breaking news
Technology
-
ఒప్పో కొత్త సిరీస్ స్మార్ట్ఫోన్లు విడుదల
చైనా స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఒప్పో ఎఫ్ 31 సిరీస్ను భారత్లో లాంచ్ చేసింది. ఎఫ్ 31, ఎఫ్ 31 ప్రో, ఎఫ్ 31 ప్రో ప్లస్ అనే మూడు మోడళ్ల స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్లన్నీ 7,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తాయి. అన్నింటిలోనూ ఏఐ ఆధారిత ఫీచర్లు చాలానే ఇచ్చారు. వాటి స్పెసిఫికేషన్లు ఏంటి.. ధరలు ఎంత.. ఎక్కడ కొనుక్కోవాలి.. తదితర వివరాలను ఈ కథనంలో పూర్తిగా తెలుసుకుందాం.ఒప్పో ఎఫ్31 5జీ సిరీస్ ధరలు, లభ్యతఒప్పో ఎఫ్31 ప్రో ప్లస్ 5జీ8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.32,999. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర రూ.34,999. హిమాలయన్ వైట్, జెమ్స్టోన్ బ్లూ, ఫెస్టివల్ పింక్ రంగుల్లో లభ్యమవుతుంది.ఒప్పో ఎఫ్31 ప్రో 5జీ8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.26,999. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర రూ.28,999. అదే 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.30,999. డెసెర్ట్ గోల్డ్, స్పేస్ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంది.ఒప్పో ఎఫ్31 5జీ8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.22,999. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర రూ.24,999. క్లౌడ్ గ్రీన్, మిడ్నైట్ బ్లూ, బ్లూమ్ రెడ్ రంగుల్లో లభ్యమవుతుంది.ఒప్పో ఎఫ్31 ప్రో, ఎఫ్31 ప్రో ప్లస్ స్టార్ట్ఫోన్లు సెప్టెంబర్ 19 నుంచి ఒప్పో ఈ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈకామర్స్ ప్లాట్ఫామ్లు, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయి. మరోవైపు ఒప్పో ఎఫ్ 31 5జీ మాత్రం సెప్టెంబర్ 27 నుంచి అందుబాటులోకి రానుంది.ఆఫర్లుఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, కొటక్ మహీంద్రా బ్యాంకుల ఎంపిక చేసిన కార్డులను ఉపయోగించుకుంటే 10 శాతం వరకు క్యాష్బ్యాక్ లభిస్తుంది. 10 శాతం వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ వినియోగించుకోవచ్చు. ప్రమాదవశాత్తు డ్యామేజీ అయితే 180 రోజుల ఉచిత కేర్ ఉంటుంది. ఇవి కాక ఆరు నెలల వరకు వడ్డీ లేని ఈఎంఐ ప్లాన్ లు, మొదటి రోజు ప్రీ-బుక్ లేదా కొనుగోలు చేసే కస్టమర్లు ఎంపిక చేసిన కార్డులు లేదా ఎక్స్ఛేంజ్ బోనస్ లపై బ్యాంక్ డిస్కౌంట్ వంటివి ఉంటాయి.స్పెసిఫికేషన్లుమూడు మోడళలోనూ కొన్ని ఒకే రకమైన స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ప్రో ప్లస్ 6.8-అంగుళాల డిస్ప్లే, మిగిలిన రెండు 6.5-అంగుళాల స్క్రీన్లను కలిగి ఉన్నాయి. అన్నింటికీ 120 హెడ్జ్ రీఫ్రెష్ రేటు ఉంటుంది. ప్రతి ఫోన్లోనూ 80వాట్ల సూపర్వోక్ ఫాస్ట్ ఛార్జింగ్ తో 7,000ఎంఏహెచ్ బ్యాటరీ, రివర్స్ అండ్ బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అన్ని ఫోన్లూ క్వాల్కామ్ స్నాప్గ్రాడన్ 7 జెన్ 3 చిప్సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్ ఓఎస్ 15పై పనిచేస్తాయి. ఇక కీలకమైన కెమెరా విషయానికి వస్తే ఒప్పో ఎఫ్31 ప్రో ప్లస్ 5జీ, ఒప్పో ఎఫ్31 ప్రో 5జీ ఫోన్లకు ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఇవ్వగా ఒప్పో ఎఫ్31 5జీ ఫోన్లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. రియర్ కెమెరా మాత్రం అన్ని ఫోన్లకూ ఒకేలా 50ఎంపీ + 2ఎంపీ ఇచ్చారు.ఇదీ చదవండి: ఒప్పో కొత్త సిరీస్ స్మార్ట్ఫోన్లు విడుదల.. భారీ బ్యాటరీతో ప్రత్యేక ఫీచర్లు -
‘టీసీఎస్లో బలవంతంగా రాజీనామా చేయమన్నారు’
దేశీయ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ చుట్టూ రోజుకో వివాదం రేగుతోంది. భారీగా లేఆఫ్ల ప్రకటనతోపాటు ఆ సంస్థలో బలవంతంగా రాజీనామాలు, ఉద్యోగ విరమణలు చేయిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా మరో ఉద్యోగి తనను రాజీనామా చేయాలని బలవంతం చేశారని ఆరోపిస్తున్నారు.ఈ మేరకు ప్రొఫెషనల్ సామాజిక ప్లాట్ఫామ్ రెడిట్లో షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్గా మారింది. 3,000 కు పైగా అప్ ఓట్లు, వందలాది కామెంట్లు వచ్చాయి. ఇది దేశంలోని అతిపెద్ద ఐటీ సంస్థలలో ఒకటైన టీసీఎస్లో విషపూరిత పద్ధతులపై విస్తృత ఆగ్రహాన్ని రేకెత్తించింది.తనను టీసీఎస్లో జూనియర్ టెక్ ఉద్యోగిగా చెప్పుకొన్న రెడిటర్ అదే తన మొదటి ఉద్యోగంగా పేర్కొన్నారు. మూడు రోజుల ముందు మీటింగ్ హాల్కు పిలిచి అక్కడ తనను స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని హెచ్ఆర్ ఒత్తిడి చేసినట్లు ఆరోపించారు. అయితే తాను రాజీనామా చేయడానికి నిరాకరించానని, అందుకు తనను టర్మినేట్ చేసి వ్యతిరేక రివ్వూలు ఇస్తానని బెదిరించారని, అయినప్పటికీ తాను రాజీనామా చేయను.. మీకు నచ్చినట్లు చేసుకోండని చెప్పానని రాసుకొచ్చారు.అంతేకాక సంస్థలో పని వాతావరణం గురించి కూడా పలు ఆరోపణలు చేశారు. జీతం చాలా తక్కువే అయినా దాని వర్క్ కల్చర్, ఉద్యోగ భద్రత కారణంగా తాను టీసీఎస్ లో చేరానని, కానీ దానికి ఇప్పుడు చింతిస్తున్నానని వాపోయారు. ‘రతన్ టాటా తరువాత, ఈ కంపెనీ గందరగోళానికి గురైంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: ట్రైనింగ్ ఇచ్చినోళ్లనే తీసేశారు.. 500 మంది తొలగింపు! -
కళ్లజోడుకు గుడ్బై?: సర్జరీ లేకుండా.. రెండేళ్లు!
వయసు పెరిగే కొద్దీ.. దాదాపు అందరికీ ప్రెస్బయోపియా (కంటిచూపు లోపం) వస్తుంది. అప్పుడు చదవడం లేదా ఫోన్ను ఉపయోగించడం వంటి క్లోజప్ విషయాలపై దృష్టి పెట్టడం కొంత కష్టతరమవుతుంది. దీనికోసం రీడింగ్ గ్లాసెస్పై ఆధారపడతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పరిశోధకులు ప్రత్యేక కంటి చుక్కలను తయారు చేశారు. ఇది కొంతకాలం పాటు గ్లాసెస్ను వదిలించుకోవడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.రెండేళ్ల పాటు మెరుగైన దృష్టిరెండు సంవత్సరాల పాటు జరిగిన ఒక అధ్యయనంలో.. కంటి చుక్కలను తయారు చేశారు. వీటిని రోజుకు రెండు లేదా మూడు సార్లు ఉపయోగించడం వల్ల, కళ్లజోడుతో పనిలేకుండానే చిన్న అక్షరాలను చదివే సామర్థ్యం మెరుగుపడిందని తేలింది. అధ్యయనంలో.. చాలా మంది వ్యక్తులు చుక్కలను ఉపయోగించిన తర్వాత ప్రామాణిక కంటి చార్టులో (జేగర్ చార్ట్) రెండు లేదా అంతకంటే ఎక్కువ అదనపు పంక్తులను చదవగలిగారు. ఈ చుక్కలను ఉపయోగించడం వల్ల.. రెండేళ్ల పాటు మెరుగైన దృష్టిని పొందవచ్చని చెబుతున్నారు.ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలు యూరోపియన్ సొసైటీ ఆఫ్ క్యాటరాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్స్ (ESCRS)లో ప్రచురించారు. కంటి చూపు పెరగడానికి ఉపయోగించే.. చుక్కల మందులో పైలోకార్పైన్ (కన్ను దగ్గరగా ఉన్న వస్తువులపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది), డైక్లోఫెనాక్ (కొంతమందికి కలిగే చికాకును నివారించడంలో సహాయపడుతుంది) ఉపయోగించినట్లు వెల్లడించారు.రోజుకు రెండుసార్లుసాధారణంగా ప్రజలు.. రోజుకు రెండుసార్లు చుక్కలను ఉపయోగిస్తారు. అవసరమైతే మూడవ మోతాదును కూడా ఉపయోగించుకోవచ్చు. ప్రెస్బయోపియా (Presbyopia) ప్రభావాన్ని బట్టి.. రోజుకు ఎన్నిసార్లు ఉపయోగించాలనేది నిర్దారించడం జరుగుతుంది. ప్రెస్బయోపియా తీవ్రత తక్కువగా ఉంటే తక్కువసార్లు, ఎక్కువగా ఉన్నప్పుడు మంచి రిజల్ట్స్ కోసం ఎక్కువసార్లు ఉపయోగించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరికకంటి చూపు మందగించడం వల్ల.. కొంతమంది ఆపరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆపరేషన్ వద్దనుకుని, సరళమైన పద్దతిలో సమస్య పరిష్కరించుకోవడానికి ఈ చుక్కల మందు ఉపయోగపడుతుంది. అయితే ప్రెస్బయోపియా ప్రభావం తగ్గించడానికి ఉపయోగించే చుక్కల మందు వల్ల.. స్వల్ప చికాకు లేదా తేలికపాటి తలనొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమస్యలను నిర్మూలించడానికి మరింత అధ్యయనం అవసరమని నిపుణులు చెబుతున్నారు. -
జియో చౌక ప్లాన్.. ఎక్కువ వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాలింగ్
కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలతో చౌకైన రీఛార్జ్ ప్లాన్లను అందించాలని కొన్ని రోజుల క్రితం ట్రాయ్ అన్ని టెలికాం కంపెనీలను ఆదేశించింది. దీని తర్వాత జియో కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్ తో రెండు చౌకైన రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. జియో తన వెబ్సైట్లో రెండు కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్లను జాబితా చేసింది.ఇందులో వినియోగదారులు 365 రోజుల వరకు సుదీర్ఘ వ్యాలిడిటీని పొందుతారు. డేటాను ఉపయోగించని యూజర్లకు ఈ ప్లాన్ ప్రయోజనం చేకూరుస్తుంది. మరొకటి 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్. ఈ ప్లాన్లు రెండూ ముఖ్యంగా కాలింగ్, ఎస్ఎంఎస్ మాత్రమే ఉపయోగించే, డేటా అవసరం లేని వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటాయి.84 రోజుల ప్లాన్జియో కొత్త రూ.448 ప్లాన్ 84 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ లో యూజర్లకు అపరిమిత కాలింగ్, 1000 ఉచిత ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. ఇది కాకుండా, వినియోగదారులకు జియో సినిమా, జియో టీవీ వంటి యాప్స్ కు కూడా ఉచిత యాక్సెస్ లభిస్తుంది.365 రోజుల ప్లాన్జియో కొత్త రూ.1958 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ లో, వినియోగదారులు భారతదేశం అంతటా ఏ నెట్ వర్క్ లోనైనా అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. దీనితో పాటు 3600 ఉచిత ఎస్ఎంఎస్లు, ఉచిత నేషనల్ రోమింగ్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ ప్లాన్ జియో సినిమా, జియో టీవీ వంటి యాప్లకు ఉచిత యాక్సెస్ను అందిస్తుంది. -
ట్రైనింగ్ ఇచ్చినోళ్లనే తీసేశారు.. 500 మంది తొలగింపు!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఎప్పుడు ఎవరి ఉద్యోగాలు ఊడిపోతాయో చెప్పలేం. అయితే ఆ ఏఐ సాధనానికి శిక్షణ ఇచ్చేవాళ్ల ఉద్యోగాలే పోవడం బాధాకరం. బిజినెస్ ఇన్ సైడర్ నివేదిక ప్రకారం.. ఎలాన్ మస్క్కు చెందిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఎక్స్ఏఐ (xAI).. తన డేటా అనోటేషన్ బృందం నుండి సుమారు 500 మంది ఉద్యోగులను తొలగించింది. వీరంతా సంస్థ జనరేటివ్ ఏఐ చాట్ బాట్ ‘గ్రోక్’కు శిక్షణ ఇచ్చే సిబ్బంది కావడం గమనార్హం.ఇదీ కారణం నివేదిక ప్రకారం.. ఉద్యోగుల తొలగింపులకు కారణం సంస్థ దృష్టి మారడం. ఎక్స్ఏఐ సాధారణ ఏఐ ట్యూటర్లను అభివృద్ధి చేయడంపై దృష్టిని తగ్గించి స్పెషలిస్ట్ ఏఐ ట్యూటర్లపై వనరులను కేంద్రీకరిస్తుందంటూ సిబ్బందికి పంపిన ఈమెయిల్ లో కంపెనీ తెలిపింది. "మా హ్యూమన్ డేటా ప్రయత్నాలను క్షుణ్ణంగా సమీక్షించిన తరువాత, మా స్పెషలిస్ట్ ఏఐ ట్యూటర్ల విస్తరణ, ప్రాధాన్యతను వేగవంతం చేయాలని నిర్ణయించుకున్నాం. అదే సమయంలో సాధారణ ఏఐ ట్యూటర్ ఉద్యోలపై మా దృష్టిని తగ్గించాం. "ఫోకస్ లో ఈ మార్పులో భాగంగా, మాకు ఇకపై చాలా సాధారణ ఏఐ ట్యూటర్ ఉద్యోగులు అవసరం లేదు.. ఎక్స్ఏఐతో మీ ఉద్యోగం ముగుస్తుంది" అని పేర్కొంది.ఉద్యోగులకు సిస్టమ్ యాక్సెస్ రద్దు చేస్తామని చెప్పిన కంపెనీ వారి ఒప్పందాలు ముగిసే వరకు లేదా నవంబర్ 30 వరకు జీతాలు చెల్లింపు కొనసాగుతుందని వివరించింది. వీడియో గేమ్స్, వెబ్ డిజైన్, డేటా సైన్స్, మెడిసిన్, స్టెమ్ వంటి రంగాలలో స్పెషలిస్ట్ ఏఐ ట్యూటర్లపై పెట్టుబడులను పెంచుతున్నట్లు కంపెనీ స్పష్టం చేసినట్లు తెలిసింది. అందుకుఅనుగుణంగా భారీ సంఖ్యలో ఉద్యోగులను పెంచుకోనున్నట్లు ఇటీవలే ఎక్స్ఏఐ ప్రకటించింది.ఇదీ చదవండి: కొత్త ఉద్యోగాలకు ఓకే కానీ.. టెకీల ఆలోచనలు -
కొత్త ఉద్యోగాలకు ఓకే కానీ.. టెకీల ఆలోచనలు
చాలా మటుకు టెక్నాలజీ నిపుణులు కొత్త అవకాశాలపై ఆసక్తిగా ఉన్నప్పటికీ .. ఉద్యోగాల ఎంపిక విషయంలో మాత్రం ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. తమ లక్ష్యాలు, కెరియర్ పురోగతి, శారీరక .. మానసిక ఆరోగ్ లాంటి అంశాలకు సదరు ఉద్యోగం ఎంత వరకు దోహదపడుతుందనేది బేరీజు వేసుకుంటున్నారు. దేశీ టెకీలపై గ్లోబల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ మైఖేల్ పేజ్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.దీని ప్రకారం అంతర్జాతీయంగా అత్యంత ఆత్మవిశ్వాసంతో, ఉద్యోగాల ఎంపికలో లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్న టెక్ నిపుణుల్లో భారతీయ ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన సర్వేలో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా సుమారు 5,000 మంది ప్రొఫెషనల్స్ పాల్గొన్నారు. భారతీయ ప్రొఫెషనల్స్లో 94 శాతం మంది కొత్త అవకాశాలపై ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. మరిన్ని విశేషాలు.. → అంతర్జాతీయంగా అవకాశాలను పరిశీలించాలనే ఆలోచనే తాము ఉద్యోగాలు మారడానికి ప్రేరణగా ఉంటుందని 39 శాతం మంది టెకీలు తెలిపారు. మెరుగైన జీతం, వృద్ధి అవకాశాలు కారణమని 31 శాతం మంది చెప్పారు. → వెసులుబాటు విషయంలో టెక్ నిపుణులు ఏమాత్రం రాజీపడటం లేదు. 26 శాతం మంది సరళతరమైన పని విధానాలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఒకవేళ మాటిమాటికీ ఆఫీసుకు రమ్మంటే ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టేసే అంశాన్ని కూడా పరిశీలిస్తామని 45 శాతం మంది తెలిపారు. → 23 శాతం మంది తమ ప్రస్తుత వేతనాలపై అసంతృప్తిగా ఉన్నారు. 20 శాతం మంది చురుగ్గా శిక్షణ పొందుతున్నారు. అర్థవంతమైన పని, కెరియర్లో వృద్ధి అవకాశాలకు ప్రాధాన్యతనివ్వడానికి మొగ్గు చూపుతున్నారు. → టెక్ నిపుణులు, ఉద్యోగాలను ఎంచుకోవడంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలో కంపెనీలు కూడా కేవలం మెరుగైన వేతనాన్ని ఇవ్వజూపడానికే పరిమితం కాకుండా వెసులుబాటు, వృద్ధి అవకాశా ల్లాంటివి కూడా ఆఫర్ చేయాల్సి వస్తోంది. → హైబ్రిడ్ పని, ఏఐ సన్నద్ధతపై పెట్టుబడులు, నమ్మకం..పారదర్శకతకు పెద్దపీట వేసే సంస్కృతిని పెంపొందించే కంపెనీలు టాప్ ప్రతిభావంతులను ఆకర్షించడంతో పాటు పోటీ మార్కెట్లోను గట్టిగా నిలబడటానికి వీలుంటుంది. -
గేమ్లోని సీక్రెట్ ఫ్రెండ్స్.. చప్పుడుదే విజయం!
గేమ్లో గెలవాలంటే కేవలం టాలెంట్ సరిపోదు, తోడుగా సీక్రెట్ ఫ్రెండ్స్ కూడా ఉండాలి. అలా గెలుపు వెనుక ఉన్న సీక్రెట్ ఫ్రెండ్స్ వీళ్లే!స్పీడ్ డబుల్!గేమ్ ఆడుతున్నప్పుడు చివరి రౌండ్లో చేతి చెమటతో స్క్రీన్ జారిపోయి, అవుట్ అయితే వచ్చే బాధ, ఒక్క గేమింగ్ లవర్స్కి మాత్రమే తెలుసు. అలాంటి వారికి చాలా అవసరం ఈ రేజర్ గేమింగ్ వేలు కవచం. ఇది ప్రత్యేకంగా నేసిన వెండి తంతులతో తయారైంది. అందువలన టచ్ చాలా స్పష్టంగా, వేగంగా ఉంటుంది. చెమట పట్టినా వేళ్లు ఎప్పుడూ పొడిగా, చల్లగా ఉంటాయి. దీని మందం కేవలం 0.8 మిల్లీమీటర్ మాత్రమే. బరువు తేలికగా ఉన్నా, శక్తి మాత్రం యుద్ధంలో గెలిపించేంత బలంగా ఉంటుంది. ఇది చిన్న వేలు అయినా, పెద్ద వేలు అయినా సులభంగా సరిపోతుంది. కడిగి మళ్లీ మళ్లీ ఉపయోగించుకోవచ్చు. పబ్జీ, ఫ్రీ ఫైర్, బీజీఎంఐ వంటి అన్ని హైస్పీడ్ మొబైల్ గేమ్స్కు ఇది అద్భుతంగా సరిపోతుంది. ధర కేవలం రూ.1200 మాత్రమే!కూల్ బేబీ కూల్!గేమ్ ఆడితే మనసు రిలాక్స్ అవుతుంది కాని, ఎక్కువసేపు ఆడితే మాత్రం కంప్యూటర్ వేడెక్కుతుంది. ఇక దాని ఫ్యాన్ శబ్దం చెవులను మోగిస్తుంది. ఆ టెన్షన్ దూరం చేయడానికి ఈ ఆర్జీబీ ఎల్ఈడీ కేస్ ఫ్యాన్ సిద్ధంగా ఉంది. 120 మిల్లీమీటర్ల సైజుతో, నిమిషానికి 1500 సార్లు తిరుగుతుంది. ప్రత్యేకంగా రూపొందించిన దీని బ్లేడ్లు గాలి ఒత్తిడిని సమంగా పంచి పీసీని చల్లగా, సైలెంట్గా ఉంచుతాయి. ఇక ఫ్యాన్లోని ఎల్ఈడీలు కంప్యూటర్ లుక్నే మార్చేస్తాయి. రంగులు మెరిసిపోతూ గేమింగ్ మూడ్ను మరింత పెంచుతాయి. కనెక్టర్తో సులభంగా అమర్చుకోవచ్చు. బలమైన నైలాన్, నాణ్యమైన ప్లాస్టిక్తో తయారవడంతో దీర్ఘకాలం మన్నుతుంది. ధర రూ.699.చప్పుడుదే విజయం!గేమ్లో గెలవాలంటే కేవలం చూపు, చేతులు మాత్రమే కాదు, వినికిడి కూడా కీలకం. అడుగులు, గన్ ఫైర్, తుపాకీ రీలోడ్, శత్రువు దగ్గరగా వస్తున్న శబ్దం లాంటివన్నీ స్పష్టంగా వినిపించాలంటే అవసరమైంది ఈ సరౌండింగ్ గేమింగ్ హెడ్సెట్. మృదువైన ఇయర్ ప్యాడ్స్ వలన గంటల తరబడి వేసుకున్నా చెవులకు ఎలాంటి బరువూ అనిపించదు. 120 డిగ్రీల వరకు తిప్పుకునే నాయిస్ క్యాన్సిలింగ్ మైక్ వాయిస్ని స్పష్టంగా అందిస్తుంది, బయటి శబ్దాన్ని తగ్గిస్తుంది. టీమ్తో ఆడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఇబ్బంది లేకుండా గేమ్లో మరింత ఫోకస్ పెంచుతుంది. దీనిని పీసీ, ఎక్స్బాక్స్ వన్, ప్లేస్టేషన్, మొబైల్ ఇలా అన్నింటికీ సులభంగా కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. ధర కేవలం రూ.1,990. -
ఏఐకి మహిళా టెకీల జై..
ముంబై: మెరుగైన అవకాశాలను దక్కించుకునేందుకు కృత్రిమ మేథ (ఏఐ) ఉపయోగపడుతుందని టెక్నాలజీ రంగంలో అత్యధిక శాతం మహిళలు విశ్వసిస్తున్నారు. జాబ్స్, కెరియర్ ప్లాట్ఫాం అప్నా డాట్కో నిర్వహించిన సర్వేలో 78 శాతం మంది ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. దీని ప్రకారం మహిళా టెకీలు ఏఐ ఆధారిత కెరియర్ల కోసం సన్నద్ధమవుతున్నారు. 58 శాతం మంది ఇప్పటికే ఉద్యోగాల్లో భాగంగానో లేదా ఏదైనా ప్రోగ్రాంలలో చేరడం ద్వారానో లేక స్వయంగానో ఏఐ/ఎంఎల్ నైపుణ్యాల్లో శిక్షణ పొందుతున్నారు. 24 శాతం మంది త్వరలోనే శిక్షణ పొందే యోచనలో ఉన్నారు. టెక్నాలజీ రంగంలో పని చేస్తున్న 11,300 మంది మహిళలు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఇందులో అత్యధిక భాగం మహిళలు జెన్ జెడ్ విభాగానికి (పాతికేళ్ల లోపు వారు) చెందినవారే. వీరిలో 60 శాతం మంది ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు చెందిన వారు కాగా, మూడింట రెండొంతుల మంది సాధారణ కాలేజీల్లో చదివినవారే. ఏఐ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి డిమాండ్.. సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు సగం మంది ఏఐ సాఫ్ట్వేర్ డెవలపర్లు కావాలనుకుంటున్నారు. అలాగే 19 శాతం మంది డేటా సైన్స్.. మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), 14 శాతం మంది ప్రోడక్ట్ మేనేజ్మెంట్, 10 శాతం మంది రీసెర్చ్ ఉద్యోగాలపై దృష్టి పెడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ఏఐని ఏదో ఆషామాషీ ట్రెండ్గా కాకుండా సమాన అవకాశాలను కల్పించే దోహదకారిగా మహిళా టెకీలు భావిస్తున్నట్లు తెలుస్తోందని అప్నాడాట్కో వ్యవస్థాపకుడు నిర్మిత్ పారిఖ్ తెలిపారు. మరోవైపు, ఇప్పుడు పేరొందిన కాలేజీ నుంచి పట్టా పొందడం కన్నా ఏఐలో నైపుణ్యాలే చాలా ముఖ్యమని మూడింట రెండొంతుల టెకీలు భావిస్తున్నారు. జెన్ జెడ్ అమ్మాయిల్లో (22–25 ఏళ్ల వయస్సున్న వారిలో 62 శాతం మంది), ద్వితీయ–తృతీయ శ్రేణి పట్టణాల్లోని మహిళల్లో (74 శాతం మంది) ఈ భావన అత్యధికంగా ఉంది.మెట్రోల్లో ఇది 66 శాతం మందిలో ఉంది. ఏఐని అందిపుచ్చుకోవడంలో ఎదురవుతున్న సవాళ్ల విషయానికొస్తే.. నాణ్యమైన అవకాశాలు అందుబాటులో ఉండటం లేదని 42 శాతం మంది, బలమైన మెంటార్షిప్ లేదని 27 శాతం, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఆప్షన్లు అవసరమని 19 శాతం మంది తెలిపారు. -
కంపెనీల్లో జెన్ఏఐ నిపుణుల కొరత..
న్యూఢిల్లీ: దేశీయంగా కృత్రిమ మేథ (ఏఐ) మార్కెట్ చాలా వేగంగా వృద్ధి చెందుతోంది. 2025లో 28.8 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు నెలకొన్నాయి. కానీ నిపుణల కొరతే పరిశ్రమకు ప్రధాన సమస్యగా మారింది. పది జెన్ఏఐ ఉద్యోగాలుంటే నైపుణ్యాలున్న అభ్యర్ధులు ఒక్కరే ఉంటున్నారు. టీమ్లీజ్ డిజిటల్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం నిర్దిష్ట ప్రాంప్ట్ ఇంజినీరింగ్, ఎల్ఎల్ఎం సేఫ్టీ..ట్యూనింగ్, ఏఐ ఆర్కె్రస్టేషన్, ఏజెంట్ డిజైన్, సిమ్యులేషన్ గవర్నెన్స్, ఏఐ కాంప్లయెన్స్, రిస్క్ ఆపరేషన్స్లాంటి ఏఐ నైపుణ్యాలకు అత్యధిక డిమాండ్ ఉంటోంది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు.. జనరేటివ్ ఏఐ ఇంజినీరింగ్, మెషిన్లెరి్నంగ్ ఆపరేషన్స్లాంటి విభాగాల్లో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతున్నాయి. సీనియర్లకు ఏటా రూ. 58–60 లక్షల వరకు ప్యాకేజీలు ఉంటున్నాయి. నివేదికలోని మరిన్ని విశేషాలు.. → డిజిటల్ ఎకానమీలో ఏఐ, క్లౌడ్ ఉద్యోగాలకు డిమాండ్ భారీగా ఉంది. దానికి తగ్గట్లుగా నైపుణ్యాలున్న అభ్యర్ధులు లభించక, తీవ్ర కొరత నెలకొంది. దీంతో తగిన అర్హతలున్న వారికి కంపెనీలు భారీ వేతనాలిస్తున్నాయి. → జీసీసీల్లో సైబర్సెక్యూరిటీ, డేటా ఇంజినీరింగ్ ఉద్యోగుల వేతనాలు 2025–2027 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో వార్షికంగా వరుసగా రూ. 28 లక్షల నుంచి రూ. 33.5 లక్షలకు, రూ. 23 లక్షల నుంచి రూ. 27 లక్షలకు పెరగనున్నాయి. → నాన్–టెక్ రంగాల్లోని టెక్ ఉద్యోగాలకు సంబంధించి ఐటీ సపోర్ట్, సంప్రదాయ తరహా సిస్టమ్స్ మెయింటెనెన్స్ విభాగాల్లో వేతనాలు వార్షికంగా రూ. 12 లక్షల స్థాయిలోనే స్థిరపడిపోయి ఉన్నాయి. పరిశ్రమ క్లౌడ్ నేటివ్, ఔట్సోర్స్డ్ సరీ్వస్ మోడల్స్ వైపు మళ్లుతుండటాన్ని ఇది సూచిస్తోంది. → ఏఐ మార్కెట్ ప్రస్తుతం హైపర్–గ్రోత్ దశలోకి అడుగుపెడుతోంది. ఏటా 45 శాతం వృద్ధితో 2025లో 28.8 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే, ప్రతిభావంతుల కొరత తీవ్రంగా ఉంటోంది. ప్రతి పది జెన్ఏఐ ఉద్యోగాలకు అన్ని అర్హతలు కలిగిన ఇంజినీరు ఒకే ఒక్కరు ఉంటున్నారు. → 2026 నాటికి ఏఐ టాలెంట్ అంతరాలు 53 శాతానికి పెరగనుంది. అలాగే క్లౌడ్ కంప్యూటింగ్లో డిమాండ్–సరఫరా మధ్య అంతరం 55–60 శాతానికి పెరగనుంది. → ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో పెద్ద స్థాయిలో శిక్షణను కల్పించకుంటే, కంపెనీల వృద్ధి ఆకాంక్షలు నెరవేరని పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. → ఏఐ వినియోగమనేది జాబ్ మార్కెట్ల రూపురేఖలను గణనీయంగా మార్చేయనుంది. గ్లోబల్ విధులు నిర్వహించే 40 శాతం వరకు ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఐటీ సరీ్వసులు, కస్టమర్ ఎక్స్పీరియన్స్, బీఎఫ్ఎస్ఐ, హెల్త్కేర్లాంటి రంగాల్లో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే కంపెనీలు ఏఐ–ఫస్ట్ లెర్నింగ్ మోడల్స్, డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. → భారత డిజిటల్ ఎకానమీలో ఉద్యోగాలు, నైపుణ్యాల్లో మార్పులకు ఇంజిన్లుగా వ్యవహరిస్తున్న జీసీసీలు, ఉద్యోగాల కల్పనకు సారథ్యం వహిస్తున్నాయి. 2025లో 22–25 శాతం మేర ఉద్యోగాలు కల్పించనున్నాయి. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ విభాగాల్లో అత్యధికంగా కొలువులు ఉండనున్నాయి. → 2027లో అందుబాటులోకి రాబోయే 47 లక్షల కొత్త టెక్ ఉద్యోగాల్లో గణనీయ సంఖ్యలో కొలువులను (12 లక్షలు) జీసీసీలే కల్పించనున్నాయి. ప్రధానంగా జెన్ఏఐ, ఇంజినీరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాల్లో ఈ ఉద్యోగాలు ఉంటాయి. → జీసీసీలు మెట్రో పరిధిని దాటి విస్తరిస్తున్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో 1,30,000–1,40,000 మంది తాజా గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేసుకోనున్నాయి. వీరిలో ఎక్కువ శాతం హైరింగ్ ద్వితీయ, తృతీయ శ్రేణి ఇంజినీరింగ్ క్యాంపస్లలో ఉండొచ్చు. వైవిధ్యానికి కూడా ప్రాధాన్యం పెరుగుతోంది. ఇప్పుడు టాప్ 20 జీసీసీల్లో 40 శాతం మంది సిబ్బంది మహిళలే ఉంటున్నారు. పరిశ్రమ సగటు కన్నా ఇది 1.5 రెట్లు అధికం. → 2027 నాటికి భారత్లో 2,100 పైగా జీసీసీలు ఉంటాయి. వీటిలో 30 లక్షల మంది పైగా ఉంటారు. -
చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయే రోజుల్లో ప్రమాదంగా మారుతుందని ఇప్పటికే చాలామంది నిపుణులు పేర్కొన్నారు. రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ఆధునిక చరిత్రలో అతిపెద్ద మార్పు.. అని రాబర్ట్ కియోసాకి ఒక ట్వీట్ చేశారు. ఇందులో ఏఐ వల్ల చాలా మంది తెలివైన విద్యార్థులు ఉద్యోగాలు కోల్పోతారు. నిరుద్యోగం పెరుగుతుంది. చాలా మందికి ఇప్పటికీ ఎడ్యుకేషన్ లోన్స్ అలాగే ఉన్నాయి. నాకు ఉద్యోగం లేదు, కాబట్టి.. ఏఐ నన్ను ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం లేదని అన్నారు.''కొన్నేళ్ల క్రితం.. పేద తండ్రి పాఠశాలకు వెళ్లు, మంచి గ్రేడ్లు పొందు, ఉద్యోగం సంపాదించు, పన్నులు కట్టు, అప్పుల నుంచి బయటపడు, డబ్బు ఆదా చేయు, మరియు స్టాక్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్ల వంటి విభిన్నమైన పోర్ట్ఫోలియోలో పెట్టుబడి పెట్టు అని చెప్పే మాటలకు బదులుగా.. ధనవంతుడైన తండ్రి సలహాను అనుసరించాను. నేను ఒక వ్యవస్థాపకుడిని అయ్యాను, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాను, అప్పును ఉపయోగించాను. డబ్బును ఆదా చేయడానికి బదులుగా, నేను నిజమైన బంగారం, వెండి, నేడు బిట్కాయిన్లను ఆదా చేస్తున్నాను'' అని రాబర్ట్ కియోసాకి చెబుతూనే.. పెట్టుబడి విషయంలో జాగ్రత్త వహించండి అని హెచ్చరించారు.ఇదీ చదవండి: ఉపరాష్ట్రపతి జీతం సున్నా.. అయితే ఆదాయం ఎలా? -
మొదలైన ఐఫోన్ 17 బుకింగ్స్: ఎక్కడ, ఎలా ఆర్డర్ చేయాలంటే..
ఈ వారం ప్రారంభంలో యాపిల్ తన ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ చేసింది. కంపెనీ ఈ లేటెస్ట్ ఫోన్స్ కోసం ప్రీ-బుకింగ్లను భారతదేశంలో శుక్రవారం (సెప్టెంబర్ 12) సాయంత్రం 5:30 గంటల నుంచి ప్రారంభించింది. ఆపిల్ ఆన్లైన్ స్టోర్ లేదా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఇతర ప్లాట్ఫామ్ల ద్వారా కూడా దీనిని బుక్ చేసుకోవచ్చు. అమ్మకాలు సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమవుతాయి. ఆ రోజు మీరు ఐఫోన్ డెలివరీ పొందవచ్చు లేదా మీ నగరంలోని ఆపిల్ స్టోర్ నుంచి కూడా తీసుకోవచ్చు.ఐఫోన్ 17 ప్రీ-బుకింగ్స్.. ఎలా ఆర్డర్ చేయాలంటే..●యాపిల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి.●హోమ్ పేజీలోని మీ ఐఫోన్ 17 మోడల్ను ఎంచుకోండి.●మీరు బుక్ చేయాలనుకుంటున్న వేరియంట్, కలర్, స్టోరేజ్ వంటి వాటిని సెలక్ట్ చేసుకొండి.●బుకింగ్స్ పూర్తి చేయడానికి కార్ట్కు జోడించి, చెక్అవుట్ మీద క్లిక్ చేయండి.●ఆ తరువాత కార్డ్, యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. లేదా ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు.●ఇవన్నీ పూర్తయిన తరువాత బుకింగ్ పూర్తవుతుంది. ఆ తరువాత కంపెనీ డెలివరీ టైమ్లైన్ను షేర్ చేస్తుంది.ఐఫోన్ 17 ధరలుఐఫోన్ 17➤ఐఫోన్ 17 - 256జీబీ: రూ. 82,900➤ఐఫోన్ 17 - 512జీబీ: రూ.1,02,900ఐఫోన్ 17 ప్రో & 17 ప్రో మాక్స్➤ఐఫోన్ 17 ప్రో 256జీబీ: రూ.1,34,900➤ఐఫోన్ 17 ప్రో 512జీబీ: రూ.1,54,900➤ఐఫోన్ 17 ప్రో 1టీబీ: రూ.1,74,900➤ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ 256జీబీ: రూ.1,49,900➤ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ 512జీబీ: రూ.1,69,900➤ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ 1టీబీ: రూ.1,89,900➤ఐఫోన్ 17 ప్రో మాక్స్ 2టీబీ: రూ. 2,29,900ఐఫోన్ 17 ఎయిర్ ➤ఐఫోన్ 17 ఎయిర్ 256జీబీ: రూ.1,19,900➤ఐఫోన్ 17 ఎయిర్ 512జీబీ: రూ.1,39,900➤ఐఫోన్ 17 ఎయిర్ 1టీబీ: రూ.1,59,900ఇదీ చదవండి: ఐఫోన్ 17 ఎయిర్: స్పందించిన ఓపెన్ఏఐ సీఈఓ -
రూ.40 వేలకే ఐఫోన్.. త్వరలో సేల్ ప్రారంభం
ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్ లభించనుంది. సెప్టెంబర్ 23 నుండి ప్రారంభమయ్యే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ లో యాపిల్ ఐఫోన్ 14 కేవలం రూ .40,000 ధరకు లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ లో విక్రయించే అన్ని ఐఫోన్ల ధరలను వెల్లడించింది. చాలా ఫోన్ల ధరలు భారీగా తగ్గాయి.2022 సెప్టెంబర్లో లాంచ్ అయిన ఐఫోన్ 14 ఇప్పుడు కేవలం రూ .40,000కు అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్పై ఇప్పటివరకు ఇదే అత్యంత తక్కువ ధర. ఐఫోన్ 14 ధర ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో రూ .52,990గా ఉంది. కానీ యాపిల్ స్టోర్ లో ఈ ఫోన్ అందుబాటులో లేదు. ఎంపిక చేసిన యాక్సిస్ క్రెడిట్ కార్డుల ద్వారా పొందగలిగే రూ .2,000 తగ్గింపుతో సహా వినియోగదారులు రూ .13,000 వరకు ఆదా చేయవచ్చు.ఫ్లిప్కార్ట్ సేల్లో ఇతర ఐఫోన్ మోడళ్ల ధరలు కూడా తగ్గాయి. ఐఫోన్ 16 ప్రో ప్రస్తుత ధర రూ .1.12 లక్షలతో పోలిస్తే కేవలం రూ .69,999 కు అందుబాటులో ఉంది. తద్వారా రూ .43,000 ఆదా అవుతుంది. అలాగే ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ప్రస్తుత ధర రూ .1,37,900 తో పోలిస్తే రూ .89,900 కు అందుబాటులో ఉంటుంది. దీంతో రూ.48,000 ఆదా అవుతుంది. సెప్టెంబర్ 9న యాపిల్ ఈవెంట్ సందర్భంగా ఆపిల్ ఇప్పటికే కొత్త ఐఫోన్ 17 మోడళ్లను ప్రకటించింది. -
నోకియా హ్యాండ్సెట్ల తయారీదారు కొత్త ఫోన్
నోకియా హ్యాండ్సెట్ల తయారీదారు హెచ్ఎండీ సంస్థ ‘వైబ్ 5జీ’ పేరుతో స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ.8,999 గా ఉంది. కంపెనీ నుంచి రూ.10,000 లోపు ధరలో వస్తున్న తొలి స్మార్ట్ఫోన్ ఇది. ఇందులో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్, 50 మెగాపిక్సల్ రియర్ కెమెరా ఉంది.5000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఈ మొబైల్లో అమర్చారు. దీనికి 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ ఉంది. 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ లభిస్తుంది. ఈ స్మార్ట్ఫోన్కు ఏడాది రిప్లేస్మెంట్ గ్యారెంటీ సదుపాయం ఉంది. అలాగే హెచ్ఎండీ 101 4జీ, 102 4జీ పేరిట రెండు 4జీ ఫీచర్ ఫోన్లను లాంచ్ చేశారు. వీటి ధరలు వరుసగా రూ.1,899, రూ.2,199గా ఉన్నాయి.ఇదీ చదవండి: ఈక్విటీ ఫండ్స్లో తగ్గిన పెట్టుబడుల జోరు! -
స్టార్టప్లకు ‘గేమింగ్’ నిషేధం సెగ..
ముంబై: దేశీయంగా రియల్ మనీ గేమ్స్ (ఆర్ఎంజీ)పై నిషేధం విధించడంతో పలు అంకురాల వాల్యుయేషన్పై ప్రభావం చూపింది. నాలుగు బడా సంస్థలు .. యూనికార్న్ (1 బిలియన్ డాలర్ల విలువ చేసే అంకురాలు) జాబితా నుంచి చోటు కోల్పోయాయి. డ్రీమ్11 (26 కోట్ల యూజర్లు) , గేమ్స్ 24 x 7 (12 కోట్ల యూజర్లు), గేమ్స్క్రాఫ్ట్ (3 కోట్ల యూజర్లు), మొబైల్ ప్రీమియర్ లీగ్ (9 కోట్ల యూజర్లు) వీటిలో ఉన్నాయి. ఇక యూనికార్న్లు కాకపోయినప్పటికీ ‘జూపీ’, ‘విన్జో గేమ్స్’లాంటి సంస్థల వాల్యుయేషన్లు కూడా పడిపోయాయి. ‘2025 ఆస్క్ ప్రైవేట్ వెల్త్ హురున్ ఇండియా యూనికార్న్, ఫ్యూచర్ యూనికార్న్’ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఆన్లైన్ మనీ గేమ్స్ను నిషేధించే బిల్లును పార్లమెంటు గత నెల ఆమోదించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఆన్లైన్ మనీ గేమ్స్ సంబంధిత ప్రకటనలపై కూడా నిషేధం వర్తిస్తుంది. అలాంటి గేమ్స్ ఆడేందుకు నగదును బదిలీ చేసే సరీ్వసులను సైతం బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అందించకూడదు. ‘‘ఇలాంటి మార్పులన్నింటి వల్ల భారత్లో పేరొందిన పలు ఆర్ఎంజీ కంపెనీలపై ప్రభావం పడింది. దీనితో వాటి వృద్ధి నెమ్మదించే అవకాశం ఉంది’’ అని నివేదిక పేర్కొంది. అలాగే ఈ చట్టం వల్ల పరిశ్రమపై ఇన్వెస్టర్ల నమ్మకం కూడా సడలిందని వివరించింది. మరోవైపు, అంకురాలు క్రమంగా లాభదాయకత, పెట్టుబడులను సమర్ధంగా వినియోగించుకోవడం, దీర్ఘకాలంలో నిలకడగా ఉండే వ్యాపార విధానాల వైపు మొగ్గు చూపుతున్నాయని ఆస్క్ ప్రైవేట్ వెల్త్ ఎండీ రాజేశ్ సలూజా తెలిపారు. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు.. → 8.2 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్తో అత్యంత విలువైన భారతీయ స్టార్టప్గా డిస్కౌంట్ బ్రోకరేజీ సంస్థ జిరోధా అగ్రస్థానంలో ఉంది. చెరి 7.5 బిలియన్ డాలర్లతో ఫిన్టెక్ సంస్థ రేజర్పే, లెన్స్కార్ట్ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. → అత్యధికంగా 26 అంకురాలతో బెంగళూరు యూనికార్న్ హబ్గా నిల్చింది. వీటి మొత్తం వాల్యుయేషన్ 70 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక 36.3 బిలియన్ డాలర్ల విలువ చేసే 12 స్టార్టప్లతో ఢిల్లీ–ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్) రెండో స్థానంలో, 22.8 బిలియన్ డాలర్ల విలువ చేసే 11 సంస్థలతో ముంబై మూడో స్థానంలో నిల్చాయి. → దేశీయంగా అత్యంత పిన్న వయసు్కలైన యూనికార్న్ వ్యవస్థాపకులుగా జెప్టో ఫౌండర్లు కైవల్య ఓహ్రా, ఆదిత్ పలిచా (ఇద్దరికీ 22 ఏళ్లు) నిల్చారు. → వెంచర్ క్యాపిటల్ సంస్థ పీక్ ఫిఫ్టీన్ పార్ట్నర్స్ భారతీయ స్టార్టప్స్లో అత్యధికంగా ఇన్వెస్ట్ చేసింది. టరి్టల్మింట్, వాట్ఫిక్స్, గ్రో, ప్రిజమ్ (ఓయో) సహా 68 అంకురాల్లో 200 మిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులు పెట్టింది. అత్యంత విలువైన స్టార్టప్లు ఏకంగా 3.74 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. యూనికార్న్లలో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య 2.06 లక్షలుగా ఉంది. 11 కొత్త యూనికార్న్లు .. కొన్ని ఆర్ఎంజీ కంపెనీలు లిస్టు నుంచి నిష్క్రమించినప్పటికీ ఈ ఏడాది యూనికార్న్ల జాబితాలోని స్టార్టప్ల సంఖ్య మొత్తం మీద పెరిగి, 73కి చేరింది. ఈ ఏడాది 11 అంకురాలు యూనికార్న్ హోదా దక్కించుకున్నాయి. ఏఐడాట్టెక్, నవీ టెక్నాలజీస్, వివృతి క్యాపిటల్, వెరిటాస్ ఫైనాన్స్, ర్యాపిడో, నెట్రాడైన్, జంబోటెయిల్, డార్విన్బాక్స్, మనీవ్యూ, జస్పే, డ్రూల్స్ వీటిలో ఉన్నాయి. -
ఐఫోన్ 17 ఎయిర్: స్పందించిన ఓపెన్ఏఐ సీఈఓ
యాపిల్ కంపెనీ ఇటీవల ఐఫోన్ 17 సిరీస్ ఫోన్ను నాలుగు వేరియంట్లలో లాంచ్ చేసింది. ఇందులోని ఎయిర్ వేరియంట్ ఓపెన్ఏఐ సీఈఓ 'సామ్ ఆల్ట్మన్'ను తెగ ఆకట్టుకుంది. దీనిపై స్పందిస్తూ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.''చాలా కాలంగా నేను కోరుకుంటున్న మొదటి కొత్త ఐఫోన్ అప్గ్రేడ్ ఇది! చాలా బాగుంది'' అని యాపిల్ టెక్నాలజీని సామ్ ఆల్ట్మన్ ప్రశంసించారు. కంపెనీ ఇటీవల లాంచ్ చేసిన ఐఫోన్ ఎయిర్ అత్యంత సన్నని హ్యాండ్సెట్. ఇది చాలా తేలికగా ఉండటం వల్ల మీ చేతిలో ఇట్టే ఇమిడిపోతుంది. 5.6 మిల్లీమీటర్ల మందం కలిగిన ఫ్రేమ్, కేవలం 165 గ్రాముల బరువు కలిగిన ఇది ఇప్పటివరకు ఉన్న అత్యంత సన్నని ఐఫోన్.గతంలో చాలామంది ఐఫోన్ ప్రియులు, విశ్లేషకులు.. కొత్త ఆవిష్కరణలు లేదని ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పుడు ఐఫోన్ 17 ఎయిర్ ఎనిమిది సంవత్సరాలలో కంపెనీ ఆవిష్కరించిన అతిపెద్ద మార్పులలో ఒకటిగా నిలిచింది.first new iphone upgrade i have really wanted in awhile! looks very cool.— Sam Altman (@sama) September 9, 2025ఐఫోన్17 ధరలుటెక్ దిగ్గజం యాపిల్ తాజాగా ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్ ఫోన్లను ఆవిష్కరించింది. ఐఫోన్ 17లో 6.3 ఇంచెస్ స్క్రీన్, ఏ19 ప్రో ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ డ్యుయల్ ఫ్యూజన్ కెమెరా, 24 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 256 జీబీ మెమొరీ తదితర ఫీచర్లు ఉన్నాయి. అయిదు రంగుల్లో లభించే అత్యంత పల్చని ఐఫోన్ 17 ఎయిర్ని కూడా యాపిల్ విడుదల చేసింది. ఐఫోన్ 17 ధర 799 డాలర్ల నుంచి, ప్రో ధర 1,099 డాలర్లు, ప్రో మ్యాక్స్ ధర 1,199 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. -
ఇప్పుడంతా ఇదే ట్రెండ్!.. అద్భుతాలు చేస్తున్న బనానా ఏఐ
టెక్నాలజీ రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. ఇందులో భాగంగానే గూగుల్ గత నెలలో జెమిని యాప్కు 'నానో బనానా' సంబంధించిన ఏఐ ఇమేజ్ నేర్ ఎడిటింగ్ టూల్ను విడుదల చేసింది. నానో బనానా లాంచ్ అయిన కొన్ని రోజుల్లోనే జెమిని యాప్ 10 మిలియన్ డౌన్లోడ్లను దాటిందని, ఈ యాప్ అధిక ప్రజాదరణ పొందిందని గూగుల్ వీపీ జోష్ వుడ్వార్డ్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.ప్రస్తుతం నానో బననా ట్రెండ్ సాగుతోంది. 3D బొమ్మలను సృష్టించడానికి ఇది చాలా ఉపయోగకరంగా మారింది. ఇప్పటి వరకు ఈ టూల్ 200 మిలియన్ల కంటే ఎక్కువ ఫోటోలను సృష్టించింది. వేగం, ఖచ్చితత్వంలో ఇది చాట్జీపీటీ, మిడ్జర్నీ వంటి ప్రత్యర్థులంటే ముందు ఉంది. దీంతో ఇది ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. సినీతారలు, రాజకీయ నాయకులు, పెంపుడు జంతువులను సైతం ఈ ట్రెండింగ్ ఏఐను ఉపయోగించి అద్భుతంగా రూపొందించుకుంటున్నారు. ఇవి చూపరులను వావ్ అనేలా చేస్తున్నాయి. ప్రస్తుతం నానో బననా 5 ప్రాంప్ట్లలో అందుబాటులో ఉంది.ప్రాంప్ట్ 1వినియోగదారులు తమ ఫోటోను అప్లోడ్ చేసి, బొమ్మల పెట్టె లోపల తమ బొమ్మను రూపొందించమని జెమినిని అడగవచ్చు. ఇది ప్యాకేజింగ్, గ్రాఫిక్స్, స్టోర్-షెల్ఫ్ లుక్తో పూర్తి చేస్తుంది. ఈ విధానాన్ని చాలామంది ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ప్రాంప్ట్లలో ఇది ఒకటి. మిమ్మల్ని మీరు యాక్షన్ ఫిగర్గా మార్చుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.ప్రాంప్ట్ 2వేరే దశాబ్దంలో ఉన్నట్లు కూడా మిమ్మల్ని మీరు సృష్టించుకోవచ్చు. మీ ఫోటోను 1920ల ఫ్లాపర్, 1970ల డిస్కో డాన్సర్ లేదా 1990ల సిట్కామ్ పాత్రలో చూపించమని అడగవచ్చు. మీరు ఎంచుకున్న దశాబ్దానికి సరిపోయే విధంగా బట్టలు, హెయిర్స్టైల్స్ వంటివాటిని ఏఐ మారుస్తుంది.ప్రాంప్ట్ 3కొంతమంది తమను తాము ప్రసిద్ద టీవీ షోలలో కనిపించేలా డిజైన్ చేసుకోవాలని ఆశపడతారు. బననా ఏఐ ఇప్పుడు దీనిని సాధ్యం చేస్తుంది. మీరు కోరుకున్నట్లు ఏఐ మిమ్మల్ని మారుస్తుంది.ప్రాంప్ట్ 4జెమిని ఏఐ ఇప్పుడు మిమ్మల్ని ప్రముఖుల పక్కన ఉన్నట్లు కూడా చూపించగలదు. ఉదాహరణకు మోనాలిసా పక్కన నిలబడి ఉండటం, వాన్ గోహ్ స్టార్రి నైట్లో కనిపించడం లేదా డాలీ ది పెర్సిస్టెన్స్ ఆఫ్ మెమరీలో కలిసిపోవడం వంటివి ఉన్నాయి. మీకు నచ్చిన ప్రముఖుల పక్కన మిమ్మల్ని మీరు చూసుకోవడానికి ఇది అనుమతిస్తుంది.ఇదీ చదవండి: క్షీణిస్తున్న అమెరికా టూరిజం: అసలైన కారణాలు ఇవే..ప్రాంప్ట్ 5బననా ఏఐ సాయంతో.. ప్రపంచంలోని ప్రముఖ ప్రదేశాల్లో ఉన్నట్లు కూడా రూపొందిందించుకోవచ్చు. ఐఫెల్ టవర్ నుంచి తాజ్ మహల్, హాలీవుడ్ సైన్ వరకు మీకు నచ్చిన ప్రసిద్ధ ప్రదేశంలో మీరు ఉన్నట్లు చూసుకోవడానికి ఇది అనుమతిస్తుంది. ఏఐ దీనికి లైటింగ్ ఇతర షేడ్స్ కూడా అందిస్తుంది. -
మార్స్పై గతంలో జీవం!
కేప్ కనావెరల్(యూఎస్): అంగారకునిపై కోట్ల సంవత్సరాల క్రితం జీవం మనుగడ ఉండేదన్న వాదనలకు మరింత బలం చేకూరేలా అక్కడి నాసా ‘పర్సివరెన్స్’రోవర్ ఒక శిలాజం ఆనవాళ్లను గుర్తించింది. వందల కోట్ల సంవత్సరాల క్రితం ప్రవహించి ఎండిపోయిన ఒక నది ఒడ్డున ఉన్న ఒక శిలపై ప్రత్యేకమైన గుర్తులను పర్సివరెన్స్ రోవర్ కనిపెట్టింది.భూమి మీద మాత్రమే కనిపించే కొన్ని ప్రత్యేక మూలకాల రసాయన, భౌతిక చర్యల కలయికగా ఏర్పడే ‘లెపర్డ్స్పాట్స్’ ను అక్కడ గుర్తించారు. ఆ గుర్తుల్లో అధిక ఇనుప ధాతువు జాడలున్నాయి. నీటి పీల్చుకున్న ఐరన్ ఫాస్ఫేట్(వివియనైట్), గ్రెగైట్(ఐరన్ సల్పైడ్)లను దానిపై కనిపెట్టారు. శిథిలమైన కర్భన పదార్థాల్లో వివియనైట్ ఉంటుంది. అలాగే చిన్నపాటి జీవులు సైతం గ్రెగైట్ను ఉత్పత్తిచేస్తాయి. ఈ లెక్కన ప్రాచీన జీవికి సంబంధించిన జాడగా ఈ ‘లెపర్ట్ స్పాట్’ను భావించవచ్చని నాసా తాత్కాలిక అడ్మినిస్ట్రేటర్ సీన్ డఫీ వ్యాఖ్యానించారు. After a year of scientific scrutiny, a rock sample collected by the Perseverance rover has been confirmed to contain a potential biosignature. The sample is the best candidate so far to provide evidence of ancient microbial life on Mars. https://t.co/0BAO1dhMG8 pic.twitter.com/JsOXgrNDmY— NASA Mars (@NASAMars) September 10, 2025 -
రిలయన్స్ ఇంటెలిజెన్స్ షురూ
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇంటెలిజెన్స్ పేరుతో ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సేవల కంపెనీకి తెరతీసినట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా వెల్లడించింది. పూర్తి అనుబంధ కంపెనీగా ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఇందుకు కార్పొరేట్ వ్యవహారాల శాఖ నుంచి సర్టీఫికెట్ను పొందినట్లు తెలియజేసింది. గత నెలలో నిర్వహించిన వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం) లో కొత్తగా ఏఐ కంపెనీని ఏర్పాటు చేయనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ వాటాదారులకు వెల్లడించిన సంగతి తెలిసిందే. తద్వారా భారీస్థాయి ఏఐ మౌలికసదుపాయాలకు తెరతీయనున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్లోబల్ టెక్ దిగ్గజాలు మెటా, గూగుల్తో కొత్త భాగస్వామ్యాలను సైతం ప్రకటించారు. గిగావాట్ సామర్థ్యంతో రిలయన్స్ ఇంటెలిజెన్స్ను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్ఐఎల్ ఇప్పటికే వెల్లడించింది. గ్రీన్ ఎనర్జీ మద్దతుతో ఏఐ–రెడీ డేటా సెంటర్లతో నెలకొల్పుతున్నట్లు తెలియజేసింది. దశాబ్దంక్రితం రిలయన్స్ ఇండస్ట్రీస్కు డిజిటల్ సరీ్వసులు గ్రోత్ ఇంజిన్గా నిలవగా.. ఇకపై ఏఐతో మరింత పురోభివృద్ధిని అందుకోనున్నట్లు ఏజీఎంలో ముకేశ్ పేర్కొన్నారు. -
భారత్లో 19 నుంచి ఐఫోన్ 17 సేల్..!
