breaking news
Technology
-
ఏడాది పాటు ‘చాట్జీపీటీ గో’ ఉచితం
క్వెరీలు, ఇమేజ్ జనరేషన్ పరిమితులు కొంత తక్కువగా ఉండే ‘చాట్జీపీటీ గో’ను భారత్లోని యూజర్లకు ఏడాదిపాటు ఉచితంగా అందించనున్నట్లు ఓపెన్ఏఐ ప్రకటించింది. నవంబర్ 4 నుంచి పరిమితం కాలం పాటు నిర్వహించే ప్రమోషనల్ క్యాంపెయిన్లో నమోదు చేసుకోవడం ద్వారా ఈ ఆఫర్ను పొందవచ్చని పేర్కొంది.భారత్లో తొలిసారిగా బెంగళూరులో నవంబర్ 4న డెవ్డే ఎక్స్ఛేంజ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని, ఈ సందర్భంగానే ఉచిత ఆఫర్ను అందిస్తున్నామని కంపెనీ తెలిపింది. ప్రస్తుతమున్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఏడాది ఉచిత ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. కాస్త అందుబాటు స్థాయి చార్జీలతో అడ్వాన్స్డ్ ఫీచర్లను అందించాలన్న యూజర్ల డిమాండ్ మేరకు చాట్జీపీటీ గోని ఓపెన్ఏఐ ఈ ఏడాది ఆగస్టులో భారత్లో ఆవిష్కరించింది.ఇదీ చదవండి: ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాలు -
ఎంసీఎక్స్లో సాంకేతిక సమస్య
ముంబై: మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)ను సాంకేతిక సమస్యలు వెన్నాడుతున్నాయి. ఇదే కారణంతో తాజాగా మంగళవారం ట్రేడింగ్ 4 గంటలకు పైగా నిలిచిపోయింది. పసిడి, వెండి రేట్లు భారీగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం ట్రేడర్లలో తీవ్ర ఆందోళనకు దారి తీసింది. చివరికి డిజాస్టర్ రికవరీ సైట్ దన్నుతో మధ్యాహ్నం 1.25 గం.లకు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. దీనిపై విచారణ జరుపుతున్నట్లు ఎక్స్ఛేంజ్ వెల్లడించింది. వివరాల్లోకి వెళ్తే.. ఎంసీఎక్స్లో ఉదయం 9 గం.లకు ప్రారంభం కావాల్సిన ట్రేడింగ్, సాంకేతిక సమస్య కారణంగా ముందు 9.30 గం.లకు వాయిదా పడింది.ఆ తర్వాత 10 గం.లకు, అటుపైన 10.30 గం.లకు, 11.49, 12.35 గం.లకు వాయిదాల పర్వం కొనసాగింది. చివరికి మధ్యాహ్నం 1.20 –1.24 గం.ల మధ్య స్పెషల్ సెషన్ నిర్వహించి, 1.25 గం.లకు సాధారణ ట్రేడింగ్ ప్రారంభించారు. సాంకేతిక సమస్య వల్ల పసిడి, వెండి, క్రూడాయిల్తో పాటు కాపర్, జింక్, అల్యూమినియంలాంటి బేస్ మెటల్స్ ట్రేడింగ్పైనా తీవ్ర ప్రభావం పడింది.టెక్నికల్ సమస్యల వల్ల ఎంసీఎక్స్లో ఈ ఏడాది జూలైలో కూడా గంట ఆలస్యంగా ట్రేడింగ్ ప్రారంభమైంది. అంతకు ముందు గతేడాది ఫిబ్రవరిలో కొత్త ట్రేడింగ్ ప్లాట్ఫాంలో సమస్యలు తలెత్తడంతో కార్యకలాపాలను ఏకంగా నాలుగు గంటల పాటు నిలిపివేయాల్సి వచ్చింది. బీఎస్ఈలో మంగళవారం ఎంసీఎక్స్ షేరు 2% క్షీణించి రూ. 9,118 వద్ద క్లోజయ్యింది. -
తెలుగు రాష్ట్రాల్లో జియో టాప్
రిలయన్స్ జియో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తన ఆధిపత్యాన్ని మరింత బలపరచుకుంది. సెప్టెంబర్ 2025లో సంస్థ వైర్లెస్, వైర్లైన్ రెండు విభాగాల్లోనూ వృద్ధి సాధించినట్లు తెలిపింది. టెలికాం రెగ్యులేటర్ సంస్థ (TRAI) తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం, వైర్లైన్ విభాగంలో జియో 40,641 కొత్త యూజర్లను చేర్చుకొని తన సబ్స్క్రైబర్ సంఖ్యను 17.87 లక్షల నుంచి 18.28 లక్షలకు పెంచుకుంది. ఇది అన్ని ఆపరేటర్లలో అత్యధికం.ఈ వృద్ధి ముఖ్యంగా టైర్ 2, టైర్ 3 నగరాల్లో జియోఫైబర్ బ్రాడ్బ్యాండ్, ఎంటర్ప్రైజ్ కనెక్టివిటీ సొల్యూషన్లకు పెరుగుతున్న డిమాండ్ను ప్రతిబింబిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. భారతి ఎయిర్టెల్ సెప్టెంబర్లో 12,043 మంది కొత్త సబ్స్క్రైబర్లను చేర్చుకోగా, బీఎస్ఎన్ఎల్ తక్కువ స్థాయిలో మాత్రమే వృద్ధి నమోదు చేసింది. వొడాఫోన్ ఐడియా మాత్రం 1,310 మంది యూజర్లను కోల్పోయింది.వైర్లెస్ విభాగంలో జియో 1.17 లక్షల కొత్త మొబైల్ సబ్స్క్రైబర్లను చేర్చుకొని తన మొత్తం యూజర్ బేస్ను సెప్టెంబర్ 2025 నాటికి 3.18 కోట్లకు చేర్చుకుంది. ఎయిర్టెల్ 39,248 కొత్త యూజర్లను యాడ్ చేసుకుంది. బీఎస్ఎన్ఎల్ చవక ధర ప్లాన్లతో 80,840 యూజర్లను సాధించింది. అయితే వొడాఫోన్ ఐడియా దాదాపు 70,000 యూజర్లను కోల్పోయింది.ఇదీ చదవండి: ఆరేళ్లు పూర్తి చేసుకున్న తొలి ప్రైవేట్ రైలు -
కొత్త రూల్: 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధం!
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, టిక్టాక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు.. 16 ఏళ్లలోపు వినియోగదారులను తొలగించాలని ఆస్ట్రేలియా పార్లమెంట్ ఆమోదించింది. ఈ నిబంధనలను పాటించకపోయితే.. టెక్ కంపెనీలకు భారీ జరిమానా విధించనున్నట్లు స్పష్టం చేసింది. దీని కోసం 2025 డిసెంబర్ 10 వరకు గడువు ఇచ్చింది.ఆస్ట్రేలియా పార్లమెంట్ విధించిన.. అండర్-16 సోషల్ మీడియా నిషేధాన్ని పాటించడానికి తాము (మెటా, టిక్టాక్ & స్నాప్చాట్) సిద్ధమని ప్రకటించాయి.చట్టానికి మేము కట్టుబడి ఉన్నప్పటికీ.. దీనిని అమలు చేయడం కష్టమని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ దిగ్గజాలు వెల్లడించాయి. అయితే.. ఇలాంటి చట్టాన్ని విధించడం పట్ల ఆందోళన కూడా వ్యక్తం చేశాయి. డిసెంబర్ 10 నాటికి 16 ఏళ్లలోపు లక్షలాది మంది వినియోగదారులను గుర్తించడం.. వారిని తొలగించడం అనేది చాలా పెద్ద సవాలు. దీనిని పరిష్కరించడం అంత సులభం కాదని మెటా పాలసీ డైరెక్టర్ మియా గార్లిక్ అన్నారు.వయసుకు సంబంధించిన సోషల్ మీడియా నిషేధం అనేది తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని టిక్టాక్ ఆస్ట్రేలియా పాలసీ లీడ్ ఎల్లా వుడ్స్ జాయిస్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా పార్లమెంట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని.. అస్పష్టం, సమస్యాత్మకం, తొందరపాటు చర్యగా టెక్ కంపెనీలు విమర్శించాయి. 16 ఏళ్లలోపు వారిపై సోషల్ మీడియా నిషేధం విధించడం అనేది.. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన నిషేధాలలో ఒకటిగా పరిగణించబడుతుందని అన్నాయి.ఇదీ చదవండి: ఇంటర్నేషనల్ నంబర్లతో యూపీఐ చెల్లింపులు -
ఎలాన్ మస్క్ మరో సంచలనం
ప్రపంచ అపరకుబేరుడు ఎలాన్ మస్క్ మరో సంచలనానికి తెర తీశారు. వికీపీడియాకు పోటీగా.. గ్రోకిపీడియా(Grokipedia)ను తీసుకొచ్చారు. ఇది ఏఐ ఆధారితంగా పని చేస్తుందని.. వికీపీడియా కంటే పది రేట్లు ఎంతో బెటర్ అంటూ ప్రకటించారు. ఎలాన్ మస్క్కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ xAI గ్రోకిపీడియా(Grokipedia version 0.1) ప్లాట్ఫారమ్ను ఇవాళ(అక్టోబర్ 28న) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది Grokకు conversational AI మోడల్. వాస్తవాలను ఆధారంగా తీసుకుని.. శరవేగంగా, ఎలాంటి పక్షపాతం లేకుండా సమాచారం అందించడం దీని ఉద్దేశమని మస్క్ అంటున్నారు. అయితే.. ఇది ప్రారంభమైన కాసేపటికే భారీ ట్రాఫిక్ కారణంగా క్రాష్ అయ్యింది. దీంతో కాసేపటికి సేవల్ని పునరుద్ధరించారు. అంతేకాదు.. కొంత మంది ఇది వికీపీడియాతో పోలిస్తే కొత్తగా ఏం లేదని పెదవి విరుస్తున్నారు. పైగా ప్రాథమిక సమాచారాన్ని వికీపీడియా నుంచే తీసుకుంటోందని ఆరోపిస్తున్నారు. వికీపీడియాను జిమ్మీ వేల్స్ (Jimmy Wales), ల్యారీ సాంగర్ (Larry Sanger) కలిసి 2001 జనవరి 15న స్థాపించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సమాచార వేదికలలో ఒకటి. ఇది ఒక ఫ్రీ ప్లాట్ఫారమ్. ఇందులో ఎవరైనా సమాచారాన్ని పొందుపరచవచ్చు.. లాగిన్ అయ్యి ఎడిట్ కూడా చేయొచ్చు. ఇది వికీమీడియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తోంది. అయితే.. వికీపీడియాకు పోటీగా, నిజమైన సమాచారం కోసం కొత్త వేదికలు అవసరం అంటూ మస్క్ చాలాకాలంగా చెబుతూ వస్తున్నారు. వికీపీడియాలోని సమాచారం విషయంలో స్పష్టత కొరవడింది. పూర్తిగా పక్షపాత ధోరణి కనిపిస్తోంది. అదే ఏఐతో అయితే అందుకు ఆస్కారం ఉండదని చెబుతూ ఇప్పుడు మస్క్ Grokipedia తీసుకొచ్చారు. -
స్టార్ హార్టిస్ట్
international Animation day 2025 యానిమేషన్ కంపెనీలు అక్కడొకటి, ఇక్కడొకటి అన్నట్లుగా ఉండే కాలంలో యానిమేషన్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది ప్రమిత ముఖర్జీ. మన దేశంలో యానిమేషన్ రంగం విస్తరణను దగ్గరి నుంచి చూసిన ముఖర్జీ మూడు ఖండాల్లో ప్రసిద్ధ కంపెనీలలో పనిచేసింది. ప్రపంచవ్యాప్తంగా 90 మంది యువతులను యానిమేషన్ రంగంలో తీర్చిదిద్దింది.యానిమేషన్ ఆర్టిస్ట్ కావాలనుకునే ఎంతోమంది యువతులకు నిరంతర స్ఫూర్తినిస్తోంది. కోల్కతాలో పుట్టి పెరిగిన ప్రమిత ముఖర్జీకి చిన్నప్పటి నుంచి కార్టూన్లు, బొమ్మలు అంటే ఇష్టం. తనకు తోచినట్లు బొమ్మలు, కార్టూన్లు వేసేది. బొమ్మలపై ఇష్టమే ప్రమితను యానిమేషన్ ప్రపంచంలోకి తీసుకువచ్చింది. హైస్కూల్ చదువు పూర్తయిన తరువాత 3డీ యానిమేషన్ సర్టిఫికేషన్ కోర్సు చేసింది. ఆ రోజుల్లో...ఆ రోజుల్లో మన దేశంలో కొన్ని యానిమేషన్ స్టూడియోలు మాత్రమే ఉండేవి. అవి హాలీవుడ్ కోసం పనిచేస్తుండేవి. వాటిలో ముంబైలోని ‘క్రెస్ట్ యానిమేషన్’ ఒకటి. ఆ స్టూడియో నుంచే క్యారెక్టర్ రిగ్గింగ్ ఇంటర్న్గా కెరీర్ ప్రారంభించింది. ‘యానిమేషన్ ఫీల్డ్కు భవిష్యత్ ఉంటుందా? ఇది నీటిబుడగ కాదు కదా!’ ‘యానిమేషన్ ఫీల్డ్లో కెరీర్ వెదుక్కోవడం ఎంతవరకు క్షేమం?’ ‘యానిమేషన్ అనేది పురుషాధిపత్య రంగం. మహిళలకు సమాన అవకాశాలు ఉంటాయా?’...ఇలాంటి సందేహాలు ఎన్నో ఆరోజుల్లో ఉండేవి.సందేహాలను వదిలి సత్తా చాటుతూ...కోల్కత్తాలోని ‘డ్రీమ్వర్క్స్ యానిమేషన్’తో పాటు లండన్, లాస్ ఏంజెలెస్లోని ప్రసిద్ధ స్టూడియోలలో పని చేసింది ప్రమిత. ‘ఫీచర్, షార్ట్, ఎపిసోడిక్... ఏదైనా యానిమేటెడ్ ప్రాజెక్ట్లో పనిచేస్తున్నప్పుడు, సృజనాత్మక కోణంలో నేను చేసే మొదటి పని దర్శకుడి మనసును చదవడం. బొమ్మలకు ప్రాణం పోయడం. ప్రతి డైరెక్టర్కు తనదైన భిన్నమైన ఆలోచనా విధానం ఉంటుంది. ఒక ఆర్టిస్ట్గా వారి ఆలోచనను లోతుగా అర్థం చేసుకోవడంతో పాటు క్రియేటివ్ అవుట్పుట్ ఇవ్వడం ముఖ్యం’ అంటుంది ప్రమిత.బాధ నుంచి బయట పడేలా...అమెరికాలో ఒక యానిమేషన్ కంపెనీ లో ఉద్యోగంలో చేరిన రోజుల్లో కొత్త దేశంలో, కొత్త ఉద్యోగ జీవితానికి అలవాటుపడడం ప్రమితకు కష్టంగా ఉండేది. ఆ సమయంలో తండ్రి క్యాన్సర్తో చని పోవడంతో మానసికంగా బాగా కృంగి పోయింది. ఆ బాధ నుంచి బయట పడడానికి తనకు ఉమెన్ ఇన్ యానిమేషన్ (డబ్ల్యూఐఏ) ఎంతో ఉపయోగపడింది. లాస్ ఏంజెలెస్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ స్వచ్ఛంద సంస్థ యానిమేషన్ రంగంలో లింగ సమానత్వం, మహిళలకు సమాన అవకాశాలకు కృషి చేస్తోంది. ఇదీ చదవండి: Yoga: ప్రశాంతమైన నిద్ర కావాలంటే.. చక్కటి ఆసనాలు‘2020లో డబ్ల్యూఐఏ మెంటర్షిప్ ప్రోగ్రామ్లో చేరాను. మెరుగైన సాఫ్ట్స్కిల్స్, నాయకత్వ సామర్థ్యాలు, మెరుగైన మాటతీరు... మొదలైన వాటిలో ఈ ప్రోగ్రామ్ ఎంతో ఉపకరించింది. సమాజానికి నా వంతుగా తిరిగి ఇవ్వాలి అనే ఆలోచన ఇచ్చింది’ అంటుంది ప్రమిత.మూడు ఖండాలలో...రెండు దశాబ్దాల తన కెరీర్లో మూడు ఖండాలలో, ఎన్నో ప్రసిద్ధ కంపెనీలలో, ఎన్నో స్థాయులలో, ఎన్నో ప్రాజెక్ట్లలో పనిచేసింది ప్రమిత. గత పది సంవత్సరాల కాలంలో విఎఫ్ఎక్స్, యానిమేషన్ రంగంలో సాంకేతికంగా ఎంతో మార్పు వచ్చింది. ఆ మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకొని, కాలంతో పాటు నడుస్తూ, తమను తాము నిరూపించుకుంటున్నారు ప్రమితలాంటి యానిమేషన్ ఆర్టిస్ట్లు. మహిళల సంఖ్య పెరుగుతోంది...లింగ అసమానతను తగ్గించడానికి చేసిన అనేక ప్రయత్నాల వల్ల యానిమేషన్ రంగంలో మహిళా ఆర్టిస్ట్ల సంఖ్య గతంతో పోల్చితే బాగా పెరిగింది. 2007లో నా బ్యాచ్లో వందమంది ఉంటే అందులో ఇద్దరు మాత్రమే మహిళలు. యానిమేషన్ ఆర్టిస్ట్గా రాణించడానికి జెండర్, బ్యాక్గ్రౌండ్తో పనిలేదు. మనం చేసే పనిపై మాత్రమే దృష్టి పెట్టాలి. ప్రతికూలంగా మాట్లాడే వారికి దూరంగా ఉండాలి. యానిమేషన్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా 90 మంది యువతులకు మార్గదర్శిగా నిలవడం సంతోషంగా, గర్వంగా ఉంది.యానిమేషన్లో ఆమె బహుముఖ ప్రజ్ఞయానిమేషన్ రంగంలో మహిళా ఆర్టిస్ట్లు, సాంకేతిక నిపుణులకు ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఎందుకు పెరుగుతోంది... అనే విషయానికి వస్తే విశ్లేషకులు ఇలా అంటున్నారు – ‘‘యానిమేషన్కు సంబంధించి సృజనాత్మక ప్రక్రియలో మహిళలు తమ జీవితానుభవాలను జోడిస్తున్నారు. యానిమేషన్ పరిశ్రమలో మహిళల ప్రాతినిధ్యం పెరగడం వల్ల పనిలో వైవిధ్యం, సృజనాత్మకత పెరుగుతుంది. యానిమేషన్ రంగంలో మహిళలు యానిమేటర్ ఆర్టిస్ట్లుగా మాత్రమే కాదు డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్టూడియో ఎగ్జిక్యూటివ్గా కూడా తమను తాము నిరూపించుకుంటున్నారు. వారు సృష్టించే కథలు అన్ని వర్గాల వారికి చేరువ అవుతున్నాయి.’’– ప్రమిత ముఖర్జీ -
ఏఐ యుగంలో ఏం నేర్చుకుంటే సేఫ్?
‘మారుతున్న కాలంతోపాటు.. అన్ని రంగాల్లో కొత్త టెక్నాలజీలు ఆవిష్కృతం అవడం సహజం. దీన్ని అందిపుచ్చుకోవడానికి, సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలే తప్ప.. కొత్త సాంకేతికతలతో కెరీర్ మనుగడ ప్రశ్నార్థకం అనే ఆందోళన చెందడం సరికాదు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఎంట్రీ లెవల్ నుంచి సీనియర్ ఎక్జిక్యూటివ్స్ వరకు నిరంతర అధ్యయనం అలవర్చుకోవాలి.’ అంటున్నారు.. ప్రముఖ కార్పొరేట్ హ్యూమన్ రిసోర్స్ నిపుణులు, విప్రో టెక్నాలజీస్ మాజీ చీఫ్ లెర్నింగ్ ఆఫీసర్, మైక్రోసాఫ్ట్ ఇండియా హెచ్ఆర్ మాజీ జీఎం అభిజిత్ భాదురి.ఆయన తన శిక్షణతో ఎందరో మేనేజర్లను తీర్చిదిద్దడమే కాకుండా.. అంతర్జాతీయంగా బెస్ట్ రిక్రూటింగ్ కన్సల్టెంట్స్ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్ పెన్సెల్వేనియా అందిస్తున్న చీఫ్ లెర్నింగ్ ఆఫీసర్స్ ప్రోగ్రామ్ అడ్వయిజరీ బోర్డ్ మెంబర్గా విధులు నిర్వర్తించారు. అంతేకాకుండా ఆధునిక యుగంలో కొలువుల్లో సాంకేతికపై ‘డిజిటల్ సునామీ’ పేరుతో పుస్తకాన్ని కూడా రాశారు. బెస్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా, ఆథర్గా, బెస్ట్ రిక్రూటర్గా గుర్తింపు పొందిన అభిజిత్ భాదురితో ఈ వారం ఇంటర్వ్యూ.ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగార్థులు ఆందోళనలేకుండా ఎలా సంసిద్ధంగా ఉండాలి?ఆధునిక ప్రపంచంలో.. ఏఐ యుగంలో.. పోటీ వాతావరణంలో యువత అకడమిక్స్లోనైనా, కెరీర్ పరంగానైనా సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి. అప్పుడే సక్సెస్ సొంతమవుతుంది. సమస్య తీవ్రత చూసి ఆందోళన చెందకూడదు. ఎంతటి సమస్యకైనా పరిష్కారం ఉంటుందని గమనించాలి. దానికి మార్గాలు ఏంటి? అని ఆత్మ విశ్లేషణ చేసుకుంటే ఆందోళన వీడుతుంది. ముఖ్యంగా ఏఐతో ఉద్యోగాలు పోతాయనే భయాందోళనను వీడి.. ఆ టెక్నాలజీ ద్వారా లభించే కొత్త ఉద్యోగాలు, ప్రొఫైల్స్ను అందుకునే ప్రయత్నం చేయాలి.జాబ్మార్కెట్లో కుదురుకునేందుకు విద్యార్థులు అకడమిక్గా ఏయే అంశాలపై దృష్టిసారించాలి?ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ వంటి ప్రొఫెషనల్ ప్రోగ్రామ్స్లో అడుగు పెట్టిన తర్వాత విద్యార్థులు సెల్ఫ్ లెర్నింగ్ దృక్పథం అలవర్చుకోవాల్సిందే. స్కూల్ లెవల్లో ఉన్నట్లు స్పూన్ ఫీడింగ్ ఉంటుందని భావించొద్దు. నేటితరం విద్యార్థులకు ఏ రంగానికి సంబంధించైనా చిటికెలో విస్తృత సమాచారం లభిస్తోంది. దీన్ని అనుకూలంగా మార్చుకోవాలి. అయితే ఇదే సమయంలో కనిపించిన ప్రతి అంశాన్ని చదివితే సమయం వృథా. అందుకే సెల్ప్ లెర్నింగ్ ట్రిక్స్ ఫాలో అవ్వాలి. లెర్నింగ్ లేదా సెల్ఫ్ లెర్నింగ్ అంటే.. ఏదైనా ఒక అంశం గురించి క్లాస్ రూంలో బోధిస్తున్నప్పుడు సరైన ప్రశ్న అడగడం లేదా అందుబాటులో ఉన్న సమాచారంలో సరైన అంశాన్ని గుర్తించడమే. ఇప్పటికీ చాలా మంది విద్యార్థులు నిర్దిష్టంగా ఒక అంశాన్ని క్లాస్ రూంలో వినకపోవడం వల్ల సందేహాలు నివృత్తి చేసుకోలేకపోతున్నారు. ఇది అంతిమంగా వారి కెరీర్పై ప్రభావం చూపుతోంది.ఉద్యోగార్థులు అకడమిక్స్తోపాటు దృష్టి సారించాల్సిన అంశాలేవి?ప్రస్తుతం వ్యాపార రంగం విభిన్న నైపుణ్యాలున్న స్పెషలిస్ట్ల కోసం అన్వేషిస్తోంది. కాబట్టి విద్యార్థులు తమ ఆసక్తులను విస్తృతం చేసుకోవాలి. ఎంచుకున్న స్పెషలైజేషన్ లేదా ప్రోగ్రామ్కే పరిమితం కాకుండా విభిన్న డిసిప్లైన్స్ అభ్యసించాలి. ప్రతి ఏటా కొత్త నైపుణ్యాలు పొందేలా తమను తాము మలచుకోవాలి. అంతేకాకుండా కెరీర్లో ప్రతి దశలోనూ మంచి మెంటార్స్ ఉండేలా చూసుకోవాలి. ఫలితంగా సుదీర్ఘ కాలం సుస్థిరత లభిస్తుంది.విద్యార్థులు కొంచెం ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కుంగుబాటుకు గురవుతున్నారు? దీనికి మీరు సూచించే పరిష్కారం?యువత ఆసక్తిని పెంచుకోవడంతోపాటు.. శరవేగంగా మారుతున్న పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు పెంచుకోవాలి. ఇక ఉద్యోగం, కెరీర్ ఎంపికలో తమ బలాలు, బలహీనతలు గుర్తించి తమ సామర్థ్యాలకు సరితూగే సంస్థలు/ఉద్యోగం పొందేందుకు కృషి చేయాలి. ఒక అవకాశం చేజారినా నిరుత్సాహం చెందకూడదు. అది ఎందుకు చేజారిందనే ఆత్మవిశ్లేషణ చేసుకుని ఆ సమస్య పునరావృతం కాకుండా చూసుకుంటే అంతా సవ్యంగా సాగుతుంది.యువత మానసికంగా దృఢంగా ఉండటానికి ఏ లక్షణాలను అలవర్చుకోవాలి?విద్యార్థులు ఐక్యూ లెవల్స్ను పెంచుకోవడంతోపాటు.. ఎమోషనల్ కోషియంట్ – ఈక్యూ (భావోద్వేగ ప్రజ్ఞ) లెవల్స్ను పెంచుకునేలా కృషి చేయాలి. ముఖ్యంగా పోటీ ప్రపంచంలో.. కెరీర్ లక్ష్యాలు చేరుకునే క్రమంలో.. విధుల్లో ఉన్నత స్థానాలు అధిగమించే క్రమంలో మానసిక ఉద్విగ్నతలను సమతూకంలో ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. దీనికి ప్రధాన సాధనం ఈక్యూ. కెరీర్లో విజయాలు సాధించాలంటే ఎమోషనల్ కోషియంట్దే ప్రధాన పాత్ర అని పలు సందర్భాల్లో రుజువైందని తెలుసుకోవాలి.ప్రస్తుత జాబ్మార్కెట్కు అనుగుణంగా కరిక్యులం ఉందా?ప్రస్తుత పరిస్థితుల్లో ఇండస్ట్రీ కార్యకలాపాలు ఆరేడు నెలలకోసారి.. కొత్త పుంతల్లో వెళుతున్నాయి. దీనికి అనుగుణంగా క్లాస్ రూంలో బోధన కుదరట్లేదు. కాబట్టి ఇంజనీరింగ్, టెక్నాలజీ, మేనేజ్మెంట్ తదితర ప్రొఫెషనల్ ప్రోగ్రామ్స్లో కరిక్యులం మార్పులు చేయాలి. పూర్తి స్థాయిలో ఇది క్లిష్టమైతే ఇండస్ట్రీ వర్గాల భాగస్వామ్యంతో క్లాస్ రూమ్ టీచింగ్ ఏర్పాట్లు చేయాలి. విద్యార్థులకు ఇండస్ట్రీ వాస్తవ పరిస్థితులపై అవగాహనతోపాటు.. రియల్టైమ్ నైపుణ్యాలు పెంచుకునే అవకాశం ఏర్పడుతుంది.నియామక పద్ధతుల్లోని మార్పులపై మీ అభిప్రాయం ఏంటి?ప్రస్తుతం లేటెస్ట్ టెక్నాలజీలకు అనుగుణంగా.. వాటిలో పట్టు ఉన్న వారిని గుర్తించడం, హైరింగ్ చేసుకోవడం హెచ్ఆర్ నిపుణులకు కూడా కష్టంగానే మారుతోంది. ఇదే కారణంగా ఇంటర్వ్యూలలో టెక్నికల్ రౌండ్స్ క్రమేణా పెరుగుతున్నాయి. టెక్నికల్ టీమ్ మదింపు ఆధారంగా హెచ్ఆర్ టీమ్ ఆఫర్స్ ఖరారు చేస్తున్నాయి. అయితే ఈ విషయంలోనూ ఏఐ ప్రమేయాన్ని మనం చూడొచ్చు. ఇప్పటికే విదేశాల్లో ఏఐ ఆధారిత ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి మన దేశంలోనూ త్వరలోనే ఇది కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు, జాబ్ సీకర్స్ ఏఐ ఆధారిత ఇంటర్వ్యూల సరళిపై ఇప్పటి నుంచే అవగాహన ఏర్పరచుకోవాలి.ఏఐ కారణంగా ఫ్రెషర్స్కు అవకాశాలు తగ్గుతాయా?ఏఐ విప్లవం నేపథ్యంలో ప్రెషర్స్ నియామకాలు తక్కువగా ఉంటాయి.. క్యాంపస్ డ్రైవ్స్ ఉండవు అనే మాటను అంగీకరించను. ఎందుకంటే.. కంపెనీలకు ఫ్రెష్ మైండ్స్ దొరికేది క్యాంపస్లలోనే. ఫ్రెషర్స్ను రిక్రూట్ చేసుకుంటే తమ ప్రణాళికలు, తమ కార్యకలాపాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవచ్చనే భావన ఇప్పటికీ కార్పొరేట్ వర్గాల్లో సజీవంగా ఉంది. అందువల్ల విద్యార్థులు క్యాంపస్ డ్రైవ్స్లో రాణించేలా.. లేటెస్ట్ టెక్నాలజీస్, మార్పులపై అవగాహన ఏర్పరచుకుని.. క్యాంపస్ ఇంటర్వ్యూలకు సన్నద్ధం కావాలి. మరోవైపు విద్యార్థులు క్లాస్లో టాపర్స్తో పోల్చుకోకుండా తమకున్న టాలెంట్కు సరితూగే సంస్థలను ఎంపిక చేసుకోవాలి. అప్పుడు కెరీర్లో నిరాశకు గురికాకుండా.. తప్పనిసరిగా సక్సెస్ అవుతారు. -
‘రూ.96 లక్షల ఉద్యోగం.. చేరాలా వద్దా?’
ఎంతటి అనుభవం, అవగాహన ఉన్నవారికైనా వృత్తిపరమైన జీవితంలో అనేక సందేహాలు, సందిగ్ధాలు ఎదురవుతుంటాయి. అలాంటి వాటిని ప్రొఫెషనల్ కమ్యూనిటీ వేదిక రెడిట్లో పంచుకుంటూ సలహాలు కోరుతుంటారు. ఇలాగే హైదరాబాద్కు చెందిన టెకీ కూడా తనకు ఎదురైన సందిగ్ధాన్ని షేర్ చేశారు.ఈ హైదరబాద్ టెకీ ప్రస్తుతం సంవత్సరానికి రూ.85 లక్షల జీతంతో స్థిరమైన ఉద్యోగం చేస్తున్నారు. అయితే తనకు యూఎస్ ఆధారిత స్టార్టప్ నుంచి వచ్చిన కొత్త రిమోట్ కన్సల్టెన్సీ ఆఫర్ గురించి సబ్రెడిట్ (కమ్యూనిటీ గ్రూప్) ఇండియన్వర్క్ప్లేస్లో షేర్ చేసి ఏం చేయమంటూరు? అంటూ సలహా కోరడంతో ఆన్లైన్లో చర్చకు దారి తీసింది.ఆ కొత్త స్టార్టప్లో ఉద్యోగానికి సంవత్సరానికి 1,10,000 డాలర్లు (సుమారు రూ.96.6 లక్షలు) జీతం ఇస్తామంటున్నారు. అయితే ఇది శాశ్వత ఉద్యోగం కాదు.. ప్రాజెక్టు ఆధారిత కన్సల్టెన్సీ కాంట్రాక్ట్. ఈ ఆఫర్ను తాను పరిశీలిస్తున్నప్పటికీ, పన్ను బాధ్యతలు, ఉద్యోగ భద్రత, అలాగే దీర్ఘకాలిక కెరీర్ ప్రమాదాలు వంటి అంశాలపై అనిశ్చితంగా ఉన్నట్లు టెకీ తన పోస్ట్లో పేర్కొన్నారు.తాను ఆ ఆఫర్ను అంగీకరించాలనుకుంటే, పన్ను ప్రయోజనాలను గరిష్ఠం చేయడానికి చార్టర్డ్ అకౌంటెంట్ సలహా తీసుకోవడం, జీఎస్టీ కింద రిజిస్ట్రేషన్ చేయడం గురించి కూడా ఆలోచిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, భవిష్యత్తులో స్టార్టప్ వ్యాపారం విజయవంతంగా పెరిగితే యునైటెడ్ స్టేట్స్కు మకాం మార్చమని కోరే అవకాశం కూడా ఉందని వెల్లడించారు.ఈ పోస్ట్ కొద్ది సమయంలోనే వైరల్ అయింది. వందలాది వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ నుంచి విభిన్న అభిప్రాయాలు వచ్చాయి. కొంతమంది ఈ ఆఫర్ను ప్రమాదకరంగా పేర్కొంటూ, స్థిరమైన ఉద్యోగాన్ని కొద్దిపాటి జీతం పెరుగుదల కోసం విడిచిపెట్టడం సరైంది కాదని అన్నారు.మరికొందరు మాత్రం, వృద్ధి చెందుతున్న యూఎస్ స్టార్టప్లో చేరడం దీర్ఘకాలంలో పెద్ద అవకాశాలను అందించవచ్చని, ముఖ్యంగా యూఎస్ రీలొకేషన్ సాధ్యమైతే ఇది కెరీర్ బూస్టర్ అవుతుందని వ్యాఖ్యానించారు. కన్సల్టెన్సీ రోల్లో ఉండే ఉద్యోగ భద్రతా లోపం దృష్ట్యా ఈ వేతనం సరిపోదని, మరికొంత కోరాలని మరో యూజర్ సలహా ఇచ్చారు.ఇదీ చదవండి: ‘కొత్త’ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు.. కోట్లలో జీతాలు -
మ్యాజిక్ కవర్స్.. ఫోన్ను ఫుల్ చార్జ్ చేస్తుంది
ఫోన్ మన ఫ్రెండ్, మన స్టయిల్, కొన్నిసార్లు మన సీక్రెట్ కీపర్ కూడా! అలాంటి ఫోన్ను కాపాడే కవర్స్, ఫోన్ కేస్లను తక్కువ అంచనా వేయొద్దు! ఇవి కేవలం ప్రొటక్షన్ కోసం మాత్రమే కాదు. స్మార్ట్నెస్, సౌలభ్యం అన్నీ కలిపిన మ్యాజిక్ కవర్స్ కూడా!సోలార్ కేస్!ఫోన్ ‘లో బ్యాటరీ’ అని అరుస్తుందా? పైగా పవర్బ్యాంక్ కూడా మర్చిపోయారా? టెన్షన్ వద్దు! బయటకి వెళ్లి సూర్యుడి వైపు మీఫోన్ను చూపించండి. అప్పుడు ఈ కేస్ చెప్తుంది ‘ఓకే బ్రో, నేను ఉన్నా కదా!’ ఎందుకంటే ఇది సాధారణ ఫోన్ కవర్ కాదు. ‘అయాన్ సోలార్ కేస్’ మార్కెట్లో కొత్తగా వచ్చిన ఈఫోన్ కేస్ ఒక గంట సూర్యరశ్మిని ఉపయోగించి మీ ఫోన్ను ఫుల్ చార్జ్ చేస్తుంది. వైర్లు లేవు, ప్లగ్ లేదు. పైగా క్యూట్గా క్లాసీగా స్టయిలిష్ డిజైన్తో కూడా వస్తుంది. ఇది తొంభై ఐదు శాతం పవర్ను సమర్థంగా ట్రాన్స్ఫర్ చేయగలదు. అంటే ఎక్కడైనా, చార్జింగ్ ఎఫిషియెన్సీ పూర్తి అయితే, తర్వాతి రోజులకు ఇది, ఒక పవర్బ్యాంక్ లాగా బ్యాటరీని స్టోర్ కూడా చేస్తుంది. ధర 99 డాలర్లు అంటే రూ. 8,778.సెల్ఫీ స్టార్ఫోన్లో ఫొటో తీసుకుంటే వెలుతురు తక్కువగా ఉందా? వీడియో తీయాలంటే ముఖం స్పష్టంగా కనిపించడం లేదా? ఇక ఆ సమస్యలకు పూర్తి లైట్ సొల్యూషన్ వచ్చేసింది! అదే ఈ ‘సెల్ఫీ ఎల్ఈడీ రింగ్ లైట్ కేస్’. ఫోన్ కవర్లా కనిపించే ఈ కేస్లోనే లైట్ దాగి ఉంటుంది. బటన్ నొక్కగానే గుండ్రంగా వెలిగే రింగ్ లైట్ బయటకి వస్తుంది. ఒక్కసారి నొక్కితే లైట్ ఆన్, తర్వాతి ఆప్షన్లతో మీ ఇష్టానికి సరిపోయేలా వెలుతురు తక్కువగా లేదా ఎక్కువగా సర్దుకోవచ్చు. సెల్ఫీలు, వీడియోలు, మేకప్, రీల్లు ఏదైనా సరే, మిమ్మల్ని ఒక స్టార్లా మెరిపించే బాధ్యత ఇది తీసుకుంటుంది. అదనపు వైర్లు, బ్యాటరీల అవసరం లేకుండా, దీనిని యూఎస్బీ ద్వారా చార్జ్ చేసుకోవచ్చు. ధర బ్రాండ్, డిజైన్ బట్టి మారుతుంది.పాకెట్లో గేమ్ పార్ట్నర్పెద్ద గేమ్ కంట్రోలర్ను జేబులో పెట్టుకొని వెళ్లడం సాధ్యం కాదు. కాని, ఫోన్కు ఎప్పుడూ అంటిపెట్టుకొని ఉండే కేస్లో దాచేస్తే ఎలా ఉంటుంది ? అదే ఈ ‘ఎమ్కాన్ కంట్రోలర్’. ఇది బయటకి సాధారణ ఫోన్ కేసులా కనిపించినా, లోపల మాత్రం గేమింగ్ మాయ దాగి ఉంటుంది. దీని సైడ్లో ఉన్న రెండు బటన్లను ఒకేసారి నొక్కగానే అసలు సరదా మొదలవుతుంది! అప్పటిదాకా, ఫోన్ వెనుక దాగి ఉన్న గేమ్ కంట్రోలర్ ఒక్కసారిగా బయటకి వచ్చేస్తుంది. కనెక్ట్ చేయడం చాలా సులభం. స్క్రీన్ను గేమింగ్ కోణంలో సెట్ చేసి, గ్రిప్స్ను లాక్ చేస్తే, ఇక దీనికున్న స్మూత్ బటన్లతో ఆట నిశ్శబ్దంగా, స్మూత్గా సాగిపోతుంది. తక్కువ బరువుతో, స్టయిలిష్గా పాకెట్లో సులభంగా ఇమిడిపోయేలా దీని డిజైన్ ఉంటుంది. ధర 129 డాలర్లు, అంటే సుమారు రూ. 11,439. -
జియో కొత్త రీఛార్జ్ ప్లాన్స్: హై-స్పీడ్ డేటా, ఫ్రీ కాలింగ్స్
జియో తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త రీఛార్జ్ ప్లాన్స్ తీసుకొస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే.. హై-స్పీడ్ ఇంటర్నెట్ ఉపయోగించేవారు కొరకు.. మూడు అద్భుతమైన ఫ్యాక్స్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్లాన్స్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా డేటా మాత్రమే కాకుండా.. ఫ్రీ టీవీ ఛానెల్స్, ఓటీటీ యాప్లకు ఫ్రీ యాక్సెస్ పొందవచ్చు.రూ. 599 రీఛార్జ్ ప్లాన్: ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడంతో.. మీకు 30Mbps ఇంటర్నెట్ వేగం.. 1000GB హై-స్పీడ్ డేటా పొందవచ్చు. ఫ్రీ వాయిస్ కాలింగ్ సదుపాయం లభిస్తుంది. అంతే కాకుండా.. 800 కంటే ఎక్కువ టీవీ ఛానెల్లు, జియో హాట్స్టార్, సోనీ లివ్, జీ5 తో సహా 11 ఓటీటీ యాప్లకు యాక్సెస్ను పొందవచ్చు.రూ. 899 రీఛార్జ్ ప్లాన్: ఈ ప్లాన్ 100Mbps వరకు ఇంటర్నెట్ వేగాన్ని అందిస్తుంది. 1000GB హై-స్పీడ్ ఇంటర్నెట్ డేటా లభిస్తుంది. కాగా ఈ ప్లాన్ 800కి పైగా టీవీ ఛానెల్లు, జియో హాట్స్టార్, సోనీ లివ్ & జీ5 తో సహా 11 ఓటీటీ యాప్లకు యాక్సెస్ పొందవచ్చు.రూ. 1199 రీఛార్జ్ ప్లాన్: ఈ ప్లాన్ 100Mbps వరకు ఇంటర్నెట్ వేగాన్ని అందిస్తుంది. మీకు మొత్తం 1000GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ ఉచిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలతో వస్తుంది. 800కి పైగా టీవీ ఛానెల్స్, నెట్ఫ్లిక్స్ (బేసిక్), అమెజాన్ ప్రైమ్ లైట్, జియో హాట్స్టార్తో సహా 15 ఓటీటీ యాప్లకు ఉచిత యాక్సెస్ కూడా పొందవచ్చు.ఇదీ చదవండి: అరట్టైను తెలుగులో ఎలా పిలవాలంటే?: శ్రీధర్ వెంబు -
400 సెల్ఫోన్లు పేలితే ఇంత తీవ్రత ఉంటుందా?
కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైన ఘటనలో సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా కొత్త కోణాన్ని గుర్తించాయి. ప్రమాదానికి ఇతర అంశాలు కారణమైనా, బస్సు లగేజీ క్యాబిన్లో ఉన్న సుమారు 400 మొబైల్ ఫోన్లు పేలడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగినట్లు తెలిపాయి.ఘటన జరిగిందిలా..కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి ఇంకా విచారణ జరుగుతోంది. అయితే ప్రాథమిక వివరాల ప్రకారం.. బస్సు ఒక బైకును ఢీకొట్టగానే ఆ బస్సు కింద బైకు ఇరుక్కుపోయింది. దాన్ని కొంత దూరం ఈడ్చుకెళ్లడం వల్ల మంటలు చెలరేగాయి. ఈ మంటలు తొలుత లగేజీ క్యాబిన్కు అంటుకున్నాయి. ఆ క్యాబిన్లో 400కు పైగా మొబైల్ ఫోన్లతో కూడిన పార్సిల్ ఉంది. అధిక వేడి వల్ల ఈ ఫోన్లలో వాడే బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలాయి.బ్యాటరీలు పేలడం వల్ల భారీ శబ్దం వచ్చి మంటలు మరింత తీవ్రమయ్యాయి. ఈ మంటలు లగేజీ క్యాబిన్ పైభాగంలోని ప్రయాణికుల కంపార్ట్మెంట్కు వేగంగా వ్యాపించాయి. లగేజీ క్యాబిన్ పైభాగంలో, అంటే బస్సు మొదటి భాగంలో ఉండే సీట్లు, బెర్తుల్లో ఉన్నవారికి తప్పించుకునే సమయం లేకుండా పోయింది. దట్టమైన పొగ, మంటల్లో చిక్కుకున్న ప్రయాణికులు అత్యవసర ద్వారం తెరుచుకోకపోవడంతో బయటపడలేకపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ మాత్రం తన సీటు పక్కన ఉండే కిటికీ నుంచి తప్పించుకున్నాడు. ప్రాథమికంగా ఫొరెన్సిక్ అధికారులు చెప్పిన పైవివరాల ప్రకారం బస్సు ఢీకొనడం వల్ల మంటలు ప్రారంభమైనప్పటికీ మొబైల్ ఫోన్లలోని బ్యాటరీల పేలుడే ప్రమాద తీవ్రతను పెంచింది.లిథియం అయాన్ బ్యాటరీలుమొబైల్ ఫోన్లలో సాధారణంగా లిథియం అయాన్ బ్యాటరీలు ఎక్కువగా వాడుతున్నారు. ఈ బ్యాటరీలు అధిక శక్తి సాంద్రత కలిగి ఉండటం వల్ల చిన్న పరిమాణంలో ఎక్కువ శక్తిని నిల్వ చేయగలవు. అయితే ఇవి వేడెక్కినప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తాయి.ఈ బ్యాటరీలు పేలేందుకు కారణాలుఈ బ్యాటరీలకు వేడి తగిలితే పేలే అవకాశం ఉంటుంది. బస్సు ప్రమాదంలో జరిగింది ఇదే. బయట నుంచి అగ్ని ప్రమాదం కారణంగా వేడి ఎక్కువై పార్శిల్ క్యాబిన్లోకి వచ్చింది. దాంతో ఫోన్లలోని బ్యాటరీలు వేడై పేలిపోయాయి.బ్యాటరీ పూర్తిగా నిండిన తర్వాత కూడా ఛార్జింగ్ కొనసాగడం వల్ల బ్యాటరీ లోపల ఉష్ణోగ్రత పెరుగుతుంది.బ్యాటరీ లోపల అనోడ్, కాథోడ్ పొరలు దెబ్బతినడం లేదా పటిష్టమైన తయారీ విధానాలు అనుసరించకపోవడంతో అవి ఒకదానితో ఒకటి తాకితే పేలిపోతాయి.పూర్తిగా బ్యాటరీ అయిపోయేంత వరకు వేచి చూసి ఒక్కసారిగా ఛార్జింగ్ పెట్టినా పేలే అవకాశం ఉంటుంది.బస్సు ఢీకొన్న సందర్భంలో పార్శిళ్లు, అందులోని వస్తువులు గట్టిగా కొట్టుకోవడం వల్ల బ్యాటరీ నిర్మాణంలో మార్పులు వచ్చి అంతర్గత షార్ట్ సర్క్యూట్కు దారితీయవచ్చు.బ్యాటరీ పేలుడు వెనుక రసాయన చర్యలులిథియం అయాన్ బ్యాటరీ పేలడాన్ని ‘థర్మల్ రన్అవే’ అని కూడా పిలుస్తారు. అధిక వేడిమి లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగా బ్యాటరీ సెల్లో ఉష్ణోగ్రత నిర్ణీత పరిమితి దాటినప్పుడు థర్మల్ రన్అవేకు దారి తీస్తుంది. మొదట కాథోడ్, అనోడ్లను వేరు చేసే సెపరేటర్ (పాలిమర్) కరిగిపోతుంది. సెపరేటర్ కరగడం వల్ల కాథోడ్, అనోడ్ నేరుగా ఒకదాంతో ఒకటి తాకి ఇంటర్నల్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడుతుంది. దీనివల్ల మరింత ఎక్కువ వేడి ఉత్పత్తి అవుతుంది. అధిక ఉష్ణోగ్రత వద్ద అందులోని కెమికల్స్ విచ్ఛిన్నం కావడం మొదలవుతుంది. అదే సమయంలో ఎలక్ట్రోలైట్ (బ్యాటరీ లోపల ఉండే ద్రవం) వేడెక్కి ఆవిరై మండే స్వభావం గల హైడ్రోకార్బన్ వాయువులను విడుదల చేస్తుంది.ఈ చర్యలో విడుదలైన ఆక్సిజన్, ఇతర మండే వాయువులు అధిక వేడి వల్ల మరింత తీవ్రంగా పేలిపోతాయి. ఒక సెల్ పేలడం వల్ల విడుదలైన వేడి పక్కనే ఉన్న ఇతర మొబైళ్లకు వ్యాపించి అవి కూడా థర్మల్ రన్అవేకు గురవుతాయి. ఈ గొలుసుకట్టు చర్య కారణంగా బస్సు లగేజీ క్యాబిన్లో వందల కొద్దీ ఫోన్లు వరుసగా పేలి భారీ శబ్దంతో అగ్ని తీవ్రత పెరగడానికి కారణం కావచ్చు.లిథియం బ్యాటరీలతో జాగ్రత్త - నాగసాయి, ఏసీపీ, సిటీ సెక్యూరిటీ వింగ్, సైబరాబాద్కర్నూలు బస్సు అగ్ని ప్రమాద సంఘటన దురదృష్టకరం. క్లూస్ టీమ్ ప్రాథమికంగా విచారించిన అంశాలను బట్టి బస్సు బైక్ను ఢీకొట్టడంతో కింద ఇరుక్కుపోయి మంటలు చెలరేగాయి. అవికాస్తా పార్శిల్ క్యాబిన్కు వ్యాపించి అందులోని మొబైళ్లు ఒక్కసారిగా పేలాయి. ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోంది. సాధారణంగా ఫోన్లలో వాడే లిథియం అయాన్ బ్యాటరీలకు పేలే గుణం ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా అవి పేలే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఫోన్లు వాడటం జీవితంలో భాగమైంది. ఈ క్రమంలో యూజర్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఛార్జింగ్ చేసేటప్పుడు లేదా సాధారణంగా ఉపయోగించేటప్పుడు ఫోన్ను ఎండలోగానీ, కారు డాష్బోర్డ్ల్లో, స్టవ్ లేదా రేడియేటర్ వంటి అధిక వేడిని ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో పెట్టకూడదు. వేడి పెరిగితే బ్యాటరీ పేలే ప్రమాదం ఉంటుంది.ఎల్లప్పుడూ ఫోన్ తయారీదారు సిఫార్సు చేసిన ఒరిజినల్ ఛార్జర్, కేబుల్ను మాత్రమే ఉపయోగించాలి.నాసిరకం ఛార్జర్లు ఓవర్ఛార్జింగ్కు లేదా అధిక వేడికి దారితీయవచ్చు.ఫోన్ను రాత్రంతా లేదా ఎక్కువ సేపు ఛార్జింగ్లో ఉంచడం మానుకోండి. 80 నుంచి 90 శాతం వరకు ఛార్జ్ అయిన తర్వాత తీసివేయడం ఉత్తమం.ఛార్జింగ్ అవుతున్నప్పుడు ఫోన్ను వాడడం మానుకోవాలి. దీనివల్ల వేడి పెరిగే ప్రమాదం ఉంది.ఛార్జింగ్ చేసేటప్పుడు ఫోన్ను దుప్పటి, దిండు లేదా మంచం వంటి గాలి ఆడకుండా ఉండే మెత్తటి ఉపరితలాలపై కాకుండా గట్టి, చల్లటి ఉపరితలం (టేబుల్)పై ఉంచండి.బ్యాటరీ స్థాయి 20 శాతం కంటే తక్కువకు పడిపోకుండా చూసుకోవడం మంచిది.ఫోన్ను కింద పడేయడం, బలంగా కొట్టడం లేదా వంచడం వంటివి చేయకండి. దీనివల్ల బ్యాటరీ లోపల షార్ట్ సర్క్యూట్కు దారితీయవచ్చు.మీ ఫోన్ బ్యాటరీ ఉబ్బినట్లు అనిపిస్తే లేదా ఫోన్ వెనుక భాగం ఉబ్బినట్లయితే వెంటనే దాన్ని ఉపయోగించడం ఆపివేసి సర్వీస్ సెంటర్కు తీసుకెళ్లండి. ఉబ్బిన బ్యాటరీలు చాలా ప్రమాదకరం.ఒక్క మొబైళ్లలోనే కాదు, ఇంట్లో వాడే ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, ఈవీ వాహనాల్లోనూ లిథియం బ్యాటరీలు వాడుతున్నారు. వీటిని వాడే సమయంలో నిబంధనలకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. -
సాంకేతికత అను..బంధం
టీవీ వచ్చి ఆడవాళ్లు .. ఇంట్లోవాళ్లకు తిండి పెట్టకుండా చేసింది.. స్మార్ట్ ఫోన్ వచ్చి.. ఇంట్లోవాళ్లు ఒకరికొకరు మాట్లాడుకోకుండా చేసింది.. టెక్నాలజీ మీద సంప్రదాయం చేస్తున్న కామెంటూ.. విడుస్తున్న నిట్టూర్పూనూ!అయ్యో సాంకేతికతతో సౌకర్యాలే కాదు.. సాఫల్య అనుబంధాలూ ఉన్నాయని చెబుతున్నాయి కొన్ని అనుభవాలు!జనార్థన్, రాధ (పేర్లు మార్చాం)కి కొడుకు, కూతురు. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. అమ్మాయి ఆస్ట్రేలియాలో, అబ్బాయి అమెరికాలో ఉంటున్నారు. జనార్దన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రిటైర్డ్ ఉద్యోగి. రాధ గృహిణి. ఇద్దరూ డెబ్భైల్లో ఉన్నారు. బీపీతో జనార్ధన్, షుగర్, థైరాయిడ్తో రాధ సహజీవనం చేస్తున్నారు. ఓ మూడేళ్ల కిందటిదాకా ఇద్దరి జీవనశైలి వేరుగా ఉండేది. ఆరోగ్యం మీద పెద్దగా శ్రద్ధ పెట్టేవారు కాదు. చిన్నిపాటి వ్యాయామానిక్కూడా బద్ధకించేవారు రాధ. కూర్చున్న చోటికే ఆమెకు అన్నీ తెచ్చిపెట్టేది వాళ్ల పనమ్మాయి. నిద్రపోయినప్పుడు తప్ప మిగిలిన సమయమంతా యూట్యూబ్లోనే గడిపేవారు. జనార్దన్ వాకింగ్ క్లబ్ ఫ్రెండ్స్తో వాకింగ్కి వెళ్లినా.. పార్క్లోని చెట్లకింద కూర్చుని కబుర్లతోనే కాలక్షేపం చేసేవారు కానీ నడిచేవారు కాదు. ఆహారం మీద అదుపు ఉండేదికాదు. అమెరికాలో ఉన్న పిల్లలు పోరగా పోరగా మెడికల్ టెస్ట్లకి వెళ్లేవారు. ఆ రిపోర్ట్స్లో ఎప్పుడూ హెచ్చుతగ్గులు కనపడేవి. ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో వాళ్లు బాధపడుతూ, విదేశాల్లో ఉన్న తమ పిల్లలకు ఆందోళన కలిగించేవారు. తల్లిదండ్రుల కోసం కెరీర్ను వదులుకుని పిల్లలు వచ్చే పరిస్థితి లేదు. అలాగని వీళ్లే అక్కడికి వెళ్లినా, అక్కడ అడ్జస్ట్ అయ్యే ముచ్చట అసలే లేదు. అమ్మా నాన్నను హెల్త్లైన్లో పెట్టడమెలాగా? వాళ్లకు ఓ యాక్టివిటీ కల్పించడమెలాగా అని పిల్లలిద్దరూ తలలు పట్టుకున్నారు. అప్పుడు కోడలు రంగంలోకి దిగింది.ఇలా సీన్ మార్చేసింది.. ఆ అమ్మాయి వృత్తిరీత్యా బిజినెస్ ఎనలిస్ట్. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్, ఇండోర్ డెకరేషన్ ఆమె ఇష్టంగా చేసే పనులు. అందుకే తన అత్తమామల జీవనశైలిని ఓ గాడిలో పెట్టేవరకు ఉద్యోగానికి సెలవుపెట్టి.. హాబీల మీద దృష్టి పెట్టింది. అలా దొరికిన సమయం, వెసులుబాటును పూర్తిగా ఇండియాలో ఉన్న ఇన్లాస్ మీదే వెచ్చించింది. అందులో భాగంగా ముందు వాళ్ల దైనందిన జీవనసరళిని పరిశిలీంచింది. వాళ్ల బాధ్యతలను చూస్తున్న కన్సల్టెంట్స్తో మాట్లాడింది. ఆ రిపోర్ట్స్, వాళ్ల లైఫ్స్టయిల్ గురించి సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ న్యూట్రిషనిస్ట్తోనూ చర్చించింది. ఇవన్నీ కూడా అమెరికాలో ఉండే షెడ్యూల్ చేసుకుంది. ఈ స్టడీతో ఆమె వాళ్ల దైనందిన కార్యక్రమాల టైమ్టేబుల్ ఒకటి తయారు చేసి వాట్సాప్లో పంపింది. ప్రింట్ అవుట్స్ తీసుకొమ్మని చెప్పింది. డైట్కి సంబంధించిన పట్టీని ఫ్రిజ్కి అతికించమంది. వ్యాయామానికి సంబంధించి డ్రెసింగ్ టేబుల్కి అతికించమంది. సాయంకాలం వాళ్లు చేయాల్సిన పనుల పట్టికను టీవీ కేస్కి అతికించమంది. రోజూ ఉదయాన్నే (ఇండియన్ కాలమానం ప్రకారం) అయిదింటికల్లా ఆ ఇద్దరినీ ఫోన్ చేసి నిద్రలేపేది. వాకింగ్కి వెళ్లమని పోరేది. వాళ్లకు కావాల్సిన సరకులు, కూరగాయలు, డాక్టర్ అపాయింట్మెంట్స్ వగైరా సమస్తం తానే చూసుకోవడం మొదలుపెట్టింది. అక్కడి నుంచే యాప్స్ ద్వారా తనిచ్చిన జాబితా ప్రకారం అన్నీ ఆర్డర్ చేసేది. మూడు నెలలకు ఒకసారి వాళ్లకు టూర్స్నీ ΄్లాన్ చేయడం.. టికెట్స్, అకామడేషన్ బుక్ చేయడం అన్నీ చూసేది. ప్రతివారం ఏడు రోజులకు సరిపడా వాళ్లకు సుడోకు, వర్డ్ పజిల్ లాంటి ఎక్సర్సైజెస్ కూడా ఇచ్చేది. వీటన్నిటితో.. ఆరు నెలల గడిచేసరికి ఇద్దరిలో చాలామార్పు వచ్చింది. ఇద్దరూ చెరో రెండు కేజీల వెయిట్ తగ్గారు. షుగర్, బీపీ, థైరాయిడ్ అన్నీ కంట్రోల్లోకి వచ్చాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇద్దరికీ కొత్త సర్కిల్ ఏర్పడింది. దాంతో ఇద్దరిలో జీవనాసక్తి, జీవనోత్సాహం పెరిగాయి. ట్రావెల్ చేయడం వల్ల ఉల్లాసంగా కనపడసాగారు. ఈ మార్పుకి ఇరుగు పొరుగు, చుట్టాలే కాదు వాళ్ల కన్సల్టెంట్ డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఇంట్లో పళ్లు, కూరగాయలు, సరకులు వృథా అవట్లేదు. మురిగిపోయి చెత్త బుట్ట దాఖలు కావట్లేదు. ఎప్పటికప్పుడు తాజా వాటినే వినియోగిస్తున్నారు. కారణం.. తానిచ్చిన టైమ్టేబుల్ తప్పితే ఆ వారం మనవరాలితో గానీ.. తమతో గానీ ఫోన్ ఇన్ ఉండదని, తామెవరమూ మాట్లాడమని హెచ్చరించింది కోడలు. ఈ హెచ్చరిక వాళ్ల జీవనశైలిని దిద్దడమే కాదు.. తమ కుటుంబ అనుబంధాన్నీ బలపరచింది అంటారు జనార్ధన్.‘తొలుత.. చిన్నపిల్లల్లా మాతో మా కోడలు అవన్నీ చేయిస్తుంటే చిరాకు, కోపం వచ్చేవి. మా అబ్బాయికి, అమ్మాయికి కంప్లయింట్ కూడా చేశాను. మా అమ్మాయి మా కోడలితో ‘పోనీలే వదినా.. పెద్దవాళ్లయిపోయారు వాళ్ల మానాన వాళ్లను ఉండనివ్వండ’ని చెప్పింది. పెద్దవాళ్లయ్యారు కాబట్టే.. ఈ జాగ్రత్తలు. ఒక్క ఏడాది ఓపికపట్టండి.. నా మీద నమ్మకం ఉంచండి’ అని అందరికీ చెప్పింది మా కోడలు. ఏడాది కాదు.. ఆర్నెలు తిరిగేసరికే మా కోడలు కోరుకున్నదేంటో మాకు తెలిసింది. ఆ మార్పు మా ఆరోగ్యాన్నే కాదు మా కుటుంబ బంధాలనూ గట్టిపరిచింది’ అంటారు రాధ. తాను చేసిన ఈ ప్రయోగం తన అత్తమామల ఆరోగ్యాన్ని మెరుగుపరచేసరికి దాన్ని వాళ్ల అమ్మకూ అప్లయ్ చేసింది. అంతేకాదు రాధ వాళ్లమ్మాయి తన అత్తమామల విషయంలోనూ ఆ ఎక్స్పరిమెంట్ను అమలు చేసి అద్భుతమైన ఫలితాలను సాధించింది.విదేశాలలో ఉన్నా కూడా...విదేశాల్లో ఉన్న చాలామంది పిల్లలు ఇండియాలో ఉన్న తమ తల్లిదండ్రులు, ఇన్ లాస్ ఆరోగ్యం విషయంలో డాక్టర్ల అపాయింట్మెంట్స్ తీసుకోవడం, ట్రావెల్ ΄్లాన్ చేయడం, మందులు, నిత్యావసర సరుకులు ఆర్డర్ పెట్టడం పరిపాటే. కానీ ఇలా ఫిజీషియన్ ఇచ్చిన రిపోర్ట్స్ను సైకియాట్రి, సైకాలజీ నిపుణులు, ΄ûష్టికాహార నిపుణులతో చర్చించి.. భవిష్యత్లో రానున్న రిస్క్లను నియంత్రించడానికి చేయాల్సిన పనులతో పెద్దవాళ్లకు ఓ ఎక్సర్సైజ్లాంటిది ఇచ్చి.. అందులో వాళ్లను తలమునకలు చేయడం మాత్రం కొత్తే. అంతేకాదు ఆరోగ్యకరమైన ప్రయోగం కూడా. దీంతో పెద్దలు రోజుకు సరిపడా కావల్సినంత యాక్టివిటీలో ఉండి.. పిల్లలు దగ్గరలేరన్న బెంగకు గురికాకుండా మానసిక ఉల్లాసాన్ని పెం పొందించుకున్నారు. అలాగే గాడ్జెట్స్ వల్ల బంధాలు బలహీనమైపోయి ఒంటరితనంతో కునారిల్లిపోతారన్న అపోహకూ చెక్ పెట్టింది ఈ కుటుంబం. ఏదైనా ఉపయోగించుకునే తీరులో ఉంటుందని నిరూపించింది. ఆ గాడ్జెట్.. వాట్సాప్ నెట్వర్క్తోనే తన ఇన్లాస్, పేరెంట్స్కి దగ్గరై.. లాంగ్ డిస్టెన్స్లో కూడా రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పింది.గాడ్జెట్స్ వల్ల బంధాలు బలహీనమైపోయి ఒంటరితనంతో కునారిల్లిపోతారన్న అపోహకూ చెక్ పెట్టింది ఈ కుటుంబం. ఏదైనా ఉపయోగించుకునే తీరులో ఉంటుందని నిరూపించింది. -
పంక్చర్ షీల్డ్ ప్యాడ్.. టైరు చాలా సేఫ్!
ప్రస్తుతం ట్యూబ్ టైర్ల నుంచి ట్యూబ్లెస్ టైర్ల వరకు మార్కట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఫంక్చర్ నుంచి కాపాడే పంక్చర్ షీల్డ్ ప్యాడ్ అనేది తెరమీదకు వచ్చింది. ఇదెలా పనిచేస్తుంది?, దీనివల్ల ఉపయోగాలేమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.పంక్చర్ షీల్డ్ ప్యాడ్.. టైర్లలో ఉపయోగించడం వల్ల, పంక్చర్ను తక్షణమే మూసివేయడం మాత్రమే కాకుండా.. ఎయిర్ లీక్ వంటి వాటిని కూడా ఆపుతుంది. దీనిని టైర్లలో ఫిక్స్ చేయడం కూడా చాలా సులభం. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వీడియోలో గమనిస్తే.. టైరు మధ్యలో క్లీన్ చేసుకుని, పంక్చర్ షీల్డ్ ప్యాడ్ అమర్చడం కనిపిస్తుంది. ఆ తరువాత అల్లాయ్ వీల్కు ఫిక్స్ చేశారు. ఇలా చేసిన తరువాత ఒక స్క్రూను టైరులో దింపి టెస్ట్ చేస్తారు. కానీ టైరుకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఆ తరువాత కారుకు టైరును ఫిక్స్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఇది ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుందని, సురక్షితమైన డ్రైవ్ అందిస్తుందని తెలుస్తోంది.ట్యూబ్ టైర్స్ vs ట్యూబ్లెస్ టైర్స్ఇక ట్యూబ్ టైర్లు.. ట్యూబ్లెస్ టైర్ల విషయానికి వస్తే, ఈ రెండింటినీ వాహనాల్లోనే ఉపయోగించినప్పటికీ.. కొన్ని తేడాలు గమనించవచ్చు. ట్యూబ్ టైర్.. రబ్బర్ ట్యూబ్ కలిగి ఉంటుంది. ఈ ట్యూబ్లోనే గాలి నింపుతారు. అయితే ట్యూబ్లెస్ టైర్లలో ట్యూబ్ ఉండదు. పైగా దీనిని అల్లాయ్ వీల్కు ఫిక్స్ చేసి.. గాలిని నింపుతారు.ట్యూబ్ టైరు పంక్చర్ అయినప్పుడు.. టైరులోని గాలి మొత్తం బయటకు వచ్చేస్తుంది. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అయితే ట్యూబ్లెస్ టైర్లలో మాత్రమే ఇలా జరగదు. గాలి నెమ్మదిగా బయటకు వస్తుంది. వాహనాన్ని సేఫ్గా ఆపడానికి సమయం లభిస్తుంది. View this post on Instagram A post shared by Halston Enterprises Private Limited (@halston_india) -
పెళ్లి ఘనంగా.. రిజిస్ట్రేషన్ డిజిటల్గా..
