breaking news
Technology
-
రైల్వే ట్రాక్పై సోలార్ ఎనర్జీ తయారీ!
దేశంలోనే తొలిసారిగా రైల్వే ట్రాక్పై సోలార్ ప్యానెళ్లతో ప్రయోగాలు ప్రారంభించింది భారతీయ రైల్వే. వారణాసిలోని బెనారస్ లోకోమోటివ్ వర్క్స్ (బీఎల్డబ్ల్యూ)లో 70 మీటర్ల పొడవున అదనపు భూమిని వినియోగించకుండా గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేసేలా సోలార్ ప్యానెళ్లను అమర్చారు. దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ రైల్వే మంత్రిత్వ శాఖ దీన్ని ‘హరిత, సుస్థిర రైలు రవాణా’ చర్యగా అభివర్ణించింది.సంప్రదాయానికి భిన్నంగా..సాధారణంగా సోలార్ ఎనర్జీకి భారీగా భూసేకరణ అవసరం అవుతుంది. సోలార్ ప్యానెళ్లను అమర్చేందుకు భూమి ఎంతో అవసరం. భూసేకరణ దేశంలో ఇలాంటి ప్రాజెక్ట్లకు పెద్ద అడ్డంకి. దీన్ని పరిష్కరించేందుకు భారతీయ రైల్వే ప్రణాళికలు సిద్ధం చేసింది. సంప్రదాయానికి భిన్నంగా రైల్వేపట్టాలకు మధ్యలో ఉన్న భూమిని ప్యానెళ్ల ఏర్పాటుకు వినియోగిస్తున్నారు. దేశంలో చాలా కిలోమీటర్లు విస్తరించిన ఈ రైల్వే పట్టాల్లో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రాథమికంగా పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా వారణాసిలోని బెనారస్ లోకోమోటివ్ వర్క్స్ (బీఎల్డబ్ల్యూ)లో 70 మీటర్ల పొడవున అదనపు భూమిని వినియోగించకుండా గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేసేలా సోలార్ ప్యానెల్స్ను అమర్చారు. ఇది విజయవంతం అయితే క్రమంగా ఈ వ్యవస్థను ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నట్లు తెలుస్తుంది.నిర్వహణ సులువుఈ ప్రాజెక్ట్లో నిర్వహణను సులభతరం చేసేలా ఏర్పాట్లు చేశారు. ఏదైనా సమస్య వస్తే వాటిని త్వరగా తొలగించి తిరిగి ఇన్స్టాల్ చేసే విధంగా ప్యానెల్స్ను అమర్చారు. దీని ద్వారా తనిఖీలు, మరమ్మతులు లేదా అత్యవసరాల కోసం రైల్వే కార్మికులు ఎక్కువ ఆలస్యం చేయకుండా వీలవుతుంది. పట్టాలపై రైలు ప్రయాణించినప్పుడు, దుమ్ము పేరుకుపోవడం, వర్షం.. వంటి పరిస్థితులను తట్టుకునేలా ఈ ప్యానెళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.భవిష్యత్తులో రైల్వే స్వావలంబనఇందులో 28 హైస్ట్రెంత్ ఫోటోవోల్టాయిక్ ప్యానెళ్లను ఉపయోగిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఇవి మొత్తంగా 15 కిలోవాట్ ఎనర్జీని ఉత్పత్తి చేయగలవు. భారతీయ రైల్వే వ్యవస్థ 1.2 లక్షల కిలోమీటర్లకు పైగా విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్ద రైలు నెట్వర్క్ల్లో ఒకటిగా నిలుస్తోంది. ఇలాంటి వ్యవస్థ రానున్న రోజుల్లో గ్రీన్ ఎనర్జీకి కీలకంగా మారే అవకాశాలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో ఈ గ్రీన్ ఎనర్జీ ద్వారా రైల్వే విద్యుత్ వాడకంలో స్వావలంబన సాధిస్తుందని నమ్ముతున్నారు.ఇదీ చదవండి: యూఎస్లో రూ.1 కోటి సంపాదిస్తే ఎంత మిగులుతుంది? -
ఒక్క రూపాయికే రూ.4999 రీచార్జ్ ప్లాన్!
వొడాఫోన్ ఐడియా (వీఐ) తన యూజర్లకు అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. కేవలం ఒక్క రూపాయికే రూ.4,999 రీఛార్జ్ ప్లాన్ ను అందిస్తోంది. వీఐ గేమ్స్ లో గెలాక్సీ షూటర్ ఫ్రీడమ్ ఫెస్ట్ ఎడిషన్ ను వొడాఫోన్ ఐడియా ప్రవేశపెట్టింది. ఈ స్పెషల్ ఎడిషన్ ఫెస్ట్ కింద అనేక రివార్డులను అందిస్తుండగా వాటిలో ఒకటే ఒక్క రూపాయికి రూ .4,999 రీచార్జ్ ప్లాన్.ఆగస్టు 31 వరకే ఆఫర్టెలికామ్ టాక్ నివేదిక ప్రకారం.. వీఐ గేమ్స్ పై గెలాక్సీ షూటర్స్ ఫ్రీడమ్ ఫెస్ట్ ఎడిషన్ ఆగస్టు 31 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ గెలాక్సీ షూటర్స్ ఫ్రీడమ్ ఫెస్ట్ లో వినియోగదారులు అనేక రివార్డులను పొందుతున్నారు. రివార్డుల జాబితాలో రూ .4,999 రీఛార్జ్ ప్లాన్ కూడా ఉంది. ఈ ఫెస్ట్ లో కంపెనీ కేవలం రూ.1కే రూ.4,999 వార్షిక ప్లాన్ ను వినియోగదారులకు అందిస్తోంది.ప్లాన్లో లభించే బెనిఫిట్స్ రూ.4,999 ప్లాన్లో వీఐ తన వినియోగదారులకు అపరిమిత కాలింగ్తో పాటు ప్రతిరోజూ 2 జీబీ మొబైల్ డేటా, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లను అందిస్తుంది. దీనితో పాటు అపరిమిత 5జీ డేటా కూడా ఈ ప్యాక్ లో లభిస్తుంది. అంతేకాకుండా వీఐఎంటీవీ, అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఈ ప్లాన్లో వినియోగదారులకు అర్ధరాత్రి 12 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అపరిమిత డేటా లభిస్తుంది. ఇది కాకుండా, వీకెండ్ డేటా రోల్ఓవర్ కూడా ఇందులో లభిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు అంటే ఏడాది. కేవలం రూ.1కే ఇన్ని బెనిఫిట్స్ పొందొచ్చు.ఆఫర్ పొందండిలా.. వీఐ యాప్ను ఓపెన్ చేయండివీఐ గేమ్స్ సెక్షన్కి వెళ్లండిగెలాక్సీ షూటర్స్ ఫ్రీడమ్ ఫెస్ట్ ఎడిషన్ గేమ్ ఆడండిడ్రోన్లను షూట్ చేసి జెమ్స్ సంపాదించండిజెమ్స్ ఆధారంగా రివార్డ్స్ పొందండిఎన్ని రివార్డ్స్కు ఏమి లభిస్తాయి? 25 జెమ్స్ రివార్డ్స్కు రూ.50 అమెజాన్ వోచర్75 జెమ్స్ రివార్డ్స్కు 10జీబీ డేటా + ఓటీటీ యాక్సెస్150 జెమ్స్ రివార్డ్స్కు 50జీబీ డేటా ప్యాక్300 జెమ్స్ రివార్డ్స్కు రూ.1కే రూ.4999 ప్లాన్ (15 మంది విజేతలకు మాత్రమే) -
భక్తి ప్లస్ టెక్ కాంబోలో.. గణపయ్యకు టెక్నో హారం!
ఈసారి గణపయ్యకు టెక్ టచ్తో స్వాగతం చెప్పారంటే, ఇక మీ పండుగ వాతావరణం భక్తి ప్లస్ టెక్ కాంబోలో డబుల్ ఆనందంతో మెరిసిపోతుంది.వీఆర్ గణపయ్యతో రద్దీకి గుడ్బై!వినాయక చతుర్థి రాగానే ముంబయి లాల్బాగ్చా రాజా ముందు కనిపించే రద్దీ మాటల్లో చెప్పలేనిది. కాని.. ఇప్పుడు బయట అడుగు పెట్టకుండానే, మీ లివింగ్రూమ్లో కూర్చొని ఆ భవ్య దర్శనాన్ని ఆస్వాదించవచ్చు. అదే ఈ ‘లాల్బాగ్ 360’ వీఆర్ దర్శనం. ఒక్క యాప్తో మీ హాల్లో కూర్చునే పూజా గంటలు, పూజారుల మంత్రోచ్ఛారణ, మండప అలంకారాలు అన్నీ కళ్లముందే ప్రత్యక్షం అవుతాయి. ఎడమ వైపు తిప్పితే పూలతో అలంకరించిన మండపం, కుడివైపు తిప్పితే గణపయ్య పాదాల వద్ద నమస్కరిస్తున్న భక్తులు అన్నీ నిజంగానే అక్కడ ఉన్నట్టు అనిపిస్తాయి.ఇదే విధంగా ‘గణేశ్ వీఆర్’, ‘విజయవిధి వర్చువల్ దర్శనం’ లాంటి యాప్లు కూడా 360 డిగ్రీల వీడియోలతో పండుగ వాతావరణాన్ని ఇంటికే తీసుకొస్తున్నాయి. వాడటం కూడా చాలా సులభం. మీ ఫోన్ లేదా స్మార్ట్ టీవీలో యాప్ డౌన్లోడ్ చేసి, హెడ్సెట్ లేదా మానిటర్లో ఫుల్స్క్రీన్లో ఆన్ చేస్తే సరిపోతుంది. లైవ్ టైమింగ్స్, లింకులు అధికారిక వెబ్సైట్లో దొరుకుతాయి.ఒకే టచ్తో భక్తి ప్లస్ డీజే మోడ్!గణేష్ మండపం అంటే వెలుగుల వేదిక! అయితే, ఇప్పుడు తీగలు, ప్లగ్లు, స్విచ్లతో ఇబ్బంది పడే రోజులు పోయాయి. ఒక వైఫై ఎల్ఈడీ బల్బు పెట్టేస్తే చాలు. మీ మండపం క్షణాల్లో ‘సినిమా సెట్’లా మెరిసిపోతుంది. ఉదయం పూజ సమయానికి పసుపు వెలుగు, మధ్యాహ్నం భక్తులు రాగానే ప్రకాశించే తెలుపు వెలుగు, రాత్రి డీజే బీట్ పడగానే గ్రీన్ , బ్లూ, రెడ్ ఫ్లాష్లతో మండపం ఫుల్ పార్టీ మూడ్లోకి మారిపోతుంది. ఇవన్నీ కేవలం ఫోన్ టచ్తోనే! ‘అలెక్సా, డివోషనల్ మోడ్ ఆన్’ అంటే పసుపు, ఎరుపు కాంబినేషన్ రెడీ. వాడటం కూడా సింపుల్. బల్బు పెట్టి, యాప్ డౌన్లోడ్ చేసి, వైఫై కనెక్ట్ చేస్తే సరిపోతుంది. టైమింగ్ సెట్ చేసి, పూజ సమయానికి ఆటోమేటిక్గా వెలుగులు వెలిగేలా చేసుకోవచ్చు. విప్రో, ఫిలిప్స్, హెవెల్స్ లాంటి బ్రాండ్లు మంచి ఆప్షన్లు ఇస్తున్నాయి. ఒక్క బల్బు ధర రూ. 600 నుంచి మొదలవుతుంది.ఒక్క బాక్స్లో మొత్తం పండుగ! వినాయక చవితి దగ్గర పడుతుంటే, ఇంట్లో అందరికీ ఒకటే టెన్షన్, పూజ సామగ్రిని సర్దుకోవాలి, పత్రి తెప్పించాలి, విగ్రహం తీసుకురావాలి. వీటన్నిటికీ చివరి నిమిషంలో టెన్షన్.. టెన్షన్! కాని, ఈసారి అంతా ఈజీ! ‘ఆరాధ్య గణేశ్ చతుర్థి సంపూర్ణ పూజా కిట్’ చేతిలో ఉంటే చాలు, మీ పండుగ ఏ లోటు లేకుండా చక్కగా పూర్తవుతుంది.ఒక్క బాక్స్లోనే పన్నెండు అంగుళాల మట్టి గణపయ్య, ఇరవైఒక్క రకాల పవిత్ర పత్రి, ఒక చెక్క పాలవెల్లి సహా పూజకు కావాల్సినవన్నీ సిద్ధంగా లభిస్తాయి. కేవలం పూలు, పండ్లు, నైవేద్యం బాధ్యత మాత్రమే మీది! ఎవరైనా పూజ విధానం మరచిపోయారా? టెన్షన్ లేదు, చిన్న పుస్తకంతోపాటు, వీడియో గైడ్ కూడా వెబ్సైట్లో రెడీగా ఉంటుంది. పైగా ప్యాకేజింగ్ నుంచి విగ్రహం వరకు అంతా ప్రకృతికి నష్టం లేకుండా పర్యావరణహితంగా ఉంటుంది. ధర కేవలం రూ.1500 మాత్రమే! -
మిక్స్డ్ రియల్టీ హెడ్సెట్: తొలి చైనా కంపెనీగా వివో
ప్రముఖ స్మార్ట్ఫోన్స్ సంస్థ వివో తమ 30వ వార్షికోత్సవం సందర్భంగా మిక్స్డ్ రియాల్టీ హెడ్సెట్ 'విజన్ డిస్కవరీ' ఎడిషన్ను ప్రవేశపెట్టింది. దీంతో ఇటు స్మార్ట్ఫోన్స్, అటు ఎంఆర్ ప్రోడక్టుల విభాగాల్లో మొదటిసారిగా మిక్సిడ్ రియాలిటీ ఉత్పత్తిని ప్రవేశపెట్టిన తొలి చైనా కంపెనీగా నిలిచింది.వివో మిక్స్డ్ రియల్టీ హెడ్సెట్ బరువు 300 గ్రాములు, మందం 40 మిమీ మాత్రమే. కాబట్టి ఇప్పటివరకు మార్కెట్లో ఉన్న ఇతర ఎంఆర్ ఉత్పత్తితో పోలిస్తే ఇది 26 శాతం చిన్నగాను, సౌకర్యవంతంగాను ఉంటుంది. ఈ హెడ్సెట్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ఎక్స్ఆర్2ప్లస్ జెన్ 21 ప్లాట్ఫామ్ మీద నిర్మితమైంది. ఇది రెండున్నర రెట్లు అధికంగా జీపీయూ సామర్థ్యాలు, ఎనిమిది రెట్లు అధికంగా ఏఐ సామర్థ్యాలను పొందింది. -
భారత్లో ఓపెన్ ఏఐ కార్యాలయం
న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ఏఐ ఈ ఏడాది భారత్లో తొలి కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. న్యూఢిల్లీలో దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ఇందుకోసం ఇప్పటికే స్థానికంగా నియామకాలు కూడా ప్రారంభించినట్లు వివరించింది. చాట్జీపీటీకి అమెరికా తర్వాత భారత్ రెండో అతి పెద్ద మార్కెట్గా ఉన్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్లో కార్యాలయం తెరవడం వల్ల ఇక్కడి యూజర్లకు మరింత మెరుగైన సరీ్వసులు అందించేందుకు వీలవుతుందని ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మన్ తెలిపారు. స్థానిక భాగస్వాములు, ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు, డెవలపర్లు, విద్యా సంస్థలతో కలిసి పని చేయడంపై స్థానిక సిబ్బంది దృష్టి పెడతారని వివరించారు. -
సరికొత్త హెచ్పీ గేమింగ్ ల్యాప్టాప్: ధర & వివరాలు
భారతదేశంలో హెచ్పీ ఒమెన్ 16ను లాంచ్ చేస్తూ తన గేమింగ్ ల్యాప్టాప్ లైనప్ను విస్తరించింది. ఈ లేటెస్ట్ ఏఐ గేమింగ్ ల్యాప్టాప్ ఎన్వీడియా గెఫోర్స్ 12జీబీ ఆర్టీఎక్స్తో జత చేసిన.. ఐటెల్ కోర్ అల్ట్రా లేదా ఏఎండీ రైజిన్ ఏఐ ప్రాసెసర్ను పొందుతుంది. దీని ప్రారంభ ధర రూ.1,29,999.హెచ్పీ ఒమెన్ 16 గేమింగ్ ల్యాప్టాప్ ఇప్పుడు ఆన్లైన్ స్టోర్, హెచ్పీ వరల్డ్, అమెజాన్, క్రోమా, రిలయన్స్ డిజిటల్ వంటి రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ఇది 6 సెల్ 83 వాట్స్ బ్యాటరీ కలిగి ఫాస్ట్ ఛార్జ్కు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి దీనిని 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ప్రత్యేకించి గేమింగ్కు చాలా అనుకూలంగా ఉంటుంది.హార్డ్వేర్ విషయానికొస్తే.. ఈ ల్యాప్టాప్ 16 ఇంచెస్ క్యూహెచ్డీ (2560 × 1600) డిస్ప్లేను పొందింది. ఇది 500 నైట్స్ బ్రైట్నెస్ను పొందుతుంది. ఇది 100 శాతం 100 శాతం sRGB కలర్ కవరేజ్.. బ్లూ లైట్ ఎక్స్పోజర్ను తగ్గించడానికి ఐసేఫ్ సర్టిఫికేషన్ను కలిగి ఉంది. అంతే కాకుండా థర్మల్ డిజైన్లో టెంపెస్ట్ కూలింగ్, ఫ్యాన్ గ్యాప్లు, హీట్ ఫేజ్ రీడిస్ట్రిబ్యూషన్ కూడా ఇందులో ఉన్నాయి. -
ఏకంగా 10,000mAh భారీ బ్యాటరీ ఫోన్ వచ్చేస్తోంది..
ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్ రియల్మీ తన రాబోయే స్మార్ట్ఫో న్ లాంచ్ తేదీని టీజ్ చేసింది. బ్యాటరీ విషయంలో ఇది "పెద్ద" డీల్ అంటూ ఊరిస్తోంది. దీని పేరును ఇంకా వెల్లడించనప్పటికీ, కొత్త రియల్మీ డివైస్ 10,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని కలిగి ఉంటుందని కంపెనీ ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో ఒక పోస్ట్లో టీజ్ చేసింది."ఇంత పెద్దది సరిపోతుందా? ఇదిగో రియల్మీ 1x000mAh - మరోసారి పరిమితులను చెరిపేస్తుంది. ఆగస్టు 27న అద్భుతం చూడండి' అంటూ రియల్మీ పోస్ట్ చేసింది. "అతిపెద్దది మరింత పెద్దదిగా మారింది. రియల్మీ మరోసారి పరిమితులను పునర్నిర్వచించనుంది. 320వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ నుంచి 10,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ వరకు... తర్వాత ఏం జరగబోతోంది?" అని మరో ఎక్స్ పోస్ట్ లో పేర్కొంది.అంటే ఈ స్మార్ట్ ఫోన్ లో అధునాతన బ్యాటరీ, ఛార్జింగ్ టెక్నాలజీ ఉండొచ్చని తెలుస్తోంది. రియల్మీ రాబోయే డివైజ్ 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని దాటుతుందా అని చాలా మంది ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం రియల్మీలో అత్యంత శక్తివంతమైన బ్యాటరీ ఉన్న స్మార్ట్ఫోన్ రియల్మీ జీటీ 7. చైనీస్ మోడల్లో ఇది 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్తో 7,200 ఎంఏహెచ్ సామర్థ్యంతో ఉంది. అదే ఇండియన్ రియల్మీ జీటీ 7 వెర్షన్లో అయితే 120వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.THE BIGGEST JUST GOT EVEN BIGGER. 🔋realme Is Set To Redefine The Limits Once More.From 320W Fast Charging To A Massive 1x000mAh Battery…What’s Coming Next?August 27 — Get Ready For The Next Power Revolution.Know More: https://t.co/c8wHve6fZ2#FreeToBeReal… pic.twitter.com/SrctmwWzrg— realme (@realmeIndia) August 21, 2025 -
చేతిరాతకు ‘ఏఐ’ పవర్.. హైదరాబాద్ కంపెనీ సృష్టి
టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా, పుస్తకాలన్నీ డిజిటలైజ్ అయిపోతున్నా ఇప్పటికీ చాలా మంది పెన్నూ పేపర్ ఉపయోగించి చేత్తో రాయడాన్ని ఇష్టపడుతుంటారు. అలాంటి వారి కోసమే కాగితాన్ని డిజిటల్తో కలిపే ఏఐ స్మార్ట్ నోట్బుక్ను అందుబాటులోకి తీసుకువచ్చింది హైదరాబాద్కు చెందిన స్టార్టప్.టెకీ నుంచి ఎంట్రప్రెన్యూర్గా మారిన సుమన్ బాలబొమ్మ అభివృద్ధి చేసిన రీనోట్ ఏఐ నోట్బుక్ (ReNote AI Notebook) దేశంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత నోట్బుక్గా గుర్తింపు పొందింది. ఇది సాధారణ కాగితపై రాయడం అనుభూతిని అందిస్తూ, ఆ చేతిరాతను డిజిటల్ టెక్స్ట్గా మార్చే ప్రత్యేకమైన సాంకేతికతను కలిగి ఉంది.ఎన్నో ఫీచర్లుఈ నోట్బుక్లో నీటికి తడిసిపోని, చిరిగిపోని, రీ యూజబుల్ పేజీలు ఉంటాయి. పైలట్ ఫ్రిక్సియాన్ (Pilot Frixion) పెన్నుతో వీటిన రాసిన నోట్స్ను తుడిచేయవచ్చు. రీనోట్ ఏఐ మొబైల్ యాప్ ద్వారా చేతిరాతను డిజిటల్ టెక్స్ట్గా మార్చడం, సారాంశాలు తయారు చేయడం, తెలుగు సహా అనేక భాషల్లో అనువాదం, వాయిస్ ఆధారిత శోధన, చిత్రంగా మార్చే స్కెచ్లు వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.తెలంగాణ ప్రభుత్వ టీ-హబ్ ప్రోత్సాహంతో ఏర్పాటైన ఈ స్టార్టప్ జీఐటెక్స్ దుబాయ్, ఒసాకా వరల్డ్ ఎక్స్పో, గిఫ్ట్స్ వరల్డ్ ఎక్స్పో న్యూఢిల్లీ వంటి అంతర్జాతీయ ప్రదర్శనల్లో తమ రీనోట్ ఏఐ నోట్బుక్ను ప్రదర్శించింది. మైటీ, గూగుల్ వంటి సంస్థలు ఈ యాప్ను భారతదేశం లోని టాప్ 100 మొబైల్ యాప్స్ లో ఒకటిగా గుర్తించాయి.వ్యక్తిగత అనుభవాల నుంచి ప్రేరణతో ఈ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టిన సుమన్ బాలబొమ్మ.. "చేతిరాతలో ఉన్న ఫోకస్, జ్ఞాపక శక్తిని కోల్పోకుండా, డిజిటల్ సౌలభ్యాన్ని కలిపే ప్రయత్నమే రీనోట్" అని చెబుతున్నారు. ఇలాంటి ఏఐ నోట్బుక్ను ‘ఎక్స్నోట్’ (XNote) అనే అమెరికా సంస్థ కూడా రూపొందించింది. -
ఏఐలో ఆధిపత్యం కోసం ఎగబడుతున్నారు!
ఏఐ(కృత్రిమ మేధ) గాడ్ఫాదర్గా పేరొందిన జెఫ్రీ హింటన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల టెక్ పరిశ్రమ అనుసరిస్తున్న విధానంపై విమర్శలు చేశారు. నైతిక దూరదృష్టి లేకపోవడం, నియంత్రణలేని కృత్రిమ మేధ అభివృద్ధి పెరుగుతున్న నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేశారు. హింటన్ ఇటీవల ఫార్చ్యూన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంపెనీల సాంకేతిక ఆధిపత్యం కొనసాగుతున్న తరుణంలో దీర్ఘకాలిక శ్రేయస్సు మసకబారుతుందని చెప్పారు.స్వల్పకాలిక లాభాలే కీలకంసాంకేతిక పరిజ్ఞానానికి శక్తినిచ్చే ఏఐ అల్గారిథమ్లను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించిన హింటన్, ప్రస్తుతం టెక్ కంపెనీలు మరింత శక్తివంతమైన ఏఐ మోడళ్లను నిర్మించడానికి పోటీ పడుతున్నాయని తెలిపారు. ఆ సమయంలో భవిష్యత్తులో నెలకొనే విస్తృత ప్రభావాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నైతికంగా ఏఐ అభివృద్ధి పట్ల నిబద్ధత కంటే ప్రధానంగా పోటీ ఒత్తిళ్లు, స్వల్పకాలిక లాభాలే కీలకం అవుతున్నట్లు చెప్పారు.మానవ విలువలకు అనుగుణంగా ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా సూపర్ ఇంటెలిజెన్స్ ఏఐ వ్యవస్థలను మోహరిస్తే వినాశకరమైన పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఏఐ వల్ల తప్పుడు సమాచారం, ఉద్యోగాలు కోల్పోవడం, గోప్యతా ఉల్లంఘనలు.. వంటి ప్రమాదాల కన్నా మానవులను డామినేట్ చేసే వ్యవస్థల వల్ల మరింత నష్టం కలుగుతుందన్నారు.నైతిక ఫ్రేమ్వర్క్..కృత్రిమ మేధ అభివృద్ధిలో బలమైన నైతిక చట్రం(మోరల్ ఫ్రేమ్వర్క్) లేదని హింటన్ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నమూనాలను పెంచడానికి, వినియోగదారుల డేటాను మానిటైజ్ చేయడానికి బిలియన్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నప్పటికీ కొన్ని కంపెనీలు మాత్రం ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్(ఏజీఐ) అస్తిత్వ ప్రమాదాలపై దృష్టి పెడుతున్నాయని పేర్కొన్నారు. ఏదేమైనా కృత్రిమ మేధ అభివృద్ధికి నైతిక ప్రమాణాలు చాలా అవసరం అని చెప్పారు. నిర్దిష్ట ఫ్రేమ్వర్క్లను తయారు చేయడానికి ప్రపంచ సహకారం కావాలని పిలుపునిచ్చారు. వ్యవస్థల మధ్య ఒప్పందాలు, పర్యవేక్షణ, నైతిక ప్రమాణాలు అవసరమన్నారు. ఏఐ పరిశోధకులు, భద్రత, పారదర్శకత, దీర్ఘకాలిక ఆలోచనలకు ప్రాధాన్యమివ్వాలని కోరారు.ఇదీ చదవండి: బైక్ ట్యాక్సీ సేవలు పునరుద్ధరణ -
విప్రో చేతికి హర్మన్ డీటీఎస్.. రూ. 3,270 కోట్ల డీల్
ఐటీ సేవల దేశీ దిగ్గజం విప్రో తాజాగా హర్మన్కు చెందిన డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ సొల్యూషన్స్(డీటీఎస్) బిజినెస్ యూనిట్ కొనుగోలుకి తెరతీసింది. శామ్సంగ్కు చెందిన ఈ సంస్థలో 100 శాతం వాటా కొనుగోలుకి తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందుకు నగదు రూపేణా 37.5 కోట్ల డాలర్లు(సుమారు రూ. 3,270 కోట్లు) వెచ్చించనుంది.ఒప్పందంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 5,600మంది డీటీఎస్ ఉద్యోగులు విప్రోకు బదిలీకానున్నారు. 2025 డిసెంబర్31కల్లా లావాదేవీ పూర్తికావచ్చని అంచనా వేస్తున్నారు. హర్మన్ కనెక్టెడ్ సర్వీసెస్ ఇంక్లో 100 శాతం వాటా కొనుగోలుకి హర్మన్ ఇంటర్నేషనల్ ఇండస్ట్రీస్ ఇంక్తో తప్పనిసరి ఒప్పందంపై సంతకాలు చేసినట్లు విప్రో పేర్కొంది.తద్వారా హర్మన్ అనుబంధ సంస్థలుసహా.. సంబంధిత ఆస్తులను సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. కొనుగోలు తదుపరి విప్రో ఇంజినీరింగ్ గ్లోబల్ బిజినెస్ లైన్లో డీటీఎస్ విలీనంకానున్నట్లు వెల్లడించింది. కనెక్టికట్(యూఎస్) కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డీటీఎస్ అంతర్జాతీయంగా ఈఆర్అండ్డీ, ఐటీ సర్వీసులను అందిస్తోంది. ఎంబెడ్డెడ్ సాఫ్ట్వేర్, డిజిటల్ ఇంజినీరింగ్, డిజైన్ థింకింగ్, క్లౌడ్, ఇన్ఫ్రా సర్వీసులలో ప్రధానంగా కార్యకలాపాలు విస్తరించింది. -
చరిత్ర చెప్పకుండా.. పరువు కాపాడుతూ...
అప్పుడూ.. ఇప్పుడూ.. మనమంతా నెట్టింట్లో ముందు తట్టే తలుపు గూగుల్దే. అంతలా అన్నింట్లోనూ తనదైన ముద్ర వేస్తోంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగా మరికొన్ని ఫీచర్లను పరిచయం చేసింది.ఆ మెసేజెస్ ‘బ్లర్’!వాట్సాప్లో లేని సేఫ్టీ ఫీచర్ గూగుల్ మెసేజుల్లో ఒకటుంది. తరచూ వాట్సాప్ లేదా మరేదైనా మెసేజింగ్ యాప్లలో తెలియని నంబర్ నుంచి మెసేజులు, ఫొటోలు, వీడియోలు వస్తుంటాయ్. వాటిలో అశ్లీల చిత్రాలు, వీడియోలు ఉండొచ్చు. అనుకోకుండా వాటిని ఓపెన్ చేసి షాక్ అవుతాం. చుట్టుపక్కల ఎవరైనా ఉంటే.. పరువు పోయినట్టే! అలాంటి ఇబ్బందులు రాకుండా.. అద్భుతమైన ఫీచర్ను ‘గూగుల్ మెసేజెస్’ తీసుకొచ్చింది. అదే ఆటోమేటిక్ ‘బ్లర్’ ఫీచర్. ఇది ‘న్యూడ్’ మెసేజ్లను ఓపెన్ చేస్తే ఆటోమేటిగ్గా బ్లర్ చేస్తుంది. సెండర్ని కూడా వెంటనే బ్లాక్ చేస్తుంది. కావాలంటే.. అశ్లీల చిత్రాలు కనిపించకుండా చేసి, సంభాషణ కొనసాగించొచ్చు. అంతేకాదు.. మీరు పొరపాటున అశ్లీలమైన కంటెంట్ను పంపితే అలర్ట్ చేస్తుంది. ఇంట్లో పిల్లలు కూడా ఫోన్లు వాడుతున్న నేపథ్యంలో ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. మైనర్లు వాడే ఫోన్లలో ఇది ఆన్ చేసి ఉంటుంది. అయితే, వాళ్లు దాన్ని ఆఫ్ చేసేందుకు వీలుంది. అందుకే పేరెంటల్ కంట్రోల్స్ పెట్టాలి. అప్పుడు తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా దాన్ని ఆఫ్ చేయడం కుదరదు. అందుకు ఫ్యామిలీ లింక్ యాప్ ని వాడొచ్చు. దీన్ని మీ ఫోన్లో ఎనేబుల్ చేసేందుకు గూగుల్ మెసేజెస్ యాప్ ని ఓపెన్ చేయండి. ఈ పాత్ ని ఫాలో అవ్వండి. Messages Settings > Protection & Safety > Manage sensitive content warnings > Warnings in Google Messages.‘జెమినై’లో ప్రైవసీ అప్డేట్ఏఐ పోటీ రోజురోజుకీ పెరుగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో చాట్జీపీటీ కంటే ముందే గూగుల్ జెమినై (Google Gemini).. ఇన్ కాగ్నిటో మోడ్ పరిచయం చేసింది. ఏఐ యూజర్ల ప్రైవసీకి ఇదో చక్కని పరిష్కారం. ఇకపై జెమినితో చేసే చాటింగ్, వ్యక్తిగత సమాచారం ఎవరి కంటా పడవు. ఎందుకంటే.. గూగుల్ కొత్త ’టెంపరరీ చాట్స్’ ఫీచర్తో ముందుకొచ్చింది. ఇది మనం బ్రౌజింగ్లో వాడే ఇన్ కాగ్నిటో మోడ్లా పని చేస్తుంది. దీన్ని వాడుకుని జెమినితో మనం చేసే సంభాషణలు సేవ్ కాకుండా చూడొచ్చు. మీ కమాండ్ ప్రాంప్ట్స్ని ఇకపై ఎవరూ కాపీ కొట్టలేరు. ఏఐ వాడకంలో ప్రైవసీని కోరుకునే వారికి ఇదో చక్కని ఫీచర్. ఇంకా చెప్పాలంటే.. ‘గూగుల్ కీప్’ సర్వీసులో ఫొటోలు,వీడియోలను జెమిని మీ అనుమతితోనే యాక్సెస్ చేసేలా చేయొచ్చు. ఒకవేళ ‘కీప్’ డేటా యాక్సెస్ ఇవ్వాలంటే ఎప్పుడైనా ఎనేబుల్ చేసుకోవచ్చు. అలాగే, జెమినై లైవ్ సర్వీసులోనూ ప్రైవసీని కట్టుదిట్టంగా అమలు చేస్తోంది. ఈ సర్వీసుని వాడే క్రమంలో మీ ప్రమేయం లేకుండా చూపించే ఆడియో, వీడియో సేకరించకుండా చేయొచ్చు.టూర్ ప్లాన్ చెప్తే చాలు..ఏ పని చేయాలన్నా ప్లానింగ్ అవసరం. పర్యటనల విషయంలో మరీనూ. ఈ విమాన ప్రయాణం కోసం సరైన ఫ్లైట్లు వెతకడం పెద్ద తలనొప్పి. ఏ వెబ్సైట్లో వెతకాలి? ఏ యాప్లో చూస్తే తక్కువ ధరకి టికెట్టు బుక్ చేసుకోవచ్చు? ఏమేం బెటర్ ఆఫర్లు ఉన్నాయి? ఇలాంటి ప్రశ్నలతోనే గూగుల్ సెర్చ్ హిస్టరీ మొత్తం నిండిపోతుంది. ఇకపై అంత కష్టపడక్కర్లేదు. ఇందుకోసం గూగుల్ ఒక సూపర్ టూల్తో ముందుకొచ్చింది. అదే "Google Flights' లోని కొత్త ఏఐ టూల్. ఇది మనతో మాట్లాడుతుంది.మీరు చేయాల్సిందల్లా ట్రిప్ గురించి ఏఐకి చెప్పాలంతే. ‘పదిరోజులు కేరళ ట్రిప్కి వెళ్లాలి. మంచి రిసార్టులో ఉండాలి. కాస్త బడ్జెట్లో ట్రిప్ని ప్లాన్ చేయమని అడిగితే చాలు. టూల్ అన్ని ఎయిర్లైన్స్నీ వెతుకుతుంది. బుకింగ్ వెబ్సైట్లలోని డేటాని క్షణాల్లో జల్లెడ పడుతుంది. అలాగే, ఉండేందుకు తగిన హోటళ్లను కూడా సూచిస్తుంది. బడ్జెట్ ప్లానింగ్కి తగిన బెస్ట్ డీల్స్ చూపిస్తుంది. ప్రస్తుతానికి ఇది బీటా వెర్షన్గా అందుబాటులో ఉంది. గూగుల్ ఫ్లైట్స్ వెబ్సైట్ www.google.com/travel/flights లేదా యాప్ ద్వారా ఈ సేవలు పొందొచ్చు. -
కొత్త ఫోన్ సేల్ షురూ.. రూ.10 వేలకే లేటెస్ట్ 5జీ మొబైల్
టెక్నో తన లేటెస్ట్ చౌకైన 5జీ మొబైల్ ఫోన్ టెక్నో స్పార్క్ గో 5జీని ఇటీవల భారత్ లో లాంచ్ చేసింది. నెక్స్ట్ జనరేషన్ కనెక్టివిటీని కోరుకునే యూజర్ల కోసం ఎంట్రీ లెవల్ 5జీ ఆప్షన్గా కంపెనీ ఈ ఫోన్ను తీసుకొచ్చింది. కొత్త 5జీ మొబైల్ ఫోన్కు అప్గ్రేడ్ అవ్వాలనుకునేవారి కోసం టెక్నో స్పార్క్ గో 5 జీ మంచి సేల్ ఆఫర్లు, డిస్కౌంట్లతో కొనుగోలుకు అందుబాటులో ఉంది.ఫోన్ ధర, లభ్యత, సేల్ ఆఫర్లుటెక్నో స్పార్క్ గో 5జీ 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999 కాగా, స్కై బ్లూ, ఇంక్ బ్లాక్, టర్కోయిస్ గ్రీన్, హెరిటేజ్ ప్రేరేపిత బికనీర్ రెడ్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఆగస్ట్ 21 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్ కార్ట్ లో తొలి సేల్ ప్రారంభమైంది. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడి, డెబిట్ కార్డులపై 5% క్యాష్ బ్యాక్ సహా లాంచ్ ఆఫర్లను పొందవచ్చు. దీంతోపాటు భీమ్ యాప్ ద్వారా చేసే చెల్లింపులపై రూ.30 వరకు ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్ లభిస్తుంది.స్పెసిఫికేషన్లు, ఫీచర్లుటెక్నో స్పార్క్ గో 5జీ స్మార్ట్ఫోన్లో 6.76 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 670 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది.మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత హైఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేస్తుంది.50 మెగాపిక్సెల్ ఏఐ అసిస్టెడ్ ప్రైమరీ రియర్ సెన్సార్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 6,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఇందులో అందించారు.టెక్నోకు చెందిన "నో నెట్ వర్క్ కమ్యూనికేషన్" ఫీచర్ ను కూడా ఈ హ్యాండ్ సెస్టో ఇంటిగ్రేట్ చేశారు. ఇది మొబైల్ సర్వీస్ లేకపోయినా టెక్నో ఫోన్ల మధ్య కాల్స్, సందేశాలకు వీలు కల్పిస్తుంది.డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ ఈ ఫోన్లో ఉంది. ఇందు కోసం ఐపీ 64 రేటింగ్ ను కలిగి ఉంది.కనెక్టివిటీ విషయానికి వస్తే, ఈ ఫోన్లో 5జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఐఆర్ బ్లాస్టర్, యూఎస్బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి.భద్రత కోసం ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అమర్చారు. -
స్టార్లింక్ ఇంటర్నెట్ కోసం ఆధార్ వెరిఫికేషన్
ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్.. ఈ-కేవైసీ వెరిఫికేషన్ కోసం ఆధార్ను ఉపయోగించడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీన్నిబట్టి చూస్తే.. భారతదేశంలో శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సేవలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.స్టార్లింక్ ఇప్పటికే టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT).. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPACe) నుంచి భారతదేశంలో తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి కావలసిన అనుమతిని పొందింది. అయితే జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా టెక్నాలజీ.. మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం వంటి కొన్ని ఆన్-ది-గ్రౌండ్ సన్నాహాలు ఇంకా పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని కూడా త్వరలోనే పూర్తి చేయడానికి కావాల్సిన ఏర్పాట్లను కంపెనీ పూర్తి చేస్తోంది.స్టార్లింక్ భారతదేశంలో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత కొత్త కస్టమర్ల ఆన్బోర్డింగ్ ప్రక్రియను సులభతరం చేయడమే కాకుండా.. వేగవంతమైన, మరింత సురక్షితమైన సేవలను అందించడానికి ప్రస్తుతం యూఐడీఏఐతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్పష్టమవుతోంది.స్టార్లింక్ ఇంటర్నెట్ కోసం ఈకేవైసీ చేసుకున్న యూజర్లు హైస్పీడ్ ఇంటర్నెట్ ఆస్వాదించవచ్చు. ఇది గృహాల్లో వినియోగించడానికి, సంస్థల్లో ఉపయోగించడానికి కూడా అనుకూలంగా ఉంటుందని.. ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.భారతదేశంలో స్టార్లింక్ ధరలుస్టార్లింక్ హార్డ్వేర్ ధర రూ.30,000 నుంచి రూ.40,000 వరకు ఉంటుందని అంచనా. ఇందులో శాటిలైట్ డిష్ & వై-ఫై రౌటర్ ఉన్నాయి. అయితే నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్లాన్లు రూ.3,000 నుంచి రూ.5,000 వరకు ఉంటుంది. యూజర్లు 25 Mbps నుంచి 220 Mbps మధ్య ఇంటర్నెట్ వేగాన్ని ఆస్వాదించవచ్చు. ధరలు త్వరలోనే అధికారికంగా వెల్లడవుతాయి.ఇదీ చదవండి: రెండేళ్లకే మస్క్ కంపెనీ వీడిన 16 ఏళ్ల కుర్రాడుస్టార్లింక్ సేవలను ప్రారంభ దశలో 20 లక్షల కనెక్షన్లకు మాత్రమే పరిమితం చేశారు. అయితే పరికరాల సరఫరా కోసం భారతి ఎయిర్టెల్ & రిలయన్స్ జియోలతో ఒప్పందం కుదుర్చుకుంది. మారుమూల ప్రాంతాలకు కూడా హైస్పీడ్ ఇంటర్నెట్ అందించాలనే లక్ష్యంతో స్టార్లింక్ శాటిలైట్ సేవలను ప్రారంభించనున్నారు. -
మారిన రీచార్జ్ ప్లాన్లు.. ఏది చవక.. లాభదాయకం?
దేశంలోని ప్రముఖ టెలికం కంపెనీలు తమ రీచార్జ్ ప్లాన్లలో ఇటీవల మార్పులు చేశాయి. కొన్ని ఎంట్రీ లెవల్ ప్లాన్లను తొలగించాయి. అయితే ఇప్పటికీ దేశంలోని ఇతర టెలికాం ఆపరేటర్లతో పోలిస్తే రిలయన్స్ జియో మొబైల్ వినియోగదారులకు అత్యంత చవకైన ఎంపికగా కొనసాగుతోందని బీఎన్పీ పారిబాస్ ప్లాన్ విశ్లేషణ నివేదిక తెలిపింది.మూడు ప్రధాన టెలికాం ఆపరేటర్లు జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా తమ పాపులర్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను సవరించాయి. ఈ క్రమంలో ఏ టెలికం కంపెనీలో రీచార్జ్ ప్లాన్లు చవకగా.. లాభదాయకంగా ఉన్నాయన్నదానిపై బీఎన్పీ పారిబాస్ విశ్లేషించింది. ఇందులో జియో ఇప్పటికీ అదే ధర పాయింట్లలో అధిక డేటా ప్రయోజనాలను అందిస్తోందని తేల్చింది.28 రోజుల ప్లాన్కు ఇప్పుడు ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా మూడు కంపెనీల్లోనూ ధర రూ .299గానే ఉంది. అయితే ప్రయోజనాలపరంగా చూస్తే జియో ఇప్పటికీ అధిక డేటా బెనిఫిట్లను అందిస్తోంది. దీంతో ఎక్కువ డేటా వినియోగించే కస్టమర్లకు జియో మరింత చౌకైన ఎంపికగా నిలిచిందని నివేదిక పేర్కొంది.జియోలో అందుబాటులో ఉన్న ప్లాన్లలో, రూ .799 ప్లాన్ 84 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ డేటాను అందిస్తుంది. మరోవైపు, రూ .249 ప్లాన్ ఇప్పుడు ఫిజికల్ జియో స్టోర్లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఆన్లైన్లో తొలగించింది. రూ .209 వాయిస్-ఓన్లీ ప్లాన్ కేవలం మై జియో యాప్లో మాత్రమే అందుబాటులో ఉంది.ఇక రూ .189 ప్లాన్లో అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్లు, 2 జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీతో అందిస్తోంది. ఇంకా రూ.209 ప్లాన్ 22 రోజుల పాటు రోజుకు 1 జీబీని అందిస్తుంది. రూ.299 ప్లాన్ 28 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ, రూ.349 ప్లాన్ 28 రోజుల పాటు రోజుకు 2 జీబీని అందిస్తున్నాయి. ఎయిర్టెల్, వీఐ ప్లాన్లతో పోలిస్తే జియో కస్టమర్లు నెలకు రూ.50 లబ్ధి పొందుతున్నారని నివేదిక విశ్లేషించింది.ఉదాహరణకు, రోజుకు 1.5 జీబీ, 28 రోజుల ప్లాన్ ధర జియోకు రూ .299, ఎయిర్టెల్, బీఐలు అదే ప్రయోజనం కోసం రూ .349 వసూలు చేస్తున్నాయి. అంటే జియో వినియోగదారులకు నెలకు రూ .50 ఆదా అవుతుందన్న మాట. అదేవిధంగా రోజుకు 2 జీబీ డేటా అందించే 28 రోజుల ప్లాన్కు జియో రూ.349, ఎయిర్టెల్ రూ.398, వీఐ రూ.365 వసూలు చేస్తున్నాయి. ఎయిర్టెల్తో పోలిస్తే రూ.49, వీఐతో పోలిస్తే రూ.16 చొప్పున జియో యూజర్లకు నెలకు ఆదా అవుతుంది. -
స్మార్ట్వాచీలకు ఏమైంది? వరుసగా మార్కెట్ డౌన్
దేశీయంగా వేరబుల్ మార్కెట్ వరుసగా అయిదో త్రైమాసికంలోనూ నెమ్మదించింది. స్మార్ట్వాచీలు, ట్రూ వైర్లెస్ స్టీరియో ఇయర్బడ్స్ విక్రయాలు తగ్గడంతో ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో అమ్మకాలు 9.4 శాతం క్షీణించి 2.67 కోట్లకు పరిమితమయ్యాయి. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఐడీసీ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.దీని ప్రకారం సరఫరా తగ్గినప్పటికీ వేరబుల్స్ సగటు విక్రయ ధర (ఏఎస్పీ) ఒక మోస్తరుగా 2.2 శాతం మేర పెరిగి 19.2 డాలర్లకు (సుమారు రూ. 1,700)కు చేరింది. 2025 ప్రథమార్థంలో వేరబుల్ డివైజ్ మార్కెట్ వార్షికంగా 6.3 శాతం తగ్గి 5.16 కోట్ల యూనిట్లకు పరిమితమైంది. ఏఎస్పీ పెద్దగా మార్పులు లేకుండా 18.7 డాలర్ల (సుమారు రూ. 1,630) స్థాయిలో కొనసాగింది. స్మార్ట్ రింగ్స్, స్మార్ట్ గ్లాసెస్, స్మార్ట్ రిస్ట్బ్యాండ్స్లాంటి కొత్త రకం వేరబుల్స్కి డిమాండ్ పెరిగింది.మరిన్ని ముఖ్యాంశాలు..అమ్మకాలు 4.8 శాతం తగ్గినప్పటికీ వేరబుల్స్ మార్కెట్లో 28 శాతం వాటాతో ఇమేజిన్ మార్కెటింగ్ (బోట్ బ్రాండ్) అగ్రస్థానంలో ఉంది. 13.1 శాతం వాటాతో నాయిస్ రెండో స్థానంలో నిల్చింది. విక్రయాలు 8.6 శాతం తగ్గాయి.గోబోల్ట్ (గతంలో బోల్ట్) అమ్మకాలు 21.8 శాతం పెరిగాయి. 10.9 శాతం మార్కెట్ వాటా ఉంది. ఒప్పో, వన్ప్లస్ వాటా చెరి 8 శాతంగా, రియల్మి వాటా 6.5 శాతంగా ఉంది.ఇక స్మార్ట్వాచీల అమ్మకాలు వరుసగా ఆరో త్రైమాసికంలోనూ క్షీణించాయి. జూన్ క్వార్టర్లో 28.4 శాతం తగ్గి 66 లక్షల యూనిట్లకు పరిమితమయ్యాయి. మొత్తం వేరబుల్స్ మార్కెట్లో వీటి వాటా 31.5 శాతం నుంచి 24.9 శాతానికి తగ్గింది. బౌల్ట్ మినహా మిగతా అన్ని బ్రాండ్ల (నాయిస్, బోట్, టైటాన్, ఫైర్ బోల్ట్) స్మార్ట్వాచీల అమ్మకాలు తగ్గాయి.2022, 2023లో భారీగా వృద్ధి చెందిన స్మార్ట్వాచీల మార్కెట్ ప్రస్తుతం కన్సాలిడేట్ అవుతోంది. ఇయర్వేర్ కేటగిరీ స్వల్పంగ్ 1.2 శాతం తగ్గి 1.99 కోట్ల యూనిట్లకు పరిమితం అయింది. ట్రూలీ వైర్లెస్ స్టీరియో (టీడబ్ల్యూఎస్) సెగ్మెంట్ అమ్మకాలు 1.2 శాతం తగ్గినా, 71.2 శాతం వాటాతో అగ్రస్థానంలో కొనసాగింది. నెక్బ్యాండ్ స్టయిల్ ఇయర్వేర్ మరింతగా 16.1 శాతం మేర పడిపోయింది. ఓవర్–ది–ఇయర్ సెగ్మెంట్ అమ్మకాలు 97.4 శాతం ఎగిసి 15 లక్షల యూనిట్లకు పెరిగాయి. టీడబ్ల్యూఎస్ విభాగంలో 31.9 శాతం వాటాతో బోట్ అగ్రస్థానంలో, 14.9 శాతం వాటాతో బోల్ట్ రెండో స్థానంలో ఉన్నాయి. బోట్ అమ్మకాలు 6.9 శాతం తగ్గాయి.స్మార్ట్ రింగ్స్ విక్రయాలు 2.8 శాతం పెరిగి 75,000కు చేరాయి. అ్రల్టాహ్యూమన్, గేబిట్, ఆబో సంస్థలు సంయుక్తంగా 65 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో కొనసాగాయి. మెటా, లెన్స్కార్ట్ కొత్తగా ప్రవేశపెట్టిన మోడల్స్ దన్నుతో స్మార్ట్ గ్లాసెస్ అమ్మకాలు 4,000 నుంచి ఏకంగా 50,000 యూనిట్లకు పెరిగాయి. స్మార్ట్ రిస్ట్బ్యాండ్స్ విక్రయాలు 118.5 శాతం పెరిగి 83,000 యూనిట్లకు చేరాయి. ప్రధానంగా శాంసంగ్కి చెందిన ఫిట్3కి గణనీయంగా డిమాండ్ నెలకొంది. క్యూ2లో రిస్ట్బ్యాండ్స్ కేటగిరీలో శాంసంగ్ 80.6 శాతం మార్కెట్ వాటా దక్కించుకుంది. -
సేమ్ షాక్: ఎయిర్టెల్లోనూ ఆ ప్లాన్ కనుమరుగు
టెలికాం సర్వీస్ ప్రొవైడర్ భారతీ ఎయిర్టెల్ తన ఎంట్రీ సెగ్మెంట్ ప్రీపెయిడ్ ప్లాన్ను నిలిపివేసింది. ప్రత్యర్థి సంస్థ జియో కూడా రూ.249 ధర గల ఎంట్రీ లెవల్ ప్లాన్ ను నిలిపివేసింది. ఎక్కువ మంది రీచార్జ్ చేసుకునే ఈ ప్లాన్ ను ఎయిర్టెల్ నిశ్శబ్దంగా కనుమరుగు చేసింది. ఇప్పుడు వారు రూ .299 ధర గల ఖరీదైన ప్రీపెయిడ్ ప్లాన్ ను ఎంచుకోవలసి వచ్చింది.ఎయిర్ టెల్ నిలిపివేసిన ఈ ప్లాన్ ధర రూ.249. ఇది 28 రోజుల పాటు రోజుకు 1 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లను అందించేది. ముఖ్యంగా, ఇది వినియోగదారులకు ఉచిత హలోట్యూన్స్, ప్రో ఏఐ, ఎక్స్ట్రీమ్ ప్లే వంటి ప్రయోజనాలను కల్పించేది. 28 రోజుల పాటు రోజుకు 1 జీబీ డేటాను అందించే రూ.249 ప్లాన్ ను జియో కూడా ఇటీవల తొలగించింది. జియోలో ఇకపై 1 జీబీ రోజువారీ డేటా లిమిట్తో ఎలాంటి ప్లాన్ లేదు. చౌకైన 28 రోజుల ప్లాన్ ఇప్పుడు రూ .299 నుండి ప్రారంభమవుతుంది. ఇది రోజుకు 1.5 జిబి డేటాను అందిస్తుంది.ఈ చర్య ఎయిర్ల్, జియోలకు సగటు వినియోగదారుడి ఆదాయాన్ని (ఏఆర్పీయూ) పెంచుతుండగా, సామాన్యులపై ఖరీదైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల భారం పడుతోంది. ఈ రెండు టెలికాం ఆపరేటర్లు తీసుకున్న నిర్ణయాన్ని మరో ప్రైవేట్ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా కూడా అనుసరించే అవకాశం ఉంది. -
బోనస్ వస్తుందోచ్.. ఇన్ఫీ ఉద్యోగులకు శుభవార్త
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 2025-26 ఆర్థిక సంవత్సరం ప్రథమ త్రైమాసికానికి (Q1 FY2025-26) సంబంధించిన పనితీరు బోనస్ లెటర్లను జారీ చేసింది. ఈ త్రైమాసికంలో కంపెనీ ఆర్థిక పనితీరు బలంగా ఉండటంతో ఉద్యోగులకు కూడా మెరుగైన బోనస్ను ప్రకటించింది.2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి సంబంధించి ఉద్యోగులకు సగటున 80% పనితీరు బోనస్ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. గత త్రైమాసికంలో ఇచ్చిన 65% సగటు బోనస్ చెల్లింపుతో పోలిస్తే ఇది గణనీయమైన వృద్ధి. దీంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రకటించిన ఈ బోనస్ ఆగస్టు నెల జీతంతో పాటు ఉద్యోగులకు అందనుంది.ఉద్యోగులు తమ పనితీరు రేటింగ్ ఆధారంగా 75% నుండి 89%వరకు బోనస్ పొందారు. ఈ బోనస్ చెల్లింపు లెవెల్ 4, 5, 6 స్థాయిల్లో ఉన్న (సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, టీమ్ లీడర్లు, సీనియర్ మేనేజర్లు) 3.23 లక్షల మందికి పైగా ఉద్యోగులను కవర్ చేస్తుంది. పనితీరు విషయంలో ఉద్యోగులను మూడు కేటగిరీలుగా వర్గీకరించి బోనస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.ఇన్ఫోసిస్ 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి బలమైన ఆర్థిక ఫలితాలు సాధించింది. రూ.6,921 కోట్ల నికర లాభం (వార్షిక ప్రాతిపదికన 8.7% వృద్ధి), రూ.42,279 కోట్ల ఆదాయం (వార్షిక ప్రాతిపదికన 7.5% వృద్ధి) నమోదు చేసి, విశ్లేషకుల అంచనాలను అధిగమించింది.ఇదీ చదవండి: ఐటీ రంగంలో అత్యంత భారీ డీల్ -
చాట్జీపీటీ గో ప్లాన్@ రూ. 399
న్యూఢిల్లీ: ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ఏఐ భారత్లో ‘చాట్జీపీటీ గో’కి సంబంధించి కొత్త సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ప్రకటించింది. ఉచిత ప్లాన్తో పోలిస్తే 10 రెట్లు అధికంగా మెసేజీలు, ఇమేజ్ల జనరేషన్, ఫైల్ అప్లోడ్స్ పరిమితులతో ఈ ప్లాన్ నెలవారీగా రూ. 399గా ఉంటుంది. చాట్జీపీటీ అధునాతన సామర్థ్యాలను మరింత అందుబాటు ధరలో పొందాలనుకునే వారి కోసం ‘చాట్జీపీటీ గో’ని డిజైన్ చేసినట్లు వివరించింది. యాక్సెస్ విషయంలో ప్రాధాన్యత, వేగవంతమైన పనితీరు, అధిక యూసేజీ పరిమితులు అందించే ప్రస్తుత చాట్జీపీటీ ప్లస్కి (నెలకు రూ. 1,999) ఈ కొత్త ప్లాన్ అదనంగా ఉంటుంది. అత్యంత అధునాతన మోడల్స్, మరింత కస్టమైజేషన్ కావాలనుకునే ప్రొఫెషనల్స్, సంస్థల కోసం చాట్జీపీటీ ప్రో (నెలకు రూ. 19,900)ని అందిస్తున్నట్లు ఓపెన్ఏఐ వివరించింది. యూపీఐ విధానంతో కూడా సబ్ స్క్రిప్షన్కి చెల్లింపులు జరపవచ్చని చాట్జీపీటీ వీపీ నిక్ టర్లీ తెలిపారు. చాట్జీపీటీకి భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రెండో భారీ మార్కెట్గా ఉంది. -
రూ. 5,800 కోట్లతో అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ
న్యూఢిల్లీ: ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్ సేవల దిగ్గజంగా ఎదిగే దిశగా ఇండియా పోస్ట్ రూ. 5,800 కోట్లతో అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ (ఏపీటీ) ప్రాజెక్టును ఆవిష్కరించింది. ఏపీటీ ఆధారిత మౌలిక సదుపాయాలతో ఆధునిక లాజిస్టిక్స్ కంపెనీల్లాగా ఇండియా పోస్ట్కి సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందని ‘ఎక్స్’లో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పోస్ట్ చేశారు. డిజిటల్ లావాదేవీలను, ఏ బ్యాంకు కస్టమర్ల నుంచైనా యూపీఐ చెల్లింపులను స్వీకరించేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.సాంకేతిక అంశాల కారణంగా పోస్టాఫీసు సర్వీసులను కొనుగోలు చేయాలన్నా, ఇతర చెల్లింపులు జరపాలన్నా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ఖాతాల నుంచి మాత్రమే సాధ్యపడేది. ఎక్కడైనా సర్వీసులు అందించేందుకు, రియల్ టైమ్లో నిర్ణయాలు తీసుకునేందుకు కొత్త టెక్నాలజీ ఉపయోగపడుతుందని సింధియా వివరించారు. -
హైదరాబాద్లో తలెత్తిన ఇంటర్నెట్ సమస్య
టీజీఎస్పీడీసీఎల్ (TGSPDCL) హైదరాబాద్లో కేబుల్స్ తొలగించడం వల్ల, నగరంలో ఫైబర్ టు హోమ్ కనెక్టివిటీ సమస్యలు తలెత్తాయి. ఇది పెద్ద సంఖ్యలో హోమ్ బ్రాడ్బ్యాండ్ వినియోగదారులకు అంతరాయాన్ని కలిగించింది.విద్యుత్ శాఖ ఆప్టికల్ ఫైబర్ కేబుల్లను విచక్షణారహితంగా.. కత్తిరించడం వల్ల ఈ (ఇంటర్నెట్) అంతరాయం ఏర్పడింది. ఇంటర్నెట్ కేబుల్లు విద్యుత్తును తీసుకువెళ్లవని.. దీనివల్ల విద్యుత్ మౌలిక సదుపాయాలకు సంబంధం లేదని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) చెబుతోంది. విచక్షణారహితంగా కేబుల్స్ కట్ చేయడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని శాఖను కోరుతున్నామని వెల్లడించింది.ఇదీ చదవండి: అమెరికా సుంకాలు.. రిస్క్లో 3 లక్షల ఉద్యోగాలు!నగరంలో తలెత్తిన సమస్యను పరిష్కరించడానికి.. ఇంటర్నెట్ సేవలను వీలైనంత త్వరగా పునరుద్ధరించడానికి సంబంధిత శాఖ పనిచేస్తోంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ దెబ్బతినడం వల్ల చాలా ముఖ్యమైన సేవలు నిలిచిపోతాయి. ప్రస్తుతం ఈ ప్రభావం జియో, ఎయిర్టెల్లకు చెందిన దాదాపు 40 వేల ఫైబర్ కస్టమర్లపై పడింది. -
టెలికం కంపెనీలకు లాభాల మోత!