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ కొత్తగా ప్రవేశపెట్టిన ఐఫోన్ 17 స్మార్ట్ఫోన్ల శ్రేణి విక్రయాలు సెప్టెంబర్ 19 నుంచి భారత మార్కెట్లో ప్రారంభం కానున్నాయి. వీటి ధరల శ్రేణి రూ. 82,900 నుంచి రూ. 2,29,900 వరకు ఉంటుంది. ఎయిర్ పేరిట యాపిల్ అత్యంత పల్చని ఐఫోన్ను కూడా ప్రవేశపెట్టింది. ఇది కేవలం 5.6 మిల్లీమీటర్ల మందం ఉంటుంది. ఈ–సిమ్లను మాత్రమే సపోర్ట్ చేస్తుంది. కొత్త ఐఫోన్ మోడల్స్లో 128 జీబీ స్టోరేజీ ఆప్షన్ను కంపెనీ నిలిపివేసింది. దీంతో ఐఫోన్ 16 సిరీస్తో పోలిస్తే బేస్ మోడల్స్ ధర పెరిగింది. భారత్ సహా 63 దేశాల్లోని కస్టమర్లు సెప్టెంబర్ 12 నుంచి ఐఫోన్ 17 ప్రో, ప్రో మ్యాక్స్ని ప్రీ–ఆర్డర్ చేయొచ్చని యాపిల్ తెలిపింది. ఐఫోన్ 17 ఫోన్లు 256 జీబీ, 512 జీబీ స్టోరేజీతో లభిస్తాయి. ఎయిర్ సిరీస్ 256 జీబీ నుంచి 1 టీబీ స్టోరేజీతో లభిస్తుంది. ఏ19 చిప్సెట్ వల్ల ఐఫోన్ 16తో పోలిస్తే కొత్త ఐఫోన్ 20% అధికం, ఐఫోన్ 13తో పోలిస్తే రెట్టింపు వేగంతో పని చేస్తుంది. గతానికి భిన్నంగా ఈసారి ‘ప్లస్’ మోడల్స్ ఏవీ లేవు. ప్రో మ్యాక్స్లో తొలిసారిగా 2టీబీ ఆప్షన్ను కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు, శాటిలైట్ కమ్యూనికేషన్స్కి కూడా ఉపయోగపడేలా వాచ్ 3 అల్ట్రాను కూడా యాపిల్ ఆవిష్కరించింది. దీని ధర రూ. 89,900గా ఉంటుంది. ప్రీ–ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. -
సర్వీస్ స్టార్
‘నా టైమ్ బాగ లేదు’ అనుకున్నాడు తాతయ్య. ఎందుకంటే ఆయన ఆన్లైన్ మోసానికి గురయ్యాడు. దాంతో తీవ్ర నిర్వేదానికి లోనయ్యాడు. ఈ నేపథ్యంలో తన తాతయ్యలాంటి ఎంతో మంది వృద్ధుల కోసం ‘షీల్డ్ సీనియర్స్’ అనే వెబ్సైట్ను రూపొందించిన పదిహేడు సంవత్సరాల ఇండియన్–అమెరికన్ తేజస్వి మనోజ్... టైమ్స్ మ్యాగజైన్ ‘కిడ్ ఆఫ్ ది ఇయర్–2025’ ఘనత సాధించింది. ‘ఆన్లైన్ మోసానికి గురైతే ఏం చేయాలి...’ నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తల వరకు సెమినార్లు, తన వెబ్సైట్ ద్వారా విస్తృత ప్రచారం చేస్తోంది తేజస్వి. ఇప్పుడు తేజస్వి ‘టైమ్’ బాగుంది. ఆమె చెప్పే సాంకేతిక విషయాల గురించి వినడానికి ఆబాలగోపాలం ఆసక్తి కనబరుస్తోంది. టైమ్ మ్యాగజైన్ తేజస్విని ‘సర్వీస్ స్టార్’గా కొనియాడింది...కాలిఫోర్నియాలో పుట్టి డాలస్లో పెరిగింది తేజస్వి మనోజ్. తేజస్వి తల్లిదండ్రులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. కోడింగ్ అంటే తేజస్వికి ఎంతో ఇష్టం. చాలా చిన్న వయసులోనే కోడింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టింది. బొమ్మలతో ఆడుకుందో లేదో తెలియదుగానీ కోడింగ్ ప్రపంచంలో జావా, పైథాన్లతో ఆడుకుంది.కోడింగ్ శక్తి... ‘గర్ల్స్ హూ కోడ్’ అనే స్వచ్ఛంద సంస్థ సైబర్ సెక్యూరిటీపై నిర్వహించే క్లాసులకు రెగ్యులర్గా హాజరయ్యేది తేజస్వి. ఎయిర్ ఫోర్స్, స్పేస్ఫోర్స్ ప్రోగ్రామ్ ‘సైబర్–పేట్రియాట్’లో చురుగ్గా పాల్గొనేది. ‘కోడింగ్ అనేది ఎంతో అద్భుత ప్రక్రియ. కోడింగ్ ను చాలా ఎంజాయ్ చేస్తాను. కోడింగ్ను నేర్చుకోవడం వల్ల దానిశక్తి ఏమిటో తెలుసుకోగలిగాను. భవిష్యత్లో కూడా కోడింగ్తో నా ప్రయాణం కొనసాగుతుంది’ అంటుంది తేజస్వి.ఎంతోమంది తాతయ్యల కోసం...గత సంవత్సరం తేజస్వి తాత ఆన్లైన్ మోసానికి గురయ్యాడు. మోసగాళ్లు ఆయన నుంచి డబ్బు డిమాండ్ చేశారు. అయితే కుటుంబసభ్యులకు ఈ ఆన్లైన్ మోసం గురించి తెలియడంతో వారి ఆటలు సాగలేదు. తాతయ్యకు ఆన్లైన్ మోసాల గురించి అవగాహన లేకపోవడం తేజస్విని ఆశ్చర్యపరిచింది. అయితే తన తాత మాత్రమే కాదు ఎంతోమంది వ్యక్తులకు ఆన్లైన్ మోసాల గురించి బొత్తిగా అవగాహన లేదనే విషయం తెలుసుకుంది. అలా అని తేజస్వి బాధపడుతూ కూర్చోలేదు.‘నా వంతుగా ఏదైనా చేయాలి’ అని పరిశోధన బాట పట్టింది. సీనియర్ సిటిజన్లకు ఆన్లైన్ మోసాల గురించి హెచ్చరించడానికి ‘షీల్డ్ సీనియర్స్’ పేరుతో వెబ్సైట్ రూపొందించింది. సైబర్సెక్యూరిటీకి సంబంధించిన ప్రాథమిక సూత్రాలను ‘షీల్డ్ సీనియర్స్’ తెలియజేస్తుంది.స్వతంత్రంగా... సగర్వంగా...‘సీనియర్ సిటిజనులు ఎలాంటి సంకోచం లేకుండా స్వతంత్రంగా, సగర్వంగా ఆన్లైన్ ప్రపంచంలో తమ పనులు తాము చేసుకునేలా షీల్డ్ సీనియర్స్’కు రూపకల్పన చేశాం’ అంటుంది తేజస్వి.ఆన్లైన్ మోసాలపై అవగాహన కలిగించడానికి తేజస్వి నిర్వహించే సమావేశాలకు ఎంతోమంది వృద్ధులు హాజరవుతుంటారు. ఆమె ప్రసంగిస్తుంటే నోట్స్ రాసుకుంటారు. ప్రసంగం పూర్తయిన తరువాత తేజస్విని రకరకాల సందేహాలు అడుగుతుంటారు. వాటికి ఓపికగా జవాబులు ఇస్తుంటుంది తేజస్వి.‘మాది టెక్ ఫ్యామిలీ’ అని ఘనంగా చెబుతుంటాడు తేజస్వి తండ్రి మనోజ్. ఆ ఘనతకు సామాజిక ప్రయోజానాన్ని జోడించి ‘డిజిటల్ డిఫెండర్’గా పేరు తెచ్చుకుంది తేజస్వి. ∙ఆహా... ఆల్రౌండర్!కోడింగ్లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న తేజస్వి మనోజ్ వయోలిన్ అద్భుతంగా వాయిస్తుంది. తన ఆర్కెస్ట్రాతో హైస్కూల్లో ఎన్నో కచేరీలు చేసింది. కరాటేలో కూడా ప్రవేశం ఉంది. స్కౌటింగ్–అమెరికాలో యాక్టివ్గా ఉంది. తాజాగా ఈగిల్ స్కౌట్ ర్యాంక్ అందుకుంది. ‘వైభ’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా భూటాన్ కాందిశీకుల పిల్లలకు మ్యాథ్స్, ఇంగ్లీష్ బోధిస్తోంది. సామాజిక సేవాకార్యక్రమాలలో ఎప్పుడూ ముందుంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ తనకు ఇష్టమైన సబ్జెక్ట్లు. భవిష్యత్లో కంప్యూటర్ సైన్స్ చదవాలనుకుంటుంది. ‘ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవాలనే ఉత్సాహవంతుల దగ్గరికి విజయాలు ఉత్సాహంగా నడిచొస్తాయి’ అని చెప్పడానికి బలమైన ఉదాహరణ తేజస్వి మనోజ్.ఉక్కుకవచం... షీల్డ్ సీనియర్స్‘షీల్డ్ సీనియర్స్’లో ఆన్లైన్ మోసాలకు సంబంధించిన సందేహాలకు చాట్బాట్ ద్వారా సమాధానాలు తెలుసుకోవచ్చు. అనుమానాస్పద టెక్ట్స్, మెజేస్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా విశ్లేషించుకోవచ్చు. ‘షీల్డ్ సీనియర్స్’లో నాలుగు విభాగాలు ఉంటాయి. ‘లెర్న్’ విభాగంలో ఇంటర్నెట్ సెక్యూరిటీకి సంబంధించి ప్రాథమిక విషయాలు తెలుసుకోవచ్చు. స్ట్రాంగ్ పాస్వర్డ్స్ రూపొందించుకోవడానికి, ప్రైవసీ సెట్టింగ్స్ను అర్థం చేసుకోవడానికి, ఎలాంటి సమాచారం షేర్ చేయవచ్చు, ఏది చేయకూడదు...మొదలైనవి తెలుసుకోవచ్చు. ‘ఆస్క్’ విభాగంలో చాట్బాట్ ద్వారా సందేహ నివృత్తి చేసుకోవచ్చు. ‘ఎనలైజ్’ అనేది మూడో విభాగం. యూజర్లు ఈ ట్యాబ్ క్లిక్ చేసి అనుమానాస్పద టెక్ట్స్, ఈ మెయిల్స్ను అప్లోడ్ చేయవచ్చు. ‘రిపోర్ట్’ సెక్షన్లో ఆన్లైన్ మోసగాళ్లపై ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదులపై స్పందించే 14 ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలకు చెందిన లింక్స్ ఇందులో ఉంటాయి. -
2030 నాటికి 15.7 ట్రిలియన్ డాలర్లు.. ప్రపంచ జీడీపీకి ఏఐ శక్తి
న్యూఢిల్లీ: కృత్రిమ మేధస్సు (AI) 21వ శతాబ్దాన్ని నిర్వచించే సాంకేతికతగా ఎదుగుతోంది. 2030 నాటికి ప్రపంచ జీడీపీలో సుమారు 15.7 ట్రిలియన్ డాలర్లను ఏఐ జోడించనుందని ఫీక్కీ-బీసీజీ విడుదల చేసిన "ది గ్లోబల్ ఏఐ రేస్" నివేదిక వెల్లడించింది.ఏఐ స్వీకరణలో అభివృద్ధి చెందిన దేశాలు ముందంజలో ఉన్నాయి. 66% దేశాలు జాతీయ ఏఐ వ్యూహాలను రూపొందించగా, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది 30 శాతంగా ఉంది. ఇక తక్కువ అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది కేవలం 12% మాత్రమే. ఈ అసమానత విదేశీ దిగుమతులపై ఆధారపడే ప్రమాదాన్ని పెంచుతోంది.ఏఐ స్వీకరణ రేస్లో కంప్యూట్, డేటా, మోడల్స్, టాలెంట్ అనే నాలుగు కీలక అంశాలు ఉన్నాయి. అమెరికా, చైనా వంటి దేశాలు ఏఐ నిపుణులలో ఆధిపత్యం కలిగి ఉన్నాయి. వ్యవసాయం, ప్రజా సేవలు వంటి రంగాలు ఏఐ స్వీకరణలో ఇంకా వెనుకబడ్డాయి.వ్యవసాయ రంగంలో ఏఐ ద్వారా 20% ఉత్పత్తి వృద్ధి సాధ్యమవుతుంది. అయితే, సంస్థలు పెట్టుబడులు పెట్టినా ఏఐ పైలట్లు క్షేత్రస్థాయికి వెళ్లకముందే సగం విఫలమవుతున్నాయి. రైజ్ (రీసెర్చ్, ఇన్వెస్ట్మెంట్, స్కిల్లింగ్, ఎథిక్స్) ఫ్రేమ్వర్క్ ద్వారా ప్రభుత్వాలు ఏఐ స్వీకరణ పెంపుపై దృష్టి పెట్టాలి. అంతర్జాతీయ సహకారం, మౌలిక సదుపాయాలు, నైపుణ్య అభివృద్ధి, నైతిక పాలన అవసరం."ఏఐ కేవలం సాంకేతిక తరంగం మాత్రమే కాదు.ఇది రాబోయే దశాబ్దాలలో ఆర్థిక, సామాజిక నాయకత్వాన్ని నిర్వచించే వ్యూహాత్మక పోటీ. ఏఐ అనేది ప్రయోజనం కోసం జరిగే పోటీ మాత్రమే కాదు. ప్రపంచానికి విలువను పెంచే పురోగతికి సమిష్టి అన్వేషణ" అని ఫీక్కీ డైరెక్టర్ జనరల్ జ్యోతి విజ్ పేర్కొన్నారు. -
చైనా సంచలనం.. అమెరికా చిప్ లేకుండా ‘బ్రెయిన్’ ఏఐ నమూనా
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో చైనా మరో కీలక అడుగు వేసింది. స్పైకింగ్బ్రెయిన్ 1.0 (SpikingBrain 1.0) అనే “మెదడు ప్రేరిత” లాంగ్వేజ్ మోడల్ను విడుదల చేసింది. ఇది ఎన్విడియా చిప్లు లేకుండానే సంప్రదాయ ఏఐ మోడళ్ల కంటే 100 రెట్లు వేగంగా పనిచేస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు.ఈ మోడల్ను చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆటోమేషన్ అభివృద్ధి చేసింది. ఇది న్యూరోమార్ఫిక్ డిజైన్ ఆధారంగా పనిచేస్తుంది. అంటే మన మెదడు లాగా, అవసరమైన న్యూరాన్లు మాత్రమే స్పందిస్తాయి. ఈ “స్పైకింగ్ కంప్యూటేషన్” పద్ధతి వల్ల విద్యుత్ వినియోగం తక్కువగా ఉంటుంది. అలాగే ట్రైనింగ్ డేటా అవసరం కూడా చాలా తక్కువగా ఉంటుంది.స్పైకింగ్బ్రెయిన్.. చాట్జీపీటీ (ChatGPT) లాంటి మోడళ్లకు అవసరమైన ట్రైనింగ్ డేటాలో కేవలం 2 శాతం మాత్రమే ఉపయోగించి, వాటితో సమానమైన పనితీరును అందిస్తుందని ప్రాజెక్ట్ ప్రధాన పరిశోధకుడు లి గువోకి తెలిపారు. ఈ మోడల్ చైనాలోనే అభివృద్ధి చేసిన మెటాఎక్స్ చిప్లపై పనిచేస్తుంది. అమెరికా జీపీయూ ఎగుమతి నియంత్రణలకు లోనవకుండా, స్వతంత్ర ఏఐ మౌలిక సదుపాయాల వైపు చైనా అడుగులు వేస్తోంది.స్పైకింగ్బ్రెయిన్.. దాని డెమో సైట్ లో తనను తాను ఇలా పరిచయం చేసుకుంటుంది. "హలో! నేను స్పైకింగ్ బ్రెయిన్ 1.0, లేదా 'షుంక్సీ', మెదడు-ప్రేరేపిత ఏఐ మోడల్ని. మానవ మెదడు సమాచారాన్ని స్పైకింగ్ కంప్యూటేషన్ పద్ధతితో ప్రాసెస్ చేసే విధానాన్ని నేను మిళితం చేస్తాను. పూర్తిగా చైనీస్ టెక్నాలజీపై నిర్మించిన శక్తివంతమైన, నమ్మదగిన, శక్తి-సమర్థవంతమైన ఏఐ సేవలను అందించగలను" అంటోంది. -
ఇన్ఫోసిస్ వచ్చేస్తోంది.. క్యాంపస్ ఉద్యోగాల జాతరకు సిద్ధం
దేశీయ రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ క్యాంపస్ నియామకాలకు సన్నద్ధమవుతోంది. దాదాపు రెండేళ్ల తర్వాత కాలేజీ క్యాంపస్లకు వచ్చి విద్యార్థులను ఉద్యోగాల్లో నియమించుకోబోతోంది. ఈ మేరకు రిక్రూట్మెంట్కు సంబంధించిన ప్యానెల్ ఇంటర్వ్యూలలో పాల్గొనాలని తమ సీనియర్ సిబ్బందిని ఇన్ఫోసిస్ కోరింది.టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రోతో సహా ప్రధాన ఐటీ కంపెనీలు కోవిడ్ కారణంగా క్యాంపస్, లేటరల్ రిక్రూట్మెంట్లను తగ్గించాయి. ఇన్ఫోసిస్ అయితే ఫ్రెషర్ రిక్రూట్మెంట్లను బాగా తగ్గించేసింది. 2024 ఆర్థిక సంవత్సరంలో 11,900 మందిని మాత్రమే నియమించుకుంది. అంతకుముందు సంవత్సరంలో నియామకాల సంఖ్య 50,000తో పోల్చితే ఇది చాలా తక్కువ. ఈ సంఖ్య 2025 ఆర్థిక సంవత్సరంలో 15,000 కు పెరిగింది.బెంగళూరుకు చెందిన ఐటీ సంస్థ మార్చి 2026 తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి కంబైన్డ్ ఆఫ్, ఆన్-క్యాంపస్ కార్యక్రమాల ద్వారా 15,000-20,000 కొత్త నియామకాల లక్ష్యాన్ని పెట్టుకుంది. డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ల (డీఎస్ఈ) పేరుతో ఫ్రెషర్లను ఇన్ఫోసిస్ ఎంపిక చేయబోతోంది.క్యాంపస్ ఇంటర్వ్యూల గురించి ఇన్ఫోసిస్ తొలిసారిగా మేనేజర్ స్థాయి అంతకంటే ఎక్కువ హోదా ఉన్న ఉద్యోగులకు మాస్ ఈ మెయిల్ కమ్యూనికేషన్ పంపింది. దీని ప్రకారం.. ఇన్ఫోసిస్ ప్రతినిధులు అభ్యర్థుల ప్రాథమిక ప్రోగ్రామింగ్ సామర్థ్యాలను, ఎంట్రీ లెవల్ డీఎస్ఈ స్థానాలకు అవసరమైన సమస్య పరిష్కార సామర్థ్యాలను అంచనా వేస్తారు.ఇన్ఫోసిస్ క్యాంపస్ నియామాలు వచ్చే అక్టోబర్, నవంబర్ చివరి మధ్య షెడ్యూల్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో కోవిడ్ మహమ్మారి సమయంలో కంపెనీ వర్చువల్ ఇంటర్వ్యూలను నిర్వహించింది. -
ఐఫోన్ 17 వచ్చేసింది..
క్యుపర్టీనో, అమెరికా: టెక్ దిగ్గజం యాపిల్ తాజాగా ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్ ఫోన్లను ఆవిష్కరించింది. ఐఫోన్ 17లో 6.3 అంగుళాల స్క్రీన్, ఏ19 ప్రో ప్రాసెసర్, 48 ఎంపీ డ్యుయల్ ఫ్యూజన్ కెమెరా, 24 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 256 జీబీ మెమొరీ తదితర ఫీచర్లు ఉన్నాయి. అయిదు రంగుల్లో లభిస్తుంది. అత్యంత పల్చని ఐఫోన్ 17 ఎయిర్ని కూడా యాపిల్ విడుదల చేసింది. దీని మందం 5.6 మిల్లీమీటర్లుగా ఉంటుంది. ఐఫోన్ 17 ధర రూ. 799 డాలర్ల నుంచి, ప్రో ధర రూ. 1,099 డాలర్ల నుంచి, ప్రో మ్యాక్స్ రేటు 1,199 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది.ఎయిర్ ధర 999 డాలర్ల నుంచి ఉంటుంది. మంగళవారం క్యుపర్టినోలో జరిగిన కార్యక్రమంలో యాపిల్ సీఈవో టిమ్ కుక్.. కొత్త ఐఫోన్తో పాటు పలు ఉత్పత్తులను ఆవిష్కరించారు. వీటిలో వాచీలు, ఎయిర్పాడ్స్ ఉన్నాయి. వాచ్ ఎస్ఈ, వాచ్ సిరీస్ 11, వాచ్ అల్ట్రా 3ని కంపెనీ ఆవిష్కరించింది. వీటి ధరలు వరుసగా 249 డాలర్లు, 399 డాలర్లు, 799 డాలర్లుగా ఉంటాయి. సెపె్టంబర్ 19 నుంచి అందుబాటులోకి వస్తాయి. అటు కొత్త ఎయిర్పాడ్స్ ప్రో3 ధర 249 డాలర్లుగా ఉంటుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 10 గంటలు బ్యాటరీ లైఫ్ ఉంటుంది. -
జియో కొత్త టెక్నాలజీ: టెన్షన్ లేకుండా 5జీ నెట్.. కాలింగ్
వినియోగదారుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రిలయన్స్ జియో తన సేవలను నిరంతరం అప్ డేట్ చేస్తూనే ఉంది. కాల్స్ చేయడంలో ఉన్న సమస్యలను అధిగమించేందుకు దేశవ్యాప్తంగా వాయిస్ ఓవర్ న్యూ రేడియో (VoNR) అనే ఒక కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టింది. ఈ జియో సర్వీస్ వారి సొంతంగా పనిచేస్తుంది, అంటే స్వదేశీ 5జీ స్వతంత్ర కోర్. ఈ సేవతో ప్రతి 5జీ ఫోన్ మినీ స్టూడియోగా మారుతుందని జియో పేర్కొంది.ఇప్పటి వరకు చాలా టెలికాం కంపెనీలు 5జీ ఇంటర్నెట్ ను అందిస్తున్నప్పటికీ, కాలింగ్ కోసం బ్యాక్ ఎండ్ లో 4జీ నెట్ వర్క్ పైనే ఆధారపడేవి. వీవోఎన్ఆర్ ఈ అంతరాన్ని పూరిస్తుంది. వినియోగదారులకు పూర్తిగా 5జీ కోర్ ఆధారంగా కాలింగ్ అనుభవాన్ని ఇస్తుంది.వీవోఎన్ఆర్ అంటే ఏమిటి?జియో కొత్త టెక్నాలజీ వోఎల్టీఈ వంటి పాత వ్యవస్థల స్థానంలో వీఓఎన్ఆర్ భర్తీ చేస్తోంది. ఈ 5జీ ఫోన్ నేటివ్ వాయిస్ కాల్స్ ను అందిస్తుంది. ఈ టెక్నాలజీ కారణంగా, కాల్ త్వరగా కనెక్ట్ అవుతుంది. దీని రాకతో, కాల్ డ్రాప్లు, వాయిస్ బ్రేక్ వంటి సమస్యలు కూడా దాదాపుగా తొలగిపోతాయి. దీంతో యూజర్ల ఫోన్ బ్యాటరీని కూడా ఆదా చేస్తుందని జియో చెబుతోంది. దీనితో పాటు కాల్ రూటింగ్, నెట్ వర్క్ ఎఫిషియెన్సీ మెరుగ్గా ఉంటుంది.జియో తన వీఓఎన్ఆర్ రోల్ అవుట్ పూర్తిగా స్వదేశీ టెక్నాలజీ స్టాక్ పై ఆధారపడి ఉందని పేర్కొంది. దీని అర్థం బ్యాక్ ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుండి సర్వీస్ మేనేజ్మెంట్ వరకు ప్రతిదీ భారతీయ ఇంజనీర్లు, భాగస్వాముల సహాయంతో నిర్మించినదే. ఇది సాంకేతిక స్వాతంత్ర్యం వైపు ఒక పెద్ద అడుగు మాత్రమే కాదు, భవిష్యత్తులో భారతదేశాన్ని డిజిటల్ పరిష్కారాలను ఎగుమతి చేసే దేశంగా మార్చగలదు.వీవోఎన్ఆర్ ప్రయోజనాలుఫాస్ట్ కాల్ కనెక్షన్ - ఫోన్ చేసిన కొన్ని సెకండ్లలోనే కాల్ కనెక్ట్ అవుతుంది.మెరుగైన వాయిస్ క్వాలిటీ - హెచ్డీ+ సౌండ్ సంభాషణను మరింత స్పష్టంగా చేస్తుంది.కాల్ డ్రాప్ లు తగ్గడం- నెట్ వర్క్ స్విచింగ్ వల్ల ఎలాంటి సమస్య ఉండదు.బ్యాటరీ సేవింగ్: ఫోన్ 4జీ, 5జీ మధ్య పదే పదే షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు.మెరుగైన ఇంటర్నెట్ + కాలింగ్ - కాల్ లో మాట్లాడేటప్పుడు కూడా ఇంటర్నెట్ బ్రౌజింగ్ 5జీ వేగంతో కొనసాగుతుంది. -
‘టీసీఎస్లో ఉద్యోగికి బలవంతపు రిటైర్మెంట్’
దేశీయ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో బలవంతపు రాజీనామాలు, ముందస్తు రిటైర్మెంట్లు చేయిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. టీసీఎస్లో సుదీర్ఘకాలంగా ఉద్యోగిగా పనిచేసిన తమ సోదరుడిని ముందస్తు పదవీ విరమణ చేయించడమే కాకుండా, సెవెరెన్స్ పే లేదా ఎలాంటి పరిహారం కూడా ఇవ్వలేదని ఒక వ్యక్తి పేర్కొన్నారు. ఆ వ్యక్తి తమ సోదరుడికి జరిగిన విషయాన్ని రెడ్డిట్ లో పోస్ట్ చేశారు."టీసీఎస్ ఉద్యోగిని 30 సంవత్సరాల తరువాత ముందస్తు పదవీ విరమణకు బలవంతం చేశారు. తొలగింపు వేతనం లేదు, పరిహారం లేదు" అని రెడ్డిట్ యూజర్ (silver_traveller) పేర్కొన్నారు. తన సోదరుడు తన జీవితంలో దాదాపు 30 ఏళ్లను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు అంకితం చేశాడని 'వర్క్ ప్లేస్ టాక్సిసిటీ' ట్యాగ్ కింద షేర్ చేసిన ఈ ఘటన పేర్కొంది.రిటైర్ అవుతావా.. తొలగించమంటావా?30 ఏళ్లుగా కంపెనీకి విధేయుడిగా ఉన్న తమ సోదరుడికి నిర్ణయం తీసుకోవడానికి కేవలం 20 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చారని రెడిట్ యూజర్ ఆరోపించారు. 2025 జూన్లో ఆయనను ఒక సమావేశానికి పిలిపించి, తొలగిస్తున్నట్లు చెప్పారని, ముందస్తు పదవీ విరమణను స్వీకరించడం లేదా తొలగింపును ఎదుర్కోవడం.. రెండిటిలో ఏదో ఒకదాన్ని నిర్ణయించుకోవాలని సరిగ్గా 20 నిమిషాలే సమయం ఇచ్చారని వాపోయారు.50 ఏళ్ల వయసున్న తమ సోదరుడు ఇప్పుడు అనుభవజ్ఞులైన నిపుణులకు ప్రతికూలంగా ఉన్న జాబ్ మార్కెట్లో పరిమిత ఉద్యోగావకాశాలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రెడిట్ పోస్టుకు ఫాలోవర్ల నుంచి విశేష స్పందన వచ్చింది. చాలా మంది యూజర్లు బాధిత ఉద్యోగికి మద్దతుగా, టీసీఎస్ వైఖరికి వ్యతిరేకంగా కామెంట్లు చేశారు.కాగా టీసీఎస్ లో బలవంతపు రాజీనామా, అక్రమ తొలగింపుకు వ్యతిరేకంగా పలువురు ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగులు ఇటీవలే వీధుల్లోకి వచ్చారు. నోయిడా, కోల్ కతాలో ఆలిండియా ఐటీ, ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఐటీఈయూ) ఆధ్వర్యంలో ఈ నిరసనలు జరిగాయి. నిరసనలకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ, "టీసీఎస్ తొలగింపును ఆపండి, లేకపోతే ప్రతిఘటన మరింత గట్టిగా పెరుగుతుంది" అని ఏఐఐటీఈయూ ఎక్స్లో పోస్ట్ చేసింది.IT/ITeS employees across India hit the streets on 5 Sept against #ForcedResignation & #IllegalTermination in #TCS. Protests in Noida & Kolkata sent a clear message: #TCSstopRetrenchment or the resistance will grow louder. ✊ #JoinAIITEU pic.twitter.com/NidRgsU3Xy— AIITEU (@aiiteu) September 6, 2025 -
ఐఫోన్ 17 వివరాలు లీక్!.. ధర ఎంతంటే?
యాపిల్ కంపెనీ తన 'అవే డ్రాపింగ్' ఈవెంట్ను మంగళవారం (సెప్టెంబర్ 9) నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 17 సిరీస్, యాపిల్ వాచ్ కొత్త వెర్షన్లు, అప్డేటెడ్ ఎయిర్పాడ్లతో పాటు.. వివిధ రకాల యాక్ససరీస్ కూడా ఆవిష్కరించనుంది.యాపిల్ త్వరలో నిర్వహించనున్న ఈవెంట్లో.. ఐఫోన్ 17 ప్రో మాక్స్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ఎయిర్, బేసిక్ ఐఫోన్ 17 అనే నాలుగు వేరియంట్లను విడుదల చేయనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి, థర్మల్ కెమెరా ఇమేజ్ లాగా స్టైల్ చేసిన లోగో షేర్ చేశారు. కంపెనీ రాబోయే కొత్త ఐఫోన్ గురించి అధికారికంగా వెల్లడించకపోయినా.. కొన్ని వివరాలు లీక్ అయ్యాయి.చాలా సంవత్సరాల తరువాత.. యాపిల్ కంపెనీ మొదటిసారి అప్డేటెడ్ ఐఫోన్ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది మునుపటి ఐఫోన్ కంటే 5.5 మిల్లీమీటర్లు సన్నగా ఉండే అవకాశం ఉంది. ఇది ఇటీవల విడుదలైన శామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ కంటే కూడా సన్నగా ఉంటుందని బ్లూమ్బెర్గ్ తెలిపింది. USB-C పోర్ట్, ప్రోమోషన్ సపోర్ట్, 6.6 ఇంచెస్ స్క్రీన్ కూడా ఉండనున్నాయి. కెమెరా సెటప్ కూడా అద్భుతంగా ఉంటుంది.ఇదీ చదవండి: సముద్ర గర్భంలో కేబుల్స్ కట్: ఇంటర్నెట్ సేవలకు అంతరాయంవిడుదలకు సిద్దమవుతున్న యాపిల్ ఐఫోన్ 17 సిరీస్ రెండు కొత్త రంగుల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఇప్పటికి అందుబాటులో ఉన్న ఐఫోన్ 16 సిరీస్ రంగుల కంటే కూడా ఆకర్షణీయంగా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో 5000 mAh బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ ధరలు రూ. 89,900 నుంచి రూ. 1.64 లక్షల మధ్య ఉంటుందని సమాచారం. ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ సమయంలో ధరలు అధికారికంగా వెల్లడవుతాయి.Join us for a special Apple Event on September 9 at 10 a.m. PT. Tap the ❤️ and we’ll send you a reminder on event day. pic.twitter.com/o5sI2sdkwO— Apple (@Apple) August 26, 2025 -
సముద్ర గర్భంలో కేబుల్స్ కట్: ఇంటర్నెట్ సేవలకు అంతరాయం
ఎర్ర సముద్రంలో.. సముద్రగర్భ కేబుల్స్ తెగిపోవడంతో ఆసియా, మధ్యప్రాచ్య ప్రాంతాలలో ఇంటర్నెట్ సేవలకు ఆదివారం అంతరాయం ఏర్పడింది. దీనికి ప్రధాన కారణమేమిటో స్పష్టంగా వెల్లడికాలేదు.ఇంటర్నెట్ యాక్సెస్ను పర్యవేక్షించే గ్లోబల్ వాచ్డాగ్ నెట్బ్లాక్స్, ఎర్ర సముద్రంలో వరుస సబ్సీ కేబుల్ అంతరాయాలు భారతదేశం, పాకిస్తాన్తో సహా అనేక దేశాలలో కనెక్టివిటీని దెబ్బతీశాయని నివేదించింది. అయితే సౌదీ అరేబియాలోని జెడ్డా సమీపంలోని ఆగ్నేయాసియా-మిడిల్ ఈస్ట్-వెస్ట్రన్ యూరప్ 4 (ఎస్ఎండబ్ల్యు4), ఇండియా-మిడిల్ ఈస్ట్-వెస్ట్రన్ యూరప్ (ఐఎంఈడబ్ల్యుఈ) కేబుల్ వ్యవస్థలను ప్రభావితం చేసే వైఫల్యాలను ఇది గుర్తించింది.ఎస్ఎండబ్ల్యు4ను.. టాటా గ్రూప్లో భాగమైన టాటా కమ్యూనికేషన్స్ నిర్వహిస్తుండగా, ఐఎంఈడబ్ల్యుఈను ఆల్కాటెల్-లూసెంట్ పర్యవేక్షించే కన్సార్టియం నిర్వహిస్తోంది. ఇంటర్నెట్ అంతరాయాల గురించి ఈ రెండు కంపెనీలు స్పందించలేదు. అయితే పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్స్ కో. లిమిటెడ్ శనివారం ఒక ప్రకటనలో కోతలను ధృవీకరించింది. యూఏఈలో ప్రభుత్వ యాజమాన్యంలోని డు అండ్ ఎటిసలాట్ నెట్వర్క్ల వినియోగదారులు కూడా ఇంటర్నెట్ స్పీడ్ గురించి ఫిర్యాదు చేశారు. అయితే సౌదీ అరేబియాలోని అధికారులు దీనిపై స్పందించలేదు.ఇదీ చదవండి: జీఎస్టీ 2.0 ఎఫెక్ట్: రూ.2 లక్షలు తగ్గిన ఫేమస్ కారు ధరకేబుల్స్ తెగిపోవడానికి కారణంప్రపంచ ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలలో కీలకమైన భాగమైన జలాంతర్గామి కేబుల్స్.. అప్పుడప్పుడు ఓడ యాంకర్లు లేదా ఉద్దేశపూర్వక దాడులకు గురవుతాయి. ఇదే ఇంటర్నెట్ సమస్యకు కారణమవుతుంది. దీనిని మరమ్మతులు చేయాలంటే వారాల సమయం పడుతుంది. అంతే కాకుండా నష్టాన్ని గుర్తించి సరిచేయడానికి ప్రత్యేక నౌకలు అవసరం. -
హాయి నిద్రకోసం.. బెడ్రూమ్ గ్యాడ్జెట్స్
రోజంతటి అలసట ఇట్టే పోగొట్టే మందు ఒక్కటే, అదే హాయినిద్ర!. అందుకే, ప్రపంచాన్ని మరచిపోయేలా, ప్రశాంతమైన నిద్రకోసం ఇవి మీ బెడ్రూమ్లో తప్పకుండా ఉండాలి.మాయాదీపం!ఊహించుకోండి.. మీ మంచం పక్కన ఒక చిన్న మాయాదీపం ఉందని. ఎందుకంటే, ఈ బెడ్సైడ్ ల్యాంప్, సాధారణ బెడ్ల్యాంప్ కాదు. ఇదొక మూడ్ మ్యాజిక్, మల్టీ యూజ్ ఫ్రెండ్. రాత్రి పడుకున్నప్పుడు ఒక్క టచ్ చేస్తే మెల్లగా వెలిగే వార్మ్ లైట్తో పాటు, పుస్తకం చదవాలనిపిస్తే కూల్ వైట్ లైట్, పార్టీ మూడ్కి బ్రైట్ లైట్. అన్నీ మీ వేళ్ల అంచుల్లోనే! మొబైల్ ఛార్జింగ్ అయిపోయిందా? ప్లగ్ కోసం వెతకాల్సిన అవసరం లేదు. ల్యాంప్ మీద ఫోన్ పెట్టేయండి. వాచ్, ఇయర్ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ పరికాలన్నింటినీ దీంతోనే చార్జ్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఇందులో ఉన్న డిజిటల్ క్లాక్తో అలారం కూడా సెట్ చేసుకోవచ్చు. ధర రూ. 3,900.ఆకాశం అంతా మీ గదిలోనే!ఆరుబయట మంచం వేసుకొని చుక్కలు లెక్కపెడుతూ పడుకునే రోజులు గుర్తున్నాయా? గాలి తాకుతూ, ఆకాశం చూస్తూ కలల్లో తేలిపోయే ఆ మజానే వేరు. ఇప్పుడు ఆ అనుభూతి మళ్లీ పొందటానికి ఆరుబయట మంచం వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆకాశం అంతా మీ గదిలోకే దిగిపోతుంది. ఒక్కసారి ఈ స్టార్షిప్ ల్యాంప్ ఆన్ చేస్తే, గది గోడల మీద నక్షత్రాలు, చంద్రుడు, మేఘాలు, గ్రహాలు అన్నీ మెరిసిపోతూ మీ గదినే గగనమండలంలా మార్చేస్తాయి. మొబైల్కి కనెక్ట్ చేసుకొని యాప్ ద్వారా కలర్స్, బ్రైట్నెస్, స్పీడ్ అన్నీ మీ మూడ్కి తగినట్టుగా మార్చుకోవచ్చు. టైమర్ సెట్ చేస్తే మీరు కలల్లో తేలుతుండగానే దానంతట అదే ఆఫ్ అవుతుంది. ధర రూ.2,890.ఇదీ చదవండి: భారత్పై ప్రశ్న.. చైనా రోబో సమాధానంవెచ్చని దుప్పటిచల్లని రాత్రుల్లో వణుకుతూ నిద్రపోవడం ఇక మానేయండి. ఎందుకంటే ఇప్పుడు హీటెడ్ అండర్ బ్లాంకెట్ ఉంది. ఒక్క బటన్తో మీ మంచాన్ని వెచ్చగా, సౌకర్యంగా మార్చేస్తుంది. దీన్ని ఉపయోగించడం చాలా ఈజీ. దుప్పటిని మంచం మీద సెట్ చేసి, పవర్కి కనెక్ట్ చేయండి. కంట్రోల్ స్విచ్లో మీకు కావాల్సిన లో, మీడియం, హై అనే ఉష్ణస్థాయులను ఎంచుకోండి. నిమిషాల్లోనే మంచం మొత్తం వెచ్చగా మారిపోతుంది. రాత్రంతా వెచ్చదనం కొనసాగుతుంది. ఉదయం లేవగానే కేవలం స్విచ్ ఆఫ్ చేస్తే చాలు. ఉతకాల్సినప్పుడు ప్లగ్ తీసేసి వాషింగ్ మెషిన్ లో వేసేసుకోచ్చు. మృదువైన, నాణ్యమైన కాటన్ తో తయారైన ఈ దుప్పటి ధర కేవలం రూ.3,749 మాత్రమే! -
నిరుద్యోగ విపత్తు తప్పదు: ఏఐ గాడ్ ఫాదర్ హెచ్చరిక
‘గాడ్ ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)’గా భావించే జెఫ్రీ హింటన్ (Geoffrey Hinton) టెక్నాలజీ పెరుగుదల కంపెనీలను గతంలో కంటే ఎక్కువ లాభదాయకంగా మారుస్తుందని, కానీ అది ఖర్చుతో కూడుకున్నదని పేర్కొన్నారు. నేటి కృత్రిమ మేధ ఆధారిత ఉత్పత్తులకు మూలమైన మెషిన్ లెర్నింగ్ కు పునాదులు వేసిన హింటన్, ఉద్యోగాలు కోల్పోయే కార్మికుల ఖర్చుతో కంపెనీలకు లాభాలు వస్తాయని, నిరుద్యోగం ఖచ్చితంగా విపత్కర స్థాయికి పెరుగుతుందని హెచ్చరించారు."వాస్తవానికి ఏమి జరగబోతోందంటే.. ధనవంతులు కార్మికుల స్థానంలో కృత్రిమ మేధను ఉపయోగించబోతున్నారు" అని హింటన్ ఫైనాన్షియల్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇది భారీ నిరుద్యోగాన్ని సృష్టిస్తుందని, కంపెనీలకు లాభాలు భారీగా పెరుగుతాయని పేర్కొన్నారు. ఇది కొంతమందిని మరింత ధనవంతులను చేస్తుంది.. చాలా మందిని పేదలుగా చేస్తుంది. అది ఏఐ తప్పు కాదు, పెట్టుబడిదారీ వ్యవస్థది అంటూ వివరించారు.గత ఏడాది నోబెల్ బహుమతి గెలుచుకున్న హింటన్ చాలాకాలంగా కృత్రిమ మేధ గురించి, దానిని నియంత్రించకుండా వదిలేస్తే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎలా నాశనం చేస్తుందో హెచ్చరిస్తూనే ఉన్నారు. "ఏమి జరుగుతుందో మనకు తెలియడం లేదు. కనీసం ఊహకు కూడా అందడం లేదు. కానీ దాని గురించి చెప్పాల్సిన వాళ్లు మాత్రం మిన్నకుండిపోతున్నారు" అని హింటన్ అన్నారు.‘మనం చరిత్రలో ఒక దశలో ఉన్నాం, అక్కడ ఏదో అద్భుతం జరుగుతోంది, అది ఆశ్చర్యకరంగా మంచిది కావచ్చు.. చెడ్డది కావచ్చు. మనం ఊహాగానాలు చేయగలం, కానీ పరిస్థితులు అలా ఉండవు’ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్స్ తమ భాషను అభివృద్ధి చేసుకోగలిగితే సాంకేతిక పరిజ్ఞానం చేతికి అందకుండా పోతుందని ఆయన గతంలోనే హెచ్చరించారు. కృత్రిమ మేధ భయంకరమైన ఆలోచనలు చేయగలదని ఇప్పటికే నిరూపించిందని, మానవులు ట్రాక్ చేయలేని లేదా అర్థం చేసుకోలేని విధంగా యంత్రాలు చివరికి ఆలోచించగలవని ఊహించలేమని హింటన్ అన్నారు. -
నెలకు రూ.20 లక్షల జీతం.. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం
ఏఐ విజృంభణతో వేలాదిగా ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఫ్రెషర్లకు మంచి జీతంతో ఉద్యోగాలు రావడమే కష్టమైపోతున్న ప్రస్తుత తరుణంలో ఓ 23 ఏళ్ల కుర్రాడు మాత్రం మరో విధంగా నిరూపించాడు. ఈశాన్య భారతదేశంలోని ఒక చిన్న పట్టణానికి చెందిన ఈ టెకీ పట్టుదల, నైపుణ్యం అన్ని సవాళ్లను, వైఫల్యాలను అధిగమించగలవని నిరూపించాడు.ఏకంగా 500 పైగా తిరస్కరణలను ఎదుర్కొన్న ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇప్పుడు ఏఐలోనే అగ్ర సంస్థలలో ఒకటైన ఓపెన్ఏఐలో పనిచేస్తున్నారు. నెలకు రూ.20 లక్షల జీతం. అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం.బీటెక్ చేసిన మొదటి వ్యక్తిఈ యువ ఇంజనీర్ రెడ్డిట్ పోస్టు ప్రకారం.. తన కుటుంబంలో కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ చేసిన మొదటి వ్యక్తి ఇతనే. ఏడాదికి రూ.3.6 లక్షల వేతనంతో మొదట్లో క్యాంపస్ ప్లేస్మెంట్ ఆఫర్ వచ్చింది. తీసుకున్నాడు. అయితే జాయిన్ డేట్ కోసం ఎదురుచూడకుండా మరింత క్రియాశీలకంగా వ్యవహరించాడు.ఒక్క ఇంటర్వ్యూ దక్కింది.. పట్టేశాడువందలాది రిమోట్ అంతర్జాతీయ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం ప్రారంభించాడు. ఈ మార్గం ప్రారంభంలో లెక్కలేనన్ని తిరస్కరణలకు దారితీసింది, కానీ చివరికి ఫలించింది. ‘నెలల తరబడి తిరస్కరణ తరువాత తిరస్కరణ. ఆ అప్లికేషన్లలో నాకు ఒక్క ఇంటర్వ్యూ కాల్ మాత్రమే వచ్చింది, ఎలాగోలా క్లియర్ చేశాను’ అంటూ రెడిట్ పోస్ట్లో పేర్కొన్నాడు.దాదాపు 500-600 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న టెక్కీ ఓపెన్ఏఐ లింక్డ్ ప్రాజెక్టుతో ఒకే ఇంటర్వ్యూను పొంది విజయవంతంగా ఉత్తీర్ణత సాధించాడు. మొదట్లో ఏడాదికి రూ.3.6 లక్షలుగా ఉన్న ఆయన జీతం ఇప్పుడు నెలకు రూ.20 లక్షలకు చేరింది.అయినా ‘ఆగడు’రూ.లక్షల జీతంతో చేతిలో ఉద్యోగం ఉన్నా టెక్కీ మాత్రం ఆగడం లేదు. ఓపెన్ఏఐ లింక్డ్ ప్రాజెక్టు ద్వారా వచ్చే అదనపు డబ్బుతో సొంతంగా టెక్ సంస్థను ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నాడు. ఇది పూర్తయితే అతను తన లాంటి మరింత మందిని చేర్చుకుని పెద్ద ప్రాజెక్టులపై పనిచేయాలనుకుంటున్నాడు. మంచి కంపెనీల్లో సౌకర్యవంతమైన ఒక్క జాబ్ వస్తే చాలు స్థిరపడాలనుకుంటున్న యువతకు ఈ కుర్రాడు భిన్నంగా ఆలోచిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. -
యంత్రుడి చేతుల్లోకి మనిషి! డెడ్ ఇంటర్నెట్ థియరీ నిజమే!!
‘‘ఓ మర మనిషి మా లోకి రా..’’ అంటూ పిలిచిన మనిషి.. ఇప్పుడు పూర్తిగా దాని చెప్పుచేతల్లోకి వెళ్లిపోయాడా? ఇంటర్నెట్ అనేది మనిషి చేజారి పోయిందా?.. ఇప్పుడది పూర్తిగా బాట్ల నియంత్రణలో నడుస్తోందా?.. ఈ అర్థం వచ్చేలా ఓపెన్ఏఐ సీఈవో ఆల్ట్మన్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా కలకలం రేగింది. తద్వారా Dead Internet Theory కి బలమైన మద్దతు చేకూరినట్లైంది. ఇంతకీ ఈ థియరీ ఏంటి?.. చాట్జీపీటీ లాంటి ఏఐ చాట్బాట్ను రూపొందించిన వ్యక్తి ఇలా మాట్లాడడం వెనుక ఆంతర్యం ఏంటి? పరిశీలిస్తే.. ఇంటర్నెట్లో మనం చూస్తోంది నిజంగా మనుషులనేనా?.. కొన్ని పోస్టులు చేసేది.. ఇతరుల పోస్ట్లకు కామెంటలు చేసేది.. లైకులు, షేర్లు ఇదంతా మనుషులు చేస్తున్నదేనా?.. లేదంటే అప్పుడెప్పుడో చర్చ జరిగినట్లు.. కృత్రిమ మేధస్సు చేస్తోందా?. ఇప్పటివరకు ఇది కేవలం ఊహగా కనిపించినా.. తాజాగా OpenAI CEO సామ్ ఆల్ట్మన్ చేసిన వ్యాఖ్యలతో ‘Dead Internet Theory’ అనే సిద్ధాంతం వాస్తవానికి దగ్గరగా ఉందేమో అనే అనుమానాలు బలపడ్డాయి. ChatGPT వంటి శక్తివంతమైన AI చాట్బాట్ను రూపొందించిన వ్యక్తి.. సామ్ ఆల్ట్మన్. అలాంటి వ్యక్తి తన ఎక్స్ అకౌంట్లో ఓ ఆసక్తికరమై పోస్ట్ చేశారు.. డెడ్ ఇంటర్నెట్ థియరీని ఇంతకాలం నేను అంతగా నమ్మలేదు. కానీ ఇప్పుడు ఎక్స్(పూర్వపు ట్విటర్)ను చూస్తుంటే చాలా LLM-run అకౌంట్లు ఉన్నట్లు అనిపిస్తోంది అని అన్నారు.i never took the dead internet theory that seriously but it seems like there are really a lot of LLM-run twitter accounts now— Sam Altman (@sama) September 3, 2025ఈ వ్యాఖ్య వైరల్ కావడంతో, పలువురు వినియోగదారులు ఆల్ట్మన్ను వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఆ విషయం తమకు ఎప్పుడో తెలుసని ఒకరు.. డెడ్ఇంటర్నెట్కు పునాది వేసింది మీరే కదా? అని మరొకొరు కామెంట్ చేశారు. బ్రేకింగ్.. LLMల సృష్టికర్త, ఇప్పుడు ఎక్స్లో అన్నీ LLMలే అని బాధపడుతున్నాడు ఇంకొకరు సెటైరిక్గా స్పందించారు. మరొకరైతే ఎలాన్ మస్క్తో ఉన్న వైరంతోనే ఇలా మాట్లాడుతున్నారంటూ కామెంట్ చేశారు.. ఇలా ఆల్ట్మన్ను తమకు తోచిన తెగ ఆడేసుకుంటున్నారు.డెడ్ ఇంటర్నెట్ థియరీ అంటే ఏమిటి?డెడ్ ఇంటర్నెట్ థియరీ అనేది ఒక వివాదాస్పదమైన సిద్ధాంతం, ఇది 2021లో "Dead Internet Theory: Most of the Internet is Fake" అనే బ్లాగ్ ద్వారా ప్రజల్లోకి వచ్చింది. దీని ప్రకారం, ఇంటర్నెట్లో ఎక్కువ భాగం నిజమైన మనుషుల ద్వారా కాకుండా.. AI బాట్స్, ఆటోమేటెడ్ స్క్రిప్ట్స్, మరియు LLM-run అకౌంట్ల ద్వారా నడుస్తోందని అంటోంది. అంటే.. Large Language Model (LLM) ఆధారంగా నడిచే సోషల్ మీడియా లేదంటే ఆన్లైన్ అకౌంట్లు. ఇవి నిజమైన వ్యక్తులు నిర్వహించకపోవచ్చు. అర్టిషీషియల్ ఇంటెలిజెన్సీ(AI) మోడల్స్ ద్వారా ఆటోమేటెడ్గా స్పందించేవి, పోస్టులు చేసేవి.. లేదంటే చాట్ చేసేవి అయి ఉండొచ్చు. ఇంటర్నెట్లో మనం చూస్తున్న చాలా అకౌంట్లు, పోస్టులు, కామెంట్లు.. అన్నీ మనుషులు చేసినవి కాదని.. ఏఐ చాట్బాట్లు చేసినవి అర్థం. అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) మోడల్స్, యాంత్రిక వ్యవస్థలు ఇంటర్నెట్ను పూర్తిగా ఆక్రమించేశాయని.. తద్వారా మనం నిజమైన మనుషులతో కాకుండా, యంత్రాలతో సంభాషిస్తున్నాం అనే ఈ థియరీ చెప్పింది. ఒకరకంగా.. The Matrix సినిమా లాంటి వాస్తవికతను మాయగా చూపించే సిద్ధాంతమన్నమాట. దీనికి ఓ ప్రత్యక్ష ఉదాహరణ పరిశీలిస్తే.. సోషల్ఏఐ SocialAI అనేది డెడ్ ఇంటర్నెట్ థియరీకి ఒక ప్రాక్టికల్ ఉదాహరణ. ఇదొక సోషల్ నెట్వర్క్ యాప్. మైఖేల్ సైమన్ అనే టెక్ ప్రాడిజీ దీనిని రూపొందించాడు. ఈ యాప్లో యూజర్లు చాట్ చేస్తారు.. పోస్టులు పెడతారు.. కామెంట్లు చేస్తారు. కానీ twist ఏంటంటే.. అవతల ఉండేది నిజమైన మనిషి కాకపోవచ్చు. SocialAI లో AI బాట్స్ అచ్చం మనుషుల్లాగే స్పందిస్తాయి. చాలా పోస్టులకు వచ్చిన కామెంట్లు, లైక్స్ అన్నీ కృత్రిమంగా రూపొందించబడినవే. అంటే.. అక్కడ ఉండేది మనిషా? బాట్? అనేదానిపై స్పష్టత లేకుండా పోతుంది.అందుకే అంత రీచ్..సోషల్ మీడియాలో లైకులు, షేర్ల కోసం జరిగే పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ క్రమంలో.. 2016 తర్వాత ఇంటర్నెట్లో నిజమైన యూజర్ యాక్టివిటీ తగ్గిపోయిందన్నది Dead Internet Theory థియరీ చెప్పేది. ఎక్కువ కంటెంట్ బాట్స్, AI, ఆటోమేటెడ్ సిస్టమ్లు తయారు చేస్తున్నాయని, ఫోరమ్లు, సోషల్ మీడియా, కామెంట్స్ అన్నీ నిజమైన మనుషుల నుంచి రావడం తగ్గిపోయిందని చెబుతుందీ సిద్ధాంతం. సపోజ్.. సోషల్ మీడియాలో కొన్ని పోస్టులను గమనించండి. ఆ యూజర్కు పెద్ద ఫాలోయింగ్ ఉండడు. కానీ ఉన్నట్లుండి అతను చేసే ఓ పోస్టుకు విపరీతంగా లైకులు, షేర్లు వస్తాయి. అలాగని అందులోవన్నీ జెన్యూన్గా వచ్చినవి అనుకుంటే పొరపాటే. అదంతా యంత్రుడి మాయాజాలం. యూజర్లు వ్యక్తపర్చాల్సిన అభిప్రాయాలు, ఆన్లైన్ అనుభవాలు.. క్రమంగా కృత్రిమంగా ప్రభావితం అవుతూ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఎలాన్ మస్క్ ట్విటర్ను చేజిక్కించుకున్నాక.. కంటెంట్ క్రియేటర్లకు డబ్బు ఇచ్చే విధానం ప్రారంభమైంది. దీంతో AI బాట్ల వినియోగం విపరీతంగా పెరిగింది. ఏఐ ఆధారిత ఇమేజ్లు, పోస్టులు పెరిగిపోయాయి. తద్వారా ఇష్టానుసారం చేస్తున్న పోస్టులతో రీచ్ దక్కుతోంది. నష్టాలేంటంటే.. నిన్నటి దాకా ఇది ఒక conspiracy theory. కానీ, ఇప్పుడది నిజమై ఉంటుందని ఆల్ట్మన్ పోస్ట్తో స్పష్టమవుతోంది. అయితే ఏఐ బాట్లతో ముప్పు ఉందనే సైబర్ విశ్లేషకులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తూ వస్తున్నారు. వాటి మీద ఆధారపడడం వల్ల మనిషి బుర్రకు పదును పెట్టకపోవడంతో.. స్కిల్స్ మరుగున పడిపోతుంది. మానవ సంబంధాల ప్రామాణికత తగ్గిపోతుంది. ఒక్కోసారి వినియోగదారుల మానసిక స్థితిపై ప్రభావం చూపొచ్చు. అంతేకాదు.. నిజమైన సమాచారాన్ని గుర్తించడం కష్టంగా ఉంటోంది. వెరసి సామాజిక మాధ్యమాలు ఒక యాంత్రిక మాయాజాలంగా మారుతున్నాయి.నిన్ను నీవే మర్చిపోయిన వేళ.. నియంత్రణ నీ చేతుల్లో లేదు. సృష్టి నీదే అయినా, ఆట మాత్రం ఇంకెవరో ఆడుతున్నారు.కొసమెరుపు.. ఏఐ బాట్లు, డీప్ఫేక్లు పెరిగిపోయిన కాలంలో.. నిజమైన వాటిని గుర్తించడం కష్టంగా మారుతోంది. అందుకే ఆన్లైన్లో మనుషులు తమను నిరూపించుకోవడానికి ఒక సాంకేతిక పరిష్కారం అవసరమని సామ్ ఆల్ట్మన్ భావించారు. అలా 2023 జులై 24న పుట్టిందే Worldcoin ప్రాజెక్టు(2019లోనే బీజం పడింది). దీని ద్వారా మనిషి ఐరిస్ ఆధారంగా ఇంటర్నెట్ వినియోగం కోసం ఓ యూనిక్ ఐడీ(Proof of Personhood) ఇస్తారు. అప్పుడు అవతల ఉంది మనిషా? లేకుంటే ఏఐ చాట్బాట్ అనేదానిపై స్పష్టత వస్తుంది. ఇందులో మనుషుల గుర్తింపును రక్షించేందుకు బ్లాక్చెయిన్, బయోమెట్రిక్ వెరిఫికేషన్ వంటివి ఉపయోగిస్తారు. వివిధ దేశాలకు చెందిన కోటి 20 లక్షల మంది ఈ ప్రాజెక్టులో భాగం అయ్యారు. ఈ యాప్ ద్వారా 26 లక్షల అకౌంట్లు క్రియేట్ అయ్యాయి. అయితే ఏఐ కాలంలో.. నిజమైన మనిషిని గుర్తించడానికి ఇది ఒక వినూత్న పరిష్కారమే అయినప్పటికీ సవాళ్లు మాత్రం తప్పడం లేదు. అలా వరల్డ్నెట్వర్క్ ప్రాజెక్టు నత్తనడకన ముందుకు సాగుతోంది.:::వెబ్డెస్క్ ప్రత్యేకం -
మన గోప్యత బజారుపాలు!
ఒకప్పుడు వ్యక్తిగత గోప్యతకు మన సమాజం అత్యంత ప్రాధాన్యాన్ని ఇచ్చేది. తిన్నా, తినకపోయినా, ఎన్ని కష్టాలు, నష్టాలు వచ్చినా... అన్నీ నాలుగు గోడల మధ్యనే జరిగిపోయేవి. ఏ ఒక్క విషయమూ గడప దాటి బయటకు పోయేది కాదు. ఒకవేళ బయటి వారికి తెలిస్తే తమ కుటుంబ గౌరవానికి, పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లినట్లు బాధపడేవారు. స్నేహితులైనా, హితులైనా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడి పంపించే వారు.కానీ నేటి అంతర్జాల యుగంలో, డిజిటల్ సాంకేతికతలో వచ్చిన పెను మార్చుల వల్ల మనది అంటూ ఏ ఒక్క రహస్యం కూడా మిగలకుండా పోతోంది. వ్యక్తిగత గోప్యత కోసం మన చుట్టా మనం కట్టుకున్న గోడలు బద్దలవుతున్నాయి. మనం తినే తిండి దగ్గర నుంచి, మన ఇష్టానిష్టాలు, వ్యాపకాలు, స్నేహాలు, భావాలు, మన అభిరుచులు... ఇలా ఒకటేమిటి అన్నీ బహిర్గతం అయి పోతున్నాయి. మనమందరం ఏఐ సాంకేతికను వాడుకుంటున్నాము అని సంతోషపడుతున్నాము. కానీ నిజానికి అదే మనల్ని వాడుకుంటోంది. ఇప్పుడు ఏఐ సాంకేతికతకు ముడి సరుకు మనుషులు, వారి అలవాట్లే.ఇప్పుడు అందరం ఆ ఏఐ ఆడించే తోలుబొమ్మలం. ఏఐ ఆధారిత అనువర్తనాలు ఆడిస్తున్నట్లు ఆడతున్నాం. అంతర్జాల వేదికలయిన ఫేస్బుక్, వాట్సాప్ వంటి వాటిల్లో మనకు ఖాతా ఉంటే చాలు... మనల్ని మనం అమ్ముకున్నట్టే! మనకు తెలియకుండానే మనల్ని ఎవరో పల్లకీల్లో ఉరేగిస్తుంటారు. మనకు తెలియకుండానే మనల్ని అమ్మేస్తుంటారు. మన చుట్టూ మనకు తెలియకుండానే ఏఐ అనువర్తనాల నిఘా వ్యవస్థలు సాలెగూడుల్లా అల్లుకుపోయి ఉన్నాయి. పొరపాటున మనం అంతర్జాలంలోని అనువర్తనాల ద్వారా ఏదన్నా వస్తువు కొన్నా, ఇష్టమైన తిండి గురించి చూసినా, నచ్చిన టాపిక్పై వార్తలు చదివినా, విన్నా... ఆ సమాచారం మొత్తం సేకరించి మనకు భవిష్యత్తులో ఏమి కావాలో, మనం ఏమి తినాలో, ఏ సినిమా చూడాలో, ఏమి చదవాలో కూడా అవే సూచిస్తున్నాయి.ఇదీ చదవండి: అలవోకగా రూ.కోట్లు సంపాదించే మార్గం..వీటివల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లడం మాత్రమే కాదు, సమాజం స్వేచ్ఛగా ఆలోచించే మెదళ్లను, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే గుండెలను కోల్పోతోంది. గోప్యత అనేది రహస్యాల గురించి కాదు... గోప్యత అనేది మన జీవనంపై మనకుండే నియంత్రణను తెలియచేస్తుంది. కానీ కాలక్రమేణా మనకు తెలియకుండా మనమే మన జీవితంపై నియంత్రణ కోల్పోతున్నాం. గోప్యత లేని ప్రపంచంలో మనకు గౌరవ మర్యాదలు ఉండవు. మనలో మానవత్వం హరించుకుపోయి, మార్కెట్లకు అనుగుణంగా బతకటానికి అలవాటుపడతాము.గోప్యతను కాపాడుకోవటం మన నైతిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వ బాధ్యత. ఇందుకోసం అందరం బాధ్యత తీసుకుని, మరొకరి గోప్యతకు భంగం వాటిల్లే పనులకు స్వస్తి చెప్పాలి. విద్యా విధానంలో కూడా కేవలం ఆధునిక సాంకేతికతను చొప్పించడమే కాక... నైతిక, మానవతా విలువలను ఇమిడ్చినప్పుడే రేపటి తరానికి జీవితపు విలువ తెలిసివస్తుంది. – ఈదర శ్రీనివాస రెడ్డి, ప్రొఫెసర్ -
రొమాన్స్ స్కామ్: రూ.6 లక్షలు పోగొట్టుకున్న మహిళ
ఆన్లైన్ మోసాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్త వహించాలని అధికారులు ఎంతచెప్పినా.. ప్రజలు మోసపోతున్నారు. ఇటీవల జపాన్కు చెందిన 80 ఏళ్ల మహిళ.. వ్యోమగామినని చెప్పుకుని పరిచయమైన మోసగాడి భారినపడి దాదాపు రూ. 6 లక్షలు పోగొట్టుకుంది.జపాన్లోని ఉత్తరాన ఉన్న హక్కైడోకు చెందిన 80 ఏళ్ల మహిళ.. జూలైలో సోషల్ మీడియాలో తాను వ్యోమగామి అని చెప్పుకునే స్కామర్ను కలిసింది. కొంత సంభాషణ తరువాత.. తాను ప్రస్తుతం అంతరిక్ష నౌకలో.. అంతరిక్షంలో ఉన్నానని, ఆక్సిజన్ అవసరం ఉందని మహిళతో చెప్పాడు. ఆక్సిజన్ కొనడానికి డబ్బు కావాలని ఆమెను కోరాడు. ఒంటరిగా ఉన్న మహిళ ఆ మోసగాడిపై ప్రేమ పెంచుకుని.. 5000 పౌండ్లు (సుమారు రూ.6 లక్షలు) డబ్బు పంపింది. చివరకు మోసపోయానని తెలుసుకుంది.చివరికి చేసేదేమీ లేక పోలీసులను సంప్రదించింది. వారు దీనికి 'రొమాన్స్ స్కామ్' (అపరిచిత వ్యక్తులపై ప్రేమ పెంచుకోవడం) అని పేరుపెట్టారు. సోషల్ మీడియాలో మీకు పరిచయమైన వారు.. ఎవరైనా మీ నుంచి డబ్బు డిమాండ్ చేస్తే.. దయచేసి స్కామ్ జరిగే అవకాశం ఉందని తెలుసుకోండి. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి అని పోలీసు అధికారి హెచ్చరించారు.ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగిన దేశాల జాబితాలో జపాన్ ఒకటి. దీంతో ఇక్కడ మోసాలు పెరుగుతున్నాయి. జపాన్ నేషనల్ పోలీసు ఏజెన్సీ ప్రకారం.. 2024 మొదటి 11 నెలల్లో 3,326 రొమాన్స్ స్కామ్లు నమోదయ్యాయి. ఈ కేసులు 2023తో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువ.గతంలో రొమాన్స్ స్కామ్లు వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని.. ఇలాంటి రొమాన్స్ స్కామ్లు జరగడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో, ఒక ఆస్ట్రేలియన్ మహిళ ఆన్లైన్ మోసగాళ్ల వలలో పడి రూ.4.3 కోట్లకు పైగా పోగొట్టుకుంది. డేటింగ్ యాప్లో పరిచయమైనా.. అపరిచితుడు మలేషియాలోని కౌలాలంపూర్లో తన పర్సు దొంగిలించబడినందున తనకు రూ.2,75,000 అవసరమని ఆమెకు చెప్పాడు. నిజమని నమ్మిన ఆ మహిళ డబ్బు పోగొట్టుకుంది.ఇదీ చదవండి: భారత్పై ప్రశ్న.. చైనా రోబో సమాధానం -
ఫేస్బుక్లో జుకర్ బర్గ్ బ్యాన్.. కేసేసిన జుకర్ బర్గ్
వాషింగ్టన్: ఫేస్బుక్లో తనని బ్యాన్చేయడంపై జుకర్ బర్గ్ కోర్టులో కేసు వేశాడు. ఈ కేసు ఇప్పటిది కాదు.. గత ఎనిమిదేళ్లుగా కోర్టులో నలుగుతూనే ఉంది. ఇంతకీ.. ఫేస్బుక్ తనని బ్యాన్ చేయడంపై జుకర్ బర్గ్ కేసు ఎందుకు పెట్టారని అనుకుంటున్నారా? అమెరికాలో 38వ అతిపెద్ద రాష్ట్రం ఇండియానా. ఇప్పుడీ రాష్ట్రానికి చెందిన మార్క్ స్టీవెన్ జుకర్బర్గ్ అనే న్యాయవాది.. మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్పై న్యాయపోరాటం చేస్తున్నారు. గత ఎనిమిదేళ్లుగా మెటా(గతంలో ఫేస్బుక్) తన అకౌంట్ను బ్యాన్ చేసిందని, ఫలితంగా భారీ మొత్తంలో నష్టపోయినట్లు కోర్టులో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ న్యాయవాది పేరు మార్క్ జుకర్ బర్గ్. కానీ అతను మెటావర్స్ నిర్మించడంలో కాదు. దివాళా కేసుల్లో వాదిస్తుంటారు. 2017 నుండి తన న్యాయ సేవలను ప్రచారం చేసేందుకు ఫేస్బుక్ పేజీని ప్రారంభించారు. ఇందుకోసం 11వేల డాలర్ల కంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేశాడు. కానీ అతని పేజీని తరచూ ఫేస్బుక్ బ్లాక్ చేస్తూనే ఉంది. ఎందుకు అని ప్రశ్నిస్తే.. మీరు ఫేస్బుక్ అధినేత జుకర్బర్గ్ను అనుకరిస్తున్నారనే సమాధానం చెబుతోంది. తనను తానే నిరూపించుకోవడం అతనికి రోజువారీ తలనొప్పిగా మారింది.ఇదే విషయంపై స్థానిక టీవీ ఛానల్కు మాట్లాడుతూ, "బిలియనీర్ జుకర్బర్గ్ స్కూల్ పూర్తిచేసేలోపే నేను న్యాయవాదిగా పని చేస్తున్నాను’ అని చెప్పారు. ఇది మీకు వ్యంగ్యంగా అనిపించవచ్చు. కానీ ఆర్ధికంగా నష్టపోయేది నేనే కదా. డబ్బుపోయా, శనిపట్టుకుంది అన్న చందంగా ఫేస్బుక్ నా అకౌంట్ను బ్యాన్ చేయడంతో బిజినెస్ను కోల్పోయాను. iammarkzuckerberg.com అనే వెబ్సైట్ను ప్రారంభించి అందులో తన సర్వీసులు అందిద్దామంటే ఆఫ్లైన్లో క్లయింట్స్కాల్స్ చేస్తే ప్రాంక్ కాల్ అనుకుని కట్ చేస్తున్నారని కోర్టులో వాపోతున్నారు. ‘నేను మార్క్ స్టీవెన్, అతను మార్క్ ఎలియట్. ఇది సరదాగా చెప్పడం లేదు. మెటా నిర్ణయం వల్ల నేను వేలాది డాలర్లు నష్టపోవడం నాకు కోపం తెప్పించింది. 40 ఏళ్లుగా న్యాయవృత్తిలో ఉన్నా. ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ ఎలియట్ జుకర్బర్గ్ చిన్నపిల్లవాడిగా ఉన్నప్పటి నుంచే నేను ఈ వృత్తిలో ఉన్నా. నన్ను మెటాలో బ్యాన్ చేయడం తగదు అని అన్నారు. ఈ సందర్భంగా ఫేస్బుక్ వ్యవస్థాపకుడికి ఓ ఆఫర్ కూడా ఇచ్చాడు. ఈ గ్రహం మీద అత్యంత ధనవంతులలో ఒకరైన జుకర్బర్గ్ తనని క్షమించమని కోరవచ్చు. లేదంటే అతని పడవలో గడిపేందుకు నాకు ఓ వారం రోజుల పాటు అనుమతిస్తే.. కోర్టులు, కేసులు అవసరం ఉండదని చెప్పాడు. మార్క్ స్టీవెన్ దావా వేయడంపై మెటా స్పందించింది. జుకర్బర్గ్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ సమస్య మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం'అని పేర్కొంది. -
కోవాసెంట్ నుంచి.. ఏఐ ఏజెంట్ కంట్రోల్ టవర్
కోవాసెంట్ టెక్నాలజీస్ తాజాగా ఏఐ ఏజెంట్ కంట్రోల్ టవర్ (ఏఐ–యాక్ట్) పేరిట కొత్త టూల్ను ఆవిష్కరించింది. వివిధ ఏఐ ప్రోగ్రాంలను (లేదా ఏజెంట్లను) సమన్వయపర్చుకుంటూ, వాటిని సమర్ధవంతంగా ఉపయోగించుకోవడంలో కంపెనీలకు ఇది సహాయకరంగా ఉంటుంది.ప్రస్తుతం వివిధ కార్యకలాపాలకు వివిధ ఏఐ ఏజెంట్లను ఉపయోగిస్తుండటం వల్ల గందరగోళం, భద్రతాపరమైన రిస్కులు తలెత్తుతున్నాయని కోవాసెంట్ టెక్నాలజీస్ సీఎండీ సీవీ సుబ్రమణ్యం తెలిపారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఏఐ ఏజెంట్లన్నింటికీ ఏఐ యాక్ట్ అనేది ఒక సెంట్రల్ కంట్రోల్ రూమ్లాగా పని చేస్తుందని ఆయన వివరించారు. -
మరో అడుగు ముందుకేసిన స్టార్లింక్..
