్తించగలవు.చట్టపరంగా చూస్తే, ఈ నిఘా వ్యవస్థలలో చాలా వాటిని నగరపాలక సంస్థలు లేదా చట్టాలను అమలుచేసే వ్యవస్థలు డేటా ప్రొటెక్షన్ మార్గదర్శకాల ఆధారంగానే తీసుకుంటాయి. అయితే, ఈ వ్యవస్థ ప్రజాభద్రతను వ్యక్తిగత హక్కులతో బ్యాలెన్స్ చేసేందుకు ఏఐ ఆధారిత పర్యవేక్షణ నియంత్రణకు కఠినమైన జాతీయస్థాయి నిబంధనలు అమలుచేయాలి.దోపిడీలను నిరోధించడానికి ఏఐ నిఘాలో డేటామాస్కింగ్, రోల్ ఆధారిత యాక్సెస్, తాత్కాలికంగా వీడియోలను దాచడం లాంటివి చేయాలి. తరచు ఆడిటింగ్తో ఈ చర్యలు తీసుకుంటే చట్టాన్ని వ్యతిరేకించకుండాప్రజలు దీన్ని నమ్మే అవకాశం ఉంటుంది.మెరుగైన భవిష్యత్తుఎవరో గమనిస్తున్నారు అనే విధానం మారింది. ఇది నియంత్రణ కాదు.. రక్షణ. ఏఐ నిఘా అనేది ప్రజల ఉద్యోగాలు తీసేసేది కాదు. ప్రజాభద్రతను మరింత స్మార్ట్గా, వేగంగా అందిస్తుంది. మనుషులు తీసుకునే నిర్ణయాలకు బదులు రియల్ టైం ఏఐ నిఘాతో మన నగరాల్లో ఉండే ట్రాఫిక్ జామ్లు, రద్దీ నిర్వహణ, అత్యవసర పరిస్థితులు, నేరాలు అన్నింటి విషయంలో సులభంగా నిర్ణయాలు తీసుకోవచ్చు.బృహస్పతి టెక్నాలజీస్ ఎండీ రాజశేఖర్ పాపోలు -
ఏఐతో ఊడ్చుకుపోయే ఉద్యోగాలు ఇవే..
కృత్రిమ మేధ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీలు కాస్ట్కటింగ్ పేరుతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే టెక్నాలజీతోపాటు ఇతర సంస్థల్లోని దాదాపు అన్ని విభాగాల్లో ఏఐ పాగా వేస్తోంది. దాంతో ఉద్యోగాల్లో కోత తప్పడం లేదు. భవిష్యత్తులో ఏఐ ప్రభావంతో దాదాపు కనుమరుగయ్యే కొన్ని జాబ్స్ జాబితాను ఓపెన్ఏఐ సీఈఓ సామ్ఆల్ట్మన్ తెలిపారు. దాంతోపాటు కొత్తగా సృష్టించబడే కొలువులను కూడా పేర్కొన్నారు.ఏఐ వల్ల కనుమరుగయ్యే ఉద్యోగాలుడేటా ఎంట్రీ క్లర్క్లుబేసిక్ కస్టమర్ సర్వీస్ రిప్రెజెంటేటివ్స్టెలిమార్కెటర్లుప్రాథమిక కాపీ రైటింగ్ స్కిల్స్ కలిగిన జాబ్స్సింపుల్ గ్రాఫిక్ డిజైన్ నైపుణ్యాలున్న ఉద్యోగాలుసోషల్ మీడియా షెడ్యూలింగ్ కొలువులుజూనియర్ కోడింగ్ ఉద్యోగాలు ఉదా: బగ్ ఫిక్సింగ్, టెంప్లెట్ ఆధారిత కొలువులుఏఐ కొన్ని విభాగాలను ఆటోమేట్ చేసే అవకాశం ఉన్నా, కొత్త ఉద్యోగాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అందులో..ఏఐ ఓవర్సైట్ ఉద్యోగాలుప్రాంప్ట్ ఇంజినీరింగ్హ్యూమన్-ఏఐ కొలొబరేషన్ జాబ్స్ఏఐ ట్రయినింగ్ జాబ్స్ఏఐ వ్యవస్థల నైతికత, భద్రత, పాలన పరమైన ఉద్యోగాలు ఉన్నాయి.ప్రభుత్వాలు, కంపెనీలు మార్పునకు సిద్ధం కావాలని, రీస్కిల్లింగ్లో పెట్టుబడులు పెట్టాలని ఆల్ట్మన్ సూచించారు.ఇదీ చదవండి: ‘నేనో మేనేజర్ని.. టీమ్ సభ్యులకంటే జీతం తక్కువ’ -
అమెరికాలో భారతీయ టెకీలు సంపాదిస్తున్నదెంత?
అమెరికా హెచ్-1బి వీసాలపై భారతీయ ఐటీ ఉద్యోగుల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ వీసాలకు వార్షిక ఫీజును యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లక్ష డాలర్లు చేశారు. అంటే దాదాపు రూ.88 లక్షలపైనే. దీంతో ఈ హెచ్-1బి వీసాలపై ఇప్పటికే అక్కడ పనిచేస్తున్నవారు, కొత్తగా వెళ్లాలనువారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఈ నేపథ్యంలో హెచ్-1బి వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఐటీ ఉద్యోగులు ఎంత సంపాదిస్తున్నారు.. వారి జీతాలు, వాస్తవ స్థితిగతుల గురించి ఈ కథనంలో చూద్దాం..అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఐటీ నిపుణులు, ముఖ్యంగా ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి భారతీయ ఐటీ సంస్థలచే నియమితులైనవారు మరీ అంత ఎక్కువ జీతాలేమీ పొందడం లేదు. వారి జీతంలో అత్యధికం బేస్ పే (ప్రాథమిక జీతం)కు ఉండటం వల్ల మొత్తం ప్యాకేజీ చూడగానే ఆకర్షణీయంగా కనిపించినా, అమెరికన్ టెక్ కంపెనీలతో పోల్చితే గణనీయమైన తేడా స్పష్టమవుతుంది.జీత నిర్మాణంఅమెరికాలో ఈ ఉద్యోగుల బేస్ పే మొత్తం జీతంలో 70-90% వరకు ఉంటుంది. ఇది యూఎస్ కార్మిక విభాగం (U.S. Department of Labor) నిర్ణయించిన వేతన స్థాయిలపై ఆధారపడి ఉంటుంది. జాబ్ రోల్, అనుభవం, పని ప్రదేశాన్ని బట్టి మారుతుంది. సాధారణంగా, భారతీయ సంస్థలు తమ హెచ్-1బి ఉద్యోగులకు 65,000 నుండి 90,000 డాలర్ల మధ్య బేస్ పేని అందిస్తుంటాయి.అదే ఉద్యోగులు స్వదేశానికి తిరిగి వచ్చాక కొన్ని సంస్థలు ఆ జీతాన్ని భారీగా తగ్గించేస్తున్నాయి. ఇది మొత్తం ప్యాకేజీలో 10% కంటే తక్కువగా ఉండటం గమనార్హం. అయితే పీఎఫ్, గ్రాట్యుటీ వంటి లీగల్ బెనిఫిట్ల నిర్వహణకు ఇది ఉపయోగపడుతుంది.అలవెన్సులు, బోనసులుబేస్ పే పైన, కొన్ని ఆన్సైట్ అలవెన్సులు – హౌసింగ్, కాల్ (Cost of Living) అడ్జస్ట్మెంట్లు, రీలొకేషన్ సపోర్ట్ – జీతంలో 5-20% వరకు ఉంటాయి. అయితే, ఇవి ప్రాంతం, సంస్థ విధానంపై ఆధారపడి, యూఎస్ లోని స్థానిక ఉద్యోగుల అలవెన్సులతో పోలిస్తే తక్కువగా ఉంటాయి.బోనస్లు సాధారణంగా జీతంలో 10% లోపు ఉంటాయి. సీనియర్ ఉద్యోగులకు కొంత మెరుగుదల కనిపించినా, అవి యూఎస్ కంపెనీలు ఇచ్చే ప్రోత్సాహకాలతో పోల్చితే తక్కువగానే ఉంటాయి. ఉదాహరణకు, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి సంస్థలు హెచ్-1బి ఉద్యోగులకు 120,000 – 200,000 డాలర్ల వరకు బేస్ పే, అదనపు ఈక్విటీ, స్టాక్ ఆప్షన్లు, గణనీయమైన బోనస్లు అందిస్తున్నాయి.ప్రయోజనాలుహెచ్-1బి ఉద్యోగులకు హెల్త్ బెనిఫిట్స్ కింద ఆరోగ్య బీమా, డెంటల్, కంటి బీమా వంటి ప్రాథమిక ప్రయోజనాలు అందిస్తున్నారు. ఇవి సాధారణంగా కుటుంబ సభ్యులను కూడా కవర్ చేస్తాయి. అయితే, భారతీయ ఐటీ సంస్థలలో స్టాక్ ఆప్షన్లు, ఈక్విటీ వంటి లాంగ్-టర్మ్ ఇన్సెంటివ్లు చాలా అరుదుగా ఉంటాయి. ప్రత్యక్షంగా యూఎస్ కంపెనీలచే నియమితులైన ఉద్యోగులకు మాత్రమే ఇవి సాధారణంగా లభ్యమవుతాయి.ఈ పరిస్థితులలో హెచ్-1బి వీసాపై ఉన్న భారతీయ ఉద్యోగులు అమెరికాలో మెరుగైన జీవన ప్రమాణాలు అందుకుంటున్నా, తమ స్థానిక సహోద్యోగులతో పోల్చితే జీతాల పరంగా తక్కువగానే అందుకుంటున్నారు. దీన్నిబట్టి అమెరికాలో హెచ్-1బి వీసాల ప్రస్తుత పరిస్థితి గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని అర్థమవుతుంది. -
యాపిల్ సీఈవో ముందే కొత్త ఐఫోన్ పడేసుకున్నాడు..
ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్కు ఉన్న క్రేజ్ తెలిసిందే కదా.. తాజాగా విడుదలైన ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లను కొనేందుకైతే యాపిల్ స్టోర్ల ముందు కస్టమర్లు క్యూకట్టారు. కొత్త ఫీచర్లతో లాంచ్ అయిన బ్రాండ్ న్యూ ఐఫోన్ను కొనుక్కొని తమ చేతుల్లోకి ఎప్పుడెప్పుడు తీసుకుందామా అని గంటల కొద్దీ కస్టమర్లు క్యూలో వేచిఉన్న దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా కనిపించాయి.అయితే ఓ కస్టమర్ తన కొత్త ఐఫోన్ 17ను యాపిల్ సీఈవో టిమ్ కుక్ ముందే పడేసుకున్న సంఘటన ఓ యాపిల్ స్టోర్లో జరిగింది. ముచ్చటపడి కొనుక్కున్న కొత్త ఫోన్పై సీఈవో టిమ్ కుక్తో ఆటోగ్రాఫ్ చేయించుకోవాలనుకున్న యువకుడు ఆ ఆత్రుతలో ఇంకా ఓపెన్ చేసిన సరికొత్త ఐఫోన్ను చేజార్చుకున్నాడు.తన ముందు కస్టమర్ కొత్త ఫోన్ పడేసుకున్నప్పుడు టిమ్ కుక్ స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. కింద పడిన ఫోన్ను తీసుకునేందుకు కస్టమర్ కిందికి ఒంగగా టిమ్ కుక్ కూడా అతనికి సాయం చేసుందుకు అన్నట్టుగా కిందికి ఒంగారు. అతను ఫోన్ చేతిలోకి తీసుకున్నాక ఏం కాలేదులే అని అభినందించి ఆ తర్వాత ఆ ఫోన్పై తన ఆటోగ్రాఫ్ చేశారు.ఈ సంఘటన ఎక్కడి యాపిల్ స్టోర్ జరిగిందో తెలియదు కానీ, దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ తిరుగుతూ వైరల్గా మారింది. ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు యూజర్ల నుంచి విపరీతమైన కామెంట్లు వచ్చాయి.this is so embarrassing 😭 pic.twitter.com/AkrKd41Kn3— Holly - I like tech (@AnxiousHolly) September 20, 2025 -
H-1B visas: టీసీఎస్వే ఎక్కువ..
అమెరికాలో అత్యధిక నైపుణ్యమున్న విదేశీ నిపుణులకు ఇచ్చే హెచ్ -1బీ వీసాలకు సంబంధించి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2025లో రెండవ అతిపెద్ద గ్రహీతగా అవతరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 5,500కి పైగా ఆమోదాలతో అమెజాన్ (10,044) తర్వాత స్థానంలో నిలిచింది.2025 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ తర్వాత అత్యధిక హెచ్ 1బీ వీసా అప్రూవల్స్ పొందిన కంపెనీల్లో మైక్రోసాఫ్ట్ (5,189), మెటా (5,123), ఆపిల్ (4,202), గూగుల్ (4,181), డెలాయిట్ (2,353), ఇన్ఫోసిస్ (2,004), విప్రో (1,523), టెక్ మహీంద్రా అమెరికాస్ (951) ఉన్నాయి.అమెరికాలోని భారతీయ ఐటీ నిపుణులను గణనీయంగా ప్రభావితం చేసే చర్యను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తీసుకున్నారు. వార్షిక హెచ్ -1 బి వీసా ఫీజు 100,000 డాలర్లకు పెంచుతూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు.2025 సెప్టెంబర్ 21 తర్వాత దాఖలు చేసిన పిటిషన్లకు ఈ పరిమితి వర్తిస్తుంది. పొడిగించకపోతే 12 నెలల తర్వాత ముగుస్తుంది. "ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలు హెచ్-1బీ వ్యవస్థను దుర్వినియోగం చేశాయి. కంప్యూటర్ సంబంధిత రంగాలలో అమెరికన్ ఉద్యోగులకు గణనీయంగా హాని కలిగిస్తున్నాయి" అని పేర్కొంటూ ఐటీ అవుట్ సోర్సింగ్ కంపెనీలు హెచ్-1బీ ఆమోదాలపై ఎంతలా ఆధిపత్యం చెలాయించాయో ప్రభుత్వ ప్రకటన హైలైట్ చేసింది. -
విమానానికి ఎయిర్బ్యాగులు
విమానం గాల్లో వెళ్తోంది. హఠాత్తుగా విమానంలో సమస్య తలెత్తింది. పైలట్లు ఇక విమానం నడపడం మావల్ల కాదని చేతులెత్తేశారు. అప్పుడు కనీవినీ ఎరగని రీతిలో విమానానికి ఎయిర్ బ్యాగులు ప్రత్యక్షమయ్యాయి. విమానం సురక్షితంగా కిందకు దిగింది. భారీ ప్రమాదం తప్పింది. వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇలా జరిగితే ఎంత బాగుంటుంది! ఈ దిశగా ఇప్పుడే ప్రయత్నాలు మొదలయ్యాయి. బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్కి చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థుల ఆలోచన ఇది.ప్రాజెక్ట్ రీబర్త్ (Project REBIRTH) ఏఐ సాయంతో విమానాలకు ఎయిర్బ్యాగులు (Airbags) ఏర్పాటుచేసే వినూత్న ఆవిష్కరణ. దుబాయ్లోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో చదువుతున్న భారతీయ విద్యార్థులైన ఈషెల్ వసీం, దర్శన్ శ్రీనివాసన్ దీన్ని రూపొందించారు. ఈ ఎయిర్బ్యాగుల ఆలోచన.. ల్యాబులోనో, క్లాస్రూములోనో రాలేదు. ఇది ఒక మాతృమూర్తి ఆవేదన, సానుభూతి నుంచి వచ్చింది.అమ్మ బాధ తెలుసుకుని..జూన్ 12, 2025.. దేశం మొత్తం ఎప్పటికీ మర్చిపోలేని రోజు. ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్లో టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కుప్పకూలిపోయింది. 260 మంది ప్రాణాలు కోల్పోయారు. తమ ఆప్తుల మృతదేహాలు కూడా దొరకని వారి కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణనాతీతం. అదిగో అది.. ఓ తల్లిని తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఆమె.. దుబాయ్లోని బిట్స్పిలానీలో చదువుతున్న ఈషెల్ తల్లి. ‘విమాన ప్రమాదం గురించి విన్న మా అమ్మ తీవ్రంగా కలత చెందింది. ఆమెకు నిద్ర కూడా పట్టేది కాదు. ‘‘ప్రమాదం తప్పదు.. ఇక విమానాన్ని, ప్రయాణికుల ప్రాణాలు కాపాడలేం’ అనుకున్న క్షణంలో పైలట్లు ఎంత మానసిక వేదన అనుభవించి ఉంటారు’’ అనుకుంది. అలాగే తమ ప్రాణాలు పోవడం ఖాయం అనుకున్న ప్రయాణికుల మానసిక స్థితి ఎలా ఉండి ఉంటుందో అని రోజూ ఆలోచించేది. ఆమె ఆవేదనే నన్ను ఆలోచింపజేసింది. నా స్నేహితుడు శ్రీనివాసన్తో ఈ విషయాన్ని పంచుకున్నాను. ఇలాంటి విమాన ప్రమాదాలు ఎలా ఆపవచ్చా అనుకున్నప్పుడు ఎయిర్బ్యాగుల ఆలోచన వచ్చింది’ అంటాడు వసీం.క్షణాల్లో తెలిసిపోతుందిసాధారణంగా విమాన ప్రమాదాలు (Flight Accidents) జరిగాక కొన్ని గంటలకో, రోజులకోగానీ ఎక్కడ జరిగిందో తెలియదు. ఈలోగా.. తీవ్ర గాయాలతో ఉన్నవారు ప్రాణాలు కోల్పోవచ్చు. మంటలు పెరిగి అంతా కాలి బూడిదైపోవచ్చు. ఏదైనా జరగొచ్చు. ఇలా జరగకుండా.. విమానం ఎక్కడ ఉందో తెలియజేసేందుకు జీపీఎస్, లైటింగ్ వ్యవస్థ ఇందులో ఉన్నాయి. అంటే.. క్షణాల్లో విమాన సమాచారం తెలిసిపోతుందనమాట!పునర్జన్మకు వాగ్దానం‘ప్రస్తుతం రీబర్త్ టెస్టింగ్కి సిద్ధంగా ఉంది. పైలట్లతో సంబంధం లేకుండానే.. విమానం ఎప్పుడు కుప్పకూలిపోవచ్చో ఏఐ వ్యవస్థ కచ్చితంగా అంచనా వేయడం దీని ప్రత్యేకత. విమానానికి బయట నుంచి వచ్చి, ప్రమాదం నుంచి కాపాడే ఎయిర్బ్యాగులు అసలైన రక్షణ వ్యవస్థ. ముఖ్యంగా లోపల ఉన్న ప్రయాణికులు తీవ్రమైన కుదుపులకు గురికాకుండా, ఎలాంటి గాయాలు కూడా కాకుండా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేశాం. ఈ మొత్తం వ్యవస్థను కొత్త విమానాల్లోనే కాదు, ఇప్పటికే ఉన్న విమానాల్లోనూ ఏర్పాటుచేయవచ్చు. రీబర్త్ అనేది కేవలం ఆవిష్కరణ కాదు.. అన్నీ విఫలమైపోయి ప్రాణాలు పోవడం ఖాయం అనుకున్నప్పుడు కూడా పునర్జన్మనిస్తుందనే వాగ్దానం’ అంటున్నారు వసీం, శ్రీనివాసన్.5 ఏళ్లలో సిద్ధం!రీబర్త్కు సంబంధించిన ప్రధాన భాగాల తయారీపైనా ఈ యువ ఇంజినీర్లు దృష్టిపెట్టారు. ముఖ్యంగా ప్రమాదాన్ని పసిగట్టే ఏఐ వ్యవస్థ, ఎయిర్బ్యాగులు, స్మార్ట్ సీట్ల వంటి అన్ని రకాల సాంకేతికతలనూ తయారుచేసేందుకు విమాన తయారీ సంస్థలు, ప్రభుత్వాలతో వీరు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. వచ్చే 5 ఏళ్లలో.. రీబర్త్ను పరీక్షించి, అన్ని అనుమతులూ పొంది, విమానాల్లో పూర్తిస్థాయిలో వాడాలన్నది తమ లక్ష్యం అంటున్నారు ఈ యువ ఆవిష్కర్తలు.చదవండి: ప్రపంచవ్యాప్తంగా పలు ఎయిర్పోర్టులసైబర్ ఎటాక్‘ఏఐ’ రక్షణ వ్యవస్థఇది మొట్టమొదటి ఏఐ ఆధారిత ప్రమాద నిరోధక వ్యవస్థ. 5 స్మార్ట్ టెక్నాలజీల సాయంతో విమాన ప్రమాదాలను పసిగడుతుంది. ⇒ ఇందులోని ఏఐ వ్యవస్థ.. ఎత్తు, వేగం, ఇంజిన్ పరిస్థితి, దిశ, మంటలు, పైలట్ల స్పందనలను పర్యవేక్షిస్తుంది. ⇒ విమానం కుప్పకూలిపోతుంది అనుకున్నప్పుడు ‘ప్రాజెక్ట్ రీబర్త్’ యాక్టివేట్ అవుతుంది. హైస్పీడ్ ఎయిర్బ్యాగులు విమానం రెక్కలు, కింది భాగం, వెనుక భాగాల నుంచి కేవలం 2 సెకెన్ల వ్యవధిలో వచ్చేస్తాయి.⇒ విమాన వేగం తగ్గేలా సాంకేతిక ఏర్పాటు ఉంది. ⇒ సాధారణంగా విమాన ప్రమాదాలు.. తీవ్ర విషాదాలుగా మారేది తాకిడి తీవ్రత వల్లే. అందువల్ల రీబర్త్లో ప్రధానంగా దీన్ని తగ్గించడంపైనే దృష్టి పెట్టారు. విమాన వేగం తగ్గి, దేన్నయినా బలంగా కాకుండా, నెమ్మదిగా తాకినప్పుడు.. లేదా వేగంగా కాకుండా నెమ్మదిగా ల్యాండింగ్ అయినప్పుడు ప్రమాదం తప్పినట్టే కదా. -
భారత్లో యాపిల్ మేనియా...
న్యూఢిల్లీ: భారత్లో శుక్రవారం అందుబాటులోకి వచ్చిన యాపిల్ ఐఫోన్ 17 అభిమానుల్లో మేనియా సృష్టించింది. లేటెస్ట్ ఫోన్ను ముందుగా దక్కించుకునేందుకు యాపిల్ స్టోర్స్ ముందు ఫ్యాన్స్ బారులు తీరారు. కొందరు ముందు రోజు రాత్రి నుంచే దాదాపు 21 గంటల పాటు కూడా నిరీక్షిస్తూ కూర్చున్నారు. ముంబై, ఢిల్లీ, బెంగళూరులో చాంతాడంత క్యూలు కనిపించాయి. ఐఫోన్ 17ని మొదటి రోజునే ముందుగా దక్కించుకున్నవారు మిగతా వారితో తమ సంతోషాన్ని పంచుకున్నారు. రికార్డు స్థాయిలో కొనుగోలుదారులు వెల్లువెత్తినట్లు రిటైలర్లు తెలిపారు. ‘నేను పొద్దుటి నుంచే క్యూలో ఉన్నాను. ఈ రంగు ఐఫోన్ను కొనుక్కోవడం చాలా సంతోషంగా ఉంది‘ అంటూ ఢిల్లీలోని అష్రఫ్ అనే కొనుగోలుదారు తెలిపారు. బెంగళూరులో కొత్తగా ప్రారంభించిన యాపిల్ హెబ్బాల్ స్టోర్లో కూడా ఇలాంటి సందడే నెలకొంది. అటు ముంబైలోని స్టోర్ దగ్గర గుమికూడిన కస్టమర్ల మధ్య ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలో గొడవ తలెత్తడంతో, సెక్యూరిటీ సిబ్బంది పరిష్కరించాల్సి వచ్చింది. ఇటీవల ప్రవేశపెట్టిన ఐఫోన్ 17 సిరీస్ ధర శ్రేణి రూ. 82,900 నుంచి రూ. 2,29,900 వరకు ఉంది. -
Infosys: కెరీర్ గ్యాప్ మహిళలకు శుభవార్త..
కెరీర్లో గ్యాప్ మహిళలకు దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ చక్కని అవకాశం కల్పిస్తోంది. వృత్తి జీవితానికి విరామం ఇచ్చి మళ్లీ ఉద్యోగ ప్రపంచంలో అడుగు పెట్టాలనుకుంటున్న మహిళల కోసం రీస్టార్ట్ విత్ ఇన్ఫోసిస్ అనే కొత్త రిఫరల్ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. విజయవంతమైన రిఫరల్స్కు రూ .50,000 వరకు రివార్డులను కూడా అందించనున్నట్లు కంపెనీ ఉద్యోగులకు అంతర్గత ఈమెయిల్ పంపింది.అర్హతలు ఇవే..ఈ ప్రోగ్రామ్ కు అర్హత పొందడానికి, అభ్యర్థులు కనీసం రెండు సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి. కనీసం ఆరు నెలల పాటు నిరంతర కెరీర్ గ్యాప్ ఉండాలి. అర్హులైనవారిని వివిధ టెక్నాలజీల్లో డెవలపర్లు, టెక్ లీడ్లు, మేనేజర్లుగా నియమించుకునేందుకు ప్రయత్నిస్తోందని, దీని గురించి తెలిసిన వర్గాలను ఉటంకిస్తూ ఒక నివేదిక పేర్కొంది.రెఫర్ చేసినవారికి రివార్డులుఈఎస్జీ విజన్ 2030లో భాగంగా 2030 నాటికి 45 శాతం మహిళా ప్రాతినిధ్యాన్ని సాధించాలని ఇన్ఫోసిస్ లక్ష్యంగా పెట్టుకుంది. తాజా ఈఎస్జీ నివేదిక ప్రకారం.. కంపెనీలో ప్రస్తుతం సుమారు 3,23,000 మంది ఉద్యోగులలో మహిళలు 39% ఉన్నారు. దీంతో మహిళా ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవడంలో భాగంగా కంపెనీ ఈ రిఫరల్ ప్రోత్సాహకాలను అందిస్తోంది. జాబ్ లెవల్ 3 (JL3) లో విజయవంతమైన నియామకాలకు రూ .10,000, జాబ్ లెవల్ 4కు రూ .25,000, జాబ్ లెవల్ 5కు రూ .35,000, జాబ్ లెవల్ 6 రెఫరల్స్కు రూ .50,000 రివార్డులను ఇన్ఫోసిస్ అందించనుంది.ఇదీ చదవండి: ‘టీసీఎస్లో బలవంతంగా రాజీనామా చేయమన్నారు’ -
గేమింగ్ చట్టం అమలు అప్పుడే: అశ్విని వైష్ణవ్
ఆన్లైన్ మనీ గేమ్స్ను నిషేధిస్తూ రూపొందించిన ఆన్లైన్ గేమింగ్ చట్టం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. దీనిపై గత మూడేళ్లుగా పరిశ్రమ వర్గాలతో ప్రభుత్వం సంప్రదింపులు జరిపిందని, చట్టాన్ని ఆమోదించిన తర్వాత కూడా బ్యాంకులు, ఇతరత్రా భాగస్వాములతోను చర్చించామని ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026 ఇండియాకి సంబంధించి ప్రీ–ఈవెంట్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు.పార్లమెంటు గత నెలలో ఈ చట్టానికి ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. దీనితో డ్రీమ్11, మై11 సర్కిల్, విన్జో, జూపీ, పోకర్బాజీలాంటి సంస్థలు రియల్ మనీ గేమింగ్ కార్యకలాపాలను నిలిపివేశాయి. కాగా, కృత్రిమ మేథ (ఏఐ) సంబంధిత ముప్పుల నుంచి ప్రజలకు రక్షణ కలి్పంచేందుకు, ఏఐ వినియోగ విధి విధానాలను నిర్దేశించేందుకు ఉద్దేశించిన గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ను సెపె్టంబర్ 28 నాటికి విడుదల చేయనున్నట్లు వైష్ణవ్ చెప్పారు. -
ఇండియా ఏఐ మిషన్లోకి ఎనిమిది కంపెనీలు
కృత్రిమ మేధలో ఆధిపత్యం కోసం భారతదేశం సాహసోపేతమైన అడుగులు వేస్తోంది. అత్యాధునిక లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs)ను నిర్మించడానికి ప్రభుత్వం ఎనిమిది కంపెనీలను ఎంపిక చేసినట్లు తెలిపింది. ఇండియా ఏఐ మిషన్లో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయం దేశ ఏఐ ల్యాండ్స్కేప్ను శక్తివంతం చేయడానికి, భారతీయ భాషలు, పాలనా అవసరాలకు అనుగుణంగా పరిష్కారాలను రూపొందించడానికి తోడ్పడుతుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.ప్రభుత్వం ఎంపిక చేసిన కంపెనీలు విభిన్న భాషా, సాంస్కృతిక సాంకేతికలను కలిగి ఉన్నాయని మంత్రి చెప్పారు. ఇవి ఏఐ నమూనాలను అభివృద్ధి చేయడానికి ప్రతిష్టాత్మక ప్రణాళికలను కలిగి ఉన్నట్లు తెలిపారు. ఇండియా ఏఐ మిషన్లో భాగమవుతున్న కంపెనీల వివరాలు కింది విధంగా ఉన్నాయి.టెక్ మహీంద్రా - 8 బిలియన్ పారామీటర్ ఎల్ఎల్ఎంను నిర్మించే పనిలో ఉంది. టెక్ మహీంద్రా మోడల్ దేశవ్యాప్తంగా భాషా అంతరాలను తగ్గించే లక్ష్యంతో హిందీ మాండలికాల అవగాహన, ప్రాసెసింగ్ను పెంపొందించడంపై దృష్టి పెడుతుంది. హిందీ కేంద్రీకృత ఎల్ఎల్ఎంను అభివృద్ధి చేసేందుకు ప్రాథమికంగా రూ.1.06 కోట్లతో మద్దతు ఇచ్చింది.ఫ్రాక్టల్ అనలిటిక్స్ - తార్కికత ఆధారిత నమూనాలపై దృష్టి సారించింది. ఫ్రాక్టల్ అనలిటిక్స్ ఆరోగ్య సంరక్షణ, విశ్లేషణ, జాతీయ భద్రత కోసం ఎల్ఎల్ఎంలపై పని చేస్తుంది. ఈ విధాన కేంద్రీకృత నమూనాల కోసం రూ.34.58 కోట్లు కేటాయించారు.భారత్ జెన్ - ఐఐటీ బాంబే నేతృత్వంలో భారత్ జెన్ బహుభాషా అప్లికేషన్లను, రీజినల్ నాలెడ్జ్తో సహా భారతీయ యూజర్ కేసుల కోసం రూపొందించిన 1-ట్రిలియన్ పారామీటర్ మోడల్ను రూపొందించడానికి సిద్ధమవుతోంది. ఐఐటీ బాంబే-భారత్ జెన్ కోసం రూ.988.6 కోట్లు కేటాయించారు.అవతార్ AI, షోధ్ AI, జీన్టిక్, ఏఐటెక్ ఇన్నోవేషన్స్, జెన్లూప్ ఇంటెలిజెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, న్యూరోడిఎక్స్ (ఇంటెల్లిహెల్త్) వంటి కంపెనీలు ఆరోగ్య సంరక్షణ, ఫిన్టెక్, అధునాతన సాంకేతిక పరిష్కారాలు వంటి విభాగాల్లో సర్వీసులు అందించనున్నాయి.ఏఐ పరిశోధన, వాటి మోడళ్ల శిక్షణకు భారతదేశం ఇప్పటికే 38,000 జీపీయూలను ఏర్పాటు చేసింది. 2025 చివరి నాటికి వీటిని 50,000కి పెంచాలని యోచిస్తోంది. ఇండియా ఏఐ మిషన్లో భాగంగా హిందీ, ప్రాంతీయ మాండలికాలు, ఇతర భారతీయ భాషలకు అనుగుణంగా ఎల్ఎల్ఎంలను అభివృద్ధి చేస్తున్నారు. ఈ నమూనాలు వ్యవసాయం, ఆర్థిక, న్యాయ సేవలు, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి కీలక రంగాలలో ఏఐ అప్లికేషన్లకు మద్దతు ఇస్తాయి. క్లిష్టమైన సవాళ్లను పరిష్కరించడం, పాలనా సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఇవి ఉపయోగపడుతాయి. ఈ మిషన్లో భాగంగా దేశవ్యాప్తంగా 500+ ఏఐ డేటా ల్యాబ్లను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇవి ప్రతిభ, మౌలిక సదుపాయాల కోసం ఇంక్యుబేటర్లుగా పనిచేస్తాయి. తరువాతి తరం ఏఐ ఆవిష్కర్తలను తయారు చేస్తాయి.ఇదీ చదవండి: కేంద్ర బ్యాంకులకు బంగారు నిల్వలు ఎందుకు? -
2025 టు 1990
గూగుల్ జెమిని నానో బనాన ట్రెండ్ హవా కొనసాగుతుండగానే మరోవైపు నానో బనాన ఏఐ శారీ ట్రెండ్ మొదలైంది. మహిళా యూజర్లు జెమిని నానో బనాన ఇమేజ్ ఎడిటింగ్ టూల్ను ఉపయోగించి తమ సెల్ఫీలను 90 దశకం డ్రామటిక్ బాలీవుడ్–స్టైల్ ప్రోర్ట్రయిట్స్లోకి మార్చడమే... బనాన శారీ ట్రెండ్.ఏఐ ప్రాంప్ట్లతో అలనాటి అద్భుత చీరలలో మెరిసిపోవడమే బనాన ఏఐ శారీ ట్రెండ్ ప్రత్యేకత.ఈ ట్రెండ్ పుణ్యమా అని 90 దశకంలోని పాపులర్ స్టైల్స్..పోల్కా–డాట్ డిజైన్, బ్లాక్ పార్టీ–వేర్ శారీ, సాఫ్ట్ ఫ్లోరల్ యాక్సెంట్లు మళ్లీ కనువిందు చేస్తున్నాయి.మీరు కూడా ఈ ట్రెండ్లో భాగం కావాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి...∙జెమిని చాట్జీపీటీలో లాగిన్ కావాలి ∙ట్రై ఇమేజ్ ఎడిటింగ్–క్లిక్ చేయాలి. ∙క్లీయర్ సోలో ఫోటోను అప్లోడ్ చేయాలి. ∙బ్లాక్ శారీ, వైట్పోల్కా డాట్....మొదలైన వైరల్ ్రపాంప్ట్స్లో ఒకదాన్ని పేస్ట్ చేయాలి. ∙రెట్రో శారీపోర్ట్రయిట్ క్షణాల్లో కళ్లముందుంటుంది. -
బిగ్ బిలియన్ డేస్ సేల్లో మోటరోలా ఫోన్లపై ఆఫర్లు
ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ మోటరోలా ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 కోసం ప్రీమియం, మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్లపై ‘బిగ్బిలియన్ మోటోరష్’ పేరుతో ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఏఐ-ఆధారిత మోటరోలా ఎడ్జ్ 60 ప్రో, మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ మొదలుకొని మోటో జీ సిరీస్ స్మార్ట్ఫోన్లు, మోటరోలా రేజర్ 60 సిరీస్ వరకు ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది.మోటరోలా ఎడ్జ్ 60 ప్రో 8+ 256జీబీ వేరియంట్ అసలు ధర రూ.29,999 కాగా ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో ఆఫర్ కింద రూ.24,999 లకే సొంతం చేసుకోవచ్చు.మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్ఫోన్ 8+256జీబీ వేరియంట్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో రూ.19,999, 12+256జీబీ రూ.21,999 లకు అందుబాటులో ఉంటుంది.మోటో జీ96 5జీ 8+128జీబీ రూ.14,999లకు, 8+256జీబీ రూ.16,999లకు వస్తుంది.మోటో జీ86 పవర్ స్మార్ట్ ఫోన్ను ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో రూ.15,999లకే సొంతం చేసుకోవచ్చు.మోటరోలా రేజర్ 60 8+256జీబీ వేరియంట్ బిగ్ బిలియన్ డేస్ ధర రూ.39,999. -
టాటా స్టోర్లలో ఐఫోన్ 17 ప్రత్యేక ఆఫర్లు
భారతదేశపు ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైలర్, టాటా గ్రూప్నకు చెందిన క్రోమా ఐఫోన్ 17 మోడళ్లపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. క్రోమా స్టోర్స్, ట్రైబ్ అవుట్లెల్లు, క్రోమా.కామ్(ఆన్లైన్), టాటా న్యూ యాప్లలో ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. లాంచ్ క్యాంపెయిన్ సెప్టెంబర్ 19-27 వరకు సేల్ విండోతో ప్రారంభమవుతుంది. తరువాత అక్టోబర్ 26 వరకు కొన్ని ఎంపిక చేసిన ప్రయోజనాలతో ఆఫర్లు కొనసాగుతాయి.క్రోమా, ట్రైబ్ స్టోర్లలో, అలాగే ఆన్లైన్లో(Croma.com)లో, టాటా న్యూ యాప్లో సెప్టెంబర్ 19-27 వరకు, కస్టమర్లు ఐఫోన్ 17 కొనుగోలుపై రూ.12,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు. టాటా న్యూ హెచ్డీఎఫ్సీ కార్డుతో 10% న్యూకాయిన్లను సంపాదించవచ్చు. నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంటుంది. ఐఫోన్ కేస్లు, చార్జర్లు, ఆడియో గేర్ వంటి యాపిల్ యాక్సెసరీలపై 20 శాతం డిస్కౌంట్ ఉంటుంది. ఇది ప్రత్యేక ఆఫర్ గా, ఈ లాంచ్ సేల్ విండోలో మాత్రమే వర్తిస్తుంది. -
ఒక్కసారే రీఛార్జ్.. ఏడాదంతా ఫ్రీ!: బెస్ట్ యాన్యువల్ ప్లాన్స్ ఇవే..