న్యూఢిల్లీ: టెలికం కంపెనీల నిర్వహణ లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) 12–14% పెరగొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. రూ.1.55 లక్షల కోట్లుగా ఉంటుందని తెలిపింది. డేటా వినియోగంతో సగటు యూజర్ నుంచి వచ్చే ఆదాయం (ఏఆర్పీయూ) పెరుగుతుందని పే ర్కొంది. 5జీ సేవలను ప్రారంభించిన అనంతరం బలమైన పనితీరు, మూలధన వ్యయాల తీవ్రత తగ్గుతుండడం, మె రుగైన నగదు ప్రవాహాలు కంపెనీల రుణ పరపతికి మద్ద తుగా నిలుస్తున్నట్టు వివరించింది. ఏఆర్పీయూ ప్రతి రూపాయి పెరుగుదలతో టెలికం కంపెనీలకు మొత్తంగా రూ.850–900కోట్లు సమకూరుతుందని వెల్లడించింది. టెలి కం రంగంలో 93% చందాదారులను కలిగిన మూడు ప్రము ఖ టెలికం కంపెనీలపై (జియో, ఎయిర్టెల్, వొడాఫోన్) అధ్యయనం చేసిన క్రిసిల్ రేటింగ్స్ ఈ నివేదికను విడుదల చేసింది. టారిఫ్ల పెంపుతో టెలికం కంపెనీల నిర్వహణ లాభం 2024–25లో 17% వృద్ధి చెందడం గమనార్హం. ప్రీమియం ప్లాన్లు.. ఓటీటీ సేవల కోసం డేటాకు డిమాండ్ పెరుగుతుండడంతో దీన్నుంచి ప్రయోజనం పొందేందుకు టెలికం కంపెనీలు ప్రీమియం ప్లాన్లను ఆఫర్ చేస్తుండడాన్ని క్రిసిల్ రేటింగ్స్ నివేదిక ప్రస్తావించింది. ఇది కూడా సగటు యూజర్ వారీ ఆదాయాన్ని పెంచుతుందని తెలిపింది. ఇక చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో టెలికం సేవల విస్తరణ మరో 4–5 శాతం పెరిగి 2026 మార్చి నాటికి 82 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది. వాయిస్ కాల్స్ ప్లాన్లను వినియోగిస్తున్న యూజర్లు డేటా ప్లాన్లకు మళ్లడం ఆదాయాన్ని పెంచుతుందని వివరించింది. ఈ ధోరణులతో టెలికం కంపెనీలకు ఆదాయం పెరుగుతుందని.. అదే సమయంలో కంపెనీలకు 60 శాతం వ్యయాలు స్థిరంగా ఉంటాయి కనుక నిర్వహణ లాభం అధికమవుతుందని పేర్కొంది. అలాగే, మూలధన వ్యయాల అవసరం తక్కువగా ఉండడంతో ఫ్రీక్యాష్ ఫ్లో (నికర మిగులు నిల్వలు) పెరుగుతుందని వివరించింది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో 31 శాతంగా ఉన్న మూలధన వ్యయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 24–26 శాతానికి (ఆదాయంలో) పరిమితమవుతాయని క్రిసిల్ రేటింగ్స్ అసోసియేట్ డైరెక్టర్ నితిన్ బన్సాల్ తెలిపారు. స్పెక్ట్రమ్ కొనుగోళ్లు దాదాపుగా 2022–23 ఆర్థిక సంవత్సరంలోనే ముగిశాయని, తదుపరి స్పెక్ట్రమ్ పెట్టుబడులు 2030లో అవసరపడతాయని చెప్పారు. ఇవన్నీ కలసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.70,000 కోట్ల ఫ్రీ క్యాష్ ఫ్లోకు దారితీస్తాయని తెలిపారు. కంపెనీల నికర రుణ భారం 3.4 రెట్ల నుంచి 2.7 రెట్లకు (మూలధనంతో దిగొస్తుందన్నారు. రూ.225కు ఏఆర్పీయూ ‘‘గత ఆర్థిక సంవత్సరంలో ఏఆర్పీయూ రూ.205గా ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.220–225కు చేరుకుంటుంది. ప్రధానంగా అధిక డేటా వినియోగం ఇందుకు దోహదం చేస్తుంది. 5జీ నెట్వర్క్ లభ్యత మరింత విస్తృతమై 2026 మార్చి నాటికి 45–47 శాతానికి చేరుకుంటుంది. 2025 మార్చి నాటికి ఇది 35 శాతంగా ఉంది’’అని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ ఆనంద్ కులకర్ణి తెలిపారు. సోషల్ మీడియా యాప్లు, వీడియో స్ట్రీమింగ్, గేమింగ్, జెనరేటివ్ ఏఐ, డిజిటల్ మార్కెటింగ్ కోసం డేటా వినియోగం పెరుగుతున్నట్టు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో సగటు యూజర్ నెలవారీ డేటా వినియోగం 27జీబీగా ఉంటే, అది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 31–32జీబీకి పెరుగుతుందన్నారు. ‘‘టెలికం కంపెనీలు ప్లాన్లలో డేటా ప్రయోజనాలను తగ్గిస్తున్నాయి. లేదా అధిక డేటా ప్లాన్లపైనే 5జీ సేవలను ఆఫర్ చేస్తున్నాయి. ఈ చర్యలు కస్టమర్లు ప్రీమియం ప్లాన్లకు వెళ్లేలా చేస్తాయి. దీంతో కంపెనీల ఏఆర్పీయూ పెరుగుతుంది’’అని కులకర్ణి వివరించారు. -
బెంగళూరు ఫాక్స్కాన్ ప్లాంట్ షురూ
న్యూఢిల్లీ: తైవాన్కు చెందిన ఎల్రక్టానిక్స్ తయారీ సంస్థ ఫాక్స్కాన్ బెంగళూరులోని తన యూనిట్లో కార్యకలాపాలు ప్రారంభించింది. స్వల్ప స్థాయిలో ఐఫోన్ 17 ఉత్పత్తిని ఆరంభించింది. చైనా తర్వాత రెండో అతిపెద్ద తయారీ కేంద్రాన్ని బెంగళూరు సమీపంలోని దేవనహళ్లి వద్ద 2.8 బిలియన్ డాలర్లతో (రూ.25,000 కోట్లు) ఫాక్స్కాన్ ఏర్పాటు చేయడం గమనార్హం. ఐఫోన్ తయారీలో ఫాక్స్కాన్ అతిపెద్ద సంస్థగా ఉంది. బెంగళూరులోని యూనిట్లో ఐఫోన్ 17 ఉత్పత్తితో కార్యకలాపాలు మొదలు పెట్టినట్టు.. చెన్నై యూనిట్లోనూ ఐఫోన్ 17 తయారీ చేస్తున్నట్టు ఈ వ్యహారం తెలిసిన వర్గాలు తెలిపాయి. ఇటీవలే ఫాక్స్కాన్ బెంగళూరు యూనిట్ నుంచి వందలాది చైనా ఇంజనీర్లు, నిపుణులు అర్ధంతరంగా వెనక్కి వెళ్లిపోవడం తెలిసిందే. అవసరం అయితే తైవాన్ నుంచి అయినా నిపుణులను తెచ్చుకోగల సామర్థ్యం ఫాక్స్కాన్కు ఉండడంతో దీని ప్రభావం పెద్దగా పడలేదు. 60 మిలియన్ ఐఫోన్లుఐఫోన్ తయారీని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 60 మిలియన్ యూనిట్లకు పెంచే ప్రణాళికతో ఫాక్స్కాన్ ఉంది. 2024–25లో 35–40 యూనిట్లను తయారు చేసింది. 2025 జూన్లో అమెరికాలో విక్రయించిన మెజారిటీ ఐఫోన్లు భారత్లో తయారైనవేనని యాపిల్ సీఈవో టిక్కుక్ జూలై 31న ప్రకటించడం గమనార్హం. అంతేకాదు, జూన్ త్రైమాసికంలో అమెరికాలో విక్రయించిన ఐఫోన్లు సైతం భారత్ నుంచి రవాణా చేసినవిగా ఫలితాల అనంతరం సమావేశంలో ప్రకటించారు. భారత్లోని యాపిల్ సరఫరాదార్లు 2025 మొదటి ఆరు నెల్లో 5.9 మిలియన్ యూనిట్లన సరఫరా చేశారు. గతేడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 21.5 శాతం అధికం. ఎస్అండ్పీ గ్లోబల్ అంచనా ప్రకారం 2024లో అమెరికాలో ఐఫోన్ల అమ్మకాలు 75.9 మిలియన్ యూనిట్లుగా ఉన్నాయి. -
స్మార్ట్ఫోన్లో ఉండాల్సిన ముఖ్యమైన 12 యాప్స్
టెక్నాలజీ విస్తరిస్తోంది.. ప్రపంచం పరుగెడుతోంది. సమయం చాలా ముఖ్యమైపోయింది. ఇలాంటి సమయంలో స్మార్ట్ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరూ తప్పకుండా కొన్ని ప్రభుత్వ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇవి మీ సమయాన్ని మాత్రమే కాకుండా.. అవసరమైన గవర్నమెంట్ సర్వీసులను ఉపయోగించుకోవడానికి కూడా అనుమతిస్తాయి.ఉమాంగ్ (యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్)కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి స్థానిక ప్రభుత్వ సంస్థల వరకు దేశవ్యాప్త ఈ-గవర్నమెంట్ సేవలను యాక్సెస్ చేయడానికి 'ఉమాంగ్' యాప్ చాలా ఉపయోగపడుతుంది. ఇందులో పీఎఫ్ క్లెయిమ్స్ అప్లై చేసుకోవడం దగ్గర నుంచి.. యుటిలిటీ బిల్లులు చెక్ చేసుకోవడం వరకు ఉన్నాయి. ఇది సుమారు 1500 కంటే ఎక్కువ ప్రభుత్వ సేవలకు ఒక ప్లాట్ఫామ్.పన్ను చెల్లింపుదారుల కోసం ఏఐఎస్ఏఐఎస్ యాప్ అనేది.. భారత ప్రభుత్వ ఆదాయపు పన్ను శాఖ అందించే ఫ్రీ మొబైల్ అప్లికేషన్. యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ (AIS)కు సంబంధించిన సమాచారాన్ని అందించడమే ముఖ్య ఉద్దేశ్యంగా ఈ యాప్ పనిచేస్తుంది. ఇందులో పన్ను చెల్లింపుదారులు తమ అభిప్రాయాలను అందించవచ్చు.డిజిలాకర్డిజిలాకర్ అనేది.. భారతదేశంలో ప్రభుత్వ మద్దతుతో పనిచేసే అప్లికేషన్. డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) దీనిని ప్రారంభించారు. పేపర్లెస్ పాలనను ప్రోత్సహించడానికి ప్రారంభించిన ఈ అప్లికేషన్ ముఖ్యమైన డాక్యుమెంట్స్ (ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి) స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇందులో డాక్యుమెంట్స్ ఉంటే ఫిజికల్ కాపీలను చూపించాల్సిన అవసరం లేదు.డిజియాత్రవిమానాశ్రయాలలో వేగవంతమైన చెక్-ఇన్ల కోసం డిజియాత్ర చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం ఇది అనేక ప్రధాన నగరాల్లో పనిచేస్తుంది.ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్బ్రోకర్ అవసరం లేకుండా నేరుగా ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది చాలా సురక్షితమైనది, పారదర్శకమైనది. అంతే కాకుండా పెట్టుబడికి సంబంధించిన మొత్తం ప్రక్రియ ఆన్లైన్లోనే ఉంటుంది.పోస్ట్ఇన్ఫోపోస్ట్ఇన్ఫో అనేది ఇండియా పోస్ట్ యాప్. దీని ద్వారా స్పీడ్ పోస్ట్లను ట్రాక్ చేయవచ్చు. పోస్టల్ ధరలను చెక్ చేసుకోవచ్చు. మీకు సమీపంలో ఏ పోస్టాఫీసులు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.స్వయం (SWAYAM)స్వయం యాప్ ద్వారా IIT, IIM వంటి అగ్రశ్రేణి సంస్థల నుంచి పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు ప్రతిదానిని కవర్ చేయవచ్చు. ఇందులో ఫ్రీ ఆన్లైన్ కోర్సులను పొందవచ్చు. విద్యార్థులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఇదీ చదవండి: ఐదు ఏఐ కోర్సులు.. పూర్తిగా ఉచితం112 ఇండియాపోలీసులు, అగ్నిమాపక & అంబులెన్స్ సేవలను తక్షణమే పొందటానికి 112 ఇండియా యాప్ ఉపయోగపడుతుంది. ఇది ఆండ్రాయిడ్ బేస్డ్ యాప్, దీనిని పౌరులు అత్యవసర సమయంలో సహాయం కోరడానికి ఉపయోగించవచ్చు.భీమ్ యూపీఐభీమ్ యూపీఐ అనేది నగదు రహిత లావాదేవీలను అనుమతిస్తుంది. ఇది ప్రభుత్వ యూపీఐ యాప్. ఇది సింపుల్ అండ్ సెక్యూర్ కూడా.నెక్స్ట్జెన్ ఎంపరివాహన్ఆర్సీ, డీఎల్ యొక్క డిజిటల్ వెర్షన్లను యాక్సెస్ చేయడానికి మాత్రమే కాకుండా.. చలాన్లను చెక్ చేయడానికి నెక్స్ట్జెన్ ఎంపరివాహన్ యాప్ ఉపయోగపడుతుంది.దీక్ష (DIKSHA)దీక్ష అనేది పాఠశాల విద్యార్థులు.. ఉపాధ్యాయుల కోసం ఉపయోగపడే ఒక ఇ-లెర్నింగ్ యాప్. ఇది పాఠ్యాంశాలకు అనుగుణంగా నాణ్యమైన విద్యా కంటెంట్ను అందిస్తుంది.జన్ ఔషధి సుగంసరసమైన ధరలకు జనరిక్ మందులను, సమీపంలోని జన్ ఔషధి కేంద్ర స్థానాలను సులభంగా కనుగొనడానికి 'జన్ ఔషధి సుగం' యాప్ ఉపయోగపడుతుంది. -
బాత్రూమ్ సింగింగ్ పార్ట్నర్.. మాయ అద్దం!
హ్యాపీ బాత్రూమ్ నుంచే హ్యాపీ డే మొదలవుతుంది. బాత్రూమ్లో కలిగే చిన్న చిరాకు మీ రోజంతటినీ చెడగొడుతుంది. అందుకే బాత్రూమ్ ఇబ్బందులన్నీ క్షణాల్లో తీర్చేసే స్మార్ట్ గ్యాడ్జెట్స్ గురించి ఈ కథనంలో చూసేద్దాం.బాత్రూమ్ సింగింగ్ పార్ట్నర్!స్నానం మొదలైందంటే బకెట్లో నీళ్లు మాత్రమే కాదు, కొందరి నోటి నుంచి పాటలు కూడా వెలువడుతూ ఉంటాయి. అలా బాత్రూమ్లో పాడుతూ గాన స్నానాల్లో ఓలలాడే బాత్రూమ్ రాక్స్టార్స్కు ఇప్పుడు ఓ కొత్త సింగింగ్ పార్ట్నర్ వచ్చేసింది. అదే ‘మాక్సీ షవర్హెడ్ ’. ఇది కేవలం షవర్ మాత్రమే కాదు, ఇందులో బ్లూటూత్ స్పీకర్ కూడా ఉంటుంది. మొబైల్తో బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేస్తే చాలు.నీటి శబ్దం మధ్య కూడా మీ పాటలు స్పష్టంగా వినిపిస్తాయి. స్పీకర్ను తొలగించడమూ, వాడడమూ చాలా సులభం. యూఎస్బీ ద్వారా పూర్తిగా చార్జ్ చేస్తే దాదాపు ఏడుగంటలపాటు పనిచేస్తుంది. ఈ స్పీకర్ శబ్దం నీటి శబ్దాన్ని మించి ఉంటుంది. అందుకే, ఏ అవరోధాలు లేకుండా పాటలు, కథలు, వార్తలు అన్నీ స్పష్టంగా వినవచ్చు. ఫోన్ కాల్ వచ్చినా, స్నానం చేస్తూనే మాట్లాడుకోవచ్చు. ధర సుమారు రూ.10,000. అయితే, కొన్ని చోట్ల తగ్గింపు ధరకూ లభిస్తోంది.బబుల్ బాత్పిల్లలకు స్నానం చేయించడమంటే టామ్ అండ్ జెర్రీ ఫైట్ లాంటిది. ఒకరు పరుగులు పెడితే, మరొకరు వెనకాలే పరుగెడుతూనే ఉండాలి. ‘నో... నో...’ అంటూ పిల్లలు అరుస్తుంటే, ‘ఐదు నిమిషాలే... ఐదు నిమిషాలే’ అంటూ అమ్మనాన్నలు వారిని పట్టుకోవడానికి తిరుగుతూనే ఉంటారు. ఇలాంటి హడావిడితో నిండిన బాత్ టైమ్కు గుడ్బై చెప్పే పరిష్కారం వచ్చేసింది! అదే ఈ ‘బాత్ బబుల్ మేకర్’. ఇది నీటి బుడగలను తయారుచేసే పరికరం మాత్రమే కాదు, పిల్లల మొహాల్లో నవ్వులు విరబూయించే సాధనం కూడా!మ్యూజిక్, బబుల్స్, పిల్లల్ని ఆకట్టుకునేలా ఉండే రంగురంగుల డిజైన్లతో ఉండే వీటిని బాత్రూమ్ గోడకు తగిలించేశారంటే చాలు. పిల్లలు స్వయంగా ‘నాకు టబ్ టైమ్ కావాలి!’ అని తెగ కోరుకుంటారు. మార్కెట్లో ఇవి వివిధ ధరల్లో లభిస్తున్నాయి. సంగీతం, లైట్స్తో ఉన్న ఆటోమేటిక్ బబుల్ మేకర్లు రూ.2,000 నుంచి రూ.5,000 వరకు లభిస్తాయి. అధిక బబుల్ ఔట్పుట్ ఉన్న హైఎండ్ మోడల్స్కు అయితే ధర రూ.5,000 కంటే ఎక్కువే ఉంటుంది.మాయ అద్దం!ఉదయం కాఫీ చల్లారినా భరించగలమేమో కాని, షవర్ తర్వాత అద్దంలో ముఖం కనిపించకపోతే మాత్రం వేడెక్కిపోతాం! అప్పుడు చేతిలో టవల్ పట్టుకుని అద్దాన్ని తుడవక తప్పదు. ఇలా ప్రతి ఉదయం చిరాకు తెప్పించే ఈ చిన్న వర్కౌట్కి ఇప్పుడు శాశ్వత పరిష్కారం దొరికింది. అదే ఫాగ్లెస్ మిర్రర్. దీనిని యాంటీ–ఫాగ్ పూతతో తయారు చేస్తారు.ఇలాంటి అద్దాలు కొన్నింటిలో హీటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇది అద్దాన్ని మెల్లగా వేడి చేసి పొగను తొలగిస్తుంది. మరికొన్నింటిలో ఎల్ఈడీ లైట్లు కూడా ఉంటాయి, ఇవి క్లియర్ విజ¯Œ కి తగిన వెలుతురును అందిస్తాయి. దీంతో షేవింగ్, మేకప్ ఏదైనా పని సులభంగా, స్పష్టంగా చేయవచ్చు. ఇవి మార్కెట్లో వివిధ డిజైన్లలో అందుబాటులో ఉన్నాయి. గోడకూ అమర్చుకోచ్చు, టేబుల్పైన అయినా ఉంచవచ్చు. ధర కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది. సింపుల్ వెర్షన్లు రూ.799 నుంచి, హీటెడ్ అద్దాలు, లైటింగ్ ఉన్నవి రూ.2,000 వరకు లభిస్తున్నాయి. -
తల్లి కాబోతున్న రోబో!
స్త్రీ, పురుషుల కలయికతో పిల్లలు పుట్టడం సర్వసాధారణం. ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో టెస్ట్ ట్యూబ్ బేబీలు పుడుతున్నారు. సరోగసీ ద్వారా కూడా పిల్లలను కంటున్నారు. అయితే శిశువు పుట్టడానికి మనిషి గర్భమే అవసరం లేదంటూ.. చైనా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా 'గర్భధారణ రోబోట్'లను సృష్టిస్తున్నారు. వినడానికి ఇది వింతగా ఉన్నా.. దీనికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే, ఈ కథనం చదవాల్సిందే..ప్రపంచంలోనే మొట్టమొదటి 'గర్భధారణ రోబోట్'పై చైనా శాస్త్రవేత్తలు పని చేస్తున్నారని, ఇది సజీవ శిశువుకు జన్మనిస్తుందని ది టెలిగ్రాఫ్ నివేదించింది. ఈ టెక్నాలజీ గర్భధారణ నుంచి ప్రసవం వరకు గర్భధారణకు కావలసిన అన్ని విషయాలను అనుకరిస్తుందని నిపుణులు పేర్కొన్నారు.పిండం అనేది గర్భధారణ రోబో.. కృత్రిమ గర్భంలోనే పెరుగుతుంది. పిండాలకు కావలసిన పోషకాలు అన్నీ కూడా ట్యూబ్స్ ద్వారా అందిస్తారు. అయితే అండం, స్పెర్మ్ ఎలా.. ఎక్కడ ఫలదీకరణం అవుతుందనే విషయాలను ప్రస్తుతానికి శాస్త్రవేత్తలు వెల్లడించలేదు. సింగపూర్లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ 'జాంగ్ కిఫెంగ్' నేతృత్వంలోని గ్వాంగ్జౌకు చెందిన కైవా టెక్నాలజీ ఈ రోబోను అభివృద్ధి చేస్తోంది.ఇదీ చదవండి: ఐదు ఏఐ కోర్సులు.. పూర్తిగా ఉచితంఈ టెక్నాలజీ విజయవంతమైతే.. సంతానం లేని జంటలకు లేదా జీవసంబంధమైన గర్భధారణ చేయించుకోవడానికి ఇష్టపడని వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ పరిణతి చెందిన దశలో ఉందని డాక్టర్ జాంగ్ పేర్కొన్నారు. పిండం.. రోబోట్ కృత్రిమ గర్భంలో పెరగడానికి కావలసిన జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఈ రోబోట్ నమూనా 2026 నాటికి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.మనిషి గర్భంతో పనిలేకుండా రాబోయే టెక్నాలజీ బాగానే ఉంది. కానీ ఇది ప్రతికూల ప్రభావాలకు దారి తీస్తుందేమో అని కొందరు అభిప్రాయపడుతున్నారు. తల్లి, బిడ్డల పేగు బంధం లేకపోతే.. పిల్లల మానసిక ప్రభావం ఎలా ఉండబోతుందో అని ఆందోళన చెందుతున్నారు. అంతే కాకుండా ఇది చట్టపరంగా సాధ్యమేనా?, చట్టాలు దీనికి ఒప్పుకుంటాయా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. -
పాతిక వేలలో ఒప్పో నుంచి కొత్త ఫోన్
స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో ఇండియా తాజాగా కే13 టర్బో సిరీస్ ప్రో 5జీ, టర్బో 5జీ ఫోన్లను ఆవిష్కరించింది. వీటిలో అంతర్గతంగా కూలింగ్ ఫ్యాన్ ఉంటుందని, దేశీయంగా స్మార్ట్ఫోన్లలో ఈ ఫీచరును అందించడం ఇదే ప్రథమం అని సంస్థ తెలిపింది. భారీగా మల్టీ టాస్కింగ్, గేమింగ్కి అనువుగా ఇవి ఉంటాయని వివరించింది.7000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్స్ సూపర్వూక్ ఫాస్ట్ చార్జింగ్, 1.5 అమోలెడ్ డిస్ప్లే తదితర ఫీచర్లు వీటిలో ఉన్నాయి. దీని ధర రూ. 27,999 నుంచి ప్రారంభం అవుతుంది. అయితే, ఆఫర్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే రూ. 24,999 నుంచి లభిస్తుందని సంస్థ తెలిపింది. టర్బో ప్రో 5జీ ఫోన్ల సేల్ ఆగస్టు 15 నుంచి, టర్బో 5జీ ఫోన్ల అమ్మకాలు 18 నుంచి ప్రారంభమవుతాయి.ముఖ్యమైన ఫీచర్లుఇండియాలో మొట్టమొదటి సారిగా అంతర్గత కూలింగ్ ఫ్యాన్ ఉన్న స్మార్ట్ఫోన్గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందింది.ట్రిపుల్-లెవల్ కూలింగ్ సిస్టమ్: కూలింగ్ ఫ్యాన్, ఎయిర్ డక్ట్స్, 5000mm² వేపర్ చాంబర్.ప్రాసెసర్: స్నాప్డ్రాగన్ 8ఎస్ జెన్ 4 ఎస్ఓసీర్యామ్ & స్టోరేజ్: 8జీబీ/12జీబీ ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జీబీ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్.డిస్ప్లే: 6.8 అంగుళాల ఎల్టీపీఎస్ అమోల్డ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, 1500 నిట్స్ బ్రైట్నెస్.బ్యాటరీ: 7000mAh, 80 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ (15 నిమిషాల్లో 50%).కెమెరా: 50MP + 2MP రియర్, 16MP ఫ్రంట్, 4K 60fps వీడియో సపోర్ట్.సాఫ్ట్వేర్: ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్ఓఎస్ 15, 2 ఓఎస్ అప్డేట్లు, 3 ఏళ్లు సెక్యూరిటీ ప్యాచ్లుధర & లభ్యతకే13 టర్బో ప్రో 5జీ ఫోన్ ప్రారంభ ధర రూ.37,999 కాగా డిస్కౌంట్లో రూ. 34,999 లకు లభిస్తుంది. అలాగే కే13 టర్బో 5జీ ఫోన్ ధర రూ. 27,999 కాగా తగ్గింపులు పోగా రూ. 24,999 లకు లభిస్తుంది. ఈ ఫోన్లు ఫ్లిప్కార్ట్, ఒప్పో ఈ-స్టోర్లు, ఇతర ఆఫ్లైన్ స్టోర్స్ ద్వారా అందుబాటులో ఉంటాయి. -
యాపిల్ ఉత్పత్తుల సరఫరా 21% అప్
న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రథమార్ధంలో భారత్లో యాపిల్ ఉత్పత్తుల సరఫరా వార్షికంగా 21.5 శాతం పెరిగి 59 లక్షల యూనిట్లకు చేరుకుంది. అత్యధికంగా సరఫరా అయిన మోడల్గా ఐఫోన్ 16 నిల్చింది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) ఓ నివేదికలో ఈ విషయాలు తెలిపింది. దీని ప్రకారం గతేడాది ప్రథమార్ధంతో పోలిస్తే దేశీ మార్కెట్లో స్మార్ట్ఫోన్ల సరఫరా 0.9 శాతం పెరిగి 7 కోట్లకు చేరింది. పోకో, షావోమీ, వన్ప్లస్, రియల్మి తదితర చైనా సంస్థల ఫోన్ల సప్లై తగ్గింది. ఇక రెండో త్రైమాసికంలో మొత్తం 3.7 కోట్ల స్మార్ట్ఫోన్స్ సరఫరా అయ్యాయి. యాపిల్ ఐఫోన్ల సరఫరా 19.7 శాతం పెరిగి 27 లక్షల యూనిట్లకు చేరింది. స్మార్ట్ఫోన్ మార్కెట్లో 7.5 శాతం వాటా దక్కించుకుంది. మరిన్ని విశేషాలు.. → జూన్ క్వార్టర్లో 19 శాతం మార్కెట్ వాటాతో వివో అగ్ర స్థానంలో (23.5 శాతం వార్షిక వృద్ధి) నిల్చింది. 14.5 శాతం వాటాతో శాంసంగ్ (21 శాతం వృద్ధి) రెండో స్థానంలో ఉంది. ఒప్పో (13.4 శాతం వాటా, 25.4 శాతం వృద్ధి), మోటరోలా (8 శాతం వాటా, 39.4 శాతం వృద్ధి) ఆ తర్వాత ర్యాంకుల్లో ఉన్నాయి. → వన్ప్లస్ మార్కెట్ వాటా 4.4 శాతం నుంచి 2.5 శాతానికి, సరఫరా 39.4 శాతం మేర పడిపోయాయి. → రియల్మి మార్కెట్ వాటా 9.7 శాతానికి, స్మార్ట్ఫోన్ల సప్లై 17.8 శాతం మేర క్షీణించాయి. అటు షావోమీ మార్కెట్ వాటా కూడా 9.6 శాతానికి, వాల్యూమ్స్ 23.5 శాతం స్థాయిలో తగ్గాయి. పోకో 3.8 శాతానికి తగ్గగా, సరఫరా 28.8 శాతం మేర క్షీణించింది. → ప్రీమియం సెగ్మెంట్ డివైజ్లు (రూ.52,000 నుంచి రూ. 70,000 వరకు) అత్యధికంగా 96.4% వృద్ధి చెందాయి. మార్కెట్ వాటా 2 నుంచి 4 శాతానికి పెరిగింది. ఈ విభాగంలో ఐఫోన్ 16/15ల వాటా అయిదింట మూడొంతులు ఉంది. → సూపర్ ప్రీమియం సెగ్మెంట్ ఫోన్లు (రూ. 70,000 కన్నా పైన) 15.8% వృద్ధి చెందగా, మార్కెట్ వాటా పెద్దగా మార్పులు లేకుండా 7 శాతంగా కొనసాగింది. శాంసంగ్, యాపిల్ మార్కెట్ వాటా వరుసగా 49%, 48%గా ఉంది. ఈ సెగ్మెంట్లో ఐఫోన్ 16, గెలాక్సీ ఎస్25, ఎస్24 అల్ట్రా, ఎస్25, ఐఫోన్ 16ప్లస్ కీలక మోడల్స్గా ఉన్నాయి. → స్మార్ట్ఫోన్ల సగటు విక్రయ ధర (ఏఎస్పీ) 10.8% పెరిగి రికార్డు స్థాయిలో 275 డాలర్లకు చేరింది. → ఎంట్రీ స్థాయి (రూ. 8,700 లోపు) సెగ్మెంట్ 22.9 శాతం వృద్ధి చెందింది. గతేడాది క్వార్టర్తో పోలిస్తే మార్కెట్ వాటాను 14 శాతం నుంచి 16 శాతానికి పెరిగింది. → మాస్ బడ్జెట్ సెగ్మెంట్ (రూ. 8,700 నుంచి రూ. 17,400 వరకు) ఫోన్ల సరఫరా పరిమాణం 1.1 శాతం పెరగ్గా, ఎంట్రీ ప్రీమియం సెగ్మెంట్ (రూ. 17,400 – రూ. 35,000) సరఫరా 2.5 శాతం, మార్కెట్ వాటా 30 శాతం నుంచి 27 శాతానికి తగ్గాయి. -
నిర్ణయాల ప్రక్రియలో కీలకంగా ఏఐ
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఏఐ) పూర్తిగా ఆటోమేషన్ సాధనంగా కన్నా, మెరుగైన నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలోనే మరింత కీలకంగా ఉపయోగపడుతుందని పలు దిగ్గజ కంపెనీలు భావిస్తున్నాయి. పబ్లికేషన్ సంస్థ సీఐవోఅండ్లీడర్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దీని ప్రకారం 2023 నుంచి వివిధ సృజనాత్మక ప్రక్రియల్లో కంటెంట్ మార్కెటింగ్ నుంచి సాఫ్ట్వేర్ కోడింగ్ వరకు జనరేటివ్ ఏఐ వినియోగం అయిదు రెట్లు పెరిగింది. 2025 ఆఖరు నాటికి కంపెనీలు 30 శాతం ఐటీ సరీ్వసులు పూర్తిగా ఏఐతో ఆటోమేట్ చేయనున్నాయి. వ్యయాలను తగ్గించుకోవడం, ప్రాసెసింగ్, నిర్వహణ సామరŠాధ్యలను పెంచుకోవాలన్న లక్ష్యాలే ఏఐని వినియోగించుకోవడానికి కారణమని 98.4 శాతం కంపెనీలు తెలిపాయి. కస్టమర్లకు మెరుగైన అనుభూతిని అందించేందుకు కృత్రిమ మేథ విలువైన సాధనంగా ఉపయోగపడుతుందని 96 శాతం కంపెనీలు వివరించాయి. 2025 మే–జూలై మధ్య నిర్వహించిన సర్వేలో రూ. 5,000 కోట్ల పైగా వార్షిక టర్నోవరు ఉన్న కంపెనీలకు చెందిన 350 మంది చీఫ్ ఐటీ (లేదా) చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్లు పాల్గొన్నారు. రిపోర్ట్లో మరిన్ని విశేషాలు.. → 2025లో 93 శాతం కంపెనీలు ఏఐ, అనలిటిక్స్పై పెట్టుబడులను పెంచనున్నాయి. సగం పైగా సంస్థ లు బడ్జెట్లను భారీగా పెంచే ఆలోచనలో ఉన్నాయి. → ఐటీ కార్యకలాపాల్లో ఆటోమేషన్ కోసం, లోపాలను గుర్తించడం వంటి పనులకు 41 శాతం కంపెనీలు ఏఐని వినియోగిస్తున్నాయి. → చాట్బాట్లు, పర్సనలైజేషన్ లాంటి అవసరాల కోసం ఫైనాన్స్ (31 శాతం), కస్టమర్ సర్వీస్ (28 శాతం) విభాగాల్లో ఏఐని వినియోగిస్తున్నారు. → 90 శాతం కంపెనీలు డేటా భద్రత, గోప్యతను ఏఐ వినియోగానికి ప్రధాన సవాలుగా ఉంటోంది. డేటా నాణ్యతపరమైన సవాళ్లు ఆ తర్వాత స్థానంలో ఉన్నాయి. → 85 శాతం సంస్థలు ఏఐ సాధనాలను అంతర్గతంగానే తయారు చేసుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నాయి. -
ఐదు ఏఐ కోర్సులు.. పూర్తిగా ఉచితం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు డిమాండ్ పెరుగుతోంది. చాలామంది ఇందులో కొత్తగా నైపుణ్యాలను పెంచుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని విద్యా మంత్రిత్వ శాఖ 'స్వయం పోర్టల్'లో ఫ్రీ ఏఐ (AI) కోర్సులను అందిస్తోంది. వివిధ పరిశ్రమలలో ఏఐ ప్రాముఖ్యత పెరుగుతున్న సమయంలో ఈ కోర్సులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.ఏఐ/ఎమ్ఎల్ యూసింగ్ పైథాన్ఈ కోర్సు ద్వారా విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్ వంటి వాటికి సంబంధించిన ప్రాథమిక అంశాలను పరిచయం చేస్తారు. ఇందులో స్టాటిస్టిక్స్, లీనియర్ ఆల్జీబ్రా, ఆప్టిమైజేషన్, డేటా విజువలైజేషన్ వంటివి నేర్చుకోవడానికి అవకాశం ఉంది. అంతే కాకుండా.. డేటా సైన్స్లో విస్తృతంగా ఉపయోగించే ప్రోగ్రామింగ్ భాషలలో ఒకటైన పైథాన్ను కూడా కవర్ చేస్తుంది. ఈ కోర్సు 36 గంటల పాటు కొనసాగుతుంది. కోర్సు పూర్తయిన తరువాత చివరిలో సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది.క్రికెట్ అనలిటిక్ విత్ ఏఐఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్లు అందించే ఈ కోర్సు ద్వారా.. క్రికెట్ను ప్రాథమిక ఉదాహరణగా తీసుకుని, పైథాన్ని ఉపయోగించి స్పోర్ట్స్ అనలిటిక్స్ కు సంబంధించిన ప్రాథమిక అంశాలను తెలుసుకోవచ్చు. ఈ కోర్సు 25 గంటలు ఉంటుంది.ఏఐ ఇన్ ఫిజిక్స్ ఈ కోర్సు మెషిన్ లెర్నింగ్ & న్యూరల్ నెట్వర్క్లు వాస్తవ ప్రపంచ భౌతిక శాస్త్ర సమస్యలను ఎలా పరిష్కరించగలవో చెబుతుంది. ఇందులో ఇంటరాక్టివ్ సెషన్లు, ఆచరణాత్మక ఉదాహరణలు, హ్యాండ్స్-ఆన్ ల్యాబ్ వర్క్ మొదలైనవి ఉన్నాయి. ఈ కోర్సు 45 గంటల ఉంటుంది.ఇదీ చదవండి: ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్: తొలిరోజే 1.4 లక్షల కొనుగోళ్లుఏఐ ఇన్ అకౌంటింగ్కామర్స్ అండ్ మేనేజ్మెంట్ విద్యార్థులనే లక్ష్యంగా చేసుకుని ఈ కోర్స్ ప్రవేశపెట్టింది. అకౌంటింగ్ పద్ధతుల్లో ఏఐను ఎలా ఉపయోగించుకోవచ్చో.. ఈ కోర్సు ద్వారా నేర్చుకోవచ్చు. ఇది 45 గంటల కోర్సు.ఏఐ ఇన్ కెమిస్ట్రీఈ కోర్సు ద్వారా వాస్తవ ప్రపంచ రసాయన డేటాసెట్లను ఉపయోగించాలో తెలుసుకోవచ్చు. అంతే కాకుండా పరమాణు లక్షణాలు, మోడల్ ప్రతిచర్యలు, డిజైన్ డ్రగ్స్ మొదలైనవాటిని ఎలా అంచనా వేయాలో తెలుస్తుంది. ఇది 45 గంటల కోర్సు. -
ఏఐ నుంచి మానవాళిని కాపాడాలంటే?: హింటన్ సూచన
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతిక రంగంలో సంచలనాలను సృష్టిస్తోంది. ప్రతి రంగంలోనూ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ మానవాళిని తుడిచిపెట్టే అవకాశం ఉందని.. ''గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ''గా ప్రసిద్ధి చెందిన బ్రిటిష్ - కెనడియన్ కంప్యూటర్ శాస్త్రవేత్త 'జియోఫ్రీ హింటన్' (Geoffrey Hinton) ఆందోళన వ్యక్తం చేశారు.లాస్ వెగాస్లో జరిగిన Ai4 సమావేశంలో హింటన్ మాట్లాడుతూ.. ఏఐ మానవాళికి ప్రమాదంగా మారుతుందని, దీనిపై నియంత్రణ కలిగి ఉండాలని హెచ్చరించారు. పెద్దవాళ్ళు.. పిల్లలకు మిఠాయి ఇచ్చి ఏమార్చిన విధంగా భవిష్యత్తులో ఏఐ మనుషులను నియంత్రించే అవకాశం ఉందని ఆయన అన్నారు.మోసం చేయడం, దొంగిలించడం వంటివి కూడా ఏఐ సులభంగా చేసేస్తోంది. ఇటీవల ఒక ఏఐ ఇంజినీర్ వ్యక్తిగత సమాచారాన్ని బయటకు చెప్పేస్తా అని భయపెట్టిన ఉదంతాన్ని హింటన్ ఉదాహరణగా చెప్పారు. కాబట్టి ఏఐ భావోద్వేగ స్పందనలను కలిగి ఉండాలి. అప్పుడే సమాజహితంగా ఉంటుందని అన్నారు. ఏఐలో కరుణ భావాన్ని పెంపొందించడం అత్యంత ముఖ్యమైనదని హింటన్ వెల్లడించారు. తల్లి - బిడ్డ సంబంధం మాదిరిగా ఏఐను రూపొందించాలని ఆయన వివరించారు.ఇదీ చదవండి: మినిమమ్ బ్యాలెన్స్: ఏ బ్యాంకులో ఎంత ఉండాలంటే?ఏఐ ఇప్పటికే భయంకరమైన ఆలోచనలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది. ఆ ఆలోచనలు ఎల్లప్పుడూ మనం ట్రాక్ చేయగల భాషలోనే ఉంటాయని భావించకూడదు. ఇది కొత్త భాషను ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇదే జరిగితే ఆ తరువాత జరిగే పరిణాలను అంచనా వేయలేము. అయితే ఏఐ వల్ల ప్రమాదాలు ఉన్నప్పటికీ.. వైద్య రంగంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని జియోఫ్రీ హింటన్ అన్నారు. -
చాలామందికి తెలియని వాట్సాప్ టిప్స్
టెక్నాలజీ పెరుగుతోంది, ప్రతి అంశంలో పురోగతి కనిపిస్తోంది. స్మార్ట్ఫోన్ ఉపయోగించే అందరూ వాట్సాప్ వినియోగిస్తున్నారు. కానీ చాలామందికి చాట్జీపీటీతో చాట్ చేయడం, వాయిస్ మెసేజ్ను టెక్స్ట్ రూపంలోకి ఎలా మార్చాలి?, వీడియో కాల్స్కు ఫన్ యాడ్ చేయడం వంటివి తెలియదు. ఈ కథనంలో అలాంటి ఆసక్తికరమైన వాట్సాప్ టిప్స్ గురించి తెలుసుకుందాం.చాట్జీపీటీతో చాటింగ్ఏఐ అందుబాటులోకి వచ్చిన తరువాత చాట్జీపీటీతో చాటింగ్ చేయడం సాధ్యమవుతోంది. మీరు దీనికోసం చేయాల్సిందల్లా.. చాట్జీపీటీ యొక్క ప్రత్యేక నంబర్ను యాడ్ చేసుకోవడమే. ఇలా చేస్తే మీరు వాట్సాప్లోనే చాటింగ్ చేయవచ్చు. ప్రశ్నలు అడగడం వంటివి చేయవచ్చు. దీనిని ఒక తెలివైన ఫ్రెండ్ మాదిరిగా ఉపయోగించుకోవచ్చు.వాయిస్ మెసేజ్లను టెక్స్ట్ రూపంఐఫోన్ వినియోగదారులకు మాత్రమే వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్షన్ ఫీచర్ లభిస్తుంది. నలుగురిలో ఉన్నప్పుడు మీకు వచ్చిన వాయిస్ మెసేజ్ వినడానికి ఇబ్బందిపడే సమయంలో.. ఈ ఫీచర్ వచ్చిన సందేశాన్ని టెక్స్ట్ రూపంలోకి మారుస్తుంది. అప్పుడు వచ్చిన విషయాన్ని చదివి తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లకు కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తుంది.వీడియో కాల్లకు ఫన్ యాడ్వీడియో కాల్స్ మాట్లాడుతున్న సమయంలో.. మీ ముఖం విసుగ్గా అనిపించినప్పుడు.. మ్యాజిక్ వాండ్ ఐకాన్ ద్వారా విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ ట్వీక్లు లేదా ఫిల్టర్లను ఉపయోగించి కొంత ఆనందపడొచ్చు. ఇది సరదాగా కూడా ఉంటుంది.ఈ మెయిల్ లేదా పాస్కీతో లాగిన్ఎస్ఎమ్ఎస్ కోడ్ పనిచేయనప్పుడు.. మీరు ఈమెయిల్ను లింక్ చేసి వెరిఫికేషన్ కోడ్స్ స్వీకరించవచ్చు. అంతే కాకుండా.. భవిష్యత్ లాగిన్ల కోసం పాస్కీని సెట్ చేసుకోవచ్చు. ఇది స్టార్ట్ చేసిన తరువాత కోడ్లను టైప్ చేయడానికి బదులుగా బయోమెట్రిక్ సాయంతో సైన్ ఇన్ చేసుకోవచ్చు.ఒక వాట్సాప్.. మల్టిపుల్ ఫోన్లలోఒక నెంబరుకు ఒక వాట్సాప్ ఉంటుంది. రెండు లేదా మూడు మొబైల్ ఫోన్లలో ఒకే వాట్సాప్ లాగిన్ అవ్వాలనుకున్నప్పుడు లేదా ఉపయోగించాలనుకున్నప్పుడు.. మీ మొదటి ఫోన్ నుంచి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి.. రెండవ మొబైల్ ఫోనులో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది వర్క్ లైఫ్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ''వన్ అకౌంట్ - మల్టిపుల్ స్మార్ట్ఫోన్స్'' అన్నమాట.ప్రైవేట్ సంభాషణలను లాక్మీరు చేసే చాటింగ్ రహస్యంగా ఉంచాలంటే.. లాక్ చేసుకోవచ్చు. దీనికి మీరు పేస్ ఐడీ, టచ్ ఐడీ లేదా బయోమెట్రిక్ వంటివి ఉపయోగించుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా.. మీ అనుమతి లేకుండా ఎవరూ మీ చాటింగ్ చూడలేరు.పర్సనల్ నోట్బుక్గా వాట్సాప్మీకు అవసరమైన విషయాన్ని సేవ్ చేసుకోవడానికి లేదా మర్చిపోకుండా ఉండటానికి పర్సనల్ నోట్బుక్గా వాట్సాప్ పనిచేస్తుంది. అంటే 'మై సెల్ఫ్' అన్నట్టు.. మీకు మీరే విషయాలను మెసేజ్ చేసుకోవచ్చు. వాటిని మళ్ళీ అవసరమైనప్పుడు చదువుకోవచ్చు.ఇలాంటి టిప్స్ ఉపయోగించడం వల్ల వినియోగదారులకు సరదాగా ఉంటుంది. అంతే కాకుండా మీకు మీరే వాట్సప్ను ఉపయోగకరంగా కూడా మార్చుకోవచ్చు. మొత్తం మీద వాట్సప్ను సరదాగా ఉండే కమ్యూనికేషన్ హబ్గా మార్చుకోవడం మీ చేతుల్లోనే ఉందనే విషయం మాత్రమే మర్చిపోవచ్చు. -
ఐటీ రంగంలో అత్యంత భారీ డీల్
ప్రముఖ అంతర్జాతీయ ఐటీ సేవల సంస్థ యాక్సెంచర్ ఆస్ట్రేలియన్ సైబర్ సెక్యూరిటీ సంస్థ సైబర్ సీఎక్స్ ను కొనుగోలు చేస్తోంది. ఈ రంగంలో ఇది అత్యంత భారీ ఒప్పందంగా తెలుస్తోంది. ఆస్ట్రేలియన్ ఫైనాన్షియల్ రివ్యూ పత్రిక ప్రకారం.. ఈ డీల్ విలువ 1 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు 5,400 కోట్లు).రాయిటర్స్ కథనం ప్రకారం.. ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బీజీహెచ్ క్యాపిటల్ సైబర్ సీఎక్స్ ను విక్రయిస్తోంది. అయితే ఈ ఒప్పందంలోని ఆర్థిక నిబంధనలు మాత్రం వెల్లడి కాలేదు. ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడుల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, హెల్త్ కేర్ నుంచి ఫైనాన్స్ వరకు కంపెనీలు కార్యకలాపాలకు అంతరాయం కలిగించే, సున్నితమైన డేటాతో రాజీపడే అధునాతన బెదిరింపులతో సతమతమవుతున్న నేపథ్యంలో ఈ డీల్కు ప్రాధాన్యం ఏర్పడింది.బీజీహెచ్ క్యాపిటల్ మద్దతుతో 12 చిన్న సైబర్ సెక్యూరిటీ సంస్థల విలీనం ద్వారా మెల్బోర్న్కు చెందిన సైబర్ సీఎక్స్ 2019లో ఏర్పడింది. ఈ సంస్థ ప్రస్తుతం 1,400 మందికి ఉపాధి కల్పిస్తోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అంతటా భద్రతా కార్యకలాపాల కేంద్రాలను నిర్వహిస్తుంది. లండన్, న్యూయార్క్ లలో కార్యాలయాలు ఉన్నాయి.యాక్సెంచర్ 2015 నుండి ఇలాంటి 20 భద్రతా కొనుగోళ్లను పూర్తి చేసింది. వీటిలో బ్రెజిల్ సైబర్ డిఫెన్స్ సంస్థ మార్ఫస్, ఎంఎన్ఈఎమ్ఓ మెక్సికో, స్పెయిన్కు చెందిన ఇన్నోటెక్ సెక్యూరిటీ వంటివి ఇటీవల కొనుగోలు చేసిన సంస్థలు. -
రక్షణ రంగంలో స్టార్టప్లతో స్వావలంబన
బ్రిటిష్ రాచరిక పాలన నుంచి స్వాతంత్ర్యం పొందిన మన దేశం 79 ఏళ్ల పాటు ఎన్నో విధాలుగా శ్రమించి ఎకానమీలో ప్రపంచంలోని టాప్ దేశాల సరసన నిలిచింది. దేశ రక్షణకు, సార్వభౌమత్వానికి పెద్దపీట వేస్తున్న భారత్ ఆపరేషన్ సింధూర్ వంటి చర్యలతో శత్రుదేశాల్లో వణుకు పుట్టిస్తోంది. పక్కలో బళ్లెంలాగా పాకిస్థాన్ కవ్వింపు చర్యలు, గతంలో గల్వాన్లోయాలోకి చైనా సైనికులు దూసుకురావడం వంటి చర్యలను చాకచక్యంగా, సమర్థంగా తిప్పికొట్టింది. అందుకు టెక్నాలజీని వాడుకుంటూ ముందుకుసాగింది. ఈ క్రమంలో భారత్ ఎప్పటినుంచో రక్షణ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతూ వస్తోంది. ఇప్పటికే ఈ విభాగంలో సేవలందిస్తున్న కంపెనీలతోపాటు స్టార్టప్లకు తోడ్పాడు అందిస్తోంది.స్వావలంబన దిశగా అడుగులు..ఏవియానిక్స్, ప్రొపల్షన్ మాడ్యూల్స్, రాడార్, టార్గెటింగ్ టెక్నాలజీ వంటి కీలకమైన రక్షణ వ్యవస్థల కోసం ఒకప్పుడు విదేశీ సంస్థలపై ఎక్కువగా ఆధారపడిన భారత్లో ఇప్పుడు పరిస్థితులు మారాయి. స్వావలంబన దిశగా నిర్ణయాత్మక పురోగతితో రక్షణ రంగంలో దిగుమతిదారు నుంచి అధిక విలువైన సైనిక సాంకేతిక పరిజ్ఞానాల ఉత్పత్తిదారుగా, వాటి ఎగుమతిదారుగా ఎదుగుతోంది. ఈ పరివర్తన కేవలం విధాన పరమైంది మాత్రమే కాదు.. స్వదేశీ యాజమాన్యంలోని డిఫెన్స్ టెక్ స్టార్టప్ల ద్వారా చేకూరుతోంది.ప్రభుత్వం తోడ్పాటు..భారత్ గతంలో విదేశాల నుంచి సేకరించిన దాదాపు 4,500కి పైగా భాగాలను దేశంలోనే తయారు చేసుకునేలా పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్(పీఐఎల్)ను సిద్ధం చేసింది. ఈ జాబితాలోని నిర్దిష్ట రక్షణ రంగానికి సంబంధించిన వస్తువుల దిగుమతులను నియంత్రిస్తుంది. వీటి లోటును భర్తీ చేసేలా దేశీయ స్టార్టప్లు, తయారీదారులకు తోడ్పాటును అందిస్తున్నారు. దీనికితోడు ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ (ఐడెక్స్) కార్యక్రమం డీఆర్డీవో, డీపీఎస్యూల సహకారంతో 200కు పైగా స్టార్టప్లకు నిధులు సమకూరుస్తోంది. ఇందులో ప్రధానంగా దృష్టి సారిస్తున్న విభాగాలు కింది విధంగా ఉన్నాయి.స్వయంప్రతిపత్తి కలిగిన హై-ఆల్టిట్యూడ్ డ్రోన్లుమానవరహిత అండర్వాటర్ వెసెల్స్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కౌంటర్ డ్రోన్ వ్యవస్థలుదిగుమతి చేసుకున్న జెట్ ఇంజిన్లు, మెరైన్ టర్బైన్ల స్థానంలో స్వదేశీ ప్రొపల్షన్ యూనిట్ల ఏర్పాటుప్రభుత్వ ప్రధాన పెట్టుబడులురక్షణ రంగంలో స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తోంది.అధునాతన మేల్-క్లాస్ యూఏవీల కోసం రూ.20,000 కోట్లుమానవ రహిత నావల్ ప్లాట్ఫామ్ల కోసం రూ.2,500 కోట్లురూ.2 వేల కోట్లు డ్రోన్ సబ్ సిస్టమ్స్, డిఫెన్స్ సాఫ్ట్వేర్ కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకంలో భాగంగా అందిస్తున్నారు.అధిక సంక్లిష్ట విభాగాలపై దృష్టిడీప్టెక్ సామర్థ్యాలు ఉన్న స్టార్టప్లను లక్ష్యంగా చేసుకుంటూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా తక్కువ వాల్యూమ్స్, అధిక సంక్లిష్టత కలిగిన విభాగాలపై దృష్టి సారిస్తుంది. అందులో..కాంపోజిట్ ఏరోస్పేస్ నిర్మాణాలుమిస్సైల్-గ్రేడ్ ప్రిసిషన్ కాంపోనెంట్స్హార్డెంన్డ్ ఎలక్ట్రానిక్స్స్పెషాలిటీ మిలిటరీ టెక్స్టైల్స్అంతర్జాతీయ ఒప్పందాలుభారత్, అమెరికాల మధ్య అటానమస్ సిస్టమ్స్ ఇండస్ట్రీ అలయన్స్ (ఏషియా) వంటి వ్యూహాత్మక అంతర్జాతీయ ఒప్పందాలు సంయుక్త మేథోసంపత్తి అభివృద్ధి, కో-ప్రొడక్షన్ను వేగవంతం చేస్తున్నాయి. ఈ సహకారాలు భారత తయారీ సంస్థలకు ఎగుమతులను పెంచుతున్నాయి. ముఖ్యంగా కింది విభాగాల్లో ఈ ధోరణి ఊపందుకుంది.కౌంటర్-యూఏవీ వ్యవస్థలుస్వయంప్రతిపత్తి కలిగిన మెరిటైమ్ డ్రోన్లుకృత్రిమ మేధ ఆధారిత మిషన్-క్రిటికల్ వ్యవస్థలుభారతదేశ డిఫెన్స్-టెక్లో కొన్ని స్టార్టప్లురాఫె ఎంఫిబ్ర్ (నోయిడా)స్థాపన: 2016ఫోకస్: స్వదేశీ యూఏవీలు, కార్బన్ కాంపోజిట్ ఎయిర్ క్రాఫ్ట్ స్ట్రక్చర్స్, మిలిటరీ గ్రేడ్ ఐసీ ఇంజిన్లుభారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఆటోపైలట్, యూఏవీ స్పెసిఫిక్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ను అభివృద్ధి చేసింది.కీలక ఉత్పత్తులు: ఎంఆర్ 10 డ్రోన్స్మార్మ్, ఎంఆర్ 20 లాజిస్టిక్స్ డ్రోన్, భారత్ మ్యాన్ పోర్టబుల్ యూఏవీ, ఎక్స్8 మారిటైమ్ పెట్రోలింగ్ డ్రోన్.భాగస్వాములు: డసాల్ట్ సిస్టెమ్స్, సాఫ్రాన్, హెన్సోల్ట్.పూర్తి స్థాయి ఏరోస్పేస్ తయారీకి 100 మిలియన్ డాలర్ల సిరీస్ బీ నిధులను (జనరల్ క్యాటలిస్ట్ నేతృత్వంలో) సమీకరించింది.ఎస్ఎస్ఎస్ డిఫెన్స్ (బెంగళూరు)స్థాపన: 2017ఫోకస్: చిన్న ఆయుధాలు, మందుగుండు సామగ్రి, టిక్టికల్ ఆప్టిక్స్.వైపర్ (.308), సాబెర్ (.338 లాపువా మాగ్నమ్) వంటి స్నైపర్ రైఫిళ్లను అభివృద్ధి చేశారు.2024లో 50 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను ఎగుమతి చేసింది.దేశీయ ఆర్డర్లు: భారత సైన్యం ఏకె -47 అప్గ్రేడ్ ప్రోగ్రామ్, మనోహర్ ఎం 72 కార్బైన్లుఅధునాతన మందుగుండు సామగ్రి అభివృద్ధి కోసం సీబీసీ బ్రెజిల్తో భాగస్వామ్యంసాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ (ముంబై)స్థాపన: 2015ఫోకస్: సముద్ర, వైమానిక మానవరహిత వ్యవస్థలుభారతదేశపు మొట్టమొదటి సముద్ర స్పాటర్ డ్రోన్, స్వయంప్రతిపత్తి కలిగిన ఆయుధ పడవలను అభివృద్ధి చేసింది.వరుణ అనే వ్యక్తిగత వైమానిక వాహనంపై కూడా పనిచేస్తుంది.అటానమస్ డ్రోన్ ల్యాండింగ్ వ్యవస్థలకు జపాన్ పేటెంట్ లభించింది.ఐడెక్స్ డిస్క్ 7 కింద భారత నౌకాదళంతో కలిసి ప్రాజెక్టుల్లో నిమగ్నమైంది.బిగ్ బ్యాంగ్ బూమ్ సొల్యూషన్స్ (చెన్నై)స్థాపన: 2018ఫోకస్: ఏఐ, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, నానోటెక్, హైబ్రిడ్ ఆర్మర్ఆవిష్కరణల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు, రాడార్ క్లాక్, హైబ్రిడ్ సిరామిక్ బాడీ ఆర్మర్, ఏఐ-ఆధారిత బాటిల్ ఫీల్డ్ ఇంటర్ ఫేస్లు ఉన్నాయి.మూడు భారత రక్షణ దళాలకు 2025లో ఎగుమతులు ప్రారంభించింది.యూకే, ఫిన్లాండ్, ఇజ్రాయెల్, ఆస్ట్రేలియాలోని సంస్థలతో కలిసి పనిచేస్తుంది.ఐరోవ్ (కొచ్చి)స్థాపన: 2016ఫోకస్: అటానమస్ అండర్ వాటర్ వెహికల్స్ (ఏయూవీ), ఆర్వోవీలు.భారతదేశపు మొట్టమొదటి కమర్షియల్ అండర్ వాటర్ డ్రోన్ ఐరోవ్ ట్యూనాను అభివృద్ధి చేసింది.డీఆర్డీవో, ముంబై పోర్ట్ ట్రస్ట్, బీపీసీఎల్కు సర్వీసులు అందిస్తుంది.ఏఐ ఆధారిత 3D మ్యాపింగ్, విశ్లేషణతో 300 మీటర్ల లోతున సముద్ర కార్యకలాపాలను చేయగల ఉత్పత్తులు తయారు చేస్తుంది.ఐడియాఫోర్జ్ (ముంబై)స్థాపన: 2007ఫోకస్: రక్షణ, లా ఎన్ఫోర్స్మెంట్, మౌలిక సదుపాయాల కోసం డ్రోన్లు తయారీ.వీటీవోఎల్ యూఏవీలను తయారు చేసిన తొలి కంపెనీ.7,25,000 కంటే ఎక్కువ మిషన్ గంటలు, 80+ పేటెంట్లు దక్కించుకుంది.టాప్ గ్లోబల్ డ్యూయల్ యూజ్ డ్రోన్ తయారీదారుగా నిలుస్తుంది.స్కైరూట్ ఏరోస్పేస్ (హైదరాబాద్)స్థాపన: 2018ఫోకస్: చిన్న ఉపగ్రహాల కోసం ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగ వ్యవస్థలు.విక్రమ్-ఎస్ను లాంచ్ చేసింది. అంతరిక్ష రంగంలో సర్వీసులు అందించే భారతదేశపు మొదటి ప్రైవేట్ కంపెనీగా నిలిచింది.విక్రమ్ సిరీస్లో చౌకైన, పునర్వినియోగ రాకెట్ల అభివృద్ధి చేస్తోంది.వాణిజ్య అంతరిక్ష అవకాశాన్ని వేగవంతం చేయడానికి 95 మిలియన్ డాలర్లను సమీకరించింది.ఇదీ చదవండి: రూపాయి 79 ఏళ్ల ప్రస్థానం -
వివో, పోకో నుంచి కొత్త ఫోన్లు..
