breaking news
Technology
-
సిమ్ యాక్టివ్ ప్లాన్లు.. ఒక్కసారి రీచార్జ్ చేస్తే చాలు
చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ మొబైల్ నంబర్లు ఉంటాయి. టెలికం సంస్థలు టారిఫ్లను పెంచేసిన నేపథ్యంలో రెండింటికీ రీచార్జ్ చేయాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రాథమికంగా వినియోగించే నంబర్ కాకుండా మరో నంబర్ను తక్కువ ఖర్చుతో యాక్టివ్ ఉంచుకొనే రీచార్జ్ ప్లాన్ల కోసం చాలా మంది చూస్తున్నారు.డేటా లేకుండా కూడా మొబైల్ నంబర్ను యాక్టివ్గా ఉంచడానికి సహాయపడే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్లను ప్రారంభించాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అన్ని ప్రధాన టెలికాం కంపెనీలను ఆదేశించింది. ఈ క్రమంలో ఎయిర్టెల్, జియో, వీఐలు తమ డేటా ఫ్రీ ప్రీపెయిడ్ ప్లాన్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..ఎయిర్టెల్ డేటా రహిత ప్లాన్స్ఇంటర్నెట్ డేటా సదుపాయం లేకుండా కాలింగ్, ఎస్ఎంఎస్ ల పూర్తి ప్రయోజనాన్ని అందించే రెండు ప్లాన్లను ఎయిర్ టెల్ ప్రవేశపెట్టింది. 84 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ రూ.469కి అందుబాటులో ఉంది. ఇది దేశవ్యాప్తంగా అపరిమిత కాలింగ్, ఉచిత రోమింగ్, 900 ఎస్ఎంఎస్లను అందిస్తోంది. 365 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ ధర రూ.1849. ఇందులో అపరిమిత కాలింగ్, ఉచిత రోమింగ్, ఏడాది పొడవునా 3600 ఎస్ఎంఎస్లు లభిస్తాయి.జియో లాంగ్ వాలిడిటీ ఆఫర్లు84 రోజులు, 336 రోజుల వాలిడిటీ ఉన్న రెండు డేటా ఫ్రీ ప్లాన్లను జియో అందిస్తోంది. రూ.448 విలువైన 84 రోజుల ప్లాన్ ద్వారా అపరిమిత కాలింగ్, 1000 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. అదే సమయంలో రూ .1748 విలువైన 336 రోజుల ప్లాన్ వినియోగదారులకు అన్లిమిటెడ్ కాలింగ్, 3600 ఎస్ఎంఎస్ల సదుపాయాన్ని అందిస్తుంది.వొడాఫోన్ ఐడియా ప్లాన్స్వొడాఫోన్ ఐడియా కూడా ఎయిర్టెల్ మాదిరిగానే రెండు ప్లాన్లను లాంచ్ చేసింది. రూ.470 ప్లాన్లో యూజర్లకు 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రూ.1849 ప్లాన్తో 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రెండు ప్లాన్లు అపరిమిత కాలింగ్, ఎస్ఎంఎస్లను అందిస్తాయి. ఇది దాదాపు ఎయిర్టెల్ ఆఫర్లను పోలి ఉంటుంది.చదవండి: ఎయిర్టెల్ కొత్త రీచార్జ్ ప్లాన్.. ఓటీటీలన్నీ ఫ్రీ.. -
ఎప్పుడూ ఊహించని కొత్త ఉద్యోగాలొస్తాయ్..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వ్యవస్థలు రోజురోజుకూ మెరుగవుతున్నకొద్దీ మానవ ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన పెరుగుతోంది. మనుషులు చేయగలిగే పనులన్నీ ఏఐ చేసేస్తుండటంతో మానవ ఉద్యోగాలను త్వరలోనే ఈ కొత్త ఏఐ టూల్స్ భర్తీ చేసే ప్రమాదం ఎక్కువవుతోంది.టెక్ దిగ్గజాల సీఈవోలూ ఇదే హెచ్చరిస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో తమ కంపెనీలోని ఉద్యోగులను ఏఐ తగ్గిస్తుందని స్వయంగా అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీనే కొన్ని వారాలుగా చెబుతూ వస్తున్నారు. ప్రతి ఒక్కరి ఉద్యోగాలు ప్రభావితమవుతాయని ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ కూడా ఇటీవల హెచ్చరించారు.సమూల మార్పుఅయితే,ఈ క్రమంలో ఉద్యోగుల్లో ఏఐపై ఉన్న భయాల్ని పొగొట్టేలా గూగుల్ డీప్ మైండ్ సీఈఓ డెమిస్ హస్సాబిస్ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. ఓ అడుగు ముందుకేసి ప్రస్తుతం ప్రత్యామ్నాయంగానే ఉన్న కృత్రిమ మేధస్సుతో రాబోయే ఐదు నుండి పదేళ్లలో ఉద్యోగ భావనలోనే సమూల మార్పు సంభవించవచ్చని అభిప్రాయపడ్డారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎప్పుడూ ఊహించని విధంగా కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని ‘వైర్డ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు."ఉద్యోగ ప్రపంచంలో చాలా మార్పు ఉంటుందని నేను అనుకుంటున్నాను. కానీ గతంలో మాదిరిగానే మెరుగైన కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. ఇవి ఈ సాధనాలు లేదా కొత్త సాంకేతికతలను ఉపయోగిస్తాయి" అని హస్సాబిస్ అన్నారు.డాక్టరుకూ ముప్పు?ప్రస్తుతం మానవులు చేసే ప్రతి పనినీ ఏజీఐ లేదా ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ చేయగలిగితే, రానున్న కొత్త ఉద్యోగాలను కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానం భర్తీ చేయకుండా ఆపగలమా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమైంది. దీనికి హస్సాబిస్ బదులిస్తూ ఒక వైద్యుడి స్థానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భర్తీ చేయగలదు కానీ నర్సులను కాదు అన్నారు."సాధారణంగా డాక్టర్ ఏం చేస్తారు.. డాక్టర్ చేసే రోగ నిర్ధారణను ఏఐ టూల్ సాయంతో చేయవచ్చు. లేదా పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరహా డాక్టర్లు రావచ్చు. కానీ నర్సులు అలా కాదు. ఎందుకంటే నర్సుల ఉద్యోగంలో మానవ సహానుభూతి ఎక్కువగా ఉంటుంది" అని వివరించారు.చదవండి: ఇదిగో ఈ 40 రకాల ఉద్యోగాలకు డేంజర్! -
ఆ భాషను ఎవరూ అర్థం చేసుకోలేరు: హింటన్ హెచ్చరిక
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాజ్యమేలుతోంది. అన్ని రంగాల్లో ఏఐ హవా కొనసాగుతోంది. ఇప్పటికే చాలామంది ఉద్యోగుల్లో భయం పుట్టుకుంది. ఇలాంటి సమయంలో 'గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ'గా ప్రసిద్ధి చెందిన 'జియోఫ్రీ హింటన్' (Geoffrey Hinton) ఓ హెచ్చరిక జారీ చేశారు.ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత అయిన జియోఫ్రీ హింటన్ 'వన్ డెసిషన్' పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ప్రస్తుతం, AI ఇంగ్లీషులో ఆలోచిస్తుంది. కాబట్టి డెవలపర్లు కూడా టెక్నాలజీ ఏమి ఆలోచిస్తుందనే విషయాన్ని ట్రాక్ చేయడానికి వీలు కలుగుతోంది. అయితే ఇది త్వరలోనే ఓ సొంత ప్రైవేట్ భాషను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. ఆ భాషను మానవ సృష్టికర్తలు కూడా అర్థం చేసుకోలేరని హెచ్చరించారు.యంత్రాలు ఇప్పటికే భయంకరమైన ఆలోచనలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని ప్రదర్శించాయి. ఆ ఆలోచనలు ఎల్లప్పుడూ మనం ట్రాక్ చేయగల భాషలోనే ఉంటాయని భావించకూడదు. ఇదే జరిగితే ఆ తరువాత జరిగే పరిణాలను అంచనా వేయలేము.ఇదీ చదవండి: విదేశీ గడ్డపై వేల కోట్ల సామ్రాజ్యం.. ఎవరీ భారతీయుడు?హింటన్ చేసిన కృషి AI వ్యవస్థలకు మార్గం సుగమం చేసింది. కానీ భద్రతా గురించి ఆలోచించలేదని ఒప్పుకున్నారు. అప్పట్లోనే ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో అని గ్రహించి ఉండాల్సింది. ఇప్పుడు ఆలస్యమైంది. కాబట్టి జాగ్రత్తపడాల్సిన అవసరాన్ని గురించి ఆయన వెల్లడించారు. జ్ఞానాన్ని శ్రమతో పంచుకోవాల్సిన మానవుల మాదిరిగా కాకుండా, ఏఐ తమకు తెలిసిన వాటిని క్షణంలో కాపీ చేసి పేస్ట్ చేయగలవు. ఇదే ప్రస్తుతం చాలా రంగాలను భయపెడుతోంది. దీని గురించే హింటన్ కూడా భయపడుతున్నారు. -
ఈ సీఈవో శాలరీ.. ఐటీ కంపెనీల్లోనే టాప్
ప్రముఖ ఐటీ కంపెనీ హెచ్సీఎల్టెక్ సీఈవో సి.విజయకుమార్ రికార్డు స్థాయి వేతనం అందుకున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆయన 10.85 మిలియన్ డాలర్లు (సుమారు రూ.94.6 కోట్లు) సంపాదించారు. ఇది భారతీయ ఐటీ రంగంలో ఎగ్జిక్యూటివ్లు పొందుతున్న అత్యధిక వేతనంగా నిలిచింది.విజయకుమార్ వేతనం పెద్ద పోటీ సంస్థలైన టీసీఎస్, ఇన్ఫోసిస్ ఛీప్ల సంపాదనను సైతం అధిగమించింది. అంతేకాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆయన ప్రస్తుత వేతనాన్ని 71 శాతం పెంచి 18.6 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.154 కోట్లు) పెంచుకోవడానికి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపిందని కంపెనీ వార్షిక నివేదిక తెలిపింది.ఇదే సమయంలో టీసీఎస్ సీఈఓ కృతివాసన్ వేతనం రూ.26.52 కోట్లు కాగా, ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ వేతనం రూ.80.62 కోట్లుగా ఉంది. అలాగే విప్రో సీఈఓ శ్రీనివాస్ పలియా ఆర్జన సుమారు రూ.53.64 కోట్లు, టెక్ మహీంద్రా సీఈఓ మోహిత్ జోషి సంపాదన రూ.53.9 కోట్లుగా ఉన్నాయి.2025 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో విజయకుమార్ అందుకున్న మొత్తం పరిహారంలో మూల వేతనం 1.96 మిలియన్ డాలర్లు కాగా పనితీరు ఆధారిత బోనస్ 1.73 మిలియన్ డాలర్లుగా ఉందని హెచ్సీఎల్టెక్ వార్షిక నివేదిక తెలిపింది.ఆయన సంపాదనలో ఎక్కువ భాగం దీర్ఘకాలిక ప్రోత్సాహకాలు 6.96 మిలియన్ డాలర్ల విలువైన నియంత్రిత స్టాక్ యూనిట్లు (ఆర్ఎస్యూలు) నుంచే వచ్చింది. ఇవికాక బెనిఫిట్స్, పెర్క్విసైట్స్ కింద అదనంగా మరో 0.20 మిలియన్ డాలర్లు లభించాయి.2016లో హెచ్సీఎల్టెక్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన విజయకుమార్ అమెరికాలో ఉంటూ తన రెమ్యూనరేషన్ను కంపెనీకి చెందిన అమెరికా అనుబంధ సంస్థ హెచ్సీఎల్ అమెరికా ఇంక్ నుంచి తీసుకుంటున్నారు.👉ఇది చదివారా? కాగ్నిజెంట్లో జీతాల పెంపు.. సీఎఫ్వో కీలక ప్రకటన -
ఏడబ్ల్యూఎస్ కొత్త సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మోడల్
బెంగళూరు: అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) కొత్తగా ఏఐ డ్రివెన్ డెవలప్మెంట్ లైఫ్సైకిల్ (ఏఐ–డీఎల్సీ) మోడల్ను ఆవిష్కరించింది. కైరో, అమెజాన్ క్యూ డెవలపర్లాంటి టూల్స్ను ఉపయోగించి, కృత్రిమ మేథ (ఏఐ)తో సాఫ్ట్వేర్ను రూపొందించేందుకు ఇది ఉపయోగపడుతుంది.దీనితో మానవ పర్యవేక్షణలో కోడింగ్, టెస్టింగ్లాంటి పనులను ఆటోమేట్ చేయడం ద్వారా సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసే వ్యవధిని నెలల నుంచి రోజుల స్థాయిలోకి కుదించవచ్చని సంస్థ తెలిపింది. అలాగే మెరుగైన ఏఐ విధానాలను షేర్ చేసుకునేందుకు ఏఐ–నేటివ్ బిల్డర్స్ కమ్యూనిటీని కూడా ప్రవేశపెట్టినట్లు వివరించింది.అటు ఏడబ్ల్యూఎస్ స్కిల్ బిల్డర్ ద్వారా అంతర్జాతీయంగా 27 లక్షల మంది విద్యార్థులకు, ఉచితంగా ఏఐ ట్రైనింగ్ యాక్సెస్ అందిస్తున్నట్లు ఏడబ్ల్యూఎస్ తెలిపింది. జనరేటివ్ ఏఐని ఉపయోగించి వాస్తవ ప్రపంచపు సవాళ్లను పరిష్కరించే డెవలపర్లకు 2 మిలియన్ డాలర్ల విలువ చేసే క్రెడిట్స్ను ఇచ్చేలా ఏడబ్ల్యూఎస్ ఏఐ లీగ్ను కూడా ప్రకటించింది. -
చదువు నేర్పించే చిట్టి మిత్రుడు.. క్యూట్ టైమ్ మేనేజర్
పిల్లలకు ఫ్రెండ్స్ అవసరం లేదు, ఫీచర్లే సరిపోతాయి. ఆటల్లో ఆటోమెషిన్, కథల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చదువులో టెక్నాలజీ అసిస్టెంట్స్.. ఇలా ఇవన్నీ చిన్నారుల చిట్టి మిత్రులుగా మారిపోయాయి.ఆల్ ఇన్ వన్ ఫ్రెండ్!పిల్లలతో ఆడుతూ పాడుతూ కథలు చెబుతూ, చదువు నేర్పించే చిట్టి మిత్రుడు ఇప్పుడు ఇంటికే వచ్చేశాడు. అదే ‘మికో మినీ’. చూడటానికి చిన్న ఆటబొమ్మలా కనిపించే ఇది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఒక తెలివైన రోబో. పిల్లల ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెబుతుంది. చదువు, డాన్స్, పాటలు, గేమ్స్ ఇలా అన్ని రంగాల్లో పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ నేర్పిస్తుంది. చదువు, ఆలోచనా శక్తి, కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంచేలా రోజువారీ ప్రణాళికలు తయారు చేసి ఇస్తుంది. ముఖ్యంగా అత్యవసర సమయాల్లో తల్లిదండ్రుల నంబర్లకు, ఇతర ఎమర్జెన్సీ నంబర్లకు సమాచారం ఇచ్చే ఫీచర్ కూడా ఇందులో ఉంది. ధర కేవలం రూ. 13,999 మాత్రమే!క్యూట్ టైమ్ మేనేజర్!పిల్లల షెడ్యూల్ చూస్తే బిలియనీర్ బిజినెస్మెన్ కంటే తక్కువేమీ ఉండదు. ఉదయం స్కూల్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం హోంవర్క్, ఆ తర్వాత ఆటలు, ఇలా చాలానే ఉంటాయి. అందుకే, వాళ్ల బిజీ షెడ్యూల్కి బ్రిలియంట్ అసిస్టెంట్గా వచ్చింది ఈ స్మార్ట్ గాడ్జెట్. పేరు ‘చాంపియన్ కిడ్స్ అండ్ టీన్స్ స్మార్ట్వాచ్’. ఇది పిల్లలకి ఓ చిట్టి మేనేజర్లా పనిచేస్తుంది. హార్ట్బీట్ చెక్, నిద్ర ట్రాక్ చేయడంతో పాటు ‘నీళ్లు తాగు’ అని వేళకు గుర్తు చేస్తుంది. ఇలా మరెన్నో ఇందులో సెట్ చేసుకోవచ్చు. స్కూల్ మోడ్ ఆన్ చేస్తే, చదువుకు ఆటంకం రాకుండా మేనేజ్ చేస్తుంది. పనితో పాటు సరదా కోసం గేమ్స్, మ్యూజిక్, కెమెరా, క్యాలిక్యులేటర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇక ఇందులో సిమ్ వేసుకుని, ఫోన్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. అచ్చం ఓ మినీ ఫోన్ మాదిరిగా పనిచేస్తుంది. రోజుకో వాచ్ డిస్ప్లే మార్చుకోవచ్చు. వర్షం వచ్చినా, చెమట పట్టినా నో టెన్షన్. ఎందుకంటే, ఇది వాటర్ప్రూఫ్. ధర రూ.2,499 మాత్రమే!కథల లోకానికి గెలాక్సీ గేట్!చిట్టి చెవుల్లోకి మెల్లగా కథలు జాలువారాలంటే, మామూలు హెడ్ఫోన్లు పనికిరావు. అందుకే వచ్చిందీ కొత్త ‘గెలాక్సీ హెడ్ఫోన్’. పిల్లల చెవులకు హాని చేయకుండా, హాయి గొలిపేలా కథలు వినిపిస్తుంది. ఇందులో ఏకంగా ఐదు వందలకు పైగా కథలు, పాటలు ముందే స్టోర్ చేసి ఉంటాయి. అవసరమైతే మరిన్ని కథలను స్టోర్ చేసుకునే అవకాశం ఉంది. స్క్రీన్ ఏదీ అవసరం లేకుండానే నేరుగా దీనిని పెట్టుకుని కథలు వినవచ్చు. కేవలం పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, భద్రతకు అనుగుణంగా వాల్యూమ్ను నియంత్రించేలా రూపొందించారు. ఒక్కసారి ఇది పెట్టుకున్న వెంటనే పిల్లలు కథల ప్రపంచంలోకి వెళ్లిపోతారు. అన్ బ్రేకబుల్ బాడీతో, డిటాచబుల్ మైక్తో, మెరిసే ఎల్ఈడీ లైట్స్, మ్యాగ్నెట్ స్టిక్కర్లతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ధర కేవలం రూ. 2,999 మాత్రమే! -
ఏజెంటిక్ ఏఐ.. ఉద్యోగ విప్లవం.. ఏమిటి దీని ప్రత్యేకత?
సాధారణంగా ఏఐ అంటే.. మనం ఏదైనా అడిగితే జవాబు చెప్పే చాట్బాట్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే.. ఒక పాట ప్లే చేయమనగానే చటుక్కున ప్లే చేసే స్మార్ట్ స్పీకర్ లాంటిది. కానీ, ‘ఏజెంటిక్ ఏఐ’ దీనికి భిన్నమైనది. – సాక్షి, స్పెషల్ డెస్క్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో మార్పులు, ఏయే ఉద్యోగాలకు ముప్పు రావచ్చు అంటూ ఈ మధ్య మనం చాలా వింటున్నాం. అయితే, అందరూ ఊహిస్తున్న దానికంటే చాలా పెద్ద మార్పు మన ముందుకు రాబోతోంది. వచ్చే ఐదేళ్లలో దేశంలో ఏకంగా కోటికి పైగా ఉద్యోగాలను ఓ కొత్త రకం ఏఐ పూర్తిగా మార్చనుంది. అదే ’ఏజెంటిక్ ఏఐ’. అయితే ఈ మార్పు వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం అక్కర్లేదు. ఎందుకంటే.. ఇది యువతకు కొత్త అవకాశాలు, దారుల్ని తెరుస్తోంది. ఈ ఏఐతో పని వేగం పెరిగి, పనులన్నీ సులభంగా మారిపోనున్నాయి.రిటైల్ రంగంవ్యాపారాలు ఎదుర్కొనే అతి పెద్ద సవాళ్ళలో ఒకటి.. మార్కెట్ ట్రెండ్లు, వినియోగదారుల నుంచి వచ్చే సమాచారాన్ని వేగంగా విశ్లేషించడం. ఏజెంటిక్ ఏఐ ఈ సమస్యను తీరుస్తుంది. ఈ రంగంలో 76 లక్షల ఉద్యోగాలు మార్పునకు గురవుతాయట. ఏఐ ఏజెంట్లు కస్టమర్ల ఇష్టాలను బట్టి వారికి నచ్చే వస్తువులను చూపించడం, ఎప్పుడు ఏ వస్తువు స్టాక్లో ఉందో తెలుసుకోవడం, కస్టమర్ సర్వీస్కు జవాబులు చెప్పడం వంటివి చేస్తాయి. ఈ ఏఐ వల్ల ఉద్యోగులకు విలువైన సమయం ఆదా అవుతుంది. వారు మార్కెట్ మార్పులకు స్పందించడంపై దృష్టి పెట్టొచ్చు. అయితే, ఈ ఏఐ నిర్ణయాలకు మనుషుల పర్యవేక్షణ చాలా ముఖ్యం. ఆటోమేషన్, మానవ నిర్ణయాల మధ్య సమతుల్యత సాధించొచ్చు.విప్లవాత్మక మార్పులు!ఈ ఏజెంటిక్ ఏఐ మన రోజువారీ జీవితాన్ని, ముఖ్యంగా పనిచేసే విధానాన్ని పూర్తిగా మార్చేయనుంది అంటున్నారు టెక్ నిపుణులు.పని విధానంలో మార్పులు: మనం చేసే కొన్ని పనులు బోరింగ్గా, రోజూ ఒకే రకంగా ఉంటాయి. ఈ ఏఐ ఆ రొటీన్ పనులను పూర్తిగా తన చెప్పుచేతల్లోకి తీసుకుంటుంది. దీంతో మనుషులు క్రియేటివ్గా ఆలోచించడం, కొత్త వ్యూహాలు రూపొందించడం లాంటి కీలకమైన పనులపై దృష్టి పెట్టొచ్చు.కొత్త ఉద్యోగాలు, కొత్త నైపుణ్యాలు: ఏఐ వల్ల కొన్ని ఉద్యోగాలు మారినా, కొత్త ఉద్యోగాలూ పుట్టుకొస్తాయి. ఉదాహరణకు, డేటా ఎంట్రీ చేసేవాళ్లు ఏఐని ఎలా ఉపయోగించాలి అని గైడ్ చేసే ‘ఏఐ సూపర్ వైజర్’గా మారొచ్చు. ఈ మార్పును ఎదుర్కోవడానికి మనం ఏఐ టూల్స్ వాడటం, సృజనాత్మకంగా ఆలోచించడం వంటి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి.ఏయే రంగాల్లో..‘సర్వీస్నౌ ఏఐ స్కిల్స్ రీసెర్చ్ 2025’ ప్రకారం, కొన్ని కీలక రంగాల్లో ఈ ఏఐ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఈ రంగంలో ఏకంగా 80 లక్షల ఉద్యోగాలు మారబోతున్నాయి. ఏఐ ఏజెంట్లు ఒక వస్తువు తయారీకి కావాల్సిన ముడి పదార్థాలను మేనేజ్ చేయడం, యంత్రాలు ఎప్పుడు పాడైపోతాయో ముందే చెప్పడం, ఉత్పత్తి వేగాన్ని పెంచడం వంటివి చేస్తాయి. దీంతో మనుషులు యంత్రాల పర్యవేక్షణ, మరమ్మతులు వంటి పనులు చేయాల్సి రావొచ్చు.విద్యారంగంఈ రంగంలో 25 లక్షల ఉద్యోగాలు మారనున్నాయి. ఏఐ ఏజెంట్లు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా చదువుకునే ప్రణాళికలు తయారు చేయడం, అసై¯Œ మెంట్లను కరెక్ట్ చేయడం, వెంటనే ఫీడ్బ్యాక్ ఇవ్వడం వంటివి చేస్తాయి. దీంతో టీచర్లు క్లాస్రూమ్లో విద్యార్థులపై మరింత శ్రద్ధ పెట్టడం, వారికి మార్గదర్శకత్వం చేయడం వంటి వాటిపై ఫోకస్ చేయవచ్చు.ఏఐతో కలిసి పనిచేయాలిఇది కేవలం ఆటోమేషన్ మాత్రమే కాదు. పని అంటే ఏంటో తిరిగి నిర్వచించుకునే సమయం. ఈ ఏఐ విప్లవం వల్ల దేశ యువతకు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి, కొత్త రకాల ఉద్యోగాలు చేయడానికి అపారౖమెన అవకాశాలు లభిస్తాయి. ఏఐతో కలిసి పనిచేయడం ఎలాగో నేర్చుకోవాలి. అప్పుడే భవిష్యత్తులో మనం మరింత మెరుగ్గా రాణించగలుగుతాం. ఏజెంటిక్ ఏఐ అనేది మన శత్రువు కాదు, మన పనిని సులభతరం చేసే ఒక స్మార్ట్ పార్ట్నర్.– సుమీత్ మాథుర్, ఎస్వీపీ–ఎండీ, సర్వీస్నౌ ఇండియాడేటా సెక్యూరిటీ సమస్యఏజెంటిక్ ఏఐ వల్ల డేటా సెక్యూరిటీ విషయంలో కంపెనీలకు ఇంకా పూర్తి స్పష్టత రాలేదని సర్వీస్నౌ నివేదిక చెబుతోంది. ఇందుకోసం ఎలాంటి నైపుణ్యాలు అవసరమవుతాయో తమకు తెలియడం లేదని 26 శాతం కంపెనీలు చెప్పాయట. -
అగ్రరాజ్యంతో పోటీపడుతున్న భారత్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ).. నిపుణుల నియామకాల్లో తొలి స్థానంలో నిలిచి మన దేశం ప్రపంచం ఔరా అనిపించేలా చేసింది. మొత్తం ఏఐ నైపుణ్యాల్లో.. అత్యధిక నైపుణ్యాలున్న దేశం అమెరికా కాగా, రెండో స్థానంలో భారత్ ఉంది. అంటే అగ్రరాజ్యంతో నువ్వా నేనా అన్నట్టు భారత్ పోటీపడుతోంది. పేటెంట్లు.. అందులో మళ్లీ ఏఐ పేటెంట్ల విషయంలో మాత్రం మనం చాలా వెనకబడి ఉన్నాం.ప్రపంచంలో అత్యధిక ఏఐ నైపుణ్యాలు కలిగిన ఐటీ ఇంజనీర్లు ఉన్న దేశాల్లో యూఎస్ టాప్–1లో నిలిచింది. మొత్తం ఏఐ నైపుణ్యాల్లో.. ఈ దేశంలోని ఐటీ ఇంజనీర్లలో సగటున 2.63 శాతం నైపుణ్యాలు ఉన్నాయి. మనదేశంలో ఇది 2.51 శాతంగా ఉంది. ఈ విషయంలో యూకే, జర్మనీ, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, స్పెయిన్ మన కంటే వెనుకబడి ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐటీ ఇంజనీర్లలో ఏఐ నిపుణుల వాటా 1 శాతమే. భారత్లో లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్పై గత ఏడాది జరిగిన మొత్తం నియామకాల్లో 33.39 శాతం ఏఐ సంబంధ రోల్స్ ఉండడం విశేషం. ఈ స్థాయిలో ఏఐ రిక్రూట్మెంట్ జరగడంతో ప్రపంచంలోనే మనం టాప్లో నిలిచాం. ఏఐ పబ్లికేషన్ల విషయంలో కూడా 2013– 23 మధ్య 9.22 శాతం వాటాతో అమెరికా (America) కంటే మనమే ముందున్నాం. ఈ విషయంలో చైనా (China) 23.20 శాతంతో మొదటి స్థానంలో ఉంది.చదవండి: డిబ్బి డబ్బులతో కాలేజీ ఫీజులు కట్టేస్తున్న స్కూల్ పిల్లలు!పరిశోధకుల్లో వెనకడుగే..అంతర్జాతీయంగా ఏఐ పరిశోధకుల్లో టాప్–2 శాతంలో మనవాళ్లు లేకపోవడం నిరాశపరుస్తోంది. ఈ విషయంలో యూఎస్, చైనా ఆధిపత్యం చెలాయిస్తున్నాయి, మరో ముఖ్యమైన విషయం.. మన ఏఐ నిపుణులు (AI Experts) మనదేశం నుంచి తరలిపోవడం. గత ఏడాది లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్పై.. భారత్లో సగటున ప్రతి 10,000 మంది ఏఐ నిపుణులకుగాను 1.55 మంది మన దేశం నుండి నిష్క్రమించారు. ఇలా అత్యధికులు వెళ్లిపోతున్న దేశంగా ఇజ్రాయెల్ తరువాత మనదేశం ఉందని ‘స్టాన్ ఫోర్డ్ ఏఐ ఇండెక్స్ 2025’ నివేదిక వెల్లడించింది.పేటెంట్లలో చైనా జోరు..ఏఐ పేటెంట్లలో కూడా మన దేశం వెనుకబడి ఉంది. 2024లో ప్రైవేట్ ఏఐ పెట్టుబడుల్లో కేవలం 1.16 బిలియన్ డాలర్లను మాత్రమే భారత్ ఆకర్షించింది. యూఎస్ ఏకంగా 109.08 బిలియన్ డాలర్ల నిధులను అందుకుంది. నిపుణులు, విస్తృతి పెరిగినప్పటికీ చాట్జీపీటీ లేదా డీప్సీక్ వంటి ప్రపంచవ్యాప్తంగా పేరొందిన చాట్బాట్లు రూపొందించే స్థాయిలో భారత్ పురోగతి సాధించలేదు. ప్రతిభను అగ్రశ్రేణి పరిశోధన, పేటెంట్ పొందిన ఆవిష్కరణలు, బిలియన్ డాలర్ల ఏఐ ఉత్పత్తులను అందించేలా మలచడంలో పర్యావరణ వ్యవస్థ లేకపోవడం భారత్కు ప్రతికూలాంశంగా నిపుణులు చెబుతున్నారు. -
ఒక్క నెలలో 98 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్
ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్ గత జూన్ నెలలో భారత్లో భారీ సంఖ్యలో అకౌంట్లను బ్యాన్ చేసింది. దుర్వినియోగం, హానికరమైన కార్యకలాపాలను నిరోధించే ప్రయత్నాలలో భాగంగా జూన్ నెలలో భారత్లో 98 లక్షలకు పైగా ఖాతాలను నిషేధించింది. వీటిలో 19.79 లక్షల ఖాతాలను యూజర్ల ఫిర్యాదులు రాకముందే బ్యాన్ చేసింది.వాట్సాప్లో అనుమానాస్పద, హానికరమైన ఖాతాలపై యూజర్ల నుంచి ఎప్పటికప్పుడు ఫిర్యాదులు అందుతుంటాయి. అందులో భాగంగా వాట్సాప్ కు భారత్ లోని యూజర్ల నుంచి 23,596 ఫిర్యాదులు అందాయి. వాటిని పరిశీలించి 1,001 ఖాతాలపై చర్యలు తీసుకున్నారు. ఇందులో కొన్ని ఖాతాలను నిషేధించడం, తప్పుగా నిషేధించిన మరికొన్నింటిని పునరుద్ధరించడం వంటివి ఉన్నాయి. వీటిలో 16,069 ఫిర్యాదులు నిషేధ అప్పీళ్లకు సంబంధించినవే కావడం గమనార్హం. ఫలితంగా 756 ఖాతాలపై చర్యలు తీసుకున్నారు. ఇతర ఫిర్యాదులు ఖాతా మద్దతు, ఉత్పత్తి సంబంధిత సమస్యలు, భద్రతా సమస్యల గురించి ఉన్నాయి.ఖాతా క్రియేట్ చేసినప్పుడు, మెసేజ్లు పంపుతున్నప్పుడు, యూజర్ రిపోర్టులు లేదా బ్లాక్స్ వంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు మూడు దశల్లో దుర్వినియోగాన్ని గుర్తిస్తామని వాట్సాప్ వివరించింది. నివారణ తమ ప్రాథమిక దృష్టి అని కంపెనీ తెలిపింది. ఎందుకంటే హానికరమైన చర్యను తరువాత గుర్తించడం కంటే అది జరగడానికి ముందు ఆపడం మరింత ప్రభావవంతంగా ఉంటుంది. దుర్వినియోగం, తప్పుడు సమాచారం, భద్రతా ముప్పులతో పోరాడటానికి ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్, భద్రతా సాధనాలు, ప్రత్యేక బృందాలను ఉపయోగిస్తున్నట్లు వాట్సాప్ యాజమాన్యం పేర్కొంది. -
భౌతికశాస్త్ర నియమాలకు సవాలు.. మస్క్ ఫైటర్ జెట్
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత 'ఎలాన్ మస్క్' టెక్నాలజీలో సరికొత్త మార్గాలను అన్వేషిస్తూ.. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెడుతూనే ఉంటారు. ఇందులో భాగంగానే భౌతిక శాస్త్ర నియమాలనే సవాలు చేసే ఒక కొత్త యుద్ధ విమానాన్ని ఆవిష్కరించారు. దీని పేరు 'యూఎఫ్ఓ ఫైటర్' (UFO Fighter).ఎలాన్ మస్క్ ఆవిష్కరించిన యుద్ధ విమానం యూఎఫ్ఓ ఫైటర్.. ఇప్పటి వరకు ఉన్న అన్ని విమానాలకంటే భిన్నంగా, ప్రత్యేకంగా ఉంటుంది. ఈ జెట్ చాలా వేగంగా ప్రయాణించగలదు. అంతే కాకుండా.. అసాధ్యమైన విన్యాసాలు చేయగలదని, ఆకాశంలో నిశ్శబ్దంగా పనిచేయగలదని మస్క్ వెల్లడించారు.ఇదీ చదవండి: మేమంతా ఆమె వెంటే.. వేలకోట్ల ఆఫర్ వదులుకున్న ఉద్యోగులుమస్క్ ఆవిష్కరించిన కొత్త యూఎఫ్ఓ ఫైటర్.. ఎంతోమంది నిపుణులను సైతం ఆశ్చర్యపరిచింది. కొందరు ఈ ఫైటర్ జెట్ మీద కొంత సందేహాస్పదంగానే ఉన్నారు. ఇది టెక్నాలజీనా? లేక దార్శనిక భావననా? అని అనుకుంటున్నారు. అయితే మస్క్ కొత్త ఆవిష్కరణ ఓ సరికొత్త విప్లవానికి నాంది పలకనుంది. లేటెస్ట్ ఏరోస్పేస్ టెక్నాలజీ మానవాళి భవిష్యత్తుకు దోహదపడుతుందని పలువురు చెబుతున్నారు. అయితే మస్క్ యూఎఫ్ఓ ఫైటర్ గురించి చాలా విషయాలు తెలియాల్సి ఉంది. -
మేమంతా ఆమె వెంటే.. వేలకోట్ల ఆఫర్ వదులుకున్న ఉద్యోగులు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాజ్యమేలుతోంది. ఈ రంగంలో ప్రతిభ ఉన్నవారిని అవకాశాలు తప్పకుండా వెతుక్కుంటూ వస్తాయని ఎంతోమంది నిపుణులు చెబుతూనే ఉన్నారు. ఆ మాటలే ఇప్పుడు నిజమయ్యాయి. కృత్రిమ మేధలో ట్యాలెంట్ ఉన్న ఓ కంపెనీ ఉద్యోగులకు.. దిగ్గజ సంస్థలు వేలకోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చాయి. కానీ వారు మాత్రం తమ బాస్ను వదిలిపెట్టకుండా.. ఆఫర్లను తృణప్రాయంగా భావించారు.మీరా మురాటీ 2025 ఫిబ్రవరిలో ఏఐ స్టార్టప్ 'థింకింగ్ మెషీన్స్ ల్యాబ్' ప్రారంభించారు. ఇందులో పనిచేస్తున్నవారందరూ కూడా గతంలో పెద్ద కంపెనీలలో పనిచేసి వచ్చినవారే. అయితే వీరిలో కొందరికి.. 'మార్క్ జుకర్బర్గ్'కు చెందిన మెటా.. దాని AI సూపర్ ఇంటెలిజెన్స్ బృందంలో చేరడానికి ఒక బిలియన్ డాలర్లను (రూ.8,755 కోట్లు) ఆఫర్ చేసినట్లు ఓ అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.నిజానికి మీరా మురాటీ తన థింకింగ్ మెషీన్స్ ల్యాబ్ ప్రారంభించి.. ఏడాది కూడా పూర్తి కాలేదు. అంతే కాకుండా ఈ కంపెనీ ఒక్క ఉత్పత్తిని కూడా మార్కెట్లోకి విడుదల చేయలేదు. కానీ అప్పుడే ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు భారీ ఆఫర్స్ వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే ఏఐలో నైపుణ్యం ఉన్నవారికి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో స్పష్టమవుతోంది.ఇదీ చదవండి: సమయాన్ని, డబ్బును దేనికి ఖర్చు చేస్తారు?: రాబర్ట్ కియోసాకిథింకింగ్ మెషీన్స్ ల్యాబ్లో పనిచేస్తున్న ఉద్యోగులు మాత్రం.. వారికి వచ్చిన ఆఫర్స్ వద్దనుకుని మీరా మురాటితో పాటు ఉండటానికే ఆసక్తి చూపించినట్లు సమాచారం. దీనికి కారణం మురాటీ నాయకత్వం.. భవిష్యత్ అంచనాలు కారణమై ఉంటాయని పలువురు భావిస్తున్నారు. కాగా ఈ కంపెనీ మార్కెట్ విలువ 12 బిలియన్ డాలర్లు.ఎవరీ మీరా మురాటీ?ఇంజినీరింగ్ చేసిన మీరా మురాటీ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ ‘టెస్లా’లో ప్రొడక్ట్ మేనేజర్గా పనిచేశారు. ఆ తరువాత వర్చువల్ రియాలిటీ స్టార్టప్ ‘లిప్ మోషన్’లో పనిచేసి.. 2016లో ‘ఓపెన్ ఏఐ’లో చేరి అడ్వాన్స్డ్ ఏఐ మోడల్స్, టూల్స్ డెవలప్మెంట్లో కీలక పాత్ర పోషిస్తూ.. చీఫ్ టెక్నికల్ ఆఫీసర్(సీటీవో) స్థాయికి ఎదిగారు. సొంతంగా కంపెనీ స్థాపించాలనే తపనతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘ఓపెన్ఏఐ’కి గుడ్బై చెప్పి.. థింకింగ్ మెషీన్స్ ల్యాబ్ స్థాపించారు.అల్బేనియాలో పుట్టిన మీరా మురాటీకి చిన్నప్పటి నుంచి సాంకేతిక విషయాలపై అమితమైన ఆసక్తి. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు సాంకేతిక జ్ఞానం పరిష్కారం చూపుతుందనేది ఆమె నమ్మకం. అదే ఈ రోజు ఎన్నో గొప్ప కంపెనీలను సైతం ఆకర్శించేలా చేసింది. -
కంటెంట్ క్రియేటర్ల పీక నొక్కిన యూఏఈ
సోషల్ మీడియా ప్రమోషన్ల కోసం కంటెంట్ క్రియేటర్లందరికీ తప్పనిసరిగా ‘అడ్వర్టైజర్ పర్మిట్’ అవసరమని యూఏఈ మీడియా కౌన్సిల్ ప్రకటించింది. కంటెంట్ క్రియేటర్లు అధికారిక వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఈ అనుమతి మంజూరు చేస్తామని తెలిపింది. ఈ విధానం త్వరలో అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. అయితే కంటెంట్ క్రియేటర్లకు ఈ అనుమతులు మొదటి మూడేళ్లు ఉచితంగా ఇవ్వబోతున్నట్లు తెలిపింది. ఆ తర్వాత రెన్యువల్ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.క్రియేటర్లు దరఖాస్తు చేసుకున్న తర్వాత వెరిఫై చేసి ప్రభుత్వం వారికి పర్మిట్ నంబర్లను కేటాయిస్తుంది. ఈ పర్మిట్ నంబర్లను కంటెంట్ క్రియేటర్లు తమ అకౌంట్లపై స్పష్టంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. కౌన్సిల్ నుంచి అనుమతులు పొందిన తరువాత మాత్రమే ప్రకటనలు పోస్ట్ చేయాలి. యూఏఈ మీడియా కౌన్సిల్ సెక్రటరీ జనరల్ మొహమ్మద్ సయీద్ అల్ షెహి మాట్లాడుతూ.. ‘అడ్వర్టైజర్ పర్మిట్ అనేది ప్రజా హక్కులను కాపాడుతుంది. కంటెంట్ సృష్టికర్తలు, ప్రకటనదారులు, ప్రేక్షకుల మధ్య బాధ్యతాయుతమైన, వృత్తిపరమైన సంబంధాలను మెరుగుపరుస్తుంది’ అని చెప్పారు. సొంత ఉత్పత్తులు లేదా సర్వీస్ లేదా కంపెనీని ప్రమోట్ చేయడానికి వ్యక్తిగత ఖాతాలను ఉపయోగించే వారికి ఈ నియమం నుంచి మినహాయింపు ఇస్తామని కౌన్సిల్ పేర్కొంది. ఎడ్యుకేషన్, అథ్లెటిక్, సాంస్కృతిక లేదా అవగాహన కార్యకలాపాలలో పాల్గొనే 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వారికి ఈ వెసులుబాటు ఉంటుందని చెప్పింది.యూఏఈ మీడియా కౌన్సిల్లో స్ట్రాటజీ అండ్ మీడియా పాలసీ సెక్టార్ సీఈఓ మైతా మజీద్ అల్ సువైది మాట్లాడుతూ.. కౌన్సిల్ ద్వారా లైసెన్స్ పొందిన వ్యక్తులతో మాత్రమే కంపెనీలు, సంస్థలు టైఆప్ కావాలని తెలిపారు. విజిటింగ్ కంటెంట్ క్రియేటర్లు ‘విజిటర్ అడ్వర్టైజర్ పర్మిట్’ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మూడు నెలలు చెల్లుబాటు అవుతుంది. తర్వాత మూడు నెలలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి. యూఏఈలో కౌన్సిల్ ఆమోదించిన లైసెన్స్డ్ అడ్వర్టైజింగ్ లేదా టాలెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీల ద్వారా రిజిస్ట్రేషన్లు నిర్వహించనున్నారు.భారత్పై ప్రభావం ఎంతంటే..భారత్ కేవలం యూఏఈకి పొరుగు దేశం మాత్రమే కాదు. ఇది దాని డిజిటల్, కల్చరల్ ఎకోసిస్టమ్లో కీలకమైన స్థానంలో ఉంది. యూఏఈ డిజిటల్ టాలెంట్ పూల్లో భారతీయ క్రియేటర్లు, ఫ్రీలాన్సర్లు, ఇన్ఫ్లూయెన్సర్లు గణనీయమైన భాగం ఉన్నారు. తాజా నిర్ణయంతో యూఏఈ ఆధారిత ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకున్న భారతీయ ఇన్ఫ్లూయెన్సర్లపై ప్రభావం ఉండనుంది. అక్కడ నివసిస్తున్న ఎన్ఆర్ఐలు, భారతీయ ప్రవాసులు కంటెంట్ను సృష్టించడంలో సదరు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. భారతీయ బ్రాండ్లు, ఏజెన్సీలు యూఏఈ ఆధారిత ఇన్ఫ్లుయెన్సర్లతో కలిసి పనిచేయడం లేదా గల్ఫ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ప్రచారాలను నిర్వహించడంలో కొంత ఇబ్బందులు ఎదురవ్వొచ్చు.మన కంటెంట్ క్రియేటర్లకు కొత్త సవాళ్లుప్రమోషనల్ కంటెంట్పై చెల్లుబాటు అయ్యే ప్రకటనదారు పర్మిట్ నెంబరును పొందాల్సి ఉంటుంది. దీన్ని బహిరంగంగా ప్రదర్శించాలి.కంటెంట్ సృష్టించే స్వల్పకాలిక సృష్టికర్తలు లేదా పర్యాటకులకు యూఏఈ ఆధారిత ఏజెన్సీ స్పాన్సర్షిప్ అవసరం.అన్పెయిడ్ ఎండార్స్మెంట్లు ఇప్పుడు నియంత్రణ పరిధిలోకి వస్తాయి.నిబంధనలు పాటించకపోతే భారీ జరిమానాలు, ప్లాట్ఫామ్ ఆంక్షలు లేదా నిషేధానికి కూడా దారితీసే అవకాశం ఏర్పడవచ్చు. ఇక్కడా ఇలాంటి నిబంధనలు?ఇన్ఫ్లూయెన్సర్ రెగ్యులేషన్లో భారత్ అడ్వాన్స్గానే ఉంది. అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ), వినియోగదారుల రక్షణ చట్టం ఇప్పటికే వీటి అవసరాన్ని హైలైట్ చేశాయి. భారత్లో ఇప్పటికే పెయిడ్ కొలాబరేషన్కు సంబంధించిన వివరాలను స్పష్టంగా వెల్లడించాలి. #ad, #sponsored లేదా #collab వంటి హ్యాష్ట్యాగ్లతో కంటెంట్కు లేబులింగ్ ఇవ్వాలి.యూఏఈ తీసుకున్న నిర్ణయం భారత్లో మరిన్ని నియంత్రణ చర్యలకు దారితీసే అవకాశం ఉంది. తప్పుడు సమాచారం, పెయిడ్ ఎండార్స్మెంట్లు, డిజిటల్ మార్కెటింగ్లో ఆర్థిక పారదర్శకతపై పెరుగుతున్న పరిశీలన, భారత ప్రభుత్వం లేదా నియంత్రణ సంస్థలు లైసెన్సింగ్ నమూనాలను కఠినంగా అమలు చేయడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవచ్చు.యూఏఈ అడ్వర్టైజర్ పర్మిట్ రూల్ ప్రయోజనాలుపారదర్శకతవీక్షకులు ప్రమోషనల్ కంటెంట్ను స్పష్టంగా గుర్తించగలరు. మోసపూరిత ప్రకటనల అవకాశాలను తగ్గించవచ్చు. ఇది ఇన్ఫ్లూయెన్సర్లు, ప్రేక్షకుల మధ్య ఎక్కువ నమ్మకాన్ని పెంపొందిస్తుంది.పరిశ్రమపై పక్కా ప్రమాణాలుఇన్ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ కోసం ప్రమాణాలను ఏర్పరుస్తుంది. క్రియేటర్లకు వ్యాపార అవకాశాలు అందిస్తుంది.వినియోగదారుల రక్షణముఖ్యంగా ఫైనాన్స్, హెల్త్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో ప్రేక్షకులను తప్పుదోవ పట్టించే లేదా అప్రకటిత ఎండార్స్మెంట్ల నుంచి రక్షణ లభిస్తుంది. అన్పెయిడ్ ప్రమోషన్లను కూడా నియంత్రిస్తుంది.ప్రభుత్వానికి రెవెన్యూపర్మిట్ ఫీజుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. ఇన్ఫ్లూయెన్సర్ క్యాంపెయిన్లు, బ్రాండ్ కోలాబరేషన్లపై ట్రాకింగ్ ఉంటుంది.ఇదీ చదవండి: ‘టీసీఎస్ నిర్ణయం ప్రమాదకరం’యూఏఈ ప్రకటనతో నష్టాలుచిన్న కంటెంట్ క్రియేటర్లలో నిరుత్సాహంఫ్రీలాన్సర్లు, మైక్రో-ఇన్ఫ్లూయెన్సర్లు, స్పాన్సర్ అవసరాలను నిర్వహించడం కష్టంగా మారుతుంది. కొత్తగా వచ్చేవారిని నిరుత్సాహపరుస్తుంది.యూఏఈ కాని క్రియేటర్లకు..యూఏఐ వెలుపల కంటెంట్ సృష్టికర్తలు (ఉదా. భారతదేశంలో లేదా మరెక్కడైనా) అక్కడి ప్రేక్షకులను ప్రభావితం చేసేందుకు చట్టాలు అడ్డంకిగా మారుతాయి. గ్లోబల్ డిజిటల్ కంటెంట్లో పరిధులు నిర్ధారించినట్లు అవుతుంది.సందర్శకులకు పరిమితులుతాత్కాలికంగా యూఏఈని సందర్శించే సృష్టికర్తలకు (ఉదా.ట్రావెల్ వ్లాగ్లు లేదా ఈవెంట్ల కోసం) పరిమిత అనుమతులుంటాయి. ఇందుకోసం స్థానిక స్పాన్సర్షిప్ అవసరం అవుతుంది. -
రూ.10 వేలకే వచ్చే లేటెస్ట్ బెస్ట్ 5జీ స్మార్ట్ఫోన్లు
ప్రతి నెలా ఏవో కొత్త ఫోన్లు వస్తూనే ఉంటాయి. అయితే వినియోగదారుడి అవసరాలకు సరిపోయే, బడ్జెట్కు తగిన స్మార్ట్ఫోన్లు కొన్నే ఉంటాయి. వాటిని ఎంచుకోవడం కష్టమైన పనిగా మారింది. ఈ నేపథ్యంలో సామాన్య వినియోగదారులకు బడ్జెట్లో అంటే రూ.10 వేల లోపు ధరలో జూలైలో వచ్చిన కొన్ని బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్ల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం.శాంసంగ్ ఎం06 5జీ🔹శాంసంగ్ ఎం06 5జీ స్మార్ట్ఫోన్లో 6.7 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లేను అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, ఆర్మ్ మాలి జీ57 ఎంసీ2 జీపీయూ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేస్తుంది. 4/6 జీబీ LPDDR4X ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు🔹వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ షూటర్ ఉంది.🔹సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5 ఎంఎం హెడ్ఫోన్ జాక్, సింగిల్ బాటమ్ ఫైరింగ్ స్పీకర్ ఉన్నాయి. 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉంది.ఇన్ఫినిక్స్ హాట్ 60🔹ఇన్ఫినిక్స్ హాట్ 60లో 6.7 అంగుళాల హెచ్డీ+ పంచ్ హోల్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. ఇది 7.8 మిమీ మందంతో ఉంటుంది. వాటర్, డస్ట్ ప్రూఫ్ కోసం ఐపీ 64 రేటింగ్ పొందింది. అంటే ఇది స్ప్లాష్లు, తేలికపాటి నీటి చుక్కలు పడినా ఏమీకాదు.🔹హాట్ 60 5జీ + మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ఎస్ఓసీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ సింగిల్ 6 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లో వస్తుంది. మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా 2 టీబీ వరకు అదనపు స్టోరేజ్ను పెంచుకోవచ్చు.🔹హాట్ 60 5జీ ప్లస్లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, ఎల్ఈడీ ఫ్లాష్ సపోర్ట్తో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 15 ఆధారిత కొత్త ఎక్స్ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై ఇది పనిచేస్తుంది.🔹18వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5,200 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.లావా స్టార్మ్ ప్లే🔹లావా స్టార్మ్ ప్లే ఫోన్లో 6.75 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్, 6 జీబీ ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 128 జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఎక్స్పాండబుల్ స్టోరేజ్ సపోర్ట్తో ఈ ఫోన్ పనిచేస్తుంది.🔹50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 752 ప్రైమరీ షూటర్, 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ కూడా ఉంది.🔹18వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.ఐక్యూ జెడ్10 లైట్ 5జీ🔹ఐక్యూ జెడ్10 లైట్ 6.74 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్పై ఈ ఫోన్ పనిచేస్తుంది. 8 జీబీ వరకు ఎల్ పీడీడీఆర్ 4ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్, మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా 1 టీబీ ఎక్స్ టర్నల్ స్టోరేజ్ పొందవచ్చు.🔹ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 15వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.🔹ఆప్టిక్స్ విషయానికి వస్తే, జెడ్ 10 లైట్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్తో వస్తుంది. వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ కూడా ఉంది. -
ఎయిర్టెల్ కొత్త రీచార్జ్ ప్లాన్.. ఓటీటీలన్నీ ఫ్రీ..
ఓటీటీ వినియోగదారుల కోసం టెలికాం కంపెనీలు అనేక ప్లాన్లను అందిస్తున్నాయి. అయితే ఇలాంటి ప్లాన్లలో చాలా వరకు ఖరీదైనవి లేదా ఒకటీ రెండు ఓటీటీ సర్వీసులకు మాత్రమే యాక్సెస్ కల్పిస్తాయి. కానీ ఎయిర్టెల్ ఓటీటీ వినియోగదారుల కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఇది ఒకటీ రెండు కాదు నెట్ఫ్లిక్స్, జియో హాట్స్టార్ సహా రెండు డజన్లకు పైగా ఓటీటీ ప్లాట్ఫామ్లకు ఉచిత యాక్సెస్ అందిస్తుంది.ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ పోర్ట్ఫోలియోలో ఎంపిక చేసిన ఆల్-ఇన్-వన్ ఓటీటీ ప్లాన్లను చేర్చింది. అంటే ఒక్క రీఛార్జ్ లో ఒకటీ రెండు కాదు అనేక ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు యాక్సెస్ లభిస్తుంది. ఈ ప్లాన్ల జాబితాలో రూ .279 రీఛార్జ్ టారిఫ్ ఉంది. పూర్తి నెల వాలిడిటీతో వస్తుంది. దీనితో రీఛార్జ్ చేస్తే నెల రోజుల పాటు ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ లభిస్తుంది.రూ.279తో ఆల్ ఇన్ వన్ ఓటీటీ ప్లాన్ఎయిర్టెల్ యూజర్లకు అందిస్తున్న ఈ ప్లాన్ డేటా బూస్టర్ లేదా డేటా ఓన్లీ ప్లాన్. కాబట్టి ఇందులో కాలింగ్ లేదా ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. అయితే ఒక నెల వ్యాలిడిటీతో 1 జీబీ అదనపు డేటా లభిస్తుంది. వినియోగదారులు ఏదైనా యాక్టివ్ ప్లాన్తో దీన్ని రీఛార్జ్ చేసుకోవచ్చు.ఈ ప్లాన్ అందిస్తున్న ఓటీటీ సేవల జాబితాలో నెట్ఫ్లిక్స్ బేసిక్, జియో హాట్స్టార్ సూపర్, జీ5 ప్రీమియం వంటి పెద్ద సబ్స్క్రిప్షన్లు ఉన్నాయి. వీటితో పాటు ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ ప్లే ప్రీమియం సబ్స్క్రిప్షన్ కూడా అందుబాటులో ఉంది. దీనితో వినియోగదారులు 25 కంటే ఎక్కువ ఓటీటీ సేవల కంటెంట్ను చూడవచ్చు. ఎక్స్స్ట్రీమ్ ప్లే ప్రీమియంలో సోనీలివ్, లయన్స్గేట్ ప్లే, ఆహా, చౌపాల్, హోయిచోయ్ వంటి ప్లాట్ఫామ్లను చేర్చారు. -
కాగ్నిజెంట్లో జీతాల పెంపు.. సీఎఫ్వో కీలక ప్రకటన
ఐటీ సేవల దిగ్గజం కాగ్నిజెంట్లో ఉద్యోగుల జీతాల పెంపుపై కీలక ప్రకటన చేశారు ఆ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్వో) జతిన్ దలాల్. 2025 ద్వితీయార్థంలో చాలా మంది ఉద్యోగులకు వేతన పెంపును అమలు చేయాలని కంపెనీ యోచిస్తోందని, అయితే స్థూల ఆర్థిక అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో వేతన పెంపు తేదీని ఇంకా నిర్ణయించలేదని జతిన్ దలాల్ జూలై 31న కంపెనీ క్యూ 2 ఎర్నింగ్ కాల్ సందర్భంగా చెప్పారు.న్యూజెర్సీ కేంద్రంగా పనిచేస్తున్న కాగ్నిజెంట్ సాధారణంగా ఆగస్టు 1 నుంచి వార్షిక వేతన పెంపును ప్రారంభిస్తుంది. అయితే ఈ ఏడాది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), విప్రో, హెచ్సీఎల్టెక్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ వంటి సంస్థలతో కలిసి కాగ్నిజెంట్ వేతన ఇంక్రిమెంట్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు వేతన పెంపును అమలు చేసిన ఏకైక ప్రధాన టైర్-1 ఐటీ సంస్థగా ఇన్ఫోసిస్ నిలిచింది.స్థూల ఆర్థిక వాతావరణం, దాని చుట్టూ ఉన్న అనిశ్చితి దృష్ట్యా వేతనాల పెంపుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని దలాల్ పేర్కొన్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో అమలు చేసే వేతన పెంపులో మెజారిటీ ఉద్యోగులను కవర్ చేయాలనేది తమ ప్రయత్నమని చెప్పారు. అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ, కాగ్నిజెంట్ స్థిరమైన హెడ్ కౌంట్ వృద్ధిని నివేదిస్తూనే ఉంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ వరుసగా 7,500 మంది ఉద్యోగులను చేర్చుకుంది, మొత్తం ఉద్యోగుల సంఖ్య 343,800 కు చేరుకుంది. అట్రిషన్ గత త్రైమాసికంతో పోలిస్తే 60 బేసిస్ పాయింట్లు తగ్గి పన్నెండు నెలల ప్రాతిపదికన 15.2 శాతానికి తగ్గింది. -
ఇదిగో ఈ 40 రకాల ఉద్యోగాలకు డేంజర్!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవంలో భాగంగా చాట్ జీపీటీ ప్రవేశపెట్టినప్పటి నుంచి విశ్లేషకులు, నిపుణులు, సీఈఓలు వైట్ కాలర్ రోల్స్ లో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఏఐ ప్రభావం కలిగించే లేదా పూర్తిగా భర్తీ చేసే అవకాశం ఉన్న 40 రకాల ఉద్యోగాలను మైక్రోసాఫ్ట్ మద్దతుతో నిర్వహించిన ఒక తాజా అధ్యయనం జాబితా చేసింది.ఉపాధ్యాయులు, పాత్రికేయులు, కాల్ సెంటర్ ఏజెంట్లు వంటి వృత్తులు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఓపెన్ఏఐ, లింక్డ్ఇన్ సహకారంతో నిర్వహించిన ఈ పరిశోధన ప్రపంచ శ్రామిక శక్తిలోని వివిధ రంగాల్లో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తృత ప్రభావాన్ని ఎత్తిచూపింది.చాట్ జీపీటీ వంటి ఏఐ సాధనాలను వేగంగా స్వీకరించడంపై పెరుగుతున్న ఆందోళనల మధ్య ఈ అధ్యయనం జరిగింది. ఈ ఏడాది ఒక్క మైక్రోసాఫ్ట్ మాత్రమే దాదాపు 15,000 తొలగింపులను ప్రకటించింది.ఏఐతో దెబ్బతినే ఉద్యోగాలుటెలిమార్కెటర్లు, ఉపాధ్యాయులు, కస్టమర్ సర్వీస్ ప్రతినిధులు, సైకాలజిస్టులు, న్యాయమూర్తులు, సామాజిక శాస్త్రవేత్తలు, న్యూస్ అనలిస్టులు, పాత్రికేయులు, టెక్నికల్ రైటర్లు, ప్రూఫ్ రీడర్లు, అనువాదకులు, సామాజిక కార్యకర్తలు, బీమా అండర్ రైటర్లు, ఆంత్రోపాలజిస్టులు, క్లినికల్ డేటా మేనేజర్లు, సర్వే పరిశోధకులు, చరిత్రకారులు, రాజకీయ శాస్త్రవేత్తలు, ఆర్బిట్రేటర్లు, ఎపిడెమియాలజిస్టులు, హెచ్ఆర్ స్పెషలిస్టులు, మధ్యవర్తులు, కెరీర్ కౌన్సిలర్లు, క్యూరేటర్లు, కరస్పాండెంట్లు, కాపీ రైటర్లు, ఎడిటర్లు, మార్కెట్ రీసెర్చ్ అనలిస్టులు, లీగల్ సెక్రటరీలు, ట్రైనింగ్ స్పెషలిస్టులు, పబ్లిక్ రిలేషన్స్ స్పెషలిస్టులు.పెద్దగా ముప్పు లేని ఉద్యోగాలుక్లీనర్లు, డిష్ వాషర్లు, కార్మికులు, కార్పెంటర్లు, పెయింటర్లు, రూఫర్లు, మెకానిక్లు, వెల్డర్లు, బచర్స్, బేకర్లు, డెలివరీ వర్కర్లు, వంటవారు, కాపలాదారులు, డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, భవన నిర్మాణ కార్మికులు, సెక్యూరిటీ గార్డులు, మేస్త్రీలు, టైలర్లు. -
మోటరోలా కొత్త ఫోన్.. రూ.18వేల లోపే పవర్ఫుల్ మొబైల్
స్మార్ట్ఫోన్ బ్రాండ్ మోటరోలా తాజాగా మోటో జీ86 పవర్ ఫోన్ను ఆవిష్కరించింది. ఇందులో 8జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ వెర్షన్ ధర రూ. 17,699గా ఉంటుంది. అదనంగా రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంటు పోగా రూ. 16,999కే లభిస్తుందని కంపెనీ తెలిపింది.ఇందులో 6.67 అంగుళాల పీఓఎల్ఈడీ సూపర్ హెచ్డీ ఫ్లాట్ డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ 7ఐ, 50 ఎంపీ ఓఐఎస్ సోనీ కెమెరా, రెండు రోజుల వరకు సరిపోయే 6720 ఎంఏహెచ్ బ్యాటరీ, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్ మొదలైన ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో అన్ని లెన్స్లతో 4కే వీడియో రికార్డింగ్ చేసే వీలుంటుంది.మోటరోలా జీ86 పవర్ స్పెసిఫికేషన్లు🔹మోటరోలా జీ86 పవర్ లో 6.67 అంగుళాల 1.5కే పీఓఎల్ఈడీ సూపర్ హెచ్డీ ఫ్లాట్ డిస్ప్లే, 4500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్ ఉన్నాయి.🔹మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఇందులో అందించారు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత హలో యూఐ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ డివైజ్ 1 సంవత్సరం ఓఎస్ అప్ గ్రేడ్ లు మరియు 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్ డేట్ లను అందిస్తుంది.🔹వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా కూడా ఉంది. ఈ స్మార్ట్ఫోన్ వెనుక భాగంలో ఫ్లిక్కర్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఏఐ ఫోటో ఎన్హాన్స్మెంట్, ఏఐ సూపర్ జూమ్, ఏఐ ఆటో స్మైల్ క్యాప్చర్, టిల్ట్ షిఫ్ట్ మోడ్ వంటి స్మార్ట్ ఫీచర్లతో మోటో ఏఐ లభిస్తుంది.🔹ఇందులోని 6,720 ఎంఏహెచ్ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 53 గంటల రన్ టైమ్ తో 2 రోజులకు పైగా పవర్ ను అందిస్తుంది. ఇందులో 33వాట్ టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జర్ ను అందించారు. -
మరో ఐదేళ్లలో విభిన్న రంగాల్లో ఏఐ పాగా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలు ప్రస్తుత ఉద్యోగుల స్థానాన్ని క్రమంగా ఆక్రమిస్తున్నాయి. ఇప్పటికే చాలా సంస్థల్లోని క్లర్క్, మేనేజర్ స్థాయి ఉద్యోగాల్లో ఏజెంటిక్ ఏఐ పాగా వేసిందని సర్వీస్నౌ 2025 నివేదిక తెలిపింది. మానవులతో కలిసి పనిచేసే ఏజెంటిక్ ఏఐ పనులను ఆటోమేట్ చేయడమే కాకుండా పనిని ఎలా అంచనా వేయాలి.. మరింత సమర్థంగా ఎలా నిర్వహించాలో విశ్లేషించి అమలు చేస్తుంది.నివేదికలోని అంశాలుకంపెనీలు పేరోల్ క్లర్కులు, మేనేజర్ల స్థానంలో ఏఐ ఏజెంట్లను పూర్తిగా నియమిస్తున్నాయి.సిస్టమ్ అడ్మిన్లు, కన్సల్టెంట్ల స్థానంలో కంపెనీలు ఏఐ టూల్స్తో భాగస్వామ్యం ఏర్పరుచుకొని కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.ఏఐతో సంబంధం ఉన్న కాన్ఫిగరేటర్లు, ఎక్స్ పీరియన్స్ డిజైనర్లు, డేటా సైంటిస్టు పోస్టుల్లో కొత్తగా నియామకాలు చేపడుతున్నాయి.2030 నాటికి తయారీ రంగంలో 8 మిలియన్ల ఉద్యోగాలు ఏఐ వల్ల ప్రభావితం చెందుతాయి.రిటైల్లో 7.6 మిలియన్ ఉద్యోగాలు, ఉడ్యుకేషన్లో 2.5 మిలియన్ కొలువులు ప్రభావితం అవుతాయి.టెక్ పరిశ్రమల్లో కొత్తగా 3 మిలియన్ల ఉద్యోగాలు వస్తాయి.భారత్లో 25% సంస్థలు కృత్రిమ మేధ అనుసరించేలా పరివర్తన దశలో ఉన్నాయి. ఈ విషయంలో సింగపూర్, ఆస్ట్రేలియా కంటే భారత్ ముందుంది.13.5% టెక్నాలజీ బడ్జెట్లు ఇప్పటికే కృత్రిమ మేధకు కట్టుబడి ఉన్నాయి.57% సంస్థలు ఏఐ సామర్థ్య లాభాలను నివేదించాయి.ఏఐ రీడిజైన్ చేసిన వర్క్ఫ్లోల నుంచి 63% ఉత్పాదకత పెరిగింది.సవాళ్లు ఇవే..ఏఐ వినియోగం పెరుగుతున్నా 30% సంస్థలకు డేటా భద్రత ఆందోళనగా మారుతుంది.టెక్ కంపెనీల్లోని 26 శాతం ఉద్యోగులకు ఏఐ భవిష్యత్తు నైపుణ్యాలపై అవగాహన లేదు.కీలక అంశాలపై నిర్ణయం తీసుకోవడంలో కృత్రిమ మేధను ఏమేరకు నమ్మాలో ప్రశ్నార్థకంగా మారుతుంది.ఇదీ చదవండి: ‘వేగంగా ఏఐ విస్తరణ.. మార్పునకు సిద్ధపడాలి’ -
‘వేగంగా ఏఐ విస్తరణ.. మార్పునకు సిద్ధపడాలి’
కృత్రిమ మేధ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు, వ్యవస్థలు మార్పుకు అనుగుణంగా సిద్ధంగా ఉండాలని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్గేట్స్ అన్నారు. లేదంటే సమస్యలు తప్పవని హెచ్చరించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఏఐ ఉత్పాదకతను పెంచే క్రమంలో చాలామంది సిబ్బంది తమ కొలువులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.ఏఐ వాడకం అనివార్యం‘కృత్రిమ మేధ నేతృత్వంలోని ఆటోమేషన్ ఒక సానుకూల మార్పు. ఇది ప్రజలను, ఉద్యోగులను ఇతర మెరుగైన కొలువులు చేయడానికి సాయం చేస్తుంది. ఉత్పాదకతను మెరుగుపరిచే క్రమంలో ఏఐ వాడకం అనివార్యం అవుతుంది. కాబట్టి అందుకు అనువుగా మార్పులకు సిద్ధంగా ఉండాలి. లేదంటే సమస్యలు వస్తాయి. ఏఐ వేగంగా విస్తరిస్తోంది. అంత వేగంగా వచ్చే మార్పులకు సర్దుకుపోయే సమయం ఉండదనేదే ప్రశ్న’ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఎంత వేగంగా అమలవుతున్నాయోనన్న ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.రోబోటిక్ ఆయుధాలు..రాబోయే రోజుల్లో అనేక ఎంట్రీ లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భర్తీ చేయవచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానం మెరుగుపడిన తర్వాత భవిష్యత్తులో మాన్యువల్ లేబర్ తీవ్రంగా ప్రభావితం చెందుతుంది. ‘రోబోటిక్ ఆయుధాలు ఇంకా అభివృద్ధి చెందలేదు. కానీ అవి అందుబాటులోకి వస్తే, శ్రామిక శక్తిని పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తాయి’ అని గేట్స్ చెప్పారు.ఏజీఐతో ముప్పు‘ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్(ఏజీఐ) ఆన్లైన్ సేల్స్ లేదా కస్టమర్ సర్వీస్ వంటి సంక్లిష్ట పనులను మానవుల కంటే మెరుగ్గా చేయగలదు. ఏజీఐ వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు విషయాల ద్వారా సర్వీసు అందిస్తాయి. యంత్రాలు తక్కువ ఖర్చుతో మరింత కచ్చితత్వంతో పనులను నిర్వహించగలిగితే మాత్రం అది పెద్ద మార్పు అవుతుంది’ అని గేట్స్ తెలిపారు.ఇదీ చదవండి: యూపీఐ చెల్లింపులకు పిన్ అవసరం లేదు?కచ్చితమైన డేటాఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఎలా వాడుతున్నారని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ..‘ఏఐ పురోగతిలో ఉన్న వేగం నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కఠినమైన విషయాలను అర్థం చేసుకోవడానికి ఏఐ రీసెర్చ్ టూల్స్ను ఉపయోగిస్తాను. అయితే వాటిలోని అంశాలను ధ్రువీకరించేందుకు నిపుణులతో తరచూ తనిఖీ చేస్తాను. విచిత్రంగా వారుకూడా చాలాసార్లు అందులోని అంశాలు నిజమనే చెబుతారు’ అని అన్నారు. -
యూపీఐ చెల్లింపులకు పిన్ అవసరం లేదు?
