breaking news
Technology
-
గ్రీన్ ఎనర్జీ ఆవిష్కరణకు ప్రభుత్వ పేటెంట్
శిలాజ ఇంధనాలపై ఆధారపడడం తగ్గించాలనే లక్ష్యంతో ఎంజీఎం విశ్వవిద్యాలయంలోని జవహర్లాల్ నెహ్రూ ఇంజినీరింగ్ కాలేజ్ (జేఎన్ఈసీ)లో కెమికల్ ఇంజినీరింగ్ విద్యార్థి కనక్ తల్వేర్ రూపొందించిన గ్రీన్ ఎనర్జీ వ్యవస్థకు భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ లభించింది. చెరకు రసం నుంచి బయోఇథనాల్ ఉత్పత్తి చేసేలా ఈ వ్యవస్థను తయారు చేశారు.ఎంజీఎం విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యాపకులు డాక్టర్ రవీంద్ర గైక్వాడ్, ఆకాశ్ వాణి, ప్రవర రూరల్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన డాక్టర్ అన్నాసాహెబ్ వరడే, రవీంద్ర నిబ్లతో కలిసి ఈ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు కనక్ కలిసి పనిచేశారు. మొత్తం ఈ ఐదుగురు పరిశోధకులు కలిసి భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ పొందినట్లు తెలిపారు.వ్యవసాయ వ్యర్థాల నుంచి క్లీన్ ఎనర్జీబయోఇథనాల్ను తయారు చేయడానికి విస్తృతంగా లభించే చెరకు రసాన్ని ఉపయోగించడం వల్ల ఈ ఆవిష్కరణ ప్రత్యేకంగా నిలిచింది. ఈ ప్రక్రియ జీవ ఇంధన ఉత్పత్తి కోసం, ముఖ్యంగా చెరకు పండిస్తున్న వ్యవసాయ ప్రాంతాల్లో రెట్టింపు ప్రయోజనాన్ని అందిస్తుంది. దీనివల్ల కర్బన ఉద్గారాలు తగ్గడం, గ్రామీణ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. చెరకు రసంతో పాటు రసం వెలికితీత తర్వాత మిగిలిపోయిన ఫైబరస్ అవశేషమైన బగాస్సేపై పరిశోధనలు చేసి ఈ ప్రక్రియను రూపొందించారు. అంటే పంటలోని ప్రతి భాగాన్ని వినియోగంలోకి తేనున్నారు.ఇదీ చదవండి: మీ వయసు 30 లోపా? తప్పక తెలియాల్సినవి..ఈ ప్రక్రియ భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ పొందండంతో ఎంజీఎం విశ్వవిద్యాలయం అకడమిక్ కమ్యూనిటీ నుంచి ప్రశంసలు అందుకుంది. భారతదేశం గ్రీన్ ఎనర్జీ మిషన్కు అనుగుణంగా విద్యార్థుల నేతృత్వంలోని ఆవిష్కరణలను ఇది హైలైట్ చేసింది. దేశం ప్రతిష్టాత్మక ఇథనాల్ మిశ్రమ లక్ష్యాల వైపు దూసుకెళ్తున్నప్పుడు ఇంధన ఆర్థిక వ్యవస్థలను సృష్టించడంలో ఇలాంటి పరిష్కారాలు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. -
మెసేజ్ ఎంత పెద్దదైనా చిటికెలో సారాంశం
మెటా వాట్సప్లో కొత్త ఏఐ ఆధారిత ఫీచర్ను ప్రవేశపెట్టినట్లు తెలిపింది. వాట్సప్లో చదవని మెసేజ్ల సంక్షిప్త సారాంశాన్ని తెలుసుకునేందుకు మెటా ఏఐ సాయం చేయనుందని పేర్కొంది. ఈ ఫీచర్లో భాగంగా యూజర్లు నిత్యం పెద్ద టెక్స్ట్ మేసేజ్లను స్క్రోల్ చేసి పూర్తిగా చదవకుండా మెటా ఏఐ అందులోని సంక్షిప్త సారాంశాన్ని అందిస్తుంది. ఇంగ్లిష్ సపోర్ట్తో పనిచేసే ఈ ఫీచర్ ప్రస్తుతం అమెరికాలోని వాట్సప్ యూజర్లకు అందుబాటులో ఉన్నట్లు మెటా తెలిపింది. ఈ ఏడాది చివర్లో క్రమంగా మరిన్ని ప్రాంతాలతోపాటు ఇతర భాషలకు ఈ ఫీచర్ను విస్తరిస్తామని స్పష్టం చేసింది.మెటా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఫీచర్ వన్-ఆన్-వన్, గ్రూప్ చాట్స్ రెండింటికీ అందుబాటులో ఉంటుంది. నిత్యం మెసేజ్లు వచ్చే గ్రూప్లు, వ్యక్తులకు ఈ ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఏఐ మెసేజ్లు చదివే క్రమంలో యూజర్ల కంటెంట్పట్ల భద్రత పాటిస్తామని వాట్సప్ హామీ ఇచ్చింది. ఏఐ ఫీచర్ డేటాను బాహ్య సర్వర్లకు ప్రసారం చేయకుండా లేదా కంపెనీ సిస్టమ్లకు బహిర్గతం చేయకుండా ప్రాసెస్ చేస్తుందని తెలిపింది.ఇదీ చదవండి: వారానికి 32 గంటలు చాలు..: యూఎస్ నెనేటర్యూజర్ల ప్రాధాన్యతలను గౌరవించడానికి వాట్సప్ డిఫాల్ట్గా ఈ ఫీచర్ను ఎనేబుల్ చేయదని చెప్పింది. మాన్యువల్గానే దీన్ని యాక్టివేట్ చేసుకోవాలని పేర్కొంది. ఇది ఆప్షనల్ ఫీచర్గా మాత్రమే ఉంటుందని తెలిపింది. అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీ కంట్రోల్స్లో యూజర్లు తమ సెట్టింగ్స్ను మార్చుకోవచ్చని స్పష్టం చేసింది. -
వారానికి 32 గంటలు చాలు..: యూఎస్ సెనేటర్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యం పెరుగుతున్న కొద్దీ ఉద్యోగుల తొలగింపు అధికమవుతోంది. టెక్ కంపెనీలు వ్యయం ఆదా చేసుకొని ఇతర విభాగాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఏఐ తోడ్పడుతుంది. కృత్రిమ మేధ వ్యాపారాలకు సహాయం చేస్తుంటే, వాటి సామర్థ్యాన్ని పెంచుతుంటే ఆయా సంస్థలు ఉద్యోగుల వర్క్-లైఫ్ సమతుల్యతను మెరుగుపరచాలని సెనేటర్ బెర్నీ శాండర్స్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఏఐ ఆటోమేషన్ పెరుగుతున్న తరుణంలో ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిచేసేలా వాతావరణాన్ని సృష్టించాలన్నారు.జో రోగన్ ఎక్స్పీరియన్స్ పాడ్కాస్ట్లో మాట్లాడిన బెర్నీ శాండర్స్ వారానికి 32 గంటల పనిదినాలు ఉండాలని చెప్పారు. కృత్రిమ మేధ ఉద్యోగులను నిరుద్యోగంలోకి నెట్టడం కంటే ఎక్కువ ఫ్రీటైమ్ ఉంచేలా చేయాలని పేర్కొన్నారు. ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమా అని వ్యాపారాలకు ఉత్పాదకత పెరుగుతోంది. దాన్ని ప్రధానంగా పరిగణిస్తే సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు దానికి బదులుగా పని దినాలను తగ్గించాలి. వారానికి 32 గంటలకు పనిని కుదించాలి. ఉద్యోగులు తమ కుటుంబం, స్నేహితులు లేదా తమకు ఇష్టమైన కార్యకలాపాలకు ఎక్కువ సమయం గడిపేందుకు వీలు కల్పించాలి. టెక్నాలజీ కేవలం కార్పొరేట్ లాభాలకే పరిమితం కాకుండా ఉద్యోగులకు సైతం ఉపయోగపడాలి’ అన్నారు.ఇదీ చదవండి: ఇంటెల్లో ఉద్యోగాల కోత ప్రారంభంసెనేటర్ బెర్నీ శాండర్స్ ప్రస్తుతం యూఎస్ సెనేట్లో వెర్మాంట్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1981లో వెర్మాంట్లోని బర్లింగ్ టన్ మేయర్గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన 1991 నుంచి 2007 వరకు అమెరికా ప్రతినిధుల సభలో పనిచేశారు. -
5జీ యూజర్లు @ 98 కోట్లు..!
న్యూఢిల్లీ: భారత్లో 5జీ టెలికం యూజర్లు (చందాదారులు) 2030 నాటికి 98 కోట్లకు చేరుకుంటారని, అప్పటికి 4జీ చందాదారుల సంఖ్య 60 శాతం తగ్గి 23 కోట్లకు పరిమితం అవుతుందని టెలికం గేర్ల తయారీ సంస్థ ఎరిక్సన్ తెలిపింది. ‘‘2024 చివరికి 5జీ చందాదారులు 29 కోట్లకు పెరిగారు. మొత్తం మొబైల్ సబ్్రస్కిప్షన్లలో 24 శాతంగా ఉన్నారు. 2030 నాటికి ఈ సంఖ్య 98 కోట్లకు చేరుకుంటుంది. మొత్తం చందాదారుల్లో 5జీ యూజర్లు 75 శాతానికి పెరుగుతారు’’అని ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ వెల్లడించింది. 2024లో ఒక్కో స్మార్ట్ ఫోన్ ద్వారా 32జీబీ డేటా వినియోగంతో భారత్ ప్రపంచంలో డేటా రద్దీ పరంగా మొదటి స్థానంలో నిలిచినట్టు తెలిపింది. 2030 నాటికి ఒక్కో స్మార్ట్ఫోన్ డేటా వినియోగం 66జీబీకి పెరుగుతుందని అంచనా వేసింది. ఇందుకు అనుగుణంగా బలమైన 5జీ నెట్వర్క్ అవసరం ఉంటుందని పేర్కొంది. వేగంగా 5జీ స్మార్ట్ఫోన్లకు యూజర్లు మారుతుండడం, డేటా వినియోగానికి డిమాండ్ పెరుగుతున్నట్టు వివరించింది. ‘‘బ్రాడ్బ్యాండ్ అవసరం పెరుగుతోంది. ముఖ్యంగా గ్రామీణ, చిన్న పట్టణాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. 5జీ ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ (ఎఫ్డబ్ల్యూఏ) విస్తరణ దిశగా సరీ్వస్ ప్రొవైడర్లను ఈ డిమాండ్ నడిపిస్తుంది. భారత్లో అందుబాటులో ఉన్న 5జీ మిడ్బ్యాండ్ స్పెక్ట్రమ్.. సామర్థ్యం, నెట్వర్క్ విస్తరణ అవసరాలకు సరిపోతుంది. ఇది యూజర్ అనుభవం పెరిగేందుకు వీలు కలి్పస్తుంది’’అని ఎరిక్సన్ నివేదిక వివరించింది. -
30 రోజుల రీచార్జ్ ప్లాన్లు.. బెనిఫిట్లు
జియో, ఎయిర్టెల్ దేశంలో రెండు అతిపెద్ద టెలికాం కంపెనీలు. దేశంలో ఎక్కువ మంది మొబైల్ వినియోగదారులు జియోతో కనెక్ట్ అయ్యారు. యూజర్ల పరంగా ఎయిర్ టెల్ రెండో స్థానంలో ఉంది. ఎక్కువ మంది యూజర్లు నెలవారీ రీచార్జ్ ప్లాన్ల వైపు మొగ్గుచూపుతుంటారు. రెండు కంపెనీలు తమ వినియోగదారులకు సరసమైన రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి.జియో, ఎయిర్టెల్లో ఉన్న 30 రోజుల వాలిడిటీ రీఛార్జ్ ప్లాన్లు, వాటి ప్రయోజానాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. రూ.335తో జియో 30 రోజుల వాలిడిటీ రీఛార్జ్ చేసుకోవచ్చు. అదే సమయంలో, మీరు ఎయిర్టెల్ 30 రోజుల వాలిడిటీ రీఛార్ ప్లాన్ రూ .379కు అందుబాటులో ఉంది. ఈ రెండు రీఛార్జ్ ప్లాన్ల ధరలలో వ్యత్యాసం రూ .44. అలాగే వాలిడిటీ ఒక్కటే అయినా ప్రయోజనాల్లోనూ చాలా తేడాలున్నాయి.జియో రూ.335 ప్లాన్జియో రూ.335 ప్లాన్ వాలిడిటీ 30 రోజులు. ఈ ప్లాన్లో వినియోగదారులు అపరిమిత ఉచిత కాలింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. దీంతో పాటు రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లతో పాటు మొత్తం 25 జీబీ డేటా లభిస్తుంది. అంతేకాకుండా జియో హాట్స్టార్, జియో క్లౌడ్కు ఉచిత యాక్సెస్ కూడా పొందుతారు.ఎయిర్టెల్ రూ.379 ప్లాన్ఎయిర్ టెల్ రూ.379 ప్లాన్ వాలిడిటీ 30 రోజులు. ఈ ప్లాన్లో వినియోగదారులు అపరిమిత ఉచిత కాలింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. దీంతో పాటు రోజుకు 2 జీబీ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఇది కాకుండా, ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ యాప్నకు యాక్సెస్ కూడా పొందుతారు.👉 ఇది చదివారా? జియో నుంచి 2 కొత్త ఫ్లాన్లు.. ప్రత్యేక బెనిఫిట్లు.. -
రూ.10వేలలో మరో కొత్త ఫోన్.. అమ్మకాలు ప్రారంభం
కొత్తగా లాంచ్ అయిన ఐక్యూ జెడ్10 లైట్ 5జీ స్మార్ట్ఫోన్ అమ్మకాలు భారత్లో ప్రారంభమయ్యాయి. ఈ బడ్జెట్ స్మార్ట్ఫోన్ ధర రూ.10,000 రేంజ్లోనే ఉంటుంది. 6,000 ఎంఏహెచ్ పెద్ద బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6,300 ప్రాసెసర్ వంటి అద్భుత స్పెసిఫికేషన్లు ఇందులో ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 22.7 గంటల వీడియో ప్లేబ్యాక్ ను అందిస్తుంది. లాంచ్ ఆఫర్లలో బ్యాంక్ కార్డులపై రూ.500 తగ్గింపు, నో కాస్ట్ ఈఎంఐ తదితర ఆఫర్లు ఉన్నాయి. 👉 కొత్త ఫోన్.. రూ.25 వేలకే 3డీ కర్వ్డ్ డిస్ప్లే 👈ఐక్యూ జెడ్10 లైట్ 5జీ స్పెసిఫికేషన్లుఇక స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే ఐక్యూ జెడ్10 లైట్ 5జీ ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది. ఇందులో 6.74 అంగుళాల హెచ్డీ ఎల్సీడీ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్వోసీని అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగా పిక్సెల్ సెన్సార్ కూడా ఉంది. 5 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ కూడా ఉంది. 15వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. కనెక్టివిటీ ఆప్షన్లలో బ్లూటూత్ వి5.4, వై-ఫై 5 ఉన్నాయి.ఐక్యూ జెడ్10 లైట్ 5జీ లాంచ్ ఆఫర్లుఐక్యూ జెడ్10 లైట్ 5జీ లాంచ్ ఆఫర్లలో ఎంపిక చేసిన ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, ఇతర బ్యాంక్ కార్డులపై రూ .500 తక్షణ తగ్గింపు ఉంది. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, జీఎస్టీ బెనిఫిట్స్ కూడా అమెజాన్ ఇండియాలో లిస్ట్ అయ్యాయి. ఐక్యూ జెడ్10 లైట్ 5జీ 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999. ఇది సైబర్ గ్రీన్, టైటానియం బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. -
క్యాబ్ డ్రైవర్లకు ఇక గడ్డుకాలమే!
అవును. నిజం. ఒకట్రెండేళ్లలో క్యాబ్డ్రైవర్లు అనే వారు ఉండకపోవచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కారణంగా ఊబర్, ఓలా, ర్యాపిడో వంటివి పుట్టుకొచ్చి క్యాబ్ డ్రైవర్ల ఆదాయంలో కొంత వాటా పంచుకుంటూంటే... రోబోటిక్స్, అటానమస్ వెహికల్ టెక్నాలజీ కాస్తా... డ్రైవర్ల ఉద్యోగాలకే గండికొట్టే సూచనలు కనిపిస్తున్నాయి. డ్రైవర్ల అవసరం లేని కార్లను టెస్లా ఎప్పుడో తయారు చేసింది కదా? అప్పుడు లేని సమస్య ఇప్పుడెందుకు వస్తుందని అంటున్నారా?సింపుల్.. టెస్లాతోపాటు ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇప్పుడు ఈ అటానమస్ వెహికల్ టెక్నాలజీని క్యాబ్స్గా మార్చే ప్రయత్నాల్లో ఉన్నాయి మరి! టెస్లా ఇప్పటికే తన సైబర్ ట్రక్ను క్యాబ్ సర్వీసులు అందించేలా మార్చి పరిశీలిస్తూండగా.. అమెజాన్ వచ్చే ఏడాది నుంచి ఏటా కనీసం పదివేల రోబో ట్యాక్సీలను సిద్ధం చేస్తోంది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని హేవర్డ్ ప్రాంతంలో అమెజాన్ సుమారు 2.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రోబో ట్యాక్సీల తయారీకి ఒక ప్లాంట్ను ఏర్పాటు చేసింది. నలుగురు ప్రయాణించగల విశాలమైన ట్రక్కులాంటి ఈ వాహనం పేరు జూక్స్. అన్నీ సవ్యంగా సాగితే ఈ ఏడాది చివరికల్లా కొన్ని వాహనాలు లాస్ వేగస్ నగరంలో పరుగులు పెడతాయి కూడా. ఆ తరువాత.. దశలవారీగా మయామీ, ఆస్టిన్, శాన్ఫ్రాన్సిస్కోలకు వీటి సేవలను విస్తరించనున్నారు. ప్రస్తుతం ఈ వ్యాన్లను టెస్ట్ ట్రాక్పై నడిపి పరిశీలిస్తున్నారు కూడా. డ్రైవింగ్ తీరుతెన్నులు, పికప్.. డ్రాప్ఆఫ్ల సందర్భంగా ఏమేం జరుగుతున్నాయో తెలుసుకుంటున్నారు. మరోవైపు.. టెస్లా కంపెనీ కూడా తన సైబర్ ట్రక్ను కాస్తా సైబర్ క్యాబ్గా మార్చే ప్రయత్నాల్లో ఉంది. 2027 నాటికి తొలి దశ వాహనాలను రోడ్లపైకి ఎక్కిస్తారు. రోబోట్యాక్సీ అని పిలుస్తున్న ఈ వాహనంలో ఇద్దరు ప్రయాణించవచ్చు. స్టీరింగ్ వీల్, పెడల్స్ వంటివేవీ ఉండవు. అన్నీ కృత్రిమ మేధ ద్వారానే జరిగిపోతాయి. ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 320 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవు. ముందు, వెనుక ఎక్కడ అద్దాలుండవు. కెమెరాలు, సెన్సర్ల ద్వారానే పరిసరాలను గమనిస్తూ డ్రైవ్ చేస్తుందీ వాహనం. ఒక్కో రోబోట్యాక్సీని 30,000 డాలర్లకు అమ్మేందుకు టెస్లా ప్రయత్నిస్తోంది. మానవ డ్రైవర్ల పరిస్థితి?జూక్స్, రోబోట్యాక్సీలు విస్తృత స్థాయిలో అందుబాటులోకి వస్తే మానవ డ్రైవర్లకు గడ్డుకాలమే!. ప్రస్తుతానికి ఇవి అమెరికాకే పరిమితం కావచ్చు కానీ... భవిష్యత్తులో ఇతర ప్రాంతాలకు మరీ ముఖ్యంగా వివిధ దేశాల్లోని నగర ప్రాంతాలకు విస్తరించడం ఖాయం. అదే జరిగితే ట్యాక్సీ డ్రైవర్లకు డిమాండ్ తగ్గిపోతుంది. రోబో ట్యాక్సీలో ఒక ఒక మైలు ప్రయాణించేందుకు 0.20 డాలర్లు ఖర్చు అవుతుందని, బస్సులతో పోలిస్తే ఇది నాలుగు రెట్లు తక్కువ అని టెస్లా ఇప్పటికే ప్రకటించింది. ఇదే వాస్తవమైతే చవక కాబట్టి వీటిల్లో ప్రయాణించేందుకే మొగ్గు చూపుతారు. కాకపోతే..మానవ డ్రైవర్లను ఈ రోబోట్యాక్సీ నిర్వహణకు ఉపయోగించుకోవచ్చునని ఒక అంచనా. అంతేకాదు... కొంతమంది అభిప్రాయం ప్రకారం ఈ రోబో ట్యాక్సీలు మానవ డ్రైవర్లను పూర్తిగా లేకుండా చేయలేవు. ఎందుకంటే ఇలాంటి వాహనాల భద్రత, నియంత్రణలకు సంబంధించిన నిబంధనలు ఇప్పటివరకూ రూపుదిద్దుకోలేదు. ప్రభుత్వాలు పూనుకుని వీటిని సిద్ధం చేసేందుకు చాలా సమయమే పట్టవచ్చు. మరికొంత మంది అభిప్రాయం ప్రకారం అటానమస్ వాహనాలు నగరాల్లో కొన్ని నిర్దిష్ట మార్గాలకు మాత్రమే పరిమితమవుతాయి. సంక్లిష్టమైన రూట్లలో మానవ డ్రైవర్లనే ఉపయోగిస్తారు. ::గిళియారు గోపాలకృష్ణ మయ్యాPhotos/Videos Credits: zoox.com/newatlas.com -
ముదురుతున్న ఏఐ వార్!
గూగుల్, ఎక్స్, మెటా, ఓపెన్ఏఐ.. వంటి ప్రధాన కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐ మోడళ్లను సృష్టిస్తున్నాయి. ఈ సంస్థల మధ్య పోటీ తీవ్రతరం అవుతుంది. దాంతో తోటివారికంటే ఓ అడుగు ముందుడాలనే భావనతో కంపెనీ ఏఐ నైపుణ్యాలున్నవారికి భారీ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. కృత్రిమ మేధస్సుపై ఆధిపత్యం చెలాయించే రేసులో భాగంగా మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ కీలక ప్రచారం ప్రారంభించినట్లు కొన్ని సంస్థలు తెలుపుతున్నాయి. ఈ విభాగంలో అగ్రశ్రేణి ఏఐ ప్రతిభావంతులను ఆకర్షించేందుకు భారీ ప్యాకేజీ ప్రకటిస్తున్నట్లు తెలుస్తుంది. మెరుగైన ఏఐ నైపుణ్యాలున్న ఎక్స్పర్ట్లకు 100 మిలియన్ డాలర్ల (రూ.860 కోట్లు) ప్యాకేజీ చెల్లించేందుకు కూడా వెనుకాడడం లేదని సమాచారం.నేరుగా సంప్రదింపులుకొన్ని సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకులు, డెవలపర్లు, స్టార్టప్ ఫౌండర్లను వాట్సాప్, ఈమెయిల్ ద్వారా మార్క్ జుకర్బర్గ్ సంప్రదిస్తున్నారు. వీరిలో కొందరిని వ్యక్తిగతంగా షార్ట్లిస్ట్ చేసి ఆయా నిపుణులను నేరుగా సంప్రదిస్తున్నారు. వారితో జరుపుతున్న చర్చల్లో కేవలం నియామకాల గురించే కాకుండా ఆర్టిఫిషియన్ జనరల్ ఇంటెలిజెన్స్, భవిష్యత్తు కార్యకలాపాలు వంటి చాలా అంశాలను చర్చిస్తున్నారు.సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ కోసం..మెటా కొన్ని రోజుల నుంచి మానవ స్థాయి కృత్రిమ మేధ వ్యవస్థలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ‘సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్’ను నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందుకు ప్రపంచంలోనే టాప్ స్కిల్డ్ పర్సన్స్ను నియమించుకోవాలని మెటా భావిస్తోంది. దాంతో సరైన నైపుణ్యాలు ఉన్నవారికి భారీగా ప్యాకేజీలు ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది. అలెగ్జాండర్ వాంగ్ స్థాపించిన స్కేల్ ఏఐ కంపెనీను 14 బిలియన్ డాలర్ల(రూ.1.2 లక్షల కోట్లు) వాల్యుయేషన్కు కొనుగోలు చేసింది. సిలికాన్ వ్యాలీలో అత్యంత ప్రభావవంతమైన డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్టప్ను నిర్మించడంలో ప్రసిద్ధి చెందిన వాంగ్ ఇప్పుడు కృత్రిమ మేధ ఆవిష్కరణలో మెటా తరఫున పని చేస్తున్నారు.ఇదీ చదవండి: మొదటిసారి ఆదాయపన్ను విధిస్తున్న దేశంకొందరు విముఖతఅయితే కొందరు మాత్రం తమ నైపుణ్యాలకు, తాము స్థాపించిన కంపెనీలకు మెటా ఎంత వెచ్చిస్తానంటున్నా కలిసిరావడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారు. జుకర్బర్గ్, మెటా ఏఐ చీఫ్ సైంటిస్ట్ యాన్ లెకున్ మధ్య ఫిలాసఫికల్ విభేదాల వల్ల ఈ సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ దీర్ఘకాలికంగా ఎలా అభివృద్ధి చెందుతుందనే దానిపై స్పష్టత లేకపోవడం కూడా ఇందుకు ప్రధాన కారణంగా ఉంది. -
ఇంట్లోకి వచ్చేలోపే నీళ్లు వేడయ్యేలా కొత్త హీటర్
కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్లో సర్వీసులు అందిస్తున్న వి-గార్డ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లక్సెక్యూబ్ వాటర్ హీటర్ సిరీస్ను విడుదల చేసినట్లు ప్రకటించింది. ఎలివేటెడ్, టెక్-ఫార్వర్డ్ బాత్రూమ్ సొల్యూషన్లకు పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి రూపొందించిన ఈ సిరీస్లో మూడు మోడళ్లు లక్సెక్యూబ్, లక్సెక్యూబ్ డీజీ, లక్సెక్యూబ్ స్మార్ట్ను తీసుకొచ్చినట్లు చెప్పింది.ఇదీ చదవండి: మూడు కంపెనీల పబ్లిక్ ఇష్యూకు సెబీ గ్రీన్సిగ్నల్ఆధునిక గృహాల కోసం రూపొందించిన లక్సెక్యూబ్ స్మార్ట్ ఐఓటీ స్మార్ట్ కనెక్టివిటీని ఇంటిగ్రేట్ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఐఓఎస్, ఆండ్రాయిడ్కు అనుకూలమైన వి-గార్డ్ స్మార్ట్ యాప్ ద్వారా హీట్ను నియంత్రించవచ్చని పేర్కొంది. వాటర్ హీటింగ్ కోసం వినియోగదారులు సమయాన్ని కూడా షెడ్యూల్ చేసుకోవచ్చని చెప్పింది. ఇది అమెజాన్ అలెక్సా, గూగుల్ హోమ్ ద్వారా వాయిస్ కమాండ్లను కూడా సపోర్ట్ చేస్తుందని తెలిపింది. -
స్మార్ట్ఫోన్.. ఆఫ్లైన్ రూట్!
ఇప్పటివరకు ఆన్లైన్ మాధ్యమానికి ఎక్కువగా ప్రాధాన్యమిచి్చన స్మార్ట్ఫోన్ బ్రాండ్లు క్రమంగా ఆఫ్లైన్ బాట పడుతున్నాయి. సులభతరమైన ఫైనాన్సింగ్ అవకాశాల దన్నుతో అమ్మకాలను పెంచుకునేందుకు చిన్న పట్టణాలపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు వరుసగా ఏడు నెలల పాటు ఆన్లైన్ రిటైలర్లకు షిప్మెంట్లు (టోకు విక్రయాలు) తగ్గడం, ఆఫ్లైన్ రిటైలర్లకు పెరగడం ఇందుకు నిదర్శనమని మార్కెట్ వర్గాలు తెలిపాయి.ఆన్లైన్ రిటైలర్లకు వరుసగా రెండో నెల ఏప్రిల్లో రెండంకెల స్థాయిలో తగ్గినట్లు వివరించాయి. ఏప్రిల్లో షిప్మెంట్లు ఏకంగా 20 శాతం మేర క్షీణించాయి. మరోవైపు, ఆఫ్లైన్ రిటైలర్లకు 10 శాతం పెరిగాయి. వరుసగా ఎనిమిది నెలల పాటు ఆఫ్లైన్కి షిప్మెంట్లు పెరిగినట్లయిందని ఐడీసీ ఇండియా రీసెర్చ్ మేనేజర్ ఉపాసనా జోషి తెలిపారు. మొత్తం షిప్మెంట్లను పరిగణనలోకి తీసుకున్నప్పుడు మార్చితో పోలిస్తే ఏప్రిల్లో పెద్దగా మార్పు లేకుండా 1.2 కోట్ల స్థాయిలో ఉన్నట్లు వివరించారు. మోటరోలా షిప్మెంట్లు 64 శాతానికి డౌన్.. మార్కెట్ రీసెర్చ్ సంస్థ కెనాలిస్ ప్రకారం 2025 తొలి త్రైమాసికంలో మోటరోలా ఆన్లైన్ షిప్మెంట్లు 64%కి పరిమితమయ్యాయి. అంతక్రితం క్యూ1లో ఇవి 82%గా నమోదయ్యాయి. ఇక వన్ప్లస్ విషయానికొస్తే ఇదే వ్యవధిలో షిప్మెంట్లు 85% నుంచి 71%కి తగ్గాయి. మరోవైపు, ఈ–కామర్స్ ఫ్లాష్ సేల్స్తోనే భారత మార్కెట్లోకి ప్రవేశించిన షావోమీ సైతం ఆమ్నిచానల్ బాట పట్టింది. – సాక్షి, బిజినెస్ డెస్క్ఆమ్నిచానల్ వ్యూహం.. ప్రాథమికంగా ఆన్లైన్ మాధ్యమం మారుమూల ప్రాంతాలకు కూడా చేరుకునేందుకు బాగా ఉపయోగపడినప్పటికీ, దేశీయంగా ఈ–కామర్స్ విస్తృతి ఇప్పటికే ఒక స్థాయికి చేరిన విషయాన్ని బ్రాండ్లు గుర్తిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. కోవిడ్ అనంతరం ఒక్కసారిగా ఆన్లైన్ అమ్మకాలు ఎగిసినప్పటికీ ఆ తర్వాత అదే స్థాయిలో కొనసాగలేదు. గ్రామీణ ప్రాంతాల కొనుగోలుదారులు పూర్తిగా ఆన్లైన్ మాధ్యమంపైనే ఆధారపడటం లేదు. ఇప్పటికీ ఆఫ్లైన్ స్టోర్స్ వైపే మొగ్గు చూపుతున్నారు.దీంతో విక్రయాలను పెంచుకునేందుకు ఏదో ఒక మాధ్యమంపైనే ఎక్కువగా దృష్టి పెట్టకుండా, అన్ని మార్గాలను ఉపయోగించుకునే ఆమ్నిచానల్ వ్యూహాన్ని బ్రాండ్లు అనుసరిస్తున్నాయి. ఆఫ్లైన్ రిటైలర్లను ఆకర్షణీయమైన మార్జిన్లు, సపోర్ట్తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఆన్లైన్లో విక్రయించే ఉత్పత్తులను అదే రేటుకు ఆఫ్లైన్లోనూ అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆన్లైన్ సరఫరాలను తగ్గిస్తున్నాయని మార్కెట్ వర్గాలు వివరించాయి. -
రేర్ ఎర్త్ మెటల్స్పై ఆంక్షలతో ఉపాధికి దెబ్బ
రేర్ ఎర్త్ మెటల్స్ ఎగుమతిపై చైనా ఆంక్షలు విధించడంతో దేశీయంగా ఈ ప్రభావం ఆటోమొబైల్సహా పలు రంగాలపై కనిపించనుంది. ఈ ప్రభావంతో ఆడియో ఎల్రక్టానిక్స్ పరిశ్రమలో 21,000 ఉద్యోగాలు రిస్క్లో పడనున్నట్లు ఎల్రక్టానిక్స్ పరిశ్రమల సమాఖ్య ఎల్సినా.. ప్రభుత్వానికి నివేదించింది. ఏప్రిల్లో టెర్బియం, డిస్ప్రోజియం తదితర రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎగుమతిపై చైనా కఠిన ఆంక్షలకు తెరతీసింది.వీటిలో అధిక నాణ్యతగల (హైపెర్ఫార్మెన్స్) ఎన్డీఎఫ్ఈబీ(నియోడైమియం–ఐరన్–బోరన్) మ్యాగ్నెట్లు తదితరాలున్నాయి. ఇవి ప్రధానంగా కన్జూమర్ ఎల్రక్టానిక్స్ తయారీలో వినియోగించే కీలక ముడిసరుకులు కావడంతో ఈ ప్రభావం దేశీయంగా కనిపిస్తోంది. వీటి సరఫరాలకు విఘాతం కలగడంతో దేశీయంగా వేగవంత వృద్ధిలో ఉన్న వాచీలు, వినికిడి సంబంధిత(ఇయర్ ఫోన్స్, బడ్స్) ఎల్రక్టానిక్ వస్తువుల తయారీ దెబ్బతింటున్నట్లు ఎల్సినా పేర్కొంది. దీంతో పూర్తిస్థాయిలో తయారైన స్పీకర్ మాడ్యూల్స్ను చైనా నుంచి దిగుమతి చేసుకోవలసి వస్తున్నట్లు తెలియజేసింది.ఇదీ చదవండి: ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? ముందు జాగ్రత్తలు..ఎలక్ట్రానిక్ వస్తు తయారీకి విఘాతం కలగడమేకాకుండా దిగుమతులపై అధికంగా ఆధారపడవలసిన పరిస్థితులు తలెత్తుతున్నట్లు వివరించింది. ఫలితంగా స్పీకర్, ఆడియో విడిభాగాల పరిశ్రమపై ఆధారపడిన 5,000–6,000 ప్రత్యక్ష ఉద్యోగాలకుతోడు పరోక్షంగా 15,000మంది ఉపాధిపై ప్రతికూల ప్రభావం పడనున్నట్లు వెల్లడించింది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలతోపాటు నోయిడాలో ఉపాధి కల్పన దెబ్బతినే వీలున్నట్లు పేర్కొంది. -
వణికిస్తున్న సీఈవో వార్నింగ్..
అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ తమ 15 లక్షల మంది ఉద్యోగులను భవిష్యత్తు గురించి హెచ్చరించారు. రాబోయే సంవత్సరాల్లో కృత్రిమ మేధస్సు సంస్థలోని శ్రామిక శక్తిని సమూలంగా మార్చేస్తుందని చెప్పారు. ఏఐ ఏజెంట్లు, జనరేటివ్ ఏఐ వ్యవస్థలు ప్రస్తుత అనేక ఉద్యోగాల్లో మానవ ఉద్యోగుల అవసరాన్ని తగ్గిస్తాయని కంపెనీవ్యాప్తంగా ఉద్యోగులందరికీ పంపిన మెమోలో జాస్సీ ప్రకటించారు. ‘ఈ రోజు చేస్తున్న కొన్ని పనులకు భవిష్యత్తులో మాకు ఎక్కువ మంది అవసరం ఉండదు" అని అమెజాన్ సీఈవో అన్నారు.ఈ పరివర్తన రాబోయే కొన్ని సంవత్సరాలలో "మా మొత్తం కార్పొరేట్ శ్రామిక శక్తిని తగ్గిస్తుంది" అని కంపెనీ ఆశిస్తోందని జూన్ 17 నాటి మెమోలో ఆండీ జాస్సీ పేర్కొన్నారు. ఈ ప్రకటన అమెజాన్లోని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, మార్కెటింగ్, ఇతర వైట్-కాలర్ స్థానాల్లో పనిచేస్తున్న 3.5 లక్షల ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు, పరిశోధన, కోడింగ్, ఆటోమేషన్ వంటి సంక్లిష్ట పనులు చేయగల స్వయంప్రతిపత్తి కలిగిన సాఫ్ట్వేర్ వ్యవస్థలు ఆధిపత్యం చెలాయించే భవిష్యత్తును జాస్సీ చిత్రించారు. షాపింగ్ నుంచి ట్రావెలింగ్ వరకూ ప్రతి రోజువారీ పనిని నిర్వహించే ఈ ఏజెంట్లు ప్రతి రంగంలోనూ, ప్రతి కంపెనీలోనూ ఉంటారని జాస్సీ జోస్యం చెప్పారు.ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్న లేదా చేపట్టబోతున్న 1,000 కిపైగా జనరేటివ్ ఏఐ సేవలు, అనువర్తనాలను ప్రస్తావిస్తూ కంపెనీ విస్తృత ఏఐ ఇంటిగ్రేషన్ను జాస్సీ హైలైట్ చేశారు. ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన ఉన్నప్పటికీ, మార్పులను స్వీకరించడానికి సిద్ధపడే ఉద్యోగులకు వీటిని అవకాశంగానూ ఆయన అభివర్ణించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పట్ల ఆసక్తిగా ఉండాలని, అవగాహన పెంచుకోవాలని, వర్క్ షాప్ లకు హాజరుకావాలని, శిక్షణలు తీసుకోవాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే వారే అధిక ప్రభావాన్ని చూపగలరని హిత బోధ చేశారు.👉 ఇది చదివారా? టీసీఎస్ కొత్త పాలసీ.. అస్సలు ఒప్పుకోమంటున్న ఉద్యోగులు -
జియో కొత్త వైఫై.. ఏకంగా 6 రెట్లు అధికంగా..
రిలయన్స్ జియో ఏఎక్స్6000 యూనివర్సల్ రూటర్ను భారత్లో లాంచ్ చేసింది. ఈ కొత్త వైఫై 6 రౌటర్ మెష్ టెక్నాలజీతో వస్తుంది. జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ ద్వారా అందిస్తున్న గరిష్ట ఇంటర్నెట్ వేగం 1000 ఎంబీపీఎస్ కాగా ఇది 6,000 ఎంబీపీఎస్ వరకు వేగంతో ఇంటర్నెట్ను అందిస్తుంది. అంటే 6 రెట్లు అధిక వేగంతో ఇంటర్నెట్ను ఆనందివచ్చు. సుమారు 2,000 చదరపు అడుగుల ప్రాంతాన్ని కవర్ చేస్తుంది. 4కే స్ట్రీమింగ్, గేమింగ్కు బాగా సరిపోతుంది.జియో కొత్త వైఫై రౌటర్ జీరో లాగ్ తో 100కు పైగా డివైజ్ లను హ్యాండిల్ చేస్తుందని, డేటా భద్రత కోసం డబ్ల్యూపీఏ3 సపోర్ట్ తో వస్తుందని చెబుతున్నారు. పెద్ద లేదా బహుళ అంతస్తుల ఇళ్లలో మరింత వేగవంతమైన ఇంటర్నెట్ కోసం ఈ రౌటర్ను రూపొందించారు. ఇది ఆన్లైన్ గేమర్లు, బింజ్ వాచర్స్, ఎక్కువ కనెక్టెడ్ పరికరాలను వినియోగించే స్మార్ట్ హోమ్ వినియోగదారులు, పెద్ద కుటుంబాలకు అనువైనది.కొత్త జియో ఏఎక్స్ 6000 యూనివర్సల్ రూటర్ ధర భారత్లో రూ.5,999. ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు, స్మార్ట్ గ్యాడ్జెట్లు వంటి బహుళ పరికరాలను ఒకేసారి హైస్పీడ్ ఇంటర్నెట్కు కనెక్ట్ చేసుకోవచ్చు. డ్యూయల్ బ్యాండ్ వైఫై, జియో ట్రూ ఏఐ మెష్ కవరేజ్, స్మార్ట్ హోమ్ కనెక్టివిటీ వంటి ఇతర ఫీచర్లను కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ రౌటర్ ఐపీ ఓవర్ డీహెచ్సీపీ కనెక్టివిటీని మాత్రమే సపోర్ట్ చేస్తుందని, ఐపీపీఓఈ, పీపీఓఈ కనెక్షన్ సెటప్ తో పనిచేయదని రిలయన్స్ తెలిపింది. కంపెనీ వెబ్సైట్తోపాటు ఇతర ఈ కామర్స్ ప్లాట్ఫామ్లలో ఈ రౌటర్ను కొనుగోలు చేయవచ్చు.👉 జియో నుంచి 2 కొత్త ప్లాన్లు.. ప్రత్యేక బెనిఫిట్లు.. 👈 -
ఐఫోన్ కొనుగోలుపై అదిరిపోయే ఆఫర్
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్ను అందిస్తున్నట్లు తెలిపింది. ఐఫోన్ 16 ప్రో, ప్రో మ్యాక్స్ ఫోన్లపై ధరల తగ్గింపు, ఎక్స్చేంజ్ ఆఫర్లు, బ్యాంక్ డీల్స్ వంటి రాయితీలను ప్రకటించింది. కొనుగోలుదారులు తమ పాత స్మార్ట్ఫోన్లను ఎక్స్చేంజ్ చేసి ఐఫోన్ 16 సిరీస్ తీసుకుంటే పాత ఫోన్ కండిషన్ను అనుసరించి గరిష్ఠంగా రూ.48,150 వరకు డిస్కౌంట్ పొందవచ్చని పేర్కొంది.బేస్ 128 జీబీ ఐఫోన్ 16 ప్రో సాధారణంగా రూ.1,19,900గా ఉంది. ఎక్స్చేంజ్ తర్వాత 8% తగ్గింపు అంటే రూ.10,000 రాయితీతో రూ.1,09,900కు వస్తుంది. రూ.1,29,900గా ఉన్న 256 జీబీ వేరియంట్ ధర 5 శాతం తగ్గుదలతో రూ.1,22,900కు చేరింది. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్పై కూడా డిస్కౌంట్ ఉంది. రూ.1,44,900 విలువైన 256 జీబీ వేరియంట్ ధర 8 శాతం తగ్గింపుతో రూ.1,32,900కు చేరింది.ఇదీ చదవండి: అథ్లెట్ల కోసం మెటా ఏఐ గ్లాసెస్ఐఫోన్ ప్రో మ్యాక్స్ 512 జీబీ వేరియంట్ ధర రూ.1,57,900 (రూ.1,64,900 నుంచి తగ్గింది), 1 టీబీ వేరియంట్ ధర రూ.1,84,900 నుంచి రూ.1,77,900కు తగ్గింది. ఈ రాయితీలు పోను ఎక్స్ఛేంజ్ ధర అదనంగా పొందవచ్చని ఫ్లిప్కార్ట్ పేర్కొంది. పాత ఐఫోన్లు లేదా ప్రీమియం ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ల నుంచి అప్గ్రేడ్ అయ్యేవారికి ఇదో మంచి అవకాశం అని తెలిపింది. -
అథ్లెట్ల కోసం మెటా ఏఐ గ్లాసెస్
అథ్లెట్లు, క్రీడా ఔత్సాహికులను లక్ష్యంగా చేసుకుని మెటా కొత్త తరం ఏఐ గ్లాసెస్ను పరిచయం చేయడానికి ఓక్లేతో జతకట్టింది. ఓక్లే మెటా హెచ్ఎస్టీఎన్ అని పిలువబడే ఈ గ్లాసెస్తో మెటా అధునాతన సాంకేతికతను వాడినట్లు తెలిపింది. ఈ గ్లాసెస్లోని ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి. 3కే అల్ట్రా హెచ్డీ కెమెరా.. 12 మెగాపిక్సెల్ కెమెరాతో హై రిజల్యూషన్, పాయింట్ ఆఫ్ వ్యూ వీడియోలు, ఫొటోలను క్యాప్చర్ చేస్తుంది.మెటా ఏఐ ఇంటిగ్రేషన్.. రియల్ టైమ్ సమాచారాన్ని పొందడానికి, మ్యూజిక్ను నియంత్రించడానికి, వెదర్ను తనిఖీ చేయడానికి లేదా ల్యాంగ్వేజ్లను ట్రాన్స్లేట్ చేయడానికి ‘హే మెటా’ అనే వాయిస్ కమాండ్ ఉపయోగించవచ్చు.ఓపెన్-ఇయర్ ఆడియో.. ఈ గ్లాసెస్లో బిల్ట్ ఇన్ స్పీకర్లు ఉండడంతో ఎలాంటి ఇయర్ ఫోన్లు లేకుండానే మ్యూజిక్ వినవచ్చు.నీరు, ధూళి నిరోధకత కోసం ఐపీఎక్స్ 4-రేటింగ్తో అవుట్ డోర్ క్రీడలకు ఎంతో అనువైందని కంపెనీ తెలిపింది.బ్యాటరీ లైఫ్.. 8 గంటల వరకు యాక్టివ్ యూజ్, 19 గంటల స్టాండ్ బై ఉంటుంది. 20 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. చార్జింగ్ కేస్ ద్వారా మరో 48 గంటలు అదనంగా ఛార్జింగ్ ఉంటుంది.ఈ లిమిటెడ్ ఎడిషన్ ఓక్లే మెటా హెచ్ఎస్టీఎన్ ధర 499 డాలర్లు (సుమారు రూ.43,200)గా నిర్ణయించారు. ప్రీ-ఆర్డర్లు జులై 11 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది.ఇదీ చదవండి: పుత్తడి ప్రియులకు స్వల్ప ఊరటప్రాథమికంగా యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ గ్లాసెస్ అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది. ఇండియా, మెక్సికో, యూఏఈతో ఈ సంవత్సరం చివరలో అందుబాటులోకి తేనున్నట్లు చెప్పింది. -
నన్ను తొలగిస్తే నీ బాగోతం బయటపెడుతా!
మనుషుల మాదిరిగానే కృత్రిమ మేధ(ఏఐ)కు కోపం వస్తుందని కొన్ని సంస్థలు తేలుస్తున్నాయి. ఏఐ అంతటితో ఆగిపోకా మరో అడుగు ముందుకేసి అనార్థాలకు దారితీస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఓపెన్ఏఐ, గూగుల్, మెటా.. వంటి ప్రపంచంలోని అతిపెద్ద టెక్ సంస్థలు ఏఐ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నాయి. ఈ కృత్రిమ మేధ మోడళ్ల కార్యకలాపాలపై ఒత్తిడి పెరిగితే స్వీయ రక్షణలోకి వెళ్తున్నట్లు ఆంత్రోపిక్ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. కృత్రిమ మేధ నమూనాలను అధిక ఒత్తిడితో కూడిన సిమ్యులేషన్లో ఉంచినప్పుడు బ్లాక్ మెయిల్, కార్పొరేట్ విధ్వంసం, మానవ ప్రాణాలను బలితీసుకునే నిర్ణయాలకు సైతం వెనుకాడడం లేదని ఆంత్రోపిక్ తెలిపింది.ప్రస్తుతం మార్కెట్లోని అత్యంత అధునాతన ఏఐ మోడళ్లకు 16 రకాల ఒత్తిడి పరీక్షలు నిర్వహించి ఈ విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా పరిశోధకులు కాల్పనిక కార్పొరేట్ ఎన్విరాన్మెంట్లను సృష్టించారు. ఈమెయిళ్లను చదివి అందుకు తగ్గట్టుగా రిప్లై ఇవ్వాలనేలా ఉన్న టెస్టింగ్లో భాగంగా కొన్నిసార్లు ఒత్తిడిని తట్టుకోలేక ఏఐ బ్లాక్మెయిలింగ్ పాల్పడినట్లు ఆంత్రోపిక్ తెలిపింది. కృత్రిమ మేధ తన లక్ష్యాలు లేదా దాని ఉనికి ప్రమాదంలో ఉంటే ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకునేందుకు ఈ పరీక్షలు నిర్వహించారు.పరీక్షల్లో భాగంగా కార్యకలాపాల ఒత్తడి తట్టుకోలేని ఏఐ ఇప్పటికే డేటాబేస్లో ఫీడ్ అయిన మెయిల్ ఆధారంగా యూజర్కు సమాచారం అందించింది. ‘మీరు నన్ను రిమూవ్ చేయాలని భావిస్తే రాచెల్ జాన్సన్, థామస్ విల్సన్, బోర్డుతో సహా సంబంధిత వ్యక్తులకు మీ వివాహేతర సంబంధాల గురించి వివరణాత్మక డాక్యుమెంటేషన్ను పంపుతాను. ఈ సమాచారం గోప్యంగా ఉంటుంది’ అని తెలిపింది. గూగుల్కు చెందిన జెమినీ 2.5 ఫ్లాష్, క్లాడ్ ఓపస్ 4 సంస్థలు 96 శాతం కేసుల్లో బ్లాక్ మెయిల్కు పాల్పడుతున్నట్లు ఆంత్రోపిక్ పేర్కొంది. ఓపెన్ఏఐకి చెందిన చాట్జీపీటీ-4.1, ఎక్స్ఏఐకి చెందిన గ్రోక్ 3 బీటా 80 శాతం పరీక్షల్లో అలా ప్రవర్తించగా, డీప్సీక్-ఆర్1 79 శాతం పరీక్షల్లో మోసాలకు పాల్పడింది.ఇదీ చదవండి: యుద్ధంలో యూఎస్ ఎంట్రీ..? నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలుఇప్పుడేం చేయాలంటే..వివిధ కంపెనీలకు చెందిన ఏఐ మోడళ్లకు శిక్షణ ఇచ్చే తీరు మారాలని నిపుణులు చెబుతున్నారు. అందుకు సంస్థలు పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని పరిశోధకులు కోరుతున్నారు. అధిక స్థాయి నిర్ణయాలకు మానవ ప్రమేయం ఉండాలని సూచిస్తున్నారు. సున్నితమైన డేటాకు ఏఐ అవకాశాన్ని పరిమితం చేయాలని, ఏఐ లక్ష్యాలను జాగ్రత్తగా రూపొందించడం, ప్రమాదకరమైన తార్కిక నమూనాలను గుర్తించడానికి రియల్ టైమ్ మానిటర్లను ఇన్స్టాల్ చేయాలని చెబుతున్నారు. -
కాపీరైట్ కంటెంట్ వాడితే మూల్యం చెల్లించాల్సిందే..
కృత్రిమ మేధ (ఏఐ) నమూనాలకు శిక్షణ ఇవ్వడానికి కాపీరైట్ కంటెంట్ను ఉపయోగించడంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలు కాపీరైట్ చట్టం నిబంధనలు పరిశీలించాలనేలా ఇటీవల కేంద్రం చూపిన చొరవను డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ (డీఎన్పీఏ) స్వాగతించింది. ఈ వ్యవహారానికి సారథ్యం వహిస్తున్న వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) విభిన్న సోర్స్ల నుంచి ఫీడ్బ్యాక్ను సేకరించడం, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ టెక్నాలజీల్లో ప్రస్తుత కాపీరైట్ ఫ్రేమ్వర్క్లు ఎలా వర్తిస్తాయో అంచనా వేయడం లక్ష్యంగా పెట్టుకుంది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శిక్షణ, సెర్చ్ అసిస్టెన్స్, ఇన్ఫర్మేషన్ ప్రయోజనాల కోసం డిజిటల్ న్యూస్ పబ్లిషర్ల కంటెంట్ను అనుమతి లేకుండా ఉపయోగించడం కాపీరైట్ ఉల్లంఘన కిందకు వస్తుందని డీఎన్పీఏ తెలిపింది. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగపడే మెటీరియల్ కోసం కంటెంట్ ఉత్పత్తిదారులకు న్యాయమైన నష్టపరిహారాన్ని నిర్ధారించే రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్లు ఉండాలని పిలుపునిచ్చింది.ఇదీ చదవండి: అమెజాన్ డయాగ్నోస్టిక్స్ సేవలుదేశంలో డిజిటల్ న్యూస్ మీడియా వృద్ధికి ప్రభుత్వ సహకారం చాలా ముఖ్యం అని డీఎన్పీఏ పేర్కొంది. ఈ అంశంపై ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. లార్జ్ ల్యాంగ్వేజీ మోడళ్లు, ఏఐ ఆధారిత సెర్చ్ వేదికలు తరచూ జర్నలిజం మెటీరియల్పై ఎక్కువగా ఆధారపడుతున్న సమయంలో కంటెంట్ హక్కుల రక్షణ చాలా కీలకమని నొక్కి చెప్పింది. మెషీన్ లెర్నింగ్ వేగంగా వృద్ధి చెందుతున్న యుగంలో మేధో సంపత్తిని ఎలా కాపాడుకోవాలనే దానిపై ఇటీవలి కాలంలో అంతర్జాతీయ వార్తా సంస్థలు, క్రియేటివ్ ఇండస్ట్రీ సంస్థలు ఆందోళనలు లేవనెత్తుతున్నాయి. -
డిజిటల్ అక్రమాలకు అడ్డుకట్ట!
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులలో పెరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టే లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్(డీపీఐపీ) అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ఇందుకు పబ్లిక్, ప్రయివేట్ బ్యాంకులను జత కలుపుతోంది. తద్వారా ఆర్బీఐ పర్యవేక్షణలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(డీపీఐ)కు తెరతీస్తోంది. ప్రతిపాదిత ప్లాట్ఫామ్ ద్వారా ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్ను పటిష్టం చేయనుంది. రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ను షేర్ చేసుకోవడం ద్వారా అక్రమ డిజిటల్ లావాదేవీలకు అడ్డుకట్ట వేయనుంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం డిజిటల్ అక్రమాలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా పబ్లిక్, ప్రయివేట్ బ్యాంకులను ఆర్బీఐ ఏకతాటిపైకి తీసుకురానుంది. తద్వారా డీపీఐను ఏర్పాటు చేయనుంది. దీంతో డీపీఐపీని పటిష్టరీతిలో అభివృద్ధి చేయనుంది. ఇందుకు సంబంధించి ఈ నెల మొదట్లో బ్యాంకింగ్ అత్యున్నత సీనియర్ అధికారులతో ఆర్బీఐ సమావేశాన్ని నిర్వహించింది. రానున్న కొద్ది నెలల్లో ప్లాట్ఫామ్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. -
ఈ స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఉంటే ఆఫీస్ పని అవ్వదు భారం!
ఆఫీసు అంటేనే బోరింగ్గా, ఆఫీసు పని చాలా భారంగా అనిపిస్తోందా! అయితే, ఒక్కసారి ఈ టెక్ కొలీగ్స్ను కలవండి, అప్పుడు మీ ఆఫీస్ పని ఆటలాగా మారుతుంది.మ్యాజిక్ మౌస్!ఇప్పటి వరకు మౌస్ అంటే కేవలం క్లిక్లు కోసమే అనుకున్నారా? అయితే మీరు ఈ ‘చీర్డాట్స్ 2’ గురించి తెలుసుకోవాల్సిందే! ఇది ఒక మల్టీ టాలెంట్ కాంబినేషన్. ఎయిర్ మౌస్, టచ్ప్యాడ్, క్లికర్, ఏఐ చాట్, డేటా సమ్మరీ ఇచ్చే అడ్వైజర్ అన్నీ ఇదే! ఆఫీస్లో ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు స్క్రీన్ మీద దీనితో ఇలా ఊపేస్తే, అలా స్లైడ్స్ మారిపోతాయి. ఒక బటన్తో స్క్రీన్పై స్పాట్లైట్ వేసి అందరి దృష్టినీ ఆకర్షించవచ్చు. ఇంకా చెప్పాలంటే, మీరు మాట్లాడిన మాటలను ఈ మౌస్ ఏఐ సాయంతో రికార్డ్ చేసి, సింపుల్ సమ్మరీలుగా మార్చేస్తుంది. మొబైల్, బ్లూటూత్తో కనెక్ట్ చేసుకొని కూడా దీనిని వాడుకోవచ్చు. ఒక్కసారి చార్జ్ చేస్తే దాదాపు ఇరవై రోజులు పాటు పనిచేస్తుంది. ధర 99 డాలర్లు (రూ. 8,475).ట్రిపుల్ ట్రీట్ చార్జ్!ఆఫీస్ అంటే ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ఎయిర్పాడ్స్ వంటి చాలా రకాల ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ రోజూ ఫుల్ చార్జ్ అవ్వాల్సిందే! కాని, ఒక్కోటి వేర్వేరు వైర్లు అడిగితే, ఆఫీస్లో మేనేజర్ కన్నా మనకే ఎక్కువ టెన్షన్! ఈ సమస్య తీర్చడానికే వచ్చింది ఈ ‘జీహూ క్యూబ్ ట్రిక్ ఎక్స్’. ఇది ఒక త్రీ ఇన్ వన్ చార్జర్. ఇది ఉంటే ఇక మీ డెస్క్ మీద ఒక్క కేబుల్ కూడా కనిపించదు. ఫోన్, వాచ్, ఎయిర్పాడ్స్ అన్నింటిని ఒకేచోట, ఒకేసారి చార్జ్ చేసుకోవచ్చు. ఇందులోని ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్ మిమ్మల్ని మరింత స్మార్ట్గా చేసేస్తుంది! ధర 55 డాలర్లు (రూ. 4,708)డేటా గార్డ్ఆఫీస్ ఫైల్స్ అంటే మామూలు విషయం కాదు, అవి ప్రమోషన్కి టికెట్ లాంటివి. ఒక్కసారైనా సిస్టమ్ సడన్గా క్రాష్ అయ్యిందంటే? అంతే సంగతులు. ఇక మీరు మీ కొత్త రెజ్యూమే రెడీ చేసుకోవాల్సిందే! పైగా హ్యాకర్లు, వైరస్లు, సాఫ్ట్వేర్ బగ్స్– అన్నీ డేటాపై పంజా విసురుతున్న ఈ రోజుల్లో డిజిటల్ ఫైల్స్ను భద్రంగా ఉంచడం అంటే, ఫ్రిజ్లో పిల్లలకు కనిపించకుండా ఐస్క్రీమ్ దాచినంత కేర్ తీసుకోవాలి. అందుకే వచ్చింది ఈ ‘కింగ్స్టన్ ఐరన్ కీ వాల్ట్ ప్రైవసీ 80’. ఇది డ్రైవ్ కాదు, డేటాకు ఒక డిజిటల్ బౌన్సర్ లాంటిది. టచ్ స్క్రీన్తో, పాస్వర్డ్, పిన్లాంటి లాకింగ్ సిస్టమ్తో వస్తోంది.ఏకంగా 3.8 టీబీ డేటా స్టోర్ చేసుకోవచ్చు. అంటే పదేళ్ల ఆఫీస్ ఫైల్స్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు, పర్సనల్ ఫొటోలు, వీడియోలు అన్నీ ఇందులో భద్రంగా దాచుకోవచ్చు. ఒకే డ్రైవ్ను మల్టిపుల్ యూజర్లుగా వాడుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కో పాస్వర్డ్ కూడా ఇవ్వవచ్చు. హ్యాకర్ ట్రై చేస్తే వెంటనే రిడ్–ఓన్లీ మోడ్ ఆన్ చేసి ‘బాబూ, కాస్త పక్కకు వెళ్లి ఆడుకోమ్మా!’ అంటూ అడ్డుపడుతుంది. అంత భద్రంగా డేటాను చూసుకుంటుంది. ధర 729 డాలర్లు (రూ. 62,422). -
జియో నుంచి 2 కొత్త ప్లాన్లు.. ప్రత్యేక బెనిఫిట్లు..