వివో కంపెనీ వీ60 పేరుతో కొత్త స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించింది. ఇందులో 6.77 అంగుళాల ప్రీమియం క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే, అల్ట్రా కాంపాక్ట్ కెమెరా మాడ్యూల్ ఉన్నాయి. 50 మెగాపిక్సల్ టెలీఫొటో, స్నాప్డ్రాగన్ 7జెన్4 చిప్సెట్, ఐపీ రేటింగ్ (ఐపీ68, 69), స్కాట్ డ్రాప్ రెసిస్టెన్స్ గ్లాస్తో వస్తుంది. ధరల శ్రేణి రూ.36,999 నుంచ రూ.45,999 మధ్య ఉంటుంది.ఈ నెల 19వ తేదీ నుంచి వివో వెబ్సైట్తోపాటు ఫ్లిప్కార్ట్, అమెజాన్, అన్ని రిటైల్ స్టోర్లలో లభిస్తుందని కంపెనీ ప్రకటించింది. యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తే 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఆరు నెలల నోకాస్ట్ ఈఎంఐ, ఏడాది అదనపు వారంటీని కంపెనీ ఆఫర్ చేస్తోంది. వివో టీడబ్ల్యూఎస్ 3ఈ సెట్ను రూ.1,499కే సొంతం చేసుకోవచ్చని ప్రకటించింది. ఇదీ చదవండి: రూపాయి 79 ఏళ్ల ప్రస్థానంపోకో నుంచి ఎం7 ప్లస్ 5జీ స్మార్ట్ఫోన్కన్జూమర్ టెక్నాలజీ బ్రాండ్ పోకో తాజాగా ఎం7 ప్లస్ 5జీ స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించింది. ప్రారంభ ఆఫర్ కింద దీని ధర రూ.12,999గా ఉంటుంది. ఇందులో 7000 ఎంఏహెచ్ సిలికాన్ కార్బన్ బ్యాటరీ, 6.9 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్,50 ఎంపీ ఏఐ రియర్ కెమెరా తదితర ఫీచర్లు ఉన్నాయి. 2 ఓఎస్ జనరేషన్స్, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ పొందవచ్చు. ఫ్లిప్కార్ట్లో ఆగస్టు 19 నుంచి సేల్ ప్రారంభమవుతుందని పోకో వివరించింది. -
బీఎస్ఎన్ఎల్కి పెట్టుబడుల దన్ను
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ను పటిష్టం చేయడంపై కేంద్రం మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా నెట్వర్క్ను బలోపేతం చేసేందుకు రూ. 47,000 కోట్ల పెట్టుబడులతో మరో ప్రణాళికను సిద్ధం చేసినట్లు సోషల్ మీడియా ప్లాట్ఫాం ఎక్స్లో టెలికం శాఖ వెల్లడించింది. 4జీ సేవలను విస్తరించేందుకు 1 లక్షకు పైగా టవర్లను ఏర్పాటు చేసేందుకు కంపెనీ గతేడాది రూ. 25,000 కోట్లు వెచి్చంచినట్లు కేంద్ర టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ఉటంకిస్తూ పేర్కొంది. వచ్చే ఏడాది నాటికి కస్టమర్లను పెంచుకుని, మొబైల్ సర్వీస్ వ్యాపారాన్ని 50 శాతం మేర పెంచుకోవాలని గత నెలలో బీఎస్ఎన్ఎల్ అధికారులతో సమీక్షా సమావేశం సందర్భంగా మంత్రి సూచించారు. ఎంటర్ప్రైజ్ వ్యాపారాన్ని 25–30 శాతం, ఫిక్స్డ్ లైన్ విభాగాన్ని కనీసం 15–20 శాతం మేర పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. అలాగే ప్రతి యూజరుపై సగటున వచ్చే ఆదాయం (ఏఆర్పీయూ)ని మెరుగుపర్చుకోవాలని తెలిపారు. ప్రస్తుతం సర్కిల్ని బట్టి బీఎస్ఎన్ఎల్ ఏఆర్పీయూ సుమారు రూ. 40 నుంచి రూ. 175 వరకు ఉంటోంది. జూన్ త్రైమాసికంలో ప్రైవేట్ టెల్కోలు రిలయన్స్ జియో ఏఆర్పీయూ రూ. 208గా, ఎయిర్టెల్ది రూ. 250గా నమోదైంది. -
జియో కొత్త ప్లాన్ వచ్చింది.. చవగ్గా 28 రోజులు వ్యాలిడిటీ
రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ పోర్ట్ఫోలియోకు కొత్త, చాలా తక్కువ ధర ప్లాన్ను జోడించింది. బడ్జెట్ యూజర్లను దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాన్ ను లాంచ్ చేసింది. రూ.189 విలువైన ఈ ప్లాన్లో వినియోగదారులకు అపరిమిత కాలింగ్, 2 జీబీ హైస్పీడ్ డేటా, 300 ఉచిత ఎస్ఎంఎస్లు 28 రోజుల పాటు లభిస్తాయి. తక్కువ ఖర్చుతో నెలంతా ఫోన్ యాక్టివ్ గా ఉండాలనుకునే వారికి ఈ ప్లాన్ బెస్ట్.ఈ జియో ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్, తక్కువ డేటా ఉపయోగించేవారికి మాత్రమే కాకుండా, ఓటీటీ కంటెంట్ ఇష్టపడేవారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్కు ఉచిత యాక్సెస్ను అందిస్తుంది. అంటే వినోదం, డిజిటల్ స్టోరేజ్ అవసరాలను కూడా తీరుస్తుందన్న మాట.సెకండరీ సిమ్ ఉన్న లేదా తక్కువ ఇంటర్నెట్ ఉపయోగించే కస్టమర్ల కోసం ఈ వాల్యూ ప్యాక్ ప్రత్యేకంగా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ ప్లాన్ కేవలం రూ.189కే వినియోగదారులకు అందుబాటులో ఉంది. రూ.189తో 28 రోజుల పాటు అన్ లిమిటెడ్ కాలింగ్, డేటా, ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి. -
జీతాల పెరుగుదల.. ఐటీ కంపెనీ శుభవార్త
ఐటీ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ తమ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. నవంబర్ 1, 2025 నుంచి అర్హులైన ఉద్యోగుల్లో 80 శాతం మందికి వేతన పెంపును అమలు చేయనుంది. 2025 ద్వితీయార్ధంలో చాలా మంది ఉద్యోగులకు మెరిట్ ఆధారిత వేతన పెంపును అందించే ప్రణాళికలను కంపెనీ తన రెండవ త్రైమాసిక ఆదాయ ప్రకటనలో ధృవీకరించింది.సీనియర్ అసోసియేట్ స్థాయి వరకు ఉన్న ఉద్యోగులకు వేతన పెంపు వర్తిస్తుందని కంపెనీ ప్రతినిధి పీటీఐకి తెలిపారు. పెంపు శాతం వ్యక్తిగత పనితీరుతో పాటు ఉద్యోగి స్థానంపై ఆధారపడి ఉంటుంది. భారత్ ఉద్యోగులలో నిలకడ పనితీరు చూపినవారికి సింగిల్ డిజిట్లో, అసాధారణ పనితీరు కనబరిచిన వారికి గణనీయమైన ఇంక్రిమెంట్లు లభించే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధి తెలిపారు.పెరిగిన నికర లాభంనాస్డాక్లో లిస్టైన కాగ్నిజెంట్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 14 శాతం పెరిగి 2025 జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో 645 మిలియన్ డాలర్లకు చేరుకుంది. త్రైమాసిక ఆదాయం 8.1 శాతం పెరిగి 5.25 బిలియన్ డాలర్లకు చేరుకుంది.ఇతర కంపెనీల్లో ఇలా..టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సెప్టెంబర్ 1 నుండి దాదాపు 80% మంది ఉద్యోగులకు వేతనాలు పెంచే ప్రణాళికలను ఇటీవలె వెల్లడించింది. నివేదికల ప్రకారం.. ఆఫ్షోర్ ఉద్యోగులు 6–8% వరకు, ఆన్షోర్ ఉద్యోగులు 2–4% వరకు పెరుగుదల ఉండవచ్చు. ఇక విప్రో, ఇన్ఫోసిస్ 2025లో వేతన పెంపు ప్రణాళికలను ఇంకా వెల్లడించలేదు.👉 ఇది చదివారా? రూ.3 లక్షల కోట్లు ఇస్తా.. గూగుల్కే ఆఫర్ ఇచ్చిన ఇండియన్ -
జియో హాట్స్టార్ ఆ ఒక్క రోజు అందరికీ ఫ్రీ..
ప్రముఖ ఓటీటీ జియో హాట్స్టార్ను ఎటువంటి సబ్స్క్రిప్షన్ లేకుండా ఉచితంగా వీక్షించే అవకాశం.. అది కూడా జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్.. ఇలా ఏ యూజర్ అయినా పర్వాలేదు. అయితే ఈ ఆఫర్ కేవలం ఒక్క రోజు మాత్రమే.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న తమ ఓటీటీ యాప్లోని కంటెంట్ మొత్తం ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తోంది జియో హాట్స్టార్. జియో హాట్ స్టార్కు చెందిన అన్ని షోలు, సినిమాలు, వెబ్సిరీస్లు రోజంతా ఉచితంగా వీక్షించవచ్చు.ఈ బిగ్ అనౌన్స్మెంట్కు సంబంధించిన బ్యానర్ జియో హాట్స్టార్ యాప్లో కనిపిస్తోంది. ఈ బ్యానర్లలో "ప్రౌడ్ ఇండియన్ ప్రౌడ్లీ ఫ్రీ" అనే ట్యాగ్ లైన్ తో "ఫ్రీ" అని రాసి ఉంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ జియో హాట్స్టార్ కంటెంట్ను వీక్షించవచ్చు. ఇందుకోసం మొబైల్ లేదా టీవీ యాప్ లోకి లాగిన్ అవ్వాలి. ఆగస్టు 15న జియో హాట్స్టార్లో సలాకార్ అనే కొత్త సిరీస్ రాబోతోంది. ఇది ఒక డిటెక్టివ్ కథ. ఆగస్టు 15న ఉచితం కావడంతో ఈ సిరీస్ను ఉచితంగా ఆస్వాదించవచ్చు.ఈ ఆఫర్ అందరికీ..ఈ ఆఫర్ ప్రత్యేకత ఏమిటంటే జియో హాట్స్టార్ను చూడటానికి జియో యూజరే అయి ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే జియో హాట్స్టార్ బండిల్ ఆఫర్ ఎయిర్టెల్, వీఐ ప్లాన్లలో కూడా అందుబాటులో ఉంది. మామూలుగా ఎంపిక చేసిన కొంత కంటెంట్ జియో హాట్స్టార్లో ఎప్పుడైనా ఉచితంగా చూడవచ్చు. కానీ ఆగస్టు 15న మాత్రం 24 గంటల పాటు మొత్తం కంటెంట్ను ఉచితంగా అందించనున్నారు. -
రూ.3 లక్షల కోట్లు ఇస్తా.. గూగుల్కే ఆఫర్ ఇచ్చిన ఇండియన్
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్కే ఆఫర్ ఇచ్చాడో భారతీయ యువకుడు. రాయిటర్స్ కథనం ప్రకారం.. పెర్ప్లెక్సిటీ ఏఐ (Perplexity AI) సీఈఓ, భారత సంతతికి చెందిన అరవింద్ శ్రీనివాస్ (Aravind Srinivas) గూగుల్ క్రోమ్ కొనుగోలు చేయడానికి 34.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.3,02,152 కోట్లు) నగదు బిడ్ చేశారు. దాదాపు 17 ఏళ్ల చరిత్ర ఉన్న సంస్థకు కేవలం మూడేళ్ల ఏఐ స్టార్టప్ ఆఫర్ ఇవ్వడం విశేషం.ఎన్విడియా, సాఫ్ట్ బ్యాంక్ సహా పలువురు ఇన్వెస్టర్ల నుంచి 1 బిలియన్ డాలర్లు సమీకరించిన పెర్ప్లెక్సిటీ ఏఐ కంపెనీ ప్రస్తుత మార్కెట్ విలువ 18 బిలియన్ డాలర్లుగా ( సుమారు రూ.1,57,800 కోట్లు) ఉంది. అంటే దాని విలువ కంటే దాదాపు రెట్టింపు ధరను గూగుల్ క్రోమ్ కొనుగోలుకు ఆఫర్ చేసింది. ఈ డీల్ కు పూర్తి స్థాయిలో నిధులు సమకూర్చేందుకు పలు ఫండ్లు ముందుకొచ్చాయని చెబుతోన్న పెర్ప్లెక్సిటీ ఏఐ.. పేర్లను మాత్రం వెల్లడించలేదు.ఆన్లైన్ సెర్చ్ మార్కెట్ గుత్తాధిపత్యాన్నిఆక్షేపిస్తూ కోర్టు తీర్పు నేపథ్యంలో గూగుల్పై ఇప్పటికే రెగ్యులేటరీ ఒత్తిడి కొనసాగుతోంది. ఈ క్రమంలో క్రోమ్ను వదులుకోవాలన్న ప్రతిపాదన కూడా ఉంది. అయితే కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళతాం కానీ బ్రౌజర్ ను విక్రయించే ఉద్దేశం మాత్రం లేదని గూగుల్ తెలిపింది. ఈ పరిణామాలు జరుగుతుండగానే పెర్ప్లెక్సిటీ ఏఐ నుంచి కొనుగోలు ప్రతిపాదన రావడం గమనార్హం.ఎవరీ అరవింద్ శ్రీనివాస్?చెన్నైలో జన్మించిన అరవింద్ శ్రీనివాస్ ఐఐటీ మద్రాస్ గ్రాడ్యుయేట్. గతంలో గూగుల్లోనే పనిచేసిన శ్రీనివాస్ డెనిస్ యారాట్స్, జానీ హో, ఆండీ కొన్విన్స్కీలతో కలిసి 2022లో పెర్ప్లెక్సిటీ ఏఐ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ రియల్ టైమ్లో సమాధానాలను అందించే తన సంభాషణాత్మక ఏఐ సెర్చ్ ఇంజిన్తో శరవేగంగా అభివృద్ధి చెందింది. ఈ కంపెనీ ఇటీవల తన సొంత ఏఐ ఆధారిత బ్రౌజర్ కామెట్ ను కూడా ప్రారంభించింది. క్రోమ్ ను కొనుగోలు చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా మూడు బిలియన్లకు పైగా వినియోగదారులను చేరుకోవచ్చని యోచిస్తోంది.👉 చదవండి: ఐఐటీ హైదరాబాద్లో అద్భుతం.. డ్రైవర్ లేని బస్సుల ఘనత -
మహిళా సాధికారతలో టెక్నాలజీ సవాలు
దేశం ఆర్థికంగా శరవేగంగా దూసుకుపోవడంలో సాంకేతికతది కీలక పాత్ర. అయితే భారత ఆర్థికాభివృద్ధిలో ఎంతగా సాంకేతికత పెరుగుతున్నదో అదే స్థాయిలో మహిళల భాగస్వామ్యం తిరోగమిస్తున్నది. ప్రస్తుతం 35.9 శాతం మించని మహిళా శక్తి భాగస్వామ్యం... 2030 నాటికి 1.9 కోట్ల మంది మహిళలు ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి మరింత దిగజారుతుందనేది ఓ అంచనా. వ్యవసాయ రంగంలోని అన్ని దశల్లో సాంకేతికతను విరివిగా వినియోగిస్తున్నారు. ఎరువులు, పురుగు మందులు చల్లడానికి డ్రోన్లు వచ్చేశాయి. కలుపు తీయడానికి, పంట కోతకు ఆధునిక యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. అనుబంధ రంగాలతో కలిసి భారత వ్యవసాయ దిగుబడుల విలువ సుమారు రూ. 58.74 లక్షల కోట్లకు చేరింది. సాంకేతికత దేశంలో వ్యవసాయ దిగుబడులను పెంచుతూ... వ్యవసాయ మహిళల జీవనోపాధిని కబళిస్తోంది. ఫలితంగా ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. విజృంభిస్తోన్న సాంకేతికతనూ వ్యతిరేకించలేం; కోట్లాది శ్రామిక మహిళాశక్తినీ విస్మరించలేం. ఇదో సంక్లిష్ట వ్యవహారం. ఈ రెండింటి మధ్య హేతుబద్ధత, సమతౌల్యత సాధించడం విహిత కర్తవ్యం.చదవండి: బాల అమితాబ్ గుర్తున్నాడా? ఇపుడు రూ. 200 కోట్ల కంపెనీకి అధిపతివర్తమాన 4వ పారిశ్రామిక విప్లవ కాలంలో, రోబోటిక్స్, ఆటోమేషన్, బ్రెయిన్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిగ్ డేటా, నానో– బయోటెక్నాలజీలు, బయోకెమిస్ట్రీ, జెనెటిక్స్ వంటి అత్యాధునిక సాంకేతికతలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఇవి ప్రధానంగా ఉత్పత్తి, సేవలపై దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. ఈ పరిణామం వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో నిమగ్నమైన కోట్లాది పేద, మధ్యతరగతి మహిళల ఉపాధిని హరిస్తోంది.వ్యవసాయ రంగంతో పోల్చితే, భారత పారిశ్రామిక రంగంలో సాంకేతికత వినియోగం ఎక్కువగా ఉంటోంది. అదే సమయంలో మహిళల భాగస్వామ్యం వేగంగా తగ్గుతోంది. అయితే భారత సేవా రంగంలో మహిళల పాత్ర గణనీయంగానే ఉంది. విద్య, ఆరోగ్యం, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, రిటైల్, హాస్పిటాలిటీ వంటి రంగాలలో మహిళల సంఖ్య గణనీయం. ఇవ్వాళ సేవారంగం... లింగ వివక్షకు, అసమానతలకు దూరంగా ఉంటూ, ప్రతిభకు పట్టం కడుతోంది. ఈ రంగం ఆధునిక సాంకేతిక విద్యావంతులైన కోట్లాది మహిళలకు ఉద్యోగాలను కల్పించింది. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ కేవలం సాంకేతికతను మాత్రమే కాదు, మహిళల శ్రమశక్తిని, మేధాసంపత్తిని సమానంగా ఇముడ్చుకుంటూ ముందుకు సాగితే లింగ వివక్ష, అసమానత సమసిపోతుందని విధాన నిర్ణేతలు గ్రహించాలి. మహిళలకు సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడం, చిన్న, అతి చిన్న పరిశ్రమలలో మహిళల సంఖ్యను గణనీయంగా పెంచడం, మహిళలు తయారు చేసిన వస్తు ఉత్పత్తులకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వడం; వనరులు, ముడి సరుకుల లభ్యతను సులభతరం చేయడం, బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణ సౌకర్యం కల్పించడం వంటి చర్యల వల్ల మహిళల ఆర్థిక స్వావలంబన సులభతరం అవుతుంది. ప్రభుత్వాలు ఈ దిశలో అడుగులు వేయాలి. మహిళా సాధికారతలో టెక్నాలజీ సవాలువిజృంభిస్తోన్న సాంకేతికతనూ వ్యతిరేకించలేం; కోట్లాది శ్రామిక మహిళాశక్తినీ విస్మరించలేం. ఈ రెండింటి మధ్య హేతుబద్ధత, సమతౌల్యత సాధించడం విహిత కర్తవ్యం.-బోగా దీపిక వ్యాసకర్త పరిశోధకురాలు -
ఎరిక్సన్, నోకియాతో బీఎస్ఎన్ఎల్ జట్టు
యువతకు నైపుణ్యాల్లో శిక్షణ కల్పించే దిశగా నాలుగు అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజాలతో ప్రభుత్వ రంగ దిగ్గజం బీఎస్ఎన్ఎల్ చేతులు కలిపింది. కేంద్ర టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా సమక్షంలో ఎరిక్సన్ ఇండియా, క్వాల్కామ్ టెక్నాలజీస్, సిస్కో సిస్టమ్స్, నోకియా సొల్యూషన్స్ అండ్ నెట్వర్క్స్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.ఇదీ చదవండి: కోనసీమలో ఓఎన్జీసీ గ్యాస్ సెంటర్5జీ, ఏఐ, సైబర్సెక్యూరిటీ, నెట్వర్కింగ్ తదితర టెక్నా లజీలకు సంబంధించిన కోర్సుల్లో యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది. జబల్పూర్లోని భారతరత్న భీమ్రావ్ అంబేడ్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెలికం ట్రైనింగ్లో ఈ కోర్సుల్లో శిక్షణనిస్తారు. తొలి దశలో రూ.1 కోటికి పైగా పెట్టుబడితో ఏటా 2,000 మంది విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు సింధియా తెలిపారు. కాగా, భారత్లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని విస్తరించి, భారీగా ఉద్యోగాలు కల్పిస్తామని నోకియా ఇండియా కంట్రీ మేనేజర్ తరుణ్ ఛాబ్రా తెలిపారు. -
కోడింగ్ ఉద్యోగాల కథ కంచికేనా?
టెక్ కంపెనీలు ఉద్యోగాల విషయంలో ఒకప్పుడు అవలంబించిన ధోరణికి భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. 2010 ప్రారంభం నుంచి సిలికాన్వ్యాలీలోని టాప్ కంపెనీల నుంచి చిన్న సంస్థల వరకు విద్యార్థులు కోడింగ్ నేర్చుకోవాలని ప్రోత్సహించాయి. టెక్ ఎగ్జిక్యూటివ్లు, అధ్యాపకులు, దేశ అధ్యక్ష స్థాయి వ్యక్తులు కూడా విద్యార్థులను కంప్యూటర్ సైన్స్లో నైపుణ్యాలు నేర్చుకోవాలని కోరారు. అధిక వేతనంతో కూడిన ఉద్యోగాలు, భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే అది ఒక తరానికి కలిసొచ్చిన అంశమే అయినా ప్రస్తుతం ఈ ధోరణి మారుతోంది.భారీ వేతనాలు ఆశ చూపి..2012లో మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్ ఉన్నత సంస్థల్లో మరిన్ని కంప్యూటర్ సైన్స్ కోర్సులను తీసుకురావడానికి యూఎస్ అంతటా ప్రచారం సాగించారు. సాధారణంగా అప్పటి పరిస్థితులనుబట్టి వారి ప్రారంభ వేతనం 1,00,000 డాలర్లు కంటే ఎక్కువే ఉంటుందని స్మిత్ ఆ సమయంలో కంప్యూటింగ్ గ్రాడ్యుయేట్లను ఉద్దేశించి తెలిపారు. 15,000 డాలర్ల నియామక బోనస్లు, 50,000 డాలర్ల విలువైన స్టాక్ గ్రాంట్లు ఉంటాయని కూడా చెప్పారు. ఈ ఆర్థిక ప్రోత్సాహకాలతోపాటు తర్వాతి కాలంలో టాప్ కంపెనీల్లో పనిచేసే అవకాశం ఉంటుందని యువత కూడా ఎంతో ఆసక్తి చూపారు. అప్పుడు కంపెనీలకు ఉన్న ఆర్డర్లు, టెక్నాలజీ అభివృద్ధి, క్లెయింట్ల పెట్టుబడుల నేపథ్యంలో ఇది ఎంతో ఉపయోగపడింది.పెరుగుతున్న కంప్యూటర్ గ్రాడ్యుయేట్లుటెక్ ఉద్యోగాలపట్ల ఎంత వేగంగా ఆసక్తి పెరిగిందో అంతే వేగంగా కొత్త టెక్నాలజీ విస్తరించడంతో లేఆఫ్స్ పర్వం మొదలైంది. కంప్యూటింగ్ రీసెర్చ్ అసోసియేషన్ ప్రకారం 2023 నాటికి యూఎస్లో 1,70,000 మందికి పైగా అండర్ గ్రాడ్యుయేట్లు కంప్యూటర్ సైన్స్ పట్టభద్రులవుతున్నారు. ఇది 2014తో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువ. ఈ సమయంలో దేశవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాల్లో కంప్యూటర్ సైన్స్ అత్యంత ప్రాచుర్యం పొందింది. కానీ క్రమేణా కొలువుల విషయంలో పరిస్థితులు భిన్నంగా మారాయి.ఏఐ టూల్స్ అభివృద్ధిఒకప్పుడు వందల సంఖ్యలో ఇంజినీర్లను నియమించుకున్న అమెజాన్, ఇంటెల్, మెటా, మైక్రోసాఫ్ట్.. వంటి టెక్ దిగ్గజాల ఇటీవలి భారీ తొలగింపులు జాబ్ మార్కెట్ను దెబ్బతీస్తున్నాయి. అదే సమయంలో సెకన్లలో కోడ్ను డెవలప్చేసి, డీబగ్, ఆప్టిమైజ్ చేయగల ఆర్టిఫిషియన్ ఇంటెలిజెన్స్ టూల్స్ వేగంగా అభివృద్ధి చేస్తున్నారు. వీటిని ప్రోగ్రామింగ్ ఉద్యోగాల స్థానంలో విరివిగా వాడుతున్నారు. దాంతో ఉద్యోగుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ డేటా ప్రకారం.. 22 నుంచి 27 సంవత్సరాల వయసు ఉన్న ఇటీవలి కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగం 6.1%కు పెరిగింది. బయాలజీ లేదా ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ల నిరుద్యోగ రేటు కంటే ఇది రెట్టింపు.ఒకప్పుడు కంప్యూటర్ సైన్స్ కార్యక్రమాలకు ఫెడరల్ నిధులను వెచ్చించిన యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కృత్రిమ మేధ కెరియర్ వైపు విద్యార్థులను మళ్లించే లక్ష్యంతో జాతీయ ఏఐ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. మైక్రోసాఫ్ట్ కూడా ఈ విధానాన్ని తన పాలసీలో పునఃసమీక్షిస్తోంది. విద్యార్థులు, ప్రస్తుత ఉద్యోగులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కోసం కంపెనీ ఇటీవల 4 బిలియన్ డాలర్లు కేటాయించింది. ఏఐ కంప్యూటర్ సైన్స్ విద్యను ఎలా మారుస్తుందో పునఃసమీక్షిస్తున్నామని స్మిత్ గత నెలలో చెప్పారు.ఎన్నో ప్రశ్నలు.. చేయాల్సిందేంటి?టెక్నాలజీ ఉద్యోగాల్లో వస్తున్న పరివర్తన విద్యార్థులు, అధ్యాపకులకు కఠినమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఎథిక్స్కు అనుకూలంగా విశ్వవిద్యాలయాలు సంప్రదాయ ప్రోగ్రామింగ్ కోర్సులకు ప్రాధాన్యం తగ్గించాలా? అనే ప్రశ్నలు లేవనెత్తుతుంది. అయితే కోడింగ్ ఎప్పటికైనా అవసరమేనని కొందరు నిపుణులు చెబుతున్నారు. అయితే ప్యూర్ ప్రోగ్రామింగ్ కొలువులు ఒకప్పటిలాగా గోల్డెన్ జాబ్స్ కావనే వాస్తవాన్ని జీర్ణించుకోవాలని అంటున్నారు. అందుకు బదులుగా ఏఐతో ఎలా సమర్థంగా పనిచేయాలో అర్థం చేసుకోవడం, తెలివైన వ్యవస్థలను నిర్మించడం, బిగ్ డేటాను విశ్లేషించడం చాలా ముఖ్యమని చెబుతున్నారు.ఇదీ చదవండి: ఆర్థిక స్వేచ్ఛ అంతరార్థం తెలుసా? -
16 ఏళ్లకే సొంత కంపెనీ.. రెండేళ్లలో రూ.100 కోట్ల సామ్రాజ్యం!
చేయాలనే తపన, ఆలోచించే శక్తి ఉంటే ఎవరైనా అద్భుతాలు చేస్తారు. చదువుకునే వయసులోనే సొంతంగా కోడింగ్ నేర్చుకోవడమే కాకుండా.. కోట్ల విలువైన కంపెనీ స్థాపించింది. ఇంతకీ ఈ ఘనత సాధించినది ఎవరు?, వారు స్థాపించిన కంపెనీ ఏది అనే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో చూసేద్దాం.భారతదేశంలో పుట్టిన 'ప్రాంజలి అవస్థి' (Pranjali Awasthi) చిన్నప్పుడే తన తండ్రి ఉపయోగించే కంప్యూటర్ చూస్తూ.. దాన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకుంది. ఆ తరువాత కోడింగ్ ఎలా రాయాలో నేర్చుకుని.. ఏడేళ్ల ప్రాయానికే సొంతంగా కోడింగ్ రాసింది. 11 సంవత్సరాల వయసులో ప్రాంజలి అవస్థి.. తన కుటుంబంతో అమెరికాలోని ఫ్లోరిడాకు మారింది. అక్కడే కంప్యూటర్ సైన్స్ అండ్ కాంపిటీటివ్ మ్యాథ్స్ కోర్సుల్లో చేరింది. ఆ తరువాత 13 ఏళ్ల వయసుకే ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి చెందిన న్యూరల్ డైనమిక్స్ ఆఫ్ కంట్రోల్ ల్యాబ్లో ఇంటర్న్షిప్ చేయడం మొదలుపెట్టింది. ఆ సమయంలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) గురించి తెలుసుకుంది.ఏఐ సాయంతో చాలా పనులను సులభంగా చేయవచ్చని గ్రహించిన ప్రాంజలి.. డెల్వ్.ఏఐ (Delv.AI) ప్రారంభించింది. ఈ కంపెనీ రూ. 3.5 కోట్లతో.. ముగ్గురు ఉద్యోగులతో మొదలైంది. ప్రస్తుతం దీని విలువ రూ.100 కోట్ల కంటే ఎక్కువ. ఈ సంస్థలో పదిమంది కంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం.ప్రస్తుతం ప్రాంజలి అమెరికాలోని జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ చదువుతోంది. ఆమె 'చాట్జీపీటీ ఇన్ హ్యాండ్' అనే కొత్త ప్రాజెక్ట్లో కూడా పనిచేస్తోంది. ఇది ఒక ఏఐ అసిస్టెంట్. ఇది మాట్లాడటమే కాకుండా మీ కోసం కూడా పని చేయగలదని అవస్థి చెబుతోంది.ఇదీ చదవండి: జీతం వచ్చిన ఐదు నిమిషాలకే ఉద్యోగి రాజీనామా: హెచ్ఆర్ ఏమన్నారంటే? -
సెమీకండక్టర్ల మార్కెట్ @ రూ. 9.6 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: దేశీయంగా సెమీకండక్టర్ల మార్కెట్ 2030 నాటికి 100–110 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 9.6 లక్షల కోట్లు) స్థాయికి చేరనుంది. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం రెండు రెట్లు వృద్ధి చెందనుంది. 2023లో 38 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ మార్కెట్ 2024–25లో 45–50 బిలియన్ డాలర్లకు చేరినట్లు పరిశ్రమ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. ప్రస్తుతం ఈ రంగంపై తైవాన్, దక్షిణ కొరియా, జపాన్, చైనా, అమెరికా తదితర దేశాల ఆధిపత్యం ఉంటోందని వివరించాయి. సెమీకండక్టర్ల ఆవశ్యకత, కోవిడ్ మహమ్మారి కాలంలో నిర్దిష్ట ప్రాంతాలపై ఆధారపడటం వల్ల ఆటోమొబైల్ తదితర సెగ్మెంట్లు ఎదుర్కొన్న సంక్షోభ పరిస్థితులు, సవాళ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పరిశ్రమ స్పందన తదితర అంశాల గురించి ఇందులో తెలిపాయి. అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థలో విశ్వసనీయ భాగస్వామిగా భారత్ ఎదగాల్సిన అవసరాన్ని ప్రస్తావించాయి. ప్రకటన ప్రకారం.. ప్రపంచంలో తయారయ్యే మొత్తం సెమీకండక్టర్లలో తైవాన్ 60 శాతం ఉత్పత్తి చేస్తోంది. అత్యంత అధునాతన సెమీకండక్టర్ల ఉత్పత్తిలో తైవాన్ వాటా ఏకంగా 90 శాతం ఉంటోంది. ఒకే ప్రాంతంపై భారీగా ఆధారపడటమనేది అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలకు రిసు్కలతో కూడుకున్న వ్యవహారమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కోవిడ్ తరహా మహమ్మారులు, ప్రకృతి విపత్తులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల్లాంటి అనేకానేక అంశాల ప్రభావం పడే అవకాశం ఉందని వివరించాయి. దీన్ని గుర్తించే చాలా దేశాలు ప్రస్తుతం సురక్షితమైన, వైవిధ్యమైన సరఫరా వ్యవస్థలను ఏర్పర్చుకుంటున్నాయని పేర్కొన్నాయి. అమెరికా, యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా దేశీయంగా చిప్ల తయారీని ప్రోత్సహించేందుకు, ఒకే ప్రాంతంపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు జాతీయ స్థాయిలో వ్యూహాలు అమలు చేస్తున్నాయని వివరించాయి. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న మార్పుల్లో భారత్ కూడా కీలకమైన, విశ్వసనీయమైన భాగస్వామిగా ఎదుగుతోందని పేర్కొన్నాయి. 1 ట్రిలియన్ డాలర్లకు గ్లోబల్ మార్కెట్ .. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం 2030 నాటికి అంతర్జాతీయంగా సెమీకండక్టర్ల మార్కెట్ 1 ట్రిలియన్ (లక్ష కోట్లు) డాలర్లకు చేరనుంది. భారత్ ఇందులో గణనీయమైన వాటా దక్కించుకునే అవకాశం ఉంది. సెమీకండక్టర్ల తయారీ సరఫరా వ్యవస్థకు మూడు ప్రధాన మూల స్తంభాలైన పరికరాలు, మెటీరియల్స్..సరీ్వసులు, పరిశోధన–అభివృద్ధి కార్యకలాపాల విభాగాల్లో కీలక భాగస్వామిగా ఎదిగే సత్తా భారత్కి ఉంది. సెమీకండక్టర్ల ఎక్విప్మెంట్కి అవసరమైన విడిభాగాలను ఉత్పత్తి చేసేందుకు చిన్న, మధ్య తరహా సంస్థలను (ఎంఎస్ఎంఈ) ఉపయోగించుకోవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సెమీకండక్టర్ సప్లై చెయిన్ కంపెనీలకు అవసరమైన రసాయనాలు, లోహాలు మొదలైనవి మన దగ్గర సమృద్ధిగా ఉన్నాయని వివరించాయి. ఇక సరీ్వసుల విషయానికొస్తే ఆర్అండ్డీ, లాజిస్టిక్స్, సరఫరా వ్యవస్థకు సంబంధించి కృత్రిమ మేథ, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ)లాంటి విభాగాల్లోనూ భారత్ పటిష్టంగా ఉందని పేర్కొన్నాయి. ప్రభుత్వం దన్ను.. అంతర్జాతీయంగా ఎల్రక్టానిక్స్ వేల్యూ చెయి న్లకి భారత్ను మరింతగా అనుసంధానం చేసే దిశగా సెమీకండక్టర్ల ఫ్యాబ్రికేషన్, డిస్ప్లేల తయారీ, చిప్ డిజైన్ మొదలైన వాటిల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పరిశ్రమకు ఆర్థిక మద్ద తు కలి్పంచేలా 2021 డిసెంబర్లో రూ. 76,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఇండియా సెమీకండక్టర్ మిషన్ను ఆవిష్కరించింది. అమెరికాకు చెందిన మెమొరీ చిప్ల తయారీ దిగ్గజం మైక్రాన్, టాటా సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ (టీఎస్ఏటీ), కేనెస్ సెమీకాన్, హెచ్సీఎల్–ఫాక్స్కాన్లతో పా టు తైవాన్ సంస్థ పవర్చిప్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ (పీఎస్ఎంసీ) భాగస్వామ్యంలో టాటా ఎలక్ట్రానిక్స్ (టీఈపీఎల్), రెనిసాస్ అండ్ స్టార్స్ భాగస్వామ్యంలో సీజీ పవర్ అండ్ ఇండ్రస్టియల్ ప్రైవేట్ లిమిటెడ్ మొదలైనవి భారత్లో సెమీకండక్టర్ల ఉత్పత్తి కోసం రూ. 1.55 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం) కింద చిప్ డిజైనింగ్ కోసం రూ. 1,000 కోట్లతో డిజైన్ ఆధారిత ప్రోత్సాహకాలకు కూడా ఐఎస్ఎం ప్రొవిజనింగ్ ఏర్పాటు చేసింది. అర్హత కలిగిన స్టార్టప్లకు ఆర్థికంగా మద్దతునిచ్చేందుకు ఇందులో రూ. 234 కోట్లు కేటాయించారు. ‘22 కంపెనీలు ప్రతిపాదించిన చిప్ డిజైన్ ప్రాజెక్టులకు కేంద్రం రూ. 234 కోట్ల మద్దతుకి హామీ ఇచి్చంది. ఈ మొత్తం ప్రాజెక్టుల వ్యయం రూ. 690 కోట్లుగా ఉంటుంది. ఈ చిప్లను సీసీటీవీ కెమెరాలు, మొబైల్ నెట్వర్క్లు, ఉపగ్రహాలు, కార్లు, స్మార్ట్ డివైజ్లు మొదలైన వాటిలో ఉపయోగిస్తారు. దేశీయంగా చిప్ల తయారీ వ్యవస్థను అభివృద్ధి చేసే క్రమంలో సెమీకండక్టర్ ఎక్విప్మెంట్ అండ్ మెటీరియల్స్ ఇంటర్నేషనల్ (సెమీ) భాగస్వామ్యంతో కేంద్రం సెమీకాన్ ఇండియా సదస్సుకు కూడా మద్దతునిస్తోంది‘ అని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ సదస్సులో అంతర్జాతీయ పరిశ్రమ దిగ్గజాలు, విధాన నిర్ణేతలు, విద్యావేత్తలు, అంకుర సంస్థలు కూడా పాల్గొంటాయి. పె ట్టుబడులు, వ్యూహాత్మక భాగస్వామ్యాలపై చర్చలకు ఇది వేదికగా నిలుస్తోంది. ఈ ఏడాది సెపె్టంబర్ 2 నుంచి 4 వరకు సెమీకాన్ ఇండియా 4వ ఎడిషన్ న్యూఢిల్లీలో జరుగనుంది. ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం), సెమీ కలిసి సెమీకాన్ ఇండియా 2025ని నిర్వహించనున్నాయి. అంతర్జాతీయంగా సెమీకండక్టర్ల వ్యవస్థలో భారత్ పాత్ర గురించి చాటి చెప్పే విధంగా ఈ సదస్సు ఉంటుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ విస్తరణ
హైదరాబాద్: యూకే కేంద్రంగా ఉన్న ఒరాకిల్ (Oracle) భాగస్వామ్య సంస్థ ఈయాప్సిస్ (eAppSys), హైదరాబాద్లో తన గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ను విస్తరించింది. ప్రస్తుతం ఉన్న 200 మంది ఉద్యోగుల సంఖ్యను వచ్చే రెండు సంవత్సరాల్లో 500కి పెంచే లక్ష్యాన్ని సంస్థ ప్రకటించింది. ఈ కొత్త కేంద్రాన్ని తెలంగాణ ఐటీ మంత్రి డి.శ్రీధర్ బాబు ప్రారంభించారు.ఈ విస్తరణలో భాగంగా 400 సీట్ల సామర్థ్యంతో కూడిన ఆధునిక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఒరాకిల్ క్లౌడ్, ఈఆర్పీ, ఏఐ, ఎంటర్ప్రైజ్ ట్రాన్స్ఫర్మేషన్ సేవల కోసం ఇది ఆసియా-పసిఫిక్ (APAC), యూరప్-మిడిల్ ఈస్ట్- ఆఫ్రికా (EMEA), నార్త్ అమెరికా ప్రాంతాలకు వ్యూహాత్మక కేంద్రంగా పనిచేస్తుంది.ఏఐ/ఎంఎల్ ఇంజనీర్లు, ఈఆర్పీ కన్సల్టెంట్లు, సొల్యూషన్ ఆర్కిటెక్టులు వంటి నైపుణ్యాల ఉద్యోగాలు సృష్టించనున్నట్లు ఈయాప్సిస్ సంస్థ తెలిపింది. స్థానిక ప్రతిభను అభివృద్ధి చేసేందుకు అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్లలో పెట్టుబడులు పెడుతున్నట్లు పేర్కొంది.“ఈ కేంద్రం మా గ్లోబల్ వృద్ధి ప్రయాణంలో కీలక మైలురాయి” అని ఈయాప్సిస్ ఛైర్మన్ ప్రవీణ్ రెడ్డి బద్దం అన్నారు. “ప్రపంచ దృష్టితో ఆలోచించి, స్థానికంగా అమలు చేసే బృందాన్ని నిర్మిస్తున్నాం” అని ఆయన పేర్కొన్నారు. ఈ ఈయాప్సిస్ కంపెనీ వివిధ సంస్థలకు ఒరాకిల్ సాఫ్ట్వేర్తో సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ సేవలు అందిస్తుంది. -
రక్షాబంధన్ 2025: సైబర్ నేరగాళ్ల కొత్త స్కామ్లు
దేశవ్యాప్తంగా రాఖీ పండుగ సంబరాలు మొదలయ్యాయి. సోదరులు.. సోదరీమణులు రక్షా బంధన్ జరుపుకోవడానికి సిద్ధమవుతుండగా, సైబర్ నేరస్థులు కూడా కొత్త మోసాలకు తెరలేపారు. సాంప్రదాయ విక్రేతలకు బదులుగా ఆన్లైన్లో రాఖీలు, బహుమతులు, స్వీట్లు ఆర్డర్ చేసే వారి సంఖ్య పెరుగుతుండడంతో, సైబర్ నేరస్థులు దీనిని అదనుగా తీసుకుంటున్నట్లు సైబర్ సెక్యూరిటీ క్లౌడ్సెక్ (CloudSEK) చెబుతోంది.ఫిషింగ్ సందేశాలు: స్కామర్లు ఇన్బాక్స్లు, వాట్సాప్, ఎస్ఎమ్ఎస్ల ద్వారా.. రాఖీ గిఫ్ట్ డెలివరీలు లేదా ఎక్స్క్లూజివ్ సేల్ కూపన్ల పేరుతో మెసేజస్ పంపవచ్చు. ఇలాంటి సందేశాలను క్లిక్ చేసినప్పుడు వచ్చే లింక్స్ ఫిల్ చేయడం, లేదా ఇతర చెల్లింపు వివరాలను పూర్తి చేసినప్పుడు మీ ఖాతాలో డబ్బు మాయమయ్యే అవకాశం ఉంది.ఫేక్ ఈ-కామర్స్ వెబ్సైట్లు: సైబర్ నేరస్థులు చట్టబద్ధమైన ప్లాట్ఫారమ్లను అనుకరించే మోసపూరిత వెబ్సైట్లను సృష్టిస్తారు. ఇలాంటి ఫేక్ వెబ్సైట్ విషయంలో కూడా వినియోగదారులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.సోషల్ మీడియా స్కామ్: స్కామర్లు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో నకిలీ రాఖీ యాడ్స్ కూడా ప్రచారం చేయవచ్చు. ప్లాట్ఫామ్ చట్టబద్ధమైనదని భావించి, వినియోగదారుడు ఆర్థిక వివరాలను పంచుకుంటే మీ చెబుకు చిల్లు గ్యారెంటీ.యూపీఐ & గిఫ్ట్ కార్డ్ స్కామ్లు: రాఖీ గిఫ్ట్ క్లెయిమ్ల మాదిరిగానే నకిలీ యూపీఐ అభ్యర్థనలు లేదా క్యూఆర్ కోడ్లు మీ మొబైల్ ఫోనుకు వస్తే.. వాటిపట్ల కొంత జాగ్రత్త వహించాలి.స్కామ్ల నుంచి బయటపడే మార్గాలు➤రాఖీలు, స్వీట్స్ లేదా గిఫ్ట్స్ వంటివి ఆన్లైన్లో కొనుగోలు చేయాలనుకుంటే.. వినియోగదారుడు తప్పకుండా అధికారిక వెబ్సైట్ల నుంచి కొనుగోలు చేయాలి. నకిలీ వెబ్సైట్లు ఆఫర్స్ ఎరవేసి మిమ్మల్ని ఆకర్శించే అవకాశం ఉంది. కాబట్టి విశ్వసనీయ ప్లాట్ఫామ్ల నుంచి మాత్రమే ఆర్డర్ చేసుకోవాలి.➤ఆన్లైన్ చెల్లింపుల విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించాలి. కొన్ని క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేసినప్పుడు ఫిషింగ్ సైట్లు లేదా మాల్వేర్ డౌన్లోడ్లు జరిగే అవకాశం ఉంది. తెలియని నెంబర్స్ నుంచి వచ్చే లింక్స్ మీద క్లిక్ చేయకూడదు.➤ఫేక్ సైట్లను గుర్తించాలి. నకిలీ సైట్లు దాదాపు అధికారిక సైట్ల మాదిరిగా కనిపించేలా స్కామర్లు పన్నాగాలు పన్నుతారు. అయితే కొన్ని చిన్న మార్పులు గమనించాలి. వెబ్సైట్ URLలలో తేడాలను కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది.రాఖీ పండుగ సంతోషంగా జరుపుకునే సమయం. అయితే స్కామర్లు ఉన్నారన్న సంగతి మర్చిపోకూడదు. ఆదమరిస్తే మోసపోవడం మీ వంతు అవుతుంది. కాబట్టి స్కామర్ల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం మాత్రమే కాకుండా.. కుటుంబ సభ్యులను, స్నేహితులను కూడా రక్షించాలి. -
ఓపెన్ ఏఐ నుంచి జీపీటీ 5: అందరికీ ఫ్రీ
ప్రస్తుతం అంతర్జాతీయంగా తమకు అతి పెద్ద మార్కెట్లలో రెండో స్థానంలో ఉన్న భారత్ త్వరలోనే అగ్ర స్థానానికి చేరుతుందని ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్ తెలిపారు. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారత మార్కెట్లో ప్రజలు, వ్యాపార సంస్థలు గణనీయ స్థాయిలో కృత్రిమ మేధను వినియోగిస్తున్నాయని ఆయన వివరించారు.కొత్త తరం మోడల్ జీపీటీ-5ని ఆల్ట్మన్ ఆవిష్కరించారు. ఇది అందరికీ ఉచితమని వివరించారు. తాము మరిన్ని ఉత్పత్తులను భారత మార్కెట్లో ప్రజలకు ఏఐని మరింతగా అందుబాటులోకి తేవడంపై కసరత్తు చేస్తున్నామని, స్థానిక భాగస్వాములతో కూడా కలిసి పని చేస్తున్నామని ఆల్ట్మన్ చెప్పారు.జీపీటీ–5 గురించి వివరిస్తూ, కోడింగ్.. ఏజెంటిక్ టాస్క్లకు ఇప్పటివరకు వచ్చిన మోడల్స్లో ఇది అత్యుత్తమమైనదని వివరించారు. డెవలపర్లకు మరింత వెసులుబాటు లభించేలా ఏపీఐలో జీపీటీ–5, జీపీటీ–5–మినీ, జీపీటీ–5–నానో అని మూడు విధాలుగా ఇది అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ట్రాఫిక్ సమస్యకు చెక్!.. జపాన్ కంపెనీ వ్యూహం ఇదే..కొత్త మోడల్ 12 భారతీయ భాషలను అర్థం చేసుకోగలుగుతుందని ఆల్ట్మన్ చెప్పారు. ఉచిత, ప్లస్, ప్రో యూజర్లకు జీపీటీ–5 ఆగస్టు 7 నుంచి అందుబాటులోకి రాగా, ఎంటర్ప్రైజ్.. ఎడ్యుకేషన్ యూజర్ల సెగ్మెంట్కు వారం తర్వాత నుంచి లభిస్తుందని వివరించారు. -
ఏంటి టీసీఎస్లో ఇలా చేస్తున్నారు?
దేశంలో అగ్ర ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా 12,000 మంది ఉద్యోగులను తొలగించే ప్రణాళికను ప్రకటించింది. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే ఉద్యోగాల్లో చేరిన ఫ్రెషర్లతో కూడా బలవంతపు రాజీనామాలు చేయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కంపెనీ తన బెంచ్ పాలసీని సవరించిన కొన్ని వారాల తరువాత ఇలాంటి చర్యలకు పాల్పడుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి.ఓవైపు లేఆఫ్ ఆందోళనలున్నా జీతాల పెంపు ప్రకటించి ఉద్యోగులకు కాస్త ఊరట కల్పించింది టీసీఎస్. అయితే ఈ ప్రకటనకు ఒక రోజు ముందు, ఒక రెడ్డిట్ యూజర్ తాను బలవంతంగా రాజీనామా చేయవలసి వచ్చిందంటూ పేర్కొన్నారు. 'టీసీఎస్ ఫైరింగ్ ఫ్రెషర్స్?' అనే శీర్షికతో ఓ పోస్టు పెట్టారు. అహ్మదాబాద్, పుణెకు చెందిన పలువురు ట్రైనీలను కేవలం నాలుగైదు వారాల పాటు బెంచ్పై ఉంచి ఆ తర్వాత ఉద్వాసన పలికారని పేర్కొన్నారు.బెంచ్ పాలసీలో మార్పు, క్రియాశీల క్లయింట్ ప్రాజెక్ట్ లేకుండా అనుమతించదగిన వ్యవధిని 35 రోజులకు తగ్గించడం వంటివాటితో ఒత్తిడి తెచ్చి చప్పుడు లేకుండా ఉద్యోగులను టీసీఎస్ వదిలించుకుంటోందని ఆరోపించారు. ఉద్యోగాలు తగ్గించుకునేందుకు ఫ్రెషర్లను కూడా వదిలిపెట్టడం లేదన్నారు.బలవంతంగా రాజీనామా చేయించారు'నేను కొన్ని రోజుల క్రితం బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది' అని పేర్కొన్న రెడ్డిట్ యూజర్ ఫ్రెషర్స్ కూడా జాబ్ కట్ రాడార్ లో ఉన్నారని ఆరోపించారు. హెచ్ఆర్ తనను ఒక సమావేశానికి పిలిచి, తనతో ఫోన్ స్విచ్ఛాఫ్ చేయించి ఆపై తనకు రెండు ఆప్షన్లు ఇచ్చాడని పేర్కొన్నాడు. అవి వెంటనే రాజీనామా చేయడం లేదా తొలగింపును ఎదుర్కోవడం.రాజీనామా చేయకపోతే ఎటువంటి పరిహారం ఇవ్వకుండా నెగటివ్ రిలీజ్ లెటర్ జారీ చేస్తామని బెదిరించారని రాసుకొచ్చారు. అదే చెప్పినట్లు రాజీనామా చేస్తే మూడు నెలల వేతనం ఇచ్చి ఎటువంటి నెగటివ్ లేకుండా మంచిగా రిలీజ్ లెటర్ ఇస్తామన్నారని వివరించాడు. తన లాగే మరో నలుగురు ఫ్రెషర్లను కూడా ఏడిపించి బలవంతంగా రాజీనామా చేయించారని రెడ్డిట్ పోస్ట్లో పేర్కొన్నారు.తనను క్రియాశీల ప్రాజెక్టుకు కేటాయించినప్పటికీ బలవంతంగా రాజీనామా చేయించి ఆ ఆకస్మిక రాజీనామాకు వ్యక్తిగత కారణాలను పేర్కొనాలని హెచ్ఆర్ ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. రాజీనామా, తొలగింపు రెండింటిలో ఏదో ఒకటి నిర్ణయించుకోవడానికి తనకు కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చారని, తన కుటుంబంతో మాట్లాడేందుకు కూడా అనుమతించలేదని ఫ్రెషర్ ఆరోపించారు.👉 చదవండి: హమ్మయ్య.. ఈఎంఐలు ఇక కాస్తయినా తగ్గుతాయ్.. -
ప్రపంచ ఏఐని శాసించేది మనమే.. అన్ని అవకాశాలూ మనకే..
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విస్తృతి అంతటా పెరిగిపోయింది. అన్ని రంగాలను, పరిశ్రమలను ఈ సరికొత్త సాంకేతికత కమ్మేస్తోంది. దీంతో ఉద్యోగాలు, పని చేసే విధానం పూర్తిగా మారబోతున్నాయి. ఈ నేపథ్యంలో 16వ ఫిక్కీ గ్లోబల్ స్కిల్స్ సమ్మిట్ 2025లో ఫిక్కీ, కేపీఎంజీలు 'నెక్ట్స్ జనరేషన్ స్కిల్స్ ఫర్ ఎ గ్లోబల్ వర్క్ఫోర్స్: ఎనేబుల్ యూత్ అండ్ ఎంపవర్ ఎకానమీ' పేరుతో ఓ కీలక నివేదికను ఆవిష్కరించాయి.కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరి విడుదల చేసిన ఈ నివేదిక గ్లోబల్ ఏఐ టాలెంట్ హబ్ గా మారడానికి భారతదేశ రోడ్ మ్యాప్ ను వివరిస్తుంది.ప్రాంప్ట్ ఇంజినీర్లు, స్మార్ట్ గ్రిడ్ అనలిస్టులు వంటి సరికొత్త భవిష్యత్ ఉద్యోగాలతో ఐటీ, హెల్త్ కేర్, ఫైనాన్స్, మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో వేగవంతమైన కృత్రిమ మేధ ఆధారిత పరివర్తనను కీలక పరిశోధనలు హైలైట్ చేస్తున్నాయి. అయితే భారతీయ యువతలో కేవలం 26.1% మంది మాత్రమే సరైన వృత్తి శిక్షణను పొందుతున్నారు. ఇది అత్యవసర నైపుణ్య అంతరాలను తెలియజేస్తోంది.రంగాల వారీగా ఏఐ శిక్షణ, ఐటీఐలను ఆధునీకరించడం, టైర్ 2, 3 నగరాల్లో స్థానిక అవసరాలకు తగ్గట్లు నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని నివేదిక సిఫార్సు చేసింది. అట్టడుగు వర్గాల సాధికారత కోసం గ్లోబల్ సర్టిఫికేషన్ అలైన్ మెంట్, నైతిక ఏఐ ప్రమాణాలు, సమ్మిళిత విధానాలు అవసరమని పేర్కొంది.కలిసొచ్చే అంశాలు భారతదేశంలో ఎక్కువగా ఉన్న యువ జనాభా, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టార్టప్ ఎకోసిస్టమ్ మనం ఏఐ వర్క్ఫోర్స్లో నిర్ణయాత్మకమైన శక్తిగా ఎదగడానికి సానుకూల అంశాలుగా కేపీఎంజీకి చెందిన నిపుణులు పేర్కొన్నారు. వ్యూహాత్మక పెట్టుబడులు, సాహసోపేతమైన సంస్కరణలతో, భారత్ ఏఐ నిపుణులను బయటి దేశాలకు అందించగలదని అభిప్రాయపడ్డారు. -
‘ఓపెన్ఏఐతో మైక్రోసాఫ్ట్ సర్వనాశనం’
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో మాది గొప్ప అంటే మాది గొప్ప.. అంటూ చంకలు చరుచుకోవడం కంపెనీలకు అలవాటైంది. మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంగా ఉన్న ఓపెన్ఏఐ తాజాగా విడుదల చేసిన చాట్జీపీటీ-5 మోడల్ ఎంతో సమర్థంగా పని చేస్తుందని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిపై ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్మస్క్ స్పందిస్తూ త్వరలో ఓపెన్ఏఐ మైక్రోసాఫ్ట్ను నాశనం చేస్తుందని చెప్పారు.సత్య నాదెళ్ల పోస్ట్ చేస్తూ..‘ఈ రోజు జీపీటీ-5 మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్, కోపైలట్, గిట్హబ్ కోపైలట్, అజూర్ ఏఐ ఫౌండ్రీతో సహా మా ప్లాట్ఫామ్ల్లో లాంచ్ అవుతుంది. ఇది ఓపెన్ఏఐ వద్ద ఉన్న అత్యంత సమర్థవంతమైన మోడల్. ఇది రీజనింగ్, కోడింగ్, చాట్లో మెరుగైన పురోగతిని అందిస్తుంది. దీని మోడల్స్ అన్నీ అజూర్లో శిక్షణ పొందాయి. సామ్ఆల్ట్మన్ మాతో చేరి రెండున్నరేళ్లు అయిందంటే నమ్మలేకపోతున్నాం. బింగ్లో జీపీటీ-4 ఇంప్లిమెంట్ చేసేందుకు సామ్ మాతో చేరారు. అప్పటి నుంచి ఎంతో సాధించాం. తాజా పురోగతితో వేగం పెరుగుతుంది. ఈ మోడల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అన్నారు.Today, GPT-5 launches across our platforms, including Microsoft 365 Copilot, Copilot, GitHub Copilot, and Azure AI Foundry. It's the most capable model yet from our partners at OpenAI, bringing powerful new advances in reasoning, coding, and chat, all trained on Azure.It’s… pic.twitter.com/jHDA94YOL0— Satya Nadella (@satyanadella) August 7, 2025ఇదీ చదవండి: ‘భారత్ను బెదిరిస్తారు’.. సూపర్ పవర్గా ఎదగాలంటే..సత్య పోస్ట్పై ఎలాన్మస్క్ స్పందిస్తూ.. ‘త్వరలో ఓపెన్ఏఐ మైక్రోసాఫ్ట్ను బ్రతికుండగానే మింగేస్తుంది’ అన్నారు. దీనిపై సత్య ప్రతిస్పందిస్తూ.. ‘కొందరు 50 ఏళ్లుగా అందుకోసం ప్రయత్నిస్తున్నారు. అదే సరదా అయిన విషయం! ప్రతిరోజూ మీరు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటారు. సృజనాత్మకతను జోడిస్తూ భాగస్వామిగా మారుతారు. తర్వాత ఇతరులతో పోటీపడతారు. అజూర్లో గ్రోక్ 4 వినియోగంపట్ల ఉత్సాహంగా ఉన్నాను. గ్రోక్ 5 కోసం ఎదురుచూస్తున్నాను!’ అని రాసుకొచ్చారు. ‘గ్రోక్ 4 హెవీ రెండు వారాల క్రితం జీపీటీ 5 కంటే స్మార్ట్గా ఉంది’ అని మస్క్ రిప్లై ఇచ్చారు. దాన్ని సూచించే కొన్ని డేటా పాయింట్లు ఉన్న పోస్ట్ను కోట్ చేశారు.OpenAI is going to eat Microsoft alive— Elon Musk (@elonmusk) August 7, 2025People have been trying for 50 years and that’s the fun of it! Each day you learn something new, and innovate, partner, and compete. Excited for Grok 4 on Azure and looking forward to Grok 5!— Satya Nadella (@satyanadella) August 7, 2025 -
తక్కువ ధరకే బోలెడు ఫీచర్లు!