ప్రస్తుతం మనమంతా డిజిటల్ యుగంలో జీవిస్తున్నాం. ఇప్పటికే దాదాపు చెల్లింపులన్నీ డిజిటల్గానే జరుగుతున్నాయి. డిజిటలైజేషన్ ఇప్పుడిప్పుడే ఒక్కొక్క పౌరసేవకు విస్తరిస్తోంది. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు సైతం డిజిటలైజేషన్ను అందిపుచ్చుకుంటున్నాయి. ఈ క్రమంలో వివాహ రిజిస్ట్రేషన్ డిజిటల్గా నిర్వహించడం ఇప్పుడు సరికొత్త అధ్యాయానికి తెర తీసింది.ఏమిటీ డిజిటల్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్?సాధారణంగా వివాహ రిజిస్ట్రేషన్ అంటే పెళ్లి జరిగిన తర్వాత వధూవరులతో పాటు ఇరువైపులా సాక్షుల సంతాలతో పలు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ శాఖకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందు కోసం రోజులకొద్దీ సమయం పడుతుంది. ఆఫీసుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది.ఈ తతంగాన్ని సరళీకరిస్తూ డాక్యుమెంట్ల అవసరం లేకుండా పెళ్లి వేదిక వద్ద నుంచే డిజిటల్ కేవైసీ వెరిఫికేషన్ ద్వారా చేసేదే డిజిటల్ వివాహ రిజిస్ట్రేషన్. పెళ్లి జరిగే స్థానిక మున్సిపాలిటీలు లేదా గ్రామ పంచాయతీలను సమన్వయం చేసుకుంటూ అధికారులు ఈ ప్రక్రియ నిర్వహిస్తారు. డిజిటల్ సంతకం కూడిన మ్యారేజ్ సర్టిఫికెట్ను కూడా జారీ చేస్తారు.కేరళలో శ్రీకారంవివాహ రిజిస్ట్రేషన్ డిజిటల్గా నిర్వహించి వార్తల్లో నిలిచింది కేరళ. కవస్సేరీ గ్రామ పంచాయతీలో లావణ్య, విష్టు అనే వధూవరులు వీడియో డిజిటల్ కేవైసీ ద్వారా తమ వివాహాన్ని రిజిష్టర్ చేసుకున్నారు. అదే రోజున డిజిటల్ ధ్రువీకరణతో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అందుకున్నారు.కేరళ ప్రభుత్వ అనేక పౌర సేవలను డిజిటల్ విధానంలో అందిస్తోంది. ఇందు కోసం ‘కె-స్మార్ట్ గవర్నెన్స్’ అనే ప్లాట్ఫామ్ను తీసుకొచ్చింది. ప్రజలకు ప్రభుత్వ సేవలను వేగంగా, పారదర్శకంగా అందించడమే ఈ చొరవ లక్ష్యం.జాతీయస్థాయిలోనూ ప్రయత్నాలుపౌర సేవలను డిజిటలైజేషన్ చేసేందుకు జాతీయస్థాయిలోనూ విస్తృత ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనేక రాష్ట్రాలు డిజిటల్ చొరవతో ముందుకు వెళ్తున్నాయి. ఈ దిశగా మహారాష్ట్రలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ రూ.62 కోట్ల నిధులు కేటాయించి భూములు, వివాహాల రికార్డులను డిజిటలైజ్ చేస్తోంది.Kerala sets an example !! In Kawassery, Kerala, Lavanya and Vishnu got married and registered their marriage instantly through Video KYC.The Panchayat member even handed over a digitally verified certificate with their photo on the same day.Respected Panchayati Raj Minister… pic.twitter.com/HGAnoU5cu0— Sreekanth B+ve (@sreekanth324) October 23, 2025 -
స్మార్ట్ఫోన్ మార్కెట్ 3 శాతం అప్
న్యూఢిల్లీ: ఈ ఏడాది మూడో త్రైమాసికంలో దేశీయంగా స్మార్ట్ఫోన్ మార్కెట్ 3 శాతం వృద్ధి చెందింది. 4.84 కోట్ల యూనిట్లు ఫ్యాక్టరీల నుంచి డిస్ట్రిబ్యూటర్లకు సరఫరా అయ్యాయి (షిప్పింగ్). మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఓమ్డీయా నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. జూలై, ఆగస్టులో కొత్త ఫోన్ల ఆవిష్కరణ, డిస్కౌంట్లు, పండగల సీజన్ ముందుగా రావడం వంటి అంశాలు ఇందుకు తోడ్పడ్డాయి. పండగ డిమాండ్ భారీగా ఉంటుందనే అంచనాలతో వెండార్లు కొత్త స్టాక్స్ను పెద్ద ఎత్తున నిల్వ చేసుకున్నారు. వినియోగదారుల డిమాండ్ మెరుగుపడటం కన్నా ప్రోత్సాహకాల ఆకర్షణ వల్లే మూడో త్రైమాసికంలో అమ్మకాల వృద్ధి నిలకడగా నిలబడినట్లు నివేదిక పేర్కొంది. రిపోర్ట్ ప్రకారం 97 లక్షల యూనిట్ల షిప్పింగ్, 20 శాతం మార్కెట్ వాటాతో వివో (ఐక్యూని మినహాయించి) అగ్రస్థానంలో నిలి్చంది. 68 లక్షల యూనిట్లు, 14 శాతం మార్కెట్ వాటాతో శాంసంగ్ రెండో స్థానం దక్కించుకుంది. సుమారు 65 లక్షల యూనిట్ల షిప్పింగ్తో షావోమీ, ఒప్పో (వన్ప్లస్ కాకుండా) వరుసగా తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇక 49 లక్షల ఫోన్ల షిప్పింగ్తో యాపిల్ తిరిగి టాప్ 5లో చోటు దక్కించుకుంది. భారత్లో క్యూ3లో కంపెనీ అత్యధికంగా షిప్మెంట్స్ నమోదు చేసుకుంది. 10 శాతం మార్కెట్ వాటా దక్కించుకుంది. -
3డీ సెన్సార్లతో రహదారి లోపాలు గుర్తింపు
రహదారి భద్రతను, మౌలిక సదుపాయాల నాణ్యతను గణనీయంగా పెంచే దిశగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కీలక అడుగు వేసింది. దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లో 20,000 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారులను కవర్ చేస్తూ అధునాతన 3డీ సెన్సార్లు, డేటా సేకరణ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నట్లు ఎన్హెచ్ఏఐ ప్రకటించింది.సాంకేతికతతో పర్యవేక్షణఈ ప్రాజెక్టులో భాగంగా రహదారుల ఉపరితల లోపాలను (గుంతలు, పగుళ్లు వంటివి) అత్యంత కచ్చితత్వంతో గుర్తించడానికి ప్రత్యేకంగా అమర్చిన వాహనాలను ఎన్హెచ్ఏఐ ఏర్పాటు చేయనుంది. ఈ వాహనాల్లో 3డీ లేజర్ ఆధారిత స్కానింగ్ వ్యవస్థలు సిద్ధం చేస్తుంది. ఇందులో గుర్తించిన లోపాలను ఇనెర్షియర్ మెజర్మెంట్ యూనిట్స్(IMU) ద్వారా జియోట్యాగ్ చేయడానికి జీపీఎస్ (GPS) ఉంటుంది. ఈ టెక్నాలజీల సాయంతో రియల్టైమ్ డేటా సేకరిస్తూ దాన్ని విశ్లేషించే వీలుంటుంది. దాని ద్వారా సమర్థవంతమైన నిర్వహణ సాధ్యమవుతుంది.డేటా లేక్ఇలా సేకరించిన మొత్తం డేటా ఎన్హెచ్ఏఐ ఏఐ ఆధారిత పోర్టల్ ‘డేటా లేక్’లో అప్లోడ్ అవుతుంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నిపుణుల బృందం ఆ డేటాను విశ్లేషించి కార్యాచరణ రూపొందిస్తుంది. ఈ డేటా ఆధారిత విధానం రహదారి ఇన్వెంటరీ మేనేజ్మెంట్, నిర్వహణ, మౌలిక సదుపాయాల ప్రణాళికలో కీలక పాత్ర పోషిస్తుంది. సేకరించిన డేటాను ప్రామాణిక ఫార్మాట్లలో భద్రపరచనున్నారు. ఇది దీర్ఘకాలిక సాంకేతిక, ప్రణాళిక ప్రయోజనాలకు తోడ్పడుతుంది.భారత ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రోడ్డు అభివృద్ధి పనులకు ముందే డేటా సేకరణ ప్రారంభమవుతుంది. ఆరు నెలలపాటు ఇది కొనసాగుతుంది. రెండు నుంచి ఎనిమిది లేన్ల రహదారులతో కూడిన అన్ని ప్రాజెక్టులకు ఇది వర్తిస్తుంది. ఈ ప్రాజెక్ట్ అమలు కోసం ఎన్హెచ్ఏఐ ఇప్పటికే బిడ్లను ఆహ్వానించింది.ఇదీ చదవండి: గూగుల్కు పోటీగా ఓపెన్ఏఐ కొత్త బ్రౌజర్ -
గూగుల్కు పోటీగా ఓపెన్ఏఐ కొత్త బ్రౌజర్
ఓపెన్ఏఐ తమ ఏఐ ఆధారిత వెబ్ బ్రౌజర్ చాట్జీపీటీ అట్లాస్(ChatGPT Atlas)ను ఇటీవల విడుదల చేసింది. ఇది గూగుల్ క్రోమ్ (Google Chrome), ఇతర బ్రౌజర్లకు పోటీగా నిలువనుందని కంపెనీ తెలిపింది. చాట్జీపీటీ అట్లాస్ ప్రస్తుతం మ్యాక్ ఓఎస్ (యాపిల్ ల్యాప్టాప్లు) వినియోగదారులకు అందుబాటులో ఉంది. త్వరలో విండోస్ (Windows), ఐఓఎస్ (iOS - ఐఫోన్), ఆండ్రాయిడ్ (Android) ప్లాట్ఫామ్ల్లో విడుదల చేయాలని ఓపెన్ ఏఐ యోచిస్తోంది.ఫీచర్లు, ప్రత్యేకతలుసాధారణ బ్రౌజర్లకు (Google Chrome, Firefox వంటివి) భిన్నంగా అట్లాస్ను ఇంటెరాక్షన్ ఏఐ ఆధారంగా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఇది వెబ్ను నావిగేట్ చేయడానికి, ఇంటరాక్ట్ అవ్వడానికి చాట్జీపీటీని ప్రధాన ఇంటర్ఫేస్గా ఉపయోగిస్తుంది.ఇంటిగ్రేటెడ్ చాట్ అసిస్టెంట్ఈ బ్రౌజర్లో వెబ్పేజీలోని కంటెంట్కు అనుగుణంగా ఎప్పుడైనా చాట్జీపీటీని యాక్సెస్ చేసే వీలు కల్పిస్తున్నారు. దీని ద్వారా వినియోగదారులు ఆ పేజీలోని సమాచారాన్ని సారాంశం రూపంలో తెలుసుకోవచ్చు. కొత్త బ్రౌజర్లో డేటాను సైతం విశ్లేషించవచ్చని సంస్థ పేర్కొంది.ఏజెంట్ మోడ్ఇది అత్యంత విభిన్నమైన ప్రీమియం ఫీచర్. దీని ద్వారా అట్లాస్ వినియోగదారు తరఫున కొన్ని పనులను పూర్తి చేయగలదు. ఉదాహరణకు ఆన్లైన్లో షాపింగ్ చేయడం, ఫారమ్లను నింపడం, ప్రయాణాల కోసం సెర్చ్ చేయడం లేదా వాటిని ప్లాన్ చేయడం వంటి సంక్లిష్టమైన పనులను ఏఐ ఏజెంట్ నిర్వహిస్తుంది. అయితే ఈ ఫీచర్ చాట్జీపీటీప్లస్, ప్రో సబ్స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.బ్రౌజర్ మెమరీఅట్లాస్ బ్రౌజింగ్ చరిత్ర, గత సంభాషణల వివరాలను గుర్తుంచుకుంటుంది. దీని వల్ల వినియోగదారునికి పనులు మరింత సులభతరం అవుతాయి. ఉదాహరణకు గతవారం చూసిన ఉద్యోగ ప్రకటనలను గుర్తుంచుకొని వాటిని సమ్మరైజ్ చేసి ముందుంచుతుంది. అయితే వినియోగదారు గోప్యతను దృష్టిలో ఉంచుకుని దీన్ని ఆన్/ ఆఫ్ చేసుకునే వెసులుబాటు ఉంది.ఏఐ-పవర్డ్ సెర్చ్ఇది గూగుల్ సెర్చ్ లేదా బింగ్కి బదులుగా చాట్జీపీసీ సెర్చ్ ద్వారా పనిచేస్తుంది. ఇది సంభాషణాత్మక, సమగ్రమైన, ఏఐ ఆధారిత ఫలితాలను అందిస్తుంది.ఇదీ చదవండి: వైట్హౌస్ను కూల్చేస్తున్న ట్రంప్ -
డీప్ఫేక్స్ కట్టడిపై కేంద్రం కసరత్తు
న్యూఢిల్లీ: జెనరేటివ్ ఏఐతో రూపొందించిన కృత్రిమ కంటెంట్ (డీప్ఫేక్స్, సింథటిక్ కంటెంట్) నుంచి యూజర్లకు రక్షణ కల్పించే దిశగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) నిబంధనలను సవరించడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ’ఐటీ రూల్స్ 2021’కి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ పలు సవరణలను ప్రతిపాదించింది. వీటి ప్రకారం అసలు, నకిలీ కంటెంట్కి మధ్య వ్యత్యాసాన్ని యూజర్లు సులువుగా గుర్తించేందుకు వీలుగా సింథటిక్ కంటెంట్కి లేబులింగ్, మార్కింగ్ చేయాల్సిన బాధ్యత బడా సోషల్ మీడియా ప్లాట్ఫాంలపై (ఎస్ఎస్ఎంఐ) ఉంటుంది. అప్లోడ్ చేసిన కంటెంట్.. ఏఐతో తయారు చేసినదా లేదా అనేది యూజర్ల నుంచి ఎస్ఎస్ఎంఐలు డిక్లరేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేగాకుండా, వారిచ్చిన డిక్లరేషన్ నిజమే నా కాదా అనేది కూడా తగు సాంకేతికతను ఉపయోగించి ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. విజువల్ అయితే కనీసం 10 శాతం స్థలాన్ని ఆక్రమించేలా, లేదా ఆడియో అయితే ప్రారంభంలోనూ, అది సింథటిక్ కంటెంట్ అని యూజర్లకు స్పష్టంగా తెలిసేలా లేబులింగ్ చేయాల్సి ఉంటుంది. సదరు కంటెంట్ను క్రియేట్ చేయడానికి లేదా మార్చడానికి తోడ్పడే సంస్థలకు కూడా ఇది వర్తిస్తుంది. ఇక, ’చట్టవిరుద్ధమైన సమాచారాన్ని’ తొలగించాలంటూ సోషల్ మీడియా ప్లాట్ఫాంలకు ఆదేశాలు జారీ చేసే అధికారం జాయింట్ సెక్రటరీ అంతకు మించిన స్థాయి గల ప్రభుత్వ సీనియర్ అధికారులు, డీఐజీ అంతకు మించిన స్థాయి గలవారికి మాత్రమే ఉంటుందని కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. -
జియో రీచార్జ్ ప్లాన్: డైలీ 3జీబీ డేటా.. ఫ్రీగా నెట్ఫ్లిక్స్
టెలికాం కంపెనీలు తమ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం అనేక రీచార్జ్ ప్లాన్లను ప్రారంభిస్తున్నాయి. అపరిమిత కాలింగ్, ఉచిత ఎస్ఎంఎస్లు, డేటా వంటి ప్రయోజనాలను అందిస్తున్నాయి. అదేవిధంగా రిలయన్స్ జియో కూడా తన వినియోగదారులకు అనేక ప్రయోజనాలతో ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తుంది. ఈసారి జియో తన వినియోగదారుల కోసం ఒక ప్రత్యేకమైన ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఇది రోజుకు 3 జీబీ డేటాను మాత్రమే కాకుండా ఉచిత నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ కూడా అందిస్తుంది.ప్లాన్ ధర, ప్రయోజనాలుఈ జియో ప్లాన్ ధర రూ .1799. 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 3 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, 100 ఎస్ఎంఎస్ ప్రయోజనాలను అందిస్తోంది. 5జీ నెట్వర్క్ పరిధిలో ఉంటే అపరిమిత 5జీ డేటాను కూడా అందిస్తుంది. అలాగే 90 రోజుల ఉచిత జియో హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ ఆనందించవచ్చు. అదనంగా, ఈ ప్లాన్ వినియోగదారులకు ప్రాథమిక నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది. అంతేకాకుండా ఈ ప్లాన్ లో జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ కు సబ్ స్క్రిప్షన్లు కూడా ఉన్నాయి.జియో రూ.1199 ప్లాన్రూ .1799 ప్లాన్ చాలా ఖరీదైనదిగా అనిపిస్తే, దీని కంటే కాస్త చౌకైన ప్లాన్ జియోలో ఉంది. రూ.1799 ప్లాన్ తో పాటు జియో తన వినియోగదారుల కోసం కొంచెం చౌకైన రూ.1199 ప్లాన్ ను కూడా ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ కూడా 84 రోజుల వ్యాలిడిటీతోనే వస్తుంది. రోజుకు 3 జీబీ డేటా, అపరిమిత 5జీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ ప్రయోజనాలు యథాతథం. అయితే ఈ ప్యాక్ లో ఉచిత నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ఉండదు. కానీ జియో హాట్ స్టార్ కు మాత్రం 3 నెలల ఉచిత యాక్సెస్ పొందుతారు. -
సరికొత్త ఏఐ తయారీకి బ్లూప్రింట్ సిద్ధం
విభిన్నమైన మూలాధారాల నుంచి సమాచారాన్ని విశ్లేషించి వాస్తవిక ప్రపంచ సమస్యలను మరింత సమర్థవంతంగా పరిష్కరించగల కృత్రిమ మేథ ఆవిష్కరణకు బాటలువేసే ‘బ్లూప్రింట్’సిద్ధమైంది. బ్రిటన్లోని షెఫీల్డ్ విశ్వవిద్యాలయం, అలాన్ ట్యూరింగ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ బ్లూప్రింట్ను రూపొందించారు. ఈ పరిశోధన తాలూకు వివరాలు ప్రఖ్యాత ‘నేచర్ మెషీన్ ఇంటెలిజెన్స్’జర్నల్లో ప్రచురితమయ్యాయి.కంటికి కనిపించని, తనకు అర్థంకాని భాష నుంచి సైతం సమాచారాన్ని ఎలాగోలా రాబట్టి దాని సారాన్ని ఒడిసిపట్టే సామర్థ్యంతో కొత్త ఏఐను సృష్టించేందుకు ఈ బ్లూప్రింట్ అక్కరకొస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతమున్న ఏఐలు చిత్రాలు, వీడియోలు, వాక్యాలు, శబ్దాలు, సెన్సార్లలో ఏకకాలంలో ఏదో ఒకటి, రెండు అంశాల నుంచి మాత్రమే డేటాను సంగ్రహించగలవు. కానీ అన్నిరకాల డేటాను విశ్లేషించేలా మల్టీమోడల్ ఏఐ వ్యవస్థను రూపొందించనున్నారు.దృశ్య, శ్రవణ, పర్యావరణ, పరిసర, సెన్సార్ డేటాలను ఏకకాలంలో విశ్లేషించగలిగితే స్వయంచోదిత కార్ల వంటి వాటిని మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చు. దీంతోపాటే వైద్య, చికిత్స, జన్యు డేటాలను ఏకకాలంలో విశ్లేషించగలిగితే వ్యాధి నిర్ధారణ పరీక్షలతోపాటు ఏఏ ఔషధాల సమ్మేళనం ఎంత మోతాదులో ఖచ్చితత్వంతో పనిచేస్తుందో సులువుగా కనిపెట్టవచ్చు.‘‘భవిష్యత్ విపత్తులు, సుస్థిర ఇంధనం, వాతావరణ మార్పుల వంటి అంశాలకు పరిష్కారాలు వెతకాలంటే విస్తృతస్తాయి డేటాను లోతుగా విశ్లేషించగలగాలి’’అనిఈ పరిశోధనకు సారథ్యం వహించిన ప్రొఫెసర్ హైపింగ్ లూ అన్నారు. షెఫీల్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్, మెషీర్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఈయన ప్రొఫెసర్గా కొనసాగుతున్నారు. -
యాపిల్కి పోటీ.. శాంసంగ్ గెలాక్సీ ఎక్స్ఆర్ హెడ్సెట్ విడుదల
శామ్ సంగ్ తాజాగా “వరల్డ్ వైడ్ ఓపెన్” ఈవెంట్లో తన కొత్త ఎక్స్ఆర్ (XR-ఎక్స్టెండెడ్ రియాలిటీ) వ్యూహాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా, గెలాక్సీ ఎక్స్ఆర్ హెడ్సెట్తో పాటు, వైర్డ్, వైర్లెస్ ఎక్స్ఆర్ గ్లాసెస్, ఏఐ గ్లాసెస్ అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించింది. గూగుల్తో భాగస్వామ్యంలో రూపొందిస్తున్న ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్ ప్లాట్ఫామ్ను ఈ పరికరాలు ఉపయోగించనున్నాయి.డిస్ప్లే ఉన్న హెడ్సెట్ల నుండి డిస్ప్లే రహిత ఏఐ గ్లాసెస్ వరకు ఎక్స్ఆర్ పరికరాల పూర్తి సిరీస్ను ఈ ఈవెంట్లో శాంసంగ్ వివరించింది. శాంసంగ్, జెంటిల్ మాన్స్టర్, వార్బీ పార్కర్ వంటి బ్రాండ్లతో కలిసి గ్లాసెస్ డిజైన్లో పనిచేస్తోంది.ఏఐ గ్లాసెస్ ప్రత్యేకంగా ఓక్లే మెటా గ్లాసెస్కు ప్రత్యర్థిగా ఉండనున్నాయి. వీటిలో డిస్ప్లే ఉండదు కానీ, గూగుల్ జెమినీ ఏఐ (Google Gemini AI) సాయంతో మెసేజింగ్, నావిగేషన్, అనువాదం వంటి స్మార్ట్ ఫీచర్లను అందిస్తాయి. గూగుల్ ఇప్పటికే ఈ తరహా గ్లాసెస్ను డెమోలో ప్రదర్శించింది.శాంసంగ్ ఎక్స్ గ్లాసెస్ (కోడ్నేమ్: HEN) క్వాల్కమ్ XR2+ Gen 2 చిప్సెట్ను ఉపయోగించి ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్ ప్లాట్ఫారమ్పై నడుస్తాయి. ఇందులో ఇంటిగ్రేటెడ్ లెన్స్ డిస్ప్లే, ఆడియో స్పీకర్లు, కెమెరాలు, చేతి సంజ్ఞల ఆధారంగా నియంత్రణలు ఉంటాయని అంచనా.గెలాక్సీ ఎక్స్ఆర్ హెడ్సెట్ స్పెసిఫికేషన్లుడిస్ప్లే: మైక్రో-OLED, 3,552×3,840 రిజల్యూషన్, 60–90Hzచిప్సెట్: క్వాల్కమ్ XR2+ Gen 2ర్యామ్: 16GB స్టోరేజ్: 256GBఓఎస్: ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్కెమెరా: 6.5MPసెన్సార్లు: నాలుగు ఐ-ట్రాకింగ్, రెండు పాస్-త్రూ, ఐదు ఐఎంయూ, డెప్త్, ఫ్లిక్కర్ ఒక్కోటి ఉంటాయి.బ్యాటరీ: 2 గంటలు సాధారణ వినియోగం, 2.5 గంటలు వీడియో ప్లేబ్యాక్కనెక్టివిటీ: వైఫై7, బ్లూటూత్ 5.4బరువు: హెడ్సెట్ - 545 గ్రాములు, బ్యాటరీ - 302 గ్రాములుశామ్ సంగ్ గెలాక్సీ ఎక్స్ఆర్ హెడ్సెట్ యాపిల్ విజన్ ప్రోకి (Apple Vision Pro), రాబోయే ఎక్స్ఆర్ గ్లాసెస్ మెటా రేబాన్ గ్లాసెస్కి పోటీగా నిలవనున్నాయి. ఏఐ గ్లాసెస్ 2025లో విస్తృత వినియోగానికి సిద్ధమయ్యే అవకాశం ఉంది. -
అబద్ధాల్ని బట్టబయలు చేస్తున్న మేధ, వారి పాలిట వరం
కవులు, కళాకారులు, మేధావులు, జర్నలిస్టులు వరుసగా హత్యలకు గురైనందుకు నిరసనగా ఈ దేశంలో పదేళ్ళ క్రితం ‘అవార్డు వాపసీ’ అనే ఒక కార్యక్రమం జరిగింది. అప్పుడు కూడా ఇదే ప్రభుత్వం అధికారంలో ఉంది. సత్యం కోసం సంఘర్షిస్తున్న ఇలాంటి వారి వెనక ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కూడా నిలబడింది. గ్రోక్ ( GROK) రంగప్రవేశం చేసింది.గ్రోక్ అనే ఇంగ్లిష్ పదానికి అర్థం – ఎవరైనా, ఏదైనా అంశాన్ని లోతుగా అవగతం చేసుకోవడం – అని! ఈ పదాన్ని మొదట రాబర్ట్ ఎ హెన్లీన్ అనే రచయిత, ‘అపరిచితుడు ఒక అపరిచిత దేశంలో’ (Stranger in a strange land) అనే తన ఎక్స్ ఏఐ ((X AI) ) టూల్కు ‘గ్రోక్’ అని పేరు పెట్టుకున్నాడు. మన దేశంలో అబద్ధాలు ప్రచారం చేస్తూ, మత విద్వేషాలు రెచ్చగొడుతూ అధికారంలో కొనసాగుతున్న రాజకీయ పక్షాల బండారాన్ని ఇప్పుడు ఆ గ్రోక్ బయట పెడుతోంది. గత పదకొండేళ్ళలో ఎంతోమంది మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు, రైతులు, మహిళలు, బాధ్యత గల పౌరులందరూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం అణచివేస్తూనే ఉంది. ఇప్పుడు వీరందరి పక్షాన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్ రంగంలోకి దిగింది. అధికార పక్షపు అగ్ర నాయకుల అబద్ధాల్ని గ్రోక్ బయటికి తీస్తోంది. ఇప్పుడు గ్రోక్ వారికి ఒక ఛాలెంజ్గా మారింది.ప్రతి విషయాన్నీ వక్రీకరించి, అబద్ధపు కథనాలతో దేశ ప్రజల్ని ముఖ్యంగా యువతను తప్పుదారిన నడిపించే కార్యక్రమానికి అడ్డుకట్ట పడింది. గాంధీ, నెహ్రూ కుటుంబాలపై అల్లిన తప్పుడు కథనాలన్నీ పటాపంచలయ్యాయి. కల్పిత కథలు, కుహనా దేశభక్తి జనం తెలుసుకోగలుగుతున్నారు. ఇన్నేళ్లుగా కొందరు కవులూ, రచయితలూ, వక్తలు, చరిత్రకారులు, స్వతంత్ర జర్నలిస్ట్లు మర్యాదగా, మెత్తగా చెబుతూ ఉంటే జనాల మెదడుకు ఎక్కడం లేదు. ఇప్పుడీ గ్రోక్ ఏం చేస్తుందీ అంటే... దెబ్బకు దెబ్బ అన్నట్లు– సమాచారమందిస్తోంది. నిజాల్ని కుప్పబోస్తోంది. మనిషి కేంద్రంగా సాధిస్తున్న విజయాల ముందు– వైజ్ఞానిక ప్రగతి ముందు– మతం కేంద్రంగా నడిచే దురహంకారుల పాలన ఎంత కాలం సాగగలదూ? తమలోని కుట్రల్ని, కుతంత్రాల్ని రాల్చేసుకుని – మనుషుల్ని ప్రేమించే, గౌరవించే ‘మనుషులు’ గా మారక తప్పదు! ఒకవేళ ఈ గ్రోక్ను బ్యాన్ చేసి నోరు మూయించి అధికారంలో ఉన్నవారు మరిన్ని అరాచకాలకు దిగితే ఎలా? అని బెంబేలు పడాల్సిన పనే లేదు. అప్పుడు సత్యాన్ని సత్యంగా నిక్కచ్చిగా చెప్పే గ్రోక్ లాంటి వెర్షన్లు రూపం మార్చుకుని, మరో పది వస్తాయి. గ్రోక్ ద్వారా నిజాలేమిటో తెలుసుకుంటున్న జనం అబద్ధాలు చెబుతున్న వారి మీదికి తిరగబడొచ్చు. ప్రజా ఉద్యమాలే వచ్చి ప్రభుత్వాల్ని మార్చుకోవచ్చు. ప్రపంచ దేశాల్లో ఎన్నోచోట్ల చూస్తూనే ఉన్నాం కదా? ఏఐ భవిష్యత్తులో ఎలా రూపుదిద్దుకుంటుందో అవివేకులు ఊహించలేరు. వివేకవంతుడి ఊహను, ప్రణాళికను అందుకోనూ లేరు – రాబోయే యుగం, వైజ్ఞానిక దృక్పథం గల పౌరులదీ, వైజ్ఞానికులదీ కాక తప్పదు.– డాక్టర్ దేవరాజు మహారాజు, ప్రముఖ జీవశాస్త్రవేత్త -
వాట్సాప్లో రాబోతున్న కొత్త ఫీచర్.. మెసేజ్లకు లిమిట్!
అవాంఛనీయ సందేశాలను తగ్గించడానికి మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్ కొత్త ఫీచర్ను తీసుకొస్తోంది. పరిచయం లేని వ్యక్తులకు పంపే మెసేజ్లపై పరిమితి విధింపును పరీక్షిస్తోంది. ఇందులో భాగంగా కొత్తవారికి ఒకసారి మెసేజ్ పంపితే దానికి అటు నుంచి రిప్లై రాకపోతే అలాంటి ప్రతి అవుట్ గోయింగ్ సందేశాన్నీ లెక్కిస్తారు. ఇవి నెలలో ఒక పరిమితి చేరుకున్నాక ఇక ఆ నెలలో కొత్తవారికి మెసేజ్ పంపేందుకు వీలుండదు.అయితే ఈ పరిమితి ఎంత ఉంటుంది అన్నంది వాట్సాప్ ఇంకా వెల్లడించలేదు. మార్కెట్లలో వేర్వేరు పరిమితులను వాట్సాప్ పరీక్షిస్తోంది. ఒక నెలలో రిప్లై రాని కొత్త మెసేజ్లు పరిమితికి చేరువకాగానే యూజర్లను అప్రమత్తం చేసేందుకు బ్యానర్ లేదా పాప్-అప్ రూపంలో హెచ్చరిక కనిపిస్తుంది.పెద్ద వాల్యూమ్ బ్రాడ్ కాస్టర్లు, బిజినెస్ ఖాతాల నుంచే మెసేజ్లు సాధారణ యూజర్ల ఇన్ బాక్స్ లను మంచెత్తకుండా నిరోధించడం దీని ఉద్దేశం. తెలిసినవారికి అంటే కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నవారికి మెసేజ్లు పంపే సాధారణ వినియోగదారులపై దీని ప్రభావం ఉండదని వాట్సాప్ వర్గాలు తెలిపినట్లు ‘టెక్ క్రంచ్’ పేర్కొంది. -
ఆవిష్కరణ.. ఆహార వ్యర్థాలతో కోట్ల రూపాయలు
ఆహార పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతంలో ఆహార ఉత్పతుల నుంచి వచ్చే వ్యర్థాలు దేనికీ పనికిరాకుండా ఉండేవి. టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఉపఉత్పత్తులను(Byproducts) విలువైన, లాభదాయకమైనవిగా కొన్ని కంపెనీలు మారుస్తున్నాయి. ఈ విభాగంలో కంపెనీలు వినూత్నంగా ఆలోచించి కొత్త ఆవిష్కరణలు చేస్తున్నాయి. ఇవి ఆహార నష్టాన్ని తగ్గించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు, లాభదాయకమైన వ్యాపార అవకాశాలకు మార్గం చూపుతున్నాయి.పండ్ల వ్యర్థాల నుంచి..సింగపూర్లోని డోల్ స్పెషాలిటీ ఇంగ్రీడియెంట్స్ వంటి కంపెనీలు అరటి, పైనాపిల్ తొక్కల వ్యర్థాలను వినూత్నంగా ఉపయోగిస్తున్నాయి. ఈ తొక్కల నుంచి ఎంజైమ్లు, నూనెలు, ఫైబర్స్ వంటి విలువైన ఉత్పత్తులను సేకరిస్తున్నారు. ఉదాహరణకు, అరటి ఫైబర్ పౌడర్ను బిస్కెట్లు, తృణధాన్యాల్లో వాడుతున్నారు. కొన్ని రకాల ఫైబర్లను వస్త్ర పరిశ్రమలో తిరిగి వినియోగిస్తున్నారు.సీఫుడ్ వ్యర్థాల వినియోగంచేపల పొలుసులు, తలలు, ఇతర ఉపఉత్పత్తులను ప్రాసెస్ చేయడం ద్వారా ఒమేగా-3-రిచ్ ఫిష్ ఆయిల్ వంటి అధిక విలువ కలిగిన ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఇది ఆహార పదార్థాలు, క్రియాత్మక ఆహారాల విభాగంలో డిమాండ్ను అందుకోవడంతో పాటు వ్యర్థాలను తగ్గించి లాభదాయకమైన ఆదాయ వనరులను సృష్టిస్తుంది.బ్రేవరీ వ్యర్థాలతో ఇలా..బెంగళూరుకు చెందిన సేవింగ్ గ్రెయిన్స్ వంటి సంస్థలు బ్రేవరీల నుంచి మిగిలిపోయిన ధాన్యాలను (Spent Grains) సేకరించి వాటితో రుచి, ఫైబర్, పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహార ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి.అప్సైకిల్జైపూర్లోని ది మిస్ఫిట్స్ వంటి సంస్థలు సాధారణంగా మార్కెట్లో కొనుగోలుదారులు తిరస్కరించే పండ్లు, కూరగాయలను డిప్స్, జామ్లుగా అప్సైకిల్ చేస్తున్నాయి. దీని ద్వారా ఆహార నష్టాన్ని పరిష్కరిస్తున్నాయి.షెల్ఫ్ లైఫ్ పొడిగింపుఆహార వ్యర్థాలను అప్సైక్లింగ్ చేయడంతో పాటు ఉత్పత్తులు పాడవకుండా అరికట్టడం మరొక ముఖ్యమైన అంశం. చెన్నైలోని గ్రీన్పాడ్ ల్యాబ్స్ వంటి స్టార్టప్లు పండ్లు, కూరగాయల షెల్ఫ్ జీవితాన్ని పొడిగించడానికి సహజ మొక్కల సారాలను ఉపయోగిస్తున్నాయి. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే ఆహారంలో దాదాపు 40% వృధా అవుతున్న నేపథ్యంలో ఇటువంటి ఆవిష్కరణలు ఆహార నష్టాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.ఇదీ చదవండి: దీపావళి కానుక.. బ్యాంకులు అదిరిపోయే ఆఫర్లు.. -
టాప్ 3లో భారత టెలికం సేవలు
అత్యుత్తమ టెలికం సేవలున్న టాప్ 3 దేశాల జాబితాలో భారత్ కూడా ఒకటని కేంద్ర టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. సర్వీసులను మెరుగుపర్చేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షించేందుకు అక్టోబర్ 1 నుంచి మరింత కఠినతరమైన నిబంధనలను అమల్లోకి తెచ్చినట్లు మంత్రి చెప్పారు.వీటిపై టెలికం ఆపరేటర్లు ఇప్పటికే తొలి నివేదికలను అందించాయని, సర్వీసుల నాణ్యత సమస్యలేమైనా ఉంటే వాటిని పరిష్కరించడంపై చర్చలు జరుగుతున్నాయని వివరించారు. వైఫై విస్తృతిని పెంచేందుకు 6 గిగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రంలో కొన్ని ఫ్రీక్వెన్సీలకు లైసెన్సు నుంచి మినహాయింపునిచ్చినట్లు సింధియా చెప్పారు. దీంతో నిర్దిష్ట ఫ్రీక్వెన్సీలను ఉపయోగించుకునే కంపెనీలు స్పెక్ట్రం ఫీజులేమీ చెల్లించనక్కర్లేదని పేర్కొన్నారు.శాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీసులపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ నుంచి తుది సిఫార్సులు వచ్చిన తర్వాత నిబంధనలను ఖరారు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ఇక టెలికం నెట్వర్క్ విస్తరణను మరింత వేగవంతం చేస్తున్నామని, ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు 1,882 సమస్యలను పరిష్కరించామని, మరో 533 అంశాలపై రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు. -
జియో దీపావళి ఆఫర్.. ప్లాన్లపై ‘అన్లిమిటెడ్’ ప్రయోజనాలు
దీపావళి పండుగను పురస్కరించుకుని, రిలయన్స్ జియో ఎంపిక చేసిన ప్రీపెయిడ్ ప్లాన్లపై ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ (Reliance Jio Diwali 2025 offer)లో భాగంగా జియో యూజర్లు అపరిమిత వాయిస్ కాల్స్, రోజువారీ 5జీ డేటా, జియో సినిమా, జియో హాట్స్టార్, జియోహోమ్ ట్రయల్స్ వంటి సేవలను ఆస్వాదించవచ్చు. అర్హత కలిగిన ప్లాన్లపై జియో గోల్డ్ క్రెడిట్ కూడా కంపెనీ ఇస్తోంది.ఆఫర్ వివరాలుమైజియో యాప్తో పాటు జియో వెబ్సైట్లోనూ కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లకు "ఫెస్టివల్ ఆఫర్: గోల్డ్ + హోమ్ ట్రయల్" పేరుతో దీపావళి సందర్భంగా బెనిఫిట్లు ప్రకటించింది. వీటిలో స్వల్ప వ్యాలిడిటీతో దీర్ఘకాలిక వ్యాలిడిటీ ప్లాన్లు ఉన్నాయి. పైన చెప్పినట్లుగా, ఈ ఆఫర్ లో జియో 5జీ నెట్ వర్క్ యాక్సెస్, బండిల్ చేసిన ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు, జియో రివార్డ్స్ ఎకోసిస్టమ్ లో ఉపయోగించగల అదనపు జియో గోల్డ్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ ఫెస్టివల్ ప్లాన్లు ఇప్పటికే ఉన్నవారితోపాటు కొత్త ప్రీపెయిడ్ కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి.ఫెస్టివల్ ఆఫర్ కింద ఉన్న ప్లాన్లు ఇవే..జియో రూ.349 ప్లాన్: 28 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2 జీబీ డేటా, జియో గోల్డ్ బోనస్, జియోహోమ్ ట్రయల్, ఓటీటీ బండిల్ ఉన్నాయి.జియో రూ.899 ప్లాన్: 90 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2 జీబీ, మొత్తంగా 20 జీబీ అదనపు డేటా.జియో రూ.999 ప్లాన్: 98 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2 జీబీ డేటా, జియో గోల్డ్ బోనస్, జియోహోమ్ ట్రయల్, ఓటీటీ బండిల్ ఉన్నాయి.జియో రూ.3,599 ప్లాన్: 365 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2.5 జీబీ డేటా.జియో రూ.100 యాడ్-ఆన్: 30 రోజుల వ్యాలిడిటీ, 5 జీబీ నాన్-డైలీ డేటా. అయితే బేస్ ప్లాన్ వ్యాలిడిటీపై ఎలాంటి ప్రభావం ఉండదు. -
ఇంకా సగం మంది ఇంటర్నెట్కు దూరమే!
దేశీయంగా 47 శాతం మంది ప్రజలు ఇంకా ఇంటర్నెట్కి దూరంగా, ఆఫ్లైన్లోనే ఉన్నారని గ్లోబల్ టెలికం పరిశ్రమ జీఎస్ఎంఏ ఓ నివేదికలో తెలిపింది. మొబైల్ ఇంటర్నెట్ వినియోగంలో పురుషులతో పోలిస్తే మహిళలు 33 శాతం తక్కువగా ఉంటున్నారని వివరించింది.హ్యాండ్సెట్స్ ధర అధికంగా ఉండటం, సాంకేతిక నైపుణ్యాలు తక్కువగా ఉండటం వంటి అంశాలు కనెక్టివిటీ మధ్య అంతరాలకు కారణమని ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025లో పాల్గొన్న సందర్భంగా జీఎస్ఎంఏ ఆసియా పసిఫిక్ హెడ్ జులియన్ గోర్మన్ తెలిపారు. దీన్ని సత్వరం పరిష్కరించకపోతే సమ్మిళిత వృద్ధికి అవరోధంగా నిల్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.దశాబ్దం క్రితం 108 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత డిజిటల్ ఎకానమీ 2023లో మూడు రెట్లు పెరిగి 370 బిలియన్ డాలర్లకు చేరిందని, 2030 నాటికి 1 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయని నివేదిక వివరించింది. అయితే, కీలకమైన ఆవిష్కరణలు, వినియోగం మధ్య అంతరాలను పూడ్చకపోతే ఈ వేగం గతి తప్పే అవకాశం ఉందని, పేర్కొంది.డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలు, మొబైల్ వినియోగాల్లో భారత్ అగ్రగామిగా ఉన్నప్పటికీ, పరిశోధనలు..అభివృద్ధి కార్యకలాపాలపై పెట్టుబడులు పెట్టడం, ప్రైవేట్ రంగంలో ఆవిష్కరణలు, సుశిక్షితులైన నిపుణులను అట్టే పెట్టుకోవడం వంటి విషయాల్లో వెనుకబడి ఉందని నివేదిక తెలిపింది. -
‘కొత్త’ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు.. కోట్లలో జీతాలు
టెక్ రంగంలో నూతన ఉద్యోగాల కోసం పోటీ తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా (Meta) తాజాగా గ్రాడ్యుయేట్లను లక్ష్యంగా చేసుకుని ఎంట్రీ లెవల్ టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ, అర్హత ఉన్న అభ్యర్థులకు మెటా మంచి జీతాలు, స్టాక్ ఆప్షన్లు, ఆరోగ్య ప్రయోజనాలువంటి ఆకర్షణీయమైన ప్యాకేజ్లను అందిస్తోంది.కావాల్సిన అర్హతలు ఇవే..మెటా ప్రస్తుతం ఫుల్-స్టాక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ (full-stack software engineers), ప్రోడక్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ (product software engineer)లాంటి ఉద్యోగాల కోసం అభ్యర్థులను నియమిస్తోంది. ఈ ఉద్యోగాలకు..కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా అప్లైడ్ సైన్సెస్లో బ్యాచిలర్ డిగ్రీ తప్పనిసరి.అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ సమయంలో లేదా తరువాత ఈ కిందివాటిలో కనీసం ఒకదాన్నైనా కలిగి ఉండాలి..సంబంధిత యూనివర్సిటీ కోర్సు, ఇంటర్న్షిప్, థీసిస్PHP, Hack, C++, Python లాంటి లాంగ్వేజెస్లో 12 నెలల పని అనుభవంReact వంటి ఫ్రేమ్వర్క్లో పని చేసిన అనుభవంలార్జ్ స్కేల్ స్టోరేజ్ సిస్టమ్లతో పని చేయగల సామర్థ్యంiOS సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్రలకు మాత్రం అభ్యర్థులకు ఒక సంవత్సరం అనుభవం.. ముఖ్యంగా ఆబ్జెక్ట్-ఒరియెంటెడ్ ప్రోగ్రామింగ్, మల్టీ థ్రెడింగ్, Linux/Unix సిస్టమ్స్లో ఉండాలి.జీతం ఎంతంటే.. ఫార్చ్యూన్ నివేదిక ప్రకారం, ఈ ఎంట్రీ లెవల్ పాత్రలకు వార్షిక జీతం 176,000 డాలర్ల నుంచి 290,000 డాలర్ల వరకు ఉంటుంది. భారతీయ కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ.1.46 కోట్ల నుంచి రూ.2.41 కోట్లు అన్న మాట. జీతంతో పాటు వార్షిక బోనస్లు, స్టాక్ ఈక్విటీలు, ఆరోగ్య భద్రతా ప్రయోజనాలు, * ఇతర కార్మిక సంక్షేమ పథకాలు ఉంటాయి.అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ ఉద్యోగాలు ఆన్-సైట్ మాత్రమే. అంటే వాషింగ్టన్ లేదా కాలిఫోర్నియాలోని మెటా కార్యాలయాల్లో పని చేయాల్సి ఉంటుంది. రిమోట్ వర్క్ ఆప్షన్ ఉండదు.ఈ అవకాశాల ప్రాముఖ్యత ప్రస్తుతం చాలా కంపెనీలు నూతన గ్రాడ్యుయేట్లను నియమించుకోవడంలో జాప్యం చేస్తుండగా, మెటా మాత్రం యువ ప్రతిభను గుర్తించి, వారిని ఉద్యోగాలలో చేర్చుకోవడంలో చురుకుగా వ్యవహరిస్తోంది. ఆటోమేషన్ పెరుగుతున్న ప్రస్తుత ఉద్యోగ విపణిలో, ఇది ఒక దిగ్గజ కంపెనీ నుంచి వచ్చిన సువర్ణావకాశంగా నిలిచింది.మార్క్ జుకర్బర్గ్ అభ్యర్థుల్లో చూసేదిదే..మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ (Mark Zuckerberg) సాంప్రదాయ విద్యా ప్రమాణాల కంటే ప్రయోజనకర నైపుణ్యాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఆయన మాటల్లోనే.."ఒకరు ఏదైనా పనిని లోతుగా నేర్చుకొని అద్భుతంగా చేయగలరని చూపగలిగితే, వారు ఆ నైపుణ్యాన్ని ఇతర రంగాల్లో కూడా వర్తింపజేయగలరు"కాబట్టి, అభ్యర్థులు తమ అభ్యాస నైపుణ్యాలను, సమస్యలపై అవగాహనను స్పష్టంగా చూపగలగాలి. మెటా లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో అవకాశాలను అందుకోవాలంటే జ్ఞానం కలిగి ఉండటం ఒక్కటే సరిపోదు.. దాన్ని ప్రయోగించగలగడం ముఖ్యమైంది.ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు గుడ్న్యూస్.. చిగురించిన ఆశలు -
ఫన్ అండ్ ఫవర్ఫుల్ టీవీ!
ఇంట్లో కుటుంబం మొత్తానికి ఆనంద కేంద్రం టీవీ. కాని, దాని వలన ఎక్కువసార్లు సంతోషం కంటే సమస్యలే ఎదురవుతాయి. ఇప్పుడు ఈ చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం ఇచ్చే అద్భుతమైన గాడ్జెట్లు ఇవీ!కామ్గా చూడొచ్చు!రాత్రి హాయిగా పిల్లలు పడుకొని ఉంటే, అప్పుడే పేరెంట్స్ ‘ఇప్పుడు మనం ప్రశాంతంగా సినిమా చూడొచ్చు’ అనుకుంటారు. కాని, టీవీలో వచ్చే ఒక్క మాస్ సీన్ సౌండ్తో మొత్తం ఇంటి సీనే రివర్స్ అవుతుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా, బ్లూటూత్ అడాప్టర్తో టీవీని హెడ్సెట్ సాయంతో చూడవచ్చు. దీనిని టీవీకి జత చేస్తే, ఇక మీరు ఏ హెడ్సెట్నైనా కనెక్ట్ చేసుకునే వీలుంటుంది. ఒకేసారి నాలుగు హెడ్సెట్లను కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అలా మీరు సీరియస్గా సీరియల్ లేదా సినిమా చూస్తున్నప్పుడు పక్కన వాళ్లని ‘షుష్..’ అని చెప్పాల్సిన అవసరం లేదు. బటన్లతో వాల్యూమ్ను తక్కువ లేదా ఎక్కువ చేయడం సులభం. ధర రూ. 1,799 మాత్రమే!అన్ని పరికరాకలకూ ఒక్కటే రిమోట్సోఫాలో హాయిగా కూర్చుని, పక్కన స్నాక్స్ పెట్టుకుని, ఫ్యామిలీతో సినిమా చూడటానికి సిద్ధమయ్యే క్షణంలో ‘రిమోట్ ఎక్కడ?’ అనే ప్రశ్న! ఆ తర్వాత ఏసీ ఆన్ అవ్వకపోయినా, సెటప్బాక్స్ సిగ్నల్ రాకపోయినా, సేమ్ ప్రశ్నే రిపీట్! ఇలా పలు రకాల రిమోట్ల కోసం అవసరం లేకుండా చేస్తుంది. ‘సోఫా బటన్ ఎక్స్వన్ యూనివర్సల్ రిమోట్’. ఇది ఒక్కటి ఉంటే చాలు, అన్ని పరికరాల రిమోట్లకు గుడ్బై చెప్పేయొచ్చు. టీవీ, ఏసీ, సెటప్ బాక్స్, లైట్స్ అన్నీ ఒక్క బటన్తోనే నియంత్రించవచ్చు. వాయిస్ కంట్రోల్తో కూడా ఆపరేట్ చేయవచ్చు. అంటే చేతులు బిజీగా ఉన్నపుడు ‘రిమోట్, టీవీ ఆన్ చేయి’ అని చెప్తే చాలు, వెంటనే చేసేస్తుంది. ఇన్ఫ్రారెడ్ కనెక్టివిటీతో అతి తక్కువ సమయంలో సులభంగా అమర్చుకోవచ్చు. ఒకేసారి ఐదు లక్షల పరికరాల వరకు కనెక్ట్ చేసుకునే వీలుంది. ధర రూ. 3,999 మాత్రమే!ఎక్కడినుంచైనా చూడొచ్చు!ఇక టీవీ చూడటానికి మెడ తిప్పే రోజులు పోయాయి! వంటగదిలో ఉన్నా, హాల్లో ఉన్నా, టీవీనే మీ వైపు తిరిగి ‘కనిపిస్తునున్నానా, ఇంకొంచెం జరగాలా?’ అంటుంది. ఇదే ‘రోబోస్టు టీవీ వాల్ మౌంట్ బ్రాకెట్’ మ్యాజిక్. గోడపై తిప్పుతూ, వంచుతూ, టీవీని మీ చూపు కోణానికి సరిపడేలా సర్దేస్తుంది. ఇక వంట చేసేటప్పుడు సీరియల్ మిస్ కానివ్వదు, క్రికెట్ స్కోర్ కూడా బాల్కనీలో కాఫీతో కలిపి చూడొచ్చు. చిన్న నుంచి పెద్ద వరకు ఏ టీవీ అయినా, ఇది తన భుజాల మీద సేఫ్గా మోస్తుంది. మెటల్ బాడీ, తుప్పు, ధూళి భయం లేదు. ఇన్స్టాలేషన్ కూడా చాలా సులభం. ధర కేవలం రూ. 568 మాత్రమే! -
అరట్టైను తెలుగులో ఎలా పిలవాలంటే?: శ్రీధర్ వెంబు
భారతదేశపు ఐటీ కంపెనీ జోహో అభివృద్ధి చెందిన మెసేజింగ్ ప్లాట్ఫామ్ 'అరట్టై' (Arattai)కు ఆదరణ పెరుగుతోంది. లక్షలమంది ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అయితే కొందరికి అరట్టై అంటే ఏమిటో బహుశా తెలుసుండకపోవచ్చు. ఈ కథనంలో దీని గురించి తెలుసుకుందాం.అరట్టై అనేది తమిళ పదం. దీనిని ఏ భాషలో ఎలా పిలవాలి అనే విషయాన్ని జోహో సీఈఓ శ్రీధర్ వెంబు ట్వీట్ చేసారు. దీనికి సంబంధించిన ఒక ఫోటో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో అరట్టైకు తెలుగులో 'మాటలాట' (మాట్లాడుకోవడం) అని సూచించారు.జోహో మెసేజింగ్ యాప్.. అరట్టై మెటా యాజమాన్యంలోని వాట్సాప్'కు ప్రత్యర్థిగా వచ్చింది. ఇందులో వాట్సాప్ కంటే కూడా ఎక్కువ ఫీచర్స్ ఉండటం వల్ల, దేశీయ యాప్ కావడం వల్ల ఎక్కువమంది డౌన్లోడ్ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీనిని ఉపయోగించాలని కేంద్రమంత్రులు కూడా పిలుపునిచ్చారు.How to say "Arattai" in various languages. pic.twitter.com/ynqBe4euBo— Sridhar Vembu (@svembu) October 11, 2025అరట్టై.. వాట్సప్ మధ్య తేడాలు●అరట్టై ఆండ్రాయిడ్ టీవీలకు, ఆ స్థాయి పరికరాలకు యాక్సెస్ అందిస్తుంది. అయితే వాట్సాప్ ప్రస్తుతం వీటికి మద్దతు ఇవ్వదు. వినియోగదారులు తమ అరట్టై ఖాతాను ఒకేసారి ఐదు పరికరాల్లో ఉపయోగించవచ్చు.●అరట్టైలో పాకెట్ ఫీచర్ ఉంది. ఇది వినియోగదారులు ఫోటోలు, వీడియోలు, నోట్స్, రిమైండర్లు, ఇతర ఫైల్లను స్టోర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వాట్సాప్లో ఈ ఫీచర్ లేదు. అయితే, వాట్సాప్ 'యూ' చాట్ విండోను అందిస్తుంది, ఇక్కడ వినియోగదారులు తమతో తాము చాట్ చేసుకోవచ్చు, కావలసినవి సేవ్ చేసుకోవచ్చు.●అరట్టై యాప్.. తక్కువ మెమరీ ఉన్న స్మార్ట్ఫోన్లు & పాత 2G/3G నెట్వర్క్లలో కూడా సజావుగా పనిచేసేలా రూపొందించబడింది. ఇది గ్రామీణ వినియోగదారులకు, బడ్జెట్ పరికరాలను కలిగిన వారికి అందుబాటులో ఉంటుంది.ఇదీ చదవండి: ఏఐ ట్రాఫిక్ సిస్టం: ఎవ్వరూ తప్పించుకోలేరు! -
తోషిబా.. భారీ విస్తరణ..!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా విద్యుత్కి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో భారత్, జపాన్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడంపై తోషిబా ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా 2027 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 3,232 కోట్లు (55 బిలియన్ యెన్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలిపింది. దీనితో 2024 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2030 నాటికి ఉత్పత్తి సామర్థ్యం రెట్టింపవుతుందని సంస్థ వివరించింది. ప్రాథమిక అంచనాలకు మించి విద్యుత్కి డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్న నేపథ్యంలో జపాన్లోని హమాకవాసాకి కార్యకలాపాలపై, హైదరాబాద్లోని తోషిబా ట్రాన్స్మిషన్ అండ్ డి్రస్టిబ్యూషన్ సిస్టమ్స్ (ఇండియా)పై గణనీయంగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ‘గ్లోబల్గా విద్యుత్కి డిమాండ్ పెరుగుతుండటంతో సరఫరా పరికరాల (టీఅండ్డీ) లభ్యత మరింత కీలకంగా మారింది. ప్రస్తుత మౌలిక సదుపాయాలు పాతబడిపోతుండటం, పునరుత్పాదక విద్యుత్ పెరుగుతుండటం, కొత్త డేటా సెంటర్ల నిర్మాణం మొదలైన అంశాల దన్నుతో 2030 నాటికి జపాన్లో టీఅండ్డీ పరికరాలకు డిమాండ్ భారీగా పెరగనుంది. అలాగే, భారత్లో కూడా పట్టణ ప్రాంత జనాభా, పునరుత్పాదక విద్యుత్ వినియోగం వేగంగా పెరుగుతుండటంతో విద్యుత్కి డిమాండ్ గణనీయంగా పెరగనుంది‘ అని తోషిబా వైస్ ప్రెసిడెంట్ హిరోషి కనెటా తెలిపారు. ఈ నేపథ్యంలో హై–వోల్టేజ్ టీఅండ్డీ పరికరాల సరఫరాను పెంచే దిశగా, తాము ప్రస్తుత ప్లాంట్లను ఆధునీకరించుకుంటూ, కొత్త ప్లాంట్లను నిర్మిస్తూ, ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకుంటున్నట్లు వివరించారు. -
ప్రపంచంలోనే మొదటి ఏఐ మ్యుచువల్ ఫొటో షేరింగ్ యాప్..
స్నేహితులు, బంధువులతో కలిసి ఏదైనా వెకేషన్కి వెళ్లినప్పుడు ఫొటోలు దిగుతుంటారు. ఈ క్రమంలో ఒకరిద్దరి ఫోన్లోనే ఎక్కువ ఫొటోలు తీస్తుంటారు. తర్వాత వాటిని షేరింగ్ యాప్ల ద్వారా షేరు చేసుకుంటారు. కొన్ని రోజులకు మరో ఈవెంట్లో అందరూ కలిసి ఫొటోలు దిగితే మళ్లీ ఇదే మాదిరిగా షేర్ చేసుకోవాల్సిందే. అయితే ఏఐ ఆధారిత యాప్ ‘పిక్సీ’ దీనికో పరిష్కారం చూపుతుంది. ఏఐ సాయంతో స్నేహితుల వద్ద ఉన్న మీ ఫొటోలను సెర్చ్ చేసి ఇద్దరి అనుమతితో షేర్ చేసుకునే వీలు కల్పిస్తుంది. దీన్ని ‘కూ’ సహ వ్యవస్థాపకుడు మయాంక్ బిడావట్కా నేతృత్వంలోని బిలియన్ హార్ట్స్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే మొదటి ఏఐ మ్యుచువల్ ఫొటో షేరింగ్ యాప్ అని కంపెనీ పేర్కొంది.కొన్ని సర్వేల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 2 లక్షల కోట్ల ఫొటోలు దిగుతున్నారు. వాటిలో చాలా వరకు ఇతరుల ఫోన్లలోనే ఉండిపోతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి పిక్సీ ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు చెప్పింది.ప్రత్యేకతలుగివ్ టు గెట్: ఇది యాప్ ప్రధాన సూత్రం. స్నేహితులు మీ ఫోటోలను షేర్ చేయాలంటే తప్పనిసరిగా ఇరువురి అనుమతి కావాల్సిందే. ఇది పరస్పర ఆమోదం ఆధారంగా పనిచేసే వ్యవస్థ. ఇది ఫొటోల షేరింగ్ను ఆటోమేట్ చేస్తుంది.పిక్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్నేహితుల ఫోన్లలో ఉన్న మీ ఫోటోలను ఆటోమేటిక్గా గుర్తిస్తుంది. వాటిని మీకు పంపుతుంది. ఒకసారి అనుమతిస్తే మాన్యువల్గా ప్రతిసారి పంపాల్సిన శ్రమ ఉండదు.ఈ యాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ను అనుసరిస్తుంది. ఫొటోలు పూర్తిగా వినియోగదారల డివైజ్లోనే ఉంటాయి. పిక్సీ సర్వర్లకు వాటిని యాక్సెస్ చేసే అవకాశం లేదు. తద్వారా వినియోగదారు గోప్యతకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది.జులై 2025లో లాంచ్ అయినప్పటి నుంచి 27 దేశాలు, 160+ నగరాల్లో ఈ యాప్ వినియోగదారులున్నారు. కేవలం రెండు నెలల్లోనే 75 రెట్లు యూజర్లు పెరిగినట్లు కంపెనీ తెలిపింది. ఈ సందర్భంగా మయాంక్ బిడావట్కా మాట్లాడుతూ..‘ప్రపంచంలో 15 ట్రిలియన్లకు పైగా ఫొటోలు ఉన్నాయి. అయినప్పటికీ చాలా వరకు షేర్ చేసుకోరు. పిక్సీ వినియోగదారుల పరస్పర అనుమతితో ఈ సమస్యను పరిష్కరిస్తుంది’ అన్నారు.ఇదీ చదవండి: మూడు నెలల్లో 8,203 మందికి ఇన్ఫీ ఉద్యోగాలు -
చేతులు కలిపిన ఎయిర్టెల్, ఐబీఎం..
టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్, అమెరికన్ ఐటీ దిగ్గజం ఐబీఎం చేతులు కలిపాయి. ముంబై, చెన్నైలో ఎయిర్టెల్ క్లౌడ్ కోసం రెండు మల్టీజోన్ రీజియన్లను (ఎంజీఆర్) నెలకొల్పేందుకు వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. క్లౌడ్ సర్వీసుల కోసం పెద్ద సంఖ్యలో డేటా సెంటర్లను ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని ఎంజీఆర్గా వ్యవహరిస్తారు.దేశీయంగా ఎయిర్టెల్ క్లౌడ్ లభించే జోన్ల సంఖ్యను ప్రస్తుత నాలుగు నుంచి పదికి పెంచుకోనున్నట్లు భారతి ఎయిర్టెల్ వైస్ చైర్మన్ గోపాల్ విఠల్ తెలిపారు. ఐబీఎం క్లౌడ్ సొల్యూషన్స్ను ఎయిర్టెల్ క్లౌడ్ కస్టమర్లు పోర్ట్ఫోలియో యాజ్ ఏ సర్వీస్ కింద ఉపయోగించుకునేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడుతుంది. ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు టెక్నాలజీ విషయంలో స్వతంత్రతను కోరుకుంటున్న నేపథ్యంలో తమ సంస్థకు వ్యాపార అవకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయని ఐబీఎం ఆసియా పసిఫిక్ జనరల్ మేనేజర్ హాన్స్ డెకర్స్ తెలిపారు.ప్రాజెక్ట్ ముఖ్యాంశాలుముంబై, చెన్నై నగరాల్లో ఎయిర్టెల్ క్లౌడ్ కోసం రెండు మల్టీజోన్ రీజియన్లు (MGRs) స్థాపించనున్నారు.ఇవి విస్తృత స్థాయిలో క్లౌడ్ సేవలు అందించగల నెట్వర్క్-కేంద్రిత డేటా సెంటర్ల సమాహారంగా పనిచేస్తాయి.ఎంజీఆర్లు అధిక స్థాయిలో లభ్యత, డేటా రిజిలియెన్సీ, డేటా ప్రాసెసింగ్ వేగాన్ని అందిస్తాయి.ప్రస్తుతం నాలుగు క్లౌడ్ జోన్లతో ఉన్న ఎయిర్టెల్, వాటిని పదికు పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది.ఇది దేశవ్యాప్తంగా వ్యాపార సంస్థలకు, ప్రభుత్వ విభాగాలకు మరింత వేగవంతమైన, నమ్మదగిన క్లౌడ్ సేవలను అందించగలదు.ఐబీఎంకు చెందిన అధునాతన సాంకేతికతలను “పోర్ట్ఫోలియో యాస్ ఏ సర్వీస్” రూపంలో ఎయిర్టెల్ క్లౌడ్ కస్టమర్లు వినియోగించవచ్చు.ఇది కస్టమర్లకు స్కేలబులిటీ, డేటా కంట్రోల్, ఏఐ సామర్థ్యాలు వంటి అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. -
ఏఐ ట్రాఫిక్ సిస్టం: ఎవ్వరూ తప్పించుకోలేరు!
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో.. ట్రాఫిక్ ఉల్లంఘనలను స్వయంచాలకంగా గుర్తించదానికి దుబాయ్ పోలీసులు, సరికొత్త ఏఐ బేస్డ్ ట్రాఫిక్ సిస్టం ప్రవేశపెట్టారు. ఇది మానవ ప్రమేయం లేదా ట్రాఫిక్ పోలీసుల ప్రమేయం అవసరం లేకుండానే.. ఐదు రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తిస్తుంది.దుబాయ్ పోలీసులు ఎమిరేట్ అంతటా రోడ్డు భద్రతను పెంపొందించడంలో భాగంగా.. ఇంటెలిజెంట్ ట్రాఫిక్ సిస్టమ్ (ITS)ను ఆవిష్కరించారు. ఇది GITEX గ్లోబల్ 2025లో ప్రదర్శించబడిన ఏఐ బేస్డ్ ప్లాట్ఫామ్. ఈ టెక్నాలజీ డ్రైవర్లు రోడ్డు నియమాలను ఎలా పాటిస్తున్నారనే విషయాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది.సీటు బెల్ట్ ధరించకపోవడం, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించడం, ట్రాఫిక్ అడ్డుకోవడం, కారణం లేకుండా రోడ్డు మధ్యలో వాహనాన్ని ఆపడం, వాహనాల మధ్య దూరాన్ని నిర్వహించడంలో విఫలం కావడం వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలను ఇంటెలిజెంట్ ట్రాఫిక్ సిస్టమ్ గుర్తిస్తుంది.ట్రాఫిక్ అనేది ఇప్పటివరకు చాలా దేశాల్లో మాన్యువల్గానే నిర్వహిస్తున్నారు. గతంలో దుబాయ్ కూడా ఇదే విధానంలో ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించింది. ఇప్పుడు కొత్త టెక్నాలజీ కచ్చితమైన వివరాలను అందిస్తుందని, తద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలు తగ్గుతాయని.. అక్కడి అధికారులు చెబుతున్నారు. -
అలాంటి నిర్ణయాలతో రిస్క్: ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్
న్యూఢిల్లీ: ఆల్గోరిథమ్ ఆధారితంగా (సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్) నిర్ణయాలు తీసుకోవడం, సేవలు కొన్ని వేదికలపైనే కేంద్రీకృతం కావడాన్ని సరిగ్గా నియంత్రించకపోతే.. ఇవి సంప్రదాయ రిస్క్లు కానందున మొత్తం ఆర్థిక వ్యవస్థపైనే ప్రభావం పడుతుందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ జే అభిప్రాయపడ్డారు.డిజిటల్ ఆవిష్కరణలు అన్నవి నేడు కేవలం చెల్లింపులకే పరిమితం కావడం లేదన్నారు. డిజిటల్ వేదికలపై సూక్ష్మ బీమా, పింఛను ఉత్పత్తుల పంపిణీ వేగంగా విస్తరిస్తోందన్నారు. ఈ తరహా డిజిటల్ ఆవిష్కరణలు తక్కువ ఆదాయ వర్గాలకు సాయపడుతున్నట్టు చెప్పారు. యూపీఐని ఇతర దేశాలకూ విస్తరించడం వల్ల సీమాంతర చెల్లింపులు వేగాన్ని సంతరించుకున్నట్టు పేర్కొన్నారు. బాధ్యాతయుతంగా అభివృద్ధి చెందగల వాతావరణాన్ని.. సురక్షితమైన, సుస్థిరమైన, కస్టమర్ కేంద్రంగా ఉండే కొత్త ఆవిష్కరణలు, పరిష్కారాల అభివృద్ధిని ఆర్బీఐ ప్రోత్సహిస్తుందని చెప్పారు.‘‘పాలన, రిస్క్ నిర్వహణ, కస్టమర్ రక్షణకు ప్రాధాన్యం ఇస్తాం. సాంకేతిక పరమైన పురోగతి అన్నది ఆర్థిక వ్యవస్థ విశ్వసనీయతతో సరిపోలాలి’’అని స్వామినాథన్ పేర్కొన్నారు. ఫిన్టెక్లు, డిజిటల్ ప్లాట్ఫామ్లు వేగంగా వృద్ధి చెందుతుండడంతో ఆర్థిక వ్యవస్థ సరిహద్దులు విస్తరిస్తున్నాయంటూ, ఇది సరికొత్త రిస్్కలను తెచి్చపెడుతున్నట్టు చెప్పారు. వీటిని సరిగ్గా చెక్పెట్టకపోతే అప్పుడు విడిగా సంస్థల నుంచి మొత్తం ఆర్థిక వ్యవస్థకు రిస్్కలు విస్తరిస్తాయని అభిప్రాయపడ్డారు. దేశంలో బలమైన డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు ఆర్థిక సేవల విస్తృతికి మద్దతుగా నిలుస్తున్నట్టు చెప్పారు. -
మరోమారు స్పెషల్ ఆఫర్: రూ. 1తో నెల రోజులు ఫ్రీ!
ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ (BSNL) కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు నెల రోజుల పాటు దివాలీ బొనాంజా ప్లాన్ పేరిట ఉచిత 4జీ సర్వీసుల ఆఫర్ ప్రకటించింది. ఇందుకోసం నామమాత్రంగా రూ. 1 మాత్రమే చార్జీ ఉంటుంది. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు నెల రోజులపాటు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది.బీఎస్ఎన్ఎల్ ప్రత్యేక ఆఫర్ కింద బీఎస్ఎన్ఎల్ కొత్త కస్టమర్లకు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 2జీబీ హైస్పీడ్ డేటా, 100 ఎస్ఎంఎస్లు, ఉచిత సిమ్ లభిస్తాయి. తమ సర్వీసుల నాణ్యత, కవరేజీని కస్టమర్లు స్వయంగా పరీక్షించి, తెలుసుకునేందుకు ఇది తోడ్పడుతుందని బీఎస్ఎన్ఎల్ సీఎండీ ఎ. రాబర్ట్ జే రవి తెలిపారు. ఆగస్టులో కూడా బీఎస్ఎన్ఎల్ ఇదే తరహా ఆఫర్ను ప్రకటించింది.This Diwali, light up your life with BSNL Swadeshi connection!Celebrate with BSNL Diwali Bonanza @ just ₹1. Get unlimited calls, 2 GB data/day, 100 SMS/Day and a Free SIM. Offer Valid from15 Oct to 15 Nov 2025 | For new users only#BSNL #BSNLDiwaliBonanza #DiwaliOffer… pic.twitter.com/genxLWRpE4— BSNL India (@BSNLCorporate) October 15, 2025 -
యూట్యూబ్ డౌన్!.. స్పందించిన కంపెనీ
బుధవారం సాయంత్రం యూట్యూబ్ (Youtube) వినియోగించడంలో అంతరాయం ఏర్పడింది. సుమారు 3,20,000 మందికి పైగా ఈ సమస్యను ఎదుర్కొన్నట్లు డౌన్డెటెక్టర్ (Downdetector) వెల్లడించింది. దీనిపై సంస్థ స్పందించింది. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వేలాది మంది యూట్యూబ్ మ్యూజిక్, టీవీ సేవలలో సమస్యలు ఉన్నట్లు వెల్లడించారు. 'ఎర్రర్ సంభవించింది, దయచేసి తర్వాత మళ్ళీ ప్రయత్నించండి' వంటి ఎర్రర్ సందేశాలను చూసినట్లు లేదా డెస్క్టాప్ & మొబైల్ యాప్లు రెండింటిలోనూ ఖాళీ బ్లాక్ స్క్రీన్లను చూసినట్లు వినియోగదారులు నివేదించారు.''మీరు ప్రస్తుతం YouTubeలో వీడియోలను ప్లే చేయలేకపోతే, మేము దాన్ని పరిష్కరిస్తున్నాము! మీ ఓర్పుకు ధన్యవాదాలు'' అంటూ టీమ్ యూట్యూబ్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.యూట్యూబ్ అంతరాయానికి కారణం ఏమిటనే విషయాన్ని కంపెనీ వెల్లడించేలేదు. అయితే దీని పరిష్కారానికి టీమ్ యూట్యూబ్ చురుగ్గా పనిచేస్తోంది. యూట్యూబ్ అంతరాయం యునైటెడ్ స్టేట్స్ అంతటా వినియోగదారులను ప్రభావితం చేసింది. డౌన్డెటెక్టర్ నుండి వచ్చిన డేటా ప్రకారం.. న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, సీటెల్, ఫీనిక్స్, చికాగో, వాషింగ్టన్, డెట్రాయిట్ వంటి పట్టణ కేంద్రాల నుంచి అత్యధిక సంఖ్యలో నివేదికలు వస్తున్నాయి. ఈ సమస్య అమెరికాలో మాత్రమే కాకుండా.. భారత్, యూరప్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా కూడా తలెత్తిందని సమాచారం.If you’re not able to play videos on YouTube right now – we’re on it! Thanks for your patience, and you can follow along here for updates: https://t.co/EcPxm09f77— TeamYouTube (@TeamYouTube) October 16, 2025 -
ఇన్ఫోసిస్ ఉద్యోగులకు గుడ్న్యూస్.. చిగురించిన ఆశలు
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) తమ ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. 2026 సంవత్సరం వేతన పెంపు కోసం ఉద్యోగుతల వార్షిక పనితీరు మూల్యాంకన చక్రాన్ని (annual performance review cycle) ప్రారంభించింది. దీంతో దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న జీతాల పెంపుపై (salary hike) ఉద్యోగుల్లో ఆశలు చిగురించాయి. అక్టోబర్ 17లోగా స్వీయ అంచనాలను సమర్పించాల్సిందిగా కంపెనీ సిబ్బందిని కోరింది.గత రెండు సంవత్సరాలుగా ఇంక్రిమెంట్లు ఆలస్యం కావడం, తక్కువ శాతం జీతాల పెరుగుదల కారణంగా ఇన్ఫోసిస్ ఉద్యోగులు నిరుత్సాహంలో ఉన్నారు. "ఇది సాధారణ ప్రక్రియే అయినా, ఈసారి మాకు మంచి పెంపు వస్తుందని ఆశిస్తున్నాం" అని ఒక ఉద్యోగి చెప్పినట్లు ఎకనమిక్ టైమ్స్ కథనం పేర్కొంది.ఎప్పుడూ ఆలస్యమే..ఇన్ఫోసిస్ సాధారణంగా అక్టోబర్-సెప్టెంబర్ మధ్య సమీక్షలు నిర్వహించి, జనవరిలో రేటింగ్స్, జూన్లో జీతాల సవరణలను విడుదల చేస్తుంది. కానీ గత కొన్ని సంవత్సరాలలో ఈ ప్రక్రియ తరచూ ఆలస్యం అవుతూ వస్తోంది.2024 ఆర్థిక సంవత్సరంలో జూనియర్ లెవల్ 5 (JL5) స్థాయిలో ఉన్న ఉద్యోగులు జనవరిలో వేతన పెంపు పొందగా, జేఎల్ 6, అంతకంటే పై స్థాయి ఉద్యుగులు 2025 ప్రిల్ వరకు వేచి చూడాల్సి వచ్చింది. అయినప్పటికీ, పెంపు శాతం మునుపటి సంవత్సరంతో పోలిస్తే 5-10% తక్కువగానే ఉంది.స్వీయ మదింపు, భవిష్యత్తు లక్ష్యాలపై దృష్టిప్రస్తుతం, ఉద్యోగులు తమ 2025 ఆర్థిక సంవత్సరం ప్రదర్శన, కష్టాలు, విజయాలు, అభివృద్ధి లక్ష్యాలను వివరించాల్సి ఉంటుంది.ఈ ప్రక్రియలో భాగంగా..* గత సంవత్సరం ముఖ్య భూమికలు వివరించాలి* అభివృద్ధి చెందాల్సిన నైపుణ్యాలను హైలైట్ చేయాలి* భవిష్యత్తు పాత్రలపై ఆకాంక్షలను పేర్కొనాలిరేటింగ్స్ ఆధారంగా "అంచనాలను అందుకున్నారు", "ప్రశంసనీయం", "అత్యుత్తమం" ఇలా వర్గీకరణలు ఇస్తారు. ఇవే జీతాల పెంపుపై ప్రభావం చూపుతాయి.టీసీఎస్ కూడా..ఇన్ఫోసిస్ మాత్రమే కాదు, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కూడా తన పనితీరు మూల్యాంకనాన్ని ప్రారంభించింది. సీ3ఏ స్థాయి ఉద్యోగులకు 2025 సెప్టెంబర్ నుండి అమల్లోకి వచ్చే విధంగా పెంపులను ప్రకటించింది. అగ్రశ్రేణి పనితీరుకు రెండంకెల వృద్ధి లభించినట్లు సమాచారం.క్యూ2 ఫలితాలు కీలకంఇన్ఫోసిస్ అక్టోబర్ 16న తన రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు విడుదల చేయనుంది. విశ్లేషకుల ప్రకారం, కంపెనీ ఆర్థిక స్థితి ఆధారంగా జీతాల పెంపు ఎలాంటి పరిమాణంలో ఉండబోతోందో స్పష్టత వస్తుంది. ఈసారైనా మంచి స్థాయిలో జీతాలు పెంపు ఉంటుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు.ఇదీ చదవండి: టీసీఎస్ గుడ్న్యూస్.. ఈసారి ఎక్కువ బోనస్! -
మైక్రోసాఫ్ట్ మొదటి ఏఐ ఇమేజ్ జనరేటర్ విడుదల
టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కృత్రిమ మేధ(AI) రంగంలో మరో కీలక ముందడుగు వేసింది. సంస్థ పూర్తిగా అంతర్గతంగా శిక్షణ ఇచ్చిన తన మొదటి ఏఐ ఇమేజ్ జనరేటర్ ‘మై ఇమేజ్-1(MAI-Image-1)’ను విడుదల చేసింది. ఇప్పటివరకు ఈ విభాగంలో ఓపెన్ఏఐ (OpenAI)పై ఆధారపడుతుండడాన్ని తగ్గించుకునేందుకు మైక్రోసాఫ్ట్ కృషి చేస్తోంది.ఫొటోరియలిస్టిక్ ఇమేజరీ‘MAI-Image-1 మోడల్ ఫొటోరియలిస్టిక్ ఇమేజరీని ఉత్పత్తి చేయడంలో మెరుగ్గా పని చేస్తుంది. ఫొటోలో లైటింగ్ పరిస్థితులు, నీటిపై ప్రతిబింబాలు, ప్రకృతి దృశ్యాలు అత్యంత వాస్తవికంగా ఉంటాయి. భారీ ఎల్ఎల్ఎంలు వాడుతూ నెమ్మదిగా అవుట్పుట్ ఇచ్చే మోడళ్లతో పోలిస్తే ఇది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అత్యంత వాస్తవిక అవుట్పుట్లను సాధించడానికి ఇప్పటికే నిపుణుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాం’ అని కంపెనీ తెలియజేసింది. మైక్రోసాఫ్ట్ MAI-Image-1 ఇప్పటికే ప్రముఖ ఏఐ బెంచ్మార్క్ అయిన ఎల్ఎంఅరెనా(LMArena)లో టాప్ 10లో స్థానం సంపాదించింది. LMArenaలో ఏఐ అవుట్పుట్ల ఆధారంగా వివిధ మోడళ్లను పోల్చి ఉత్తమమైన వాటికి ఓటు వేస్తారు.ఏఐ ఇమేజ్ జనరేషన్ విభాగంలో ఓపెన్ఏఐ (DALL-E), గూగుల్ (Nano Banana) వంటి సంస్థలు ఇప్పటికే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన ఈ టెక్నాలజీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ రంగంలో సంస్థ తనదైన ముద్ర వేయాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు ఓపెన్ఏఐ తన సోరా(Sora) 2 టూల్ను ఉపయోగించి వీడియోలను సృష్టించే యాప్ను ఇప్పటికే అమెరికా, కెనడాలోని యాపిల్ యాప్ స్టోర్లో ప్రారంభించింది.ఇదీ చదవండి: నక్సల్స్పై రివార్డుకు పన్ను మినహాయింపు ఉంటుందా? -
6జీ కనెక్టివిటీ టెస్ట్ విజయవంతం
యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) 6జీ కనెక్టివిటీ పరీక్షల్లో రికార్డు స్థాయిలో 145 గిగాబిట్స్ పర్ సెకన్ (Gbps) ఇంటర్నెట్ వేగాన్ని సాధించినట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెలిశాయి. ఈ టెక్నాలజీ టెలికమ్యూనికేషన్స్ రంగంలో కీలక మైలురాయిగా నిలవనుంది. కనెక్టివిటీలో అసాధారణ వేగం, అతి తక్కువ జాప్యం (Ultra low Latency) వంటి అంశాలు భవిష్యత్ డిజిటల్ ప్రపంచానికి సరికొత్త మార్గాన్ని సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా 6జీ టెక్నాలజీ అభివృద్ధిలో చురుకుగా ముందుకు సాగుతోంది.భారత్లో పరిశోధనలుభారతదేశం కేవలం 6జీ టెక్నాలజీని స్వీకరించే దేశంగా కాకుండా దాని రూపకల్పన, అభివృద్ధి, ప్రమాణాలను నిర్దేశించడంలో ప్రపంచానికి నాయకత్వం వహించే దేశంగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దాంతో భారత్ 6జీ విజన్ను ప్రారంభించింది. 2023 మార్చి 23న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ 6జీ విజన్ పత్రాన్ని ఆవిష్కరించారు. 2030 నాటికి ఈ టెక్నాలజీలను రూపొందించి దేశీయంగా అమలు చేయాలనేది దీని ముఖ్య ఉద్దేశం. దేశీయ పరిశ్రమ, విద్యాసంస్థలు, జాతీయ పరిశోధనా సంస్థలు, ప్రమాణాల సంస్థల సహకారంతో 2023 జులై 3న భారత్ 6జీ కూటమిని ప్రారంభించారు. భారత్ 6జీ విజన్కు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి ఇది ఒక వేదికగా పనిచేస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాల చర్చల్లో చురుకుగా పాల్గొనడం, పరిశోధనలకు నిధులు సమకూర్చడం దీని విధుల్లో భాగం.టెలికాం టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ (TTDF) పథకం కింద 6జీ టెక్నాలజీకి సంబంధించిన 104కి పైగా పరిశోధన ప్రాజెక్టులకు రూ.275.88 కోట్లకు పైగా నిధులు మంజూరు చేశారు. దేశంలోని కొన్ని ప్రముఖ విద్యాసంస్థల్లో 6జీకి సిద్ధంగా ఉండే పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి 100 5జీ ల్యాబ్లను ఏర్పాటు చేశారు. ఇవి భవిష్యత్తులో 6జీ పరిశోధనలకు వేదికగా మారుతాయి.🚨 The UAE has successfully completed its first 6G testing, achieving a record speed of 145 Gbps. pic.twitter.com/uhtmRk6Zrv— Indian Tech & Infra (@IndianTechGuide) October 15, 2025ఇండియాలో 6జీ వస్తే చోటు చేసుకోనున్న పరిణామాలుఇండియాలో ‘భారత్ 6జీ విజన్’ కింద 6జీ సాంకేతికతను 2030 నాటికి అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత్ వంటి అతిపెద్ద జనాభా గల దేశంలో 6జీ రాక వల్ల భారీ పరివర్తనలు సంభవిస్తాయి.డిజిటల్ విప్లవం: 6జీ గ్రామీణ, సరైన కనెక్టివిటీలేని ప్రాంతాలకు సైతం మెరుగైన కమ్యునికేషన్ అందిస్తుంది.ఆరోగ్య సంరక్షణ (Healthcare): రియల్-టైమ్ టెలిసర్జరీలు, రిమోట్ పేషెంట్ మానిటరింగ్, ఏఐ-ఆధారిత డయాగ్నోస్టిక్స్ వంటివి విస్తృతం అవుతాయి. అంబులెన్స్లు, ఆసుపత్రులు సహా అన్ని వైద్య మౌలిక సదుపాయాలు ఏఐ ఆధారితంగా అనుసంధానమవుతాయి.విద్య (Education): విద్యార్థులు వర్చువల్ టీచర్లతో, క్లాస్మేట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, ఎక్కడైనా, ఎప్పుడైనా నాణ్యమైన విద్యా వనరులను పొందేందుకు 6జీ ఉపయోగపడుతుంది.పరిశ్రమల ఆటోమేషన్ (Industrial Automation): స్మార్ట్ ఫ్యాక్టరీల్లో యంత్రాల రియల్-టైమ్ రిమోట్ కంట్రోల్, ఏఐ-ఆధారిత ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్, రోబోటిక్స్ వంటివి ఉత్పత్తి సామర్థ్యాన్ని, నాణ్యతను అసాధారణంగా పెంచుతాయి.రవాణా (Transportation): అర్బన్ ఎయిర్ మొబిలిటీ (UAM), అటానమస్ వాహనాల (Self-Driving Cars) కోసం 6జీ కమ్యూనికేషన్ అత్యంత అవసరం. ట్రాఫిక్ నిర్వహణ, లాజిస్టిక్స్లో డ్రోన్ ఫ్లీట్ల వాడకం పెరుగుతుంది.రక్షణ రంగం (Defence): కమాండర్లకు వేగవంతమైన, రియల్-టైమ్ క్షేత్ర సమాచారం అందించేందుకు వీలవుతుంది. సురక్షితమైన కమ్యూనికేషన్, డ్రోన్లు, హైపర్సోనిక్ ఆయుధాలకు కమ్యూనికేషన్ లింక్లు అందించడం ద్వారా రక్షణ సామర్థ్యం పెరుగుతుంది.ఈ టెక్నాలజీ వివిధ దేశాల పరిశోధనలుప్రస్తుతానికి ప్రపంచంలో ఏ దేశంలోనూ పూర్తిగా వాణిజ్యపరమైన (Commercial) 6జీ నెట్వర్క్ వాడుకలో లేదు. 6జీ సాంకేతికతను 2030 నాటికి వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుని అభివృద్ధి, పరిశోధన (R&D)లో వివిధ దేశాలు, టెక్ కంపెనీలు చురుగ్గా పోటీ పడుతున్నాయి.6జీ అభివృద్ధిలో ముందున్న దేశాలుచైనా: 6జీ పరిశోధన, అభివృద్ధిలో ముందంజలో ఉంది. చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది. టెరాహెర్ట్జ్ సిగ్నల్ ప్రసారాన్ని పరీక్షించేందుకు ఇప్పటికే ప్రయోగాత్మక ఉపగ్రహాన్ని (Experimental Satellite) ప్రయోగించింది. 6జీ పేటెంట్ ఫైలింగ్స్లో చైనా అగ్రస్థానంలో ఉంది.దక్షిణ కొరియా: 5జీని వేగంగా అమలు చేసిన దక్షిణ కొరియా 6జీలో కూడా బలమైన పోటీదారుగా ఉంది. శాంసంగ్, ఎల్జీ వంటి దిగ్గజ సంస్థలు 6జీ R&D కేంద్రాలను ఏర్పాటు చేశాయి. 2028 నాటికి 6జీని వాణిజ్యపరంగా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.జపాన్: టెక్నాలజీ అభివృద్ధిలో తన నైపుణ్యాన్ని కొనసాగిస్తూ 2030 నాటికి 6జీని ఆవిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.యునైటెడ్ స్టేట్స్, యూరప్: యూఎస్ ‘నెక్స్ట్ G అలయన్స్’ ద్వారా ఈయూ ఆధ్వర్యంలో ‘హెక్సా-ఎక్స్’ (Hexa-X) వంటి చొరవలతో 6జీ పరిశోధనలో చురుకుగా పాల్గొంటున్నాయి.ఇదీ చదవండి: ఓ మై గోల్డ్! -
ఏఐ వచ్చినా..మన ఉద్యోగాలు సేఫ్!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో ఉపాధి కోల్పోతాం అన్న భావన చాలామందిలో ఉంది. ఒక్క భారత్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల్లో ఈ ఆందోళన నెలకొంది. ఈ విషయంలో మనం సేఫ్! భారత్లో కేవలం 6.4 శాతం ఉద్యోగాలకు మాత్రమే ఏఐ ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని ప్రపంచ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. అంటే కృత్రిమ మేధ రాకతో భారతీయులపై ప్రతికూల ప్రభావం అతి తక్కువే అన్నమాట. పైగా ఈ నూతన సాంకేతికత వల్ల 15 శాతానికిపైగా ఉద్యోగాలు మరింత మెరుగుపడతాయని వివరించింది. ఏఐ నియామకాల్లో దేశంలో బెంగళూరు తర్వాత హైదరాబాద్ పోటీపడుతుండడం విశేషం. ఇక ఏఐ పరివర్తనలో దక్షిణ ఆసియాలో భారత్ ముందంజలో దూసుకెళుతోంది. – సాక్షి, స్పెషల్ డెస్క్ఉద్యోగ ప్రకటనల్లో ఏఐ వాటా దక్షిణాసియాలో ఇలా..శ్రీలంక 7.3భారత్ 5.8నేపాల్: 3.4బంగ్లాదేశ్: 1.4» ఏఐ రాకతో భారత్లో 15.6 శాతం ఉద్యోగాలు మరింత మెరుగుపడతాయి.» 6.4 శాతం జాబ్స్ను మాత్రమే ఏఐ కైవసం చేసుకుంటుంది.» సాంకేతిక సేవలకు పేరొందిన బెంగళూరు, హైదరాబాద్లలో ఏఐ సంబంధ ఉద్యోగాలు కేంద్రీకృతమయ్యాయి.» మొత్తం జాబ్ పోస్టింగ్స్లో ఏఐ సంబంధ ఉద్యోగాల వాటా మన దేశంలో 5.8 శాతం.» ఏఐ జాబ్స్లో జాతీయ సగటును మించి నాలుగు నగరాలు ముందంజలో ఉన్నాయి. దేశాల వారీగా ఏఐ రాకతో వివిధ రంగాల్లో మెరుగుపడే ఉద్యోగాలు, ప్రభావితం అయ్యే జాబ్స్, ఏమాత్రం ప్రభావం లేని విభాగాల శాతం -
మొబైల్ ఫోన్ల ఎగుమతులు.. రెట్టింపు
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ల ఎగుమతులు సెప్టెంబర్ నెలలో జోరుగా సాగాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 95 శాతం అధికంగా 1.8 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు నమోదైనట్టు ఇండియా సెల్యులర్ అండ్ ఎల్రక్టానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) ప్రకటించింది. ‘‘సాధారణంగా ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో ఎగుమతులు స్తబ్దుగా ఉంటుంటాయి. ఉత్పత్తి, సీజన్ వారీ రవాణా పరిస్థితులు ఇందుకు కారణం.అయినప్పటికీ ఎగుమతులు పటిష్టంగా నమోదు కావడం అన్నది దేశీయంగా బలమైన ఎకోసిస్టమ్ (తయారీ) ఏర్పడినట్టు తెలియజేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మొబైల్ ఫోన్ల ఎగుమతులు 13.5 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఎగుమతులు 8.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంటే 60 శాతం అధిక ఎగుమతులు జరిగినట్టు తెలుస్తోంది. దేశ మొబైల్ ఫోన్ల పరిశ్రమ తయారీ, సామర్థ్యం, విశ్వసనీయతను పెంచుకుంటున్నట్టు అర్థమవుతోంది. అంతర్జాతీయంగా పోటీపడేందుకు ఇవి కీలక ఆయుధాలు’’అని ఐసీఈఏ పేర్కొంది. అమెరికాకు మూడింతలు భారత్ నుంచి అమెరికా మార్కెట్కు ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో 9.4 బిలియన్ డాలర్ల మొబైల్ ఫోన్ల ఎగుమతులు జరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో 3.1 బిలియన్ డాలర్ల ఎగుమతులతో పోల్చి చూస్తే మూడింతలయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో మొబైల్ ఫోన్ల ఎగుమతుల్లో 70 శాతం మేర (9.4 బిలియన్ డాలర్లు) అమెరికా మార్కెట్కే వెళ్లడం గమనార్హం. క్రితం ఏడాది ఇదే కాలంలో మొత్తం ఎగుమతుల్లో అమెరికా మార్కెట్కు వెళ్లిన మొత్తం 37 శాతంగా ఉంది.ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద (2025–26) మొబైల్ ఫోన్ల ఎగుమతులు 35 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని ఐసీఈఏ అంచనా వేసింది. క్రితం ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 24.1 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ‘‘మొబైల్ ఫోన్ పరిశ్రమలో తదుపరి దశ వృద్ధి అన్నది ఇప్పటి వరకు సాధించిన సామర్థ్యాలు, పోటీతత్వాన్ని కొనసాగించడంపైనే ఆధారపడి ఉంటుంది. విడిభాగాల తయారీ ద్వారా మన సామర్థ్యాలను మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉంది’’అని ఐసీఈఏ చైర్మన్ పంకజ్ మొహింద్రూ పేర్కొన్నారు. -
ఐఫోన్ 18 ప్రో మాక్స్.. లాంచ్ ఎప్పుడంటే?
గత నెలలో ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ అయింది. కాగా ఇప్పుడు టెక్ దిగ్గజం ఐఫోన్ 18 ప్రో మాక్స్పై దృష్టి సారించింది. అయితే ఈ కొత్త ఫోనుకు సంబంధించిన డిజైన్, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ కొన్ని లీక్ అయ్యాయి. యాపిల్ కంపెనీ తన తదుపరి ఐఫోన్లో ఏమి అందిస్తుందని ఇక్కడ తెలుసుకుందాం.ఐఫోన్ 18 ప్రో మాక్స్.. ప్రస్తుత ఐఫోన్ 17 ప్రో మోడళ్లతో పోలిస్తే కొంచెం చిన్న డైనమిక్ ఐలాండ్ను కలిగి ఉండనుంది. రియర్ డిజైన్ కొంత అప్డేట్ పొందుతుంది.. కానీ కెమెరా ప్లేస్మెంట్ ఐఫోన్ 17 ప్రో సిరీస్ మాదిరిగానే ఉంటుంది. మెరుగైన థర్మల్ నిర్వహణకు సహాయపడటానికి ఆపిల్ కొత్త స్టెయిన్లెస్ స్టీల్ ఉపయోగించనుంది. డిస్ప్లే పరిమాణాల విషయానికొస్తే.. ఐఫోన్ 18 ప్రో 6.3 ఇంచెస్, ఐఫోన్ 18 ప్రో మాక్స్ 6.9 ఇంచెస్ పొందనున్నట్లు సమాచారం.కెమెరా విషయానికి వస్తే.. ఐఫోన్ 18 ప్రో మాక్స్ 48-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్కు.. వేరియబుల్ ఎపర్చర్ టెక్నాలజీని తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం. రీడిజైన్ కెమెరా కంట్రోల్ బటన్ రానుంది. వేగవంతమైన పనితీరు, మెరుగైన శక్తి సామర్థ్యం కోసం ఏఐ ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది.సాధారణంగా ఎప్పుడూ యాపిల్ కంపెనీ ప్రతి ఏటా సెప్టెంబర్ నెలలోనే కొత్త ఉత్పత్తులను లాంచ్ చేస్తుంది. కాబట్టి ఐఫోన్ 18 సిరీస్ కూడా అప్పుడే (2026 సెప్టెంబర్) లాంచ్ అయ్యే అవకాశం ఉంది. భారతదేశంలో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధర.. ప్రస్తుతం అమ్మకానికి ఉన్న ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కంటే కొంత ఎక్కువగా ఉంటుందని అంచనా.ఇదీ చదవండి: తక్కువ ధరలో కొత్త రీఛార్జ్ ప్లాన్ -
గూగుల్తో జతకట్టిన ఎయిర్టెల్: ఎందుకంటే?
భారతీ ఎయిర్టెల్.. ఈ రోజు (మంగళవారం) ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో.. భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హబ్ను ఏర్పాటు చేయడానికి గూగుల్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ చొరవతో దేశంలో ఏఐ వినియోగాన్ని వేగవంతం చేయనున్నట్లు సమాచారం.విశాఖపట్నంలోని ఏఐ హబ్ కోసం గూగుల్ ఐదేళ్లలో సుమారు 15 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టనుంది. ఎయిర్టెల్, అదానీకన్నెక్స్ వంటివి ఏఐ హబ్ కోసం సహకారం అందిస్తాయి. ఎయిర్టెల్ & గూగుల్ సంయుక్తంగా విశాఖపట్నంలో పర్పస్ బిల్ట్ డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తాయి. అంతే కాకుండా గూగుల్ కొత్త అంతర్జాతీయ సబ్సీ కేబుల్లను హోస్ట్ చేయడానికి అత్యాధునిక కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ (CLS)ను ఏర్పాటు చేస్తాయి. ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఎయిర్టెల్ ఒక బలమైన ఇంట్రా సిటీ, ఇంటర్ సిటీ ఫైబర్ నెట్వర్క్ను కూడా సృష్టిస్తుంది.భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విట్టల్ మాట్లాడుతూ.. గూగుల్తో ఈ భాగస్వామ్యం భారతదేశ డిజిటల్ భవిష్యత్తులో ఒక నిర్ణయాత్మక క్షణం. ప్రపంచ స్థాయి ఏఐ మౌలిక సదుపాయాలను పెంచడానికి మేము సహకరిస్తామని అన్నారు. ఎయిర్టెల్తో కలిసి పనిచేస్తూ, మేము తదుపరి తరం ఏఐ సేవలను అందిస్తామని గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ పేర్కొన్నారు. -
ఐఆర్ఈఈ 2025లో వందే భారత్ స్లీపర్ కోచ్ ప్రదర్శన
భారతీయ రైల్వేల ఆధునికీకరణ నేపథ్యంలో త్వరలో ప్రారంభించబోయే వందే భారత్ ఎయిర్ కండిషన్డ్ స్లీపర్ బోగీలు ప్రముఖ ఎగ్జిబిషన్లో దర్శనమివ్వనున్నాయి. అక్టోబర్ 15న ఢిల్లీలో ప్రారంభం కానున్న ఇండియన్ రైల్వే ఎక్విప్మెంట్ ఎగ్జిబిషన్ (ఐఆర్ఈఈ) 2025లో ఈ ఏసీ స్లీపర్ కోచ్ను ప్రదర్శించనున్నారు.సుదూర, మధ్యస్థ ప్రయాణాలకు విమానం లాంటి సౌకర్యాన్ని అందించే లక్ష్యంతో రైల్వే మంత్రిత్వ శాఖ ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రైళ్లను ఆటోమేటిక్ డోర్లు, వైఫై సదుపాయం, విమానం (ఎయిర్ క్రాఫ్ట్)లాంటి డిజైనింగ్లో రూపొందించారు.ఆసియాలోనే అతిపెద్ద రైల్వే ఈవెంట్భారతీయ రైల్వేల సహకారంతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) నిర్వహిస్తున్న ఐఆర్ఈఈ 2025 ఆసియాలోనే అతిపెద్ద రైల్వే ఎగ్జిబిషన్గా గుర్తింపు పొందింది. కాగా రైల్వేలు, రవాణా రంగంలో ప్రపంచంలోనే ఇది రెండో అతిపెద్ద ఈవెంట్.ఇతర కోచ్ల ప్రదర్శనఐఆర్ఈఈ 2025లో వందే భారత్ స్లీపర్ కోచ్లతో పాటు చైర్ కార్ కోచ్లు, అమృత్ భారత్ కోచ్లు, తేజస్ భారత్, హమ్సఫర్ కోచ్లు, నమో భారత్ రైళ్లు, మెయిన్లైన్ కోచ్లు కూడా ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని ఇండియన్ రైల్వే బోర్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ ధ్రువీకరించారు.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలకు టీసీఎస్ సన్నద్ధం -
బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలకు టీసీఎస్ సన్నద్ధం
ప్రభుత్వ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ ఇటీవల దేశవ్యాప్తంగా 4జీ సర్వీసులు ప్రారంభించిన నేపథ్యంలో అందుకు టెక్నాలజీ సపోర్ట్ అందించిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 5జీ కనెక్టివిటీకి సిద్ధమవుతున్నట్లు తెలిపింది. దాంతో టెలికాం పరికరాల విభాగంలో టీసీఎస్ ఎదిగేందుకు ఇది ఎంతో తోడ్పడుతుందని పేర్కొంది. గ్లోబల్ టెలికాం కంపెనీలు ఇప్పటికే భారతదేశ టెలికాం రంగంపై ఆసక్తి చూపుతున్నాయని టీసీఎస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సమీర్ సక్సరియా చెప్పారు.ఈ సందర్భంగా సమీర్ మాట్లాడుతూ.. ‘బీఎస్ఎన్ఎల్కు అందించిన టెక్నాలజీ మౌలిక సదుపాయాలు నాణ్యత పరంగా పరిశ్రమ బెంచ్మార్క్లను మించి ఉన్నాయి. భారత్తోపాటు ఇతర దేశాల్లో కంపెనీ ఈ విభాగంలో విస్తరించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. బీఎస్ఎన్ఎల్ తదుపరి కనెక్టివిటీ కార్యకలాపాల్లోనూ పాల్గొంటాం. బీఎస్ఎన్ల్ 4జీ ప్రాజెక్ట్ను విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా భారత్లో మాత్రమే కాకుండా 5జీ, ప్రపంచవ్యాప్తంగా 4జీ కోసం ఇలాంటి సర్వీస్ ఇంటిగ్రేషన్ ప్రాజెక్టులను చేపట్టడానికి కంపెనీ సిద్ధంగా ఉంది’ అని చెప్పారు.బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం ఇటీవల దేశవ్యాప్తంగా 4జీ కనెక్టివిటీని అందించేందుకు మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దాంతో ఇటీవల ప్రధాని చేతుల మీదుగా దేశంలోని అన్ని టవర్ల పరిధిలో బీఎస్ఎన్ఎల్ 4జీని ప్రారంభించింది. గత మే నెలలో 18,685 సైట్లలో 4జీ మొబైల్ నెట్వర్క్ను ఏర్పాటు చేయడానికి రూ.2,903.22 కోట్ల ఆర్డర్ను అందుకున్నట్లు టీసీఎస్ గతంలో తెలిపింది.ఇదీ చదవండి: రూ.15 వేల కోట్ల పెట్టుబడితో 14వేల ఉద్యోగాలు.. -
జియో ఫ్యామిలీ ప్లాన్.. ఒకేసారి 4 సిమ్లకు..
ప్రీపెయిడ్ వినియోగదారుల తరహాలోనే, జియో తన పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు కూడా అద్భుతమైన ప్లాన్లను అందిస్తోంది. ఈ ప్లాన్లు డేటా, అపరిమిత కాలింగ్తో పాటు, పలు ప్రముఖ OTT ప్లాట్ఫారమ్లకు ఉచిత సబ్స్క్రిప్షన్లను కలిగి ఉంటాయి. అందులో ఒకటి రూ.749 పోస్ట్ పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్. వినియోగదారులకు మెరుగైన డేటా, కాలింగ్, వినోద అనుభవాన్ని అందించే ప్లాన్ ఇది.ప్లాన్ ప్రయోజనాలుఈ పోస్ట్పెయిడ్ ప్లాన్ ధర నెలకు రూ.749. ఇందులో 100 GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అదనపు డేటా అవసరమైతే ఒక జీబీకి రూ.10 చెల్లించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు లభిస్తాయి.ఫ్యామిలీ సిమ్ కార్డులుమొత్తం 4 మంది వరకు ప్లాన్ను పంచుకోవచ్చు (ప్రధాన సిమ్తో పాటు 3 అదనపు ఫ్యామిలీ సిమ్స్). ప్రతి అదనపు సిమ్కు 5GB డేటా లభిస్తుంది. ఒక్కో ఫ్యామిలీ సిమ్ కోసం నెలకు రూ.150 అదనంగా చెల్లించాలి.ఉచిత ఓటీటీ సబ్స్క్రిప్షన్లు* నెట్ఫ్లిక్స్ (మొబైల్ ప్లాన్)* అమెజాన్ ప్రైమ్ లైట్ – 2 సంవత్సరాల ఉచిత సబ్స్క్రిప్షన్* జియో సినిమా, జియో టీవీ – ఉచిత యాక్సెస్* డిస్నీ+ హాట్స్టార్ (మొబైల్)– 3 నెలల ఉచిత సబ్స్క్రిప్షన్* జియోక్లౌడ్ స్టోరేజ్ – 50GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్ఈ ప్లాన్ కుటుంబ వినియోగదారులకు, ఓటీటీ వినోదాన్ని ఆస్వాదించే వారికి బాగా ఉపయోగపడుతుంది. మీరు ఒకే ప్లాన్ను కుటుంబ సభ్యులతో పంచుకోవాలనుకుంటే ఇది అద్భుతమైన ఎంపిక. -
ట్రాఫిక్ సిగ్నల్స్ ముందే చూపించే ఫీచర్
బెంగళూరు వంటి నగరాల్లో ట్రాఫిక్ అనేది చాలా పెద్ద సమస్య. ఈ సమస్యకు పూర్తిగా నివారించడం కష్టం, కానీ కొంత వరకు పరిష్కరించవచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకునే.. లైవ్ ట్రాఫిక్ సిగ్నల్ కౌంట్డౌన్ను ట్రాక్ చేయడంలో సహాయపడే కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టారు. ఈ ఫీచర్ ప్రస్తుతం బెంగళూరు(Bengaluru)కు మాత్రమే పరిమితమైంది. రాబోయే రోజుల్లో ఇది ఇతర నగరాలకు కూడా విస్తరించనున్నట్లు సమాచారం.నావిగేషన్ సంస్థ మ్యాప్మైఇండియా సహకారమతో.. ఈ కొత్త ఫీచర్స్ రూపొందించారు. మ్యాప్ల్స్ (Mappls) యాప్లో లైవ్ ట్రాఫిక్ సిగ్నల్ టైమ్ చూడవచ్చు. మ్యాప్మైఇండియా డైరెక్టర్ రోహన్ వర్మ పేర్కొన్నారు. భారతదేశంలో మొదటిసారి ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇది మ్యాజికల్, హెల్ప్ఫుల్ అని తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.రైల్వేలు, సమాచార & ప్రసారాలు, ఎలక్ట్రానిక్స్ & సమాచార సాంకేతిక శాఖ మంత్రి 'అశ్విని వైష్ణవ్' కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్'లో తాను ఈ ఫీచర్ను ఉపయోగిస్తున్న వీడియోను పోస్ట్ చేసి, "స్వదేశీ 'మాప్ల్స్' బై మ్యాప్మైఇండియా. మంచి ఫీచర్లు...తప్పక ప్రయత్నించాలి!" అని పేర్కొన్నారు.కొత్త ఫీచర్ ఉపయోగాలుమ్యాప్ల్స్ యాప్ ఇప్పుడు బెంగళూరులోని ట్రాఫిక్ సిగ్నెల్ టైమింగ్ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. కొత్త ఫీచర్ ప్రస్తుతం వెహికల్ యాక్చుయేటెడ్ కంట్రోల్ (VAC) సిగ్నల్లను ఉపయోగించే 169 జంక్షన్లలో అందుబాటులో ఉంది. Mappls ఇంటిగ్రేషన్తో, సిగ్నల్ స్తంభాలపై కనిపించే అదే కౌంట్డౌన్ ఇప్పుడు మొబైల్ స్క్రీన్లలో చూడవచ్చు.VAC సిగ్నల్స్ గురించి ప్రధాన ఫిర్యాదులలో ఒకటైన ఊహించలేని వెయిటింగ్ పీరియడ్లను పరిష్కరించడమే ఈ కొత్త ఫీచర్ ప్రవేశపెట్టడం వెనుక ముఖ్య ఉద్దేశ్యం అని అధికారులు తెలిపారు. జంక్షన్లకు ముందుగా టైమర్లను చూపించడం ద్వారా, ప్రయాణికులు ఆలస్యాన్ని ఊహించవచ్చు, అనవసరమైన హారన్ మోగించడం లేదా లేన్ మార్పులను నివారించవచ్చు.Can you see the live traffic signal timings showing up on Mappls app? As the real traffic signal counts down, you see the same on the map inside Mappls app. Magical, and helpful :)Live in Bangalore now thanks to @blrcitytraffic n Arcadis India, and the work done by team @mappls… pic.twitter.com/mA96gaZykd— Rohan Verma (@_rohanverma) October 11, 2025Swadeshi ‘Mappls’ by MapmyIndia 🇮🇳Good features…must try! pic.twitter.com/bZOPgvrCxW— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) October 11, 2025 -
నం.1, 2 లోహాలు.. ఎందులో వాడుతున్నారంటే..
బంగారం, వెండి ధరలు ఇటీవలి కాలంలో అసాధారణ రీతిలో పెరుగుతున్నాయి. ఇటీవల కేజీ వెండి ధర ఏకంగా రూ.1.95 లక్షలకు చేరింది. తులంగా బంగారం రూ.1.20 పైమాటే. ఈ పెరుగుదలకు ప్రధానంగా ఆర్థిక అంశాలు దోహదపడుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుదల, దీనికి విరుగుడుగా సురక్షిత పెట్టుబడి సాధనాలుగా బంగారం, వెండిపై మదుపరుల దృష్టి మళ్లడం ఒక ముఖ్య కారణం. అంతర్జాతీయంగా డాలర్ విలువ బలహీనపడటం, ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం నిల్వలను కొనుగోలు చేస్తుండడం వంటివి కూడా ఈ ధరల పెరుగుదలకు ఇంధనంగా పనిచేస్తున్నాయి. అయితే కేవలం ఆర్థిక కారకాలు, ఆభరణాల తయారీ మాత్రమే కాకుండా ఈ లోహాలకు అనేక పారిశ్రామిక, అత్యాధునిక రంగాల్లో పెరుగుతున్న డిమాండ్ కూడా ధరల పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తోంది.బంగారం, వెండి రెండూ విద్యుత్ వాహకత, తుప్పు నిరోధకత, సులభంగా సాగే (ductility), రేకులుగా మలిచే గుణం (malleability) వంటి ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్నాయి. ఈ లక్షణాల కారణంగా వీటి వినియోగం కేవలం పెట్టుబడులు లేదా ఆభరణాల తయారీకే పరిమితం కాకుండా అత్యంత ముఖ్యమైన పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో విస్తరిస్తోంది.బంగారం వినియోగంబంగారాన్ని అత్యధికంగా ఆభరణాల తయారీలో వినియోగించినప్పటికీ దాని ప్రత్యేక లక్షణాల కారణంగా అనేక అత్యాధునిక రంగాల్లో దీనికి ప్రాధాన్యత ఉంది.ఎలక్ట్రానిక్స్, ఉపకరణాల తయారీబంగారం అత్యుత్తమ విద్యుత్ వాహకాల్లో ఒకటి. తుప్పు పట్టదు కాబట్టి దీన్ని మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, జీపీఎస్ యూనిట్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో వాడుతున్నారు. ముఖ్యంగా కనెక్టర్లు, స్విచ్లు, రిలేలు, సర్క్యూట్ బోర్డులలోని కీలకమైన భాగాలలో దీర్ఘకాలిక విద్యుత్ కనెక్షన్ల కోసం బంగారాన్ని ఉపయోగిస్తున్నారు.ఏరోస్పేస్, అంతరిక్ష పరిశోధనఉపగ్రహాలు, అంతరిక్ష నౌకలు, రాకెట్ల్లోని కీలకమైన ఎలక్ట్రానిక్ విడిభాగాలను రక్షించడానికి, విద్యుత్ ప్రసారం కోసం బంగారాన్ని వాడుతున్నారు. అంతరిక్షంలోని అత్యంత కఠినమైన వాతావరణంలో కూడా ఇది అద్భుతమైన పనితీరును కనబరుస్తుంది. అధిక ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి బంగారాన్ని పూతగా కూడా ఉపయోగిస్తారు.వైద్య పరికరాలుబంగారం జీవసంబంధితంగా స్థిరంగా ఉంటుంది (శరీరంలో సులభంగా చర్యలకు గురికాదు). తుప్పు పట్టదు. నాన్-అలెర్జిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ కారణంగా దంతవైద్యంలో క్రౌన్స్, బ్రిడ్జెస్ వంటి వాటికి ఉపయోగిస్తారు. గుండెకు సంబంధించిన కొన్ని శస్త్రచికిత్సా పరికరాలు, అతిపెద్ద వైద్య ఇమేజింగ్ పరికరాల్లో బంగారాన్ని వాడుతున్నారు.నానోటెక్నాలజీబంగారు నానోపార్టికల్స్కు వైద్య రంగంలో మెరుగైన సామర్థ్యం ఉంది. వీటిని క్యాన్సర్ చికిత్స, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ (మందులను లక్షిత ప్రాంతానికి చేర్చడం), జీవసంబంధిత సెన్సార్ల (Biosensors) తయారీలో పరిశోధన కోసం ఉపయోగిస్తున్నారు.గ్లాస్, కిటికీలుకొన్ని భవనాల అద్దాలు, కిటికీలపై సన్నని బంగారు పూతను ఉపయోగిస్తున్నారు. ఈ పూత వేడిని నిరోధించి, లోపల ఉష్ణోగ్రతను చల్లగా ఉంచడానికి సహాయపడుతుంది. తద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తుంది.వెండి వినియోగంవెండి కూడా బంగారంతో సమానంగా విస్తృత పారిశ్రామిక అనువర్తనాలను కలిగి ఉంది. ఇది అన్ని లోహాల్లో అత్యుత్తమ విద్యుత్, ఉష్ణ వాహకతను కలిగి ఉంది.సోలార్ ప్యానెల్స్, విద్యుత్ బ్యాటరీలుప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన వనరుల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో సౌరశక్తి (Solar Energy) రంగంలో వెండి వినియోగం కీలక పాత్ర పోషిస్తోంది. ఫోటోవోల్టాయిక్ సెల్స్లో విద్యుత్తును సేకరించి సరఫరా చేయడానికి వెండి పేస్ట్లను (Silver Paste) వాడుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే కొన్ని రకాల బ్యాటరీల్లో కూడా వెండిని వాడుతున్నారు.ఎలక్ట్రానిక్స్, కండక్టర్లువెండి అత్యుత్తమ విద్యుత్ వాహకతను కలిగి ఉండటం వల్ల అధిక పనితీరు గల ఎలక్ట్రానిక్ ఉపకరణాలలో సర్క్యూట్ బోర్డులు, స్విచ్లు, ఫ్యూజులు, కనెక్టర్లలో దీన్ని ఉపయోగిస్తారు. ముఖ్యంగా అధిక విశ్వసనీయత అవసరమయ్యే పరికరాలలో దీని వినియోగం తప్పనిసరి అవుతోంది.పారిశ్రామిక రసాయనాలు, ఉత్ప్రేరకాలువెండిని రసాయన పరిశ్రమల్లో ఉత్ప్రేరకాలుగా (Catalysts) వాడుతున్నారు. ఉదాహరణకు, ఫార్మాల్డిహైడ్ ఉత్పత్తిలో (ఇది అనేక ప్లాస్టిక్ల తయారీలో ముఖ్యమైనది) ఇది ప్రముఖంగా ఉపయోగపడుతుంది.నీటి శుద్ధి, వైద్య రంగంవెండికి బలమైన యాంటీమైక్రోబియల్ (సూక్ష్మజీవులను నాశనం చేసే) లక్షణాలు ఉన్నాయి. ఈ కారణంగా దీన్ని నీటి శుద్ధి పద్ధతుల్లో, కొన్ని వైద్య ఉపకరణాలు, కట్టులు (Bandages) తయారీలో వాడుతున్నారు. ఆసుపత్రి పరికరాలపై క్రిమిసంహారక పూతగా కూడా వెండిని ఉపయోగిస్తున్నారు.ఫొటోగ్రఫీసాంప్రదాయ ఫిల్మ్ ఫొటోగ్రఫీలో ఫిల్మ్, పేపర్పై కాంతిని గుర్తించడానికి వెండి హాలైడ్లను విస్తృతంగా వాడుతున్నారు. డిజిటల్ ఫొటోగ్రఫీ రాకతో ఈ వినియోగం తగ్గినప్పటికీ ప్రత్యేక ఫొటోగ్రఫీ రంగాలలో ఇంకా ఉపయోగిస్తున్నారు.ఇదీ చదవండి: జరిమానా చెల్లించి, తప్పు అంగీకరిస్తే కేసు మూసివేత!బంగారం, వెండి వాటి ప్రత్యేక భౌతిక, రసాయన లక్షణాలు ఆధునిక సాంకేతిక ప్రపంచంలో వాటి వినియోగాన్ని అనివార్యంగా మార్చాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, సోలార్ ఎనర్జీ, ఏరోస్పేస్, వైద్య పరికరాలు వంటి కీలక రంగాలలో పెరుగుతున్న డిమాండ్ ఈ లోహాల ధరల పెరుగుదలకు ఒక బలమైన పారిశ్రామిక కోణాన్ని జోడిస్తోంది. భవిష్యత్తులో సాంకేతిక ఆవిష్కరణలు పెరిగే కొద్దీ ఈ అమూల్యమైన లోహాల వినియోగం, వాటి విలువ మరింత పెరిగే అవకాశం ఉంది. -
తక్కువ ధరలో కొత్త రీఛార్జ్ ప్లాన్: రెండు రోజులే ఛాన్స్
ప్రభుత్వ టెలికాం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL).. భారతదేశంలో 4జీ నెట్వర్క్ను పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో అధికారికంగా ప్రారంభించింది. వినియోగదారుల కనెక్టివిటీని పెంచడానికి, బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే దాదాపు లక్ష కొత్త 4G టవర్లను ఏర్పాటు చేసింది. కాగా 4జీ నెట్వర్క్ని ఏడాదిలోగా 5జీకి అప్గ్రేడ్ చేయనున్నట్లు టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ఇప్పటికే వెల్లడించారు. ఈ తరుణంలో ఒక స్పెషల్ రీఛార్జ్ ప్లాన్ (రూ.1999) కూడా పరిచయం చేసింది.బీఎస్ఎన్ఎల్ 1999 రూపాయల రీఛార్జ్ ప్లాన్.. 330 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ ఇంకో రెండు రోజలు (అక్టోబర్ 15) మాత్రం అందుబాటులో ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది.ప్రయోజనాలు➤కాలింగ్: భారతదేశం అంతటా అపరిమిత కాలింగ్, ఉచిత జాతీయ రోమింగ్ కూడా.➤డేటా: రోజుకు 1.5జీబీ హై-స్పీడ్ డేటా, మొత్తం డేటా 495జీబీ➤ఎస్ఎమ్ఎస్: రోజుకు 100 ఫ్రీ ఎస్ఎమ్ఎస్లు➤స్పెషల్ ఆఫర్: బీఎస్ఎన్ఎల్ వెబ్సైట్ లేదా సెల్ఫ్కేర్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే.. 2 శాతం వరకు అదా చేయవచ్చు.ఓటీటీ బెనిఫిట్స్ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకునే బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు.. 350 కంటే ఎక్కువ టీవీ ఛానల్స్, వివిధ ఓటీటీ అప్లికేషన్లకు యాక్సెస్ పొందవచ్చు. ప్రీమియం ఛానెల్స్, అదనపు ఓటీటీ కంటెంట్ యాక్సెస్ కోసం యూజర్ BiTVకి ప్రీమియం సబ్స్క్రిప్షన్ను ఎంచుకోవచ్చు. మొత్తం మీద ఇతర టెలికాం కంపెనీల ప్లాన్స్ కంటే.. బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ ప్రయోజనకారిగా ఉంటుందని తెలుస్తోంది. -
3వ తరగతి నుంచే ఏఐ పాఠాలు! ప్రభుత్వం నిర్ణయం..
భారతదేశ విద్యారంగం చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకోబోతోంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా 3వ తరగతి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను పాఠశాల పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించింది. సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే భవిష్యత్తు కోసం విద్యార్థులను సన్నద్ధం చేయడం, చిన్న వయసు నుంచే డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడం దీని ప్రధాన లక్ష్యం. ఈ చర్య జాతీయ విద్యా విధానం (NEP)-2020కి అనుగుణంగా ఉంది. ఇది సాంకేతిక ఆవిష్కరణలు, నైపుణ్యాల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి పెడుతుంది.ముఖ్య ఉద్దేశాలు.. సన్నద్ధతవిద్యలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏకీకృతం చేయడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని ఈ కార్యక్రమం సూచిస్తుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) వివిధ గ్రేడ్ స్థాయిల్లో సమర్థవంతమైన ఏఐ విద్యను అందించడానికి ఒక సమగ్ర ఫ్రేమ్వర్క్ను అభివృద్ధి చేస్తోంది. ఏఐ భావనలను సమర్థవంతంగా బోధించడానికి దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా ఉపాధ్యాయులకు ఈ కార్యక్రమంలో భాగంగా శిక్షణ ఇవ్వనున్నారు. విద్యార్థులు డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు భవిష్యత్తులో సిద్ధంగా ఉన్నారని నిర్ధారించడం ఈ ప్రణాళిక అంతిమ లక్ష్యంగా విద్యాశాఖ పేర్కొంది.విద్యార్థులపై ఏఐ ప్రభావం🚨 India will introduce Artificial Intelligence (AI) in the school curriculum from Class 3 onwards starting 2026-27. - Ministry of Education. pic.twitter.com/IACvizFCCv— Indian Tech & Infra (@IndianTechGuide) October 11, 2025ప్రస్తుతం జనరేటివ్ ఏఐ వేగంగా పురోగమిస్తోంది. చాట్జీపీటీ, జెమినీ, గ్రోక్ఏఐ.. వంటి సాధనాలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విద్యా పద్ధతులను మారుస్తున్నాయి. పాఠశాలల్లో ఏఐ పరిచయం విద్యార్థులకు క్లిష్టమైన ఆలోచన, సమస్య పరిష్కారం, వినూత్న నైపుణ్యాలను పెంపొందించడానికి సహాయపడుతుంది. చిన్నప్పటి నుంచే ఏఐ సాధనాలను ఉపయోగించడం, వాటిని నేర్చుకోవడం వల్ల సంక్లిష్ట సమస్యలను విశ్లేషించి, పరిష్కరించగల సృజనాత్మక పౌరులుగా ఎదగడానికి దోహదపడుతుంది. ఏఐ ఆధారిత నైపుణ్యాల వల్ల భవిష్యత్తులో ఉద్యోగ మార్కెట్లో పోటీపడే అవకాశం ఉంటుంది.గ్రామీణ విద్యార్థుల అవసరాలు.. మౌలిక సదుపాయాలుపట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న డిజిటల్ అంతరాన్ని తగ్గించడం ఏఐ బోధనను దేశవ్యాప్తంగా అమలు చేయడంలో అతిపెద్ద సవాలుగా ఉంది. ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులు పట్టణ ప్రాంత విద్యార్థులతో సమానంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలంటే ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాలను అందించాలి. ఏఐ బోధన క్రమంలో పాఠశాలల్లో తప్పనిసరిగా మెరుగైన మౌలిక సదుపాయాలు అవసరం. ఇందులో హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, ప్రతీ విద్యార్థికి లేదా కనీసం ఇద్దరు విద్యార్థులకు ఒక కంప్యూటర్/ టాబ్లెట్ అందుబాటులో ఉండాలి. నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా జాగ్రత్తపడాలి.మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్న గ్రామాల్లో పాఠశాల సమయం తర్వాత కూడా విద్యార్థులు ఏఐ, కంప్యూటర్లను ఉపయోగించడానికి వీలుగా ‘కమ్యూనిటీ లెర్నింగ్ కేంద్రాలు’ లేదా ‘డిజిటల్ ల్యాబ్లు’ ఏర్పాటు చేయడం అవసరమని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏఐ బోధన, అభ్యాస సామగ్రిని స్థానిక భాషల్లో అందించడం వల్ల గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఏఐ భావనలను సులభంగా అర్థం చేసుకోగలుగుతారు.ఫీజుల నియంత్రణకు ప్రభుత్వ చర్యలుఈ నూతన ఆవిష్కరణను అడ్డం పెట్టుకుని ప్రైవేట్ పాఠశాలలు ఇప్పటికే ఉన్న అధిక ఫీజులను మరింత పెంచే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితులను నివారించడానికి ప్రభుత్వం తప్పనిసరిగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర స్థాయిలో ఫీజు నియంత్రణ మండలిని బలోపేతం చేసి ఏఐ విద్య పేరుతో విధించే అదనపు ఫీజులపై పారదర్శకతను, నియంత్రణ తీసుకురావాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ బోధన మౌలిక సదుపాయాలను అత్యంత ఉన్నత ప్రమాణాలకు మెరుగుపరచడం ద్వారా ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా నాణ్యమైన విద్యను అందించాలి. ఇది ప్రైవేట్ పాఠశాలలు తమ ఫీజులను అనవసరంగా పెంచకుండా నిరోధించడానికి పరోక్షంగా ఒత్తిడిని సృష్టిస్తుంది. ఏఐ బోధనను పాఠ్యాంశాల్లో చేర్చడం వల్ల అయ్యే వాస్తవ ఖర్చుల ఆధారంగా మాత్రమే ఫీజులను పెంచడానికి అనుమతించే కఠినమైన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేయాలి.ఇదీ చదవండి: బంగారంతో ప్రైవేట్ జెట్ కొనొచ్చు! ఎప్పుడంటే.. -
మ్యూజిక్ కోసం బీట్ బస్టర్స్ - ఇవిగో బెస్ట్ గ్యాడ్జెట్స్
సంగీతం అంటే కేవలం వినిపించే గీతం కాదు, అది ఒక ఊరట, ఉల్లాసం, సంతోషం. మ్యూజిక్ లవర్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ గాడ్జెట్లు మీ సంగీత ప్రయాణాన్ని మరింత ఆనందభరితంగా మార్చగలవు. మీ తీరికవేళలను మరింత ఉల్లాసంగానూ మార్చగలవు.డీజే బాల్బాల్ అంటే కేవలం ఆడుకోవడానికే మాత్రమే పరిమితం కాదు. ఇప్పుడు అదే బాల్ సంగీతం కూడా వినిపిస్తుంది. పేరు ‘ఆడ్ బాల్’. ఈ బాల్ను కాస్త షేక్ చేస్తే డమ్ డమ్, తిప్పితే చిక్ చిక్, ఒక్కసారిగా విసిరేస్తే ఉష్ ఉష్! బంతి గాల్లో ఎగిరినా, మీ చెవుల్లో మాత్రం కిక్ ఇచ్చే మిక్స్ సాంగ్ని వినిపిస్తుంది. డీజే అవ్వాలని కలలు కనే వాళ్లకు, కానీ ఖరీదైన సెటప్ పెట్టలేనివాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్. పిల్లలకు సరదా ఆట వస్తువు, పెద్దలకు ఒత్తిడి తగ్గించే రిలాక్స్ టాయ్. నీటి చినుకులు పడినా ఇబ్బంది లేదు. జేబులో వేసుకుని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. బరువు కేవలం రెండు చాక్లెట్లు తిన్నంతే వంద గ్రాములు. యాప్ సాయంతో కనెక్ట్ చేసి, ముందే రికార్డు చేసిన పాటలను కూడా బంతితో కలిపి మిక్స్ చేయొచ్చు. ధర 99 డాలర్లు, అంటే రూ. 8,786.ఛోటా ప్యాకెట్ బడా ధమాకా!చిన్నగా కనిపించే ఈ మ్యూజెన్ మినీ స్పీకర్ నిజంగా మినీ అని మోసపోకండి. చేతిలో పట్టుకునేంత చిన్నదైనా, సౌండ్ మాత్రం గది మొత్తం మారుమోగేలా మ్యాక్సీగా వినిపిస్తుంది. మెటల్ బాడీతో స్టయిలిష్ లుక్ దీని సొంతం. పసుపు, నీలం, ఆకుపచ్చ, గులాబీ, ఎరుపు ఏ రంగులో చూసినా క్యూట్ గిఫ్ట్లా అనిపిస్తుంది. పైగా లాన్యార్డ్తో వస్తుంది కాబట్టి బ్యాగ్కి, జీన్స్ కి తగిలించుకుని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఆఫీస్ టేబుల్పై పెట్టినా రెట్రో డెకార్లా మెరవడం ఖాయం. బ్లూటూత్ కనెక్టివిటీతో సులభంగా ఫో¯Œ కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఒక్కసారి చార్జ్ చేస్తే దాదాపు నిర్విరామంగా ఏడు గంటల పాటు పనిచేస్తుంది. వాల్యూమ్ పెంచడం, తగ్గించడం, ట్రాక్ మార్చడం అన్నీ ఒకే చేతితో చేసుకునేలా బటన్స్ కూడా ఉంటాయి. త్రీ వాట్స్ పవర్ సౌండ్ క్వాలిటీతో క్లియర్ హైఫై సౌండ్ ఇస్తుంది. ధర 59 డాలర్లు దాదాపు రూ. 5,236.పార్టీకి నవ్వుల ప్యాకెట్ఒక పార్టీకి కావాల్సింది నవ్వులు, సవాళ్లు, కొంచెం గందరగోళం. అచ్చం అలాంటి ఆలోచనతో వచ్చిందే ఈ ‘మిస్ అండర్స్టాడింగ్ సాంగ్స్’ గేమ్. ఇందులోని 300 కార్డుల్లో ప్రతి ఒక్కటి వింతగా, సరదాగా తప్పుగా వినిపించే లిరిక్స్తో నిండిపోయి ఉంటుంది. ఆ కార్డులోని లిరిక్స్ చదివినపుడు నవ్వకుండా ఉండలేరు. కాని, అవి ఒక పాపులర్ పాటకు సంబంధించిన క్లూస్. ఈ ఆటలో రెండు నుంచి ఎనిమిది మంది కలిసి ఆ లిరిక్స్ నిజంగా ఏ పాట నుండి వచ్చిందో గుర్తించేందుకు పోటీ పడతారు. ఒకే గేమ్ రూమ్లో, స్నేహితులతో చక్కగా నవ్వుతూ ఆడవచ్చు, ఎలాంటి సందర్భానికైనా సరిపోయే సరదా గేమ్ ఇది. కాలేజ్ డార్మ్ నైట్, హ్యాపీ అవర్, బ్యాచిలర్ పార్టీ ఏ సందర్భంలోనైనా ఇది ఉల్లాస వాతావరణాన్ని సృష్టిస్తుంది. ధర 18 డాలర్లు. రూ. 1,597. -
ఇన్ బ్రెయిన్
మెదడు పనితీరుపై విశ్లేషణ, కార్యాచరణ సమాచారాన్ని అందించే సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసి, మానసిక వైద్యులకు ఆధునాతన బ్రెయిన్ ఇమేజింగ్–బేస్డ్ ఇన్సైట్స్ను అందించే న్యూరో–ఇన్ఫార్మటిక్స్ ప్లాట్ఫామ్ ‘బ్రెయిన్ సైట్ ఏఐ’ నిర్మించారు రింఝిమ్ అగర్వాల్, ఇమ్మాన్యుయేల్...గత సంవత్సరం ఇండియా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్ట్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడిఎస్సీవో) నుంచి ‘సాఫ్ట్వేర్–యాజ్–ఎ మెడికల్ డివైజ్’ సర్టిఫికెట్ పొందడం ద్వారా ‘బ్రెయిన్సైట్ ఏఐ’ వాణిజ్యపరంగా కీలకమైన మైలురాయిని చేరింది. ఈ సంస్థకు ఇమ్మాన్యుయేల్ సీయివో, రింఝిమ్ అగర్వాల్ సీటీవో.నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ నుంచి రింజిమ్ అగర్వాల్ పీహెచ్డీ చేసింది. ఇమ్మాన్యుయల్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ చేసింది. హెల్త్ కేర్ మేనేజ్మెంట్, టెక్నాలజీ అండ్ పాలసీలలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 సంవత్సరాల అనుభవాన్ని సంపాదించింది. ఆపరేటింగ్ సిస్టమ్ డిజైన్, పబ్లిక్ హెల్త్ అండ్ హెల్త్ కేర్ బిజినెస్లో ఆమెకు అపార అనుభవం ఉంది.‘సీడిఎస్సీవో లైసెన్స్ మాకు వాణిజ్యపరంగా ఉపయోగపడుతుంది. ఈ సంవత్సరం మా ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాం. మా ప్రాడక్స్›్ట వంద ఆస్పత్రులకు చేరువ కావాలనేది మా లక్ష్యం’ అంటుంది ఇమ్మాన్యుయేల్.‘ఆసుపత్రులలో అత్యంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వైద్యులలో న్యూరోసర్జన్లు ఒకరు. మా సాంకేతికత మెదడుకు సంబంధించిన నిర్మాణాత్మక అంశాలకు మాత్రమే కాకుండా లాంగ్వేజ్, కాగ్నిషన్లాంటి వివిధ విధులపై కూడా ఇన్సైట్స్ను అందించగలదు. మా బ్రెయిన్సైట్ ఏఐ సామర్థ్యం సర్జన్లలో ఆసక్తి రేకెత్తించింది’ అంటుంది అగర్వాల్.‘బ్రెయిన్సైట్ ఏఐ’ అందించే సమాచారం సర్జరీల సమయంలో వైద్యులకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఒక కణితి... దేహంలో ఏదైనా కీలక విధులు నిర్వహించే ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంటే, వైద్యులు దానిని చేరుకోవడానికి వేరే ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లడానికి వీలవుతుంది.బ్రెయిన్ ఏఐ ప్రాడక్ట్ ‘వోక్సెల్బాక్స్’ వేగంగా అభివృద్ధి చెందనుంది. మెదడుకు సంబంధించిన నాడీ కణాల కనెక్షన్లను మ్యాప్ చేయడానికి ‘ఫంక్షనల్ మాగ్నెటిక్ రెసోసెన్స్ ఇమేజింగ్’ (ఎఫ్ఎంఆర్ఐ) ఉపయోగ పడుతుంది. ఆ డేటాను ప్రాసెస్ చేసేందుకు ఉపయోగపడేదే ఏఐ–పవర్డ్ ప్రాడక్ట్ వోక్సెల్బాక్స్. రోగ నిర్ధారణ, శస్త్ర చికిత్సలను ప్లాన్ చేయడంలోనూ, చికిత్సను పర్యవేక్షించడంలో సహాయపడేందుకు వీలైన బ్రెయిన్ మ్యాప్స్ను తయారు చేయడంలో ‘వోక్సెల్ బాక్స్’ ఉపయోగపడుతుంది.హెల్త్–టెక్ ఎంటర్ప్రెన్యూర్గా విజయం సాధించిన రింఝిమ్ అగర్వాల్, ఇమ్మాన్యుయేల్ ‘స్నోడ్రాప్’ అనే పేషెంట్ కేర్ యాప్ను కూడా అభివృద్ధి చేశారు. పేషెంట్ల ప్రొఫైల్స్ రూపొందించడంలో, వైద్యప్రకియను మెరుగుపరచడంలో ఇది ఉపయోగపడుతుంది. -
6జీ వ్యవస్థపై ఢిల్లీ డిక్లరేషన్
న్యూఢిల్లీ: 6జీ వ్యవస్థను సురక్షితంగా, స్వేచ్ఛగా, సమ్మిళితంగా ఉంచేందుకు ఉపయోగపడే సూత్రాలకు సంబంధించిన ఢిల్లీ డిక్లరేషన్పై భారత్ 6జీ అలయెన్స్తో పాటు తొమ్మిది అంతర్జాతీయ సంస్థలు సంతకాలు చేశాయి. నెక్ట్స్జీ అలయెన్స్, 6జీ బ్రెజిల్, జపాన్కి చెందిన ఎక్స్జీ మొబైల్ ప్రమోషన్ ఫోరం మొదలైనవి వీటిలో ఉన్నాయి. ఇండియా మొబైల్ కాంగ్రెస్లో భాగంగా నిర్వహించిన ఇంటర్నేషనల్ భారత్ 6జీ సింపోజియంలో దీన్ని ప్రకటించారు. డిజిటల్ అంతరాలను భర్తీ చేసే విధంగా, పట్టణ, గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోనూ విశ్వసనీయమైన.. అఫోర్డబుల్ కవరేజీని అందించే విధంగా 6జీ ఉండాలని సంయుక్త ప్రకటనలో తెలిపాయి. స్వేచ్ఛాయుతమైన, పారదర్శకమైన, నిష్పాక్షికమైన వాతావరణంలో ప్రపంచ దేశాల, ప్రాంతాల, భాగస్వాముల సమాన ప్రాతినిధ్యంతో ప్రమాణాలను రూపొందించాల్సి ఉంటుందని వివరించాయి. పరిశోధనలు, అభివృద్ధి కార్యకలాపాలు, టెస్ట్బెడ్స్, పైలట్ ప్రాజెక్టుల విషయంలో కలిసి పనిచేయాలని పేర్కొన్నాయి. విశ్వసనీయమైన టెక్నాలజీలను, ఓపెన్ ప్రమాణాలను, సుస్థిర నెట్వర్క్లను సమిష్టిగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యతను ఈ డిక్లరేషన్ సూచిస్తోందని భారత్ 6జీ అలయెన్స్ డైరెక్టర్ జనరల్ ఆర్కే పాఠక్ తెలిపారు. 6జీ ట్రయల్స్ 2028లో ప్రారంభమవుతాయని, వాణిజ్యపరంగా వినియోగంలోకి తేవడానికి మరికొన్నాళ్లు పడుతుందనే అంచనాలు నెలకొన్నాయి. ఏఐతో కస్టమర్లకు మెరుగైన సరీ్వసులు .. టెలికం సేవలు 5జీ నుంచి 6జీకి మారుతున్న తరుణంలో సమస్యలేవైనా వస్తే టెలికం నెట్వర్క్ దానంతటదే పరిష్కరించుకునేలా, కస్టమర్లకు మరింత మెరుగైన సరీ్వసులను అందించేలా కృత్రిమ మేథ (ఏఐ) ఉపయోగపడుతుందని ఇండియా మొబైల్ కాంగ్రెస్లో పాల్గొన్న సందర్భంగా కేంద్ర టెలికం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ తెలిపారు. ఏఐని మంచికే ఉపయోగిస్తున్నప్పటికీ దుర్వినియోగమయ్యే రిసు్కలు కూడా ఉన్నందున, ఈ టెక్నాలజీ వినియోగంపై అప్రమత్తత వహించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ‘ఏఐ ఆధారిత టూల్స్ ఏ విధంగా డీప్ ఫేక్స్, వాయిస్ క్లోనింగ్, ఆర్థిక మోసాలు చేసేందుకు దుర్వినియోగమవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి మనం టెలికం నెట్వర్క్లో ఏఐ విషయంలో చాలా అప్రమత్తంగా కూడా ఉండాలి‘ అని మిట్టల్ వివరించారు. టెలికం శాఖ రూపొందించిన ఏఐ ఆధారిత ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ టూల్ని ఉపయోగించి 48 లక్షల అనుమాస్పద లావాదేవీలను బ్లాక్ చేసినట్లు, రూ. 200 కోట్ల నష్టాన్ని నివారించినట్లు పేమెంట్ యాప్స్ అయిన ఫోన్పే, పేటీఎం ప్రకటించాయి. -
డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐదే పెద్ద పాత్ర
న్యూఢిల్లీ: దేశంలో శరవేగంగా పెరుగుతున్న డిజిటల్ చెల్లింపులపై జెనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ గణనీయమైన ప్రభావం చూపించనున్నట్టు పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక తెలిపింది. యూపీఐ ఇకపైనా కీలకంగా ఉంటుందంటూ.. అదే సమయంలో తదుపరి దశ డిజిటల్ చెల్లింపులను క్రెడిట్కార్డులు, భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్) నడిపించొచ్చని అంచనా వేసింది. ఫిన్టెక్, చెల్లింపుల రంగంలో కీలక స్థానాల్లో ఉన్న 175 మంది అభిప్రాయాలను పీడబ్ల్యూసీ ఇండియా తన సర్వేలో భాగంగా తెలుసుకుంది. క్రెడిట్ కార్డు కీలక విభాగంగా ఉంటుందని 65 శాతం మంది చెప్పారు. కార్డు చెల్లింపులు బలంగా వృద్ధి చెందుతాయని 95 శాతం మంది భావిస్తున్నారు. చెల్లింపుల వ్యవస్థ ముఖచిత్రంపై జెనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ ఎంతో ప్రభావం చూపించనున్నట్టు 73 శాతం మంది చెప్పారు. ఐదేళ్లలో మూడింతలు భారత్లో డిజిటల్ చెల్లింపులు ఇక మీదట అధిక వృద్ధి వేగంతో కొనసాగుతాయని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక తెలిపింది. 2030 మార్చి నాటికి మూడింతలు అవుతాయని అంచనా వేసింది. ఆవిష్కరణలకుతోడు రుణ సేవల విస్తరణ, నియంత్రణ సంస్థల మద్దతు, సరికొత్త టెక్నాలజీలను స్వీకరించడం, మారుతున్న వినియోగదారుల వైఖరి డిజిటల్ చెల్లింపుల వేగాన్ని నడిపిస్తాయని పేర్కొంది. ‘‘భారత్లో చెల్లింపుల ఎకోవ్యవస్థ కొత్త దశలోకి అడుగుపెడుతోంది. వచ్చే ఐదేళ్లలో యూపీఐ ఆవిష్కరణలు, సేవల విస్తరణ కొనసాగుతుంది. రుణాల్లో వృద్ధి, బీమా, సంపద కలయికతో డిజిటల్ చెల్లింపులు పెరుగుతాయి’’అని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్ మిహిర్గాంధీ తెలిపారు. వివిధ సాధనాల మధ్య అనుసంధానత ద్వారా ఆవిష్కరణలు–విస్తరణ మధ్య సమతూకం ఉండేలా చూడడం అవసరమన్నారు. 90% చెల్లింపులవే..భారత డిజిటల్ చెల్లింపులకు యూపీఐ వెన్నెముకగా నిలుస్తున్నట్టు, 2024–25లో రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో 90 శాతం యూపీఐ రూపంలోనే ఉన్నట్టు పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక తెలిపింది. క్రెడిట్ కార్డు లావాదేవీలు 2023–24లో 100 మిలియన్ దాటగా, 2030 మార్చి నాటికి 200 మిలియన్కు చేరుకుంటాయని పేర్కొంది. వినియోగదారులు యూపీఐ, క్రెడిట్కార్డులకు ప్రాధాన్యం ఇస్తుండడంతో డెబిట్ కార్డుల వినియోగం ఇకమీదటా తగ్గనున్నట్టు తెలిపింది. -
జియో ఫెస్టివల్ రీచార్జ్ ప్లాన్.. బోలెడు బెనిఫిట్లు
ధంతేరాస్, దీపావళి సందర్భంగా రిలయన్స్ జియో (Reliance Jio) ప్రత్యేక పండుగ రీఛార్జ్ ప్లాన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా రూ.349 ప్లాన్ వినియోగదారులకు 28 రోజుల వ్యాలిడిటీ కలిగి, రోజుకు 2జిబి డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు వంటి బేసిక్ ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, ఇందులో ప్రత్యేక పండుగ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.ముఖ్యమైన ఫెస్టివ్ ఆఫర్లుజియోఫైనాన్స్ గోల్డ్ బోనస్: జియో గోల్డ్లో పెట్టుబడి పెడతే అదనంగా 2శాతం బోనస్ లభిస్తుంది. ఈ బెనిఫిట్ పొందేందుకు 8010000524కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశం.జియోహోమ్ ఉచిత ట్రయల్: స్మార్ట్ హోమ్ ప్రోడక్ట్స్ను ప్రోత్సహించేందుకు, కొత్త కనెక్షన్ తీసుకునే వినియోగదారులకు 2 నెలల జియోహోమ్ ఉచిత ట్రయల్ లభిస్తుంది. ఇందులో హోమ్ ఇంటర్నెట్, స్మార్ట్ డివైసులు, ఎంటర్టైన్మెంట్ సేవలు ఉంటాయి.3 నెలల జియో హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్: ప్రీమియం కంటెంట్ కోసం, జియో 3 నెలల హాట్ స్టార్ మొబైల్/టీవీ సబ్స్క్రిప్షన్ అందిస్తోంది. వినియోగదారులు అదనపు ఛార్జ్ లేకుండా సినిమాలు, వెబ్సిరీస్లు, స్పోర్ట్స్ని ఆస్వాదించవచ్చు.50GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్: డేటా భద్రత కోసం 50 జిబి ఉచిత క్లౌడ్ స్టోరేజ్ లభిస్తుంది. వినియోగదారులు ఫైళ్లను ఎక్కడినుంచి అయినా యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: కొత్త ఫోన్ తీసుకొచ్చిన జియో.. ఇది ఉంటే ఫుల్ సేఫ్టీ! -
టీసీఎస్ గుడ్న్యూస్.. ఈసారి ఎక్కువ బోనస్!
దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తమ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. త్రైమాసిక ఫలితాల వెల్లడి అనంతరం టీసీఎస్ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ సుదీప్ కున్నుమాల్ మాట్లాడుతూ తమ 'సీనియర్' ఉద్యోగులకు వ్యక్తిగత పనితీరు ఆధారంగా అధిక వేరియబుల్ వేతనం మొత్తాన్ని చెల్లిస్తామని చెప్పారు.మునుపటి త్రైమాసికాల్లో చెల్లించిన దానితో పోలిస్తే కంపెనీ ఇప్పుడు అధిక త్రైమాసిక బోనస్ లేదా వేరియబుల్ పే (variable pay) కాంపోనెంట్ చెల్లిస్తుందని కున్నుమాల్ భరోసా ఇచ్చారు. అలాగే 'జూనియర్' స్థాయి ఉద్యోగులకు 100 శాతం వేరియబుల్ వేతనం కాంపోనెంట్ ఇస్తోందని, దీనిని రాబోయే త్రైమాసికాల్లోనూ కొనసాగించాలని యోచిస్తున్నట్లు తెలిపారు."ఇది(వేరియబుల్ పే) మా సంస్థలో ఉన్న త్రైమాసిక బోనస్కు అర్హులైన వారందరినీ కవర్ చేస్తుంది. బహుశా కొత్తగా చేరిన వారు మినహా... కానీ ఇది ఆచరణాత్మకంగా ప్రతి ఒక్కరినీ కవర్ చేస్తుంది. సాధారణంగా, జూనియర్ స్థాయిలో మేము 100 శాతం చెల్లిస్తాము. ఇది కొనసాగుతుంది. అలాగే సీనియర్లకు కూడా ఎక్కువ మొత్తాన్ని చెల్లిస్తాము. ఇది వ్యక్తిగత, యూనిట్ పనితీరు ఆధారంగా ఉంటుంది "అని టీసీఎస్ సీహెచ్ఆర్ఓ పేర్కొన్నారు. -
‘సైలెంట్’గా రాలిపోతున్న ఐటీ ఉద్యోగాలు..
భారతీయ ఐటీ రంగాన్ని "సైలెంట్ లేఆఫ్లు" ముంచెత్తుతున్నాయి. 2023-24 మధ్య సుమారు 25,000 మంది ఇలా ‘నిశ్శబ్దం’గా ఉద్యోగాలు కోల్పోయినట్లు అంచనా. ఈ ఏడాది అంటే 2025 చివరికి ఈ సంఖ్య రెట్టింపు 50,000 నుండి 60,000 వరకు చేరే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ తొలగింపులకు ప్రధాన కారణాలువ్యాపార వృద్ధిలో మందగమనం, సామాన్య ఇంజినీరింగ్ పనులను ఆటోమేట్ చేయగల ఏఐ (AI) టెక్నాలజీ పెరుగుదల, సంస్థలు ఖర్చు తగ్గింపు చర్యలు తీసుకోవడమే ఈ తొలగింపులకు ప్రధాన కారణాలు.కంపెనీలు బహిరంగంగా తొలగింపులు ప్రకటించకుండా, ఉద్యోగులే స్వచ్ఛందంగా రాజీనామా చేసేలా ఒత్తిడి తెచ్చే విధానాలు అనుసరిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఉద్యోగులను ప్రత్యామ్నాయ ఉపాధి వెతుకుకోమని సూచిస్తున్నాయి.ఉదాహరణకు, టీసీఎస్ మార్చి 2026 నాటికి తమ శ్రామిక శక్తిలో 2% తగ్గింపు (సుమారు 12,000 ఉద్యోగాలు) ప్రకటించింది. యాక్సెంచర్ 865 మిలియన్ డాలర్ల వ్యాపార ఆప్టిమైజేషన్ ప్రణాళికలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 11,000 ఉద్యోగాలను తొలగించింది.హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్కు చెందిన ఫిల్ ఫెర్ష్ట్ ప్రకారం.. పనితీరు మూల్యాంకనాలు, నియామకాల తగ్గింపు, కెరీర్ పురోగతికి బ్రేక్ వంటి పద్ధతుల ద్వారా ఉద్యోగులను నిశ్శబ్దంగా తొలగిస్తున్నట్లు స్పష్టమవుతోంది.మారుతున్న టెక్నాలజీ, కాలం చెల్లిన ప్లాట్ఫామ్లు, నూతన నైపుణ్యాల అవసరం కారణంగా స్కిల్స్ అప్గ్రేడ్ తప్పనిసరి అయిందని, లేకపోతే ఉద్యోగాలపై ముప్పు ఉంటుందని టీమ్లీజ్ డిజిటల్ సీఈఓ నీతి శర్మ హెచ్చరిస్తున్నారు.ఈ నిశ్శబ్ద తొలగింపుల వల్ల ఉద్యోగ భద్రతపై అనిశ్చితి పెరుగుతోంది. ఉద్యోగులు తమ నైపుణ్యాలను విస్తరించుకోవడం, కొత్త టెక్నాలజీలపై ప్రావీణ్యం సాధించడం ద్వారా మాత్రమే ఈ సంక్షోభాన్ని అధిగమించగలరు. -
ఫిబ్రవరి నాటికి సావరీన్ ఏఐ నమూనా
భారతదేశపు సావరీన్ కృత్రిమ మేథ (ఏఐ) నమూనాపై కసరత్తు జరుగుతోందని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. ఫిబ్రవరిలో జరిగే ఏఐ ఇంపాక్ట్ సమిట్ నాటికి దీన్ని ఆవిష్కరించే అవకాశం ఉందని ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025లో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఈ ఏడాది ఆఖరు నాటికి ఫౌండేషనల్ మోడల్ సిద్ధం కాగలదని కృష్ణన్ వివరించారు.వచ్చే ఏడాది ఫిబ్రవరి 19, 20 తేదీల్లో ఏఐ ఇంపాక్ట్ సదస్సు రెండు రోజులపాటు జరగనుంది. ఏ దేశమైనా పూర్తిగా సొంత మౌలిక సదుపాయాలు, సిబ్బంది, వనరులతో రూపొందించే ఏఐ మోడల్ను సావరీన్ ఏఐ మోడల్గా వ్యవహరిస్తారు. కృత్రిమ మేథ ప్రభావాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని, అందరూ పాలుపంచుకునేందుకు వీలుండే ప్లాట్ఫాంలను రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కృష్ణన్ చెప్పారు.ఏఐలోకి ఆలస్యంగా అడుగుపెట్టినప్పటికీ, 38,000 జీపీయూలతో (గ్రాఫిక్స్ ప్రాసెసింగ్) కంప్యూట్ మౌలిక సదుపాయాలను భారత్ వేగంగా పెంచుకుందని ఆయన పేర్కొన్నారు. భారత్ అవసరాలకు తగ్గట్లు, రంగాలవారీగా పనికొచ్చే చిన్న మోడల్స్ రూపకల్పనను ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని, ఇలాంటివి ఉత్పాదకతను పెంచుకునేందుకు సహాయకరంగా ఉంటాయని కృష్ణన్ వివరించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 కింద కీలక లక్ష్యాల్లో స్వదేశీ జీపీయూ రూపకల్పన కూడా ఒకటని ఆయన పేర్కొన్నారు. -
జోహో మెయిల్ క్రియేట్ చేసుకోండిలా..
దేశీయ ఈమెయిల్ ఫ్లాట్ ఫామ్ జోహో మెయిల్ ఇటీవల వార్తల్లో నిలుస్తోంది. సురక్షితమైన, ప్రకటన రహిత సేవల కోసం యూజర్లు దేశీయ కంపెనీ ఈమెయిల్ ఫ్లాట్ ఫామ్కు మారుతున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా తన అధికారిక ఈమెయిల్ ఐడీని జోహో మెయిల్ కు మార్చినట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో జోహో మెయిల్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ కథనంలో చూద్దాం..జోహో మెయిల్ (Zoho Mail) వ్యక్తిగత, బిజినెస్ ఈమెయిల్ సర్వీసులు రెండింటిని అందిస్తుంది. మీరు వ్యక్తిగత ఈమెయిల్ ఖాతాను సృష్టించాలని చూస్తున్నట్లయితే, మీరు డొమైన్ లేకుండా వ్యక్తిగత ఖాతా కోసం నేరుగా సైన్ అప్ చేయవచ్చు.సైన్ అప్ చేయడం కోసం జోహో మెయిల్ని సందర్శించి పర్సనల్ ఈమెయిల్ ఎంచుకోండి.ఈమెయిల్ అడ్రస్ కోసం యూజర్నేమ్ ఎంచుకోండి. ఎంచుకునే యూజర్నేమ్ చెల్లుబాటు అయ్యేలా, గౌరవప్రదంగా ఉండాలి. మీ ఈమెయిల్ అడ్రస్ ఈ ఫార్మాట్ లో ఉంటుంది: username@zohomail.com (యూఎస్ డేటా సెంటర్ యూజర్ల కోసం)సంబంధిత చిహ్నాలను క్లిక్ చేయడం ద్వారా మీరు గూగుల్ / ఫేస్ బుక్ / ట్విట్టర్ / లింక్డ్ఇన్ ద్వారా ఫెడరేటెడ్ సైన్-ఇన్ ను ఉపయోగించి ఉచిత ఈమెయిల్ ఖాతా కోసం సైన్ అప్ చేయవచ్చు. ఈ సందర్భంలో కూడా, మీరు యూజర్నేమ్ భాగాన్ని ఎంచుకోవాలి. ఇది ఈమెయిల్ ఖాతాను సృష్టించడానికి అవసరం.మీ కోసం గుర్తుంచుకోవడానికి సులభమైన పాస్ వర్డ్ ను అందించండి. కానీ ఇతరులకు ఊహించడం కష్టంగా ఉండాలి. అక్కడ పేర్కొన్న నియమాలకు అనుగుణంగా పాస్ వర్డ్ ఉండాలి.తర్వాత అక్కడ సూచించిన చోట చోట మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అందించండి.ధృవీకరణ కోసం అవసరమైన మీ ఫోన్ నంబర్ ను అందించండి. (మీ ఏరియా కోడ్ తో సహా 10 అంకెల నెంబరు, ఎలాంటి డ్యాష్ లు లేదా ఖాళీలు లేకుండా)సర్వీస్ నిబంధనలను చదివి, అంగీకరించండి. ఉచిత కోసం సైన్ అప్ బటన్ ను క్లిక్ చేయండి.తర్వాత ఎస్ఎంఎస్ ద్వారా ధృవీకరణ కోడ్ ను అందుకుంటారు. ఖాతాను ధృవీకరించడానికి, ఉపయోగించడానికి ధృవీకరణ కోడ్ నమోదు చేయండిమీ ఈమెయిల్ ఖాతా ఇప్పుడు సిద్ధంగా ఉంది. ఈమెయిల్స్ పంపడానికి, అందుకోవడానికి మీరు దానిని ఉపయోగించడం ప్రారంభించవచ్చు. -
శాంసంగ్ కొత్త ఫోన్ లాంచ్.. బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్లు
Samsung Galaxy M17 5G: స్మార్ట్ఫోన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్లో మరో కొత్త మోడల్ను విడుదల చేసింది. గెలాక్సీ ఎం17 5జీ స్మార్ట్ ఫోన్ శుక్రవారం భారత్లో లాంచ్ అయింది. ఇది అమెజాన్, శాంసంగ్ ఆన్లైన్ స్టోర్లో అందుబాటులో ఉంది. రెండు కలర్ ఆప్షన్లలో లభించే ఈ ఫోన్, ఓఐఎస్తో 50MP ప్రైమరీ కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్తో వస్తుంది. 5MP అల్ట్రావైడ్, 2MP మాక్రో లెన్స్ కూడా ఇందులో ఉన్నాయి. M16 5G కంటే ఇది వేగవంతమైన ప్రాసెసర్, పెద్ద బ్యాటరీని కలిగి ఉంది.ధర & లాంచ్ ఆఫర్4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,499. 6 జీబీ ర్యామ్, 8 జీబీ ర్యామ్ వేరియంట్ల ధరలు వరుసగా రూ.13,999, రూ.15,499. లాంచ్ ఆఫర్ లో భాగంగా కస్టమర్లు 4 జీబీ వేరియంట్ను రూ.11,999లకు 6 జీబీ వేరియంట్ను రూ.13,499 లకు, 8 జీబీ వేరియంట్ను రూ.14,999 ధరకు కొనుగోలు చేయవచ్చు.ప్రధాన ఫీచర్లు» ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ 7» డిస్ప్లే: 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోల్డ్, 1,100 నిట్స్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్» ప్రాసెసర్: ఎక్సినోస్ 1330 చిప్సెట్» ర్యామ్ & స్టోరేజ్: 4GB/6GB/8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ (మైక్రో ఎస్డీ ద్వారా విస్తరించవచ్చు)» కెమెరా:రియర్: 50MP (ఓఐఎస్) + 5MP (అల్ట్రా వైడ్) + 2MP (మాక్రో)ఫ్రంట్: 13MP సెల్ఫీ కెమెరా (వాటర్డ్రాప్ నాచ్లో)ఇతర ఫీచర్లు» బ్యాటరీ: 5,000mAh, 25W ఫాస్ట్ ఛార్జింగ్» సెక్యూరిటీ & అప్డేట్స్: 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్, 6 ఓఎస్ అప్గ్రేడ్స్ హామీ» ఏఐ ఫీచర్లు: సర్కిల్ టు సెర్చ్, గూగుల్ జెమిని లైవ్, వాయిస్ మెయిల్, వాయిస్ ఫోకస్» ఆన్-డివైస్ సెక్యూరిటీ: శాంసంగ్ నాక్స్ వాల్ట్, శాంసంగ్ వాలెట్ఇదీ చదవండి: కొత్త ఫోన్ తీసుకొచ్చిన జియో.. ఇది ఉంటే ఫుల్ సేఫ్టీ! -
అరట్టై ప్రైవసీపై సందేహం: శ్రీధర్ వెంబు రిప్లై ఇలా..
జోహో మెసేజింగ్ యాప్.. అరట్టై (Arattai) గత కొన్ని రోజులుగా అధిక ప్రజాదరణ పొందుతోంది. మెటా యాజమాన్యంలోని వాట్సాప్ యాప్ కంటే కూడా ఎక్కువ ఫీచర్స్ ఉండటం వల్ల, దేశీయ యాప్ కావడం వల్ల ఎక్కువమంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దీనిని ఉపయోగించాలని కేంద్రమంత్రులు కూడా పిలుపునిచ్చారు. అయితే ఇప్పుడు సమాచార గోప్యతకు సంబంధించిన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక నెటిజన్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.మెసేజస్ పంపుకోవడానికి, ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్ వంటివి షేర్ చేసుకోవడానికి.. వాయిస్ కాల్స్ & వీడియో కాల్స్ చేసుకోవడానికి అరట్టై ఉపయోగపడుతుంది. ''అరట్టై చాట్ యాప్ని ఉపయోగిస్తున్నప్పుడు భార్యాభర్తలు షేర్ చేసుకునే ఫోటోలు ఎంతవరకు గోప్యంగా ఉంటాయని'' ఒక యూజర్ అడిగారు. దీనిని 'నన్ను నమ్మండి బ్రో' అంటూ జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు (Sridhar Vembu) పేర్కొన్నారు.యూజర్ల గోప్యతను దృష్టిలో ఉంచుకునే యాప్ రూపొందించామని, వినియోగదారుల భద్రతకు ఎలాంటి భంగం కలగదని శ్రీధర్ వెంబు పేర్కొన్నారు. దీనికోసం ప్రత్యేకంగా 'ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్' కూడా రాబోతోందని ఆయన అన్నారు. నమ్మకం చాలా విలువైనది.. మేము ప్రపంచ మార్కెట్లో ప్రతిరోజూ ఆ నమ్మకాన్ని సంపాదిస్తున్నాము. మా వినియోగదారుల నమ్మకాన్ని మేము నెరవేరుస్తూనే ఉంటామని వెంబు స్పష్టం చేశారు.ఇదీ చదవండి: గ్రోక్ ఏఐ వీడియో: స్పందించిన మస్క్ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. వాట్సాప్ ప్రారంభమైన తరువాత ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ 2016 వరకు అందుబాటులో లేదు. అరట్టై కొత్తది కాబట్టి.. ఇందులో కూడా అలాంటి ఫీచర్ తప్పకుండా వస్తుందని ఒక యూజర్ పేర్కొన్నారు. ఎవరైనా ఒక మంచి చేస్తుంటే బెదిరించడానికి ప్రయత్నించవద్దని.. ఇంకొకరు అన్నారు. ఏదైనా లోపాలను గుర్తించి మెరుగుపరచడంలో సహాయపడటం మంచిది. ఉద్దేశాలు మంచిగా ఉండాలి, సామాజిక వ్యాఖ్యాతల ఆధారంగా పక్షపాతంతో ఉండకూడదని మరొకరు పేర్కొన్నారు.I asked the Zoho founder how private the pictures shared between a husband and wife are when using the Arattai chat app. His response: "Trust me, bro!" pic.twitter.com/7MeRQrmVik— Ravi (@tamilravi) October 8, 2025 -
గ్రోక్ ఏఐ వీడియో: స్పందించిన మస్క్
టెక్నాలజీ రంగంలో.. ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ 'ఎలాన్ మస్క్' మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇందులో భాగంగానే ఈయన తన ఏఐ వీడియో జనరేషన్ ప్లాట్ఫామ్ గ్రోక్ ఇమాజిన్కు సంబంధించిన కొత్త వెర్షన్ 0.9ని ప్రవేశపెట్టారు. ఈ కొత్త వెర్షన్.. ఇప్పటికే రియాలిటీగా కనిపించే వీడియోలను సృష్టించగల సామర్థ్యంతో యూజర్లను తెగ ఆకట్టుకుంది.ఇండియన్ కంటెంట్ క్రియేటర్ ప్రశాంత్.. ప్రముఖ హాలీవుడ్ చిత్రం ఐరన్ మ్యాన్ నుంచి ఒక సన్నివేశాన్ని.. రీక్రియెట్ చేసి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసారు. ఇక్కడ కనిపించే వ్యక్తి మస్క్ను పోలి ఉన్నారు. వీడియో మొత్తం ఎడారి ప్రాంతం కనిపిస్తుంది. వీడియో షేర్ చేస్తూ.. ''గ్రోక్ ఇమాజిన్ 0.9 సినిమా నిర్మాణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దింది. ఐకానిక్ ఐరన్ మ్యాన్ దృశ్యాన్ని తిరిగి ఊహించుకున్నాను. ఇందులో విజువల్ క్వాలిటీ, ఆడియో జనరేషన్ వంటివి నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇది అద్భుతమైన మోడల్'' అని అన్నారు. దీనిపై మస్క్ స్పందిస్తూ.. 'గ్రోక్ ఇమాజిన్ వెర్షన్ 0.9 నాట్ బ్యాడ్' అని అన్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. గ్రోక్ 0.9 వెర్షన్ ఇంత అద్భుతంగా ఉంటే.. 1.0 ఎలా ఉంటుందో అని ఒకరు అన్నారు. గ్రోక్ రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతాలను సృష్టిస్తుందని ఇంకొకరు అన్నారు.Not bad for Grok Imagine version 0.9 … https://t.co/ihIzdVOylj— Elon Musk (@elonmusk) October 9, 2025 -
రూ.3.4 కోట్ల జాబ్ మానేసింది.. ‘ఉద్యోగం ఓకే కానీ..’
టెక్ దిగ్గజం గూగుల్లో ఉన్నత స్థాయి ఉద్యోగం.. భారీ వేతనం అయినా అన్నీ వదిలేసిందో ఓ ఉద్యోగిని. గూగుల్ జ్యూరిచ్ కార్యాలయంలో సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్గా పని చేసిన ఫ్లోరెన్స్ పోయిరెల్, ఏడానికి రూ. 3.40 కోట్లు (390,000 డాలర్లు) సంపాదించేవారు. అయినప్పటికీ, ఎక్కువ సమయం తన ప్రియమైన వారితో గడపాలని ఆకాంక్షతో ఆమె ఉద్యోగాన్ని వీడి, జీవితాన్ని మెల్లగా ఆస్వాదించేందుకు నిర్ణయం తీసుకున్నారు."పని మంచిగా అనిపించేది కానీ జీవితం ఇంకా గొప్పది" అని ఫ్లోరెన్స్ చెబుతారు. ఆమె 37 ఏళ్ల వయసులో ఉద్యోగానికి గుడ్బై చెప్పింది. బర్న్ అవుట్ కాకపోయినా, జీవితం అసలైన అర్థాన్ని తెలుసుకోవాలని ఆమెకు ఆసక్తి పెరిగింది. తన జీవిత భాగస్వామి జాన్ (తన కంటే 17 ఏళ్లు పెద్దవాడు, అతను కూడా గూగుల్ ఉద్యోగే)తో గడిపే సమయం చాలా విలువైనదని ఆమె గుర్తించారు.2024 నాటికి 1.5 మిలియన్ డాలర్లు (రూ. 12.6 కోట్లు) ఆదా చేసిన ఫ్లోరెన్స్, FIRE (Financial Independence, Retire Early) భావనతో ప్రేరితమై, ఉద్యోగం మానేసి 18 నెలల "మినీ రిటైర్మెంట్" తీసుకుంది. ఈ సమయంలో ఆమె జాన్తో కలిసి ప్రయాణాలు చేస్తూ, జీవితాన్ని తానే నిర్ణయించే వేగంతో అనుభవిస్తున్నారు.ఇప్పుడు ఆమె జ్యూరిచ్ సరస్సులో ఈత కొడుతూ, కెరీర్ కోచింగ్ అందిస్తూ, జీవితం యొక్క అందాన్ని ఆస్వాదిస్తోంది. "జీవితం చిన్నది, అందమైనది. దానిని మీరు ప్రేమించే వ్యక్తులతో గడపడంమే నిజమైన ఆనందం" అని ఫ్లోరెన్స్ తేల్చి చెప్పింది. -
అరట్టై అదుర్స్.. ఆ రెండింటిలో లేని ఫీచర్ ఇదే..
డిజిటల్ కమ్యూనికేషన్ యుగంలో గోప్యత, ఫైల్ షేరింగ్, ఆటోమేషన్ సామర్థ్యాలు వినియోగదారులు తమ ఇష్టపడే మెసేజింగ్ యాప్లను ఎంచుకోవడానికి కీలక నిర్ణయం తీసుకునే కారకాలుగా మారాయి. ఇంక్42 (Inc42) రీసెర్చ్ కొత్త తులనాత్మక విశ్లేషణ మూడు ప్రసిద్ధ ప్లాట్ ఫామ్లు - స్వదేశీ అరట్టై, వాట్సాప్,టెలిగ్రామ్లలో ఏవీ దేనికి ప్రత్యేకమో.. వీటిలో మన అరట్టై ఏ ఫీచర్లో గొప్పదో తెలియజేస్తోంది.అరట్టైజోహో సంస్థ అరట్టై యాప్ను అభివృద్ధి చేసింది. భారతీయ వినియోగదారుల కోసం రూపొందించిన ఈ యాప్ ప్రైవసీ-ఫస్ట్ ప్రత్యామ్నాయంగా ఉంది. ఇందులో యూజర్ల డేటాను ఇతరులకు విక్రయించడం ఉండదు. యాప్లోని అంతర్నిర్మిత విజిల్ బ్లోయర్ ఫీచర్ నిఘా, డేటా మానిటైజేషన్ గురించి ఆందోళన చెందే వినియోగదారులకు నిశ్చింత కలిగిస్తుంది. ఎన్క్రిప్షన్ వాయిస్ కాల్స్కే పరిమితం అయినప్పటికీ, దీని పారదర్శకత, స్థానిక మూలాలు గోప్యత-స్పృహ ఉన్న భారతీయ వినియోగదారులకు కచ్చితమైన ఎంపికగా చేస్తాయి.వాట్సాప్వాట్సాప్ భారతదేశంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్గా ఉంది. మెరుగైన ఇంటర్ ఫేస్, వ్యాపార సాధనాలతో కూడిన డీప్ ఇంటిగ్రేషన్తో ఆదరణ పొందింది. అయితే మాతృ సంస్థ మెటాతో దాని డేటా-షేరింగ్ పద్ధతులపై ఆందోళనలు కొనసాగుతున్నాయి.టెలిగ్రామ్టెలిగ్రామ్ దాని భారీ గ్రూప్లు / ఛానెల్ సామర్థ్యాలకు, బాట్లు, ఆటోమేషన్ కు సపోర్ట్ చేసే ఓపెన్ API కోసం ప్రత్యేకంగా నిలుస్తుంది. దాని ఎన్ క్రిప్షన్ ప్రోటోకాల్ లు, విజిల్ బ్లోయర్ ఫ్రెండ్లీ వైఖరి ప్రాచుర్యం పొందాయి.ఫీచర్అరట్టైవాట్సాప్టెలిగ్రామ్టెక్స్ట్, మీడియా, డాక్స్✅ సపోర్ట్✅ సపోర్ట్✅ సపోర్ట్ఎండ్-టు-ఎండ్ ఎన్ క్రిప్షన్వాయిస్ కాల్స్ మాత్రమేవాయిస్, వీడియో, టెక్స్ట్వాయిస్, వీడియో, టెక్స్ట్గ్రూప్ సైజ్ లిమిట్1,000 మంది1,024 మందిఅపరిమితం (ఛానెళ్ల ద్వారా)డేటా వినియోగండేటా విక్రయం ఉండదుకొంత డేటాను పంచుకుంటుందిదాదాపు ప్రైవేటుఫైల్ సైజ్ లిమిట్2 GB వరకు2 GB వరకు2–4 GBబాట్లు/ ఆటోమేషన్❌ లేదు✅ బిజినెస్ బాట్స్✅ ఓపెన్ API బాట్సెక్యూరిటీ విజిల్ బ్లోయర్✅ ఉంది❌ లేదు✅ ఉంది -
కొత్త ఫోన్ తీసుకొచ్చిన జియో.. ఇది ఉంటే ఫుల్ సేఫ్టీ!
రిలయన్స్ జియో సరికొత్త ఫోన్ను తీసుకొచ్చింది. ఢిల్లీలో జరుగుతున్న ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2025 సదస్సులో వివిధ సేఫ్టీ ఫీచర్లతో కూడిన జియోభారత్ ఫోన్లను ప్రవేశపెట్టింది. ఫోన్ పర్యవేక్షణ, వినియోగ నిర్వహణ, కుటుంబ సభ్యులు, పిల్లలు, వృద్ధులకు సంబంధించిన హెల్త్ వంటి సేఫ్టీ-ఫస్ట్ ఫీచర్లను ఈ ఫోన్లో తీసుకొచ్చింది.వినియోగదారులకు భద్రతతోపాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చేలా రూపొందించిన జియోభారత్ ఫోన్లను ఐఎంసీ సదస్సులో రిలయన్స్ ఆవిష్కరించింది. అంతేకాకుండా వైట్-లిస్టింగ్ ద్వారా అవాంఛిత కాల్స్ , కాలర్లను నివారించడంలో సేఫ్టీ షీల్డ్ సహాయపడుతుంది. ఇక అత్యంత ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే కుటుంబ సభ్యుల వద్ద ఉన్న జియోఫోన్లో బ్యాటరీ , నెట్ వర్క్ లభ్యత స్థితిని రిమోట్ గా పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. ఇక ఫోన్ బ్యాటరీ బ్యాకప్ ఏడు రోజుల వరకు ఉంటుందని జియో పేర్కొంది.జియోభారత్ ఫోన్ సేఫ్టీ షీల్డ్ మరిన్ని ప్రయోజనాలను రిలయన్స్ జియో అధ్యక్షుడు సునీల్ దత్ వివరించారు. ఈ ఫోన్లు ముఖ్యంగా కుటుంబంలోని పిల్లలు, పెద్దవారి కోసం రూపొందించినట్లు చెప్పారు. ఈ ఫోన్లు వినియోగిస్తున్న తమ వారు ఎక్కడ ఉన్నారు.. వారి ఫోన్లు ఎక్కడ ఉన్నాయో మీరు పర్యవేక్షించగలుగుతారు. ఒకవేళ కనిపించక పోయినట్లయితే ఫోన్లోని అలారాన్ని మోగించవచ్చు.జియోభారత్ ఫోన్లను జియో స్టోర్స్, జియోమార్ట్, అమెజాన్, స్విగ్గీ ఇన్స్టామార్ట్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా కొనుగోలుచ చేయవచ్చు. జియోభారత్ ఫోన్ల ధర రూ.799 నుంచి ప్రారంభమవుతుంది. -
ఫొటోలకు ప్రాణం పోసేలా వీడియో.. గ్రోక్ ఏఐ కొత్త ఫీచర్
ఎక్స్ఏఐ (xAI) రూపొందించిన గ్రోక్ఏఐ (GrokAI) యాప్లో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టినట్లు ఎలాన్మస్క్ తెలిపారు. పాత, కొత్త ఫొటోలను అప్లోడ్ చేసి కేవలం 20 సెకన్లలో వాటిని వీడియోలుగా మార్చేయవచ్చని చెప్పారు. ఈ నూతన సాంకేతికత కృత్రిమ మేధ (Artificial Intelligence) ద్వారా కేవలం ఒక చిత్రాన్ని తీసుకొని దానికి కదలిక (Motion), అనుగుణమైన శబ్దం (Audio) జోడించి 20 సెకన్లలో 6 నుంచి 15 సెకన్ల నిడివి గల వాస్తవిక దృశ్యం (Photorealistic video)లాగా మార్చగలుగుతోంది. గ్రోక్ఏఐ ‘గ్రోక్ ఇమాజిన్’ (Grok Imagine) ఫీచర్ ద్వారా చారిత్రక చిత్రాలు, ఫ్యామిలీ ఫొటోలు లేదా కార్టూన్ పాత్రలను సజీవంగా మార్చవచ్చని కంపెనీ చెబుతుంది.Upload any photos from your phone or take a picture of an old photo and turn it into a video in 20 seconds with the Grok app! https://t.co/ouHoufWeqG— Elon Musk (@elonmusk) October 7, 2025బనానా ఏఐఫొటోలు అప్లోడ్ చేసి వీడియోలు మార్చే క్రమంలో గ్రోక్ఏఐ ముందున్నా, ఇదే తరహా కృత్రిమ మేధ సామర్థ్యాలను బనానా ఏఐ (Banana AI) కలిగి ఉంది. ఇది గూగుల్ జెమిని 2.5 ఫ్లాష్ ఇమేజ్ (Gemini 2.5 Flash Image) మోడల్కు చెందింది. బనానా ఏఐ ప్రధానంగా ఫోటోలను మెరుగుపరచడం, వాటిని మార్చడం, కొత్త చిత్రాలను సృష్టించడం (Text-to-Image) వంటి వాటికి ప్రసిద్ధి చెందింది.ప్రస్తుతం బనానా ఏఐ ఫోటో-టు-వీడియో ఫీచర్ కాకుండా ఫొటో ఎడిటింగ్ వంటి వాటిలో వినియోగదారులకు సహాయపడుతుంది. ఉదాహరణకు వినియోగదారులు తమ సాధారణ ఫొటోలను ‘రెట్రో చీరలు ధరించిన వింటేజ్ ఫొటోలు’గా మార్చడానికి దీన్ని వాడుతున్నారు. ఈ రెండు కంపెనీలు (గ్రోక్, గూగుల్) వేర్వేరు మార్గాల్లో కంటెంట్ సృష్టికి కొత్త దిశానిర్దేశం చేస్తున్నాయి.మానసిక స్వాంతనతమ పాత ఫొటోకు ప్రాణం పోసినప్పుడు నెజిజన్లకు అపూర్వమైన భావోద్వేగ అనుభూతి కలుగుతుంది. దశాబ్దాల నాటి కుటుంబ ఫొటోలు, గతించిపోయిన ప్రియమైన వారి చిత్రాలు వీడియోలుగా మారినప్పుడు గతాన్ని మళ్లీ అనుభూతి చెందే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ వల్ల సంతోషం, సంతృప్తి, లోతైన భావోద్వేగ బంధం ఏర్పడతాయి. తమ ఊహలకు రూపం ఇచ్చేందుకు, పాత కథలకు దృశ్యరూపం కల్పించేందుకు ఈ ఫీచర్ వీలు కల్పిస్తుంది. ఈ సృజనాత్మకత ఒక విధమైన మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది.వ్యాపార అవకాశాలుఏఐ ఆధారిత ఫోటో-టు-వీడియో టెక్నాలజీ కేవలం వ్యక్తిగత భావోద్వేగాలకే పరిమితం కాకుండా కంపెనీలకు వ్యాపార అవకాశాలను సృష్టిస్తోంది. గ్రోక్ఏఐ ఈ అధునాతన ఫీచర్ను సాధారణంగా ‘సూపర్ గ్రోక్’ (Super Grok) వంటి పెయిడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ల్లో అందిస్తుంది. దీని ద్వారా వినియోగదారుల నుంచి స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. అధిక నాణ్యత (High-quality), ఎక్కువ నిడివి గల వీడియోల కోసం ప్రీమియం సబ్స్క్రిప్షన్ను తీసుకోవాల్సి ఉంటుంది.కంటెంట్ క్రియేటర్ల మార్కెట్నేటి సోషల్ మీడియా యుగంలో కంటెంట్ క్రియేటర్లకు వీడియో అత్యంత ముఖ్యమైన సాధనం. ఈ ఏఐ టూల్స్ ద్వారా నిమిషాల్లో ప్రొఫెషనల్ స్థాయి వీడియోలను సృష్టించవచ్చు. దీనివల్ల సోషల్ మీడియా మార్కెటింగ్, యాడ్స్, షార్ట్ ఫిల్మ్ల తయారీకి అయ్యే ఖర్చు, సమయం గణనీయంగా తగ్గుతుంది. ఈ విధంగా కంటెంట్ తయారీ ప్లాట్ఫామ్లు (FlexClip వంటివి) కూడా ఏఐ ఆధారిత ఫీచర్లను తమ వ్యాపారంలో భాగం చేసుకుంటున్నాయి.ఇదీ చదవండి: ఉద్యోగం చేస్తూనే కోట్లు సంపాదించే మార్గాలు.. -
కప్పు టీ కన్నా చౌకగా డేటా!
న్యూఢిల్లీ: డిజిటల్ రంగంలో భారత్ వేగంగా వృద్ధి చెందుతోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఓ కప్పు టీ రేటు కన్నా 1 జీబీ డేటా చౌకగా లభిస్తుండటం దీనికి నిదర్శనమని తెలిపారు. ఒకప్పుడు 2జీ టెలికం సర్వీసుల లభ్యత కూడా కష్టంగా ఉండేదని, ప్రస్తుతం దానికి అనేక రెట్లు మెరుగైన 5జీ సర్వీసులు దేశవ్యాప్తంగా దాదాపు ప్రతి జిల్లాలోనూ లభిస్తున్నాయని పేర్కొన్నారు. డేటా వినియోగంలో ప్రస్తుతం ప్రపంచంలోనే టాప్ దేశాల్లో ఒకటిగా భారత్ నిలుస్తోందని తెలిపారు. డిజిటల్ మౌలికసదుపాయాల కల్పనపై ప్రభుత్వానికి గల చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)ని ప్రారంభించిన సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విధానాలు, వ్యాపారాలకు అనువైన పరిస్థితులు మొదలైన అంశాల దన్నుతో భారత్.. పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలుస్తోందని ప్రధాని చెప్పారు. సంస్కరణలను మరింత వేగవంతం చేస్తున్నామన్నారు. సెమీకండక్టర్లు, మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ మొదలైన వాటి తయారీకి భారత్లో అపార అవకాశాలు ఉన్నాయని మోదీ వివరించారు. మరింతగా పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని ఆయన చెప్పారు. దీన్ని అందిపుచ్చుకునేందుకు పరిశ్రమలు, ఆవిష్కర్తలు, స్టార్టప్లు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘తయారీ కార్యకలాపాలు మొదలుకుని సెమీకండక్టర్లు, మొబైల్స్, ఎల్రక్టానిక్స్ వరకు అన్నింటా దేశం పురోగమిస్తోంది. వివిధ రంగాల్లో స్టార్టప్ల సందడితో దేశీయంగా పరిస్థితులు చాలా ఆశావహంగా ఉన్నాయి. భారత్లో తయారీ కార్యకలాపాలకు, పెట్టుబడులు పెట్టేందుకు, నవకల్పనలను ఆవిష్కరించేందుకు ఇదే సరైన సమయం’’ అని ఆయన చెప్పారు. రూ. 900 కోట్లతో శాట్కామ్ పర్యవేక్షణ వ్యవస్థ: సింధియా దేశ స్పెక్ట్రం అసెట్స్ను, డేటా వనరులను పరిరక్షించే దిశగా నేషనల్ శాట్కామ్ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రూ. 900 కోట్లు కేటాయించిందని టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. టెలికం, బ్రాడ్కాస్టింగ్ కలిపి భారతీయ శాట్కామ్ మార్కెట్ గతేడాది 4.3 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2033 నాటికి 14.8 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నట్లు చెప్పారు. 6జీ పేటెంట్లకు సంబంధించి 10 శాతం వాటా దక్కించుకోవాలని నిర్దేశించుకున్నట్లు సింధియా వివరించారు. పేమెంట్ యాప్లతో రూ. 200 కోట్ల మోసాల నివారణ టెలికం శాఖ రూపొందించిన ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ (ఎఫ్ఆర్ఐ) ప్లాట్ఫాంని ఉపయోగించి అనుమానాస్పద లావాదేవీలని బ్లాక్ చేయడం ద్వారా ఫోన్పే, పేటీఎంలాంటి పేమెంట్ యాప్లు సుమారు రూ. 200 కోట్ల ఆర్థిక మోసాలను నివారించాయి. ఎఫ్ఆర్ఐ డేటా ప్రకారం ఈ రెండు సంస్థలు 10 లక్షలకు పైగా ఖాతాలు, వాలెట్లను ఫ్రీజ్ చేశాయి. ఫోన్పే సహ వ్యవస్థాపకుడు రాహుల్ చారి ఈ విషయాలు తెలిపారు. త్వరలో శాట్కామ్ సర్వీసులు..: మిట్టల్ శాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీసులను ప్రారంభించడంపై యూటెల్శాట్ వన్వెబ్ కసరత్తు చేస్తోందని భారతి ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ తెలిపారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే సర్వీసులు మొదలవుతాయని పేర్కొన్నారు. మరోవైపు, సురక్షితమైన విధంగా అత్యంత నాణ్యమైన బ్రాడ్బ్యాండ్ సేవలను అందించడంపై ఆసక్తిగా ఉన్నట్లు స్టార్లింక్ ఇండియా మార్కెట్ యాక్సెస్ డైరెక్టర్ పరి్నల్ ఊర్ధ్వరేషే తెలిపారు. ఈ విషయంలో టెలికం శాఖతో పాటు విభాగాలన్నీ చక్కటి సమన్వయంతో పని చేస్తున్నాయని చెప్పారు. అటు, కొత్త ఆవిష్కరణలపై మరింతగా దృష్టి పెడుతూ, డిజిటల్ విప్లవంలో భారత్ను అగ్రగామిగా నిలబెట్టేందుకు తాము కట్టుబడి ఉన్నామని రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ చెప్పారు.స్టార్టప్ వ్యవస్థకు దన్ను .. టెలికం టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్, డిజిటల్ కమ్యూనికేషన్స్ ఇన్నోవేషన్స్ స్క్వేర్ మొదలైన వాటితో స్టార్టప్ వ్యవస్థకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందని ప్రధాని చెప్పారు. అలాగే 5జీ, 6జీ, అధునాతన ఆప్టికల్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీలను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు ఉపయోగపడే టెస్ట్ బెడ్స్కి నిధులు కూడా సమకూరుస్తోందన్నారు. సైబర్ సెక్యూరిటీకి గణనీయంగా ప్రాధాన్యం ఇస్తున్నామని, సైబర్ మోసాలను కట్టడి చేసేందుకు కఠినతరమైన చట్టాలు చేశామని ప్రధాని చెప్పారు. మొబైల్, టెలికం, ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ వ్యవస్థలవ్యాప్తంగా నెలకొన్న సరఫరా సమస్యలకి తగిన పరిష్కారాలను అందించేందుకు మన ముందు చక్కని అవకాశం ఉందని తెలిపారు. సెమీకండక్టర్ల తయారీలాంటి విభాగాల్లో భారత్ ఈ అవకాశాలను అందిపుచ్చుకుంటోందని ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 సెమీకండక్టర్ తయారీ యూనిట్ల పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయన్నారు. ఎల్రక్టానిక్స్ తయారీ విషయంలో గ్లోబల్ కంపెనీలు భారీ స్థాయిలో విశ్వసనీయంగా, భారీ స్థాయిలో సరఫరా చేయగలిగే భాగస్వాముల కోసం అన్వేíÙస్తున్నాయని .. ఆ అవకాశాలను భారతీయ కంపెనీలు అందిపుచ్చుకోవాలని సూచించారు. చిప్సెట్లు, బ్యాటరీలు, డిస్ప్లేలు, సెన్సార్లను దేశీయంగానే మరింతగా తయారు చేయడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. 2014 నుంచి ఎలక్ట్రానిక్స్ తయారీ ఆరు రెట్లు, మొబైల్ ఫోన్ల తయారీ ఇరవై ఎనిమిది రెట్లు, ఎగుమతులు 127 రెట్లు పెరిగాయని ప్రధాని చెప్పారు. గత దశాబ్దకాలంలో మొబైల్ ఫోన్ల తయారీ రంగంలో భారీ స్థాయిలో ప్రత్యక్ష ఉద్యోగాలను కల్పించిందన్నారు. డేటా ప్రకారం ఓ దిగ్గజ స్మార్ట్ఫోన్ కంపెనీకి అవసరమైన ఉత్పత్తులను 45 భారతీయ సంస్థలు సరఫరా చేస్తున్నాయని చెప్పారు. ఇలాంటి ఒక్క కంపెనీతో దాదాపు 3.5 లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు. -
గ్రామీణ ‘మహిళా చిత్రం’
డిజిటల్ యుగానికి అనుగుణంగా గ్రామీణ మహిళలకు నైపుణ్యాలను అందించడానికి ఎమ్జెఎఎస్ చేస్తున్న ప్రయత్నాల్లో ఈ ఫిల్మ్ మేకింగ్ కోర్సు ఒక భాగం. మొదట అన్హాద్ ఫిల్మ్స్ వీరికి శిక్షణ ఇచ్చింది. ఇప్పుడు డిజిటల్ రంగంలో అగ్రగామిగా ఉన్న పీర్ నేతృత్వంలోని మోడల్ విజయవంతం అయ్యింది. వీరి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన మహిళలు ఇతరులకు ట్రైనింగ్ ఇస్తున్నారు.బాల్య వివాహాల సంకెళ్లలో చిక్కుకుని, కష్టాల పాలైన అజ్మీర్ గ్రామీణ మహిళలు చిన్న సినిమాలను రూపొందిస్తున్నారు. డిజిటల్ యుగానికి అనుగుణంగా ఈ గ్రామీణ మహిళలు సాంకేతిక నైపుణ్యాలను నేర్చుకొని, మహిళా కార్మికుల దయనీయ జీవితాలు, గృహహింసపై అవగాహన కల్పించే ప్రయత్నం చేయడమే కాదు, చాలావరకు విజయం సాధించారు కూడా. వీరు తమ ఆలోచనలను సినిమా రూపకంగా గ్రామీణుల ముందుకు తీసుకువచ్చి, సరికొత్త జీవన విధానం గురించి అవగాహన కల్పిస్తున్నారు. డిజిటల్ రంగంలో నైపుణ్యం సాధించిన ఈ మహిళలు ట్రైనర్లుగా మారి మారుతున్న గ్రామీణ భారతానికి ఉదాహరణగా నిలుస్తున్నారు. రాజస్థాన్లోని అజ్మీర్లో అత్యంత సామాన్యంగా ఉండే రెండంతస్తుల భవనం అది. అక్కడ ప్రతి ఉదయం ఒక నిశ్శబ్ద విప్లవం మేలుకొంటుంది. అన్ని వయసుల మహిళలు అక్కడ కనిపిస్తారు. వారంతా బాల్యవివాహాల సంకెళ్ల బందీలే. నేడు ఆ మహిళలు బాలికలకు సాధికారత కల్పించడానికి మహిళా జన అధికార్ సమితి కార్యాలయంలోకి అడుగుపెడుతున్నారు. వీరంతా కెమెరాలు తీసుకొని షూటింగ్లకు వెళుతున్నారు. మరికొందరు తమ సినిమాలను ఎడిట్ చేయడానికి కంప్యూటర్ స్క్రీన్ల ముందు ఉంటున్నారు. అంతా కలిసి, వారు నూతన భవిష్యత్తుకు ఒక్కొక్క ఫ్రేమ్ని స్క్రిప్ట్ చేస్తున్నారు. డిజిటల్ అక్షరాస్యతమహిళా జన అధికార్ సమితి ఆఫీసులో 30 మందికి పైగా మహిళలు చిత్ర నిర్మాణం, ఎడిటింగ్ నైపుణ్యాలను నేర్చుకుంటున్నారు. వారి కుటుంబాలలో కెమెరా పట్టుకొని ప్రపంచంపై దృష్టి సారించిన మొదటి వ్యక్తులు వీరే. పాతికేళ్ల క్రితం భూమి హక్కుల కోసం, కులవివక్ష, బాల్య వివాహాలు, పరువు హత్యలకు వ్యతిరేకంగా ΄ోరాడిన మహిళల నేతృత్వంలోని అట్టడుగు వర్గాల నుంచి ఈ మహిళా జన అధికార్ సమితి పుట్టుకు వచ్చింది. నేడు అక్కడి మూడు జిల్లాలలో ఈ సమితి తన ఉనికిని కొనసాగిస్తోంది. డిజిటల్ అక్షరాస్యత, నాయకత్వ కార్యక్రమాలు, లింగ సమానత్వం, గృహ హింసపై దృష్టి సారించింది. మహిళల ఆందోళనలను వ్యక్తపరచడానికి, వారి జీవితాలలో, సమాజాలలో సానుకూల మార్పును తీసుకు రావడానికి ఒక వేదికను ఏర్పాటు చేసింది.గ్రామీణ మహిళ చేతిలో కంప్యూటర్ స్క్రీన్...మహిళా జన అధికార్ సమితి ఆఫీసులోకి వెళ్లి చూస్తే – ఎడిట్ రూమ్లో 19 ఏళ్ల మంజు రావత్ దీక్షగా తన డెస్క్టాప్పైన సినిమాను ఎడిట్ చేస్తూ కనిపిస్తుంది. రెండేళ్ల క్రితం ఈ ఎన్జీవోలో చేరినప్పుడు ఆమె ఏకైక లక్ష్యం డిజిటల్ అక్షరాస్యత పొందడం. అయితే స్క్రిప్ట్, ఇంటర్వ్యూ, కెమెరా వర్క్తో సహా మహిళలకు ఫిల్మ్ మేకింగ్ నేర్పించాలని సంస్థ తీసుకున్న నిర్ణయం ఆమెలో ఆసక్తిని కలిగించింది. ‘కంప్యూటర్ను ఎలా ఉపయోగించాలో నేర్చుకోవడానికి మొదట మా ఇంటి నుండి బయటకు వచ్చినప్పుడు, అందరూ నన్ను చూసి నవ్వారు. నా కుటుంబంతో పాటు ఇరుగు పొరుగువాళ్లు ‘ఆమె ఎలా తిరుగుతుందో చూడండి’ అనేవారు. కానీ, వారి మాటలను పట్టించుకోలేదు’ అని చెబుతుంది. నాలుగేళ్ల వయసులోనే 20 ఏళ్ల వాడితో ముడిపెట్టిన ఛాందస కుటుంబం నుండి వచ్చిన రావత్ ఇప్పుడు తనలాంటి మహిళల సమస్యలపైన దృష్టి సారిస్తూ షార్ట్ ఫిలింలు తీసింది. రావత్ చెల్లెలు సంజు వయసు 19 ఏళ్లు. ఆమె, అజేసర్ గ్రామంలోని దినసరి కార్మికుల జీవితాలను చిత్రీకరించింది. సవాళ్లను ఎదిరిస్తూ..24 ఏళ్ల భగవతీ దేవికి 15 ఏళ్ల వయసులోనే పెళ్లయ్యింది. ఆమె తన గ్రామం భవానీ నుండి అజ్మీర్కు ప్రతిరోజూ 30 కి.మీ దూరం ప్రయాణించే భగవతీ దేవి ముసుగు ధరించే ఆచారం పైన, తగిన ధ్రువపత్రాలు లేక΄ోవడం వల్ల సంక్షేమ పథకాల నుండి మినహాయించిన సంచార జాతి ఘుమంతు తెగపై సినిమాలు నిర్మించింది.ఈ కోర్సు నేర్చుకుంటున్న మహిళలందరూ ఒక్కొక్కరు ఒక్కో సినిమా తీశారు. వీరంతా పురుషుల నుంచి, కుటుంబాల నుంచి తీవ్రమైన అణచివేతను ఎదుర్కొన్నవారే. ఈ యేడాది మొదట్లో 23 ఏళ్ల సంత్రా చౌరాసియా, భగవతీ దేవి, మరో ఇద్దరు కిషన్ గఢ్లో ఒక పెళ్లిని చిత్రీకరించారు. ఇది వారి మొదటి ప్రొఫెషనల్ ప్రాజెక్ట్. వీరు తీసిన సినిమాలను చూసిన స్థానిక మహిళలు సంతోషిస్తుండగా పురుషులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ‘‘ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ మేమంతా ఒక్కటిగా నడుస్తాం. ఏ అమ్మాయి అయినా మా డిజిటల్ క్లాసులకు రాలేక΄ోతే మేమే వారి ఇంటికి వెళ్లి వెంటబెట్టుకు వస్తాం. కుటుంబ ఒత్తిడి కారణంగా ఎవరూ ఈ డిజిటల్ చదువు మానేయకుండా చూసుకోవాలని మేమంతా నిర్ణయించుకున్నాం’’ అని 22 ఏళ్ల మేరీ చెబుతోంది. ‘‘గతంలో మా కాలనీలో ఎడిటింగ్ నేర్చుకోవడానికి ఇంటినుండి బయటకు వెళ్లే ఏకైక వ్యక్తిని నేనే. ఇప్పుడు చాలామంది మహిళలు నాతో చేరారు. ఇది మా సమష్టి విజయం’ అని 21 ఏళ్ల ట్రైనర్ సమీరా బాను గర్వంగా చెబుతుంది. స్థానికంగా మహిళలు ఎదుర్కొంటున్న రకరకాల సమస్యలపైన సినిమాలు తీస్తూ, వాటిని గ్రామంలో ప్రదర్శిస్తూ అవగాహన తీసుకువస్తున్నారు. మహిళాభివృద్ధికి ఏ విధంగా తోడ్పాటును అందించాలో తమ సినిమాల ద్వారా చూపుతున్నారు. -
ఇన్స్టాగ్రామ్లో ‘మ్యాప్’ ఫీచర్
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వాడే ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ ఈరోజు నుంచి భారత మార్కెట్లో “మ్యాప్” ఫీచర్ను ప్రారంభించింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ చుట్టుపక్కల ఉన్న రెస్టారెంట్లు, కేఫేలు, టూరిస్టు ప్రదేశాలు, షాపింగ్ సెంటర్లు, ఈవెంట్లు మొదలైనవాటిని ప్రత్యక్షంగా మ్యాప్లో వీక్షించవచ్చు.ఈ ఫీచర్తో స్థానిక వ్యాపారాలకు పెద్ద ఎత్తున ప్రాచుర్యం లభించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యూజర్లు తమ పోస్టులు లేదా స్టోరీల్లో లొకేషన్ ట్యాగ్ చేస్తే — ఆ కంటెంట్ ఆ ప్రాంతానికి సంబంధించిన మ్యాప్ వ్యూలో కూడా ప్రత్యక్షమవుతుంది. దీని ద్వారా సమీప ప్రాంతాల్లో ఉన్న ఇతర యూజర్లు ఆ ప్రదేశాన్ని సులభంగా గుర్తించే అవకాశాలుంటాయి.ఈ ఫీచర్లో యూజర్లు లొకేషన్ ట్యాగ్లను పూర్తి నియంత్రణలో ఉంచవచ్చు. లొకేషన్ను పబ్లిక్గా, ఫ్రెండ్స్కి మాత్రమే లేదా ప్రైవేట్గా ఉంచే ఆప్షన్లు ఉంటాయి. 18 ఏళ్ల లోపు వయసున్న యూజర్ల ఖాతాల్లో లొకేషన్ డిఫాల్ట్గా ఆఫ్లో ఉంటుంది.భారతీయ యూజర్లలో లొకేషన్ ఆధారిత కంటెంట్ వినియోగం వేగంగా పెరుగుతోందని, అందుకే ఈ ఫీచర్ను ప్రత్యేకంగా ప్రారంభించినట్లు ఇన్స్టా వర్గాలు చెబుతున్నాయి. -
తెలంగాణ టి-ఫైబర్కు జాతీయ గుర్తింపు..
తెలంగాణ టి-ఫైబర్కు (Telangana T-Fiber ) జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2025లో టి-ఫైబర్ పైలట్ విలేజెస్ డిజిటల్ ఇన్క్లూజన్ విజయానికి ప్రశంసలు పొందాయి. కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ చొరవను "ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్" గా అభివర్ణించారు. గ్రామీణ బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీకి వినూత్న విధానాన్ని అవలంభిస్తున్నందుకు తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబును అభినందించారు.ఈ సందర్బంగా కేంద్ర సమాచార శాఖ మంత్రి అధ్యక్షతన జరిగిన ఐటీ మంత్రుల రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. భారత్ నెట్ అమలును వేగవంతం చేయడానికి, రైట్ ఆఫ్ వే (ఆర్ఓడబ్ల్యూ) సవాళ్లను పరిష్కరించడానికి, జాతీయ, రాష్ట్ర డిజిటల్ ఆస్తులను రక్షించడానికి సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్ వర్క్ లను బలోపేతం చేయడానికి కేంద్రంతో భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి తెలంగాణ నిబద్ధతను పునరుద్ఘాటించారు.ప్రతి ఇల్లు, సంస్థ, వ్యాపారాలకు హై-స్పీడ్ కనెక్టివిటీని అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రధాన బ్రాడ్ బ్యాండ్ చొరవ అయిన టి-ఫైబర్ కింద సాధించిన పురోగతిని ఆయన వివరింంచారు. మంత్రితో పాటు టి-ఫైబర్ మేనేజింగ్ డైరెక్టర్ వేణు ప్రసాద్ పన్నీరు కూడా ఉన్నారు. పైలట్ గ్రామాల నుంచి రాష్ట్ర విజయగాథలు, డేటా-ఆధారిత ఫలితాలను ఆయన వివరించారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 (India Mobile Congress- IMC) అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 11 వరకు నాలుగు రోజులపాటు జరగనుంది. డిజిటల్ టెక్నాలజీ, టెలికాం ఆవిష్కరణలకు భారతదేశ ప్రధాన వేదికగా విధాన రూపకర్తలు, పరిశ్రమ నాయకులు, ప్రపంచ నిపుణులను ఒకచోట చేర్చింది. -
TCS: వాళ్లందరికీ కనీసం ఆర్నెళ్ల జీతం..