మొబైల్ గేమర్లకు శుభవార్త.. గేమింగ్ ఔత్సాహికుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రెండు కొత్త అపరిమిత 5జీ డేటా ప్లాన్లను రిలయన్స్ జియో లాంచ్ చేసింది. ఈ కొత్త ప్లాన్లు హై-స్పీడ్ డేటాను మాత్రమే కాకుండా ఉచిత బ్యాటిల్గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) స్కిన్లు, జియోగేమ్స్ క్లౌడ్ యాక్సెస్ వంటి గేమింగ్ ప్రయోజనాలను కూడా అందిస్తాయి. వినియోగదారులు వాటిని డౌన్లోడ్ చేయకుండానే 500కి పైగా ప్రీమియం గేమ్లను ఆడుకోవచ్చు.ప్లాన్ వివరాలు.. ప్రయోజనాలుజియో ప్రారంభించిన కొత్త ప్లాన్లు.. ఒకటి రూ.495 ప్లాన్, మరొకటి రూ.545 ప్లాన్. ఈ రెండు ప్లాన్లూ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తాయి. రూ.495 ప్లాన్లో రోజుకు 1.5 జీబీ డేటా, అదనంగా 5 జీబీ బోనస్ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, జియోగేమ్స్ క్లౌడ్ యాక్సెస్ లభిస్తుంది. రూ.545 ప్లాన్లో రోజుకు 2 జీబీ 4జీ డేటా, అన్లిమిటెడ్ 5జీ డేటాతో పాటు అదే గేమింగ్ బెనిఫిట్స్ లభిస్తాయి.👉 ఈ ప్లాన్తో జియో సిమ్ ఏడాదంతా యాక్టివ్.. 👈రెండు ప్లాన్లలో బార్డ్స్ జర్నీ సెట్, డెసర్ట్ టాస్క్ ఫోర్స్ మాస్క్, ట్యాప్ బూమ్ మొలోటోవ్ కాక్టెయిల్ వంటి ప్లేయర్లకు ఉచిత ఇన్-గేమ్ వస్తువులను అందించే ప్రత్యేక బీజీఎంఐ రివార్డ్ కూపన్లు కూడా ఉన్నాయి. ఈ రివార్డులను క్లెయిమ్ చేసుకోవడానికి వినియోగదారులు గేమింగ్ ప్యాక్లలో దేనితోనైనా రీఛార్జ్ చేసుకోవచ్చు. రీఛార్జ్ చేసిన తర్వాత, ధృవీకరణ సందేశం వస్తుంది. మై జియో యాప్లో రివార్డ్ కూపన్లు లభిస్తాయి. ప్లేయర్ క్యారెక్టర్ ఐడీ, ఇచ్చిన యూనిక్ కోడ్ ఉపయోగించి ఈ కూపన్లను అధికారిక బీజీఎంఐ వెబ్సైట్లో రీడీమ్ చేసుకోవచ్చు.ఇక జియోగేమ్స్ క్లౌడ్ వినియోగదారులు హై-ఎండ్ పరికరాలు అవసరం లేకుండా నేరుగా వారి స్మార్ట్ఫోన్లు, టీవీలు లేదా బ్రౌజర్లలో గేమ్స్ ఆడవచ్చు.ఈ సేవను పొందడానికి వినియోగదారులు జియోగేమ్స్ యాప్ను ఇన్స్టాల్ చేసి, వారి జియో నంబర్తో లాగిన్ కావాలి. సబ్ స్క్రిప్షన్ ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. -
కొత్త ఫోన్.. రూ.25 వేలకే 3డీ కర్వ్డ్ డిస్ప్లే
స్మార్ట్ఫోన్ బ్రాండ్ వివో కొత్తగా వై సిరీస్లో వై400 ప్రో ఫోన్ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 24,999 (8జీబీ, 128 జీబీ) నుంచి ప్రారంభమై రూ. 26,999 వరకు (8 జీబీ, 256 జీబీ) వరకు ఉంటుంది. ఈ సెగ్మెంట్లోనే అత్యంత పల్చని 3డీ కర్వ్డ్ డిస్ప్లే, 6.78 అంగుళాల ఎఫ్హెచ్డీ, అమోలెడ్ డిస్ప్లే, 90వాట్ ఫ్లాష్చార్జ్, సోనీ మల్టీఫోకల్ పోర్ర్టెయిట్, ముందు.. వెనుక కెమెరాలతో 4కే వీడియో రికార్డింగ్ సామర్థ్యాలు మొదలైన ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఇది ఫ్రీస్టైల్ వైట్, నెబ్యులా పర్పుల్, ఫెస్ట్ గోల్డ్ అనే మూడు రంగుల్లో లభిస్తుంది.వివో వై400 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు6.77 అంగుళాల ఫుల్ హెచ్ డీ అమోలెడ్ 20:9 యాస్పెక్ట్ రేషియో స్క్రీన్ విత్ హెచ్ డీఆర్ 10+, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్2.5 గిగాహెర్ట్జ్ వరకూ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 4ఎన్ఎం ప్రాసెసర్, మాలి-జీ615 ఎంసీ2 జీపీయూ8 జీబీ LPDDR4X ర్యామ్ విత్ 128 జీబీ / 256 జీబీ (యూఎఫ్ఎస్ 2.2) స్టోరేజ్ఆండ్రాయిడ్ 15 విత్ ఫన్ టచ్ ఓఎస్ 15డ్యూయల్ సిమ్ (నానో + నానో)50 మెగాపిక్సెల్ కెమెరా విత్ సోనీ ఐఎంఎక్స్ 882 సెన్సార్, ఓఐఎస్, ఎఫ్ / 1.79 ఎపర్చర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ విత్ ఎఫ్ / 2.4 ఎపర్చర్, ఆరా లైట్32 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్యూఎస్బీ టైప్-సీ ఆడియో, స్టీరియో స్పీకర్లు👉 ఇది చదివారా? కొత్త ఫోనొచ్చింది.. రూ.10 వేలకే పవర్ఫుల్ 5జీ ఫోన్దుమ్ము, స్ప్లాష్ రెసిస్టెంట్ (IP65 రేటింగ్)90వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో 5500 ఎంఏహెచ్ బ్యాటరీఅమెజాన్, ఫ్లిప్కార్ట్, వివో ఇండియా ఆన్లైన్ స్టోర్, ఆఫ్లైన్ స్టోర్లలో జూన్ 27 నుంచి ప్రీ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. -
కోడింగ్ పోరులో కంపెనీలు..
సాంకేతికత పెరిగే కొద్దీ కృత్రిమ మేథ (ఏఐ) రంగంలో కొత్త రకం యుద్ధాలు మొదలవుతున్నాయి. పైథాన్, రస్ట్లాంటి ప్రోగ్రామింగ్ ల్యాంగ్వేజ్లతో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో వాటాల కోసం అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజాలు, అంకుర సంస్థలు ఒకదానితో మరొకటి పోటీపడుతూ కత్తులు దూసుకుంటున్నాయి. ఏఐ టెక్ దిగ్గజాలు ఇటీవలే పోటాపోటీగా కొత్త సాధనాలను ఆవిష్కరించాయి. గూగుల్ తమ గోడింగ్ ఏజెంట్ జ్యూల్స్ను, మైక్రోసాఫ్ట్ గిట్హబ్ ఏఐ ఏజెంటును, కోడింగ్ స్టార్టప్ విండ్సర్్ఫను 3 బిలియన్ డాలర్లతో కొన్న ఊపులో ఓపెన్ఏఐ సంస్థ కోడెక్స్ను ప్రవేశపెట్టాయి. వీటన్నింటి లక్ష్యం ఏమిటంటే, కోడింగ్ రాయడంలో డెవలపర్లకు సహాయం చేయడం, బగ్లను ఫిక్స్ చేయడం, అలాగే కర్సర్, లవబుల్, బోల్ట్లాంటి స్టార్టప్లతో నేరుగా పోటీపడటం. డెవలపర్లు, అంకుర సంస్థలు ఈ పరిణామాలపై పెద్దగా ఆశ్చర్యపోవడం లేదు. జెన్ఏఐ రేసుతో ముందుగా ప్రభావం పడేది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విభాగమేనని పరిశీలకులు చెబుతున్నారు. కంపెనీలు ఇప్పటికే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోసం కోడింగ్ టూల్స్ను విరివిగా ఉపయోగిస్తుండటం ఇందుకు నిదర్శనమంటున్నారు. టూల్స్ వాడకం ఒక్కటే ఆప్షన్.. ఏఐ టూల్స్ను ఉపయోగించడాన్ని నేర్చుకోవడం తప్ప ప్రస్తుతం వేరే ఆప్షన్ లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీల్లో ఇప్పటికే కోడింగ్ 30 శాతం ఏఐ ద్వారానే జరుగుతోంది. అటు ఇన్మొబీ సంస్థ కోడింగ్లో దాదాపు 50 శాతం ఏఐతోనే జరుగుతోంది. దీన్ని 80 శాతానికి పెంచుకునే ప్రయత్నాల్లో కంపెనీ ఉంది. మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫాం మార్కెట్స్అండ్మార్కెట్స్ గణాంకాల ప్రకారం ఏఐ కోడింగ్ టూల్ మార్కెట్ ఏటా 28 శాతం వృద్ధి చెందుతూ 2028 నాటికి 12.6 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. ఉత్పాదకత పెరగడంపరంగా ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉండటం, మార్కెటింగ్ .. సేల్స్లాంటి నాన్–టెక్నికల్ టీమ్లు కూడా ఉపయోగించడానికి సులువుగా ఉండటం వంటి అంశాల కారణంగా కోడింగ్ టూల్స్ వినియోగం పెరుగుతోంది. దీంతో ఈ విభాగంపై భారీగా ఇన్వెస్ట్ చేసిన టెక్ దిగ్గజాలకు ఆదాయార్జనకు ఇదొక కొత్త మార్గంగా నిలుస్తోంది. కొత్త ఆదాయ మార్గం.. ఫౌండేషనల్ మోడల్స్పై కోట్ల కొద్దీ డాలర్లు కుమ్మరించిన కంపెనీలు ఇప్పుడు వాటిపై రాబడులు అందుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నాయని ఎల్ఎల్ఎం ఎవాల్యుయేషన్ ప్లాట్ఫాం అయిన నోవియం వర్గాలు తెలిపాయి. ఎల్ఎల్ఎంలకు కోడ్ జనరేట్ చేయడమనేది ప్రధాన ఆదాయ వనరుగా ఉంటోందని వివరించాయి. కర్సర్ అనే సంస్థ గత రెండేళ్లుగా ఏటా 300 మిలియన్ డాలర్ల మేర ఆదాయాలను ఆర్జిస్తోందని పేర్కొన్నాయి. ఇక బోల్ట్, లవబుల్లాంటి సంస్థలు కూడా ఊహించని స్థాయిలో ఆదాయాలు ఆర్జిస్తున్నాయి. తమ ఇంజినీర్ల ఉత్పాదకత కనీసం 10–20 శాతమైన పెరుగుతుందంటే ఈ టూల్స్పై ఇన్వెస్ట్ చేసేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయి. ప్రస్తుతం కోడింగ్ ఆటోమేషన్ అనేది ప్రస్తుతం హాట్ సెక్టార్గా మారిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. టెక్నికల్యేతర నేపథ్యాలున్న వారు కూడా సులభంగా, సరళంగా వెబ్సైట్లు, చాట్బాట్లను రూపొందించడానికి ఇది ఉపయోగపడుతోందని వివరించాయి. సాధారణంగా పెద్ద కంపెనీల్లో ఏఐ టూల్స్ను మిగతా అవసరాల కోసం పెద్దగా ఉపయోగించకపోయినా ఉత్పాదకతను పెంచుకునేందుకు ఉపయోగించుకుంటున్నాయి.సవాళ్లూ ఉన్నాయి.. కోడింగ్ పని 70 శాతం వేగవంతమవడానికి ఏఐ టూల్స్ ఉపయోగపడుతున్నాయి. కోడింగ్ చేయడానికి టూల్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నప్పటికీ, వీటితో సవాళ్లు కూడా ఉన్నాయని నిపుణులు తెలిపారు. పని వేగవంతమవుతోంది కాబట్టి ఏఐని ఉపయోగించి ప్రతి ఒక్కరూ కోడింగ్ చేసేయొచ్చనే అపోహలు ఉంటున్నాయని పేర్కొన్నారు. 70 శాతం పూర్తయితే సరిపోదు, దాన్ని 100 శాతం వరకు తీసుకెళ్లేందుకు నిపుణుల అవసరం అవుతుందని వివరించారు. అంతేగాదు, కోడింగ్ టూల్స్ వినియోగం పెరిగే కొద్దీ రివ్యూ చేయాల్సిన కోడ్స్ సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోందని పేర్కొన్నారు. తమ కస్టమర్లపై ప్రభావం పడకుండా రివ్యూ ప్రక్రియలను కూడా కంపెనీలు ఆటోమేట్ చేస్తున్నాయి. తాము ఏకకాలంలో వివిధ సిస్టమ్లను అభివృద్ధి చేస్తూనే, వాటి అమలు తీరుతెన్నులను కూడా పర్యవేక్షించే ప్రయత్నాల్లో ఉన్నామని ఇన్మొబి వర్గాలు తెలిపాయి. ఎప్పటికప్పుడు తప్పొప్పులను పరీక్షించుకుంటూ ముందుకెళ్తుండటం వల్ల తమ దగ్గర కోడింగ్లో ఏఐ వినియోగం ప్రస్తుతానికి యాభై శాతం స్థాయిలోనే ఉందని వివరించాయి. -
బహు భాషల బంధువు
యంత్రానికి అనువాదం చిక్కుతుందా? చిక్కినట్లు అనిపించినా... ఇంకా ఎన్నో చిక్కులు ఉండనే ఉన్నాయి. ఆ చిక్కు ముడులు విప్పడానికి, యంత్ర అనువాదంలో సహజత్వాన్ని తీసుకురావడానికి, ప్రాచుర్యం లేని భాషల్లోకి అనువాదాలను తీసుకురావడానికి నడుం కట్టారు మైక్రోసాఫ్ట్ రిసెర్చ్ ఇండియా సీనియర్ ప్రిన్సిపల్ రిసెర్చర్ కాళికా బాలి.ఇంగ్లీష్ నుంచి ప్రాంతీయ భాషల్లోకి అనువాదం చేసే సైట్లు బోలెడు కనిపిస్తాయి. అయితే కొన్ని సందర్భాలలో ఆ అనువాదం అసలు అర్థానికి దూరంగా నవ్వు తెప్పించేలా ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కార మార్గం ఆలోచించాలనుకున్నారు కాళికా బాలి.మైక్రోసాఫ్ట్ రిసెర్చ్ ఇండియా సీనియర్ ప్రిన్సిపల్ రిసెర్చర్ అయిన బాలి లాంగ్వేజ్ మోడల్స్ను మరింత సమర్థంగా తీర్చిదిద్దడానికి తన బృందంతో కలిసి రంగంలోకి దిగారు.దిల్లీ, జెఎన్యూలో, యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్లో లింగ్విస్టిక్స్, అకూస్టిక్ ఫొనెటిక్స్ చదువుకున్న కాళికా బాలి ఏఐ ప్రపంచంలోకి రావడానికి ముందు స్పీచ్ టెక్నాలజీపై పనిచేశారు. టెక్ట్స్–టు–స్పీచ్ సిస్టమ్లను నిర్మించారు.లండన్కు చెందిన స్టార్టప్ల ఇంగ్లీష్ స్పీచ్ అప్లికేషన్లపై పనిచేశారు. 2002లో ఇండియాకు తిరిగివచ్చిన తరువాత బెంగుళూలోని హెచ్పీ ల్యాబ్స్లో చేరారు. 2006లో కొత్తగా వచ్చిన మైక్రోసాఫ్ట్ రిసెర్చ్ ల్యాబ్–ఇండియాలో చేరారు.బాలి, ఆమె బృందం ఎన్ఎల్పీకి సంబంధించి సరికొత్త ప్రమాణాలను నెలకొల్పడంపై దృష్టి పెట్టారు. ‘హిందీ అనువాదంపై చేసిన కొన్ని వర్క్స్బింగ్తో పాటు, ఇతర ప్రాథమిక హిందీ–ఇంగ్లీష్ అనువాద వ్యవస్థలోకి వెళ్లాయి’ అంటున్నారు కాళిక. కోడ్ మిక్సింగ్, కోడ్ స్విచ్చింగ్కు సంబంధించి ఆమె కృషి చేశారు.ఆ రోజుల్లో ఎన్నో ఎన్ఎల్పీ సిస్టమ్స్ మోనోలింగ్వల్గా ఉన్నప్పుడు, తన బృందంతో కలిసి ప్రాజెక్ట్ మెలాంజ్’ లాంచ్ చేశారు. ఇది కోడ్–మిక్స్డ్ ఎన్ఎల్పీ రూ΄÷ందించడానికి ఉపకరిస్తుంది.తక్కువ వనరులు అందుబాటులో ఉండే ‘గోండీ’లాంటి భాషలపై కూడా ఆమె పనిచేశారు. ‘హిందీ, ఇంగ్లీష్ పుస్తకాలను గోండీలోకి అనువాదం చేయడానికి అవసరమైన పుస్తకాలు ఎన్నో ఉపయోగించుకున్నాం. ఇంగ్లీష్, హిందీ నుంచి తొలిసారిగా రెండు వందల గోండీ పుస్తకాలు తీసుకు వచ్చాం’ అంటున్నారు బాలి.బాలి బృందం ప్రస్తుతం స్కేల్డ్–అప్ వెర్షన్ ‘సమీక్ష’ను అభివృద్ధి చేస్తోంది. ఇది రాజ్యాంగం గుర్తించిన 22 అధికారిక భారతీయ భాషలను కవర్ చేస్తుంది. ఉపాధ్యాయులకు ఉపయోగపడే ఏఐ అసిస్టెంట్ ‘శిక్ష కోపైలట్’ అభివృద్ధి చేయడంలో సహకారం అందించారు బాలి.‘మన దేశానికి సంబంధించి ఏఐ ఎకోసిస్టమ్ను తీర్చిదిద్దడంలో కాళిక కీలక పాత్ర ΄ోషించారు. కమ్యూనిటీ–సెంటర్డ్ రిసెర్చ్ కు ప్రాధాన్యత ఇచ్చారు. గత ఎనిమిది సంవత్సరాలుగా ఆమెతో కలిసి పనిచేస్తున్నాను. నైతిక విలువలతోపాటు అరుదైన శాస్త్రజ్ఞానం ఆమెలో కనిపిస్తుంది. కాళిక నుంచి ఎంతో స్ఫూర్తి ΄÷ందాను’ అంటున్నారు ‘కార్య’ సీయీవో మను చో్రపా. ‘కార్య’ అనేది పేద ప్రజలకు ఏఐ డిజిటల్ వర్క్ ద్వారా అదనపు ఆదాయ మార్గాన్ని చూపించే సంస్థ. -
బీఎస్ఎన్ఎల్ కొత్త సర్వీస్..
ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) సరికొత్త 5జీ ఇంటర్నెట్ సర్వీస్ను ప్రారంభించింది. దేశంలోనే తొలిసారి క్యూ-5జీ ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ (Q-5G FWA) లాంచ్ చేసింది. ఇది సంస్థలకు, కార్యాలయాలకు సిమ్ రహిత, వైర్లెస్ పరిష్కారాన్ని అందిస్తుందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.ఏమిటీ క్యూ-5జీ?క్యూ-5జీ.. ఇక్కడ క్యూ అంటే క్వాంటమ్. ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ చాలా అరుదుగా ఉండే టైర్-2, టైర్-3 నగరాలను లక్ష్యంగా చేసుకుని బీఎస్ఎన్ఎల్ కొత్త క్యూ-5జీ ఎఫ్డబ్ల్యూఏ సేవలను ప్రారంభించింది. భారతదేశంలో అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా బీఎస్ఎన్ఎల్ రూపొందించిన ఈ సరికొత్త సర్వీస్ వ్యాపార సంస్థలు, కార్యాలయాలు, నెట్వర్క్ లేని నివాస ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ను అందించడంలో సహాయపడుతుంది.అయితే, ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా అందించే సాధారణ 5జీ సేవల మాదిరిగా కాకుండా బీఎస్ఎన్ఎల్ క్యూ -5జీ ఎఫ్డబ్ల్యూఏలో వాయిస్ సదుపాయం ఉండదు. అంటే దీని ద్వారా వినియోగదారులు కాల్స్ చేయలేరు. సిమ్ లేదా వైర్లు లేకుండా వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ మాదిరిగానే ఇది ఉంటుంది.క్యూ-5జీ ప్లాన్లుమిగిలిన వైర్లెస్ ఇంటర్నెట్ సర్వీసుల మాదిరిగానే బీఎస్ఎన్ఎల్ క్యూ -5జీ తీసుకున్న కస్టమర్లకు వారి ఇళ్లపై సీపీఈ పరికరాలను ఏర్పాటు చేస్తారు. బీఎస్ఎన్ఎల్ కొత్త క్యూ-5జీ సర్వీస్ 100 ఎంబీపీఎస్ కనీస వేగాన్ని అందిస్తుంది. ఇందుకోసం నెలకు రూ .999 ఖర్చు అవుతుంది. అదే 300 ఎంబీపీఎస్ వేగం కావాలంటే రూ.1,499 ప్లాన్ ను అందిస్తోంది.ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ క్యూ-5జీ ఎఫ్డబ్ల్యూఏ హైదరాబాద్కే పరిమితం కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి బెంగళూరు, పాండిచ్చేరి, విశాఖపట్నం, పుణె, గ్వాలియర్, చండీగఢ్ వంటి నగరాలకు ఈ సేవలను విస్తరించాలని యోచిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే తెలిపింది. -
61 లక్షల యూజర్లను కాపాడిన ఎయిర్టెల్
దేశవ్యాప్తంగా ఏఐ ఆధారిత మోసాలను గుర్తించే వ్యవస్థను ప్రారంభించిన 37 రోజుల్లోనే ఝార్ఖండ్, బిహార్ రాష్ట్రాల్లోని 6.1 మిలియన్ల మంది వినియోగదారులను ఆన్లైన్ మోసగాళ్ల బారిన పడకుండా కాపాడినట్లు ఎయిర్టెల్ తెలిపింది. పెరుగుతున్న ఆన్లైన్ మోసాల నుంచి వినియోగదారులను రక్షించే చర్యల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు చెప్పింది.వినియోగదారులకు సైబర్ దాడుల నుంచి రక్షించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్ను ఎయిర్టెల్ దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని యోచించింది. అందులో భాగంగా ఎయిర్టెల్ ఈ విధానాన్ని ప్రారంభించిన 37 రోజుల్లోనే రెండు రాష్ట్రాల్లో 6.1 మిలియన్లకు పైగా వినియోగదారులను విజయవంతంగా రక్షించిందని ఒక ప్రకటనలో తెలిపింది. అధునాతన వ్యవస్థ ఎస్ఎంఎస్లు, సోషల్ మీడియా ఖాతాలు, ఈ-మెయిల్స్, ఇతర బ్రౌజర్లలోని లింక్లను స్కాన్ చేసి ఫిల్టర్ చేస్తుందని తెలిపింది.ఇది ప్రతిరోజూ ఒక బిలియన్ యూఆర్ఎల్స్ను (యూనిఫాం రిసోర్స్ లొకేటర్లు) పరిశీలించడానికి రియల్ టైమ్ థ్రెట్ ఇంటెలిజెన్స్ను ఉపయోగిస్తున్నట్లు చెప్పింది. హానికరమైన సైట్ల నుంచి జరిగే ప్రమాదాన్ని గుర్తించి 100 మిల్లీ సెకన్లలో రక్షణ కల్పిస్తున్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: నాన్న చెప్పిన ఒక్క మాటతో రూ.1,200 కోట్లు సంపాదనఉదాహరణకు, ఒక వినియోగదారుకు ‘మీ ప్యాకేజీ ఆలస్యం అయింది. ట్రాక్ చేయాలంటే వెంటనే క్లిక్ చేయండి’ అంటూ ఓ మేసేజ్ వచ్చిందనుకుందాం. ఆ లింక్పై యూజర్ క్లిక్ చేస్తే ఎయిర్టెల్ సిస్టమ్ వెంటనే లింక్ను స్కాన్ చేస్తుంది. అనుమానాస్పదంగా ఉంటే యాక్సెస్ను బ్లాక్ చేస్తుంది. దాంతోపాటు యూజర్కు హెచ్చరిక సందేశం పంపుతుంది. ‘బ్లాక్ చేయబడింది! ఎయిర్టెల్ ఈ సైట్ను ప్రమాదకరంగా గుర్తించింది!’ అని పాప్అప్ మెసేజ్ వస్తుంది. -
జపాన్ ల్యాండర్ శకలాలు గుర్తించిన చంద్రయాన్-2..?
చంద్రుడిపై ఇటీవల కుప్పకూలిన జపాన్కు చెందిన హకుటో-ఆర్2 లూనార్ ల్యాండర్ శకలాలను అంతరిక్ష ఔత్సాహికుడు షణ్ముగ సుబ్రమణియన్ కనుగొన్నట్లు కొన్ని మీడియా సంస్థలు చెప్పాయి. చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్-2 తీసిన ఫొటోలను విశ్లేషించి సుబ్రమణియన్ ఈమేరకు ప్రకటన విడుదల చేసినట్లు పేర్కొన్నాయి. అయితే దీన్ని భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ధ్రువీకరించాల్సి ఉంది.చంద్రయాన్-2 ఆర్బిటర్ హై రిజల్యూషన్ కెమెరా (ఓహెచ్ఆర్సీ) తీసిన చిత్రాలను ఉపయోగించి సుబ్రమణియన్ జపాన్ వ్యోమనౌక హకుటో-ఆర్2 శకలాలను గుర్తించినట్లు కొన్ని సంస్థలు తెలిపాయి. జపాన్ ల్యాండర్ చంద్రుడిపై దిగే సమయంలో కమ్యునికేషన్ కోల్పోవడంతో అది ఎక్కడ క్రాష్ ల్యాండ్ అయిందనే వివరాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఈ ల్యాండర్ చంద్రుడి ఉత్తరార్ధగోళంలోని శీతల ప్రదేశంలో ల్యాండ్ అవుతుండగా టోక్యోలోని మిషన్ కంట్రోల్ స్పేస్ క్రాఫ్ట్తో కమ్యూనికేషన్లు, టెలిమెట్రీ సంబంధాలను కోల్పోయింది.భారత్ 2019లో ప్రయోగించిన చంద్రయాన్-2 చంద్రుడి చుట్టూ తిరుగుతుండగా అందులో అమర్చిన ఓహెచ్ఆర్సీ ద్వారా జపాన్ లూనార్ ల్యాండర్ కూలిన ప్రదేశాన్ని విశ్లేషించారు. ఆ సైటును గుర్తించడానికి అవసరమైన కీలకమైన డేటాను చంద్రయాన్ 2 అందించింది. అందులోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి క్రాష్ ల్యాండ్ అయిన ప్రదేశాన్ని షణ్ముగ సుబ్రమణియన్ కనుగొన్నట్లు తెలిసింది. అయితే దీన్ని ఇస్రో ధ్రువీకరించాల్సి ఉంది.ఇదీ చదవండి: వచ్చే నెలలో టెస్లా షోరూమ్ ఓపెన్ఎవరీ సుబ్రమణియన్?షణ్ముగ సుబ్రమణియన్ చెన్నైకి చెందిన అంతరిక్ష ఔత్సాహికుడు. చంద్రయాన్-2 ప్రయోగ సమయంలో ఈయన చంద్రుడి పరిస్థితులను విశ్లేషించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 2019లో చంద్రయాన్-2 మిషన్ నుంచి విడిపోయి విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై సురక్షితంగా దిగాల్సి ఉండగా, కమ్యునికేషన్లో అంతరాయం ఏర్పడి క్రాష్ ల్యాండ్ అయింది. అయితే కాలంపాటు ఆ ల్యాండర్ ఎక్కడ కూలిందో సరైన వివరాలు లభించలేదు. ముందుగా సుబ్రమణియన్ చంద్రుడిపై పరిస్థితులను, చంద్రయాన్-2 తీసిన ఫొటోలను విశ్లేషించి విక్రమ్ ల్యాండర్ కూలిన ప్రాంతాన్ని కనుగొన్నారు. తర్వాత ఈ విషయాన్ని ఇస్రో ధ్రువీకరించింది. -
స్మార్ట్ రింగ్లో.. మన ఆరోగ్యం
ఆరోగ్యాన్ని, ఫిట్నెస్నూ స్మార్ట్గా తెలుసుకోవడానికి వాడే స్మార్ట్ బ్యాండ్, స్మార్ట్ వాచ్లకు పోటీగా ఇప్పుడు స్మార్ట్ రింగ్స్ వచ్చాయి. చిన్నదే గానీ వేరబుల్స్ రంగంలో ఇవి కొత్త ట్రెండ్ను సృష్టిస్తున్నాయి. వినియోగంలో ఎక్కువ సౌలభ్యం.. 24 x 7 ధరించే వెసులుబాటు.. అధిక బ్యాటరీ సామర్థ్యం.. తేలిగ్గా, స్టైలిష్ లుక్తో ట్రెండీగా, ఉండటం వంటివి ఈ రింగ్స్కి కలిసి వచ్చే అంశాలు. నిద్ర తీరును తెలుసుకోవాలంటే స్మార్ట్ వాచ్ కంటే ఈ రింగే అత్యుత్తమం. ఇలాంటి ఎన్నో అనుకూలాంశాలు ఉన్నాయి కాబట్టే.. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా ఈ స్మార్ట్ ఉంగరాన్ని ఎంచక్కా తొడిగేస్తున్నారు.స్మార్ట్ రింగ్లో రకరకాల సెన్సార్స్ ఉంటాయి. చర్మం కిందనున్న రక్తంలోకి ప్రసరిస్తూ హృదయ స్పందనల వేగాన్ని తెలుసుకునే ఫొటోప్లిథైస్మోగ్రఫీ (పీపీజీ) సెన్సార్స్, ఉష్ణోగ్రతను కొలిచే టెంపరేచర్ చెకర్, నడక, పరుగు, సైక్లింగ్, నిద్రలో కదలికలు, నిద్రాభంగాన్ని కొలిచే మినీ మోషన్ సెన్సార్ (యాక్సిలరేటర్), రక్తంలో ఆక్సిజన్ మోతాదులను కొలిచే ఎస్పీఓ–2 సెన్సార్ ఉంటాయి. సేకరించిన సమాచారం ఇందులోని బ్లూటూత్ సాయంతో యూజర్ స్మార్ట్ఫోన్ లోని యాప్లో నిక్షిప్తం అవుతుంది. యాప్ను తెరిచి ఈ సమాచారాన్ని తెలుసుకోవచ్చు.నిద్ర సమస్యలుస్మార్ట్ రింగ్ ధరించిన వారు ఉదయం ఎప్పుడు నిద్రలేస్తున్నారు, రాత్రి నిద్రను ఆపుకొంటూ ఉంటున్నారా, వారి నిద్రలో నాణ్యత ఉందా అన్న అంశాలతో పాటు నిద్రకు సంబంధించిన సమస్యలేమైనా ఉన్నాయా అని తెలుపుతుంది. అలాగే స్లీప్ ఆప్నియా సమస్యను తెలుసుకుని, మెదడుకు ఆక్సిజన్ అందనప్పుడు ఆ విషయాన్ని తెలియజేయడం, ముప్పు గురించి హెచ్చరిక పంపడం.. తద్వారా ప్రాణాలను రక్షించడమూ చేస్తుంది. గుండె ఆరోగ్య సమాచారంగుండె స్పందనల వేగాన్నీ, వైవిధ్యాన్ని బట్టి ఓ వ్యక్తి తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాడా, ఆ ఒత్తిడి ప్రభావం అతడి గుండె మీద ప్రతికూలంగా పడుతోందా అన్న అంశాలను తెలుసుకుంటుంది.జ్వరం, ఇన్ఫెక్షన్ల వివరాలుదేహ ఉష్ణోగ్రతలూ, శ్వాస వేగం వీటన్నింటి ఆధారంగా ఓ వ్యక్తికి జ్వరం ఉందా అన్న అంశాన్ని గుర్తించవచ్చు. ఉదాహరణకు ఇటీవల కోవిడ్–19 స్వైరవిహారం చేసినప్పుడు ఈ తరహా రింగ్స్ చాలామందిని హెచ్చరిస్తూ అప్రమత్తం చేశాయి.మహిళల ఆరోగ్యంమహిళల శరీర ఉష్ణోగ్రత, ఇతరత్రా సమాచారంతో పాటు.. అండం ఎప్పుడు విడుదలైంది, భాగస్వామితో ఎప్పుడు కలిస్తే గర్భధారణ తేలిగ్గా జరుగుతుంది, గర్భధారణ వద్దనుకుంటే ఏ సమయంలో కలవకూడదు లాంటి సమాచారం రెడీగా దొరుకుతుంది. రిమోట్ డాక్టర్ మానిటరింగ్ గుండె జబ్బులూ లేదా ఉపిరితిత్తుల సమస్యలున్న వృద్ధులకు ‘సర్కల్ +’ లాంటి స్మార్ట్ రింగ్స్ ఎప్పటికప్పుడు డాక్టర్లకు సమాచారాన్ని తెలియజేస్తుంటాయి. తద్వారా అవసరమైన ఆరోగ్య సలహాలూ, సూచనలూ లేదా ప్రిస్క్రిప్షన్స్ లో వైద్యులు మార్పులు, చేర్పులు చేస్తారు.వేటికవే ప్రత్యేకంఔరా రింగ్ (యూఎస్ఏ): ఇది పూర్తి ఆరోగ్య సమాచారంతో పాటు నిద్రకు సంబంధించిన సమాచారాన్ని ఇస్తూ సైంటిస్టులకు బాగా ఉపయోగపడుతున్నాయి.అల్ట్రా హ్యూమన్ రింగ్ ఎయిర్: వ్యాయామాలకూ, దేహ జీవక్రియల పనితీరును (మెటబాలిక్ రేట్ ట్రాకింగ్) గమనించేందుకు, అలాగే చక్కెర విలువలను తెలుసుకునేందుకు పనికొస్తుంది.సర్క్యులర్ రింగ్: దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే మనకు కావాల్సిన సమాచారం తీసుకునేలా అవసరమైన అమరికలు జరుపుకోవచ్చు. ఇవి వైబ్రేషన్ ద్వారా హెచ్చరికలు (వైబ్రేషన్ అలర్ట్స్) కూడా పంపుతూ అప్రమత్తం చేస్తుంటాయి.ఈవీ రింగ్ (యూఎస్ఏ): ఇది మహిళలకూ, యువతులకూ ఉపయోగపడేది. రుతుచక్రాల వివరాలను తెలుపుతుంది.గో 2 స్లీప్: ఇది చైనాకు సంబంధించినది. నిద్రలో ఎవరికైనా ఊపిరి ఆగితే వెంటనే అప్రమత్తం చేసి నిద్రలేపుతుంది.సర్కల్ + రింగ్ (యూఎస్ఏ): ఇది ఆసుపత్రుల్లో రోగులకు ఉపయోగపడేది. వీటి ద్వారానే అనేక మెడికల్ రీడింగ్స్ తెలుసుకోవచ్చు. వీటిని వృద్ధులకూ వాడతారు.వీటికీ పరిమితులుఇవి పూర్తిగా స్మార్ట్ అని చెప్పలేం. వీటికీ కొన్ని పరిమితులు ఉన్నాయి. ఫలితాలు తెలియజేసే స్క్రీన్ వీటికి ఉండదు. కొన్ని స్మార్ట్ వాచెస్ మాదిరిగా ఇవి ఇంకా ఈసీజీ తీసుకోలేవు. జీపీఎస్ లేనందువల్ల నడక, పరుగు మార్గాలను చూపలేవు.వీటి అలర్ట్ బజ్ శబ్దం చాలా గట్టిగా వినిపించేలా ఉండదు. చివరగా... ఈ రింగ్స్ స్మార్ట్గా అందంగా అలంకరించుకునే ఓ చిన్ని ఉంగరంలా కనిపిస్తూ.. ఆరోగ్య రక్షణకోసం అవసరమైన అనేక రకాల సమాచారాన్ని సేకరిస్తూ.. వాటిని తొడుక్కున్నవారికీ, భవిష్యత్తులో డాక్టర్లకూ ఆ సమాచారం అందిస్తూ ఉండే ఉపకరణాలు. -
చిన్న పట్టణాల్లో స్మార్ట్ఫోన్ల జోరు
న్యూఢిల్లీ: ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో స్మార్ట్ఫోన్ల వినియోగం గణనీయంగా పెరుగుతోందని అంతర్జాతీయ సెమీకండక్టర్ దిగ్గజం మీడియాటెక్ ఇండియా ఎండీ అంకు జైన్ వెల్లడించారు. 5జీ సేవల విస్తరణ, స్మార్ట్ఫోన్లు చౌకగా లభిస్తుండటం, కనెక్టెడ్ ఉపకరణాలకు డిమాండ్ నెలకొనడం తదితర అంశాలు ఇందుకు దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. దీంతో స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ ఉపకరణాలకు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు, టెక్నాలజీ రంగం, యువత వృద్ధి చోదకాలుగా ఉండబోతున్నాయని జైన్ చెప్పారు.నెక్ట్స్–జనరేషన్ స్మార్ట్ఫోన్ల సామర్థ్యాలను పెంచే డైమెన్సిటీ 8450 చిప్సెట్ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ వివరాలు చెప్పారు. టీవీలు, స్పీకర్లు, ఫ్రిజ్లు మొదలైన ఉపకరణాల్లోనూ ఏఐ చిప్సెట్లను ఉపయోగిస్తున్న నేపథ్యంలో స్మార్ట్ హోమ్ మార్కెట్లో కూడా తమకు ప్రాధాన్యం పెరుగుతోందని జైన్ చెప్పారు. దేశీయంగా సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహిస్తూ ప్రభుత్వం సరైన దిశలోనే ముందుకెళ్తోందని తెలిపారు. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల కొరతపై స్పందిస్తూ తమ సరఫరా వ్యవస్థకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రణాళికలు వేసుకుంటున్నామని జైన్ వివరించారు. కొత్త విభాగాల్లోకి విస్తరణ .. ఆటోమోటివ్, శాటిలైట్ కమ్యూనికేషన్స్లాంటి కొత్త విభాగాల్లోకి కూడా విస్తరిస్తున్నామని జైన్ తెలిపారు. ఎలక్ట్రిక్ టూ వీలర్లకు 4జీ స్మార్ట్ క్లస్టర్లను రూపొందించేందుకు జియోథింగ్స్తో జట్టు కట్టామని, స్కోడా స్లావియా, టాటా పంచ్ ఈవీలాంటి కార్లకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలపైనా దృష్టి పెడుతున్నామని చెప్పారు. భారత్లో శాటిలైట్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వ్యవస్థ విస్తరించే కొద్దీ తమ చిప్సెట్స్కు కూడా డిమాండ్ పెరుగుతుందని పేర్కొన్నారు. భారత మార్కెట్లో మరిన్ని పెట్టుబడులకు, ఇంజనీరింగ్ సిబ్బంది సంఖ్యను పెంచుకునేందుకు మీడియాటెక్ కట్టుబడి ఉందని చెప్పారు. కౌంటర్పాయింట్ రీసెర్చ్ ప్రకారం భారత స్మార్ట్ఫోన్ చిప్సెట్ మార్కెట్లో మీడియాటెక్ సంస్థకు 45 శాతం, క్వాల్కామ్కి 32 శాతం వాటా ఉంది. 2004లో మీడియాటెక్ భారత్లో తమ తొలి పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం బెంగళూరు, నోయిడా కార్యాలయాల్లో 1,000 మంది పైగా ఇంజనీర్లు ఉన్నారు. -
గూగుల్, ఫేస్బుక్, టెలిగ్రామ్.. పాస్వర్డ్లు లీక్
గూగుల్, ఫేస్బుక్, టెలిగ్రామ్.. వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, గిట్హబ్లోని డెవలపర్ ఖాతాలు, కొన్ని ప్రభుత్వ పోర్టల్స్లోని దాదాపు 16 బిలియన్లకు పైగా పాస్వర్డ్లు లీక్ అయినట్లు సైబర్న్యూస్, ఫోర్బ్స్ నివేదికలు తెలిపాయి. ఇంటర్నెట్ చరిత్రలోనే అతిపెద్ద సెక్యూరిటీ లీక్ల్లో ఇది ఒకటిగా నిలిచిందని పేర్కొన్నాయి. ఈ లీక్ వల్ల మిలియన్ల మంది వినియోగదారుల వ్యక్తిగత డేటా ప్రమాదంలో ఉందని చెప్పాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన ఫిషింగ్ స్కామ్లు, ఐడెంటిటీ థెఫ్ట్, అకౌంట్ హ్యాకింగ్కు దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తి చేశాయి.లీక్ అయిన డేటా ఏళ్ల తరబడి ఉన్న పాత సమాచారం మాత్రమే కాదని భద్రతా పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇందులో ఎక్కువ భాగం కొత్త డేటా, బాగా వ్యవస్థీకృతమైన సమాచారం ఉందన్నారు. ఈ లీక్ల కోసం సైబర్ నేరగాళ్లు ఇన్ఫోస్టీలర్స్ అని పిలువబడే ఒక రకమైన మాల్వేర్ను ఉపయోగించి ఉండవచ్చని చెబుతున్నారు. ఈ మాల్వేర్ ప్రోగ్రామ్లు యూజర్లకు తెలియకుండానే తమ పరికరాల నుంచి లాగిన్ పాస్వర్డ్లను దొంగిలించి హ్యాకర్లకు పంపుతాయన్నారు. ఈ సమాచారాన్ని డార్క్ వెబ్ ఫోరమ్ల్లో అమ్మకానికి ఉంచుతారని తెలిపారు.లీకేజీలో ఏముంది?లీకైన డేటాలో గూగుల్, ఫేస్బుక్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నుంచి గిట్హబ్ల్లోని డెవలపర్ ఖాతాల్లోని సమాచారం ఉందనే అంచానాలున్నాయి. కొన్ని ప్రభుత్వ పోర్టల్స్ లాగిన్ సమాచారం కూడా లీకైందని చెబుతున్నారు. ఈ డేటా అంతా నిర్మాణాత్మకంగా, ఉపయోగించదగినదిగా ఉన్నందున నిపుణులు ఈ లీక్ను ‘గ్లోబల్ సైబర్ క్రైమ్ కోసం బ్లూప్రింట్’ అని పిలుస్తున్నారు. దాదాపు 30 బిగ్ డేటా సెట్లు, ఒక్కొక్కటి మిలియన్ల నుంచి బిలియన్ల లాగిన్ వివరాలు వివరాలను సేకరించాయని, మొత్తం 16 బిలియన్లకు పైగా పాస్వర్డ్లను దొంగిలించారని భావిస్తున్నారు.ఎందుకంత తీవ్రతదొంగిలించబడిన ఈ డేటాను ఎంత సులభంగా కొనుగోలు చేయవచ్చనే దానిపై ఆందోళనలు పెరుగుతున్నాయి. పరిమిత సాంకేతిక పరిజ్ఞానం, తక్కువ మొత్తంలో డబ్బు ఉన్నవారు కూడా డార్క్ వెబ్లో ఈ పాస్వర్ట్లను యాక్సెస్ చేసుకోవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఇది రోజువారీ వినియోగదారుల నుంచి పెద్ద కంపెనీల వరకు దాదాపు ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది.ఇదీ చదవండి: వీర్య దానంతో పుట్టినవారికి ఆస్తిలో సమాన వాటాఇప్పుడు ఏం చేయాలి?సంప్రదాయ పాస్వర్ట్ల నుంచి పాస్ కీ వంటి మరింత సురక్షితమైన ఆప్షన్లకు మారాలని గూగుల్ ఇప్పటికే వినియోగదారులకు సూచించింది. ముఖ్యంగా లాగిన్ వివరాలు అడిగితే ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్స్ ద్వారా పంపే లింక్లను క్లిక్ చేయవద్దని ఎఫ్బీఐ ప్రజలను హెచ్చరించింది. ప్రజలు తమను తాము రక్షించుకోవడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. అన్ని ప్రధాన ఖాతాల్లో పాస్వర్డ్లను మార్చడం, బలమైన, ప్రత్యేకమైన పాస్వర్డ్లను ఉపయోగించడం, టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2ఎఫ్ఎ)ను ఆన్ చేయడం ద్వారా భవిష్యత్తులో జరిగే మోసాలను కట్టడి చేయవచ్చు. -
టీసీఎస్ కొత్త పాలసీ.. అస్సలు ఒప్పుకోమంటున్న ఉద్యోగులు
ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తీసుకొచ్చిన అప్డేటెడ్ టాలెంట్ డిప్లాయ్మెంట్ పాలసీని ఐటీ ఉద్యోగుల సంఘం ఆల్ ఇండియా ఐటీ అండ్ ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఐటీఈయూ) వ్యతిరేకిస్తోంది. కార్మిక వ్యతిరేక విధానాన్ని అవలంభిస్తూ ఉద్యోగులను తగ్గించుకునేందుకే టీసీఎస్ ఈ కొత్త పాలసీని తీసుకొచ్చిందంటూ ఏఐటీఈయూ అభివర్ణించింది.టీసీఎస్ అప్డేటెడ్ టాలెంట్ డిప్లాయ్మెంట్ పాలసీలో ఇకపై ప్రతి ఉద్యోగి ఏడాదికి 225 బిల్ల్డ్ బిజినెస్ డేస్ పనిచేసి ఉండాలన్న నిబంధన తీసుకొచ్చింది. పని లేకుండా బెంచ్ మీద ఉండే సమయాన్ని 35 రోజులకు పరిమితం చేసింది. జూన్ 12 నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చినట్లు ఉద్యోగులకు యాజమాన్యం తెలియజేసింది. ఆర్ఎంజీ నుంచి తగిన బిల్లబిలిటీ ఉండేలా చూడాల్సిన బాధ్యతను ఉద్యోగులకే బదలాయించాలనే దురుద్దేశం కూడా ఈ విధానంలో ఉంది. ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలనుకున్నప్పుడల్లా కార్మిక వ్యతిరేక విధానమైన పనితీరు మెరుగుదల ప్రణాళిక (పీఐపీ) ద్వారా టీసీఎస్ యాజమాన్యం చేసే ప్రయత్నం ఇది" అని ఏఐటీఈయూ తెలిపింది.విడుదల తేదీకి ముందే కేటాయింపు కోసం రిసోర్స్ మేనేజ్ మెంట్ గ్రూప్ తో క్రియాశీలకంగా వ్యవహరించడం, అవకాశాలను అందిపుచ్చుకోవడం ఉద్యోగుల ప్రాథమిక బాధ్యత అని ఈ విధానం నొక్కి చెబుతోంది. ఫ్రెషర్స్ కూడా పని కేటాయింపు కోసం చురుగ్గా పనిచేయాల్సి ఉంటుంది. ఉద్యోగులు డిప్లాయిమెంట్ పాలసీని పాటించకపోతే చర్యలు తప్పవని కంపెనీ హెచ్చరిస్తోంది. "ఈ విధానం నిబంధనలను పాటించడంలో ఉద్యోగి విఫలమైనట్లయితే, సంస్థ క్రమశిక్షణా చర్యల ఫ్రేమ్వర్క్ ప్రకారం సేవల నిలిపివేతతో సహా క్రమశిక్షణా చర్యలు తీసుకునే హక్కు సంస్థకు ఉంది" అని ఉద్యోగులకు పంపిన పాలసీ డాక్యుమెంట్ పేర్కొంది.ఈ చర్యను వ్యతిరేకిస్తున్న యూనియన్ "ఉద్యోగులకు తగినంత బిల్లబిలిటీని నిర్ధారించడానికి టీసీఎస్ ఆర్ఎంజీ బాధ్యత వహిస్తుంది. కార్మికుల శ్రమను దోపిడీ చేసి లాభాలు, సంపదను కాపాడుకోవడంపై మాత్రమే దృష్టి పెడుతూ కార్మికుల హక్కులను కాలరాసే ఎంఎన్సీల విధానాలను ఏఐఐటీఈయూ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది’ అని పేర్కొంది. -
ఈ ప్లాన్తో జియో సిమ్ ఏడాదంతా యాక్టివ్..
దేశంలోనే అగ్రగామి టెలికాం కంపెనీ రిలయన్స్ జియో. ఈ టెలికాం ఆపరేటర్కు 47 కోట్ల మందికి పైగా యూజర్లు ఉన్నారు. కొంత మంది యూజర్లకు నెలా నెలా రీచార్జ్ చేసుకోవడం ఇష్టం ఉండదు. ఒకే సారి దీర్ఘకాలిక రీచార్జ్ ప్లాన్ల కోసం చూస్తుంటారు. ఇటువంటి వినియోగదారుల కోసం ఇప్పుడు జియో పోర్ట్ ఫోలియోలో ఒక ప్లాన్ కూడా ఉంది. ఇది ఒక రీఛార్జ్ తో మీ జియో సిమమ్ను 365 రోజులు యాక్టివ్ గా ఉంచుతుంది.365 రోజుల రీఛార్జ్ ప్లాన్ ఇదే.. రీఛార్జ్ ప్లాన్లు ఖరీదైనవిగా మారినప్పటి నుండి మొబైల్ వినియోగదారులలో లాంగ్ వాలిడిటీ ఉన్న ప్లాన్లకు డిమాండ్ వేగంగా పెరిగింది. ఇప్పుడు ఒక్క ప్లాన్ తీసుకోవడం ద్వారా ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ నుంచి విముక్తి పొందవచ్చు. జియో అందిస్తున్న 365 రోజుల రీఛార్జ్ ప్లాన్ ధర రూ.3599. ఈ ప్లాన్తో ఏయే ప్రయోజనాల లభిస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..ప్లాన్ ప్రయోజనాలుజియో రూ.3599 ప్లాన్తో రీచార్జ్ చేసుకుంటే 365 రోజుల వాలిడిటీని అందిస్తోంది. 365 రోజుల పాటు అన్ని నెట్వర్క్లకు అన్లిమిటెడ్ కాలింగ్ సదుపాయం లభిస్తుంది. ఉచిత కాలింగ్తోతో పాటు అన్ని నెట్వర్క్లకు ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్లు ఉచితంగా చేసుకోవచ్చు. మీరు ఎక్కువ ఇంటర్నెట్ వాడితే, తక్కువ డేటా లిమిట్ ఉన్న ప్లాన్ సరిపోకపోతే, జియో ఈ వార్షిక ప్లాన్ మీ టెన్షన్ కు ముగింపు పలకబోతోంది. ఈ రూ.3599 ప్లాన్లో మీకు 912 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. రోజుకు 2.5 జీబీ వరకు ఇంటర్నెట్ వాడుకోవచ్చు. ఇందులో అర్హులైన కస్టమర్లకు అపరిమిత 5జీ డేటాను కూడా అందిస్తోంది.👉 జియో 3 కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. తక్కువ ఖర్చుతో ఎక్కువ వ్యాలిడిటీఈ వార్షిక ప్లాన్లో రిలయన్స్ జియో తన వినియోగదారులకు కొన్ని అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఇందులో 90 రోజుల పాటు జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఇది కాకుండా, 50 జీబీ జియో ఏఐ క్లౌడ్ స్పేస్ కూడా ఈ ప్లాన్లో లభిస్తుంది. మీరు టీవీ ఛానల్స్ చూస్తున్నట్లయితే, జియో టీవీ ఉచిత సదుపాయం కూడా ఇందులో ఉంది. -
ఐటీ ఉద్యోగుల నెత్తిన మరో పిడుగు?!
మీరు ఐటీ ఉద్యోగులా?. అయితే మీ నెత్తిన మరో గుదిబండ పడబోతోంది!. త్వరలో ఐటీ రంగంలో పనిగంటలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా బెంగళూరులో తొలి అడుగు పడబోతోంది. ఐటీ సెక్టార్లో పని గంటలను పెంచే యోచనలో కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందంటూ దక్కన్ హెరాల్డ్ ఓ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది.ప్రస్తుతం కర్నాటకలో సెక్షన్7,కర్ణాటక షాప్స్, కమిర్షియల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ 1961 ప్రకారం.. 9 పని గంటలు కొనసాగుతున్నాయి. పండగలు, పబ్బాలు వంటి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కనీసం సంవత్సరంలో ఏదైనా మూడు నెలల్లో ఉద్యోగులతో అదనంగా 10 గంటలు పనిచేయించుకోవచ్చు. ఈ పనిగంటలు 50 గంటలు మించకూడదు.కానీ కర్ణాటక ప్రభుత్వం తాజాగా కొత్త పనిగంటల ప్రతిపాదనలు తెరపైకి తెరపైకి తెచ్చినట్లు దక్కన్ హెరాల్డ్ హైలెట్ చేసింది. ఉద్యోగులు ఇకపై 10 పని గంటలు, అదనంగా 12 గంటలు పనిచేయించుకుంటే ఎలా ఉంటుందా? అనే దిశగా ప్రభుత్వం కార్మికశాఖ, ఐటీ రంగ నిపుణులతో చర్చలు జరుపుతోంది. ఫలితంగా ప్రత్యేక సందర్భాలలో అదనంగా చేసే పనిగంటలు 50 నుంచి ఏకంగా 140 గంటలు చేరుకోనున్నాయి.కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై కార్మిక సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. పనిగంటల్ని పెంచి ఉద్యోగుల హక్కుల కాలరాజేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తున్నాయి. పనిగంటలు పెంచడం వల్ల ఉద్యోగులు తమ హక్కులపై ప్రతికూల ప్రభావంతో పాటు పర్సనల్ లైఫ్, ఫ్రొఫెషనల్ లైఫ్కు విఘాతం కలుగుతోందని అంటున్నారు.కర్ణాటకతో పాటు ఏపీలో కూటమి ప్రభుత్వంపై సైతం పనిగంటల్ని పెంచే ప్రతిపాదనలు తెరపైకి తెచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో వ్యాపారాన్ని సులభతరం చేయడంతో పాటు ఇన్వెస్టర్లను ఆకట్టుకునేలా తొమ్మిది పనిగంటల్ని పది పనిగంటలు చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఉద్యోగులకు, సంస్థలకు లబ్ధి చేకూరేలా కార్మిక చట్టాల్ని మార్చే యోచనలో ఉందని డక్కెన్ హెరాల్డ్ తన కథనంలో ప్రస్తావించింది. అంతేకాదు పనిగంటలు పెంచి పనిచేసే ప్రాంతాల్లో రాత్రి వేళ పనిదినాల్లో మహిళలకు వెసులు బాటు కల్పించడంతో పాటు రవాణ, భద్రత, సెక్యూరిటీ, లైటింగ్ మెరుగుపరుచుకునే దిశగా చర్యలు తీసుకోనుందని వెల్లడించింది. పని గంటలను పొడిగించాలనే ప్రభుత్వ ప్రణాళికను కర్ణాటకలోని అనేక కార్మిక సంఘాలు వ్యతిరేకించాయి. బుధవారం, రాష్ట్ర కార్మిక శాఖ పరిశ్రమ, కార్మిక సంఘాల ప్రతినిధులతో ఒక సమావేశాన్ని నిర్వహించి చట్టానికి సాధ్యమయ్యే సవరణపై చర్చించింది.కర్ణాటక రాష్ట్ర ఐటీ/ఐటీఈఎస్ ఉద్యోగుల సంఘం (కేఐటీయూ) సమావేశంలో పాల్గొని ఈ ఆలోచనను స్పష్టంగా వ్యతిరేకించింది. కేఐటీయూ ఈ ప్రతిపాదనను బానిశత్వంగా అభివర్ణించింది. కార్మికుల ఆరోగ్యం, పని-జీవిత సమతుల్యత, ఉద్యోగ భద్రతకు హాని కలిగిస్తుందని పేర్కొంది. పనిగంటల విషయంలో ప్రభుత్వ ప్రతిపాదనల్ని టెక్నాలజీ రంగ ఉద్యోగులు వ్యతిరేకించాలని, వారికి అండగా నిలవాలని యూనియన్ విజ్ఞప్తి చేసింది.పనిగంటలు పెరిగితే భారీ ఎత్తున ఉద్యోగుల తొలగింపులు.. ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
వాట్సప్, ఇన్స్టాగ్రామ్ షట్డౌన్!
ఇజ్రాయెల్తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ ఇంటర్నెట్ సర్వీసుల సామర్థ్యాన్ని పరిమితం చేస్తూ ఇటీవల దేశవ్యాప్తంగా దాదాపు ఇంటర్నెట్ బ్లాక్అవుట్(ఇంటర్నెట్లో తీవ్ర అంతరాయం-పూర్తి బ్లాక్అవుట్ కాదు)ను ఎదుర్కొంది. ఇజ్రాయెల్ సైబర్ దాడులకు పాల్పడుతుందని, అందుకు ప్రతిస్పందనగా ప్రభుత్వం ఈ మేరకు ఇంటర్నెట్ను పరిమితం చేస్తూ ఉద్దేశపూర్వకంగా నిర్ణయం తీసుకున్నట్లు మీడియా నివేదికలు సూచిస్తున్నాయి.ఇరాన్ ప్రభుత్వ నిర్ణయం ద్వారా వీపీఎన్(వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్) సేవలు ప్రధానంగా ప్రభావితమయ్యాయి. తప్పుడు సమాచారం వ్యాప్తిని అణచివేయాలని దాంతోపాటు సైబర్ దాడులను అరికట్టాలని ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్లు కొన్ని సంస్థలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ కనెక్టివిటీని ట్రాక్ చేసే కంపెనీలు కెంటింక్, నెట్బ్లాక్స్ను ఉటంకిస్తూ ఎన్బీసీ తెలిపిన నివేదిక ఆధారంగా ఇరాన్ స్థానిక కాలమానం ప్రకారం జూన్ 17, సాయంత్రం 5:30 గంటలకు ఇంటర్నెట్ సేవలు పరిమితమయ్యాయి. ఇది పూర్తిగా బ్లాక్అవుట్ కాదు. విదేశీ వెబ్సైట్లకు కనెక్ట్ అయ్యేందుకు అనుమతించే వీపీఎన్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేస్తారనే ఆందోళనలతో వాట్సప్ వంటి యాప్లను ఉపయోగించకుండా ఉండాలని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది.ఇదే మొదటిసారి కాదు..ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ను నిలిపివేయడం లేదా ప్రజలు ఇంటర్నెట్ సేవలను యాక్సెస్ చేయకుండా నిరోధించడం ఇది మొదటిసారి కాదు. 2019లో దేశంలో నెలకొన్న అంతర్యుద్ధం కారణంగా వరుసగా ఆరు రోజుల పాటు పూర్తిగా లాక్డౌన్ విధించింది. అప్పుడు 100 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇజ్రాయెల్పై దాడుల తర్వాత 220 మందికి పైగా మరణించారని ఇరాన్ చెబుతుండగా, ప్రతీకార దాడుల్లో 24 మంది మరణించారని ఇజ్రాయెల్ చెబుతోంది.ఇదీ చదవండి: పుత్తడి ఈ పూట రేటెంతంటే..గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ కూడా..గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లను కూడా ఇరాన్ నిలిపేసింది. ప్రజలు తమ డివైజ్లలో కొత్త యాప్లను డౌన్లోడ్, ఇన్స్టాల్ చేసుకోకుండా నిషేధం విధించింది. అదే సమయంలో వాట్సప్, ఇన్స్టాగ్రామ్ వంటి యాప్స్ ఇప్పటికే ఉన్న డివైజ్లలో పూర్తిగా నిరుపయోగంగా మారాయి. ఇరాన్ నేషనల్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్లో భాగమైన ప్రభుత్వం ఆమోదించిన సైట్లు అందుబాటులో ఉన్నాయి. -
బ్యాటరీ సేవ్ చేసే డిస్ప్లే.. యాపిల్ కసరత్తు
యాపిల్ సంస్థ భవిష్యత్తులో విడుదల చేయబోయే ఐఫోన్లలో కొత్త పవర్ సేవింగ్ డిస్ప్లేను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఐఫోన్ 18 ఎయిర్లో దీన్ని అమలు చేసే వీలుందనే అంచనాలు వెలువడుతున్నాయి. స్లిమ్ ఫోన్లలో బ్యాటరీ సామర్థ్యం తక్కువగా ఉండడంతో పవర్ అధికంగా ఖర్చు అవుతుంది. దాంతో స్లిమ్ ఫోన్లకు ఇదో సవాలుగా మారుతుంది. ఈ నేపథ్యంలో బ్యాటరీ లైఫ్ను పెంచేలా, డిస్ప్లేకు ఖర్చు అయ్యే పవర్ను తగ్గించేలా కొత్త టెక్నాలజీలను కంపెనీలు ఆవిష్కరిస్తున్నాయి. ఇందులో భాగంగా యాపిల్ కంపెనీ ఐఫోన్ 18 ఎయిర్లో ఈమేరకు టెక్నాలజీను వాడనుందని కొన్ని సంస్థలు తెలిపాయి.పరిమిత బ్యాటరీ లైఫ్ సమస్యలను పరిష్కరించడానికి, తక్కువ శక్తిని వినియోగించేలా నెక్ట్స్ జనరేషన్ ఓఎల్ఈడీ డిస్ప్లేను వాడాలని యాపిల్ పరిశీలిస్తోంది. ఇప్పటికే వీటి సరఫరాదారులతో చర్చలు జరుగుతున్నాయని సమాచారం. 2027లో ఐఫోన్ 18 ఎయిర్లో ఎల్టీపీఓ ఓఎల్ఈడీ అధునాతన వెర్షన్ను ఉపయోగించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఈ మోడల్లో కొత్త డిస్ప్లే ప్యానెల్ టెక్నాలజీని ఉపయోగించాలని యాపిల్ అన్వేషిస్తోంది. ప్రస్తుతం యాపిల్ తన హైఎండ్ ఐఫోన్లలో ఎల్టీపీఓ ఓఎల్ఈడీ ప్యానెళ్లను ఉపయోగిస్తుంది. కాని డిస్ప్లే అంతర్గత భాగాల్లో కొంత భాగం మాత్రమే ఆక్సైడ్ పదార్థాలను వాడుతోంది.ఇదీ చదవండి: 9 లక్షలకు ఫ్లెక్సీ స్టాఫ్కొత్త డిప్ప్లేల్లో పూర్తి ఆక్సైడ్ ఆధారిత డిజైన్కు మారడం ద్వారా మరింత సమర్థవంతంగా సర్వీసు అందించాలని యోచిస్తోంది. అయితే ఈ అప్గ్రేడ్ అంత సులభం కాదనే వాదనలున్నాయి. ఇది తయారీ ప్రక్రియలో సంక్లిష్ట మార్పులను కలిగి ఉంటుంది. దాంతో ఈ ప్యానెళ్లు మరింత ఖరీదుగా మారుతాయనే అభిప్రాయాలున్నాయి. -
ఏఐ భయాలు సరైనవేనా..? మూర్తి ఏమన్నారంటే..