చాలామంది యూజర్లు మంత్లీ ప్లాన్స్ (28 రోజులు) రీఛార్జ్ చేసుకుంటారు. ఈ ప్యాక్ ధరలు, యాన్యువల్ ప్లాన్తో పోలిస్తే కొంత ఎక్కువగా ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కొంతమంది ఏడాది ప్లాన్స్ రీఛార్జ్ చేసుకుంటున్నారు. ఈ కథనంలో బెస్ట్ యాన్యువల్ రీఛార్జ్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం.ఎయిర్టెల్ఎయిర్టెల్ తన యూజర్ల కోసం రూ.3599, రూ.2249 ప్లాన్స్ అందిస్తోంది. రూ.3599 రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 2 జీబీ డేటా, అపరిమిత కాల్స్ వంటివాటితో పాటు.. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ సబ్స్క్రిప్షన్ వంటివి లభిస్తాయి. కాగా రూ.2249 ప్లాన్ ద్వారా 365 రోజుల అపరిమిత కాలింగ్స్.. 30 జీబీ డేటా మాత్రమే లభిస్తుంది. ఇందులో డైలీ డేటా.. ఇతర సబ్స్క్రిప్షన్ ఉండవు.రిలయన్స్ జియోజియో యూజర్లకు రూ.3599, రూ.999, రూ.234, రూ.895 ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. రూ. 3599 రీఛార్జ్ ప్లాన్ ద్వారా యూజర్లు అపరిమిత కాలింగ్స్ పొందటమే కాకుండా.. రోజుకి 2.5 జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. పైగా జియో టీవీ, హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. రూ.3999 ప్లాన్ ద్వారా అదనంగా జియో ప్యాక్ కోడ్ సబ్స్క్రిప్షన్ పొందవచ్చు. అయితే రూ.1234 ద్వారా రీఛార్జ్ చేసుకుంటే.. 336 రోజుల వ్యాలిడిటీతో రోజుకి 0.5 జీబీ డేటా లభిస్తుంది. జియో ఫోన్ ప్రైమా యూజర్లు 336 రోజుల వాలిడిటీ కోసం రూ.895 రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ప్రతి 28 రోజులకు 2 జీబీ డేటా లభిస్తుంది.వోడాఫోన్ ఐడియావోడాఫోన్ ఐడియా విషయానికి వస్తే.. ఇది తన యూజర్ల కోసం రూ. 3599తో రీఛార్జ్ ప్లాన్ అందిస్తుంది. దీని వ్యాలిడిటీ 365 రోజులు. రోజుకి 2జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత వాయిస్ కాల్స్ పొందవచ్చు. అంతే కాకుండా ఈ ప్యాక్ రీఛార్జ్ చేసుకుంటే.. రాత్రి 12 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఫ్రీ డేటా పొందవచ్చు. రూ.3799తో రీఛార్జ్ చేస్తే.. అదనంగా ఆమెర్జన్ ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. రోజుకి 1.5 జీబీ చాలనుకుంటే.. రూ.3499తో రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. డైలీ డేటా వద్దనుకుంటే.. రూ.1999తో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇందులో ప్యాక్ మొత్తానికి 24 జీబీ డేటా లభిస్తుంది.ఇదీ చదవండి: ఈ20 ఫ్యూయెల్ ఎఫెక్ట్.. ఫెరారీ స్టార్ట్ అవ్వడం లేదట!!బీఎస్ఎన్ఎల్బీఎస్ఎన్ఎల్ విషయానికి.. రూ.2399, రూ.1999, రూ. 1515 అనే ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. రూ.2399 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 600 రోజులు అపరిమిత కాల్స్, రోజుకి 2 జీబీ డేటా వంటివి లభిస్తాయి. రూ.1999 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 365 రోజులు 600 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ లభిస్తాయి. అయితే రూ.1515 ప్లాన్ ద్వారా 365 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత కాల్స్, రోజుకి 2 జీబీ డేటా లభిస్తుంది. -
ఈవీ స్కూటర్లో మొదటిసారి స్మార్ట్ వాచ్ ఇంటిగ్రేషన్
టీవీఎస్ తన వినియోగదారులకు కనెక్టివిటీ సర్వీసులు అందించేందుకు నాయిస్ కంపెనీతో జతకట్టినట్లు తెలిపింది. ఈ భాగస్వామ్యంతో భారతదేశపు మొట్టమొదటి ఈవీ-స్మార్ట్ వాచ్ ఇంటిగ్రేషన్ను ఐక్యూబ్ మోడల్లో లాంచ్ చేసినట్లు పేర్కొంది. ఈ స్మార్ట్ వాచ్ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్లోని కొన్ని అంశాలను లైవ్టైమ్లో ట్రాక్ చేయవచ్చని తెలిపింది.బ్యాటరీ స్టేటస్, దాని రేంజ్ను మానిటర్ చేయవచ్చు.టైర్ ప్రజర్ మానిటరింగ్వాహన భద్రతా హెచ్చరికలురైడ్ గణాంకాలను తెలుసుకోవచ్చు.ఈ ఫీచర్లను ప్రామాణిక కనెక్టివిటీ ఫంక్షన్లతోపాటు విలీనం చేసినట్లు కంపెనీ పేర్కొంది. ‘కొత్త టీవీఎస్ ఐక్యూబ్ను స్మార్ట్ వాచ్తో అనుసంధానించడం ద్వారా వినియోగదారులకు సురక్షితమైన, మరింత సహజమైన ప్రయాణాలు సాగించేందుకు వీలుంటుంది’ అని టీవీఎస్ మోటార్ కంపెనీలో హెడ్ కమ్యూటర్ & ఈవీ బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, హెడ్ కార్పొరేట్ బ్రాండ్ అండ్ మీడియా అనిరుద్ధ హల్దార్ అన్నారు.ఇదీ చదవండి: మరో నాలుగు రోజులు ఇంతే.. -
అంతర్జాతీయంగా ఏఐ నైతిక ప్రమాణాలపై కసరత్తు
రోజువారీ జీవనంలో కృత్రిమ మేథ (ఏఐ) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో దాన్ని నైతికంగా ఉపయోగించడానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలను రూపొందించడంపై కసరత్తు జరుగుతోందని వినియోగదారుల వ్యవహారాల విభాగం కార్యదర్శి నిధి ఖరే తెలిపారు. ఆయా కమిటీల్లో భారతీయ నిపుణులు కూడా ఉన్నారని వివరించారు. గ్లోబల్ ప్రమాణాలు ఖరారైన తర్వాత భారత్ సహా ప్రపంచ దేశాలు వాటిని అమలు చేస్తాయని పీహెచ్డీసీసీఐ సదస్సులో చెప్పారు. ఇప్పటికే 39 ఉండగా, మరో 45 గ్లోబల్ ఏఐ ప్రమాణాలను రూపొందించే ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. ఏఐ టెక్నాలజీకి రెండు పార్శ్వాలు ఉన్నాయని చెప్పారు. రిటైల్, ఈ–కామర్స్ రంగాల్లో మోసాలను అరికట్టేందుకు ఇది ఉపయోగపడనుండగా, అదే సమయంలో అనైతికంగా ఉపయోగిస్తే ప్రమాదకరంగా పరిణమించే అవకాశాలూ ఉన్నాయని నిధి చెప్పారు. ‘ప్రస్తుతం ప్రపంచంలో ఏఐ పెద్ద సవాలుగా మారింది. దీనితో ఎంతగా దుష్ప్రచారం జరుగుతోందో మనం చూస్తున్నాం. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. మోసాల నుంచి వినియోగదారులను కాపాడేందుకు ప్రభుత్వాలు తప్పనిసరిగా చట్టాలు చేసే పరిస్థితి ఏర్పడుతోంది. అలాగని ఏఐ వల్ల ప్రయోజనాలు లేవని చెప్పడానికి లేదు. సోషల్ మీడియా, ప్లాట్ఫాంలు, నవకల్పనలకు సంబంధించి ఇదొక సానుకూల, సృజనాత్మక ఆవిష్కరణ’ అని తెలిపారు.ఇదీ చదవండి: పండుగ సీజన్పై ‘సోనీ’ ఆశలు..! -
ఇది ఓ కార్పొరేట్ ఉద్యోగి క(ఖ)ర్మ!
కార్పొరేట్ ప్రపంచం చాలా చిత్రమైంది. ఒక పైసా ఖర్చు మిగిల్చేందుకు వంద రూపాయలు తగలేసేందుకూ సిద్ధం. ఇది కూడా అట్లాంటి వ్యవహారమే. కంపెనీ ఊరూ, పేరు తెలియదు కానీ.. సామాజిక మాధ్యమం రెడిట్లో ప్రచురితమైన వివరాల ప్రకారం...అతడో సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఏళ్లుగా అదే కంపెనీలో పనిచేస్తున్నాడు. గాడిద చాకిరీ చేస్తున్నానని తనే చెప్పుకున్నాడు కూడా. ఈమధ్యే వార్షిక ఇంక్రిమెంట్ల ప్రహసనం ముగిసింది. ఊహించినట్టుగానే జీతం జానెడే పెరిగింది. ‘‘జీతం కనీసం పది శాతమైనా పెంచండి సారూ’’ అంటూ పైవాళ్లకు మెయిల్ పెట్టాడు. పైనున్న మేనేజర్.. ఆ పైనున్న హెచ్ఆర్ వాళ్లు ఏమనుకున్నారో.. ఎలా ఆలోచించారో తెలియదు కానీ.. ‘‘ఠాట్.. పది శాతం పెంచమంటావా’’ అంటూ హూంకరించారు.‘‘నిన్ను ఉద్యోగం లోంచి పీకేశాం. ఫో’’ అనేశారు. కంపెనీ కదా.. ఆమాత్రం పైచేయి చూపడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఆఫ్ట్రాల్ ఒక ఉద్యోగి విజ్ఞప్తిని మన్నిస్తే.. అందరూ మీదపడిపోతారు అనుకుని ఉంటుంది. తొలగించనైతే తొలగించారు కానీ.. అప్పటివరకూ ఆ ఇంజినీర్ చేసే పని? అర్జెంటుగా ‘‘సిబ్బంది కావలెను’’ అన్న సందేశం వెళ్లిపోయింది. హడావుడిగా మెయిళ్లు అటు ఇటూ కదిలాయి. బోలెడంత మందిని ఇంటర్వ్యూలకు పిలిచారు. చివరకు ఆరు మందిని సెలెక్ట్ చేశారు. మంచి ప్యాకేజీలతో వారి జీతాలూ ఫిక్స్ చేసేశారు. ఆ ఒక్కడు చేసే పనిని వీరందరూ కలసికట్టుగా చేయడం మొదలుపెట్టారు కొనసాగిస్తున్నారు. కార్పొరేట్ కంపెనీల వ్యవహారం ఇలా ఉంటుందన్నమాట.పది శాతం పెంపును నిరాకరించి ఉద్యోగంలోంచి తొలగించిన ఆ ఉద్యోగి ఆరేళ్లపాటు కంపెనీకి సంబంధించిన కీలకమైన బ్యాకెండ్ వ్యవస్థను ఒంటిచేత్తో నడిపిస్తున్నాడట. ముందుగా చెప్పినట్లు గాడిద మాదిరిగా ఆ బాధ్యతంతా తలపై మోసుకుని కష్టపడినా.. సహోద్యోగుల కంటే తక్కువ జీతం వస్తూండటంతో ఉండబట్టలేక జీతం పది శాతం పెంచమని అడిగాడట. ఇక లాభం లేదనుకుని కంపెనీ పనులపై శ్రద్ధ తగ్గించేశాడు. ఇతగాడి ఖర్మానికో, పుణ్యానికో అప్పుడే కంపెనీలో ఒక కొత్త డైరెక్టర్ వచ్చి చేరాడు. ఆఫీసుకు సక్రమంగా రావడం లేదన్న మిషతో ఉద్యోగంలోంచి తీసేశాడు. ఫలితం.. ఒకరి స్థానంలో ఆరుగురికి జీతాలు సమర్పించుకోవాల్సి రావడం. ‘‘పదిశాతం పెంచేసి ఉంటే గొడవే ఉండకపోవను. అయితే ఒక్కటి. ప్రపంచంలో న్యాయం అనేది ఇంకా ఉంది అనేందుకు ఇదో నిదర్శనం’’ అని ఆ ఉద్యోగి తన రెడిట్ పోస్టులో రాసుకోవడం అక్షర సత్యం అనిపిస్తుంది! ఏమంటారు? -
డిస్కార్డ్ వంటి మరెన్నో యాప్స్..
నేపాల్లో ఇటీవల సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో జెన్జీ యువతకు కమ్యునికేషన్ సాధనంగా ‘డిస్కార్డ్’ యాప్ ఎంతో తోడ్పడినట్లు తెలుస్తుంది. యువతను కట్టడి చేసేందుకు, అల్లర్లను అదుపు చేసేందుకు నేపాల్ గత ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధించడంతో గేమింగ్ యాప్లో ఇంటర్నల్ కమ్యునికేషన్ టూల్గా వాడే డిస్కార్డ్ ఎంతో ఉపయోగపడినట్లు కొందరు చెబుతున్నారు.శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన వ్యవస్థాపకులు జాసన్ సిట్రాన్, స్టాన్ విస్నేవిస్క్ 2015లో డిస్కార్డ్ను ఆవిష్కరించారు. ఇది వాయిస్, వీడియో, చాట్ ప్లాట్ఫామ్. గేమింగ్ సాధనాల్లో గేమర్లు ఇంటర్నల్ కమ్యునికేషన్ కోసం దీన్ని ఉపయోగిస్తారు. ఇటీవల నేపాల్ జెన్జీ యువత రాజకీయ మార్పును డిమాండ్ చేస్తూ వీధుల్లోకి పెద్దమొత్తంగా ర్యాలీకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే సామాజిక మాధ్యమాలపై ఆంక్షలున్న సమయంలో ఇంతలా యువత ఒకేసారి అసంతృప్తితో కూడబలుక్కొని వీధుల్లోకి రావడం ఎలా సాధ్యమైందనే దానిపై చర్చ సాగింది. అందుకు గేమింగ్ టూల్స్లో ఉన్న డిస్కార్డ్ యాప్ ద్వారా యువత పరస్పరం కమ్యునికేట్ అయి ఇలా మూకుమ్మడిగా దాడికి దిగినట్లు తెలుస్తుంది.ఇదిలాఉండగా, భారతదేశంలో 2025లో డౌన్లోడ్ల పరంగా డిస్కార్డ్ నాలుగో అతిపెద్ద మార్కెట్గా ఉంది. ఇది మొత్తం ఇన్స్టాల్స్లో 6 శాతం వాటాను కలిగి ఉంది. ఇండియాలో ఈ ఒక్క ఏడాదే 5 మిలియన్ల డౌన్లోడ్లు నమోదు అయ్యాయి. 2024 కంటే 2 శాతం పెరిగింది. ఇలాంటి మరిన్ని యాప్స్ గురించి యువత సెర్చ్ చేస్తోంది. వాటిలో కొన్నింటి వివరాలు కింద చూద్దాం.యాప్ముఖ్య లక్షణాలుఎవరి కోసం అంటే..గిల్డెడ్వాయిస్, వీడియో, బాట్గేమింగ్ కమ్యూనిటీలుటీమ్ స్పీక్అల్ట్రా-లో లేటెన్సీ వాయిస్, మిలిటరీ-గ్రేడ్ ఎన్ క్రిప్షన్ఈస్పోర్ట్స్, ఎఫ్పీఎస్ పోటీ దారులకు..మంబుల్ఓపెన్ సోర్స్, ఎన్ క్రిప్టెడ్ వాయిస్ చాట్గోప్యంగా ఉండాలనుకునే గేమర్లుటాక్స్పీర్-టు-పీర్ మెసేజింగ్గేమింగ్ సమూహాలు ఇదీ చదవండి: బిగ్ రిలీఫ్! తగ్గిన బంగారు ధర.. తులం ఎంతంటే -
‘రాత్రిళ్లు పనిచేసి రూ.1 కోటి సంపాదించాను’
జీవితంలో ఎదగాలనే తపన, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని కొందరు నిరూపిస్తున్నారు. టెక్నాలజీ పెరుగుతున్న ఈ కాలంలో కాలేజీ రోజుల్లో నుంచే కోడింగ్పై ఆసక్తి పెంచుకొని, ఓవైపు పగటిపూట ఉద్యోగం చేస్తూనే మరోవైపు రాత్రిళ్లు డిజిటల్ యాప్స్ తయారు చేశాడు ఓ యువకుడు. ఆ యాప్స్కు నెటిజన్లు నుంచి ఆదరణ లభించడంతో రెండేళ్లలోనే ఏకంగా రూ.1 కోటి సంపాదించాడు. ఈమేరకు ఆ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్ట్ వైరల్గా మారింది.రెడ్డిట్లో ఇండియన్ ఫ్లెక్స్ హ్యాండిల్లో చేసిన పోస్ట్లోని వివరాల ప్రకారం..‘నేను 2015లో కాలేజీలో చేరాను. మొదటి నుంచే నాకు కోడింగ్పై ఆసక్తి పెరిగింది. అందులోని మెలకువలు నేర్చుకున్నాను. కాలేజీ చదువు పూర్తయ్యాక ఓ రిటైల్ కంపెనీలో పగలు ఉద్యోగం చేసేవాడిని. కోడింగ్ నైపుణ్యాలతో రాత్రిళ్లు పనిచేస్తూ కొన్ని యాప్స్ డెవలప్ చేశాను. మొత్తంగా 5 డిజిటల్స్ యాప్స్ ఆవిష్కరించాను. వీటి అభివృద్ధికి ఎవరి సాయం తీసుకోలేదు. నేనే కోడింగ్, డిజైనింగ్, మార్కెటింగ్, కస్టమర్ సపోర్ట్.. వంటివి చేసుకున్నాను. దాంతో రెండేళ్లలో రూ.1 కోటి సంపాదించాను’ అని రాసుకొచ్చారు.మనం చేసే పనిలో ఆసక్తి, పట్టుదల, నైపుణ్యాలు పెంచుకుంటే ఏదైనా సాధించవచ్చు. దాంతో క్రమంగా ఆర్థిక భరోసా ఏర్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: ఎలక్ట్రానిక్ పాస్పోర్ట్ చిప్లపై పరిశోధన -
జర్మనీని వెనక్కి నెట్టిన చైనా: మొదటిసారి టాప్ 10లోకి..
చైనాలోని పలు కంపెనీలు.. రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. దీంతో ఈ దేశం మొదటిసారి ఐక్యరాజ్యసమితి మోస్ట్ ఇన్నోవేటివ్ కంట్రీస్ యాన్యువల్ ర్యాంకింగ్లో టాప్ 10లోకి ప్రవేశించింది. యూరప్లోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీని అధిగమించి ఈ రికార్డ్ కైవసం చేసుకుంది.2011 నుంచి స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో కొనసాగుతోంది, స్వీడన్, యునైటెడ్ స్టేట్స్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. 78 సూచికల ఆధారంగా 139 ఆర్థిక వ్యవస్థలపై నిర్వహించిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (GII) సర్వేలో చైనా 10వ స్థానంలో నిలిచింది.జాబితాలోని టాప్ 10 దేశాలలో.. వరుసగా స్విట్జర్లాండ్, స్వీడన్, యునైటెడ్ స్టేట్స్, కొరియా, సింగపూర్, యునైటెడ్ కింగ్డమ్, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, డెన్మార్క్, చైనా ఉన్నాయి.ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరికజర్మనీ ప్రస్తుతం 11వ స్థానానికి పడిపోవడం పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని GII కో ఎడిటర్ 'సచా వున్ష్-విన్సెంట్ (Sacha Wunsch-Vincent) అన్నారు. కొత్త ర్యాంకింగ్.. అమెరికాలో ట్రంప్ పరిపాలన విధించిన సుంకాల ప్రభావాన్ని ప్రతిబింబించలేదని అన్నారు. -
‘ఒక్క క్లిక్తో బ్యాంకు ఖాతాలోని డబ్బు మాయం’
సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్న టెక్నాలజీలను ఆసరాగా తీసుకుని సైబర్ నేరస్థులు సామాన్య ప్రజలను టార్గెట్ చేసే వీలుందని ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ తన ఎక్స్ ఖాతా వేదికగా హెచ్చరించారు. ఇటీవల జెమిని నానో బనానా మోడల్ వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆయన ఈమేరకు హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.నానో బనానాగూగుల్ గత నెలలో జెమిని యాప్కు ‘నానో బనానా’ సంబంధించిన ఏఐ ఇమేజ్ ఎడిటింగ్ టూల్ను విడుదల చేసింది. నానో బనానా లాంచ్ అయిన కొన్ని రోజుల్లోనే జెమిని యాప్ 10 మిలియన్ డౌన్లోడ్లను దాటింది. 3D బొమ్మలను సృష్టించడానికి ఇది చాలా ఉపయోగకరంగా మారింది. ఇప్పటి వరకు ఈ టూల్ 200 మిలియన్ల కంటే ఎక్కువ ఫొటోలను సృష్టించింది. వేగం, కచ్చితత్వంలో ఇది చాట్జీపీటీ, మిడ్జర్నీ వంటి ప్రత్యర్థులకంటే ముందు ఉంది. దీంతో ఇది ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.సారీ ట్రెండ్..సినీతారలు, రాజకీయ నాయకులు, పెంపుడు జంతువులను సైతం ఈ ట్రెండింగ్ ఏఐను ఉపయోగించి అద్భుతంగా రూపొందించుకుంటున్నారు. ప్రస్తుతం నానో బనానా 5 ప్రాంప్ట్లలో అందుబాటులో ఉంది. తాజాగా బనానా మోడల్ తరహాలోనే ‘సారీ ట్రెండ్’ కూడా వైరల్గా మారుతోంది. ఈ నేపథ్యంలో వైరల్ అవుతున్న ట్రెండింగ్ టెక్నాలజీలను ఉపయోగించుకుని సామాన్య ప్రజలపై మోసాలకు ఒడిగట్టే అవకాశం ఉంటుందని, వెబ్సైట్ల్లో ఫొటోలు అప్లోడ్ చేసేముందు జాగ్రత్త వహించాలని సజ్జనార్ చెప్పారు.నకిలీ వెబ్సైట్లు.. అనధికార యాప్లు..‘ఇంటర్నెట్లో ట్రెండింగ్ టాపిక్లతో జాగ్రత్తగా ఉండండి! నానో బనానా ట్రెండింగ్ క్రేజ్ ఉచ్చులోపడి వ్యక్తిగత సమాచారాన్ని ఆన్లైన్లో పంచుకుంటే, సైబర్ మోసాలు జరగడం ఖాయం. కేవలం ఒక్క క్లిక్తో మీ బ్యాంకు ఖాతాల్లోని డబ్బు నేరస్థుల చేతుల్లోకి చేరుతుంది. ఫొటోలు లేదా వ్యక్తిగత వివరాలను నకిలీ వెబ్సైట్లు లేదా అనధికార యాప్ల్లో ఎప్పుడూ పంచుకోవద్దు. మీ ఫొటోలు లేదా వ్యక్తిగత సమాచారాన్ని అప్లోడ్ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి’ అని సజ్జనార్ ఎక్స్తో చెప్పారు.ఇదీ చదవండి: ఇప్పుడంతా ఇదే ట్రెండ్!.. అద్భుతాలు చేస్తున్న బనానా ఏఐ -
కీ చెయిన్ కెమెరా.. ధర ఎంతంటే..
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వస్తువుల పరిమాణంలో, అందుకు ఉపయోగించే పరికరాల్లో మార్పులొస్తున్నాయి. గతంలో పెద్ద రూమ్ సైజ్లో ఉండే కంప్యూటర్ ఇప్పుడు మడిచి జేబులో పెట్టుకునేంత సైజ్లోకి మారిపోయింది. సాంకేతిక విభిన్న విభాగాల్లో భారీ మార్పులు తీసుకొస్తోంది. ఇది కెమెరా తయారీ పరిశ్రమలోనూ విశేష మార్పులకు నాంది పలికింది. గతంలో సూట్కేస్ సైజ్లో ఉండే కెమెరాలు టెక్నాలజీ సాయంతో ప్రస్తుతం ‘కీ చెయిన్’ సైజ్లోకి వచ్చేశాయి. అవును.. కేవలం 30 గ్రాముల బరువుండే కెమెరాను కొడాక్ కంపెనీ ‘చార్మెరా’ పేరుతో ఇటీవల ఆవిష్కరించింది.కొడాక్ చార్మెరా ఫీచర్లు..ఇది ఒక మినీ కెమెరా.దీని ధర కేవలం 30 డాలర్లు(సుమారు రూ.2,500). రిటైలర్ను అనుసరించి ధరలో మార్పులుంటాయని గమనించాలి.దీన్ని ‘బ్లైండ్ బాక్స్’ల్లో విక్రయిస్తున్నారు. (ఇది డిలివరీ అయ్యే వరకు రంగు / డిజైన్ తెలియదు).ఇది 30 గ్రాముల బరువు ఉంటుంది.1.6 మెగా పిక్సెల్ కెమెరా సామర్థ్యం ఉండి, జేపీఈజీ ఫార్మాట్లో ఫొటోలు (1440×1440) సేవ్ చేస్తుంది.30fps ఈవీఐ వీడియోఎస్సీడీ స్క్రీన్ + వ్యూఫైండర్యూఎస్బీ టైప్-C ఛార్జింగ్.మైక్రో ఎస్డీ స్లాట్ (128GB వరకు)ఇదీ చదవండి: ముడి చమురు స్టోరేజ్ కోసం రూ.5,700 కోట్లతో ప్రాజెక్ట్ -
ఒప్పో కొత్త సిరీస్ స్మార్ట్ఫోన్లు విడుదల
చైనా స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఒప్పో ఎఫ్ 31 సిరీస్ను భారత్లో లాంచ్ చేసింది. ఎఫ్ 31, ఎఫ్ 31 ప్రో, ఎఫ్ 31 ప్రో ప్లస్ అనే మూడు మోడళ్ల స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్లన్నీ 7,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తాయి. అన్నింటిలోనూ ఏఐ ఆధారిత ఫీచర్లు చాలానే ఇచ్చారు. వాటి స్పెసిఫికేషన్లు ఏంటి.. ధరలు ఎంత.. ఎక్కడ కొనుక్కోవాలి.. తదితర వివరాలను ఈ కథనంలో పూర్తిగా తెలుసుకుందాం.ఒప్పో ఎఫ్31 5జీ సిరీస్ ధరలు, లభ్యతఒప్పో ఎఫ్31 ప్రో ప్లస్ 5జీ8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.32,999. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర రూ.34,999. హిమాలయన్ వైట్, జెమ్స్టోన్ బ్లూ, ఫెస్టివల్ పింక్ రంగుల్లో లభ్యమవుతుంది.ఒప్పో ఎఫ్31 ప్రో 5జీ8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.26,999. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర రూ.28,999. అదే 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.30,999. డెసెర్ట్ గోల్డ్, స్పేస్ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంది.ఒప్పో ఎఫ్31 5జీ8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.22,999. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర రూ.24,999. క్లౌడ్ గ్రీన్, మిడ్నైట్ బ్లూ, బ్లూమ్ రెడ్ రంగుల్లో లభ్యమవుతుంది.ఒప్పో ఎఫ్31 ప్రో, ఎఫ్31 ప్రో ప్లస్ స్టార్ట్ఫోన్లు సెప్టెంబర్ 19 నుంచి ఒప్పో ఈ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈకామర్స్ ప్లాట్ఫామ్లు, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయి. మరోవైపు ఒప్పో ఎఫ్ 31 5జీ మాత్రం సెప్టెంబర్ 27 నుంచి అందుబాటులోకి రానుంది.ఆఫర్లుఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, కొటక్ మహీంద్రా బ్యాంకుల ఎంపిక చేసిన కార్డులను ఉపయోగించుకుంటే 10 శాతం వరకు క్యాష్బ్యాక్ లభిస్తుంది. 10 శాతం వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ వినియోగించుకోవచ్చు. ప్రమాదవశాత్తు డ్యామేజీ అయితే 180 రోజుల ఉచిత కేర్ ఉంటుంది. ఇవి కాక ఆరు నెలల వరకు వడ్డీ లేని ఈఎంఐ ప్లాన్ లు, మొదటి రోజు ప్రీ-బుక్ లేదా కొనుగోలు చేసే కస్టమర్లు ఎంపిక చేసిన కార్డులు లేదా ఎక్స్ఛేంజ్ బోనస్ లపై బ్యాంక్ డిస్కౌంట్ వంటివి ఉంటాయి.స్పెసిఫికేషన్లుమూడు మోడళలోనూ కొన్ని ఒకే రకమైన స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ప్రో ప్లస్ 6.8-అంగుళాల డిస్ప్లే, మిగిలిన రెండు 6.5-అంగుళాల స్క్రీన్లను కలిగి ఉన్నాయి. అన్నింటికీ 120 హెడ్జ్ రీఫ్రెష్ రేటు ఉంటుంది. ప్రతి ఫోన్లోనూ 80వాట్ల సూపర్వోక్ ఫాస్ట్ ఛార్జింగ్ తో 7,000ఎంఏహెచ్ బ్యాటరీ, రివర్స్ అండ్ బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అన్ని ఫోన్లూ క్వాల్కామ్ స్నాప్గ్రాడన్ 7 జెన్ 3 చిప్సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్ ఓఎస్ 15పై పనిచేస్తాయి. ఇక కీలకమైన కెమెరా విషయానికి వస్తే ఒప్పో ఎఫ్31 ప్రో ప్లస్ 5జీ, ఒప్పో ఎఫ్31 ప్రో 5జీ ఫోన్లకు ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఇవ్వగా ఒప్పో ఎఫ్31 5జీ ఫోన్లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. రియర్ కెమెరా మాత్రం అన్ని ఫోన్లకూ ఒకేలా 50ఎంపీ + 2ఎంపీ ఇచ్చారు.ఇదీ చదవండి: ఒప్పో కొత్త సిరీస్ స్మార్ట్ఫోన్లు విడుదల.. భారీ బ్యాటరీతో ప్రత్యేక ఫీచర్లు -
‘టీసీఎస్లో బలవంతంగా రాజీనామా చేయమన్నారు’
దేశీయ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ చుట్టూ రోజుకో వివాదం రేగుతోంది. భారీగా లేఆఫ్ల ప్రకటనతోపాటు ఆ సంస్థలో బలవంతంగా రాజీనామాలు, ఉద్యోగ విరమణలు చేయిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా మరో ఉద్యోగి తనను రాజీనామా చేయాలని బలవంతం చేశారని ఆరోపిస్తున్నారు.ఈ మేరకు ప్రొఫెషనల్ సామాజిక ప్లాట్ఫామ్ రెడిట్లో షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్గా మారింది. 3,000 కు పైగా అప్ ఓట్లు, వందలాది కామెంట్లు వచ్చాయి. ఇది దేశంలోని అతిపెద్ద ఐటీ సంస్థలలో ఒకటైన టీసీఎస్లో విషపూరిత పద్ధతులపై విస్తృత ఆగ్రహాన్ని రేకెత్తించింది.తనను టీసీఎస్లో జూనియర్ టెక్ ఉద్యోగిగా చెప్పుకొన్న రెడిటర్ అదే తన మొదటి ఉద్యోగంగా పేర్కొన్నారు. మూడు రోజుల ముందు మీటింగ్ హాల్కు పిలిచి అక్కడ తనను స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని హెచ్ఆర్ ఒత్తిడి చేసినట్లు ఆరోపించారు. అయితే తాను రాజీనామా చేయడానికి నిరాకరించానని, అందుకు తనను టర్మినేట్ చేసి వ్యతిరేక రివ్వూలు ఇస్తానని బెదిరించారని, అయినప్పటికీ తాను రాజీనామా చేయను.. మీకు నచ్చినట్లు చేసుకోండని చెప్పానని రాసుకొచ్చారు.అంతేకాక సంస్థలో పని వాతావరణం గురించి కూడా పలు ఆరోపణలు చేశారు. జీతం చాలా తక్కువే అయినా దాని వర్క్ కల్చర్, ఉద్యోగ భద్రత కారణంగా తాను టీసీఎస్ లో చేరానని, కానీ దానికి ఇప్పుడు చింతిస్తున్నానని వాపోయారు. ‘రతన్ టాటా తరువాత, ఈ కంపెనీ గందరగోళానికి గురైంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: ట్రైనింగ్ ఇచ్చినోళ్లనే తీసేశారు.. 500 మంది తొలగింపు! -
కళ్లజోడుకు గుడ్బై?: సర్జరీ లేకుండా.. రెండేళ్లు!
వయసు పెరిగే కొద్దీ.. దాదాపు అందరికీ ప్రెస్బయోపియా (కంటిచూపు లోపం) వస్తుంది. అప్పుడు చదవడం లేదా ఫోన్ను ఉపయోగించడం వంటి క్లోజప్ విషయాలపై దృష్టి పెట్టడం కొంత కష్టతరమవుతుంది. దీనికోసం రీడింగ్ గ్లాసెస్పై ఆధారపడతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పరిశోధకులు ప్రత్యేక కంటి చుక్కలను తయారు చేశారు. ఇది కొంతకాలం పాటు గ్లాసెస్ను వదిలించుకోవడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.రెండేళ్ల పాటు మెరుగైన దృష్టిరెండు సంవత్సరాల పాటు జరిగిన ఒక అధ్యయనంలో.. కంటి చుక్కలను తయారు చేశారు. వీటిని రోజుకు రెండు లేదా మూడు సార్లు ఉపయోగించడం వల్ల, కళ్లజోడుతో పనిలేకుండానే చిన్న అక్షరాలను చదివే సామర్థ్యం మెరుగుపడిందని తేలింది. అధ్యయనంలో.. చాలా మంది వ్యక్తులు చుక్కలను ఉపయోగించిన తర్వాత ప్రామాణిక కంటి చార్టులో (జేగర్ చార్ట్) రెండు లేదా అంతకంటే ఎక్కువ అదనపు పంక్తులను చదవగలిగారు. ఈ చుక్కలను ఉపయోగించడం వల్ల.. రెండేళ్ల పాటు మెరుగైన దృష్టిని పొందవచ్చని చెబుతున్నారు.ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలు యూరోపియన్ సొసైటీ ఆఫ్ క్యాటరాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్స్ (ESCRS)లో ప్రచురించారు. కంటి చూపు పెరగడానికి ఉపయోగించే.. చుక్కల మందులో పైలోకార్పైన్ (కన్ను దగ్గరగా ఉన్న వస్తువులపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది), డైక్లోఫెనాక్ (కొంతమందికి కలిగే చికాకును నివారించడంలో సహాయపడుతుంది) ఉపయోగించినట్లు వెల్లడించారు.రోజుకు రెండుసార్లుసాధారణంగా ప్రజలు.. రోజుకు రెండుసార్లు చుక్కలను ఉపయోగిస్తారు. అవసరమైతే మూడవ మోతాదును కూడా ఉపయోగించుకోవచ్చు. ప్రెస్బయోపియా (Presbyopia) ప్రభావాన్ని బట్టి.. రోజుకు ఎన్నిసార్లు ఉపయోగించాలనేది నిర్దారించడం జరుగుతుంది. ప్రెస్బయోపియా తీవ్రత తక్కువగా ఉంటే తక్కువసార్లు, ఎక్కువగా ఉన్నప్పుడు మంచి రిజల్ట్స్ కోసం ఎక్కువసార్లు ఉపయోగించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరికకంటి చూపు మందగించడం వల్ల.. కొంతమంది ఆపరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆపరేషన్ వద్దనుకుని, సరళమైన పద్దతిలో సమస్య పరిష్కరించుకోవడానికి ఈ చుక్కల మందు ఉపయోగపడుతుంది. అయితే ప్రెస్బయోపియా ప్రభావం తగ్గించడానికి ఉపయోగించే చుక్కల మందు వల్ల.. స్వల్ప చికాకు లేదా తేలికపాటి తలనొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమస్యలను నిర్మూలించడానికి మరింత అధ్యయనం అవసరమని నిపుణులు చెబుతున్నారు. -
జియో చౌక ప్లాన్.. ఎక్కువ వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాలింగ్
కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలతో చౌకైన రీఛార్జ్ ప్లాన్లను అందించాలని కొన్ని రోజుల క్రితం ట్రాయ్ అన్ని టెలికాం కంపెనీలను ఆదేశించింది. దీని తర్వాత జియో కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్ తో రెండు చౌకైన రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. జియో తన వెబ్సైట్లో రెండు కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్లను జాబితా చేసింది.ఇందులో వినియోగదారులు 365 రోజుల వరకు సుదీర్ఘ వ్యాలిడిటీని పొందుతారు. డేటాను ఉపయోగించని యూజర్లకు ఈ ప్లాన్ ప్రయోజనం చేకూరుస్తుంది. మరొకటి 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్. ఈ ప్లాన్లు రెండూ ముఖ్యంగా కాలింగ్, ఎస్ఎంఎస్ మాత్రమే ఉపయోగించే, డేటా అవసరం లేని వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటాయి.84 రోజుల ప్లాన్జియో కొత్త రూ.448 ప్లాన్ 84 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ లో యూజర్లకు అపరిమిత కాలింగ్, 1000 ఉచిత ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. ఇది కాకుండా, వినియోగదారులకు జియో సినిమా, జియో టీవీ వంటి యాప్స్ కు కూడా ఉచిత యాక్సెస్ లభిస్తుంది.365 రోజుల ప్లాన్జియో కొత్త రూ.1958 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ లో, వినియోగదారులు భారతదేశం అంతటా ఏ నెట్ వర్క్ లోనైనా అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. దీనితో పాటు 3600 ఉచిత ఎస్ఎంఎస్లు, ఉచిత నేషనల్ రోమింగ్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ ప్లాన్ జియో సినిమా, జియో టీవీ వంటి యాప్లకు ఉచిత యాక్సెస్ను అందిస్తుంది. -
ట్రైనింగ్ ఇచ్చినోళ్లనే తీసేశారు.. 500 మంది తొలగింపు!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఎప్పుడు ఎవరి ఉద్యోగాలు ఊడిపోతాయో చెప్పలేం. అయితే ఆ ఏఐ సాధనానికి శిక్షణ ఇచ్చేవాళ్ల ఉద్యోగాలే పోవడం బాధాకరం. బిజినెస్ ఇన్ సైడర్ నివేదిక ప్రకారం.. ఎలాన్ మస్క్కు చెందిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఎక్స్ఏఐ (xAI).. తన డేటా అనోటేషన్ బృందం నుండి సుమారు 500 మంది ఉద్యోగులను తొలగించింది. వీరంతా సంస్థ జనరేటివ్ ఏఐ చాట్ బాట్ ‘గ్రోక్’కు శిక్షణ ఇచ్చే సిబ్బంది కావడం గమనార్హం.ఇదీ కారణం నివేదిక ప్రకారం.. ఉద్యోగుల తొలగింపులకు కారణం సంస్థ దృష్టి మారడం. ఎక్స్ఏఐ సాధారణ ఏఐ ట్యూటర్లను అభివృద్ధి చేయడంపై దృష్టిని తగ్గించి స్పెషలిస్ట్ ఏఐ ట్యూటర్లపై వనరులను కేంద్రీకరిస్తుందంటూ సిబ్బందికి పంపిన ఈమెయిల్ లో కంపెనీ తెలిపింది. "మా హ్యూమన్ డేటా ప్రయత్నాలను క్షుణ్ణంగా సమీక్షించిన తరువాత, మా స్పెషలిస్ట్ ఏఐ ట్యూటర్ల విస్తరణ, ప్రాధాన్యతను వేగవంతం చేయాలని నిర్ణయించుకున్నాం. అదే సమయంలో సాధారణ ఏఐ ట్యూటర్ ఉద్యోలపై మా దృష్టిని తగ్గించాం. "ఫోకస్ లో ఈ మార్పులో భాగంగా, మాకు ఇకపై చాలా సాధారణ ఏఐ ట్యూటర్ ఉద్యోగులు అవసరం లేదు.. ఎక్స్ఏఐతో మీ ఉద్యోగం ముగుస్తుంది" అని పేర్కొంది.ఉద్యోగులకు సిస్టమ్ యాక్సెస్ రద్దు చేస్తామని చెప్పిన కంపెనీ వారి ఒప్పందాలు ముగిసే వరకు లేదా నవంబర్ 30 వరకు జీతాలు చెల్లింపు కొనసాగుతుందని వివరించింది. వీడియో గేమ్స్, వెబ్ డిజైన్, డేటా సైన్స్, మెడిసిన్, స్టెమ్ వంటి రంగాలలో స్పెషలిస్ట్ ఏఐ ట్యూటర్లపై పెట్టుబడులను పెంచుతున్నట్లు కంపెనీ స్పష్టం చేసినట్లు తెలిసింది. అందుకుఅనుగుణంగా భారీ సంఖ్యలో ఉద్యోగులను పెంచుకోనున్నట్లు ఇటీవలే ఎక్స్ఏఐ ప్రకటించింది.ఇదీ చదవండి: కొత్త ఉద్యోగాలకు ఓకే కానీ.. టెకీల ఆలోచనలు -
కొత్త ఉద్యోగాలకు ఓకే కానీ.. టెకీల ఆలోచనలు
చాలా మటుకు టెక్నాలజీ నిపుణులు కొత్త అవకాశాలపై ఆసక్తిగా ఉన్నప్పటికీ .. ఉద్యోగాల ఎంపిక విషయంలో మాత్రం ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. తమ లక్ష్యాలు, కెరియర్ పురోగతి, శారీరక .. మానసిక ఆరోగ్ లాంటి అంశాలకు సదరు ఉద్యోగం ఎంత వరకు దోహదపడుతుందనేది బేరీజు వేసుకుంటున్నారు. దేశీ టెకీలపై గ్లోబల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ మైఖేల్ పేజ్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.దీని ప్రకారం అంతర్జాతీయంగా అత్యంత ఆత్మవిశ్వాసంతో, ఉద్యోగాల ఎంపికలో లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్న టెక్ నిపుణుల్లో భారతీయ ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన సర్వేలో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా సుమారు 5,000 మంది ప్రొఫెషనల్స్ పాల్గొన్నారు. భారతీయ ప్రొఫెషనల్స్లో 94 శాతం మంది కొత్త అవకాశాలపై ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. మరిన్ని విశేషాలు.. → అంతర్జాతీయంగా అవకాశాలను పరిశీలించాలనే ఆలోచనే తాము ఉద్యోగాలు మారడానికి ప్రేరణగా ఉంటుందని 39 శాతం మంది టెకీలు తెలిపారు. మెరుగైన జీతం, వృద్ధి అవకాశాలు కారణమని 31 శాతం మంది చెప్పారు. → వెసులుబాటు విషయంలో టెక్ నిపుణులు ఏమాత్రం రాజీపడటం లేదు. 26 శాతం మంది సరళతరమైన పని విధానాలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఒకవేళ మాటిమాటికీ ఆఫీసుకు రమ్మంటే ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టేసే అంశాన్ని కూడా పరిశీలిస్తామని 45 శాతం మంది తెలిపారు. → 23 శాతం మంది తమ ప్రస్తుత వేతనాలపై అసంతృప్తిగా ఉన్నారు. 20 శాతం మంది చురుగ్గా శిక్షణ పొందుతున్నారు. అర్థవంతమైన పని, కెరియర్లో వృద్ధి అవకాశాలకు ప్రాధాన్యతనివ్వడానికి మొగ్గు చూపుతున్నారు. → టెక్ నిపుణులు, ఉద్యోగాలను ఎంచుకోవడంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలో కంపెనీలు కూడా కేవలం మెరుగైన వేతనాన్ని ఇవ్వజూపడానికే పరిమితం కాకుండా వెసులుబాటు, వృద్ధి అవకాశా ల్లాంటివి కూడా ఆఫర్ చేయాల్సి వస్తోంది. → హైబ్రిడ్ పని, ఏఐ సన్నద్ధతపై పెట్టుబడులు, నమ్మకం..పారదర్శకతకు పెద్దపీట వేసే సంస్కృతిని పెంపొందించే కంపెనీలు టాప్ ప్రతిభావంతులను ఆకర్షించడంతో పాటు పోటీ మార్కెట్లోను గట్టిగా నిలబడటానికి వీలుంటుంది. -
గేమ్లోని సీక్రెట్ ఫ్రెండ్స్.. చప్పుడుదే విజయం!