భారతదేశంలో ట్రయల్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవలను ప్రారంభించడానికి, ఎలాన్ మస్క్కు చెందిన 'స్టార్లింక్'.. టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) నుంచి తాత్కాలిక స్పెక్ట్రమ్ క్లియరెన్స్ను పొందిందని. దీంతో కంపెనీ తన కార్యకలాపాలను త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.స్పెక్ట్రమ్ క్లియరెన్స్ పొందటంతో.. స్టార్లింక్ ఇప్పుడు దాని గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మించి, భద్రతా సమ్మతి పరీక్షలను నిర్వహిస్తుంది. దీనికోసం కంపెనీ ముంబై కేంద్రంగా 10 ప్రదేశాలలో బేస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.భారతదేశంలో తన గ్రౌండ్ స్టేషన్ను ఏర్పాటు చేయడానికి ల్యాండింగ్ స్టేషన్ హార్డ్వేర్తో సహా పరికరాలను తీసుకురావడానికి స్టార్లింక్ దిగుమతి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసింది. అంతే కాకుండా.. స్టార్లింక్ ఇటీవలే తన లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LoI) కింద అన్ని భద్రతా అవసరాలను తీర్చిన తర్వాత గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ (GMPCS) లైసెన్స్ను పొందిన తాజా ఆపరేటర్గా అవతరించింది. ఇప్పటికే 100 కంటే దేశాల్లో స్టార్లింక్ సేవలు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: భారత్పై ప్రశ్న.. చైనా రోబో సమాధానంస్టార్లింక్ ఇంటర్నెట్ కోసం ఆధార్ వెరిఫికేషన్స్టార్లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్.. ఈ-కేవైసీ వెరిఫికేషన్ కోసం ఆధార్ను ఉపయోగించడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI)తో ఇప్పటికే భాగస్వామ్యం కుదుర్చుకుంది. స్టార్లింక్ ఇంటర్నెట్ కోసం ఈకేవైసీ చేసుకున్న యూజర్లు హైస్పీడ్ ఇంటర్నెట్ ఆస్వాదించవచ్చు. -
భారత సెమీకండక్టర్ మిషన్లో సీబీఐటీ భాగస్వామ్యం
భారతదేశపు స్వదేశీ సెమీకండక్టర్ చిప్ రూపకల్పనలో చైతన్య భారతీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(సీబీఐటీ) కీలకపాత్ర పోషించినట్లు పేర్కొంది. వీఎల్ఎస్ఐ డిజైన్, అధునాతన చిప్ అభివృద్ధిలో సంస్థ నైపుణ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ, సీబీఐటీను దేశంలోని సెమీకండక్టర్ మిషన్లో భాగస్వామ్య సంస్థగా ఎంపిక చేసింది. ఇటీవల జరిగిన సెమీకాన్ ఇండియా 2025లో సీబీఐటీ, ఉస్మానియా యూనివర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన సెమీకండక్టర్ చిప్ను ప్రదర్శించారు.సెప్టెంబర్ 2న న్యూఢిల్లీలో జరిగిన సెమీకాన్ ఇండియా 2025 సదస్సులో సీబీఐటీ-ఓయూ రూపొందించిన చిప్ను కూడా ప్రదర్శించినట్లు సీబీఐటీ పేర్కొంది. ఇది దేశీయ సెమీకండక్టర్ రూపకల్పనలో ఆత్మనిర్భరత దిశగా సంస్థ చేసిన కృషిని ప్రతిబింబిస్తుందని తెలిపింది. ఈ ప్రాజెక్ట్లో భాగంగా ‘హై-రిజల్యూషన్ ఫేజ్ లాక్డ్ లూప్(ఏడీపీఎల్ఎల్)’ చిప్ను తయారు చేసినట్లు పేర్కొంది. ఇందులో 180 ఎన్ఎం సీమోస్ టెక్నాలజీ నోడ్ను ఉపయోగించినట్లు తెలిపింది. దీన్ని మోహాలీలోని సెమీకండక్టర్ ల్యాబొరేటరీలో ఉస్మానియా యూనివర్సిటీ సహాయంతో తయారు చేసినట్లు వివరించింది.ఈ సందర్భంగా సీబీఐటీ అధ్యక్షులు ఎన్.సుభాష్ ఇతర బోర్డు సభ్యులను అభినందిస్తూ..‘ఈ విజయం సీబీఐటీకి గర్వకారణమని, వీఎల్ఎస్ఐ , సెమీకండక్టర్ టెక్నాలజీలో మరింత పురోగతి సాధించేందుకు సంస్థ మరిన్ని పరిశోధనా అవకాశాలు, మద్దతు అందిస్తుంది’ అని హామీ ఇచ్చారు. సీబీఐటీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి.వి.నరసింహులు మాట్లాడుతూ..‘ఇది ఆత్మనిర్భర్ భారత్ దిశగా సంస్థ చేసిన కృషి’ అన్నారు. ఈ ప్రాజెక్ట్లో డా.మొహమ్మద్ జియౌద్దీన్ జహంగీర్ (చీఫ్-ఇన్వెస్టిగేటర్), డా.డి.కృష్ణరెడ్డి (కో చీఫ్-ఇన్వెస్టిగేటర్), పి.శిరీషా, పి.చరిష్మా (ప్రాజెక్ట్ సిబ్బంది)ఉన్నారు.ఇదీ చదవండి: ఇన్సైడర్ ట్రేడింగ్కు చెక్ పెట్టాలి -
50 కోట్లు దాటిన కస్టమర్లు.. అదిరే ఆఫర్లు ప్రకటించిన జియో
ప్రముఖ ప్రైవేట్ టెలికాం సంస్థ రిలయన్స్ జియో వార్షికోత్సవ వేళ అరుదైన మైలురాయిని దాటింది. తమ వినియోగదారుల సంఖ్య 500 మిలియన్ల మైలురాయిని అధిగమించిందని జియో తాజాగా ప్రకటించింది. దీని ప్రకారం జియో యూజర్ బేస్ అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్ల మొత్తం జనాభా కంటే ఎక్కువ. సెప్టెంబర్ 5న జియో 9వ వార్షికోత్సవాన్ని జరుపుకొంటోంది."జియో 9వ వార్షికోత్సవం సందర్భంగా, 500 మిలియన్లకు పైగా భారతీయులు మాపై నమ్మకం ఉంచడం నాకు నిజంగా గర్వంగా అనిపిస్తుంది. ఒకే దేశంలో ఈ స్థాయిని చేరుకోవడం జియో రోజువారీ జీవితంలో ఎంతగా భాగమైందో ప్రతిబింబిస్తుంది. ఇది శక్తివంతమైన డిజిటల్ సమాజాన్ని రూపొందించడంలో కనెక్టివిటీ అద్భుతమైన శక్తిని చూపిస్తుంది" అని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్ ఆకాష్ అంబానీ అన్నారు.అదిరే ఆఫర్లుజియో 9వ వార్షికోత్సవం, 500 మిలియన్ యూజర్ బేస్ దాటిన సందర్భంగా తమ వినియోగదారుల కోసం పలు ఆఫర్లను జియో ప్రకటించింది. వీటిలో వీకెండ్ విత్ అన్లిమిటెడ్ డేటా, మంత్లీ ప్రత్యేక ఆఫర్, 12 నెలలు రీచార్జ్ చేసుకున్నవారికి 13వ నెల ప్లాన్ ఉచితం వంటివి ఉన్నాయి.యానివర్సరీ వేకెండ్వారాంతంలో అంటే సెప్టెంబర్ 5,6,7 తేదీల్లో (శుక్ర, శని, ఆది వారాలు) 5G స్మార్ట్ఫోన్ వినియోగదారులందరూ వారి ప్రస్తుత ప్లాన్తో సంబంధం లేకుండా అపరిమిత 5జీ డేటాను పూర్తిగా ఉచితంగా పొందుతారు. ఇక 4జీ స్మార్ట్ఫోన్ వినియోగదారులైతే రూ.39 డేటా యాడ్-ఆన్ను ఎంచుకోవడం ద్వారా అపరిమిత 4G డేటాను (రోజుకు గరిష్టంగా 3జీబీ) ఆనందిస్తారు.యానివర్సరీ మంత్ ఆఫర్ఈ ఆఫర్లో భాగంగా రోజుకు 2జీబీ, అంతకంటే ఎక్కువ దీర్ఘకాలిక ప్లాన్లపై వినియోగదారులు సెప్టెంబర్ 5 నుండి అక్టోబర్ 5 వరకు నెలంతా పలు ప్రయోజనాలను పొందుతారు. ఇందులో అన్లిమిటెడ్ 5జీ, 2% అదనంగా జియో గోల్డ్, జియో హాట్స్టార్, జియో సావన్ప్రో, జొమాటో గోల్డ్, నెట్మెడ్స్ ఫస్ట్, రిలయన్స్ డిజిటల్, అజియో, ఈజ్మైట్రిప్ వంటి వాటికి సంబంధించిన రూ.3000 విలువైన సెలబ్రేషన్ వోచర్లు, జియోహోమ్ 2 నెలల ఫ్రీ ట్రయల్ ఉన్నాయి. ఇప్పటికే డైలీ 2జీబీ ప్లాన్ ఉన్నవారు, రూ.349 కంటే తక్కువ ప్లాన్ ఉన్నవారు పై ప్రయోజనాలు పొందడానికి రూ.100 ప్యాక్ వేసుకుంటే సరిపోతుంది.యానివర్సరీ ఇయర్ ఆఫర్ఇక యానివర్సరీ ఇయర్ ఆఫర్ కింద జియో ప్రతినెలా రూ.349 ప్లాన్తో రీచార్జ్ చేసుకుంటున్న కస్టమర్లకు అద్భుతమైన ప్రయోజనాలను ప్రకటించింది. 12 నెలలపాటు క్రమం తప్పకుండా ప్లాన్ వేసుకున్న కస్టమర్లకు 13వ నెల ప్లాన్ను ఉచితంగా అందిస్తోంది.జియోహోమ్ ఆఫర్సెప్టెంబర్ 5 నుండి అక్టోబర్ 5 మధ్య వినియోగదారులు కేవలం రూ. 1200 (జీఎస్టీతో సహా) కు 2 నెలల జియోహోమ్ కొత్త కనెక్షన్ను పొందుతారు. -
హైదరాబాద్లో యాపిల్ విస్తరణ... మరింత స్థలం లీజు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ గ్లోబల్ సంస్థ యాపిల్ హైదరాబాద్ నగరంలో తన ఉనికిని, సేవలను మరింత విస్తరించింది. ఇందులో భాగంగా నగరంలోని ఐటీ పార్క్ వేవ్రాక్లో నూతనంగా 64,125 చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంది. ఈ విస్తరణతో సంస్థ మొత్తంగా 5 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది.అయితే వేవ్రాక్ టవర్లో యాపిల్ 64,125 చదరపు అడుగుల అదనపు కార్యాలయ స్థలానికి రూ.80.15 లక్షల నెలవారీ అద్దె చెల్లించేలా ఐదేళ్లకు లీజ్కు తీసుకున్నట్లు సమాచారం. ఇందుకుగాను చదరపు అడుగుకు రూ.125 చొప్పున చెల్లించనుంది. హైదరాబాద్లోని టీఎస్ఐ బిజినెస్ పార్క్స్ లిమిటెడ్ ద్వారా ప్రాజెక్ట్లో ఉన్న యాపిల్ ప్రస్తుత కార్యాలయాలను విస్తరించింది. ప్రాప్స్టాక్ ప్రకారం., యాపిల్ కంపెనీ ఈ ప్రాజెక్ట్లో అనేక కార్యాలయ స్థలాలను మల్టీ లీజ్లో భాగంగా మొత్తం 5 లక్షల చదరపు అడుగుల తీసుకుంది.అద్దె ప్రారంభ తేదీ నుండి లీజుకు మూడు సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధి ఉంటుంది . ఈ సమయంలో, ఒప్పందంలో పేర్కొన్న నిర్దిష్ట షరతుల కింద తప్ప, ఏ పక్షమూ లీజును రద్దు చేయలేరు. 2016 మేలో యాపిల్ సీఈవో టిమ్ కుక్ అధికారికంగా హైదరాబాద్ కార్యాలయాన్ని ప్రారంభించారు. జియోస్పేషియల్ టెక్నాలజీ, డేటా మోడలింగ్లో ప్రత్యేకత కలిగిన యాపిల్ మ్యాప్స్కు ఇది కీలకమైన అభివృద్ధి కేంద్రంగా పనిచేస్తుంది.ఇదీ చదవండి: ఒక్కో కంపెనీ నెలకు ఎన్ని కోట్లు కడుతున్నాయో తెలుసా? -
రియల్మీ నుంచి కొత్త స్మార్ట్ఫోన్.. ఐఫోన్ స్టైల్లో..
స్మార్ట్ఫోన్స్ బ్రాండ్ రియల్మీ తాజాగా 15టీ ఫోన్ను ఆవిష్కరించింది. బ్యాంక్, ఎక్స్చేంజ్ ఆఫర్ల తర్వాత దీని ధర రూ. 18,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 50 ఎంపీ ఫ్రంట్, రియర్ కెమెరాలు, 7000 ఎంఏహెచ్ టైటాన్ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6400 మ్యాక్స్ 5జీ చిప్సెట్, అమోలెడ్ డిస్ప్లే తదితర ఫీచర్లు ఉన్నాయి. ఫ్లిప్కార్ట్, రియల్మీ వెబ్సైట్లలో సెప్టెంబర్ 6 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి.రియల్మీ 15టీ ముఖ్య ఫీచర్లుకెమెరా: 50ఎంపీ ఫ్రంట్ + 50ఎంపీ రియర్ (ఏఐ ఫీచర్లతో), 4కే వీడియో రికార్డింగ్ సపోర్ట్బ్యాటరీ: 7000ఎంఏహెచ్ టైటాన్ బ్యాటరీ, 60వాట్ల ఫాస్ట్ చార్జింగ్, 10వాట్ల రివర్స్ చార్జింగ్డిస్ప్లే: 6.57" అమోలెడ్, 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 6400 మ్యాక్స్ 5జీ చిప్సెట్ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్మీ యూఐ 6.0డిజైన్: 7.79ఎంఎం స్లిమ్ బాడీ, IP66/IP68/IP69 రేటింగ్తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ధరలు, ఆఫర్లు8జీబీ + 128జీబీ వేరియంట్ అసలు ధర ధర 20,999 కాగా ఆఫర్ ధర (బ్యాంక్/ఎక్స్చేంజ్ తర్వాత) రూ.18,9998జీబీ + 256జీబీ వేరియంట్ అసలు ధర ధర 22,999 కాగా ఆఫర్ ధర (బ్యాంక్/ఎక్స్చేంజ్ తర్వాత) రూ.20,99912జీబీ + 256జీబీ వేరియంట్ అసలు ధర ధర 24,999 కాగా ఆఫర్ ధర (బ్యాంక్/ఎక్స్చేంజ్ తర్వాత) రూ.22,999ఈ ఫోన్ను "బడ్జెట్ ఐఫోన్ స్టైల్" అని కూడా పిలుస్తున్నారు.దాని డిజైన్, ఫీచర్లు చూస్తే ఆకట్టుకునేలా ఉంది. -
ఐఎస్ఎం 2.0తో మద్దతు: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి
ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం) రెండో వెర్షన్లో (2.0) చిప్ల తయారీ ప్రాజెక్టులతో పాటు సెమీకండక్టర్ల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించే భాగస్వామ్య సంస్థలకూ తగిన ప్రోత్సాహకాలు లభిస్తాయని మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఎక్విప్మెంట్, మెటీరియల్స్ తయారీ సంస్థలతో పాటు వ్యవస్థలోని అన్ని విభాగాలకు గణనీయంగా మద్దతు అందిస్తామని పేర్కొన్నారు.‘ఆటోమోటివ్, పవర్ ఎల్రక్టానిక్స్, కన్జూమర్ ఎల్రక్టానిక్స్, వైద్య, రక్షణ తదితర విభాగాలన్నింటికీ తోడ్పాటునివ్వాల్సిన అవసరం ఉంది. తదుపరి విడతలో సింహభాగం వాటా ప్రొడక్టుల అభివృద్ధికి ఉంటుంది’ అని మంత్రి చెప్పారు.వివిధ స్కీముల ద్వారా డిజైన్ ప్రాజెక్టులకు సంబంధించి 278 వర్సిటీలకు అత్యాధునిక ఈడీఏ (ఎల్రక్టానిక్ డిజైన్ ఆటోమేషన్) సాధనాలను అందించామని సెమీకాన్ ఇండియా 2025లో పాల్గొన్న సందర్భంగా మంత్రి తెలిపారు. 60,000 పైచిలుకు ఇంజినీరింగ్ విద్యార్థులు వీటితో 1.3 కోట్ల గంటలు పని చేసినట్లు వివరించారు. రూ. 76,000 కోట్లతో ఐఎస్ఎం తొలి విడతను ప్రకటించగా అందులో రూ. 65,000 కోట్లను చిప్ల ఉత్పత్తికి, రూ. 10,000 కోట్ల మొత్తాన్ని మొహాలీలో సెమీకండక్టర్ ల్యాబొరేటరీని ఆధునీకరించడానికి, రూ. 1,000 కోట్లను డిజైన్ ఆధారిత ప్రోత్సాహక స్కీముకు కేటాయించారు. ప్రస్తుతం ఐఎస్ఎం రెండో విడతపై కసరత్తు జరుగుతోంది. మరోవైపు, కీలకమైన సెమీకండక్టర్ల ఉత్పత్తి ప్రాజెక్టులకు సంబంధించి మొత్తం వ్యయాల్లో 70 శాతం వాటా ఇకపైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహకాలుగా లభించే అవకాశం ఉందని ఎల్రక్టానిక్స్, ఐటీ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. సెమీకండక్టర్ ప్రాజెక్టులకు భారత్ అసాధారణ స్థాయిలో మద్దతు అందిస్తోందని, 30 బిలియన్ డాలర్ల విలువ చేసే ప్రోత్సాహకాలు.. ఇతరత్రా ప్రయోజనాలు కలి్పస్తోందని వివరించారు. -
మెర్క్తో టాటా ఎలక్ట్రానిక్స్ జత
సెమీకండక్టర్ మెటీరియల్ టెక్నాలజీ దిగ్గజం మెర్క్ ఎల్రక్టానిక్స్తో టాటా ఎలక్ట్రానిక్స్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తద్వారా గుజరాత్లోని ధోలెరాలో ఏర్పాటు చేస్తున్న చిప్ ప్లాంటుకి అవసరమైన పూర్తిస్థాయి ప్రొడక్టులు, సర్విసులను ఔట్సోర్సింగ్ చేసుకోనుంది. దీనిలో భాగంగా హైప్యూరిటీ ఎలక్ట్రానిక్ మెటీరియల్స్, అడ్వాన్స్డ్ గ్యాస్, కెమికల్ డెలివరీ సిస్టమ్స్ తదితరాలను సమకూర్చుకోనుంది. 2025 సెమీకాన్ ఇండియా సదస్సు సందర్భంగా కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమక్షంలో రెండు సంస్థలు అవగాహన ఒప్పందాన్ని (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. -
ప్రపంచాన్ని మార్చే భారత్ చిప్!
న్యూఢిల్లీ: భారత్లో తయారైన ఓ చిన్న చిప్ ప్రపంచంలో పెద్ద మార్పును తీసుకొస్తుందని, అది ఎంతో దూరంలో లేదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సెమీకాన్ ఇండియా 2025 సదస్సును ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మాట్లాడారు. భారత్లో రూపుదిద్దుకుని, భారత్లో తయారైందంటూ ప్రపంచమంతా మర్మోగే రోజు ఎంతో దూరంలో లేదన్నారు.18 బిలియన్ డాలర్ల విలువ చేసే 10 సెమీకండక్టర్ ప్రాజెక్టులు ప్రస్తుతం అమలు దశలో ఉన్నాయంటూ.. తదుపరి దశ భారత సెమీకండక్టర్ మిషన్ దిశగా అడుగులు వేస్తున్నట్టు ప్రకటించారు. ట్రిలియన్ డాలర్ల అంతర్జాతీయ చిప్ మార్కెట్లో స్థానాన్ని సంపాదించడమే భారత్ లక్ష్యమని పేర్కొన్నారు. వివిధ దేశాలకు చెందిన సెమీకండక్టర్ నిపుణులు, 50 దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో భారత యువ శక్తి, ఆవిష్కరణలు ప్రస్ఫుటమవుతున్నట్టు ప్రధాని వ్యాఖ్యానించారు. భారత్ను ప్రపంచం విశ్వసిస్తున్నట్టు ఇది స్పష్టమైన సంకేతం పంపిస్తుందన్నారు. భారత్తో కలసి సెమీకండక్టర్ భవిష్యత్ నిర్మాణానికి ప్రపంచం సుముఖంగా ఉన్నట్టు చెప్పారు. డిజిటల్ డైమండ్స్...చిప్లపై ప్రధాని మోదీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆయిల్ అన్నది నల్ల బంగారం. కానీ చిప్లు అన్నవి డిజిటల్ వజ్రాలు’’అని పేర్కొన్నారు. చమురు గత శతాబ్దాన్ని మలుపు తిప్పగా, 21వ శతాబ్దాన్ని చిన్న చిప్లు నడిపించనున్నట్టు చెప్పారు. పరిమాణంలోనే చిన్నవే అయినా ప్రపంచ పురోగతిని వేగవంతం చేస్తాయని అభిప్రాయపడ్డారు. నోయిడా, బెంగళూరులో ఏర్పాటు చేసిన డిజైన్ కేంద్రాలు ప్రపంచంలోనే అత్యాధునికమైన చిప్ల అభివృద్ధిపై పనిచేస్తున్నాయని, అవి బిలియన్ల లావాదేవీలను నిల్వ చేయగలవన్నారు.‘‘ప్రస్తుతం ప్రపంచ సెమీకండక్టర్ మార్కెట్ 600 బిలియన్ డాలర్లుగా ఉంటే, రానున్న సంవత్సరాల్లో ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. సెమీకండక్టర్ రంగంలో సాధిస్తున్న పురోగతి దృష్ట్యా భవిష్యత్తులో ట్రిలియన్ డాలర్ల మార్కెట్లో భారత్ చెప్పుకోతగ్గ వాటాను సొంతం చేసుకుంటుంది’’అని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ పెద్ద హృదయంతో ఇన్వెస్టర్లకు ఆహ్వానం పలుకుతున్నట్టు ప్రకటించారు. భారత విధానాలు స్వల్పకాలం కోసం కాదంటూ ప్రతి ఇన్వెస్టర్ అవసరాలకు అనుగుణంగా ఉంటాయన్నారు.సెమీకండక్టర్ రంగంలో వేగం ముఖ్యమంటూ.. దరఖాస్తు నుంచి ఫ్యాక్టరీ నిర్మాణం వరకు పేపర్ పని తక్కువగా ఉంటే వేఫర్ తయారీ వేగంగా సాధ్యపడుతుందని చెప్పారు. ప్రభుత్వం ఇదే ధోరణితో పనిచేస్తున్నట్టు తెలిపారు. జాతీయ స్థాయిలో సింగిల్ విండో ద్వారా అన్ని అనుమతులను ఇస్తున్నట్టు చెప్పారు. వెంటనే కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా దేశవ్యాప్తంగా సెమీకండక్టర్ పార్క్లను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. భూమి, విద్యుత్, పోర్ట్, ఎయిర్పోర్ట్లతో అనుసంధానత, నిపుణులైన మానవవనరులు ఇలా అన్ని అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. వీటితో పారిశ్రామికవృద్ధి వేగవంతం అవుతుందన్నారు. సీజీ పవర్కు చెందిన సెమీకండక్టర్ పైలట్ ప్లాంట్ ఆగస్ట్ 28న కార్యకలాపాలు మొదలు పెట్టిందని, కేనెస్ టెక్నాలజీ ప్లాంట్ పైలట్ పనులు త్వరలోనే ప్రారంభించనున్నట్టు చెప్పారు. మైక్రాన్ టెక్నాలజీ, టాటా ఎలక్ట్రానిక్స్ ఇప్పటికే తయారీ కార్యకలాపాలు మొదలు పెట్టాయని, వాణిజ్య చిప్ ఉత్పత్తి ఈ ఏడాదే మొదలవుతుందని ప్రధాని ప్రకటించారు. విక్రమ్.. తొలి మేడిన్ ఇండియా చిప్భారత్లో రూపుదిద్దుకుని, ఇక్కడే తయారైన విక్రమ్ 32 బిట్ మైక్రో ప్రాసెసర్తో పాటు ఇతర టెస్ట్ చిప్లను ప్రధాని మోదీకి కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ ఇదే కార్యక్రమంలో అందజేశారు. ఈ తొలి మేడిన్ ఇండియా చిప్ విక్రమ్ను ఇస్రో సెమీకండక్టర్ ల్యాబ్ అభివృద్ధి చేసింది. కఠినమైన ఉపగ్రహ ప్రయోగ పరిస్థితుల్లోనూ వినియోగించేందుకు అనుకూలంగా రూపొందించారు. సెమీకండక్టర్ మిషన్ ప్రారంభించిన మూడున్నరేళ్లలోనే ప్రపంచం భారత్వైపు చూసేలా పురోగతి సాధించినట్టు మంత్రి అశ్వని వైష్ణవ్ పేర్కొన్నారు. -
శాంసంగ్ నుంచి ఏ17 స్మార్ట్ఫోన్: ధర ఎంతంటే?
పండుగ సీజన్ సందర్భంగా.. కన్జూమర్ ఎల్రక్టానిక్స్ దిగ్గజం శాంసంగ్ తాజాగా తమ గెలాక్సీ ‘ఏ’ సిరీస్ స్మార్ట్ఫోన్లను విస్తరించింది. ఇందులో భాగంగానే 5జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలు గల ఏ17ని ఆవిష్కరించింది. దీని ధరలు రూ. 18,999 నుంచి రూ. 23,499గా ఉన్నాయి.హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ కార్డులు, యూపీఐ ద్వారా రూ. 1,000 వరకు క్యాష్బ్యాక్ లభిస్తుందని సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఆదిత్య బబ్బర్ తెలిపారు. ఈ విభాగంలో అత్యంత పల్చని, తేలికైన ఫోన్ ఇదేనని ఆయన చెప్పారు. 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, ఎక్సినోస్ ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరా, 14 ప్రాంతీయ భాషల్లో జెమినీ లైవ్ సపోర్ట్ తదితర ప్రత్యేకతలు ఇందులో ఉంటాయని ఆదిత్య వివరించారు.6 జనరేషన్స్ వరకు ఆండ్రాయిడ్, 6 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ ఆఫర్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ఆఖరు నాటికి పది కోట్ల ‘ఏ’ సిరీస్ స్మార్ట్ఫోన్ల అమ్మకాలు సాధించాలని నిర్దేశించుకున్నట్లు, ఇప్పటివరకు 9.7 కోట్లు విక్రయించినట్లు ఆయన పేర్కొన్నారు. -
డిజిటల్ డైమండ్.. ఈ శతాబ్దం దీనికే!.. నరేంద్ర మోదీ
భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచంలోని చాలా దేశాలు ఇండియా వైపు చూస్తున్నాయి. ఈ తరుణంలో న్యూఢిల్లీలో జరిగిన 'సెమికాన్ ఇండియా 2025' శిఖరాగ్ర సమావేశంలో.. సెమీకండక్టర్ల పెరుగుతున్న ప్రాముఖ్యతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించారు.ఈ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి మాట్లాడుతూ.. పెట్టుబడిదారులందరినీ స్వాగతించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రపంచంలోని చాలా దేశాలు.. భారతదేశంలో తయారైన వాటిని విశ్వసిస్తున్నాయి అని చెప్పే రోజు ఎంతో.. దూరంలో లేదని అన్నారు. ప్రపంచంలో.. చమురును నల్ల బంగారం అని, చిప్స్ను డిజిటల్ డైమండ్స్ అంటారని అన్నారు. గత శతాబ్దం మొత్తం చమురుకు ప్రాధాన్యత ఇచ్చింది. కానీ 21వ శతాబ్దం మాత్రం చిప్కే పరిమితం అని అన్నారు. ఈ చిప్ ప్రపంచ అభివృద్ధిని వేగవంతం చేసే శక్తిని కలిగి ఉందని మోదీ పేర్కొన్నారు.#WATCH | At Semicon India 2025, Union Minister for Electronics & Information Technology, Ashwini Vaishnaw presents Vikram 32-bit processor and test chips of the 4 approved projects to PM Narendra Modi.Vikram 32-bit processor is the first fully “Make-in-India” 32-bit… pic.twitter.com/8FCkbe0sve— ANI (@ANI) September 2, 2025కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ సెమికాన్ ఇండియాలో.. ప్రధాని మోదీకి విక్రమ్ 32 బిట్ ప్రాసెసర్, టెస్ట్ చిప్లను అందజేశారు. మన ప్రధానమంత్రిని దూరదృష్టితో కొత్త ఆరంభం కోసం మొదటిసారి కలిశాము. అప్పుడే మేము ఇండియా సెమీకండక్టర్ మిషన్ను ప్రారంభించాము. ఇది 3.5 సంవత్సరాల వ్యవధిలోనే.. ప్రపంచం భారతదేశం వైపు నమ్మకంగా చూసేలా చేసింది. నేడు, ఐదు సెమీకండక్టర్ యూనిట్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. మేము ఇప్పుడు మొదటి 'మేడ్-ఇన్-ఇండియా' చిప్ను ప్రధాని మోదీకి అందించామని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నాడు.ఇదీ చదవండి: యూరోపియన్ దేశాలకు.. మోదీ ప్రారంభించిన కారుగత కొన్ని సంవత్సరాలుగా సెమికాన్ ఇండియా ప్రణాళిక కింద జరుగుతున్న పురోగతి గురించి కూడా ప్రధాని మోదీ మాట్లాడారు. 2023 నాటికి, భారతదేశంలో మొట్టమొదటి సెమీకండక్టర్ ప్లాంట్ సిద్ధమైంది. 2024లో మేము అదనపు ప్లాంట్లను ఆమోదించాము. 2025లో మరో ఐదు అదనపు ప్రాజెక్టులను క్లియర్ చేసాము. మొత్తం మీద ప్రభుత్వం పది సెమీకండక్టర్ ప్రాజెక్టులలో రూ. 1.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నారు. ఇది భారతదేశంపై ప్రపంచ దేశాలు పెంచుకున్న నమ్మకానికి నిదర్శనమని అన్నారు.First ‘Made in India’ Chips!A moment of pride for any nation. Today, Bharat has achieved it. 🇮🇳This significant milestone was made possible by our Hon’ble PM @narendramodi Ji’s far-sighted vision, strong will and decisive action. pic.twitter.com/ao2YeoAkCv— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) September 2, 2025 -
యూరాలజీ సర్జరీల్లో రోబోల యుగం
హైదరాబాద్: యూరాలజీ విభాగంలో చేసే శస్త్రచికిత్సల్లో రోబోల యుగం వచ్చేసిందని, అమెరికా లాంటి దేశాల్లో అయితే అది తప్పనిసరి కూడా అయ్యిందని పలువురు వక్తలు పేర్కొన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా అందరూ తమకు వీలైనంత చిన్న కోతలతో సర్జరీలు కావాలని అడుగుతున్నారని, ముఖ్యంగా రోబోటిక్ శస్త్రచికిత్సల వల్ల తమకు ఇబ్బంది తక్కువనే భావన అందరిలోనూ వచ్చిందని అంతర్జాతీయ వైద్య నిపుణులు చెప్పారు. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్యూ) ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన రోబో-ల్యాప్ 2025 సదస్సులో పలువురు విదేశీ వైద్య నిపుణులు ఈ తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. యూరలాజికల్ చికిత్సల విషయంలో రోబోటిక్, లాప్రోస్కొపిక్ చికిత్సలలో వస్తున్న సరికొత్త టెక్నాలజీలపై చర్చించేందుకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలతో పాటు ఇంగ్లండ్, అమెరికా, బెల్జియం, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక లాంటి దేశాల నుంచి కలిపి మొత్తం వెయ్యి మందికి పైగా యూరాలజిస్టులు ఇందులో పాల్గొన్నారు. సంక్లిష్టమైన యూరాలజీ కేసులు, వాటికి చికిత్సలు ఎలా అందించాలన్న విషయమై నిపుణులు ఇందులో విస్తృతంగా చర్చించారు. శస్త్రచికిత్సలలో పాటించాల్సిన విధానాలు, భవిష్యత్తు సవాళ్లకు సిద్ధం కావడం, ఈ స్పెషాలిటీలో రోగులకు అత్యుత్తమ చికిత్సలు అందించడంపై ఏఐఎన్యూ నిర్వహించిన ఈ సదస్సు ఉత్సాహవంతంగా సాగింది. రెండు రోజుల పాటు సాగిన ఈ సదస్సులో పలు వర్క్ షాప్లు, సంక్లిష్టమైన కేసుల గురించిన చర్చలు, భవిష్యత్తు టెక్నాలజీలు యూరాలజీ, నెఫ్రాలజీ చికిత్సలను ఎలా మారుస్తాయన్న అంశంపై అత్యున్నత స్థాయి సమీక్షలు జరిగాయి.ఈ సదస్సు గురించి ఏఐఎన్యూ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ సి. మల్లికార్జున మాట్లాడుతూ, “రోగులకు చికిత్స అందించే విషయంలో అత్యాధునిక వైద్య పరిజ్ఞానాన్ని అమలుచేయాలని ఏఐఎన్యూ ఎప్పుడూ భావిస్తుంది. రోబో-ల్యాప్ 2025 సదస్సు కేవలం శస్త్రచికిత్సల్లో వస్తున్న కొత్త మార్పులు ప్రదర్శించడానికి కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులంతా ఒక్క వేదికమీదకు చేరి, వారి ఆలోచనలు పంచుకుని యూరాలజీ చికిత్సల భవిష్యత్తును సమిష్టిగా పునర్నిర్వచించాలన్నదే మా ఉద్దేశం. ఈ స్థాయి సదస్సుల నిర్వహణ ద్వారా యూరాలజీ రంగంలో రోబోటిక్, మినిమల్లీ ఇన్వేజివ్ చికిత్సల్లో సరికొత్త విజయాల గురించి అందరికీ తెలుస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా అందరూ తమకు వీలైనంత చిన్న కోతలతో సర్జరీలు కావాలని అడుగుతున్నారు. దానివల్ల నొప్పి తక్కువ ఉండడం, త్వరగా కోలుకుని తమ పనులు చేసుకోవడం సాధ్యమవుతుందని వారికి తెలుసు. కానీ, అలాంటి శస్త్రచికిత్సలు, ముఖ్యంగా యూరాలజీ విభాగంలో వైద్య కళాశాలల్లో ఇంతకుముందు నేర్పలేదు. అందువల్ల ఇప్పటికే ఈ రంగంలో ఉన్నవారు వీటిపై తమ విజ్ఞానాన్ని పెంచుకుని తమ స్వదేశాలకు లేదా సొంత రాష్ట్రాలకు వెళ్లి అక్కడి రోగులకు సంతృప్తికరమైన చికిత్స అందించడానికి ఈ సదస్సు వారికి ఎంతగానో ఉపయోగపడింది. దీనికి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలతో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, గల్ఫ్ దేశాలు.. ఇలా పలు దేశాల నుంచి వైద్యులు వచ్చి రోబోటిక్, ల్యాప్రోస్కొపిక్ శస్త్రచికిత్సలు చేయడం, వాటిలో ఉండే టెక్నిక్లు, నైపుణ్యాల గురించి వివరంగా నేర్చుకున్నారు. మన దేశంతో పాటు విదేశాల్లో కూడా యూరాలజీ చికిత్సలను మరింత మెరుగుపరచాలన్న ఏఐఎన్యూ నిబద్ధతకు ఈ సదస్సు నిదర్శనం. ఇది లాప్రోస్కొపిక్, రోబోటిక్ యూరాలజీ శస్త్రచికిత్సలకు ఒక కరదీపికలా ఉపయోగపడుతుంది” అని చెప్పారు.ఏఐఎన్యూ సీఈఓ సందీప్ గూడూరు మాట్లాడుతూ, “యూరాలజీ రంగంలో అత్యున్నత స్థాయి చికిత్సలు, నిరంతర అధ్యయనం, సాంకేతిక ఆవిష్కరణల దిశగా ఏఐఎన్యూ నిబద్ధతను రోబో-ల్యాప్ సదస్సు ప్రతిబింబిస్తుంది. ఆవిష్కరణలకు హద్దులు ఉండకూడదని ఏఐఎన్యూ భావిస్తుంది. రోబో-ల్యాప్ సదస్సు ఈ స్ఫూర్తికి నిదర్శనం” అన్నారు.అధిక నాణ్యత కలిగిన యూరో-ఆంకాలజీ శస్త్రచికిత్సలు, రీకన్స్ట్రక్టివ్ శస్త్రచికిత్సలు, సంక్లిష్మైన పిల్లల శస్త్రచికిత్సలలో వస్తున్న మార్పులపై అత్యంత అవసరమైన విజ్ఞాన పంపిణీ వేదికగా ఈ సదస్సు నిలిచింది. సమస్యాత్మక కేసులకు శస్త్రచికిత్సా పరిష్కారాలు, రోబోటిక్, లాప్రోస్కొపిక్ శస్త్రచికిత్సలు కచ్చితత్వాన్ని ఎలా సాధిస్తున్నాయి, కోతలను ఎలా తగ్గిస్తున్నాయి, రోగులు త్వరగా ఎలా కోలుకుంటున్నారు అన్న విషయాలపై ప్రముఖ వైద్య నిపుణులు సమగ్రంగా వివరించారు. -
భారత్పై ప్రశ్న.. చైనా రోబో సమాధానం
చైనాలోని తియాన్జిన్లో షాంఘై సహకార సదస్సు (SCO) జరుగుతోంది. ఈ సదస్సులో రిసెప్షన్ వద్ద చైనీస్ హ్యుమానాయిడ్ రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అక్కడి అతిధులు అడిగే ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానాలు చెబుతూ ఎంతగానో ఆకట్టుకుంది.ఎస్సీవో సదస్సులో హ్యుమానాయిడ్ రోబో సమాధానాలు చెప్పడానికి సిద్ధం కావడానికి ముందు.. "నేను ఈ రోజు నా గరిష్ట సామర్థ్యంతో పనిచేస్తున్నాను. నన్ను ప్రశ్నలు అడుగుతున్నందుకు ధన్యవాదాలు'' అని చెప్పింది.భారతదేశంపై నీ ఆలోచలను చెప్పమని అడిగినప్పుడు.. నేను ఒక ఏఐ రోబోను. దేశాలు, రాజకీయ పరిణాలను గురించి నేను చెప్పలేనని స్పష్టం చేసింది. అయితే ఎస్సీవో సదస్సుకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఇది ఇంగ్లీష్, చైనీస్, రష్యన్ భాషలు మాట్లాడుతుంది. View this post on Instagram A post shared by Firstpost (@firstpost) -
ఆర్మీ ట్రెయినింగ్ కమాండ్తో ఐఐటీ-హైదరాబాద్ ఒప్పందం
భారత సైన్యం కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీ-హెచ్), ఇండియన్ ఆర్మీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)ను ప్రారంభించనున్నాయి. ఈమేరకు ఐఐటీ హైదరాబాద్ సిమ్లాలోని ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ (ఏఆర్టీఆర్ఏసీ), సిమ్యులేటర్ డెవలప్మెంట్ డివిజన్ (ఎస్డీడీ)తో అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకుంది. స్వదేశీ సాంకేతిక స్వావలంబనకు ఇది కీలకం కానుందని అధికారులు చెప్పారు.‘విగ్రహ’(వర్చువల్, ఇంటెలిజెంట్, గ్రౌండ్ బ్రేకింగ్ రీసెర్చ్ ఇన్ ఏఆర్/వీఆర్ అండ్ హైటెక్ అప్లికేషన్స్ ఫర్ ఇండియన్ ఆర్మీ) పేరుతో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్(సీఓఈ) భారత నైన్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఇరు వర్గాలు తెలిపాయి.‘విగ్రహ’ లక్ష్యం ఏమిటి?భారత సైన్యం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని శిక్షణ, యుద్ధ సన్నద్ధతకు ఉపయోగించడం ద్వారా సైనిక సంసిద్ధతను నిర్ధారించాలని విగ్రాహ భావిస్తోంది.రియలిస్టిక్ మిలిటరీ ట్రైనింగ్ సిమ్యులేషన్స్ కోసం అడ్వాన్స్డ్ ఏఆర్/వీఆర్ ప్లాట్ఫామ్స్ ఉపయోగపడుతాయి.సంక్లిష్ట భూభాగాల్లో సమర్థమైన నిర్ణయాలు తీసుకోవడం, స్వయంప్రతిపత్తి కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఏఐ, రోబోటిక్స్, మానవరహిత వ్యవస్థలను అభివృద్ధి చేసేందుకు ఈ సెంటర్ తోడ్పడుతుంది.భారత సైన్యం ఆపరేషనల్ మెలకువలు, వ్యూహాత్మక అవసరాలను తీర్చడానికి బ్యాటిల్ ఫీల్డ్ సిమ్యులేషన్ టూల్స్ను ఏర్పాటు చేయనున్నారు.ఈ సందర్భంగా ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ..‘ఈ కేంద్రం కేవలం టెక్ ల్యాబ్ మాత్రమే కాదు. ప్రపంచ స్థాయి ఆవిష్కరణలతో భారతదేశ రక్షణ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయాలనే మా ఉమ్మడి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది’ అని తెలిపారు. బ్రిగేడియర్ ఏకే చతుర్వేది మాట్లాడుతూ..‘ఈ సహకారం తదుపరి తరం సామర్థ్యాలను స్వీకరించడానికి, స్వదేశీ సాంకేతిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి సైన్యం నిబద్ధతకు హైలైట్ చేస్తుంది’ అన్నారు.ఇదీ చదవండి: భారత్ మూడంచెల ప్లాన్.. -
రూ.200 లోపు మంత్లీ ప్లాన్.. అదీ రోజుకు 2 జీబీ డేటాతో..
ప్రైవేట్ టెలికం కంపెనీలన్నీ తమ ఎంట్రీ లెవల్ మంత్లీ ప్లాన్లను మార్చేశాయి. తక్కువ ధర రీచార్జ్ ప్లాన్లను తొలగించాయి. రోజువారీ డేటాతో కూడిన ప్లాన్లు కావాలంటే కనీసం రూ.300 ఖర్చు పెట్టాల్సి వస్తోంది. కానీ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తక్కువ ధరకే అధిక సేవలను అందించే మరో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ను లాంచ్ చేసింది. రూ.200 లోపు మంత్లీ ప్లాన్.. అదీ రోజుకు 2 జీబీ డేటాతో..ప్రైవేటు సంస్థలకు పెద్ద సవాలు విసురాలనే లక్ష్యంతో బీఎస్ఎన్ఎల్ ఈ రీఛార్జ్ ప్లాన్ ను లాంచ్ చేసింది. 30 రోజుల పాటు రోజుకు 2 జీబీ డేటా, ఉచిత కాలింగ్ అందించే ఈ ప్లాన్ ధర రూ.200 లోపే. ఈ రీఛార్జ్ ప్యాక్ లో బీఎస్ఎన్ఎల్ అందించే ప్రయోజనాలను వివరంగా చూద్దాం.బీఎస్ఎన్ఎల్ రూ.199 ప్లాన్పై 30 రోజుల ఆకర్షణీయమైన వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 2 జీబీ హైస్పీడ్ డేటా మరో ఆకర్షణ. వీటన్నింటితో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లను కూడా అందిస్తుంది. దేశంలోని ఇతర టెలికాం సర్వీస్ ప్రొవైడర్లతో పోలిస్తే రూ .199 ప్లాన్ ఆర్థిక ప్రయోజనాలు, అధిక ప్రయోజనాలను కలిగి ఉందని పేర్కొంటూ బీఎస్ఎన్ఎల్ ఈ రీఛార్జ్ ప్యాక్ను ప్రవేశపెట్టింది.ఇదే రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ కాల్స్ అందించే ప్లాన్కు ఒక ఆపరేటర్ నెలకు రూ.379 వసూలు చేస్తుందని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. మరో టెలికాం సర్వీస్ ప్రొవైడర్ అదే సౌకర్యాలతో 28 రోజుల ప్లాన్ కోసం రూ .365 వసూలు చేస్తుంది. మరోవైపు రూ.199 ప్లాన్తో మరో ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ రోజుకు 2 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, 100 ఎస్ఎంఎస్లకు 14 రోజుల వాలిడిటీని మాత్రమే అందిస్తుందని బీఎస్ఎన్ఎల్ స్పష్టం చేసింది. -
చాట్ జీపీటీ చెప్పిందని తల్లిని చంపాడు
కనెక్టికట్: చాట్జీపీటీ చెప్పిందని తల్లిని చంపిన ఓ వ్యక్తి, ఆ తరువాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అమెరికాలోని కనెక్టికట్లో జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రమేయంతో జరిగిన తొలి హత్యగా దీన్ని భావిస్తున్నారు. ఆ వ్యక్తిని 56 ఏళ్ల స్టెయిన్ ఎరిక్ సోయెల్బర్గ్గా గుర్తించారు. గతంలో యాహూలో మేనేజర్గా పనిచేసిన సోయెల్.. ఏఐ చాట్బాట్ నిరంతరం మాట్లాడుతూ ఉండేవాడు. దానికి బాబీ అని పేరు పెట్టుకున్నాడు. బాబీతో చేసిన సంభాషణలను యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేవాడు. అప్పటికే మానసిక అనారోగ్యంతో ఉన్న సోయెల్.. తల్లి సుజాన్ ఎబెర్సన్ ఆడమ్స్ తనను చంపేందుకు కుట్ర చేస్తోందని భావించాడు. ఈ విషయంపై ఏఐతో మాట్లాడాడు. అది అతని అనుమానాన్ని పెంచింది. మానసిక అనారోగ్యానికి వాడే మందుల్లో విషం కలిపి ఇవ్వొచ్చని చెప్పింది. దీంతో సోయెల్ తల్లిపై దాడి చేశాడు. తలకు, మెడకు బలమైన గాయాలవ్వడంతో ఆమె మరణించింది. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మెడ, ఛాతీపై బలమైన గాయాలవ్వడంతో ఆయన చనిపోయాడు. 2.7 మిలియన్ డాలర్ల విలువైన వారి ఇంట్లో ఇద్దరి మృతదేహాలు ఆగస్ట్ 5న దొరికాయి. పదునైన ఆయుధంతో దాడిచేయడంతోపాటు, తనను తాను కోసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. -
జీమెయిల్ యూజర్లకు గూగుల్ హెచ్చరిక
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2.5 బిలియన్ల జీమెయిల్ వినియోగదారులకు గూగుల్ ఓ హెచ్చరిక జారీ చేసింది. హ్యాకర్లు తమ దాడులను వేగవంతం చేస్తున్నారని.. యూజర్లు తమ పాస్వర్డ్లను మార్చుకోవాలని, టూ స్టెప్ వెరిఫికేషన్ కూడా ప్రారంభించాలని కోరింది.ఇప్పటికే చాలా మంది ప్రజలు హ్యాకర్స్ బారిన పడ్డారు. షైనీహంటర్స్ అనే అంతర్జాతీయ హ్యాకర్స్ ముఠా.. కూడా దీని వెనుక ఉన్నట్లు గుర్తించినట్లు గూగుల్ వెల్లడించింది. 2020 నుంచి ఏటీ&టీ, మైక్రోసాఫ్ట్, సాంటాండర్, టికెట్మాస్టర్ వంటి కంపెనీల డేటా లీక్ కేసులో ఈ గ్రూప్ ప్రమేయం ఉందని పేర్కొంది. దీనికోసం హ్యాకర్స్ ఫిషింగ్ పద్దతిని ప్రధానంగా ఉపయోగిస్తున్నట్లు తెలిసింది.యూజర్లకు ఫేక్ మెయిల్స్ పంపి.. వేరొక లాగిన్ పేజిలోకి మళ్లించడం, తద్వారా సెక్యూరిటీ కోడ్స్ వంటి సమాచారాన్ని దోచుకోవడం హ్యాకర్స్ పని. సెక్యూరిటీ కోడ్స్ హ్యాకర్స్ చేతికి వెళ్తే.. తరువాత జరిగే నష్టాలను అంచనా వేసుకోవచ్చు. షైనీహంటర్స్ గ్రూప్ ఒక డేటా లీక్ సైట్ ప్రారంభించడానికి సిద్ధమవుతోంది, ఇది సున్నితమైన సమాచారం దోచుకునే అవకాశం ఉందని గూగుల్ ఇప్పటికే ఒక బ్లాగ్పోస్ట్ ద్వారా వెల్లడించింది.ఇదీ చదవండి: భారత్లోకి మళ్ళీ టిక్టాక్?: మొదలైన నియామకాలుటూ స్టెప్ వెరిఫికేషన్ ఎందుకంటే?ఒక ఈమెయిల్కు మరింత సెక్యూరిటీ కావాలనుకుంటే.. టూ స్టెప్ వెరిఫికేషన్ చాలా ఉపయోగపడుతుంది. హ్యాకర్స్ మీ ఈమెయిల్ పాస్వర్డ్ను తెలుసుకున్నప్పటికీ.. టూ స్టెప్ వెరిఫికేషన్ లేకుండా లాగిన్ అవ్వలేరు. ఇది మీకు సంబంధించిన ఈమెయిల్లోని సమాచారాన్ని సురక్షితంగా ఉంచుతుంది. సైబర్ నేరగాళ్లు లేదా హ్యాకర్స్ భారీ నుంచి తప్పించుకోవడానికి ఇదొక సులువైన మార్గం. -
ఫోన్ వేడెక్కుతోందా.. స్పీడ్ తగ్గిందా: కారణం ఇదే కావొచ్చు
టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో.. సైబర్ నేరగాళ్లు ఎక్కువవుతున్నారు. మొబైల్స్ హ్యాక్ చేసి డబ్బు దోచేస్తున్నారు. ఫోన్లో మాల్వేర్స్ ఉపయోగించి కొందరు మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేయవచ్చు. అయితే మీ ఫోన్లో మాల్వేర్స్ ఉన్నాయా?, లేదా? అని ఎలా తెలుసుకోవాలో ఇక్కడ చూసేద్దాం..కంటిన్యూస్ పాప్ అప్ యాడ్స్: మీరు ఉపయోగించే ఫోన్లో మాల్వేర్స్ ఉంటే.. పాప్ అప్ యాడ్స్ ఎక్కువగా వస్తుంటాయి. అలాంటి యాడ్స్ మీద క్లిక్ చేస్తే.. డబ్బు పోగొట్టుకోవడం ఖాయం. కొన్ని ప్రమాదకర యాప్ల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవి మీకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం కూడా లీక్ చేస్తాయి.బ్యాటరీ ఛార్జ్ త్వరగా అయిపోతుంది: మీ ఫోన్లో మాల్వేర్స్ ఉంటే.. బ్యాటరీ ఛార్జ్ కూడా త్వరగా అయిపోతుంది. దీనికి కారణం మీకు తెలియకుండా మీ ఫోన్ను (బ్యాక్గ్రౌండ్) ఇతరులు హ్యాండిల్ చేతుంటారన్న మాట. దీంతో ఛార్జింగ్ కూడా వేగంగా తగ్గిపోతుంది. ఫోన్ స్పీడ్ తగ్గుతుంది: మాల్వేర్స్ కారణంగా ఫోన్ వేగం తగ్గుతుంది. దీంతో చిన్న చిన్న పనులు చేయడానికి కూడా మొబైల్ సహకరించదు. కొన్నిసార్లు యాప్లు కూడా మాల్వేర్స్ కారణంగా క్రాష్ కావచ్చు.ఇదీ చదవండి: పేటీఎం యూపీఐ ఆగిపోతుందా?: గూగుల్ ప్లే అలర్ట్పై కంపెనీ రెస్పాన్స్ఫోన్ వేడెక్కుతోంది: మాల్వేర్స్ మీ ఫోన్లో ఉన్నట్లయితే.. మొబైల్ చాలా వేడెక్కుతుంది. కొన్నిసార్లు ఇంటర్నల్ సీపీయూపై ఎక్కువ లోడ్ పెంచుతుంది. లోపి అనే మాల్వేర్స్ ఫోన్ను వేడెక్కేలా చేస్తుంది. కాబట్టి ఏమీ చేయకుండానే ఫోన్ వేడెక్కుతుంటే.. కొంత సమయం పాటు దాన్ని ఆఫ్ చేయడం మంచిది.మాల్వేర్ను ఎలా తొలగించాలి?ఫోన్ నుంచి మాల్వేర్ను తొలగించడానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. ఇందులో ఒకటి సేఫ్ మోడ్ను ప్రారంభించడం. ఆండ్రాయిడ్ ఫోన్లో సేఫ్ మోడ్ను ప్రారంభించడం ద్వారా, ఇది థర్డ్ పార్టీ యాప్లను నిలిపివేస్తుంది. దీనితో పాటు యాంటీ వైరస్ సహాయంతో ఫోన్ను స్కాన్ చేయడం ద్వారా కూడా మాల్వేర్ను గుర్తించవచ్చు. ఇవన్నీ పనిచేయకపోతే.. ఫోన్ను రీసెట్ చేసుకోవాలి. రీసెట్ చేయడానికి ముందు.. మీకు అవసరమైన డేటాను బ్యాకప్ తీసుకోవడం మర్చిపోవద్దు. -
భారత్లోకి మళ్ళీ టిక్టాక్?: మొదలైన నియామకాలు
భారతదేశంలో ఒకప్పుడు ఎంతో ప్రాచుర్యం పొంది.. ఇప్పుడు నిషేధంలో ఉన్న ప్రముఖ సోషల్ మీడియా యాప్ 'టిక్టాక్' ఉద్యోగుల కోసం ఎదురు చూస్తోంది. గురుగ్రామ్లోని ఆఫీసులో రెండు ఖాళీలను భర్తీ చేయనున్నట్లు లింక్డిన్లో పోస్ట్ చేసింది. ఇందులో ఒకటి కంటెంట్ మోడరేటర్ (బెంగాలీ స్పీకర్), మరొకటి మంచి భాగస్వామ్యం.. కార్యకలాపాల లీడ్ కోసం. దీన్నిబట్టి చూస్తుంటే టిక్టాక్ మళ్ళీ భారత్లోకి అందుబాటులోకి రానుందా అనే ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి.బైట్డాన్స్ యాజమాన్యంలోని షార్ట్ వీడియో యాప్ టిక్టాక్ కంపెనీ వెబ్సైట్ ఇటీవల భారతదేశంలో మళ్లీ అందుబాటులోకి వచ్చింది. అయితే.. దేశంలో టిక్టాక్ సేవలను తిరిగి ప్రారంభించడానికి కావలసిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేయలేదని అధికారులు తెలిపారు. ఆగస్టు 22న, కూడా ఈ చైనా యాప్ భారతదేశంలో తిరిగి అనుమతించారనే వాదనలను అధికారులు తిరస్కరించారు.టిక్టాక్ వెబ్సైట్లోని ల్యాండింగ్ పేజీ ఓపెన్ చేయగానే.. భారతదేశంలో ఇది అందుబాటులో లేదని సందేశాన్ని ప్రదర్శించేది. కానీ గత వారం డెస్క్టాప్ ద్వారా యాక్సెస్ చేసినప్పుడు ఈ ప్లాట్ఫామ్కు సంబంధించిన 'అబౌట్ అస్' పేజీ కనిపించింది. అయితే ఎలాంటి వీడియోలు కనిపించలేదు.ఇదీ చదవండి: స్టార్లింక్ ఇంటర్నెట్ కోసం ఆధార్ వెరిఫికేషన్: సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఇలాటిక్టాక్ యాప్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో లేదు. "మేము భారతదేశంలో టిక్టాక్కు మళ్ళీ స్టార్ట్ చేయలేదు. ఇప్పటికి కూడా భారత ప్రభుత్వ ఆదేశాన్ని పాటిస్తూనే ఉన్నాము" అని టిక్టాక్ ప్రతినిధి ఒకరు ఒక ప్రకటనలో తెలిపారు.భారత.. చైనా దళాల మధ్య గాల్వాన్ లోయ ఘర్షణ తర్వాత జాతీయ భద్రతా సమస్యలను పేర్కొంటూ భారతదేశం జూన్ 2020లో టిక్టాక్తో పాటు 58 ఇతర చైనీస్ యాప్లను నిషేధించింది. అయితే ఇప్పుడు ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడే సంకేతాలను కనిపిస్తున్నాయి. ఏడేళ్ల తరువాత ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే.. చైనా సోషల్ మీడియా యాప్ మళ్ళీ అందుబాటులోకి వస్తుందేమో అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. -
ఇంట్లో ఇవి ఉంటే.. టెన్షన్ లేకుండా వర్క్ ఫ్రమ్ హోమ్
వర్క్ ఫ్రమ్ హోమ్లో వచ్చే చిన్న చిన్న టెన్షన్లను కట్ చేసి, మీ ఫోకస్, కంఫర్ట్, పీస్ ఆఫ్ మైండ్ను కాపాడే గాడ్జెట్లే ఇవీ!జీరో డిస్ట్రాక్షన్!పక్కింటి వర్కర్ బోర్వెల్ డ్రిల్ చేస్తున్నా, ఇంట్లో పిల్లలు కార్టూన్ సాంగ్స్తో ఫుల్ జోష్లో ఉన్నా మీ పనిమీద ఫోకస్ తగ్గాల్సిన అవసరం లేదు. ఈ ‘నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ఫోన్స్’ మీ చుట్టూ ఉన్న మొత్తం హంగామాను మ్యూట్ చేసి, మీకు సైలెన్స్ అనే లగ్జరీని అందిస్తాయి. కంఫర్ట్ ఫిట్, లాంగ్ బ్యాటరీ బ్యాకప్ ఉండటంతో గంటల తరబడి వేసుకున్నా ఇబ్బంది లేదు. వైర్డ్ – వైర్లెస్ మోడ్ రెండింటినీ సపోర్ట్ చేస్తాయి. కాబట్టి ల్యాప్టాప్, ఫోన్, ట్యాబ్ ఇలా దేనికైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఆఫీస్ కాల్స్ అయినా, డీప్ వర్క్ సెషన్స్ అయినా లేదా మ్యూజిక్లో మునిగిపోవడానికైనా ఇది బెస్ట్ సౌండ్ షీల్డ్. ధర రూ.3,000 నుంచి రూ.5,000 మధ్య లభిస్తుంది.వైర్లు క్రమంగా, మనసు ప్రశాంతంగా!వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే చాలామందికి ఆనందమే కాని, టేబుల్ కింద గజిబిజిగా ఉన్న కేబుల్స్ మాత్రం టెన్షన్ పెంచుతాయి. పొరపాటున ఒక్కటి లాగితే, మిగతావన్నీ కట్టుకట్టుకుని ‘మమ్మల్ని విడదీయొద్దు’అన్నట్టే దాడి చేస్తాయి. ఈ గందరగోళానికి సింపుల్ పరిష్కారమే ‘కేబుల్ మేనేజ్మెంట్ కిట్’. బలమైన పీవీసీ మెటీరియల్తో తయారైన ఈ కిట్లో పెద్దవి, చిన్నవి అన్న తేడా లేకుండా ఒకేసారి ఎనిమిది కేబుల్స్ వరకు సర్దుకోవచ్చు. కిట్లోనే చుట్టే టైలు, వైర్ హోల్డర్లు ఉన్నందున అదనంగా ఏమీ కొనాల్సిన అవసరం లేదు. గోడకు స్క్రూ పెట్టి లేదా అతికించుకుని, కొన్ని నిమిషాల్లోనే సెట్ చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్, ఫైర్ప్రూఫ్ కావడంతో దీర్ఘకాలం టెన్షన్ లేకుండా వాడుకోవచ్చు. మార్కెట్లో ఇది సుమారు రూ.1,000 నుంచి రూ.1,500 మధ్య లభిస్తుంది.క్లీనింగ్ క్రష్! కాఫీ సిప్, హాట్ స్నాక్స్ ఎంజాయ్ చేస్తూ టైప్ చేయడం సంతోషమే! కాని ఒక్కసారి అవి కీబోర్డ్ లోపలికి జారిపడితే, వర్క్ మూడ్ మొత్తం ఆఫ్ అవుతుంది. అప్పుడు గుడ్డతో తుడుస్తూ టైమ్ వేస్ట్ చేయకుండా, వెంటనే ఈ ‘మినీ వ్యాక్యూమ్ క్లీనర్’ను రంగంలోకి దింపండి. ఇది మీ డెస్క్టాప్ను క్షణాల్లో తళతళలాడే స్పాట్లైట్ లుక్తో మెరిసేలా చేస్తుంది. క్యూట్గా ఉండే ఈ పరికరం అరచేతిలో పట్టేంత చిన్న సైజులోనే ఉంటుంది. వైర్లెస్ కాబట్టి ఎక్కడైనా సులభంగా క్లీనింగ్ చేసుకోవచ్చు. కీబోర్డ్, టేబుల్, చిన్న మూలలు ఎక్కడ దుమ్ము, ధూళి ఉన్నా ఒక్క బటన్ నొక్కితే చాలు, చిటికెలో మాయం! లోపల ఉన్న కలెక్షన్ కంపార్ట్మెంట్ తీయడం, ఖాళీ చేయడం కూడా ఈజీ. ఒకసారి చార్జ్ చేస్తే గంటపాటు పనిచేస్తుంది. ధర రూ.800 నుంచి రూ.1,200 మధ్య ఉంటుంది. -
BSNL యూజర్లకు గుడ్ న్యూస్
ప్రభుత్వం టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఆన్లైన్ సేవల్లో ప్రైవేటు కంపెనీలతో పోటీ పడుతోంది. ప్రిపెయిడ్, పోస్ట్ పెయిడ్, డేటా ప్లాన్లతో ప్రైవేటు సంస్థలకు దీటుగా దూసుకెళుతున్న బీఎస్ఎన్ఎల్ (BSNL) మరో ముందడుగు వేయబోతోంది. వినియోగదారుల కోసం త్వరలో కోసం కొత్త సర్వీసును అందుబాటులోకి తెచ్చేందుకు సన్నద్ధమవుతోంది.స్మార్ట్ఫోన్ వినియోగదారులు ఆర్థిక లావేదేవీలు, బిల్లుల చెల్లింపుల కోసం ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం లాంటి ప్రైవేటు డిజిటల్ యాప్లను ఎక్కువగా వాడుతున్నారు. బీఎస్ఎన్ఎల్ కూడా త్వరలోనే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సేవలను ప్రారంభించనుంది. బీఎస్ఎన్ఎల్ పే పేరుతో దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ (భీమ్) యూపీఐ ఆధారంగా బీఎస్ఎన్ఎల్ పే (BSNL Pay) సేవలను వినియోగించుకునేలా దీన్ని రూపొందిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.దీపావళి నాటికి ప్రారంభం!బీఎస్ఎన్ఎల్ పే సేవలు వినియోగదారులకు దీపావళి (Diwali) నాటికి అందుబాటులోకి వస్తాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి. బీఎస్ఎన్ఎల్ పే అనేది ప్రత్యేకమైన యాప్ కాదు. బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్కేర్ యాప్లో భాగంగానే ఇది ఉంటుంది. భీమ్ యూపీఐ ద్వారా దీని సేవలను యూజర్లు వినియోగించుకోవచ్చు.ఎలాంటి సేవలు అందిస్తుంది?ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం (Paytm) మాదిరిగానే బీఎస్ఎన్ఎల్ పే ద్వారా అన్ని రకాల ఆన్లైన్ చెల్లింపులు చేయగలుగుతారు. సెల్ఫ్ కేర్ యాప్ వినియోగదారులు సులువుగా ఈ సేవలు ఉపయోగించుకోవచ్చు. యూజర్లకు నాణ్యమైన డిజిటల్ సేవలు అందించడంతో పాటు, దేశంలో వేగంగా విస్తరిస్తున్న యూపీఐ చెల్లింపుల మార్కెట్లో తమ దైన ముద్ర వేయాలని బీఎస్ఎన్ఎల్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. బీఎస్ఎన్ఎల్ పే సేవలు అందుబాటులోకి వస్తే ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం లాంటి ప్రైవేటు డిజిటల్ యాప్లకు గట్టి పోటీ ఎదురవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. చదవండి: ఉచిత డిజిటల్ యూపీఐ యాప్లు ఎలా సంపాదిస్తాయంటే..? -
అదిగో అలా వచ్చింది రూ.3.36 కోట్ల ఉద్యోగం..