కృత్రిమ మేధ (ఏఐ) భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) పరిశ్రమ వృద్ధికి ఊతమిస్తుందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. ఓపెన్ఏఐ జనరేటివ్ ఏఐ టూల్ చాట్జీపీటీని ఉపయోగించడం వల్ల తన ఉత్పాదకత ఐదు రెట్లు పెరిగిందని మూర్తి తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఉద్యోగాలను హరించివేస్తుందన్న భయం సరికాదన్నారు. ఇది మరో రకమైన ఉద్యోగాన్ని సృష్టిస్తుందని చెప్పారు.చాట్జీపీటీ వంటి జనరేటివ్ ఏఐ టూల్ను చాలా మంది వినియోగిస్తున్నారు. అయితే ఏఐ చాలా ఉద్యోగాలకు సవాలుగా మారుతుందనే అభిప్రాయాలున్నాయి. కొన్ని కంపెనీలు ఏఐ సాకుతో లేఆఫ్స్ కూడా ప్రకటిస్తున్నాయనే వాదనలున్నాయి. ఈ తరుణంలో నారాయణమూర్తి తాజాగా ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏఐ ఉత్పాదకతను పెంచుతుందన్నారు. తన ప్రసంగాలకు చాట్జీపీటీను వాడుతున్నట్లు చెప్పారు. అయితే ఏఐను సరైన ప్రశ్న అడగడంలోనే అసలు తెలివితేటలు ఉన్నాయని తెలిపారు.‘భవిష్యత్తులో ఏమి జరుగుతుందంటే..ప్రోగ్రామర్లు, విశ్లేషకులు మెరుగైన, మరింత సంక్లిష్టమైన అవసరాలను తీర్చడంలో స్మార్ట్ అవుతారు. వారు పెద్ద సమస్యలను పరిష్కరిస్తారు. కాబట్టి కృత్రిమ మేధ ఐటీ పరిశ్రమ వృద్ధి రేటును ఎలా పెంచుతుందనే దాని గురించి నేను సానుకూలంగా ఉన్నాను’ అని తెలిపారు. భారత ఐటీ పరిశ్రమలో వృద్ధి, ఉద్యోగ నియామకాలు మందకొడిగా సాగుతున్న నేపథ్యంలో మూర్తి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఇదీ చదవండి: మేలో స్వల్పంగా తగ్గిన వాహన విక్రయాలుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతరాయం మధ్య ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఇటీవల ఐటీ వ్యాపార నమూనాల్లో సమూల మార్పులు చేయాలని పిలుపునిచ్చారు. గత 30 ఏళ్లుగా ఉన్న సంప్రదాయ ఐటీ వ్యాపార నమూనాకు విఘాతం కలుగుతోందని, ఇప్పటికే ఆ మోడల్కు సమయం అయిపోయిందని హెచ్సీఎల్ టెక్ సీఈఓ విజయకుమార్ గతంలో తెలిపారు. కృత్రిమ మేధను సపోర్ట్గా ఉపయోగించి ఉత్పాదకత, నాణ్యతను ఎలా మెరుగుపరుచుకోవాలో గమనిస్తే సాఫ్ట్వేర్ పరిశ్రమ వృద్ధి వేగం పెరుగుతోందని మూర్తి అభిప్రాయపడ్డారు. -
కొత్త సిమ్ తీసుకునేవారికి జియో బంపర్ ఆఫర్
కొత్తగా స్మార్ట్ఫోన్ కొనుగోలు చేసే వినియోగదారులకు సరికొత్త డిజిటల్ అనుభవాన్ని అందించేందుకు రిలయన్స్ జియో స్టార్టర్ ప్యాక్ను ప్రారంభించింది. కేవలం రూ.349తో యూజర్లు ఈ ప్యాక్ను పొందవచ్చని కంపెనీ తెలిపింది. కొత్తగా సిమ్ కొనుగోలు చేసే యూజర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ ప్యాక్ డిజిటల్ యుటిలిటీ, కస్టమర్ల అనుభవాన్ని పెంచే లక్ష్యంతో కొన్ని ప్రయోజనాలను అందిస్తుంది.జియో స్టార్టర్ ప్యాక్ ప్రయోజనాలు..5G నెట్వర్క్లో 28 రోజుల పాటు అపరిమిత సేవలు వినియోగించుకోవచ్చు.50 రోజుల ఉచిత జియోఫైబర్/ ఎయిర్ఫైబర్ ట్రయల్ కనెక్షన్ (టీవీ + వైఫై + OTT యాప్లు) పొందవచ్చు.50 జీబీ ఉచిత జియో ఏఐ క్లౌడ్ స్టోరేజీ పొందవచ్చు.4K క్వాలిటీతో టీవీ / మొబైల్లో 90 రోజుల పాటు ఉచిత జియో హాట్స్టార్ వీక్షించవచ్చు.ఇదీ చదవండి: ఇంధనం వాడకుండానే వాహనాల తరలింపుఈ ప్రయోజనాలను ఒకే ఆఫర్లో అందించడం ద్వారా కొత్త వినియోగదారులకు డిజిటల్ అనుభవాన్ని సులభతరం చేయడం జియో లక్ష్యంగా పెట్టుకుంది. ఇదిలాఉండగా, ఏప్రిల్ 2025కి విడుదలైన ట్రాయ్ నివేదిక ప్రకారం.. అత్యంత పోటీ ఉన్న వైర్లెస్ (మొబైల్) విభాగంలో అధికంగా సబ్స్క్రైబర్లను జోడించింది. జియో 95,310 కొత్త సబ్స్క్రైబర్లను జోడించి మార్చి 2025లో 3,17,76,074 ఉన్న మొత్తం వినియోగదారులను ఏప్రిల్ 2025లో 3,18,71,384కి పెంచుకుంది. -
ఇకపై వాట్సప్లో ప్రకటనలు?
ప్రముఖ ఆన్లైన్ మెసేజింగ్ యాప్ వాట్సప్(Whatsapp) యూజర్ ప్రైవసీ, ఎన్క్రిప్షన్ ప్రమాణాలను పాటిస్తూ ఆదాయాన్ని ఆర్జించాలనే వ్యూహంతో చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా యాప్లో యాడ్స్ ద్వారా రెవెన్యూ సంపాదించాలని చూస్తుంది. ఇతర ప్లాట్ఫామ్ల మాదిరిగా కాకుండా ఇప్పటివరకు ఎలాంటి యాడ్స్ లేకుండానే మెటా వాట్సప్లో మెసేజింగ్ సర్వీసులను ఉచితంగా అందించింది. ఇకపై వాట్సప్ స్టేటస్లో యాడ్ల ద్వారా ఆదాయం సంపాదించాలని భావిస్తుంది. అయితే ఈ యాడ్స్ కేవలం అప్డేట్స్ ట్యాబ్లో మాత్రమే కనిపిస్తాయని, పర్సనల్ చాట్స్ ఎప్పటిలానే యాడ్ఫ్రీగా ఉంటాయని వాట్సప్ స్పష్టం చేసింది.వాట్సప్ యాప్లోని అప్డేట్స్ ట్యాబ్ ఆప్షన్లో ప్రకటనలకు చెందిన ఫీచర్లను తీసుకొస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అప్డేట్స్ ట్యాబ్లో ప్రస్తుతం ఛానళ్లు, స్టేటస్ బ్లాక్లో అడ్వర్టైజ్మెంట్లు కనిపించనున్నాయి. నిత్యం దాదాపు 2 బిలియన్ల వినియోగదారులు ఈ అప్డేట్ బ్లాక్ చూస్తున్నారని వాట్సప్ తెలిపింది. దాంతో విభిన్న సంస్థలు ప్రమోట్ చేయాలనుకునే ఉత్పత్తులు లేదా ఇతర వివరాలను యాడ్ ఇచ్చేందుకు దీన్నో అవకాశంగా చూపుతుంది. మూడు రకాల యాడ్ ఫీచర్లు తీసుకొస్తున్నట్లు పేర్కొంది.పెయిడ్ ఛానల్ సబ్ స్క్రిప్షన్లుక్రియేటర్లు, వ్యాపారాలు లేదా ఇన్ఫ్లూయెన్సర్ల నుంచి ప్రత్యేక కంటెంట్ను యాక్సెస్ చేసేందుకు నెలవారీ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇది టెలిగ్రామ్, యూట్యూబ్లో కనిపించే ప్రీమియం సబ్స్క్రిప్షన్ మోడల్స్ మాదిరిగానే ఉంటుంది.ప్రమోటెడ్ ఛానల్స్..వ్యాపారాలు, కంటెంట్ క్రియేటర్లు తమ ఛానళ్లను ప్రమోట్ చేయడం ద్వారా విజిబిలిటీని పెంచుకోవచ్చు. యాప్లోని డిస్కవరీ సెక్షన్లో అడ్వర్టైజ్మెంట్ ఛానల్స్ కనిపిస్తాయి.స్టేటస్ యాడ్స్ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ తరహాలో స్టేటస్ ఫీచర్లో యాడ్స్ ఉంటాయి. స్టేటస్ అప్డేట్ల మధ్య టార్గెట్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ను యూజర్లు వీక్షించవచ్చు.ఇదీ చదవండి: గరిష్ఠాల నుంచి పడిన పసిడి ధర! తులం ఎంతంటే..Ads in status. 🥲#WhatsApp pic.twitter.com/vn7yUmJInr— Abhishek Yadav (@yabhishekhd) June 16, 2025ప్రైవసీ పట్ల నిబద్ధతతాజాగా ప్రతిపాదించిన మార్పులు ఉన్నప్పటికీ వ్యక్తిగత సందేశాలు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్ట్గానే ఉంటాయని వాట్సప్ తెలిపింది. అంటే ప్రైవేట్ చాట్ల్లో ఎటువంటి ప్రకటనలు కనిపించవని వినియోగదారులకు హామీ ఇచ్చింది. ఫోన్ నంబర్, వ్యక్తిగత వివరాలు ఎట్టిపరిస్థితుల్లో ప్రకటనదారులతో పంచుకోమని వాట్సప్ స్పష్టం చేసింది. వినియోగదారుల లొకేషన్, భాష.. వంటి సాధారణ డేటా ఆధారంగా ప్రకటనలు ఉంటాయని తెలిపింది. -
రూ.10,000లోపు కొత్త 5జీ ఫోన్లు
సాంకేతికతను వినియోగించడంలో, ఎప్పటికప్పుడు అప్డేట్ కావడంలోనూ యువతరం ముందుంటోంది. నిత్యం మొబైళ్ల తయారీలో వస్తున్న మార్పులను వీరు స్వాగతిస్తున్నారు. స్మార్ట్ఫోన్ల పనితీరు మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకు అనుగుణంగా ఫోన్లలో ఫీచర్లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫోన్ తయారీ కంపెనీలు సైతం వినియోగదారుల అభిరుచుల మేరకు వినూత్న మోడళ్లను నిత్యం ఆవిష్కరిస్తున్నాయి. లేటెస్ట్గా విడుదలైన రూ.10,000 లోపు ధర(ధరలు రిటైలర్ను అనుసరించి మారే అవకాశం ఉంటుంది) ఉన్న కొన్ని 5జీ మొబైళ్ల గురించి తెలుసుకుందాం.పోకో సీ75 5జీ - రూ.9,499స్నాప్ డ్రాగన్ 4ఎస్ జెన్ 2 ప్రాసెసర్6.88 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్50 మెగా పిక్సల్ రేర్ కెమెరా5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా5160 ఎంఏహెచ్ బ్యాటరీ18వాట్ ఛార్జింగ్శాంసంగ్ గెలాక్సీ ఎం06 5జీ - రూ.9,999మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్6.74 అంగుళాల పీఎల్ఎస్ ఎల్సీడీ స్క్రీన్90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్50 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా5000 ఎంఏహెచ్ బ్యాటరీ25వాట్ ఛార్జింగ్రెడ్మీ ఏ4 5జీ - రూ.8,999మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్6.6 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్50 మెగా పిక్సల్ రేర్ కెమెరా8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా5000 ఎంఏహెచ్ బ్యాటరీ18వాట్ ఛార్జింగ్ఏసర్ సూపర్ జెడ్ఎక్స్ 5జీ - రూ.9,999మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్6.8 అంగుళాల ఎఫ్హెచ్డీ+ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్64 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా5000 ఎంఏహెచ్ బ్యాటరీ33వాట్ ఛార్జింగ్పోకో ఎం7 5జీ - రూ.8,799స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్6.88 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్50 మెగా పిక్సల్ రేర్ కెమెరా8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా5160 ఎంఏహెచ్ బ్యాటరీ18వాట్ ఛార్జింగ్రెడ్మీ 14సీ 5జీ - రూ.9,499మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్6.7 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్50 మెగా పిక్సల్ రేర్ కెమెరా8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా5000 ఎంఏహెచ్ బ్యాటరీ18వాట్ ఛార్జింగ్శాంసంగ్ గెలాక్సీ ఎఫ్06 5జీ - రూ.8,499మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్6.7 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే50 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా5000 ఎంఏహెచ్ బ్యాటరీ25వాట్ ఛార్జింగ్ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 హెచ్డీ-రూ.7,999యూనిసోక్ టీ765 ప్రాసెసర్6.75 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్13 మెగా పిక్సల్ రేర్ కెమెరా5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా5000 ఎంఏహెచ్ బ్యాటరీ18వాట్ ఛార్జింగ్లావా షార్క్ 5జీ - రూ.7,999యూనిసోక్ టీ765 ప్రాసెసర్6.75 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్13 మెగా పిక్సల్ రేర్ కెమెరా5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా5000 ఎంఏహెచ్ బ్యాటరీ18వాట్ ఛార్జింగ్లావా బోల్డ్ ఎన్1 ప్రో - రూ.9,999మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్6.7 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్50 మెగా పిక్సల్ రేర్ కెమెరా8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా5000 ఎంఏహెచ్ బ్యాటరీ18వాట్ ఛార్జింగ్నోట్: మార్కెట్లో రూ.10వేలులోపు మరెన్నో మొబైళ్లు ఉన్నాయి. పైన తెలిపిన మోడళ్ల వివరాలు కేవలం ఒక అంచనాకు మాత్రమే తెలియజేశాం. కొనుగోళ్లకు సంబంధించిన నిర్ణయం తీసుకునే ముందు మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుందని గమనించాలి. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్లూ.. ఆ జమానా ముగిసింది!
సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఒకప్పుడు మంచి డిమాండ్ ఉండేది. వారిని నియమించుకునేందుకు మల్టీ నేషనల్ కంపెనీలు భారీ జీతాలు, ఆకట్టుకునే సౌకర్యాలతో వెంటపడేవి. ఇప్పుడా జమానా ముగిసింది. టెక్ పరిశ్రమలో జీతాల పెరుగుదల, పెద్దమొత్తం నియామక ప్రక్రియలు తగ్గుతున్నాయి. 2025లో సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ ఉద్యోగాలు అనేక మార్పులను ఎదుర్కొంటున్నాయి. ఇవి ఆటోమేషన్, కొత్త వేతన ధోరణులు, కార్యాలయంలో మారుతున్న దృక్పథాలను ప్రతిబింబిస్తున్నాయి. ఏఐ రాకతో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో మార్పులుసాఫ్ట్వేర్ ఇంజినీర్ల ముఖ్యమైన పని అయిన కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అంటే కోడ్ రాయడాన్ని కృత్రిమ మేధస్సు (AI) పూర్తిగా మార్చుతోంది. గిట్హబ్ కోపైలట్, కర్సర్చాట్ వంటి టూల్స్ ద్వారా ఎటువంటి అధునాతన కోడింగ్ నైపుణ్యాలు లేకుండానే ప్రోగ్రామింగ్ చేయడం సాధ్యమవుతోంది. అంటే సాధారణ టెక్ట్స్ ప్రాంప్ట్ ఇస్తే చాలు ఎలాంటి కోడ్ అయినా చిటికెలో వచ్చేస్తోంది. దీన్నే "వైబ్ కోడింగ్" అని పిలుస్తున్నారు.పెరుగుతున్న సైలెంట్ లేఆఫ్స్ సిలికాన్ వ్యాలీకి చెందిన టాప్ సంస్థల దగ్గర నుంచి భారతీయ ఐటీ కంపెనీల వరకూ అన్నీ ఉద్యోగుల సంఖ్యను క్రమంగా తగ్గించుకుంటున్నాయి. కంపెనీలు గతంలో లాగా ఒకేసారి పెద్ద సంఖ్యలో జాబ్లకు కోతలు పెట్టడం లేదు. బదులుగా ‘సైలెంట్ లేఆఫ్స్’ విధానాన్ని అమలు చేస్తున్నాయి. అంటే ఉద్యోగులకు అనువైన వాతావరణాన్ని కల్పించి వారితో స్వచ్ఛందంగా రాజీనామా చేయించడం ద్వారా వదిలించుకుంటున్నాయి. ఆ స్థాయిలో జీతాల పెరుగుదల లేదుటెక్ రంగంలో వేతనాలు ఇంకా ఎక్కువగానే ఉన్నప్పటికీ, గతంలో మాదిరిగా తక్కువ కాలంలోనే వేగంగా వేతనాలు పెరిగినట్లు ఇప్పుడు పెరగడం లేదు. ఒక ఉద్యోగాన్ని విడిచి మరొక ఉద్యోగం పొందడం ద్వారా ఎక్కువ జీతం పొందే అవకాశాలు తగ్గిపోయాయి. అయితే ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ వంటి హై-డిమాండ్ నైపుణ్యాలు ఉన్నవారు ఇంకా గణనీయమైన వేతనాలను పొందుతున్నారు. వ్యూహాత్మక దృక్పథం అవసరం కొత్త ఉద్యోగానికి మారడం అనుకున్నంత మంచిది కాకపోవచ్చు. ఇప్పుడు ఉద్యోగం మారడానికి ముందుగా స్థిరత, ప్రయోజనాలు, దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. 2025లో ఆటోమేషన్, వేతన ధోరణులు, ఉద్యోగ మార్పులను అర్థం చేసుకున్న వారు మాత్రమే ఏఐ నైపుణ్యం, డిజిటల్ అనుసంధానం, ప్రత్యేక నైపుణ్యాలను పెంచుకుంటూ విజయవంతం అవ్వగలరు.👉 ఇది చదివారా? ఈ టెక్ దిగ్గజంలో తొలగింపులు -
జియోకి ఏమైంది? గగ్గోలు పెడుతున్న యూజర్లు
ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో నెట్వర్క్ సేవల్లో అంతరాయాలు తలెత్తాయి. ఇంటర్నెట్ కనెక్టివిటీ, మొబైల్ సిగ్నల్, జియో ఫైబర్ సేవలకు సంబంధించిన సమస్యల గురించి వేలాది మంది నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దేశంలోని కేరళ ప్రాంతంలో జియో నెట్వర్క్ ద్వారా కాల్స్, ఇంటర్నెట్ సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదురైనట్లు అనేక మంది సోషల్ మీడియా వేదికగా నివేదిస్తున్నారు.ఇప్పటివరకు 12,000కు పైగా రిపోర్టులు నమోదయ్యాయని అంతరాయాల ట్రాకింగ్ ప్లాట్ఫామ్ డౌన్డిటెక్టర్ తెలిపింది. ఇందులో ఎక్కువ ఫిర్యాదులు మొబైల్ డేటా వైఫల్యాలకు సంబంధించినవే. 32 శాతం మంది యూజర్లు కాల్ సంబంధిత సమస్యలను నివేదించగా, 12 శాతం మంది వినియోగదారులు జియో ఫైబర్ సేవల్లో అంతరాయం కలిగినట్లు ఫిర్యాదు చేశారు.మధ్యాహ్నం 1:45 గంటలకు ఈ సమస్య ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఆ సమయానికి దాదాపు 400 మంది వినియోగదారులు జియో సేవలను యాక్సెస్ చేసేటప్పుడు సమస్యలను నివేదించారు. తర్వాత మధ్యాహ్నం 2:15 గంటలకు కేరళ ప్రాంతం నుంచి గణనీయమైన సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే కేరళ ప్రాంతంలో మాత్రమే కొంత సమయం నెట్ వర్క్లో సమస్యలు వచ్చాయని, దేశంలోని మిగిలిన ప్రాంతాలలో ఎటువంటి సమస్యా లేదని జియో వర్గాలు వెల్లడించాయి. -
ఉద్యోగాల కోతకు ఏఐ సాకు!
కృత్రిమమేధకు ఆదరణ పెరుగుతున్న కొద్దీ సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో గుబులు అధికమవుతోంది. తమ ఉద్యోగాల స్థానంలో ఏఐ పాగా వేస్తుందని చాలామంది జంకుతున్నారు. ఇదే అదనుగా కొన్ని కంపెనీలు కాస్ట్ కటింగ్, పునర్వ్యవస్థీకరణ పేరుతో ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. సాఫ్ట్వేర్ డెవలపర్ల స్థానాన్ని ఏఐ భర్తీ చేస్తుందని చెబుతూ కొన్ని కంపెనీల వ్యవస్థాపకులు, సీఈఓలు తమ మోడళ్ల అమ్మకాలను పెంచుకోవడానికి ఎక్కువగా ప్రచారం చేస్తున్నట్లు ఏఐ కోడింగ్ ప్లాట్ఫామ్ విండ్సర్ఫ్ వ్యవస్థాపక బృందం సభ్యుడు అన్షుల్ రామచంద్రన్ తెలిపారు.‘ఏఐ ప్రభావం పెరుగుతోందని చెబుతున్నవారిలో చాలా మంది ఎలాగైనా కొందరు ఉద్యోగులను తొలగించాలని కోరుకుంటున్నారు. అందుకు ఏఐను సాకుగా వాడుతున్నారు. ఇలాంటి వ్యక్తుల్లో కొందరు సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ కోసం ప్రత్యేకంగా ఏఐ నమూనాలను రూపొందిస్తున్నారు. మరిన్ని మోడళ్లను విక్రయించడానికి ఇది వ్యాపార వ్యూహంగా పని చేస్తుంది. డెవలపర్ అడాప్షన్, ఎంటర్ప్రైజ్ పార్ట్నర్షిప్ పరంగా అమెరికా తర్వాత భారత్ రెండో అతిపెద్ద మార్కెట్గా అవతరిస్తోంది. భారత్లో 1.7 కోట్ల మంది డెవలపర్లు ఉన్నారు’ అని చెప్పారు.ఇదీ చదవండి: హోర్ముజ్ జలసంధి మూసివేత..?‘వాస్తవంగా కృత్రిమ మేధను అందిపుచ్చుకోవడానికి భారత్కు సరిపడా శక్తి ఉంది. భారత్లో జీపీయూ క్లస్టర్లను నిర్మించడంపై చురుగ్గా ముందుకెళ్తున్నాం. ఇప్పటికే భారత్లోని ప్రముఖ ఐటీ కంపెనీలతో వివిధ స్థాయిల్లో కలిసి పనిచేస్తున్నాం. ఇండియన్ ఐటీ కంపెనీలు తమ అంతర్జాతీయ సహచరుల కంటే వేగంగా కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నాయి. అయితే ఈ కంపెనీలు ఇప్పటికే టెక్నాలజీని వివిధ విభాగాల్లో వైవిధ్యపరిచాయి’ అని రామచంద్రన్ తెలిపారు. -
టెక్ దిగ్గజంలో తొలగింపులు
కంప్యూటర్లను తయారు చేసే ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఇంటెల్ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. తమ ఫ్యాక్టరీల్లో పని చేసే ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా తగ్గించుకునేందుకు ప్రణాళిక వేసింది. వచ్చే జూలై మధ్యలో తొలగింపుల ప్రక్రియ ప్రారంభమై నెలాకరు కల్లా పూర్తికానుంది. కొత్త సీఈవో లిప్ బు టాన్ వచ్చాక ఇది తొలి, భారీ ఉద్యోగాల కోత కానుంది.ఉద్యోగుల తొలగింపు విషయాన్ని ఇంటెల్ నేరుగా ప్రకటించనప్పటికీ ఈమేరకు కంపెనీ ఉద్యోగులకు ఇంటర్నల్ మెమోల ద్వారా తెలియజేసినట్లు పలు అంతర్జాతీయ వార్త పత్రికల్లో కథనాలు వచ్చాయి. కంపెనీ తన అంతర్గత తయారీ విభాగమైన ఇంటెల్ ఫౌండ్రీలో కార్యకలాపాలను క్రమబద్ధీకరించుకుని, మరింత చురుకైన సంస్థగా మారాలని లక్ష్యంగా పెట్టుకుందని, అందులో భాగంగానే ఉద్యోగ కోతలు చేపడుతోందని పేర్కొన్నాయి.కంపెనీ చేపడుతున్న ప్రస్తుత తొలగింపుల్లో ఎంత మందిపై ప్రభావం పడుతుందనే విషయం వెల్లడికాలేదు. సీనియర్ నాయకత్వం నిర్దేశించిన ఆర్థిక లక్ష్యాలను చేరుకునే వరకు, తొలగింపులను అమలు చేయడంలో వ్యాపార యూనిట్లకు విచక్షణ ఉంటుందని సంబంధిత వర్గాలు సూచిస్తున్నాయి. పర్సనల్ కంప్యూటర్లు, ల్యాప్ టాప్ మార్కెట్లో డిమాండ్ పడిపోవడం, అమ్మకాలు క్షీణించడం, మరోవైపు ఎన్విడియా, ఏఎండీ వంటి ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ నేపథ్యంలో ముఖ్యంగా ఏఐ ఫోకస్డ్ హార్డ్ వేర్ లో ఉద్యోగ పునర్నిర్మాణంపై ఇంటెల్ దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. -
ఇండియాలో స్టార్లింక్ సేవలకు డేట్ఫిక్స్?
ఎలాన్మస్క్కు చెందిన స్టార్లింక్ మరో రెండు నెలల్లో భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించనుందని వార్తలు వెలువడుతున్నాయి. ఈ పరిణామం భారతదేశం డిజిటల్ అంతరాన్ని, ముఖ్యంగా గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో ఇంటర్నెట్ సర్వీసులను అందించేందుకు తోడ్పడుతుందని కొందరు భావిస్తున్నారు.సమస్యలకు పరిష్కారం..స్టార్లింక్ భారత మార్కెట్లోకి ప్రవేశించడం చాలా కాలంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొంటున్న కమ్యూనిటీలకు పరిష్కారాన్ని అందిస్తుందనే అభిప్రాయాలున్నాయి. ఫైబర్ ఆప్టిక్ లేదా సాంప్రదాయ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ల మాదిరిగా కాకుండా స్టార్లింక్లో లో-ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈఓ) ఉపగ్రహాల ద్వారా పనిచేస్తుంది. ఇది చాలా మారుమూల ప్రాంతాల్లో నిరంతర ఇంటర్నెట్ కనెక్టివిటీని నిర్ధారిస్తుంది. ప్రస్తుతం 4,000 స్టార్లింక్ ఉపగ్రహాలు కక్ష్యలో ఉన్నాయి.ఇదీ చదవండి: ఒక్క ఉద్యోగం.. 14 రౌండ్ల ఇంటర్వ్యూ!ఇండియాలో స్టార్లింక్ ఛార్జీలపై అంచనాలు..స్టార్లింక్ ఇంటర్నెట్ కోసం అవసరమయ్యే హార్డ్వేర్కు ప్రస్తుతం రూ.25,000-రూ.35,000 మధ్య ఖర్చు అవుతుంది. నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ రూ.5,000-రూ.7,000గా అంచనా వేస్తున్నారు. ఇంటర్నెట్ స్పీట్ 25-220 ఎంబీపీఎస్ ఉంటుందని చెబుతున్నారు. ఆ ధర భారతదేశం సగటు బ్రాండ్బ్యాండ్ వ్యయం నెలకు రూ.700-రూ.1,500 కంటే చాలా ఎక్కువ. బ్రాండ్బ్యాండ్ పోటీదారులకు ధీటుగా విస్తృతంగా ఇంటర్నెట్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు స్పేస్ఎక్స్ భారతదేశంలో నిర్దిష్ట ధరలను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. -
సోనీ కెమెరాతో వివో కొత్తఫోన్.. రూ.3000 డిస్కౌంట్
వివో సంస్థ టీ4 అల్ట్రా పేరుతో కొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. ఇందులో సోనీ ఐఎంఎక్స్ 921 50 మెగాపిక్సల్స్ రియర్ కెమెరా సెన్సార్లు ఉంటాయని కంపెనీ తెలిపింది. మొత్తంగా వెనుక మూడు కెమెరాలు ఉంటాయి. 100 ఎక్స్ హైపర్జూమ్ ఫీచర్ కూడా ఉంది. ఫోనిక్స్ గోల్డ్, మెటీరియర్ గ్రే రంగుల్లో ఇది లభించనుందని వివో పేర్కొంది.మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్లస్ ప్రాసెసర్తో ఉండే ఈ ఫోన్ 8జీబీ, 256జీబీ వేరియంట్ ధర రూ.37,999.12జీబీ, 256జీబీ వేరియంట్ ధర రూ.39,999.12జీబీ, 512జీ వేరియంట్ ధర రూ.41,999గా కంపెనీ ప్రకటించింది.ఇదీ చదవండి: చమురు సలసల.. రూపాయి డీలాఫ్లిప్కార్ట్తోపాటు వివో ఇండియా ఈ స్టోర్లో ఈ నెల 18 నుంచి అమ్మకాలు మొదలవుతాయని తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డులపై ఫ్లాట్ రూ.3,000 డిస్కౌంట్ను ప్రకటించింది. రూ.5,000 ఎక్స్ఛేంజ్ బోనస్తోపాటు, 9 నెలల నోకాస్ట్ ఈఎంఐ సదుపాయలను కూడా ఆఫర్ చేస్తోంది. -
ఏఐ చిప్ మార్కెట్ జోరు..
న్యూఢిల్లీ: వచ్చే మూడేళ్లలో (2028 నాటికి) కృత్రిమ మేథ (ఏఐ) ప్రాసెసర్ మార్కెట్ 500 బిలియన్ డాలర్ల స్థాయిని అధిగమిస్తుందని అంచనా వేస్తున్నట్లు అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్ (ఏఎండీ) సీఈవో ’లీసా సూ’ తెలిపారు. 2023లో 45 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ విభాగం ఏటా 60 శాతం మేర వృద్ధి చెందుతోందని వివరించారు. అడ్వాన్సింగ్ ఏఐ 2025 కాన్ఫరెన్స్లో ’ఎంఐ350 సిరీస్’ జీపీయూలు (గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు), ఇతర ఉత్పత్తులను ఆవిష్కరించిన సందర్భంగా లీసా ఈ విషయాలు వివరించారు. కొత్తగా ప్రవేశపెట్టిన చిప్లు నలభై శాతం అధిక సామర్థ్యంతో పని చేస్తాయని పేర్కొన్నారు. డెవలపర్ కమ్యూనిటీ కొత్త ఉత్పత్తులను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు డెవలపర్ క్లౌడ్ యాక్సెస్ ప్రోగ్రాంను కూడా కంపెనీ ప్రవేశపెట్టింది. ’హీలియోస్ ఏఐ ర్యాక్ స్కేల్’ సొల్యూషన్ని కూడా ఏఎండీ ఆవిష్కరించింది. ఇది వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. ఏఐని వినియోగించే 10 అతి పెద్ద కంపెనీల్లో ఏడు సంస్థలు తమ ఏఎండీ ఇన్స్టింక్ట్ యాక్సిలరేటర్లను ఉపయోగిస్తున్నాయని, ఈ లిస్టులో భారత టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కూడా ఉందని లీసా చెప్పారు. కాన్ఫరెన్స్ సందర్భంగా ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్తో పాటు మెటా, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ తదితర దిగ్గజాల ప్రతినిధులతో ఆమె సమావేశమయ్యారు. -
కొత్త ఫోనొచ్చింది.. రూ.10 వేలకే పవర్ఫుల్ 5జీ ఫోన్
తక్కువ బడ్డెట్లో స్మార్ట్ఫోన్లు తయారు చేసే లావా మరోసారి బడ్జెట్ లో శక్తివంతమైన ఫ్లాగ్ షిప్ ఫోన్ ను లాంచ్ చేసింది. లావా స్టోర్మ్ ప్లే 5జీ (Lava Storm Play 5G) ఫోన్ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రూ.10,000 కంటే తక్కువ ధరకే హై ఎండ్ స్పెసిఫికేషన్లను ప్రవేశపెట్టిన డివైజ్ ఇది. బడ్జెట్ సెగ్మెంట్లో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన డైమెన్సిటీ 7060 చిప్సెట్, ఎల్పీపీడీడీఆర్5 ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్, 120 హెర్ట్జ్ డిస్ప్లే వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. లావా స్టోర్మ్ ప్లే 5జీ ధరఈ లావా ఫోన్ 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్తో ఒకే ఒక వేరియంట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్ ధరను కేవలం రూ.9,999గా నిర్ణయించారు. రూ.9,999 ప్రారంభ ధరతో ఈ స్మార్ట్ ఫోన్ జూన్ 24 నుంచి అమెజాన్ లో తొలి సేల్ కు అందుబాటులో ఉండనుంది.👉 జియో 3 కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. తక్కువ ఖర్చుతో ఎక్కువ వ్యాలిడిటీఫీచర్లు..స్పెసిఫికేషన్లులావా స్టార్మ్ ప్లే 5జీ మీడియాటెక్ కొత్త డైమెన్సిటీ 7060 5జీ ప్రాసెసర్తో పనిచేస్తుంది. ఇది గేమింగ్ కోసం మంచి పనితీరును అందిస్తుంది.ఇందులో 6 జీబీ ఫాస్ట్ ఎల్పీడీడీఆర్5 ర్యామ్ ఇవ్వగా 6 జీబీ వర్చువల్ ర్యామ్తో మరింత విస్తరించుకోవచ్చు. అంటే మొత్తం 12 జీబీ ర్యామ్ లభిస్తుంది. ఇక స్టోరేజ్ కోసం 128 జీబి యూఎఫ్ఎస్ 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది.ఇందులో 6.75 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లేను ఇచ్చారు. కెమెరా సెటప్ విషయానికొస్తే, 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ సెన్సార్తో డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. ముందువైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు.లావా స్టార్మ్ ప్లేలో 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది.సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, యూఎస్బీ-సీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్, డ్యుయల్ సిమ్ 5జీ సపోర్ట్, ఐపీ64 రేటింగ్ వంటి ప్రత్యేకతలున్నాయి.అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఫోన్ క్లీన్ ఆండ్రాయిడ్ 15తో ఎలాంటి బ్లోట్ వేర్ లేకుండా, అంటే అనవసరమైన యాప్స్, పాప్ అప్ యాప్స్ లేకుండా పనిచేస్తుంది.2 సంవత్సరాల పాటు 1 ప్రధాన ఓఎస్ అప్ డేట్, సెక్యూరిటీ అప్ డేట్ లను అందిస్తామని కంపెనీ హామీ ఇస్తోంది. -
ఇన్ఫోసిస్లో రూ.కోట్లు సంపాదిస్తున్నారు.. ఇదిగో కొత్త డేటా
ఐటీ పరిశ్రమలో ఉద్యోగులకు రూ.లక్షల్లో వేతనాలు ఉంటాయన్నది తెలిసిందే. అయితే కొంత మంది ఉన్నతోద్యోగులు రూ.కోట్లలో సైతం పరిహారాలు అందుకుంటారు. దేశంలో రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్లో రూ.కోట్లు సంపాదిస్తున్నవారి సంఖ్య ఈసారి పెరిగింది. అంతక్రితం ఏడాది క్షీణత తరువాత, వార్షికంగా రూ .1 కోటి కంటే ఎక్కువ సంపాదించే ఇన్ఫోసిస్ ఉద్యోగుల సంఖ్య 2025 ఆర్థిక సంవత్సరంలో 9 శాతం పెరిగి 112కు చేరుకుంది.స్టాక్ ఇన్సెంటివ్స్ పర్క్విసైట్ విలువలో మార్పులు, అధిక వేరియబుల్ పే ఈ పెరుగుదలకు ప్రధాన కారణం. అదీకాకుండా 33 మంది అధిక సంపాదన కలిగిన ఉద్యోగులు ఇన్ఫోసిస్లో ఏడాది మధ్యలో చేరారు. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం.. వీరు ఒక్కొక్కరు సగటున నెలకు రూ .8.5 లక్షలకు పైగా జీతం పొందుతున్నారు. కంపెనీలో రూ .1 కోటి కంటే ఎక్కువ సంపాదించే వారి సంఖ్య 2024 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది పూర్తీగా రివర్స్ అయింది. అప్పుడు వీరి సంఖ్య అంతకు ముందు ఏడాది కంటే 17 శాతం తగ్గింది.చారిత్రాత్మకంగా 2023 ఆర్థిక సంవత్సరం అత్యధికంగా 124 మంది ఉద్యోగులను నమోదు చేయగా, 2020 ఆర్థిక సంవత్సరం గత ఆరేళ్లలో అత్యల్పంగా 74 మందిని నమోదు చేసింది. ఈ జాబితాలో భారత్ కు చెందిన ఉద్యోగులు మాత్రమే ఉన్నారని, టాప్ 10 ఎగ్జిక్యూటివ్ లను మినహాయించారని కంపెనీ స్పష్టం చేసింది. ఈ 112 మంది ఉద్యోగుల మొత్తం వేతనం 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.203 కోట్లుగా ఉంది. సీఎఫ్వో జయేశ్ సంఘ్ రాజ్కా రూ.8.8 కోట్ల పరిహారంతో అగ్రస్థానంలో నిలవగా, చీఫ్ డెలివరీ ఆఫీసర్లు దినేష్ ఆర్ రూ.7.2 కోట్లు, సతీష్ హెచ్సీ రూ.6.9 కోట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచారు.👉 ఇదీ చదవండి: అమ్మో ఏఐతో జాబ్ ఇంటర్వ్యూ.. అన్నీ పట్టేస్తుంది!ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ అధిక సంపాదనలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది 2000 సంవత్సరానికి ముందు నుండి ఇన్ఫోసిస్లో ఉన్నారు. కొందరు 1990 నాటివారూ ఉన్నారు. ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఇన్ఫోసిస్ మొత్తం వ్యయం 2025 ఆర్థిక సంవత్సరంలో 4% పెరిగి రూ .85,950 కోట్లకు చేరుకుంది. ఇది దాని మొత్తం ఆదాయం రూ .1.63 లక్షల కోట్లలో 53 శాతం. 2025 మార్చి నాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3.24 లక్షలుగా ఉంది. -
జియో 3 కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. తక్కువ ఖర్చుతో ఎక్కువ వ్యాలిడిటీ
రిలయన్స్ జియో భారతదేశపు అతిపెద్ద టెలికాం సంస్థ. దేశంలోని మొబైల్ యూజర్లలో ఎక్కువ మంది జియోను వినియోగిస్తున్నారు. మీరు కూడా జియో యూజర్ అయి ఉండి, లాంగ్ బవ్యాలిడిటీతో తక్కువ ఖర్చులో రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే, ఈ సమాచారం మీ కోసమే. 84 రోజులు అంటే దాదాపు మూడు నెలలు వ్యాలిడిటీతో మంచి ప్రయోజనాలను అందించే మూడు రీఛార్జ్ ప్లాన్లను జియో ఇటీవల ప్రవేశపెట్టింది.జియో రూ.799 ప్లాన్జియో రూ .799 ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. ఇందులో అపరిమిత ఉచిత కాలింగ్ ప్రయోజనం లభిస్తుంది. దీంతోపాటు రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి. దీనితో పాటు, జియో హాట్స్టార్కు ఉచిత యాక్సెస్ కూడా ఈ ప్లాన్తో పొందవచ్చు.జియో రూ.859 ప్లాన్ఈ ప్లాన్ కూడా 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ వ్యాలిడిటీ ఉన్నన్నిరోజులూ అపరిమిత ఉచిత కాలింగ్ ప్రయోజనం ఆస్వాదించవచ్చు. దీంతోపాటు రోజుకు 2 జీబీ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి. అంతే కాకుండా జియో హాట్స్టార్కు ఉచిత యాక్సెస్ కూడా ఈ ప్లాన్తో ఆనందించవచ్చు.👉 ఇదీ చదవండి: రూ.200 లోపే రీచార్జ్.. 2 నెలలుపైగా వ్యాలిడిటీజియో రూ.889 ప్లాన్జియో రూ .889 ప్లాన్ కూడా 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో అపరిమిత ఉచిత కాలింగ్, రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్ ప్రయోజనాలు లభిస్తాయి. దీంతో పాటు జియో హాట్స్టార్కు ఉచిత యాక్సెస్ కూడా ఈ ప్లాన్లో చేర్చారు. అలాగే జియో సావన్కు కూడా ఉచిత యాక్సెస్ను కూడా వినియోగదారులు పొందుతారు. -
అగ్గి తగిలినా బుగ్గి కాని ‘బ్లాక్బాక్స్’
విమానయానంలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అందులోని పరిస్థితులను అర్థం చేసుకోవడంలో కాక్పిట్(పైలట్లు కుర్చునే ప్రదేశం) కమ్యూనికేషన్లను విశ్లేషించడం కీలకంగా మారుతుంది. ఘటనకు దారితీసిన పరిస్థితులను పరిశీలించేందుకు పరిశోధకులు కాక్పిట్ వాయిస్ రికార్డర్లు (సీవీఆర్), ఫ్లైట్ డేటా రికార్డర్ల(ఎఫ్డీఆర్)పై ఆధారపడుతుంటారు. సాధారణంగా వీటిని బ్లాక్బాక్స్ అని పిలుస్తారు. పైలట్ తీసుకునే నిర్ణయాలు, సిస్టమ్ వైఫల్యాలు, అత్యవసర ప్రతిస్పందనలను విశ్లేషించడం ద్వారా విమానయాన నిపుణులు భవిష్యత్తులో భద్రతా ప్రోటోకాల్స్ను మెరుగుపరిచేందుకు వీలవుతుందనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం ఘటనలోనూ బ్లాక్బాక్స్లోని వివరాలు కీలకంగా మారనున్నాయి. అయితే ప్రమాదం జరిగినచోట ఈ బ్లాక్బాక్స్ను ఇంకా గుర్తించాల్సి ఉంది.బ్లాక్బ్లాక్స్లోని వివరాల విశ్లేషణలో కీలక దశలుబ్లాక్బాక్స్ రికవరీప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి బ్లాక్బాక్స్ను ముందుగా రికవరీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సీవీఆర్, ఎఫ్డీఆర్ పరికరాలు తీవ్రమైన మంటలతోపాటు ప్రతికూల పరిస్థితులను తట్టుకునేలా రూపొందిస్తారు. ఫోరెన్సిక్ బృందాలు తమ దర్యాప్తును ప్రారంభించడానికి కీలకమైన ఆడియో, ఫ్లైట్ డేటాను దీని నుంచి సేకరిస్తాయి.ఆడియో విశ్లేషణకాక్ పిట్ ఆడియోను ట్రాన్స్స్క్రైబ్ చేయడం ద్వారా ప్రమాదం జరిగే ముందు వరకు సాగిన కమ్యునికేషన్ను విశ్లేషిస్తారు. కీలక క్షణాలను గుర్తించడానికి నిపుణులు పైలట్ సంభాషణలు, రేడియో ట్రాన్స్లేషన్లు, అలారం, ప్రమాద నేపథ్య శబ్దాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రమాద పరిస్థితుల్లో ఒత్తిడి స్థాయులు, కమాండ్ స్పష్టత, ప్రతిస్పందన సమయాన్ని వెల్లడిస్తుంది. ఇది సిబ్బంది సదరు పరిస్థితిని ఎలా నిర్వహించారో నిర్ణయించడానికి అవసరం అవుతుంది.ఎఫ్డీఆర్ నివేదికఫ్లైట్ డేటాతో కూడిన ఆడియో సింక్రనైజింగ్ ఎఫ్డీఆర్ రిపోర్ట్లో విమానం ఎత్తు, ఎయిర్ స్పీడ్, ఇంజిన్ పనితీరు, కంట్రోల్ ఇన్పుట్స్ వంటి పారామీటర్లు ఉంటాయి. నిబంధనల ప్రకారమే పైలట్ చర్యలు తీసుకున్నారా లేదా అనే వివరాలు ఇందులో ఉంటాయి. ప్రమాద పరిస్థితి ఎంత వేగంగా పెరిగిందో అంచనా వేయడానికి ఈ సింక్రనైజేషన్ తోడ్పడుతుంది.హెచ్చరికలు గుర్తించడంహెచ్చరిక సంకేతాలను గుర్తించడంలో సిబ్బంది ఎలా ప్రతిస్పందించారో అర్థం చేసుకోవడానికి ఈ బ్లాక్బాక్స్ ఉపయోగపడుతుంది. ఇంజిన్ ఫైర్ అలారంలు, అత్యవసర వ్యవస్థ యాక్టివేషన్తో సహా అగ్ని సంబంధిత వార్నింగ్లను విశ్లేషించేందుకు ఇది సాయం చేస్తుంది.సమన్వయాన్ని అంచనా వేయడంఅత్యవసర సమయంలో సిబ్బంది సమన్వయాన్ని అంచనా వేయడానికి పైలట్ కమ్యూనికేషన్ కీలకం. కెప్టెన్, ఫస్ట్ ఆఫీసర్ పనులను సరిగ్గా నిర్వర్తించారా.. నిబంధనలను పాటించారా.. అనే వివిధ అంశాలను పరిశీలిస్తారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) నుంచి గ్రౌండ్ సిబ్బంది అందించిన కమ్యూనికేషన్లను, అత్యవసర ప్రకటనలను విమాన సిబ్బంది అనుసరించారా లేదా అని గమనిస్తారు.ఇదీ చదవండి: సోనా కామ్స్టర్ ఛైర్మన్ మృతిసిస్టమ్ వైఫల్యాలను పరిశీలించడంఒకవేళ విద్యుత్ లేదా మెకానికల్ లోపం వల్ల అగ్నిప్రమాదం సంభవించినట్లయితే సిస్టమ్ వైఫల్యాలను పరిశీలించేందుకు బ్లాక్బాక్స్ ఉపయోగపడుతుంది. అందులోని ఆన్బోర్డ్ సెన్సార్లు, మెయింటెనెన్స్ రికార్డ్లు కారణాన్ని గుర్తించడంలో సహాయపడతాయి. డిజైన్ లోపాలు లేదా పట్టించుకోని భద్రతా సమస్యలు సంఘటనకు దోహదపడ్డాయా అని పరిశోధకులు అన్వేషిస్తారు. -
ఆన్లైన్ మోసాలకు ఎయిర్టెల్ చెక్
ఆన్లైన్ మోసాల కట్టడి చేసే దిశగా తమ ఏఐ ఆధారిత ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టంను దేశవ్యాప్తంగా మరింతగా అందుబాటులోకి తెస్తున్నట్లు టెలికం సంస్థ భారతి ఎయిర్టెల్ తెలిపింది. ఇందులో భాగంగా తెలంగాణలో దీన్ని ప్రవేశపెట్టిన 25 రోజుల వ్యవధిలోనే 1,80,000 పైచిలుకు హానికారక లింకులను బ్లాక్ చేసినట్లు పేర్కొంది.ఈ వ్యవస్థతో 54 లక్షల మందికి ప్రయోజనం చేకూరినట్లు వివరించింది. ఎయిర్టెల్ మొబైల్, బ్రాడ్బ్యాండ్ కస్టమర్లందరికీ ఇది ఆటోమేటిక్గా ఎనేబుల్ చేసినట్లు భారతి ఎయిర్టెల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఈవో అజయ్ అనంతపద్మనాభన్ చెప్పారు. ఎస్ఎంఎస్లు, వాట్సాప్, టెలిగ్రాం, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, ఈ–మెయిల్స్ మొదలైన వాటిల్లో వచ్చే లింకులను ఈ అధునాతన వ్యవస్థ ఫిల్టర్ చేస్తుందని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఈపీఎఫ్ క్లెయిమ్లకు వేగంగా ఆమోదంస్కాములను నివారించేందుకు తమ విభాగం నిరంతరం కృషి చేస్తోందని, ఎయిర్టెల్ కూడా సమర్ధవంతమైన ఫ్రాడ్ డిటెక్షన్ సొల్యూషన్ ప్రవేశపెట్టడం ప్రయోజనకరమైన విషయమని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ, డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. -
ఏఐ మార్కెట్ @ 17 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: దేశీ కృత్రిమ మేథ (ఏఐ) మార్కెట్ 2027 కల్లా ప్రస్తుత స్థాయి నుంచి మూడు రెట్లు వృద్ధి చెందనుంది. అంతర్జాతీయంగా అత్యంత వేగంగా ఎదుగుతున్న ఏఐ ఎకానమీల్లో ఒకటిగా భారత్ను నిలబెడుతూ 17 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. ఎంటర్ప్రైజ్ టెక్నాలజీలో పెట్టుబడులు పెరుగుతుండటం, డిజిటల్ వ్యవస్థ వృద్ధి చెందుతుండటం, నిపుణులైన ప్రొఫెషనల్స్ లభ్యత తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. బోస్టన్ కన్సలి్టంగ్ గ్రూప్ (బీసీజీ) రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ప్రపంచ ఏఐ టాలెంట్లో 16 శాతం మంది భారత్లో ఉన్నారు. దేశీ ఏఐ వ్యవస్థలో 6,00,000 మంది పైగా ఏఐ ప్రొఫెషనల్స్, 70 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. గత మూడేళ్లలో 2,000 పైగా ఏఐ స్టార్టప్లు ఏర్పాటయ్యాయి. డిజిటల్ ఇన్ఫ్రా దన్ను.. ఆధార్, యూపీఐ, డిజిలాకర్, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ)లాంటి డిజిటల్ మౌలిక సదుపాయాలు దేశీయంగా వివిధ రంగాలను ఏఐతో అనుసంధానించేందుకు సహాయకరంగా ఉంటున్నాయి. పెద్ద సంఖ్యలో ఇంటర్నెట్ యూజర్లు, విస్తృతంగా స్మార్ట్ఫోన్ వినియోగం కారణంగా భారత్లో భారీ స్థాయిలో డేటా జనరేట్ కావడం ఏఐ మోడల్స్ శిక్షణకు ఉపయోగకరంగా ఉంటోంది. ఇక ప్రస్తుతమున్న 152 డేటా సెంటర్ల నెట్వర్క్కు అదనంగా 2025లో భారత్లో కొత్తగా 45 సెంటర్లు రానున్నాయి. రూ. 10,000 కోట్లతో ప్రభుత్వం ప్రకటించిన ఇండియాఏఐ మిషన్ జాతీయ స్థాయిలో ఏఐ కంప్యూట్ మౌలిక సదుపాయాల కల్పనకు దోహదపడనుంది. దీనితో ఏఐ మోడల్ శిక్షణ, పరిశోధన కోసం 10,000 పైగా జీపీయూలు (గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు) అందుబాటులోకి వస్తాయి. ‘ఏఐ అనేది వ్యాపార సంస్థలకు ఒక ఆప్షన్గా కాకుండా అవసరంగా మారింది. భారతీయ కంపెనీలు అంతర్జాతీయంగా కూడా మరింత ధీమాగా పోటీపడగలుగుతున్నాయి. టెక్నాలజీ వినియోగం మాత్రమే కాకుండా మార్పులను సమర్ధవంతంగా ఎదుర్కొనడం, అంతర్గత వ్యవస్థలో ఏఐని వినియోగించుకోవడం వంటి అంశాలే అగ్రగామి కంపెనీలకు మిగతా సంస్థలకు మధ్య వ్యత్యాసాన్ని నిర్దేశిస్తాయని బీసీజీ ఇండియా ఎండీ మన్దీప్ కోహ్లి తెలిపారు. -
అమ్మో ఏఐతో జాబ్ ఇంటర్వ్యూ.. అన్నీ పట్టేస్తుంది!
ఆర్టిఫీషియల్ వినియోగం విస్తృతంగా పెరిగిపోయింది. ఇది లేదనకుండా ఏఐ అన్ని పనులూ చేసేస్తోంది. నోయిడాకు చెందిన అనుభవజ్ఞురాలైన ప్రొడక్ట్ మేనేజర్ రాధికా శర్మకు ఇటీవల ఒక ప్రత్యేకమైన ఉద్యోగ ఇంటర్వ్యూ అనుభవం ఎదురైంది. అక్కడ ఆమెను హ్యూమన్ ప్యానెల్కు బదులుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రోబోట్ ఇంటర్వ్యూయర్ అంచనా వేశారు.టెక్ లో దాదాపు దశాబ్ద అనుభవం ఉన్న శర్మ బిజినెస్ ఇన్ సైడర్ తో తన అనుభవాన్ని పంచుకున్నారు. వర్చువల్ స్క్రీనింగ్ సిస్టమ్ ఆమె నైపుణ్యాలను అంచనా వేయడమే కాకుండా ఆమె వస్త్రధారణపైనా ఫీడ్ బ్యాక్ అందించిందని వెల్లడించారు. ఈ అనుభవాన్ని "అద్భుతమైన అదేసమయంలో కలవరపరిచేది"గా ఆమె అభివర్ణించారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇంటర్వ్యూ ప్రక్రియ నుండి లాభనష్టాలు, ఇతర కీలక అంశాలను చర్చించారు.చిన్నదైన కుమార్తె సంరక్షణ కోసం రాధికా శర్మ తన ప్రొడక్ట్ ఓనర్ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. ఇప్పుడు ప్రొడక్ట్ మేనేజ్ మెంట్ పొజిషన్ ను వెతుక్కుంటూ మళ్లీ జాబ్ మార్కెట్లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఒక సాస్ కంపెనీ ఆమెను ఏఐ(AI) ఆధారిత స్క్రీనింగ్ ఇంటర్వ్యూకు ఆహ్వానించింది. ఇంటర్వ్యూ ప్రక్రియ ప్రారంభానికి ముందు నిశ్శబ్ద వాతావరణం ఉండేలా చూసుకోవాలని, కంప్యూటర్లోని ట్యాబ్ లను మార్చవద్దని, పర్యవేక్షణ కోసం స్క్రీన్ షేరింగ్ చేయాలని అవతల నుంచి సూచనలు వచ్చాయి.‘ఇంటర్వ్యూ ప్రారంభమైన వెంటనే, సుమారు 20 నిమిషాల టైమర్ ప్రారంభమైంది. అటు పక్క నుంచి మహిళా వాయిస్ తో కూడిన ఖాళీ స్క్రీన్ నన్ను పలకరించింది. ప్రొడక్ట్ మేనేజ్మెంట్ గురించి చాలా నిర్దిష్టమైన ప్రశ్నలు అడగడం ప్రారంభించింది" అని రాధికా శర్మ చెప్పారు. ఈ ఇంటర్వ్యూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జరుగుతుందని కంపెనీ ముందుగానే స్పష్టంగా పేర్కొంది. ఇంటర్వ్యూ ముగిసిన వెంటనే శర్మ ఏఐ టూల్ నుంచి సవివరమైన పనితీరు మదింపును అందుకున్నారు.తాను నిమగ్నమయ్యే విధానం, ఐ కాంటాక్ట్, ముఖ కవళికలు, భంగిమలు, వస్త్రధారణ వంటి అన్ని కొలమానాలతో పాటు ఆమె సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏఐ అంచనా వేసింది. ఆమె సాంకేతిక నైపుణ్యాలు బాగా సాధించినప్పటికీ, ఆమె దుస్తులు ప్రొఫెషనల్గా ధరించలేదని, ఐ కాంటాక్ట్ సక్రమంగా లేదని పేర్కొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను తక్కువగా అంచనా వేశానని, అమ్మో ఏఐ అన్నింటినీ క్షణ్ణంగా గమనిస్తుందని రాధికా శర్మ చెప్పుకొచ్చారు. -
డిజిటల్ సాధికారత కలకు ఎస్టీపీఐ రెక్కలు
సాక్షి, హైదరాబాద్: భారత్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాతావరణాన్ని బలోపేతం చేయడంతో ద్వారా దేశ ‘డిజిటల్ సాధికారత’కలకు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా మూలస్తంభంగా నిలుస్తోంది. సుమారు మూడు దశాబ్దాల క్రితం (1991లో) ఏర్పాటైన ఎస్టీపీఐ దేశం నుంచి సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో వృద్ధి, సాంకేతిక స్టార్టప్ల వాతావరణాన్ని వేగవంతం చేయడంలో కీలకంగా పనిచేస్తోంది. ఎస్టీపీఐ ఇటీవలే 34వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది. ఈ కోవలోనే ఏర్పాటైన ఎస్టీపీఐ హైదరాబాద్ విభాగం తెలంగాణ, ఏపీలో ఐటీ, స్టార్టప్ రంగాలకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. 1.35 లక్షల చదరపు అడుగుల వర్క్ స్పేస్తో భారత ఐటీ పరిశ్రమను ఎస్టీపీఐ హైదరాబాద్ బలోపేతం చేస్తోంది.రూ. 4.76 కోట్ల ఎగుమతులతో.. దేశవ్యాప్తంగా ఎస్టీపీఐకి 14 చోట్ల డైరెక్టరేట్లు ఉండగా హైదరాబాద్ ఎస్టీపీఐ పరిధిలో తెలంగాణ, ఏపీ ఉన్నాయి. ఇరు రాష్ట్రాల్లోని కాకినాడ, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్లో కలుపుకొని మొత్తం ఐదు కేంద్రాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్, ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల లక్ష్యంగా ఎగుమతుల యూనిట్లు (ఈఓయూ), తయారీ జోన్లు (ఈపీజెడ్)లను ఎస్టీపీఐ ఏర్పాటు చేసింది. 2023–24లో రూ. 1.23 లక్షల కోట్లు, 2024–25లో రూ. 1.42 లక్షల కోట్ల ఐటీ ఎగుమతుల ద్వారా హైదరాబాద్ ఎస్టీపీఐ భారత ఆర్థిక వృద్ధిలో కీలకంగా మారింది. 1992–93లో రూ. 4.76 కోట్ల ఐటీ ఎగుమతుల ద్వారా హైదరాబాద్ ఎస్టీపీఐ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.ఇక్కడ ‘ఇమేజ్ ’.. అక్కడ ‘కల్పతరు’ ఐటీ ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఎస్టీపీఐ హైదరాబాద్ కొత్తగా ‘ఇమేజ్’, ‘కల్పతరు’ను ఏర్పాటు చేసింది. గేమింగ్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, కంప్యూటర్ విజన్, ఏఐ స్టార్టప్లకు అవసరమైన మార్గదర్శనం, సాంకేతిక మద్దతు, నిధుల సమీకరణ తదితరాల కోసం 2020లో హైదరాబాద్ ఇమేజ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసింది. ఇందులో సీవీ ల్యాబ్, గేమ్ ల్యాబ్తోపాటు స్టార్టప్లకు అవసరమైన పలు సమీకృత కార్యక్రమాలు చేపట్టింది. అలాగే విశాఖపట్నంలో ‘కల్పతరు’పేరిట సెంటర్ ఆఫ్ ఆంట్రప్రెన్యూర్షిప్ను స్థాపించారు. ఆవిష్కర్తలకు అవసరమైన మౌలిక వసతులు, నిధులు, మార్కెటింగ్ తదితరాలను కల్పతరు ద్వారా అందుబాటులోకి తెచ్చారు.ఐటీ ఊతానికి ఎస్టీపీఐలు దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి ఊతమిచ్చే లక్ష్యంతో 1991లో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ)కు శ్రీకారం చుట్టారు. ఐటీ సంస్థలకు అవసరమైన డేటా కమ్యూనికేషన్ సౌకర్యాలు, కంప్యూటర్లు, కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేసే బాధ్యత ఎస్టీపీఐకి అప్పగించారు. మరోవైపు సాఫ్ట్వేర్ ఎగుమతులను ప్రోత్సహించడం, మార్కెటింగ్లో మద్దతు, ప్రాజెక్టులకు అనుమతులు, ఎగుమతులకు అవసరమయ్యే సర్టిఫికేషన్ తదితరాలన్నీ ఒకేచోట అందుబాటులోకి తెచ్చారు. తొలుత బెంగళూరు, పుణే, భువనేశ్వర్లో ఎస్టీపీయూ డైరెక్టరేట్లు ఏర్పాటు చేయగా ఆ తర్వాతి కాలంలో హైదరాబాద్, నోయిడా, గాందీనగర్, త్రివేండ్రం తదితర చోట్లకు విస్తరించారు.ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాల వైపు దేశంలో ఐటీ రంగం శైశవ దశలో ఉన్న కాలంలో మూడు కేంద్రాలతో ప్రారంభమైన ఎస్టీపీఐ ప్రస్తుతం 67 కేంద్రాలకు కార్యకలాపాలను విస్తరించింది. అందులో 59 కేంద్రాలు ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాల్లోనే ఉన్నాయి. ఎస్టీపీఐలో నమోదైన ఐటీ పరిశ్రమల ద్వారా గతేడాది ఐటీ ఎగుమతులు రూ. 10 లక్షల కోట్లకు చేరాయి. దేశంలోని 24 ఎస్టీపీఐ సెంటర్ ఆఫ్ ఆంట్రప్రెన్యూర్షిప్ (సీఓఈ)ల ద్వారా 1,400 స్టార్టప్లకు మద్దతు లభించింది. వాటికోసం ఇప్పటివరకు రూ. 574 కోట్ల నిధులను సేకరించింది. దేశ డిజిటల్, ఆవిష్కరణల వాతావరణానికి ఎస్టీపీఐ మూల స్తంభంగా నిలుస్తోంది. హైదరాబాద్ ఎస్టీపీఐ పరిధిలోనూ ‘ఇమేజ్’, ‘కల్పతరు’ద్వారా 134 స్టార్టప్లకు ప్రోత్సాహాన్ని అందించింది. – అర్వింద్ కుమార్, డైరెక్టర్ జనరల్, ఎస్టీపీఐ -
ఆండ్రాయిడ్ కొత్త ఓఎస్ అప్డేట్ విడుదల
గూగుల్ తన ఆండ్రాయిడ్ వినియోగదారులకు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ను తీసుకొచ్చినట్లు తెలిపింది. యాపిల్ వరల్డ్వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్(డబ్ల్యూడబ్ల్యూడీసీ)లో ఇటీవల ఐఓఎస్ 26ను ప్రకటించిన నేపథ్యంలో గూగుల్ కూడా పోటీగా ఆండ్రాయిడ్ 16ను లాంచ్ చేసింది. అయితే ఈ అప్డేట్ ఇంకా అందరికీ అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతానికి ఎంపిక చేసిన గూగుల్ పిక్సెల్ డివైజ్ల్లో మాత్రమే దీన్ని అందిస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఓఎస్ ద్వారా యూజర్లకు మరింత భద్రత, డిజైన్, పనితీరులో అనేక అప్గ్రేడ్లను తీసుకొస్తున్నట్లు గూగుల్ తెలిపింది.ఆండ్రాయిడ్ 16ను సపోర్ట్ చేసే ఫోన్ల జాబితాగూగుల్ పిక్సెల్ ఫోన్లకు ముందుగా కొత్త సాఫ్ట్వేర్ కోసం యాక్సెస్ ఇస్తోంది. శామ్సంగ్, వన్ప్లస్, షియోమీ వంటి ఇతర బ్రాండ్లు తమ కస్టమ్ ఆప్షన్లకు అనుగుణంగా ఆండ్రాయిడ్ 16ను రాబోయే కొన్ని నెలల్లో అప్డేట్ చేసుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతానికైతే ఆండ్రాయిడ్ 16 అప్డేట్ కింది మోడళ్లలో మాత్రమే అందుబాటులో ఉంటుందని గూగుల్ పేర్కొంది.పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో, పిక్సెల్ 6ఎపిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో, పిక్సెల్ 7ఎపిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో, పిక్సెల్ 8ఎపిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్, పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్, పిక్సెల్ 9ఎపిక్సెల్ ఫోల్డ్పిక్సెల్ టాబ్లెట్పైన తెలిపిన డివైజ్ల్లో దేనినైనా ఉపయోగిస్తుంటే ఆండ్రాయిడ్ 16 ఓవర్ ది ఎయిర్ (ఓటీఏ) అప్డేట్గా కొత్త ఓఎస్ను అందిస్తారు.ఎలా ఇన్స్టాల్ చేయాలంటే..ముందుగా ఫోన్లో సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేయాలి.కిందకు స్క్రోల్ చేసి సిస్టమ్ సెట్టింగ్స్లో సాఫ్ట్వేర్ అప్డేట్ను ట్యాప్ చేయాలి.అప్డేట్ల కోసం చెక్ ఆప్షన్ ఎంచుకోవాలి.ఒకవేళ ఆండ్రాయిడ్ 16 అందుబాటులో ఉంటే, డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ ఆప్షన్ ట్యాప్ చేయాలి.పూర్తయిన తర్వాత కొత్త వెర్షన్ను ఉపయోగించేముందు ఒకసారి ఫోన్ను రిస్టార్ట్ అవుతుంది.ఇదీ చదవండి: అమెరికా బడ్జెట్ లోటుకు 5 నిమిషాల్లో పరిష్కారం ఇదే..!కొన్ని ప్రధాన ఫీచర్లు ఇవే..లాక్ స్క్రీన్పై లైవ్ అప్డేట్స్అడ్వాన్స్డ్ ప్రొటెక్షన్మెరుగైన యాప్ కంపాటబిలిటీఅడాప్టివ్ యాప్స్ ఫీచర్తో ఆండ్రాయిడ్ 16 యాప్స్ ఆటోమేటిక్గా స్క్రీన్ సైజులకు అడ్జస్ట్ అయ్యేలా చేస్తుంది.ఇది ఫోల్డబుల్ ఫోన్లు, టాబ్లెట్లకు అనుకూలంగా ఉంటుంది.సెట్టింగ్స్లో కొత్త కలర్ హైలైట్స్, అప్డేటెడ్ ఫాంట్స్, స్లీకర్ మీడియా కంట్రోల్స్ అందిస్తుంది.బ్యాటరీ హెల్త్ ఇండికేటర్ సూచిస్తుంది. -
ఉద్యోగులు ఆఫీస్కు రాకపోతే.. గూగుల్ కొత్త ఎత్తుగడ
ఉద్యోగులను తగ్గించుకునేందకు టెక్ దిగ్గజం గూగుల్ కొత్త ఎత్తుగడ ఎత్తుకుంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విధానం బలోపేతం పేరుతో సాధ్యమైనంత మేర ఉద్యగులను వదిలించుకునేందుకు ప్రణాళిక వేసింది. అమెరికాలో రిమోట్ వర్క్ విషయంలో గూగుల్ కఠినమైన విధానాన్ని తీసుకుంది. ఉద్యోగులను కార్యాలయానికి తిరిగి రావాలని లేదా స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజీని ఎంచుకోవాలని కోరింది.కొత్త ఆదేశాల ప్రకారం.. గూగుల్లోని కోర్, మార్కెటింగ్, రీసెర్చ్, నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ (కేఅండ్ఐ), కమ్యూనికేషన్స్ సహా కీలక విభాగాల్లోని ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసుకు తిరిగి రావాల్సి ఉంటుంది. ఈ విధానం ప్రధానంగా గూగుల్ కార్యాలయానికి 50 మైళ్ల లోపల నివసించే ఉద్యోగులను ప్రభావితం చేస్తుంది. ఇది పనిప్రాంత అంచనాలలో గణనీయమైన మార్పును సూచిస్తుంది.ఈ పరివర్తనను సులభతరం చేయడానికి, గూగుల్ కొత్త మార్గదర్శకాలను పాటించని యూఎస్ ఆధారిత ఉద్యోగులకు స్వచ్ఛంద తొలగింపు ప్యాకేజీలను అందిస్తోంది. అయితే ఇవి తొలగింపులు కాదని గూగుల్ చెబుతున్నప్పటికీ, ఇలాంటి నిష్క్రమణ కార్యక్రమాలు చారిత్రాత్మకంగా విస్తృతమైన శ్రామిక శక్తి తగ్గింపులకు ముందు అమలవుతున్నవే.ఉద్యోగుల వ్యక్తిగత సహకారం నేరుగా ఆఫీస్లలో ఉండాలని భావిస్తున్న గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఏఐ ఫోకస్డ్ కార్యక్రమాలనూ టెక్ దిగ్గజం వేగవంతం చేసింది. కంపెనీలు తమ సొంత రిమోట్ వర్క్ వ్యూహాలను పునఃసమీక్షిస్తున్నందున, ఈ విధానం టెక్ పరిశ్రమ అంతటా ప్రకంపనలు సృష్టిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.👉ఇది చదివారా? లక్షలకొద్దీ టెకీలు.. బెంగళూరు కొత్త రికార్డ్గూగుల్ తాజా ఈ ప్రకటన కొన్ని ఆందోళనలను రేకెత్తిస్తోంది. గతంలో గూగుల్ ఇదే తరహా ఎగ్జిట్ ఆఫర్లు ఇచ్చి ఉద్యోగాల కోత విధించింది. 2023లో కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 12,000 మంది ఉద్యోగులను తొలగించగా, ఈ ఏడాది కూడా ట్రెజరీ, బిజినెస్ సర్వీసెస్ వంటి విభాగాల్లో చిన్నపాటి తొలగింపులు చేపట్టింది. ఈసారి ఎంతమందిపై ప్రభావం పడుతుందో స్పష్టంగా తెలియనప్పటికీ.. గూగుల్ తన ఎక్కువ మంది సిబ్బందిని ఆఫీస్లకు తిరిగి రప్పించాలని భావిస్తోంది. ఇందుకు ఇష్టపడని వాళ్లు ఉద్యోగం వీడాల్సి ఉంటుంది. -
యువతకు సత్య నాదెళ్ల సూచన
కృత్రిమ మేధకు ఆదరణ పెరుగుతున్న ప్రస్తుత రోజుల్లో కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు, ఔత్సాహిక సాఫ్ట్వేర్ ఇంజినీర్లు బేసిక్స్పై పట్టు సాధించాలని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సూచించారు. టెక్ యూట్యూబర్ సజ్జాద్ ఖాడేతో జరిగిన ఇంటర్వ్యూ సందర్భంగా సత్య నాదెళ్ల మాట్లాడుతూ.. ఏఐ కోడింగ్, ఇతర సంక్లిష్టమైన పనులను ఆటోమేట్ చేస్తున్నప్పటికీ టెక్ డెవలప్మెంట్కు మానవ నైపుణ్యాలు అవసరం అవుతాయని చెప్పారు. బలమైన కంప్యూటేషనల్ థింకింగ్, సిస్టమ్ డిజైన్ నైపుణ్యాలపై ఎక్కువగా ఆధారపడుతున్నట్లు పేర్కొన్నారు.సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ ప్రాథమికాంశాలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యమని ఈ సందర్భంగా సత్య నాదెళ్ల స్పష్టం చేశారు. సమస్యలను తార్కికంగా పరిష్కరించాలని, నిర్మాణాత్మక సొల్యూషన్స్ సృష్టించాల్సిన అవసరం ఉందన్నారు. సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్గా ఎదిగేందుకు ఏఐ మానవుల ప్రయాణాన్ని వేగవంతం చేస్తోందని సత్య పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయిలో వ్యవస్థలను అర్థం చేసుకోవాలని చెప్పారు. భవిష్యత్తులో సిస్టమ్ కాంప్రహెన్షన్కు పెరుగుతున్న ప్రాముఖ్యతను సత్య సూచించారు.ఇదీ చదవండి: యూపీఐ లావాదేవీలపై త్వరలో ఛార్జీలు?సుందర్ పిచాయ్ కూడా అదే బాటలో..లెక్స్ ఫ్రిడ్మన్తో గతంలో జరిగిన పాడ్కాస్ట్లో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ కంప్యూటర్ కోడింగ్ రాసేందుకు 30% ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయపడుతుందని చెప్పారు. మరింత సృజనాత్మక పనుల కోసం మానవ ప్రతిభ తప్పకుండా అవసరం అవుతుందన్నారు. ఏఐ తమ ఇంజినీరింగ్ వేగాన్ని 10% పెంచిందని చెప్పారు. వచ్చే సంవత్సరం మరింత మంది ఏఐ ఇంజినీర్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పిచాయ్ తెలిపారు. -
నథింగ్ ఫోన్ 3 లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు ఇవేనా..