దేశీయ ఐటీ సంస్థ టీసీఎస్ (TCS) ఇటీవల భారీ లేఆఫ్ ప్రణాళికను (TCS Layoff)ప్రకటించింది. సుమారు 12,000 మందిని తొలగిస్తున్నట్లు తెలిపింది. ఈ తొలగింపులతో ప్రభావితమవుతున్న ఉద్యోగులకు వివిధ స్థాయిల సెవెరెన్స్ ప్యాకేజీని అమలు చేస్తోంది. ఏఐ, డేటా, సైబర్ సెక్యూరిటీలో కంపెనీ పెట్టుబడులను పెంచుతున్న నేపథ్యంలో సిబ్బంది పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. ఈ నిర్ణయం సోషల్ మీడియాలో కలకలం రేపింది.సంస్థలో ఎవరి నైపుణ్యాలైతే పనికిరావో లేదా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం పొందడానికి అవకాశం లేదో అలాంటి వారిని టీసీఎస్ తొలగిస్తోంది. వీరందరికీ మూడు నెలల నోటీసు వ్యవధి చెల్లింపుతో పాటు ఆరు నెలల నుండి ఒక సంవత్సరం జీతాన్ని సెవెరెన్స్ ప్యాకేజీ కింద అందిస్తోంది. ఇది సంస్థలో వారి సర్వీస్ కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అయితే అందరికీ కనీసం ఆరు నెలల వేతనాన్ని ఇవ్వాలని నిర్ణయించారు.ప్రభావిత ఉద్యోగులు మరో ఉద్యోగం వెతుక్కోవడంలో సహాయపడటానికి, టీసీఎస్ మూడు నెలల వరకు అవుట్ ప్లేస్ మెంట్ ఏజెన్సీ ఫీజులను అందిస్తోంది. అదే జూనియర్ అసోసియేట్లకు అయితే ఇంకొన్ని నెలలు ఈ సహాయాన్ని అందించనుందని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. ఇక అలాగే ఉద్యోగులకు అందించే మానసిక ఆరోగ్య సాయం టీసీఎస్ కేర్స్ను కూడా కొన్నాళ్ల పాటు వారికి కొనసాగించనుంది.బెంచ్లో ఉన్నవారికి మూణ్నెళ్ల జీతమే..బెంచ్లో ఉండి లేదా ఎనిమిది నెలలకు పైగా వర్క్ కేటాయించని ఉద్యోగులు తొలగింపునకు గురైతే వారు ప్రామాణిక మూడు నెలల నోటీసు వ్యవధి వేతనాన్ని మాత్రమే పొందుతారు. రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నవారికి, పదవీ విరమణ ప్రయోజనాలు, బీమాకు పూర్తి ప్రాప్యతతో ముందస్తు రిటైర్మెంట్ ఎంపికను టీసీఎస్ అందించింది. అలాంటి వారు మిగిలిఉన్న సర్వీస్ కాలాన్ని బట్టి ఆరు నెలల నుండి రెండేళ్ల వరకు జీతాన్ని సెవెరెన్స్ ప్యాకేజీగా అందుకుంటారు.ఇదీ చదవండి: దీపావళి ధమాకా.. ఐఫోన్పై రూ.55 వేల డిస్కౌంట్! -
ఏఐ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలి
ముంబై: ప్రజలను మోసగించేందుకు నేరగాళ్లు కృత్రిమ మేధను (ఏఐ) ఉపయోగించి క్లోనింగ్, ఫేక్ వీడియోల్లాంటివి సృష్టిస్తున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ దుర్వినియోగం కాకుండా అడ్డుకట్ట వేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని, రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థలను పటిష్టం చేసుకోవాలని ఫిన్టెక్ సంస్థలకు సూచించారు. 6వ గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2025లో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు చెప్పారు. వివిధ రకాల ఏఐ ఉత్పత్తులు, సరీ్వసులను రూపొందించే విషయంలో గ్లోబల్ హబ్గా ఎదిగే సత్తా భారత్కి ఉందని మంత్రి చెప్పారు.ప్రపంచవ్యాప్తంగా పలు రకాల అవసరాలకు ఉపయోగపడే ఏఐ ఉత్పత్తులను సృష్టించగలదని, ఏఐ ఐడియాలను అభివృద్ధి చేసేందుకు, ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు ప్రయోగశాలగా కూడా ఉండగలదని ఆమె పేర్కొన్నారు. ఏఐ చీకటి కోణం..: ఏఐతో ఆర్థిక రంగం, గవర్నెన్స్లో సానుకూల మార్పులు వచి్చనప్పటికీ, ఈ టెక్నాలజీలో చీకటి కోణం కూడా ఉందని ఆమె చెప్పారు. ‘ఏఐతో అసాధారణ అవకాశాలు లభిస్తాయి. అదే సమయంలో అది దుర్వినియోగం కాకుండా కూడా మనం కట్టడి చేయాలి.కొత్త ఆవిష్కరణలకు దన్నుగా నిల్చే సాధనాలే మోసాలు చేసేందుకు ఆయుధాలుగా కూడా మారే అవకాశాలు ఉన్నాయి. ప్రజలను తప్పుదారి పట్టించేలా, వాస్తవాలను కప్పిపుచ్చేలా తయారు చేసిన నా డీప్ఫేక్ వీడియోలు ఎన్నో ఆన్లైన్లో సర్క్యులేట్ అవుతుండటాన్ని నేను స్వయంగా చూశాను. ఇలాంటి వాటిని తక్షణం ఎదుర్కొనేందుకు మన వ్యవస్థలను తక్షణం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది‘ అని చెప్పారు. ఆర్థిక సాధికారతకు ఫిన్టెక్ దన్ను.. ఫిన్టెక్ అనేది ఏదో పట్టణ ప్రాంతాలకు పరిమితమైన సౌకర్యం కాదని, దేశవ్యాప్తంగా ఆర్థిక సాధికారతకు ఉపయోగపడే సాంకేతికతని మంత్రి చెప్పారు. యూపీఐ, డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలతో రోజువారీ జరిపే చెల్లింపుల తీరుతెన్నులను ఇది మార్చేసిందని పేర్కొన్నారు. ప్రపంచంలో దాదాపు సగభాగం రియల్ టైమ్ డిజిటల్ లావాదేవీలు భారత్లో జరుగుతున్నాయని తెలిపారు. ‘మనం ఆర్థికంగా ఎలాంటి భవిష్యత్తును కోరుకుంటున్నాం, దాన్ని ఎలా సాధించదల్చుకుంటున్నాం అనేది ఆలోచించుకునేందుకు ఇది సరైన తరుణం. ఆదాయ వృద్ధి, కొత్త ఆవిష్కరణలు, లాభదాయకత, రిస్క్ సామర్థ్యాలు మొదలైన ప్రాథమికాంశాలపై ఫిన్టెక్లు తప్పకుండా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది‘ అని వివరించారు.బయోమెట్రిక్తో యూపీఐ చెల్లింపులు..ఏకీకృత చెల్లింపు విధానం (యూపీఐ)కి సంబంధించిన పలు సొల్యూషన్స్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఆవిష్కరించింది. ప్రస్తుతం డివైజ్లో యూపీఐ లావాదేవీ ధ్రువీకరణ కోసం ఉపయోగిస్తున్న పిన్ నంబరు స్థానంలో, బయోమెట్రిక్ విధానాన్ని (వేలి ముద్ర, ఫేస్ అన్లాక్) వాడేందుకు ఉపయోగపడే టెక్నాలజీని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు ప్రవేశపెట్టారు.ఏటీఎంలలో నగదు విత్డ్రాయల్తో పాటు యూపీఐ పిన్ను సెట్ చేసేందుకు లేదా రీసెట్ చేసేందుకు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. కొత్త యూజర్లు, సీనియర్ సిటిజన్లను కూడా యూపీఐ చెల్లింపుల పరిధిలోకి చేర్చేందుకు ఇది తోడ్పడుతుందని ఎన్పీసీఐ వివరించింది. అలాగే యూపీఐ క్యాష్ పాయింట్లలో యూపీఐని ఉపయోగించి నగదును విత్డ్రా చేసుకునే సదుపాయాన్ని కూడా ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. యూపీఐ లైట్ ద్వారా వేరబుల్ స్మార్ట్గ్లాసెస్తో కూడా చెల్లింపులు జరిపే సొల్యూషన్ని రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ టి. రవి శంకర్ ఆవిష్కరించారు. ఫోన్తో పని లేకుండా, పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా క్యూఆర్ని స్మార్ట్ కళ్లద్దాలతో స్కాన్ చేసి, వాయిస్ కమాండ్తో పేమెంట్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. చిన్న మొత్తాల్లో చెల్లింపులు అవసరమయ్యే రోజువారీ కొనుగోళ్లకు ఇది ఉపయోగకరం. ఇక జాయింట్ అకౌంట్ హోల్డర్లు కూడా చెల్లింపుల కోసం యూపీఐని ఉపయోగించే సదుపాయాన్ని ఆవిష్కరించింది. అటు ఎన్పీసీఐ ఇంటర్నేషనల్తో జట్టు కట్టినట్లు పేపాల్ ప్రకటించింది. -
6జీ అభివృద్ధిలో భారత్ పాత్ర కీలకం
భారతదేశం 6జీ టెక్నాలజీ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో, ప్రపంచవ్యాప్త భాగస్వామ్యాలను ఏర్పాటు చేయడంలో చురుకుగా ముందుకు సాగుతోంది. విశ్వసనీయ భాగస్వామిగా భారత్కు ఉన్న అంతర్జాతీయ గుర్తింపు 6జీ వ్యవస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు గట్టిగా నమ్ముతున్నారు. ఈ నెల 8 నుంచి 11 వరకు న్యూఢిల్లీలో నిర్వహించే ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2025లో ఈమేరకు చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో 6జీ టెక్నాలజీ, దాని స్పెక్ట్రమ్ పరిమితులు, భారత్పై ప్రభావం, ప్రపంచవ్యాప్త అభివృద్ధి గురించి వివరంగా తెలుసుకుందాం.6జీ టెక్నాలజీ అంటే ఏమిటి?6జీ అనేది వైర్లెస్ కమ్యూనికేషన్ ఆరో తరం సాంకేతికత. ఇది ప్రస్తుతం ఉన్న 5జీ నెట్వర్క్ల సామర్థ్యాన్ని, వేగాన్ని, విశ్వసనీయతను గణనీయంగా పెంచుతుంది. 6జీ సాంకేతికత ప్రధాన లక్ష్యం అల్ట్రా-హైస్పీడ్, అల్ట్రా-లో లేటెన్సీ (చాలా తక్కువ జాప్యం), భారీ కనెక్టివిటీతో కూడిన కమ్యునికేషన్ను సృష్టించడం.6జీ ముఖ్య లక్షణాలుఅత్యధిక వేగం (Ultra-High Speed)6జీ నెట్వర్క్లు సెకనుకు 1 టెరాబిట్ (Tbps) లేదా అంతకంటే ఎక్కువ గరిష్ట డేటా ట్రాన్స్ఫర్ రేటును అందించగలవని అంచనా. ఇది 5జీ కంటే 100 రెట్లు ఎక్కువగా ఉంటుందని కొందరు చెబుతున్నారు.చాలా తక్కువ జాప్యం (Ultra-Low Latency)డేటా బదిలీకి పట్టే సమయం 100 మైక్రోసెకన్ల కంటే తక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ అతి తక్కువ జాప్యం వల్ల రియల్-టైమ్ ఆపరేషన్స్, క్లిష్టమైన అప్లికేషన్లు మరింత సులభతరం అవుతాయి.విస్తృత కనెక్టివిటీ (Massive Connectivity)ఒక చదరపు కిలోమీటరుకు కోట్లాది డివైజ్లను కనెక్ట్ చేసే సామర్థ్యం 6జీకి ఉంటుంది. ఇది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), స్మార్ట్ సిటీస్ విస్తరణకు ఎంతో తోడ్పడుతుంది.ఏఐ ఏకీకరణ (AI Integration)ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML) నెట్వర్క్తో పూర్తిగా కలిసిపోయి ఆటోమేటెడ్, సమర్థవంతమైన నెట్వర్క్ నిర్వహణను అందిస్తుంది.హోలోగ్రాఫిక్ కమ్యూనికేషన్6జీ ద్వారా త్రీ-డైమెన్షనల్ (3D) హోలోగ్రాఫిక్ కమ్యూనికేషన్, వర్చువల్ రియాలిటీ (VR), ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) వంటి ఇమ్మర్సివ్ అనుభవాలు సాధ్యమవుతాయి.6జీకి కావాల్సిన స్పెక్ట్రమ్ పరిమితులు6జీ నెట్వర్క్లకు కావాల్సిన అత్యంత వేగం, సామర్థ్యం కోసం ప్రస్తుతం వాడుకలో ఉన్న ఫ్రీక్వెన్సీ బ్యాండ్లతో పాటు కొత్త, విశాలమైన స్పెక్ట్రమ్ బ్యాండ్లు అవసరం. 6జీ కోసం దృష్టి సారిస్తున్న ప్రధాన స్పెక్ట్రమ్ పరిమితులు కింది విధంగా ఉంటాయి.సబ్-టెరాహెర్ట్జ్ (Sub-Terahertz - Sub-THz) బ్యాండ్ఇది 90 GHz (గిగాహెర్ట్జ్) నుంచి 3 THz (టెరాహెర్ట్జ్) మధ్య ఉండే ఫ్రీక్వెన్సీ పరిధి. ఈ బ్యాండ్ చాలా విశాలమైన బ్యాండ్విడ్త్ను అందిస్తుంది. దీని ద్వారానే 1 Tbps వేగం సాధ్యమవుతుందని అంచనా. అయితే ఈ ఫ్రీక్వెన్సీల్లో సిగ్నల్స్ పరిధి తక్కువగా ఉండి భవనాలు వంటి అడ్డంకులను దాటడం కష్టం. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.సెంటీమీటర్ వేవ్ (cmWave) బ్యాండ్ప్రస్తుతం 5జీకి వాడుతున్న మిడ్-బ్యాండ్ ఫ్రీక్వెన్సీలకు దగ్గరగా ఉండే 7 GHz నుంచి 15 GHz మధ్య ఉన్న ఈ బ్యాండ్ను ‘6జీ గోల్డెన్ బ్యాండ్’గా పరిగణిస్తున్నారు. ఇది మంచి కవరేజ్, సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 6జీ కోసం 1.5-2 GHz మిడ్-బ్యాండ్ స్పెక్ట్రమ్ అవసరమని పరిశోధకులు భావిస్తున్నారు.ఇండియాలో 6జీ వస్తే చోటు చేసుకోనున్న పరిణామాలుఇండియాలో ‘భారత్ 6జీ విజన్’ కింద 6జీ సాంకేతికతను 2030 నాటికి అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత్ వంటి అతిపెద్ద జనాభా గల దేశంలో 6జీ రాక వల్ల భారీ పరివర్తనలు సంభవిస్తాయి.డిజిటల్ విప్లవం: 6జీ గ్రామీణ, సరైన కనెక్టివిటీలేని ప్రాంతాలకు సైతం మెరుగైన కమ్యునికేషన్ అందిస్తుంది.ఆరోగ్య సంరక్షణ (Healthcare): రియల్-టైమ్ టెలిసర్జరీలు, రిమోట్ పేషెంట్ మానిటరింగ్, ఏఐ-ఆధారిత డయాగ్నోస్టిక్స్ వంటివి విస్తృతం అవుతాయి. అంబులెన్స్లు, ఆసుపత్రులు సహా అన్ని వైద్య మౌలిక సదుపాయాలు ఏఐ ఆధారితంగా అనుసంధానమవుతాయి.విద్య (Education): విద్యార్థులు వర్చువల్ టీచర్లతో, క్లాస్మేట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, ఎక్కడైనా, ఎప్పుడైనా నాణ్యమైన విద్యా వనరులను పొందేందుకు 6జీ ఉపయోగపడుతుంది.పరిశ్రమల ఆటోమేషన్ (Industrial Automation): స్మార్ట్ ఫ్యాక్టరీల్లో యంత్రాల రియల్-టైమ్ రిమోట్ కంట్రోల్, ఏఐ-ఆధారిత ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్, రోబోటిక్స్ వంటివి ఉత్పత్తి సామర్థ్యాన్ని, నాణ్యతను అసాధారణంగా పెంచుతాయి.రవాణా (Transportation): అర్బన్ ఎయిర్ మొబిలిటీ (UAM), అటానమస్ వాహనాల (Self-Driving Cars) కోసం 6జీ కమ్యూనికేషన్ అత్యంత అవసరం. ట్రాఫిక్ నిర్వహణ, లాజిస్టిక్స్లో డ్రోన్ ఫ్లీట్ల వాడకం పెరుగుతుంది.రక్షణ రంగం (Defence): కమాండర్లకు వేగవంతమైన, రియల్-టైమ్ క్షేత్ర సమాచారం అందించేందుకు వీలవుతుంది. సురక్షితమైన కమ్యూనికేషన్, డ్రోన్లు, హైపర్సోనిక్ ఆయుధాలకు కమ్యూనికేషన్ లింక్లు అందించడం ద్వారా రక్షణ సామర్థ్యం పెరుగుతుంది.ఈ టెక్నాలజీ వివిధ దేశాల పరిశోధనలుప్రస్తుతానికి ప్రపంచంలో ఏ దేశంలోనూ పూర్తిగా వాణిజ్యపరమైన (Commercial) 6జీ నెట్వర్క్ వాడుకలో లేదు. 6జీ సాంకేతికతను 2030 నాటికి వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుని అభివృద్ధి, పరిశోధన (R&D)లో వివిధ దేశాలు, టెక్ కంపెనీలు చురుగ్గా పోటీ పడుతున్నాయి.6జీ అభివృద్ధిలో ముందున్న దేశాలుచైనా: 6జీ పరిశోధన, అభివృద్ధిలో ముందంజలో ఉంది. చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది. టెరాహెర్ట్జ్ సిగ్నల్ ప్రసారాన్ని పరీక్షించేందుకు ఇప్పటికే ప్రయోగాత్మక ఉపగ్రహాన్ని (Experimental Satellite) ప్రయోగించింది. 6జీ పేటెంట్ ఫైలింగ్స్లో చైనా అగ్రస్థానంలో ఉంది.దక్షిణ కొరియా: 5జీని వేగంగా అమలు చేసిన దక్షిణ కొరియా 6జీలో కూడా బలమైన పోటీదారుగా ఉంది. శాంసంగ్, ఎల్జీ వంటి దిగ్గజ సంస్థలు 6జీ R&D కేంద్రాలను ఏర్పాటు చేశాయి. 2028 నాటికి 6జీని వాణిజ్యపరంగా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.జపాన్: టెక్నాలజీ అభివృద్ధిలో తన నైపుణ్యాన్ని కొనసాగిస్తూ 2030 నాటికి 6జీని ఆవిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.యునైటెడ్ స్టేట్స్, యూరప్: యూఎస్ ‘నెక్స్ట్ G అలయన్స్’ ద్వారా ఈయూ ఆధ్వర్యంలో ‘హెక్సా-ఎక్స్’ (Hexa-X) వంటి చొరవలతో 6జీ పరిశోధనలో చురుకుగా పాల్గొంటున్నాయి.ప్రస్తుత డిజిటల్ అభివృద్ధిపైన తెలిపిన దేశాలు ఇంకా 6జీని వాడకపోయినా 5జీని వేగంగా, విస్తృతంగా అమలు చేస్తున్నాయి. ఉదాహరణకు దక్షిణ కొరియా వంటి దేశాలు ప్రపంచంలోనే అత్యధిక 5జీ కవరేజ్, వేగాన్ని కలిగి ఉన్నాయి. ఇది ఇప్పటికే రిమోట్ సర్జరీ, ఏఐ-ఆధారిత స్మార్ట్ ఫ్యాక్టరీలు వంటి డిజిటల్ ఆవిష్కరణలకు మార్గం సుగమం చేస్తోంది. 6జీ రాకతో ఈ డిజిటల్ అభివృద్ధి మరింత వేగవంతమై ఊహించని పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.చివరగా..6జీ టెక్నాలజీ అనేది కేవలం మొబైల్ స్పీడ్ను పెంచేది మాత్రమే కాదు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ, హోలోగ్రాఫిక్స్, అటానమస్ సిస్టమ్స్ వంటి వాటిని అనుసంధానించే ఒక కొత్త డిజిటల్ ఫ్రేమ్వర్క్. భారత్ తన ‘భారత్ 6జీ విజన్’తో ఈ రేసులో దూసుకుపోతోంది. విశ్వసనీయ భాగస్వామిగా ఉన్న భారత్ అంతర్జాతీయ సహకారంతో 6జీ సాంకేతికతను అభివృద్ధి చేయడంలో విజయం సాధిస్తే అది దేశ సామాజిక-ఆర్థిక పురోగతిని, ప్రపంచ టెక్నాలజీ రంగంలో దాని నాయకత్వాన్ని బలోపేతం చేస్తుంది. ఈ ఆవిష్కరణతో ప్రజల జీవన నాణ్యత మెరుగుపడటంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు వస్తుందని చెప్పవచ్చు.ఇదీ చదవండి: సోషల్ మీడియాలో మోసపూరిత కంటెంట్ తొలగింపు -
కొత్త మొబైల్ యూజర్లలో టాప్ కంపెనీ
కొత్త మొబైల్ యూజర్లకు సంబంధించి ఆగస్టులో రిలయన్స్ జియో జోరు కొనసాగగా, ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ దాదాపు ఏడాది తర్వాత భారతి ఎయిర్టెల్ను అధిగమించింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ గణాంకాల ప్రకారం మొబైల్ సెగ్మెంట్లో ఆగస్టులో నికరంగా 35.19 లక్షల కొత్త కనెక్షన్లు నమోదయ్యాయి. జియో కస్టమర్లు అత్యధికంగా 19 లక్షల మేర పెరగ్గా బీఎస్ఎన్ఎల్ (13.85 లక్షలు), ఎయిర్టెల్ (4.96 లక్షలు) తర్వాత స్థానాల్లో నిల్చాయి.చివరిసారిగా 2024 సెప్టెంబర్లో అన్ని ప్రైవేట్ సంస్థలను మించి బీఎస్ఎన్ఎల్ అత్యధికంగా యూజర్లను దక్కించుకుంది. అప్పట్లో కంపెనీ 3జీ సేవలను మాత్రమే అందించేది. అయితే, ప్రైవేట్ టెల్కోలు టారిఫ్లను పెంచేయడం బీఎస్ఎన్ఎల్కి కలిసొచ్చింది. కంపెనీ ఇటీవలే దేశవ్యాప్తంగా 4జీ సర్వీసులు ప్రారంభించింది. ఇక, తాజాగా జూలైలో 122 కోట్లుగా ఉన్న మొత్తం టెలిఫోన్ సబ్ర్స్కయిబర్స్ సంఖ్య ఆగస్టులో 122.45 కోట్లకు చేరింది. వొడాఫోన్ ఐడియా అత్యధికంగా 3.08 లక్షల యూజర్లను కోల్పోయింది. బ్రాడ్బ్యాండ్ సెగ్మెంట్లో (మొబైల్, ఫిక్సిడ్ లైన్ కలిపి) 50 కోట్ల కస్టమర్లతో జియో అగ్రస్థానంలో ఉండగా, తర్వాత స్థానాల్లో 30.9 కోట్ల కనెక్షన్లతో భారతి ఎయిర్టెల్, 12.7 కోట్లతో వొడాఫోన్ ఐడియా, 3.43 కోట్ల కనెక్షన్లతో బీఎస్ఎన్ఎల్, 23.5 లక్షల బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లతో ఏట్రియా కన్వర్జెన్స్ ఉన్నాయి.ఇదీ చదవండి: సోషల్ మీడియాలో మోసపూరిత కంటెంట్ తొలగింపు -
ఉద్యోగం కోసం డిగ్రీ సరిపోదు!: లింక్డ్ఇన్ సీఈఓ కీలక వ్యాఖ్యలు
చదువుకుని ఒక డిగ్రీ తెచ్చుకుంటే.. వెంటనే ఉద్యోగంలో చేరిపోవచ్చని చాలామంది అనుకుంటారు. కానీ డిగ్రీ ఉంటేనే ఉద్యోగాలు త్వరగా లభిస్తాయని చెప్పలేమని లింక్డ్ఇన్ సీఈఓ 'ర్యాన్ రోస్లాన్స్కీ' (Ryan Roslansky) పేర్కొన్నారు.పరుగులు పెడుతున్న పోటీ ప్రపంచంలో కేవలం ఒక కాలేజీ డిగ్రీ సరిపోదు. నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి. ముఖ్యంగా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) గురించి చాలా నేర్చుకోవాల్సి ఉందని.. గత వారం కంపెనీ శాన్ ఫ్రాన్సిస్కో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ర్యాన్ రోస్లాన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు.మార్పు అనేది చాలా ఉత్తేజకరమైన విషయం అని భావిస్తున్నాను. ఎందుకంటే ఉద్యోగ భవిష్యత్తు ఇకపై ఫ్యాన్సీ డిగ్రీలు ఉన్నవారికి లేదా మంచి కాలేజీలో చదువుకున్న వారికి మాత్రమే చెందదు. మారుతున్న కాలానికి అనుగుణంగా అలోచించి కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నవారికి ఉద్యోగాలు లభిస్తాయని నా అంచనా అని అన్నారు.ఏఐ మనుషుల స్థానాన్ని భర్తీ చేస్తుందనే విషయాన్ని నేను నమ్మనని ర్యాన్ రోస్లాన్స్కీ అన్నారు. అయితే కమ్యునికేషన్, ఎవరితో అయినా మాట్లాడగలగడం వంటివి నేర్చుకోవాలి. స్కిల్స్ ఎప్పుడూ పెంచుకుంటూ ఉండాలి. మీరు ముందుకు సాగడానికి ప్రయత్నిస్తున్న ఏ పనిలోనైనా విజయం సాధించడానికి అవి చాలా కీలకం అని ఆయన అన్నారు.ఇదీ చదవండి: ముకేశ్ అంబానీ పర్సులో ఎంత డబ్బు ఉంటుందో తెలుసా?ఏఐ గురించి తెలుసుకోవడం లేదా నేర్చుకోవడం చాలా అవసరం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఏఐ నైపుణ్యాలు ఉన్న వ్యక్తికే పరిశ్రమల్లో ఉద్యోగాలు లభిస్తాయి. అంటే ఉద్యోగం కోసం ఏఐ ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. ఉద్యోగ మార్కెట్ వేగంగా మారుతోంది. నిపుణులు నిరంతరం తమను తాము అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉందని చెబుతూనే ఉన్నారని ర్యాన్ రోస్లాన్స్కీ చెప్పారు. -
వాట్సప్కు పోటీగా అరట్టై.. 75 లక్షల డౌన్లోడ్స్!
భారతదేశపు ఐటీ కంపెనీ జోహో అభివృద్ధి చెందిన మెసేజింగ్ ప్లాట్ఫామ్ 'అరట్టై'కు ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. ఈ యాప్ శుక్రవారం నాటికి మొత్తం 75 లక్షల డౌన్లోడ్లను అధిగమించింది. అంటే అంతమంది దీనిని డౌన్లోడ్ చేసుకున్నారన్నమాట. దీన్ని బట్టి చూస్తే ఇది ఇటీవలి కాలంలో.. అతి తక్కువ కాలంలో ఎక్కువ డౌన్లోడ్స్ పొందిన యాప్లలో ఒకటిగా నిలిచింది.ఇప్పటి వరకు చాలామంది భారతీయులు.. మెటా యాజమాన్యంలోని వాట్సప్ను వినియోగిస్తున్నారు. అయితే ఇక దేశీయ యాప్ అరట్టైను ఉపయోగించాలని పలువురు మంత్రులు, వ్యవస్థాపకులు, సీఈఓలు పిలుపునిచ్చారు. దీంతో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకునేవారు సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ & ఆపిల్ యాప్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది.అరట్టై అంటే.. తమిళంలో సరదాగా ముచ్చటించుకోవడం అని అర్థం. దీనిని జోహో సంస్థ.. వాట్సప్కు పోటీగా అభివృద్ధి చేసింది. ఇది వాట్సప్ కంటే ఎక్కువ ఫీచర్స్ కలిగి ఉంది. దీనికి అశ్వినీ వైష్ణవ్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్ వంటి కేంద్రమంత్రులు కూడా మద్దతు ప్రకటించారు. దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా కూడా నేను అరట్టై డౌన్లోడ్ చేసుకున్నా అంటూ ట్వీట్ చేశారు.అరట్టై.. వాట్సప్ మధ్య తేడాలు➤అరట్టై.. వాట్సాప్ రెండూ మెసేజింగ్ యాప్స్ అయినప్పటికీ, అరట్టైలో కొన్ని అదనపు ఫీచర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యాప్ గురించి జోహో సీఈఓ శ్రీధర్ వెంబు గత కొన్ని రోజులుగా తన ఎక్స్ ఖాతాలో చెబుతూనే ఉన్నారు.➤అరట్టై ఆండ్రాయిడ్ టీవీలతో సహా విస్తృత శ్రేణి పరికరాలకు యాక్సెస్ను అందిస్తుంది. అయితే వాట్సాప్ ప్రస్తుతం వీటికి మద్దతు ఇవ్వదు. వినియోగదారులు తమ అరట్టై ఖాతాను ఒకేసారి ఐదు పరికరాల్లో ఉపయోగించవచ్చు.➤అరట్టైలో పాకెట్ ఫీచర్ ఉంది. ఇది వినియోగదారులు ఫోటోలు, వీడియోలు, నోట్స్, రిమైండర్లు, ఇతర ఫైల్లను స్టోర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వాట్సాప్లో ఈ ఫీచర్ లేదు. అయితే, వాట్సాప్ 'యు' చాట్ విండోను అందిస్తుంది, ఇక్కడ వినియోగదారులు తమతో తాము చాట్ చేసుకోవచ్చు, కావలసినవి సేవ్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: మస్క్ ట్వీట్: నెట్ఫ్లిక్స్కు రూ.2 లక్షల కోట్ల నష్టం!➤అరట్టై యాప్.. తక్కువ మెమరీ ఉన్న స్మార్ట్ఫోన్లు & పాత 2G/3G నెట్వర్క్లలో కూడా సజావుగా పనిచేసేలా రూపొందించబడింది. ఇది గ్రామీణ వినియోగదారులకు, బడ్జెట్ పరికరాలను కలిగిన వారికి అందుబాటులో ఉంటుంది. అంతే కాకుండా అరట్టైలో యూపీఐ చేయడానికి కూడా జోహో సిద్ధమవుతోంది. దీనికోసం ఐస్పిరిట్ గ్రూప్తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. -
ఆనంద్ మహీంద్రా ఫోన్లో కొత్త యాప్ డౌన్లోడ్
వాట్సాప్ మాదిరి దేశీయ కంపెనీ జోహో తయారు చేసిన ఆన్లైన్ కమ్యునికేషన్ యాప్ ‘అరట్టై’(Arattai)ని గర్వంగా డౌన్లోడ్ చేసినట్లు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో తెలిపారు. ఈ యాప్ మొదటిసారిగా 2021లో యాప్ స్టోర్లోకి ప్రవేశించింది. అయితే భారత ప్రభుత్వం ఆమోదం పొందిన తరువాత సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ మేడ్ ఇన్ ఇండియా యాప్ ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది.మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా దేశీయ టెక్నాలజీ ఉత్పత్తులకు మద్దతు ఇవ్వడంలో తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. జోహో సంస్థ కొత్తగా రూపొందించిన చాట్, కాలింగ్ యాప్ అరట్టైకి ఆయన ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా మద్దతు ప్రకటించారు. ‘గర్వంగా అరట్టైను డౌన్లోడ్ చేశా’ అని ఆనంద్ మహీంద్రా ప్రకటించారు. దీనికి యాప్ అధికారిక హ్యాండిల్ తక్షణమే స్పందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ అరట్టై ప్లాట్ఫామ్లోకి ఆయనను ఆహ్వానించింది.దీనిపై కంపెనీ చీఫ్ శ్రీధర్ వెంబు స్పందిస్తూ.. ‘నేను మా తెన్కాసి కార్యాలయంలో అరట్టై ఇంజినీర్లతో సమావేశంలో ఉన్నాను. యాప్కు మెరుగుదలలు చేస్తున్నాం. మా టీమ్లో ఒక సభ్యుడు ఈ ట్వీట్ను చూపించాడు. ధన్యవాదాలు @anandmahindra. మీ మద్దతు మాకు మరింత స్ఫూర్తినిచ్చింది’ అని ఎక్స్లో పేర్కొన్నారు. దీనికి ప్రతిస్పందనగా ఆనంద్ మహీంద్రా ‘మీ జట్టు విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ ప్రోత్సహించారు.ఇదీ చదవండి: దేశం విడిచిన కుబేరులు.. కారణాలు.. -
దీపావళి ధమాకా.. ఐఫోన్పై రూ.55 వేల డిస్కౌంట్!
దీపావళి పండుగ సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్కార్ట్ రెండూ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్వాచ్లు, ల్యాప్టాప్లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై అద్భుతమైన డిస్కౌంట్ డీల్స్ అందిస్తున్నాయి. పాత స్మార్ట్ ఫోన్ నుంచి ఐఫోన్కు అప్గ్రేడ్ కావాలనుకుంటున్నవారికి, ఆండ్రాయిడ్ నుంచి ఐఓఎస్కు మారాలనుకుంటున్నవారికి ఇంతకంటే మంచి సమయం లేదు.ఐఫోన్ 16 ప్రో మాక్స్పై భారీ తగ్గింపుప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో ఉన్న స్టాండ్ అవుట్ ఆఫర్లలో ఐఫోన్ 16 ప్రో మాక్స్ డీల్ ఒకటి. ఇది ఇప్పటివరకు సంవత్సరంలో అతిపెద్ద తగ్గింపు. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ (256 జీబీ వేరియంట్) వాస్తవ ధర రూ .1,34,999 కాగా ఫ్లిప్కార్ట్ రూ .1,09,999 కు లిస్ట్ చేసింది. కస్టమర్లు హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తే రూ .5,000 వరకు తగ్గింపు పొందవచ్చు.అదే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు ద్వారా ఈఎంఐ కొనుగోళ్లపై రూ .4,000 వరకు తగ్గింపును అందుకోవచ్చు. అంతేకాదు.. కొనుగోలుదారులు తమ పాత స్మార్ట్ఫోన్లను ఎక్స్చేంజ్కి ఇచ్చి ఫోన్ కండీషన్ను బట్టి రూ.55,790 వరకు పొందవచ్చు. ఇలా అన్ని డిస్కౌంట్లను కలిపితే ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ కొనుగోలుపై రూ.35,000 నుంచి రూ.55,000 ఆదా చేయవచ్చు. ఈ ఆఫర్లు పరిమితమైనవి, లభ్యతకు లోబడి ఉంటాయని గమనించాలి.ఐఫోన్ 16 ప్రో మాక్స్ ఫీచర్లుడిజైన్: ప్రీమియం టైటానియం నలుపు, తెలుపు, నేచురల్, డిసెర్ట్ ఫినిషింగ్.డిస్ప్లే: 6.9-అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్ డీఆర్ ఓఎల్ఈడీ, 120 హెర్ట్జ్ ప్రోమోషన్, హెచ్డీఆర్, ఆల్వేస్-ఆన్.పనితీరు: అధునాతన యాపిల్ ఇంటెలిజెన్స్, న్యూరల్ ఇంజిన్ తో A18 ప్రో చిప్.కెమెరా: 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్, అల్ట్రా వైడ్, 5ఎక్స్ టెలిఫోటో, నైట్ మోడ్, మాక్రో, 4కే డాల్బీ విజన్.ఇతర స్పెసిఫికేషన్లు: ఫేస్ ఐడీ, యాపిల్ పే, ఐపీ 68 రేటింగ్, 5జీ, వైఫై 7, స్పేషియల్ ఆడియో, శాటిలైట్ ద్వారా ఎమర్జెన్సీ ఎస్ఓఎస్. -
ఏడాదిలో బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్వర్క్
న్యూఢిల్లీ: భారత్ సొంతంగా అభివృద్ధి చేసిన బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్వర్క్ని ఏడాదిలోగా 5జీకి అప్గ్రేడ్ చేయనున్నట్లు టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింథియా తెలిపారు. భారత దేశం కూడా సొంతంగా 4జీ టెక్నాలజీ రంగంలోకి అడుగుపెట్టిందని ప్రపంచవ్యాప్తంగా స్వీడన్, ఫిన్లాండ్, దక్షిణ కొరియా, చైనాకు చెందిన హువావే, జడ్టీఈ, శాంసంగ్, నోకియా, ఎరిక్సన్ తదితర ఐదు కంపెనీలు 4జీ టెక్నాలజీలో ఆధిపత్యం వహిస్తున్నాయని, భారత్ కూడా ఇప్పుడు 4జీ ప్రపంచ క్లబ్లో ప్రవేశించిందన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భరూచ్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు 92564 టవర్లను ప్రారంభించినట్లు సింధియా తెలిపారు. ఈ వేగం ఇక్కడితో ఆగదని వచ్చే ఏడాదిలోగా ఈ 4జీ టవర్లను 5జీ నెట్వర్క్కు అప్గ్రేడ్ చేసి దేశమంతా 5జీ సేవలు అందిస్తామని సింథియా వెల్లడించారు. -
వికీపీడియాకు పోటీగా గ్రోకీపీడియా!: మస్క్
టెస్లా అధినేత.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) వికీపీడియాకు పోటీగా.. గ్రోకీపీడియా (Grokipedia) లాంచ్ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం దీని బీటా వెర్షన్ రెండు వారాల్లో ప్రారంభమవుతుందని ఆయన తన ఎక్స్ ఖాతాలో తెలిపారు.గ్రోకీపీడియాను.. మస్క్ ఏఐ కంపెనీ ఎక్స్ఏఐ (xAI) రూపొందిస్తోంది. ''గ్రోకిపీడియా ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఖచ్చితమైన జ్ఞాన వనరుగా మారబోతోంది'' అని ఒక ఎక్స్ యూజర్ చేసిన పోస్టుకు.. మస్క్ రిప్లై ఇచ్చారు. అయితే ఈ గ్రోకీపీడియాకు సంబంధించిన ఫీచర్లను గురించి అధికారికంగా వెల్లడించలేదు. నిజాలను వెల్లడించానికే ఈ ఫ్లాట్ఫామ్ను రూపొందిస్తున్నట్లు సమాచారం.Version 0.1 early beta of Grokipedia will be published in 2 weeks https://t.co/M6VrGv8zp5— Elon Musk (@elonmusk) October 5, 2025Exactly https://t.co/Ia38jMbJoj— Elon Musk (@elonmusk) October 5, 2025 -
చిన్న బిజినెస్.. పెద్ద మ్యాజిక్!
నేటి రోజుల్లో చిన్న చిన్న వ్యాపార యజమానులందరూ సులభంగా, వేగంగా, సురక్షితంగా పని చేయాలనుకుంటే, ఒక్కసారి ఈ స్మార్ట్ టూల్స్ ప్రయత్నించాల్సిందే!పేపర్ ప్లస్ డిజిటల్ మ్యాజిక్ఒకప్పుడు నోట్స్ రాస్తే కేవలం కాగితాలకే పరిమితం అయ్యేది. ఒక్క కాగితం మిస్ అయినా, రాసిన మాట, గీసిన డ్రాయింగ్ అంతా మాయం అవుతుంది. ఇప్పుడు ‘హుయిన్ డిజిటల్ నోట్బుక్’తో ఆ భయం పూర్తిగా తొలగింది. ఇది కేవలం ఒక నోట్బుక్ కాదు, పేపర్ ప్లస్ డిజిటల్ టాబ్లెట్. ఇందులో రాసిన ప్రతి అక్షరం, గీసిన ప్రతి లైన్ వెంటనే మీ డివైస్లో స్టోర్ అవుతుంది. ఆడియో రికార్డ్ ఫీచర్తో, మీ వాయిస్ కూడా నోట్స్తో కలిసి రికార్డ్ అవుతుంది. ఒక్క క్లిక్తో షేర్ చేసుకోవచ్చు కూడా. పేజీలను మిళితం చేయడం, విడగొట్టడం చాలా సులభం. ముఖ్యమైన విషయాలను హైలైట్ చేయడానికి సులభమైన టూల్స్ కూడా ఉన్నాయి. ధర రూ. 7,105 ల ప్యాక్లో ఒక హుయిన్ నోట్, ఏ ఐ నోట్ ప్యాడ్, యూఎస్బీ కేబుల్, మాగ్నెటిక్ పెన్ స్లీవ్, రీఫిల్స్, ప్లాస్టిక్ పెన్ నిబ్స్, మార్గదర్శక పుస్తకంతో వస్తుంది.ఒక్క కార్డు చాలు! ఒకప్పుడు పాత పేపర్ విజిటింగ్ కార్డ్ అంటే స్టేటస్ సింబల్. ‘ఇదిగో నా కార్డ్’ అంటూ ఇచ్చేసి స్టయిల్ కొట్టేవాళ్లు. కాని, నిజం చెప్పాలంటే ఆ కార్డుల ఫ్యూచర్ బాగుండేది కాదు. రోజుల తరబడి జేబులో మురిగి, కాఫీ కప్పుల కింద నలిగి, చివరికి ఏ డస్ట్బిన్లోనో ఎండ్ అయ్యేది. అలాంటప్పుడు వాటికోసం అనవసరంగా ఖర్చు ఎందుకు చేయటం. కేవలం, ఒక్క టాప్తోనే మీ పేరు, నంబర్, వెబ్సైట్, సోషల్ మీడియా అన్నీ ఎదుటివారి మొబైల్లో బజ్ అయ్యే మాయ చేస్తుంది ఈ ‘టాప్మో స్మార్ట్ బిజినెస్ కార్డ్’. ఇందులో చిన్న లోగో, క్యూ ఆర్ కోడ్, లైఫ్టైమ్ వాలిడిటీ అన్నీ రెడీ! యాప్ డౌన్లోడ్ అనే తలనొప్పి లేదు, ‘కార్డులు అయిపోయాయి’ అనే టెన్షన్ లేదు. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు కూడా. ధర కేవలం రూ. 599 మాత్రమే!పోర్టబుల్ సర్వర్స్మాల్ బిజినెస్ ఓనర్స్కు కస్టమర్ డేటా, ఫైనాన్స్ రికార్డులు, ప్రాజెక్ట్ ఫైల్స్ అన్నీ రక్షించుకోవాలంటే పెద్ద సర్వర్ అవసరమా? లేనే లేదు! బిజినెస్ డీటైల్స్ అన్నీ ఒకే చోట, సురక్షితంగా ఉంచాలంటే ‘అప్రికార్న్ ఏజిస్ ప్యాడ్లాక్’ బెస్ట్ ఆప్షన్. 480 జీబీ స్టోరేజ్, 256–బిట్ ఎన్క్రిప్షన్, రగ్డ్ బాడీ, టూ స్టెప్ వెరిఫికేషన్తో ఏ ఫైల్ అయినా సేఫ్గా స్టోర్ చేస్తుంది. ఇది కేవలం స్టోరేజ్ సర్వర్ మాత్రమే కాదు, చిన్న బిజినెస్కి నమ్మకమైన డేటా గార్డు. ఆఫీస్లోనైనా, ఇంట్లోనైనా, ట్రావెల్లోనైనా సులభంగా ఉపయోగించవచ్చు. చిన్న, పోర్టబుల్ బాడీతో జేబులోనైనా పెట్టుకుని క్యారీ చేయవచ్చు. ఏకకాలంలో డేటా యాక్సెస్, బ్యాకప్, షేర్ అన్నీ సులభం. ధర రూ. 49,325. -
ఇక ఫోకస్ అంతా 6జీపైనే.. 8 నుంచి ఇండియా మొబైల్ కాంగ్రెస్
ఈ నెల 8 నుంచి 11 వరకు న్యూఢిల్లీలో నిర్వహించే ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2025 సదస్సులో ప్రధానంగా 6జీ వ్యవస్థను అభివృద్ధి చేయడం, భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి పెట్టనున్నారు. విశ్వసనీయ భాగస్వామిగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన భారత్, 6జీ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించగలదని డిజిటల్ టెక్నాలజీ ప్లాట్ఫాం ఐఎంసీ సీఈవో పి. రామకృష్ణ తెలిపారు.’6జీ వ్యవస్థకు ప్రధానమైన అంశాలను అనుసంధానం చేయగలిగే కీలక ప్లాట్ఫాంగా ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఎదుగుతోంది. ఇందులో భారత్తో పాటు యూరప్, బ్రిటన్, అమెరికా, జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాల నుంచి పరిశ్రమకు చెందిన సీనియర్ నేతలు, నిపుణులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు’ అని ఆయన పేర్కొన్నారు. 6జీ సిపోజియంలో టెక్నాలజీ దిగ్గజాలతో పాటు ఐఐటీ, అంతర్జాతీయ యూనివర్సిటీల్లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల నుంచి విద్యావేత్తలు పాల్గోనున్నారు.6జీకి సంబంధించిన టెక్నాలజీలు, కృత్రిమ మేథ నెట్వర్క్లు, స్పెక్ట్రం క్రమబద్ధీకరణ తదితర అంశాలపై అత్యున్నత స్థాయిలో చర్చలు జరపనున్నట్లు రామకృష్ణ చెప్పారు. 7,000 మంది పైగా గ్లోబల్ ప్రతినిధులు, 800 మంది వక్తలు, 150 దేశాల నుంచి 400 మంది ఎగ్జిబిటర్లు ఇందులో పాల్గొంటారని అంచనా. 6జీ గ్లోబల్ రేసుకు భారత్ సారథ్యం వహించనుందని సెల్యులార్ ఆపరేటర్స్ సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచ్చర్ తెలిపారు.ఏఐ, జెన్ఏఐ టెక్నాలజీల్లో భారతీయ డిజిటల్ ఆవిష్కరణలు, దేశీయంగా టెలికం రంగాన్ని సరికొత్తగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. 5జీ విస్తరణ, 6జీ సన్నద్ధతకు 6 గిగాహెట్జ్ బ్యాండ్ను సమర్ధవంతంగా కేటాయించడం కీలకంగా ఉంటుందని వివరించారు. -
మస్క్ కంపెనీలో జాబ్స్: జీతం ఎంతో తెలుసా?
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ఏఐ కంపెనీ అయిన ఎక్స్ఏఐ (xAI) దాని చాట్బాట్ 'గ్రోక్' కోసం ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమైంది. వీడియో గేమ్ల కోసం.. వీడియో గేమ్స్ ట్యూటర్లను నియమించుకోనుంది. వీరు గ్రోక్కు గేమ్లను రూపొందించడం, కథలు చెప్పడం, యూజర్ ఆలోచనలకు సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వనున్నారు.గ్రోక్ టెక్స్ట్ ఆధారిత సంభాషణలకు పరిమితం చేయకుండా.. మరింత సృజనాత్మకంగా ఉండేలా ట్యూటర్స్ శిక్షణ ఇవ్వాల్సి ఉంది. కాబట్టి వీరు ఎక్స్ఏఐ సాఫ్ట్వేర్తో పని చేస్తారు. గేమ్ డిజైన్, కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత రంగాలలో అనుభవం ఉన్న అభ్యర్థుల కోసం కంపెనీ అన్వేషిస్తోంది. అయితే ఎన్ని ఉద్యోగాలు, ఎంతమందిని నియమించుకుంటారనే విషయం వెల్లడించలేదు.ఎంపికైన ఉద్యోగులు కాలిఫోర్నియాలోని ఆఫీసులో పనిచేయాల్సి ఉంటుంది. కానీ రిమోట్గా కూడా ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంది. రిమోట్గా వర్క్ చేయాలనుకునే అభ్యర్థులకు సెల్ఫ్ డిసిప్లైన్, స్ట్రాంగ్ మోటివేషన్ వంటివి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు మొదటి రెండు వారాలు ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుంది. ఆ తరువాత అనుకూలమైన టైమ్ ఎంచుకోవచ్చు.ఇదీ చదవండి: నాలుగు నిమిషాల మీటింగ్: ఉద్యోగం నుంచి తీసేశారు!జీతం & ప్రయోజనాలుఎంపికైన ఉద్యోగులకు జీతం గంటకు 45 డాలర్ల నుంచి 100 డాలర్ల వరకు ఉంటుంది. ప్రయోజనాలు దరఖాస్తుదారు నివసించే దేశంపై ఆధారపడి ఉంటాయి. ఫుల్ టైమ్ జాబ్ చేసే ఉద్యోగులకు మెడికల్ కవరేజ్ లభిస్తాయి. అయితే, పార్ట్-టైమ్ ఉద్యోగులకు ఇలాంటి ప్రయోజనాలు ఉండవు. -
సంద్రంలో వ్యక్తి ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్
టెక్నాలజీ అనేది చాలామంది పనులను వేగవంతం చేస్తుంది. దాంతోపాటు కొందరి ప్రాణాలు కోల్పోకుండా కాపాడుతుంది. అదెలాగని అనుకుంటున్నారా.. ఇటీవల బంగాళాఖాతంలో జరిగిన ఓ సంఘటన గురించి తెలియాల్సిందే. ఆ ఘటనలో ధరించగలిగే సాంకేతిక పరిజ్ఞానం (wearable technology) మరోసారి ప్రాణాలను రక్షించే సామర్థ్యాన్ని రుజువు చేసింది. పుదుచ్చేరి తీరంలో సంభవించిన స్కూబా డైవింగ్ ప్రమాదంలో యాపిల్ వాచ్ అల్ట్రా ముంబైకి చెందిన 26 ఏళ్ల టెక్కీని ఊహించని విధంగా కాపాడింది.ఈ-కామర్స్ రంగంలో పనిచేస్తున్న, స్కూబా డైవింగ్పై ఆసక్తి ఉన్న క్షితిజ్(26) అనే వ్యక్తి ఇటీవల బంగాళాఖాతంలో డైవింగ్ కోసం వెళ్లాడు. తన కోచ్తో కలిసి సముద్రంలో సుమారు 36 మీటర్ల లోతుకు చేరుకున్నాడు. ఒక్కసారిగా సంద్రంలో పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. అది గమనించిన క్షితిజ్ పైకి రావాలని నిర్ణయించుకున్నాడు. కానీ డైవింగ్ కిట్లో ముఖ్యమైన భాగంగా ఉన్న అతని వెయిట్ బెల్ట్ (Weight Belt) వదులైంది. దాంతో కంగారుపడి మరింత వేగంగా పైకి రావడానికి ప్రయత్నించాడు.నీటి అడుగున ఒత్తిడి మార్పుల కారణంగా డైవర్లు వేగంగా ఆరోహణ (Rapid Ascent) దిశగా లోతు నుంచి పైకి వచ్చే క్రమంలో ఒక్కోసారి ప్రాణాలు కోల్పోవచ్చు. ఇది ఊపిరితిత్తుల ఓవర్ ఎక్స్పాన్షన్ ఇంజురీలకు దారితీస్తుంది. అదేమీ లెక్క చేయకుండా వేగంగా పైకి రావడానికి క్షితిజ్ ప్రయత్నించాడు. అప్పటికే అతడు సాహసోపేత క్రీడల కోసం రూపొందించిన యాపిల్ వాచ్ అల్ట్రాను ధరించాడు. అతను వేగంగా పైకి వెళ్తుండగా వాచ్లోని సెన్సార్లు ఉపరితలం నుంచి లోతు, తన వేగాన్ని పరిగణించి అసాధారణ మార్పును గుర్తించాయి. వాచ్ స్క్రీన్పై తక్షణమే ఒక హెచ్చరిక కనిపించింది. ‘నెమ్మదిగా ఉండండి. మీరు చాలా వేగంగా వెళ్తున్నారు’ అని మేసేజ్ రూపంలో వచ్చింది.అయినప్పటికీ క్షితిజ్ పట్టించుకోకుండా వేగంగా వెళ్తున్నాడు. ఈ కీలక సమయంలో అత్యవసర పరిస్థితుల కోసం రూపొందించిన వాచ్ అల్ట్రా ఆటోమేటిక్ ఎమర్జెన్సీ సైరన్ మోగించింది. దాని శబ్దం సముద్రంలో గందరగోళ వాతావరణంలో కూడా స్పష్టంగా వినిపించేలా ఉండడంతో ముందు వెళ్తున్న కోచ్ ఆ శబ్దం విని తన వద్దకు వచ్చాడు. కోచ్ జోక్యం చేసుకుని క్షితిజ్ పరిస్థితిని నియంత్రించాడు. సురక్షితంగా పైకి వచ్చేందుకు తోడ్పాటు అందించాడు. ‘ఆ వాచ్లో సైరన్ ఫీచర్ ఉందని కూడా నాకు తెలియదు’ అని క్షితిజ్ అంగీకరించాడు. ‘ఇది నా ప్రాణాలను కాపాడింది’ అని చెప్పుకొచ్చాడు.ఇదీ చదవండి: తయారీ రంగంలో వృద్ధికి వ్యూహాలు -
అనుబంధ కంపెనీని అమ్మేస్తున్న గూగుల్!
టెక్నాలజీ దిగ్గజం గూగుల్ (Google) మాతృ సంస్థ ఆల్ఫాబెట్ (Alphabet Inc.) తన లైఫ్ సైన్సెస్ యూనిట్ ‘వెరిలీ’ని వదిలించుకోవడానికి సిద్ధమైంది. వెరిలీని సాంకేతికంగా విడదీయడానికి ఆల్ఫాబెట్ గత రెండేళ్లుగా పనిచేస్తోందని, ఇందులో భాగంగా దాన్ని విక్రయించడమో లేదా విడిపడి వేరే సంస్థగా ఏర్పాటు చేయడమో జరుగుతుందని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు.గూగుల్ చట్టవిరుద్ధంగా ప్రకటనల సాంకేతికతను గుత్తాధిపత్యం చేసిందన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో ప్రతివాది సాక్షిగా హాజరైన గూగుల్ సెక్యూరిటీ ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్ హీథర్ అడ్కిన్స్ వెరిలీ ప్రణాళికలను వివరించారు.వర్జీనియాలోని ఫెడరల్ కోర్టులో అడ్కిన్స్ మాట్లాడుతూ.. ఆల్ఫాబెట్ గొడుగు కింద గూగుల్కు సోదరి సంస్థగా ఉన్న వెరిలీ గత రెండున్నర సంవత్సరాలుగా గూగుల్ సొంత మౌలిక సదుపాయాల నుండి బయటపడటానికి, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్లోకి వెళ్లడానికి కృషి చేస్తోందన్నారు."మేము వారిని (వెరిలీ) స్వతంత్ర సంస్థగా మార్చడానికి సహాయపడే ప్రక్రియలో ఉన్నాము" అని ఆమె యూనిట్ గురించి చెప్పారు. అది అమ్మకం లేదా స్పిన్ ఆఫ్ ద్వారా కావచ్చు అన్నారు. "ఇది (వెరిలీ) ఇకపై ఆల్ఫాబెట్ సంస్థగా ఉండకూడదన్నదే ఆలోచన" అని పేర్కొన్నారు.వెరిలీ గురించి..వెరిలీ అనేది గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్కి చెందిన ఒక లైఫ్ సైన్సెస్ విభాగం. ఇది ఆరోగ్య పరిశోధన, ప్రెసిషన్ మెడిసిన్, డేటా ఆధారిత హెల్త్కేర్ పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో నిమగ్నమై ఉంది. వెరిలీ (మునుపటి పేరు గూగుల్ లైఫ్ సైన్స్ సర్వీస్) 2015 డిసెంబర్లో ఏర్పాటైంది. ఆల్ఫాబెట్ ఏర్పాటైన తర్వాత, గూగుల్ లైఫ్ సైన్సెస్ నుంచి వెరిలీ పేరుతో విడిపోయింది. -
టీసీఎస్లో తొలగించినవాళ్లకు రెండేళ్లు జీతం!
దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) భారీగా తొలగింపులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తొలగింపు కారణంగా ప్రభావితమైన ఉద్యోగుల కోసం కంపెనీ ఆకర్షణీయమైన సెవెరన్స్ ప్యాకేజీలను ప్రకటించినట్లు మీడియా నివేదికలు తెలిపాయి.మారుతున్న టెక్నాలజీ, కంపెనీ అవసరాలకు సరిపోలని ఉద్యోగులకు ఆరు నెలల నుండి గరిష్టంగా రెండేళ్ల వరకు జీతం ప్యాకేజీని అందిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. తొలగింపునకు గురైన ఉద్యోగులకు టీసీఎస్ ఇంకా ఏమేమి ఆఫర్ చేస్తోందో ఈ కథనంలో చూద్దాం.12,000 మందికి ఉద్వాసనమనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. టీసీఎస్ తన ఉద్యోగులలో సుమారు 2 శాతం లేదా సుమారు 12,000 మందిని వచ్చే సంవత్సరంలో తొలగించాలని నిర్ణయించింది. టెక్నాలజీ మార్పు, ఆటోమేషన్ యుగంలో చురుకైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండటానికి ఈ దశ అవసరమని కంపెనీ నమ్ముతోంది.మీడియా నివేదికలు ఉటంకించిన కంపెనీ వర్గాల ప్రకారం.. ఈ తొలగింపులు ప్రధానంగా ఎవరి నైపుణ్యాలు అవసరాలకు తగినట్లు లేవో, ఎవరైతే తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోలేదో అలాంటి ఉద్యోగులను ప్రభావితం చేస్తున్నాయి.కంపెనీ ఇస్తున్న ఆఫర్లు..ఉద్యోగులకు వారి సేవా వ్యవధిని బట్టి మూడు నెలల నోటీసు వ్యవధి, ఆరు నెలల నుండి 24 నెలల వరకు సెవెరన్స్ ప్యాకేజీని అందిస్తున్నారు. పదవీ విరమణ వయస్సుకు దగ్గరగా ఉన్న ఉద్యోగులకు కూడా కంపెనీ ముందస్తు పదవీ విరమణ ఎంపికలను విస్తరిస్తోందని మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఈ పథకం కింద, వారు బీమా వంటి పూర్తి పదవీ విరమణ ప్రయోజనాలతో పాటు వారికి ఇంకా మిగిలి ఉన్న సర్వీస్ కాలాన్ని బట్టి ఆరు నెలల నుండి రెండు సంవత్సరాల జీతానికి సమానమైన అదనపు సెవెరన్స్ ప్యాకేజీని పొందుతారు.సెవెరన్స్ ప్యాకేజీలు ఇలా..స్టాండర్డ్ ఆఫర్: 3 నెలల నోటీసు పీరియడ్ పే.10–15 సంవత్సరాల సర్వీసు: 1.5 సంవత్సరాల జీతం.15 ఏళ్ల కంటే ఎక్కువ సర్వీసు: 2 సంవత్సరాల వరకు జీతంబెంచ్ ఉద్యోగులు (8 నెలలకుపైగా వర్క్ అసైన్ కానివారు): 3 నెలల నోటీసు వేతనం మాత్రమే.కెరీర్ అవుట్ ప్లేస్ మెంట్: రెజుమ్ తయారీ, జాబ్ సెర్చ్లో సహాయం, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ (3 నెలలపాటు ఏజెన్సీ ఫీజులు).మానసిక ఆరోగ్య మద్దతు: "టీసీఎస్ కేర్స్" ప్రోగ్రామ్ ద్వారా సహాయం. -
జియో 3 నెలల ప్లాన్: చౌకగా డైలీ 2జీబీ.. అన్లిమిటెడ్
రిలయన్స్ జియో తన 9వ వార్షికోత్సవాన్ని ఇటీవలె జరుపుకొంది. అప్పటి నుండి, కంపెనీ తన వినియోగదారుల కోసం అనేక రీఛార్జ్ ప్లాన్లపై ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. అందులో ఒకటే రూ.899 ప్లాన్. దీంతో హై స్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్తో పాటు ఇతర ఆకట్టుకునే ప్రయోజనాలను అందిస్తోంది.జియో రూ.899 ప్లాన్.. ప్రయోజనాలుజియో నుండి వచ్చిన ఈ ఆకట్టుకునే ప్లాన్ ధర రూ.899. పూర్తి 90 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. రోజుకు 2జీబీ హై-స్పీడ్ డేటాతో పాటు 20జీబీ అదనపు డేటాను కూడా అందిస్తోంది. అంటే మొత్తం డేటా 200GB అవుతుంది.ఇంకా ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్ ను కూడా అందిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉచితంగా పంపించుకోవచ్చు. జియో 5జీ నెట్ వర్క్ ఉన్న ప్రాంతంలో నివసిస్తుంటే ఈ ప్లాన్ తో అపరిమిత 5జీ డేటాను ఆనందించవచ్చు.డేటా, కాలింగ్ మాత్రమే కాదు, ఈ ప్లాన్ జియో టీవీ, జియో ఐ క్లౌడ్, జియో హాట్ స్టార్ కు ఉచిత సబ్ స్క్రిప్షన్ లతో సహా ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్లో 3నెలల జియో హాట్ స్టార్ మొబైల్, టీవీ సబ్ స్క్రిప్షన్ కూడా చేర్చారు.అదనంగా, ఈ ప్లాన్ లో 3 నెలల పాటు జియోసావ్ ప్రోకు 1 నెల జొమాటో గోల్డ్ సబ్ స్క్రిప్షన్, ఉచితంగా 6 నెలల నెట్ మెడ్స్ ఫస్ట్ సభ్యత్వం ఉన్నాయి. ఇంకా ఈజీ మై ట్రిప్ పై రూ .2220 వరకు డిస్కౌంట్, హోటల్ బుకింగ్ లపై 15% వరకు తగ్గింపును అందిస్తుంది. అజియోపై రూ.200 తగ్గింపు, రిలయన్స్ డిజిటల్పై రూ.399 వరకు తగ్గింపును కూడా పొందుతారు. -
దేశపు తొలి ఏఐ కాల్ అసిస్టెంట్..
గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్కి సమాధానమిచ్చేలా భారతదేశపు తొలి ఏఐ కాల్ అసిస్టెంట్ను రూపొందించినట్లు హైదరాబాదీ అంకుర సంస్థ ఈక్వల్ వ్యవస్థాపకుడు, పారిశ్రామిక దిగ్గజం జీవీకే వారసుడు కేశవ రెడ్డి తెలిపారు.ఈక్వల్ ఏఐ అక్టోబర్ 2 నుంచి ఢిల్లీ–ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్)లో అందుబాటులోకి వస్తుందని, దశలవారీగా దేశవ్యాప్తంగా ప్రవేశపెడతామని యన తెలిపారు. 2026 మధ్య నాటికి రోజుకు 10 లక్షల యాక్టివ్ యూజర్లను లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.గుర్తు తెలియని నంబర్లు, టెలీమార్కెటింగ్, డెలివరీ ఏజెంట్ల కాల్స్ మొదలైన వాటికి ఇది ఇంగ్లీష్, హిందీ, హింగ్లీష్ భాషల్లో సమాధానమివ్వగలదు. అవసరమైతే యూజర్ మధ్యలో కాల్ను టేకోవర్ చేయొచ్చు. -
సైబర్ నేరాలకు చెక్ పెట్టేలా ఆర్బీఐ చర్యలు
సైబర్ నేరాలు భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాలకు తీవ్రమైన ముప్పు కలిగిస్తున్న నేపథ్యంలో దేశంలో ఆన్లైన్ బ్యాంకింగ్ భద్రతను పటిష్టం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా భారతదేశంలోని టాప్ 200 బ్యాంకులు తమ ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలను కొత్త, సురక్షితమైన, ప్రత్యేకమైన డొమైన్ ‘.bank.in’కు మార్చాలని తెలిపింది. అక్టోబర్ 31, 2025 నాటికి దీని అమలును పూర్తి చేయాలని అన్ని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది.సైబర్ సెక్యూరిటీ పెంచడమే లక్ష్యంపెరుగుతున్న సైబర్ సెక్యూరిటీ సమస్యలను పరిష్కరించడానికి ఆర్బీఐ ఈమేరకు వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం, బ్యాంకులు .com, .in, .co.in వంటి సాధారణ డొమైన్ల కింద కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ డొమైన్లను సైబర్ నేరగాళ్లు సులభంగా దుర్వినియోగం చేస్తున్నారు. ఫిషింగ్, స్పూఫింగ్ దాడుల ద్వారా వినియోగదారులను మోసం చేసి వారి సున్నితమైన సమాచారాన్ని దొంగిలిస్తున్నారు.ఈ వ్యవహారంపై ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (IDRBT) డైరెక్టర్ దీపక్ కుమార్ స్పందిస్తూ..‘కొత్తగా ఆర్బీఐ ప్రతిపాదించిన .bank.in డొమైన్తో వినియోగదారులు చట్టబద్ధమైన బ్యాంకింగ్ వెబ్సైట్లను మాత్రమే యాక్సెస్ చేస్తున్నారని నమ్మకంగా ఉండవచ్చు. రిజిస్టర్డ్ భారతీయ బ్యాంకులు మాత్రమే వెబ్సైట్లను హోస్ట్ చేయగల సర్వీసులను అందించడం ద్వారా ఫిషింగ్ దాడులను గణనీయంగా తగ్గించవచ్చు. ఇది ప్రజల విశ్వాసాన్ని పెంచుతుంది. దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థలో 95% ఇప్పటికే ఈమేరకు చర్యలు పూర్తయ్యాయి. ముఖ్యంగా 12 ప్రభుత్వం ప్రధాన ప్రైవేట్ రంగ సంస్థలతోపాటు కొన్ని ప్రైవేట్ బ్యాంకులు .bank.in యూఆర్ఎల్ను పొందాయి’ అని చెప్పారు.ఇదీ చదవండి: అమెరికా షట్డౌన్తో భారత వాణిజ్యంపై ప్రభావం ఎంత? -
వాట్సాప్కు పోటీగా స్వదేశీ యాప్: అరట్టై గురించి తెలుసా?