మనకు ఏ అంశంపైన ఆసక్తి ఉందో.. ఏ పనినైతే మనం ఇష్టంగా చేయగలుగుతామో దాన్నే కెరియర్గా ఎంచుకుంటే ప్రతిఒక్కరూ తప్పకుండా విజయవంతం అవుతారు. దీనికి ఉదాహరణే ఈ 23 వేళ్ల ఇండియన్-అమెరికన్ కుర్రాడు మనోజ్ తుము. ప్రస్తుతం ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటాలో 4 లక్షల డాలర్ల (రూ.3.36 కోట్లు) జీతంతో ఉద్యోగం చేస్తున్న తాను.. ఈ జాబ్ను గతంలో అమెజాన్లో పనిచేస్తున్నప్పుడు ఎలా పొందిందీ వివరించాడు.. తనలాగే ముందుకెళ్లాలనుకుంటున్నవారికి సూచనలూ ఇచ్చాడు.బిజినెస్ ఇన్సైడర్ కోసం రాసిన వ్యాసంలో మనోజ్ తుము పోటీ నియామక ప్రక్రియను ఎలా ఎదుర్కొన్నాడో, తన కెరీర్ మార్గాన్ని తీర్చిదిద్దిన పాఠాల గురించి వివరించాడు. హైస్కూల్ క్రెడిట్స్ కారణంగా ఏడాదిలోనే అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మనోజ్ ఫుల్ టైమ్ పనిచేస్తూనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మాస్టర్స్ చేశారు. మరింత ఉత్తేజకరమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టుల కోసం మెటాకు మారడానికి ముందు మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్గా 9 నెలల పాటు అమెజాన్లో పనిచేశారు.ఏఐలో ప్రవేశించాలంటే..మనోజ్ ప్రకారం.. మెషిన్ లెర్నింగ్ టైటిల్స్ మారుతూ ఉంటాయి. రిసెర్చ్ సైంటిస్ట్, అప్లైడ్ సైంటిస్ట్, సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తదితర పాత్రలు పోషించవచ్చు. క్లాసికల్ ఎంఎల్ నుంచి డీప్ లెర్నింగ్ కు మారడం ఈ రంగాన్ని మరింత డైనమిక్ గా, కాంపిటీటివ్ గా మార్చింది. కళాశాల ఇంటర్న్ షిప్ లు తక్కువ వేతనంతో కూడినవి అయినీ అనుభవం పొందడానికి, నిలదొక్కుకోవడానికి చాలా కీలకం.రెజ్యూమె & ఇంటర్వ్యూ చిట్కాలురెజ్యూమెలో మీరు చేసిన ప్రాజెక్టుల గురించి పేర్కొనడం ఉపయోగకరమే కానీ మీకు రియల్టైమ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీ రెజ్యూమ్ పై ప్రాజెక్ట్లు ఆధిపత్యం చెలాయించకూడదని కొత్తగా జాబ్ మార్కెట్లోకి వస్తున్నవారికి సూచిస్తున్నారు మనోజ్. బిహేవియరల్ ఇంటర్వ్యూలు కీలకమని, కానీ చాలా మంది అభ్యర్థులు దీన్న విస్మరిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇక వేతనాల విషయానికి వస్తే సంబంధిత అనుభవాన్ని పెంచుకోవడానికి మనోజ్ ప్రారంభంలో సంప్రదాయ సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ కంటే తక్కువ వేతనంతో కూడిన ఎంఎల్ ఉద్యోగాన్నే ఎంచుకున్నాడు. ఇది తరువాత అధిక వేతన అవకాశాలకు దారితీసింది. -
బీఎస్ఎన్ఎల్ బైటీవీ ప్రీమియం ప్యాక్.. కేవలం రూ.151లకే..
ప్రభుత్వ టెలికమ్ దిగ్గజం బీఎస్ఎన్ఎల్ తమ వినియోగదారుల కోసం బైటీవీ ప్రీమియం ప్యాక్ను ప్రారంభించింది. డిజిటల్ వినోదాన్ని ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 25 పైగా ఓటీటీలు, 450 పైగా లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించే సౌలభ్యాన్ని రూ .151 లకే అందిస్తోంది.బైటీవీ ప్రీమియం ప్యాక్లో ప్రముఖ ఓటీటీ సేవలు ఉన్నాయి. జీ5, సోనీలివ్, లయన్స్గేట్ ప్లే, ఆహా, షెమారూమీ, సన్ ఎన్ఎక్స్టీ, డిస్కవరీ, ఎపిక్ ఆన్, ఈటీవీ విన్, చౌపాల్ వంటి ఓటీటీలు ఇందులో ఉన్నాయి. సినిమాలు, వెబ్ సిరీస్లు, ప్రాంతీయ కంటెంట్, లైవ్ టెలివిజన్ను వివిధ భాషలలో స్ట్రీమ్ చేయవచ్చు. ఇవన్నీ బీఎస్ఎన్ఎల్ మొబైల్ వినియోగదారులకు ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న బైటీవీ యాప్ ద్వారా వీక్షించవచ్చు.బైటీవీ ప్రీమియం ప్యాక్కు సంబంధించి బీఎస్ఎన్ఎల్ అధికారికంగా ఎలాంటి వ్యాలిడిటీని ధృవీకరించనప్పటికీ, రూ .151 ప్యాక్ వ్యాలిడిటీ 30 రోజులు ఉంటుందని చాలా నివేదికలు పేర్కొంటున్నాయి. కాగా ఇందులో అనేక పాపులర్ ఓటీటీ సర్వీసలు ఉన్నప్పటికీ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్లను మాత్రం ఈ ఆఫర్లో చేర్చకపోవడం గమనార్హం.2025 ఫిబ్రవరిలో ఉచిత పైలట్గా ప్రారంభమైన బైటీవీ ఇప్పుడు పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్గా రూపాంతరం చెంది ఓటీటీ అగ్రిగేషన్ స్పేస్లో బీఎస్ఎన్ఎల్ను గట్టి పోటీదారుగా నిలబెట్టింది.Stream 450+ Live TV Channels & 25+ OTTs with BSNL BiTV Premium Pack - All-In-One Entertainment at ₹151!Get it now: https://t.co/0lA2HY4IOJ#BSNL #BSNLIndia #DigitalIndia #BiTV #Entertainment pic.twitter.com/VQ6e946dWx— BSNL India (@BSNLCorporate) August 28, 2025 -
చాలా ఫోన్లలో వాడుతున్న ఆ బ్రౌజర్.. డేంజర్!
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఆండ్రాయిడ్ ఫోన్లను వినియోగిస్తున్నారు. రు. అయితే ఈ ఫోన్లలో ఏ బ్రౌజర్ వాడాలి.. ఏది సురక్షితం అన్న అవగాహన చాలా మందికి ఉండటం లేదు. ఫోన్లలో డిఫాల్ట్ ఏ బ్రౌజర్ ఇస్తే అదే వాడుతున్నారు. చాలా ఫోన్లలో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ డీఫాల్ట్గా వస్తోంది. దీంతో ప్రైవసీకి ముప్పు ఉందని నిపుణులు చెబుతున్నారు.ఆన్లైన్ భద్రతలో ప్రత్యేకత కలిగిన సర్ఫ్ షార్క్ అనే సంస్థ ఇటీవల కొన్ని పరిశోధనలు చేసింది. ఇందులో క్రోమ్ దాని పోటీదారుల కంటే ఎంత ఎక్కువ సమాచారాన్ని సేకరిస్తున్నట్లు గుర్తించింది. క్రోమ్కు ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సెక్యూరిటీ ఫీచర్లను గూగుల్ జోడించినప్పటికీ ఇప్పటికీ చాలా డేటాను బ్యాక్ గ్రౌండ్లో ట్రాక్ చేయడం మాత్రం మానడం లేదని బీజీఆర్ నివేదిక తెలిపింది.అన్నీ ట్రాక్ చేస్తోంది..ఆటోఫిల్, వ్యక్తిగతీకరించిన వార్తలు వంటి క్రోమ్ ఫీచర్లు పైకి జీవితాన్ని సులభతరం చేసేవిగా ఉన్నా కానీ అవే ఫీచర్లను గూగుల్ అడ్వర్టైజింగ్, అనలిటిక్స్ నెట్వర్క్లు కూడా ఉపయోగిస్తున్నాయి. దీని అర్థం ఏమిటంటే మీరు ఆన్లైన్లో ఎలా ప్రవర్తిస్తారో వివరణాత్మక చిత్రాన్ని రూపొందించడానికి మీరు చేసే క్లిక్లు, సెర్చ్లు, వెబ్ పేజీలో మీరు గడిపే సమయం కూడా ఎల్లప్పుడూ ట్రాక్ అవుతుందన్న మాట.ఇదేదో ఊహాజనితంగా చెబుతున్న విషయం కాదు. ఇన్కాగ్నిటో మోడ్ను ఉపగించినవారి సమాచారాన్ని కూడా ట్రాక్ చేసినందుకు 2020లో గూగుల్పై కేసు కూడా నమోదైంది. ఆ తర్వాత ప్రైవేట్ బ్రౌజింగ్ సెషన్ల సమయంలో సేకరించిన కోట్లాది రికార్డులను తొలగించేందుకు గూగుల్ అంగీకరించింది.సర్ఫ్ షార్క్ పరిశోధన ప్రకారం, బ్రౌజింగ్ హిస్టరీ, సేవ్ చేసిన చెల్లింపు సమాచారం, కాంటాక్ట్ జాబితాలు వంటి సమాచారాన్ని క్రోమ్ సేకరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ఆండ్రాయిడ్ వినియోగదారులు ఉన్నారు, కాబట్టి సేకరించే డేటా మొత్తం భారీగా ఉంటుంది. ఇదంతా యూజర్ ఎక్స్పీరియన్స్ను మెరుగుపరిచేందుకేనని పైకి చెబుతున్నా తెర వెనుక చాలా మందికి తెలియకుండానే వారి డేటా చోరీకి గురవుతోంది.ప్రత్యామ్నాయాలు లేవా?ఆండ్రాయిడ్ ఫోన్లలో ముప్పుతో కూడిన గూగుల్ క్రోమ్ బ్రౌజర్కు ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. బ్రౌజర్లను మార్చడం సులభం. బ్రేవ్, డక్ డక్గో, ఫైర్ఫాక్స్, టోర్ ఇవన్నీ ట్రాకర్లను ఆపివేసే, బ్యాక్గ్రౌండ్లో సేకరించగల డేటా మొత్తాన్ని పరిమితం చేసే గోప్యతకు ప్రాధాన్యం ఇచ్చే బ్రౌజర్లు. సెట్టింగ్ లలో మార్పులు చేసుకుని, ఈ బ్రౌజింగ్ యాప్లకు మారడం ద్వారా మీ ఫోన్ నుండి వ్యక్తిగత సమాచారం బయటకు వెళ్లకుండా పరిమితం చేయవచ్చు. క్రోమ్ కూడా ఇటీవల ట్రాకింగ్ తగ్గించడంలో సహాయపడటానికి ఐపీ అడ్రస్ మాస్కింగ్ వంటి సాధనాలను జోడించింది. కానీ ఇది ఇప్పటికీ డేటా-హెవీ బ్రౌజర్ అనే వాస్తవాన్ని మార్చదని నిపుణులు అంటున్నారు. -
వైద్య రంగంలో కృత్రిమ మేధ విస్తరణ
టెక్నాలజీ అన్ని రంగాల్లో విస్తరిస్తోంది. భారత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో సాంకేతికత పాగా వేస్తోంది. అందుకు చాలానే కారణాలున్నాయి. ఇండియాలో కొన్ని సర్వేల ప్రకారం 1,457 మంది రోగులకు ఒక డాక్టర్ ఉన్నారు. కానీ ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సిఫార్సు చేసిన డాక్టర్-రోగుల నిష్పత్తి 1:1,000 కంటే చాలా తక్కువ. గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో లక్షల మందికి ప్రాథమిక వైద్య సదుపాయాలు కరవవుతున్నాయి. కాబట్టి ఈ రంగంలో సేవలు విస్తరించాలంటే సాంకేతికత కీలకంగా వ్యవహరిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నాలజీని అందిపుచ్చుకోవడం అత్యవసరం. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల్లో కృత్రిమ మేధ (AI) వేగంగా విస్తరిస్తోంది. దీని సాయంతో వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.ఉదాహరణకు.. ఒడిశాలోని కొన్ని మారుమూల గ్రామాల్లో ఏఐ సాయంతో వైద్యం నిఫారసు చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ స్మార్ట్ఫోన్ అప్లికేషన్లతో కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు దగ్గు రికార్డింగ్లను విశ్లేషించడం ద్వారా క్షయ(టీబీ) కేసులను గుర్తించారు. అదే నేపథ్యంలో కొన్ని వేల మామోగ్రామ్లపై శిక్షణ పొందిన మరొక ఏఐ యాప్ రొమ్ము క్యాన్సర్ కేసులను గుర్తించడంలో సహాయపడింది. ఇది రిమోట్గా ఆంకాలజిస్టులతో మమేకమై రోగులకు సలహాలు ఇస్తోంది.వ్యాధిని గుర్తించడంలో కీలకండయాగ్నోస్టిక్స్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరించింది. ఉదాహరణకు.. గూగుల్ డీప్ మైండ్ రొమ్ము క్యాన్సర్ను గుర్తించడంలో 99% కచ్చితత్వాన్ని చేరుకుందని కొన్ని రిపోర్ట్ల ద్వారా తెలుస్తుంది. కంటి వ్యాధులు, చర్మ క్యాన్సర్, అల్జీమర్స్ వంటి నాడీ పరిస్థితులను గుర్తించడానికి కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నారు. చెస్ట్ ఎక్స్-రే రిపోర్ట్ల నుంచి టీబీని నిర్ధారించడంలో ఏఐ సాధనాలు మెరుగ్గా పని చేస్తున్నాయి. వ్యాధిని వేగంగా గుర్తించడంతో ముందస్తు చికిత్స అందుతుంది. ఇది ట్రీట్మెంట్ ఫలితాలను మెరుగుపరచడమే కాకుండా, ఆరోగ్య సంరక్షణ నిపుణులపై ఒత్తిడిని తగ్గిస్తుంది.రియల్ టైమ్ మానిటరింగ్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాల ద్వారా హైపర్-పర్సనలైజ్డ్ మెడిసిన్కు అవకాశం ఉంటుంది. ఇందులో ఉపయోగించే అల్గారిథమ్లు నిర్దిష్ట మందులకు ప్రత్యేకంగా రోగులు తమ వ్యక్తిగత జీవన విధానాన్ని అనుసరించి ఎలా స్పందిస్తారో అంచనా వేస్తాయి. ఇది ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుంది. డయాబెటిక్ రోగులు పెరుగుతున్న నేపథ్యంలో కృత్రిమ మేధ ఆధారిత వేరబుల్ పరికరాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయులను రియల్ టైమ్లో పర్యవేక్షిస్తున్నాయి. సంభావ్య సంక్షోభాల గురించి వైద్యులు లేదా సంరక్షకులను అప్రమత్తం చేస్తున్నాయి.ఇదీ చదవండి: నెట్వర్క్ విస్తరణలో అమెజాన్ -
టెకీలను ఆరోజు ఆఫీసులకు రప్పించాలంటున్న ఐటీ వెటరన్..
ఐటీ కంపెనీల్లో పని విధానం, వాతావరణం గురించి నిత్యం చర్చ జరుగుతూ ఉంటుంది. టెకీలకు సోమవారాల్లో ఆఫ్లు గానీ, వర్క్ ఫ్రమ్ హోం ఆప్షన్లు గానీ ఇవ్వకుండా ఆఫీసులకు రప్పించాలని ఓ సీనియర్ ఉన్నతోద్యోగి చేసిన సూచన తాజాగా మరోసారి సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఛీఫ్ క్వాలిటీ ఆఫీసర్గా పనిచేస్తున్న నాగరాజ్ ఎం.సి.. ఐటీ ఉద్యోగులు సోమవారాల్లో తప్పనిసరిగా ఆఫీసులకు వచ్చి పనిచేయాలని అభిప్రాయపడుతూ ప్రొఫెషనల్ షేరింగ్ ప్లాట్ఫామ్ లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. పరిశ్రమలో 35 ఏళ్ల అనుభవం ఉన్న ఆయన సోమవారాల్లో ఆఫీస్ హాజరు అన్నది ఎంత ఆవశ్యకరమో వివరించారు.సోమవారాల్లో ఆఫీస్ హాజరు ఎందుకు ముఖ్యమంటే..ఉద్యోగులు సోమవారం రోజున సెలవులు తీసుకోవడం లేదా వర్క్ ఫ్రం హోమ్ కోరడం వల్ల పని వాతావరణానికి కలిగే ఇబ్బందులను నాగరాజ్ వివరించారు. మొదటిది ఉద్యోగుల్లో ఉత్సాహం తగ్గిపోతుంది. మూడు రోజుల వీకెండ్ తర్వాత (సోమవారం తీసుకునే సెలవుతో కలుపుకొని) ఉద్యోగులు ఉత్సాహం లేకుండా వస్తారు. రెండోది ఉద్యోగులు ప్రాధాన్యతలపై దృష్టి కోల్పోతారు. సోమవారం కార్యాలయంలో ఉండటం వల్ల వారం మొత్తం పనికి దిశ చూపుతుంది. మూడోది ఉద్యోగుల మధ్య సహకారంపై ప్రభావం పడుతుంది. సోమవారం గైర్హాజరు వల్ల టీమ్ డైనమిక్స్ బలహీనమవుతుంది. కాబట్టి అన్ని కంపెనీల్లో ఉన్నతోద్యోగులు తమ సహచరులు సోమవారాల్లో తప్పనిసరిగా ఆఫీస్లకు వచ్చేలా ప్రోత్సహించాలని ఆయన సూచిస్తున్నారు.ఆన్లైన్ స్పందనలునాగరాజ్ ప్రతిపాదించిన సోమవారం ఆఫీస్ హాజరు సూచనపై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. చాలా మంది ఈ అభిప్రాయాన్ని పాతదిగా, కఠినంగా అభివర్ణించారు. మంచి పనితీరు అంటే అవుట్పుట్, హాజరు కాదంటూ బదులిచ్చారు. ఏఐ, డిజిటల్ టూల్స్ వలన వర్క్ మోడల్స్ మారుతున్నాయి. సోమవారం-శుక్రవారం హాజరు మీద దృష్టి పెట్టడం మైక్రో మేనేజ్మెంట్ లా అనిపించిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.సోమవారాల్లో సెలవులు ఎందుకు పెడతారు?రెండు రోజుల వారాంతపు సెలవుల తర్వాత సోమవారం నుంచి మళ్లీ వారం ప్రారంభమవుతుంది. చాలా మంది సెలవు మూడ్నుంచి బయటపడి వెంటనే పనిలో నిమగ్నం కాలేరు. అందుకే సోమవారం కూడా సెలవు కావాలని కోరుకుంటారు. వీకెండ్ తర్వాత పని ప్రారంభించేటప్పుడు వచ్చే అసౌకర్య భావనలను సోమవారం బ్లూస్ అంటారు. అలసట, ఆందోళన, నిద్రలేమి, తలనొప్పులు, ఒత్తిడి వీటి లక్షణాలు. ఉద్యోగ అసంతృప్తి, పని ఒత్తిడి, వీకెండ్ అలవాట్లు వీటికి ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: HCLTech: మా ఐటీ ఉద్యోగులకు మాటిస్తున్నా.. -
స్మార్ట్ఫోన్ కంపెనీకి యాపిల్, శామ్సంగ్ నోటీసులు
భారతదేశ ప్రీమియం స్మార్ట్ఫోన్ సెగ్మెంట్లో పోటీ పెరుగుతోంది. ఈ క్రమంలో కొన్ని కంపెనీలు తమ పోటీ సంస్థల ఉత్పత్తులను నేరుగా ప్రకటనల్లో పోలుస్తూ వివిధ మాధ్యమాల ద్వారా యాడ్లు ఇస్తూ వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. ఇటీవల యాపిల్, శామ్సంగ్ కంపెనీలు తమ ఉత్పత్తులను నేరుగా పోల్చే ప్రకటనలను ఉటంకిస్తూ షావోమీకి వేర్వేరుగా నోటీసులు జారీ చేశాయని కొన్ని సంస్థలు తెలిపాయి. ప్రత్యర్థి మార్కెటింగ్ వ్యూహాలను కట్టడి చేస్తూ, తమ బ్రాండ్ విలువను కాపాడుకోవడానికి మార్కెట్ లీడర్లు చేస్తున్న రక్షణాత్మక చర్యలను ఈ లీగల్ నోటీసులు హైలైట్ చేస్తున్నాయి.వివాదానికి కారణంఐఫోన్ 16 ప్రోమ్యాక్స్, కొన్ని శామ్సంగ్ మోడళ్లను లక్ష్యంగా చేసుకుని షావోమీ ఈ ప్రచారం చేసిందని సమాచారం. ఇటీవల షావోమీ 15 అల్ట్రా మోడల్ ప్రకటనలను ఉంటకిస్తూ ధర, స్పెసిఫికేషన్లపై యాపిల్ ఐఫోన్ 16 ప్రోమ్యాక్స్తో ప్రత్యక్ష పోలికలున్నట్లు తెలిపింది. సోషల్ మీడియాలో ఎంపిక చేసిన శామ్సంగ్ మోడళ్లను లక్ష్యంగా చేసుకుని షావోమీ ఇదే విధానాన్ని అనుసరించిందని కొన్ని సంస్థలు తెలిపాయి.ఇదీ చదవండి: ఆర్బీఐ బ్యాంకులకు మార్గదర్శకాలు జారీయాపిల్, శామ్సంగ్ జారీ చేసిన లీగల్ నోటీసులు వాటి బ్రాండ్ ఇమేజ్కు మరింత నష్టం జరగకుండా ఉండటానికి తోడ్పడుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్రాండ్ కన్సల్టెంట్ హరీష్ బిజూర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘కొన్ని కంపెనీలు అనుసరిస్తున్న ఇలాంటి విధానాలు బ్రాండ్ వాల్యుయేషన్కు ముప్పుగా వాటిల్లుతున్నాయి. వీటిపై చట్టపరమైన చర్యలు ఎంతో అవసరం’ అని చెప్పారు. ఈ వ్యవహారంపై షావోమీ అధికారంగా స్పందించాల్సి ఉంది. -
మా ఐటీ ఉద్యోగులకు మాటిస్తున్నా..
ఐటీ పరిశ్రమలో ఏఐ పేరు చెబితేనే ఉద్యోగులు బెంబేలెత్తిపోతున్నారు. కారణం ఎడాపెడా లేఆఫ్లు. ఒక కంపెనీ ఏఐపై దృష్టి పెట్టిందంటేనే ఇక ఆ సంస్థలో మానవ ఉద్యోగాలకు మూడినట్టేనన్న చర్చ సాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో హెచ్సీఎల్ ఉద్యోగులకు మంచి మాట చెప్పారు ఆ కంపెనీ చైర్ పర్సన్ రోష్ని నాడార్.ఇటీవల జరిగిన హెచ్సీఎల్టెక్ వార్షిక సర్వసభ్య సమావేశంలో చైర్పర్సన్ రోషిణి నాడార్ మల్హోత్రా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ముడిపడి ఉన్న ఉద్యోగాల కోతలపై పెరుగుతున్న ఆందోళనలను ప్రస్తావించారు. తాము మానవ ప్రతిభను మరింత పెంచడానికే తప్ప దాన్ని భర్తీ చేయడం కోసం ఏఐని వినియోగించడం లేదని స్పష్టం చేశారు. ఆ రకంగా ఉద్యోగాల తొలగింపు కాకుండా వాటి సృష్టిపై కంపెనీ దృష్టి సారించిందని ఆమె వాటాదారులకు భరోసా ఇచ్చారు.బాధ్యతాయుతమైన వ్యూహానికి కట్టుబడి ఉన్నాంమానవ సామర్థ్యాలను పెంపొందించడానికి ఏఐని కో పైలట్ గా ప్రవేశపెడుతున్నామని, వాటి స్థానంలో కాదని ఆమె అన్నారు. ‘కొన్ని ఉద్యోగాల్లో మార్పులు ఉండొచ్చు కానీ, అధిక విలువ పనులను చేపట్టడానికి ఉద్యోగుల నైపుణ్యాలను పెంచడంపైనే మా దృష్టి ఉంది. ఉద్యోగాల కోత కంటే వాటి పెరుగుదల, ఉద్యోగ పరివర్తనకు ప్రాధాన్యమిచ్చే బాధ్యతాయుతమైన ఏఐ స్వీకరణ వ్యూహానికి మేం కట్టుబడి ఉన్నాం’ అని రోష్ని నాడార్ సపష్టం చేశారు.ఐటీ రంగంలో నియామకాలు మందకొడిగా సాగుతున్న తరుణంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశంలోని అగ్రశ్రేణి ఐటీ కంపెనీలలో సిబ్బంది నికర చేర్పులు తక్కువగా ఉన్నాయి. ఇది నియామకంలో మరింత జాగ్రత్తగా విధానాన్ని సూచిస్తుంది. కొన్ని కంపెనీలు స్వల్ప లాభాలను నమోదు చేయగా, మొత్తం ట్రెండ్ ప్రకారం నియామకాలు చల్లబడ్డాయి.జూన్ తో ముగిసిన త్రైమాసికంలో హెచ్సీఎల్ టెక్ 1,984 మంది ఫ్రెషర్లను నియమించుకుంది. గత త్రైమాసికంలో 2,23,420గా ఉన్న మొత్తం ఉద్యోగుల సంఖ్య ఆ త్రైమాసికంలో 2,23,151కి తగ్గింది. మార్చిలో 13 శాతంగా ఉన్న అట్రిషన్ రేటు జూనలో 12.8 శాతానికి తగ్గింది.ఇదీ చదవండి: విప్రో చేతికి హర్మన్ డీటీఎస్.. రూ. 3,270 కోట్ల డీల్ -
ఏఐతో బ్యాంకింగ్లో సమూల మార్పులు..!
ముంబై: కృత్రిమ మేధ (ఏఐ) అమలుతో భారత బ్యాంకింగ్ రంగంలో సగం ఉద్యోగాల స్వరూపం మారిపోతుందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) అంచనా వేసింది. ఎన్నో రంగాల్లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం చూపిస్తుందన్న ఆందోళనల నేపథ్యంలో బీసీజీ నివేదికకు ప్రాధాన్యం ఏర్పడింది. గత దశాబ్ద కాలంలో బ్యాంకులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై (ఐటీ) ఐదు రెట్లు అధికంగా వ్యయాలు చేసినప్పటికీ పెరిగిన ఉత్పాదక పరిమితమేనని ఈ నివేదిక తెలిపింది. నికరంగా పెరిగిన ఉత్పాదకత ఒక శాతమేనంటూ, అంతర్జాతీయ బ్యాంకులతో పోల్చితే భారత బ్యాంకులు వెనుకబడినట్టు పేర్కొంది. కనుక బ్యాంక్లు ఏఐ వినియోగం ద్వారా ఉత్పాదతక పెంపు పరంగా ఉన్న సవాళ్లను అధిగమించొచ్చని తెలిపింది. ఇప్పటికే చాలా బ్యాంక్లు ఈ తరహా టూల్స్ను వినియోగిస్తున్నట్టు పేర్కొంది. బ్యాంకులు ఈ తరహా కొత్త సాంకేతికతలను స్వీకరించడం మొదలు పెడితే, గత కొన్నేళ్ల నుంచి ఎదుర్కొంటున్న సంక్లిష్ట వ్యయ సవాళ్లను అధిగమించగలవని బీసీజీ సీనియర్ పార్ట్నర్ రుచిన్ గోయల్ పేర్కొన్నారు.‘ఏఐ వినియోగం పెరిగే కొద్దీ సంఘటిత రంగంలో ఉద్యోగాలకు సవాళ్లు ఎదురవుతాయి. ఐటీ తదితర రంగాల్లో ఇప్పటికే ఉద్యోగుల తొలగింపులు వింటున్నాం. బ్యాంకుల్లోనూ నికర ఉద్యోగుల సంఖ్య పెరుగుదల తగ్గుతోంది. టెక్నాలజీ కారణంగా కొన్ని ఉద్యోగ ఖాళీలను బ్యాంకులు భర్తీ చేయకపోవచ్చు’ అని గోయల్ చెప్పారు. రానున్న రోజుల్లో టెక్నాలజీపై బ్యాంకులు చేసే వ్యయాలు పెరుగుతాయన్నారు. రుణ వృద్ధి మెరుగుపడాలి.. బ్యాంకుల్లో రుణ వృద్ధి నిదానించడాన్ని బీసీజీ నివేదిక ఎత్తి చూపించింది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు వీలుగా బ్యాంకుల రుణ వృద్ది వేగవంతం కావాలని పేర్కొంది. సాధారణ జీడీపీ వృద్ది కంటే 3–3.5 శాతం మేర బ్యాంకుల రుణ ఆస్తులు పెరగాల్సి ఉంటుందని తెలిపింది. 2024–25లో సాధారణ జీడీపీ 9.8 శాతం కాగా, బ్యాంకుల రుణ వృద్ధి 12 శాతానికే పరిమితమైనట్టు గుర్తు చేసింది. -
మానవ మేధస్సు ముందు ఏఐ ఎంత?
ఏఐ సాధనాలు మరింత అధునాతనంగా మారినప్పటికీ, కీలక నిర్ణయాలను తీసుకోవాల్సి వస్తే మానవ మేధస్సును ఏదీ భర్తీ చేయలేదని నిపుణులు భావిస్తున్నారు. అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్వర్క్ అయిన లింక్డ్ఇన్ అధ్యయనం ప్రకారం కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో భారతదేశంలో 83% మంది నిపుణులు, హైదరాబాద్లోని 88% మంది నిపుణులు ఏఐపై ఆధారపడడం కంటే మానవ మేధస్సుకు ఓటేస్తున్నారు.లింక్డ్ఇన్ అధ్యయనంలోని అంశాలు..హైదరాబాద్లో 79% మంది ఉద్యోగ విధుల్లో భాగంగా ఏఐని వాడుతున్నట్లు చెబుతున్న సమయంలో కీలక నిర్ణయాల విషయంలో మాత్రం ఏఐ సాయం తీసుకోకపోవడం గమనార్హం.75% మంది తమ కెరియర్లో ఎదిగేందుకు ఏఐలో ప్రావీణ్యం సంపాదించడం అవసరమని భావిస్తున్నారు.ఏఐలో నైపుణ్యం సాధించడం రెండో ఉద్యోగంలా అనిపిస్తుందని హైదరాబాద్లోని నలుగురు నిపుణుల్లో ముగ్గురు అంగీకరిస్తున్నారు.59% మంది ఏఐని పూర్తి సామర్థ్యంతో ఉపయోగించడం లేదని చెబుతున్నారు.75% మంది నిపుణులు ఏఐ తమ రోజువారీ పని జీవితాన్ని మెరుగుపరుచగలదని నమ్ముతున్నారు.78% మంది నిపుణులు ఏఐని నిజమైన నిర్ణయం తీసుకోవడానికి కాకుండా రాయడం, డ్రాఫ్టింగ్కు ఉపయోగకరంగా భావిస్తున్నారు.70% మంది ఉద్యోగ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏఐ కంటే కూడా తమ సొంత నిర్ణయాలనే నమ్ముతున్నారు.భారతదేశంలో 83% మంది కార్యనిర్వాహకులు మంచి వ్యాపార నిర్ణయాలు మానవ మేధస్సుపైనే ఆధారపడి ఉంటాయని నమ్ముతున్నారు.లింక్డ్ఇన్ కెరియర్ నిపుణులు, ఇండియా సీనియర్ మేనేజింగ్ ఎడిటర్ నీరజిత బెనర్జీ మాట్లాడుతూ ‘ఏఐ ఒక అద్భుతమైన సాధనం. ఇది వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడుతోంది. రోజువారీ పనులను క్రమబద్ధీకరించగలదు. అయితే కీలక విషయాల్లో నిర్ణయం తీసుకునేప్పుడు చాలామంది ఏఐపై ఆధారపడడం లేదు. ఏఐని తాము విశ్వసించే సాధనంగానే కానీ, అనుసరించే సాధనంగా భావించడంలేదు. మానవులు మాత్రమే చేసే పని కోసం సమయాన్ని ఆదా చేసేందుకు ఏఐని ఉపయోగించాలి’ అని చెప్పారు.ఇదీ చదవండి: మార్వాడీలు వ్యాపారంలో ఎందుకు విజయం సాధిస్తారు? -
కోర్టుకెక్కిన మస్క్ కంపెనీ: యాపిల్, ఓపెన్ఏఐ దావా..
బిలియనీర్ ఎలాన్ మస్క్కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ 'ఎక్స్ఏఐ' (xAI).. యాపిల్ & ఓపెన్ఏఐపై సోమవారం టెక్సాస్లోని యూఎస్ ఫెడరల్ కోర్టులో దావా వేసింది. ఏఐలో పోటీని అడ్డుకోవడానికి వారు చట్టవిరుద్ధంగా కుట్ర పన్నుతున్నట్లు ఆరోపించింది.యాపిల్, ఓపెన్ఏఐ రెండూ కూడా తమ గుత్తాధిపత్యాన్ని కొనసాగించడానికి.. ఎక్స్, ఎక్స్ఏఐ వంటి ఆవిష్కర్తలు పోటీ పడకుండా నిరోధించడానికి మార్కెట్లను లాక్ చేశాయని దావాలో పేర్కొన్నారు. ఎక్స్ఏఐ ఉత్పత్తులను అణిచివేయడానికి ఈ రెండూ పన్నాగం పన్నినట్లు ఫిర్యాదులో పేర్కొంది.ఓపెన్ఏఐతో.. యాపిల్కు ఒప్పందం లేకపోతే దాని యాప్ స్టోర్లో ఎక్స్, గ్రోక్ యాప్లకు ప్రాముఖ్యత ఎందుకు ఇవ్వడం లేదు. మా సంస్థ యాప్ను ఎందుకు ముందుగా ప్రదర్శించడం లేదని ఎక్స్ఏఐ ప్రశ్నించింది. దీనిపై యాపిల్, ఓపెన్ఏఐ కంపెనీలు స్పందించలేదు.ఇదీ చదవండి: ఇది పరిశ్రమకు కొత్త విజయగాథ: నరేంద్ర మోదీకాగా.. ఈ నెల ప్రారంభంలో, కాలిఫోర్నియాకు చెందిన యాపిల్ సంస్థ కుపెర్టినోపై దావా వేస్తానని మస్క్ పేర్కొన్నారు. యాపిల్ ''యప్ స్టోర్లో OpenAI తప్ప మరే AI కంపెనీ #1 స్థానానికి చేరుకోవడం అసాధ్యం'' అని మస్క్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.Apple is behaving in a manner that makes it impossible for any AI company besides OpenAI to reach #1 in the App Store, which is an unequivocal antitrust violation. xAI will take immediate legal action.— Elon Musk (@elonmusk) August 12, 2025 -
రైల్వే ట్రాక్పై సోలార్ ఎనర్జీ తయారీ!
దేశంలోనే తొలిసారిగా రైల్వే ట్రాక్పై సోలార్ ప్యానెళ్లతో ప్రయోగాలు ప్రారంభించింది భారతీయ రైల్వే. వారణాసిలోని బెనారస్ లోకోమోటివ్ వర్క్స్ (బీఎల్డబ్ల్యూ)లో 70 మీటర్ల పొడవున అదనపు భూమిని వినియోగించకుండా గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేసేలా సోలార్ ప్యానెళ్లను అమర్చారు. దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ రైల్వే మంత్రిత్వ శాఖ దీన్ని ‘హరిత, సుస్థిర రైలు రవాణా’ చర్యగా అభివర్ణించింది.సంప్రదాయానికి భిన్నంగా..సాధారణంగా సోలార్ ఎనర్జీకి భారీగా భూసేకరణ అవసరం అవుతుంది. సోలార్ ప్యానెళ్లను అమర్చేందుకు భూమి ఎంతో అవసరం. భూసేకరణ దేశంలో ఇలాంటి ప్రాజెక్ట్లకు పెద్ద అడ్డంకి. దీన్ని పరిష్కరించేందుకు భారతీయ రైల్వే ప్రణాళికలు సిద్ధం చేసింది. సంప్రదాయానికి భిన్నంగా రైల్వేపట్టాలకు మధ్యలో ఉన్న భూమిని ప్యానెళ్ల ఏర్పాటుకు వినియోగిస్తున్నారు. దేశంలో చాలా కిలోమీటర్లు విస్తరించిన ఈ రైల్వే పట్టాల్లో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రాథమికంగా పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా వారణాసిలోని బెనారస్ లోకోమోటివ్ వర్క్స్ (బీఎల్డబ్ల్యూ)లో 70 మీటర్ల పొడవున అదనపు భూమిని వినియోగించకుండా గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేసేలా సోలార్ ప్యానెల్స్ను అమర్చారు. ఇది విజయవంతం అయితే క్రమంగా ఈ వ్యవస్థను ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నట్లు తెలుస్తుంది.నిర్వహణ సులువుఈ ప్రాజెక్ట్లో నిర్వహణను సులభతరం చేసేలా ఏర్పాట్లు చేశారు. ఏదైనా సమస్య వస్తే వాటిని త్వరగా తొలగించి తిరిగి ఇన్స్టాల్ చేసే విధంగా ప్యానెల్స్ను అమర్చారు. దీని ద్వారా తనిఖీలు, మరమ్మతులు లేదా అత్యవసరాల కోసం రైల్వే కార్మికులు ఎక్కువ ఆలస్యం చేయకుండా వీలవుతుంది. పట్టాలపై రైలు ప్రయాణించినప్పుడు, దుమ్ము పేరుకుపోవడం, వర్షం.. వంటి పరిస్థితులను తట్టుకునేలా ఈ ప్యానెళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.భవిష్యత్తులో రైల్వే స్వావలంబనఇందులో 28 హైస్ట్రెంత్ ఫోటోవోల్టాయిక్ ప్యానెళ్లను ఉపయోగిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఇవి మొత్తంగా 15 కిలోవాట్ ఎనర్జీని ఉత్పత్తి చేయగలవు. భారతీయ రైల్వే వ్యవస్థ 1.2 లక్షల కిలోమీటర్లకు పైగా విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్ద రైలు నెట్వర్క్ల్లో ఒకటిగా నిలుస్తోంది. ఇలాంటి వ్యవస్థ రానున్న రోజుల్లో గ్రీన్ ఎనర్జీకి కీలకంగా మారే అవకాశాలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో ఈ గ్రీన్ ఎనర్జీ ద్వారా రైల్వే విద్యుత్ వాడకంలో స్వావలంబన సాధిస్తుందని నమ్ముతున్నారు.ఇదీ చదవండి: యూఎస్లో రూ.1 కోటి సంపాదిస్తే ఎంత మిగులుతుంది? -
ఒక్క రూపాయికే రూ.4999 రీచార్జ్ ప్లాన్!
వొడాఫోన్ ఐడియా (వీఐ) తన యూజర్లకు అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. కేవలం ఒక్క రూపాయికే రూ.4,999 రీఛార్జ్ ప్లాన్ ను అందిస్తోంది. వీఐ గేమ్స్ లో గెలాక్సీ షూటర్ ఫ్రీడమ్ ఫెస్ట్ ఎడిషన్ ను వొడాఫోన్ ఐడియా ప్రవేశపెట్టింది. ఈ స్పెషల్ ఎడిషన్ ఫెస్ట్ కింద అనేక రివార్డులను అందిస్తుండగా వాటిలో ఒకటే ఒక్క రూపాయికి రూ .4,999 రీచార్జ్ ప్లాన్.ఆగస్టు 31 వరకే ఆఫర్టెలికామ్ టాక్ నివేదిక ప్రకారం.. వీఐ గేమ్స్ పై గెలాక్సీ షూటర్స్ ఫ్రీడమ్ ఫెస్ట్ ఎడిషన్ ఆగస్టు 31 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ గెలాక్సీ షూటర్స్ ఫ్రీడమ్ ఫెస్ట్ లో వినియోగదారులు అనేక రివార్డులను పొందుతున్నారు. రివార్డుల జాబితాలో రూ .4,999 రీఛార్జ్ ప్లాన్ కూడా ఉంది. ఈ ఫెస్ట్ లో కంపెనీ కేవలం రూ.1కే రూ.4,999 వార్షిక ప్లాన్ ను వినియోగదారులకు అందిస్తోంది.ప్లాన్లో లభించే బెనిఫిట్స్ రూ.4,999 ప్లాన్లో వీఐ తన వినియోగదారులకు అపరిమిత కాలింగ్తో పాటు ప్రతిరోజూ 2 జీబీ మొబైల్ డేటా, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లను అందిస్తుంది. దీనితో పాటు అపరిమిత 5జీ డేటా కూడా ఈ ప్యాక్ లో లభిస్తుంది. అంతేకాకుండా వీఐఎంటీవీ, అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఈ ప్లాన్లో వినియోగదారులకు అర్ధరాత్రి 12 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అపరిమిత డేటా లభిస్తుంది. ఇది కాకుండా, వీకెండ్ డేటా రోల్ఓవర్ కూడా ఇందులో లభిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు అంటే ఏడాది. కేవలం రూ.1కే ఇన్ని బెనిఫిట్స్ పొందొచ్చు.ఆఫర్ పొందండిలా.. వీఐ యాప్ను ఓపెన్ చేయండివీఐ గేమ్స్ సెక్షన్కి వెళ్లండిగెలాక్సీ షూటర్స్ ఫ్రీడమ్ ఫెస్ట్ ఎడిషన్ గేమ్ ఆడండిడ్రోన్లను షూట్ చేసి జెమ్స్ సంపాదించండిజెమ్స్ ఆధారంగా రివార్డ్స్ పొందండిఎన్ని రివార్డ్స్కు ఏమి లభిస్తాయి? 25 జెమ్స్ రివార్డ్స్కు రూ.50 అమెజాన్ వోచర్75 జెమ్స్ రివార్డ్స్కు 10జీబీ డేటా + ఓటీటీ యాక్సెస్150 జెమ్స్ రివార్డ్స్కు 50జీబీ డేటా ప్యాక్300 జెమ్స్ రివార్డ్స్కు రూ.1కే రూ.4999 ప్లాన్ (15 మంది విజేతలకు మాత్రమే) -
భక్తి ప్లస్ టెక్ కాంబోలో.. గణపయ్యకు టెక్నో హారం!
ఈసారి గణపయ్యకు టెక్ టచ్తో స్వాగతం చెప్పారంటే, ఇక మీ పండుగ వాతావరణం భక్తి ప్లస్ టెక్ కాంబోలో డబుల్ ఆనందంతో మెరిసిపోతుంది.వీఆర్ గణపయ్యతో రద్దీకి గుడ్బై!వినాయక చతుర్థి రాగానే ముంబయి లాల్బాగ్చా రాజా ముందు కనిపించే రద్దీ మాటల్లో చెప్పలేనిది. కాని.. ఇప్పుడు బయట అడుగు పెట్టకుండానే, మీ లివింగ్రూమ్లో కూర్చొని ఆ భవ్య దర్శనాన్ని ఆస్వాదించవచ్చు. అదే ఈ ‘లాల్బాగ్ 360’ వీఆర్ దర్శనం. ఒక్క యాప్తో మీ హాల్లో కూర్చునే పూజా గంటలు, పూజారుల మంత్రోచ్ఛారణ, మండప అలంకారాలు అన్నీ కళ్లముందే ప్రత్యక్షం అవుతాయి. ఎడమ వైపు తిప్పితే పూలతో అలంకరించిన మండపం, కుడివైపు తిప్పితే గణపయ్య పాదాల వద్ద నమస్కరిస్తున్న భక్తులు అన్నీ నిజంగానే అక్కడ ఉన్నట్టు అనిపిస్తాయి.ఇదే విధంగా ‘గణేశ్ వీఆర్’, ‘విజయవిధి వర్చువల్ దర్శనం’ లాంటి యాప్లు కూడా 360 డిగ్రీల వీడియోలతో పండుగ వాతావరణాన్ని ఇంటికే తీసుకొస్తున్నాయి. వాడటం కూడా చాలా సులభం. మీ ఫోన్ లేదా స్మార్ట్ టీవీలో యాప్ డౌన్లోడ్ చేసి, హెడ్సెట్ లేదా మానిటర్లో ఫుల్స్క్రీన్లో ఆన్ చేస్తే సరిపోతుంది. లైవ్ టైమింగ్స్, లింకులు అధికారిక వెబ్సైట్లో దొరుకుతాయి.ఒకే టచ్తో భక్తి ప్లస్ డీజే మోడ్!గణేష్ మండపం అంటే వెలుగుల వేదిక! అయితే, ఇప్పుడు తీగలు, ప్లగ్లు, స్విచ్లతో ఇబ్బంది పడే రోజులు పోయాయి. ఒక వైఫై ఎల్ఈడీ బల్బు పెట్టేస్తే చాలు. మీ మండపం క్షణాల్లో ‘సినిమా సెట్’లా మెరిసిపోతుంది. ఉదయం పూజ సమయానికి పసుపు వెలుగు, మధ్యాహ్నం భక్తులు రాగానే ప్రకాశించే తెలుపు వెలుగు, రాత్రి డీజే బీట్ పడగానే గ్రీన్ , బ్లూ, రెడ్ ఫ్లాష్లతో మండపం ఫుల్ పార్టీ మూడ్లోకి మారిపోతుంది. ఇవన్నీ కేవలం ఫోన్ టచ్తోనే! ‘అలెక్సా, డివోషనల్ మోడ్ ఆన్’ అంటే పసుపు, ఎరుపు కాంబినేషన్ రెడీ. వాడటం కూడా సింపుల్. బల్బు పెట్టి, యాప్ డౌన్లోడ్ చేసి, వైఫై కనెక్ట్ చేస్తే సరిపోతుంది. టైమింగ్ సెట్ చేసి, పూజ సమయానికి ఆటోమేటిక్గా వెలుగులు వెలిగేలా చేసుకోవచ్చు. విప్రో, ఫిలిప్స్, హెవెల్స్ లాంటి బ్రాండ్లు మంచి ఆప్షన్లు ఇస్తున్నాయి. ఒక్క బల్బు ధర రూ. 600 నుంచి మొదలవుతుంది.ఒక్క బాక్స్లో మొత్తం పండుగ! వినాయక చవితి దగ్గర పడుతుంటే, ఇంట్లో అందరికీ ఒకటే టెన్షన్, పూజ సామగ్రిని సర్దుకోవాలి, పత్రి తెప్పించాలి, విగ్రహం తీసుకురావాలి. వీటన్నిటికీ చివరి నిమిషంలో టెన్షన్.. టెన్షన్! కాని, ఈసారి అంతా ఈజీ! ‘ఆరాధ్య గణేశ్ చతుర్థి సంపూర్ణ పూజా కిట్’ చేతిలో ఉంటే చాలు, మీ పండుగ ఏ లోటు లేకుండా చక్కగా పూర్తవుతుంది.ఒక్క బాక్స్లోనే పన్నెండు అంగుళాల మట్టి గణపయ్య, ఇరవైఒక్క రకాల పవిత్ర పత్రి, ఒక చెక్క పాలవెల్లి సహా పూజకు కావాల్సినవన్నీ సిద్ధంగా లభిస్తాయి. కేవలం పూలు, పండ్లు, నైవేద్యం బాధ్యత మాత్రమే మీది! ఎవరైనా పూజ విధానం మరచిపోయారా? టెన్షన్ లేదు, చిన్న పుస్తకంతోపాటు, వీడియో గైడ్ కూడా వెబ్సైట్లో రెడీగా ఉంటుంది. పైగా ప్యాకేజింగ్ నుంచి విగ్రహం వరకు అంతా ప్రకృతికి నష్టం లేకుండా పర్యావరణహితంగా ఉంటుంది. ధర కేవలం రూ.1500 మాత్రమే! -
మిక్స్డ్ రియల్టీ హెడ్సెట్: తొలి చైనా కంపెనీగా వివో
ప్రముఖ స్మార్ట్ఫోన్స్ సంస్థ వివో తమ 30వ వార్షికోత్సవం సందర్భంగా మిక్స్డ్ రియాల్టీ హెడ్సెట్ 'విజన్ డిస్కవరీ' ఎడిషన్ను ప్రవేశపెట్టింది. దీంతో ఇటు స్మార్ట్ఫోన్స్, అటు ఎంఆర్ ప్రోడక్టుల విభాగాల్లో మొదటిసారిగా మిక్సిడ్ రియాలిటీ ఉత్పత్తిని ప్రవేశపెట్టిన తొలి చైనా కంపెనీగా నిలిచింది.వివో మిక్స్డ్ రియల్టీ హెడ్సెట్ బరువు 300 గ్రాములు, మందం 40 మిమీ మాత్రమే. కాబట్టి ఇప్పటివరకు మార్కెట్లో ఉన్న ఇతర ఎంఆర్ ఉత్పత్తితో పోలిస్తే ఇది 26 శాతం చిన్నగాను, సౌకర్యవంతంగాను ఉంటుంది. ఈ హెడ్సెట్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ఎక్స్ఆర్2ప్లస్ జెన్ 21 ప్లాట్ఫామ్ మీద నిర్మితమైంది. ఇది రెండున్నర రెట్లు అధికంగా జీపీయూ సామర్థ్యాలు, ఎనిమిది రెట్లు అధికంగా ఏఐ సామర్థ్యాలను పొందింది. -
భారత్లో ఓపెన్ ఏఐ కార్యాలయం
న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ఏఐ ఈ ఏడాది భారత్లో తొలి కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. న్యూఢిల్లీలో దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ఇందుకోసం ఇప్పటికే స్థానికంగా నియామకాలు కూడా ప్రారంభించినట్లు వివరించింది. చాట్జీపీటీకి అమెరికా తర్వాత భారత్ రెండో అతి పెద్ద మార్కెట్గా ఉన్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్లో కార్యాలయం తెరవడం వల్ల ఇక్కడి యూజర్లకు మరింత మెరుగైన సరీ్వసులు అందించేందుకు వీలవుతుందని ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మన్ తెలిపారు. స్థానిక భాగస్వాములు, ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు, డెవలపర్లు, విద్యా సంస్థలతో కలిసి పని చేయడంపై స్థానిక సిబ్బంది దృష్టి పెడతారని వివరించారు. -
సరికొత్త హెచ్పీ గేమింగ్ ల్యాప్టాప్: ధర & వివరాలు
భారతదేశంలో హెచ్పీ ఒమెన్ 16ను లాంచ్ చేస్తూ తన గేమింగ్ ల్యాప్టాప్ లైనప్ను విస్తరించింది. ఈ లేటెస్ట్ ఏఐ గేమింగ్ ల్యాప్టాప్ ఎన్వీడియా గెఫోర్స్ 12జీబీ ఆర్టీఎక్స్తో జత చేసిన.. ఐటెల్ కోర్ అల్ట్రా లేదా ఏఎండీ రైజిన్ ఏఐ ప్రాసెసర్ను పొందుతుంది. దీని ప్రారంభ ధర రూ.1,29,999.హెచ్పీ ఒమెన్ 16 గేమింగ్ ల్యాప్టాప్ ఇప్పుడు ఆన్లైన్ స్టోర్, హెచ్పీ వరల్డ్, అమెజాన్, క్రోమా, రిలయన్స్ డిజిటల్ వంటి రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ఇది 6 సెల్ 83 వాట్స్ బ్యాటరీ కలిగి ఫాస్ట్ ఛార్జ్కు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి దీనిని 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ప్రత్యేకించి గేమింగ్కు చాలా అనుకూలంగా ఉంటుంది.హార్డ్వేర్ విషయానికొస్తే.. ఈ ల్యాప్టాప్ 16 ఇంచెస్ క్యూహెచ్డీ (2560 × 1600) డిస్ప్లేను పొందింది. ఇది 500 నైట్స్ బ్రైట్నెస్ను పొందుతుంది. ఇది 100 శాతం 100 శాతం sRGB కలర్ కవరేజ్.. బ్లూ లైట్ ఎక్స్పోజర్ను తగ్గించడానికి ఐసేఫ్ సర్టిఫికేషన్ను కలిగి ఉంది. అంతే కాకుండా థర్మల్ డిజైన్లో టెంపెస్ట్ కూలింగ్, ఫ్యాన్ గ్యాప్లు, హీట్ ఫేజ్ రీడిస్ట్రిబ్యూషన్ కూడా ఇందులో ఉన్నాయి. -
ఏకంగా 10,000mAh భారీ బ్యాటరీ ఫోన్ వచ్చేస్తోంది..
ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్ రియల్మీ తన రాబోయే స్మార్ట్ఫో న్ లాంచ్ తేదీని టీజ్ చేసింది. బ్యాటరీ విషయంలో ఇది "పెద్ద" డీల్ అంటూ ఊరిస్తోంది. దీని పేరును ఇంకా వెల్లడించనప్పటికీ, కొత్త రియల్మీ డివైస్ 10,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని కలిగి ఉంటుందని కంపెనీ ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో ఒక పోస్ట్లో టీజ్ చేసింది."ఇంత పెద్దది సరిపోతుందా? ఇదిగో రియల్మీ 1x000mAh - మరోసారి పరిమితులను చెరిపేస్తుంది. ఆగస్టు 27న అద్భుతం చూడండి' అంటూ రియల్మీ పోస్ట్ చేసింది. "అతిపెద్దది మరింత పెద్దదిగా మారింది. రియల్మీ మరోసారి పరిమితులను పునర్నిర్వచించనుంది. 320వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ నుంచి 10,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ వరకు... తర్వాత ఏం జరగబోతోంది?" అని మరో ఎక్స్ పోస్ట్ లో పేర్కొంది.అంటే ఈ స్మార్ట్ ఫోన్ లో అధునాతన బ్యాటరీ, ఛార్జింగ్ టెక్నాలజీ ఉండొచ్చని తెలుస్తోంది. రియల్మీ రాబోయే డివైజ్ 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని దాటుతుందా అని చాలా మంది ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం రియల్మీలో అత్యంత శక్తివంతమైన బ్యాటరీ ఉన్న స్మార్ట్ఫోన్ రియల్మీ జీటీ 7. చైనీస్ మోడల్లో ఇది 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్తో 7,200 ఎంఏహెచ్ సామర్థ్యంతో ఉంది. అదే ఇండియన్ రియల్మీ జీటీ 7 వెర్షన్లో అయితే 120వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.THE BIGGEST JUST GOT EVEN BIGGER. 🔋realme Is Set To Redefine The Limits Once More.From 320W Fast Charging To A Massive 1x000mAh Battery…What’s Coming Next?August 27 — Get Ready For The Next Power Revolution.Know More: https://t.co/c8wHve6fZ2#FreeToBeReal… pic.twitter.com/SrctmwWzrg— realme (@realmeIndia) August 21, 2025 -
చేతిరాతకు ‘ఏఐ’ పవర్.. హైదరాబాద్ కంపెనీ సృష్టి
టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా, పుస్తకాలన్నీ డిజిటలైజ్ అయిపోతున్నా ఇప్పటికీ చాలా మంది పెన్నూ పేపర్ ఉపయోగించి చేత్తో రాయడాన్ని ఇష్టపడుతుంటారు. అలాంటి వారి కోసమే కాగితాన్ని డిజిటల్తో కలిపే ఏఐ స్మార్ట్ నోట్బుక్ను అందుబాటులోకి తీసుకువచ్చింది హైదరాబాద్కు చెందిన స్టార్టప్.టెకీ నుంచి ఎంట్రప్రెన్యూర్గా మారిన సుమన్ బాలబొమ్మ అభివృద్ధి చేసిన రీనోట్ ఏఐ నోట్బుక్ (ReNote AI Notebook) దేశంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత నోట్బుక్గా గుర్తింపు పొందింది. ఇది సాధారణ కాగితపై రాయడం అనుభూతిని అందిస్తూ, ఆ చేతిరాతను డిజిటల్ టెక్స్ట్గా మార్చే ప్రత్యేకమైన సాంకేతికతను కలిగి ఉంది.ఎన్నో ఫీచర్లుఈ నోట్బుక్లో నీటికి తడిసిపోని, చిరిగిపోని, రీ యూజబుల్ పేజీలు ఉంటాయి. పైలట్ ఫ్రిక్సియాన్ (Pilot Frixion) పెన్నుతో వీటిన రాసిన నోట్స్ను తుడిచేయవచ్చు. రీనోట్ ఏఐ మొబైల్ యాప్ ద్వారా చేతిరాతను డిజిటల్ టెక్స్ట్గా మార్చడం, సారాంశాలు తయారు చేయడం, తెలుగు సహా అనేక భాషల్లో అనువాదం, వాయిస్ ఆధారిత శోధన, చిత్రంగా మార్చే స్కెచ్లు వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.తెలంగాణ ప్రభుత్వ టీ-హబ్ ప్రోత్సాహంతో ఏర్పాటైన ఈ స్టార్టప్ జీఐటెక్స్ దుబాయ్, ఒసాకా వరల్డ్ ఎక్స్పో, గిఫ్ట్స్ వరల్డ్ ఎక్స్పో న్యూఢిల్లీ వంటి అంతర్జాతీయ ప్రదర్శనల్లో తమ రీనోట్ ఏఐ నోట్బుక్ను ప్రదర్శించింది. మైటీ, గూగుల్ వంటి సంస్థలు ఈ యాప్ను భారతదేశం లోని టాప్ 100 మొబైల్ యాప్స్ లో ఒకటిగా గుర్తించాయి.వ్యక్తిగత అనుభవాల నుంచి ప్రేరణతో ఈ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టిన సుమన్ బాలబొమ్మ.. "చేతిరాతలో ఉన్న ఫోకస్, జ్ఞాపక శక్తిని కోల్పోకుండా, డిజిటల్ సౌలభ్యాన్ని కలిపే ప్రయత్నమే రీనోట్" అని చెబుతున్నారు. ఇలాంటి ఏఐ నోట్బుక్ను ‘ఎక్స్నోట్’ (XNote) అనే అమెరికా సంస్థ కూడా రూపొందించింది. -
ఏఐలో ఆధిపత్యం కోసం ఎగబడుతున్నారు!
ఏఐ(కృత్రిమ మేధ) గాడ్ఫాదర్గా పేరొందిన జెఫ్రీ హింటన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల టెక్ పరిశ్రమ అనుసరిస్తున్న విధానంపై విమర్శలు చేశారు. నైతిక దూరదృష్టి లేకపోవడం, నియంత్రణలేని కృత్రిమ మేధ అభివృద్ధి పెరుగుతున్న నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేశారు. హింటన్ ఇటీవల ఫార్చ్యూన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంపెనీల సాంకేతిక ఆధిపత్యం కొనసాగుతున్న తరుణంలో దీర్ఘకాలిక శ్రేయస్సు మసకబారుతుందని చెప్పారు.స్వల్పకాలిక లాభాలే కీలకంసాంకేతిక పరిజ్ఞానానికి శక్తినిచ్చే ఏఐ అల్గారిథమ్లను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించిన హింటన్, ప్రస్తుతం టెక్ కంపెనీలు మరింత శక్తివంతమైన ఏఐ మోడళ్లను నిర్మించడానికి పోటీ పడుతున్నాయని తెలిపారు. ఆ సమయంలో భవిష్యత్తులో నెలకొనే విస్తృత ప్రభావాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నైతికంగా ఏఐ అభివృద్ధి పట్ల నిబద్ధత కంటే ప్రధానంగా పోటీ ఒత్తిళ్లు, స్వల్పకాలిక లాభాలే కీలకం అవుతున్నట్లు చెప్పారు.మానవ విలువలకు అనుగుణంగా ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా సూపర్ ఇంటెలిజెన్స్ ఏఐ వ్యవస్థలను మోహరిస్తే వినాశకరమైన పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఏఐ వల్ల తప్పుడు సమాచారం, ఉద్యోగాలు కోల్పోవడం, గోప్యతా ఉల్లంఘనలు.. వంటి ప్రమాదాల కన్నా మానవులను డామినేట్ చేసే వ్యవస్థల వల్ల మరింత నష్టం కలుగుతుందన్నారు.నైతిక ఫ్రేమ్వర్క్..కృత్రిమ మేధ అభివృద్ధిలో బలమైన నైతిక చట్రం(మోరల్ ఫ్రేమ్వర్క్) లేదని హింటన్ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నమూనాలను పెంచడానికి, వినియోగదారుల డేటాను మానిటైజ్ చేయడానికి బిలియన్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నప్పటికీ కొన్ని కంపెనీలు మాత్రం ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్(ఏజీఐ) అస్తిత్వ ప్రమాదాలపై దృష్టి పెడుతున్నాయని పేర్కొన్నారు. ఏదేమైనా కృత్రిమ మేధ అభివృద్ధికి నైతిక ప్రమాణాలు చాలా అవసరం అని చెప్పారు. నిర్దిష్ట ఫ్రేమ్వర్క్లను తయారు చేయడానికి ప్రపంచ సహకారం కావాలని పిలుపునిచ్చారు. వ్యవస్థల మధ్య ఒప్పందాలు, పర్యవేక్షణ, నైతిక ప్రమాణాలు అవసరమన్నారు. ఏఐ పరిశోధకులు, భద్రత, పారదర్శకత, దీర్ఘకాలిక ఆలోచనలకు ప్రాధాన్యమివ్వాలని కోరారు.ఇదీ చదవండి: బైక్ ట్యాక్సీ సేవలు పునరుద్ధరణ -
విప్రో చేతికి హర్మన్ డీటీఎస్.. రూ. 3,270 కోట్ల డీల్
ఐటీ సేవల దేశీ దిగ్గజం విప్రో తాజాగా హర్మన్కు చెందిన డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ సొల్యూషన్స్(డీటీఎస్) బిజినెస్ యూనిట్ కొనుగోలుకి తెరతీసింది. శామ్సంగ్కు చెందిన ఈ సంస్థలో 100 శాతం వాటా కొనుగోలుకి తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందుకు నగదు రూపేణా 37.5 కోట్ల డాలర్లు(సుమారు రూ. 3,270 కోట్లు) వెచ్చించనుంది.ఒప్పందంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 5,600మంది డీటీఎస్ ఉద్యోగులు విప్రోకు బదిలీకానున్నారు. 2025 డిసెంబర్31కల్లా లావాదేవీ పూర్తికావచ్చని అంచనా వేస్తున్నారు. హర్మన్ కనెక్టెడ్ సర్వీసెస్ ఇంక్లో 100 శాతం వాటా కొనుగోలుకి హర్మన్ ఇంటర్నేషనల్ ఇండస్ట్రీస్ ఇంక్తో తప్పనిసరి ఒప్పందంపై సంతకాలు చేసినట్లు విప్రో పేర్కొంది.తద్వారా హర్మన్ అనుబంధ సంస్థలుసహా.. సంబంధిత ఆస్తులను సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. కొనుగోలు తదుపరి విప్రో ఇంజినీరింగ్ గ్లోబల్ బిజినెస్ లైన్లో డీటీఎస్ విలీనంకానున్నట్లు వెల్లడించింది. కనెక్టికట్(యూఎస్) కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డీటీఎస్ అంతర్జాతీయంగా ఈఆర్అండ్డీ, ఐటీ సర్వీసులను అందిస్తోంది. ఎంబెడ్డెడ్ సాఫ్ట్వేర్, డిజిటల్ ఇంజినీరింగ్, డిజైన్ థింకింగ్, క్లౌడ్, ఇన్ఫ్రా సర్వీసులలో ప్రధానంగా కార్యకలాపాలు విస్తరించింది. -
చరిత్ర చెప్పకుండా.. పరువు కాపాడుతూ...