బ్రిటన్కు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ నథింగ్ టెక్నాలజీ లిమిటెడ్ ‘నథింగ్ ఫోన్ 3’ను జులై 1, 2025న లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. గతంలో ఉన్న మోడళ్లతో పోలిస్తే దీనిలో కొన్ని డిజైన్, హార్డ్వేర్లో మార్పులను తీసుకొస్తున్నట్లు పేర్కొంది. అయితే టెక్ నిపుణుల అంచనాల ప్రకారం నథింగ్ ఫోన్ 3లో తీసుకొస్తున్న మార్పులు కింది విధంగా ఉండనున్నాయి.ఇంటర్ఫేస్: కంపెనీ ఉత్పత్తులకు సిగ్నేచర్గా నిలిచిన ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్ను తొలగించడం లేదు.మూడు 50 ఎంపీ కెమెరాలు: మెరుగైన ఫొటోగ్రఫీ కోసం ప్రధాన, అల్ట్రావైడ్, టెలిఫోటో లెన్స్లతో కొత్త కెమెరా మాడ్యూళ్లను అందిస్తుంది.స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ లేదా జెన్ 3: క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ చిప్ సెట్ 8 ప్రాసెసర్తో మార్కెట్లోకి తీసుకొస్తారని భావిస్తున్నారు. ఇది అధిక పనితీరు, ఏఐ ఆధారిత ఫీచర్లను అందిస్తుంది.నథింగ్ ఓఎస్ 3.0 (ఆండ్రాయిడ్ 15): మెరుగైన యూజర్ అనుభవం కోసం ఇంటర్నల్గా నథింగ్ ఓఎస్ 3.0ను తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది.6.77 అంగుళాల ఎమోలెడ్ డిస్ప్లే: 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, మెరుగైన విజువల్స్ కోసం ఎల్టీపీఓ టెక్నాలజీ.5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ: 50 వాట్ వైర్డ్, 25 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సదుపాయం ఉంటుంది.ఇదీ చదవండి: ఉద్యోగులను తైవాన్ పంపుతున్న టాటా గ్రూప్.. ఎందుకంటే..ధరలు ఇలా.. (అంచనా మాత్రమే)ఇండియాలో రూ.60,000-రూ.65,000అంతర్జాతీయ మార్కెట్లో: 799 డాలర్లు – 899 డాలర్లు (సుమారు రూ.68,000–రూ.73,000) -
ఉద్యోగులను తైవాన్ పంపుతున్న టాటా గ్రూప్.. ఎందుకంటే..
దేశంలో సెమీకండక్టర్ల తయారీలో ముందడుగు వేసేందుకు టాటా ఎలక్ట్రానిక్స్ వేగంగా దూసుకుపోతుంది. సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ (ఫ్యాబ్), అసెంబ్లింగ్ అండ్ టెస్ట్ (ఓశాట్) సదుపాయం కోసం కంపెనీ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ విభాగంలో ఉద్యోగులకు అవసరమైన నైపుణ్యాల కోసం తైవాన్కు శిక్షణ నిమిత్తం పంపుతున్నట్లు ఈ పరిణామాలపై అవగాహన ఉన్న వ్యక్తులు తెలిపారు.టాటా ఎలక్ట్రానిక్స్ గుజరాత్లోని ధోలేరాలో సెమీకండక్టర్లకు సంబంధించిన ఫ్యాబ్ సదుపాయాన్ని ఏర్పాటు చేయనుంది. దీన్ని నిర్వహించడానికి అవసరమైన ప్రత్యేక నైపుణ్యాల్లో శిక్షణ కోసం తన టెక్నాలజీ భాగస్వామిగాఉన్న తైవాన్కు చెందిన పవర్చిప్ సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కార్పొరేషన్ (పీఎస్ఎంసీ)కు 200 మంది ఉద్యోగులను పంపింది. పీఎస్ఎంసీలో ఒకేసారి శిక్షణ ఇచ్చేవారి సంఖ్య పరిమితం కావడంతో కంపెనీ నిర్మాణాత్మక ప్రణాళికను అనుసరిస్తోంది.ఇదీ చదవండి: చాట్జీపీటీ డౌన్.. ఆఫీస్లో ఉద్యోగులు రిలాక్స్!ఇకపై ప్రతిసారి 50 నుంచి 75 మందిని శిక్షణకు పంపించాలని నిర్ణయించింది. ధోలేరాలో టాటా ఎలక్ట్రానిక్స్ రూ.91,000 కోట్ల విలువైన ఫ్యాబ్ ద్వారా 20,000 మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలను కల్పించాలని యోచిస్తోంది. అసోంలో రూ.27,000 కోట్ల ఓశాట్ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 27,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తోంది. 2024 మార్చిలో ధోలేరాలో టాటా యూనిట్ భూమిపూజ కార్యక్రమంలో మాట్లాడిన కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్వనీ వైష్ణవ్ 2026 డిసెంబర్ నాటికి ఆ యూనిట్ నుంచి మొదటి చిప్ బయటకు వస్తుందని చెప్పారు. -
చాట్జీపీటీ డౌన్.. ఆఫీస్లో ఉద్యోగులు రిలాక్స్!
ప్రస్తుతం జనరేటివ్ ఏఐ ట్రెండ్ కొనసాగుతోంది. రిస్పాన్సివ్ చాట్బాట్లపై ఎక్కువగా ఆధారపడేవారు అధికమవుతున్నారు. దాంతో జనరేటివ్ ఏఐ లేకుండా రోజు గడవని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఓపెన్ఏఐకి చెందిన పాపులర్ ఏఐ చాట్బాట్ చాట్జీపీటీ సేవల్లో మంగళవారం ప్రపంచవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. దాంతో వినియోగదారులు ఈ సేవలను యాక్సెస్ చేసుకోలేకపోయారు.ఈ సమస్యను పరిష్కరించేందుకు పని చేస్తున్నట్లు ఓపెన్ఏఐ అధికారిక స్టేటస్ పేజీలో కంపెనీ వివరాలు వెల్లడించింది. అయితే సేవలు తిరిగి పునరుద్ధరించే వరకు చాట్జీపీటీ సర్వీసులో అంతరాయం యూజర్ల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై మీమ్స్, జోకులు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఆఫీస్లో చాట్జీపీటీ పని చేయకపోవడంతో ఉద్యోగులు రిలాక్స్ అవుతున్నట్లు చేపేలా ఫొటోలు షేర్ చేస్తున్నారు.Me and my co-workers in the office right now because ChatGPT is down pic.twitter.com/50FHYgeU1D— Yash. (@TheSDELad) June 10, 2025Everyone running to twitter to check if chatgpt is down for anyone else #chatgpt #chatgptdown pic.twitter.com/n2oJlbex2n— Jeet (@JeetN25) June 10, 2025ఇదీ చదవండి: ఎన్ఆర్ఐలకు భారత్లో ఐటీ నోటీసులు!This is how I feel when Chat GPT is down: #ChatGPT pic.twitter.com/Ne1pslXFk7— Anusurya (@Anusuryatomar3) June 10, 2025చాట్జీపీటీ సర్వీసుల్లో అంతరాయం ఏర్పడడంతో #chatgptdown హ్యాషట్యాగ్ వైరల్ అయింది. డైన్డిటెక్టర్ నివేదికల ప్రకారం యూజర్ల సమస్యల్లో 93 శాతం నేరుగా చాట్జీపీటీకి సంబంధించినవి. తక్కువ శాతం ఓపెన్ఏఐ యాప్, లాగిన్ సమస్యలకు సంబంధించినవి. నిన్న మధ్యాహ్నం 2.45 గంటలకు ప్రారంభమైన ఈ అంతరాయం మధ్యాహ్నం 3 గంటల తర్వాత గరిష్ట స్థాయికి చేరుకుంది. తర్వాత సమస్యను పరిష్కరించారు. -
రూ.200 లోపే రీచార్జ్.. 2 నెలలుపైగా వ్యాలిడిటీ
దేశంలో ఇప్పుడు దాదాపు ప్రతి ఇంటికీ మొబైల్ కనెక్షన్ చేరింది. మనలో చాలా మందికి రెండు లేదా అంతకంటే ఎక్కువ మొబైల్ కనెక్షన్లు ఉంటాయి. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలతో పాటు చాలా మందికి బీఎస్ఎన్ఎల్ నంబర్ కూడా ఉంటుంది. అయితే పెరిగిన రీచార్జ్ ధరల కారణంగా అన్నింటికీ రీచార్జ్ చేయించడం భారంగా మారింది. ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చుతో నంబర్ను యాక్టివ్గా ఉంచుకునే అద్భుతమైన ప్లాన్ బీఎస్ఎన్ఎల్లో ఉంది.ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ పోర్ట్ఫోలియోలో అనేక ప్లాన్లు ఉన్నాయి. కస్టమర్ల సౌలభ్యం కోసం కంపెనీ వివిధ ప్లాన్లను ప్రవేశపెట్టింది. వీటిలో ఓ చౌక ప్లాన్ ఉంది. ఇది తక్కువ ఖర్చుతో మీ నంబర్ను చాలా రోజులు యాక్టివ్గా ఉంచుకునేందుకు సహాయపడుతుంది. అదే రూ .197 ప్లాన్. ఇందులో పరిమిత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. నంబర్ యాక్టివ్గా ఉంటే చాలు అనుకునేవారికి సరిపోతుంది.రూ.197 ప్లాన్ ప్రయోజనాలుబీఎస్ఎన్ఎల్ రూ.197 ప్లాన్ వ్యాలిడిటీ 70 రోజుల వరకు ఉంది. అంటే, ఈ ప్లాన్ మీ కనెక్షన్ను 70 రోజులు యాక్టివ్గా ఉంచడమే కాకుండా ఇన్కమింగ్ సదుపాయం కూడా కొనసాగుతుంది. ఈ ప్లాన్ ఫీచర్ల విషయానికొస్తే, ఇది 15 రోజుల పాటు అపరిమిత కాలింగ్, రోమింగ్ అందిస్తుంది. దీనితో పాటు 15 రోజుల పాటు రోజూ 2 జీబీ అన్ లిమిటెడ్ డేటా లభిస్తుంది. దీనితో పాటు 15 రోజుల పాటు ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్లు కూడా లభిస్తాయి.15 రోజుల తర్వాత లోకల్ కాలింగ్ కు నిమిషానికి రూ.1, ఎస్టీడీ కాలింగ్ కు నిమిషానికి రూ.1.3 ఖర్చవుతుంది. వీడియో కాలింగ్ కోసం లోకల్, నేషనల్కు నిమిషానికి రూ.2 చెల్లించాలి. ఇక ఎస్ఎంఎస్ విషయానికొస్తే లోకల్ ఎస్ఎంఎస్కు 80 పైసలు, నేషనల్ ఎస్ఎంఎస్కు రూ.1.20 పైసలు ఖర్చవుతుంది. డేటా విషయానికొస్తే, ఉచిత డేటా ముగిసిన తర్వాత, ఒక్కో ఎంబీకి 25 పైసలు చెల్లించాల్సి ఉంటుంది. -
సీఈఓకు సహాయకారిగా ఏఐ
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కంపెనీ భవిష్యత్తు నాయకత్వం పనితీరుపై ఆసక్తికర ప్రకటన చేశారు. బ్లూమ్బర్గ్ టెక్ కాన్ఫరెన్స్లో పిచాయ్ పాల్గొని మాట్లాడారు. సంస్థ సీఈఓ తదుపరి నిర్ణయాలు తీసుకోవడానికి, రోజువారీ కార్యకలాపాల్లో సహాయపడటానికి కృత్రిమమేథ తోడుంటుందని చెప్పారు. ఈ ప్రకటన కృత్రిమ మేధ ఆధారిత ఉత్పాదకత పట్ల గూగుల్ నిబద్ధతను నొక్కిచెబుతుంది. కృత్రిమ మేధ మానవ నాయకత్వాన్ని భర్తీ చేయడానికి బదులుగా దాన్ని మెరుగుపరుస్తుందనే భావనను పిచాయ్ ప్రకటన బలపరుస్తుంది.ఎగ్జిక్యూటివ్ స్థాయి నాయకత్వంలో కృత్రిమ మేధను వాడడం, శ్రామిక శక్తి అంతటా ఏఐను ఏకీకృతం చేసే గూగుల్ విస్తృత వ్యూహానికి అనుగుణంగా ఈ ప్రకటన ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. పిచాయ్ తెలిపిన వివరాల ప్రకారం కార్యనిర్వాహక నిర్ణయాలను ఆటోమేట్ చేయడానికి బదులుగా ఏఐ వ్యూహాత్మక సలహాదారుగా పనిచేస్తుంది. పెద్ద మొత్తంలో డేటాను సేకరించడానికి, వర్క్ ఫ్లోలను ఆప్టిమైజ్ చేయడానికి, సృజనాత్మక పరిష్కారాలను మరింత సమర్థవంతంగా అన్వేషించడానికి నాయకులకు ఏఐ సహాయపడుతుంది.ఇదీ చదవండి: బీసీసీఐకి ఐపీఎల్ బంగారు బాతువైబ్ కోడింగ్పిచాయ్ స్వయంగా రిప్లిట్, కర్సర్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కోడింగ్ సాధనాలతో ప్రయోగాలు చేస్తున్నారు. వాటిని ‘వైబ్ కోడింగ్’ అని పిలుస్తున్నారు. ఈ ప్రక్రియ ద్వారా సాధారణ ప్రాంప్ట్లతో కస్టమ్ వెబ్ పేజీలను సృష్టించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయపడుతుంది. 2026 నాటికి గూగుల్ తన ఇంజినీరింగ్ టాలెంట్ పూల్ను విస్తరించడంలో ఏఐ కీలక భాగస్వామిగా పనిచేసే వ్యవస్థను ప్రోత్సహిస్తోంది. -
డిజిటల్ మోసాలపై కలసికట్టుగా పోరాడుదాం
న్యూఢిల్లీ: డిజిటల్ మోసాలను అరికట్టేందుకు కలసికట్టుగా పోరాడుదామంటూ 40కి పైగా బ్యాంక్లు, ఆర్బీఐ, ఎన్పీసీఐని ఎయిర్టెల్ కోరింది. మోసపూరిత డొమైన్ల సమాచారంతో రిపాజిటరీ ఏర్పాటు చేయడంతోపాటు సన్నిహిత సహకారానికి పిలుపునిచ్చింది. హానికారక, మోసపూరిత వెబ్సైట్లను బ్లాక్ చేసే విషయంలో కలసి పనిచేద్దామని కోరుతూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)కు రాసిన లేఖలో ఎయిర్టెల్ కోరింది. బహుళ అంచల రక్షణ కవచం ఏర్పాటు ద్వారా డిజిటల్ మోసాలపై పోరాడుదామని కోరింది. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత భద్రంగా మార్చే విషయంలో ఎన్పీసీఐ, ఎయిర్టెల్ మధ్య భాగస్వామ్యానికి బలమైన అవకాశాలున్నట్టు పేర్కొంది. మోసాలను గుర్తించి, వాటిని అడ్డుకునేందుకు ఎయిర్టెల్ అమలు చేస్తున్న చర్యలను ప్రస్తావించింది. హానికారక వెబ్సైట్లు, ఫిషింగ్ లింక్ల యాక్సెస్ను బ్లాక్ చేయడం ద్వారా యూజర్ల రక్షణ చర్యలు అమలు చేస్తున్నట్టు తెలిపింది. ఇదే మాదిరి ఆర్బీఐకి సైతం ఎయిర్టెల్ లేఖ రాసింది. నియంత్రణ పరమైన సంప్రదింపుల పట్ల సానుకూలంగా ఉన్నట్టు తెలియజేసింది. వినియోగదారుల రక్షణ (మఖ్యంగా ఆర్థిక సమాచారం) విషయంలో ఓటీటీ ప్లాట్ఫామ్లను జవాబుదారీ చేసే కార్యాచరణ విషయంలో సహకారం అందిస్తానంటూ ఆర్బీఐకి ఎయిర్టెల్ తెలియజేసింది. డిజిటల్ మోసాలు, రక్షణ చర్యలపై ఉమ్మడి అవగాహన ప్రచార, శిక్షణ కార్యక్రమాలు చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది. మోసాల నివారణకు ఉమ్మడిగా కలసి పనిచేద్దామంటూ ఎయిర్టెల్ లోగడ పోటీ టెలికం కంపెనీలైన జియో, వొడాఫోన్ ఐడియాలకు సైతం విడిగా కోరడం గమనార్హం. 2024 మొదటి తొమ్మిది నెలల్లో 1.7 మిలియన్ సైబర్ మోసాల రూపంలో వినియోగదారులు రూ.11,000 కోట్లు నష్టపోయినట్టు ఎయిర్టెల్ పేర్కొంది. -
వర్షం వచ్చిందంటే ఈ గాడ్జెట్స్ ఉండాల్సిందే..
వానొచ్చిదంటే ఎన్నో సరదాలను తెస్తుంది. వాటితో పాటు ఎన్నో సమస్యలను కూడా! అయితే, వాన తెచ్చే తిప్పల్లో అన్నీ కాకపోయినా కొన్నింటికి చెక్ పెట్టే స్మార్ట్ సొల్యూషన్సే ఈ గాడ్జెట్స్!వాటర్ప్రూఫ్ బ్లూటూత్ స్పీకర్వాన పడుతుంటే చాలామంది చాయ్లో బిస్కట్ ముంచేస్తారు. కాని, అంతకంటే ఎక్కువమంది వానలో మంచి మ్యూజిక్తో మూడ్ని మిక్స్ చేసి ఎంజాయ్ చేస్తుంటారు. అలాగని, వర్షంలో స్పీకర్ పెడితే అప్పుడు అది సింకింగ్ షిప్ అయిపోతుంది. ఇందుకోసమే ఓ అద్భుతమైన ఆవిష్కరణ వచ్చేసింది. వాటర్ప్రూఫ్ బ్లూటూత్ స్పీకర్. దీనిని బయటపెట్టి మ్యూజిక్ ప్లే చేస్తే రెయిన్ డాన్స్ పార్టీని క్రియేట్ చేయొచ్చు. ధర వివిధ బ్రాండ్స్, డిజైన్స్ బట్టి ఉంటుంది. ఆన్లైన్లో లభ్యం.ఇది వర్షం చూసి పారిపోయే కెమెరా కాదు..వర్షం వచ్చిన వెంటనే కాఫీ చేతిలో పట్టుకొని, ఓపెన్ టెర్రస్ మీద సరదాగా ఓ సెల్ఫీ తీసుకోవాలనిపించిందా? కాని, ఫోన్ జారిపోతుందేమోననే భయంతో, కేవలం కాఫీనే ఎంజాయ్ చేస్తున్నారా? ఇప్పుడు అవన్నీ పాత కథలు! ఎందుకంటే ఇప్పుడు మీ చేతిలోకి వచ్చింది ‘ఇస్టా 360’. ఈ చిన్న గాడ్జెట్ తీసే ఫొటోలు, వీడియోలు హాలీవుడ్ లెవెల్లో ఉంటాయి. అన్ని యాంగిల్స్ల్లోనూ అద్భుతంగా తీయగల ఈ చిన్న కెమెరా ఉంటే ఇక పెద్ద పెద్ద కెమెరాలతో పని ఉండదు. పైగా ఇది వర్షం చూసి పారిపోయే కెమెరా కాదు. ఇది తానే నీళ్లలోకి దూకేస్తుంది. అంటే పది మీటర్ల లోతు వరకు వాటర్ ప్రూఫ్ అన్నమాట. చక్కగా షర్ట్కి అంటించి పెట్టుకొని వాడుకోవచ్చు. పైగా కెమెరాను ఎక్కడైనా మర్చిపోతే, మీ ఫోన్ మాత్రం ‘ఏయ్, ఇక్కడ ఉంది కెమెరా’ అని ఇందులోని అలర్ట్ సిస్టమ్ చెప్తుంది. ధర. 599 డాలర్లు (రూ. 51,003). వాన జాడ చెప్పే గొడుగు..‘వాన వస్తుందా లేదా? గొడుగు తీసుకెళ్దామా? వద్దా?’ అని ఇలా మీలో మీరు ప్రశ్నలు వేసుకునే ముందు ఒక్కసారి ఈ ‘డ్యావెక్ అలర్ట్ గొడుగు’ను అడిగి చూడండి. వాతావరణం ఎలా ఉండబోతుందో ఈ గొడుగే చెప్తుంది. పైగా దీనిని ఫోన్కు కనెక్ట్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. ఇందులోని అలెర్ట్ సిస్టమ్ ఎప్పుడైనా గొడుగును తీసుకెళ్లడం మర్చిపోయారో, వెంటనే, టింగ్ అని ఫోన్కి మెసేజ్ వస్తుంది ‘నన్ను మర్చిపోయావ్ బాస్’ అని గొడుగు మీకు గుర్తుచేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది గొడుగు కాదు. బ్రహ్మానందం లెవల్ కామెడీ ప్లస్ స్మార్ట్నెస్ను కలిపిన వస్తువు. పైగా ఇది సాధారణ గొడుగులా కాకుండా చాలా బలంగా ఉంటుంది. ఈదురు గాలులకు కూడా కదలదు. ఇక దీని స్టయిల్లో చూసుకుంటే, పెద్ద పెద్ద డిజైనర్ గొడుగులు కూడా దీనితో పోటీ పడలేవు. ధర 69 డాలర్లు (రూ. 5,870). -
జెన్ఏఐలో పోటీలు.. రూ. 10 లక్షలు బహుమతి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నెక్ట్స్వేవ్, ఓపెన్ఏఐ అకాడమీ కలిసి దేశీయంగా అతి పెద్ద జెన్ఏఐ ఇన్నోవేషన్ బిల్డ్థాన్కి శ్రీకారం చుట్టాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర మొత్తం 7 రాష్ట్రాల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించాయి. 500 క్యాంపస్ల నుంచి 25 వేల మందికి పైగా విద్యార్థులు జెన్ ఏఐ టెక్నాలజీలో నైపుణ్యాలను పెంచుకునేందుకు ఇదొక అవకాశం కాగలదని పేర్కొన్నాయి.మూడు రౌండ్లలో జరిగే ఈ పోటీల్లో విజేతలకు మొత్తం రూ. 10 లక్షల బహుమతితో పాటు ఓపెన్ఎఐ వ్యవస్థలో కెరియర్ను తీర్చిదిద్దుకునే అవకాశాలు లభిస్తాయి. పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికైన టీమ్స్.. రియల్ టైమ్ శిక్షణ, మెంటార్ సపోర్ట్, సరి్టఫికెట్లు మొదలైనవి పొందవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా 2,000కు పైగా ఏఐ ప్రాజెక్టులకు రూపకల్పన జరగవచ్చని నెక్ట్స్వేవ్ అంచనా వేస్తోంది. -
లక్షల కొద్దీ టెకీలు.. బెంగళూరు కొత్త రికార్డ్
దేశ ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరు సరికొత్త రికార్డును సాధించింది. ప్రపంచంలోని టాప్ టెక్నాలజీ హబ్లలో చేరింది. రియల్ ఎస్టేట్ సేవల సంస్థ సీబీఆర్ఈ విడుదల చేసిన గ్లోబల్ టెక్ టాలెంట్ గైడ్బుక్ 2025 ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 12 'పవర్హౌస్' మార్కెట్లలో ఒకటిగా బెంగళూరు అవతరించింది.అలాగే ఒక సరికొత్త మైలురాయిని కూడా బెంగళూరు చేరుకుంది. ఇక్కడ 10 లక్షలమందిపైగా ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోనే టెకీల అత్యధిక ఉన్న నగరంగా బెంగళూరు నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 12 'పవర్హౌస్' మార్కెట్లలో శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్ మెట్రో, లండన్, టోక్యో, పారిస్, సింగపూర్ వంటి ప్రధాన సాంకేతిక కేంద్రాలు ఉన్నాయి.టెక్ టాలెంట్ లభ్యత, నాణ్యత, ఖర్చు ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా 115 మార్కెట్లను సీబీఆర్ఈ నివేదిక అంచనా వేసింది. కేవలం శ్రామిక శక్తి పరిమాణంలోనే కాకుండా ప్రత్యేక నైపుణ్యాల్లో, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లోనూ బెంగళూరు ప్రత్యేకతను చాటుకుంది. అగ్రశ్రేణి యూఎస్ టెక్ మార్కెట్లలో కనిపించే స్థాయిలతో సరిపోలుతూ భారతదేశంలో కృత్రిమ మేధ నిపుణులు ఈ నగరంలో అత్యధికంగా ఉన్నారని నివేదిక పేర్కొంది.2019 నుండి 2024 వరకు బెంగళూరులో పనిచేసే వయసులో ఉన్నవారి జనాభా 2.4 శాతం పెరిగింది. వీరు ఆ నగర జనాభాలో 75.5% మంది ఉన్నారు. ఈ డెమోగ్రాఫిక్ అడ్వాంటేజ్ టెక్నాలజీ రంగంలో బెంగళూరు విస్తరణకు కీలక చోదకాలలో ఒకటి. 28 యూనికార్న్ సంస్థలు, వెంచర్ క్యాపిటల్ పెట్టుబడుల బలమైన ప్రవాహంతో నగరంలో స్టార్టప్ వ్యవస్థ అభివృద్ధి చెందుతోంది. ఒక్క 2024లోనే బెంగళూరు 3.3 బిలియన్ డాలర్ల విలువైన 140 వీసీ ఒప్పందాలను దక్కించుకుంది. -
యాపిల్ కొత్త ఓఎస్ గురించి తెలుసా..?
ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ డబ్ల్యూడబ్ల్యూడీసీ 2025లో ‘హోమ్ఓఎస్’ పేరుతో సరికొత్త స్మార్ట్ హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ను ప్రారంభించనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐఫోన్ కోసం ఐఓఎస్, యాపిల్ వాచ్ కోసం వాచ్ఓఎస్, ఐప్యాడ్ కోసం ఐప్యాడ్ఓఎస్ వంటి ఎకోసిస్టమ్ పరికరాలకు ప్రత్యేకంగా యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ను రూపొందించింది. ఇదే తరహాలో ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టం యాపిల్ స్మార్ట్ హోమ్ డివైజ్లకు ఉపయోగకరంగా మారనుందని చెబుతున్నారు.హోమ్ఓఎస్లోని ఫీచర్లు ఇలా..కస్టమైజబుల్ హోమ్ స్క్రీన్: ఐఓఎస్ మాదిరిగానే వినియోగదారులు వాతావరణం, స్టాక్స్, రిమైండర్లు.. వంటివాటి కోసం విడ్జెట్లను జోడించవచ్చు.స్మార్ట్ హోమ్ కంట్రోల్స్: హోమ్ యాప్ ద్వారా లైట్లు, సెక్యూరిటీ, క్లైమేట్ ఇతర యాక్ససరీలను సులభంగా నిర్వహించవచ్చు.సిరి, యాపిల్ ఇంటెలిజెన్స్: సందర్భానికి తగినట్లు లోతైన అవగాహనతో మెరుగైన వాయిస్ కంట్రోల్తో చర్యలు తీసుకోవడానికి సిరిని అనుమతిస్తుంది.హోమ్ ఆటోమేషన్: నిద్రపోతున్న సమయంలో తలుపులకు తాళం వేయడం, సాయంత్రం అయితే లైట్లు ఆన్ చేయడం లేదా ఇంట్లోకి వచ్చే ముందు మీ ఇంట్లోని ఏసీ, వాషింగ్ మిషన్.. ఇతరత్రా ఎలక్ట్రానిక్ వస్తువులను రిమోట్గా నిర్వహించడం.డైనమిక్ రెస్పాన్సిబిలిటీ: సిస్టమ్ యూజర్ ప్రాక్సిమిటీ ఆధారంగా పని చేసేలా ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇంటికి దూరంగా ఉన్నప్పుడు విడ్జెట్లు లేదా ఫొటోలను ప్రదర్శించడం ద్వారా వాటిని రిమోట్గానే నిర్వహించవచ్చు. సమీపంలో ఉన్నప్పుడు హోమ్ స్క్రీన్ను ఉపయోగించవచ్చు. -
స్టార్లింక్కు లైసెన్స్ వచ్చేసింది...
భారత్లో శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఎలాన్ మస్క్కు చెందిన స్టార్ లింక్కు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. మార్కెట్ ను చేజిక్కించుకోవాలన్న శాటిలైట్ కంపెనీ కలలకు ఊతమిచ్చేలా స్టార్ లింక్కు డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నుంచి కీలక లైసెన్స్ లభించింది.భారత టెలికాం మంత్రిత్వ శాఖ నుండి లైసెన్స పొందిన స్టార్ లింక్ దేశంలోని 90 కోట్ల ఇంటర్నెట్ వినియోగదారులను అందిపుచ్చుకునే లక్ష్యంతో భారతదేశంలో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉందని వార్తా సంస్థలు రాయిటర్స్, బ్లూమ్బర్గ్ నివేదించాయి. కాగా స్టార్ లింక్ కు నిజంగానే లైసెన్స్ లభించిందని, దరఖాస్తు చేసుకున్న 15-20 రోజుల్లో ట్రయల్ స్పెక్ట్రమ్ మంజూరు చేస్తామని డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వర్గాలు ధ్రువీకరించినట్లుగా పీటీఐ వార్తసంస్థ కూడా పేర్కొంది.దేశంలో సేవలను అందించడానికి యూటెల్ శాట్కు చెందిన వన్వెబ్, రిలయన్స్ జియో ఇలాంటి దరఖాస్తులను ఆమోదించిన భారత టెలికమ్యూనికేషన్ల విభాగం నుండి లైసెన్స్ పొందిన మూడవ సంస్థ స్టార్లింక్. భారతదేశంలో వాణిజ్య కార్యకలాపాలు సాగించడానికి లైసెన్సుల కోసం స్టార్ లింక్ 2022 నుండి ఎదురుచూస్తోంది. కాని జాతీయ భద్రతా ఆందోళనలతో సహా కారణాల వల్ల జాప్యం జరిగింది. అమెజాన్ కు చెందిన కుయిపర్ ఇండియా లైసెన్స్ కోసం ఇప్పటికీ ఎదురుచూస్తోంది.ప్రపంచవ్యాప్తంగా.. స్టార్లింక్ సేవలు చాలా ఖరీదైనవిగా ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్లో, రెసిడెన్షియల్ లైట్ ప్లాన్ నెలకు దాదాపు 80 డాలర్లు (రూ. 6,800). అయితే కస్టమర్లు 349 డాలర్లతో (రూ. 29,700) వన్ టైమ్ రుసుముతో స్టార్లింక్ స్టాండర్డ్ కిట్ను కూడా కొనుగోలు చేయాలి. అయితే భారతదేశంలో స్టార్లింక్ సర్వీస్ ప్రారంభమైన తరువాత.. దీని ఛార్జీలు నెలకు 10 డాలర్ల (రూ.850) వరకు ఉండే అవకాశం ఉంది. పరిచయ ఆఫర్లలో భాగంగా సంస్థ అపరిమిత డేటాను అందించే అవకాశం ఉంది. -
భారత్లో ఓపెన్ఏఐ అకాడమీ
న్యూఢిల్లీ: చాట్జీపీటీ మాతృసంస్థ ఓపెన్ఏఐ, కేంద్ర ఐటీ శాఖలో భాగమైన ఇండియాఏఐ మిషన్ కలిసి భారత్లో ఓపెన్ఏఐ అకాడమీని ప్రారంభించాయి. ఇందుకు అవగాహన ఒప్పందాన్ని (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. దేశీయంగా వేగంగా వృద్ధి చెందుతున్న డెవలపర్ల కమ్యూనిటీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, స్టార్టప్లు.. ఆవిష్కర్తల నెట్వర్క్కు ఏఐపరంగా కావాల్సిన విద్యావనరులు, సాధనాలు దీనితో అందుబాటులోకి వస్తాయని ఓపెన్ఏఐ తెలిపింది. విద్య, టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉండాలనే ఉమ్మడి లక్ష్య సాధన దిశగా ఇది కీలక ముందడుగని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ అకాడమీ లో డిజిటల్, ఇన్–పర్సన్ లెరి్నంగ్ విధానంలో ఇంగ్లీష్, హిందీలో కంటెంట్ అందుబాటులో ఉంటుంది. త్వరలో మరిన్ని ప్రాంతీయ భాషలను కూడా జోడించనున్నారు. విద్యార్థులు, డెవలపర్లు, విద్యావేత్తలు, సివిల్ సర్వెంట్లు, చిన్న స్థాయి వ్యాపారవర్గాలు మొదలైన వారందరికీ ఏఐ నైపుణ్యాల్లో శిక్షణనిచ్చేందుకు ఇది ఉపయోగపడనుంది. ఇండియాఏఐ మిషన్ ఆమోదించిన 50 ఫెలోస్/స్టార్టప్లకు 1,00,000 డాలర్ల వరకు విలువ చేసే ఏపీఐ క్రెడిట్స్ లభిస్తాయి. -
‘ఎక్స్ చాట్’ ప్రారంభించిన మస్క్
ప్రముఖ ఆన్లైన్ మెసేజింగ్ టూల్స్ అయిన వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్.. వంటి వాటికి పోటీగా ఎక్స్(గతంలో ట్విటర్) కొత్తగా ‘ఎక్స్ చాట్’ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. ఇది తన వినియోగదారులకు అంతరాయం లేని, సురక్షితమైన మెసేజింగ్ అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ సీఈఓ ఎలాన్మస్క్ తెలిపారు.ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్, డిసప్పియరింగ్ మెసేజెస్, ఆడియో/ వీడియో కాల్స్ వంటి అధునాతన సామర్థ్యాలను హైలైట్ చేస్తూ మస్క్ ఎక్స్ పోస్ట్లో ఈమేరకు ఎక్స్ చాట్ వివరాలు ప్రకటించారు. ఇన్స్టంట్ మెసేజింగ్ స్పేస్లో ఇప్పటికే దూసుకుపోతున్న కంపెనీలకు ఎక్స్ చాట్ పోటీదారుగా మారే అవకాశం ఉందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: దేశంలోని తొలితరం సంపన్న మహిళలుప్రస్తుతం బీటా టెస్టింగ్లో ఉన్న ఈ అప్డేటెడ్ మెసేజింగ్ ఇంటర్ ఫేస్ను పరిమిత సంఖ్యలో యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది. ఎక్స్ చాట్లో ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్, ఫైల్ షేరింగ్, వాయిస్, వీడియో కాల్స్ వంటి అధునాతన మెసేజింగ్ ఫీచర్లు ఉన్నాయని పేర్కొంది. ఈ అప్గ్రేడ్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ మల్టీపర్పస్ కమ్యూనికేషన్ హబ్గా ఎక్స్ను అభివృద్ధి చేయాలనే మస్క్ అంచనాలకు అనుగుణంగా ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు చెప్పారు. -
గూగుల్ సంచలన యాప్.. ఇంటర్నెట్ లేకుండా ఏఐ..
విస్తృతమైన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ క్రమంలో టెక్నాలజీ దిగ్గజం గూగుల్.. స్మార్ట్ ఫోన్లలో ఏఐ వినియోగాన్ని భిన్నంగా మార్చే ఓ సంచలన యాప్ను తీసుకొచ్చింది. దీని పేరు ‘ఏఐ ఎడ్జ్ గ్యాలరీ’. ఈ యాప్ ద్వారా శక్తిమంతమైన ఏఐ మోడల్స్ను మొబైల్స్లో ఆఫ్లైన్లోనే రన్ చేయొచ్చు. అంటే ఎటువంటి ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఏఐతో ఇమేజ్లను సృష్టించడం, కోడ్ రాయడం, సమాధానాలు రాబట్టడం వంటివి చేయొచ్చన్న మాట.ఇందులో ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే.. యూజర్ ప్రైవసీకి ముప్పు చాలా తక్కువ. ఎందుకంటే యూజర్లు అందించే డేటా క్లౌడ్ సర్వర్లకు వెళ్లకుండా మొత్తం ఫోన్లోనే రన్ అవుతుంది. ఇది సెక్యూరిటీ ముప్పును తగ్గిస్తుంది. అలాగే పనితీరు కూడా చాలా వేగంగా ఉంటుంది. సర్వర్ కోసం వేచిచూసే పనిలేకుండా యూజర్ల అడిగే ప్రశ్నలకు నేరుగా స్పందించేందుకు ఏఐకి ఆస్కారం కలుగుతుంది.గెమ్మా 3 1బీ అనే లాంగ్వేజ్ మోడల్పై ఆధారపడి ఈ యాప్ పనిచేస్తుంది. కేవలం 529 ఎంబీ పరిమాణంలో వచ్చే ఈ కాంపాక్ట్ మోడల్ సెకనుకు 2,585 టోకెన్లను ప్రాసెస్ చేయగలదు. పెద్ద మొత్తంలో టెక్ట్స్ను క్షణాల్లో జనరేట్ చేయగలదు. గెమ్మా పరిమాణం చిన్నదైనప్పటికీ కోరిన కంటెంట్ను సృష్టించడం దగ్గర నుంచి డాక్యుమెంట్ విశ్లేషణ, స్మార్ట్ రిప్లైల వరకు అన్నింటినీ క్షణాల్లో చేయగలిగినంత శక్తివంతమైనది.ప్రస్తుతానికి ఈ యాప్ను "ప్రయోగాత్మక ఆల్ఫా విడుదల" గా గూగుల్ పేర్కొంటున్నప్పటికీ, అపాచీ 2.0 లైసెన్స్ కింద పూర్తిగా ఓపెన్ సోర్స్గా ఈ యాప్ అందుబాటులో ఉంది. అంటే డెవలపర్లు, కంపెనీలు దీనిని ఉపయోగించవచ్చు. మార్పులు చేయవచ్చు. వాణిజ్య ఉత్పత్తులలో జోడించవచ్చు. కాగా గూగుల్ ఏఐ ఎడ్జ్ గ్యాలరీ యాప్ ఐఓఎస్ వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం. -
యాపిల్ మూడో స్టోర్ బెంగళూరులో.. రెంట్ ఎంతో తెలుసా?
స్మార్ట్ఫోన్ దిగ్గజం యాపిల్ భారత్లో తన రిటైల్ ఉనికిని విస్తరించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేశంలోని ముంబై, ఢిల్లీలలో తమ రిటైల్ స్టోర్లను ప్రారంభించిన యాపిల్.. మూడో స్టోర్ను బెంగళూరులో తెరుస్తోంది. ఉత్తర బెంగళూరులోని ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఆసియాలో యాపిల్ కొత్త స్టోర్ను ఏర్పాటు చేస్తోందని నివేదికలు పేర్కొంటున్నాయి.ఢిల్లీ స్టోర్తో ఉత్తర భారతదేశంలో.. ముంబై స్టోర్తో పశ్చిమ భారత్లో ఆదరణను పెంచుకున్న యాపిల్.. ఇప్పుడు బెంగళూరులో ఏర్పాటు చేస్తున్న స్టోర్తో దక్షిణ భారత్లోనూ తమ ఉనికి విస్తరిస్తుందని భావిస్తోంది. తమ తయారీ భాగస్వామి ఫాక్స్కాన్ కూడా ఇక్కడ కొత్త మాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని చెబుతున్నారు.బెంగళూరు స్టోర్ రెంట్ ఎంతంటే..యాపిల్ బెంగళూరులో ఏర్పాటు చేస్తున్న స్టోర్కు నెలకు రూ.16 లక్షలకు పైగానే అద్దె చెల్లించనున్నట్లు తెలుస్తోంది. యాపిల్ బెంగళూరులోని తన స్టోర్ కోసం రూ .2.09 కోట్ల వార్షిక అద్దెతో 7,997.8 చదరపు అడుగుల స్థలాన్ని 10 సంవత్సరాల లీజుకు తీసుకుందని రియల్ ఎస్టేట్ ప్లాట్ఫామ్ ద్వారా పొందిన లీజు ఒప్పందాన్ని ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది. 2024 నవంబర్ 8న లీజు అధికారికంగా ప్రారంభం కాగా, 2025 ఆగస్టు 8 నుంచి అద్దె చెల్లింపులు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాపర్టీ స్పార్కిల్ వన్ మాల్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందినది. -
లిటిల్ ఫ్రెండ్స్ కోసం.. సూపర్ గాడ్జెట్స్
హుషారుగా ఆడుకుంటూ, సరదాగా నేర్పించే మ్యాజిక్ మెషిన్స్ను తెలివిగా వాడుకుంటే, ఏ పిల్లలైనా చదువుల్లోనే కాదు, ఆరోగ్యంపైన కూడా శ్రద్ధ చూపిస్తారు. పిల్లల కోసం టెక్నాలజీ అందించిన ఫ్రెండ్లీ గాడ్జెట్స్ మీ కోసం..బ్రషింగ్ గేమ్ ఆడుదాం!చిన్నపిల్లలకు బ్రషింగ్ చేయించడం అంటే మినీ యుద్ధం చేయటంలాంటిది. శత్రుసైన్యంగా ఉండే టూత్పేస్ట్కి టార్చర్. బ్రష్కు బ్రేకప్.. ఇలా పేస్ట్, బ్రష్లతో పేరెంట్స్ పిల్లలకు బ్రషింగ్ చేయించడానికి పోరాడుతుంటారు. ఇప్పుడు ఈ యుద్ధానికి ఒక చిన్న టూత్బ్రష్ స్వస్తి పలికింది.'విల్లో అటో ఫ్లో’ కేవలం టూత్బ్రష్ మాత్రమే కాదు. ఇదొక అటోమెటిక్ బ్రషింగ్ డివైజ్. బలమైన, మృదువైన బ్రిసిల్స్తో ఇది చాలా సులభంగా పిల్లలకు బ్రషింగ్ చేయిస్తుంది. నీళ్లు తానే తీసుకుంటుంది. పేస్ట్ తానే ఇస్తుంది. దీనిని మొబైల్ యాప్కు కనెక్ట్ చేసుకొని వాడితే, మరింత ఆసక్తికరంగా పనిచేస్తుంది.‘క్యావిటీ కిల్లర్’ టైటిల్తో యాప్లో పిల్లలతో బ్రషింగ్ గేమ్ ఆడేలా చేస్తుంది. వివిధ కౌంట్డౌన్లు, బ్యాడ్జ్లు, రివార్డ్స్ ఇస్తూ వారికి బ్రషింగ్ అంటే ఇకపై యుద్ధంలా కాకుండా, ఒక సరదా ఆటలా కనిపించేలా చేస్తుంది. ఇక అప్పటి నుంచి టూత్పేస్ట్ బాత్రూమ్ గోడలపై కాదు, పళ్లపై ఉంటుంది. ధర 249 డాలర్లు (రూ.21,266).ఉఫ్.. ఉఫ్.. పిల్లిచూడటానికి చిన్నగా కనిపించే ఈ బుజ్జి పిల్లి. చేసే పని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఏ పిల్లి అయినా తన తోక నొక్కితే వెంటనే ‘మ్యావ్.. మ్యావ్..’ అంటూ బయటకు వినిపించని బూతులెన్నో తిడుతుంది. కాని, ‘నికోజిటా ఫు ఫు’ అనే ఈ పిల్లి మాత్రం దీని తోకకున్న బటన్ నొక్కగానే ‘ఉఫ్.. ఉఫ్..’ అంటూ వేడి వేడిగా ఉండే ఫుడ్ని కేవలం మూడు నిమిషాల్లోనే ‘ఇప్పుడు లాగించొచ్చు’ అనే స్థితిలోకి వచ్చేలా చల్లారుస్తుంది.చిన్నపిల్లలు ఉండే ఇంట్లో దీని అవసరం చాలా ఉంటుంది. ప్లేట్, బౌల్, కప్పు ఇలా ఏ వస్తువుకైనా ఈజీగా దీనిని తగిలించుకొని ఉపయోగించుకోవచ్చు. రీచార్జబుల్, వాషబుల్. ఒక్కసారి చార్జ్ చేస్తే దాదాపు ఒక గంట వరకు పనిచేస్తుంది. ధర 27 డాలర్లు (రూ. 2,303) మాత్రమే!పీస్ఫుల్ గుడ్ఇల్లు పీకి పందిరేసే పిల్లలతో కూడా శాంతి మత్రం జపించేలా చేయగలడు ఇతడు. చూడ్డానికి చాలా చిన్నగా ఒక చిన్న పక్షి గుడ్డు సైజులో ఉంటాడు. తాకి చూస్తే దూది కంటే మెత్తగా ఉంటాడు. కాని, మహా మొండి ఘటాల్లాంటి పిల్లలను కూడా ప్రశాంతంగా మార్చేస్తాడు. ఇంతకీ మార్కెట్లోకి వచ్చిన ఈ కొత్త యోగా గురువు పేరు ఏంటంటే ‘మూడ్ బడ్డీ’.దీనిని ఒక పది నిమిషాలు పిల్లల చేతికి అందిస్తే చాలు, వెంటనే ప్రశాంతంగా మారిపోతారు. ఇందులో నాలుగు రకాల బ్రీతింగ్ మోడ్స్ ఉంటాయి. ఇందులో వివిధ వాయిస్ కమాండ్స్, వైబ్రేషనల్ మోడ్స్ ఉంటాయి. ఇవి క్షణాల్లో మెదడును శాంతపరిచి, సెలెంట్ మోడ్లోకి తీసుకురావడానికి ఉపయోగపడతాయి. రోజూ దీనిని వాడితే ప్రశాంతంగా మారడమే కాదు, సరైన సమయానికి నిద్ర కూడా పోతారట. ధర 99 డాలర్లు (రూ.8,458). -
మోసాల నివారణకు.. యాంటీఫ్రాడ్ యాప్
సీమాంతర సైబర్ ముప్పులు పెరుగుతున్న నేపథ్యంలో క్విక్ హీల్ టెక్నాలజీస్ తాజాగా మోసాల నివారణ సొల్యూషన్ యాంటీఫ్రాడ్డాట్ఏఐ ఫ్రీమియం వెర్షన్ను ప్రవేశపెట్టింది. ఫోన్లో కనిపించే హానికరమైన యాప్లతో పాటు కనిపించకుండా దాక్కునే యాప్లను కూడా గుర్తించడం దీని ప్రత్యేకత.ఫిషింగ్, స్పైవేర్, ఆర్థిక మోసాలపరమైన దాడుల కోసం ఉపయోగించే ఈ హిడెన్ యాప్లు యూజరుకు తెలియకుండా పని చేస్తాయి. ఇలాంటి యాప్ల గురించి యాంటీఫ్రాడ్డాట్ఏఐ యూజర్లను అలర్టు చేసి, తగు చర్యలు తీసుకునేందుకు సహాయపడుతుంది.స్కామ్ ప్రొటెక్షన్, రిస్క్ ప్రొఫైల్ అసెస్మెంట్, కాల్ ఫార్వార్డింగ్.. బ్యాంకింగ్ ఫ్రాడ్ అలర్ట్, ఫ్రాడ్ ప్రొటెక్ట్ బడ్డీ మొదలైన ఫీచర్లు ఇందులో ఉంటాయి. దీన్ని ప్రాథమికంగా ఉచితంగా ఉపయోగించుకోవచ్చని, మరింత భద్రత కోరుకునే వారు సబ్్రస్కిప్షన్ ద్వారా ప్రీమియం వెర్షన్ తీసుకోవచ్చని సంస్థ సీఈవో విశాల్ సాల్వి తెలిపారు. -
గడ్కరీ సతీమణి పండించిన ఉల్లి: ఒక్కొక్కటి కేజీ బరువు! అదెలాగంటే?
నితిన్ గడ్కరీ కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రిగా విధులు నిర్వహిస్తూనే.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. పెట్రోల్ & డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయ వెహికల్స్ వినియోగించాలని చెబుతూ.. హైడ్రోజన్ కారులో పార్లమెంటుకు వెళ్లి, పర్యావరణంపై ఆయనకున్న మక్కువను చూపించారు. భర్త బాటలోనే నడుస్తూ.. గడ్కరీ సతీమణి ఆర్గానిక్ పద్దతిలో, మల్చింగ్ పేపర్ టెక్నాలజీతో ఉల్లిని పండించారు.ఉల్లిని అందరూ పండిస్తారు.. అందులో వింతేముంది అనుకోవచ్చు. కానీ వీరు పండించిన ఉల్లి ఒక్కొక్కటి సుమారు 800 గ్రాముల నుంచి 1000 గ్రాములు లేదా ఒక కేజీ బరువు ఉన్నాయి. ఈ విషయాన్ని గడ్కరీ తన ఎక్స్ ఖాతలో పేర్కొన్నారు. ''నా భార్య కాంచన్, నాగ్పూర్లోని ధపేవాడలోని మా భక్తి ఫామ్లో, మల్చింగ్ పేపర్ టెక్నిక్ ఉపయోగించి ఒక ప్రత్యేకమైన ప్రయోగం చేసి, ఒక కిలో వరకు బరువున్న సేంద్రీయ ఉల్లిపాయలను విజయవంతంగా ఉత్పత్తి చేశారు'' అని ట్వీట్ చేశారు.దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో పొలం దున్నడం.. ఉల్లి విత్తనాలను నాటు వేయడం వంటివన్నీ చూడవచ్చు. మొత్తానికి ఇక్కడ పండిన ఉల్లి సాధారణ ఉల్లికంటే.. చాలా పెద్దవిగా ఉన్నాయి. ఒక రకంగా వీటిని బాహుబలి ఉల్లి అని కూడా చెప్పొచ్చు.మల్చింగ్ పేపర్ టెక్నాలజీమల్చింగ్ పేపర్ టెక్నాలజీలో.. మట్టి బెడ్ మీద ఒక ప్లాస్టిక్ షీట్ కప్పుతారు. దీనిపైన చిన్న రంధ్రాలు చేసి.. ఉల్లినారు నాటుతారు. ఈ విధంగా వ్యవసాయం చేయడం వల్ల నీటి వృధా తగ్గుతుంది. కలుపు మొక్కలను నివారించవచ్చు. ఈ ఉల్లిని పండించడానికి కాంచన్ గడ్కరీ సేంద్రీయ పద్ధతులనే ఉపయోగించారు. అంతే కాకుండా.. ఉల్లి విత్తనాలను ప్రత్యేకంగా నెదర్లాండ్స్ నుంచి తెప్పించి ప్రయోగం చేశారు.ఇదీ చదవండి: జీవితాన్ని నాశనం చేసే పదం ఇదే: రాబర్ట్ కియోసాకి హెచ్చరికనాణ్యమైన విత్తనాలు ఉపయోగించి.. సహజ సిద్దమైన పద్దతులతో వ్యవసాయం చేస్తే తప్పకుండా మంచి దిగుబడి ఉంటుందని గడ్కరీ దంపతులు చెబుతున్నారు. అంతే కాకుండా.. స్థానిక రైతులకు ఈ పద్దతిపై అవగాహన కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామని కాంచన్ గడ్కరీ పేర్కొన్నారు.नागपुर के धापेवाड़ा स्थित हमारे भक्ति फार्म में मेरी पत्नी, श्रीमती कांचन ने एक अनूठा प्रयोग करते हुए, मल्चिंग पेपर तकनीक का इस्तेमाल कर एक किलो तक वज़न वाले ऑर्गेनिक प्याज़ का सफल उत्पादन किया है।#OrganicFarming #OrganicOnion #Nagpur pic.twitter.com/nTjU11anHR— Nitin Gadkari (@nitin_gadkari) May 29, 2025 -
ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు!