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) యూపీఐ లావాదేవీల కోసం ప్రస్తుతం ఉన్న పిన్ స్థానంలో బయోమెట్రిక్, ఫేస్ఐడీ ఆధారిత ధ్రువీకరణను ప్రవేశపెట్టాలని పరిశీలిస్తున్నట్లు బిజినెస్ స్టాండర్డ్ తెలిపింది. ఇది అమల్లోకి వస్తే డిజిటల్ లావాదేవీలు జరిపే సమయంలో యూజర్లు తమ యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా కేవలం బయోమెట్రిక్(ఫింగర్ప్రింట్) లేదా ఫేస్ ఐడీని ఉపయోగించి చెల్లింపులు చేయవచ్చు. అయితే దీనిపై ప్రభుత్వ యంత్రాంగం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని గమనించాలి.ప్రస్తుతం యూపీఐ లావాదేవీలు చేసేందుకు 4 నుంచి 6 అంకెల పిన్ అవసరం. చెల్లింపులు చేసినప్పుడు కచ్చితంగా వినియోగదారులు ఈ పిన్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ పిన్ పేమెంట్ గేట్వేకు సెక్యూరిటీ లేయర్గా పనిచేస్తుంది. డిజిటల్ ప్లాట్ఫామ్లను ఉపయోగించడం సౌకర్యవంతంగా లేని వ్యక్తులకు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు లేదా గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఇది ఎంటర్ చేయడం అడ్డంకిగా మారుతుంది. దాంతో కొత్త విధానాన్ని ఉపయోగించాలని ఎన్పీసీఐ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా బయోమెట్రిక్ అథెంటికేషన్తో లేదా ముఖ గుర్తింపు వంటి భౌతిక లక్షణాల ద్వారా యూజర్ను ధ్రువీకరించే ప్రక్రియను పరిశీలిస్తున్నారు.ఇదీ చదవండి: భారత్లో స్టార్లింక్ సబ్స్క్రిప్షన్ ఎంతంటే..ఈ చర్య పెద్ద సంఖ్యలో వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. పాస్వర్డ్లను గుర్తుంచుకోవడంలో ఇబ్బంది పడేవారికి బయోమెట్రిక్, ఫేస్ఐడీ ఆమోదంతో డిజిటల్ చెల్లింపులను సులభతరం చేయవచ్చని ప్లూటోస్ వన్ వ్యవస్థాపకులు, మేనేజింగ్ పార్టనర్ రోహిత్ మహాజన్ ఎకనామిక్ టైమ్స్కు చెప్పారు. ఇది డిజిటల్ లావాదేవీలను సులభతరం చేయడానికి, వీటిని మరింత మందికి అందుబాటులోకి తీసుకురావడానికి సహాయపడుతుందన్నారు. అదే సమయంలో బయోమెట్రిక్ వ్యవస్థలు మోసాలను కూడా తగ్గిస్తాయని చెప్పారు. పిన్ ఎంటర్ చేయడంతో పోలిస్తే వినియోగదారుల భౌతిక లక్షణాలు డూప్లికేట్ చేయడం లేదా దొంగిలించడం కష్టమన్నారు. -
భారత్లో స్టార్లింక్ సబ్స్క్రిప్షన్ ఎంతంటే..
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలోని ‘స్టార్లింక్’ ఇంటర్నెట్ సేవల సంస్థకు భారత్లో ద్వారాలు తెరచుకున్న నేపథ్యంలో సబ్స్క్రిప్షన్ ఎంత ఉండబోతుందనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే భూటాన్, ఇండోనేషియా, ఒమన్, మాల్దీవులు.. వంటి ఆసియా దేశాల్లో స్టార్లింక్ వసూలు చేస్తున్న ఛార్జీలను పరిగణలోకి తీసుకుని భారత్లో నెలవారీ ఇంటర్నెట్ సర్వీసులు ఎంతో ఉండొచ్చనే దానిపై కావాలనుకునేవారు ఎంత చెల్లించాలనే వివరాలపై కొన్ని అంచనాలు వెలువడుతున్నాయి.ఇదీ చదవండి: త్వరలో మడతెట్టే యాపిల్ ఫోన్?స్టార్లింక్కు సంబంధించి కొన్ని అంశాలు..ఇంటర్నెట్ స్పీడ్ 200 ఎంబీపీఎస్ వరకు ఉంటుంది. లొకేషన్ను అనుసరించి సగటు వేగం 100 ఎంబీపీఎస్గా ఉండొచ్చు.మారుమూల, గ్రామీణ ప్రాంతాలకు లో-ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ల ద్వారా ఇంటర్నెట్ అందిస్తారు.వినియోగదారులు, ఆయా ప్రాంతాన్ని బట్టి నెలకు రూ.3,000 నుంచి రూ.4,200 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.హార్డ్ వేర్ కిట్లో భాగంగా శాటిలైట్ డిష్, రౌటర్ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని ధర సుమారు రూ.33,000 ఉండొచ్చు.ఇంటర్నెట్ సర్వీసుల కోసం అనువైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఎయిర్టెల్, జియోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.బీఎస్ఎన్ఎల్ వంటి ప్రస్తుత టెలికాం సంస్థలకు అంతరాయం కలగకుండా ఉండటానికి భారతదేశం అంతటా 20 లక్షల కనెక్షన్లకే పరిమితం చేశారు. అంతకంటే ఎక్కువ కనెక్టన్లు ఇవ్వకూడదు.2025 చివరి నాటికి భారత్లో ఈ సర్వీసులు లాంచ్ చేస్తారని అంచనా. తర్వలో ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. -
త్వరలో మడతెట్టే యాపిల్ ఫోన్?
స్మార్ట్ ఫోన్ తయారీ రంగంలో నిత్యం కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు తమ వినియోగదారుల అభిరుచులకు తగినట్లుగా ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. అయితే ప్రపంచంలోనే టాప్ కంపెనీగా ఉన్న యాపిల్ మాత్రం ఈ విభాగంలో ఉత్పత్తులను తీసుకురాలేదు. కానీ ఎట్టకేలకు ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ విభాగంలో యాపిల్ అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.యాపిల్ 2026లోనే ఫోల్డబుల్ ఫోన్ను విపణిలోకి తీసుకురాబోతుందని కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురిస్తున్నాయి. టెక్ విశ్లేషకులు, ఇన్సైడర్ల వివరాల ప్రకారం ఫోల్డబుల్ ఐఫోన్ 2026 ద్వితీయార్ధంలో ఐఫోన్ 18 సిరీస్తో పాటు ఆవిష్కరించే అవకాశం ఉంది. ఐఫోన్ ఎక్స్ తర్వాత యాపిల్ తన ఉత్పత్తుల్లో చేయనున్న అతిపెద్ద డిజైన్ మార్పు ఇదేనని చెబుతున్నారు. ఫోల్డబుల్ ఐఫోన్ శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ సిరీస్ను పోలిన బుక్ స్టైల్ ఫోల్డింగ్ విధానంలో ఉంటుందని చెబుతున్నారు.ఇదీ చదవండి: కార్డు ఉంది కదా అని రెచ్చిపోతున్నారు!జేపీ మోర్గాన్ అనలిస్ట్ సమిక్ ఛటర్జీ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఫోల్డబుల్ ఐఫోన్ 7.8 అంగుళాల ఇన్నర్ డిస్ప్లే, 5.5 అంగుళాల బాహ్య డిస్ప్లేను కలిగి ఉంటుందని అంచనా వేశారు. ఈ ఫోన్ ధరపై కూడా కొందరు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా అంచనా వేస్తున్నారు. ఫోల్డబుల్ ఐఫోన్ ప్రారంభ ధర 1,999 డాలర్లుగా ఉంటుందని సూచిస్తున్నారు. ఇది ఇండియాలో సుమారు రూ.1.75 లక్షలుగా ఉండొచ్చని చెబుతున్నారు. -
ఇన్ఫోసిస్ చల్లని కబురు: తొలగించడం కాదు.. చేర్చుకుంటాం
టీసీఎస్ లేఆఫ్ల ప్రకటన తర్వాత దేశ ఐటీ పరిశ్రమలో కల్లోల వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆందోళనలో ఉన్న ఐటీ ఉద్యోగార్థులకు దేశీయ రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది 20,000 మంది గ్రాడ్యుయేట్లను నియమించుకోనున్నట్లు ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ ధృవీకరించారు.మొదటి త్రైమాసికంలో 17,000 మందిని (స్థూల నియామకాలు) నియమించుకున్నామని, ఈ ఏడాది ఇంకా 20,000 మంది కాలేజీ గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని యోచిస్తున్నట్లు ఆయన ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రీస్కిల్లింగ్లలో వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టడం ద్వారా కంపెనీ కాస్త ముందంజలో ఉందన్న పరేఖ్.. ఇప్పటి వరకు వివిధ స్థాయిల్లో 2,75,000 మంది ఉద్యోగులకు శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు.పోటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 12,000 మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇన్ఫోసిస్ సీఈవో నియామకాలను ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మరే ఇతర భారతీయ ఐటీ కంపెనీ కూడా ఈ స్థాయిలో లేఆఫ్లను ప్రకటించలేదు.ఏఐ ప్రభావంపై..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం గురించి పరేఖ్ మాట్లాడుతూ, "కృత్రిమ మేధ లోతైన ఆటోమేషన్, అవగాహనను అందిస్తుంది. అదే సమయంలో ఉన్నత స్థాయి నైపుణ్యాలు, ప్రతిభ అవసరం" అని అన్నారు. ఉద్యోగులు,సాంకేతికత రెండింటి పట్ల దీర్ఘకాలిక నిబద్ధతను ప్రతిబింబిస్తూ ఇన్ఫోసిస్ తన శ్రామిక శక్తిని విస్తరిస్తుందని పేర్కొన్నారు.వేతనాల పెంపుపై..గత ఆర్థిక సంవత్సరం క్యూ4, క్యూ1లకు వేతనాల పెంపును కంపెనీ ఇప్పటికే పూర్తి చేసిందని పరేఖ్ తెలిపారు. "ఇప్పుడు ఈ సైకిల్ పూర్తయింది. ఎప్పటిలాగే తదుపరి రౌండ్ కోసం సమయాన్ని అంచనా వేయడం ప్రారంభించాం. మా ప్రస్తుత ప్రక్రియకు కట్టుబడి ఉంటాం. సరైన సమయంలో తదుపరి రౌండ్ను ప్రకటిస్తాం" అని పరేఖ్ వివరించారు.👉 ఇదీ చదవండి: TCS layoffs: రంగంలోకి కేంద్ర ప్రభుత్వం! -
మర మనుషులు.. కేవలం రూ.5 లక్షలే!
భలే మంచి చౌక బేరము.. రూ.5.12 లక్షలకే హ్యూమనాయిడ్ రోబో అంటోంది చైనాకు చెందిన ఓ కంపెనీ. రోబో.. అంటేనే ఖరీదైన వ్యవహారం. అందులోకి, అచ్చం మనిషిలా ఉండి, మనిషి చేయగలిగే చాలా పనులు చేసే హ్యూమనాయిడ్ రోబో అంటే.. ఇంకా ఖరీదు. కానీ.. అస్సలు కాదు అంటోంది చైనా దిగ్గజం యూనిట్రీ రోబోటిక్స్. రోబోల తయారీలో మంచి పేరున్న ఈ కంపెనీ ఆర్1 హ్యూమనాయిడ్ను తయారుచేసింది. దీని ధర కేవలం 5,900 డాలర్లు (రూ.5.12 లక్షలు) మాత్రమేనట. కంపెనీ గతంలో అందుబాటులోకి తెచ్చిన జీ1తో పోలిస్తే కొత్త మోడల్ ధర 63 శాతం తక్కువ కావడం విశేషం.గంటపాటు నిర్విరామంగా..ఈ హ్యూమనాయిడ్ ఎత్తు 121 సెంటీమీటర్లు, వెడల్పు 35.7 సెం.మీ. మందం 19 సెం.మీ.కేవలం 25 కేజీల బరువే ఉండటం కూడా వాడకందారులకు చాలా సౌలభ్యం.వాయిస్ గుర్తించేందుకు నాలుగు మైక్రోఫోన్స్, అల్ట్రావైడ్ యాంగిల్ విజువల్స్ కోసం బైనాక్యులర్ కెమెరా పొందుపరిచారు. వైఫై 6, బ్లూటూత్ 5.2 కనెక్టివిటీ ఉంది.బ్యాటరీ ఒకసారి రీచార్జ్ చేస్తే రోబో గంటపాటు పనులు చక్కబెడుతుంది.మాన్యువల్ రిమోట్ కంట్రోల్తో పనిచేస్తుంది.పూర్తి కస్టమైజేబుల్.. అంటే కస్టమర్ కోరిన విధంగా మార్పులు చేసి కూడా తయారు చేస్తారు.యూనిట్రీ రోబోటిక్స్ ఆర్1 హ్యూమనాయిడ్.. పరుగెడుతుంది, నడుస్తుంది, పిల్లిమొగ్గలు వేస్తుంది, చేతుల మీద నిలబడుతుంది. మనం ఇచ్చే వాయిస్ ఆదేశాలకు ప్రతిస్పందిస్తుంది. పరిసరాలను అర్థం చేసుకుంటుంది. ప్రయోగాలకు అనువుగా ఇది పనిచేస్తుంది. అంటే టెక్ కంపెనీలు ఈ హ్యూమనాయిడ్ను మరింతగా అభివృద్ధి చేసేందుకు వీలు కూడా ఉండటం దీనిలోని మరో ప్రత్యేకత. ఆఫీసులు, ఇంటి పనుల కోసం పని మనుషులను పెట్టాలనుకునేవాళ్లు దీన్ని ట్రై చేయొచ్చు అంటోంది కంపెనీ.ఆర్1.. ఒక మైలురాయిఫ్యాక్టరీలు, ఇంటి పనులకు సంబంధించి హ్యూమనాయిడ్ల తయారీలో ఇంతవరకు అమెరికన్ కంపెనీల ఆధిపత్యం ఉండేది. ఇప్పుడు చైనా కంపెనీలు ఈ రేసులోకి ‘తక్కువ ధరకే’ ట్యాగుతో వచ్చాయి. ఇవి పై రెండు రకాల పనులతోపాటు మిలటరీలో కూడా ఉపయోగపడతాయట. చైనాలోని పరిశోధనా ప్రయోగశాలలు, పాఠశాలల్లో వాడుతున్న యూనిట్రీ కంపెనీ తయారీ జీ1 రోబో ధర 16,000 డాలర్లుగా ఉంది. మరింత అధునాతన, పెద్ద సైజులో ఉండే హెచ్1 మోడల్ ధర 90,000 డాలర్ల కంటే ఎక్కువ. అందరికీ అందుబాటు ధరలో ఏకంగా 5,900 డాలర్లకే ఇప్పుడు ఆర్1 హ్యూమనాయిడ్ను తీసుకొచ్చింది. ఇది సంక్లిష్ట హ్యూమనాయిడ్ల విభాగంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.ఇదీ చదవండి: ‘లేఆఫ్స్ నిర్ణయం ఎంతో భారం’.. అయినా తప్పట్లేదు!రోజువారీ జీవితంలో మమేకం..మీరు ఉదయం లేవగానే మీ కదలికలను రోబో గుర్తిస్తుంది.కాఫీ మెషీన్ను ఆపరేట్ చేస్తుంది.ఒకవేళ మీకు కళ్లజోడు అలవాటు ఉంటే.. అది ఎక్కడ ఉన్నా తెచ్చి మీ చేతికి ఇస్తుంది.ఆ రోజు చేయాల్సిన మీ షెడ్యూల్ను చదువుతుంది.మీ బిడ్డకు సైన్స్, మ్యాథ్స్.. ఇలా ఏదైనా సబ్జెక్టులో సందేహాలు ఉంటే సమాధానాలతో సహాయపడుతుంది. సంభాషణను సరదా క్విజ్గా కూడా మారుస్తుంది.అమ్మమ్మ, తాతయ్యల వంటి పెద్దలకు.. ఎతైన షెల్ఫ్ నుండి మందులను తీసుకొచ్చి చేతిలో పెడుతుంది.ఇంటికి బంధువులు, స్నేహితులు వస్తే వారిని ఆకట్టుకోవడానికి పిల్లిమొగ్గల వంటివి వేస్తుంది. -
అమెరికాకు స్మార్ట్ఫోన్ల ఎగుమతుల్లో భారత్ టాప్
న్యూఢిల్లీ: టారిఫ్ల వివాదాలతో అమెరికాకు చైనా స్మార్ట్ఫోన్ల ఎగుమతులు నెమ్మదించడాన్ని భారత్ అవకాశంగా మల్చుకుంటోంది. 2025 రెండో త్రైమాసికంలో తొలిసారిగా అగ్రరాజ్యానికి చైనాకన్నా అధికంగా స్మార్ట్ఫోన్లను ఎగుమతి చేసింది. కన్సల్టెన్సీ సంస్థ కెనాలిస్ నివేదికలో ఈ అంశం వెల్లడైంది. దీని ప్రకారం అమెరికాకు స్మార్ట్ఫోన్ల ఎగుమతుల్లో చైనాలో అసెంబుల్ చేసిన ఫోన్ల వాటా గతేడాది ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో 61 శాతంగా ఉండగా ఈ ఏడాది అదే వ్యవధిలో 25 శాతానికి తగ్గింది. అదే సమయంలో భారత్ వాటా 13 శాతం నుంచి 44 శాతానికి (సుమారు 240 శాతం వృద్ధి) పెరిగింది. క్యూ2లో ఐఫోన్ల ఎగుమతులు వార్షికంగా 11 శాతం తగ్గి 1.33 కోట్ల యూనిట్లకు పరిమితం కాగా, శాంసంగ్ ఫోన్ల ఎగుమతులు 38 శాతం పెరిగి 83 లక్షల యూనిట్లకు పెరిగాయి. టాప్ 5 ఫోన్లకు సంబంధించి అమెరికాకు మోటరోలా ఫోన్ల ఎగుమతులు రెండు శాతం పెరిగి 32 లక్షల యూనిట్లకు, గూగుల్ 13% పెరిగి 8 లక్షల యూనిట్లకు చేరగా, టీసీఎల్ 23% క్షీణించి 7 లక్షల యూనిట్లకు పరిమితమైంది. క్యూ2లో తొలిసారి...అమెరికాకు ఎగుమతయ్యే స్మార్ట్ఫోన్లకు సంబంధించి క్యూ2లో భారత్ తొలిసారిగా అగ్రగామి తయారీ హబ్గా నిల్చిందని కెనాలిస్ ప్రిన్సిపల్ అనలిస్ట్ సన్యమ్ చౌరాసియా తెలిపారు. అమెరికా–చైనా మధ్య వాణిజ్య అనిశ్చితి వల్ల యాపిల్ తమ సరఫరా వ్యవస్థను భారత్కు మళ్లిస్తుండటం ఇందుకు దోహదపడిందని వివరించారు. చైనా ప్లస్ వన్ వ్యూహంలో భాగంగా యాపిల్ గత కొన్నేళ్లుగా భారత్లో తమ ఉత్పత్తుల తయారీని పెంచుకుంటోందని చౌరాసియా చెప్పారు. అయితే, ఐఫోన్ 16 సిరీస్, ప్రో మోడల్స్ తయారీని భారత్లో ప్రారంభించినప్పటికీ, పెద్ద స్థాయిలో సరఫరా కోసం యాపిల్ ఇప్పటికీ చైనా తయారీ ప్లాంట్లపైనే ఎక్కువగా ఆధారపడుతోందని ఆయన వివరించారు. యాపిల్ తరహాలోనే మోటరోలా ఫోన్లకు కూడా ప్రధాన తయారీ హబ్గా చైనా నిలుస్తోంది. మరోవైపు, యాపిల్తో పోలిస్తే కాస్త తక్కువ పరిమాణమే అయినప్పటికీ అమెరికాకు ఎగుమతి చేసే ఉత్పత్తుల తయారీని శాంసంగ్, మోటరోలా కూడా భారత్లోనే ఎక్కువగా చేపడుతున్నాయని చౌరాసియా పేర్కొన్నారు. శాంసంగ్ అత్యధికంగా స్మార్ట్ఫోన్లను వియత్నాంలో ఉత్పత్తి చేస్తోంది. -
దేశంలోనే మొదటి క్లౌడ్ ఆధారిత డెస్క్టాప్
ఖరీదైన హార్డ్వేర్ అవసరం లేకుండా ఏ స్క్రీన్ నైనా పూర్తి స్థాయి కంప్యూటర్గా మార్చే గేమ్ ఛేంజింగ్ సర్వీస్ను రిలయన్స్ జియో ‘జియోపీసీ’ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో ఫైబర్ లేదా జియోఎయిర్ ఫైబర్తో నడిచే క్లౌడ్ ఆధారిత వర్చువల్ డెస్క్ టాప్ను జియోపీసీ అంటారు. దీనిద్వారా కేవలం కీబోర్డు, మౌస్ ఉపయోగించి టీవీ లేదా మానిటర్ను పర్సనల్ కంప్యూటర్గా మార్చుకోవచ్చు.పూర్తిగా క్లౌడ్ మీద ఆధారపది ఇది కంప్యూటింగ్ సర్వీసు అందిస్తుంది. ఇందులో సీపీయూ ఉండదు. అప్గ్రేడ్లు ఉండవు. మెయింటెనెన్స్ ఉండదు. ఈ క్లౌడ్ సర్వీస్ కోసం నెలకు రూ.400 నుంచి ‘పే-యాస్ యూ-గో’ మోడల్ ప్రారంభిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. కొత్త యూజర్లకు ఒక నెల ఉచిత ట్రయల్ అందిస్తారు. 8 జీబీ ర్యామ్, 100 జీబీ క్లౌడ్ స్టోరేజ్, ఏఐ ఆధారిత టూల్స్ ఇందులో ఉంటాయి. అడోబ్ ఎక్స్ ప్రెస్ను ఉచితంగా అందిస్తారు. ఇది ఫైల్ డిజైన్, ఎడిటింగ్కు ఉపయోగపడుతుంది.లిబ్రే ఆఫీస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ (బ్రౌజర్ కోసం), జియో వర్క్ స్పేస్ వంటి ఉత్పాదక అప్లికేషన్లను సపోర్ట్ చేస్తుంది. ఈ క్లౌడ్లో డేటాను సురక్షితంగా స్టోర్ చేసేందుకు వైరస్ అటాక్ల నుంచి భద్రత కల్పిస్తారు.ఎవరికి ఉపయోగమంటే..ఆన్లైన్ లెర్నింగ్, కోడింగ్, రీసెర్చ్ కోసం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. ముందస్తు పెట్టుబడి లేకుండా సరసమైన కంప్యూటింగ్ కోసం చిరు వ్యాపారాలకు తోడ్పడుతుంది. కుటుంబ సభ్యుల కోసం వినోదాన్ని అందిస్తుంది. క్లౌడ్ టూల్స్తో కంటెంట్ క్రియేటర్లు డిజైన్, ఎడిట్, పబ్లిషింగ్ను ఉపయోగించవచ్చు.ఇదీ చదవండి: ‘ఏఐ మా ఉద్యోగులను ఏం చేయలేదు’ఎలా సెట్ చేయాలంటే..జియో సెట్ టాప్ బాక్స్ ఆన్ చేయాలి.యాప్స్ విభాగానికి వెళ్లి జియోపీసీ యాప్ను లాంచ్ చేయాలి.కీబోర్డ్, మౌస్ను ప్లగ్ ఇన్ చేయాలి.జియో నంబర్తో రిజిస్టర్ అయి, సైన్ ఇన్ అవ్వాలి. -
‘ఏఐ మా ఉద్యోగులను ఏం చేయలేదు’
టెక్ రంగంలో ఉద్యోగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భర్తీ చేస్తుందనే భయాలు నెలకొంటున్న తరుణంలో జోహో సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఆశలు రేకెత్తిస్తోంది. జోహోలో ఇంజినీర్లను ఏఐ భర్తీ చేయగలదా అని కంపెనీ సీఈఓ మణి వెంబును అడిగినప్పుడు ప్రస్తుతానికి దాని ప్రభావం లేదని సమాధానం చెప్పారు. ఇటీవల ఓ సమావేశంలో వెంబు మాట్లాడారు.‘కృత్రిమ మేధ కారణంగా జోహోలో ఉద్యోగాల్లో కోత లేదు. మీరు ఏఐ వ్యవస్థను ఒక కంటెంట్ను సృష్టించమని అడిగితే అది చాలా మెరుగ్గా కంటెంట్ను ఇస్తుంది. అయితే కేవలం ఈ ఫీచర్ మా కంపెనీలో ఉద్యోగాలను తొలగించలేదు. ఇప్పటివరకు కృత్రిమ మేధ కారణంగా మేము సిబ్బందిని తగ్గించలేదు. వాస్తవానికి మరికొందరు ఇంజినీర్లను నియమించుకోవాలని యోచిస్తున్నాం’ అని చెప్పారు.ఇటీవల బెంగళూరులో జరిగిన జోహోలిక్స్ కార్యక్రమంలో వెంబు ఈమేరకు వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో జియా అని పిలువబడే కంపెనీ సొంత లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం)ను ఆవిష్కరించారు. ఈ కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ భారతదేశపు మొట్టమొదటి ఎంటర్ప్రైజ్ ఏఐ అని చెప్పారు. ఇది సాధారణ ప్రజల కోసం ఉద్దేశించింది కానప్పటికీ, ఈ నమూనా వ్యాపారాలకు ఎంతో తోడ్పడుతుందని తెలిపారు. దీన్ని జోహో ఉత్పాదకత, ఎంటర్ప్రైజ్ ప్లాట్ఫామ్లతో అనుసంధానించినట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: టీసీఎస్ లేఆఫ్స్తో ఆర్థిక ప్రకంపనలుకృత్రిమ మేధ కంపెనీ వర్క్ ఫ్లోలో భాగమవుతోందని వెంబు చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగులకు మరింత సహాయపడుతుందని నమ్ముతున్నారు. ‘ఇప్పటివరకు (జోహోలో) మేము కంపెనీలో ఏఐ కచ్చితంగా ఉద్యోగులను భర్తీ చేయడాన్ని చూడలేదు. దానికి బదులుగా ఇది ఉద్యోగులకు సహాయపడుతుంది. ఉదాహరణకు, ఒక సపోర్ట్ రిప్రజెంటేటివ్ సాధారణంగా రోజుకు 20 టిక్కెట్లను హ్యాండిల్ చేస్తాడనుకోండి.. ఏఐ సాయంతో 25 టిక్కెట్లను నిర్వహించే అవకాశం ఉంది. ఇది 20 శాతం వరకు ఉత్పాదకతను పెంచుతుంది’ అని చెప్పారు. -
ఆలోచనలతో కంప్యూటర్ని కంట్రోల్ చేస్తున్న తొలి మహిళ!
సాంకేతికత కూడిన వైద్యం ఎందరో రోగులకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. అందుకు ఎన్నో ఉదంతాలు నిదర్శనం. అయితే బ్రెయిన్ సంబంధిత విషయంలో మాత్రం సాంకేతికతను వాడటం కాస్త సవాలు. అయితే దాన్నికూడా అధిగమించి..స్ట్రోక్కి గురై పక్షవాతంతో బాధపడుతున్న పేషెంట్లలో కొత్త ఆశను అందించేలా టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది ఎలోన్ మస్క్ స్థాపించిన న్యూరాలింక్ (Neuralink) కంపెనీ. ఇది మానవ మెదడు, కంప్యూటర్ మధ్య నేరుగా కమ్యూనికేషన్ ఏర్పరిచే బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్ (BCI) టెక్నాలజీపై పని చేస్తోందనే విషయం తెలిసిందే. ఈ టెక్నాలజీ ద్వారా, మెదడులో చిన్న చిప్ను అమర్చి, ఆలోచనల ద్వారా డిజిటల్ పరికరాలను నియంత్రిస్తారు. ప్రస్తుతం ఈ టెక్నాలజీ క్లినకల్ ట్రయల్ దశలో ఉంది. అందులో భాగంగానే ఈ న్యూరాలింక్ చిప్ను పొందింది ఆడ్రీక్రూస్ అనే మహిళ. ఎవరామె.? ఆమె ఈ సాంకేతికత సాయంతో ఏం చేసిందంటే..రెండు దశాబ్దాలకు పైగానే ఆడ్రీ కూస్ పక్షవాతానికి గురై మంచానికే పరిమితమైంది. క్లినికల్ ట్రయల్లో భాగంగా ఎలోన్ మస్క్ న్యూరాలింక్ చిప్ను ఆమె మెదడులో అమర్చారు. దీంతో న్యూరాలింక్ బ్రెయిన్ ఇంప్లాట్ ద్వారా తన ఆలోచనలతో కంప్యూటర్ని నియంత్రిస్తున్న తొలి మహిళగా రికార్డు సృష్టించింది. ఆమె తన మానసిక ఆదేశాలతో తన పేరుని డిజిటల్ రూపంలో రాసింది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ఎక్స్లో షేర్ చేసుకున్నారామె. ఆ పోస్ట్లో ఆండ్రీ డిజిటల్ సిరాతో తన పేరును( ఆడ్రీ) సూచించే ల్యాప్టాప్ స్క్రీన్ ఫోటోని షేర్ చేశారు. అంతేగాదు దాంతోపాటు ఎర్రటి హార్ట్ సింబల్, ఒక పక్షి, పిజ్జా ముక్క ఉండే డూడుల్ని కూడా పంచుకుంది. దీన్ని ఆమె టెలిపతి ద్వారా గీసినట్లుగా ఆ పోస్ట్కి క్యాప్షన్ ఇచ్చింది ఆడ్రీ. ఆమె 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా తన పేరును రాసిన క్షణం నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఎందుకంటే ఆమె గత 20 ఏళ్లకు పైగా పక్షవాతానికి గురై కదలలేని, మాట్లాడలేని స్థితిలో ఉండిపోయారామె. ఆమె తన చూపుడు వేలుని క్లిక్గా, కర్సర్గా మణికట్టుని ఊహించుకుంటూ.. తన మానసిక ఆలోచనలతో కంప్యూటర్ని నియంత్రిస్తుందామె. ఇదంతా ఆమె తన బ్రెయిన్తో చేస్తుంది. ఇక్కడ ఆడ్రికి ఈ న్యూరాలింక్ క్లినికల్ ట్రయల్లో తొమ్మిదొ పేషెంట్గా ఈ చిప్ను ఆమెకు అమర్చారు. పుర్రెలో రంధ్రం చేసి మోటారు కార్టెక్స్లో సుమారు 128 కనెక్షన్లతో ఈ చిప్ని అమర్చారు. ఈ బీసీఐ(బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్ టెక్నాలజీ) ఆమె మెదడు కదలికలు, సంకేతాలను చదివి వాటిని కర్సర్ కదలికలుగా అనువదిస్తుంది. ఈ బ్రెయిన్ చిప్ ఆమెను మళ్లీ నడిచేలా సాయం చేయలేకపోయినా..డిజిటల్ పరికరాలతో తన మనసులోని మాటలను వ్యక్తం చేయడానికి వీలు కల్పిస్తోంది. ఇది పూర్తి మానసిక ఆలోచనలతో పనిచేస్తుంది. న్యూరాలింక్ అంటే.. 2016లో ఎలోన్ మస్క్ స్థాపించిన న్యూరాలింక్, మానవ మెదడును నేరుగా కంప్యూటర్లకు అనుసంధానించడం లక్ష్యంగా పెట్టుకుంది. పక్షవాతం వంటి నాడీ సంబంధిత పరిస్థితులతో బాధపడుతున్న వ్యక్తులు డిజిటల్ స్వాతంత్య్రాన్ని పొందేలా.. సంభాషించడంలో సహాయపడటమే ఈ సాంకేకతికత లక్ష్యం.కాగా, ఇక్కడ ఆడ్రీ ఇలాంటి మరిన్ని పోస్ట్లను వీడియోలను పంచుకోవాలని ఆత్రుతగా ఎదురుచూస్తోంది. అంతేగాదు ఆమె తన పోస్ట్లో తాను త్వరలో ఇంటికి వస్తానని, ఈ ప్రక్రియ గురించి మరింత వివరంగా తెలిపేలా వీడియోలను కూడా పోస్ట్ చేస్తానని పేర్కొనడం విశేషం. ఈ న్యూరాలింక్ సాంకేతికతను వినియోగించిన తొలి మహిళగా ఆమె ప్రస్థానం పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని ఆశిద్దాం.(చదవండి: 12వ తరగతి డ్రాపౌట్..సొంతంగా జిమ్..ఇంతలో ఊహకందని మలుపు..!) -
బీఎస్ఎన్ఎల్ టారిప్లపై కీలక ప్రకటన
ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ బీఎస్ఎన్ఎల్ టారిఫ్లను పెంచే యోచన లేదని కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. భారతదేశం అంతటా 4జీ వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. బీఎస్ఎన్ఎల్ త్వరలో టారిఫ్లను పెంచబోతుందనే వాదనలను తోసిపుచ్చుతూ మంత్రి ఈమేరకు స్పష్టత ఇచ్చారు. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్లు (సీజీఎంలు) పాల్గొన్నారు.బీఎస్ఎన్ఎల్ ఎప్పటినుంచో 2జీ, 3జీ నెట్వర్క్ల్లో వాడుతున్న పాత చైనీస్ పరికరాలను స్వదేశీ 4జీ మౌలిక సదుపాయాలతో భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు మంత్రి పెమ్మసాని చెప్పారు. అయితే, ఎప్పటిలోపు దీన్ని పూర్తి చేస్తారో నిర్దిష్ట కాలపరిమితి తెలపలేదు. బీఎస్ఎన్ఎల్ 2జీ, 3జీ సేవలను దశలవారీగా నిలిపివేస్తున్నప్పటికీ, 5జీకి మారే ప్రణాళికలు మాత్రం ప్రస్తుతానికి లేవనే సంకేతాలు వెలువడుతున్నాయి.బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు ప్రస్తుతం 4జీ సరిపోతుందని మంత్రి అన్నారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా 4జీ నెట్వర్క్ను అందించడమే ప్రస్తుత ప్రాధాన్యమని పెమ్మసాని తెలిపారు. ఇతర టెల్కోల్లో 75 శాతం మంది వినియోగదారుల అవసరాలను 4జీ తీరుస్తుందన్నారు. స్వదేశీ 5జీ కోర్, అందుకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నాయని, ఆర్థికంగా లాభదాయకంగా ఉన్నప్పుడే ఈ విషయంలో ముందుకెళ్తామన్నారు.మొబైల్ కస్టమర్ గ్రోత్, ఏఆర్పీయూ, ఫిక్స్డ్ వైర్లెస్ వంటి విభాగాల్లో ప్రతి సర్కిల్కు లక్ష్యాలు కేటాయించినట్లు చెప్పారు. ఏటా 20-30 శాతం ఆదాయ వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. బీఎస్ఎన్ఎల్ 1,00,000 స్వదేశీ 4జీ టవర్లను ఏర్పాటు చేసిందని, వీటి ఇంటిగ్రేషన్ ప్రక్రియ సవాలుతో కూడుకున్నదని మంత్రి అన్నారు. నోకియా, ఎరిక్సన్ వంటి గ్లోబల్ కంపెనీలకు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి దశాబ్దాలు పట్టిందని, కానీ బీఎస్ఎన్ఎల్ కేవలం 2–3 ఏళ్లలోనే 90–95% సమస్యలను పరిష్కరించిందని తెలిపారు.ఇదీ చదవండి: క్లెయిమ్ చేయని డిపాజిట్లు రూ.67వేల కోట్లుమౌలిక సదుపాయాలను వేగవంతం చేయడం, పౌర కేంద్రీకృత సేవల పంపిణీని మెరుగుపరచడం, భారత టెలికాం రంగంలో బీఎస్ఎన్ఎల్ వ్యూహాత్మక పాత్రను బలోపేతం చేయడంపై ఈ సమావేశం దృష్టి సారించిందని కేంద్రమంత్రి సింథియా చెప్పారు. కంపెనీ పరివర్తనను ఆయన ప్రశంసించారు. కస్టమర్ అనుభవం, ఆదాయ సృష్టిలో గణనీయమైన మెరుగుదల అవసరాన్ని నొక్కి చెప్పారు. -
స్టార్లింక్ ఇచ్చేది 20 లక్షల కనెక్షన్లే
న్యూఢిల్లీ: అమెరికన్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థ స్టార్లింక్ నుంచి బీఎస్ఎన్ఎల్లాంటి దేశీ టెలికం సంస్థలకు ఎలాంటి పోటీ ఉండబోదని కేంద్ర టెలికం శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ప్రస్తుత సామర్థ్యాలను బట్టి స్టార్లింక్ భారత్లో గరిష్టంగా 200 ఎంబీపీఎస్ స్పీడ్తో 20 లక్షల కనెక్షన్లు మాత్రమే ఇవ్వగలదని ఆయన తెలిపారు. దీనితో టెలికం సర్వీసులపై ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పారు. ఈ సర్వీసులను పొందాలంటే ముందుగా భారీ మొత్తం వెచ్చించడంతో పాటు ప్రతి నెలా సుమారు రూ. 3,000 వరకు చెల్లించాల్సి రావచ్చని మంత్రి చెప్పారు. ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్కి గణనీయంగా కార్యకలాపాలున్న గ్రామీణ, మారుమూల ప్రాంతాలే లక్ష్యంగా శాట్కామ్ సర్వీసులు ఉండనున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బీఎస్ఎన్ఎల్ 4జీ సర్వీసుల విస్తరణ పూర్తయిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం మార్కెటింగ్పైనే దృష్టి పెడుతున్నట్లు, టారిఫ్లు పెంచే ప్రతిపాదనేదీ లేనట్లు మంత్రి వివరించారు. బీఎస్ఎన్ఎల్లో చైనా పరికరాల వినియోగంపై స్పందిస్తూ, పూర్తిగా దేశీ సాంకేతికతల వినియోగానికి ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. -
భూకంపం వస్తోంది.. జాగ్రత్త..!
ఫోన్ అంటే కాల్స్, మెసేజెస్, వినోదమేనా? అంతకు మించి.. చూడ్డానికి చిన్న పరికరమే కావొచ్చు కానీ కొన్ని సందర్భాల్లో ప్రాణాలను కాపాడే సంజీవని కూడా. అవును మీరు చదువుతున్నది నిజమే. భూకంప కేంద్రం నుంచి తీవ్రత చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించేలోపే.. విపత్తు రాబోతోందని యూజర్లను హెచ్చరించే వ్యవస్థ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉంది. మొబైల్లోని యాక్సిలరేషన్ సెన్సార్ల ఆధారంగా పనిచేసే ఈ వ్యవస్థ ప్రపంచంలో భూకంప ప్రభావిత ప్రాంతాలలో నివసించే ప్రజలకు సందేశాల రూపంలో హెచ్చరిస్తోంది.– సాక్షి, స్పెషల్ డెస్క్ఆండ్రాయిడ్ ఎర్త్క్వేక్ అలర్ట్ (ఏఈఏ) వ్యవస్థను ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ను అభివృద్ధి చేసిన టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2020 నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లలో పరిచయం చేసింది. ప్రాథమిక (ప్రైమరీ వేవ్స్), ద్వితీయ (సెకండరీ వేవ్స్) భూకంప తరంగాలను ఈ వ్యవస్థ గుర్తిస్తుంది. ఏఈఏ సిస్టమ్ ఇప్పటి వరకు 98 దేశాలలో భూకంప ప్రభావిత ప్రాంతాలలో నివసించే ప్రజలకు హెచ్చరికలను పంపింది. ఇప్పటి వరకు 18,000 పైచిలుకు భూకంప సంఘటనలకు సంబంధించి 79 కోట్లకుపైగా అలర్ట్స్ జారీ చేసింది. ఈ వ్యవస్థ ఇప్పుడు నెలకు సగటున 60 హెచ్చరికలను పంపుతోంది. దాదాపు 1.8 కోట్ల మంది కనీసం ఒక హెచ్చరికనైనా అందుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల మంది ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. గూగుల్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలీ సీస్మాలజీ ల్యాబొరేటరీ మూడు సంవత్సరాలుగా ఈ వ్యవస్థ పనితీరు, పద్ధతులను వివరిస్తూ డేటాను విడుదల చేశాయి.సెకన్ల ముందు హెచ్చరిక..భూకంపం వచ్చే కొన్ని సెకన్ల ముందు యూజర్లకు ఏఈఏ హెచ్చరిక సందేశాన్ని పంపుతుంది. భూకంప తీవ్రత సాధారణంగా ఉండే అవకాశం ఉంటే ‘మీరు జాగ్రత్త’ అని, ముప్పు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంటే ఆడియో రూపంలో వార్నింగ్తోపాటు పారాహుషార్ అంటూ హెచ్చరిస్తుంది. భూ ప్రకంపనలను గుర్తించడానికి ఫోన్లోని యాక్సిలెరోమీటర్ సాయంతోనే భూ ప్రకంపనలను ఈ వ్యవస్థ గుర్తిస్తుంది. భూకంప తరంగాలు ఫోన్ను చేరగానే ఆ సమాచారాన్ని గూగుల్ సర్వర్లకు పంపుతుంది. ఒక ప్రాంతంలోని ఇతర ఫోన్ల నుంచి కూడా ఇలాంటి సమాచారమే వస్తే భూకంపం సంభవించినట్టు గూగుల్ నిర్ధారిస్తుంది. అత్యంత తీవ్రంగా భూమి కంపించకముందే ప్రభావిత ప్రాంతంలో.. ఆండ్రాయిడ్ ఫోన్ను వాడుతున్న వారికి ఈ వ్యవస్థ హెచ్చరికలను పంపుతుంది. భూకంప తరంగాల కంటే వేగంగా హెచ్చరికలను ప్రసారం చేయడానికి ఏఈఏ కాంతి వేగాన్ని ఉపయోగిస్తుంది.యూఎస్తో మొదలు..ఏఈఏ వ్యవస్థ తొలుత 2020లో యూఎస్లో మొదలైంది. 2021లో న్యూజిలాండ్, గ్రీస్లో, ఆ తర్వాత మిగిలిన దేశాలకు విస్తరించారు. ఈ వ్యవస్థ హెచ్చరించిన సంఘటనల్లో 2023లో టర్కీ–సిరియా (రిక్టర్ స్కేల్పై తీవ్రత 7.8), ఫిలిప్పీన్స్ (6.7), నేపాల్ (5.7), 2025 ఏప్రిల్లో టర్కీలో 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపాలు ఉన్నాయి. ఇప్పటివరకు గుర్తించిన సంఘటనలలో 2,000 కంటే ఎక్కువ తీవ్ర భూకంపాలు ఉన్నాయి. ఇక ఏఈఏ బృందం 2023 ఫిబ్రవరి–2024 ఏప్రిల్ మధ్య 15 మందిని సర్వే చేస్తే.. 79% మంది ఈ హెచ్చరికలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. భూకంపం రాకముందే హెచ్చరిక అందుకున్నట్టు 5.4 లక్షల మంది చెప్పడం విశేషం.కోట్లాది మందికి..2023 నవంబర్లో ఫిలిప్పీన్స్లో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించినప్పుడు.. భూకంపం ప్రారంభమైన 18.3 సెకన్ల తర్వాత ఈ వ్యవస్థ మొదటి హెచ్చరికను పంపింది. అత్యంత తీవ్ర ప్రకంపనలు సంభవించిన భూకంప కేంద్రానికి దగ్గరగా ఉన్నవారికి 15 సెకన్లపాటు మెసేజులు పంపారు. దూరంగా ఉన్నవారికి, తక్కువ ప్రకంపనలు వచ్చిన ప్రాంత యూజర్లకు ఒక నిమిషంపాటు అలర్ట్స్ జారీ చేశారు. ఇలా మొత్తంగా 25 లక్షల మందిని అప్రమత్తం చేశారు. 2023 నవంబర్లో నేపాల్లో 5.7 తీవ్రతతో భూకంపం వచ్చినప్పుడు కోటి మందికిపైగా హెచ్చరికలు అందాయి. 2025 ఏప్రిల్లో టర్కీలో భూమి కంపించడం ప్రారంభమైన 8 సెకన్ల తర్వాత మొదటి అలర్ట్ జారీ అయింది. ఈ ఘటనలో 1.1 కోట్ల మందికిపైగా ఈ సందేశాలు అందుకున్నారు.అలర్ట్స్ అందుకోవాలంటే వినియోగదారులు వైఫై లేదా సెల్యులార్ డేటా కనెక్టివిటీని కలిగి ఉండాలి. ఆండ్రాయిడ్ ఎర్త్క్వేక్ అలర్ట్, లొకేషన్ సెట్టింగ్స్ రెండూ ఆన్లో ఉండాలి.భూకంప తీవ్రత సాధారణంగా ఉండే అవకాశం ఉంటే ‘మీరు జాగ్రత్త’ అని, ముప్పు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంటే ఆడియో రూపంలో వార్నింగ్తోపాటు పారాహుషార్ అంటూ హెచ్చరిస్తుంది. -
TCS layoffs: రంగంలోకి కేంద్ర ప్రభుత్వం!
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 12,000 మందికిపైగా ఉద్యోగులను తొలగించబోతున్నట్లు చేసిన ప్రకటన దేశ టెక్ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించింది. దీంతో దేశంలోని ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన ఆవరించింది. కాగా టీసీఎస్ లేఆఫ్ల ప్రకటన తరువాత జరుగుతున్న పరిణామాలను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.బాధిత ఉద్యోగులకు ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ వంటి కార్యక్రమాలు ఉపాధి కల్పనను పెంచడానికి ఎలా సహాయపడతాయనే దానిపై కేంద్ర ఐటీ శాఖ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో నైపుణ్యం పెంపు, రీస్కిల్లింగ్కు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయా వర్గాలను ఉటంకిస్తూ ఎకనమిక్స్ టైమ్స్ కథనం పేర్కొంది.ఈ మొత్తం పరిస్థితిని ఐటీ మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోందని, టెక్ కంపెనీతో సంప్రదింపులు జరుపుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. తొలగింపులపై మంత్రిత్వ శాఖ ఆందోళన చెందుతోంది. ఇది ఎందుకు జరుగుతోంది.. అంతర్లీన కారణాలను అర్థం చేసుకోవడానికి పరిశీలిస్తుంది.భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయిన టీసీఎస్ ఈ సంవత్సరం 12,261 మంది ఉద్యోగులను తొలగించనున్న నేపథ్యంలో ఈ వైఖరి ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ ప్రభావం ఎక్కువగా మిడిల్, సీనియర్ గ్రేడ్ ఉద్యోగులపై పడుతుంది. 2025 జూన్ 30 నాటికి టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 6,13,069గా ఉంది. ఇటీవల ముగిసిన ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 5,000 మంది ఉద్యోగులు జతయ్యారు. -
TCS Layoffs: ‘రాజీనామాలు మాత్రం చేయొద్దు’
దేశీయ అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 12,000 మంది ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు ప్రకటించింది. ఈ తొలగింపు మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగులపై ప్రభావం చూపనుంది.ఈ ప్రకటన ఐటీ రంగంలో ప్రకంపనలు సృష్టించింది. టీసీఎస్ ఉద్యోగుల తొలగింపు ప్రకటనను ఐటీ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.ఒత్తిడికి తలొగ్గి రాజీనామాలు చేయొద్దుఈటీ నివేదిక ప్రకారం.. టీసీఎస్ తొలగింపులను చట్టవిరుద్ధమని ప్రకటించిన ఐటీ ఉద్యోగ సంఘాలు ఒత్తిడికి తలొగ్గి ఎవరూ రాజీనామా చేయొద్దంటూ టీసీఎస్ సిబ్బందికి సూచించాయి. అదే సమయంలో లేఆఫ్ ప్రణాళికలను ఉపసంహరించుకోవాలని, ప్రభావిత ఉద్యోగాలను పునరుద్ధరించాలని కర్ణాటక స్టేట్ ఐటీ/ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ టీసీఎస్ యాజమాన్యాన్ని కోరింది.రాజీనామా చేయాలని ఉద్యోగులపై ఒత్తిడి చేయొద్దని ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయీస్ (ఎఫ్ఐటీఈ) టీసీఎస్ను కోరింది. బాధితులకు నోటీస్ పీరియడ్ పేమెంట్స్, సెవెరెన్స్ బెనిఫిట్స్, ఏడాది పాటు ఇన్సూరెన్స్ కవరేజీని అందించాలని డిమాండ్ చేసింది. టీసీఎస్ ఆర్థికంగా పటిష్టంగా ఉందని, అనిశ్చితులేవీ లేనప్పటికీ ప్రకటించిన ఈ తొలగింపులు పూర్తిగా లాభాపేక్షతో తీసుకున్న నిర్ణయాలేనని ఎఫ్ఐటీఈ పేర్కొంది. అన్ని రికార్డులు సిద్ధం చేసుకోవాలని, స్వచ్ఛంద రాజీనామాలకు ఎవరూ వెళ్లొద్దని, నిష్క్రమించాలని ఒత్తిడి చేస్తే రాష్ట్ర లేబర్ కమిషనర్ లేదా ఎఫ్ఐటీఈ సహాయం తీసుకోవాలని ఉద్యోగులకు సూచించింది. 👉 వేలాది లేఆఫ్లు.. ఎమోషనల్ అయిన మైక్రోసాఫ్ట్ సీఈవో -
ఓలా కృత్రిమ్లో రెండో విడత లేఆఫ్స్
ఓలాకు చెందిన భవీష్ అగర్వాల్ స్థాపించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘కృతిమ్’ రెండో విడత ఉద్యోగాలను తొలగించినట్లు వార్తలొస్తున్నాయి. ఈ విడతలో 100 మందికి పైగా సిబ్బందిని ఇంటికి పంపినట్లు తెలుస్తుంది. ఈ లేఆఫ్స్లో ప్రధానంగా ఇటీవలే కంపెనీలో చేరిన లింగ్విస్టిక్స్ బృందంలో పని చేస్తున్న వారిని అధికంగా తొలగించినట్లు కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి.జూన్లో కృతిమ్ మొదటి రౌండ్ ఉద్యోగుల తొలగింపు చేపట్టింది. అందులో భాగంగా డజనుకుపైగా సిబ్బందికి లేఆఫ్స్ ప్రకటించింది. తాజాగా 100కుపైగా ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తుంది. ఈ తొలగింపులు కంపెనీ వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణలో భాగమని, ఉన్న వనరులను మెరుగ్గా నిర్వహించడానికి ఇది ఎంతో తోడ్పడుతుందని ఈ విషయం తెలిసిన వ్యక్తులు చెప్పారు.ఇదీ చదవండి: బంగారు బాతులను చంపేస్తున్నారు.. దేశానికి సిగ్గుచేటుజూన్లో కంపెనీ కృత్రిమ్లో ఏఐ అసిస్టెంట్ ‘కృతి’ని ప్రారంభించింది. దీనికి దాదాపు 80 శాతం శిక్షణ ఇచ్చామని, గతంలో మాదిరిగా తమకు ఎక్కువ మంది సిబ్బంది అవసరం లేదని ఒక అదికారి తెలిపారు. కృత్రిమ్ గతంలో కృత్రిమ మేధ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంలో భారీ పెట్టుబడులను ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభంలో భవీష్ అగర్వాల్ కృత్రిమ్ ఏఐ ల్యాబ్స్ను ఆవిష్కరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి రూ.2,000 కోట్లు కేటాయించారు. వచ్చే ఏడాది ఈ సంఖ్యను రూ.10,000 కోట్లకు పెంచే ప్రణాళికలున్నట్లు తెలిపారు. -
టీసీఎస్.. భారీగా లే ఆఫ్స్.. ఎవరిపై ప్రభావమంటే..!
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) భారీ లే ఆఫ్స్కు సిద్ధమైంది. ప్రస్తుతం సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులు కారణంగా భారీ తొలగింపునకు టీసీఎస్ సన్నద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా టీసీఎస్ కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగాల్లో 2 శాతం లే ఆఫ్స్ కు సిద్ధమైన విషయాన్ని కంపెనీ ఆదివారం స్పష్టం చేసింది. అంటే 12వేలకు పైగా ఉద్యోగులు తమ ఉద్యోగాల్ని కోల్పోనన్నారు. ఇది మధ్యస్థంగా ఉన్న ఉద్యోగులతో పాటు సీనియర్ స్థాయిల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ కె కృతివాసన్ స్పష్టం చేశారు. అయితే ఉద్యోగుల్ని తొలగించడం తమకు కూడా బాధగానే ఉందని, కాకపోతే మారిన టెక్నాలజీతో తొలగింపులు తప్పడం లేదన్నారు.కొత్త టెక్నాలజీల పరంగా చూస్తే ముఖ్యంగా ఏఐ ఆపరేటింగ్ మోడల్ మార్పులను గుర్తిస్తున్నాం. పని చేసే విధానాలూ మారుతున్నాయి. అందుకే భవిష్యత్తుకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. అందుకోసం మేము ఏఐని ఉపయోగిస్తూ కావాల్సిన నైపుణ్యాలను మెరుగుపరిచే పనిలో ఉన్నాం. మా కంపెనీ విస్తరణ అవకాశాలను మెరుగుపరిచేందుకు ఎక్కువ శాతం పెట్టుబడులు పెట్టాం. కానీ, పలు విభాగాల్లో వృద్ధి కనిపించడం లేదు. దాంతో లే ఆఫ్స్ తప్పడం లేదు. ఇది ప్రపంచ వ్యాప్తంగా మా ఉద్యోగుల్లో సుమారు 2 శాతం మందిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మధ్యస్థ, సీనియర్ స్థాయుల్లో ఉండే ఉద్యోగులపైనే ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ నిర్ణయం అనుకున్నంత ఈజీ కాదు. సీఈఓగా నేను తీసుకున్న అత్యంత కఠిన నిర్ణయాల్లో ఇదొకటి’ అని కృతివాసన్ తెలిపారు. -
వాన పడితే వావ్! ఈ గ్యాడ్జెట్స్ ఉంటే రెయిన్ టెన్షన్ ఉండదిక..