అప్పుడూ.. ఇప్పుడూ.. మనమంతా నెట్టింట్లో ముందు తట్టే తలుపు గూగుల్దే. అంతలా అన్నింట్లోనూ తనదైన ముద్ర వేస్తోంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగా మరికొన్ని ఫీచర్లను పరిచయం చేసింది.ఆ మెసేజెస్ ‘బ్లర్’!వాట్సాప్లో లేని సేఫ్టీ ఫీచర్ గూగుల్ మెసేజుల్లో ఒకటుంది. తరచూ వాట్సాప్ లేదా మరేదైనా మెసేజింగ్ యాప్లలో తెలియని నంబర్ నుంచి మెసేజులు, ఫొటోలు, వీడియోలు వస్తుంటాయ్. వాటిలో అశ్లీల చిత్రాలు, వీడియోలు ఉండొచ్చు. అనుకోకుండా వాటిని ఓపెన్ చేసి షాక్ అవుతాం. చుట్టుపక్కల ఎవరైనా ఉంటే.. పరువు పోయినట్టే! అలాంటి ఇబ్బందులు రాకుండా.. అద్భుతమైన ఫీచర్ను ‘గూగుల్ మెసేజెస్’ తీసుకొచ్చింది. అదే ఆటోమేటిక్ ‘బ్లర్’ ఫీచర్. ఇది ‘న్యూడ్’ మెసేజ్లను ఓపెన్ చేస్తే ఆటోమేటిగ్గా బ్లర్ చేస్తుంది. సెండర్ని కూడా వెంటనే బ్లాక్ చేస్తుంది. కావాలంటే.. అశ్లీల చిత్రాలు కనిపించకుండా చేసి, సంభాషణ కొనసాగించొచ్చు. అంతేకాదు.. మీరు పొరపాటున అశ్లీలమైన కంటెంట్ను పంపితే అలర్ట్ చేస్తుంది. ఇంట్లో పిల్లలు కూడా ఫోన్లు వాడుతున్న నేపథ్యంలో ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. మైనర్లు వాడే ఫోన్లలో ఇది ఆన్ చేసి ఉంటుంది. అయితే, వాళ్లు దాన్ని ఆఫ్ చేసేందుకు వీలుంది. అందుకే పేరెంటల్ కంట్రోల్స్ పెట్టాలి. అప్పుడు తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా దాన్ని ఆఫ్ చేయడం కుదరదు. అందుకు ఫ్యామిలీ లింక్ యాప్ ని వాడొచ్చు. దీన్ని మీ ఫోన్లో ఎనేబుల్ చేసేందుకు గూగుల్ మెసేజెస్ యాప్ ని ఓపెన్ చేయండి. ఈ పాత్ ని ఫాలో అవ్వండి. Messages Settings > Protection & Safety > Manage sensitive content warnings > Warnings in Google Messages.‘జెమినై’లో ప్రైవసీ అప్డేట్ఏఐ పోటీ రోజురోజుకీ పెరుగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో చాట్జీపీటీ కంటే ముందే గూగుల్ జెమినై (Google Gemini).. ఇన్ కాగ్నిటో మోడ్ పరిచయం చేసింది. ఏఐ యూజర్ల ప్రైవసీకి ఇదో చక్కని పరిష్కారం. ఇకపై జెమినితో చేసే చాటింగ్, వ్యక్తిగత సమాచారం ఎవరి కంటా పడవు. ఎందుకంటే.. గూగుల్ కొత్త ’టెంపరరీ చాట్స్’ ఫీచర్తో ముందుకొచ్చింది. ఇది మనం బ్రౌజింగ్లో వాడే ఇన్ కాగ్నిటో మోడ్లా పని చేస్తుంది. దీన్ని వాడుకుని జెమినితో మనం చేసే సంభాషణలు సేవ్ కాకుండా చూడొచ్చు. మీ కమాండ్ ప్రాంప్ట్స్ని ఇకపై ఎవరూ కాపీ కొట్టలేరు. ఏఐ వాడకంలో ప్రైవసీని కోరుకునే వారికి ఇదో చక్కని ఫీచర్. ఇంకా చెప్పాలంటే.. ‘గూగుల్ కీప్’ సర్వీసులో ఫొటోలు,వీడియోలను జెమిని మీ అనుమతితోనే యాక్సెస్ చేసేలా చేయొచ్చు. ఒకవేళ ‘కీప్’ డేటా యాక్సెస్ ఇవ్వాలంటే ఎప్పుడైనా ఎనేబుల్ చేసుకోవచ్చు. అలాగే, జెమినై లైవ్ సర్వీసులోనూ ప్రైవసీని కట్టుదిట్టంగా అమలు చేస్తోంది. ఈ సర్వీసుని వాడే క్రమంలో మీ ప్రమేయం లేకుండా చూపించే ఆడియో, వీడియో సేకరించకుండా చేయొచ్చు.టూర్ ప్లాన్ చెప్తే చాలు..ఏ పని చేయాలన్నా ప్లానింగ్ అవసరం. పర్యటనల విషయంలో మరీనూ. ఈ విమాన ప్రయాణం కోసం సరైన ఫ్లైట్లు వెతకడం పెద్ద తలనొప్పి. ఏ వెబ్సైట్లో వెతకాలి? ఏ యాప్లో చూస్తే తక్కువ ధరకి టికెట్టు బుక్ చేసుకోవచ్చు? ఏమేం బెటర్ ఆఫర్లు ఉన్నాయి? ఇలాంటి ప్రశ్నలతోనే గూగుల్ సెర్చ్ హిస్టరీ మొత్తం నిండిపోతుంది. ఇకపై అంత కష్టపడక్కర్లేదు. ఇందుకోసం గూగుల్ ఒక సూపర్ టూల్తో ముందుకొచ్చింది. అదే "Google Flights' లోని కొత్త ఏఐ టూల్. ఇది మనతో మాట్లాడుతుంది.మీరు చేయాల్సిందల్లా ట్రిప్ గురించి ఏఐకి చెప్పాలంతే. ‘పదిరోజులు కేరళ ట్రిప్కి వెళ్లాలి. మంచి రిసార్టులో ఉండాలి. కాస్త బడ్జెట్లో ట్రిప్ని ప్లాన్ చేయమని అడిగితే చాలు. టూల్ అన్ని ఎయిర్లైన్స్నీ వెతుకుతుంది. బుకింగ్ వెబ్సైట్లలోని డేటాని క్షణాల్లో జల్లెడ పడుతుంది. అలాగే, ఉండేందుకు తగిన హోటళ్లను కూడా సూచిస్తుంది. బడ్జెట్ ప్లానింగ్కి తగిన బెస్ట్ డీల్స్ చూపిస్తుంది. ప్రస్తుతానికి ఇది బీటా వెర్షన్గా అందుబాటులో ఉంది. గూగుల్ ఫ్లైట్స్ వెబ్సైట్ www.google.com/travel/flights లేదా యాప్ ద్వారా ఈ సేవలు పొందొచ్చు. -
కొత్త ఫోన్ సేల్ షురూ.. రూ.10 వేలకే లేటెస్ట్ 5జీ మొబైల్
టెక్నో తన లేటెస్ట్ చౌకైన 5జీ మొబైల్ ఫోన్ టెక్నో స్పార్క్ గో 5జీని ఇటీవల భారత్ లో లాంచ్ చేసింది. నెక్స్ట్ జనరేషన్ కనెక్టివిటీని కోరుకునే యూజర్ల కోసం ఎంట్రీ లెవల్ 5జీ ఆప్షన్గా కంపెనీ ఈ ఫోన్ను తీసుకొచ్చింది. కొత్త 5జీ మొబైల్ ఫోన్కు అప్గ్రేడ్ అవ్వాలనుకునేవారి కోసం టెక్నో స్పార్క్ గో 5 జీ మంచి సేల్ ఆఫర్లు, డిస్కౌంట్లతో కొనుగోలుకు అందుబాటులో ఉంది.ఫోన్ ధర, లభ్యత, సేల్ ఆఫర్లుటెక్నో స్పార్క్ గో 5జీ 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999 కాగా, స్కై బ్లూ, ఇంక్ బ్లాక్, టర్కోయిస్ గ్రీన్, హెరిటేజ్ ప్రేరేపిత బికనీర్ రెడ్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఆగస్ట్ 21 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్ కార్ట్ లో తొలి సేల్ ప్రారంభమైంది. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడి, డెబిట్ కార్డులపై 5% క్యాష్ బ్యాక్ సహా లాంచ్ ఆఫర్లను పొందవచ్చు. దీంతోపాటు భీమ్ యాప్ ద్వారా చేసే చెల్లింపులపై రూ.30 వరకు ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్ లభిస్తుంది.స్పెసిఫికేషన్లు, ఫీచర్లుటెక్నో స్పార్క్ గో 5జీ స్మార్ట్ఫోన్లో 6.76 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 670 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది.మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత హైఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేస్తుంది.50 మెగాపిక్సెల్ ఏఐ అసిస్టెడ్ ప్రైమరీ రియర్ సెన్సార్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 6,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఇందులో అందించారు.టెక్నోకు చెందిన "నో నెట్ వర్క్ కమ్యూనికేషన్" ఫీచర్ ను కూడా ఈ హ్యాండ్ సెస్టో ఇంటిగ్రేట్ చేశారు. ఇది మొబైల్ సర్వీస్ లేకపోయినా టెక్నో ఫోన్ల మధ్య కాల్స్, సందేశాలకు వీలు కల్పిస్తుంది.డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ ఈ ఫోన్లో ఉంది. ఇందు కోసం ఐపీ 64 రేటింగ్ ను కలిగి ఉంది.కనెక్టివిటీ విషయానికి వస్తే, ఈ ఫోన్లో 5జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఐఆర్ బ్లాస్టర్, యూఎస్బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి.భద్రత కోసం ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అమర్చారు. -
స్టార్లింక్ ఇంటర్నెట్ కోసం ఆధార్ వెరిఫికేషన్
ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్.. ఈ-కేవైసీ వెరిఫికేషన్ కోసం ఆధార్ను ఉపయోగించడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీన్నిబట్టి చూస్తే.. భారతదేశంలో శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సేవలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.స్టార్లింక్ ఇప్పటికే టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT).. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPACe) నుంచి భారతదేశంలో తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి కావలసిన అనుమతిని పొందింది. అయితే జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా టెక్నాలజీ.. మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం వంటి కొన్ని ఆన్-ది-గ్రౌండ్ సన్నాహాలు ఇంకా పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని కూడా త్వరలోనే పూర్తి చేయడానికి కావాల్సిన ఏర్పాట్లను కంపెనీ పూర్తి చేస్తోంది.స్టార్లింక్ భారతదేశంలో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత కొత్త కస్టమర్ల ఆన్బోర్డింగ్ ప్రక్రియను సులభతరం చేయడమే కాకుండా.. వేగవంతమైన, మరింత సురక్షితమైన సేవలను అందించడానికి ప్రస్తుతం యూఐడీఏఐతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్పష్టమవుతోంది.స్టార్లింక్ ఇంటర్నెట్ కోసం ఈకేవైసీ చేసుకున్న యూజర్లు హైస్పీడ్ ఇంటర్నెట్ ఆస్వాదించవచ్చు. ఇది గృహాల్లో వినియోగించడానికి, సంస్థల్లో ఉపయోగించడానికి కూడా అనుకూలంగా ఉంటుందని.. ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.భారతదేశంలో స్టార్లింక్ ధరలుస్టార్లింక్ హార్డ్వేర్ ధర రూ.30,000 నుంచి రూ.40,000 వరకు ఉంటుందని అంచనా. ఇందులో శాటిలైట్ డిష్ & వై-ఫై రౌటర్ ఉన్నాయి. అయితే నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్లాన్లు రూ.3,000 నుంచి రూ.5,000 వరకు ఉంటుంది. యూజర్లు 25 Mbps నుంచి 220 Mbps మధ్య ఇంటర్నెట్ వేగాన్ని ఆస్వాదించవచ్చు. ధరలు త్వరలోనే అధికారికంగా వెల్లడవుతాయి.ఇదీ చదవండి: రెండేళ్లకే మస్క్ కంపెనీ వీడిన 16 ఏళ్ల కుర్రాడుస్టార్లింక్ సేవలను ప్రారంభ దశలో 20 లక్షల కనెక్షన్లకు మాత్రమే పరిమితం చేశారు. అయితే పరికరాల సరఫరా కోసం భారతి ఎయిర్టెల్ & రిలయన్స్ జియోలతో ఒప్పందం కుదుర్చుకుంది. మారుమూల ప్రాంతాలకు కూడా హైస్పీడ్ ఇంటర్నెట్ అందించాలనే లక్ష్యంతో స్టార్లింక్ శాటిలైట్ సేవలను ప్రారంభించనున్నారు. -
మారిన రీచార్జ్ ప్లాన్లు.. ఏది చవక.. లాభదాయకం?
దేశంలోని ప్రముఖ టెలికం కంపెనీలు తమ రీచార్జ్ ప్లాన్లలో ఇటీవల మార్పులు చేశాయి. కొన్ని ఎంట్రీ లెవల్ ప్లాన్లను తొలగించాయి. అయితే ఇప్పటికీ దేశంలోని ఇతర టెలికాం ఆపరేటర్లతో పోలిస్తే రిలయన్స్ జియో మొబైల్ వినియోగదారులకు అత్యంత చవకైన ఎంపికగా కొనసాగుతోందని బీఎన్పీ పారిబాస్ ప్లాన్ విశ్లేషణ నివేదిక తెలిపింది.మూడు ప్రధాన టెలికాం ఆపరేటర్లు జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా తమ పాపులర్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను సవరించాయి. ఈ క్రమంలో ఏ టెలికం కంపెనీలో రీచార్జ్ ప్లాన్లు చవకగా.. లాభదాయకంగా ఉన్నాయన్నదానిపై బీఎన్పీ పారిబాస్ విశ్లేషించింది. ఇందులో జియో ఇప్పటికీ అదే ధర పాయింట్లలో అధిక డేటా ప్రయోజనాలను అందిస్తోందని తేల్చింది.28 రోజుల ప్లాన్కు ఇప్పుడు ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా మూడు కంపెనీల్లోనూ ధర రూ .299గానే ఉంది. అయితే ప్రయోజనాలపరంగా చూస్తే జియో ఇప్పటికీ అధిక డేటా బెనిఫిట్లను అందిస్తోంది. దీంతో ఎక్కువ డేటా వినియోగించే కస్టమర్లకు జియో మరింత చౌకైన ఎంపికగా నిలిచిందని నివేదిక పేర్కొంది.జియోలో అందుబాటులో ఉన్న ప్లాన్లలో, రూ .799 ప్లాన్ 84 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ డేటాను అందిస్తుంది. మరోవైపు, రూ .249 ప్లాన్ ఇప్పుడు ఫిజికల్ జియో స్టోర్లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఆన్లైన్లో తొలగించింది. రూ .209 వాయిస్-ఓన్లీ ప్లాన్ కేవలం మై జియో యాప్లో మాత్రమే అందుబాటులో ఉంది.ఇక రూ .189 ప్లాన్లో అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్లు, 2 జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీతో అందిస్తోంది. ఇంకా రూ.209 ప్లాన్ 22 రోజుల పాటు రోజుకు 1 జీబీని అందిస్తుంది. రూ.299 ప్లాన్ 28 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ, రూ.349 ప్లాన్ 28 రోజుల పాటు రోజుకు 2 జీబీని అందిస్తున్నాయి. ఎయిర్టెల్, వీఐ ప్లాన్లతో పోలిస్తే జియో కస్టమర్లు నెలకు రూ.50 లబ్ధి పొందుతున్నారని నివేదిక విశ్లేషించింది.ఉదాహరణకు, రోజుకు 1.5 జీబీ, 28 రోజుల ప్లాన్ ధర జియోకు రూ .299, ఎయిర్టెల్, బీఐలు అదే ప్రయోజనం కోసం రూ .349 వసూలు చేస్తున్నాయి. అంటే జియో వినియోగదారులకు నెలకు రూ .50 ఆదా అవుతుందన్న మాట. అదేవిధంగా రోజుకు 2 జీబీ డేటా అందించే 28 రోజుల ప్లాన్కు జియో రూ.349, ఎయిర్టెల్ రూ.398, వీఐ రూ.365 వసూలు చేస్తున్నాయి. ఎయిర్టెల్తో పోలిస్తే రూ.49, వీఐతో పోలిస్తే రూ.16 చొప్పున జియో యూజర్లకు నెలకు ఆదా అవుతుంది. -
స్మార్ట్వాచీలకు ఏమైంది? వరుసగా మార్కెట్ డౌన్
దేశీయంగా వేరబుల్ మార్కెట్ వరుసగా అయిదో త్రైమాసికంలోనూ నెమ్మదించింది. స్మార్ట్వాచీలు, ట్రూ వైర్లెస్ స్టీరియో ఇయర్బడ్స్ విక్రయాలు తగ్గడంతో ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో అమ్మకాలు 9.4 శాతం క్షీణించి 2.67 కోట్లకు పరిమితమయ్యాయి. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఐడీసీ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.దీని ప్రకారం సరఫరా తగ్గినప్పటికీ వేరబుల్స్ సగటు విక్రయ ధర (ఏఎస్పీ) ఒక మోస్తరుగా 2.2 శాతం మేర పెరిగి 19.2 డాలర్లకు (సుమారు రూ. 1,700)కు చేరింది. 2025 ప్రథమార్థంలో వేరబుల్ డివైజ్ మార్కెట్ వార్షికంగా 6.3 శాతం తగ్గి 5.16 కోట్ల యూనిట్లకు పరిమితమైంది. ఏఎస్పీ పెద్దగా మార్పులు లేకుండా 18.7 డాలర్ల (సుమారు రూ. 1,630) స్థాయిలో కొనసాగింది. స్మార్ట్ రింగ్స్, స్మార్ట్ గ్లాసెస్, స్మార్ట్ రిస్ట్బ్యాండ్స్లాంటి కొత్త రకం వేరబుల్స్కి డిమాండ్ పెరిగింది.మరిన్ని ముఖ్యాంశాలు..అమ్మకాలు 4.8 శాతం తగ్గినప్పటికీ వేరబుల్స్ మార్కెట్లో 28 శాతం వాటాతో ఇమేజిన్ మార్కెటింగ్ (బోట్ బ్రాండ్) అగ్రస్థానంలో ఉంది. 13.1 శాతం వాటాతో నాయిస్ రెండో స్థానంలో నిల్చింది. విక్రయాలు 8.6 శాతం తగ్గాయి.గోబోల్ట్ (గతంలో బోల్ట్) అమ్మకాలు 21.8 శాతం పెరిగాయి. 10.9 శాతం మార్కెట్ వాటా ఉంది. ఒప్పో, వన్ప్లస్ వాటా చెరి 8 శాతంగా, రియల్మి వాటా 6.5 శాతంగా ఉంది.ఇక స్మార్ట్వాచీల అమ్మకాలు వరుసగా ఆరో త్రైమాసికంలోనూ క్షీణించాయి. జూన్ క్వార్టర్లో 28.4 శాతం తగ్గి 66 లక్షల యూనిట్లకు పరిమితమయ్యాయి. మొత్తం వేరబుల్స్ మార్కెట్లో వీటి వాటా 31.5 శాతం నుంచి 24.9 శాతానికి తగ్గింది. బౌల్ట్ మినహా మిగతా అన్ని బ్రాండ్ల (నాయిస్, బోట్, టైటాన్, ఫైర్ బోల్ట్) స్మార్ట్వాచీల అమ్మకాలు తగ్గాయి.2022, 2023లో భారీగా వృద్ధి చెందిన స్మార్ట్వాచీల మార్కెట్ ప్రస్తుతం కన్సాలిడేట్ అవుతోంది. ఇయర్వేర్ కేటగిరీ స్వల్పంగ్ 1.2 శాతం తగ్గి 1.99 కోట్ల యూనిట్లకు పరిమితం అయింది. ట్రూలీ వైర్లెస్ స్టీరియో (టీడబ్ల్యూఎస్) సెగ్మెంట్ అమ్మకాలు 1.2 శాతం తగ్గినా, 71.2 శాతం వాటాతో అగ్రస్థానంలో కొనసాగింది. నెక్బ్యాండ్ స్టయిల్ ఇయర్వేర్ మరింతగా 16.1 శాతం మేర పడిపోయింది. ఓవర్–ది–ఇయర్ సెగ్మెంట్ అమ్మకాలు 97.4 శాతం ఎగిసి 15 లక్షల యూనిట్లకు పెరిగాయి. టీడబ్ల్యూఎస్ విభాగంలో 31.9 శాతం వాటాతో బోట్ అగ్రస్థానంలో, 14.9 శాతం వాటాతో బోల్ట్ రెండో స్థానంలో ఉన్నాయి. బోట్ అమ్మకాలు 6.9 శాతం తగ్గాయి.స్మార్ట్ రింగ్స్ విక్రయాలు 2.8 శాతం పెరిగి 75,000కు చేరాయి. అ్రల్టాహ్యూమన్, గేబిట్, ఆబో సంస్థలు సంయుక్తంగా 65 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో కొనసాగాయి. మెటా, లెన్స్కార్ట్ కొత్తగా ప్రవేశపెట్టిన మోడల్స్ దన్నుతో స్మార్ట్ గ్లాసెస్ అమ్మకాలు 4,000 నుంచి ఏకంగా 50,000 యూనిట్లకు పెరిగాయి. స్మార్ట్ రిస్ట్బ్యాండ్స్ విక్రయాలు 118.5 శాతం పెరిగి 83,000 యూనిట్లకు చేరాయి. ప్రధానంగా శాంసంగ్కి చెందిన ఫిట్3కి గణనీయంగా డిమాండ్ నెలకొంది. క్యూ2లో రిస్ట్బ్యాండ్స్ కేటగిరీలో శాంసంగ్ 80.6 శాతం మార్కెట్ వాటా దక్కించుకుంది. -
సేమ్ షాక్: ఎయిర్టెల్లోనూ ఆ ప్లాన్ కనుమరుగు
టెలికాం సర్వీస్ ప్రొవైడర్ భారతీ ఎయిర్టెల్ తన ఎంట్రీ సెగ్మెంట్ ప్రీపెయిడ్ ప్లాన్ను నిలిపివేసింది. ప్రత్యర్థి సంస్థ జియో కూడా రూ.249 ధర గల ఎంట్రీ లెవల్ ప్లాన్ ను నిలిపివేసింది. ఎక్కువ మంది రీచార్జ్ చేసుకునే ఈ ప్లాన్ ను ఎయిర్టెల్ నిశ్శబ్దంగా కనుమరుగు చేసింది. ఇప్పుడు వారు రూ .299 ధర గల ఖరీదైన ప్రీపెయిడ్ ప్లాన్ ను ఎంచుకోవలసి వచ్చింది.ఎయిర్ టెల్ నిలిపివేసిన ఈ ప్లాన్ ధర రూ.249. ఇది 28 రోజుల పాటు రోజుకు 1 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లను అందించేది. ముఖ్యంగా, ఇది వినియోగదారులకు ఉచిత హలోట్యూన్స్, ప్రో ఏఐ, ఎక్స్ట్రీమ్ ప్లే వంటి ప్రయోజనాలను కల్పించేది. 28 రోజుల పాటు రోజుకు 1 జీబీ డేటాను అందించే రూ.249 ప్లాన్ ను జియో కూడా ఇటీవల తొలగించింది. జియోలో ఇకపై 1 జీబీ రోజువారీ డేటా లిమిట్తో ఎలాంటి ప్లాన్ లేదు. చౌకైన 28 రోజుల ప్లాన్ ఇప్పుడు రూ .299 నుండి ప్రారంభమవుతుంది. ఇది రోజుకు 1.5 జిబి డేటాను అందిస్తుంది.ఈ చర్య ఎయిర్ల్, జియోలకు సగటు వినియోగదారుడి ఆదాయాన్ని (ఏఆర్పీయూ) పెంచుతుండగా, సామాన్యులపై ఖరీదైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల భారం పడుతోంది. ఈ రెండు టెలికాం ఆపరేటర్లు తీసుకున్న నిర్ణయాన్ని మరో ప్రైవేట్ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా కూడా అనుసరించే అవకాశం ఉంది. -
బోనస్ వస్తుందోచ్.. ఇన్ఫీ ఉద్యోగులకు శుభవార్త
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 2025-26 ఆర్థిక సంవత్సరం ప్రథమ త్రైమాసికానికి (Q1 FY2025-26) సంబంధించిన పనితీరు బోనస్ లెటర్లను జారీ చేసింది. ఈ త్రైమాసికంలో కంపెనీ ఆర్థిక పనితీరు బలంగా ఉండటంతో ఉద్యోగులకు కూడా మెరుగైన బోనస్ను ప్రకటించింది.2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి సంబంధించి ఉద్యోగులకు సగటున 80% పనితీరు బోనస్ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. గత త్రైమాసికంలో ఇచ్చిన 65% సగటు బోనస్ చెల్లింపుతో పోలిస్తే ఇది గణనీయమైన వృద్ధి. దీంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రకటించిన ఈ బోనస్ ఆగస్టు నెల జీతంతో పాటు ఉద్యోగులకు అందనుంది.ఉద్యోగులు తమ పనితీరు రేటింగ్ ఆధారంగా 75% నుండి 89%వరకు బోనస్ పొందారు. ఈ బోనస్ చెల్లింపు లెవెల్ 4, 5, 6 స్థాయిల్లో ఉన్న (సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, టీమ్ లీడర్లు, సీనియర్ మేనేజర్లు) 3.23 లక్షల మందికి పైగా ఉద్యోగులను కవర్ చేస్తుంది. పనితీరు విషయంలో ఉద్యోగులను మూడు కేటగిరీలుగా వర్గీకరించి బోనస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.ఇన్ఫోసిస్ 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి బలమైన ఆర్థిక ఫలితాలు సాధించింది. రూ.6,921 కోట్ల నికర లాభం (వార్షిక ప్రాతిపదికన 8.7% వృద్ధి), రూ.42,279 కోట్ల ఆదాయం (వార్షిక ప్రాతిపదికన 7.5% వృద్ధి) నమోదు చేసి, విశ్లేషకుల అంచనాలను అధిగమించింది.ఇదీ చదవండి: ఐటీ రంగంలో అత్యంత భారీ డీల్ -
చాట్జీపీటీ గో ప్లాన్@ రూ. 399
న్యూఢిల్లీ: ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ఏఐ భారత్లో ‘చాట్జీపీటీ గో’కి సంబంధించి కొత్త సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ప్రకటించింది. ఉచిత ప్లాన్తో పోలిస్తే 10 రెట్లు అధికంగా మెసేజీలు, ఇమేజ్ల జనరేషన్, ఫైల్ అప్లోడ్స్ పరిమితులతో ఈ ప్లాన్ నెలవారీగా రూ. 399గా ఉంటుంది. చాట్జీపీటీ అధునాతన సామర్థ్యాలను మరింత అందుబాటు ధరలో పొందాలనుకునే వారి కోసం ‘చాట్జీపీటీ గో’ని డిజైన్ చేసినట్లు వివరించింది. యాక్సెస్ విషయంలో ప్రాధాన్యత, వేగవంతమైన పనితీరు, అధిక యూసేజీ పరిమితులు అందించే ప్రస్తుత చాట్జీపీటీ ప్లస్కి (నెలకు రూ. 1,999) ఈ కొత్త ప్లాన్ అదనంగా ఉంటుంది. అత్యంత అధునాతన మోడల్స్, మరింత కస్టమైజేషన్ కావాలనుకునే ప్రొఫెషనల్స్, సంస్థల కోసం చాట్జీపీటీ ప్రో (నెలకు రూ. 19,900)ని అందిస్తున్నట్లు ఓపెన్ఏఐ వివరించింది. యూపీఐ విధానంతో కూడా సబ్ స్క్రిప్షన్కి చెల్లింపులు జరపవచ్చని చాట్జీపీటీ వీపీ నిక్ టర్లీ తెలిపారు. చాట్జీపీటీకి భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రెండో భారీ మార్కెట్గా ఉంది. -
రూ. 5,800 కోట్లతో అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ
న్యూఢిల్లీ: ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్ సేవల దిగ్గజంగా ఎదిగే దిశగా ఇండియా పోస్ట్ రూ. 5,800 కోట్లతో అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ (ఏపీటీ) ప్రాజెక్టును ఆవిష్కరించింది. ఏపీటీ ఆధారిత మౌలిక సదుపాయాలతో ఆధునిక లాజిస్టిక్స్ కంపెనీల్లాగా ఇండియా పోస్ట్కి సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందని ‘ఎక్స్’లో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పోస్ట్ చేశారు. డిజిటల్ లావాదేవీలను, ఏ బ్యాంకు కస్టమర్ల నుంచైనా యూపీఐ చెల్లింపులను స్వీకరించేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.సాంకేతిక అంశాల కారణంగా పోస్టాఫీసు సర్వీసులను కొనుగోలు చేయాలన్నా, ఇతర చెల్లింపులు జరపాలన్నా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ఖాతాల నుంచి మాత్రమే సాధ్యపడేది. ఎక్కడైనా సర్వీసులు అందించేందుకు, రియల్ టైమ్లో నిర్ణయాలు తీసుకునేందుకు కొత్త టెక్నాలజీ ఉపయోగపడుతుందని సింధియా వివరించారు. -
హైదరాబాద్లో తలెత్తిన ఇంటర్నెట్ సమస్య
టీజీఎస్పీడీసీఎల్ (TGSPDCL) హైదరాబాద్లో కేబుల్స్ తొలగించడం వల్ల, నగరంలో ఫైబర్ టు హోమ్ కనెక్టివిటీ సమస్యలు తలెత్తాయి. ఇది పెద్ద సంఖ్యలో హోమ్ బ్రాడ్బ్యాండ్ వినియోగదారులకు అంతరాయాన్ని కలిగించింది.విద్యుత్ శాఖ ఆప్టికల్ ఫైబర్ కేబుల్లను విచక్షణారహితంగా.. కత్తిరించడం వల్ల ఈ (ఇంటర్నెట్) అంతరాయం ఏర్పడింది. ఇంటర్నెట్ కేబుల్లు విద్యుత్తును తీసుకువెళ్లవని.. దీనివల్ల విద్యుత్ మౌలిక సదుపాయాలకు సంబంధం లేదని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) చెబుతోంది. విచక్షణారహితంగా కేబుల్స్ కట్ చేయడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని శాఖను కోరుతున్నామని వెల్లడించింది.ఇదీ చదవండి: అమెరికా సుంకాలు.. రిస్క్లో 3 లక్షల ఉద్యోగాలు!నగరంలో తలెత్తిన సమస్యను పరిష్కరించడానికి.. ఇంటర్నెట్ సేవలను వీలైనంత త్వరగా పునరుద్ధరించడానికి సంబంధిత శాఖ పనిచేస్తోంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ దెబ్బతినడం వల్ల చాలా ముఖ్యమైన సేవలు నిలిచిపోతాయి. ప్రస్తుతం ఈ ప్రభావం జియో, ఎయిర్టెల్లకు చెందిన దాదాపు 40 వేల ఫైబర్ కస్టమర్లపై పడింది. -
టెలికం కంపెనీలకు లాభాల మోత!
న్యూఢిల్లీ: టెలికం కంపెనీల నిర్వహణ లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) 12–14% పెరగొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. రూ.1.55 లక్షల కోట్లుగా ఉంటుందని తెలిపింది. డేటా వినియోగంతో సగటు యూజర్ నుంచి వచ్చే ఆదాయం (ఏఆర్పీయూ) పెరుగుతుందని పే ర్కొంది. 5జీ సేవలను ప్రారంభించిన అనంతరం బలమైన పనితీరు, మూలధన వ్యయాల తీవ్రత తగ్గుతుండడం, మె రుగైన నగదు ప్రవాహాలు కంపెనీల రుణ పరపతికి మద్ద తుగా నిలుస్తున్నట్టు వివరించింది. ఏఆర్పీయూ ప్రతి రూపాయి పెరుగుదలతో టెలికం కంపెనీలకు మొత్తంగా రూ.850–900కోట్లు సమకూరుతుందని వెల్లడించింది. టెలి కం రంగంలో 93% చందాదారులను కలిగిన మూడు ప్రము ఖ టెలికం కంపెనీలపై (జియో, ఎయిర్టెల్, వొడాఫోన్) అధ్యయనం చేసిన క్రిసిల్ రేటింగ్స్ ఈ నివేదికను విడుదల చేసింది. టారిఫ్ల పెంపుతో టెలికం కంపెనీల నిర్వహణ లాభం 2024–25లో 17% వృద్ధి చెందడం గమనార్హం. ప్రీమియం ప్లాన్లు.. ఓటీటీ సేవల కోసం డేటాకు డిమాండ్ పెరుగుతుండడంతో దీన్నుంచి ప్రయోజనం పొందేందుకు టెలికం కంపెనీలు ప్రీమియం ప్లాన్లను ఆఫర్ చేస్తుండడాన్ని క్రిసిల్ రేటింగ్స్ నివేదిక ప్రస్తావించింది. ఇది కూడా సగటు యూజర్ వారీ ఆదాయాన్ని పెంచుతుందని తెలిపింది. ఇక చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో టెలికం సేవల విస్తరణ మరో 4–5 శాతం పెరిగి 2026 మార్చి నాటికి 82 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది. వాయిస్ కాల్స్ ప్లాన్లను వినియోగిస్తున్న యూజర్లు డేటా ప్లాన్లకు మళ్లడం ఆదాయాన్ని పెంచుతుందని వివరించింది. ఈ ధోరణులతో టెలికం కంపెనీలకు ఆదాయం పెరుగుతుందని.. అదే సమయంలో కంపెనీలకు 60 శాతం వ్యయాలు స్థిరంగా ఉంటాయి కనుక నిర్వహణ లాభం అధికమవుతుందని పేర్కొంది. అలాగే, మూలధన వ్యయాల అవసరం తక్కువగా ఉండడంతో ఫ్రీక్యాష్ ఫ్లో (నికర మిగులు నిల్వలు) పెరుగుతుందని వివరించింది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో 31 శాతంగా ఉన్న మూలధన వ్యయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 24–26 శాతానికి (ఆదాయంలో) పరిమితమవుతాయని క్రిసిల్ రేటింగ్స్ అసోసియేట్ డైరెక్టర్ నితిన్ బన్సాల్ తెలిపారు. స్పెక్ట్రమ్ కొనుగోళ్లు దాదాపుగా 2022–23 ఆర్థిక సంవత్సరంలోనే ముగిశాయని, తదుపరి స్పెక్ట్రమ్ పెట్టుబడులు 2030లో అవసరపడతాయని చెప్పారు. ఇవన్నీ కలసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.70,000 కోట్ల ఫ్రీ క్యాష్ ఫ్లోకు దారితీస్తాయని తెలిపారు. కంపెనీల నికర రుణ భారం 3.4 రెట్ల నుంచి 2.7 రెట్లకు (మూలధనంతో దిగొస్తుందన్నారు. రూ.225కు ఏఆర్పీయూ ‘‘గత ఆర్థిక సంవత్సరంలో ఏఆర్పీయూ రూ.205గా ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.220–225కు చేరుకుంటుంది. ప్రధానంగా అధిక డేటా వినియోగం ఇందుకు దోహదం చేస్తుంది. 5జీ నెట్వర్క్ లభ్యత మరింత విస్తృతమై 2026 మార్చి నాటికి 45–47 శాతానికి చేరుకుంటుంది. 2025 మార్చి నాటికి ఇది 35 శాతంగా ఉంది’’అని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ ఆనంద్ కులకర్ణి తెలిపారు. సోషల్ మీడియా యాప్లు, వీడియో స్ట్రీమింగ్, గేమింగ్, జెనరేటివ్ ఏఐ, డిజిటల్ మార్కెటింగ్ కోసం డేటా వినియోగం పెరుగుతున్నట్టు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో సగటు యూజర్ నెలవారీ డేటా వినియోగం 27జీబీగా ఉంటే, అది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 31–32జీబీకి పెరుగుతుందన్నారు. ‘‘టెలికం కంపెనీలు ప్లాన్లలో డేటా ప్రయోజనాలను తగ్గిస్తున్నాయి. లేదా అధిక డేటా ప్లాన్లపైనే 5జీ సేవలను ఆఫర్ చేస్తున్నాయి. ఈ చర్యలు కస్టమర్లు ప్రీమియం ప్లాన్లకు వెళ్లేలా చేస్తాయి. దీంతో కంపెనీల ఏఆర్పీయూ పెరుగుతుంది’’అని కులకర్ణి వివరించారు. -
బెంగళూరు ఫాక్స్కాన్ ప్లాంట్ షురూ
న్యూఢిల్లీ: తైవాన్కు చెందిన ఎల్రక్టానిక్స్ తయారీ సంస్థ ఫాక్స్కాన్ బెంగళూరులోని తన యూనిట్లో కార్యకలాపాలు ప్రారంభించింది. స్వల్ప స్థాయిలో ఐఫోన్ 17 ఉత్పత్తిని ఆరంభించింది. చైనా తర్వాత రెండో అతిపెద్ద తయారీ కేంద్రాన్ని బెంగళూరు సమీపంలోని దేవనహళ్లి వద్ద 2.8 బిలియన్ డాలర్లతో (రూ.25,000 కోట్లు) ఫాక్స్కాన్ ఏర్పాటు చేయడం గమనార్హం. ఐఫోన్ తయారీలో ఫాక్స్కాన్ అతిపెద్ద సంస్థగా ఉంది. బెంగళూరులోని యూనిట్లో ఐఫోన్ 17 ఉత్పత్తితో కార్యకలాపాలు మొదలు పెట్టినట్టు.. చెన్నై యూనిట్లోనూ ఐఫోన్ 17 తయారీ చేస్తున్నట్టు ఈ వ్యహారం తెలిసిన వర్గాలు తెలిపాయి. ఇటీవలే ఫాక్స్కాన్ బెంగళూరు యూనిట్ నుంచి వందలాది చైనా ఇంజనీర్లు, నిపుణులు అర్ధంతరంగా వెనక్కి వెళ్లిపోవడం తెలిసిందే. అవసరం అయితే తైవాన్ నుంచి అయినా నిపుణులను తెచ్చుకోగల సామర్థ్యం ఫాక్స్కాన్కు ఉండడంతో దీని ప్రభావం పెద్దగా పడలేదు. 60 మిలియన్ ఐఫోన్లుఐఫోన్ తయారీని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 60 మిలియన్ యూనిట్లకు పెంచే ప్రణాళికతో ఫాక్స్కాన్ ఉంది. 2024–25లో 35–40 యూనిట్లను తయారు చేసింది. 2025 జూన్లో అమెరికాలో విక్రయించిన మెజారిటీ ఐఫోన్లు భారత్లో తయారైనవేనని యాపిల్ సీఈవో టిక్కుక్ జూలై 31న ప్రకటించడం గమనార్హం. అంతేకాదు, జూన్ త్రైమాసికంలో అమెరికాలో విక్రయించిన ఐఫోన్లు సైతం భారత్ నుంచి రవాణా చేసినవిగా ఫలితాల అనంతరం సమావేశంలో ప్రకటించారు. భారత్లోని యాపిల్ సరఫరాదార్లు 2025 మొదటి ఆరు నెల్లో 5.9 మిలియన్ యూనిట్లన సరఫరా చేశారు. గతేడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 21.5 శాతం అధికం. ఎస్అండ్పీ గ్లోబల్ అంచనా ప్రకారం 2024లో అమెరికాలో ఐఫోన్ల అమ్మకాలు 75.9 మిలియన్ యూనిట్లుగా ఉన్నాయి. -
స్మార్ట్ఫోన్లో ఉండాల్సిన ముఖ్యమైన 12 యాప్స్
టెక్నాలజీ విస్తరిస్తోంది.. ప్రపంచం పరుగెడుతోంది. సమయం చాలా ముఖ్యమైపోయింది. ఇలాంటి సమయంలో స్మార్ట్ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరూ తప్పకుండా కొన్ని ప్రభుత్వ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇవి మీ సమయాన్ని మాత్రమే కాకుండా.. అవసరమైన గవర్నమెంట్ సర్వీసులను ఉపయోగించుకోవడానికి కూడా అనుమతిస్తాయి.ఉమాంగ్ (యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్)కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి స్థానిక ప్రభుత్వ సంస్థల వరకు దేశవ్యాప్త ఈ-గవర్నమెంట్ సేవలను యాక్సెస్ చేయడానికి 'ఉమాంగ్' యాప్ చాలా ఉపయోగపడుతుంది. ఇందులో పీఎఫ్ క్లెయిమ్స్ అప్లై చేసుకోవడం దగ్గర నుంచి.. యుటిలిటీ బిల్లులు చెక్ చేసుకోవడం వరకు ఉన్నాయి. ఇది సుమారు 1500 కంటే ఎక్కువ ప్రభుత్వ సేవలకు ఒక ప్లాట్ఫామ్.పన్ను చెల్లింపుదారుల కోసం ఏఐఎస్ఏఐఎస్ యాప్ అనేది.. భారత ప్రభుత్వ ఆదాయపు పన్ను శాఖ అందించే ఫ్రీ మొబైల్ అప్లికేషన్. యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ (AIS)కు సంబంధించిన సమాచారాన్ని అందించడమే ముఖ్య ఉద్దేశ్యంగా ఈ యాప్ పనిచేస్తుంది. ఇందులో పన్ను చెల్లింపుదారులు తమ అభిప్రాయాలను అందించవచ్చు.డిజిలాకర్డిజిలాకర్ అనేది.. భారతదేశంలో ప్రభుత్వ మద్దతుతో పనిచేసే అప్లికేషన్. డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) దీనిని ప్రారంభించారు. పేపర్లెస్ పాలనను ప్రోత్సహించడానికి ప్రారంభించిన ఈ అప్లికేషన్ ముఖ్యమైన డాక్యుమెంట్స్ (ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి) స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇందులో డాక్యుమెంట్స్ ఉంటే ఫిజికల్ కాపీలను చూపించాల్సిన అవసరం లేదు.డిజియాత్రవిమానాశ్రయాలలో వేగవంతమైన చెక్-ఇన్ల కోసం డిజియాత్ర చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం ఇది అనేక ప్రధాన నగరాల్లో పనిచేస్తుంది.ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్బ్రోకర్ అవసరం లేకుండా నేరుగా ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది చాలా సురక్షితమైనది, పారదర్శకమైనది. అంతే కాకుండా పెట్టుబడికి సంబంధించిన మొత్తం ప్రక్రియ ఆన్లైన్లోనే ఉంటుంది.పోస్ట్ఇన్ఫోపోస్ట్ఇన్ఫో అనేది ఇండియా పోస్ట్ యాప్. దీని ద్వారా స్పీడ్ పోస్ట్లను ట్రాక్ చేయవచ్చు. పోస్టల్ ధరలను చెక్ చేసుకోవచ్చు. మీకు సమీపంలో ఏ పోస్టాఫీసులు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.స్వయం (SWAYAM)స్వయం యాప్ ద్వారా IIT, IIM వంటి అగ్రశ్రేణి సంస్థల నుంచి పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు ప్రతిదానిని కవర్ చేయవచ్చు. ఇందులో ఫ్రీ ఆన్లైన్ కోర్సులను పొందవచ్చు. విద్యార్థులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఇదీ చదవండి: ఐదు ఏఐ కోర్సులు.. పూర్తిగా ఉచితం112 ఇండియాపోలీసులు, అగ్నిమాపక & అంబులెన్స్ సేవలను తక్షణమే పొందటానికి 112 ఇండియా యాప్ ఉపయోగపడుతుంది. ఇది ఆండ్రాయిడ్ బేస్డ్ యాప్, దీనిని పౌరులు అత్యవసర సమయంలో సహాయం కోరడానికి ఉపయోగించవచ్చు.భీమ్ యూపీఐభీమ్ యూపీఐ అనేది నగదు రహిత లావాదేవీలను అనుమతిస్తుంది. ఇది ప్రభుత్వ యూపీఐ యాప్. ఇది సింపుల్ అండ్ సెక్యూర్ కూడా.నెక్స్ట్జెన్ ఎంపరివాహన్ఆర్సీ, డీఎల్ యొక్క డిజిటల్ వెర్షన్లను యాక్సెస్ చేయడానికి మాత్రమే కాకుండా.. చలాన్లను చెక్ చేయడానికి నెక్స్ట్జెన్ ఎంపరివాహన్ యాప్ ఉపయోగపడుతుంది.దీక్ష (DIKSHA)దీక్ష అనేది పాఠశాల విద్యార్థులు.. ఉపాధ్యాయుల కోసం ఉపయోగపడే ఒక ఇ-లెర్నింగ్ యాప్. ఇది పాఠ్యాంశాలకు అనుగుణంగా నాణ్యమైన విద్యా కంటెంట్ను అందిస్తుంది.జన్ ఔషధి సుగంసరసమైన ధరలకు జనరిక్ మందులను, సమీపంలోని జన్ ఔషధి కేంద్ర స్థానాలను సులభంగా కనుగొనడానికి 'జన్ ఔషధి సుగం' యాప్ ఉపయోగపడుతుంది. -
బాత్రూమ్ సింగింగ్ పార్ట్నర్.. మాయ అద్దం!
హ్యాపీ బాత్రూమ్ నుంచే హ్యాపీ డే మొదలవుతుంది. బాత్రూమ్లో కలిగే చిన్న చిరాకు మీ రోజంతటినీ చెడగొడుతుంది. అందుకే బాత్రూమ్ ఇబ్బందులన్నీ క్షణాల్లో తీర్చేసే స్మార్ట్ గ్యాడ్జెట్స్ గురించి ఈ కథనంలో చూసేద్దాం.బాత్రూమ్ సింగింగ్ పార్ట్నర్!స్నానం మొదలైందంటే బకెట్లో నీళ్లు మాత్రమే కాదు, కొందరి నోటి నుంచి పాటలు కూడా వెలువడుతూ ఉంటాయి. అలా బాత్రూమ్లో పాడుతూ గాన స్నానాల్లో ఓలలాడే బాత్రూమ్ రాక్స్టార్స్కు ఇప్పుడు ఓ కొత్త సింగింగ్ పార్ట్నర్ వచ్చేసింది. అదే ‘మాక్సీ షవర్హెడ్ ’. ఇది కేవలం షవర్ మాత్రమే కాదు, ఇందులో బ్లూటూత్ స్పీకర్ కూడా ఉంటుంది. మొబైల్తో బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేస్తే చాలు.నీటి శబ్దం మధ్య కూడా మీ పాటలు స్పష్టంగా వినిపిస్తాయి. స్పీకర్ను తొలగించడమూ, వాడడమూ చాలా సులభం. యూఎస్బీ ద్వారా పూర్తిగా చార్జ్ చేస్తే దాదాపు ఏడుగంటలపాటు పనిచేస్తుంది. ఈ స్పీకర్ శబ్దం నీటి శబ్దాన్ని మించి ఉంటుంది. అందుకే, ఏ అవరోధాలు లేకుండా పాటలు, కథలు, వార్తలు అన్నీ స్పష్టంగా వినవచ్చు. ఫోన్ కాల్ వచ్చినా, స్నానం చేస్తూనే మాట్లాడుకోవచ్చు. ధర సుమారు రూ.10,000. అయితే, కొన్ని చోట్ల తగ్గింపు ధరకూ లభిస్తోంది.బబుల్ బాత్పిల్లలకు స్నానం చేయించడమంటే టామ్ అండ్ జెర్రీ ఫైట్ లాంటిది. ఒకరు పరుగులు పెడితే, మరొకరు వెనకాలే పరుగెడుతూనే ఉండాలి. ‘నో... నో...’ అంటూ పిల్లలు అరుస్తుంటే, ‘ఐదు నిమిషాలే... ఐదు నిమిషాలే’ అంటూ అమ్మనాన్నలు వారిని పట్టుకోవడానికి తిరుగుతూనే ఉంటారు. ఇలాంటి హడావిడితో నిండిన బాత్ టైమ్కు గుడ్బై చెప్పే పరిష్కారం వచ్చేసింది! అదే ఈ ‘బాత్ బబుల్ మేకర్’. ఇది నీటి బుడగలను తయారుచేసే పరికరం మాత్రమే కాదు, పిల్లల మొహాల్లో నవ్వులు విరబూయించే సాధనం కూడా!మ్యూజిక్, బబుల్స్, పిల్లల్ని ఆకట్టుకునేలా ఉండే రంగురంగుల డిజైన్లతో ఉండే వీటిని బాత్రూమ్ గోడకు తగిలించేశారంటే చాలు. పిల్లలు స్వయంగా ‘నాకు టబ్ టైమ్ కావాలి!’ అని తెగ కోరుకుంటారు. మార్కెట్లో ఇవి వివిధ ధరల్లో లభిస్తున్నాయి. సంగీతం, లైట్స్తో ఉన్న ఆటోమేటిక్ బబుల్ మేకర్లు రూ.2,000 నుంచి రూ.5,000 వరకు లభిస్తాయి. అధిక బబుల్ ఔట్పుట్ ఉన్న హైఎండ్ మోడల్స్కు అయితే ధర రూ.5,000 కంటే ఎక్కువే ఉంటుంది.మాయ అద్దం!ఉదయం కాఫీ చల్లారినా భరించగలమేమో కాని, షవర్ తర్వాత అద్దంలో ముఖం కనిపించకపోతే మాత్రం వేడెక్కిపోతాం! అప్పుడు చేతిలో టవల్ పట్టుకుని అద్దాన్ని తుడవక తప్పదు. ఇలా ప్రతి ఉదయం చిరాకు తెప్పించే ఈ చిన్న వర్కౌట్కి ఇప్పుడు శాశ్వత పరిష్కారం దొరికింది. అదే ఫాగ్లెస్ మిర్రర్. దీనిని యాంటీ–ఫాగ్ పూతతో తయారు చేస్తారు.ఇలాంటి అద్దాలు కొన్నింటిలో హీటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇది అద్దాన్ని మెల్లగా వేడి చేసి పొగను తొలగిస్తుంది. మరికొన్నింటిలో ఎల్ఈడీ లైట్లు కూడా ఉంటాయి, ఇవి క్లియర్ విజ¯Œ కి తగిన వెలుతురును అందిస్తాయి. దీంతో షేవింగ్, మేకప్ ఏదైనా పని సులభంగా, స్పష్టంగా చేయవచ్చు. ఇవి మార్కెట్లో వివిధ డిజైన్లలో అందుబాటులో ఉన్నాయి. గోడకూ అమర్చుకోచ్చు, టేబుల్పైన అయినా ఉంచవచ్చు. ధర కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది. సింపుల్ వెర్షన్లు రూ.799 నుంచి, హీటెడ్ అద్దాలు, లైటింగ్ ఉన్నవి రూ.2,000 వరకు లభిస్తున్నాయి. -
తల్లి కాబోతున్న రోబో!