స్మార్ట్ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరికీ.. వాట్సాప్ గురించి తెలిసే ఉంటుంది. కానీ ఇలాంటి తరహా ఇండియన్ యాప్ 'అరట్టై' (Arattai) గురించి తెలుసా?. ఈ పేరును ఎప్పుడైనా విన్నారా?. బహుశా ఈ పేరు కొత్తగా అనిపించినప్పటికీ.. ఈ యాప్ మొదటిసారిగా 2021లో యాప్ స్టోర్లలోకి ప్రవేశించింది. అయితే భారత ప్రభుత్వం ఆమోదం పొందిన తరువాత.. సోషల్ మీడియా వైరల్ అవ్వడంతో ఈ మేడ్ ఇన్ ఇండియా యాప్ ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది.అరట్టై యాప్ జోహో కంపెనీ రూపొందించింది. ప్రస్తుతం ఇది గూగుల్ ప్లే స్టోర్ & యాపిల్ యాప్ స్టోర్లలో అందుబాటులో ఉంది. దీనికి మెల్లగా ఆదరణ పెరుగుతోంది. దీన్నిబట్టి చూస్తే.. రానున్న రోజుల్లో మెటా మెసేజింగ్ యాప్ వాట్సాప్కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.➤అరట్టై.. వాట్సాప్ రెండూ మెసేజింగ్ యాప్స్ అయినప్పటికీ, అరట్టైలో కొన్ని అదనపు ఫీచర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యాప్ గురించి జోహో సీఈఓ శ్రీధర్ వెంబు గత కొన్ని రోజులుగా తన ఎక్స్ ఖాతాలో చెబుతూనే ఉన్నారు.➤అరట్టై ఆండ్రాయిడ్ టీవీలతో సహా విస్తృత శ్రేణి పరికరాలకు యాక్సెస్ను అందిస్తుంది. అయితే వాట్సాప్ ప్రస్తుతం వీటికి మద్దతు ఇవ్వదు. వినియోగదారులు తమ అరట్టై ఖాతాను ఒకేసారి ఐదు పరికరాల్లో ఉపయోగించవచ్చు.➤అరట్టైలో పాకెట్ ఫీచర్ ఉంది. ఇది వినియోగదారులు ఫోటోలు, వీడియోలు, నోట్స్, రిమైండర్లు, ఇతర ఫైల్లను స్టోర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వాట్సాప్లో ఈ ఫీచర్ లేదు. అయితే, వాట్సాప్ 'యు' చాట్ విండోను అందిస్తుంది, ఇక్కడ వినియోగదారులు తమతో తాము చాట్ చేసుకోవచ్చు, కావలసినవి సేవ్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: చాట్జీపీటీతో కొత్త భాష.. కేవలం 30 రోజుల్లో!➤అరట్టై యాప్.. తక్కువ మెమరీ ఉన్న స్మార్ట్ఫోన్లు & పాత 2G/3G నెట్వర్క్లలో కూడా సజావుగా పనిచేసేలా రూపొందించబడింది. ఇది గ్రామీణ వినియోగదారులకు, బడ్జెట్ పరికరాలను కలిగిన వారికి అందుబాటులో ఉంటుంది. అంతే కాకుండా అరట్టైలో యూపీఐ చేయడానికి కూడా జోహో సిద్ధమవుతోంది. దీనికోసం ఐస్పిరిట్ గ్రూప్తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.On Arattai, we have initiated discussions with Sharad Sharma of iSpirt, the group that did the technical work to make UPI happen, to standardize and publish the messaging protocols. I am a huge fan of UPI and hugely respect the work the team did. Sharad is a good friend and he…— Sridhar Vembu (@svembu) September 30, 2025 -
దేశంలోనే తొలి ఏఐ కాల్ అసిస్టెంట్.. త్వరలో ప్రారంభం
ఏదో ముఖ్యమైన పనిలో బిజీగా ఉన్న సమయంలో వచ్చే స్పామ్ కాల్స్ చిరాకు తెప్పిస్తుంటాయి. ఇకపై అలాంటి కాల్స్తోపాటు ఫోన్లోని కాంటాక్ట్ లిస్ట్లో లేని కాల్స్కు సమాధానం ఇచ్చేలా హైదరాబాద్కు చెందిన స్టార్టప్ ‘ఈక్వల్ఏఐ’ కొత్తగా ఇంటెలిజెంట్ కాల్ అసిస్టెంట్ను రూపొందించింది. ఇది ఆయా కాల్స్ను గుర్తించి ఎదుటి వ్యక్తితో వాస్తవికంగా మాట్లాడి బ్రీఫ్గా అందులోని సారాంశాన్ని సందేశం రూపంలో యూజర్ ముందుంచుతుంది. దీన్ని అక్టోబర్ 2న న్యూదిల్లీలో ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది.భారతదేశంలో దాదాపు 100 కోట్ల స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఉన్నారు. 60% మంది భారతీయులు రోజుకు 3 కంటే ఎక్కువ స్పామ్ కాల్స్తో ఇబ్బంది పడుతున్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఇప్పటికే డునాట్ డిస్టర్బ్(DND) రిజిస్ట్రీలు, కాలర్ ఐడీ యాప్లు ఉన్నప్పటికీ స్పామ్ కాల్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో యూజర్లకు వీటి నుంచి ఉపశమనం కలిగించేలా ఈక్వల్ ఏఐ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా కొత్తగా ఏఐ అసిస్టెంట్ను ప్రారంభించనుంది.ట్రయల్ సక్సెస్ఈక్వల్ ఏఐ టూల్ ట్రయల్స్ సమయంలో 87% అంతరాయాలను సమర్థంగా నిర్వహించినట్లు కంపెనీ తెలిపింది. పార్సిల్ డెలివరీలను సమన్వయం చేసుకోవడంలో యూజర్లు గడిపే సమయాన్ని 73% తగ్గించినట్లు పేర్కొంది. 94% స్పామ్ కాల్స్ను గుర్తించి అందుకు అనుగుణంగా స్పందించినట్లు తెలిపింది. అయితే కాంటాక్ట్ లిస్ట్లో సేవ్ అయిన నంబర్ల నుంచి వచ్చే కాల్స్కు ఇది సమాధానం ఇవ్వదని గమనించాలి.డెలివరీ ఏజెంట్లతో మాట్లాడే క్రమంలో చిరునామాలు లేదా సూచనలు ఇస్తుంది.లైవ్ కాల్ ట్రాన్స్క్రిప్ట్ అందిస్తుంది.యూజర్ ఎప్పుడైనా నేరుగా కాల్కు సమాధానం ఇవ్వొచ్చు.భారతీయ భాషలు, కాలర్ నమూనాలపై శిక్షణ పొందింది.ప్రాథమికంగా ఢిల్లీ ఎన్సీఆర్లో ఆండ్రాయిడ్ వినియోగదారులకు అక్టోబర్ 2, 2025 నుంచి ఈ సేవలు ప్రారంభం అవుతాయని కంపెనీ తెలిపింది. 2025 నాలుగో త్రైమాసికం నాటికి ముంబై, బెంగళూరు, హైదరాబాద్లకు ఈ సర్వీసులు విస్తరిస్తాయని పేర్కొంది.ఇదీ చదవండి: యూఎస్ బెదిరించినా తగ్గేదేలే -
చాట్జీపీటీతో కొత్త భాష.. కేవలం 30 రోజుల్లో!
ఏ ప్రశ్నకైనా సమాధానం ఇచ్చే చాట్జీపీటీ (ChatGPT).. ఇప్పుడు కొత్త భాషలు (New Language) నేర్చుకోవడానికి కూడా సహకరిస్తోంది. నెల రోజుల వ్యవధిలోనే.. పదజాలం, వ్యాకరణం, మాట్లాడటం వంటివి సులభంగా నేర్చుకోవచ్చు!. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సులభంగా కొత్త భాషను 30 రోజుల్లో నేర్చుకోవడానికి 8 ప్రాంప్ట్లను ఉపయోగించాల్సి ఉంటుందని మార్కెటింగ్, గ్రోత్ నిపుణుడైన 'చిదానంద్ త్రిపాఠి' పేర్కొన్నారు. అవి ''30 రోజులలో భాషా అభ్యాస ప్రణాళిక, రోజువారీ పదజాలం, అభ్యాస అనుకరణ, సాధారణ పదాలలో వ్యాకరణ వివరణ, వినడం, నిజ జీవిత సంభాషణకు సంబంధించిన ఉదాహరణలను క్రియేట్ చేయడం, తప్పుల దిద్దుబాటు, మోటివేషనల్ చెక్''.పైన చెప్పిన 8 ప్రాంప్ట్లను ఉపయోగించడం ద్వారా.. నెల రోజుల్లో కొత్త భాషను సులభంగా నేర్చుకోవచ్చని.. చిదానంద్ త్రిపాఠి పేర్కొన్నారు. ప్రాక్టీస్ చేయడానికి, పదాలను తెలుసుకోవడానికి చాట్జీపీటీ ఉపయోగపడుతుందని ఆయన వివరించారు.CHATGPT CAN TEACH YOU A NEW LANGUAGE - MASTER IT IN 30 DAYSUse these 8 prompts to accelerate language acquisition:— Chidanand Tripathi (@thetripathi58) September 28, 2025 -
ఏఐతో సరిగమలు పలికించేలా రెహమాన్ వినూత్న ప్రాజెక్ట్
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ‘మొజార్ట్ ఆఫ్ మద్రాస్ సీక్రెట్ మౌంటైన్’ అనే వినూత్న సంగీత ప్రాజెక్టును ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. ఇది మెటావర్స్లో వర్చువల్ ఏఐ ఆధారిత బ్యాండ్. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ ప్రాజెక్ట్కులో భాగంగా ప్రత్యేకమైన డిజిటల్ సింఫనీ ద్వారా ప్రపంచ సంస్కృతులను ఏకం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రెహమన్ ఓ కార్యక్రమంలో చెప్పారు.సీక్రెట్ మౌంటైన్ అంటే ఏమిటి?ఇది ఆరుగురు సభ్యులున్న వర్చువల్ బ్యాండ్. ఇందులో ప్రముఖ సంగీత కళాకారులు కారా, బ్లెసింగ్, ఎకామ్, జెంటమ్, డేవిడ్, ఆఫియా ఉన్నారు. ఈ బ్యాండ్ పూర్తిగా మెటావర్స్లో ఉంటుంది. మెటావర్స్ అనేది ఒక సామూహిక వర్చువల్ స్పేస్. ఇందులో డిజిటల్ అవతార్లు వర్చువల్గా సాంకేతికతలను ఉపయోగించి పరస్పరం సంభాషించవచ్చు. కలిసి పాడవచ్చు. వర్చువల్ రియాలిటీ (VR), ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) కలయికతో ఇది పని చేస్తుంది. వీటిని ఉపయోగించి రెహమాన్ సంగీతాన్ని సృష్టించనున్నారు.ఏఐ, క్రియేటివిటీఏఐ సృజనాత్మకతను పెంపొందించడానికి ఈ ప్రాజెక్ట్ ఉపయోగించబడుతుందని, అదే సమయంలో మానవ కళాత్మకతను ఇది భర్తీ చేయదని రెహమాన్ నొక్కి చెప్పారు. ఇందులో అవతార్లు ఉపయోగించినా సంగీతం, సాహిత్యం, స్వరాలు రియలిస్టిక్గా ఉంటాయన్నారు. ఏఐ మ్యూజిక్ ప్రోడక్షన్ను వేగవంతం చేస్తుందని చెప్పారు. ఇటీవల యూఎస్లో రెహమాన్ ఓపెన్ ఎఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్, పెర్ప్లెక్సిటీకి చెందిన అరవింద్ శ్రీనివాస్తో సమావేశమయ్యారు. ఈ వినూత్న ప్రాజెక్ట్కు సారథ్యం వహిస్తున్న రేడియంట్ సోల్స్ అనే సంస్థ సిలికాన్ వ్యాలీలోని ఏఐ కంపెనీలతో భాగస్వామ్యం కలిగి ఉంది.ఇదీ చదవండి: ఎన్నికల వేళ రాష్ట్ర ఖజానాకు కాసుల గలగల -
రోజుకు 2.5జీబీ డేటా.. అన్లిమిటెడ్ కాల్స్: రూ.225 ప్లాన్
భారత ప్రభుత్వం యాజమాన్యంలోని టెలికాం ఆపరేటర్ 'భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్' (BSNL), జియో & ఎయిర్టెల్ వంటి ప్రైవేట్ టెలికాం దిగ్గజాలకు సవాలు విసురుతూ కేవలం రూ.225 ధరకే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ను ప్రారంభించింది. రూ.250 కంటే తక్కువ ధరకే అత్యుత్తమ ప్రయోజనాలను అందించడం ద్వారా ఎక్కువమంది వినియోగదారులను ఆకట్టుకునే చర్యలో భాగంగానే బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ తీసుకొచ్చింది.బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టిన రూ. 225 ప్లాన్.. 30 రోజులు చెల్లుబాటు అవుతుంది. అంటే రోజువారీ ఖర్చు రూ.7.50 అన్నమాట. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా వినియోగదారుడు రోజుకు 2.5 జీబీ హైస్పీడ్ డేటా, ఏ నెట్వర్క్కు అయినా.. అపరిమిత లోకల్ & ఎస్టీడీ కాలింగ్ లభిస్తుంది. రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు లభిస్తాయి. ఇన్ని ప్రయోజనాలను అందించే ఈ ప్లాన్.. ఇతర ప్రైవేట్ ఆపరేటర్స్ ప్లాన్స్ కంటే చౌక.బీఎస్ఎన్ఎల్ ఇతర రీఛార్జ్ ప్లాన్స్రూ.199 ప్లాన్: ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు. రోజుకు 2 జీబీ హై-స్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, వీటన్నింటితో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లను కూడా అందిస్తుంది. దేశంలోని ఇతర టెలికాం సర్వీస్ ప్రొవైడర్లతో పోలిస్తే రూ .199 ప్లాన్ ఆర్థిక ప్రయోజనాలు, అధిక ప్రయోజనాలను కలిగి ఉందని పేర్కొంటూ బీఎస్ఎన్ఎల్ ఈ రీఛార్జ్ ప్యాక్ను ప్రవేశపెట్టింది.బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్వర్క్ప్రధానమంత్రి నరేంద్ర మోదీ "స్వదేశీ" 4G స్టాక్ను ప్రారంభించారు. ఇది 'ఆత్మనిర్భర్ భారత్' దార్శనికత వైపు ఒక పెద్ద ముందడుగును సూచిస్తుంది. ఈ 4G టెక్నాలజీని పూర్తిగా దేశీయ సాఫ్ట్వేర్ & హార్డ్వేర్పై నిర్మించారు. దీనిని భారతీయ కన్సార్టియం అభివృద్ధి చేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 98,000 సైట్లలో 4G సేవను విస్తరించాలనే లక్ష్యంతో దీనిని ప్రారంభించారు. -
ఒక్క క్లిక్ చాలు.. వెంటనే చేతిలో ఫొటో
మునుపటి రోజుల్లో ఫొటో అంటే ఒక్క క్లిక్ చాలు. వెంటనే ఆ ఫొటో చేతిలోనే ఉండేది. వేలకొద్దీ బ్లర్లు, సెల్ఫీ డిలీట్స్, ఎడిట్స్ ఏమీ ఉండేవి కాదు. ఆ మ్యాజిక్ను మళ్లీ మన చేతిలో తేవడానికి వచ్చింది – ఇన్టాక్స్ మినీ ఇవో ప్రీమియం ఎడిషన్! ఇది కేవలం కెమెరా మాత్రమే కాదు, ప్రింటర్ కూడా. ఒక్క క్లిక్తో ఫొటో తీయవచ్చు, అదే క్షణంలో ప్రింట్ చేసుకోవచ్చు. పది లెన్స్ ప్రభావాలు, పది ఫిల్మ్ ప్రభావాలు – మొత్తం వంద రకాల మూడ్లలో మీ ఫోటోలు తీర్చిదిద్దుకోవచ్చు. రెట్రో లుక్ డిజైన్, డయల్స్తో పాత కెమెరా ఫీల్కు కొత్త స్పర్శ ఇస్తుంది. అంతేకాదు, డైరెక్ట్ ప్రింట్ ఫీచర్తో మొబైల్ నుంచి ఫోటోలు నేరుగా ప్రింట్ చేయవచ్చు. ధర రూ. 19,999.చిన్ననాటి జాదూ బాక్స్!చిన్నప్పటి రోజుల్లో స్కూల్ నుంచి వచ్చి బ్యాగ్ మూలన పడేసి, భోజనం కూడా మరచిపోయి గేమ్ కన్సోల్ ఆన్ చేసిన క్షణాలు గుర్తున్నాయా? మారియోలో ప్రిన్సెస్ కోసం పరిగెత్తిన ఆ ఉత్సాహం, కాంట్రాలో లైఫ్ పోయినప్పుడు మనసులో పడిన ఆ బాధ– ఇవన్నీ మళ్లీ నిజం కానున్నాయి. ‘బెలోక్సీ ఎ5 హ్యాండ్హెల్డ్ గేమ్ కన్సోల్’ అంటే కేవలం ఒక గాడ్జెట్ కాదు, అది 90ల నాటి బాల్యపు మజాను తిరిగి మన చేతిలో పెట్టే జాదూ బాక్స్. ఇందులో ఏకంగా 500 క్లాసిక్ గేమ్స్. చేతిలో పట్టుకుని ఆడినా సరే, టీవీకి కనెక్ట్ చేసి పెద్ద స్క్రీన్పై ఆడినా సరే, ఆ పాత రెట్రో ఫీల్ కచ్చితంగా వస్తుంది. రాత్రిళ్లు దుప్పట్లో దాక్కుని, లైట్ ఆఫ్ చేసి ఆడిన ఆ సీక్రెట్ మజాను కూడా ఇది మళ్లీ జ్ఞాపకం చేస్తుంది. ధర కేవలం రూ.758 మాత్రమే!అప్పటి రోబో పెట్!ప్రస్తుత పిల్లలు ఆడుతున్న ఆర్టిఫిషియల్ రోబో ఫ్రెండ్స్, డిజిటల్ టాయ్స్ కంటే బెటర్గా అప్పట్లో ఒక నిజమైన డిజిటల్ ఫ్రెండ్ ఉండేది. అది అప్పటి అందరి ఫేవరెట్ పెట్– టమాగొచ్చి! అప్పట్లో అది కేవలం ఒక గేమ్ కాదు, నిజంగా మనకున్న డిజిటల్ పెట్ ఫ్రెండ్. దానికి తిండి పెట్టాలి, స్నానం చేయించాలి, బయటికి తీసుకెళ్లాలి, ఆటలు ఆడించాలి– ఇవన్నీ మన బాధ్యతే! ఇప్పుడా పెట్ కొత్త కలర్ స్క్రీన్, టచ్ బటన్స్, కెమెరా, గేమ్స్ అన్నీ కలిపి మరింత అప్డేట్ అయి మన చేతిలోకి వచ్చేసింది– బాండై అమెరికా టమాగొచ్చి పిక్స్ – స్కై పర్పుల్ ఎడిషన్! ఇందులో మీరు మీ పెట్తో సెల్ఫీలు తీయొచ్చు, వంటలు చేయించవచ్చు, ఫ్రెండ్స్ టమాగొచ్చిలతో కలసి ప్లే డేట్స్కి వెళ్లొచ్చు, గిఫ్ట్లు మార్చుకోవచ్చు. పదిహేడుకు పైగా గేమ్స్లో ఆడి పాయింట్స్ సంపాదించి, మీ పెట్కి కావలసిన ఫర్నిచర్, ఫుడ్, యాక్సెసరీస్ కొనిపెట్టొచ్చు. ధర రూ.9,831. -
హెచ్-1బి వీసా రాని టెకీలకు కెనడా గాలం!
అమెరికాలో పనిచేస్తూ కొత్త ఫీజు, నిబంధనల కారణంగా హెచ్-1బి వీసా (H-1B Visa) పొందలేకపోయిన టెక్నాలజీ రంగ నిపుణలకు కెనడా దేశం గాలం వేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కొత్త వీసా ఛార్జీలకు ముందు యూఎస్లో పనిచేసిన టెక్ ఉద్యోగులను తమ దేశానికి ఆకర్షించాలనుకుంటున్నారు కెనడా ప్రధాని మార్క్ కార్నీ.తాజాగా లండన్లో విలేకరులతో మార్క్ కార్నీ మాట్లాడుతూ తమ ఆలోచనను బయటపెట్టారు. గతంలో హెచ్ -1బీ వీసాలు ఉన్న వారిని ఆకర్షించే అవకాశం స్పష్టంగా ఉందని కార్నీ వెల్లడించారు. అలాంటి వారిలో టెక్ రంగ ఉద్యోగులు చాలా మంది ఉన్నారని, వారంతా వేరే ప్రాంతానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.కొత్త హెచ్ -1బి వీసాలపై లక్ష డాలర్ల ఫీజు విధిస్తూ ట్రంప్ గత వారం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. ఇది కంప్యూటర్ ప్రోగ్రామింగ్, ఇంజనీరింగ్, ఇతర ఉద్యోగాల్లో ప్రపంచ ప్రతిభను తీసుకురావడానికి కొత్త హెచ్ -1బి ప్రోగ్రామ్పై ఆధారపడే కంపెనీలకు గందరగోళం, నిరాశను సృష్టించింది.కెనడా (Canada) ప్రభుత్వం తన ఇమ్మిగ్రేషన్ వ్యూహాన్ని సమీక్షిస్తున్నప్పుడు, ఈ రకమైన ప్రతిభావంతులైన నిపుణులను ఆకర్షించే అంశాన్ని గ్రహించడాన్ని పరిగణనలోకి తీసుకుంటుందని, దానిపై "స్పష్టమైన సమర్పణ" ఉంటుందని కార్నీ చెప్పారు.హెచ్-1బి వీసాలు చేజారి, అమెరికాలో పని చేసేందుకు అవకాశాలు కోల్పోయినవారిని పలు ఇతర దేశాలు కూడా ఆకర్షిస్తున్నాయి. జర్మనీ, యూకే వంటి దేశాలు నైపుణ్యం కలిగిన కార్మికులకు ప్రత్యామ్నాయ గమ్యస్థానంగా తమను తాము పేర్కొంటున్నాయి. -
ఊహకందని చరిత్ర: గూగుల్కు ఆ పేరు వచ్చిందిలా..
ప్రపంచం టెక్నాలజీ వైపు పరుగులు పెడుతున్న సమయంలో 'గూగుల్' (Google) గురించి తెలియని వారు దాదాపు ఉండరనేది అక్షర సత్యం. ఆవకాయ వండాలన్న.. అమలాపురం గురించి తెలుసుకోవాలన్నా.. అన్నింటికీ ఒకటే సులభమైన మార్గం గూగుల్. ఈ రోజు నభూతో నభవిష్యతిగా ఎదిగిన 'గూగుల్' రెండు దశాబ్దాల క్రితం ఓ సాదాసీదా సెర్చ్ ఇంజన్ మాత్రమే. ఇప్పుడు ఏ ప్రశ్నకైనా సమాధానం అందించే జగద్గురుగా మారింది. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు గూగుల్ ప్రస్థానం గురించి మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం..చరిత్ర గురించి చదువుకునేటప్పుడు క్రీస్తు పూర్వం.. క్రీస్తు శకం అని చదువుకున్నాం. ఇప్పుడు మాత్రం గూగుల్ పూర్వం యుగం, గూగుల్ తర్వాత యుగం అని చదువుకోవాల్సిన రోజులు వచ్చేసాయి. దీన్ని బట్టి చూస్తే.. గూగుల్ ఎంతలా వ్యాపించిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.గూగుల్ ప్రారంభం..90వ దశకం చివరిలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటిలో కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్లో ప్రావిణ్యం కలిగిన ఇద్దరు PhD స్టూడెంట్స్ ''సెర్గీ బ్రిన్, లారీ పేజ్''లు గూగుల్ ప్రారంభించాలని నిర్విరామంగా శ్రమించి మెరుగైన సర్చ్ ఇంజిన్ కోసం ఒక నమూనాను అభివృద్ధి చేశారు. 1997 సెప్టెంబర్ 15న ‘గూగుల్ డాట్ కామ్’ డొమైన్ పేరును నమోదు చేసుకున్నారు. ఆ తరువాత 1998 సెప్టెంబర్ 4న గూగుల్ కంపెనీని ఏర్పాటు చేసుకుని.. తోటి పీహెచ్డీ స్టూడెంట్ 'క్రెయిగ్ సిల్వర్స్టీన్'ను తొలి ఉద్యోగిగా చేర్చుకుని సంస్థను అధికారికంగా ప్రారంభించారు.గూగుల్ అనే పదం ఎలా వచ్చిందంటే..'గూగుల్' అనే పేరు 'గూగోల్' అనే పదం నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. గూగోల్ అనే పదానికి అర్థం ఒకటి తర్వాత వంద సున్నాలు లేదా సరైన శోధన ఫలితాలను అందించేది. ఈ పదాన్ని జేమ్స్ న్యూమాన్ అండ్ ఎడ్వర్డ్ కాస్నర్ రాసిన 'మ్యాథమెటిక్స్ అండ్ ది ఇమాజినేషన్' అనే పుస్తకం నుంచి తీసుకున్నట్లు తెలుస్తోంది.గూగుల్ ప్రస్థానం ఇలా..1998లో అధికారికంగా ప్రారంభమైన గూగుల్ అంచెలంచేలా ఎదుగుతూ కేవలం సెర్చ్ ఇంజన్గా మాత్రమే కాకుండా.. గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్, గూగుల్ స్టోర్స్, గూగుల్ క్రోమ్, యూట్యూబ్ మొదలైనవి ప్రారంభించి ప్రపంచాన్ని అరచేతిలో పెట్టేసింది.●1997 - గూగుల్.కామ్ డొమైన్ రిజిస్ట్రేషన్●1998 - గూగుల్ అధికారికంగా ప్రారంభమైంది●1999 - గూగుల్ పేజీ ర్యాంక్ డెవెలప్●2000 - యాహూ భాగస్వామ్యంతో.. పెద్ద యూజర్ 'ఆర్గానిక్ సెర్చ్'గా అవతరించింది. గూగుల్ టూల్ బార్ లాంచ్. కొత్తగా 10 భాషలను జోడించింది (ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, స్వీడిష్, ఫిన్నిష్, స్పానిష్, పోర్చుగీస్, డచ్, నార్వేజియన్, జపనీస్, చైనీస్, కొరియన్, డానిష్).●2001 - గూగుల్ తన మొదటి ఛైర్మన్ 'ఎరిక్ ష్మిత్'ను స్వాగతించింది. గూగుల్ ఫొటోస్ ప్రారంభమైంది.●2002 - Google AdWords పరిచయం, గూగుల్ న్యూస్ మొదలైంది. గూగుల్ చరిత్రలో ఇది పెద్ద మైలురాయి.●2003 - గూగుల్ AdSense ప్రారంభమైంది, దీనికి మొదట కంటెంట్ టార్గెటింగ్ అడ్వర్టైజింగ్ అని పేరు పెట్టారు.●2004 - జీమెయిల్ ప్రారంభం●2005 - గూగుల్ మ్యాప్స్●2006 - Google YouTubeని కొనుగోలు చేస్తుంది●2007 - ఆన్లైన్ అడ్వర్టైజింగ్ కంపెనీ అయిన డబుల్ క్లిక్ను గూగుల్ కొనుగోలు చేసింది●2008 - గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ప్రారంభించింది●2009 - ఫోర్బ్స్ మ్యాగజైన్ సెర్గీ బ్రిన్, లారీ పేజ్లను ప్రపంచంలోని ఐదవ అత్యంత శక్తివంతమైన వ్యక్తులుగా పేర్కొంది●2010 - గూగుల్ తన మొట్టమొదటి బ్రాండ్ స్మార్ట్ఫోన్ నెక్సస్ వన్ను విడుదల చేసింది.●2011 - సీఈఓగా లారీ పేజ్ నియామకం, ఎరిక్ ష్మిత్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయ్యారు. ●2012 - గూగుల్ మోటరోలా మొబిలిటీని కొనుగోలు చేసింది●2013 - గూగుల్ రీడర్ మూసివేసి.. Chromecast ప్రారంభం●2014 - హమ్మింగ్ బర్డ్ ఆల్గారిథం●2015 - సీఈఓగా సుందర్ పిచాయ్●2016 - గూగుల్ తయారు చేసిన మొదటి ఫోన్.. గూగుల్ పిక్సెల్ లాంచ్●2017 - HTCలో కొంత భాగాన్ని కొనుగోలు చేసింది●2018 - మొబైల్ స్పీడ్ అల్గారిథం అప్డేట్, 20 సంవత్సరాల చరిత్రలో 100 బిలియన్ డాలర్లను అధిగమించింది●2019 - బ్రాడ్ కోర్ అల్గారిథం, గూగుల్ SERPs స్టార్ట్●2020 - నియామకాలను నెమ్మదించడం, మెషీన్లు మరియు డేటాపై ఎక్కువ దృష్టి పెట్టడం (కోవిడ్-19)●2021 - ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ కంటెంట్ను ఉపయోగించుకునే హక్కు కోసం మీడియా కంపెనీలకు Google చెల్లించాల్సిన చట్టాన్ని ప్రతిపాదించింది.●2022 - క్రోమ్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ●2023 - గూగుల్ పిక్సెల్ 8, 8ప్రో లాంచ్, గూగుల్ జెమిని ఏఐ●2024 - 2024 మార్చిలో గూగుల్ కోర్ అప్డేట్లో దాని ప్రధాన ర్యాంకింగ్ సిస్టమ్లకు అల్గారిథమిక్ మెరుగుదలలను చేసింది. ఈ అప్డేట్ స్పామ్, లో-వాల్యూ కంటెంట్ వంటి వాటిని పరిష్కరించడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగం.●2025: 2025లో గూగుల్ జెమిని 2.5 ఫ్లాష్ & ప్రో లాంచ్ చేసింది. బననా ఏఐ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.గూగుల్ కంపెనీ ఎన్ని దేశాల్లో ఉంది1998లో ఒక చిన్న సంస్థగా ప్రారంభమైన గూగుల్.. నేడు 50 కంటే ఎక్కువ దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా 1.80 లక్షల కంటే ఎక్కువ మంది గూగుల్ సంస్థలో పనిచేస్తున్నట్లు సమాచారం.గూగుల్ ఉపయోగాలుప్రతి ప్రశ్నకు మల్టిపుల్ సమాధానాలు అందిస్తున్న గూగుల్.. ఎన్నెన్నో రకాలుగా ఉపయోగపడుతోంది. ప్రత్యేకంగా విద్యారంగంలో గూగుల్ పాత్ర అనన్య సామాన్యమనే చెప్పాలి.🡆బ్లాగర్, యూట్యూబ్, గూగుల్ అందిస్తున్న సేవలు.. సమాచార విప్లవంలో కొత్త శకానికి నాంది పలికాయి. ఒక్క మాటలో చెప్పాలంటే గూగుల్ దెబ్బకు ఇంటర్నెట్ ఒక అనధికారిక ఓపెన్ యూనివర్సిటీలా మారిపోయింది.🡆వినోదం కోసం యూట్యూబ్ వినియోగించుకునే వారి సంగతి పక్కన పెడితే.. 10వ తరగతి చదివే ఒక విద్యార్ధి నుంచి.. IAS చదివే వ్యక్తి వరకు యూట్యూబ్ ఎలా ఉపయోగపడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.🡆భౌతిక, రసాయనిక శాస్త్రాలు మాత్రమే కాకుండా శస్త్రచికిత్సకు సంబంధించిన ఎన్నో విషయాలను కూడా గూగుల్ ద్వారా తెలుసుకోవచ్చు. మొత్తం మీద పాఠాలు నేర్చుకునే విద్యార్థులకు మాత్రమే కాకుండా.. పాఠాలు నేర్పే గురువులకు సైతం గురువుగా మారిన గూగుల్ ఉపయోగాల గురించి ఎంత చెప్పినా తక్కువే అని నిస్సందేహంగా చెప్పవచ్చు.గూగుల్ లేకపోతే పరిస్థితి ఎలా ఉండేదిగూగుల్ లేకపోతే ప్రపంచంలో జరిగే విషయాలు అందరికీ చేరటం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ప్రజల సమూహాలుగా చేరినప్పుడు మాత్రమే ఇతర విషయాలను చర్చించుకోవాల్సి వచ్చేది. గూగుల్ లేకుంటే.. స్మార్ట్ఫోన్ వినియోగం కూడా ఇంతలా ఉండేది కాదనే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు స్మార్ట్ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరూ గూగుల్ ఉపయోగించాల్సిందే.గూగుల్ లేకపోతే చదువుకునే వారికి కూడా.. అన్ని అంశాలు అందుబాటులో ఉండేవి కాదు. ఎందుకంటే గూగుల్ ప్రమేయం లేకుండా ఏదైనా తెలుసుకోవాలంటే తప్పకుండా ఉద్గ్రంధాలను (పుస్తకాలు) తిరగేయాల్సిందే. అంటే మనకు కావలసిన విషయం తెలుసుకోవడానికి కనీసం రోజుల సమయం పట్టేది. మొత్తం మీద గూగుల్ లేని ప్రపంచంలో జీవించడం ఇప్పుడు దాదాపు అసాధ్యమనే చెప్పాలి. -
రూ.40,000 లోపు ల్యాప్టాప్ల లిస్ట్ ఇదే..
జీఎస్టీ(Goods and Services Tax) క్రమబద్ధీకరణలో కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గినా ల్యాప్టాప్ల ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం గతంలో ఉన్న 18 శాతం జీఎస్టీ శ్లాబులో ఎలాంటి మార్పులు చేయకపోవడమే ఇందుకు కారణం. అయితే పండుగవేళ బ్యాంకులు, రిటైలర్లు ఆఫర్ ఇస్తున్నాయి. మార్కెట్లో రూ.40,000 లోపు ల్యాప్టాప్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ బడ్జెట్లో మంచి ఫీచర్లతో కూడిన కొన్ని ల్యాప్టాప్ల వివరాలు తెలుసుకుందాం.మోడల్ప్రాసెసర్ ర్యామ్/స్టోరేజ్ధర(అంచనా)ASUS Vivobook Go 15Intel Core i3 (13th Gen)8GB / 512GB SSDరూ.34,200 – రూ.44,999Lenovo IdeaPad Slim 3AMD Ryzen 3 7320U8GB / 512GB SSDరూ.36,000 – రూ.41,000HP 15sRyzen 3 7320U / i3 (12/13 Gen)8GB / 512GB SSDరూ.38,000 – రూ.45,000Acer Aspire LiteAMD Ryzen 5 5625U16GB / 512GB SSDరూ.39,000 – రూ.43,000Samsung Galaxy Book4Intel Core i3 (13th Gen)8GB / 512GB SSDరూ.42,000 – రూ.47,000 (గమనిక: పైన తెలిపిన ల్యాప్టాప్ల ధరలు, ప్రత్యేకతలు ఈకామర్స్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్ల కారణంగా ఎప్పటికప్పుడు మారవచ్చు. కొనుగోలుకు ముందు వెబ్సైట్లో తుది ధరను ధ్రువీకరించుకోవాలి)కొనుగోలు చేసేముందు చూడాల్సినవి..వినియోగం, ఉద్దేశం (Usage and Purpose)రోజువారీ/విద్యార్థుల కోసం: వెబ్ బ్రౌజింగ్, ఆన్లైన్ క్లాసులు, డాక్యుమెంట్లు వంటి సాధారణ పనులకు కనీసం Intel Core i3 (12th Gen లేదా అంతకంటే ఎక్కువ) లేదా AMD Ryzen 3 ప్రాసెసర్ ఉండాల్సిందే.మల్టీ టాస్కింగ్/ ప్రొఫెషనల్: ఎక్కువ సాఫ్ట్వేర్లను ఏకకాలంలో ఉపయోగించాలనుకుంటే కనీసం Core i5 లేదా Ryzen 5 ప్రాసెసర్ను ఎంచుకోవడం మంచిది. పైన తెలిపిన బడ్జెట్లో i5 లేదా R5 పాతతరం ల్యాప్టాప్లు దొరికే అవకాశం ఉంది.ప్రాసెసర్ (CPU)ల్యాప్టాప్ వేగం, పనితీరును ప్రాసెసర్ నిర్ణయిస్తుంది.Intel Core i3/i5: Intel ప్రాసెసర్ల్లో 11వ తరం (11th Gen) లేదా 12వ, 13వ తరం (12th/13th Gen) లేదా కొత్త వెర్షన్లను ఎంచుకోవాలి.AMD Ryzen 3/Ryzen 5: AMD ప్రాసెసర్ల్లో 5000 సిరీస్, 7000 సిరీస్ లేదా కొత్త వెర్షన్లను పరిగణించాలి.ర్యామ్ (RAM)ర్యామ్ అనేది మల్టీ టాస్కింగ్కు కీలకం. మీరు ఒకేసారి ఎన్ని ప్రోగ్రామ్లను రన్ చేయగలరనేది దీనిపై ఆధారపడి ఉంటుంది. రోజువారీ పనులు, సాధారణ బ్రౌజింగ్, ఆఫీస్ వర్క్ కోసం కనీసం 8GB RAM ప్రామాణికం. పైన తెలిపిన బడ్జెట్లో 16GB RAMను పొందగలిగితే అది అత్యుత్తమ ఎంపిక.స్టోరేజ్ (Storage)ల్యాప్టాప్ త్వరగా బూట్ కావడానికి, అప్లికేషన్లు వేగంగా లోడ్ కావడానికి SSD (Solid State Drive) తప్పనిసరి. పాత HDD (Hard Disk Drive) ఉన్న ల్యాప్టాప్లను కొనుగోలు చేయకండి. చాలా మంది వినియోగదారులకు కనీసం 512GB SSD సరిపోతుంది.డిస్ప్లేచూడటానికి సౌకర్యంగా ఉండే డిస్ప్లేను ఎంచుకోవాలి. కనీసం ఫుల్హెచ్డీ (1920 x 1080) తప్పనిసరి. హెచ్డీ (1366x768) స్క్రీన్లు పాతవి. ఇవి నాణ్యత తక్కువగా ఉంటాయి. యాంటీ-గ్లేర్ (Anti-Glare) ఫీచర్ ఉంటే బెటర్. ఇది లైటింగ్ ఉన్న పరిస్థితుల్లో కంటిపై ఒత్తిడిని తగ్గిస్తుంది.బ్యాటరీ లైఫ్ల్యాప్టాప్ను ఎక్కువగా ప్రయాణంలో లేదా బయట ఉపయోగించాలనుకుంటే బ్యాటరీ లైఫ్ కనీసం 6-8 గంటలు లేదా అంతకంటే ఎక్కువ బ్యాకప్ ఇచ్చే ల్యాప్టాప్ను ఎంచుకోవాలి.ఇదీ చదవండి: అమెరికా ఆంక్షలపై ద్వంద్వ వైఖరి -
బీఎస్ఎన్ఎల్ ‘స్వదేశీ’ 4జీ నెట్వర్క్
పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్వర్క్ను ప్రధాని నరేంద్ర మోదీ నేడు (శనివారం) ప్రారంభించనున్నారు. దీనితో టెలికం పరికరాలను పూర్తిగా దేశీయంగానే ఉత్పత్తి చేసుకుంటున్న చైనా, డెన్మార్క్, స్వీడన్, దక్షిణ కొరియా సరసన అయిదో దేశంగా భారత్ కూడా చేరనుంది.బీఎస్ఎన్ఎల్కి చెందిన 97,500 మొబైల్ 4జీ టవర్లను ఒరిస్సాలోని ఝర్సుగూడలో ప్రధాని ప్రారంభిస్తారని, ఇది భారతీయ టెలికం రంగానికి ఒక కొత్త శకంలాంటిదని కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఇందులో 92,600 మొబైల్ సైట్లు పూర్తిగా స్వదేశీ 4జీ టెక్నాలజీతో రూపొందినవని, వీటిని 5జీకి అప్గ్రేడ్ చేయొచ్చని ఆయన పేర్కొన్నారు.కోర్ నెట్వర్క్ సిస్టమ్ను సీ–డాట్, రేడియో యాక్సెస్ నెట్వర్క్ (ర్యాన్) సిస్టమ్ను తేజస్ నెట్వర్క్ రూపొందించగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) వీటిని అనుసంధానం చేసింది. మరోవైపు, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, భారతీ ఎయిర్టెల్ కలిసి 4,700 మొబైల్ 4జీ టవర్లను ఇన్స్టాల్ చేశాయి. ఈ టవర్లతో మారుమూల, సరిహద్దు ప్రాంతాల్లోని 26,700 గ్రామాలకు కవరేజీ లభిస్తుంది. తద్వారా ఇరవై లక్షల మంది పైగా సబ్స్క్రైబర్స్కు సర్వీసులు అందుతాయి.ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి! -
చూపున్న యాప్
దృష్టి లోపం ఉన్న వ్యక్తులు పరిసరాలను నావిగేట్ చేయడానికి ప్రత్యూష, ఐశ్వర్య ‘స్పేస్ఫెల్ట్’ అనే పేరుతో అప్లికేషన్ను రూపొందించారు. దృష్టి లోపం సమస్యతో బాధపడిన ప్రత్యూష, ఐశ్వర్యలు కలిసి ఈ అప్లికేషన్ను రూపొందించారు. హైదరాబాద్లో గ్రెయల్ మేకర్ ఇన్నోవేషన్ ద్వారా వీరు తమ సేవలను నాలుగేళ్లుగా అందిస్తున్నారు. పిల్లలు ఇంట్లోనే ఉండి చూపును పెంచుకునేందుకు, వారి తల్లిదండ్రులకు ‘విజన్ నానీ డిజిటల్ యాప్’ ద్వారా పనులను సులభతరం చేస్తున్నారు.దృష్టి లోపం ఉన్న చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు సాంకేతికంగా ఉపయోగపడేలా తమ జీవన ప్రయాణాన్ని మార్చుకున్నారు స్పేస్ఫెల్ట్, విజన్ నానీ యాప్ ఫౌండర్స్ ప్రత్యూష, ఐశ్వర్య. పిల్లల మెరుగైన భవిష్యత్తుకుతమ వర్క్ గురించి ప్రత్యూష మాట్లాడుతూ – ‘‘కార్టికల్ విజువల్ ఇంపెయిర్మెంట్ ఉన్న పిల్లలు, ఏదైనా కారణాల వల్ల మెదడు పనితీరులో లోపాలు ఉన్నా వారు చూసింది త్వరగా అర్థం చేసుకోలేరు. చదువుతో పాటు జీవనంలో వెనకబడి పోతుంటారు. ఇలాంటప్పుడు వారి తల్లితండ్రులు స్పెషల్ సెంటర్స్ కోసం వెతుకుతుంటారు. హైదరాబాద్తో పాటు కొన్ని ప్రధాన పట్టణాలలోనే ఈ సెంటర్లు, అవీ చాలా తక్కువ శాతంలో ఉంటాయి. అలాంటి తల్లితండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం ఉన్న చోటును వదులుకొని నగరాలకు వలస వెళ్లాల్సి ఉంటుంది. దీనివల్ల వారి కుటుంబం మొత్తం ఇబ్బందులు పడుతుంటుంది. అందుకని, ‘విజన్ నానీ’ పేరుతో దృష్టి లోపం ఉన్న పిల్లల కోసం డిజిటల్ ప్రోడక్ట్ను రూపొందించాం. తమ ఇంటినుంచే బాల్య అంధత్వానికి కారణమేంటో తెలుసుకునేలా, వారికి సరైన మార్గదర్శకం చూపేలా దీనిని తయారుచేశాం.దీనిని తమ స్మార్ట్ ఫోన్ ద్వారా ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయవచ్చు. కమ్యూనిటీ సెంటర్లలో కూడా వీటిని ఉపయోగిస్తున్నాం. తల్లిదండ్రులకు, సంరక్షకులకు, స్పెషల్ టీచర్స్కు అనుకూలమైన విజన్ థెరపీ యాక్సెస్ను కూడా ఈ యాప్ అందిస్తుంది.స్వయంగా అర్థం చేసుకొని...చిన్నప్పుడు నేను చూపు సమస్యలను ఎదుర్కొన్నాను. దీంతో చదువులో వెనకబడేదాన్ని. మా అమ్మ నా సమస్యను నివారించడానికి చాలా ప్రయత్నాలు చేసింది. పెద్దయ్యాక నాలాంటి వారికోసం ఉపయోగపడే పనిచేయాలని అనుకునేదాన్ని. అందుకే ఎంతో కష్టపడి పట్టుదలతో ఐఐటీ హైదరాబాద్లో బయోటెక్నాలజీ డిగ్రీ చేశాను. విజన్ సమస్య ఉన్నవారు టెక్నాలజీ ఉపయోగించడంతో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలుసుకోవాలని, ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో వాలెంటీర్గా చేరాను. అక్కడ దృష్టి లోపంతో వచ్చే పిల్లల సమస్యలను స్వయంగా చూస్తూ అర్థం చేసుకునేదాన్ని. వాస్తవానికి విజన్ థెరపీకి 3–5 ఏళ్ల వరకు క్రమం తప్పకుండా రావాలి. కానీ, తల్లిదండ్రులకు కుదరక మిస్ చేసేవారు. దీంతో వారి సమస్య అలాగే ఉండేది. ఇంటి నుంచే వారి సమస్యను పరిష్కరించే విధానం ఉంటే బాగుంటుందనుకున్నాం. ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లోనే ఐశ్వర్య పరిచయం అయ్యింది. తను 18 ఏళ్ల వయసులో బ్రెయిన్ ట్యూమర్ వల్ల చూపు కోల్పోయింది. కోలుకున్నాక చూపు లేని వారికి సాయం చేయాలనుకుంది. తను ఎదుర్కొన్న సంఘటనలను, తనకు ఎదురైన అనుభవాలను తెలుసుకొని, ఈ డిజిటల్ ప్రోడక్ట్ని డెవలప్ చేశాం. ఇప్పటి వరకు 7000 మంది పిల్లలు ఈ యాప్ను ఉపయోగిస్తున్నారు. దేశంలోని అన్నిప్రాంతాల నుంచి, విదేశాల నుంచి కూడా ఈ యాప్కి యూజర్స్ ఉన్నారు.పబ్లిక్ ప్లేసులో క్యూఆర్ చూపులేని వారిని బయటకు తీసుకెళ్లినప్పుడు, అక్కడ పబ్లిక్ వాష్రూమ్ వరకు ఒకరు తోడుగా వెళ్లినా, ఆ డోర్ వరకు తీసుకెళ్లి వదిలేస్తారు. కానీ, వారు వాష్ రూమ్లో చాలా ఇబ్బంది పడతారు. ఇలాంటప్పుడు యాప్లోని క్యూఆర్ కోడ్ (మనీ పే యాప్స్ ఏ విధంగా వాడతారో అలా)ని ఉపయోగించి, లోపల వాష్రూమ్లో ఏ వస్తువులు ఎక్కడ, ఏ డైరెక్షన్లో ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇదేవిధంగా పబ్లిక్ ప్లేస్లో ఉన్న లొకేషన్స్, ఆడియో విని, ఎవరి సాయం లేకుండానే వాటిని ఉపయోగించవచ్చు. మ్యూజియంకు వెళితే చూపులేనివారికి అక్కడ ఏమీ తెలియదు. యాప్ క్యూఆర్ కోడ్ ను ఉపయోగిస్తే ఆడియో విని అక్కడి స్టోరీ తెలుసుకోవచ్చు. దీనిని లాంచ్ చేసింది చూపులేనివారికోసమే అయినా ఇప్పుడు ఈ యాప్ మిగతావారికీ ఉపయోగపడుతోంది. హైదరాబాద్లో ఉన్న అభయ స్వచ్ఛంద సంస్థ, ఎల్.వి.ప్రసాద్ వారితో కలిసి వర్క్ చేస్తున్నాం’’ అని వివరించారు ఈ యాప్ డెవలపర్. సమస్యకు పరిష్కారంనాకు సమస్య ఉన్నప్పుడు మా అమ్మ నాకు చాలా సాయంగా ఉన్నారు. అందరికీ ఆ స పోర్ట్ ఉండక పోవచ్చు. వాలెంటీర్గా చేసినప్పుడు అక్కడికి వచ్చిన పిల్లలను చూసి చాలా బాధనిపించేది. టెక్నాలజీ పరంగా మనం ఎంతో ప్రగతి సాధిస్తున్నాం. కానీ, మన పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యను తీర్చలేక పోతున్నాం అనిపించింది. టెక్నాలజీని ఉపయోగించే దృష్టి లోపంతో బాధపడుతున్నవారికి పరిష్కారం కనుక్కోవాలని ఈ యాప్ను తీసుకువచ్చాం. – ప్రత్యూషపనులు సులువయ్యాయిదృష్టిలోపంతో జీవిస్తున్న వ్యక్తిగా నేను ఎదుర్కొన్న సమస్యలు ఏంటో నాకు బాగా తెలుసు. నాలాంటి వారు ఆ సమస్యలను ఎదుర్కోకూడదు అనే ఆలోచన నుంచి ఈ యాప్ని డిజైన్ చేశాం. పబ్లిక్ టాయిలెట్లు, మ్యూజియం.. మొదలైన ప్రదేశాలకు వెళ్లినప్పుడు వారు ‘క్యూఆర్’ కోడ్ సాయంతో ఇబ్బందులు లేకుండా సందర్శించవచ్చు. పిల్లల్లో కంటి సమస్య ఉన్నవారి పేరెంట్స్కి ఇప్పుడు వర్క్ సులువుగా మారింది. అదే విషయాన్ని రివ్యూస్ ద్వారా తల్లిదండ్రులు తెలియజేస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. – ఐశ్వర్య – నిర్మలారెడ్డి -
3 నెలల్లో 11 వేల ఉద్యోగాలు తొలగించిన ఐటీ కంపెనీ
ప్రముఖ మల్టీనేషనల్ ఐటీ కంపెనీ యాక్సెంచర్ (Accenture) గత మూడు నెలల్లో 11,000 మందికిపైగా ఉద్యోగులను తగ్గించింది. రానున్న రోజుల్లో మరిన్న కోతలు ఉంటాయని సంకేతాలు ఇచ్చింది. ఏఐ కార్యాచరణకు సరిపోయేలా ఉద్యోగులకు నైపుణ్యాలు పెంచడం సాధ్యపడకపోతే తొలగించడమే ( layoffs) మార్గమని త్రైమాసిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీ స్పష్టం చేసింది.సీఈవో ఏమన్నారంటే..తాజాగా జరిగిన ఎర్నింగ్ కాల్ సందర్భంగా యాక్సెంచర్ సీఈవో జూలీ స్వీట్ మాట్లాడుతూ.. కార్యాచరణ అవసరాలను ఏఐ సమూలంగా మార్చేస్తున్న తరుణంలో రీస్కిల్లింగ్ సాధ్యంకాని ఉద్యోగాలను కంపెనీ తొలగిస్తుందన్నారు. అయితే ఖచ్చితంగా సంఖ్య ఎంతన్నది ఆమె స్పష్టం చేయలేదు. యాక్సెంచర్లో మూడు నెలల క్రితం మొత్తం 791,000 మంది ఉద్యోగులు ఉండగా ఈ ఆగస్టు చివరి నాటికి ఆ సంఖ్య 779,000 మందికి తగ్గింది.యాక్సెంచర్ ఆదాయం జూన్-ఆగస్టు 2025 త్రైమాసికంలో 17.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. సంవత్సరానికి 7 శాతం పెరుగుదలను నమోదు చేసింది. సెప్టెంబర్-ఆగస్టు ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 2.5 శాతం విదేశీ మారక ద్రవ్య ప్రభావంతో దాని ఆదాయాలను ప్రభావితం చేసిందని తెలిపింది. కొనసాగుతున్న పోర్ట్ ఫోలియో ఆప్టిమైజేషన్ లో భాగంగా, యాక్సెంచర్ కొన్ని నాన్-కోర్ వ్యాపారాల నుండి నిష్క్రమించనున్నట్లు, 865 మిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను ఉపసంహరించుకునే ప్రణాళికలను కూడా ప్రకటించింది.(అమెరికాలో భారతీయ టెకీలు సంపాదిస్తున్నదెంత?) -
రూ.500 లోపు రీచార్జ్.. 72 రోజులు అన్లిమిటెడ్!
ప్రైవేట్ టెలికం సంస్థలు టారిఫ్లు పెంచిన క్రమంలో వినియోగదారులు చౌక రీచార్జ్ ప్లాన్ల కోసం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) తక్కువ ఖర్చుతో దీర్ఘకాలిక వ్యాలిడిటీని ఇచ్చే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను ప్రవేశపెట్టింది.బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ ధర రూ .485. ఈ ప్లాన్ లో రోజూ హై-స్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్ ఇటీవల ఇలాంటి ప్రయోజనాలతోనే రూ .199 రీఛార్జ్ ప్లాన్ ను ప్రకటించింది. ఇది మంత్లీ ప్లాన్ కాగా తాజా రూ.485 ప్లాన్ (Recharge plan) దాదాపు రెండున్నర నెలల వ్యాలిడిటీతో వస్తుందిరూ.485 ప్లాన్ ప్రయోజనాలుబీఎస్ఎన్ఎల్ రూ.485 ప్లాన్లో 2 జీబీ రోజువారీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు, 72 రోజుల వాలిడిటీతో లభిస్తాయి. అంటే యూజర్లు మొత్తం 144 జీబీ డేటాను పొందుతారు. ఇది బ్రౌజింగ్, సోషల్ మీడియా, వీడియో కాల్స్ లేదా లైట్ స్ట్రీమింగ్ కు సరిపోతుంది. వర్క్ లేదా ఎంటర్టైన్మెంట్ కోసం మొబైల్ డేటాపై ఆధారపడే వారికి, రూ .500 కంటే తక్కువ ధర పరిధిలో ఇది ఉత్తమ ప్లాన్. అంతే కాకుండా బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్ సైట్ లేదా బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా రీఛార్జ్ చేస్తే 2 శాతం తగ్గింపు కూడా లభిస్తుంది.ఇదీ చదవండి: రూ.200 లోపు రీచార్జ్.. రోజుకు 2 జీబీ డేటా -
ఏఐ సొల్యూషన్స్, సర్వీసులపై లెనొవొ దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ ఏఐ (కృత్రిమ మేధ) ప్రయోజనాలను అందరికీ మరింతగా అందుబాటులోకి తేవాలని టెక్ దిగ్గజం లెనొవొ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా కేవలం పీసీలు మొబైల్స్లాంటి ఉత్పత్తులే కాకుండా ఏఐ ఆధారిత మౌలిక సర్విసులు, సొల్యూషన్స్ను విస్తృతంగా అందిస్తున్నట్లు లెనొవొ ఇండియా ఎండీ అమిత్ లూథ్రా, ఈడీ రోహిత్ వెల్లడించారు. ఇతర ఆసియా పసిఫిక్ దేశాల్లోని సంస్థలు బ్యాక్–ఆఫీస్ అవసరాల కోసమే ఏఐని ఉపయోగిస్తుండగా, దేశీయంగా సేల్స్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్లు గణనీయంగా కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నాయని చెప్పారు.భారత్లో ఇప్పటికే 53 శాతం సంస్థలు ఏఐ ఆధారిత పీసీలను వినియోగిస్తున్నట్లు చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్పై (సీఐవో) నిర్వహించిన తమ అధ్యయనంలో వెల్లడైందని హైదరాబాద్లో తమ ఏఐ పోర్ట్ఫోలియోను డిస్ప్లే చేసిన సందర్భంగా వివరించారు. ప్రస్తుతం దేశీయంగా పర్సనల్ కంప్యూటింగ్ ఉత్పత్తుల విభాగంలో రెండో స్థానంలో, ఇన్ఫ్రా సొల్యూషన్స్ విభాగంలో మూడో స్థానంలో ఉన్నట్లు రోహిత్ చెప్పారు. భారత్లో 5 తయారీ ప్లాంట్లు, సుమారు 1,700 మంది సిబ్బంది ఉండగా, గత ఆర్థిక సంవత్సరం 3.4 బిలియన్ డాలర్ల ఆదాయం నమోదైందని ఆయన వివరించారు. -
నానో బనానా క్రేజ్: ఒక్క నెలలో 500 కోట్ల చిత్రాలు
గూగుల్ ఇటీవల జెమిని యాప్లో నానో బనానా అనే కొత్త ఇమేజ్ జనరేషన్ ఫీచర్ను ప్రారంభించింది. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన నెల రోజుల్లో ఏకంగా 500 కోట్ల ఏఐ ఫోటోలను క్రియేట్ చేసింది. దీనిపై కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ స్పందించారు.500 కోట్ల చిత్రాలు పూర్తయ్యాయి. ఆ తరువాత ఫోటో నాదే అంటూ 'సుందర్ పిచాయ్' నానో బననా ఫోటో షేర్ చేశారు. ఒక్క నెలలో 500 కోట్ల ఫోటోలు అంటే.. దీనికున్న ఆదరణ అంతాఇంతా కాదు.నానో బనానా ఫీచర్ ద్వారా.. యూజర్లు రెట్రో చిత్రాలు, నవరాత్రి లుక్స్ వంటివాటిని సృష్టిస్తున్నారు. నానో బనానా రూపొందించే ఏఐ 3డీ చిత్రాలు నిజమైనవి కాదు. ఇవి కేవలం డిజిటల్ ఇమేజస్ మాత్రమే. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటం వల్ల.. ఎవరైనా తమ ఫ్యూతోను కూడా 3డీగా చేసుకోవాలని ఆశపడతారు. ఈ కారణంగానే.. ఎక్కువమంది దీనిని ఉపయోగించారు.Make that 5 billion and 1 😂 https://t.co/3HDKDY3T0F pic.twitter.com/EQin9fpZuE— Sundar Pichai (@sundarpichai) September 24, 2025 -
శామ్సంగ్ ఏఐ హోమ్: ఇంట్లో పనులు ఇట్టే అయిపోతాయ్!
భారతదేశంలో లార్జెస్ట్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన శామ్సంగ్.. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని జియో వరల్డ్ ప్లాజాలోని దాని ఫ్లాగ్షిప్ స్టోర్లో "ఏఐ హోమ్: ఫ్యూచర్ లివింగ్, నౌ" కోసం తన విజన్ను ఆవిష్కరించింది. టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో సంస్థ దీనిని పరిచయం చేసింది.ఒకసారి ఊహించుకోండి.. మీరు ఇంటికి వచ్చేసరికి లైట్లు ఆన్ అవుతాయి. వీ మీకు ఇష్టమైన షోను క్యూలో ఉంచుతుంది. ఏసీ మీ నిద్రకు కావలసిన టెంపరేచర్ అందిస్తుంది. ఇలా ఇంటిపనులన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతే ఎంతబాగుంటుంది. ఇవన్నీ సాధ్యం చేయడానికే.. శామ్సంగ్ ఏఐ హోమ్: ఫ్యూచర్ లివింగ్, నౌ తీసుకొస్తోంది.శామ్సంగ్ గెలాక్సీ ఏఐ, విజన్ ఏఐ, బెస్పోక్ ఏఐ వంటి వాటి ద్వారా.. ప్రజల దైనందిన జీవితాల్లోకి టెక్నాలజీని అనువదించాలనుకుంటున్నాము. ఇది రోజువారీ జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా, సమర్థవంతంగా, ఆరోగ్యంగా, సురక్షితంగా మారుస్తుంది. భారతదేశం ఈ ప్రయాణంలో కేంద్రంగా ఉంది. ఇక్కడ నుంచే ప్రపంచానికి పరిచయం చేస్తామని.. శామ్సంగ్ సౌత్వెస్ట్ ఆసియా అధ్యక్షుడు, సీఈఓ జేబీ పార్క్ అన్నారు. -
టాప్ 10 బెస్ట్ స్మార్ట్ఫోన్స్: రూ. 20వేల కంటే తక్కువే..
అసలే పండుగ సీజన్.. ఈ సమయంలో అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ దిగ్గజాలు ఆఫర్స్ ప్రకటిస్తాయని, ఓ మంచి స్మార్ట్ఫోన్ కొనాలని చాలామంది ఎదురుచూస్తూ ఉంటారు. ఆ టైమ్ ఇప్పుడు వచ్చేసింది. ఈ కథనంలో రూ. 20వేలకంటే తక్కువ ధరలో లభించే బెస్ట్ స్మార్ట్ఫోన్స్ గురించి తెలుసుకుందాం.రెడ్మీ ఏ4 5జీ: రెడ్మీ ఏ4 5జీ స్మార్ట్ఫోన్ ధర అమెజాన్లో రూ.7,499 మాత్రమే. ఇది మార్కెట్లోని అత్యంత సరసమైన 5జీ-రెడీ స్మార్ట్ఫోన్లలో ఒకటి. ఇది మంచి డిజైన్ కలిగి ఉండటమే కాకుండా.. బ్యాటరీ లైఫ్ కూడా బాగుంటుంది.రియల్మి నార్జో 80 లైట్: అమెజాన్లో రూ. 8,999 ధరకు లభించే ఈ ఫోన్ మంచి పనితీరును అందిస్తుంది. విద్యార్థులకు, సాధారణ వినియోగదారులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.లావా స్టార్మ్ ప్లే 5జీ: అమెజాన్లో రూ.8,999 ధర వద్ద అందుబాటులో ఉన్న ఈ ఫోన్.. ఈ విభాగంలోని ఇతర ఫోన్లతో పోలిస్తే వేగవంతమైన పనితీరును అందిస్తుంది. ఇది మంచి స్టోరేజ్ కూడా పొందుతుంది.ఐకూ జెడ్10 లైట్ 5జీ: అమెజాన్లో రూ. 8,999 ధరకు లభించే ఐకూ జెడ్10 లైట్ 5జీ.. లేటెస్ట్ డిజైన్ పొందుతుంది. గేమింగ్, మల్టీ టాస్కింగ్ వంటి వాటికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఒప్పో కే13ఎక్స్: ఫ్లిప్కార్ట్లో రూ. 9,499 ధరకు లభించే.. ఒప్పో కే13ఎక్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్. ఇది మంచి కెమెరా, బ్యాటరీ లైఫ్ కలిగి ఉండటమే కాకుండా.. స్టైలిష్ డిజైన్ పొందుతుంది.పోకో ఎం7 ప్లస్: ఫ్లిప్కార్ట్లో రూ.10,999 ధరకు లభించే పోకో ఎం7 ప్లస్.. స్మూత్ పెర్ఫార్మెన్స్ అందిస్తూ పెద్ద బ్యాటరీని కలిగి ఉంటుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ అయిన ఈ ఫోన్ గేమింగ్ వంటి వాటికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది.ఒప్పో కే13: ఫ్లిప్కార్ట్లో రూ.14,999 వద్ద ఉన్న.. ఒప్పో కే13 అనేది ఒక స్టైలిష్ మిడ్-రేంజ్ ఫోన్. ఇది మంచి పనితీరును అందిస్తుంది. కెమెరా ఫీచర్ బాగుంటుంది. బ్యాటరీ లైఫ్ కూడా అద్భుతంగా ఉంటుంది.వివో టీ4ఎక్స్: ఫ్లిప్కార్ట్లో రూ. 12,249 కు లభించే వివో టీ4ఎక్స్ కూడా తక్కువ ధరలో లభించే ఓ బెస్ట్ మొబైల్. ఇది మల్టీ టాస్కింగ్ ఫోన్. మంచి పర్ఫామెన్స్ కూడా అందిస్తుంది.ఐక్యూఓ జెడ్10ఎక్స్: అమెజాన్లో రూ.11,999 ధరకు లభించే ఈ ఫోన్ గేమింగ్, మల్టీ టాస్కింగ్ వంటి వాటికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రూ. 15వేలు కంటే తక్కువ ధరలో లభించే స్మార్ట్ఫోన్ల జాబితాలో ఇది ఒకటి.రియల్మి పీ4 & సీఎమ్ఎఫ్ ఫోన్ 2 ప్రో: వీటి ధరలు ఫ్లిప్కార్ట్లో రూ. 14,999. రియల్మే పీ4 లేటెస్ట్ డిజైన్ కలిగి.. మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. కాగా సీఎమ్ఎఫ్ ఫోన్ 2 ప్రో మంచి హార్డ్వేర్తో మినిమలిస్టిక్ స్టైలింగ్ పొందుతుంది. కాబట్టి వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. -
అమెరికాలో అందమైన నగరం: ఇన్స్టాలో ఇదే టాప్..
స్మార్ట్ఫోన్ వచ్చిన తరువాత.. అందమైన ప్రదేశం కనిపించగానే ఫోటో తీసేస్తారు. అంతటితో ఊరుకుంటారా?, సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. లైక్స్, కామెంట్స్, షేర్స్ కోసం చూస్తారు. అయితే ఇన్స్టాగ్రామ్లో ఫోటో తీసి పోస్ట్ చేయడానికి అనువైన ఆకర్షణీయమైన నగరాల జాబితాను ఆర్ట్ అండ్ డిజైన్ ఇంప్రెంట్ అయిన రివర్స్ వాల్ ఆర్ట్ ఒక నివేదికలో విడుదల చేసింది.రివర్స్ వాల్ ఆర్ట్ డేటా ప్రకారం.. అమెరికాలో అత్యంత అందమైన నగరంగా న్యూయార్క్ నిలిచింది. అమెరికాలోని 25 అతిపెద్ద నగరాల్లో 895 మిలియన్లకు పైగా హ్యాష్ట్యాగ్లను విశ్లేషించిన తరువాత నిపుణులు నివేదిక విడుదల చేసారు. న్యూయార్క్ ఒక సాంస్కృతిక చిహ్నం. అంతే కాకుండా ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ నగరాల్లో ఒకటి. యాన్యువల్ రాక్ఫెల్లర్ సెంటర్ క్రిస్మస్ ట్రీ నుంచి ఎంపైర్ స్టేట్ భవనం వరకు.. ఈ నగరంలో చూడచక్కని ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు.అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాష్ట్యాగ్లలో #NYC (145.3 మిలియన్), #NewYorkCity (35.9 మిలియన్స్) ఉన్నాయి. మొత్తం మీద న్యూయార్క్ హ్యాష్ట్యాగ్లతో 183,869,262 పోస్టులు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇది అత్యంత అందమైన నగరం మాత్రమే కాదు.. అత్యధిక జనాభా కలిగిన నగరం కూడా.ఇన్స్టాగ్రామ్లో అధికంగా పోస్ట్ చేసిన అమెరికాలోని నగరాలు●న్యూయార్క్: 18,38,69,262 పోస్ట్లు●లాస్ ఏంజిల్స్: 141,271,982 పోస్ట్లు●చికాగో: 60,196,138 పోస్ట్లు●లాస్ వెగాస్: 54,038,732 పోస్ట్లు●శాన్ ఫ్రాన్సిస్కో: 45,895,134 పోస్ట్లు●వాషింగ్టన్: 45,470,821 పోస్ట్లు●శాన్ డియాగో: 39,451,127 పోస్ట్లు●సియాటిల్: 37,597,785 పోస్ట్లు●ఆస్టిన్: 34,022,105 పోస్ట్లు●హూస్టన్: 33,942,790 పోస్ట్లుఇదీ చదవండి: అమెరికా పొమ్మంటే.. ఆ 25 ఐటీ హబ్స్ రమ్మంటాయ్ -
ట్రంప్ ఓ ‘ఇడియట్’: గూగుల్ ఇమేజెస్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తోపాటు ఆయన పేరు కూడా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ట్రంప్ పేరుతో గూగుల్లో సెర్చ్(Google search) చేస్తే ఆయనకు సంబంధించి తాజా వార్తావిశేషాలు, తాను తీసుకున్న నిర్ణయాలు, తన పర్యటనలు... ఇలా విభిన్న సమాచారం ప్రత్యక్షం అవుతుంది. అయితే గూగుల్ ఇమేజెస్లో ఇటీవల ‘ఇడియట్’ అని సెర్చ్ చేస్తున్న వ్యూయర్లకు కూడా ట్రంప్ ఫొటోనే దర్శనమివ్వడం పట్ల తీవ్ర దుమారం రేగింది. దాంతో అమెరికా ప్రభుత్వం స్పందించి ఈ వ్యవహారంపై జ్యుడీషియరీ కమిటీ ఏర్పాటు చేసింది. ఇటీవల ఆ కమిటీ ముందు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్(Sundar Pichai) అలా జరగడానికి కారణాలేంటో వివరించారు.ఇటీవల యూఎస్ హౌస్ జ్యుడీషియరీ కమిటీ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ను గూగుల్ ఇమేజెస్లో ‘ఇడియట్’ అనే పదాన్ని సెర్చ్ చేసినప్పుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చిత్రాలను ఎందుకు చూపించారని ప్రశ్నించింది. ఈ సందర్భంగా గూగుల్ సెర్చ్ అల్గారిథమ్ ఎలా పనిచేస్తుందో వివరించారు. ‘మేము కీవర్డ్ తీసుకుంటాం. మా ఇండెక్స్లోని బిలియన్లలో ఉన్న పేజీలతో సరిపోలుస్తాం. ఆ సమయంలో ఆ కీవర్డ్కు సంబంధించిన, తాజాగా ఉన్న, ప్రజాదరణ పొందిన సమాచారాన్ని యూజర్లకు అందిస్తాం. ఇది పూర్తిగా ఇతర వ్యక్తులు సెర్చ్ చేస్తున్నదానిపై ఆధారపడి ఉంటుంది. దాని ఆధారంగా వాటిని ర్యాంక్ చేస్తాం’ అన్నారు.గూగుల్ బాంబింగ్‘ఈ విధానాన్ని ‘గూగుల్ బాంబింగ్’ అని పిలుస్తారు. ఇది ఒక నిర్దిష్ట పదాన్ని నిర్దిష్ట పేజీకి లింక్ చేయడం వంటి ఆన్లైన్ సమన్వయ సెర్చ్ ఫలితాలను ప్రభావితం చేస్తుంది. గూగుల్ మాన్యువల్గా ఫలితాలను తారుమారు చేయదు. రాజకీయ పక్షపాతం వహించదు. ఈ అల్గోరిథమ్లు వినియోగదారుల ప్రవర్తన, ఇంటర్నెట్ ట్రెండ్స్ను ప్రతిబింబిస్తాయి’ అని పిచాయ్ నొక్కి చెప్పారు. ‘ఇది కొన్నిసార్లు ఊహించని లేదా వివాదాస్పద ఫలితాలను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: చెప్పులు ధరించి డ్రైవింగ్ చేస్తే చలానా!? -
లైక్స్, కామెంట్స్ కోసం ఆరాటపడితే అంతే..