గేమ్లో గెలవాలంటే కేవలం టాలెంట్ సరిపోదు, తోడుగా సీక్రెట్ ఫ్రెండ్స్ కూడా ఉండాలి. అలా గెలుపు వెనుక ఉన్న సీక్రెట్ ఫ్రెండ్స్ వీళ్లే!స్పీడ్ డబుల్!గేమ్ ఆడుతున్నప్పుడు చివరి రౌండ్లో చేతి చెమటతో స్క్రీన్ జారిపోయి, అవుట్ అయితే వచ్చే బాధ, ఒక్క గేమింగ్ లవర్స్కి మాత్రమే తెలుసు. అలాంటి వారికి చాలా అవసరం ఈ రేజర్ గేమింగ్ వేలు కవచం. ఇది ప్రత్యేకంగా నేసిన వెండి తంతులతో తయారైంది. అందువలన టచ్ చాలా స్పష్టంగా, వేగంగా ఉంటుంది. చెమట పట్టినా వేళ్లు ఎప్పుడూ పొడిగా, చల్లగా ఉంటాయి. దీని మందం కేవలం 0.8 మిల్లీమీటర్ మాత్రమే. బరువు తేలికగా ఉన్నా, శక్తి మాత్రం యుద్ధంలో గెలిపించేంత బలంగా ఉంటుంది. ఇది చిన్న వేలు అయినా, పెద్ద వేలు అయినా సులభంగా సరిపోతుంది. కడిగి మళ్లీ మళ్లీ ఉపయోగించుకోవచ్చు. పబ్జీ, ఫ్రీ ఫైర్, బీజీఎంఐ వంటి అన్ని హైస్పీడ్ మొబైల్ గేమ్స్కు ఇది అద్భుతంగా సరిపోతుంది. ధర కేవలం రూ.1200 మాత్రమే!కూల్ బేబీ కూల్!గేమ్ ఆడితే మనసు రిలాక్స్ అవుతుంది కాని, ఎక్కువసేపు ఆడితే మాత్రం కంప్యూటర్ వేడెక్కుతుంది. ఇక దాని ఫ్యాన్ శబ్దం చెవులను మోగిస్తుంది. ఆ టెన్షన్ దూరం చేయడానికి ఈ ఆర్జీబీ ఎల్ఈడీ కేస్ ఫ్యాన్ సిద్ధంగా ఉంది. 120 మిల్లీమీటర్ల సైజుతో, నిమిషానికి 1500 సార్లు తిరుగుతుంది. ప్రత్యేకంగా రూపొందించిన దీని బ్లేడ్లు గాలి ఒత్తిడిని సమంగా పంచి పీసీని చల్లగా, సైలెంట్గా ఉంచుతాయి. ఇక ఫ్యాన్లోని ఎల్ఈడీలు కంప్యూటర్ లుక్నే మార్చేస్తాయి. రంగులు మెరిసిపోతూ గేమింగ్ మూడ్ను మరింత పెంచుతాయి. కనెక్టర్తో సులభంగా అమర్చుకోవచ్చు. బలమైన నైలాన్, నాణ్యమైన ప్లాస్టిక్తో తయారవడంతో దీర్ఘకాలం మన్నుతుంది. ధర రూ.699.చప్పుడుదే విజయం!గేమ్లో గెలవాలంటే కేవలం చూపు, చేతులు మాత్రమే కాదు, వినికిడి కూడా కీలకం. అడుగులు, గన్ ఫైర్, తుపాకీ రీలోడ్, శత్రువు దగ్గరగా వస్తున్న శబ్దం లాంటివన్నీ స్పష్టంగా వినిపించాలంటే అవసరమైంది ఈ సరౌండింగ్ గేమింగ్ హెడ్సెట్. మృదువైన ఇయర్ ప్యాడ్స్ వలన గంటల తరబడి వేసుకున్నా చెవులకు ఎలాంటి బరువూ అనిపించదు. 120 డిగ్రీల వరకు తిప్పుకునే నాయిస్ క్యాన్సిలింగ్ మైక్ వాయిస్ని స్పష్టంగా అందిస్తుంది, బయటి శబ్దాన్ని తగ్గిస్తుంది. టీమ్తో ఆడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఇబ్బంది లేకుండా గేమ్లో మరింత ఫోకస్ పెంచుతుంది. దీనిని పీసీ, ఎక్స్బాక్స్ వన్, ప్లేస్టేషన్, మొబైల్ ఇలా అన్నింటికీ సులభంగా కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. ధర కేవలం రూ.1,990. -
ఏఐకి మహిళా టెకీల జై..
ముంబై: మెరుగైన అవకాశాలను దక్కించుకునేందుకు కృత్రిమ మేథ (ఏఐ) ఉపయోగపడుతుందని టెక్నాలజీ రంగంలో అత్యధిక శాతం మహిళలు విశ్వసిస్తున్నారు. జాబ్స్, కెరియర్ ప్లాట్ఫాం అప్నా డాట్కో నిర్వహించిన సర్వేలో 78 శాతం మంది ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. దీని ప్రకారం మహిళా టెకీలు ఏఐ ఆధారిత కెరియర్ల కోసం సన్నద్ధమవుతున్నారు. 58 శాతం మంది ఇప్పటికే ఉద్యోగాల్లో భాగంగానో లేదా ఏదైనా ప్రోగ్రాంలలో చేరడం ద్వారానో లేక స్వయంగానో ఏఐ/ఎంఎల్ నైపుణ్యాల్లో శిక్షణ పొందుతున్నారు. 24 శాతం మంది త్వరలోనే శిక్షణ పొందే యోచనలో ఉన్నారు. టెక్నాలజీ రంగంలో పని చేస్తున్న 11,300 మంది మహిళలు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఇందులో అత్యధిక భాగం మహిళలు జెన్ జెడ్ విభాగానికి (పాతికేళ్ల లోపు వారు) చెందినవారే. వీరిలో 60 శాతం మంది ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు చెందిన వారు కాగా, మూడింట రెండొంతుల మంది సాధారణ కాలేజీల్లో చదివినవారే. ఏఐ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి డిమాండ్.. సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు సగం మంది ఏఐ సాఫ్ట్వేర్ డెవలపర్లు కావాలనుకుంటున్నారు. అలాగే 19 శాతం మంది డేటా సైన్స్.. మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), 14 శాతం మంది ప్రోడక్ట్ మేనేజ్మెంట్, 10 శాతం మంది రీసెర్చ్ ఉద్యోగాలపై దృష్టి పెడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ఏఐని ఏదో ఆషామాషీ ట్రెండ్గా కాకుండా సమాన అవకాశాలను కల్పించే దోహదకారిగా మహిళా టెకీలు భావిస్తున్నట్లు తెలుస్తోందని అప్నాడాట్కో వ్యవస్థాపకుడు నిర్మిత్ పారిఖ్ తెలిపారు. మరోవైపు, ఇప్పుడు పేరొందిన కాలేజీ నుంచి పట్టా పొందడం కన్నా ఏఐలో నైపుణ్యాలే చాలా ముఖ్యమని మూడింట రెండొంతుల టెకీలు భావిస్తున్నారు. జెన్ జెడ్ అమ్మాయిల్లో (22–25 ఏళ్ల వయస్సున్న వారిలో 62 శాతం మంది), ద్వితీయ–తృతీయ శ్రేణి పట్టణాల్లోని మహిళల్లో (74 శాతం మంది) ఈ భావన అత్యధికంగా ఉంది.మెట్రోల్లో ఇది 66 శాతం మందిలో ఉంది. ఏఐని అందిపుచ్చుకోవడంలో ఎదురవుతున్న సవాళ్ల విషయానికొస్తే.. నాణ్యమైన అవకాశాలు అందుబాటులో ఉండటం లేదని 42 శాతం మంది, బలమైన మెంటార్షిప్ లేదని 27 శాతం, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఆప్షన్లు అవసరమని 19 శాతం మంది తెలిపారు. -
కంపెనీల్లో జెన్ఏఐ నిపుణుల కొరత..
న్యూఢిల్లీ: దేశీయంగా కృత్రిమ మేథ (ఏఐ) మార్కెట్ చాలా వేగంగా వృద్ధి చెందుతోంది. 2025లో 28.8 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు నెలకొన్నాయి. కానీ నిపుణల కొరతే పరిశ్రమకు ప్రధాన సమస్యగా మారింది. పది జెన్ఏఐ ఉద్యోగాలుంటే నైపుణ్యాలున్న అభ్యర్ధులు ఒక్కరే ఉంటున్నారు. టీమ్లీజ్ డిజిటల్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం నిర్దిష్ట ప్రాంప్ట్ ఇంజినీరింగ్, ఎల్ఎల్ఎం సేఫ్టీ..ట్యూనింగ్, ఏఐ ఆర్కె్రస్టేషన్, ఏజెంట్ డిజైన్, సిమ్యులేషన్ గవర్నెన్స్, ఏఐ కాంప్లయెన్స్, రిస్క్ ఆపరేషన్స్లాంటి ఏఐ నైపుణ్యాలకు అత్యధిక డిమాండ్ ఉంటోంది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు.. జనరేటివ్ ఏఐ ఇంజినీరింగ్, మెషిన్లెరి్నంగ్ ఆపరేషన్స్లాంటి విభాగాల్లో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతున్నాయి. సీనియర్లకు ఏటా రూ. 58–60 లక్షల వరకు ప్యాకేజీలు ఉంటున్నాయి. నివేదికలోని మరిన్ని విశేషాలు.. → డిజిటల్ ఎకానమీలో ఏఐ, క్లౌడ్ ఉద్యోగాలకు డిమాండ్ భారీగా ఉంది. దానికి తగ్గట్లుగా నైపుణ్యాలున్న అభ్యర్ధులు లభించక, తీవ్ర కొరత నెలకొంది. దీంతో తగిన అర్హతలున్న వారికి కంపెనీలు భారీ వేతనాలిస్తున్నాయి. → జీసీసీల్లో సైబర్సెక్యూరిటీ, డేటా ఇంజినీరింగ్ ఉద్యోగుల వేతనాలు 2025–2027 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో వార్షికంగా వరుసగా రూ. 28 లక్షల నుంచి రూ. 33.5 లక్షలకు, రూ. 23 లక్షల నుంచి రూ. 27 లక్షలకు పెరగనున్నాయి. → నాన్–టెక్ రంగాల్లోని టెక్ ఉద్యోగాలకు సంబంధించి ఐటీ సపోర్ట్, సంప్రదాయ తరహా సిస్టమ్స్ మెయింటెనెన్స్ విభాగాల్లో వేతనాలు వార్షికంగా రూ. 12 లక్షల స్థాయిలోనే స్థిరపడిపోయి ఉన్నాయి. పరిశ్రమ క్లౌడ్ నేటివ్, ఔట్సోర్స్డ్ సరీ్వస్ మోడల్స్ వైపు మళ్లుతుండటాన్ని ఇది సూచిస్తోంది. → ఏఐ మార్కెట్ ప్రస్తుతం హైపర్–గ్రోత్ దశలోకి అడుగుపెడుతోంది. ఏటా 45 శాతం వృద్ధితో 2025లో 28.8 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే, ప్రతిభావంతుల కొరత తీవ్రంగా ఉంటోంది. ప్రతి పది జెన్ఏఐ ఉద్యోగాలకు అన్ని అర్హతలు కలిగిన ఇంజినీరు ఒకే ఒక్కరు ఉంటున్నారు. → 2026 నాటికి ఏఐ టాలెంట్ అంతరాలు 53 శాతానికి పెరగనుంది. అలాగే క్లౌడ్ కంప్యూటింగ్లో డిమాండ్–సరఫరా మధ్య అంతరం 55–60 శాతానికి పెరగనుంది. → ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో పెద్ద స్థాయిలో శిక్షణను కల్పించకుంటే, కంపెనీల వృద్ధి ఆకాంక్షలు నెరవేరని పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. → ఏఐ వినియోగమనేది జాబ్ మార్కెట్ల రూపురేఖలను గణనీయంగా మార్చేయనుంది. గ్లోబల్ విధులు నిర్వహించే 40 శాతం వరకు ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఐటీ సరీ్వసులు, కస్టమర్ ఎక్స్పీరియన్స్, బీఎఫ్ఎస్ఐ, హెల్త్కేర్లాంటి రంగాల్లో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే కంపెనీలు ఏఐ–ఫస్ట్ లెర్నింగ్ మోడల్స్, డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. → భారత డిజిటల్ ఎకానమీలో ఉద్యోగాలు, నైపుణ్యాల్లో మార్పులకు ఇంజిన్లుగా వ్యవహరిస్తున్న జీసీసీలు, ఉద్యోగాల కల్పనకు సారథ్యం వహిస్తున్నాయి. 2025లో 22–25 శాతం మేర ఉద్యోగాలు కల్పించనున్నాయి. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ విభాగాల్లో అత్యధికంగా కొలువులు ఉండనున్నాయి. → 2027లో అందుబాటులోకి రాబోయే 47 లక్షల కొత్త టెక్ ఉద్యోగాల్లో గణనీయ సంఖ్యలో కొలువులను (12 లక్షలు) జీసీసీలే కల్పించనున్నాయి. ప్రధానంగా జెన్ఏఐ, ఇంజినీరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాల్లో ఈ ఉద్యోగాలు ఉంటాయి. → జీసీసీలు మెట్రో పరిధిని దాటి విస్తరిస్తున్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో 1,30,000–1,40,000 మంది తాజా గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేసుకోనున్నాయి. వీరిలో ఎక్కువ శాతం హైరింగ్ ద్వితీయ, తృతీయ శ్రేణి ఇంజినీరింగ్ క్యాంపస్లలో ఉండొచ్చు. వైవిధ్యానికి కూడా ప్రాధాన్యం పెరుగుతోంది. ఇప్పుడు టాప్ 20 జీసీసీల్లో 40 శాతం మంది సిబ్బంది మహిళలే ఉంటున్నారు. పరిశ్రమ సగటు కన్నా ఇది 1.5 రెట్లు అధికం. → 2027 నాటికి భారత్లో 2,100 పైగా జీసీసీలు ఉంటాయి. వీటిలో 30 లక్షల మంది పైగా ఉంటారు. -
చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయే రోజుల్లో ప్రమాదంగా మారుతుందని ఇప్పటికే చాలామంది నిపుణులు పేర్కొన్నారు. రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ఆధునిక చరిత్రలో అతిపెద్ద మార్పు.. అని రాబర్ట్ కియోసాకి ఒక ట్వీట్ చేశారు. ఇందులో ఏఐ వల్ల చాలా మంది తెలివైన విద్యార్థులు ఉద్యోగాలు కోల్పోతారు. నిరుద్యోగం పెరుగుతుంది. చాలా మందికి ఇప్పటికీ ఎడ్యుకేషన్ లోన్స్ అలాగే ఉన్నాయి. నాకు ఉద్యోగం లేదు, కాబట్టి.. ఏఐ నన్ను ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం లేదని అన్నారు.''కొన్నేళ్ల క్రితం.. పేద తండ్రి పాఠశాలకు వెళ్లు, మంచి గ్రేడ్లు పొందు, ఉద్యోగం సంపాదించు, పన్నులు కట్టు, అప్పుల నుంచి బయటపడు, డబ్బు ఆదా చేయు, మరియు స్టాక్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్ల వంటి విభిన్నమైన పోర్ట్ఫోలియోలో పెట్టుబడి పెట్టు అని చెప్పే మాటలకు బదులుగా.. ధనవంతుడైన తండ్రి సలహాను అనుసరించాను. నేను ఒక వ్యవస్థాపకుడిని అయ్యాను, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాను, అప్పును ఉపయోగించాను. డబ్బును ఆదా చేయడానికి బదులుగా, నేను నిజమైన బంగారం, వెండి, నేడు బిట్కాయిన్లను ఆదా చేస్తున్నాను'' అని రాబర్ట్ కియోసాకి చెబుతూనే.. పెట్టుబడి విషయంలో జాగ్రత్త వహించండి అని హెచ్చరించారు.ఇదీ చదవండి: ఉపరాష్ట్రపతి జీతం సున్నా.. అయితే ఆదాయం ఎలా? -
మొదలైన ఐఫోన్ 17 బుకింగ్స్: ఎక్కడ, ఎలా ఆర్డర్ చేయాలంటే..
ఈ వారం ప్రారంభంలో యాపిల్ తన ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ చేసింది. కంపెనీ ఈ లేటెస్ట్ ఫోన్స్ కోసం ప్రీ-బుకింగ్లను భారతదేశంలో శుక్రవారం (సెప్టెంబర్ 12) సాయంత్రం 5:30 గంటల నుంచి ప్రారంభించింది. ఆపిల్ ఆన్లైన్ స్టోర్ లేదా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఇతర ప్లాట్ఫామ్ల ద్వారా కూడా దీనిని బుక్ చేసుకోవచ్చు. అమ్మకాలు సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమవుతాయి. ఆ రోజు మీరు ఐఫోన్ డెలివరీ పొందవచ్చు లేదా మీ నగరంలోని ఆపిల్ స్టోర్ నుంచి కూడా తీసుకోవచ్చు.ఐఫోన్ 17 ప్రీ-బుకింగ్స్.. ఎలా ఆర్డర్ చేయాలంటే..●యాపిల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి.●హోమ్ పేజీలోని మీ ఐఫోన్ 17 మోడల్ను ఎంచుకోండి.●మీరు బుక్ చేయాలనుకుంటున్న వేరియంట్, కలర్, స్టోరేజ్ వంటి వాటిని సెలక్ట్ చేసుకొండి.●బుకింగ్స్ పూర్తి చేయడానికి కార్ట్కు జోడించి, చెక్అవుట్ మీద క్లిక్ చేయండి.●ఆ తరువాత కార్డ్, యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. లేదా ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు.●ఇవన్నీ పూర్తయిన తరువాత బుకింగ్ పూర్తవుతుంది. ఆ తరువాత కంపెనీ డెలివరీ టైమ్లైన్ను షేర్ చేస్తుంది.ఐఫోన్ 17 ధరలుఐఫోన్ 17➤ఐఫోన్ 17 - 256జీబీ: రూ. 82,900➤ఐఫోన్ 17 - 512జీబీ: రూ.1,02,900ఐఫోన్ 17 ప్రో & 17 ప్రో మాక్స్➤ఐఫోన్ 17 ప్రో 256జీబీ: రూ.1,34,900➤ఐఫోన్ 17 ప్రో 512జీబీ: రూ.1,54,900➤ఐఫోన్ 17 ప్రో 1టీబీ: రూ.1,74,900➤ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ 256జీబీ: రూ.1,49,900➤ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ 512జీబీ: రూ.1,69,900➤ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ 1టీబీ: రూ.1,89,900➤ఐఫోన్ 17 ప్రో మాక్స్ 2టీబీ: రూ. 2,29,900ఐఫోన్ 17 ఎయిర్ ➤ఐఫోన్ 17 ఎయిర్ 256జీబీ: రూ.1,19,900➤ఐఫోన్ 17 ఎయిర్ 512జీబీ: రూ.1,39,900➤ఐఫోన్ 17 ఎయిర్ 1టీబీ: రూ.1,59,900ఇదీ చదవండి: ఐఫోన్ 17 ఎయిర్: స్పందించిన ఓపెన్ఏఐ సీఈఓ -
రూ.40 వేలకే ఐఫోన్.. త్వరలో సేల్ ప్రారంభం
ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్ లభించనుంది. సెప్టెంబర్ 23 నుండి ప్రారంభమయ్యే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ లో యాపిల్ ఐఫోన్ 14 కేవలం రూ .40,000 ధరకు లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ లో విక్రయించే అన్ని ఐఫోన్ల ధరలను వెల్లడించింది. చాలా ఫోన్ల ధరలు భారీగా తగ్గాయి.2022 సెప్టెంబర్లో లాంచ్ అయిన ఐఫోన్ 14 ఇప్పుడు కేవలం రూ .40,000కు అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్పై ఇప్పటివరకు ఇదే అత్యంత తక్కువ ధర. ఐఫోన్ 14 ధర ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో రూ .52,990గా ఉంది. కానీ యాపిల్ స్టోర్ లో ఈ ఫోన్ అందుబాటులో లేదు. ఎంపిక చేసిన యాక్సిస్ క్రెడిట్ కార్డుల ద్వారా పొందగలిగే రూ .2,000 తగ్గింపుతో సహా వినియోగదారులు రూ .13,000 వరకు ఆదా చేయవచ్చు.ఫ్లిప్కార్ట్ సేల్లో ఇతర ఐఫోన్ మోడళ్ల ధరలు కూడా తగ్గాయి. ఐఫోన్ 16 ప్రో ప్రస్తుత ధర రూ .1.12 లక్షలతో పోలిస్తే కేవలం రూ .69,999 కు అందుబాటులో ఉంది. తద్వారా రూ .43,000 ఆదా అవుతుంది. అలాగే ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ప్రస్తుత ధర రూ .1,37,900 తో పోలిస్తే రూ .89,900 కు అందుబాటులో ఉంటుంది. దీంతో రూ.48,000 ఆదా అవుతుంది. సెప్టెంబర్ 9న యాపిల్ ఈవెంట్ సందర్భంగా ఆపిల్ ఇప్పటికే కొత్త ఐఫోన్ 17 మోడళ్లను ప్రకటించింది. -
నోకియా హ్యాండ్సెట్ల తయారీదారు కొత్త ఫోన్
నోకియా హ్యాండ్సెట్ల తయారీదారు హెచ్ఎండీ సంస్థ ‘వైబ్ 5జీ’ పేరుతో స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ.8,999 గా ఉంది. కంపెనీ నుంచి రూ.10,000 లోపు ధరలో వస్తున్న తొలి స్మార్ట్ఫోన్ ఇది. ఇందులో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్, 50 మెగాపిక్సల్ రియర్ కెమెరా ఉంది.5000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఈ మొబైల్లో అమర్చారు. దీనికి 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ ఉంది. 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ లభిస్తుంది. ఈ స్మార్ట్ఫోన్కు ఏడాది రిప్లేస్మెంట్ గ్యారెంటీ సదుపాయం ఉంది. అలాగే హెచ్ఎండీ 101 4జీ, 102 4జీ పేరిట రెండు 4జీ ఫీచర్ ఫోన్లను లాంచ్ చేశారు. వీటి ధరలు వరుసగా రూ.1,899, రూ.2,199గా ఉన్నాయి.ఇదీ చదవండి: ఈక్విటీ ఫండ్స్లో తగ్గిన పెట్టుబడుల జోరు! -
స్టార్టప్లకు ‘గేమింగ్’ నిషేధం సెగ..
ముంబై: దేశీయంగా రియల్ మనీ గేమ్స్ (ఆర్ఎంజీ)పై నిషేధం విధించడంతో పలు అంకురాల వాల్యుయేషన్పై ప్రభావం చూపింది. నాలుగు బడా సంస్థలు .. యూనికార్న్ (1 బిలియన్ డాలర్ల విలువ చేసే అంకురాలు) జాబితా నుంచి చోటు కోల్పోయాయి. డ్రీమ్11 (26 కోట్ల యూజర్లు) , గేమ్స్ 24 x 7 (12 కోట్ల యూజర్లు), గేమ్స్క్రాఫ్ట్ (3 కోట్ల యూజర్లు), మొబైల్ ప్రీమియర్ లీగ్ (9 కోట్ల యూజర్లు) వీటిలో ఉన్నాయి. ఇక యూనికార్న్లు కాకపోయినప్పటికీ ‘జూపీ’, ‘విన్జో గేమ్స్’లాంటి సంస్థల వాల్యుయేషన్లు కూడా పడిపోయాయి. ‘2025 ఆస్క్ ప్రైవేట్ వెల్త్ హురున్ ఇండియా యూనికార్న్, ఫ్యూచర్ యూనికార్న్’ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఆన్లైన్ మనీ గేమ్స్ను నిషేధించే బిల్లును పార్లమెంటు గత నెల ఆమోదించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఆన్లైన్ మనీ గేమ్స్ సంబంధిత ప్రకటనలపై కూడా నిషేధం వర్తిస్తుంది. అలాంటి గేమ్స్ ఆడేందుకు నగదును బదిలీ చేసే సరీ్వసులను సైతం బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అందించకూడదు. ‘‘ఇలాంటి మార్పులన్నింటి వల్ల భారత్లో పేరొందిన పలు ఆర్ఎంజీ కంపెనీలపై ప్రభావం పడింది. దీనితో వాటి వృద్ధి నెమ్మదించే అవకాశం ఉంది’’ అని నివేదిక పేర్కొంది. అలాగే ఈ చట్టం వల్ల పరిశ్రమపై ఇన్వెస్టర్ల నమ్మకం కూడా సడలిందని వివరించింది. మరోవైపు, అంకురాలు క్రమంగా లాభదాయకత, పెట్టుబడులను సమర్ధంగా వినియోగించుకోవడం, దీర్ఘకాలంలో నిలకడగా ఉండే వ్యాపార విధానాల వైపు మొగ్గు చూపుతున్నాయని ఆస్క్ ప్రైవేట్ వెల్త్ ఎండీ రాజేశ్ సలూజా తెలిపారు. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు.. → 8.2 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్తో అత్యంత విలువైన భారతీయ స్టార్టప్గా డిస్కౌంట్ బ్రోకరేజీ సంస్థ జిరోధా అగ్రస్థానంలో ఉంది. చెరి 7.5 బిలియన్ డాలర్లతో ఫిన్టెక్ సంస్థ రేజర్పే, లెన్స్కార్ట్ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. → అత్యధికంగా 26 అంకురాలతో బెంగళూరు యూనికార్న్ హబ్గా నిల్చింది. వీటి మొత్తం వాల్యుయేషన్ 70 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక 36.3 బిలియన్ డాలర్ల విలువ చేసే 12 స్టార్టప్లతో ఢిల్లీ–ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్) రెండో స్థానంలో, 22.8 బిలియన్ డాలర్ల విలువ చేసే 11 సంస్థలతో ముంబై మూడో స్థానంలో నిల్చాయి. → దేశీయంగా అత్యంత పిన్న వయసు్కలైన యూనికార్న్ వ్యవస్థాపకులుగా జెప్టో ఫౌండర్లు కైవల్య ఓహ్రా, ఆదిత్ పలిచా (ఇద్దరికీ 22 ఏళ్లు) నిల్చారు. → వెంచర్ క్యాపిటల్ సంస్థ పీక్ ఫిఫ్టీన్ పార్ట్నర్స్ భారతీయ స్టార్టప్స్లో అత్యధికంగా ఇన్వెస్ట్ చేసింది. టరి్టల్మింట్, వాట్ఫిక్స్, గ్రో, ప్రిజమ్ (ఓయో) సహా 68 అంకురాల్లో 200 మిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులు పెట్టింది. అత్యంత విలువైన స్టార్టప్లు ఏకంగా 3.74 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. యూనికార్న్లలో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య 2.06 లక్షలుగా ఉంది. 11 కొత్త యూనికార్న్లు .. కొన్ని ఆర్ఎంజీ కంపెనీలు లిస్టు నుంచి నిష్క్రమించినప్పటికీ ఈ ఏడాది యూనికార్న్ల జాబితాలోని స్టార్టప్ల సంఖ్య మొత్తం మీద పెరిగి, 73కి చేరింది. ఈ ఏడాది 11 అంకురాలు యూనికార్న్ హోదా దక్కించుకున్నాయి. ఏఐడాట్టెక్, నవీ టెక్నాలజీస్, వివృతి క్యాపిటల్, వెరిటాస్ ఫైనాన్స్, ర్యాపిడో, నెట్రాడైన్, జంబోటెయిల్, డార్విన్బాక్స్, మనీవ్యూ, జస్పే, డ్రూల్స్ వీటిలో ఉన్నాయి. -
ఐఫోన్ 17 ఎయిర్: స్పందించిన ఓపెన్ఏఐ సీఈఓ
యాపిల్ కంపెనీ ఇటీవల ఐఫోన్ 17 సిరీస్ ఫోన్ను నాలుగు వేరియంట్లలో లాంచ్ చేసింది. ఇందులోని ఎయిర్ వేరియంట్ ఓపెన్ఏఐ సీఈఓ 'సామ్ ఆల్ట్మన్'ను తెగ ఆకట్టుకుంది. దీనిపై స్పందిస్తూ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.''చాలా కాలంగా నేను కోరుకుంటున్న మొదటి కొత్త ఐఫోన్ అప్గ్రేడ్ ఇది! చాలా బాగుంది'' అని యాపిల్ టెక్నాలజీని సామ్ ఆల్ట్మన్ ప్రశంసించారు. కంపెనీ ఇటీవల లాంచ్ చేసిన ఐఫోన్ ఎయిర్ అత్యంత సన్నని హ్యాండ్సెట్. ఇది చాలా తేలికగా ఉండటం వల్ల మీ చేతిలో ఇట్టే ఇమిడిపోతుంది. 5.6 మిల్లీమీటర్ల మందం కలిగిన ఫ్రేమ్, కేవలం 165 గ్రాముల బరువు కలిగిన ఇది ఇప్పటివరకు ఉన్న అత్యంత సన్నని ఐఫోన్.గతంలో చాలామంది ఐఫోన్ ప్రియులు, విశ్లేషకులు.. కొత్త ఆవిష్కరణలు లేదని ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పుడు ఐఫోన్ 17 ఎయిర్ ఎనిమిది సంవత్సరాలలో కంపెనీ ఆవిష్కరించిన అతిపెద్ద మార్పులలో ఒకటిగా నిలిచింది.first new iphone upgrade i have really wanted in awhile! looks very cool.— Sam Altman (@sama) September 9, 2025ఐఫోన్17 ధరలుటెక్ దిగ్గజం యాపిల్ తాజాగా ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్ ఫోన్లను ఆవిష్కరించింది. ఐఫోన్ 17లో 6.3 ఇంచెస్ స్క్రీన్, ఏ19 ప్రో ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ డ్యుయల్ ఫ్యూజన్ కెమెరా, 24 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 256 జీబీ మెమొరీ తదితర ఫీచర్లు ఉన్నాయి. అయిదు రంగుల్లో లభించే అత్యంత పల్చని ఐఫోన్ 17 ఎయిర్ని కూడా యాపిల్ విడుదల చేసింది. ఐఫోన్ 17 ధర 799 డాలర్ల నుంచి, ప్రో ధర 1,099 డాలర్లు, ప్రో మ్యాక్స్ ధర 1,199 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. -
ఇప్పుడంతా ఇదే ట్రెండ్!.. అద్భుతాలు చేస్తున్న బనానా ఏఐ
టెక్నాలజీ రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. ఇందులో భాగంగానే గూగుల్ గత నెలలో జెమిని యాప్కు 'నానో బనానా' సంబంధించిన ఏఐ ఇమేజ్ నేర్ ఎడిటింగ్ టూల్ను విడుదల చేసింది. నానో బనానా లాంచ్ అయిన కొన్ని రోజుల్లోనే జెమిని యాప్ 10 మిలియన్ డౌన్లోడ్లను దాటిందని, ఈ యాప్ అధిక ప్రజాదరణ పొందిందని గూగుల్ వీపీ జోష్ వుడ్వార్డ్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.ప్రస్తుతం నానో బననా ట్రెండ్ సాగుతోంది. 3D బొమ్మలను సృష్టించడానికి ఇది చాలా ఉపయోగకరంగా మారింది. ఇప్పటి వరకు ఈ టూల్ 200 మిలియన్ల కంటే ఎక్కువ ఫోటోలను సృష్టించింది. వేగం, ఖచ్చితత్వంలో ఇది చాట్జీపీటీ, మిడ్జర్నీ వంటి ప్రత్యర్థులంటే ముందు ఉంది. దీంతో ఇది ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. సినీతారలు, రాజకీయ నాయకులు, పెంపుడు జంతువులను సైతం ఈ ట్రెండింగ్ ఏఐను ఉపయోగించి అద్భుతంగా రూపొందించుకుంటున్నారు. ఇవి చూపరులను వావ్ అనేలా చేస్తున్నాయి. ప్రస్తుతం నానో బననా 5 ప్రాంప్ట్లలో అందుబాటులో ఉంది.ప్రాంప్ట్ 1వినియోగదారులు తమ ఫోటోను అప్లోడ్ చేసి, బొమ్మల పెట్టె లోపల తమ బొమ్మను రూపొందించమని జెమినిని అడగవచ్చు. ఇది ప్యాకేజింగ్, గ్రాఫిక్స్, స్టోర్-షెల్ఫ్ లుక్తో పూర్తి చేస్తుంది. ఈ విధానాన్ని చాలామంది ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ప్రాంప్ట్లలో ఇది ఒకటి. మిమ్మల్ని మీరు యాక్షన్ ఫిగర్గా మార్చుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.ప్రాంప్ట్ 2వేరే దశాబ్దంలో ఉన్నట్లు కూడా మిమ్మల్ని మీరు సృష్టించుకోవచ్చు. మీ ఫోటోను 1920ల ఫ్లాపర్, 1970ల డిస్కో డాన్సర్ లేదా 1990ల సిట్కామ్ పాత్రలో చూపించమని అడగవచ్చు. మీరు ఎంచుకున్న దశాబ్దానికి సరిపోయే విధంగా బట్టలు, హెయిర్స్టైల్స్ వంటివాటిని ఏఐ మారుస్తుంది.ప్రాంప్ట్ 3కొంతమంది తమను తాము ప్రసిద్ద టీవీ షోలలో కనిపించేలా డిజైన్ చేసుకోవాలని ఆశపడతారు. బననా ఏఐ ఇప్పుడు దీనిని సాధ్యం చేస్తుంది. మీరు కోరుకున్నట్లు ఏఐ మిమ్మల్ని మారుస్తుంది.ప్రాంప్ట్ 4జెమిని ఏఐ ఇప్పుడు మిమ్మల్ని ప్రముఖుల పక్కన ఉన్నట్లు కూడా చూపించగలదు. ఉదాహరణకు మోనాలిసా పక్కన నిలబడి ఉండటం, వాన్ గోహ్ స్టార్రి నైట్లో కనిపించడం లేదా డాలీ ది పెర్సిస్టెన్స్ ఆఫ్ మెమరీలో కలిసిపోవడం వంటివి ఉన్నాయి. మీకు నచ్చిన ప్రముఖుల పక్కన మిమ్మల్ని మీరు చూసుకోవడానికి ఇది అనుమతిస్తుంది.ఇదీ చదవండి: క్షీణిస్తున్న అమెరికా టూరిజం: అసలైన కారణాలు ఇవే..ప్రాంప్ట్ 5బననా ఏఐ సాయంతో.. ప్రపంచంలోని ప్రముఖ ప్రదేశాల్లో ఉన్నట్లు కూడా రూపొందిందించుకోవచ్చు. ఐఫెల్ టవర్ నుంచి తాజ్ మహల్, హాలీవుడ్ సైన్ వరకు మీకు నచ్చిన ప్రసిద్ధ ప్రదేశంలో మీరు ఉన్నట్లు చూసుకోవడానికి ఇది అనుమతిస్తుంది. ఏఐ దీనికి లైటింగ్ ఇతర షేడ్స్ కూడా అందిస్తుంది. -
మార్స్పై గతంలో జీవం!
కేప్ కనావెరల్(యూఎస్): అంగారకునిపై కోట్ల సంవత్సరాల క్రితం జీవం మనుగడ ఉండేదన్న వాదనలకు మరింత బలం చేకూరేలా అక్కడి నాసా ‘పర్సివరెన్స్’రోవర్ ఒక శిలాజం ఆనవాళ్లను గుర్తించింది. వందల కోట్ల సంవత్సరాల క్రితం ప్రవహించి ఎండిపోయిన ఒక నది ఒడ్డున ఉన్న ఒక శిలపై ప్రత్యేకమైన గుర్తులను పర్సివరెన్స్ రోవర్ కనిపెట్టింది.భూమి మీద మాత్రమే కనిపించే కొన్ని ప్రత్యేక మూలకాల రసాయన, భౌతిక చర్యల కలయికగా ఏర్పడే ‘లెపర్డ్స్పాట్స్’ ను అక్కడ గుర్తించారు. ఆ గుర్తుల్లో అధిక ఇనుప ధాతువు జాడలున్నాయి. నీటి పీల్చుకున్న ఐరన్ ఫాస్ఫేట్(వివియనైట్), గ్రెగైట్(ఐరన్ సల్పైడ్)లను దానిపై కనిపెట్టారు. శిథిలమైన కర్భన పదార్థాల్లో వివియనైట్ ఉంటుంది. అలాగే చిన్నపాటి జీవులు సైతం గ్రెగైట్ను ఉత్పత్తిచేస్తాయి. ఈ లెక్కన ప్రాచీన జీవికి సంబంధించిన జాడగా ఈ ‘లెపర్ట్ స్పాట్’ను భావించవచ్చని నాసా తాత్కాలిక అడ్మినిస్ట్రేటర్ సీన్ డఫీ వ్యాఖ్యానించారు. After a year of scientific scrutiny, a rock sample collected by the Perseverance rover has been confirmed to contain a potential biosignature. The sample is the best candidate so far to provide evidence of ancient microbial life on Mars. https://t.co/0BAO1dhMG8 pic.twitter.com/JsOXgrNDmY— NASA Mars (@NASAMars) September 10, 2025 -
రిలయన్స్ ఇంటెలిజెన్స్ షురూ
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇంటెలిజెన్స్ పేరుతో ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సేవల కంపెనీకి తెరతీసినట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా వెల్లడించింది. పూర్తి అనుబంధ కంపెనీగా ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఇందుకు కార్పొరేట్ వ్యవహారాల శాఖ నుంచి సర్టీఫికెట్ను పొందినట్లు తెలియజేసింది. గత నెలలో నిర్వహించిన వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం) లో కొత్తగా ఏఐ కంపెనీని ఏర్పాటు చేయనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ వాటాదారులకు వెల్లడించిన సంగతి తెలిసిందే. తద్వారా భారీస్థాయి ఏఐ మౌలికసదుపాయాలకు తెరతీయనున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్లోబల్ టెక్ దిగ్గజాలు మెటా, గూగుల్తో కొత్త భాగస్వామ్యాలను సైతం ప్రకటించారు. గిగావాట్ సామర్థ్యంతో రిలయన్స్ ఇంటెలిజెన్స్ను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్ఐఎల్ ఇప్పటికే వెల్లడించింది. గ్రీన్ ఎనర్జీ మద్దతుతో ఏఐ–రెడీ డేటా సెంటర్లతో నెలకొల్పుతున్నట్లు తెలియజేసింది. దశాబ్దంక్రితం రిలయన్స్ ఇండస్ట్రీస్కు డిజిటల్ సరీ్వసులు గ్రోత్ ఇంజిన్గా నిలవగా.. ఇకపై ఏఐతో మరింత పురోభివృద్ధిని అందుకోనున్నట్లు ఏజీఎంలో ముకేశ్ పేర్కొన్నారు. -
భారత్లో 19 నుంచి ఐఫోన్ 17 సేల్..!