ప్రముఖ స్మార్ట్ఫోన్ సంస్థ 'వన్ప్లస్' వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను పరిచయం చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే 'వన్ప్లస్ నార్డ్ సీఈ' సిరీస్ను ఒక ప్రధాన లక్ష్యంతో తీసుకొచ్చింది. ఇది శక్తివంతమైన పనితీరు, లేటెస్ట్ ఫీచర్స్, యూజర్ ఇంటర్ఫేస్తో కూడిన సిగ్నేచర్ వన్ప్లస్ అనుభవాన్ని ప్రేక్షకులకు అందిస్తుంది. దీనికి 'వన్ప్లస్ నార్డ్ సీఈ5' (OnePlus Nord CE5) ఒక ఉదాహరణ. లేటెస్ట్ వన్ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సామర్థ్యాలను కలిగి, ఆక్సిజన్ఓఎస్ అనుభవాన్ని మెరుగుపరచడం ద్వారా ఇది మంచి పనితీరును అందిస్తుంది. ఇది దాని విభాగంలో.. ధరకు తగిన ఫ్రీమియం ఫీచర్స్ అందిస్తుంది.వన్ప్లస్ నార్డ్ సీఈ5 - వాల్యూ ఫర్ మనీరూ.25వేలు లోపు ధర వద్ద బెస్ట్ ఫీచర్స్ కలిగిన స్మార్ట్ఫోన్ వన్ప్లస్ నార్డ్ సీఈ5. మీరు చెల్లించే డబ్బుకు, తగిన ఫీచర్స్ తప్పకుండా ఆస్వాదించవచ్చు. ఈ స్మార్ట్ఫోన్ను మీరు మాత్రమే కాకుండా.. మీ సన్నిహితులకు లేదా కుటుంబ సభ్యులకు కూడా పండుగల సమయంలో గిఫ్ట్గా ఇవ్వడానికి అనువైనది.వన్ప్లస్ నార్డ్ సీఈ5 ఫీచర్లు ఇలా..మీడియాటెక్ 8350 అపెక్స్ప్రతి మొబైల్కు కీలకంగా వ్యవహరించేది దాని ప్రాసెసర్. నార్డ్ సీఈ5లో మీడియాటెక్ 8350 అపెక్స్ చిప్ సెట్ ఉంది. ఇది దాని పనితీరును సూచిస్తుంది. వినియోగదారుల కోసం రూపొందించబడిన కొత్త తరం ప్రాసెసర్ ఇది. యువత మొబైల్ స్పీడ్లో రాజీపడకుండా మెరుగైన పనితీరును కోరుకుంటారు. కాబట్టి దీన్ని సమర్థవంతమైన ఆర్కిటెక్చర్తో నిర్మించారు. యూజర్లకు అంతరాయం లేకుండా యాప్ను రన్ చేస్తూ, అప్రయత్నంగా మల్టీ టాస్కింగ్ నిర్వహిస్తుంది. పెద్ద సైజ్లో ఉన్న గేమ్లను కూడా 120 ఎఫ్పీఎస్తో స్మూత్ గేమింగ్ పనితీరును నిర్ధారిస్తుంది. వినియోగదారుల ప్రవర్తన ఆధారంగా పనితీరును ఆప్టిమైజ్ చేసేలా కొన్ని ఫీచర్లను కూడా కంపెనీ అందిస్తుంది.సూపర్ ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ప్లేనార్డ్ సీఈ5లో 6.7 అంగుళాల సూపర్ ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ప్లే ఉంది. ఇది మంచి విజువల్ను అందిస్తుంది. ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్, బటర్ స్మూత్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో స్క్రీన్ వేగంగా స్పందిస్తుంది. సాధారణంగా అధిక బ్రైట్నెస్ అవుట్ డోర్ విజిబిలిటీకి సమస్యగా ఉంటుంది. హెచ్డీఆర్10+ కాంట్రాస్ట్, కలర్ క్లారిటీతో ఈ సమస్యకు నార్డ్ సీఈ5 చెక్ పెడుతుంది. ఇందులోకి ఏఐ విజువల్ ఎన్హాన్స్మెంట్ విభిన్న లైటింగ్ కండిషన్స్లో వినియోగదారులకు మంచి అనుభవాన్ని అందిస్తుంది. గేమ్ ఆడుతున్నా, ఎక్కువగా స్క్రీన్ చూస్తున్నా ఈ డిస్ప్లే యూజర్లకు మెరుగైన అనుభవాన్ని సొంతం చేస్తుంది.కెమెరా సిస్టమ్వన్ప్లస్ నార్డ్ సీఈ5లో కేవలం మెగాపిక్సెల్స్ కోసమే కాకుండా అర్థవంతమైన ఫొటోగ్రఫీ కోసం డిజైన్ చేసిన రిఫైన్డ్ డ్యూయల్ లెన్స్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది.50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్: తక్కువ వెలుతురులో కూడా అదిరిపోయే క్లారిటీ, డైనమిక్ రేంజ్ అందిస్తుంది.8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా: ల్యాండ్స్కేప్, గ్రూప్ షాట్స్, ఆర్కిటెక్చర్ కోసం ఇది ప్రత్యేకమైంది.60 ఎఫ్పీఎస్ వద్ద 4కే వీడియో: రియల్ టైమ్ స్టెబిలైజేషన్తో ఫ్లూయిడ్, సినిమా క్వాలిటీ రికార్డింగ్ అందిస్తుంది.ఈ ఫోన్లో ప్రతి కెమెరా షాట్ను ఎలివేట్ చేసేలా ఏఐ ఆధారిత ఫొటోగ్రఫీ ఫీచర్లు ఉన్నాయి. సీన్ రికగ్నిషన్, ఇంటెలిజెంట్ హెచ్డీఆర్, నైట్ స్కేప్ ఆప్టిమైజేషన్, సోషల్ రెడీ కంటెంట్ కోసం రూపొందించిన సృజనాత్మక ఫిల్టర్లు ఉన్నాయి.అర్థం చేసుకునే ఏఐనార్డ్ సీఈ5ను మార్కెట్లోని ఇతర ఫోన్లతో నిజంగా వేరు చేసేది అందులో వాడుతున్న కృత్రిమ మేధ. ఇందులో స్మార్ట్ ఉత్పాదకత సాధనాలను వాడారు. ఫోన్లోని ఏఐ యూజర్ షెడ్యూల్ను నిర్వహించగలదు. ఈమెయిల్లను చదివి సంక్షిప్తంగా తెలపగలదు. సందర్భోచితంగా నోటిఫికేషన్లకు కూడా ప్రాధాన్యత ఇవ్వగలదు.కెమెరా ఏఐ: ఫొటో తీస్తున్న సమయంలో సబ్జెక్ట్, బ్యాక్ గ్రౌండ్ ఆధారంగా ఫోకస్, లైటింగ్, కలర్ టోన్లను ఆటో అడ్జస్ట్ చేస్తుంది. దీంతో మాన్యువల్గా మళ్లీ సదరు ఫొటో లేదా కెమెరా సెట్టింగ్స్లోకి వెళ్లి మార్పులు చేయాల్సిన పని ఉండదు.120 ఎఫ్పీఎస్ గేమింగ్ పవర్ హౌస్స్మార్ట్ ఫోన్లో గేమింగ్ అనేది ప్రస్తుత రోజుల్లో ప్రధానంగా మారింది. నార్డ్ సీఈ 5 ఈ అనుభవాన్ని చాకచక్యంగా అందిస్తుంది. దాని 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్కు అందుకు ఎంతో తోడ్పడుతుంది. 120 ఎఫ్పీఎస్ వద్ద అసాధారణ గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది.డిజైనింగ్నార్డ్ సీఈ 5 బ్రష్డ్ మ్యాట్ ఫినిష్తో హై-గ్రేడ్ పాలీకార్కొనేట్తో తయారైంది. యూనిబాడీతో ప్రీమియం లుక్ ఉండేలా డిజైన్ చేశారు. ఇది విజువల్ అప్పీల్ మాత్రమే కాకుండా మంచి గ్రిప్ను కూడా నిర్ధారిస్తుంది. సీఈ5లోని కలర్ ఆప్షన్లు కింది విధంగా ఉన్నాయి.గ్రాఫైట్ ఐస్ - రిఫ్లెక్టివ్ షైనింగ్తో మెటాలిక్ గ్రే కలర్.మిస్ట్ బ్లూ - హిమానీనదాల నుండి ప్రేరణ పొంది ఈ రంగులో అందిస్తున్నారు.సన్సెట్ కాపర్ఆక్సిజన్ఓఎస్ఆక్సిజన్ఓఎస్ తాజా వెర్షన్తో నడుస్తున్న నార్డ్ సీఈ 5 రెస్పాన్సివ్, యాడ్ ఫ్రీ సాఫ్టేవేర్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ మిడ్ రేంజ్ ఫోన్ల్లో చాలా అరుదుగా ఉంటుంది. ఇందులోని స్మార్ట్ ఎఫిషియెన్సీ టూల్స్ మెరుగైన షెల్ఫ్ విడ్జెట్లు, సందర్భోచిత యాప్ సజెషన్లను అందిస్తున్నాయి. వినియోగదారులకు వారి డిజిటల్ గోప్యతపై మరింత నియంత్రణను కల్పించేలా మెరుగైన భద్రతా ఫీచర్లను అందిస్తుంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే థీమ్స్, ఫింగర్ ప్రింట్ యానిమేషన్లు, ఐకాన్ ప్యాక్లను నియంత్రిస్తుంది. మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్లు, ప్రధాన ఆండ్రాయిడ్ అప్డేషన్లను అందిస్తుంది.5జీ కనెక్టివిటీనార్డ్ సీఈ5 డ్యూయల్ 5జీ సిమ్ స్లాట్లను కలిగి ఉంది. ఇది విస్తృత శ్రేణి గ్లోబల్ 5జీ బ్యాండ్లను సపోర్ట్ చేస్తుంది. అధిక రిజల్యూషన్ కంటెంట్ను స్ట్రీమింగ్ చేస్తున్నా, రియల్ టైమ్ క్లౌడ్ గేమింగ్లో పాల్గొంటున్నా లేదా అధిక మొబిలిటీ సందర్భాల్లో వీడియో కాలింగ్ చేసినా సీఈ 5 అల్ట్రా లో-లేటెన్సీ వల్ల స్థిరమైన వేగంతో పని చేస్తుంది.హై-స్పీడ్, మెరుగైన ఇంటర్నెట్ కోసం వై-ఫై 6ఈడ్యూయల్ డివైజ్ ఆడియో సపోర్ట్, బ్లూటూత్ 5.3 టెక్నాలజీఅంతరాయం లేని మొబైల్ పేమెంట్లు, డివైజ్ పెయిరింగ్ కోసం ఎన్ఎఫ్సీవేగవంతమైన డేటా బదిలీ, రివర్స్ ఛార్జింగ్ సామర్థ్యాల కోసం యూఎస్బీ-ఈ 3.2 జెన్ 1 సదుపాయంఆడియో ఎక్స్ పీరియన్స్ఆడియో కోసం నార్డ్ సిఇ 5 డాల్బీ అట్మోస్ సర్టిఫికేషన్తో స్టీరియో డ్యూయల్ స్పీకర్లను కలిగి ఉంది. గేమింగ్, వీడియోలు చూడటం లేదా కాల్స్లో ఉన్నా స్పష్టమైన ఆడియోను అందిస్తుంది. మ్యూజిక్ వింటున్న సమయంలో స్పష్టమైన సంగీతం ఆస్వాదించేలా ఏర్పాటు చేశారు. యూఎస్బీ-సీ ద్వారా హై-రిజల్యూషన్ ఆడియో సపోర్ట్ చేస్తుంది. రియల్టైమ్లో పరిసరాల శబ్దం ఆధారంగా వాల్యూమ్ స్థాయిలను నిర్వహించే ఏఐ ఆధారిత ట్యూనింగ్ సిస్టమ్ ఉంది. 3.5 ఎంఎం హెడ్ఫోన్ జాక్ను సపోర్ట్ చేస్తుంది.కూలింగ్ సిస్టమ్ఫోన్లో అధిక సైజ్ ఉన్న గేమ్లు ఎక్కువసేపు ఆడితే మొబైల్ వేడవ్వడం సహజం. దీన్ని కట్టడి చేసేందుకు నార్డ్ సీఈ5 మెరుగైన మల్టీ లేయర్ గ్రాఫైట్, వేపర్ ఛాంబర్ కూలింగ్ వ్యవస్థను పరిచయం చేస్తుంది. ఇది మునుపటి నార్డ్ మోడళ్ల కంటే వేడిని మరింత సమర్థవంతంగా నిర్వహిస్తుంది. సుదీర్ఘ గేమింగ్ లేదా వీడియో సెషన్ల సమయంలో కూడా సౌకర్యవంతమైన అనుభవాన్ని ఇస్తుంది.భద్రత ఫీచర్లునార్డ్ సీఈ5 డిస్ప్లేపై ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫీచర్ను అందిస్తుంది. దాంతోపాటు వేగవంతమైన, మరింత సురక్షితమైన యాక్సెస్ కోసం ఏఐ ఆధారిత ఫేస్ అన్లాక్ వెసులుబాటును ఇస్తుంది. ఇందులోని ప్రైవేట్ సేఫ్ 3.0 ద్వారా సున్నితమైన డాక్యుమెంట్లు, ఇమేజ్లు, ఫైళ్లను ఎన్ క్రిప్టెడ్గా స్టోర్ చేసుకోవచ్చు.చివరగా..మిడ్ రేంజ్ మార్కెట్లో వన్ప్లస్ నార్డ్ సీఈ5 కీలకంగా వ్యవహరించనుంది. వినియోగదారులను ఆకర్షించే ఇన్నోవేషన్ ప్రీమియం ధరలతోనే రావాల్సిన అవసరం లేదని వన్ప్లస్ బ్రాండ్ మరోసారి నిరూపించింది. రియల్ వరల్డ్ పెర్ఫార్మెన్స్, అర్థవంతమైన ఫీచర్లు, ఇంటెలిజెంట్ డిజైన్ ఎంపికలకు ప్రాధాన్యమిచ్చే నార్డ్ సీఈ5ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్యాటరీ నుంచి దాని ఏఐ ఆధారిత కెమెరా వరకు, ఫ్లూయిడ్ 120 హెర్ట్జ్ గేమింగ్ నుంచి ప్రాసెసింగ్ ఎనర్జీ వరకు నార్డ్ సీఈ5 వినియోగదారుకు నమ్మశక్యం కాని అనుభవాన్ని అందిస్తుంది.వన్ప్లస్ నార్డ్ సీఈ5 వేరియంట్స్ & ధరలు1) 8 జీబీ + 128 జీబీ: రూ. 24,9992) 8 జీబీ + 256 జీబీ: రూ. 26,9993) 12 జీబీ + 256 జీబీ: రూ. 28,999 -
కెమరా ఫోకస్ పెట్టు... సినిమా మజా పట్టు!
మనం కొన్ని నగరాలను సందర్శించినప్పుడు.. అక్కడ రోడ్డుపక్కన గోడలపైన లేదా కొన్ని హోటల్లో ఆకర్షణీయమైన చిత్రాలు కనిపిస్తాయి. అవి చూడగానే ఆకట్టుకునే విధంగా ఉంటాయి. అంతగా ఆకట్టుకునే చిత్రాలు మాట్లాడితే?, వచ్చే అనుభూతి మాటల్లో చెప్పలేము. ఈ ఆలోచనకే న్యూజెర్సీలోని ఫ్రాంక్లిన్ పార్క్లోని ఒక రెస్టారెంట్ కార్యరూపం దాల్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వీడియోలో గమనించినట్లయితే.. రెస్టారెంట్కు విచ్చేసిన కస్టమర్లు గోడలపై ఉన్న చిత్రాలను మొబైల్ ఫోన్ కెమెరా ద్వారా చూస్తుంటే, కొన్ని బొమ్మలు డైలాగ్స్ చెబుతున్నాయి, మరికొన్ని డ్యాన్స్ వేస్తున్నాయి. ఇవన్నీ కస్టమర్లను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తున్నాయి. భారతీయ వంటకాలను ఆస్వాదిస్తూ.. ఇండియన్ సినిమా డైలాగ్స్ కూడా వినవచ్చు. View this post on Instagram A post shared by Marketing Stories (@marketing.stories) -
చెబితే రాసే యంత్రం.. సరికొత్త టెక్నాలజీ
టెక్నాలజీ పెరుగుతోంది, కొత్త ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే కేరళకు చెందిన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఒకరు 'టాక్ టు రైట్' అనే ఏఐ డివైజ్ రూపొందించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..లింక్డ్ఇన్ పోస్ట్లో, అజయ్ హెచ్ అనే విద్యార్థి.. ఈ పరికరం AI బేస్డ్ వాయిస్-టు-పెన్ సిస్టమ్ అని, ఇది CNC పెన్ ప్లాటర్ని ఉపయోగించి మనం మాట్లాడే పదాలను చేతితో రాసిన టెక్స్ట్గా మారుస్తుందని వెల్లడించారు. ఈ పరికరాన్ని రాస్ప్బెర్రీ పై, ఆర్డునో (GRBL), పైథాన్లతో రూపొందించారని వెల్లడించారు. దీనిని ఎంటే కేరళం ఎక్స్పో 2025 (Ente Keralam Expo 2025)లో ఆవిష్కరించారు.ఇదీ చదవండి: ఏఐ నుంచి ఎవరూ తప్పించుకోలేరు: గౌడత్ హెచ్చరికలింక్డ్ఇన్ పోస్ట్లో షేర్ చేసిన వీడియోలో గమనించినట్లయితే.. అక్కడ అమర్చిన టాక్ టు రైట్ పరికరం మైక్లో అజయ్ మాట్లాడుతూ 'డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్' అని చెబుతాడు. ఆ యంత్రం కాగితంపై ఆ ఎలాంటి తప్పులు లేకుండా రాస్తుంది. ఇది వైకల్యం ఉన్న వ్యక్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. View this post on Instagram A post shared by SUNNOBC | JAYRAJSINH ZALA (@sunnobc) -
ఏఐ నుంచి ఎవరూ తప్పించుకోలేరు: గౌడత్ హెచ్చరిక
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఊహకందని సమస్యలను తీసుకొస్తుందని 'గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ'గా ప్రసిద్ధి చెందిన 'జియోఫ్రీ హింటన్' (Geoffrey Hinton) హెచ్చరికలు జారీ చేసిన తరువాత.. గూగుల్ మాజీ ఎగ్జిక్యూటివ్ 'మో గౌడత్' (Mo Gawdat) కూడా అదే తరహాలో పేర్కొన్నారు.కృత్రిమ మేధ కారణంగా 2027 నుంచి భారీ సంఖ్యలో ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుందని, సమాజానికి పెద్ద సమస్యగా తయారవుతుందని మో గౌడత్ పేర్కొన్నారు. సాఫ్ట్వేర్ డెవలపర్లు, సీఈఓలు, పాడ్కాస్టర్లతో సహా ఎవరూ ఏఐ నుంచి తప్పించుకోలేరని అన్నారు. అంతే కాకుండా రాబోయే 15 సంవత్సరాలు ఉద్యోగులకు నరకం అని సంబోధించారు.గూగుల్ సంస్థలో చీఫ్ బిజినెస్ ఆఫీసర్గా పనిచేసిన గౌడత్.. ప్రస్తుతం ఎమ్మా.లవ్ అనే స్టార్టప్ నడుపుతున్నారు. ఇందులో కేవలం ముగ్గురు వ్యక్తులు మాత్రమే పనిచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో ఆ స్టార్టప్లో 350 మంది డెవలపర్లు ఉండేవారు. కానీ ఏఐ కారణంగా ప్రస్తుతం దీన్ని ముగ్గురే నిర్వహిస్తున్నారు. దీన్ని బట్టి ఏఐ ఎంతగా విస్తృతిస్తోందో అర్థం చేసుకోవచ్చు.ఏఐ ఆవిర్భావం 'సామాజిక అశాంతిని' రేకెత్తిస్తుందని. ప్రజలు ఇప్పటికే తమ జీవనోపాధిని కోల్పోతున్నారు. దీని ఫలితంగా మానసిక ఆరోగ్య సమస్యలు పెరగడం, ఒంటరితనం పెరగడం, సామాజిక విభజనలు తీవ్రమవుతాయని గౌడత్ అన్నారు. ఏఐని సరిగ్గా నియంత్రించకపోతే భారీ అసమానతలను సృష్టిస్తుంది. ధనవంతులు మాత్రమే మనగలుగుతారు. మిగతా వారందరూ కష్టపడతారని ఆయన హెచ్చరించారు.ఇదీ చదవండి: ఉద్యోగం మానేసి నా స్టోర్లో పనిచెయ్ అన్నాడు: కానీ ఇప్పుడు..ఏఐ సొంత భాషప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత అయిన జియోఫ్రీ హింటన్ 'వన్ డెసిషన్' ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతూ.. ఏఐ సొంత భాషను ఏర్పాటు చేసుకుంటుంది. ఆ భాషను మానవ సృష్టికర్తలు కూడా అర్థం చేసుకోలేరని హెచ్చరించారు. యంత్రాలు ఇప్పటికే భయంకరమైన ఆలోచనలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని ప్రదర్శించాయి. ఆ ఆలోచనలు ఎల్లప్పుడూ మనం ట్రాక్ చేయగల భాషలోనే ఉంటాయని భావించకూడదు. ఇదే జరిగితే ఆ తరువాత జరిగే పరిణాలను అంచనా వేయలేమని అన్నారు. -
84,000 గేమింగ్ యూజర్ల వివరాలు లీక్!
గతేడాది దేశీయంగా 84,000 పైచిలుకు ఆన్లైన్ గేమింగ్ ఖాతాదారుల వివరాలు లీక్ అయినట్లు గ్లోబల్ సైబర్సెక్యూరిటీ, డిజిటల్ ప్రైవసీ కంపెనీ కాస్పర్స్కీ వెల్లడించింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో (ఏపీఏసీ) ఇలాంటి ఉదంతాలు అత్యధికంగా థాయ్ల్యాండ్లో, అత్యల్పంగా సింగపూర్లో నమోదయ్యాయి.కాస్పర్స్కీ ప్రకారం.. థాయ్ల్యాండ్లో 1,62,892 కేసులు, ఫిలిప్పీన్స్లో 99,273, వియత్నాంలో 87,969, సింగపూర్లో 4,262 కేసులు నమోదయ్యాయి. గతేడాది మొత్తం మీద 1.1 కోట్ల గేమింగ్ ఖాతాల వివరాలు బహిర్గతమైనట్లు కాస్పర్స్కీ తెలిపింది. అంతర్జాతీయంగా గేమర్లలో దాదాపు సగం మంది ఏపీఏసీ రీజియన్లోనే ఉన్నారు.ఆగ్నేయాసియాలో చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా మార్కెట్లు కీలకంగా ఉంటున్నాయి. ఈ మార్కెట్లలో డిజిటల్.. మొబైల్స్ వినియోగం పెరగడం, పెద్ద సంఖ్యలో యువ జనాభా తదితర అంశాలు గేమింగ్కి దన్ను గా ఉంటున్నాయి. 180 కోట్ల మంది పైగా ప్లే యర్లతో ఏపీఏసీ రీజియన్ అంతర్జాతీయంగా గేమింగ్ ధోరణులను కొత్తగా తీర్చిదిద్దుతోందని కాస్పర్స్కీ తెలిపింది. దీంతో ఈ ప్రాంతంలో సైబర్ ముప్పులు కూడా పెరుగుతున్నాయని వివరించింది.ఇదీ చదవండి: ఉద్యోగం మానేసి నా స్టోర్లో పనిచెయ్ అన్నాడు: కానీ ఇప్పుడు..ద్వితీయ శ్రేణి నగరాలపై కంపెనీ దృష్టిభారత్లో విస్తరణలో భాగంగా ఇతర భాగస్వాములతో చేతులు కలపడం ద్వారా ద్వితీయ శ్రేణి పట్టణాల్లోకి కూడా ప్రవేశించే యోచనలో ఉన్నట్లు కాస్పర్స్కీ ఎండీ (ఆసియా పసిఫిక్) ఏడ్రియన్ హియా తెలిపారు. ప్రస్తుతం కంపెనీ దేశీయంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు నుంచి కార్యకలాపాలు సాగిస్తోంది. గత రెండేళ్లుగా భారత్లో సేల్స్, టెక్నికల్ సపోర్ట్ తదితర విభాగాల్లో స్థానిక సిబ్బంది సంఖ్యను మూడు రెట్లు పెంచుకున్నట్లు హియా చెప్పారు. అంతర్జాతీయంగా తమ కార్యకలాపాలకు కీలక ఇన్నోవేషన్ హబ్గా భారత్ను పరిగణిస్తున్నామని, ఇక్కడ పరిశోధన–అభివృద్ధి కార్యకలాపాలను పెంచుకుంటున్నామని వివరించారు. -
మ్యాక్బుక్ కోసం వియత్నాం: ఎంత డబ్బు సేవ్ అయిందంటే?
మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ వంటి ఎలక్ట్రానిక్స్ మన దేశంలో కంటే కొన్ని ఇతర దేశాల్లో కొంత తక్కువ ధరకే లభిస్తాయని, చాలా సందర్భాల్లో వినే ఉంటారు. ఇది నిజమే అని ఓ వ్యక్తి నిరూపించి చూపించాడు. ఈ విషయాన్ని వివరంగా తన రెడ్డిట్లో పోస్ట్ చేశాడు.''నేను మ్యాక్బుక్ కొనడానికే భారతదేశం నుంచి వియత్నాంకు వెళ్లాను'' అనే శీర్షికతో ఆ వ్యక్తి తన అనుభవాన్ని పూర్తిగా వివరించాడు. మీరు మ్యాక్బుక్ కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే వియత్నాంకు ఓ చిన్న ట్రిప్ వేసుకోండని కూడా సలహా ఇచ్చాడు.నేను కొంత తక్కువ ధరలోనే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని హనోయ్కి (వియత్నాం రాజధాని) చేరుకున్నాను. మ్యాక్బుక్ కొనడానికి సమీపంలోని ప్రాంతాలలో 15 కంటే ఎక్కువ షాపులను సందర్శించాను. ల్యాప్టాప్ కోసం వెళ్లి 11 రోజులు వెకేషన్ ఎంజాయ్ చేసాను. మొత్తానికి రూ. 1.48 లక్షలకు మ్యాక్బుక్ కొనేసాను.ఇండియాలో మ్యాక్బుక్ ధర రూ. 1.89 లక్షలు. కార్డ్ ఆఫర్లతో రూ. 1.85 లక్షలు. అయితే వియత్నాంలో రూ. 1,48,500లకు కొనుగోలు చేసాను. దీంతో రూ. 36,500 ఆదా అయింది. అంటే ఇది దాదాపు రౌండ్ ట్రిప్ టికెట్ ధర. మొత్తం మీద ల్యాప్టాప్ ఖర్చుతో సహా, ప్రయాణానికి దాదాపు రూ.2.08 లక్షలు ఖర్చు అయింది. ట్యాక్స్ వంటివి వాపసు వచ్చిన తరువాత ఖర్చు రూ. 1.97 లక్షలు. ఇందులో మ్యాక్బుక్ ధరను తీసివేస్తే.. ఆ వ్యక్తి వియత్నాం తిరిగిరావడానికి అయిన ఖర్చు అని తెలుస్తోంది.ఇదీ చదవండి: అందని జీతం.. ఫుట్పాత్పై పడుకున్న టీసీఎస్ ఉద్యోగిప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. మొత్తానికి ఇండియాలో మ్యాక్బుక్ కొనుగోలు చేయడానికి పెట్టే డబ్బుతో.. మ్యాక్బుక్ కొనుగోలు చేయడమే కాకుండా వియత్నాం కూడా చూసి వచ్చేసాడు. అయితే రెండు లేదా మూడు మ్యాక్బుక్స్ కొనాలనుకునే వారికి ఇంకా ఎక్కువ ఆదా అవుతుందని కొందరు చెబుతున్నారు.I flew to Vietnam from India just to buy a MacBookbyu/Shuict inmacoffer -
సిమ్ యాక్టివ్ ప్లాన్లు.. ఒక్కసారి రీచార్జ్ చేస్తే చాలు
చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ మొబైల్ నంబర్లు ఉంటాయి. టెలికం సంస్థలు టారిఫ్లను పెంచేసిన నేపథ్యంలో రెండింటికీ రీచార్జ్ చేయాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రాథమికంగా వినియోగించే నంబర్ కాకుండా మరో నంబర్ను తక్కువ ఖర్చుతో యాక్టివ్ ఉంచుకొనే రీచార్జ్ ప్లాన్ల కోసం చాలా మంది చూస్తున్నారు.డేటా లేకుండా కూడా మొబైల్ నంబర్ను యాక్టివ్గా ఉంచడానికి సహాయపడే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్లను ప్రారంభించాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అన్ని ప్రధాన టెలికాం కంపెనీలను ఆదేశించింది. ఈ క్రమంలో ఎయిర్టెల్, జియో, వీఐలు తమ డేటా ఫ్రీ ప్రీపెయిడ్ ప్లాన్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..ఎయిర్టెల్ డేటా రహిత ప్లాన్స్ఇంటర్నెట్ డేటా సదుపాయం లేకుండా కాలింగ్, ఎస్ఎంఎస్ ల పూర్తి ప్రయోజనాన్ని అందించే రెండు ప్లాన్లను ఎయిర్ టెల్ ప్రవేశపెట్టింది. 84 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ రూ.469కి అందుబాటులో ఉంది. ఇది దేశవ్యాప్తంగా అపరిమిత కాలింగ్, ఉచిత రోమింగ్, 900 ఎస్ఎంఎస్లను అందిస్తోంది. 365 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ ధర రూ.1849. ఇందులో అపరిమిత కాలింగ్, ఉచిత రోమింగ్, ఏడాది పొడవునా 3600 ఎస్ఎంఎస్లు లభిస్తాయి.జియో లాంగ్ వాలిడిటీ ఆఫర్లు84 రోజులు, 336 రోజుల వాలిడిటీ ఉన్న రెండు డేటా ఫ్రీ ప్లాన్లను జియో అందిస్తోంది. రూ.448 విలువైన 84 రోజుల ప్లాన్ ద్వారా అపరిమిత కాలింగ్, 1000 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. అదే సమయంలో రూ .1748 విలువైన 336 రోజుల ప్లాన్ వినియోగదారులకు అన్లిమిటెడ్ కాలింగ్, 3600 ఎస్ఎంఎస్ల సదుపాయాన్ని అందిస్తుంది.వొడాఫోన్ ఐడియా ప్లాన్స్వొడాఫోన్ ఐడియా కూడా ఎయిర్టెల్ మాదిరిగానే రెండు ప్లాన్లను లాంచ్ చేసింది. రూ.470 ప్లాన్లో యూజర్లకు 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రూ.1849 ప్లాన్తో 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రెండు ప్లాన్లు అపరిమిత కాలింగ్, ఎస్ఎంఎస్లను అందిస్తాయి. ఇది దాదాపు ఎయిర్టెల్ ఆఫర్లను పోలి ఉంటుంది.చదవండి: ఎయిర్టెల్ కొత్త రీచార్జ్ ప్లాన్.. ఓటీటీలన్నీ ఫ్రీ.. -
ఎప్పుడూ ఊహించని కొత్త ఉద్యోగాలొస్తాయ్..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వ్యవస్థలు రోజురోజుకూ మెరుగవుతున్నకొద్దీ మానవ ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన పెరుగుతోంది. మనుషులు చేయగలిగే పనులన్నీ ఏఐ చేసేస్తుండటంతో మానవ ఉద్యోగాలను త్వరలోనే ఈ కొత్త ఏఐ టూల్స్ భర్తీ చేసే ప్రమాదం ఎక్కువవుతోంది.టెక్ దిగ్గజాల సీఈవోలూ ఇదే హెచ్చరిస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో తమ కంపెనీలోని ఉద్యోగులను ఏఐ తగ్గిస్తుందని స్వయంగా అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీనే కొన్ని వారాలుగా చెబుతూ వస్తున్నారు. ప్రతి ఒక్కరి ఉద్యోగాలు ప్రభావితమవుతాయని ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ కూడా ఇటీవల హెచ్చరించారు.సమూల మార్పుఅయితే,ఈ క్రమంలో ఉద్యోగుల్లో ఏఐపై ఉన్న భయాల్ని పొగొట్టేలా గూగుల్ డీప్ మైండ్ సీఈఓ డెమిస్ హస్సాబిస్ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. ఓ అడుగు ముందుకేసి ప్రస్తుతం ప్రత్యామ్నాయంగానే ఉన్న కృత్రిమ మేధస్సుతో రాబోయే ఐదు నుండి పదేళ్లలో ఉద్యోగ భావనలోనే సమూల మార్పు సంభవించవచ్చని అభిప్రాయపడ్డారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎప్పుడూ ఊహించని విధంగా కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని ‘వైర్డ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు."ఉద్యోగ ప్రపంచంలో చాలా మార్పు ఉంటుందని నేను అనుకుంటున్నాను. కానీ గతంలో మాదిరిగానే మెరుగైన కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. ఇవి ఈ సాధనాలు లేదా కొత్త సాంకేతికతలను ఉపయోగిస్తాయి" అని హస్సాబిస్ అన్నారు.డాక్టరుకూ ముప్పు?ప్రస్తుతం మానవులు చేసే ప్రతి పనినీ ఏజీఐ లేదా ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ చేయగలిగితే, రానున్న కొత్త ఉద్యోగాలను కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానం భర్తీ చేయకుండా ఆపగలమా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమైంది. దీనికి హస్సాబిస్ బదులిస్తూ ఒక వైద్యుడి స్థానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భర్తీ చేయగలదు కానీ నర్సులను కాదు అన్నారు."సాధారణంగా డాక్టర్ ఏం చేస్తారు.. డాక్టర్ చేసే రోగ నిర్ధారణను ఏఐ టూల్ సాయంతో చేయవచ్చు. లేదా పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరహా డాక్టర్లు రావచ్చు. కానీ నర్సులు అలా కాదు. ఎందుకంటే నర్సుల ఉద్యోగంలో మానవ సహానుభూతి ఎక్కువగా ఉంటుంది" అని వివరించారు.చదవండి: ఇదిగో ఈ 40 రకాల ఉద్యోగాలకు డేంజర్! -
ఆ భాషను ఎవరూ అర్థం చేసుకోలేరు: హింటన్ హెచ్చరిక
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాజ్యమేలుతోంది. అన్ని రంగాల్లో ఏఐ హవా కొనసాగుతోంది. ఇప్పటికే చాలామంది ఉద్యోగుల్లో భయం పుట్టుకుంది. ఇలాంటి సమయంలో 'గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ'గా ప్రసిద్ధి చెందిన 'జియోఫ్రీ హింటన్' (Geoffrey Hinton) ఓ హెచ్చరిక జారీ చేశారు.ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత అయిన జియోఫ్రీ హింటన్ 'వన్ డెసిషన్' పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ప్రస్తుతం, AI ఇంగ్లీషులో ఆలోచిస్తుంది. కాబట్టి డెవలపర్లు కూడా టెక్నాలజీ ఏమి ఆలోచిస్తుందనే విషయాన్ని ట్రాక్ చేయడానికి వీలు కలుగుతోంది. అయితే ఇది త్వరలోనే ఓ సొంత ప్రైవేట్ భాషను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. ఆ భాషను మానవ సృష్టికర్తలు కూడా అర్థం చేసుకోలేరని హెచ్చరించారు.యంత్రాలు ఇప్పటికే భయంకరమైన ఆలోచనలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని ప్రదర్శించాయి. ఆ ఆలోచనలు ఎల్లప్పుడూ మనం ట్రాక్ చేయగల భాషలోనే ఉంటాయని భావించకూడదు. ఇదే జరిగితే ఆ తరువాత జరిగే పరిణాలను అంచనా వేయలేము.ఇదీ చదవండి: విదేశీ గడ్డపై వేల కోట్ల సామ్రాజ్యం.. ఎవరీ భారతీయుడు?హింటన్ చేసిన కృషి AI వ్యవస్థలకు మార్గం సుగమం చేసింది. కానీ భద్రతా గురించి ఆలోచించలేదని ఒప్పుకున్నారు. అప్పట్లోనే ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో అని గ్రహించి ఉండాల్సింది. ఇప్పుడు ఆలస్యమైంది. కాబట్టి జాగ్రత్తపడాల్సిన అవసరాన్ని గురించి ఆయన వెల్లడించారు. జ్ఞానాన్ని శ్రమతో పంచుకోవాల్సిన మానవుల మాదిరిగా కాకుండా, ఏఐ తమకు తెలిసిన వాటిని క్షణంలో కాపీ చేసి పేస్ట్ చేయగలవు. ఇదే ప్రస్తుతం చాలా రంగాలను భయపెడుతోంది. దీని గురించే హింటన్ కూడా భయపడుతున్నారు. -
ఈ సీఈవో శాలరీ.. ఐటీ కంపెనీల్లోనే టాప్
ప్రముఖ ఐటీ కంపెనీ హెచ్సీఎల్టెక్ సీఈవో సి.విజయకుమార్ రికార్డు స్థాయి వేతనం అందుకున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆయన 10.85 మిలియన్ డాలర్లు (సుమారు రూ.94.6 కోట్లు) సంపాదించారు. ఇది భారతీయ ఐటీ రంగంలో ఎగ్జిక్యూటివ్లు పొందుతున్న అత్యధిక వేతనంగా నిలిచింది.విజయకుమార్ వేతనం పెద్ద పోటీ సంస్థలైన టీసీఎస్, ఇన్ఫోసిస్ ఛీప్ల సంపాదనను సైతం అధిగమించింది. అంతేకాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆయన ప్రస్తుత వేతనాన్ని 71 శాతం పెంచి 18.6 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.154 కోట్లు) పెంచుకోవడానికి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపిందని కంపెనీ వార్షిక నివేదిక తెలిపింది.ఇదే సమయంలో టీసీఎస్ సీఈఓ కృతివాసన్ వేతనం రూ.26.52 కోట్లు కాగా, ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ వేతనం రూ.80.62 కోట్లుగా ఉంది. అలాగే విప్రో సీఈఓ శ్రీనివాస్ పలియా ఆర్జన సుమారు రూ.53.64 కోట్లు, టెక్ మహీంద్రా సీఈఓ మోహిత్ జోషి సంపాదన రూ.53.9 కోట్లుగా ఉన్నాయి.2025 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో విజయకుమార్ అందుకున్న మొత్తం పరిహారంలో మూల వేతనం 1.96 మిలియన్ డాలర్లు కాగా పనితీరు ఆధారిత బోనస్ 1.73 మిలియన్ డాలర్లుగా ఉందని హెచ్సీఎల్టెక్ వార్షిక నివేదిక తెలిపింది.ఆయన సంపాదనలో ఎక్కువ భాగం దీర్ఘకాలిక ప్రోత్సాహకాలు 6.96 మిలియన్ డాలర్ల విలువైన నియంత్రిత స్టాక్ యూనిట్లు (ఆర్ఎస్యూలు) నుంచే వచ్చింది. ఇవికాక బెనిఫిట్స్, పెర్క్విసైట్స్ కింద అదనంగా మరో 0.20 మిలియన్ డాలర్లు లభించాయి.2016లో హెచ్సీఎల్టెక్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన విజయకుమార్ అమెరికాలో ఉంటూ తన రెమ్యూనరేషన్ను కంపెనీకి చెందిన అమెరికా అనుబంధ సంస్థ హెచ్సీఎల్ అమెరికా ఇంక్ నుంచి తీసుకుంటున్నారు.👉ఇది చదివారా? కాగ్నిజెంట్లో జీతాల పెంపు.. సీఎఫ్వో కీలక ప్రకటన -
ఏడబ్ల్యూఎస్ కొత్త సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మోడల్
బెంగళూరు: అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) కొత్తగా ఏఐ డ్రివెన్ డెవలప్మెంట్ లైఫ్సైకిల్ (ఏఐ–డీఎల్సీ) మోడల్ను ఆవిష్కరించింది. కైరో, అమెజాన్ క్యూ డెవలపర్లాంటి టూల్స్ను ఉపయోగించి, కృత్రిమ మేథ (ఏఐ)తో సాఫ్ట్వేర్ను రూపొందించేందుకు ఇది ఉపయోగపడుతుంది.దీనితో మానవ పర్యవేక్షణలో కోడింగ్, టెస్టింగ్లాంటి పనులను ఆటోమేట్ చేయడం ద్వారా సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసే వ్యవధిని నెలల నుంచి రోజుల స్థాయిలోకి కుదించవచ్చని సంస్థ తెలిపింది. అలాగే మెరుగైన ఏఐ విధానాలను షేర్ చేసుకునేందుకు ఏఐ–నేటివ్ బిల్డర్స్ కమ్యూనిటీని కూడా ప్రవేశపెట్టినట్లు వివరించింది.అటు ఏడబ్ల్యూఎస్ స్కిల్ బిల్డర్ ద్వారా అంతర్జాతీయంగా 27 లక్షల మంది విద్యార్థులకు, ఉచితంగా ఏఐ ట్రైనింగ్ యాక్సెస్ అందిస్తున్నట్లు ఏడబ్ల్యూఎస్ తెలిపింది. జనరేటివ్ ఏఐని ఉపయోగించి వాస్తవ ప్రపంచపు సవాళ్లను పరిష్కరించే డెవలపర్లకు 2 మిలియన్ డాలర్ల విలువ చేసే క్రెడిట్స్ను ఇచ్చేలా ఏడబ్ల్యూఎస్ ఏఐ లీగ్ను కూడా ప్రకటించింది. -
చదువు నేర్పించే చిట్టి మిత్రుడు.. క్యూట్ టైమ్ మేనేజర్
పిల్లలకు ఫ్రెండ్స్ అవసరం లేదు, ఫీచర్లే సరిపోతాయి. ఆటల్లో ఆటోమెషిన్, కథల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చదువులో టెక్నాలజీ అసిస్టెంట్స్.. ఇలా ఇవన్నీ చిన్నారుల చిట్టి మిత్రులుగా మారిపోయాయి.ఆల్ ఇన్ వన్ ఫ్రెండ్!పిల్లలతో ఆడుతూ పాడుతూ కథలు చెబుతూ, చదువు నేర్పించే చిట్టి మిత్రుడు ఇప్పుడు ఇంటికే వచ్చేశాడు. అదే ‘మికో మినీ’. చూడటానికి చిన్న ఆటబొమ్మలా కనిపించే ఇది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఒక తెలివైన రోబో. పిల్లల ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెబుతుంది. చదువు, డాన్స్, పాటలు, గేమ్స్ ఇలా అన్ని రంగాల్లో పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ నేర్పిస్తుంది. చదువు, ఆలోచనా శక్తి, కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంచేలా రోజువారీ ప్రణాళికలు తయారు చేసి ఇస్తుంది. ముఖ్యంగా అత్యవసర సమయాల్లో తల్లిదండ్రుల నంబర్లకు, ఇతర ఎమర్జెన్సీ నంబర్లకు సమాచారం ఇచ్చే ఫీచర్ కూడా ఇందులో ఉంది. ధర కేవలం రూ. 13,999 మాత్రమే!క్యూట్ టైమ్ మేనేజర్!పిల్లల షెడ్యూల్ చూస్తే బిలియనీర్ బిజినెస్మెన్ కంటే తక్కువేమీ ఉండదు. ఉదయం స్కూల్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం హోంవర్క్, ఆ తర్వాత ఆటలు, ఇలా చాలానే ఉంటాయి. అందుకే, వాళ్ల బిజీ షెడ్యూల్కి బ్రిలియంట్ అసిస్టెంట్గా వచ్చింది ఈ స్మార్ట్ గాడ్జెట్. పేరు ‘చాంపియన్ కిడ్స్ అండ్ టీన్స్ స్మార్ట్వాచ్’. ఇది పిల్లలకి ఓ చిట్టి మేనేజర్లా పనిచేస్తుంది. హార్ట్బీట్ చెక్, నిద్ర ట్రాక్ చేయడంతో పాటు ‘నీళ్లు తాగు’ అని వేళకు గుర్తు చేస్తుంది. ఇలా మరెన్నో ఇందులో సెట్ చేసుకోవచ్చు. స్కూల్ మోడ్ ఆన్ చేస్తే, చదువుకు ఆటంకం రాకుండా మేనేజ్ చేస్తుంది. పనితో పాటు సరదా కోసం గేమ్స్, మ్యూజిక్, కెమెరా, క్యాలిక్యులేటర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇక ఇందులో సిమ్ వేసుకుని, ఫోన్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. అచ్చం ఓ మినీ ఫోన్ మాదిరిగా పనిచేస్తుంది. రోజుకో వాచ్ డిస్ప్లే మార్చుకోవచ్చు. వర్షం వచ్చినా, చెమట పట్టినా నో టెన్షన్. ఎందుకంటే, ఇది వాటర్ప్రూఫ్. ధర రూ.2,499 మాత్రమే!కథల లోకానికి గెలాక్సీ గేట్!చిట్టి చెవుల్లోకి మెల్లగా కథలు జాలువారాలంటే, మామూలు హెడ్ఫోన్లు పనికిరావు. అందుకే వచ్చిందీ కొత్త ‘గెలాక్సీ హెడ్ఫోన్’. పిల్లల చెవులకు హాని చేయకుండా, హాయి గొలిపేలా కథలు వినిపిస్తుంది. ఇందులో ఏకంగా ఐదు వందలకు పైగా కథలు, పాటలు ముందే స్టోర్ చేసి ఉంటాయి. అవసరమైతే మరిన్ని కథలను స్టోర్ చేసుకునే అవకాశం ఉంది. స్క్రీన్ ఏదీ అవసరం లేకుండానే నేరుగా దీనిని పెట్టుకుని కథలు వినవచ్చు. కేవలం పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, భద్రతకు అనుగుణంగా వాల్యూమ్ను నియంత్రించేలా రూపొందించారు. ఒక్కసారి ఇది పెట్టుకున్న వెంటనే పిల్లలు కథల ప్రపంచంలోకి వెళ్లిపోతారు. అన్ బ్రేకబుల్ బాడీతో, డిటాచబుల్ మైక్తో, మెరిసే ఎల్ఈడీ లైట్స్, మ్యాగ్నెట్ స్టిక్కర్లతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ధర కేవలం రూ. 2,999 మాత్రమే! -
ఏజెంటిక్ ఏఐ.. ఉద్యోగ విప్లవం.. ఏమిటి దీని ప్రత్యేకత?
సాధారణంగా ఏఐ అంటే.. మనం ఏదైనా అడిగితే జవాబు చెప్పే చాట్బాట్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే.. ఒక పాట ప్లే చేయమనగానే చటుక్కున ప్లే చేసే స్మార్ట్ స్పీకర్ లాంటిది. కానీ, ‘ఏజెంటిక్ ఏఐ’ దీనికి భిన్నమైనది. – సాక్షి, స్పెషల్ డెస్క్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో మార్పులు, ఏయే ఉద్యోగాలకు ముప్పు రావచ్చు అంటూ ఈ మధ్య మనం చాలా వింటున్నాం. అయితే, అందరూ ఊహిస్తున్న దానికంటే చాలా పెద్ద మార్పు మన ముందుకు రాబోతోంది. వచ్చే ఐదేళ్లలో దేశంలో ఏకంగా కోటికి పైగా ఉద్యోగాలను ఓ కొత్త రకం ఏఐ పూర్తిగా మార్చనుంది. అదే ’ఏజెంటిక్ ఏఐ’. అయితే ఈ మార్పు వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం అక్కర్లేదు. ఎందుకంటే.. ఇది యువతకు కొత్త అవకాశాలు, దారుల్ని తెరుస్తోంది. ఈ ఏఐతో పని వేగం పెరిగి, పనులన్నీ సులభంగా మారిపోనున్నాయి.రిటైల్ రంగంవ్యాపారాలు ఎదుర్కొనే అతి పెద్ద సవాళ్ళలో ఒకటి.. మార్కెట్ ట్రెండ్లు, వినియోగదారుల నుంచి వచ్చే సమాచారాన్ని వేగంగా విశ్లేషించడం. ఏజెంటిక్ ఏఐ ఈ సమస్యను తీరుస్తుంది. ఈ రంగంలో 76 లక్షల ఉద్యోగాలు మార్పునకు గురవుతాయట. ఏఐ ఏజెంట్లు కస్టమర్ల ఇష్టాలను బట్టి వారికి నచ్చే వస్తువులను చూపించడం, ఎప్పుడు ఏ వస్తువు స్టాక్లో ఉందో తెలుసుకోవడం, కస్టమర్ సర్వీస్కు జవాబులు చెప్పడం వంటివి చేస్తాయి. ఈ ఏఐ వల్ల ఉద్యోగులకు విలువైన సమయం ఆదా అవుతుంది. వారు మార్కెట్ మార్పులకు స్పందించడంపై దృష్టి పెట్టొచ్చు. అయితే, ఈ ఏఐ నిర్ణయాలకు మనుషుల పర్యవేక్షణ చాలా ముఖ్యం. ఆటోమేషన్, మానవ నిర్ణయాల మధ్య సమతుల్యత సాధించొచ్చు.విప్లవాత్మక మార్పులు!ఈ ఏజెంటిక్ ఏఐ మన రోజువారీ జీవితాన్ని, ముఖ్యంగా పనిచేసే విధానాన్ని పూర్తిగా మార్చేయనుంది అంటున్నారు టెక్ నిపుణులు.పని విధానంలో మార్పులు: మనం చేసే కొన్ని పనులు బోరింగ్గా, రోజూ ఒకే రకంగా ఉంటాయి. ఈ ఏఐ ఆ రొటీన్ పనులను పూర్తిగా తన చెప్పుచేతల్లోకి తీసుకుంటుంది. దీంతో మనుషులు క్రియేటివ్గా ఆలోచించడం, కొత్త వ్యూహాలు రూపొందించడం లాంటి కీలకమైన పనులపై దృష్టి పెట్టొచ్చు.కొత్త ఉద్యోగాలు, కొత్త నైపుణ్యాలు: ఏఐ వల్ల కొన్ని ఉద్యోగాలు మారినా, కొత్త ఉద్యోగాలూ పుట్టుకొస్తాయి. ఉదాహరణకు, డేటా ఎంట్రీ చేసేవాళ్లు ఏఐని ఎలా ఉపయోగించాలి అని గైడ్ చేసే ‘ఏఐ సూపర్ వైజర్’గా మారొచ్చు. ఈ మార్పును ఎదుర్కోవడానికి మనం ఏఐ టూల్స్ వాడటం, సృజనాత్మకంగా ఆలోచించడం వంటి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి.ఏయే రంగాల్లో..‘సర్వీస్నౌ ఏఐ స్కిల్స్ రీసెర్చ్ 2025’ ప్రకారం, కొన్ని కీలక రంగాల్లో ఈ ఏఐ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఈ రంగంలో ఏకంగా 80 లక్షల ఉద్యోగాలు మారబోతున్నాయి. ఏఐ ఏజెంట్లు ఒక వస్తువు తయారీకి కావాల్సిన ముడి పదార్థాలను మేనేజ్ చేయడం, యంత్రాలు ఎప్పుడు పాడైపోతాయో ముందే చెప్పడం, ఉత్పత్తి వేగాన్ని పెంచడం వంటివి చేస్తాయి. దీంతో మనుషులు యంత్రాల పర్యవేక్షణ, మరమ్మతులు వంటి పనులు చేయాల్సి రావొచ్చు.విద్యారంగంఈ రంగంలో 25 లక్షల ఉద్యోగాలు మారనున్నాయి. ఏఐ ఏజెంట్లు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా చదువుకునే ప్రణాళికలు తయారు చేయడం, అసై¯Œ మెంట్లను కరెక్ట్ చేయడం, వెంటనే ఫీడ్బ్యాక్ ఇవ్వడం వంటివి చేస్తాయి. దీంతో టీచర్లు క్లాస్రూమ్లో విద్యార్థులపై మరింత శ్రద్ధ పెట్టడం, వారికి మార్గదర్శకత్వం చేయడం వంటి వాటిపై ఫోకస్ చేయవచ్చు.ఏఐతో కలిసి పనిచేయాలిఇది కేవలం ఆటోమేషన్ మాత్రమే కాదు. పని అంటే ఏంటో తిరిగి నిర్వచించుకునే సమయం. ఈ ఏఐ విప్లవం వల్ల దేశ యువతకు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి, కొత్త రకాల ఉద్యోగాలు చేయడానికి అపారౖమెన అవకాశాలు లభిస్తాయి. ఏఐతో కలిసి పనిచేయడం ఎలాగో నేర్చుకోవాలి. అప్పుడే భవిష్యత్తులో మనం మరింత మెరుగ్గా రాణించగలుగుతాం. ఏజెంటిక్ ఏఐ అనేది మన శత్రువు కాదు, మన పనిని సులభతరం చేసే ఒక స్మార్ట్ పార్ట్నర్.– సుమీత్ మాథుర్, ఎస్వీపీ–ఎండీ, సర్వీస్నౌ ఇండియాడేటా సెక్యూరిటీ సమస్యఏజెంటిక్ ఏఐ వల్ల డేటా సెక్యూరిటీ విషయంలో కంపెనీలకు ఇంకా పూర్తి స్పష్టత రాలేదని సర్వీస్నౌ నివేదిక చెబుతోంది. ఇందుకోసం ఎలాంటి నైపుణ్యాలు అవసరమవుతాయో తమకు తెలియడం లేదని 26 శాతం కంపెనీలు చెప్పాయట. -
అగ్రరాజ్యంతో పోటీపడుతున్న భారత్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ).. నిపుణుల నియామకాల్లో తొలి స్థానంలో నిలిచి మన దేశం ప్రపంచం ఔరా అనిపించేలా చేసింది. మొత్తం ఏఐ నైపుణ్యాల్లో.. అత్యధిక నైపుణ్యాలున్న దేశం అమెరికా కాగా, రెండో స్థానంలో భారత్ ఉంది. అంటే అగ్రరాజ్యంతో నువ్వా నేనా అన్నట్టు భారత్ పోటీపడుతోంది. పేటెంట్లు.. అందులో మళ్లీ ఏఐ పేటెంట్ల విషయంలో మాత్రం మనం చాలా వెనకబడి ఉన్నాం.ప్రపంచంలో అత్యధిక ఏఐ నైపుణ్యాలు కలిగిన ఐటీ ఇంజనీర్లు ఉన్న దేశాల్లో యూఎస్ టాప్–1లో నిలిచింది. మొత్తం ఏఐ నైపుణ్యాల్లో.. ఈ దేశంలోని ఐటీ ఇంజనీర్లలో సగటున 2.63 శాతం నైపుణ్యాలు ఉన్నాయి. మనదేశంలో ఇది 2.51 శాతంగా ఉంది. ఈ విషయంలో యూకే, జర్మనీ, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, స్పెయిన్ మన కంటే వెనుకబడి ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐటీ ఇంజనీర్లలో ఏఐ నిపుణుల వాటా 1 శాతమే. భారత్లో లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్పై గత ఏడాది జరిగిన మొత్తం నియామకాల్లో 33.39 శాతం ఏఐ సంబంధ రోల్స్ ఉండడం విశేషం. ఈ స్థాయిలో ఏఐ రిక్రూట్మెంట్ జరగడంతో ప్రపంచంలోనే మనం టాప్లో నిలిచాం. ఏఐ పబ్లికేషన్ల విషయంలో కూడా 2013– 23 మధ్య 9.22 శాతం వాటాతో అమెరికా (America) కంటే మనమే ముందున్నాం. ఈ విషయంలో చైనా (China) 23.20 శాతంతో మొదటి స్థానంలో ఉంది.చదవండి: డిబ్బి డబ్బులతో కాలేజీ ఫీజులు కట్టేస్తున్న స్కూల్ పిల్లలు!పరిశోధకుల్లో వెనకడుగే..అంతర్జాతీయంగా ఏఐ పరిశోధకుల్లో టాప్–2 శాతంలో మనవాళ్లు లేకపోవడం నిరాశపరుస్తోంది. ఈ విషయంలో యూఎస్, చైనా ఆధిపత్యం చెలాయిస్తున్నాయి, మరో ముఖ్యమైన విషయం.. మన ఏఐ నిపుణులు (AI Experts) మనదేశం నుంచి తరలిపోవడం. గత ఏడాది లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్పై.. భారత్లో సగటున ప్రతి 10,000 మంది ఏఐ నిపుణులకుగాను 1.55 మంది మన దేశం నుండి నిష్క్రమించారు. ఇలా అత్యధికులు వెళ్లిపోతున్న దేశంగా ఇజ్రాయెల్ తరువాత మనదేశం ఉందని ‘స్టాన్ ఫోర్డ్ ఏఐ ఇండెక్స్ 2025’ నివేదిక వెల్లడించింది.పేటెంట్లలో చైనా జోరు..ఏఐ పేటెంట్లలో కూడా మన దేశం వెనుకబడి ఉంది. 2024లో ప్రైవేట్ ఏఐ పెట్టుబడుల్లో కేవలం 1.16 బిలియన్ డాలర్లను మాత్రమే భారత్ ఆకర్షించింది. యూఎస్ ఏకంగా 109.08 బిలియన్ డాలర్ల నిధులను అందుకుంది. నిపుణులు, విస్తృతి పెరిగినప్పటికీ చాట్జీపీటీ లేదా డీప్సీక్ వంటి ప్రపంచవ్యాప్తంగా పేరొందిన చాట్బాట్లు రూపొందించే స్థాయిలో భారత్ పురోగతి సాధించలేదు. ప్రతిభను అగ్రశ్రేణి పరిశోధన, పేటెంట్ పొందిన ఆవిష్కరణలు, బిలియన్ డాలర్ల ఏఐ ఉత్పత్తులను అందించేలా మలచడంలో పర్యావరణ వ్యవస్థ లేకపోవడం భారత్కు ప్రతికూలాంశంగా నిపుణులు చెబుతున్నారు. -
ఒక్క నెలలో 98 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్
ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్ గత జూన్ నెలలో భారత్లో భారీ సంఖ్యలో అకౌంట్లను బ్యాన్ చేసింది. దుర్వినియోగం, హానికరమైన కార్యకలాపాలను నిరోధించే ప్రయత్నాలలో భాగంగా జూన్ నెలలో భారత్లో 98 లక్షలకు పైగా ఖాతాలను నిషేధించింది. వీటిలో 19.79 లక్షల ఖాతాలను యూజర్ల ఫిర్యాదులు రాకముందే బ్యాన్ చేసింది.వాట్సాప్లో అనుమానాస్పద, హానికరమైన ఖాతాలపై యూజర్ల నుంచి ఎప్పటికప్పుడు ఫిర్యాదులు అందుతుంటాయి. అందులో భాగంగా వాట్సాప్ కు భారత్ లోని యూజర్ల నుంచి 23,596 ఫిర్యాదులు అందాయి. వాటిని పరిశీలించి 1,001 ఖాతాలపై చర్యలు తీసుకున్నారు. ఇందులో కొన్ని ఖాతాలను నిషేధించడం, తప్పుగా నిషేధించిన మరికొన్నింటిని పునరుద్ధరించడం వంటివి ఉన్నాయి. వీటిలో 16,069 ఫిర్యాదులు నిషేధ అప్పీళ్లకు సంబంధించినవే కావడం గమనార్హం. ఫలితంగా 756 ఖాతాలపై చర్యలు తీసుకున్నారు. ఇతర ఫిర్యాదులు ఖాతా మద్దతు, ఉత్పత్తి సంబంధిత సమస్యలు, భద్రతా సమస్యల గురించి ఉన్నాయి.ఖాతా క్రియేట్ చేసినప్పుడు, మెసేజ్లు పంపుతున్నప్పుడు, యూజర్ రిపోర్టులు లేదా బ్లాక్స్ వంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు మూడు దశల్లో దుర్వినియోగాన్ని గుర్తిస్తామని వాట్సాప్ వివరించింది. నివారణ తమ ప్రాథమిక దృష్టి అని కంపెనీ తెలిపింది. ఎందుకంటే హానికరమైన చర్యను తరువాత గుర్తించడం కంటే అది జరగడానికి ముందు ఆపడం మరింత ప్రభావవంతంగా ఉంటుంది. దుర్వినియోగం, తప్పుడు సమాచారం, భద్రతా ముప్పులతో పోరాడటానికి ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్, భద్రతా సాధనాలు, ప్రత్యేక బృందాలను ఉపయోగిస్తున్నట్లు వాట్సాప్ యాజమాన్యం పేర్కొంది. -
భౌతికశాస్త్ర నియమాలకు సవాలు.. మస్క్ ఫైటర్ జెట్
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత 'ఎలాన్ మస్క్' టెక్నాలజీలో సరికొత్త మార్గాలను అన్వేషిస్తూ.. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెడుతూనే ఉంటారు. ఇందులో భాగంగానే భౌతిక శాస్త్ర నియమాలనే సవాలు చేసే ఒక కొత్త యుద్ధ విమానాన్ని ఆవిష్కరించారు. దీని పేరు 'యూఎఫ్ఓ ఫైటర్' (UFO Fighter).ఎలాన్ మస్క్ ఆవిష్కరించిన యుద్ధ విమానం యూఎఫ్ఓ ఫైటర్.. ఇప్పటి వరకు ఉన్న అన్ని విమానాలకంటే భిన్నంగా, ప్రత్యేకంగా ఉంటుంది. ఈ జెట్ చాలా వేగంగా ప్రయాణించగలదు. అంతే కాకుండా.. అసాధ్యమైన విన్యాసాలు చేయగలదని, ఆకాశంలో నిశ్శబ్దంగా పనిచేయగలదని మస్క్ వెల్లడించారు.ఇదీ చదవండి: మేమంతా ఆమె వెంటే.. వేలకోట్ల ఆఫర్ వదులుకున్న ఉద్యోగులుమస్క్ ఆవిష్కరించిన కొత్త యూఎఫ్ఓ ఫైటర్.. ఎంతోమంది నిపుణులను సైతం ఆశ్చర్యపరిచింది. కొందరు ఈ ఫైటర్ జెట్ మీద కొంత సందేహాస్పదంగానే ఉన్నారు. ఇది టెక్నాలజీనా? లేక దార్శనిక భావననా? అని అనుకుంటున్నారు. అయితే మస్క్ కొత్త ఆవిష్కరణ ఓ సరికొత్త విప్లవానికి నాంది పలకనుంది. లేటెస్ట్ ఏరోస్పేస్ టెక్నాలజీ మానవాళి భవిష్యత్తుకు దోహదపడుతుందని పలువురు చెబుతున్నారు. అయితే మస్క్ యూఎఫ్ఓ ఫైటర్ గురించి చాలా విషయాలు తెలియాల్సి ఉంది. -
మేమంతా ఆమె వెంటే.. వేలకోట్ల ఆఫర్ వదులుకున్న ఉద్యోగులు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాజ్యమేలుతోంది. ఈ రంగంలో ప్రతిభ ఉన్నవారిని అవకాశాలు తప్పకుండా వెతుక్కుంటూ వస్తాయని ఎంతోమంది నిపుణులు చెబుతూనే ఉన్నారు. ఆ మాటలే ఇప్పుడు నిజమయ్యాయి. కృత్రిమ మేధలో ట్యాలెంట్ ఉన్న ఓ కంపెనీ ఉద్యోగులకు.. దిగ్గజ సంస్థలు వేలకోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చాయి. కానీ వారు మాత్రం తమ బాస్ను వదిలిపెట్టకుండా.. ఆఫర్లను తృణప్రాయంగా భావించారు.మీరా మురాటీ 2025 ఫిబ్రవరిలో ఏఐ స్టార్టప్ 'థింకింగ్ మెషీన్స్ ల్యాబ్' ప్రారంభించారు. ఇందులో పనిచేస్తున్నవారందరూ కూడా గతంలో పెద్ద కంపెనీలలో పనిచేసి వచ్చినవారే. అయితే వీరిలో కొందరికి.. 'మార్క్ జుకర్బర్గ్'కు చెందిన మెటా.. దాని AI సూపర్ ఇంటెలిజెన్స్ బృందంలో చేరడానికి ఒక బిలియన్ డాలర్లను (రూ.8,755 కోట్లు) ఆఫర్ చేసినట్లు ఓ అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.నిజానికి మీరా మురాటీ తన థింకింగ్ మెషీన్స్ ల్యాబ్ ప్రారంభించి.. ఏడాది కూడా పూర్తి కాలేదు. అంతే కాకుండా ఈ కంపెనీ ఒక్క ఉత్పత్తిని కూడా మార్కెట్లోకి విడుదల చేయలేదు. కానీ అప్పుడే ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు భారీ ఆఫర్స్ వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే ఏఐలో నైపుణ్యం ఉన్నవారికి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో స్పష్టమవుతోంది.ఇదీ చదవండి: సమయాన్ని, డబ్బును దేనికి ఖర్చు చేస్తారు?: రాబర్ట్ కియోసాకిథింకింగ్ మెషీన్స్ ల్యాబ్లో పనిచేస్తున్న ఉద్యోగులు మాత్రం.. వారికి వచ్చిన ఆఫర్స్ వద్దనుకుని మీరా మురాటితో పాటు ఉండటానికే ఆసక్తి చూపించినట్లు సమాచారం. దీనికి కారణం మురాటీ నాయకత్వం.. భవిష్యత్ అంచనాలు కారణమై ఉంటాయని పలువురు భావిస్తున్నారు. కాగా ఈ కంపెనీ మార్కెట్ విలువ 12 బిలియన్ డాలర్లు.ఎవరీ మీరా మురాటీ?ఇంజినీరింగ్ చేసిన మీరా మురాటీ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ ‘టెస్లా’లో ప్రొడక్ట్ మేనేజర్గా పనిచేశారు. ఆ తరువాత వర్చువల్ రియాలిటీ స్టార్టప్ ‘లిప్ మోషన్’లో పనిచేసి.. 2016లో ‘ఓపెన్ ఏఐ’లో చేరి అడ్వాన్స్డ్ ఏఐ మోడల్స్, టూల్స్ డెవలప్మెంట్లో కీలక పాత్ర పోషిస్తూ.. చీఫ్ టెక్నికల్ ఆఫీసర్(సీటీవో) స్థాయికి ఎదిగారు. సొంతంగా కంపెనీ స్థాపించాలనే తపనతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘ఓపెన్ఏఐ’కి గుడ్బై చెప్పి.. థింకింగ్ మెషీన్స్ ల్యాబ్ స్థాపించారు.అల్బేనియాలో పుట్టిన మీరా మురాటీకి చిన్నప్పటి నుంచి సాంకేతిక విషయాలపై అమితమైన ఆసక్తి. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు సాంకేతిక జ్ఞానం పరిష్కారం చూపుతుందనేది ఆమె నమ్మకం. అదే ఈ రోజు ఎన్నో గొప్ప కంపెనీలను సైతం ఆకర్శించేలా చేసింది. -
కంటెంట్ క్రియేటర్ల పీక నొక్కిన యూఏఈ
సోషల్ మీడియా ప్రమోషన్ల కోసం కంటెంట్ క్రియేటర్లందరికీ తప్పనిసరిగా ‘అడ్వర్టైజర్ పర్మిట్’ అవసరమని యూఏఈ మీడియా కౌన్సిల్ ప్రకటించింది. కంటెంట్ క్రియేటర్లు అధికారిక వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఈ అనుమతి మంజూరు చేస్తామని తెలిపింది. ఈ విధానం త్వరలో అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. అయితే కంటెంట్ క్రియేటర్లకు ఈ అనుమతులు మొదటి మూడేళ్లు ఉచితంగా ఇవ్వబోతున్నట్లు తెలిపింది. ఆ తర్వాత రెన్యువల్ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.క్రియేటర్లు దరఖాస్తు చేసుకున్న తర్వాత వెరిఫై చేసి ప్రభుత్వం వారికి పర్మిట్ నంబర్లను కేటాయిస్తుంది. ఈ పర్మిట్ నంబర్లను కంటెంట్ క్రియేటర్లు తమ అకౌంట్లపై స్పష్టంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. కౌన్సిల్ నుంచి అనుమతులు పొందిన తరువాత మాత్రమే ప్రకటనలు పోస్ట్ చేయాలి. యూఏఈ మీడియా కౌన్సిల్ సెక్రటరీ జనరల్ మొహమ్మద్ సయీద్ అల్ షెహి మాట్లాడుతూ.. ‘అడ్వర్టైజర్ పర్మిట్ అనేది ప్రజా హక్కులను కాపాడుతుంది. కంటెంట్ సృష్టికర్తలు, ప్రకటనదారులు, ప్రేక్షకుల మధ్య బాధ్యతాయుతమైన, వృత్తిపరమైన సంబంధాలను మెరుగుపరుస్తుంది’ అని చెప్పారు. సొంత ఉత్పత్తులు లేదా సర్వీస్ లేదా కంపెనీని ప్రమోట్ చేయడానికి వ్యక్తిగత ఖాతాలను ఉపయోగించే వారికి ఈ నియమం నుంచి మినహాయింపు ఇస్తామని కౌన్సిల్ పేర్కొంది. ఎడ్యుకేషన్, అథ్లెటిక్, సాంస్కృతిక లేదా అవగాహన కార్యకలాపాలలో పాల్గొనే 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వారికి ఈ వెసులుబాటు ఉంటుందని చెప్పింది.యూఏఈ మీడియా కౌన్సిల్లో స్ట్రాటజీ అండ్ మీడియా పాలసీ సెక్టార్ సీఈఓ మైతా మజీద్ అల్ సువైది మాట్లాడుతూ.. కౌన్సిల్ ద్వారా లైసెన్స్ పొందిన వ్యక్తులతో మాత్రమే కంపెనీలు, సంస్థలు టైఆప్ కావాలని తెలిపారు. విజిటింగ్ కంటెంట్ క్రియేటర్లు ‘విజిటర్ అడ్వర్టైజర్ పర్మిట్’ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మూడు నెలలు చెల్లుబాటు అవుతుంది. తర్వాత మూడు నెలలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి. యూఏఈలో కౌన్సిల్ ఆమోదించిన లైసెన్స్డ్ అడ్వర్టైజింగ్ లేదా టాలెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీల ద్వారా రిజిస్ట్రేషన్లు నిర్వహించనున్నారు.భారత్పై ప్రభావం ఎంతంటే..భారత్ కేవలం యూఏఈకి పొరుగు దేశం మాత్రమే కాదు. ఇది దాని డిజిటల్, కల్చరల్ ఎకోసిస్టమ్లో కీలకమైన స్థానంలో ఉంది. యూఏఈ డిజిటల్ టాలెంట్ పూల్లో భారతీయ క్రియేటర్లు, ఫ్రీలాన్సర్లు, ఇన్ఫ్లూయెన్సర్లు గణనీయమైన భాగం ఉన్నారు. తాజా నిర్ణయంతో యూఏఈ ఆధారిత ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకున్న భారతీయ ఇన్ఫ్లూయెన్సర్లపై ప్రభావం ఉండనుంది. అక్కడ నివసిస్తున్న ఎన్ఆర్ఐలు, భారతీయ ప్రవాసులు కంటెంట్ను సృష్టించడంలో సదరు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. భారతీయ బ్రాండ్లు, ఏజెన్సీలు యూఏఈ ఆధారిత ఇన్ఫ్లుయెన్సర్లతో కలిసి పనిచేయడం లేదా గల్ఫ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ప్రచారాలను నిర్వహించడంలో కొంత ఇబ్బందులు ఎదురవ్వొచ్చు.మన కంటెంట్ క్రియేటర్లకు కొత్త సవాళ్లుప్రమోషనల్ కంటెంట్పై చెల్లుబాటు అయ్యే ప్రకటనదారు పర్మిట్ నెంబరును పొందాల్సి ఉంటుంది. దీన్ని బహిరంగంగా ప్రదర్శించాలి.కంటెంట్ సృష్టించే స్వల్పకాలిక సృష్టికర్తలు లేదా పర్యాటకులకు యూఏఈ ఆధారిత ఏజెన్సీ స్పాన్సర్షిప్ అవసరం.అన్పెయిడ్ ఎండార్స్మెంట్లు ఇప్పుడు నియంత్రణ పరిధిలోకి వస్తాయి.నిబంధనలు పాటించకపోతే భారీ జరిమానాలు, ప్లాట్ఫామ్ ఆంక్షలు లేదా నిషేధానికి కూడా దారితీసే అవకాశం ఏర్పడవచ్చు. ఇక్కడా ఇలాంటి నిబంధనలు?ఇన్ఫ్లూయెన్సర్ రెగ్యులేషన్లో భారత్ అడ్వాన్స్గానే ఉంది. అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ), వినియోగదారుల రక్షణ చట్టం ఇప్పటికే వీటి అవసరాన్ని హైలైట్ చేశాయి. భారత్లో ఇప్పటికే పెయిడ్ కొలాబరేషన్కు సంబంధించిన వివరాలను స్పష్టంగా వెల్లడించాలి. #ad, #sponsored లేదా #collab వంటి హ్యాష్ట్యాగ్లతో కంటెంట్కు లేబులింగ్ ఇవ్వాలి.యూఏఈ తీసుకున్న నిర్ణయం భారత్లో మరిన్ని నియంత్రణ చర్యలకు దారితీసే అవకాశం ఉంది. తప్పుడు సమాచారం, పెయిడ్ ఎండార్స్మెంట్లు, డిజిటల్ మార్కెటింగ్లో ఆర్థిక పారదర్శకతపై పెరుగుతున్న పరిశీలన, భారత ప్రభుత్వం లేదా నియంత్రణ సంస్థలు లైసెన్సింగ్ నమూనాలను కఠినంగా అమలు చేయడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవచ్చు.యూఏఈ అడ్వర్టైజర్ పర్మిట్ రూల్ ప్రయోజనాలుపారదర్శకతవీక్షకులు ప్రమోషనల్ కంటెంట్ను స్పష్టంగా గుర్తించగలరు. మోసపూరిత ప్రకటనల అవకాశాలను తగ్గించవచ్చు. ఇది ఇన్ఫ్లూయెన్సర్లు, ప్రేక్షకుల మధ్య ఎక్కువ నమ్మకాన్ని పెంపొందిస్తుంది.పరిశ్రమపై పక్కా ప్రమాణాలుఇన్ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ కోసం ప్రమాణాలను ఏర్పరుస్తుంది. క్రియేటర్లకు వ్యాపార అవకాశాలు అందిస్తుంది.వినియోగదారుల రక్షణముఖ్యంగా ఫైనాన్స్, హెల్త్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో ప్రేక్షకులను తప్పుదోవ పట్టించే లేదా అప్రకటిత ఎండార్స్మెంట్ల నుంచి రక్షణ లభిస్తుంది. అన్పెయిడ్ ప్రమోషన్లను కూడా నియంత్రిస్తుంది.ప్రభుత్వానికి రెవెన్యూపర్మిట్ ఫీజుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. ఇన్ఫ్లూయెన్సర్ క్యాంపెయిన్లు, బ్రాండ్ కోలాబరేషన్లపై ట్రాకింగ్ ఉంటుంది.ఇదీ చదవండి: ‘టీసీఎస్ నిర్ణయం ప్రమాదకరం’యూఏఈ ప్రకటనతో నష్టాలుచిన్న కంటెంట్ క్రియేటర్లలో నిరుత్సాహంఫ్రీలాన్సర్లు, మైక్రో-ఇన్ఫ్లూయెన్సర్లు, స్పాన్సర్ అవసరాలను నిర్వహించడం కష్టంగా మారుతుంది. కొత్తగా వచ్చేవారిని నిరుత్సాహపరుస్తుంది.యూఏఈ కాని క్రియేటర్లకు..యూఏఐ వెలుపల కంటెంట్ సృష్టికర్తలు (ఉదా. భారతదేశంలో లేదా మరెక్కడైనా) అక్కడి ప్రేక్షకులను ప్రభావితం చేసేందుకు చట్టాలు అడ్డంకిగా మారుతాయి. గ్లోబల్ డిజిటల్ కంటెంట్లో పరిధులు నిర్ధారించినట్లు అవుతుంది.సందర్శకులకు పరిమితులుతాత్కాలికంగా యూఏఈని సందర్శించే సృష్టికర్తలకు (ఉదా.ట్రావెల్ వ్లాగ్లు లేదా ఈవెంట్ల కోసం) పరిమిత అనుమతులుంటాయి. ఇందుకోసం స్థానిక స్పాన్సర్షిప్ అవసరం అవుతుంది. -
రూ.10 వేలకే వచ్చే లేటెస్ట్ బెస్ట్ 5జీ స్మార్ట్ఫోన్లు
ప్రతి నెలా ఏవో కొత్త ఫోన్లు వస్తూనే ఉంటాయి. అయితే వినియోగదారుడి అవసరాలకు సరిపోయే, బడ్జెట్కు తగిన స్మార్ట్ఫోన్లు కొన్నే ఉంటాయి. వాటిని ఎంచుకోవడం కష్టమైన పనిగా మారింది. ఈ నేపథ్యంలో సామాన్య వినియోగదారులకు బడ్జెట్లో అంటే రూ.10 వేల లోపు ధరలో జూలైలో వచ్చిన కొన్ని బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్ల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం.శాంసంగ్ ఎం06 5జీ🔹శాంసంగ్ ఎం06 5జీ స్మార్ట్ఫోన్లో 6.7 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లేను అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, ఆర్మ్ మాలి జీ57 ఎంసీ2 జీపీయూ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేస్తుంది. 4/6 జీబీ LPDDR4X ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు🔹వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ షూటర్ ఉంది.🔹సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5 ఎంఎం హెడ్ఫోన్ జాక్, సింగిల్ బాటమ్ ఫైరింగ్ స్పీకర్ ఉన్నాయి. 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉంది.ఇన్ఫినిక్స్ హాట్ 60🔹ఇన్ఫినిక్స్ హాట్ 60లో 6.7 అంగుళాల హెచ్డీ+ పంచ్ హోల్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. ఇది 7.8 మిమీ మందంతో ఉంటుంది. వాటర్, డస్ట్ ప్రూఫ్ కోసం ఐపీ 64 రేటింగ్ పొందింది. అంటే ఇది స్ప్లాష్లు, తేలికపాటి నీటి చుక్కలు పడినా ఏమీకాదు.🔹హాట్ 60 5జీ + మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ఎస్ఓసీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ సింగిల్ 6 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లో వస్తుంది. మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా 2 టీబీ వరకు అదనపు స్టోరేజ్ను పెంచుకోవచ్చు.🔹హాట్ 60 5జీ ప్లస్లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, ఎల్ఈడీ ఫ్లాష్ సపోర్ట్తో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 15 ఆధారిత కొత్త ఎక్స్ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై ఇది పనిచేస్తుంది.🔹18వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5,200 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.లావా స్టార్మ్ ప్లే🔹లావా స్టార్మ్ ప్లే ఫోన్లో 6.75 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్, 6 జీబీ ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 128 జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఎక్స్పాండబుల్ స్టోరేజ్ సపోర్ట్తో ఈ ఫోన్ పనిచేస్తుంది.🔹50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 752 ప్రైమరీ షూటర్, 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ కూడా ఉంది.🔹18వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.ఐక్యూ జెడ్10 లైట్ 5జీ🔹ఐక్యూ జెడ్10 లైట్ 6.74 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్పై ఈ ఫోన్ పనిచేస్తుంది. 8 జీబీ వరకు ఎల్ పీడీడీఆర్ 4ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్, మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా 1 టీబీ ఎక్స్ టర్నల్ స్టోరేజ్ పొందవచ్చు.🔹ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 15వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.🔹ఆప్టిక్స్ విషయానికి వస్తే, జెడ్ 10 లైట్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్తో వస్తుంది. వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ కూడా ఉంది. -
ఎయిర్టెల్ కొత్త రీచార్జ్ ప్లాన్.. ఓటీటీలన్నీ ఫ్రీ..