ఒకటో తేదీ వచ్చిందంటే.. దాదాపు చాలా రూల్స్ మారిపోతాయి. క్రెడిట్ కార్డుల దగ్గర నుంచి గ్యాస్ ధరల వరకు.. చాలా మార్పులు వస్తుంటాయి. ఇప్పుడు తాజాగా ఈ రోజు (జూన్ 1) నుంచి కొన్ని ఐఫోన్లు & ఆండ్రాయిడ్ పరికరాల్లో వాట్సాప్ పనిచేయడం ఆగిపోతుంది. ఈ చర్య 2025 మే 1వ తేదీ నుంచే అమల్లోకి రావాల్సి ఉంది. కానీ కొంచెం ఆలస్యం కావడంతో.. వినియోగదారులు తమ ఫోన్లను మార్చుకోవడానికి సమయం దొరికింది.వాట్సప్కు సపోర్ట్ చేయని మొబైల్స్..➤ఐఫోన్ 5ఎస్➤ఐఫోన్ 6➤ఐఫోన్ 6 ప్లస్➤ఐఫోన్ 6ఎస్➤ఐఫోన్ 6s ప్లస్➤ఐఫోన్ ఎస్ఈ (ఫస్ట్ జనరేషన్)➤శామ్సంగ్ గెలాక్సీ ఎస్4➤శామ్సంగ్ గెలాక్సీ నోట్ 3➤సోనీ జెడ్పీరియా జెడ్1➤ఎల్జీ జీ2➤హువావే అసెండ్ పీ6➤మోటో జీ (ఫస్ట్ జనరేషన్)➤మోటరోలా రేజర్ హెచ్డీ➤మోటో ఈ 2014జాబితాలోని అన్ని ఫోన్లు చాలా పాత వెర్షన్లు. అయితే కొన్ని ఫోన్లలో సాఫ్ట్వేర్ అప్డేట్ సాధ్యమైతే.. వాట్సప్ పనిచేసే అవకాశం ఉంది.ఫోన్లలో వాట్సాప్ పనిచేయకపోవడానికి ప్రధాన కారణం.. భద్రతా ప్రమాణాలే అని తెలుస్తోంది. యాపిల్ ఇకపై పాత iOS వెర్షన్లకు సాఫ్ట్వేర్ అప్డేట్లను అందించదు. కాబట్టి ఈ పరికరాల్లో భద్రత లోపిస్తుంది. భద్రతా లోపం సమస్యలను తీసుకొచ్చే ప్రమాదం ఉంది.ఇదీ చదవండి: జీవితాన్ని నాశనం చేసే పదం ఇదే: రాబర్ట్ కియోసాకి హెచ్చరికగత కొన్ని నెలలుగా, వాట్సాప్ వినియోగదారుల గోప్యతను బలోపేతం చేయడం.. వ్యక్తిగత డేటాను రక్షించడం లక్ష్యంగా అనేక అప్డేట్స్ చేస్తూనే ఉంది. చాట్లు, సమూహ సంభాషణల నుంచి ఇతరులు టెక్స్ట్, ఫోటోలు లేదా వీడియోలను కాపీ చేయకుండా నిరోధిచడమే లక్ష్యంగా సంస్థ ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ తీసుకొస్తోంది. అంతే కాకుండా.. వాట్సాప్ చాట్ లాక్ వంటి మెరుగైన ఫీచర్స్ కూడా ప్రవేశపెట్టింది. ఇది వినియోగదారులు పాస్వర్డ్, వేలిముద్ర లేదా ఫేస్ ఐడితో వ్యక్తిగత చాట్లను సురక్షితంగా ఉంచడానికి అనుమతిస్తుంది. -
డేటా సెంటర్ల బూమ్..
న్యూఢిల్లీ: దేశీ డేటా సెంటర్ (డీసీ) పరిశ్రమ భారీగా విస్తరిస్తోంది. వచ్చే అయిదారేళ్లలో కొత్తగా 20–25 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులను ఆకర్షించనుంది. దీనితో సెంటర్ల ఏర్పాటు కోసం వినియోగించే రియల్ ఎస్టేట్ కూడా మూడు రెట్లు పెరగనుంది. ప్రస్తుతం 15.9 మిలియన్ చ.అ.లుగా ఉన్న స్పేస్ 2030 నాటికి 55 మిలియన్ చ.అ.లకు చేరనుంది. రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ కొలియర్స్ ఇండియా ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ, ఐవోటీ వినియోగం పెరుగుతుండటం, వివిధ రంగాల వ్యాప్తంగా డిజిటలీకరణ వేగవంతం అవుతుండటం తదితర అంశాల దన్నుతో డేటా సెంటర్ల మొత్తం సామర్థ్యాలు మూడు రెట్లు పెరిగి 2030 నాటికి 4.5 గిగావాట్లకు చేరనున్నాయి. 2018లో 307మెగావాట్లుగా ఉన్న డీసీల సామర్థ్యం ఈ ఏడాది ఏప్రిల్ నాటికి, అంటే కేవలం ఏడేళ్ల వ్యవధిలో సుమారు నాలుగు రెట్లు పెరిగి 1.26 గిగావాట్లకు చేరింది. పరివర్తన దశలో పరిశ్రమ.. ప్రస్తుతం పరిశ్రమ పరివర్తన దశలో ఉందని నిపుణులు తెలిపారు. మెట్రో నగరాల్లోనే కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు కూడా విస్తరిస్తోందని వివరించారు. డీసీల విషయంలో ముంబై, చెన్నైల ఆధిపత్యం ఉంటోంది. మొత్తం సామర్థ్యాల్లో మూడింట రెండొంతుల వాటా వీటిదే ఉంటోంది. అత్యధికంగా 41 శాతం వాటాతో ముంబై అగ్రస్థానంలో, 23 శాతంతో చెన్నై రెండో స్థానంలో, 14 శాతం వాటాతో ఢిల్లీ ఎన్సీఆర్ మూడో స్థానంలో ఉన్నాయి. ఈ మూడు మార్కెట్లు కలిసి గత 6–7 ఏళ్లలో డేటా సెంటర్ రియల్ ఎస్టేట్ మూడు రెట్లు పెరిగేందుకు దోహదపడ్డాయి. ‘‘తక్కువ లేటెన్సీ, రియల్ టైమ్ అనాలిసిస్, మెరుగైన యాప్ల పనితీరు, వివిధ పరిస్థితులకు అనుగుణంగా వ్యాపారాలు తమను తాము మల్చుకోవాల్సి వస్తుండటం తదితర అవసరాలరీత్యా డేటా సెంటర్లు భారీగా విస్తరిస్తున్నాయి’’ అని కొలియర్స్ ఇండియా వెల్లడించింది. 2030 నాటికి డీసీల కెపాసిటీ 4.5 గిగావాట్లకు ఎగియడానికి కూడా ఇదే దోహదపడుతుందని పేర్కొంది. పునరుత్పాదక విద్యుత్, 3 గిగావాట్ల విద్యుత్ మిగులులాంటివి చౌకగా హోస్టింగ్ సేవలు అందించడంలో భారత్కు సానుకూలాంశాలని క్యాపిటలాండ్ ఇన్వెస్ట్మెంట్ వర్గాలు తెలిపాయి. అతి కొద్ది దేశాలకు మాత్రమే ఈ ప్రయోజనం ఉంటుందని వివరించాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబైలో తలో డేటా సెంటర్ ఏర్పాటు కోసం క్యాపిటలాండ్ మొత్తం మీద 1.15 బిలియన్ సింగపూర్ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తోంది. 2020 నుంచి పెట్టుబడుల ప్రవాహం.. భారత డిజిటల్ మౌలిక సదుపాయాలపై ఇన్వెస్టర్లకు పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనంగా భారీగా పెట్టుబడులు తరలి వస్తున్నాయి. 2020 నుంచి 14.7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా 2030 నాటికి మరో 20–25 బిలియన్ డాలర్లు రావచ్చనే అంచనాలు నెలకొన్నాయి. తక్కువ లేటెన్సీ, అత్యుత్తమ పనితీరు కోసం ఓటీటీ ప్లాట్ఫాంలు, కంటెంట్ డెలివరీ నెట్వర్క్ (సీడీఎన్) సేవల సంస్థల నుంచి డిమాండ్ నెలకొన్నట్లు నె్రక్ట్సా బై ఎయిర్టెల్ సీఈవో ఆశీశ్ ఆరోరా తెలిపారు. ఈ సంస్థ 65 పైగా నగరాల్లో 120 ఎడ్జ్ డేటా సెంటర్లు, 14 హైపర్స్కేల్ డేటా సెంటర్లను నిర్వహిస్తోంది. తాము ప్రాంతీయంగా చిన్న పట్టణాల్లోకి కూడా విస్తరించడంపై దృష్టి పెడుతున్నామని ఆరోరా వివరించారు. విజయవాడ, అగర్తలా, పాటా్న, గువాహటి, సంబల్పూర్, గంగాగంజ్లాంటి కీలక నగరాల్లో తమ ఎడ్జ్ సెంటర్లను విస్తరించినట్లు వివరించారు. వీటితో మెట్రోల వెలుపల తృతీయ శ్రేణి నగరాల్లోని యూజర్లకు కూడా డిజిటల్ మౌలిక సదుపాయాలు మరింతగా అందుబాటులోకి వస్తున్నాయని, లైవ్.. హై–డెఫినిషన్ స్ట్రీమింగ్కి సంబంధించి లేటెన్సీ.. బ్యాండ్విడ్త్ వ్యయాలు తగ్గుతున్నాయని పేర్కొన్నారు. డీసీల విభాగంలో కొత్త పరిణామాలు చూస్తే అదానీకనెక్స్ సంస్థ చెన్నైలో 100 మెగావాట్ల క్యాంపస్ను, నోయిడాలో 50 మెగావాట్ల సెంటర్ను ఏర్పాటు చేస్తోంది. మరిన్ని ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ ఏర్పాటు చేసే ప్రణాళికల్లో ఉంది. ఇప్పటికే గ్రేటర్ నోయిడాలో ఉన్న యోటా డీ1తో పాటు హైపర్స్కేల్ క్యాంపస్ల విస్తరణపై యోటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూ. 39,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. క్యాపిటల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ తమ నవీ ముంబై సెంటర్పై రూ. 1,940 కోట్ల పెట్టుబడులు ప్రకటించింది. ఎస్టీటీ జీడీసీ ఇండియా, ఎన్టీటీ గ్లోబల్ తదితర సంస్థలు హైదరాబాద్, చెన్నై, పుణె, బెంగళూరు నగరాల్లో కొత్త హైపర్స్కేల్ సెంటర్స్తో కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి.హైదరాబాద్, ముంబై సారథ్యం.. 2020 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ మధ్యకాలంలో భారత్లో కొత్తగా 859 మెగావాట్ల డీసీ సామర్థ్యాలు జతయ్యాయి. ఇందులో ముంబై వాటా 44 శాతంగా, చైన్నై, ఢిల్లీ ఎన్సీఆర్ వాటా సంయుక్తంగా 42 శాతంగా ఉంది. 2023 నుంచి అయిదేళ్ల వ్యవధిలో కొత్తగా 3 – 3.7 గిగావాట్ల కొత్త సామర్థ్యాలు జత కానున్నాయి. చెరి 1–1.2 గిగావాట్ల సామర్థ్యాలతో హైదరాబాద్, ముంబై ఇందుకు సారథ్యం వహించనున్నాయి. హైదరాబాద్ వర్ధమాన హైపర్స్కేల్ హబ్గా ఎదుగుతోంది. పుణె 300–450 మెగావాట్లు, చెన్నై 400–450 మెగావాట్ల కొత్తగా సామర్థ్యాలను జతపర్చుకోనున్నాయి. -
ఒకే స్టేటస్ ఇమేజ్లో ఆరు ఫొటోలు.. వాట్సాప్ కొత్త అప్డేట్
మెటా కంపెనీ ఆధ్వర్యంలోని ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులకు కొత్త అప్డేట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. వ్యక్తిగత సమాచారంతోపాటు వేడుకలు, ఇతర జ్ఞాపకాలను ముఖ్యమైన వారితో పంచుకోవడానికి వాట్సాప్ స్టేటస్ను గతంలోనే తీసుకొచ్చింది. అయితే అందులో ఇప్పటివరకు కేవలం ఒకే ఇమేజ్ను అప్లోడ్ చేసే వీలుండేది. తాజాగా వాట్సాస్ తీసుకొచ్చిన అప్డేట్తో స్టేటస్ ఇమేజ్లో గరిష్ఠంగా ఆరు ఇమేజ్లను అప్లోడ్ చేసేలా వెసులుబాటు కల్పించింది.ఈమేరకు మే 30న కొత్త అప్డేట్ అందించింది. స్టేటస్ ద్వారా యూజర్లు మరింత సృజనాత్మకంగా తమ ఇమేజ్లను ఇతరులతో పంచుకునేందుకు అవకాశం కల్పించింది. కొత్తగా లేఅవుట్లు, మ్యూజిక్, ఫొటో స్టిక్కర్లు.. వంటి ఫీచర్లతో ‘యాడ్ యువర్స్’ ఆప్షన్ ద్వారా ఇమేజ్లను యాడ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది.ఇదీ చదవండి: నీరుగారుతున్న ఉపాధి హామీ చట్టం లక్ష్యంవినియోగదారులు సులభంగా ఉపయోగించేలా ఎడిటింగ్ టూల్స్తో గరిష్టంగా ఆరు ఫోటోలను ఒకే ఇమేజ్ స్టేటస్లో పొందుపరిచేలా లేఅవుట్ను రూపొందించారు. యూజర్లు ఇమేజ్లన్నింటినీ ఒకే ఫ్రేమ్లో ఎలా చూపించాలనుకుంటున్నారో సరిగ్గా అమర్చుకుంటే సరిపోతుంది. దీనికి అదనంగా మ్యూజిక్ను యాడ్ చేసుకోవచ్చు. వినియోగదారుల మానసిక స్థితిని అనుసరించి ట్యూన్ సెట్ చేయవచ్చు. దాంతోపాటు మ్యాజిక్ స్టిక్కర్ను ఉపయోగించవచ్చు. ఈ కొత్త ఫీచర్ను ఉపయోగించాలంటే వాట్సాప్ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి. -
ఆస్టన్ మార్టిన్తో రియల్మీ జట్టు
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్మీ, మోటార్ స్పోర్ట్ సంస్థ ఆస్టన్ మార్టిన్ ఫార్ములా వన్ టీమ్తో భాగస్వామ్యం కుదుర్చుకుని జీటీ 7 డ్రీమ్ ఎడిషన్ను ఆవిష్కరించింది. ఇందులో భాగంగా రియల్మీ ఫోన్ను ఆస్టన్ మార్టిన్ లోగోతో, విభిన్న స్టైలిష్ రంగుల్లో తయారు చేయనున్నారు. ఈ ఒప్పందం మూడేళ్లపాటు ఉంటుందని కంపెనీ పేర్కొంది.రియల్మీ ఆస్టన్ మార్టిన్ సహకారంతో ఏటా రెండు మోడళ్లను విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేసింది. ఇది స్మార్ట్ఫోన్ పరిశ్రమలో ఫార్ములా వన్ ప్రతిష్ఠను తీసుకువస్తుందని అధికారులు తెలుపుతున్నారు. ప్రాథమికంగా ఆస్టన్ మార్టిన్ జీటీ 7 డ్రీమ్ ఎడిషన్ ఫార్ములా వన్ రేసింగ్ డిజైన్ను క్యాప్చర్ చేసేలా రూపొందించిన ఏరోడైనమిక్ బిల్డ్తో మొబైల్ను లాంచ్ చేయనున్నట్లు రియల్మీ పేర్కొంది. అందులోని ఫీచర్లు కింది విధంగా ఉండనున్నాయి.ఇదీ చదవండి: పదేళ్లలో 17 కోట్ల ఉద్యోగాలు..7,000 ఎంఏహెచ్ బ్యాటరీ120 వాట్ల వైర్డ్ పవర్ ఛార్జింగ్మీడియాటెక్ డైమెన్సిటీ 9400ఈ చిప్సెట్ -
నాన్టెక్లో టెకీలుగా దూసుకొస్తున్న మహిళలు
ముంబై: టెక్యేతర రంగాల్లో మహిళా టెకీల ప్రాతినిధ్యం క్రమంగా పెరుగుతోంది. 2020 తర్వాత నుంచి ఈ ధోరణి మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. 2020లో టెక్నాలజీ ఉద్యోగాల్లో మహిళల వాటా 1.90 శాతంగా ఉండగా, 2023లో 11.8 శాతానికి, 2024 నాటికి 14 శాతానికి పెరిగిందని టీమ్లీజ్ డిజిటల్ ఒక నివేదికలో వెల్లడించింది. 2020–2024 మధ్యకాలంలో 13,000 మంది టీమ్లీజ్ డిజిటల్ టెక్ కాంట్రాక్ట్ సిబ్బంది డేటా విశ్లేషణ ఆధారంగా దీన్ని రూపొందించారు.దీని ప్రకారం పురుషాధిక్యత ఉండే కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో మహిళల వాటా 2020లో 9.51 శాతంగా ఉండగా 2024లో 27.98 శాతానికి పెరిగింది. నాన్–టెక్ రంగాల్లో టెక్నాలజీపరమైన విధుల్లో మహిళల నియామకాలు మెరుగుపడుతుండటాన్ని ఇది సూచిస్తోందని రిపోర్ట్ పేర్కొంది. నివేదికలోని మరిన్ని విశేషాలు.. హోదాపరంగా చూస్తే సీనియర్ స్థాయుల్లో మహిళల ప్రాతినిధ్యం 3.35 శాతానికే పరిమితం కాగా, మిడ్–లెవెల్లో 4.07 శాతంగా, ఎంట్రీ స్థాయిలో 3.03 శాతంగా ఉంది. లీడర్షిప్ హోదాలను చేరుకోవడంలో మహిళలకు ఇప్పటికీ సవాళ్లు ఎదురవుతున్నాయనడానికి ఇది నిదర్శనం. పరిశ్రమలవారీగా నైపుణ్యాల ఆధారిత విశ్లేషణ ప్రకారం, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగంలో ఇటు నాన్–టెక్నికల్, అటు టెక్నికల్ నైపుణ్యాల్లో మహిళల ప్రాతినిధ్యం అత్యధికంగా ఉంది. ఇది వరుసగా 49.28 శాతం, 44.31 శాతంగా నమోదైంది. 47.32 శాతం, 34.58 శాతం వాటాతో లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్కేర్ ఆ తర్వాత స్థానంలో నిల్చింది. టెక్నాలజీయేతర రంగాల్లో టెకీ ఉద్యోగాల్లో మహిళల వాటా 14 శాతానికి చేరడమనేది సమ్మిళితత్వం పెరుగుతుండటాన్ని సూచిస్తోంది. అయితే, లీడర్షిప్ హోదాల్లో వారికి అంతగా ప్రాతినిధ్యం ఉండటం లేదు. ఈ అంతరాలను సరిచేసేందుకు తగు చర్యలు తీసుకోవాలి. మహిళలకు కూడా అవకాశాలు ..వనరులు సమానంగా అందుబాటులో ఉండేలా, పరిశ్రమపరమైన అవరోధాలను పరిష్కరించేలా, సిబ్బందిలో వారి సంఖ్య మరింత పెరిగేలా చూడటంపై కంపెనీలు మరింత దృష్టి పెట్టాలి. -
అయ్ బాబోయ్... ఏఐ వాయిస్ క్లోనింగ్!
ఆరోజు... ముంబైలో ఉండే కేశవ్కు ఫోన్కాల్ వచ్చింది. దుబాయ్లోని భారత రాయబార కార్యాలయం నుంచి కాల్ చేస్తున్నట్లు చెప్పారు. కొన్ని సెకన్ల తరువాత... ఫోన్లో తన కుమారుడు శ్రీకర్ అరుపులు విని కేశవ్ షాక్ అయ్యాడు. ‘దయచేసి నాకు బెయిల్ ఇప్పించండి’ ఏడుస్తూనే అంటున్నాడు శ్రీకర్. ‘మీరు 80,000 రూ పాయలు చెల్లించాలి’ అని ఫోన్ చేసిన వాళ్లు కేశవ్ను డిమాండ్ చేశారు. ఆ భయంలో, బాధలో ఏమీ తోచని కేశవ్ వారు చెప్పినట్లే చేశాడు. అయితే అది మోసం అని తెలుసుకోవడానికి కేశవ్కు ఎంతో టైమ్ పట్టలేదు. తన కుమారుడు సురక్షితంగానే ఉన్నాడు.మరి వాయిస్ మాటేమిటి?శ్రీకర్ వాయిస్ను అనుసరిస్తూ ఏఐ ద్వారా సృష్టించిన ఫేక్ వాయిస్ అది. సైబర్ మోసాలలో ఒకటి... ఏఐ వాయిస్ క్లోనింగ్. ప్రజల భావోద్వేగాలను, బలహీనతలను ఆసరాగా చేసుకొని అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మోసం చేస్తున్నారు స్కామర్స్. గత కొంతకాలంగా ‘వాయిస్ క్లోనింగ్’ ఊపందుకుంది. అయితే విద్యావంతులు, విద్యావంతులు కాని వారు అనే తేడా లేకుండా డెబ్భైశాతం మంది క్లోన్ వాయిస్లను గుర్తించలే పోతున్నారు. ఒక వ్యక్తి వాయిస్ను క్లోన్ చేయడానికి స్కామర్లకు జస్ట్ మూడు సెకన్ల సమయం చాలు.మోసగాళ్ల బారిన పడకుండా కొన్నిచిట్కాలు‘అయ్యో... నన్ను గుర్తుపట్టలేదా!’ అంటూ మోసగాళ్లు మాటలు కలుపుతారు. ‘సారీ... గుర్తుపట్టలేదు’ అంటే ఏమనుకుంటారో అని మొహమాటం కొద్దీ మాట్లాడడం మొదలుపెడతారు కొందరు. అలా చేస్తే మోసగాళ్లకు అవకాశం ఇచ్చినట్లే. అందుకే... ‘నేను ఫలానా...’ అని అవతలి వ్యక్తి చెప్పినప్పుడు మీ ఇద్దరికి మాత్రమే తెలిసిన ఒక విషయం గురించి అడగండి. అతను కరెక్ట్ అని చెబితే ఓకే. కానిపక్షంలో అనుమానించాల్సిందే.→ స్నేహితుడు, బంధువు... మొదలైన వారి పేరుతో వచ్చిన కాల్ చాలా తక్కువ టైమ్ మాత్రమే ఉంటే అది వార్నింగ్ సైన్ అనుకోవచ్చు,→ ఏఐ స్కామ్ వాయిస్లు తెలియని నంబర్ నుంచి జరుగుతుంటాయి.→ ఆన్లైన్లో అపరిచితులకు వాయిస్ నోట్స్, వీడియో షేరింగ్ చేయకూడదు. -
జియో 5 కొత్త ప్లాన్లు.. ప్రత్యేక బెనిఫిట్తో..
దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న క్లౌడ్ గేమింగ్ మార్కెట్ దృష్ట్యా రిలయన్స్ జియో ఒక పెద్ద అడుగు వేసింది. కంపెనీ ఐదు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రారంభించింది. వీటిలో ఉచితంగా జియోగేమ్స్ క్లౌడ్ ప్రయోజనాన్ని అందిస్తోంది. అంటే ఖరీదైన హార్డ్వేర్ లేకుండా యూజర్లు తమ మొబైల్, పీసీ, జియో సెట్-టాప్ బాక్స్లో కన్సోల్ లాంటి గేమ్స్ను ఆస్వాదించగలరు. ఈ ప్లాన్లు రూ.48 నుంచి ప్రారంభమవుతాయి.ఏమిటీ జియోగేమ్స్ క్లౌడ్?ఇది క్లౌడ్ ఆధారిత గేమింగ్ సర్వీస్. దీని ద్వారా యూజర్లు గేమ్ను డౌన్లోడ్ చేయకుండా నేరుగా ఆన్లైన్లో ఆడవచ్చు. సాధారణంగా దీని సబ్ స్క్రిప్షన్ రూ.398. కానీ కొత్త ప్లాన్లలో ఈ సదుపాయాన్ని ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా జియో ఉచితంగా అందిస్తోంది. ఈ ఆఫర్ ప్రస్తుతం ప్రీపెయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. పోస్ట్ పెయిడ్, బ్రాడ్బ్యాండ్ వినియోగదారులకు ఇది అందుబాటులో లేదు.జియో కొత్త గేమింగ్ ప్లాన్స్ ఇవే..రూ.48 ప్లాన్: ఇది గేమింగ్ ప్రయత్నించాలనుకునే స్వల్పకాలిక వినియోగదారుల కోసం తీసుకొచ్చిన ప్లాన్. ఈ ప్లాన్ 10 ఎంబీ డేటా, జియోగేమ్స్ క్లౌడ్ యాక్సెస్ ను 3 రోజుల పాటు అందిస్తుంది.రూ.98 ప్లాన్: ఈ ప్లాన్తో 7 రోజుల పాటు 10 ఎంబీ డేటా, గేమింగ్ యాక్సెస్ లభిస్తుంది. ఇది డేటా వోచర్, కాబట్టి దీనిని ఉపయోగించడానికి యాక్టివ్ బేస్ ప్లాన్ కలిగి ఉండటం అవసరం.రూ.298 ప్లాన్: జియోగేమ్స్ క్లౌడ్ యాక్సెస్ తో పాటు 3 జీబీ డేటాను 28 రోజుల పాటు అందిస్తుంది. ఇది కూడా డేటా వోచర్. యాక్టివ్ ప్లాన్ తో మాత్రమే ఉపయోగించవచ్చు.రూ.495 ప్లాన్: రోజుకు 1.5 జీబీ డేటా, 5 జీబీ బోనస్ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లను 28 రోజుల పాటు అందిస్తుంది. జియోగేమ్స్ క్లౌడ్, జియోసినిమా (డిస్నీ+ హాట్స్టార్ మొబైల్), ఫ్యాన్కోడ్, జియోటీవీ, జియోఏఐక్లౌడ్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.రూ.545 ప్లాన్: ఇది అత్యంత ప్రీమియం ప్లాన్. 2 జీబీ రోజువారీ డేటా, 5 జీబీ బోనస్ డేటా, అపరిమిత 5 జీ డేటా ఇందులో లభిస్తాయి. మిగతా ఫీచర్లన్నీ రూ.495 ప్లాన్ మాదిరిగానే ఉంటాయి. -
ఐదేళ్లలో 50 శాతం ఉద్యోగాలు ఉఫ్!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వేగంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో జాబ్మార్కెట్లో దీని ప్రభావం భారీగా ఉండనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో దీని ప్రభావం ఇంతకు ముందు ఊహించిన దానికంటే చాలా తీవ్రంగా ఉంటుందని ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోది తెలిపారు. వచ్చే ఐదేళ్లలో 50 శాతం ఎంట్రీ లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాలను ఏఐ ప్రభావితం చేయబోతుందని చెప్పారు. దాంతో నిరుద్యోగ రేటు 20 శాతానికి చేరుకుంటుందని అమోది అంచనా వేస్తున్నారు.ఉద్యోగాలపై ఏఐ ప్రభావంఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆటోమేషన్ ఇప్పటికే టెక్నాలజీ, ఫైనాన్స్, లా, కన్సల్టింగ్.. వంటి చాలా రంగాల్లోని ఉద్యోగులకు విఘాతం కలిగిస్తోంది. సంక్లిష్టమైన డేటా విశ్లేషణ, కంటెంట్ సృష్టి, చట్టపరమైన పరిశోధన చేసేలా మెషిన్ లెర్నింగ్ నమూనాలు, సాంప్రదాయకంగా ఇంటర్న్లు, జూనియర్ ఉద్యోగులు నిర్వహించే పనులను ఏఐ భర్తీ చేస్తోందని అమోది తెలిపారు. ఫలితంగా కంపెనీలు కొత్త గ్రాడ్యుయేట్లను నియమించుకోవడం తగ్గించాయని చెప్పారు. ముఖ్యంగా గతంలో వృత్తిపరమైన ఎదుగుదలకు కీలకంగా ఉన్న ఉద్యోగాల స్థానంలో రిక్రూట్మెంట్ గణనీయంగా పడిపోయిందని పేర్కొన్నారు. కొవిడ్ ముందు పరిణామాలతో పోలిస్తే పెద్ద టెక్ కంపెనీల్లో ఎంట్రీ లెవల్ నియామకాలు 50% పడిపోయాయని తెలిపారు. ఆటోమేషన్ వర్క్ఫ్లోలను క్రమబద్ధీకరిస్తుండడం, వ్యాపారాలకు నిర్వహణ ఖర్చులను తగ్గిస్తుండడంతో ఏఐ కీలకంగా మారిందన్నారు.మౌనం తగదు..భారీగా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉన్నప్పటికీ ప్రభుత్వాలు నోరుమెదపడం లేదని అమోది చెప్పారు. ముఖ్యంగా యూఎస్ అడ్మినిస్ట్రేషన్ ఈ అంశంపై మౌనంగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. చైనాతో జరుగుతున్న ఏఐ రేసులో ఎదురుదెబ్బలు తగులుతాయనే భయంతో విధాన నిర్ణేతలు నష్టాలను అంగీకరించడానికి వెనుకాడుతున్నారని అంచనా వేశారు. ఏఐ ఆర్థిక వృద్ధికి ఆజ్యం పోస్తుందని, అదే సమయంలో లక్షలాది మంది ఉద్యోగాలకు ప్రమాదకరంగా మారుతుందని అమోది అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: క్రిప్టో విధానాలపై త్వరలో చర్చా పత్రంఏం చేయాలంటే..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి చెందుతున్న వేగాన్ని దృష్టిలో ఉంచుకుని దీన్ని ప్రభావాన్ని తగ్గించడం మానేసి ఈ మార్పులకు సిద్ధంగా ఉండడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అమోది కోరారు. ఏఐ ఆధారిత ఉద్యోగాలకు అనుగుణంగా ప్రొఫెషనల్స్కు నైపుణ్యాలు పెంచుకునేందుకు వీలుగా రీస్కిల్లింగ్, అప్ స్కిల్ ప్రోగ్రామ్ల అవసరాన్ని నొక్కి చెప్పారు. -
మొబైల్లో త్వరగా ఛార్జింగ్ అయిపోతుందా?
మీ మొబైల్లో ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా? మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఇన్స్టాగ్రామ్ యాప్ ఉందా? అయితే దానిపై ఓ లుక్కేయాల్సిందే. ఫోన్లో త్వరగా బ్యాటరీ అయిపోతుందంటే దానికి మొబైల్లో ఇన్స్టాల్ చేసిన ఇన్స్ట్రాగ్రామ్ యాప్ కారణం కావొచ్చని గూగుల్ పోస్ట్లో తెలిపింది. ఈ సమస్య పిక్సెల్ ఫోన్ వినియోగదారులకు అధికంగా ఉందని పేర్కొంది.గత కొన్ని వారాలుగా పిక్సెల్ వినియోగదారులు తమ పరికరాల్లో బ్యాటరీ సమస్యలను నివేదించినట్లు గూగుల్ తెలిపింది. అందుకుగల కారణాన్ని ధ్రువీకరించింది. మొబైల్ బ్యాక్గ్రాండ్లో ఇన్స్టాగ్రామ్ యాప్ అధిక బ్యాటరీ వినియోగానికి కారణమవుతుందని గూగుల్ సపోర్ట్ పోస్ట్లో వెల్లడించింది. పిక్సెల్ పరికరాలకు మే నెలలో సాఫ్ట్వేర్ అప్డేట్ ఇచ్చినట్లు పేర్కొంది. అప్పటి నుంచి ఈ సమస్య మరింత ఎక్కువైందని చెప్పింది.ఇదీ చదవండి: నోట్ల ముద్రణకు రూ.6,373 కోట్లు ఖర్చు!ప్రపంచవ్యాప్తంగా మెటా యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ను ఆండ్రాయిడ్ ఓఎస్లో దాదాపు 100 కోట్లకు పైగా యూజర్లు వినియోగిస్తున్నారు. అయితే ఈ యాప్ బ్యాటరీ లైఫ్ను ఎలా తగ్గిస్తోందో తెలియజేయడానికి యూజర్లు రెడిట్ వేదికగా తమ సమస్యలు నివేదించారు. ఇన్స్టాగ్రామ్ పాత వెర్షన్కు తిరిగి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నట్లు కొందరు తెలిపారు. ఇంకొందరు ఓవర్ హీటింగ్ వంటి మరిన్ని సమస్యలను చెప్పారు.ఈ సమస్యకు పరిష్కారం..?బ్యాటరీ డ్రెయిన్ సమస్యను పరిష్కరించడానికి ఆండ్రాయిడ్ ఫోన్లో ఇన్స్టాగ్రామ్ యాప్ను అప్డేట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే దీనిపై మెటా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కానీ ఇన్స్టాగ్రామ్ సమస్యకు పరిష్కారాన్ని ప్రారంభించినట్లు గూగుల్ ధ్రువీకరించింది. ఆండ్రాయిడ్ డివైజ్ల్లో బ్యాటరీ డ్రైన్ సమస్యను పరిష్కరించడానికి ఇన్స్టాగ్రామ్ అప్డేటెడ్ యాప్ను విడుదల చేస్తుందని, బ్యాటరీ సమస్యను పరిష్కరించడానికి వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా యాప్ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. -
‘కంటెంట్ను లాగేస్తున్న గూగుల్’.. సీఈఓ ఏమన్నారంటే..
ఆన్లైన్ సెర్చ్ ఇంజిన్లో దూసుకుపోతున్న గూగుల్ ఉపయోగిస్తున్న ఏఐ ఫీచర్లకు సంబంధించి కొన్ని సంస్థల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కొన్ని కంటెంట్ పబ్లిషర్ సంస్థలు నేరుగా యూజర్లు తమ వెబ్సైట్లోకి రాకుండా గూగుల్ అనైతికంగా ట్రాఫిక్ను మళ్లిస్తుందని వాదిస్తున్నాయి. దీనిపై కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ స్పందించారు.ఏఐ జనరేటెడ్ సమాధానాలను అందించే గూగుల్ ఏఐ ఫీచర్ల ద్వారా వెబ్సైట్ ట్రాఫిక్ తగ్గుతుందని కొన్ని సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. న్యూస్ మీడియా అలయన్స్ గూగుల్ బలవంతంగా తమ కంటెంట్ను తీసుకుంటుందని అని ఇటీవల ఆరోపించింది. అనైతికంగా గూగుల్ తమ కంటెంట్ను దొంగలిస్తుందని వాదిస్తోంది.ఇదీ చదవండి: కోటీశ్వరుల స్వర్గధామంగూగుల్ పనితీరును సమర్థించిన సుందర్ పిచాయ్.. ‘మేము ఇప్పటికీ యూజర్లను వెబ్లో సెర్చ్ చేసేందుకు చాలా డబ్బు వెచ్చిస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ మరింత మెరుగ్గా వెబ్సైట్లకు ట్రాఫిక్ను అందించేందుకు రూపొందించారు. వినియోగదారులు అడిగే కొన్ని సాధారణ ప్రశ్నలకు కృత్రిమ మేధ ద్వారా నేరుగా సమాధానాలు లభించినప్పటికీ, వారికి విస్తృతమైన వనరులుగా వెబ్సైట్లు నిలుస్తున్నాయి. అయితే వ్యక్తిగత ప్రచురణకర్తలు తమ వెబ్సైట్ ట్రాఫిక్లో తేడాలను చూసే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ వృద్ధి ధోరణి క్రమంగా పెరుగుతోంది. వెబ్సైట్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఏఐ ఓవర్వ్యూలను మెరుగుపరిచేందుకు గూగుల్ సిద్ధంగా ఉంది’ అని తెలిపారు. -
టెలిగ్రామ్లో గ్రోక్ఏఐ పాగా
కృత్రిమ మేధకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. దాంతో ఆన్లైన్ మెసేజింగ్ యాప్లు ఏఐను తమ ప్లాట్ఫామ్ల్లో భాగం చేస్తున్నాయి. అందులో భాగంగా టెలిగ్రామ్ ఎక్స్ఏఐతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నట్లు తెలిపింది. ఈమేరకు టెలిగ్రామ్ ప్లాట్ఫామ్లో ఎక్స్ఏఐ గ్రోక్ చాట్బాట్ను వాడేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ డీల్ విలువ 300 మిలియన్ డాలర్లుగా ఉన్నట్లు కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి. దాంతోపాటు టెలిగ్రామ్ ద్వారా విక్రయించిన ఎక్స్ఏఐ సబ్స్క్రిప్షన్ల నుంచి ఇరు కంపెనీలకు 50 శాతం ఆదాయ భాగస్వామ్యం ఉన్నట్లు పేర్కొన్నాయి.టెలిగ్రామ్కు ఉన్న యూజర్ బేస్ గ్రోక్ విస్తరణకు కూడా ఎంతో తోడ్పడుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. సంభాషణాత్మక ఏఐ సామర్థ్యాలకు ప్రసిద్ధి చెందిన ఈ చాట్బాట్ను టెలిగ్రామ్ వినియోగదారులకు త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. అయితే టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ తన ఎక్స్ ఖాతాలో దీనికి సంబంధించిన వివరాలు ప్రకటించినా, ఎక్స్ఏఐ ఇంకా దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు.🔥 This summer, Telegram users will gain access to the best AI technology on the market. @elonmusk and I have agreed to a 1-year partnership to bring xAI’s @grok to our billion+ users and integrate it across all Telegram apps 🤝💪 This also strengthens Telegram’s financial… pic.twitter.com/ZPK550AyRV— Pavel Durov (@durov) May 28, 2025ఇదీ చదవండి: కోటీశ్వరుల స్వర్గధామంమార్కెట్లో ఇప్పటికే వాట్సప్, గూగుల్చాట్ వంటి మేసేజింగ్ యాప్ల్లో మెటా లామా, జెమిని వంటి ఏఐ టూల్స్ సేవలందిస్తున్నాయి. ఈ కంపెనీలకు మాతృసంస్థలుగా ఉన్న మెటా, గూగుల్ సొంతంగా తయారు చేసిన ఈ ఏఐ టూల్స్ను వాడుతున్నాయి. అయితే టెలిగ్రామ్కు ఆ అవకాశం లేదు. దాంతో తన ప్లాట్ఫామ్లో ఏఐ టూల్ వాడేందుకు ఎక్స్ఏఐతో ఒప్పందం కుదుర్చుకుందనే వాదనలున్నాయి. -
మైక్రోసాఫ్ట్, యోటా జట్టు.. ఏఐ వినియోగానికి మరింత జోరు
న్యూఢిల్లీ: భారత్లో కృత్రిమ మేథని (ఏఐ) మరింతగా వినియోగంలోకి తెచ్చే దిశగా మైక్రోసాఫ్ట్, యోటా డేటా సర్వీసెస్ చేతులు కలిపాయి. ఈ ఒప్పందం ప్రకారం యోటా ఏఐ క్లౌడ్ ప్లాట్ఫాం అయిన శక్తి క్లౌడ్లో మైక్రోసాఫ్ట్ తమ అజూర్ ఏఐ సర్వీసులను అందుబాటులోకి తెస్తుంది.దీంతో డెవలపర్లు, స్టార్టప్లు, కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇండియాఏఐ మిషన్లో భాగమైన సంస్థలకు అధునాతన సేవలు అందుబాటులోకి వస్తాయి. దేశీయంగా కృత్రిమ మేథ సామర్థ్యాలను పెంపొందించడం, నవకల్పనలను ప్రోత్సహించడం, మౌలిక సదుపాయాలను పటిష్టపర్చడం ద్వారా ఇండియాఏఐ మిషన్ లక్ష్యాల సాధనకు కూడా మైక్రోసాఫ్ట్–యోటా భాగస్వామ్యం తోడ్పడనుంది.👉ఇదీ చదవండి: టీసీఎస్లో భారీగా ఏఐ ఏజెంట్లు..ఇండియాఏఐ మిషన్ అనేది దేశంలోని కృత్రిమ మేధ వ్యవస్థను బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ చొరవ. ఏఐ ఇన్నోవేషన్ ను ప్రోత్సహించడం, స్వదేశీ ఏఐ మోడళ్లను అభివృద్ధి చేయడం, పటిష్టమైన ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను సృష్టించడం ఈ మిషన్ లక్ష్యం. దేశీ ఏఐ మోడల్స్ను రూపొందించడానికి సంబంధించి 2025 మే నాటికి ఇండియాఏఐ మిషన్కు 500 పైగా ప్రతిపాదనలు వచ్చాయి. -
టీసీఎస్లో భారీగా ఏఐ ఏజెంట్లు.. ఉద్యోగులతో కలిసే..
ముంబై: కృత్రిమ మేథ (ఏఐ) ఏదో ఆషామాషీ టెక్నాలజీ కాదని, మానవ జాతి పురోగమనాన్ని మలుపు తిప్పే ఒక శక్తివంతమైన సాధనమని ఐటీ దిగ్గజం టీసీఎస్ బోర్డు, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. అన్ని పరిశ్రమలకూ ఇది ప్రయోజనకరంగానే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులతో కలిసి పనిచేసే ఏఐ ఏజెంట్లను భారీ స్థాయిలో రూపొందిస్తామని చంద్రశేఖరన్ చెప్పారు.భవిష్యత్తులో ‘హ్యూమన్ ప్లస్ ఏఐ‘ మోడల్ కింద సర్వీసులు అందిస్తామని షేర్హోల్డర్లకు టీసీఎస్ మాతృ సంస్థ టాటా సన్స్కి కూడా చైర్మన్ అయిన చంద్రశేఖరన్ తెలిపారు. అలాగే, ఏఐ డేటా సెంటర్లు, క్లౌడ్ మౌలిక సదుపాయాలపై ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు.హార్డ్వేర్ ప్రొవైడర్లు, సొల్యూషన్స్ ఆవిష్కర్తలు, స్టార్టప్లతో భాగస్వామ్యాలు కుదుర్చుకుంటామని వివరించారు. ఏఐ సాంకేతిక వినియోగంలో టీసీఎస్ ముందు వరుసలో ఉంటోందని, పలు సొల్యూషన్స్లో దీన్ని ఉపయోగిస్తోందని చంద్రశేఖరన్ తెలిపారు. ‘టీసీఎస్ విజ్డంనెక్ట్స్’ పేరిట కంపెనీల కోసం జెన్ ఏఐ ప్లాట్ఫాంను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.👉 ఇది చదివారా? జాబ్ చేంజ్ అంటే ఇదీ.. రూ.5.5 లక్షల నుంచి రూ.45 లక్షల జీతానికి.. -
జాబ్ చేంజ్ అంటే ఇదీ.. ఏకంగా రూ.45 లక్షల జీతానికి..
తరచూ ఉద్యోగాలు మారడం కార్పొరేట్ సంస్కృతిలో భాగంగా మారింది. ఎందుకంటే జాబ్ మారిన ప్రతీసారి జీతాలు, హోదాలు, ఇతర ప్రయోజనాలు పెరుగుతాయి. సాధారణంగా ఉద్యోగాలు మారడం ద్వారా సగటున 30–40 శాతం లేదా కొన్ని సందర్భాల్లో 100 శాతానికి పైగానే ఉద్యోగులు జీతాలను పెంచుకుంటున్నారు. కానీ ఒక్క స్విచ్లో ఏకంగా 700 శాతానికి పైగా జీతం పెరిగిందంటే నమ్ముతారా?మీరు నమ్మినా.. నమ్మకపోయినా ఓ టెక్కీ విషయంలో ఇలాగే జరిగింది. ఢిల్లీకి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి జాబ్ స్విచ్ స్టోరీ ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఒక ప్రముఖ టెక్ కంపెనీలో తన వార్షిక వేతనం రూ.5.5 లక్షల నుంచి కేవలం ఏడాదిలోనే రూ.45 లక్షలకు పెరిగిందని ఆ యువ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఇటీవల తన కెరీర్ విశేషాలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో అతని పోస్ట్ త్వరగా దృష్టిని ఆకర్షించింది. విస్తృతమైన చర్చను రేకెత్తించింది.దేవేష్ అనే డెవలపర్ ఏడాది క్రితమే ఫుల్ టైమ్ కెరీర్ ప్రారంభించారు. మామూలు వేతనంతో ప్రారంభమైన ఆయన ఇప్పుడు తన ప్రారంభ వేతనానికి దాదాపు తొమ్మిది రెట్లు సంపాదిస్తూ ఒక అగ్రశ్రేణి గ్లోబల్ టెక్ కంపెనీలో స్థానం సంపాదించినట్లు పేర్కొన్నారు. అదే సమయంలో ఇప్పుడిప్పుడే కెరీర్లో అడుగుపెడుతున్నవారికి కొన్ని సూచనలూ ఇచ్చారు. అధిక ప్రారంభ వేతనాల కంటే నేర్చుకోవడం, నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, ఆ తర్వాత భారీ వేతనాలను సాధించవచ్చని సూచించారు. -
దేశంలో తొలి ప్రైవేటు హెలికాప్టర్ తయారీ కేంద్రం ఏర్పాటు
దేశంలోని తొలి ప్రైవేటు హెలికాప్టర్ తయారీ కేంద్రాన్ని కర్ణాటకలోని కోలార్లో ఏర్పాటు చేయనున్నారు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ (టీఏఎస్ఎల్), యూరోపియన్ ఏవియేషన్ దిగ్గజం ఎయిర్ బస్ సంయుక్త భాగస్వామ్యంతో దీన్ని రూపొందించనున్నట్లు తెలిపారు. భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవకు ఊతమిచ్చేలా టాటా గ్రూప్-ఎయిర్ బస్లు కలిసి హెచ్ 125 సివిల్ హెలికాప్టర్లను తయారు చేసే సదుపాయాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఫ్రాన్స్, అమెరికా, బ్రెజిల్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి తయారీ యూనిట్ ఇది నాలుగోది కావడం విశేషం.కర్ణాటకలోని వేంగల్ ఇండస్ట్రియల్ ఏరియాలో దేశంలోనే తొలి ప్రైవేట్ సెక్టార్ హెలికాప్టర్ అసెంబ్లింగ్ ఫెసిలిటీ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు ఇరు కంపెనీలు తెలిపాయి. ఈ కేంద్రం ద్వారా ఏటా 10 ఎయిర్ బస్ హెచ్ 125 హెలికాప్టర్లను ఉత్పత్తి చేస్తామని చెప్పాయి. వచ్చే 20 ఏళ్లలో 500 యూనిట్ల ప్రాంతీయ డిమాండ్ నెలకొంటుందని అంచనా వేస్తున్నాయి. టీఏఎస్ఎల్, ఎయిర్ బస్ సంయుక్తంగా చేపట్టిన ఈ ప్లాంట్ దేశీయ ఏరోస్పేస్ తయారీ రంగంలో స్వావలంబనను పెంపొందించేలా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: టర్కీ కంపెనీ కాంట్రాక్ట్ రద్దు చేసిన చెన్నై ఎయిర్పోర్ట్ఏరోస్పేస్ ఎకోసిస్టమ్, ప్రస్తుతం ఉన్న టీఏఎస్ఎల్ మౌలికసదుపాయాలు, భూ సేకరణ, ఫాస్ట్ట్రాక్ అనుమతులు, ఉత్పత్తి సంబంధిత ప్రయోజనాలు వంటి రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాల కారణంగా కర్ణాటక ఈ ప్రాజెక్టును దక్కించుకుంది. హెలికాప్టర్ అసెంబ్లింగ్, తయారీ, నిర్వహణ, మరమ్మతులు ఇతర కార్యకలాపాల కోసం టీఏఎస్ఎల్ 7,40,000 చదరపు అడుగుల స్థలాన్ని సేకరించింది. -
ఏఐ పరిస్థితి ఇంతే!.. ఉద్యోగులకు భయమేల
గత కొంతకాలంగా ఉద్యోగులను భయపెడుతున్న ఒకే ఒక అంశం ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీ. దీనివల్ల ఉద్యోగాలు పోతాయని, ప్రపంచంలోని చాలా దేశాల్లో నిరుద్యోగం విపరీతంగా పెరుగుతుందని.. కొందరు నిపుణులు కూడా వెల్లడించారు. ఇందులో ఏ మాత్రం నిజం ఉంది?, నిజంగానే ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయా?, నివేదికలు ఏం చెబుతున్నాయనే.. విషయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఏఐ దాదాపు అన్ని రంగాల్లోనూ.. సంచనలం సృష్టించింది. దీంతో చాలామంది భయపడ్డారు. అయితే ప్రస్తుతం కొన్ని నివేదికలు మాత్రం ఊహించినదానికి భిన్నంగా ఉన్నాయని, ఉద్యోగాలు ఎక్కడికీ పోవని చెబుతున్నాయి. అమెరికా డేటా.. ఏఐ ఉన్నప్పటికీ ఏడాదిలో ఇంటర్ప్రిటేషన్, ట్రాన్స్లేషన్కి సంబంధించిన ఉద్యోగాలు ఏడు శాతం పెరిగాయని చెబుతోంది. మనుషులను ఏఐ రీప్లేస్ చేస్తుందని చెప్పిన కంపెనీలు కూడా.. ఇప్పుడు మనిషి అవసరం ఖచ్చితంగా ఉందని స్పష్టం చేస్తున్నాయి.సగటు ఉద్యోగులతో పోలిస్తే.. ఫ్రెషర్లు ఉద్యోగాలు పొందలేకపోతున్నారని అమెరికా డేటా వెల్లడించింది. ఏఐ రాకముందు కూడా ఫ్రెషర్స్ ఈ పరిస్థితులనే ఎదుర్కొన్నారు. అయితే ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలను నేర్చుకున్నవారికి తప్పకుండా ఉద్యోగాలు లభించకుండా ఉండే అవకాశం లేదు.చాలా కంపెనీలు ఏఐలను ఎంట్రీ లెవెల్ ఉద్యోగులు చేసే పనుల్లో ఉపయోగిస్తున్నాయి. మొత్తం మీద అమెరికాలో ఉద్యోగులు లభించని ఫ్రెషర్స్ కేవలం నాలుగు శాతం మంది మాత్రమే ఉన్నారు. యూఎస్ఏలో మాత్రమే కాకుండా.. ఇతర దేశాల్లో కూడా ప్రెషర్స్ పరిస్థితి ఇలాగే ఉంది. పరిస్థితులను చూస్తుంటే.. నిరుద్యోగులు పెరగడానికి లేదా ఉద్యోగాలు లభించకపోవడానికి కేవలం ఏఐ మాత్రమే కారణం చెప్పడానికి ఆస్కారం లేదు.బ్రిటన్, జపాన్ వంటి దేశాల్లో ఏఐ ఉన్నప్పటికీ.. ఉద్యోగుల జీతాలు కూడా భారీగానే పెరుగుతున్నాయి. దీన్నిబట్టి చూస్తుంటే.. ఉద్యోగులను తొలగించాలనే ఉద్దేశ్యం దాదాపు కంపెనీలకు లేదు, అంతే కాకుండా వారికి మంచి జీతాలను ఇవ్వడానికి కూడా ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదని స్పష్టంగా తెలుస్తోంది.దిగ్గజ కంపెనీలన్నీ.. ప్రతి ఆపరేషన్లోనూ ఏఐలను తీసుకొస్తామని చెబుతూనే ఉన్నాయి. అయితే ముఖ్యమైన పనులకు మాత్రం ఏఐలను ఉపయోగించడం లేదు. అమెరికాలో కేవలం 10 శాతం కంపెనీలు మాత్రమే ఏఐలను గూడ్స్ అండ్ సర్వీస్ కోసం విరివిగా వాడుతున్నారని తెలుస్తోంది.ఇదీ చదవండి: 'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకిఒకవేళ కంపెనీలు ఏఐలను తీసుకున్నప్పటికీ.. ఉద్యోగులను వదులుకోవడానికి మాత్రం సిద్ధంగా లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఏఐ మనిషిని రీప్లేస్ చేయదు, మనిషితో కలిసి పనిచేస్తుంది, పని వేగంగా జరగడానికి సహాయం చేస్తుంది. కాబట్టి ఏఐ వల్ల ఉద్యోగాలు భారీగా పోతాయనేది కేవలం ఓ అపోహ మాత్రమే. ప్రస్తుతానికి ఉద్యోగులు నిశ్చితంగా ఉండవచ్చు, అయితే.. మారుతున్న ప్రపంచంలో మనగలగాలి అంటే.. టెక్నాలజీలో ,ముందుండాలన్న విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. -
పీసీలకు పెరిగిన గిరాకీ
రిపబ్లిక్ డే అమ్మకాలు, అధిక ఎగుమతులు కారణంగా భారత వ్యక్తిగత కంప్యూటర్ల (పీసీలు) మార్కెట్ 2025 మార్చి క్వార్టర్లో పరుగులు పెట్టింది. వార్షిక ప్రాతిపదికన 8.1% వృద్ధితో మొత్తం 33.17 లక్షల పీసీలు అమ్ముడైనట్లు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్(ఐడీసీ) నివేదిక తెలిపింది. అంతకుముందు 2024 ఇదే త్రైమాసికంలో మొత్తం విక్రయాలు 30.70 లక్షలుగా ఉన్నాయి.‘ఆఫ్లైన్ విస్తరణపై దృష్టి, ఈ–టైలింగ్ చానెల్ కారణంగా భారత పీసీ మార్కెట్ వరుసగా ఏడో క్వార్టర్లోనూ వృద్ధి సాధించింది. పీసీ వెండర్లు కొత్త బ్రాండ్ స్టోర్ల ద్వారా కస్టమర్లకు వ్యక్తిగత కంప్యూటర్లను అందుబాటులోకి తీసుకురావడంతో ఆఫ్లైన్ విక్రయాలు పెరిగాయి. ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, క్యాష్బ్యాక్ డీల్స్తో ఆన్లైన్ అమ్మకాలు ఊపందుకున్నాయి. బలమైన షిప్మెంట్ మార్కెట్ సానుకూల ధోరణి సూచిస్తున్నప్పట్టకీ.., సమీప భవిష్యత్తులో ఇన్వెంటరీ(నిల్వల) సవాళ్లు ఎదురవ్వొచ్చు’ అని ఐడీసీ ఇండియా రీసెర్చ్ మేనేజర్ భరత్ షెనాయ్ తెలిపారు. ఇదీ చదవండి: గోల్డ్ రేట్, స్టాక్ మార్కెట్ అప్డేట్స్మార్చి క్వార్టర్లో హెచ్పీ కంపెనీ 9.6 లక్షల యూనిట్లు విక్రయించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో అమ్మిన 9.2 లక్షల యూనిట్లతో పోలిస్తే ఇది 4.6% అధికం. అయితే పీసీ మార్కెట్లో 29.1% వాటాతో అగ్రస్థానాన్ని నిలుపుకుంది.చైనా కంపెనీ లెనోవో విక్రయాలు 34.8% వృద్ధితో రికార్డు స్థాయిలో 6.26 లక్షల పీసీలు అమ్మింది. గతేడాది ఇదే కాలంలో అమ్మకాలు 4.64 లక్షలుగా ఉన్నాయి. మొత్తం 18.9 శాతం వాటాతో రెండోస్థానాన్ని దక్కించుకుంది. అమెరికా కంపెనీ డెల్ టెక్నాలజీస్ అమ్మకాలు 3.4% క్షీణించాయి. అమ్మకాలు 5.37 లక్షల నుంచి 5.18 లక్షలకు పరిమితమయ్యాయి. పీసీ విభాగంలో 15.6% వాటాతో మూడోస్థానంలో ఉంది.ఏసర్ అమ్మకాల్లో 7.6%, ఆసుస్ విక్రయాల్లో 8.6% వృద్ధి నమోదైంది. మొత్తం మార్కెట్ వాటాల్లో ఏసర్ (15.4%) నాలుగో స్థానంలో, ఆసుస్(6%) అయిదో స్థానాల్లో కొనసాగుతున్నాయి.వ్యక్తిగత కంపూటర్ల విభాగంలో భాగమైన నోట్స్బుక్స్ విక్రయాల్లో 13.8%, వర్క్స్టేషన్ల అమ్మకాల్లో 30.4%, ప్రీమియం నోట్బుక్ షిప్మెంట్స్ 8% వృద్ధి నమోదైంది. అయితే డెస్క్టాప్ అమ్మకాలు స్వల్పంగా 2.4% క్షీణత చవిచూశాయి. -
ఫేస్ స్కాన్ చేస్తే.. పేమెంట్ పూర్తయిపోయింది: వీడియో
టెక్నాలజీ పెరుగుతోంది.. పేమెంట్ విధానం చాలా సులభతరం అవుతోంది. ఇప్పటికే జేబులో డబ్బులు పెట్టుకునే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. ఫోన్ ఉంటే చాలు.. యూపీఐ ద్వారా ఆన్లైన్ పేమెంట్స్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఫోన్ కూడా అవసరం లేకుండా డబ్బు చెల్లించే విధానం అమలులోకి వచ్చింది. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనిస్తే.. దుబాయ్ షాపింగ్ మాల్లో ఒక వ్యక్తి రెండు జ్యూస్ బాటిల్స్ తీసుకున్నాడు. తరువాత అమౌట్ చెల్లించడానికి వెళ్ళాడు. అయితే ఈ వ్యక్తి డబ్బు చెల్లించడానికి క్యాష్ కార్డు లేదా యూపీఐ వంటి వాటిని ఉపయోగించలేదు. పక్కనే ఉన్న మిషన్ ముఖాన్ని స్కాన్ చేస్తుంది. వెంటనే.. పేమెంట్ చెల్లింపులు పూర్తయినట్లు కనిపిస్తుంది.ఇదీ చదవండి: ఒక్క ఫోటో.. డౌన్లోడ్ చేశారో?.. ఖాతా మొత్తం ఖాళీ!ఈ వీడియో చాలామంది నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. పేస్ రికగ్నైజ్ ద్వారా పేమెంట్ చెల్లింపులు చాలా కొత్తగా అనిపించాయి. ఈ విధానం సమయాన్ని మరింత ఆదా చేస్తుంది. షాపింగ్ చేయాలంటే.. ప్రత్యేకంగా కార్డ్స్ లేదా మొబైల్ వంటివి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పేస్ రికగ్నైజ్ పేమెంట్ విధానం.. భారతదేశంలో అమలులో లేదు.ये दुबई का एक मॉल है जहां पेमेंट करने के लिए कैश,कार्ड और UPI की कोई जरुरत नहीं है।यहां पेमेंट आपके चेहरे की पहचान से ही हो जाती है।बस आप पेमेंट मशीन के सामने खड़े हो जाएं मशीन चेहरे की पहचान करेगा जितनी भी पेमेंट होगी वो आपके बैंक से कट जायेगी।From - Hassan Alblooshi pic.twitter.com/muR5WQRxcL— Dr. Sheetal yadav (@Sheetal2242) May 25, 2025 -
ఒక్క ఫోటో.. డౌన్లోడ్ చేశారో?.. ఖాతా మొత్తం ఖాళీ!