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ కొత్తగా ప్రవేశపెట్టిన ఐఫోన్ 17 స్మార్ట్ఫోన్ల శ్రేణి విక్రయాలు సెప్టెంబర్ 19 నుంచి భారత మార్కెట్లో ప్రారంభం కానున్నాయి. వీటి ధరల శ్రేణి రూ. 82,900 నుంచి రూ. 2,29,900 వరకు ఉంటుంది. ఎయిర్ పేరిట యాపిల్ అత్యంత పల్చని ఐఫోన్ను కూడా ప్రవేశపెట్టింది. ఇది కేవలం 5.6 మిల్లీమీటర్ల మందం ఉంటుంది. ఈ–సిమ్లను మాత్రమే సపోర్ట్ చేస్తుంది. కొత్త ఐఫోన్ మోడల్స్లో 128 జీబీ స్టోరేజీ ఆప్షన్ను కంపెనీ నిలిపివేసింది. దీంతో ఐఫోన్ 16 సిరీస్తో పోలిస్తే బేస్ మోడల్స్ ధర పెరిగింది. భారత్ సహా 63 దేశాల్లోని కస్టమర్లు సెప్టెంబర్ 12 నుంచి ఐఫోన్ 17 ప్రో, ప్రో మ్యాక్స్ని ప్రీ–ఆర్డర్ చేయొచ్చని యాపిల్ తెలిపింది. ఐఫోన్ 17 ఫోన్లు 256 జీబీ, 512 జీబీ స్టోరేజీతో లభిస్తాయి. ఎయిర్ సిరీస్ 256 జీబీ నుంచి 1 టీబీ స్టోరేజీతో లభిస్తుంది. ఏ19 చిప్సెట్ వల్ల ఐఫోన్ 16తో పోలిస్తే కొత్త ఐఫోన్ 20% అధికం, ఐఫోన్ 13తో పోలిస్తే రెట్టింపు వేగంతో పని చేస్తుంది. గతానికి భిన్నంగా ఈసారి ‘ప్లస్’ మోడల్స్ ఏవీ లేవు. ప్రో మ్యాక్స్లో తొలిసారిగా 2టీబీ ఆప్షన్ను కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు, శాటిలైట్ కమ్యూనికేషన్స్కి కూడా ఉపయోగపడేలా వాచ్ 3 అల్ట్రాను కూడా యాపిల్ ఆవిష్కరించింది. దీని ధర రూ. 89,900గా ఉంటుంది. ప్రీ–ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. -
సర్వీస్ స్టార్
‘నా టైమ్ బాగ లేదు’ అనుకున్నాడు తాతయ్య. ఎందుకంటే ఆయన ఆన్లైన్ మోసానికి గురయ్యాడు. దాంతో తీవ్ర నిర్వేదానికి లోనయ్యాడు. ఈ నేపథ్యంలో తన తాతయ్యలాంటి ఎంతో మంది వృద్ధుల కోసం ‘షీల్డ్ సీనియర్స్’ అనే వెబ్సైట్ను రూపొందించిన పదిహేడు సంవత్సరాల ఇండియన్–అమెరికన్ తేజస్వి మనోజ్... టైమ్స్ మ్యాగజైన్ ‘కిడ్ ఆఫ్ ది ఇయర్–2025’ ఘనత సాధించింది. ‘ఆన్లైన్ మోసానికి గురైతే ఏం చేయాలి...’ నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తల వరకు సెమినార్లు, తన వెబ్సైట్ ద్వారా విస్తృత ప్రచారం చేస్తోంది తేజస్వి. ఇప్పుడు తేజస్వి ‘టైమ్’ బాగుంది. ఆమె చెప్పే సాంకేతిక విషయాల గురించి వినడానికి ఆబాలగోపాలం ఆసక్తి కనబరుస్తోంది. టైమ్ మ్యాగజైన్ తేజస్విని ‘సర్వీస్ స్టార్’గా కొనియాడింది...కాలిఫోర్నియాలో పుట్టి డాలస్లో పెరిగింది తేజస్వి మనోజ్. తేజస్వి తల్లిదండ్రులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. కోడింగ్ అంటే తేజస్వికి ఎంతో ఇష్టం. చాలా చిన్న వయసులోనే కోడింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టింది. బొమ్మలతో ఆడుకుందో లేదో తెలియదుగానీ కోడింగ్ ప్రపంచంలో జావా, పైథాన్లతో ఆడుకుంది.కోడింగ్ శక్తి... ‘గర్ల్స్ హూ కోడ్’ అనే స్వచ్ఛంద సంస్థ సైబర్ సెక్యూరిటీపై నిర్వహించే క్లాసులకు రెగ్యులర్గా హాజరయ్యేది తేజస్వి. ఎయిర్ ఫోర్స్, స్పేస్ఫోర్స్ ప్రోగ్రామ్ ‘సైబర్–పేట్రియాట్’లో చురుగ్గా పాల్గొనేది. ‘కోడింగ్ అనేది ఎంతో అద్భుత ప్రక్రియ. కోడింగ్ ను చాలా ఎంజాయ్ చేస్తాను. కోడింగ్ను నేర్చుకోవడం వల్ల దానిశక్తి ఏమిటో తెలుసుకోగలిగాను. భవిష్యత్లో కూడా కోడింగ్తో నా ప్రయాణం కొనసాగుతుంది’ అంటుంది తేజస్వి.ఎంతోమంది తాతయ్యల కోసం...గత సంవత్సరం తేజస్వి తాత ఆన్లైన్ మోసానికి గురయ్యాడు. మోసగాళ్లు ఆయన నుంచి డబ్బు డిమాండ్ చేశారు. అయితే కుటుంబసభ్యులకు ఈ ఆన్లైన్ మోసం గురించి తెలియడంతో వారి ఆటలు సాగలేదు. తాతయ్యకు ఆన్లైన్ మోసాల గురించి అవగాహన లేకపోవడం తేజస్విని ఆశ్చర్యపరిచింది. అయితే తన తాత మాత్రమే కాదు ఎంతోమంది వ్యక్తులకు ఆన్లైన్ మోసాల గురించి బొత్తిగా అవగాహన లేదనే విషయం తెలుసుకుంది. అలా అని తేజస్వి బాధపడుతూ కూర్చోలేదు.‘నా వంతుగా ఏదైనా చేయాలి’ అని పరిశోధన బాట పట్టింది. సీనియర్ సిటిజన్లకు ఆన్లైన్ మోసాల గురించి హెచ్చరించడానికి ‘షీల్డ్ సీనియర్స్’ పేరుతో వెబ్సైట్ రూపొందించింది. సైబర్సెక్యూరిటీకి సంబంధించిన ప్రాథమిక సూత్రాలను ‘షీల్డ్ సీనియర్స్’ తెలియజేస్తుంది.స్వతంత్రంగా... సగర్వంగా...‘సీనియర్ సిటిజనులు ఎలాంటి సంకోచం లేకుండా స్వతంత్రంగా, సగర్వంగా ఆన్లైన్ ప్రపంచంలో తమ పనులు తాము చేసుకునేలా షీల్డ్ సీనియర్స్’కు రూపకల్పన చేశాం’ అంటుంది తేజస్వి.ఆన్లైన్ మోసాలపై అవగాహన కలిగించడానికి తేజస్వి నిర్వహించే సమావేశాలకు ఎంతోమంది వృద్ధులు హాజరవుతుంటారు. ఆమె ప్రసంగిస్తుంటే నోట్స్ రాసుకుంటారు. ప్రసంగం పూర్తయిన తరువాత తేజస్విని రకరకాల సందేహాలు అడుగుతుంటారు. వాటికి ఓపికగా జవాబులు ఇస్తుంటుంది తేజస్వి.‘మాది టెక్ ఫ్యామిలీ’ అని ఘనంగా చెబుతుంటాడు తేజస్వి తండ్రి మనోజ్. ఆ ఘనతకు సామాజిక ప్రయోజానాన్ని జోడించి ‘డిజిటల్ డిఫెండర్’గా పేరు తెచ్చుకుంది తేజస్వి. ∙ఆహా... ఆల్రౌండర్!కోడింగ్లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న తేజస్వి మనోజ్ వయోలిన్ అద్భుతంగా వాయిస్తుంది. తన ఆర్కెస్ట్రాతో హైస్కూల్లో ఎన్నో కచేరీలు చేసింది. కరాటేలో కూడా ప్రవేశం ఉంది. స్కౌటింగ్–అమెరికాలో యాక్టివ్గా ఉంది. తాజాగా ఈగిల్ స్కౌట్ ర్యాంక్ అందుకుంది. ‘వైభ’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా భూటాన్ కాందిశీకుల పిల్లలకు మ్యాథ్స్, ఇంగ్లీష్ బోధిస్తోంది. సామాజిక సేవాకార్యక్రమాలలో ఎప్పుడూ ముందుంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ తనకు ఇష్టమైన సబ్జెక్ట్లు. భవిష్యత్లో కంప్యూటర్ సైన్స్ చదవాలనుకుంటుంది. ‘ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవాలనే ఉత్సాహవంతుల దగ్గరికి విజయాలు ఉత్సాహంగా నడిచొస్తాయి’ అని చెప్పడానికి బలమైన ఉదాహరణ తేజస్వి మనోజ్.ఉక్కుకవచం... షీల్డ్ సీనియర్స్‘షీల్డ్ సీనియర్స్’లో ఆన్లైన్ మోసాలకు సంబంధించిన సందేహాలకు చాట్బాట్ ద్వారా సమాధానాలు తెలుసుకోవచ్చు. అనుమానాస్పద టెక్ట్స్, మెజేస్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా విశ్లేషించుకోవచ్చు. ‘షీల్డ్ సీనియర్స్’లో నాలుగు విభాగాలు ఉంటాయి. ‘లెర్న్’ విభాగంలో ఇంటర్నెట్ సెక్యూరిటీకి సంబంధించి ప్రాథమిక విషయాలు తెలుసుకోవచ్చు. స్ట్రాంగ్ పాస్వర్డ్స్ రూపొందించుకోవడానికి, ప్రైవసీ సెట్టింగ్స్ను అర్థం చేసుకోవడానికి, ఎలాంటి సమాచారం షేర్ చేయవచ్చు, ఏది చేయకూడదు...మొదలైనవి తెలుసుకోవచ్చు. ‘ఆస్క్’ విభాగంలో చాట్బాట్ ద్వారా సందేహ నివృత్తి చేసుకోవచ్చు. ‘ఎనలైజ్’ అనేది మూడో విభాగం. యూజర్లు ఈ ట్యాబ్ క్లిక్ చేసి అనుమానాస్పద టెక్ట్స్, ఈ మెయిల్స్ను అప్లోడ్ చేయవచ్చు. ‘రిపోర్ట్’ సెక్షన్లో ఆన్లైన్ మోసగాళ్లపై ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదులపై స్పందించే 14 ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలకు చెందిన లింక్స్ ఇందులో ఉంటాయి. -
2030 నాటికి 15.7 ట్రిలియన్ డాలర్లు.. ప్రపంచ జీడీపీకి ఏఐ శక్తి
న్యూఢిల్లీ: కృత్రిమ మేధస్సు (AI) 21వ శతాబ్దాన్ని నిర్వచించే సాంకేతికతగా ఎదుగుతోంది. 2030 నాటికి ప్రపంచ జీడీపీలో సుమారు 15.7 ట్రిలియన్ డాలర్లను ఏఐ జోడించనుందని ఫీక్కీ-బీసీజీ విడుదల చేసిన "ది గ్లోబల్ ఏఐ రేస్" నివేదిక వెల్లడించింది.ఏఐ స్వీకరణలో అభివృద్ధి చెందిన దేశాలు ముందంజలో ఉన్నాయి. 66% దేశాలు జాతీయ ఏఐ వ్యూహాలను రూపొందించగా, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది 30 శాతంగా ఉంది. ఇక తక్కువ అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది కేవలం 12% మాత్రమే. ఈ అసమానత విదేశీ దిగుమతులపై ఆధారపడే ప్రమాదాన్ని పెంచుతోంది.ఏఐ స్వీకరణ రేస్లో కంప్యూట్, డేటా, మోడల్స్, టాలెంట్ అనే నాలుగు కీలక అంశాలు ఉన్నాయి. అమెరికా, చైనా వంటి దేశాలు ఏఐ నిపుణులలో ఆధిపత్యం కలిగి ఉన్నాయి. వ్యవసాయం, ప్రజా సేవలు వంటి రంగాలు ఏఐ స్వీకరణలో ఇంకా వెనుకబడ్డాయి.వ్యవసాయ రంగంలో ఏఐ ద్వారా 20% ఉత్పత్తి వృద్ధి సాధ్యమవుతుంది. అయితే, సంస్థలు పెట్టుబడులు పెట్టినా ఏఐ పైలట్లు క్షేత్రస్థాయికి వెళ్లకముందే సగం విఫలమవుతున్నాయి. రైజ్ (రీసెర్చ్, ఇన్వెస్ట్మెంట్, స్కిల్లింగ్, ఎథిక్స్) ఫ్రేమ్వర్క్ ద్వారా ప్రభుత్వాలు ఏఐ స్వీకరణ పెంపుపై దృష్టి పెట్టాలి. అంతర్జాతీయ సహకారం, మౌలిక సదుపాయాలు, నైపుణ్య అభివృద్ధి, నైతిక పాలన అవసరం."ఏఐ కేవలం సాంకేతిక తరంగం మాత్రమే కాదు.ఇది రాబోయే దశాబ్దాలలో ఆర్థిక, సామాజిక నాయకత్వాన్ని నిర్వచించే వ్యూహాత్మక పోటీ. ఏఐ అనేది ప్రయోజనం కోసం జరిగే పోటీ మాత్రమే కాదు. ప్రపంచానికి విలువను పెంచే పురోగతికి సమిష్టి అన్వేషణ" అని ఫీక్కీ డైరెక్టర్ జనరల్ జ్యోతి విజ్ పేర్కొన్నారు. -
చైనా సంచలనం.. అమెరికా చిప్ లేకుండా ‘బ్రెయిన్’ ఏఐ నమూనా
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో చైనా మరో కీలక అడుగు వేసింది. స్పైకింగ్బ్రెయిన్ 1.0 (SpikingBrain 1.0) అనే “మెదడు ప్రేరిత” లాంగ్వేజ్ మోడల్ను విడుదల చేసింది. ఇది ఎన్విడియా చిప్లు లేకుండానే సంప్రదాయ ఏఐ మోడళ్ల కంటే 100 రెట్లు వేగంగా పనిచేస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు.ఈ మోడల్ను చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆటోమేషన్ అభివృద్ధి చేసింది. ఇది న్యూరోమార్ఫిక్ డిజైన్ ఆధారంగా పనిచేస్తుంది. అంటే మన మెదడు లాగా, అవసరమైన న్యూరాన్లు మాత్రమే స్పందిస్తాయి. ఈ “స్పైకింగ్ కంప్యూటేషన్” పద్ధతి వల్ల విద్యుత్ వినియోగం తక్కువగా ఉంటుంది. అలాగే ట్రైనింగ్ డేటా అవసరం కూడా చాలా తక్కువగా ఉంటుంది.స్పైకింగ్బ్రెయిన్.. చాట్జీపీటీ (ChatGPT) లాంటి మోడళ్లకు అవసరమైన ట్రైనింగ్ డేటాలో కేవలం 2 శాతం మాత్రమే ఉపయోగించి, వాటితో సమానమైన పనితీరును అందిస్తుందని ప్రాజెక్ట్ ప్రధాన పరిశోధకుడు లి గువోకి తెలిపారు. ఈ మోడల్ చైనాలోనే అభివృద్ధి చేసిన మెటాఎక్స్ చిప్లపై పనిచేస్తుంది. అమెరికా జీపీయూ ఎగుమతి నియంత్రణలకు లోనవకుండా, స్వతంత్ర ఏఐ మౌలిక సదుపాయాల వైపు చైనా అడుగులు వేస్తోంది.స్పైకింగ్బ్రెయిన్.. దాని డెమో సైట్ లో తనను తాను ఇలా పరిచయం చేసుకుంటుంది. "హలో! నేను స్పైకింగ్ బ్రెయిన్ 1.0, లేదా 'షుంక్సీ', మెదడు-ప్రేరేపిత ఏఐ మోడల్ని. మానవ మెదడు సమాచారాన్ని స్పైకింగ్ కంప్యూటేషన్ పద్ధతితో ప్రాసెస్ చేసే విధానాన్ని నేను మిళితం చేస్తాను. పూర్తిగా చైనీస్ టెక్నాలజీపై నిర్మించిన శక్తివంతమైన, నమ్మదగిన, శక్తి-సమర్థవంతమైన ఏఐ సేవలను అందించగలను" అంటోంది. -
ఇన్ఫోసిస్ వచ్చేస్తోంది.. క్యాంపస్ ఉద్యోగాల జాతరకు సిద్ధం
దేశీయ రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ క్యాంపస్ నియామకాలకు సన్నద్ధమవుతోంది. దాదాపు రెండేళ్ల తర్వాత కాలేజీ క్యాంపస్లకు వచ్చి విద్యార్థులను ఉద్యోగాల్లో నియమించుకోబోతోంది. ఈ మేరకు రిక్రూట్మెంట్కు సంబంధించిన ప్యానెల్ ఇంటర్వ్యూలలో పాల్గొనాలని తమ సీనియర్ సిబ్బందిని ఇన్ఫోసిస్ కోరింది.టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రోతో సహా ప్రధాన ఐటీ కంపెనీలు కోవిడ్ కారణంగా క్యాంపస్, లేటరల్ రిక్రూట్మెంట్లను తగ్గించాయి. ఇన్ఫోసిస్ అయితే ఫ్రెషర్ రిక్రూట్మెంట్లను బాగా తగ్గించేసింది. 2024 ఆర్థిక సంవత్సరంలో 11,900 మందిని మాత్రమే నియమించుకుంది. అంతకుముందు సంవత్సరంలో నియామకాల సంఖ్య 50,000తో పోల్చితే ఇది చాలా తక్కువ. ఈ సంఖ్య 2025 ఆర్థిక సంవత్సరంలో 15,000 కు పెరిగింది.బెంగళూరుకు చెందిన ఐటీ సంస్థ మార్చి 2026 తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి కంబైన్డ్ ఆఫ్, ఆన్-క్యాంపస్ కార్యక్రమాల ద్వారా 15,000-20,000 కొత్త నియామకాల లక్ష్యాన్ని పెట్టుకుంది. డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ల (డీఎస్ఈ) పేరుతో ఫ్రెషర్లను ఇన్ఫోసిస్ ఎంపిక చేయబోతోంది.క్యాంపస్ ఇంటర్వ్యూల గురించి ఇన్ఫోసిస్ తొలిసారిగా మేనేజర్ స్థాయి అంతకంటే ఎక్కువ హోదా ఉన్న ఉద్యోగులకు మాస్ ఈ మెయిల్ కమ్యూనికేషన్ పంపింది. దీని ప్రకారం.. ఇన్ఫోసిస్ ప్రతినిధులు అభ్యర్థుల ప్రాథమిక ప్రోగ్రామింగ్ సామర్థ్యాలను, ఎంట్రీ లెవల్ డీఎస్ఈ స్థానాలకు అవసరమైన సమస్య పరిష్కార సామర్థ్యాలను అంచనా వేస్తారు.ఇన్ఫోసిస్ క్యాంపస్ నియామాలు వచ్చే అక్టోబర్, నవంబర్ చివరి మధ్య షెడ్యూల్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో కోవిడ్ మహమ్మారి సమయంలో కంపెనీ వర్చువల్ ఇంటర్వ్యూలను నిర్వహించింది. -
ఐఫోన్ 17 వచ్చేసింది..
క్యుపర్టీనో, అమెరికా: టెక్ దిగ్గజం యాపిల్ తాజాగా ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్ ఫోన్లను ఆవిష్కరించింది. ఐఫోన్ 17లో 6.3 అంగుళాల స్క్రీన్, ఏ19 ప్రో ప్రాసెసర్, 48 ఎంపీ డ్యుయల్ ఫ్యూజన్ కెమెరా, 24 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 256 జీబీ మెమొరీ తదితర ఫీచర్లు ఉన్నాయి. అయిదు రంగుల్లో లభిస్తుంది. అత్యంత పల్చని ఐఫోన్ 17 ఎయిర్ని కూడా యాపిల్ విడుదల చేసింది. దీని మందం 5.6 మిల్లీమీటర్లుగా ఉంటుంది. ఐఫోన్ 17 ధర రూ. 799 డాలర్ల నుంచి, ప్రో ధర రూ. 1,099 డాలర్ల నుంచి, ప్రో మ్యాక్స్ రేటు 1,199 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది.ఎయిర్ ధర 999 డాలర్ల నుంచి ఉంటుంది. మంగళవారం క్యుపర్టినోలో జరిగిన కార్యక్రమంలో యాపిల్ సీఈవో టిమ్ కుక్.. కొత్త ఐఫోన్తో పాటు పలు ఉత్పత్తులను ఆవిష్కరించారు. వీటిలో వాచీలు, ఎయిర్పాడ్స్ ఉన్నాయి. వాచ్ ఎస్ఈ, వాచ్ సిరీస్ 11, వాచ్ అల్ట్రా 3ని కంపెనీ ఆవిష్కరించింది. వీటి ధరలు వరుసగా 249 డాలర్లు, 399 డాలర్లు, 799 డాలర్లుగా ఉంటాయి. సెపె్టంబర్ 19 నుంచి అందుబాటులోకి వస్తాయి. అటు కొత్త ఎయిర్పాడ్స్ ప్రో3 ధర 249 డాలర్లుగా ఉంటుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 10 గంటలు బ్యాటరీ లైఫ్ ఉంటుంది. -
జియో కొత్త టెక్నాలజీ: టెన్షన్ లేకుండా 5జీ నెట్.. కాలింగ్
వినియోగదారుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రిలయన్స్ జియో తన సేవలను నిరంతరం అప్ డేట్ చేస్తూనే ఉంది. కాల్స్ చేయడంలో ఉన్న సమస్యలను అధిగమించేందుకు దేశవ్యాప్తంగా వాయిస్ ఓవర్ న్యూ రేడియో (VoNR) అనే ఒక కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టింది. ఈ జియో సర్వీస్ వారి సొంతంగా పనిచేస్తుంది, అంటే స్వదేశీ 5జీ స్వతంత్ర కోర్. ఈ సేవతో ప్రతి 5జీ ఫోన్ మినీ స్టూడియోగా మారుతుందని జియో పేర్కొంది.ఇప్పటి వరకు చాలా టెలికాం కంపెనీలు 5జీ ఇంటర్నెట్ ను అందిస్తున్నప్పటికీ, కాలింగ్ కోసం బ్యాక్ ఎండ్ లో 4జీ నెట్ వర్క్ పైనే ఆధారపడేవి. వీవోఎన్ఆర్ ఈ అంతరాన్ని పూరిస్తుంది. వినియోగదారులకు పూర్తిగా 5జీ కోర్ ఆధారంగా కాలింగ్ అనుభవాన్ని ఇస్తుంది.వీవోఎన్ఆర్ అంటే ఏమిటి?జియో కొత్త టెక్నాలజీ వోఎల్టీఈ వంటి పాత వ్యవస్థల స్థానంలో వీఓఎన్ఆర్ భర్తీ చేస్తోంది. ఈ 5జీ ఫోన్ నేటివ్ వాయిస్ కాల్స్ ను అందిస్తుంది. ఈ టెక్నాలజీ కారణంగా, కాల్ త్వరగా కనెక్ట్ అవుతుంది. దీని రాకతో, కాల్ డ్రాప్లు, వాయిస్ బ్రేక్ వంటి సమస్యలు కూడా దాదాపుగా తొలగిపోతాయి. దీంతో యూజర్ల ఫోన్ బ్యాటరీని కూడా ఆదా చేస్తుందని జియో చెబుతోంది. దీనితో పాటు కాల్ రూటింగ్, నెట్ వర్క్ ఎఫిషియెన్సీ మెరుగ్గా ఉంటుంది.జియో తన వీఓఎన్ఆర్ రోల్ అవుట్ పూర్తిగా స్వదేశీ టెక్నాలజీ స్టాక్ పై ఆధారపడి ఉందని పేర్కొంది. దీని అర్థం బ్యాక్ ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుండి సర్వీస్ మేనేజ్మెంట్ వరకు ప్రతిదీ భారతీయ ఇంజనీర్లు, భాగస్వాముల సహాయంతో నిర్మించినదే. ఇది సాంకేతిక స్వాతంత్ర్యం వైపు ఒక పెద్ద అడుగు మాత్రమే కాదు, భవిష్యత్తులో భారతదేశాన్ని డిజిటల్ పరిష్కారాలను ఎగుమతి చేసే దేశంగా మార్చగలదు.వీవోఎన్ఆర్ ప్రయోజనాలుఫాస్ట్ కాల్ కనెక్షన్ - ఫోన్ చేసిన కొన్ని సెకండ్లలోనే కాల్ కనెక్ట్ అవుతుంది.మెరుగైన వాయిస్ క్వాలిటీ - హెచ్డీ+ సౌండ్ సంభాషణను మరింత స్పష్టంగా చేస్తుంది.కాల్ డ్రాప్ లు తగ్గడం- నెట్ వర్క్ స్విచింగ్ వల్ల ఎలాంటి సమస్య ఉండదు.బ్యాటరీ సేవింగ్: ఫోన్ 4జీ, 5జీ మధ్య పదే పదే షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు.మెరుగైన ఇంటర్నెట్ + కాలింగ్ - కాల్ లో మాట్లాడేటప్పుడు కూడా ఇంటర్నెట్ బ్రౌజింగ్ 5జీ వేగంతో కొనసాగుతుంది. -
‘టీసీఎస్లో ఉద్యోగికి బలవంతపు రిటైర్మెంట్’
దేశీయ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో బలవంతపు రాజీనామాలు, ముందస్తు రిటైర్మెంట్లు చేయిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. టీసీఎస్లో సుదీర్ఘకాలంగా ఉద్యోగిగా పనిచేసిన తమ సోదరుడిని ముందస్తు పదవీ విరమణ చేయించడమే కాకుండా, సెవెరెన్స్ పే లేదా ఎలాంటి పరిహారం కూడా ఇవ్వలేదని ఒక వ్యక్తి పేర్కొన్నారు. ఆ వ్యక్తి తమ సోదరుడికి జరిగిన విషయాన్ని రెడ్డిట్ లో పోస్ట్ చేశారు."టీసీఎస్ ఉద్యోగిని 30 సంవత్సరాల తరువాత ముందస్తు పదవీ విరమణకు బలవంతం చేశారు. తొలగింపు వేతనం లేదు, పరిహారం లేదు" అని రెడ్డిట్ యూజర్ (silver_traveller) పేర్కొన్నారు. తన సోదరుడు తన జీవితంలో దాదాపు 30 ఏళ్లను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు అంకితం చేశాడని 'వర్క్ ప్లేస్ టాక్సిసిటీ' ట్యాగ్ కింద షేర్ చేసిన ఈ ఘటన పేర్కొంది.రిటైర్ అవుతావా.. తొలగించమంటావా?30 ఏళ్లుగా కంపెనీకి విధేయుడిగా ఉన్న తమ సోదరుడికి నిర్ణయం తీసుకోవడానికి కేవలం 20 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చారని రెడిట్ యూజర్ ఆరోపించారు. 2025 జూన్లో ఆయనను ఒక సమావేశానికి పిలిపించి, తొలగిస్తున్నట్లు చెప్పారని, ముందస్తు పదవీ విరమణను స్వీకరించడం లేదా తొలగింపును ఎదుర్కోవడం.. రెండిటిలో ఏదో ఒకదాన్ని నిర్ణయించుకోవాలని సరిగ్గా 20 నిమిషాలే సమయం ఇచ్చారని వాపోయారు.50 ఏళ్ల వయసున్న తమ సోదరుడు ఇప్పుడు అనుభవజ్ఞులైన నిపుణులకు ప్రతికూలంగా ఉన్న జాబ్ మార్కెట్లో పరిమిత ఉద్యోగావకాశాలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రెడిట్ పోస్టుకు ఫాలోవర్ల నుంచి విశేష స్పందన వచ్చింది. చాలా మంది యూజర్లు బాధిత ఉద్యోగికి మద్దతుగా, టీసీఎస్ వైఖరికి వ్యతిరేకంగా కామెంట్లు చేశారు.కాగా టీసీఎస్ లో బలవంతపు రాజీనామా, అక్రమ తొలగింపుకు వ్యతిరేకంగా పలువురు ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగులు ఇటీవలే వీధుల్లోకి వచ్చారు. నోయిడా, కోల్ కతాలో ఆలిండియా ఐటీ, ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఐటీఈయూ) ఆధ్వర్యంలో ఈ నిరసనలు జరిగాయి. నిరసనలకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ, "టీసీఎస్ తొలగింపును ఆపండి, లేకపోతే ప్రతిఘటన మరింత గట్టిగా పెరుగుతుంది" అని ఏఐఐటీఈయూ ఎక్స్లో పోస్ట్ చేసింది.IT/ITeS employees across India hit the streets on 5 Sept against #ForcedResignation & #IllegalTermination in #TCS. Protests in Noida & Kolkata sent a clear message: #TCSstopRetrenchment or the resistance will grow louder. ✊ #JoinAIITEU pic.twitter.com/NidRgsU3Xy— AIITEU (@aiiteu) September 6, 2025 -
ఐఫోన్ 17 వివరాలు లీక్!.. ధర ఎంతంటే?
యాపిల్ కంపెనీ తన 'అవే డ్రాపింగ్' ఈవెంట్ను మంగళవారం (సెప్టెంబర్ 9) నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 17 సిరీస్, యాపిల్ వాచ్ కొత్త వెర్షన్లు, అప్డేటెడ్ ఎయిర్పాడ్లతో పాటు.. వివిధ రకాల యాక్ససరీస్ కూడా ఆవిష్కరించనుంది.యాపిల్ త్వరలో నిర్వహించనున్న ఈవెంట్లో.. ఐఫోన్ 17 ప్రో మాక్స్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ఎయిర్, బేసిక్ ఐఫోన్ 17 అనే నాలుగు వేరియంట్లను విడుదల చేయనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి, థర్మల్ కెమెరా ఇమేజ్ లాగా స్టైల్ చేసిన లోగో షేర్ చేశారు. కంపెనీ రాబోయే కొత్త ఐఫోన్ గురించి అధికారికంగా వెల్లడించకపోయినా.. కొన్ని వివరాలు లీక్ అయ్యాయి.చాలా సంవత్సరాల తరువాత.. యాపిల్ కంపెనీ మొదటిసారి అప్డేటెడ్ ఐఫోన్ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది మునుపటి ఐఫోన్ కంటే 5.5 మిల్లీమీటర్లు సన్నగా ఉండే అవకాశం ఉంది. ఇది ఇటీవల విడుదలైన శామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ కంటే కూడా సన్నగా ఉంటుందని బ్లూమ్బెర్గ్ తెలిపింది. USB-C పోర్ట్, ప్రోమోషన్ సపోర్ట్, 6.6 ఇంచెస్ స్క్రీన్ కూడా ఉండనున్నాయి. కెమెరా సెటప్ కూడా అద్భుతంగా ఉంటుంది.ఇదీ చదవండి: సముద్ర గర్భంలో కేబుల్స్ కట్: ఇంటర్నెట్ సేవలకు అంతరాయంవిడుదలకు సిద్దమవుతున్న యాపిల్ ఐఫోన్ 17 సిరీస్ రెండు కొత్త రంగుల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఇప్పటికి అందుబాటులో ఉన్న ఐఫోన్ 16 సిరీస్ రంగుల కంటే కూడా ఆకర్షణీయంగా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో 5000 mAh బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ ధరలు రూ. 89,900 నుంచి రూ. 1.64 లక్షల మధ్య ఉంటుందని సమాచారం. ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ సమయంలో ధరలు అధికారికంగా వెల్లడవుతాయి.Join us for a special Apple Event on September 9 at 10 a.m. PT. Tap the ❤️ and we’ll send you a reminder on event day. pic.twitter.com/o5sI2sdkwO— Apple (@Apple) August 26, 2025 -
సముద్ర గర్భంలో కేబుల్స్ కట్: ఇంటర్నెట్ సేవలకు అంతరాయం
ఎర్ర సముద్రంలో.. సముద్రగర్భ కేబుల్స్ తెగిపోవడంతో ఆసియా, మధ్యప్రాచ్య ప్రాంతాలలో ఇంటర్నెట్ సేవలకు ఆదివారం అంతరాయం ఏర్పడింది. దీనికి ప్రధాన కారణమేమిటో స్పష్టంగా వెల్లడికాలేదు.ఇంటర్నెట్ యాక్సెస్ను పర్యవేక్షించే గ్లోబల్ వాచ్డాగ్ నెట్బ్లాక్స్, ఎర్ర సముద్రంలో వరుస సబ్సీ కేబుల్ అంతరాయాలు భారతదేశం, పాకిస్తాన్తో సహా అనేక దేశాలలో కనెక్టివిటీని దెబ్బతీశాయని నివేదించింది. అయితే సౌదీ అరేబియాలోని జెడ్డా సమీపంలోని ఆగ్నేయాసియా-మిడిల్ ఈస్ట్-వెస్ట్రన్ యూరప్ 4 (ఎస్ఎండబ్ల్యు4), ఇండియా-మిడిల్ ఈస్ట్-వెస్ట్రన్ యూరప్ (ఐఎంఈడబ్ల్యుఈ) కేబుల్ వ్యవస్థలను ప్రభావితం చేసే వైఫల్యాలను ఇది గుర్తించింది.ఎస్ఎండబ్ల్యు4ను.. టాటా గ్రూప్లో భాగమైన టాటా కమ్యూనికేషన్స్ నిర్వహిస్తుండగా, ఐఎంఈడబ్ల్యుఈను ఆల్కాటెల్-లూసెంట్ పర్యవేక్షించే కన్సార్టియం నిర్వహిస్తోంది. ఇంటర్నెట్ అంతరాయాల గురించి ఈ రెండు కంపెనీలు స్పందించలేదు. అయితే పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్స్ కో. లిమిటెడ్ శనివారం ఒక ప్రకటనలో కోతలను ధృవీకరించింది. యూఏఈలో ప్రభుత్వ యాజమాన్యంలోని డు అండ్ ఎటిసలాట్ నెట్వర్క్ల వినియోగదారులు కూడా ఇంటర్నెట్ స్పీడ్ గురించి ఫిర్యాదు చేశారు. అయితే సౌదీ అరేబియాలోని అధికారులు దీనిపై స్పందించలేదు.ఇదీ చదవండి: జీఎస్టీ 2.0 ఎఫెక్ట్: రూ.2 లక్షలు తగ్గిన ఫేమస్ కారు ధరకేబుల్స్ తెగిపోవడానికి కారణంప్రపంచ ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలలో కీలకమైన భాగమైన జలాంతర్గామి కేబుల్స్.. అప్పుడప్పుడు ఓడ యాంకర్లు లేదా ఉద్దేశపూర్వక దాడులకు గురవుతాయి. ఇదే ఇంటర్నెట్ సమస్యకు కారణమవుతుంది. దీనిని మరమ్మతులు చేయాలంటే వారాల సమయం పడుతుంది. అంతే కాకుండా నష్టాన్ని గుర్తించి సరిచేయడానికి ప్రత్యేక నౌకలు అవసరం. -
హాయి నిద్రకోసం.. బెడ్రూమ్ గ్యాడ్జెట్స్
రోజంతటి అలసట ఇట్టే పోగొట్టే మందు ఒక్కటే, అదే హాయినిద్ర!. అందుకే, ప్రపంచాన్ని మరచిపోయేలా, ప్రశాంతమైన నిద్రకోసం ఇవి మీ బెడ్రూమ్లో తప్పకుండా ఉండాలి.మాయాదీపం!ఊహించుకోండి.. మీ మంచం పక్కన ఒక చిన్న మాయాదీపం ఉందని. ఎందుకంటే, ఈ బెడ్సైడ్ ల్యాంప్, సాధారణ బెడ్ల్యాంప్ కాదు. ఇదొక మూడ్ మ్యాజిక్, మల్టీ యూజ్ ఫ్రెండ్. రాత్రి పడుకున్నప్పుడు ఒక్క టచ్ చేస్తే మెల్లగా వెలిగే వార్మ్ లైట్తో పాటు, పుస్తకం చదవాలనిపిస్తే కూల్ వైట్ లైట్, పార్టీ మూడ్కి బ్రైట్ లైట్. అన్నీ మీ వేళ్ల అంచుల్లోనే! మొబైల్ ఛార్జింగ్ అయిపోయిందా? ప్లగ్ కోసం వెతకాల్సిన అవసరం లేదు. ల్యాంప్ మీద ఫోన్ పెట్టేయండి. వాచ్, ఇయర్ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ పరికాలన్నింటినీ దీంతోనే చార్జ్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఇందులో ఉన్న డిజిటల్ క్లాక్తో అలారం కూడా సెట్ చేసుకోవచ్చు. ధర రూ. 3,900.ఆకాశం అంతా మీ గదిలోనే!ఆరుబయట మంచం వేసుకొని చుక్కలు లెక్కపెడుతూ పడుకునే రోజులు గుర్తున్నాయా? గాలి తాకుతూ, ఆకాశం చూస్తూ కలల్లో తేలిపోయే ఆ మజానే వేరు. ఇప్పుడు ఆ అనుభూతి మళ్లీ పొందటానికి ఆరుబయట మంచం వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆకాశం అంతా మీ గదిలోకే దిగిపోతుంది. ఒక్కసారి ఈ స్టార్షిప్ ల్యాంప్ ఆన్ చేస్తే, గది గోడల మీద నక్షత్రాలు, చంద్రుడు, మేఘాలు, గ్రహాలు అన్నీ మెరిసిపోతూ మీ గదినే గగనమండలంలా మార్చేస్తాయి. మొబైల్కి కనెక్ట్ చేసుకొని యాప్ ద్వారా కలర్స్, బ్రైట్నెస్, స్పీడ్ అన్నీ మీ మూడ్కి తగినట్టుగా మార్చుకోవచ్చు. టైమర్ సెట్ చేస్తే మీరు కలల్లో తేలుతుండగానే దానంతట అదే ఆఫ్ అవుతుంది. ధర రూ.2,890.ఇదీ చదవండి: భారత్పై ప్రశ్న.. చైనా రోబో సమాధానంవెచ్చని దుప్పటిచల్లని రాత్రుల్లో వణుకుతూ నిద్రపోవడం ఇక మానేయండి. ఎందుకంటే ఇప్పుడు హీటెడ్ అండర్ బ్లాంకెట్ ఉంది. ఒక్క బటన్తో మీ మంచాన్ని వెచ్చగా, సౌకర్యంగా మార్చేస్తుంది. దీన్ని ఉపయోగించడం చాలా ఈజీ. దుప్పటిని మంచం మీద సెట్ చేసి, పవర్కి కనెక్ట్ చేయండి. కంట్రోల్ స్విచ్లో మీకు కావాల్సిన లో, మీడియం, హై అనే ఉష్ణస్థాయులను ఎంచుకోండి. నిమిషాల్లోనే మంచం మొత్తం వెచ్చగా మారిపోతుంది. రాత్రంతా వెచ్చదనం కొనసాగుతుంది. ఉదయం లేవగానే కేవలం స్విచ్ ఆఫ్ చేస్తే చాలు. ఉతకాల్సినప్పుడు ప్లగ్ తీసేసి వాషింగ్ మెషిన్ లో వేసేసుకోచ్చు. మృదువైన, నాణ్యమైన కాటన్ తో తయారైన ఈ దుప్పటి ధర కేవలం రూ.3,749 మాత్రమే! -
నిరుద్యోగ విపత్తు తప్పదు: ఏఐ గాడ్ ఫాదర్ హెచ్చరిక
‘గాడ్ ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)’గా భావించే జెఫ్రీ హింటన్ (Geoffrey Hinton) టెక్నాలజీ పెరుగుదల కంపెనీలను గతంలో కంటే ఎక్కువ లాభదాయకంగా మారుస్తుందని, కానీ అది ఖర్చుతో కూడుకున్నదని పేర్కొన్నారు. నేటి కృత్రిమ మేధ ఆధారిత ఉత్పత్తులకు మూలమైన మెషిన్ లెర్నింగ్ కు పునాదులు వేసిన హింటన్, ఉద్యోగాలు కోల్పోయే కార్మికుల ఖర్చుతో కంపెనీలకు లాభాలు వస్తాయని, నిరుద్యోగం ఖచ్చితంగా విపత్కర స్థాయికి పెరుగుతుందని హెచ్చరించారు."వాస్తవానికి ఏమి జరగబోతోందంటే.. ధనవంతులు కార్మికుల స్థానంలో కృత్రిమ మేధను ఉపయోగించబోతున్నారు" అని హింటన్ ఫైనాన్షియల్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇది భారీ నిరుద్యోగాన్ని సృష్టిస్తుందని, కంపెనీలకు లాభాలు భారీగా పెరుగుతాయని పేర్కొన్నారు. ఇది కొంతమందిని మరింత ధనవంతులను చేస్తుంది.. చాలా మందిని పేదలుగా చేస్తుంది. అది ఏఐ తప్పు కాదు, పెట్టుబడిదారీ వ్యవస్థది అంటూ వివరించారు.గత ఏడాది నోబెల్ బహుమతి గెలుచుకున్న హింటన్ చాలాకాలంగా కృత్రిమ మేధ గురించి, దానిని నియంత్రించకుండా వదిలేస్తే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎలా నాశనం చేస్తుందో హెచ్చరిస్తూనే ఉన్నారు. "ఏమి జరుగుతుందో మనకు తెలియడం లేదు. కనీసం ఊహకు కూడా అందడం లేదు. కానీ దాని గురించి చెప్పాల్సిన వాళ్లు మాత్రం మిన్నకుండిపోతున్నారు" అని హింటన్ అన్నారు.‘మనం చరిత్రలో ఒక దశలో ఉన్నాం, అక్కడ ఏదో అద్భుతం జరుగుతోంది, అది ఆశ్చర్యకరంగా మంచిది కావచ్చు.. చెడ్డది కావచ్చు. మనం ఊహాగానాలు చేయగలం, కానీ పరిస్థితులు అలా ఉండవు’ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్స్ తమ భాషను అభివృద్ధి చేసుకోగలిగితే సాంకేతిక పరిజ్ఞానం చేతికి అందకుండా పోతుందని ఆయన గతంలోనే హెచ్చరించారు. కృత్రిమ మేధ భయంకరమైన ఆలోచనలు చేయగలదని ఇప్పటికే నిరూపించిందని, మానవులు ట్రాక్ చేయలేని లేదా అర్థం చేసుకోలేని విధంగా యంత్రాలు చివరికి ఆలోచించగలవని ఊహించలేమని హింటన్ అన్నారు. -
నెలకు రూ.20 లక్షల జీతం.. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం
ఏఐ విజృంభణతో వేలాదిగా ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఫ్రెషర్లకు మంచి జీతంతో ఉద్యోగాలు రావడమే కష్టమైపోతున్న ప్రస్తుత తరుణంలో ఓ 23 ఏళ్ల కుర్రాడు మాత్రం మరో విధంగా నిరూపించాడు. ఈశాన్య భారతదేశంలోని ఒక చిన్న పట్టణానికి చెందిన ఈ టెకీ పట్టుదల, నైపుణ్యం అన్ని సవాళ్లను, వైఫల్యాలను అధిగమించగలవని నిరూపించాడు.ఏకంగా 500 పైగా తిరస్కరణలను ఎదుర్కొన్న ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇప్పుడు ఏఐలోనే అగ్ర సంస్థలలో ఒకటైన ఓపెన్ఏఐలో పనిచేస్తున్నారు. నెలకు రూ.20 లక్షల జీతం. అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం.బీటెక్ చేసిన మొదటి వ్యక్తిఈ యువ ఇంజనీర్ రెడ్డిట్ పోస్టు ప్రకారం.. తన కుటుంబంలో కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ చేసిన మొదటి వ్యక్తి ఇతనే. ఏడాదికి రూ.3.6 లక్షల వేతనంతో మొదట్లో క్యాంపస్ ప్లేస్మెంట్ ఆఫర్ వచ్చింది. తీసుకున్నాడు. అయితే జాయిన్ డేట్ కోసం ఎదురుచూడకుండా మరింత క్రియాశీలకంగా వ్యవహరించాడు.ఒక్క ఇంటర్వ్యూ దక్కింది.. పట్టేశాడువందలాది రిమోట్ అంతర్జాతీయ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం ప్రారంభించాడు. ఈ మార్గం ప్రారంభంలో లెక్కలేనన్ని తిరస్కరణలకు దారితీసింది, కానీ చివరికి ఫలించింది. ‘నెలల తరబడి తిరస్కరణ తరువాత తిరస్కరణ. ఆ అప్లికేషన్లలో నాకు ఒక్క ఇంటర్వ్యూ కాల్ మాత్రమే వచ్చింది, ఎలాగోలా క్లియర్ చేశాను’ అంటూ రెడిట్ పోస్ట్లో పేర్కొన్నాడు.దాదాపు 500-600 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న టెక్కీ ఓపెన్ఏఐ లింక్డ్ ప్రాజెక్టుతో ఒకే ఇంటర్వ్యూను పొంది విజయవంతంగా ఉత్తీర్ణత సాధించాడు. మొదట్లో ఏడాదికి రూ.3.6 లక్షలుగా ఉన్న ఆయన జీతం ఇప్పుడు నెలకు రూ.20 లక్షలకు చేరింది.అయినా ‘ఆగడు’రూ.లక్షల జీతంతో చేతిలో ఉద్యోగం ఉన్నా టెక్కీ మాత్రం ఆగడం లేదు. ఓపెన్ఏఐ లింక్డ్ ప్రాజెక్టు ద్వారా వచ్చే అదనపు డబ్బుతో సొంతంగా టెక్ సంస్థను ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నాడు. ఇది పూర్తయితే అతను తన లాంటి మరింత మందిని చేర్చుకుని పెద్ద ప్రాజెక్టులపై పనిచేయాలనుకుంటున్నాడు. మంచి కంపెనీల్లో సౌకర్యవంతమైన ఒక్క జాబ్ వస్తే చాలు స్థిరపడాలనుకుంటున్న యువతకు ఈ కుర్రాడు భిన్నంగా ఆలోచిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. -
యంత్రుడి చేతుల్లోకి మనిషి! డెడ్ ఇంటర్నెట్ థియరీ నిజమే!!