ఓటీటీ వినియోగదారుల కోసం టెలికాం కంపెనీలు అనేక ప్లాన్లను అందిస్తున్నాయి. అయితే ఇలాంటి ప్లాన్లలో చాలా వరకు ఖరీదైనవి లేదా ఒకటీ రెండు ఓటీటీ సర్వీసులకు మాత్రమే యాక్సెస్ కల్పిస్తాయి. కానీ ఎయిర్టెల్ ఓటీటీ వినియోగదారుల కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఇది ఒకటీ రెండు కాదు నెట్ఫ్లిక్స్, జియో హాట్స్టార్ సహా రెండు డజన్లకు పైగా ఓటీటీ ప్లాట్ఫామ్లకు ఉచిత యాక్సెస్ అందిస్తుంది.ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ పోర్ట్ఫోలియోలో ఎంపిక చేసిన ఆల్-ఇన్-వన్ ఓటీటీ ప్లాన్లను చేర్చింది. అంటే ఒక్క రీఛార్జ్ లో ఒకటీ రెండు కాదు అనేక ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు యాక్సెస్ లభిస్తుంది. ఈ ప్లాన్ల జాబితాలో రూ .279 రీఛార్జ్ టారిఫ్ ఉంది. పూర్తి నెల వాలిడిటీతో వస్తుంది. దీనితో రీఛార్జ్ చేస్తే నెల రోజుల పాటు ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ లభిస్తుంది.రూ.279తో ఆల్ ఇన్ వన్ ఓటీటీ ప్లాన్ఎయిర్టెల్ యూజర్లకు అందిస్తున్న ఈ ప్లాన్ డేటా బూస్టర్ లేదా డేటా ఓన్లీ ప్లాన్. కాబట్టి ఇందులో కాలింగ్ లేదా ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. అయితే ఒక నెల వ్యాలిడిటీతో 1 జీబీ అదనపు డేటా లభిస్తుంది. వినియోగదారులు ఏదైనా యాక్టివ్ ప్లాన్తో దీన్ని రీఛార్జ్ చేసుకోవచ్చు.ఈ ప్లాన్ అందిస్తున్న ఓటీటీ సేవల జాబితాలో నెట్ఫ్లిక్స్ బేసిక్, జియో హాట్స్టార్ సూపర్, జీ5 ప్రీమియం వంటి పెద్ద సబ్స్క్రిప్షన్లు ఉన్నాయి. వీటితో పాటు ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ ప్లే ప్రీమియం సబ్స్క్రిప్షన్ కూడా అందుబాటులో ఉంది. దీనితో వినియోగదారులు 25 కంటే ఎక్కువ ఓటీటీ సేవల కంటెంట్ను చూడవచ్చు. ఎక్స్స్ట్రీమ్ ప్లే ప్రీమియంలో సోనీలివ్, లయన్స్గేట్ ప్లే, ఆహా, చౌపాల్, హోయిచోయ్ వంటి ప్లాట్ఫామ్లను చేర్చారు. -
కాగ్నిజెంట్లో జీతాల పెంపు.. సీఎఫ్వో కీలక ప్రకటన
ఐటీ సేవల దిగ్గజం కాగ్నిజెంట్లో ఉద్యోగుల జీతాల పెంపుపై కీలక ప్రకటన చేశారు ఆ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్వో) జతిన్ దలాల్. 2025 ద్వితీయార్థంలో చాలా మంది ఉద్యోగులకు వేతన పెంపును అమలు చేయాలని కంపెనీ యోచిస్తోందని, అయితే స్థూల ఆర్థిక అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో వేతన పెంపు తేదీని ఇంకా నిర్ణయించలేదని జతిన్ దలాల్ జూలై 31న కంపెనీ క్యూ 2 ఎర్నింగ్ కాల్ సందర్భంగా చెప్పారు.న్యూజెర్సీ కేంద్రంగా పనిచేస్తున్న కాగ్నిజెంట్ సాధారణంగా ఆగస్టు 1 నుంచి వార్షిక వేతన పెంపును ప్రారంభిస్తుంది. అయితే ఈ ఏడాది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), విప్రో, హెచ్సీఎల్టెక్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ వంటి సంస్థలతో కలిసి కాగ్నిజెంట్ వేతన ఇంక్రిమెంట్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు వేతన పెంపును అమలు చేసిన ఏకైక ప్రధాన టైర్-1 ఐటీ సంస్థగా ఇన్ఫోసిస్ నిలిచింది.స్థూల ఆర్థిక వాతావరణం, దాని చుట్టూ ఉన్న అనిశ్చితి దృష్ట్యా వేతనాల పెంపుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని దలాల్ పేర్కొన్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో అమలు చేసే వేతన పెంపులో మెజారిటీ ఉద్యోగులను కవర్ చేయాలనేది తమ ప్రయత్నమని చెప్పారు. అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ, కాగ్నిజెంట్ స్థిరమైన హెడ్ కౌంట్ వృద్ధిని నివేదిస్తూనే ఉంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ వరుసగా 7,500 మంది ఉద్యోగులను చేర్చుకుంది, మొత్తం ఉద్యోగుల సంఖ్య 343,800 కు చేరుకుంది. అట్రిషన్ గత త్రైమాసికంతో పోలిస్తే 60 బేసిస్ పాయింట్లు తగ్గి పన్నెండు నెలల ప్రాతిపదికన 15.2 శాతానికి తగ్గింది. -
ఇదిగో ఈ 40 రకాల ఉద్యోగాలకు డేంజర్!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవంలో భాగంగా చాట్ జీపీటీ ప్రవేశపెట్టినప్పటి నుంచి విశ్లేషకులు, నిపుణులు, సీఈఓలు వైట్ కాలర్ రోల్స్ లో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఏఐ ప్రభావం కలిగించే లేదా పూర్తిగా భర్తీ చేసే అవకాశం ఉన్న 40 రకాల ఉద్యోగాలను మైక్రోసాఫ్ట్ మద్దతుతో నిర్వహించిన ఒక తాజా అధ్యయనం జాబితా చేసింది.ఉపాధ్యాయులు, పాత్రికేయులు, కాల్ సెంటర్ ఏజెంట్లు వంటి వృత్తులు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఓపెన్ఏఐ, లింక్డ్ఇన్ సహకారంతో నిర్వహించిన ఈ పరిశోధన ప్రపంచ శ్రామిక శక్తిలోని వివిధ రంగాల్లో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తృత ప్రభావాన్ని ఎత్తిచూపింది.చాట్ జీపీటీ వంటి ఏఐ సాధనాలను వేగంగా స్వీకరించడంపై పెరుగుతున్న ఆందోళనల మధ్య ఈ అధ్యయనం జరిగింది. ఈ ఏడాది ఒక్క మైక్రోసాఫ్ట్ మాత్రమే దాదాపు 15,000 తొలగింపులను ప్రకటించింది.ఏఐతో దెబ్బతినే ఉద్యోగాలుటెలిమార్కెటర్లు, ఉపాధ్యాయులు, కస్టమర్ సర్వీస్ ప్రతినిధులు, సైకాలజిస్టులు, న్యాయమూర్తులు, సామాజిక శాస్త్రవేత్తలు, న్యూస్ అనలిస్టులు, పాత్రికేయులు, టెక్నికల్ రైటర్లు, ప్రూఫ్ రీడర్లు, అనువాదకులు, సామాజిక కార్యకర్తలు, బీమా అండర్ రైటర్లు, ఆంత్రోపాలజిస్టులు, క్లినికల్ డేటా మేనేజర్లు, సర్వే పరిశోధకులు, చరిత్రకారులు, రాజకీయ శాస్త్రవేత్తలు, ఆర్బిట్రేటర్లు, ఎపిడెమియాలజిస్టులు, హెచ్ఆర్ స్పెషలిస్టులు, మధ్యవర్తులు, కెరీర్ కౌన్సిలర్లు, క్యూరేటర్లు, కరస్పాండెంట్లు, కాపీ రైటర్లు, ఎడిటర్లు, మార్కెట్ రీసెర్చ్ అనలిస్టులు, లీగల్ సెక్రటరీలు, ట్రైనింగ్ స్పెషలిస్టులు, పబ్లిక్ రిలేషన్స్ స్పెషలిస్టులు.పెద్దగా ముప్పు లేని ఉద్యోగాలుక్లీనర్లు, డిష్ వాషర్లు, కార్మికులు, కార్పెంటర్లు, పెయింటర్లు, రూఫర్లు, మెకానిక్లు, వెల్డర్లు, బచర్స్, బేకర్లు, డెలివరీ వర్కర్లు, వంటవారు, కాపలాదారులు, డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, భవన నిర్మాణ కార్మికులు, సెక్యూరిటీ గార్డులు, మేస్త్రీలు, టైలర్లు. -
మోటరోలా కొత్త ఫోన్.. రూ.18వేల లోపే పవర్ఫుల్ మొబైల్
స్మార్ట్ఫోన్ బ్రాండ్ మోటరోలా తాజాగా మోటో జీ86 పవర్ ఫోన్ను ఆవిష్కరించింది. ఇందులో 8జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ వెర్షన్ ధర రూ. 17,699గా ఉంటుంది. అదనంగా రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంటు పోగా రూ. 16,999కే లభిస్తుందని కంపెనీ తెలిపింది.ఇందులో 6.67 అంగుళాల పీఓఎల్ఈడీ సూపర్ హెచ్డీ ఫ్లాట్ డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ 7ఐ, 50 ఎంపీ ఓఐఎస్ సోనీ కెమెరా, రెండు రోజుల వరకు సరిపోయే 6720 ఎంఏహెచ్ బ్యాటరీ, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్ మొదలైన ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో అన్ని లెన్స్లతో 4కే వీడియో రికార్డింగ్ చేసే వీలుంటుంది.మోటరోలా జీ86 పవర్ స్పెసిఫికేషన్లు🔹మోటరోలా జీ86 పవర్ లో 6.67 అంగుళాల 1.5కే పీఓఎల్ఈడీ సూపర్ హెచ్డీ ఫ్లాట్ డిస్ప్లే, 4500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్ ఉన్నాయి.🔹మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఇందులో అందించారు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత హలో యూఐ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ డివైజ్ 1 సంవత్సరం ఓఎస్ అప్ గ్రేడ్ లు మరియు 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్ డేట్ లను అందిస్తుంది.🔹వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా కూడా ఉంది. ఈ స్మార్ట్ఫోన్ వెనుక భాగంలో ఫ్లిక్కర్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఏఐ ఫోటో ఎన్హాన్స్మెంట్, ఏఐ సూపర్ జూమ్, ఏఐ ఆటో స్మైల్ క్యాప్చర్, టిల్ట్ షిఫ్ట్ మోడ్ వంటి స్మార్ట్ ఫీచర్లతో మోటో ఏఐ లభిస్తుంది.🔹ఇందులోని 6,720 ఎంఏహెచ్ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 53 గంటల రన్ టైమ్ తో 2 రోజులకు పైగా పవర్ ను అందిస్తుంది. ఇందులో 33వాట్ టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జర్ ను అందించారు. -
మరో ఐదేళ్లలో విభిన్న రంగాల్లో ఏఐ పాగా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలు ప్రస్తుత ఉద్యోగుల స్థానాన్ని క్రమంగా ఆక్రమిస్తున్నాయి. ఇప్పటికే చాలా సంస్థల్లోని క్లర్క్, మేనేజర్ స్థాయి ఉద్యోగాల్లో ఏజెంటిక్ ఏఐ పాగా వేసిందని సర్వీస్నౌ 2025 నివేదిక తెలిపింది. మానవులతో కలిసి పనిచేసే ఏజెంటిక్ ఏఐ పనులను ఆటోమేట్ చేయడమే కాకుండా పనిని ఎలా అంచనా వేయాలి.. మరింత సమర్థంగా ఎలా నిర్వహించాలో విశ్లేషించి అమలు చేస్తుంది.నివేదికలోని అంశాలుకంపెనీలు పేరోల్ క్లర్కులు, మేనేజర్ల స్థానంలో ఏఐ ఏజెంట్లను పూర్తిగా నియమిస్తున్నాయి.సిస్టమ్ అడ్మిన్లు, కన్సల్టెంట్ల స్థానంలో కంపెనీలు ఏఐ టూల్స్తో భాగస్వామ్యం ఏర్పరుచుకొని కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.ఏఐతో సంబంధం ఉన్న కాన్ఫిగరేటర్లు, ఎక్స్ పీరియన్స్ డిజైనర్లు, డేటా సైంటిస్టు పోస్టుల్లో కొత్తగా నియామకాలు చేపడుతున్నాయి.2030 నాటికి తయారీ రంగంలో 8 మిలియన్ల ఉద్యోగాలు ఏఐ వల్ల ప్రభావితం చెందుతాయి.రిటైల్లో 7.6 మిలియన్ ఉద్యోగాలు, ఉడ్యుకేషన్లో 2.5 మిలియన్ కొలువులు ప్రభావితం అవుతాయి.టెక్ పరిశ్రమల్లో కొత్తగా 3 మిలియన్ల ఉద్యోగాలు వస్తాయి.భారత్లో 25% సంస్థలు కృత్రిమ మేధ అనుసరించేలా పరివర్తన దశలో ఉన్నాయి. ఈ విషయంలో సింగపూర్, ఆస్ట్రేలియా కంటే భారత్ ముందుంది.13.5% టెక్నాలజీ బడ్జెట్లు ఇప్పటికే కృత్రిమ మేధకు కట్టుబడి ఉన్నాయి.57% సంస్థలు ఏఐ సామర్థ్య లాభాలను నివేదించాయి.ఏఐ రీడిజైన్ చేసిన వర్క్ఫ్లోల నుంచి 63% ఉత్పాదకత పెరిగింది.సవాళ్లు ఇవే..ఏఐ వినియోగం పెరుగుతున్నా 30% సంస్థలకు డేటా భద్రత ఆందోళనగా మారుతుంది.టెక్ కంపెనీల్లోని 26 శాతం ఉద్యోగులకు ఏఐ భవిష్యత్తు నైపుణ్యాలపై అవగాహన లేదు.కీలక అంశాలపై నిర్ణయం తీసుకోవడంలో కృత్రిమ మేధను ఏమేరకు నమ్మాలో ప్రశ్నార్థకంగా మారుతుంది.ఇదీ చదవండి: ‘వేగంగా ఏఐ విస్తరణ.. మార్పునకు సిద్ధపడాలి’ -
‘వేగంగా ఏఐ విస్తరణ.. మార్పునకు సిద్ధపడాలి’
కృత్రిమ మేధ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు, వ్యవస్థలు మార్పుకు అనుగుణంగా సిద్ధంగా ఉండాలని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్గేట్స్ అన్నారు. లేదంటే సమస్యలు తప్పవని హెచ్చరించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఏఐ ఉత్పాదకతను పెంచే క్రమంలో చాలామంది సిబ్బంది తమ కొలువులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.ఏఐ వాడకం అనివార్యం‘కృత్రిమ మేధ నేతృత్వంలోని ఆటోమేషన్ ఒక సానుకూల మార్పు. ఇది ప్రజలను, ఉద్యోగులను ఇతర మెరుగైన కొలువులు చేయడానికి సాయం చేస్తుంది. ఉత్పాదకతను మెరుగుపరిచే క్రమంలో ఏఐ వాడకం అనివార్యం అవుతుంది. కాబట్టి అందుకు అనువుగా మార్పులకు సిద్ధంగా ఉండాలి. లేదంటే సమస్యలు వస్తాయి. ఏఐ వేగంగా విస్తరిస్తోంది. అంత వేగంగా వచ్చే మార్పులకు సర్దుకుపోయే సమయం ఉండదనేదే ప్రశ్న’ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఎంత వేగంగా అమలవుతున్నాయోనన్న ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.రోబోటిక్ ఆయుధాలు..రాబోయే రోజుల్లో అనేక ఎంట్రీ లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భర్తీ చేయవచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానం మెరుగుపడిన తర్వాత భవిష్యత్తులో మాన్యువల్ లేబర్ తీవ్రంగా ప్రభావితం చెందుతుంది. ‘రోబోటిక్ ఆయుధాలు ఇంకా అభివృద్ధి చెందలేదు. కానీ అవి అందుబాటులోకి వస్తే, శ్రామిక శక్తిని పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తాయి’ అని గేట్స్ చెప్పారు.ఏజీఐతో ముప్పు‘ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్(ఏజీఐ) ఆన్లైన్ సేల్స్ లేదా కస్టమర్ సర్వీస్ వంటి సంక్లిష్ట పనులను మానవుల కంటే మెరుగ్గా చేయగలదు. ఏజీఐ వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు విషయాల ద్వారా సర్వీసు అందిస్తాయి. యంత్రాలు తక్కువ ఖర్చుతో మరింత కచ్చితత్వంతో పనులను నిర్వహించగలిగితే మాత్రం అది పెద్ద మార్పు అవుతుంది’ అని గేట్స్ తెలిపారు.ఇదీ చదవండి: యూపీఐ చెల్లింపులకు పిన్ అవసరం లేదు?కచ్చితమైన డేటాఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఎలా వాడుతున్నారని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ..‘ఏఐ పురోగతిలో ఉన్న వేగం నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కఠినమైన విషయాలను అర్థం చేసుకోవడానికి ఏఐ రీసెర్చ్ టూల్స్ను ఉపయోగిస్తాను. అయితే వాటిలోని అంశాలను ధ్రువీకరించేందుకు నిపుణులతో తరచూ తనిఖీ చేస్తాను. విచిత్రంగా వారుకూడా చాలాసార్లు అందులోని అంశాలు నిజమనే చెబుతారు’ అని అన్నారు. -
యూపీఐ చెల్లింపులకు పిన్ అవసరం లేదు?
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) యూపీఐ లావాదేవీల కోసం ప్రస్తుతం ఉన్న పిన్ స్థానంలో బయోమెట్రిక్, ఫేస్ఐడీ ఆధారిత ధ్రువీకరణను ప్రవేశపెట్టాలని పరిశీలిస్తున్నట్లు బిజినెస్ స్టాండర్డ్ తెలిపింది. ఇది అమల్లోకి వస్తే డిజిటల్ లావాదేవీలు జరిపే సమయంలో యూజర్లు తమ యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా కేవలం బయోమెట్రిక్(ఫింగర్ప్రింట్) లేదా ఫేస్ ఐడీని ఉపయోగించి చెల్లింపులు చేయవచ్చు. అయితే దీనిపై ప్రభుత్వ యంత్రాంగం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని గమనించాలి.ప్రస్తుతం యూపీఐ లావాదేవీలు చేసేందుకు 4 నుంచి 6 అంకెల పిన్ అవసరం. చెల్లింపులు చేసినప్పుడు కచ్చితంగా వినియోగదారులు ఈ పిన్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ పిన్ పేమెంట్ గేట్వేకు సెక్యూరిటీ లేయర్గా పనిచేస్తుంది. డిజిటల్ ప్లాట్ఫామ్లను ఉపయోగించడం సౌకర్యవంతంగా లేని వ్యక్తులకు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు లేదా గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఇది ఎంటర్ చేయడం అడ్డంకిగా మారుతుంది. దాంతో కొత్త విధానాన్ని ఉపయోగించాలని ఎన్పీసీఐ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా బయోమెట్రిక్ అథెంటికేషన్తో లేదా ముఖ గుర్తింపు వంటి భౌతిక లక్షణాల ద్వారా యూజర్ను ధ్రువీకరించే ప్రక్రియను పరిశీలిస్తున్నారు.ఇదీ చదవండి: భారత్లో స్టార్లింక్ సబ్స్క్రిప్షన్ ఎంతంటే..ఈ చర్య పెద్ద సంఖ్యలో వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. పాస్వర్డ్లను గుర్తుంచుకోవడంలో ఇబ్బంది పడేవారికి బయోమెట్రిక్, ఫేస్ఐడీ ఆమోదంతో డిజిటల్ చెల్లింపులను సులభతరం చేయవచ్చని ప్లూటోస్ వన్ వ్యవస్థాపకులు, మేనేజింగ్ పార్టనర్ రోహిత్ మహాజన్ ఎకనామిక్ టైమ్స్కు చెప్పారు. ఇది డిజిటల్ లావాదేవీలను సులభతరం చేయడానికి, వీటిని మరింత మందికి అందుబాటులోకి తీసుకురావడానికి సహాయపడుతుందన్నారు. అదే సమయంలో బయోమెట్రిక్ వ్యవస్థలు మోసాలను కూడా తగ్గిస్తాయని చెప్పారు. పిన్ ఎంటర్ చేయడంతో పోలిస్తే వినియోగదారుల భౌతిక లక్షణాలు డూప్లికేట్ చేయడం లేదా దొంగిలించడం కష్టమన్నారు. -
భారత్లో స్టార్లింక్ సబ్స్క్రిప్షన్ ఎంతంటే..
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలోని ‘స్టార్లింక్’ ఇంటర్నెట్ సేవల సంస్థకు భారత్లో ద్వారాలు తెరచుకున్న నేపథ్యంలో సబ్స్క్రిప్షన్ ఎంత ఉండబోతుందనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే భూటాన్, ఇండోనేషియా, ఒమన్, మాల్దీవులు.. వంటి ఆసియా దేశాల్లో స్టార్లింక్ వసూలు చేస్తున్న ఛార్జీలను పరిగణలోకి తీసుకుని భారత్లో నెలవారీ ఇంటర్నెట్ సర్వీసులు ఎంతో ఉండొచ్చనే దానిపై కావాలనుకునేవారు ఎంత చెల్లించాలనే వివరాలపై కొన్ని అంచనాలు వెలువడుతున్నాయి.ఇదీ చదవండి: త్వరలో మడతెట్టే యాపిల్ ఫోన్?స్టార్లింక్కు సంబంధించి కొన్ని అంశాలు..ఇంటర్నెట్ స్పీడ్ 200 ఎంబీపీఎస్ వరకు ఉంటుంది. లొకేషన్ను అనుసరించి సగటు వేగం 100 ఎంబీపీఎస్గా ఉండొచ్చు.మారుమూల, గ్రామీణ ప్రాంతాలకు లో-ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ల ద్వారా ఇంటర్నెట్ అందిస్తారు.వినియోగదారులు, ఆయా ప్రాంతాన్ని బట్టి నెలకు రూ.3,000 నుంచి రూ.4,200 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.హార్డ్ వేర్ కిట్లో భాగంగా శాటిలైట్ డిష్, రౌటర్ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని ధర సుమారు రూ.33,000 ఉండొచ్చు.ఇంటర్నెట్ సర్వీసుల కోసం అనువైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఎయిర్టెల్, జియోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.బీఎస్ఎన్ఎల్ వంటి ప్రస్తుత టెలికాం సంస్థలకు అంతరాయం కలగకుండా ఉండటానికి భారతదేశం అంతటా 20 లక్షల కనెక్షన్లకే పరిమితం చేశారు. అంతకంటే ఎక్కువ కనెక్టన్లు ఇవ్వకూడదు.2025 చివరి నాటికి భారత్లో ఈ సర్వీసులు లాంచ్ చేస్తారని అంచనా. తర్వలో ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. -
త్వరలో మడతెట్టే యాపిల్ ఫోన్?
స్మార్ట్ ఫోన్ తయారీ రంగంలో నిత్యం కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు తమ వినియోగదారుల అభిరుచులకు తగినట్లుగా ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. అయితే ప్రపంచంలోనే టాప్ కంపెనీగా ఉన్న యాపిల్ మాత్రం ఈ విభాగంలో ఉత్పత్తులను తీసుకురాలేదు. కానీ ఎట్టకేలకు ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ విభాగంలో యాపిల్ అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.యాపిల్ 2026లోనే ఫోల్డబుల్ ఫోన్ను విపణిలోకి తీసుకురాబోతుందని కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురిస్తున్నాయి. టెక్ విశ్లేషకులు, ఇన్సైడర్ల వివరాల ప్రకారం ఫోల్డబుల్ ఐఫోన్ 2026 ద్వితీయార్ధంలో ఐఫోన్ 18 సిరీస్తో పాటు ఆవిష్కరించే అవకాశం ఉంది. ఐఫోన్ ఎక్స్ తర్వాత యాపిల్ తన ఉత్పత్తుల్లో చేయనున్న అతిపెద్ద డిజైన్ మార్పు ఇదేనని చెబుతున్నారు. ఫోల్డబుల్ ఐఫోన్ శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ సిరీస్ను పోలిన బుక్ స్టైల్ ఫోల్డింగ్ విధానంలో ఉంటుందని చెబుతున్నారు.ఇదీ చదవండి: కార్డు ఉంది కదా అని రెచ్చిపోతున్నారు!జేపీ మోర్గాన్ అనలిస్ట్ సమిక్ ఛటర్జీ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఫోల్డబుల్ ఐఫోన్ 7.8 అంగుళాల ఇన్నర్ డిస్ప్లే, 5.5 అంగుళాల బాహ్య డిస్ప్లేను కలిగి ఉంటుందని అంచనా వేశారు. ఈ ఫోన్ ధరపై కూడా కొందరు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా అంచనా వేస్తున్నారు. ఫోల్డబుల్ ఐఫోన్ ప్రారంభ ధర 1,999 డాలర్లుగా ఉంటుందని సూచిస్తున్నారు. ఇది ఇండియాలో సుమారు రూ.1.75 లక్షలుగా ఉండొచ్చని చెబుతున్నారు. -
ఇన్ఫోసిస్ చల్లని కబురు: తొలగించడం కాదు.. చేర్చుకుంటాం
టీసీఎస్ లేఆఫ్ల ప్రకటన తర్వాత దేశ ఐటీ పరిశ్రమలో కల్లోల వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆందోళనలో ఉన్న ఐటీ ఉద్యోగార్థులకు దేశీయ రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది 20,000 మంది గ్రాడ్యుయేట్లను నియమించుకోనున్నట్లు ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ ధృవీకరించారు.మొదటి త్రైమాసికంలో 17,000 మందిని (స్థూల నియామకాలు) నియమించుకున్నామని, ఈ ఏడాది ఇంకా 20,000 మంది కాలేజీ గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని యోచిస్తున్నట్లు ఆయన ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రీస్కిల్లింగ్లలో వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టడం ద్వారా కంపెనీ కాస్త ముందంజలో ఉందన్న పరేఖ్.. ఇప్పటి వరకు వివిధ స్థాయిల్లో 2,75,000 మంది ఉద్యోగులకు శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు.పోటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 12,000 మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇన్ఫోసిస్ సీఈవో నియామకాలను ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మరే ఇతర భారతీయ ఐటీ కంపెనీ కూడా ఈ స్థాయిలో లేఆఫ్లను ప్రకటించలేదు.ఏఐ ప్రభావంపై..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం గురించి పరేఖ్ మాట్లాడుతూ, "కృత్రిమ మేధ లోతైన ఆటోమేషన్, అవగాహనను అందిస్తుంది. అదే సమయంలో ఉన్నత స్థాయి నైపుణ్యాలు, ప్రతిభ అవసరం" అని అన్నారు. ఉద్యోగులు,సాంకేతికత రెండింటి పట్ల దీర్ఘకాలిక నిబద్ధతను ప్రతిబింబిస్తూ ఇన్ఫోసిస్ తన శ్రామిక శక్తిని విస్తరిస్తుందని పేర్కొన్నారు.వేతనాల పెంపుపై..గత ఆర్థిక సంవత్సరం క్యూ4, క్యూ1లకు వేతనాల పెంపును కంపెనీ ఇప్పటికే పూర్తి చేసిందని పరేఖ్ తెలిపారు. "ఇప్పుడు ఈ సైకిల్ పూర్తయింది. ఎప్పటిలాగే తదుపరి రౌండ్ కోసం సమయాన్ని అంచనా వేయడం ప్రారంభించాం. మా ప్రస్తుత ప్రక్రియకు కట్టుబడి ఉంటాం. సరైన సమయంలో తదుపరి రౌండ్ను ప్రకటిస్తాం" అని పరేఖ్ వివరించారు.👉 ఇదీ చదవండి: TCS layoffs: రంగంలోకి కేంద్ర ప్రభుత్వం! -
మర మనుషులు.. కేవలం రూ.5 లక్షలే!
భలే మంచి చౌక బేరము.. రూ.5.12 లక్షలకే హ్యూమనాయిడ్ రోబో అంటోంది చైనాకు చెందిన ఓ కంపెనీ. రోబో.. అంటేనే ఖరీదైన వ్యవహారం. అందులోకి, అచ్చం మనిషిలా ఉండి, మనిషి చేయగలిగే చాలా పనులు చేసే హ్యూమనాయిడ్ రోబో అంటే.. ఇంకా ఖరీదు. కానీ.. అస్సలు కాదు అంటోంది చైనా దిగ్గజం యూనిట్రీ రోబోటిక్స్. రోబోల తయారీలో మంచి పేరున్న ఈ కంపెనీ ఆర్1 హ్యూమనాయిడ్ను తయారుచేసింది. దీని ధర కేవలం 5,900 డాలర్లు (రూ.5.12 లక్షలు) మాత్రమేనట. కంపెనీ గతంలో అందుబాటులోకి తెచ్చిన జీ1తో పోలిస్తే కొత్త మోడల్ ధర 63 శాతం తక్కువ కావడం విశేషం.గంటపాటు నిర్విరామంగా..ఈ హ్యూమనాయిడ్ ఎత్తు 121 సెంటీమీటర్లు, వెడల్పు 35.7 సెం.మీ. మందం 19 సెం.మీ.కేవలం 25 కేజీల బరువే ఉండటం కూడా వాడకందారులకు చాలా సౌలభ్యం.వాయిస్ గుర్తించేందుకు నాలుగు మైక్రోఫోన్స్, అల్ట్రావైడ్ యాంగిల్ విజువల్స్ కోసం బైనాక్యులర్ కెమెరా పొందుపరిచారు. వైఫై 6, బ్లూటూత్ 5.2 కనెక్టివిటీ ఉంది.బ్యాటరీ ఒకసారి రీచార్జ్ చేస్తే రోబో గంటపాటు పనులు చక్కబెడుతుంది.మాన్యువల్ రిమోట్ కంట్రోల్తో పనిచేస్తుంది.పూర్తి కస్టమైజేబుల్.. అంటే కస్టమర్ కోరిన విధంగా మార్పులు చేసి కూడా తయారు చేస్తారు.యూనిట్రీ రోబోటిక్స్ ఆర్1 హ్యూమనాయిడ్.. పరుగెడుతుంది, నడుస్తుంది, పిల్లిమొగ్గలు వేస్తుంది, చేతుల మీద నిలబడుతుంది. మనం ఇచ్చే వాయిస్ ఆదేశాలకు ప్రతిస్పందిస్తుంది. పరిసరాలను అర్థం చేసుకుంటుంది. ప్రయోగాలకు అనువుగా ఇది పనిచేస్తుంది. అంటే టెక్ కంపెనీలు ఈ హ్యూమనాయిడ్ను మరింతగా అభివృద్ధి చేసేందుకు వీలు కూడా ఉండటం దీనిలోని మరో ప్రత్యేకత. ఆఫీసులు, ఇంటి పనుల కోసం పని మనుషులను పెట్టాలనుకునేవాళ్లు దీన్ని ట్రై చేయొచ్చు అంటోంది కంపెనీ.ఆర్1.. ఒక మైలురాయిఫ్యాక్టరీలు, ఇంటి పనులకు సంబంధించి హ్యూమనాయిడ్ల తయారీలో ఇంతవరకు అమెరికన్ కంపెనీల ఆధిపత్యం ఉండేది. ఇప్పుడు చైనా కంపెనీలు ఈ రేసులోకి ‘తక్కువ ధరకే’ ట్యాగుతో వచ్చాయి. ఇవి పై రెండు రకాల పనులతోపాటు మిలటరీలో కూడా ఉపయోగపడతాయట. చైనాలోని పరిశోధనా ప్రయోగశాలలు, పాఠశాలల్లో వాడుతున్న యూనిట్రీ కంపెనీ తయారీ జీ1 రోబో ధర 16,000 డాలర్లుగా ఉంది. మరింత అధునాతన, పెద్ద సైజులో ఉండే హెచ్1 మోడల్ ధర 90,000 డాలర్ల కంటే ఎక్కువ. అందరికీ అందుబాటు ధరలో ఏకంగా 5,900 డాలర్లకే ఇప్పుడు ఆర్1 హ్యూమనాయిడ్ను తీసుకొచ్చింది. ఇది సంక్లిష్ట హ్యూమనాయిడ్ల విభాగంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.ఇదీ చదవండి: ‘లేఆఫ్స్ నిర్ణయం ఎంతో భారం’.. అయినా తప్పట్లేదు!రోజువారీ జీవితంలో మమేకం..మీరు ఉదయం లేవగానే మీ కదలికలను రోబో గుర్తిస్తుంది.కాఫీ మెషీన్ను ఆపరేట్ చేస్తుంది.ఒకవేళ మీకు కళ్లజోడు అలవాటు ఉంటే.. అది ఎక్కడ ఉన్నా తెచ్చి మీ చేతికి ఇస్తుంది.ఆ రోజు చేయాల్సిన మీ షెడ్యూల్ను చదువుతుంది.మీ బిడ్డకు సైన్స్, మ్యాథ్స్.. ఇలా ఏదైనా సబ్జెక్టులో సందేహాలు ఉంటే సమాధానాలతో సహాయపడుతుంది. సంభాషణను సరదా క్విజ్గా కూడా మారుస్తుంది.అమ్మమ్మ, తాతయ్యల వంటి పెద్దలకు.. ఎతైన షెల్ఫ్ నుండి మందులను తీసుకొచ్చి చేతిలో పెడుతుంది.ఇంటికి బంధువులు, స్నేహితులు వస్తే వారిని ఆకట్టుకోవడానికి పిల్లిమొగ్గల వంటివి వేస్తుంది. -
అమెరికాకు స్మార్ట్ఫోన్ల ఎగుమతుల్లో భారత్ టాప్
న్యూఢిల్లీ: టారిఫ్ల వివాదాలతో అమెరికాకు చైనా స్మార్ట్ఫోన్ల ఎగుమతులు నెమ్మదించడాన్ని భారత్ అవకాశంగా మల్చుకుంటోంది. 2025 రెండో త్రైమాసికంలో తొలిసారిగా అగ్రరాజ్యానికి చైనాకన్నా అధికంగా స్మార్ట్ఫోన్లను ఎగుమతి చేసింది. కన్సల్టెన్సీ సంస్థ కెనాలిస్ నివేదికలో ఈ అంశం వెల్లడైంది. దీని ప్రకారం అమెరికాకు స్మార్ట్ఫోన్ల ఎగుమతుల్లో చైనాలో అసెంబుల్ చేసిన ఫోన్ల వాటా గతేడాది ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో 61 శాతంగా ఉండగా ఈ ఏడాది అదే వ్యవధిలో 25 శాతానికి తగ్గింది. అదే సమయంలో భారత్ వాటా 13 శాతం నుంచి 44 శాతానికి (సుమారు 240 శాతం వృద్ధి) పెరిగింది. క్యూ2లో ఐఫోన్ల ఎగుమతులు వార్షికంగా 11 శాతం తగ్గి 1.33 కోట్ల యూనిట్లకు పరిమితం కాగా, శాంసంగ్ ఫోన్ల ఎగుమతులు 38 శాతం పెరిగి 83 లక్షల యూనిట్లకు పెరిగాయి. టాప్ 5 ఫోన్లకు సంబంధించి అమెరికాకు మోటరోలా ఫోన్ల ఎగుమతులు రెండు శాతం పెరిగి 32 లక్షల యూనిట్లకు, గూగుల్ 13% పెరిగి 8 లక్షల యూనిట్లకు చేరగా, టీసీఎల్ 23% క్షీణించి 7 లక్షల యూనిట్లకు పరిమితమైంది. క్యూ2లో తొలిసారి...అమెరికాకు ఎగుమతయ్యే స్మార్ట్ఫోన్లకు సంబంధించి క్యూ2లో భారత్ తొలిసారిగా అగ్రగామి తయారీ హబ్గా నిల్చిందని కెనాలిస్ ప్రిన్సిపల్ అనలిస్ట్ సన్యమ్ చౌరాసియా తెలిపారు. అమెరికా–చైనా మధ్య వాణిజ్య అనిశ్చితి వల్ల యాపిల్ తమ సరఫరా వ్యవస్థను భారత్కు మళ్లిస్తుండటం ఇందుకు దోహదపడిందని వివరించారు. చైనా ప్లస్ వన్ వ్యూహంలో భాగంగా యాపిల్ గత కొన్నేళ్లుగా భారత్లో తమ ఉత్పత్తుల తయారీని పెంచుకుంటోందని చౌరాసియా చెప్పారు. అయితే, ఐఫోన్ 16 సిరీస్, ప్రో మోడల్స్ తయారీని భారత్లో ప్రారంభించినప్పటికీ, పెద్ద స్థాయిలో సరఫరా కోసం యాపిల్ ఇప్పటికీ చైనా తయారీ ప్లాంట్లపైనే ఎక్కువగా ఆధారపడుతోందని ఆయన వివరించారు. యాపిల్ తరహాలోనే మోటరోలా ఫోన్లకు కూడా ప్రధాన తయారీ హబ్గా చైనా నిలుస్తోంది. మరోవైపు, యాపిల్తో పోలిస్తే కాస్త తక్కువ పరిమాణమే అయినప్పటికీ అమెరికాకు ఎగుమతి చేసే ఉత్పత్తుల తయారీని శాంసంగ్, మోటరోలా కూడా భారత్లోనే ఎక్కువగా చేపడుతున్నాయని చౌరాసియా పేర్కొన్నారు. శాంసంగ్ అత్యధికంగా స్మార్ట్ఫోన్లను వియత్నాంలో ఉత్పత్తి చేస్తోంది. -
దేశంలోనే మొదటి క్లౌడ్ ఆధారిత డెస్క్టాప్
ఖరీదైన హార్డ్వేర్ అవసరం లేకుండా ఏ స్క్రీన్ నైనా పూర్తి స్థాయి కంప్యూటర్గా మార్చే గేమ్ ఛేంజింగ్ సర్వీస్ను రిలయన్స్ జియో ‘జియోపీసీ’ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో ఫైబర్ లేదా జియోఎయిర్ ఫైబర్తో నడిచే క్లౌడ్ ఆధారిత వర్చువల్ డెస్క్ టాప్ను జియోపీసీ అంటారు. దీనిద్వారా కేవలం కీబోర్డు, మౌస్ ఉపయోగించి టీవీ లేదా మానిటర్ను పర్సనల్ కంప్యూటర్గా మార్చుకోవచ్చు.పూర్తిగా క్లౌడ్ మీద ఆధారపది ఇది కంప్యూటింగ్ సర్వీసు అందిస్తుంది. ఇందులో సీపీయూ ఉండదు. అప్గ్రేడ్లు ఉండవు. మెయింటెనెన్స్ ఉండదు. ఈ క్లౌడ్ సర్వీస్ కోసం నెలకు రూ.400 నుంచి ‘పే-యాస్ యూ-గో’ మోడల్ ప్రారంభిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. కొత్త యూజర్లకు ఒక నెల ఉచిత ట్రయల్ అందిస్తారు. 8 జీబీ ర్యామ్, 100 జీబీ క్లౌడ్ స్టోరేజ్, ఏఐ ఆధారిత టూల్స్ ఇందులో ఉంటాయి. అడోబ్ ఎక్స్ ప్రెస్ను ఉచితంగా అందిస్తారు. ఇది ఫైల్ డిజైన్, ఎడిటింగ్కు ఉపయోగపడుతుంది.లిబ్రే ఆఫీస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ (బ్రౌజర్ కోసం), జియో వర్క్ స్పేస్ వంటి ఉత్పాదక అప్లికేషన్లను సపోర్ట్ చేస్తుంది. ఈ క్లౌడ్లో డేటాను సురక్షితంగా స్టోర్ చేసేందుకు వైరస్ అటాక్ల నుంచి భద్రత కల్పిస్తారు.ఎవరికి ఉపయోగమంటే..ఆన్లైన్ లెర్నింగ్, కోడింగ్, రీసెర్చ్ కోసం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. ముందస్తు పెట్టుబడి లేకుండా సరసమైన కంప్యూటింగ్ కోసం చిరు వ్యాపారాలకు తోడ్పడుతుంది. కుటుంబ సభ్యుల కోసం వినోదాన్ని అందిస్తుంది. క్లౌడ్ టూల్స్తో కంటెంట్ క్రియేటర్లు డిజైన్, ఎడిట్, పబ్లిషింగ్ను ఉపయోగించవచ్చు.ఇదీ చదవండి: ‘ఏఐ మా ఉద్యోగులను ఏం చేయలేదు’ఎలా సెట్ చేయాలంటే..జియో సెట్ టాప్ బాక్స్ ఆన్ చేయాలి.యాప్స్ విభాగానికి వెళ్లి జియోపీసీ యాప్ను లాంచ్ చేయాలి.కీబోర్డ్, మౌస్ను ప్లగ్ ఇన్ చేయాలి.జియో నంబర్తో రిజిస్టర్ అయి, సైన్ ఇన్ అవ్వాలి. -
‘ఏఐ మా ఉద్యోగులను ఏం చేయలేదు’
టెక్ రంగంలో ఉద్యోగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భర్తీ చేస్తుందనే భయాలు నెలకొంటున్న తరుణంలో జోహో సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఆశలు రేకెత్తిస్తోంది. జోహోలో ఇంజినీర్లను ఏఐ భర్తీ చేయగలదా అని కంపెనీ సీఈఓ మణి వెంబును అడిగినప్పుడు ప్రస్తుతానికి దాని ప్రభావం లేదని సమాధానం చెప్పారు. ఇటీవల ఓ సమావేశంలో వెంబు మాట్లాడారు.‘కృత్రిమ మేధ కారణంగా జోహోలో ఉద్యోగాల్లో కోత లేదు. మీరు ఏఐ వ్యవస్థను ఒక కంటెంట్ను సృష్టించమని అడిగితే అది చాలా మెరుగ్గా కంటెంట్ను ఇస్తుంది. అయితే కేవలం ఈ ఫీచర్ మా కంపెనీలో ఉద్యోగాలను తొలగించలేదు. ఇప్పటివరకు కృత్రిమ మేధ కారణంగా మేము సిబ్బందిని తగ్గించలేదు. వాస్తవానికి మరికొందరు ఇంజినీర్లను నియమించుకోవాలని యోచిస్తున్నాం’ అని చెప్పారు.ఇటీవల బెంగళూరులో జరిగిన జోహోలిక్స్ కార్యక్రమంలో వెంబు ఈమేరకు వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో జియా అని పిలువబడే కంపెనీ సొంత లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం)ను ఆవిష్కరించారు. ఈ కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ భారతదేశపు మొట్టమొదటి ఎంటర్ప్రైజ్ ఏఐ అని చెప్పారు. ఇది సాధారణ ప్రజల కోసం ఉద్దేశించింది కానప్పటికీ, ఈ నమూనా వ్యాపారాలకు ఎంతో తోడ్పడుతుందని తెలిపారు. దీన్ని జోహో ఉత్పాదకత, ఎంటర్ప్రైజ్ ప్లాట్ఫామ్లతో అనుసంధానించినట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: టీసీఎస్ లేఆఫ్స్తో ఆర్థిక ప్రకంపనలుకృత్రిమ మేధ కంపెనీ వర్క్ ఫ్లోలో భాగమవుతోందని వెంబు చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగులకు మరింత సహాయపడుతుందని నమ్ముతున్నారు. ‘ఇప్పటివరకు (జోహోలో) మేము కంపెనీలో ఏఐ కచ్చితంగా ఉద్యోగులను భర్తీ చేయడాన్ని చూడలేదు. దానికి బదులుగా ఇది ఉద్యోగులకు సహాయపడుతుంది. ఉదాహరణకు, ఒక సపోర్ట్ రిప్రజెంటేటివ్ సాధారణంగా రోజుకు 20 టిక్కెట్లను హ్యాండిల్ చేస్తాడనుకోండి.. ఏఐ సాయంతో 25 టిక్కెట్లను నిర్వహించే అవకాశం ఉంది. ఇది 20 శాతం వరకు ఉత్పాదకతను పెంచుతుంది’ అని చెప్పారు. -
ఆలోచనలతో కంప్యూటర్ని కంట్రోల్ చేస్తున్న తొలి మహిళ!