వాన పడితే చాయ్, పకోడీతో ‘వావ్’ అనాలా? లేదా తడి బట్టల టెన్షన్తో ‘ఓహ్ నో!’ అనాలా?. ఇప్పుడు వావ్ మాత్రమే అనిపించేలా, వాన తెచ్చే టెన్షన్కి బై.. బై చెప్పే గాడ్జెట్స్ వచ్చేశాయి. అవే ఇవి.ఇంట్లోనే ఆరేసేయ్!ఇంట్లో బట్టలు ఆరేయడానికి చోటు లేదు, బయట గాలి లేదు, లాండ్రీకి వేసేందుకు టైమ్ లేదు.. ఇలా వానాకాలంలో బట్టలు అన్నవే బాధగా మారిపోయాయా? కూల్! ఇప్పుడు మార్కెట్లోకి చిటికెలోనే దుస్తులను ఆరబెట్టే అద్భుతమైన పరికరం వచ్చేసింది. పేరు ‘ఎక్స్ప్రెస్ డ్రైయర్ ఔరేట్ ప్రో మ్యాక్స్’. చిన్న బాటిల్ సైజులో ఉండే ఈ పరికరం, ఒకేసారి నాలుగు పెద్ద దుస్తులను ఆరబెట్టగలదు. అంతేకాదు, దీనిని ఆన్ చేసుకుంటే, ఇందులోంచి వెలువడే అల్ట్రావయొలెట్ కాంతి దుస్తులపై ఉండే సూక్ష్మజీవులను నిర్మూలిస్తుంది. దీని వల్ల దుస్తుల మురుగు వాసన తొలగి, అచ్చం బయట ఎండలో ఆరవేసినంత శుభ్రంగా తయారవుతాయి. పవర్ ఆన్చేసి, ఒక్కసారి టైమర్ పెడితే, పని అయిపోగానే ఆదే ఆగిపోతుంది. ఈ డ్రైయర్ను మడతపెట్టి సూట్కేస్లో పెట్టుకోవచ్చు కూడా. దీని ధర రూ. 4,712.కవర్ వేసి కూల్గా నడవండి వర్షం రాగానే చాలామంది హెల్మెట్, గొడుగు, రెయిన్ కోట్ వేసుకొని ఫుల్ ప్రొటెక్షన్ మోడ్లోకి వెళ్తారు. ముఖం తడవదు, జుట్టు తడవదు కాని, చెప్పులు? కొత్తగా కొన్న బ్రాండెడ్ షూస్ బురదలో మునిగి, మురికి నీళ్లలో నానిపోయి, ఇంట్లోకి అడుగు పెట్టే సరికి వాసనతో బరువెక్కిపోతుంటాయి. ఇప్పుడు ఆ బాధకు ఫుల్స్టాప్ పెట్టేందుకు మార్కెట్లోకి వచ్చాయి వాటర్ప్రూఫ్ షూ కవర్స్. పీవీసీ మెటీరియల్తో తయారైన ఇవి జిప్పర్, డ్రాస్ట్రింగ్ డిజైన్లతో షూస్కి నాలుగు వైపులా కవచంలా ఉంటాయి. వర్షం, మంచు, మట్టి, బురద నుంచి రక్షణ ఇస్తాయి. నాన్స్లిప్ సోల్ వల్ల వీటితో నడిచేటప్పుడు జారిపోయే ప్రమాదం ఉండదు. వీటిని మడతపెట్టి పాకెట్లో వేసుకోవచ్చు. ధర వివిధ కంపెనీలను బట్టి రూ. 200 నుంచి రూ. 1000 వరకు ఉంటుంది.సురక్షితమైన వెలుగు సువాసనతోవర్షం వచ్చినప్పుడల్లా పవర్ కట్ కామన్! టీవీ ఆగిపోతుంది, ఫ్యాన్ ఆగిపోతుంది, ఇల్లంతా చీకటి కమ్మేస్తుంది. అప్పుడు మనం క్యాండిల్స్ వెలిగిస్తాం. అది మామూలు క్యాండిల్ అయితే, చేతుల మీద కరిగిన మైనం పడి మండుతుంది. గాజు జార్లో ఉన్న క్యాండిల్ చీకట్లో పగిలిపోతుంది. అందుకే, ఇలాంటి సమయాల్లో నిజంగా పనికొచ్చేవి మామూలు క్యాండిల్స్ కాదు, ‘సాండ్ వాక్స్ క్యాండిల్స్’. ఈ క్యాండిల్ వాక్స్ మామూలు వాక్స్ కాదు. సువాసనతో కూడిన పౌడర్ వాక్స్. ఇది రీఫిల్లబుల్, నాన్ టాక్సిక్. చేతులపై కరిగి పడదు, పొగతో చికాకు పెట్టదు. మీకు ఇష్టమైన గిన్నెలో వేసుకుని, అందులో ఒత్తి పెట్టి వెలిగించుకోవచ్చు. ఇలా ఎన్నిసార్లయినా ఒత్తి తీసి మళ్లీ వాడుకోవచ్చు. ధర. రూ.309 మాత్రమే! -
బెంగళూరులో వర్క్ ఫ్రమ్ హోమ్? పరిశీలిస్తున్న ఐటీ సంస్థలు
దేశ ఐటీ రాజధానిగా పిలిచే బెంగళూరు మహా నగరంలో ట్రాఫిక్ తిప్పలు అన్నీ ఇన్నీ కావు. నాలుగైదు కిలోమీటర్ల ప్రయాణానికే గంటలకొద్దీ సమయం పడుతోంది. నగరంలో ట్రాఫిక్ తగ్గించడానికి ముఖ్యంగా రద్దీగా ఉండే ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) వెంబడి దీర్ఘకాలిక ట్రాఫిక్ ఇబ్బందులను పరిష్కరించడానికి నగర ట్రాఫిక్ పోలీసులు కొత్త ఆలోచనను ప్రతిపాదించారు. బుధవారాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ (డబ్ల్యూఎఫ్హెచ్) అమలు చేయాలని అక్కడి ఐటీ సంస్థలకు సూచించారు.ఎడతెగని ట్రాఫిక్బెంగళూరు ట్రాఫిక్ పరిస్థితి చాలా కాలంగా నగరవాసులకు, ప్రయాణికులకు చిరాకు తెప్పిస్తోంది. బెంగళూరులో ట్రాఫిక్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ‘ఎక్స్’లో ఓ యూజర్ వ్యాఖ్యానించారు. ‘నేను ఇంటి నుంచి ఉదయం 9 లేదా 9:30 గంటలకు బయలుదేరితే ఏ 12 గంటలకో ఆఫీసు చేరుకుంటాన్నాను. ఇది కేవలం 6 కిలోమీటర్ల ప్రయాణం మాత్రమే! నాకు సొంత కారు ఉన్నా ట్రాఫిక్కు భయపడి దాన్ని బయటకు తీసే ఆలోచన కూడా చేయడం లేదు. ఏ ఉబెర్ లాంటిదో బుక్ చేసుకోవాల్సి వస్తోంది. రద్దీ సమయాల్లో వాళ్లు ఒక్కో రైడ్కు రూ .500–రూ .600 తీసుకుంటున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘అదృష్టవశాత్తూ మా ఆఫీస్లో హైబ్రిడ్ విధానం అనుసరిస్తున్నారు. కానీ ఆఫీస్కు బయలుదేరినప్పుడు ఈ గందరగోళాన్ని అనుభవించాల్సి ఉంటుంది. ఇది పనిచేసే ఉత్సాహాన్ని హరిస్తుంది. ఎవరోఒకరు ట్రాఫిక్ లో ఇరుక్కోవడం వల్ల చాలాసార్లు మీటింగ్లు వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. ఆఫీస్కి 1-2 కిలోమీటర్ల పరిధిలో నివసించే సహోద్యోగులు కూడా క్యాబ్లలో వచ్చి ఆ ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం ఎందుకని నడిచి వస్తున్నారు. బెంగళూరు లాంటి నగరానికి ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు’ అని పేర్కొన్నారు.ఉదయం విపరీత ట్రాఫిక్పలు ప్రధాన ఐటీ పార్కులు, కంపెనీలకు నిలయమైన ఓఆర్ ఆర్ పై ఒత్తిడిని తగ్గించే చర్యల్లో భాగంగానే ఈ ప్రతిపాదిత డబ్ల్యూఎఫ్ హెచ్ ప్రణాళికను రూపొందించినట్లు ట్రాఫిక్ అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని జాయింట్ కమిషనర్ ఆఫ్ ట్రాఫిక్ కార్తీక్ రెడ్డి తెలిపారు. ఈ ఒత్తిడిని తగ్గించడానికి కంపెనీలు ఉదయం 7.30 గంటలకే పనివేళలను ప్రారంభించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వారం మధ్యలో అంటే బుధవారం వర్క్ఫ్రమ్ హోమ్ అమలు చేయాలని ట్రాఫిక్ అధికారులు సిఫార్సు చేస్తున్నారు.వ్యూహం ఇదీ..ట్రాఫిక్ విభాగం, బీబీఎంపీ (నగర కార్పొరేషన్), బీఎంటీసీ (బస్ సర్వీస్), ఐటీ రంగానికి చెందిన కీలక భాగస్వాములతో కూడిన సంయుక్త సమావేశంలో ఈ ప్రతిపాదనలపై చర్చించారు. ఓఆర్ ఆర్ వెంబడి పెండింగ్ లో ఉన్న రోడ్డు పనులను వేగవంతం చేయడం, ప్రత్యేక బస్ బేల ఏర్పాటు, ప్రధాన టెక్ పార్కుల మధ్య కనెక్టివిటీని మెరుగుపరచడం సహా అత్యవసర మౌలిక సదుపాయాల అప్ గ్రేడ్ లపై సమావేశంలో చర్చించారు. ఈ ప్రతిపాదనలపై ఐటీ కంపెనీలు కూడా పరిశీలిస్తున్నాయి. ఇది అమల్లోకి వస్తే వారంలో ఒక్కరోజైనా నగరంలో ఎంతో కొంత ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉంది. -
ఫోన్కి వస్తున్న మెసేజ్లలో కొత్త మార్పులు.. గమనించారా?
మన ఫోన్లకు రోజూ పదుల సంఖ్యలో వివిధ రకాల ఎస్ఎంఎస్లు వస్తుంటాయి. వీటిలో ఎక్కువ శాతం వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రమోషనల్ మెసేజ్లే ఉంటుంటాయి. వీటి మధ్య ముఖ్యమైన మెసేజ్లను చూసుకోకుండా విస్మరిస్తుంటాం. కానీ ఈ మధ్య వస్తున్న వస్తున్న ఎస్ఎంఎస్లను గమనిస్తే కొత్త మార్పులు కనిపిస్తాయి. అదేమీ లేదండి ఏ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందో సులువుగా తెలిసేలా ట్రాయ్ ఇటీవల కొత్త ఎస్ఎంఎస్ ట్యాగింగ్ వ్యవస్థను తీసుకొచ్చింది.మనకు వచ్చే ప్రతి ఎస్ఎంఎస్ ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేసేలా ఐడింటిఫికేషన్ అక్షరం ఉంటుంది. ఎస్ఎంఎస్ హెడర్లో పీ(P) అని ఉంటే ప్రమోషనల్ అంటే వివిధ కంపెనీలు తమ ప్రచారం కోసం పంపించే మెసేజ్లు అన్నమాట. ఎస్(S) అని ఉంటే సర్వేస్ అంటే సాధారణ సమాచారం తెలియజేసేవి అని అర్థం. ఇక టీ(T) అని ఉంటే ట్రాన్సాక్షనల్ అంటే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి బ్యాంకుల నుంచి వచ్చే ఓటీపీలు, జీ(G) అని ఉంటే గవర్నమెంట్ అంటే ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారం. ఇలా.. ఏదైనా ఎస్ఎంఎస్ వచ్చినప్పుడు దాన్ని పూర్తిగా తెరిచి చదవకుండానే దాని ఉద్దేశం తెలుసుకోవచ్చు.ఈ మార్పు ఎందుకంటే..దేశంలో 1.1 బిలియన్లకు పైగా మొబైల్ వినియోగదారులు తరచూ స్పామ్, అవాంఛిత ఎస్ఎంఎస్ సందేశాలను ఎదుర్కొంటున్నారు. చాలా మంది వినియోగదారులు ఏ సందేశాలు ముఖ్యమైనవి, ఏవి అసంబద్ధమైనవి అని తెలుసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. వినియోగదారులు వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడటానికి ఫిల్టర్గా పనిచేసేలా కొత్త అనుబంధ వ్యవస్థను రూపొందించారు. -
ఏఐకి ప్రభుత్వ మద్దతు కావాలి
న్యూఢిల్లీ: జాతీయ భద్రత దృష్ట్యా కృత్రిమ మేథకి (ఏఐ) ప్రభుత్వం మద్దతు అవసరమని నెక్స్జెన్ ఎగ్జిబిషన్స్ ఒక నివేదికలో తెలిపింది. పటిష్టమైన సైబర్సెక్యూరిటీ, బోర్డర్ సెక్యూరిటీ కోసం దీనిపై గణనీయంగా ఇన్వెస్ట్ చేయాలని, ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. 15 నగరాలకు చెందిన 200 పైగా కంపెనీలతో నిర్వహించిన సర్వే ప్రాతిపదికన నెక్స్జెన్ ఈ నివేదిక రూపొందించింది. జాతీయ భద్రత కోసం ప్రభుత్వం ఏఐకి క్రియాశీలకంగా మద్దతునివ్వాలనే విషయంపై ’ఏకీభవిస్తున్నాను’, ’మరింతగా ఏకీభవిస్తున్నాను’ అనే ఆప్షన్లకు 86 శాతం మంది సానుకూలంగా స్పందించినట్లు సంస్థ తెలిపింది. డిఫెన్స్లో ఏఐ ఆవిష్కరణల కోసం ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యాలు, ప్రోత్సాహకాలు అవసరమని 14 శాతం మంది అభిప్రాయపడ్డారు. పరిశ్రమలో ఏఐ అంతరాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యాలు ఉపయోగపడగలవని పేర్కొన్నారు. దేశ భద్రతను పటిష్టం చేసుకునే దిశగా ఏఐని సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలంటే పాలసీపరంగా ఉన్న అనేక అంతరాలను ప్రభుత్వం, పరిశ్రమ పరిష్కరించుకోవాల్సి ఉంటుందని నివేదిక తెలిపింది. ఎల్రక్టానిక్ యుద్ధాలు, సమాచార యుద్ధాలతో సవాళ్లు పెరిగిపోతున్న నేపథ్యంలో జాతీయ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఏఐ ఎంతో ఉపయోగకరమైన సాధనంగా ఉండగలదని నెక్స్జెన్ పేర్కొంది. పరిశ్రమ గణాంకాల ప్రకారం 2024లో దేశీయంగా 23 లక్షల పైగా సైబర్దాడులు చోటు చేసుకున్నాయి. వీటి వల్ల రూ. 1,200 కోట్ల మేర ఆరి్థక నష్టం వాటిల్లింది. అంతర్జాతీయంగా ఫిషింగ్ దాడుల విషయంలో అమెరికా, రష్యా తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. -
వేలాది లేఆఫ్లు.. ఎమోషనల్ అయిన మైక్రోసాఫ్ట్ సీఈవో
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్లో వేలాది లేఆఫ్లపై ఆ సంస్థ సీఈవో సత్య నాదెళ్ల ఎమోషనల్గా స్పందించారు. ఇటీవల కంపెనీలో ఇటీవల 9,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించడం తనను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని అంగీకరించారు. అయితే సంస్థ ఏఐ పరివర్తనకు ఈ కోతలు అవసరమని ఆయన పేర్కొన్నారు.కంపెనీ పరిణామాలపై ఆయన ఉద్యోగులకు లేఖలు పంపారు. "అన్నింటికంటే ముందుగా నేను నాపై ఎక్కువ భారం మోపుతున్న వాటి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇటీవలి ఉద్యోగ తొలగింపుల గురించి మీలో చాలా మంది ఆలోచిస్తున్నారని నాకు తెలుసు" అంటూ సత్య నాదెళ్ల లేఖ మొదలు పెట్టారు. " ఈ నిర్ణయాలు మనం తీసుకోవాల్సిన అత్యంత క్లిష్టమైనవి. మన సహోద్యోగులు, సహచరులు, స్నేహితులు.. మనం ఎవరితో అయితే కలిసి పనిచేశామో, నేర్చుకున్నామో, లెక్కలేనన్ని క్షణాలను పంచుకున్నామో వారిని అవి ప్రభావితం చేస్తాయి" అంటూ రాసుకొచ్చారు.మైక్రోసాఫ్ట్ 2014 తర్వాత ఈ సంవత్సరం భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. దాని ప్రపంచ శ్రామిక శక్తిలో 7 శాతం మందికి ఉద్వాసన పలికింది. ఉద్యోగాల కోతలో అనిశ్చితి, అసంబద్ధత కనిపిస్తోందని అంగీకరించిన సత్య నాదెళ్ల కంపెనీ వృద్ధిపై కూడా దృష్టి సారించారు. "మార్కెట్ పనితీరు, వ్యూహాత్మక స్థానం, వృద్ధి ఇలా అంశాల్లో లక్ష్యంతో కూడిన చర్యల ద్వారా మైక్రోసాఫ్ట్ పురోగమిస్తోంది. మనం మునుపటి కంటే మూలధన పెట్టుబడులు ఎక్కువ పెడుతున్నాం. మన మొత్తం హెడ్ కౌంట్లో పెద్దగా మార్పేమీ లేదు. మన పరిశ్రమలో, మైక్రోసాఫ్ట్ లో కొంతమంది ప్రతిభ, నైపుణ్యానికి మునుపెన్నడూ చూడని స్థాయిలో గుర్తింపు, రివార్డులు లభిస్తున్నాయి. అదే సమయంలో లేఆఫ్లూ అమలు చేస్తున్నాం" అని వివరించారు. -
సుందర్ పిచాయ్ ఇక బిలియనీర్..
ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ బిలియనీర్స్ క్లబ్లోకి చేరారు. 1 బిలియన్ డాలర్ల నికర సంపద పరిమితిని అధిగమించి బిలియనీర్గా అవతరించారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ఆల్ఫాబెట్ షేర్లు ఆల్టైమ్ గరిష్టానికి చేరుకోవడంతో, భారత్కు చెందిన 53 ఏళ్ల పిచాయ్ నెట్వర్త్ 1.1 బిలియన్ డాలర్లకు పెరిగింది.2023 ప్రారంభం నుంచి ఆల్ఫాబెట్ స్టాక్ 120 శాతానికి పైగా పెరగడం, కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1 ట్రిలియన్ డాలర్లకు పైగా పెరగడం ఈ ఆర్థిక పురోగతికి ప్రధాన కారణమని బ్లూమ్బర్గ్ పేర్కొంది. ముఖ్యంగా టెక్ రంగంలో ఒక వ్యవస్థాపకేతర సీఈఓకు ఇది అరుదైన ఘనత. మెటాకు చెందిన మార్క్ జుకర్ బర్గ్, ఎన్విడియాకు చెందిన జెన్సెన్ హువాంగ్ వంటి ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్ లు బిలియనీర్స్గా ముందు వరసలో ఉన్నప్పటికీ వారు తమ కంపెనీల్లో ఈక్విటీ వాటాలను కలిగి ఉన్నారు.సీఈవోగా పదేళ్లుఆల్ఫాబెట్ సీఈవోగా సుందర్ పిచాయ్ ఇటీవలే పదేళ్లు పూర్తి చేసుకుని కంపెనీలో ఎక్కువ కాలం చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. పిచాయ్ 2004లో ఆల్ఫాబెట్ ప్రధాన అనుబంధ సంస్థ గూగుల్ లో చేరారు. క్రోమ్, ఆండ్రాయిడ్ లకు ఆయన తొలినాళ్లలో చేసిన సేవలు 2015లో సీఈఓగా ఎదగడానికి పునాది వేశాయి. తర్వాత 2019లో ఆల్ఫాబెట్ సీఈఓగా సుందర్ పిచాయ్ నియమితులయ్యారు.నిరాడంబర నేపథ్యం..సుందర్ పిచాయ్ తమిళనాడులోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించి రెండు గదుల అపార్ట్ మెంట్ లో పెరిగారు. వారి కుటుంబానికి కారు ఉండేది కాదు. ఆయనకు 12 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు తొలిసారిగా ఇంటికి టెలిఫోన్ వచ్చింది. 1993 లో సుందర్ పిచాయ్ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి స్కాలర్షిప్ సాధించగా ఆయన్ను కాలిఫోర్నియా పంపించడానికి విమాన టికెట్ కోసం ఆయన తండ్రి ఏడాది మొత్తం జీతం కంటే కూడా పైగానే ఆ కుటుంబం ఖర్చుపెట్టాల్సి వచ్చింది. -
రూ.10 వేల లోపు కేటగిరిలో మరో కొత్త స్మార్ట్ ఫోన్
రూ.10 వేల లోపు కేటగిరిలో మరో కొత్త స్మార్ట్ ఫోన్ విడుదలైంది. హెచ్డీ+ డిస్ప్లే, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఐపీ64 వాటర్ రెసిస్టెన్స్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, ఎన్ఎఫ్సీ, ఎఫ్ఎం రేడియో సపోర్ట్ తో ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ కొత్త ఫోన్ వివో టీ4 లైట్, పోకో ఎం7, లావా స్టార్మ్ ప్లే ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 ధర.. లభ్యత ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 స్మార్ట్ఫోన్ 4 జీబీ ర్యామ్ / 64 జీబీ స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే వస్తుంది. దీని ధర రూ .6,799. ఐరిస్ బ్లూ, ట్విలైట్ గోల్డ్, టైటానియం సిల్వర్, స్లీక్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. ఆగస్టు 2వ తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది.ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 స్పెసిఫికేషన్లుఇన్ఫినిక్స్ స్మార్ట్ 10లో 6.67 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 700 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.ఇది ఐపీ 64 వాటర్ రెసిస్టెన్స్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్ తో వస్తుంది. అంటే ఫోన్పై దుమ్ము, నీటి చుక్కలు పడినా ఏమీ అవ్వదు కానీ నీటిలో పూర్తిగా మునిగిపోకుండా ఉండాలి.స్మార్ట్ 10 డీటీఎస్ ట్యూన్ చేసిన డ్యూయల్ స్పీకర్ సెటప్ తో వస్తుంది. 300% వాల్యూమ్ బూస్ట్ ను సపోర్ట్ చేస్తుంది.ఏ55 జీపీయూతో కూడిన యూనిసోక్ టీ7250 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేస్తుంది. ఈ ఏడాది లాంచ్ అయిన ఇతర ఇన్ఫినిక్స్ ఫోన్ల మాదిరిగానే, ఈ స్మార్ట్ 10 ఆండ్రాయిడ్ 15 ఆధారిత కంపెనీ తాజా ఎక్స్ఓఎస్ 15 పై పనిచేస్తుంది.ఇందులో 4 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ను అందించారు. మైక్రో ఎస్ డీ కార్డ్ స్లాట్ ద్వారా స్టోరేజ్ ను 2 టీబీ వరకు పెంచుకునే వెసులుబాటు కూడా ఉంది.ఆప్టిక్స్ విషయానికొస్తే, ఫోన్లలో 8 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, వెనుక భాగంలో డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ షూటర్ ఉంది. రియర్, ఫ్రంట్ కెమెరా రెండూ 2కే 30 ఎఫ్పీఎస్ వేగంతో వీడియోలను షూట్ చేయగలవు.15వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. -
మెటా వారి ఇమాజిన్ మీ
‘ఇమాజిన్ మీ’ అనే సరికొత్త ఏఐ–పవర్డ్ ఫీచర్ని తీసుకువచ్చింది మెటా ఏఐ. ఈ ఫీచర్తో టెక్ట్స్ ప్రాంప్ట్ ఉపయోగించి యూజర్లు తమ ఏఐ ఇమేజ్లను జనరేట్ చేయవచ్చు. ‘ఇమాజిన్ మీ’ ఫీచర్ని వాట్సప్, ఫేస్బుక్ మెసెంజర్, ఇన్స్టాగ్రామ్ చాట్విండోస్లో ఉపయోగించవచ్చు.అక్యురేట్, కస్టమైజ్డ్ ఫోటోగ్రాఫ్స్ కోసం ‘ఇమాజిన్ మీ’ యూజర్లకు సంబంధించి ఫ్రంట్, లెఫ్ట్, రైట్ ఫేస్ల సెల్ఫీలను అడుగుతుంది.‘ఇమాజిన్ మీ యాజ్ ఏ నైంటీస్ గ్యాంగ్స్టర్’ ‘ఇమాజిన్ మీ యాజ్ ఏ కౌబాయ్’లాంటిప్రాంప్ట్ను యూజర్లు ఇవ్వవచ్చు. ప్రామ్ట్ సెట్టింగ్స్తో అదనపు మార్పులు కూడా చేయవచ్చు.ఉదా: ఇమాజిన్ మీ యాజ్ ఏ కౌబాయ్, బట్ ఆన్ ది మూన్, వీయరింగ్ ఫ్యూచరిస్టిక్ క్లాత్స్ఇమాజిన్ యాజ్ ఏ నైంటీస్ గ్యాంగ్స్టర్ సిప్పింగ్ కాఫీ ఎట్ యాన్ ఇండియన్ బీచ్తమ ఏఐ–జనరేటెడ్ ఇమేజ్లు సంతృప్తికరంగా లేకపోతే ఎడిట్, రీజెనరేట్, రిమూవ్ ఇమేజెస్లాంటి ఆప్షన్లను యూజర్లు ఉపయోగించుకోవచ్చు. -
గూగుల్ క్రోమ్కు సవాల్.. ఎన్విడియా ఏఐ వచ్చేస్తోంది!
ప్రపంచవ్యాప్తంగా వెబ్ బ్రౌజర్ల మార్కెట్ లీడర్గా కొనసాగుతున్న ఆల్ఫాబెట్కు చెందిన గూగుల్ క్రోమ్కు సవాల్ విసిరేందుకు టెక్నాలజీ దిగ్గజ సంస్థ ఎన్విడియాకు చెందిన పర్పెక్స్సిటీ ఏఐ సిద్ధమవుతోంది. త్వరలోనే కామెట్ పేరుతో ఏఐ ఆధారిత సామర్థ్యంగల వెబ్ బ్రౌజర్ను తీసుకురానుంది. – సాక్షి, సెంట్రల్డెస్క్మార్కెట్.యూఎస్ అనే సంస్థ నివేదిక ప్రకారం 2024లో 4.5 బిలియన్ డాలర్లుగా ఉన్న ఏఐ ఆధారిత వెబ్ బ్రౌజర్ల మార్కెట్.. 2034 నాటికి 76.8 బిలియన్ డాలర్లకు చేరుకొనే అవకాశం ఉంది. స్టాట్కౌంటర్ అనే సంస్థ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జూన్ నాటికి ప్రపంచ వెబ్ బ్రౌజర్ల మార్కెట్లో క్రోమ్ 68 శాతం వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రపంచంలోనే అత్యధికం మంది యూజర్లు ఉపయోగిస్తున్న వెబ్ బ్రౌజర్గా మార్కెట్ను సుస్థిరం చేసుకొని ఇతర ప్రముఖ వెబ్ బ్రౌజర్లయిన సఫారీ, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఫైర్ఫాక్స్కు అందనంత ఎత్తులో ఉంది.యూజర్లకు లభించేవి ఇవీ..సాధారణ బ్రౌజర్లతో పోలిస్తే ఏఐ ఆధారిత బ్రౌజర్లు యూజర్లు కోరిన కంటెంట్ను సంక్షిప్తంగా అందించగలవు. అలాగే టాస్క్లను ఆటోమేట్ చేయగలవు. ఉదాహరణకు ఈ–మెయిళ్లకు ఆటోమెటిక్గా రిప్లైలు పంపడం, సోషల్ మీడియా పోస్ట్లను షెడ్యూల్ చేయడం, దరఖాస్తుల్లోని డేటాను సంగ్రహించడం లాంటివి అన్నమాట.ముఖ్యంగా సందర్భానుసారంగా జవాబులు అందించగలవు. అంటే యూజర్లు అందించే ఇన్పుట్లు, డేటా హిస్టరీని పరిగణనలోకి తీసుకొని, వాటిని విశ్లేషించి జవాబులను అందించడం, వివిధ డేటా సోర్స్ల నుంచి సమాచారాన్ని క్రోడీకరించి నేరుగా సమాధానాలు ఇవ్వ డం చేయగలవు. అపాయింట్మెంట్ల బుకింగ్లు, ఉత్పత్తులను పోల్చడం వంటి సంక్లిష్ట పనులను కూడా చక్కబెట్టగలవు. -
కొత్త ఆవిష్కరణలపై బ్యాంక్ ఆఫ్ బరోడా దృష్టి
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) తమ 118వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా పలు కొత్త ఆవిష్కరణలు, కార్యక్రమాలను ప్రకటించింది. వ్యాపార వర్గాల కోసం ఉద్దేశించిన వరల్డ్ బిజినెస్ యాప్, బాబ్ ఈ–పే ఇంటర్నేషనల్, ఇన్సైట్ బ్రెయిలీ డెబిట్ కార్డు, గ్రీన్ ఫైనాన్సింగ్ స్కీములు మొదలైనవి ఉన్నాయి.టెక్నాలజీ ఆధారిత బ్యాంకింగ్ సేవలను అందించడం ద్వారా సమ్మిళిత వృద్ధి సాధనలో బీవోబీలాంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయని కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు తెలిపారు. బ్యాంకింగ్ సేవలను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు, లావాదేవీల నిర్వహణను సరళతరంగా, సురక్షితంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని బీవోబీ ఎండీ దేబదత్త చంద్ తెలిపారు.ఇదీ చదవండి: ఉద్యోగం ఇచ్చారు.. అంతలోనే తొలగించారు!బ్యాంకు అందిస్తున్న జనరేటివ్ ఏఐ పవర్డ్ టూల్స్అదితి: వీడియో, ఆడియో, చాట్ ద్వారా మల్టీ ల్యాంగ్వేజీలో 24/7 వర్చువల్ రిలేషన్ షిప్ మేనేజర్ సర్వీసులు అందిస్తుంది.ఏడీఐ: తక్షణ సమస్యల పరిష్కారం కోసం జనరేటివ్ఏఐ ఆధారిత చాట్ బాట్.గ్యాన్సహాహ్.ఏఐ(GyanSahay.AI): ఉద్యోగులు ప్రొడక్ట్, పాలసీ సమాచారాన్ని త్వరగా యాక్సెస్ చేయడానికి ఇంటర్నల్ జెఎన్ఏఐ ప్లాట్ఫామ్. -
ఉపాధిని తొలగించే టెక్నాలజీ ఎందుకు?
సాంకేతిక పురోగతి ఉపాధిని తొలగించేదిగా ఉండకూడదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు. టెక్నాలజీ అనేది కార్మికులను గౌరవించి, పరిశ్రమలకు మద్దతు ఇచ్చేలా, జాతీయ ప్రయోజనాలకు ఉపయోగపడేలా సమతుల్య విధానాన్ని ప్రోత్సహించాలని చెప్పారు. భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) 70వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో భగవత్ మాట్లాడారు. బీఎంఎస్ ఆర్ఎస్ఎస్కు అనుబంధంగా ఉన్న భారతదేశపు అతిపెద్ద కార్మిక సంఘం.ఇదీ చదవండి: ఉద్యోగం ఇచ్చారు.. అంతలోనే తొలగించారు!‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరివర్తన సవాలుగా మారుతోంది. ప్రతి కొత్త టెక్నాలజీ ప్రాథమికంగా ఆందోళన కలిగిస్తుంది. నాలెడ్జ్ బేస్డ్ టెక్నాలజీ సంబంధిత రంగంలోని ఉద్యోగాలపై ప్రభావం చూపకూడదు. దాని ప్రతిష్ఠను దిగజార్చకూడదు. మారుతున్న ఆర్థిక, సాంకేతిక పరిస్థితులకు అనుగుణంగా కార్మిక, పారిశ్రామిక, జాతీయ ప్రయోజనాలను సమన్వయం చేసేలా సాంకేతిక అభివృద్ధి ఉండాలి. ప్రతి ఆవిష్కరణలో ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగా మాన్యువల్ లేదా సెమీ స్కిల్డ్ లేబర్పై ఎక్కువగా ఆధారపడే రంగాల్లో దీని ప్రభావం అధికంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి’ అన్నారు. -
ఎకానమీకి గూగుల్ ప్లే, ఆండ్రాయిడ్ దన్ను
న్యూఢిల్లీ: భారత ఎకానమీ వృద్ధికి గూగుల్ ప్లే, ఆండ్రాయిడ్ కూడా ఇతోధికంగా తోడ్పాటు అందిస్తున్నట్లు రీసెర్చ్ కన్సల్టెన్సీ సంస్థ పబ్లిక్ ఫస్ట్ తెలిపింది. 2024లో యాప్ పబ్లిషర్లకు, విస్తృత ఆర్థిక వ్యవస్థకు ఇవి సుమారు రూ. 4 లక్షల కోట్ల మేర ఆదాయ ప్రయోజనం చేకూర్చినట్లు వివరించింది. ప్రపంచంలోనే అతి పెద్దదైన, అత్యంత వేగంగా ఎదుగుతున్న డిజిటల్ ఎకానమీల్లో భారత్ కూడా ఒకటని పబ్లిక్ ఫస్ట్ ఒక నివేదికలో వివరించింది. స్మార్ట్ఫోన్ల వినియోగం వేగంగా పెరగడం, డేటా చౌకగా లభిస్తుండటం, డెవలపర్లు.. ఎంట్రప్రెన్యూర్లకు అనువైన పరిస్థితులు నెలకొనడం తదితర అంశాలు ఇందుకు దోహదపడుతున్నట్లు పేర్కొంది. రిపోర్టు ప్రకారం గూగుల్ ప్లే, ఆండ్రాయిడ్ యాప్ వ్యవస్థ దాదాపు ముప్పైఅయిదు లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను కల్పించింది. గూగుల్ ప్లేలో నమోదు చేసుకున్న యాక్టివ్ డెవలపర్లకు సంబంధించి 10 లక్షల డెవలపర్ జాబ్స్తో భారత్ రెండో స్థానంలో ఉంది. సుమారు 79% మంది యాప్ డెవలపర్లకు విదేశీ యూజర్లు ఉన్నారు. ప్లే స్టోర్ నుంచి భారతీయ డెవలపర్ల యాప్ల డౌన్లోడ్లు 720 కోట్లుగా ఉండగా, ఇందులో దేశీ యూజర్ల డౌన్లోడ్లు 600 కోట్లు, విదేశీ యూజర్ల డౌన్లోడ్లు 120 కోట్లుగా నమోదయ్యాయి. ఆండ్రాయిడ్ సర్వీసులకు సంబంధించి గూగుల్ ప్లే అధికారిక యాప్ స్టోర్. -
టీసీఎస్ కూడా అంతేనా? కేంద్రానికి ఉద్యోగుల ఫిర్యాదు
ఉద్యోగులకు ఆఫర్ లెటర్లు ఇచ్చి ఉద్యోగంలోకి చేర్చుకోకుండా తిప్పలు పెడుతోందంటూ దేశీ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్పై ఐటీ ఉద్యోగుల సంఘం ఆ మధ్య కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కూడా ఇలాగే చేస్తోందని ఐటీ ఉద్యోగుల సంఘం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది.600 మందికి పైగా అనుభవజ్ఞులైన ఉద్యోగుల లేటరల్ నియామకాల్లో టీసీఎస్ జాప్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్) కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాసింది. ఈ ఆన్బోర్డింగ్ టైమ్లైన్పై ఎటువంటి కమ్యూనికేషన్ లేదని, దీంతో చాలా మంది టెక్కీలు ఇబ్బంది పడుతున్నారని మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో పేర్కొంది.ఆన్ బోర్డింగ్ ప్రక్రియల్లో ఈ 'నిరవధిక జాప్యం' ప్రభావాన్ని ఎత్తిచూపుతూ కార్మిక మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవాలని ఎన్ఐటీఈఎస్ కోరింది. అధికారిక ఆఫర్ లెటర్ ఉన్నప్పటికీ ఉద్యోగంలో చేర్చుకోకపోవడం ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని వివరించింది. ప్రభావితమైనవారిలో రెండేళ్ల నుంచి 18 సంవత్సరాల అనుభవం ఉన్న వారు ఉన్నారని లేఖలో తెలిపింది. ఈ ఉద్యోగులు తమ మునుపటి సంస్థకు అధికారికంగా రాజీనామా చేశారని, ప్రస్తుతం వీరు ఇటు టీసీఎస్ ఉద్యోగంలో చేర్చుకోకపోవడం, వేరే ఉద్యోగమూ లేకపోవడంతో ఈఎంఐలు, అద్దెలు, వాయిదాలు చెల్లించడం కష్టమవుతోంది. దీనిపై టీసీఎస్ ఏమంటోందంటే..ఆఫర్ లెటర్ అందుకున్న ప్రతి ఒక్కరినీ ఆన్బోర్డ్ చేస్తామని టీసీఎస్ పునరుద్ఘాటిస్తోంది. ‘ఫ్రెషర్స్ లేదా అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్ ఇచ్చిన అన్ని ఆఫర్లను గౌరవించడానికి టీసీఎస్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని మేము ధృవీకరించగలము. టీసీఎస్ నుంచి ఆఫర్ వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆన్బోర్డ్ చేస్తాం. వ్యాపార డిమాండ్ ప్రకారం జాయినింగ్ తేదీలు నిర్ణయించడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో, అవి వ్యాపార అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేస్తుంటాం. ఈ సందర్భాల్లో అభ్యర్థులందరితో నిరంతరం టచ్ లో ఉంటామని, వారిని త్వరలోనే సంస్థలో చేర్చుకునేందుకు చూస్తుంటాం’ అని కంపెనీ తెలిపింది.ఆలస్యమైన అభ్యర్థుల ఆన్బోర్డింగ్కు సంబంధించి స్పష్టమైన కాలపరిమితి కోసం టీసీఎస్పై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ ఎన్ఐటీఈఎస్ అధికారికంగా కార్మిక మంత్రిత్వ శాఖను ఆశ్రయించింది. వెయిటింగ్ పీరియడ్ కు ఆర్థిక పరిహారం, టీసీఎస్ ఎంప్లాయీ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ (ఈఏపీ) ద్వారా మానసిక ఆరోగ్య మద్దతుకు ప్రాప్యత, బాధితులకు కంపెనీలో ప్రత్యామ్నాయ పాత్రలను పరిగణనలోకి తీసుకోవాలని ఎన్ఐటీఈఎస్ డిమాండ్ చేస్తోంది.👉 ఇదీ చదవండి: ఈ ఐటీ ఉద్యోగం.. రూ.కోటి జీతం -
ప్రభుత్వ సర్వీసులకు ఓపెన్ఏఐతో భాగస్వామ్యం
ప్రభుత్వ సేవల్లో ఉత్పాదకతను పెంచేందుకు కృత్రిమ మేధ (ఏఐ)ను ఉపయోగించేలా చాట్జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు యూకే ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఒప్పందం ప్రకారం ఓపెన్ఏఐ ప్రభుత్వ డేటాను యాక్సెస్ చేసే అవకాశం ఏర్పడుతుంది. విద్య, రక్షణ, భద్రత, న్యాయ వ్యవస్థలో ఉపయోగించే ప్రభుత్వ సాఫ్ట్వేర్ల్లో ఏఐ ఆధారిత కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నట్లు ఇరు వర్గాలు తెలిపాయి.యూకేలో మార్పు తీసుకురావడానికి, ఆర్థిక వృద్ధిని మెరుగు పరిచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలకం కానుందని ప్రభుత్వ టెక్నాలజీ సెక్రటరీ పీటర్ కైల్ అన్నారు. ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను స్వీకరించడం ద్వారా గతంలో స్థానిక సంగీతకారుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఏఐ టూల్స్ తమ సంగీతాన్ని లైసెన్స్ లేకుండా ఉపయోగించడాన్ని వారు వ్యతిరేకించారు.ఇదీ చదవండి: టెస్లా డైనర్ రెస్టారెంట్లు.. అదిరిపోయే ప్రత్యేకతలుప్రస్తుతం ప్రాథమికంగా 100 మందికి పైగా ఉపాధి కల్పిస్తున్న లండన్ కార్యాలయంలో ఓపెన్ ఏఐ సర్వీసులను విస్తరించనుంది. క్రమంగా ఏఐ సేవలు ఇతర విభాగాలకు వ్యాపిస్తాయని ఇరువర్గాలు తెలిపాయి. ఓపెన్ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ శామ్ ఆల్ట్మన్ మాట్లాడుతూ.. దీని ద్వారా అందరికీ మేలు జరుగుతుందన్నారు. ఏఐ అనేది దేశ నిర్మాణానికి కీలకమైన సాంకేతికత అని తెలుపుతూ, ఇది ఆర్థిక వ్యవస్థలను మారుస్తుందని చెప్పారు. -
టెస్లా డైనర్ రెస్టారెంట్లు.. అదిరిపోయే ప్రత్యేకతలు
టెస్లా లాస్ ఏంజిల్స్లో టెక్నాలజీని మిళితం చేస్తూ వినియోగదారులకు సరికొత్త డైనర్, డ్రైవ్-ఇన్ అనుభవాన్ని అందించాలని కొత్త అవుట్లెట్ను ఆవిష్కరించింది. శాంటా మోనికా బౌలేవార్డ్లో టెస్లా టెక్ ఔత్సాహికులతోపాటు సాధారణ ప్రజలకు సాంకేతికత సాయంతో ఫుడ్ సర్వీసులు ప్రారంభించింది. క్లాసిక్ కంఫర్ట్ ఫుడ్ను ఈ అవుట్లెట్లో అందుబాటులో ఉంచుతున్నట్లు టెస్లా తెలిపింది.టెక్ కంటెంట్ సృష్టికర్త జాక్లిన్ డల్లాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ డైనర్ కేవలం ఒక హోటల్గా మాత్రమే కాకుండా 45 అడుగుల స్క్రీన్ అమర్చిన డ్రైవ్ ఇన్ థియేటర్ అనుభవాన్ని ఇస్తుందని చెప్పారు. ఇందులో బర్గర్లు, హాట్ డాగ్స్, చికెన్ వింగ్స్ హ్యాండ్ స్పిన్డ్ మిల్క్ షేక్స్ లభిస్తాయన్నారు. అయితే కస్టమర్లు చేసే ఆర్డర్లు అన్నీ టెస్లా సైబర్ ట్రక్ థీమ్ బాక్స్ల్లో అందిస్తారని తెలిపారు.My kids ❤️ @Tesla_Optimus #TeslaDiner pic.twitter.com/Kt6t8gsHOL— Prime the pump (@whistingbhole) July 20, 2025ఇదీ చదవండి: టెక్ కంపెనీల్లో భారీగా కొలువుల కోతలుఈ టెస్లా డైనర్లో భోజనం చేయాలనుకునే కస్టమర్లు కార్లలోని టెస్లా స్క్రీన్ల నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదా ఆడియో సింక్ చేయడం ద్వారా అయినా ఆర్డర్ బుక్ చేయవచ్చు. ఇందులో సర్వీసు చేసేందుకు టెస్లా ఆప్టిమస్ రోబోట్లను వినియోగిస్తున్నట్లు డల్లాస్ చెప్పారు. దాంతోపాటు టెస్లా కార్లు ఛార్జింగ్ పెట్టుకునేందుకు వీలుగా ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం 2023 చివరిలో ప్రారంభమైంది.Inside @Tesla ‘s NEW Diner!! pic.twitter.com/yOPdQEEXwZ— Jacklyn Dallas (@NBTJacklyn) July 20, 2025 -
టెక్ కంపెనీల్లో భారీగా కొలువుల కోతలు
టెక్నాలజీ అభివృద్ధి అనేది రెండు వైపులా పదనున్న కత్తిగా వ్యవహరిస్తోందనే వాదనలున్నాయి. ఆర్థికాభివృద్ధి, టెక్ వ్యవస్థలను ముందుకు నడిపేందుకు కొత్త ఆవిష్కరణలు ఎంతో ఉపయోగపడుతుంటే.. దీనివల్ల లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. 2025 ప్రథమార్ధం ముగిసిన నేపథ్యంలో అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇతర టెక్ దిగ్గజాల్లోని వేలాది మంది ఉద్యోగులు తమ కొలువులు కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరగడమే ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు.టాప్ కంపెనీల్లో..2025 జనవరి-జులై మధ్య ప్రపంచవ్యాప్తంగా ప్రధాన టెక్ కంపెనీలు సుమారు 91,000 ఉద్యోగాలను తొలగించగా, అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ గణనీయంగా తమ సిబ్బందిని తగ్గించాయి. స్టార్టప్లు, యునికార్న్లతోపాటు ఆధునిక కంప్యూటింగ్కు మార్గదర్శకత్వం వహిస్తున్న, కృత్రిమ మేధ రేసులో ముందున్న సంస్థల నుంచి ఈ ఉద్యోగ కోతలు ఎక్కువయ్యాయి.ఎవరేం చెప్పినా కోతలే ప్రధానంలాజిస్టిక్స్, ఏడబ్ల్యూఎస్ సపోర్ట్, ఇంటర్నల్ ఆపరేషన్స్ విభాగాల్లో ఇప్పటివరకు అమెజాన్ సుమారు 23,000 ఉద్యోగాలను తగ్గించింది. సేల్స్, కస్టమర్ సపోర్ట్, నాన్ ఏఐ ఆర్ అండ్ డీ విభాగాల్లో 17,500 ఉద్యోగాలను మైక్రోసాఫ్ట్ తొలగించింది. సీఈఓ సత్య నాదెళ్ల ఈ చర్యను ‘తదుపరి తరం ఉత్పాదకత దిశగా శ్రామిక శక్తిని పునర్వ్యవస్థీకరించడం’గా అభివర్ణించారు. అడ్వర్టైజింగ్, హెచ్ఆర్, లెగసీ ప్రొడక్ట్ ఇంజినీరింగ్ విభాగాల్లో మొత్తం టీమ్లతో సహా ప్రపంచవ్యాప్తంగా 21,000 ఉద్యోగాలను గూగుల్ తొలగించింది. ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫస్ట్’ విధానంతో కంపెనీ ట్రాన్సఫర్మేషన్లో భాగంగా ఈ తొలగింపులు జరిగాయని సుందర్ పిచాయ్ తెలిపారు.ఏఐ ఆర్ అండ్ డీలో పెట్టుబడిఈ కోతల వల్ల కంపెనీలకు భారీగా వ్యయం మిగులుతుంది. రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం దీన్ని వెచ్చిస్తున్నాయి. ఈ మూడు సంస్థలు కలిసి 2026 నాటికి ఏఐ ఆర్ అండ్ డీ, మౌలిక సదుపాయాలకు 150 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేయబోతున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. హెడ్ కౌంట్ పడిపోవడంతో కంపెనీల ఆపరేటింగ్ మార్జిన్లు పెరిగాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ సంస్థల షేర్ల ధరలు ఇటీవల 18-27 శాతం మధ్య పెరిగాయి.ఇదీ చదవండి: ఎనిమిదో పే కమిషన్ ఏర్పాటుకు చర్చలు ప్రారంభంకొన్ని ఉద్యోగాలకు డిమాండ్ఏఐ పెరుగుతున్నా కొన్ని ఉద్యోగాలకు మాత్రం డిమాండ్ అధికమవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రాంప్ట్ ఇంజినీర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎథిక్స్, మోడల్ ట్రైనర్లకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. సరైన నైపుణ్యాలున్న వారికి కంపెనీలు ఎంతైన వెచ్చించేందుకు సిద్ధమవుతున్నట్లు ఇటీవల మెటా ప్యాకేజీల వల్ల తెలుస్తుంది. ఏఐ టెక్ నిపుణులకు సుమారు రూ.830 కోట్ల ప్యాకేజీలను సైతం ప్రకటిస్తోంది. -
ఎల్రక్టానిక్స్ ఎగుమతులు జూమ్
న్యూఢిల్లీ: ఎల్రక్టానిక్స్ ఎగుమతులు ప్రస్తుత ఆరి్థక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్/క్యూ1) బలమైన పనితీరు చూపించాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే ఏకంగా 47 శాతం పెరిగి 12.41 బిలియన్ డాలర్లకు (రూ.1.05 లక్షల కోట్లు సుమారు) చేరాయి. కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం.. ముఖ్యంగా అమెరికా, యూఏఈ, చైనా టాప్–3 ఎగుమతి గమ్యస్థానాలుగా ఉన్నాయి. నెదర్లాండ్స్, జర్మనీ తర్వాతి రెండు స్థానాల్లో నిలిచాయి. ‘‘భౌగోళికంగా వివిధ దేశాల మధ్య ఎగుమతుల్లో వైవిధ్యం, అంతర్జాతీయ ఎల్రక్టానిక్స్ సరఫరా వ్యవస్థతో పెరుగుతున్న భారత్ అనుసంధానతను ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. ఆసియాలో విశ్వసనీయ ప్రత్యామ్నాయ తయారీ కేంద్రంగా భారత్ అవతరిస్తున్నదానికి నిదర్శనం’’అని వాణిజ్య శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. అమెరికాకే 60 శాతం భారత ఎల్రక్టానిక్స్ ఎగుమతుల్లో 60 శాతం మేర అమెరికాకే వెళ్లాయి. ఆ తర్వాత యూఏఈకి 8 శాతం, చైనాకి 3.88 శాతం, నెదర్లాండ్స్కు 2.68 శాతం, జర్మనీకి 2.09 శాతం చొప్పున జూన్ త్రైమాసికంలో ఎగుమతులు నమోదయ్యాయి. భారత రెడీమేడ్ వ్రస్తాల ఎగుమతుల్లోనూ (ఆర్ఎంజీ) అమెరికాయే అగ్రస్థానంలో ఉంది. 34 శాతం రెడీమేడ్ వస్త్ర ఎగుమతులు అమెరికాకు వెళ్లాయి. ఆ తర్వాత యూకేకి 8.81 శాతం, యూఏఈకి 7.85 శాతం, జర్మనీకి 5.51 శాతం, స్పెయిన్కు 5.29 శాతం చొప్పున ఆర్ఎంజీ ఎగుమతులు నమోదయ్యాయి. జూన్ త్రైమాసికంలో మొత్తం రెడీమెడ్ వస్త్ర ఎగుమతులు 4.19 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. క్రితం ఆరి్థక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇవి 3.85 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు జూన్ క్వార్టర్లో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 19 శాతానికి పైగా పెరిగి 1.95 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 37.63 శాతం మేర అమెరికాయే దిగుమతి చేసుకుంది. ఆ తర్వాత 17 శాతం చైనాకి, 6.63 శాతం వియత్నాంకి, 4.47 శాతం జపాన్కు వెళ్లాయి. -
8 వేల మంది ప్రొఫెషనల్స్కి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ
న్యూఢిల్లీ: వచ్చే మూడేళ్లలో భారత్లో 8,000 మంది ప్రొఫెషనల్స్కు కృత్రిమ మేధ (ఏఐ) సంబంధ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు అమెరికాకు చెందిన బీపీవో సంస్థ వర్టెక్స్ గ్లోబల్ సర్వీసెస్ (వీజీఎస్) తెలిపింది. కాంటాక్ట్ సెంటర్ ప్రక్రియలను మెరుగుపర్చే వీఅసిస్ట్ టూల్తో ఈ శిక్షణా కార్యక్రమం తమ సంస్థ అంతర్గతంగా సామర్థ్యాలను పెంచుకునేందుకు ఉపయోగపడుతుందని వివరించింది. కస్టమర్ల నుంచి వచ్చే క్వెరీలను మరింత మెరుగ్గా అర్థం చేసుకుని, విశ్లేషించుకుని, సముచిత కేటగిరీల కింద వర్గీకరించడం (కాంటాక్ట్ సెంటర్, కస్టమర్ సర్వీస్, వ్యాపార అవసరాలు) ద్వారా కంపెనీ సిబ్బంది తగిన పరిష్కార మార్గాలను అందించేందుకు ఈ టూల్ ఉపయోగపడుతుందని సంస్థ తెలిపింది. ఏఐ రాకతో దేశీ బీపీవో రంగంలో కూడా శరవేగంగా పెను మార్పులు వస్తున్నాయని వీజీఎస్ ప్రెసిడెంట్ గగన్ ఆరోరా తెలిపారు. అధునాతన టెక్నాలజీలు, ఏఐ దన్నుతో 2033 నాటికి ఈ విభాగం 280 బిలియన్ డాలర్లకు పెరుగుతుందనే అంచనాలు ఉన్నట్లు వివరించారు. ప్రస్తుతం 2025లో ఇది 139.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఉద్యోగులు, ఏఐ మధ్య సమతూకం సాధించడం ద్వారా ఏజెంట్ల పనితీరును మెరుగుపర్చుకోవడంతో పాటు కస్టమర్లకు కూడా మరింత సంతృప్తికరమైన సేవలు అందించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. -
చిటికెలో సినిమా.. ఫోన్తోనే!
స్మార్ట్ ఫోన్ ఉందా? ఈ లెన్స్ తగిలించండి. మీ రూమ్ ఒక సెట్, మీరే డైరెక్టర్! ఆశ్చర్యపోతున్నారా! నిజం, ఈ చిన్న 1.33 ఎక్స్ అనామార్ఫిక్ లెన్స్ సాయంతో, మీ స్మార్ట్ఫోన్తోనే సినిమా తీయొచ్చు. పెద్ద కెమెరాలు, లైట్లు, సెటప్లు ఏవీ అవసరం లేదు. బెడ్రూమ్, హాల్, టెర్రస్... ఎక్కడైనా సినిమా లెవెల్ షాట్ తీయవచ్చు. ఇది రెండు రకాల లైటింగ్ ఎఫెక్ట్స్తో పనిచేస్తుంది. అందులో బ్లూ ఫ్లేర్ పెడితే ఇంట్లోనే స్పేస్ సినిమా ఫీల్, గోల్డ్ ఫ్లేర్ పెడితే శ్రావణ మాసం గుడిలో వచ్చే డివోషనల్ ఫీల్ కనిపిస్తుంది. ఒక్కసారి ఇది తీసిన వీడియో చూస్తూ ‘ఇది నిజంగా ఫోన్తో తీయగలరా?’ అని అశ్చర్యపోతారు. ఒక్కసారి వాడాక, మామూలు కెమెరా తెరవాలని కూడా అనిపించదు. ఇంకా ప్రత్యేకంగా డబ్బింగ్ చేయాల్సిన అవసరం లేదు. వీడియోలో సౌండ్ కూడా అద్భుతంగా రికార్డ్ అవుతుంది. ధర రూ.13,999 మాత్రమే!జేబులో దీపావళి!చుట్టూ చీకటి ఉన్నా, మీ ఇల్లు దీపావళి నాటి ఆకాశంలా మెరవాలంటే, మీ దగ్గర ఈ ‘డిజి టెక్ పోర్టబుల్ ఎల్ఈడీ లైట్’ ఉండాల్సిందే! చేతిలో పట్టేంత చిన్నదే, కాని ఆన్ చేస్తే మాత్రం మీ ముఖం, చుట్టూ ఉన్న వాతావరణం అంతా బ్రైట్గా మెరిసిపోతుంది. ఈ లైట్ సుమారు మూడు వేల నుంచి ఆరువేల కెల్విన్ వరకు వెలుతురును అందిస్తుంది. లైట్ బ్రైట్నెస్, రంగులను అవసరానికి అనుగుణంగా మార్చుకోవచ్చు. అలా చిత్రీకరణకు కావాల్సిన వాతావరణాన్ని సులభంగా సృష్టించవచ్చు. ఒక్కసారి చార్జ్ చేస్తే, నిర్విరామంగా సుమారు రెండు గంటలపాటు పని చేస్తుంది. ధర కేవలం రూ.1,299 మాత్రమే!స్టూడియో బాక్స్!చిన్న వస్తువులను ఫొటో తీయడం అంటే, ‘ఫ్యాన్ ఇండియా’ సినిమా తీసినంత ఈజీ కాదు. హోల్ లైట్, టేబుల్, షీట్, లో ఫ్యాన్ ... ఇలా చాలానే ప్లానింగ్ చేసి తీయాలి. అయితే, ఇప్పుడు ఈ హిఫిన్ ఫోల్డబుల్ లైట్ బాక్స్ ఉంటే చాలు, ఇంట్లోనే ఓ చిన్న సినిమాటిక్ ఫొటో స్టూడియో సెట్ రెడీ అవుతుంది. చూసేందుకు క్యూబ్లా ఉంటుంది. కాని, ఒక్కసారి తెరిస్తే, అంతా మాయలా మారిపోతుంది. ఫుల్ బ్రైట్ ఎల్ఈడీ లైట్లు మెరిసిపోతాయి. వాడటం కూడా చాలా సులభం– యూఎస్బీకి పెట్టండి, ఎంత చిన్నవస్తువునైనా మధ్యలో పెట్టండి, ఫోటో తీయండి... అంతే! పైగా ఈ బాక్స్ను మడిచి పెట్టుకోవచ్చు, ఎక్కడికైనా తేలికగా తీసుకెళ్లవచ్చు. ఇందులో పెట్టి ఫొటో తీస్తే తెలుపు, నలుపు రంగుల బ్యాక్డ్రాప్లతో ఫొటోలకు పూర్తిగా ప్రొఫెషనల్ టచ్ ఇస్తుంది. ధర రూ.499 మాత్రమే!తిరిగే ఎలక్ట్రిక్ స్టాండ్!వస్తువుల ఫొటో తీయాలంటే చేతితో తిప్పుతూ తిప్పుతూ మీ తల తిరగాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఈ తిరిగే ఎలక్ట్రిక్ స్టాండ్పై వస్తువును పెట్టి ఫొటో తీయండి. మెల్లగా 360 డిగ్రీలుగా తిరుగుతూ, ఏ కోణంలో చూసినా వస్తువును అందంగా చూపిస్తుంది. కావాల్సిన రీతిలో వస్తువు యాంగిల్, దిశ, వేగాన్ని సులభంగా నియంత్రించవచ్చు. ఇది బంగారు వస్తువులు, గడియారాలు, చిన్న కేకులు, ప్రదర్శన వస్తువుల ఫొటోగ్రఫీకి అద్భుతంగా ఉపయోగపడుతుంది. సుమారు ఎనిమిది కిలోల బరువు వరకు కోరుకున్న దిశలో తిప్పగలదు. దీనిని ఉపయోగించడం చాలా సులువు. ధర రూ. 1,699 మాత్రమే! -
రోజూ 2జీబీ హైస్పీడ్ డేటాతో జియో కొత్త ప్లాన్
ప్రముఖ ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో రోజూ 2జీబీ హైస్పీడ్ డేటాతో రూ .1049 ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. రోజువారీ హై-స్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్, టాప్ ఓటీటీ ప్లాట్ఫామ్లకు ఉచిత యాక్సెస్ అందించే ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే ఈ జియో ప్లాన్ మీకు సరిగ్గా సరిపోతుంది. ఈ ప్లాన్ ప్రయోజనాలేంటో ఇక్కడ వివరంగా తెలుసుకోండి..ప్లాన్ వాలిడిటీ.. ప్రధాన ప్రయోజనాలుఈ రూ .1049 జియో ప్లాన్ మొత్తం 84 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఇందులో ప్రతిరోజూ 2 జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 84 రోజుల్లో మొత్తం 168 జిబి డేటా ఆనందించవచ్చు. దీంతోపాటు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు కూడా లభిస్తాయి.ఈ ప్లాన్ అతిపెద్ద ఫీచర్ ఇది అందించే ఉచిత ఓటీటీ యాక్సెస్. వినియోగదారులు ఎటువంటి అదనపు రుసుము చెల్లించకుండా అనేక ప్రసిద్ధ స్ట్రీమింగ్ సర్వీసులకు యాక్సెస్ పొందుతారు. వీటిలో అమెజాన్ ప్రైమ్ లైట్ (84 రోజులు చెల్లుబాటు అవుతుంది), సోనీలివ్, జీ5, జియోటీవీ, జియో హాట్స్టార్ (90 రోజులు, ఒకసారి చెల్లుబాటు అవుతుంది) వంటివి ఉన్నాయి.ఈ రీఛార్జ్ ప్లాన్ 50 జీబీ జియోఏఐక్లౌడ్ స్టోరేజ్, ఉచిత 5జీ డేటా (5జీ ఫోన్ అయి ఉండి 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉంటే మాత్రమే) వంటి జియో నుండి కొన్ని ఇతర ప్రత్యేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. -
48 గంటల్లో 2 లక్షలకుపైగా ఆర్డర్లు..
కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తన సెవెంత్ జనరేషన్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ సిరీస్ కోసం భారత్లో లాంచ్ అయిన 48 గంటల్లోనే 2.1 లక్షల ప్రీ-ఆర్డర్లు వచ్చినట్లు తెలిపింది. శాంసంగ్ ఏడో తరం ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ సిరీస్లో భాగంగా గెలాక్సీ జెడ్ ఫోల్డ్7, గెలాక్సీ జెడ్ ఫ్లిప్7, గెలాక్సీ జెడ్ ఫ్లిప్7 ఎఫ్ఈ స్మార్ట్ఫోన్లు జూలై 9న భారత్లో లాంచ్ అయ్యాయి.ఇంత భారీ సంఖ్యలో ప్రీ-ఆర్డర్లు రావడం "బ్రాండ్ ఏడవ తరం ఫోల్డబుల్ కోసం వినియోగదారుల్లో భారీ డిమాండ్, ఉత్సాహాన్ని" సూచిస్తున్నాయని శాంసంగ్ తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో గెలాక్సీ ఎస్ 25 సిరీస్ కోసం వచ్చిన ప్రీ-ఆర్డర్లకు ఇది దాదాపు సమానం అని శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఒక ప్రకటనలో తెలిపింది.శాంసంగ్ తన స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎస్ 25 లాంచ్ అయిన మూడు వారాల వ్యవధిలో రికార్డు స్థాయిలో 4.3 లక్షల ప్రీ-ఆర్డర్లను అందుకుంది. మొదటి 48 గంటల్లో, ఎస్ 25, ఫోల్డ్ 7 / ఫ్లిప్ 7 కోసం ప్రీ-ఆర్డర్ల సంఖ్య దాదాపు సమానంగా ఉంటుంది. ఈ మేడ్ ఇన్ ఇండియా ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ల ధర రూ.89,000 నుంచి రూ.2.11 లక్షల మధ్యలో ఉంది.గెలాక్సీ జెడ్ ఫోల్డ్7 ధర రూ.1.75 లక్షల నుంచి ప్రారంభమై రూ.2.11 లక్షల వరకు ఉంది. గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 ధర రూ.1.10 లక్షల నుంచి రూ.1.22 లక్షల మధ్యలో ఉంది. గెలాక్సీ జెడ్ ఫ్లిప్7 ఎఫ్ఈ ధర రూ.89,000 నుంచి రూ.95,999 వరకు ఉంది. భారత మార్కెట్లో శాంసంగ్ సూపర్ ప్రీమియం కేటగిరీలో అమెరికాకు చెందిన ఫోన్ల తయారీ సంస్థ యాపిల్ తో పోటీ పడుతోంది.ఐడీసీ ప్రకారం, భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో వివో ముందంజలో ఉంది. ఇది 2025 తొలి త్రైమాసికంలో 19.7 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఆ తర్వాత శాంసంగ్ 16.4 శాతం ఎగుమతులతో రెండో స్థానంలో ఉంది. -
‘బేబీ గ్రోక్’ వస్తుంది.. పిల్లల కోసం ప్రత్యేక ఏఐ యాప్
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఎక్స్ఏఐ పిల్లల కోసం ప్రత్యేక ఏఐ చాట్బాట్ యాప్ను తీసుకురానుంది. తమ గ్రోక్ చాట్బాట్కు కిడ్-ఫ్రెండ్లీ వెర్షన్ను రూపొందించే పనిలో ఉన్నట్లు ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’(ట్విటర్) పోస్ట్ చేశారు.'ఎక్స్ఏఐలో బేబీ గ్రోక్ అనే యాప్ను రూపొందించబోతున్నాం' అని మస్క్ తాజాగా ట్వీట్ చేశారు. పిల్లలకే ప్రత్యేకమైన కంటెంట్తో ఈ యాప్ను రూపొందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కొత్త వెర్షన్ యువ వినియోగదారుల కోసం రూపొందించిన ప్రత్యేక అప్లికేషన్ గా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు, అయితే మరిన్ని వివరాలను ఇంకా ప్రకటించలేదు.మస్క్ యాజమాన్యంలోని ఎక్స్ స్పామ్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి ప్లాట్ఫామ్పై కొత్త గ్రోక్ ప్రస్తావనలను తాత్కాలికంగా నిలిపివేసిన కొన్ని రోజుల తర్వాత ఈ ప్రకటన వచ్చింది. మరోవైపు వైరల్ వీడియోలను జనరేట్ చేయడానికి, దాని సృజనాత్మక సాధనాలను మరింత విస్తరించడానికి వీలు కల్పించే ‘ఇమాజిన్’ అనే కొత్త సామర్థ్యాన్ని ‘గ్రోక్’కు జోడించే పనిలో ఉన్నట్లు కూడా మస్క్ ఇటీవల వెల్లడించారు.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం ఇటీవల విస్తృతంగా పెరిగింది. ముఖ్యంగా పిల్లల్లో ఏఐ వినియోగం క్రమంగా పెరుగుతోంది. కొన్ని నివేదికల ప్రకారం.. 44 శాతం మంది పిల్లలు జనరేటివ్ ఏఐని చురుగ్గా ఉపయోగిస్తున్నారు. ఇందులో తమ స్కూల్ వర్క్ లేదా హోమ్ వర్క్ చేయడానికే 54 శాతం వినియోగం ఉంటోంది.We’re going to make Baby Grok @xAI, an app dedicated to kid-friendly content— Elon Musk (@elonmusk) July 20, 2025 -
శాంసంగ్ నుంచి కొత్త స్మార్ట్ఫోన్.. బడ్జెట్లోనే హై ఎండ్ ఫీచర్స్
దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ నుండి కొత్త ఎఫ్-సిరీస్ ఫోన్ విడుదలైంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్36 5జీ స్మార్ట్ ఫోన్ భారత్లో లాంచ్ అయింది. బడ్జెట్ ధర రూ .20,000 లోపే ఇది లభ్యమవుతుంది. ఎక్సినోస్ 1380 చిప్సెట్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్స్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్తోపాటు గూగుల్ సర్కిల్ టు సెర్చ్, జెమినీ లైవ్ సహా ఏఐ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.శాంసంగ్ గెలాక్సీ ఎఫ్36 5జీ ధరగెలాక్సీ ఎఫ్36 5జీ 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,499గా ఉంది. శాంసంగ్ 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.18,999గా నిర్ణయించారు. శాంసంగ్ కొత్త ఎఫ్-సిరీస్ స్మార్ట్ఫోన్ జూలై 29 నుంచి ఫ్లిప్కార్ట్, శాంసంగ్ అధికారిక ఆన్లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. కోరల్ రెడ్, లక్స్ వయొలెట్, ఓనిక్స్ బ్లాక్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ మూడు కలర్ వేస్ లో లెదర్ ఫినిష్ రియర్ ప్యానెల్ ఉంది.స్పెసిఫికేషన్లుశాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 36 5జీ డ్యూయల్ సిమ్ హ్యాండ్ సెట్, ఇందులో 6.7 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ ప్లే, ఫుల్ హెచ్ డీ+ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.సెల్ఫీ కెమెరా కోసం డిస్ ప్లే పైభాగంలో వాటర్ డ్రాప్ నాచ్ ను అందించారు. ఆక్టాకోర్ ఎక్సినోస్ 1380 ఎస్ వోసీ, మాలి-జీ68 ఎంపీ5 జీపీయూతో ఈ ఫోన్ పనిచేస్తుంది. థర్మల్ మేనేజ్ మెంట్ కోసం వేపర్ ఛాంబర్ కూడా ఉంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్, మైక్రో ఎస్డీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు.ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 4కే వీడియో రికార్డింగ్కు సపోర్ట్ చేసే ప్రైమరీ 50 మెగాపిక్సెల్ ఎఫ్/ 1.8 సెన్సార్తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 8 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఇది 4కె వీడియో రికార్డింగ్ ను కూడా సపోర్ట్ చేస్తుంది.శాంసంగ్ లేటెస్ట్ ఎఫ్ సిరీస్ ఫోన్ ఆండ్రాయిడ్-15 ఆధారిత వన్ యూఐ 7 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుది. ఆరు ఏళ్లు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్ డేట్స్, ఏడేళ్ల సెక్యూరిటీ ప్యాచ్ లను అందిస్తామని కంపెనీ హామీ ఇస్తోంది.గూగుల్ సర్కిల్ టు సెర్చ్, జెమినీ లైవ్, ఆబ్జెక్ట్ ఎరేజర్, ఇమేజ్ క్లిప్పర్, ఏఐ ఎడిట్ వంటి ఏఐ ఫీచర్లు కూడా ఉన్నాయి.గెలాక్సీ ఎఫ్36 5జీలో 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఛార్జింగ్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. కనెక్టివిటీ కోసం, ఫోన్ డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్ + గ్లోనాస్ను అందిస్తుంది. -
ఏఐ ఎఫెక్ట్స్తో తొలిసారి ఒరిజినల్ టీవీ షో
కృత్రిమ మేధ (ఏఐ) సృష్టించిన విజువల్ ఎఫెక్ట్స్ను తొలిసారిగా ఒరిజినల్ టీవీ షోలో ఉపయోగించినట్లు నెట్ఫ్లిక్స్ తెలిపింది. ప్రాంప్ట్స్ ఆధారంగా వీడియోలు, చిత్రాలను రూపొందించే ఏఐని అర్జెంటీనా సైన్స్ ఫిక్షన్ షో ‘ది ఎటర్నాట్’లో భవనం కూలిపోయే సన్నివేశాన్ని సృష్టించడానికి ఉపయోగించినట్లు కంపెనీ కో-చీఫ్ ఎగ్జిక్యూటివ్ టెడ్ సారాండోస్ తెలిపారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల నిర్మాణ బృందం వేగంగా, తక్కువ ఖర్చుతో సన్నివేశాలను పూర్తి చేయగలిగిందని చెప్పారు.జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలో వివాదాస్పదంగా ఉంది. ఇది ఇతరుల పనిని వారి అనుమతి లేకుండా ఉపయోగించి కంటెంట్ సృష్టిస్తుందనే ఆందోళనలు రేకెత్తిస్తుంది. నెట్ఫ్లిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం గురించి సారాండోస్ మాట్లాడుతూ.. ఈ సాంకేతికత చిన్న బడ్జెట్ ఉన్న నిర్మాణాలకు అధునాతన విజువల్ ఎఫెక్స్ట్ ఉపయోగించడానికి అనుమతించినట్లు చెప్పారు. బ్యూనస్ ఎయిర్స్లో ఒక భవనం కూలిన క్రమాన్ని సంప్రదాయ స్పెషల్ ఎఫెక్ట్స్ టూల్స్ ఉపయోగించిన దానికంటే 10 రెట్లు వేగంగా పూర్తి చేయడానికి ఎటెర్నాట్లో ఉపయోగించిన జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తమ బృందానికి సహాయపడిందని ఆయన చెప్పారు.ఇదీ చదవండి: ఫేస్బుక్పై రూ.68 వేలకోట్ల దావాదక్షిణ కొరియా థ్రిల్లర్ స్క్విడ్ గేమ్ మూడో, చివరి సిరీస్ విజయం సాధించడంతో ఊహించిన దానికంటే మెరుగైన పనితీరు కనబరిచినట్లు నెట్ఫ్లిక్స్ తెలిపింది. ఇది ఇప్పటివరకు 122 మిలియన్ వ్యూస్ సాధించిందని సారాండోస్ అన్నారు. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే జూన్ నెలాఖరు వరకు మూడు నెలల్లో నెట్ఫ్లిక్స్ ఆదాయం 16 శాతం పెరిగి 11 బిలియన్ డాలర్లకు (8.25 బిలియన్ పౌండ్లు) చేరుకున్నట్లు ప్రకటించడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లాభాలు 2.1 బిలియన్ డాలర్ల నుంచి 3.1 బిలియన్ డాలర్లకు పెరిగాయి. -
ఐటీ కంపెనీ హెక్సావేర్ రూ.1,029 కోట్ల డీల్
న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ కంపెనీ హెక్సావేర్ టెక్నాలజీస్ 120 మిలియన్ డాలర్లతో (రూ.1,029 కోట్లు) ఎస్ఎంసీ స్వేర్డ్ను కొనుగోలు చేసినట్టు ప్రకటించింది. గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల (జీసీసీలు) మార్కెట్లో విస్తరణకు ఈ డీల్ దోహదపడుతుందని పేర్కొంది. జీసీసీ కేంద్రాల నిర్మాణం, నిర్వహణ, బదిలీ సేవల్లో ఎస్ఎంసీ స్వేర్డ్ సేవలు అందిస్తోంది.‘‘ఎస్ఎంసీ కొనుగోలుతో జీసీసీ నైపుణ్యాలు మరింత బలపడతాయి. ఎస్ఎంసీ నైపుణ్యాలు మధ్య స్థాయి జీసీసీ విభాగంలో మా మార్కెట్ విస్తరణకు దోహదపడతాయి. ఎస్ఎంసీ సేవలను మా విస్తృతమైన క్లయింట్లకు ఆఫర్ చేస్తాం’’అని హెక్సావేర్ టెక్నాలజీస్ స్టాక్ ఎక్స్ఛేంజ్లకు సమాచారం ఇచి్చంది. జోహో నుంచి ఎల్ఎల్ఎందేశీ టెక్నాలజీ సంస్థ జోహో (Zoho) తమ స్వంత లార్జ్ ల్యాంగ్వేజ్ (ఎల్ఎల్ఎం) మోడల్ను ప్రవేశపెట్టింది. తమ ఉత్పత్తులను ఉపయోగించే సంస్థల కోసం దీన్ని డిజైన్ చేసినట్లు కంపెనీ తెలిపింది. ఎన్విడియాకు చెందిన ఏఐ కంప్యూటింగ్ ప్లాట్ఫాంను ఉపయోగించి దీన్ని తాము అంతర్గతంగా తయారు చేసినట్లు పేర్కొంది. ఇంగ్లీష్, హిందీలో మాటలను ఆటోమేటిక్గా టెక్ట్స్ కింద మార్చే మోడల్స్ను కూడా ప్రవేశపెడుతున్నట్లు వివరించింది. దీన్ని ఇతర భారతీయ, యూరోపియన్ భాషలకు కూడా విస్తరిస్తామని తెలిపింది. -
రూ.19,500 సబ్స్క్రిప్షన్ ఉచితం!
గూగుల్ భారతదేశంలోని విద్యార్థులకు ప్రోత్సహించేందుకు తన ఏఐ ప్రో ప్లాన్ను ఒక సంవత్సరం పాటు ఉచితంగా అందించేందుకు చర్యలు చేపట్టింది. రూ.19,500 సబ్స్క్రిప్షన్ కలిగిన ఏఐ ప్రో ప్లాన్ ద్వారా గూగుల్ అధునాతన ఏఐ సాధనాలకు అవకాశం కల్పిస్తోంది. దీన్ని విద్యార్థులు హోంవర్క్, రైటింగ్, వీడియో జనరేషన్లో సహాయం పొందేందుకు ఉచితంగా ఉపయోగించవచ్చని కంపెనీ తెలిపింది.ఈ ఆఫర్లో భాగంగా 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న భారతీయ విద్యార్థులు 12 నెలల పాటు గూగుల్ ఏఐ ప్రో ప్లాన్ను కాంప్లిమెంటరీ యాక్సెస్గా పొందవచ్చు. ఈ సబ్స్క్రిప్షన్లో జెమినీ 2.5 ప్రో, వీయో 3 వంటి విస్తృత శ్రేణి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఇది వీడియో జనరేషన్ ఏఐ మోడల్. జీమెయిల్, డాక్స్, ఇతర గూగుల్ యాప్స్లో 2టీబీ క్లౌడ్ స్టోరేజ్, ఏఐ ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి.కళాశాల పాఠ్యాంశాల అధ్యయనం, పరిశోధన, ఉద్యోగ ఇంటర్వ్యూ ప్రిపరేషన్, సృజనాత్మక ఆలోచన.. వంటి విస్తృత శ్రేణి ఉపయోగాల కోసం విద్యార్థులకు మద్దతుగా నిలుస్తుందని కంపెనీ తెలిపింది. గూగుల్ హైలైట్ చేస్తున్న కొన్ని ఏఐ ఆధారిత టూల్స్ కింది విధంగా ఉన్నాయి.హోంవర్క్ హెల్ప్ & ఎగ్జామ్ ప్రిపరేషన్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో 1,500 పేజీల పాఠ్యపుస్తకాలను విశ్లేషించవచ్చు.స్టడీ సపోర్ట్: అధిక పేజీలున్న(1,500 పేజీల వరకు) పాఠ్యపుస్తకాలను విశ్లేషించవచ్చు. పరీక్ష సన్నద్ధతలో సహాయం తీసుకోవచ్చు. సంక్లిష్టమైన అంశాలను సులువుగా అర్థం చేసుకోవచ్చు.రైటింగ్ టూల్స్: వ్యాసాలను రాసేందుకు సాయపడుతాయి.వీడియో జనరేషన్: గూగుల్ వీయో 3 సిస్టమ్ ఉపయోగించి టెక్స్ట్, ఇమేజ్లను షార్ట్ వీడియోలుగా మార్చవచ్చు.జెమిని ఇంటిగ్రేషన్: జీమెయిల్, డాక్స్, షీట్స్, ఇతర యాప్స్లో డైరెక్ట్ ఏఐ సపోర్ట్ ఉంటుంది.క్లౌడ్ స్టోరేజ్: అసైన్మెంట్లు, ప్రాజెక్టులు, మీడియా ఫైళ్లను నిల్వ చేసేందుకు డ్రైవ్, జీమెయిల్, ఫోటోస్ కలిపి 2 టీబీ స్పేస్ ఇస్తుంది.ఉచితంగా ఎలా పొందాలి?కంపెనీ ప్రతిపాదించిన అర్హతా ప్రమాణాలకు అనుగుణంగా విద్యార్థుల స్టేటస్ను విజయవంతంగా ధ్రువీకరించాల్సి ఉంటుంది. కేవలం విద్యార్థులకు మాత్రమే ఈ ఉచిత సబ్ స్క్రిప్షన్ ప్లాన్ అందుబాటులో ఉంటుందని గూగుల్ పేర్కొంది. ఈ ఆఫర్ పొందాలంటే విద్యార్థులు తమ స్టేటస్ను వెరిఫై చేసుకోవాలి.వెరిఫికేషన్ ప్రక్రియ ఎలా..గూగుల్ వన్ స్టూడెంట్ ఆఫర్ పేజీకి వెళ్లాలి.కాలేజీ పేరు, విద్యార్థి పూర్తి పేరు, పుట్టిన తేదీ వంటి అవసరమైన వివరాలను నింపాలి.గుర్తింపు పొందిన సంస్థ నమోదును రుజువు చేయమని కోరితే డాక్యుమెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.వెరిఫై చేసిన తర్వాత గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఏఐ ప్రో ప్లాన్కు సబ్స్క్రైబ్ చేసుకోవాలి.ఈ ఆఫర్ను రిడీమ్ చేసుకోవడానికి చివరి తేదీ 15 సెప్టెంబర్ 2025.నిబంధనలు ఇవే..విద్యార్థికి 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి.భారత నివాసి అయి ఉండాలి.వ్యక్తిగత గూగుల్ ఖాతాను ఉపయోగించాలి.కాలేజీ ఈమెయిల్ లేదా నమోదు రుజువును అందించాలి.థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్ ద్వారా సబ్స్రైబ్ చేయకూడదు.గూగుల్ పేమెంట్స్ ఖాతాకు చెల్లుబాటు అయ్యే చెల్లింపు పద్ధతిని జోడించాలి. (పోస్ట్-ట్రయల్ బిల్లింగ్ ప్రయోజనాల కోసం).ఇదీ చదవండి: మారుతీ ఎర్టిగా, బాలెనో ధరలు పెరిగాయ్..మొదటి సంవత్సరానికి ఆఫర్ పూర్తిగా ఉచితం అయినప్పటికీ, ప్రామాణిక రేట్ల వద్ద ఆటోమేటిక్ బిల్లింగ్ను నివారించడానికి విద్యార్థులు ట్రయల్ ముగిసేలోపు రద్దు చేయాలని గూగుల్ పేర్కొంది. ఉచిత వ్యవధి తర్వాత మాన్యువల్గా రద్దు చేయకపోతే సబ్ స్క్రిప్షన్ రిన్యువల్ అవుతుంది. -
మెసేజ్లకు టెల్కోల గుర్తింపు ‘కోడ్’
అసలైన మెసేజ్లు, స్పామ్ మెసేజ్లను మొబైల్ యూజర్లు సులువుగా గుర్తించేందుకు వీలుగా టెలికం సంస్థలు ప్రత్యేక విధానాన్ని అమల్లోకి తెచ్చాయి. దీని ప్రకారం మెసేజ్ల వర్గీకరణ బట్టి వాటిని పంపించే వారి పేరు లేదా హెడర్కి ముందు నిర్దిష్ట ‘కోడ్’ వస్తుంది. ప్రమోషనల్ ఎస్ఎంఎస్లకు ‘పి’ (ఆంగ్ల అక్షరం), సర్వీస్ సంబంధితమైనవాటికి ‘ఎస్’, లావాదేవీలకు సంబంధించిన వాటికి ‘టి’, ప్రభుత్వం నుంచి వచ్చే మెసేజీలకు ‘జి’ అని కనిపిస్తుంది.ఇదీ చదవండి: ఎగుమతులు కదల్లేదు..మెదల్లేదు!ఈ కోడ్లతో ఏ ఎస్ఎంఎస్ ఏ కోవకి చెందినదో సులువుగా తెలుసుకునేందుకు వీలవుతుందని, అవాంఛిత మెసేజ్లకు దూరంగా ఉండొచ్చని టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇలాంటి ఓటీటీ యాప్లపై నియంత్రణ లేకపోవడమే ఇందుకు కారణమన్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీ యాప్లను కూడా నియంత్రణ పరిధిలోకి తీసుకొస్తే వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు వీలవుతుందని కొచర్ పేర్కొన్నారు. -
విశాఖలో మెరుగైన నెట్వర్క్గా జియో
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న టెలికాం ఆపరేటర్గా రిలయన్స్ జియో నిలిచింది. కీలకమైన వాయిస్, డేటా పనితీరులో ఇతర టెల్కోలను వెనక్కి నెట్టింది. నగరంలో ఇటీవల ట్రాయ్ నిర్వహించిన ఇండిపెండెంట్ డ్రైవ్ టెస్ట్ (ఐడీటీ)లో జియో తన బలమైన మొబైల్ నెట్వర్క్ సామర్ధ్యాన్ని నిరూపించుకుంది. మిలియన్ల మంది వినియోగదారులకు అత్యుత్తమ డిజిటల్ సేవలను అందించడంలో తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది.ట్రాయ్ నివేదిక ప్రకారం రిలయన్స్ జియో తన 4జీ నెట్వర్క్లో 204.91 ఎంబీపీఎస్ సగటు డౌన్లోడ్ వేగాన్ని నమోదు చేసింది. ఇది నగరంలోని అన్ని ఆపరేటర్లలో అత్యధికం. ఈ అసాధారణ పనితీరు వల్ల జియో కస్టమర్లు గరిష్ట వినియోగ సమయాల్లో కూడా వేగవంతమైన వీడియో స్ట్రీమింగ్, ఆన్లైన్ గేమింగ్, వేగవంతమైన యాప్ డౌన్లోడ్లు, అంతరాయం లేని బ్రౌజింగ్ను ఆస్వాదించేలా చేస్తుంది.ఇదీ చదవండి: మొన్న రూ.800 కోట్లు.. ఇప్పుడు రూ.1,600 కోట్లుమరోవైపు వాయిస్ సేవల్లోనూ జియో పనితీరు అంతే బలంగా ఉంది. జియో సేవలు అధిక కాల్ సెటప్ సక్సెస్ రేటు, తక్కువ కాల్ సెటప్ సమయం, జీరో కాల్ డ్రాప్ రేటుతోపాటు మెరుగైన వాయిస్ స్పష్టత అందిస్తున్నాయని ట్రాయ్ నివేదిక సూచిస్తోంది. విశాఖపట్నం అంతటా విస్తృత ప్రాంతాన్ని కవర్ చేసిన ఈ డ్రైవ్ టెస్ట్ ఫలితాలు జియోను అత్యుత్తమ ఆపరేటర్గా నిలబెట్టాయి. హెచ్డీ కంటెంట్ను స్ట్రీమింగ్ చేసినా, హెచ్డీ-నాణ్యత వాయిస్ కాల్లు చేసినా లేదా రియల్ టైమ్ అప్లికేషన్లను యాక్సెస్ చేసినా ఎలాంటి అవాంతరాలు లేవని తేలింది. -
పీఎస్యూ టెల్కోలకు లైన్ క్లియర్
పీఎస్యూ టెలికం దిగ్గజాలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, ఐటీఐలకు మద్దతుగా అత్యున్నత కమిటీ మార్గదర్శకాలకు తెరతీసింది. దీంతో వేలం లేకుండానే ఇతర ప్రభుత్వ రంగ కంపెనీలకు మిగులు భూమి, భవనాలను బదిలీ చేసేందుకు వీలు చిక్కనుంది. గత నెలలో సమావేశమైన సెక్రటరీల కమిటీ ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది.టెలికం పీఎస్యూ సంస్థల ఆస్తులను సొంతం చేసుకోవాలనుకునే ఇతర ప్రభుత్వ రంగ కంపెనీలు సంబంధిత అనుమతులతోపాటు ఆసక్తి వ్యక్తీకరణ బిడ్ను దాఖలు చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా క్లెయిమ్ను రిజిస్టర్ చేసుకునేందుకు ఆస్తుల సంకేత విలువలో 2 శాతం సొమ్మును డిపాజిట్ చేయవలసి ఉంటుంది. ఆయా ఆస్తుల మానిటైజేషన్కు సంబంధిత వెబ్సైట్లో నోటిఫికేషన్ వెలువడిన 90 రోజుల్లోగా వీటిని పూర్తి చేయవలసి ఉంటుంది. ఇదీ చదవండి: విదేశీ విస్తరణలో హీరో మోటోకార్ప్ కేంద్ర ప్రభుత్వ సంస్థలకు తొలి ప్రాధాన్యతా హక్కును వినియోగించుకునే వీలుంటుంది. అయితే నోటిఫికేషన్ వెలువడిన 90 రోజుల తదుపరి ఇతర ప్రయివేట్ రంగ కంపెనీలకు ఆస్తులను విక్రయించే వెసులుబాటును బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, ఐటీఐ పొందుతాయి. -
పల్లెకు పరిచయమైన "వర్చువల్ రియాలిటీ గేమింగ్".. స్పందన మామూలుగా లేదు..!
వర్చువల్ రియాలిటీ గేమింగ్ (VR Gaming) అనేది గేమింగ్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చిన సాంకేతికత. ఇది ఆటగాళ్లను త్రిమితీయ (3D) వాతావరణంలోకి తీసుకెళ్లి, నిజంగానే ఆ ప్రపంచంలో ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. ఈ క్రీడలను VR హెడ్సెట్, మోషన్ కంట్రోలర్ లాంటి సాధనాలను ఉపయోగించి ఆడతారు. VR Gamingను కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా విద్య, శిక్షణ, వైద్య రంగాల్లో కూడా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం దేశంలోని పెద్దపెద్ద నగరాల్లో మాత్రమే ఈ VR Gaming సెంటర్లు వెలిశాయి.Few youths opened a "Virtual Reality Gaming Centre" in Karnataka 's village. The response was overwhelming 🤩 pic.twitter.com/hNTfIY0qoQ— 👑Che_Krishna🇮🇳💛❤️ (@CheKrishnaCk_) July 14, 2025అయితే, ఇటీవల కర్ణాటకలోని హసన్ జిల్లాకు కొందరు ఔత్సాహిక యువకులు ఈ VR Gamingను ఓ మారుమూల పల్లెకు పరిచయం చేశారు. టెక్నాలజీ అంటే ఏమిటో తెలియని ఆ పల్లె ప్రజలు ఈ కాల్పనిక క్రీడలను తెగ ఎంజాయ్ చేశారు. సదరు యువత ఇచ్చిన Meta Quest VR Headsetలను ధరించి నిజంకాని ప్రపంచంలోకి వెళ్లిపోయారు.పిల్లలు, మహిళలు, వృద్దులు అన్న తేడా లేకుండా ఆ గ్రామంలోని ప్రతి ఒక్కరు VR Gamingతో కలిగిన కొత్త అనుభూతిని ఆస్వాధించారు. VR Gaming ద్వారా బాక్సింగ్, బిల్డింగ్పై నడవడం లాంటి కాల్పనిక క్రీడలను ఆడారు. ఈ VR Gaming కేంద్రానికి విశేషమైన స్పందన రావడంతో సదరు యువకులు దీనికి సంబంధించిన వీడియోను సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు కూడా విపరీతమైన స్పందన వస్తుంది. -
మూడేళ్లలో ఆరు లక్షల గ్రామాలకు బ్రాడ్బ్యాండ్..
మూడేళ్ల వ్యవధిలో దాదాపు ఆరు లక్షల గ్రామాల్లో హై–స్పీడ్ ఆప్టికల్ ఫైబర్ ఆధారిత బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ను అందుబాటులోకి తేనున్నట్లు సీఐఐ–జీసీసీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా టెలికం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ తెలిపారు. జీసీసీలు ప్రస్తుతం ఎక్కువగా పెద్ద నగరాలకే పరిమితమవుతున్నాయని, కనెక్టివిటీ పెరుగుతున్న నేపథ్యంలో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు కూడా విస్తరించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లో డేటా చార్జీలు అత్యంత తక్కువగా ఉండటమనేది, జీసీసీల ఏర్పాటుకు ఎంతో ప్రయోజనకరమైన అంశమని వివరించారు. అలాగే, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి కీలకమైన నిపుణుల లభ్యత, కనెక్టివిటీ, కొత్త ఆవిష్కరణలు చేసే సామర్థ్యాలు, మేథోహక్కుల పరిరక్షణకు పటిష్టమైన చట్టాలు మొదలైనవన్నీ భారత్కు సానుకూలాంశాలని పేర్కొన్నారు. దేశీయంగా బ్రాడ్బ్యాండ్ స్పీడ్ సగటున 138 ఎంబీపీఎస్గా ఉంటోందని మిట్టల్ చెప్పారు. అదనంగా మరింత స్పెక్ట్రంను అందుబాటులోకి తేవడం, పరిశోధనలు .. అభివృద్ధి కార్యకలాపాలకు అనువైన పరిస్థితులు కల్పించడం, చిన్న..మధ్య తరహా సంస్థలు అలాగే స్టార్టప్లను ప్రోత్సహించడం తదితర చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీనితో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు విస్తరించినప్పుడు జీసీసీలకు డిజిటల్ మౌలిక సదుపాయాల కొరత ఉండదని మిట్టల్ తెలిపారు. -
మస్క్ అన్ని కంపెనీల్లో ఒక్కటే ఏఐ
ఎలాన్మస్క్కు చెందిన కంపెనీలన్నింటినీ ఒకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గొడుగు కిందకు తీసుకువచ్చే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతేడాది మస్క్ స్థాపించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ఎక్స్ఏఐలో స్పేస్ఎక్స్ రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు రాయిటర్స్ తెలిపింది. స్పేస్ఎక్స్, టెస్లా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)తో సహా అతని అన్ని కంపెనీల్లో ఏఐని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తున్నారు.ఈ ఏడాది ప్రారంభంలో ఎక్స్ఏఐ ఎక్స్లో విలీనమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారని, ఇప్పుడు కంపెనీ విలువ 113 బిలియన్ డాలర్లుగా ఉందని రాయిటర్స్ నివేదిక తెలిపింది. జూన్లో మోర్గాన్ స్టాన్లీ ఈ భారీ ఫండింగ్కు నేతృత్వం వహించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను తన వ్యాపారాల్లో కీలకంగా ఉపయోగించుకోవాలన్న మస్క్ ప్రణాళికపై బలమైన పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ఇది హైలైట్ చేస్తుంది.ఇదీ చదవండి: పీఎం కిసాన్ నిధి విడుదలకు డేట్ ఫిక్స్?ఈ ప్లాన్లో ఎక్స్ఏఐ రూపొందించిన చాట్బాట్ గ్రోక్ కీలకంగా మారింది. స్పేస్ఎక్స్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ స్టార్లింక్లో కస్టమర్ ప్రశ్నలను నిర్వహించడానికి గ్రోక్ను ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. దీన్ని టెస్లా ఆప్టిమస్ రోబోట్లలోకి తీసుకురావడానికి టెస్టింగ్ నిర్వహిస్తున్నారు. మస్క్కు చెందిన అన్ని కంపెనీల ఎకోసిస్టమ్లో గ్రోక్ను ప్రధాన ఏఐ వ్యవస్థగా ఉండాలని కోరుకుంటున్నట్లు సమాచారం. -
ఇంటర్నెట్ స్పీడ్ పెంచి జపాన్ ప్రపంచ రికార్డు
డిజిటల్ మౌలిక సదుపాయాలు వేగంగా విస్తరిస్తున్నాయి. పదేళ్ల కిందట ఒక మూవీ లేదా ఏదైనా ఒకమోస్తారు లార్జ్ఫైల్ను డౌన్లోడ్ చేయాలంటే చాలా సమయం పట్టేది. కానీ ప్రస్తుతం క్షణాల్లో డౌన్లోడ్ అయిపోతుంది. ఇటీవల జపాన్ పరిశోధకులు భారీగా ఇంటర్నెట్ స్పీడ్ లిమిట్ను పెంచి సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఒక్క సెకనులో నెట్ఫ్లిక్స్లోని మొత్తం డేటా డౌన్లోడ్ చేసేంత నెట్స్పీడ్ వచ్చేలా పరిశోధనలు చేశారు.జపాన్ పరిశోధకులు జరిపిన ఎక్స్పరిమెంట్ ప్రకారం ఇంటర్నెట్ వేగం సెకనుకు 1.02 పెటాబైట్లకు చేరుకుంది. జపాన్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఎన్ఐసీటీ) శాస్త్రవేత్తలు ఈమేరకు ప్రపంచ రికార్డు సాధించారు. మనలో చాలా మంది ఇంటర్నెట్ వేగాన్ని సెకనుకు మెగాబైట్స్ (ఎంబీపీఎస్)లో కొలుస్తారు. ఒక పెటాబైట్ ఒక మిలియన్ గిగాబైట్లకు సమానం లేదా ఒక బిలియన్ మెగాబైట్కు సమానం. కాబట్టి ఈ కొత్త రికార్డుతో సుమారు 1,020,000,000 ఎంబీపీఎస్ స్పీడ్తో ఇంటర్నెట్ను అందించేలా పరిశోధనలు చేశారు. అమెరికాలో సగటు ఇంటర్నెట్ స్పీడ్ 300 ఎంబీపీఎస్ కాగా, భారత్లో 64 ఎంబీపీఎస్గా ఉంది. ఈ కొత్త వేగం నెట్ఫ్లిక్స్ మొత్తం కంటెంట్ లైబ్రరీని సెకనులో డౌన్లోడ్ చేస్తుంది.ఇదీ చదవండి: ఎవరు చెప్పినా వినండి.. కానీ..ఎన్ఐసీటీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ స్పీడ్ను సాధించేందుకు పరిశోధనా బృందం 19 కోర్లతో ప్రత్యేక రకం ఆప్టికల్ ఫైబర్ను ఉపయోగించింది. ఇందులో 19 చిన్న ఛానళ్లు ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి డేటాను తీసుకెళ్లగలవు. సాధారణంగా ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ కేవలం ఒక కోర్ను కలిగి ఉంటాయి. ఈ పరీక్ష స్వల్ప దూరానికే పరిమితం కాలేదు. ఈ టెస్టింగ్ ద్వారా 1,808 కిలోమీటర్లు (సుమారు 1,123 మైళ్లు) డేటాను ప్రసారం చేశారు. ప్రతి 86.1 కిలోమీటర్ల పొడవు ఉన్న 19 వేర్వేరు సర్క్యూట్ల ద్వారా సిగ్నల్ను లూప్ చేసే సెటప్ను ఉపయోగించారు. మొత్తం 180 డేటా స్ట్రీమ్లు ఒకేసారి ప్రసారం చేశారు. ఫలితంగా బ్యాండ్విడ్త్ కిలోమీటరుకు సెకనుకు 1.86 ఎక్సాబిట్లుగా నమోదైంది. ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను ఉపయోగించి అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ వేగాన్ని సాధించవచ్చని నిరూపించడమే తమ లక్ష్యమని ఎన్ఐసీటీ తెలిపింది. -
జీతాల పెంపుపై టీసీఎస్ సీఎఫ్వో కీలక ప్రకటన
భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ తొలి త్రైమాసిక ఫలితాలను ఇటీవల ప్రకటించింది. వ్యాపార వృద్ధి, మార్జిన్లలో ప్రతికూలతను కంపెనీ చూసింది. ఈ క్రమంలో జీతాల పెంపు గురించి ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. దీనిపై టీసీఎస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్వో) సమీర్ సెక్సారియా తాజాగా ప్రకటన చేశారు.తమ 6 లక్షల మంది ఉద్యోగులకు వేతనాల పెంపు టీసీఎస్ ప్రాధాన్య అంశమని సీఎఫ్వో సమీర్ సెక్సారియా తెలిపారు. వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడిన సెక్సారియా, టీసీఎస్ లాభదాయకతతో కూడిన వృద్ధిపై దృష్టి పెడుతుందని స్పష్టం చేశారు. తోటి కంపెనీల మాదిరిగా కాకుండా టీసీఎస్ చాలా అరుదుగా వేతనాల పెంపును వాయిదా వేస్తోందన్న ఆయన గతంలో మాదిరి సకాలంలో వేతనాల పెంపు అమలు చేయడమే తన ప్రాధాన్యమని సెక్సారియా అన్నారు. అయితే ఈ పెంపును ఎప్పుడు అమలు చేస్తారనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.సాధారణంగా వార్షిక వేతనాల పెంపు వల్ల నిర్వహణ లాభం మార్జిన్ 1.50 శాతానికి పైగా తగ్గుతుందని సెక్సారియా తెలిపారు. స్థూల ఆర్థిక, భౌగోళిక రాజకీయ సమస్యల కారణంగా డిమాండ్ దెబ్బతినడంతో నాన్ కోర్ ఆదాయంపై నికరంగా 6 శాతం పెరుగుదలను కంపెనీ చూపించింది. సాధారణంగా ఏప్రిల్ నుండి ప్రారంభమయ్యే వార్షిక వేతన పెంపును వాయిదా వేసింది. జూన్ త్రైమాసికంలో ఈ సంఖ్య 0.20 శాతం క్షీణించి 24.5 శాతంగా నమోదైందని, అయితే మార్జిన్లను 26-28 శాతం ఆకాంక్షాత్మక పరిధిలోకి తీసుకురావడమే తమ ఉద్దేశమని సెక్సారియా నొక్కి చెప్పారు.డిమాండ్ వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకునేందుకు ముందస్తు నియామకాల్లో పెట్టుబడులు పెట్టడం మార్జిన్లను దెబ్బతీసిందని, డిమాండ్ లేకపోవడం వినియోగ స్థాయిలను తగ్గించిందని సెక్సారియా వివరించారు. జూలై 11 నాటికి టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.11.81 లక్షల కోట్లుగా ఉంది. -
Mivi AI Buds: భాష ఏదైనా ‘హాయ్ మివి’ అంటే చాలు..
కన్జూమర్ ఎల్రక్టానిక్స్ సంస్థ మివి కొత్తగా కృత్రిమ మేథ ఆధారిత ఏఐ బడ్స్ను ప్రవేశపెట్టింది. సెటింగ్స్ ఏవీ మార్చకుండానే తెలుగు, హిందీ సహా ఎనిమిది భారతీయ భాషలను ఇది అర్థం చేసుకుని, ప్రతిస్పందిస్తుంది. యూజర్ల ప్రాధాన్యతలను గుర్తుపెట్టుకుని, సందర్భానుసారంగా వ్యవహరించేలా దీన్ని రూపొందించినట్లు సంస్థ కో–ఫౌండర్ మిధులా దేవభక్తుని తెలిపారు. 40 గంటల బ్యాటరీ లైఫ్, 3డీ సౌండ్స్టేజ్, స్పష్టత కోసం క్వాడ్ మైక్ మొదలైన ప్రత్యేకతలు ఉన్నాయి. దీని ధర రూ. 6,999గా ఉంటుంది.ఏఐ బడ్స్ లో మివి ఏఐ అనే ప్రొప్రైటరీ వాయిస్ అసిస్టెంట్ ఉంది. "హాయ్ మివి" అంటే చాలు ఈ వాయిస్ అసిస్టెంట్ ప్రతిస్పందిస్తుంది. ఇది ఎనిమిది భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తుంది. అవి హిందీ, తమిళం, తెలుగు, బెంగాలీ, మరాఠీ, కన్నడ, మలయాళం, గుజరాతీ. లాంగ్వేజ్ సెట్టింగ్ ల మార్చుకునే పనిలేకుండానే వినియోగదారులు ఏ భాషలోనైనా ప్రశ్నలు అడగవచ్చు లేదా సహాయాన్ని అభ్యర్థించవచ్చు.అసిస్టెంట్ అవతార్ ల ద్వారా మివి ఏఐ బడ్స్ వివిధ పనులకు సహకారం అందిస్తుంది. ఇవి ప్రీ డిఫైన్డ్ మాడ్యూల్స్.🔸జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలకు గురు అవతార్ సమాధానాలు చెబుతుంది.🔸ఇంటర్వ్యూవర్ అవతార్ మాక్ ఇంటర్వ్యూలు, ఫీడ్ బ్యాక్ అందిస్తుంది.🔸చెఫ్ అవతార్ వంట చేయడంలో మార్గనిర్దేశం చేస్తుంది.🔸వెల్ నెస్ కోచ్ అవతార్ సంభాషణల సమయంలో యూజర్ ఇన్ పుట్ లకు స్పందిస్తుంది.🔸న్యూస్ రిపోర్టర్ అవతార్ యూజర్ ఆసక్తుల ఆధారంగా న్యూస్ అప్ డేట్స్ అందిస్తుంది.🔸గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉన్న మివి ఏఐ యాప్ ద్వారా యూజర్లు ఏఐ సెట్టింగ్స్, ఫీచర్లను మేనేజ్ చేసుకోవచ్చు. -
లగ్జరీ ఈవీలవైపు.. సంపన్నుల చూపు
న్యూఢిల్లీ: దేశీయంగా అత్యంత సంపన్నులు కాలుష్యకారక ఇంధనాలతో నడిచే వాహనాలతో పోలిస్తే క్రమంగా పర్యావరణహితమైన వాహనాల వైపు మళ్లుతున్నారు. దీనితో లగ్జరీ కార్ల విభాగంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వాటా పెరుగుతోంది. వాహన్ పోర్టల్ గణాంకాల ప్రకారం 2024 జనవరి–మే మధ్య కాలంలో లగ్జరీ సెగ్మెంట్లో 7 శాతంగా ఉన్న ఈవీల వాటా ఈ ఏడాది అదే వ్యవధిలో 11 శాతానికి చేరింది. ఏకంగా 66 శాతం వృద్ధి చెందింది. ప్రీ–ఓన్డ్ కార్ల మార్కెట్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. 2025లో జూన్ నెలాఖరు వరకు అమ్ముడైన ఖరీదైన కార్లలో 10 శాతం వాటా ఈవీలదే ఉంటోంది. గతేడాది ఇదే వ్యవధిలో వీటి వాటా 5 శాతం లోపే నమోదైంది. కొత్త మోడల్స్ దన్ను.. మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడిలాంటి దిగ్గజ సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ను ప్రవేశపెడుతుండటం కూడా ప్రీమియం కస్టమర్లకు ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి నెలకొనడానికి కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. బీఎండబ్ల్యూ ఐఎక్స్1 మోడల్ గేమ్చేంజర్గా నిల్చిందని పేర్కొన్నాయి. ఇక, తమిళనాడులోని రాణిపేటలో 2026 తొలి నాళ్లలో భారీ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇటీవల ప్రకటించింది. ప్రాథమికంగా దీని వార్షికోత్పత్తి సామర్థ్యం 30,000 యూనిట్లుగా ఉంటుంది. ఇక అమెరికన్ దిగ్గజం టెస్లా కూడా భారత్లో విక్రయాలకు సిద్ధమవుతోంది. జూన్ 15న తొలి స్టోర్ను ముంబైలో ప్రారంభిస్తోంది. దీనితో ఎలక్ట్రిక్ వాహనాల విభాగం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ప్రస్తుతం ఈవీలను ఎందుకు కొనాలి అనే సందేహం నుంచి బైటపడి ఏ ఈవీని కొనుక్కోవాలి అనే ఆలోచించే వైపు కొనుగోలుదార్లు మళ్లుతున్నట్లు మెర్సిడెస్ బెంజ్ ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. తాను రెండేళ్లుగా ఈవీని ఉపయోగిస్తున్నానని పేర్కొన్నారు. మాస్ మార్కెట్ ఈవీల రేట్లు కూడా దాదాపు సంప్రదాయ ఐసీఈ వాహనాల ధరలకు కాస్త అటూ ఇటూగా ఉండటం కూడా ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్కి దోహదపడుతోంది. ట్యాక్సేషన్పరమైన ప్రయోజనాల వల్ల లగ్జరీ సెగ్మెంట్లో ఐసీఈ వాహనాలతో పోలిస్తే ఈవీల రేట్లు కొన్ని సందర్భాల్లో 4–5 శాతం తక్కువకే లభిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇక , డ్రైవింగ్పరంగా సౌకర్యం, చార్జింగ్ పాయింట్లు పెరుగుతుండటం వంటి అంశాలు సైతం ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తికి దోహదపడుతున్నాయని వివరించాయి. రేంజ్పరమైన (మైలేజీ) ఆందోళన కూడా తగ్గుతోందని పేర్కొన్నాయి. టాప్ ఎండ్ లగ్జరీ కార్లకు డిమాండ్ దేశీయంగా టాప్ ఎండ్ లగ్జరీ, బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలకు గణనీయంగా డిమాండ్ నెలకొందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దిన వాహనాలపై కస్టమర్లు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అమ్మకాలపరంగా అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసినట్లు చెప్పారు. 4,238 కార్లను విక్రయించినట్లు పేర్కొన్నారు. ఎస్–క్లాస్, మేబాక్, ఏఎంజీల్లాంటి టాప్ ఎండ్ వాహన విక్రయాలు 20 శాతం ఎగిశాయని వివరించారు. కొత్తగా జీఎల్ఎస్ ఏఎంజీ లైన్కి సంబంధించి రెండు వాహనాలను కంపెనీ ప్రవేశపెట్టింది. వీటి ధర రూ. 1.4 కోట్ల నుంచి ప్రారంభమవుతుంది. -
జియో మరో సంచలనం.. ఇక టీవీనే కంప్యూటర్!
ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ విభాగం మరో సంచలనంతో ముందుకొచ్చింది. తక్కువ ధరలో డిజిటల్ ఉపకరణాలు కోరుకునే వినియోగదారులకు జియో ప్లాట్ఫాంస్ జియో పీసీ (JioPC) పేరుతో కొత్త ఆవిష్కరణను తెచ్చింది. ఇది ఒక క్లౌడ్ ఆధారిత వర్చువల్ డెస్క్టాప్ సర్వీసుగా పనిచేస్తూ మీ టీవీని పూర్తి స్థాయి కంప్యూటర్గా మార్చుతుంది.ఈ ఏఐ (AI) ఆధారిత వర్చువల్ కంప్యూటింగ్ సర్వీస్ జియో సెట్-టాప్ బాక్స్ ద్వారా అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు కీబోర్డ్, మౌస్ని ప్లగ్ఇన్ చేసి తమ టీవీలో డెస్క్టాప్ అనుభవాన్ని పొందవచ్చు. అయితే ప్రస్తుతానికి కెమెరాలు, ప్రింటర్లు వంటి పరికరాలకు ఇది సపోర్ట్ చేయదు.ధర, లభ్యతజియోపీసీ ప్రస్తుతానికి ఉచిత ట్రయల్ ద్వారా ఎంపిక చేసిన వినియోగదారులకు అందిస్తోంది. పూర్తిగా పొందాలంటే రూ.5,499 చెల్లించి జియో బ్రాడ్బ్యాండ్తో పొందవచ్చు. తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలను లక్ష్యంగా తీసుకుంటూ, కంప్యూటింగ్ను అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంగా దీన్ని భావిస్తున్నారు. క్లౌడ్ ఆధారిత కంప్యూటర్ను తీసుకొస్తున్నట్లు జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ గత మార్చిలోనే వెల్లడించారు.ఫీచర్లు, వినియోగం ఇలా..జియో వెబ్సైట్లో పేర్కొన్నదాని ప్రకారం.. లైబ్రేఆఫీస్ (LibreOffice) అనే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లాంటి ఓపెన్-సోర్స్ ఆఫీస్ సూట్ను దీంట్లో ప్రీఇన్స్టాల్ చేసిఉంటారు. దీని ద్వారా బ్రౌజింగ్ చేసుకోవచ్చని, విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు, ఇతర అసవసరాలకు వినియోగించుకోవచ్చని వెబ్సైట్లో పేర్కొన్నారు. ఇక మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యాప్లను విడి బ్రౌజర్ ద్వరా ఉపయోగించవచ్చు. క్లౌడ్ ఆధారిత నిర్వహణ వల్ల మెయింటెనెన్స్ ఖర్చు కూడా ఏమీ ఉండదు. -
ఎయిర్టెల్ రీచార్జ్పై 25% క్యాష్ బ్యాక్.. ఇలా చేస్తే..
దేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీలలో ఒకటైన ఎయిర్టెల్ ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ సేవలతో పాటు, బ్రాడ్బ్యాండ్ సర్వీస్ను కూడా అందిస్తోంది. మొబైల్ టారిఫ్లు పెరిగిన నేపథ్యంలో మీరు మొబైల్ రీఛార్జ్, బ్రాడ్ బ్యాండ్ బిల్లు లేదా డిటిహెచ్ రీఛార్జ్ పై ఆదా చేయాలనుకుంటే మీకో చక్కటి మార్గం ఉంది. దీని ద్వారా ప్రతి రీఛార్జ్ పైనా 25 శాతం వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చని మీకు తెలుసా?యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో ఎయిర్టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టింది. దీని సాయంతో రీఛార్జ్ వంటి యుటిలిటీ చెల్లింపులపై బంపర్ క్యాష్ బ్యాక్ పొందడం ఈ కార్డు ప్రత్యేకత. మీరు ఎయిర్టెల్ రీఛార్జ్లలో డబ్బులు ఆదా చేయాలనుకుంటే, ఈ కార్డు మీకు సరైన ఎంపిక. దీనితో ఇతర కంపెనీల రీఛార్జ్ లపై కూడా డిస్కౌంట్లు పొందవచ్చు.25 శాతం క్యాష్ బ్యాక్ పొందండిలా..ఈ క్యాష్ బ్యాక్ కోసం యూజర్లు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వరా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రీఛార్జ్ కోసం ఎయిర్టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో చెల్లించినట్లయితే ఫ్లాట్ 25 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అదే సమయంలో ఇతర రీఛార్జ్ లపై కూడా 10 శాతం క్యాష్ బ్యాక్ ప్రయోజనాన్ని అందిస్తోంది. ఈ క్యాష్ బ్యాక్ 60 రోజుల్లో ప్రాసెస్ అయి నేరుగా క్రెడిట్ స్టేట్ మెంట్ లో ప్రతిబింబిస్తుంది. -
షిప్రాకెట్ నుంచి ‘శూన్య.ఏఐ’
చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ), డీ2సీ వ్యాపార సంస్థల కోసం ఈ–కామర్స్ సేవల సంస్థ షిప్రాకెట్ కొత్తగా ‘శూన్య.ఏఐ’ పేరిట ఏఐ ఇంజిన్ను ఆవిష్కరించింది. అల్ట్రాసేఫ్ సంస్థ భాగస్వామ్యంతో దీన్ని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. తొమ్మిదికి పైగా భారతీయ భాషల్లో వాయిస్, టెక్ట్స్, ఇమేజ్ ఇంటెలిజెన్స్ను ఇది అందిస్తుందని పేర్కొంది. దీన్ని పూర్తిగా భారత్లోనే తీర్చిదిద్దినట్లు వివరించింది.ఇదీ చదవండి: ఐపీవోకు ఇన్ఫ్రా పరికరాలు అద్దెకిచ్చే కంపెనీతొలి ఏడాదిలో ఇది 1 లక్ష పైచిలుకు ఎంఎస్ఎంఈలను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు షిప్రాకెట్ పేర్కొంది. కేటలాగింగ్, మార్కెటింగ్, ఫుల్ఫిల్మెంట్ తదితర విభాగాలవ్యాప్తంగా సమయాన్ని, డబ్బును ఆదా చేసుకునేందుకు శూన్య.ఏఐ ఉపయోగపడుతుందని కంపెనీ ఎండీ సాహిల్ గోయల్ చెప్పారు. షిప్రాకెట్, కేపీఎంజీ విడుదల చేసిన నివేదిక ప్రకారం 11,000 పైచిలుకు బ్రాండ్లు ఉన్న దేశీ డీ2సీ మార్కెట్ ఈ ఏడాది (2025) 100 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. అలాగే 22 కోట్ల ఆన్లైన్ షాపర్లున్న ఈ–రిటైల్ మార్కెట్ 125 బిలియన్ డాలర్లకు చేరనుంది. -
ఏఐ ఆధారిత వైద్య సేవలు
ముంబై: అంతర్జాతీయ ప్రమాణాలతో, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఆరోగ్య సంరక్షణ సేవలను అందుబాటు ధరలకే అందించే ప్రణాళికలను అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ప్రకటించారు. భారత్లో ఆరోగ్యం సంరక్షణ రంగాన్ని మార్చేసే స్వప్నాన్ని ఆయన ఆవిష్కరించారు. సొసైటీ ఫర్ మినిమల్లీ ఇన్వేసివ్ స్పైన్ సర్జరీ – ఆసియా పసిఫిక్ (ఎస్ఎంఐఎస్ఎస్–ఏపీ) 5వ వార్షిక సమావేశం శుక్రవారం ముంబైలో జరిగింది. ఇందులో పాల్గొన్న సందర్భంగా గౌతమ్ అదానీ మాట్లాడారు. భవిష్యత్ ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చేందుకు వీలుగా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ కంటే.. వ్యవస్థ వ్యాప్తంగా పునర్నిర్మాణం అవసరమన్నారు. మూడేళ్ల క్రితం తన 60వ పుట్టిన రోజు సందర్భంగా హెల్త్కేర్, విద్య, నైపుణ్యాభివృద్ధి కోసం రూ.60,000 కోట్లను ఖర్చు చేయనున్నట్టు ప్రకటించడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘‘హెల్త్కేర్ రంగంలో తగినంత వేగం లేకపోవడం వల్ల మేము ఇందులోకి ప్రవేశించలేదు. ఇప్పుడు ఆ వేగం సరిపడా లేకపోవడంతో అడుగు పెట్టాం’’అని అదానీ తెలిపారు. 1,000 పడకల ఇంటిగ్రేటెడ్ మెడికల్ క్యాంపస్లను తొలుత అహ్మదాబాద్, ముంబైలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేయనున్నట్టు గతంలో చేసిన ప్రకటనను గుర్తు చేస్తూ.. కరోనా మాదిరి మహమ్మారి, విపత్తు సమయాల్లో వేగంగా సదుపాయాలను విస్తరించేలా ఇవి ఉంటాయన్నా రు. వైద్య చికిత్సలు, పరిశోధన, శిక్షణకు అత్యుత్తమ కేంద్రాలుగా పనిచేస్తాయంటూ.. మయో క్లినిక్ అంతర్జాతీయ అనుభవం ఈ దిశగా తమకు సాయపడుతుందని అదానీ చెప్పారు. నేడు గుండె జబ్బులు, మధుమేహం కంటే కూడా వెన్నునొప్పి ఎక్కువ మందిని వేధిస్తుందన్న విషయాన్ని ప్రస్తావించారు.నచ్చిన చిత్రం మున్నాభాయ్ ఎంబీబీఎస్ ‘నాకు బాగా నచి్చన చిత్రం మున్నా భాయ్ ఎంబీబీఎస్. నవ్వుకోవడానికే కాదు, సందేశం ఇవ్వడానికి కూడా. మున్నాభాయ్ మందులతో కాకుండా, మానవత్వంతో రోగుల బాధలను నయం చేశాడు. నిజమైన వైద్యం సర్జరీలకు అతీతమైనదని ఇది మనందరికీ గుర్తు చేసింది’ అని గౌతమ్ అదానీ పేర్కొన్నారు. -
వాట్సప్కు పోటీగా త్వరలో బిట్చాట్
ట్విటర్ మాజీ సీఈవో జాక్ డోర్స్ టెక్ ప్రపంచంలో సరికొత్త సంచలనాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నారు. సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. వాట్సప్ తరహా మెసేజింగ్ యాప్ను.. అందునా ఆఫ్లైన్లో పనిచేసేలా త్వరలో జనాలకు అందుబాటులోకి తేనున్నారు. దీనిపేరు.. బిట్చాట్. ఇంటర్నెట్తో అవసరం లేకుండా మెసేజ్లు పంపించుకునే ఈ యాప్ ఎలా పని చేస్తుందో ఓ లుక్కేద్దాం..బిట్చాట్ అంటే అనే బ్లూటూత్తో పనిచేసే పీర్-టు-పీర్ వ్యవస్థ. సర్వర్లతో దీనికి పని ఉండదు. బ్లూటూత్ ఆన్లో ఉంటే సరిపోతుంది. బిట్చాట్ యూజర్లు ఏదైనా మెసేజ్ చేయాలంటూ బ్లూటూత్ ఆన్ చేసి మెసేజ్లు పంపుకోవచ్చు. ఇంటర్నెట్ సమస్యలు, ఇతర విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు, ముఖ్యంగా మారుమూల ప్రాంతాలు, ఘర్షణ వాతావారణ నెలకొన్న సమయాల్లో దీన్ని వినియోగించుకోవచ్చు. సర్వర్లు, అకౌంట్లు, ట్రాకింగ్ విధానాలు ఇందులో లేకపోవడంతో.. యూజర్లను విపరీతంగా ఆకట్టుకోవచ్చనే అంచనా వేస్తున్నారు.ప్రైవసీకి ది బెస్ట్?బిట్చాట్ అనే పేరుతో అందుబాటులోకి వచ్చిన ఆఫ్లైన్ మెసేజింగ్ యాప్లో యూజర్లు అవతల వ్యక్తికి పంపే ప్రతి మెసేజ్ ఎన్క్రిప్ట్ అవుతుంది. మెసేజ్ టూ మెసేజ్ మధ్యలో ఎలాంటి సర్వర్ వ్యవస్థ ఉండదు కాబట్టి యూజర్లకు భద్రత విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని డోర్స్ అంటున్నారు. సింపుల్గా.. డివైజ్ టూ డివైజ్ కనెక్షన్. ఫోన్లో బ్లూటూత్ ద్వారా బిట్చాట్ పనిచేస్తోంది నో సెంట్రల్ సర్వర్: వాట్సప్,టెలిగ్రాం తరహా ఒక యూజర్కు పంపిన మెసేజ్ సర్వర్లోకి వెళుతుంది. సర్వర్ నుంచి రిసీవర్కు మెసేజ్ వెళుతుంది. బిట్చాట్లో అలా ఉండదు.. నేరుగా సెండర్నుంచి రిసీవర్కు మెసేజ్ వెళుతుంది. మెష్ నెట్వర్కింగ్: బ్లూట్తో పనిచేసే ఈ బిట్చాట్ యాప్ ద్వారా రిసీవర్ సమీపంలో లేనప్పటికీ మెసేజ్ వెళుతుంది. ఈ టెక్నిక్ను మెష్ రూటింగ్ అంటారు ఇది మెసేజ్ బ్లూటూత్ పరిధికి మించి 300 మీటర్లు (984 అడుగులు) వరకు పంపడానికి వీలవుతుంది. ప్రూప్స్ అవసరం లేదు: ఈ యాప్లో లాగిన్ అయ్యేందుకు ఎలాంటి వ్యక్తిగత యూజర్ వివరాలు అవసరం లేదు. అంటే ఫోన్ నెంబర్,ఈమెయిల్తో పాటు ఇతర వ్యక్తిగత వివరాలతో పనిలేదు. డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ : బిట్చాట్ కొన్నిసార్లు పీట్ టూ పీర్ నెట్వర్క్ ఆధారంగా పనిచేస్తుంది. అంటే సర్వర్ లేకుండా నెట్వర్క్లోని యూజర్ టూ యూజర్ల మధ్య డేటా మార్పిడి జరుగుతుంది. పాస్వర్డ్ ప్రొటెక్షన్: గ్రూప్ చాట్స్ను ‘రూమ్లు’ అని పిలుస్తారు. ఇవి పాస్వర్డ్తో రక్షితంగా ఉంటాయియూజర్ ఇంటర్ఫేస్: యాప్ను ఇన్ స్టాల్ చేసి, అకౌంట్ క్రియేట్ చేస్తే చాలు. తర్వాత మీ కాంటాక్ట్ లిస్ట్ నుంచి ఎవరితోనైనా చాట్ చేసుకోవచ్చు. గ్రూప్ చాట్స్ అండ్ రూమ్స్: హ్యాష్ట్యాగ్లతో పేర్లు పెట్టి, పాస్వర్డ్లతో సెక్యూర్ చేయవచ్చు. ఉపయోగపడే సందర్భాలు: రద్దీ ప్రదేశాల్లో నెట్వర్క్ సరిగ్గా పనిచేయని సమయంలో విపత్తుల సమయంలో (disaster zones). సెన్సార్ ఉన్న ప్రాంతాల్లో కమ్యూనికేట్ చేయాలనుకునే వారికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం బిట్చాట్ బీటా వెర్షన్లో టెస్ట్ఫ్లైట్ మోడ్లో ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ వెర్షన్ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.టెస్ట్ ఫ్లైట్ మోడ్ అనేది యాపిల్ అందించే బీటా టెస్టింగ్ ప్లాట్ఫారమ్. యాప్లను విడుదలకు ముందు దీని ద్వారా iOS, iPadOS, watchOS, tvOS పరీక్షించేందుకు డెవలపర్లు ఉపయోగించుకుంటారు. తద్వారా ఫీడ్బ్యాక్తో సంబంధిత యాప్ను ఎలా అంటే అలా మార్పులు చేర్పులు చేస్తారు. -
ఎయిర్టెల్ కొత్త ప్లాన్.. రూ.200 లోపే అన్లిమిటెడ్..