‘‘ఓ మర మనిషి మా లోకి రా..’’ అంటూ పిలిచిన మనిషి.. ఇప్పుడు పూర్తిగా దాని చెప్పుచేతల్లోకి వెళ్లిపోయాడా? ఇంటర్నెట్ అనేది మనిషి చేజారి పోయిందా?.. ఇప్పుడది పూర్తిగా బాట్ల నియంత్రణలో నడుస్తోందా?.. ఈ అర్థం వచ్చేలా ఓపెన్ఏఐ సీఈవో ఆల్ట్మన్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా కలకలం రేగింది. తద్వారా Dead Internet Theory కి బలమైన మద్దతు చేకూరినట్లైంది. ఇంతకీ ఈ థియరీ ఏంటి?.. చాట్జీపీటీ లాంటి ఏఐ చాట్బాట్ను రూపొందించిన వ్యక్తి ఇలా మాట్లాడడం వెనుక ఆంతర్యం ఏంటి? పరిశీలిస్తే.. ఇంటర్నెట్లో మనం చూస్తోంది నిజంగా మనుషులనేనా?.. కొన్ని పోస్టులు చేసేది.. ఇతరుల పోస్ట్లకు కామెంటలు చేసేది.. లైకులు, షేర్లు ఇదంతా మనుషులు చేస్తున్నదేనా?.. లేదంటే అప్పుడెప్పుడో చర్చ జరిగినట్లు.. కృత్రిమ మేధస్సు చేస్తోందా?. ఇప్పటివరకు ఇది కేవలం ఊహగా కనిపించినా.. తాజాగా OpenAI CEO సామ్ ఆల్ట్మన్ చేసిన వ్యాఖ్యలతో ‘Dead Internet Theory’ అనే సిద్ధాంతం వాస్తవానికి దగ్గరగా ఉందేమో అనే అనుమానాలు బలపడ్డాయి. ChatGPT వంటి శక్తివంతమైన AI చాట్బాట్ను రూపొందించిన వ్యక్తి.. సామ్ ఆల్ట్మన్. అలాంటి వ్యక్తి తన ఎక్స్ అకౌంట్లో ఓ ఆసక్తికరమై పోస్ట్ చేశారు.. డెడ్ ఇంటర్నెట్ థియరీని ఇంతకాలం నేను అంతగా నమ్మలేదు. కానీ ఇప్పుడు ఎక్స్(పూర్వపు ట్విటర్)ను చూస్తుంటే చాలా LLM-run అకౌంట్లు ఉన్నట్లు అనిపిస్తోంది అని అన్నారు.i never took the dead internet theory that seriously but it seems like there are really a lot of LLM-run twitter accounts now— Sam Altman (@sama) September 3, 2025ఈ వ్యాఖ్య వైరల్ కావడంతో, పలువురు వినియోగదారులు ఆల్ట్మన్ను వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఆ విషయం తమకు ఎప్పుడో తెలుసని ఒకరు.. డెడ్ఇంటర్నెట్కు పునాది వేసింది మీరే కదా? అని మరొకొరు కామెంట్ చేశారు. బ్రేకింగ్.. LLMల సృష్టికర్త, ఇప్పుడు ఎక్స్లో అన్నీ LLMలే అని బాధపడుతున్నాడు ఇంకొకరు సెటైరిక్గా స్పందించారు. మరొకరైతే ఎలాన్ మస్క్తో ఉన్న వైరంతోనే ఇలా మాట్లాడుతున్నారంటూ కామెంట్ చేశారు.. ఇలా ఆల్ట్మన్ను తమకు తోచిన తెగ ఆడేసుకుంటున్నారు.డెడ్ ఇంటర్నెట్ థియరీ అంటే ఏమిటి?డెడ్ ఇంటర్నెట్ థియరీ అనేది ఒక వివాదాస్పదమైన సిద్ధాంతం, ఇది 2021లో "Dead Internet Theory: Most of the Internet is Fake" అనే బ్లాగ్ ద్వారా ప్రజల్లోకి వచ్చింది. దీని ప్రకారం, ఇంటర్నెట్లో ఎక్కువ భాగం నిజమైన మనుషుల ద్వారా కాకుండా.. AI బాట్స్, ఆటోమేటెడ్ స్క్రిప్ట్స్, మరియు LLM-run అకౌంట్ల ద్వారా నడుస్తోందని అంటోంది. అంటే.. Large Language Model (LLM) ఆధారంగా నడిచే సోషల్ మీడియా లేదంటే ఆన్లైన్ అకౌంట్లు. ఇవి నిజమైన వ్యక్తులు నిర్వహించకపోవచ్చు. అర్టిషీషియల్ ఇంటెలిజెన్సీ(AI) మోడల్స్ ద్వారా ఆటోమేటెడ్గా స్పందించేవి, పోస్టులు చేసేవి.. లేదంటే చాట్ చేసేవి అయి ఉండొచ్చు. ఇంటర్నెట్లో మనం చూస్తున్న చాలా అకౌంట్లు, పోస్టులు, కామెంట్లు.. అన్నీ మనుషులు చేసినవి కాదని.. ఏఐ చాట్బాట్లు చేసినవి అర్థం. అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) మోడల్స్, యాంత్రిక వ్యవస్థలు ఇంటర్నెట్ను పూర్తిగా ఆక్రమించేశాయని.. తద్వారా మనం నిజమైన మనుషులతో కాకుండా, యంత్రాలతో సంభాషిస్తున్నాం అనే ఈ థియరీ చెప్పింది. ఒకరకంగా.. The Matrix సినిమా లాంటి వాస్తవికతను మాయగా చూపించే సిద్ధాంతమన్నమాట. దీనికి ఓ ప్రత్యక్ష ఉదాహరణ పరిశీలిస్తే.. సోషల్ఏఐ SocialAI అనేది డెడ్ ఇంటర్నెట్ థియరీకి ఒక ప్రాక్టికల్ ఉదాహరణ. ఇదొక సోషల్ నెట్వర్క్ యాప్. మైఖేల్ సైమన్ అనే టెక్ ప్రాడిజీ దీనిని రూపొందించాడు. ఈ యాప్లో యూజర్లు చాట్ చేస్తారు.. పోస్టులు పెడతారు.. కామెంట్లు చేస్తారు. కానీ twist ఏంటంటే.. అవతల ఉండేది నిజమైన మనిషి కాకపోవచ్చు. SocialAI లో AI బాట్స్ అచ్చం మనుషుల్లాగే స్పందిస్తాయి. చాలా పోస్టులకు వచ్చిన కామెంట్లు, లైక్స్ అన్నీ కృత్రిమంగా రూపొందించబడినవే. అంటే.. అక్కడ ఉండేది మనిషా? బాట్? అనేదానిపై స్పష్టత లేకుండా పోతుంది.అందుకే అంత రీచ్..సోషల్ మీడియాలో లైకులు, షేర్ల కోసం జరిగే పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ క్రమంలో.. 2016 తర్వాత ఇంటర్నెట్లో నిజమైన యూజర్ యాక్టివిటీ తగ్గిపోయిందన్నది Dead Internet Theory థియరీ చెప్పేది. ఎక్కువ కంటెంట్ బాట్స్, AI, ఆటోమేటెడ్ సిస్టమ్లు తయారు చేస్తున్నాయని, ఫోరమ్లు, సోషల్ మీడియా, కామెంట్స్ అన్నీ నిజమైన మనుషుల నుంచి రావడం తగ్గిపోయిందని చెబుతుందీ సిద్ధాంతం. సపోజ్.. సోషల్ మీడియాలో కొన్ని పోస్టులను గమనించండి. ఆ యూజర్కు పెద్ద ఫాలోయింగ్ ఉండడు. కానీ ఉన్నట్లుండి అతను చేసే ఓ పోస్టుకు విపరీతంగా లైకులు, షేర్లు వస్తాయి. అలాగని అందులోవన్నీ జెన్యూన్గా వచ్చినవి అనుకుంటే పొరపాటే. అదంతా యంత్రుడి మాయాజాలం. యూజర్లు వ్యక్తపర్చాల్సిన అభిప్రాయాలు, ఆన్లైన్ అనుభవాలు.. క్రమంగా కృత్రిమంగా ప్రభావితం అవుతూ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఎలాన్ మస్క్ ట్విటర్ను చేజిక్కించుకున్నాక.. కంటెంట్ క్రియేటర్లకు డబ్బు ఇచ్చే విధానం ప్రారంభమైంది. దీంతో AI బాట్ల వినియోగం విపరీతంగా పెరిగింది. ఏఐ ఆధారిత ఇమేజ్లు, పోస్టులు పెరిగిపోయాయి. తద్వారా ఇష్టానుసారం చేస్తున్న పోస్టులతో రీచ్ దక్కుతోంది. నష్టాలేంటంటే.. నిన్నటి దాకా ఇది ఒక conspiracy theory. కానీ, ఇప్పుడది నిజమై ఉంటుందని ఆల్ట్మన్ పోస్ట్తో స్పష్టమవుతోంది. అయితే ఏఐ బాట్లతో ముప్పు ఉందనే సైబర్ విశ్లేషకులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తూ వస్తున్నారు. వాటి మీద ఆధారపడడం వల్ల మనిషి బుర్రకు పదును పెట్టకపోవడంతో.. స్కిల్స్ మరుగున పడిపోతుంది. మానవ సంబంధాల ప్రామాణికత తగ్గిపోతుంది. ఒక్కోసారి వినియోగదారుల మానసిక స్థితిపై ప్రభావం చూపొచ్చు. అంతేకాదు.. నిజమైన సమాచారాన్ని గుర్తించడం కష్టంగా ఉంటోంది. వెరసి సామాజిక మాధ్యమాలు ఒక యాంత్రిక మాయాజాలంగా మారుతున్నాయి.నిన్ను నీవే మర్చిపోయిన వేళ.. నియంత్రణ నీ చేతుల్లో లేదు. సృష్టి నీదే అయినా, ఆట మాత్రం ఇంకెవరో ఆడుతున్నారు.కొసమెరుపు.. ఏఐ బాట్లు, డీప్ఫేక్లు పెరిగిపోయిన కాలంలో.. నిజమైన వాటిని గుర్తించడం కష్టంగా మారుతోంది. అందుకే ఆన్లైన్లో మనుషులు తమను నిరూపించుకోవడానికి ఒక సాంకేతిక పరిష్కారం అవసరమని సామ్ ఆల్ట్మన్ భావించారు. అలా 2023 జులై 24న పుట్టిందే Worldcoin ప్రాజెక్టు(2019లోనే బీజం పడింది). దీని ద్వారా మనిషి ఐరిస్ ఆధారంగా ఇంటర్నెట్ వినియోగం కోసం ఓ యూనిక్ ఐడీ(Proof of Personhood) ఇస్తారు. అప్పుడు అవతల ఉంది మనిషా? లేకుంటే ఏఐ చాట్బాట్ అనేదానిపై స్పష్టత వస్తుంది. ఇందులో మనుషుల గుర్తింపును రక్షించేందుకు బ్లాక్చెయిన్, బయోమెట్రిక్ వెరిఫికేషన్ వంటివి ఉపయోగిస్తారు. వివిధ దేశాలకు చెందిన కోటి 20 లక్షల మంది ఈ ప్రాజెక్టులో భాగం అయ్యారు. ఈ యాప్ ద్వారా 26 లక్షల అకౌంట్లు క్రియేట్ అయ్యాయి. అయితే ఏఐ కాలంలో.. నిజమైన మనిషిని గుర్తించడానికి ఇది ఒక వినూత్న పరిష్కారమే అయినప్పటికీ సవాళ్లు మాత్రం తప్పడం లేదు. అలా వరల్డ్నెట్వర్క్ ప్రాజెక్టు నత్తనడకన ముందుకు సాగుతోంది.:::వెబ్డెస్క్ ప్రత్యేకం -
మన గోప్యత బజారుపాలు!
ఒకప్పుడు వ్యక్తిగత గోప్యతకు మన సమాజం అత్యంత ప్రాధాన్యాన్ని ఇచ్చేది. తిన్నా, తినకపోయినా, ఎన్ని కష్టాలు, నష్టాలు వచ్చినా... అన్నీ నాలుగు గోడల మధ్యనే జరిగిపోయేవి. ఏ ఒక్క విషయమూ గడప దాటి బయటకు పోయేది కాదు. ఒకవేళ బయటి వారికి తెలిస్తే తమ కుటుంబ గౌరవానికి, పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లినట్లు బాధపడేవారు. స్నేహితులైనా, హితులైనా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడి పంపించే వారు.కానీ నేటి అంతర్జాల యుగంలో, డిజిటల్ సాంకేతికతలో వచ్చిన పెను మార్చుల వల్ల మనది అంటూ ఏ ఒక్క రహస్యం కూడా మిగలకుండా పోతోంది. వ్యక్తిగత గోప్యత కోసం మన చుట్టా మనం కట్టుకున్న గోడలు బద్దలవుతున్నాయి. మనం తినే తిండి దగ్గర నుంచి, మన ఇష్టానిష్టాలు, వ్యాపకాలు, స్నేహాలు, భావాలు, మన అభిరుచులు... ఇలా ఒకటేమిటి అన్నీ బహిర్గతం అయి పోతున్నాయి. మనమందరం ఏఐ సాంకేతికను వాడుకుంటున్నాము అని సంతోషపడుతున్నాము. కానీ నిజానికి అదే మనల్ని వాడుకుంటోంది. ఇప్పుడు ఏఐ సాంకేతికతకు ముడి సరుకు మనుషులు, వారి అలవాట్లే.ఇప్పుడు అందరం ఆ ఏఐ ఆడించే తోలుబొమ్మలం. ఏఐ ఆధారిత అనువర్తనాలు ఆడిస్తున్నట్లు ఆడతున్నాం. అంతర్జాల వేదికలయిన ఫేస్బుక్, వాట్సాప్ వంటి వాటిల్లో మనకు ఖాతా ఉంటే చాలు... మనల్ని మనం అమ్ముకున్నట్టే! మనకు తెలియకుండానే మనల్ని ఎవరో పల్లకీల్లో ఉరేగిస్తుంటారు. మనకు తెలియకుండానే మనల్ని అమ్మేస్తుంటారు. మన చుట్టూ మనకు తెలియకుండానే ఏఐ అనువర్తనాల నిఘా వ్యవస్థలు సాలెగూడుల్లా అల్లుకుపోయి ఉన్నాయి. పొరపాటున మనం అంతర్జాలంలోని అనువర్తనాల ద్వారా ఏదన్నా వస్తువు కొన్నా, ఇష్టమైన తిండి గురించి చూసినా, నచ్చిన టాపిక్పై వార్తలు చదివినా, విన్నా... ఆ సమాచారం మొత్తం సేకరించి మనకు భవిష్యత్తులో ఏమి కావాలో, మనం ఏమి తినాలో, ఏ సినిమా చూడాలో, ఏమి చదవాలో కూడా అవే సూచిస్తున్నాయి.ఇదీ చదవండి: అలవోకగా రూ.కోట్లు సంపాదించే మార్గం..వీటివల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లడం మాత్రమే కాదు, సమాజం స్వేచ్ఛగా ఆలోచించే మెదళ్లను, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే గుండెలను కోల్పోతోంది. గోప్యత అనేది రహస్యాల గురించి కాదు... గోప్యత అనేది మన జీవనంపై మనకుండే నియంత్రణను తెలియచేస్తుంది. కానీ కాలక్రమేణా మనకు తెలియకుండా మనమే మన జీవితంపై నియంత్రణ కోల్పోతున్నాం. గోప్యత లేని ప్రపంచంలో మనకు గౌరవ మర్యాదలు ఉండవు. మనలో మానవత్వం హరించుకుపోయి, మార్కెట్లకు అనుగుణంగా బతకటానికి అలవాటుపడతాము.గోప్యతను కాపాడుకోవటం మన నైతిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వ బాధ్యత. ఇందుకోసం అందరం బాధ్యత తీసుకుని, మరొకరి గోప్యతకు భంగం వాటిల్లే పనులకు స్వస్తి చెప్పాలి. విద్యా విధానంలో కూడా కేవలం ఆధునిక సాంకేతికతను చొప్పించడమే కాక... నైతిక, మానవతా విలువలను ఇమిడ్చినప్పుడే రేపటి తరానికి జీవితపు విలువ తెలిసివస్తుంది. – ఈదర శ్రీనివాస రెడ్డి, ప్రొఫెసర్ -
రొమాన్స్ స్కామ్: రూ.6 లక్షలు పోగొట్టుకున్న మహిళ
ఆన్లైన్ మోసాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్త వహించాలని అధికారులు ఎంతచెప్పినా.. ప్రజలు మోసపోతున్నారు. ఇటీవల జపాన్కు చెందిన 80 ఏళ్ల మహిళ.. వ్యోమగామినని చెప్పుకుని పరిచయమైన మోసగాడి భారినపడి దాదాపు రూ. 6 లక్షలు పోగొట్టుకుంది.జపాన్లోని ఉత్తరాన ఉన్న హక్కైడోకు చెందిన 80 ఏళ్ల మహిళ.. జూలైలో సోషల్ మీడియాలో తాను వ్యోమగామి అని చెప్పుకునే స్కామర్ను కలిసింది. కొంత సంభాషణ తరువాత.. తాను ప్రస్తుతం అంతరిక్ష నౌకలో.. అంతరిక్షంలో ఉన్నానని, ఆక్సిజన్ అవసరం ఉందని మహిళతో చెప్పాడు. ఆక్సిజన్ కొనడానికి డబ్బు కావాలని ఆమెను కోరాడు. ఒంటరిగా ఉన్న మహిళ ఆ మోసగాడిపై ప్రేమ పెంచుకుని.. 5000 పౌండ్లు (సుమారు రూ.6 లక్షలు) డబ్బు పంపింది. చివరకు మోసపోయానని తెలుసుకుంది.చివరికి చేసేదేమీ లేక పోలీసులను సంప్రదించింది. వారు దీనికి 'రొమాన్స్ స్కామ్' (అపరిచిత వ్యక్తులపై ప్రేమ పెంచుకోవడం) అని పేరుపెట్టారు. సోషల్ మీడియాలో మీకు పరిచయమైన వారు.. ఎవరైనా మీ నుంచి డబ్బు డిమాండ్ చేస్తే.. దయచేసి స్కామ్ జరిగే అవకాశం ఉందని తెలుసుకోండి. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి అని పోలీసు అధికారి హెచ్చరించారు.ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగిన దేశాల జాబితాలో జపాన్ ఒకటి. దీంతో ఇక్కడ మోసాలు పెరుగుతున్నాయి. జపాన్ నేషనల్ పోలీసు ఏజెన్సీ ప్రకారం.. 2024 మొదటి 11 నెలల్లో 3,326 రొమాన్స్ స్కామ్లు నమోదయ్యాయి. ఈ కేసులు 2023తో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువ.గతంలో రొమాన్స్ స్కామ్లు వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని.. ఇలాంటి రొమాన్స్ స్కామ్లు జరగడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో, ఒక ఆస్ట్రేలియన్ మహిళ ఆన్లైన్ మోసగాళ్ల వలలో పడి రూ.4.3 కోట్లకు పైగా పోగొట్టుకుంది. డేటింగ్ యాప్లో పరిచయమైనా.. అపరిచితుడు మలేషియాలోని కౌలాలంపూర్లో తన పర్సు దొంగిలించబడినందున తనకు రూ.2,75,000 అవసరమని ఆమెకు చెప్పాడు. నిజమని నమ్మిన ఆ మహిళ డబ్బు పోగొట్టుకుంది.ఇదీ చదవండి: భారత్పై ప్రశ్న.. చైనా రోబో సమాధానం -
ఫేస్బుక్లో జుకర్ బర్గ్ బ్యాన్.. కేసేసిన జుకర్ బర్గ్
వాషింగ్టన్: ఫేస్బుక్లో తనని బ్యాన్చేయడంపై జుకర్ బర్గ్ కోర్టులో కేసు వేశాడు. ఈ కేసు ఇప్పటిది కాదు.. గత ఎనిమిదేళ్లుగా కోర్టులో నలుగుతూనే ఉంది. ఇంతకీ.. ఫేస్బుక్ తనని బ్యాన్ చేయడంపై జుకర్ బర్గ్ కేసు ఎందుకు పెట్టారని అనుకుంటున్నారా? అమెరికాలో 38వ అతిపెద్ద రాష్ట్రం ఇండియానా. ఇప్పుడీ రాష్ట్రానికి చెందిన మార్క్ స్టీవెన్ జుకర్బర్గ్ అనే న్యాయవాది.. మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్పై న్యాయపోరాటం చేస్తున్నారు. గత ఎనిమిదేళ్లుగా మెటా(గతంలో ఫేస్బుక్) తన అకౌంట్ను బ్యాన్ చేసిందని, ఫలితంగా భారీ మొత్తంలో నష్టపోయినట్లు కోర్టులో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ న్యాయవాది పేరు మార్క్ జుకర్ బర్గ్. కానీ అతను మెటావర్స్ నిర్మించడంలో కాదు. దివాళా కేసుల్లో వాదిస్తుంటారు. 2017 నుండి తన న్యాయ సేవలను ప్రచారం చేసేందుకు ఫేస్బుక్ పేజీని ప్రారంభించారు. ఇందుకోసం 11వేల డాలర్ల కంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేశాడు. కానీ అతని పేజీని తరచూ ఫేస్బుక్ బ్లాక్ చేస్తూనే ఉంది. ఎందుకు అని ప్రశ్నిస్తే.. మీరు ఫేస్బుక్ అధినేత జుకర్బర్గ్ను అనుకరిస్తున్నారనే సమాధానం చెబుతోంది. తనను తానే నిరూపించుకోవడం అతనికి రోజువారీ తలనొప్పిగా మారింది.ఇదే విషయంపై స్థానిక టీవీ ఛానల్కు మాట్లాడుతూ, "బిలియనీర్ జుకర్బర్గ్ స్కూల్ పూర్తిచేసేలోపే నేను న్యాయవాదిగా పని చేస్తున్నాను’ అని చెప్పారు. ఇది మీకు వ్యంగ్యంగా అనిపించవచ్చు. కానీ ఆర్ధికంగా నష్టపోయేది నేనే కదా. డబ్బుపోయా, శనిపట్టుకుంది అన్న చందంగా ఫేస్బుక్ నా అకౌంట్ను బ్యాన్ చేయడంతో బిజినెస్ను కోల్పోయాను. iammarkzuckerberg.com అనే వెబ్సైట్ను ప్రారంభించి అందులో తన సర్వీసులు అందిద్దామంటే ఆఫ్లైన్లో క్లయింట్స్కాల్స్ చేస్తే ప్రాంక్ కాల్ అనుకుని కట్ చేస్తున్నారని కోర్టులో వాపోతున్నారు. ‘నేను మార్క్ స్టీవెన్, అతను మార్క్ ఎలియట్. ఇది సరదాగా చెప్పడం లేదు. మెటా నిర్ణయం వల్ల నేను వేలాది డాలర్లు నష్టపోవడం నాకు కోపం తెప్పించింది. 40 ఏళ్లుగా న్యాయవృత్తిలో ఉన్నా. ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ ఎలియట్ జుకర్బర్గ్ చిన్నపిల్లవాడిగా ఉన్నప్పటి నుంచే నేను ఈ వృత్తిలో ఉన్నా. నన్ను మెటాలో బ్యాన్ చేయడం తగదు అని అన్నారు. ఈ సందర్భంగా ఫేస్బుక్ వ్యవస్థాపకుడికి ఓ ఆఫర్ కూడా ఇచ్చాడు. ఈ గ్రహం మీద అత్యంత ధనవంతులలో ఒకరైన జుకర్బర్గ్ తనని క్షమించమని కోరవచ్చు. లేదంటే అతని పడవలో గడిపేందుకు నాకు ఓ వారం రోజుల పాటు అనుమతిస్తే.. కోర్టులు, కేసులు అవసరం ఉండదని చెప్పాడు. మార్క్ స్టీవెన్ దావా వేయడంపై మెటా స్పందించింది. జుకర్బర్గ్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ సమస్య మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం'అని పేర్కొంది. -
కోవాసెంట్ నుంచి.. ఏఐ ఏజెంట్ కంట్రోల్ టవర్
కోవాసెంట్ టెక్నాలజీస్ తాజాగా ఏఐ ఏజెంట్ కంట్రోల్ టవర్ (ఏఐ–యాక్ట్) పేరిట కొత్త టూల్ను ఆవిష్కరించింది. వివిధ ఏఐ ప్రోగ్రాంలను (లేదా ఏజెంట్లను) సమన్వయపర్చుకుంటూ, వాటిని సమర్ధవంతంగా ఉపయోగించుకోవడంలో కంపెనీలకు ఇది సహాయకరంగా ఉంటుంది.ప్రస్తుతం వివిధ కార్యకలాపాలకు వివిధ ఏఐ ఏజెంట్లను ఉపయోగిస్తుండటం వల్ల గందరగోళం, భద్రతాపరమైన రిస్కులు తలెత్తుతున్నాయని కోవాసెంట్ టెక్నాలజీస్ సీఎండీ సీవీ సుబ్రమణ్యం తెలిపారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఏఐ ఏజెంట్లన్నింటికీ ఏఐ యాక్ట్ అనేది ఒక సెంట్రల్ కంట్రోల్ రూమ్లాగా పని చేస్తుందని ఆయన వివరించారు. -
మరో అడుగు ముందుకేసిన స్టార్లింక్..
భారతదేశంలో ట్రయల్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవలను ప్రారంభించడానికి, ఎలాన్ మస్క్కు చెందిన 'స్టార్లింక్'.. టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) నుంచి తాత్కాలిక స్పెక్ట్రమ్ క్లియరెన్స్ను పొందిందని. దీంతో కంపెనీ తన కార్యకలాపాలను త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.స్పెక్ట్రమ్ క్లియరెన్స్ పొందటంతో.. స్టార్లింక్ ఇప్పుడు దాని గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మించి, భద్రతా సమ్మతి పరీక్షలను నిర్వహిస్తుంది. దీనికోసం కంపెనీ ముంబై కేంద్రంగా 10 ప్రదేశాలలో బేస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.భారతదేశంలో తన గ్రౌండ్ స్టేషన్ను ఏర్పాటు చేయడానికి ల్యాండింగ్ స్టేషన్ హార్డ్వేర్తో సహా పరికరాలను తీసుకురావడానికి స్టార్లింక్ దిగుమతి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసింది. అంతే కాకుండా.. స్టార్లింక్ ఇటీవలే తన లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LoI) కింద అన్ని భద్రతా అవసరాలను తీర్చిన తర్వాత గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ (GMPCS) లైసెన్స్ను పొందిన తాజా ఆపరేటర్గా అవతరించింది. ఇప్పటికే 100 కంటే దేశాల్లో స్టార్లింక్ సేవలు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: భారత్పై ప్రశ్న.. చైనా రోబో సమాధానంస్టార్లింక్ ఇంటర్నెట్ కోసం ఆధార్ వెరిఫికేషన్స్టార్లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్.. ఈ-కేవైసీ వెరిఫికేషన్ కోసం ఆధార్ను ఉపయోగించడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI)తో ఇప్పటికే భాగస్వామ్యం కుదుర్చుకుంది. స్టార్లింక్ ఇంటర్నెట్ కోసం ఈకేవైసీ చేసుకున్న యూజర్లు హైస్పీడ్ ఇంటర్నెట్ ఆస్వాదించవచ్చు. -
భారత సెమీకండక్టర్ మిషన్లో సీబీఐటీ భాగస్వామ్యం
భారతదేశపు స్వదేశీ సెమీకండక్టర్ చిప్ రూపకల్పనలో చైతన్య భారతీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(సీబీఐటీ) కీలకపాత్ర పోషించినట్లు పేర్కొంది. వీఎల్ఎస్ఐ డిజైన్, అధునాతన చిప్ అభివృద్ధిలో సంస్థ నైపుణ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ, సీబీఐటీను దేశంలోని సెమీకండక్టర్ మిషన్లో భాగస్వామ్య సంస్థగా ఎంపిక చేసింది. ఇటీవల జరిగిన సెమీకాన్ ఇండియా 2025లో సీబీఐటీ, ఉస్మానియా యూనివర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన సెమీకండక్టర్ చిప్ను ప్రదర్శించారు.సెప్టెంబర్ 2న న్యూఢిల్లీలో జరిగిన సెమీకాన్ ఇండియా 2025 సదస్సులో సీబీఐటీ-ఓయూ రూపొందించిన చిప్ను కూడా ప్రదర్శించినట్లు సీబీఐటీ పేర్కొంది. ఇది దేశీయ సెమీకండక్టర్ రూపకల్పనలో ఆత్మనిర్భరత దిశగా సంస్థ చేసిన కృషిని ప్రతిబింబిస్తుందని తెలిపింది. ఈ ప్రాజెక్ట్లో భాగంగా ‘హై-రిజల్యూషన్ ఫేజ్ లాక్డ్ లూప్(ఏడీపీఎల్ఎల్)’ చిప్ను తయారు చేసినట్లు పేర్కొంది. ఇందులో 180 ఎన్ఎం సీమోస్ టెక్నాలజీ నోడ్ను ఉపయోగించినట్లు తెలిపింది. దీన్ని మోహాలీలోని సెమీకండక్టర్ ల్యాబొరేటరీలో ఉస్మానియా యూనివర్సిటీ సహాయంతో తయారు చేసినట్లు వివరించింది.ఈ సందర్భంగా సీబీఐటీ అధ్యక్షులు ఎన్.సుభాష్ ఇతర బోర్డు సభ్యులను అభినందిస్తూ..‘ఈ విజయం సీబీఐటీకి గర్వకారణమని, వీఎల్ఎస్ఐ , సెమీకండక్టర్ టెక్నాలజీలో మరింత పురోగతి సాధించేందుకు సంస్థ మరిన్ని పరిశోధనా అవకాశాలు, మద్దతు అందిస్తుంది’ అని హామీ ఇచ్చారు. సీబీఐటీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి.వి.నరసింహులు మాట్లాడుతూ..‘ఇది ఆత్మనిర్భర్ భారత్ దిశగా సంస్థ చేసిన కృషి’ అన్నారు. ఈ ప్రాజెక్ట్లో డా.మొహమ్మద్ జియౌద్దీన్ జహంగీర్ (చీఫ్-ఇన్వెస్టిగేటర్), డా.డి.కృష్ణరెడ్డి (కో చీఫ్-ఇన్వెస్టిగేటర్), పి.శిరీషా, పి.చరిష్మా (ప్రాజెక్ట్ సిబ్బంది)ఉన్నారు.ఇదీ చదవండి: ఇన్సైడర్ ట్రేడింగ్కు చెక్ పెట్టాలి -
50 కోట్లు దాటిన కస్టమర్లు.. అదిరే ఆఫర్లు ప్రకటించిన జియో
ప్రముఖ ప్రైవేట్ టెలికాం సంస్థ రిలయన్స్ జియో వార్షికోత్సవ వేళ అరుదైన మైలురాయిని దాటింది. తమ వినియోగదారుల సంఖ్య 500 మిలియన్ల మైలురాయిని అధిగమించిందని జియో తాజాగా ప్రకటించింది. దీని ప్రకారం జియో యూజర్ బేస్ అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్ల మొత్తం జనాభా కంటే ఎక్కువ. సెప్టెంబర్ 5న జియో 9వ వార్షికోత్సవాన్ని జరుపుకొంటోంది."జియో 9వ వార్షికోత్సవం సందర్భంగా, 500 మిలియన్లకు పైగా భారతీయులు మాపై నమ్మకం ఉంచడం నాకు నిజంగా గర్వంగా అనిపిస్తుంది. ఒకే దేశంలో ఈ స్థాయిని చేరుకోవడం జియో రోజువారీ జీవితంలో ఎంతగా భాగమైందో ప్రతిబింబిస్తుంది. ఇది శక్తివంతమైన డిజిటల్ సమాజాన్ని రూపొందించడంలో కనెక్టివిటీ అద్భుతమైన శక్తిని చూపిస్తుంది" అని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్ ఆకాష్ అంబానీ అన్నారు.అదిరే ఆఫర్లుజియో 9వ వార్షికోత్సవం, 500 మిలియన్ యూజర్ బేస్ దాటిన సందర్భంగా తమ వినియోగదారుల కోసం పలు ఆఫర్లను జియో ప్రకటించింది. వీటిలో వీకెండ్ విత్ అన్లిమిటెడ్ డేటా, మంత్లీ ప్రత్యేక ఆఫర్, 12 నెలలు రీచార్జ్ చేసుకున్నవారికి 13వ నెల ప్లాన్ ఉచితం వంటివి ఉన్నాయి.యానివర్సరీ వేకెండ్వారాంతంలో అంటే సెప్టెంబర్ 5,6,7 తేదీల్లో (శుక్ర, శని, ఆది వారాలు) 5G స్మార్ట్ఫోన్ వినియోగదారులందరూ వారి ప్రస్తుత ప్లాన్తో సంబంధం లేకుండా అపరిమిత 5జీ డేటాను పూర్తిగా ఉచితంగా పొందుతారు. ఇక 4జీ స్మార్ట్ఫోన్ వినియోగదారులైతే రూ.39 డేటా యాడ్-ఆన్ను ఎంచుకోవడం ద్వారా అపరిమిత 4G డేటాను (రోజుకు గరిష్టంగా 3జీబీ) ఆనందిస్తారు.యానివర్సరీ మంత్ ఆఫర్ఈ ఆఫర్లో భాగంగా రోజుకు 2జీబీ, అంతకంటే ఎక్కువ దీర్ఘకాలిక ప్లాన్లపై వినియోగదారులు సెప్టెంబర్ 5 నుండి అక్టోబర్ 5 వరకు నెలంతా పలు ప్రయోజనాలను పొందుతారు. ఇందులో అన్లిమిటెడ్ 5జీ, 2% అదనంగా జియో గోల్డ్, జియో హాట్స్టార్, జియో సావన్ప్రో, జొమాటో గోల్డ్, నెట్మెడ్స్ ఫస్ట్, రిలయన్స్ డిజిటల్, అజియో, ఈజ్మైట్రిప్ వంటి వాటికి సంబంధించిన రూ.3000 విలువైన సెలబ్రేషన్ వోచర్లు, జియోహోమ్ 2 నెలల ఫ్రీ ట్రయల్ ఉన్నాయి. ఇప్పటికే డైలీ 2జీబీ ప్లాన్ ఉన్నవారు, రూ.349 కంటే తక్కువ ప్లాన్ ఉన్నవారు పై ప్రయోజనాలు పొందడానికి రూ.100 ప్యాక్ వేసుకుంటే సరిపోతుంది.యానివర్సరీ ఇయర్ ఆఫర్ఇక యానివర్సరీ ఇయర్ ఆఫర్ కింద జియో ప్రతినెలా రూ.349 ప్లాన్తో రీచార్జ్ చేసుకుంటున్న కస్టమర్లకు అద్భుతమైన ప్రయోజనాలను ప్రకటించింది. 12 నెలలపాటు క్రమం తప్పకుండా ప్లాన్ వేసుకున్న కస్టమర్లకు 13వ నెల ప్లాన్ను ఉచితంగా అందిస్తోంది.జియోహోమ్ ఆఫర్సెప్టెంబర్ 5 నుండి అక్టోబర్ 5 మధ్య వినియోగదారులు కేవలం రూ. 1200 (జీఎస్టీతో సహా) కు 2 నెలల జియోహోమ్ కొత్త కనెక్షన్ను పొందుతారు. -
హైదరాబాద్లో యాపిల్ విస్తరణ... మరింత స్థలం లీజు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ గ్లోబల్ సంస్థ యాపిల్ హైదరాబాద్ నగరంలో తన ఉనికిని, సేవలను మరింత విస్తరించింది. ఇందులో భాగంగా నగరంలోని ఐటీ పార్క్ వేవ్రాక్లో నూతనంగా 64,125 చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంది. ఈ విస్తరణతో సంస్థ మొత్తంగా 5 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది.అయితే వేవ్రాక్ టవర్లో యాపిల్ 64,125 చదరపు అడుగుల అదనపు కార్యాలయ స్థలానికి రూ.80.15 లక్షల నెలవారీ అద్దె చెల్లించేలా ఐదేళ్లకు లీజ్కు తీసుకున్నట్లు సమాచారం. ఇందుకుగాను చదరపు అడుగుకు రూ.125 చొప్పున చెల్లించనుంది. హైదరాబాద్లోని టీఎస్ఐ బిజినెస్ పార్క్స్ లిమిటెడ్ ద్వారా ప్రాజెక్ట్లో ఉన్న యాపిల్ ప్రస్తుత కార్యాలయాలను విస్తరించింది. ప్రాప్స్టాక్ ప్రకారం., యాపిల్ కంపెనీ ఈ ప్రాజెక్ట్లో అనేక కార్యాలయ స్థలాలను మల్టీ లీజ్లో భాగంగా మొత్తం 5 లక్షల చదరపు అడుగుల తీసుకుంది.అద్దె ప్రారంభ తేదీ నుండి లీజుకు మూడు సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధి ఉంటుంది . ఈ సమయంలో, ఒప్పందంలో పేర్కొన్న నిర్దిష్ట షరతుల కింద తప్ప, ఏ పక్షమూ లీజును రద్దు చేయలేరు. 2016 మేలో యాపిల్ సీఈవో టిమ్ కుక్ అధికారికంగా హైదరాబాద్ కార్యాలయాన్ని ప్రారంభించారు. జియోస్పేషియల్ టెక్నాలజీ, డేటా మోడలింగ్లో ప్రత్యేకత కలిగిన యాపిల్ మ్యాప్స్కు ఇది కీలకమైన అభివృద్ధి కేంద్రంగా పనిచేస్తుంది.ఇదీ చదవండి: ఒక్కో కంపెనీ నెలకు ఎన్ని కోట్లు కడుతున్నాయో తెలుసా? -
రియల్మీ నుంచి కొత్త స్మార్ట్ఫోన్.. ఐఫోన్ స్టైల్లో..