సాంకేతికత కూడిన వైద్యం ఎందరో రోగులకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. అందుకు ఎన్నో ఉదంతాలు నిదర్శనం. అయితే బ్రెయిన్ సంబంధిత విషయంలో మాత్రం సాంకేతికతను వాడటం కాస్త సవాలు. అయితే దాన్నికూడా అధిగమించి..స్ట్రోక్కి గురై పక్షవాతంతో బాధపడుతున్న పేషెంట్లలో కొత్త ఆశను అందించేలా టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది ఎలోన్ మస్క్ స్థాపించిన న్యూరాలింక్ (Neuralink) కంపెనీ. ఇది మానవ మెదడు, కంప్యూటర్ మధ్య నేరుగా కమ్యూనికేషన్ ఏర్పరిచే బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్ (BCI) టెక్నాలజీపై పని చేస్తోందనే విషయం తెలిసిందే. ఈ టెక్నాలజీ ద్వారా, మెదడులో చిన్న చిప్ను అమర్చి, ఆలోచనల ద్వారా డిజిటల్ పరికరాలను నియంత్రిస్తారు. ప్రస్తుతం ఈ టెక్నాలజీ క్లినకల్ ట్రయల్ దశలో ఉంది. అందులో భాగంగానే ఈ న్యూరాలింక్ చిప్ను పొందింది ఆడ్రీక్రూస్ అనే మహిళ. ఎవరామె.? ఆమె ఈ సాంకేతికత సాయంతో ఏం చేసిందంటే..రెండు దశాబ్దాలకు పైగానే ఆడ్రీ కూస్ పక్షవాతానికి గురై మంచానికే పరిమితమైంది. క్లినికల్ ట్రయల్లో భాగంగా ఎలోన్ మస్క్ న్యూరాలింక్ చిప్ను ఆమె మెదడులో అమర్చారు. దీంతో న్యూరాలింక్ బ్రెయిన్ ఇంప్లాట్ ద్వారా తన ఆలోచనలతో కంప్యూటర్ని నియంత్రిస్తున్న తొలి మహిళగా రికార్డు సృష్టించింది. ఆమె తన మానసిక ఆదేశాలతో తన పేరుని డిజిటల్ రూపంలో రాసింది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ఎక్స్లో షేర్ చేసుకున్నారామె. ఆ పోస్ట్లో ఆండ్రీ డిజిటల్ సిరాతో తన పేరును( ఆడ్రీ) సూచించే ల్యాప్టాప్ స్క్రీన్ ఫోటోని షేర్ చేశారు. అంతేగాదు దాంతోపాటు ఎర్రటి హార్ట్ సింబల్, ఒక పక్షి, పిజ్జా ముక్క ఉండే డూడుల్ని కూడా పంచుకుంది. దీన్ని ఆమె టెలిపతి ద్వారా గీసినట్లుగా ఆ పోస్ట్కి క్యాప్షన్ ఇచ్చింది ఆడ్రీ. ఆమె 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా తన పేరును రాసిన క్షణం నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఎందుకంటే ఆమె గత 20 ఏళ్లకు పైగా పక్షవాతానికి గురై కదలలేని, మాట్లాడలేని స్థితిలో ఉండిపోయారామె. ఆమె తన చూపుడు వేలుని క్లిక్గా, కర్సర్గా మణికట్టుని ఊహించుకుంటూ.. తన మానసిక ఆలోచనలతో కంప్యూటర్ని నియంత్రిస్తుందామె. ఇదంతా ఆమె తన బ్రెయిన్తో చేస్తుంది. ఇక్కడ ఆడ్రికి ఈ న్యూరాలింక్ క్లినికల్ ట్రయల్లో తొమ్మిదొ పేషెంట్గా ఈ చిప్ను ఆమెకు అమర్చారు. పుర్రెలో రంధ్రం చేసి మోటారు కార్టెక్స్లో సుమారు 128 కనెక్షన్లతో ఈ చిప్ని అమర్చారు. ఈ బీసీఐ(బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్ టెక్నాలజీ) ఆమె మెదడు కదలికలు, సంకేతాలను చదివి వాటిని కర్సర్ కదలికలుగా అనువదిస్తుంది. ఈ బ్రెయిన్ చిప్ ఆమెను మళ్లీ నడిచేలా సాయం చేయలేకపోయినా..డిజిటల్ పరికరాలతో తన మనసులోని మాటలను వ్యక్తం చేయడానికి వీలు కల్పిస్తోంది. ఇది పూర్తి మానసిక ఆలోచనలతో పనిచేస్తుంది. న్యూరాలింక్ అంటే.. 2016లో ఎలోన్ మస్క్ స్థాపించిన న్యూరాలింక్, మానవ మెదడును నేరుగా కంప్యూటర్లకు అనుసంధానించడం లక్ష్యంగా పెట్టుకుంది. పక్షవాతం వంటి నాడీ సంబంధిత పరిస్థితులతో బాధపడుతున్న వ్యక్తులు డిజిటల్ స్వాతంత్య్రాన్ని పొందేలా.. సంభాషించడంలో సహాయపడటమే ఈ సాంకేకతికత లక్ష్యం.కాగా, ఇక్కడ ఆడ్రీ ఇలాంటి మరిన్ని పోస్ట్లను వీడియోలను పంచుకోవాలని ఆత్రుతగా ఎదురుచూస్తోంది. అంతేగాదు ఆమె తన పోస్ట్లో తాను త్వరలో ఇంటికి వస్తానని, ఈ ప్రక్రియ గురించి మరింత వివరంగా తెలిపేలా వీడియోలను కూడా పోస్ట్ చేస్తానని పేర్కొనడం విశేషం. ఈ న్యూరాలింక్ సాంకేతికతను వినియోగించిన తొలి మహిళగా ఆమె ప్రస్థానం పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని ఆశిద్దాం.(చదవండి: 12వ తరగతి డ్రాపౌట్..సొంతంగా జిమ్..ఇంతలో ఊహకందని మలుపు..!) -
బీఎస్ఎన్ఎల్ టారిప్లపై కీలక ప్రకటన
ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ బీఎస్ఎన్ఎల్ టారిఫ్లను పెంచే యోచన లేదని కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. భారతదేశం అంతటా 4జీ వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. బీఎస్ఎన్ఎల్ త్వరలో టారిఫ్లను పెంచబోతుందనే వాదనలను తోసిపుచ్చుతూ మంత్రి ఈమేరకు స్పష్టత ఇచ్చారు. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్లు (సీజీఎంలు) పాల్గొన్నారు.బీఎస్ఎన్ఎల్ ఎప్పటినుంచో 2జీ, 3జీ నెట్వర్క్ల్లో వాడుతున్న పాత చైనీస్ పరికరాలను స్వదేశీ 4జీ మౌలిక సదుపాయాలతో భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు మంత్రి పెమ్మసాని చెప్పారు. అయితే, ఎప్పటిలోపు దీన్ని పూర్తి చేస్తారో నిర్దిష్ట కాలపరిమితి తెలపలేదు. బీఎస్ఎన్ఎల్ 2జీ, 3జీ సేవలను దశలవారీగా నిలిపివేస్తున్నప్పటికీ, 5జీకి మారే ప్రణాళికలు మాత్రం ప్రస్తుతానికి లేవనే సంకేతాలు వెలువడుతున్నాయి.బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు ప్రస్తుతం 4జీ సరిపోతుందని మంత్రి అన్నారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా 4జీ నెట్వర్క్ను అందించడమే ప్రస్తుత ప్రాధాన్యమని పెమ్మసాని తెలిపారు. ఇతర టెల్కోల్లో 75 శాతం మంది వినియోగదారుల అవసరాలను 4జీ తీరుస్తుందన్నారు. స్వదేశీ 5జీ కోర్, అందుకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నాయని, ఆర్థికంగా లాభదాయకంగా ఉన్నప్పుడే ఈ విషయంలో ముందుకెళ్తామన్నారు.మొబైల్ కస్టమర్ గ్రోత్, ఏఆర్పీయూ, ఫిక్స్డ్ వైర్లెస్ వంటి విభాగాల్లో ప్రతి సర్కిల్కు లక్ష్యాలు కేటాయించినట్లు చెప్పారు. ఏటా 20-30 శాతం ఆదాయ వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. బీఎస్ఎన్ఎల్ 1,00,000 స్వదేశీ 4జీ టవర్లను ఏర్పాటు చేసిందని, వీటి ఇంటిగ్రేషన్ ప్రక్రియ సవాలుతో కూడుకున్నదని మంత్రి అన్నారు. నోకియా, ఎరిక్సన్ వంటి గ్లోబల్ కంపెనీలకు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి దశాబ్దాలు పట్టిందని, కానీ బీఎస్ఎన్ఎల్ కేవలం 2–3 ఏళ్లలోనే 90–95% సమస్యలను పరిష్కరించిందని తెలిపారు.ఇదీ చదవండి: క్లెయిమ్ చేయని డిపాజిట్లు రూ.67వేల కోట్లుమౌలిక సదుపాయాలను వేగవంతం చేయడం, పౌర కేంద్రీకృత సేవల పంపిణీని మెరుగుపరచడం, భారత టెలికాం రంగంలో బీఎస్ఎన్ఎల్ వ్యూహాత్మక పాత్రను బలోపేతం చేయడంపై ఈ సమావేశం దృష్టి సారించిందని కేంద్రమంత్రి సింథియా చెప్పారు. కంపెనీ పరివర్తనను ఆయన ప్రశంసించారు. కస్టమర్ అనుభవం, ఆదాయ సృష్టిలో గణనీయమైన మెరుగుదల అవసరాన్ని నొక్కి చెప్పారు. -
స్టార్లింక్ ఇచ్చేది 20 లక్షల కనెక్షన్లే
న్యూఢిల్లీ: అమెరికన్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థ స్టార్లింక్ నుంచి బీఎస్ఎన్ఎల్లాంటి దేశీ టెలికం సంస్థలకు ఎలాంటి పోటీ ఉండబోదని కేంద్ర టెలికం శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ప్రస్తుత సామర్థ్యాలను బట్టి స్టార్లింక్ భారత్లో గరిష్టంగా 200 ఎంబీపీఎస్ స్పీడ్తో 20 లక్షల కనెక్షన్లు మాత్రమే ఇవ్వగలదని ఆయన తెలిపారు. దీనితో టెలికం సర్వీసులపై ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పారు. ఈ సర్వీసులను పొందాలంటే ముందుగా భారీ మొత్తం వెచ్చించడంతో పాటు ప్రతి నెలా సుమారు రూ. 3,000 వరకు చెల్లించాల్సి రావచ్చని మంత్రి చెప్పారు. ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్కి గణనీయంగా కార్యకలాపాలున్న గ్రామీణ, మారుమూల ప్రాంతాలే లక్ష్యంగా శాట్కామ్ సర్వీసులు ఉండనున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బీఎస్ఎన్ఎల్ 4జీ సర్వీసుల విస్తరణ పూర్తయిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం మార్కెటింగ్పైనే దృష్టి పెడుతున్నట్లు, టారిఫ్లు పెంచే ప్రతిపాదనేదీ లేనట్లు మంత్రి వివరించారు. బీఎస్ఎన్ఎల్లో చైనా పరికరాల వినియోగంపై స్పందిస్తూ, పూర్తిగా దేశీ సాంకేతికతల వినియోగానికి ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. -
భూకంపం వస్తోంది.. జాగ్రత్త..!
ఫోన్ అంటే కాల్స్, మెసేజెస్, వినోదమేనా? అంతకు మించి.. చూడ్డానికి చిన్న పరికరమే కావొచ్చు కానీ కొన్ని సందర్భాల్లో ప్రాణాలను కాపాడే సంజీవని కూడా. అవును మీరు చదువుతున్నది నిజమే. భూకంప కేంద్రం నుంచి తీవ్రత చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించేలోపే.. విపత్తు రాబోతోందని యూజర్లను హెచ్చరించే వ్యవస్థ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉంది. మొబైల్లోని యాక్సిలరేషన్ సెన్సార్ల ఆధారంగా పనిచేసే ఈ వ్యవస్థ ప్రపంచంలో భూకంప ప్రభావిత ప్రాంతాలలో నివసించే ప్రజలకు సందేశాల రూపంలో హెచ్చరిస్తోంది.– సాక్షి, స్పెషల్ డెస్క్ఆండ్రాయిడ్ ఎర్త్క్వేక్ అలర్ట్ (ఏఈఏ) వ్యవస్థను ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ను అభివృద్ధి చేసిన టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2020 నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లలో పరిచయం చేసింది. ప్రాథమిక (ప్రైమరీ వేవ్స్), ద్వితీయ (సెకండరీ వేవ్స్) భూకంప తరంగాలను ఈ వ్యవస్థ గుర్తిస్తుంది. ఏఈఏ సిస్టమ్ ఇప్పటి వరకు 98 దేశాలలో భూకంప ప్రభావిత ప్రాంతాలలో నివసించే ప్రజలకు హెచ్చరికలను పంపింది. ఇప్పటి వరకు 18,000 పైచిలుకు భూకంప సంఘటనలకు సంబంధించి 79 కోట్లకుపైగా అలర్ట్స్ జారీ చేసింది. ఈ వ్యవస్థ ఇప్పుడు నెలకు సగటున 60 హెచ్చరికలను పంపుతోంది. దాదాపు 1.8 కోట్ల మంది కనీసం ఒక హెచ్చరికనైనా అందుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల మంది ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. గూగుల్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలీ సీస్మాలజీ ల్యాబొరేటరీ మూడు సంవత్సరాలుగా ఈ వ్యవస్థ పనితీరు, పద్ధతులను వివరిస్తూ డేటాను విడుదల చేశాయి.సెకన్ల ముందు హెచ్చరిక..భూకంపం వచ్చే కొన్ని సెకన్ల ముందు యూజర్లకు ఏఈఏ హెచ్చరిక సందేశాన్ని పంపుతుంది. భూకంప తీవ్రత సాధారణంగా ఉండే అవకాశం ఉంటే ‘మీరు జాగ్రత్త’ అని, ముప్పు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంటే ఆడియో రూపంలో వార్నింగ్తోపాటు పారాహుషార్ అంటూ హెచ్చరిస్తుంది. భూ ప్రకంపనలను గుర్తించడానికి ఫోన్లోని యాక్సిలెరోమీటర్ సాయంతోనే భూ ప్రకంపనలను ఈ వ్యవస్థ గుర్తిస్తుంది. భూకంప తరంగాలు ఫోన్ను చేరగానే ఆ సమాచారాన్ని గూగుల్ సర్వర్లకు పంపుతుంది. ఒక ప్రాంతంలోని ఇతర ఫోన్ల నుంచి కూడా ఇలాంటి సమాచారమే వస్తే భూకంపం సంభవించినట్టు గూగుల్ నిర్ధారిస్తుంది. అత్యంత తీవ్రంగా భూమి కంపించకముందే ప్రభావిత ప్రాంతంలో.. ఆండ్రాయిడ్ ఫోన్ను వాడుతున్న వారికి ఈ వ్యవస్థ హెచ్చరికలను పంపుతుంది. భూకంప తరంగాల కంటే వేగంగా హెచ్చరికలను ప్రసారం చేయడానికి ఏఈఏ కాంతి వేగాన్ని ఉపయోగిస్తుంది.యూఎస్తో మొదలు..ఏఈఏ వ్యవస్థ తొలుత 2020లో యూఎస్లో మొదలైంది. 2021లో న్యూజిలాండ్, గ్రీస్లో, ఆ తర్వాత మిగిలిన దేశాలకు విస్తరించారు. ఈ వ్యవస్థ హెచ్చరించిన సంఘటనల్లో 2023లో టర్కీ–సిరియా (రిక్టర్ స్కేల్పై తీవ్రత 7.8), ఫిలిప్పీన్స్ (6.7), నేపాల్ (5.7), 2025 ఏప్రిల్లో టర్కీలో 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపాలు ఉన్నాయి. ఇప్పటివరకు గుర్తించిన సంఘటనలలో 2,000 కంటే ఎక్కువ తీవ్ర భూకంపాలు ఉన్నాయి. ఇక ఏఈఏ బృందం 2023 ఫిబ్రవరి–2024 ఏప్రిల్ మధ్య 15 మందిని సర్వే చేస్తే.. 79% మంది ఈ హెచ్చరికలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. భూకంపం రాకముందే హెచ్చరిక అందుకున్నట్టు 5.4 లక్షల మంది చెప్పడం విశేషం.కోట్లాది మందికి..2023 నవంబర్లో ఫిలిప్పీన్స్లో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించినప్పుడు.. భూకంపం ప్రారంభమైన 18.3 సెకన్ల తర్వాత ఈ వ్యవస్థ మొదటి హెచ్చరికను పంపింది. అత్యంత తీవ్ర ప్రకంపనలు సంభవించిన భూకంప కేంద్రానికి దగ్గరగా ఉన్నవారికి 15 సెకన్లపాటు మెసేజులు పంపారు. దూరంగా ఉన్నవారికి, తక్కువ ప్రకంపనలు వచ్చిన ప్రాంత యూజర్లకు ఒక నిమిషంపాటు అలర్ట్స్ జారీ చేశారు. ఇలా మొత్తంగా 25 లక్షల మందిని అప్రమత్తం చేశారు. 2023 నవంబర్లో నేపాల్లో 5.7 తీవ్రతతో భూకంపం వచ్చినప్పుడు కోటి మందికిపైగా హెచ్చరికలు అందాయి. 2025 ఏప్రిల్లో టర్కీలో భూమి కంపించడం ప్రారంభమైన 8 సెకన్ల తర్వాత మొదటి అలర్ట్ జారీ అయింది. ఈ ఘటనలో 1.1 కోట్ల మందికిపైగా ఈ సందేశాలు అందుకున్నారు.అలర్ట్స్ అందుకోవాలంటే వినియోగదారులు వైఫై లేదా సెల్యులార్ డేటా కనెక్టివిటీని కలిగి ఉండాలి. ఆండ్రాయిడ్ ఎర్త్క్వేక్ అలర్ట్, లొకేషన్ సెట్టింగ్స్ రెండూ ఆన్లో ఉండాలి.భూకంప తీవ్రత సాధారణంగా ఉండే అవకాశం ఉంటే ‘మీరు జాగ్రత్త’ అని, ముప్పు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంటే ఆడియో రూపంలో వార్నింగ్తోపాటు పారాహుషార్ అంటూ హెచ్చరిస్తుంది. -
TCS layoffs: రంగంలోకి కేంద్ర ప్రభుత్వం!
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 12,000 మందికిపైగా ఉద్యోగులను తొలగించబోతున్నట్లు చేసిన ప్రకటన దేశ టెక్ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించింది. దీంతో దేశంలోని ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన ఆవరించింది. కాగా టీసీఎస్ లేఆఫ్ల ప్రకటన తరువాత జరుగుతున్న పరిణామాలను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.బాధిత ఉద్యోగులకు ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ వంటి కార్యక్రమాలు ఉపాధి కల్పనను పెంచడానికి ఎలా సహాయపడతాయనే దానిపై కేంద్ర ఐటీ శాఖ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో నైపుణ్యం పెంపు, రీస్కిల్లింగ్కు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయా వర్గాలను ఉటంకిస్తూ ఎకనమిక్స్ టైమ్స్ కథనం పేర్కొంది.ఈ మొత్తం పరిస్థితిని ఐటీ మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోందని, టెక్ కంపెనీతో సంప్రదింపులు జరుపుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. తొలగింపులపై మంత్రిత్వ శాఖ ఆందోళన చెందుతోంది. ఇది ఎందుకు జరుగుతోంది.. అంతర్లీన కారణాలను అర్థం చేసుకోవడానికి పరిశీలిస్తుంది.భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయిన టీసీఎస్ ఈ సంవత్సరం 12,261 మంది ఉద్యోగులను తొలగించనున్న నేపథ్యంలో ఈ వైఖరి ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ ప్రభావం ఎక్కువగా మిడిల్, సీనియర్ గ్రేడ్ ఉద్యోగులపై పడుతుంది. 2025 జూన్ 30 నాటికి టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 6,13,069గా ఉంది. ఇటీవల ముగిసిన ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 5,000 మంది ఉద్యోగులు జతయ్యారు. -
TCS Layoffs: ‘రాజీనామాలు మాత్రం చేయొద్దు’
దేశీయ అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 12,000 మంది ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు ప్రకటించింది. ఈ తొలగింపు మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగులపై ప్రభావం చూపనుంది.ఈ ప్రకటన ఐటీ రంగంలో ప్రకంపనలు సృష్టించింది. టీసీఎస్ ఉద్యోగుల తొలగింపు ప్రకటనను ఐటీ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.ఒత్తిడికి తలొగ్గి రాజీనామాలు చేయొద్దుఈటీ నివేదిక ప్రకారం.. టీసీఎస్ తొలగింపులను చట్టవిరుద్ధమని ప్రకటించిన ఐటీ ఉద్యోగ సంఘాలు ఒత్తిడికి తలొగ్గి ఎవరూ రాజీనామా చేయొద్దంటూ టీసీఎస్ సిబ్బందికి సూచించాయి. అదే సమయంలో లేఆఫ్ ప్రణాళికలను ఉపసంహరించుకోవాలని, ప్రభావిత ఉద్యోగాలను పునరుద్ధరించాలని కర్ణాటక స్టేట్ ఐటీ/ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ టీసీఎస్ యాజమాన్యాన్ని కోరింది.రాజీనామా చేయాలని ఉద్యోగులపై ఒత్తిడి చేయొద్దని ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయీస్ (ఎఫ్ఐటీఈ) టీసీఎస్ను కోరింది. బాధితులకు నోటీస్ పీరియడ్ పేమెంట్స్, సెవెరెన్స్ బెనిఫిట్స్, ఏడాది పాటు ఇన్సూరెన్స్ కవరేజీని అందించాలని డిమాండ్ చేసింది. టీసీఎస్ ఆర్థికంగా పటిష్టంగా ఉందని, అనిశ్చితులేవీ లేనప్పటికీ ప్రకటించిన ఈ తొలగింపులు పూర్తిగా లాభాపేక్షతో తీసుకున్న నిర్ణయాలేనని ఎఫ్ఐటీఈ పేర్కొంది. అన్ని రికార్డులు సిద్ధం చేసుకోవాలని, స్వచ్ఛంద రాజీనామాలకు ఎవరూ వెళ్లొద్దని, నిష్క్రమించాలని ఒత్తిడి చేస్తే రాష్ట్ర లేబర్ కమిషనర్ లేదా ఎఫ్ఐటీఈ సహాయం తీసుకోవాలని ఉద్యోగులకు సూచించింది. 👉 వేలాది లేఆఫ్లు.. ఎమోషనల్ అయిన మైక్రోసాఫ్ట్ సీఈవో -
ఓలా కృత్రిమ్లో రెండో విడత లేఆఫ్స్
ఓలాకు చెందిన భవీష్ అగర్వాల్ స్థాపించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘కృతిమ్’ రెండో విడత ఉద్యోగాలను తొలగించినట్లు వార్తలొస్తున్నాయి. ఈ విడతలో 100 మందికి పైగా సిబ్బందిని ఇంటికి పంపినట్లు తెలుస్తుంది. ఈ లేఆఫ్స్లో ప్రధానంగా ఇటీవలే కంపెనీలో చేరిన లింగ్విస్టిక్స్ బృందంలో పని చేస్తున్న వారిని అధికంగా తొలగించినట్లు కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి.జూన్లో కృతిమ్ మొదటి రౌండ్ ఉద్యోగుల తొలగింపు చేపట్టింది. అందులో భాగంగా డజనుకుపైగా సిబ్బందికి లేఆఫ్స్ ప్రకటించింది. తాజాగా 100కుపైగా ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తుంది. ఈ తొలగింపులు కంపెనీ వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణలో భాగమని, ఉన్న వనరులను మెరుగ్గా నిర్వహించడానికి ఇది ఎంతో తోడ్పడుతుందని ఈ విషయం తెలిసిన వ్యక్తులు చెప్పారు.ఇదీ చదవండి: బంగారు బాతులను చంపేస్తున్నారు.. దేశానికి సిగ్గుచేటుజూన్లో కంపెనీ కృత్రిమ్లో ఏఐ అసిస్టెంట్ ‘కృతి’ని ప్రారంభించింది. దీనికి దాదాపు 80 శాతం శిక్షణ ఇచ్చామని, గతంలో మాదిరిగా తమకు ఎక్కువ మంది సిబ్బంది అవసరం లేదని ఒక అదికారి తెలిపారు. కృత్రిమ్ గతంలో కృత్రిమ మేధ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంలో భారీ పెట్టుబడులను ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభంలో భవీష్ అగర్వాల్ కృత్రిమ్ ఏఐ ల్యాబ్స్ను ఆవిష్కరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి రూ.2,000 కోట్లు కేటాయించారు. వచ్చే ఏడాది ఈ సంఖ్యను రూ.10,000 కోట్లకు పెంచే ప్రణాళికలున్నట్లు తెలిపారు. -
టీసీఎస్.. భారీగా లే ఆఫ్స్.. ఎవరిపై ప్రభావమంటే..!
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) భారీ లే ఆఫ్స్కు సిద్ధమైంది. ప్రస్తుతం సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులు కారణంగా భారీ తొలగింపునకు టీసీఎస్ సన్నద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా టీసీఎస్ కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగాల్లో 2 శాతం లే ఆఫ్స్ కు సిద్ధమైన విషయాన్ని కంపెనీ ఆదివారం స్పష్టం చేసింది. అంటే 12వేలకు పైగా ఉద్యోగులు తమ ఉద్యోగాల్ని కోల్పోనన్నారు. ఇది మధ్యస్థంగా ఉన్న ఉద్యోగులతో పాటు సీనియర్ స్థాయిల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ కె కృతివాసన్ స్పష్టం చేశారు. అయితే ఉద్యోగుల్ని తొలగించడం తమకు కూడా బాధగానే ఉందని, కాకపోతే మారిన టెక్నాలజీతో తొలగింపులు తప్పడం లేదన్నారు.కొత్త టెక్నాలజీల పరంగా చూస్తే ముఖ్యంగా ఏఐ ఆపరేటింగ్ మోడల్ మార్పులను గుర్తిస్తున్నాం. పని చేసే విధానాలూ మారుతున్నాయి. అందుకే భవిష్యత్తుకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. అందుకోసం మేము ఏఐని ఉపయోగిస్తూ కావాల్సిన నైపుణ్యాలను మెరుగుపరిచే పనిలో ఉన్నాం. మా కంపెనీ విస్తరణ అవకాశాలను మెరుగుపరిచేందుకు ఎక్కువ శాతం పెట్టుబడులు పెట్టాం. కానీ, పలు విభాగాల్లో వృద్ధి కనిపించడం లేదు. దాంతో లే ఆఫ్స్ తప్పడం లేదు. ఇది ప్రపంచ వ్యాప్తంగా మా ఉద్యోగుల్లో సుమారు 2 శాతం మందిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మధ్యస్థ, సీనియర్ స్థాయుల్లో ఉండే ఉద్యోగులపైనే ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ నిర్ణయం అనుకున్నంత ఈజీ కాదు. సీఈఓగా నేను తీసుకున్న అత్యంత కఠిన నిర్ణయాల్లో ఇదొకటి’ అని కృతివాసన్ తెలిపారు. -
వాన పడితే వావ్! ఈ గ్యాడ్జెట్స్ ఉంటే రెయిన్ టెన్షన్ ఉండదిక..
వాన పడితే చాయ్, పకోడీతో ‘వావ్’ అనాలా? లేదా తడి బట్టల టెన్షన్తో ‘ఓహ్ నో!’ అనాలా?. ఇప్పుడు వావ్ మాత్రమే అనిపించేలా, వాన తెచ్చే టెన్షన్కి బై.. బై చెప్పే గాడ్జెట్స్ వచ్చేశాయి. అవే ఇవి.ఇంట్లోనే ఆరేసేయ్!ఇంట్లో బట్టలు ఆరేయడానికి చోటు లేదు, బయట గాలి లేదు, లాండ్రీకి వేసేందుకు టైమ్ లేదు.. ఇలా వానాకాలంలో బట్టలు అన్నవే బాధగా మారిపోయాయా? కూల్! ఇప్పుడు మార్కెట్లోకి చిటికెలోనే దుస్తులను ఆరబెట్టే అద్భుతమైన పరికరం వచ్చేసింది. పేరు ‘ఎక్స్ప్రెస్ డ్రైయర్ ఔరేట్ ప్రో మ్యాక్స్’. చిన్న బాటిల్ సైజులో ఉండే ఈ పరికరం, ఒకేసారి నాలుగు పెద్ద దుస్తులను ఆరబెట్టగలదు. అంతేకాదు, దీనిని ఆన్ చేసుకుంటే, ఇందులోంచి వెలువడే అల్ట్రావయొలెట్ కాంతి దుస్తులపై ఉండే సూక్ష్మజీవులను నిర్మూలిస్తుంది. దీని వల్ల దుస్తుల మురుగు వాసన తొలగి, అచ్చం బయట ఎండలో ఆరవేసినంత శుభ్రంగా తయారవుతాయి. పవర్ ఆన్చేసి, ఒక్కసారి టైమర్ పెడితే, పని అయిపోగానే ఆదే ఆగిపోతుంది. ఈ డ్రైయర్ను మడతపెట్టి సూట్కేస్లో పెట్టుకోవచ్చు కూడా. దీని ధర రూ. 4,712.కవర్ వేసి కూల్గా నడవండి వర్షం రాగానే చాలామంది హెల్మెట్, గొడుగు, రెయిన్ కోట్ వేసుకొని ఫుల్ ప్రొటెక్షన్ మోడ్లోకి వెళ్తారు. ముఖం తడవదు, జుట్టు తడవదు కాని, చెప్పులు? కొత్తగా కొన్న బ్రాండెడ్ షూస్ బురదలో మునిగి, మురికి నీళ్లలో నానిపోయి, ఇంట్లోకి అడుగు పెట్టే సరికి వాసనతో బరువెక్కిపోతుంటాయి. ఇప్పుడు ఆ బాధకు ఫుల్స్టాప్ పెట్టేందుకు మార్కెట్లోకి వచ్చాయి వాటర్ప్రూఫ్ షూ కవర్స్. పీవీసీ మెటీరియల్తో తయారైన ఇవి జిప్పర్, డ్రాస్ట్రింగ్ డిజైన్లతో షూస్కి నాలుగు వైపులా కవచంలా ఉంటాయి. వర్షం, మంచు, మట్టి, బురద నుంచి రక్షణ ఇస్తాయి. నాన్స్లిప్ సోల్ వల్ల వీటితో నడిచేటప్పుడు జారిపోయే ప్రమాదం ఉండదు. వీటిని మడతపెట్టి పాకెట్లో వేసుకోవచ్చు. ధర వివిధ కంపెనీలను బట్టి రూ. 200 నుంచి రూ. 1000 వరకు ఉంటుంది.సురక్షితమైన వెలుగు సువాసనతోవర్షం వచ్చినప్పుడల్లా పవర్ కట్ కామన్! టీవీ ఆగిపోతుంది, ఫ్యాన్ ఆగిపోతుంది, ఇల్లంతా చీకటి కమ్మేస్తుంది. అప్పుడు మనం క్యాండిల్స్ వెలిగిస్తాం. అది మామూలు క్యాండిల్ అయితే, చేతుల మీద కరిగిన మైనం పడి మండుతుంది. గాజు జార్లో ఉన్న క్యాండిల్ చీకట్లో పగిలిపోతుంది. అందుకే, ఇలాంటి సమయాల్లో నిజంగా పనికొచ్చేవి మామూలు క్యాండిల్స్ కాదు, ‘సాండ్ వాక్స్ క్యాండిల్స్’. ఈ క్యాండిల్ వాక్స్ మామూలు వాక్స్ కాదు. సువాసనతో కూడిన పౌడర్ వాక్స్. ఇది రీఫిల్లబుల్, నాన్ టాక్సిక్. చేతులపై కరిగి పడదు, పొగతో చికాకు పెట్టదు. మీకు ఇష్టమైన గిన్నెలో వేసుకుని, అందులో ఒత్తి పెట్టి వెలిగించుకోవచ్చు. ఇలా ఎన్నిసార్లయినా ఒత్తి తీసి మళ్లీ వాడుకోవచ్చు. ధర. రూ.309 మాత్రమే! -
బెంగళూరులో వర్క్ ఫ్రమ్ హోమ్? పరిశీలిస్తున్న ఐటీ సంస్థలు
దేశ ఐటీ రాజధానిగా పిలిచే బెంగళూరు మహా నగరంలో ట్రాఫిక్ తిప్పలు అన్నీ ఇన్నీ కావు. నాలుగైదు కిలోమీటర్ల ప్రయాణానికే గంటలకొద్దీ సమయం పడుతోంది. నగరంలో ట్రాఫిక్ తగ్గించడానికి ముఖ్యంగా రద్దీగా ఉండే ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) వెంబడి దీర్ఘకాలిక ట్రాఫిక్ ఇబ్బందులను పరిష్కరించడానికి నగర ట్రాఫిక్ పోలీసులు కొత్త ఆలోచనను ప్రతిపాదించారు. బుధవారాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ (డబ్ల్యూఎఫ్హెచ్) అమలు చేయాలని అక్కడి ఐటీ సంస్థలకు సూచించారు.ఎడతెగని ట్రాఫిక్బెంగళూరు ట్రాఫిక్ పరిస్థితి చాలా కాలంగా నగరవాసులకు, ప్రయాణికులకు చిరాకు తెప్పిస్తోంది. బెంగళూరులో ట్రాఫిక్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ‘ఎక్స్’లో ఓ యూజర్ వ్యాఖ్యానించారు. ‘నేను ఇంటి నుంచి ఉదయం 9 లేదా 9:30 గంటలకు బయలుదేరితే ఏ 12 గంటలకో ఆఫీసు చేరుకుంటాన్నాను. ఇది కేవలం 6 కిలోమీటర్ల ప్రయాణం మాత్రమే! నాకు సొంత కారు ఉన్నా ట్రాఫిక్కు భయపడి దాన్ని బయటకు తీసే ఆలోచన కూడా చేయడం లేదు. ఏ ఉబెర్ లాంటిదో బుక్ చేసుకోవాల్సి వస్తోంది. రద్దీ సమయాల్లో వాళ్లు ఒక్కో రైడ్కు రూ .500–రూ .600 తీసుకుంటున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘అదృష్టవశాత్తూ మా ఆఫీస్లో హైబ్రిడ్ విధానం అనుసరిస్తున్నారు. కానీ ఆఫీస్కు బయలుదేరినప్పుడు ఈ గందరగోళాన్ని అనుభవించాల్సి ఉంటుంది. ఇది పనిచేసే ఉత్సాహాన్ని హరిస్తుంది. ఎవరోఒకరు ట్రాఫిక్ లో ఇరుక్కోవడం వల్ల చాలాసార్లు మీటింగ్లు వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. ఆఫీస్కి 1-2 కిలోమీటర్ల పరిధిలో నివసించే సహోద్యోగులు కూడా క్యాబ్లలో వచ్చి ఆ ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం ఎందుకని నడిచి వస్తున్నారు. బెంగళూరు లాంటి నగరానికి ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు’ అని పేర్కొన్నారు.ఉదయం విపరీత ట్రాఫిక్పలు ప్రధాన ఐటీ పార్కులు, కంపెనీలకు నిలయమైన ఓఆర్ ఆర్ పై ఒత్తిడిని తగ్గించే చర్యల్లో భాగంగానే ఈ ప్రతిపాదిత డబ్ల్యూఎఫ్ హెచ్ ప్రణాళికను రూపొందించినట్లు ట్రాఫిక్ అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని జాయింట్ కమిషనర్ ఆఫ్ ట్రాఫిక్ కార్తీక్ రెడ్డి తెలిపారు. ఈ ఒత్తిడిని తగ్గించడానికి కంపెనీలు ఉదయం 7.30 గంటలకే పనివేళలను ప్రారంభించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వారం మధ్యలో అంటే బుధవారం వర్క్ఫ్రమ్ హోమ్ అమలు చేయాలని ట్రాఫిక్ అధికారులు సిఫార్సు చేస్తున్నారు.వ్యూహం ఇదీ..ట్రాఫిక్ విభాగం, బీబీఎంపీ (నగర కార్పొరేషన్), బీఎంటీసీ (బస్ సర్వీస్), ఐటీ రంగానికి చెందిన కీలక భాగస్వాములతో కూడిన సంయుక్త సమావేశంలో ఈ ప్రతిపాదనలపై చర్చించారు. ఓఆర్ ఆర్ వెంబడి పెండింగ్ లో ఉన్న రోడ్డు పనులను వేగవంతం చేయడం, ప్రత్యేక బస్ బేల ఏర్పాటు, ప్రధాన టెక్ పార్కుల మధ్య కనెక్టివిటీని మెరుగుపరచడం సహా అత్యవసర మౌలిక సదుపాయాల అప్ గ్రేడ్ లపై సమావేశంలో చర్చించారు. ఈ ప్రతిపాదనలపై ఐటీ కంపెనీలు కూడా పరిశీలిస్తున్నాయి. ఇది అమల్లోకి వస్తే వారంలో ఒక్కరోజైనా నగరంలో ఎంతో కొంత ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉంది. -
ఫోన్కి వస్తున్న మెసేజ్లలో కొత్త మార్పులు.. గమనించారా?
మన ఫోన్లకు రోజూ పదుల సంఖ్యలో వివిధ రకాల ఎస్ఎంఎస్లు వస్తుంటాయి. వీటిలో ఎక్కువ శాతం వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రమోషనల్ మెసేజ్లే ఉంటుంటాయి. వీటి మధ్య ముఖ్యమైన మెసేజ్లను చూసుకోకుండా విస్మరిస్తుంటాం. కానీ ఈ మధ్య వస్తున్న వస్తున్న ఎస్ఎంఎస్లను గమనిస్తే కొత్త మార్పులు కనిపిస్తాయి. అదేమీ లేదండి ఏ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందో సులువుగా తెలిసేలా ట్రాయ్ ఇటీవల కొత్త ఎస్ఎంఎస్ ట్యాగింగ్ వ్యవస్థను తీసుకొచ్చింది.మనకు వచ్చే ప్రతి ఎస్ఎంఎస్ ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేసేలా ఐడింటిఫికేషన్ అక్షరం ఉంటుంది. ఎస్ఎంఎస్ హెడర్లో పీ(P) అని ఉంటే ప్రమోషనల్ అంటే వివిధ కంపెనీలు తమ ప్రచారం కోసం పంపించే మెసేజ్లు అన్నమాట. ఎస్(S) అని ఉంటే సర్వేస్ అంటే సాధారణ సమాచారం తెలియజేసేవి అని అర్థం. ఇక టీ(T) అని ఉంటే ట్రాన్సాక్షనల్ అంటే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి బ్యాంకుల నుంచి వచ్చే ఓటీపీలు, జీ(G) అని ఉంటే గవర్నమెంట్ అంటే ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారం. ఇలా.. ఏదైనా ఎస్ఎంఎస్ వచ్చినప్పుడు దాన్ని పూర్తిగా తెరిచి చదవకుండానే దాని ఉద్దేశం తెలుసుకోవచ్చు.ఈ మార్పు ఎందుకంటే..దేశంలో 1.1 బిలియన్లకు పైగా మొబైల్ వినియోగదారులు తరచూ స్పామ్, అవాంఛిత ఎస్ఎంఎస్ సందేశాలను ఎదుర్కొంటున్నారు. చాలా మంది వినియోగదారులు ఏ సందేశాలు ముఖ్యమైనవి, ఏవి అసంబద్ధమైనవి అని తెలుసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. వినియోగదారులు వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడటానికి ఫిల్టర్గా పనిచేసేలా కొత్త అనుబంధ వ్యవస్థను రూపొందించారు. -
ఏఐకి ప్రభుత్వ మద్దతు కావాలి
న్యూఢిల్లీ: జాతీయ భద్రత దృష్ట్యా కృత్రిమ మేథకి (ఏఐ) ప్రభుత్వం మద్దతు అవసరమని నెక్స్జెన్ ఎగ్జిబిషన్స్ ఒక నివేదికలో తెలిపింది. పటిష్టమైన సైబర్సెక్యూరిటీ, బోర్డర్ సెక్యూరిటీ కోసం దీనిపై గణనీయంగా ఇన్వెస్ట్ చేయాలని, ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. 15 నగరాలకు చెందిన 200 పైగా కంపెనీలతో నిర్వహించిన సర్వే ప్రాతిపదికన నెక్స్జెన్ ఈ నివేదిక రూపొందించింది. జాతీయ భద్రత కోసం ప్రభుత్వం ఏఐకి క్రియాశీలకంగా మద్దతునివ్వాలనే విషయంపై ’ఏకీభవిస్తున్నాను’, ’మరింతగా ఏకీభవిస్తున్నాను’ అనే ఆప్షన్లకు 86 శాతం మంది సానుకూలంగా స్పందించినట్లు సంస్థ తెలిపింది. డిఫెన్స్లో ఏఐ ఆవిష్కరణల కోసం ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యాలు, ప్రోత్సాహకాలు అవసరమని 14 శాతం మంది అభిప్రాయపడ్డారు. పరిశ్రమలో ఏఐ అంతరాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యాలు ఉపయోగపడగలవని పేర్కొన్నారు. దేశ భద్రతను పటిష్టం చేసుకునే దిశగా ఏఐని సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలంటే పాలసీపరంగా ఉన్న అనేక అంతరాలను ప్రభుత్వం, పరిశ్రమ పరిష్కరించుకోవాల్సి ఉంటుందని నివేదిక తెలిపింది. ఎల్రక్టానిక్ యుద్ధాలు, సమాచార యుద్ధాలతో సవాళ్లు పెరిగిపోతున్న నేపథ్యంలో జాతీయ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఏఐ ఎంతో ఉపయోగకరమైన సాధనంగా ఉండగలదని నెక్స్జెన్ పేర్కొంది. పరిశ్రమ గణాంకాల ప్రకారం 2024లో దేశీయంగా 23 లక్షల పైగా సైబర్దాడులు చోటు చేసుకున్నాయి. వీటి వల్ల రూ. 1,200 కోట్ల మేర ఆరి్థక నష్టం వాటిల్లింది. అంతర్జాతీయంగా ఫిషింగ్ దాడుల విషయంలో అమెరికా, రష్యా తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. -
వేలాది లేఆఫ్లు.. ఎమోషనల్ అయిన మైక్రోసాఫ్ట్ సీఈవో
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్లో వేలాది లేఆఫ్లపై ఆ సంస్థ సీఈవో సత్య నాదెళ్ల ఎమోషనల్గా స్పందించారు. ఇటీవల కంపెనీలో ఇటీవల 9,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించడం తనను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని అంగీకరించారు. అయితే సంస్థ ఏఐ పరివర్తనకు ఈ కోతలు అవసరమని ఆయన పేర్కొన్నారు.కంపెనీ పరిణామాలపై ఆయన ఉద్యోగులకు లేఖలు పంపారు. "అన్నింటికంటే ముందుగా నేను నాపై ఎక్కువ భారం మోపుతున్న వాటి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇటీవలి ఉద్యోగ తొలగింపుల గురించి మీలో చాలా మంది ఆలోచిస్తున్నారని నాకు తెలుసు" అంటూ సత్య నాదెళ్ల లేఖ మొదలు పెట్టారు. " ఈ నిర్ణయాలు మనం తీసుకోవాల్సిన అత్యంత క్లిష్టమైనవి. మన సహోద్యోగులు, సహచరులు, స్నేహితులు.. మనం ఎవరితో అయితే కలిసి పనిచేశామో, నేర్చుకున్నామో, లెక్కలేనన్ని క్షణాలను పంచుకున్నామో వారిని అవి ప్రభావితం చేస్తాయి" అంటూ రాసుకొచ్చారు.మైక్రోసాఫ్ట్ 2014 తర్వాత ఈ సంవత్సరం భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. దాని ప్రపంచ శ్రామిక శక్తిలో 7 శాతం మందికి ఉద్వాసన పలికింది. ఉద్యోగాల కోతలో అనిశ్చితి, అసంబద్ధత కనిపిస్తోందని అంగీకరించిన సత్య నాదెళ్ల కంపెనీ వృద్ధిపై కూడా దృష్టి సారించారు. "మార్కెట్ పనితీరు, వ్యూహాత్మక స్థానం, వృద్ధి ఇలా అంశాల్లో లక్ష్యంతో కూడిన చర్యల ద్వారా మైక్రోసాఫ్ట్ పురోగమిస్తోంది. మనం మునుపటి కంటే మూలధన పెట్టుబడులు ఎక్కువ పెడుతున్నాం. మన మొత్తం హెడ్ కౌంట్లో పెద్దగా మార్పేమీ లేదు. మన పరిశ్రమలో, మైక్రోసాఫ్ట్ లో కొంతమంది ప్రతిభ, నైపుణ్యానికి మునుపెన్నడూ చూడని స్థాయిలో గుర్తింపు, రివార్డులు లభిస్తున్నాయి. అదే సమయంలో లేఆఫ్లూ అమలు చేస్తున్నాం" అని వివరించారు. -
సుందర్ పిచాయ్ ఇక బిలియనీర్..
ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ బిలియనీర్స్ క్లబ్లోకి చేరారు. 1 బిలియన్ డాలర్ల నికర సంపద పరిమితిని అధిగమించి బిలియనీర్గా అవతరించారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ఆల్ఫాబెట్ షేర్లు ఆల్టైమ్ గరిష్టానికి చేరుకోవడంతో, భారత్కు చెందిన 53 ఏళ్ల పిచాయ్ నెట్వర్త్ 1.1 బిలియన్ డాలర్లకు పెరిగింది.2023 ప్రారంభం నుంచి ఆల్ఫాబెట్ స్టాక్ 120 శాతానికి పైగా పెరగడం, కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1 ట్రిలియన్ డాలర్లకు పైగా పెరగడం ఈ ఆర్థిక పురోగతికి ప్రధాన కారణమని బ్లూమ్బర్గ్ పేర్కొంది. ముఖ్యంగా టెక్ రంగంలో ఒక వ్యవస్థాపకేతర సీఈఓకు ఇది అరుదైన ఘనత. మెటాకు చెందిన మార్క్ జుకర్ బర్గ్, ఎన్విడియాకు చెందిన జెన్సెన్ హువాంగ్ వంటి ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్ లు బిలియనీర్స్గా ముందు వరసలో ఉన్నప్పటికీ వారు తమ కంపెనీల్లో ఈక్విటీ వాటాలను కలిగి ఉన్నారు.సీఈవోగా పదేళ్లుఆల్ఫాబెట్ సీఈవోగా సుందర్ పిచాయ్ ఇటీవలే పదేళ్లు పూర్తి చేసుకుని కంపెనీలో ఎక్కువ కాలం చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. పిచాయ్ 2004లో ఆల్ఫాబెట్ ప్రధాన అనుబంధ సంస్థ గూగుల్ లో చేరారు. క్రోమ్, ఆండ్రాయిడ్ లకు ఆయన తొలినాళ్లలో చేసిన సేవలు 2015లో సీఈఓగా ఎదగడానికి పునాది వేశాయి. తర్వాత 2019లో ఆల్ఫాబెట్ సీఈఓగా సుందర్ పిచాయ్ నియమితులయ్యారు.నిరాడంబర నేపథ్యం..సుందర్ పిచాయ్ తమిళనాడులోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించి రెండు గదుల అపార్ట్ మెంట్ లో పెరిగారు. వారి కుటుంబానికి కారు ఉండేది కాదు. ఆయనకు 12 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు తొలిసారిగా ఇంటికి టెలిఫోన్ వచ్చింది. 1993 లో సుందర్ పిచాయ్ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి స్కాలర్షిప్ సాధించగా ఆయన్ను కాలిఫోర్నియా పంపించడానికి విమాన టికెట్ కోసం ఆయన తండ్రి ఏడాది మొత్తం జీతం కంటే కూడా పైగానే ఆ కుటుంబం ఖర్చుపెట్టాల్సి వచ్చింది. -
రూ.10 వేల లోపు కేటగిరిలో మరో కొత్త స్మార్ట్ ఫోన్
రూ.10 వేల లోపు కేటగిరిలో మరో కొత్త స్మార్ట్ ఫోన్ విడుదలైంది. హెచ్డీ+ డిస్ప్లే, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఐపీ64 వాటర్ రెసిస్టెన్స్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, ఎన్ఎఫ్సీ, ఎఫ్ఎం రేడియో సపోర్ట్ తో ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ కొత్త ఫోన్ వివో టీ4 లైట్, పోకో ఎం7, లావా స్టార్మ్ ప్లే ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 ధర.. లభ్యత ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 స్మార్ట్ఫోన్ 4 జీబీ ర్యామ్ / 64 జీబీ స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే వస్తుంది. దీని ధర రూ .6,799. ఐరిస్ బ్లూ, ట్విలైట్ గోల్డ్, టైటానియం సిల్వర్, స్లీక్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. ఆగస్టు 2వ తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది.ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 స్పెసిఫికేషన్లుఇన్ఫినిక్స్ స్మార్ట్ 10లో 6.67 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 700 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.ఇది ఐపీ 64 వాటర్ రెసిస్టెన్స్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్ తో వస్తుంది. అంటే ఫోన్పై దుమ్ము, నీటి చుక్కలు పడినా ఏమీ అవ్వదు కానీ నీటిలో పూర్తిగా మునిగిపోకుండా ఉండాలి.స్మార్ట్ 10 డీటీఎస్ ట్యూన్ చేసిన డ్యూయల్ స్పీకర్ సెటప్ తో వస్తుంది. 300% వాల్యూమ్ బూస్ట్ ను సపోర్ట్ చేస్తుంది.ఏ55 జీపీయూతో కూడిన యూనిసోక్ టీ7250 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేస్తుంది. ఈ ఏడాది లాంచ్ అయిన ఇతర ఇన్ఫినిక్స్ ఫోన్ల మాదిరిగానే, ఈ స్మార్ట్ 10 ఆండ్రాయిడ్ 15 ఆధారిత కంపెనీ తాజా ఎక్స్ఓఎస్ 15 పై పనిచేస్తుంది.ఇందులో 4 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ను అందించారు. మైక్రో ఎస్ డీ కార్డ్ స్లాట్ ద్వారా స్టోరేజ్ ను 2 టీబీ వరకు పెంచుకునే వెసులుబాటు కూడా ఉంది.ఆప్టిక్స్ విషయానికొస్తే, ఫోన్లలో 8 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, వెనుక భాగంలో డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ షూటర్ ఉంది. రియర్, ఫ్రంట్ కెమెరా రెండూ 2కే 30 ఎఫ్పీఎస్ వేగంతో వీడియోలను షూట్ చేయగలవు.15వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. -
మెటా వారి ఇమాజిన్ మీ
‘ఇమాజిన్ మీ’ అనే సరికొత్త ఏఐ–పవర్డ్ ఫీచర్ని తీసుకువచ్చింది మెటా ఏఐ. ఈ ఫీచర్తో టెక్ట్స్ ప్రాంప్ట్ ఉపయోగించి యూజర్లు తమ ఏఐ ఇమేజ్లను జనరేట్ చేయవచ్చు. ‘ఇమాజిన్ మీ’ ఫీచర్ని వాట్సప్, ఫేస్బుక్ మెసెంజర్, ఇన్స్టాగ్రామ్ చాట్విండోస్లో ఉపయోగించవచ్చు.అక్యురేట్, కస్టమైజ్డ్ ఫోటోగ్రాఫ్స్ కోసం ‘ఇమాజిన్ మీ’ యూజర్లకు సంబంధించి ఫ్రంట్, లెఫ్ట్, రైట్ ఫేస్ల సెల్ఫీలను అడుగుతుంది.‘ఇమాజిన్ మీ యాజ్ ఏ నైంటీస్ గ్యాంగ్స్టర్’ ‘ఇమాజిన్ మీ యాజ్ ఏ కౌబాయ్’లాంటిప్రాంప్ట్ను యూజర్లు ఇవ్వవచ్చు. ప్రామ్ట్ సెట్టింగ్స్తో అదనపు మార్పులు కూడా చేయవచ్చు.ఉదా: ఇమాజిన్ మీ యాజ్ ఏ కౌబాయ్, బట్ ఆన్ ది మూన్, వీయరింగ్ ఫ్యూచరిస్టిక్ క్లాత్స్ఇమాజిన్ యాజ్ ఏ నైంటీస్ గ్యాంగ్స్టర్ సిప్పింగ్ కాఫీ ఎట్ యాన్ ఇండియన్ బీచ్తమ ఏఐ–జనరేటెడ్ ఇమేజ్లు సంతృప్తికరంగా లేకపోతే ఎడిట్, రీజెనరేట్, రిమూవ్ ఇమేజెస్లాంటి ఆప్షన్లను యూజర్లు ఉపయోగించుకోవచ్చు. -
గూగుల్ క్రోమ్కు సవాల్.. ఎన్విడియా ఏఐ వచ్చేస్తోంది!
ప్రపంచవ్యాప్తంగా వెబ్ బ్రౌజర్ల మార్కెట్ లీడర్గా కొనసాగుతున్న ఆల్ఫాబెట్కు చెందిన గూగుల్ క్రోమ్కు సవాల్ విసిరేందుకు టెక్నాలజీ దిగ్గజ సంస్థ ఎన్విడియాకు చెందిన పర్పెక్స్సిటీ ఏఐ సిద్ధమవుతోంది. త్వరలోనే కామెట్ పేరుతో ఏఐ ఆధారిత సామర్థ్యంగల వెబ్ బ్రౌజర్ను తీసుకురానుంది. – సాక్షి, సెంట్రల్డెస్క్మార్కెట్.యూఎస్ అనే సంస్థ నివేదిక ప్రకారం 2024లో 4.5 బిలియన్ డాలర్లుగా ఉన్న ఏఐ ఆధారిత వెబ్ బ్రౌజర్ల మార్కెట్.. 2034 నాటికి 76.8 బిలియన్ డాలర్లకు చేరుకొనే అవకాశం ఉంది. స్టాట్కౌంటర్ అనే సంస్థ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జూన్ నాటికి ప్రపంచ వెబ్ బ్రౌజర్ల మార్కెట్లో క్రోమ్ 68 శాతం వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రపంచంలోనే అత్యధికం మంది యూజర్లు ఉపయోగిస్తున్న వెబ్ బ్రౌజర్గా మార్కెట్ను సుస్థిరం చేసుకొని ఇతర ప్రముఖ వెబ్ బ్రౌజర్లయిన సఫారీ, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఫైర్ఫాక్స్కు అందనంత ఎత్తులో ఉంది.యూజర్లకు లభించేవి ఇవీ..సాధారణ బ్రౌజర్లతో పోలిస్తే ఏఐ ఆధారిత బ్రౌజర్లు యూజర్లు కోరిన కంటెంట్ను సంక్షిప్తంగా అందించగలవు. అలాగే టాస్క్లను ఆటోమేట్ చేయగలవు. ఉదాహరణకు ఈ–మెయిళ్లకు ఆటోమెటిక్గా రిప్లైలు పంపడం, సోషల్ మీడియా పోస్ట్లను షెడ్యూల్ చేయడం, దరఖాస్తుల్లోని డేటాను సంగ్రహించడం లాంటివి అన్నమాట.ముఖ్యంగా సందర్భానుసారంగా జవాబులు అందించగలవు. అంటే యూజర్లు అందించే ఇన్పుట్లు, డేటా హిస్టరీని పరిగణనలోకి తీసుకొని, వాటిని విశ్లేషించి జవాబులను అందించడం, వివిధ డేటా సోర్స్ల నుంచి సమాచారాన్ని క్రోడీకరించి నేరుగా సమాధానాలు ఇవ్వ డం చేయగలవు. అపాయింట్మెంట్ల బుకింగ్లు, ఉత్పత్తులను పోల్చడం వంటి సంక్లిష్ట పనులను కూడా చక్కబెట్టగలవు. -
కొత్త ఆవిష్కరణలపై బ్యాంక్ ఆఫ్ బరోడా దృష్టి
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) తమ 118వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా పలు కొత్త ఆవిష్కరణలు, కార్యక్రమాలను ప్రకటించింది. వ్యాపార వర్గాల కోసం ఉద్దేశించిన వరల్డ్ బిజినెస్ యాప్, బాబ్ ఈ–పే ఇంటర్నేషనల్, ఇన్సైట్ బ్రెయిలీ డెబిట్ కార్డు, గ్రీన్ ఫైనాన్సింగ్ స్కీములు మొదలైనవి ఉన్నాయి.టెక్నాలజీ ఆధారిత బ్యాంకింగ్ సేవలను అందించడం ద్వారా సమ్మిళిత వృద్ధి సాధనలో బీవోబీలాంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయని కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు తెలిపారు. బ్యాంకింగ్ సేవలను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు, లావాదేవీల నిర్వహణను సరళతరంగా, సురక్షితంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని బీవోబీ ఎండీ దేబదత్త చంద్ తెలిపారు.ఇదీ చదవండి: ఉద్యోగం ఇచ్చారు.. అంతలోనే తొలగించారు!బ్యాంకు అందిస్తున్న జనరేటివ్ ఏఐ పవర్డ్ టూల్స్అదితి: వీడియో, ఆడియో, చాట్ ద్వారా మల్టీ ల్యాంగ్వేజీలో 24/7 వర్చువల్ రిలేషన్ షిప్ మేనేజర్ సర్వీసులు అందిస్తుంది.ఏడీఐ: తక్షణ సమస్యల పరిష్కారం కోసం జనరేటివ్ఏఐ ఆధారిత చాట్ బాట్.గ్యాన్సహాహ్.ఏఐ(GyanSahay.AI): ఉద్యోగులు ప్రొడక్ట్, పాలసీ సమాచారాన్ని త్వరగా యాక్సెస్ చేయడానికి ఇంటర్నల్ జెఎన్ఏఐ ప్లాట్ఫామ్. -
ఉపాధిని తొలగించే టెక్నాలజీ ఎందుకు?