దేశంలో ప్రముఖ ప్రైవేట్ టెలికం ఆపరేటర్ ఎయిర్టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఇది వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్తోపాటు మరికొన్ని అదనపు ప్రయోజనాలను అందిస్తుంది. లాంచ్ను అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఈ ప్లాన్ ఇప్పటికే ఎయిర్టెల్ వెబ్సైట్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది.రూ .200 లోపు బేసిక్, షార్ట్ టర్మ్ వాలిడిటీ ప్లాన్ కోసం చూస్తున్న వినియోగదారులను, ముఖ్యంగా ఖరీదైన డేటా ప్యాక్లు కాకుండా మొబైల్ నంబర్ను యాక్టివ్గా ఉంటే చాలనుకునే యూజర్లను లక్ష్యంగా చేసుకుని ఈ ప్లాన్ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. రూ.189 విలువైన ఈ ప్లాన్లో ఏయే ప్రయోజనాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.రూ.189 ప్లాన్ బెనిఫిట్స్ఎయిర్టెల్ రూ.189 ప్లాన్ వాలిడిటీ 21 రోజులు. ఈ వ్యవధిలో వినియోగదారులు అన్ని నెట్వర్క్లకు అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ప్లాన్ మొత్తానికి 1 జీబీ మొబైల్ డేటా లభిస్తుంది. అలాగే మొత్తం 300 ఎస్ఎంఎస్లు ఉచితంగా పంపుకోవచ్చు.ఈ ప్లాన్ భారీ డేటా వినియోగదారులు లేదా స్ట్రీమింగ్ ఆస్వాదించేవారి కోసం రూపొందింది కాదు. ఎక్కువగా కాలింగ్, అప్పుడప్పుడు ఎస్ఎంఎస్లు చేసుకునేవారికి ఇది అనువుగా ఉంటుంది.ఇదే ధర విభాగంలో రిలయన్స్ జియో వంటి ప్రత్యర్థి ఆపరేటర్లలోనూ రీఛార్జ్ ప్లాన్లు ఉన్నాయి. రూ .200 కంటే తక్కువ రీఛార్జ్ చేయాలనుకునేవారికి, ఎయిర్టెల్ ఇప్పుడు రెండు ప్రధాన ఎంపికలను అందిస్తుంది. అవి కొత్తగా ప్రారంభించిన రూ .189 ప్లాన్, అలాగే ఇప్పటికే ఉన్న రూ .199 ప్లాన్. ఇది 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఏదేమైనా రూ .199 ప్లాన్ కొంచెం ఎక్కువ వ్యవధితో ఇలాంటి ప్రయోజనాలను అందిస్తుంది. అదనంగా మరో రూ .10 ఖర్చు చేయడానికి ఇష్టపడే వినియోగదారులకు ఇది మంచి డీల్. -
వందేళ్లయినా AI ఈ పని చేయలేదు: బిల్గేట్స్
విస్తృతంగా విస్తరిస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ (ఏఐ) మానవ ఉద్యోగాలపై ప్రభావం చూపుతుందని, కోట్లాది ఉద్యోగాలను భర్తీ చేస్తుందన్న అంచనాలు ఆందోళనలు పెంచుతున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రోగ్రామింగ్కు ఏఐ ప్రత్యామ్నాయం కాదని అభిప్రాయపడ్డారు. మానవ సృజనాత్మకతతోనే ప్రోగ్రామింగ్ రూపుదిద్దుకుంటుందని వ్యాఖ్యానించిన ఆయన ప్రోగ్రామర్లను ఏఐ ఇప్పుడే కాదు.. వందేళ్లయినా భర్తీ చేయలేదని స్పష్టం చేశారు.ఇటీవల ఎకనమిక్ టైమ్స్తోపాటు టునైట్ షో విత్ జిమ్మీ ఫాలన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలలో బిల్ గేట్స్ దీని గురించి మాట్లాడారు. కోడింగ్ కు మానవ మేధస్సు అవసరమని గేట్స్ చెప్పారు. ప్రోగ్రామింగ్ విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయపడగలదు కానీ పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోలేదని స్పష్టం చేశారు. ప్రోగ్రామింగ్లో నిజమైన సవాలు సంక్లిష్ట సమస్యను సృజనాత్మకతతో పరిష్కరించడమేనన్న ఆయన ఇది యంత్రాలు చేయలేవన్నారు.‘కోడ్ రాయడం అంటే కేవలం టైపింగ్ మాత్రమే కాదు. లోతుగా ఆలోచించడం’ అని బిల్ గేట్స్ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా విభిన్న పరిశ్రమల్లో అనేక ఉద్యోగాలు రూపాంతరం చెందుతాయని, లేదా కనుమరుగవుతాయని భావిస్తున్నప్పటికీ, ప్రోగ్రామింగ్ మాత్రం మానవ ఉద్యోగంగానే ఉంటుందని గేట్స్ అంచనా వేస్తున్నారు. ఎందుకంటే దీనికి విచక్షణ, ఊహాశక్తి, అడాప్టబిలిటీ అవసరం. ఈ లక్షణాలు ఏఐకి ఉండవని అంటున్నారాయన.మరోవైపు 2030 నాటికి కృత్రిమ మేధ 8.5 కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తుందని, అదే సమయంలో 9.7 కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంచనా వేసింది. ఈ ద్వంద్వ ప్రభావాన్ని గేట్స్ అంగీకరిస్తూ, కృత్రిమ మేధ పర్యవసానాల గురించి తాను కూడా భయపడుతున్నానని అంగీకరించారు. అయితే తెలివిగా ఉపయోగిస్తే కృత్రిమ మేధ ఉత్పాదకతను మెరుగుపరుస్తుందని, సమయాన్ని ఆదా చేస్తుందని ఆయన నమ్ముతున్నారు.ఏఐ ప్రభావం గురించి కొన్ని నెలల క్రితమే బిల్గేట్స్ మాట్లాడారు. ఆర్టిపీషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ప్రభావం చూపినా, ఎన్ని మార్పులు తెచ్చినా, కోడింగ్ నిపుణులు, జీవ శాస్త్రవేత్తలు, ఇంధన రంగంలో పనిచేసేవారికి ఎలాంటి ఢోకా ఉండదని తన అభిప్రాయాన్ని చెప్పారు. -
శాంసంగ్ నుంచి 3 ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లు
శాంసంగ్ ఎల్రక్టానిక్స్ సంస్థ ప్రీమియం ఫోల్డబుల్ గెలాక్సీ సిరీస్లో మూడు కొత్త మోడల్స్ను ప్రవేశపెట్టింది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్7, ఫ్లిప్ 7, ఫ్లిప్7 ఎఫ్ఈ వీటిలో ఉన్నాయి. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ సిరీస్లో ఇవి ఏడో జనరేషన్ ఫోన్లు. మరింత వెడల్పాటి స్క్రీన్, తక్కువ బరువు, 200 మెగాపిక్సెల్ వైడ్–యాంగిల్ కెమెరా, కృత్రిమ మేథపరంగా కొత్త ఫీచర్లు మొదలైనవి వీటిలో ఉన్నాయి. ఫోన్ను బట్టి స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్లు, 8.5 అంగుళాల డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ మెయిన్ డిస్ప్లే, 16 జీబీ వరకు మెమరీ, 1 టీబీ స్టోరేజీ మొదలైన ప్రత్యేకతలు ఉంటాయి.శాంసంగ్ ఈసారి స్లిమ్ ఫోల్డబుల్ డిజైన్, శక్తివంతమైన పనితీరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఇది ఫ్లాగ్షిప్ మార్కెట్లో ఎక్కువ దృష్టిని ఆకర్షించింది. జెమినీ లైవ్, నౌ బార్, నౌ బ్రీఫ్ వంటి మరెన్నో కొత్త ఏఐ సామర్థ్యాలను తీసుకువస్తున్నందున శాంసంగ్ ఈ ఫోన్లను "గెలాక్సీ ఏఐ ఫోన్లు" అని పిలుస్తోంది. వీటి ధరలను ప్రకటించిన కొరియన్ స్మార్ట్ఫోన్ మేకర్ ప్రీ బుకింగ్లను ప్రారంభించింది.శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 బ్లూ షాడో, సిల్వర్ షాడో, జెట్బ్లాక్, మింట్ (Samsung.com మాత్రమే) అనే నాలుగు రంగుల్లో లభిస్తుంది.12జీబీ+256జీబీ ధర రూ.1,74,99912జీబీ+512జీబీ ధర రూ.1,86,99916జీబీ+1టీబీ ధర రూ.2,10,999శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 బ్లూ షాడో, జెట్బ్లాక్, కోరల్ రెడ్, మింట్ (Samsung.comలో మాత్రమే) రంగుల్లో లభిస్తుంది.12జీబీ+256జీబీ ధర రూ.1,09,99912జీబీ+512జీబీ ధర రూ.1,21,999శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 ఎఫ్ఈగెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 ఎఫ్ఈ బ్లాక్ లేదా వైట్ కలర్లలో లభిస్తుంది.8జీబీ+128జీబీ: రూ.89,9998జీబీ+256జీబీ: రూ.95,999ఈ స్మార్ట్ ఫోన్లు భారత్లో శాంసంగ్ (Samsung.com), అమెజాన్ (Amazon.in), ఫ్లిప్కార్ట్ (Flipkart.com)లలో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉన్నాయి. ప్రీ ఆర్డర్లకు ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తున్నాయి. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 ప్రీ-ఆర్డర్ చేస్తే రూ.12,000 విలువైన ఉచిత స్టోరేజ్ అప్ గ్రేడ్ లభిస్తుంది. మరోవైపు శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్7 ఎఫ్ఈ ప్రీ ఆర్డర్పై రూ.6,000 విలువైన స్టోరేజ్ అప్గ్రేడ్ ఉచితంగా అందిస్తోంది. అదనంగా, కొనుగోలుదారులు ఈ మూడు మోడళ్లపై 24 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఎంపికలను కూడా ఎంచుకోవచ్చు. కొత్త ఫోల్డబుల్ అధికారిక సేల్ జూలై 25న మొదలుకానుంది. -
మస్క్ కంపెనీకి భారత్లో అనుమతులు
ఎలాన్ మస్క్కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థ స్టార్లింక్ భారత్లో కార్యకలాపాలు ప్రారంభించడానికి అన్ని అడ్డంకులను అధిగమించింది. భారతదేశ అంతరిక్ష నియంత్రణ సంస్థ ఇన్-స్పేస్ (ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్) ఈ సంస్థకు అనుమతులు ఇచ్చింది. దాంతో దేశంలో స్టార్లింక్ ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించేందుకు అడ్డంకులు తొలగినట్లయింది.2022 నుంచి భారతదేశంలో స్టార్లింక్ తన సర్వీసులు ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గత నెలలో టెలికమ్యూనికేషన్స్ విభాగం (డాట్) నుంచి గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ (జీఎంపీసీఎస్) లైసెన్స్ కూడా పొందింది. ఇప్పుడు, ఇన్-స్పేస్ ఆమోదంతో స్టార్లింక్ భారత్లోని కంపెనీ ప్రణాళికలకు లైన్ క్లియర్ అయింది.ఐఎన్-స్పేస్ స్టార్లింక్ తన జెన్ 1 ఉపగ్రహ సమూహాన్ని భారతదేశంపై నిలిపేందుకు అనుమతిస్తుంది. ఈ అనుమతులు జులై 7, 2030 వరకు చెల్లుబాటు అవుతాయని కొన్ని సంస్థలు తెలిపాయి. ఈ ఆమోదంలో భాగంగా IN-SPACe యూజర్లు ఉపయోచించేందుకు నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ బ్యాండ్లను కూడా ఖరారు చేస్తుంది. గేట్ వే బీమ్ల కోసం స్టార్లింక్ 27.5–29.1 గిగాహెర్జ్ట్, 29.5–30 గిగాహెర్జ్ట్ అప్లింక్ బ్యాండ్లను, 17.8–18.6 గిగాహెర్జ్ట్, 18.8–19.3 గిగాహెర్జ్ట్ డౌన్లింక్ బ్యాండ్లను ఉపయోగించే అవకాశం ఉందని సమాచారం. సరళంగా చెప్పాలంటే స్టార్లింక్ దాని వినియోగదారులు, గ్రౌండ్ స్టేషన్ల నుంచి భారతదేశం అంతటా ఇంటర్నెట్ డేటాను పంపించేందుకు నిర్దిష్ట ఉపగ్రహ సంకేతాలను ఉపయోగించేలా అధికారిక అనుమతులు పొందింది.ఇదీ చదవండి: పిల్లలూ.. బ్యాంకు తలుపు తట్టండి!గేట్వే స్టేషన్లు నిర్మాణం..ఇదిలాఉండగా, ఈ ఆమోదం పొందడం వల్ల స్టార్లింక్ వెంటనే భారత్లో సర్వీసులు ప్రారంభిస్తుందని కాదు. సంస్థ ఇంకా భారత ప్రభుత్వం నుంచి స్పెక్ట్రమ్ను పొందాల్సి ఉంటుంది. గ్రౌండ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం, భద్రతా అవసరాలను తీర్చడానికి పరీక్షలను పూర్తి చేయాల్సి ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా కనీసం మూడు గేట్వే స్టేషన్లను నిర్మించాలని కంపెనీ యోచిస్తోంది. ఈ వ్యవస్థ పూర్తయితే స్టార్లింక్ కూడా త్వరలో ట్రయల్స్ ప్రారంభించే అవకాశం ఉంది. కంపెనీ భారతదేశ సాంకేతిక, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నిరూపించడానికి టెలికమ్యూనికేషన్స్ విభాగం ట్రయల్ స్పెక్ట్రమ్ను మంజూరు చేయబోతున్నట్లు సమాచారం. -
ఈ ఐటీ ఉద్యోగం.. రూ.కోటి జీతం
పేరున్న కాలేజీలో పెద్ద పెద్ద డిగ్రీలు చదివితేనే మంచి ఉద్యోగాలు వస్తాయన్న భావనకు కాలం చెల్లిపోతోంది. ఏఐ టెక్నాలజీ విస్తృతమవుతున్న నేపథ్యంలో కాలేజీలు, డిగ్రీలతో సంబంధం లేకుండా ప్రతిభ ఉంటే చాలు రూ.లక్షల్లో జీతాలతో ఉద్యోగాలిస్తామంటూ ముందుకొస్తున్నాయి కొన్ని సంస్థలు. ఈ క్రమంలోనే భారత సంతతికి చెందిన ఓ స్టార్టప్ ఫౌండర్ సోషల్ మీడియాలో అసాధారణమైన జాబ్ లిస్టింగ్ను పోస్ట్ చేసి ఆన్లైన్లో విస్తృత చర్చను రేకెత్తించారు.‘స్మాల్ ఏఐ’ అనే ఏఐ స్టార్టప్ వ్యవస్థాపకుడు సుదర్శన్ కామత్ తన కంపెనీకి ఫుల్ స్టాక్ టెక్ లీడ్ కావాలంటూ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో ఓ పోస్ట్ పెట్టారు. ఈ జాబ్కి ఆయన రూ .1 కోటి వార్షిక వేతన పరిహారాన్నిఆఫర్ చేశారు. ఈ ప్యాకేజీలో రూ.60 లక్షల ఫిక్స్డ్ వార్షిక వేతనం కాగా రూ.40 లక్షలు కంపెనీ యాజమాన్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే దీనికి అభ్యర్థి కాలేజీ డిగ్రీలతో నిమిత్తం లేదని, రెజ్యూమ్ కూడా అక్కర్లేదని ప్రకటించడంతో అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.ఇంకా ఈ ఉద్యోగానికి ఏమేం కావాలన్నది కామత్ వివరించారు. ఆదర్శ అభ్యర్థికి "4-5 సంవత్సరాల అనుభవం" ఉండాలని, "నెక్ట్స్ జెఎస్, పైథాన్, రియాక్ట్ జెఎస్" గురించి బాగా తెలిసి ఉండాలని కామత్ పేర్కొన్నారు. అలాగే ఈ ఉద్యోగం బెంగళూరు కేంద్రంగా ఉంటుందని, ఎంపికైనవారు తక్షణమే ఉద్యోగంలో చేరాల్సి ఉంటుందని వెల్లడించారు. అదేవిధంగా జాబ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విధానంలో ఉంటుందని, వారానికి 5 రోజులు కార్యాలయానికి వచ్చి పనిచేయాలని కూడా వివరించారు.ఈ జాబ్కు అప్లయి చేయడానికి రెజ్యూమె అవసరం లేదని, కేవలం 100 పదాలతో తమ గురించి తెలియజేస్తే చాలంటూ కంపెనీ ఈ మెయిల్ అడ్రస్ ఇచ్చారు. కామత్ చేసిన ఈ పోస్ట్ వైరల్గా మారింది. ఇప్పటికే మూడు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు భిన్న కామెంట్లతో ప్రతిస్పందిస్తున్నారు.Hiring a cracked full-stack lead at Smallest AISalary CTC - 1 CrSalary Base - 60 LPASalary ESOPs - 40 LPAJoining - ImmediateLocation - Bangalore (Indiranagar)Experience - 4-5 years minimumLanguages - Next JS, Python, React JSWork from Office - 5 days a week (slightly…— Sudarshan Kamath (@kamath_sutra) July 7, 2025 -
ఐఫోన్ 17: చైనా టెకీలు వెళ్లిపోయినా పర్లేదు..
యాపిల్ వెండార్ల ప్లాంట్లలో పని చేసే చైనా టెకీలు స్వదేశాలకు వెళ్లిపోయినా భారత్లో ఐఫోన్ 17 ఫోన్ల ఉత్పత్తి ప్రణాళికలు యథాతథంగానే కొనసాగుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. చైనా నుంచి, ఐఫోన్ల తయారీలో కీలకమైన యంత్రపరికరాల దిగుమతులు ఇటీవలి కాలంలో మెరుగుపడ్డట్లు వివరించాయి.భారత్లో ఫాక్స్కాన్, టాటా ఎల్రక్టానిక్స్ సంస్థలు యాపిల్ ఫోన్లను తయారు చేస్తున్నాయి. గత రెండు నెలలుగా ఫాక్స్కాన్ ఇండియా యూనిట్లలో పని చేస్తున్న వందలకొద్దీ చైనా నిపుణులు స్వదేశానికి వెళ్లిపోయినట్లు సమాచారం. వీరంతా అసెంబ్లీ లైన్స్, ఫ్యాక్టరీ డిజైన్, ఇతరత్రా సిబ్బందికి శిక్షణనిచ్చే విధులు నిర్వర్తించేవారు.దీనితో ఐఫోన్ల తయారీపై ప్రతికూల ప్రభావం పడొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. కానీ, భారత్లో ఐఫోన్ల ఉత్పత్తిని 3.5–4 కోట్ల స్థాయి నుంచి ఈ ఏడాది 6 కోట్లకు పెంచుకోవాలన్న యాపిల్ టార్గెట్లో ఎలాంటి మార్పు లేదని సంబంధిత వర్గాలు వివరించాయి. -
యాపిల్ కొత్త సీఓఓ మనోడే..
ప్రపంచ దిగ్గజ కంపెనీ యాపిల్ కొత్తగా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా భారత సంతతికి చెందిన సబీహ్ ఖాన్ను నియమించింది. ఇప్పటి వరకు ఈ స్థానంలో జెఫ్ విలియమ్స్ సేవలందించారు. 2015 నుంచి సీఓఓ పదవిలో ఉన్న జెఫ్ విలియమ్స్ ఇకపై కంపెనీ సీఈఓ టిమ్ కుక్కు రిపోర్ట్ చేస్తూ యాపిల్ వాచ్, డిజైన్ బృందాలను పర్యవేక్షించనున్నారు. ఈ ఏడాది చివర్లో విలియమ్స్ పదవీ విరమణ చేసిన తర్వాత డిజైన్ బృందం నేరుగా టిమ్కు నివేదిస్తుందని యాపిల్ పేర్కొంది.ఎవరీ సబీహ్ ఖాన్..యాపిల్ సంస్థలో 30 ఏళ్లుగా పనిచేస్తూ, ప్రస్తుతం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆపరేషన్స్గా సేవలందిస్తున్న సబీహ్ ఖాన్ ఈ నెలాఖరులో అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో 1966లో జన్మించిన ఖాన్ చదువుకునే రోజుల్లోనే సింగపూర్కు మకాం మార్చారు. టఫ్ట్స్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్లో డ్యూయల్ బ్యాచిలర్ డిగ్రీలు పొందారు. రెన్సెలీర్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ (ఆర్పీఐ) నుంచి మెకానికల్ ఇంజినీరింగ్లో మాస్టర్స్ పట్టా సాధించారు.Many congratulations to Sabih Khan on being elevated as the COO of AppleI had the pleasure of meeting and interacting with Sabih a few years ago when he was leading Global supply chain operations for AppleOnwards and upwards my friend 👏 pic.twitter.com/TbsYffwLJv— KTR (@KTRBRS) July 9, 2025ఇదీ చదవండి: కుబేరులకు దేశాలు రెడ్కార్పెట్జీఈ ప్లాస్టిక్స్లో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన తరువాత ఖాన్ 1995లో యాపిల్లో చేరారు. అప్పటి నుంచి అతను గ్లోబల్ సప్లై చైన్, సప్లయర్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రామ్స్, ఆపరేషనల్ స్ట్రాటజీని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. యాపిల్ గ్లోబల్ స్ట్రాటజీలో కీలక మార్కెట్గా భారత్ ఎదుగుతున్న నేపథ్యంలో ఖాన్ ఈ పదవిని చేపట్టడం గమనార్హం. ఖాన్ భారాస నేత కేటీఆర్ స్నేహితుడు కావడంతో తన ఎక్స్ ఖాతాలో శుభాకాంక్షలు తెలిపారు. -
బడ్జెట్ ధరలో మోటో 5జీ ఫోన్
ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ మోటోరొలా బడ్జెట్ ధరలో ‘మోటో జీ96’ 5జీ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. రూ.17,999 ప్రారంభ ధరతో వస్తున్న ఈ బడ్జెట్ ఫోన్ను వినియోగదారులు ఎంపిక చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఫోన్ను స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, 256 జీబీ స్టోరేజ్తో మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: పెరుగుతున్న కార్మిక కొరత.. జనాభా సంక్షోభంఫీచర్లు..144 హెచ్జెడ్ 3డీ కర్వ్డ్ పీఓఎల్ఈడీ డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంది. స్నాప్డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్ని వాడారు. వెనుక 50 ఎంపీ సోనీ ఎల్వైటీ–700సీ కెమెరా ఉంది. 5,500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 128బీజీ స్టోరేజ్లతో 2 వేరియంట్లు ఉన్నాయి. ప్రారంభ ధర రూ.17,999గా ఉంది. ఈ జూలై 16 నుంచి ఫ్లిప్కార్ట్, మోటోరొలా వెబ్సైట్లతో పాటు రిటైల్ షాపుల్లో అమ్మకాలు ప్రారంభవుతాయి. -
డ్రోన్ మార్కెట్ @ రూ.2 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: రక్షణ, వ్యవసాయం, లాజిస్టిక్స్, మౌలికం తదితర ఎన్నో రంగాల్లో డ్రోన్ల వినియోగంతో మంచి ఫలితాలు కనిపిస్తుండడంతో ఈ మార్కెట్ వచ్చే ఐదు సంవత్సరాల్లో గణనీయంగా వృద్ధి చెందనుందని నెక్స్జెన్ సంస్థ అంచనా వేసింది. 2030 నాటికి దేశీ డ్రోన్ తయారీ పరిమాణం 23 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.1.96 లక్షల కోట్లు) చేరుకోవచ్చని పేర్కొంది. ఆధునిక యుద్ధ తంత్రాల్లో డ్రోన్లు కీలకంగా మారిన విషయాన్ని ప్రస్తావించింది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో డ్రోన్ల వినియోగం స్పష్టమైన మార్పునకు నిదర్శనంగా పేర్కొంది. 15 పట్టణాలకు చెందిన 150 కంపెనీల అభిప్రాయాలను నెక్స్జెన్ తన సర్వేలో భాగంగా తెలుసుకుంది. ముఖ్యంగా వ్యవసాయం, కచ్చితమైన సాగు అవసరాలు 2030 నాటికి డ్రోన్ల డిమాండ్కు కీలకంగా నిలుస్తాయని 40 శాతం కంపెనీలు భావిస్తున్నాయి. ఆ తర్వాత రక్షణ రంగం నుంచి ఎక్కువ డిమాండ్ వస్తుందని పేర్కొన్నాయి. స్మార్ట్ సాగు రూపంలో వచ్చే ఐదేళ్లో గ్రామీణ వ్యవసాయంలో డ్రోన్లు బూమ్ను సృష్టిస్తాయని నమ్ముతున్నట్టు సర్వేలో 20 శాతం కంపెనీల ప్రతినిధుల తెలిపారు. లాజిస్టిక్స్ (వస్తు రవాణా), ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలు సైతం డ్రోన్ల తయారీకి చోదకంగా నిలుస్తాయని 15 శాతం కంపెనీలు అభిప్రాయపడ్డాయి. ఢిల్లీలో అంతర్జాతీయ డ్రోన్స్ ప్రదర్శన ఈ డిమాండ్నకు మరింత మద్దతునిచ్చే చర్యల్లో భాగంగా ఈ నెల 31 నుంచి ఆగస్ట్ 1 వరకు ఢిల్లీలో అతిపెద్ద ‘డ్రోన్ అంతర్జాతీయ ప్రదర్శన 2025’ నిర్వహించనున్నట్టు నెక్స్జెన్ తెలిపింది. నెక్స్జెన్ ఎగ్జిబిషన్స్ దీన్ని నిర్వహిస్తుండడం గమనార్హం. రష్యా, తైవాన్, కెనడా, ఉక్రెయిన్, భారత్ సహా ఆరు దేశాలు తమ నూతన డ్రోన్ ఆవిష్కరణలను ఈ సందర్భంగా ప్రదర్శించనున్నట్టు వెల్లడించింది. అలాగే, 50కు పైగాఅంతర్జాతీయ డ్రోన్ తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నట్టు తెలిపింది. ‘‘ఆపరేషన్ సింధూర్ సమయంలో డ్రోన్లు చూపించిన అద్భుత సామర్థ్యాలను యావత్ ప్రపంచం గమనించింది. దేశీ తయారీ డ్రోన్లను ప్రోత్సహించడం ‘భారత్లో తయారీ’ కార్యక్రమాన్ని బలోపేతం చేస్తుందని, పలు రంగాల్లో దేశ శ్రేయస్సుకు మేలు చేస్తుందని భావిస్తున్నాను’’అని నెక్స్జెన్ ఎగ్జిబిషన్స్ డైరెక్టర్ ఆధార్ బన్సాల్ తెలిపారు. వ్యవసాయంలో విత్తనాలు నాటడం, మందుల పిచికారీతోపాటు నిఘా, పంటల ఆరోగ్యం పరిశీలన సహా ఎన్నో రూపాల్లో డ్రోన్లు సేవలు అందిస్తుండడం గమనార్హం. అంతర్జాతీయంగా వ్యవసాయ డ్రోన్ల మార్కెట్ 2030 నాటికి చేరుకోవచ్చని 6 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చన్న అంచనాలను నెక్స్జెన్ నివేదిక ప్రస్తావించింది. -
బాబోయ్.. రీచార్జ్ ప్లాన్లు మళ్లీ పెరుగుతాయా?
దేశంలో మొబైల్ రీచార్జ్ ప్లాన్ల ధరలు మళ్లీ పెరుగనున్నాయి. టెలికాం ఆపరేటర్లు ఈ ఏడాది చివరి నాటికి మొబైల్ టారిఫ్లను పెంచవచ్చని తెలుస్తోంది. ధరల పెరుగుదల 10 నుంచి 12 శాతం వరకు ఉండొచ్చని ఓ వార్తా నివేదిక తెలిపింది. 2024 జూలైలో బేస్ ధరలను 11 నుండి 23 శాతం పెంచిన భారతీయ టెలికాం కంపెనీలు ఈసారి కొత్త విధానాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, మే నెలలో బలమైన క్రియాశీలక యూజర్ల పెరుగుదలే ఈ పెంపునకు కారణమని చెబుతున్నారు.మళ్లీ మొబైల్ టారిఫ్ల పెంపుభారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియాతో సహా భారతీయ టెలికాం ఆపరేటర్లు ఈ ఏడాది చివరి నాటికి మొబైల్ టారిఫ్లపై తాజా పెంపును విధించవచ్చని ఈటీ టెలికాం నివేదిక తెలిపింది. ఈ పెరుగుదల 10-12 శాతం మధ్య ఉంటుందని, మిడ్-టు-హై-ప్రైస్ రీఛార్జ్ ప్లాన్లను కొనుగోలు చేసే వినియోగదారులను కంపెనీలు లక్ష్యంగా చేసుకోవచ్చని తెలిపింది.టారిఫ్ల పెంపుతో యాక్టివ్ సబ్స్క్రైబర్లు వేరే టెలికాం నెట్వర్క్ ప్రొవైడర్కు మళ్లకుండా ఆపరేటర్లు టైర్డ్ విధానంపై దృష్టి సారించారు. మే నెలలో యాక్టివ్ సబ్స్క్రైబర్ల బలమైన వృద్ధి మరోసారి ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని చెబుతున్నారు. ఈ 31 రోజుల్లో భారతీయ టెలికాం రంగంలో 7.4 మిలియన్ల క్రియాశీల చందాదారులు పెరిగారు. 29 నెలల్లో ఇదే అత్యధికం. దీంతో మొత్తం యాక్టివ్ సబ్స్క్రైబర్ల సంఖ్య 1.08 బిలియన్లకు చేరింది. -
‘పాస్వర్డ్ సరైందే! ఎందుకు లాగిన్ అవ్వట్లేదు’
బ్యాంక్, ఆఫీస్ పోర్టళ్లు, జాబ్ కోసం దరఖాస్తులు వంటి ఇతర ముఖ్యమైన వెబ్సైట్ల్లో చాలామంది లాగిన్ ఐడీ, పాస్వర్డ్లు కొత్తగా క్రియేట్ చేసుకుంటుంటారు. కానీ తిరిగి లాగిన్ చేయాలంటే మాత్రం సైన్ఇన్ ఇవ్వొదు. ‘అదేంటి సరిగ్గానే పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నానే.. ఎందుకు అవ్వట్లేదు’ అనే అనుమానం వస్తుంది. దాంతో తిరికి ఫర్గాట్ పాస్ట్వర్డ్ అప్షన్కు వెళ్లాల్సి వస్తుంది. అందులోనూ కొన్ని సైట్లు పాత పాస్వర్డ్లు ఎంటర్ చేయమని అడిగే అవకాశం ఉంటుంది.ఏవీ చూసుకోకుండా లాగిన్ చేస్తే..లాగిన్ పోర్టల్లో ఐడీ ఎంటర్ చేసేప్పుడు సదరు బ్లాక్లో ఎంటర్ చేసే అక్షరాలు యూజర్కు కనిపిస్తాయి. కానీ పాస్వర్డ్ ఎంటర్ చేసేప్పుడు మాత్రం సెక్యూరిటీ కారణాల వల్ల డాట్లు వస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో అప్పర్కేస్, లోయర్ కేస్ ఇంగ్లీష్ అక్షరాలు, స్పెషల్ క్యారెక్టర్లు, క్యాప్స్లాక్ ఆన్ అవుతుంది. అవేవీ చూసుకోకుండా లాగిన్ చేస్తే అప్పటివరకు లాగిన్ అవుతుంది. కానీ లాగవుట్ చేసి తిరిగి లాగిన్ చేస్తే సైన్ఇన్ అవ్వదు. ఇలాంటి సమయాల్లో ఏం చేయాలో టెక్ నిపుణులు సూచిస్తున్నారు.చెక్ చేయాల్సిందే..ఆన్లైన్లో ఖాతాలు ఓపెన్ చేసేప్పుడు లాగిన్ ఐడీ, పాస్వర్డ్లు టైప్ చేయాల్సి వస్తుంది. ఐడీ బ్లాక్లో అక్షరాలు యూజర్కు కనిపిస్తాయి. కానీ పాస్వర్డ్ బ్లాక్లో ఎంటర్ చేసే అక్షరాలు కనిపించవు. బదులుగా డాట్స్ పడుతుంటాయి. ఆ సమయంలో ఒకవేళ కంప్యూటర్ ద్వారా సైన్ఇన్ అవుతుంటే నోట్పాడ్ ఓపెన్ చేసి అందులో ముందుగా పాస్వర్డ్ టైప్చేసి, ఎంటర్ చేయాల్సిన అన్ని అక్షరాలు సరిగ్గా పడుతున్నాయా? లేదా ఏదైనా బటన్ సమస్యలు, లేదా కేస్ సెన్సిటివ్ అక్షరాలు టైప్ అవుతున్నాయా చెక్ చేసుకోవాలి. తర్వాత పాస్వర్డ్ బ్లాక్లో ఎంటర్ చేయడంతో సమస్య ఉండదు.ఇదీ చదవండి: ఏఐ ఉండగా ఉద్యోగాలొస్తాయా?మొబైల్లో ఇలా..మొబైల్లో సైనప్ అవుతుంటే మాత్రం నోట్స్లో రాసుకోవచ్చు. దాంతోపాటు వెర్టికల్ వ్యూలో అక్షరాలు చిన్నగా ఉంటాయి. కాబట్టి పొరపాటున ఒక అక్షరం నొక్కితే పక్కన ఉన్న లెటర్లు ప్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి పరిష్కారంగా మొబైల్లో స్క్రీన్ రొటేట్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఉపయోగించి ఫోన్ రొటేట్ చేస్తే కీబోర్డ్ పెద్దగా కనిపిస్తుంది. మరింత స్పష్టంగా, ఎంటర్ చేయాలనుకునే పాస్వర్డ్ సదరు బ్లాక్లో ఇవ్వొచ్చు. -
జియో కొత్త ప్లాన్లు.. తక్కువ ఖర్చుతో ఏడాది వ్యాలిడిటీ
కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్లతో చౌకగా రీఛార్జ్ ప్లాన్లను అందించాలని ట్రాయ్ కొద్ది రోజుల క్రితం అన్ని టెలికాం కంపెనీలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో జియో కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోనాలతో రెండు చౌక రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. తన అధికారిక వెబ్సైట్లో రెండు కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్లను జాబితా చేసింది. వీటిలో వినియోగదారులు 365 రోజుల వరకు సుదీర్ఘ వాలిడిటీని పొందుతారు. డేటా అవసరం లేని యూజర్లకు ఈ ప్లాన్ ప్రయోజనం చేకూరుస్తుంది.కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్ మాత్రమే వాడే యూజర్లకు, డేటా అవసరం లేని వారికి ఈ జియో ప్లాన్లు ప్రత్యేకం. వీటిలో ఒక దాని ధర రూ .458 కాగా మరొకటి రూ .1958. ఇవి వరసగా 84 రోజులు, 365 రోజుల వాలిడిటీతో వస్తాయి. ఇంకా ఈ రెండు జియో ప్లాన్లలో వినియోగదారులు చాలా ప్రయోజనాలను పొందుతారు. ఈ ప్లాన్స్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.84 రోజుల ప్లాన్జియో కొత్త రూ.458 ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. ఈ ప్లాన్లో వినియోగదారులకు అపరిమిత కాలింగ్, 1000 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి. దీంతోపాటు జియో సినిమా, జియో టీవీ వంటి యాప్స్కు కూడా ఉచిత యాక్సెస్ లభిస్తుంది. ముఖ్యంగా కాలింగ్, ఎస్ఎంఎస్ మాత్రమే వాడే యూజర్ల కోసం జియో ఈ ప్లాన్ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్లో దేశం అంతటా ఏ నెట్వర్క్లోనైనా అపరిమిత కాల్స్, ఉచిత నేషనల్ రోమింగ్ సదుపాయం లభిస్తుంది.365 రోజుల ప్లాన్జియో కొత్త రూ .1958 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్లో వినియోగదారులు దేశం అంతటా ఏ నెట్వర్క్కు అయినా అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. వీటితో పాటు 3600 ఉచిత ఎస్ఎంఎస్లు, ఉచిత నేషనల్ రోమింగ్ ప్రయోజనాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ప్లాన్ జియో సినిమా, జియో టీవీ వంటి యాప్లకు ఉచిత యాక్సెస్ను అందిస్తుంది. -
ఈ డాక్యుమెంట్ కెమెరాతో ఆన్లైన్ క్లాస్ ఈజీ..
టీచర్లు టెక్తో టచ్లోకి రావాలన్నా, విద్యార్థులు విజ్ఞానంలో విండో ఓపెన్ చేయాలన్నా.. వారి వద్ద ఈ టెకీ టూల్ మాస్టార్లు ఉండాల్సిందే!క్లాస్లో స్క్రీన్ స్టార్ఆన్లైన్ క్లాసుల్లో విద్యార్థులు బయటకు కనబడేలా భయపడితే, టీచర్లు లోలోపల భయపడుతుంటారు. ఎందుకంటే ముందే పీపీటీలు సిద్ధం చేయకపోతే, ‘సార్, స్క్రీన్ షేర్ చేయండి’, ‘మిస్, స్లయిడ్ మిస్ అయింది’ అంటూ సందేశాల వర్షం కురిపిస్తారు విద్యార్థులు. ఇక నెట్ స్లో, లైట్ తక్కువ, ఫాంట్ చిన్నది లాంటి ఇతర సమస్యలతో ఆన్లైన్ క్లాస్ మొత్తం గాలిలో కలిసిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో టీచర్లకు తోడుగా ఉండే నేస్తమే ఈ ‘డాక్యుమెంట్ కెమెరా’. దీని ముందు పుస్తకం పెడితే చాలు, స్పష్టంగా సమాచారాన్ని స్క్రీన్పై చూపిస్తుంది. టచ్ చేస్తే లైట్ వెలుగుతుంది, బటన్ నొక్కితే బ్లర్ లేకుండా చూసుకుంటుంది. మీరు పేజీ తిప్పితే ఇది కూడా తిప్పి చూపిస్తుంది. స్లయిడ్స్ అవసరం లేకుండా బుక్తోనే క్లాస్ పూర్తవుతుంది. ధర రూ. 2,999.ఆర్ట్ మాస్టర్!పిల్లలు బొమ్మలు గీస్తారు, కట్ చేస్తారు, స్టిక్ చేస్తారు. ఇలా చేస్తూ చేస్తూ చివరకు చేతికి బ్యాండేజ్ వేసుకుంటారు! ఇలాంటి చిన్న చిన్న గాయాలకు ఇకపై ఈ ‘స్కాన్ అండ్ కట్’ మెషిన్ గుడ్బై చెప్తుంది. బొమ్మ చూపిస్తే, ఏ మెటీరియల్పై అయినా కట్ చేయగలదు. కాగితం, ఫ్యాబ్రిక్, ఫోమ్.. ఏదైనా సరే, స్క్రీన్ మీద టచ్ చేస్తే చాలు, రెండు వందలకు పైగా రెడీ డిజైన్లతో సిద్ధంగా ఉంటుంది. ఒక్క క్లిక్తో కావాల్సిన ఆర్ట్ని రెడీ చేసి ఇస్తుంది. ఇది కేవలం కటింగ్ మెషిన్ కాదు. స్కానింగ్, డిజైనింగ్, కటింగ్ అన్నీ కలిపిన ఒక క్రాఫ్ట్ మాస్టర్. ఇంట్లోనైనా, క్లాస్రూమ్లోనైనా ఒక్కసారి పెట్టి చూడండి. అప్పుడు చిన్న చేతులు పెద్ద ఆర్ట్ చేయడం చూస్తారు. ధర రూ. 22,000. -
త్వరలో 50 శాతం వైట్కాలర్ జాబ్స్ కనుమరుగు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొందరికి భవిష్యత్తుపై ఆశావహాన్ని పెంచితే ఇంకొందరి కొలువులకు ప్రమాదకరంగా పరిణమిస్తోంది. ముఖ్యంగా ఏఐ వల్ల వివిధ పరిశ్రమల్లోకి వైట్ కాలర్ ఉద్యోగాలు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో ఫైనాన్స్, లా, హెల్త్ కేర్, టెక్నాలజీ వంటి పరిశ్రమల్లో వైట్ కాలర్ ఉద్యోగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆక్రమించే అవకాశం ఉందని టెక్ లీడర్లు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో అమెరికాలోని వైట్ కాలర్ ఉద్యోగాల్లో 50 శాతం కృత్రిమ మేధతో భర్తీ అవతాయని ఫోర్డ్ మోటార్ సీఈఓ జిమ్ ఫార్లే తెలిపారు.ఆస్పెన్ ఐడియాస్ ఫెస్టివల్ కార్యక్రమంలో రచయిత వాల్టర్ ఐజాక్సన్తో ఫార్లే మాట్లాడుతూ..‘కృత్రిమ మేధ అమెరికాలోని వైట్ కాలర్ కార్మికుల్లో సగం మందిని భర్తీ చేయబోతోంది. భవిష్యత్తులో కృత్రిమ మేధ కేవలం ఉత్పాదకతను పెంపొందించే సాధనంగా మాత్రమే ఉండబోదు. పరిపాలనా, నిర్వహణ, సాంకేతిక ఉద్యోగాల్లో సిబ్బంది సంఖ్యను గణనీయంగా తగ్గిస్తుంది’ అన్నారు.ఇదీ చదవండి: లేదని బాధపడకు.. వశం చేసుకోవాలని ఆరాటపడు!అంతకుముందు మే నెలలో జేపీ మోర్గాన్ ఛేజ్లో కన్జ్యూమర్ అండ్ కమ్యూనిటీ బ్యాంకింగ్ విభాగం అధిపతి మరియానే లేక్ ఇన్వెస్టర్లతో మాట్లాడుతూ.. ఏఐ ఇంటిగ్రేషన్ కారణంగా కార్యకలాపాల హెడ్ కౌంట్ను 10 శాతం తగ్గించాలని బ్యాంక్ భావిస్తోందని చెప్పారు. అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ కూడా భవిష్యత్తులో కార్పొరేట్ శ్రామిక శక్తి తగ్గిపోతుందని అంచనా వేశారు. -
అమెరికా సీఈవో ఫోరంపై నాస్కామ్ కసరత్తు
భారత్, అమెరికా టెక్ దిగ్గజాలు కలిసి పని చేసేలా ఓ వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ వెల్లడించింది. జూలై 9న అమెరికా న్యూయార్క్లోని భారత కాన్సులేట్ కార్యాలయంలో యూఎస్ సీఈవో ఫోరంను ప్రారంభించనున్నట్లు వివరించింది.కొత్త ఆవిష్కరణలు, పాలసీలు, నిపుణులను తయారు చేసుకోవడం వంటి అంశాలపై అత్యున్నత స్థాయి లో సంప్రదింపులు నిర్వహించేందుకు ఇది తోడ్పడుతుందని నాస్కామ్ పేర్కొంది. ప్రవాస భారతీయులు, ప్రభుత్వం, పరిశ్రమ, ఇన్వెస్ట్మెంట్, మేధావులు, విద్యావేత్తలు మొదలైన వర్గాలను సమన్వయపర్చడం ద్వారా భారత్–అమెరికా టెక్ భాగస్వామ్యాన్ని పటిష్టపర్చేందుకు సహాయకరంగా ఉంటుందని తెలిపింది.భారతీయ టెక్నాలజీ కంపెనీలు అమెరికా అంతటా డిజిటల్ పరివర్తనను శక్తివంతం చేయడమే కాకుండా, ఉద్యోగాలను సృష్టించడం, స్థానిక కమ్యూనిటీలలో పెట్టుబడులు పెట్టడం, నిజమైన ప్రభావాన్ని అందించే ఆవిష్కరణలను నడిపిస్తున్నాయని నాస్కామ్ అధ్యక్షుడు రాజేష్ నంబియార్ అన్నారు. కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ ఎస్, ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ సీఈఓ అమిత్ చద్దా, విప్రోలో అమెరికాస్ వన్ సీఈఓ మలయ్ జోషితో పాటు నంబియార్ ఈ ఫోరం ప్రారంభ సమావేశంలో పాల్గొంటారని నాస్కామ్ తెలిపింది. -
పెళ్లైన 18 ఏళ్ల నిరీక్షణకు తెర.. AIతో తల్లిదండ్రులు కాబోతున్న జంట!
వాషింగ్టన్: వైద్య చరిత్రలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) అద్భుతం చేసింది. పెళ్లైన 18 ఏళ్ల తర్వాత మహిళ గర్భం దాల్చేందుకు దారి చూపించింది. త్వరలో ఆమె అమ్మ కాబోతుంది. అంతేకాదు స్టార్ పద్ధతిలో గర్భం దాల్చిన ప్రపంచంలో తొలి మహిళగా చరిత్రలో నిలిచారు. ఇంతకీ ఆ ఎవరా? తల్లి.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మాత్రమే కాదు. మానవ జీవితాల్లో పెనుమార్పులు తెస్తున్న అద్భుత సాధనం. ఏఐతో ఉద్యోగాలకు ఎసరు అని అనుకునే వారికంటే దాని వల్ల మా జీవితాలే మారిపోయాయని సంతోషపడే వారు కోకొల్లలు. అలాంటి వారిలో ఈ మహిళ ఒకరు. వ్యక్తిగత భద్రత దృష్ట్యా ఆమె పేరు బహిర్గతం చేయలేదు.వివరాల్లోకి వెళితే.. వాళ్లిద్దరూ భార్య,భర్తలు. వివాహం జరిగి 18 ఏళ్లవుతుంది. సంతనాలేమి సమస్యతో బాధపడుతున్నారు. సంతానం కోసం ఎక్కని గుడి లేదు. మొక్కని దేవుడు లేడు. సంతానం కోసం ఎన్ని ప్రయత్నాలో చేయాలో అన్నీ చేశారు. గతంలో అనేక సార్లు ఐవీఎఫ్ (In Vitro Fertilization) ద్వారా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం విఫలమైంది. కారణం? ఆమె భర్త అజోస్పెర్మియా అనే అరుదైన సమస్యతో బాధపడుతున్నారు. అంటే వీర్యంలో స్పెర్మ్ కనిపించకపోవడం అన్నమాట.అయితే, ఈ నేపథ్యంలో ఆ దంపతులు కొలంబియా యూనివర్సిటీ ఫెర్టిలిటీ సెంటర్ను ఆశ్రయించారు. అక్కడ స్టార్(Sperm Tracking and Recovery) అనే ఏఐ ఆధారిత పద్ధతిని ఉపయోగించారు.ఈ పద్దతిలో ఏఐ గంటలో 8 మిలియన్లకు పైగా చిత్రాలను స్కాన్ చేసి, మానవ కంటికి కనిపించని 44 స్పెర్మ్లు గుర్తించింది.అలా గుర్తించిన స్పెర్మ్లను ఉపయోగించి ఐవీఎఫ్ ద్వారా గర్భధారణ జరిపారు. ఈ స్టార్ పద్ధతిలో గర్భం దాల్చిన ప్రపంచంలో తొలి మహిళగా ఆమె చరిత్రలో నిలవడం గమనార్హం. ఏఐ ఎలా పనిచేస్తుంది?వైద్యులు స్పెర్మ్ నమూనాను ఒక ప్రత్యేక చిప్పై ఉంచి హై-పవర్డ్ ఇమేజింగ్ ద్వారా స్కాన్ చేస్తారు. ఏఐ అల్గోరిథం స్పెర్మ్ ఆకారాన్ని, కదలికలను గుర్తించి వాటిని వేరు చేస్తుంది. ఇది సూక్ష్మతతో కూడిన, వేగవంతమైన ప్రక్రియ, మానవ నిపుణులు రెండు రోజులు వెతికినా కనిపించని స్పెర్మ్లను ఏఐ ఒక గంటలో కనిపెట్టగలిగింది.వైద్య చరిత్రలో గేమ్ చేంజర్ఈ స్టార్ టెక్నాలజీని అభివృద్ధి చేసిన డాక్టర్ జెవ్ విలియమ్స్ మాట్లాడుతూ..‘ఇది గేమ్ చేంజర్. అమ్మ తనాన్ని నోచుకోలేక ఇబ్బందులు పడుతున్న ఎంతో మంది తల్లులకు ఈ ఏఐ టెక్నాలజీ ఓ వరం’ అని అన్నారు.కాగా, ప్రస్తుతం ఈ విధానం అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది, కానీ భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందని టెక్నాలజీ నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. ఇలా ఏఐ కేవలం యంత్రాల మేధస్సు కాదు, అది మనిషి ఆశలకు రూపం కూడా కావచ్చనే నానుడిని నిజం చేసింది. -
‘జియో డేటా సెంటర్లలో వాడే జీపీయూలు మావే’
ఇంజినీరింగ్ కోణంలో భారత్ తమకు అత్యంత కీలకమైన మార్కెట్గా ఉంటోందని ఏఎండీ జనరల్ మేనేజర్ (డేటా సెంటర్ జీపీయూ వ్యాపార విభాగం) ఆండ్రూ డీక్మాన్ తెలిపారు. టెల్కో దిగ్గజం రిలయన్స్ జియో తదితర సంస్థలు తమ డేటా సెంటర్లలో గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లను (జీపీయూ) ఉపయోగిస్తున్నట్లు వివరించారు. భారత్లో జియో తమకు ముఖ్యమైన భాగస్వామి అని కంపెనీ నిర్వహించిన అడ్వాన్సింగ్ ఏఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు.దేశీయంగా ఏఐ మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏఎండీ పోటీ సంస్థ ఎన్విడియాతో జియో జట్టు కట్టిన నేపథ్యంలో ఆండ్రూ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఏఎండీకి భారత్లో 8,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. ఏఐ చాలా పెద్ద మార్కెట్ అని, ఏ ఒక్క సంస్థకో ఇది పరిమితం కాదని ఆండ్రూ చెప్పారు. ఇదీ చదవండి: ఏటా ఒక ఎలక్ట్రిక్ బైక్ లాంచ్కు ప్రణాళికలుప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 దేశాల ప్రభుత్వాలకు ఏఐపరంగా తోడ్పాటు అందించడంపై ఏఎండీ కలిసి పని చేస్తోందని ఆయన పేర్కొన్నారు. పోటీ సంస్థలతో పోలిస్తే తమ చిప్లు తక్కువ ధరలో మరింత మెరుగైన పనితీరు కనపరుస్తున్నాయని కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఏఎండీ సీఈవో లీసా సూ చెప్పారు. -
పుట్టకతో చెవిటివారా? ‘ఫర్వాలేదు శబ్దాలు వినవచ్చు’
పుట్టకతోనే చెవిటివారా లేదా చెవిలో మిషన్ పెట్టనిదే బయట శబ్దాలు వినిపించట్లేదా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే.. పుట్టకతోనే ఎవరైనా పూర్తిగా చెవిటివారుగా ఉన్న సందర్భాల్లోనూ వినికిడిని పొందేందుకు న్యూరాలింక్ బ్రెయిన్ చిప్ సహాయపడుతుందని ఆ కంపెనీ చీఫ్ ఎలాన్ మస్క్ తెలిపారు. వినికిడి లోపం గురించి యూజర్లను హెచ్చరించిన ఎక్స్లోని ఒక పోస్ట్కు ప్రతిస్పందనగా మస్క్ ఈమేరకు వివరాలు వెల్లడించారు.కెర్నల్ కంపెనీ సీఈఓ బ్రెయిన్ జాన్సన్ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెడుతూ..‘మీ చెవులను సంరక్షించుకోండి. వినికిడి కోల్పేతే ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రస్తుతం చికిత్సలు అందుబాటులో లేవు. డెమెన్షియా వల్ల వినికిడి కోల్పోయే ప్రమాదం 5 రెట్లు ఉంటుంది. 30–40% మెదడుపై ప్రభావం పడుతుంది. ఒకసారి చెవి లోపలి కణాలు పాడైతే సహజ వినికిడిని పునరుద్ధరించలేం. కాబట్టి మీ చెవులకు గరిష్టంగా 80 డెసిబుల్స్ మించి శబ్దాలను దరిచేరకుండా జాగ్రత్తపడండి. శబ్దాలను కొలిచే యాప్లో ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి’ అన్నారు.దీనికి ప్రతిస్పందనగా మస్క్..‘వినికిడిని పునరుద్ధరించడానికి న్యూరాలింక్ ద్వారా ఒక స్పష్టమైన మార్గం సూచిస్తుంది. పుట్టినప్పటి నుంచి పూర్తిగా వినికిడి లేనివారికి కూడా వినికిడి వచ్చేలా చేయవచ్చు. ఎందుకంటే న్యూరాలింక్ పరికరం ధ్వనిని ప్రాసెస్ చేసే మెదడులోని న్యూరాన్లను యాక్టివేట్ చేస్తుంది’ అని చెప్పారు.There is a clear path to restoring hearing with a @Neuralink, even for someone who has had total loss of hearing since birth, as our device directly activates the neurons in the brain that process sound https://t.co/h5CeELct5m— Elon Musk (@elonmusk) June 28, 2025ఇదీ చదవండి: ‘యాపిల్ రహస్యాలు దొంగతనం’ఇదిలాఉండగా, ఎలాన్ మస్క్కు చెందిన బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్ న్యూరాలింక్ పక్షవాత బాధితుల కోసం రూపొందించిన ఇంప్లాంట్ ఇప్పటికే రెండో ట్రయల్ విజయవంతమైంది. అలెక్స్ అనే వ్యక్తికి అమర్చిన రెండో ఇంప్లాంట్ బాగా పని చేస్తోందని కంపెనీ గతంలో తెలిపింది. -
‘యాపిల్ రహస్యాలు దొంగతనం’
యాపిల్ ప్రతిష్టాత్మకంగా తయారు చేస్తున్న విజన్ ప్రో మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్కు సంబంధించిన రహస్య సమాచారాన్ని దొంగిలించాడని ఆరోపిస్తూ మాజీ సీనియర్ డిజైన్ ఇంజినీర్ డి లియుపై కంపెనీ దావా వేసింది. యాపిల్ నుంచి వెళ్లిపోయే చివరి రోజుల్లో లియు ప్రాజెక్ట్కు సంబంధించిన సున్నితమైన ఫైళ్లను డౌన్లోడ్ చేశాడని, ఇంకా లాంచ్ అవ్వని డివైజ్కు సంబంధించిన రహస్యాలను ఇతర కంపెనీకి చేరవేసి అందులో ఉద్యోగం సంపాదించేందుకు ప్రయత్నించాడని యాపిల్ ఆరోపించింది.కాలిఫోర్నియాలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో దాఖలు చేసిన దావా ప్రకారం.. ఐఫోన్ తరువాత యాపిల్ తన అత్యంత ముఖ్యమైన హార్డ్వేర్ లాంచ్గా విజన్ ప్రోను పరిగణిస్తుంది. ఈ ప్రాజెక్ట్లో సీనియర్ డిజైన్ ఇంజినీర్గా పనిచేస్తున్న లియు.. సున్నితమైన వివరాలను అనధికారికంగా కాపీ చేయడానికి, ఇతరులకు బదిలీ చేసేందుకు అంతర్గత డేటాను ఉపయోగించాడు. విజన్ ప్రో డిజైన్, ఫంక్షనాలిటీకి సంబంధించిన రహస్య పత్రాలను లియు పెద్ద మొత్తంలో డౌన్లోడ్ చేశాడు. కంపెనీ వీడిన తర్వాత లియు స్నాప్ ఇంక్లో చేరుతున్నట్లు తెలిసింది. ఈ రహస్య వివరాలు ఉపయోగించి తాను ఆ కంపెనీలో ఉద్యోగం సంపాదించాలనుకుంటున్నాడని ఆరోపించింది.పోటీకి భంగం..యాపిల్ విజన్ ప్రో డివైజ్ మార్కెట్లో ఇంకా విడుదల అవ్వలేదు. లియు చర్యలు యాపిల్ మేధో సంపత్తి భద్రతను దెబ్బతీయడమే కాకుండా వేగంగా అభివృద్ధి చెందుతున్న మిక్స్డ్ రియాలిటీ విభాగంలో కంపెనీ పోటీకి ముప్పుగా పరిణమించిందని యాపిల్ న్యాయ బృందం వాదిస్తోంది. మెటా, మైక్రోసాఫ్ట్, ఇతర టెక్ దిగ్గజాల నుంచి ఇలాంటి ఫీచర్లతో కొత్త ప్రోడక్ట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీలో యాపిల్ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ల్లో విజన్ప్రో కీలకంగా ఉందని తెలిపింది.ఎలాంటి న్యాయపరమైన విచారణకైనా సిద్ధంయాపిల్ దావాపై స్నాప్ ఇంక్ ఒక ప్రకటనలో స్పందిస్తూ.. లియు కంపెనీలో చేసిన తప్పుల గురించి తమకు తెలియదని పేర్కొంది. ఆయన నియామకానికి ముందు ఈ ఆరోపణల గురించి సమాచారం లేదని తెలిపింది. ఇలాంటి విషయాలను తీవ్రంగా పరిగణిస్తామని స్నాప్ ఇంక్ ప్రతినిధి ఒకరు చెప్పారు. దీనిపై ఎలాంటి న్యాయపరమైన విచారణకైనా పూర్తిగా సహకరిస్తామన్నారు.ఇదీ చదవండి: ఇదీ చదవండి: ‘ప్రభుత్వ నియమాలకు దండం.. కారు చౌకగా అమ్ముతున్నా!’ఏదేమైనా, కీలక హోదాల్లో సున్నితమైన పాత్రల్లో ఉన్న ఉద్యోగులు ఇతర కంపెనీలకు మారినప్పుడు, ముఖ్యంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగంలో యాజమాన్య డేటాను సులభంగా చేరవేసే అవకాశం ఉందనే దానిపై ఈ కేసు ఆందోళనలను లేవనెత్తుతుంది. -
‘మానవుల మాదిరిగా వాస్తవాలు తెలుసుకోదు’
చాట్జీపీటీ యూజర్లు పాపులర్ ఏఐ చాట్బాట్ను గుడ్డిగా నమ్మకూడదని ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ కోరారు. ఓపెన్ఏఐ అధికారిక పాడ్కాస్ట్ మొదటి ఎపిసోడ్లో ఆయన మాట్లాడారు. చాట్జీపీటీ ఒక టెక్నాలజీ అని.. ఆశ్చర్యకరంగా దాన్ని చాలామంది వినియోగదారులు అమితంగా విశ్వసిస్తున్నారని చెప్పారు. చాట్జీపీటీలో నిర్దిష్ట పరిమితులున్నాయని తెలిపారు. అందుకే దీనిపై ప్రజలకు చాలా నమ్మకం ఉందన్నారు. కానీ ఏఐ చాట్బాట్ను వినియోగదారులు గుడ్డిగా నమ్మకూడదని పేర్కొన్నారు.‘చాట్జీపీటీని వినియోగదారులు సహేతుకమైన సందేహాలు అడగాలి. అడ్డదిడ్డ ప్రశ్నలడిగితే సమాధానాలు భిన్నంగా ఉండవచ్చు. చాట్జీపీటీపై ప్రజలకు చాలా నమ్మకం ఉంది. ఏఐ కొన్నిసార్లు భ్రాంతులు(Hallucination) కలిగిస్తుంది. ఏఐ చాట్బాట్ నమ్మదగిన, కల్పిత సమాచారాన్ని సృష్టించగలదు. ఎల్ఎల్ఎంలోని డేటా నమూనాల ఆధారంగా ఏఐ టెక్ట్స్ను అంచనా వేస్తుంది. ఇది మానవుల మాదిరిగా వాస్తవాలను తెలుసుకోదు. ఏఐ టూల్స్పై ఆధారపడటం ఎక్కువవుతోంది. పిల్లల పెంపకం కోసం సలహా అడగడం దగ్గర నుంచి ఇన్నోవేషన్ పరిశోధన వరకు ప్రతిదానికీ చాట్జీపీటీని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అయినప్పటికీ యూజర్లు కీలకమైన సమాచారాన్ని స్వతంత్రంగా ధ్రువీకరించుకోవాలి’ అని ఆల్ట్మన్ నొక్కి చెప్పారు.ఇదీ చదవండి: మస్క్ కంపెనీలో ఉద్యోగం కావాలా?సరి చూసుకోవాల్సిందే..కీలక విషయాలకు సంబంధించిన ఏఐ సమాచారాన్ని ధ్రువీకరించుకునేందుకు టెక్ నిపుణులు కొన్ని మార్గాలను సూచిస్తున్నారు. వారి వివరాల ప్రకారం.. ఏఐ సమాచారాన్ని విశ్వసనీయ వార్తా సంస్థలు, ప్రభుత్వ పోర్టల్స్ లేదా అకడమిక్ సైట్లలో(ఉదా., .gov, .edu, లేదా పీర్-రివ్యూడ్ జర్నల్స్) సరిచూసుకోవాలి. ఏఐ సమాచారం ఇతర విశ్వసనీయ సైట్ల్లో ఒకేలా ఉంటే కొంతవరకు ఏకాభిప్రాయానికి రావొచ్చు. ఏఐ చాలాసార్లు పాత డేటాను క్రీడికరిస్తుంది. లేటెస్ట్ వివరాలను సరిచేసుఏకోవాలి. ఏఐ వివరాలు వినియోగదారుల క్రిటికల్ థింకింగ్కు పొంతనలేకుండా అనిపిస్తే వెంటనే అధికారికంగా ధ్రువీకరించుకోవాలి. -
11 మంది టాప్ ఎక్స్పర్ట్లతో మెటా కొత్త ల్యాబ్
ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటలిజెన్స్(ఏజీఐ)ను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్(ఎంఎస్ఎల్) అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ప్రకటించారు. ఈ విభాగంలో పనిచేసే మెటా ఏఐ మోడల్, ఉత్పత్తి బృందాలు ఫండమెంటల్ ఏఐ రీసెర్చ్(ఫెయిర్)ను అభివృద్ధి చేస్తాయని చెప్పారు. ఎంఎస్ఎల్ కింద కొత్త ల్యాబ్ తదుపరి తరం లార్జ్ ల్యాంగ్వేజ్ మోడళ్ల (ఎల్ఎల్ఎం) నిర్మాణంపై దృష్టి పెడుతుందని తెలిపారు.డేటా లేబులింగ్ స్టార్టప్ స్కేల్ ఏఐ మాజీ సీఈఓ అలెగ్జాండర్ వాంగ్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్నారు. ఈ విభాగానికి చీఫ్ ఏఐ ఆఫీసర్గా వాంగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. బ్లూమ్బర్గ్లోని వివరాల ప్రకారం.. ఉద్యోగులకు పంపిన మెమోలో జుకర్బర్గ్ వాంగ్ను ‘ఈ తరం అత్యంత ఆకట్టుకునే వ్యవస్థాపకుడు’ అని అభివర్ణించారు. వాంగ్తోపాటు గిట్ హబ్ మాజీ సీఈఓ నాట్ ఫ్రీడ్ మన్ కూడా ఈ బృందంలో చేరనున్నారు. కృత్రిమ మేధ ఉత్పత్తులను అభివృద్ధి చేయడం, అనువర్తిత పరిశోధనలపై ఫ్రీడ్ మన్ దృష్టి సారించనున్నారు.అగ్రశ్రేణి పరిశోధకులుబ్లూమ్బర్గ్ నివేదిక ప్రకారం, మెటా తన ప్రత్యర్థుల నుంచి 11 మంది అగ్రశ్రేణి ఏఐ పరిశోధకులను నియమించుకుంది. ఎంఎస్ఎల్ కోసం మెటాలో చేరినవారి వివరాలను వైర్డ్ తెలిపింది. ఇందులో ఓపెన్ ఏఐ ఓ-సిరీస్ మోడళ్ల సృష్టికర్త ట్రాపిట్ బన్సాల్, జీపీటీ-4 ఓ వాయిస్, మల్టీమోడల్ పోస్ట్ ట్రైనింగ్లో పాల్గొన్న షుచావో బీ, గూగుల్ రీసెర్చ్లో ఇమేజ్ జనరేషన్ టూల్స్ అభివృద్ధి చేయడంలో ప్రసిద్ధి చెందిన హుయ్వెన్ చాంగ్, జీపీటీ-4 మోడల్స్, రీజనింగ్ సిస్టమ్లకు కంట్రిబ్యూటర్ అయిన జీ లిన్ ఉన్నారు. గూగుల్ నుంచి జాక్ రే, జోహాన్ షాల్క్విక్, పీ సన్, ఓపెన్ఏఐకి చెందిన హాంగ్యు రెన్, జియాహుయి యు, షెంగ్జియా ఝావో.. వంటి ప్రముఖులున్నారు.ఇదీ చదవండి: టెస్లా షేర్లు భారీగా కుదేలుభారీ ప్యాకేజీలు..గూగుల్, ఎక్స్, మెటా, ఓపెన్ఏఐ.. వంటి ప్రధాన కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐ మోడళ్లను సృష్టిస్తున్నాయి. ఈ సంస్థల మధ్య పోటీ తీవ్రతరం అవుతుంది. దాంతో తోటివారికంటే ఓ అడుగు ముందుడాలనే భావనతో కంపెనీ ఏఐ నైపుణ్యాలున్నవారికి భారీ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. కృత్రిమ మేధస్సుపై ఆధిపత్యం చెలాయించే రేసులో భాగంగా మెటా కీలక ప్రచారం ప్రారంభించినట్లు ఇటీవల కొన్ని సంస్థలు తెలుపుతున్నాయి. ఈ విభాగంలో అగ్రశ్రేణి ఏఐ ప్రతిభావంతులను ఆకర్షించేందుకు భారీ ప్యాకేజీ ప్రకటిస్తున్నట్లు తెలుస్తుంది. మెరుగైన ఏఐ నైపుణ్యాలున్న ఎక్స్పర్ట్లకు 100 మిలియన్ డాలర్ల (రూ.860 కోట్లు) ప్యాకేజీ చెల్లించేందుకు కూడా వెనుకాడడం లేదని సమాచారం. -
ఇలా చేస్తే... వేగంగా వైఫై సిగ్నల్స్!