స్మార్ట్ఫోన్స్ బ్రాండ్ రియల్మీ తాజాగా 15టీ ఫోన్ను ఆవిష్కరించింది. బ్యాంక్, ఎక్స్చేంజ్ ఆఫర్ల తర్వాత దీని ధర రూ. 18,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 50 ఎంపీ ఫ్రంట్, రియర్ కెమెరాలు, 7000 ఎంఏహెచ్ టైటాన్ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6400 మ్యాక్స్ 5జీ చిప్సెట్, అమోలెడ్ డిస్ప్లే తదితర ఫీచర్లు ఉన్నాయి. ఫ్లిప్కార్ట్, రియల్మీ వెబ్సైట్లలో సెప్టెంబర్ 6 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి.రియల్మీ 15టీ ముఖ్య ఫీచర్లుకెమెరా: 50ఎంపీ ఫ్రంట్ + 50ఎంపీ రియర్ (ఏఐ ఫీచర్లతో), 4కే వీడియో రికార్డింగ్ సపోర్ట్బ్యాటరీ: 7000ఎంఏహెచ్ టైటాన్ బ్యాటరీ, 60వాట్ల ఫాస్ట్ చార్జింగ్, 10వాట్ల రివర్స్ చార్జింగ్డిస్ప్లే: 6.57" అమోలెడ్, 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 6400 మ్యాక్స్ 5జీ చిప్సెట్ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్మీ యూఐ 6.0డిజైన్: 7.79ఎంఎం స్లిమ్ బాడీ, IP66/IP68/IP69 రేటింగ్తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ధరలు, ఆఫర్లు8జీబీ + 128జీబీ వేరియంట్ అసలు ధర ధర 20,999 కాగా ఆఫర్ ధర (బ్యాంక్/ఎక్స్చేంజ్ తర్వాత) రూ.18,9998జీబీ + 256జీబీ వేరియంట్ అసలు ధర ధర 22,999 కాగా ఆఫర్ ధర (బ్యాంక్/ఎక్స్చేంజ్ తర్వాత) రూ.20,99912జీబీ + 256జీబీ వేరియంట్ అసలు ధర ధర 24,999 కాగా ఆఫర్ ధర (బ్యాంక్/ఎక్స్చేంజ్ తర్వాత) రూ.22,999ఈ ఫోన్ను "బడ్జెట్ ఐఫోన్ స్టైల్" అని కూడా పిలుస్తున్నారు.దాని డిజైన్, ఫీచర్లు చూస్తే ఆకట్టుకునేలా ఉంది. -
ఐఎస్ఎం 2.0తో మద్దతు: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి
ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం) రెండో వెర్షన్లో (2.0) చిప్ల తయారీ ప్రాజెక్టులతో పాటు సెమీకండక్టర్ల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించే భాగస్వామ్య సంస్థలకూ తగిన ప్రోత్సాహకాలు లభిస్తాయని మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఎక్విప్మెంట్, మెటీరియల్స్ తయారీ సంస్థలతో పాటు వ్యవస్థలోని అన్ని విభాగాలకు గణనీయంగా మద్దతు అందిస్తామని పేర్కొన్నారు.‘ఆటోమోటివ్, పవర్ ఎల్రక్టానిక్స్, కన్జూమర్ ఎల్రక్టానిక్స్, వైద్య, రక్షణ తదితర విభాగాలన్నింటికీ తోడ్పాటునివ్వాల్సిన అవసరం ఉంది. తదుపరి విడతలో సింహభాగం వాటా ప్రొడక్టుల అభివృద్ధికి ఉంటుంది’ అని మంత్రి చెప్పారు.వివిధ స్కీముల ద్వారా డిజైన్ ప్రాజెక్టులకు సంబంధించి 278 వర్సిటీలకు అత్యాధునిక ఈడీఏ (ఎల్రక్టానిక్ డిజైన్ ఆటోమేషన్) సాధనాలను అందించామని సెమీకాన్ ఇండియా 2025లో పాల్గొన్న సందర్భంగా మంత్రి తెలిపారు. 60,000 పైచిలుకు ఇంజినీరింగ్ విద్యార్థులు వీటితో 1.3 కోట్ల గంటలు పని చేసినట్లు వివరించారు. రూ. 76,000 కోట్లతో ఐఎస్ఎం తొలి విడతను ప్రకటించగా అందులో రూ. 65,000 కోట్లను చిప్ల ఉత్పత్తికి, రూ. 10,000 కోట్ల మొత్తాన్ని మొహాలీలో సెమీకండక్టర్ ల్యాబొరేటరీని ఆధునీకరించడానికి, రూ. 1,000 కోట్లను డిజైన్ ఆధారిత ప్రోత్సాహక స్కీముకు కేటాయించారు. ప్రస్తుతం ఐఎస్ఎం రెండో విడతపై కసరత్తు జరుగుతోంది. మరోవైపు, కీలకమైన సెమీకండక్టర్ల ఉత్పత్తి ప్రాజెక్టులకు సంబంధించి మొత్తం వ్యయాల్లో 70 శాతం వాటా ఇకపైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహకాలుగా లభించే అవకాశం ఉందని ఎల్రక్టానిక్స్, ఐటీ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. సెమీకండక్టర్ ప్రాజెక్టులకు భారత్ అసాధారణ స్థాయిలో మద్దతు అందిస్తోందని, 30 బిలియన్ డాలర్ల విలువ చేసే ప్రోత్సాహకాలు.. ఇతరత్రా ప్రయోజనాలు కలి్పస్తోందని వివరించారు. -
మెర్క్తో టాటా ఎలక్ట్రానిక్స్ జత
సెమీకండక్టర్ మెటీరియల్ టెక్నాలజీ దిగ్గజం మెర్క్ ఎల్రక్టానిక్స్తో టాటా ఎలక్ట్రానిక్స్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తద్వారా గుజరాత్లోని ధోలెరాలో ఏర్పాటు చేస్తున్న చిప్ ప్లాంటుకి అవసరమైన పూర్తిస్థాయి ప్రొడక్టులు, సర్విసులను ఔట్సోర్సింగ్ చేసుకోనుంది. దీనిలో భాగంగా హైప్యూరిటీ ఎలక్ట్రానిక్ మెటీరియల్స్, అడ్వాన్స్డ్ గ్యాస్, కెమికల్ డెలివరీ సిస్టమ్స్ తదితరాలను సమకూర్చుకోనుంది. 2025 సెమీకాన్ ఇండియా సదస్సు సందర్భంగా కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమక్షంలో రెండు సంస్థలు అవగాహన ఒప్పందాన్ని (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. -
ప్రపంచాన్ని మార్చే భారత్ చిప్!
న్యూఢిల్లీ: భారత్లో తయారైన ఓ చిన్న చిప్ ప్రపంచంలో పెద్ద మార్పును తీసుకొస్తుందని, అది ఎంతో దూరంలో లేదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సెమీకాన్ ఇండియా 2025 సదస్సును ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మాట్లాడారు. భారత్లో రూపుదిద్దుకుని, భారత్లో తయారైందంటూ ప్రపంచమంతా మర్మోగే రోజు ఎంతో దూరంలో లేదన్నారు.18 బిలియన్ డాలర్ల విలువ చేసే 10 సెమీకండక్టర్ ప్రాజెక్టులు ప్రస్తుతం అమలు దశలో ఉన్నాయంటూ.. తదుపరి దశ భారత సెమీకండక్టర్ మిషన్ దిశగా అడుగులు వేస్తున్నట్టు ప్రకటించారు. ట్రిలియన్ డాలర్ల అంతర్జాతీయ చిప్ మార్కెట్లో స్థానాన్ని సంపాదించడమే భారత్ లక్ష్యమని పేర్కొన్నారు. వివిధ దేశాలకు చెందిన సెమీకండక్టర్ నిపుణులు, 50 దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో భారత యువ శక్తి, ఆవిష్కరణలు ప్రస్ఫుటమవుతున్నట్టు ప్రధాని వ్యాఖ్యానించారు. భారత్ను ప్రపంచం విశ్వసిస్తున్నట్టు ఇది స్పష్టమైన సంకేతం పంపిస్తుందన్నారు. భారత్తో కలసి సెమీకండక్టర్ భవిష్యత్ నిర్మాణానికి ప్రపంచం సుముఖంగా ఉన్నట్టు చెప్పారు. డిజిటల్ డైమండ్స్...చిప్లపై ప్రధాని మోదీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆయిల్ అన్నది నల్ల బంగారం. కానీ చిప్లు అన్నవి డిజిటల్ వజ్రాలు’’అని పేర్కొన్నారు. చమురు గత శతాబ్దాన్ని మలుపు తిప్పగా, 21వ శతాబ్దాన్ని చిన్న చిప్లు నడిపించనున్నట్టు చెప్పారు. పరిమాణంలోనే చిన్నవే అయినా ప్రపంచ పురోగతిని వేగవంతం చేస్తాయని అభిప్రాయపడ్డారు. నోయిడా, బెంగళూరులో ఏర్పాటు చేసిన డిజైన్ కేంద్రాలు ప్రపంచంలోనే అత్యాధునికమైన చిప్ల అభివృద్ధిపై పనిచేస్తున్నాయని, అవి బిలియన్ల లావాదేవీలను నిల్వ చేయగలవన్నారు.‘‘ప్రస్తుతం ప్రపంచ సెమీకండక్టర్ మార్కెట్ 600 బిలియన్ డాలర్లుగా ఉంటే, రానున్న సంవత్సరాల్లో ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. సెమీకండక్టర్ రంగంలో సాధిస్తున్న పురోగతి దృష్ట్యా భవిష్యత్తులో ట్రిలియన్ డాలర్ల మార్కెట్లో భారత్ చెప్పుకోతగ్గ వాటాను సొంతం చేసుకుంటుంది’’అని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ పెద్ద హృదయంతో ఇన్వెస్టర్లకు ఆహ్వానం పలుకుతున్నట్టు ప్రకటించారు. భారత విధానాలు స్వల్పకాలం కోసం కాదంటూ ప్రతి ఇన్వెస్టర్ అవసరాలకు అనుగుణంగా ఉంటాయన్నారు.సెమీకండక్టర్ రంగంలో వేగం ముఖ్యమంటూ.. దరఖాస్తు నుంచి ఫ్యాక్టరీ నిర్మాణం వరకు పేపర్ పని తక్కువగా ఉంటే వేఫర్ తయారీ వేగంగా సాధ్యపడుతుందని చెప్పారు. ప్రభుత్వం ఇదే ధోరణితో పనిచేస్తున్నట్టు తెలిపారు. జాతీయ స్థాయిలో సింగిల్ విండో ద్వారా అన్ని అనుమతులను ఇస్తున్నట్టు చెప్పారు. వెంటనే కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా దేశవ్యాప్తంగా సెమీకండక్టర్ పార్క్లను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. భూమి, విద్యుత్, పోర్ట్, ఎయిర్పోర్ట్లతో అనుసంధానత, నిపుణులైన మానవవనరులు ఇలా అన్ని అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. వీటితో పారిశ్రామికవృద్ధి వేగవంతం అవుతుందన్నారు. సీజీ పవర్కు చెందిన సెమీకండక్టర్ పైలట్ ప్లాంట్ ఆగస్ట్ 28న కార్యకలాపాలు మొదలు పెట్టిందని, కేనెస్ టెక్నాలజీ ప్లాంట్ పైలట్ పనులు త్వరలోనే ప్రారంభించనున్నట్టు చెప్పారు. మైక్రాన్ టెక్నాలజీ, టాటా ఎలక్ట్రానిక్స్ ఇప్పటికే తయారీ కార్యకలాపాలు మొదలు పెట్టాయని, వాణిజ్య చిప్ ఉత్పత్తి ఈ ఏడాదే మొదలవుతుందని ప్రధాని ప్రకటించారు. విక్రమ్.. తొలి మేడిన్ ఇండియా చిప్భారత్లో రూపుదిద్దుకుని, ఇక్కడే తయారైన విక్రమ్ 32 బిట్ మైక్రో ప్రాసెసర్తో పాటు ఇతర టెస్ట్ చిప్లను ప్రధాని మోదీకి కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ ఇదే కార్యక్రమంలో అందజేశారు. ఈ తొలి మేడిన్ ఇండియా చిప్ విక్రమ్ను ఇస్రో సెమీకండక్టర్ ల్యాబ్ అభివృద్ధి చేసింది. కఠినమైన ఉపగ్రహ ప్రయోగ పరిస్థితుల్లోనూ వినియోగించేందుకు అనుకూలంగా రూపొందించారు. సెమీకండక్టర్ మిషన్ ప్రారంభించిన మూడున్నరేళ్లలోనే ప్రపంచం భారత్వైపు చూసేలా పురోగతి సాధించినట్టు మంత్రి అశ్వని వైష్ణవ్ పేర్కొన్నారు. -
శాంసంగ్ నుంచి ఏ17 స్మార్ట్ఫోన్: ధర ఎంతంటే?
పండుగ సీజన్ సందర్భంగా.. కన్జూమర్ ఎల్రక్టానిక్స్ దిగ్గజం శాంసంగ్ తాజాగా తమ గెలాక్సీ ‘ఏ’ సిరీస్ స్మార్ట్ఫోన్లను విస్తరించింది. ఇందులో భాగంగానే 5జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలు గల ఏ17ని ఆవిష్కరించింది. దీని ధరలు రూ. 18,999 నుంచి రూ. 23,499గా ఉన్నాయి.హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ కార్డులు, యూపీఐ ద్వారా రూ. 1,000 వరకు క్యాష్బ్యాక్ లభిస్తుందని సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఆదిత్య బబ్బర్ తెలిపారు. ఈ విభాగంలో అత్యంత పల్చని, తేలికైన ఫోన్ ఇదేనని ఆయన చెప్పారు. 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, ఎక్సినోస్ ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరా, 14 ప్రాంతీయ భాషల్లో జెమినీ లైవ్ సపోర్ట్ తదితర ప్రత్యేకతలు ఇందులో ఉంటాయని ఆదిత్య వివరించారు.6 జనరేషన్స్ వరకు ఆండ్రాయిడ్, 6 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ ఆఫర్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ఆఖరు నాటికి పది కోట్ల ‘ఏ’ సిరీస్ స్మార్ట్ఫోన్ల అమ్మకాలు సాధించాలని నిర్దేశించుకున్నట్లు, ఇప్పటివరకు 9.7 కోట్లు విక్రయించినట్లు ఆయన పేర్కొన్నారు. -
డిజిటల్ డైమండ్.. ఈ శతాబ్దం దీనికే!.. నరేంద్ర మోదీ
భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచంలోని చాలా దేశాలు ఇండియా వైపు చూస్తున్నాయి. ఈ తరుణంలో న్యూఢిల్లీలో జరిగిన 'సెమికాన్ ఇండియా 2025' శిఖరాగ్ర సమావేశంలో.. సెమీకండక్టర్ల పెరుగుతున్న ప్రాముఖ్యతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించారు.ఈ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి మాట్లాడుతూ.. పెట్టుబడిదారులందరినీ స్వాగతించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రపంచంలోని చాలా దేశాలు.. భారతదేశంలో తయారైన వాటిని విశ్వసిస్తున్నాయి అని చెప్పే రోజు ఎంతో.. దూరంలో లేదని అన్నారు. ప్రపంచంలో.. చమురును నల్ల బంగారం అని, చిప్స్ను డిజిటల్ డైమండ్స్ అంటారని అన్నారు. గత శతాబ్దం మొత్తం చమురుకు ప్రాధాన్యత ఇచ్చింది. కానీ 21వ శతాబ్దం మాత్రం చిప్కే పరిమితం అని అన్నారు. ఈ చిప్ ప్రపంచ అభివృద్ధిని వేగవంతం చేసే శక్తిని కలిగి ఉందని మోదీ పేర్కొన్నారు.#WATCH | At Semicon India 2025, Union Minister for Electronics & Information Technology, Ashwini Vaishnaw presents Vikram 32-bit processor and test chips of the 4 approved projects to PM Narendra Modi.Vikram 32-bit processor is the first fully “Make-in-India” 32-bit… pic.twitter.com/8FCkbe0sve— ANI (@ANI) September 2, 2025కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ సెమికాన్ ఇండియాలో.. ప్రధాని మోదీకి విక్రమ్ 32 బిట్ ప్రాసెసర్, టెస్ట్ చిప్లను అందజేశారు. మన ప్రధానమంత్రిని దూరదృష్టితో కొత్త ఆరంభం కోసం మొదటిసారి కలిశాము. అప్పుడే మేము ఇండియా సెమీకండక్టర్ మిషన్ను ప్రారంభించాము. ఇది 3.5 సంవత్సరాల వ్యవధిలోనే.. ప్రపంచం భారతదేశం వైపు నమ్మకంగా చూసేలా చేసింది. నేడు, ఐదు సెమీకండక్టర్ యూనిట్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. మేము ఇప్పుడు మొదటి 'మేడ్-ఇన్-ఇండియా' చిప్ను ప్రధాని మోదీకి అందించామని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నాడు.ఇదీ చదవండి: యూరోపియన్ దేశాలకు.. మోదీ ప్రారంభించిన కారుగత కొన్ని సంవత్సరాలుగా సెమికాన్ ఇండియా ప్రణాళిక కింద జరుగుతున్న పురోగతి గురించి కూడా ప్రధాని మోదీ మాట్లాడారు. 2023 నాటికి, భారతదేశంలో మొట్టమొదటి సెమీకండక్టర్ ప్లాంట్ సిద్ధమైంది. 2024లో మేము అదనపు ప్లాంట్లను ఆమోదించాము. 2025లో మరో ఐదు అదనపు ప్రాజెక్టులను క్లియర్ చేసాము. మొత్తం మీద ప్రభుత్వం పది సెమీకండక్టర్ ప్రాజెక్టులలో రూ. 1.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నారు. ఇది భారతదేశంపై ప్రపంచ దేశాలు పెంచుకున్న నమ్మకానికి నిదర్శనమని అన్నారు.First ‘Made in India’ Chips!A moment of pride for any nation. Today, Bharat has achieved it. 🇮🇳This significant milestone was made possible by our Hon’ble PM @narendramodi Ji’s far-sighted vision, strong will and decisive action. pic.twitter.com/ao2YeoAkCv— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) September 2, 2025 -
యూరాలజీ సర్జరీల్లో రోబోల యుగం
హైదరాబాద్: యూరాలజీ విభాగంలో చేసే శస్త్రచికిత్సల్లో రోబోల యుగం వచ్చేసిందని, అమెరికా లాంటి దేశాల్లో అయితే అది తప్పనిసరి కూడా అయ్యిందని పలువురు వక్తలు పేర్కొన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా అందరూ తమకు వీలైనంత చిన్న కోతలతో సర్జరీలు కావాలని అడుగుతున్నారని, ముఖ్యంగా రోబోటిక్ శస్త్రచికిత్సల వల్ల తమకు ఇబ్బంది తక్కువనే భావన అందరిలోనూ వచ్చిందని అంతర్జాతీయ వైద్య నిపుణులు చెప్పారు. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్యూ) ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన రోబో-ల్యాప్ 2025 సదస్సులో పలువురు విదేశీ వైద్య నిపుణులు ఈ తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. యూరలాజికల్ చికిత్సల విషయంలో రోబోటిక్, లాప్రోస్కొపిక్ చికిత్సలలో వస్తున్న సరికొత్త టెక్నాలజీలపై చర్చించేందుకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలతో పాటు ఇంగ్లండ్, అమెరికా, బెల్జియం, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక లాంటి దేశాల నుంచి కలిపి మొత్తం వెయ్యి మందికి పైగా యూరాలజిస్టులు ఇందులో పాల్గొన్నారు. సంక్లిష్టమైన యూరాలజీ కేసులు, వాటికి చికిత్సలు ఎలా అందించాలన్న విషయమై నిపుణులు ఇందులో విస్తృతంగా చర్చించారు. శస్త్రచికిత్సలలో పాటించాల్సిన విధానాలు, భవిష్యత్తు సవాళ్లకు సిద్ధం కావడం, ఈ స్పెషాలిటీలో రోగులకు అత్యుత్తమ చికిత్సలు అందించడంపై ఏఐఎన్యూ నిర్వహించిన ఈ సదస్సు ఉత్సాహవంతంగా సాగింది. రెండు రోజుల పాటు సాగిన ఈ సదస్సులో పలు వర్క్ షాప్లు, సంక్లిష్టమైన కేసుల గురించిన చర్చలు, భవిష్యత్తు టెక్నాలజీలు యూరాలజీ, నెఫ్రాలజీ చికిత్సలను ఎలా మారుస్తాయన్న అంశంపై అత్యున్నత స్థాయి సమీక్షలు జరిగాయి.ఈ సదస్సు గురించి ఏఐఎన్యూ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ సి. మల్లికార్జున మాట్లాడుతూ, “రోగులకు చికిత్స అందించే విషయంలో అత్యాధునిక వైద్య పరిజ్ఞానాన్ని అమలుచేయాలని ఏఐఎన్యూ ఎప్పుడూ భావిస్తుంది. రోబో-ల్యాప్ 2025 సదస్సు కేవలం శస్త్రచికిత్సల్లో వస్తున్న కొత్త మార్పులు ప్రదర్శించడానికి కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులంతా ఒక్క వేదికమీదకు చేరి, వారి ఆలోచనలు పంచుకుని యూరాలజీ చికిత్సల భవిష్యత్తును సమిష్టిగా పునర్నిర్వచించాలన్నదే మా ఉద్దేశం. ఈ స్థాయి సదస్సుల నిర్వహణ ద్వారా యూరాలజీ రంగంలో రోబోటిక్, మినిమల్లీ ఇన్వేజివ్ చికిత్సల్లో సరికొత్త విజయాల గురించి అందరికీ తెలుస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా అందరూ తమకు వీలైనంత చిన్న కోతలతో సర్జరీలు కావాలని అడుగుతున్నారు. దానివల్ల నొప్పి తక్కువ ఉండడం, త్వరగా కోలుకుని తమ పనులు చేసుకోవడం సాధ్యమవుతుందని వారికి తెలుసు. కానీ, అలాంటి శస్త్రచికిత్సలు, ముఖ్యంగా యూరాలజీ విభాగంలో వైద్య కళాశాలల్లో ఇంతకుముందు నేర్పలేదు. అందువల్ల ఇప్పటికే ఈ రంగంలో ఉన్నవారు వీటిపై తమ విజ్ఞానాన్ని పెంచుకుని తమ స్వదేశాలకు లేదా సొంత రాష్ట్రాలకు వెళ్లి అక్కడి రోగులకు సంతృప్తికరమైన చికిత్స అందించడానికి ఈ సదస్సు వారికి ఎంతగానో ఉపయోగపడింది. దీనికి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలతో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, గల్ఫ్ దేశాలు.. ఇలా పలు దేశాల నుంచి వైద్యులు వచ్చి రోబోటిక్, ల్యాప్రోస్కొపిక్ శస్త్రచికిత్సలు చేయడం, వాటిలో ఉండే టెక్నిక్లు, నైపుణ్యాల గురించి వివరంగా నేర్చుకున్నారు. మన దేశంతో పాటు విదేశాల్లో కూడా యూరాలజీ చికిత్సలను మరింత మెరుగుపరచాలన్న ఏఐఎన్యూ నిబద్ధతకు ఈ సదస్సు నిదర్శనం. ఇది లాప్రోస్కొపిక్, రోబోటిక్ యూరాలజీ శస్త్రచికిత్సలకు ఒక కరదీపికలా ఉపయోగపడుతుంది” అని చెప్పారు.ఏఐఎన్యూ సీఈఓ సందీప్ గూడూరు మాట్లాడుతూ, “యూరాలజీ రంగంలో అత్యున్నత స్థాయి చికిత్సలు, నిరంతర అధ్యయనం, సాంకేతిక ఆవిష్కరణల దిశగా ఏఐఎన్యూ నిబద్ధతను రోబో-ల్యాప్ సదస్సు ప్రతిబింబిస్తుంది. ఆవిష్కరణలకు హద్దులు ఉండకూడదని ఏఐఎన్యూ భావిస్తుంది. రోబో-ల్యాప్ సదస్సు ఈ స్ఫూర్తికి నిదర్శనం” అన్నారు.అధిక నాణ్యత కలిగిన యూరో-ఆంకాలజీ శస్త్రచికిత్సలు, రీకన్స్ట్రక్టివ్ శస్త్రచికిత్సలు, సంక్లిష్మైన పిల్లల శస్త్రచికిత్సలలో వస్తున్న మార్పులపై అత్యంత అవసరమైన విజ్ఞాన పంపిణీ వేదికగా ఈ సదస్సు నిలిచింది. సమస్యాత్మక కేసులకు శస్త్రచికిత్సా పరిష్కారాలు, రోబోటిక్, లాప్రోస్కొపిక్ శస్త్రచికిత్సలు కచ్చితత్వాన్ని ఎలా సాధిస్తున్నాయి, కోతలను ఎలా తగ్గిస్తున్నాయి, రోగులు త్వరగా ఎలా కోలుకుంటున్నారు అన్న విషయాలపై ప్రముఖ వైద్య నిపుణులు సమగ్రంగా వివరించారు. -
భారత్పై ప్రశ్న.. చైనా రోబో సమాధానం
చైనాలోని తియాన్జిన్లో షాంఘై సహకార సదస్సు (SCO) జరుగుతోంది. ఈ సదస్సులో రిసెప్షన్ వద్ద చైనీస్ హ్యుమానాయిడ్ రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అక్కడి అతిధులు అడిగే ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానాలు చెబుతూ ఎంతగానో ఆకట్టుకుంది.ఎస్సీవో సదస్సులో హ్యుమానాయిడ్ రోబో సమాధానాలు చెప్పడానికి సిద్ధం కావడానికి ముందు.. "నేను ఈ రోజు నా గరిష్ట సామర్థ్యంతో పనిచేస్తున్నాను. నన్ను ప్రశ్నలు అడుగుతున్నందుకు ధన్యవాదాలు'' అని చెప్పింది.భారతదేశంపై నీ ఆలోచలను చెప్పమని అడిగినప్పుడు.. నేను ఒక ఏఐ రోబోను. దేశాలు, రాజకీయ పరిణాలను గురించి నేను చెప్పలేనని స్పష్టం చేసింది. అయితే ఎస్సీవో సదస్సుకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఇది ఇంగ్లీష్, చైనీస్, రష్యన్ భాషలు మాట్లాడుతుంది. View this post on Instagram A post shared by Firstpost (@firstpost) -
ఆర్మీ ట్రెయినింగ్ కమాండ్తో ఐఐటీ-హైదరాబాద్ ఒప్పందం
భారత సైన్యం కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీ-హెచ్), ఇండియన్ ఆర్మీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)ను ప్రారంభించనున్నాయి. ఈమేరకు ఐఐటీ హైదరాబాద్ సిమ్లాలోని ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ (ఏఆర్టీఆర్ఏసీ), సిమ్యులేటర్ డెవలప్మెంట్ డివిజన్ (ఎస్డీడీ)తో అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకుంది. స్వదేశీ సాంకేతిక స్వావలంబనకు ఇది కీలకం కానుందని అధికారులు చెప్పారు.‘విగ్రహ’(వర్చువల్, ఇంటెలిజెంట్, గ్రౌండ్ బ్రేకింగ్ రీసెర్చ్ ఇన్ ఏఆర్/వీఆర్ అండ్ హైటెక్ అప్లికేషన్స్ ఫర్ ఇండియన్ ఆర్మీ) పేరుతో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్(సీఓఈ) భారత నైన్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఇరు వర్గాలు తెలిపాయి.‘విగ్రహ’ లక్ష్యం ఏమిటి?భారత సైన్యం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని శిక్షణ, యుద్ధ సన్నద్ధతకు ఉపయోగించడం ద్వారా సైనిక సంసిద్ధతను నిర్ధారించాలని విగ్రాహ భావిస్తోంది.రియలిస్టిక్ మిలిటరీ ట్రైనింగ్ సిమ్యులేషన్స్ కోసం అడ్వాన్స్డ్ ఏఆర్/వీఆర్ ప్లాట్ఫామ్స్ ఉపయోగపడుతాయి.సంక్లిష్ట భూభాగాల్లో సమర్థమైన నిర్ణయాలు తీసుకోవడం, స్వయంప్రతిపత్తి కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఏఐ, రోబోటిక్స్, మానవరహిత వ్యవస్థలను అభివృద్ధి చేసేందుకు ఈ సెంటర్ తోడ్పడుతుంది.భారత సైన్యం ఆపరేషనల్ మెలకువలు, వ్యూహాత్మక అవసరాలను తీర్చడానికి బ్యాటిల్ ఫీల్డ్ సిమ్యులేషన్ టూల్స్ను ఏర్పాటు చేయనున్నారు.ఈ సందర్భంగా ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ..‘ఈ కేంద్రం కేవలం టెక్ ల్యాబ్ మాత్రమే కాదు. ప్రపంచ స్థాయి ఆవిష్కరణలతో భారతదేశ రక్షణ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయాలనే మా ఉమ్మడి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది’ అని తెలిపారు. బ్రిగేడియర్ ఏకే చతుర్వేది మాట్లాడుతూ..‘ఈ సహకారం తదుపరి తరం సామర్థ్యాలను స్వీకరించడానికి, స్వదేశీ సాంకేతిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి సైన్యం నిబద్ధతకు హైలైట్ చేస్తుంది’ అన్నారు.ఇదీ చదవండి: భారత్ మూడంచెల ప్లాన్.. -
రూ.200 లోపు మంత్లీ ప్లాన్.. అదీ రోజుకు 2 జీబీ డేటాతో..
ప్రైవేట్ టెలికం కంపెనీలన్నీ తమ ఎంట్రీ లెవల్ మంత్లీ ప్లాన్లను మార్చేశాయి. తక్కువ ధర రీచార్జ్ ప్లాన్లను తొలగించాయి. రోజువారీ డేటాతో కూడిన ప్లాన్లు కావాలంటే కనీసం రూ.300 ఖర్చు పెట్టాల్సి వస్తోంది. కానీ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తక్కువ ధరకే అధిక సేవలను అందించే మరో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ను లాంచ్ చేసింది. రూ.200 లోపు మంత్లీ ప్లాన్.. అదీ రోజుకు 2 జీబీ డేటాతో..ప్రైవేటు సంస్థలకు పెద్ద సవాలు విసురాలనే లక్ష్యంతో బీఎస్ఎన్ఎల్ ఈ రీఛార్జ్ ప్లాన్ ను లాంచ్ చేసింది. 30 రోజుల పాటు రోజుకు 2 జీబీ డేటా, ఉచిత కాలింగ్ అందించే ఈ ప్లాన్ ధర రూ.200 లోపే. ఈ రీఛార్జ్ ప్యాక్ లో బీఎస్ఎన్ఎల్ అందించే ప్రయోజనాలను వివరంగా చూద్దాం.బీఎస్ఎన్ఎల్ రూ.199 ప్లాన్పై 30 రోజుల ఆకర్షణీయమైన వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 2 జీబీ హైస్పీడ్ డేటా మరో ఆకర్షణ. వీటన్నింటితో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లను కూడా అందిస్తుంది. దేశంలోని ఇతర టెలికాం సర్వీస్ ప్రొవైడర్లతో పోలిస్తే రూ .199 ప్లాన్ ఆర్థిక ప్రయోజనాలు, అధిక ప్రయోజనాలను కలిగి ఉందని పేర్కొంటూ బీఎస్ఎన్ఎల్ ఈ రీఛార్జ్ ప్యాక్ను ప్రవేశపెట్టింది.ఇదే రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ కాల్స్ అందించే ప్లాన్కు ఒక ఆపరేటర్ నెలకు రూ.379 వసూలు చేస్తుందని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. మరో టెలికాం సర్వీస్ ప్రొవైడర్ అదే సౌకర్యాలతో 28 రోజుల ప్లాన్ కోసం రూ .365 వసూలు చేస్తుంది. మరోవైపు రూ.199 ప్లాన్తో మరో ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ రోజుకు 2 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, 100 ఎస్ఎంఎస్లకు 14 రోజుల వాలిడిటీని మాత్రమే అందిస్తుందని బీఎస్ఎన్ఎల్ స్పష్టం చేసింది. -
చాట్ జీపీటీ చెప్పిందని తల్లిని చంపాడు
కనెక్టికట్: చాట్జీపీటీ చెప్పిందని తల్లిని చంపిన ఓ వ్యక్తి, ఆ తరువాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అమెరికాలోని కనెక్టికట్లో జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రమేయంతో జరిగిన తొలి హత్యగా దీన్ని భావిస్తున్నారు. ఆ వ్యక్తిని 56 ఏళ్ల స్టెయిన్ ఎరిక్ సోయెల్బర్గ్గా గుర్తించారు. గతంలో యాహూలో మేనేజర్గా పనిచేసిన సోయెల్.. ఏఐ చాట్బాట్ నిరంతరం మాట్లాడుతూ ఉండేవాడు. దానికి బాబీ అని పేరు పెట్టుకున్నాడు. బాబీతో చేసిన సంభాషణలను యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేవాడు. అప్పటికే మానసిక అనారోగ్యంతో ఉన్న సోయెల్.. తల్లి సుజాన్ ఎబెర్సన్ ఆడమ్స్ తనను చంపేందుకు కుట్ర చేస్తోందని భావించాడు. ఈ విషయంపై ఏఐతో మాట్లాడాడు. అది అతని అనుమానాన్ని పెంచింది. మానసిక అనారోగ్యానికి వాడే మందుల్లో విషం కలిపి ఇవ్వొచ్చని చెప్పింది. దీంతో సోయెల్ తల్లిపై దాడి చేశాడు. తలకు, మెడకు బలమైన గాయాలవ్వడంతో ఆమె మరణించింది. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మెడ, ఛాతీపై బలమైన గాయాలవ్వడంతో ఆయన చనిపోయాడు. 2.7 మిలియన్ డాలర్ల విలువైన వారి ఇంట్లో ఇద్దరి మృతదేహాలు ఆగస్ట్ 5న దొరికాయి. పదునైన ఆయుధంతో దాడిచేయడంతోపాటు, తనను తాను కోసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. -
జీమెయిల్ యూజర్లకు గూగుల్ హెచ్చరిక
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2.5 బిలియన్ల జీమెయిల్ వినియోగదారులకు గూగుల్ ఓ హెచ్చరిక జారీ చేసింది. హ్యాకర్లు తమ దాడులను వేగవంతం చేస్తున్నారని.. యూజర్లు తమ పాస్వర్డ్లను మార్చుకోవాలని, టూ స్టెప్ వెరిఫికేషన్ కూడా ప్రారంభించాలని కోరింది.ఇప్పటికే చాలా మంది ప్రజలు హ్యాకర్స్ బారిన పడ్డారు. షైనీహంటర్స్ అనే అంతర్జాతీయ హ్యాకర్స్ ముఠా.. కూడా దీని వెనుక ఉన్నట్లు గుర్తించినట్లు గూగుల్ వెల్లడించింది. 2020 నుంచి ఏటీ&టీ, మైక్రోసాఫ్ట్, సాంటాండర్, టికెట్మాస్టర్ వంటి కంపెనీల డేటా లీక్ కేసులో ఈ గ్రూప్ ప్రమేయం ఉందని పేర్కొంది. దీనికోసం హ్యాకర్స్ ఫిషింగ్ పద్దతిని ప్రధానంగా ఉపయోగిస్తున్నట్లు తెలిసింది.యూజర్లకు ఫేక్ మెయిల్స్ పంపి.. వేరొక లాగిన్ పేజిలోకి మళ్లించడం, తద్వారా సెక్యూరిటీ కోడ్స్ వంటి సమాచారాన్ని దోచుకోవడం హ్యాకర్స్ పని. సెక్యూరిటీ కోడ్స్ హ్యాకర్స్ చేతికి వెళ్తే.. తరువాత జరిగే నష్టాలను అంచనా వేసుకోవచ్చు. షైనీహంటర్స్ గ్రూప్ ఒక డేటా లీక్ సైట్ ప్రారంభించడానికి సిద్ధమవుతోంది, ఇది సున్నితమైన సమాచారం దోచుకునే అవకాశం ఉందని గూగుల్ ఇప్పటికే ఒక బ్లాగ్పోస్ట్ ద్వారా వెల్లడించింది.ఇదీ చదవండి: భారత్లోకి మళ్ళీ టిక్టాక్?: మొదలైన నియామకాలుటూ స్టెప్ వెరిఫికేషన్ ఎందుకంటే?ఒక ఈమెయిల్కు మరింత సెక్యూరిటీ కావాలనుకుంటే.. టూ స్టెప్ వెరిఫికేషన్ చాలా ఉపయోగపడుతుంది. హ్యాకర్స్ మీ ఈమెయిల్ పాస్వర్డ్ను తెలుసుకున్నప్పటికీ.. టూ స్టెప్ వెరిఫికేషన్ లేకుండా లాగిన్ అవ్వలేరు. ఇది మీకు సంబంధించిన ఈమెయిల్లోని సమాచారాన్ని సురక్షితంగా ఉంచుతుంది. సైబర్ నేరగాళ్లు లేదా హ్యాకర్స్ భారీ నుంచి తప్పించుకోవడానికి ఇదొక సులువైన మార్గం. -
ఫోన్ వేడెక్కుతోందా.. స్పీడ్ తగ్గిందా: కారణం ఇదే కావొచ్చు
టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో.. సైబర్ నేరగాళ్లు ఎక్కువవుతున్నారు. మొబైల్స్ హ్యాక్ చేసి డబ్బు దోచేస్తున్నారు. ఫోన్లో మాల్వేర్స్ ఉపయోగించి కొందరు మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేయవచ్చు. అయితే మీ ఫోన్లో మాల్వేర్స్ ఉన్నాయా?, లేదా? అని ఎలా తెలుసుకోవాలో ఇక్కడ చూసేద్దాం..కంటిన్యూస్ పాప్ అప్ యాడ్స్: మీరు ఉపయోగించే ఫోన్లో మాల్వేర్స్ ఉంటే.. పాప్ అప్ యాడ్స్ ఎక్కువగా వస్తుంటాయి. అలాంటి యాడ్స్ మీద క్లిక్ చేస్తే.. డబ్బు పోగొట్టుకోవడం ఖాయం. కొన్ని ప్రమాదకర యాప్ల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవి మీకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం కూడా లీక్ చేస్తాయి.బ్యాటరీ ఛార్జ్ త్వరగా అయిపోతుంది: మీ ఫోన్లో మాల్వేర్స్ ఉంటే.. బ్యాటరీ ఛార్జ్ కూడా త్వరగా అయిపోతుంది. దీనికి కారణం మీకు తెలియకుండా మీ ఫోన్ను (బ్యాక్గ్రౌండ్) ఇతరులు హ్యాండిల్ చేతుంటారన్న మాట. దీంతో ఛార్జింగ్ కూడా వేగంగా తగ్గిపోతుంది. ఫోన్ స్పీడ్ తగ్గుతుంది: మాల్వేర్స్ కారణంగా ఫోన్ వేగం తగ్గుతుంది. దీంతో చిన్న చిన్న పనులు చేయడానికి కూడా మొబైల్ సహకరించదు. కొన్నిసార్లు యాప్లు కూడా మాల్వేర్స్ కారణంగా క్రాష్ కావచ్చు.ఇదీ చదవండి: పేటీఎం యూపీఐ ఆగిపోతుందా?: గూగుల్ ప్లే అలర్ట్పై కంపెనీ రెస్పాన్స్ఫోన్ వేడెక్కుతోంది: మాల్వేర్స్ మీ ఫోన్లో ఉన్నట్లయితే.. మొబైల్ చాలా వేడెక్కుతుంది. కొన్నిసార్లు ఇంటర్నల్ సీపీయూపై ఎక్కువ లోడ్ పెంచుతుంది. లోపి అనే మాల్వేర్స్ ఫోన్ను వేడెక్కేలా చేస్తుంది. కాబట్టి ఏమీ చేయకుండానే ఫోన్ వేడెక్కుతుంటే.. కొంత సమయం పాటు దాన్ని ఆఫ్ చేయడం మంచిది.మాల్వేర్ను ఎలా తొలగించాలి?ఫోన్ నుంచి మాల్వేర్ను తొలగించడానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. ఇందులో ఒకటి సేఫ్ మోడ్ను ప్రారంభించడం. ఆండ్రాయిడ్ ఫోన్లో సేఫ్ మోడ్ను ప్రారంభించడం ద్వారా, ఇది థర్డ్ పార్టీ యాప్లను నిలిపివేస్తుంది. దీనితో పాటు యాంటీ వైరస్ సహాయంతో ఫోన్ను స్కాన్ చేయడం ద్వారా కూడా మాల్వేర్ను గుర్తించవచ్చు. ఇవన్నీ పనిచేయకపోతే.. ఫోన్ను రీసెట్ చేసుకోవాలి. రీసెట్ చేయడానికి ముందు.. మీకు అవసరమైన డేటాను బ్యాకప్ తీసుకోవడం మర్చిపోవద్దు. -
భారత్లోకి మళ్ళీ టిక్టాక్?: మొదలైన నియామకాలు
భారతదేశంలో ఒకప్పుడు ఎంతో ప్రాచుర్యం పొంది.. ఇప్పుడు నిషేధంలో ఉన్న ప్రముఖ సోషల్ మీడియా యాప్ 'టిక్టాక్' ఉద్యోగుల కోసం ఎదురు చూస్తోంది. గురుగ్రామ్లోని ఆఫీసులో రెండు ఖాళీలను భర్తీ చేయనున్నట్లు లింక్డిన్లో పోస్ట్ చేసింది. ఇందులో ఒకటి కంటెంట్ మోడరేటర్ (బెంగాలీ స్పీకర్), మరొకటి మంచి భాగస్వామ్యం.. కార్యకలాపాల లీడ్ కోసం. దీన్నిబట్టి చూస్తుంటే టిక్టాక్ మళ్ళీ భారత్లోకి అందుబాటులోకి రానుందా అనే ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి.బైట్డాన్స్ యాజమాన్యంలోని షార్ట్ వీడియో యాప్ టిక్టాక్ కంపెనీ వెబ్సైట్ ఇటీవల భారతదేశంలో మళ్లీ అందుబాటులోకి వచ్చింది. అయితే.. దేశంలో టిక్టాక్ సేవలను తిరిగి ప్రారంభించడానికి కావలసిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేయలేదని అధికారులు తెలిపారు. ఆగస్టు 22న, కూడా ఈ చైనా యాప్ భారతదేశంలో తిరిగి అనుమతించారనే వాదనలను అధికారులు తిరస్కరించారు.టిక్టాక్ వెబ్సైట్లోని ల్యాండింగ్ పేజీ ఓపెన్ చేయగానే.. భారతదేశంలో ఇది అందుబాటులో లేదని సందేశాన్ని ప్రదర్శించేది. కానీ గత వారం డెస్క్టాప్ ద్వారా యాక్సెస్ చేసినప్పుడు ఈ ప్లాట్ఫామ్కు సంబంధించిన 'అబౌట్ అస్' పేజీ కనిపించింది. అయితే ఎలాంటి వీడియోలు కనిపించలేదు.ఇదీ చదవండి: స్టార్లింక్ ఇంటర్నెట్ కోసం ఆధార్ వెరిఫికేషన్: సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఇలాటిక్టాక్ యాప్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో లేదు. "మేము భారతదేశంలో టిక్టాక్కు మళ్ళీ స్టార్ట్ చేయలేదు. ఇప్పటికి కూడా భారత ప్రభుత్వ ఆదేశాన్ని పాటిస్తూనే ఉన్నాము" అని టిక్టాక్ ప్రతినిధి ఒకరు ఒక ప్రకటనలో తెలిపారు.భారత.. చైనా దళాల మధ్య గాల్వాన్ లోయ ఘర్షణ తర్వాత జాతీయ భద్రతా సమస్యలను పేర్కొంటూ భారతదేశం జూన్ 2020లో టిక్టాక్తో పాటు 58 ఇతర చైనీస్ యాప్లను నిషేధించింది. అయితే ఇప్పుడు ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడే సంకేతాలను కనిపిస్తున్నాయి. ఏడేళ్ల తరువాత ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే.. చైనా సోషల్ మీడియా యాప్ మళ్ళీ అందుబాటులోకి వస్తుందేమో అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. -
ఇంట్లో ఇవి ఉంటే.. టెన్షన్ లేకుండా వర్క్ ఫ్రమ్ హోమ్
వర్క్ ఫ్రమ్ హోమ్లో వచ్చే చిన్న చిన్న టెన్షన్లను కట్ చేసి, మీ ఫోకస్, కంఫర్ట్, పీస్ ఆఫ్ మైండ్ను కాపాడే గాడ్జెట్లే ఇవీ!జీరో డిస్ట్రాక్షన్!పక్కింటి వర్కర్ బోర్వెల్ డ్రిల్ చేస్తున్నా, ఇంట్లో పిల్లలు కార్టూన్ సాంగ్స్తో ఫుల్ జోష్లో ఉన్నా మీ పనిమీద ఫోకస్ తగ్గాల్సిన అవసరం లేదు. ఈ ‘నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ఫోన్స్’ మీ చుట్టూ ఉన్న మొత్తం హంగామాను మ్యూట్ చేసి, మీకు సైలెన్స్ అనే లగ్జరీని అందిస్తాయి. కంఫర్ట్ ఫిట్, లాంగ్ బ్యాటరీ బ్యాకప్ ఉండటంతో గంటల తరబడి వేసుకున్నా ఇబ్బంది లేదు. వైర్డ్ – వైర్లెస్ మోడ్ రెండింటినీ సపోర్ట్ చేస్తాయి. కాబట్టి ల్యాప్టాప్, ఫోన్, ట్యాబ్ ఇలా దేనికైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఆఫీస్ కాల్స్ అయినా, డీప్ వర్క్ సెషన్స్ అయినా లేదా మ్యూజిక్లో మునిగిపోవడానికైనా ఇది బెస్ట్ సౌండ్ షీల్డ్. ధర రూ.3,000 నుంచి రూ.5,000 మధ్య లభిస్తుంది.వైర్లు క్రమంగా, మనసు ప్రశాంతంగా!వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే చాలామందికి ఆనందమే కాని, టేబుల్ కింద గజిబిజిగా ఉన్న కేబుల్స్ మాత్రం టెన్షన్ పెంచుతాయి. పొరపాటున ఒక్కటి లాగితే, మిగతావన్నీ కట్టుకట్టుకుని ‘మమ్మల్ని విడదీయొద్దు’అన్నట్టే దాడి చేస్తాయి. ఈ గందరగోళానికి సింపుల్ పరిష్కారమే ‘కేబుల్ మేనేజ్మెంట్ కిట్’. బలమైన పీవీసీ మెటీరియల్తో తయారైన ఈ కిట్లో పెద్దవి, చిన్నవి అన్న తేడా లేకుండా ఒకేసారి ఎనిమిది కేబుల్స్ వరకు సర్దుకోవచ్చు. కిట్లోనే చుట్టే టైలు, వైర్ హోల్డర్లు ఉన్నందున అదనంగా ఏమీ కొనాల్సిన అవసరం లేదు. గోడకు స్క్రూ పెట్టి లేదా అతికించుకుని, కొన్ని నిమిషాల్లోనే సెట్ చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్, ఫైర్ప్రూఫ్ కావడంతో దీర్ఘకాలం టెన్షన్ లేకుండా వాడుకోవచ్చు. మార్కెట్లో ఇది సుమారు రూ.1,000 నుంచి రూ.1,500 మధ్య లభిస్తుంది.క్లీనింగ్ క్రష్! కాఫీ సిప్, హాట్ స్నాక్స్ ఎంజాయ్ చేస్తూ టైప్ చేయడం సంతోషమే! కాని ఒక్కసారి అవి కీబోర్డ్ లోపలికి జారిపడితే, వర్క్ మూడ్ మొత్తం ఆఫ్ అవుతుంది. అప్పుడు గుడ్డతో తుడుస్తూ టైమ్ వేస్ట్ చేయకుండా, వెంటనే ఈ ‘మినీ వ్యాక్యూమ్ క్లీనర్’ను రంగంలోకి దింపండి. ఇది మీ డెస్క్టాప్ను క్షణాల్లో తళతళలాడే స్పాట్లైట్ లుక్తో మెరిసేలా చేస్తుంది. క్యూట్గా ఉండే ఈ పరికరం అరచేతిలో పట్టేంత చిన్న సైజులోనే ఉంటుంది. వైర్లెస్ కాబట్టి ఎక్కడైనా సులభంగా క్లీనింగ్ చేసుకోవచ్చు. కీబోర్డ్, టేబుల్, చిన్న మూలలు ఎక్కడ దుమ్ము, ధూళి ఉన్నా ఒక్క బటన్ నొక్కితే చాలు, చిటికెలో మాయం! లోపల ఉన్న కలెక్షన్ కంపార్ట్మెంట్ తీయడం, ఖాళీ చేయడం కూడా ఈజీ. ఒకసారి చార్జ్ చేస్తే గంటపాటు పనిచేస్తుంది. ధర రూ.800 నుంచి రూ.1,200 మధ్య ఉంటుంది. -
BSNL యూజర్లకు గుడ్ న్యూస్
ప్రభుత్వం టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఆన్లైన్ సేవల్లో ప్రైవేటు కంపెనీలతో పోటీ పడుతోంది. ప్రిపెయిడ్, పోస్ట్ పెయిడ్, డేటా ప్లాన్లతో ప్రైవేటు సంస్థలకు దీటుగా దూసుకెళుతున్న బీఎస్ఎన్ఎల్ (BSNL) మరో ముందడుగు వేయబోతోంది. వినియోగదారుల కోసం త్వరలో కోసం కొత్త సర్వీసును అందుబాటులోకి తెచ్చేందుకు సన్నద్ధమవుతోంది.స్మార్ట్ఫోన్ వినియోగదారులు ఆర్థిక లావేదేవీలు, బిల్లుల చెల్లింపుల కోసం ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం లాంటి ప్రైవేటు డిజిటల్ యాప్లను ఎక్కువగా వాడుతున్నారు. బీఎస్ఎన్ఎల్ కూడా త్వరలోనే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సేవలను ప్రారంభించనుంది. బీఎస్ఎన్ఎల్ పే పేరుతో దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ (భీమ్) యూపీఐ ఆధారంగా బీఎస్ఎన్ఎల్ పే (BSNL Pay) సేవలను వినియోగించుకునేలా దీన్ని రూపొందిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.దీపావళి నాటికి ప్రారంభం!బీఎస్ఎన్ఎల్ పే సేవలు వినియోగదారులకు దీపావళి (Diwali) నాటికి అందుబాటులోకి వస్తాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి. బీఎస్ఎన్ఎల్ పే అనేది ప్రత్యేకమైన యాప్ కాదు. బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్కేర్ యాప్లో భాగంగానే ఇది ఉంటుంది. భీమ్ యూపీఐ ద్వారా దీని సేవలను యూజర్లు వినియోగించుకోవచ్చు.ఎలాంటి సేవలు అందిస్తుంది?ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం (Paytm) మాదిరిగానే బీఎస్ఎన్ఎల్ పే ద్వారా అన్ని రకాల ఆన్లైన్ చెల్లింపులు చేయగలుగుతారు. సెల్ఫ్ కేర్ యాప్ వినియోగదారులు సులువుగా ఈ సేవలు ఉపయోగించుకోవచ్చు. యూజర్లకు నాణ్యమైన డిజిటల్ సేవలు అందించడంతో పాటు, దేశంలో వేగంగా విస్తరిస్తున్న యూపీఐ చెల్లింపుల మార్కెట్లో తమ దైన ముద్ర వేయాలని బీఎస్ఎన్ఎల్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. బీఎస్ఎన్ఎల్ పే సేవలు అందుబాటులోకి వస్తే ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం లాంటి ప్రైవేటు డిజిటల్ యాప్లకు గట్టి పోటీ ఎదురవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. చదవండి: ఉచిత డిజిటల్ యూపీఐ యాప్లు ఎలా సంపాదిస్తాయంటే..? -
అదిగో అలా వచ్చింది రూ.3.36 కోట్ల ఉద్యోగం..