ప్రస్తుతం టెక్నాలజీని ఓ రేంజ్లో వాడుతున్నాం. అది మితిమీరితే ఎలాంటి ప్రమాదాలు వస్తాయన్న విషయాన్ని కూడా మర్చిపోయి దాన్ని అంతగా ఉపయోగిస్తున్నాం. ఇటీవల కాలంలో జిబ్లీ ఆర్ట్, జెమినీ ఏఐ(GeminiAI)..వంటివి చూశాం. తాజాగా నానో బనానా(Nano Banana) ఉపయోగిస్తున్నాం. మన ఫొటోస్ను అప్లోడ్ చేస్తే ఎడిట్ చేసి ఇతర ఫార్మాట్లో ఇది మన ముందుంచుతుంది. అసలు ఒరిజినల్గా అప్లోడ్ చేసిన ఫోటోలు అన్నీ ఏమవుతున్నాయి.. ఇటీవల జరుగుతున్న సైబర్ అటాక్స్కు ఈ కొత్త టెక్నాలజీలకు ఎదైనా సంబంధం ఉండే అవకాశం ఉందా.. అనే విషయాలను సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ సందీప్ ముదాల్కర్ తెలిపారు.టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఏఐకి ఆదరణ అధికం అవుతోంది. అయితే దీంతో ఎంత ప్రయోజనం ఉందో అంతే నష్టాలున్నాయి. కొన్నేళ్ల కిందట క్రైమ్స్ను గమనిస్తే.. సోషల్ క్రైమ్స్ ఎక్కువగా జరిగేవి. అంటే వ్యక్తుల వద్దకు వెళ్లి సమాచారం తెలుసుకుని దాన్ని క్రైమ్ కోసం ఉపయోగించుకునేవారు. కానీ ఇప్పుడు క్రైమ్ తీరు మారింది. అంతా సైబర్ క్రైమ్. ఫిజికల్గా వ్యక్తుల ప్రమేయం లేకుండా క్రైమ్ జరుగుతుంది. ఇప్పుడు వస్తున్న టెక్నాలజీల్లో కొన్ని అందుకు తోడ్పడుతున్నాయి.ఆర్గనైజ్డ్ ఇంటెలిజెన్స్మనిషి చనిపోయినా తన ఆలోచనలు, తెలివితేటలు ఎల్లకాలం ఉండేలా ‘ఆర్గనైజ్డ్ ఇంటెలిజెన్స్’ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ఆలోచనలున్న పరిస్థితుల్లో టెక్నాలజీ పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి. సైబర్ నేరాలు(cyber attack) చేసేవారు చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కనిపెడుతున్నారు. కానీ సాధారణ యూజర్లకు ఆ విషయాలు తెలిసే అవకాశం ఉండదు. సైబర్ క్రైమ్కు సంబంధించి ఒక కేసు ఇన్వెస్టిగేట్ చేయాలన్నా, ఒక డివైజ్ నుంచి కొంత డేటా కలెక్ట్ చేయాలన్నా సరైన టూల్స్ లేవు. కానీ సైబర్ క్రిమినల్స్ మాత్రం నేరం చేసేందుకు కొత్త టూల్స్ కనుగొంటున్నారు. అందుకు ఎక్కువ రీసెర్చ్ చేస్తున్నారు. ప్రజలు కూడా మార్కెట్లో ఏదైనా టూల్ ఉచితంగా వచ్చిందంటే దానిపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దానికితోడు ఈ సోషల్మీడియా ప్రభావం కూడా ఎక్కువైంది.డేటా సేకరిస్తున్నారు.. జాగ్రత్త!ఇప్పుడు వస్తున్న టెక్నాలజీలు యూజర్లను వదులుకోవాలని అనుకోవడం లేదు. ఉదాహరణకు Facebookను తీసుకుందాం. దీని ఖాతాను డిలీట్ చేయాలనుకుంటే వెంటనే డిలీట్ అవ్వదు. అందుకు కొంత టైమ్ ఇస్తున్నారు. ఒకవేళ ఈ గ్యాప్లో మళ్లీ లాగిన్ చేస్తే రికవరీ అవుతుంది. ఎందుకంటే Facebook మన ఖాతాను డిలీట్ చేయాలని అనుకోవడంలేదు. ఇప్పటికే దాదాపు అన్ని టెక్ కంపెనీలు యూజర్ల ఇంట్రెస్ట్ ఏంటీ.. వారికి ఎలాంటి డేటా ముఖ్యం.. వారి అభిరుచులు ఏమిటి.. ఎలా కమ్యునికేట్ చేస్తున్నారు.. ఏం కొంటున్నారు.. ఏ ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు..వంటివి గమనిస్తున్నాయి. ఈ సమాచారం స్టోర్ అవ్వడంతో భవిష్యత్తులో ఇది దుర్వినియోగం అయ్యే అవకాశం కూడా ఉంది.అనైతికంగా వాడుతారు..ప్రస్తుతం నానో బనానా టూల్ ద్వారా ఫొటోలు అప్లోడ్ చేస్తున్నారు. ఆ సర్వర్లో నుంచి డేటాని హ్యాకర్స్ గానీ, సైబర్ క్రిమినల్స్ గానీ దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. యూజర్లకు ఎలాంటి సమాచారాన్ని తెలపకుండా వారి ఫొటోలను సైబర్ నేరగాళ్లు కార్టూన్ వీడియోస్కు, యనిమేషన్స్ చేయడానికి, పొర్నోగ్రఫీ కంటెంట్లో వాడుకోవడానికి, యడ్స్ ప్రమోట్ చేసుకోవడానికి, ఏదైనా డేటింగ్ సైట్స్లో అప్లోడ్ చేసేందుకు..వాడే అవకాశం ఉంది.కొత్త ఛాలెంజ్లతో..శారీ ఛాలెంజ్ అనే కొత్తరకం టూల్స్ పుట్టుకొస్తున్నాయి. ఇందులో తాజా ఫోటోను అప్లోడ్ చేస్తే 1990ల్లో శారీ లుక్లో మనం ఎలా ఉండేవాళ్లమో తిరిగి చూపుతుంది. ఇలాంటి టెక్నాలజీలను కొన్నిసార్లు హ్యాకర్లు, సైబర్ నేరగాళ్లు ఉపయోగించే అవకాశం ఉంది. హ్యాకర్లకు కొత్త డేటా కావాలనుకుంటే కొత్త ఛాలెంజెస్ రిలీజ్ చేస్తారు. ఉదాహరణకు.. గ్రీన్ సారీ ఛాలెంజ్ అనగానే మహిళలు గ్రీన్ సారీ వేసుకొని ఫొటోలు దిగి అప్లోడ్(uploading photos) చేస్తారు. హాష్టాగ్ పెట్టేస్తారు. ఆ డేటాని హ్యాకర్స్ కలెక్ట్ చేసుకుంటారు. అదే విధంగా చికెన్ బిర్యానీ ఛాలెంజ్ అని పెడతారు. అప్పుడు లేడీస్ చికెన్ బిర్యానీ చేస్తూ వీడియోలు చేసి ఫొటోలని అప్లోడ్ చేస్తారు. దీన్ని సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేస్తారు. లైక్స్, కామెంట్స్ కోసం చేసే పనులు కొన్నిసార్లు విపరీత పరిస్థితులకు దారితీస్తాయని గుర్తుంచుకోవాలి.ఇప్పుడేం చేయాలి?కొన్ని సంస్థలకు చెందిన ఏఐ టూల్స్ మన అనుమతి లేకుండా మన ఇమేజెస్ను వెబ్సైట్ల్లో అప్లోడ్ చేసి, దాన్ని మనం గ్రహించి తొలగించమంటే కూడా తొలగించే అవకాశం ఉండదు. ఎందుకంటే వాటిలో అంతర్జాతీయ కంపెనీలు ఉంటాయి. అవి వాటి దేశ చట్టాలను అనుసరిస్తున్నట్లు చెబుతాయి. ఒకవేళ తమ దేశంలోని యూజర్ల కంటెంట్ను దుర్వినియోగం చేసినా డిపార్ట్మెంట్ రైట్స్కు వెళుతాయి. కాబట్టి వారు ఆ కంటెంట్ను డిలీట్ చేయడం చాలా కష్టం. ఇతర దేశాల వారు తమపై లీగల్ యాక్షన్ తీసుకోవాలన్న కూడా వీలుండదు. కాబట్టి టెక్నాలజీ వాడే ముందు అప్రమత్తంగా ఉండాలి. అలా అని అసలే వాడకూడదని కాదు. అధికారిక వెబ్సైట్లను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలి. నిబంధనల ప్రకారం అత్యవసరం అయితే తప్పా ఏ సమాచారాన్ని పంచుకోవద్దు. మనం మితిమీరిన ఆలోచనలతో చేసే పనులే సైబర్ నేరగాళ్లకు తోడ్పడుతున్నాయని గుర్తుంచుకోవాలి.ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి! -
5జీ సేవల పటిష్టతపై ఫోకస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా దేశీయంగా 5జీ సేవలను పటిష్టం చేసుకోవడంపై మరింతగా దృష్టి పెడుతోంది. తమకు స్పెక్ట్రం ఉన్న 17 ప్రాధాన్య సర్కిల్స్పై ఫోకస్ చేస్తున్నామని, ఏపీ సర్కిల్కి సంబంధించి ఇప్పటికే విశాఖ, తిరుమలలో 5జీ సేవలను ప్రవేశపెట్టామని సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీవో) జగ్బీర్ సింగ్ తెలిపారు. త్వరలోనే జాతీయ స్థాయిలో మరో నగరంలోనూ ప్రారంభిస్తున్నామని వివరించారు. 5జీ సర్వీసులను అందిస్తున్న ప్రాంతాల్లో తమ నెట్వర్క్కి సంబంధించి డేటా వినియోగం 25–30 శాతం వరకు పెరిగిందని ఆయన చెప్పారు. సగటున డేటా వినియోగం నెలకు 22–23 జీబీ నుంచి 26–27 జీబీకి పెరిగిందని చెప్పారు. దేశవ్యాప్తంగా 83 శాతం మందికి, ప్రాధాన్యతా సర్కిళ్లలో 88 శాతం మందికి తమ 4జీ సేవలు అందుబాటులో ఉంటున్నాయని సింగ్ చెప్పారు. పుణెలోని సూపర్ నెట్వర్క్ ఆపరేషన్స్ సెంటర్ (ఎస్ఎన్వోసీ) సందర్శన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. ఈ ఏడాది జూన్ వరకు సుమారు 15 నెలల వ్యవధిలో 5జీ, 4జీ నెట్వర్క్ను బలోపేతం చేసుకునేందుకు ప్రస్తుత సైట్లలో మరింత స్పెక్ట్రంను వినియోగంలోకి తేవడంతో పాటు కొత్తగా 1,000 సైట్లను సంస్థ ఏర్పాటు చేసింది. కార్యకలాపాల్లో కృత్రిమ మేథ (ఏఐ) ఆటోమేషన్ను వినియోగించుకోవడంపై ఇన్వెస్ట్ చేస్తున్నట్లు జగ్బీర్ సింగ్ తెలిపారు. ఫిక్స్డ్ వైర్లెస్ యోచన లేదు.. ఫిక్సిడ్ వైర్లెస్ యాక్సెస్ (ఎఫ్డబ్ల్యూఏ) విభాగంలో పోటీపడే యోచనేదీ ప్రస్తుతానికి లేదని సింగ్ చెప్పారు. ఇప్పటికైతే తాము ప్రధానంగా మొబిలిటీ విభాగంపైనే దృష్టి పెడుతున్నామని వివరించారు. అటు, శాటిలైట్ కమ్యూనికేషన్స్ సర్వీసులు వచ్చే ఏడాదిలో అందుబాటులోకి రావొచ్చని పేర్కొన్నారు. ఈ సర్వీసులకు సంబంధించి ఏఎస్టీ స్పేస్మొబైల్తో వొడాఫోన్ ఐడియా జట్టు కట్టింది. మరోవైపు, ఇప్పటికే యాంటీ–స్పామ్ మెసేజీ అలర్టులను అందుబాటులోకి తెచ్చామని, యాంటీ–స్పామ్ కాల్ అలర్టు సేవలను కూడా త్వరలో ప్రవేశపెడుతున్నామని చెప్పారు. పుణెలోని వొడాఫోన్ ఐడియా ఎస్ఎన్వోసీ 2012లో ఏర్పాటైంది. హైదరాబాద్లోని మరో యూనిట్తో కలిసి ఇది దేశవ్యాప్తంగా కంపెనీ మొత్తం నెట్వర్క్ను పర్యవేక్షిస్తుంది. 22 సర్కిళ్లలోని విస్తృతమైన నెట్వర్క్లో స్థూల స్థాయి నుంచి సూక్ష్మ స్థాయి దాకా సమస్యలను ఇరవై నాలుగ్గంటలూ, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, పరిష్కరించేందుకు కృషి చేస్తుంటుంది. ప్రతి రోజు 85 లక్షల అలర్టులను ప్రాసెస్ చేస్తుంది. 5 లక్షల పైగా డివైజ్ హెల్త్ చెక్లను నిర్వహిస్తుంటుంది. -
ఖతార్లోనూ ‘క్యూఆర్’
న్యూఢిల్లీ: భారత్లో రూపొందిన క్యూఆర్ ఆధారిత చెల్లింపుల విధానం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లోకి కూడా విస్తరిస్తోంది. తాజాగా ఖతార్లో దీన్ని ప్రవేశపెట్టారు. ఇందుకోసం ఖతార్ నేషనల్ బ్యాంకుతో (క్యూఎన్బీ) ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ (ఎన్ఐపీఎల్) ఒప్పందం కుదుర్చుకుంది. దీనితో యూపీఐ అందుబాటులోకి వచ్చిన ఎనిమిదో దేశంగా ఖతార్ నిల్చింది. ఇప్పటిదాకా భూటాన్, నేపాల్, శ్రీలంక, మారిషస్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్లో యూపీఐ సేవలను ప్రవేశపెట్టారు. దీనితో ఆయా దేశాలను సందర్శించే భారతీయులు విదేశీ కరెన్సీ కోసం చూసుకోవాల్సిన అవసరం లేకుండా తక్షణం రూపాయి మారకంలోనే చెల్లింపులు జరిపేందుకు వీలవుతుంది. డిజిటల్ చెల్లింపులను సులభతరంగా చేసిన యూపీఐ లావాదేవీలు దేశీయంగా కొత్త రికార్డులను తాకుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో సుమారు రూ. 25 లక్షల కోట్ల విలువ చేసే 2,000 కోట్ల లావాదేవీలను యూపీఐ ప్రాసెస్ చేసింది. రెండేళ్లలోనే రోజువారీ లావాదేవీల పరిమాణం రెట్టింపయ్యింది. ఏడాది వ్యవధిలోగా రోజుకు 100 కోట్ల యూపీఐ లావాదేవీల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. -
పోయిందనున్న ఫోన్.. యూపీఐ సాయంతో దొరికిందిలా..
ఎక్కడైనా ఒకసారి మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నామంటే.. దాన్ని తిరిగి పొందటం దాదాపు అసాధ్యం. అయితే ఓ జంట మాత్రం యూపీఐ సాయంతోనే పోయిన ఫోన్ పొందగలిగింది. ఇది వినడటానికి వింతగా అనిపించినా.. అసలు విషయం తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవడం మీ వంతు అవుతుంది.నా భార్య ఫోన్ తిరిగి పొందడంలో యూపీఐ సహాయపడింది అనే శీర్షికతో.. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. ఇందులో ఈ రోజు నేను, నా భార్య ఆటోలో షాపింగ్కి వెళ్ళాము, గమ్యం చేరుకున్న తరువాత.. ఆటోకు యూపీఐ ద్వారా డబ్బులు పంపించాను. ఆటో వెళ్లిపోయింది. ఆ తరువాత చూస్తే నా భార్య ఫోన్ కనిపించలేదు. ఆ ఫోన్కు కాల్ చేద్దామంటే.. అప్పటికి అందులో సిమ్ కార్డు వేయలేదు.మొదట్లో ఫోన్ ఎవరో దొంగలించి ఉంటారనుకున్నాము, తరువాత ఆలోచిస్తే ఆటోలో మారిపోయినట్లు గుర్తొచ్చింది. ఆటో డ్రైవర్ వివరాలు తెలుసుకుందామంటే.. స్కాన్ చేసి డబ్బు పంపించడం వల్ల అది సాధ్యం కాలేదు. మొత్తానికి ఫోన్ పోయింది అనుకున్నాము. ఇంతలో నా బ్యాంక్ ఖాతాకు ఒక్కరూపాయి యూపీఐ నుంచి వచ్చింది. అంతే కాకుండా పోయిందనుకుంటున్న ఫోన్ నా దగ్గర ఉంది అని.. ఒక నెంబర్ పంపి, దానికి కాల్ చేయమని మెసేజ్ వచ్చింది. మేము ఆ నెంబరుకు కాల్ చేసి.. ఎక్కడ ఉన్నారు అని కనుక్కున్నాం. కానీ ఆ ఆటో డ్రైవర్ మా దగ్గరకు వచ్చి ఫోన్ ఇచ్చాడు. మా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆటో డ్రైవరుకు కొంత డబ్బు కూడా ఇచ్చి పంపాను అని రెడ్డిట్ పోస్టులో వెల్లడించారు.ఇదీ చదవండి: జీఎస్టీ 2.0 ఎఫెక్ట్: మొదటి రోజే భారీగా అమ్ముడైన కార్లు -
ఫోన్లపై రూ.63 వేల వరకు డిస్కౌంట్.. లిస్ట్ ఇదే..
జీఎస్టీ శ్లాబులను క్రమబద్ధీకరించడంతో ఎలక్ట్రానిక్ ఉపకరణాలతోపాటు ఇతర చాలా వస్తువుల ధరలు దిగొస్తున్నాయి. దాంతోపాటు ఈ-కామర్స్ వెబ్సైట్లు చాలానే ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. దీనికితోడు పండుగ సీజన్ కావడంతో కంపెనీలు మరిన్ని ఆఫర్లు అందిస్తున్నాయి. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్లలో కొన్ని ఫోన్లపై ఏకంగా రూ.63,000 వరకు డిస్కౌంట్ వస్తున్నట్లు తెలుస్తుంది. ఫోన్లకు సంబంధించి భారీగా రాయితీలు వచ్చే మోడళ్ల వివరాలు కింది విధంగా ఉన్నాయి.మోడల్ఓరిజినల్ ధరఆఫర్ ధరడిస్కౌంట్ప్లాట్ఫామ్ శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రారూ.1,34,999రూ.71,999రూ.63,000అమెజాన్ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్రూ.1,44,900రూ.89,900రూ.55,000ఫ్లిప్కార్ట్గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్రూ.1,72,999రూ.99,999రూ.73,000ఫ్లిప్కార్ట్నథింగ్ ఫోన్ (3)రూ.84,999రూ.34,999రూ.50,000ఫ్లిప్కార్ట్షావోమి 14 సీవీరూ.54,999రూ.26,499రూ.28,500అమెజాన్ ఇదీ చదవండి: రూ.15 వేలులోపు 5జీ స్మార్ట్ఫోన్లు -
రూ.15 వేలలోపు 5జీ స్మార్ట్ఫోన్లు
మొబైల్ యూజర్లు వాటి పనితీరు మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకు అనుగుణంగా టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ స్మార్ట్ఫోన్(Smart Phone) ఫీచర్లలో మార్పులు వస్తున్నాయి. మొబైల్ తయారీ కంపెనీలు వినియోగదారుల అభిరుచుల మేరకు వినూత్న మోడళ్లను నిత్యం ఆవిష్కరిస్తున్నారు. జీఎస్టీ(GST) తగ్గిన నేపథ్యంలో చాలామంది స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేయాలని ఆసక్తి చూపుతున్నారు. కొంతమంది రిటైలర్లు ప్రకటించిన ధరలమేరకు(జీఎస్టీ మార్పుల వల్ల రిటైలర్లను అనుసరించి ధరల్లోనూ మార్పులు ఉంటాయని గమనించాలి) రూ.15,000 లోపు 5జీ మొబైళ్ల(Mobiles) వివరాలు కింద తెలుసుకుందాం.మోడల్బ్రాండ్కీలక స్పెసిఫికేషన్లుధరiQOO Z10xiQOO6.72 అంగుళాల ఎల్సీడీ 120 హెర్ట్జ్ డిస్ప్లే, 50 ఎంపీ+2 ఎంపీ కెమెరా, 6500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 15 ఓఎస్రూ.13,499పోకో ఎం7 ప్రో 5జీపోకో6.67 అమోలెడ్ 120 హెర్ట్జ్ డిస్ప్లే, 50 ఎంపీ+2ఎంపీ కెమెరా, 5110 ఎంఏహెచ్ బ్యాటరీరూ.12,984రియల్ మీ 13+ 5జీరియల్ మి6.72 ఎల్సీడీ 120హెర్ట్జ్ డిస్ప్లే, 50ఎంపీ+2ఎంపీ కెమెరా, 6000ఎంఏహెచ్ బ్యాటరీరూ.13,499వివో టీ4ఎక్స్ 5జీవివో6.72 ఎల్సీడీ 120 హెర్ట్జ్ డిస్ప్లే, 50 ఎమ్ పి+2 ఎంపీ కెమెరా, 6500 ఎంఏహెచ్ బ్యాటరీరూ.13,999ఒప్పో కె13ఎక్స్ 5జీOPPO6.67 ఎల్సీడీ 120 హెర్ట్జ్ డిస్ప్లే, 50 ఎంపీ+2 ఎంపీ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీరూ.11,030మోటరోలా జీ86 పవర్ 5జీమోటరోలా6.7 పీ-ఓలెడ్ 120హెర్ట్జ్ డిస్ప్లే, 50ఎంపీ+8ఎంపీ కెమెరా, 6720ఎంఏహెచ్ బ్యాటరీరూ.15,999పోకో ఎం7 ప్లస్ 5జీపోకో6.9 అంగుళాల ఎల్సీడీ 144 హెర్ట్జ్ డిస్ప్లే, 50 ఎంపీ కెమెరా, 7000 ఎంఏహెచ్ బ్యాటరీరూ.13,499రెడ్ మీ నోట్ 14 ఎస్ ఈ 5జీరెడ్మీ6.67 అమోలెడ్ 120హెర్ట్జ్ డిస్ప్లే, 50ఎంపీ+8ఎంపీ+2ఎంపీ కెమెరా, 5110ఎంఏహెచ్ బ్యాటరీరూ.13,999శాంసంగ్ గెలాక్సీ ఎఫ్17 5జీశామ్ సంగ్6.7 అంగుళాల సూపర్ అమోలెడ్ 90 హెర్ట్జ్ డిస్ప్లే, 50 ఎంపీ+5ఎంపీ+2ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీరూ.13,999లావా ప్లే ఆల్ట్రా 5Gలావా6.67 అమోలెడ్ 120 హెర్ట్జ్ డిస్ప్లే, 64 ఎంపీ+5ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీరూ.14,999నోట్: పైన తెలిపిన ఫోన్లతో పాటు విడుదలై ప్రజాదరణ పొందిన మరిన్ని మెరుగైన ఉత్పత్తులు మార్కెట్లో ఉన్నాయని గుర్తుంచుకోవాలి.ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్లే ఇప్పుడు దిక్కు -
రూ.200 లోపు రీచార్జ్.. రోజుకు 2 జీబీ డేటా
ప్రభుత్వ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త కొత్త, చౌకౌన ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెడుతూనే ఉంది. ఇటీవల అపరిమిత కాలింగ్, రోజువారీ డేటా, ఇతర ప్రయోజనాలతో రూ .199 రీఛార్జ్ ప్లాన్ను ప్రకటించింది.రూ .199 రీఛార్జ్ ప్లాన్ ప్రయోజనాలురూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ (Recharge plan) లో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 2 జీబీ హై స్పీడ్ డేటా, 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. అదనంగా టెలికాం ఆపరేటర్ రీఛార్జ్ పై 2% తగ్గింపును కూడా అందిస్తోంది. ఆసక్తి ఉన్న వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ వెబ్సైట్, సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా మాత్రమే రీఛార్జ్ చేసుకోవచ్చు.ఇవి కాకుండా, బీఎస్ఎన్ఎల్ బడ్జెట్ ఫ్రెండ్లీ వినియోగదారుల కోసం కేవలం రూ .107 నుండి ప్రారంభమయ్యే ప్రీపెయిడ్ ప్లాన్లను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ 35 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఇందులో 3 జీబీ హైస్పీడ్ డేటా, 200 ఫ్రీ వాయిస్ మినిట్స్ (లోకల్, ఎస్టీడీ, రోమింగ్) లభిస్తాయి. అదనంగా, రూ .141 ప్యాక్ కూడా ఉంది. ఇది 30 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 200 ఎస్ఎంఎస్ లను అందిస్తుంది.ఇదీ చదవండి: జియో చౌక ప్లాన్.. ఎక్కువ వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాలింగ్ -
ప్రమాదంలో మహిళా ఉద్యోగాలు!: ఐక్యరాజ్యసమితి హెచ్చరిక
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా.. చాలామంది ఉద్యోగాలు కోల్పోతారని పలువురు నిపుణులు చాలా రోజుల నుంచి చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయేవారిలో మహిళలే ఎక్కువ ఉన్నారని ఐక్యరాజ్యసమితి 'జెండర్ స్నాప్షాట్ 2025' నివేదికలో వెల్లడించింది.ఏఐ కారణంగా.. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 28 శాతం మహిళలు ఉద్యోగాలు కోల్పోతారు. ఈ ప్రమాదంలో పడే పురుష ఉద్యోగులు 21 శాతం మాత్రమే అని ఐక్యరాజ్యసమితి నివేదించింది.తప్పుల నుంచి నేర్చుకోకపోతే..ఐక్యరాజ్యసమితి 'జెండర్ స్నాప్షాట్ 2025' (Gender Snapshot 2025) నివేదిక.. ప్రస్తుత అసమానతలను కూడా హైలైట్ చేసింది. ప్రపంచ టెక్ వర్క్ఫోర్స్లో మహిళలు 29%, టెక్ లీడర్లలో కేవలం 14% మాత్రమే ఉన్నారని వెల్లడించింది. ప్రపంచం కొత్త అంతరాయాన్ని ఎదుర్కొంటోంది. మనం గతంలో జరిగిన తప్పుల నుంచి నేర్చుకోకపోతే.. భవిష్యత్తులో అసమానత మరింత ఎక్కువవుతాయని హెచ్చరించింది.జెండర్ అంతరాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. ''ఇది 343 మిలియన్ల మహిళలకు, బాలికలకు ప్రయోజనం చేకూరుస్తుంది. 30 మిలియన్ల మందిని తీవ్ర పేదరికం నుంచి బయటపడేస్తుంది, 42 మిలియన్లకు ఆహార భద్రతను మెరుగుపరుస్తుంది. 2030 నాటికి ప్రపంచ వృద్ధిలో 1.5 ట్రిలియన్ డాలర్లకు దారితీస్తుందని నివేదికలో హైలైట్ చేసింది''.మహిళలు శ్రామిక శక్తిలో చేరడానికి.. విద్య, కెరీర్స్, కుటుంబ జీవితాన్ని సమతుల్యం చేసుకోవడానికి సహాయం చేయడంలో అనేక దేశాలు నిజమైన పురోగతి సాధించాయి. సౌదీ అరేబియా శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి.. సంరక్షణ సంబంధిత అడ్డంకులను తగ్గించడానికి చట్టపరమైన & విధాన సంస్కరణలను ప్రవేశపెట్టింది. ఫలితంగా, మహిళల భాగస్వామ్యం రెండింతలు పెరిగి, 2017లో 17 శాతం నుంచి 2024 మూడవ త్రైమాసికం నాటికి 35.4 శాతానికి పెరిగింది.ఇదీ చదవండి: తిరిగి వచ్చేయండి.. భయంతో జీవించవద్దు: శ్రీధర్ వెంబు -
ఏఐ నిఘాను అందిపుచ్చుకుంటున్న స్మార్ట్ నగరాలు
భారతీయ నగరాలు మరింత పట్టణీకరణతో మరింత రద్దీగా మారుతున్నాయి. వీటిలో మాల్స్, పార్కులు, రైల్వేస్టేషన్లు, రద్దీ రోడ్లు.. ఇలా అన్నిచోట్లా ట్రాఫిక్ పెరిగి భద్రతా సమస్యలు వస్తున్నాయి. అధిక రద్దీ వల్ల తొక్కిసలాటలు, లగేజి పోవడంతో ఖంగారు పడడం, చిన్నచిన్న దొంగతనాలు జరుగుతాయి. అందువల్ల మరింతగా భద్రతాచర్యలు చేపట్టడం చాలా అవసరం అవుతోంది. అందుకే నగరాలకు భద్రత కల్పించేందుకు ప్రాక్టికల్ పరిష్కారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత నిఘా వ్యవస్థ గణనీయంగా ఉపయోగపడుతోంది.ఏఐ నిఘా: ఏమిటిది?ఒకప్పుడు సీసీటీవీ కెమెరాల స్క్రీన్ల ముందు భద్రతా సిబ్బంది గంటల తరబడి కూర్చుని ఏదైనా అసాధారణంగా కనిపిస్తుందా అని చూసేవారు. కానీ ప్రస్తుతం ఏఐ నిఘా వ్యవస్థవల్ల కంప్యూటర్ విజన్, డీప్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్, న్యూరల్ నెట్వర్క్లు ఉండి.. మరింత స్పష్టంగా చూస్తూ, మనుషులు చేయగలిగినదానికంటే ఇంకా వేగంగా స్పందిస్తున్నాయి.కంప్యూటర్ విజన్ కెమెరాలు కేవలం వీడియో తీయడమే కాదు దాన్ని రియల్-టైంలో విశ్లేషిస్తాయి. నిషేధిత ప్రాంతంలో ఎవరైనా మూత్రవిసర్జన చేస్తున్నా, ఏదైనా జాతరలో ఎక్కువమంది జనాన్ని గమనించాలన్నా, రద్దీ మార్కెట్లో ఏదైనా వస్తువు పోయినా గుర్తిస్తాయి. ఇవి చాలా వేగంగా స్పందించి, సెకండ్లలోనే కంట్రోల్ సెంటర్లను అప్రమత్తం చేస్తాయి.నగరాల్లోని నిఘా వ్యవస్థలలో ఏఐ కెమెరాలను ఉపయోగించడం ద్వారా కేవలం ఘటనలను గుర్తించడమే కాకుండా, ఒకే తరహాలో ఏఐనా జరుగుతున్నా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు తెలుస్తుంది. ముఖాలను, అసాధారణ ప్రవర్తనను గుర్తించి, నేరచరిత్ర ఉన్నవారిని రియల్-టైంలో ఇట్టే పట్టేస్తాయి. తద్వారా వివిధ ప్రాంతాల్లో పదేపదే మోసాలు, నేరాలకు పాల్పడేవారిని గుర్తించడంలో పోలీసులకు సాయపడతాయి.ఏఐ గుర్తిస్తే.. వెంటనే స్పందిస్తుందిఏఐ నిఘాకు ఉన్న పరిమితులేంటని ఒకసారి చూసుకుంటే, అది ఎక్కువమంది ప్రజలు గుమిగూడేచోట (అంటే రాజకీయ ర్యాలీలు, కచేరీలు, మతపరమైన కార్యక్రమాలు) కూడా స్పష్టంగా గుర్తిస్తుంది. రియల్ టైంలో రద్దీ నిర్వహణ, రద్దీప్రాంతాలలో పరిశీలనకు ఏఐ మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ టెక్నాలజీలో ప్రెడిక్టివ్ ఎనాలసిస్, ప్యాటర్న్ ఎనాలసిస్ ఉపయోగించి ఎలాంటి ముప్పునైనా ముందుగానే అరికడుతుంది.మనుషులను ఎక్కడ కావాలో అక్కడ పెట్టడం, సహాయాన్ని సరైన సమయంలో అందించడం కూడా దీనివల్ల సాధ్యమవుతుంది. రద్దీ నియంత్రణ కోసం పుణెలో ఒక పైలట్ స్మార్ట్ సిటీలో ఏఐని ఉపయోగించి, బహిరంగ కార్యక్రమాల్లో అత్యవసర పరిస్థితులను 42% తగ్గించారు. విమానాశ్రయాలు, బస్టాండ్లలో పిల్లలు తప్పిపోయినా, చట్టవిరుద్ధ కార్యకలాపాలున్నా, లగేజి పోయినా ఏఐ కెమెరాలు గుర్తిస్తాయి. ఇవి కదలికలను, వస్తువులను, ఆడియోను కూడా గుర్తిస్తాయి. (ఉదా: రద్దీ ప్రాంతంలో అద్దం పగిలినా పట్టేస్తాయి) దీనివల్ల రాబోయే ప్రమాదాన్ని వెంటనే గుర్తుపట్టగలరు.నేరాలు గుర్తించడమే కాదు.. ఆపుతాయి కూడా!నేరాల రేటును తగ్గించడం ఏఐ నిఘా వ్యవస్థల ప్రాథమిక పనుల్లో ఒకటి. హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలు బహిరంగ స్థలాల్లో ఏఐ నిఘావ్యవస్థను ఏర్పాటుచేసి.. చైన్ స్నాచింగ్, ఆస్తినష్టం, ఏటీఎంల చోరీల్లాంటి ఘటనలను 30% తగ్గించగలిగాయి. ఇవి కేవలం నేరాలకు వెంటనే స్పందించడమే కాక.. గతంలో జరిగిన ఘటనల్లో పాల్గొన్నవారిని గుర్తించి ఏదైనా జరగడానికి ముందే భద్రతా దళాలను అప్రమత్తం చేస్తాయి.ఏఐ కెమెరాలు ముఖాలను, నంబర్ ప్లేట్లను, చొరబాట్లను గుర్తించి ఏవైనా తేడా ఉంటే వెంటనే చెబుతాయి. అర్ధరాత్రి ఎవరైనా ప్రహరీ ఎక్కుతున్నా, స్కూలు గేట్లు దాటుతున్నా ఏదో తేడా ఉందని ఏఐ గమనించి, వెనువెంటనే చెప్పేస్తుంది.అంచనాతో కాకుండా డేటాతో నగరప్రణాళికలుఏఐ నిఘా అనేది కేవలం అత్యవసర పరిస్థితుల్లోనే కాదు.. నగర ప్రణాళికల కోసం ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో సమగ్ర డేటా ఇవ్వడానికీ ఉపయుక్తంగా ఉంటుంది. ఉదాహరణకు రాత్రిపూట పార్కులు నిర్మానుష్యంగా ఉంటే అక్కడ మెరుగైన లైటింగ్, నిఘాను ఏర్పాటుచేసుకోవచ్చు. శనివారం సాయంత్రం బస్టాపులో రద్దీ ఎక్కువగా ఉంటే అక్కడ సదుపాయాలు మెరుగుపరచడంపై దృష్టిపెట్టచ్చు. స్మార్ట్ సిటీ ఇనీషియేటివ్లను డిజైన్ చేయడంలో ఈ సమాచారం బాగా ఉపయోగపడుతుంది. కేవలం అంచనాల మీద ఆధారపడి నగర ప్రణాళికలు వేసేకంటే ఇలా చేయడం మంచిది.గోప్యత, న్యాయ విషయాల సంగతేంటిఇన్నిరకాల ప్రయోజనాలు ఉన్నా, ఏఐ నిఘా వ్యవస్థ వల్ల గోప్యత విషయంలో కొన్ని సమస్యలున్నాయి. భద్రతకోసమైనా తమమీద నిఘా ఉందంటే వ్యక్తులు ఆందోళనకు గురవుతారు. ఆధునిక ఏఐ నిఘా వ్యవస్థలు చట్టసంస్థలు చెబితే తప్ప వ్యక్తుల మీద అనవసర పరిశీలన లేకుండా వాళ్ల పనులు మాత్రమే గుర్తించగలవు.చట్టపరంగా చూస్తే, ఈ నిఘా వ్యవస్థలలో చాలా వాటిని నగరపాలక సంస్థలు లేదా చట్టాలను అమలుచేసే వ్యవస్థలు డేటా ప్రొటెక్షన్ మార్గదర్శకాల ఆధారంగానే తీసుకుంటాయి. అయితే, ఈ వ్యవస్థ ప్రజాభద్రతను వ్యక్తిగత హక్కులతో బ్యాలెన్స్ చేసేందుకు ఏఐ ఆధారిత పర్యవేక్షణ నియంత్రణకు కఠినమైన జాతీయస్థాయి నిబంధనలు అమలుచేయాలి.దోపిడీలను నిరోధించడానికి ఏఐ నిఘాలో డేటామాస్కింగ్, రోల్ ఆధారిత యాక్సెస్, తాత్కాలికంగా వీడియోలను దాచడం లాంటివి చేయాలి. తరచు ఆడిటింగ్తో ఈ చర్యలు తీసుకుంటే చట్టాన్ని వ్యతిరేకించకుండాప్రజలు దీన్ని నమ్మే అవకాశం ఉంటుంది.మెరుగైన భవిష్యత్తుఎవరో గమనిస్తున్నారు అనే విధానం మారింది. ఇది నియంత్రణ కాదు.. రక్షణ. ఏఐ నిఘా అనేది ప్రజల ఉద్యోగాలు తీసేసేది కాదు. ప్రజాభద్రతను మరింత స్మార్ట్గా, వేగంగా అందిస్తుంది. మనుషులు తీసుకునే నిర్ణయాలకు బదులు రియల్ టైం ఏఐ నిఘాతో మన నగరాల్లో ఉండే ట్రాఫిక్ జామ్లు, రద్దీ నిర్వహణ, అత్యవసర పరిస్థితులు, నేరాలు అన్నింటి విషయంలో సులభంగా నిర్ణయాలు తీసుకోవచ్చు.బృహస్పతి టెక్నాలజీస్ ఎండీ రాజశేఖర్ పాపోలు -
ఏఐతో ఊడ్చుకుపోయే ఉద్యోగాలు ఇవే..
కృత్రిమ మేధ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీలు కాస్ట్కటింగ్ పేరుతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే టెక్నాలజీతోపాటు ఇతర సంస్థల్లోని దాదాపు అన్ని విభాగాల్లో ఏఐ పాగా వేస్తోంది. దాంతో ఉద్యోగాల్లో కోత తప్పడం లేదు. భవిష్యత్తులో ఏఐ ప్రభావంతో దాదాపు కనుమరుగయ్యే కొన్ని జాబ్స్ జాబితాను ఓపెన్ఏఐ సీఈఓ సామ్ఆల్ట్మన్ తెలిపారు. దాంతోపాటు కొత్తగా సృష్టించబడే కొలువులను కూడా పేర్కొన్నారు.ఏఐ వల్ల కనుమరుగయ్యే ఉద్యోగాలుడేటా ఎంట్రీ క్లర్క్లుబేసిక్ కస్టమర్ సర్వీస్ రిప్రెజెంటేటివ్స్టెలిమార్కెటర్లుప్రాథమిక కాపీ రైటింగ్ స్కిల్స్ కలిగిన జాబ్స్సింపుల్ గ్రాఫిక్ డిజైన్ నైపుణ్యాలున్న ఉద్యోగాలుసోషల్ మీడియా షెడ్యూలింగ్ కొలువులుజూనియర్ కోడింగ్ ఉద్యోగాలు ఉదా: బగ్ ఫిక్సింగ్, టెంప్లెట్ ఆధారిత కొలువులుఏఐ కొన్ని విభాగాలను ఆటోమేట్ చేసే అవకాశం ఉన్నా, కొత్త ఉద్యోగాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అందులో..ఏఐ ఓవర్సైట్ ఉద్యోగాలుప్రాంప్ట్ ఇంజినీరింగ్హ్యూమన్-ఏఐ కొలొబరేషన్ జాబ్స్ఏఐ ట్రయినింగ్ జాబ్స్ఏఐ వ్యవస్థల నైతికత, భద్రత, పాలన పరమైన ఉద్యోగాలు ఉన్నాయి.ప్రభుత్వాలు, కంపెనీలు మార్పునకు సిద్ధం కావాలని, రీస్కిల్లింగ్లో పెట్టుబడులు పెట్టాలని ఆల్ట్మన్ సూచించారు.ఇదీ చదవండి: ‘నేనో మేనేజర్ని.. టీమ్ సభ్యులకంటే జీతం తక్కువ’ -
అమెరికాలో భారతీయ టెకీలు సంపాదిస్తున్నదెంత?
అమెరికా హెచ్-1బి వీసాలపై భారతీయ ఐటీ ఉద్యోగుల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ వీసాలకు వార్షిక ఫీజును యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లక్ష డాలర్లు చేశారు. అంటే దాదాపు రూ.88 లక్షలపైనే. దీంతో ఈ హెచ్-1బి వీసాలపై ఇప్పటికే అక్కడ పనిచేస్తున్నవారు, కొత్తగా వెళ్లాలనువారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఈ నేపథ్యంలో హెచ్-1బి వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఐటీ ఉద్యోగులు ఎంత సంపాదిస్తున్నారు.. వారి జీతాలు, వాస్తవ స్థితిగతుల గురించి ఈ కథనంలో చూద్దాం..అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఐటీ నిపుణులు, ముఖ్యంగా ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి భారతీయ ఐటీ సంస్థలచే నియమితులైనవారు మరీ అంత ఎక్కువ జీతాలేమీ పొందడం లేదు. వారి జీతంలో అత్యధికం బేస్ పే (ప్రాథమిక జీతం)కు ఉండటం వల్ల మొత్తం ప్యాకేజీ చూడగానే ఆకర్షణీయంగా కనిపించినా, అమెరికన్ టెక్ కంపెనీలతో పోల్చితే గణనీయమైన తేడా స్పష్టమవుతుంది.జీత నిర్మాణంఅమెరికాలో ఈ ఉద్యోగుల బేస్ పే మొత్తం జీతంలో 70-90% వరకు ఉంటుంది. ఇది యూఎస్ కార్మిక విభాగం (U.S. Department of Labor) నిర్ణయించిన వేతన స్థాయిలపై ఆధారపడి ఉంటుంది. జాబ్ రోల్, అనుభవం, పని ప్రదేశాన్ని బట్టి మారుతుంది. సాధారణంగా, భారతీయ సంస్థలు తమ హెచ్-1బి ఉద్యోగులకు 65,000 నుండి 90,000 డాలర్ల మధ్య బేస్ పేని అందిస్తుంటాయి.అదే ఉద్యోగులు స్వదేశానికి తిరిగి వచ్చాక కొన్ని సంస్థలు ఆ జీతాన్ని భారీగా తగ్గించేస్తున్నాయి. ఇది మొత్తం ప్యాకేజీలో 10% కంటే తక్కువగా ఉండటం గమనార్హం. అయితే పీఎఫ్, గ్రాట్యుటీ వంటి లీగల్ బెనిఫిట్ల నిర్వహణకు ఇది ఉపయోగపడుతుంది.అలవెన్సులు, బోనసులుబేస్ పే పైన, కొన్ని ఆన్సైట్ అలవెన్సులు – హౌసింగ్, కాల్ (Cost of Living) అడ్జస్ట్మెంట్లు, రీలొకేషన్ సపోర్ట్ – జీతంలో 5-20% వరకు ఉంటాయి. అయితే, ఇవి ప్రాంతం, సంస్థ విధానంపై ఆధారపడి, యూఎస్ లోని స్థానిక ఉద్యోగుల అలవెన్సులతో పోలిస్తే తక్కువగా ఉంటాయి.బోనస్లు సాధారణంగా జీతంలో 10% లోపు ఉంటాయి. సీనియర్ ఉద్యోగులకు కొంత మెరుగుదల కనిపించినా, అవి యూఎస్ కంపెనీలు ఇచ్చే ప్రోత్సాహకాలతో పోల్చితే తక్కువగానే ఉంటాయి. ఉదాహరణకు, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి సంస్థలు హెచ్-1బి ఉద్యోగులకు 120,000 – 200,000 డాలర్ల వరకు బేస్ పే, అదనపు ఈక్విటీ, స్టాక్ ఆప్షన్లు, గణనీయమైన బోనస్లు అందిస్తున్నాయి.ప్రయోజనాలుహెచ్-1బి ఉద్యోగులకు హెల్త్ బెనిఫిట్స్ కింద ఆరోగ్య బీమా, డెంటల్, కంటి బీమా వంటి ప్రాథమిక ప్రయోజనాలు అందిస్తున్నారు. ఇవి సాధారణంగా కుటుంబ సభ్యులను కూడా కవర్ చేస్తాయి. అయితే, భారతీయ ఐటీ సంస్థలలో స్టాక్ ఆప్షన్లు, ఈక్విటీ వంటి లాంగ్-టర్మ్ ఇన్సెంటివ్లు చాలా అరుదుగా ఉంటాయి. ప్రత్యక్షంగా యూఎస్ కంపెనీలచే నియమితులైన ఉద్యోగులకు మాత్రమే ఇవి సాధారణంగా లభ్యమవుతాయి.ఈ పరిస్థితులలో హెచ్-1బి వీసాపై ఉన్న భారతీయ ఉద్యోగులు అమెరికాలో మెరుగైన జీవన ప్రమాణాలు అందుకుంటున్నా, తమ స్థానిక సహోద్యోగులతో పోల్చితే జీతాల పరంగా తక్కువగానే అందుకుంటున్నారు. దీన్నిబట్టి అమెరికాలో హెచ్-1బి వీసాల ప్రస్తుత పరిస్థితి గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని అర్థమవుతుంది. -
యాపిల్ సీఈవో ముందే కొత్త ఐఫోన్ పడేసుకున్నాడు..
ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్కు ఉన్న క్రేజ్ తెలిసిందే కదా.. తాజాగా విడుదలైన ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లను కొనేందుకైతే యాపిల్ స్టోర్ల ముందు కస్టమర్లు క్యూకట్టారు. కొత్త ఫీచర్లతో లాంచ్ అయిన బ్రాండ్ న్యూ ఐఫోన్ను కొనుక్కొని తమ చేతుల్లోకి ఎప్పుడెప్పుడు తీసుకుందామా అని గంటల కొద్దీ కస్టమర్లు క్యూలో వేచిఉన్న దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా కనిపించాయి.అయితే ఓ కస్టమర్ తన కొత్త ఐఫోన్ 17ను యాపిల్ సీఈవో టిమ్ కుక్ ముందే పడేసుకున్న సంఘటన ఓ యాపిల్ స్టోర్లో జరిగింది. ముచ్చటపడి కొనుక్కున్న కొత్త ఫోన్పై సీఈవో టిమ్ కుక్తో ఆటోగ్రాఫ్ చేయించుకోవాలనుకున్న యువకుడు ఆ ఆత్రుతలో ఇంకా ఓపెన్ చేసిన సరికొత్త ఐఫోన్ను చేజార్చుకున్నాడు.తన ముందు కస్టమర్ కొత్త ఫోన్ పడేసుకున్నప్పుడు టిమ్ కుక్ స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. కింద పడిన ఫోన్ను తీసుకునేందుకు కస్టమర్ కిందికి ఒంగగా టిమ్ కుక్ కూడా అతనికి సాయం చేసుందుకు అన్నట్టుగా కిందికి ఒంగారు. అతను ఫోన్ చేతిలోకి తీసుకున్నాక ఏం కాలేదులే అని అభినందించి ఆ తర్వాత ఆ ఫోన్పై తన ఆటోగ్రాఫ్ చేశారు.ఈ సంఘటన ఎక్కడి యాపిల్ స్టోర్ జరిగిందో తెలియదు కానీ, దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ తిరుగుతూ వైరల్గా మారింది. ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు యూజర్ల నుంచి విపరీతమైన కామెంట్లు వచ్చాయి.this is so embarrassing 😭 pic.twitter.com/AkrKd41Kn3— Holly - I like tech (@AnxiousHolly) September 20, 2025 -
H-1B visas: టీసీఎస్వే ఎక్కువ..
అమెరికాలో అత్యధిక నైపుణ్యమున్న విదేశీ నిపుణులకు ఇచ్చే హెచ్ -1బీ వీసాలకు సంబంధించి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2025లో రెండవ అతిపెద్ద గ్రహీతగా అవతరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 5,500కి పైగా ఆమోదాలతో అమెజాన్ (10,044) తర్వాత స్థానంలో నిలిచింది.2025 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ తర్వాత అత్యధిక హెచ్ 1బీ వీసా అప్రూవల్స్ పొందిన కంపెనీల్లో మైక్రోసాఫ్ట్ (5,189), మెటా (5,123), ఆపిల్ (4,202), గూగుల్ (4,181), డెలాయిట్ (2,353), ఇన్ఫోసిస్ (2,004), విప్రో (1,523), టెక్ మహీంద్రా అమెరికాస్ (951) ఉన్నాయి.అమెరికాలోని భారతీయ ఐటీ నిపుణులను గణనీయంగా ప్రభావితం చేసే చర్యను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తీసుకున్నారు. వార్షిక హెచ్ -1 బి వీసా ఫీజు 100,000 డాలర్లకు పెంచుతూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు.2025 సెప్టెంబర్ 21 తర్వాత దాఖలు చేసిన పిటిషన్లకు ఈ పరిమితి వర్తిస్తుంది. పొడిగించకపోతే 12 నెలల తర్వాత ముగుస్తుంది. "ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలు హెచ్-1బీ వ్యవస్థను దుర్వినియోగం చేశాయి. కంప్యూటర్ సంబంధిత రంగాలలో అమెరికన్ ఉద్యోగులకు గణనీయంగా హాని కలిగిస్తున్నాయి" అని పేర్కొంటూ ఐటీ అవుట్ సోర్సింగ్ కంపెనీలు హెచ్-1బీ ఆమోదాలపై ఎంతలా ఆధిపత్యం చెలాయించాయో ప్రభుత్వ ప్రకటన హైలైట్ చేసింది. -
విమానానికి ఎయిర్బ్యాగులు
విమానం గాల్లో వెళ్తోంది. హఠాత్తుగా విమానంలో సమస్య తలెత్తింది. పైలట్లు ఇక విమానం నడపడం మావల్ల కాదని చేతులెత్తేశారు. అప్పుడు కనీవినీ ఎరగని రీతిలో విమానానికి ఎయిర్ బ్యాగులు ప్రత్యక్షమయ్యాయి. విమానం సురక్షితంగా కిందకు దిగింది. భారీ ప్రమాదం తప్పింది. వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇలా జరిగితే ఎంత బాగుంటుంది! ఈ దిశగా ఇప్పుడే ప్రయత్నాలు మొదలయ్యాయి. బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్కి చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థుల ఆలోచన ఇది.ప్రాజెక్ట్ రీబర్త్ (Project REBIRTH) ఏఐ సాయంతో విమానాలకు ఎయిర్బ్యాగులు (Airbags) ఏర్పాటుచేసే వినూత్న ఆవిష్కరణ. దుబాయ్లోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో చదువుతున్న భారతీయ విద్యార్థులైన ఈషెల్ వసీం, దర్శన్ శ్రీనివాసన్ దీన్ని రూపొందించారు. ఈ ఎయిర్బ్యాగుల ఆలోచన.. ల్యాబులోనో, క్లాస్రూములోనో రాలేదు. ఇది ఒక మాతృమూర్తి ఆవేదన, సానుభూతి నుంచి వచ్చింది.అమ్మ బాధ తెలుసుకుని..జూన్ 12, 2025.. దేశం మొత్తం ఎప్పటికీ మర్చిపోలేని రోజు. ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్లో టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కుప్పకూలిపోయింది. 260 మంది ప్రాణాలు కోల్పోయారు. తమ ఆప్తుల మృతదేహాలు కూడా దొరకని వారి కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణనాతీతం. అదిగో అది.. ఓ తల్లిని తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఆమె.. దుబాయ్లోని బిట్స్పిలానీలో చదువుతున్న ఈషెల్ తల్లి. ‘విమాన ప్రమాదం గురించి విన్న మా అమ్మ తీవ్రంగా కలత చెందింది. ఆమెకు నిద్ర కూడా పట్టేది కాదు. ‘‘ప్రమాదం తప్పదు.. ఇక విమానాన్ని, ప్రయాణికుల ప్రాణాలు కాపాడలేం’ అనుకున్న క్షణంలో పైలట్లు ఎంత మానసిక వేదన అనుభవించి ఉంటారు’’ అనుకుంది. అలాగే తమ ప్రాణాలు పోవడం ఖాయం అనుకున్న ప్రయాణికుల మానసిక స్థితి ఎలా ఉండి ఉంటుందో అని రోజూ ఆలోచించేది. ఆమె ఆవేదనే నన్ను ఆలోచింపజేసింది. నా స్నేహితుడు శ్రీనివాసన్తో ఈ విషయాన్ని పంచుకున్నాను. ఇలాంటి విమాన ప్రమాదాలు ఎలా ఆపవచ్చా అనుకున్నప్పుడు ఎయిర్బ్యాగుల ఆలోచన వచ్చింది’ అంటాడు వసీం.క్షణాల్లో తెలిసిపోతుందిసాధారణంగా విమాన ప్రమాదాలు (Flight Accidents) జరిగాక కొన్ని గంటలకో, రోజులకోగానీ ఎక్కడ జరిగిందో తెలియదు. ఈలోగా.. తీవ్ర గాయాలతో ఉన్నవారు ప్రాణాలు కోల్పోవచ్చు. మంటలు పెరిగి అంతా కాలి బూడిదైపోవచ్చు. ఏదైనా జరగొచ్చు. ఇలా జరగకుండా.. విమానం ఎక్కడ ఉందో తెలియజేసేందుకు జీపీఎస్, లైటింగ్ వ్యవస్థ ఇందులో ఉన్నాయి. అంటే.. క్షణాల్లో విమాన సమాచారం తెలిసిపోతుందనమాట!పునర్జన్మకు వాగ్దానం‘ప్రస్తుతం రీబర్త్ టెస్టింగ్కి సిద్ధంగా ఉంది. పైలట్లతో సంబంధం లేకుండానే.. విమానం ఎప్పుడు కుప్పకూలిపోవచ్చో ఏఐ వ్యవస్థ కచ్చితంగా అంచనా వేయడం దీని ప్రత్యేకత. విమానానికి బయట నుంచి వచ్చి, ప్రమాదం నుంచి కాపాడే ఎయిర్బ్యాగులు అసలైన రక్షణ వ్యవస్థ. ముఖ్యంగా లోపల ఉన్న ప్రయాణికులు తీవ్రమైన కుదుపులకు గురికాకుండా, ఎలాంటి గాయాలు కూడా కాకుండా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేశాం. ఈ మొత్తం వ్యవస్థను కొత్త విమానాల్లోనే కాదు, ఇప్పటికే ఉన్న విమానాల్లోనూ ఏర్పాటుచేయవచ్చు. రీబర్త్ అనేది కేవలం ఆవిష్కరణ కాదు.. అన్నీ విఫలమైపోయి ప్రాణాలు పోవడం ఖాయం అనుకున్నప్పుడు కూడా పునర్జన్మనిస్తుందనే వాగ్దానం’ అంటున్నారు వసీం, శ్రీనివాసన్.5 ఏళ్లలో సిద్ధం!రీబర్త్కు సంబంధించిన ప్రధాన భాగాల తయారీపైనా ఈ యువ ఇంజినీర్లు దృష్టిపెట్టారు. ముఖ్యంగా ప్రమాదాన్ని పసిగట్టే ఏఐ వ్యవస్థ, ఎయిర్బ్యాగులు, స్మార్ట్ సీట్ల వంటి అన్ని రకాల సాంకేతికతలనూ తయారుచేసేందుకు విమాన తయారీ సంస్థలు, ప్రభుత్వాలతో వీరు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. వచ్చే 5 ఏళ్లలో.. రీబర్త్ను పరీక్షించి, అన్ని అనుమతులూ పొంది, విమానాల్లో పూర్తిస్థాయిలో వాడాలన్నది తమ లక్ష్యం అంటున్నారు ఈ యువ ఆవిష్కర్తలు.చదవండి: ప్రపంచవ్యాప్తంగా పలు ఎయిర్పోర్టులసైబర్ ఎటాక్‘ఏఐ’ రక్షణ వ్యవస్థఇది మొట్టమొదటి ఏఐ ఆధారిత ప్రమాద నిరోధక వ్యవస్థ. 5 స్మార్ట్ టెక్నాలజీల సాయంతో విమాన ప్రమాదాలను పసిగడుతుంది. ⇒ ఇందులోని ఏఐ వ్యవస్థ.. ఎత్తు, వేగం, ఇంజిన్ పరిస్థితి, దిశ, మంటలు, పైలట్ల స్పందనలను పర్యవేక్షిస్తుంది. ⇒ విమానం కుప్పకూలిపోతుంది అనుకున్నప్పుడు ‘ప్రాజెక్ట్ రీబర్త్’ యాక్టివేట్ అవుతుంది. హైస్పీడ్ ఎయిర్బ్యాగులు విమానం రెక్కలు, కింది భాగం, వెనుక భాగాల నుంచి కేవలం 2 సెకెన్ల వ్యవధిలో వచ్చేస్తాయి.⇒ విమాన వేగం తగ్గేలా సాంకేతిక ఏర్పాటు ఉంది. ⇒ సాధారణంగా విమాన ప్రమాదాలు.. తీవ్ర విషాదాలుగా మారేది తాకిడి తీవ్రత వల్లే. అందువల్ల రీబర్త్లో ప్రధానంగా దీన్ని తగ్గించడంపైనే దృష్టి పెట్టారు. విమాన వేగం తగ్గి, దేన్నయినా బలంగా కాకుండా, నెమ్మదిగా తాకినప్పుడు.. లేదా వేగంగా కాకుండా నెమ్మదిగా ల్యాండింగ్ అయినప్పుడు ప్రమాదం తప్పినట్టే కదా. -
భారత్లో యాపిల్ మేనియా...
న్యూఢిల్లీ: భారత్లో శుక్రవారం అందుబాటులోకి వచ్చిన యాపిల్ ఐఫోన్ 17 అభిమానుల్లో మేనియా సృష్టించింది. లేటెస్ట్ ఫోన్ను ముందుగా దక్కించుకునేందుకు యాపిల్ స్టోర్స్ ముందు ఫ్యాన్స్ బారులు తీరారు. కొందరు ముందు రోజు రాత్రి నుంచే దాదాపు 21 గంటల పాటు కూడా నిరీక్షిస్తూ కూర్చున్నారు. ముంబై, ఢిల్లీ, బెంగళూరులో చాంతాడంత క్యూలు కనిపించాయి. ఐఫోన్ 17ని మొదటి రోజునే ముందుగా దక్కించుకున్నవారు మిగతా వారితో తమ సంతోషాన్ని పంచుకున్నారు. రికార్డు స్థాయిలో కొనుగోలుదారులు వెల్లువెత్తినట్లు రిటైలర్లు తెలిపారు. ‘నేను పొద్దుటి నుంచే క్యూలో ఉన్నాను. ఈ రంగు ఐఫోన్ను కొనుక్కోవడం చాలా సంతోషంగా ఉంది‘ అంటూ ఢిల్లీలోని అష్రఫ్ అనే కొనుగోలుదారు తెలిపారు. బెంగళూరులో కొత్తగా ప్రారంభించిన యాపిల్ హెబ్బాల్ స్టోర్లో కూడా ఇలాంటి సందడే నెలకొంది. అటు ముంబైలోని స్టోర్ దగ్గర గుమికూడిన కస్టమర్ల మధ్య ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలో గొడవ తలెత్తడంతో, సెక్యూరిటీ సిబ్బంది పరిష్కరించాల్సి వచ్చింది. ఇటీవల ప్రవేశపెట్టిన ఐఫోన్ 17 సిరీస్ ధర శ్రేణి రూ. 82,900 నుంచి రూ. 2,29,900 వరకు ఉంది. -
Infosys: కెరీర్ గ్యాప్ మహిళలకు శుభవార్త..