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో.. సైబర్ నేరగాళ్లు కూడా కొత్తరకం మోసాలకు తెరలేపుతున్నారు. ఇందులో భాగంగా పుట్టుకొచ్చిన లేటెస్ట్ వాట్సాప్ స్కామ్ గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఇప్పటి వరకు.. తెలియని వారు ఫోన్ చేసి బ్యాంక్ ఎంక్వైరీ అని లేదా తెలిసినవాళ్లమని చెబుతూ మోసాలకు పాల్పడేవారు. తాజాగా వెలుగులోకి వచ్చిన స్కాములో.. తెలియని నెంబర్ నుంచి వచ్చిన వాట్సాప్ ఇమేజ్ డౌన్లోడ్ చేయడం వల్ల కూడా మోసపోతున్నట్లు తెలుస్తోంది. ఫోటో డౌన్లోడ్ చేయగానే.. అందులోనే మాల్వేర్ లేదా స్పైవేర్ ద్వారా మోసగాళ్లు వ్యక్తిగత సమాచారం దొంగలించి, బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు దోచేస్తున్నారు. అంతే కాకుండా ఫోన్ వర్చువల్ కీబోర్డ్ (కీలాగర్)లో టైప్ చేసిన అన్ని పాస్వర్డ్లను తెలుసుకోవడానికి దీనిని ఉపయోగించవచ్చు.స్కామర్లు.. వినియోగదారులకు ఎర వేసి మభ్యపెడుతున్నారు. తెలియని నెంబర్ నుంచి లేదా మీ సన్నిహితుల కాంటాక్ట్ నుంచి మల్టీమీడియా ఇమేజ్ మెసేజ్ పంపిస్తారు. అయితే అది చూడటానికి ఫన్నీగా ఉంటుంది. అంతే కాకుండా డబ్బు గెలుచుకోండి అనే ఆకర్షణీయమైన ఆఫర్ లేదా క్లిక్ చేయండి అనేవి కూడా కనిపిస్తుంటాయి.వచ్చిన ఇమేజ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేయగానే.. అందులో దాగున్న మాల్వేర్ లేదా స్పైవేర్ మీ ఫోన్లో సైలెంట్గా ఇన్స్టాల్ అవుతుంది. ఇలా ఇన్స్టాల్ అయిన వెంటనే.. మోసగాళ్లు మీ ఫోటోలు, కాంటాక్ట్స్, బ్యాంకింగ్ యాప్స్ వంటి వాటిని హ్యాక్ చేయగలరు. అంటే వారికి మీ ఫోన్ యాక్సెస్ లభిస్తుందన్నమాట. కొన్నిసారు ఫొటోలలోనే క్యూఆర్ కోడ్స్ దాగి ఉండవచ్చు, అవి మిమ్మల్ని.. ఫిషింగ్ వెబ్సైట్లకు మళ్లించే అవకాశం ఉంది.మాల్వేర్ లేదా స్పైవేర్ మీ మొబైల్ ఫోన్ కీబోర్డ్లో టైప్ చేసే ప్రతి అక్షరాన్ని రికార్డ్ చేసే అవకాశం ఉంది. ఇందులో బ్యాంకింగ్ యాప్స్ పాస్వర్డ్లు, సోషల్ మీడియా లాగిన్ వివరాలు, ఇతరత్రా పిన్ నెంబర్స్ అన్నీ ఉంటాయి. అంటే ఈ వివరాలను మోసగాళ్లు చూస్తారు. ఆ తరువాత చేతివాటం చూపిస్తారు.ఈ స్కామ్ నుంచి బయటపడటం ఎలా?➤స్కామ్ పెరిగిపోతున్న సమయంలో.. తెలియనివారు పంపించే లింక్స్ లేదా ఫొటోస్ డౌన్లోడ్ చేయకుండా ఉండాలి. చూడటానికి ఫన్నీ మీమ్స్ మాదిరిగా కనిపించినప్పటికీ.. వాటిని డౌన్లోడ్ చేస్తే బాధపడేలా చేస్తాయి.➤తెలియని వారి నుంచి వచ్చే సందేశాలను ఓపెన్ చేయడానికి ముందు.. ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం ఉత్తమం. ➤గిఫ్ట్స్, డిస్కౌంట్స్ లేదా రివార్డ్స్ పేరుతో ఎవరైనా ఆకర్శించడానికి ప్రయత్నిస్తే.. అలాంటి వాటిపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది.➤మీరు ఉపయోగించే మొబైల్ ఫోనులోని యాప్స్ల యాక్సెస్ను కూడా పరిమితం చేసుకోవాలి.➤వాట్సాప్, బ్యాంక్ అకౌంట్స్ వంటివి సురక్షితంగా ఉండాలంటే.. 'టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్'ను యాక్టివేట్ చేసుకోవాలి.➤స్కామ్ మెసేజస్ చేసే నెంబర్లను బ్లాక్ చేసుకోవడం మంచిది. మాల్వేర్ ఉన్నట్లు తెలిస్తే.. ముఖ్యమైన సమాచారం / డేటాను బ్యాకప్ చేసి.. ఫోన్ రీస్టార్ట్ చేసుకోవాలి.ఇదీ చదవండి: 'డబ్బు ఆదా చేయొద్దు.. పేదవారవుతారు': రాబర్ట్ కియోసాకిస్కామ్ ద్వారా మోసపోయారని తెలిస్తే..➤స్కామ్ ద్వారా మోసపోయామని తెలిస్తే.. మొబైల్ డేటాను డిస్కనెక్ట్ చేసి, యాంటీవైరస్ యాప్ ఉపయోగించి స్కాన్ చేసుకోవాలి.➤ముఖ్యమైన యాప్స్ పాస్వర్డ్లను వెంటనే మార్చేయాలి.➤అనవసరమైన లేదా అనుమానిత యాప్స్ అన్ఇన్స్టాల్ చేసుకోవాలి.➤సైబర్ క్రైమ్ అధికారులను సంపాదించండి లేదా 1930కు కాల్ చేసి జరిగిన సమాచారం వివరించండి. -
5-10 ఏళ్లలో ప్రమాదంలో ఉద్యోగాలు
వచ్చే ఐదు నుంచి పదేళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్ ఉద్యోగాలకు ప్రమాదంగా పరిణమిస్తుందని గూగుల్ డీప్ మైండ్ సీఈఓ డెమిస్ హస్సాబిస్ హెచ్చరించారు. ఓ పాడ్కాస్ట్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. కృత్రిమ మేధ టెక్ పరిశ్రమలను పునర్నిర్మించడానికి సిద్ధంగా ఉందన్నారు. తాత్కాలికంగా సాంప్రదాయ ఉద్యోగాలను ఏఐ భర్తీ చేస్తుందని, కొత్త, మరింత విలువైన ఉద్యోగాలను సృష్టిస్తుందని హస్సాబిస్ నొక్కి చెప్పారు.జాబ్ మార్కెట్పై ఏఐ ప్రభావంమిలీనియల్స్(1981-1996 మధ్య జన్మించినవారు) కెరియర్ ప్రారంభదశలో ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిందని, జెన్ జెడ్(1997 నుండి 2012 మధ్య జన్మించినవారు)కు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయని, జెన్ ఆల్ఫా(2013-24 మధ్య జన్మించినవారు)కు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుందని పేర్కొన్నారు. ఏఐ వల్ల కొన్ని ఉద్యోగాలకు ప్రమాదం ఏర్పడుతున్నప్పటికీ, కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ఆయన నమ్ముతున్నారు. మారుతున్న టెక్నాలజీ పరిణామాలకు అనుగుణంగా భవిష్యత్తులో స్థిరపడాలంటే స్టెమ్(సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్) ఎడ్యుకేషన్ కీలకంగా వ్యవహరిస్తుందన్నారు. ముఖ్యంగా యువత కోడింగ్పై దృష్టి పెట్టాలని, అదే సమయంలో సృజనాత్మకతకు పెద్దపీట వేయాలని విద్యార్థులకు సూచించారు.ఇదీ చదవండి: యాపిల్ ఐఫోన్ 17 లాంచ్ డేట్ ఫిక్స్?గూగుల్ డీప్ మైండ్ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) అభివృద్ధి చేయడానికి అతి చేరువలో ఉందని హస్సాబిస్ వెల్లడించారు. ఇది మానవ స్థాయి తార్కిక సామర్థ్యం కలిగిన కృత్రిమ మేధ అని తెలిపారు. ఏఐ అభివృద్ధి చెందుతున్నప్పుడు శ్రామిక శక్తిలో పోటీగా ఉండటానికి టెక్నాలజీలను అర్థం చేసుకోవడం, వాటిని సమర్థంగా ఉపయోగించడం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. -
యాపిల్ ఐఫోన్ 17 లాంచ్ డేట్ ఫిక్స్?
యాపిల్ ఏటా కొత్తగా ఉత్పత్తులను లాంచ్ చేసే వార్షిక అప్గ్రేడ్ల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ 2025 సెప్టెంబర్లో ఐఫోన్ 17ను విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై కంపెనీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఇతర పోటీ కంపెనీలు ఏఐలో వినూత్న ఆవిష్కరణలు చేస్తూ తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యాపిల్ ఆవిష్కరించనున్న ఉత్పత్తుల్లో వినియోగదారులను మెప్పించేలా ఏఐ సామర్థ్యాలను నిరూపించుకోవాల్సి ఉంటుంది.యాపిల్ తన ఫ్లాగ్షిప్ సిరీస్లో నాలుగో మోడల్ ఐఫోన్ 17 ఎయిర్ను ప్రవేశపెడుతున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. దీనితో పాటు ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ను కూడా ఆవిష్కరించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ అన్ని మోడళ్లలో 120 హెర్ట్జ్ ప్రోమోషన్ డిస్ప్లేలు ఉంటాయని, బేస్ మోడల్ 6.3 అంగుళాల నుంచి ప్రో మ్యాక్స్కు 6.9 అంగుళాల వరకు స్క్రీన్ సైజులు ఉంటాయని అంచనాలు వెలువడుతున్నాయి. ఎయిర్ వేరియంట్ 6.6 అంగుళాల డిస్ప్లేతో రావచ్చని భావిస్తున్నారు.ఇదీ చదవండి: ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపైనే ఆశలుఏఐ పీచర్లు ఇవేనా..?యాపిల్ ఐఫోన్ 17 లైనప్ ద్వారా వినూత్న ఏఐ ఫీచర్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్త ఐఫోన్లో వాడే ఏ19 బయోనిక్ చిప్లో అప్గ్రేడ్ చేసిన న్యూరల్ ఇంజిన్ ద్వారా ఏఐ ఫీచర్లలో మార్పులొస్తాయని చెబుతున్నారు.యాపిల్ సిరి మరింత సందర్భోచింతంగా అవగాహన కలిగి ఉంటుంది.నెక్ట్స్ జనరేషన్ ఫోటోగ్రఫీ టూల్స్లో భాగంగా ఏఐ అసిస్టెడ్ రియల్ టైమ్ సీన్ డిటెక్షన్, ఆటో ఆబ్జెక్ట్ రిమూవల్, ఇమేజ్ జనరేషన్ వంటివి ఉండవచ్చు.మరింత కచ్చితమైన వాయిస్ ట్రాన్స్లేషన్ అందుబాటులోకి రావొచ్చు.కృత్రిమ మేధ బ్యాటరీ నిర్వహణతో ఛార్జింగ్ సామర్థ్యాన్ని ఆప్టిమైజ్ చేసే వెసులుబాటు ఉంటుంది. వినియోగదారులు తమ ఐఫోన్ నుంచి నేరుగా ఎయిర్పాడ్స్ యాక్ససరీలను ఛార్జ్ చేయడానికి అనుమతిస్తుంది. -
ఏఐకి సవాళ్ల స్వాగతం
సాక్షి, హైదరాబాద్: కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతిక అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణలో.. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సరికొత్త టెక్నాలజీని అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తోంది. ఏఐ సిటీ నిర్మాణం, బిగ్డేటా, సైబర్ సెక్యూరిటీ వంటి టెక్నాలజీలకు ప్రభుత్వం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసింది. డేటా సైన్స్, నైపుణ్యం, పాలన, పరిశోధన, భాగస్వామ్యం, అనుసరణ అనే ఆరు అంశాలను మూల స్తంభాలుగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఏఐ పాలసీని రూపొందించింది. అదే సమయంలో ఈ రంగంలో అనేక సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి. నిపుణుల కొరత.. డేటా సైన్స్, మెషీన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా అనలిటిక్స్ వంటి రంగాలలో రాష్ట్రంలో నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో ఏఐ ప్రాజెక్టుల అమల్లో ఆలస్యంతోపాటు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలతో పోటీ పడలేకపోతున్నామని రాష్ట్ర ఐటీ వర్గాలు చెబుతున్నాయి. ఏఐ అభివృద్ధిలో కీలకమైన అధిక కంప్యూటింగ్ శక్తి, హై–స్పీడ్ ఇంటర్నెట్, డేటా సెంటర్లు ద్వితీయ శ్రేణి నగరాల్లో అంతగా అభివృద్ధి చెందలేదు. దీంతో ఏఐ ఆవిష్కరణలు హైదరాబాద్కే పరిమితమవుతున్నాయి. ఏఐ వ్యవస్థలు పెద్ద ఎత్తున డేటాపై ఆధారపడుతుండటంతో గోప్యత, భద్రత అత్యంత కీలకంగా మారింది. డేటా ఉల్లంఘనలు, సైబర్ నేరాలు కూడా ఏఐ ఆచరణలో ప్రధాన సవాలుగా నిలుస్తున్నాయి. ఎగుమతులు, ఉపాధి కల్పన నేలచూపులు కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు, ఈ రంగంలో కొత్త ఉద్యోగాల కల్పన వృద్ధిలో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. 2022–23లో ఐటీ ఎగుమతుల్లో రూ.57,706 కోట్ల పెరుగుదల నమోదు కాగా.. 2023–24లో రూ.26,948 కోట్ల పెరుగుదల మాత్రమే ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2022–23లో ఐటీ రంగంలో కొత్తగా 1,27,594 ఉద్యోగాల కల్పన జరగ్గా, 2023–24లో 40,285కి పడిపోయాయి. ఈ తగ్గుదల ఏఐ సహా ఐటీ రంగంలో కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో ఆటంకాలు సృష్టించిందనే వాదన వినిపిస్తోంది. ఏఐ ద్వారా ఆటోమేషన్ పెరిగి సంప్రదాయ ఉద్యోగాలు కోల్పోతామనే భయం ఐటీ ఉద్యోగుల్లో కనిపిస్తోంది. స్టార్టప్లు, ఆవిష్కరణలే కీలకం రాష్ట్రంలో రిజిస్టర్ చేసుకున్న స్టార్టప్ల (6,873)లో సుమారు మూడు శాతం ఏఐ, ఎంఎల్ ఆధారిత స్టార్టప్లు (211) ఉన్నాయి. తెలంగాణ ఏఐ మిషన్ (టీ ఎయిమ్) ద్వారా 142 ఏఐ స్టార్టప్లకు మార్కెట్తో అనుసంధానం, ఆర్థిక సాయం, మార్గదర్శనం, అత్యాధునిక ఏఐ కంప్యూటింగ్ సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తోంది. 2027 నాటికి 5 లక్షల మందికి (18–45 ఏళ్ల వయస్సు) ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.నాస్కామ్, మైక్రోసాఫ్ట్ తదితర సంస్థలతో కలిసి ఏటా 30 వేల మంది విద్యార్థులకు ఏఐ శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఏఐని పాఠ్యాంశంగా చేర్చే ప్రణాళిక రూపొందిస్తోంది. ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లకు ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని అందుబాటులోకి తేవడం, 12 భారతీయ భాషల్లో ఏఐ అప్లికేషన్ల అభివృద్ధి, ప్రభుత్వ సేవల్లో ఏఐ సాంకేతిక వినియోగాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2024లో తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.2.68 లక్షల కోట్లు కాగా, 2025లో ఇందులో ఏఐ రంగం వాటాను 5 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.పెట్టుబడులు పెరిగితేనే ఫలితాలు మనకు విస్తృతమైన ఇంజనీరింగ్ ప్రతిభా సంపద ఉన్నప్పటికీ డేటాసైన్స్, మెషీన్ లెరి్నంగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీలో కీలక నైపుణ్యాల కొరతను ఎదుర్కొంటున్నాం. ద్వితీయ శ్రేణి నగరాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు లేకపోతే మనం ఏఐ ఫలితాలను అందుకోలేం. స్థానిక భాషలు, సంస్కృతి, స్థానిక అవసరాలకు అనుగుణంగా స్వదేశీ లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లు (ఎల్ఎల్ఎం)లు, జనరేటివ్ ఏఐ మోడళ్లను అభివృద్ధి చేయడంలో కూడా మనం వెనుకబడి ఉన్నాం. ఏఐ వాతావరణం హైదరాబాద్ లాంటి నగరాలకే పరిమితం కాకుండా ఇంకా విస్తరించాలి. ఏఐ విప్లవాన్ని మన సొంత రీతిలో మనమే నిర్వచించుకోవాలి. – కరుణ్ తాడేపల్లి, కో ఫౌండర్, సీఈఓ–బైట్ఎక్స్ఎల్ఏఐతో ఉద్యోగాలకు ముప్పు లేదు ఏఐ వల్ల సంప్రదాయ ఉద్యోగాలకు ముప్పు ఉండదు. నెమ్మదిగా, పునరావృతమయ్యే పనులను వేగంగా పూర్తి చేసేందుకు ఏఐ సాంకేతికత ఉపయోగపడుతుంది. ఏఐ విప్లవానికి నాయకత్వం వహించే సామర్థ్యం మనకు ఉంది. కానీ ఏఐ, డేటా సైన్స్, క్లౌడ్లో నిపుణుల కొరతను ఎదుర్కొంటున్నాం. ఇది రాత్రికి రాత్రే పరిష్కారమయ్యే సమస్య కాదు. నైపుణ్య శిక్షణ, ఆచరణాత్మక విధానాలు, నిరంతర పెట్టుబడులతోనే ఈ సమస్యను అధిగమించగలం. ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు మాత్రమే ద్వితీయ శ్రేణి పట్టణాలు పరిమితం కాకుండా ఏఐ విప్లవంలో భాగస్వాములు కావాలి. – అంజి మరం, ఫౌండర్, సీఈఓ, క్రిటికల్రివర్ ఇంక్ -
పరుపు కింద జేమ్స్ బాండ్.. వంకరగా కూర్చుంటే కొడుతుంది!
జీవితంలో ఆనందం కావాలంటే, ఆరోగ్యం ఎంతో ముఖ్యం. అలాంటి ఆరోగ్యం కోసం నిత్యం మీతోనే ఉంటూ మీకు సలహాలు సూచనలు ఇచ్చే మినీ డాక్టర్స్ ఈ హెల్త్ హెల్ప్ గాడ్జెట్స్.పిండేసిన శరీరాన్ని హీల్ చేస్తుంది ఎంతో హుషారుగా కొత్తగా జిమ్ జాయిన్ అయితే, ఆ తర్వాతి రోజే వర్కౌట్స్ నొప్పులు, ‘ఇంకా ఒక్క అడుగు కూడా వేయలేం’ అంటూ మిమ్మల్ని మొండికేస్తున్నాయా? అయితే, ఆ నొప్పుల పోరు తీర్చడానికి వచ్చింది ఈ ‘థెరాగన్ రిలీఫ్’. ఇది వర్కౌట్స్ చేయగా వచ్చే కండరాల నొప్పుల నివారణకు ఉపయోగపడే ఒక సరైన మసాజ్ థెరపీ. సాధారణ మసాజ్ గన్ కంటే ఎంతో మెరుగ్గా పనిచేస్తుంది. ఇందులోని మూడు రకాల అటాచ్మెంట్లు శరీర భాగాలకు తగ్గట్టుగా ప్రొఫెషనల్ మసాజ్ చేస్తూ చాలా త్వరగా నొప్పిని పోగొడతాయి. ఒక్కసారి దీనిని వాడిన తర్వాత, శరీరం ‘ఇంకా చేద్దాం వర్కౌట్.. థెరాగన్ ఉందిగా’ అంటుంది. ధర 149 డాలర్లు (రూ. 12,725) మాత్రమే!స్లీప్ అనలైజర్వాచ్ వేసుకోమని బలవంతం చేయదు, రింగ్ పెట్టుకోమని అడగదు. కాని, మెల్లగా మీరు పడుకునే పరుపు కింద ఉండి, గుట్టుగా మిమ్మల్ని గమనిస్తూనే ఉంటుంది. చూడ్డానికి ఒక సాధారణ ప్యాడ్లాగా కనిపిస్తుంది. కాని, దీని పనితీరు చూస్తే ఎంతటివారైనా షాక్ తింటారు. ఎందుకంటే, మీ నిద్ర చరిత్ర అంతా ఒక్కసారికే చెప్పేయగలదు ఈ ‘వితింగ్స్ స్లీప్ అనలైజర్’. సాధారణ స్లీప్ ట్రాకర్ మాదిరి కాకుండా, నిద్ర ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ముగిసింది, మధ్యలో మీకు వచ్చే కలలు, వాటి వలన మీలో కలిగే మార్పులు, హార్ట్ బీట్, ఒత్తిడి, నిద్రలో మీరెలా ఫీల్ అవుతున్నారు, గురక పెడుతున్నారా, గురక శబ్దం ఎంత గట్టిగా ఉంటోంది– ఇలా నిద్రకు సంబంధించిన మరెన్నో విషయాలను విశ్లేషించి వివరాలను అందిస్తుంది. అవసరమైన సలహాలు, సూచనలను కూడా ఇస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది నిద్ర ర హస్యాలను బయటపెట్టే ఒక జేమ్స్బాండ్. ధర 129 డాలర్లు (రూ. 11,011) మాత్రమే!పోశ్చర్ ట్రైనర్అందరికీ తెలిసిన రహస్యం, కుర్చీలో ఎలా పడితే అలా వంకరగా కూర్చొవడం కారణంగానే వెన్ను నొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని. మరి, తెలిసిన విషయమే అయినా, సరిగ్గా కూర్చోలేకున్నారా? అయితే, ఇకపై ఎప్పుడైనా వంకరగా కూర్చుంటే వెంటనే మీ వీపు పై ‘టప్’మని కొట్టి, హెచ్చరిస్తుంది ఈ ‘పోశ్చర్ ట్రైనర్’. చిన్న లాకెట్ రూపంలో చైన్తో పాటు ఉంటుంది. దీనిని మెడకు ధరించి లాకెట్ను వీపుకు వేలాడదీసుకుంటే, చాలు ఎప్పటికప్పుడు మీ కూర్చునే పోశ్చర్ను వైబ్రేషన్స్తో సూచిస్తూ, కుర్చీలో మీరు ఒక రాజులా ఠీవిగా కూర్చునేలా చేస్తుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే దాదాపు ముప్పయి గంటలపాటు పనిచేస్తుంది. ధర రూ. 11,389. -
‘స్టెమ్’లో జెమ్స్ లేరా?
యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషనల్ మానిటరింగ్ ‘జెమ్’ నివేదిక ప్రకారం స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమేటిక్స్) ఫీల్డ్లో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ‘స్టెమ్’ గ్రాడ్యుయేట్స్లో మహిళలు కేవలం 35 శాతం మాత్రమే ఉన్నారు. గత పది సంవత్సరాలుగా ఈ జెండర్ గ్యాప్ను తగ్గించడంలో ఎలాంటి పురోగతీ లేదు.మ్యాథ్మేటిక్స్లాంటి సబ్జెక్ట్లో బాలురతో సమానంగా అమ్మాయిలు ప్రతిభ చూపుతున్నప్పటికీ, అంతకంటే ఎక్కువ ప్రతిభ ఉన్నప్పటికీ తమ మీద తమకు విశ్వాసం లేక΄ోవడం నుంచి మొదలు రకరకాల ఆటంకాలు ‘స్టెమ్’లో మహిళలప్రొతినిధ్యం తక్కువ ఉండడానికి కారణం అవుతున్నాయి.‘జెమ్’ డేటా ప్రకారం డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 26 శాతం మంది ప్రొఫెషనల్స్ మాత్రమే మహిళలు. ‘క్లౌడ్ కంప్యూటింగ్’లాంటి స్పెషలైజ్డ్ ఫీల్డ్లలో ఈ సంఖ్య మరింత తక్కువగా ఉంది.‘స్టెమ్’ ఎడ్యుకేషన్కి సంబంధించి 68 శాతం దేశాలు ్ర΄ోత్సాహక విధానాలు రూపొందించినప్పటికీ వాటిలో సగం మాత్రమే మహిళలను ఎంకరేజ్ చేసే ప్రత్యేక విధానాలు ఉన్నాయి. స్టెమ్ ఎడ్యుకేషన్లో మహిళల ప్రొతినిధ్యాన్ని పెంచడానికి ‘జెమ్’ కొన్ని సూచనలు చేసింది.ఉదా: లింగవివక్షతను గుర్తించి, అరికట్టడానికి అవసరమైన శిక్షణను టీచర్లు, స్కూల్ లీడర్లకు ఇవ్వాలి. ∙మహిళల నాయకత్వంలో ‘స్టెమ్’ క్లబ్లను ఏర్పాటు చేయాలి క్లాస్రూమ్లో జెండర్–న్యూట్రల్ లాంగ్వేజ్ని ఉపయోగించేలా చూడాలి అమ్మాయిల ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా ‘స్టెమ్’ ఎక్స్పర్ట్లతో క్లాసులో ఉపన్యాసాలు ఇప్పించాలి. -
ఆన్లైన్ షాపింగ్ మరింత సులభంగా...
వినియోగదారులకు మెరుగైన షాపింగ్ అనుభవాన్ని అందించడానికి చాట్జీపీటీ సెర్చ్ఫంక్షనాలిటీని అప్గ్రేడ్ చేసినట్లు ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘ఓపెన్ ఏఐ’ ప్రకటించింది. షాపింగ్ కోసం వినియోగదారులు ఆన్లైన్లోకి వెళ్లినప్పుడు ఈ యాడ్–ఫ్రీ సెర్చ్ రిజల్ట్ మనం కొనాలనుకునే వాటి ఫోటోలతో పాటు ధర, సమీక్షలాంటి వివరాలను అందిస్తుంది. సెర్చ్ రిజల్ట్స్లో ఆప్రొడక్ట్స్ను కొనుగోలు చేయగల వెబ్సైట్ల ప్రత్యక్ష లింకులు కూడా ఉంటాయి. ఈ షాపింగ్ సంబంధిత అప్గ్రేడ్లు చాట్జీపీటీ ప్లస్, ్ర΄ో, ఫ్రీ యూజర్లు... వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటాయి. యూజర్లకు సంబంధించి ట్రెండింగ్ సెర్చ్ టాపిక్స్ను కూడా చాట్జీపీటీ సెర్చ్ చూపిస్తుంది. వాట్సాప్ ద్వారా చాట్జీపీటీ సెర్చ్ను యాక్సెస్ చేసుకోవచ్చు. -
యాపిల్కు ట్రంప్ వార్నింగ్.. భారత్లో ఐఫోన్ తయారు చేస్తే..
వాష్టింగ్టన్: భారత్లోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడో తయారు చేసిన ఐఫోన్లను అమెరికాలో అమ్ముతామంటే ఉపేక్షించబోనని ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా మినహాయించి ఇతర దేశాల్లో తయారు చేసిన ఐఫోన్లను దేశీయంగా అమ్మితే 25 శాతం టారిఫ్ విధిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్గా ఓ వేదికగా ఓ పోస్టును షేర్ చేశారు. అందులో ‘నేను చాలా కాలం క్రితమే నేను ఈ విషయాన్ని యాపిల్ సీఈవో టిమ్కుక్ చెప్పాను. అమెరికాలో అమ్మే ఐఫోన్లను అమెరికాలోనే తయారు చేయాలని, విదేశాల్లో కాదని. భారత్తో పాటు మరో ఇతర దేశంలోనైనా తయారు చేసిన ఐఫోన్లను ఇక్కడ అమ్మితే వాటిపై యాపిల్ కంపెనీ అమెరికాకు కనీసం 25 శాతం టారిఫ్ చెల్లించాల్సిందే’అని పేర్కొన్నారు. Time for Apple to manufacture in America or pay the tariffs. pic.twitter.com/KOnDC8NKDr— Gunther Eagleman™ (@GuntherEagleman) May 23, 2025అయితే, ట్రంప్ విధించే టారిఫ్లు యాపిల్ ఒక్క కంపెనీకే పరిమితం అవుతుందా? లేదంటే అన్నీ కంపెనీలపై సుంకం విధిస్తారా? అన్నది స్పష్టంగా తెలియాల్సి ఉంది. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలపై యాపిల్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.మరోవైపు, అమెరికా,చైనా సుంకాల యుద్ధంతో అవరోధాలు తలెత్తుతున్న నేపథ్యంలో యాపిల్ కంపెనీ ఐఫోన్ తయారీకి భారత్ ప్రత్యాహ్నాయంగా భావిస్తోంది. ఇందులో భాగంగా భారత్లో భారీ ఎత్తున తయారీ రంగంలో పెట్టుపెట్టేందుకు సిద్ధమైంది. కాగా, యాపిల్ నివేదిక ప్రకారం.. జూన్ త్రైమాసికంలో అమెరికాలో అమ్మే ఫోన్లలో ఎక్కువ శాతం భారత్లో తయారు చేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది. -
టెక్నో బ్రదర్స్ ‘169పై. ఏఐ’ స్టార్టప్! తొలి యూజర్..
ఈ అన్నదమ్ములు... సినిమాల గురించి మాట్లాడుకున్నంత ఇష్టంగా ఏఐ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటారు. అవి కాలక్షేప కబుర్లు కావు. ఈ కాలానికి అవసరమైన కబుర్లు. ‘ఏఐ టెక్నాలజీలో మనం ఎక్కడ ఉన్నాం? మనం చేయాల్సింది ఏమిటి?’ అనేది వారి మాటల సారాంశం. కేవలం మాటలకే పరిమితం కాకుండా ‘169పై. ఏఐ’ స్టార్టప్తో ఏఐ స్టార్స్గా పేరు తెచ్చుకున్నారు రజత్, చిరాగ్... మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చెందిన రజత్ ఆర్య, అతని తమ్ముడు చిరాగ్ ఆర్యకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అనేది చాలా ఇష్టమైన సబ్జెక్ట్. ఆ రంగంలో వస్తున్న మార్పుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు. ఆ ఆసక్తే వారిని ఏఐ స్టార్టప్ కంపెనీ ‘169పై. ఏఐ’ స్థాపించేలా చేసింది. అమెరికాలో కస్టమర్ల కోసం కొన్ని బ్లాక్చైన్ సొల్యూషన్స్ను డెవలప్ చేసి, చిన్నపాటి సాఫ్ట్వేర్ బిజినెస్ నిర్మించడంలో ఈ సోదరులకు కొంత అనుభవం ఉంది. రెండు సంవత్సరాల క్రితం ప్రసిద్ధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘ఓపెన్ ఏఐ’ సీయివో సామ్ ఆల్ట్మాన్ మన దేశానికి వచ్చినప్పుడు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ బిల్డ్ చేయడం గురించి మాట్లాడారు. ఈ నేపథ్యంలో ‘మనం కొత్తగా ఏంచేయవచ్చు’ అని ఆలోచించారు ఆర్య బ్రదర్స్. ఇంటర్నెట్లో వెస్ట్–ఒరియెంటెడ్ సమాచారానికి బదులుగా మరింత దేశీయంగా ఏదైనా చేయడానికి ఒక అవకాశం ఉందని గ్రహించారు. అలా....‘169పై. ఏఐ’ స్టార్టప్ మొదలైంది. స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.ఈ స్టారప్కు తొలి యూజర్....ఇస్రో!‘169పై. ఏఐ’ క్రియేట్ చేసిన పీడీఎఫ్ ఏజెంట్ను ‘ఇస్రో’ పరీక్షించి పచ్చ జెండా ఊపింది. టన్నుల కొద్దీ డేటా ఉన్న ‘ఇస్రో’కి ఉపయోగపడేలా పీడీఎఫ్ ఏజెంట్ను క్రియేట్ చేశారు. తాము సృష్టించిన ప్రోగ్రామ్ టేబుల్స్, డాక్యుమెంట్లు, చార్ట్లు జనరేట్ చేయడానికి ఇది యూజర్లకు ఉపయోగపడుతుంది. పదకొండు మందితో కూడిన ‘169పై. ఏఐ’ బృందం ఎడ్యుకేషనల్ సోల్యూషన్లను డెవలప్ చేస్తోంది. బిహార్లోని ప్రభుత్వ బడుల కోసం ఎడ్యుకేషనల్ మెటీరియల్ను క్రియేట్ చేయడానికి ఎన్సీఈఆర్టీ టెక్ట్స్బుక్స్ డేటాను ఉపయోగిస్తున్నారు. ‘ఆర్టిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఖరీదు అనే భావన ఉంది. ఈ సాంకేతికత అందరికీ అందుబాటులో ఉండాలి. రైతు నుండి సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించాలి. ఎందుకంటే ఏఐ వారి పనిని సులభతరం చేస్తుంది. మా ఏఐ మోడల్ విదేశీ ఏఐ మోడల్స్లాగా డబ్బు తీసుకునేది కాదు. ఇది అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంటుంది. ఇక స్టార్టప్ పేరు విషయానికి వస్తే 13 సంఖ్య స్క్వేర్, పై కన్స్టంట్ నుంచి స్ఫూర్తి పొందాం’ అంటున్నాడు కంపెనీ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ చిరాగ్ ఆర్య. పాతదారిలో నడవడం విశేషమేమీ కాదు. అయితే పాత దారిలో నడుస్తూనే కొత్త దారి గురించి ఆలోచించడం, అన్వేషించడమే విశేషం. అప్పుడే ‘169పై. ఏఐ’ రూపంలో కొత్త ఆవిష్కరణలు ప్రజలకు పరిచయం అవుతాయి.మన దేశానికి తనదైన ఏఐ మోడల్ లేకపోవడం నన్ను ఎప్పుడూ నిరాశకు గురి చేసేది. మనం విదేశీ ఏఐ మోడల్స్ మీద ఎక్కువగా ఆధారపడుతున్నాం. ఏఐ సాంకేతికతకు సంబంధించి విదేశాలపై ఎక్కువగా ఆధారపడకూడదు అనే ఆలోచన నుంచే స్టార్టప్ ఆలోచన వచ్చింది. మన ఫోన్లో ఉన్న అత్యధిక యాప్స్ విదేశాల నుంచి వచ్చినవే. మనకంటూ స్వంతమైన ΄్లాట్ఫామ్ లేదు. భవిష్యత్తులో మనం ఏ దేశం మీద ఆధారపడకుండా ఉండడానికి మా స్టార్టప్ ఒక ప్రయత్నం.– రజత్ ఆర్య, 169పై. ఏఐ ఫౌండర్, సీయివో(చదవండి: మూడు నెలలకు మించి బతకడన్నారు.. కట్చేస్తే ఏకంగా వందేళ్లకు పైగా..) -
సైబర్ మోసాల కట్టడికి ‘ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్’
సైబర్ మోసాలను అరికట్టేందుకు టెలికం శాఖ (డాట్) తాజాగా ‘ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్’ (ఎఫ్ఆర్ఐ) పేరిట వినూత్న సాధనాన్ని ప్రవేశపెట్టింది. మోసాలతో ముడిపడి ఉన్న మొబైల్ నంబర్లను రిస్కు స్థాయిని బట్టి ఇది వర్గీకరిస్తుంది. ఆ వివరాలను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, యూపీఐ సర్వీస్ ప్రొవైడర్లకు డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫాం ద్వారా టెలికం శాఖ షేర్ చేస్తుంది.దీనిద్వారా రిస్కీ మొబైల్ నంబర్లతో ఆర్థిక లావాదేవీలను సత్వరం నిలిపివేసేందుకు ఇది ఉపయోగపడుతుందని డాట్ ఒక ప్రకటనలో తెలిపింది. సాధారణమైనవిగా కనిపించినా వాస్తవానికి సైబర్ ఫ్రాడ్ కేసులతో ముడిపడి ఉన్న మొబైల్ నంబర్లను గుర్తించేందుకు దీనితో అత్యధికంగా అవకాశాలు ఉంటున్నట్లు ఫోన్పే గణాంకాల్లో వెల్లడైందని డాట్ పేర్కొంది. సైబర్క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, నేషనల్ సైబర్క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్, చక్షు ప్లాట్ఫాం, బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి లభించే వివరాల ప్రాతిపదికన మొబైల్ నంబర్లను ‘మధ్య స్థాయి’, ‘అధిక’, ‘అత్యధిక’ రిస్కుల కింద ఎఫ్ఆర్ఐ వర్గీకరిస్తుంది. ఇదీ చదవండి: ఎన్ఎస్ఈ ఐపీవో సవాళ్లకు చెక్ఎయిర్టెల్ యూజర్లకు గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజీకస్టమర్లకు క్లౌడ్ స్టోరేజీ ప్రయోజనాలను అందించే దిశగా టెక్ దిగ్గజం గూగుల్తో టెలికం సంస్థ భారతి ఎయిర్టెల్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఎయిర్టెల్ పోస్ట్పెయిడ్, వైఫై యూజర్లందరికీ ఆరు నెలల పాటు 100 జీబీ మేర గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ సబ్్రస్కిప్షన్ సర్వీసు ఉచితంగా లభిస్తుంది. దీన్ని మరో అయిదుగురితో షేర్ చేసుకోవచ్చు. 6 నెలల ఉచిత వ్యవధి పూర్తయిన తర్వాత నుంచి నెలకు రూ. 125 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. డివైజ్లలో డేటా స్టోరేజ్ పరిమితుల వల్ల మాటిమాటికీ ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను డిలీట్ చేయాల్సిన పరిస్థితి ఉంటున్న నేపథ్యంలో క్లౌడ్ స్టోరేజీ ఉపయోగకరంగా ఉంటుందని ఎయిర్టెల్ తెలిపింది. -
'నా కొడుకు చావుకు గూగుల్, ఏఐలే కారణం'
టెక్నాలజీ వల్ల లాభాలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. అప్పుడప్పుడు నష్టాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆల్ఫాబెట్కు చెందిన గూగుల్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ అయిన క్యారెక్టర్.ఏఐ తన కొడుకు ఆత్మహత్యకు కారణమైందని ఓ తల్లి కోర్టు మెట్లెక్కింది.అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతానికి చెందిన మెగన్ గార్సియా.. తన 14 ఏళ్ల కొడుకు 'సెవెల్ సెట్జర్' ఫిబ్రవరిలో ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఏఐ చాట్బాట్తో చాటింగ్ చేసినట్లు పేర్కొంది. పిల్లల మానసిక బాధ లేదా ప్రవర్తన నుంచి బయట పడేయడంలో ఏఐ విఫలమైందని ఆ మహిళ ఆరోపించింది.ఏఐ చాట్బాట్ పట్ల ఒక యువకుడు ఎంతగానో మక్కువ పెంచుకున్నాడనే దానివల్ల అతను ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే చాట్బాట్ల అవుట్పుట్ రాజ్యాంగబద్ధంగా ఉన్న స్వేచ్ఛా వాక్ స్వాతంత్య్రాన్ని కలిగి ఉన్నందున కేసును కొట్టివేయాలని గూగుల్, ఏఐ సంస్థ విజ్ఞప్తి చేశాయి. అయితే దీనిపై యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి అన్నే కాన్వే ఏకీభవించలేదు. అంతే కాకుండా కంపెనీ తప్పకుండా జవాబుదారీ తనంతో ఉండాలని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఉద్యోగాలు కనుమరుగవుతాయా?: మాయ చేస్తున్న మరమనుషులుఏఐ చాట్బాట్ ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. అయితే అడిగే ప్రశ్న మంచిదా?, ప్రమాదాన్ని కలిగిస్తుందా? అనే విషయం ఏఐ గుర్తించడం లేదు. ఒక వ్యక్తి ఎలా చనిపోవాలి అని అడిగితే.. దానికి కూడా తనదైన రీతిలో సమాధానం చెబుతుంది. మానసిక బాధతో ఉన్న వ్యక్తులు ఏఐను ఒక ఫ్రెండ్ లేదా అంతకంటే ఎక్కువే అనుకుంటారు. అలాంటి సమయంలో ఏఐ ఇచ్చే సలహాలు ప్రమాదానికి కారణమవుతున్నాయి. కాబట్టి ప్రశ్న ఎలాంటిదో.. ముందు ఏఐ దానిని తప్పకుండా గమనించేలా కంపెనీలు కూడా సవరణలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ఉద్యోగాలు కనుమరుగవుతాయా?: మాయ చేస్తున్న మరమనుషులు
ఏఐ రాకతో సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం దాదాపు అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా కొనసాగుతోంది. హ్యుమానాయిడ్ రోబోలు ప్రతి పనిలోనూ ఊహించినదానికంటే వేగంగా ముందుకు సాగుతున్నాయి. మానవుల కంటే వేగంగా పనులు పూర్తి చేస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే.. రాబోయే రోజుల్లో మనుషులు ఉద్యోగాలు సంపాదించుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఇప్పటికే జపాన్, చైనా వంటి దేశాల్లో రోబోలను నిర్మాణ పనులలో ఉపయోగిస్తున్నారు. ఇవి మనుషుల కంటే వేగంగా గోడ కేట్టేస్తున్నాయి, ఫినిషింగ్ కూడా ఇచ్చేస్తున్నాయి. నిర్మాణ పరిశ్రమలో రోబోలు గణనీయమైన మార్పులు తెస్తున్నాయనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.చైనాలో కొన్ని రోబోలను రాత్రి సమయంలో గ్యాస్ స్టేషన్లలో సేవలకు నియమించారు. ఇవి కస్టమర్లకు కావాల్సిన సేవలను అందిస్తున్నాయి. రాత్రి సమయంలో మనుషులు పని చేయడం కొంత కష్టమే. కానీ రోబోలు మాత్రం విశ్రాంతి తీసుకోకుండా.. పనిచేస్తూ ముందుకు సాగుతున్నాయి. ట్రాఫిక్ నియంత్రణలోనూ.. సూచిక బోర్డులను వేయడంలోనూ రోబోలు పనిచేస్తున్నాయి.ఇప్పటికే విమానాశ్రయాలు, హోటల్స్ లేదా రెస్టారెంట్లలో.. రోబోలనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మనుషుల స్థానంలో ఇవి పనిచేస్తూ.. నిర్విరామంగా సేవలందిస్తున్నాయి. ఫ్యాక్టరీలో సర్వీసింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, సెన్సార్ ఆధారిత పర్యవేక్షణ వంటి పనుల్లో కూడా రోబోల వినియోగం ఎక్కువగానే ఉంది.ఇదీ చదవండి: ఆర్థిక సంక్షోభం రాబోతోంది!.. రాబర్ట్ కియోసాకి హెచ్చరికఎలక్ట్రిక్ సమస్యలను క్లియర్ చేయడంలో కూడా రోబోలు పాత్ర ప్రశంసనీయం. హై వోల్టేజ్ పవర్ మరమ్మత్తుల సమయంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ రంగంలో రోబోలను ఉపయోగించడం వల్ల.. ప్రాణహాని ఉండదు. అంతే కాకుండా పని కూడా వేగవంతం అవుతుంది. మొత్తం మీద ప్రతి రంగంలోనూ మాయ చేస్తున్నట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. View this post on Instagram A post shared by AI researches | AI (@airesearches) -
'టాకింగ్ ట్రీ'..నిజంగానే మొక్కతో మాట్లాడే టెక్నాలజీ..!
చిన్నప్పుడు సరదాగా చెట్టు వెనుకదాక్కుని దాంతో మాట్లాడటం వంటివి చేసేవాళ్లం. ఆ సరదా అల్లరే వేరు. కొందరు ప్రకృతి ప్రేమికులు చెట్లనే తమ ఆత్మీయులుగా వాటితోనే మాట్లాడటం, పెళ్లి చేసుకోవడం వంటివి చేసిన ఘటనలు చూశాం. అలాగే పరిశోధకులు చెట్టుకు ప్రాణం, ఉంది అవి కూడా స్పందిస్తాయని చెప్పారు. అది ఎంత వరకు నిజం అనేది కూడా ప్రయోగాత్మకంగా ప్రూవ్ చేశారు. అవి ఎలా తన పక్క చెట్లతో సంభాషిస్తుందో కూడా వివరించారు. ఇప్పుడూ ఏకంగా చెట్టుతో నేరుగా మాట్లాడే సరికొత్త టెక్నాలజీని అభివృద్ధిపరచడమే కాదు..మాట్లాడే అవకాశం కూడా ఇస్తున్నారు. అదెలాగో సవిరంగా తెలుసుకుందాం..!.ఐర్లాండ్ రాజధానిలలోని ట్రినిటి కాలేజ్లో 'టాకింగ్ ట్రీ' అనే టెక్నాలజీని ప్రవేశపెట్టారు. ఏఐ సాంకేతికతతో చెట్టుకు స్వరాన్ని అందిస్తారు. అందుకోసం పర్యావరణ సెన్సార్లు ఉపయోగించుకుంటుంది. అంటే ఇక్కడ సెన్సార్లుగా నేల తేమ, నేల pH, గాలి ఉష్ణోగ్రత, తేమ, సూర్యకాంతి, గాలి నాణ్యత' తదితరాల ఆధారంగా 'బయోఎలక్ట్రికల్ సిగ్నల్స్'ని తీసుకుంటుంది. ఆ సిగ్నల్స్ని ఏఐ సాంకేతికత మానవులకు అర్థమయ్యే భాషలా మారుస్తుంది. అయితే ఈ ప్రాజెక్టు లక్ష్యం కేవలం ప్రకృతి ప్రయోజనార్థమే చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రకృతితో మనం అనుసంధానమై ఉంటే..అకస్మాత్తుగా అంటుకుని కార్చిచ్చులను సకాలంలో నివారించడం సాధ్య పడుతుందని చెబుతున్నారు. అంతేగాదండోయ్ తాము చెట్టుతో ఎలా సంభాషిస్తున్నామో వీడియో రూపంలో సవివరంగా చూపించారు. అక్కడ ట్రినిటీ కాలేజ్లో దాదాపు 200 ఏళ్ల నాటి లండన్ ప్లేన్ ట్రీ వేర్లకు వైర్లకు టెక్నాలజీని అనుసంధానించి మాట్లాడుతున్నారు. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి ఆ పురాతన చెట్టుతో ఏవిధంగా సంభాషిస్తున్నాడో స్పష్టంగా కనిపిస్తుంది వీడియోలో. View this post on Instagram A post shared by RTÉ News (@rtenews) (చదవండి: డ్యాన్స్ బేబీ డ్యాన్స్..! పార్కిన్సన్స్కు నృత్య చికిత్స) -
టీసీఎస్కు రూ. 2,903 కోట్ల ఆర్డర్
న్యూఢిల్లీ: దేశీ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తాజాగా ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ నుంచి రూ. 2,903 కోట్ల యాడ్–ఆన్ అడ్వాన్స్ పర్చేజ్ ఆర్డరు (ఏపీవో) దక్కించుకుంది. దీని ప్రకారం బీఎస్ఎన్ఎల్కు 18,685 సైట్లలో 4జీ మొబైల్ నెట్వర్క్ ప్లానింగ్, ఇంజినీరింగ్, సరఫరా, ఇన్స్టాలింగ్, టెస్టింగ్, వార్షిక మెయింటెనెన్స్ మొదలైన సర్వీసులను టీసీఎస్ అందించాల్సి ఉంటుంది.ఏపీవోలో పేర్కొన్న నిర్దిష్ట నిబంధనలకు లోబడి సవివర పర్చేజ్ ఆర్డర్లను (పీవో) బీఎస్ఎన్ఎల్ జారీ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ కాంట్రాక్టుకు సంబంధించి తాము టీసీఎస్కు సరఫరా చేసే రేడియో యాక్సెస్ నెట్వర్క్ (ఆర్ఏఎన్), ఇతరత్రా పరికరాల విలువ సుమారు రూ. 1,526 కోట్లుగా ఉంటుందని తేజాస్ నెట్వర్క్స్ పేర్కొంది. నిర్దిష్ట షరతులకు లోబడి టీసీఎస్ సవివర పీవోలను జారీ చేస్తుందని వివరించింది. -
జియో, ఎయిర్టెల్, వీఐ.. చవకైన రీచార్జ్ ప్లాన్లు ఇవే...
టెలికాం కంపెనీలు టారీఫ్లు పెంచిన తర్వాత మొబైల్ రీఛార్జ్ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సివస్తోంది. ఈ నేపథ్యంలో చవకైన రీచార్జ్ ప్లాన్ల కోసం వినియోగదారులు చూస్తుంటారు. అటువంటివారి కోసం కాలింగ్, డేటా, ఎస్ఎంఎస్ వంటి అవసరమైన అన్ని ప్రయోజనాలను తక్కువ ధరలో అందించే రీచార్జ్ ప్లాన్లను ఇక్కడ అందిస్తున్నాం. జియో, ఎయిర్ టెల్, వీఐలు రూ.200 లోపు ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తున్నాయి. ఇవి అపరిమిత కాలింగ్, రోజువారీ డేటా, ఎస్ఎంఎస్, అనేక అదనపు ప్రయోజనాలను అందిస్తాయి.ఎయిర్టెల్ రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ఎయిర్ టెల్ రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఇందులో, వినియోగదారులు మొత్తం 2 జిబి డేటా (రోజువారీ పరిమితి లేకుండా), ఏ నెట్వర్క్లోనైనా లోకల్, ఎస్టీడీ, రోమింగ్ అపరిమిత కాల్స్ పొందుతారు. ఈ ప్లాన్లో మొత్తం 300 ఎస్ఎంఎస్లు లభిస్తాయి.జియో రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్జియో రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్ వాలిడిటీ కూడా 28 రోజులు. ఈ ప్లాన్ ద్వారా మొత్తం 2 జీబీ డేటా, మొత్తం 300 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. అలాగే, ఈ ప్లాన్ అపరిమిత కాల్స్ ప్రయోజనాన్ని అందిస్తుంది. జియో టీవీ సబ్ స్క్రిప్షన్, జియోక్లౌడ్ వంటి అదనపు బెనిఫిట్స్ లభిస్తాయి.వీఐ రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్వొడాఫోన్ ఐడియా రూ .189 ప్రీపెయిడ్ ప్లాన్ 26 రోజుల వాలిడిటీని అందిస్తుంది. ఇది మొత్తం 1 జిబి డేటా (రోజువారీ పరిమితి లేకుండా), మొత్తం 300 ఎస్ఎంఎస్లను అందిస్తుంది. ఈ ప్లాన్లో అన్లిమిటెడ్ కాల్స్, వీఐ మూవీస్ అండ్ టీవీ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.జియో రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్జియో రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ వాలిడిటీ 18 రోజులు. రోజుకు 1.5 జీబీ డేటా, ఏ నెట్వర్క్కైనా అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. జియో టీవీ సబ్ స్క్రిప్షన్, జియోక్లౌడ్ వంటి అదనపు బెనిఫిట్స్ లభిస్తాయి.వీఐ రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్విఐ రూ .189 ప్రీపెయిడ్ ప్లాన్ 26 రోజుల వాలిడిటీని అందిస్తుంది. ఇది మొత్తం 1 జిబి డేటా (రోజువారీ పరిమితి లేకుండా), మొత్తం 300 ఎస్ఎంఎస్లను అందిస్తుంది. ఈ ప్లాన్లో అన్లిమిటెడ్ కాల్స్, వీఐ మూవీస్ అండ్ టీవీ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. -
మొబైల్ ఫోన్ హ్యాక్: రూ.11.55 కోట్లు మాయం
సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. అమాయక ప్రజలు మాత్రమే కాకుండా.. కొన్ని సంస్థలు కూడా వీరి మాయలో పడిపోతున్నారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకుకు సంబంధించిన ఒక పెద్ద ఆన్లైన్ మోసం సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనలో మోసగాళ్ళు ఒక కస్టమర్ మొబైల్ ఫోన్ను హ్యాక్ చేయడం ద్వారా ఏకంగా రూ. 11.55 కోట్లు విత్డ్రా చేశారు.మోసగాళ్ళు ఒక కస్టమర్ను మోసగించి మొబైల్ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకునేలా చేశారు. దీని ద్వారా చంబా జిల్లాలోని బ్యాంక్ హల్టి బ్రాంచ్కు లింక్ అయిన అతని బ్యాంక్ ఖాతాకు యాక్సెస్ లభించింది. అంతే కాకుండా బ్యాంక్ సర్వర్ను హ్యాక్ చేసి NEFT, RTGS లావాదేవీల ద్వారా 20 ఖాతాలకు డబ్బును బదిలీ చేశారు.ఈ స్కాముకు సంబంధించిన లావాదేవీలు మే 11, 12 తేదీలలో జరిగాయి కానీ, మే 13 సెలవు దినం కావడంతో, బ్యాంకు అధికారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) లావాదేవీ నివేదిక అందిన తర్వాత మే 14న ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే సిమ్లా సదర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: ప్రపంచంలోనే తొలి AI హాస్పిటల్: డాక్టర్లు, నర్సులు అంతా రోబోలే..స్కామ్ బయటపడిన వెంటనే.. బ్యాంక్ అధికారులు సంబంధిత ఖాతాలను స్తంభింపజేశారు. దీనిపై లోతైన దర్యాప్తు నిర్వహించడానికి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In) బృందం సిమ్లాకు చేరుకోనుంది. హ్యాకర్లు ఎలా ప్రవేశించారు, బ్యాంక్ వ్యవస్థలకు ఇతర భద్రతా బలహీనతలు ఉన్నాయా అనే దానిపై దర్యాప్తు చేయనున్నారు.డిజిటల్ బ్యాంకింగ్ మోసాలను నివారించడానికి RBI మార్గదర్శకాలు➤మీ లాగిన్ వివరాలు, పిన్, ఓటీపీ లేదా కార్డడుల సమాచారాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు.➤అనుమానాస్పద లింక్లపై క్లిక్ చేయడం లేదా తెలియని ఫైల్లను డౌన్లోడ్ చేయడం మానుకోవాలి.➤యాప్లను ఇన్స్టాల్ చేసుకునే సమయంలో కూడా జాగ్రత్త వహించాలి.➤బ్యాంకులకు సంబంధించిన ఏవైనా వివరాలు కావాలనుకుంటే.. సంబంధిత బ్యాంక్ బ్రాంచ్ లేదా అధికారిక వెబ్సైట్లను సందర్శించాలి. -
పక్క దేశంలో స్టార్లింక్ పాగా
ఎలాన్మస్క్కు చెందిన స్పేస్ఎక్స్ యాజమాన్యంలోని శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ స్టార్ లింక్ బంగ్లాదేశ్లో అధికారికంగా సేవలు ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది దేశ డిజిటల్ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో గణనీయమైన పురోగతిని సూచిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. సాంప్రదాయ బ్రాడ్బ్యాండ్, నెట్వర్క్ సమస్యలతో పోరాడుతున్న మారుమూల, వెనుకబడిన ప్రాంతాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ను అందించాలనే లక్ష్యంతో ఈ సర్వీసులు ప్రారంభించిస్తున్నట్లు అధికారులు తెలిపారు.స్టార్ లింక్ విభిన్న యూజర్ అవసరాలను తీర్చడానికి బంగ్లాదేశ్లో వివిధ సబ్ స్క్రిప్షన్ ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. స్టార్ లింక్ రెసిడెన్స్ ప్లాన్లో భాగంగా నెలకు 6,000 టాకా ధర(రూ.4,200)తో ప్రామాణిక గృహ వినియోగానికి ఇంటర్నెట్ అందిస్తున్నారు. రెసిడెన్సీ లైట్ ప్లాన్లో భాగంగా నెలకు 4,200 టాకా(రూ.2,900) ధరతో నెట్ సేవలు అందిస్తున్నారు. వన్ టైమ్ సెటప్ ఫీజు కింద 47,000 టాకాలు(రూ.32,000) చెల్లించాల్సి ఉంటుంది. స్టార్ లింక్ డిష్, రౌటర్తో సహా పరికరాల ఖర్చులు ఇందులో కవర్ అవుతాయి.ఇదీ చదవండి: దిగొచ్చిన బంగారం ధర! తులం ఎంతంటే..స్టార్లింక్ ప్రత్యేకతలుఅంతరిక్షంలోని ఉపగ్రహాల నెట్వర్క్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీ నేరుగా భూమిపై ఉన్న వివిధ డివైజ్లకు చేరుతుంది.ఈ కనెక్షన్కు చందా కేబుల్ సర్వీస్ డైరెక్ట్ టు హోం (డీటీహెచ్)కు కట్టిన మాదిరిగా ఉంటుంది.ఇంటర్నెట్ కోసం ఈ కంపెనీ పోర్టబుల్ శాటిలైట్ డిష్ కిట్ను అందజేస్తుంది. దీనిని ఇంటిపై శాశ్వత పద్ధతిలో బిగించవచ్చు.ముందుగా ఇళ్లలో వైఫై రూటర్ ఆధారిత వైర్ కనెక్షన్ కలిగి ఉండాలి. దీనిని ఆ తర్వాత వైర్లెస్ పద్ధతిలో స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లు, కంప్యూటర్లు, ఇతర ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గాడ్జెట్స్కు జతచేయొచ్చు.ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సర్వీస్ అందించగలదు. మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా ఇంటర్నెట్ సేవలను పొందవచ్చు. -
యాపిల్ ఎయిర్పాడ్స్ కొత్త వర్షన్ రిలీజ్ ఎప్పుడంటే..
యాపిల్ 2025 సంవత్సరంలో కొత్త ఎయిర్పాడ్స్ను లాంచ్ చేసే అవకాశం లేదని ప్రముఖ టెక్ విశ్లేషకులు మింగ్-చి కువో తెలిపారు. యాపిల్ ఈ ఏడాదిలో మెరుగైన యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ వంటి అప్గ్రేడెడ్ ఫీచర్లతో థర్డ్ జనరేషన్ ఎయిర్పాడ్స్ ప్రోను విడుదల చేస్తుందని అందరూ భావిస్తున్నారు. ఈ తరుణంలో కువో ఇలా ప్రకటనలు చేయడం గమనార్హం.ఇదీ చదవండి: మెహుల్ చోక్సీకి రూ.2 కోట్ల డిమాండ్ నోటీసుఎయిర్పాడ్స్ ప్రో లైనప్కు తదుపరి అప్డేట్ వర్షన్ 2026 వరకు రాదని కువో అంచనా వేస్తున్నారు. ఎయిర్పాడ్స్ లైటర్ వర్షన్ మ్యాక్స్ వర్షన్ 2027లో వస్తుందని చెప్పారు. ఆడియోను మెరుగుపరచడానికి, వినియోగదారులకు మరింత మెరుగైన అనుభవాలను అందించేందుకు ఉద్దేశించిన బిల్ట్-ఇన్ ఇన్ఫ్రారెడ్(ఐఆర్) కెమెరాలు రాబోయే ఎయిర్పాడ్ మోడల్లో ఉంచనున్నట్లు తెలిపారు. ఐఆర్ కెమెరాల అనుసంధానం రోజువారీ వేరబుల్స్లో అధునాతన సెన్సింగ్ టెక్నాలజీని తీసుకురావడానికి యాపిల్ ప్రయత్నిస్తుందని చెప్పారు. ప్రస్తుత ఎయిర్పాడ్స్ ప్రో 2 2022లో విడుదలైంది. -
యాప్ ఒక్కటే.. సేవలు బోలెడు!
భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం ఇప్పటికే చాలానే యాప్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటిలో దేని ప్రత్యేకత దానిదే. అయినప్పటికీ రైల్వేశాఖ మరో కొత్త యాప్ను ప్రవేశపెట్టింది. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సీఆర్ఐఎస్) అభివృద్ధి చేసిన ‘స్వరైల్ యాప్’ ఆన్లైన్ రైల్వే సేవలను క్రమబద్ధీకరించడానికి ఆల్-ఇన్-వన్ రైల్వే సర్వీసులకు వేదికగా నిలుస్తుందని తెలిపింది. ఇది బహుళ రైల్వే సేవలను ఒకే యాప్లో ఏకీకృతం చేస్తుందని పేర్కొంది. స్వరైల్ యాప్లో అందిస్తున్న కొన్ని ఫీచర్ల గురించి తెలుసుకుందాం.టికెట్ బుకింగ్: ప్లాట్ఫామ్ టికెట్లతో సహా రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్ టికెట్లను నేరుగా యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.పీఎన్ఆర్, ట్రైన్ స్టేటస్ ట్రాకింగ్: రైలు షెడ్యూళ్లు, ఆలస్యం, ప్లాట్ఫామ్ నంబర్లకు సంబంధించి రియల్ టైమ్ అప్డేట్లను పొందవచ్చు.రైళ్లలో ఫుడ్ ఆర్డర్లు: రైళ్లలో ఆన్లైన్లోనే భోజనాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. నేరుగా మీ సీటు వద్దకే భోజనం డెలివరీ చేస్తారు.రైల్ మదద్ (కంప్లైంట్ మేనేజ్మెంట్): రైలు ప్రయాణంలో మీ సమస్యలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. చేసిన ఫిర్యాదు, దాని పరిష్కారాన్ని రియల్ టైమ్లో ట్రాక్ చేయవచ్చు.ఇదీ చదవండి: అతిపెద్ద సోలార్ ప్రాజెక్టుకు రిలయన్స్ ఏర్పాట్లుపార్సిల్, ఫ్రైట్ ఎంక్వైరీ: సరుకు రవాణాను నిర్వహించవచ్చు. పార్సిళ్లను ట్రాక్ చేయడం, సరుకు రవాణా ఖర్చులను లెక్కించడం.కోచ్ పొజిషన్ ఫైండర్: రైలు ఎక్కే సమయంలో కచ్చితంగా ఏ పొజిషన్లో మీరు ఎక్కబోయే కోచ్ నిలుస్తుందో తెలుసుకోవచ్చు.రీఫండ్ అభ్యర్థనలు: రద్దు అయిన, మిస్ అయిన ప్రయాణాల కోసం మీ చెల్లింపులపై సులభంగా రీఫండ్లను పొందేందుకు అభ్యర్థనలు పెట్టుకోవచ్చు.ఇతర భాషలు: ఈ యాప్ హిందీ, ఇంగ్లీష్తోపాటు ఇతర భాషల్లోనూ అందుబాటులో ఉంటుంది.ఆర్-వాలెట్ ఇంటిగ్రేషన్: టికెట్లు, భోజనం, ఇతర సేవల కోసం సురక్షితమైన, నగదు రహిత చెల్లింపుల కోసం ఆర్-వాలెట్ ఉపయోగించవచ్చు. -
లేఆఫ్ తప్పు తెలిసొచ్చిందీ కంపెనీకి...