ఇంట్లో వైఫై సిగ్నల్స్ సరిగ్గా లేవా? ఒకరిద్దరు మాత్రమే వాడుతున్నా ఇంటర్నెట్ స్లో అవుతోందా? అయితే మీ వైఫై రూటర్ ఎక్కడ పెట్టారో ఒకసారి చూసుకోండి. సరైన ప్రాంతంలో లేకపోతేనే ఈ సమస్యలన్నీ వస్తాయి మీకు! మరి.. ఇంట్లో వైఫై రూటర్ ఉంచేందుకు బెస్ట్ ప్లేస్ ఏంటి?ఇంటర్నెట్ వాడకం బాగా పెరుగుతున్న ఈ కాలంలో చాలా ఇళ్లల్లోకి వైఫై రూటర్లు వచ్చేశాయి. అయితే ఎక్కువమంది వీటిని ఎవరికీ కనిపించని చోట ఉంచేస్తూంటారు. కొందరు పుస్తకాల అలమారాలో లేదంటే టేబుళ్ల కింద కుక్కేస్తూంటారు. దీనివల్ల వాటి నుంచి వెలువడే రేడియో సిగ్నల్స్ మన సెల్ఫోన్లు, ల్యాప్టాప్లు, ఫైర్ స్టిక్స్ వంటివాటికి సరిగ్గా సంకేతాలు పంపలేదు. రేడియో సిగ్నల్స్ ఓపెన్ స్పేసెస్లో బాగా ప్రయాణిస్తాయన్న విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి మనం. అడ్డంకులు ఎన్ని ఎక్కువ ఉంటే.. వాటి శక్తి అంత తగ్గిపోతూంటుందన్నమాట. దీంతో ఇంటర్నెట్ వేగమూ మందగిస్తుంది.వైఫై రూటర్ను నేలపై ఉంచడం కూడా సరికాదు. సిగ్నల్ స్ట్రెంగ్త్ గరిష్టంగా ఉండదు. శక్తిమంతమైన రేడియో తరంగాలు ఎక్కువగా కిందివైపు ప్రయాణిస్తూంటాయి. నేలపై ఉంచితే సిగ్నల్స్ కాస్తా నేలల్లోకి వెళ్లిపోతాయన్నమాట. ఇలా కాకుండా..ఎత్తుగా ఉన్న చోట్ల ఉంచడం మేలు.కుర్చీలు, టేబుళ్ల వెనుక ఉంచినా చిక్కే. గోడలున్నా సిగ్నల్స్ సులువుగా ప్రయాణించలేవు. ఇంకొంతమంది వైఫై రూటర్ను ఎవరికీ కనిపించకుండా ఉండాలని ఎక్కడో ఒక మూలన దాచేస్తూంటారు. దీనివల్ల కూడా వైఫై సిగ్నల్స్ పూర్తిస్థాయిలో వాడుకోలేము.ఇంట్లో రెండు వైఫై రూటర్లు ఉండి.. వాటిని పక్కపక్కనే పెట్టారనుకోండి. నెట్ వేగం పడిపోయేందుకే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే వైఫై అనేది నిర్దిష్ట స్పెక్ట్రమ్లో రేడియో తరంగాలను ప్రసారం చేస్తూంటుంది. రెండూ ఒకే స్పెక్ట్రమ్లో ప్రసారం చేస్తూంటే... ఒకదాని సిగ్నల్ ఇంకోదానితో ఇబ్బందిపడటం ఖాయం. ఏతావాతా.. ఇంట్లో వైఫై సిగ్నల్స్ బాగా ఉండాలంటే... పూర్తి సామర్థ్యం మేరకు వాడుకోవాలంటే రూటర్లను అందరికీ కనిపించేలా ఏదైనా ఎత్తైన టేబుల్ లేదా షెల్ఫ్లో ఉంచడం మేలు. వీలైనంత వరకూ వైఫైకి అడ్డుగా ఏ వస్తువు పెట్టకూడదు. గోడలకు లేదా మందంగా ఉండే ఫర్నీచర్కు ఒకట్రెండు అడుగుల దూరంలో ఉంచడం అవసరం. -
BSNL ఫ్లాష్ ఆఫర్.. మరికొన్ని గంటలే అవకాశం
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ క్వాంటమ్ 5జీ నెట్వర్క్ కింద వాణిజ్య 5జీ సేవలను త్వరలో ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. టవర్లను ఏర్పాటు చేయడం ద్వారా సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ఇవి తాజాగా 90,000 లను దాటాయి. ఈ మైలురాయిని పురస్కరించుకుని బీఎస్ఎన్ఎల్ తమ వినియోగదారుల కోసం పరిమిత కాల ప్రమోషనల్ "ఫ్లాష్ సేల్"ను ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్ "ఫ్లాష్ సేల్"లో భాగంగా 400 జీబీ హైస్పీడ్ 4జీ డేటాను రూ.400లకే అందిస్తోంది. అంటే ఒక జీబీకి ఒక రూపాయి మాత్రమే అన్నమాట. దీనికి 40 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. రూ.400 ప్రత్యేక డేటా రీఛార్జ్ ప్యాక్ జూన్ 28 నుంచి అందుబాటులోకి వచ్చింది. జూలై 1 వరకు కొనసాగుతుంది. ఇది డేటా రీచార్జ్ కాబట్టి యూజర్లు ఇప్పటికే ఉన్న ప్లాన్తో కలిపి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కాలింగ్ లేదా ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. కేవలం 400 జీబీ డేటా మాత్రమే లభిస్తుందని, 400 జీబీ తర్వాత స్పీడ్ 40 కేబీపీఎస్కు తగ్గుతుందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.BSNL celebrates the milestone of 90,000 towers with a limited-time Flash Sale.Get 400GB for just ₹400, with 40 days validity.Tomorrow is the last day to benefit from this offer.Experience trusted, nationwide connectivity with BSNL.Recharge Now - https://t.co/yDeFrwK5vt… pic.twitter.com/lz7Kv4iKlm— BSNL India (@BSNLCorporate) June 30, 2025 -
అదిరే గ్యాడ్జెట్స్.. హోమ్ హ్యాపీస్
ఇప్పుడు ఇంట్లో పని గట్టిగా కాదు, గాడ్జెట్స్తో స్మార్ట్గా చేయండి. ఎందుకంటే పని తగ్గించి, సమయాన్ని ఆదా చేసి, సంతోషాన్ని ఇచ్చే కొన్ని హౌస్ గాడ్జెట్లు ఇవిగో మీ కోసం!ఈగలకు నో ఎంట్రీకిటికీ తీయగానే, ఈగలు వచ్చి చుట్టూ తిరగడం కామన్! అలాగని, అవి చెవి దగ్గరకు వచ్చి ‘జూయ్.. జూయ్.. ’ రాగాలు వినిపిస్తూ విసిగిస్తుంటే, చేతికి గాజు వేసుకోండి. అవును, ఈ గాజు పేరు ‘వ్రోక్సీ’ ఇది చూడటానికి గాజులాగే ఉంటుంది కాని, దీని లోపల నేచురల్ ఆయిల్స్, ఇతర ఆయుర్వేద మూలికల వాసనలతో ఈగలకి నో ఎంట్రీ బోర్డు పెడుతుంది. సాఫ్ట్ సిలికాన్తో ఉంటుంది కాబట్టి చేతికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. రోజూ వాడేలా స్టయిలిష్గా, తేలికగా ఉంటుంది. ఇది ఇంట్లోకి, పిక్నిక్కి, క్యాంపింగ్కి బెస్ట్ ఆప్షన్. ధర రూ. 299 మాత్రమే!చేతులకు వెచ్చదనంచలికాలం వచ్చిందంటే మీ చేతులు జారిపోతున్నాయా? ఇంట్లో పని చెయ్యాలన్నా, మొబైల్ స్క్రోల్ చేయాలన్నా, చేతులు తిమ్మిరితో మొద్దుబారితే ఎలా? అప్పుడు వెంటనే మీకు కావాల్సింది మామూలు రూమ్ హీటర్ కాదు, ఈ ‘ఒకూపా హ్యాండ్ వార్మర్’. ఇది చిన్న లిప్స్టిక్ సైజులో ఉంటుంది. ఇందులో రెండు చేతులకూ సరిపోయేలా రెండు మినీ హ్యాండ్ వార్మర్లు మాగ్నెట్కు అంటిపెట్టుకొని ఉంటాయి. వేరుచేసి వాడితే, రెండు చేతులకు వెచ్చదనాన్ని ఇస్తాయి. రెండింటినీ కలిపి వాడితే, చిన్న రూమ్ హీటర్లాగా కూడా పనిచేస్తుంది. అదిరే కాంబో కదా! ఒక్కసారి చార్జ్చేస్తే దాదాపు ఆరుగంటల వరకు పనిచేస్తుంది. ధర రూ. 3,999.వెచ్చని కౌగిలి! ఇంటి పని అంతా ముగించుకుని కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకుంటే; వెన్నునొప్పులు, కాళ్ల నొప్పులు వెంటనే ‘‘హాయ్ సిస్టర్!’’ అని వచ్చేస్తాయి. నెలసరి సమయంలో ఇవి మరింత ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటప్పడే ఒక మంచి సహాయం మసాజ్తో కాదు, వెచ్చదనంతో కావాలి. ఆ వెచ్చదనం అందించే స్నేహితురాలే ఈ ‘హగ్బ్యాగ్’! ఇది కేవలం బొమ్మ కాదు. ఇది ఓ చిట్టి డాక్టర్ లాంటిది. క్యూట్ టాయ్లా కనిపిస్తుంది కాని, లోపల మాత్రం వాటర్ బాటిల్తో ఉంటుంది. అందులో వేడి నీళ్లు పోసి, వెచ్చని చికిత్సను ఇంట్లోనే పొందొచ్చు. వంటింట్లో గంటల పాటు నిలబడి పని చేసిన తర్వాత ఇది పట్టుకొని పడుకోండి, గట్టిగా నిద్ర పడుతుంది. నెలసరి నొప్పుల నుంచి ఇది చక్కని ఉపశమనం కూడా ఇస్తుంది. ధర రూ.799 మాత్రమే!మీ మాటే తనకు శాసనం!చెప్పిందే పది సార్లు చెప్పినా కూడా టీవీలో మునిగిపోయిన భర్త వినడు, గేమ్స్లో లీనమైపోయిన పిల్లలు వినరు. ఇక అత్త మామలకైతే వాట్సాప్లో మెసేజ్ చేసినా, బ్లూటిక్ పడటానికి పదిరోజులు పడుతుంది. ఇలా ఇంట్లో ఎవరూ మీ మాట వినకపోయినా! ఈ ‘అలెక్సా ఎకో పాప్’ మాత్రం మీ మాటే శాసనంగా పాటిస్తుంది. ఎందుకంటే, ఇది అలెక్సా సరికొత్త, స్మార్ట్ మోడల్. మీకు టైమింగ్ గుర్తు చేస్తుంది, పాటలు పాడుతుంది, టీవీ, లైట్లు ఆన్, ఆఫ్ చేస్తుంది. అలాగే, లేటెస్ట్ షాపింగ్కు కావాల్సిన డిస్కౌంట్ ఆఫర్లు కూడా చెబుతుంది. ఇది మీ ఇంట్లో ఉండాలంటే, పెద్ద కారణాలు అవసరం లేదు. కాని, ఇది ఉంటే మాత్రం మీ పనులు చకచకా చిటికెలో జరిగిపోతాయి. ఇకపై ‘మా ఇంట్లో ఎవరూ నా మాట వినరు’ అనే ఫీలింగ్ కూడా ఉండదు. ధర రూ. 4,499. -
తీవ్ర వ్యసనం
మొన్నటి మేలో కర్నాటకలోని ఉడిపిలో ఒక సంఘటన జరిగింది. రోడ్డు మీద తిరుగుతున్న ఒక పిచ్చివాణ్ణి ఒక స్వచ్ఛంద సంస్థ కార్యకర్త సంరక్షించి, వైద్యం చేయించి, తిరిగి మామూలు మనిషిని చేశాడు. మెల్లగా ఆ కోలుకున్న వ్యక్తి తమిళుడని, సొంత ఊరు కుంభకోణం అని తెలిసింది. అతని మనుషులు వెతుక్కుంటూ వచ్చారు. ‘ఇతను ఆరునెలలుగా కనిపించకుండా పోయాడు. దానికి ముందు ఫోన్లో రీల్స్ చూస్తూ కుటుంబంతో మాట్లాడక, స్నానం చేయక, తిండి తినక అదే లోకంగా ఉండేవాడు. ఆ తర్వాత ఈ స్థితిలో దొరికాడు’ అని చెప్పి తీసుకెళ్లారు. రీల్స్ను వరుసపెట్టి చూడటానికి ‘డూమ్ స్క్రోలింగ్’ అంటున్నారు నిపుణులు. రీల్స్ మనిషి మెదడును ఏ విధంగా ఆక్రమించగలదో ఇదొక ఉదాహరణ.ఇటీవలే గుజరాత్లోని వడోదరలో మరో ఘటన జరిగింది. అక్కడి ఒక కొడుకు తన భార్యతో కలిసి పోలీసుల సహాయం కోరుతూ ఫోన్ చేశాడు. దానికి కారణం ఆ ఇంట్లోని తల్లి రీల్స్లో పడి తిండి తినడం మానేసింది. కొడుకు, కోడలు డ్యూటీకి వెళుతుంటే ఆమెకు బోర్ కొట్టి రీల్స్ చూడటానికి అలవాటు పడిందట. ఆ రీల్స్లో కూడా ఒక ఇన్ఫ్లూయెన్సర్ పెట్టే రీల్స్ చూస్తుందట. వాటికింద కామెంట్స్ పెడుతుందట. ఆ కామెంట్స్కు ఆ ఇన్ఫ్లూయెన్సర్ రియాక్ట్ అయితే ఆమెకు సంతోషం. లేదంటే అప్సెట్ అయ్యి అన్నం తినదు. కొడుకు కోడలు ఆమె ఫోన్ నుంచి ఇన్స్టా యాప్ను తొలగించారు. దాంతో ఇంకా పెద్ద గొడవ జరిగి, ఆమె అన్నం తినడం మానేసింది. దాంతో ఇప్పుడా కొడుకు, కోడలు తల పట్టుకుని కూచుని ఉన్నారు.అసలు రీల్స్ అంటే ఏమిటి? కొన్ని సెకన్ల విన్యాసం. 2020లో మన దేశంలో టిక్టాక్ను నిషేధించాక, ఇన్స్టాగ్రామ్ రీల్స్ పేరుతో 90 సెకన్ల నుంచి 3 నిమిషాల వీడియోస్ను ప్రవేశ పెట్టింది. వీటిద్వారా గుర్తింపు, పేరు, ఫాలోయెర్సు తద్వారా డబ్బు... ఇవన్నీ వచ్చేసరికి కేవలం రీల్స్ మీద ఆధారపడినవారు కోకొల్లలుగా పెరిగారు. వీరు రకరకాల విన్యాసాలతో నిత్యం వేలకొద్దీ రీల్స్ వదులుతుంటారు. అవి చూడటానికి ఎవరికైనా, ఎన్ని సంవత్సరాలైనా సరిపోవు. ఆ సంగతి గ్రహించి ఎప్పుడైనా సరదాగా చూసి ఫోన్ కట్టేయాలి తప్పితే వాటిలోనే కూరుకుపోతే మెదడు ఆ రీల్స్కు బానిసవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.చేయి విరగ్గొట్టుకున్న అమ్మాయిఅహ్మదాబాద్లో నర్సింగ్ కోర్సులో చేరిన ఒక అమ్మాయి హాస్టల్లో బోరు కొడుతున్నదని రీల్స్ చూడటానికి అలవాటు పడింది. పరీక్షలు వచ్చాయి. రీల్స్ చూడాలంటే పరీక్షలు రాయకూడదని ఆ అమ్మాయి తన కుడి చేతిని బల్ల మీద పదేపదే బాది విరగ్గొట్టుకుంది. ఇలా ఉంటాయి రీల్స్ ఉత్పాతాలు.బి.పి. పెరుగుతుందిచైనాలోని హైబె మెడికల్ యూనివర్సిటీ చేసిన అధ్యయనం ప్రకారం రీల్స్ వల్ల 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్నవారిలో బి.పి. పెరుగుతుందని నిరూపణ అయ్యింది. రీల్స్లోని కంటెంట్ ఒక్కోసారి ఎక్కువగా, మరోసారి తక్కువగా కొనసాగుతూ మూడ్స్ను హెచ్చుతగ్గులు తెచ్చిపెడుతుండటం వల్ల ఇలా జరుగుతుంది. రాత్రివేళ గంటలు గంటలు రీల్స్ చూస్తూ నిద్ర పాడుచేసుకుని ఉద్యోగాల్లో కునికిపాట్లు పడుతున్నవారు వేలమంది ఉన్నారు. ఇక దేహం కదల్చకుండా ఉండటం వల్ల వస్తున్న శారీరక సమస్యలు ఎన్నో.టీవీ నయంరీల్స్ చూడటం కన్నా టీవీ చూడటం నయం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే టీవీ చూస్తూ కనీసం ట్రెడ్మిల్ మీద వాకింగ్ చేయొచ్చు. లేదా పుస్తకాల ర్యాక్ సర్దుకోవచ్చు. లేదా బట్టలు మడతపెట్టడమో, కూరగాయలు తరగడమో... ఏదో ఒక పని టీవీ చూస్తూ చేయొచ్చు. రీల్స్ చూడాలంటే ఇలా చేయడానికి చేతులు ఖాళీ ఉండవు. ఒక చేతిలో ఫోన్ పట్టుకుని మరో చేత్తో స్క్రోలింగ్ చేస్తూ వెళ్లాలి. కాబట్టి శరీరం వేరే పని చేయలేదు.కాపురాలలో చిచ్చురీల్స్ చూడటం భార్యాభర్తల మధ్య చిచ్చు తెస్తోంది. నాలుగురోజుల క్రితం కర్నాటకలోని మంగళూరు సమీపంలో రీల్స్ చూస్తున్న భార్యను కట్టడి చేయలేక భర్త ఆమెను చంపేశాడు. ఉత్తర ప్రదేశ్లో ఒక భార్య రీల్స్ చూడనివ్వడం లేదని, గిన్నెలు తోమమంటున్నాడని భర్త మీద కేసుపెట్టింది. వీటన్నింటికి విరుగుడు ఆరోగ్యకరమైన వ్యాపకాల్లో ఉండటమే అంటున్నారు నిపుణులు. హస్తకళలు, పుస్తకాలు చదవడం, క్రీడలు వీటిలో సమయాన్ని వెచ్చించడం మేలంటున్నారు. ముఖ్యంగా పిల్లల్ని రీల్స్ బారిన పడకుండా చూడమంటున్నారు. -
సింపుల్ యాప్లు.. సీక్రెట్గా దోచేస్తున్నాయ్..
ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్లలో ఏవేవో పదుల సంఖ్యలో యాప్లు ఉంటున్నాయి. వివిధ అవసరాల నిమిత్తం వాటిని డౌన్లోడ్ చేసుకుంటున్నాం. అధికారిక గూగుల్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ డౌన్లోడ్ చేసుకుంటున్నాం ఇవేం హాని చేయవులే అనుకుంటున్నారా? హానిచేయనిదిగా కనిపించే యాప్ నిశ్శబ్దంగా మీ ఫొటోలను స్కాన్ చేస్తుంది. మీ డిజిటల్ లైఫ్కు సంబంధించిన ఆధారాల కోసం శోధిస్తుంది. ఆ యాప్ మీ మనీ వాలెట్లను టార్గెట్ చేస్తే.. ఇది ఇప్పటికే ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలోనూ సాధారణ సెక్యూరిటీ గేట్లను దాటింది. ఇది సుదూర ముప్పు కాదు. ఇది ప్రస్తుతం జరుగుతోంది.రిస్క్తో కూడుకున్న వ్యవహారంచాలా మంది అధికారిక ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసే యాప్లను నమ్ముతారు. ఎందుకంటే ప్రమాదకర యాప్లను ఇవి తొలగిస్తాయని చెబుతుంటాయి. కానీ స్పార్క్ కిట్టీ అనే కొత్త మాల్వేర్ స్ట్రెయిన్ ఈ తనిఖీలను అధిగమించగలిగింది. భద్రతా పరిశోధకులు దీనిని మొదట 2025 ప్రారంభంలో గుర్తించారు. అప్పటి నుండి ఇవి సాధారణంగా కనిపించే యాప్లుగా మారిపోయాయి. వీటిని గుర్తించకముందే కొంతమంది వేల సార్లు డౌన్ లోడ్ చేసుకున్నారు.ఏం చేయాలంటే..ఈ ట్రిక్ సింపుల్ కానీ ఎఫెక్టివ్ గా ఉంటుంది. మెసేజింగ్ లేదా క్రిప్టో ట్రాకింగ్ వంటి ఫీచర్లను అందించే యాప్లలో స్పార్క్ కిట్టీ దాగి ఉంది. ఇన్ స్టాల్ చేసిన తర్వాత, ఇది మీ ఫోటోలను యాక్సెస్ చేయడానికి అనుమతి అడుగుతుంది. చాలా మంది యూజర్లు దీని గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించరు. కానీ తెరవెనుక, మాల్వేర్ టెక్స్ట్ కోసం చిత్రాలను స్కాన్ చేయడానికి ఆప్టికల్ క్యారెక్టర్ గుర్తింపును ఉపయోగిస్తుంది.మీరు విశ్వసించే డెవలపర్ల నుంచి మాత్రమే యాప్లను డౌన్ లోడ్ చేయండి. ఇన్ స్టాల్ చేయడానికి ముందు యాప్ రివ్యూలు, వివరాలను తనిఖీ చేయండి. స్పష్టమైన కారణం లేకుండా మీ ఫోటోలు లేదా ఫైళ్లకు యాప్ యాక్సెస్ అడిగితే జాగ్రత్తగా ఉండండి. రికవరీ పదబంధాలు లేదా పాస్ వర్డ్ లను మీ ఫోటో గ్యాలరీలో ఎప్పుడూ స్టోర్ చేయవద్దు. సున్నితమైన డేటా కోసం ఎన్ క్రిప్టెడ్ స్టోరేజ్ లేదా పాస్ వర్డ్ మేనేజర్ ఉపయోగించండి. -
నెల రోజుల్లో 43 లక్షల కొత్త కనెక్షన్లు
దేశీయంగా మే నెలలో టెలికం యూజర్ల సంఖ్య స్వల్పంగా 43,58,231 మేర పెరిగి 120.7 కోట్లకు చేరింది. కొత్త యూజర్లలో సింహభాగం 99.84 శాతం వాటాను (43,51,294 కనెక్షన్లు) రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్ దక్కించుకున్నాయి. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 5జీ ఫిక్సిడ్ వైర్లెస్ యాక్సెస్ విభాగంలో రిలయన్స్ జియో యూజర్ల సంఖ్య నికరంగా 27 లక్షల కొత్త కస్టమర్లతో 47.24 కోట్లకు చేరింది. 40.92 శాతం మార్కెట్ వాటా ఉంది.ఇదీ చదవండి: ఐటీ అధికారులకు సీబీడీటీ సూచనభారతీ ఎయిర్టెల్ సబ్ర్స్కయిబర్స్ సంఖ్య నికరంగా 2.75 లక్షలు పెరిగి 39 కోట్లకు చేరగా, 33.61 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది. అయితే సంక్షోభంలో ఉన్న వొడాఫోన్ ఐడియా 2.74 లక్షల మంది, ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ 1.35 లక్షలు, ఎంటీఎన్ఎల్ 4.7 లక్షల మంది కస్టమర్లను కోల్పోయాయి. వైర్లైన్ సెగ్మెంట్లో జియో కొత్త యూజర్ల సంఖ్య 12.76 లక్షలు, ఎయిర్టెల్ యూజర్లు 99,000, టాటా టెలీసర్వీసెస్ సబ్స్క్రైబర్స్ 4,890, వొడాఫోన్ ఐడియా యూజర్ల సంఖ్య 1,795 పెరిగింది. ప్రభుత్వ రంగ ఎంటీఎన్ఎల్ అత్యధికంగా 66,834 మంది, బీఎస్ఎన్ఎల్ 46,000 మంది కస్టమర్లను కోల్పోయాయి. దేశీయంగా మొత్తం ల్యాండ్లైన్ కనెక్షన్లు 3.34 శాతం పెరిగి 3.86 కోట్లకు, మొబైల్ కనెక్షన్లు 116.84 కోట్లకు చేరాయి. ఏప్రిల్లో మొత్తం యూజర్ల సంఖ్య 120.3 కోట్లు. -
కాలం కలిసొచ్చింది... కారు నడిచొచ్చింది!
‘‘కలిసొచ్చే కాలానికి... నడిచొచ్చే కొడుకు పుడతాడంట!’’ పాతకాలపు సామెత. ఈ టెక్నాలజీ యుగంలో ఈ పప్పులేమీ ఉడకవు. కానీ.. డబ్బులు ఉంటే షోరూమ్కు వెళ్లి బోలెడన్ని పత్రాలపై సంతకాలు పెట్టి డ్రైవింగ్ వస్తే సొంతంగా.. లేదంటే అద్దెడ్రైవర్ను పెట్టుకుని మరీ తెచ్చుకోవాల్సిన కారు మాత్రం ఇప్పుడు దానంతట అదే నడిచొస్తుంది!. విషయం ఏమిటో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది!.. ఎలాన్ మస్క్ సృష్టించిన అద్భుతం డ్రైవర్లెస్ కారు మొట్టమొదటిసారి కొనుగోలుదారు ఇంటి వద్దకు వచ్చేసింది. ఈ విషయాన్నే టెస్లా కార్ల కంపెనీ యజమాని ఈలాన్ మస్క్ గర్వంగా తన ‘ఎక్స్’ ప్లాట్ఫామ్పై పంచుకున్నారు కూడా. ఎలాంటి మానవ సాయం, జోక్యం లేకుండా.. టెక్సస్లోని టెస్లా గిగా ఫ్యాక్టరీలో తయారైన ‘మోడల్ వై’ కారు స్థానికంగా కొనుగోలుదారు వద్దకు గంటకు 72 మైళ్ల వేగంతో ప్రయాణిస్తూ వచ్చిందన్నమాట. First time that a car has delivered itself to its owner! https://t.co/xgZBRDaMiX— Elon Musk (@elonmusk) June 28, 2025పైగా... అనుకున్నదాని కంటే ఒక రోజు ముందుగా ఎలాన్ మస్క్ పుట్టినరోజు నాడే ఈ కారు డెలివరీ కావడం ఒక విశేషం. ఆటోమొబైల్ రంగ చరిత్రలో ఇదో చిరస్మరణీయ ఘట్టం అవుతుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. డ్రైవర్ల అవసరం లేని వాహనాలతో క్యాబ్లు నడపాలన్న మస్క్ ఆలోచనలు వాస్తవమయ్యే దిశగా ఇంకో ముందడుగూ పడిందన్నమాట!. మోడల్ వై గురించి క్లుప్తంగా..2020లో లాంచ్ అయిన కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఇది. టెస్లా మోడల్ త్రీ ప్లాట్ఫామ్పై నిర్మించారు. ఐదుగురు కూర్చోగలరు. కొన్ని ప్రాంతాల్లో ఏడు సీట్లు ఉన్న వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. టెక్సస్లోని ఆస్టిన్ ప్రాంతం ఫ్రీమాంట్లోని టెస్లా గిగాఫ్యాక్టరీతోపాటు షాంఘై, బెర్లిన్లలో ఈ మోడల్ వై కార్లు తయారవుతున్నాయి. వేరియంట్ను బట్టి 60 - 81 కిలోవాట్ హవర్ల బ్యాటరీతో నడుస్తుంది. లిథియం అయాన్ ఫాస్పే్ట్ (ఎల్ఎఫ్పీ), నికెల్ మాంగనీస్ కోబాల్ట్ (ఎన్ఎంసీ) బ్యాటరీలతో లభిస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే వేరియంట్ను బట్టి 320 నుంచి 330 మైళ్ల దూరం ప్రయాణించగలదు. పావుగంటలోనే 180 మైళ్ల దూరం ప్రయాణించగలిగేంత విద్యుత్తును ఛార్జ్ చేసుకోవచ్చు. కేవలం 5.4 సెకన్లలోనే 60 మైళ్ల వేగాన్ని అందుకోగల శక్తి దీని సొంతం. గరిష్ట వేగం గంటకు 155 మైళ్లు! వాహనం లోపలి విశేషాల గురించి చూస్తే.. 15.4 అంగుళాల విశాలమైన టచ్స్ట్రీన్, పనోరమిక్ గ్లాస్ రూఫ్లు ఉంటాయి. కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టగలిగితే ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ వేరియంట్ను కొనుక్కోవచ్చు. లేదంటే కొన్ని పరిమితమైన ఫీచర్లతో డ్రైవింగ్ అవసరాన్ని తగ్గించేవి లభిస్తాయి. తెల్లగీతల మధ్య మాత్రమే ప్రయాణించడం, అడాప్టివ్ క్రూయిజ్, ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటివి అన్నమాట. అత్యాధునిక ఆడియో సిస్టమ్ ఉండనే ఉంది. భద్రత విషయానికి వస్తే ఫైవ్ స్టార్ రేటింగ్ లభించింది. చివరిగా ధరల గురించి... రకాన్ని బట్టి 39.3 లక్షల రూపాయలు (46000 డాలర్లు) నుంచి 41.01 లక్షల రూపాయలు (48,000 డాలర్లు) వరకూ ఉంటుంది.::గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
త్వరలో జియోహాట్స్టార్ నెట్ఫ్లిక్స్ను దాటనుందా?
అంతర్జాతీయ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్కి జియోహాట్స్టార్ అత్యంత చేరువలో ఉంది. డిసెంబర్ ఆఖరు నాటి గణాంకాల ప్రకారం నెట్ఫ్లిక్స్కి 19 దేశాల్లో 30.16 కోట్ల మంది సబ్స్క్రైబర్లు+ ఉండగా ప్రస్తుతం జియోహాట్స్టార్ మొత్తం యూజర్ల సంఖ్య 30 కోట్లకు చేరింది. ఫిబ్రవరిలో 5 కోట్లుగా ఉన్న సబ్స్క్రైబర్ల స్కయిబర్స్ సంఖ్య భారీగా పెరగడానికి ఇటీవల ముగిసిన టాటా ఐపీఎల్ క్రికెట్ లీగ్ కారణంగా నిలిచింది. డిస్నీప్లస్హాట్స్టార్, రిలయన్స్కి చెందిన జియోసినిమా విలీనంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏర్పాటైన జియోస్టార్ విడుదల చేసిన వివరాల ప్రకారం, ఐపీఎల్ తాజా ఎడిషన్కి డిజిటల్ వ్యూయర్షిప్ 65.2 కోట్ల స్థాయిని దాటగా, టీవీలో వ్యూయర్షిప్ 53.7 కోట్లకు చేరింది.ఇదీ చదవండి: పోస్టాఫీసుల్లోనూ డిజిటల్ చెల్లింపులుజియోహాట్స్టార్ ఎదుగుదలకు కారణమేంటి?ఐపీఎల్ 2025: క్రికెట్ టోర్నమెంట్ గేమ్ ఛేంజర్గా ఈ ఈవెంట్ నిలిచింది. 65.2 కోట్ల డిజిటల్ వీక్షకులను ఇది ఆకర్షించింది. మొదటిసారి టీవీ వ్యూయర్షిప్ను అధిగమించింది.విలీనం: జియో సినిమా, డిస్నీ+ హాట్స్టార్లను జియోహాట్స్టార్లోకి విలీనం చేయడం కంటెంట్, డిస్ట్రిబ్యూషన్ జోష్ను సృష్టించింది.డివైజ్ రీచ్: 104 కోట్లకు పైగా ఆండ్రాయిడ్ డౌన్లోడ్లున్నాయి.ప్రకటనలు: ఐపీఎల్ సీజన్లో 40 కేటగిరీల్లో 425 మంది అడ్వర్టైజర్లను సొంతం చేసుకుంది. -
శాంసంగ్ నుంచి కొత్త ఫోన్.. ధర తక్కువే..
శాంసంగ్ తన పాపులర్ గెలాక్సీ ఎం సిరీస్లో మరో కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. సరికొత్త గెలాక్సీ ఎం36 5జీని విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ 5ఎన్ఎం ఎక్సినోస్ 1380 ప్రాసెసర్తో పనిచేస్తుంది. ఇది స్మూత్ గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం వేపర్ కూలింగ్ ఛాంబర్ను సపోర్ట్ చేస్తుంది.120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, విజన్ బూస్టర్ టెక్నాలజీతో స్లీక్, 7.7 ఎంఎం సన్నని బాడీ, 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోల్డ్ డిస్ప్లేను కలిగి ఉంది.గూగుల్తో సర్కిల్ టు సెర్చ్, జెమినీ లైవ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ + ప్రొటెక్షన్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్లు, సెగ్మెంట్-ఫస్ట్ ఆఫర్లు ఇందులో ఉన్నాయి.వెల్వెట్ బ్లాక్, సెరీన్ గ్రీన్, ఆరెంజ్ హేజ్ అనే మూడు రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది.షేక్ ఫ్రీ వీడియోలు, బ్లర్ ఫ్రీ ఫోటోల కోసం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)తో కూడిన 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరాను ఇందులో అందించారు.ఫ్రంట్, రియర్ కెమెరాలలో 4కే వీడియో రికార్డింగ్ను సపోర్ట్ చేస్తుంది. ఇమేజ్ నాణ్యతను పెంచడానికి ఆటో నైట్ మోడ్, ఫోటో రీమాస్టర్, ఆబ్జెక్ట్ ఎరేజర్ వంటి ఫీచర్లతో వస్తుంది. ముందు భాగంలో స్పష్టమైన సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, సింగిల్ ఛార్జింగ్తో ఎక్కువ గంటలు వినోదం, ఉత్పాదకతను అందిస్తుంది. వేగవంతమైన డౌన్లోడ్, అంతరాయం లేని స్ట్రీమింగ్ కోసం డివైజ్ పూర్తి 5జీ కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది.ఈ ఫోన్ వన్ యుఐ 7 తో వెళుతుంది, ఇది మరింత క్రమబద్ధమైన డిజైన్, కస్టమైజబుల్ విడ్జెట్లు మరియు లాక్ స్క్రీన్లో రియల్-టైమ్ అప్డేట్ల కోసం నౌ బార్ అనే కొత్త ఫీచర్ను పరిచయం చేస్తుంది.ఆండ్రాయిడ్ ఓఎస్ ఆరు జనరేషన్ అప్గ్రేడ్ లు, ఆరేళ్ల సెక్యూరిటీ అప్ డేట్స్ కు శాంసంగ్ హామీ ఇస్తోంది. ఈ విభాగంలో కొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేస్తోంది.గెలాక్సీ ఎం36 5జీ స్మార్ట్ ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.16,499గా, 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.17,999గా, 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.20,999గానూ నిర్ణయించారు.గెలాక్సీ ఎం36 5జీ స్మార్ట్ ఫోన్లను జూలై 12 నుంచి శాంసంగ్, అమెజాన్ వెబ్సైట్లతోపాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో విక్రయించనున్నారు. -
WEF టెక్నాలజీ దిగ్గజాల్లో హైదరాబాద్ కంపెనీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: 2025 సంవత్సరానికి గాను వరల్డ్ ఎకనమిక్ ఫోరం 100 టెక్నాలజీ పయొనీర్ల జాబితాలో హైదరాబాద్కి చెందిన డేటా షేరింగ్ ప్లాట్ఫాం ఈక్వల్ చోటు దక్కించుకుంది. భారత్ నుంచి మొత్తం 10 సంస్థలు ఈ లిస్టులో ఎంపికయ్యాయి.గతంలో డబ్ల్యూఈఎఫ్ పయొనీర్లుగా నిల్చిన గూగుల్, స్పాటిఫై, ఎయిర్బీఎన్బీ వంటి దిగ్గజాల సరసన తమ సంస్థ కూడా నిల్చిందని కంపెనీ వ్యవస్థాపకుడు, వెంచర్ క్యాపిటలిస్ట్ జీవీకే కేశవ్ రెడ్డి తెలిపారు. కేవైసీ తదితర అంశాలకు సంబంధించి డేటా షేరింగ్కి ఉపయోగపడే మౌలిక సదుపాయాలను ఈక్వల్ అందిస్తోంది. కేశవ్ రెడ్డి, రాజీవ్ రంజన్ కలిసి 2022లో దీన్ని నెలకొల్పారు. 2024లో 75,000 లావాదేవీలను ప్రాసెస్ చేసింది.బృహస్పతి టెక్నాలజీస్లో పెట్టుబడులు నిఘా, సెక్యూరిటీ సొల్యూషన్స్ సేవలందించే హైదరాబాద్ సంస్థ బృహస్పతి టెక్నాలజీస్ (Brihaspathi Technologies Limited) తాజాగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి 10 మిలియన్ డాలర్లు సమీకరించింది. హైదరాబాద్లో 72,000 చ.అ. విస్తీర్ణంలో సీసీటీవీ తయారీ ప్లాంటు ఏర్పాటుకు, కార్యకలాపాల విస్తరణకు ఈ నిధులను ఉపయోగించుకోనున్నట్లు సంస్థ ఎండీ రాజశేఖర్ పాపోలు తెలిపారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి ఈ ప్లాంటు అందుబాటులోకి వస్తుందని విలేఖరుల సమావేశంలో చెప్పారు. వృద్ధి ప్రణాళికల్లో భాగంగా కొత్తగా 400 మంది ఉద్యోగులను తీసుకోనున్నట్లు వివరించారు. మరోవైపు, 2026–27లో పబ్లిక్ ఇష్యూకి వచ్చే ఆలోచన కూడా ఉన్నట్లు వివరించారు.ఈ నిధులను పరిశోధన–అభివృద్ధి సామర్థ్యాలను, తయారీ సామర్థ్యాలను పెంచుకునేందుకు, ఏఐ ఆధారిత సొల్యూషన్స్ను రూపొందించేందుకు ఉపయోగించుకోనున్నట్లు చెప్పారు. ఇటీవలే మహారాష్ట్ర రోడ్ రవాణా కార్పొరేషన్ నుంచి సుమారు రూ. 100 కోట్ల విలువ చేసే సీసీటీవీ మానిటరింగ్ సిస్టం ఏర్పాటునకు ఆర్డరు లభించినట్లు రాజశేఖర్ తెలిపారు. -
బీఎస్ఎన్ఎల్ ఫ్లాష్ సేల్ త్వరలో.. ఎలాంటి ఆఫర్లు ఉంటాయో..
ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) త్వరలో ఫ్లాష్ సేల్ నిర్వహించనుంది. తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ ఫ్లాష్ సేల్ ద్వారా వినియోగదారులకు ఉచిత డేటా, బ్రాడ్ బ్యాండ్ డీల్స్ లేదా డిస్కౌంట్లు లభించనున్నాయి. దేశంలో ఇటీవలే 5జీ సేవలను ప్రకటించిన బీఎస్ఎన్ఎల్.. పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్ సిమ్ కార్డుల డోర్ డెలివరీని కూడా ప్రారంభించింది. తాజాగా వినియోగదారులను మరింత ఆకట్టుకునేందుకు త్వరలో బీఎస్ఎన్ఎల్ఫ్లాష్ సేల్ ఉంటుందని ప్రకటించింది.బీఎస్ఎన్ఎల్ ఫ్లాష్ సేల్ వివరాలుఫ్లాష్ సేల్ గురించి బీఎస్ఎన్ఎల్ ఎక్స్ (ట్విట్టర్) లో టీజర్ను పోస్ట్ చేసింది. దానితో పాటు ఉన్న వీడియో క్లిప్ ఇలా ఉంది.. "ఏదో పెద్దది ల్యాండ్ కాబోతోంది! ఊహించని అనుభూతిని అనుభవించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?" అయితే ఫ్లాష్ సేల్ తేదీని మాత్రం వెల్లడించకుండా త్వరలోనే రానుందని పేర్కొంది. సేల్ సమయంలో ఎలాంటి ఆఫర్లు ఉంటాయో ఊహించండి అంటూ టీజ్ చేసింది. టీజర్ ప్రకారం బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు ఉచిత డేటా, బ్రాడ్ బ్యాండ్ డీల్స్ లేదా భారీ డిస్కౌంట్లు లభించవచ్చు.వేగంగా వినియోగదారులను కోల్పోతున్న నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ ఈ ఫ్లాష్ సేల్ చేపడుతుండటం గమనార్హం. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఇటీవల విడుదల చేసిన టెలికాం సబ్స్క్రిప్షన్ డేటా ప్రకారం ఏప్రిల్లో బీఎస్ఎన్ఎల్ మొత్తం 2 లక్షల మంది యూజర్లను కోల్పోయింది. ఇదే కాలంలో యాక్టివ్ బీఎస్ఎన్ఎల్ సబ్స్క్రైబర్ల సంఖ్య 1.8 మిలియన్లు తగ్గినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
పిక్సెల్ స్మార్ట్పోన్ల నిషేధం
ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్కు జపాన్ కోర్టులో చుక్కెదురైంది. గూగుల్ పేటెంట్ ఉల్లంఘించిందంటూ వేసిన దావాకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. జపాన్లో పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో స్మార్ట్ఫోన్ల అమ్మకాలను నిషేధించాలని పేర్కొంది. పేటెంట్ పొందిన ఎల్టీఈ టెక్నాలజీని అనుమతి లేకుండా గూగుల్ చట్టవిరుద్ధంగా ఉపయోగిస్తోందని ఆరోపిస్తూ ఇటీవల కోర్టులో వేసిన దావాకు అనుకూలంగా తీర్పు వెలువడింది.ఈటీన్యూస్ ప్రచురించిన తాజా నివేదిక ప్రకారం.. 4జీ నెట్వర్క్లో ఉపయోగించే నిర్దిష్ట కమ్యూనికేషన్ పద్ధతిపై వివాదం మొదలైంది. ఎల్టీఈ టెక్నాలజీపై జపాన్లో ఇప్పటికే పేటెంట్ తీసుకున్నట్లు పాన్టెక్ సంస్థ దావాలో పేర్కొంది. దేశ చట్టాలకు విరుద్ధంగా గూగుల్ పిక్సెల్ ఫోన్లో ఈ టెక్నాలజీని వాడుతున్నట్లు తెలిపింది. దాంతో విచారణ జరిపిన జపాన్ కోర్టు ఆ దేశంలో పిక్సెల్ సిరీస్ ఫోన్లను నిషేధిస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. ‘అక్నాలెడ్జ్మెంట్ సిగ్నల్’ లేదా ఏసీకే అని పిలువబడే నియంత్రణ సిగ్నల్ పరికరాలు, బేస్ స్టేషన్ల మధ్య కమ్యునికేషన్ ఎలా ప్రసారం అవుతుందనే దానిపై కంపెనీ, దావా వేసిన వారిలో పరస్పరం భిన్నాభిప్రాయలు వ్యక్తమయ్యాయి. ఈ ఎల్టీఈ టెక్నాలజీ జపాన్ పేటెంట్ చట్టం కింద సంరక్షించబడుతుంది. దాంతో జపాన్ కోర్టు చర్యలు తీసుకుంది.ఇదీ చదవండి: పుత్తడి ప్రియుల్లో కోటి ఆశలు.. బంగారం తగ్గుముఖంకోర్టులో దావా వేసిన పాన్టెక్ కంపెనీ స్వయంగా స్మార్ట్ ఫోన్ వ్యాపారం నుంచి నిష్క్రమించినప్పటికీ, దాని మిగిలి ఉన్న పేటెంట్లు ఇప్పటికీ యాక్టివ్గానే ఉన్నట్లు తెలిపింది. గూగుల్ పిక్సెల్ 7, 7 ప్రో సరైన లైసెన్సింగ్ లేకుండా ఈ సాంకేతికతను ఉపయోగించాయని టోక్యో డిస్ట్రిక్ట్ కోర్టు తెలిపింది. దాంతో ఈ మోడళ్ల అమ్మకాలపై మాత్రమే కాకుండా దిగుమతులు, ప్రకటనలు, జపాన్లో ఈ మోడళ్ల ప్రదర్శనపై కూడా నిషేధాన్ని విధించింది. విచారణ సందర్భంగా కంపెనీ ప్రవర్తనపై కోర్టు తీవ్ర విమర్శలు చేసింది. గూగుల్ది ‘చిత్తశుద్ధి లేని వైఖరి’గా అభివర్ణించింది. -
సోనీ కెమెరాతో పోకో కొత్త ఫోన్
స్మార్ట్ఫోన్స్ బ్రాండ్ తాజాగా ఎఫ్–సిరీస్లో ఎఫ్7 ఫోన్ను ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ.29,999 నుంచి రూ.31,999 వరకు ఉంటుంది. 7,550 ఎంఏహెచ్ బ్యాటరీ, 90 వాట్స్ టర్బో చార్జింగ్, స్నాప్డ్రాగన్ 8ఎస్ జెన్ 4 చిప్సెట్, 6.83 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్882 కెమెరా తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయని సంస్థ ప్రోడక్ట్ మార్కెటింగ్ మేనేజర్ సచిన్ దేవ్ తెలిపారు.ఇదీ చదవండి: దేశంలో అత్యంత విలువైన టాప్ 10 బ్రాండ్లునాలుగేళ్ల వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి. జులై 1 నుంచి ఫ్లిప్కార్ట్పై ఎక్స్క్లూజివ్గా అమ్మకాలు ప్రారంభమవుతాయి. తొలి రోజున హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ తదితర కార్డులపై రూ.2,000 డిస్కౌంటు, రూ.2,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్ పొందవచ్చని దేవ్ చెప్పారు. -
గ్రీన్ ఎనర్జీ ఆవిష్కరణకు ప్రభుత్వ పేటెంట్
శిలాజ ఇంధనాలపై ఆధారపడడం తగ్గించాలనే లక్ష్యంతో ఎంజీఎం విశ్వవిద్యాలయంలోని జవహర్లాల్ నెహ్రూ ఇంజినీరింగ్ కాలేజ్ (జేఎన్ఈసీ)లో కెమికల్ ఇంజినీరింగ్ విద్యార్థి కనక్ తల్వేర్ రూపొందించిన గ్రీన్ ఎనర్జీ వ్యవస్థకు భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ లభించింది. చెరకు రసం నుంచి బయోఇథనాల్ ఉత్పత్తి చేసేలా ఈ వ్యవస్థను తయారు చేశారు.ఎంజీఎం విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యాపకులు డాక్టర్ రవీంద్ర గైక్వాడ్, ఆకాశ్ వాణి, ప్రవర రూరల్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన డాక్టర్ అన్నాసాహెబ్ వరడే, రవీంద్ర నిబ్లతో కలిసి ఈ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు కనక్ కలిసి పనిచేశారు. మొత్తం ఈ ఐదుగురు పరిశోధకులు కలిసి భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ పొందినట్లు తెలిపారు.వ్యవసాయ వ్యర్థాల నుంచి క్లీన్ ఎనర్జీబయోఇథనాల్ను తయారు చేయడానికి విస్తృతంగా లభించే చెరకు రసాన్ని ఉపయోగించడం వల్ల ఈ ఆవిష్కరణ ప్రత్యేకంగా నిలిచింది. ఈ ప్రక్రియ జీవ ఇంధన ఉత్పత్తి కోసం, ముఖ్యంగా చెరకు పండిస్తున్న వ్యవసాయ ప్రాంతాల్లో రెట్టింపు ప్రయోజనాన్ని అందిస్తుంది. దీనివల్ల కర్బన ఉద్గారాలు తగ్గడం, గ్రామీణ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. చెరకు రసంతో పాటు రసం వెలికితీత తర్వాత మిగిలిపోయిన ఫైబరస్ అవశేషమైన బగాస్సేపై పరిశోధనలు చేసి ఈ ప్రక్రియను రూపొందించారు. అంటే పంటలోని ప్రతి భాగాన్ని వినియోగంలోకి తేనున్నారు.ఇదీ చదవండి: మీ వయసు 30 లోపా? తప్పక తెలియాల్సినవి..ఈ ప్రక్రియ భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ పొందండంతో ఎంజీఎం విశ్వవిద్యాలయం అకడమిక్ కమ్యూనిటీ నుంచి ప్రశంసలు అందుకుంది. భారతదేశం గ్రీన్ ఎనర్జీ మిషన్కు అనుగుణంగా విద్యార్థుల నేతృత్వంలోని ఆవిష్కరణలను ఇది హైలైట్ చేసింది. దేశం ప్రతిష్టాత్మక ఇథనాల్ మిశ్రమ లక్ష్యాల వైపు దూసుకెళ్తున్నప్పుడు ఇంధన ఆర్థిక వ్యవస్థలను సృష్టించడంలో ఇలాంటి పరిష్కారాలు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. -
మెసేజ్ ఎంత పెద్దదైనా చిటికెలో సారాంశం
మెటా వాట్సప్లో కొత్త ఏఐ ఆధారిత ఫీచర్ను ప్రవేశపెట్టినట్లు తెలిపింది. వాట్సప్లో చదవని మెసేజ్ల సంక్షిప్త సారాంశాన్ని తెలుసుకునేందుకు మెటా ఏఐ సాయం చేయనుందని పేర్కొంది. ఈ ఫీచర్లో భాగంగా యూజర్లు నిత్యం పెద్ద టెక్స్ట్ మేసేజ్లను స్క్రోల్ చేసి పూర్తిగా చదవకుండా మెటా ఏఐ అందులోని సంక్షిప్త సారాంశాన్ని అందిస్తుంది. ఇంగ్లిష్ సపోర్ట్తో పనిచేసే ఈ ఫీచర్ ప్రస్తుతం అమెరికాలోని వాట్సప్ యూజర్లకు అందుబాటులో ఉన్నట్లు మెటా తెలిపింది. ఈ ఏడాది చివర్లో క్రమంగా మరిన్ని ప్రాంతాలతోపాటు ఇతర భాషలకు ఈ ఫీచర్ను విస్తరిస్తామని స్పష్టం చేసింది.మెటా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఫీచర్ వన్-ఆన్-వన్, గ్రూప్ చాట్స్ రెండింటికీ అందుబాటులో ఉంటుంది. నిత్యం మెసేజ్లు వచ్చే గ్రూప్లు, వ్యక్తులకు ఈ ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఏఐ మెసేజ్లు చదివే క్రమంలో యూజర్ల కంటెంట్పట్ల భద్రత పాటిస్తామని వాట్సప్ హామీ ఇచ్చింది. ఏఐ ఫీచర్ డేటాను బాహ్య సర్వర్లకు ప్రసారం చేయకుండా లేదా కంపెనీ సిస్టమ్లకు బహిర్గతం చేయకుండా ప్రాసెస్ చేస్తుందని తెలిపింది.ఇదీ చదవండి: వారానికి 32 గంటలు చాలు..: యూఎస్ నెనేటర్యూజర్ల ప్రాధాన్యతలను గౌరవించడానికి వాట్సప్ డిఫాల్ట్గా ఈ ఫీచర్ను ఎనేబుల్ చేయదని చెప్పింది. మాన్యువల్గానే దీన్ని యాక్టివేట్ చేసుకోవాలని పేర్కొంది. ఇది ఆప్షనల్ ఫీచర్గా మాత్రమే ఉంటుందని తెలిపింది. అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీ కంట్రోల్స్లో యూజర్లు తమ సెట్టింగ్స్ను మార్చుకోవచ్చని స్పష్టం చేసింది. -
వారానికి 32 గంటలు చాలు..: యూఎస్ సెనేటర్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యం పెరుగుతున్న కొద్దీ ఉద్యోగుల తొలగింపు అధికమవుతోంది. టెక్ కంపెనీలు వ్యయం ఆదా చేసుకొని ఇతర విభాగాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఏఐ తోడ్పడుతుంది. కృత్రిమ మేధ వ్యాపారాలకు సహాయం చేస్తుంటే, వాటి సామర్థ్యాన్ని పెంచుతుంటే ఆయా సంస్థలు ఉద్యోగుల వర్క్-లైఫ్ సమతుల్యతను మెరుగుపరచాలని సెనేటర్ బెర్నీ శాండర్స్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఏఐ ఆటోమేషన్ పెరుగుతున్న తరుణంలో ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిచేసేలా వాతావరణాన్ని సృష్టించాలన్నారు.జో రోగన్ ఎక్స్పీరియన్స్ పాడ్కాస్ట్లో మాట్లాడిన బెర్నీ శాండర్స్ వారానికి 32 గంటల పనిదినాలు ఉండాలని చెప్పారు. కృత్రిమ మేధ ఉద్యోగులను నిరుద్యోగంలోకి నెట్టడం కంటే ఎక్కువ ఫ్రీటైమ్ ఉంచేలా చేయాలని పేర్కొన్నారు. ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమా అని వ్యాపారాలకు ఉత్పాదకత పెరుగుతోంది. దాన్ని ప్రధానంగా పరిగణిస్తే సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు దానికి బదులుగా పని దినాలను తగ్గించాలి. వారానికి 32 గంటలకు పనిని కుదించాలి. ఉద్యోగులు తమ కుటుంబం, స్నేహితులు లేదా తమకు ఇష్టమైన కార్యకలాపాలకు ఎక్కువ సమయం గడిపేందుకు వీలు కల్పించాలి. టెక్నాలజీ కేవలం కార్పొరేట్ లాభాలకే పరిమితం కాకుండా ఉద్యోగులకు సైతం ఉపయోగపడాలి’ అన్నారు.ఇదీ చదవండి: ఇంటెల్లో ఉద్యోగాల కోత ప్రారంభంసెనేటర్ బెర్నీ శాండర్స్ ప్రస్తుతం యూఎస్ సెనేట్లో వెర్మాంట్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1981లో వెర్మాంట్లోని బర్లింగ్ టన్ మేయర్గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన 1991 నుంచి 2007 వరకు అమెరికా ప్రతినిధుల సభలో పనిచేశారు. -
5జీ యూజర్లు @ 98 కోట్లు..!