కెరీర్లో గ్యాప్ మహిళలకు దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ చక్కని అవకాశం కల్పిస్తోంది. వృత్తి జీవితానికి విరామం ఇచ్చి మళ్లీ ఉద్యోగ ప్రపంచంలో అడుగు పెట్టాలనుకుంటున్న మహిళల కోసం రీస్టార్ట్ విత్ ఇన్ఫోసిస్ అనే కొత్త రిఫరల్ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. విజయవంతమైన రిఫరల్స్కు రూ .50,000 వరకు రివార్డులను కూడా అందించనున్నట్లు కంపెనీ ఉద్యోగులకు అంతర్గత ఈమెయిల్ పంపింది.అర్హతలు ఇవే..ఈ ప్రోగ్రామ్ కు అర్హత పొందడానికి, అభ్యర్థులు కనీసం రెండు సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి. కనీసం ఆరు నెలల పాటు నిరంతర కెరీర్ గ్యాప్ ఉండాలి. అర్హులైనవారిని వివిధ టెక్నాలజీల్లో డెవలపర్లు, టెక్ లీడ్లు, మేనేజర్లుగా నియమించుకునేందుకు ప్రయత్నిస్తోందని, దీని గురించి తెలిసిన వర్గాలను ఉటంకిస్తూ ఒక నివేదిక పేర్కొంది.రెఫర్ చేసినవారికి రివార్డులుఈఎస్జీ విజన్ 2030లో భాగంగా 2030 నాటికి 45 శాతం మహిళా ప్రాతినిధ్యాన్ని సాధించాలని ఇన్ఫోసిస్ లక్ష్యంగా పెట్టుకుంది. తాజా ఈఎస్జీ నివేదిక ప్రకారం.. కంపెనీలో ప్రస్తుతం సుమారు 3,23,000 మంది ఉద్యోగులలో మహిళలు 39% ఉన్నారు. దీంతో మహిళా ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవడంలో భాగంగా కంపెనీ ఈ రిఫరల్ ప్రోత్సాహకాలను అందిస్తోంది. జాబ్ లెవల్ 3 (JL3) లో విజయవంతమైన నియామకాలకు రూ .10,000, జాబ్ లెవల్ 4కు రూ .25,000, జాబ్ లెవల్ 5కు రూ .35,000, జాబ్ లెవల్ 6 రెఫరల్స్కు రూ .50,000 రివార్డులను ఇన్ఫోసిస్ అందించనుంది.ఇదీ చదవండి: ‘టీసీఎస్లో బలవంతంగా రాజీనామా చేయమన్నారు’ -
గేమింగ్ చట్టం అమలు అప్పుడే: అశ్విని వైష్ణవ్
ఆన్లైన్ మనీ గేమ్స్ను నిషేధిస్తూ రూపొందించిన ఆన్లైన్ గేమింగ్ చట్టం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. దీనిపై గత మూడేళ్లుగా పరిశ్రమ వర్గాలతో ప్రభుత్వం సంప్రదింపులు జరిపిందని, చట్టాన్ని ఆమోదించిన తర్వాత కూడా బ్యాంకులు, ఇతరత్రా భాగస్వాములతోను చర్చించామని ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026 ఇండియాకి సంబంధించి ప్రీ–ఈవెంట్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు.పార్లమెంటు గత నెలలో ఈ చట్టానికి ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. దీనితో డ్రీమ్11, మై11 సర్కిల్, విన్జో, జూపీ, పోకర్బాజీలాంటి సంస్థలు రియల్ మనీ గేమింగ్ కార్యకలాపాలను నిలిపివేశాయి. కాగా, కృత్రిమ మేథ (ఏఐ) సంబంధిత ముప్పుల నుంచి ప్రజలకు రక్షణ కలి్పంచేందుకు, ఏఐ వినియోగ విధి విధానాలను నిర్దేశించేందుకు ఉద్దేశించిన గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ను సెపె్టంబర్ 28 నాటికి విడుదల చేయనున్నట్లు వైష్ణవ్ చెప్పారు. -
ఇండియా ఏఐ మిషన్లోకి ఎనిమిది కంపెనీలు
కృత్రిమ మేధలో ఆధిపత్యం కోసం భారతదేశం సాహసోపేతమైన అడుగులు వేస్తోంది. అత్యాధునిక లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs)ను నిర్మించడానికి ప్రభుత్వం ఎనిమిది కంపెనీలను ఎంపిక చేసినట్లు తెలిపింది. ఇండియా ఏఐ మిషన్లో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయం దేశ ఏఐ ల్యాండ్స్కేప్ను శక్తివంతం చేయడానికి, భారతీయ భాషలు, పాలనా అవసరాలకు అనుగుణంగా పరిష్కారాలను రూపొందించడానికి తోడ్పడుతుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.ప్రభుత్వం ఎంపిక చేసిన కంపెనీలు విభిన్న భాషా, సాంస్కృతిక సాంకేతికలను కలిగి ఉన్నాయని మంత్రి చెప్పారు. ఇవి ఏఐ నమూనాలను అభివృద్ధి చేయడానికి ప్రతిష్టాత్మక ప్రణాళికలను కలిగి ఉన్నట్లు తెలిపారు. ఇండియా ఏఐ మిషన్లో భాగమవుతున్న కంపెనీల వివరాలు కింది విధంగా ఉన్నాయి.టెక్ మహీంద్రా - 8 బిలియన్ పారామీటర్ ఎల్ఎల్ఎంను నిర్మించే పనిలో ఉంది. టెక్ మహీంద్రా మోడల్ దేశవ్యాప్తంగా భాషా అంతరాలను తగ్గించే లక్ష్యంతో హిందీ మాండలికాల అవగాహన, ప్రాసెసింగ్ను పెంపొందించడంపై దృష్టి పెడుతుంది. హిందీ కేంద్రీకృత ఎల్ఎల్ఎంను అభివృద్ధి చేసేందుకు ప్రాథమికంగా రూ.1.06 కోట్లతో మద్దతు ఇచ్చింది.ఫ్రాక్టల్ అనలిటిక్స్ - తార్కికత ఆధారిత నమూనాలపై దృష్టి సారించింది. ఫ్రాక్టల్ అనలిటిక్స్ ఆరోగ్య సంరక్షణ, విశ్లేషణ, జాతీయ భద్రత కోసం ఎల్ఎల్ఎంలపై పని చేస్తుంది. ఈ విధాన కేంద్రీకృత నమూనాల కోసం రూ.34.58 కోట్లు కేటాయించారు.భారత్ జెన్ - ఐఐటీ బాంబే నేతృత్వంలో భారత్ జెన్ బహుభాషా అప్లికేషన్లను, రీజినల్ నాలెడ్జ్తో సహా భారతీయ యూజర్ కేసుల కోసం రూపొందించిన 1-ట్రిలియన్ పారామీటర్ మోడల్ను రూపొందించడానికి సిద్ధమవుతోంది. ఐఐటీ బాంబే-భారత్ జెన్ కోసం రూ.988.6 కోట్లు కేటాయించారు.అవతార్ AI, షోధ్ AI, జీన్టిక్, ఏఐటెక్ ఇన్నోవేషన్స్, జెన్లూప్ ఇంటెలిజెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, న్యూరోడిఎక్స్ (ఇంటెల్లిహెల్త్) వంటి కంపెనీలు ఆరోగ్య సంరక్షణ, ఫిన్టెక్, అధునాతన సాంకేతిక పరిష్కారాలు వంటి విభాగాల్లో సర్వీసులు అందించనున్నాయి.ఏఐ పరిశోధన, వాటి మోడళ్ల శిక్షణకు భారతదేశం ఇప్పటికే 38,000 జీపీయూలను ఏర్పాటు చేసింది. 2025 చివరి నాటికి వీటిని 50,000కి పెంచాలని యోచిస్తోంది. ఇండియా ఏఐ మిషన్లో భాగంగా హిందీ, ప్రాంతీయ మాండలికాలు, ఇతర భారతీయ భాషలకు అనుగుణంగా ఎల్ఎల్ఎంలను అభివృద్ధి చేస్తున్నారు. ఈ నమూనాలు వ్యవసాయం, ఆర్థిక, న్యాయ సేవలు, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి కీలక రంగాలలో ఏఐ అప్లికేషన్లకు మద్దతు ఇస్తాయి. క్లిష్టమైన సవాళ్లను పరిష్కరించడం, పాలనా సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఇవి ఉపయోగపడుతాయి. ఈ మిషన్లో భాగంగా దేశవ్యాప్తంగా 500+ ఏఐ డేటా ల్యాబ్లను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇవి ప్రతిభ, మౌలిక సదుపాయాల కోసం ఇంక్యుబేటర్లుగా పనిచేస్తాయి. తరువాతి తరం ఏఐ ఆవిష్కర్తలను తయారు చేస్తాయి.ఇదీ చదవండి: కేంద్ర బ్యాంకులకు బంగారు నిల్వలు ఎందుకు? -
2025 టు 1990
గూగుల్ జెమిని నానో బనాన ట్రెండ్ హవా కొనసాగుతుండగానే మరోవైపు నానో బనాన ఏఐ శారీ ట్రెండ్ మొదలైంది. మహిళా యూజర్లు జెమిని నానో బనాన ఇమేజ్ ఎడిటింగ్ టూల్ను ఉపయోగించి తమ సెల్ఫీలను 90 దశకం డ్రామటిక్ బాలీవుడ్–స్టైల్ ప్రోర్ట్రయిట్స్లోకి మార్చడమే... బనాన శారీ ట్రెండ్.ఏఐ ప్రాంప్ట్లతో అలనాటి అద్భుత చీరలలో మెరిసిపోవడమే బనాన ఏఐ శారీ ట్రెండ్ ప్రత్యేకత.ఈ ట్రెండ్ పుణ్యమా అని 90 దశకంలోని పాపులర్ స్టైల్స్..పోల్కా–డాట్ డిజైన్, బ్లాక్ పార్టీ–వేర్ శారీ, సాఫ్ట్ ఫ్లోరల్ యాక్సెంట్లు మళ్లీ కనువిందు చేస్తున్నాయి.మీరు కూడా ఈ ట్రెండ్లో భాగం కావాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి...∙జెమిని చాట్జీపీటీలో లాగిన్ కావాలి ∙ట్రై ఇమేజ్ ఎడిటింగ్–క్లిక్ చేయాలి. ∙క్లీయర్ సోలో ఫోటోను అప్లోడ్ చేయాలి. ∙బ్లాక్ శారీ, వైట్పోల్కా డాట్....మొదలైన వైరల్ ్రపాంప్ట్స్లో ఒకదాన్ని పేస్ట్ చేయాలి. ∙రెట్రో శారీపోర్ట్రయిట్ క్షణాల్లో కళ్లముందుంటుంది. -
బిగ్ బిలియన్ డేస్ సేల్లో మోటరోలా ఫోన్లపై ఆఫర్లు
ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ మోటరోలా ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 కోసం ప్రీమియం, మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్లపై ‘బిగ్బిలియన్ మోటోరష్’ పేరుతో ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఏఐ-ఆధారిత మోటరోలా ఎడ్జ్ 60 ప్రో, మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ మొదలుకొని మోటో జీ సిరీస్ స్మార్ట్ఫోన్లు, మోటరోలా రేజర్ 60 సిరీస్ వరకు ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది.మోటరోలా ఎడ్జ్ 60 ప్రో 8+ 256జీబీ వేరియంట్ అసలు ధర రూ.29,999 కాగా ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో ఆఫర్ కింద రూ.24,999 లకే సొంతం చేసుకోవచ్చు.మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్ఫోన్ 8+256జీబీ వేరియంట్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో రూ.19,999, 12+256జీబీ రూ.21,999 లకు అందుబాటులో ఉంటుంది.మోటో జీ96 5జీ 8+128జీబీ రూ.14,999లకు, 8+256జీబీ రూ.16,999లకు వస్తుంది.మోటో జీ86 పవర్ స్మార్ట్ ఫోన్ను ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో రూ.15,999లకే సొంతం చేసుకోవచ్చు.మోటరోలా రేజర్ 60 8+256జీబీ వేరియంట్ బిగ్ బిలియన్ డేస్ ధర రూ.39,999. -
టాటా స్టోర్లలో ఐఫోన్ 17 ప్రత్యేక ఆఫర్లు
భారతదేశపు ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైలర్, టాటా గ్రూప్నకు చెందిన క్రోమా ఐఫోన్ 17 మోడళ్లపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. క్రోమా స్టోర్స్, ట్రైబ్ అవుట్లెల్లు, క్రోమా.కామ్(ఆన్లైన్), టాటా న్యూ యాప్లలో ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. లాంచ్ క్యాంపెయిన్ సెప్టెంబర్ 19-27 వరకు సేల్ విండోతో ప్రారంభమవుతుంది. తరువాత అక్టోబర్ 26 వరకు కొన్ని ఎంపిక చేసిన ప్రయోజనాలతో ఆఫర్లు కొనసాగుతాయి.క్రోమా, ట్రైబ్ స్టోర్లలో, అలాగే ఆన్లైన్లో(Croma.com)లో, టాటా న్యూ యాప్లో సెప్టెంబర్ 19-27 వరకు, కస్టమర్లు ఐఫోన్ 17 కొనుగోలుపై రూ.12,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు. టాటా న్యూ హెచ్డీఎఫ్సీ కార్డుతో 10% న్యూకాయిన్లను సంపాదించవచ్చు. నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంటుంది. ఐఫోన్ కేస్లు, చార్జర్లు, ఆడియో గేర్ వంటి యాపిల్ యాక్సెసరీలపై 20 శాతం డిస్కౌంట్ ఉంటుంది. ఇది ప్రత్యేక ఆఫర్ గా, ఈ లాంచ్ సేల్ విండోలో మాత్రమే వర్తిస్తుంది. -
ఒక్కసారే రీఛార్జ్.. ఏడాదంతా ఫ్రీ!: బెస్ట్ యాన్యువల్ ప్లాన్స్ ఇవే..
చాలామంది యూజర్లు మంత్లీ ప్లాన్స్ (28 రోజులు) రీఛార్జ్ చేసుకుంటారు. ఈ ప్యాక్ ధరలు, యాన్యువల్ ప్లాన్తో పోలిస్తే కొంత ఎక్కువగా ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కొంతమంది ఏడాది ప్లాన్స్ రీఛార్జ్ చేసుకుంటున్నారు. ఈ కథనంలో బెస్ట్ యాన్యువల్ రీఛార్జ్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం.ఎయిర్టెల్ఎయిర్టెల్ తన యూజర్ల కోసం రూ.3599, రూ.2249 ప్లాన్స్ అందిస్తోంది. రూ.3599 రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 2 జీబీ డేటా, అపరిమిత కాల్స్ వంటివాటితో పాటు.. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ సబ్స్క్రిప్షన్ వంటివి లభిస్తాయి. కాగా రూ.2249 ప్లాన్ ద్వారా 365 రోజుల అపరిమిత కాలింగ్స్.. 30 జీబీ డేటా మాత్రమే లభిస్తుంది. ఇందులో డైలీ డేటా.. ఇతర సబ్స్క్రిప్షన్ ఉండవు.రిలయన్స్ జియోజియో యూజర్లకు రూ.3599, రూ.999, రూ.234, రూ.895 ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. రూ. 3599 రీఛార్జ్ ప్లాన్ ద్వారా యూజర్లు అపరిమిత కాలింగ్స్ పొందటమే కాకుండా.. రోజుకి 2.5 జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. పైగా జియో టీవీ, హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. రూ.3999 ప్లాన్ ద్వారా అదనంగా జియో ప్యాక్ కోడ్ సబ్స్క్రిప్షన్ పొందవచ్చు. అయితే రూ.1234 ద్వారా రీఛార్జ్ చేసుకుంటే.. 336 రోజుల వ్యాలిడిటీతో రోజుకి 0.5 జీబీ డేటా లభిస్తుంది. జియో ఫోన్ ప్రైమా యూజర్లు 336 రోజుల వాలిడిటీ కోసం రూ.895 రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ప్రతి 28 రోజులకు 2 జీబీ డేటా లభిస్తుంది.వోడాఫోన్ ఐడియావోడాఫోన్ ఐడియా విషయానికి వస్తే.. ఇది తన యూజర్ల కోసం రూ. 3599తో రీఛార్జ్ ప్లాన్ అందిస్తుంది. దీని వ్యాలిడిటీ 365 రోజులు. రోజుకి 2జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత వాయిస్ కాల్స్ పొందవచ్చు. అంతే కాకుండా ఈ ప్యాక్ రీఛార్జ్ చేసుకుంటే.. రాత్రి 12 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఫ్రీ డేటా పొందవచ్చు. రూ.3799తో రీఛార్జ్ చేస్తే.. అదనంగా ఆమెర్జన్ ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. రోజుకి 1.5 జీబీ చాలనుకుంటే.. రూ.3499తో రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. డైలీ డేటా వద్దనుకుంటే.. రూ.1999తో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇందులో ప్యాక్ మొత్తానికి 24 జీబీ డేటా లభిస్తుంది.ఇదీ చదవండి: ఈ20 ఫ్యూయెల్ ఎఫెక్ట్.. ఫెరారీ స్టార్ట్ అవ్వడం లేదట!!బీఎస్ఎన్ఎల్బీఎస్ఎన్ఎల్ విషయానికి.. రూ.2399, రూ.1999, రూ. 1515 అనే ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. రూ.2399 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 600 రోజులు అపరిమిత కాల్స్, రోజుకి 2 జీబీ డేటా వంటివి లభిస్తాయి. రూ.1999 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 365 రోజులు 600 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ లభిస్తాయి. అయితే రూ.1515 ప్లాన్ ద్వారా 365 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత కాల్స్, రోజుకి 2 జీబీ డేటా లభిస్తుంది. -
ఈవీ స్కూటర్లో మొదటిసారి స్మార్ట్ వాచ్ ఇంటిగ్రేషన్
టీవీఎస్ తన వినియోగదారులకు కనెక్టివిటీ సర్వీసులు అందించేందుకు నాయిస్ కంపెనీతో జతకట్టినట్లు తెలిపింది. ఈ భాగస్వామ్యంతో భారతదేశపు మొట్టమొదటి ఈవీ-స్మార్ట్ వాచ్ ఇంటిగ్రేషన్ను ఐక్యూబ్ మోడల్లో లాంచ్ చేసినట్లు పేర్కొంది. ఈ స్మార్ట్ వాచ్ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్లోని కొన్ని అంశాలను లైవ్టైమ్లో ట్రాక్ చేయవచ్చని తెలిపింది.బ్యాటరీ స్టేటస్, దాని రేంజ్ను మానిటర్ చేయవచ్చు.టైర్ ప్రజర్ మానిటరింగ్వాహన భద్రతా హెచ్చరికలురైడ్ గణాంకాలను తెలుసుకోవచ్చు.ఈ ఫీచర్లను ప్రామాణిక కనెక్టివిటీ ఫంక్షన్లతోపాటు విలీనం చేసినట్లు కంపెనీ పేర్కొంది. ‘కొత్త టీవీఎస్ ఐక్యూబ్ను స్మార్ట్ వాచ్తో అనుసంధానించడం ద్వారా వినియోగదారులకు సురక్షితమైన, మరింత సహజమైన ప్రయాణాలు సాగించేందుకు వీలుంటుంది’ అని టీవీఎస్ మోటార్ కంపెనీలో హెడ్ కమ్యూటర్ & ఈవీ బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, హెడ్ కార్పొరేట్ బ్రాండ్ అండ్ మీడియా అనిరుద్ధ హల్దార్ అన్నారు.ఇదీ చదవండి: మరో నాలుగు రోజులు ఇంతే.. -
అంతర్జాతీయంగా ఏఐ నైతిక ప్రమాణాలపై కసరత్తు
రోజువారీ జీవనంలో కృత్రిమ మేథ (ఏఐ) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో దాన్ని నైతికంగా ఉపయోగించడానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలను రూపొందించడంపై కసరత్తు జరుగుతోందని వినియోగదారుల వ్యవహారాల విభాగం కార్యదర్శి నిధి ఖరే తెలిపారు. ఆయా కమిటీల్లో భారతీయ నిపుణులు కూడా ఉన్నారని వివరించారు. గ్లోబల్ ప్రమాణాలు ఖరారైన తర్వాత భారత్ సహా ప్రపంచ దేశాలు వాటిని అమలు చేస్తాయని పీహెచ్డీసీసీఐ సదస్సులో చెప్పారు. ఇప్పటికే 39 ఉండగా, మరో 45 గ్లోబల్ ఏఐ ప్రమాణాలను రూపొందించే ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. ఏఐ టెక్నాలజీకి రెండు పార్శ్వాలు ఉన్నాయని చెప్పారు. రిటైల్, ఈ–కామర్స్ రంగాల్లో మోసాలను అరికట్టేందుకు ఇది ఉపయోగపడనుండగా, అదే సమయంలో అనైతికంగా ఉపయోగిస్తే ప్రమాదకరంగా పరిణమించే అవకాశాలూ ఉన్నాయని నిధి చెప్పారు. ‘ప్రస్తుతం ప్రపంచంలో ఏఐ పెద్ద సవాలుగా మారింది. దీనితో ఎంతగా దుష్ప్రచారం జరుగుతోందో మనం చూస్తున్నాం. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. మోసాల నుంచి వినియోగదారులను కాపాడేందుకు ప్రభుత్వాలు తప్పనిసరిగా చట్టాలు చేసే పరిస్థితి ఏర్పడుతోంది. అలాగని ఏఐ వల్ల ప్రయోజనాలు లేవని చెప్పడానికి లేదు. సోషల్ మీడియా, ప్లాట్ఫాంలు, నవకల్పనలకు సంబంధించి ఇదొక సానుకూల, సృజనాత్మక ఆవిష్కరణ’ అని తెలిపారు.ఇదీ చదవండి: పండుగ సీజన్పై ‘సోనీ’ ఆశలు..! -
ఇది ఓ కార్పొరేట్ ఉద్యోగి క(ఖ)ర్మ!
కార్పొరేట్ ప్రపంచం చాలా చిత్రమైంది. ఒక పైసా ఖర్చు మిగిల్చేందుకు వంద రూపాయలు తగలేసేందుకూ సిద్ధం. ఇది కూడా అట్లాంటి వ్యవహారమే. కంపెనీ ఊరూ, పేరు తెలియదు కానీ.. సామాజిక మాధ్యమం రెడిట్లో ప్రచురితమైన వివరాల ప్రకారం...అతడో సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఏళ్లుగా అదే కంపెనీలో పనిచేస్తున్నాడు. గాడిద చాకిరీ చేస్తున్నానని తనే చెప్పుకున్నాడు కూడా. ఈమధ్యే వార్షిక ఇంక్రిమెంట్ల ప్రహసనం ముగిసింది. ఊహించినట్టుగానే జీతం జానెడే పెరిగింది. ‘‘జీతం కనీసం పది శాతమైనా పెంచండి సారూ’’ అంటూ పైవాళ్లకు మెయిల్ పెట్టాడు. పైనున్న మేనేజర్.. ఆ పైనున్న హెచ్ఆర్ వాళ్లు ఏమనుకున్నారో.. ఎలా ఆలోచించారో తెలియదు కానీ.. ‘‘ఠాట్.. పది శాతం పెంచమంటావా’’ అంటూ హూంకరించారు.‘‘నిన్ను ఉద్యోగం లోంచి పీకేశాం. ఫో’’ అనేశారు. కంపెనీ కదా.. ఆమాత్రం పైచేయి చూపడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఆఫ్ట్రాల్ ఒక ఉద్యోగి విజ్ఞప్తిని మన్నిస్తే.. అందరూ మీదపడిపోతారు అనుకుని ఉంటుంది. తొలగించనైతే తొలగించారు కానీ.. అప్పటివరకూ ఆ ఇంజినీర్ చేసే పని? అర్జెంటుగా ‘‘సిబ్బంది కావలెను’’ అన్న సందేశం వెళ్లిపోయింది. హడావుడిగా మెయిళ్లు అటు ఇటూ కదిలాయి. బోలెడంత మందిని ఇంటర్వ్యూలకు పిలిచారు. చివరకు ఆరు మందిని సెలెక్ట్ చేశారు. మంచి ప్యాకేజీలతో వారి జీతాలూ ఫిక్స్ చేసేశారు. ఆ ఒక్కడు చేసే పనిని వీరందరూ కలసికట్టుగా చేయడం మొదలుపెట్టారు కొనసాగిస్తున్నారు. కార్పొరేట్ కంపెనీల వ్యవహారం ఇలా ఉంటుందన్నమాట.పది శాతం పెంపును నిరాకరించి ఉద్యోగంలోంచి తొలగించిన ఆ ఉద్యోగి ఆరేళ్లపాటు కంపెనీకి సంబంధించిన కీలకమైన బ్యాకెండ్ వ్యవస్థను ఒంటిచేత్తో నడిపిస్తున్నాడట. ముందుగా చెప్పినట్లు గాడిద మాదిరిగా ఆ బాధ్యతంతా తలపై మోసుకుని కష్టపడినా.. సహోద్యోగుల కంటే తక్కువ జీతం వస్తూండటంతో ఉండబట్టలేక జీతం పది శాతం పెంచమని అడిగాడట. ఇక లాభం లేదనుకుని కంపెనీ పనులపై శ్రద్ధ తగ్గించేశాడు. ఇతగాడి ఖర్మానికో, పుణ్యానికో అప్పుడే కంపెనీలో ఒక కొత్త డైరెక్టర్ వచ్చి చేరాడు. ఆఫీసుకు సక్రమంగా రావడం లేదన్న మిషతో ఉద్యోగంలోంచి తీసేశాడు. ఫలితం.. ఒకరి స్థానంలో ఆరుగురికి జీతాలు సమర్పించుకోవాల్సి రావడం. ‘‘పదిశాతం పెంచేసి ఉంటే గొడవే ఉండకపోవను. అయితే ఒక్కటి. ప్రపంచంలో న్యాయం అనేది ఇంకా ఉంది అనేందుకు ఇదో నిదర్శనం’’ అని ఆ ఉద్యోగి తన రెడిట్ పోస్టులో రాసుకోవడం అక్షర సత్యం అనిపిస్తుంది! ఏమంటారు? -
డిస్కార్డ్ వంటి మరెన్నో యాప్స్..
నేపాల్లో ఇటీవల సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో జెన్జీ యువతకు కమ్యునికేషన్ సాధనంగా ‘డిస్కార్డ్’ యాప్ ఎంతో తోడ్పడినట్లు తెలుస్తుంది. యువతను కట్టడి చేసేందుకు, అల్లర్లను అదుపు చేసేందుకు నేపాల్ గత ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధించడంతో గేమింగ్ యాప్లో ఇంటర్నల్ కమ్యునికేషన్ టూల్గా వాడే డిస్కార్డ్ ఎంతో ఉపయోగపడినట్లు కొందరు చెబుతున్నారు.శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన వ్యవస్థాపకులు జాసన్ సిట్రాన్, స్టాన్ విస్నేవిస్క్ 2015లో డిస్కార్డ్ను ఆవిష్కరించారు. ఇది వాయిస్, వీడియో, చాట్ ప్లాట్ఫామ్. గేమింగ్ సాధనాల్లో గేమర్లు ఇంటర్నల్ కమ్యునికేషన్ కోసం దీన్ని ఉపయోగిస్తారు. ఇటీవల నేపాల్ జెన్జీ యువత రాజకీయ మార్పును డిమాండ్ చేస్తూ వీధుల్లోకి పెద్దమొత్తంగా ర్యాలీకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే సామాజిక మాధ్యమాలపై ఆంక్షలున్న సమయంలో ఇంతలా యువత ఒకేసారి అసంతృప్తితో కూడబలుక్కొని వీధుల్లోకి రావడం ఎలా సాధ్యమైందనే దానిపై చర్చ సాగింది. అందుకు గేమింగ్ టూల్స్లో ఉన్న డిస్కార్డ్ యాప్ ద్వారా యువత పరస్పరం కమ్యునికేట్ అయి ఇలా మూకుమ్మడిగా దాడికి దిగినట్లు తెలుస్తుంది.ఇదిలాఉండగా, భారతదేశంలో 2025లో డౌన్లోడ్ల పరంగా డిస్కార్డ్ నాలుగో అతిపెద్ద మార్కెట్గా ఉంది. ఇది మొత్తం ఇన్స్టాల్స్లో 6 శాతం వాటాను కలిగి ఉంది. ఇండియాలో ఈ ఒక్క ఏడాదే 5 మిలియన్ల డౌన్లోడ్లు నమోదు అయ్యాయి. 2024 కంటే 2 శాతం పెరిగింది. ఇలాంటి మరిన్ని యాప్స్ గురించి యువత సెర్చ్ చేస్తోంది. వాటిలో కొన్నింటి వివరాలు కింద చూద్దాం.యాప్ముఖ్య లక్షణాలుఎవరి కోసం అంటే..గిల్డెడ్వాయిస్, వీడియో, బాట్గేమింగ్ కమ్యూనిటీలుటీమ్ స్పీక్అల్ట్రా-లో లేటెన్సీ వాయిస్, మిలిటరీ-గ్రేడ్ ఎన్ క్రిప్షన్ఈస్పోర్ట్స్, ఎఫ్పీఎస్ పోటీ దారులకు..మంబుల్ఓపెన్ సోర్స్, ఎన్ క్రిప్టెడ్ వాయిస్ చాట్గోప్యంగా ఉండాలనుకునే గేమర్లుటాక్స్పీర్-టు-పీర్ మెసేజింగ్గేమింగ్ సమూహాలు ఇదీ చదవండి: బిగ్ రిలీఫ్! తగ్గిన బంగారు ధర.. తులం ఎంతంటే -
‘రాత్రిళ్లు పనిచేసి రూ.1 కోటి సంపాదించాను’
జీవితంలో ఎదగాలనే తపన, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని కొందరు నిరూపిస్తున్నారు. టెక్నాలజీ పెరుగుతున్న ఈ కాలంలో కాలేజీ రోజుల్లో నుంచే కోడింగ్పై ఆసక్తి పెంచుకొని, ఓవైపు పగటిపూట ఉద్యోగం చేస్తూనే మరోవైపు రాత్రిళ్లు డిజిటల్ యాప్స్ తయారు చేశాడు ఓ యువకుడు. ఆ యాప్స్కు నెటిజన్లు నుంచి ఆదరణ లభించడంతో రెండేళ్లలోనే ఏకంగా రూ.1 కోటి సంపాదించాడు. ఈమేరకు ఆ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్ట్ వైరల్గా మారింది.రెడ్డిట్లో ఇండియన్ ఫ్లెక్స్ హ్యాండిల్లో చేసిన పోస్ట్లోని వివరాల ప్రకారం..‘నేను 2015లో కాలేజీలో చేరాను. మొదటి నుంచే నాకు కోడింగ్పై ఆసక్తి పెరిగింది. అందులోని మెలకువలు నేర్చుకున్నాను. కాలేజీ చదువు పూర్తయ్యాక ఓ రిటైల్ కంపెనీలో పగలు ఉద్యోగం చేసేవాడిని. కోడింగ్ నైపుణ్యాలతో రాత్రిళ్లు పనిచేస్తూ కొన్ని యాప్స్ డెవలప్ చేశాను. మొత్తంగా 5 డిజిటల్స్ యాప్స్ ఆవిష్కరించాను. వీటి అభివృద్ధికి ఎవరి సాయం తీసుకోలేదు. నేనే కోడింగ్, డిజైనింగ్, మార్కెటింగ్, కస్టమర్ సపోర్ట్.. వంటివి చేసుకున్నాను. దాంతో రెండేళ్లలో రూ.1 కోటి సంపాదించాను’ అని రాసుకొచ్చారు.మనం చేసే పనిలో ఆసక్తి, పట్టుదల, నైపుణ్యాలు పెంచుకుంటే ఏదైనా సాధించవచ్చు. దాంతో క్రమంగా ఆర్థిక భరోసా ఏర్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: ఎలక్ట్రానిక్ పాస్పోర్ట్ చిప్లపై పరిశోధన -
జర్మనీని వెనక్కి నెట్టిన చైనా: మొదటిసారి టాప్ 10లోకి..
చైనాలోని పలు కంపెనీలు.. రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. దీంతో ఈ దేశం మొదటిసారి ఐక్యరాజ్యసమితి మోస్ట్ ఇన్నోవేటివ్ కంట్రీస్ యాన్యువల్ ర్యాంకింగ్లో టాప్ 10లోకి ప్రవేశించింది. యూరప్లోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీని అధిగమించి ఈ రికార్డ్ కైవసం చేసుకుంది.2011 నుంచి స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో కొనసాగుతోంది, స్వీడన్, యునైటెడ్ స్టేట్స్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. 78 సూచికల ఆధారంగా 139 ఆర్థిక వ్యవస్థలపై నిర్వహించిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (GII) సర్వేలో చైనా 10వ స్థానంలో నిలిచింది.జాబితాలోని టాప్ 10 దేశాలలో.. వరుసగా స్విట్జర్లాండ్, స్వీడన్, యునైటెడ్ స్టేట్స్, కొరియా, సింగపూర్, యునైటెడ్ కింగ్డమ్, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, డెన్మార్క్, చైనా ఉన్నాయి.ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరికజర్మనీ ప్రస్తుతం 11వ స్థానానికి పడిపోవడం పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని GII కో ఎడిటర్ 'సచా వున్ష్-విన్సెంట్ (Sacha Wunsch-Vincent) అన్నారు. కొత్త ర్యాంకింగ్.. అమెరికాలో ట్రంప్ పరిపాలన విధించిన సుంకాల ప్రభావాన్ని ప్రతిబింబించలేదని అన్నారు. -
‘ఒక్క క్లిక్తో బ్యాంకు ఖాతాలోని డబ్బు మాయం’
సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్న టెక్నాలజీలను ఆసరాగా తీసుకుని సైబర్ నేరస్థులు సామాన్య ప్రజలను టార్గెట్ చేసే వీలుందని ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ తన ఎక్స్ ఖాతా వేదికగా హెచ్చరించారు. ఇటీవల జెమిని నానో బనానా మోడల్ వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆయన ఈమేరకు హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.నానో బనానాగూగుల్ గత నెలలో జెమిని యాప్కు ‘నానో బనానా’ సంబంధించిన ఏఐ ఇమేజ్ ఎడిటింగ్ టూల్ను విడుదల చేసింది. నానో బనానా లాంచ్ అయిన కొన్ని రోజుల్లోనే జెమిని యాప్ 10 మిలియన్ డౌన్లోడ్లను దాటింది. 3D బొమ్మలను సృష్టించడానికి ఇది చాలా ఉపయోగకరంగా మారింది. ఇప్పటి వరకు ఈ టూల్ 200 మిలియన్ల కంటే ఎక్కువ ఫొటోలను సృష్టించింది. వేగం, కచ్చితత్వంలో ఇది చాట్జీపీటీ, మిడ్జర్నీ వంటి ప్రత్యర్థులకంటే ముందు ఉంది. దీంతో ఇది ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.సారీ ట్రెండ్..సినీతారలు, రాజకీయ నాయకులు, పెంపుడు జంతువులను సైతం ఈ ట్రెండింగ్ ఏఐను ఉపయోగించి అద్భుతంగా రూపొందించుకుంటున్నారు. ప్రస్తుతం నానో బనానా 5 ప్రాంప్ట్లలో అందుబాటులో ఉంది. తాజాగా బనానా మోడల్ తరహాలోనే ‘సారీ ట్రెండ్’ కూడా వైరల్గా మారుతోంది. ఈ నేపథ్యంలో వైరల్ అవుతున్న ట్రెండింగ్ టెక్నాలజీలను ఉపయోగించుకుని సామాన్య ప్రజలపై మోసాలకు ఒడిగట్టే అవకాశం ఉంటుందని, వెబ్సైట్ల్లో ఫొటోలు అప్లోడ్ చేసేముందు జాగ్రత్త వహించాలని సజ్జనార్ చెప్పారు.నకిలీ వెబ్సైట్లు.. అనధికార యాప్లు..‘ఇంటర్నెట్లో ట్రెండింగ్ టాపిక్లతో జాగ్రత్తగా ఉండండి! నానో బనానా ట్రెండింగ్ క్రేజ్ ఉచ్చులోపడి వ్యక్తిగత సమాచారాన్ని ఆన్లైన్లో పంచుకుంటే, సైబర్ మోసాలు జరగడం ఖాయం. కేవలం ఒక్క క్లిక్తో మీ బ్యాంకు ఖాతాల్లోని డబ్బు నేరస్థుల చేతుల్లోకి చేరుతుంది. ఫొటోలు లేదా వ్యక్తిగత వివరాలను నకిలీ వెబ్సైట్లు లేదా అనధికార యాప్ల్లో ఎప్పుడూ పంచుకోవద్దు. మీ ఫొటోలు లేదా వ్యక్తిగత సమాచారాన్ని అప్లోడ్ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి’ అని సజ్జనార్ ఎక్స్తో చెప్పారు.ఇదీ చదవండి: ఇప్పుడంతా ఇదే ట్రెండ్!.. అద్భుతాలు చేస్తున్న బనానా ఏఐ -
కీ చెయిన్ కెమెరా.. ధర ఎంతంటే..
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వస్తువుల పరిమాణంలో, అందుకు ఉపయోగించే పరికరాల్లో మార్పులొస్తున్నాయి. గతంలో పెద్ద రూమ్ సైజ్లో ఉండే కంప్యూటర్ ఇప్పుడు మడిచి జేబులో పెట్టుకునేంత సైజ్లోకి మారిపోయింది. సాంకేతిక విభిన్న విభాగాల్లో భారీ మార్పులు తీసుకొస్తోంది. ఇది కెమెరా తయారీ పరిశ్రమలోనూ విశేష మార్పులకు నాంది పలికింది. గతంలో సూట్కేస్ సైజ్లో ఉండే కెమెరాలు టెక్నాలజీ సాయంతో ప్రస్తుతం ‘కీ చెయిన్’ సైజ్లోకి వచ్చేశాయి. అవును.. కేవలం 30 గ్రాముల బరువుండే కెమెరాను కొడాక్ కంపెనీ ‘చార్మెరా’ పేరుతో ఇటీవల ఆవిష్కరించింది.కొడాక్ చార్మెరా ఫీచర్లు..ఇది ఒక మినీ కెమెరా.దీని ధర కేవలం 30 డాలర్లు(సుమారు రూ.2,500). రిటైలర్ను అనుసరించి ధరలో మార్పులుంటాయని గమనించాలి.దీన్ని ‘బ్లైండ్ బాక్స్’ల్లో విక్రయిస్తున్నారు. (ఇది డిలివరీ అయ్యే వరకు రంగు / డిజైన్ తెలియదు).ఇది 30 గ్రాముల బరువు ఉంటుంది.1.6 మెగా పిక్సెల్ కెమెరా సామర్థ్యం ఉండి, జేపీఈజీ ఫార్మాట్లో ఫొటోలు (1440×1440) సేవ్ చేస్తుంది.30fps ఈవీఐ వీడియోఎస్సీడీ స్క్రీన్ + వ్యూఫైండర్యూఎస్బీ టైప్-C ఛార్జింగ్.మైక్రో ఎస్డీ స్లాట్ (128GB వరకు)ఇదీ చదవండి: ముడి చమురు స్టోరేజ్ కోసం రూ.5,700 కోట్లతో ప్రాజెక్ట్ -
ఒప్పో కొత్త సిరీస్ స్మార్ట్ఫోన్లు విడుదల
చైనా స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఒప్పో ఎఫ్ 31 సిరీస్ను భారత్లో లాంచ్ చేసింది. ఎఫ్ 31, ఎఫ్ 31 ప్రో, ఎఫ్ 31 ప్రో ప్లస్ అనే మూడు మోడళ్ల స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్లన్నీ 7,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తాయి. అన్నింటిలోనూ ఏఐ ఆధారిత ఫీచర్లు చాలానే ఇచ్చారు. వాటి స్పెసిఫికేషన్లు ఏంటి.. ధరలు ఎంత.. ఎక్కడ కొనుక్కోవాలి.. తదితర వివరాలను ఈ కథనంలో పూర్తిగా తెలుసుకుందాం.ఒప్పో ఎఫ్31 5జీ సిరీస్ ధరలు, లభ్యతఒప్పో ఎఫ్31 ప్రో ప్లస్ 5జీ8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.32,999. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర రూ.34,999. హిమాలయన్ వైట్, జెమ్స్టోన్ బ్లూ, ఫెస్టివల్ పింక్ రంగుల్లో లభ్యమవుతుంది.ఒప్పో ఎఫ్31 ప్రో 5జీ8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.26,999. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర రూ.28,999. అదే 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.30,999. డెసెర్ట్ గోల్డ్, స్పేస్ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంది.ఒప్పో ఎఫ్31 5జీ8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.22,999. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర రూ.24,999. క్లౌడ్ గ్రీన్, మిడ్నైట్ బ్లూ, బ్లూమ్ రెడ్ రంగుల్లో లభ్యమవుతుంది.ఒప్పో ఎఫ్31 ప్రో, ఎఫ్31 ప్రో ప్లస్ స్టార్ట్ఫోన్లు సెప్టెంబర్ 19 నుంచి ఒప్పో ఈ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈకామర్స్ ప్లాట్ఫామ్లు, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయి. మరోవైపు ఒప్పో ఎఫ్ 31 5జీ మాత్రం సెప్టెంబర్ 27 నుంచి అందుబాటులోకి రానుంది.ఆఫర్లుఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, కొటక్ మహీంద్రా బ్యాంకుల ఎంపిక చేసిన కార్డులను ఉపయోగించుకుంటే 10 శాతం వరకు క్యాష్బ్యాక్ లభిస్తుంది. 10 శాతం వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ వినియోగించుకోవచ్చు. ప్రమాదవశాత్తు డ్యామేజీ అయితే 180 రోజుల ఉచిత కేర్ ఉంటుంది. ఇవి కాక ఆరు నెలల వరకు వడ్డీ లేని ఈఎంఐ ప్లాన్ లు, మొదటి రోజు ప్రీ-బుక్ లేదా కొనుగోలు చేసే కస్టమర్లు ఎంపిక చేసిన కార్డులు లేదా ఎక్స్ఛేంజ్ బోనస్ లపై బ్యాంక్ డిస్కౌంట్ వంటివి ఉంటాయి.స్పెసిఫికేషన్లుమూడు మోడళలోనూ కొన్ని ఒకే రకమైన స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ప్రో ప్లస్ 6.8-అంగుళాల డిస్ప్లే, మిగిలిన రెండు 6.5-అంగుళాల స్క్రీన్లను కలిగి ఉన్నాయి. అన్నింటికీ 120 హెడ్జ్ రీఫ్రెష్ రేటు ఉంటుంది. ప్రతి ఫోన్లోనూ 80వాట్ల సూపర్వోక్ ఫాస్ట్ ఛార్జింగ్ తో 7,000ఎంఏహెచ్ బ్యాటరీ, రివర్స్ అండ్ బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అన్ని ఫోన్లూ క్వాల్కామ్ స్నాప్గ్రాడన్ 7 జెన్ 3 చిప్సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్ ఓఎస్ 15పై పనిచేస్తాయి. ఇక కీలకమైన కెమెరా విషయానికి వస్తే ఒప్పో ఎఫ్31 ప్రో ప్లస్ 5జీ, ఒప్పో ఎఫ్31 ప్రో 5జీ ఫోన్లకు ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఇవ్వగా ఒప్పో ఎఫ్31 5జీ ఫోన్లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. రియర్ కెమెరా మాత్రం అన్ని ఫోన్లకూ ఒకేలా 50ఎంపీ + 2ఎంపీ ఇచ్చారు.ఇదీ చదవండి: ఒప్పో కొత్త సిరీస్ స్మార్ట్ఫోన్లు విడుదల.. భారీ బ్యాటరీతో ప్రత్యేక ఫీచర్లు -
‘టీసీఎస్లో బలవంతంగా రాజీనామా చేయమన్నారు’
దేశీయ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ చుట్టూ రోజుకో వివాదం రేగుతోంది. భారీగా లేఆఫ్ల ప్రకటనతోపాటు ఆ సంస్థలో బలవంతంగా రాజీనామాలు, ఉద్యోగ విరమణలు చేయిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా మరో ఉద్యోగి తనను రాజీనామా చేయాలని బలవంతం చేశారని ఆరోపిస్తున్నారు.ఈ మేరకు ప్రొఫెషనల్ సామాజిక ప్లాట్ఫామ్ రెడిట్లో షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్గా మారింది. 3,000 కు పైగా అప్ ఓట్లు, వందలాది కామెంట్లు వచ్చాయి. ఇది దేశంలోని అతిపెద్ద ఐటీ సంస్థలలో ఒకటైన టీసీఎస్లో విషపూరిత పద్ధతులపై విస్తృత ఆగ్రహాన్ని రేకెత్తించింది.తనను టీసీఎస్లో జూనియర్ టెక్ ఉద్యోగిగా చెప్పుకొన్న రెడిటర్ అదే తన మొదటి ఉద్యోగంగా పేర్కొన్నారు. మూడు రోజుల ముందు మీటింగ్ హాల్కు పిలిచి అక్కడ తనను స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని హెచ్ఆర్ ఒత్తిడి చేసినట్లు ఆరోపించారు. అయితే తాను రాజీనామా చేయడానికి నిరాకరించానని, అందుకు తనను టర్మినేట్ చేసి వ్యతిరేక రివ్వూలు ఇస్తానని బెదిరించారని, అయినప్పటికీ తాను రాజీనామా చేయను.. మీకు నచ్చినట్లు చేసుకోండని చెప్పానని రాసుకొచ్చారు.అంతేకాక సంస్థలో పని వాతావరణం గురించి కూడా పలు ఆరోపణలు చేశారు. జీతం చాలా తక్కువే అయినా దాని వర్క్ కల్చర్, ఉద్యోగ భద్రత కారణంగా తాను టీసీఎస్ లో చేరానని, కానీ దానికి ఇప్పుడు చింతిస్తున్నానని వాపోయారు. ‘రతన్ టాటా తరువాత, ఈ కంపెనీ గందరగోళానికి గురైంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: ట్రైనింగ్ ఇచ్చినోళ్లనే తీసేశారు.. 500 మంది తొలగింపు! -
కళ్లజోడుకు గుడ్బై?: సర్జరీ లేకుండా.. రెండేళ్లు!
వయసు పెరిగే కొద్దీ.. దాదాపు అందరికీ ప్రెస్బయోపియా (కంటిచూపు లోపం) వస్తుంది. అప్పుడు చదవడం లేదా ఫోన్ను ఉపయోగించడం వంటి క్లోజప్ విషయాలపై దృష్టి పెట్టడం కొంత కష్టతరమవుతుంది. దీనికోసం రీడింగ్ గ్లాసెస్పై ఆధారపడతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పరిశోధకులు ప్రత్యేక కంటి చుక్కలను తయారు చేశారు. ఇది కొంతకాలం పాటు గ్లాసెస్ను వదిలించుకోవడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.రెండేళ్ల పాటు మెరుగైన దృష్టిరెండు సంవత్సరాల పాటు జరిగిన ఒక అధ్యయనంలో.. కంటి చుక్కలను తయారు చేశారు. వీటిని రోజుకు రెండు లేదా మూడు సార్లు ఉపయోగించడం వల్ల, కళ్లజోడుతో పనిలేకుండానే చిన్న అక్షరాలను చదివే సామర్థ్యం మెరుగుపడిందని తేలింది. అధ్యయనంలో.. చాలా మంది వ్యక్తులు చుక్కలను ఉపయోగించిన తర్వాత ప్రామాణిక కంటి చార్టులో (జేగర్ చార్ట్) రెండు లేదా అంతకంటే ఎక్కువ అదనపు పంక్తులను చదవగలిగారు. ఈ చుక్కలను ఉపయోగించడం వల్ల.. రెండేళ్ల పాటు మెరుగైన దృష్టిని పొందవచ్చని చెబుతున్నారు.ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలు యూరోపియన్ సొసైటీ ఆఫ్ క్యాటరాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్స్ (ESCRS)లో ప్రచురించారు. కంటి చూపు పెరగడానికి ఉపయోగించే.. చుక్కల మందులో పైలోకార్పైన్ (కన్ను దగ్గరగా ఉన్న వస్తువులపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది), డైక్లోఫెనాక్ (కొంతమందికి కలిగే చికాకును నివారించడంలో సహాయపడుతుంది) ఉపయోగించినట్లు వెల్లడించారు.రోజుకు రెండుసార్లుసాధారణంగా ప్రజలు.. రోజుకు రెండుసార్లు చుక్కలను ఉపయోగిస్తారు. అవసరమైతే మూడవ మోతాదును కూడా ఉపయోగించుకోవచ్చు. ప్రెస్బయోపియా (Presbyopia) ప్రభావాన్ని బట్టి.. రోజుకు ఎన్నిసార్లు ఉపయోగించాలనేది నిర్దారించడం జరుగుతుంది. ప్రెస్బయోపియా తీవ్రత తక్కువగా ఉంటే తక్కువసార్లు, ఎక్కువగా ఉన్నప్పుడు మంచి రిజల్ట్స్ కోసం ఎక్కువసార్లు ఉపయోగించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరికకంటి చూపు మందగించడం వల్ల.. కొంతమంది ఆపరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆపరేషన్ వద్దనుకుని, సరళమైన పద్దతిలో సమస్య పరిష్కరించుకోవడానికి ఈ చుక్కల మందు ఉపయోగపడుతుంది. అయితే ప్రెస్బయోపియా ప్రభావం తగ్గించడానికి ఉపయోగించే చుక్కల మందు వల్ల.. స్వల్ప చికాకు లేదా తేలికపాటి తలనొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమస్యలను నిర్మూలించడానికి మరింత అధ్యయనం అవసరమని నిపుణులు చెబుతున్నారు. -
జియో చౌక ప్లాన్.. ఎక్కువ వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాలింగ్
కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలతో చౌకైన రీఛార్జ్ ప్లాన్లను అందించాలని కొన్ని రోజుల క్రితం ట్రాయ్ అన్ని టెలికాం కంపెనీలను ఆదేశించింది. దీని తర్వాత జియో కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్ తో రెండు చౌకైన రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. జియో తన వెబ్సైట్లో రెండు కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్లను జాబితా చేసింది.ఇందులో వినియోగదారులు 365 రోజుల వరకు సుదీర్ఘ వ్యాలిడిటీని పొందుతారు. డేటాను ఉపయోగించని యూజర్లకు ఈ ప్లాన్ ప్రయోజనం చేకూరుస్తుంది. మరొకటి 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్. ఈ ప్లాన్లు రెండూ ముఖ్యంగా కాలింగ్, ఎస్ఎంఎస్ మాత్రమే ఉపయోగించే, డేటా అవసరం లేని వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటాయి.84 రోజుల ప్లాన్జియో కొత్త రూ.448 ప్లాన్ 84 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ లో యూజర్లకు అపరిమిత కాలింగ్, 1000 ఉచిత ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. ఇది కాకుండా, వినియోగదారులకు జియో సినిమా, జియో టీవీ వంటి యాప్స్ కు కూడా ఉచిత యాక్సెస్ లభిస్తుంది.365 రోజుల ప్లాన్జియో కొత్త రూ.1958 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ లో, వినియోగదారులు భారతదేశం అంతటా ఏ నెట్ వర్క్ లోనైనా అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. దీనితో పాటు 3600 ఉచిత ఎస్ఎంఎస్లు, ఉచిత నేషనల్ రోమింగ్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ ప్లాన్ జియో సినిమా, జియో టీవీ వంటి యాప్లకు ఉచిత యాక్సెస్ను అందిస్తుంది. -
ట్రైనింగ్ ఇచ్చినోళ్లనే తీసేశారు.. 500 మంది తొలగింపు!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఎప్పుడు ఎవరి ఉద్యోగాలు ఊడిపోతాయో చెప్పలేం. అయితే ఆ ఏఐ సాధనానికి శిక్షణ ఇచ్చేవాళ్ల ఉద్యోగాలే పోవడం బాధాకరం. బిజినెస్ ఇన్ సైడర్ నివేదిక ప్రకారం.. ఎలాన్ మస్క్కు చెందిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఎక్స్ఏఐ (xAI).. తన డేటా అనోటేషన్ బృందం నుండి సుమారు 500 మంది ఉద్యోగులను తొలగించింది. వీరంతా సంస్థ జనరేటివ్ ఏఐ చాట్ బాట్ ‘గ్రోక్’కు శిక్షణ ఇచ్చే సిబ్బంది కావడం గమనార్హం.ఇదీ కారణం నివేదిక ప్రకారం.. ఉద్యోగుల తొలగింపులకు కారణం సంస్థ దృష్టి మారడం. ఎక్స్ఏఐ సాధారణ ఏఐ ట్యూటర్లను అభివృద్ధి చేయడంపై దృష్టిని తగ్గించి స్పెషలిస్ట్ ఏఐ ట్యూటర్లపై వనరులను కేంద్రీకరిస్తుందంటూ సిబ్బందికి పంపిన ఈమెయిల్ లో కంపెనీ తెలిపింది. "మా హ్యూమన్ డేటా ప్రయత్నాలను క్షుణ్ణంగా సమీక్షించిన తరువాత, మా స్పెషలిస్ట్ ఏఐ ట్యూటర్ల విస్తరణ, ప్రాధాన్యతను వేగవంతం చేయాలని నిర్ణయించుకున్నాం. అదే సమయంలో సాధారణ ఏఐ ట్యూటర్ ఉద్యోలపై మా దృష్టిని తగ్గించాం. "ఫోకస్ లో ఈ మార్పులో భాగంగా, మాకు ఇకపై చాలా సాధారణ ఏఐ ట్యూటర్ ఉద్యోగులు అవసరం లేదు.. ఎక్స్ఏఐతో మీ ఉద్యోగం ముగుస్తుంది" అని పేర్కొంది.ఉద్యోగులకు సిస్టమ్ యాక్సెస్ రద్దు చేస్తామని చెప్పిన కంపెనీ వారి ఒప్పందాలు ముగిసే వరకు లేదా నవంబర్ 30 వరకు జీతాలు చెల్లింపు కొనసాగుతుందని వివరించింది. వీడియో గేమ్స్, వెబ్ డిజైన్, డేటా సైన్స్, మెడిసిన్, స్టెమ్ వంటి రంగాలలో స్పెషలిస్ట్ ఏఐ ట్యూటర్లపై పెట్టుబడులను పెంచుతున్నట్లు కంపెనీ స్పష్టం చేసినట్లు తెలిసింది. అందుకుఅనుగుణంగా భారీ సంఖ్యలో ఉద్యోగులను పెంచుకోనున్నట్లు ఇటీవలే ఎక్స్ఏఐ ప్రకటించింది.ఇదీ చదవండి: కొత్త ఉద్యోగాలకు ఓకే కానీ.. టెకీల ఆలోచనలు -
కొత్త ఉద్యోగాలకు ఓకే కానీ.. టెకీల ఆలోచనలు
చాలా మటుకు టెక్నాలజీ నిపుణులు కొత్త అవకాశాలపై ఆసక్తిగా ఉన్నప్పటికీ .. ఉద్యోగాల ఎంపిక విషయంలో మాత్రం ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. తమ లక్ష్యాలు, కెరియర్ పురోగతి, శారీరక .. మానసిక ఆరోగ్ లాంటి అంశాలకు సదరు ఉద్యోగం ఎంత వరకు దోహదపడుతుందనేది బేరీజు వేసుకుంటున్నారు. దేశీ టెకీలపై గ్లోబల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ మైఖేల్ పేజ్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.దీని ప్రకారం అంతర్జాతీయంగా అత్యంత ఆత్మవిశ్వాసంతో, ఉద్యోగాల ఎంపికలో లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్న టెక్ నిపుణుల్లో భారతీయ ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన సర్వేలో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా సుమారు 5,000 మంది ప్రొఫెషనల్స్ పాల్గొన్నారు. భారతీయ ప్రొఫెషనల్స్లో 94 శాతం మంది కొత్త అవకాశాలపై ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. మరిన్ని విశేషాలు.. → అంతర్జాతీయంగా అవకాశాలను పరిశీలించాలనే ఆలోచనే తాము ఉద్యోగాలు మారడానికి ప్రేరణగా ఉంటుందని 39 శాతం మంది టెకీలు తెలిపారు. మెరుగైన జీతం, వృద్ధి అవకాశాలు కారణమని 31 శాతం మంది చెప్పారు. → వెసులుబాటు విషయంలో టెక్ నిపుణులు ఏమాత్రం రాజీపడటం లేదు. 26 శాతం మంది సరళతరమైన పని విధానాలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఒకవేళ మాటిమాటికీ ఆఫీసుకు రమ్మంటే ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టేసే అంశాన్ని కూడా పరిశీలిస్తామని 45 శాతం మంది తెలిపారు. → 23 శాతం మంది తమ ప్రస్తుత వేతనాలపై అసంతృప్తిగా ఉన్నారు. 20 శాతం మంది చురుగ్గా శిక్షణ పొందుతున్నారు. అర్థవంతమైన పని, కెరియర్లో వృద్ధి అవకాశాలకు ప్రాధాన్యతనివ్వడానికి మొగ్గు చూపుతున్నారు. → టెక్ నిపుణులు, ఉద్యోగాలను ఎంచుకోవడంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలో కంపెనీలు కూడా కేవలం మెరుగైన వేతనాన్ని ఇవ్వజూపడానికే పరిమితం కాకుండా వెసులుబాటు, వృద్ధి అవకాశా ల్లాంటివి కూడా ఆఫర్ చేయాల్సి వస్తోంది. → హైబ్రిడ్ పని, ఏఐ సన్నద్ధతపై పెట్టుబడులు, నమ్మకం..పారదర్శకతకు పెద్దపీట వేసే సంస్కృతిని పెంపొందించే కంపెనీలు టాప్ ప్రతిభావంతులను ఆకర్షించడంతో పాటు పోటీ మార్కెట్లోను గట్టిగా నిలబడటానికి వీలుంటుంది. -
గేమ్లోని సీక్రెట్ ఫ్రెండ్స్.. చప్పుడుదే విజయం!
గేమ్లో గెలవాలంటే కేవలం టాలెంట్ సరిపోదు, తోడుగా సీక్రెట్ ఫ్రెండ్స్ కూడా ఉండాలి. అలా గెలుపు వెనుక ఉన్న సీక్రెట్ ఫ్రెండ్స్ వీళ్లే!స్పీడ్ డబుల్!గేమ్ ఆడుతున్నప్పుడు చివరి రౌండ్లో చేతి చెమటతో స్క్రీన్ జారిపోయి, అవుట్ అయితే వచ్చే బాధ, ఒక్క గేమింగ్ లవర్స్కి మాత్రమే తెలుసు. అలాంటి వారికి చాలా అవసరం ఈ రేజర్ గేమింగ్ వేలు కవచం. ఇది ప్రత్యేకంగా నేసిన వెండి తంతులతో తయారైంది. అందువలన టచ్ చాలా స్పష్టంగా, వేగంగా ఉంటుంది. చెమట పట్టినా వేళ్లు ఎప్పుడూ పొడిగా, చల్లగా ఉంటాయి. దీని మందం కేవలం 0.8 మిల్లీమీటర్ మాత్రమే. బరువు తేలికగా ఉన్నా, శక్తి మాత్రం యుద్ధంలో గెలిపించేంత బలంగా ఉంటుంది. ఇది చిన్న వేలు అయినా, పెద్ద వేలు అయినా సులభంగా సరిపోతుంది. కడిగి మళ్లీ మళ్లీ ఉపయోగించుకోవచ్చు. పబ్జీ, ఫ్రీ ఫైర్, బీజీఎంఐ వంటి అన్ని హైస్పీడ్ మొబైల్ గేమ్స్కు ఇది అద్భుతంగా సరిపోతుంది. ధర కేవలం రూ.1200 మాత్రమే!కూల్ బేబీ కూల్!గేమ్ ఆడితే మనసు రిలాక్స్ అవుతుంది కాని, ఎక్కువసేపు ఆడితే మాత్రం కంప్యూటర్ వేడెక్కుతుంది. ఇక దాని ఫ్యాన్ శబ్దం చెవులను మోగిస్తుంది. ఆ టెన్షన్ దూరం చేయడానికి ఈ ఆర్జీబీ ఎల్ఈడీ కేస్ ఫ్యాన్ సిద్ధంగా ఉంది. 120 మిల్లీమీటర్ల సైజుతో, నిమిషానికి 1500 సార్లు తిరుగుతుంది. ప్రత్యేకంగా రూపొందించిన దీని బ్లేడ్లు గాలి ఒత్తిడిని సమంగా పంచి పీసీని చల్లగా, సైలెంట్గా ఉంచుతాయి. ఇక ఫ్యాన్లోని ఎల్ఈడీలు కంప్యూటర్ లుక్నే మార్చేస్తాయి. రంగులు మెరిసిపోతూ గేమింగ్ మూడ్ను మరింత పెంచుతాయి. కనెక్టర్తో సులభంగా అమర్చుకోవచ్చు. బలమైన నైలాన్, నాణ్యమైన ప్లాస్టిక్తో తయారవడంతో దీర్ఘకాలం మన్నుతుంది. ధర రూ.699.చప్పుడుదే విజయం!గేమ్లో గెలవాలంటే కేవలం చూపు, చేతులు మాత్రమే కాదు, వినికిడి కూడా కీలకం. అడుగులు, గన్ ఫైర్, తుపాకీ రీలోడ్, శత్రువు దగ్గరగా వస్తున్న శబ్దం లాంటివన్నీ స్పష్టంగా వినిపించాలంటే అవసరమైంది ఈ సరౌండింగ్ గేమింగ్ హెడ్సెట్. మృదువైన ఇయర్ ప్యాడ్స్ వలన గంటల తరబడి వేసుకున్నా చెవులకు ఎలాంటి బరువూ అనిపించదు. 120 డిగ్రీల వరకు తిప్పుకునే నాయిస్ క్యాన్సిలింగ్ మైక్ వాయిస్ని స్పష్టంగా అందిస్తుంది, బయటి శబ్దాన్ని తగ్గిస్తుంది. టీమ్తో ఆడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఇబ్బంది లేకుండా గేమ్లో మరింత ఫోకస్ పెంచుతుంది. దీనిని పీసీ, ఎక్స్బాక్స్ వన్, ప్లేస్టేషన్, మొబైల్ ఇలా అన్నింటికీ సులభంగా కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. ధర కేవలం రూ.1,990. -
ఏఐకి మహిళా టెకీల జై..
ముంబై: మెరుగైన అవకాశాలను దక్కించుకునేందుకు కృత్రిమ మేథ (ఏఐ) ఉపయోగపడుతుందని టెక్నాలజీ రంగంలో అత్యధిక శాతం మహిళలు విశ్వసిస్తున్నారు. జాబ్స్, కెరియర్ ప్లాట్ఫాం అప్నా డాట్కో నిర్వహించిన సర్వేలో 78 శాతం మంది ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. దీని ప్రకారం మహిళా టెకీలు ఏఐ ఆధారిత కెరియర్ల కోసం సన్నద్ధమవుతున్నారు. 58 శాతం మంది ఇప్పటికే ఉద్యోగాల్లో భాగంగానో లేదా ఏదైనా ప్రోగ్రాంలలో చేరడం ద్వారానో లేక స్వయంగానో ఏఐ/ఎంఎల్ నైపుణ్యాల్లో శిక్షణ పొందుతున్నారు. 24 శాతం మంది త్వరలోనే శిక్షణ పొందే యోచనలో ఉన్నారు. టెక్నాలజీ రంగంలో పని చేస్తున్న 11,300 మంది మహిళలు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఇందులో అత్యధిక భాగం మహిళలు జెన్ జెడ్ విభాగానికి (పాతికేళ్ల లోపు వారు) చెందినవారే. వీరిలో 60 శాతం మంది ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు చెందిన వారు కాగా, మూడింట రెండొంతుల మంది సాధారణ కాలేజీల్లో చదివినవారే. ఏఐ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి డిమాండ్.. సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు సగం మంది ఏఐ సాఫ్ట్వేర్ డెవలపర్లు కావాలనుకుంటున్నారు. అలాగే 19 శాతం మంది డేటా సైన్స్.. మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), 14 శాతం మంది ప్రోడక్ట్ మేనేజ్మెంట్, 10 శాతం మంది రీసెర్చ్ ఉద్యోగాలపై దృష్టి పెడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ఏఐని ఏదో ఆషామాషీ ట్రెండ్గా కాకుండా సమాన అవకాశాలను కల్పించే దోహదకారిగా మహిళా టెకీలు భావిస్తున్నట్లు తెలుస్తోందని అప్నాడాట్కో వ్యవస్థాపకుడు నిర్మిత్ పారిఖ్ తెలిపారు. మరోవైపు, ఇప్పుడు పేరొందిన కాలేజీ నుంచి పట్టా పొందడం కన్నా ఏఐలో నైపుణ్యాలే చాలా ముఖ్యమని మూడింట రెండొంతుల టెకీలు భావిస్తున్నారు. జెన్ జెడ్ అమ్మాయిల్లో (22–25 ఏళ్ల వయస్సున్న వారిలో 62 శాతం మంది), ద్వితీయ–తృతీయ శ్రేణి పట్టణాల్లోని మహిళల్లో (74 శాతం మంది) ఈ భావన అత్యధికంగా ఉంది.మెట్రోల్లో ఇది 66 శాతం మందిలో ఉంది. ఏఐని అందిపుచ్చుకోవడంలో ఎదురవుతున్న సవాళ్ల విషయానికొస్తే.. నాణ్యమైన అవకాశాలు అందుబాటులో ఉండటం లేదని 42 శాతం మంది, బలమైన మెంటార్షిప్ లేదని 27 శాతం, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఆప్షన్లు అవసరమని 19 శాతం మంది తెలిపారు. -
కంపెనీల్లో జెన్ఏఐ నిపుణుల కొరత..
న్యూఢిల్లీ: దేశీయంగా కృత్రిమ మేథ (ఏఐ) మార్కెట్ చాలా వేగంగా వృద్ధి చెందుతోంది. 2025లో 28.8 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు నెలకొన్నాయి. కానీ నిపుణల కొరతే పరిశ్రమకు ప్రధాన సమస్యగా మారింది. పది జెన్ఏఐ ఉద్యోగాలుంటే నైపుణ్యాలున్న అభ్యర్ధులు ఒక్కరే ఉంటున్నారు. టీమ్లీజ్ డిజిటల్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం నిర్దిష్ట ప్రాంప్ట్ ఇంజినీరింగ్, ఎల్ఎల్ఎం సేఫ్టీ..ట్యూనింగ్, ఏఐ ఆర్కె్రస్టేషన్, ఏజెంట్ డిజైన్, సిమ్యులేషన్ గవర్నెన్స్, ఏఐ కాంప్లయెన్స్, రిస్క్ ఆపరేషన్స్లాంటి ఏఐ నైపుణ్యాలకు అత్యధిక డిమాండ్ ఉంటోంది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు.. జనరేటివ్ ఏఐ ఇంజినీరింగ్, మెషిన్లెరి్నంగ్ ఆపరేషన్స్లాంటి విభాగాల్లో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతున్నాయి. సీనియర్లకు ఏటా రూ. 58–60 లక్షల వరకు ప్యాకేజీలు ఉంటున్నాయి. నివేదికలోని మరిన్ని విశేషాలు.. → డిజిటల్ ఎకానమీలో ఏఐ, క్లౌడ్ ఉద్యోగాలకు డిమాండ్ భారీగా ఉంది. దానికి తగ్గట్లుగా నైపుణ్యాలున్న అభ్యర్ధులు లభించక, తీవ్ర కొరత నెలకొంది. దీంతో తగిన అర్హతలున్న వారికి కంపెనీలు భారీ వేతనాలిస్తున్నాయి. → జీసీసీల్లో సైబర్సెక్యూరిటీ, డేటా ఇంజినీరింగ్ ఉద్యోగుల వేతనాలు 2025–2027 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో వార్షికంగా వరుసగా రూ. 28 లక్షల నుంచి రూ. 33.5 లక్షలకు, రూ. 23 లక్షల నుంచి రూ. 27 లక్షలకు పెరగనున్నాయి. → నాన్–టెక్ రంగాల్లోని టెక్ ఉద్యోగాలకు సంబంధించి ఐటీ సపోర్ట్, సంప్రదాయ తరహా సిస్టమ్స్ మెయింటెనెన్స్ విభాగాల్లో వేతనాలు వార్షికంగా రూ. 12 లక్షల స్థాయిలోనే స్థిరపడిపోయి ఉన్నాయి. పరిశ్రమ క్లౌడ్ నేటివ్, ఔట్సోర్స్డ్ సరీ్వస్ మోడల్స్ వైపు మళ్లుతుండటాన్ని ఇది సూచిస్తోంది. → ఏఐ మార్కెట్ ప్రస్తుతం హైపర్–గ్రోత్ దశలోకి అడుగుపెడుతోంది. ఏటా 45 శాతం వృద్ధితో 2025లో 28.8 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే, ప్రతిభావంతుల కొరత తీవ్రంగా ఉంటోంది. ప్రతి పది జెన్ఏఐ ఉద్యోగాలకు అన్ని అర్హతలు కలిగిన ఇంజినీరు ఒకే ఒక్కరు ఉంటున్నారు. → 2026 నాటికి ఏఐ టాలెంట్ అంతరాలు 53 శాతానికి పెరగనుంది. అలాగే క్లౌడ్ కంప్యూటింగ్లో డిమాండ్–సరఫరా మధ్య అంతరం 55–60 శాతానికి పెరగనుంది. → ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో పెద్ద స్థాయిలో శిక్షణను కల్పించకుంటే, కంపెనీల వృద్ధి ఆకాంక్షలు నెరవేరని పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. → ఏఐ వినియోగమనేది జాబ్ మార్కెట్ల రూపురేఖలను గణనీయంగా మార్చేయనుంది. గ్లోబల్ విధులు నిర్వహించే 40 శాతం వరకు ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఐటీ సరీ్వసులు, కస్టమర్ ఎక్స్పీరియన్స్, బీఎఫ్ఎస్ఐ, హెల్త్కేర్లాంటి రంగాల్లో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే కంపెనీలు ఏఐ–ఫస్ట్ లెర్నింగ్ మోడల్స్, డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. → భారత డిజిటల్ ఎకానమీలో ఉద్యోగాలు, నైపుణ్యాల్లో మార్పులకు ఇంజిన్లుగా వ్యవహరిస్తున్న జీసీసీలు, ఉద్యోగాల కల్పనకు సారథ్యం వహిస్తున్నాయి. 2025లో 22–25 శాతం మేర ఉద్యోగాలు కల్పించనున్నాయి. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ విభాగాల్లో అత్యధికంగా కొలువులు ఉండనున్నాయి. → 2027లో అందుబాటులోకి రాబోయే 47 లక్షల కొత్త టెక్ ఉద్యోగాల్లో గణనీయ సంఖ్యలో కొలువులను (12 లక్షలు) జీసీసీలే కల్పించనున్నాయి. ప్రధానంగా జెన్ఏఐ, ఇంజినీరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాల్లో ఈ ఉద్యోగాలు ఉంటాయి. → జీసీసీలు మెట్రో పరిధిని దాటి విస్తరిస్తున్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో 1,30,000–1,40,000 మంది తాజా గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేసుకోనున్నాయి. వీరిలో ఎక్కువ శాతం హైరింగ్ ద్వితీయ, తృతీయ శ్రేణి ఇంజినీరింగ్ క్యాంపస్లలో ఉండొచ్చు. వైవిధ్యానికి కూడా ప్రాధాన్యం పెరుగుతోంది. ఇప్పుడు టాప్ 20 జీసీసీల్లో 40 శాతం మంది సిబ్బంది మహిళలే ఉంటున్నారు. పరిశ్రమ సగటు కన్నా ఇది 1.5 రెట్లు అధికం. → 2027 నాటికి భారత్లో 2,100 పైగా జీసీసీలు ఉంటాయి. వీటిలో 30 లక్షల మంది పైగా ఉంటారు.