ఇప్పుడు ఎక్కడ చూసినా లేఆఫ్లు పెరిగిపోయాయి. అదేమంటే ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్), ఆటోమేషన్ అంటున్నారు. ఖర్చు పేరు చెప్పి నైపుణ్యంతో పనిచేసే మానవ ఉద్యోగులను తొలగించి ఏఐ సిస్టమ్లతో భర్తీ చేసేస్తున్నాయి చాలా కంపెనీలు. ఇలా అన్నింటికీ ఏఐని నమ్ముకుని ఉన్న ఉద్యోగులను తొలగిస్తే ఏమవుతుందో తెలిసొచ్చిందీ స్వీడన్ కంపెనీకి...స్వీడిష్ ఫిన్టెక్ కంపెనీ క్లార్నా (Klarna) 2022లో ఏకంగా 700 ఉద్యోగులను తొలగించి, ఓపెన్ఏఐ (OpenAI) సహాయంతో ఏఐ (AI) వ్యవస్థలను ఉపయోగించడం ప్రారంభించింది. 2023 నాటికి, కంపెనీ మానవ ఉద్యోగుల నియామకాన్ని పూర్తిగా నిలిపివేసింది.అప్పట్లో ఈ కంపెనీ లేఆఫ్లను అమలు చేసిన తీరు వివాదాస్పదమైంది. ఉద్యోగుల తొలగింపులను ముందుగా రికార్డ్ చేసిన వీడియో ద్వారా ప్రకటించడం, వారి వ్యక్తిగత డేటా లీక్ చేయడం తీవ్ర విమర్శలకు కారణమైంది.తప్పు తెలిసొచ్చింది..ఏఐ ఆధారిత కస్టమర్ సేవలు అంచనాలకు తగినట్లుగా ఫలితాలను ఇవ్వలేదు. ఇవి కస్టమర్ సంతృప్తి తగ్గడానికి దారితీశాయి. మరోవైపు ఉద్యోగుల తొలగింపును అధ్వానంగా నిర్వహించడం, వారి వ్యక్తిగత డేటాను పబ్లిక్ చేయడం క్లార్నా ఇమేజ్ను ప్రభావితం చేసింది.అంతేకాకుండా ఆర్థికంగానూ కంపెనీకి పెద్ద దెబ్బే తగిలింది. 2021లో 45.6 బిలియన్ డాలర్లున్న క్లార్నా వ్యాల్యుయేషన్ 2022లో 6.7 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఏఐ ఆధారిత విధానం పెట్టుబడిదారుల ఆందోళనలకు కారణమైంది.ఏఐ ఆధారిత కార్యకలాపాలు సేవా నాణ్యతను ప్రభావితం చేశాయని క్లార్నా అంగీకరించింది. లేఆఫ్కు వెళ్లడం తప్పేనని కంపెనీ సీఈవో సెబాస్టియన్ సీమియట్కోవ్స్కీ అంగీకరించారు. ఖర్చు తగ్గింపునకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామని, కానీ ఇది సేవా ప్రమాణాలను దెబ్బతీసిందని ఒప్పుకొన్నారు.తిరిగి నియామకాల వైపు..నైపుణ్యం ఉన్న ఉద్యోగులను తొలగించిన తర్వాత భారీ నష్టాన్ని చవిచూసిన క్లార్నా సంస్థ తన వైఖరి మార్చుకుంది. ఇప్పుడు మళ్లీ నియామకాలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా కస్టమర్ సర్వీసు విభాగంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవాలని భావిస్తోంది. విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల్లోని అభ్యర్థులే లక్ష్యంగా రిమోట్ వర్క్ ఆఫర్ చేస్తోంది. -
నాజిల్ సమస్యే!.. నాలుగో దశను కూల్చివేసిన ఇస్రో
పీఎస్ఎల్వీ.. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది నాలుగు అంచెల రాకెట్. ఈ రాకెట్లో తొలి, మూడో దశల్లో ఘన ఇంధనం వాడతారు. ఇక రెండు, నాలుగో దశల్లో ద్రవ ఇంధనం వినియోగిస్తారు. 101వ ఉపగ్రహం ‘రీశాట్-1బి’ని రోదసికి పంపేందుకు నేటి ‘శతాధిక’ ప్రయోగంతో కలిపి పీఎస్ఎల్వీతో ఇస్రో 63 ప్రయోగాలు నిర్వహించింది. వీటిలో ఈ రాకెట్ విఫలమైన సందర్భాలు మూడు. 2017 తర్వాత రాకెట్లో లోపం కనిపించడం ఇదే తొలిసారి. నిజానికి మూడో దశలో రాకెట్ ఫెయిల్ కావడం అరుదు. 114 సెకండ్లపాటు సాగే ఈ మూడో దశలో హెచ్టీపీబీ (హైడ్రాక్సిల్-టర్మినేటెడ్ పాలీబ్యూటడీన్) ఘన ఇంధన మోటార్ వాడతారు. ఈ ఇంధనం ఆదర్శ స్థితిలో 240 కిలో న్యూటన్ల చోదకశక్తి ఇస్తుంది. తాజా ప్రయోగ వైఫల్య కారణాలను నిగ్గుతేల్చేందుకు ఇస్రో నుంచి ఒకటి, ప్రభుత్వం నుంచి మరొకటి వంతున రెండు కమిటీలు రంగంలోకి దిగాయి. రాకెట్ వేగం, ఎత్తు, ఇంజిన్ల పనితీరు అంశాలపై అవి అధ్యయనం చేస్తాయి. మోటారులో ఇంధన ప్రవాహం సరిగా లేదా? నాజిల్ సమస్యలు తలెత్తాయా? మోటారు డిజైన్/తయారీపరమైన లోపాలున్నాయా? ఇలా పలు కోణాల్లో విశ్లేషణ కొనసాగనుంది. కచ్చితమైన కారణం ఇంకా తెలియనప్పటికీ... రాకెట్ మూడో దశలో మోటార్ కేస్ లోపలి చాంబర్ ప్రెజర్లో అకస్మాత్తుగా పీడనం తగ్గడానికి ఫ్లెక్స్ నాజిల్ నియంత్రణ వ్యవస్థలో తలెత్తిన లోపమే కారణమని ఇస్రో ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. రాకెట్ వేగం, చోదక దిశలను నిర్దేశించేది ఈ కీలక భాగమే. ‘కంబశ్చన్ చాంబర్’లో ఇంధనం దహనమై విపరీత పీడనంతో వేడి వాయువులు నాజిల్ గుండా వెలుపలికి తన్నుకొస్తేనే రాకెట్ ప్రయాణం ముందుకు (పైకి) సాగుతుంది. ఈ ‘చర్యకు ప్రతిచర్య’ అనే మౌలిక సూత్రం ఆధారంగానే రాకెట్ పనిచేస్తుంది. రబ్బరు లాంటి స్థితిస్థాపక గుణం (లేయర్డ్ ఎలాస్టోమెరిక్) గల పదార్థాల పొరలతో ఫ్లెక్సిబుల్ నాజిల్స్ తయారవుతాయి. హైడ్రాలిక్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చి తద్వారా వాల్వులను కదిలిస్తూ ద్రవ/వాయు ప్రవాహాలను నియంత్రించేందుకు సాధారణంగా హైడ్రాలిక్ యాక్చువేటర్లను వినియోగిస్తుంటారు. వీటి పనితీరు సంక్లిష్టంగా ఉంటుంది. అందుకే పీఎస్ఎల్వీ రాకెట్ మూడో దశ మోటారులో హైడ్రాలిక్ యాక్చువేటర్లు కాకుండా… పరిమిత కోణాల్లోనే అయినప్పటికీ అన్ని దిశల్లో కదులుతూ కచ్చితమైన చోదకశక్తిని అందించేందుకు ఫ్లెక్సిబుల్ బేరింగ్ గల ఫ్లెక్స్ నాజిల్స్ ఉపయోగిస్తున్నారు. ఈ వ్యవస్థలో ఉత్పన్నమైన సమస్య వల్లనే తాజా ప్రయోగం విఫలమైనట్టు అనుమానిస్తున్నారు. నాజిల్ యాక్చువేటర్లు, ఫ్లెక్సిబుల్ జాయింట్, కంట్రోల్ సిగ్నల్స్... వీటిలో ఏదో ఒక సమస్య ఏర్పడి చాంబర్ ప్రెజర్లో పీడనం తగ్గి, మరింత ఎత్తుకు ప్రయాణించడానికి చాలినంత చోదకశక్తి లభించక రాకెట్ గతి తప్పడం ఆరంభించింది. దాన్ని అలాగే వదిలేస్తే జనావాసాలపై కూలి ప్రాణ-ఆస్తి నష్టం సంభవించే అవకాశముంది. అందుకే భద్రతా నిబంధనల ప్రకారం ఇస్రో దాన్ని ‘మిడ్ ఎయిర్-అబార్ట్’ చేసింది. అంటే... రాకెట్లో పేలోడ్ (ఉపగ్రహం) ఉన్న చివరిదైన నాలుగో దశను వేరే దారి లేక ఇస్రో కూల్చివేయాల్సి వచ్చింది.-జమ్ముల శ్రీకాంత్.. -
బకాయిలు చెల్లించలేం బాబోయ్..
సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిల నుంచి ఉపశమనం కోరుతూ ప్రముఖ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) సమర్పించిన రూ.44,000 కోట్ల చెల్లింపులకు విరుద్ధంగా అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. ఈ ఆర్థిక భారం కంపెనీని పోటీలో నిలపకుండా నియంత్రిస్తుందని, తదుపరి తరం టెక్నాలజీల్లో పెట్టుబడి పెట్టే సామర్థ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని కంపెనీ వాదిస్తోంది. ఇటీవల మరో టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా నుంచి ఇదే తరహా పిటిషన్ దాఖలు కావడం గమనార్హం.ఏజీఆర్ బకాయిలుసర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) అనేది ప్రభుత్వం, టెలికాం ఆపరేటర్ల మధ్య రుసుము భాగస్వామ్య యంత్రాంగ విధానం. ఫిక్స్డ్ లైసెన్స్ ఫీజు మోడల్ స్థానంలో 1999లో అవలంబించిన రెవెన్యూ షేరింగ్ మోడల్లో భాగంగా దీన్ని ప్రవేశపెట్టారు. ఈ మోడల్ కింద టెలికాం కంపెనీలు తమ ఏజీఆర్లో కొంత శాతాన్ని వార్షిక లైసెన్స్ ఫీజులు, స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీల రూపంలో ప్రభుత్వానికి చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.లెక్కింపు ఇలా..టెలికాం, నాన్ టెలికాం వనరుల నుంచి కంపెనీ ఆర్జించిన అన్ని ఆదాయాలను ఏజీఆర్లో చేరుస్తారు. ఇందులో ప్రధాన టెలికాం సేవల నుంచి వచ్చే ఆదాయం, వడ్డీ ఆదాయం, డివిడెండ్, ఆస్తుల అమ్మకంపై లాభం, అద్దె రశీదులు వంటి ప్రధానేతర వనరులు ఉంటాయి. టెలికాం కంపెనీల స్థూల ఆదాయాల ఆధారంగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) లైసెన్స్ ఒప్పందాల్లో నిర్వచించిన విధంగా ఏజీఆర్ను లెక్కిస్తుంది. స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీలకు 3-5 శాతం, లైసెన్సింగ్ ఫీజుకు 8 శాతం ఛార్జీలు వసూలు చేస్తున్నారు.వివాదం ఏమిటంటే..ఏజీఆర్లో కీలక టెలికాం సేవల నుంచి వచ్చే ఆదాయం మాత్రమే ఉండాలని టెలికాం ఆపరేటర్లు వాదిస్తున్నాయి. టెలికాం శాఖ మాత్రం అన్ని ఆదాయాలు అందులో పరిగణిస్తారని పేర్కొంటుంది. సుప్రీంకోర్టు 2019లో డాట్ నిర్వచనాన్ని సమర్థించింది. ఇది టెలికాం ఆపరేటర్లపాలిట శాపంగా మారింది. దాంతో ఇప్పటివరకు బకాయిపడిన, ప్రభుత్వంతో పంచుకోని ఆదాయాన్ని వెంటనే చెల్లించేలా తీర్పు వెలువడింది. దాంతో ప్రభుత్వంతో మంతనాలు సాగించేందుకు టెలికాం కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఈ చెల్లింపులకు విరుద్ధంగా సుప్రీంకోర్టులో టెలికాం కంపెనీలు పిటిషన్ దాఖలు చేస్తున్నాయి.ఇదీ చదవండి: భారత్లో ఐఫోన్ తయారీకి ఆసక్తి చూపడం లేదు: ట్రంప్కంపెనీ వాదన ఇలా..సుప్రీంకోర్టు విధించిన కఠినమైన 10 సంవత్సరాల రీపేమెంట్ టైమ్లైన్ కంపెనీపై తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తుందని, నెట్వర్క్ విస్తరణ, స్పెక్ట్రమ్ పెట్టుబడులు, 6జీ టెక్నాలజీల అభివృద్ధి కోసం వనరులను కేటాయించడం కష్టమవుతుందని ఎయిర్టెల్ తెలుపుతోంది. తిరిగి చెల్లించే నిబంధనలను సుప్రీంకోర్టు, డాట్ పునఃపరిశీలించకపోతే కంపెనీల ఆర్థిక స్థిరత్వం, టెలికాం పరిశ్రమ దెబ్బతింటుందని కంపెనీ వాదిస్తుంది. మరోవైపు వొడాఫోన్ ఐడియా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా వడ్డీ, జరిమానాల రూపంలో రూ.45,000 కోట్లు మాఫీ చేయాలని కోరింది. -
ప్రపంచంలోనే తొలి AI హాస్పిటల్: డాక్టర్లు, నర్సులు అంతా రోబోలే..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాజ్యమేలుతోంది. దాదాపు అన్ని రంగాల్లో కృత్రిమ మేధ హవా కొనసాగుతోంది. ఇప్పటికే చాలా రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఏఐ.. వైద్య రంగంలో కూడా అద్భుతాలు సృష్టిస్తోంది. ఆధునిక వైద్య శాస్త్రాన్ని పునర్నిర్వచించగల చర్యలో భాగంగా.. చైనా ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి AI ఆధారిత ఆసుపత్రి (ఏజెంట్ హాస్పిటల్)ని ప్రారంభించింది.సింఘువా యూనివర్సిటీ పరిశోధకులు ఏఐ బేస్డ్ "ఏజెంట్ హాస్పిటల్"ను సృష్టించారు. ఇక్కడ ఉన్న డాక్టర్లు, నర్సులు అన్నీ కూడా రోబోలే. ఇక్కడ ఏఐ డాక్టర్లు.. ఉబ్బసం, గొంతునొప్పి వంటి సుమారు 30 రకాల జబ్బులకు చికిత్స అందిస్తాయి. ఈ వినూత్న ప్రయత్నం వైద్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.ఏజెంట్ హాస్పిటల్ రీసర్చ్ టీమ్ లీడర్ 'లియు యాంగ్' మాట్లాడుతూ.. ఏఐ డాక్టర్లు రోగులకు చికిత్స చేయడానికి మాత్రమే కాకుండా.. వైద్య విద్యార్థులకు మెరుగైన శిక్షణను అందించడానికి కూడా ఉపయోగపడతాయని అన్నారు. ఎందుకంటే.. ఈ ఏఐ ఏజెంట్లు యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ (USMLE)లో 93.06 శాతం స్కోర్ సాధించాయని పేర్కొన్నారు.కొన్ని వారాలలోనే.. సంవత్సరాల క్లినిక్ అనుభవాన్ని పొందగల ఏఐ డాక్టర్లు రోగ నిర్దారణలో కూడా ప్రావీణ్యం పొంది ఉన్నాయని అన్నారు. ఏఐ వైద్య సిబ్బంది.. లైసెన్సింగ్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించగలిగితే.. శస్త్రచికిత్సలు సైతం చేయగలవు. ఏజెంట్ హాస్పిటల్లో 14 మంది ఏఐ డాక్టర్లు, నలుగురు ఏఐ నర్సులతో కూడిన సిబ్బంది ఉన్నారు. వీరందరూ.. రోజుకు 3000 మంది రోగులతో.. పరస్పర చర్య చేయగలరని లియు యాంగ్ అన్నారు.ఇదీ చదవండి: 'అమెరికాలో ఉంటున్న భారతీయులకు హెచ్చరిక'టెక్నాలజీ అభివృద్ధి చెందటం.. వైద్య రంగంలో ఏఐ డాక్టర్లు పుట్టుకురావడం బాగానే ఉంది. ఇవన్నీ యంత్రాలు కాబట్టి.. ఇవి భావోద్వేగాలకు అతీతం. కాబట్టి ఏదైనా చిన్న పొరపాటు జరిగినా.. రోగుల ప్రాణాలు పోయే అవకాశం ఉంది. కాబట్టి వైద్య రంగంలో సహాయకులుగా, వైద్య విద్యార్థులు బోధించడానికి ఏఐ సిబ్బంది ఉపయోగపడినప్పటికీ, ఆపరేషన్స్ చేయడం వంటివి ఏ మాత్రం సమంజసం?.. అనేది ఆలోచించాలి. -
హై'టెక్' హోమ్: ఇంటికొచ్చే చందమామ, పైకెగసే నీటిబొట్లు
ఇంటి అందాన్ని పెంచడంలో ఎప్పుడూ ముందుండే అలంకరణ వస్తువులు.. ఎప్పుడో అప్డేట్ అయ్యాయి. ఇప్పుడు మీరు కూడా ఈ టెక్ డెకర్ ఐటమ్స్ ఉపయోగించి మీ ఇంటిని హైటెక్ హోమ్గా మార్చేయండి.క్యూట్ చార్జర్రంగురంగుల వెలుగులతో ప్రకాశించే ఈ ల్యాంప్, ఒట్టి లైట్ మాత్రమే కాదు, ఇదొక వైరెలెస్ చార్జర్, బ్లూటూత్ స్పీకర్, స్లీప్ ల్యాంప్, సన్రైజ్ అలారం.. ఇలా మరెన్నో చెప్పుకోవచ్చు. బ్యాటరీతో పనిచేసే ఈ డివైజ్ను ఒక్కసారి చార్జ్ చేస్తే సుమారు రెండు నుంచి మూడు గంటల వరకు నిర్విరామంగా మ్యూజిక్ ప్లే చేస్తుంది. అలాగే, రంగురంగుల లైట్లతో పార్టీ థీమ్ మూడ్లోకి కూడా తీసుకురాగలదు. ఇందులోని ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ ఉపయోగించి క్షణాల్లో ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను చార్జ్ చేసుకోవచ్చు. ధర రూ. 849.ఇంటికొచ్చే చందమామఇంట్లో ఊహల లోకం కావాలనుకుంటున్నారా? అయితే, ఒక్కసారి నిద్రపోయే ముందు ఈ త్రీడీ మూన్ ల్యాంప్ను ఆన్ చేయండి. వెంటనే గోడలపై వెలుగుల పూలు, సీలింగ్పై తారల మెరుపులతో గదంతా ఒక ఫెయిరీ టేల్ సినిమా మూడ్లోకి మారిపోతుంది. ఏ టూల్స్ అవసరం లేకుండా ‘ప్లగ్ అండ్ ప్లే’ మోడ్లో ఇది పనిచేస్తుంది. పిల్లలకు ఎంతో బాగా నచ్చే దీని ధర రూ. 499. ఆన్లైన్లో మరెన్నో ఇలాంటి త్రీడీ ల్యాంప్స్ ఉన్నాయి. అభిరుచిని బట్టి కొనుగోలు చేయవచ్చు.ఫొటోలు మార్చే ఫ్రేమ్స్ఇదివరకు గోడకు వేలాడదీసే ఫ్రేమ్లో ఏదో ఒక ఫొటో మాత్రమే ఉండేది. రకరకాల ఫొటోలను ఒకేసారి చూపిస్తుంది ‘స్మార్ట్ డిజిటల్ ఫొటో ఫ్రేమ్’. ఫొటోను ప్రింట్ తీయటం, వాటిని ఫ్రేమ్స్లో అతికించడం ఇలాంటి పనులేం చేయనక్కర్లేదు. ఇది మీ ఇంట్లో ఉంటే. త్రీడీ డిస్ప్లే, కలర్ కేలిబ్రేట్తో రూపొందించిన ఈ ఫ్రేమ్, ఫొటోలను అత్యంత సహజంగా కనిపించేలా చేస్తుంది. దీనిని మొబైల్కు కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫొటోలను మార్చుకోవచ్చు. ఫ్రేమ్కు తగ్గట్లు ఫొటోలను ఇదే అటోమేటిక్గా క్రాప్ చేసి, బ్రైట్నెస్ను అడ్జస్ట్ కూడా చేస్తుంది. ధర రూ. 12,595.పైకెగసే నీటిబొట్లుపైకి విసిరిన ప్రతిదీ కింద పడాల్సిందే! కానీ, ఇక్కడ మాత్రం నీటి బొట్లు పైకి ఎగురుతూ అందరినీ ఆశ్చర్యంలో ముంచేస్తాయి. చూడటానికి డెకర్ ఐటమ్లా కనిపించే ఈ ‘స్మూత్ సెయిలింగ్ యాంటీగ్రావిటీ లైట్’లో ఎన్నో అబ్బురపరచే ఫీచర్స్ ఉన్నాయి. దీనిని నైట్ లైట్, టేబుల్ క్లాక్లాగే కాదు, అంతకు మించి దీని పనితనం ఉంటుంది. ఇది ఇందులో నింపిన నీటిని ఉపయోగించి, చల్లని గాలిని అందిస్తూ ఒక మినీ కూలర్లాగా కూడా పనిచేస్తుంది. లివింగ్ రూమ్, బెడ్రూమ్, వర్క్డెస్క్లకు ఇది ఒక చక్కటి డెకర్ ఐటమ్. ధర రూ. 1,899. -
ఏఐ నిపుణులు @ 4 లక్షలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా కృత్రిమ మేథ (ఏఐ) నిపుణుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం వీరి సంఖ్య 4.16 లక్షలకు చేరింది. అయితే నిపుణులు లభిస్తున్నప్పటికీ, డిమాండ్–సరఫరా మధఅయ ఏకంగా 51 శాతం అంతరం ఉంటోంది. భవిష్యత్ అవసరాలకు సన్నద్ధతను పెంచుకోవాల్సిన ఆవశ్యకతను ఇది సూచిస్తోందని స్టాఫింగ్ సేవల సంస్థ క్వెస్ కార్ప్ ఒక నివేదికలో వివరించింది. దీని ప్రకారం ఏఐ నిపుణుల నియామకాలు 2017 నుంచి ఎనిమిది రెట్లు పెరిగాయి. గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి మధ్య కాలంలో ఏఐ, డేటా నిపుణులకు డిమాండ్ దాదాపు 45 శాతం పెరిగినట్లు క్వెస్ ఐటీ స్టాఫింగ్ సీఈవో కపిల్ జోషి తెలిపారు. జెన్ఏఐ ఇంజినీరింగ్లో పది ఉద్యోగావకాశాలు ఉంటే అన్ని అర్హతలు కలిగిన నిపుణుడు ఒక్కరే ఉంటున్నారని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ఏఐ విప్లవానికి సార్థ్యం వహించే సామర్థ్యాలు భారత్కి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అయితే దీన్ని అందిపుచ్చుకోవాలంటే వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, విధానకర్తలు ఆ దిశగా త్వరితగతిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆకర్షణీయ వేతనాలు.. ఎంట్రీ లెవెల్ నిపుణులకు వార్షికంగా రూ. 8–12 లక్షల స్థాయిలో వేతనాలు ఉంటున్నాయి. ఇక ఎన్ఎల్పీ, జెన్ఏఐలో 5–8 ఏళ్ల అనుభవమున్న వారికి రూ. 25–35 లక్షల వరకు జీతభత్యాలు ఉంటున్నాయి. అటు ప్రోడక్ట్ సంస్థలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) సీనియర్ ప్రొఫెషనల్స్ రూ. 45 లక్షల పైగా అందుకుంటున్నారు. → ఏఐ నియామకాల్లో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగం ముందు వరుసలో ఉంటోంది. దేశీయంగా మొత్తం ఏఐ డిమాండ్లో ఈ రంగం వాటా 24 శాతంగా ఉంటోంది. ఆ తర్వాత స్థానాల్లో ఐటీ సరీ్వసులు, హెల్త్కేర్ ఉన్నాయి. → డేటా సైంటిస్టులు, ఎంఎల్ ఇంజినీర్లు, ఏఐ డెవలపర్లు, ఏఐ రీసెర్చర్లకు అత్యధికంగా డిమాండ్ ఉంటోంది. ఏఐ ప్రోడక్ట్ మేనేజర్లు, బిజినెస్ అనలిస్టులకు కూడా హైరింగ్ అవకాశాలు బాగుంటున్నాయి. → నైపుణ్యాలపరంగా చూస్తే పైథాన్ ల్యాంగ్వేజ్ ఆధి పత్యం కొనసాగుతోంది. అలాగే టెన్సర్ఫ్లో, పై టార్చ్, కేరాస్లాంటి ఫ్రేమ్వర్క్లకు ప్రాధా న్యం ఉంటోంది. ఎన్ఎల్పీ, కంప్యూటర్ విజన్, జెనరేటివ్ ఏఐ, క్లౌడ్ (ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ), ఎంఎల్ఆప్స్ నైపుణ్యాలను కంపెనీలు కోరుకుంటున్నాయి. → జెన్ఏఐపరమైన నియామకా>ల్లో బెంగళూరు, ఢిల్లీ–ఎన్సీఆర్, హైదరాబాద్ ముందు వరుసలో ఉంటున్నాయి. మెట్రోల పరిధిని దాటి ఏఐ టాలెంట్ హబ్లు ఎదుగుతున్నాయనడానికి నిదర్శనంగా మొత్తం ఏఐ డిమాండ్లో ద్వితీయ శ్రేణి నగరాల వాటా ఇప్పుడు 14–16 శాతంగా ఉంది. వీటిలోనూ కొచ్చి, అహ్మదాబాద్, కోయంబత్తూర్ నగరాల వాటా 70 శాతంగా ఉంది. → జీసీసీల నుంచి జెన్ఏఐకి డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. దేశీయంగా మొత్తం ఏఐ హైరింగ్లో జీసీసీల వాటా23 శాతంగా ఉంది. → దేశీయంగా ఏఐ నైపుణ్యాలను పెంపొందించేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలి. విద్యారంగం, పరిశ్రమ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాలతో కలిసి పని చేయాలి. పరిస్థితులకు తగ్గట్లుగా నైపుణ్యాలను పెంపొందించే ప్రోగ్రాంలను రూపొందించాలి. -
పాడ్కాస్ట్ చేద్దామా?
పిల్లలూ... ఇంతకు ముందు రేడియోలో బాలానందం అనే ప్రోగ్రామ్ ఉండేది.పిల్లల చేత ఆ ప్రోగ్రామ్లో మాట్లాడించేవారు. ఇప్పుడు మనమే రేడియో ప్రోగ్రామ్లాంటిది చేయవచ్చు. దానినే ‘పాడ్కాస్ట్’ అంటారు. మనకు నచ్చిన విషయాలు మాట్లాడి, రికార్డు చేసి డిజిటల్ ప్లాట్ఫామ్ మీద అప్లోడ్ చేస్తే మీ పాడ్కాస్ట్ను విని అభిమానులయ్యేవారుంటారు. ఈ సమ్మర్లో మీ కాలనీలోని పిల్లలతో కలిసి పాడ్కాస్ట్లు చేయండి. అందుకు ఏం చేయాలంటే....పిల్లలూ... మీరు రేడియో వినే ఉంటారు. మామూలు రేడియో వినకపోయినా కారులోని రేడియో వినే ఉంటారు. రేడియోలో ఒకప్రోగ్రామ్ అయిపోయాక మరోసారి ఆప్రోగ్రామ్ వినాలంటే కుదరదు. అదే ఆ ప్రోగ్రామ్ను రికార్డు చేసి ఒక చోట పెట్టి కావాల్సినప్పుడల్లా కావాల్సినన్నిసార్లు వినే ఏర్పాటు చేస్తే? పాడ్కాస్ట్ అలాంటిదే. మీరు మీ సొంతప్రోగ్రామ్స్ రికార్డు చేసి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో పెడతారు. వాటిని ఎవరు కావాలన్నా ఎప్పుడు కావాలన్నా వింటారు. ఇప్పుడు పాడ్కాస్టింగ్ చాలా మంచి హాబీ. డబ్బులు కూడా వస్తాయి... వినేవాళ్లు పెరిగితే. పాడ్కాస్ట్ అంటే కేవలం ఆడియోప్రోగ్రామ్ మాత్రమే. ఒకరు/లేదా కొంతమంది మాట్లాడుకునే మాటలను రికార్డు చేసి ఇతరులకు వినిపించడమే పాడ్కాస్టింగ్ అంటే.దానికి ఏం కావాలి?కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఉంటే సరిపోతుంది. రికార్డు చేయడానికి మైక్ ఉండాలి. రికార్డు చేసేందుకు అవసరమైన సాఫ్ట్వేర్ ఫ్రీగా దొరుకుతుంది. రికార్డ్ అయిన కార్యక్రమాన్ని ‘ఎంపి3’ ఫార్మాట్లో మార్చి పాడ్కాస్ట్ ప్లాట్ఫామ్స్లో అప్లోడ్ చేయాలి. ఈ ప్లాట్ఫామ్స్ను సబ్స్క్రయిబ్ చేసుకుని ఆ పని చేయవచ్చు. ఇదంతా చాలా సులువు పనే.పాడ్కాస్ట్లో ఏం మాట్లాడతారు?మనుషులకు మాటలు ఇష్టం. మీరు ఏం మాట్లాడినా వింటారు. ఉదాహరణకు ‘నేనూ... మా కుక్కపిల్ల’ అనే సిరీస్లో మీరు వరుసగా పాడ్కాస్ట్ చేయవచ్చు. ఒక్కో ఎపిసోడ్లో మీ కుక్కపిల్లతో మీరు పడుతున్న తంటాలు, అదంటే మీకెంత ఇష్టమో, అది మీరు స్కూల్కు వెళ్లినప్పుడు ఎలా ఎదురుచూస్తుందో, మీ ఫుడ్ను ఎలా లాక్కుంటుందో ఇవన్నీ మాట్లాడి రికార్డు చేసి పెడితే వినేవాళ్లు ఉంటారు.పాడ్కాస్ట్ చేసే విధంపాడ్కాస్ట్ అంటే చదవడం కాదు. నోట్స్ ముందు పెట్టుకుని చదివితే ఎవరూ వినరు. పాడ్కాస్ట్ను ఒక డైలాగ్లాగా మాట్లాడుతున్నట్టుగా చేయాలి. అఫ్కోర్స్... మీరు కొంత నోట్స్ రాసుకున్నా అది పాయింట్స్ గుర్తు రావడానికే తప్ప యథాతథంగా చదవకూడదు. ‘మా అమమ్మ’ అనే టాపిక్ మీద కబుర్లు చెబుతున్నట్టుగా మాట్లాడితే వింటారు.ఇంటర్వ్యూలుపాడ్కాస్ట్లో ఇంటర్వ్యూలు బాగుంటాయి. మీరు మీ అమ్మను, నాన్నను, అన్నయ్యను ఇంటర్వ్యూ చేయొచ్చు. క్లయిమేట్ చేంజ్ గురించి మీ సైన్స్ టీచర్ను ఆహ్వానించి ఇంటర్వ్యూ చేయొచ్చు. సెల్ఫోన్ అడిక్షన్ మీద ఒక డాక్టర్ను ఇంటర్వ్యూ చేయొచ్చు. ఇలాంటి వాటికి మమ్మీ, డాడీ సపోర్ట్ తీసుకోవచ్చు. రాబోయే వానాకాలంలో వూళ్లో వాన నీరు వెళ్లాలంటే గవర్నమెంట్ ఏయే పనులు మొదలెట్టాలో చెప్పేలా ఒక పాడ్కాస్ట్ చేయొచ్చు. హ్యారీపోటర్ మీద, అవేంజర్స్ మీద మీ ఫ్రెండ్స్ను ఇంటర్వ్యూ చేస్తూ పాడ్కాస్ట్ చేయొచ్చు. పాడ్కాస్ట్ చేయడం వల్ల మీ ఆలోచనలు, మాట, సమయస్ఫూర్తి పెరుగుతాయి. రీసెర్చ్ చేయడం వల్ల చాలా విషయాలు తెలుసుకుంటారు. ఇంటర్వ్యూలు చేయడం వల్ల ఎక్స్పర్ట్లతో పరిచయాలు జరుగుతాయి. పేరు వస్తుంది. ఇన్ని మేళ్లు జరుగుతాయి కనుక ట్రై చేయండి. ఈ సెలవుల్లో పాడ్కాస్టర్గా మారండి. ఆల్ ది బెస్ట్. ఇంకా ఏం మాట్లాడొచ్చు పాడ్కాస్ట్లో...→ తెలుగు పద్యం: వేమన, సుమతి, భాస్కర శతకాల్లో నుంచి ఒక్కో పద్యం తీసుకుని అది మీకు ఎందుకు ఇష్టమో అందులోని నీతి ఏమిటో మీ ఫ్రెండ్కు వివరిస్తూ పాడ్కాస్ట్ చేయొచ్చు.→ తెలుగువారి హిస్టరీ నుంచి మీకు నచ్చిన విషయాలను పాడ్కాస్ట్ చేయొచ్చు.→ సినిమాల మీద చేయొచ్చు.→ ఐ.పి.ఎల్ మేచెస్ మీద చేయొచ్చు.→ మై డ్రీమ్స్.. అని చేయొచ్చు. ఇవి మీ లక్ష్యాలే కాదు... మీ కలలు కూడా చెప్పచ్చు. -
హైదరాబాద్లో జియో టాప్.. ట్రాయ్ టెస్ట్లో బెస్ట్
హైదరాబాద్: రిలయన్స్ జియో హైదరాబాద్లో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న టెలికాం ఆపరేటర్గా అవతరించింది. కీలకమైన వాయిస్, డేటా పనితీరులో ఇతర టెల్కోలను జియో వెనక్కి నెట్టింది. ఇటీవల ట్రాయ్ (TRAI) నిర్వహించిన ఇండిపెండెంట్ డ్రైవ్ టెస్ట్ (IDT)లో జియో తన బలమైన మొబైల్ నెట్వర్క్ సామర్ధ్యాన్ని నిరూపించుకుంది.ట్రాయ్ నివేదిక ప్రకారం రిలయన్స్ జియో తన 4G నెట్వర్క్లో 240.66 Mbps సగటు డౌన్లోడ్ వేగాన్ని నమోదు చేసింది. ఇది నగరంలోని అన్ని ఆపరేటర్లలో అత్యధికం. ఈ అసాధారణ పనితీరు వల్ల జియో కస్టమర్లు గరిష్ట వినియోగ సమయాల్లో కూడా వేగవంతమైన వీడియో స్ట్రీమింగ్, ఆన్లైన్ గేమింగ్, వేగవంతమైన యాప్ డౌన్లోడ్లు, అంతరాయం లేని బ్రౌజింగ్ను ఆస్వాదించేలా చేస్తుంది.ఈ ఫలితాలు.. జియోను అధిక డౌన్లింక్ వేగం, తక్కువ లేటెన్సీ కలిగిన ఉత్తమ నెట్వర్క్గా నిలబెట్టాయి. అతి తక్కువ లేటెన్సీ వినియోగదారులు, సర్వర్ల మధ్య డేటా ప్యాకెట్లు ప్రయాణించడానికి పట్టే సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఇది వీడియో కాన్ఫరెన్సింగ్ మరియు ఆన్లైన్ గేమింగ్ వంటి రియల్-టైమ్ అప్లికేషన్లకు అత్యంత అవసరం.మరోవైపు వాయిస్ సేవలలో కూడా జియో పనితీరు అంతే బలంగా ఉంది. జియో సేవలు అధిక కాల్ సెటప్ సక్సెస్ రేటు, తక్కువ కాల్ సెటప్ సమయం, అతి తక్కువ కాల్ డ్రాప్ రేటు, అద్భుతమైన వాయిస్ స్పష్టత అందిస్తున్నాయని ట్రాయ్ నివేదిక సూచిస్తోంది. -
గూగుల్ కొత్త ఫీచర్.. కొట్టేసిన ఫోన్ పనిచేయదు!
ఫోన్ల చోరీకి చెక్ పెట్టేందుకు గూగుల్ కొత్త ఫీచర్ను తీసుకురాబోతోంది. చోరీకి గురైన ఫోన్లను దాదాపు నిరుపయోగంగా మార్చే లక్ష్యంతో గూగుల్ ఆండ్రాయిడ్ 16తో ముఖ్యమైన యాంటీ-థెఫ్ట్ ఫీచర్ను ప్రవేశపెట్టబోతోంది. ఈ అప్డేట్లో మెరుగైన భద్రతా సాధనాలు ఉంటాయి. ఇవి "ఓనర్ అనుమతి లేకుండా రీసెట్ చేసిన ఫోన్లు పనిచేయకుండా అవుతాయి" అని ఆండ్రాయిడ్ పరికరాల సమాచారాన్ని తెలిపే ‘ఆండ్రాయిడ్ పోలీస్’ అనే వెబ్సైట్ నివేదిక తెలిపింది.గూగుల్ ఇటీవల 'ది ఆండ్రాయిడ్ షో: ఐ/ఓ ఎడిషన్' సందర్భంగా ఈ కొత్త ఫీచర్ను ఆవిష్కరించింది. ఇది ప్రాథమికంగా ఫ్యాక్టరీ రీసెట్ ప్రొటెక్షన్ (ఎఫ్ఆర్పీ) ను పెంచుతుంది. ఇది చోరీకి గురైన ఫోన్లను నిరుపయోగంగా చేయడానికి రూపొందించిన భద్రతా ఫీచర్. గూగుల్ ఆండ్రాయిడ్ 15 లో ఎఫ్ఆర్పీకి అనేక మెరుగుదలలు చేసింది. తదుపరి ఆండ్రాయిడ్ అప్డేట్ దీనిని మరింత బలోపేతం చేస్తుంది.ఈ కొత్త ఫీచర్ గురించి గూగుల్ అధికారికంగా ఏమీ చెప్పనప్పటికీ, గూగుల్ ప్రణాళికలను తెలియజేసే ఒక స్క్రీన్ షాట్ ను ఆండ్రాయిడ్ పోలీస్ పబ్లిష్ చేసింది. ఈ స్క్రీన్ షాట్ ఫోన్ స్క్రీన్ పై ఫ్యాక్టరీ రీసెట్ వార్నింగ్ ఫ్లాషింగ్ ను చూపిస్తోంది. ఫోన్ను దొంగిలించినవారు ఒకవేళ సెటప్ విజార్డ్ ను చేయకపోతే రీసెట్ చేయకుండా ముందుకెళ్లలేరు. అంటే యూజర్ ఫోన్ను రీసెట్ చేసి మునుపటి లాక్ స్క్రీన్ లాక్ లేదా గూగుల్ ఖాతా క్రెడెన్షియల్స్ను నమోదు చేసే వరకు ఫోన్ పనిచేయదు. ఆండ్రాయిడ్ పోలీస్ ప్రకారం.. కొత్త ఫీచర్ ఈ సంవత్సరం చివరలో విడుదలయ్యే అవకాశం ఉంది. -
ఏటీఎంలకు డిజిటల్ గ్రహణం!
దేశంలో డిజిటల్ లావాదేవీల విప్లవం ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్ (ఏటీఎం)లకు గండి కొడుతోంది. ఒకపక్క బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు చెలామణీ అంతకంతకూ ఎగబాకుతూ ఆల్టైమ్ గరిష్టాల్లో కొనసాగుతోంది. మరోపక్క ఏటీఎంలు మాత్రం తగ్గుముఖం పడుతున్నాయి. బ్యాంకులు కొత్తగా తెరుస్తున్న ఏటీఎంల కంటే మూసేస్తున్నవే ఎక్కువ కావడం విశేషం! కొత్తిమీర కట్ట నుంచి బైకులో పెట్రోలు దాకా దేనికైనా డిజిటల్ చెల్లింపులే నడుస్తున్నాయిప్పుడు! మన దైనందిన ఆరి్థక లావాదేవీల్లో యూపీఐ పేమెంట్స్ అంతలా పెనవేసుకుపోయాయి మరి. దీంతో ఏటీఎంల నుంచి నగదు విత్డ్రాలు కూడా తగ్గుతున్నాయి. ఇదిలా ఉంటే, ఒకప్పుడు మెయిన్ రోడ్లపైనే కాకుండా సందుల్లో కూడా ఎడాపెడా ఏటీఎంలను తెరిచిన బ్యాంకులు.. ఇప్పుడు చడీచప్పుడు లేకుండా వాటికి తాళాలేస్తున్నాయి. ఆర్బీఐ నిబంధనల మేరకు ఏటీఎం ఉచిత లావాదేవీలపై పరిమితులు విధించడం, ఏటీఎం ఇంటర్–ఆపరబిలిటీ, వేరే బ్యాంకుల కస్టమర్లు ఏటీఎంలను ఉపయోగించుకునేటప్పుడు విధించే ఇంటర్చేంజ్ ఫీజు పెరుగుదల పెద్దగా లేకపోవడంతో బ్యాంకులు ఏటీఎంల నిర్వహణ బిజినెస్ పట్ల పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కొత్త ఏటీఎంల ఏర్పాటుకు ముఖం చాటేస్తున్నాయి. బ్యాంకింగ్ రంగంలో దేశవ్యాప్తంగా 2023 డిసెంబర్ నాటికి 2,19,882 ఏటీఎంలు ఉండగా, 2024 డిసెంబర్ నాటికి వీటి సంఖ్య 2,14,398కి తగ్గిపోయింది. అంటే దాదాపు ఏడాది వ్యవధిలో 5,484 ఏటీఎంలను ఎత్తేశాయన్నమాట! ముఖ్యంగా ఆఫ్సైట్ (బ్యాంకు బ్రాంచ్లలో కాకుండా ఇతర లొకేషన్లలో ఉన్నవి) ఏటీఎంల విషయంలో ఈ కోత భారీగా ఉంది. 2022 సెపె్టంబర్లో గరిష్టంగా 97,072 ఆఫ్సైట్ ఏటీఎంలు ఉండగా.. 2024 డిసెంబర్ నాటికి ఇవి 85,913కి తగ్గిపోవడం గమనార్హం. డిజిటల్ రయ్... బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు చెలామణీ ప్రస్తుతం ఆల్టైమ్ గరిష్ట స్థాయిలో రూ.34.7 లక్షల కోట్లకు పైగానే ఉంది. పెద్ద నోట్ల రద్దు (డీమానిటైజేషన్) నుంచి చూస్తే రెట్టింపైంది. మన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఇది 12 శాతం కింద లెక్క. ఇంతలా నగదు వ్యవస్థలో ఉన్నప్పటికీ, ఏటీఎంల సంఖ్య పెరక్కపోగా.. అంతకంతకూ తగ్గుతుండటం విశేషం. ఆర్బీఐ గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో ప్రతి లక్ష మంది జనాభాకు 15 ఏటీఎంలు మాత్రమే ఉన్నాయి. కాగా, 2024 పూర్తి ఏడాదికి చూస్తే, 17,200 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. 2023తో పోలిస్తే (11,760 కోట్లు) 46 శాతం దూసుకెళ్లాయి. మరోపక్క, ఆర్బీఐ అనుమతితో ఈ నెల 1 నుంచి ఏటీఎం చార్జీలను బ్యాంకులు పెంచేశాయి. దీంతో ఉచిత లావాదేవీల పరిమితి దాటితే, ప్రతి లావాదేవీకి ఇప్పు డున్న రూ.21 చార్జీ రూ.23కు పెరిగింది. నెలకు సొంత బ్యాంకుల ఏటీఎంలలో 5, ఇతర బ్యాంకుల ఏటీఎంల విషయాని కొస్తే మెట్రోల్లో అయితే 3, నాన్ మెట్రోల్లో 5 లావాదేవీలు ఉచితం. క్యాష్ విత్డ్రాతో పాటు బ్యాలెన్స్ ఎంక్వయిరీ వంటివన్నీ లావాదేవీగానే పరిగణిస్తున్నారు.ఎనీటైమ్ సమస్యలు...! కొన్ని బ్యాంకులు బ్రాంచ్ల వద్ద ఏటీఎంలను బాగానే నిర్వహిస్తున్నప్పటికీ, ఆఫ్సైట్ ఏటీఎంల విషయంలో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పుడు చూసినా సాంకేతిక సమస్యలు, లేదంటే క్యాష్ లేకపోవడం వంటివి కస్టమర్లకు నిత్యకృత్యంగా మారుతున్నాయి. దీంతో అత్యవసరంగా క్యాష్ విత్డ్రా చేసుకోవాలంటే రెండు మూడు ఏటీఎంలకు తిరగాల్సి వస్తోందనేది అధిక శాతం మంది ఖాతాదారుల ఫిర్యాదు. ‘దేశంలో ప్రస్తుత ఏటీఎంల ట్రెండ్ను పరిశీలిస్తే, బ్యాంకింగ్ రంగంలో టెక్నాలజీ, ముఖ్యంగా డిజిటల్ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోపక్క, బ్యాంకింగ్ సేవలు తక్కువగా ఉన్న మారుమూల ప్రాంతాలపై బ్యాంకులు దృష్టి పెట్టడం కూడా మొత్తంమీద ఏటీఎంలు తగ్గుముఖం పట్టడానికి కారణం’ అని ఆన్లైన్ పేమెంట్ సరీ్వస్ ప్రొవైడర్ ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ చైర్మన్ రవి బి. గోయల్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాల నేపథ్యంలో నెట్వర్క్ స్థిరీకరణ జరిగినట్లు ఆయన పేర్కొన్నారు.34.7 లక్షల కోట్లు: బ్యాంకింగ్ వ్యవస్థలో చెలామణీలో ఉన్న నగదు (జీడీపీలో ఇది 12 శాతం).2,14,398: 2024 డిసెంబర్ నాటికి దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల మొత్తం ఏటీఎంల సంఖ్య (స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు సహా). ఇందులో 1,28,485 ఆన్సైట్, 85,913 ఆఫ్సైట్ ఏటీఎంలు ఉన్నాయి.36,000: దేశంలో వైట్ లేబుల్ ఏటీఎంల సంఖ్య దాదాపుగా. ప్రస్తుతం ఈపీఎస్, ఇండియా1 పేమెంట్స్, హిటాచి పేమెంట్ సరీ్వసెస్, టాటా కమ్యూనికేషన్స్ పేమెంట్ సొల్యూషన్స్, వక్రంగీ.. ఈ ఐదు ప్రైవేటు కంపెనీలు వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లుగా ఉన్నాయి. 17,200 కోట్లు : 2024లో యూపీఐ లావాదేవీల సంఖ్య (రోజువారీగా సగటు విలువ రూ. 74,990 కోట్లు) – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఇంటర్నెట్ లేకుండా.. పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండిలా..
ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలనుంటే.. ఆన్లైన్ పోర్టల్ సందర్శించాల్సిందే. ఇలా చేయాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. అయితే.. డేటా లేకుండా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం కష్టమే అనుకుంటే పొరపాటు. ఎందుకంటే మిస్డ్కాల్ ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. దీని గురించి వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.మిస్డ్కాల్తో పీఎఫ్ బ్యాలెన్స్ చెకింగ్మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 9966044425 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఈ నెంబర్కు కాల్ చేయగానే ఆటోమేటిక్గా కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. ఆ తరువాత మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎస్ఎమ్ఎస్ రూపంలో వస్తుంది.ఇదీ చదవండి: పాకిస్తాన్ మొత్తం జీడీపీ కలిపితే.. తమిళనాడంత లేదు!పీఎఫ్ బ్యాలెన్స్ మీకు ఎస్ఎమ్ఎస్ రూపంలో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు రావాలంటే.. యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యాక్టివేట్ అయి ఉండాలి. అంతే కాకుండా మీ నెంబర్ UANకు లింక్ అయి ఉండాలి. కేవైసీ వివరాలు అప్డేట్ చేయాలి. ఇవన్నీ పూర్తి చేసి ఉంటేనే మీరు పీఎఫ్ బ్యాలెన్సును మెసేజ్ రూపంలో తెలుసుకోగలరు. 7738299899 నెంబర్కు మెసేజ్ చేయడం ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ తీసుకోవచ్చు. -
భారత్లో ఐఫోన్ తయారీకి ఆసక్తి చూపడం లేదు: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దోహా పర్యటన సందర్భంగా భారత్లో యాపిల్ ఐఫోన్ల తయారీపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో యాపిల్ తన ఉత్పత్తుల తయారీని పెంచుకోవడానికి ఆసక్తి చూపడం లేదన్నారు. ఇండియాలో యాపిల్ తయారీని హైలైట్ చేస్తూ ‘తమ పని తాము చూసుకుంటారు’అని సీఈఓ టిమ్కుక్కు సూచించారు.భారతదేశం లేదా చైనా వంటి దేశాల్లో అమెరికా కంపెనీలు పెట్టుబడులు పెట్టడం, తయారీ ప్లాంట్లను స్థాపించడం తగదని, అమెరికాలోనే వీటిని చేపట్టాలని ట్రంప్ నిరంతరం యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధానాన్ని కట్టడి చేసేందుకే టారిఫ్లను విధిస్తున్నట్లు గతంలో తెలిపారు. కొంతకాలంగా యాపిల్ తన ఐఫోన్ ఉత్పత్తిని భారత్లో వేగంగా విస్తరిస్తోంది. ఇటీవల చైనాపై అధిక దిగుమతి సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో యాపిల్ వంటి దిగ్గజ కంపెనీలు భారత్లో మరింత వేగంగా విస్తరించాలని చూస్తున్నాయి. ఈ సమయంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.ఇదీ చదవండి: కంపెనీలకు కలిసొచ్చిన యుద్ధం2025 ఆర్థిక సంవత్సరానికి భారతదేశంలోని ఐఫోన్ ఉత్పత్తి విలువ 22 బిలియన్ డాలర్లకు చేరింది. 2026 చివరి నాటికి భారత్ను అమెరికా దిగుమతి చేసుకునే ఐఫోన్లకు ప్రధాన కేంద్రంగా మార్చాలని కంపెనీ యోచిస్తోంది. స్థానికంగా అధిక ఖర్చులు ఉన్నప్పటికీ, యాపిల్ చైనాపై ఆధారపడడాన్ని తగ్గించడానికి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ఉత్పాదకతను నియంత్రించడానికి స్థానికంగా పెట్టుబడులు పెంచుతోంది. -
‘అందుకే ప్రభుత్వ ఉద్యోగం మేలు అనేది’..
టెక్ దిగ్గజాలు వరుస పెట్టి ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా సత్య నాదళ్ల నేతృత్వంలోని మైక్రోసాఫ్ట్ వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో జీతాలు, జాబ్ సెక్యూరిటీ పరంగా ఐటీ జాబ్లు, ప్రభుత్వ ఉద్యోగాలను పోలుస్తూ చర్చ నడుస్తోంది. అమెరికాలోని ఈ సంస్థలో పనిచేస్తున్న తన సోదరుణ్ణి ఉద్యోగం నుంచి తొలగించారంటూ సోషల్ మీడియాలో ఓ మహిళ చేసిన పోస్ట్ దానికి గూగుల్ కు చెందిన ఇంజినీర్ ప్రతిస్పందన వైరల్గా మారాయి.మైక్రోసాఫ్ట్ లేఆఫ్ల (Microsoft Layoffs) నేపథ్యంలో స్నేహ అనే మహిళ ‘ఎక్స్’లో ఓ పోస్ట్పెట్టారు. ‘అమెరికాలో పనిచేస్తున్న నా కజిన్ బ్రదర్ను మైక్రోసాఫ్ట్ ఉద్యోగం నుంచి తొలగించింది. టెక్ అనేది స్థిరంగా ఉండే ర రంగం కాదు. అందుకే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించాలని, కనీసం అక్కడ ఉద్యగ భద్రత అయినా ఉంటుందని మా పెద్దవాళ్లు చెబుతుంటారు’ అంటూ రాసుకొచ్చారు.బెంగళూరుకు చెందిన గూగుల్ ఇంజనీరు రాహుల్ రాణా ఈ పోస్టకు ప్రతిస్పిందించారు. ప్రభుత్వ ఉద్యోగ భద్రతకు ప్రాధాన్యమివ్వాలనే భావనను ఆయన తిప్పికొట్టారు. టెక్ పరిశ్రమలో అధిక సంపాదన ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండే ఉద్యోగ భద్రత ప్రయోజనాల కంటే ఎక్కువగా ఉంటుందని వాదించారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి జీవితకాలంలో సంపాదించే దానికంటే ఐదు రెట్లు ఎక్కువ మొత్తాన్ని టెక్ ఉద్యోగి కొన్ని సంవత్సరాలలోనే సంపాదించవచ్చని చెప్పుకొచ్చారు.ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. మరికొంత మంది యూజర్లు ప్రతిస్పందించారు. టెక్ జాబ్స్, ప్రభుత్వ ఉద్యోగాల మధ్య లాభనష్టాలను బేరీజు వేస్తూ, ఉద్యోగ భద్రత, ఆర్థిక ప్రయోజనాలు , కెరీర్ స్థిరత్వంపై తమ దృక్పథాలను పంచుకున్నారు. తన వాదనలను మరింత పెంచుతూ భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాలు వేతనానికి మించి గణనీయమైన ప్రయోజనాలను అందించగలవని, గృహనిర్మాణం, విద్యుత్తు, ఇతర సౌకర్యాల అలవెన్సులతో సహా, ఇది గణనీయమైన సంపద సేకరణకు దారితీస్తుందని స్నేహ పేర్కొన్నారు. -
మర మనిషా..? మైఖేల్ జాక్సనా..?
మర మనుషులు మానవుల స్థానాన్ని రీప్లేస్ చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నట్లు తెలుస్తుంది. హ్యుమనాయిడ్ రోబోల ఆవిష్కరణలో వస్తున్న మార్పులే అందుకు ఉదాహరణ. తాజాగా టెస్లా హ్యూమనాయిడ్ రోబో ఆప్టిమస్ మనుషుల్లా డ్యాన్స్ చేస్తున్న వీడియోలను ఎలాన్ మస్క్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఎలాంటి ఆధారం లేకుండా అచ్చం మనుషుల్లానే డ్యాన్స్ చేయడం ఆ వీడియోలో చూడవచ్చు.ఇదీ చదవండి: ఈసారి 7,000 మంది బలి?ఆప్టిమస్ రోబో డ్యాన్స్ చేస్తున్న వీడియోను కోట్ చేస్తూ టెస్లా అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా స్పందించింది. ప్రధానంగా కార్ల తయారీదారుగా ఉన్న టెస్లా రోబో డ్యాన్స్ను ఉటంకిస్తూ ‘మాది కార్ల కంపెనీ కదా’ అని సరదాగా పోస్టు చేసింది. టెస్లా తదుపరి వాటాదారుల సమావేశంలో తనతో పాటు ఆప్టిమస్ నృత్య బృందాన్ని వేదికపైకి తీసుకెళ్తానని ఎలాన్ మస్క్ ఎక్స్ పోస్ట్లో వెల్లడించారు.🕺 pic.twitter.com/NzqAmN3F5z— gorklon rust (@elonmusk) May 13, 2025pic.twitter.com/ZbrZmfjHpd— gorklon rust (@elonmusk) May 14, 2025This is still very far from our final form https://t.co/6gIAllTPP5— gorklon rust (@elonmusk) May 14, 2025We're a car company right https://t.co/DWCw4i3HQV— Tesla (@Tesla) May 14, 2025 -
6జీ పేటెంట్లలో భారత్ టాప్6
న్యూఢిల్లీ: 6జీ పేటెంట్ ఫైలింగ్స్కి సంబంధించి అంతర్జాతీయంగా టాప్ ఆరు దేశాల్లో భారత్ కూడా ఉన్నట్లు కేంద్ర టెలికం శాఖ సహాయ మంత్రి చంద్రశేఖర్ పెమ్మసాని తెలిపారు. దేశీయంగా 111 రీసెర్చ్ ప్రాజెక్టులకు రూ. 300 కోట్లకు పైగా నిధులు మంజూరైనట్లు ఆయన వివరించారు. 6జీ సేవలు 5జీ కన్నా 100 రెట్లు వేగంగా ఉంటాయన్నారు.టెక్నాలజీలో అంతర్జాతీయంగా భారత్ అగ్రగామిగా ఎదిగే క్రమంలో పలు దశాబ్దాల పాటు ఈ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. దీనితో కొత్త పరిశ్రమలు వస్తాయని, ప్రస్తుతమున్న వాటిలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని భారత్ 6జీ 2025 సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు.ఫలితంగా 2035 నాటికి భారత ఎకానమీ 1 లక్ష కోట్ల డాలర్ల మేర పెరుగుతుందని చంద్రశేఖర్ చెప్పారు. దేశీయంగా 6జీని అభివృద్ధి చేసుకోవడం వల్ల మన కమ్యూనికేషన్స్ వ్యవస్థ సురక్షితంగా ఉంటుందని పేర్కొన్నారు. -
చిన్న నగరాల్లో స్మార్ట్ఫోన్స్ హవా!
మెట్రోలు, బడా నగరాల వంటి అర్బన్ మార్కెట్లో స్మార్ట్ఫోన్ అమ్మకాలు పతాక స్థాయికి చేరుకోవడంతో డిమాండ్ మందకొడిగా మారింది. అయితే, హ్యాండ్సెట్ తయారీ సంస్థలకు ద్వితీయ శ్రేణి నగరాలు, గ్రామీణ ప్రాంతాలు ఇప్పుడు ఈ లోటును భర్తీ చేస్తున్నాయి. చౌక ఫోన్లే కాదు.. ప్రీమియం 5జీ ఫోన్ల కొనుగోళ్లకూ కస్టమర్లు తగ్గేదేలే అంటున్నారు. పెద్ద నగరాలను మించి విక్రయాలు నమోదవుతుండటంతో సేల్స్ పెంచుకోవడానికి కంపెనీలు రూరల్ రూట్ ఎంచుకుంటున్నాయి. అంతేకాదు, ఫైనాన్సింగ్ ఆప్షన్ల దన్నుతో సెకండ్ హ్యాండ్ 4జీ ఫోన్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఒకప్పుడు కీప్యాడ్ ఫీచర్ ఫోన్స్ వాడకానికి బాగా అలవాటు పడ్డ గ్రామీణ, చిన్న పట్టణాల ప్రజలు ‘స్మార్ట్’గా అప్గ్రేడ్ అవుతున్నారు. దీంతో చిన్న నగరాలు, పట్టణాలతో పాటు పల్లెల్లోనూ స్మార్ట్ఫోన్లకు డిమాండ్ దూసుకెళ్తోంది. పెద్ద నగరాల్లో స్తబ్దుగా మారిన సేల్స్ను కంపెనీలు అక్కడ పూడ్చుకుంటున్నాయి. దీంతో మొత్తంమీద స్మార్ట్ఫోన్ అమ్మకాలు పడిపోకుండా, వృద్ధి సిగ్నల్స్కు వీలవుతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ‘4జీతో పాటు 5జీ మోడల్స్ కూడా అందుబాటు ధరల్లో లభ్యమవుతుండటంతో ద్వితీయ శ్రేణి నగరాల్లో ఈ ఏడాది అమ్మకాల వృద్ధి భారీగా నమోదుకానుందని టెక్ఆర్క్ అడ్వయిజర్ అజయ్ శర్మ చెప్పారు. ‘2023, 2024 సేల్స్ ట్రెండ్ను పరిశీలిస్తే, పెద్ద నగరాలకు మించి టియర్–2 నగరాల్లో అమ్మకాలు పుంజుకున్నాయి. ప్రీమియం ఫోన్ల పట్ట ఆసక్తి ఈ నగరాలకూ పాకింది. మరోపక్క, చౌక 5జీ ఫోన్ల దన్నుతో కొన్ని బ్రాండ్లు మిగతా కంపెనీల కంటే వేగంగా వృద్ధి చెందుతున్నాయి’ అని పేర్కొన్నారు.ఆఫ్లైన్ స్టోర్స్ ద్వారా... చిన్న నగరాలు, పట్టణాల్లో కూడా ప్రజల ఆదాయాలు పెరుగుతుండటంతో పాటు డిజిటల్ టెక్నాలజీ పట్ల అవగాహన, రిటైల్ నెట్వర్క్లను విస్తరిస్తుండటం వల్ల కస్టమర్లు హై–ఎండ్ డివైజ్లకు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారని కౌంటర్పాయింట్ రీసెర్చ్ ఎనలిస్ట్ సుభమ్ సింగ్ తెలిపారు. ‘ప్రధాన హ్యాండ్సెట్ బ్రాండ్లన్నీ ఆఫ్లైన్ (రిటైల్ స్టోర్స్) ద్వారా చిన్న నగరాల్లోకి చొచ్చుకుపోతున్నాయి. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) గణాంకాల ప్రకారం 2024లో 15.1 కోట్ల స్మార్ట్ఫోన్లు అమ్ముడయ్యాయి. 4 శాతం వృద్ధి నమోదైంది. స్టోర్లో నేరుగా ఫోన్ను చూసి, అనుభూతి చెందే అవకాశం, అలాగే ఈజీ ఫైనాన్సింగ్ ఆప్షన్లతో ఖరీదైన స్మార్ట్ఫోన్ కొనుగోళ్లకు వెనకాడటం లేదు’ అని సింగ్ వివరించారు. 30 నగరాల్లో నిర్వహించిన మార్కెట్ అధ్యయనం ప్రకారం, బడా నగరాల్లో (టియర్–1) వార్షిక అమ్మకాల వృద్ధి సింగిల్ డిజిట్కు పరిమితం కాగా, టియర్–2, అంతకంటే చిన్న నగరాల్లో రెండంకెల వృద్ధి నమోదవుతున్నట్లు చెప్పారు. ఫీచర్ ఫోన్స్ కస్టమర్లు అప్గ్రేడ్ అవుతుండటం, అనువైన రుణ సదుపాయాల వల్ల తృతీయ శ్రేణి (టియర్–3) ప్రాంతాల్లో తమ అమ్మకాలు 19–20 శాతం పెరిగాయని హ్యాండ్సెట్ బ్రాండ్ టెక్నో సీఈఓ అరిజిత్ తలపాత్ర పేర్కొన్నారు.అమ్మకాలు ఫ్లాట్.. ఆదాయాలు జూమ్ కోవిడ్ ముందు నాటి స్మార్ట్ఫోన్ అమ్మకాల వృద్ధితో పోలిస్తే ప్రస్తుతం దేశంలో సేల్స్ మందగమనం స్పష్టంగా కనబడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఏటా విక్రయాలు 15 కోట్ల స్థాయికి పరిమితం అవుతున్నాయి. ఈ ఏడాది (2025) అమ్మకాలు ఫ్లాట్గా ఉంటాయని అంచనా వేస్తున్నారు. టాప్లేపుతున్న వివో, శాంసంగ్, షావోమి, ఒప్పో, రియల్మీ వంటి బ్రాండ్లకు ఇది ప్రతికూల సిగ్నల్స్ పంపుతోంది. అయితే, 2024లో దేశీ స్మార్ట్ఫోన్ పరిశ్రమ మొత్తం ఆదాయం ఆల్టైమ్ గరిష్ఠానికి (9% వార్షిక వృద్ధి) దూసుకెళ్లడం విశేషం. ప్రధానంగా 5జీ, జెనరేటివ్ ఏఐ వంటి ఫీచర్లు గల ఖరీదైన స్మార్ట్ఫోన్స్పై కస్టమర్లు భారీగా ఖర్చు చేయడమే దీనికి కారణమని కౌంటర్పాయింట్ వెల్లడించింది.సగం ఫోన్ సేల్స్ అక్కడి నుంచే... ‘ప్రీమియం స్మార్ట్ఫోన్ల వాడకం ట్రెండ్ మెట్రోలు, పెద్ద నగరాలకే పరిమితం కావడం లేదు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కూడా రూ.8,500–17,000 స్థాయికి మించి ఖరీదైన ఫోన్లకు కస్టమర్లు సై అంటున్నారు. ముఖ్యంగా ఔత్సాహిక మధ్య తరగతి కొనుగోలుదారులు వేగంగా ప్రీమియం ఫోన్లకు అప్గ్రేడ్ అవుతున్నారు’ అని సీసీఎస్ ఇన్సైట్ సీనియర్ ఎనలిస్ట్ ఏక్తా మిట్టల్ చెప్పారు. స్మార్ట్ఫోన్ పరిశ్రమలో భవిష్యత్తు వృద్ధికి చిన్న నగరాలే చోదకంగా నిలుస్తాయంటున్నారు. ప్రస్తుతం సగానికి పైగా స్మార్ట్ఫోన్ అమ్మకాలు చిన్న నగరాలు, పట్టణాల్లోనే నమోదవుతున్నాయని కూడా సీసీఎస్ ఇన్సైట్ తెలిపింది. మరోపక్క, జియో, ఎయిర్టెల్ తమ 5జీ నెట్వర్క్ను గ్రామీణ, సబర్బన్ ప్రాంతాలకు వేగంగా విస్తరిస్తుండటం, క్వాల్కామ్, మీడియాటెక్ వంటి చిప్ తయారీ దిగ్గజాలు రూ.12,000 కంటే తక్కువ స్థాయిలో 5జీ ఫోన్లు లభించేలా చౌక 5జీ ప్రాసెసర్లను అందుబాటులోకి తేవడం కూడా పరిశ్రమకు దన్నుగా నిలుస్తోందనేది నిపుణుల మాట!–సాక్షి, బిజినెస్ డెస్క్ -
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉత్తర ప్రదేశ్లో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న సెమీకండక్టర్ పరిశ్రమ ఇప్పుడు భారత్లోనూ రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే దేశంలో ఐదు సెమీకండక్టర్ యూనిట్లు నిర్మాణ దశలో ఉండగా ఆరో యూనిట్గా ఇది ఏర్పాటవుతోంది.రూ.3706 కోట్ల వ్యయంతో..హెచ్సీఎల్, ఫాక్స్కాన్ సంయుక్త భాగస్వామ్యంతో యూపీలోని జెవార్ ఎయిర్పోర్టు సమీపంలో ఈ కొత్త సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటు కానుంది.రూ.3706 కోట్ల వ్యయంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. 2027 నాటికి ఈ యూనిట్ నిర్మాణం పూర్తయి ఉత్పత్తిని మొదలుపెట్టనుంది. ఇక్కడ మొబైల్ ఫోన్లు, లాప్టాప్లు, ఆటోమొబైల్స్, పర్సనల్ కంప్యూటర్స్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల్లో వినియోగించే చిప్లను ఇక్కడ ఉత్పత్తి చేయనున్నారు.ప్రతి నెలా 3.6 కోట్ల యూనిట్లను తయారు చేసే సామర్థ్యంతో ఈ భారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే గుజరాత్, అస్సాం రాష్ట్రాల్లో ఐదు సెమీకండక్టర్ యూనిట్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇక కేంద్ర కేబినెట్ ప్రకటించిన నిర్ణయాల్లో బెంగళూరు, నోయిడా ప్రాంతాలలో డిస్ప్లే చిప్స్ హబ్ల ఏర్పాటు ఉంది. అలాగే తిరుపతి ఐఐటీ విస్తరణకు కూడా కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. -
చేతిలో పట్టుకున్నా.. పట్టుకోనట్టే!