మనకు ఏ అంశంపైన ఆసక్తి ఉందో.. ఏ పనినైతే మనం ఇష్టంగా చేయగలుగుతామో దాన్నే కెరియర్గా ఎంచుకుంటే ప్రతిఒక్కరూ తప్పకుండా విజయవంతం అవుతారు. దీనికి ఉదాహరణే ఈ 23 వేళ్ల ఇండియన్-అమెరికన్ కుర్రాడు మనోజ్ తుము. ప్రస్తుతం ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటాలో 4 లక్షల డాలర్ల (రూ.3.36 కోట్లు) జీతంతో ఉద్యోగం చేస్తున్న తాను.. ఈ జాబ్ను గతంలో అమెజాన్లో పనిచేస్తున్నప్పుడు ఎలా పొందిందీ వివరించాడు.. తనలాగే ముందుకెళ్లాలనుకుంటున్నవారికి సూచనలూ ఇచ్చాడు.బిజినెస్ ఇన్సైడర్ కోసం రాసిన వ్యాసంలో మనోజ్ తుము పోటీ నియామక ప్రక్రియను ఎలా ఎదుర్కొన్నాడో, తన కెరీర్ మార్గాన్ని తీర్చిదిద్దిన పాఠాల గురించి వివరించాడు. హైస్కూల్ క్రెడిట్స్ కారణంగా ఏడాదిలోనే అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మనోజ్ ఫుల్ టైమ్ పనిచేస్తూనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మాస్టర్స్ చేశారు. మరింత ఉత్తేజకరమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టుల కోసం మెటాకు మారడానికి ముందు మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్గా 9 నెలల పాటు అమెజాన్లో పనిచేశారు.ఏఐలో ప్రవేశించాలంటే..మనోజ్ ప్రకారం.. మెషిన్ లెర్నింగ్ టైటిల్స్ మారుతూ ఉంటాయి. రిసెర్చ్ సైంటిస్ట్, అప్లైడ్ సైంటిస్ట్, సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తదితర పాత్రలు పోషించవచ్చు. క్లాసికల్ ఎంఎల్ నుంచి డీప్ లెర్నింగ్ కు మారడం ఈ రంగాన్ని మరింత డైనమిక్ గా, కాంపిటీటివ్ గా మార్చింది. కళాశాల ఇంటర్న్ షిప్ లు తక్కువ వేతనంతో కూడినవి అయినీ అనుభవం పొందడానికి, నిలదొక్కుకోవడానికి చాలా కీలకం.రెజ్యూమె & ఇంటర్వ్యూ చిట్కాలురెజ్యూమెలో మీరు చేసిన ప్రాజెక్టుల గురించి పేర్కొనడం ఉపయోగకరమే కానీ మీకు రియల్టైమ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీ రెజ్యూమ్ పై ప్రాజెక్ట్లు ఆధిపత్యం చెలాయించకూడదని కొత్తగా జాబ్ మార్కెట్లోకి వస్తున్నవారికి సూచిస్తున్నారు మనోజ్. బిహేవియరల్ ఇంటర్వ్యూలు కీలకమని, కానీ చాలా మంది అభ్యర్థులు దీన్న విస్మరిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇక వేతనాల విషయానికి వస్తే సంబంధిత అనుభవాన్ని పెంచుకోవడానికి మనోజ్ ప్రారంభంలో సంప్రదాయ సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ కంటే తక్కువ వేతనంతో కూడిన ఎంఎల్ ఉద్యోగాన్నే ఎంచుకున్నాడు. ఇది తరువాత అధిక వేతన అవకాశాలకు దారితీసింది. -
బీఎస్ఎన్ఎల్ బైటీవీ ప్రీమియం ప్యాక్.. కేవలం రూ.151లకే..
ప్రభుత్వ టెలికమ్ దిగ్గజం బీఎస్ఎన్ఎల్ తమ వినియోగదారుల కోసం బైటీవీ ప్రీమియం ప్యాక్ను ప్రారంభించింది. డిజిటల్ వినోదాన్ని ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 25 పైగా ఓటీటీలు, 450 పైగా లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించే సౌలభ్యాన్ని రూ .151 లకే అందిస్తోంది.బైటీవీ ప్రీమియం ప్యాక్లో ప్రముఖ ఓటీటీ సేవలు ఉన్నాయి. జీ5, సోనీలివ్, లయన్స్గేట్ ప్లే, ఆహా, షెమారూమీ, సన్ ఎన్ఎక్స్టీ, డిస్కవరీ, ఎపిక్ ఆన్, ఈటీవీ విన్, చౌపాల్ వంటి ఓటీటీలు ఇందులో ఉన్నాయి. సినిమాలు, వెబ్ సిరీస్లు, ప్రాంతీయ కంటెంట్, లైవ్ టెలివిజన్ను వివిధ భాషలలో స్ట్రీమ్ చేయవచ్చు. ఇవన్నీ బీఎస్ఎన్ఎల్ మొబైల్ వినియోగదారులకు ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న బైటీవీ యాప్ ద్వారా వీక్షించవచ్చు.బైటీవీ ప్రీమియం ప్యాక్కు సంబంధించి బీఎస్ఎన్ఎల్ అధికారికంగా ఎలాంటి వ్యాలిడిటీని ధృవీకరించనప్పటికీ, రూ .151 ప్యాక్ వ్యాలిడిటీ 30 రోజులు ఉంటుందని చాలా నివేదికలు పేర్కొంటున్నాయి. కాగా ఇందులో అనేక పాపులర్ ఓటీటీ సర్వీసలు ఉన్నప్పటికీ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్లను మాత్రం ఈ ఆఫర్లో చేర్చకపోవడం గమనార్హం.2025 ఫిబ్రవరిలో ఉచిత పైలట్గా ప్రారంభమైన బైటీవీ ఇప్పుడు పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్గా రూపాంతరం చెంది ఓటీటీ అగ్రిగేషన్ స్పేస్లో బీఎస్ఎన్ఎల్ను గట్టి పోటీదారుగా నిలబెట్టింది.Stream 450+ Live TV Channels & 25+ OTTs with BSNL BiTV Premium Pack - All-In-One Entertainment at ₹151!Get it now: https://t.co/0lA2HY4IOJ#BSNL #BSNLIndia #DigitalIndia #BiTV #Entertainment pic.twitter.com/VQ6e946dWx— BSNL India (@BSNLCorporate) August 28, 2025 -
చాలా ఫోన్లలో వాడుతున్న ఆ బ్రౌజర్.. డేంజర్!
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఆండ్రాయిడ్ ఫోన్లను వినియోగిస్తున్నారు. రు. అయితే ఈ ఫోన్లలో ఏ బ్రౌజర్ వాడాలి.. ఏది సురక్షితం అన్న అవగాహన చాలా మందికి ఉండటం లేదు. ఫోన్లలో డిఫాల్ట్ ఏ బ్రౌజర్ ఇస్తే అదే వాడుతున్నారు. చాలా ఫోన్లలో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ డీఫాల్ట్గా వస్తోంది. దీంతో ప్రైవసీకి ముప్పు ఉందని నిపుణులు చెబుతున్నారు.ఆన్లైన్ భద్రతలో ప్రత్యేకత కలిగిన సర్ఫ్ షార్క్ అనే సంస్థ ఇటీవల కొన్ని పరిశోధనలు చేసింది. ఇందులో క్రోమ్ దాని పోటీదారుల కంటే ఎంత ఎక్కువ సమాచారాన్ని సేకరిస్తున్నట్లు గుర్తించింది. క్రోమ్కు ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సెక్యూరిటీ ఫీచర్లను గూగుల్ జోడించినప్పటికీ ఇప్పటికీ చాలా డేటాను బ్యాక్ గ్రౌండ్లో ట్రాక్ చేయడం మాత్రం మానడం లేదని బీజీఆర్ నివేదిక తెలిపింది.అన్నీ ట్రాక్ చేస్తోంది..ఆటోఫిల్, వ్యక్తిగతీకరించిన వార్తలు వంటి క్రోమ్ ఫీచర్లు పైకి జీవితాన్ని సులభతరం చేసేవిగా ఉన్నా కానీ అవే ఫీచర్లను గూగుల్ అడ్వర్టైజింగ్, అనలిటిక్స్ నెట్వర్క్లు కూడా ఉపయోగిస్తున్నాయి. దీని అర్థం ఏమిటంటే మీరు ఆన్లైన్లో ఎలా ప్రవర్తిస్తారో వివరణాత్మక చిత్రాన్ని రూపొందించడానికి మీరు చేసే క్లిక్లు, సెర్చ్లు, వెబ్ పేజీలో మీరు గడిపే సమయం కూడా ఎల్లప్పుడూ ట్రాక్ అవుతుందన్న మాట.ఇదేదో ఊహాజనితంగా చెబుతున్న విషయం కాదు. ఇన్కాగ్నిటో మోడ్ను ఉపగించినవారి సమాచారాన్ని కూడా ట్రాక్ చేసినందుకు 2020లో గూగుల్పై కేసు కూడా నమోదైంది. ఆ తర్వాత ప్రైవేట్ బ్రౌజింగ్ సెషన్ల సమయంలో సేకరించిన కోట్లాది రికార్డులను తొలగించేందుకు గూగుల్ అంగీకరించింది.సర్ఫ్ షార్క్ పరిశోధన ప్రకారం, బ్రౌజింగ్ హిస్టరీ, సేవ్ చేసిన చెల్లింపు సమాచారం, కాంటాక్ట్ జాబితాలు వంటి సమాచారాన్ని క్రోమ్ సేకరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ఆండ్రాయిడ్ వినియోగదారులు ఉన్నారు, కాబట్టి సేకరించే డేటా మొత్తం భారీగా ఉంటుంది. ఇదంతా యూజర్ ఎక్స్పీరియన్స్ను మెరుగుపరిచేందుకేనని పైకి చెబుతున్నా తెర వెనుక చాలా మందికి తెలియకుండానే వారి డేటా చోరీకి గురవుతోంది.ప్రత్యామ్నాయాలు లేవా?ఆండ్రాయిడ్ ఫోన్లలో ముప్పుతో కూడిన గూగుల్ క్రోమ్ బ్రౌజర్కు ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. బ్రౌజర్లను మార్చడం సులభం. బ్రేవ్, డక్ డక్గో, ఫైర్ఫాక్స్, టోర్ ఇవన్నీ ట్రాకర్లను ఆపివేసే, బ్యాక్గ్రౌండ్లో సేకరించగల డేటా మొత్తాన్ని పరిమితం చేసే గోప్యతకు ప్రాధాన్యం ఇచ్చే బ్రౌజర్లు. సెట్టింగ్ లలో మార్పులు చేసుకుని, ఈ బ్రౌజింగ్ యాప్లకు మారడం ద్వారా మీ ఫోన్ నుండి వ్యక్తిగత సమాచారం బయటకు వెళ్లకుండా పరిమితం చేయవచ్చు. క్రోమ్ కూడా ఇటీవల ట్రాకింగ్ తగ్గించడంలో సహాయపడటానికి ఐపీ అడ్రస్ మాస్కింగ్ వంటి సాధనాలను జోడించింది. కానీ ఇది ఇప్పటికీ డేటా-హెవీ బ్రౌజర్ అనే వాస్తవాన్ని మార్చదని నిపుణులు అంటున్నారు. -
వైద్య రంగంలో కృత్రిమ మేధ విస్తరణ
టెక్నాలజీ అన్ని రంగాల్లో విస్తరిస్తోంది. భారత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో సాంకేతికత పాగా వేస్తోంది. అందుకు చాలానే కారణాలున్నాయి. ఇండియాలో కొన్ని సర్వేల ప్రకారం 1,457 మంది రోగులకు ఒక డాక్టర్ ఉన్నారు. కానీ ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సిఫార్సు చేసిన డాక్టర్-రోగుల నిష్పత్తి 1:1,000 కంటే చాలా తక్కువ. గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో లక్షల మందికి ప్రాథమిక వైద్య సదుపాయాలు కరవవుతున్నాయి. కాబట్టి ఈ రంగంలో సేవలు విస్తరించాలంటే సాంకేతికత కీలకంగా వ్యవహరిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నాలజీని అందిపుచ్చుకోవడం అత్యవసరం. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల్లో కృత్రిమ మేధ (AI) వేగంగా విస్తరిస్తోంది. దీని సాయంతో వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.ఉదాహరణకు.. ఒడిశాలోని కొన్ని మారుమూల గ్రామాల్లో ఏఐ సాయంతో వైద్యం నిఫారసు చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ స్మార్ట్ఫోన్ అప్లికేషన్లతో కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు దగ్గు రికార్డింగ్లను విశ్లేషించడం ద్వారా క్షయ(టీబీ) కేసులను గుర్తించారు. అదే నేపథ్యంలో కొన్ని వేల మామోగ్రామ్లపై శిక్షణ పొందిన మరొక ఏఐ యాప్ రొమ్ము క్యాన్సర్ కేసులను గుర్తించడంలో సహాయపడింది. ఇది రిమోట్గా ఆంకాలజిస్టులతో మమేకమై రోగులకు సలహాలు ఇస్తోంది.వ్యాధిని గుర్తించడంలో కీలకండయాగ్నోస్టిక్స్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరించింది. ఉదాహరణకు.. గూగుల్ డీప్ మైండ్ రొమ్ము క్యాన్సర్ను గుర్తించడంలో 99% కచ్చితత్వాన్ని చేరుకుందని కొన్ని రిపోర్ట్ల ద్వారా తెలుస్తుంది. కంటి వ్యాధులు, చర్మ క్యాన్సర్, అల్జీమర్స్ వంటి నాడీ పరిస్థితులను గుర్తించడానికి కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నారు. చెస్ట్ ఎక్స్-రే రిపోర్ట్ల నుంచి టీబీని నిర్ధారించడంలో ఏఐ సాధనాలు మెరుగ్గా పని చేస్తున్నాయి. వ్యాధిని వేగంగా గుర్తించడంతో ముందస్తు చికిత్స అందుతుంది. ఇది ట్రీట్మెంట్ ఫలితాలను మెరుగుపరచడమే కాకుండా, ఆరోగ్య సంరక్షణ నిపుణులపై ఒత్తిడిని తగ్గిస్తుంది.రియల్ టైమ్ మానిటరింగ్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాల ద్వారా హైపర్-పర్సనలైజ్డ్ మెడిసిన్కు అవకాశం ఉంటుంది. ఇందులో ఉపయోగించే అల్గారిథమ్లు నిర్దిష్ట మందులకు ప్రత్యేకంగా రోగులు తమ వ్యక్తిగత జీవన విధానాన్ని అనుసరించి ఎలా స్పందిస్తారో అంచనా వేస్తాయి. ఇది ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుంది. డయాబెటిక్ రోగులు పెరుగుతున్న నేపథ్యంలో కృత్రిమ మేధ ఆధారిత వేరబుల్ పరికరాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయులను రియల్ టైమ్లో పర్యవేక్షిస్తున్నాయి. సంభావ్య సంక్షోభాల గురించి వైద్యులు లేదా సంరక్షకులను అప్రమత్తం చేస్తున్నాయి.ఇదీ చదవండి: నెట్వర్క్ విస్తరణలో అమెజాన్ -
టెకీలను ఆరోజు ఆఫీసులకు రప్పించాలంటున్న ఐటీ వెటరన్..
ఐటీ కంపెనీల్లో పని విధానం, వాతావరణం గురించి నిత్యం చర్చ జరుగుతూ ఉంటుంది. టెకీలకు సోమవారాల్లో ఆఫ్లు గానీ, వర్క్ ఫ్రమ్ హోం ఆప్షన్లు గానీ ఇవ్వకుండా ఆఫీసులకు రప్పించాలని ఓ సీనియర్ ఉన్నతోద్యోగి చేసిన సూచన తాజాగా మరోసారి సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఛీఫ్ క్వాలిటీ ఆఫీసర్గా పనిచేస్తున్న నాగరాజ్ ఎం.సి.. ఐటీ ఉద్యోగులు సోమవారాల్లో తప్పనిసరిగా ఆఫీసులకు వచ్చి పనిచేయాలని అభిప్రాయపడుతూ ప్రొఫెషనల్ షేరింగ్ ప్లాట్ఫామ్ లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. పరిశ్రమలో 35 ఏళ్ల అనుభవం ఉన్న ఆయన సోమవారాల్లో ఆఫీస్ హాజరు అన్నది ఎంత ఆవశ్యకరమో వివరించారు.సోమవారాల్లో ఆఫీస్ హాజరు ఎందుకు ముఖ్యమంటే..ఉద్యోగులు సోమవారం రోజున సెలవులు తీసుకోవడం లేదా వర్క్ ఫ్రం హోమ్ కోరడం వల్ల పని వాతావరణానికి కలిగే ఇబ్బందులను నాగరాజ్ వివరించారు. మొదటిది ఉద్యోగుల్లో ఉత్సాహం తగ్గిపోతుంది. మూడు రోజుల వీకెండ్ తర్వాత (సోమవారం తీసుకునే సెలవుతో కలుపుకొని) ఉద్యోగులు ఉత్సాహం లేకుండా వస్తారు. రెండోది ఉద్యోగులు ప్రాధాన్యతలపై దృష్టి కోల్పోతారు. సోమవారం కార్యాలయంలో ఉండటం వల్ల వారం మొత్తం పనికి దిశ చూపుతుంది. మూడోది ఉద్యోగుల మధ్య సహకారంపై ప్రభావం పడుతుంది. సోమవారం గైర్హాజరు వల్ల టీమ్ డైనమిక్స్ బలహీనమవుతుంది. కాబట్టి అన్ని కంపెనీల్లో ఉన్నతోద్యోగులు తమ సహచరులు సోమవారాల్లో తప్పనిసరిగా ఆఫీస్లకు వచ్చేలా ప్రోత్సహించాలని ఆయన సూచిస్తున్నారు.ఆన్లైన్ స్పందనలునాగరాజ్ ప్రతిపాదించిన సోమవారం ఆఫీస్ హాజరు సూచనపై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. చాలా మంది ఈ అభిప్రాయాన్ని పాతదిగా, కఠినంగా అభివర్ణించారు. మంచి పనితీరు అంటే అవుట్పుట్, హాజరు కాదంటూ బదులిచ్చారు. ఏఐ, డిజిటల్ టూల్స్ వలన వర్క్ మోడల్స్ మారుతున్నాయి. సోమవారం-శుక్రవారం హాజరు మీద దృష్టి పెట్టడం మైక్రో మేనేజ్మెంట్ లా అనిపించిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.సోమవారాల్లో సెలవులు ఎందుకు పెడతారు?రెండు రోజుల వారాంతపు సెలవుల తర్వాత సోమవారం నుంచి మళ్లీ వారం ప్రారంభమవుతుంది. చాలా మంది సెలవు మూడ్నుంచి బయటపడి వెంటనే పనిలో నిమగ్నం కాలేరు. అందుకే సోమవారం కూడా సెలవు కావాలని కోరుకుంటారు. వీకెండ్ తర్వాత పని ప్రారంభించేటప్పుడు వచ్చే అసౌకర్య భావనలను సోమవారం బ్లూస్ అంటారు. అలసట, ఆందోళన, నిద్రలేమి, తలనొప్పులు, ఒత్తిడి వీటి లక్షణాలు. ఉద్యోగ అసంతృప్తి, పని ఒత్తిడి, వీకెండ్ అలవాట్లు వీటికి ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: HCLTech: మా ఐటీ ఉద్యోగులకు మాటిస్తున్నా.. -
స్మార్ట్ఫోన్ కంపెనీకి యాపిల్, శామ్సంగ్ నోటీసులు
భారతదేశ ప్రీమియం స్మార్ట్ఫోన్ సెగ్మెంట్లో పోటీ పెరుగుతోంది. ఈ క్రమంలో కొన్ని కంపెనీలు తమ పోటీ సంస్థల ఉత్పత్తులను నేరుగా ప్రకటనల్లో పోలుస్తూ వివిధ మాధ్యమాల ద్వారా యాడ్లు ఇస్తూ వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. ఇటీవల యాపిల్, శామ్సంగ్ కంపెనీలు తమ ఉత్పత్తులను నేరుగా పోల్చే ప్రకటనలను ఉటంకిస్తూ షావోమీకి వేర్వేరుగా నోటీసులు జారీ చేశాయని కొన్ని సంస్థలు తెలిపాయి. ప్రత్యర్థి మార్కెటింగ్ వ్యూహాలను కట్టడి చేస్తూ, తమ బ్రాండ్ విలువను కాపాడుకోవడానికి మార్కెట్ లీడర్లు చేస్తున్న రక్షణాత్మక చర్యలను ఈ లీగల్ నోటీసులు హైలైట్ చేస్తున్నాయి.వివాదానికి కారణంఐఫోన్ 16 ప్రోమ్యాక్స్, కొన్ని శామ్సంగ్ మోడళ్లను లక్ష్యంగా చేసుకుని షావోమీ ఈ ప్రచారం చేసిందని సమాచారం. ఇటీవల షావోమీ 15 అల్ట్రా మోడల్ ప్రకటనలను ఉంటకిస్తూ ధర, స్పెసిఫికేషన్లపై యాపిల్ ఐఫోన్ 16 ప్రోమ్యాక్స్తో ప్రత్యక్ష పోలికలున్నట్లు తెలిపింది. సోషల్ మీడియాలో ఎంపిక చేసిన శామ్సంగ్ మోడళ్లను లక్ష్యంగా చేసుకుని షావోమీ ఇదే విధానాన్ని అనుసరించిందని కొన్ని సంస్థలు తెలిపాయి.ఇదీ చదవండి: ఆర్బీఐ బ్యాంకులకు మార్గదర్శకాలు జారీయాపిల్, శామ్సంగ్ జారీ చేసిన లీగల్ నోటీసులు వాటి బ్రాండ్ ఇమేజ్కు మరింత నష్టం జరగకుండా ఉండటానికి తోడ్పడుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్రాండ్ కన్సల్టెంట్ హరీష్ బిజూర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘కొన్ని కంపెనీలు అనుసరిస్తున్న ఇలాంటి విధానాలు బ్రాండ్ వాల్యుయేషన్కు ముప్పుగా వాటిల్లుతున్నాయి. వీటిపై చట్టపరమైన చర్యలు ఎంతో అవసరం’ అని చెప్పారు. ఈ వ్యవహారంపై షావోమీ అధికారంగా స్పందించాల్సి ఉంది. -
మా ఐటీ ఉద్యోగులకు మాటిస్తున్నా..
ఐటీ పరిశ్రమలో ఏఐ పేరు చెబితేనే ఉద్యోగులు బెంబేలెత్తిపోతున్నారు. కారణం ఎడాపెడా లేఆఫ్లు. ఒక కంపెనీ ఏఐపై దృష్టి పెట్టిందంటేనే ఇక ఆ సంస్థలో మానవ ఉద్యోగాలకు మూడినట్టేనన్న చర్చ సాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో హెచ్సీఎల్ ఉద్యోగులకు మంచి మాట చెప్పారు ఆ కంపెనీ చైర్ పర్సన్ రోష్ని నాడార్.ఇటీవల జరిగిన హెచ్సీఎల్టెక్ వార్షిక సర్వసభ్య సమావేశంలో చైర్పర్సన్ రోషిణి నాడార్ మల్హోత్రా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ముడిపడి ఉన్న ఉద్యోగాల కోతలపై పెరుగుతున్న ఆందోళనలను ప్రస్తావించారు. తాము మానవ ప్రతిభను మరింత పెంచడానికే తప్ప దాన్ని భర్తీ చేయడం కోసం ఏఐని వినియోగించడం లేదని స్పష్టం చేశారు. ఆ రకంగా ఉద్యోగాల తొలగింపు కాకుండా వాటి సృష్టిపై కంపెనీ దృష్టి సారించిందని ఆమె వాటాదారులకు భరోసా ఇచ్చారు.బాధ్యతాయుతమైన వ్యూహానికి కట్టుబడి ఉన్నాంమానవ సామర్థ్యాలను పెంపొందించడానికి ఏఐని కో పైలట్ గా ప్రవేశపెడుతున్నామని, వాటి స్థానంలో కాదని ఆమె అన్నారు. ‘కొన్ని ఉద్యోగాల్లో మార్పులు ఉండొచ్చు కానీ, అధిక విలువ పనులను చేపట్టడానికి ఉద్యోగుల నైపుణ్యాలను పెంచడంపైనే మా దృష్టి ఉంది. ఉద్యోగాల కోత కంటే వాటి పెరుగుదల, ఉద్యోగ పరివర్తనకు ప్రాధాన్యమిచ్చే బాధ్యతాయుతమైన ఏఐ స్వీకరణ వ్యూహానికి మేం కట్టుబడి ఉన్నాం’ అని రోష్ని నాడార్ సపష్టం చేశారు.ఐటీ రంగంలో నియామకాలు మందకొడిగా సాగుతున్న తరుణంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశంలోని అగ్రశ్రేణి ఐటీ కంపెనీలలో సిబ్బంది నికర చేర్పులు తక్కువగా ఉన్నాయి. ఇది నియామకంలో మరింత జాగ్రత్తగా విధానాన్ని సూచిస్తుంది. కొన్ని కంపెనీలు స్వల్ప లాభాలను నమోదు చేయగా, మొత్తం ట్రెండ్ ప్రకారం నియామకాలు చల్లబడ్డాయి.జూన్ తో ముగిసిన త్రైమాసికంలో హెచ్సీఎల్ టెక్ 1,984 మంది ఫ్రెషర్లను నియమించుకుంది. గత త్రైమాసికంలో 2,23,420గా ఉన్న మొత్తం ఉద్యోగుల సంఖ్య ఆ త్రైమాసికంలో 2,23,151కి తగ్గింది. మార్చిలో 13 శాతంగా ఉన్న అట్రిషన్ రేటు జూనలో 12.8 శాతానికి తగ్గింది.ఇదీ చదవండి: విప్రో చేతికి హర్మన్ డీటీఎస్.. రూ. 3,270 కోట్ల డీల్ -
ఏఐతో బ్యాంకింగ్లో సమూల మార్పులు..!
ముంబై: కృత్రిమ మేధ (ఏఐ) అమలుతో భారత బ్యాంకింగ్ రంగంలో సగం ఉద్యోగాల స్వరూపం మారిపోతుందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) అంచనా వేసింది. ఎన్నో రంగాల్లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం చూపిస్తుందన్న ఆందోళనల నేపథ్యంలో బీసీజీ నివేదికకు ప్రాధాన్యం ఏర్పడింది. గత దశాబ్ద కాలంలో బ్యాంకులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై (ఐటీ) ఐదు రెట్లు అధికంగా వ్యయాలు చేసినప్పటికీ పెరిగిన ఉత్పాదక పరిమితమేనని ఈ నివేదిక తెలిపింది. నికరంగా పెరిగిన ఉత్పాదకత ఒక శాతమేనంటూ, అంతర్జాతీయ బ్యాంకులతో పోల్చితే భారత బ్యాంకులు వెనుకబడినట్టు పేర్కొంది. కనుక బ్యాంక్లు ఏఐ వినియోగం ద్వారా ఉత్పాదతక పెంపు పరంగా ఉన్న సవాళ్లను అధిగమించొచ్చని తెలిపింది. ఇప్పటికే చాలా బ్యాంక్లు ఈ తరహా టూల్స్ను వినియోగిస్తున్నట్టు పేర్కొంది. బ్యాంకులు ఈ తరహా కొత్త సాంకేతికతలను స్వీకరించడం మొదలు పెడితే, గత కొన్నేళ్ల నుంచి ఎదుర్కొంటున్న సంక్లిష్ట వ్యయ సవాళ్లను అధిగమించగలవని బీసీజీ సీనియర్ పార్ట్నర్ రుచిన్ గోయల్ పేర్కొన్నారు.‘ఏఐ వినియోగం పెరిగే కొద్దీ సంఘటిత రంగంలో ఉద్యోగాలకు సవాళ్లు ఎదురవుతాయి. ఐటీ తదితర రంగాల్లో ఇప్పటికే ఉద్యోగుల తొలగింపులు వింటున్నాం. బ్యాంకుల్లోనూ నికర ఉద్యోగుల సంఖ్య పెరుగుదల తగ్గుతోంది. టెక్నాలజీ కారణంగా కొన్ని ఉద్యోగ ఖాళీలను బ్యాంకులు భర్తీ చేయకపోవచ్చు’ అని గోయల్ చెప్పారు. రానున్న రోజుల్లో టెక్నాలజీపై బ్యాంకులు చేసే వ్యయాలు పెరుగుతాయన్నారు. రుణ వృద్ధి మెరుగుపడాలి.. బ్యాంకుల్లో రుణ వృద్ధి నిదానించడాన్ని బీసీజీ నివేదిక ఎత్తి చూపించింది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు వీలుగా బ్యాంకుల రుణ వృద్ది వేగవంతం కావాలని పేర్కొంది. సాధారణ జీడీపీ వృద్ది కంటే 3–3.5 శాతం మేర బ్యాంకుల రుణ ఆస్తులు పెరగాల్సి ఉంటుందని తెలిపింది. 2024–25లో సాధారణ జీడీపీ 9.8 శాతం కాగా, బ్యాంకుల రుణ వృద్ధి 12 శాతానికే పరిమితమైనట్టు గుర్తు చేసింది. -
మానవ మేధస్సు ముందు ఏఐ ఎంత?
ఏఐ సాధనాలు మరింత అధునాతనంగా మారినప్పటికీ, కీలక నిర్ణయాలను తీసుకోవాల్సి వస్తే మానవ మేధస్సును ఏదీ భర్తీ చేయలేదని నిపుణులు భావిస్తున్నారు. అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్వర్క్ అయిన లింక్డ్ఇన్ అధ్యయనం ప్రకారం కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో భారతదేశంలో 83% మంది నిపుణులు, హైదరాబాద్లోని 88% మంది నిపుణులు ఏఐపై ఆధారపడడం కంటే మానవ మేధస్సుకు ఓటేస్తున్నారు.లింక్డ్ఇన్ అధ్యయనంలోని అంశాలు..హైదరాబాద్లో 79% మంది ఉద్యోగ విధుల్లో భాగంగా ఏఐని వాడుతున్నట్లు చెబుతున్న సమయంలో కీలక నిర్ణయాల విషయంలో మాత్రం ఏఐ సాయం తీసుకోకపోవడం గమనార్హం.75% మంది తమ కెరియర్లో ఎదిగేందుకు ఏఐలో ప్రావీణ్యం సంపాదించడం అవసరమని భావిస్తున్నారు.ఏఐలో నైపుణ్యం సాధించడం రెండో ఉద్యోగంలా అనిపిస్తుందని హైదరాబాద్లోని నలుగురు నిపుణుల్లో ముగ్గురు అంగీకరిస్తున్నారు.59% మంది ఏఐని పూర్తి సామర్థ్యంతో ఉపయోగించడం లేదని చెబుతున్నారు.75% మంది నిపుణులు ఏఐ తమ రోజువారీ పని జీవితాన్ని మెరుగుపరుచగలదని నమ్ముతున్నారు.78% మంది నిపుణులు ఏఐని నిజమైన నిర్ణయం తీసుకోవడానికి కాకుండా రాయడం, డ్రాఫ్టింగ్కు ఉపయోగకరంగా భావిస్తున్నారు.70% మంది ఉద్యోగ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏఐ కంటే కూడా తమ సొంత నిర్ణయాలనే నమ్ముతున్నారు.భారతదేశంలో 83% మంది కార్యనిర్వాహకులు మంచి వ్యాపార నిర్ణయాలు మానవ మేధస్సుపైనే ఆధారపడి ఉంటాయని నమ్ముతున్నారు.లింక్డ్ఇన్ కెరియర్ నిపుణులు, ఇండియా సీనియర్ మేనేజింగ్ ఎడిటర్ నీరజిత బెనర్జీ మాట్లాడుతూ ‘ఏఐ ఒక అద్భుతమైన సాధనం. ఇది వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడుతోంది. రోజువారీ పనులను క్రమబద్ధీకరించగలదు. అయితే కీలక విషయాల్లో నిర్ణయం తీసుకునేప్పుడు చాలామంది ఏఐపై ఆధారపడడం లేదు. ఏఐని తాము విశ్వసించే సాధనంగానే కానీ, అనుసరించే సాధనంగా భావించడంలేదు. మానవులు మాత్రమే చేసే పని కోసం సమయాన్ని ఆదా చేసేందుకు ఏఐని ఉపయోగించాలి’ అని చెప్పారు.ఇదీ చదవండి: మార్వాడీలు వ్యాపారంలో ఎందుకు విజయం సాధిస్తారు? -
కోర్టుకెక్కిన మస్క్ కంపెనీ: యాపిల్, ఓపెన్ఏఐ దావా..
బిలియనీర్ ఎలాన్ మస్క్కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ 'ఎక్స్ఏఐ' (xAI).. యాపిల్ & ఓపెన్ఏఐపై సోమవారం టెక్సాస్లోని యూఎస్ ఫెడరల్ కోర్టులో దావా వేసింది. ఏఐలో పోటీని అడ్డుకోవడానికి వారు చట్టవిరుద్ధంగా కుట్ర పన్నుతున్నట్లు ఆరోపించింది.యాపిల్, ఓపెన్ఏఐ రెండూ కూడా తమ గుత్తాధిపత్యాన్ని కొనసాగించడానికి.. ఎక్స్, ఎక్స్ఏఐ వంటి ఆవిష్కర్తలు పోటీ పడకుండా నిరోధించడానికి మార్కెట్లను లాక్ చేశాయని దావాలో పేర్కొన్నారు. ఎక్స్ఏఐ ఉత్పత్తులను అణిచివేయడానికి ఈ రెండూ పన్నాగం పన్నినట్లు ఫిర్యాదులో పేర్కొంది.ఓపెన్ఏఐతో.. యాపిల్కు ఒప్పందం లేకపోతే దాని యాప్ స్టోర్లో ఎక్స్, గ్రోక్ యాప్లకు ప్రాముఖ్యత ఎందుకు ఇవ్వడం లేదు. మా సంస్థ యాప్ను ఎందుకు ముందుగా ప్రదర్శించడం లేదని ఎక్స్ఏఐ ప్రశ్నించింది. దీనిపై యాపిల్, ఓపెన్ఏఐ కంపెనీలు స్పందించలేదు.ఇదీ చదవండి: ఇది పరిశ్రమకు కొత్త విజయగాథ: నరేంద్ర మోదీకాగా.. ఈ నెల ప్రారంభంలో, కాలిఫోర్నియాకు చెందిన యాపిల్ సంస్థ కుపెర్టినోపై దావా వేస్తానని మస్క్ పేర్కొన్నారు. యాపిల్ ''యప్ స్టోర్లో OpenAI తప్ప మరే AI కంపెనీ #1 స్థానానికి చేరుకోవడం అసాధ్యం'' అని మస్క్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.Apple is behaving in a manner that makes it impossible for any AI company besides OpenAI to reach #1 in the App Store, which is an unequivocal antitrust violation. xAI will take immediate legal action.— Elon Musk (@elonmusk) August 12, 2025 -
రైల్వే ట్రాక్పై సోలార్ ఎనర్జీ తయారీ!