సాంకేతిక పురోగతి ఉపాధిని తొలగించేదిగా ఉండకూడదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు. టెక్నాలజీ అనేది కార్మికులను గౌరవించి, పరిశ్రమలకు మద్దతు ఇచ్చేలా, జాతీయ ప్రయోజనాలకు ఉపయోగపడేలా సమతుల్య విధానాన్ని ప్రోత్సహించాలని చెప్పారు. భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) 70వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో భగవత్ మాట్లాడారు. బీఎంఎస్ ఆర్ఎస్ఎస్కు అనుబంధంగా ఉన్న భారతదేశపు అతిపెద్ద కార్మిక సంఘం.ఇదీ చదవండి: ఉద్యోగం ఇచ్చారు.. అంతలోనే తొలగించారు!‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరివర్తన సవాలుగా మారుతోంది. ప్రతి కొత్త టెక్నాలజీ ప్రాథమికంగా ఆందోళన కలిగిస్తుంది. నాలెడ్జ్ బేస్డ్ టెక్నాలజీ సంబంధిత రంగంలోని ఉద్యోగాలపై ప్రభావం చూపకూడదు. దాని ప్రతిష్ఠను దిగజార్చకూడదు. మారుతున్న ఆర్థిక, సాంకేతిక పరిస్థితులకు అనుగుణంగా కార్మిక, పారిశ్రామిక, జాతీయ ప్రయోజనాలను సమన్వయం చేసేలా సాంకేతిక అభివృద్ధి ఉండాలి. ప్రతి ఆవిష్కరణలో ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగా మాన్యువల్ లేదా సెమీ స్కిల్డ్ లేబర్పై ఎక్కువగా ఆధారపడే రంగాల్లో దీని ప్రభావం అధికంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి’ అన్నారు. -
ఎకానమీకి గూగుల్ ప్లే, ఆండ్రాయిడ్ దన్ను
న్యూఢిల్లీ: భారత ఎకానమీ వృద్ధికి గూగుల్ ప్లే, ఆండ్రాయిడ్ కూడా ఇతోధికంగా తోడ్పాటు అందిస్తున్నట్లు రీసెర్చ్ కన్సల్టెన్సీ సంస్థ పబ్లిక్ ఫస్ట్ తెలిపింది. 2024లో యాప్ పబ్లిషర్లకు, విస్తృత ఆర్థిక వ్యవస్థకు ఇవి సుమారు రూ. 4 లక్షల కోట్ల మేర ఆదాయ ప్రయోజనం చేకూర్చినట్లు వివరించింది. ప్రపంచంలోనే అతి పెద్దదైన, అత్యంత వేగంగా ఎదుగుతున్న డిజిటల్ ఎకానమీల్లో భారత్ కూడా ఒకటని పబ్లిక్ ఫస్ట్ ఒక నివేదికలో వివరించింది. స్మార్ట్ఫోన్ల వినియోగం వేగంగా పెరగడం, డేటా చౌకగా లభిస్తుండటం, డెవలపర్లు.. ఎంట్రప్రెన్యూర్లకు అనువైన పరిస్థితులు నెలకొనడం తదితర అంశాలు ఇందుకు దోహదపడుతున్నట్లు పేర్కొంది. రిపోర్టు ప్రకారం గూగుల్ ప్లే, ఆండ్రాయిడ్ యాప్ వ్యవస్థ దాదాపు ముప్పైఅయిదు లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను కల్పించింది. గూగుల్ ప్లేలో నమోదు చేసుకున్న యాక్టివ్ డెవలపర్లకు సంబంధించి 10 లక్షల డెవలపర్ జాబ్స్తో భారత్ రెండో స్థానంలో ఉంది. సుమారు 79% మంది యాప్ డెవలపర్లకు విదేశీ యూజర్లు ఉన్నారు. ప్లే స్టోర్ నుంచి భారతీయ డెవలపర్ల యాప్ల డౌన్లోడ్లు 720 కోట్లుగా ఉండగా, ఇందులో దేశీ యూజర్ల డౌన్లోడ్లు 600 కోట్లు, విదేశీ యూజర్ల డౌన్లోడ్లు 120 కోట్లుగా నమోదయ్యాయి. ఆండ్రాయిడ్ సర్వీసులకు సంబంధించి గూగుల్ ప్లే అధికారిక యాప్ స్టోర్. -
టీసీఎస్ కూడా అంతేనా? కేంద్రానికి ఉద్యోగుల ఫిర్యాదు
ఉద్యోగులకు ఆఫర్ లెటర్లు ఇచ్చి ఉద్యోగంలోకి చేర్చుకోకుండా తిప్పలు పెడుతోందంటూ దేశీ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్పై ఐటీ ఉద్యోగుల సంఘం ఆ మధ్య కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కూడా ఇలాగే చేస్తోందని ఐటీ ఉద్యోగుల సంఘం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది.600 మందికి పైగా అనుభవజ్ఞులైన ఉద్యోగుల లేటరల్ నియామకాల్లో టీసీఎస్ జాప్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్) కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాసింది. ఈ ఆన్బోర్డింగ్ టైమ్లైన్పై ఎటువంటి కమ్యూనికేషన్ లేదని, దీంతో చాలా మంది టెక్కీలు ఇబ్బంది పడుతున్నారని మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో పేర్కొంది.ఆన్ బోర్డింగ్ ప్రక్రియల్లో ఈ 'నిరవధిక జాప్యం' ప్రభావాన్ని ఎత్తిచూపుతూ కార్మిక మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవాలని ఎన్ఐటీఈఎస్ కోరింది. అధికారిక ఆఫర్ లెటర్ ఉన్నప్పటికీ ఉద్యోగంలో చేర్చుకోకపోవడం ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని వివరించింది. ప్రభావితమైనవారిలో రెండేళ్ల నుంచి 18 సంవత్సరాల అనుభవం ఉన్న వారు ఉన్నారని లేఖలో తెలిపింది. ఈ ఉద్యోగులు తమ మునుపటి సంస్థకు అధికారికంగా రాజీనామా చేశారని, ప్రస్తుతం వీరు ఇటు టీసీఎస్ ఉద్యోగంలో చేర్చుకోకపోవడం, వేరే ఉద్యోగమూ లేకపోవడంతో ఈఎంఐలు, అద్దెలు, వాయిదాలు చెల్లించడం కష్టమవుతోంది. దీనిపై టీసీఎస్ ఏమంటోందంటే..ఆఫర్ లెటర్ అందుకున్న ప్రతి ఒక్కరినీ ఆన్బోర్డ్ చేస్తామని టీసీఎస్ పునరుద్ఘాటిస్తోంది. ‘ఫ్రెషర్స్ లేదా అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్ ఇచ్చిన అన్ని ఆఫర్లను గౌరవించడానికి టీసీఎస్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని మేము ధృవీకరించగలము. టీసీఎస్ నుంచి ఆఫర్ వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆన్బోర్డ్ చేస్తాం. వ్యాపార డిమాండ్ ప్రకారం జాయినింగ్ తేదీలు నిర్ణయించడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో, అవి వ్యాపార అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేస్తుంటాం. ఈ సందర్భాల్లో అభ్యర్థులందరితో నిరంతరం టచ్ లో ఉంటామని, వారిని త్వరలోనే సంస్థలో చేర్చుకునేందుకు చూస్తుంటాం’ అని కంపెనీ తెలిపింది.ఆలస్యమైన అభ్యర్థుల ఆన్బోర్డింగ్కు సంబంధించి స్పష్టమైన కాలపరిమితి కోసం టీసీఎస్పై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ ఎన్ఐటీఈఎస్ అధికారికంగా కార్మిక మంత్రిత్వ శాఖను ఆశ్రయించింది. వెయిటింగ్ పీరియడ్ కు ఆర్థిక పరిహారం, టీసీఎస్ ఎంప్లాయీ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ (ఈఏపీ) ద్వారా మానసిక ఆరోగ్య మద్దతుకు ప్రాప్యత, బాధితులకు కంపెనీలో ప్రత్యామ్నాయ పాత్రలను పరిగణనలోకి తీసుకోవాలని ఎన్ఐటీఈఎస్ డిమాండ్ చేస్తోంది.👉 ఇదీ చదవండి: ఈ ఐటీ ఉద్యోగం.. రూ.కోటి జీతం -
ప్రభుత్వ సర్వీసులకు ఓపెన్ఏఐతో భాగస్వామ్యం
ప్రభుత్వ సేవల్లో ఉత్పాదకతను పెంచేందుకు కృత్రిమ మేధ (ఏఐ)ను ఉపయోగించేలా చాట్జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు యూకే ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఒప్పందం ప్రకారం ఓపెన్ఏఐ ప్రభుత్వ డేటాను యాక్సెస్ చేసే అవకాశం ఏర్పడుతుంది. విద్య, రక్షణ, భద్రత, న్యాయ వ్యవస్థలో ఉపయోగించే ప్రభుత్వ సాఫ్ట్వేర్ల్లో ఏఐ ఆధారిత కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నట్లు ఇరు వర్గాలు తెలిపాయి.యూకేలో మార్పు తీసుకురావడానికి, ఆర్థిక వృద్ధిని మెరుగు పరిచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలకం కానుందని ప్రభుత్వ టెక్నాలజీ సెక్రటరీ పీటర్ కైల్ అన్నారు. ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను స్వీకరించడం ద్వారా గతంలో స్థానిక సంగీతకారుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఏఐ టూల్స్ తమ సంగీతాన్ని లైసెన్స్ లేకుండా ఉపయోగించడాన్ని వారు వ్యతిరేకించారు.ఇదీ చదవండి: టెస్లా డైనర్ రెస్టారెంట్లు.. అదిరిపోయే ప్రత్యేకతలుప్రస్తుతం ప్రాథమికంగా 100 మందికి పైగా ఉపాధి కల్పిస్తున్న లండన్ కార్యాలయంలో ఓపెన్ ఏఐ సర్వీసులను విస్తరించనుంది. క్రమంగా ఏఐ సేవలు ఇతర విభాగాలకు వ్యాపిస్తాయని ఇరువర్గాలు తెలిపాయి. ఓపెన్ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ శామ్ ఆల్ట్మన్ మాట్లాడుతూ.. దీని ద్వారా అందరికీ మేలు జరుగుతుందన్నారు. ఏఐ అనేది దేశ నిర్మాణానికి కీలకమైన సాంకేతికత అని తెలుపుతూ, ఇది ఆర్థిక వ్యవస్థలను మారుస్తుందని చెప్పారు. -
టెస్లా డైనర్ రెస్టారెంట్లు.. అదిరిపోయే ప్రత్యేకతలు
టెస్లా లాస్ ఏంజిల్స్లో టెక్నాలజీని మిళితం చేస్తూ వినియోగదారులకు సరికొత్త డైనర్, డ్రైవ్-ఇన్ అనుభవాన్ని అందించాలని కొత్త అవుట్లెట్ను ఆవిష్కరించింది. శాంటా మోనికా బౌలేవార్డ్లో టెస్లా టెక్ ఔత్సాహికులతోపాటు సాధారణ ప్రజలకు సాంకేతికత సాయంతో ఫుడ్ సర్వీసులు ప్రారంభించింది. క్లాసిక్ కంఫర్ట్ ఫుడ్ను ఈ అవుట్లెట్లో అందుబాటులో ఉంచుతున్నట్లు టెస్లా తెలిపింది.టెక్ కంటెంట్ సృష్టికర్త జాక్లిన్ డల్లాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ డైనర్ కేవలం ఒక హోటల్గా మాత్రమే కాకుండా 45 అడుగుల స్క్రీన్ అమర్చిన డ్రైవ్ ఇన్ థియేటర్ అనుభవాన్ని ఇస్తుందని చెప్పారు. ఇందులో బర్గర్లు, హాట్ డాగ్స్, చికెన్ వింగ్స్ హ్యాండ్ స్పిన్డ్ మిల్క్ షేక్స్ లభిస్తాయన్నారు. అయితే కస్టమర్లు చేసే ఆర్డర్లు అన్నీ టెస్లా సైబర్ ట్రక్ థీమ్ బాక్స్ల్లో అందిస్తారని తెలిపారు.My kids ❤️ @Tesla_Optimus #TeslaDiner pic.twitter.com/Kt6t8gsHOL— Prime the pump (@whistingbhole) July 20, 2025ఇదీ చదవండి: టెక్ కంపెనీల్లో భారీగా కొలువుల కోతలుఈ టెస్లా డైనర్లో భోజనం చేయాలనుకునే కస్టమర్లు కార్లలోని టెస్లా స్క్రీన్ల నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదా ఆడియో సింక్ చేయడం ద్వారా అయినా ఆర్డర్ బుక్ చేయవచ్చు. ఇందులో సర్వీసు చేసేందుకు టెస్లా ఆప్టిమస్ రోబోట్లను వినియోగిస్తున్నట్లు డల్లాస్ చెప్పారు. దాంతోపాటు టెస్లా కార్లు ఛార్జింగ్ పెట్టుకునేందుకు వీలుగా ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం 2023 చివరిలో ప్రారంభమైంది.Inside @Tesla ‘s NEW Diner!! pic.twitter.com/yOPdQEEXwZ— Jacklyn Dallas (@NBTJacklyn) July 20, 2025 -
టెక్ కంపెనీల్లో భారీగా కొలువుల కోతలు
టెక్నాలజీ అభివృద్ధి అనేది రెండు వైపులా పదనున్న కత్తిగా వ్యవహరిస్తోందనే వాదనలున్నాయి. ఆర్థికాభివృద్ధి, టెక్ వ్యవస్థలను ముందుకు నడిపేందుకు కొత్త ఆవిష్కరణలు ఎంతో ఉపయోగపడుతుంటే.. దీనివల్ల లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. 2025 ప్రథమార్ధం ముగిసిన నేపథ్యంలో అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇతర టెక్ దిగ్గజాల్లోని వేలాది మంది ఉద్యోగులు తమ కొలువులు కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరగడమే ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు.టాప్ కంపెనీల్లో..2025 జనవరి-జులై మధ్య ప్రపంచవ్యాప్తంగా ప్రధాన టెక్ కంపెనీలు సుమారు 91,000 ఉద్యోగాలను తొలగించగా, అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ గణనీయంగా తమ సిబ్బందిని తగ్గించాయి. స్టార్టప్లు, యునికార్న్లతోపాటు ఆధునిక కంప్యూటింగ్కు మార్గదర్శకత్వం వహిస్తున్న, కృత్రిమ మేధ రేసులో ముందున్న సంస్థల నుంచి ఈ ఉద్యోగ కోతలు ఎక్కువయ్యాయి.ఎవరేం చెప్పినా కోతలే ప్రధానంలాజిస్టిక్స్, ఏడబ్ల్యూఎస్ సపోర్ట్, ఇంటర్నల్ ఆపరేషన్స్ విభాగాల్లో ఇప్పటివరకు అమెజాన్ సుమారు 23,000 ఉద్యోగాలను తగ్గించింది. సేల్స్, కస్టమర్ సపోర్ట్, నాన్ ఏఐ ఆర్ అండ్ డీ విభాగాల్లో 17,500 ఉద్యోగాలను మైక్రోసాఫ్ట్ తొలగించింది. సీఈఓ సత్య నాదెళ్ల ఈ చర్యను ‘తదుపరి తరం ఉత్పాదకత దిశగా శ్రామిక శక్తిని పునర్వ్యవస్థీకరించడం’గా అభివర్ణించారు. అడ్వర్టైజింగ్, హెచ్ఆర్, లెగసీ ప్రొడక్ట్ ఇంజినీరింగ్ విభాగాల్లో మొత్తం టీమ్లతో సహా ప్రపంచవ్యాప్తంగా 21,000 ఉద్యోగాలను గూగుల్ తొలగించింది. ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫస్ట్’ విధానంతో కంపెనీ ట్రాన్సఫర్మేషన్లో భాగంగా ఈ తొలగింపులు జరిగాయని సుందర్ పిచాయ్ తెలిపారు.ఏఐ ఆర్ అండ్ డీలో పెట్టుబడిఈ కోతల వల్ల కంపెనీలకు భారీగా వ్యయం మిగులుతుంది. రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం దీన్ని వెచ్చిస్తున్నాయి. ఈ మూడు సంస్థలు కలిసి 2026 నాటికి ఏఐ ఆర్ అండ్ డీ, మౌలిక సదుపాయాలకు 150 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేయబోతున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. హెడ్ కౌంట్ పడిపోవడంతో కంపెనీల ఆపరేటింగ్ మార్జిన్లు పెరిగాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ సంస్థల షేర్ల ధరలు ఇటీవల 18-27 శాతం మధ్య పెరిగాయి.ఇదీ చదవండి: ఎనిమిదో పే కమిషన్ ఏర్పాటుకు చర్చలు ప్రారంభంకొన్ని ఉద్యోగాలకు డిమాండ్ఏఐ పెరుగుతున్నా కొన్ని ఉద్యోగాలకు మాత్రం డిమాండ్ అధికమవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రాంప్ట్ ఇంజినీర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎథిక్స్, మోడల్ ట్రైనర్లకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. సరైన నైపుణ్యాలున్న వారికి కంపెనీలు ఎంతైన వెచ్చించేందుకు సిద్ధమవుతున్నట్లు ఇటీవల మెటా ప్యాకేజీల వల్ల తెలుస్తుంది. ఏఐ టెక్ నిపుణులకు సుమారు రూ.830 కోట్ల ప్యాకేజీలను సైతం ప్రకటిస్తోంది. -
ఎల్రక్టానిక్స్ ఎగుమతులు జూమ్
న్యూఢిల్లీ: ఎల్రక్టానిక్స్ ఎగుమతులు ప్రస్తుత ఆరి్థక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్/క్యూ1) బలమైన పనితీరు చూపించాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే ఏకంగా 47 శాతం పెరిగి 12.41 బిలియన్ డాలర్లకు (రూ.1.05 లక్షల కోట్లు సుమారు) చేరాయి. కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం.. ముఖ్యంగా అమెరికా, యూఏఈ, చైనా టాప్–3 ఎగుమతి గమ్యస్థానాలుగా ఉన్నాయి. నెదర్లాండ్స్, జర్మనీ తర్వాతి రెండు స్థానాల్లో నిలిచాయి. ‘‘భౌగోళికంగా వివిధ దేశాల మధ్య ఎగుమతుల్లో వైవిధ్యం, అంతర్జాతీయ ఎల్రక్టానిక్స్ సరఫరా వ్యవస్థతో పెరుగుతున్న భారత్ అనుసంధానతను ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. ఆసియాలో విశ్వసనీయ ప్రత్యామ్నాయ తయారీ కేంద్రంగా భారత్ అవతరిస్తున్నదానికి నిదర్శనం’’అని వాణిజ్య శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. అమెరికాకే 60 శాతం భారత ఎల్రక్టానిక్స్ ఎగుమతుల్లో 60 శాతం మేర అమెరికాకే వెళ్లాయి. ఆ తర్వాత యూఏఈకి 8 శాతం, చైనాకి 3.88 శాతం, నెదర్లాండ్స్కు 2.68 శాతం, జర్మనీకి 2.09 శాతం చొప్పున జూన్ త్రైమాసికంలో ఎగుమతులు నమోదయ్యాయి. భారత రెడీమేడ్ వ్రస్తాల ఎగుమతుల్లోనూ (ఆర్ఎంజీ) అమెరికాయే అగ్రస్థానంలో ఉంది. 34 శాతం రెడీమేడ్ వస్త్ర ఎగుమతులు అమెరికాకు వెళ్లాయి. ఆ తర్వాత యూకేకి 8.81 శాతం, యూఏఈకి 7.85 శాతం, జర్మనీకి 5.51 శాతం, స్పెయిన్కు 5.29 శాతం చొప్పున ఆర్ఎంజీ ఎగుమతులు నమోదయ్యాయి. జూన్ త్రైమాసికంలో మొత్తం రెడీమెడ్ వస్త్ర ఎగుమతులు 4.19 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. క్రితం ఆరి్థక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇవి 3.85 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు జూన్ క్వార్టర్లో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 19 శాతానికి పైగా పెరిగి 1.95 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 37.63 శాతం మేర అమెరికాయే దిగుమతి చేసుకుంది. ఆ తర్వాత 17 శాతం చైనాకి, 6.63 శాతం వియత్నాంకి, 4.47 శాతం జపాన్కు వెళ్లాయి. -
8 వేల మంది ప్రొఫెషనల్స్కి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ
న్యూఢిల్లీ: వచ్చే మూడేళ్లలో భారత్లో 8,000 మంది ప్రొఫెషనల్స్కు కృత్రిమ మేధ (ఏఐ) సంబంధ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు అమెరికాకు చెందిన బీపీవో సంస్థ వర్టెక్స్ గ్లోబల్ సర్వీసెస్ (వీజీఎస్) తెలిపింది. కాంటాక్ట్ సెంటర్ ప్రక్రియలను మెరుగుపర్చే వీఅసిస్ట్ టూల్తో ఈ శిక్షణా కార్యక్రమం తమ సంస్థ అంతర్గతంగా సామర్థ్యాలను పెంచుకునేందుకు ఉపయోగపడుతుందని వివరించింది. కస్టమర్ల నుంచి వచ్చే క్వెరీలను మరింత మెరుగ్గా అర్థం చేసుకుని, విశ్లేషించుకుని, సముచిత కేటగిరీల కింద వర్గీకరించడం (కాంటాక్ట్ సెంటర్, కస్టమర్ సర్వీస్, వ్యాపార అవసరాలు) ద్వారా కంపెనీ సిబ్బంది తగిన పరిష్కార మార్గాలను అందించేందుకు ఈ టూల్ ఉపయోగపడుతుందని సంస్థ తెలిపింది. ఏఐ రాకతో దేశీ బీపీవో రంగంలో కూడా శరవేగంగా పెను మార్పులు వస్తున్నాయని వీజీఎస్ ప్రెసిడెంట్ గగన్ ఆరోరా తెలిపారు. అధునాతన టెక్నాలజీలు, ఏఐ దన్నుతో 2033 నాటికి ఈ విభాగం 280 బిలియన్ డాలర్లకు పెరుగుతుందనే అంచనాలు ఉన్నట్లు వివరించారు. ప్రస్తుతం 2025లో ఇది 139.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఉద్యోగులు, ఏఐ మధ్య సమతూకం సాధించడం ద్వారా ఏజెంట్ల పనితీరును మెరుగుపర్చుకోవడంతో పాటు కస్టమర్లకు కూడా మరింత సంతృప్తికరమైన సేవలు అందించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. -
చిటికెలో సినిమా.. ఫోన్తోనే!
స్మార్ట్ ఫోన్ ఉందా? ఈ లెన్స్ తగిలించండి. మీ రూమ్ ఒక సెట్, మీరే డైరెక్టర్! ఆశ్చర్యపోతున్నారా! నిజం, ఈ చిన్న 1.33 ఎక్స్ అనామార్ఫిక్ లెన్స్ సాయంతో, మీ స్మార్ట్ఫోన్తోనే సినిమా తీయొచ్చు. పెద్ద కెమెరాలు, లైట్లు, సెటప్లు ఏవీ అవసరం లేదు. బెడ్రూమ్, హాల్, టెర్రస్... ఎక్కడైనా సినిమా లెవెల్ షాట్ తీయవచ్చు. ఇది రెండు రకాల లైటింగ్ ఎఫెక్ట్స్తో పనిచేస్తుంది. అందులో బ్లూ ఫ్లేర్ పెడితే ఇంట్లోనే స్పేస్ సినిమా ఫీల్, గోల్డ్ ఫ్లేర్ పెడితే శ్రావణ మాసం గుడిలో వచ్చే డివోషనల్ ఫీల్ కనిపిస్తుంది. ఒక్కసారి ఇది తీసిన వీడియో చూస్తూ ‘ఇది నిజంగా ఫోన్తో తీయగలరా?’ అని అశ్చర్యపోతారు. ఒక్కసారి వాడాక, మామూలు కెమెరా తెరవాలని కూడా అనిపించదు. ఇంకా ప్రత్యేకంగా డబ్బింగ్ చేయాల్సిన అవసరం లేదు. వీడియోలో సౌండ్ కూడా అద్భుతంగా రికార్డ్ అవుతుంది. ధర రూ.13,999 మాత్రమే!జేబులో దీపావళి!చుట్టూ చీకటి ఉన్నా, మీ ఇల్లు దీపావళి నాటి ఆకాశంలా మెరవాలంటే, మీ దగ్గర ఈ ‘డిజి టెక్ పోర్టబుల్ ఎల్ఈడీ లైట్’ ఉండాల్సిందే! చేతిలో పట్టేంత చిన్నదే, కాని ఆన్ చేస్తే మాత్రం మీ ముఖం, చుట్టూ ఉన్న వాతావరణం అంతా బ్రైట్గా మెరిసిపోతుంది. ఈ లైట్ సుమారు మూడు వేల నుంచి ఆరువేల కెల్విన్ వరకు వెలుతురును అందిస్తుంది. లైట్ బ్రైట్నెస్, రంగులను అవసరానికి అనుగుణంగా మార్చుకోవచ్చు. అలా చిత్రీకరణకు కావాల్సిన వాతావరణాన్ని సులభంగా సృష్టించవచ్చు. ఒక్కసారి చార్జ్ చేస్తే, నిర్విరామంగా సుమారు రెండు గంటలపాటు పని చేస్తుంది. ధర కేవలం రూ.1,299 మాత్రమే!స్టూడియో బాక్స్!చిన్న వస్తువులను ఫొటో తీయడం అంటే, ‘ఫ్యాన్ ఇండియా’ సినిమా తీసినంత ఈజీ కాదు. హోల్ లైట్, టేబుల్, షీట్, లో ఫ్యాన్ ... ఇలా చాలానే ప్లానింగ్ చేసి తీయాలి. అయితే, ఇప్పుడు ఈ హిఫిన్ ఫోల్డబుల్ లైట్ బాక్స్ ఉంటే చాలు, ఇంట్లోనే ఓ చిన్న సినిమాటిక్ ఫొటో స్టూడియో సెట్ రెడీ అవుతుంది. చూసేందుకు క్యూబ్లా ఉంటుంది. కాని, ఒక్కసారి తెరిస్తే, అంతా మాయలా మారిపోతుంది. ఫుల్ బ్రైట్ ఎల్ఈడీ లైట్లు మెరిసిపోతాయి. వాడటం కూడా చాలా సులభం– యూఎస్బీకి పెట్టండి, ఎంత చిన్నవస్తువునైనా మధ్యలో పెట్టండి, ఫోటో తీయండి... అంతే! పైగా ఈ బాక్స్ను మడిచి పెట్టుకోవచ్చు, ఎక్కడికైనా తేలికగా తీసుకెళ్లవచ్చు. ఇందులో పెట్టి ఫొటో తీస్తే తెలుపు, నలుపు రంగుల బ్యాక్డ్రాప్లతో ఫొటోలకు పూర్తిగా ప్రొఫెషనల్ టచ్ ఇస్తుంది. ధర రూ.499 మాత్రమే!తిరిగే ఎలక్ట్రిక్ స్టాండ్!వస్తువుల ఫొటో తీయాలంటే చేతితో తిప్పుతూ తిప్పుతూ మీ తల తిరగాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఈ తిరిగే ఎలక్ట్రిక్ స్టాండ్పై వస్తువును పెట్టి ఫొటో తీయండి. మెల్లగా 360 డిగ్రీలుగా తిరుగుతూ, ఏ కోణంలో చూసినా వస్తువును అందంగా చూపిస్తుంది. కావాల్సిన రీతిలో వస్తువు యాంగిల్, దిశ, వేగాన్ని సులభంగా నియంత్రించవచ్చు. ఇది బంగారు వస్తువులు, గడియారాలు, చిన్న కేకులు, ప్రదర్శన వస్తువుల ఫొటోగ్రఫీకి అద్భుతంగా ఉపయోగపడుతుంది. సుమారు ఎనిమిది కిలోల బరువు వరకు కోరుకున్న దిశలో తిప్పగలదు. దీనిని ఉపయోగించడం చాలా సులువు. ధర రూ. 1,699 మాత్రమే! -
రోజూ 2జీబీ హైస్పీడ్ డేటాతో జియో కొత్త ప్లాన్
ప్రముఖ ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో రోజూ 2జీబీ హైస్పీడ్ డేటాతో రూ .1049 ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. రోజువారీ హై-స్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్, టాప్ ఓటీటీ ప్లాట్ఫామ్లకు ఉచిత యాక్సెస్ అందించే ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే ఈ జియో ప్లాన్ మీకు సరిగ్గా సరిపోతుంది. ఈ ప్లాన్ ప్రయోజనాలేంటో ఇక్కడ వివరంగా తెలుసుకోండి..ప్లాన్ వాలిడిటీ.. ప్రధాన ప్రయోజనాలుఈ రూ .1049 జియో ప్లాన్ మొత్తం 84 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఇందులో ప్రతిరోజూ 2 జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 84 రోజుల్లో మొత్తం 168 జిబి డేటా ఆనందించవచ్చు. దీంతోపాటు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు కూడా లభిస్తాయి.ఈ ప్లాన్ అతిపెద్ద ఫీచర్ ఇది అందించే ఉచిత ఓటీటీ యాక్సెస్. వినియోగదారులు ఎటువంటి అదనపు రుసుము చెల్లించకుండా అనేక ప్రసిద్ధ స్ట్రీమింగ్ సర్వీసులకు యాక్సెస్ పొందుతారు. వీటిలో అమెజాన్ ప్రైమ్ లైట్ (84 రోజులు చెల్లుబాటు అవుతుంది), సోనీలివ్, జీ5, జియోటీవీ, జియో హాట్స్టార్ (90 రోజులు, ఒకసారి చెల్లుబాటు అవుతుంది) వంటివి ఉన్నాయి.ఈ రీఛార్జ్ ప్లాన్ 50 జీబీ జియోఏఐక్లౌడ్ స్టోరేజ్, ఉచిత 5జీ డేటా (5జీ ఫోన్ అయి ఉండి 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉంటే మాత్రమే) వంటి జియో నుండి కొన్ని ఇతర ప్రత్యేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. -
48 గంటల్లో 2 లక్షలకుపైగా ఆర్డర్లు..
కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తన సెవెంత్ జనరేషన్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ సిరీస్ కోసం భారత్లో లాంచ్ అయిన 48 గంటల్లోనే 2.1 లక్షల ప్రీ-ఆర్డర్లు వచ్చినట్లు తెలిపింది. శాంసంగ్ ఏడో తరం ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ సిరీస్లో భాగంగా గెలాక్సీ జెడ్ ఫోల్డ్7, గెలాక్సీ జెడ్ ఫ్లిప్7, గెలాక్సీ జెడ్ ఫ్లిప్7 ఎఫ్ఈ స్మార్ట్ఫోన్లు జూలై 9న భారత్లో లాంచ్ అయ్యాయి.ఇంత భారీ సంఖ్యలో ప్రీ-ఆర్డర్లు రావడం "బ్రాండ్ ఏడవ తరం ఫోల్డబుల్ కోసం వినియోగదారుల్లో భారీ డిమాండ్, ఉత్సాహాన్ని" సూచిస్తున్నాయని శాంసంగ్ తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో గెలాక్సీ ఎస్ 25 సిరీస్ కోసం వచ్చిన ప్రీ-ఆర్డర్లకు ఇది దాదాపు సమానం అని శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఒక ప్రకటనలో తెలిపింది.శాంసంగ్ తన స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎస్ 25 లాంచ్ అయిన మూడు వారాల వ్యవధిలో రికార్డు స్థాయిలో 4.3 లక్షల ప్రీ-ఆర్డర్లను అందుకుంది. మొదటి 48 గంటల్లో, ఎస్ 25, ఫోల్డ్ 7 / ఫ్లిప్ 7 కోసం ప్రీ-ఆర్డర్ల సంఖ్య దాదాపు సమానంగా ఉంటుంది. ఈ మేడ్ ఇన్ ఇండియా ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ల ధర రూ.89,000 నుంచి రూ.2.11 లక్షల మధ్యలో ఉంది.గెలాక్సీ జెడ్ ఫోల్డ్7 ధర రూ.1.75 లక్షల నుంచి ప్రారంభమై రూ.2.11 లక్షల వరకు ఉంది. గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 ధర రూ.1.10 లక్షల నుంచి రూ.1.22 లక్షల మధ్యలో ఉంది. గెలాక్సీ జెడ్ ఫ్లిప్7 ఎఫ్ఈ ధర రూ.89,000 నుంచి రూ.95,999 వరకు ఉంది. భారత మార్కెట్లో శాంసంగ్ సూపర్ ప్రీమియం కేటగిరీలో అమెరికాకు చెందిన ఫోన్ల తయారీ సంస్థ యాపిల్ తో పోటీ పడుతోంది.ఐడీసీ ప్రకారం, భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో వివో ముందంజలో ఉంది. ఇది 2025 తొలి త్రైమాసికంలో 19.7 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఆ తర్వాత శాంసంగ్ 16.4 శాతం ఎగుమతులతో రెండో స్థానంలో ఉంది. -
‘బేబీ గ్రోక్’ వస్తుంది.. పిల్లల కోసం ప్రత్యేక ఏఐ యాప్
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఎక్స్ఏఐ పిల్లల కోసం ప్రత్యేక ఏఐ చాట్బాట్ యాప్ను తీసుకురానుంది. తమ గ్రోక్ చాట్బాట్కు కిడ్-ఫ్రెండ్లీ వెర్షన్ను రూపొందించే పనిలో ఉన్నట్లు ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’(ట్విటర్) పోస్ట్ చేశారు.'ఎక్స్ఏఐలో బేబీ గ్రోక్ అనే యాప్ను రూపొందించబోతున్నాం' అని మస్క్ తాజాగా ట్వీట్ చేశారు. పిల్లలకే ప్రత్యేకమైన కంటెంట్తో ఈ యాప్ను రూపొందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కొత్త వెర్షన్ యువ వినియోగదారుల కోసం రూపొందించిన ప్రత్యేక అప్లికేషన్ గా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు, అయితే మరిన్ని వివరాలను ఇంకా ప్రకటించలేదు.మస్క్ యాజమాన్యంలోని ఎక్స్ స్పామ్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి ప్లాట్ఫామ్పై కొత్త గ్రోక్ ప్రస్తావనలను తాత్కాలికంగా నిలిపివేసిన కొన్ని రోజుల తర్వాత ఈ ప్రకటన వచ్చింది. మరోవైపు వైరల్ వీడియోలను జనరేట్ చేయడానికి, దాని సృజనాత్మక సాధనాలను మరింత విస్తరించడానికి వీలు కల్పించే ‘ఇమాజిన్’ అనే కొత్త సామర్థ్యాన్ని ‘గ్రోక్’కు జోడించే పనిలో ఉన్నట్లు కూడా మస్క్ ఇటీవల వెల్లడించారు.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం ఇటీవల విస్తృతంగా పెరిగింది. ముఖ్యంగా పిల్లల్లో ఏఐ వినియోగం క్రమంగా పెరుగుతోంది. కొన్ని నివేదికల ప్రకారం.. 44 శాతం మంది పిల్లలు జనరేటివ్ ఏఐని చురుగ్గా ఉపయోగిస్తున్నారు. ఇందులో తమ స్కూల్ వర్క్ లేదా హోమ్ వర్క్ చేయడానికే 54 శాతం వినియోగం ఉంటోంది.We’re going to make Baby Grok @xAI, an app dedicated to kid-friendly content— Elon Musk (@elonmusk) July 20, 2025 -
శాంసంగ్ నుంచి కొత్త స్మార్ట్ఫోన్.. బడ్జెట్లోనే హై ఎండ్ ఫీచర్స్
దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ నుండి కొత్త ఎఫ్-సిరీస్ ఫోన్ విడుదలైంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్36 5జీ స్మార్ట్ ఫోన్ భారత్లో లాంచ్ అయింది. బడ్జెట్ ధర రూ .20,000 లోపే ఇది లభ్యమవుతుంది. ఎక్సినోస్ 1380 చిప్సెట్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్స్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్తోపాటు గూగుల్ సర్కిల్ టు సెర్చ్, జెమినీ లైవ్ సహా ఏఐ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.శాంసంగ్ గెలాక్సీ ఎఫ్36 5జీ ధరగెలాక్సీ ఎఫ్36 5జీ 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,499గా ఉంది. శాంసంగ్ 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.18,999గా నిర్ణయించారు. శాంసంగ్ కొత్త ఎఫ్-సిరీస్ స్మార్ట్ఫోన్ జూలై 29 నుంచి ఫ్లిప్కార్ట్, శాంసంగ్ అధికారిక ఆన్లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. కోరల్ రెడ్, లక్స్ వయొలెట్, ఓనిక్స్ బ్లాక్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ మూడు కలర్ వేస్ లో లెదర్ ఫినిష్ రియర్ ప్యానెల్ ఉంది.స్పెసిఫికేషన్లుశాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 36 5జీ డ్యూయల్ సిమ్ హ్యాండ్ సెట్, ఇందులో 6.7 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ ప్లే, ఫుల్ హెచ్ డీ+ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.సెల్ఫీ కెమెరా కోసం డిస్ ప్లే పైభాగంలో వాటర్ డ్రాప్ నాచ్ ను అందించారు. ఆక్టాకోర్ ఎక్సినోస్ 1380 ఎస్ వోసీ, మాలి-జీ68 ఎంపీ5 జీపీయూతో ఈ ఫోన్ పనిచేస్తుంది. థర్మల్ మేనేజ్ మెంట్ కోసం వేపర్ ఛాంబర్ కూడా ఉంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్, మైక్రో ఎస్డీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు.ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 4కే వీడియో రికార్డింగ్కు సపోర్ట్ చేసే ప్రైమరీ 50 మెగాపిక్సెల్ ఎఫ్/ 1.8 సెన్సార్తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 8 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఇది 4కె వీడియో రికార్డింగ్ ను కూడా సపోర్ట్ చేస్తుంది.శాంసంగ్ లేటెస్ట్ ఎఫ్ సిరీస్ ఫోన్ ఆండ్రాయిడ్-15 ఆధారిత వన్ యూఐ 7 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుది. ఆరు ఏళ్లు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్ డేట్స్, ఏడేళ్ల సెక్యూరిటీ ప్యాచ్ లను అందిస్తామని కంపెనీ హామీ ఇస్తోంది.గూగుల్ సర్కిల్ టు సెర్చ్, జెమినీ లైవ్, ఆబ్జెక్ట్ ఎరేజర్, ఇమేజ్ క్లిప్పర్, ఏఐ ఎడిట్ వంటి ఏఐ ఫీచర్లు కూడా ఉన్నాయి.గెలాక్సీ ఎఫ్36 5జీలో 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఛార్జింగ్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. కనెక్టివిటీ కోసం, ఫోన్ డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్ + గ్లోనాస్ను అందిస్తుంది. -
ఏఐ ఎఫెక్ట్స్తో తొలిసారి ఒరిజినల్ టీవీ షో
కృత్రిమ మేధ (ఏఐ) సృష్టించిన విజువల్ ఎఫెక్ట్స్ను తొలిసారిగా ఒరిజినల్ టీవీ షోలో ఉపయోగించినట్లు నెట్ఫ్లిక్స్ తెలిపింది. ప్రాంప్ట్స్ ఆధారంగా వీడియోలు, చిత్రాలను రూపొందించే ఏఐని అర్జెంటీనా సైన్స్ ఫిక్షన్ షో ‘ది ఎటర్నాట్’లో భవనం కూలిపోయే సన్నివేశాన్ని సృష్టించడానికి ఉపయోగించినట్లు కంపెనీ కో-చీఫ్ ఎగ్జిక్యూటివ్ టెడ్ సారాండోస్ తెలిపారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల నిర్మాణ బృందం వేగంగా, తక్కువ ఖర్చుతో సన్నివేశాలను పూర్తి చేయగలిగిందని చెప్పారు.జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలో వివాదాస్పదంగా ఉంది. ఇది ఇతరుల పనిని వారి అనుమతి లేకుండా ఉపయోగించి కంటెంట్ సృష్టిస్తుందనే ఆందోళనలు రేకెత్తిస్తుంది. నెట్ఫ్లిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం గురించి సారాండోస్ మాట్లాడుతూ.. ఈ సాంకేతికత చిన్న బడ్జెట్ ఉన్న నిర్మాణాలకు అధునాతన విజువల్ ఎఫెక్స్ట్ ఉపయోగించడానికి అనుమతించినట్లు చెప్పారు. బ్యూనస్ ఎయిర్స్లో ఒక భవనం కూలిన క్రమాన్ని సంప్రదాయ స్పెషల్ ఎఫెక్ట్స్ టూల్స్ ఉపయోగించిన దానికంటే 10 రెట్లు వేగంగా పూర్తి చేయడానికి ఎటెర్నాట్లో ఉపయోగించిన జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తమ బృందానికి సహాయపడిందని ఆయన చెప్పారు.ఇదీ చదవండి: ఫేస్బుక్పై రూ.68 వేలకోట్ల దావాదక్షిణ కొరియా థ్రిల్లర్ స్క్విడ్ గేమ్ మూడో, చివరి సిరీస్ విజయం సాధించడంతో ఊహించిన దానికంటే మెరుగైన పనితీరు కనబరిచినట్లు నెట్ఫ్లిక్స్ తెలిపింది. ఇది ఇప్పటివరకు 122 మిలియన్ వ్యూస్ సాధించిందని సారాండోస్ అన్నారు. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే జూన్ నెలాఖరు వరకు మూడు నెలల్లో నెట్ఫ్లిక్స్ ఆదాయం 16 శాతం పెరిగి 11 బిలియన్ డాలర్లకు (8.25 బిలియన్ పౌండ్లు) చేరుకున్నట్లు ప్రకటించడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లాభాలు 2.1 బిలియన్ డాలర్ల నుంచి 3.1 బిలియన్ డాలర్లకు పెరిగాయి. -
ఐటీ కంపెనీ హెక్సావేర్ రూ.1,029 కోట్ల డీల్
న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ కంపెనీ హెక్సావేర్ టెక్నాలజీస్ 120 మిలియన్ డాలర్లతో (రూ.1,029 కోట్లు) ఎస్ఎంసీ స్వేర్డ్ను కొనుగోలు చేసినట్టు ప్రకటించింది. గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల (జీసీసీలు) మార్కెట్లో విస్తరణకు ఈ డీల్ దోహదపడుతుందని పేర్కొంది. జీసీసీ కేంద్రాల నిర్మాణం, నిర్వహణ, బదిలీ సేవల్లో ఎస్ఎంసీ స్వేర్డ్ సేవలు అందిస్తోంది.‘‘ఎస్ఎంసీ కొనుగోలుతో జీసీసీ నైపుణ్యాలు మరింత బలపడతాయి. ఎస్ఎంసీ నైపుణ్యాలు మధ్య స్థాయి జీసీసీ విభాగంలో మా మార్కెట్ విస్తరణకు దోహదపడతాయి. ఎస్ఎంసీ సేవలను మా విస్తృతమైన క్లయింట్లకు ఆఫర్ చేస్తాం’’అని హెక్సావేర్ టెక్నాలజీస్ స్టాక్ ఎక్స్ఛేంజ్లకు సమాచారం ఇచి్చంది. జోహో నుంచి ఎల్ఎల్ఎందేశీ టెక్నాలజీ సంస్థ జోహో (Zoho) తమ స్వంత లార్జ్ ల్యాంగ్వేజ్ (ఎల్ఎల్ఎం) మోడల్ను ప్రవేశపెట్టింది. తమ ఉత్పత్తులను ఉపయోగించే సంస్థల కోసం దీన్ని డిజైన్ చేసినట్లు కంపెనీ తెలిపింది. ఎన్విడియాకు చెందిన ఏఐ కంప్యూటింగ్ ప్లాట్ఫాంను ఉపయోగించి దీన్ని తాము అంతర్గతంగా తయారు చేసినట్లు పేర్కొంది. ఇంగ్లీష్, హిందీలో మాటలను ఆటోమేటిక్గా టెక్ట్స్ కింద మార్చే మోడల్స్ను కూడా ప్రవేశపెడుతున్నట్లు వివరించింది. దీన్ని ఇతర భారతీయ, యూరోపియన్ భాషలకు కూడా విస్తరిస్తామని తెలిపింది. -
రూ.19,500 సబ్స్క్రిప్షన్ ఉచితం!
గూగుల్ భారతదేశంలోని విద్యార్థులకు ప్రోత్సహించేందుకు తన ఏఐ ప్రో ప్లాన్ను ఒక సంవత్సరం పాటు ఉచితంగా అందించేందుకు చర్యలు చేపట్టింది. రూ.19,500 సబ్స్క్రిప్షన్ కలిగిన ఏఐ ప్రో ప్లాన్ ద్వారా గూగుల్ అధునాతన ఏఐ సాధనాలకు అవకాశం కల్పిస్తోంది. దీన్ని విద్యార్థులు హోంవర్క్, రైటింగ్, వీడియో జనరేషన్లో సహాయం పొందేందుకు ఉచితంగా ఉపయోగించవచ్చని కంపెనీ తెలిపింది.ఈ ఆఫర్లో భాగంగా 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న భారతీయ విద్యార్థులు 12 నెలల పాటు గూగుల్ ఏఐ ప్రో ప్లాన్ను కాంప్లిమెంటరీ యాక్సెస్గా పొందవచ్చు. ఈ సబ్స్క్రిప్షన్లో జెమినీ 2.5 ప్రో, వీయో 3 వంటి విస్తృత శ్రేణి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఇది వీడియో జనరేషన్ ఏఐ మోడల్. జీమెయిల్, డాక్స్, ఇతర గూగుల్ యాప్స్లో 2టీబీ క్లౌడ్ స్టోరేజ్, ఏఐ ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి.కళాశాల పాఠ్యాంశాల అధ్యయనం, పరిశోధన, ఉద్యోగ ఇంటర్వ్యూ ప్రిపరేషన్, సృజనాత్మక ఆలోచన.. వంటి విస్తృత శ్రేణి ఉపయోగాల కోసం విద్యార్థులకు మద్దతుగా నిలుస్తుందని కంపెనీ తెలిపింది. గూగుల్ హైలైట్ చేస్తున్న కొన్ని ఏఐ ఆధారిత టూల్స్ కింది విధంగా ఉన్నాయి.హోంవర్క్ హెల్ప్ & ఎగ్జామ్ ప్రిపరేషన్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో 1,500 పేజీల పాఠ్యపుస్తకాలను విశ్లేషించవచ్చు.స్టడీ సపోర్ట్: అధిక పేజీలున్న(1,500 పేజీల వరకు) పాఠ్యపుస్తకాలను విశ్లేషించవచ్చు. పరీక్ష సన్నద్ధతలో సహాయం తీసుకోవచ్చు. సంక్లిష్టమైన అంశాలను సులువుగా అర్థం చేసుకోవచ్చు.రైటింగ్ టూల్స్: వ్యాసాలను రాసేందుకు సాయపడుతాయి.వీడియో జనరేషన్: గూగుల్ వీయో 3 సిస్టమ్ ఉపయోగించి టెక్స్ట్, ఇమేజ్లను షార్ట్ వీడియోలుగా మార్చవచ్చు.జెమిని ఇంటిగ్రేషన్: జీమెయిల్, డాక్స్, షీట్స్, ఇతర యాప్స్లో డైరెక్ట్ ఏఐ సపోర్ట్ ఉంటుంది.క్లౌడ్ స్టోరేజ్: అసైన్మెంట్లు, ప్రాజెక్టులు, మీడియా ఫైళ్లను నిల్వ చేసేందుకు డ్రైవ్, జీమెయిల్, ఫోటోస్ కలిపి 2 టీబీ స్పేస్ ఇస్తుంది.ఉచితంగా ఎలా పొందాలి?కంపెనీ ప్రతిపాదించిన అర్హతా ప్రమాణాలకు అనుగుణంగా విద్యార్థుల స్టేటస్ను విజయవంతంగా ధ్రువీకరించాల్సి ఉంటుంది. కేవలం విద్యార్థులకు మాత్రమే ఈ ఉచిత సబ్ స్క్రిప్షన్ ప్లాన్ అందుబాటులో ఉంటుందని గూగుల్ పేర్కొంది. ఈ ఆఫర్ పొందాలంటే విద్యార్థులు తమ స్టేటస్ను వెరిఫై చేసుకోవాలి.వెరిఫికేషన్ ప్రక్రియ ఎలా..గూగుల్ వన్ స్టూడెంట్ ఆఫర్ పేజీకి వెళ్లాలి.కాలేజీ పేరు, విద్యార్థి పూర్తి పేరు, పుట్టిన తేదీ వంటి అవసరమైన వివరాలను నింపాలి.గుర్తింపు పొందిన సంస్థ నమోదును రుజువు చేయమని కోరితే డాక్యుమెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.వెరిఫై చేసిన తర్వాత గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఏఐ ప్రో ప్లాన్కు సబ్స్క్రైబ్ చేసుకోవాలి.ఈ ఆఫర్ను రిడీమ్ చేసుకోవడానికి చివరి తేదీ 15 సెప్టెంబర్ 2025.నిబంధనలు ఇవే..విద్యార్థికి 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి.భారత నివాసి అయి ఉండాలి.వ్యక్తిగత గూగుల్ ఖాతాను ఉపయోగించాలి.కాలేజీ ఈమెయిల్ లేదా నమోదు రుజువును అందించాలి.థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్ ద్వారా సబ్స్రైబ్ చేయకూడదు.గూగుల్ పేమెంట్స్ ఖాతాకు చెల్లుబాటు అయ్యే చెల్లింపు పద్ధతిని జోడించాలి. (పోస్ట్-ట్రయల్ బిల్లింగ్ ప్రయోజనాల కోసం).ఇదీ చదవండి: మారుతీ ఎర్టిగా, బాలెనో ధరలు పెరిగాయ్..మొదటి సంవత్సరానికి ఆఫర్ పూర్తిగా ఉచితం అయినప్పటికీ, ప్రామాణిక రేట్ల వద్ద ఆటోమేటిక్ బిల్లింగ్ను నివారించడానికి విద్యార్థులు ట్రయల్ ముగిసేలోపు రద్దు చేయాలని గూగుల్ పేర్కొంది. ఉచిత వ్యవధి తర్వాత మాన్యువల్గా రద్దు చేయకపోతే సబ్ స్క్రిప్షన్ రిన్యువల్ అవుతుంది. -
మెసేజ్లకు టెల్కోల గుర్తింపు ‘కోడ్’
అసలైన మెసేజ్లు, స్పామ్ మెసేజ్లను మొబైల్ యూజర్లు సులువుగా గుర్తించేందుకు వీలుగా టెలికం సంస్థలు ప్రత్యేక విధానాన్ని అమల్లోకి తెచ్చాయి. దీని ప్రకారం మెసేజ్ల వర్గీకరణ బట్టి వాటిని పంపించే వారి పేరు లేదా హెడర్కి ముందు నిర్దిష్ట ‘కోడ్’ వస్తుంది. ప్రమోషనల్ ఎస్ఎంఎస్లకు ‘పి’ (ఆంగ్ల అక్షరం), సర్వీస్ సంబంధితమైనవాటికి ‘ఎస్’, లావాదేవీలకు సంబంధించిన వాటికి ‘టి’, ప్రభుత్వం నుంచి వచ్చే మెసేజీలకు ‘జి’ అని కనిపిస్తుంది.ఇదీ చదవండి: ఎగుమతులు కదల్లేదు..మెదల్లేదు!ఈ కోడ్లతో ఏ ఎస్ఎంఎస్ ఏ కోవకి చెందినదో సులువుగా తెలుసుకునేందుకు వీలవుతుందని, అవాంఛిత మెసేజ్లకు దూరంగా ఉండొచ్చని టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇలాంటి ఓటీటీ యాప్లపై నియంత్రణ లేకపోవడమే ఇందుకు కారణమన్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీ యాప్లను కూడా నియంత్రణ పరిధిలోకి తీసుకొస్తే వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు వీలవుతుందని కొచర్ పేర్కొన్నారు. -
విశాఖలో మెరుగైన నెట్వర్క్గా జియో
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న టెలికాం ఆపరేటర్గా రిలయన్స్ జియో నిలిచింది. కీలకమైన వాయిస్, డేటా పనితీరులో ఇతర టెల్కోలను వెనక్కి నెట్టింది. నగరంలో ఇటీవల ట్రాయ్ నిర్వహించిన ఇండిపెండెంట్ డ్రైవ్ టెస్ట్ (ఐడీటీ)లో జియో తన బలమైన మొబైల్ నెట్వర్క్ సామర్ధ్యాన్ని నిరూపించుకుంది. మిలియన్ల మంది వినియోగదారులకు అత్యుత్తమ డిజిటల్ సేవలను అందించడంలో తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది.ట్రాయ్ నివేదిక ప్రకారం రిలయన్స్ జియో తన 4జీ నెట్వర్క్లో 204.91 ఎంబీపీఎస్ సగటు డౌన్లోడ్ వేగాన్ని నమోదు చేసింది. ఇది నగరంలోని అన్ని ఆపరేటర్లలో అత్యధికం. ఈ అసాధారణ పనితీరు వల్ల జియో కస్టమర్లు గరిష్ట వినియోగ సమయాల్లో కూడా వేగవంతమైన వీడియో స్ట్రీమింగ్, ఆన్లైన్ గేమింగ్, వేగవంతమైన యాప్ డౌన్లోడ్లు, అంతరాయం లేని బ్రౌజింగ్ను ఆస్వాదించేలా చేస్తుంది.ఇదీ చదవండి: మొన్న రూ.800 కోట్లు.. ఇప్పుడు రూ.1,600 కోట్లుమరోవైపు వాయిస్ సేవల్లోనూ జియో పనితీరు అంతే బలంగా ఉంది. జియో సేవలు అధిక కాల్ సెటప్ సక్సెస్ రేటు, తక్కువ కాల్ సెటప్ సమయం, జీరో కాల్ డ్రాప్ రేటుతోపాటు మెరుగైన వాయిస్ స్పష్టత అందిస్తున్నాయని ట్రాయ్ నివేదిక సూచిస్తోంది. విశాఖపట్నం అంతటా విస్తృత ప్రాంతాన్ని కవర్ చేసిన ఈ డ్రైవ్ టెస్ట్ ఫలితాలు జియోను అత్యుత్తమ ఆపరేటర్గా నిలబెట్టాయి. హెచ్డీ కంటెంట్ను స్ట్రీమింగ్ చేసినా, హెచ్డీ-నాణ్యత వాయిస్ కాల్లు చేసినా లేదా రియల్ టైమ్ అప్లికేషన్లను యాక్సెస్ చేసినా ఎలాంటి అవాంతరాలు లేవని తేలింది. -
పీఎస్యూ టెల్కోలకు లైన్ క్లియర్
పీఎస్యూ టెలికం దిగ్గజాలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, ఐటీఐలకు మద్దతుగా అత్యున్నత కమిటీ మార్గదర్శకాలకు తెరతీసింది. దీంతో వేలం లేకుండానే ఇతర ప్రభుత్వ రంగ కంపెనీలకు మిగులు భూమి, భవనాలను బదిలీ చేసేందుకు వీలు చిక్కనుంది. గత నెలలో సమావేశమైన సెక్రటరీల కమిటీ ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది.టెలికం పీఎస్యూ సంస్థల ఆస్తులను సొంతం చేసుకోవాలనుకునే ఇతర ప్రభుత్వ రంగ కంపెనీలు సంబంధిత అనుమతులతోపాటు ఆసక్తి వ్యక్తీకరణ బిడ్ను దాఖలు చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా క్లెయిమ్ను రిజిస్టర్ చేసుకునేందుకు ఆస్తుల సంకేత విలువలో 2 శాతం సొమ్మును డిపాజిట్ చేయవలసి ఉంటుంది. ఆయా ఆస్తుల మానిటైజేషన్కు సంబంధిత వెబ్సైట్లో నోటిఫికేషన్ వెలువడిన 90 రోజుల్లోగా వీటిని పూర్తి చేయవలసి ఉంటుంది. ఇదీ చదవండి: విదేశీ విస్తరణలో హీరో మోటోకార్ప్ కేంద్ర ప్రభుత్వ సంస్థలకు తొలి ప్రాధాన్యతా హక్కును వినియోగించుకునే వీలుంటుంది. అయితే నోటిఫికేషన్ వెలువడిన 90 రోజుల తదుపరి ఇతర ప్రయివేట్ రంగ కంపెనీలకు ఆస్తులను విక్రయించే వెసులుబాటును బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, ఐటీఐ పొందుతాయి. -
పల్లెకు పరిచయమైన "వర్చువల్ రియాలిటీ గేమింగ్".. స్పందన మామూలుగా లేదు..!
వర్చువల్ రియాలిటీ గేమింగ్ (VR Gaming) అనేది గేమింగ్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చిన సాంకేతికత. ఇది ఆటగాళ్లను త్రిమితీయ (3D) వాతావరణంలోకి తీసుకెళ్లి, నిజంగానే ఆ ప్రపంచంలో ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. ఈ క్రీడలను VR హెడ్సెట్, మోషన్ కంట్రోలర్ లాంటి సాధనాలను ఉపయోగించి ఆడతారు. VR Gamingను కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా విద్య, శిక్షణ, వైద్య రంగాల్లో కూడా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం దేశంలోని పెద్దపెద్ద నగరాల్లో మాత్రమే ఈ VR Gaming సెంటర్లు వెలిశాయి.Few youths opened a "Virtual Reality Gaming Centre" in Karnataka 's village. The response was overwhelming 🤩 pic.twitter.com/hNTfIY0qoQ— 👑Che_Krishna🇮🇳💛❤️ (@CheKrishnaCk_) July 14, 2025అయితే, ఇటీవల కర్ణాటకలోని హసన్ జిల్లాకు కొందరు ఔత్సాహిక యువకులు ఈ VR Gamingను ఓ మారుమూల పల్లెకు పరిచయం చేశారు. టెక్నాలజీ అంటే ఏమిటో తెలియని ఆ పల్లె ప్రజలు ఈ కాల్పనిక క్రీడలను తెగ ఎంజాయ్ చేశారు. సదరు యువత ఇచ్చిన Meta Quest VR Headsetలను ధరించి నిజంకాని ప్రపంచంలోకి వెళ్లిపోయారు.పిల్లలు, మహిళలు, వృద్దులు అన్న తేడా లేకుండా ఆ గ్రామంలోని ప్రతి ఒక్కరు VR Gamingతో కలిగిన కొత్త అనుభూతిని ఆస్వాధించారు. VR Gaming ద్వారా బాక్సింగ్, బిల్డింగ్పై నడవడం లాంటి కాల్పనిక క్రీడలను ఆడారు. ఈ VR Gaming కేంద్రానికి విశేషమైన స్పందన రావడంతో సదరు యువకులు దీనికి సంబంధించిన వీడియోను సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు కూడా విపరీతమైన స్పందన వస్తుంది. -
మూడేళ్లలో ఆరు లక్షల గ్రామాలకు బ్రాడ్బ్యాండ్..
మూడేళ్ల వ్యవధిలో దాదాపు ఆరు లక్షల గ్రామాల్లో హై–స్పీడ్ ఆప్టికల్ ఫైబర్ ఆధారిత బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ను అందుబాటులోకి తేనున్నట్లు సీఐఐ–జీసీసీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా టెలికం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ తెలిపారు. జీసీసీలు ప్రస్తుతం ఎక్కువగా పెద్ద నగరాలకే పరిమితమవుతున్నాయని, కనెక్టివిటీ పెరుగుతున్న నేపథ్యంలో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు కూడా విస్తరించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లో డేటా చార్జీలు అత్యంత తక్కువగా ఉండటమనేది, జీసీసీల ఏర్పాటుకు ఎంతో ప్రయోజనకరమైన అంశమని వివరించారు. అలాగే, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి కీలకమైన నిపుణుల లభ్యత, కనెక్టివిటీ, కొత్త ఆవిష్కరణలు చేసే సామర్థ్యాలు, మేథోహక్కుల పరిరక్షణకు పటిష్టమైన చట్టాలు మొదలైనవన్నీ భారత్కు సానుకూలాంశాలని పేర్కొన్నారు. దేశీయంగా బ్రాడ్బ్యాండ్ స్పీడ్ సగటున 138 ఎంబీపీఎస్గా ఉంటోందని మిట్టల్ చెప్పారు. అదనంగా మరింత స్పెక్ట్రంను అందుబాటులోకి తేవడం, పరిశోధనలు .. అభివృద్ధి కార్యకలాపాలకు అనువైన పరిస్థితులు కల్పించడం, చిన్న..మధ్య తరహా సంస్థలు అలాగే స్టార్టప్లను ప్రోత్సహించడం తదితర చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీనితో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు విస్తరించినప్పుడు జీసీసీలకు డిజిటల్ మౌలిక సదుపాయాల కొరత ఉండదని మిట్టల్ తెలిపారు. -
మస్క్ అన్ని కంపెనీల్లో ఒక్కటే ఏఐ
ఎలాన్మస్క్కు చెందిన కంపెనీలన్నింటినీ ఒకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గొడుగు కిందకు తీసుకువచ్చే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతేడాది మస్క్ స్థాపించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ఎక్స్ఏఐలో స్పేస్ఎక్స్ రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు రాయిటర్స్ తెలిపింది. స్పేస్ఎక్స్, టెస్లా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)తో సహా అతని అన్ని కంపెనీల్లో ఏఐని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తున్నారు.ఈ ఏడాది ప్రారంభంలో ఎక్స్ఏఐ ఎక్స్లో విలీనమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారని, ఇప్పుడు కంపెనీ విలువ 113 బిలియన్ డాలర్లుగా ఉందని రాయిటర్స్ నివేదిక తెలిపింది. జూన్లో మోర్గాన్ స్టాన్లీ ఈ భారీ ఫండింగ్కు నేతృత్వం వహించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను తన వ్యాపారాల్లో కీలకంగా ఉపయోగించుకోవాలన్న మస్క్ ప్రణాళికపై బలమైన పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ఇది హైలైట్ చేస్తుంది.ఇదీ చదవండి: పీఎం కిసాన్ నిధి విడుదలకు డేట్ ఫిక్స్?ఈ ప్లాన్లో ఎక్స్ఏఐ రూపొందించిన చాట్బాట్ గ్రోక్ కీలకంగా మారింది. స్పేస్ఎక్స్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ స్టార్లింక్లో కస్టమర్ ప్రశ్నలను నిర్వహించడానికి గ్రోక్ను ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. దీన్ని టెస్లా ఆప్టిమస్ రోబోట్లలోకి తీసుకురావడానికి టెస్టింగ్ నిర్వహిస్తున్నారు. మస్క్కు చెందిన అన్ని కంపెనీల ఎకోసిస్టమ్లో గ్రోక్ను ప్రధాన ఏఐ వ్యవస్థగా ఉండాలని కోరుకుంటున్నట్లు సమాచారం. -
ఇంటర్నెట్ స్పీడ్ పెంచి జపాన్ ప్రపంచ రికార్డు
డిజిటల్ మౌలిక సదుపాయాలు వేగంగా విస్తరిస్తున్నాయి. పదేళ్ల కిందట ఒక మూవీ లేదా ఏదైనా ఒకమోస్తారు లార్జ్ఫైల్ను డౌన్లోడ్ చేయాలంటే చాలా సమయం పట్టేది. కానీ ప్రస్తుతం క్షణాల్లో డౌన్లోడ్ అయిపోతుంది. ఇటీవల జపాన్ పరిశోధకులు భారీగా ఇంటర్నెట్ స్పీడ్ లిమిట్ను పెంచి సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఒక్క సెకనులో నెట్ఫ్లిక్స్లోని మొత్తం డేటా డౌన్లోడ్ చేసేంత నెట్స్పీడ్ వచ్చేలా పరిశోధనలు చేశారు.జపాన్ పరిశోధకులు జరిపిన ఎక్స్పరిమెంట్ ప్రకారం ఇంటర్నెట్ వేగం సెకనుకు 1.02 పెటాబైట్లకు చేరుకుంది. జపాన్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఎన్ఐసీటీ) శాస్త్రవేత్తలు ఈమేరకు ప్రపంచ రికార్డు సాధించారు. మనలో చాలా మంది ఇంటర్నెట్ వేగాన్ని సెకనుకు మెగాబైట్స్ (ఎంబీపీఎస్)లో కొలుస్తారు. ఒక పెటాబైట్ ఒక మిలియన్ గిగాబైట్లకు సమానం లేదా ఒక బిలియన్ మెగాబైట్కు సమానం. కాబట్టి ఈ కొత్త రికార్డుతో సుమారు 1,020,000,000 ఎంబీపీఎస్ స్పీడ్తో ఇంటర్నెట్ను అందించేలా పరిశోధనలు చేశారు. అమెరికాలో సగటు ఇంటర్నెట్ స్పీడ్ 300 ఎంబీపీఎస్ కాగా, భారత్లో 64 ఎంబీపీఎస్గా ఉంది. ఈ కొత్త వేగం నెట్ఫ్లిక్స్ మొత్తం కంటెంట్ లైబ్రరీని సెకనులో డౌన్లోడ్ చేస్తుంది.ఇదీ చదవండి: ఎవరు చెప్పినా వినండి.. కానీ..ఎన్ఐసీటీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ స్పీడ్ను సాధించేందుకు పరిశోధనా బృందం 19 కోర్లతో ప్రత్యేక రకం ఆప్టికల్ ఫైబర్ను ఉపయోగించింది. ఇందులో 19 చిన్న ఛానళ్లు ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి డేటాను తీసుకెళ్లగలవు. సాధారణంగా ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ కేవలం ఒక కోర్ను కలిగి ఉంటాయి. ఈ పరీక్ష స్వల్ప దూరానికే పరిమితం కాలేదు. ఈ టెస్టింగ్ ద్వారా 1,808 కిలోమీటర్లు (సుమారు 1,123 మైళ్లు) డేటాను ప్రసారం చేశారు. ప్రతి 86.1 కిలోమీటర్ల పొడవు ఉన్న 19 వేర్వేరు సర్క్యూట్ల ద్వారా సిగ్నల్ను లూప్ చేసే సెటప్ను ఉపయోగించారు. మొత్తం 180 డేటా స్ట్రీమ్లు ఒకేసారి ప్రసారం చేశారు. ఫలితంగా బ్యాండ్విడ్త్ కిలోమీటరుకు సెకనుకు 1.86 ఎక్సాబిట్లుగా నమోదైంది. ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను ఉపయోగించి అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ వేగాన్ని సాధించవచ్చని నిరూపించడమే తమ లక్ష్యమని ఎన్ఐసీటీ తెలిపింది. -
జీతాల పెంపుపై టీసీఎస్ సీఎఫ్వో కీలక ప్రకటన
భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ తొలి త్రైమాసిక ఫలితాలను ఇటీవల ప్రకటించింది. వ్యాపార వృద్ధి, మార్జిన్లలో ప్రతికూలతను కంపెనీ చూసింది. ఈ క్రమంలో జీతాల పెంపు గురించి ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. దీనిపై టీసీఎస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్వో) సమీర్ సెక్సారియా తాజాగా ప్రకటన చేశారు.తమ 6 లక్షల మంది ఉద్యోగులకు వేతనాల పెంపు టీసీఎస్ ప్రాధాన్య అంశమని సీఎఫ్వో సమీర్ సెక్సారియా తెలిపారు. వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడిన సెక్సారియా, టీసీఎస్ లాభదాయకతతో కూడిన వృద్ధిపై దృష్టి పెడుతుందని స్పష్టం చేశారు. తోటి కంపెనీల మాదిరిగా కాకుండా టీసీఎస్ చాలా అరుదుగా వేతనాల పెంపును వాయిదా వేస్తోందన్న ఆయన గతంలో మాదిరి సకాలంలో వేతనాల పెంపు అమలు చేయడమే తన ప్రాధాన్యమని సెక్సారియా అన్నారు. అయితే ఈ పెంపును ఎప్పుడు అమలు చేస్తారనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.సాధారణంగా వార్షిక వేతనాల పెంపు వల్ల నిర్వహణ లాభం మార్జిన్ 1.50 శాతానికి పైగా తగ్గుతుందని సెక్సారియా తెలిపారు. స్థూల ఆర్థిక, భౌగోళిక రాజకీయ సమస్యల కారణంగా డిమాండ్ దెబ్బతినడంతో నాన్ కోర్ ఆదాయంపై నికరంగా 6 శాతం పెరుగుదలను కంపెనీ చూపించింది. సాధారణంగా ఏప్రిల్ నుండి ప్రారంభమయ్యే వార్షిక వేతన పెంపును వాయిదా వేసింది. జూన్ త్రైమాసికంలో ఈ సంఖ్య 0.20 శాతం క్షీణించి 24.5 శాతంగా నమోదైందని, అయితే మార్జిన్లను 26-28 శాతం ఆకాంక్షాత్మక పరిధిలోకి తీసుకురావడమే తమ ఉద్దేశమని సెక్సారియా నొక్కి చెప్పారు.డిమాండ్ వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకునేందుకు ముందస్తు నియామకాల్లో పెట్టుబడులు పెట్టడం మార్జిన్లను దెబ్బతీసిందని, డిమాండ్ లేకపోవడం వినియోగ స్థాయిలను తగ్గించిందని సెక్సారియా వివరించారు. జూలై 11 నాటికి టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.11.81 లక్షల కోట్లుగా ఉంది. -
Mivi AI Buds: భాష ఏదైనా ‘హాయ్ మివి’ అంటే చాలు..