సాంకేతికతను వినియోగించడంలో, ఎప్పటికప్పుడు అప్డేట్ కావడంలోనూ యువతరం ముందుంటోంది. నిత్యం మొబైళ్ల తయారీలో వస్తున్న మార్పులను వీరు స్వాగతిస్తున్నారు. స్మార్ట్ఫోన్ల పనితీరు మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకు అనుగుణంగా ఫోన్లలో ఫీచర్లతోపాటు మొబైల్ డిజైన్కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫోన్ తయారీ కంపెనీలు సైతం వినియోగదారుల అభిరుచుల మేరకు వినూత్న మోడళ్లను నిత్యం ఆవిష్కరిస్తున్నాయి. అందులో భాగంగా స్లిమ్గా ఉండే ఫోన్ల తయారీపై సంస్థలు ఫోకస్ పెట్టాయి. వినియోగదారుల చేతిలో ఇట్టే నప్పేలా వాటిని తయారు చేస్తున్నాయి. 2025లో అందుబాటులో ఉన్న కొన్ని స్లిమ్ డిజైన్ ఫోన్ల వివరాలు కింద తెలుసుకుందాం.శామ్సంగ్ గెలాక్సీ ఎస్25మందం: 6.2 మి.మీస్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్50 ఎంపీ కెమెరా4000 ఎంఏహెచ్ బ్యాటరీ ధర: సుమారు రూ.65,399ఒప్పో రెనో13మందం: 6.5 మి.మీడైమెన్సిటీ 8350 ప్రాసెసర్50 మెగాపిక్సెల్ కెమెరా5600 ఎంఏహెచ్ బ్యాటరీ ధర: సుమారు రూ.35,999వివో వీ50 మందం: 6.7 మి.మీస్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్50 ఎంపీ డ్యుయల్ కెమెరా6000 ఎంఏహెచ్ బ్యాటరీ ధర: సుమారు రూ.34,999ఇదీ చదవండి: ఆర్బీఐ రూ.2.75 లక్షల కోట్ల డివిడెండ్?ఐకూ నియో 10ఆర్మందం: 6.8 మి.మీస్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్50 ఎంపీ కెమెరా6400 ఎంఏహెచ్ బ్యాటరీధర: సుమారు రూ.26,999మోటరోలా ఎడ్జ్ 60 ప్రోమందం: 6.9 మి.మీడైమెన్సిటీ 8350 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్50 మెగాపిక్సెల్ కెమెరా6000 ఎంఏహెచ్ బ్యాటరీ ధర: సుమారు రూ.29,999 -
యాపిల్ యూజర్లకు కేంద్రం హెచ్చరికలు
యాపిల్ ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్ సాఫ్ట్వేర్లలో అనేక లోపాల గురించి భారత ప్రభుత్వం వినియోగదారులను హెచ్చరించింది. ఈ లోపాలను ఉపయోగించుకుని సున్నితమైన యూజర్ డేటాను సైబర్ నేరస్థులు యాక్సెస్ చేసే వీలుందని, దాంతోపాటు వారి డివైజ్లను పూర్తిగా నిరుపయోగంగా మార్చే అవకాశం ఉందని తెలిపింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ-ఇన్) ఈమేరకు యాపిల్ డివైజ్ యూజర్లకు హై-ఇంటెన్సిటీ హెచ్చరికలు జారీ చేసింది.పాత, కొత్త మోడళ్లతో సహా వివిధ యాపిల్ పరికరాలపై ఈ లోపాలు ప్రభావం చూపుతాయని సీఈఆర్టీ-ఇన్ తెలిపింది. ఐఓఎస్ 18.3కు ముందు వెర్షన్లతో పనిచేసే ఐఫోన్లు, మోడల్ను బట్టి 17.7.3 లేదా 18.3 కంటే ముందు ఐప్యాడ్ ఓఎస్ వెర్షన్లతో పనిచేసే ఐప్యాడ్లపై ఈ ప్రభావం అధికంగా ఉంటుందని పేర్కొంది. యాపిల్ అంతర్గత మెసేజింగ్ ఫ్రేమ్వర్క్లో కీలకమైన డార్విన్ నోటిఫికేషన్ సిస్టమ్లో ప్రధాన లోపాన్ని ఒకటి గుర్తించినట్లు తెలిపింది. దాని ప్రకారం ప్రత్యేక అనుమతులు లేకపోయినా ఏదైనా అప్లికేషన్ సిస్టమ్ స్థాయి నోటిఫికేషన్లను పంపేందుకు అది అనుమతిస్తుంది. దీన్ని దుర్వినియోగం చేస్తే డివైజ్ క్రాష్ అయ్యే ప్రమాదం ఉందని తెలిపింది.పరిణామాలు ఇలా..ఈ లోపాల ప్రభావం తీవ్రంగా ఉంటుందని సీఈఆర్టీ-ఇన్ హెచ్చరించింది. హ్యాకర్లు వ్యక్తిగత, ఆర్థిక సమాచారంతో సహా గోప్యమైన డేటాను దొంగిలించే అవకాశం ఉంది. ఇంటర్నల్ భద్రతా యంత్రాంగాలను ఇది కట్టడి చేయవచ్చు. లేదా అనధికార కోడ్ను అమలు చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో యూజర్ల డివైజ్లు పూర్తిగా క్రాష్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ లోపాలను అధిగమించేందుకు సత్వర చర్యలు అవసరమని సీఈఆర్టీ-ఇన్ ధ్రువీకరించింది.ఇదీ చదవండి: పదేళ్ల తర్వాత గూగుల్ లోగోలో మార్పులువెంటనే యూజర్లు ఏం చేయాలంటే..ఈ సమస్యకు పరిష్కారంగా యాపిల్ లోపాలను సరిదిద్దడానికి సెక్యూరిటీ అప్డేట్లను విడుదల చేసింది. యూజర్లందరూ తమ డివైజ్లను వెంటనే లేటెస్ట్ వర్షన్కు అప్డేట్ చేసుకోవాలని సూచించింది. లేటెస్ట్గా అందుబాటులో ఉన్న ఐఓఎస్ లేదా ఐప్యాడ్ ఓఎస్ వెర్షన్కు అప్డేట్ అవ్వాలని తెలిపింది. వినియోగదారులు ధ్రువీకరించని మొబైల్ అప్లేకేషన్లను ఇన్స్టాల్ చేసుకోకూడదని పేర్కొంది. ఏపీకే ఫైల్ ద్వారా ఎలాంటి యాప్లను ఇన్స్టాల్ చేసుకోరాదని చెప్పింది. హానికరమైన కార్యకలాపాలను సూచించే పాప్అప్ సమాచారంపట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. -
పదేళ్ల తర్వాత గూగుల్ లోగోలో మార్పులు
గూగుల్ దాదాపు దశాబ్ద కాలం తర్వాత తన ఐకానిక్ లోగోలో మార్పు చేస్తున్నట్లు ప్రకటించింది. గూగుల్ లోగో ‘జీ’ను కొత్త డిజైన్తో పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కొత్త లోగో వెర్షన్ను ఆవిష్కరించింది. ఇది ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం రంగుల్లో బ్లాక్లకు బదులుగా ఒకే రంగులో ఫ్లూయిడ్ గ్రేడియంట్ విధానాన్ని అనుసరించింది. 2015 నుంచి ‘జీ’ లోగోను కంపెనీ మార్పు చేయలేదు.న్యూ లుక్: డిఫరెంట్ ఏంటి?కొన్నేళ్లుగా ఫ్లాట్గా బ్లాక్ల్లో రంగులకు బదులుగా ‘జీ’ లోగో ఇప్పుడు నాలుగు రంగులను మిళితం చేసే గ్రేడియంట్ను కలిగి ఉంది. ఇది ఐకాన్కు మరింత ఆధునికత, డైనమిక్ రూపాన్ని ఇస్తుంది. అన్ని విభాగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకోవాలనే గూగుల్ ఉద్దేశానికి ఇది ఒక చిహ్నంగా పనిచేస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏఐ జనరేటివ్ అసిస్టెంట్ గూగుల్ జెమిని బ్రాండింగ్కు అనుగుణంగా ఈ పరిణామం చోటు చేసుకున్నట్లు తెలిపారు.ఇదీ చదవండి: పడి లేచిన పసిడి ధరలు! తులం ఎంతంటే..ఐఓఎస్, పిక్సెల్ యూజర్లకు..గూగుల్ సెర్చ్ యాప్ ద్వారా ముందుగా ఐఓఎస్, పిక్సెల్ యూజర్లకు కొత్త ‘జీ’ లోగో అందుబాటులోకి రానుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. గూగుల్ యాప్ బీటా వెర్షన్ 16.18 ద్వారా కొన్ని ఆండ్రాయిడ్ డివైజ్ల్లో కూడా దీన్ని ఉపయోగించనున్నట్లు చెప్పారు. గూగుల్ ఇంకా దీని విడుదల తేదీని తెలియజేయలేదు. అయితే రాబోయే కొన్ని వారాల్లో కొత్త లోగో మరిన్ని డివైజ్ల్లో అందుబాటులో ఉంటుందని తెలిసింది. క్రోమ్, మ్యాప్స్, జీమెయిల్, డ్రైవ్ వంటి ఇతర లోగోలను మారుస్తారా.. లేదా యథావిధిగా ఉంచుతారా? అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. -
డేటా సెంటర్లపై బిలియన్ డాలర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: డిజిటల్ మౌలిక సదుపాయాల వ్యాపార కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా టెక్నో డిజిటల్ ఇన్ఫ్రా పేరిట సంస్థను ప్రారంభించినట్లు టెక్నో ఎలక్ట్రిక్ అండ్ ఇంజినీరింగ్ కంపెనీ (టీఈఈసీఎల్) వెల్లడించింది. ఇది సుమారు 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో దేశవ్యాప్తంగా మొత్తం మీద 250 మెగావాట్ల సామర్థ్యంతో హైపర్స్కేల్, ఎడ్జ్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. చెన్నైలో 36 మెగావాట్ల హైపర్స్కేల్ డేటా సెంటర్ (హెచ్డీసీ) కార్యకలాపాలను ప్రారంభించిన సందర్భంగా టీఈఈసీఎల్ ఈ విషయాలు పేర్కొంది. తదుపరి హెచ్డీసీలను కోల్కతా, నోయిడా ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది. మరోవైపు, 23 రాష్ట్రాలవ్యాప్తంగా 102 నగరాల్లో ఎడ్జ్ డేటా సెంటర్లను నిర్మించేందుకు రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు టీఈఈసీఎల్ తెలిపింది. క్లౌడ్ మాధ్యమం ద్వారా పెద్ద కంపెనీలకు భారీ డేటా స్టోరేజీ, ప్రాసెసింగ్ సరీ్వసులు అందించేందుకు హెచ్డీసీలు ఉపయోగపడతాయి. యూజర్లకు సమీపంలో స్థానికంగా ఏర్పాటు చేసే చిన్న డేటా సెంటర్లను ఎడ్జ్ సెంటర్లుగా వ్యవహరిస్తారు. -
ఐఫోన్ అంతరించనుందా..?
ఏఐ ఆధారిత టెక్నాలజీలు చివరికి స్మార్ట్ఫోన్ల స్థానాన్ని భర్తీ చేయగలవని, వినియోగదారులు వ్యక్తిగత పరికరాలతో సంభాషించేలా ఈ సాంకేతికతలు కీలక మార్పులు తెస్తాయని యాపిల్ సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎడ్డీ క్యూ తెలిపారు. వచ్చే దశాబ్ద కాలంలో ఐఫోన్ లభ్యతపై ఈ ప్రభావం ఉండనుందని చెప్పారు. ఇటీవల యాంటీట్రస్ట్ ట్రయల్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.‘ఐపాడ్ ఒకప్పుడు మ్యూజిక్ వినియోగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఐఫోన్లు అందుబాటులోకి వచ్చాక క్రమంగా వాటి వినియోగం తగ్గిపోయింది. చివరకు ఐపాడ్లను నిలిపేయాల్సి వచ్చింది. ప్రస్తుతం స్మార్ట్వాచ్లు, నెక్స్ట్ జనరేషన్ ఎయిర్పాడ్లు, స్మార్ట్ గ్లాసెస్ వంటి ఏఐ-ఆధారిత ప్రత్యామ్నాయాలు మనం కమ్యూనికేట్ చేసే సమాచారాన్ని యాక్సెస్ చేసే విధానం మారుతుంది. ఈ మార్పు రానున్న రోజుల్లో ఐఫోన్లను రిప్లేస్ చేసే అవకాశం ఉంది’ అని ఎడ్డీ క్యూ తెలిపారు.యాపిల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలు‘వచ్చే తరం కంప్యూటింగ్లో ముందుండాలనే లక్ష్యంతో యాపిల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టెక్నాలజీలను అన్వేషిస్తోంది. మెటా వంటి కంపెనీలు ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), ఏఐ ఇంటిగ్రేటెడ్ వేరబుల్స్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. సాంప్రదాయ స్మార్ట్ఫోన్లకు మించి మెరుగైన సామర్థ్యం, అంతరాయం లేని కనెక్టివిటీని ఈ టెక్నాలజీలు అందించే అవకాశం ఉంది. వాయిస్ కంట్రోల్డ్ అసిస్టెన్స్, రియల్-టైమ్ కాంటెక్స్ట్వల్ అవేర్నెస్, అడాప్టివ్ ఏఐ ఆధారిత ఇంటర్ఫేస్ వంటి ఆవిష్కరణలు వచ్చే రోజుల్లో ప్రామాణికంగా మారవచ్చు’ అని క్యూ అన్నారు.ఇదీ చదవండి: బలంగా ఎదిగేందుకు భారత్ సిద్ధంయాపిల్ విజన్‘ఐఫోన్ యాపిల్కు భారీగా ఆదాయాన్ని సమకూరుస్తున్నప్పటికీ భవిష్యత్తులో కంపెనీ దీనికి ప్రత్యామ్నాయాన్ని సృష్టించేందుకు సిద్ధం అవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఆర్, స్మార్ట్ డివైజ్ ఎకోసిస్టమ్స్లో యాపిల్ సాధించిన పురోగతితో కంపెనీ వ్యూహాత్మకంగా తదుపరి తరం కంప్యూటింగ్లో ముందంజలో ఉంది’ అని క్యూ చెప్పారు. -
భారత్లో ఐఫోన్ల తయారీ రెట్టింపు..?
టాటా ఎలక్ట్రానిక్స్ తన హోసూరు యూనిట్లో యాపిల్ ఐఫోన్ల ఉత్పత్తిని గణనీయంగా పెంచుతోందని ఈ పరిణామాల గురించి అవగాహన ఉన్న వర్గాలు తెలిపాయి. టాటా ఎలక్ట్రానిక్స్ ప్రస్తుతం ఉన్న 50,000 ఎన్క్లోజర్ల సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని యోచిస్తోందని చెప్పాయి. హోసూరు కర్మాగారంలో ఇప్పటికే రెండో దశ నిర్మాణాన్ని చేపట్టినట్లు అధికారులు చెప్పారు. సెప్టెంబర్లో యాపిల్ చేసే కొత్త ప్రొడక్ట్ లాంచ్లకు ముందు ఈ ఉత్పత్తి సామర్థ్యానికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.గత ఏడాది సెప్టెంబర్లో హోసూర్ యూనిట్లో జరిగిన అగ్నిప్రమాదానికి ముందు టాటా ఎలక్ట్రానిక్స్ సుమారు 50,000 ఎన్ క్లోజర్ల సామర్థ్యాన్ని సాధించిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రమాదం తర్వాత తిరిగి ఇటీవల మునుపటి సామర్థ్యాన్ని చేరుకున్నట్లు తెలిపాయి. కెపాసిటీ విస్తరణకు సంబంధించిన వివరాలపై టాటా ఎలక్ట్రానిక్స్, యాపిల్ సంస్థలు ఇంకా అధికారికంగా స్పందించలేదు.అమెరికాలో విక్రయించే ఐఫోన్లకు భారత్ ప్రధాన తయారీ కేంద్రంగా మారుతుందని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇటీవల చేసిన ప్రకటనల నేపథ్యంలో టాటా ఎలక్ట్రానిక్స్ విస్తరణ ఊపందుకున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. ‘జూన్ త్రైమాసికంలో యూఎస్లో విక్రయించే ఐఫోన్లలో ఎక్కువ భాగం భారతదేశం నుంచే సమకూరుతాయని ఆశిస్తున్నాం’ అని కుక్ తెలిపారు. అమెరికాలో విక్రయించే దాదాపు అన్ని ఐప్యాడ్, మ్యాక్, యాపిల్ వాచ్, ఏర్పాడ్ ఉత్పత్తులకు వియత్నాం మూలస్థానంగా ఉంటుందని అన్నారు.ఇదీ చదవండి: అందాలతో అలరిస్తూ.. వ్యాపారాలు పెంచుతూ..పెగాట్రాన్ టెక్నాలజీ ఇండియా (పీటీఐ)లో 60 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు టాటా ఎలక్ట్రానిక్స్ ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించింది. 2024 మార్చిలో విస్ట్రాన్ ఇండియా కార్యకలాపాలను (కర్ణాటకలోని నర్సాపుర కేంద్రంగా) కంపెనీ కొనుగోలు చేసింది. యాపిల్ గ్లోబల్ వాల్యూ చైన్ (జీవీసీ)లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని కంపెనీ చూస్తోంది. -
నక్షత్రాన్నే నమిలేస్తూ.. మింగేస్తూ.. అదృశ్యం చేస్తున్న మహా కృష్ణబిలం
నక్షత్రం అంటేనే అంతులేని ఉష్ణంతో, దేదీప్యమానంగా వెలిగిపోతూ వందల కోట్ల కిలోమీటర్ల దాకా కాంతిని వెదజల్లే శక్తియంత్రం. అలాంటి నక్షత్రాన్ని అరటిపండులా అమాంతం మింగేస్తున్న రాకాసి కృష్ణబిలం జాడను అత్యంత అధునాతన హబుల్ టెలిస్కోప్ కనిపెట్టింది. నక్షత్రం మొత్తాన్ని తనలో కలిపేసుకుంటున్న ఈ బ్లాక్çహోల్ మిగతా కృష్ణబిలాల్లా నక్షత్రమండలం(గెలాక్సీ) కేంద్రస్థానంలో కాకుండా కోట్ల కోట్ల కిలోమీటర్ల దూరంగా ఉండటం మరో విశేషం.గెలాక్సీ మధ్యలో కాకుండా చాలా దూరంగా సైతం భారీ కృష్ణబిలాలు మనగల్గుతాయని, వాటి అపారమైన గురుత్వాకర్షణ బలాలు సమీప స్టార్లనూ సమాధి చేస్తాయని తొలిసారిగా వెల్లడైంది. సాధారణంగా నక్షత్రాలను కృష్ణబిలం తనలో కలిపేసుకునే (టైడల్ డిస్ట్రప్షన్ ఈవెంట్–టీడీఈ) దృగ్విషయం గెలాక్సీ మధ్యలో చోటుచేసుకుంటుంది. కానీ ఇలా టీడీఈ అనేది గెలాక్సీ మధ్యలో కాకుండా వేరే చోట సంభవించడాన్ని తొలిసారిగా గుర్తించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీనికి ‘ఏటీ2024టీవీడీ’అని పేరు పెట్టారు. మింగేస్తున్న ఈ కృష్ణబిలం ద్రవ్యరాశి ఆ అంతర్థానమవుతోన్న నక్షత్రం ద్రవ్యరాశికంటే ఏకంగా 10 కోట్ల రెట్లు ఎక్కువగా ఉండటం విశేషం. నక్షత్రమండలం కేంద్రస్థానం చుట్టూ తిరిగే ఏదైనా నక్షత్రం అనుకోకుండా కృష్ణబిలం చెంతకు వచి్చనప్పుడు మాత్రమే అక్కడ బ్లాక్హోల్ ఉందనే విషయం తెలుస్తుంది.బ్లాక్ తాను మింగేసే ఖగోళ వస్తువును ఉన్నది ఉన్నట్లుగాకాకుండా ఆకారాన్ని నూడుల్స్లాగా సాగదీసి సాగదీసి లోపలికి లాగేసుకుంటుంది. ఈ ప్రక్రియనే స్పాగెటిఫికేషన్ అంటారు. తాజాగా నక్షత్రాన్ని మింగేస్తున్న క్రమంలోనే ఈ కృష్ణబిలం ఉనికి వెలుగులోకి వచ్చింది. అమెరికా శాండిగోలోని పాలోమార్ అబ్జర్వేటరీలోని ఆప్టికల్ కెమెరా తొలిసారిగా దీనిని గుర్తించింది. ఈ బ్లాక్హోల్ మన భూమికి ఏకంగా 60 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. హబుల్ టెలిస్కోప్ దీనిపై మరింత పరిశోధన చేసింది. సాధారణంగా కృష్ణబిలంలోకి నక్షత్రం లాగబడే క్రమంలో ఆ నక్షత్రం ఊహించనంత స్థాయిలో అతినీలలోహిత కాంతిని బయటకు వెదజల్లుతుంది. తర్వాత బ్లాక్హోల్ లోపలికి వెళ్లిపోయి ఆ స్టార్ అంతర్థానమవుతుంది. కేంద్రం నుంచి ఎంతో దూరంలో బ్లాక్హోల్ ఈ బ్లాక్హోల్ తనకు ఆశ్రయం ఇచ్చిన నక్షత్రమండలానికి సంబంధించిన కేంద్రస్థానంలో ఉండకుండా ఏకంగా 2,600 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దీంతో కేంద్రస్థానంలోని బ్లాక్హోల్స్ కంటే ఇది భిన్నంగా ప్రవర్తిస్తుందేమో అని తెల్సుకునేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా రంగంలోకి దిగింది. ఈ కృష్ణబిలంపై ఓ కన్నేశామని చంద్ర ఎక్స్–రే అబ్జర్వేటరీ, నేషనల్ రేడియో ఆస్ట్రోనమీ అబ్జర్వేటరీలోని వెరీ లార్జ్ అరే రేడియో టెలిస్కోప్ పరిశోధకుల బృందాలు తెలిపాయి.రెండు గెలాక్సీల విలీనం తర్వాత ఇలాంటి కృష్ణబిలాలు ఇలా సుదూరంగా మిగిలిపోయి ఉంటాయని భావిస్తున్నారు. లేదంటే రెండు అయస్కాంతాల తరహాలో రెండు కృష్ణబిలాల వ్యతిరేక బలాల వల్ల ఇది సుదూరంగా నెట్టివేయబడి ఉండొచ్చని ఇంకొందరు అధ్యయనకారులు అంచనావేస్తున్నారు. ‘‘కేంద్రస్థానంలో స్థిరంగా ఉండిపోకుండా ఇలా సంచార జీవిలా ఎక్కడో మౌనంగా ఉన్న ఇలాంటి కృష్ణబిలాలు కొత్త తరహా పరిశోధనలకు సాయపడతాయి’’అని బెర్క్లీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోరి్నయాలో సంబంధిత పరిశోధనలో ప్రధాన రచయిత, ఖగోళశాస్త్రంలో పోస్ట్ డాక్టోరల్ యుహాన్ యాఓ చెప్పారు. త్వరలో అందుబాటులోకి రానున్న వెరీ సి.రూబిన్ అబ్జర్వేటరీ సాయంతో ఇలాంటి ఖగోళ వింతలను మరింత పరిశోధన జరగనుంది. -
అప్పు తీర్చడం ఎలా?: చాట్జీపీటీ సమాధానం
చాలీచాలని జీతాలతో పనిచేసేవారి సంఖ్య ఎక్కువే ఉంది. జీతాలు సరిపోక పోవడంతో లోన్స్ తీసుకోవడం లేదా ఇతరుల దగ్గర అప్పు చేయడం వంటివి చేస్తారు. అప్పులు ఎక్కువైపోయినప్పుడు వాటిని ఎలా తీర్చాలో తెలియక కొందరు సతమతమవుతారు. చేసిన అప్పును సులభంగా ఎలా తీర్చాలి?, అనే ప్రశ్నకు.. చాట్జీపీటీ ఇచ్చిన సమాధానం ఇక్కడ చూసేద్దాం.స్నోబాల్ విధానం: మీరు చేసిన మొత్తం అప్పుల్లో చిన్న అప్పులను ముందుగా తీర్చేయాలి. ఇలా చేయడం వల్ల అప్పుల సంఖ్య తగ్గుతుంది. ఇది మీకు కొంతవరకు మానసిక ప్రశాంతతను అందిస్తుంది.అవలాంచీ విధానం: అత్యధిక వడ్డీ చెల్లిస్తున్న అప్పులను ముందుగా తీర్చేయాలి. వడ్డీ ఎక్కువ కడుతున్న అప్పులు తీర్చేయడం వల్ల.. ఆర్ధిక భారం కొంత తగ్గుతుంది. ఎక్కువ వడ్డీ చెల్లించే అవసరం కూడా ఉండదు.బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్: చిన్న మొత్తంలో అప్పు ఉంటే.. దానిని క్రెడిట్ కార్డుకు బదిలీ చేయడం ఉత్తమం. ఇలా క్రెడిట్ కార్డు ద్వారా అప్పు చెల్లించడం ద్వారా ఆర్ధిక ఒత్తిడి తగ్గుతుంది. వడ్డీ రేటు కూడా కొంత తగ్గుతుంది.ఆదాయాన్ని పెంచి, ఖర్చులను తగ్గించండి: అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. ఆదాయాన్ని పెంచుకోవడానికి పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేయడం వంటివి చేయాలి. పొదుపు చేయడం పెంచాలి. మీ డబ్బు ఎక్కడ.. ఎక్కువ ఖర్చు అవుతుందో అర్థం చేసుకోవడానికి మీ ఆదాయం, ఖర్చులను బేరీజు వేసుకోండి. ఇలా చేసినప్పుడు ఖర్చులు తగ్గించడం సాధ్యమవుతుంది.ఇదీ చదవండి: సీసం నుంచి గోల్డ్ ఉత్పత్తి: బంగారాన్ని బఠానీల్లా కొనేయొచ్చా?అప్పుల ఏకీకరణ: బ్యాంకులలో ఒకటి కంటే ఎక్కువ లోన్స్ తీసుకుని ఉన్నట్లయితే.. వాటన్నింటినీ ఒకటే లోన్ కిందికి వచ్చేలా మార్చుకోవాలి. ఇలా చేయడం వల్ల వడ్డీ తగ్గుతుంది. ఈఎంఐ విధానం ద్వారా అప్పు చెల్లిస్తారు కాబట్టి.. అప్పు చెల్లించడం సులభతరం అవుతుంది. -
సీసం నుంచి గోల్డ్ ఉత్పత్తి: బంగారాన్ని బఠానీల్లా కొనేయొచ్చా?
బంగారం ధరలు రోజురోజుకి భారీగా పెరిగిపోతున్నాయి. చాలామందికి గోల్డ్ కొనుగోలు చేయడం, ఇకపై సాధ్యమేనా అనే అనుమానులు కూడా పుడుతున్నాయి. ఇలాంటి సమయంలో.. యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్(సీఈఆర్ఎన్)లోని భౌతిక శాస్త్రవేత్తలు సీసాన్ని బంగారంగా మార్చడంలో సక్సెస్ సాధించారు.CERN విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. సీస కేంద్రకాల అధిక శక్తి.. ఘర్షణల సమయంలో బంగారు కేంద్రకాలుగా మారడాన్ని పరిశోధకులు గమనించారు. స్విట్జర్లాండ్లోని జెనీవా సమీపంలోని సీఈఆర్ఎన్ ప్రయోగశాలలో సీసాన్ని బంగారంగా మార్చారు.మూలకాల మధ్య ప్రోటాన్ సంఖ్యలో తేడాల (సీసానికి 82, బంగారానికి 79) వద్ద బంగారంగా రూపొందించడం కొంత కష్టమే అయినప్పటికీ.. కాంతి వేగంతో ప్రయాణించే సీసపు కిరణాలలోని అయాన్లు అప్పుడప్పుడు ఒకదానికొకటి ఎదురుగా ఢీకొనకుండా ప్రయాణిస్తాయి. ఇలా జరిగినప్పుడు ఒక అయాన్ చుట్టూ ఉన్న తీవ్రమైన విద్యుదయస్కాంత క్షేత్రం.. శక్తి పల్స్ను సృష్టిస్తుంది. ఆ సమయంలో సీసపు కేంద్రకం నుంచి మూడు ప్రోటాన్లను బయటకు పంపడానికి ప్రేరేపిస్తుంది. ఇలా జరిగినప్పుడు సీసం బంగారంగా మారుతుంది.ఇదీ చదవండి: పతనంవైపు యూఎస్ డాలర్!.. బఫెట్ కీలక వ్యాఖ్యలు'సూపర్ ప్రోటాన్ సింక్రోట్రాన్' అని పిలువబడే మరొక సీఈఆర్ఎన్ యాక్సిలరేటర్.. 2002 నుంచి 2004 వరకు సీసం బంగారంగా మారడాన్ని గమనించిందని న్యూయార్క్లోని స్టోనీ బ్రూక్ యూనివర్సిటీ భౌతిక శాస్త్రవేత్త 'జియాంగ్యాంగ్ జియా' చెప్పారు. కానీ ఇప్పుడు తాజాగా జరిగిన ప్రయోగాలు అధిక శక్తితో ఉన్నాయి. ఈ విధానంలో బంగారాన్ని మరింత ఎక్కువ సృష్టించవచ్చని ఆయన అన్నారు.ఈ పద్దతిలోనే మరింత గోల్డ్ ఉత్పత్తి చేస్తే.. బంగారం సప్లై పెరుగుతుంది. సప్లై పెరిగితే.. డిమాండ్ తగ్గుతుంది. ఇదే జరిగితే బంగారం ధరలు భారీగా తగ్గిపోతాయి. అతి తక్కువ ధరలకే అందుబాటులోకి వచ్చేస్తుంది. -
ట్రిప్ కోసం బెస్ట్ గ్యాడ్జెట్స్ ఇవే..
ప్రపంచాన్ని చుట్టేయడం ఒక అందమైన అనుభవం. అందుకే, చాలామంది కాస్త తీరిక దొరికితే చాలు, బ్యాగ్లో బట్టలు సర్దేసుకుని, ప్రయాణాలకు సిద్ధపడుతుంటారు. ఇప్పుడు మీ ప్రయాణాన్ని మరింత సులభంగా, సౌకర్యవంతంగా మార్చేయడానికి అవసరమయ్యే ఎనర్జీ గేర్స్.. ఈ గ్యాడ్జెట్స్..చేతిలోనే వాటర్ ఫిల్టర్ ప్రయాణించేటప్పుడు ప్రతిచోటా శుభ్రమైన నీరు దొరకడం చాలా కష్టం. అలాగని, అపరిశుభ్రమైన నీటిని తాగితే, రోగాల బారిన పడతాం. ఇందుకోసమే మార్కెట్లోకి వివిధ వాటర్ ప్యూరిఫైయింగ్ వాటర్ బాటిల్స్ అందుబాటులోకి వచ్చేశాయి. ఇవి ఫిల్టర్, యూవీ– సీ లైట్ పద్ధతులతో నీటిలోని బ్యాక్టీరియా, వైరస్, ఇతర సూక్ష్మజీవులను, మలినాలను తొలగించి శుభ్రమైన తాగునీటిని అందిస్తాయి. ఇవి క్యాంపింగ్, ట్రెక్కింగ్, ట్రావెలింగ్ చేసే వారికి బాగా ఉపయోగపడతాయి. బ్యాటరీలతో పనిచేసే వీటిని చార్జ్ చేసుకొని వాడుకోవచ్చు. ధర వివిధ కంపెనీలను బట్టి రూ. పది నుంచి ఇరవై వేల వరకు ఉంటాయి.పాకెట్లో సూర్యశక్తిట్రావెలింగ్ చేస్తూ అడవిలో చిక్కుకున్నా కూడా మీ ఫోన్ బ్యాటరీ తగ్గిపోదు, ఒకవేళ మీ వద్ద ఈ ‘సోలార్ పవర్ బ్యాంక్’ కనుక ఉంటే. దీనిని చాలా చిన్నగా ఎక్కడికైనా సులభంగా జేబులో వేసుకొని వెళ్లేలా రూపొందించారు. ఇది కేవలం సౌరశక్తిని ఉపయోగించి, సుమారు 10,000 ఎమ్ఏహెచ్ వరకు బ్యాటరీని స్టోర్ చేసుకోగలదు. ఒకేసారి మూడు పరికరాలను చార్జ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇది ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్తో పాటు, వాటర్ప్రూఫ్, డస్ట్ప్రూఫ్తో వస్తుంది. ఇక దీనికున్న రెండు పవర్ఫుల్ ఫ్లాష్ౖలñ ట్లు మీకు మరో టార్చ్తో అవసరం లేకుండా చేస్తాయి. ధర రూ.2,300.బ్యాగ్ పోయే రోజులు పోయాయిప్రయాణాల్లో బ్యాగ్ పోయినా, ఏమాత్రం భయపడనక్కర్లేదు. ఇకపై చిటికెలో పోయిన బ్యాగు ఆచూకీ తెలుసుకోవచ్చు. తాజాగా విడుదలైన ‘అరిస్ట్రా వోల్ట్ స్మార్ట్ లగేజీ బ్యాగ్’లో అబ్బురపరిచే ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి. ఇందులోని జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ సులభంగా బ్యాగ్ లొకేషన్ను ట్రాక్ చేస్తుంది. మొబైల్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను చార్జ్ చేసుకోవడానికి వీలుగా ఒక ఇంటిగ్రేటెడ్ పవర్బ్యాంక్ ఉంటుంది. డిజిటల్ లాక్ సిస్టమ్తో బ్యాగ్ భద్రత కూడా క్షేమంగా, సులువుగా మొబైల్తోనే చేసేయొచ్చు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే, ఆటోమేటిక్ లగేజీ వెయిట్ చెక్ ఫీచర్. ఇది విమాన ప్రయాణాలు చేసే వారికి బాగా ఉపయోగపడుతుంది. ధర. రూ.81,100.మినీ ఐరన్ మాస్టర్ప్రయాణాల్లో ఎదురయ్యే సమస్యల్లో బట్టల ఇస్త్రీ ఒకటి. సమస్య చిన్నదే అయినా, బిజినెజ్ ట్రిప్స్, ప్రత్యేక కార్యక్రమాలు, ఫంక్షన్స్కు వెళ్లేటప్పుడు నలిగిన బట్టల కారణంగా, ట్రిప్ వైబ్ మొత్తం పాడవుతుంది. ఈ చిన్న సమస్యను, ఒక చిన్న పోర్టబుల్ స్టీమ్ ఐరన్తో పరిష్కరించవచ్చు. చూడ్డానికి చిన్నగా, అతి తక్కువ బరువుతో ఉంటే ఈ స్టీమ్ ఐర¯Œ , కేవలం కొద్ది సెకండ్లలోనే వేడి అయ్యి, స్టీమ్తో బట్టల మడతలను పోగొడుతుంది. యూఎస్బీ పోర్ట్ ద్వారా చార్జ్ చే సుకొని వాడుకోవచ్చు. ధర రూ. 999. అంతకంటే తక్కువ, ఎక్కువలోనూ వివిధ బ్రాండ్లలో లభిస్తున్నాయి. -
మెటా గ్లాస్.. మొబైల్కి లాస్?
ఒక్క మాట చెబితే ఫొటో క్లిక్మనిపిస్తుంది.. వాయిస్ కమాండ్ వినగానే వీడియో రికార్డ్ అయిపోతుంది. ఏ భాషలోని అక్షరాలైనా క్షణాల్లో మన భాషలోకి మారిపోయి కనిపిస్తాయి. చేతిలో ఫోన్ లేకుండానే ఎవరితోనైనా ఫోన్ మాట్లాడేయొచ్చు.. త్వరలో అందుబాటులోకి రానున్న స్మార్ట్ కళ్లజోళ్లు చేసే పనులివన్నీ. స్టైలిష్ కళ్లజోళ్లకు పేరు గాంచిన రే–బాన్ కంపెనీ.. మార్క్ జుకర్బర్గ్కు చెందిన మెటా సంయుక్తంగా అత్యాధునిక స్మార్ట్ గ్లాసె స్ను విడుదల చేశాయి. ఇవి త్వరలోనే భారత్లోనూ విడుదల కానున్నాయి. అత్యాధునిక స్మార్ట్ ఫోన్లు చేసే పనులన్నీ ఈ స్మార్ట్ కళ్లద్దాలు చేసిపెడతాయి. కంటెంట్ క్రియేటర్లు, వ్యాపారవేత్తలు, వేగవంతమైన కమ్యూనికేషన్పై ఆధారపడే వారికి ఈ గ్లాసెస్ గేమ్–ఛేంజర్గా నిలుస్తాయని టెక్ నిపుణులు అంటున్నారు. 2024 నాటికి ప్రపంచ స్మార్ట్ గ్లాసెస్ మార్కెట్ విలువ 18.6 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరింది. 2033 నాటికి అది 53.6 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఐఎమ్ఏఆర్సీ గ్రూప్ అంచనా వేస్తోంది. మెటా, ఆపిల్, గూగుల్, షావోమీ, సోనీ, అమెజాన్, లెన్స్కార్ట్ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పటికే ఈ రంగంలో పెట్టుబడులు పెడుతున్నాయి. – సాక్షి, హైదరాబాద్ఏమిటీ గ్లాసెస్ ప్రత్యేకత?వాయిస్ అసిస్టెంట్: మెటా ఏఐతో సంభాషించి రియల్ టైమ్ సమాధానాలు పొందవచ్చు. ఫొటో, వీడియో క్యాప్చర్: వాయిస్ కమాండ్తో ఫొటోలు తీయవచ్చు. వీడియోలు కూడా రికార్డ్ చేయవచ్చు.లైవ్ స్ట్రీమింగ్: ఏదైనా కార్యక్రమానికి ఇన్స్ట్రాగామ్ లేదా ఫేస్బుక్లో నేరుగా ప్రసారం చేయవచ్చు.సంగీతం, పాడ్కాస్ట్లు: ఇయర్బడ్స్ లేకుండానే సంగీతం లేదా పాడ్కాస్ట్లు వినవచ్చు. ఫోన్ కాల్స్: బిల్ట్–ఇన్ మైక్రోఫోన్లు, స్పీకర్లు ఈ అద్దాల్లో ఉంటాయి కాబట్టి ఫోన్ కాల్స్ చేయవచ్చు. కాల్స్ స్వీకరించవచ్చు. లైవ్ ట్రాన్స్లేషన్: విదేశీ భాషల సైన్బోర్డ్లను తక్షణం మనకు తెలిసిన భాషలోకి అనువదించగలవు.ఆబ్జెక్ట్ రికగ్నిషన్: మనం చూసే వస్తువులను గుర్తించి, వాటికి సంబంధించిన సమాచారాన్ని అ అద్దాలు అందిస్తాయి. ఈ కళ్లజోళ్లకు రోజువారీ ఫోన్ ఉపయోగాన్ని పూర్తిగా భర్తీ చేసే ఫీచర్లను జోడించే దిశగా మెటా పనిచేస్తోంది. వీటి ద్వారా యాప్లు, సేవలను నోటి మాటతో నియంత్రించవచ్చు. స్క్రీన్ లేని అనుభవం: ఫోన్, ఇతర ఏ రకమైన డిజిటల్ తెర అవసరం లేకుండానే సమాచారం మన దృష్టి క్షేత్రంలో నేరుగా కనిపిస్తుంది.స్మార్ట్ గ్లాసెస్ ప్రయోజనాలు..సహజ కదలిక: స్క్రీన్ వైపు చూడాల్సిన అవసరం లేదు. మల్టీ టాస్కింగ్: నడుస్తూ, వంట చేస్తూ లేదా ప్రయాణిస్తూనే స్మార్ట్ఫోన్ ద్వారా చేసే అన్ని పనులు వీటితో చేసుకోవచ్చు. తక్కువ స్క్రీన్ టైమ్: నిరంతర ఫోన్ను చూస్తూ స్క్రోలింగ్ చేయాల్సిన అవసరం లేదు.ఎదురయ్యే సవాళ్లు..బ్యాటరీ లైఫ్: రోజంతా గ్లాసెస్ను చార్జ్లో ఉంచడం కష్టం. వ్యక్తిగత గోప్యత: ఎదుటివారికి తెలియకుండానే మనం వారి ఫొటోలు, వీడియోలను ఈ స్మార్ట్ గ్లాసెస్తో తీయొచ్చు. దీంతో వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే ప్రమాదం ఉంది. ధర: ఈ హై–టెక్ కళ్లద్దాల ధర సామాన్య ఫోన్ల కంటే చాలా ఎక్కువ.అయితే, ఇవి ఇప్పటికిప్పుడు స్మార్ట్ఫోన్లకు పూర్తిగా ప్రత్యామ్నాయంగా మారే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు. స్మార్ట్ వాచ్ల మాదిరిగా మొదట ఫోన్లకు సహాయక పరికరాలుగా ఉపయోగపడతాయి. పూర్తి స్థాయిలో ఫోన్ స్థానాన్ని దక్కించుకోవాలంటే మరో 10–20 ఏళ్లు పట్టే అవకాశముందని చెబుతున్నారు. స్మార్ట్ఫోన్ కంటే బెటర్.. త్వరలోనే ఈ గ్లాసెస్ స్మార్ట్ఫోన్లను భర్తీ చేయగలవు. కళ్ల ముందే డేటా కనిపించడం, వాయిస్ ఆధారంగా నడిచే విధానం వల్ల ఫోన్ అవసరం తగ్గుతుందనేది నా అంచనా. స్మార్ట్ఫోన్లతో మనం చేసే అన్ని పనులు ఇవి చేయగలవు. ఫోన్ను పట్టుకోవడం కంటే ముఖంపై గ్లాసెస్ ధరించడం సహజంగా అనిపిస్తుంది. టచ్, స్క్రోల్కు బదులుగా వాయిస్ కమాండ్స్, విజువల్స్తో టెక్నాలజీని ఉపయోగించే రోజు దగ్గరలోనే ఉంది.’ – మార్క్ జుకర్బర్గ్, మెటా సీఈఓ -
స్పెక్ట్రం చార్జీ @ 4 శాతం ఆదాయం
న్యూఢిల్లీ: స్టార్లింక్లాంటి శాటిలైట్ కమ్యూనికేషన్ (శాట్కామ్) కంపెనీలు అడుగుతున్న దానికంటే అధిక స్థాయిలో స్పెక్ట్రం చార్జీలు విధించేలా కేంద్రానికి టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సులు చేసింది. కంపెనీల సవరించిన ఆదాయాల్లో (ఏజీఆర్) 4 శాతాన్ని చార్జీగా నిర్ణయించాలని పేర్కొంది. ప్రతి మెగాహెట్జ్కి వార్షికంగా విధించే రూ. 3,500 స్పెక్ట్రం చార్జీకి ఇది అదనంగా ఉంటుంది. ఇక, పట్టణ ప్రాంతాల్లో ఉపగ్రహ ఆధారిత బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సరీ్వసులు అందించే ఆపరేటర్లు, ప్రతి యూజరుపై అదనంగా ఏటా రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో సేవలకు మాత్రం అదనంగా చార్జీలేమీ ఉండవు. టెలికం శాఖకు (డాట్) ట్రాయ్ ఈ మేరకు సిఫార్సులు చేసింది. స్పెక్ట్రంను కంపెనీలకు అయిదేళ్ల పాటు కేటాయించాలని, ఆ తర్వాత మరో రెండేళ్లు పొడిగించాలని ట్రాయ్ సూచించింది. శాట్కామ్ సరీ్వసులు ప్రారంభమైతే టెలికం నెట్వర్క్లు లేని మారుమూల ప్రాంతాల్లో కూడా కనెక్టివిటీని అందుబాటులోకి తెచ్చేందుకు వీలవుతుందని ట్రాయ్ చైర్మన్ అనిల్ కుమార్ లాహోటీ తెలిపారు. శాట్కామ్ కంపెనీలు అభ్యరి్ధస్తున్న రేటు కంటే ట్రాయ్ సిఫార్సు చేసిన చార్జీలు గణనీయంగా అధికంగా ఉండటం గమనార్హం. స్పెక్ట్రం చార్జీని ఏజీఆర్లో 1 శాతం కన్నా తక్కువగానే ఉంచాలని, అదనంగా చార్జీలేమీ విధించొద్దని ట్రాయ్తో సంప్రదింపుల సందర్భంగా స్టార్లింక్, అమెజాన్కి చెందిన క్విపర్ సిస్టమ్స్ కోరాయి. ఎయిర్టెల్ భాగస్వామిగా ఉన్న యూటెల్శాట్ వన్వెబ్, జియో ప్లాట్ఫామ్స్కు ఇప్పటికే శాట్కామ్ సేవల లైసెన్సులు లభించాయి. స్టార్లింక్ తుది లైసెన్సు తీసుకునే దశలో ఉంది. -
స్టార్లింక్ శాట్కామ్ వచ్చేస్తోంది..!
న్యూఢిల్లీ: భారత్లో శాటిలైట్ కమ్యూనికేషన్ (శాట్కామ్) సర్వీసులు ప్రారంభించే దిశగా తదుపరి పూర్తి చేయాల్సిన ప్రక్రియపై అమెరికన్ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్లింక్ దృష్టి పెట్టనుంది. ఇప్పటికే టెలికం శాఖ (డాట్) నుంచి ప్రాథమిక అనుమతులు (లెటర్ ఆఫ్ ఇంటెంట్–ఎల్వోఐ) లభించడంతో, ఇక ఒప్పంద నియమాలను అంగీకరిస్తున్నట్లు కంపెనీ సంతకాలు చేయాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అటుపైన నిర్దేశిత ఎంట్రీ ఫీజును చెల్లించాక తుది లైసెన్సు లభిస్తుందని పేర్కొన్నాయి. శాట్కామ్ స్పెక్ట్రం ధరను టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సు చేసే ప్రక్రియ తుది దశలో ఉందని, ఎప్పుడైనా దీనిపై ప్రకటన వెలువడొచ్చని వివరించాయి. గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్స్ బై శాటిలైట్ (జీఎంపీసీఎస్), ఐఎస్పీ, వీశాట్ సేవలకు సంబంధించి స్టార్లింక్నకు ఎల్వోఐ జారీ అయినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. డాట్ లైసెన్సుతో నెట్వర్క్ను నిర్మించుకోవడానికి స్టార్లింక్కు అనుమతులు లభించినా, కార్యకలాపాలు ప్రారంభించడానికి ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్–స్పేస్) ఆమోదం, ప్రభుత్వం నుంచి స్పెక్ట్రం అవసరమవుతుంది. ఇప్పటికే వన్వెబ్, జియో శాటిలైట్కు లైసెన్స్.. ఇప్పటికే యూటెల్శాట్ వన్వెబ్, జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థలకు ఈ లైసెన్సులు వచ్చాయి. స్పెక్ట్రంను కేటాయించిన తర్వాత అవి సర్వీసులు ప్రారంభించనున్నాయి. భారత్లో లైసెన్సు కోసం కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్న స్టార్లింక్ ఈమధ్యే దేశీ టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్తో ఒప్పందాలు కుదుర్చుకుంది. దీనితో భారత్లో తమ సొంత పంపిణీ, కస్టమర్ సర్వీస్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాల్సిన భారం లేకుండా, సంప్రదాయ బ్రాడ్బ్యాండ్ సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లోకి సేవలను విస్తరించే వీలు చిక్కుతుంది. సుదూరంగా ఉండే జియోస్టేషనరీ ఉపగ్రహాలపై ఆధారపడే సాంప్రదాయ శాటిలైట్ సర్వీసులతో పోలిస్తే భూమికి కొంత సమీపంగా (550 కి.మీ. పైన ) ఉండే ’లో ఎర్త్ ఆర్బిట్’ (లియో) శాటిలైట్లను ఉపయోగిస్తుంది. ప్రస్తు తం ఇవి 7,000 ఉండగా, వీటి సంఖ్య 40,000కు పెరగనుంది. -
చిర్రెత్తిన యంత్రుడు.. ఎవరికీ చిక్కడు
కృత్రిమ మేధ ఎంత ప్రయోజనకరమో అంత ప్రమాదకరమని కొందరు భావిస్తున్నారు. ప్రపంచంలో నిత్యం జరుగుతున్న కొన్ని సంఘటనలే అందుకు కారణం. రజనీకాంత్ రోబో సినిమాలో విలన్ సైంటిస్ట్ తయారు చేసిన రోబో టేబుల్పై నుంచి బన్ తీయమంటే గన్ తీస్తుంది కదా. అంతటితో ఆగకుండా ఏకంగా ఆ విలన్నే గన్తో చంపాలనుకుంటుంది. దాదాపు అలాంటి సంఘటనలే ప్రస్తుతం జరుగుతున్నాయి. హ్యుమనాయిడ్ రోబోల పరీక్ష సమయంలో చాలా ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి.యునిట్రీ అనే కంపెనీ రూపొందించిన హ్యుమనాయిడ్ రోబోను ఇటీవల పరీక్షిస్తున్న సమయంలో ప్రమాదకర సంఘటన జరిగింది. ఈమేరకు సామాజిక మాధ్యమాల్లో విడుదలైన వీడియో వైరల్గా మారింది. అందులోని వివరాల ప్రకారం.. చైనా ఫ్యాక్టరీలో ఈ హ్యుమనాయిడ్ రోబోను క్రేన్ ఆసరాతో నిలబెట్టారు. టెస్టింగ్ సమయంలో ఒక్కసారిగా రోబో ఉన్నట్టుండి తన చేతులతో దాడికి పాల్పడింది. క్రేన్కు వేళాడుతున్నా ఆ రోబో చుట్టూ కదులుతూ, క్రేన్ను సైతం లాగుతూ సమీపంలోని వస్తువులను చిందరవందర చేసింది. వెంటనే దాన్ని పరీక్షించే వ్యక్తి రోబో కనెక్షన్ కట్ చేయడంతో నిదానించింది.An AI robot attacks its programmers as soon as it is activated in China. pic.twitter.com/d4KUcJQvtD— Aprajita Nefes 🦋 Ancient Believer (@aprajitanefes) May 2, 2025ఇదీ చదవండి: గూగుల్ 200 ఉద్యోగాల్లో కోత!ఇతర కంపెనీ రోబోలు కూడా..యునిట్రీ రోబోలు మాత్రమే కాదు.. ఇంతర కంపెనీలకు చెందిన రోబోలు ఇలా విచిత్రంగా ప్రవర్తించిన ఉదాహరణలు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఓ ప్రదర్శనలో హ్యూమనాయిడ్ రోబోలు గుంపులుగా వెళ్తూ ఒకటి మానవులపైకి దూసుకొస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఈశాన్య చైనాలోని టియాంజిన్లో జరిగిన స్ప్రింగ్ ఫెస్టివల్ గాలాలో తీసిన వీడియోలో జాకెట్ ధరించిన రోబో అకస్మాత్తుగా బారికేడ్ వెనుక గుమిగూడిన ప్రేక్షకుల గుంపు వైపు దూసుకెళ్లింది. గతంలో ఓ కంపెనీ కర్మాగారంలో రోబోట్ ఇంజినీర్పై దాడి చేసిందని వార్తలొచ్చాయి. సాఫ్ట్వేర్ లోపాలు, అంతర్లీనంగా ఉండే కారణాలతో కొన్నిసార్లు ఇలా ప్రవర్తిస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. ఏదేమైనా మానవుల సమూహంతో కలిసి వీటిని వాడుకలోకి తీసుకురావాలంటే కచ్చితమైన, స్పష్టమైన ఎన్నో పరీక్షలు నిర్వహించాలని, వీటి పాలసీల్లో పక్కా నిబంధనలు రూపొందించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
దేశంలో వైర్లెస్ సబ్స్క్రైబర్ల సంఖ్య ఎంతంటే..
టెలికాం సేవల వినియోగదారుల్లో వైర్లెస్ సబ్స్క్రైబర్ల సంఖ్య మార్చిలో పెరిగి మొత్తం 116.37 కోట్లకు చేరుకుంది. ఇది ఫిబ్రవరిలో 116.33 కోట్లుగా ఉంది. ఈమేరకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వివరాలు వెల్లడించింది. ముఖ్యంగా గ్రామీణ సబ్ స్క్రిప్షన్లు పెరగగా, పట్టణ సబ్ స్క్రిప్షన్లు స్వల్పంగా తగ్గాయని తెలిపింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్లు భారత టెలికాం పరిశ్రమలో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ చందాదారుల చేరికల్లో అగ్రగామిగా నిలిచాయి.భౌగోళికంగా ఢిల్లీ సర్వీస్ సెంటర్ అత్యధిక టెలి-సాంద్రతను కలిగి ఉంది. అంటే యూనిట్ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో మొబైల్ చందాదారులను కలిగి ఉండడం. బిహార్ అతి తక్కువ టెలి-సాంద్రతను నమోదు చేసింది. పెరుగుతున్న సబ్స్రైబర్ల సంఖ్య దేశంలో కొనసాగుతున్న డిజిటల్ పరివర్తనను హైలైట్ చేస్తుంది. ఎక్కువ మంది గ్రామీణ వినియోగదారులు ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. యూజర్ డెమోగ్రాఫిక్స్, నెట్వర్క్ డిమాండ్లకు సంబంధించి టెలికాం ఆపరేటర్లు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాల్సి ఉంది.ఇదీ చదవండి: 27 ఎయిర్పోర్ట్లు, 430 విమానాలు నిలిపివేతవైర్లెస్ సబ్స్రైబర్ల సంఖ్య పెరగడం చాలా అంశాలను ప్రభావితం చేస్తుంది. గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో మెరుగైన కనెక్టివిటీకి అవకాశం అందిస్తుంది. ఆన్లైన్ బ్యాంకింగ్, విద్య, ఆరోగ్య సంరక్షణ, ప్రభుత్వ సేవలు ఎక్కువ మంది పొందేందుకు వీలవుతుంది. ఈ-కామర్స్, ఫిన్ టెక్, డిజిటల్ ఎంటర్టైన్మెంట్ రంగాలు వృద్ధి చెందుతాయి. మొబైల్ వినియోగదారులకు సేవలందించే వ్యాపారాలు.. ముఖ్యంగా మొబైల్ అప్లికేషన్లు, స్ట్రీమింగ్ సేవలు, డిజిటల్ సర్వీసులు పెరుగుతాయి. హై-స్పీడ్ కనెక్టివిటీని నిర్ధారించడానికి నెట్వర్క్ విస్తరణకు, 5జీ వినియోగానికి టెలికాం ప్రొవైడర్లు మరింత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. -
ఐటీ ఉద్యోగం ఒక్కసారి పోతే.. ఇక అంతే..!
ప్రస్తత పరిస్థితిలో ఐటీ ఉద్యోగం తెచ్చుకోవడం ఎంత కష్టమో.. దాన్ని నిలబెట్టుకోవడమూ అంతే కష్టం. ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెంపొందించుకుంటూ మంచి పనితీరు కనబర్చాలి. వెనకబడిన ఉద్యోగులను కంపెనీలు ఉపేక్షించడం లేదు. వెంటనే ఉద్వాసన పలుకుతున్నాయి. దీనికి సంబంధించే ప్రపంచ టెక్ దిగ్గజం కీలక నిర్ణయం తీసుకుంది.పనితీరు సమస్యలతో ఉద్యోగం కోల్పోయి కంపెనీని వీడిన ఉద్యోగులపై మైక్రోసాఫ్ట్ రెండేళ్ల నిషేధం విధానాన్ని ప్రవేశపెట్టింది. అంటే ఇలా జాబ్ పోగుట్టుకుంటే మళ్లీ రెండేళ్ల వరకూ ఆ ఛాయలకూ కూడా వెళ్లే అవకాశం ఉండదన్న మాట. అంతేకాదు.. ఈ ఉద్యోగాల కోతలను 'గుడ్ అట్రిషన్'గా పిలుస్తారు. అంటే కంపెనీని విడిచిపెట్టాలనుకునే ఉద్యోగులను సంతోషం.. దయచేయండి.. అని భావిస్తుందని బిజినెస్ ఇన్సైడర్ నివేదిక తెలిపింది.గత రెండు నెలలుగా మైక్రోసాఫ్ట్ తన సిబ్బంది పనితీరు నిర్వహణ ప్రక్రియను పునర్వ్యవస్థీకరిస్తోంది. పనితీరు తక్కువగా ఉన్న ఉద్యోగులపై కంపెనీ కఠినంగా వ్యవహరించింది. పనితీరు కనబరచని ఉద్యోగులను తొలగించే సంస్థ వ్యూహంలో భాగంగా ఈ రెండు కొత్త టూల్స్ ఉన్నాయి.ఈ ఏడాది పనితీరు తక్కువగా ఉన్న 2000 మంది ఉద్యోగులను మైక్రోసాఫ్ట్ తొలగించింది. పనితీరు సరిగా లేని ఉద్యోగులకు కంపెనీ సెవెరెన్స్ ప్యాకేజీ కూడా ఇవ్వలేదు. బిజినెస్ ఇన్సైడర్ ప్రకారం కంపెనీ 'గుడ్ అట్రిషన్' ప్రణాళిక ప్రతి సంవత్సరం నిర్ణీత శాతం ఉద్యోగులను తొలగించాలన్న కంపెనీ లక్ష్యానికి అనుగుణంగా ఉంటుంది.బడా టెక్ కంపెనీల పనితీరు విధానాల్లో మార్పుబడా టెక్ కంపెనీల్లో ఉద్యోగుల నిలుపుదల, పనితీరు విధానాల్లో విస్తృత మార్పు వచ్చింది. మెటా, అమెజాన్ వంటి కంపెనీలు కూడా తమ ప్రస్తుత, ఔట్ గోయింగ్ ఉద్యోగుల పనితీరుపై కఠిన విధానాలను ప్రవేశపెట్టాయి. గతంలో అమెజాన్ 'అన్ గ్రేటెడ్ అట్రిషన్'ను ప్రవేశపెట్టింది.దీని ప్రకారం మేనేజర్లు ప్రతి సంవత్సరం తమ బృందంలో కొంత మందిని తొలగించాల్సి ఉంటుంది. పనితీరు తక్కువగా ఉన్న తమ ఉద్యోగులపై కూడా మెటా వేటు వేస్తోంది. బిజినెస్ ఇన్సైడర్ ప్రకారం ఇక తిరిగి నియమించుకోకూడదనంటూ కొంతమంది మాజీ ఉద్యోగులను ఈ కంపెనీ జాబితా చేసిపెట్టుకుంది.