దేశంలోనే తొలిసారిగా రైల్వే ట్రాక్పై సోలార్ ప్యానెళ్లతో ప్రయోగాలు ప్రారంభించింది భారతీయ రైల్వే. వారణాసిలోని బెనారస్ లోకోమోటివ్ వర్క్స్ (బీఎల్డబ్ల్యూ)లో 70 మీటర్ల పొడవున అదనపు భూమిని వినియోగించకుండా గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేసేలా సోలార్ ప్యానెళ్లను అమర్చారు. దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ రైల్వే మంత్రిత్వ శాఖ దీన్ని ‘హరిత, సుస్థిర రైలు రవాణా’ చర్యగా అభివర్ణించింది.సంప్రదాయానికి భిన్నంగా..సాధారణంగా సోలార్ ఎనర్జీకి భారీగా భూసేకరణ అవసరం అవుతుంది. సోలార్ ప్యానెళ్లను అమర్చేందుకు భూమి ఎంతో అవసరం. భూసేకరణ దేశంలో ఇలాంటి ప్రాజెక్ట్లకు పెద్ద అడ్డంకి. దీన్ని పరిష్కరించేందుకు భారతీయ రైల్వే ప్రణాళికలు సిద్ధం చేసింది. సంప్రదాయానికి భిన్నంగా రైల్వేపట్టాలకు మధ్యలో ఉన్న భూమిని ప్యానెళ్ల ఏర్పాటుకు వినియోగిస్తున్నారు. దేశంలో చాలా కిలోమీటర్లు విస్తరించిన ఈ రైల్వే పట్టాల్లో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రాథమికంగా పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా వారణాసిలోని బెనారస్ లోకోమోటివ్ వర్క్స్ (బీఎల్డబ్ల్యూ)లో 70 మీటర్ల పొడవున అదనపు భూమిని వినియోగించకుండా గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేసేలా సోలార్ ప్యానెల్స్ను అమర్చారు. ఇది విజయవంతం అయితే క్రమంగా ఈ వ్యవస్థను ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నట్లు తెలుస్తుంది.నిర్వహణ సులువుఈ ప్రాజెక్ట్లో నిర్వహణను సులభతరం చేసేలా ఏర్పాట్లు చేశారు. ఏదైనా సమస్య వస్తే వాటిని త్వరగా తొలగించి తిరిగి ఇన్స్టాల్ చేసే విధంగా ప్యానెల్స్ను అమర్చారు. దీని ద్వారా తనిఖీలు, మరమ్మతులు లేదా అత్యవసరాల కోసం రైల్వే కార్మికులు ఎక్కువ ఆలస్యం చేయకుండా వీలవుతుంది. పట్టాలపై రైలు ప్రయాణించినప్పుడు, దుమ్ము పేరుకుపోవడం, వర్షం.. వంటి పరిస్థితులను తట్టుకునేలా ఈ ప్యానెళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.భవిష్యత్తులో రైల్వే స్వావలంబనఇందులో 28 హైస్ట్రెంత్ ఫోటోవోల్టాయిక్ ప్యానెళ్లను ఉపయోగిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఇవి మొత్తంగా 15 కిలోవాట్ ఎనర్జీని ఉత్పత్తి చేయగలవు. భారతీయ రైల్వే వ్యవస్థ 1.2 లక్షల కిలోమీటర్లకు పైగా విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్ద రైలు నెట్వర్క్ల్లో ఒకటిగా నిలుస్తోంది. ఇలాంటి వ్యవస్థ రానున్న రోజుల్లో గ్రీన్ ఎనర్జీకి కీలకంగా మారే అవకాశాలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో ఈ గ్రీన్ ఎనర్జీ ద్వారా రైల్వే విద్యుత్ వాడకంలో స్వావలంబన సాధిస్తుందని నమ్ముతున్నారు.ఇదీ చదవండి: యూఎస్లో రూ.1 కోటి సంపాదిస్తే ఎంత మిగులుతుంది? -
ఒక్క రూపాయికే రూ.4999 రీచార్జ్ ప్లాన్!
వొడాఫోన్ ఐడియా (వీఐ) తన యూజర్లకు అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. కేవలం ఒక్క రూపాయికే రూ.4,999 రీఛార్జ్ ప్లాన్ ను అందిస్తోంది. వీఐ గేమ్స్ లో గెలాక్సీ షూటర్ ఫ్రీడమ్ ఫెస్ట్ ఎడిషన్ ను వొడాఫోన్ ఐడియా ప్రవేశపెట్టింది. ఈ స్పెషల్ ఎడిషన్ ఫెస్ట్ కింద అనేక రివార్డులను అందిస్తుండగా వాటిలో ఒకటే ఒక్క రూపాయికి రూ .4,999 రీచార్జ్ ప్లాన్.ఆగస్టు 31 వరకే ఆఫర్టెలికామ్ టాక్ నివేదిక ప్రకారం.. వీఐ గేమ్స్ పై గెలాక్సీ షూటర్స్ ఫ్రీడమ్ ఫెస్ట్ ఎడిషన్ ఆగస్టు 31 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ గెలాక్సీ షూటర్స్ ఫ్రీడమ్ ఫెస్ట్ లో వినియోగదారులు అనేక రివార్డులను పొందుతున్నారు. రివార్డుల జాబితాలో రూ .4,999 రీఛార్జ్ ప్లాన్ కూడా ఉంది. ఈ ఫెస్ట్ లో కంపెనీ కేవలం రూ.1కే రూ.4,999 వార్షిక ప్లాన్ ను వినియోగదారులకు అందిస్తోంది.ప్లాన్లో లభించే బెనిఫిట్స్ రూ.4,999 ప్లాన్లో వీఐ తన వినియోగదారులకు అపరిమిత కాలింగ్తో పాటు ప్రతిరోజూ 2 జీబీ మొబైల్ డేటా, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లను అందిస్తుంది. దీనితో పాటు అపరిమిత 5జీ డేటా కూడా ఈ ప్యాక్ లో లభిస్తుంది. అంతేకాకుండా వీఐఎంటీవీ, అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఈ ప్లాన్లో వినియోగదారులకు అర్ధరాత్రి 12 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అపరిమిత డేటా లభిస్తుంది. ఇది కాకుండా, వీకెండ్ డేటా రోల్ఓవర్ కూడా ఇందులో లభిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు అంటే ఏడాది. కేవలం రూ.1కే ఇన్ని బెనిఫిట్స్ పొందొచ్చు.ఆఫర్ పొందండిలా.. వీఐ యాప్ను ఓపెన్ చేయండివీఐ గేమ్స్ సెక్షన్కి వెళ్లండిగెలాక్సీ షూటర్స్ ఫ్రీడమ్ ఫెస్ట్ ఎడిషన్ గేమ్ ఆడండిడ్రోన్లను షూట్ చేసి జెమ్స్ సంపాదించండిజెమ్స్ ఆధారంగా రివార్డ్స్ పొందండిఎన్ని రివార్డ్స్కు ఏమి లభిస్తాయి? 25 జెమ్స్ రివార్డ్స్కు రూ.50 అమెజాన్ వోచర్75 జెమ్స్ రివార్డ్స్కు 10జీబీ డేటా + ఓటీటీ యాక్సెస్150 జెమ్స్ రివార్డ్స్కు 50జీబీ డేటా ప్యాక్300 జెమ్స్ రివార్డ్స్కు రూ.1కే రూ.4999 ప్లాన్ (15 మంది విజేతలకు మాత్రమే) -
భక్తి ప్లస్ టెక్ కాంబోలో.. గణపయ్యకు టెక్నో హారం!
ఈసారి గణపయ్యకు టెక్ టచ్తో స్వాగతం చెప్పారంటే, ఇక మీ పండుగ వాతావరణం భక్తి ప్లస్ టెక్ కాంబోలో డబుల్ ఆనందంతో మెరిసిపోతుంది.వీఆర్ గణపయ్యతో రద్దీకి గుడ్బై!వినాయక చతుర్థి రాగానే ముంబయి లాల్బాగ్చా రాజా ముందు కనిపించే రద్దీ మాటల్లో చెప్పలేనిది. కాని.. ఇప్పుడు బయట అడుగు పెట్టకుండానే, మీ లివింగ్రూమ్లో కూర్చొని ఆ భవ్య దర్శనాన్ని ఆస్వాదించవచ్చు. అదే ఈ ‘లాల్బాగ్ 360’ వీఆర్ దర్శనం. ఒక్క యాప్తో మీ హాల్లో కూర్చునే పూజా గంటలు, పూజారుల మంత్రోచ్ఛారణ, మండప అలంకారాలు అన్నీ కళ్లముందే ప్రత్యక్షం అవుతాయి. ఎడమ వైపు తిప్పితే పూలతో అలంకరించిన మండపం, కుడివైపు తిప్పితే గణపయ్య పాదాల వద్ద నమస్కరిస్తున్న భక్తులు అన్నీ నిజంగానే అక్కడ ఉన్నట్టు అనిపిస్తాయి.ఇదే విధంగా ‘గణేశ్ వీఆర్’, ‘విజయవిధి వర్చువల్ దర్శనం’ లాంటి యాప్లు కూడా 360 డిగ్రీల వీడియోలతో పండుగ వాతావరణాన్ని ఇంటికే తీసుకొస్తున్నాయి. వాడటం కూడా చాలా సులభం. మీ ఫోన్ లేదా స్మార్ట్ టీవీలో యాప్ డౌన్లోడ్ చేసి, హెడ్సెట్ లేదా మానిటర్లో ఫుల్స్క్రీన్లో ఆన్ చేస్తే సరిపోతుంది. లైవ్ టైమింగ్స్, లింకులు అధికారిక వెబ్సైట్లో దొరుకుతాయి.ఒకే టచ్తో భక్తి ప్లస్ డీజే మోడ్!గణేష్ మండపం అంటే వెలుగుల వేదిక! అయితే, ఇప్పుడు తీగలు, ప్లగ్లు, స్విచ్లతో ఇబ్బంది పడే రోజులు పోయాయి. ఒక వైఫై ఎల్ఈడీ బల్బు పెట్టేస్తే చాలు. మీ మండపం క్షణాల్లో ‘సినిమా సెట్’లా మెరిసిపోతుంది. ఉదయం పూజ సమయానికి పసుపు వెలుగు, మధ్యాహ్నం భక్తులు రాగానే ప్రకాశించే తెలుపు వెలుగు, రాత్రి డీజే బీట్ పడగానే గ్రీన్ , బ్లూ, రెడ్ ఫ్లాష్లతో మండపం ఫుల్ పార్టీ మూడ్లోకి మారిపోతుంది. ఇవన్నీ కేవలం ఫోన్ టచ్తోనే! ‘అలెక్సా, డివోషనల్ మోడ్ ఆన్’ అంటే పసుపు, ఎరుపు కాంబినేషన్ రెడీ. వాడటం కూడా సింపుల్. బల్బు పెట్టి, యాప్ డౌన్లోడ్ చేసి, వైఫై కనెక్ట్ చేస్తే సరిపోతుంది. టైమింగ్ సెట్ చేసి, పూజ సమయానికి ఆటోమేటిక్గా వెలుగులు వెలిగేలా చేసుకోవచ్చు. విప్రో, ఫిలిప్స్, హెవెల్స్ లాంటి బ్రాండ్లు మంచి ఆప్షన్లు ఇస్తున్నాయి. ఒక్క బల్బు ధర రూ. 600 నుంచి మొదలవుతుంది.ఒక్క బాక్స్లో మొత్తం పండుగ! వినాయక చవితి దగ్గర పడుతుంటే, ఇంట్లో అందరికీ ఒకటే టెన్షన్, పూజ సామగ్రిని సర్దుకోవాలి, పత్రి తెప్పించాలి, విగ్రహం తీసుకురావాలి. వీటన్నిటికీ చివరి నిమిషంలో టెన్షన్.. టెన్షన్! కాని, ఈసారి అంతా ఈజీ! ‘ఆరాధ్య గణేశ్ చతుర్థి సంపూర్ణ పూజా కిట్’ చేతిలో ఉంటే చాలు, మీ పండుగ ఏ లోటు లేకుండా చక్కగా పూర్తవుతుంది.ఒక్క బాక్స్లోనే పన్నెండు అంగుళాల మట్టి గణపయ్య, ఇరవైఒక్క రకాల పవిత్ర పత్రి, ఒక చెక్క పాలవెల్లి సహా పూజకు కావాల్సినవన్నీ సిద్ధంగా లభిస్తాయి. కేవలం పూలు, పండ్లు, నైవేద్యం బాధ్యత మాత్రమే మీది! ఎవరైనా పూజ విధానం మరచిపోయారా? టెన్షన్ లేదు, చిన్న పుస్తకంతోపాటు, వీడియో గైడ్ కూడా వెబ్సైట్లో రెడీగా ఉంటుంది. పైగా ప్యాకేజింగ్ నుంచి విగ్రహం వరకు అంతా ప్రకృతికి నష్టం లేకుండా పర్యావరణహితంగా ఉంటుంది. ధర కేవలం రూ.1500 మాత్రమే! -
మిక్స్డ్ రియల్టీ హెడ్సెట్: తొలి చైనా కంపెనీగా వివో
ప్రముఖ స్మార్ట్ఫోన్స్ సంస్థ వివో తమ 30వ వార్షికోత్సవం సందర్భంగా మిక్స్డ్ రియాల్టీ హెడ్సెట్ 'విజన్ డిస్కవరీ' ఎడిషన్ను ప్రవేశపెట్టింది. దీంతో ఇటు స్మార్ట్ఫోన్స్, అటు ఎంఆర్ ప్రోడక్టుల విభాగాల్లో మొదటిసారిగా మిక్సిడ్ రియాలిటీ ఉత్పత్తిని ప్రవేశపెట్టిన తొలి చైనా కంపెనీగా నిలిచింది.వివో మిక్స్డ్ రియల్టీ హెడ్సెట్ బరువు 300 గ్రాములు, మందం 40 మిమీ మాత్రమే. కాబట్టి ఇప్పటివరకు మార్కెట్లో ఉన్న ఇతర ఎంఆర్ ఉత్పత్తితో పోలిస్తే ఇది 26 శాతం చిన్నగాను, సౌకర్యవంతంగాను ఉంటుంది. ఈ హెడ్సెట్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ఎక్స్ఆర్2ప్లస్ జెన్ 21 ప్లాట్ఫామ్ మీద నిర్మితమైంది. ఇది రెండున్నర రెట్లు అధికంగా జీపీయూ సామర్థ్యాలు, ఎనిమిది రెట్లు అధికంగా ఏఐ సామర్థ్యాలను పొందింది. -
భారత్లో ఓపెన్ ఏఐ కార్యాలయం
న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ఏఐ ఈ ఏడాది భారత్లో తొలి కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. న్యూఢిల్లీలో దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ఇందుకోసం ఇప్పటికే స్థానికంగా నియామకాలు కూడా ప్రారంభించినట్లు వివరించింది. చాట్జీపీటీకి అమెరికా తర్వాత భారత్ రెండో అతి పెద్ద మార్కెట్గా ఉన్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్లో కార్యాలయం తెరవడం వల్ల ఇక్కడి యూజర్లకు మరింత మెరుగైన సరీ్వసులు అందించేందుకు వీలవుతుందని ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మన్ తెలిపారు. స్థానిక భాగస్వాములు, ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు, డెవలపర్లు, విద్యా సంస్థలతో కలిసి పని చేయడంపై స్థానిక సిబ్బంది దృష్టి పెడతారని వివరించారు. -
సరికొత్త హెచ్పీ గేమింగ్ ల్యాప్టాప్: ధర & వివరాలు
భారతదేశంలో హెచ్పీ ఒమెన్ 16ను లాంచ్ చేస్తూ తన గేమింగ్ ల్యాప్టాప్ లైనప్ను విస్తరించింది. ఈ లేటెస్ట్ ఏఐ గేమింగ్ ల్యాప్టాప్ ఎన్వీడియా గెఫోర్స్ 12జీబీ ఆర్టీఎక్స్తో జత చేసిన.. ఐటెల్ కోర్ అల్ట్రా లేదా ఏఎండీ రైజిన్ ఏఐ ప్రాసెసర్ను పొందుతుంది. దీని ప్రారంభ ధర రూ.1,29,999.హెచ్పీ ఒమెన్ 16 గేమింగ్ ల్యాప్టాప్ ఇప్పుడు ఆన్లైన్ స్టోర్, హెచ్పీ వరల్డ్, అమెజాన్, క్రోమా, రిలయన్స్ డిజిటల్ వంటి రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ఇది 6 సెల్ 83 వాట్స్ బ్యాటరీ కలిగి ఫాస్ట్ ఛార్జ్కు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి దీనిని 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ప్రత్యేకించి గేమింగ్కు చాలా అనుకూలంగా ఉంటుంది.హార్డ్వేర్ విషయానికొస్తే.. ఈ ల్యాప్టాప్ 16 ఇంచెస్ క్యూహెచ్డీ (2560 × 1600) డిస్ప్లేను పొందింది. ఇది 500 నైట్స్ బ్రైట్నెస్ను పొందుతుంది. ఇది 100 శాతం 100 శాతం sRGB కలర్ కవరేజ్.. బ్లూ లైట్ ఎక్స్పోజర్ను తగ్గించడానికి ఐసేఫ్ సర్టిఫికేషన్ను కలిగి ఉంది. అంతే కాకుండా థర్మల్ డిజైన్లో టెంపెస్ట్ కూలింగ్, ఫ్యాన్ గ్యాప్లు, హీట్ ఫేజ్ రీడిస్ట్రిబ్యూషన్ కూడా ఇందులో ఉన్నాయి. -
ఏకంగా 10,000mAh భారీ బ్యాటరీ ఫోన్ వచ్చేస్తోంది..
ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్ రియల్మీ తన రాబోయే స్మార్ట్ఫో న్ లాంచ్ తేదీని టీజ్ చేసింది. బ్యాటరీ విషయంలో ఇది "పెద్ద" డీల్ అంటూ ఊరిస్తోంది. దీని పేరును ఇంకా వెల్లడించనప్పటికీ, కొత్త రియల్మీ డివైస్ 10,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని కలిగి ఉంటుందని కంపెనీ ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో ఒక పోస్ట్లో టీజ్ చేసింది."ఇంత పెద్దది సరిపోతుందా? ఇదిగో రియల్మీ 1x000mAh - మరోసారి పరిమితులను చెరిపేస్తుంది. ఆగస్టు 27న అద్భుతం చూడండి' అంటూ రియల్మీ పోస్ట్ చేసింది. "అతిపెద్దది మరింత పెద్దదిగా మారింది. రియల్మీ మరోసారి పరిమితులను పునర్నిర్వచించనుంది. 320వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ నుంచి 10,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ వరకు... తర్వాత ఏం జరగబోతోంది?" అని మరో ఎక్స్ పోస్ట్ లో పేర్కొంది.అంటే ఈ స్మార్ట్ ఫోన్ లో అధునాతన బ్యాటరీ, ఛార్జింగ్ టెక్నాలజీ ఉండొచ్చని తెలుస్తోంది. రియల్మీ రాబోయే డివైజ్ 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని దాటుతుందా అని చాలా మంది ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం రియల్మీలో అత్యంత శక్తివంతమైన బ్యాటరీ ఉన్న స్మార్ట్ఫోన్ రియల్మీ జీటీ 7. చైనీస్ మోడల్లో ఇది 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్తో 7,200 ఎంఏహెచ్ సామర్థ్యంతో ఉంది. అదే ఇండియన్ రియల్మీ జీటీ 7 వెర్షన్లో అయితే 120వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.THE BIGGEST JUST GOT EVEN BIGGER. 🔋realme Is Set To Redefine The Limits Once More.From 320W Fast Charging To A Massive 1x000mAh Battery…What’s Coming Next?August 27 — Get Ready For The Next Power Revolution.Know More: https://t.co/c8wHve6fZ2#FreeToBeReal… pic.twitter.com/SrctmwWzrg— realme (@realmeIndia) August 21, 2025 -
చేతిరాతకు ‘ఏఐ’ పవర్.. హైదరాబాద్ కంపెనీ సృష్టి
టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా, పుస్తకాలన్నీ డిజిటలైజ్ అయిపోతున్నా ఇప్పటికీ చాలా మంది పెన్నూ పేపర్ ఉపయోగించి చేత్తో రాయడాన్ని ఇష్టపడుతుంటారు. అలాంటి వారి కోసమే కాగితాన్ని డిజిటల్తో కలిపే ఏఐ స్మార్ట్ నోట్బుక్ను అందుబాటులోకి తీసుకువచ్చింది హైదరాబాద్కు చెందిన స్టార్టప్.టెకీ నుంచి ఎంట్రప్రెన్యూర్గా మారిన సుమన్ బాలబొమ్మ అభివృద్ధి చేసిన రీనోట్ ఏఐ నోట్బుక్ (ReNote AI Notebook) దేశంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత నోట్బుక్గా గుర్తింపు పొందింది. ఇది సాధారణ కాగితపై రాయడం అనుభూతిని అందిస్తూ, ఆ చేతిరాతను డిజిటల్ టెక్స్ట్గా మార్చే ప్రత్యేకమైన సాంకేతికతను కలిగి ఉంది.ఎన్నో ఫీచర్లుఈ నోట్బుక్లో నీటికి తడిసిపోని, చిరిగిపోని, రీ యూజబుల్ పేజీలు ఉంటాయి. పైలట్ ఫ్రిక్సియాన్ (Pilot Frixion) పెన్నుతో వీటిన రాసిన నోట్స్ను తుడిచేయవచ్చు. రీనోట్ ఏఐ మొబైల్ యాప్ ద్వారా చేతిరాతను డిజిటల్ టెక్స్ట్గా మార్చడం, సారాంశాలు తయారు చేయడం, తెలుగు సహా అనేక భాషల్లో అనువాదం, వాయిస్ ఆధారిత శోధన, చిత్రంగా మార్చే స్కెచ్లు వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.తెలంగాణ ప్రభుత్వ టీ-హబ్ ప్రోత్సాహంతో ఏర్పాటైన ఈ స్టార్టప్ జీఐటెక్స్ దుబాయ్, ఒసాకా వరల్డ్ ఎక్స్పో, గిఫ్ట్స్ వరల్డ్ ఎక్స్పో న్యూఢిల్లీ వంటి అంతర్జాతీయ ప్రదర్శనల్లో తమ రీనోట్ ఏఐ నోట్బుక్ను ప్రదర్శించింది. మైటీ, గూగుల్ వంటి సంస్థలు ఈ యాప్ను భారతదేశం లోని టాప్ 100 మొబైల్ యాప్స్ లో ఒకటిగా గుర్తించాయి.వ్యక్తిగత అనుభవాల నుంచి ప్రేరణతో ఈ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టిన సుమన్ బాలబొమ్మ.. "చేతిరాతలో ఉన్న ఫోకస్, జ్ఞాపక శక్తిని కోల్పోకుండా, డిజిటల్ సౌలభ్యాన్ని కలిపే ప్రయత్నమే రీనోట్" అని చెబుతున్నారు. ఇలాంటి ఏఐ నోట్బుక్ను ‘ఎక్స్నోట్’ (XNote) అనే అమెరికా సంస్థ కూడా రూపొందించింది. -
ఏఐలో ఆధిపత్యం కోసం ఎగబడుతున్నారు!
ఏఐ(కృత్రిమ మేధ) గాడ్ఫాదర్గా పేరొందిన జెఫ్రీ హింటన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల టెక్ పరిశ్రమ అనుసరిస్తున్న విధానంపై విమర్శలు చేశారు. నైతిక దూరదృష్టి లేకపోవడం, నియంత్రణలేని కృత్రిమ మేధ అభివృద్ధి పెరుగుతున్న నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేశారు. హింటన్ ఇటీవల ఫార్చ్యూన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంపెనీల సాంకేతిక ఆధిపత్యం కొనసాగుతున్న తరుణంలో దీర్ఘకాలిక శ్రేయస్సు మసకబారుతుందని చెప్పారు.స్వల్పకాలిక లాభాలే కీలకంసాంకేతిక పరిజ్ఞానానికి శక్తినిచ్చే ఏఐ అల్గారిథమ్లను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించిన హింటన్, ప్రస్తుతం టెక్ కంపెనీలు మరింత శక్తివంతమైన ఏఐ మోడళ్లను నిర్మించడానికి పోటీ పడుతున్నాయని తెలిపారు. ఆ సమయంలో భవిష్యత్తులో నెలకొనే విస్తృత ప్రభావాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నైతికంగా ఏఐ అభివృద్ధి పట్ల నిబద్ధత కంటే ప్రధానంగా పోటీ ఒత్తిళ్లు, స్వల్పకాలిక లాభాలే కీలకం అవుతున్నట్లు చెప్పారు.మానవ విలువలకు అనుగుణంగా ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా సూపర్ ఇంటెలిజెన్స్ ఏఐ వ్యవస్థలను మోహరిస్తే వినాశకరమైన పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఏఐ వల్ల తప్పుడు సమాచారం, ఉద్యోగాలు కోల్పోవడం, గోప్యతా ఉల్లంఘనలు.. వంటి ప్రమాదాల కన్నా మానవులను డామినేట్ చేసే వ్యవస్థల వల్ల మరింత నష్టం కలుగుతుందన్నారు.నైతిక ఫ్రేమ్వర్క్..కృత్రిమ మేధ అభివృద్ధిలో బలమైన నైతిక చట్రం(మోరల్ ఫ్రేమ్వర్క్) లేదని హింటన్ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నమూనాలను పెంచడానికి, వినియోగదారుల డేటాను మానిటైజ్ చేయడానికి బిలియన్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నప్పటికీ కొన్ని కంపెనీలు మాత్రం ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్(ఏజీఐ) అస్తిత్వ ప్రమాదాలపై దృష్టి పెడుతున్నాయని పేర్కొన్నారు. ఏదేమైనా కృత్రిమ మేధ అభివృద్ధికి నైతిక ప్రమాణాలు చాలా అవసరం అని చెప్పారు. నిర్దిష్ట ఫ్రేమ్వర్క్లను తయారు చేయడానికి ప్రపంచ సహకారం కావాలని పిలుపునిచ్చారు. వ్యవస్థల మధ్య ఒప్పందాలు, పర్యవేక్షణ, నైతిక ప్రమాణాలు అవసరమన్నారు. ఏఐ పరిశోధకులు, భద్రత, పారదర్శకత, దీర్ఘకాలిక ఆలోచనలకు ప్రాధాన్యమివ్వాలని కోరారు.ఇదీ చదవండి: బైక్ ట్యాక్సీ సేవలు పునరుద్ధరణ -
విప్రో చేతికి హర్మన్ డీటీఎస్.. రూ. 3,270 కోట్ల డీల్
ఐటీ సేవల దేశీ దిగ్గజం విప్రో తాజాగా హర్మన్కు చెందిన డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ సొల్యూషన్స్(డీటీఎస్) బిజినెస్ యూనిట్ కొనుగోలుకి తెరతీసింది. శామ్సంగ్కు చెందిన ఈ సంస్థలో 100 శాతం వాటా కొనుగోలుకి తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందుకు నగదు రూపేణా 37.5 కోట్ల డాలర్లు(సుమారు రూ. 3,270 కోట్లు) వెచ్చించనుంది.ఒప్పందంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 5,600మంది డీటీఎస్ ఉద్యోగులు విప్రోకు బదిలీకానున్నారు. 2025 డిసెంబర్31కల్లా లావాదేవీ పూర్తికావచ్చని అంచనా వేస్తున్నారు. హర్మన్ కనెక్టెడ్ సర్వీసెస్ ఇంక్లో 100 శాతం వాటా కొనుగోలుకి హర్మన్ ఇంటర్నేషనల్ ఇండస్ట్రీస్ ఇంక్తో తప్పనిసరి ఒప్పందంపై సంతకాలు చేసినట్లు విప్రో పేర్కొంది.తద్వారా హర్మన్ అనుబంధ సంస్థలుసహా.. సంబంధిత ఆస్తులను సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. కొనుగోలు తదుపరి విప్రో ఇంజినీరింగ్ గ్లోబల్ బిజినెస్ లైన్లో డీటీఎస్ విలీనంకానున్నట్లు వెల్లడించింది. కనెక్టికట్(యూఎస్) కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డీటీఎస్ అంతర్జాతీయంగా ఈఆర్అండ్డీ, ఐటీ సర్వీసులను అందిస్తోంది. ఎంబెడ్డెడ్ సాఫ్ట్వేర్, డిజిటల్ ఇంజినీరింగ్, డిజైన్ థింకింగ్, క్లౌడ్, ఇన్ఫ్రా సర్వీసులలో ప్రధానంగా కార్యకలాపాలు విస్తరించింది. -
చరిత్ర చెప్పకుండా.. పరువు కాపాడుతూ...
అప్పుడూ.. ఇప్పుడూ.. మనమంతా నెట్టింట్లో ముందు తట్టే తలుపు గూగుల్దే. అంతలా అన్నింట్లోనూ తనదైన ముద్ర వేస్తోంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగా మరికొన్ని ఫీచర్లను పరిచయం చేసింది.ఆ మెసేజెస్ ‘బ్లర్’!వాట్సాప్లో లేని సేఫ్టీ ఫీచర్ గూగుల్ మెసేజుల్లో ఒకటుంది. తరచూ వాట్సాప్ లేదా మరేదైనా మెసేజింగ్ యాప్లలో తెలియని నంబర్ నుంచి మెసేజులు, ఫొటోలు, వీడియోలు వస్తుంటాయ్. వాటిలో అశ్లీల చిత్రాలు, వీడియోలు ఉండొచ్చు. అనుకోకుండా వాటిని ఓపెన్ చేసి షాక్ అవుతాం. చుట్టుపక్కల ఎవరైనా ఉంటే.. పరువు పోయినట్టే! అలాంటి ఇబ్బందులు రాకుండా.. అద్భుతమైన ఫీచర్ను ‘గూగుల్ మెసేజెస్’ తీసుకొచ్చింది. అదే ఆటోమేటిక్ ‘బ్లర్’ ఫీచర్. ఇది ‘న్యూడ్’ మెసేజ్లను ఓపెన్ చేస్తే ఆటోమేటిగ్గా బ్లర్ చేస్తుంది. సెండర్ని కూడా వెంటనే బ్లాక్ చేస్తుంది. కావాలంటే.. అశ్లీల చిత్రాలు కనిపించకుండా చేసి, సంభాషణ కొనసాగించొచ్చు. అంతేకాదు.. మీరు పొరపాటున అశ్లీలమైన కంటెంట్ను పంపితే అలర్ట్ చేస్తుంది. ఇంట్లో పిల్లలు కూడా ఫోన్లు వాడుతున్న నేపథ్యంలో ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. మైనర్లు వాడే ఫోన్లలో ఇది ఆన్ చేసి ఉంటుంది. అయితే, వాళ్లు దాన్ని ఆఫ్ చేసేందుకు వీలుంది. అందుకే పేరెంటల్ కంట్రోల్స్ పెట్టాలి. అప్పుడు తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా దాన్ని ఆఫ్ చేయడం కుదరదు. అందుకు ఫ్యామిలీ లింక్ యాప్ ని వాడొచ్చు. దీన్ని మీ ఫోన్లో ఎనేబుల్ చేసేందుకు గూగుల్ మెసేజెస్ యాప్ ని ఓపెన్ చేయండి. ఈ పాత్ ని ఫాలో అవ్వండి. Messages Settings > Protection & Safety > Manage sensitive content warnings > Warnings in Google Messages.‘జెమినై’లో ప్రైవసీ అప్డేట్ఏఐ పోటీ రోజురోజుకీ పెరుగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో చాట్జీపీటీ కంటే ముందే గూగుల్ జెమినై (Google Gemini).. ఇన్ కాగ్నిటో మోడ్ పరిచయం చేసింది. ఏఐ యూజర్ల ప్రైవసీకి ఇదో చక్కని పరిష్కారం. ఇకపై జెమినితో చేసే చాటింగ్, వ్యక్తిగత సమాచారం ఎవరి కంటా పడవు. ఎందుకంటే.. గూగుల్ కొత్త ’టెంపరరీ చాట్స్’ ఫీచర్తో ముందుకొచ్చింది. ఇది మనం బ్రౌజింగ్లో వాడే ఇన్ కాగ్నిటో మోడ్లా పని చేస్తుంది. దీన్ని వాడుకుని జెమినితో మనం చేసే సంభాషణలు సేవ్ కాకుండా చూడొచ్చు. మీ కమాండ్ ప్రాంప్ట్స్ని ఇకపై ఎవరూ కాపీ కొట్టలేరు. ఏఐ వాడకంలో ప్రైవసీని కోరుకునే వారికి ఇదో చక్కని ఫీచర్. ఇంకా చెప్పాలంటే.. ‘గూగుల్ కీప్’ సర్వీసులో ఫొటోలు,వీడియోలను జెమిని మీ అనుమతితోనే యాక్సెస్ చేసేలా చేయొచ్చు. ఒకవేళ ‘కీప్’ డేటా యాక్సెస్ ఇవ్వాలంటే ఎప్పుడైనా ఎనేబుల్ చేసుకోవచ్చు. అలాగే, జెమినై లైవ్ సర్వీసులోనూ ప్రైవసీని కట్టుదిట్టంగా అమలు చేస్తోంది. ఈ సర్వీసుని వాడే క్రమంలో మీ ప్రమేయం లేకుండా చూపించే ఆడియో, వీడియో సేకరించకుండా చేయొచ్చు.టూర్ ప్లాన్ చెప్తే చాలు..ఏ పని చేయాలన్నా ప్లానింగ్ అవసరం. పర్యటనల విషయంలో మరీనూ. ఈ విమాన ప్రయాణం కోసం సరైన ఫ్లైట్లు వెతకడం పెద్ద తలనొప్పి. ఏ వెబ్సైట్లో వెతకాలి? ఏ యాప్లో చూస్తే తక్కువ ధరకి టికెట్టు బుక్ చేసుకోవచ్చు? ఏమేం బెటర్ ఆఫర్లు ఉన్నాయి? ఇలాంటి ప్రశ్నలతోనే గూగుల్ సెర్చ్ హిస్టరీ మొత్తం నిండిపోతుంది. ఇకపై అంత కష్టపడక్కర్లేదు. ఇందుకోసం గూగుల్ ఒక సూపర్ టూల్తో ముందుకొచ్చింది. అదే "Google Flights' లోని కొత్త ఏఐ టూల్. ఇది మనతో మాట్లాడుతుంది.మీరు చేయాల్సిందల్లా ట్రిప్ గురించి ఏఐకి చెప్పాలంతే. ‘పదిరోజులు కేరళ ట్రిప్కి వెళ్లాలి. మంచి రిసార్టులో ఉండాలి. కాస్త బడ్జెట్లో ట్రిప్ని ప్లాన్ చేయమని అడిగితే చాలు. టూల్ అన్ని ఎయిర్లైన్స్నీ వెతుకుతుంది. బుకింగ్ వెబ్సైట్లలోని డేటాని క్షణాల్లో జల్లెడ పడుతుంది. అలాగే, ఉండేందుకు తగిన హోటళ్లను కూడా సూచిస్తుంది. బడ్జెట్ ప్లానింగ్కి తగిన బెస్ట్ డీల్స్ చూపిస్తుంది. ప్రస్తుతానికి ఇది బీటా వెర్షన్గా అందుబాటులో ఉంది. గూగుల్ ఫ్లైట్స్ వెబ్సైట్ www.google.com/travel/flights లేదా యాప్ ద్వారా ఈ సేవలు పొందొచ్చు. -
కొత్త ఫోన్ సేల్ షురూ.. రూ.10 వేలకే లేటెస్ట్ 5జీ మొబైల్
టెక్నో తన లేటెస్ట్ చౌకైన 5జీ మొబైల్ ఫోన్ టెక్నో స్పార్క్ గో 5జీని ఇటీవల భారత్ లో లాంచ్ చేసింది. నెక్స్ట్ జనరేషన్ కనెక్టివిటీని కోరుకునే యూజర్ల కోసం ఎంట్రీ లెవల్ 5జీ ఆప్షన్గా కంపెనీ ఈ ఫోన్ను తీసుకొచ్చింది. కొత్త 5జీ మొబైల్ ఫోన్కు అప్గ్రేడ్ అవ్వాలనుకునేవారి కోసం టెక్నో స్పార్క్ గో 5 జీ మంచి సేల్ ఆఫర్లు, డిస్కౌంట్లతో కొనుగోలుకు అందుబాటులో ఉంది.ఫోన్ ధర, లభ్యత, సేల్ ఆఫర్లుటెక్నో స్పార్క్ గో 5జీ 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999 కాగా, స్కై బ్లూ, ఇంక్ బ్లాక్, టర్కోయిస్ గ్రీన్, హెరిటేజ్ ప్రేరేపిత బికనీర్ రెడ్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఆగస్ట్ 21 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్ కార్ట్ లో తొలి సేల్ ప్రారంభమైంది. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడి, డెబిట్ కార్డులపై 5% క్యాష్ బ్యాక్ సహా లాంచ్ ఆఫర్లను పొందవచ్చు. దీంతోపాటు భీమ్ యాప్ ద్వారా చేసే చెల్లింపులపై రూ.30 వరకు ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్ లభిస్తుంది.స్పెసిఫికేషన్లు, ఫీచర్లుటెక్నో స్పార్క్ గో 5జీ స్మార్ట్ఫోన్లో 6.76 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 670 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది.మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత హైఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేస్తుంది.50 మెగాపిక్సెల్ ఏఐ అసిస్టెడ్ ప్రైమరీ రియర్ సెన్సార్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 6,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఇందులో అందించారు.టెక్నోకు చెందిన "నో నెట్ వర్క్ కమ్యూనికేషన్" ఫీచర్ ను కూడా ఈ హ్యాండ్ సెస్టో ఇంటిగ్రేట్ చేశారు. ఇది మొబైల్ సర్వీస్ లేకపోయినా టెక్నో ఫోన్ల మధ్య కాల్స్, సందేశాలకు వీలు కల్పిస్తుంది.డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ ఈ ఫోన్లో ఉంది. ఇందు కోసం ఐపీ 64 రేటింగ్ ను కలిగి ఉంది.కనెక్టివిటీ విషయానికి వస్తే, ఈ ఫోన్లో 5జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఐఆర్ బ్లాస్టర్, యూఎస్బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి.భద్రత కోసం ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అమర్చారు. -
స్టార్లింక్ ఇంటర్నెట్ కోసం ఆధార్ వెరిఫికేషన్
ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్.. ఈ-కేవైసీ వెరిఫికేషన్ కోసం ఆధార్ను ఉపయోగించడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీన్నిబట్టి చూస్తే.. భారతదేశంలో శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సేవలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.స్టార్లింక్ ఇప్పటికే టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT).. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPACe) నుంచి భారతదేశంలో తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి కావలసిన అనుమతిని పొందింది. అయితే జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా టెక్నాలజీ.. మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం వంటి కొన్ని ఆన్-ది-గ్రౌండ్ సన్నాహాలు ఇంకా పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని కూడా త్వరలోనే పూర్తి చేయడానికి కావాల్సిన ఏర్పాట్లను కంపెనీ పూర్తి చేస్తోంది.స్టార్లింక్ భారతదేశంలో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత కొత్త కస్టమర్ల ఆన్బోర్డింగ్ ప్రక్రియను సులభతరం చేయడమే కాకుండా.. వేగవంతమైన, మరింత సురక్షితమైన సేవలను అందించడానికి ప్రస్తుతం యూఐడీఏఐతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్పష్టమవుతోంది.స్టార్లింక్ ఇంటర్నెట్ కోసం ఈకేవైసీ చేసుకున్న యూజర్లు హైస్పీడ్ ఇంటర్నెట్ ఆస్వాదించవచ్చు. ఇది గృహాల్లో వినియోగించడానికి, సంస్థల్లో ఉపయోగించడానికి కూడా అనుకూలంగా ఉంటుందని.. ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.భారతదేశంలో స్టార్లింక్ ధరలుస్టార్లింక్ హార్డ్వేర్ ధర రూ.30,000 నుంచి రూ.40,000 వరకు ఉంటుందని అంచనా. ఇందులో శాటిలైట్ డిష్ & వై-ఫై రౌటర్ ఉన్నాయి. అయితే నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్లాన్లు రూ.3,000 నుంచి రూ.5,000 వరకు ఉంటుంది. యూజర్లు 25 Mbps నుంచి 220 Mbps మధ్య ఇంటర్నెట్ వేగాన్ని ఆస్వాదించవచ్చు. ధరలు త్వరలోనే అధికారికంగా వెల్లడవుతాయి.ఇదీ చదవండి: రెండేళ్లకే మస్క్ కంపెనీ వీడిన 16 ఏళ్ల కుర్రాడుస్టార్లింక్ సేవలను ప్రారంభ దశలో 20 లక్షల కనెక్షన్లకు మాత్రమే పరిమితం చేశారు. అయితే పరికరాల సరఫరా కోసం భారతి ఎయిర్టెల్ & రిలయన్స్ జియోలతో ఒప్పందం కుదుర్చుకుంది. మారుమూల ప్రాంతాలకు కూడా హైస్పీడ్ ఇంటర్నెట్ అందించాలనే లక్ష్యంతో స్టార్లింక్ శాటిలైట్ సేవలను ప్రారంభించనున్నారు.