కన్జూమర్ ఎల్రక్టానిక్స్ సంస్థ మివి కొత్తగా కృత్రిమ మేథ ఆధారిత ఏఐ బడ్స్ను ప్రవేశపెట్టింది. సెటింగ్స్ ఏవీ మార్చకుండానే తెలుగు, హిందీ సహా ఎనిమిది భారతీయ భాషలను ఇది అర్థం చేసుకుని, ప్రతిస్పందిస్తుంది. యూజర్ల ప్రాధాన్యతలను గుర్తుపెట్టుకుని, సందర్భానుసారంగా వ్యవహరించేలా దీన్ని రూపొందించినట్లు సంస్థ కో–ఫౌండర్ మిధులా దేవభక్తుని తెలిపారు. 40 గంటల బ్యాటరీ లైఫ్, 3డీ సౌండ్స్టేజ్, స్పష్టత కోసం క్వాడ్ మైక్ మొదలైన ప్రత్యేకతలు ఉన్నాయి. దీని ధర రూ. 6,999గా ఉంటుంది.ఏఐ బడ్స్ లో మివి ఏఐ అనే ప్రొప్రైటరీ వాయిస్ అసిస్టెంట్ ఉంది. "హాయ్ మివి" అంటే చాలు ఈ వాయిస్ అసిస్టెంట్ ప్రతిస్పందిస్తుంది. ఇది ఎనిమిది భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తుంది. అవి హిందీ, తమిళం, తెలుగు, బెంగాలీ, మరాఠీ, కన్నడ, మలయాళం, గుజరాతీ. లాంగ్వేజ్ సెట్టింగ్ ల మార్చుకునే పనిలేకుండానే వినియోగదారులు ఏ భాషలోనైనా ప్రశ్నలు అడగవచ్చు లేదా సహాయాన్ని అభ్యర్థించవచ్చు.అసిస్టెంట్ అవతార్ ల ద్వారా మివి ఏఐ బడ్స్ వివిధ పనులకు సహకారం అందిస్తుంది. ఇవి ప్రీ డిఫైన్డ్ మాడ్యూల్స్.🔸జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలకు గురు అవతార్ సమాధానాలు చెబుతుంది.🔸ఇంటర్వ్యూవర్ అవతార్ మాక్ ఇంటర్వ్యూలు, ఫీడ్ బ్యాక్ అందిస్తుంది.🔸చెఫ్ అవతార్ వంట చేయడంలో మార్గనిర్దేశం చేస్తుంది.🔸వెల్ నెస్ కోచ్ అవతార్ సంభాషణల సమయంలో యూజర్ ఇన్ పుట్ లకు స్పందిస్తుంది.🔸న్యూస్ రిపోర్టర్ అవతార్ యూజర్ ఆసక్తుల ఆధారంగా న్యూస్ అప్ డేట్స్ అందిస్తుంది.🔸గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉన్న మివి ఏఐ యాప్ ద్వారా యూజర్లు ఏఐ సెట్టింగ్స్, ఫీచర్లను మేనేజ్ చేసుకోవచ్చు. -
లగ్జరీ ఈవీలవైపు.. సంపన్నుల చూపు
న్యూఢిల్లీ: దేశీయంగా అత్యంత సంపన్నులు కాలుష్యకారక ఇంధనాలతో నడిచే వాహనాలతో పోలిస్తే క్రమంగా పర్యావరణహితమైన వాహనాల వైపు మళ్లుతున్నారు. దీనితో లగ్జరీ కార్ల విభాగంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వాటా పెరుగుతోంది. వాహన్ పోర్టల్ గణాంకాల ప్రకారం 2024 జనవరి–మే మధ్య కాలంలో లగ్జరీ సెగ్మెంట్లో 7 శాతంగా ఉన్న ఈవీల వాటా ఈ ఏడాది అదే వ్యవధిలో 11 శాతానికి చేరింది. ఏకంగా 66 శాతం వృద్ధి చెందింది. ప్రీ–ఓన్డ్ కార్ల మార్కెట్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. 2025లో జూన్ నెలాఖరు వరకు అమ్ముడైన ఖరీదైన కార్లలో 10 శాతం వాటా ఈవీలదే ఉంటోంది. గతేడాది ఇదే వ్యవధిలో వీటి వాటా 5 శాతం లోపే నమోదైంది. కొత్త మోడల్స్ దన్ను.. మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడిలాంటి దిగ్గజ సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ను ప్రవేశపెడుతుండటం కూడా ప్రీమియం కస్టమర్లకు ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి నెలకొనడానికి కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. బీఎండబ్ల్యూ ఐఎక్స్1 మోడల్ గేమ్చేంజర్గా నిల్చిందని పేర్కొన్నాయి. ఇక, తమిళనాడులోని రాణిపేటలో 2026 తొలి నాళ్లలో భారీ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇటీవల ప్రకటించింది. ప్రాథమికంగా దీని వార్షికోత్పత్తి సామర్థ్యం 30,000 యూనిట్లుగా ఉంటుంది. ఇక అమెరికన్ దిగ్గజం టెస్లా కూడా భారత్లో విక్రయాలకు సిద్ధమవుతోంది. జూన్ 15న తొలి స్టోర్ను ముంబైలో ప్రారంభిస్తోంది. దీనితో ఎలక్ట్రిక్ వాహనాల విభాగం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ప్రస్తుతం ఈవీలను ఎందుకు కొనాలి అనే సందేహం నుంచి బైటపడి ఏ ఈవీని కొనుక్కోవాలి అనే ఆలోచించే వైపు కొనుగోలుదార్లు మళ్లుతున్నట్లు మెర్సిడెస్ బెంజ్ ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. తాను రెండేళ్లుగా ఈవీని ఉపయోగిస్తున్నానని పేర్కొన్నారు. మాస్ మార్కెట్ ఈవీల రేట్లు కూడా దాదాపు సంప్రదాయ ఐసీఈ వాహనాల ధరలకు కాస్త అటూ ఇటూగా ఉండటం కూడా ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్కి దోహదపడుతోంది. ట్యాక్సేషన్పరమైన ప్రయోజనాల వల్ల లగ్జరీ సెగ్మెంట్లో ఐసీఈ వాహనాలతో పోలిస్తే ఈవీల రేట్లు కొన్ని సందర్భాల్లో 4–5 శాతం తక్కువకే లభిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇక , డ్రైవింగ్పరంగా సౌకర్యం, చార్జింగ్ పాయింట్లు పెరుగుతుండటం వంటి అంశాలు సైతం ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తికి దోహదపడుతున్నాయని వివరించాయి. రేంజ్పరమైన (మైలేజీ) ఆందోళన కూడా తగ్గుతోందని పేర్కొన్నాయి. టాప్ ఎండ్ లగ్జరీ కార్లకు డిమాండ్ దేశీయంగా టాప్ ఎండ్ లగ్జరీ, బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలకు గణనీయంగా డిమాండ్ నెలకొందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దిన వాహనాలపై కస్టమర్లు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అమ్మకాలపరంగా అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసినట్లు చెప్పారు. 4,238 కార్లను విక్రయించినట్లు పేర్కొన్నారు. ఎస్–క్లాస్, మేబాక్, ఏఎంజీల్లాంటి టాప్ ఎండ్ వాహన విక్రయాలు 20 శాతం ఎగిశాయని వివరించారు. కొత్తగా జీఎల్ఎస్ ఏఎంజీ లైన్కి సంబంధించి రెండు వాహనాలను కంపెనీ ప్రవేశపెట్టింది. వీటి ధర రూ. 1.4 కోట్ల నుంచి ప్రారంభమవుతుంది. -
జియో మరో సంచలనం.. ఇక టీవీనే కంప్యూటర్!
ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ విభాగం మరో సంచలనంతో ముందుకొచ్చింది. తక్కువ ధరలో డిజిటల్ ఉపకరణాలు కోరుకునే వినియోగదారులకు జియో ప్లాట్ఫాంస్ జియో పీసీ (JioPC) పేరుతో కొత్త ఆవిష్కరణను తెచ్చింది. ఇది ఒక క్లౌడ్ ఆధారిత వర్చువల్ డెస్క్టాప్ సర్వీసుగా పనిచేస్తూ మీ టీవీని పూర్తి స్థాయి కంప్యూటర్గా మార్చుతుంది.ఈ ఏఐ (AI) ఆధారిత వర్చువల్ కంప్యూటింగ్ సర్వీస్ జియో సెట్-టాప్ బాక్స్ ద్వారా అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు కీబోర్డ్, మౌస్ని ప్లగ్ఇన్ చేసి తమ టీవీలో డెస్క్టాప్ అనుభవాన్ని పొందవచ్చు. అయితే ప్రస్తుతానికి కెమెరాలు, ప్రింటర్లు వంటి పరికరాలకు ఇది సపోర్ట్ చేయదు.ధర, లభ్యతజియోపీసీ ప్రస్తుతానికి ఉచిత ట్రయల్ ద్వారా ఎంపిక చేసిన వినియోగదారులకు అందిస్తోంది. పూర్తిగా పొందాలంటే రూ.5,499 చెల్లించి జియో బ్రాడ్బ్యాండ్తో పొందవచ్చు. తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలను లక్ష్యంగా తీసుకుంటూ, కంప్యూటింగ్ను అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంగా దీన్ని భావిస్తున్నారు. క్లౌడ్ ఆధారిత కంప్యూటర్ను తీసుకొస్తున్నట్లు జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ గత మార్చిలోనే వెల్లడించారు.ఫీచర్లు, వినియోగం ఇలా..జియో వెబ్సైట్లో పేర్కొన్నదాని ప్రకారం.. లైబ్రేఆఫీస్ (LibreOffice) అనే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లాంటి ఓపెన్-సోర్స్ ఆఫీస్ సూట్ను దీంట్లో ప్రీఇన్స్టాల్ చేసిఉంటారు. దీని ద్వారా బ్రౌజింగ్ చేసుకోవచ్చని, విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు, ఇతర అసవసరాలకు వినియోగించుకోవచ్చని వెబ్సైట్లో పేర్కొన్నారు. ఇక మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యాప్లను విడి బ్రౌజర్ ద్వరా ఉపయోగించవచ్చు. క్లౌడ్ ఆధారిత నిర్వహణ వల్ల మెయింటెనెన్స్ ఖర్చు కూడా ఏమీ ఉండదు. -
ఎయిర్టెల్ రీచార్జ్పై 25% క్యాష్ బ్యాక్.. ఇలా చేస్తే..
దేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీలలో ఒకటైన ఎయిర్టెల్ ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ సేవలతో పాటు, బ్రాడ్బ్యాండ్ సర్వీస్ను కూడా అందిస్తోంది. మొబైల్ టారిఫ్లు పెరిగిన నేపథ్యంలో మీరు మొబైల్ రీఛార్జ్, బ్రాడ్ బ్యాండ్ బిల్లు లేదా డిటిహెచ్ రీఛార్జ్ పై ఆదా చేయాలనుకుంటే మీకో చక్కటి మార్గం ఉంది. దీని ద్వారా ప్రతి రీఛార్జ్ పైనా 25 శాతం వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చని మీకు తెలుసా?యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో ఎయిర్టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టింది. దీని సాయంతో రీఛార్జ్ వంటి యుటిలిటీ చెల్లింపులపై బంపర్ క్యాష్ బ్యాక్ పొందడం ఈ కార్డు ప్రత్యేకత. మీరు ఎయిర్టెల్ రీఛార్జ్లలో డబ్బులు ఆదా చేయాలనుకుంటే, ఈ కార్డు మీకు సరైన ఎంపిక. దీనితో ఇతర కంపెనీల రీఛార్జ్ లపై కూడా డిస్కౌంట్లు పొందవచ్చు.25 శాతం క్యాష్ బ్యాక్ పొందండిలా..ఈ క్యాష్ బ్యాక్ కోసం యూజర్లు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వరా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రీఛార్జ్ కోసం ఎయిర్టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో చెల్లించినట్లయితే ఫ్లాట్ 25 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అదే సమయంలో ఇతర రీఛార్జ్ లపై కూడా 10 శాతం క్యాష్ బ్యాక్ ప్రయోజనాన్ని అందిస్తోంది. ఈ క్యాష్ బ్యాక్ 60 రోజుల్లో ప్రాసెస్ అయి నేరుగా క్రెడిట్ స్టేట్ మెంట్ లో ప్రతిబింబిస్తుంది. -
షిప్రాకెట్ నుంచి ‘శూన్య.ఏఐ’
చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ), డీ2సీ వ్యాపార సంస్థల కోసం ఈ–కామర్స్ సేవల సంస్థ షిప్రాకెట్ కొత్తగా ‘శూన్య.ఏఐ’ పేరిట ఏఐ ఇంజిన్ను ఆవిష్కరించింది. అల్ట్రాసేఫ్ సంస్థ భాగస్వామ్యంతో దీన్ని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. తొమ్మిదికి పైగా భారతీయ భాషల్లో వాయిస్, టెక్ట్స్, ఇమేజ్ ఇంటెలిజెన్స్ను ఇది అందిస్తుందని పేర్కొంది. దీన్ని పూర్తిగా భారత్లోనే తీర్చిదిద్దినట్లు వివరించింది.ఇదీ చదవండి: ఐపీవోకు ఇన్ఫ్రా పరికరాలు అద్దెకిచ్చే కంపెనీతొలి ఏడాదిలో ఇది 1 లక్ష పైచిలుకు ఎంఎస్ఎంఈలను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు షిప్రాకెట్ పేర్కొంది. కేటలాగింగ్, మార్కెటింగ్, ఫుల్ఫిల్మెంట్ తదితర విభాగాలవ్యాప్తంగా సమయాన్ని, డబ్బును ఆదా చేసుకునేందుకు శూన్య.ఏఐ ఉపయోగపడుతుందని కంపెనీ ఎండీ సాహిల్ గోయల్ చెప్పారు. షిప్రాకెట్, కేపీఎంజీ విడుదల చేసిన నివేదిక ప్రకారం 11,000 పైచిలుకు బ్రాండ్లు ఉన్న దేశీ డీ2సీ మార్కెట్ ఈ ఏడాది (2025) 100 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. అలాగే 22 కోట్ల ఆన్లైన్ షాపర్లున్న ఈ–రిటైల్ మార్కెట్ 125 బిలియన్ డాలర్లకు చేరనుంది. -
ఏఐ ఆధారిత వైద్య సేవలు
ముంబై: అంతర్జాతీయ ప్రమాణాలతో, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఆరోగ్య సంరక్షణ సేవలను అందుబాటు ధరలకే అందించే ప్రణాళికలను అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ప్రకటించారు. భారత్లో ఆరోగ్యం సంరక్షణ రంగాన్ని మార్చేసే స్వప్నాన్ని ఆయన ఆవిష్కరించారు. సొసైటీ ఫర్ మినిమల్లీ ఇన్వేసివ్ స్పైన్ సర్జరీ – ఆసియా పసిఫిక్ (ఎస్ఎంఐఎస్ఎస్–ఏపీ) 5వ వార్షిక సమావేశం శుక్రవారం ముంబైలో జరిగింది. ఇందులో పాల్గొన్న సందర్భంగా గౌతమ్ అదానీ మాట్లాడారు. భవిష్యత్ ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చేందుకు వీలుగా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ కంటే.. వ్యవస్థ వ్యాప్తంగా పునర్నిర్మాణం అవసరమన్నారు. మూడేళ్ల క్రితం తన 60వ పుట్టిన రోజు సందర్భంగా హెల్త్కేర్, విద్య, నైపుణ్యాభివృద్ధి కోసం రూ.60,000 కోట్లను ఖర్చు చేయనున్నట్టు ప్రకటించడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘‘హెల్త్కేర్ రంగంలో తగినంత వేగం లేకపోవడం వల్ల మేము ఇందులోకి ప్రవేశించలేదు. ఇప్పుడు ఆ వేగం సరిపడా లేకపోవడంతో అడుగు పెట్టాం’’అని అదానీ తెలిపారు. 1,000 పడకల ఇంటిగ్రేటెడ్ మెడికల్ క్యాంపస్లను తొలుత అహ్మదాబాద్, ముంబైలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేయనున్నట్టు గతంలో చేసిన ప్రకటనను గుర్తు చేస్తూ.. కరోనా మాదిరి మహమ్మారి, విపత్తు సమయాల్లో వేగంగా సదుపాయాలను విస్తరించేలా ఇవి ఉంటాయన్నా రు. వైద్య చికిత్సలు, పరిశోధన, శిక్షణకు అత్యుత్తమ కేంద్రాలుగా పనిచేస్తాయంటూ.. మయో క్లినిక్ అంతర్జాతీయ అనుభవం ఈ దిశగా తమకు సాయపడుతుందని అదానీ చెప్పారు. నేడు గుండె జబ్బులు, మధుమేహం కంటే కూడా వెన్నునొప్పి ఎక్కువ మందిని వేధిస్తుందన్న విషయాన్ని ప్రస్తావించారు.నచ్చిన చిత్రం మున్నాభాయ్ ఎంబీబీఎస్ ‘నాకు బాగా నచి్చన చిత్రం మున్నా భాయ్ ఎంబీబీఎస్. నవ్వుకోవడానికే కాదు, సందేశం ఇవ్వడానికి కూడా. మున్నాభాయ్ మందులతో కాకుండా, మానవత్వంతో రోగుల బాధలను నయం చేశాడు. నిజమైన వైద్యం సర్జరీలకు అతీతమైనదని ఇది మనందరికీ గుర్తు చేసింది’ అని గౌతమ్ అదానీ పేర్కొన్నారు. -
వాట్సప్కు పోటీగా త్వరలో బిట్చాట్
ట్విటర్ మాజీ సీఈవో జాక్ డోర్స్ టెక్ ప్రపంచంలో సరికొత్త సంచలనాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నారు. సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. వాట్సప్ తరహా మెసేజింగ్ యాప్ను.. అందునా ఆఫ్లైన్లో పనిచేసేలా త్వరలో జనాలకు అందుబాటులోకి తేనున్నారు. దీనిపేరు.. బిట్చాట్. ఇంటర్నెట్తో అవసరం లేకుండా మెసేజ్లు పంపించుకునే ఈ యాప్ ఎలా పని చేస్తుందో ఓ లుక్కేద్దాం..బిట్చాట్ అంటే అనే బ్లూటూత్తో పనిచేసే పీర్-టు-పీర్ వ్యవస్థ. సర్వర్లతో దీనికి పని ఉండదు. బ్లూటూత్ ఆన్లో ఉంటే సరిపోతుంది. బిట్చాట్ యూజర్లు ఏదైనా మెసేజ్ చేయాలంటూ బ్లూటూత్ ఆన్ చేసి మెసేజ్లు పంపుకోవచ్చు. ఇంటర్నెట్ సమస్యలు, ఇతర విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు, ముఖ్యంగా మారుమూల ప్రాంతాలు, ఘర్షణ వాతావారణ నెలకొన్న సమయాల్లో దీన్ని వినియోగించుకోవచ్చు. సర్వర్లు, అకౌంట్లు, ట్రాకింగ్ విధానాలు ఇందులో లేకపోవడంతో.. యూజర్లను విపరీతంగా ఆకట్టుకోవచ్చనే అంచనా వేస్తున్నారు.ప్రైవసీకి ది బెస్ట్?బిట్చాట్ అనే పేరుతో అందుబాటులోకి వచ్చిన ఆఫ్లైన్ మెసేజింగ్ యాప్లో యూజర్లు అవతల వ్యక్తికి పంపే ప్రతి మెసేజ్ ఎన్క్రిప్ట్ అవుతుంది. మెసేజ్ టూ మెసేజ్ మధ్యలో ఎలాంటి సర్వర్ వ్యవస్థ ఉండదు కాబట్టి యూజర్లకు భద్రత విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని డోర్స్ అంటున్నారు. సింపుల్గా.. డివైజ్ టూ డివైజ్ కనెక్షన్. ఫోన్లో బ్లూటూత్ ద్వారా బిట్చాట్ పనిచేస్తోంది నో సెంట్రల్ సర్వర్: వాట్సప్,టెలిగ్రాం తరహా ఒక యూజర్కు పంపిన మెసేజ్ సర్వర్లోకి వెళుతుంది. సర్వర్ నుంచి రిసీవర్కు మెసేజ్ వెళుతుంది. బిట్చాట్లో అలా ఉండదు.. నేరుగా సెండర్నుంచి రిసీవర్కు మెసేజ్ వెళుతుంది. మెష్ నెట్వర్కింగ్: బ్లూట్తో పనిచేసే ఈ బిట్చాట్ యాప్ ద్వారా రిసీవర్ సమీపంలో లేనప్పటికీ మెసేజ్ వెళుతుంది. ఈ టెక్నిక్ను మెష్ రూటింగ్ అంటారు ఇది మెసేజ్ బ్లూటూత్ పరిధికి మించి 300 మీటర్లు (984 అడుగులు) వరకు పంపడానికి వీలవుతుంది. ప్రూప్స్ అవసరం లేదు: ఈ యాప్లో లాగిన్ అయ్యేందుకు ఎలాంటి వ్యక్తిగత యూజర్ వివరాలు అవసరం లేదు. అంటే ఫోన్ నెంబర్,ఈమెయిల్తో పాటు ఇతర వ్యక్తిగత వివరాలతో పనిలేదు. డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ : బిట్చాట్ కొన్నిసార్లు పీట్ టూ పీర్ నెట్వర్క్ ఆధారంగా పనిచేస్తుంది. అంటే సర్వర్ లేకుండా నెట్వర్క్లోని యూజర్ టూ యూజర్ల మధ్య డేటా మార్పిడి జరుగుతుంది. పాస్వర్డ్ ప్రొటెక్షన్: గ్రూప్ చాట్స్ను ‘రూమ్లు’ అని పిలుస్తారు. ఇవి పాస్వర్డ్తో రక్షితంగా ఉంటాయియూజర్ ఇంటర్ఫేస్: యాప్ను ఇన్ స్టాల్ చేసి, అకౌంట్ క్రియేట్ చేస్తే చాలు. తర్వాత మీ కాంటాక్ట్ లిస్ట్ నుంచి ఎవరితోనైనా చాట్ చేసుకోవచ్చు. గ్రూప్ చాట్స్ అండ్ రూమ్స్: హ్యాష్ట్యాగ్లతో పేర్లు పెట్టి, పాస్వర్డ్లతో సెక్యూర్ చేయవచ్చు. ఉపయోగపడే సందర్భాలు: రద్దీ ప్రదేశాల్లో నెట్వర్క్ సరిగ్గా పనిచేయని సమయంలో విపత్తుల సమయంలో (disaster zones). సెన్సార్ ఉన్న ప్రాంతాల్లో కమ్యూనికేట్ చేయాలనుకునే వారికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం బిట్చాట్ బీటా వెర్షన్లో టెస్ట్ఫ్లైట్ మోడ్లో ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ వెర్షన్ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.టెస్ట్ ఫ్లైట్ మోడ్ అనేది యాపిల్ అందించే బీటా టెస్టింగ్ ప్లాట్ఫారమ్. యాప్లను విడుదలకు ముందు దీని ద్వారా iOS, iPadOS, watchOS, tvOS పరీక్షించేందుకు డెవలపర్లు ఉపయోగించుకుంటారు. తద్వారా ఫీడ్బ్యాక్తో సంబంధిత యాప్ను ఎలా అంటే అలా మార్పులు చేర్పులు చేస్తారు. -
ఎయిర్టెల్ కొత్త ప్లాన్.. రూ.200 లోపే అన్లిమిటెడ్..
దేశంలో ప్రముఖ ప్రైవేట్ టెలికం ఆపరేటర్ ఎయిర్టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఇది వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్తోపాటు మరికొన్ని అదనపు ప్రయోజనాలను అందిస్తుంది. లాంచ్ను అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఈ ప్లాన్ ఇప్పటికే ఎయిర్టెల్ వెబ్సైట్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది.రూ .200 లోపు బేసిక్, షార్ట్ టర్మ్ వాలిడిటీ ప్లాన్ కోసం చూస్తున్న వినియోగదారులను, ముఖ్యంగా ఖరీదైన డేటా ప్యాక్లు కాకుండా మొబైల్ నంబర్ను యాక్టివ్గా ఉంటే చాలనుకునే యూజర్లను లక్ష్యంగా చేసుకుని ఈ ప్లాన్ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. రూ.189 విలువైన ఈ ప్లాన్లో ఏయే ప్రయోజనాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.రూ.189 ప్లాన్ బెనిఫిట్స్ఎయిర్టెల్ రూ.189 ప్లాన్ వాలిడిటీ 21 రోజులు. ఈ వ్యవధిలో వినియోగదారులు అన్ని నెట్వర్క్లకు అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ప్లాన్ మొత్తానికి 1 జీబీ మొబైల్ డేటా లభిస్తుంది. అలాగే మొత్తం 300 ఎస్ఎంఎస్లు ఉచితంగా పంపుకోవచ్చు.ఈ ప్లాన్ భారీ డేటా వినియోగదారులు లేదా స్ట్రీమింగ్ ఆస్వాదించేవారి కోసం రూపొందింది కాదు. ఎక్కువగా కాలింగ్, అప్పుడప్పుడు ఎస్ఎంఎస్లు చేసుకునేవారికి ఇది అనువుగా ఉంటుంది.ఇదే ధర విభాగంలో రిలయన్స్ జియో వంటి ప్రత్యర్థి ఆపరేటర్లలోనూ రీఛార్జ్ ప్లాన్లు ఉన్నాయి. రూ .200 కంటే తక్కువ రీఛార్జ్ చేయాలనుకునేవారికి, ఎయిర్టెల్ ఇప్పుడు రెండు ప్రధాన ఎంపికలను అందిస్తుంది. అవి కొత్తగా ప్రారంభించిన రూ .189 ప్లాన్, అలాగే ఇప్పటికే ఉన్న రూ .199 ప్లాన్. ఇది 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఏదేమైనా రూ .199 ప్లాన్ కొంచెం ఎక్కువ వ్యవధితో ఇలాంటి ప్రయోజనాలను అందిస్తుంది. అదనంగా మరో రూ .10 ఖర్చు చేయడానికి ఇష్టపడే వినియోగదారులకు ఇది మంచి డీల్. -
వందేళ్లయినా AI ఈ పని చేయలేదు: బిల్గేట్స్
విస్తృతంగా విస్తరిస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ (ఏఐ) మానవ ఉద్యోగాలపై ప్రభావం చూపుతుందని, కోట్లాది ఉద్యోగాలను భర్తీ చేస్తుందన్న అంచనాలు ఆందోళనలు పెంచుతున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రోగ్రామింగ్కు ఏఐ ప్రత్యామ్నాయం కాదని అభిప్రాయపడ్డారు. మానవ సృజనాత్మకతతోనే ప్రోగ్రామింగ్ రూపుదిద్దుకుంటుందని వ్యాఖ్యానించిన ఆయన ప్రోగ్రామర్లను ఏఐ ఇప్పుడే కాదు.. వందేళ్లయినా భర్తీ చేయలేదని స్పష్టం చేశారు.ఇటీవల ఎకనమిక్ టైమ్స్తోపాటు టునైట్ షో విత్ జిమ్మీ ఫాలన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలలో బిల్ గేట్స్ దీని గురించి మాట్లాడారు. కోడింగ్ కు మానవ మేధస్సు అవసరమని గేట్స్ చెప్పారు. ప్రోగ్రామింగ్ విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయపడగలదు కానీ పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోలేదని స్పష్టం చేశారు. ప్రోగ్రామింగ్లో నిజమైన సవాలు సంక్లిష్ట సమస్యను సృజనాత్మకతతో పరిష్కరించడమేనన్న ఆయన ఇది యంత్రాలు చేయలేవన్నారు.‘కోడ్ రాయడం అంటే కేవలం టైపింగ్ మాత్రమే కాదు. లోతుగా ఆలోచించడం’ అని బిల్ గేట్స్ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా విభిన్న పరిశ్రమల్లో అనేక ఉద్యోగాలు రూపాంతరం చెందుతాయని, లేదా కనుమరుగవుతాయని భావిస్తున్నప్పటికీ, ప్రోగ్రామింగ్ మాత్రం మానవ ఉద్యోగంగానే ఉంటుందని గేట్స్ అంచనా వేస్తున్నారు. ఎందుకంటే దీనికి విచక్షణ, ఊహాశక్తి, అడాప్టబిలిటీ అవసరం. ఈ లక్షణాలు ఏఐకి ఉండవని అంటున్నారాయన.మరోవైపు 2030 నాటికి కృత్రిమ మేధ 8.5 కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తుందని, అదే సమయంలో 9.7 కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంచనా వేసింది. ఈ ద్వంద్వ ప్రభావాన్ని గేట్స్ అంగీకరిస్తూ, కృత్రిమ మేధ పర్యవసానాల గురించి తాను కూడా భయపడుతున్నానని అంగీకరించారు. అయితే తెలివిగా ఉపయోగిస్తే కృత్రిమ మేధ ఉత్పాదకతను మెరుగుపరుస్తుందని, సమయాన్ని ఆదా చేస్తుందని ఆయన నమ్ముతున్నారు.ఏఐ ప్రభావం గురించి కొన్ని నెలల క్రితమే బిల్గేట్స్ మాట్లాడారు. ఆర్టిపీషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ప్రభావం చూపినా, ఎన్ని మార్పులు తెచ్చినా, కోడింగ్ నిపుణులు, జీవ శాస్త్రవేత్తలు, ఇంధన రంగంలో పనిచేసేవారికి ఎలాంటి ఢోకా ఉండదని తన అభిప్రాయాన్ని చెప్పారు. -
శాంసంగ్ నుంచి 3 ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లు
శాంసంగ్ ఎల్రక్టానిక్స్ సంస్థ ప్రీమియం ఫోల్డబుల్ గెలాక్సీ సిరీస్లో మూడు కొత్త మోడల్స్ను ప్రవేశపెట్టింది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్7, ఫ్లిప్ 7, ఫ్లిప్7 ఎఫ్ఈ వీటిలో ఉన్నాయి. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ సిరీస్లో ఇవి ఏడో జనరేషన్ ఫోన్లు. మరింత వెడల్పాటి స్క్రీన్, తక్కువ బరువు, 200 మెగాపిక్సెల్ వైడ్–యాంగిల్ కెమెరా, కృత్రిమ మేథపరంగా కొత్త ఫీచర్లు మొదలైనవి వీటిలో ఉన్నాయి. ఫోన్ను బట్టి స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్లు, 8.5 అంగుళాల డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ మెయిన్ డిస్ప్లే, 16 జీబీ వరకు మెమరీ, 1 టీబీ స్టోరేజీ మొదలైన ప్రత్యేకతలు ఉంటాయి.శాంసంగ్ ఈసారి స్లిమ్ ఫోల్డబుల్ డిజైన్, శక్తివంతమైన పనితీరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఇది ఫ్లాగ్షిప్ మార్కెట్లో ఎక్కువ దృష్టిని ఆకర్షించింది. జెమినీ లైవ్, నౌ బార్, నౌ బ్రీఫ్ వంటి మరెన్నో కొత్త ఏఐ సామర్థ్యాలను తీసుకువస్తున్నందున శాంసంగ్ ఈ ఫోన్లను "గెలాక్సీ ఏఐ ఫోన్లు" అని పిలుస్తోంది. వీటి ధరలను ప్రకటించిన కొరియన్ స్మార్ట్ఫోన్ మేకర్ ప్రీ బుకింగ్లను ప్రారంభించింది.శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 బ్లూ షాడో, సిల్వర్ షాడో, జెట్బ్లాక్, మింట్ (Samsung.com మాత్రమే) అనే నాలుగు రంగుల్లో లభిస్తుంది.12జీబీ+256జీబీ ధర రూ.1,74,99912జీబీ+512జీబీ ధర రూ.1,86,99916జీబీ+1టీబీ ధర రూ.2,10,999శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 బ్లూ షాడో, జెట్బ్లాక్, కోరల్ రెడ్, మింట్ (Samsung.comలో మాత్రమే) రంగుల్లో లభిస్తుంది.12జీబీ+256జీబీ ధర రూ.1,09,99912జీబీ+512జీబీ ధర రూ.1,21,999శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 ఎఫ్ఈగెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 ఎఫ్ఈ బ్లాక్ లేదా వైట్ కలర్లలో లభిస్తుంది.8జీబీ+128జీబీ: రూ.89,9998జీబీ+256జీబీ: రూ.95,999ఈ స్మార్ట్ ఫోన్లు భారత్లో శాంసంగ్ (Samsung.com), అమెజాన్ (Amazon.in), ఫ్లిప్కార్ట్ (Flipkart.com)లలో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉన్నాయి. ప్రీ ఆర్డర్లకు ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తున్నాయి. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 ప్రీ-ఆర్డర్ చేస్తే రూ.12,000 విలువైన ఉచిత స్టోరేజ్ అప్ గ్రేడ్ లభిస్తుంది. మరోవైపు శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్7 ఎఫ్ఈ ప్రీ ఆర్డర్పై రూ.6,000 విలువైన స్టోరేజ్ అప్గ్రేడ్ ఉచితంగా అందిస్తోంది. అదనంగా, కొనుగోలుదారులు ఈ మూడు మోడళ్లపై 24 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఎంపికలను కూడా ఎంచుకోవచ్చు. కొత్త ఫోల్డబుల్ అధికారిక సేల్ జూలై 25న మొదలుకానుంది. -
మస్క్ కంపెనీకి భారత్లో అనుమతులు
ఎలాన్ మస్క్కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థ స్టార్లింక్ భారత్లో కార్యకలాపాలు ప్రారంభించడానికి అన్ని అడ్డంకులను అధిగమించింది. భారతదేశ అంతరిక్ష నియంత్రణ సంస్థ ఇన్-స్పేస్ (ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్) ఈ సంస్థకు అనుమతులు ఇచ్చింది. దాంతో దేశంలో స్టార్లింక్ ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించేందుకు అడ్డంకులు తొలగినట్లయింది.2022 నుంచి భారతదేశంలో స్టార్లింక్ తన సర్వీసులు ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గత నెలలో టెలికమ్యూనికేషన్స్ విభాగం (డాట్) నుంచి గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ (జీఎంపీసీఎస్) లైసెన్స్ కూడా పొందింది. ఇప్పుడు, ఇన్-స్పేస్ ఆమోదంతో స్టార్లింక్ భారత్లోని కంపెనీ ప్రణాళికలకు లైన్ క్లియర్ అయింది.ఐఎన్-స్పేస్ స్టార్లింక్ తన జెన్ 1 ఉపగ్రహ సమూహాన్ని భారతదేశంపై నిలిపేందుకు అనుమతిస్తుంది. ఈ అనుమతులు జులై 7, 2030 వరకు చెల్లుబాటు అవుతాయని కొన్ని సంస్థలు తెలిపాయి. ఈ ఆమోదంలో భాగంగా IN-SPACe యూజర్లు ఉపయోచించేందుకు నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ బ్యాండ్లను కూడా ఖరారు చేస్తుంది. గేట్ వే బీమ్ల కోసం స్టార్లింక్ 27.5–29.1 గిగాహెర్జ్ట్, 29.5–30 గిగాహెర్జ్ట్ అప్లింక్ బ్యాండ్లను, 17.8–18.6 గిగాహెర్జ్ట్, 18.8–19.3 గిగాహెర్జ్ట్ డౌన్లింక్ బ్యాండ్లను ఉపయోగించే అవకాశం ఉందని సమాచారం. సరళంగా చెప్పాలంటే స్టార్లింక్ దాని వినియోగదారులు, గ్రౌండ్ స్టేషన్ల నుంచి భారతదేశం అంతటా ఇంటర్నెట్ డేటాను పంపించేందుకు నిర్దిష్ట ఉపగ్రహ సంకేతాలను ఉపయోగించేలా అధికారిక అనుమతులు పొందింది.ఇదీ చదవండి: పిల్లలూ.. బ్యాంకు తలుపు తట్టండి!గేట్వే స్టేషన్లు నిర్మాణం..ఇదిలాఉండగా, ఈ ఆమోదం పొందడం వల్ల స్టార్లింక్ వెంటనే భారత్లో సర్వీసులు ప్రారంభిస్తుందని కాదు. సంస్థ ఇంకా భారత ప్రభుత్వం నుంచి స్పెక్ట్రమ్ను పొందాల్సి ఉంటుంది. గ్రౌండ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం, భద్రతా అవసరాలను తీర్చడానికి పరీక్షలను పూర్తి చేయాల్సి ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా కనీసం మూడు గేట్వే స్టేషన్లను నిర్మించాలని కంపెనీ యోచిస్తోంది. ఈ వ్యవస్థ పూర్తయితే స్టార్లింక్ కూడా త్వరలో ట్రయల్స్ ప్రారంభించే అవకాశం ఉంది. కంపెనీ భారతదేశ సాంకేతిక, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నిరూపించడానికి టెలికమ్యూనికేషన్స్ విభాగం ట్రయల్ స్పెక్ట్రమ్ను మంజూరు చేయబోతున్నట్లు సమాచారం. -
ఈ ఐటీ ఉద్యోగం.. రూ.కోటి జీతం
పేరున్న కాలేజీలో పెద్ద పెద్ద డిగ్రీలు చదివితేనే మంచి ఉద్యోగాలు వస్తాయన్న భావనకు కాలం చెల్లిపోతోంది. ఏఐ టెక్నాలజీ విస్తృతమవుతున్న నేపథ్యంలో కాలేజీలు, డిగ్రీలతో సంబంధం లేకుండా ప్రతిభ ఉంటే చాలు రూ.లక్షల్లో జీతాలతో ఉద్యోగాలిస్తామంటూ ముందుకొస్తున్నాయి కొన్ని సంస్థలు. ఈ క్రమంలోనే భారత సంతతికి చెందిన ఓ స్టార్టప్ ఫౌండర్ సోషల్ మీడియాలో అసాధారణమైన జాబ్ లిస్టింగ్ను పోస్ట్ చేసి ఆన్లైన్లో విస్తృత చర్చను రేకెత్తించారు.‘స్మాల్ ఏఐ’ అనే ఏఐ స్టార్టప్ వ్యవస్థాపకుడు సుదర్శన్ కామత్ తన కంపెనీకి ఫుల్ స్టాక్ టెక్ లీడ్ కావాలంటూ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో ఓ పోస్ట్ పెట్టారు. ఈ జాబ్కి ఆయన రూ .1 కోటి వార్షిక వేతన పరిహారాన్నిఆఫర్ చేశారు. ఈ ప్యాకేజీలో రూ.60 లక్షల ఫిక్స్డ్ వార్షిక వేతనం కాగా రూ.40 లక్షలు కంపెనీ యాజమాన్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే దీనికి అభ్యర్థి కాలేజీ డిగ్రీలతో నిమిత్తం లేదని, రెజ్యూమ్ కూడా అక్కర్లేదని ప్రకటించడంతో అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.ఇంకా ఈ ఉద్యోగానికి ఏమేం కావాలన్నది కామత్ వివరించారు. ఆదర్శ అభ్యర్థికి "4-5 సంవత్సరాల అనుభవం" ఉండాలని, "నెక్ట్స్ జెఎస్, పైథాన్, రియాక్ట్ జెఎస్" గురించి బాగా తెలిసి ఉండాలని కామత్ పేర్కొన్నారు. అలాగే ఈ ఉద్యోగం బెంగళూరు కేంద్రంగా ఉంటుందని, ఎంపికైనవారు తక్షణమే ఉద్యోగంలో చేరాల్సి ఉంటుందని వెల్లడించారు. అదేవిధంగా జాబ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విధానంలో ఉంటుందని, వారానికి 5 రోజులు కార్యాలయానికి వచ్చి పనిచేయాలని కూడా వివరించారు.ఈ జాబ్కు అప్లయి చేయడానికి రెజ్యూమె అవసరం లేదని, కేవలం 100 పదాలతో తమ గురించి తెలియజేస్తే చాలంటూ కంపెనీ ఈ మెయిల్ అడ్రస్ ఇచ్చారు. కామత్ చేసిన ఈ పోస్ట్ వైరల్గా మారింది. ఇప్పటికే మూడు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు భిన్న కామెంట్లతో ప్రతిస్పందిస్తున్నారు.Hiring a cracked full-stack lead at Smallest AISalary CTC - 1 CrSalary Base - 60 LPASalary ESOPs - 40 LPAJoining - ImmediateLocation - Bangalore (Indiranagar)Experience - 4-5 years minimumLanguages - Next JS, Python, React JSWork from Office - 5 days a week (slightly…— Sudarshan Kamath (@kamath_sutra) July 7, 2025 -
ఐఫోన్ 17: చైనా టెకీలు వెళ్లిపోయినా పర్లేదు..
యాపిల్ వెండార్ల ప్లాంట్లలో పని చేసే చైనా టెకీలు స్వదేశాలకు వెళ్లిపోయినా భారత్లో ఐఫోన్ 17 ఫోన్ల ఉత్పత్తి ప్రణాళికలు యథాతథంగానే కొనసాగుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. చైనా నుంచి, ఐఫోన్ల తయారీలో కీలకమైన యంత్రపరికరాల దిగుమతులు ఇటీవలి కాలంలో మెరుగుపడ్డట్లు వివరించాయి.భారత్లో ఫాక్స్కాన్, టాటా ఎల్రక్టానిక్స్ సంస్థలు యాపిల్ ఫోన్లను తయారు చేస్తున్నాయి. గత రెండు నెలలుగా ఫాక్స్కాన్ ఇండియా యూనిట్లలో పని చేస్తున్న వందలకొద్దీ చైనా నిపుణులు స్వదేశానికి వెళ్లిపోయినట్లు సమాచారం. వీరంతా అసెంబ్లీ లైన్స్, ఫ్యాక్టరీ డిజైన్, ఇతరత్రా సిబ్బందికి శిక్షణనిచ్చే విధులు నిర్వర్తించేవారు.దీనితో ఐఫోన్ల తయారీపై ప్రతికూల ప్రభావం పడొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. కానీ, భారత్లో ఐఫోన్ల ఉత్పత్తిని 3.5–4 కోట్ల స్థాయి నుంచి ఈ ఏడాది 6 కోట్లకు పెంచుకోవాలన్న యాపిల్ టార్గెట్లో ఎలాంటి మార్పు లేదని సంబంధిత వర్గాలు వివరించాయి. -
యాపిల్ కొత్త సీఓఓ మనోడే..
ప్రపంచ దిగ్గజ కంపెనీ యాపిల్ కొత్తగా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా భారత సంతతికి చెందిన సబీహ్ ఖాన్ను నియమించింది. ఇప్పటి వరకు ఈ స్థానంలో జెఫ్ విలియమ్స్ సేవలందించారు. 2015 నుంచి సీఓఓ పదవిలో ఉన్న జెఫ్ విలియమ్స్ ఇకపై కంపెనీ సీఈఓ టిమ్ కుక్కు రిపోర్ట్ చేస్తూ యాపిల్ వాచ్, డిజైన్ బృందాలను పర్యవేక్షించనున్నారు. ఈ ఏడాది చివర్లో విలియమ్స్ పదవీ విరమణ చేసిన తర్వాత డిజైన్ బృందం నేరుగా టిమ్కు నివేదిస్తుందని యాపిల్ పేర్కొంది.ఎవరీ సబీహ్ ఖాన్..యాపిల్ సంస్థలో 30 ఏళ్లుగా పనిచేస్తూ, ప్రస్తుతం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆపరేషన్స్గా సేవలందిస్తున్న సబీహ్ ఖాన్ ఈ నెలాఖరులో అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో 1966లో జన్మించిన ఖాన్ చదువుకునే రోజుల్లోనే సింగపూర్కు మకాం మార్చారు. టఫ్ట్స్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్లో డ్యూయల్ బ్యాచిలర్ డిగ్రీలు పొందారు. రెన్సెలీర్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ (ఆర్పీఐ) నుంచి మెకానికల్ ఇంజినీరింగ్లో మాస్టర్స్ పట్టా సాధించారు.Many congratulations to Sabih Khan on being elevated as the COO of AppleI had the pleasure of meeting and interacting with Sabih a few years ago when he was leading Global supply chain operations for AppleOnwards and upwards my friend 👏 pic.twitter.com/TbsYffwLJv— KTR (@KTRBRS) July 9, 2025ఇదీ చదవండి: కుబేరులకు దేశాలు రెడ్కార్పెట్జీఈ ప్లాస్టిక్స్లో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన తరువాత ఖాన్ 1995లో యాపిల్లో చేరారు. అప్పటి నుంచి అతను గ్లోబల్ సప్లై చైన్, సప్లయర్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రామ్స్, ఆపరేషనల్ స్ట్రాటజీని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. యాపిల్ గ్లోబల్ స్ట్రాటజీలో కీలక మార్కెట్గా భారత్ ఎదుగుతున్న నేపథ్యంలో ఖాన్ ఈ పదవిని చేపట్టడం గమనార్హం. ఖాన్ భారాస నేత కేటీఆర్ స్నేహితుడు కావడంతో తన ఎక్స్ ఖాతాలో శుభాకాంక్షలు తెలిపారు. -
బడ్జెట్ ధరలో మోటో 5జీ ఫోన్
ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ మోటోరొలా బడ్జెట్ ధరలో ‘మోటో జీ96’ 5జీ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. రూ.17,999 ప్రారంభ ధరతో వస్తున్న ఈ బడ్జెట్ ఫోన్ను వినియోగదారులు ఎంపిక చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఫోన్ను స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, 256 జీబీ స్టోరేజ్తో మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: పెరుగుతున్న కార్మిక కొరత.. జనాభా సంక్షోభంఫీచర్లు..144 హెచ్జెడ్ 3డీ కర్వ్డ్ పీఓఎల్ఈడీ డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంది. స్నాప్డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్ని వాడారు. వెనుక 50 ఎంపీ సోనీ ఎల్వైటీ–700సీ కెమెరా ఉంది. 5,500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 128బీజీ స్టోరేజ్లతో 2 వేరియంట్లు ఉన్నాయి. ప్రారంభ ధర రూ.17,999గా ఉంది. ఈ జూలై 16 నుంచి ఫ్లిప్కార్ట్, మోటోరొలా వెబ్సైట్లతో పాటు రిటైల్ షాపుల్లో అమ్మకాలు ప్రారంభవుతాయి. -
డ్రోన్ మార్కెట్ @ రూ.2 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: రక్షణ, వ్యవసాయం, లాజిస్టిక్స్, మౌలికం తదితర ఎన్నో రంగాల్లో డ్రోన్ల వినియోగంతో మంచి ఫలితాలు కనిపిస్తుండడంతో ఈ మార్కెట్ వచ్చే ఐదు సంవత్సరాల్లో గణనీయంగా వృద్ధి చెందనుందని నెక్స్జెన్ సంస్థ అంచనా వేసింది. 2030 నాటికి దేశీ డ్రోన్ తయారీ పరిమాణం 23 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.1.96 లక్షల కోట్లు) చేరుకోవచ్చని పేర్కొంది. ఆధునిక యుద్ధ తంత్రాల్లో డ్రోన్లు కీలకంగా మారిన విషయాన్ని ప్రస్తావించింది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో డ్రోన్ల వినియోగం స్పష్టమైన మార్పునకు నిదర్శనంగా పేర్కొంది. 15 పట్టణాలకు చెందిన 150 కంపెనీల అభిప్రాయాలను నెక్స్జెన్ తన సర్వేలో భాగంగా తెలుసుకుంది. ముఖ్యంగా వ్యవసాయం, కచ్చితమైన సాగు అవసరాలు 2030 నాటికి డ్రోన్ల డిమాండ్కు కీలకంగా నిలుస్తాయని 40 శాతం కంపెనీలు భావిస్తున్నాయి. ఆ తర్వాత రక్షణ రంగం నుంచి ఎక్కువ డిమాండ్ వస్తుందని పేర్కొన్నాయి. స్మార్ట్ సాగు రూపంలో వచ్చే ఐదేళ్లో గ్రామీణ వ్యవసాయంలో డ్రోన్లు బూమ్ను సృష్టిస్తాయని నమ్ముతున్నట్టు సర్వేలో 20 శాతం కంపెనీల ప్రతినిధుల తెలిపారు. లాజిస్టిక్స్ (వస్తు రవాణా), ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలు సైతం డ్రోన్ల తయారీకి చోదకంగా నిలుస్తాయని 15 శాతం కంపెనీలు అభిప్రాయపడ్డాయి. ఢిల్లీలో అంతర్జాతీయ డ్రోన్స్ ప్రదర్శన ఈ డిమాండ్నకు మరింత మద్దతునిచ్చే చర్యల్లో భాగంగా ఈ నెల 31 నుంచి ఆగస్ట్ 1 వరకు ఢిల్లీలో అతిపెద్ద ‘డ్రోన్ అంతర్జాతీయ ప్రదర్శన 2025’ నిర్వహించనున్నట్టు నెక్స్జెన్ తెలిపింది. నెక్స్జెన్ ఎగ్జిబిషన్స్ దీన్ని నిర్వహిస్తుండడం గమనార్హం. రష్యా, తైవాన్, కెనడా, ఉక్రెయిన్, భారత్ సహా ఆరు దేశాలు తమ నూతన డ్రోన్ ఆవిష్కరణలను ఈ సందర్భంగా ప్రదర్శించనున్నట్టు వెల్లడించింది. అలాగే, 50కు పైగాఅంతర్జాతీయ డ్రోన్ తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నట్టు తెలిపింది. ‘‘ఆపరేషన్ సింధూర్ సమయంలో డ్రోన్లు చూపించిన అద్భుత సామర్థ్యాలను యావత్ ప్రపంచం గమనించింది. దేశీ తయారీ డ్రోన్లను ప్రోత్సహించడం ‘భారత్లో తయారీ’ కార్యక్రమాన్ని బలోపేతం చేస్తుందని, పలు రంగాల్లో దేశ శ్రేయస్సుకు మేలు చేస్తుందని భావిస్తున్నాను’’అని నెక్స్జెన్ ఎగ్జిబిషన్స్ డైరెక్టర్ ఆధార్ బన్సాల్ తెలిపారు. వ్యవసాయంలో విత్తనాలు నాటడం, మందుల పిచికారీతోపాటు నిఘా, పంటల ఆరోగ్యం పరిశీలన సహా ఎన్నో రూపాల్లో డ్రోన్లు సేవలు అందిస్తుండడం గమనార్హం. అంతర్జాతీయంగా వ్యవసాయ డ్రోన్ల మార్కెట్ 2030 నాటికి చేరుకోవచ్చని 6 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చన్న అంచనాలను నెక్స్జెన్ నివేదిక ప్రస్తావించింది. -
బాబోయ్.. రీచార్జ్ ప్లాన్లు మళ్లీ పెరుగుతాయా?
దేశంలో మొబైల్ రీచార్జ్ ప్లాన్ల ధరలు మళ్లీ పెరుగనున్నాయి. టెలికాం ఆపరేటర్లు ఈ ఏడాది చివరి నాటికి మొబైల్ టారిఫ్లను పెంచవచ్చని తెలుస్తోంది. ధరల పెరుగుదల 10 నుంచి 12 శాతం వరకు ఉండొచ్చని ఓ వార్తా నివేదిక తెలిపింది. 2024 జూలైలో బేస్ ధరలను 11 నుండి 23 శాతం పెంచిన భారతీయ టెలికాం కంపెనీలు ఈసారి కొత్త విధానాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, మే నెలలో బలమైన క్రియాశీలక యూజర్ల పెరుగుదలే ఈ పెంపునకు కారణమని చెబుతున్నారు.మళ్లీ మొబైల్ టారిఫ్ల పెంపుభారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియాతో సహా భారతీయ టెలికాం ఆపరేటర్లు ఈ ఏడాది చివరి నాటికి మొబైల్ టారిఫ్లపై తాజా పెంపును విధించవచ్చని ఈటీ టెలికాం నివేదిక తెలిపింది. ఈ పెరుగుదల 10-12 శాతం మధ్య ఉంటుందని, మిడ్-టు-హై-ప్రైస్ రీఛార్జ్ ప్లాన్లను కొనుగోలు చేసే వినియోగదారులను కంపెనీలు లక్ష్యంగా చేసుకోవచ్చని తెలిపింది.టారిఫ్ల పెంపుతో యాక్టివ్ సబ్స్క్రైబర్లు వేరే టెలికాం నెట్వర్క్ ప్రొవైడర్కు మళ్లకుండా ఆపరేటర్లు టైర్డ్ విధానంపై దృష్టి సారించారు. మే నెలలో యాక్టివ్ సబ్స్క్రైబర్ల బలమైన వృద్ధి మరోసారి ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని చెబుతున్నారు. ఈ 31 రోజుల్లో భారతీయ టెలికాం రంగంలో 7.4 మిలియన్ల క్రియాశీల చందాదారులు పెరిగారు. 29 నెలల్లో ఇదే అత్యధికం. దీంతో మొత్తం యాక్టివ్ సబ్స్క్రైబర్ల సంఖ్య 1.08 బిలియన్లకు చేరింది. -
‘పాస్వర్డ్ సరైందే! ఎందుకు లాగిన్ అవ్వట్లేదు’
బ్యాంక్, ఆఫీస్ పోర్టళ్లు, జాబ్ కోసం దరఖాస్తులు వంటి ఇతర ముఖ్యమైన వెబ్సైట్ల్లో చాలామంది లాగిన్ ఐడీ, పాస్వర్డ్లు కొత్తగా క్రియేట్ చేసుకుంటుంటారు. కానీ తిరిగి లాగిన్ చేయాలంటే మాత్రం సైన్ఇన్ ఇవ్వొదు. ‘అదేంటి సరిగ్గానే పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నానే.. ఎందుకు అవ్వట్లేదు’ అనే అనుమానం వస్తుంది. దాంతో తిరికి ఫర్గాట్ పాస్ట్వర్డ్ అప్షన్కు వెళ్లాల్సి వస్తుంది. అందులోనూ కొన్ని సైట్లు పాత పాస్వర్డ్లు ఎంటర్ చేయమని అడిగే అవకాశం ఉంటుంది.ఏవీ చూసుకోకుండా లాగిన్ చేస్తే..లాగిన్ పోర్టల్లో ఐడీ ఎంటర్ చేసేప్పుడు సదరు బ్లాక్లో ఎంటర్ చేసే అక్షరాలు యూజర్కు కనిపిస్తాయి. కానీ పాస్వర్డ్ ఎంటర్ చేసేప్పుడు మాత్రం సెక్యూరిటీ కారణాల వల్ల డాట్లు వస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో అప్పర్కేస్, లోయర్ కేస్ ఇంగ్లీష్ అక్షరాలు, స్పెషల్ క్యారెక్టర్లు, క్యాప్స్లాక్ ఆన్ అవుతుంది. అవేవీ చూసుకోకుండా లాగిన్ చేస్తే అప్పటివరకు లాగిన్ అవుతుంది. కానీ లాగవుట్ చేసి తిరిగి లాగిన్ చేస్తే సైన్ఇన్ అవ్వదు. ఇలాంటి సమయాల్లో ఏం చేయాలో టెక్ నిపుణులు సూచిస్తున్నారు.చెక్ చేయాల్సిందే..ఆన్లైన్లో ఖాతాలు ఓపెన్ చేసేప్పుడు లాగిన్ ఐడీ, పాస్వర్డ్లు టైప్ చేయాల్సి వస్తుంది. ఐడీ బ్లాక్లో అక్షరాలు యూజర్కు కనిపిస్తాయి. కానీ పాస్వర్డ్ బ్లాక్లో ఎంటర్ చేసే అక్షరాలు కనిపించవు. బదులుగా డాట్స్ పడుతుంటాయి. ఆ సమయంలో ఒకవేళ కంప్యూటర్ ద్వారా సైన్ఇన్ అవుతుంటే నోట్పాడ్ ఓపెన్ చేసి అందులో ముందుగా పాస్వర్డ్ టైప్చేసి, ఎంటర్ చేయాల్సిన అన్ని అక్షరాలు సరిగ్గా పడుతున్నాయా? లేదా ఏదైనా బటన్ సమస్యలు, లేదా కేస్ సెన్సిటివ్ అక్షరాలు టైప్ అవుతున్నాయా చెక్ చేసుకోవాలి. తర్వాత పాస్వర్డ్ బ్లాక్లో ఎంటర్ చేయడంతో సమస్య ఉండదు.ఇదీ చదవండి: ఏఐ ఉండగా ఉద్యోగాలొస్తాయా?మొబైల్లో ఇలా..మొబైల్లో సైనప్ అవుతుంటే మాత్రం నోట్స్లో రాసుకోవచ్చు. దాంతోపాటు వెర్టికల్ వ్యూలో అక్షరాలు చిన్నగా ఉంటాయి. కాబట్టి పొరపాటున ఒక అక్షరం నొక్కితే పక్కన ఉన్న లెటర్లు ప్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి పరిష్కారంగా మొబైల్లో స్క్రీన్ రొటేట్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఉపయోగించి ఫోన్ రొటేట్ చేస్తే కీబోర్డ్ పెద్దగా కనిపిస్తుంది. మరింత స్పష్టంగా, ఎంటర్ చేయాలనుకునే పాస్వర్డ్ సదరు బ్లాక్లో ఇవ్వొచ్చు. -
జియో కొత్త ప్లాన్లు.. తక్కువ ఖర్చుతో ఏడాది వ్యాలిడిటీ
కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్లతో చౌకగా రీఛార్జ్ ప్లాన్లను అందించాలని ట్రాయ్ కొద్ది రోజుల క్రితం అన్ని టెలికాం కంపెనీలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో జియో కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోనాలతో రెండు చౌక రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. తన అధికారిక వెబ్సైట్లో రెండు కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్లను జాబితా చేసింది. వీటిలో వినియోగదారులు 365 రోజుల వరకు సుదీర్ఘ వాలిడిటీని పొందుతారు. డేటా అవసరం లేని యూజర్లకు ఈ ప్లాన్ ప్రయోజనం చేకూరుస్తుంది.కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్ మాత్రమే వాడే యూజర్లకు, డేటా అవసరం లేని వారికి ఈ జియో ప్లాన్లు ప్రత్యేకం. వీటిలో ఒక దాని ధర రూ .458 కాగా మరొకటి రూ .1958. ఇవి వరసగా 84 రోజులు, 365 రోజుల వాలిడిటీతో వస్తాయి. ఇంకా ఈ రెండు జియో ప్లాన్లలో వినియోగదారులు చాలా ప్రయోజనాలను పొందుతారు. ఈ ప్లాన్స్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.84 రోజుల ప్లాన్జియో కొత్త రూ.458 ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. ఈ ప్లాన్లో వినియోగదారులకు అపరిమిత కాలింగ్, 1000 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి. దీంతోపాటు జియో సినిమా, జియో టీవీ వంటి యాప్స్కు కూడా ఉచిత యాక్సెస్ లభిస్తుంది. ముఖ్యంగా కాలింగ్, ఎస్ఎంఎస్ మాత్రమే వాడే యూజర్ల కోసం జియో ఈ ప్లాన్ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్లో దేశం అంతటా ఏ నెట్వర్క్లోనైనా అపరిమిత కాల్స్, ఉచిత నేషనల్ రోమింగ్ సదుపాయం లభిస్తుంది.365 రోజుల ప్లాన్జియో కొత్త రూ .1958 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్లో వినియోగదారులు దేశం అంతటా ఏ నెట్వర్క్కు అయినా అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. వీటితో పాటు 3600 ఉచిత ఎస్ఎంఎస్లు, ఉచిత నేషనల్ రోమింగ్ ప్రయోజనాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ప్లాన్ జియో సినిమా, జియో టీవీ వంటి యాప్లకు ఉచిత యాక్సెస్ను అందిస్తుంది. -
ఈ డాక్యుమెంట్ కెమెరాతో ఆన్లైన్ క్లాస్ ఈజీ..
టీచర్లు టెక్తో టచ్లోకి రావాలన్నా, విద్యార్థులు విజ్ఞానంలో విండో ఓపెన్ చేయాలన్నా.. వారి వద్ద ఈ టెకీ టూల్ మాస్టార్లు ఉండాల్సిందే!క్లాస్లో స్క్రీన్ స్టార్ఆన్లైన్ క్లాసుల్లో విద్యార్థులు బయటకు కనబడేలా భయపడితే, టీచర్లు లోలోపల భయపడుతుంటారు. ఎందుకంటే ముందే పీపీటీలు సిద్ధం చేయకపోతే, ‘సార్, స్క్రీన్ షేర్ చేయండి’, ‘మిస్, స్లయిడ్ మిస్ అయింది’ అంటూ సందేశాల వర్షం కురిపిస్తారు విద్యార్థులు. ఇక నెట్ స్లో, లైట్ తక్కువ, ఫాంట్ చిన్నది లాంటి ఇతర సమస్యలతో ఆన్లైన్ క్లాస్ మొత్తం గాలిలో కలిసిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో టీచర్లకు తోడుగా ఉండే నేస్తమే ఈ ‘డాక్యుమెంట్ కెమెరా’. దీని ముందు పుస్తకం పెడితే చాలు, స్పష్టంగా సమాచారాన్ని స్క్రీన్పై చూపిస్తుంది. టచ్ చేస్తే లైట్ వెలుగుతుంది, బటన్ నొక్కితే బ్లర్ లేకుండా చూసుకుంటుంది. మీరు పేజీ తిప్పితే ఇది కూడా తిప్పి చూపిస్తుంది. స్లయిడ్స్ అవసరం లేకుండా బుక్తోనే క్లాస్ పూర్తవుతుంది. ధర రూ. 2,999.ఆర్ట్ మాస్టర్!పిల్లలు బొమ్మలు గీస్తారు, కట్ చేస్తారు, స్టిక్ చేస్తారు. ఇలా చేస్తూ చేస్తూ చివరకు చేతికి బ్యాండేజ్ వేసుకుంటారు! ఇలాంటి చిన్న చిన్న గాయాలకు ఇకపై ఈ ‘స్కాన్ అండ్ కట్’ మెషిన్ గుడ్బై చెప్తుంది. బొమ్మ చూపిస్తే, ఏ మెటీరియల్పై అయినా కట్ చేయగలదు. కాగితం, ఫ్యాబ్రిక్, ఫోమ్.. ఏదైనా సరే, స్క్రీన్ మీద టచ్ చేస్తే చాలు, రెండు వందలకు పైగా రెడీ డిజైన్లతో సిద్ధంగా ఉంటుంది. ఒక్క క్లిక్తో కావాల్సిన ఆర్ట్ని రెడీ చేసి ఇస్తుంది. ఇది కేవలం కటింగ్ మెషిన్ కాదు. స్కానింగ్, డిజైనింగ్, కటింగ్ అన్నీ కలిపిన ఒక క్రాఫ్ట్ మాస్టర్. ఇంట్లోనైనా, క్లాస్రూమ్లోనైనా ఒక్కసారి పెట్టి చూడండి. అప్పుడు చిన్న చేతులు పెద్ద ఆర్ట్ చేయడం చూస్తారు. ధర రూ. 22,000.