స్త్రీ, పురుషుల కలయికతో పిల్లలు పుట్టడం సర్వసాధారణం. ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో టెస్ట్ ట్యూబ్ బేబీలు పుడుతున్నారు. సరోగసీ ద్వారా కూడా పిల్లలను కంటున్నారు. అయితే శిశువు పుట్టడానికి మనిషి గర్భమే అవసరం లేదంటూ.. చైనా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా 'గర్భధారణ రోబోట్'లను సృష్టిస్తున్నారు. వినడానికి ఇది వింతగా ఉన్నా.. దీనికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే, ఈ కథనం చదవాల్సిందే..ప్రపంచంలోనే మొట్టమొదటి 'గర్భధారణ రోబోట్'పై చైనా శాస్త్రవేత్తలు పని చేస్తున్నారని, ఇది సజీవ శిశువుకు జన్మనిస్తుందని ది టెలిగ్రాఫ్ నివేదించింది. ఈ టెక్నాలజీ గర్భధారణ నుంచి ప్రసవం వరకు గర్భధారణకు కావలసిన అన్ని విషయాలను అనుకరిస్తుందని నిపుణులు పేర్కొన్నారు.పిండం అనేది గర్భధారణ రోబో.. కృత్రిమ గర్భంలోనే పెరుగుతుంది. పిండాలకు కావలసిన పోషకాలు అన్నీ కూడా ట్యూబ్స్ ద్వారా అందిస్తారు. అయితే అండం, స్పెర్మ్ ఎలా.. ఎక్కడ ఫలదీకరణం అవుతుందనే విషయాలను ప్రస్తుతానికి శాస్త్రవేత్తలు వెల్లడించలేదు. సింగపూర్లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ 'జాంగ్ కిఫెంగ్' నేతృత్వంలోని గ్వాంగ్జౌకు చెందిన కైవా టెక్నాలజీ ఈ రోబోను అభివృద్ధి చేస్తోంది.ఇదీ చదవండి: ఐదు ఏఐ కోర్సులు.. పూర్తిగా ఉచితంఈ టెక్నాలజీ విజయవంతమైతే.. సంతానం లేని జంటలకు లేదా జీవసంబంధమైన గర్భధారణ చేయించుకోవడానికి ఇష్టపడని వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ పరిణతి చెందిన దశలో ఉందని డాక్టర్ జాంగ్ పేర్కొన్నారు. పిండం.. రోబోట్ కృత్రిమ గర్భంలో పెరగడానికి కావలసిన జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఈ రోబోట్ నమూనా 2026 నాటికి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.మనిషి గర్భంతో పనిలేకుండా రాబోయే టెక్నాలజీ బాగానే ఉంది. కానీ ఇది ప్రతికూల ప్రభావాలకు దారి తీస్తుందేమో అని కొందరు అభిప్రాయపడుతున్నారు. తల్లి, బిడ్డల పేగు బంధం లేకపోతే.. పిల్లల మానసిక ప్రభావం ఎలా ఉండబోతుందో అని ఆందోళన చెందుతున్నారు. అంతే కాకుండా ఇది చట్టపరంగా సాధ్యమేనా?, చట్టాలు దీనికి ఒప్పుకుంటాయా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. -
పాతిక వేలలో ఒప్పో నుంచి కొత్త ఫోన్
స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో ఇండియా తాజాగా కే13 టర్బో సిరీస్ ప్రో 5జీ, టర్బో 5జీ ఫోన్లను ఆవిష్కరించింది. వీటిలో అంతర్గతంగా కూలింగ్ ఫ్యాన్ ఉంటుందని, దేశీయంగా స్మార్ట్ఫోన్లలో ఈ ఫీచరును అందించడం ఇదే ప్రథమం అని సంస్థ తెలిపింది. భారీగా మల్టీ టాస్కింగ్, గేమింగ్కి అనువుగా ఇవి ఉంటాయని వివరించింది.7000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్స్ సూపర్వూక్ ఫాస్ట్ చార్జింగ్, 1.5 అమోలెడ్ డిస్ప్లే తదితర ఫీచర్లు వీటిలో ఉన్నాయి. దీని ధర రూ. 27,999 నుంచి ప్రారంభం అవుతుంది. అయితే, ఆఫర్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే రూ. 24,999 నుంచి లభిస్తుందని సంస్థ తెలిపింది. టర్బో ప్రో 5జీ ఫోన్ల సేల్ ఆగస్టు 15 నుంచి, టర్బో 5జీ ఫోన్ల అమ్మకాలు 18 నుంచి ప్రారంభమవుతాయి.ముఖ్యమైన ఫీచర్లుఇండియాలో మొట్టమొదటి సారిగా అంతర్గత కూలింగ్ ఫ్యాన్ ఉన్న స్మార్ట్ఫోన్గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందింది.ట్రిపుల్-లెవల్ కూలింగ్ సిస్టమ్: కూలింగ్ ఫ్యాన్, ఎయిర్ డక్ట్స్, 5000mm² వేపర్ చాంబర్.ప్రాసెసర్: స్నాప్డ్రాగన్ 8ఎస్ జెన్ 4 ఎస్ఓసీర్యామ్ & స్టోరేజ్: 8జీబీ/12జీబీ ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జీబీ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్.డిస్ప్లే: 6.8 అంగుళాల ఎల్టీపీఎస్ అమోల్డ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, 1500 నిట్స్ బ్రైట్నెస్.బ్యాటరీ: 7000mAh, 80 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ (15 నిమిషాల్లో 50%).కెమెరా: 50MP + 2MP రియర్, 16MP ఫ్రంట్, 4K 60fps వీడియో సపోర్ట్.సాఫ్ట్వేర్: ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్ఓఎస్ 15, 2 ఓఎస్ అప్డేట్లు, 3 ఏళ్లు సెక్యూరిటీ ప్యాచ్లుధర & లభ్యతకే13 టర్బో ప్రో 5జీ ఫోన్ ప్రారంభ ధర రూ.37,999 కాగా డిస్కౌంట్లో రూ. 34,999 లకు లభిస్తుంది. అలాగే కే13 టర్బో 5జీ ఫోన్ ధర రూ. 27,999 కాగా తగ్గింపులు పోగా రూ. 24,999 లకు లభిస్తుంది. ఈ ఫోన్లు ఫ్లిప్కార్ట్, ఒప్పో ఈ-స్టోర్లు, ఇతర ఆఫ్లైన్ స్టోర్స్ ద్వారా అందుబాటులో ఉంటాయి. -
యాపిల్ ఉత్పత్తుల సరఫరా 21% అప్
న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రథమార్ధంలో భారత్లో యాపిల్ ఉత్పత్తుల సరఫరా వార్షికంగా 21.5 శాతం పెరిగి 59 లక్షల యూనిట్లకు చేరుకుంది. అత్యధికంగా సరఫరా అయిన మోడల్గా ఐఫోన్ 16 నిల్చింది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) ఓ నివేదికలో ఈ విషయాలు తెలిపింది. దీని ప్రకారం గతేడాది ప్రథమార్ధంతో పోలిస్తే దేశీ మార్కెట్లో స్మార్ట్ఫోన్ల సరఫరా 0.9 శాతం పెరిగి 7 కోట్లకు చేరింది. పోకో, షావోమీ, వన్ప్లస్, రియల్మి తదితర చైనా సంస్థల ఫోన్ల సప్లై తగ్గింది. ఇక రెండో త్రైమాసికంలో మొత్తం 3.7 కోట్ల స్మార్ట్ఫోన్స్ సరఫరా అయ్యాయి. యాపిల్ ఐఫోన్ల సరఫరా 19.7 శాతం పెరిగి 27 లక్షల యూనిట్లకు చేరింది. స్మార్ట్ఫోన్ మార్కెట్లో 7.5 శాతం వాటా దక్కించుకుంది. మరిన్ని విశేషాలు.. → జూన్ క్వార్టర్లో 19 శాతం మార్కెట్ వాటాతో వివో అగ్ర స్థానంలో (23.5 శాతం వార్షిక వృద్ధి) నిల్చింది. 14.5 శాతం వాటాతో శాంసంగ్ (21 శాతం వృద్ధి) రెండో స్థానంలో ఉంది. ఒప్పో (13.4 శాతం వాటా, 25.4 శాతం వృద్ధి), మోటరోలా (8 శాతం వాటా, 39.4 శాతం వృద్ధి) ఆ తర్వాత ర్యాంకుల్లో ఉన్నాయి. → వన్ప్లస్ మార్కెట్ వాటా 4.4 శాతం నుంచి 2.5 శాతానికి, సరఫరా 39.4 శాతం మేర పడిపోయాయి. → రియల్మి మార్కెట్ వాటా 9.7 శాతానికి, స్మార్ట్ఫోన్ల సప్లై 17.8 శాతం మేర క్షీణించాయి. అటు షావోమీ మార్కెట్ వాటా కూడా 9.6 శాతానికి, వాల్యూమ్స్ 23.5 శాతం స్థాయిలో తగ్గాయి. పోకో 3.8 శాతానికి తగ్గగా, సరఫరా 28.8 శాతం మేర క్షీణించింది. → ప్రీమియం సెగ్మెంట్ డివైజ్లు (రూ.52,000 నుంచి రూ. 70,000 వరకు) అత్యధికంగా 96.4% వృద్ధి చెందాయి. మార్కెట్ వాటా 2 నుంచి 4 శాతానికి పెరిగింది. ఈ విభాగంలో ఐఫోన్ 16/15ల వాటా అయిదింట మూడొంతులు ఉంది. → సూపర్ ప్రీమియం సెగ్మెంట్ ఫోన్లు (రూ. 70,000 కన్నా పైన) 15.8% వృద్ధి చెందగా, మార్కెట్ వాటా పెద్దగా మార్పులు లేకుండా 7 శాతంగా కొనసాగింది. శాంసంగ్, యాపిల్ మార్కెట్ వాటా వరుసగా 49%, 48%గా ఉంది. ఈ సెగ్మెంట్లో ఐఫోన్ 16, గెలాక్సీ ఎస్25, ఎస్24 అల్ట్రా, ఎస్25, ఐఫోన్ 16ప్లస్ కీలక మోడల్స్గా ఉన్నాయి. → స్మార్ట్ఫోన్ల సగటు విక్రయ ధర (ఏఎస్పీ) 10.8% పెరిగి రికార్డు స్థాయిలో 275 డాలర్లకు చేరింది. → ఎంట్రీ స్థాయి (రూ. 8,700 లోపు) సెగ్మెంట్ 22.9 శాతం వృద్ధి చెందింది. గతేడాది క్వార్టర్తో పోలిస్తే మార్కెట్ వాటాను 14 శాతం నుంచి 16 శాతానికి పెరిగింది. → మాస్ బడ్జెట్ సెగ్మెంట్ (రూ. 8,700 నుంచి రూ. 17,400 వరకు) ఫోన్ల సరఫరా పరిమాణం 1.1 శాతం పెరగ్గా, ఎంట్రీ ప్రీమియం సెగ్మెంట్ (రూ. 17,400 – రూ. 35,000) సరఫరా 2.5 శాతం, మార్కెట్ వాటా 30 శాతం నుంచి 27 శాతానికి తగ్గాయి. -
నిర్ణయాల ప్రక్రియలో కీలకంగా ఏఐ
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఏఐ) పూర్తిగా ఆటోమేషన్ సాధనంగా కన్నా, మెరుగైన నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలోనే మరింత కీలకంగా ఉపయోగపడుతుందని పలు దిగ్గజ కంపెనీలు భావిస్తున్నాయి. పబ్లికేషన్ సంస్థ సీఐవోఅండ్లీడర్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దీని ప్రకారం 2023 నుంచి వివిధ సృజనాత్మక ప్రక్రియల్లో కంటెంట్ మార్కెటింగ్ నుంచి సాఫ్ట్వేర్ కోడింగ్ వరకు జనరేటివ్ ఏఐ వినియోగం అయిదు రెట్లు పెరిగింది. 2025 ఆఖరు నాటికి కంపెనీలు 30 శాతం ఐటీ సరీ్వసులు పూర్తిగా ఏఐతో ఆటోమేట్ చేయనున్నాయి. వ్యయాలను తగ్గించుకోవడం, ప్రాసెసింగ్, నిర్వహణ సామరŠాధ్యలను పెంచుకోవాలన్న లక్ష్యాలే ఏఐని వినియోగించుకోవడానికి కారణమని 98.4 శాతం కంపెనీలు తెలిపాయి. కస్టమర్లకు మెరుగైన అనుభూతిని అందించేందుకు కృత్రిమ మేథ విలువైన సాధనంగా ఉపయోగపడుతుందని 96 శాతం కంపెనీలు వివరించాయి. 2025 మే–జూలై మధ్య నిర్వహించిన సర్వేలో రూ. 5,000 కోట్ల పైగా వార్షిక టర్నోవరు ఉన్న కంపెనీలకు చెందిన 350 మంది చీఫ్ ఐటీ (లేదా) చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్లు పాల్గొన్నారు. రిపోర్ట్లో మరిన్ని విశేషాలు.. → 2025లో 93 శాతం కంపెనీలు ఏఐ, అనలిటిక్స్పై పెట్టుబడులను పెంచనున్నాయి. సగం పైగా సంస్థ లు బడ్జెట్లను భారీగా పెంచే ఆలోచనలో ఉన్నాయి. → ఐటీ కార్యకలాపాల్లో ఆటోమేషన్ కోసం, లోపాలను గుర్తించడం వంటి పనులకు 41 శాతం కంపెనీలు ఏఐని వినియోగిస్తున్నాయి. → చాట్బాట్లు, పర్సనలైజేషన్ లాంటి అవసరాల కోసం ఫైనాన్స్ (31 శాతం), కస్టమర్ సర్వీస్ (28 శాతం) విభాగాల్లో ఏఐని వినియోగిస్తున్నారు. → 90 శాతం కంపెనీలు డేటా భద్రత, గోప్యతను ఏఐ వినియోగానికి ప్రధాన సవాలుగా ఉంటోంది. డేటా నాణ్యతపరమైన సవాళ్లు ఆ తర్వాత స్థానంలో ఉన్నాయి. → 85 శాతం సంస్థలు ఏఐ సాధనాలను అంతర్గతంగానే తయారు చేసుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నాయి. -
ఐదు ఏఐ కోర్సులు.. పూర్తిగా ఉచితం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు డిమాండ్ పెరుగుతోంది. చాలామంది ఇందులో కొత్తగా నైపుణ్యాలను పెంచుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని విద్యా మంత్రిత్వ శాఖ 'స్వయం పోర్టల్'లో ఫ్రీ ఏఐ (AI) కోర్సులను అందిస్తోంది. వివిధ పరిశ్రమలలో ఏఐ ప్రాముఖ్యత పెరుగుతున్న సమయంలో ఈ కోర్సులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.ఏఐ/ఎమ్ఎల్ యూసింగ్ పైథాన్ఈ కోర్సు ద్వారా విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్ వంటి వాటికి సంబంధించిన ప్రాథమిక అంశాలను పరిచయం చేస్తారు. ఇందులో స్టాటిస్టిక్స్, లీనియర్ ఆల్జీబ్రా, ఆప్టిమైజేషన్, డేటా విజువలైజేషన్ వంటివి నేర్చుకోవడానికి అవకాశం ఉంది. అంతే కాకుండా.. డేటా సైన్స్లో విస్తృతంగా ఉపయోగించే ప్రోగ్రామింగ్ భాషలలో ఒకటైన పైథాన్ను కూడా కవర్ చేస్తుంది. ఈ కోర్సు 36 గంటల పాటు కొనసాగుతుంది. కోర్సు పూర్తయిన తరువాత చివరిలో సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది.క్రికెట్ అనలిటిక్ విత్ ఏఐఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్లు అందించే ఈ కోర్సు ద్వారా.. క్రికెట్ను ప్రాథమిక ఉదాహరణగా తీసుకుని, పైథాన్ని ఉపయోగించి స్పోర్ట్స్ అనలిటిక్స్ కు సంబంధించిన ప్రాథమిక అంశాలను తెలుసుకోవచ్చు. ఈ కోర్సు 25 గంటలు ఉంటుంది.ఏఐ ఇన్ ఫిజిక్స్ ఈ కోర్సు మెషిన్ లెర్నింగ్ & న్యూరల్ నెట్వర్క్లు వాస్తవ ప్రపంచ భౌతిక శాస్త్ర సమస్యలను ఎలా పరిష్కరించగలవో చెబుతుంది. ఇందులో ఇంటరాక్టివ్ సెషన్లు, ఆచరణాత్మక ఉదాహరణలు, హ్యాండ్స్-ఆన్ ల్యాబ్ వర్క్ మొదలైనవి ఉన్నాయి. ఈ కోర్సు 45 గంటల ఉంటుంది.ఇదీ చదవండి: ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్: తొలిరోజే 1.4 లక్షల కొనుగోళ్లుఏఐ ఇన్ అకౌంటింగ్కామర్స్ అండ్ మేనేజ్మెంట్ విద్యార్థులనే లక్ష్యంగా చేసుకుని ఈ కోర్స్ ప్రవేశపెట్టింది. అకౌంటింగ్ పద్ధతుల్లో ఏఐను ఎలా ఉపయోగించుకోవచ్చో.. ఈ కోర్సు ద్వారా నేర్చుకోవచ్చు. ఇది 45 గంటల కోర్సు.ఏఐ ఇన్ కెమిస్ట్రీఈ కోర్సు ద్వారా వాస్తవ ప్రపంచ రసాయన డేటాసెట్లను ఉపయోగించాలో తెలుసుకోవచ్చు. అంతే కాకుండా పరమాణు లక్షణాలు, మోడల్ ప్రతిచర్యలు, డిజైన్ డ్రగ్స్ మొదలైనవాటిని ఎలా అంచనా వేయాలో తెలుస్తుంది. ఇది 45 గంటల కోర్సు. -
ఏఐ నుంచి మానవాళిని కాపాడాలంటే?: హింటన్ సూచన
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతిక రంగంలో సంచలనాలను సృష్టిస్తోంది. ప్రతి రంగంలోనూ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ మానవాళిని తుడిచిపెట్టే అవకాశం ఉందని.. ''గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ''గా ప్రసిద్ధి చెందిన బ్రిటిష్ - కెనడియన్ కంప్యూటర్ శాస్త్రవేత్త 'జియోఫ్రీ హింటన్' (Geoffrey Hinton) ఆందోళన వ్యక్తం చేశారు.లాస్ వెగాస్లో జరిగిన Ai4 సమావేశంలో హింటన్ మాట్లాడుతూ.. ఏఐ మానవాళికి ప్రమాదంగా మారుతుందని, దీనిపై నియంత్రణ కలిగి ఉండాలని హెచ్చరించారు. పెద్దవాళ్ళు.. పిల్లలకు మిఠాయి ఇచ్చి ఏమార్చిన విధంగా భవిష్యత్తులో ఏఐ మనుషులను నియంత్రించే అవకాశం ఉందని ఆయన అన్నారు.మోసం చేయడం, దొంగిలించడం వంటివి కూడా ఏఐ సులభంగా చేసేస్తోంది. ఇటీవల ఒక ఏఐ ఇంజినీర్ వ్యక్తిగత సమాచారాన్ని బయటకు చెప్పేస్తా అని భయపెట్టిన ఉదంతాన్ని హింటన్ ఉదాహరణగా చెప్పారు. కాబట్టి ఏఐ భావోద్వేగ స్పందనలను కలిగి ఉండాలి. అప్పుడే సమాజహితంగా ఉంటుందని అన్నారు. ఏఐలో కరుణ భావాన్ని పెంపొందించడం అత్యంత ముఖ్యమైనదని హింటన్ వెల్లడించారు. తల్లి - బిడ్డ సంబంధం మాదిరిగా ఏఐను రూపొందించాలని ఆయన వివరించారు.ఇదీ చదవండి: మినిమమ్ బ్యాలెన్స్: ఏ బ్యాంకులో ఎంత ఉండాలంటే?ఏఐ ఇప్పటికే భయంకరమైన ఆలోచనలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది. ఆ ఆలోచనలు ఎల్లప్పుడూ మనం ట్రాక్ చేయగల భాషలోనే ఉంటాయని భావించకూడదు. ఇది కొత్త భాషను ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇదే జరిగితే ఆ తరువాత జరిగే పరిణాలను అంచనా వేయలేము. అయితే ఏఐ వల్ల ప్రమాదాలు ఉన్నప్పటికీ.. వైద్య రంగంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని జియోఫ్రీ హింటన్ అన్నారు. -
చాలామందికి తెలియని వాట్సాప్ టిప్స్
టెక్నాలజీ పెరుగుతోంది, ప్రతి అంశంలో పురోగతి కనిపిస్తోంది. స్మార్ట్ఫోన్ ఉపయోగించే అందరూ వాట్సాప్ వినియోగిస్తున్నారు. కానీ చాలామందికి చాట్జీపీటీతో చాట్ చేయడం, వాయిస్ మెసేజ్ను టెక్స్ట్ రూపంలోకి ఎలా మార్చాలి?, వీడియో కాల్స్కు ఫన్ యాడ్ చేయడం వంటివి తెలియదు. ఈ కథనంలో అలాంటి ఆసక్తికరమైన వాట్సాప్ టిప్స్ గురించి తెలుసుకుందాం.చాట్జీపీటీతో చాటింగ్ఏఐ అందుబాటులోకి వచ్చిన తరువాత చాట్జీపీటీతో చాటింగ్ చేయడం సాధ్యమవుతోంది. మీరు దీనికోసం చేయాల్సిందల్లా.. చాట్జీపీటీ యొక్క ప్రత్యేక నంబర్ను యాడ్ చేసుకోవడమే. ఇలా చేస్తే మీరు వాట్సాప్లోనే చాటింగ్ చేయవచ్చు. ప్రశ్నలు అడగడం వంటివి చేయవచ్చు. దీనిని ఒక తెలివైన ఫ్రెండ్ మాదిరిగా ఉపయోగించుకోవచ్చు.వాయిస్ మెసేజ్లను టెక్స్ట్ రూపంఐఫోన్ వినియోగదారులకు మాత్రమే వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్షన్ ఫీచర్ లభిస్తుంది. నలుగురిలో ఉన్నప్పుడు మీకు వచ్చిన వాయిస్ మెసేజ్ వినడానికి ఇబ్బందిపడే సమయంలో.. ఈ ఫీచర్ వచ్చిన సందేశాన్ని టెక్స్ట్ రూపంలోకి మారుస్తుంది. అప్పుడు వచ్చిన విషయాన్ని చదివి తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లకు కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తుంది.వీడియో కాల్లకు ఫన్ యాడ్వీడియో కాల్స్ మాట్లాడుతున్న సమయంలో.. మీ ముఖం విసుగ్గా అనిపించినప్పుడు.. మ్యాజిక్ వాండ్ ఐకాన్ ద్వారా విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ ట్వీక్లు లేదా ఫిల్టర్లను ఉపయోగించి కొంత ఆనందపడొచ్చు. ఇది సరదాగా కూడా ఉంటుంది.ఈ మెయిల్ లేదా పాస్కీతో లాగిన్ఎస్ఎమ్ఎస్ కోడ్ పనిచేయనప్పుడు.. మీరు ఈమెయిల్ను లింక్ చేసి వెరిఫికేషన్ కోడ్స్ స్వీకరించవచ్చు. అంతే కాకుండా.. భవిష్యత్ లాగిన్ల కోసం పాస్కీని సెట్ చేసుకోవచ్చు. ఇది స్టార్ట్ చేసిన తరువాత కోడ్లను టైప్ చేయడానికి బదులుగా బయోమెట్రిక్ సాయంతో సైన్ ఇన్ చేసుకోవచ్చు.ఒక వాట్సాప్.. మల్టిపుల్ ఫోన్లలోఒక నెంబరుకు ఒక వాట్సాప్ ఉంటుంది. రెండు లేదా మూడు మొబైల్ ఫోన్లలో ఒకే వాట్సాప్ లాగిన్ అవ్వాలనుకున్నప్పుడు లేదా ఉపయోగించాలనుకున్నప్పుడు.. మీ మొదటి ఫోన్ నుంచి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి.. రెండవ మొబైల్ ఫోనులో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది వర్క్ లైఫ్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ''వన్ అకౌంట్ - మల్టిపుల్ స్మార్ట్ఫోన్స్'' అన్నమాట.ప్రైవేట్ సంభాషణలను లాక్మీరు చేసే చాటింగ్ రహస్యంగా ఉంచాలంటే.. లాక్ చేసుకోవచ్చు. దీనికి మీరు పేస్ ఐడీ, టచ్ ఐడీ లేదా బయోమెట్రిక్ వంటివి ఉపయోగించుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా.. మీ అనుమతి లేకుండా ఎవరూ మీ చాటింగ్ చూడలేరు.పర్సనల్ నోట్బుక్గా వాట్సాప్మీకు అవసరమైన విషయాన్ని సేవ్ చేసుకోవడానికి లేదా మర్చిపోకుండా ఉండటానికి పర్సనల్ నోట్బుక్గా వాట్సాప్ పనిచేస్తుంది. అంటే 'మై సెల్ఫ్' అన్నట్టు.. మీకు మీరే విషయాలను మెసేజ్ చేసుకోవచ్చు. వాటిని మళ్ళీ అవసరమైనప్పుడు చదువుకోవచ్చు.ఇలాంటి టిప్స్ ఉపయోగించడం వల్ల వినియోగదారులకు సరదాగా ఉంటుంది. అంతే కాకుండా మీకు మీరే వాట్సప్ను ఉపయోగకరంగా కూడా మార్చుకోవచ్చు. మొత్తం మీద వాట్సప్ను సరదాగా ఉండే కమ్యూనికేషన్ హబ్గా మార్చుకోవడం మీ చేతుల్లోనే ఉందనే విషయం మాత్రమే మర్చిపోవచ్చు. -
ఐటీ రంగంలో అత్యంత భారీ డీల్
ప్రముఖ అంతర్జాతీయ ఐటీ సేవల సంస్థ యాక్సెంచర్ ఆస్ట్రేలియన్ సైబర్ సెక్యూరిటీ సంస్థ సైబర్ సీఎక్స్ ను కొనుగోలు చేస్తోంది. ఈ రంగంలో ఇది అత్యంత భారీ ఒప్పందంగా తెలుస్తోంది. ఆస్ట్రేలియన్ ఫైనాన్షియల్ రివ్యూ పత్రిక ప్రకారం.. ఈ డీల్ విలువ 1 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు 5,400 కోట్లు).రాయిటర్స్ కథనం ప్రకారం.. ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బీజీహెచ్ క్యాపిటల్ సైబర్ సీఎక్స్ ను విక్రయిస్తోంది. అయితే ఈ ఒప్పందంలోని ఆర్థిక నిబంధనలు మాత్రం వెల్లడి కాలేదు. ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడుల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, హెల్త్ కేర్ నుంచి ఫైనాన్స్ వరకు కంపెనీలు కార్యకలాపాలకు అంతరాయం కలిగించే, సున్నితమైన డేటాతో రాజీపడే అధునాతన బెదిరింపులతో సతమతమవుతున్న నేపథ్యంలో ఈ డీల్కు ప్రాధాన్యం ఏర్పడింది.బీజీహెచ్ క్యాపిటల్ మద్దతుతో 12 చిన్న సైబర్ సెక్యూరిటీ సంస్థల విలీనం ద్వారా మెల్బోర్న్కు చెందిన సైబర్ సీఎక్స్ 2019లో ఏర్పడింది. ఈ సంస్థ ప్రస్తుతం 1,400 మందికి ఉపాధి కల్పిస్తోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అంతటా భద్రతా కార్యకలాపాల కేంద్రాలను నిర్వహిస్తుంది. లండన్, న్యూయార్క్ లలో కార్యాలయాలు ఉన్నాయి.యాక్సెంచర్ 2015 నుండి ఇలాంటి 20 భద్రతా కొనుగోళ్లను పూర్తి చేసింది. వీటిలో బ్రెజిల్ సైబర్ డిఫెన్స్ సంస్థ మార్ఫస్, ఎంఎన్ఈఎమ్ఓ మెక్సికో, స్పెయిన్కు చెందిన ఇన్నోటెక్ సెక్యూరిటీ వంటివి ఇటీవల కొనుగోలు చేసిన సంస్థలు. -
రక్షణ రంగంలో స్టార్టప్లతో స్వావలంబన
బ్రిటిష్ రాచరిక పాలన నుంచి స్వాతంత్ర్యం పొందిన మన దేశం 79 ఏళ్ల పాటు ఎన్నో విధాలుగా శ్రమించి ఎకానమీలో ప్రపంచంలోని టాప్ దేశాల సరసన నిలిచింది. దేశ రక్షణకు, సార్వభౌమత్వానికి పెద్దపీట వేస్తున్న భారత్ ఆపరేషన్ సింధూర్ వంటి చర్యలతో శత్రుదేశాల్లో వణుకు పుట్టిస్తోంది. పక్కలో బళ్లెంలాగా పాకిస్థాన్ కవ్వింపు చర్యలు, గతంలో గల్వాన్లోయాలోకి చైనా సైనికులు దూసుకురావడం వంటి చర్యలను చాకచక్యంగా, సమర్థంగా తిప్పికొట్టింది. అందుకు టెక్నాలజీని వాడుకుంటూ ముందుకుసాగింది. ఈ క్రమంలో భారత్ ఎప్పటినుంచో రక్షణ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతూ వస్తోంది. ఇప్పటికే ఈ విభాగంలో సేవలందిస్తున్న కంపెనీలతోపాటు స్టార్టప్లకు తోడ్పాడు అందిస్తోంది.స్వావలంబన దిశగా అడుగులు..ఏవియానిక్స్, ప్రొపల్షన్ మాడ్యూల్స్, రాడార్, టార్గెటింగ్ టెక్నాలజీ వంటి కీలకమైన రక్షణ వ్యవస్థల కోసం ఒకప్పుడు విదేశీ సంస్థలపై ఎక్కువగా ఆధారపడిన భారత్లో ఇప్పుడు పరిస్థితులు మారాయి. స్వావలంబన దిశగా నిర్ణయాత్మక పురోగతితో రక్షణ రంగంలో దిగుమతిదారు నుంచి అధిక విలువైన సైనిక సాంకేతిక పరిజ్ఞానాల ఉత్పత్తిదారుగా, వాటి ఎగుమతిదారుగా ఎదుగుతోంది. ఈ పరివర్తన కేవలం విధాన పరమైంది మాత్రమే కాదు.. స్వదేశీ యాజమాన్యంలోని డిఫెన్స్ టెక్ స్టార్టప్ల ద్వారా చేకూరుతోంది.ప్రభుత్వం తోడ్పాటు..భారత్ గతంలో విదేశాల నుంచి సేకరించిన దాదాపు 4,500కి పైగా భాగాలను దేశంలోనే తయారు చేసుకునేలా పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్(పీఐఎల్)ను సిద్ధం చేసింది. ఈ జాబితాలోని నిర్దిష్ట రక్షణ రంగానికి సంబంధించిన వస్తువుల దిగుమతులను నియంత్రిస్తుంది. వీటి లోటును భర్తీ చేసేలా దేశీయ స్టార్టప్లు, తయారీదారులకు తోడ్పాటును అందిస్తున్నారు. దీనికితోడు ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ (ఐడెక్స్) కార్యక్రమం డీఆర్డీవో, డీపీఎస్యూల సహకారంతో 200కు పైగా స్టార్టప్లకు నిధులు సమకూరుస్తోంది. ఇందులో ప్రధానంగా దృష్టి సారిస్తున్న విభాగాలు కింది విధంగా ఉన్నాయి.స్వయంప్రతిపత్తి కలిగిన హై-ఆల్టిట్యూడ్ డ్రోన్లుమానవరహిత అండర్వాటర్ వెసెల్స్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కౌంటర్ డ్రోన్ వ్యవస్థలుదిగుమతి చేసుకున్న జెట్ ఇంజిన్లు, మెరైన్ టర్బైన్ల స్థానంలో స్వదేశీ ప్రొపల్షన్ యూనిట్ల ఏర్పాటుప్రభుత్వ ప్రధాన పెట్టుబడులురక్షణ రంగంలో స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తోంది.అధునాతన మేల్-క్లాస్ యూఏవీల కోసం రూ.20,000 కోట్లుమానవ రహిత నావల్ ప్లాట్ఫామ్ల కోసం రూ.2,500 కోట్లురూ.2 వేల కోట్లు డ్రోన్ సబ్ సిస్టమ్స్, డిఫెన్స్ సాఫ్ట్వేర్ కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకంలో భాగంగా అందిస్తున్నారు.అధిక సంక్లిష్ట విభాగాలపై దృష్టిడీప్టెక్ సామర్థ్యాలు ఉన్న స్టార్టప్లను లక్ష్యంగా చేసుకుంటూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా తక్కువ వాల్యూమ్స్, అధిక సంక్లిష్టత కలిగిన విభాగాలపై దృష్టి సారిస్తుంది. అందులో..కాంపోజిట్ ఏరోస్పేస్ నిర్మాణాలుమిస్సైల్-గ్రేడ్ ప్రిసిషన్ కాంపోనెంట్స్హార్డెంన్డ్ ఎలక్ట్రానిక్స్స్పెషాలిటీ మిలిటరీ టెక్స్టైల్స్అంతర్జాతీయ ఒప్పందాలుభారత్, అమెరికాల మధ్య అటానమస్ సిస్టమ్స్ ఇండస్ట్రీ అలయన్స్ (ఏషియా) వంటి వ్యూహాత్మక అంతర్జాతీయ ఒప్పందాలు సంయుక్త మేథోసంపత్తి అభివృద్ధి, కో-ప్రొడక్షన్ను వేగవంతం చేస్తున్నాయి. ఈ సహకారాలు భారత తయారీ సంస్థలకు ఎగుమతులను పెంచుతున్నాయి. ముఖ్యంగా కింది విభాగాల్లో ఈ ధోరణి ఊపందుకుంది.కౌంటర్-యూఏవీ వ్యవస్థలుస్వయంప్రతిపత్తి కలిగిన మెరిటైమ్ డ్రోన్లుకృత్రిమ మేధ ఆధారిత మిషన్-క్రిటికల్ వ్యవస్థలుభారతదేశ డిఫెన్స్-టెక్లో కొన్ని స్టార్టప్లురాఫె ఎంఫిబ్ర్ (నోయిడా)స్థాపన: 2016ఫోకస్: స్వదేశీ యూఏవీలు, కార్బన్ కాంపోజిట్ ఎయిర్ క్రాఫ్ట్ స్ట్రక్చర్స్, మిలిటరీ గ్రేడ్ ఐసీ ఇంజిన్లుభారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఆటోపైలట్, యూఏవీ స్పెసిఫిక్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ను అభివృద్ధి చేసింది.కీలక ఉత్పత్తులు: ఎంఆర్ 10 డ్రోన్స్మార్మ్, ఎంఆర్ 20 లాజిస్టిక్స్ డ్రోన్, భారత్ మ్యాన్ పోర్టబుల్ యూఏవీ, ఎక్స్8 మారిటైమ్ పెట్రోలింగ్ డ్రోన్.భాగస్వాములు: డసాల్ట్ సిస్టెమ్స్, సాఫ్రాన్, హెన్సోల్ట్.పూర్తి స్థాయి ఏరోస్పేస్ తయారీకి 100 మిలియన్ డాలర్ల సిరీస్ బీ నిధులను (జనరల్ క్యాటలిస్ట్ నేతృత్వంలో) సమీకరించింది.ఎస్ఎస్ఎస్ డిఫెన్స్ (బెంగళూరు)స్థాపన: 2017ఫోకస్: చిన్న ఆయుధాలు, మందుగుండు సామగ్రి, టిక్టికల్ ఆప్టిక్స్.వైపర్ (.308), సాబెర్ (.338 లాపువా మాగ్నమ్) వంటి స్నైపర్ రైఫిళ్లను అభివృద్ధి చేశారు.2024లో 50 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను ఎగుమతి చేసింది.దేశీయ ఆర్డర్లు: భారత సైన్యం ఏకె -47 అప్గ్రేడ్ ప్రోగ్రామ్, మనోహర్ ఎం 72 కార్బైన్లుఅధునాతన మందుగుండు సామగ్రి అభివృద్ధి కోసం సీబీసీ బ్రెజిల్తో భాగస్వామ్యంసాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ (ముంబై)స్థాపన: 2015ఫోకస్: సముద్ర, వైమానిక మానవరహిత వ్యవస్థలుభారతదేశపు మొట్టమొదటి సముద్ర స్పాటర్ డ్రోన్, స్వయంప్రతిపత్తి కలిగిన ఆయుధ పడవలను అభివృద్ధి చేసింది.వరుణ అనే వ్యక్తిగత వైమానిక వాహనంపై కూడా పనిచేస్తుంది.అటానమస్ డ్రోన్ ల్యాండింగ్ వ్యవస్థలకు జపాన్ పేటెంట్ లభించింది.ఐడెక్స్ డిస్క్ 7 కింద భారత నౌకాదళంతో కలిసి ప్రాజెక్టుల్లో నిమగ్నమైంది.బిగ్ బ్యాంగ్ బూమ్ సొల్యూషన్స్ (చెన్నై)స్థాపన: 2018ఫోకస్: ఏఐ, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, నానోటెక్, హైబ్రిడ్ ఆర్మర్ఆవిష్కరణల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు, రాడార్ క్లాక్, హైబ్రిడ్ సిరామిక్ బాడీ ఆర్మర్, ఏఐ-ఆధారిత బాటిల్ ఫీల్డ్ ఇంటర్ ఫేస్లు ఉన్నాయి.మూడు భారత రక్షణ దళాలకు 2025లో ఎగుమతులు ప్రారంభించింది.యూకే, ఫిన్లాండ్, ఇజ్రాయెల్, ఆస్ట్రేలియాలోని సంస్థలతో కలిసి పనిచేస్తుంది.ఐరోవ్ (కొచ్చి)స్థాపన: 2016ఫోకస్: అటానమస్ అండర్ వాటర్ వెహికల్స్ (ఏయూవీ), ఆర్వోవీలు.భారతదేశపు మొట్టమొదటి కమర్షియల్ అండర్ వాటర్ డ్రోన్ ఐరోవ్ ట్యూనాను అభివృద్ధి చేసింది.డీఆర్డీవో, ముంబై పోర్ట్ ట్రస్ట్, బీపీసీఎల్కు సర్వీసులు అందిస్తుంది.ఏఐ ఆధారిత 3D మ్యాపింగ్, విశ్లేషణతో 300 మీటర్ల లోతున సముద్ర కార్యకలాపాలను చేయగల ఉత్పత్తులు తయారు చేస్తుంది.ఐడియాఫోర్జ్ (ముంబై)స్థాపన: 2007ఫోకస్: రక్షణ, లా ఎన్ఫోర్స్మెంట్, మౌలిక సదుపాయాల కోసం డ్రోన్లు తయారీ.వీటీవోఎల్ యూఏవీలను తయారు చేసిన తొలి కంపెనీ.7,25,000 కంటే ఎక్కువ మిషన్ గంటలు, 80+ పేటెంట్లు దక్కించుకుంది.టాప్ గ్లోబల్ డ్యూయల్ యూజ్ డ్రోన్ తయారీదారుగా నిలుస్తుంది.స్కైరూట్ ఏరోస్పేస్ (హైదరాబాద్)స్థాపన: 2018ఫోకస్: చిన్న ఉపగ్రహాల కోసం ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగ వ్యవస్థలు.విక్రమ్-ఎస్ను లాంచ్ చేసింది. అంతరిక్ష రంగంలో సర్వీసులు అందించే భారతదేశపు మొదటి ప్రైవేట్ కంపెనీగా నిలిచింది.విక్రమ్ సిరీస్లో చౌకైన, పునర్వినియోగ రాకెట్ల అభివృద్ధి చేస్తోంది.వాణిజ్య అంతరిక్ష అవకాశాన్ని వేగవంతం చేయడానికి 95 మిలియన్ డాలర్లను సమీకరించింది.ఇదీ చదవండి: రూపాయి 79 ఏళ్ల ప్రస్థానం -
వివో, పోకో నుంచి కొత్త ఫోన్లు..
వివో కంపెనీ వీ60 పేరుతో కొత్త స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించింది. ఇందులో 6.77 అంగుళాల ప్రీమియం క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే, అల్ట్రా కాంపాక్ట్ కెమెరా మాడ్యూల్ ఉన్నాయి. 50 మెగాపిక్సల్ టెలీఫొటో, స్నాప్డ్రాగన్ 7జెన్4 చిప్సెట్, ఐపీ రేటింగ్ (ఐపీ68, 69), స్కాట్ డ్రాప్ రెసిస్టెన్స్ గ్లాస్తో వస్తుంది. ధరల శ్రేణి రూ.36,999 నుంచ రూ.45,999 మధ్య ఉంటుంది.ఈ నెల 19వ తేదీ నుంచి వివో వెబ్సైట్తోపాటు ఫ్లిప్కార్ట్, అమెజాన్, అన్ని రిటైల్ స్టోర్లలో లభిస్తుందని కంపెనీ ప్రకటించింది. యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తే 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఆరు నెలల నోకాస్ట్ ఈఎంఐ, ఏడాది అదనపు వారంటీని కంపెనీ ఆఫర్ చేస్తోంది. వివో టీడబ్ల్యూఎస్ 3ఈ సెట్ను రూ.1,499కే సొంతం చేసుకోవచ్చని ప్రకటించింది. ఇదీ చదవండి: రూపాయి 79 ఏళ్ల ప్రస్థానంపోకో నుంచి ఎం7 ప్లస్ 5జీ స్మార్ట్ఫోన్కన్జూమర్ టెక్నాలజీ బ్రాండ్ పోకో తాజాగా ఎం7 ప్లస్ 5జీ స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించింది. ప్రారంభ ఆఫర్ కింద దీని ధర రూ.12,999గా ఉంటుంది. ఇందులో 7000 ఎంఏహెచ్ సిలికాన్ కార్బన్ బ్యాటరీ, 6.9 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్,50 ఎంపీ ఏఐ రియర్ కెమెరా తదితర ఫీచర్లు ఉన్నాయి. 2 ఓఎస్ జనరేషన్స్, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ పొందవచ్చు. ఫ్లిప్కార్ట్లో ఆగస్టు 19 నుంచి సేల్ ప్రారంభమవుతుందని పోకో వివరించింది. -
బీఎస్ఎన్ఎల్కి పెట్టుబడుల దన్ను
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ను పటిష్టం చేయడంపై కేంద్రం మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా నెట్వర్క్ను బలోపేతం చేసేందుకు రూ. 47,000 కోట్ల పెట్టుబడులతో మరో ప్రణాళికను సిద్ధం చేసినట్లు సోషల్ మీడియా ప్లాట్ఫాం ఎక్స్లో టెలికం శాఖ వెల్లడించింది. 4జీ సేవలను విస్తరించేందుకు 1 లక్షకు పైగా టవర్లను ఏర్పాటు చేసేందుకు కంపెనీ గతేడాది రూ. 25,000 కోట్లు వెచి్చంచినట్లు కేంద్ర టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ఉటంకిస్తూ పేర్కొంది. వచ్చే ఏడాది నాటికి కస్టమర్లను పెంచుకుని, మొబైల్ సర్వీస్ వ్యాపారాన్ని 50 శాతం మేర పెంచుకోవాలని గత నెలలో బీఎస్ఎన్ఎల్ అధికారులతో సమీక్షా సమావేశం సందర్భంగా మంత్రి సూచించారు. ఎంటర్ప్రైజ్ వ్యాపారాన్ని 25–30 శాతం, ఫిక్స్డ్ లైన్ విభాగాన్ని కనీసం 15–20 శాతం మేర పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. అలాగే ప్రతి యూజరుపై సగటున వచ్చే ఆదాయం (ఏఆర్పీయూ)ని మెరుగుపర్చుకోవాలని తెలిపారు. ప్రస్తుతం సర్కిల్ని బట్టి బీఎస్ఎన్ఎల్ ఏఆర్పీయూ సుమారు రూ. 40 నుంచి రూ. 175 వరకు ఉంటోంది. జూన్ త్రైమాసికంలో ప్రైవేట్ టెల్కోలు రిలయన్స్ జియో ఏఆర్పీయూ రూ. 208గా, ఎయిర్టెల్ది రూ. 250గా నమోదైంది. -
జియో కొత్త ప్లాన్ వచ్చింది.. చవగ్గా 28 రోజులు వ్యాలిడిటీ
రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ పోర్ట్ఫోలియోకు కొత్త, చాలా తక్కువ ధర ప్లాన్ను జోడించింది. బడ్జెట్ యూజర్లను దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాన్ ను లాంచ్ చేసింది. రూ.189 విలువైన ఈ ప్లాన్లో వినియోగదారులకు అపరిమిత కాలింగ్, 2 జీబీ హైస్పీడ్ డేటా, 300 ఉచిత ఎస్ఎంఎస్లు 28 రోజుల పాటు లభిస్తాయి. తక్కువ ఖర్చుతో నెలంతా ఫోన్ యాక్టివ్ గా ఉండాలనుకునే వారికి ఈ ప్లాన్ బెస్ట్.ఈ జియో ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్, తక్కువ డేటా ఉపయోగించేవారికి మాత్రమే కాకుండా, ఓటీటీ కంటెంట్ ఇష్టపడేవారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్కు ఉచిత యాక్సెస్ను అందిస్తుంది. అంటే వినోదం, డిజిటల్ స్టోరేజ్ అవసరాలను కూడా తీరుస్తుందన్న మాట.సెకండరీ సిమ్ ఉన్న లేదా తక్కువ ఇంటర్నెట్ ఉపయోగించే కస్టమర్ల కోసం ఈ వాల్యూ ప్యాక్ ప్రత్యేకంగా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ ప్లాన్ కేవలం రూ.189కే వినియోగదారులకు అందుబాటులో ఉంది. రూ.189తో 28 రోజుల పాటు అన్ లిమిటెడ్ కాలింగ్, డేటా, ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి. -
జీతాల పెరుగుదల.. ఐటీ కంపెనీ శుభవార్త
ఐటీ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ తమ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. నవంబర్ 1, 2025 నుంచి అర్హులైన ఉద్యోగుల్లో 80 శాతం మందికి వేతన పెంపును అమలు చేయనుంది. 2025 ద్వితీయార్ధంలో చాలా మంది ఉద్యోగులకు మెరిట్ ఆధారిత వేతన పెంపును అందించే ప్రణాళికలను కంపెనీ తన రెండవ త్రైమాసిక ఆదాయ ప్రకటనలో ధృవీకరించింది.సీనియర్ అసోసియేట్ స్థాయి వరకు ఉన్న ఉద్యోగులకు వేతన పెంపు వర్తిస్తుందని కంపెనీ ప్రతినిధి పీటీఐకి తెలిపారు. పెంపు శాతం వ్యక్తిగత పనితీరుతో పాటు ఉద్యోగి స్థానంపై ఆధారపడి ఉంటుంది. భారత్ ఉద్యోగులలో నిలకడ పనితీరు చూపినవారికి సింగిల్ డిజిట్లో, అసాధారణ పనితీరు కనబరిచిన వారికి గణనీయమైన ఇంక్రిమెంట్లు లభించే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధి తెలిపారు.పెరిగిన నికర లాభంనాస్డాక్లో లిస్టైన కాగ్నిజెంట్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 14 శాతం పెరిగి 2025 జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో 645 మిలియన్ డాలర్లకు చేరుకుంది. త్రైమాసిక ఆదాయం 8.1 శాతం పెరిగి 5.25 బిలియన్ డాలర్లకు చేరుకుంది.ఇతర కంపెనీల్లో ఇలా..టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సెప్టెంబర్ 1 నుండి దాదాపు 80% మంది ఉద్యోగులకు వేతనాలు పెంచే ప్రణాళికలను ఇటీవలె వెల్లడించింది. నివేదికల ప్రకారం.. ఆఫ్షోర్ ఉద్యోగులు 6–8% వరకు, ఆన్షోర్ ఉద్యోగులు 2–4% వరకు పెరుగుదల ఉండవచ్చు. ఇక విప్రో, ఇన్ఫోసిస్ 2025లో వేతన పెంపు ప్రణాళికలను ఇంకా వెల్లడించలేదు.👉 ఇది చదివారా? రూ.3 లక్షల కోట్లు ఇస్తా.. గూగుల్కే ఆఫర్ ఇచ్చిన ఇండియన్ -
జియో హాట్స్టార్ ఆ ఒక్క రోజు అందరికీ ఫ్రీ..
ప్రముఖ ఓటీటీ జియో హాట్స్టార్ను ఎటువంటి సబ్స్క్రిప్షన్ లేకుండా ఉచితంగా వీక్షించే అవకాశం.. అది కూడా జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్.. ఇలా ఏ యూజర్ అయినా పర్వాలేదు. అయితే ఈ ఆఫర్ కేవలం ఒక్క రోజు మాత్రమే.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న తమ ఓటీటీ యాప్లోని కంటెంట్ మొత్తం ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తోంది జియో హాట్స్టార్. జియో హాట్ స్టార్కు చెందిన అన్ని షోలు, సినిమాలు, వెబ్సిరీస్లు రోజంతా ఉచితంగా వీక్షించవచ్చు.ఈ బిగ్ అనౌన్స్మెంట్కు సంబంధించిన బ్యానర్ జియో హాట్స్టార్ యాప్లో కనిపిస్తోంది. ఈ బ్యానర్లలో "ప్రౌడ్ ఇండియన్ ప్రౌడ్లీ ఫ్రీ" అనే ట్యాగ్ లైన్ తో "ఫ్రీ" అని రాసి ఉంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ జియో హాట్స్టార్ కంటెంట్ను వీక్షించవచ్చు. ఇందుకోసం మొబైల్ లేదా టీవీ యాప్ లోకి లాగిన్ అవ్వాలి. ఆగస్టు 15న జియో హాట్స్టార్లో సలాకార్ అనే కొత్త సిరీస్ రాబోతోంది. ఇది ఒక డిటెక్టివ్ కథ. ఆగస్టు 15న ఉచితం కావడంతో ఈ సిరీస్ను ఉచితంగా ఆస్వాదించవచ్చు.ఈ ఆఫర్ అందరికీ..ఈ ఆఫర్ ప్రత్యేకత ఏమిటంటే జియో హాట్స్టార్ను చూడటానికి జియో యూజరే అయి ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే జియో హాట్స్టార్ బండిల్ ఆఫర్ ఎయిర్టెల్, వీఐ ప్లాన్లలో కూడా అందుబాటులో ఉంది. మామూలుగా ఎంపిక చేసిన కొంత కంటెంట్ జియో హాట్స్టార్లో ఎప్పుడైనా ఉచితంగా చూడవచ్చు. కానీ ఆగస్టు 15న మాత్రం 24 గంటల పాటు మొత్తం కంటెంట్ను ఉచితంగా అందించనున్నారు. -
రూ.3 లక్షల కోట్లు ఇస్తా.. గూగుల్కే ఆఫర్ ఇచ్చిన ఇండియన్
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్కే ఆఫర్ ఇచ్చాడో భారతీయ యువకుడు. రాయిటర్స్ కథనం ప్రకారం.. పెర్ప్లెక్సిటీ ఏఐ (Perplexity AI) సీఈఓ, భారత సంతతికి చెందిన అరవింద్ శ్రీనివాస్ (Aravind Srinivas) గూగుల్ క్రోమ్ కొనుగోలు చేయడానికి 34.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.3,02,152 కోట్లు) నగదు బిడ్ చేశారు. దాదాపు 17 ఏళ్ల చరిత్ర ఉన్న సంస్థకు కేవలం మూడేళ్ల ఏఐ స్టార్టప్ ఆఫర్ ఇవ్వడం విశేషం.ఎన్విడియా, సాఫ్ట్ బ్యాంక్ సహా పలువురు ఇన్వెస్టర్ల నుంచి 1 బిలియన్ డాలర్లు సమీకరించిన పెర్ప్లెక్సిటీ ఏఐ కంపెనీ ప్రస్తుత మార్కెట్ విలువ 18 బిలియన్ డాలర్లుగా ( సుమారు రూ.1,57,800 కోట్లు) ఉంది. అంటే దాని విలువ కంటే దాదాపు రెట్టింపు ధరను గూగుల్ క్రోమ్ కొనుగోలుకు ఆఫర్ చేసింది. ఈ డీల్ కు పూర్తి స్థాయిలో నిధులు సమకూర్చేందుకు పలు ఫండ్లు ముందుకొచ్చాయని చెబుతోన్న పెర్ప్లెక్సిటీ ఏఐ.. పేర్లను మాత్రం వెల్లడించలేదు.ఆన్లైన్ సెర్చ్ మార్కెట్ గుత్తాధిపత్యాన్నిఆక్షేపిస్తూ కోర్టు తీర్పు నేపథ్యంలో గూగుల్పై ఇప్పటికే రెగ్యులేటరీ ఒత్తిడి కొనసాగుతోంది. ఈ క్రమంలో క్రోమ్ను వదులుకోవాలన్న ప్రతిపాదన కూడా ఉంది. అయితే కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళతాం కానీ బ్రౌజర్ ను విక్రయించే ఉద్దేశం మాత్రం లేదని గూగుల్ తెలిపింది. ఈ పరిణామాలు జరుగుతుండగానే పెర్ప్లెక్సిటీ ఏఐ నుంచి కొనుగోలు ప్రతిపాదన రావడం గమనార్హం.ఎవరీ అరవింద్ శ్రీనివాస్?చెన్నైలో జన్మించిన అరవింద్ శ్రీనివాస్ ఐఐటీ మద్రాస్ గ్రాడ్యుయేట్. గతంలో గూగుల్లోనే పనిచేసిన శ్రీనివాస్ డెనిస్ యారాట్స్, జానీ హో, ఆండీ కొన్విన్స్కీలతో కలిసి 2022లో పెర్ప్లెక్సిటీ ఏఐ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ రియల్ టైమ్లో సమాధానాలను అందించే తన సంభాషణాత్మక ఏఐ సెర్చ్ ఇంజిన్తో శరవేగంగా అభివృద్ధి చెందింది. ఈ కంపెనీ ఇటీవల తన సొంత ఏఐ ఆధారిత బ్రౌజర్ కామెట్ ను కూడా ప్రారంభించింది. క్రోమ్ ను కొనుగోలు చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా మూడు బిలియన్లకు పైగా వినియోగదారులను చేరుకోవచ్చని యోచిస్తోంది.👉 చదవండి: ఐఐటీ హైదరాబాద్లో అద్భుతం.. డ్రైవర్ లేని బస్సుల ఘనత -
మహిళా సాధికారతలో టెక్నాలజీ సవాలు
దేశం ఆర్థికంగా శరవేగంగా దూసుకుపోవడంలో సాంకేతికతది కీలక పాత్ర. అయితే భారత ఆర్థికాభివృద్ధిలో ఎంతగా సాంకేతికత పెరుగుతున్నదో అదే స్థాయిలో మహిళల భాగస్వామ్యం తిరోగమిస్తున్నది. ప్రస్తుతం 35.9 శాతం మించని మహిళా శక్తి భాగస్వామ్యం... 2030 నాటికి 1.9 కోట్ల మంది మహిళలు ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి మరింత దిగజారుతుందనేది ఓ అంచనా. వ్యవసాయ రంగంలోని అన్ని దశల్లో సాంకేతికతను విరివిగా వినియోగిస్తున్నారు. ఎరువులు, పురుగు మందులు చల్లడానికి డ్రోన్లు వచ్చేశాయి. కలుపు తీయడానికి, పంట కోతకు ఆధునిక యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. అనుబంధ రంగాలతో కలిసి భారత వ్యవసాయ దిగుబడుల విలువ సుమారు రూ. 58.74 లక్షల కోట్లకు చేరింది. సాంకేతికత దేశంలో వ్యవసాయ దిగుబడులను పెంచుతూ... వ్యవసాయ మహిళల జీవనోపాధిని కబళిస్తోంది. ఫలితంగా ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. విజృంభిస్తోన్న సాంకేతికతనూ వ్యతిరేకించలేం; కోట్లాది శ్రామిక మహిళాశక్తినీ విస్మరించలేం. ఇదో సంక్లిష్ట వ్యవహారం. ఈ రెండింటి మధ్య హేతుబద్ధత, సమతౌల్యత సాధించడం విహిత కర్తవ్యం.చదవండి: బాల అమితాబ్ గుర్తున్నాడా? ఇపుడు రూ. 200 కోట్ల కంపెనీకి అధిపతివర్తమాన 4వ పారిశ్రామిక విప్లవ కాలంలో, రోబోటిక్స్, ఆటోమేషన్, బ్రెయిన్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిగ్ డేటా, నానో– బయోటెక్నాలజీలు, బయోకెమిస్ట్రీ, జెనెటిక్స్ వంటి అత్యాధునిక సాంకేతికతలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఇవి ప్రధానంగా ఉత్పత్తి, సేవలపై దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. ఈ పరిణామం వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో నిమగ్నమైన కోట్లాది పేద, మధ్యతరగతి మహిళల ఉపాధిని హరిస్తోంది.వ్యవసాయ రంగంతో పోల్చితే, భారత పారిశ్రామిక రంగంలో సాంకేతికత వినియోగం ఎక్కువగా ఉంటోంది. అదే సమయంలో మహిళల భాగస్వామ్యం వేగంగా తగ్గుతోంది. అయితే భారత సేవా రంగంలో మహిళల పాత్ర గణనీయంగానే ఉంది. విద్య, ఆరోగ్యం, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, రిటైల్, హాస్పిటాలిటీ వంటి రంగాలలో మహిళల సంఖ్య గణనీయం. ఇవ్వాళ సేవారంగం... లింగ వివక్షకు, అసమానతలకు దూరంగా ఉంటూ, ప్రతిభకు పట్టం కడుతోంది. ఈ రంగం ఆధునిక సాంకేతిక విద్యావంతులైన కోట్లాది మహిళలకు ఉద్యోగాలను కల్పించింది. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ కేవలం సాంకేతికతను మాత్రమే కాదు, మహిళల శ్రమశక్తిని, మేధాసంపత్తిని సమానంగా ఇముడ్చుకుంటూ ముందుకు సాగితే లింగ వివక్ష, అసమానత సమసిపోతుందని విధాన నిర్ణేతలు గ్రహించాలి. మహిళలకు సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడం, చిన్న, అతి చిన్న పరిశ్రమలలో మహిళల సంఖ్యను గణనీయంగా పెంచడం, మహిళలు తయారు చేసిన వస్తు ఉత్పత్తులకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వడం; వనరులు, ముడి సరుకుల లభ్యతను సులభతరం చేయడం, బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణ సౌకర్యం కల్పించడం వంటి చర్యల వల్ల మహిళల ఆర్థిక స్వావలంబన సులభతరం అవుతుంది. ప్రభుత్వాలు ఈ దిశలో అడుగులు వేయాలి. మహిళా సాధికారతలో టెక్నాలజీ సవాలువిజృంభిస్తోన్న సాంకేతికతనూ వ్యతిరేకించలేం; కోట్లాది శ్రామిక మహిళాశక్తినీ విస్మరించలేం. ఈ రెండింటి మధ్య హేతుబద్ధత, సమతౌల్యత సాధించడం విహిత కర్తవ్యం.-బోగా దీపిక వ్యాసకర్త పరిశోధకురాలు -
ఎరిక్సన్, నోకియాతో బీఎస్ఎన్ఎల్ జట్టు
యువతకు నైపుణ్యాల్లో శిక్షణ కల్పించే దిశగా నాలుగు అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజాలతో ప్రభుత్వ రంగ దిగ్గజం బీఎస్ఎన్ఎల్ చేతులు కలిపింది. కేంద్ర టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా సమక్షంలో ఎరిక్సన్ ఇండియా, క్వాల్కామ్ టెక్నాలజీస్, సిస్కో సిస్టమ్స్, నోకియా సొల్యూషన్స్ అండ్ నెట్వర్క్స్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.ఇదీ చదవండి: కోనసీమలో ఓఎన్జీసీ గ్యాస్ సెంటర్5జీ, ఏఐ, సైబర్సెక్యూరిటీ, నెట్వర్కింగ్ తదితర టెక్నా లజీలకు సంబంధించిన కోర్సుల్లో యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది. జబల్పూర్లోని భారతరత్న భీమ్రావ్ అంబేడ్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెలికం ట్రైనింగ్లో ఈ కోర్సుల్లో శిక్షణనిస్తారు. తొలి దశలో రూ.1 కోటికి పైగా పెట్టుబడితో ఏటా 2,000 మంది విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు సింధియా తెలిపారు. కాగా, భారత్లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని విస్తరించి, భారీగా ఉద్యోగాలు కల్పిస్తామని నోకియా ఇండియా కంట్రీ మేనేజర్ తరుణ్ ఛాబ్రా తెలిపారు. -
కోడింగ్ ఉద్యోగాల కథ కంచికేనా?
టెక్ కంపెనీలు ఉద్యోగాల విషయంలో ఒకప్పుడు అవలంబించిన ధోరణికి భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. 2010 ప్రారంభం నుంచి సిలికాన్వ్యాలీలోని టాప్ కంపెనీల నుంచి చిన్న సంస్థల వరకు విద్యార్థులు కోడింగ్ నేర్చుకోవాలని ప్రోత్సహించాయి. టెక్ ఎగ్జిక్యూటివ్లు, అధ్యాపకులు, దేశ అధ్యక్ష స్థాయి వ్యక్తులు కూడా విద్యార్థులను కంప్యూటర్ సైన్స్లో నైపుణ్యాలు నేర్చుకోవాలని కోరారు. అధిక వేతనంతో కూడిన ఉద్యోగాలు, భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే అది ఒక తరానికి కలిసొచ్చిన అంశమే అయినా ప్రస్తుతం ఈ ధోరణి మారుతోంది.భారీ వేతనాలు ఆశ చూపి..2012లో మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్ ఉన్నత సంస్థల్లో మరిన్ని కంప్యూటర్ సైన్స్ కోర్సులను తీసుకురావడానికి యూఎస్ అంతటా ప్రచారం సాగించారు. సాధారణంగా అప్పటి పరిస్థితులనుబట్టి వారి ప్రారంభ వేతనం 1,00,000 డాలర్లు కంటే ఎక్కువే ఉంటుందని స్మిత్ ఆ సమయంలో కంప్యూటింగ్ గ్రాడ్యుయేట్లను ఉద్దేశించి తెలిపారు. 15,000 డాలర్ల నియామక బోనస్లు, 50,000 డాలర్ల విలువైన స్టాక్ గ్రాంట్లు ఉంటాయని కూడా చెప్పారు. ఈ ఆర్థిక ప్రోత్సాహకాలతోపాటు తర్వాతి కాలంలో టాప్ కంపెనీల్లో పనిచేసే అవకాశం ఉంటుందని యువత కూడా ఎంతో ఆసక్తి చూపారు. అప్పుడు కంపెనీలకు ఉన్న ఆర్డర్లు, టెక్నాలజీ అభివృద్ధి, క్లెయింట్ల పెట్టుబడుల నేపథ్యంలో ఇది ఎంతో ఉపయోగపడింది.పెరుగుతున్న కంప్యూటర్ గ్రాడ్యుయేట్లుటెక్ ఉద్యోగాలపట్ల ఎంత వేగంగా ఆసక్తి పెరిగిందో అంతే వేగంగా కొత్త టెక్నాలజీ విస్తరించడంతో లేఆఫ్స్ పర్వం మొదలైంది. కంప్యూటింగ్ రీసెర్చ్ అసోసియేషన్ ప్రకారం 2023 నాటికి యూఎస్లో 1,70,000 మందికి పైగా అండర్ గ్రాడ్యుయేట్లు కంప్యూటర్ సైన్స్ పట్టభద్రులవుతున్నారు. ఇది 2014తో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువ. ఈ సమయంలో దేశవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాల్లో కంప్యూటర్ సైన్స్ అత్యంత ప్రాచుర్యం పొందింది. కానీ క్రమేణా కొలువుల విషయంలో పరిస్థితులు భిన్నంగా మారాయి.ఏఐ టూల్స్ అభివృద్ధిఒకప్పుడు వందల సంఖ్యలో ఇంజినీర్లను నియమించుకున్న అమెజాన్, ఇంటెల్, మెటా, మైక్రోసాఫ్ట్.. వంటి టెక్ దిగ్గజాల ఇటీవలి భారీ తొలగింపులు జాబ్ మార్కెట్ను దెబ్బతీస్తున్నాయి. అదే సమయంలో సెకన్లలో కోడ్ను డెవలప్చేసి, డీబగ్, ఆప్టిమైజ్ చేయగల ఆర్టిఫిషియన్ ఇంటెలిజెన్స్ టూల్స్ వేగంగా అభివృద్ధి చేస్తున్నారు. వీటిని ప్రోగ్రామింగ్ ఉద్యోగాల స్థానంలో విరివిగా వాడుతున్నారు. దాంతో ఉద్యోగుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ డేటా ప్రకారం.. 22 నుంచి 27 సంవత్సరాల వయసు ఉన్న ఇటీవలి కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగం 6.1%కు పెరిగింది. బయాలజీ లేదా ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ల నిరుద్యోగ రేటు కంటే ఇది రెట్టింపు.ఒకప్పుడు కంప్యూటర్ సైన్స్ కార్యక్రమాలకు ఫెడరల్ నిధులను వెచ్చించిన యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కృత్రిమ మేధ కెరియర్ వైపు విద్యార్థులను మళ్లించే లక్ష్యంతో జాతీయ ఏఐ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. మైక్రోసాఫ్ట్ కూడా ఈ విధానాన్ని తన పాలసీలో పునఃసమీక్షిస్తోంది. విద్యార్థులు, ప్రస్తుత ఉద్యోగులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కోసం కంపెనీ ఇటీవల 4 బిలియన్ డాలర్లు కేటాయించింది. ఏఐ కంప్యూటర్ సైన్స్ విద్యను ఎలా మారుస్తుందో పునఃసమీక్షిస్తున్నామని స్మిత్ గత నెలలో చెప్పారు.ఎన్నో ప్రశ్నలు.. చేయాల్సిందేంటి?టెక్నాలజీ ఉద్యోగాల్లో వస్తున్న పరివర్తన విద్యార్థులు, అధ్యాపకులకు కఠినమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఎథిక్స్కు అనుకూలంగా విశ్వవిద్యాలయాలు సంప్రదాయ ప్రోగ్రామింగ్ కోర్సులకు ప్రాధాన్యం తగ్గించాలా? అనే ప్రశ్నలు లేవనెత్తుతుంది. అయితే కోడింగ్ ఎప్పటికైనా అవసరమేనని కొందరు నిపుణులు చెబుతున్నారు. అయితే ప్యూర్ ప్రోగ్రామింగ్ కొలువులు ఒకప్పటిలాగా గోల్డెన్ జాబ్స్ కావనే వాస్తవాన్ని జీర్ణించుకోవాలని అంటున్నారు. అందుకు బదులుగా ఏఐతో ఎలా సమర్థంగా పనిచేయాలో అర్థం చేసుకోవడం, తెలివైన వ్యవస్థలను నిర్మించడం, బిగ్ డేటాను విశ్లేషించడం చాలా ముఖ్యమని చెబుతున్నారు.ఇదీ చదవండి: ఆర్థిక స్వేచ్ఛ అంతరార్థం తెలుసా? -
16 ఏళ్లకే సొంత కంపెనీ.. రెండేళ్లలో రూ.100 కోట్ల సామ్రాజ్యం!
చేయాలనే తపన, ఆలోచించే శక్తి ఉంటే ఎవరైనా అద్భుతాలు చేస్తారు. చదువుకునే వయసులోనే సొంతంగా కోడింగ్ నేర్చుకోవడమే కాకుండా.. కోట్ల విలువైన కంపెనీ స్థాపించింది. ఇంతకీ ఈ ఘనత సాధించినది ఎవరు?, వారు స్థాపించిన కంపెనీ ఏది అనే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో చూసేద్దాం.భారతదేశంలో పుట్టిన 'ప్రాంజలి అవస్థి' (Pranjali Awasthi) చిన్నప్పుడే తన తండ్రి ఉపయోగించే కంప్యూటర్ చూస్తూ.. దాన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకుంది. ఆ తరువాత కోడింగ్ ఎలా రాయాలో నేర్చుకుని.. ఏడేళ్ల ప్రాయానికే సొంతంగా కోడింగ్ రాసింది. 11 సంవత్సరాల వయసులో ప్రాంజలి అవస్థి.. తన కుటుంబంతో అమెరికాలోని ఫ్లోరిడాకు మారింది. అక్కడే కంప్యూటర్ సైన్స్ అండ్ కాంపిటీటివ్ మ్యాథ్స్ కోర్సుల్లో చేరింది. ఆ తరువాత 13 ఏళ్ల వయసుకే ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి చెందిన న్యూరల్ డైనమిక్స్ ఆఫ్ కంట్రోల్ ల్యాబ్లో ఇంటర్న్షిప్ చేయడం మొదలుపెట్టింది. ఆ సమయంలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) గురించి తెలుసుకుంది.ఏఐ సాయంతో చాలా పనులను సులభంగా చేయవచ్చని గ్రహించిన ప్రాంజలి.. డెల్వ్.ఏఐ (Delv.AI) ప్రారంభించింది. ఈ కంపెనీ రూ. 3.5 కోట్లతో.. ముగ్గురు ఉద్యోగులతో మొదలైంది. ప్రస్తుతం దీని విలువ రూ.100 కోట్ల కంటే ఎక్కువ. ఈ సంస్థలో పదిమంది కంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం.ప్రస్తుతం ప్రాంజలి అమెరికాలోని జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ చదువుతోంది. ఆమె 'చాట్జీపీటీ ఇన్ హ్యాండ్' అనే కొత్త ప్రాజెక్ట్లో కూడా పనిచేస్తోంది. ఇది ఒక ఏఐ అసిస్టెంట్. ఇది మాట్లాడటమే కాకుండా మీ కోసం కూడా పని చేయగలదని అవస్థి చెబుతోంది.ఇదీ చదవండి: జీతం వచ్చిన ఐదు నిమిషాలకే ఉద్యోగి రాజీనామా: హెచ్ఆర్ ఏమన్నారంటే? -
సెమీకండక్టర్ల మార్కెట్ @ రూ. 9.6 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: దేశీయంగా సెమీకండక్టర్ల మార్కెట్ 2030 నాటికి 100–110 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 9.6 లక్షల కోట్లు) స్థాయికి చేరనుంది. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం రెండు రెట్లు వృద్ధి చెందనుంది. 2023లో 38 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ మార్కెట్ 2024–25లో 45–50 బిలియన్ డాలర్లకు చేరినట్లు పరిశ్రమ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. ప్రస్తుతం ఈ రంగంపై తైవాన్, దక్షిణ కొరియా, జపాన్, చైనా, అమెరికా తదితర దేశాల ఆధిపత్యం ఉంటోందని వివరించాయి. సెమీకండక్టర్ల ఆవశ్యకత, కోవిడ్ మహమ్మారి కాలంలో నిర్దిష్ట ప్రాంతాలపై ఆధారపడటం వల్ల ఆటోమొబైల్ తదితర సెగ్మెంట్లు ఎదుర్కొన్న సంక్షోభ పరిస్థితులు, సవాళ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పరిశ్రమ స్పందన తదితర అంశాల గురించి ఇందులో తెలిపాయి. అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థలో విశ్వసనీయ భాగస్వామిగా భారత్ ఎదగాల్సిన అవసరాన్ని ప్రస్తావించాయి. ప్రకటన ప్రకారం.. ప్రపంచంలో తయారయ్యే మొత్తం సెమీకండక్టర్లలో తైవాన్ 60 శాతం ఉత్పత్తి చేస్తోంది. అత్యంత అధునాతన సెమీకండక్టర్ల ఉత్పత్తిలో తైవాన్ వాటా ఏకంగా 90 శాతం ఉంటోంది. ఒకే ప్రాంతంపై భారీగా ఆధారపడటమనేది అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలకు రిసు్కలతో కూడుకున్న వ్యవహారమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కోవిడ్ తరహా మహమ్మారులు, ప్రకృతి విపత్తులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల్లాంటి అనేకానేక అంశాల ప్రభావం పడే అవకాశం ఉందని వివరించాయి. దీన్ని గుర్తించే చాలా దేశాలు ప్రస్తుతం సురక్షితమైన, వైవిధ్యమైన సరఫరా వ్యవస్థలను ఏర్పర్చుకుంటున్నాయని పేర్కొన్నాయి. అమెరికా, యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా దేశీయంగా చిప్ల తయారీని ప్రోత్సహించేందుకు, ఒకే ప్రాంతంపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు జాతీయ స్థాయిలో వ్యూహాలు అమలు చేస్తున్నాయని వివరించాయి. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న మార్పుల్లో భారత్ కూడా కీలకమైన, విశ్వసనీయమైన భాగస్వామిగా ఎదుగుతోందని పేర్కొన్నాయి. 1 ట్రిలియన్ డాలర్లకు గ్లోబల్ మార్కెట్ .. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం 2030 నాటికి అంతర్జాతీయంగా సెమీకండక్టర్ల మార్కెట్ 1 ట్రిలియన్ (లక్ష కోట్లు) డాలర్లకు చేరనుంది. భారత్ ఇందులో గణనీయమైన వాటా దక్కించుకునే అవకాశం ఉంది. సెమీకండక్టర్ల తయారీ సరఫరా వ్యవస్థకు మూడు ప్రధాన మూల స్తంభాలైన పరికరాలు, మెటీరియల్స్..సరీ్వసులు, పరిశోధన–అభివృద్ధి కార్యకలాపాల విభాగాల్లో కీలక భాగస్వామిగా ఎదిగే సత్తా భారత్కి ఉంది. సెమీకండక్టర్ల ఎక్విప్మెంట్కి అవసరమైన విడిభాగాలను ఉత్పత్తి చేసేందుకు చిన్న, మధ్య తరహా సంస్థలను (ఎంఎస్ఎంఈ) ఉపయోగించుకోవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సెమీకండక్టర్ సప్లై చెయిన్ కంపెనీలకు అవసరమైన రసాయనాలు, లోహాలు మొదలైనవి మన దగ్గర సమృద్ధిగా ఉన్నాయని వివరించాయి. ఇక సరీ్వసుల విషయానికొస్తే ఆర్అండ్డీ, లాజిస్టిక్స్, సరఫరా వ్యవస్థకు సంబంధించి కృత్రిమ మేథ, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ)లాంటి విభాగాల్లోనూ భారత్ పటిష్టంగా ఉందని పేర్కొన్నాయి. ప్రభుత్వం దన్ను.. అంతర్జాతీయంగా ఎల్రక్టానిక్స్ వేల్యూ చెయి న్లకి భారత్ను మరింతగా అనుసంధానం చేసే దిశగా సెమీకండక్టర్ల ఫ్యాబ్రికేషన్, డిస్ప్లేల తయారీ, చిప్ డిజైన్ మొదలైన వాటిల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పరిశ్రమకు ఆర్థిక మద్ద తు కలి్పంచేలా 2021 డిసెంబర్లో రూ. 76,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఇండియా సెమీకండక్టర్ మిషన్ను ఆవిష్కరించింది. అమెరికాకు చెందిన మెమొరీ చిప్ల తయారీ దిగ్గజం మైక్రాన్, టాటా సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ (టీఎస్ఏటీ), కేనెస్ సెమీకాన్, హెచ్సీఎల్–ఫాక్స్కాన్లతో పా టు తైవాన్ సంస్థ పవర్చిప్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ (పీఎస్ఎంసీ) భాగస్వామ్యంలో టాటా ఎలక్ట్రానిక్స్ (టీఈపీఎల్), రెనిసాస్ అండ్ స్టార్స్ భాగస్వామ్యంలో సీజీ పవర్ అండ్ ఇండ్రస్టియల్ ప్రైవేట్ లిమిటెడ్ మొదలైనవి భారత్లో సెమీకండక్టర్ల ఉత్పత్తి కోసం రూ. 1.55 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం) కింద చిప్ డిజైనింగ్ కోసం రూ. 1,000 కోట్లతో డిజైన్ ఆధారిత ప్రోత్సాహకాలకు కూడా ఐఎస్ఎం ప్రొవిజనింగ్ ఏర్పాటు చేసింది. అర్హత కలిగిన స్టార్టప్లకు ఆర్థికంగా మద్దతునిచ్చేందుకు ఇందులో రూ. 234 కోట్లు కేటాయించారు. ‘22 కంపెనీలు ప్రతిపాదించిన చిప్ డిజైన్ ప్రాజెక్టులకు కేంద్రం రూ. 234 కోట్ల మద్దతుకి హామీ ఇచి్చంది. ఈ మొత్తం ప్రాజెక్టుల వ్యయం రూ. 690 కోట్లుగా ఉంటుంది. ఈ చిప్లను సీసీటీవీ కెమెరాలు, మొబైల్ నెట్వర్క్లు, ఉపగ్రహాలు, కార్లు, స్మార్ట్ డివైజ్లు మొదలైన వాటిలో ఉపయోగిస్తారు. దేశీయంగా చిప్ల తయారీ వ్యవస్థను అభివృద్ధి చేసే క్రమంలో సెమీకండక్టర్ ఎక్విప్మెంట్ అండ్ మెటీరియల్స్ ఇంటర్నేషనల్ (సెమీ) భాగస్వామ్యంతో కేంద్రం సెమీకాన్ ఇండియా సదస్సుకు కూడా మద్దతునిస్తోంది‘ అని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ సదస్సులో అంతర్జాతీయ పరిశ్రమ దిగ్గజాలు, విధాన నిర్ణేతలు, విద్యావేత్తలు, అంకుర సంస్థలు కూడా పాల్గొంటాయి. పె ట్టుబడులు, వ్యూహాత్మక భాగస్వామ్యాలపై చర్చలకు ఇది వేదికగా నిలుస్తోంది. ఈ ఏడాది సెపె్టంబర్ 2 నుంచి 4 వరకు సెమీకాన్ ఇండియా 4వ ఎడిషన్ న్యూఢిల్లీలో జరుగనుంది. ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం), సెమీ కలిసి సెమీకాన్ ఇండియా 2025ని నిర్వహించనున్నాయి. అంతర్జాతీయంగా సెమీకండక్టర్ల వ్యవస్థలో భారత్ పాత్ర గురించి చాటి చెప్పే విధంగా ఈ సదస్సు ఉంటుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ విస్తరణ
హైదరాబాద్: యూకే కేంద్రంగా ఉన్న ఒరాకిల్ (Oracle) భాగస్వామ్య సంస్థ ఈయాప్సిస్ (eAppSys), హైదరాబాద్లో తన గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ను విస్తరించింది. ప్రస్తుతం ఉన్న 200 మంది ఉద్యోగుల సంఖ్యను వచ్చే రెండు సంవత్సరాల్లో 500కి పెంచే లక్ష్యాన్ని సంస్థ ప్రకటించింది. ఈ కొత్త కేంద్రాన్ని తెలంగాణ ఐటీ మంత్రి డి.శ్రీధర్ బాబు ప్రారంభించారు.ఈ విస్తరణలో భాగంగా 400 సీట్ల సామర్థ్యంతో కూడిన ఆధునిక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఒరాకిల్ క్లౌడ్, ఈఆర్పీ, ఏఐ, ఎంటర్ప్రైజ్ ట్రాన్స్ఫర్మేషన్ సేవల కోసం ఇది ఆసియా-పసిఫిక్ (APAC), యూరప్-మిడిల్ ఈస్ట్- ఆఫ్రికా (EMEA), నార్త్ అమెరికా ప్రాంతాలకు వ్యూహాత్మక కేంద్రంగా పనిచేస్తుంది.ఏఐ/ఎంఎల్ ఇంజనీర్లు, ఈఆర్పీ కన్సల్టెంట్లు, సొల్యూషన్ ఆర్కిటెక్టులు వంటి నైపుణ్యాల ఉద్యోగాలు సృష్టించనున్నట్లు ఈయాప్సిస్ సంస్థ తెలిపింది. స్థానిక ప్రతిభను అభివృద్ధి చేసేందుకు అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్లలో పెట్టుబడులు పెడుతున్నట్లు పేర్కొంది.“ఈ కేంద్రం మా గ్లోబల్ వృద్ధి ప్రయాణంలో కీలక మైలురాయి” అని ఈయాప్సిస్ ఛైర్మన్ ప్రవీణ్ రెడ్డి బద్దం అన్నారు. “ప్రపంచ దృష్టితో ఆలోచించి, స్థానికంగా అమలు చేసే బృందాన్ని నిర్మిస్తున్నాం” అని ఆయన పేర్కొన్నారు. ఈ ఈయాప్సిస్ కంపెనీ వివిధ సంస్థలకు ఒరాకిల్ సాఫ్ట్వేర్తో సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ సేవలు అందిస్తుంది. -
రక్షాబంధన్ 2025: సైబర్ నేరగాళ్ల కొత్త స్కామ్లు
దేశవ్యాప్తంగా రాఖీ పండుగ సంబరాలు మొదలయ్యాయి. సోదరులు.. సోదరీమణులు రక్షా బంధన్ జరుపుకోవడానికి సిద్ధమవుతుండగా, సైబర్ నేరస్థులు కూడా కొత్త మోసాలకు తెరలేపారు. సాంప్రదాయ విక్రేతలకు బదులుగా ఆన్లైన్లో రాఖీలు, బహుమతులు, స్వీట్లు ఆర్డర్ చేసే వారి సంఖ్య పెరుగుతుండడంతో, సైబర్ నేరస్థులు దీనిని అదనుగా తీసుకుంటున్నట్లు సైబర్ సెక్యూరిటీ క్లౌడ్సెక్ (CloudSEK) చెబుతోంది.ఫిషింగ్ సందేశాలు: స్కామర్లు ఇన్బాక్స్లు, వాట్సాప్, ఎస్ఎమ్ఎస్ల ద్వారా.. రాఖీ గిఫ్ట్ డెలివరీలు లేదా ఎక్స్క్లూజివ్ సేల్ కూపన్ల పేరుతో మెసేజస్ పంపవచ్చు. ఇలాంటి సందేశాలను క్లిక్ చేసినప్పుడు వచ్చే లింక్స్ ఫిల్ చేయడం, లేదా ఇతర చెల్లింపు వివరాలను పూర్తి చేసినప్పుడు మీ ఖాతాలో డబ్బు మాయమయ్యే అవకాశం ఉంది.ఫేక్ ఈ-కామర్స్ వెబ్సైట్లు: సైబర్ నేరస్థులు చట్టబద్ధమైన ప్లాట్ఫారమ్లను అనుకరించే మోసపూరిత వెబ్సైట్లను సృష్టిస్తారు. ఇలాంటి ఫేక్ వెబ్సైట్ విషయంలో కూడా వినియోగదారులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.సోషల్ మీడియా స్కామ్: స్కామర్లు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో నకిలీ రాఖీ యాడ్స్ కూడా ప్రచారం చేయవచ్చు. ప్లాట్ఫామ్ చట్టబద్ధమైనదని భావించి, వినియోగదారుడు ఆర్థిక వివరాలను పంచుకుంటే మీ చెబుకు చిల్లు గ్యారెంటీ.యూపీఐ & గిఫ్ట్ కార్డ్ స్కామ్లు: రాఖీ గిఫ్ట్ క్లెయిమ్ల మాదిరిగానే నకిలీ యూపీఐ అభ్యర్థనలు లేదా క్యూఆర్ కోడ్లు మీ మొబైల్ ఫోనుకు వస్తే.. వాటిపట్ల కొంత జాగ్రత్త వహించాలి.స్కామ్ల నుంచి బయటపడే మార్గాలు➤రాఖీలు, స్వీట్స్ లేదా గిఫ్ట్స్ వంటివి ఆన్లైన్లో కొనుగోలు చేయాలనుకుంటే.. వినియోగదారుడు తప్పకుండా అధికారిక వెబ్సైట్ల నుంచి కొనుగోలు చేయాలి. నకిలీ వెబ్సైట్లు ఆఫర్స్ ఎరవేసి మిమ్మల్ని ఆకర్శించే అవకాశం ఉంది. కాబట్టి విశ్వసనీయ ప్లాట్ఫామ్ల నుంచి మాత్రమే ఆర్డర్ చేసుకోవాలి.➤ఆన్లైన్ చెల్లింపుల విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించాలి. కొన్ని క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేసినప్పుడు ఫిషింగ్ సైట్లు లేదా మాల్వేర్ డౌన్లోడ్లు జరిగే అవకాశం ఉంది. తెలియని నెంబర్స్ నుంచి వచ్చే లింక్స్ మీద క్లిక్ చేయకూడదు.➤ఫేక్ సైట్లను గుర్తించాలి. నకిలీ సైట్లు దాదాపు అధికారిక సైట్ల మాదిరిగా కనిపించేలా స్కామర్లు పన్నాగాలు పన్నుతారు. అయితే కొన్ని చిన్న మార్పులు గమనించాలి. వెబ్సైట్ URLలలో తేడాలను కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది.రాఖీ పండుగ సంతోషంగా జరుపుకునే సమయం. అయితే స్కామర్లు ఉన్నారన్న సంగతి మర్చిపోకూడదు. ఆదమరిస్తే మోసపోవడం మీ వంతు అవుతుంది. కాబట్టి స్కామర్ల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం మాత్రమే కాకుండా.. కుటుంబ సభ్యులను, స్నేహితులను కూడా రక్షించాలి. -
ఓపెన్ ఏఐ నుంచి జీపీటీ 5: అందరికీ ఫ్రీ
ప్రస్తుతం అంతర్జాతీయంగా తమకు అతి పెద్ద మార్కెట్లలో రెండో స్థానంలో ఉన్న భారత్ త్వరలోనే అగ్ర స్థానానికి చేరుతుందని ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్ తెలిపారు. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారత మార్కెట్లో ప్రజలు, వ్యాపార సంస్థలు గణనీయ స్థాయిలో కృత్రిమ మేధను వినియోగిస్తున్నాయని ఆయన వివరించారు.కొత్త తరం మోడల్ జీపీటీ-5ని ఆల్ట్మన్ ఆవిష్కరించారు. ఇది అందరికీ ఉచితమని వివరించారు. తాము మరిన్ని ఉత్పత్తులను భారత మార్కెట్లో ప్రజలకు ఏఐని మరింతగా అందుబాటులోకి తేవడంపై కసరత్తు చేస్తున్నామని, స్థానిక భాగస్వాములతో కూడా కలిసి పని చేస్తున్నామని ఆల్ట్మన్ చెప్పారు.జీపీటీ–5 గురించి వివరిస్తూ, కోడింగ్.. ఏజెంటిక్ టాస్క్లకు ఇప్పటివరకు వచ్చిన మోడల్స్లో ఇది అత్యుత్తమమైనదని వివరించారు. డెవలపర్లకు మరింత వెసులుబాటు లభించేలా ఏపీఐలో జీపీటీ–5, జీపీటీ–5–మినీ, జీపీటీ–5–నానో అని మూడు విధాలుగా ఇది అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ట్రాఫిక్ సమస్యకు చెక్!.. జపాన్ కంపెనీ వ్యూహం ఇదే..కొత్త మోడల్ 12 భారతీయ భాషలను అర్థం చేసుకోగలుగుతుందని ఆల్ట్మన్ చెప్పారు. ఉచిత, ప్లస్, ప్రో యూజర్లకు జీపీటీ–5 ఆగస్టు 7 నుంచి అందుబాటులోకి రాగా, ఎంటర్ప్రైజ్.. ఎడ్యుకేషన్ యూజర్ల సెగ్మెంట్కు వారం తర్వాత నుంచి లభిస్తుందని వివరించారు. -
ఏంటి టీసీఎస్లో ఇలా చేస్తున్నారు?