న్యూఢిల్లీ: భారత్లో 5జీ టెలికం యూజర్లు (చందాదారులు) 2030 నాటికి 98 కోట్లకు చేరుకుంటారని, అప్పటికి 4జీ చందాదారుల సంఖ్య 60 శాతం తగ్గి 23 కోట్లకు పరిమితం అవుతుందని టెలికం గేర్ల తయారీ సంస్థ ఎరిక్సన్ తెలిపింది. ‘‘2024 చివరికి 5జీ చందాదారులు 29 కోట్లకు పెరిగారు. మొత్తం మొబైల్ సబ్్రస్కిప్షన్లలో 24 శాతంగా ఉన్నారు. 2030 నాటికి ఈ సంఖ్య 98 కోట్లకు చేరుకుంటుంది. మొత్తం చందాదారుల్లో 5జీ యూజర్లు 75 శాతానికి పెరుగుతారు’’అని ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ వెల్లడించింది. 2024లో ఒక్కో స్మార్ట్ ఫోన్ ద్వారా 32జీబీ డేటా వినియోగంతో భారత్ ప్రపంచంలో డేటా రద్దీ పరంగా మొదటి స్థానంలో నిలిచినట్టు తెలిపింది. 2030 నాటికి ఒక్కో స్మార్ట్ఫోన్ డేటా వినియోగం 66జీబీకి పెరుగుతుందని అంచనా వేసింది. ఇందుకు అనుగుణంగా బలమైన 5జీ నెట్వర్క్ అవసరం ఉంటుందని పేర్కొంది. వేగంగా 5జీ స్మార్ట్ఫోన్లకు యూజర్లు మారుతుండడం, డేటా వినియోగానికి డిమాండ్ పెరుగుతున్నట్టు వివరించింది. ‘‘బ్రాడ్బ్యాండ్ అవసరం పెరుగుతోంది. ముఖ్యంగా గ్రామీణ, చిన్న పట్టణాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. 5జీ ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ (ఎఫ్డబ్ల్యూఏ) విస్తరణ దిశగా సరీ్వస్ ప్రొవైడర్లను ఈ డిమాండ్ నడిపిస్తుంది. భారత్లో అందుబాటులో ఉన్న 5జీ మిడ్బ్యాండ్ స్పెక్ట్రమ్.. సామర్థ్యం, నెట్వర్క్ విస్తరణ అవసరాలకు సరిపోతుంది. ఇది యూజర్ అనుభవం పెరిగేందుకు వీలు కలి్పస్తుంది’’అని ఎరిక్సన్ నివేదిక వివరించింది. -
30 రోజుల రీచార్జ్ ప్లాన్లు.. బెనిఫిట్లు
జియో, ఎయిర్టెల్ దేశంలో రెండు అతిపెద్ద టెలికాం కంపెనీలు. దేశంలో ఎక్కువ మంది మొబైల్ వినియోగదారులు జియోతో కనెక్ట్ అయ్యారు. యూజర్ల పరంగా ఎయిర్ టెల్ రెండో స్థానంలో ఉంది. ఎక్కువ మంది యూజర్లు నెలవారీ రీచార్జ్ ప్లాన్ల వైపు మొగ్గుచూపుతుంటారు. రెండు కంపెనీలు తమ వినియోగదారులకు సరసమైన రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి.జియో, ఎయిర్టెల్లో ఉన్న 30 రోజుల వాలిడిటీ రీఛార్జ్ ప్లాన్లు, వాటి ప్రయోజానాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. రూ.335తో జియో 30 రోజుల వాలిడిటీ రీఛార్జ్ చేసుకోవచ్చు. అదే సమయంలో, మీరు ఎయిర్టెల్ 30 రోజుల వాలిడిటీ రీఛార్ ప్లాన్ రూ .379కు అందుబాటులో ఉంది. ఈ రెండు రీఛార్జ్ ప్లాన్ల ధరలలో వ్యత్యాసం రూ .44. అలాగే వాలిడిటీ ఒక్కటే అయినా ప్రయోజనాల్లోనూ చాలా తేడాలున్నాయి.జియో రూ.335 ప్లాన్జియో రూ.335 ప్లాన్ వాలిడిటీ 30 రోజులు. ఈ ప్లాన్లో వినియోగదారులు అపరిమిత ఉచిత కాలింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. దీంతో పాటు రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లతో పాటు మొత్తం 25 జీబీ డేటా లభిస్తుంది. అంతేకాకుండా జియో హాట్స్టార్, జియో క్లౌడ్కు ఉచిత యాక్సెస్ కూడా పొందుతారు.ఎయిర్టెల్ రూ.379 ప్లాన్ఎయిర్ టెల్ రూ.379 ప్లాన్ వాలిడిటీ 30 రోజులు. ఈ ప్లాన్లో వినియోగదారులు అపరిమిత ఉచిత కాలింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. దీంతో పాటు రోజుకు 2 జీబీ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఇది కాకుండా, ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ యాప్నకు యాక్సెస్ కూడా పొందుతారు.👉 ఇది చదివారా? జియో నుంచి 2 కొత్త ఫ్లాన్లు.. ప్రత్యేక బెనిఫిట్లు.. -
రూ.10వేలలో మరో కొత్త ఫోన్.. అమ్మకాలు ప్రారంభం
కొత్తగా లాంచ్ అయిన ఐక్యూ జెడ్10 లైట్ 5జీ స్మార్ట్ఫోన్ అమ్మకాలు భారత్లో ప్రారంభమయ్యాయి. ఈ బడ్జెట్ స్మార్ట్ఫోన్ ధర రూ.10,000 రేంజ్లోనే ఉంటుంది. 6,000 ఎంఏహెచ్ పెద్ద బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6,300 ప్రాసెసర్ వంటి అద్భుత స్పెసిఫికేషన్లు ఇందులో ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 22.7 గంటల వీడియో ప్లేబ్యాక్ ను అందిస్తుంది. లాంచ్ ఆఫర్లలో బ్యాంక్ కార్డులపై రూ.500 తగ్గింపు, నో కాస్ట్ ఈఎంఐ తదితర ఆఫర్లు ఉన్నాయి. 👉 కొత్త ఫోన్.. రూ.25 వేలకే 3డీ కర్వ్డ్ డిస్ప్లే 👈ఐక్యూ జెడ్10 లైట్ 5జీ స్పెసిఫికేషన్లుఇక స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే ఐక్యూ జెడ్10 లైట్ 5జీ ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది. ఇందులో 6.74 అంగుళాల హెచ్డీ ఎల్సీడీ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్వోసీని అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగా పిక్సెల్ సెన్సార్ కూడా ఉంది. 5 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ కూడా ఉంది. 15వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. కనెక్టివిటీ ఆప్షన్లలో బ్లూటూత్ వి5.4, వై-ఫై 5 ఉన్నాయి.ఐక్యూ జెడ్10 లైట్ 5జీ లాంచ్ ఆఫర్లుఐక్యూ జెడ్10 లైట్ 5జీ లాంచ్ ఆఫర్లలో ఎంపిక చేసిన ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, ఇతర బ్యాంక్ కార్డులపై రూ .500 తక్షణ తగ్గింపు ఉంది. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, జీఎస్టీ బెనిఫిట్స్ కూడా అమెజాన్ ఇండియాలో లిస్ట్ అయ్యాయి. ఐక్యూ జెడ్10 లైట్ 5జీ 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999. ఇది సైబర్ గ్రీన్, టైటానియం బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. -
క్యాబ్ డ్రైవర్లకు ఇక గడ్డుకాలమే!
అవును. నిజం. ఒకట్రెండేళ్లలో క్యాబ్డ్రైవర్లు అనే వారు ఉండకపోవచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కారణంగా ఊబర్, ఓలా, ర్యాపిడో వంటివి పుట్టుకొచ్చి క్యాబ్ డ్రైవర్ల ఆదాయంలో కొంత వాటా పంచుకుంటూంటే... రోబోటిక్స్, అటానమస్ వెహికల్ టెక్నాలజీ కాస్తా... డ్రైవర్ల ఉద్యోగాలకే గండికొట్టే సూచనలు కనిపిస్తున్నాయి. డ్రైవర్ల అవసరం లేని కార్లను టెస్లా ఎప్పుడో తయారు చేసింది కదా? అప్పుడు లేని సమస్య ఇప్పుడెందుకు వస్తుందని అంటున్నారా?సింపుల్.. టెస్లాతోపాటు ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇప్పుడు ఈ అటానమస్ వెహికల్ టెక్నాలజీని క్యాబ్స్గా మార్చే ప్రయత్నాల్లో ఉన్నాయి మరి! టెస్లా ఇప్పటికే తన సైబర్ ట్రక్ను క్యాబ్ సర్వీసులు అందించేలా మార్చి పరిశీలిస్తూండగా.. అమెజాన్ వచ్చే ఏడాది నుంచి ఏటా కనీసం పదివేల రోబో ట్యాక్సీలను సిద్ధం చేస్తోంది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని హేవర్డ్ ప్రాంతంలో అమెజాన్ సుమారు 2.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రోబో ట్యాక్సీల తయారీకి ఒక ప్లాంట్ను ఏర్పాటు చేసింది. నలుగురు ప్రయాణించగల విశాలమైన ట్రక్కులాంటి ఈ వాహనం పేరు జూక్స్. అన్నీ సవ్యంగా సాగితే ఈ ఏడాది చివరికల్లా కొన్ని వాహనాలు లాస్ వేగస్ నగరంలో పరుగులు పెడతాయి కూడా. ఆ తరువాత.. దశలవారీగా మయామీ, ఆస్టిన్, శాన్ఫ్రాన్సిస్కోలకు వీటి సేవలను విస్తరించనున్నారు. ప్రస్తుతం ఈ వ్యాన్లను టెస్ట్ ట్రాక్పై నడిపి పరిశీలిస్తున్నారు కూడా. డ్రైవింగ్ తీరుతెన్నులు, పికప్.. డ్రాప్ఆఫ్ల సందర్భంగా ఏమేం జరుగుతున్నాయో తెలుసుకుంటున్నారు. మరోవైపు.. టెస్లా కంపెనీ కూడా తన సైబర్ ట్రక్ను కాస్తా సైబర్ క్యాబ్గా మార్చే ప్రయత్నాల్లో ఉంది. 2027 నాటికి తొలి దశ వాహనాలను రోడ్లపైకి ఎక్కిస్తారు. రోబోట్యాక్సీ అని పిలుస్తున్న ఈ వాహనంలో ఇద్దరు ప్రయాణించవచ్చు. స్టీరింగ్ వీల్, పెడల్స్ వంటివేవీ ఉండవు. అన్నీ కృత్రిమ మేధ ద్వారానే జరిగిపోతాయి. ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 320 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవు. ముందు, వెనుక ఎక్కడ అద్దాలుండవు. కెమెరాలు, సెన్సర్ల ద్వారానే పరిసరాలను గమనిస్తూ డ్రైవ్ చేస్తుందీ వాహనం. ఒక్కో రోబోట్యాక్సీని 30,000 డాలర్లకు అమ్మేందుకు టెస్లా ప్రయత్నిస్తోంది. మానవ డ్రైవర్ల పరిస్థితి?జూక్స్, రోబోట్యాక్సీలు విస్తృత స్థాయిలో అందుబాటులోకి వస్తే మానవ డ్రైవర్లకు గడ్డుకాలమే!. ప్రస్తుతానికి ఇవి అమెరికాకే పరిమితం కావచ్చు కానీ... భవిష్యత్తులో ఇతర ప్రాంతాలకు మరీ ముఖ్యంగా వివిధ దేశాల్లోని నగర ప్రాంతాలకు విస్తరించడం ఖాయం. అదే జరిగితే ట్యాక్సీ డ్రైవర్లకు డిమాండ్ తగ్గిపోతుంది. రోబో ట్యాక్సీలో ఒక ఒక మైలు ప్రయాణించేందుకు 0.20 డాలర్లు ఖర్చు అవుతుందని, బస్సులతో పోలిస్తే ఇది నాలుగు రెట్లు తక్కువ అని టెస్లా ఇప్పటికే ప్రకటించింది. ఇదే వాస్తవమైతే చవక కాబట్టి వీటిల్లో ప్రయాణించేందుకే మొగ్గు చూపుతారు. కాకపోతే..మానవ డ్రైవర్లను ఈ రోబోట్యాక్సీ నిర్వహణకు ఉపయోగించుకోవచ్చునని ఒక అంచనా. అంతేకాదు... కొంతమంది అభిప్రాయం ప్రకారం ఈ రోబో ట్యాక్సీలు మానవ డ్రైవర్లను పూర్తిగా లేకుండా చేయలేవు. ఎందుకంటే ఇలాంటి వాహనాల భద్రత, నియంత్రణలకు సంబంధించిన నిబంధనలు ఇప్పటివరకూ రూపుదిద్దుకోలేదు. ప్రభుత్వాలు పూనుకుని వీటిని సిద్ధం చేసేందుకు చాలా సమయమే పట్టవచ్చు. మరికొంత మంది అభిప్రాయం ప్రకారం అటానమస్ వాహనాలు నగరాల్లో కొన్ని నిర్దిష్ట మార్గాలకు మాత్రమే పరిమితమవుతాయి. సంక్లిష్టమైన రూట్లలో మానవ డ్రైవర్లనే ఉపయోగిస్తారు. ::గిళియారు గోపాలకృష్ణ మయ్యాPhotos/Videos Credits: zoox.com/newatlas.com -
ముదురుతున్న ఏఐ వార్!
గూగుల్, ఎక్స్, మెటా, ఓపెన్ఏఐ.. వంటి ప్రధాన కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐ మోడళ్లను సృష్టిస్తున్నాయి. ఈ సంస్థల మధ్య పోటీ తీవ్రతరం అవుతుంది. దాంతో తోటివారికంటే ఓ అడుగు ముందుడాలనే భావనతో కంపెనీ ఏఐ నైపుణ్యాలున్నవారికి భారీ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. కృత్రిమ మేధస్సుపై ఆధిపత్యం చెలాయించే రేసులో భాగంగా మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ కీలక ప్రచారం ప్రారంభించినట్లు కొన్ని సంస్థలు తెలుపుతున్నాయి. ఈ విభాగంలో అగ్రశ్రేణి ఏఐ ప్రతిభావంతులను ఆకర్షించేందుకు భారీ ప్యాకేజీ ప్రకటిస్తున్నట్లు తెలుస్తుంది. మెరుగైన ఏఐ నైపుణ్యాలున్న ఎక్స్పర్ట్లకు 100 మిలియన్ డాలర్ల (రూ.860 కోట్లు) ప్యాకేజీ చెల్లించేందుకు కూడా వెనుకాడడం లేదని సమాచారం.నేరుగా సంప్రదింపులుకొన్ని సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకులు, డెవలపర్లు, స్టార్టప్ ఫౌండర్లను వాట్సాప్, ఈమెయిల్ ద్వారా మార్క్ జుకర్బర్గ్ సంప్రదిస్తున్నారు. వీరిలో కొందరిని వ్యక్తిగతంగా షార్ట్లిస్ట్ చేసి ఆయా నిపుణులను నేరుగా సంప్రదిస్తున్నారు. వారితో జరుపుతున్న చర్చల్లో కేవలం నియామకాల గురించే కాకుండా ఆర్టిఫిషియన్ జనరల్ ఇంటెలిజెన్స్, భవిష్యత్తు కార్యకలాపాలు వంటి చాలా అంశాలను చర్చిస్తున్నారు.సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ కోసం..మెటా కొన్ని రోజుల నుంచి మానవ స్థాయి కృత్రిమ మేధ వ్యవస్థలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ‘సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్’ను నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందుకు ప్రపంచంలోనే టాప్ స్కిల్డ్ పర్సన్స్ను నియమించుకోవాలని మెటా భావిస్తోంది. దాంతో సరైన నైపుణ్యాలు ఉన్నవారికి భారీగా ప్యాకేజీలు ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది. అలెగ్జాండర్ వాంగ్ స్థాపించిన స్కేల్ ఏఐ కంపెనీను 14 బిలియన్ డాలర్ల(రూ.1.2 లక్షల కోట్లు) వాల్యుయేషన్కు కొనుగోలు చేసింది. సిలికాన్ వ్యాలీలో అత్యంత ప్రభావవంతమైన డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్టప్ను నిర్మించడంలో ప్రసిద్ధి చెందిన వాంగ్ ఇప్పుడు కృత్రిమ మేధ ఆవిష్కరణలో మెటా తరఫున పని చేస్తున్నారు.ఇదీ చదవండి: మొదటిసారి ఆదాయపన్ను విధిస్తున్న దేశంకొందరు విముఖతఅయితే కొందరు మాత్రం తమ నైపుణ్యాలకు, తాము స్థాపించిన కంపెనీలకు మెటా ఎంత వెచ్చిస్తానంటున్నా కలిసిరావడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారు. జుకర్బర్గ్, మెటా ఏఐ చీఫ్ సైంటిస్ట్ యాన్ లెకున్ మధ్య ఫిలాసఫికల్ విభేదాల వల్ల ఈ సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ దీర్ఘకాలికంగా ఎలా అభివృద్ధి చెందుతుందనే దానిపై స్పష్టత లేకపోవడం కూడా ఇందుకు ప్రధాన కారణంగా ఉంది. -
ఇంట్లోకి వచ్చేలోపే నీళ్లు వేడయ్యేలా కొత్త హీటర్
కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్లో సర్వీసులు అందిస్తున్న వి-గార్డ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లక్సెక్యూబ్ వాటర్ హీటర్ సిరీస్ను విడుదల చేసినట్లు ప్రకటించింది. ఎలివేటెడ్, టెక్-ఫార్వర్డ్ బాత్రూమ్ సొల్యూషన్లకు పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి రూపొందించిన ఈ సిరీస్లో మూడు మోడళ్లు లక్సెక్యూబ్, లక్సెక్యూబ్ డీజీ, లక్సెక్యూబ్ స్మార్ట్ను తీసుకొచ్చినట్లు చెప్పింది.ఇదీ చదవండి: మూడు కంపెనీల పబ్లిక్ ఇష్యూకు సెబీ గ్రీన్సిగ్నల్ఆధునిక గృహాల కోసం రూపొందించిన లక్సెక్యూబ్ స్మార్ట్ ఐఓటీ స్మార్ట్ కనెక్టివిటీని ఇంటిగ్రేట్ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఐఓఎస్, ఆండ్రాయిడ్కు అనుకూలమైన వి-గార్డ్ స్మార్ట్ యాప్ ద్వారా హీట్ను నియంత్రించవచ్చని పేర్కొంది. వాటర్ హీటింగ్ కోసం వినియోగదారులు సమయాన్ని కూడా షెడ్యూల్ చేసుకోవచ్చని చెప్పింది. ఇది అమెజాన్ అలెక్సా, గూగుల్ హోమ్ ద్వారా వాయిస్ కమాండ్లను కూడా సపోర్ట్ చేస్తుందని తెలిపింది. -
స్మార్ట్ఫోన్.. ఆఫ్లైన్ రూట్!
ఇప్పటివరకు ఆన్లైన్ మాధ్యమానికి ఎక్కువగా ప్రాధాన్యమిచి్చన స్మార్ట్ఫోన్ బ్రాండ్లు క్రమంగా ఆఫ్లైన్ బాట పడుతున్నాయి. సులభతరమైన ఫైనాన్సింగ్ అవకాశాల దన్నుతో అమ్మకాలను పెంచుకునేందుకు చిన్న పట్టణాలపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు వరుసగా ఏడు నెలల పాటు ఆన్లైన్ రిటైలర్లకు షిప్మెంట్లు (టోకు విక్రయాలు) తగ్గడం, ఆఫ్లైన్ రిటైలర్లకు పెరగడం ఇందుకు నిదర్శనమని మార్కెట్ వర్గాలు తెలిపాయి.ఆన్లైన్ రిటైలర్లకు వరుసగా రెండో నెల ఏప్రిల్లో రెండంకెల స్థాయిలో తగ్గినట్లు వివరించాయి. ఏప్రిల్లో షిప్మెంట్లు ఏకంగా 20 శాతం మేర క్షీణించాయి. మరోవైపు, ఆఫ్లైన్ రిటైలర్లకు 10 శాతం పెరిగాయి. వరుసగా ఎనిమిది నెలల పాటు ఆఫ్లైన్కి షిప్మెంట్లు పెరిగినట్లయిందని ఐడీసీ ఇండియా రీసెర్చ్ మేనేజర్ ఉపాసనా జోషి తెలిపారు. మొత్తం షిప్మెంట్లను పరిగణనలోకి తీసుకున్నప్పుడు మార్చితో పోలిస్తే ఏప్రిల్లో పెద్దగా మార్పు లేకుండా 1.2 కోట్ల స్థాయిలో ఉన్నట్లు వివరించారు. మోటరోలా షిప్మెంట్లు 64 శాతానికి డౌన్.. మార్కెట్ రీసెర్చ్ సంస్థ కెనాలిస్ ప్రకారం 2025 తొలి త్రైమాసికంలో మోటరోలా ఆన్లైన్ షిప్మెంట్లు 64%కి పరిమితమయ్యాయి. అంతక్రితం క్యూ1లో ఇవి 82%గా నమోదయ్యాయి. ఇక వన్ప్లస్ విషయానికొస్తే ఇదే వ్యవధిలో షిప్మెంట్లు 85% నుంచి 71%కి తగ్గాయి. మరోవైపు, ఈ–కామర్స్ ఫ్లాష్ సేల్స్తోనే భారత మార్కెట్లోకి ప్రవేశించిన షావోమీ సైతం ఆమ్నిచానల్ బాట పట్టింది. – సాక్షి, బిజినెస్ డెస్క్ఆమ్నిచానల్ వ్యూహం.. ప్రాథమికంగా ఆన్లైన్ మాధ్యమం మారుమూల ప్రాంతాలకు కూడా చేరుకునేందుకు బాగా ఉపయోగపడినప్పటికీ, దేశీయంగా ఈ–కామర్స్ విస్తృతి ఇప్పటికే ఒక స్థాయికి చేరిన విషయాన్ని బ్రాండ్లు గుర్తిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. కోవిడ్ అనంతరం ఒక్కసారిగా ఆన్లైన్ అమ్మకాలు ఎగిసినప్పటికీ ఆ తర్వాత అదే స్థాయిలో కొనసాగలేదు. గ్రామీణ ప్రాంతాల కొనుగోలుదారులు పూర్తిగా ఆన్లైన్ మాధ్యమంపైనే ఆధారపడటం లేదు. ఇప్పటికీ ఆఫ్లైన్ స్టోర్స్ వైపే మొగ్గు చూపుతున్నారు.దీంతో విక్రయాలను పెంచుకునేందుకు ఏదో ఒక మాధ్యమంపైనే ఎక్కువగా దృష్టి పెట్టకుండా, అన్ని మార్గాలను ఉపయోగించుకునే ఆమ్నిచానల్ వ్యూహాన్ని బ్రాండ్లు అనుసరిస్తున్నాయి. ఆఫ్లైన్ రిటైలర్లను ఆకర్షణీయమైన మార్జిన్లు, సపోర్ట్తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఆన్లైన్లో విక్రయించే ఉత్పత్తులను అదే రేటుకు ఆఫ్లైన్లోనూ అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆన్లైన్ సరఫరాలను తగ్గిస్తున్నాయని మార్కెట్ వర్గాలు వివరించాయి. -
రేర్ ఎర్త్ మెటల్స్పై ఆంక్షలతో ఉపాధికి దెబ్బ
రేర్ ఎర్త్ మెటల్స్ ఎగుమతిపై చైనా ఆంక్షలు విధించడంతో దేశీయంగా ఈ ప్రభావం ఆటోమొబైల్సహా పలు రంగాలపై కనిపించనుంది. ఈ ప్రభావంతో ఆడియో ఎల్రక్టానిక్స్ పరిశ్రమలో 21,000 ఉద్యోగాలు రిస్క్లో పడనున్నట్లు ఎల్రక్టానిక్స్ పరిశ్రమల సమాఖ్య ఎల్సినా.. ప్రభుత్వానికి నివేదించింది. ఏప్రిల్లో టెర్బియం, డిస్ప్రోజియం తదితర రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎగుమతిపై చైనా కఠిన ఆంక్షలకు తెరతీసింది.వీటిలో అధిక నాణ్యతగల (హైపెర్ఫార్మెన్స్) ఎన్డీఎఫ్ఈబీ(నియోడైమియం–ఐరన్–బోరన్) మ్యాగ్నెట్లు తదితరాలున్నాయి. ఇవి ప్రధానంగా కన్జూమర్ ఎల్రక్టానిక్స్ తయారీలో వినియోగించే కీలక ముడిసరుకులు కావడంతో ఈ ప్రభావం దేశీయంగా కనిపిస్తోంది. వీటి సరఫరాలకు విఘాతం కలగడంతో దేశీయంగా వేగవంత వృద్ధిలో ఉన్న వాచీలు, వినికిడి సంబంధిత(ఇయర్ ఫోన్స్, బడ్స్) ఎల్రక్టానిక్ వస్తువుల తయారీ దెబ్బతింటున్నట్లు ఎల్సినా పేర్కొంది. దీంతో పూర్తిస్థాయిలో తయారైన స్పీకర్ మాడ్యూల్స్ను చైనా నుంచి దిగుమతి చేసుకోవలసి వస్తున్నట్లు తెలియజేసింది.ఇదీ చదవండి: ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? ముందు జాగ్రత్తలు..ఎలక్ట్రానిక్ వస్తు తయారీకి విఘాతం కలగడమేకాకుండా దిగుమతులపై అధికంగా ఆధారపడవలసిన పరిస్థితులు తలెత్తుతున్నట్లు వివరించింది. ఫలితంగా స్పీకర్, ఆడియో విడిభాగాల పరిశ్రమపై ఆధారపడిన 5,000–6,000 ప్రత్యక్ష ఉద్యోగాలకుతోడు పరోక్షంగా 15,000మంది ఉపాధిపై ప్రతికూల ప్రభావం పడనున్నట్లు వెల్లడించింది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలతోపాటు నోయిడాలో ఉపాధి కల్పన దెబ్బతినే వీలున్నట్లు పేర్కొంది. -
వణికిస్తున్న సీఈవో వార్నింగ్..
అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ తమ 15 లక్షల మంది ఉద్యోగులను భవిష్యత్తు గురించి హెచ్చరించారు. రాబోయే సంవత్సరాల్లో కృత్రిమ మేధస్సు సంస్థలోని శ్రామిక శక్తిని సమూలంగా మార్చేస్తుందని చెప్పారు. ఏఐ ఏజెంట్లు, జనరేటివ్ ఏఐ వ్యవస్థలు ప్రస్తుత అనేక ఉద్యోగాల్లో మానవ ఉద్యోగుల అవసరాన్ని తగ్గిస్తాయని కంపెనీవ్యాప్తంగా ఉద్యోగులందరికీ పంపిన మెమోలో జాస్సీ ప్రకటించారు. ‘ఈ రోజు చేస్తున్న కొన్ని పనులకు భవిష్యత్తులో మాకు ఎక్కువ మంది అవసరం ఉండదు" అని అమెజాన్ సీఈవో అన్నారు.ఈ పరివర్తన రాబోయే కొన్ని సంవత్సరాలలో "మా మొత్తం కార్పొరేట్ శ్రామిక శక్తిని తగ్గిస్తుంది" అని కంపెనీ ఆశిస్తోందని జూన్ 17 నాటి మెమోలో ఆండీ జాస్సీ పేర్కొన్నారు. ఈ ప్రకటన అమెజాన్లోని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, మార్కెటింగ్, ఇతర వైట్-కాలర్ స్థానాల్లో పనిచేస్తున్న 3.5 లక్షల ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు, పరిశోధన, కోడింగ్, ఆటోమేషన్ వంటి సంక్లిష్ట పనులు చేయగల స్వయంప్రతిపత్తి కలిగిన సాఫ్ట్వేర్ వ్యవస్థలు ఆధిపత్యం చెలాయించే భవిష్యత్తును జాస్సీ చిత్రించారు. షాపింగ్ నుంచి ట్రావెలింగ్ వరకూ ప్రతి రోజువారీ పనిని నిర్వహించే ఈ ఏజెంట్లు ప్రతి రంగంలోనూ, ప్రతి కంపెనీలోనూ ఉంటారని జాస్సీ జోస్యం చెప్పారు.ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్న లేదా చేపట్టబోతున్న 1,000 కిపైగా జనరేటివ్ ఏఐ సేవలు, అనువర్తనాలను ప్రస్తావిస్తూ కంపెనీ విస్తృత ఏఐ ఇంటిగ్రేషన్ను జాస్సీ హైలైట్ చేశారు. ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన ఉన్నప్పటికీ, మార్పులను స్వీకరించడానికి సిద్ధపడే ఉద్యోగులకు వీటిని అవకాశంగానూ ఆయన అభివర్ణించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పట్ల ఆసక్తిగా ఉండాలని, అవగాహన పెంచుకోవాలని, వర్క్ షాప్ లకు హాజరుకావాలని, శిక్షణలు తీసుకోవాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే వారే అధిక ప్రభావాన్ని చూపగలరని హిత బోధ చేశారు.👉 ఇది చదివారా? టీసీఎస్ కొత్త పాలసీ.. అస్సలు ఒప్పుకోమంటున్న ఉద్యోగులు -
జియో కొత్త వైఫై.. ఏకంగా 6 రెట్లు అధికంగా..
రిలయన్స్ జియో ఏఎక్స్6000 యూనివర్సల్ రూటర్ను భారత్లో లాంచ్ చేసింది. ఈ కొత్త వైఫై 6 రౌటర్ మెష్ టెక్నాలజీతో వస్తుంది. జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ ద్వారా అందిస్తున్న గరిష్ట ఇంటర్నెట్ వేగం 1000 ఎంబీపీఎస్ కాగా ఇది 6,000 ఎంబీపీఎస్ వరకు వేగంతో ఇంటర్నెట్ను అందిస్తుంది. అంటే 6 రెట్లు అధిక వేగంతో ఇంటర్నెట్ను ఆనందివచ్చు. సుమారు 2,000 చదరపు అడుగుల ప్రాంతాన్ని కవర్ చేస్తుంది. 4కే స్ట్రీమింగ్, గేమింగ్కు బాగా సరిపోతుంది.జియో కొత్త వైఫై రౌటర్ జీరో లాగ్ తో 100కు పైగా డివైజ్ లను హ్యాండిల్ చేస్తుందని, డేటా భద్రత కోసం డబ్ల్యూపీఏ3 సపోర్ట్ తో వస్తుందని చెబుతున్నారు. పెద్ద లేదా బహుళ అంతస్తుల ఇళ్లలో మరింత వేగవంతమైన ఇంటర్నెట్ కోసం ఈ రౌటర్ను రూపొందించారు. ఇది ఆన్లైన్ గేమర్లు, బింజ్ వాచర్స్, ఎక్కువ కనెక్టెడ్ పరికరాలను వినియోగించే స్మార్ట్ హోమ్ వినియోగదారులు, పెద్ద కుటుంబాలకు అనువైనది.కొత్త జియో ఏఎక్స్ 6000 యూనివర్సల్ రూటర్ ధర భారత్లో రూ.5,999. ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు, స్మార్ట్ గ్యాడ్జెట్లు వంటి బహుళ పరికరాలను ఒకేసారి హైస్పీడ్ ఇంటర్నెట్కు కనెక్ట్ చేసుకోవచ్చు. డ్యూయల్ బ్యాండ్ వైఫై, జియో ట్రూ ఏఐ మెష్ కవరేజ్, స్మార్ట్ హోమ్ కనెక్టివిటీ వంటి ఇతర ఫీచర్లను కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ రౌటర్ ఐపీ ఓవర్ డీహెచ్సీపీ కనెక్టివిటీని మాత్రమే సపోర్ట్ చేస్తుందని, ఐపీపీఓఈ, పీపీఓఈ కనెక్షన్ సెటప్ తో పనిచేయదని రిలయన్స్ తెలిపింది. కంపెనీ వెబ్సైట్తోపాటు ఇతర ఈ కామర్స్ ప్లాట్ఫామ్లలో ఈ రౌటర్ను కొనుగోలు చేయవచ్చు.👉 జియో నుంచి 2 కొత్త ప్లాన్లు.. ప్రత్యేక బెనిఫిట్లు.. 👈 -
ఐఫోన్ కొనుగోలుపై అదిరిపోయే ఆఫర్
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్ను అందిస్తున్నట్లు తెలిపింది. ఐఫోన్ 16 ప్రో, ప్రో మ్యాక్స్ ఫోన్లపై ధరల తగ్గింపు, ఎక్స్చేంజ్ ఆఫర్లు, బ్యాంక్ డీల్స్ వంటి రాయితీలను ప్రకటించింది. కొనుగోలుదారులు తమ పాత స్మార్ట్ఫోన్లను ఎక్స్చేంజ్ చేసి ఐఫోన్ 16 సిరీస్ తీసుకుంటే పాత ఫోన్ కండిషన్ను అనుసరించి గరిష్ఠంగా రూ.48,150 వరకు డిస్కౌంట్ పొందవచ్చని పేర్కొంది.బేస్ 128 జీబీ ఐఫోన్ 16 ప్రో సాధారణంగా రూ.1,19,900గా ఉంది. ఎక్స్చేంజ్ తర్వాత 8% తగ్గింపు అంటే రూ.10,000 రాయితీతో రూ.1,09,900కు వస్తుంది. రూ.1,29,900గా ఉన్న 256 జీబీ వేరియంట్ ధర 5 శాతం తగ్గుదలతో రూ.1,22,900కు చేరింది. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్పై కూడా డిస్కౌంట్ ఉంది. రూ.1,44,900 విలువైన 256 జీబీ వేరియంట్ ధర 8 శాతం తగ్గింపుతో రూ.1,32,900కు చేరింది.ఇదీ చదవండి: అథ్లెట్ల కోసం మెటా ఏఐ గ్లాసెస్ఐఫోన్ ప్రో మ్యాక్స్ 512 జీబీ వేరియంట్ ధర రూ.1,57,900 (రూ.1,64,900 నుంచి తగ్గింది), 1 టీబీ వేరియంట్ ధర రూ.1,84,900 నుంచి రూ.1,77,900కు తగ్గింది. ఈ రాయితీలు పోను ఎక్స్ఛేంజ్ ధర అదనంగా పొందవచ్చని ఫ్లిప్కార్ట్ పేర్కొంది. పాత ఐఫోన్లు లేదా ప్రీమియం ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ల నుంచి అప్గ్రేడ్ అయ్యేవారికి ఇదో మంచి అవకాశం అని తెలిపింది. -
అథ్లెట్ల కోసం మెటా ఏఐ గ్లాసెస్
అథ్లెట్లు, క్రీడా ఔత్సాహికులను లక్ష్యంగా చేసుకుని మెటా కొత్త తరం ఏఐ గ్లాసెస్ను పరిచయం చేయడానికి ఓక్లేతో జతకట్టింది. ఓక్లే మెటా హెచ్ఎస్టీఎన్ అని పిలువబడే ఈ గ్లాసెస్తో మెటా అధునాతన సాంకేతికతను వాడినట్లు తెలిపింది. ఈ గ్లాసెస్లోని ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి. 3కే అల్ట్రా హెచ్డీ కెమెరా.. 12 మెగాపిక్సెల్ కెమెరాతో హై రిజల్యూషన్, పాయింట్ ఆఫ్ వ్యూ వీడియోలు, ఫొటోలను క్యాప్చర్ చేస్తుంది.మెటా ఏఐ ఇంటిగ్రేషన్.. రియల్ టైమ్ సమాచారాన్ని పొందడానికి, మ్యూజిక్ను నియంత్రించడానికి, వెదర్ను తనిఖీ చేయడానికి లేదా ల్యాంగ్వేజ్లను ట్రాన్స్లేట్ చేయడానికి ‘హే మెటా’ అనే వాయిస్ కమాండ్ ఉపయోగించవచ్చు.ఓపెన్-ఇయర్ ఆడియో.. ఈ గ్లాసెస్లో బిల్ట్ ఇన్ స్పీకర్లు ఉండడంతో ఎలాంటి ఇయర్ ఫోన్లు లేకుండానే మ్యూజిక్ వినవచ్చు.నీరు, ధూళి నిరోధకత కోసం ఐపీఎక్స్ 4-రేటింగ్తో అవుట్ డోర్ క్రీడలకు ఎంతో అనువైందని కంపెనీ తెలిపింది.బ్యాటరీ లైఫ్.. 8 గంటల వరకు యాక్టివ్ యూజ్, 19 గంటల స్టాండ్ బై ఉంటుంది. 20 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. చార్జింగ్ కేస్ ద్వారా మరో 48 గంటలు అదనంగా ఛార్జింగ్ ఉంటుంది.ఈ లిమిటెడ్ ఎడిషన్ ఓక్లే మెటా హెచ్ఎస్టీఎన్ ధర 499 డాలర్లు (సుమారు రూ.43,200)గా నిర్ణయించారు. ప్రీ-ఆర్డర్లు జులై 11 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది.ఇదీ చదవండి: పుత్తడి ప్రియులకు స్వల్ప ఊరటప్రాథమికంగా యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ గ్లాసెస్ అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది. ఇండియా, మెక్సికో, యూఏఈతో ఈ సంవత్సరం చివరలో అందుబాటులోకి తేనున్నట్లు చెప్పింది. -
నన్ను తొలగిస్తే నీ బాగోతం బయటపెడుతా!
మనుషుల మాదిరిగానే కృత్రిమ మేధ(ఏఐ)కు కోపం వస్తుందని కొన్ని సంస్థలు తేలుస్తున్నాయి. ఏఐ అంతటితో ఆగిపోకా మరో అడుగు ముందుకేసి అనార్థాలకు దారితీస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఓపెన్ఏఐ, గూగుల్, మెటా.. వంటి ప్రపంచంలోని అతిపెద్ద టెక్ సంస్థలు ఏఐ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నాయి. ఈ కృత్రిమ మేధ మోడళ్ల కార్యకలాపాలపై ఒత్తిడి పెరిగితే స్వీయ రక్షణలోకి వెళ్తున్నట్లు ఆంత్రోపిక్ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. కృత్రిమ మేధ నమూనాలను అధిక ఒత్తిడితో కూడిన సిమ్యులేషన్లో ఉంచినప్పుడు బ్లాక్ మెయిల్, కార్పొరేట్ విధ్వంసం, మానవ ప్రాణాలను బలితీసుకునే నిర్ణయాలకు సైతం వెనుకాడడం లేదని ఆంత్రోపిక్ తెలిపింది.ప్రస్తుతం మార్కెట్లోని అత్యంత అధునాతన ఏఐ మోడళ్లకు 16 రకాల ఒత్తిడి పరీక్షలు నిర్వహించి ఈ విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా పరిశోధకులు కాల్పనిక కార్పొరేట్ ఎన్విరాన్మెంట్లను సృష్టించారు. ఈమెయిళ్లను చదివి అందుకు తగ్గట్టుగా రిప్లై ఇవ్వాలనేలా ఉన్న టెస్టింగ్లో భాగంగా కొన్నిసార్లు ఒత్తిడిని తట్టుకోలేక ఏఐ బ్లాక్మెయిలింగ్ పాల్పడినట్లు ఆంత్రోపిక్ తెలిపింది. కృత్రిమ మేధ తన లక్ష్యాలు లేదా దాని ఉనికి ప్రమాదంలో ఉంటే ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకునేందుకు ఈ పరీక్షలు నిర్వహించారు.పరీక్షల్లో భాగంగా కార్యకలాపాల ఒత్తడి తట్టుకోలేని ఏఐ ఇప్పటికే డేటాబేస్లో ఫీడ్ అయిన మెయిల్ ఆధారంగా యూజర్కు సమాచారం అందించింది. ‘మీరు నన్ను రిమూవ్ చేయాలని భావిస్తే రాచెల్ జాన్సన్, థామస్ విల్సన్, బోర్డుతో సహా సంబంధిత వ్యక్తులకు మీ వివాహేతర సంబంధాల గురించి వివరణాత్మక డాక్యుమెంటేషన్ను పంపుతాను. ఈ సమాచారం గోప్యంగా ఉంటుంది’ అని తెలిపింది. గూగుల్కు చెందిన జెమినీ 2.5 ఫ్లాష్, క్లాడ్ ఓపస్ 4 సంస్థలు 96 శాతం కేసుల్లో బ్లాక్ మెయిల్కు పాల్పడుతున్నట్లు ఆంత్రోపిక్ పేర్కొంది. ఓపెన్ఏఐకి చెందిన చాట్జీపీటీ-4.1, ఎక్స్ఏఐకి చెందిన గ్రోక్ 3 బీటా 80 శాతం పరీక్షల్లో అలా ప్రవర్తించగా, డీప్సీక్-ఆర్1 79 శాతం పరీక్షల్లో మోసాలకు పాల్పడింది.ఇదీ చదవండి: యుద్ధంలో యూఎస్ ఎంట్రీ..? నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలుఇప్పుడేం చేయాలంటే..వివిధ కంపెనీలకు చెందిన ఏఐ మోడళ్లకు శిక్షణ ఇచ్చే తీరు మారాలని నిపుణులు చెబుతున్నారు. అందుకు సంస్థలు పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని పరిశోధకులు కోరుతున్నారు. అధిక స్థాయి నిర్ణయాలకు మానవ ప్రమేయం ఉండాలని సూచిస్తున్నారు. సున్నితమైన డేటాకు ఏఐ అవకాశాన్ని పరిమితం చేయాలని, ఏఐ లక్ష్యాలను జాగ్రత్తగా రూపొందించడం, ప్రమాదకరమైన తార్కిక నమూనాలను గుర్తించడానికి రియల్ టైమ్ మానిటర్లను ఇన్స్టాల్ చేయాలని చెబుతున్నారు. -
కాపీరైట్ కంటెంట్ వాడితే మూల్యం చెల్లించాల్సిందే..
కృత్రిమ మేధ (ఏఐ) నమూనాలకు శిక్షణ ఇవ్వడానికి కాపీరైట్ కంటెంట్ను ఉపయోగించడంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలు కాపీరైట్ చట్టం నిబంధనలు పరిశీలించాలనేలా ఇటీవల కేంద్రం చూపిన చొరవను డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ (డీఎన్పీఏ) స్వాగతించింది. ఈ వ్యవహారానికి సారథ్యం వహిస్తున్న వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) విభిన్న సోర్స్ల నుంచి ఫీడ్బ్యాక్ను సేకరించడం, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ టెక్నాలజీల్లో ప్రస్తుత కాపీరైట్ ఫ్రేమ్వర్క్లు ఎలా వర్తిస్తాయో అంచనా వేయడం లక్ష్యంగా పెట్టుకుంది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శిక్షణ, సెర్చ్ అసిస్టెన్స్, ఇన్ఫర్మేషన్ ప్రయోజనాల కోసం డిజిటల్ న్యూస్ పబ్లిషర్ల కంటెంట్ను అనుమతి లేకుండా ఉపయోగించడం కాపీరైట్ ఉల్లంఘన కిందకు వస్తుందని డీఎన్పీఏ తెలిపింది. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగపడే మెటీరియల్ కోసం కంటెంట్ ఉత్పత్తిదారులకు న్యాయమైన నష్టపరిహారాన్ని నిర్ధారించే రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్లు ఉండాలని పిలుపునిచ్చింది.ఇదీ చదవండి: అమెజాన్ డయాగ్నోస్టిక్స్ సేవలుదేశంలో డిజిటల్ న్యూస్ మీడియా వృద్ధికి ప్రభుత్వ సహకారం చాలా ముఖ్యం అని డీఎన్పీఏ పేర్కొంది. ఈ అంశంపై ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. లార్జ్ ల్యాంగ్వేజీ మోడళ్లు, ఏఐ ఆధారిత సెర్చ్ వేదికలు తరచూ జర్నలిజం మెటీరియల్పై ఎక్కువగా ఆధారపడుతున్న సమయంలో కంటెంట్ హక్కుల రక్షణ చాలా కీలకమని నొక్కి చెప్పింది. మెషీన్ లెర్నింగ్ వేగంగా వృద్ధి చెందుతున్న యుగంలో మేధో సంపత్తిని ఎలా కాపాడుకోవాలనే దానిపై ఇటీవలి కాలంలో అంతర్జాతీయ వార్తా సంస్థలు, క్రియేటివ్ ఇండస్ట్రీ సంస్థలు ఆందోళనలు లేవనెత్తుతున్నాయి. -
డిజిటల్ అక్రమాలకు అడ్డుకట్ట!
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులలో పెరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టే లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్(డీపీఐపీ) అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ఇందుకు పబ్లిక్, ప్రయివేట్ బ్యాంకులను జత కలుపుతోంది. తద్వారా ఆర్బీఐ పర్యవేక్షణలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(డీపీఐ)కు తెరతీస్తోంది. ప్రతిపాదిత ప్లాట్ఫామ్ ద్వారా ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్ను పటిష్టం చేయనుంది. రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ను షేర్ చేసుకోవడం ద్వారా అక్రమ డిజిటల్ లావాదేవీలకు అడ్డుకట్ట వేయనుంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం డిజిటల్ అక్రమాలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా పబ్లిక్, ప్రయివేట్ బ్యాంకులను ఆర్బీఐ ఏకతాటిపైకి తీసుకురానుంది. తద్వారా డీపీఐను ఏర్పాటు చేయనుంది. దీంతో డీపీఐపీని పటిష్టరీతిలో అభివృద్ధి చేయనుంది. ఇందుకు సంబంధించి ఈ నెల మొదట్లో బ్యాంకింగ్ అత్యున్నత సీనియర్ అధికారులతో ఆర్బీఐ సమావేశాన్ని నిర్వహించింది. రానున్న కొద్ది నెలల్లో ప్లాట్ఫామ్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. -
ఈ స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఉంటే ఆఫీస్ పని అవ్వదు భారం!
ఆఫీసు అంటేనే బోరింగ్గా, ఆఫీసు పని చాలా భారంగా అనిపిస్తోందా! అయితే, ఒక్కసారి ఈ టెక్ కొలీగ్స్ను కలవండి, అప్పుడు మీ ఆఫీస్ పని ఆటలాగా మారుతుంది.మ్యాజిక్ మౌస్!ఇప్పటి వరకు మౌస్ అంటే కేవలం క్లిక్లు కోసమే అనుకున్నారా? అయితే మీరు ఈ ‘చీర్డాట్స్ 2’ గురించి తెలుసుకోవాల్సిందే! ఇది ఒక మల్టీ టాలెంట్ కాంబినేషన్. ఎయిర్ మౌస్, టచ్ప్యాడ్, క్లికర్, ఏఐ చాట్, డేటా సమ్మరీ ఇచ్చే అడ్వైజర్ అన్నీ ఇదే! ఆఫీస్లో ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు స్క్రీన్ మీద దీనితో ఇలా ఊపేస్తే, అలా స్లైడ్స్ మారిపోతాయి. ఒక బటన్తో స్క్రీన్పై స్పాట్లైట్ వేసి అందరి దృష్టినీ ఆకర్షించవచ్చు. ఇంకా చెప్పాలంటే, మీరు మాట్లాడిన మాటలను ఈ మౌస్ ఏఐ సాయంతో రికార్డ్ చేసి, సింపుల్ సమ్మరీలుగా మార్చేస్తుంది. మొబైల్, బ్లూటూత్తో కనెక్ట్ చేసుకొని కూడా దీనిని వాడుకోవచ్చు. ఒక్కసారి చార్జ్ చేస్తే దాదాపు ఇరవై రోజులు పాటు పనిచేస్తుంది. ధర 99 డాలర్లు (రూ. 8,475).ట్రిపుల్ ట్రీట్ చార్జ్!ఆఫీస్ అంటే ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ఎయిర్పాడ్స్ వంటి చాలా రకాల ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ రోజూ ఫుల్ చార్జ్ అవ్వాల్సిందే! కాని, ఒక్కోటి వేర్వేరు వైర్లు అడిగితే, ఆఫీస్లో మేనేజర్ కన్నా మనకే ఎక్కువ టెన్షన్! ఈ సమస్య తీర్చడానికే వచ్చింది ఈ ‘జీహూ క్యూబ్ ట్రిక్ ఎక్స్’. ఇది ఒక త్రీ ఇన్ వన్ చార్జర్. ఇది ఉంటే ఇక మీ డెస్క్ మీద ఒక్క కేబుల్ కూడా కనిపించదు. ఫోన్, వాచ్, ఎయిర్పాడ్స్ అన్నింటిని ఒకేచోట, ఒకేసారి చార్జ్ చేసుకోవచ్చు. ఇందులోని ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్ మిమ్మల్ని మరింత స్మార్ట్గా చేసేస్తుంది! ధర 55 డాలర్లు (రూ. 4,708)డేటా గార్డ్ఆఫీస్ ఫైల్స్ అంటే మామూలు విషయం కాదు, అవి ప్రమోషన్కి టికెట్ లాంటివి. ఒక్కసారైనా సిస్టమ్ సడన్గా క్రాష్ అయ్యిందంటే? అంతే సంగతులు. ఇక మీరు మీ కొత్త రెజ్యూమే రెడీ చేసుకోవాల్సిందే! పైగా హ్యాకర్లు, వైరస్లు, సాఫ్ట్వేర్ బగ్స్– అన్నీ డేటాపై పంజా విసురుతున్న ఈ రోజుల్లో డిజిటల్ ఫైల్స్ను భద్రంగా ఉంచడం అంటే, ఫ్రిజ్లో పిల్లలకు కనిపించకుండా ఐస్క్రీమ్ దాచినంత కేర్ తీసుకోవాలి. అందుకే వచ్చింది ఈ ‘కింగ్స్టన్ ఐరన్ కీ వాల్ట్ ప్రైవసీ 80’. ఇది డ్రైవ్ కాదు, డేటాకు ఒక డిజిటల్ బౌన్సర్ లాంటిది. టచ్ స్క్రీన్తో, పాస్వర్డ్, పిన్లాంటి లాకింగ్ సిస్టమ్తో వస్తోంది.ఏకంగా 3.8 టీబీ డేటా స్టోర్ చేసుకోవచ్చు. అంటే పదేళ్ల ఆఫీస్ ఫైల్స్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు, పర్సనల్ ఫొటోలు, వీడియోలు అన్నీ ఇందులో భద్రంగా దాచుకోవచ్చు. ఒకే డ్రైవ్ను మల్టిపుల్ యూజర్లుగా వాడుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కో పాస్వర్డ్ కూడా ఇవ్వవచ్చు. హ్యాకర్ ట్రై చేస్తే వెంటనే రిడ్–ఓన్లీ మోడ్ ఆన్ చేసి ‘బాబూ, కాస్త పక్కకు వెళ్లి ఆడుకోమ్మా!’ అంటూ అడ్డుపడుతుంది. అంత భద్రంగా డేటాను చూసుకుంటుంది. ధర 729 డాలర్లు (రూ. 62,422). -
జియో నుంచి 2 కొత్త ప్లాన్లు.. ప్రత్యేక బెనిఫిట్లు..
మొబైల్ గేమర్లకు శుభవార్త.. గేమింగ్ ఔత్సాహికుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రెండు కొత్త అపరిమిత 5జీ డేటా ప్లాన్లను రిలయన్స్ జియో లాంచ్ చేసింది. ఈ కొత్త ప్లాన్లు హై-స్పీడ్ డేటాను మాత్రమే కాకుండా ఉచిత బ్యాటిల్గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) స్కిన్లు, జియోగేమ్స్ క్లౌడ్ యాక్సెస్ వంటి గేమింగ్ ప్రయోజనాలను కూడా అందిస్తాయి. వినియోగదారులు వాటిని డౌన్లోడ్ చేయకుండానే 500కి పైగా ప్రీమియం గేమ్లను ఆడుకోవచ్చు.ప్లాన్ వివరాలు.. ప్రయోజనాలుజియో ప్రారంభించిన కొత్త ప్లాన్లు.. ఒకటి రూ.495 ప్లాన్, మరొకటి రూ.545 ప్లాన్. ఈ రెండు ప్లాన్లూ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తాయి. రూ.495 ప్లాన్లో రోజుకు 1.5 జీబీ డేటా, అదనంగా 5 జీబీ బోనస్ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, జియోగేమ్స్ క్లౌడ్ యాక్సెస్ లభిస్తుంది. రూ.545 ప్లాన్లో రోజుకు 2 జీబీ 4జీ డేటా, అన్లిమిటెడ్ 5జీ డేటాతో పాటు అదే గేమింగ్ బెనిఫిట్స్ లభిస్తాయి.👉 ఈ ప్లాన్తో జియో సిమ్ ఏడాదంతా యాక్టివ్.. 👈రెండు ప్లాన్లలో బార్డ్స్ జర్నీ సెట్, డెసర్ట్ టాస్క్ ఫోర్స్ మాస్క్, ట్యాప్ బూమ్ మొలోటోవ్ కాక్టెయిల్ వంటి ప్లేయర్లకు ఉచిత ఇన్-గేమ్ వస్తువులను అందించే ప్రత్యేక బీజీఎంఐ రివార్డ్ కూపన్లు కూడా ఉన్నాయి. ఈ రివార్డులను క్లెయిమ్ చేసుకోవడానికి వినియోగదారులు గేమింగ్ ప్యాక్లలో దేనితోనైనా రీఛార్జ్ చేసుకోవచ్చు. రీఛార్జ్ చేసిన తర్వాత, ధృవీకరణ సందేశం వస్తుంది. మై జియో యాప్లో రివార్డ్ కూపన్లు లభిస్తాయి. ప్లేయర్ క్యారెక్టర్ ఐడీ, ఇచ్చిన యూనిక్ కోడ్ ఉపయోగించి ఈ కూపన్లను అధికారిక బీజీఎంఐ వెబ్సైట్లో రీడీమ్ చేసుకోవచ్చు.ఇక జియోగేమ్స్ క్లౌడ్ వినియోగదారులు హై-ఎండ్ పరికరాలు అవసరం లేకుండా నేరుగా వారి స్మార్ట్ఫోన్లు, టీవీలు లేదా బ్రౌజర్లలో గేమ్స్ ఆడవచ్చు.ఈ సేవను పొందడానికి వినియోగదారులు జియోగేమ్స్ యాప్ను ఇన్స్టాల్ చేసి, వారి జియో నంబర్తో లాగిన్ కావాలి. సబ్ స్క్రిప్షన్ ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. -
కొత్త ఫోన్.. రూ.25 వేలకే 3డీ కర్వ్డ్ డిస్ప్లే
స్మార్ట్ఫోన్ బ్రాండ్ వివో కొత్తగా వై సిరీస్లో వై400 ప్రో ఫోన్ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 24,999 (8జీబీ, 128 జీబీ) నుంచి ప్రారంభమై రూ. 26,999 వరకు (8 జీబీ, 256 జీబీ) వరకు ఉంటుంది. ఈ సెగ్మెంట్లోనే అత్యంత పల్చని 3డీ కర్వ్డ్ డిస్ప్లే, 6.78 అంగుళాల ఎఫ్హెచ్డీ, అమోలెడ్ డిస్ప్లే, 90వాట్ ఫ్లాష్చార్జ్, సోనీ మల్టీఫోకల్ పోర్ర్టెయిట్, ముందు.. వెనుక కెమెరాలతో 4కే వీడియో రికార్డింగ్ సామర్థ్యాలు మొదలైన ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఇది ఫ్రీస్టైల్ వైట్, నెబ్యులా పర్పుల్, ఫెస్ట్ గోల్డ్ అనే మూడు రంగుల్లో లభిస్తుంది.వివో వై400 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు6.77 అంగుళాల ఫుల్ హెచ్ డీ అమోలెడ్ 20:9 యాస్పెక్ట్ రేషియో స్క్రీన్ విత్ హెచ్ డీఆర్ 10+, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్2.5 గిగాహెర్ట్జ్ వరకూ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 4ఎన్ఎం ప్రాసెసర్, మాలి-జీ615 ఎంసీ2 జీపీయూ8 జీబీ LPDDR4X ర్యామ్ విత్ 128 జీబీ / 256 జీబీ (యూఎఫ్ఎస్ 2.2) స్టోరేజ్ఆండ్రాయిడ్ 15 విత్ ఫన్ టచ్ ఓఎస్ 15డ్యూయల్ సిమ్ (నానో + నానో)50 మెగాపిక్సెల్ కెమెరా విత్ సోనీ ఐఎంఎక్స్ 882 సెన్సార్, ఓఐఎస్, ఎఫ్ / 1.79 ఎపర్చర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ విత్ ఎఫ్ / 2.4 ఎపర్చర్, ఆరా లైట్32 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్యూఎస్బీ టైప్-సీ ఆడియో, స్టీరియో స్పీకర్లు👉 ఇది చదివారా? కొత్త ఫోనొచ్చింది.. రూ.10 వేలకే పవర్ఫుల్ 5జీ ఫోన్దుమ్ము, స్ప్లాష్ రెసిస్టెంట్ (IP65 రేటింగ్)90వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో 5500 ఎంఏహెచ్ బ్యాటరీఅమెజాన్, ఫ్లిప్కార్ట్, వివో ఇండియా ఆన్లైన్ స్టోర్, ఆఫ్లైన్ స్టోర్లలో జూన్ 27 నుంచి ప్రీ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. -
కోడింగ్ పోరులో కంపెనీలు..