దేశంలో అగ్ర ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా 12,000 మంది ఉద్యోగులను తొలగించే ప్రణాళికను ప్రకటించింది. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే ఉద్యోగాల్లో చేరిన ఫ్రెషర్లతో కూడా బలవంతపు రాజీనామాలు చేయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కంపెనీ తన బెంచ్ పాలసీని సవరించిన కొన్ని వారాల తరువాత ఇలాంటి చర్యలకు పాల్పడుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి.ఓవైపు లేఆఫ్ ఆందోళనలున్నా జీతాల పెంపు ప్రకటించి ఉద్యోగులకు కాస్త ఊరట కల్పించింది టీసీఎస్. అయితే ఈ ప్రకటనకు ఒక రోజు ముందు, ఒక రెడ్డిట్ యూజర్ తాను బలవంతంగా రాజీనామా చేయవలసి వచ్చిందంటూ పేర్కొన్నారు. 'టీసీఎస్ ఫైరింగ్ ఫ్రెషర్స్?' అనే శీర్షికతో ఓ పోస్టు పెట్టారు. అహ్మదాబాద్, పుణెకు చెందిన పలువురు ట్రైనీలను కేవలం నాలుగైదు వారాల పాటు బెంచ్పై ఉంచి ఆ తర్వాత ఉద్వాసన పలికారని పేర్కొన్నారు.బెంచ్ పాలసీలో మార్పు, క్రియాశీల క్లయింట్ ప్రాజెక్ట్ లేకుండా అనుమతించదగిన వ్యవధిని 35 రోజులకు తగ్గించడం వంటివాటితో ఒత్తిడి తెచ్చి చప్పుడు లేకుండా ఉద్యోగులను టీసీఎస్ వదిలించుకుంటోందని ఆరోపించారు. ఉద్యోగాలు తగ్గించుకునేందుకు ఫ్రెషర్లను కూడా వదిలిపెట్టడం లేదన్నారు.బలవంతంగా రాజీనామా చేయించారు'నేను కొన్ని రోజుల క్రితం బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది' అని పేర్కొన్న రెడ్డిట్ యూజర్ ఫ్రెషర్స్ కూడా జాబ్ కట్ రాడార్ లో ఉన్నారని ఆరోపించారు. హెచ్ఆర్ తనను ఒక సమావేశానికి పిలిచి, తనతో ఫోన్ స్విచ్ఛాఫ్ చేయించి ఆపై తనకు రెండు ఆప్షన్లు ఇచ్చాడని పేర్కొన్నాడు. అవి వెంటనే రాజీనామా చేయడం లేదా తొలగింపును ఎదుర్కోవడం.రాజీనామా చేయకపోతే ఎటువంటి పరిహారం ఇవ్వకుండా నెగటివ్ రిలీజ్ లెటర్ జారీ చేస్తామని బెదిరించారని రాసుకొచ్చారు. అదే చెప్పినట్లు రాజీనామా చేస్తే మూడు నెలల వేతనం ఇచ్చి ఎటువంటి నెగటివ్ లేకుండా మంచిగా రిలీజ్ లెటర్ ఇస్తామన్నారని వివరించాడు. తన లాగే మరో నలుగురు ఫ్రెషర్లను కూడా ఏడిపించి బలవంతంగా రాజీనామా చేయించారని రెడ్డిట్ పోస్ట్లో పేర్కొన్నారు.తనను క్రియాశీల ప్రాజెక్టుకు కేటాయించినప్పటికీ బలవంతంగా రాజీనామా చేయించి ఆ ఆకస్మిక రాజీనామాకు వ్యక్తిగత కారణాలను పేర్కొనాలని హెచ్ఆర్ ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. రాజీనామా, తొలగింపు రెండింటిలో ఏదో ఒకటి నిర్ణయించుకోవడానికి తనకు కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చారని, తన కుటుంబంతో మాట్లాడేందుకు కూడా అనుమతించలేదని ఫ్రెషర్ ఆరోపించారు.👉 చదవండి: హమ్మయ్య.. ఈఎంఐలు ఇక కాస్తయినా తగ్గుతాయ్.. -
ప్రపంచ ఏఐని శాసించేది మనమే.. అన్ని అవకాశాలూ మనకే..
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విస్తృతి అంతటా పెరిగిపోయింది. అన్ని రంగాలను, పరిశ్రమలను ఈ సరికొత్త సాంకేతికత కమ్మేస్తోంది. దీంతో ఉద్యోగాలు, పని చేసే విధానం పూర్తిగా మారబోతున్నాయి. ఈ నేపథ్యంలో 16వ ఫిక్కీ గ్లోబల్ స్కిల్స్ సమ్మిట్ 2025లో ఫిక్కీ, కేపీఎంజీలు 'నెక్ట్స్ జనరేషన్ స్కిల్స్ ఫర్ ఎ గ్లోబల్ వర్క్ఫోర్స్: ఎనేబుల్ యూత్ అండ్ ఎంపవర్ ఎకానమీ' పేరుతో ఓ కీలక నివేదికను ఆవిష్కరించాయి.కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరి విడుదల చేసిన ఈ నివేదిక గ్లోబల్ ఏఐ టాలెంట్ హబ్ గా మారడానికి భారతదేశ రోడ్ మ్యాప్ ను వివరిస్తుంది.ప్రాంప్ట్ ఇంజినీర్లు, స్మార్ట్ గ్రిడ్ అనలిస్టులు వంటి సరికొత్త భవిష్యత్ ఉద్యోగాలతో ఐటీ, హెల్త్ కేర్, ఫైనాన్స్, మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో వేగవంతమైన కృత్రిమ మేధ ఆధారిత పరివర్తనను కీలక పరిశోధనలు హైలైట్ చేస్తున్నాయి. అయితే భారతీయ యువతలో కేవలం 26.1% మంది మాత్రమే సరైన వృత్తి శిక్షణను పొందుతున్నారు. ఇది అత్యవసర నైపుణ్య అంతరాలను తెలియజేస్తోంది.రంగాల వారీగా ఏఐ శిక్షణ, ఐటీఐలను ఆధునీకరించడం, టైర్ 2, 3 నగరాల్లో స్థానిక అవసరాలకు తగ్గట్లు నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని నివేదిక సిఫార్సు చేసింది. అట్టడుగు వర్గాల సాధికారత కోసం గ్లోబల్ సర్టిఫికేషన్ అలైన్ మెంట్, నైతిక ఏఐ ప్రమాణాలు, సమ్మిళిత విధానాలు అవసరమని పేర్కొంది.కలిసొచ్చే అంశాలు భారతదేశంలో ఎక్కువగా ఉన్న యువ జనాభా, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టార్టప్ ఎకోసిస్టమ్ మనం ఏఐ వర్క్ఫోర్స్లో నిర్ణయాత్మకమైన శక్తిగా ఎదగడానికి సానుకూల అంశాలుగా కేపీఎంజీకి చెందిన నిపుణులు పేర్కొన్నారు. వ్యూహాత్మక పెట్టుబడులు, సాహసోపేతమైన సంస్కరణలతో, భారత్ ఏఐ నిపుణులను బయటి దేశాలకు అందించగలదని అభిప్రాయపడ్డారు. -
‘ఓపెన్ఏఐతో మైక్రోసాఫ్ట్ సర్వనాశనం’
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో మాది గొప్ప అంటే మాది గొప్ప.. అంటూ చంకలు చరుచుకోవడం కంపెనీలకు అలవాటైంది. మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంగా ఉన్న ఓపెన్ఏఐ తాజాగా విడుదల చేసిన చాట్జీపీటీ-5 మోడల్ ఎంతో సమర్థంగా పని చేస్తుందని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిపై ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్మస్క్ స్పందిస్తూ త్వరలో ఓపెన్ఏఐ మైక్రోసాఫ్ట్ను నాశనం చేస్తుందని చెప్పారు.సత్య నాదెళ్ల పోస్ట్ చేస్తూ..‘ఈ రోజు జీపీటీ-5 మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్, కోపైలట్, గిట్హబ్ కోపైలట్, అజూర్ ఏఐ ఫౌండ్రీతో సహా మా ప్లాట్ఫామ్ల్లో లాంచ్ అవుతుంది. ఇది ఓపెన్ఏఐ వద్ద ఉన్న అత్యంత సమర్థవంతమైన మోడల్. ఇది రీజనింగ్, కోడింగ్, చాట్లో మెరుగైన పురోగతిని అందిస్తుంది. దీని మోడల్స్ అన్నీ అజూర్లో శిక్షణ పొందాయి. సామ్ఆల్ట్మన్ మాతో చేరి రెండున్నరేళ్లు అయిందంటే నమ్మలేకపోతున్నాం. బింగ్లో జీపీటీ-4 ఇంప్లిమెంట్ చేసేందుకు సామ్ మాతో చేరారు. అప్పటి నుంచి ఎంతో సాధించాం. తాజా పురోగతితో వేగం పెరుగుతుంది. ఈ మోడల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అన్నారు.Today, GPT-5 launches across our platforms, including Microsoft 365 Copilot, Copilot, GitHub Copilot, and Azure AI Foundry. It's the most capable model yet from our partners at OpenAI, bringing powerful new advances in reasoning, coding, and chat, all trained on Azure.It’s… pic.twitter.com/jHDA94YOL0— Satya Nadella (@satyanadella) August 7, 2025ఇదీ చదవండి: ‘భారత్ను బెదిరిస్తారు’.. సూపర్ పవర్గా ఎదగాలంటే..సత్య పోస్ట్పై ఎలాన్మస్క్ స్పందిస్తూ.. ‘త్వరలో ఓపెన్ఏఐ మైక్రోసాఫ్ట్ను బ్రతికుండగానే మింగేస్తుంది’ అన్నారు. దీనిపై సత్య ప్రతిస్పందిస్తూ.. ‘కొందరు 50 ఏళ్లుగా అందుకోసం ప్రయత్నిస్తున్నారు. అదే సరదా అయిన విషయం! ప్రతిరోజూ మీరు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటారు. సృజనాత్మకతను జోడిస్తూ భాగస్వామిగా మారుతారు. తర్వాత ఇతరులతో పోటీపడతారు. అజూర్లో గ్రోక్ 4 వినియోగంపట్ల ఉత్సాహంగా ఉన్నాను. గ్రోక్ 5 కోసం ఎదురుచూస్తున్నాను!’ అని రాసుకొచ్చారు. ‘గ్రోక్ 4 హెవీ రెండు వారాల క్రితం జీపీటీ 5 కంటే స్మార్ట్గా ఉంది’ అని మస్క్ రిప్లై ఇచ్చారు. దాన్ని సూచించే కొన్ని డేటా పాయింట్లు ఉన్న పోస్ట్ను కోట్ చేశారు.OpenAI is going to eat Microsoft alive— Elon Musk (@elonmusk) August 7, 2025People have been trying for 50 years and that’s the fun of it! Each day you learn something new, and innovate, partner, and compete. Excited for Grok 4 on Azure and looking forward to Grok 5!— Satya Nadella (@satyanadella) August 7, 2025 -
తక్కువ ధరకే బోలెడు ఫీచర్లు!
ప్రముఖ స్మార్ట్ఫోన్ సంస్థ 'వన్ప్లస్' వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను పరిచయం చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే 'వన్ప్లస్ నార్డ్ సీఈ' సిరీస్ను ఒక ప్రధాన లక్ష్యంతో తీసుకొచ్చింది. ఇది శక్తివంతమైన పనితీరు, లేటెస్ట్ ఫీచర్స్, యూజర్ ఇంటర్ఫేస్తో కూడిన సిగ్నేచర్ వన్ప్లస్ అనుభవాన్ని ప్రేక్షకులకు అందిస్తుంది. దీనికి 'వన్ప్లస్ నార్డ్ సీఈ5' (OnePlus Nord CE5) ఒక ఉదాహరణ. లేటెస్ట్ వన్ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సామర్థ్యాలను కలిగి, ఆక్సిజన్ఓఎస్ అనుభవాన్ని మెరుగుపరచడం ద్వారా ఇది మంచి పనితీరును అందిస్తుంది. ఇది దాని విభాగంలో.. ధరకు తగిన ఫ్రీమియం ఫీచర్స్ అందిస్తుంది.వన్ప్లస్ నార్డ్ సీఈ5 - వాల్యూ ఫర్ మనీరూ.25వేలు లోపు ధర వద్ద బెస్ట్ ఫీచర్స్ కలిగిన స్మార్ట్ఫోన్ వన్ప్లస్ నార్డ్ సీఈ5. మీరు చెల్లించే డబ్బుకు, తగిన ఫీచర్స్ తప్పకుండా ఆస్వాదించవచ్చు. ఈ స్మార్ట్ఫోన్ను మీరు మాత్రమే కాకుండా.. మీ సన్నిహితులకు లేదా కుటుంబ సభ్యులకు కూడా పండుగల సమయంలో గిఫ్ట్గా ఇవ్వడానికి అనువైనది.వన్ప్లస్ నార్డ్ సీఈ5 ఫీచర్లు ఇలా..మీడియాటెక్ 8350 అపెక్స్ప్రతి మొబైల్కు కీలకంగా వ్యవహరించేది దాని ప్రాసెసర్. నార్డ్ సీఈ5లో మీడియాటెక్ 8350 అపెక్స్ చిప్ సెట్ ఉంది. ఇది దాని పనితీరును సూచిస్తుంది. వినియోగదారుల కోసం రూపొందించబడిన కొత్త తరం ప్రాసెసర్ ఇది. యువత మొబైల్ స్పీడ్లో రాజీపడకుండా మెరుగైన పనితీరును కోరుకుంటారు. కాబట్టి దీన్ని సమర్థవంతమైన ఆర్కిటెక్చర్తో నిర్మించారు. యూజర్లకు అంతరాయం లేకుండా యాప్ను రన్ చేస్తూ, అప్రయత్నంగా మల్టీ టాస్కింగ్ నిర్వహిస్తుంది. పెద్ద సైజ్లో ఉన్న గేమ్లను కూడా 120 ఎఫ్పీఎస్తో స్మూత్ గేమింగ్ పనితీరును నిర్ధారిస్తుంది. వినియోగదారుల ప్రవర్తన ఆధారంగా పనితీరును ఆప్టిమైజ్ చేసేలా కొన్ని ఫీచర్లను కూడా కంపెనీ అందిస్తుంది.సూపర్ ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ప్లేనార్డ్ సీఈ5లో 6.7 అంగుళాల సూపర్ ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ప్లే ఉంది. ఇది మంచి విజువల్ను అందిస్తుంది. ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్, బటర్ స్మూత్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో స్క్రీన్ వేగంగా స్పందిస్తుంది. సాధారణంగా అధిక బ్రైట్నెస్ అవుట్ డోర్ విజిబిలిటీకి సమస్యగా ఉంటుంది. హెచ్డీఆర్10+ కాంట్రాస్ట్, కలర్ క్లారిటీతో ఈ సమస్యకు నార్డ్ సీఈ5 చెక్ పెడుతుంది. ఇందులోకి ఏఐ విజువల్ ఎన్హాన్స్మెంట్ విభిన్న లైటింగ్ కండిషన్స్లో వినియోగదారులకు మంచి అనుభవాన్ని అందిస్తుంది. గేమ్ ఆడుతున్నా, ఎక్కువగా స్క్రీన్ చూస్తున్నా ఈ డిస్ప్లే యూజర్లకు మెరుగైన అనుభవాన్ని సొంతం చేస్తుంది.కెమెరా సిస్టమ్వన్ప్లస్ నార్డ్ సీఈ5లో కేవలం మెగాపిక్సెల్స్ కోసమే కాకుండా అర్థవంతమైన ఫొటోగ్రఫీ కోసం డిజైన్ చేసిన రిఫైన్డ్ డ్యూయల్ లెన్స్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది.50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్: తక్కువ వెలుతురులో కూడా అదిరిపోయే క్లారిటీ, డైనమిక్ రేంజ్ అందిస్తుంది.8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా: ల్యాండ్స్కేప్, గ్రూప్ షాట్స్, ఆర్కిటెక్చర్ కోసం ఇది ప్రత్యేకమైంది.60 ఎఫ్పీఎస్ వద్ద 4కే వీడియో: రియల్ టైమ్ స్టెబిలైజేషన్తో ఫ్లూయిడ్, సినిమా క్వాలిటీ రికార్డింగ్ అందిస్తుంది.ఈ ఫోన్లో ప్రతి కెమెరా షాట్ను ఎలివేట్ చేసేలా ఏఐ ఆధారిత ఫొటోగ్రఫీ ఫీచర్లు ఉన్నాయి. సీన్ రికగ్నిషన్, ఇంటెలిజెంట్ హెచ్డీఆర్, నైట్ స్కేప్ ఆప్టిమైజేషన్, సోషల్ రెడీ కంటెంట్ కోసం రూపొందించిన సృజనాత్మక ఫిల్టర్లు ఉన్నాయి.అర్థం చేసుకునే ఏఐనార్డ్ సీఈ5ను మార్కెట్లోని ఇతర ఫోన్లతో నిజంగా వేరు చేసేది అందులో వాడుతున్న కృత్రిమ మేధ. ఇందులో స్మార్ట్ ఉత్పాదకత సాధనాలను వాడారు. ఫోన్లోని ఏఐ యూజర్ షెడ్యూల్ను నిర్వహించగలదు. ఈమెయిల్లను చదివి సంక్షిప్తంగా తెలపగలదు. సందర్భోచితంగా నోటిఫికేషన్లకు కూడా ప్రాధాన్యత ఇవ్వగలదు.కెమెరా ఏఐ: ఫొటో తీస్తున్న సమయంలో సబ్జెక్ట్, బ్యాక్ గ్రౌండ్ ఆధారంగా ఫోకస్, లైటింగ్, కలర్ టోన్లను ఆటో అడ్జస్ట్ చేస్తుంది. దీంతో మాన్యువల్గా మళ్లీ సదరు ఫొటో లేదా కెమెరా సెట్టింగ్స్లోకి వెళ్లి మార్పులు చేయాల్సిన పని ఉండదు.120 ఎఫ్పీఎస్ గేమింగ్ పవర్ హౌస్స్మార్ట్ ఫోన్లో గేమింగ్ అనేది ప్రస్తుత రోజుల్లో ప్రధానంగా మారింది. నార్డ్ సీఈ 5 ఈ అనుభవాన్ని చాకచక్యంగా అందిస్తుంది. దాని 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్కు అందుకు ఎంతో తోడ్పడుతుంది. 120 ఎఫ్పీఎస్ వద్ద అసాధారణ గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది.డిజైనింగ్నార్డ్ సీఈ 5 బ్రష్డ్ మ్యాట్ ఫినిష్తో హై-గ్రేడ్ పాలీకార్కొనేట్తో తయారైంది. యూనిబాడీతో ప్రీమియం లుక్ ఉండేలా డిజైన్ చేశారు. ఇది విజువల్ అప్పీల్ మాత్రమే కాకుండా మంచి గ్రిప్ను కూడా నిర్ధారిస్తుంది. సీఈ5లోని కలర్ ఆప్షన్లు కింది విధంగా ఉన్నాయి.గ్రాఫైట్ ఐస్ - రిఫ్లెక్టివ్ షైనింగ్తో మెటాలిక్ గ్రే కలర్.మిస్ట్ బ్లూ - హిమానీనదాల నుండి ప్రేరణ పొంది ఈ రంగులో అందిస్తున్నారు.సన్సెట్ కాపర్ఆక్సిజన్ఓఎస్ఆక్సిజన్ఓఎస్ తాజా వెర్షన్తో నడుస్తున్న నార్డ్ సీఈ 5 రెస్పాన్సివ్, యాడ్ ఫ్రీ సాఫ్టేవేర్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ మిడ్ రేంజ్ ఫోన్ల్లో చాలా అరుదుగా ఉంటుంది. ఇందులోని స్మార్ట్ ఎఫిషియెన్సీ టూల్స్ మెరుగైన షెల్ఫ్ విడ్జెట్లు, సందర్భోచిత యాప్ సజెషన్లను అందిస్తున్నాయి. వినియోగదారులకు వారి డిజిటల్ గోప్యతపై మరింత నియంత్రణను కల్పించేలా మెరుగైన భద్రతా ఫీచర్లను అందిస్తుంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే థీమ్స్, ఫింగర్ ప్రింట్ యానిమేషన్లు, ఐకాన్ ప్యాక్లను నియంత్రిస్తుంది. మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్లు, ప్రధాన ఆండ్రాయిడ్ అప్డేషన్లను అందిస్తుంది.5జీ కనెక్టివిటీనార్డ్ సీఈ5 డ్యూయల్ 5జీ సిమ్ స్లాట్లను కలిగి ఉంది. ఇది విస్తృత శ్రేణి గ్లోబల్ 5జీ బ్యాండ్లను సపోర్ట్ చేస్తుంది. అధిక రిజల్యూషన్ కంటెంట్ను స్ట్రీమింగ్ చేస్తున్నా, రియల్ టైమ్ క్లౌడ్ గేమింగ్లో పాల్గొంటున్నా లేదా అధిక మొబిలిటీ సందర్భాల్లో వీడియో కాలింగ్ చేసినా సీఈ 5 అల్ట్రా లో-లేటెన్సీ వల్ల స్థిరమైన వేగంతో పని చేస్తుంది.హై-స్పీడ్, మెరుగైన ఇంటర్నెట్ కోసం వై-ఫై 6ఈడ్యూయల్ డివైజ్ ఆడియో సపోర్ట్, బ్లూటూత్ 5.3 టెక్నాలజీఅంతరాయం లేని మొబైల్ పేమెంట్లు, డివైజ్ పెయిరింగ్ కోసం ఎన్ఎఫ్సీవేగవంతమైన డేటా బదిలీ, రివర్స్ ఛార్జింగ్ సామర్థ్యాల కోసం యూఎస్బీ-ఈ 3.2 జెన్ 1 సదుపాయంఆడియో ఎక్స్ పీరియన్స్ఆడియో కోసం నార్డ్ సిఇ 5 డాల్బీ అట్మోస్ సర్టిఫికేషన్తో స్టీరియో డ్యూయల్ స్పీకర్లను కలిగి ఉంది. గేమింగ్, వీడియోలు చూడటం లేదా కాల్స్లో ఉన్నా స్పష్టమైన ఆడియోను అందిస్తుంది. మ్యూజిక్ వింటున్న సమయంలో స్పష్టమైన సంగీతం ఆస్వాదించేలా ఏర్పాటు చేశారు. యూఎస్బీ-సీ ద్వారా హై-రిజల్యూషన్ ఆడియో సపోర్ట్ చేస్తుంది. రియల్టైమ్లో పరిసరాల శబ్దం ఆధారంగా వాల్యూమ్ స్థాయిలను నిర్వహించే ఏఐ ఆధారిత ట్యూనింగ్ సిస్టమ్ ఉంది. 3.5 ఎంఎం హెడ్ఫోన్ జాక్ను సపోర్ట్ చేస్తుంది.కూలింగ్ సిస్టమ్ఫోన్లో అధిక సైజ్ ఉన్న గేమ్లు ఎక్కువసేపు ఆడితే మొబైల్ వేడవ్వడం సహజం. దీన్ని కట్టడి చేసేందుకు నార్డ్ సీఈ5 మెరుగైన మల్టీ లేయర్ గ్రాఫైట్, వేపర్ ఛాంబర్ కూలింగ్ వ్యవస్థను పరిచయం చేస్తుంది. ఇది మునుపటి నార్డ్ మోడళ్ల కంటే వేడిని మరింత సమర్థవంతంగా నిర్వహిస్తుంది. సుదీర్ఘ గేమింగ్ లేదా వీడియో సెషన్ల సమయంలో కూడా సౌకర్యవంతమైన అనుభవాన్ని ఇస్తుంది.భద్రత ఫీచర్లునార్డ్ సీఈ5 డిస్ప్లేపై ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫీచర్ను అందిస్తుంది. దాంతోపాటు వేగవంతమైన, మరింత సురక్షితమైన యాక్సెస్ కోసం ఏఐ ఆధారిత ఫేస్ అన్లాక్ వెసులుబాటును ఇస్తుంది. ఇందులోని ప్రైవేట్ సేఫ్ 3.0 ద్వారా సున్నితమైన డాక్యుమెంట్లు, ఇమేజ్లు, ఫైళ్లను ఎన్ క్రిప్టెడ్గా స్టోర్ చేసుకోవచ్చు.చివరగా..మిడ్ రేంజ్ మార్కెట్లో వన్ప్లస్ నార్డ్ సీఈ5 కీలకంగా వ్యవహరించనుంది. వినియోగదారులను ఆకర్షించే ఇన్నోవేషన్ ప్రీమియం ధరలతోనే రావాల్సిన అవసరం లేదని వన్ప్లస్ బ్రాండ్ మరోసారి నిరూపించింది. రియల్ వరల్డ్ పెర్ఫార్మెన్స్, అర్థవంతమైన ఫీచర్లు, ఇంటెలిజెంట్ డిజైన్ ఎంపికలకు ప్రాధాన్యమిచ్చే నార్డ్ సీఈ5ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్యాటరీ నుంచి దాని ఏఐ ఆధారిత కెమెరా వరకు, ఫ్లూయిడ్ 120 హెర్ట్జ్ గేమింగ్ నుంచి ప్రాసెసింగ్ ఎనర్జీ వరకు నార్డ్ సీఈ5 వినియోగదారుకు నమ్మశక్యం కాని అనుభవాన్ని అందిస్తుంది.వన్ప్లస్ నార్డ్ సీఈ5 వేరియంట్స్ & ధరలు1) 8 జీబీ + 128 జీబీ: రూ. 24,9992) 8 జీబీ + 256 జీబీ: రూ. 26,9993) 12 జీబీ + 256 జీబీ: రూ. 28,999 -
కెమరా ఫోకస్ పెట్టు... సినిమా మజా పట్టు!
మనం కొన్ని నగరాలను సందర్శించినప్పుడు.. అక్కడ రోడ్డుపక్కన గోడలపైన లేదా కొన్ని హోటల్లో ఆకర్షణీయమైన చిత్రాలు కనిపిస్తాయి. అవి చూడగానే ఆకట్టుకునే విధంగా ఉంటాయి. అంతగా ఆకట్టుకునే చిత్రాలు మాట్లాడితే?, వచ్చే అనుభూతి మాటల్లో చెప్పలేము. ఈ ఆలోచనకే న్యూజెర్సీలోని ఫ్రాంక్లిన్ పార్క్లోని ఒక రెస్టారెంట్ కార్యరూపం దాల్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వీడియోలో గమనించినట్లయితే.. రెస్టారెంట్కు విచ్చేసిన కస్టమర్లు గోడలపై ఉన్న చిత్రాలను మొబైల్ ఫోన్ కెమెరా ద్వారా చూస్తుంటే, కొన్ని బొమ్మలు డైలాగ్స్ చెబుతున్నాయి, మరికొన్ని డ్యాన్స్ వేస్తున్నాయి. ఇవన్నీ కస్టమర్లను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తున్నాయి. భారతీయ వంటకాలను ఆస్వాదిస్తూ.. ఇండియన్ సినిమా డైలాగ్స్ కూడా వినవచ్చు. View this post on Instagram A post shared by Marketing Stories (@marketing.stories) -
చెబితే రాసే యంత్రం.. సరికొత్త టెక్నాలజీ
టెక్నాలజీ పెరుగుతోంది, కొత్త ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే కేరళకు చెందిన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఒకరు 'టాక్ టు రైట్' అనే ఏఐ డివైజ్ రూపొందించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..లింక్డ్ఇన్ పోస్ట్లో, అజయ్ హెచ్ అనే విద్యార్థి.. ఈ పరికరం AI బేస్డ్ వాయిస్-టు-పెన్ సిస్టమ్ అని, ఇది CNC పెన్ ప్లాటర్ని ఉపయోగించి మనం మాట్లాడే పదాలను చేతితో రాసిన టెక్స్ట్గా మారుస్తుందని వెల్లడించారు. ఈ పరికరాన్ని రాస్ప్బెర్రీ పై, ఆర్డునో (GRBL), పైథాన్లతో రూపొందించారని వెల్లడించారు. దీనిని ఎంటే కేరళం ఎక్స్పో 2025 (Ente Keralam Expo 2025)లో ఆవిష్కరించారు.ఇదీ చదవండి: ఏఐ నుంచి ఎవరూ తప్పించుకోలేరు: గౌడత్ హెచ్చరికలింక్డ్ఇన్ పోస్ట్లో షేర్ చేసిన వీడియోలో గమనించినట్లయితే.. అక్కడ అమర్చిన టాక్ టు రైట్ పరికరం మైక్లో అజయ్ మాట్లాడుతూ 'డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్' అని చెబుతాడు. ఆ యంత్రం కాగితంపై ఆ ఎలాంటి తప్పులు లేకుండా రాస్తుంది. ఇది వైకల్యం ఉన్న వ్యక్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. View this post on Instagram A post shared by SUNNOBC | JAYRAJSINH ZALA (@sunnobc) -
ఏఐ నుంచి ఎవరూ తప్పించుకోలేరు: గౌడత్ హెచ్చరిక
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఊహకందని సమస్యలను తీసుకొస్తుందని 'గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ'గా ప్రసిద్ధి చెందిన 'జియోఫ్రీ హింటన్' (Geoffrey Hinton) హెచ్చరికలు జారీ చేసిన తరువాత.. గూగుల్ మాజీ ఎగ్జిక్యూటివ్ 'మో గౌడత్' (Mo Gawdat) కూడా అదే తరహాలో పేర్కొన్నారు.కృత్రిమ మేధ కారణంగా 2027 నుంచి భారీ సంఖ్యలో ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుందని, సమాజానికి పెద్ద సమస్యగా తయారవుతుందని మో గౌడత్ పేర్కొన్నారు. సాఫ్ట్వేర్ డెవలపర్లు, సీఈఓలు, పాడ్కాస్టర్లతో సహా ఎవరూ ఏఐ నుంచి తప్పించుకోలేరని అన్నారు. అంతే కాకుండా రాబోయే 15 సంవత్సరాలు ఉద్యోగులకు నరకం అని సంబోధించారు.గూగుల్ సంస్థలో చీఫ్ బిజినెస్ ఆఫీసర్గా పనిచేసిన గౌడత్.. ప్రస్తుతం ఎమ్మా.లవ్ అనే స్టార్టప్ నడుపుతున్నారు. ఇందులో కేవలం ముగ్గురు వ్యక్తులు మాత్రమే పనిచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో ఆ స్టార్టప్లో 350 మంది డెవలపర్లు ఉండేవారు. కానీ ఏఐ కారణంగా ప్రస్తుతం దీన్ని ముగ్గురే నిర్వహిస్తున్నారు. దీన్ని బట్టి ఏఐ ఎంతగా విస్తృతిస్తోందో అర్థం చేసుకోవచ్చు.ఏఐ ఆవిర్భావం 'సామాజిక అశాంతిని' రేకెత్తిస్తుందని. ప్రజలు ఇప్పటికే తమ జీవనోపాధిని కోల్పోతున్నారు. దీని ఫలితంగా మానసిక ఆరోగ్య సమస్యలు పెరగడం, ఒంటరితనం పెరగడం, సామాజిక విభజనలు తీవ్రమవుతాయని గౌడత్ అన్నారు. ఏఐని సరిగ్గా నియంత్రించకపోతే భారీ అసమానతలను సృష్టిస్తుంది. ధనవంతులు మాత్రమే మనగలుగుతారు. మిగతా వారందరూ కష్టపడతారని ఆయన హెచ్చరించారు.ఇదీ చదవండి: ఉద్యోగం మానేసి నా స్టోర్లో పనిచెయ్ అన్నాడు: కానీ ఇప్పుడు..ఏఐ సొంత భాషప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత అయిన జియోఫ్రీ హింటన్ 'వన్ డెసిషన్' ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతూ.. ఏఐ సొంత భాషను ఏర్పాటు చేసుకుంటుంది. ఆ భాషను మానవ సృష్టికర్తలు కూడా అర్థం చేసుకోలేరని హెచ్చరించారు. యంత్రాలు ఇప్పటికే భయంకరమైన ఆలోచనలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని ప్రదర్శించాయి. ఆ ఆలోచనలు ఎల్లప్పుడూ మనం ట్రాక్ చేయగల భాషలోనే ఉంటాయని భావించకూడదు. ఇదే జరిగితే ఆ తరువాత జరిగే పరిణాలను అంచనా వేయలేమని అన్నారు. -
84,000 గేమింగ్ యూజర్ల వివరాలు లీక్!
గతేడాది దేశీయంగా 84,000 పైచిలుకు ఆన్లైన్ గేమింగ్ ఖాతాదారుల వివరాలు లీక్ అయినట్లు గ్లోబల్ సైబర్సెక్యూరిటీ, డిజిటల్ ప్రైవసీ కంపెనీ కాస్పర్స్కీ వెల్లడించింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో (ఏపీఏసీ) ఇలాంటి ఉదంతాలు అత్యధికంగా థాయ్ల్యాండ్లో, అత్యల్పంగా సింగపూర్లో నమోదయ్యాయి.కాస్పర్స్కీ ప్రకారం.. థాయ్ల్యాండ్లో 1,62,892 కేసులు, ఫిలిప్పీన్స్లో 99,273, వియత్నాంలో 87,969, సింగపూర్లో 4,262 కేసులు నమోదయ్యాయి. గతేడాది మొత్తం మీద 1.1 కోట్ల గేమింగ్ ఖాతాల వివరాలు బహిర్గతమైనట్లు కాస్పర్స్కీ తెలిపింది. అంతర్జాతీయంగా గేమర్లలో దాదాపు సగం మంది ఏపీఏసీ రీజియన్లోనే ఉన్నారు.ఆగ్నేయాసియాలో చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా మార్కెట్లు కీలకంగా ఉంటున్నాయి. ఈ మార్కెట్లలో డిజిటల్.. మొబైల్స్ వినియోగం పెరగడం, పెద్ద సంఖ్యలో యువ జనాభా తదితర అంశాలు గేమింగ్కి దన్ను గా ఉంటున్నాయి. 180 కోట్ల మంది పైగా ప్లే యర్లతో ఏపీఏసీ రీజియన్ అంతర్జాతీయంగా గేమింగ్ ధోరణులను కొత్తగా తీర్చిదిద్దుతోందని కాస్పర్స్కీ తెలిపింది. దీంతో ఈ ప్రాంతంలో సైబర్ ముప్పులు కూడా పెరుగుతున్నాయని వివరించింది.ఇదీ చదవండి: ఉద్యోగం మానేసి నా స్టోర్లో పనిచెయ్ అన్నాడు: కానీ ఇప్పుడు..ద్వితీయ శ్రేణి నగరాలపై కంపెనీ దృష్టిభారత్లో విస్తరణలో భాగంగా ఇతర భాగస్వాములతో చేతులు కలపడం ద్వారా ద్వితీయ శ్రేణి పట్టణాల్లోకి కూడా ప్రవేశించే యోచనలో ఉన్నట్లు కాస్పర్స్కీ ఎండీ (ఆసియా పసిఫిక్) ఏడ్రియన్ హియా తెలిపారు. ప్రస్తుతం కంపెనీ దేశీయంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు నుంచి కార్యకలాపాలు సాగిస్తోంది. గత రెండేళ్లుగా భారత్లో సేల్స్, టెక్నికల్ సపోర్ట్ తదితర విభాగాల్లో స్థానిక సిబ్బంది సంఖ్యను మూడు రెట్లు పెంచుకున్నట్లు హియా చెప్పారు. అంతర్జాతీయంగా తమ కార్యకలాపాలకు కీలక ఇన్నోవేషన్ హబ్గా భారత్ను పరిగణిస్తున్నామని, ఇక్కడ పరిశోధన–అభివృద్ధి కార్యకలాపాలను పెంచుకుంటున్నామని వివరించారు. -
మ్యాక్బుక్ కోసం వియత్నాం: ఎంత డబ్బు సేవ్ అయిందంటే?
మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ వంటి ఎలక్ట్రానిక్స్ మన దేశంలో కంటే కొన్ని ఇతర దేశాల్లో కొంత తక్కువ ధరకే లభిస్తాయని, చాలా సందర్భాల్లో వినే ఉంటారు. ఇది నిజమే అని ఓ వ్యక్తి నిరూపించి చూపించాడు. ఈ విషయాన్ని వివరంగా తన రెడ్డిట్లో పోస్ట్ చేశాడు.''నేను మ్యాక్బుక్ కొనడానికే భారతదేశం నుంచి వియత్నాంకు వెళ్లాను'' అనే శీర్షికతో ఆ వ్యక్తి తన అనుభవాన్ని పూర్తిగా వివరించాడు. మీరు మ్యాక్బుక్ కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే వియత్నాంకు ఓ చిన్న ట్రిప్ వేసుకోండని కూడా సలహా ఇచ్చాడు.నేను కొంత తక్కువ ధరలోనే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని హనోయ్కి (వియత్నాం రాజధాని) చేరుకున్నాను. మ్యాక్బుక్ కొనడానికి సమీపంలోని ప్రాంతాలలో 15 కంటే ఎక్కువ షాపులను సందర్శించాను. ల్యాప్టాప్ కోసం వెళ్లి 11 రోజులు వెకేషన్ ఎంజాయ్ చేసాను. మొత్తానికి రూ. 1.48 లక్షలకు మ్యాక్బుక్ కొనేసాను.ఇండియాలో మ్యాక్బుక్ ధర రూ. 1.89 లక్షలు. కార్డ్ ఆఫర్లతో రూ. 1.85 లక్షలు. అయితే వియత్నాంలో రూ. 1,48,500లకు కొనుగోలు చేసాను. దీంతో రూ. 36,500 ఆదా అయింది. అంటే ఇది దాదాపు రౌండ్ ట్రిప్ టికెట్ ధర. మొత్తం మీద ల్యాప్టాప్ ఖర్చుతో సహా, ప్రయాణానికి దాదాపు రూ.2.08 లక్షలు ఖర్చు అయింది. ట్యాక్స్ వంటివి వాపసు వచ్చిన తరువాత ఖర్చు రూ. 1.97 లక్షలు. ఇందులో మ్యాక్బుక్ ధరను తీసివేస్తే.. ఆ వ్యక్తి వియత్నాం తిరిగిరావడానికి అయిన ఖర్చు అని తెలుస్తోంది.ఇదీ చదవండి: అందని జీతం.. ఫుట్పాత్పై పడుకున్న టీసీఎస్ ఉద్యోగిప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. మొత్తానికి ఇండియాలో మ్యాక్బుక్ కొనుగోలు చేయడానికి పెట్టే డబ్బుతో.. మ్యాక్బుక్ కొనుగోలు చేయడమే కాకుండా వియత్నాం కూడా చూసి వచ్చేసాడు. అయితే రెండు లేదా మూడు మ్యాక్బుక్స్ కొనాలనుకునే వారికి ఇంకా ఎక్కువ ఆదా అవుతుందని కొందరు చెబుతున్నారు.I flew to Vietnam from India just to buy a MacBookbyu/Shuict inmacoffer -
సిమ్ యాక్టివ్ ప్లాన్లు.. ఒక్కసారి రీచార్జ్ చేస్తే చాలు
చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ మొబైల్ నంబర్లు ఉంటాయి. టెలికం సంస్థలు టారిఫ్లను పెంచేసిన నేపథ్యంలో రెండింటికీ రీచార్జ్ చేయాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రాథమికంగా వినియోగించే నంబర్ కాకుండా మరో నంబర్ను తక్కువ ఖర్చుతో యాక్టివ్ ఉంచుకొనే రీచార్జ్ ప్లాన్ల కోసం చాలా మంది చూస్తున్నారు.డేటా లేకుండా కూడా మొబైల్ నంబర్ను యాక్టివ్గా ఉంచడానికి సహాయపడే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్లను ప్రారంభించాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అన్ని ప్రధాన టెలికాం కంపెనీలను ఆదేశించింది. ఈ క్రమంలో ఎయిర్టెల్, జియో, వీఐలు తమ డేటా ఫ్రీ ప్రీపెయిడ్ ప్లాన్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..ఎయిర్టెల్ డేటా రహిత ప్లాన్స్ఇంటర్నెట్ డేటా సదుపాయం లేకుండా కాలింగ్, ఎస్ఎంఎస్ ల పూర్తి ప్రయోజనాన్ని అందించే రెండు ప్లాన్లను ఎయిర్ టెల్ ప్రవేశపెట్టింది. 84 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ రూ.469కి అందుబాటులో ఉంది. ఇది దేశవ్యాప్తంగా అపరిమిత కాలింగ్, ఉచిత రోమింగ్, 900 ఎస్ఎంఎస్లను అందిస్తోంది. 365 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ ధర రూ.1849. ఇందులో అపరిమిత కాలింగ్, ఉచిత రోమింగ్, ఏడాది పొడవునా 3600 ఎస్ఎంఎస్లు లభిస్తాయి.జియో లాంగ్ వాలిడిటీ ఆఫర్లు84 రోజులు, 336 రోజుల వాలిడిటీ ఉన్న రెండు డేటా ఫ్రీ ప్లాన్లను జియో అందిస్తోంది. రూ.448 విలువైన 84 రోజుల ప్లాన్ ద్వారా అపరిమిత కాలింగ్, 1000 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. అదే సమయంలో రూ .1748 విలువైన 336 రోజుల ప్లాన్ వినియోగదారులకు అన్లిమిటెడ్ కాలింగ్, 3600 ఎస్ఎంఎస్ల సదుపాయాన్ని అందిస్తుంది.వొడాఫోన్ ఐడియా ప్లాన్స్వొడాఫోన్ ఐడియా కూడా ఎయిర్టెల్ మాదిరిగానే రెండు ప్లాన్లను లాంచ్ చేసింది. రూ.470 ప్లాన్లో యూజర్లకు 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రూ.1849 ప్లాన్తో 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రెండు ప్లాన్లు అపరిమిత కాలింగ్, ఎస్ఎంఎస్లను అందిస్తాయి. ఇది దాదాపు ఎయిర్టెల్ ఆఫర్లను పోలి ఉంటుంది.చదవండి: ఎయిర్టెల్ కొత్త రీచార్జ్ ప్లాన్.. ఓటీటీలన్నీ ఫ్రీ.. -
ఎప్పుడూ ఊహించని కొత్త ఉద్యోగాలొస్తాయ్..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వ్యవస్థలు రోజురోజుకూ మెరుగవుతున్నకొద్దీ మానవ ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన పెరుగుతోంది. మనుషులు చేయగలిగే పనులన్నీ ఏఐ చేసేస్తుండటంతో మానవ ఉద్యోగాలను త్వరలోనే ఈ కొత్త ఏఐ టూల్స్ భర్తీ చేసే ప్రమాదం ఎక్కువవుతోంది.టెక్ దిగ్గజాల సీఈవోలూ ఇదే హెచ్చరిస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో తమ కంపెనీలోని ఉద్యోగులను ఏఐ తగ్గిస్తుందని స్వయంగా అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీనే కొన్ని వారాలుగా చెబుతూ వస్తున్నారు. ప్రతి ఒక్కరి ఉద్యోగాలు ప్రభావితమవుతాయని ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ కూడా ఇటీవల హెచ్చరించారు.సమూల మార్పుఅయితే,ఈ క్రమంలో ఉద్యోగుల్లో ఏఐపై ఉన్న భయాల్ని పొగొట్టేలా గూగుల్ డీప్ మైండ్ సీఈఓ డెమిస్ హస్సాబిస్ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. ఓ అడుగు ముందుకేసి ప్రస్తుతం ప్రత్యామ్నాయంగానే ఉన్న కృత్రిమ మేధస్సుతో రాబోయే ఐదు నుండి పదేళ్లలో ఉద్యోగ భావనలోనే సమూల మార్పు సంభవించవచ్చని అభిప్రాయపడ్డారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎప్పుడూ ఊహించని విధంగా కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని ‘వైర్డ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు."ఉద్యోగ ప్రపంచంలో చాలా మార్పు ఉంటుందని నేను అనుకుంటున్నాను. కానీ గతంలో మాదిరిగానే మెరుగైన కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. ఇవి ఈ సాధనాలు లేదా కొత్త సాంకేతికతలను ఉపయోగిస్తాయి" అని హస్సాబిస్ అన్నారు.డాక్టరుకూ ముప్పు?ప్రస్తుతం మానవులు చేసే ప్రతి పనినీ ఏజీఐ లేదా ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ చేయగలిగితే, రానున్న కొత్త ఉద్యోగాలను కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానం భర్తీ చేయకుండా ఆపగలమా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమైంది. దీనికి హస్సాబిస్ బదులిస్తూ ఒక వైద్యుడి స్థానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భర్తీ చేయగలదు కానీ నర్సులను కాదు అన్నారు."సాధారణంగా డాక్టర్ ఏం చేస్తారు.. డాక్టర్ చేసే రోగ నిర్ధారణను ఏఐ టూల్ సాయంతో చేయవచ్చు. లేదా పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరహా డాక్టర్లు రావచ్చు. కానీ నర్సులు అలా కాదు. ఎందుకంటే నర్సుల ఉద్యోగంలో మానవ సహానుభూతి ఎక్కువగా ఉంటుంది" అని వివరించారు.చదవండి: ఇదిగో ఈ 40 రకాల ఉద్యోగాలకు డేంజర్! -
ఆ భాషను ఎవరూ అర్థం చేసుకోలేరు: హింటన్ హెచ్చరిక
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాజ్యమేలుతోంది. అన్ని రంగాల్లో ఏఐ హవా కొనసాగుతోంది. ఇప్పటికే చాలామంది ఉద్యోగుల్లో భయం పుట్టుకుంది. ఇలాంటి సమయంలో 'గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ'గా ప్రసిద్ధి చెందిన 'జియోఫ్రీ హింటన్' (Geoffrey Hinton) ఓ హెచ్చరిక జారీ చేశారు.ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత అయిన జియోఫ్రీ హింటన్ 'వన్ డెసిషన్' పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ప్రస్తుతం, AI ఇంగ్లీషులో ఆలోచిస్తుంది. కాబట్టి డెవలపర్లు కూడా టెక్నాలజీ ఏమి ఆలోచిస్తుందనే విషయాన్ని ట్రాక్ చేయడానికి వీలు కలుగుతోంది. అయితే ఇది త్వరలోనే ఓ సొంత ప్రైవేట్ భాషను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. ఆ భాషను మానవ సృష్టికర్తలు కూడా అర్థం చేసుకోలేరని హెచ్చరించారు.యంత్రాలు ఇప్పటికే భయంకరమైన ఆలోచనలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని ప్రదర్శించాయి. ఆ ఆలోచనలు ఎల్లప్పుడూ మనం ట్రాక్ చేయగల భాషలోనే ఉంటాయని భావించకూడదు. ఇదే జరిగితే ఆ తరువాత జరిగే పరిణాలను అంచనా వేయలేము.ఇదీ చదవండి: విదేశీ గడ్డపై వేల కోట్ల సామ్రాజ్యం.. ఎవరీ భారతీయుడు?హింటన్ చేసిన కృషి AI వ్యవస్థలకు మార్గం సుగమం చేసింది. కానీ భద్రతా గురించి ఆలోచించలేదని ఒప్పుకున్నారు. అప్పట్లోనే ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో అని గ్రహించి ఉండాల్సింది. ఇప్పుడు ఆలస్యమైంది. కాబట్టి జాగ్రత్తపడాల్సిన అవసరాన్ని గురించి ఆయన వెల్లడించారు. జ్ఞానాన్ని శ్రమతో పంచుకోవాల్సిన మానవుల మాదిరిగా కాకుండా, ఏఐ తమకు తెలిసిన వాటిని క్షణంలో కాపీ చేసి పేస్ట్ చేయగలవు. ఇదే ప్రస్తుతం చాలా రంగాలను భయపెడుతోంది. దీని గురించే హింటన్ కూడా భయపడుతున్నారు. -
ఈ సీఈవో శాలరీ.. ఐటీ కంపెనీల్లోనే టాప్
ప్రముఖ ఐటీ కంపెనీ హెచ్సీఎల్టెక్ సీఈవో సి.విజయకుమార్ రికార్డు స్థాయి వేతనం అందుకున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆయన 10.85 మిలియన్ డాలర్లు (సుమారు రూ.94.6 కోట్లు) సంపాదించారు. ఇది భారతీయ ఐటీ రంగంలో ఎగ్జిక్యూటివ్లు పొందుతున్న అత్యధిక వేతనంగా నిలిచింది.విజయకుమార్ వేతనం పెద్ద పోటీ సంస్థలైన టీసీఎస్, ఇన్ఫోసిస్ ఛీప్ల సంపాదనను సైతం అధిగమించింది. అంతేకాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆయన ప్రస్తుత వేతనాన్ని 71 శాతం పెంచి 18.6 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.154 కోట్లు) పెంచుకోవడానికి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపిందని కంపెనీ వార్షిక నివేదిక తెలిపింది.ఇదే సమయంలో టీసీఎస్ సీఈఓ కృతివాసన్ వేతనం రూ.26.52 కోట్లు కాగా, ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ వేతనం రూ.80.62 కోట్లుగా ఉంది. అలాగే విప్రో సీఈఓ శ్రీనివాస్ పలియా ఆర్జన సుమారు రూ.53.64 కోట్లు, టెక్ మహీంద్రా సీఈఓ మోహిత్ జోషి సంపాదన రూ.53.9 కోట్లుగా ఉన్నాయి.2025 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో విజయకుమార్ అందుకున్న మొత్తం పరిహారంలో మూల వేతనం 1.96 మిలియన్ డాలర్లు కాగా పనితీరు ఆధారిత బోనస్ 1.73 మిలియన్ డాలర్లుగా ఉందని హెచ్సీఎల్టెక్ వార్షిక నివేదిక తెలిపింది.ఆయన సంపాదనలో ఎక్కువ భాగం దీర్ఘకాలిక ప్రోత్సాహకాలు 6.96 మిలియన్ డాలర్ల విలువైన నియంత్రిత స్టాక్ యూనిట్లు (ఆర్ఎస్యూలు) నుంచే వచ్చింది. ఇవికాక బెనిఫిట్స్, పెర్క్విసైట్స్ కింద అదనంగా మరో 0.20 మిలియన్ డాలర్లు లభించాయి.2016లో హెచ్సీఎల్టెక్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన విజయకుమార్ అమెరికాలో ఉంటూ తన రెమ్యూనరేషన్ను కంపెనీకి చెందిన అమెరికా అనుబంధ సంస్థ హెచ్సీఎల్ అమెరికా ఇంక్ నుంచి తీసుకుంటున్నారు.👉ఇది చదివారా? కాగ్నిజెంట్లో జీతాల పెంపు.. సీఎఫ్వో కీలక ప్రకటన -
ఏడబ్ల్యూఎస్ కొత్త సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మోడల్
బెంగళూరు: అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) కొత్తగా ఏఐ డ్రివెన్ డెవలప్మెంట్ లైఫ్సైకిల్ (ఏఐ–డీఎల్సీ) మోడల్ను ఆవిష్కరించింది. కైరో, అమెజాన్ క్యూ డెవలపర్లాంటి టూల్స్ను ఉపయోగించి, కృత్రిమ మేథ (ఏఐ)తో సాఫ్ట్వేర్ను రూపొందించేందుకు ఇది ఉపయోగపడుతుంది.దీనితో మానవ పర్యవేక్షణలో కోడింగ్, టెస్టింగ్లాంటి పనులను ఆటోమేట్ చేయడం ద్వారా సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసే వ్యవధిని నెలల నుంచి రోజుల స్థాయిలోకి కుదించవచ్చని సంస్థ తెలిపింది. అలాగే మెరుగైన ఏఐ విధానాలను షేర్ చేసుకునేందుకు ఏఐ–నేటివ్ బిల్డర్స్ కమ్యూనిటీని కూడా ప్రవేశపెట్టినట్లు వివరించింది.అటు ఏడబ్ల్యూఎస్ స్కిల్ బిల్డర్ ద్వారా అంతర్జాతీయంగా 27 లక్షల మంది విద్యార్థులకు, ఉచితంగా ఏఐ ట్రైనింగ్ యాక్సెస్ అందిస్తున్నట్లు ఏడబ్ల్యూఎస్ తెలిపింది. జనరేటివ్ ఏఐని ఉపయోగించి వాస్తవ ప్రపంచపు సవాళ్లను పరిష్కరించే డెవలపర్లకు 2 మిలియన్ డాలర్ల విలువ చేసే క్రెడిట్స్ను ఇచ్చేలా ఏడబ్ల్యూఎస్ ఏఐ లీగ్ను కూడా ప్రకటించింది. -
చదువు నేర్పించే చిట్టి మిత్రుడు.. క్యూట్ టైమ్ మేనేజర్
పిల్లలకు ఫ్రెండ్స్ అవసరం లేదు, ఫీచర్లే సరిపోతాయి. ఆటల్లో ఆటోమెషిన్, కథల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చదువులో టెక్నాలజీ అసిస్టెంట్స్.. ఇలా ఇవన్నీ చిన్నారుల చిట్టి మిత్రులుగా మారిపోయాయి.ఆల్ ఇన్ వన్ ఫ్రెండ్!పిల్లలతో ఆడుతూ పాడుతూ కథలు చెబుతూ, చదువు నేర్పించే చిట్టి మిత్రుడు ఇప్పుడు ఇంటికే వచ్చేశాడు. అదే ‘మికో మినీ’. చూడటానికి చిన్న ఆటబొమ్మలా కనిపించే ఇది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఒక తెలివైన రోబో. పిల్లల ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెబుతుంది. చదువు, డాన్స్, పాటలు, గేమ్స్ ఇలా అన్ని రంగాల్లో పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ నేర్పిస్తుంది. చదువు, ఆలోచనా శక్తి, కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంచేలా రోజువారీ ప్రణాళికలు తయారు చేసి ఇస్తుంది. ముఖ్యంగా అత్యవసర సమయాల్లో తల్లిదండ్రుల నంబర్లకు, ఇతర ఎమర్జెన్సీ నంబర్లకు సమాచారం ఇచ్చే ఫీచర్ కూడా ఇందులో ఉంది. ధర కేవలం రూ. 13,999 మాత్రమే!క్యూట్ టైమ్ మేనేజర్!పిల్లల షెడ్యూల్ చూస్తే బిలియనీర్ బిజినెస్మెన్ కంటే తక్కువేమీ ఉండదు. ఉదయం స్కూల్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం హోంవర్క్, ఆ తర్వాత ఆటలు, ఇలా చాలానే ఉంటాయి. అందుకే, వాళ్ల బిజీ షెడ్యూల్కి బ్రిలియంట్ అసిస్టెంట్గా వచ్చింది ఈ స్మార్ట్ గాడ్జెట్. పేరు ‘చాంపియన్ కిడ్స్ అండ్ టీన్స్ స్మార్ట్వాచ్’. ఇది పిల్లలకి ఓ చిట్టి మేనేజర్లా పనిచేస్తుంది. హార్ట్బీట్ చెక్, నిద్ర ట్రాక్ చేయడంతో పాటు ‘నీళ్లు తాగు’ అని వేళకు గుర్తు చేస్తుంది. ఇలా మరెన్నో ఇందులో సెట్ చేసుకోవచ్చు. స్కూల్ మోడ్ ఆన్ చేస్తే, చదువుకు ఆటంకం రాకుండా మేనేజ్ చేస్తుంది. పనితో పాటు సరదా కోసం గేమ్స్, మ్యూజిక్, కెమెరా, క్యాలిక్యులేటర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇక ఇందులో సిమ్ వేసుకుని, ఫోన్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. అచ్చం ఓ మినీ ఫోన్ మాదిరిగా పనిచేస్తుంది. రోజుకో వాచ్ డిస్ప్లే మార్చుకోవచ్చు. వర్షం వచ్చినా, చెమట పట్టినా నో టెన్షన్. ఎందుకంటే, ఇది వాటర్ప్రూఫ్. ధర రూ.2,499 మాత్రమే!కథల లోకానికి గెలాక్సీ గేట్!చిట్టి చెవుల్లోకి మెల్లగా కథలు జాలువారాలంటే, మామూలు హెడ్ఫోన్లు పనికిరావు. అందుకే వచ్చిందీ కొత్త ‘గెలాక్సీ హెడ్ఫోన్’. పిల్లల చెవులకు హాని చేయకుండా, హాయి గొలిపేలా కథలు వినిపిస్తుంది. ఇందులో ఏకంగా ఐదు వందలకు పైగా కథలు, పాటలు ముందే స్టోర్ చేసి ఉంటాయి. అవసరమైతే మరిన్ని కథలను స్టోర్ చేసుకునే అవకాశం ఉంది. స్క్రీన్ ఏదీ అవసరం లేకుండానే నేరుగా దీనిని పెట్టుకుని కథలు వినవచ్చు. కేవలం పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, భద్రతకు అనుగుణంగా వాల్యూమ్ను నియంత్రించేలా రూపొందించారు. ఒక్కసారి ఇది పెట్టుకున్న వెంటనే పిల్లలు కథల ప్రపంచంలోకి వెళ్లిపోతారు. అన్ బ్రేకబుల్ బాడీతో, డిటాచబుల్ మైక్తో, మెరిసే ఎల్ఈడీ లైట్స్, మ్యాగ్నెట్ స్టిక్కర్లతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ధర కేవలం రూ. 2,999 మాత్రమే! -
ఏజెంటిక్ ఏఐ.. ఉద్యోగ విప్లవం.. ఏమిటి దీని ప్రత్యేకత?
సాధారణంగా ఏఐ అంటే.. మనం ఏదైనా అడిగితే జవాబు చెప్పే చాట్బాట్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే.. ఒక పాట ప్లే చేయమనగానే చటుక్కున ప్లే చేసే స్మార్ట్ స్పీకర్ లాంటిది. కానీ, ‘ఏజెంటిక్ ఏఐ’ దీనికి భిన్నమైనది. – సాక్షి, స్పెషల్ డెస్క్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో మార్పులు, ఏయే ఉద్యోగాలకు ముప్పు రావచ్చు అంటూ ఈ మధ్య మనం చాలా వింటున్నాం. అయితే, అందరూ ఊహిస్తున్న దానికంటే చాలా పెద్ద మార్పు మన ముందుకు రాబోతోంది. వచ్చే ఐదేళ్లలో దేశంలో ఏకంగా కోటికి పైగా ఉద్యోగాలను ఓ కొత్త రకం ఏఐ పూర్తిగా మార్చనుంది. అదే ’ఏజెంటిక్ ఏఐ’. అయితే ఈ మార్పు వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం అక్కర్లేదు. ఎందుకంటే.. ఇది యువతకు కొత్త అవకాశాలు, దారుల్ని తెరుస్తోంది. ఈ ఏఐతో పని వేగం పెరిగి, పనులన్నీ సులభంగా మారిపోనున్నాయి.రిటైల్ రంగంవ్యాపారాలు ఎదుర్కొనే అతి పెద్ద సవాళ్ళలో ఒకటి.. మార్కెట్ ట్రెండ్లు, వినియోగదారుల నుంచి వచ్చే సమాచారాన్ని వేగంగా విశ్లేషించడం. ఏజెంటిక్ ఏఐ ఈ సమస్యను తీరుస్తుంది. ఈ రంగంలో 76 లక్షల ఉద్యోగాలు మార్పునకు గురవుతాయట. ఏఐ ఏజెంట్లు కస్టమర్ల ఇష్టాలను బట్టి వారికి నచ్చే వస్తువులను చూపించడం, ఎప్పుడు ఏ వస్తువు స్టాక్లో ఉందో తెలుసుకోవడం, కస్టమర్ సర్వీస్కు జవాబులు చెప్పడం వంటివి చేస్తాయి. ఈ ఏఐ వల్ల ఉద్యోగులకు విలువైన సమయం ఆదా అవుతుంది. వారు మార్కెట్ మార్పులకు స్పందించడంపై దృష్టి పెట్టొచ్చు. అయితే, ఈ ఏఐ నిర్ణయాలకు మనుషుల పర్యవేక్షణ చాలా ముఖ్యం. ఆటోమేషన్, మానవ నిర్ణయాల మధ్య సమతుల్యత సాధించొచ్చు.విప్లవాత్మక మార్పులు!ఈ ఏజెంటిక్ ఏఐ మన రోజువారీ జీవితాన్ని, ముఖ్యంగా పనిచేసే విధానాన్ని పూర్తిగా మార్చేయనుంది అంటున్నారు టెక్ నిపుణులు.పని విధానంలో మార్పులు: మనం చేసే కొన్ని పనులు బోరింగ్గా, రోజూ ఒకే రకంగా ఉంటాయి. ఈ ఏఐ ఆ రొటీన్ పనులను పూర్తిగా తన చెప్పుచేతల్లోకి తీసుకుంటుంది. దీంతో మనుషులు క్రియేటివ్గా ఆలోచించడం, కొత్త వ్యూహాలు రూపొందించడం లాంటి కీలకమైన పనులపై దృష్టి పెట్టొచ్చు.కొత్త ఉద్యోగాలు, కొత్త నైపుణ్యాలు: ఏఐ వల్ల కొన్ని ఉద్యోగాలు మారినా, కొత్త ఉద్యోగాలూ పుట్టుకొస్తాయి. ఉదాహరణకు, డేటా ఎంట్రీ చేసేవాళ్లు ఏఐని ఎలా ఉపయోగించాలి అని గైడ్ చేసే ‘ఏఐ సూపర్ వైజర్’గా మారొచ్చు. ఈ మార్పును ఎదుర్కోవడానికి మనం ఏఐ టూల్స్ వాడటం, సృజనాత్మకంగా ఆలోచించడం వంటి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి.ఏయే రంగాల్లో..‘సర్వీస్నౌ ఏఐ స్కిల్స్ రీసెర్చ్ 2025’ ప్రకారం, కొన్ని కీలక రంగాల్లో ఈ ఏఐ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఈ రంగంలో ఏకంగా 80 లక్షల ఉద్యోగాలు మారబోతున్నాయి. ఏఐ ఏజెంట్లు ఒక వస్తువు తయారీకి కావాల్సిన ముడి పదార్థాలను మేనేజ్ చేయడం, యంత్రాలు ఎప్పుడు పాడైపోతాయో ముందే చెప్పడం, ఉత్పత్తి వేగాన్ని పెంచడం వంటివి చేస్తాయి. దీంతో మనుషులు యంత్రాల పర్యవేక్షణ, మరమ్మతులు వంటి పనులు చేయాల్సి రావొచ్చు.విద్యారంగంఈ రంగంలో 25 లక్షల ఉద్యోగాలు మారనున్నాయి. ఏఐ ఏజెంట్లు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా చదువుకునే ప్రణాళికలు తయారు చేయడం, అసై¯Œ మెంట్లను కరెక్ట్ చేయడం, వెంటనే ఫీడ్బ్యాక్ ఇవ్వడం వంటివి చేస్తాయి. దీంతో టీచర్లు క్లాస్రూమ్లో విద్యార్థులపై మరింత శ్రద్ధ పెట్టడం, వారికి మార్గదర్శకత్వం చేయడం వంటి వాటిపై ఫోకస్ చేయవచ్చు.ఏఐతో కలిసి పనిచేయాలిఇది కేవలం ఆటోమేషన్ మాత్రమే కాదు. పని అంటే ఏంటో తిరిగి నిర్వచించుకునే సమయం. ఈ ఏఐ విప్లవం వల్ల దేశ యువతకు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి, కొత్త రకాల ఉద్యోగాలు చేయడానికి అపారౖమెన అవకాశాలు లభిస్తాయి. ఏఐతో కలిసి పనిచేయడం ఎలాగో నేర్చుకోవాలి. అప్పుడే భవిష్యత్తులో మనం మరింత మెరుగ్గా రాణించగలుగుతాం. ఏజెంటిక్ ఏఐ అనేది మన శత్రువు కాదు, మన పనిని సులభతరం చేసే ఒక స్మార్ట్ పార్ట్నర్.– సుమీత్ మాథుర్, ఎస్వీపీ–ఎండీ, సర్వీస్నౌ ఇండియాడేటా సెక్యూరిటీ సమస్యఏజెంటిక్ ఏఐ వల్ల డేటా సెక్యూరిటీ విషయంలో కంపెనీలకు ఇంకా పూర్తి స్పష్టత రాలేదని సర్వీస్నౌ నివేదిక చెబుతోంది. ఇందుకోసం ఎలాంటి నైపుణ్యాలు అవసరమవుతాయో తమకు తెలియడం లేదని 26 శాతం కంపెనీలు చెప్పాయట. -
అగ్రరాజ్యంతో పోటీపడుతున్న భారత్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ).. నిపుణుల నియామకాల్లో తొలి స్థానంలో నిలిచి మన దేశం ప్రపంచం ఔరా అనిపించేలా చేసింది. మొత్తం ఏఐ నైపుణ్యాల్లో.. అత్యధిక నైపుణ్యాలున్న దేశం అమెరికా కాగా, రెండో స్థానంలో భారత్ ఉంది. అంటే అగ్రరాజ్యంతో నువ్వా నేనా అన్నట్టు భారత్ పోటీపడుతోంది. పేటెంట్లు.. అందులో మళ్లీ ఏఐ పేటెంట్ల విషయంలో మాత్రం మనం చాలా వెనకబడి ఉన్నాం.ప్రపంచంలో అత్యధిక ఏఐ నైపుణ్యాలు కలిగిన ఐటీ ఇంజనీర్లు ఉన్న దేశాల్లో యూఎస్ టాప్–1లో నిలిచింది. మొత్తం ఏఐ నైపుణ్యాల్లో.. ఈ దేశంలోని ఐటీ ఇంజనీర్లలో సగటున 2.63 శాతం నైపుణ్యాలు ఉన్నాయి. మనదేశంలో ఇది 2.51 శాతంగా ఉంది. ఈ విషయంలో యూకే, జర్మనీ, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, స్పెయిన్ మన కంటే వెనుకబడి ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐటీ ఇంజనీర్లలో ఏఐ నిపుణుల వాటా 1 శాతమే. భారత్లో లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్పై గత ఏడాది జరిగిన మొత్తం నియామకాల్లో 33.39 శాతం ఏఐ సంబంధ రోల్స్ ఉండడం విశేషం. ఈ స్థాయిలో ఏఐ రిక్రూట్మెంట్ జరగడంతో ప్రపంచంలోనే మనం టాప్లో నిలిచాం. ఏఐ పబ్లికేషన్ల విషయంలో కూడా 2013– 23 మధ్య 9.22 శాతం వాటాతో అమెరికా (America) కంటే మనమే ముందున్నాం. ఈ విషయంలో చైనా (China) 23.20 శాతంతో మొదటి స్థానంలో ఉంది.చదవండి: డిబ్బి డబ్బులతో కాలేజీ ఫీజులు కట్టేస్తున్న స్కూల్ పిల్లలు!పరిశోధకుల్లో వెనకడుగే..అంతర్జాతీయంగా ఏఐ పరిశోధకుల్లో టాప్–2 శాతంలో మనవాళ్లు లేకపోవడం నిరాశపరుస్తోంది. ఈ విషయంలో యూఎస్, చైనా ఆధిపత్యం చెలాయిస్తున్నాయి, మరో ముఖ్యమైన విషయం.. మన ఏఐ నిపుణులు (AI Experts) మనదేశం నుంచి తరలిపోవడం. గత ఏడాది లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్పై.. భారత్లో సగటున ప్రతి 10,000 మంది ఏఐ నిపుణులకుగాను 1.55 మంది మన దేశం నుండి నిష్క్రమించారు. ఇలా అత్యధికులు వెళ్లిపోతున్న దేశంగా ఇజ్రాయెల్ తరువాత మనదేశం ఉందని ‘స్టాన్ ఫోర్డ్ ఏఐ ఇండెక్స్ 2025’ నివేదిక వెల్లడించింది.పేటెంట్లలో చైనా జోరు..ఏఐ పేటెంట్లలో కూడా మన దేశం వెనుకబడి ఉంది. 2024లో ప్రైవేట్ ఏఐ పెట్టుబడుల్లో కేవలం 1.16 బిలియన్ డాలర్లను మాత్రమే భారత్ ఆకర్షించింది. యూఎస్ ఏకంగా 109.08 బిలియన్ డాలర్ల నిధులను అందుకుంది. నిపుణులు, విస్తృతి పెరిగినప్పటికీ చాట్జీపీటీ లేదా డీప్సీక్ వంటి ప్రపంచవ్యాప్తంగా పేరొందిన చాట్బాట్లు రూపొందించే స్థాయిలో భారత్ పురోగతి సాధించలేదు. ప్రతిభను అగ్రశ్రేణి పరిశోధన, పేటెంట్ పొందిన ఆవిష్కరణలు, బిలియన్ డాలర్ల ఏఐ ఉత్పత్తులను అందించేలా మలచడంలో పర్యావరణ వ్యవస్థ లేకపోవడం భారత్కు ప్రతికూలాంశంగా నిపుణులు చెబుతున్నారు. -
ఒక్క నెలలో 98 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్
ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్ గత జూన్ నెలలో భారత్లో భారీ సంఖ్యలో అకౌంట్లను బ్యాన్ చేసింది. దుర్వినియోగం, హానికరమైన కార్యకలాపాలను నిరోధించే ప్రయత్నాలలో భాగంగా జూన్ నెలలో భారత్లో 98 లక్షలకు పైగా ఖాతాలను నిషేధించింది. వీటిలో 19.79 లక్షల ఖాతాలను యూజర్ల ఫిర్యాదులు రాకముందే బ్యాన్ చేసింది.వాట్సాప్లో అనుమానాస్పద, హానికరమైన ఖాతాలపై యూజర్ల నుంచి ఎప్పటికప్పుడు ఫిర్యాదులు అందుతుంటాయి. అందులో భాగంగా వాట్సాప్ కు భారత్ లోని యూజర్ల నుంచి 23,596 ఫిర్యాదులు అందాయి. వాటిని పరిశీలించి 1,001 ఖాతాలపై చర్యలు తీసుకున్నారు. ఇందులో కొన్ని ఖాతాలను నిషేధించడం, తప్పుగా నిషేధించిన మరికొన్నింటిని పునరుద్ధరించడం వంటివి ఉన్నాయి. వీటిలో 16,069 ఫిర్యాదులు నిషేధ అప్పీళ్లకు సంబంధించినవే కావడం గమనార్హం. ఫలితంగా 756 ఖాతాలపై చర్యలు తీసుకున్నారు. ఇతర ఫిర్యాదులు ఖాతా మద్దతు, ఉత్పత్తి సంబంధిత సమస్యలు, భద్రతా సమస్యల గురించి ఉన్నాయి.ఖాతా క్రియేట్ చేసినప్పుడు, మెసేజ్లు పంపుతున్నప్పుడు, యూజర్ రిపోర్టులు లేదా బ్లాక్స్ వంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు మూడు దశల్లో దుర్వినియోగాన్ని గుర్తిస్తామని వాట్సాప్ వివరించింది. నివారణ తమ ప్రాథమిక దృష్టి అని కంపెనీ తెలిపింది. ఎందుకంటే హానికరమైన చర్యను తరువాత గుర్తించడం కంటే అది జరగడానికి ముందు ఆపడం మరింత ప్రభావవంతంగా ఉంటుంది. దుర్వినియోగం, తప్పుడు సమాచారం, భద్రతా ముప్పులతో పోరాడటానికి ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్, భద్రతా సాధనాలు, ప్రత్యేక బృందాలను ఉపయోగిస్తున్నట్లు వాట్సాప్ యాజమాన్యం పేర్కొంది. -
భౌతికశాస్త్ర నియమాలకు సవాలు.. మస్క్ ఫైటర్ జెట్
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత 'ఎలాన్ మస్క్' టెక్నాలజీలో సరికొత్త మార్గాలను అన్వేషిస్తూ.. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెడుతూనే ఉంటారు. ఇందులో భాగంగానే భౌతిక శాస్త్ర నియమాలనే సవాలు చేసే ఒక కొత్త యుద్ధ విమానాన్ని ఆవిష్కరించారు. దీని పేరు 'యూఎఫ్ఓ ఫైటర్' (UFO Fighter).ఎలాన్ మస్క్ ఆవిష్కరించిన యుద్ధ విమానం యూఎఫ్ఓ ఫైటర్.. ఇప్పటి వరకు ఉన్న అన్ని విమానాలకంటే భిన్నంగా, ప్రత్యేకంగా ఉంటుంది. ఈ జెట్ చాలా వేగంగా ప్రయాణించగలదు. అంతే కాకుండా.. అసాధ్యమైన విన్యాసాలు చేయగలదని, ఆకాశంలో నిశ్శబ్దంగా పనిచేయగలదని మస్క్ వెల్లడించారు.ఇదీ చదవండి: మేమంతా ఆమె వెంటే.. వేలకోట్ల ఆఫర్ వదులుకున్న ఉద్యోగులుమస్క్ ఆవిష్కరించిన కొత్త యూఎఫ్ఓ ఫైటర్.. ఎంతోమంది నిపుణులను సైతం ఆశ్చర్యపరిచింది. కొందరు ఈ ఫైటర్ జెట్ మీద కొంత సందేహాస్పదంగానే ఉన్నారు. ఇది టెక్నాలజీనా? లేక దార్శనిక భావననా? అని అనుకుంటున్నారు. అయితే మస్క్ కొత్త ఆవిష్కరణ ఓ సరికొత్త విప్లవానికి నాంది పలకనుంది. లేటెస్ట్ ఏరోస్పేస్ టెక్నాలజీ మానవాళి భవిష్యత్తుకు దోహదపడుతుందని పలువురు చెబుతున్నారు. అయితే మస్క్ యూఎఫ్ఓ ఫైటర్ గురించి చాలా విషయాలు తెలియాల్సి ఉంది. -
మేమంతా ఆమె వెంటే.. వేలకోట్ల ఆఫర్ వదులుకున్న ఉద్యోగులు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాజ్యమేలుతోంది. ఈ రంగంలో ప్రతిభ ఉన్నవారిని అవకాశాలు తప్పకుండా వెతుక్కుంటూ వస్తాయని ఎంతోమంది నిపుణులు చెబుతూనే ఉన్నారు. ఆ మాటలే ఇప్పుడు నిజమయ్యాయి. కృత్రిమ మేధలో ట్యాలెంట్ ఉన్న ఓ కంపెనీ ఉద్యోగులకు.. దిగ్గజ సంస్థలు వేలకోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చాయి. కానీ వారు మాత్రం తమ బాస్ను వదిలిపెట్టకుండా.. ఆఫర్లను తృణప్రాయంగా భావించారు.మీరా మురాటీ 2025 ఫిబ్రవరిలో ఏఐ స్టార్టప్ 'థింకింగ్ మెషీన్స్ ల్యాబ్' ప్రారంభించారు. ఇందులో పనిచేస్తున్నవారందరూ కూడా గతంలో పెద్ద కంపెనీలలో పనిచేసి వచ్చినవారే. అయితే వీరిలో కొందరికి.. 'మార్క్ జుకర్బర్గ్'కు చెందిన మెటా.. దాని AI సూపర్ ఇంటెలిజెన్స్ బృందంలో చేరడానికి ఒక బిలియన్ డాలర్లను (రూ.8,755 కోట్లు) ఆఫర్ చేసినట్లు ఓ అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.నిజానికి మీరా మురాటీ తన థింకింగ్ మెషీన్స్ ల్యాబ్ ప్రారంభించి.. ఏడాది కూడా పూర్తి కాలేదు. అంతే కాకుండా ఈ కంపెనీ ఒక్క ఉత్పత్తిని కూడా మార్కెట్లోకి విడుదల చేయలేదు. కానీ అప్పుడే ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు భారీ ఆఫర్స్ వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే ఏఐలో నైపుణ్యం ఉన్నవారికి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో స్పష్టమవుతోంది.ఇదీ చదవండి: సమయాన్ని, డబ్బును దేనికి ఖర్చు చేస్తారు?: రాబర్ట్ కియోసాకిథింకింగ్ మెషీన్స్ ల్యాబ్లో పనిచేస్తున్న ఉద్యోగులు మాత్రం.. వారికి వచ్చిన ఆఫర్స్ వద్దనుకుని మీరా మురాటితో పాటు ఉండటానికే ఆసక్తి చూపించినట్లు సమాచారం. దీనికి కారణం మురాటీ నాయకత్వం.. భవిష్యత్ అంచనాలు కారణమై ఉంటాయని పలువురు భావిస్తున్నారు. కాగా ఈ కంపెనీ మార్కెట్ విలువ 12 బిలియన్ డాలర్లు.ఎవరీ మీరా మురాటీ?ఇంజినీరింగ్ చేసిన మీరా మురాటీ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ ‘టెస్లా’లో ప్రొడక్ట్ మేనేజర్గా పనిచేశారు. ఆ తరువాత వర్చువల్ రియాలిటీ స్టార్టప్ ‘లిప్ మోషన్’లో పనిచేసి.. 2016లో ‘ఓపెన్ ఏఐ’లో చేరి అడ్వాన్స్డ్ ఏఐ మోడల్స్, టూల్స్ డెవలప్మెంట్లో కీలక పాత్ర పోషిస్తూ.. చీఫ్ టెక్నికల్ ఆఫీసర్(సీటీవో) స్థాయికి ఎదిగారు. సొంతంగా కంపెనీ స్థాపించాలనే తపనతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘ఓపెన్ఏఐ’కి గుడ్బై చెప్పి.. థింకింగ్ మెషీన్స్ ల్యాబ్ స్థాపించారు.అల్బేనియాలో పుట్టిన మీరా మురాటీకి చిన్నప్పటి నుంచి సాంకేతిక విషయాలపై అమితమైన ఆసక్తి. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు సాంకేతిక జ్ఞానం పరిష్కారం చూపుతుందనేది ఆమె నమ్మకం. అదే ఈ రోజు ఎన్నో గొప్ప కంపెనీలను సైతం ఆకర్శించేలా చేసింది. -
కంటెంట్ క్రియేటర్ల పీక నొక్కిన యూఏఈ
సోషల్ మీడియా ప్రమోషన్ల కోసం కంటెంట్ క్రియేటర్లందరికీ తప్పనిసరిగా ‘అడ్వర్టైజర్ పర్మిట్’ అవసరమని యూఏఈ మీడియా కౌన్సిల్ ప్రకటించింది. కంటెంట్ క్రియేటర్లు అధికారిక వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఈ అనుమతి మంజూరు చేస్తామని తెలిపింది. ఈ విధానం త్వరలో అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. అయితే కంటెంట్ క్రియేటర్లకు ఈ అనుమతులు మొదటి మూడేళ్లు ఉచితంగా ఇవ్వబోతున్నట్లు తెలిపింది. ఆ తర్వాత రెన్యువల్ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.క్రియేటర్లు దరఖాస్తు చేసుకున్న తర్వాత వెరిఫై చేసి ప్రభుత్వం వారికి పర్మిట్ నంబర్లను కేటాయిస్తుంది. ఈ పర్మిట్ నంబర్లను కంటెంట్ క్రియేటర్లు తమ అకౌంట్లపై స్పష్టంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. కౌన్సిల్ నుంచి అనుమతులు పొందిన తరువాత మాత్రమే ప్రకటనలు పోస్ట్ చేయాలి. యూఏఈ మీడియా కౌన్సిల్ సెక్రటరీ జనరల్ మొహమ్మద్ సయీద్ అల్ షెహి మాట్లాడుతూ.. ‘అడ్వర్టైజర్ పర్మిట్ అనేది ప్రజా హక్కులను కాపాడుతుంది. కంటెంట్ సృష్టికర్తలు, ప్రకటనదారులు, ప్రేక్షకుల మధ్య బాధ్యతాయుతమైన, వృత్తిపరమైన సంబంధాలను మెరుగుపరుస్తుంది’ అని చెప్పారు. సొంత ఉత్పత్తులు లేదా సర్వీస్ లేదా కంపెనీని ప్రమోట్ చేయడానికి వ్యక్తిగత ఖాతాలను ఉపయోగించే వారికి ఈ నియమం నుంచి మినహాయింపు ఇస్తామని కౌన్సిల్ పేర్కొంది. ఎడ్యుకేషన్, అథ్లెటిక్, సాంస్కృతిక లేదా అవగాహన కార్యకలాపాలలో పాల్గొనే 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వారికి ఈ వెసులుబాటు ఉంటుందని చెప్పింది.యూఏఈ మీడియా కౌన్సిల్లో స్ట్రాటజీ అండ్ మీడియా పాలసీ సెక్టార్ సీఈఓ మైతా మజీద్ అల్ సువైది మాట్లాడుతూ.. కౌన్సిల్ ద్వారా లైసెన్స్ పొందిన వ్యక్తులతో మాత్రమే కంపెనీలు, సంస్థలు టైఆప్ కావాలని తెలిపారు. విజిటింగ్ కంటెంట్ క్రియేటర్లు ‘విజిటర్ అడ్వర్టైజర్ పర్మిట్’ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మూడు నెలలు చెల్లుబాటు అవుతుంది. తర్వాత మూడు నెలలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి. యూఏఈలో కౌన్సిల్ ఆమోదించిన లైసెన్స్డ్ అడ్వర్టైజింగ్ లేదా టాలెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీల ద్వారా రిజిస్ట్రేషన్లు నిర్వహించనున్నారు.భారత్పై ప్రభావం ఎంతంటే..భారత్ కేవలం యూఏఈకి పొరుగు దేశం మాత్రమే కాదు. ఇది దాని డిజిటల్, కల్చరల్ ఎకోసిస్టమ్లో కీలకమైన స్థానంలో ఉంది. యూఏఈ డిజిటల్ టాలెంట్ పూల్లో భారతీయ క్రియేటర్లు, ఫ్రీలాన్సర్లు, ఇన్ఫ్లూయెన్సర్లు గణనీయమైన భాగం ఉన్నారు. తాజా నిర్ణయంతో యూఏఈ ఆధారిత ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకున్న భారతీయ ఇన్ఫ్లూయెన్సర్లపై ప్రభావం ఉండనుంది. అక్కడ నివసిస్తున్న ఎన్ఆర్ఐలు, భారతీయ ప్రవాసులు కంటెంట్ను సృష్టించడంలో సదరు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. భారతీయ బ్రాండ్లు, ఏజెన్సీలు యూఏఈ ఆధారిత ఇన్ఫ్లుయెన్సర్లతో కలిసి పనిచేయడం లేదా గల్ఫ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ప్రచారాలను నిర్వహించడంలో కొంత ఇబ్బందులు ఎదురవ్వొచ్చు.మన కంటెంట్ క్రియేటర్లకు కొత్త సవాళ్లుప్రమోషనల్ కంటెంట్పై చెల్లుబాటు అయ్యే ప్రకటనదారు పర్మిట్ నెంబరును పొందాల్సి ఉంటుంది. దీన్ని బహిరంగంగా ప్రదర్శించాలి.కంటెంట్ సృష్టించే స్వల్పకాలిక సృష్టికర్తలు లేదా పర్యాటకులకు యూఏఈ ఆధారిత ఏజెన్సీ స్పాన్సర్షిప్ అవసరం.అన్పెయిడ్ ఎండార్స్మెంట్లు ఇప్పుడు నియంత్రణ పరిధిలోకి వస్తాయి.నిబంధనలు పాటించకపోతే భారీ జరిమానాలు, ప్లాట్ఫామ్ ఆంక్షలు లేదా నిషేధానికి కూడా దారితీసే అవకాశం ఏర్పడవచ్చు. ఇక్కడా ఇలాంటి నిబంధనలు?ఇన్ఫ్లూయెన్సర్ రెగ్యులేషన్లో భారత్ అడ్వాన్స్గానే ఉంది. అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ), వినియోగదారుల రక్షణ చట్టం ఇప్పటికే వీటి అవసరాన్ని హైలైట్ చేశాయి. భారత్లో ఇప్పటికే పెయిడ్ కొలాబరేషన్కు సంబంధించిన వివరాలను స్పష్టంగా వెల్లడించాలి. #ad, #sponsored లేదా #collab వంటి హ్యాష్ట్యాగ్లతో కంటెంట్కు లేబులింగ్ ఇవ్వాలి.యూఏఈ తీసుకున్న నిర్ణయం భారత్లో మరిన్ని నియంత్రణ చర్యలకు దారితీసే అవకాశం ఉంది. తప్పుడు సమాచారం, పెయిడ్ ఎండార్స్మెంట్లు, డిజిటల్ మార్కెటింగ్లో ఆర్థిక పారదర్శకతపై పెరుగుతున్న పరిశీలన, భారత ప్రభుత్వం లేదా నియంత్రణ సంస్థలు లైసెన్సింగ్ నమూనాలను కఠినంగా అమలు చేయడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవచ్చు.యూఏఈ అడ్వర్టైజర్ పర్మిట్ రూల్ ప్రయోజనాలుపారదర్శకతవీక్షకులు ప్రమోషనల్ కంటెంట్ను స్పష్టంగా గుర్తించగలరు. మోసపూరిత ప్రకటనల అవకాశాలను తగ్గించవచ్చు. ఇది ఇన్ఫ్లూయెన్సర్లు, ప్రేక్షకుల మధ్య ఎక్కువ నమ్మకాన్ని పెంపొందిస్తుంది.పరిశ్రమపై పక్కా ప్రమాణాలుఇన్ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ కోసం ప్రమాణాలను ఏర్పరుస్తుంది. క్రియేటర్లకు వ్యాపార అవకాశాలు అందిస్తుంది.వినియోగదారుల రక్షణముఖ్యంగా ఫైనాన్స్, హెల్త్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో ప్రేక్షకులను తప్పుదోవ పట్టించే లేదా అప్రకటిత ఎండార్స్మెంట్ల నుంచి రక్షణ లభిస్తుంది. అన్పెయిడ్ ప్రమోషన్లను కూడా నియంత్రిస్తుంది.ప్రభుత్వానికి రెవెన్యూపర్మిట్ ఫీజుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. ఇన్ఫ్లూయెన్సర్ క్యాంపెయిన్లు, బ్రాండ్ కోలాబరేషన్లపై ట్రాకింగ్ ఉంటుంది.ఇదీ చదవండి: ‘టీసీఎస్ నిర్ణయం ప్రమాదకరం’యూఏఈ ప్రకటనతో నష్టాలుచిన్న కంటెంట్ క్రియేటర్లలో నిరుత్సాహంఫ్రీలాన్సర్లు, మైక్రో-ఇన్ఫ్లూయెన్సర్లు, స్పాన్సర్ అవసరాలను నిర్వహించడం కష్టంగా మారుతుంది. కొత్తగా వచ్చేవారిని నిరుత్సాహపరుస్తుంది.యూఏఈ కాని క్రియేటర్లకు..యూఏఐ వెలుపల కంటెంట్ సృష్టికర్తలు (ఉదా. భారతదేశంలో లేదా మరెక్కడైనా) అక్కడి ప్రేక్షకులను ప్రభావితం చేసేందుకు చట్టాలు అడ్డంకిగా మారుతాయి. గ్లోబల్ డిజిటల్ కంటెంట్లో పరిధులు నిర్ధారించినట్లు అవుతుంది.సందర్శకులకు పరిమితులుతాత్కాలికంగా యూఏఈని సందర్శించే సృష్టికర్తలకు (ఉదా.ట్రావెల్ వ్లాగ్లు లేదా ఈవెంట్ల కోసం) పరిమిత అనుమతులుంటాయి. ఇందుకోసం స్థానిక స్పాన్సర్షిప్ అవసరం అవుతుంది. -
రూ.10 వేలకే వచ్చే లేటెస్ట్ బెస్ట్ 5జీ స్మార్ట్ఫోన్లు
ప్రతి నెలా ఏవో కొత్త ఫోన్లు వస్తూనే ఉంటాయి. అయితే వినియోగదారుడి అవసరాలకు సరిపోయే, బడ్జెట్కు తగిన స్మార్ట్ఫోన్లు కొన్నే ఉంటాయి. వాటిని ఎంచుకోవడం కష్టమైన పనిగా మారింది. ఈ నేపథ్యంలో సామాన్య వినియోగదారులకు బడ్జెట్లో అంటే రూ.10 వేల లోపు ధరలో జూలైలో వచ్చిన కొన్ని బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్ల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం.శాంసంగ్ ఎం06 5జీ🔹శాంసంగ్ ఎం06 5జీ స్మార్ట్ఫోన్లో 6.7 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లేను అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, ఆర్మ్ మాలి జీ57 ఎంసీ2 జీపీయూ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేస్తుంది. 4/6 జీబీ LPDDR4X ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు🔹వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ షూటర్ ఉంది.🔹సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5 ఎంఎం హెడ్ఫోన్ జాక్, సింగిల్ బాటమ్ ఫైరింగ్ స్పీకర్ ఉన్నాయి. 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉంది.ఇన్ఫినిక్స్ హాట్ 60🔹ఇన్ఫినిక్స్ హాట్ 60లో 6.7 అంగుళాల హెచ్డీ+ పంచ్ హోల్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. ఇది 7.8 మిమీ మందంతో ఉంటుంది. వాటర్, డస్ట్ ప్రూఫ్ కోసం ఐపీ 64 రేటింగ్ పొందింది. అంటే ఇది స్ప్లాష్లు, తేలికపాటి నీటి చుక్కలు పడినా ఏమీకాదు.🔹హాట్ 60 5జీ + మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ఎస్ఓసీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ సింగిల్ 6 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లో వస్తుంది. మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా 2 టీబీ వరకు అదనపు స్టోరేజ్ను పెంచుకోవచ్చు.🔹హాట్ 60 5జీ ప్లస్లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, ఎల్ఈడీ ఫ్లాష్ సపోర్ట్తో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 15 ఆధారిత కొత్త ఎక్స్ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై ఇది పనిచేస్తుంది.🔹18వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5,200 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.లావా స్టార్మ్ ప్లే🔹లావా స్టార్మ్ ప్లే ఫోన్లో 6.75 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్, 6 జీబీ ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 128 జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఎక్స్పాండబుల్ స్టోరేజ్ సపోర్ట్తో ఈ ఫోన్ పనిచేస్తుంది.🔹50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 752 ప్రైమరీ షూటర్, 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ కూడా ఉంది.🔹18వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.ఐక్యూ జెడ్10 లైట్ 5జీ🔹ఐక్యూ జెడ్10 లైట్ 6.74 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్పై ఈ ఫోన్ పనిచేస్తుంది. 8 జీబీ వరకు ఎల్ పీడీడీఆర్ 4ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్, మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా 1 టీబీ ఎక్స్ టర్నల్ స్టోరేజ్ పొందవచ్చు.🔹ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 15వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.🔹ఆప్టిక్స్ విషయానికి వస్తే, జెడ్ 10 లైట్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్తో వస్తుంది. వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ కూడా ఉంది. -
ఎయిర్టెల్ కొత్త రీచార్జ్ ప్లాన్.. ఓటీటీలన్నీ ఫ్రీ..
ఓటీటీ వినియోగదారుల కోసం టెలికాం కంపెనీలు అనేక ప్లాన్లను అందిస్తున్నాయి. అయితే ఇలాంటి ప్లాన్లలో చాలా వరకు ఖరీదైనవి లేదా ఒకటీ రెండు ఓటీటీ సర్వీసులకు మాత్రమే యాక్సెస్ కల్పిస్తాయి. కానీ ఎయిర్టెల్ ఓటీటీ వినియోగదారుల కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఇది ఒకటీ రెండు కాదు నెట్ఫ్లిక్స్, జియో హాట్స్టార్ సహా రెండు డజన్లకు పైగా ఓటీటీ ప్లాట్ఫామ్లకు ఉచిత యాక్సెస్ అందిస్తుంది.ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ పోర్ట్ఫోలియోలో ఎంపిక చేసిన ఆల్-ఇన్-వన్ ఓటీటీ ప్లాన్లను చేర్చింది. అంటే ఒక్క రీఛార్జ్ లో ఒకటీ రెండు కాదు అనేక ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు యాక్సెస్ లభిస్తుంది. ఈ ప్లాన్ల జాబితాలో రూ .279 రీఛార్జ్ టారిఫ్ ఉంది. పూర్తి నెల వాలిడిటీతో వస్తుంది. దీనితో రీఛార్జ్ చేస్తే నెల రోజుల పాటు ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ లభిస్తుంది.రూ.279తో ఆల్ ఇన్ వన్ ఓటీటీ ప్లాన్ఎయిర్టెల్ యూజర్లకు అందిస్తున్న ఈ ప్లాన్ డేటా బూస్టర్ లేదా డేటా ఓన్లీ ప్లాన్. కాబట్టి ఇందులో కాలింగ్ లేదా ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. అయితే ఒక నెల వ్యాలిడిటీతో 1 జీబీ అదనపు డేటా లభిస్తుంది. వినియోగదారులు ఏదైనా యాక్టివ్ ప్లాన్తో దీన్ని రీఛార్జ్ చేసుకోవచ్చు.ఈ ప్లాన్ అందిస్తున్న ఓటీటీ సేవల జాబితాలో నెట్ఫ్లిక్స్ బేసిక్, జియో హాట్స్టార్ సూపర్, జీ5 ప్రీమియం వంటి పెద్ద సబ్స్క్రిప్షన్లు ఉన్నాయి. వీటితో పాటు ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ ప్లే ప్రీమియం సబ్స్క్రిప్షన్ కూడా అందుబాటులో ఉంది. దీనితో వినియోగదారులు 25 కంటే ఎక్కువ ఓటీటీ సేవల కంటెంట్ను చూడవచ్చు. ఎక్స్స్ట్రీమ్ ప్లే ప్రీమియంలో సోనీలివ్, లయన్స్గేట్ ప్లే, ఆహా, చౌపాల్, హోయిచోయ్ వంటి ప్లాట్ఫామ్లను చేర్చారు. -
కాగ్నిజెంట్లో జీతాల పెంపు.. సీఎఫ్వో కీలక ప్రకటన
ఐటీ సేవల దిగ్గజం కాగ్నిజెంట్లో ఉద్యోగుల జీతాల పెంపుపై కీలక ప్రకటన చేశారు ఆ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్వో) జతిన్ దలాల్. 2025 ద్వితీయార్థంలో చాలా మంది ఉద్యోగులకు వేతన పెంపును అమలు చేయాలని కంపెనీ యోచిస్తోందని, అయితే స్థూల ఆర్థిక అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో వేతన పెంపు తేదీని ఇంకా నిర్ణయించలేదని జతిన్ దలాల్ జూలై 31న కంపెనీ క్యూ 2 ఎర్నింగ్ కాల్ సందర్భంగా చెప్పారు.న్యూజెర్సీ కేంద్రంగా పనిచేస్తున్న కాగ్నిజెంట్ సాధారణంగా ఆగస్టు 1 నుంచి వార్షిక వేతన పెంపును ప్రారంభిస్తుంది. అయితే ఈ ఏడాది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), విప్రో, హెచ్సీఎల్టెక్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ వంటి సంస్థలతో కలిసి కాగ్నిజెంట్ వేతన ఇంక్రిమెంట్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు వేతన పెంపును అమలు చేసిన ఏకైక ప్రధాన టైర్-1 ఐటీ సంస్థగా ఇన్ఫోసిస్ నిలిచింది.స్థూల ఆర్థిక వాతావరణం, దాని చుట్టూ ఉన్న అనిశ్చితి దృష్ట్యా వేతనాల పెంపుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని దలాల్ పేర్కొన్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో అమలు చేసే వేతన పెంపులో మెజారిటీ ఉద్యోగులను కవర్ చేయాలనేది తమ ప్రయత్నమని చెప్పారు. అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ, కాగ్నిజెంట్ స్థిరమైన హెడ్ కౌంట్ వృద్ధిని నివేదిస్తూనే ఉంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ వరుసగా 7,500 మంది ఉద్యోగులను చేర్చుకుంది, మొత్తం ఉద్యోగుల సంఖ్య 343,800 కు చేరుకుంది. అట్రిషన్ గత త్రైమాసికంతో పోలిస్తే 60 బేసిస్ పాయింట్లు తగ్గి పన్నెండు నెలల ప్రాతిపదికన 15.2 శాతానికి తగ్గింది. -
ఇదిగో ఈ 40 రకాల ఉద్యోగాలకు డేంజర్!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవంలో భాగంగా చాట్ జీపీటీ ప్రవేశపెట్టినప్పటి నుంచి విశ్లేషకులు, నిపుణులు, సీఈఓలు వైట్ కాలర్ రోల్స్ లో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఏఐ ప్రభావం కలిగించే లేదా పూర్తిగా భర్తీ చేసే అవకాశం ఉన్న 40 రకాల ఉద్యోగాలను మైక్రోసాఫ్ట్ మద్దతుతో నిర్వహించిన ఒక తాజా అధ్యయనం జాబితా చేసింది.ఉపాధ్యాయులు, పాత్రికేయులు, కాల్ సెంటర్ ఏజెంట్లు వంటి వృత్తులు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఓపెన్ఏఐ, లింక్డ్ఇన్ సహకారంతో నిర్వహించిన ఈ పరిశోధన ప్రపంచ శ్రామిక శక్తిలోని వివిధ రంగాల్లో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తృత ప్రభావాన్ని ఎత్తిచూపింది.చాట్ జీపీటీ వంటి ఏఐ సాధనాలను వేగంగా స్వీకరించడంపై పెరుగుతున్న ఆందోళనల మధ్య ఈ అధ్యయనం జరిగింది. ఈ ఏడాది ఒక్క మైక్రోసాఫ్ట్ మాత్రమే దాదాపు 15,000 తొలగింపులను ప్రకటించింది.ఏఐతో దెబ్బతినే ఉద్యోగాలుటెలిమార్కెటర్లు, ఉపాధ్యాయులు, కస్టమర్ సర్వీస్ ప్రతినిధులు, సైకాలజిస్టులు, న్యాయమూర్తులు, సామాజిక శాస్త్రవేత్తలు, న్యూస్ అనలిస్టులు, పాత్రికేయులు, టెక్నికల్ రైటర్లు, ప్రూఫ్ రీడర్లు, అనువాదకులు, సామాజిక కార్యకర్తలు, బీమా అండర్ రైటర్లు, ఆంత్రోపాలజిస్టులు, క్లినికల్ డేటా మేనేజర్లు, సర్వే పరిశోధకులు, చరిత్రకారులు, రాజకీయ శాస్త్రవేత్తలు, ఆర్బిట్రేటర్లు, ఎపిడెమియాలజిస్టులు, హెచ్ఆర్ స్పెషలిస్టులు, మధ్యవర్తులు, కెరీర్ కౌన్సిలర్లు, క్యూరేటర్లు, కరస్పాండెంట్లు, కాపీ రైటర్లు, ఎడిటర్లు, మార్కెట్ రీసెర్చ్ అనలిస్టులు, లీగల్ సెక్రటరీలు, ట్రైనింగ్ స్పెషలిస్టులు, పబ్లిక్ రిలేషన్స్ స్పెషలిస్టులు.పెద్దగా ముప్పు లేని ఉద్యోగాలుక్లీనర్లు, డిష్ వాషర్లు, కార్మికులు, కార్పెంటర్లు, పెయింటర్లు, రూఫర్లు, మెకానిక్లు, వెల్డర్లు, బచర్స్, బేకర్లు, డెలివరీ వర్కర్లు, వంటవారు, కాపలాదారులు, డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, భవన నిర్మాణ కార్మికులు, సెక్యూరిటీ గార్డులు, మేస్త్రీలు, టైలర్లు. -
మోటరోలా కొత్త ఫోన్.. రూ.18వేల లోపే పవర్ఫుల్ మొబైల్
స్మార్ట్ఫోన్ బ్రాండ్ మోటరోలా తాజాగా మోటో జీ86 పవర్ ఫోన్ను ఆవిష్కరించింది. ఇందులో 8జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ వెర్షన్ ధర రూ. 17,699గా ఉంటుంది. అదనంగా రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంటు పోగా రూ. 16,999కే లభిస్తుందని కంపెనీ తెలిపింది.ఇందులో 6.67 అంగుళాల పీఓఎల్ఈడీ సూపర్ హెచ్డీ ఫ్లాట్ డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ 7ఐ, 50 ఎంపీ ఓఐఎస్ సోనీ కెమెరా, రెండు రోజుల వరకు సరిపోయే 6720 ఎంఏహెచ్ బ్యాటరీ, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్ మొదలైన ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో అన్ని లెన్స్లతో 4కే వీడియో రికార్డింగ్ చేసే వీలుంటుంది.మోటరోలా జీ86 పవర్ స్పెసిఫికేషన్లు🔹మోటరోలా జీ86 పవర్ లో 6.67 అంగుళాల 1.5కే పీఓఎల్ఈడీ సూపర్ హెచ్డీ ఫ్లాట్ డిస్ప్లే, 4500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్ ఉన్నాయి.🔹మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఇందులో అందించారు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత హలో యూఐ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ డివైజ్ 1 సంవత్సరం ఓఎస్ అప్ గ్రేడ్ లు మరియు 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్ డేట్ లను అందిస్తుంది.🔹వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా కూడా ఉంది. ఈ స్మార్ట్ఫోన్ వెనుక భాగంలో ఫ్లిక్కర్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఏఐ ఫోటో ఎన్హాన్స్మెంట్, ఏఐ సూపర్ జూమ్, ఏఐ ఆటో స్మైల్ క్యాప్చర్, టిల్ట్ షిఫ్ట్ మోడ్ వంటి స్మార్ట్ ఫీచర్లతో మోటో ఏఐ లభిస్తుంది.🔹ఇందులోని 6,720 ఎంఏహెచ్ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 53 గంటల రన్ టైమ్ తో 2 రోజులకు పైగా పవర్ ను అందిస్తుంది. ఇందులో 33వాట్ టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జర్ ను అందించారు. -
మరో ఐదేళ్లలో విభిన్న రంగాల్లో ఏఐ పాగా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలు ప్రస్తుత ఉద్యోగుల స్థానాన్ని క్రమంగా ఆక్రమిస్తున్నాయి. ఇప్పటికే చాలా సంస్థల్లోని క్లర్క్, మేనేజర్ స్థాయి ఉద్యోగాల్లో ఏజెంటిక్ ఏఐ పాగా వేసిందని సర్వీస్నౌ 2025 నివేదిక తెలిపింది. మానవులతో కలిసి పనిచేసే ఏజెంటిక్ ఏఐ పనులను ఆటోమేట్ చేయడమే కాకుండా పనిని ఎలా అంచనా వేయాలి.. మరింత సమర్థంగా ఎలా నిర్వహించాలో విశ్లేషించి అమలు చేస్తుంది.నివేదికలోని అంశాలుకంపెనీలు పేరోల్ క్లర్కులు, మేనేజర్ల స్థానంలో ఏఐ ఏజెంట్లను పూర్తిగా నియమిస్తున్నాయి.సిస్టమ్ అడ్మిన్లు, కన్సల్టెంట్ల స్థానంలో కంపెనీలు ఏఐ టూల్స్తో భాగస్వామ్యం ఏర్పరుచుకొని కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.ఏఐతో సంబంధం ఉన్న కాన్ఫిగరేటర్లు, ఎక్స్ పీరియన్స్ డిజైనర్లు, డేటా సైంటిస్టు పోస్టుల్లో కొత్తగా నియామకాలు చేపడుతున్నాయి.2030 నాటికి తయారీ రంగంలో 8 మిలియన్ల ఉద్యోగాలు ఏఐ వల్ల ప్రభావితం చెందుతాయి.రిటైల్లో 7.6 మిలియన్ ఉద్యోగాలు, ఉడ్యుకేషన్లో 2.5 మిలియన్ కొలువులు ప్రభావితం అవుతాయి.టెక్ పరిశ్రమల్లో కొత్తగా 3 మిలియన్ల ఉద్యోగాలు వస్తాయి.భారత్లో 25% సంస్థలు కృత్రిమ మేధ అనుసరించేలా పరివర్తన దశలో ఉన్నాయి. ఈ విషయంలో సింగపూర్, ఆస్ట్రేలియా కంటే భారత్ ముందుంది.13.5% టెక్నాలజీ బడ్జెట్లు ఇప్పటికే కృత్రిమ మేధకు కట్టుబడి ఉన్నాయి.57% సంస్థలు ఏఐ సామర్థ్య లాభాలను నివేదించాయి.ఏఐ రీడిజైన్ చేసిన వర్క్ఫ్లోల నుంచి 63% ఉత్పాదకత పెరిగింది.సవాళ్లు ఇవే..ఏఐ వినియోగం పెరుగుతున్నా 30% సంస్థలకు డేటా భద్రత ఆందోళనగా మారుతుంది.టెక్ కంపెనీల్లోని 26 శాతం ఉద్యోగులకు ఏఐ భవిష్యత్తు నైపుణ్యాలపై అవగాహన లేదు.కీలక అంశాలపై నిర్ణయం తీసుకోవడంలో కృత్రిమ మేధను ఏమేరకు నమ్మాలో ప్రశ్నార్థకంగా మారుతుంది.ఇదీ చదవండి: ‘వేగంగా ఏఐ విస్తరణ.. మార్పునకు సిద్ధపడాలి’ -
‘వేగంగా ఏఐ విస్తరణ.. మార్పునకు సిద్ధపడాలి’
కృత్రిమ మేధ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు, వ్యవస్థలు మార్పుకు అనుగుణంగా సిద్ధంగా ఉండాలని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్గేట్స్ అన్నారు. లేదంటే సమస్యలు తప్పవని హెచ్చరించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఏఐ ఉత్పాదకతను పెంచే క్రమంలో చాలామంది సిబ్బంది తమ కొలువులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.ఏఐ వాడకం అనివార్యం‘కృత్రిమ మేధ నేతృత్వంలోని ఆటోమేషన్ ఒక సానుకూల మార్పు. ఇది ప్రజలను, ఉద్యోగులను ఇతర మెరుగైన కొలువులు చేయడానికి సాయం చేస్తుంది. ఉత్పాదకతను మెరుగుపరిచే క్రమంలో ఏఐ వాడకం అనివార్యం అవుతుంది. కాబట్టి అందుకు అనువుగా మార్పులకు సిద్ధంగా ఉండాలి. లేదంటే సమస్యలు వస్తాయి. ఏఐ వేగంగా విస్తరిస్తోంది. అంత వేగంగా వచ్చే మార్పులకు సర్దుకుపోయే సమయం ఉండదనేదే ప్రశ్న’ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఎంత వేగంగా అమలవుతున్నాయోనన్న ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.రోబోటిక్ ఆయుధాలు..రాబోయే రోజుల్లో అనేక ఎంట్రీ లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భర్తీ చేయవచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానం మెరుగుపడిన తర్వాత భవిష్యత్తులో మాన్యువల్ లేబర్ తీవ్రంగా ప్రభావితం చెందుతుంది. ‘రోబోటిక్ ఆయుధాలు ఇంకా అభివృద్ధి చెందలేదు. కానీ అవి అందుబాటులోకి వస్తే, శ్రామిక శక్తిని పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తాయి’ అని గేట్స్ చెప్పారు.ఏజీఐతో ముప్పు‘ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్(ఏజీఐ) ఆన్లైన్ సేల్స్ లేదా కస్టమర్ సర్వీస్ వంటి సంక్లిష్ట పనులను మానవుల కంటే మెరుగ్గా చేయగలదు. ఏజీఐ వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు విషయాల ద్వారా సర్వీసు అందిస్తాయి. యంత్రాలు తక్కువ ఖర్చుతో మరింత కచ్చితత్వంతో పనులను నిర్వహించగలిగితే మాత్రం అది పెద్ద మార్పు అవుతుంది’ అని గేట్స్ తెలిపారు.ఇదీ చదవండి: యూపీఐ చెల్లింపులకు పిన్ అవసరం లేదు?కచ్చితమైన డేటాఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఎలా వాడుతున్నారని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ..‘ఏఐ పురోగతిలో ఉన్న వేగం నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కఠినమైన విషయాలను అర్థం చేసుకోవడానికి ఏఐ రీసెర్చ్ టూల్స్ను ఉపయోగిస్తాను. అయితే వాటిలోని అంశాలను ధ్రువీకరించేందుకు నిపుణులతో తరచూ తనిఖీ చేస్తాను. విచిత్రంగా వారుకూడా చాలాసార్లు అందులోని అంశాలు నిజమనే చెబుతారు’ అని అన్నారు. -
యూపీఐ చెల్లింపులకు పిన్ అవసరం లేదు?
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) యూపీఐ లావాదేవీల కోసం ప్రస్తుతం ఉన్న పిన్ స్థానంలో బయోమెట్రిక్, ఫేస్ఐడీ ఆధారిత ధ్రువీకరణను ప్రవేశపెట్టాలని పరిశీలిస్తున్నట్లు బిజినెస్ స్టాండర్డ్ తెలిపింది. ఇది అమల్లోకి వస్తే డిజిటల్ లావాదేవీలు జరిపే సమయంలో యూజర్లు తమ యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా కేవలం బయోమెట్రిక్(ఫింగర్ప్రింట్) లేదా ఫేస్ ఐడీని ఉపయోగించి చెల్లింపులు చేయవచ్చు. అయితే దీనిపై ప్రభుత్వ యంత్రాంగం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని గమనించాలి.ప్రస్తుతం యూపీఐ లావాదేవీలు చేసేందుకు 4 నుంచి 6 అంకెల పిన్ అవసరం. చెల్లింపులు చేసినప్పుడు కచ్చితంగా వినియోగదారులు ఈ పిన్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ పిన్ పేమెంట్ గేట్వేకు సెక్యూరిటీ లేయర్గా పనిచేస్తుంది. డిజిటల్ ప్లాట్ఫామ్లను ఉపయోగించడం సౌకర్యవంతంగా లేని వ్యక్తులకు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు లేదా గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఇది ఎంటర్ చేయడం అడ్డంకిగా మారుతుంది. దాంతో కొత్త విధానాన్ని ఉపయోగించాలని ఎన్పీసీఐ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా బయోమెట్రిక్ అథెంటికేషన్తో లేదా ముఖ గుర్తింపు వంటి భౌతిక లక్షణాల ద్వారా యూజర్ను ధ్రువీకరించే ప్రక్రియను పరిశీలిస్తున్నారు.ఇదీ చదవండి: భారత్లో స్టార్లింక్ సబ్స్క్రిప్షన్ ఎంతంటే..ఈ చర్య పెద్ద సంఖ్యలో వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. పాస్వర్డ్లను గుర్తుంచుకోవడంలో ఇబ్బంది పడేవారికి బయోమెట్రిక్, ఫేస్ఐడీ ఆమోదంతో డిజిటల్ చెల్లింపులను సులభతరం చేయవచ్చని ప్లూటోస్ వన్ వ్యవస్థాపకులు, మేనేజింగ్ పార్టనర్ రోహిత్ మహాజన్ ఎకనామిక్ టైమ్స్కు చెప్పారు. ఇది డిజిటల్ లావాదేవీలను సులభతరం చేయడానికి, వీటిని మరింత మందికి అందుబాటులోకి తీసుకురావడానికి సహాయపడుతుందన్నారు. అదే సమయంలో బయోమెట్రిక్ వ్యవస్థలు మోసాలను కూడా తగ్గిస్తాయని చెప్పారు. పిన్ ఎంటర్ చేయడంతో పోలిస్తే వినియోగదారుల భౌతిక లక్షణాలు డూప్లికేట్ చేయడం లేదా దొంగిలించడం కష్టమన్నారు. -
భారత్లో స్టార్లింక్ సబ్స్క్రిప్షన్ ఎంతంటే..
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలోని ‘స్టార్లింక్’ ఇంటర్నెట్ సేవల సంస్థకు భారత్లో ద్వారాలు తెరచుకున్న నేపథ్యంలో సబ్స్క్రిప్షన్ ఎంత ఉండబోతుందనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే భూటాన్, ఇండోనేషియా, ఒమన్, మాల్దీవులు.. వంటి ఆసియా దేశాల్లో స్టార్లింక్ వసూలు చేస్తున్న ఛార్జీలను పరిగణలోకి తీసుకుని భారత్లో నెలవారీ ఇంటర్నెట్ సర్వీసులు ఎంతో ఉండొచ్చనే దానిపై కావాలనుకునేవారు ఎంత చెల్లించాలనే వివరాలపై కొన్ని అంచనాలు వెలువడుతున్నాయి.ఇదీ చదవండి: త్వరలో మడతెట్టే యాపిల్ ఫోన్?స్టార్లింక్కు సంబంధించి కొన్ని అంశాలు..ఇంటర్నెట్ స్పీడ్ 200 ఎంబీపీఎస్ వరకు ఉంటుంది. లొకేషన్ను అనుసరించి సగటు వేగం 100 ఎంబీపీఎస్గా ఉండొచ్చు.మారుమూల, గ్రామీణ ప్రాంతాలకు లో-ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ల ద్వారా ఇంటర్నెట్ అందిస్తారు.వినియోగదారులు, ఆయా ప్రాంతాన్ని బట్టి నెలకు రూ.3,000 నుంచి రూ.4,200 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.హార్డ్ వేర్ కిట్లో భాగంగా శాటిలైట్ డిష్, రౌటర్ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని ధర సుమారు రూ.33,000 ఉండొచ్చు.ఇంటర్నెట్ సర్వీసుల కోసం అనువైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఎయిర్టెల్, జియోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.బీఎస్ఎన్ఎల్ వంటి ప్రస్తుత టెలికాం సంస్థలకు అంతరాయం కలగకుండా ఉండటానికి భారతదేశం అంతటా 20 లక్షల కనెక్షన్లకే పరిమితం చేశారు. అంతకంటే ఎక్కువ కనెక్టన్లు ఇవ్వకూడదు.2025 చివరి నాటికి భారత్లో ఈ సర్వీసులు లాంచ్ చేస్తారని అంచనా. తర్వలో ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. -
త్వరలో మడతెట్టే యాపిల్ ఫోన్?
స్మార్ట్ ఫోన్ తయారీ రంగంలో నిత్యం కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు తమ వినియోగదారుల అభిరుచులకు తగినట్లుగా ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. అయితే ప్రపంచంలోనే టాప్ కంపెనీగా ఉన్న యాపిల్ మాత్రం ఈ విభాగంలో ఉత్పత్తులను తీసుకురాలేదు. కానీ ఎట్టకేలకు ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ విభాగంలో యాపిల్ అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.యాపిల్ 2026లోనే ఫోల్డబుల్ ఫోన్ను విపణిలోకి తీసుకురాబోతుందని కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురిస్తున్నాయి. టెక్ విశ్లేషకులు, ఇన్సైడర్ల వివరాల ప్రకారం ఫోల్డబుల్ ఐఫోన్ 2026 ద్వితీయార్ధంలో ఐఫోన్ 18 సిరీస్తో పాటు ఆవిష్కరించే అవకాశం ఉంది. ఐఫోన్ ఎక్స్ తర్వాత యాపిల్ తన ఉత్పత్తుల్లో చేయనున్న అతిపెద్ద డిజైన్ మార్పు ఇదేనని చెబుతున్నారు. ఫోల్డబుల్ ఐఫోన్ శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ సిరీస్ను పోలిన బుక్ స్టైల్ ఫోల్డింగ్ విధానంలో ఉంటుందని చెబుతున్నారు.ఇదీ చదవండి: కార్డు ఉంది కదా అని రెచ్చిపోతున్నారు!జేపీ మోర్గాన్ అనలిస్ట్ సమిక్ ఛటర్జీ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఫోల్డబుల్ ఐఫోన్ 7.8 అంగుళాల ఇన్నర్ డిస్ప్లే, 5.5 అంగుళాల బాహ్య డిస్ప్లేను కలిగి ఉంటుందని అంచనా వేశారు. ఈ ఫోన్ ధరపై కూడా కొందరు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా అంచనా వేస్తున్నారు. ఫోల్డబుల్ ఐఫోన్ ప్రారంభ ధర 1,999 డాలర్లుగా ఉంటుందని సూచిస్తున్నారు. ఇది ఇండియాలో సుమారు రూ.1.75 లక్షలుగా ఉండొచ్చని చెబుతున్నారు. -
ఇన్ఫోసిస్ చల్లని కబురు: తొలగించడం కాదు.. చేర్చుకుంటాం
టీసీఎస్ లేఆఫ్ల ప్రకటన తర్వాత దేశ ఐటీ పరిశ్రమలో కల్లోల వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆందోళనలో ఉన్న ఐటీ ఉద్యోగార్థులకు దేశీయ రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది 20,000 మంది గ్రాడ్యుయేట్లను నియమించుకోనున్నట్లు ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ ధృవీకరించారు.మొదటి త్రైమాసికంలో 17,000 మందిని (స్థూల నియామకాలు) నియమించుకున్నామని, ఈ ఏడాది ఇంకా 20,000 మంది కాలేజీ గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని యోచిస్తున్నట్లు ఆయన ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రీస్కిల్లింగ్లలో వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టడం ద్వారా కంపెనీ కాస్త ముందంజలో ఉందన్న పరేఖ్.. ఇప్పటి వరకు వివిధ స్థాయిల్లో 2,75,000 మంది ఉద్యోగులకు శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు.పోటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 12,000 మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇన్ఫోసిస్ సీఈవో నియామకాలను ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మరే ఇతర భారతీయ ఐటీ కంపెనీ కూడా ఈ స్థాయిలో లేఆఫ్లను ప్రకటించలేదు.ఏఐ ప్రభావంపై..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం గురించి పరేఖ్ మాట్లాడుతూ, "కృత్రిమ మేధ లోతైన ఆటోమేషన్, అవగాహనను అందిస్తుంది. అదే సమయంలో ఉన్నత స్థాయి నైపుణ్యాలు, ప్రతిభ అవసరం" అని అన్నారు. ఉద్యోగులు,సాంకేతికత రెండింటి పట్ల దీర్ఘకాలిక నిబద్ధతను ప్రతిబింబిస్తూ ఇన్ఫోసిస్ తన శ్రామిక శక్తిని విస్తరిస్తుందని పేర్కొన్నారు.వేతనాల పెంపుపై..గత ఆర్థిక సంవత్సరం క్యూ4, క్యూ1లకు వేతనాల పెంపును కంపెనీ ఇప్పటికే పూర్తి చేసిందని పరేఖ్ తెలిపారు. "ఇప్పుడు ఈ సైకిల్ పూర్తయింది. ఎప్పటిలాగే తదుపరి రౌండ్ కోసం సమయాన్ని అంచనా వేయడం ప్రారంభించాం. మా ప్రస్తుత ప్రక్రియకు కట్టుబడి ఉంటాం. సరైన సమయంలో తదుపరి రౌండ్ను ప్రకటిస్తాం" అని పరేఖ్ వివరించారు.👉 ఇదీ చదవండి: TCS layoffs: రంగంలోకి కేంద్ర ప్రభుత్వం!