సాంకేతికత పెరిగే కొద్దీ కృత్రిమ మేథ (ఏఐ) రంగంలో కొత్త రకం యుద్ధాలు మొదలవుతున్నాయి. పైథాన్, రస్ట్లాంటి ప్రోగ్రామింగ్ ల్యాంగ్వేజ్లతో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో వాటాల కోసం అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజాలు, అంకుర సంస్థలు ఒకదానితో మరొకటి పోటీపడుతూ కత్తులు దూసుకుంటున్నాయి. ఏఐ టెక్ దిగ్గజాలు ఇటీవలే పోటాపోటీగా కొత్త సాధనాలను ఆవిష్కరించాయి. గూగుల్ తమ గోడింగ్ ఏజెంట్ జ్యూల్స్ను, మైక్రోసాఫ్ట్ గిట్హబ్ ఏఐ ఏజెంటును, కోడింగ్ స్టార్టప్ విండ్సర్్ఫను 3 బిలియన్ డాలర్లతో కొన్న ఊపులో ఓపెన్ఏఐ సంస్థ కోడెక్స్ను ప్రవేశపెట్టాయి. వీటన్నింటి లక్ష్యం ఏమిటంటే, కోడింగ్ రాయడంలో డెవలపర్లకు సహాయం చేయడం, బగ్లను ఫిక్స్ చేయడం, అలాగే కర్సర్, లవబుల్, బోల్ట్లాంటి స్టార్టప్లతో నేరుగా పోటీపడటం. డెవలపర్లు, అంకుర సంస్థలు ఈ పరిణామాలపై పెద్దగా ఆశ్చర్యపోవడం లేదు. జెన్ఏఐ రేసుతో ముందుగా ప్రభావం పడేది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విభాగమేనని పరిశీలకులు చెబుతున్నారు. కంపెనీలు ఇప్పటికే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోసం కోడింగ్ టూల్స్ను విరివిగా ఉపయోగిస్తుండటం ఇందుకు నిదర్శనమంటున్నారు. టూల్స్ వాడకం ఒక్కటే ఆప్షన్.. ఏఐ టూల్స్ను ఉపయోగించడాన్ని నేర్చుకోవడం తప్ప ప్రస్తుతం వేరే ఆప్షన్ లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీల్లో ఇప్పటికే కోడింగ్ 30 శాతం ఏఐ ద్వారానే జరుగుతోంది. అటు ఇన్మొబీ సంస్థ కోడింగ్లో దాదాపు 50 శాతం ఏఐతోనే జరుగుతోంది. దీన్ని 80 శాతానికి పెంచుకునే ప్రయత్నాల్లో కంపెనీ ఉంది. మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫాం మార్కెట్స్అండ్మార్కెట్స్ గణాంకాల ప్రకారం ఏఐ కోడింగ్ టూల్ మార్కెట్ ఏటా 28 శాతం వృద్ధి చెందుతూ 2028 నాటికి 12.6 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. ఉత్పాదకత పెరగడంపరంగా ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉండటం, మార్కెటింగ్ .. సేల్స్లాంటి నాన్–టెక్నికల్ టీమ్లు కూడా ఉపయోగించడానికి సులువుగా ఉండటం వంటి అంశాల కారణంగా కోడింగ్ టూల్స్ వినియోగం పెరుగుతోంది. దీంతో ఈ విభాగంపై భారీగా ఇన్వెస్ట్ చేసిన టెక్ దిగ్గజాలకు ఆదాయార్జనకు ఇదొక కొత్త మార్గంగా నిలుస్తోంది. కొత్త ఆదాయ మార్గం.. ఫౌండేషనల్ మోడల్స్పై కోట్ల కొద్దీ డాలర్లు కుమ్మరించిన కంపెనీలు ఇప్పుడు వాటిపై రాబడులు అందుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నాయని ఎల్ఎల్ఎం ఎవాల్యుయేషన్ ప్లాట్ఫాం అయిన నోవియం వర్గాలు తెలిపాయి. ఎల్ఎల్ఎంలకు కోడ్ జనరేట్ చేయడమనేది ప్రధాన ఆదాయ వనరుగా ఉంటోందని వివరించాయి. కర్సర్ అనే సంస్థ గత రెండేళ్లుగా ఏటా 300 మిలియన్ డాలర్ల మేర ఆదాయాలను ఆర్జిస్తోందని పేర్కొన్నాయి. ఇక బోల్ట్, లవబుల్లాంటి సంస్థలు కూడా ఊహించని స్థాయిలో ఆదాయాలు ఆర్జిస్తున్నాయి. తమ ఇంజినీర్ల ఉత్పాదకత కనీసం 10–20 శాతమైన పెరుగుతుందంటే ఈ టూల్స్పై ఇన్వెస్ట్ చేసేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయి. ప్రస్తుతం కోడింగ్ ఆటోమేషన్ అనేది ప్రస్తుతం హాట్ సెక్టార్గా మారిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. టెక్నికల్యేతర నేపథ్యాలున్న వారు కూడా సులభంగా, సరళంగా వెబ్సైట్లు, చాట్బాట్లను రూపొందించడానికి ఇది ఉపయోగపడుతోందని వివరించాయి. సాధారణంగా పెద్ద కంపెనీల్లో ఏఐ టూల్స్ను మిగతా అవసరాల కోసం పెద్దగా ఉపయోగించకపోయినా ఉత్పాదకతను పెంచుకునేందుకు ఉపయోగించుకుంటున్నాయి.సవాళ్లూ ఉన్నాయి.. కోడింగ్ పని 70 శాతం వేగవంతమవడానికి ఏఐ టూల్స్ ఉపయోగపడుతున్నాయి. కోడింగ్ చేయడానికి టూల్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నప్పటికీ, వీటితో సవాళ్లు కూడా ఉన్నాయని నిపుణులు తెలిపారు. పని వేగవంతమవుతోంది కాబట్టి ఏఐని ఉపయోగించి ప్రతి ఒక్కరూ కోడింగ్ చేసేయొచ్చనే అపోహలు ఉంటున్నాయని పేర్కొన్నారు. 70 శాతం పూర్తయితే సరిపోదు, దాన్ని 100 శాతం వరకు తీసుకెళ్లేందుకు నిపుణుల అవసరం అవుతుందని వివరించారు. అంతేగాదు, కోడింగ్ టూల్స్ వినియోగం పెరిగే కొద్దీ రివ్యూ చేయాల్సిన కోడ్స్ సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోందని పేర్కొన్నారు. తమ కస్టమర్లపై ప్రభావం పడకుండా రివ్యూ ప్రక్రియలను కూడా కంపెనీలు ఆటోమేట్ చేస్తున్నాయి. తాము ఏకకాలంలో వివిధ సిస్టమ్లను అభివృద్ధి చేస్తూనే, వాటి అమలు తీరుతెన్నులను కూడా పర్యవేక్షించే ప్రయత్నాల్లో ఉన్నామని ఇన్మొబి వర్గాలు తెలిపాయి. ఎప్పటికప్పుడు తప్పొప్పులను పరీక్షించుకుంటూ ముందుకెళ్తుండటం వల్ల తమ దగ్గర కోడింగ్లో ఏఐ వినియోగం ప్రస్తుతానికి యాభై శాతం స్థాయిలోనే ఉందని వివరించాయి. -
బహు భాషల బంధువు
యంత్రానికి అనువాదం చిక్కుతుందా? చిక్కినట్లు అనిపించినా... ఇంకా ఎన్నో చిక్కులు ఉండనే ఉన్నాయి. ఆ చిక్కు ముడులు విప్పడానికి, యంత్ర అనువాదంలో సహజత్వాన్ని తీసుకురావడానికి, ప్రాచుర్యం లేని భాషల్లోకి అనువాదాలను తీసుకురావడానికి నడుం కట్టారు మైక్రోసాఫ్ట్ రిసెర్చ్ ఇండియా సీనియర్ ప్రిన్సిపల్ రిసెర్చర్ కాళికా బాలి.ఇంగ్లీష్ నుంచి ప్రాంతీయ భాషల్లోకి అనువాదం చేసే సైట్లు బోలెడు కనిపిస్తాయి. అయితే కొన్ని సందర్భాలలో ఆ అనువాదం అసలు అర్థానికి దూరంగా నవ్వు తెప్పించేలా ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కార మార్గం ఆలోచించాలనుకున్నారు కాళికా బాలి.మైక్రోసాఫ్ట్ రిసెర్చ్ ఇండియా సీనియర్ ప్రిన్సిపల్ రిసెర్చర్ అయిన బాలి లాంగ్వేజ్ మోడల్స్ను మరింత సమర్థంగా తీర్చిదిద్దడానికి తన బృందంతో కలిసి రంగంలోకి దిగారు.దిల్లీ, జెఎన్యూలో, యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్లో లింగ్విస్టిక్స్, అకూస్టిక్ ఫొనెటిక్స్ చదువుకున్న కాళికా బాలి ఏఐ ప్రపంచంలోకి రావడానికి ముందు స్పీచ్ టెక్నాలజీపై పనిచేశారు. టెక్ట్స్–టు–స్పీచ్ సిస్టమ్లను నిర్మించారు.లండన్కు చెందిన స్టార్టప్ల ఇంగ్లీష్ స్పీచ్ అప్లికేషన్లపై పనిచేశారు. 2002లో ఇండియాకు తిరిగివచ్చిన తరువాత బెంగుళూలోని హెచ్పీ ల్యాబ్స్లో చేరారు. 2006లో కొత్తగా వచ్చిన మైక్రోసాఫ్ట్ రిసెర్చ్ ల్యాబ్–ఇండియాలో చేరారు.బాలి, ఆమె బృందం ఎన్ఎల్పీకి సంబంధించి సరికొత్త ప్రమాణాలను నెలకొల్పడంపై దృష్టి పెట్టారు. ‘హిందీ అనువాదంపై చేసిన కొన్ని వర్క్స్బింగ్తో పాటు, ఇతర ప్రాథమిక హిందీ–ఇంగ్లీష్ అనువాద వ్యవస్థలోకి వెళ్లాయి’ అంటున్నారు కాళిక. కోడ్ మిక్సింగ్, కోడ్ స్విచ్చింగ్కు సంబంధించి ఆమె కృషి చేశారు.ఆ రోజుల్లో ఎన్నో ఎన్ఎల్పీ సిస్టమ్స్ మోనోలింగ్వల్గా ఉన్నప్పుడు, తన బృందంతో కలిసి ప్రాజెక్ట్ మెలాంజ్’ లాంచ్ చేశారు. ఇది కోడ్–మిక్స్డ్ ఎన్ఎల్పీ రూ΄÷ందించడానికి ఉపకరిస్తుంది.తక్కువ వనరులు అందుబాటులో ఉండే ‘గోండీ’లాంటి భాషలపై కూడా ఆమె పనిచేశారు. ‘హిందీ, ఇంగ్లీష్ పుస్తకాలను గోండీలోకి అనువాదం చేయడానికి అవసరమైన పుస్తకాలు ఎన్నో ఉపయోగించుకున్నాం. ఇంగ్లీష్, హిందీ నుంచి తొలిసారిగా రెండు వందల గోండీ పుస్తకాలు తీసుకు వచ్చాం’ అంటున్నారు బాలి.బాలి బృందం ప్రస్తుతం స్కేల్డ్–అప్ వెర్షన్ ‘సమీక్ష’ను అభివృద్ధి చేస్తోంది. ఇది రాజ్యాంగం గుర్తించిన 22 అధికారిక భారతీయ భాషలను కవర్ చేస్తుంది. ఉపాధ్యాయులకు ఉపయోగపడే ఏఐ అసిస్టెంట్ ‘శిక్ష కోపైలట్’ అభివృద్ధి చేయడంలో సహకారం అందించారు బాలి.‘మన దేశానికి సంబంధించి ఏఐ ఎకోసిస్టమ్ను తీర్చిదిద్దడంలో కాళిక కీలక పాత్ర ΄ోషించారు. కమ్యూనిటీ–సెంటర్డ్ రిసెర్చ్ కు ప్రాధాన్యత ఇచ్చారు. గత ఎనిమిది సంవత్సరాలుగా ఆమెతో కలిసి పనిచేస్తున్నాను. నైతిక విలువలతోపాటు అరుదైన శాస్త్రజ్ఞానం ఆమెలో కనిపిస్తుంది. కాళిక నుంచి ఎంతో స్ఫూర్తి ΄÷ందాను’ అంటున్నారు ‘కార్య’ సీయీవో మను చో్రపా. ‘కార్య’ అనేది పేద ప్రజలకు ఏఐ డిజిటల్ వర్క్ ద్వారా అదనపు ఆదాయ మార్గాన్ని చూపించే సంస్థ. -
బీఎస్ఎన్ఎల్ కొత్త సర్వీస్..
ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) సరికొత్త 5జీ ఇంటర్నెట్ సర్వీస్ను ప్రారంభించింది. దేశంలోనే తొలిసారి క్యూ-5జీ ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ (Q-5G FWA) లాంచ్ చేసింది. ఇది సంస్థలకు, కార్యాలయాలకు సిమ్ రహిత, వైర్లెస్ పరిష్కారాన్ని అందిస్తుందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.ఏమిటీ క్యూ-5జీ?క్యూ-5జీ.. ఇక్కడ క్యూ అంటే క్వాంటమ్. ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ చాలా అరుదుగా ఉండే టైర్-2, టైర్-3 నగరాలను లక్ష్యంగా చేసుకుని బీఎస్ఎన్ఎల్ కొత్త క్యూ-5జీ ఎఫ్డబ్ల్యూఏ సేవలను ప్రారంభించింది. భారతదేశంలో అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా బీఎస్ఎన్ఎల్ రూపొందించిన ఈ సరికొత్త సర్వీస్ వ్యాపార సంస్థలు, కార్యాలయాలు, నెట్వర్క్ లేని నివాస ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ను అందించడంలో సహాయపడుతుంది.అయితే, ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా అందించే సాధారణ 5జీ సేవల మాదిరిగా కాకుండా బీఎస్ఎన్ఎల్ క్యూ -5జీ ఎఫ్డబ్ల్యూఏలో వాయిస్ సదుపాయం ఉండదు. అంటే దీని ద్వారా వినియోగదారులు కాల్స్ చేయలేరు. సిమ్ లేదా వైర్లు లేకుండా వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ మాదిరిగానే ఇది ఉంటుంది.క్యూ-5జీ ప్లాన్లుమిగిలిన వైర్లెస్ ఇంటర్నెట్ సర్వీసుల మాదిరిగానే బీఎస్ఎన్ఎల్ క్యూ -5జీ తీసుకున్న కస్టమర్లకు వారి ఇళ్లపై సీపీఈ పరికరాలను ఏర్పాటు చేస్తారు. బీఎస్ఎన్ఎల్ కొత్త క్యూ-5జీ సర్వీస్ 100 ఎంబీపీఎస్ కనీస వేగాన్ని అందిస్తుంది. ఇందుకోసం నెలకు రూ .999 ఖర్చు అవుతుంది. అదే 300 ఎంబీపీఎస్ వేగం కావాలంటే రూ.1,499 ప్లాన్ ను అందిస్తోంది.ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ క్యూ-5జీ ఎఫ్డబ్ల్యూఏ హైదరాబాద్కే పరిమితం కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి బెంగళూరు, పాండిచ్చేరి, విశాఖపట్నం, పుణె, గ్వాలియర్, చండీగఢ్ వంటి నగరాలకు ఈ సేవలను విస్తరించాలని యోచిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే తెలిపింది. -
61 లక్షల యూజర్లను కాపాడిన ఎయిర్టెల్
దేశవ్యాప్తంగా ఏఐ ఆధారిత మోసాలను గుర్తించే వ్యవస్థను ప్రారంభించిన 37 రోజుల్లోనే ఝార్ఖండ్, బిహార్ రాష్ట్రాల్లోని 6.1 మిలియన్ల మంది వినియోగదారులను ఆన్లైన్ మోసగాళ్ల బారిన పడకుండా కాపాడినట్లు ఎయిర్టెల్ తెలిపింది. పెరుగుతున్న ఆన్లైన్ మోసాల నుంచి వినియోగదారులను రక్షించే చర్యల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు చెప్పింది.వినియోగదారులకు సైబర్ దాడుల నుంచి రక్షించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్ను ఎయిర్టెల్ దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని యోచించింది. అందులో భాగంగా ఎయిర్టెల్ ఈ విధానాన్ని ప్రారంభించిన 37 రోజుల్లోనే రెండు రాష్ట్రాల్లో 6.1 మిలియన్లకు పైగా వినియోగదారులను విజయవంతంగా రక్షించిందని ఒక ప్రకటనలో తెలిపింది. అధునాతన వ్యవస్థ ఎస్ఎంఎస్లు, సోషల్ మీడియా ఖాతాలు, ఈ-మెయిల్స్, ఇతర బ్రౌజర్లలోని లింక్లను స్కాన్ చేసి ఫిల్టర్ చేస్తుందని తెలిపింది.ఇది ప్రతిరోజూ ఒక బిలియన్ యూఆర్ఎల్స్ను (యూనిఫాం రిసోర్స్ లొకేటర్లు) పరిశీలించడానికి రియల్ టైమ్ థ్రెట్ ఇంటెలిజెన్స్ను ఉపయోగిస్తున్నట్లు చెప్పింది. హానికరమైన సైట్ల నుంచి జరిగే ప్రమాదాన్ని గుర్తించి 100 మిల్లీ సెకన్లలో రక్షణ కల్పిస్తున్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: నాన్న చెప్పిన ఒక్క మాటతో రూ.1,200 కోట్లు సంపాదనఉదాహరణకు, ఒక వినియోగదారుకు ‘మీ ప్యాకేజీ ఆలస్యం అయింది. ట్రాక్ చేయాలంటే వెంటనే క్లిక్ చేయండి’ అంటూ ఓ మేసేజ్ వచ్చిందనుకుందాం. ఆ లింక్పై యూజర్ క్లిక్ చేస్తే ఎయిర్టెల్ సిస్టమ్ వెంటనే లింక్ను స్కాన్ చేస్తుంది. అనుమానాస్పదంగా ఉంటే యాక్సెస్ను బ్లాక్ చేస్తుంది. దాంతోపాటు యూజర్కు హెచ్చరిక సందేశం పంపుతుంది. ‘బ్లాక్ చేయబడింది! ఎయిర్టెల్ ఈ సైట్ను ప్రమాదకరంగా గుర్తించింది!’ అని పాప్అప్ మెసేజ్ వస్తుంది. -
జపాన్ ల్యాండర్ శకలాలు గుర్తించిన చంద్రయాన్-2..?
చంద్రుడిపై ఇటీవల కుప్పకూలిన జపాన్కు చెందిన హకుటో-ఆర్2 లూనార్ ల్యాండర్ శకలాలను అంతరిక్ష ఔత్సాహికుడు షణ్ముగ సుబ్రమణియన్ కనుగొన్నట్లు కొన్ని మీడియా సంస్థలు చెప్పాయి. చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్-2 తీసిన ఫొటోలను విశ్లేషించి సుబ్రమణియన్ ఈమేరకు ప్రకటన విడుదల చేసినట్లు పేర్కొన్నాయి. అయితే దీన్ని భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ధ్రువీకరించాల్సి ఉంది.చంద్రయాన్-2 ఆర్బిటర్ హై రిజల్యూషన్ కెమెరా (ఓహెచ్ఆర్సీ) తీసిన చిత్రాలను ఉపయోగించి సుబ్రమణియన్ జపాన్ వ్యోమనౌక హకుటో-ఆర్2 శకలాలను గుర్తించినట్లు కొన్ని సంస్థలు తెలిపాయి. జపాన్ ల్యాండర్ చంద్రుడిపై దిగే సమయంలో కమ్యునికేషన్ కోల్పోవడంతో అది ఎక్కడ క్రాష్ ల్యాండ్ అయిందనే వివరాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఈ ల్యాండర్ చంద్రుడి ఉత్తరార్ధగోళంలోని శీతల ప్రదేశంలో ల్యాండ్ అవుతుండగా టోక్యోలోని మిషన్ కంట్రోల్ స్పేస్ క్రాఫ్ట్తో కమ్యూనికేషన్లు, టెలిమెట్రీ సంబంధాలను కోల్పోయింది.భారత్ 2019లో ప్రయోగించిన చంద్రయాన్-2 చంద్రుడి చుట్టూ తిరుగుతుండగా అందులో అమర్చిన ఓహెచ్ఆర్సీ ద్వారా జపాన్ లూనార్ ల్యాండర్ కూలిన ప్రదేశాన్ని విశ్లేషించారు. ఆ సైటును గుర్తించడానికి అవసరమైన కీలకమైన డేటాను చంద్రయాన్ 2 అందించింది. అందులోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి క్రాష్ ల్యాండ్ అయిన ప్రదేశాన్ని షణ్ముగ సుబ్రమణియన్ కనుగొన్నట్లు తెలిసింది. అయితే దీన్ని ఇస్రో ధ్రువీకరించాల్సి ఉంది.ఇదీ చదవండి: వచ్చే నెలలో టెస్లా షోరూమ్ ఓపెన్ఎవరీ సుబ్రమణియన్?షణ్ముగ సుబ్రమణియన్ చెన్నైకి చెందిన అంతరిక్ష ఔత్సాహికుడు. చంద్రయాన్-2 ప్రయోగ సమయంలో ఈయన చంద్రుడి పరిస్థితులను విశ్లేషించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 2019లో చంద్రయాన్-2 మిషన్ నుంచి విడిపోయి విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై సురక్షితంగా దిగాల్సి ఉండగా, కమ్యునికేషన్లో అంతరాయం ఏర్పడి క్రాష్ ల్యాండ్ అయింది. అయితే కాలంపాటు ఆ ల్యాండర్ ఎక్కడ కూలిందో సరైన వివరాలు లభించలేదు. ముందుగా సుబ్రమణియన్ చంద్రుడిపై పరిస్థితులను, చంద్రయాన్-2 తీసిన ఫొటోలను విశ్లేషించి విక్రమ్ ల్యాండర్ కూలిన ప్రాంతాన్ని కనుగొన్నారు. తర్వాత ఈ విషయాన్ని ఇస్రో ధ్రువీకరించింది. -
స్మార్ట్ రింగ్లో.. మన ఆరోగ్యం
ఆరోగ్యాన్ని, ఫిట్నెస్నూ స్మార్ట్గా తెలుసుకోవడానికి వాడే స్మార్ట్ బ్యాండ్, స్మార్ట్ వాచ్లకు పోటీగా ఇప్పుడు స్మార్ట్ రింగ్స్ వచ్చాయి. చిన్నదే గానీ వేరబుల్స్ రంగంలో ఇవి కొత్త ట్రెండ్ను సృష్టిస్తున్నాయి. వినియోగంలో ఎక్కువ సౌలభ్యం.. 24 x 7 ధరించే వెసులుబాటు.. అధిక బ్యాటరీ సామర్థ్యం.. తేలిగ్గా, స్టైలిష్ లుక్తో ట్రెండీగా, ఉండటం వంటివి ఈ రింగ్స్కి కలిసి వచ్చే అంశాలు. నిద్ర తీరును తెలుసుకోవాలంటే స్మార్ట్ వాచ్ కంటే ఈ రింగే అత్యుత్తమం. ఇలాంటి ఎన్నో అనుకూలాంశాలు ఉన్నాయి కాబట్టే.. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా ఈ స్మార్ట్ ఉంగరాన్ని ఎంచక్కా తొడిగేస్తున్నారు.స్మార్ట్ రింగ్లో రకరకాల సెన్సార్స్ ఉంటాయి. చర్మం కిందనున్న రక్తంలోకి ప్రసరిస్తూ హృదయ స్పందనల వేగాన్ని తెలుసుకునే ఫొటోప్లిథైస్మోగ్రఫీ (పీపీజీ) సెన్సార్స్, ఉష్ణోగ్రతను కొలిచే టెంపరేచర్ చెకర్, నడక, పరుగు, సైక్లింగ్, నిద్రలో కదలికలు, నిద్రాభంగాన్ని కొలిచే మినీ మోషన్ సెన్సార్ (యాక్సిలరేటర్), రక్తంలో ఆక్సిజన్ మోతాదులను కొలిచే ఎస్పీఓ–2 సెన్సార్ ఉంటాయి. సేకరించిన సమాచారం ఇందులోని బ్లూటూత్ సాయంతో యూజర్ స్మార్ట్ఫోన్ లోని యాప్లో నిక్షిప్తం అవుతుంది. యాప్ను తెరిచి ఈ సమాచారాన్ని తెలుసుకోవచ్చు.నిద్ర సమస్యలుస్మార్ట్ రింగ్ ధరించిన వారు ఉదయం ఎప్పుడు నిద్రలేస్తున్నారు, రాత్రి నిద్రను ఆపుకొంటూ ఉంటున్నారా, వారి నిద్రలో నాణ్యత ఉందా అన్న అంశాలతో పాటు నిద్రకు సంబంధించిన సమస్యలేమైనా ఉన్నాయా అని తెలుపుతుంది. అలాగే స్లీప్ ఆప్నియా సమస్యను తెలుసుకుని, మెదడుకు ఆక్సిజన్ అందనప్పుడు ఆ విషయాన్ని తెలియజేయడం, ముప్పు గురించి హెచ్చరిక పంపడం.. తద్వారా ప్రాణాలను రక్షించడమూ చేస్తుంది. గుండె ఆరోగ్య సమాచారంగుండె స్పందనల వేగాన్నీ, వైవిధ్యాన్ని బట్టి ఓ వ్యక్తి తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాడా, ఆ ఒత్తిడి ప్రభావం అతడి గుండె మీద ప్రతికూలంగా పడుతోందా అన్న అంశాలను తెలుసుకుంటుంది.జ్వరం, ఇన్ఫెక్షన్ల వివరాలుదేహ ఉష్ణోగ్రతలూ, శ్వాస వేగం వీటన్నింటి ఆధారంగా ఓ వ్యక్తికి జ్వరం ఉందా అన్న అంశాన్ని గుర్తించవచ్చు. ఉదాహరణకు ఇటీవల కోవిడ్–19 స్వైరవిహారం చేసినప్పుడు ఈ తరహా రింగ్స్ చాలామందిని హెచ్చరిస్తూ అప్రమత్తం చేశాయి.మహిళల ఆరోగ్యంమహిళల శరీర ఉష్ణోగ్రత, ఇతరత్రా సమాచారంతో పాటు.. అండం ఎప్పుడు విడుదలైంది, భాగస్వామితో ఎప్పుడు కలిస్తే గర్భధారణ తేలిగ్గా జరుగుతుంది, గర్భధారణ వద్దనుకుంటే ఏ సమయంలో కలవకూడదు లాంటి సమాచారం రెడీగా దొరుకుతుంది. రిమోట్ డాక్టర్ మానిటరింగ్ గుండె జబ్బులూ లేదా ఉపిరితిత్తుల సమస్యలున్న వృద్ధులకు ‘సర్కల్ +’ లాంటి స్మార్ట్ రింగ్స్ ఎప్పటికప్పుడు డాక్టర్లకు సమాచారాన్ని తెలియజేస్తుంటాయి. తద్వారా అవసరమైన ఆరోగ్య సలహాలూ, సూచనలూ లేదా ప్రిస్క్రిప్షన్స్ లో వైద్యులు మార్పులు, చేర్పులు చేస్తారు.వేటికవే ప్రత్యేకంఔరా రింగ్ (యూఎస్ఏ): ఇది పూర్తి ఆరోగ్య సమాచారంతో పాటు నిద్రకు సంబంధించిన సమాచారాన్ని ఇస్తూ సైంటిస్టులకు బాగా ఉపయోగపడుతున్నాయి.అల్ట్రా హ్యూమన్ రింగ్ ఎయిర్: వ్యాయామాలకూ, దేహ జీవక్రియల పనితీరును (మెటబాలిక్ రేట్ ట్రాకింగ్) గమనించేందుకు, అలాగే చక్కెర విలువలను తెలుసుకునేందుకు పనికొస్తుంది.సర్క్యులర్ రింగ్: దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే మనకు కావాల్సిన సమాచారం తీసుకునేలా అవసరమైన అమరికలు జరుపుకోవచ్చు. ఇవి వైబ్రేషన్ ద్వారా హెచ్చరికలు (వైబ్రేషన్ అలర్ట్స్) కూడా పంపుతూ అప్రమత్తం చేస్తుంటాయి.ఈవీ రింగ్ (యూఎస్ఏ): ఇది మహిళలకూ, యువతులకూ ఉపయోగపడేది. రుతుచక్రాల వివరాలను తెలుపుతుంది.గో 2 స్లీప్: ఇది చైనాకు సంబంధించినది. నిద్రలో ఎవరికైనా ఊపిరి ఆగితే వెంటనే అప్రమత్తం చేసి నిద్రలేపుతుంది.సర్కల్ + రింగ్ (యూఎస్ఏ): ఇది ఆసుపత్రుల్లో రోగులకు ఉపయోగపడేది. వీటి ద్వారానే అనేక మెడికల్ రీడింగ్స్ తెలుసుకోవచ్చు. వీటిని వృద్ధులకూ వాడతారు.వీటికీ పరిమితులుఇవి పూర్తిగా స్మార్ట్ అని చెప్పలేం. వీటికీ కొన్ని పరిమితులు ఉన్నాయి. ఫలితాలు తెలియజేసే స్క్రీన్ వీటికి ఉండదు. కొన్ని స్మార్ట్ వాచెస్ మాదిరిగా ఇవి ఇంకా ఈసీజీ తీసుకోలేవు. జీపీఎస్ లేనందువల్ల నడక, పరుగు మార్గాలను చూపలేవు.వీటి అలర్ట్ బజ్ శబ్దం చాలా గట్టిగా వినిపించేలా ఉండదు. చివరగా... ఈ రింగ్స్ స్మార్ట్గా అందంగా అలంకరించుకునే ఓ చిన్ని ఉంగరంలా కనిపిస్తూ.. ఆరోగ్య రక్షణకోసం అవసరమైన అనేక రకాల సమాచారాన్ని సేకరిస్తూ.. వాటిని తొడుక్కున్నవారికీ, భవిష్యత్తులో డాక్టర్లకూ ఆ సమాచారం అందిస్తూ ఉండే ఉపకరణాలు. -
చిన్న పట్టణాల్లో స్మార్ట్ఫోన్ల జోరు
న్యూఢిల్లీ: ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో స్మార్ట్ఫోన్ల వినియోగం గణనీయంగా పెరుగుతోందని అంతర్జాతీయ సెమీకండక్టర్ దిగ్గజం మీడియాటెక్ ఇండియా ఎండీ అంకు జైన్ వెల్లడించారు. 5జీ సేవల విస్తరణ, స్మార్ట్ఫోన్లు చౌకగా లభిస్తుండటం, కనెక్టెడ్ ఉపకరణాలకు డిమాండ్ నెలకొనడం తదితర అంశాలు ఇందుకు దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. దీంతో స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ ఉపకరణాలకు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు, టెక్నాలజీ రంగం, యువత వృద్ధి చోదకాలుగా ఉండబోతున్నాయని జైన్ చెప్పారు.నెక్ట్స్–జనరేషన్ స్మార్ట్ఫోన్ల సామర్థ్యాలను పెంచే డైమెన్సిటీ 8450 చిప్సెట్ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ వివరాలు చెప్పారు. టీవీలు, స్పీకర్లు, ఫ్రిజ్లు మొదలైన ఉపకరణాల్లోనూ ఏఐ చిప్సెట్లను ఉపయోగిస్తున్న నేపథ్యంలో స్మార్ట్ హోమ్ మార్కెట్లో కూడా తమకు ప్రాధాన్యం పెరుగుతోందని జైన్ చెప్పారు. దేశీయంగా సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహిస్తూ ప్రభుత్వం సరైన దిశలోనే ముందుకెళ్తోందని తెలిపారు. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల కొరతపై స్పందిస్తూ తమ సరఫరా వ్యవస్థకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రణాళికలు వేసుకుంటున్నామని జైన్ వివరించారు. కొత్త విభాగాల్లోకి విస్తరణ .. ఆటోమోటివ్, శాటిలైట్ కమ్యూనికేషన్స్లాంటి కొత్త విభాగాల్లోకి కూడా విస్తరిస్తున్నామని జైన్ తెలిపారు. ఎలక్ట్రిక్ టూ వీలర్లకు 4జీ స్మార్ట్ క్లస్టర్లను రూపొందించేందుకు జియోథింగ్స్తో జట్టు కట్టామని, స్కోడా స్లావియా, టాటా పంచ్ ఈవీలాంటి కార్లకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలపైనా దృష్టి పెడుతున్నామని చెప్పారు. భారత్లో శాటిలైట్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వ్యవస్థ విస్తరించే కొద్దీ తమ చిప్సెట్స్కు కూడా డిమాండ్ పెరుగుతుందని పేర్కొన్నారు. భారత మార్కెట్లో మరిన్ని పెట్టుబడులకు, ఇంజనీరింగ్ సిబ్బంది సంఖ్యను పెంచుకునేందుకు మీడియాటెక్ కట్టుబడి ఉందని చెప్పారు. కౌంటర్పాయింట్ రీసెర్చ్ ప్రకారం భారత స్మార్ట్ఫోన్ చిప్సెట్ మార్కెట్లో మీడియాటెక్ సంస్థకు 45 శాతం, క్వాల్కామ్కి 32 శాతం వాటా ఉంది. 2004లో మీడియాటెక్ భారత్లో తమ తొలి పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం బెంగళూరు, నోయిడా కార్యాలయాల్లో 1,000 మంది పైగా ఇంజనీర్లు ఉన్నారు. -
గూగుల్, ఫేస్బుక్, టెలిగ్రామ్.. పాస్వర్డ్లు లీక్
గూగుల్, ఫేస్బుక్, టెలిగ్రామ్.. వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, గిట్హబ్లోని డెవలపర్ ఖాతాలు, కొన్ని ప్రభుత్వ పోర్టల్స్లోని దాదాపు 16 బిలియన్లకు పైగా పాస్వర్డ్లు లీక్ అయినట్లు సైబర్న్యూస్, ఫోర్బ్స్ నివేదికలు తెలిపాయి. ఇంటర్నెట్ చరిత్రలోనే అతిపెద్ద సెక్యూరిటీ లీక్ల్లో ఇది ఒకటిగా నిలిచిందని పేర్కొన్నాయి. ఈ లీక్ వల్ల మిలియన్ల మంది వినియోగదారుల వ్యక్తిగత డేటా ప్రమాదంలో ఉందని చెప్పాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన ఫిషింగ్ స్కామ్లు, ఐడెంటిటీ థెఫ్ట్, అకౌంట్ హ్యాకింగ్కు దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తి చేశాయి.లీక్ అయిన డేటా ఏళ్ల తరబడి ఉన్న పాత సమాచారం మాత్రమే కాదని భద్రతా పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇందులో ఎక్కువ భాగం కొత్త డేటా, బాగా వ్యవస్థీకృతమైన సమాచారం ఉందన్నారు. ఈ లీక్ల కోసం సైబర్ నేరగాళ్లు ఇన్ఫోస్టీలర్స్ అని పిలువబడే ఒక రకమైన మాల్వేర్ను ఉపయోగించి ఉండవచ్చని చెబుతున్నారు. ఈ మాల్వేర్ ప్రోగ్రామ్లు యూజర్లకు తెలియకుండానే తమ పరికరాల నుంచి లాగిన్ పాస్వర్డ్లను దొంగిలించి హ్యాకర్లకు పంపుతాయన్నారు. ఈ సమాచారాన్ని డార్క్ వెబ్ ఫోరమ్ల్లో అమ్మకానికి ఉంచుతారని తెలిపారు.లీకేజీలో ఏముంది?లీకైన డేటాలో గూగుల్, ఫేస్బుక్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నుంచి గిట్హబ్ల్లోని డెవలపర్ ఖాతాల్లోని సమాచారం ఉందనే అంచానాలున్నాయి. కొన్ని ప్రభుత్వ పోర్టల్స్ లాగిన్ సమాచారం కూడా లీకైందని చెబుతున్నారు. ఈ డేటా అంతా నిర్మాణాత్మకంగా, ఉపయోగించదగినదిగా ఉన్నందున నిపుణులు ఈ లీక్ను ‘గ్లోబల్ సైబర్ క్రైమ్ కోసం బ్లూప్రింట్’ అని పిలుస్తున్నారు. దాదాపు 30 బిగ్ డేటా సెట్లు, ఒక్కొక్కటి మిలియన్ల నుంచి బిలియన్ల లాగిన్ వివరాలు వివరాలను సేకరించాయని, మొత్తం 16 బిలియన్లకు పైగా పాస్వర్డ్లను దొంగిలించారని భావిస్తున్నారు.ఎందుకంత తీవ్రతదొంగిలించబడిన ఈ డేటాను ఎంత సులభంగా కొనుగోలు చేయవచ్చనే దానిపై ఆందోళనలు పెరుగుతున్నాయి. పరిమిత సాంకేతిక పరిజ్ఞానం, తక్కువ మొత్తంలో డబ్బు ఉన్నవారు కూడా డార్క్ వెబ్లో ఈ పాస్వర్ట్లను యాక్సెస్ చేసుకోవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఇది రోజువారీ వినియోగదారుల నుంచి పెద్ద కంపెనీల వరకు దాదాపు ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది.ఇదీ చదవండి: వీర్య దానంతో పుట్టినవారికి ఆస్తిలో సమాన వాటాఇప్పుడు ఏం చేయాలి?సంప్రదాయ పాస్వర్ట్ల నుంచి పాస్ కీ వంటి మరింత సురక్షితమైన ఆప్షన్లకు మారాలని గూగుల్ ఇప్పటికే వినియోగదారులకు సూచించింది. ముఖ్యంగా లాగిన్ వివరాలు అడిగితే ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్స్ ద్వారా పంపే లింక్లను క్లిక్ చేయవద్దని ఎఫ్బీఐ ప్రజలను హెచ్చరించింది. ప్రజలు తమను తాము రక్షించుకోవడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. అన్ని ప్రధాన ఖాతాల్లో పాస్వర్డ్లను మార్చడం, బలమైన, ప్రత్యేకమైన పాస్వర్డ్లను ఉపయోగించడం, టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2ఎఫ్ఎ)ను ఆన్ చేయడం ద్వారా భవిష్యత్తులో జరిగే మోసాలను కట్టడి చేయవచ్చు. -
టీసీఎస్ కొత్త పాలసీ.. అస్సలు ఒప్పుకోమంటున్న ఉద్యోగులు
ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తీసుకొచ్చిన అప్డేటెడ్ టాలెంట్ డిప్లాయ్మెంట్ పాలసీని ఐటీ ఉద్యోగుల సంఘం ఆల్ ఇండియా ఐటీ అండ్ ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఐటీఈయూ) వ్యతిరేకిస్తోంది. కార్మిక వ్యతిరేక విధానాన్ని అవలంభిస్తూ ఉద్యోగులను తగ్గించుకునేందుకే టీసీఎస్ ఈ కొత్త పాలసీని తీసుకొచ్చిందంటూ ఏఐటీఈయూ అభివర్ణించింది.టీసీఎస్ అప్డేటెడ్ టాలెంట్ డిప్లాయ్మెంట్ పాలసీలో ఇకపై ప్రతి ఉద్యోగి ఏడాదికి 225 బిల్ల్డ్ బిజినెస్ డేస్ పనిచేసి ఉండాలన్న నిబంధన తీసుకొచ్చింది. పని లేకుండా బెంచ్ మీద ఉండే సమయాన్ని 35 రోజులకు పరిమితం చేసింది. జూన్ 12 నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చినట్లు ఉద్యోగులకు యాజమాన్యం తెలియజేసింది. ఆర్ఎంజీ నుంచి తగిన బిల్లబిలిటీ ఉండేలా చూడాల్సిన బాధ్యతను ఉద్యోగులకే బదలాయించాలనే దురుద్దేశం కూడా ఈ విధానంలో ఉంది. ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలనుకున్నప్పుడల్లా కార్మిక వ్యతిరేక విధానమైన పనితీరు మెరుగుదల ప్రణాళిక (పీఐపీ) ద్వారా టీసీఎస్ యాజమాన్యం చేసే ప్రయత్నం ఇది" అని ఏఐటీఈయూ తెలిపింది.విడుదల తేదీకి ముందే కేటాయింపు కోసం రిసోర్స్ మేనేజ్ మెంట్ గ్రూప్ తో క్రియాశీలకంగా వ్యవహరించడం, అవకాశాలను అందిపుచ్చుకోవడం ఉద్యోగుల ప్రాథమిక బాధ్యత అని ఈ విధానం నొక్కి చెబుతోంది. ఫ్రెషర్స్ కూడా పని కేటాయింపు కోసం చురుగ్గా పనిచేయాల్సి ఉంటుంది. ఉద్యోగులు డిప్లాయిమెంట్ పాలసీని పాటించకపోతే చర్యలు తప్పవని కంపెనీ హెచ్చరిస్తోంది. "ఈ విధానం నిబంధనలను పాటించడంలో ఉద్యోగి విఫలమైనట్లయితే, సంస్థ క్రమశిక్షణా చర్యల ఫ్రేమ్వర్క్ ప్రకారం సేవల నిలిపివేతతో సహా క్రమశిక్షణా చర్యలు తీసుకునే హక్కు సంస్థకు ఉంది" అని ఉద్యోగులకు పంపిన పాలసీ డాక్యుమెంట్ పేర్కొంది.ఈ చర్యను వ్యతిరేకిస్తున్న యూనియన్ "ఉద్యోగులకు తగినంత బిల్లబిలిటీని నిర్ధారించడానికి టీసీఎస్ ఆర్ఎంజీ బాధ్యత వహిస్తుంది. కార్మికుల శ్రమను దోపిడీ చేసి లాభాలు, సంపదను కాపాడుకోవడంపై మాత్రమే దృష్టి పెడుతూ కార్మికుల హక్కులను కాలరాసే ఎంఎన్సీల విధానాలను ఏఐఐటీఈయూ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది’ అని పేర్కొంది. -
ఈ ప్లాన్తో జియో సిమ్ ఏడాదంతా యాక్టివ్..
దేశంలోనే అగ్రగామి టెలికాం కంపెనీ రిలయన్స్ జియో. ఈ టెలికాం ఆపరేటర్కు 47 కోట్ల మందికి పైగా యూజర్లు ఉన్నారు. కొంత మంది యూజర్లకు నెలా నెలా రీచార్జ్ చేసుకోవడం ఇష్టం ఉండదు. ఒకే సారి దీర్ఘకాలిక రీచార్జ్ ప్లాన్ల కోసం చూస్తుంటారు. ఇటువంటి వినియోగదారుల కోసం ఇప్పుడు జియో పోర్ట్ ఫోలియోలో ఒక ప్లాన్ కూడా ఉంది. ఇది ఒక రీఛార్జ్ తో మీ జియో సిమమ్ను 365 రోజులు యాక్టివ్ గా ఉంచుతుంది.365 రోజుల రీఛార్జ్ ప్లాన్ ఇదే.. రీఛార్జ్ ప్లాన్లు ఖరీదైనవిగా మారినప్పటి నుండి మొబైల్ వినియోగదారులలో లాంగ్ వాలిడిటీ ఉన్న ప్లాన్లకు డిమాండ్ వేగంగా పెరిగింది. ఇప్పుడు ఒక్క ప్లాన్ తీసుకోవడం ద్వారా ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ నుంచి విముక్తి పొందవచ్చు. జియో అందిస్తున్న 365 రోజుల రీఛార్జ్ ప్లాన్ ధర రూ.3599. ఈ ప్లాన్తో ఏయే ప్రయోజనాల లభిస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..ప్లాన్ ప్రయోజనాలుజియో రూ.3599 ప్లాన్తో రీచార్జ్ చేసుకుంటే 365 రోజుల వాలిడిటీని అందిస్తోంది. 365 రోజుల పాటు అన్ని నెట్వర్క్లకు అన్లిమిటెడ్ కాలింగ్ సదుపాయం లభిస్తుంది. ఉచిత కాలింగ్తోతో పాటు అన్ని నెట్వర్క్లకు ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్లు ఉచితంగా చేసుకోవచ్చు. మీరు ఎక్కువ ఇంటర్నెట్ వాడితే, తక్కువ డేటా లిమిట్ ఉన్న ప్లాన్ సరిపోకపోతే, జియో ఈ వార్షిక ప్లాన్ మీ టెన్షన్ కు ముగింపు పలకబోతోంది. ఈ రూ.3599 ప్లాన్లో మీకు 912 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. రోజుకు 2.5 జీబీ వరకు ఇంటర్నెట్ వాడుకోవచ్చు. ఇందులో అర్హులైన కస్టమర్లకు అపరిమిత 5జీ డేటాను కూడా అందిస్తోంది.👉 జియో 3 కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. తక్కువ ఖర్చుతో ఎక్కువ వ్యాలిడిటీఈ వార్షిక ప్లాన్లో రిలయన్స్ జియో తన వినియోగదారులకు కొన్ని అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఇందులో 90 రోజుల పాటు జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఇది కాకుండా, 50 జీబీ జియో ఏఐ క్లౌడ్ స్పేస్ కూడా ఈ ప్లాన్లో లభిస్తుంది. మీరు టీవీ ఛానల్స్ చూస్తున్నట్లయితే, జియో టీవీ ఉచిత సదుపాయం కూడా ఇందులో ఉంది. -
ఐటీ ఉద్యోగుల నెత్తిన మరో పిడుగు?!
మీరు ఐటీ ఉద్యోగులా?. అయితే మీ నెత్తిన మరో గుదిబండ పడబోతోంది!. త్వరలో ఐటీ రంగంలో పనిగంటలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా బెంగళూరులో తొలి అడుగు పడబోతోంది. ఐటీ సెక్టార్లో పని గంటలను పెంచే యోచనలో కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందంటూ దక్కన్ హెరాల్డ్ ఓ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది.ప్రస్తుతం కర్నాటకలో సెక్షన్7,కర్ణాటక షాప్స్, కమిర్షియల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ 1961 ప్రకారం.. 9 పని గంటలు కొనసాగుతున్నాయి. పండగలు, పబ్బాలు వంటి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కనీసం సంవత్సరంలో ఏదైనా మూడు నెలల్లో ఉద్యోగులతో అదనంగా 10 గంటలు పనిచేయించుకోవచ్చు. ఈ పనిగంటలు 50 గంటలు మించకూడదు.కానీ కర్ణాటక ప్రభుత్వం తాజాగా కొత్త పనిగంటల ప్రతిపాదనలు తెరపైకి తెరపైకి తెచ్చినట్లు దక్కన్ హెరాల్డ్ హైలెట్ చేసింది. ఉద్యోగులు ఇకపై 10 పని గంటలు, అదనంగా 12 గంటలు పనిచేయించుకుంటే ఎలా ఉంటుందా? అనే దిశగా ప్రభుత్వం కార్మికశాఖ, ఐటీ రంగ నిపుణులతో చర్చలు జరుపుతోంది. ఫలితంగా ప్రత్యేక సందర్భాలలో అదనంగా చేసే పనిగంటలు 50 నుంచి ఏకంగా 140 గంటలు చేరుకోనున్నాయి.కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై కార్మిక సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. పనిగంటల్ని పెంచి ఉద్యోగుల హక్కుల కాలరాజేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తున్నాయి. పనిగంటలు పెంచడం వల్ల ఉద్యోగులు తమ హక్కులపై ప్రతికూల ప్రభావంతో పాటు పర్సనల్ లైఫ్, ఫ్రొఫెషనల్ లైఫ్కు విఘాతం కలుగుతోందని అంటున్నారు.కర్ణాటకతో పాటు ఏపీలో కూటమి ప్రభుత్వంపై సైతం పనిగంటల్ని పెంచే ప్రతిపాదనలు తెరపైకి తెచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో వ్యాపారాన్ని సులభతరం చేయడంతో పాటు ఇన్వెస్టర్లను ఆకట్టుకునేలా తొమ్మిది పనిగంటల్ని పది పనిగంటలు చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఉద్యోగులకు, సంస్థలకు లబ్ధి చేకూరేలా కార్మిక చట్టాల్ని మార్చే యోచనలో ఉందని డక్కెన్ హెరాల్డ్ తన కథనంలో ప్రస్తావించింది. అంతేకాదు పనిగంటలు పెంచి పనిచేసే ప్రాంతాల్లో రాత్రి వేళ పనిదినాల్లో మహిళలకు వెసులు బాటు కల్పించడంతో పాటు రవాణ, భద్రత, సెక్యూరిటీ, లైటింగ్ మెరుగుపరుచుకునే దిశగా చర్యలు తీసుకోనుందని వెల్లడించింది. పని గంటలను పొడిగించాలనే ప్రభుత్వ ప్రణాళికను కర్ణాటకలోని అనేక కార్మిక సంఘాలు వ్యతిరేకించాయి. బుధవారం, రాష్ట్ర కార్మిక శాఖ పరిశ్రమ, కార్మిక సంఘాల ప్రతినిధులతో ఒక సమావేశాన్ని నిర్వహించి చట్టానికి సాధ్యమయ్యే సవరణపై చర్చించింది.కర్ణాటక రాష్ట్ర ఐటీ/ఐటీఈఎస్ ఉద్యోగుల సంఘం (కేఐటీయూ) సమావేశంలో పాల్గొని ఈ ఆలోచనను స్పష్టంగా వ్యతిరేకించింది. కేఐటీయూ ఈ ప్రతిపాదనను బానిశత్వంగా అభివర్ణించింది. కార్మికుల ఆరోగ్యం, పని-జీవిత సమతుల్యత, ఉద్యోగ భద్రతకు హాని కలిగిస్తుందని పేర్కొంది. పనిగంటల విషయంలో ప్రభుత్వ ప్రతిపాదనల్ని టెక్నాలజీ రంగ ఉద్యోగులు వ్యతిరేకించాలని, వారికి అండగా నిలవాలని యూనియన్ విజ్ఞప్తి చేసింది.పనిగంటలు పెరిగితే భారీ ఎత్తున ఉద్యోగుల తొలగింపులు.. ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
వాట్సప్, ఇన్స్టాగ్రామ్ షట్డౌన్!
ఇజ్రాయెల్తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ ఇంటర్నెట్ సర్వీసుల సామర్థ్యాన్ని పరిమితం చేస్తూ ఇటీవల దేశవ్యాప్తంగా దాదాపు ఇంటర్నెట్ బ్లాక్అవుట్(ఇంటర్నెట్లో తీవ్ర అంతరాయం-పూర్తి బ్లాక్అవుట్ కాదు)ను ఎదుర్కొంది. ఇజ్రాయెల్ సైబర్ దాడులకు పాల్పడుతుందని, అందుకు ప్రతిస్పందనగా ప్రభుత్వం ఈ మేరకు ఇంటర్నెట్ను పరిమితం చేస్తూ ఉద్దేశపూర్వకంగా నిర్ణయం తీసుకున్నట్లు మీడియా నివేదికలు సూచిస్తున్నాయి.ఇరాన్ ప్రభుత్వ నిర్ణయం ద్వారా వీపీఎన్(వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్) సేవలు ప్రధానంగా ప్రభావితమయ్యాయి. తప్పుడు సమాచారం వ్యాప్తిని అణచివేయాలని దాంతోపాటు సైబర్ దాడులను అరికట్టాలని ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్లు కొన్ని సంస్థలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ కనెక్టివిటీని ట్రాక్ చేసే కంపెనీలు కెంటింక్, నెట్బ్లాక్స్ను ఉటంకిస్తూ ఎన్బీసీ తెలిపిన నివేదిక ఆధారంగా ఇరాన్ స్థానిక కాలమానం ప్రకారం జూన్ 17, సాయంత్రం 5:30 గంటలకు ఇంటర్నెట్ సేవలు పరిమితమయ్యాయి. ఇది పూర్తిగా బ్లాక్అవుట్ కాదు. విదేశీ వెబ్సైట్లకు కనెక్ట్ అయ్యేందుకు అనుమతించే వీపీఎన్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేస్తారనే ఆందోళనలతో వాట్సప్ వంటి యాప్లను ఉపయోగించకుండా ఉండాలని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది.ఇదే మొదటిసారి కాదు..ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ను నిలిపివేయడం లేదా ప్రజలు ఇంటర్నెట్ సేవలను యాక్సెస్ చేయకుండా నిరోధించడం ఇది మొదటిసారి కాదు. 2019లో దేశంలో నెలకొన్న అంతర్యుద్ధం కారణంగా వరుసగా ఆరు రోజుల పాటు పూర్తిగా లాక్డౌన్ విధించింది. అప్పుడు 100 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇజ్రాయెల్పై దాడుల తర్వాత 220 మందికి పైగా మరణించారని ఇరాన్ చెబుతుండగా, ప్రతీకార దాడుల్లో 24 మంది మరణించారని ఇజ్రాయెల్ చెబుతోంది.ఇదీ చదవండి: పుత్తడి ఈ పూట రేటెంతంటే..గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ కూడా..గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లను కూడా ఇరాన్ నిలిపేసింది. ప్రజలు తమ డివైజ్లలో కొత్త యాప్లను డౌన్లోడ్, ఇన్స్టాల్ చేసుకోకుండా నిషేధం విధించింది. అదే సమయంలో వాట్సప్, ఇన్స్టాగ్రామ్ వంటి యాప్స్ ఇప్పటికే ఉన్న డివైజ్లలో పూర్తిగా నిరుపయోగంగా మారాయి. ఇరాన్ నేషనల్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్లో భాగమైన ప్రభుత్వం ఆమోదించిన సైట్లు అందుబాటులో ఉన్నాయి. -
బ్యాటరీ సేవ్ చేసే డిస్ప్లే.. యాపిల్ కసరత్తు
యాపిల్ సంస్థ భవిష్యత్తులో విడుదల చేయబోయే ఐఫోన్లలో కొత్త పవర్ సేవింగ్ డిస్ప్లేను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఐఫోన్ 18 ఎయిర్లో దీన్ని అమలు చేసే వీలుందనే అంచనాలు వెలువడుతున్నాయి. స్లిమ్ ఫోన్లలో బ్యాటరీ సామర్థ్యం తక్కువగా ఉండడంతో పవర్ అధికంగా ఖర్చు అవుతుంది. దాంతో స్లిమ్ ఫోన్లకు ఇదో సవాలుగా మారుతుంది. ఈ నేపథ్యంలో బ్యాటరీ లైఫ్ను పెంచేలా, డిస్ప్లేకు ఖర్చు అయ్యే పవర్ను తగ్గించేలా కొత్త టెక్నాలజీలను కంపెనీలు ఆవిష్కరిస్తున్నాయి. ఇందులో భాగంగా యాపిల్ కంపెనీ ఐఫోన్ 18 ఎయిర్లో ఈమేరకు టెక్నాలజీను వాడనుందని కొన్ని సంస్థలు తెలిపాయి.పరిమిత బ్యాటరీ లైఫ్ సమస్యలను పరిష్కరించడానికి, తక్కువ శక్తిని వినియోగించేలా నెక్ట్స్ జనరేషన్ ఓఎల్ఈడీ డిస్ప్లేను వాడాలని యాపిల్ పరిశీలిస్తోంది. ఇప్పటికే వీటి సరఫరాదారులతో చర్చలు జరుగుతున్నాయని సమాచారం. 2027లో ఐఫోన్ 18 ఎయిర్లో ఎల్టీపీఓ ఓఎల్ఈడీ అధునాతన వెర్షన్ను ఉపయోగించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఈ మోడల్లో కొత్త డిస్ప్లే ప్యానెల్ టెక్నాలజీని ఉపయోగించాలని యాపిల్ అన్వేషిస్తోంది. ప్రస్తుతం యాపిల్ తన హైఎండ్ ఐఫోన్లలో ఎల్టీపీఓ ఓఎల్ఈడీ ప్యానెళ్లను ఉపయోగిస్తుంది. కాని డిస్ప్లే అంతర్గత భాగాల్లో కొంత భాగం మాత్రమే ఆక్సైడ్ పదార్థాలను వాడుతోంది.ఇదీ చదవండి: 9 లక్షలకు ఫ్లెక్సీ స్టాఫ్కొత్త డిప్ప్లేల్లో పూర్తి ఆక్సైడ్ ఆధారిత డిజైన్కు మారడం ద్వారా మరింత సమర్థవంతంగా సర్వీసు అందించాలని యోచిస్తోంది. అయితే ఈ అప్గ్రేడ్ అంత సులభం కాదనే వాదనలున్నాయి. ఇది తయారీ ప్రక్రియలో సంక్లిష్ట మార్పులను కలిగి ఉంటుంది. దాంతో ఈ ప్యానెళ్లు మరింత ఖరీదుగా మారుతాయనే అభిప్రాయాలున్నాయి. -
ఏఐ భయాలు సరైనవేనా..? మూర్తి ఏమన్నారంటే..
కృత్రిమ మేధ (ఏఐ) భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) పరిశ్రమ వృద్ధికి ఊతమిస్తుందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. ఓపెన్ఏఐ జనరేటివ్ ఏఐ టూల్ చాట్జీపీటీని ఉపయోగించడం వల్ల తన ఉత్పాదకత ఐదు రెట్లు పెరిగిందని మూర్తి తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఉద్యోగాలను హరించివేస్తుందన్న భయం సరికాదన్నారు. ఇది మరో రకమైన ఉద్యోగాన్ని సృష్టిస్తుందని చెప్పారు.చాట్జీపీటీ వంటి జనరేటివ్ ఏఐ టూల్ను చాలా మంది వినియోగిస్తున్నారు. అయితే ఏఐ చాలా ఉద్యోగాలకు సవాలుగా మారుతుందనే అభిప్రాయాలున్నాయి. కొన్ని కంపెనీలు ఏఐ సాకుతో లేఆఫ్స్ కూడా ప్రకటిస్తున్నాయనే వాదనలున్నాయి. ఈ తరుణంలో నారాయణమూర్తి తాజాగా ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏఐ ఉత్పాదకతను పెంచుతుందన్నారు. తన ప్రసంగాలకు చాట్జీపీటీను వాడుతున్నట్లు చెప్పారు. అయితే ఏఐను సరైన ప్రశ్న అడగడంలోనే అసలు తెలివితేటలు ఉన్నాయని తెలిపారు.‘భవిష్యత్తులో ఏమి జరుగుతుందంటే..ప్రోగ్రామర్లు, విశ్లేషకులు మెరుగైన, మరింత సంక్లిష్టమైన అవసరాలను తీర్చడంలో స్మార్ట్ అవుతారు. వారు పెద్ద సమస్యలను పరిష్కరిస్తారు. కాబట్టి కృత్రిమ మేధ ఐటీ పరిశ్రమ వృద్ధి రేటును ఎలా పెంచుతుందనే దాని గురించి నేను సానుకూలంగా ఉన్నాను’ అని తెలిపారు. భారత ఐటీ పరిశ్రమలో వృద్ధి, ఉద్యోగ నియామకాలు మందకొడిగా సాగుతున్న నేపథ్యంలో మూర్తి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఇదీ చదవండి: మేలో స్వల్పంగా తగ్గిన వాహన విక్రయాలుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతరాయం మధ్య ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఇటీవల ఐటీ వ్యాపార నమూనాల్లో సమూల మార్పులు చేయాలని పిలుపునిచ్చారు. గత 30 ఏళ్లుగా ఉన్న సంప్రదాయ ఐటీ వ్యాపార నమూనాకు విఘాతం కలుగుతోందని, ఇప్పటికే ఆ మోడల్కు సమయం అయిపోయిందని హెచ్సీఎల్ టెక్ సీఈఓ విజయకుమార్ గతంలో తెలిపారు. కృత్రిమ మేధను సపోర్ట్గా ఉపయోగించి ఉత్పాదకత, నాణ్యతను ఎలా మెరుగుపరుచుకోవాలో గమనిస్తే సాఫ్ట్వేర్ పరిశ్రమ వృద్ధి వేగం పెరుగుతోందని మూర్తి అభిప్రాయపడ్డారు. -
కొత్త సిమ్ తీసుకునేవారికి జియో బంపర్ ఆఫర్
కొత్తగా స్మార్ట్ఫోన్ కొనుగోలు చేసే వినియోగదారులకు సరికొత్త డిజిటల్ అనుభవాన్ని అందించేందుకు రిలయన్స్ జియో స్టార్టర్ ప్యాక్ను ప్రారంభించింది. కేవలం రూ.349తో యూజర్లు ఈ ప్యాక్ను పొందవచ్చని కంపెనీ తెలిపింది. కొత్తగా సిమ్ కొనుగోలు చేసే యూజర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ ప్యాక్ డిజిటల్ యుటిలిటీ, కస్టమర్ల అనుభవాన్ని పెంచే లక్ష్యంతో కొన్ని ప్రయోజనాలను అందిస్తుంది.జియో స్టార్టర్ ప్యాక్ ప్రయోజనాలు..5G నెట్వర్క్లో 28 రోజుల పాటు అపరిమిత సేవలు వినియోగించుకోవచ్చు.50 రోజుల ఉచిత జియోఫైబర్/ ఎయిర్ఫైబర్ ట్రయల్ కనెక్షన్ (టీవీ + వైఫై + OTT యాప్లు) పొందవచ్చు.50 జీబీ ఉచిత జియో ఏఐ క్లౌడ్ స్టోరేజీ పొందవచ్చు.4K క్వాలిటీతో టీవీ / మొబైల్లో 90 రోజుల పాటు ఉచిత జియో హాట్స్టార్ వీక్షించవచ్చు.ఇదీ చదవండి: ఇంధనం వాడకుండానే వాహనాల తరలింపుఈ ప్రయోజనాలను ఒకే ఆఫర్లో అందించడం ద్వారా కొత్త వినియోగదారులకు డిజిటల్ అనుభవాన్ని సులభతరం చేయడం జియో లక్ష్యంగా పెట్టుకుంది. ఇదిలాఉండగా, ఏప్రిల్ 2025కి విడుదలైన ట్రాయ్ నివేదిక ప్రకారం.. అత్యంత పోటీ ఉన్న వైర్లెస్ (మొబైల్) విభాగంలో అధికంగా సబ్స్క్రైబర్లను జోడించింది. జియో 95,310 కొత్త సబ్స్క్రైబర్లను జోడించి మార్చి 2025లో 3,17,76,074 ఉన్న మొత్తం వినియోగదారులను ఏప్రిల్ 2025లో 3,18,71,384కి పెంచుకుంది. -
ఇకపై వాట్సప్లో ప్రకటనలు?
ప్రముఖ ఆన్లైన్ మెసేజింగ్ యాప్ వాట్సప్(Whatsapp) యూజర్ ప్రైవసీ, ఎన్క్రిప్షన్ ప్రమాణాలను పాటిస్తూ ఆదాయాన్ని ఆర్జించాలనే వ్యూహంతో చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా యాప్లో యాడ్స్ ద్వారా రెవెన్యూ సంపాదించాలని చూస్తుంది. ఇతర ప్లాట్ఫామ్ల మాదిరిగా కాకుండా ఇప్పటివరకు ఎలాంటి యాడ్స్ లేకుండానే మెటా వాట్సప్లో మెసేజింగ్ సర్వీసులను ఉచితంగా అందించింది. ఇకపై వాట్సప్ స్టేటస్లో యాడ్ల ద్వారా ఆదాయం సంపాదించాలని భావిస్తుంది. అయితే ఈ యాడ్స్ కేవలం అప్డేట్స్ ట్యాబ్లో మాత్రమే కనిపిస్తాయని, పర్సనల్ చాట్స్ ఎప్పటిలానే యాడ్ఫ్రీగా ఉంటాయని వాట్సప్ స్పష్టం చేసింది.వాట్సప్ యాప్లోని అప్డేట్స్ ట్యాబ్ ఆప్షన్లో ప్రకటనలకు చెందిన ఫీచర్లను తీసుకొస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అప్డేట్స్ ట్యాబ్లో ప్రస్తుతం ఛానళ్లు, స్టేటస్ బ్లాక్లో అడ్వర్టైజ్మెంట్లు కనిపించనున్నాయి. నిత్యం దాదాపు 2 బిలియన్ల వినియోగదారులు ఈ అప్డేట్ బ్లాక్ చూస్తున్నారని వాట్సప్ తెలిపింది. దాంతో విభిన్న సంస్థలు ప్రమోట్ చేయాలనుకునే ఉత్పత్తులు లేదా ఇతర వివరాలను యాడ్ ఇచ్చేందుకు దీన్నో అవకాశంగా చూపుతుంది. మూడు రకాల యాడ్ ఫీచర్లు తీసుకొస్తున్నట్లు పేర్కొంది.పెయిడ్ ఛానల్ సబ్ స్క్రిప్షన్లుక్రియేటర్లు, వ్యాపారాలు లేదా ఇన్ఫ్లూయెన్సర్ల నుంచి ప్రత్యేక కంటెంట్ను యాక్సెస్ చేసేందుకు నెలవారీ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇది టెలిగ్రామ్, యూట్యూబ్లో కనిపించే ప్రీమియం సబ్స్క్రిప్షన్ మోడల్స్ మాదిరిగానే ఉంటుంది.ప్రమోటెడ్ ఛానల్స్..వ్యాపారాలు, కంటెంట్ క్రియేటర్లు తమ ఛానళ్లను ప్రమోట్ చేయడం ద్వారా విజిబిలిటీని పెంచుకోవచ్చు. యాప్లోని డిస్కవరీ సెక్షన్లో అడ్వర్టైజ్మెంట్ ఛానల్స్ కనిపిస్తాయి.స్టేటస్ యాడ్స్ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ తరహాలో స్టేటస్ ఫీచర్లో యాడ్స్ ఉంటాయి. స్టేటస్ అప్డేట్ల మధ్య టార్గెట్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ను యూజర్లు వీక్షించవచ్చు.ఇదీ చదవండి: గరిష్ఠాల నుంచి పడిన పసిడి ధర! తులం ఎంతంటే..Ads in status. 🥲#WhatsApp pic.twitter.com/vn7yUmJInr— Abhishek Yadav (@yabhishekhd) June 16, 2025ప్రైవసీ పట్ల నిబద్ధతతాజాగా ప్రతిపాదించిన మార్పులు ఉన్నప్పటికీ వ్యక్తిగత సందేశాలు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్ట్గానే ఉంటాయని వాట్సప్ తెలిపింది. అంటే ప్రైవేట్ చాట్ల్లో ఎటువంటి ప్రకటనలు కనిపించవని వినియోగదారులకు హామీ ఇచ్చింది. ఫోన్ నంబర్, వ్యక్తిగత వివరాలు ఎట్టిపరిస్థితుల్లో ప్రకటనదారులతో పంచుకోమని వాట్సప్ స్పష్టం చేసింది. వినియోగదారుల లొకేషన్, భాష.. వంటి సాధారణ డేటా ఆధారంగా ప్రకటనలు ఉంటాయని తెలిపింది.